breaking news
West Godavari
-
కొల్లేరు కథ.. కంచికి చేరేనా!
● నేడు సుప్రీంకోర్టులో వాదనలు ● అటవీశాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ కాంతిలాల్ సమీక్ష కై కలూరు: సుప్రీం కోర్టులో కొల్లేరు సమస్యలపై బుధవారం వాదనలు జరగనున్నాయి. దీంతో ఏలూరు కలెక్టరేట్ గౌతమి సమావేశ హాలులో ప్రజాప్రతినిధులు, అధికారులతో కీలక సమావేశం బుధవారం జరిగింది. కై కలూరు, దెందులూరు, ఉంగుటూరు నియోజకవర్గ ఎమ్మెల్యేలు కామినేని శ్రీనివాస్, చింతమనేని ప్రభాకర్, పత్సమట్ల ధర్మరాజు హాజరయ్యారు. అటవీశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కాంతిలాల్ దండే, అటవీ, పర్యావరణ శాఖల ప్రత్యేక కార్యదర్శి శరవనన్, కలెక్టర్ కె.వెట్రిసెల్వితో కొల్లేరు అంశాలపై చర్చించారు. అనంతరం తాడేపల్లి సీఎంవోలో కొల్లేరుపై సమావేశమయ్యారు. కొల్లేరు అభయారణ్య ఆక్రమణలపై విశ్రాంత బీఎస్ఎన్ఎల్ ఉద్యోగి మృత్యుంజయరావు ఫిర్యాదుపై సుప్రీంకోర్టు ఆదేశాలతో కేంద్ర సాధికారిత కమిటీ(సీఈసీ) ఈ ఏడాది జూన్లో జిల్లాలో రెండు రోజుల క్షేత్ర స్థాయి పరిశీలన చేశారు. నివేదిక తమకంటే తమకు అనుకూలంగా వస్తుందని పర్యావరణవేత్తలు, కొల్లేరు ప్రజాప్రతినిధులు ఎదురు చూస్తున్నారు. సీఈసీ అడిగిన వాస్తవ వివరాలను అటవీ, రెవెన్యూ, డ్రైనేజీ శాఖలు అందించలేదు. దీంతో పూర్తి స్థాయి సమాచారం పంపించాలని సీఈసీ కోరింది. కొల్లేరులో అక్రమ చేపల సాగు యథేచ్చగా సాగుతున్నా కూటమి నేతలను ఎదిరించి ఒక్క గట్టు ధ్వంసం చేయలేని స్థితిలో అటవీశాఖ అధికారులు ఉన్నారు. మరోపక్క కొల్లేరు అక్రమ చేపల చెరువుల ధ్వంసం సమాచారం ఇవ్వాలని సుప్రీంకోర్టు పదేపదే అడుగుతోంది. క్షేత్ర స్థాయి లెక్కలను చూపించడంలో అటవీ సిబ్బంది తలలు పట్టుకుంటున్నారు. కొల్లేరు అంశాల అధ్యాయానికి వచ్చిన ప్రత్యేక సెక్రటరీ కాంతిలాల్ దండేకు కొల్లేరు నాయకుడు బలే ఏసురాజు ఆధ్వర్యంలో కొల్లేరు ప్రజలు వినతిపత్రాన్ని అందించారు. గోకర్ణపురం – చింతపాడు రహదారిలో 5 కిలోమీటర్ల రోడ్ నిర్మాణానికి అనుమతులు మంజూరు చేయాలని 14,932 ఎకరాల జిరాయితీ, 5,510 ఎకరాల డీ–ఫాం భూములను మినహాయించి పేదలకు పంపిణి చేయాలన్నారు. -
దివ్య రథంపై.. దేవదేవుడి విహారం
● ద్వారకాతిరుమలలో వైభవంగా శ్రీవారి రథోత్సవం ● నేడు చక్రస్నానం, ధ్వజావరోహణం ● ఉదయం 8 గంటల నుంచి – భజనలు ● ఉదయం 9 నుంచి – భక్తిరంజని ● ఉదయం 10.30 నుంచి–చక్రవారి, అపభృదోత్సవం ● ఉదయం 11 నుంచి–కూచిపూడి నృత్య ప్రదర్శనలు ● సాయంత్రం 4 నుంచి – నాదస్వర కచేరి ● సాయంత్రం 5 నుంచి – బుర్రకథ ● సాయంత్రం 6 నుంచి–కూచిపూడి నృత్య ప్రదర్శనలు ● రాత్రి 8 గంటల నుంచి – భక్తిరంజని ● రాత్రి 9 గంటల నుంచి – నాటకం ● రాత్రి 9 గంటల నుంచి – ధ్వజావరోహణ, అనంతరం అశ్వ వాహనంపై గ్రామోత్సవం ● ప్రత్యేక అలంకారం : వైకుంఠ నారాయణుడు ద్వారకాతిరుమల: బ్రహ్మోత్సవ వేళ.. బ్రహ్మాండనాయకుడిని దర్శించిన వారిది కదా భాగ్యము.. భువి వైకుంఠంలో అడుగిడిన వారిది కదా పుణ్యము.. ఆనందంతో దేవదేవుని కనులారా కాంచిన వారిది కదా జన్మ ధన్యము.. మహిమాన్విత రథంపై క్షేత్ర పురవీధుల్లో ఊరేగుతున్న శ్రీవారిని సేవించిన వారు కదా పునీతం.. గోవింద నామస్మరణలతో పులకించిన వారిది కదా ముక్తి మార్గం.. రథ వాహనంలో విహరిస్తున్న అలంకార ప్రియుడి కటాక్షం పొందిన వారి జీవితం కదా చరితార్ధం. ద్వారకాతిరుమల శ్రీవారి ఆశ్వయుజమాస దివ్య బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి. మంగళవారం రాత్రి ఉభయ దేవేరులతో కలసి దేవదేవుడు దివ్య రథంపై క్షేత్ర పురవీధుల్లో అట్టహాసంగా ఊరేగారు. తొలుత ఆలయంలో అర్చకులు స్వామి, అమ్మవార్లను తొళక్క వాహనంపై ఉంచి, పూజాధికాలు నిర్వహించారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, కోలాట భజనలు, అర్చకులు, పండితులు, ఆగమ విద్యార్థుల వేద మంత్రోచ్ఛరణల నడుమ వాహనాన్ని రథం వద్దకు తీసుకొచ్చారు. అక్కడ రథంలో ఏర్పాటు చేసిన సింహాసనంపై కల్యాణ మూర్తులను ఉంచి, విశేష పుష్పాలంకారాలు చేసి హారతులిచ్చారు. అనంతరం ఆలయ అనువంశిక ధర్మకర్త ఎస్వీఎన్ఎన్ నివృతరావు, డీఈఓ భద్రాజీ, ఈఈ డీవీ భాస్కర్, డీఈ, ఏఈఓలు, సూపరింటిండెంట్లు పూజలు నిర్వహించి, బలిహరణను సమర్పించగా, రథోత్సవం ప్రారంభమైంది. డప్పు వాయిద్యాలు, వేషధారణలు, భక్తుల గోవింద నామస్మరణల నడుమ శ్రీవారి దివ్య రథం క్షేత్ర పురవీధుల్లో తిరుగాడింది. స్వామివారి దివ్య దర్శనంతో భక్తులు పులకించారు. రథోత్సవంలో దేవదేవుడిని సేవించిన వారికి పునర్జన్మ ఉండదని పురాణాలు చెబుతున్నాయి. ఈ క్రమంలోనే అశేష భక్తజనులు గోవింద నామస్మరణలతో మహా రథం లాగుతూ తన్మయత్వం చెందారు. -
12వ పీఆర్సీ ప్రకటించాలి
రాష్ట్ర ప్రభుత్వం తక్షణం 12వ పీఆర్సీ ప్రకటించాలి. ఐఆర్ ఇవ్వాలి. 2023 జూలై నుంచి ఎరియర్స్ చెల్లించాలి. జీపీఎఫ్ ఖాతాలు తెరవాలి. మూడు సంవత్సరాల సరెండర్ లీవుల వేతనాలు చెల్లించాలి. మున్సిపల్ కార్మికులు, ఉద్యోగుల పట్ల పాలకులు చిన్నచూపు చూడటం తగదు. గత సమ్మె కాలపు ఒప్పందాల అమలుకు జీవోలు విడుదల చేయాలి. బి.సోమయ్య, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పారిశుద్ధ్య కార్మికులకు చాలీ చాలని వేతనాలు అందిస్తుండటంతో మా కుటుంబ పోషణ కోసం అనేక ఇబ్బందులు పడుతున్నాం. పెరిగిన నిత్యావసరాల ధరలు, పెంచిన విద్యుత్ ఛార్జీలు, ఇంటి అద్దెలు భారంగా మారాయి. పారిశుద్ధ్య కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సత్వర చర్యలు తీసుకోవాలి. – అంగులూరి జాన్ బాబు, మున్సిపల్ కార్మికుడు, ఏలూరు కార్పొరేషన్ మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులకు జీవో నెం.36 ప్రకారం కనీస వేతనం రూ.21 వేలు ఇవ్వాలి. స్కిల్డ్, సెమీ స్కిల్డ్ వేతనాల అమలుకు ప్రభుత్వం నియమించిన కమిటీ సిఫార్సులు అమలు చేయాలి. టూల్ కిట్స్, యూనిఫారం అందించాలి. వారాంతపు సెలవులు, జాతీయ, పండుగ సెలవులు, సీఎల్లు అమలు చేయాలి. – కలం సాంబశివరావు, ఇంజనీరింగ్ విభాగం వర్కర్, ఏలూరు కార్పొరేషన్ రిటైర్మెంట్ బెనిఫిట్ రూ.75 వేలు ఇచ్చేలా జీవో ఇవ్వాలి. రిటైర్మెంట్ వయస్సు 62 సంవత్సరాలు పెంచేందుకు. దహాన సంస్కారాల ఖర్చులు రూ.20 వేలకు పెంచే హామీకి తక్షణం జీవోలు ఇవ్వాలి. పారిశుద్ధ్య కార్మికులకు యూనిఫాం, చెప్పులు, సబ్బులు, కొబ్బరినూనెలు అందించాలి. కనీస వేతనం రూ.21 వేలు చెల్లించాలి. పి.దుర్గ, పారిశుద్ధ్య విభాగం వర్కర్, ఏలూరు కార్పొరేషన్ -
సీజేఐపై దాడికి నిరసనగా ర్యాలీ
భీమవరం: ప్రజల హక్కులను కాపాడేది న్యాయ వ్యవస్థేనని, ఈ వ్యవస్థలో అణగదొక్కాలనో లేదా ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలనో ప్రయత్నించినప్పుడు మేమంతా సంఘటితమేనని భీమవరం 3వ అదనపు జిల్లా జడ్జి, పోక్సో కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి బి.లక్ష్మీనారాయణ అన్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గవాయ్పై జరిగిన దాడికి నిరసనగా మంగళవారం భీమవరంలో న్యాయమూర్తులు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది ర్యాలీ నిర్వహించారు. టూటౌన్ ప్రాంతంలోని కోర్డుల సముదాయం నుంచి పాత కోర్టుల ప్రాంగణం వరకు ర్యాలీ నిర్వహించి అక్కడ న్యాయదేవత విగ్రహానికి జలాభిషేకం చేసి శుద్ధి చేసారు. కార్యక్రమంలో సివిల్ జడ్జి(సీనియర్ డివిజన్) ఎం.సుధారాణి, ప్రిన్సిపల్ సివిల్ జడ్జి(జూనియర్ డివిజన్) జి.సురేష్ బాబు, 1వ అదనపు సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) పి.హనీష, 2వ అదనపు జ్యుడిషియల్ మొదటి తరగతి మేజిస్ట్రేట్ ఎన్.జ్యోతి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు యేలేటి న్యూటన్, ఏపీపీ ఉండవల్లి రమేష్ నాయుడు, ఏజీపీ ఉచ్చుల వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై దాడి హేయం భీమవరం: దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయిపై దాడి దేశ రాజ్యాంగంపై దాడేనని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు పి.రామ్మోహన్, కెవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కె.క్రాంతిబాబు అన్నారు. గవాయ్పై దాడిని ఖండిస్తూ మంగళవారం భీమవరం అంబేడ్కర్ సెంటర్లో విద్యార్థి, దళిత, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా క్రాంతిబాబు మాట్లాడుతూ జడ్జిపై దాడి ముమ్మాటికీ రాజ్యాంగ వ్యవస్థపై దాడి అన్నారు. ఆర్ఎస్ఎస్ భావజాలంతో ప్రజల మధ్య విభేదాలకు, విభజనకు బీజేపీ ఎలా పాల్పడుతుందో ఈ ఘటన అద్దం పడుతుందన్నారు. కార్యక్రమంలో దళిత ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు గంటా సుందరకుమార్, జైభీమ్ సేవా దళ్ నాయకుడు మీసాల జయరాజు, బుద్ధిస్ట్ సొసైటీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోనా జోసెఫ్ తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీలో చేరిన కూటమి కార్యకర్తలు
అత్తిలి: కూటమి పాలన పట్ల విరక్తి చెంది, ఇతర పార్టీల వారు వైఎస్సార్సీపీలో చేరుతున్నారని మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. మంగళవారం సాయంత్రం అత్తిలి మండలం ఉరదాళ్లపాలెంలో కూటమి నుంచి 50 కుటుంబాలు వైఎస్సార్సీపీలో చేరాయి. గ్రామంలో కోపల్లె తాతయ్య నివాసంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కారుమూరి నాగేశ్వరరావు సమక్షంలో వీరు వైఎస్సార్సీపీలో చేరారు. ఈ సందర్భంగా కారుమూరి మాట్లాడుతూ వైఎస్సార్సీపీలో చేరిన ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు ఉంటుందని, గ్రామంలో పార్టీని మరింత బలోపేతం చేయడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు బుద్దరాతి ప్రసాద్, జెడ్పీ కోఆప్షన్ మెంబర్ మహ్మద్ అబుర్దీన్, బీసీ సెల్ అధ్యక్షుడు కంభ సూరిబాబు, వాణిజ్య విభాగం జోనల్ అధ్యక్షుడు కంకటా సురేష్, పార్టీ నాయకులు రామిశెట్టి రాము, యడ్లపల్లి మణికుమార్, గుండుమోగుల ఉమా మహేష్, కోపల్లి ధనరాజు తదితరులు పాల్గొన్నారు. -
నేడు జగన్ భీమవరం రాక
భీమవరం: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం భీమవరం రానున్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు కుమారుడి వివాహం బుధవారం కాళ్ల మండలం పెదఅమిరం గ్రామంలోని రాధాకృష్ణ కన్వెన్షన్లో జరగనున్నందున వివాహ వేడుకకు హాజరు కానున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు పెద అమిరంలో ఏర్పాటుచేసిన హెలీప్యాడ్కు చేరుకుని అక్కడి నుంచి కల్యాణవేదికకు వచ్చి వధూవరులను ఆశీర్వదించనున్నారు.హెలీప్యాడ్ ప్రాంతం పరిశీలనవైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం భీమవరం రానున్నందున పెదఅమిరంలో ఏర్పాటుచేసిన హెలీప్యాడ్ను మంగళవారం శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేనురాజు, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, భీమవరం వైఎస్సార్సీపీ సమన్వయకర్త చినమిల్లి వెంకటరాయుడు పరిశీలించారు.రుణాలు సద్వినియోగం చేసుకోవాలిభీమవరం (ప్రకాశం చౌక్): ఎస్హెచ్జీ గ్రూపు సభ్యులు బ్యాంకు రుణాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా బలోపేతం కావాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి పిలుపునిచ్చారు. మంగళవారం కలెక్టరేట్ పీజిఆర్ఎస్ సమావేశ మందిరంలో కలెక్టర్ అధ్యక్షతన డీఆర్డిఏ, పశుసంవర్ధక శాఖల సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ సంవత్సరం యాన్యువల్ క్రెడిట్ ప్లాన్ కింద జిల్లాకు 1,419 యూనిట్లు మంజూరయ్యాయని, ఎస్హెచ్జీ మహిళలు వీటి స్థాపన ద్వారా ఆర్థిక పురోభివృద్ధి సాధించాలన్నారు. జిల్లాలో పాల దిగుబడి పెంచేందుకు మేలు జాతి ఆవులు, గేదెలు, కొనుగోలులో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు. -
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు నిరసనగా ధర్నా
భీమవరం: రాష్ట్రంలో మెడికల్ కళాశాలలను ప్రవేటీకరణను నిరసిస్తూ దళిత సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం భీమవరం అంబేడ్కర్ సెంటర్లో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా దళిత ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు గంటా సుందరకుమార్, అంబేడ్కర్ ఆశయ సాధన కమిటీ రాష్ట్ర కన్వీనర్ కోన జోసఫ్ మాట్లాడుతూ మెడికల్ కళాశాలల ప్రవేటీకరణ దళితులకు తీరని నష్టమన్నారు. నిరుపేదలు, బలహీనవర్గాలకు విద్య విషయంలో అండగా ఉండి ప్రోత్సహించాల్సిన కూటమి ప్రభుత్వం ప్రవేటీకరణ బాట పట్టడం దారుణమన్నారు. ఈది రవికుమార్, జంగం మాణిక్యాలరావు, బి.కమలాకర్, పట్టెం శుభాకర్, కొండేటి లాజర్, గాతల సందీప్, గంటా రాహుల్ రిచర్డ్స్, అంబటి ఆనందకుమార్ పాల్గొన్నారు. భీమవరం: పెంచిన పని గంటలు తగ్గించాలని, ఎనిమిది గంటల పని విధానం కొనసాగించాలని అసెంబ్లీలో తీర్మానించిన బిల్లును రద్దు చేయాలని మంగళవారం భీమవరం ప్రకాశం చౌక్ సెంటర్లో రైతు, వ్యవసాయ కార్మిక, కౌలు రైతుల సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జక్కంశెట్టి సత్యనారాయణ మాట్లాడుతూ పోరాటం చేసి ఎనిమిది గంటల పని విధానాన్ని సాధించుకుంటే నేడు కార్పొరేట్, సంపన్నుల కోసం 13 గంటల పని విధానాన్ని తీసుకువచ్చి అసెంబ్లీలో తీర్మానం చేయడం సిగ్గుచేటన్నారు. మహిళలు పని చేసే చోట సరైన సౌకర్యాలు, రక్షణ లేకపోవడంతో పని గంటలు పెంచడం వల్ల మహిళలు తీవ్ర ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. రైతు సంఘం ప్రధాన కార్యదర్శి ఆకుల హరే రామ్, సీఐటీయు జిల్లా నాయకుడు ఎం.ఆంజనేయులు, చెల్లబోయిన వెంకటేశ్వరరావు, వైకుంఠరావు, జార్జి పాల్గొన్నారు. భీమవరం (ప్రకాశంచౌక్): జిల్లాలో దీపావళి టపాసులు తయారీ, అమ్మకాల్లో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా నిబంధనల మేరకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరంలో దీపావళి టపాసుల తయారీ, అమ్మకాలకు తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై కలెక్టర్, జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి సంయుక్తంగా అధికారులతో కన్వర్జెన్సీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దీపావళిని ఆనందోత్సాహాల మధ్య నిర్వహించుకోవడానికి అధికారులు ముందస్తు జాగ్రత్త చర్యలను చేపట్టాలని ఆదేశించారు. లైసెన్సు లేకుండా టపాసులు తయారుచేసినా, అమ్మినా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. గతంలో లైసెన్సులు పొంది ప్రస్తుతం రెన్యువల్ కానీ మందు గుండు సామగ్రి తయారీ షెడ్లను క్షేత్రస్థాయిలో పోలీస్, రెవిన్యూ శాఖలు విధిగా తనిఖీచేసి ధ్రువీకరించాలన్నారు. ఎస్పీ అద్నాన్ నయీం అస్మి మాట్లాడుతూ.. నిబంధనల మేరకు తనిఖీల్లో లోటుపాట్లు ఉంటే చర్యలు తీసుకుంటామన్నారు. డీఆర్ఓ బి.శివన్నారాయణ రెడ్డి, అడిషనల్ ఎస్పీ వి.భీమారావు, అగ్నిమాపక శాఖ అధికారి బి.శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
చెత్త డంప్ను అడ్డుకున్న స్థానికులు
● నరసాపురం 28వ వార్డులో ఉద్రిక్తత ● ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం నరసాపురం: నరసాపురం మున్సిపాలిటీలో చెత్త డంప్ చేసే విషయంలో మంగళవారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. స్థానికుల అభ్యంతరాలను పట్టించుకోకుండా, మున్సిపల్ అధికారులు దౌర్జన్యంగా చెత్తను డంప్ చేయడంతో పట్టణంలోని 28 వ వార్డులో ఉద్రిక్తత ఏర్పడింది. స్థానికులు చెత్త డంప్ను అడ్డుకోవడమే కాకుండా, కొందరు ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేయడంతో పరిస్థితి అదుపు తప్పింది. పోలీసు బందోబస్తు మధ్య మున్సిపల్ అధికారులు ఇళ్ల మధ్య ఉన్న మున్సిపల్ స్థలంలో చెత్తను డంప్ చేశారు. మున్సిపాలిటీకి డంపింగ్ యార్డ్ లేకపోవడంతో ఏళ్ల తరబడి చెత్తను గోదావరి గట్టున పోస్తున్నారు. ఇటీవల చెత్త వేయొద్దని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు ఇవ్వడంతో చెత్తను వేయడానికి మున్సిపాలిటీకి జాగా లేకపోయింది. దీంతో చెత్తను 28వ వార్డులో ఉన్న తుంగపాటి చెరువు వద్ద మున్సిపల్ స్థలంలో వేయాలని అధికారులు నిర్ణయించారు. ఆ ప్రాంతం మొత్తం నివాస గృహాలు ఉండటంతో సమస్య మొదలైంది. గతంలో ఒకసారి చెత్తను ఈ ప్రదేఽశంలో డంప్ చేసే ప్రయత్నం చేయడంతో స్థానికులు అడ్డుకున్నారు. మంగళవారం మళ్లీ ఇక్కడ చెత్తను డంప్ చేశారు. తీవ్ర ఉద్రిక్తత చెత్త వాహనాలు రాగానే స్థానికులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని అడ్డుకున్నారు. దళితులు ఉండే ఇళ్ల మధ్య చెత్తను ఎలా వేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చెత్త వాహనాలకు అడ్డంగా కూర్చుని నిరసన తెలిపారు. ఈ క్రమంలో ఇద్దరు యువకులు ఒంటిపై పెట్రోల్ పోసుకుని చెత్తను ఇక్కడ డంప్ చేస్తే ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపుచేసే ప్రయత్నం చేశారు. చివరకు పోలీసుల సాయంతో చెత్తను మున్సిపల్ స్థలంలోనే డంప్ చేశారు. దీంతో మున్సిపల్ అధికారుల తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ బాధ ఎమ్మెల్యే నాయకర్ పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు చేసుకుంటామని హెచ్చరించిన యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
చిరుద్యోగుల పోరుబాట
బుధవారం శ్రీ 8 శ్రీ అక్టోబర్ శ్రీ 2025ఏలూరు (టూటౌన్): మున్సిపల్ ఉద్యోగులు, కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 8న రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు నిర్వహించనున్నారు. గతంలో రాష్ట్ర వ్యాప్త సమ్మె విరమణ సందర్భంగా అప్పట్లో సంబంధిత అధికారులు కార్మిక సంఘాలతో చేసుకున్న ఏ ఒక్క ఒప్పందాన్ని, హామీని అమలు చేయక చేయకపోవడంతో ఉద్యోగులు, కార్మికులు ఆందోళన బాట పట్టేందుకు సన్నద్దమవుతున్నారు. మున్సిపల్ ఉద్యోగులు, కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణం 12వ పీఆర్సీ ప్రకటించి ఐఆర్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంజనీరింగ్ కార్మికులకు జీవో నెం.36 ప్రకారం నెలకు రూ.21 వేలు వేతనం ఇవ్వాలని, 2023 డిసెంబర్ సమ్మెకాలపు ఒప్పందాల అమలుకు తక్షణం జీవోలు విడుదల చేయాలని కార్మికులు, ఉద్యోగులు కోరుతున్నారు. రాష్ట్రంలోని మున్సిపల్ ఉద్యోగులు, కార్మికుల సమస్యలపై గతంలో సమ్మె చేసిన సమయంలో ప్రభుత్వం తరఫున ఒప్పందాలు కుదుర్చుకున్న అధికారులు ప్రతిపాదనలు తయారు చేసి ఫైనాన్స్ విభాగానికి పంపించారు. ఈ లోగా ఎన్నికల కోడ్ రావడంతో ఆ ఫైలు ముందుకు కదలలేదు. ఎన్నికల అనంతరం అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం మున్సిపల్ కార్మికులు, ఉద్యోగుల ఫైలును ఆమోదించకుండా ఫైనాన్స్ డిపార్టుమెంట్ వద్ద ఉన్న ఫైలును వెనక్కు రప్పించడం పట్ల మున్సిపల్ ఉద్యోగులు, కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ 2024 డిసెంబర్ 26 నుంచి దశలవారీగా ఆందోళనలు నిర్వహించారు. దీనిలో భాగంగా ఈనెల 8న ధర్నాలు నిర్వహించాలని యూనియన్ నిర్ణయించింది. చాలీచాలని వేతనం ఎన్నాళ్లు? మున్సిపల్ కార్మికులకు ఇచ్చేది కొద్దిపాటి వేతనమే. అయినా వారితో చేయించేది గొడ్డు చాకిరీ.. ఎప్పటికై నా తమ బతుకుల్లో వెలుగులు రాకపోతాయా? తమ సమస్యలు తీరకపోతాయా? అనే ఆఽశతో మున్సిపల్ కార్మికులు, ఉద్యోగులు మౌనంగా తమ విధులు నిర్వహిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే ఏడాది క్రితం సమ్మె చేశారు. సమస్యలు పరిష్కరిస్తామంటూ హామీలు ఇచ్చారు. వీటిలో ఏ ఒక్కటీ నెరవేరలేదు. దీంతో మళ్ళీ ఆందోళన బాట పట్టారు మున్సిపల్ కార్మికులు, ఉద్యోగులు. దీనిలో భాగంగా ఇప్పటికే మస్తర్ పాయింట్ల వద్ద తెల్లవారుజామున ఆందోళన చేశారు. 90 శాతం మంది ఆప్కాస్ ఉద్యోగులే ఏలూరు నగర పాలక సంస్థలో పనిచేసే ఉద్యోగులు, కార్మికుల్లో 90 శాతం మంది ఆప్కాస్ ఉద్యోగులే ఉన్నారు. ఏలూరు నగర పాలక సంస్థలో దాదాపు 1,170 మంది ఉద్యోగులు పనిచేస్తుండగా వీరిలో పర్మినెంట్ ఉద్యోగులు కేవలం 250 మంది మాత్రమే ఉన్నారు. కాంట్రాక్టు ఉద్యోగులు 800 మంది, స్కూల్ స్వీపర్లు 120 మంది పనిచేస్తున్నారు. ఈ లెక్క ప్రకారం దాదాపు వెయ్యి మంది ఉద్యోగులు, కార్మికులు అంతా ఆప్కాస్ ఉద్యోగులే. సమస్యల పరిష్కారం కోరుతూ రోడ్డెక్కుతున్న మున్సిపల్ కార్మికులు సమ్మె కాలపు ఒప్పందాలకు జీవోలు ఇవ్వాలని డిమాండ్ ఇంజనీరింగ్ కార్మికులకు రూ.21 వేలు చేయాలి నేడు మున్సిపాలిటీ, కార్పొరేషన్లలో ధర్నాలు -
వార్డెన్కు ఐదేళ్ల జైలు శిక్ష
భీమవరం అర్బన్: భీమవరం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వార్డెన్ చేసిన నేరాలు రుజువు కావడంతో మంగళవారం ఐదేళ్లు జైలు, రూ. 5 వేలు జరిమానా విధించినట్లు రూరల్ ఎస్సై ఐ.వీర్రాజు తెలిపారు. భీమవరంలోని విష్ణు కళాశాలలో హాస్టల్ వార్డెన్గా బన్నరావూరి వెంకట సుదాకర్ విధులు నిర్వహిస్తూ విద్యార్థుల నుంచి హాస్టల్ ఫీజు వసూలు చేసి కళాశాల యాజమాన్యానికి కట్టకపోవడంతో 2020లో అప్పటి ఎస్సై కె.సుధాకర్రెడ్డి కేసు నమోదు చేశారు. మంగళవారం కేసు విచారణకు రావడంతో వార్డెన్ బన్నరావూరి వెంకట సుధాకర్ చేసిన నేరాలు రుజువు కావడంతో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి, మెజిస్ట్రేట్ భీమవరం జి.సురేష్ బాబు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారని పేర్కొన్నారు. జంగారెడ్డిగూడెం: మండలంలోని గుర్వాయిగూడెం మద్ది క్షేత్రంలో మంగళవారం సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు అంజన్నను దర్శించుకున్నారు. ఆలయంలో స్వామి వారికి నిత్య కై ంకర్యాలతో పాటు, నాగవల్లీ దళాల(తమలపాకులు)తో అష్టోత్తర పూజలు నిర్వహించారు. ఆలయ ఈఓ ఆర్వీ చందన మాట్లాడుతూ ఆలయానికి మధ్యాహ్నం వరకు వివిధ సేవల రూపేణా రూ. 2,07,725 ఆదాయం వచ్చినట్లు తెలిపారు. అలాగే స్వామి వారి అన్నప్రసాదాన్ని 1868 మంది భక్తులు స్వీకరించారని పేర్కొన్నారు. అలాగే బుధవారం ఉదయం 8 గంటల నుంచి స్వామి వారి హుండీల ఆదాయాన్ని లెక్కిస్తున్నట్లు స్పష్టం చేశారు. -
పోగొట్టుకున్న బ్యాగ్ అందజేత
భీమవరం: స్థానిక టూటౌన్ పోలీసుస్టేషన్ పరిధిలో స్కూటీపై వస్తూ బంగారపు వస్తువులు, నగదు కలిగిన బ్యాగ్ను జారవిడుచుకున్న మహిళకు మంగళవారం టూటౌన్ సీఐ జి.కాళీచరణ్ అందచేశారు. గత నెల 27న చెనపాక జ్యోతి జువ్వలపాలెం రోడ్డులోని అడ్డవంతెన వైపు నుంచి కాసున్నర బంగారు వస్తువులు, రూ.60 వేల నగదు బ్యాగ్లో పెట్టుకుని స్కూటీపై బయలుదేరింది. మార్గమధ్యలో బ్యాగ్ జారవిడుచుకోగా ఆ బ్యాగ్ టూటౌన్ పోలీసుస్టేషన్లో హెడ్కానిస్టేబుల్గా పనిచేస్తున్న బుంగా రాజుకు దొరికడంతో ఆయన పోలీసుస్టేషన్లో అప్పగించారు. బ్యాగ్లో ఉన్న బ్యాంక్ పాస్బుక్లోని వివరాలు ఆధారంగా బాధితురాలికి తెలియజేయడంతో సీఐ కాళీచరణ్ సమక్షంలో బ్యాగ్ను జ్యోతికి అందించారు. యువకుడి మృతి భీమవరం: ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వృద్ధురాలికి రక్తదానం చేసిన యువకుడు కొద్దిసేపటికే మృతి చెందాడు. వివరాల ప్రకారం పాలకోడేరు మండలం మోగల్లు గ్రామానికి చెందిన ఎన్.నరేష్ తన స్నేహితుడి బంధువైన వృద్ధురాలు పట్టణంలోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా నరేష్ రక్తదానం చేశాడు. అనంతరం నరేష్, అతని స్నేహితుడు బీర్ సేవించగా చాతిలో నొప్పి వస్తుందని చెప్పడంతో దగ్గరలోని వైద్యుడికి చూపించారు. అనంతరం ఒక్కసారిగా నరేష్ కుప్పకూలి మరణించాడు. దీనికి సంబంధించి వివరాలు సేకరిస్తున్నామని వన్టౌన్ సీఐ ఎం.నాగరాజు తెలిపారు. -
తప్పిన పెను ప్రమాదం
పెనుగొండ: పెనుగొండ సుబ్రహ్మణేశ్వర స్వామి ఆలయం వద్ద మంగళవారం ఉదయం జరిగిన ప్రమాదంలో పెనుప్రమాదం తప్పింది. మంగళవారం కావడంతో సుబ్రహ్మణేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులు మోటార్ సైకిళ్లను వరుసగా పార్కింగ్ చేశారు. ఈ తరుణంలో నరసాపురం వైపు వెళుతున్న ఆర్టీసీ బస్సు ఓ మోటారు సైకిల్ను వేగంగా ఢీకొనడంతో మోటారు సైకిళ్లు అన్నీ గుట్టలుగా ఒకదానిపై ఒకటి పడిపోయాయి. అయితే, ప్రతి మంగళవారం యాచకులు ఈ మోటారు సైకిళ్లు పక్కనే కూర్చుని భక్తులను యాచిస్తుంటారు. కానీ, ఈ రోజు కొంచెం దూరంలో ఉండి యాచిస్తుండడంతో ప్రమాదంతో ఒక్కసారిగా అప్రమత్తమై పక్కకు తప్పుకున్నారు. అయితే మోటార్ సైక్లిస్టులు నష్టపరిహారం చెల్లించాలంటూ డిమాండ్ చేశారు. -
బీచ్కు వచ్చే సందర్శకుల రక్షణకు చర్యలు తీసుకోవాలి
భీమవరం (ప్రకాశంచౌక్): పేరుపాలెం, కేపీ పాలెం బీచ్ సందర్శకుల రక్షణకు పటిష్ట చర్యలు చేపట్టాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన బీచ్ సందర్శకుల రక్షణ ఏర్పాట్లపై జిల్లా స్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ నాగరాణి మాట్లాడుతూ మైరెన్ పోలీసులు ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తూ, బీచ్ సందర్శకులను అప్రమత్తం చేయడంతో పాటు, వారి భద్రతకు పటిష్టమైన చర్యలను చేపట్టాలన్నారు. పేరుపాలెం బీచ్లోని స్థానిక లా – ఆర్డర్ పోలీసులతో డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలను కూడా నిర్వహించాలని సూచించారు. పేరుపాలెం బీచ్లో కొత్త కోస్టల్ సెక్యూరిటీ పోలీస్ స్టేషన్ కోసం భూమిని సేకరించాలని ఆదేశాలు జారీ చేశారు. సమావేశంలో జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి, విశాఖపట్నం కోస్టల్ సెక్యూరిటీ పోలీస్ డీఎస్పీ జి.బాలిరెడ్డి, అంతర్వేది మైరెన్ ఇన్స్పెక్టర్ నవీన్ నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు. మహర్షి వాల్మీకికి నివాళులు భీమవరం (ప్రకాశం చౌక్): రామాయణ మహా కావ్యాన్ని రచించి జాతికి సన్మార్గాన్ని నిర్దేశించిన మహోన్నత వ్యక్తి మహర్షి వాల్మీకి అని కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరంలో మహర్షి వాల్మీకి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, డీఆర్ఓ బి.శివన్నారాయణ రెడ్డి వాల్మీకి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వాల్మీకి జయంతి ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందన్నారు. -
గిరిజన గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలి
బుట్టాయగూడెం: గిరిజన ప్రాంతాల్లో పీఎం జన్మాన్ పథకం కింద విద్య, వైద్యం, విద్యుత్, తాగునీరు, రహదారి వంటి సదుపాయాలు మరింత మెరుగుపరిచేలా అధికారులు చర్యలు తీసుకోవాలని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ అధికారులను ఆదేశించారు. మండలంలోని కేఆర్పురం ఐటీడిఏలో జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వితో కలిసి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అటవీ ప్రాంతంలో గిరిజనులకు మంజూరు చేసి నిబంధనలపేరుతో నిలుపుదల చేసిన 26 ఇళ్లను పూర్తి చేయాలని స్పష్టం చేశారు. అలాగే తమకు సమస్యలు తెలియజేసేందుకు వచ్చిన గిరిజనులపై మర్యాదపూర్వకంగా ఉండాలని చెప్పారు. కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ పెద్దవాగు ప్రాజెక్టు మరమ్మతులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి, ఇరిగేషన్ అధికారులకు ప్రతిపాదనలు పంపించామన్నారు. అనుమతులు రాగానే చర్యలు చేపడతామన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ అందించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. కార్యక్రమంలో జాతీయ ఎస్టీ కమిషన్ డైరెక్టర్ కళ్యాణ్ రెడ్డి, జిల్లా అటవీశాఖ అధికారి ఇ.సతీష్, ఐటీడిఏ పీఓ రాములు నాయక్, ఇన్చార్జి ఆర్డీఓ ముక్కంటి, పోలవరం ప్రాజెక్టు భూసేకరణ ప్రత్యేక కలెక్టర్ సరళా వందనం తదితరులు పాల్గొన్నారు. -
మావుళ్లమ్మ దీక్షాధారణ ప్రారంభం
భీమవరం (ప్రకాశంచౌక్): స్థానిక శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి దేవస్థానంలో ఆశ్వయుజ శుద్ధ పౌర్ణమి సందర్భంగా శ్రీ మావుళ్లమ్మ వారి మండలి దీక్షా మాలధారణ కార్యక్రమం ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మ శ్రీ మద్దిరాల మల్లికార్జునశర్మ కలశస్థాపన పూజ జరిపి, ప్రారంభించారు. 145 మంది భక్తులు దీక్షా మాలధారణ ధరించారని ఆలయ సహాయ కమిషనర్ బుద్ద మహాలక్ష్మి నగేష్ తెలిపారు. అలాగే ఆలయ ఆవరణలో చండీహోమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ పూర్వ ప్రధాన అర్చకుడు మద్దిరాల రామలింగేశ్వరశర్మ జ్ఞాపకార్థం మనవడు మద్దిరాల రామకార్తీక్ ఇత్తడి, రాగితో తయారు చేసిన సుమారు 53 కేజీల హోమగుండాన్ని సమర్పించారు. ఈ హోమగుండాన్ని ఆలయ ప్రధాన అర్చకులు సంప్రోక్షణ జరిపి చండీహోమం చేశారు.సుబ్బారాయుడికి ప్రత్యేక అభిషేకాలుముదినేపల్లి రూరల్: ప్రసిద్ధి చెందిన సింగరాయపాలెం–చేవూరుపాలెం సెంటర్లోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయంలో స్వామివారికి మంగళవారం ప్రత్యేక అభిషేకాలు చేశారు. ఆలయ ప్రధాన అర్చకుడు తోలేటీ వీరభద్రశర్మ ఆధ్వర్యంలో స్వామికి ప్రత్యేక పూజలు ఇతర కార్యక్రమాలు నిర్వహించి అభిషేకాలు చేశారు. భక్తుల రద్దీకి అనుగుణంగా నిత్యన్నదాన ప్రసాదానికి సంబంధించి తగిన ఏర్పాట్లు చేశామని ఈఓ ఆర్ గంగాశ్రీదేవి తెలిపారు. జిల్లా బాలికల క్రీడా జట్లకు 70 మంది ఎంపికతణుకు అర్బన్: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్–19 విభాగంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా బాలికల క్రీడా జట్ల ఎంపికలు తణుకు ఎస్కేఎస్డీ మహిళా జూనియర్ కళాశాలలో మంగళవారం నిర్వహించారు. చదరంగం, ఖోఖో, వాలీబాల్, యోగా, బాల్ బ్యాడ్మింటన్, టెన్నీకాయిట్, త్రోబాల్ విభాగాల్లో ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచి 200 మంది క్రీడాకారులు హాజరుకాగా 70 మంది ఎంపికయ్యారని వారిలో 25 మంది ఎస్కేఎస్డీ మహిళా కళాశాల విద్యార్థులు ఉన్నట్లుగా ప్రిన్సిపాల్ భూపతిరాజు హిమబిందు తెలిపారు. కళాశాల జాయింట్ సెక్రటరీ చిట్టూరి వెంకట కృష్ణారావు జట్ల ఎంపికలను ప్రారంభించారు. కార్యక్రమంలో ఫిజికల్ ఎడ్యుకేషన్ జిల్లా సెక్రటరీ కె.జయరాజు, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ యు.లక్ష్మీసుందరీబాయ్, ఎస్డీ కళాశాల ప్రిన్సిపల్ వీవీ సత్యనారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పెదవేగి ఎంఈఓ–1పై విచారణకు ఆదేశం
ఏలూరు (టూటౌన్): పెదవేగి ఎంఈఓ–1 పై జాతీయ ఎస్టీ కమిషన్ విచారణకు ఆదేశించింది. పెదవేగి మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రామచంద్రపురంలో పనిచేస్తున్న పీఎస్ హెచ్ఎం జి.కృష్ణకు జూలై నెల జీతం చేయకుండా వేధించినందుకుగాను జాతీయ ఎస్టీ కమిషన్కు ఆగస్టు నెలలో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును స్వీకరించిన జాతీయ ఎస్టీ కమిషన్ గత నెల 19న జిల్లా కలెక్టర్, జిల్లా విద్యాశాఖ అధికారికి నోటీసులు జారీ చేసింది. దీంతో ఏలూరు జిల్లా విద్యాశాఖ అధికారి ఇటీవల పెదవేగి మండల విద్యాశాఖ అధికారి–1పై విచారణ చేసేందుకు ఏలూరు ఉప విద్యాశాఖ అధికారి ఎన్.రవీంద్ర భారతి, దెందులూరు ఎంఈఓ ఏవీఎన్వీ ప్రసాద్ లను విచారణ అధికారులుగా నియమిస్తూ ఆదేశాలు ఇచ్చారు. విచారణ నివేదికను ఈ నెల 12 లోగా తమకు అందించాలని ఉత్తర్వులలో పేర్కొన్నారు. ఏలూరు (టూటౌన్): ఏలూరు జిల్లా నుంచి చలో విజయవాడ పోరుబాట కార్యక్రమానికి అత్యధిక సంఖ్యలో మహిళా ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు తరలి వెళ్లారు. ఈ ధర్నాకు 10 వేలు పై చిలుకు హాజరవ్వగా ఒక్క ఏలూరు జిల్లా నుంచే ఈ కార్యక్రమంలో సుమారు 1000 మందికి పైగా హాజరైనట్లు నాయకులు చెబుతున్నారు. బోధనేతర పనులను బహిష్కరించడంతో పాటు ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఫ్యాప్టో చైర్మన్ జి.మోహన్, సెక్రటరీ జనరల్ యం.ఆదినారాయణ, కో–చైర్మన్లు జి. వెంకటేశ్వరరావు, జి.ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. దెందులూరు: హైదరాబాద్ నుంచి కురెళ్లగూడెం చేపల చెరువుకు వెళ్తున్న కోళ్ల వ్యర్థాల లారీని మంగళవారం గుండుగొలను వద్ద పట్టుకుని సీజ్ చేశామని దెందులూరు హెచ్సీ హమీద్ అన్నారు. ముందస్తు సమాచారంతో గుండుగొలను వద్ద లారీ పట్టుకున్నామన్నారు. ఈ నేరంతో సంబంధం ఉన్న ఐదుగురు నిందితుల పై కేసు నమోదు చేశామని పేర్కొన్నారు. -
వరిపైరులో పురుగుల పని పట్టండిలా
కై కలూరు: వరి పైరు చిరు పొట్ట దశలో ఉంది. ఈ దశలో వరిపైరుపై పురుగులు, తెగుళ్లు దాడి చేస్తున్నాయి. ఏలూరు జిల్లాలో 2,45,855 సాదారణ వరి విస్తీర్ణానికి గానూ 2,00,490 ఎకరాల్లో నాట్లు వేశారు. మొత్తం రైతులు 1,36,468 రైతులు ఉండగా, వీరిలో 32,074 మంది కౌలు రైతులు ఉన్నారు. ప్రస్తుత తరుణంలో పురుగుల వ్యాప్తిపై తీసుకోవాల్సిన జాగ్రత్తలను కై కలూరు మండల వ్యవసాయాధికారిణి ఆర్.దివ్య సూచనలు చేశారు. కాండం తొలుచు పురుగు నారుమడి దశ నుంచి ఈనిక దశ వరకు వరి పైరును కాండం తొలుచు పురుగు నష్టపరుస్తుంది. దీనినే మొవ్వు పురుగు, పీక పురుగు, తెల్లకంకి అంటారు. ఖరీఫ్లో తక్కువ నుంచి మధ్యస్తంగా, రబీలో మధ్యస్తం నుంచి ఎక్కువగా ఆశిస్తుంది. నారుమడిలో అశిస్తే మొక్కలు, పిలక దశలో ఆశిస్తే మొవ్వు చనిపోతుంది. ఈనిక దశలో ఆశిస్తే కంకి పాలు పోసుకోక తెల్ల కంకి ఏర్పడుతుంది గుడ్డు నుంచి వచ్చిన లార్వా కాండము కింద వైపు నుంచి లోపలికి ప్రవేశించి మొవ్వను తినేస్తోంది. నివారణ చర్యలు.. నారు పీకటానికి వారం రోజులు ముందు 5 సెంట్ల నారుమడికి 800 గ్రాముల కార్బోప్యూరాన్ 3జీ గుళికలను పలుచగా చల్లి మడిలోనే ఇంకేటట్లు చేయాలి. పిలక, దుబ్బు చేసే దశలో కార్బోప్యూరాన్ 3జీ గుళికలను ఎకరానికి 10 కిలోలు వేయాలి. ఎసిఫేట్ 75 ఎస్.పి.1.5 10 కిలోలు వేయాలి లేదా ఎసిఫేట్ 75 ఎస్పీ1.5 గ్రా, లేదా కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 50 ఎస్పీ 2 గ్రా, లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. అంకురం నుంచి చిరుపొట్ట దశలో కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 4జీ గుళికలు 8 కిలోలు, లేదా క్లోరాంట్రానిలిప్రోల్ 0.4 శాతం గుళికలు 4 కిలోలు వేయాలి. ఆకుముడత పంట నాటిన దగ్గర నుంచి పోటాకు దశ వరకు ఆకుముడత ఆశిస్తుంది. దీనినే నాము, తెల్ల తెగులు అంటారు. ఇది సీతాకోక చిలుకలగా ముదురు గోధుమ రంగులో ఉండి రెక్కల అంచుల మధ్య సన్నని నల్ల గీతలుంటాయి. పొలంలో నడస్తూ ఉంటే గుంపులు గుంపులుగా ఎగిరే రెక్కల పురుగులను బట్టి అకుముడతను గుర్తించవచ్చు. ఆలస్యంగా నాటిన పొలాల్లో, వర్షభావ పరిస్థితులలోను, చుట్టూ నీడ ప్రదేశాలు ఉండటం, నత్రజని ఎరువు అధిక మోతాదులో వాడటం వల్ల దీని ఉదృతి పెరుగుతుంది. పొటాకు దశలో దుబ్బుకి 1 నుంచి 2 కొత్తగా తెల్లగా గీకబడిన ఆకులు, వాటిలో చిన్న లార్వాలు గమనించిన వెంటనే సస్యరక్షణ చేపట్టాలి. నివారణ చర్యలు పరాన్నజీవులైన ట్రైకోగ్రామా ఖిలోనిస్ను ఎకరాకు 20,000 చొప్పున మూడు సార్లు వదలాలి. పిలక దశలో చేనుకు అడ్డంగా తాడును 2–3 సార్లు లాగితే పురుగులు పడిపోతాయి. నివారణకు క్లోరిపైరిఫాస్ 2.5 మి.లీ, లేదా ఎసిఫేట్ 1.5 గ్రా, లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. పొట్ట ఆకు దశలో కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 50 ఎస్పీ 2 గ్రా, లేదా క్లోరాంట్రానిలిప్రోల్ 20 ఎస్పీ 0.4 మిల్లీ గ్రాములు, లేదా ఫ్లూబెండామైడ్ 20 డబ్యూడీజీ 0.25 గ్రా, లేదా ప్లూబెండమైడ్ 48 ఎస్పీ 0.1 మి.లీ, లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. లేదా కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 4జీ 8 కిలోల లేదా క్లోరాంట్రానిలిప్రోల్ 0.4 శాతం 4 కిలోలు గుళికలు ఎకరాకు చొప్పున వేయాలి. సుడిదోమ నారుమడి, పిలక, పొట్ట, ఈనిక దశల్లో దోమలు నీటి మట్టంపై ఉంటూ దుబ్బుల నుంచి రసం పీల్చడం ద్వారా నష్టాన్ని కలుగిస్తాయి. వీటిలో దోమపోటు, గోధుమ వర్ణపు దోమ, తెల్ల మచ్చ దోమలు కీలకమైనవి. వీటి ఉదృతి ఎక్కువైతే పొలం ఎండి పడిపోవటం, తాలు గింజలు, నూర్చినప్పుడు నూక అవుతుంది. తొలి దశలో రసాన్ని పీల్చడం వల్ల పైరు లేత పసువు వర్ణానికి మారుతుంది. ఉదృతి పెరిగే కొద్ది పైరు సుడులు సుడులుగా వలయకారంలో ఎండిపోతూ ఉంటాయి. నత్రజనిని అధిక మోతాదు, కాలి బాటలు తీయని పొలాల్లో, పైరు తొలిదశలో ఆకులను ఆశించే పురుగుల నివారణకు క్లోరిపైరిఫాస్, ప్రొఫెనోఫాస్, సింథటిక్ పైరథ్రాయిడ్ మందులను వాడినపుడు ఈ పురుగు ఉధృతి ఎక్కువవుతోంది. నివారణ చర్యలు పిలకల దశలో దుబ్బుకు 10 దోమలు, ఈనిక దశలో దుబ్బుకు 20–25 దోమలు గమనించిన వెంటనే సస్యరక్షణ చేపట్టాలి. వరి నాటేటప్పుడు ప్రతి 2 మీటర్లకు 20 సెంటీ మీటర్ల బాటలు తీయాలి. దీని నివారణకు లీటరు నీటికి ఎసిఫేట్ 1.5 గ్రా,లేదా మోనోక్రోటోఫాస్ 2.2 మి.లీ లేదా ఇథోఫెనోప్రాక్స్ 2 మి.లీ, లేదా ఫెనోబుకార్బ్ 2 మి.లీ, లేదా ఇమిడాక్లోప్రిడ్ 0.25 మి.లీ, లేదా థయోమిథాక్సామ్ 0.2 గ్రా, లేదా బుప్రోఫెజిన్ 1.6 మి.లీ, లేదా పైమెట్రోజైన్ 0.6 గ్రా, లేదా ట్రైవ్లూమిజోఫైరిమ్ 0.486 మి.లీ, పిచికారీ చేయాలి. కై కలూరు మండల వ్యవసాయాధికారిణి ఆర్.దివ్యచిరు పొట్ట దశలో వరిపైరుకు పురుగుల బెడద -
పశుగ్రాస వెతలకు చెక్
చింతలపూడి: రైతులకు వ్యవసాయంతో పాటు పశు పోషణ ఆర్థికంగా తోడ్పాటునిస్తుంది. ఈ నేపథ్యంలో పశు పోషణలో పశుగ్రాసం ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంటుంది. మెట్ట ప్రాంతంలో పాడి పశువులను పెంచుకునే రైతులు పశుగ్రాసం పండించడంలో మెలకువలు తెలుసుకుంటే మేలు జరుగుతుందని వ్యవసాయ సహాయ సంచాలకులు వై.సుబ్బారావు చెబుతున్నారు. వాతావరణ ప్రతికూల పరిస్థితులు ఏర్పడిన సందర్భాల్లో పశువులకు పశుగ్రాసం కొరత ఏర్పడే ప్రమాదం ఉంది. ఈ దశలో గ్రామీణ ప్రాంతాల్లో పాడిని నమ్ముకున్న రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. పశు పోషణలో 70 శాతం ఖర్చు మేతకే అవుతుందని తెలిసిందే. ఈ దశలో ప్రభుత్వం సబ్సిడీపై పశుగ్రాసం విత్తనాలను రైతులకు సరఫరా చేస్తున్నట్లు ఆయన చెప్పారు. వర్షాకాలంలో పశుగ్రాసం పండించుకుంటే వేసవిలో పశువుల పోషణకు ఇబ్బంది ఉండదని చెబుతున్నారు. ఖాళీ ప్రదేశాల్లో.. ముఖ్యంగా మెట్ట ప్రాంతంలోని పండ్ల తోటల్లోని మొక్కల మధ్య ఖాళీ ప్రదేశాల్లో పప్పు జాతి పశుగ్రాసాలు అలసంద, ఉలవ, పిల్లిపెసర, జనుము, మొక్కజొన్న వంటి పంటలను సాగు చేయడం వల్ల పశుగ్రాసం కొరతను అధిగమించడంతో పాటు భూమిలో నత్రజని స్ధిరీకరించబడి భూసారం పెరిగే అవకాశాలు ఉంటాయని పేర్కొంటున్నారు. జనుము ఇది కాయజాతి పశుగ్రాసం. అన్ని నేలల్లోనూ అన్ని కాలాల్లో కొద్దిపాటి నీటితో కూడ పండించుకోవచ్చు. ఎకరానికి 12 కిలోల విత్తనాలను 50 కిలోల సూపర్ ఫాస్ఫేట్తో కలిపి చల్లాలి. విత్తిన తరువాత 40, 50 రోజులకు కోతకు వస్తుంది. ఈ మేతను పూత దశలో కోసి ఎండు మేతగా వినియోగించుకుంటే ఉపయోగం ఉంటుంది. పిల్లి పెసర వరి సాగు చేసే అన్ని భూముల్లో అంతర పంటగా దీన్ని సాగు చేసుకోవచ్చు. సాధారణ భూములకు పచ్చి రొట్టగా వాడితే భూమికి బలం చేకూరుతుంది. శీతాకాలంలో రబీ పంటగా ఈ పశుగ్రాసాన్ని సాగు చేసుకోవచ్చు. ఈ పశుగ్రాసం వేర్లలో నత్రజని బుడిపెలు ఉండటం వల్ల భూమి సారవంతమవుతుంది. వరి పంట కోయడానికి 3,4 రోజుల ముందు అంటే భూమిలో తేమ ఉన్నప్పుడే ఎకరానికి 10–15 కిలోల విత్తనాలను 50 కిలోల సూపర్ ఫాస్ఫేట్తో కలిపి చల్లుకోవాలి. 50 రోజుల్లో కోతకు వచ్చే ఈ పశుగ్రాసం వల్ల ఎకరానికి 10 నుండి 12 టన్నుల పచ్చి మేత లభిస్తుంది. ఇతర రకాలు ఇక పశుగ్రాస మొక్కజొన్నలో ఆఫ్రికన్ టాల్ రకం జె 1006–రకం, విజయ కాంపోజిట్ రకాలు 85 రోజులకు ఒకే సారి కోతకు వస్తాయి. పండ్ల తోటలు, పామాయిల్ తోటల్లో కూడ సాగు చేసుకోవచ్చు. రైతులకు అధిక పశుగ్రాసా దిగుబడులను అందిస్తాయి. పప్పు జాతి రకాలైన అలసంద(బొబ్బర్లు) రష్యన్ జైంట్, బుందేల్ లోబియ 1,2, ఇసి 4216–5287, కెబీసీ 2 మొదలైన రకాలు 55 నుండి 60 రోజుల్లో ఒకే కోతలో నాణ్యమైన పశుగ్రాసాన్ని అందిస్తాయి. వై సుబ్బారావు –వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ తోటల్లో ఖాళీ ప్రదేశాలను ఉపయోగించుకోవాలంటున్న నిపుణులు -
నేడు భీమవరంలో వైఎస్ జగన్ పర్యటన
సాక్షి,అమరావతి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 2.40 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి ఆయన భీమవరం చేరుకుంటారు, అక్కడినుంచి పెదఅవిురం చేరుకుని వైఎస్సార్సీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాద రాజు కుమారుడి వివాహ వేడుకకు హాజరవుతారు. అనంతరం సాయంత్రం తాడేపల్లి చేరుకుంటారు.పైడితల్లి అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలి సిరిమానోత్సవం సందర్భంగా ప్రజలకు వైఎస్ జగన్ శుభాకాంక్షలు సాక్షి, అమరావతి: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం పైడితల్లి అమ్మవారి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆకాంక్షించారు. మంగళవారం విజయనగరంలో నిర్వహించే సిరిమానోత్సవం సందర్భంగా ఆయన రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అమ్మవారి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా ప్రారి్థస్తున్నానని ‘ఎక్స్’లో మంగళవారం పోస్ట్ చేశారు.ఆదర్శనీయుడు వాల్మీకి మాజీ సీఎం వైఎస్ జగన్ ఘన నివాళి సాక్షి,అమరావతి: ప్రపంచానికి రామాయణ ఇతిహాసాన్ని అందించిన మహర్షి వాల్మీకి అని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కొనియాడారు. వేటగాడైన వాల్మీకి రామనామాన్ని జపిస్తూ మహర్షిగా మారిన తీరు అందరికీ ఆదర్శనీయమని పేర్కొన్నారు. మంగళవారం వాల్మీకి జయంతి సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ వైఎస్ జగన్ ‘ఎక్స్’లో పోస్టు చేశారు. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వాల్మీకి చిత్రపటానికి పూలమాల వేసి వైఎస్ జగన్ నివాళులరి్పంచారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఉషా శ్రీచరణ్, మేరుగ నాగార్జున, కారుమూరి నాగేశ్వరరావు, ధర్మాన కృష్ణదాస్, పార్టీ సీనియర్ నేతలు గడికోట శ్రీకాంత్ రెడ్డి, దూలం నాగేశ్వరరావు, బీవై రామయ్య తదితరులు పాల్గొన్నారు. -
ఉసూరుమనిపింఛెన్
సాక్షి, భీమవరం: పేదవర్గాలకు ఆర్థిక భరోసానిచ్చే సామాజిక పింఛన్ల మంజూరును కూటమి సర్కారు విస్మరించింది. 15 నెలల పాలనలో కొత్త పింఛన్ ఒక్కటీ ఇవ్వలేదు. దరఖాస్తుల ఆన్లైన్ సైట్ను సైతం ఆఫ్లోనే ఉంచేసింది. 50 ఏళ్లకే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు వృద్ధాప్య పింఛన్ ఇస్తామన్న ఎన్నికల హామీ ఊసే ఎత్తడం లేదు. వెబ్సైట్ క్లోజ్ గత ప్రభుత్వంలో ఏటా జనవరి, జూలై నెలల్లో కొత్త పింఛన్లు మంజూరు చేసేవారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకుంటే చాలు రాజకీయాలు, కులమత వర్గాలకు అతీతంగా అర్హులను ఎంపిక చేసేవారు. 2023 జూలై నుంచి డిసెంబరు వరకు వచ్చిన దరఖాస్తులు మేరకు 2024 జనవరిలో జిల్లాలో 4,274 కొత్త పింఛన్లు మంజూరు చేశారు. మరలా జూలైలో కొత్త మంజూరు రావాల్సి ఉంది. జూన్లో కూటమి ప్రభుత్వం వచ్చాక కొత్త పింఛన్ల మంజూరు నిలిపివేసింది. అందుకు సంబంధించిన వెబ్సైట్ను క్లోజ్ చేయడంతో పాటు దరఖాస్తుల ఆన్లైన్ ప్రక్రియను నెలల తరబడి నిలిపివేసింది. పింఛన్ల కోసం పేదలు సచివాలయాలు, ఎంపీడీఓ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తుండగా ప్రభుత్వం నుంచి తమకు ఇంకా మార్గదర్శకాలు ఏమీ రాలేదని ఉద్యోగులు వారిని వెనక్కి పంపిస్తున్నారు. వేలల్లో దరఖాస్తులు వృద్ధాప్య, వితంతు, దివ్యాంగ తదితర పింఛన్లు కోరుతూ ప్రతి సోమవారం నిర్వహించే పీజీఆర్ఎస్ కార్యక్రమానికి అధిక సంఖ్యలో పేదలు దరఖాస్తు చేసుకునేందుకు వస్తున్నారు. గతంలో ప్రభుత్వ మార్గదర్శకాలు మేరకు సచివాలయ ఉద్యోగులు వెరిఫికేషన్ చేసి అర్హులైన వారికి ఆన్లైన్ చేసేవారు. ప్రస్తుతం సచివాలయ ఉద్యోగులకు లాగిన్ నిలిపివేయడంతో ఆన్లైన్ చేసే వీలులేక త్వరలో కొత్త పింఛన్లు వస్తాయంటూ దరఖాస్తుదారులను చెప్పి పంపాల్సి వస్తుందని వారంటున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వలన పింఛన్ సాయం అందక నష్టపోతున్నామని పేదవర్గాల వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్పౌజ్ పింఛన్లతో సరి పేదవర్గాల్లో కుటుంబ యజమాని మృతి చెందితే భార్యకు ఆసరాగా వితంతు పింఛన్ మంజూరు చేయడం పరిపాటి. కాగా జిల్లాలో పింఛన్ తీసుకుంటూ 3,988 మంది లబ్ధిదారులు మృతిచెందగా వారి భార్యలకు మాత్రమే కూటమి ప్రభుత్వం స్పౌజ్ కోటాలో పింఛన్లు అందజేసింది. గతంలో ఎప్పటికప్పుడు స్పౌజ్ పింఛన్లు మంజూరు చేస్తే అధికారంలోకి వచ్చిన ఏడాది తర్వాత ఆగస్టులో వీటిని అందజేసింది. స్పౌజ్ పింఛన్లనే కొత్త పింఛన్లు మంజూరు చేసినట్టుగా కూటమి నేతలు హడావుడి చేయడం గమనార్హం. భర్తను కోల్పోయిన పేద మహిళలు ఎంతోమంది వితంతు పింఛన్ సాయం కోసం ఎదురుచూస్తున్నా వారి ఆవేదనను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. 50 ఏళ్లకే పింఛన్ హామీ అమలేది? 50 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు వృద్ధాప్య పింఛన్ అందిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో కూటమి నేతలు ఊదరగొట్టారు. జిల్లాలో 50 ఏళ్ల నుంచి 60 ఏళ్ల పింఛన్కు అర్హత కలిగిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు 2 లక్షల మంది వరకు ఉంటారని అంచనా. కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాదిన్నర కావస్తున్నా ఎన్నికల హామీ అమలు దిశగా అడుగులు వేయకపోవడం ఆయా వర్గాల వారిని తీవ్ర నిరాశకు గురిచేస్తోంది.బురిడీ సర్కార్ పింఛన్ల ఊసెత్తని కూటమి ప్రభుత్వం 15 నెలల్లో కొత్త పింఛన్ ఒక్కటీ మంజూరు చేయని వైనం కూటమి సర్కారు వచ్చే నాటికి జిల్లాలో పింఛన్లు 2,32,885 ప్రస్తుతం 2,26,127కు తగ్గిన వైనం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 ఏళ్లకే పింఛన్ హామీ గాలికి.. అర్హత ఉన్నా సాయం అందక నష్టపోతున్న పేదలు కూటమి ప్రభుత్వం దళితులు, బడుగు, బలహీన, మైనార్టీ వర్గాలకు 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చింది. అయితే ఇప్పుడు వృద్ధాప్య పింఛన్ ఇస్తామన్న ఎన్నికల హామీ ఊసే ఎత్తడం లేదు. పింఛన్ల కోసం సచివాలయాలు, ఎంపీడీఓ కార్యాలయాల చుట్టూ ప్రజలు ప్రదక్షిణలు చేస్తున్నా ప్రభుత్వం నుంచి తమకు ఇంకా మార్గదర్శకాలు ఏమీ రాలేదని ఉద్యోగులు వెనక్కి పంపిస్తున్నారు. – ఉండవల్లి జానకి, తణుకు స్పౌజ్ పింఛన్లనే కొత్త పింఛన్లు మంజూరు చేసినట్టుగా కూటమి నేతలు హడావుడి చేయడం విడ్డూరం. వృద్ధాప్య, వితంతు, దివ్యాంగ తదితర పింఛన్లు కొత్తవి కొర్రీలు లేకుండా మంజూరు చేయాలి. 50 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు వృద్ధాప్య పింఛన్ అందిస్తామని ఎన్నికల సమయంలో ఊదరగొట్టారు. గద్దెనెక్కిన తర్వాత హామీ అమలు దిశగా చర్యలు లేకపోవడం నిరాశ కలిగిస్తోంది. – వర్ధనపు సుధాకర్, రుస్తుంబాద కూటమి ప్రభుత్వం కొత్త పింఛన్లు ఇవ్వకపోగా ఖజానాపై భారం పడకుండా ఉన్నవాటికి కోత పెడుతోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 2024 జూన్లో జిల్లాలో పింఛన్ లబ్ధిదారులు 2,32,885 మంది ఉండగా ఈ అక్టోబరు నాటికి వారి సంఖ్య 2,26,127లకు తగ్గింది. ఈ మేరకు ప్రతినెలా వారికి అందించే సాయం తగ్గుతోందంటున్నారు. ఏడాదిన్నర కాలంలో జిల్లాలో 6,758 పింఛన్లు తగ్గిపోగా సుమారు రూ.20 కోట్లకు పైనే భారం తగ్గించుకుంది. -
బాధితులకు పోలీస్ శాఖ భరోసా
భీమవరం: వివిధ సమస్యలతో పోలీస్ కార్యాలయాలకు వచ్చే బాధితులకు పోలీస్ శాఖ భరోసాగా ఉండాలని ఎస్పీ అద్నాన్ నయీం అస్మి ఆదేశించారు. సోమవారం భీమవరంలోని జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించి ఆయా పోలీస్స్టేషన్ అధికారులతో ఫోన్లో మాట్లాడారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి మొదటి ప్రాధాన్యమిస్తూ అర్జీలు పునరావృతం కాకుండా నిర్ణీత గడువులోపు పరిష్కరించాలన్నారు. 16 ఫిర్యాదులు అందగా పూర్తిస్థాయి విచారణ జరిపి పరిష్కారం అందిస్తామని భరోసా ఇచ్చారు. జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్) వి.భీమారావు, జిల్లా స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ కేవీవీఎన్ సత్యనారాయణ, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ దేశంశెట్టి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. భీమవరం: జిల్లాలోని 20 మండలాల్లో సోమ వారం 370.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా అత్తిలిలో 81 మిల్లీమీటర్లు నమోదుకాగా పెంటపాడులో 52, మొగల్తూరులో 38.4, వీరవాసరంలో 27.8, తాడేపల్లిగూడెంలో 15.2, తణుకులో 2.6, గణపవరంలో 25.4, ఆకివీడులో 1.2 మి.మీ. వర్షం కురిసింది. ఉండిలో 8.6, పాలకోడేరులో 1.6, పెనమంట్రలో 22.2, ఇరగవరంలో 2.2, పెనుగొండలో 18.6, ఆచంటలో 17, పోడూరులో 13.4, భీమవరంలో 15.6, కాళ్లలో 3.8, నరసాపురంలో 9.4, పాలకొల్లులో 13, యలమంచిలిలో 1.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. -
శాశ్వత పరిష్కారం చూపాలి
భీమవరం (ప్రకాశంచౌక్) : పీజీఆర్ఎస్లో అందిన అర్జీలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి నాణ్యమైన, శాశ్వత పరిష్కారం చూపాలని జాయింట్ కలెక్టర్ టి.రాహుల్కుమార్రెడ్డి సూ చించారు. సోమవారం కలెక్టరేట్లో డీఆర్వో బి.శివన్నారాయణరెడ్డి, డ్వామా పీడీ డా.కేసీహెచ్ అప్పారావు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జెడ్.వెంకటేశ్వరరావుతో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. మొత్తంగా 168 అర్జీలు అందాయి. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. క్షేత్రస్థాయిలో ఫిర్యాదుదారులతో స్వయంగా మాట్లాడి నాణ్యమైన పరిష్కారం చూపాలన్నారు. శాఖల వారీగా వచ్చిన అర్జీలను పరిశీలించి తక్షణ మే పరిష్కార చర్యలు చేపట్టాలన్నారు. అర్జీలు రీ ఓపెన్ కాకుండా చూడాలన్నారు. జిల్లా అ ధికారులు, వయోవృద్ధుల సంక్షేమ ట్రిబ్యునల్ సభ్యుడు మేళం దుర్గాప్రసాద్ పాల్గొన్నారు.స్వచ్ఛాంధ్ర అవార్డుల ప్రదానంభీమవరం (ప్రకాశంచౌక్): స్థానిక కలెక్టరేట్ లోని పరేడ్ గ్రౌండ్లో సోమవారం జిల్లాస్థాయి స్వచ్ఛాంధ్ర అవార్డుల ప్రదానోత్సవం నిర్వహించారు. కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అవార్డు గ్రహీతలకు పురస్కారాలు అందించారు. రాజ్యసభ సభ్యుడు పాక వెంకట సత్యనారాయణ, కలెక్టర్ సీహెచ్ నాగరాణి, ఎమ్మె ల్యే, పీఏసీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు, జాయింట్ కలెక్టర్ టి.రాహుల్కుమార్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.10న పింఛన్ అదాలత్భీమవరం (ప్రకాశంచౌక్): స్థానిక ఎస్ఆర్కేఆర్ ఆడిటోరియంలో ఈనెల 10న ఉదయం 10 గంటలకు ఏపీ ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ ఎస్.శాంతి ప్రియ ఆధ్వర్యంలో పింఛన్ అదాలత్ నిర్వహించనున్నట్టు జాయింట్ కలెక్టర్ టి.రాహుల్కుమార్రెడ్డి తెలిపారు. ప్రస్తుతం సర్వీసులో ఉన్నవారు, రిటైర్డ్ ఉద్యోగులు తమ సమస్యలను పరిష్కరించుకోవచ్చన్నారు. దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్న పింఛన్ మంజూరు, జీపీఎఫ్, మిస్సింగ్ క్రెడిట్ సంబంధించి అన్ని సమస్యలను అదాలత్లో పరిష్కరించుకోవచ్చని సూచించారు. దీనిలో భాగంగా ఈనెల 9న పీజీఆర్ఎస్ సమావేశం మందిరంలో జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నామన్నారు.గిరిజనుల అభ్యున్నతికి కృషి చేయాలిజాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు హుస్సేన్వేలేరుపాడు: గిరిజను ల అభ్యున్నతికి అధికారులు పాటుపడాలని, సంక్షేమ ఫలాలను గిరిజన కుటుంబాలకు అందేలా చూడాలని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ అన్నారు. సోమవారం మండలంలోని మోదెల గ్రామంలో మాజీ మంత్రి జల గం ప్రసాదరావుతో కలిసి ఆయన పర్యటించా రు. సంక్షేమ, అభివృద్ధి పనులపై గిరిజనులను ఆరా తీశారు. గిరిజన ప్రాంతాల్లో పూర్తిస్థాయిలో మౌలిక వసతులు లేని గ్రామాలపై 15 రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని, మూడు నెలల్లో పనులకు శ్రీకారం చుట్టేలా చర్యలలు తీసుకుంటామన్నారు. గిరిజనుల నుంచి అర్జీలు స్వీకరించారు. మాజీ మంత్రి జలగం, జేవీఆర్ స్వ చ్ఛంద సేవా సంస్థ ద్వారా గిరిజనులకు స్టీల్ కంచం, గ్లాస్, స్వీట్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇక్కడ పరిస్థితులు చూస్తుంటే అధికారుల వైఫల్యం కనిపిస్తోందన్నారు. ప్రతి గ్రామంలో సెల్ టవర్లు ఏ ర్పాటుచేయాలని అధికారులను ఆదేశించారు. గిరిజన తండాల అభివృద్ధికి త్వరితగతిన అనుమతులు ఇవ్వాలన్నారు. సమస్యల పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. గిరిజన ప్రాంతాలు అభివృద్ధి విషయంలో ఎవరూ కోర్టులకు వెళ్లవద్దని, ఎస్టీ కమిషన్ను సంప్రదించాలని కోరారు. ఐటీడీఏ పీఓ కె.రాములు నాయక్, ఇన్చార్చి ఆర్డీఓ, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఎం.ముక్కంటి, డీఎఫ్ జి.సతీష్ రెడ్డి, జిల్లా ఆర్డబ్ల్యూఎస్ అధికారి జి.త్రినాథబాబు, విద్యుత్ శాఖ ఈఈ ఫీర్ అహ్మద్ ఖాన్, హౌసింగ్ ఈఈ ప్రసాద్ పాల్గొన్నారు. -
బకాయిలు చెల్లించకుంటే ఫ్లాట్లకు తాళాలు
● పాలకొల్లులో టిడ్కో లబ్ధిదారులకు బ్యాంకు అధికారుల హెచ్చరిక ● నోటీసులు అంటిస్తామంటూ హుకుం ● లబోదిబోమంటున్న లబ్ధిదారులు పాలకొల్లు సెంట్రల్: అధికారంలోకి వచ్చిన వెంటనే శ్రావణమాసంలో టిడ్కో గృహాల లబ్ధిదారులకు ఉచితంగా ఇళ్లు ఇస్తామని చెప్పారు.. రెండు శ్రావణమాసాలు దాటాయి.. ఇళ్లు ఇవ్వలేదు సరికదా, బ్యాంకు అధికారుల వేధింపులతో టిడ్కో లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు. సోమవారం పాలకొల్లులోని పెంకుళ్లపాడు టిడ్కో గృహాల్లో లబ్ధిదారుల ఇళ్లకు బ్యాంకు అధికారులు వెళ్లి ఘాటుగా హెచ్చరించారు. ఇళ్ల నిర్మాణం కోసం బ్యాంకు రుణాలు ఇచ్చామని, వాయిదాలు కట్టాల్సిందేనని హెచ్చరించారు. లేకుంటే నోటీసులు ఇచ్చి చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. శుక్రవారంలోపు బకాయిలు చెల్లించాలి లేదా వడ్డీ అయినా క ట్టాలని లేదంటే ఫ్లాట్లకు తాళాలు వేస్తామని హెచ్చరించారు. యడ్లబజారు, యూనియన్ బ్యాంకు, ఎల్ఆర్పేట, పాలకొల్లు ఈఏపీ బ్రాంచ్ల నుంచి రికవరీ క్యాంపు నిమిత్తం వచ్చామని బ్యాంకు అధికారులు తెలిపారు. దీంతో లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు. మాకు ఇళ్లు కట్టించింది ప్రభుత్వం ‘మాకు ఇళ్లు కట్టించింది ప్రభుత్వం.. బ్యాంకులు కాదు కదా మీరొచ్చి మమ్మల్ని అడుగుతారేంటి.. నాడు మా నుంచి ప్రభుత్వం రూ.లక్ష కట్టించుకుంది.. కానీ రూ.50 వేలకే రిజిస్ట్రేషన్లు చేయించి ఇచ్చారు.. మిగిలిన డబ్బులు సంగతేంటి పోనీ ఆ మిగిలిన డబ్బులైనా జమ వేసుకోవాలి కదా’ అంటూ బ్యాంకు అధికారులను లబ్ధిదారులు నిలదీశారు. మిమ్మల్ని ప్రశ్నిస్తే మున్సిపల్ ఆఫీసుకు వెళ్లమంటారు, వారిని అడిగితే బ్యాంకులకు వెళ్లమంటారు, హామీలిచ్చిన నాయకులను అడిగితే కట్టేసుకోండమ్మా అంటున్నారు, మరి అలాంటప్పుడు హామీలివ్వడం ఎందుకంటూ మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ఫ్లాట్లలో నిర్వహణ లోపం టిడ్కో ఫ్లాట్లను సరిగా కట్టలేదని, దీంతో పలు ఫ్లాట్లలో నీళ్లు లీకవుతున్నాయని లబ్ధిదారులు అంటున్నారు. అయినా సర్దుబాటు చేసుకుని జీవిస్తున్నామని చెబుతున్నారు. పరిసరాలు పరిశుభ్రంగా లేవని, పాములు యథేచ్ఛగా తిరుగుతున్నాయని ఆందోళన చెందుతున్నారు. మా అబ్బాయి మీద ఆధారపడి జీవిస్తున్నానని, బ్యాంకు వాయిదా కింద నెలకు రూ.3,500 చొప్పున చెల్లించాలంటే ఎలా అని ఓ మహిళా లబ్ధిదారులు వాపోయారు. టిడ్కో గృహాల వద్ద లబ్ధిదారులను హెచ్చరిస్తున్న బ్యాంకు అధికారులు, లబోదిబోమంటున్న మహిళలు గత ఎన్నికల సమయంలో టీడీపీకి ఓట్లేస్తే టిడ్కో ఇళ్లు ఉచితంగా ఇస్తామని నాయకులు హామీ ఇచ్చారని, నమ్మి ఓట్లేస్తే ఇప్పుడు మొండిచేయి చూపిస్తున్నారని లబ్ధిదారులు వాపోయారు. ఎమ్మెల్యేని అడిగినా, ఏడాది క్రితం పాలకొల్లు వచ్చిన మంత్రి నారాయణను అడిగి నా బ్యాంకు వాయిదాలు కట్టుకోవాలని చెబుతున్నారని, అలా వాయిదాలు కట్టుకునే స్థోమతే ఉ ంటే ఇక్కడకు వచ్చి ఎందుకు ఉంటామని ప్రశ్నిస్తున్నారు. టిడ్కో గృహాల్లో ఉన్న వారంతా పేద, మధ్యతరగతి కుటుంబాలే అని, తమకు వాయిదాలు కట్టడం భారమని వాపోతున్నారు. -
కమనీయం.. కడు రమణీయం
● నేత్రపర్వంగా చిన వెంకన్న కల్యాణోత్సవం ● నేడు రథోత్సవం ద్వారకాతిరుమల: సర్వ జగద్రక్షకుడు.. కలియుగ వైకుంఠుడైన శ్రీవారు, నుదుటున కల్యాణ తిలకం, బుగ్గన చుక్కలతో సిగ్గులొలుకుతున్న ఉభయ దేవేరులను పెండ్లాడారు. ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయంలో ఆశ్వయుజమాస దివ్య బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన స్వామివారి తిరుకల్యాణ మహోత్సవం సోమవారం రాత్రి ఆలయ అనివేటి మండపంలో అట్టహాసంగా జరిగింది. ముందుగా ఆలయం నుంచి సర్వాభరణ భూషితులైన స్వామి, అమ్మవార్లను రెండు వేర్వేరు వాహనాలపై కల్యాణ వేదిక వద్దకు తీసుకుచ్చారు. వేదికపై ప్రత్యేకంగా అలంకరించిన రజిత సింహాసనంపై కల్యాణమూర్తులను ఉంచి అర్చకులు వేడుకను ప్రారంభించారు. వివిధ ఘట్టాలను పూర్తి చేసిన తర్వాత శుభముహూర్త సమయంలో నూతన వధూవరుల శిరస్సులపై జీలకర్ర, బెల్లం ధరింపజేసి, మాంగల్యధారణ, తలంబ్రాల వేడుకను భక్తుల గోవింద నామస్మరణల నడుమ వైభవంగా నిర్వహించారు. దేవస్థానం తరఫున ఆలయ ఛైర్మన్ ఎస్వీ సుధాకరరావు, ఆలయ అనువంశిక ధర్మకర్త ఎస్వీఎన్ఎన్ నివృతరావులు కుటుంబ సమేతంగా శ్రీవారికి పట్టువస్త్రాలను సమర్పించగా, రాష్ట్ర ప్రభుత్వం తరఫున గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు అమ్మవార్లకు పట్టువస్త్రాలను సమర్పించారు. శ్రీహరి కళాతోరణ వేదికపై సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. స్వామివారు ఉదయం సింహ వాహనంపై, కల్యాణ వేడుక అనంతరం రాత్రి వెండి గరుడ వాహనంపై క్షేత్ర పురవీధుల్లో ఊరేగారు. ఉత్సవ ఏర్పాట్లను ఆలయ ఈఓ ఎన్వీఎస్ఎన్ మూర్తి పర్యవేక్షించారు. విశేష అలంకారాల్లో భాగంగా స్వామివారు మోహినీ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు పాల్గొన్నారు. ఉదయం 8 గంటల నుంచి భజనలు ఉదయం 9 గంటల నుంచి భక్తిరంజని ఉదయం 10 గంటల నుంచి కూచిపూడి నృత్య ప్రదర్శనలు సాయంత్రం 4 గంటల నుంచి నాదస్వర కచేరి సాయంత్రం 5 గంటల నుంచి హరికథ సాయంత్రం 6 గంటల నుంచి కూచిపూడి నృత్య ప్రదర్శనలు రాత్రి 8 గంటల నుంచి రథోత్సవం ప్రత్యేక అలంకారం : రాజమన్నార్ -
మధ్యాహ్న భోజన కార్మికుల నిరసన
భీమవరం: మధ్యాహ్న భోజన కార్మికుల సమ స్యలు ప్రభుత్వానికి పట్టడం లేదంటూ కలెక్టరేట్ వద్ద సోమవారం నిరసన తెలిపారు. సీఐటీయూ నాయకుడు ఎం.ఆంజనేయులు మాట్లాడుతూ మధ్యాహ్న భోజన కార్మికులు కనీస వేతనాలు లేక పెరిగిన ధరలతో ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హైస్కూళ్లలో ఐదుగురు పనిచేస్తుంటే ముగ్గురికే వేతనాలు ఇస్తున్నారని, 9 ,10 తరగతుల విద్యార్థులను లెక్కల్లోకి తీసుకోకుండా 25 మందికి ఒక జీతం చొప్పున ఇస్తున్నారన్నారు. కూరగాయలు, నిత్యావసర సరకులు ధరలు ఆకాశనంటుతున్నా పాత మెనూ చార్జీలనే అమలు చేయడం దారుణమన్నారు. సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మదీనా బీబీ, నాగమణి మాట్లాడుతూ కార్మికులకు ఇచ్చిన వాగ్దానాలను ప్రభు త్వం అమలు చేసే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గుర్తింపు కార్డులు, యూనిఫామ్స్ లేవని అప్పుల ఊబిలో కొట్టుమిట్టాడుతున్నట్టు వాపోయారు. అందరికీ ఉచిత గ్యాస్ ఇస్తామని ప్రభు త్వం ప్రకటించినా కార్యరూపం దాల్చలేదన్నారు. అనంతరం డీఈఓ కార్యాలయ ఏడీకి వినతిపత్రం అందజేశారు. -
స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఎంపికలు
ఏలూరు(ఆర్ఆర్పేట): ఏలూరు జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని అన్ని యాజమాన్యాల ఉన్నత పాఠశాలల్లో చదివే విద్యార్థులకు అండర్–14, అండర్–17 బాల బాలికల క్రీడా జట్ల ఎంపికలు నిర్వహించినట్లు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి కే.అలివేలు మంగ తెలిపారు. సోమవారం ఇండోర్ స్టేడియంలో అండర్–14, 17 విభాగాల బాలబాలికలకు తైక్వాండో, హ్యాండ్బాల్ పోటీలు నిర్వహించామన్నారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ ఈ పోటీల్లో 376 క్రీడాకారులు పాల్గొన్నారన్నారు. లింగపాలెం: మండలంలోని ధర్మాజీగూడెంలో అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్న వ్యానును ఆదివారం రాత్రి అధికారులు పట్టుకున్నారు. గ్రామస్తుల తెలిపిన సమాచారం మేరకు తరలిస్తున్న అక్రమ రేషన్ బియ్యంను అధికారులు సీజ్ చేశారు. ధర్మాజీగూడెంలో కార్డుదారుల నుంచి కొనుగోలు చేసిన 10 క్వింటాళ్ల బియ్యంతో పాటు, ఇద్దరు వ్యక్తులను అదుపులో తీసుకున్నట్లు సివిల్ సప్లయిస్ డీఎస్ఓ తెలిపారు. బియ్యం తరలించే వారిపై కేసు నమోదు చేసి, వ్యాన్ను సీజ్ చేసినట్లు తెలిపారు. భీమవరం: భీమవరం ఒకటో పట్టణంలోని చినపేటలో విద్యుత్షాక్తో వ్యక్తి మృతి చెందినట్లు ఎస్సై బి.వై.కిరణ్ కుమార్ తెలిపారు. రోజువారీ కూలిపనులు చేసుకుని జీవనం సాగించే తోట లాజరు (55) స్థానికంగా ఉన్న గుడి సమీపంలో శుభ్రం చేస్తుండగా అరటి చెట్టు విద్యుత్తు తీగలపై పడింది. విద్యుత్తు తీగలు నుంచి షాక్ తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
చెరువు గట్లపై మృత్యు తీగలు
● నిర్లక్ష్యంతో బలవుతున్న కూలీలు ● కనీస జాగ్రత్తలు పాటించని యాజమానులు కై కలూరు: విద్యుదాఘాతానికి చేపల చెరువులపై పొట్టకూటి కోసం పనిచేసే బడుగు జీవులు పిట్టల్లా రాలిపోతున్నారు. యజమానుల నిర్లక్ష్యంతో మృత్యు తీగలు యమపాశాలుగా మారుతున్నాయి. చెరువు నీటిలో యంత్రాలకు మరమ్మతులు చేస్తున్న సమయంలో కార్మికులు ప్రాణాలు పొగొట్టుకుంటున్నారు. పశువులకు చెరువు గట్లపై గడ్డి కొస్తున్న కూలీలు గమనించక గడ్డితో పాటు విద్యుత్ వైర్లను కోస్తూ మరణిస్తున్నారు. కొల్లేరు ప్రాంతాల్లో ఇటువంటి మరణాలు నిత్యకృత్యంగా మారాయి. ఉమ్మడి జిల్లాలో 2.90 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగు జరుగుతోంది. వీటిలో 1.80 లక్షల ఎకరాల్లో చేపలు, 1.10 లక్షల ఎకరాల్లో రొయ్యల సాగు చేస్తున్నారు. ఏలూరు జిల్లాలో 4,759, పశ్చిమగోదావరి జిల్లాలో 16,374 ఆక్వా విద్యుత్ సర్వీసులు ఉన్నాయి. కై కలూరు నియోజకవర్గంలో ఆక్వా విస్తీర్ణం 84,852 ఎకరాలు కాగా.. ఆక్వా రైతులు 30,972 మంది ఉన్నారు. ఆక్వా రైతులు వాడకాన్ని బట్టి 10 హెచ్పీ మోటార్లును వినియోగిస్తున్నారు. రొయ్యల సాగులో నీటిలో ఆక్సిజన్ పెంచడానికి 24 గంటలు ఏరియేటర్లను వినియోగిస్తారు. లక్షల ఎకరాల్లో చేపల చెరువులకు రోజూ మేతలు కట్టడం, యజమాని పశువులకు మేత కోయడం వంటి పనులకు పలు కుటుంబాలు చేపల చెరువులపై నివాసముంటున్నాయి. చెరువు విస్తీర్ణాన్ని బట్టి భార్యభర్తలకు నెలకు రూ.18 వేల జీతం చెల్లిస్తున్నారు. జనావాసాలకు చెరువులు దూరంగా ఉండటంతో ప్రమాదం జరిగినప్పుడు తక్షణ సాయం అందక మరణాలు ఎక్కువగా ఉన్నాయి. మోటారు చక్రాలలో కొందరు తలలు ఇరుక్కుని మరణిస్తోన్నారు. ఒడిశా, రాజస్థాన్ ప్రాంతాల నుంచి వసల కూలీలు ఎక్కువగా ఇటీవల చెరువు గట్లపై స్థిరనివాసాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. కుటుంబ పోషణ కోసం అధిక అడ్వాన్సు తీసుకోవడంతో పనిభారం పెరిగినా చేయక తప్పని పరిస్థితి. ఇవి పాటించాలి ● ఆక్వా రైతులు చెరువులపై నాణ్యమైన మోటార్లు, ఫ్యాన్ సెట్టు వినియోగించాలి. ● అండర్ కేబుల్ వైరింగ్ చేసుకోవడం ఉత్తమం. ● చెరువు వద్ద కనీసం 11 అడుగుల ఎత్తులో విద్యుత్ తీగలు ఏర్పాటు చేయాలి. ● నాణ్యమైన విద్యుత్ వైర్లతో సరైన ఎర్తింగ్ ఏర్పాటు చేసి ఎంసీఏ మీటరు వినియోగించుకోవాలి. ● అవగాహన, అనుభవం లేని వ్యక్తులతో విద్యుత్ పరికరాల మరమ్మతులు చేయించవద్దు. ● విద్యుత్ లైన్లు, ట్రాన్మ్ఫార్మర్స్, మీటర్ల వద్ద మరమ్మతులకు విద్యుత్ శాఖ అధికారిక సిబ్బందిని మాత్రమే ఉపయోగించాలి. ● తడిగా ఉన్న పరికరాలను నేరుగా తాకరాదు. గాలులకు మీ పరిసరాలలో ఏవైనా స్తంభాలు, వైర్లు పడిపోతే వెంటనే విద్యుత్ సిబ్బందికి, సబ్ స్టేషన్కు తెలపాలి. ● తడి చేతులతో స్విచ్ బోర్డు ఇతర విద్యుత్ పరికరాలను తాకరాదు. ● మోటర్లకు నాణ్యమైన రేటింగ్ ఉన్న కెపాసిటర్లను వినియోగించాలి. ఇటీవల కాలంలో ప్రమాదాలు ● కై కలూరు శివారు ఏలూరు రోడ్లో పొత్తూరి సుబ్బరాజు అనే యువ ఆక్వారైతు చేపల చెరువు మోటరు స్విచ్ వేస్తున్న సమయంలో విద్యుదాఘాతంతో మరణించాడు. ● కై కలూరు మండలం పెంచికలమర్రులో దుంపగడపకు చెందిన మెరుగుమల్లి శ్రీనివాసరావు విద్యుత్ వైర్లు తగిలి మరణించాడు. ● కై కలూరు మండలం నర్సాయిపాలెం పుల్లవ డ్రైయిన్ వద్ద గేలంతో చేపలు పడుతూ మోటారు వైర్లు తగిలి పశ్చిమగోదావరి జిల్లా శృంగవృక్షంకు చెందిన తానేటి మాసేన్ మృతిచెందాడు. ● నందివాడ మండలం పోలుకొండ వద్ద రొయ్యల చెరువుపై విద్యుత్ వైర్లు తగిలి వేల్పూరి గ్రామానికి చెందిన మల్లేశ్వరరావు మృతి చెందాడు. ● కై కలూరు మండలం భుజబలపట్నంలో చేపల మేతలకు సాయం చేసే క్రమంలో విద్యుత్ వైర్లు తగిలి బోయిన నాగేశ్వరరావు మృతిచెందాడు. ● కలిదిండి మండలం తాడినాడలో కట్టా రంగారావు ఆకులు కొడుతూ మృతిచెందాడు. ● మండవల్లి మండలం దయ్యంపాడులో రొయ్యల చెరువు ఏరియేటర్ల బిగిస్తూ ఘంటసాల భాను మృతి ● కలిదిండికి చెందిన సమయం సుబ్బారావు గడ్డి కోస్తూ విద్యుత్ తీగలు తగిలి మృతి. విద్యుత్ ఎంత ఉపయోగమో అంతే ప్రమాదకరం. ఆక్వా చెరువులపై విద్యుత్ వైర్ల ఏర్పాటులో నిర్లక్ష్యం వల్ల మరణాలు సంభవిస్తున్నాయి. విద్యుత్శాఖ పరంగా గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం. చెరువు నీటిలో విద్యుత్ పరికరాలు మరమ్మత్తుల చేసే సమయంలో అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలి. – జీబీ.శ్రీనివాసరావు, విద్యుత్శాఖ ఈఈ, గుడివాడ -
ఘాట్ రోడ్డులో దూసుకెళ్లిన కారు
ద్వారకాతిరుమల: శ్రీవారి కొండపైన ఘాట్ రోడ్డులో ఫుట్పాత్ పైకి ఆదివారం రాత్రి ఓ కారు దూసుకెళ్లింది. ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ భక్తులెవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. స్థానికుల కథనం ప్రకారం.. కారు టోల్ గేట్ మీదుగా కొండపై నుంచి కిందకి వేగంగా వస్తోంది. కేశఖండన శాఖ సమీపానికి వచ్చేసరికి కారు అదుపుతప్పి ఒక్కసారిగా ఫుట్పాత్ పైకి దూసుకెళ్లింది. అయితే ఫుట్పాత్పై భక్తుల సౌకర్యార్ధం దేవస్థానం నిర్మించిన ఫెడస్టల్ షెడ్డు పోల్స్ను ఢీకొట్టి కారు నిలిచిపోయింది. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసం కాగా, షెడ్డు పోల్స్ నేలకొరిగాయి. కారులో ఉన్న వారికి ఏమీ కాలేదు. -
మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ కమిటీ ఎన్నిక
ఏలూరు (టూటౌన్): రాష్ట్ర ప్రభుత్వ ఆసుపత్రులలో పనిచేస్తున్న నర్సింగ్ స్టాప్, ల్యాబ్ టెక్నీషియన్లు, ఆఫీస్ స్టాప్ తదితర విభాగాలలో పనిచేస్తున్న ఉద్యోగ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ఆంధ్రప్రదేశ్ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ నిరంతరం పోరాడుతుందని ఏపీ మెడికల్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి.లక్ష్మణ మూర్తి తెలిపారు. సోమవారం జిల్లా సర్వజన ప్రభుత్వ ఆసుపత్రిలో ఏపీ మెడికల్ ఎంప్లాయిస్ యూనియన్ బ్రాంచ్ ఎన్నికలు జరిగాయి. అధ్యక్షుడిగా ఎం.రవికుమార్, కార్యదర్శిగా డి.లక్ష్మణమూర్తి, కోశాధికారిగా వి.శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులుగా టీఎస్ ఆచారి, ఎం.కిషోర్, బి.సందీప్, జి.రాజకుమార్, కే.మణి, కే శేషు, సహాయ కార్యదర్శులుగా పి.అరుణ్ గోపాల్, శేఖర్, ఎం.హరిబాబు, పి.లోకేష్, ఎన్.బేబీ అనురాధ, సీహెచ్ అశోక్ కుమార్ ఎన్నికయ్యారు. -
వైఎస్సార్సీపీలో నియామకాలు
చింతలపూడి: వైఎస్సార్సీపీ రాష్ట్ర మేధావుల విభాగం కార్యదర్శిగా చింతలపూడి పట్టణానికి చెందిన గోలి చంద్రశేఖర్రెడ్డిని నియమిస్తూ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం ఉత్తర్వులు జారి చేశారు. ఐటీ విభాగం కార్యదర్శిగా వెలగలపల్లి గ్రామానికి చెందిన గోలి శరత్రెడ్డిని నియమించారు.ఎర్రకాలువ వాటర్ స్పోర్ట్స్ టీం విజయభేరిజంగారెడ్డిగూడెం: కర్నూలు జిల్లాలో జరిగిన 4వ రాష్ట్రస్థాయి జలక్రీడల డ్రాగన్ పడవ పోటీల్లో జంగారెడ్డిగూడెం ఎర్రకాలువ వాటర్ స్పోర్ట్స్ టీం సత్తా చాటింది. సీనియన్ మెన్, జూనియర్ బాలుర విభాగాల్లో ఏలూరు జిల్లా తరఫున పాల్గొన్న జట్లు అత్యుత్తమ ప్రతిభ కనబరిచాయి. ఈ సందర్భంగా కోచ్లు కె.కృష్ణమూర్తి, రాజేష్లు మాట్లాడుతూ పోటీల్లో ప్రతిభ చూపి 5 బంగారు పతకాలు సాధించారని తెలిపారు. జట్టులో భాగమైన జంగారెడ్డిగూడెంకు చెందిన టి.సాయిరాం, జి.సాయిరాం, భాస్కర్, పరమాత్మ, జాన్, అఖిల్, పవన్, రెహ్మాన్, లిఖిత్, నిర్మల, నాని, కుమార్, వాసు, రాఖి, సంతోష్, రూపేష్ను వారు అభినందించారు.గోల్డ్ ఫైనాన్స్ బాధితుల ఆందోళనచింతలపూడి: స్థానిక కనకదుర్గ గోల్డ్ ఫైనాన్స్ బాధితులు తమకు న్యాయం చేయాలని సోమవారం కార్యాలయం ముందు బైఠాయించి ఆందోళన చేశారు. గత నెల 9న సంస్ధలో పని చేసే ఆడిటర్ వడ్లమూడి ఉమా మహేష్ సుమారు రూ. 3 కోట్ల విలువైన బంగారు ఆభరణాలతో పరారైన విషయం తెలిసిందే. దీంతో సంస్థ యాజమాన్యం ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. ఈ నేపధ్యంలో బంగారం తాకట్టు పెట్టిన తమకు సంస్థ ఇప్పటి వరకు ఎలాంటి హామీ ఇవ్వలేదని, ఫోన్ చేస్తే సమాధానం చెప్పడం లేదని బాధితులు వాపోయారు. -
టీఈటీపై రివ్యూ పిటిషన్ వేయాలి
భీమవరం: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టీఈటీ) విషయంలో సుప్రీంకోర్టు తీర్పుపై కేంద్ర ప్రభుత్వం రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలని పీఆర్టీయూ జిల్లా నాయకులు కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మను కోరారు. సోమవారం కేంద్రమంత్రిని మంత్రి క్యాంపు కార్యాలయంలో కలసి వినతిపత్రం అందచేశారు. ఈ సందర్బంగా పీఆర్టీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సీహెచ్ఎల్వీ చలం, ఎం.శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యదర్శి బి.త్రినాథ్ మాట్లాడుతూ.. విద్యాహక్కు చట్టం 2009 అమలులోకి రాకముందు నియామకం పొందిన ఉపాధ్యాయులను టెట్ నుంచి మినహాయించేలా ఎన్సీటీఈ మార్గదర్శకాలలో సవరణ చేయాలని, పదోన్నతి కోసం ఈవో, జీవో పరీక్షలు పాస్ అవుతున్నామని మరల టెట్ కూడా పాస్ కావాలనే నిబంధనను పునఃసమీక్ష చేయాలని కోరుతున్నట్లు చెప్పారు. -
ఎదుర్కోలు వైభవం
● స్వర్ణ హనుమంత వాహనంపై ఊరేగిన శ్రీవారు ● నేటి రాత్రి స్వామి తిరుకల్యాణం ● ఉదయం 7 గంటల నుంచి సింహ వాహనంపై గ్రామోత్సవం ● ఉదయం 8 గంటల నుంచి భజనలు ● ఉదయం 9 గంటల నుంచి భక్తిరంజని ● ఉదయం 11 గంటల నుంచి కూచిపూడి నృత్య ప్రదర్శనలు ● సాయంత్రం 4 గంటల నుంచి నాదస్వర కచేరి ● సాయంత్రం 5 గంటల నుంచి కూచిపూడి నృత్య ప్రదర్శనలు ● రాత్రి 8 గంటల నుంచి శ్రీవారి తిరుకల్యాణం, అనంతరం వెండి గరుడ వాహనంపై గ్రామోత్సవం ● ప్రత్యేక అలంకారం : మోహినీ ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమల చినవెంకన్న క్షేత్రంలో స్వామివారి ఆశ్రయుజ మాస దివ్య బ్రహ్మోత్సవాలు కన్నుల పండువగా జరుగుతున్నాయి. ఆదివారం ఉదయం నూతన స్వర్ణ హనుమంత వాహనంపై స్వామివారు క్షేత్ర పురవీధుల్లో ఊరేగుతూ భక్తకోటికి దర్శనమిచ్చారు. సాయంత్రం స్వామివారి నిత్య కల్యాణ మండపంలో జరిగిన శ్రీవారి ఎదుర్కోలు ఉత్సవం భక్తులను పరవశింపజేసింది. ఎదుర్కోలు ఉత్సవం ఇలా.. తొలుత స్వామి, అమ్మవార్లను ఆలయం నుంచి వెండి శేష వాహనంపై నిత్యకల్యాణ మండపం వద్దకు తీసుకువచ్చారు. అక్కడ విశేషంగా అలంకరించిన వేదికపై కల్యాణ మూర్తులను ఉంచి పుష్పాలంకారాలు చేశారు. అనంతరం మేళతాళాలు, మంగళ వా యిద్యాలు, అర్చకులు, పండితుల వేద మంత్రోచ్ఛరణల నడుమ ఎదుర్కోలు ఉత్సవాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అధికారులు, అర్చకులు, పండితులు, భక్తులు రెండు జట్లుగా విడిపోయి ఒక జట్టు స్వామివారి గుణగణాలను, విశిష్టతను కొని యాడారు. రెండో జట్టు అమ్మవార్ల గుణగణాలు, కీర్తిని తెలియజేశారు. స్వామి కల్యాణోత్సవానికి ముందు రోజు వధూవరుల తరపు బంధువులు శుభలేఖను పఠించేందుకు జరిపే కార్యక్రమమే ఈ ఎదుర్కోలు ఉత్సవమని పండితులు తెలిపారు. రాత్రి స్వామివారికి జరగాల్సిన వెండి శేష వాహన సేవ వర్షం కారణంగా రద్దయ్యింది. ఆలయ ముఖ మండపంలో భూ వరాహ స్వామి అలంకారంలో స్వామి దర్శనమిచ్చారు. శ్రీహరి కళాతోరణ వేదికపై జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. -
కూటమి పాలనలో ఉద్యోగులకు కష్టాలు
భీమవరం: ఉపాధ్యాయులు, ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఈనెల 7న తలపెట్టిన చలో విజయవాడ పోరుబాట కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఫ్యాప్టో చైర్మన్ పీఎస్ విజయరామరాజు, సెక్రటరీ జనరల్ జి.ప్రకాశం పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక యూటీఎఫ్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం 16 నెలల పాలనలో ఉద్యోగ, ఉపాధ్యాయుల ఆర్థిక బకాయిల విషయం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. నాలుగు డీఏల్లో కనీసం ఒక్క డీఏ కూడా ఇవ్వకపోవడం నిరాశ కలిగించింద న్నారు. 12వ పీఆర్సీ కమిషన్ను నియమించి 30 శాతం ఐఆర్ ప్రకటించాలని, ఉపాధ్యాయులను బోధనేతర కార్యక్రమాల నుంచి తప్పించాలని కోరారు. కో–చైర్మన్ సాయివర్మ, రామకృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు. భీమవరం: ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యులు చేస్తున్న రాష్ట్రవ్యాప్త ఆందోళనకు ఆశావర్కర్స్ యూనియన్ జిల్లా కమిటీ సంపూర్ణ మద్దతు తెలిపింది. స్థానిక సీఐటీయూ కార్యాలయంలో ఆదివారం జిల్లా అధ్యక్షుడు ఎండీ బేగం అధ్యక్షతన జిల్లా సమావేశం నిర్వహించారు. దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం వారం రోజులుగా పీహెచ్సీ వైద్యులు చేస్తున్న ఉద్యమం న్యాయమైందని, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వైద్యుల సంఘంతో చర్చించి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వాసుపత్రుల్లో సరైన సౌకర్యాలు, వైద్యులు లేక రో గులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారున్నారు. జిల్లా కార్యదర్శి సీహెచ్ లక్ష్మి మాట్లాడుతూ మంగళవారం ఆశా డే సందర్భంగా అన్ని పీహెచ్సీల వద్ద ఆశావర్కర్లకు జీతాలు పెంచాలని, ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలనే డిమాండ్లతో వైద్యుల ఉద్యమానికి మద్దతుగా నిరసన తెలపాలన్నారు. సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు బి.వాసుదేవరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి కె.రాజారామ్మోహన్రాయ్, ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ సభ్యులు డి జ్యోతి, లారెన్స్ కుమారి పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం అర్బన్: అఽధికారుల వేధింపుల తాళలేక శనివారం కలుపు మందు తాగిన పారిశుద్ధ్య కార్మికుడు పూనకం మునియ్య (52) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందాడు. దీంతో అతడి బంధువులు ఆస్పత్రి వద్ద ఆందోళన చేపట్టారు. మునియ్య మృతికి కారణమైన మున్సిపల్ పారిశుద్ధ్య అధికారులపై చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. పోస్టుమార్టం నిర్వహించకుండా మృతదేహాన్ని తమకు అప్పగించాలని ఆందోళన చే శారు. పట్టణ ఎస్సై బాదం శ్రీనివాస్ సంఘట నా స్థలానికి చేరుకుని మునియ్య మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. విషం తాగి ఆత్మహత్యకు పాల్పడినందున తప్పనిసరిగా పోస్టుమార్టం నిర్వ హించాలని మునియ్య బందువులకు ఎస్సై నచ్చజెప్పారు. అనంతరం మునియ్యను వేదింపులకు గురిచేసి అతడి మృతికి కారణమైన పారిశుద్ధ్య అధికారులపై పట్టణ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. ఆదివారం కావడంతో మునియ్య మృతదేహానికి సోమవారం పోస్టుమార్టం నిర్వహించనున్నట్టు పోలీసులు చెప్పారు. భీమవరం: మినిమమ్ టైమ్ స్కేల్ (ఎంటీఎస్) టీచర్లుగా 25 ఏళ్లుగా పనిచేస్తున్న 1998 డీఎస్సీ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని ఈనెల 11న విజయవాడలో విజ్ఞాపన సభ ని ర్వహించనున్నట్టు ఎంటీఎస్ యూనియన్ రా ష్ట్ర అధ్యక్షుడు చొల్లంగి కేశవకుమార్ తెలిపారు. విజ్ఞాపన సభ సన్నాహక సమావేశం ఆదివారం స్థానిక లూథరన్ హైస్కూల్లో నిర్వహించారు. టెంపరరీ ఎంటీఎస్ ఉద్యోగాలను పర్మినెంట్ చేయాలని, 62 ఏళ్ల వరకు సర్వీస్ పెంచాలని, 12 నెలల జీతం, మినిమమ్ పింఛన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తలపెట్టిన విజ్ఞాపన సభను విజయవంతం చేయాలని కోరారు. కో–ఆర్డినేటర్లు ఎం.రాజలింగం, ఎన్.అనిల్ అరవింద్కుమార్, ఎంవీ కృష్ణారావు, హేమంత్కుమార్, వీఎల్ఎన్ వేణుగోపాల్ పాల్గొన్నారు. -
డ్రైవర్ల సేవలో..నూ కూటమి కుట్ర
భీమవరం(ప్రకాశం చౌక్): బ్యాడ్జ్ కలిగిన ప్రతి ఆటో డ్రైవర్కు, ట్యాక్సీ డ్రైవర్లకు, హెవీ లైసెన్స్ కలిగిన ప్రతి లారీ, టిప్పర్ డ్రైవర్కు ఏటా రూ.15 వేలు ఆర్థికా సాయం చేస్తామని ఎన్నికల సమయంలో కూటమి పార్టీలు ఇచ్చిన హామీ నీటిమూటగా మారింది. ఆటో డ్రైవర్ల సేవలో.. పథకాన్ని ప్రారంభించిన కూటమి ప్రభుత్వం లబ్ధి కొందరు ఆటో డ్రైవర్లకు మాత్రమే అందించి వేలాది మందికి మొండిచేయి చూపించింది. నమ్మించి మోసం చేసిన కూటమి ప్రభుత్వంపై డ్రైవర్లు గుర్రుగా ఉన్నారు. ఈ పథకంలోనూ 18 రకాల నిబంధనలు పెట్టి లబ్ధిదారుల సంఖ్యను తగ్గించే కుట్ర చేసిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలో సుమారు 16 వేల మంది వరకూ ఆటో డ్రైవర్లు ఉన్నారు. వీరంతా పేద, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన వారు. తెల్ల రేషన్ కార్డు, ఏడాదికి ఆదాయం రూ.1.50 లక్షలలోపు ఉన్నా వీరిలో 8 వేల మందికి మాత్రమే ఆటో డ్రైవర్ సేవలో ప థకం కింద లబ్ధి అందించి మిగిలిన వారికి అనర్హులుగా తేల్చడంపై ఆటో డ్రైవర్లు మండిపడుతున్నారు. లబ్ధిదారులను 50 శాతానికి పరిమితం చేయడం దారుణమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జీవనం కష్టసాధ్యం అంతంతమాత్రం ఆదాయంతో ఆటోల నిర్వహణ, కష్ట సాధ్యంగా ఉన్న తరుణంలో ప్రభుత్వం అందించే సాయంలోనూ కోత విధించం తగదని డ్రైవర్లు అంటున్నారు. అప్పులు చేసి, ఫైనాన్స్లో ఆటో కొనుగోలు చేసి నడుపుతూ జీవనం పొందుతున్నామని, అయితే ప్రస్తుతం నెలావారీ వాయిదాలు చెల్లించడం కష్టసాధ్యంగా ఉందని వాపోతున్నారు. అందరికీ సాయం అందిస్తామని హామీ ఇచ్చి పథకం అమలు చేసే సమయంలో నిబంధనలు గుర్తుకు వచ్చాయా అని ప్రశ్నిస్తున్నారు. కూటమి నాయకులు ఇచ్చిన హామీ మేరకు ప్రతి ఆటో డ్రైవర్కూ ఆర్థిక సాయం అందించాలి. నిబంధనల పేరుతో కోత విధించడం దారుణం. కూటమి ప్రభుత్వం అందరికీ ఆర్థిక సాయం చేస్తుందనుకున్నాం. అయితే కొందరికే అందించారు. జిల్లాలో 16 వేల మంది డ్రైవర్లు ఉంటే 8 వేల మందికే అందించడం బాధాకరం. ఆర్థిక సాయం అందని వారిని గుర్తించి న్యాయం చేయాలి. మేనిఫెస్టోను పక్కాగా అమలు చేయాలి. –ఇంటి సత్యనారాయణ, ఆటో యూనియన్ జిల్లా అధ్యక్షుడునేను 15 ఏళ్లగా ఆటో ద్వారా ఉపాధి పొందుతున్నాను. గత ప్రభుత్వంలో నాకు వాహన మిత్ర సాయం వరుసగా అందించారు. ఇప్పుడు కూటమి పాలనలో విద్యుత్ బిల్లు ఎక్కువగా ఉందనే సాకుతో రూ.15 వేలు ఆర్థిక సాయం అందించలేదు. రెండు పోర్షన్ల ఇంటిలో నేను, మా తల్లి ఉండేవాళ్లం. రెండు మీటర్లు ఉండగా, ఇవి నా ఆధార్తో అనుసంధానం కావడం వల్ల ఆర్థిక సాయం అందించలేదు. నిబంధనలు పక్కన పెట్టి ఆటోపై బతికే ప్రతి డ్రైవర్కూ సాయం అందించారు. – చవ్వుకుల రాజేష్, ఆటో డ్రైవర్ అండలూరు ఆటోడ్రైవర్ల సేవలో పథకానికి అర్హత ఉన్నా నాకు సాయం అందించలేదు. సచివాలయానికి వెళ్లి అడిగితే అక్కడ కూడా సరైన సమాచారం లేదు. నేను 15 ఏళ్లుగా ఆటో ద్వారా ఉపాధి పొందుతున్నాను. నాకు ఎటువంటి ఆస్తిపాస్తులు లేవు. 300 యూనిట్లలోపే విద్యుత్ బిల్లు కూడా వస్తుంది. అయినా సాయం అందలేదు. అర్హత ఉన్నా కూడా ఆర్థిక సాయం అందుకోలేకపోయాను. నాలాంటి వారందరికీ ప్రభుత్వం న్యాయం చేయాలి. – పాలా విజయకుమార్, ఆటో డ్రైవర్, వేండ్ర నిబంధనల మెలిక కొందరికే ఆర్థిక సాయం జిల్లాలో ఆటో డ్రైవర్లు సుమారు 16 వేల మంది సాయం అందింది కేవలం 8 వేల మందికే.. అప్పులు, ఫైనాన్స్లతో జీవనం అగమ్యగోచరం బ్యాడ్జ్ ఉన్న వారందరికీ ఆర్థిక సాయం చేస్తామని మేనిఫెస్టోలో హామీజిల్లాలో సుమారు 16 వేల ఆటోలు ఉండగా 90 శాతం వరకూ ఆటోలను ఫైనాన్స్లో తీసుకుని డ్రైవర్లు నడుపుతున్నారు. వీరి రోజు వారీ సంపాదనలో 50 శాతం నెలవారీ వాయిదా కోసం కేటాయిస్తున్నారు. మిగిలిన దాంతో ఆటో నిర్వహణ, కుటుంబ పోషణ పరిపోని పరిస్థితి. కనీసం ఫైనాన్స్లకు వాయిదాలు చెల్లించేందుకు కూడా సొమ్ములు రావడం లేదని, కుటుంబ జీవనం కష్టంగా మారిందని వాపోతున్నారు. ఇటువంటి పరిస్థితిలో ప్రభుత్వ సాయం కూడా అందకపోతే ఎలా అని ఆవేదన చెందుతున్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు వాహన మిత్ర సాయం అందించినప్పుడు లేని నిబంధనలు ఇప్పుడు ఎందుకని అంటున్నారు. హామీ మేరకు డ్రైవర్లందరికీ లబ్ధి చేకూర్చాలని కోరుతున్నారు. గత ప్రభుత్వం అందించిన లబ్ధిని గుర్తుచేసుకుంటున్నారు. -
మద్దిలో హనుమద్ హోమం
జంగారెడ్డిగూడెం: గుర్వాయిగూడెం మద్ది క్షేత్రంలో పూర్వాభాద్ర నక్షత్రం సందర్భంగా ఆలయంలో శ్రీ సువర్ఛలా హనుమద్ కల్యాణం నిర్వహించారు. ఆలయ అర్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో కల్యాణం, అనంతరం హనుమద్ హోమం వైభవంగా నిర్వహించినట్లు ఈవో ఆర్వీ చందన తెలిపారు. ఈ కార్యక్రమాల్లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ముదినేపల్లి రూరల్: ప్రసిద్ధి చెందిన సింగరాయపాలెం–చేవూరుపాలెం సెంటర్లోని శ్రీసుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం భక్తులు పోటెత్తారు. సుదూర ప్రాంతాల నుంచి భారీసంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకుని స్వామి పుట్టలో పాలు పోసి స్వామివారిని దర్శించుకున్నారు. పాలపొంగళ్ళశాల వద్ద మహిళలు నైవేద్యాలు తయారుచేసి స్వామికి సమర్పించారు. నాగబంధాల వద్ద స్వామివారి మూర్తులను ప్రతిష్ఠించేందుకు అర్చకులతో పూజలు చేయించి ప్రతిష్ఠ తంతు నిర్వహించారు. కై కలూరు: అమ్మా.. పెద్దింట్లమ్మా.. నీ కరుణాకాటాక్షాలు మాపై అందించమ్మా.. అంటూ భక్తులు ఆర్తీతో వేడుకున్నారు. కొల్లేటికోట పెద్దింట్లమ్మ దేవస్థానంలో ఆదివారం భక్తులు రద్దీ కనిపించింది. సమీప జిల్లాల నుంచి వచ్చిన భక్తులు అమ్మవారికి వేడి నైవేద్యాలను సమర్పించారు. ఆలయ ప్రధాన ఉప అర్చకులు పేటేటి పరమేశ్వర శర్మ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఈఓ కూచిపూడి శ్రీనివాసు మాట్లాడుతూ ఒక్క ఆదివారం రోజున ప్రత్యేక, అంతరాలయ దర్శనాలు, కేశఖండన, పెద్ద, చిన్న తీర్థాలు, లడ్డు, అమ్మవారి చిత్రపఠాల విక్రయాలు, వాహనపూజలు, విరాళాల ద్వారా రూ.58,342 ఆదాయం వచ్చిందని తెలిపారు. భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించామన్నారు. అత్తిలి: అదనపు కట్నం కోసం వేఽధిస్తున్న భర్త అత్తమామలపై కేసు నమోదు చేసినట్లు హెడ్ కానిస్టేబుల్ పి.శ్రీనివాస్ తెలిపారు. ఈ ఏడాది ఫిబ్రవరి 14న అత్తిలి మండలం స్కిన్నెరపురానికి చెందిన భానుకృష్ణను ఉండి మండలం యండగండికి చెందిన గంగుల సతీష్ కుమార్కి ఇచ్చి వివాహం చేశారు. ఈ సమయంలో రూ. 40 లక్షల నగదు, 36 కాసుల బంగారం, ఐదు కిలోల వెండి పూజా సామాగ్రి ఇచ్చినట్లు తెలిపారు. భర్త జర్మనీలో ఉద్యోగం చేయడంతో పుట్టింటి నుంచి ఆస్తులు అమ్మి డబ్బు తేవాలని అత్తమామలు వేధించేవారని తెలిపారు. గత నెల 17న నిందితుడు అత్తమామల ఇంటికి వచ్చి బెదిరించడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. -
నిర్వాసితులను గాలికొదిలేశారు
ఏలూరు (టూటౌన్): పోలవరం ప్రాజెక్టు నిర్మాణ విషయంలో చంద్రబాబు ఘోరంగా విఫలమయ్యారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విమర్శించారు. ఆ పార్టీ ఏలూరు జిల్లా కార్యాలయం స్ఫూర్తి భవనంలో ఆదివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు విభజిత ఆంధ్రప్రదేశ్కు రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత పోలవరం ప్రాజెక్టును 2027కి పూర్తి చేస్తామని చెప్పటం హాస్యాస్పదంగా ఉందన్నారు. కేంద్రం ఇచ్చిన నిధులను సకాలంలో వినియోగించి యుటిలైజేషన్ సర్టిఫికెట్ ఇవ్వలేని స్థితిలో ఉండి 2027కి పోలవరం ప్రాజెక్టు ఎలా పూర్తి చేస్తారని ప్రశ్నించారు. 960 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అవకాశం ఉన్న ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాజెక్టు కోసం సర్వం త్యాగం చేసిన నిర్వాసితులను గాలికి వదిలేశారని మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టు 45.72 మీటర్ల నుంచి 41.15 మీటర్లకు ఎత్తు తగ్గిస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఎందుకు ప్రశ్నించడం లేదని ధ్వజమెత్తారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి ప్రయోజనాలను నెరవేర్చలేని దుస్థితిలో కూటమి ప్రభుత్వం ఉందన్నారు. నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణం విషయంలో రోజుకో మాట మాట్లాడుతూ ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నారని విమర్శించారు. నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణాన్ని ప్రాధాన్యత క్రమంలో జరిపేందుకు, నిర్వాసితుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం తక్షణం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి చర్చించాలని డిమాండ్ చేశారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ -
నేను మరొకరికి గాయం కలిగించక ముందే..
● గుంతల రహదారిపై వినూత్న హెచ్చరిక బోర్డులు ● అధ్వానంగా ద్వారకాతిరుమల క్షేత్ర రహదారి ద్వారకాతిరుమల : ‘నెమ్మదిగా వెళ్లండి.. నేను కు టుంబాలతో ప్రయాణించే వ్యక్తులను గాయపరుస్తున్నాను. నేను మరొకరికి గాయం కలిగించక ముందే దయచేసి నన్ను త్వరగా మరమ్మతులు చేయండి’ అంటూ ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నట్టుగా ఏర్పాటుచేసిన హెచ్చరిక బోర్డులు భీమడోలు–ద్వారకాతిరుమల క్షేత్ర ప్రధాన రహదారి దుస్థితికి అద్దం పడుతున్నాయి. భారీ గోతులతో ప్రమాదాలకు నిలయంగా మారిన రహదారిపై ఇటీవల ‘సాక్షి’లో కథనం ప్రచురితం కాగా అధికారులు గుంతల్లో మెటల్ డస్ట్ పోయించారు. అయితే రెండు రోజులకే రోడ్డు యథాస్థితికి చేరుకుంది. నిత్యం వందలాది వాహనాలు ఇటుగా ప్రయాణిస్తున్నా పూర్తిస్థాయిలో మరమ్మతులపై ప్రభుత్వం దృష్టి సారించడం లేదు. ఈ క్రమంలో గుర్తుతెలియని వ్యక్తులు పై వ్యాఖ్యలతో ఉన్న ఇంగ్లిష్ హెచ్చరిక బోర్డులను రహదారిపై పలుచోట్ల ఏర్పాటుచేశారు. బోర్డుల చుట్టూ పసుపు రంగు రేడియం స్టిక్లర్లు కూడా అతికించారు. ఇటుగా వెళుతున్న వాహనచోదకులు ఆగి మరీ బోర్డులను చదివి జాగ్రత్తగా రాకపోకలు సాగిస్తున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం కళ్లు తెరవాలని పలువురు కోరుతున్నారు. -
రైతుల భూములు లాక్కోవడం దుర్మార్గం
ఏలూరు (టూటౌన్): ప్రభుత్వం 2013 భూ సేకరణ చట్టాన్ని తుంగలో తొక్కి రైతుల భూములను ప్రాజెక్టుల పేరుతో, పరిశ్రమల పేరుతో బలవంతంగా లాక్కోవడం దుర్మార్గమని ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్ విమర్శించారు. 2013 భూ సేకరణ చట్టాన్ని అమలు చేయకపోవడం అన్యాయమన్నారు. స్థానిక అన్నే భవనంలో నిర్వహించిన సంఘ ముఖ్య నేతల సంఘ జిల్లా అధ్యక్షుడు కట్టా భాస్కరరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో నెలకొన్న రైతాంగ సమస్యలపై ఈ సందర్భంగా చర్చించి పలు తీర్మానాలు ఆమోదించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రభుత్వం స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు చేసి అన్ని పంటలకూ మద్దతు ధరలు ప్రకటించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సంఘ నేతలు ఎస్.సీతారామయ్య, కె.జలపాలు, బి.రాంబాబు, కె.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఆగిరిపల్లి: మండలంలోని శోభనాపురంలో వ్యక్తి విద్యుత్ షాక్తో మృతి చెందాడు. ఎస్సై శుభ శేఖర్ తెలిపిన వివరాల ప్రకారం మేడా తిరుపతిరావు (36) తోట రమేష్కి చెందిన పందుల ఫాంలో సహాయకుడిగా పనిచేస్తున్నాడు. ఆదివారం ఉదయం పందుల ఫాంను తిరుపతిరావు నీటితో శుభ్రం చేస్తుండగా పక్కనే ఉన్న విద్యుత్ వైర్లకు తగలడంతో విద్యుత్ షాక్ తగిలి కిందపడిపోయాడు. అక్కడ పనిచేస్తున్న సిబ్బంది వెళ్లి చూడగా అప్పటికే మృతిచెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తిరుపతి రావుకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. అనారోగ్యంతో కొన్ని రోజుల క్రితం అతని కుమారుడు మరణించాడు. ఇంతలోనే తిరుపతిరావు మరణించడంతో ఆ కుటుంబంలో విషాద చాయలు అలముకున్నాయి. -
●ముంచెత్తిన వాన.. ప్రయాణానికి హైరానా
పంగిడిగూడెంలో పోలవరం కాలువ వంతెనపై వర్షం నీటిలో రాకపోకలు అకస్మాత్తుగా ఆకాశం మేఘావృతమై జోరు వాన కురిసింది. దాదాపు గంటకు పైగా కురిసిన వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులు కాలువలను తలపించాయి. ద్వారకాతిరుమల మండలంలోని పలు గ్రామాల్లో వర్షం దంచి కొట్టడంతో పంగిడిగూడెం వద్ద పోలవరం కుడి కాలువ వంతెనపై నీరు భారీగా నిలిచిపోయింది.ద్వారకాతిరుమల క్షేత్ర ప్రధాన రహదారిలోని పంగిడిగూడెం డెయిరీ వద్ద, స్థానిక కుంకుళ్లమ్మ ఆలయ సమీపంలో రోడ్డుపై నీరు నిలిచిపోవడంతో ప్రయాణికులు రాకపోకలకు ఇబ్బంది పడ్డారు. – ద్వారకాతిరుమల -
మట్టి అక్రమ తవ్వకాలు
కొయ్యలగూడెం: తవ్వుకున్నోళ్లకు తవ్వుకున్నంత అన్న చందంగా గంగవరం మెట్ట ప్రాంతం సిరులు కురిపిస్తుంది. రాజవరం పంచాయతీ గంగవరం మెట్టగా పిలవబడే ప్రాంతం నాణ్యమైన గ్రావెల్కి పెట్టింది పేరు. దీంతో కొయ్యలగూడెం, జంగారెడ్డిగూడెం, ద్వారకా తిరుమల మండలాలకు చెందిన అక్రమార్కులు సిండికేటుగా ఏర్పడి గ్రావెల్ తవ్వకాలను భారీగా నిర్వహిస్తున్నారు. గ్రావెల్ తవ్వకాలు లాభసాటిగా ఉండటంతో అక్రమార్కులు ఏకంగా సొంతంగా లారీలనే కొనుగోలు చేసి గ్రావెల్ తవ్వకాలు కొనసాగిస్తున్నారు. తవ్వకాలను నిరోధించాల్సిన వివిధ శాఖల అధికారులకు ముందుగానే అధికార పార్టీ పెద్దలు హుకుం జారీ చేయడంతో వీళ్ళ ఇష్టారాజ్యం సాగుతోంది. భారీ వాహనాలు రాకపోకలు సాగిస్తుండడంతో వ్యవసాయ పొలాలలోకి వెళ్లే రహదారులు అధ్వాన్నంగా మారుతున్నాయని అసలే వర్షాకాలం కావడంతో భారీ గోతులు పడి ప్రమాదాలకు కారణం అవుతున్నాయని రైతులు వాపోతున్నారు. గంగవరం ప్రాంతంలో గట్టి నిఘా ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. -
ఉపాధి హామీలో ప్రభుత్వ చర్యలు విడ్డూరం
భీమవరం: ఉపాధి హామీలో అవినీతి నిర్మూలనకు ప్రభుత్వ చర్యలు విడ్డూరంగా ఉన్నాయని ఎమ్మెల్సీ బి.గోపిమూర్తి అన్నారు. ఏపీ వ్యవసాయ కా ర్మిక సంఘం జిల్లా 33వ మహాసభల కరపత్రాన్ని ఆదివారం ఆవిష్కరించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ఉపాధి హామీలో ఈకేవైసీ ఆధార్ అనుసంధానం పైలెట్ ప్రాజెక్టుగా కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో ప్రారంభించారని, అయితే ఎన్ఎంఎంఎస్ యాప్ వల్ల ఇబ్బందులు పడుతున్న ఉపాధి కూలీలకు ఈకేవైసీ విధానం మరిన్ని ఇబ్బందులు తెచ్చిపెట్టిందన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే నిధులు, పని దినాలు, వేతనాలు, సౌకర్యాలు పెంచాలన్నారు. జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బాతిరెడ్డి జార్జి, జక్కంశెట్టి సత్యనారాయణ మాట్లాడుతూ వ్యవసాయ కార్మిక సంఘం 33వ మహాసభ నవంబర్ 10, 11వ తేదీల్లో అత్తిలిలో నిర్వహించనున్నామన్నారు. జిల్లా ఉపాధ్యక్షుడు కవురు పెద్దిరాజు, కండెల్లి సోమరాజు, జె.వెంకటలక్ష్మి, సహాయ కార్యదర్శులు బల్ల చిన వీరభద్రరావు తదితరులు పాల్గొన్నారు. భీమవరం (ప్రకాశంచౌక్): స్వచ్ఛాంధ్ర–స్వర్ణాంధ్ర జిల్లాస్థాయి అవార్డుల ప్రదానోత్సవాన్ని సోమవారం కలెక్టరేట్లోని పరేడ్ గ్రౌండ్లో నిర్వహించనున్నట్టు కలెక్టర్ సీహెచ్ నాగరాణి తెలిపారు. జిల్లాకు ఒక రాష్ట్రస్థాయి, 49 జిల్లాస్థాయి అవార్డులు వరించాయన్నారు. పలువురు ప్రముఖులు హాజరవుతారన్నారు. -
చిరుద్యోగులపై పచ్చ ప్రతాపం
ఏలూరు (టూటౌన్): ప్రభుత్వం ఇచ్చే నామమాత్రపు గౌరవ వేతనం రూ.8 వేలతో కాలం వెళ్లదీస్తున్న వీవోఏలపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తోంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వారి జీవితాల్లో చీకట్లు కమ్ముకున్నాయి. తెలుగు తమ్ముళ్ల వేధింపులు, బెదిరింపులు ఎక్కువయ్యాయి. మీరు ఉద్యోగాల్లోంచి తప్పుకుంటే మా మనుషులను పెట్టుకుంటామంటూ బెదిరింపులకు దిగుతున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్డెక్కి ధర్నాలు, నిరసనలకు దిగితే ఊరుకునేది లేదని.. మొత్తం అందరినీ విధుల్లోంచి తొలగిస్తామంటూ బెదిరిస్తున్నారు. ఏలూరు జిల్లా వ్యాప్తంగా మొత్తం 39,539 డ్వాక్రా గ్రూపులు ఉన్నాయి. వీటి పరిధిలో 3,89,801 మంది సభ్యులు ఉన్నారు. గ్రామ సమాఖ్యలు 1300 వరకు ఉన్నాయి. వీటి పరిధిలో 1300 మంది వీవోఏలు పనిచేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన ఆరు నెలల వ్యవధిలోనే 150 మందిని ఎలాంటి కారణాలు లేకుండా తొలగించారు. స్థానిక తెలుగు తమ్ముళ్లు చెప్పినట్లు వింటేనే విధుల్లో ఉండండి లేకుండా రాజీనామాలు చేసి వెళ్ళిపోండి అని బెదిరిస్తున్నారు. లింగపాలెం మండల పరిధిలో 11 మందిని తెలుగు తమ్ముళ్ళు విధుల్లోంచి తొలగించేలా చేసారు. వీరిలో ఏడుగురు ఎస్సీలు ఉండటం గమనార్హం. వీరంతా కలిసి కోర్టుకు వెళ్ళారు. కోర్టు సైతం వారిని విధుల్లో కొనసాగించాలంటూ ఉత్తర్వులు ఇచ్చింది. వీరు ఇంతకు ముందు పనిచేసే చోట కొత్తవారిని నియమించేసారు. దీంతో 11 మంది కోర్టు ఉత్తర్వులను అమలు చేయాలని కోరుతూ డీఆర్డీఏ అధికారులు, స్పందనలో కలెక్టర్కు తమ గోడు మొరపెట్టుకున్నారు. కోర్టు ఆదేశాలు ఉన్నప్పుడు ఇబ్బంది ఏమి ఉంది వెళ్లి మీ విధులు మీరు చేసుకోండి అని చెప్పి పంపించేస్తున్నారు. తీరా అక్కడకు వెళ్ళాక ఆ మండల ఏపీఎం వీరితో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులతో ఒక్క మాట చెప్పి మిమ్మళ్లను విధుల్లోకి తీసుకుంటామంటూ చెప్పడంతో బాధితులు ఎవ్వరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. అందని వేతనాలు జిల్లా వ్యాప్తంగా వీవోఏలకు నెల నెలా వేతనాలు విడుదల చేయడం లేదు. అసలే ఇచ్చేది నామమాత్రపు వేతనం. అదీ నెల నెలా ఇవ్వకపోవడం పట్ల వీవోఏలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. గట్టిగా అడిగితే స్థానిక ప్రజాప్రతినిధులు ఇష్టముంటే చేయండి లేకుంటే తప్పుకోండి అంటూ సమాధానం ఇస్తుండటంతో వీవోఏలు మౌనంగానే వేతనాలు రాకపోయినా తమ పని తాము చేసుకుని వెళుతున్నారు. వీఓఏల ప్రధాన డిమాండ్లు బకాయి వేతనాలు చెల్లించాలి. ఆన్లైన్ పని భారం తగ్గించాలి. 5జీ మొబైల్స్ అందించాలి. కాలపరిమితి సర్క్యులర్ రద్దు చేయాలి. వేతనాలు పెంచాలి. హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలి. రూ.10 లక్షల గ్రూప్ బీమా కల్పించాలి. అర్హులైన వారికి సీసీలుగా ప్రమోషన్లు కల్పించాలి. జిల్లాలోని వీవోఏలపై కూటమి నాయకుల వేధింపులు వేధింపులు తట్టుకోలేక రాజీనామాలు తెలుగు తమ్ముళ్లకు వత్తాసు పలుకుతున్న డీఆర్డీఏ ఏపీఎంలు, సీసీలు -
హత్యకేసులో ఆరుగురి అరెస్ట్
● రెండు రోజుల్లోనే కేసును చేధించిన పోలీసులు ● చోరీ సొత్తు పంపకాల్లో విభేధాలే హత్యకు కారణం: పోలీసులు జంగారెడ్డిగూడెం: జంగారెడ్డిగూడెం పట్టణంలో జరిగిన హత్యకేసును పోలీసులు రెండు రోజుల్లోనే చేధించారు. ఆరుగురు నిందితులను అరెస్టు చేసినట్లు డీఎస్పీ యు.రవిచంద్ర వెల్లడించారు. ఆదివారం స్థానిక పోలీసు సర్కిల్ కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం వరంగల్ జిల్లాలో చేసిన దొంగతనాలకు సంబంధించి చోరీ సొత్తు పంపకాల విషయంలో జరిగిన విభేదాల కారణంగా పాత నేరస్తుడు కర్రి రాజేష్ (26) హత్యకు దారి తీసినట్లు చెప్పారు. ఈ కేసులో పట్టణానికి చెందిన షేక్ ఖాసిం, అతని అన్నలు షేక్ నాగుల్ మీరా, షేక్ జహీరుద్దీన్ అలియాస్ చోటు, వాసంశెట్టి పవన్కుమార్ అలియాస్ స్కైలాబ్, సమ్మంగి మంగరాజు, మరీదు సాయి అలియాస్ సైకో సాయిలను అరెస్టు చేసినట్లు డీఎస్పీ చెప్పారు. కర్రి రాజేష్, షేక్ ఖాసిం తదితరులు కలిసి దొంగతనాలు చేసేవారని, గతంలో వరంగల్ జిల్లాలో చేసిన దొంగతనాల్లో సొత్తు పంపకాల విషయంలో విభేదాలు తతెత్తినట్లు చెప్పారు. జంగారెడ్డిగూడెంలో పోలీసులు గతంలో రాజేష్ను అరెస్టు చేసినప్పుడు ఖాసిం తదితరుల పేర్లు పోలీసులకు చెప్పడంతో వీరి మధ్య విభేదాలు తలెత్తాయి. ఈ నేపధ్యంలో తమకు కోర్టులో బెయిల్ కోసం రూ.2 లక్షల వరకు ఖర్చు అయ్యాయని, ఖాసిం తదితరులు బెయిల్ కోసం ఖర్చుచేసిన డబ్బులు ఇవ్వాలని రాజేష్ను ఒత్తిడి చేశారు. అప్పటి నుంచి రాజేష్ తప్పించుకుని తిరుగుతుండగా, వీరి మధ్య వివాదం ముదిరింది. గత నాలుగైదు నెలల క్రితం ఖాసింను చంపేందుకు కర్రి రాజేష్ పథకం రూపొందించగా, అది విఫలమైంది. అది తెలుసుకున్న ఖాసిం, అతని సోదరులు నాగుల్ మీరా, జహీరుద్దీన్ రాజేష్ను అంతమొందించాలని పథకం వేశారు. ఈ నెల 3న రాజేష్ను అతని ఇంటికి వెళ్లి వెంబడించి తీసుకువెళ్లి స్థానిక బైనేరు ఒడ్డున ఖాసిం ముఠా హత్య చేసింది. ఆరుగురు కలిసి రాజేష్ను తీవ్రంగా కొట్టి, టవల్తో కాళ్లు కట్టేసి, పలు సార్లు కత్తితో పొడిచి గొంతు కోసి, చాకుతో పొడిచి పేగులు బయటకు వచ్చేలా దారుణంగా హత్య చేశారని డీఎస్పీ వివరించారు. హత్యకు ఉపయోగించిన రెండు చాకులు, రెండు మోటార్సైకిళ్లు, ఒక స్కూటీ, ఐదు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. నిందితులపై పలు స్టేషన్లలో కేసులు నిందితులు షేక్ ఖాసింపై సస్పెక్ట్ షీట్ ఉందని, కొయ్యలగూడెం, జంగారెడ్డిగూడెం, నల్లజర్ల, వరంగల్లో పలు కేసులు ఉన్నట్లు చెప్పారు. నాగుల్ మీరాపై జంగారెడ్డిగూడెం, వరంగల్, స్కైలాబ్పై జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెంలలో, మంగరాజు, చోటు, సైకో సాయిలపై జంగారెడ్డిగూడెం స్టేషన్లో కేసు ఉన్నట్లు డీఎస్పీ చెప్పారు. వీరిపై రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని, అవసరమైతే పీడీ యాక్ట్ అమలు చేస్తామన్నారు. -
కొత్త బస్సులకు నిధులు కేటాయించాలి
తణుకు అర్బన్: ఆర్టీసీలో కొత్త బస్సుల కోసం నిధులు కేటాయించకుండా సీ్త్ర శక్తి పథకాన్ని ప్రారంభించారని, కొత్త బస్సులకు నిధులు కేటాయించాలని ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ (ఎస్డబ్ల్యూఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్ సుందరయ్య అన్నారు. ఫెడరేషన్ పశ్చిమగోదావరి జిల్లా రెండో మహాసభలు ఆదివారం తణుకు అమరవీరుల స్మారక భవనంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉచిత బస్సు పథకం ప్రారంభమైన నెల రోజుల్లోనే కండక్టర్లు, డ్రైవర్లపై వేధింపులు, కేసులు, 60 మందికిపైగా సస్పెన్షన్లు నమోదయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. పథకం ఉద్యోగులను వేధించే పథకంగా మా రకూడదని, కొత్త బస్సులు వేసి ఉద్యోగులను నియమించాలని డిమాండ్ చేశారు. విద్యుత్ బస్సుల సాకుతో..విద్యుత్ బస్సుల సాకుతో ఆర్టీసీలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించే చర్యలు వెంటనే ఆపాలని, తొలి దశలో ప్రధాన నగరాల్లోని 2 డిపోలను, రెండో దశలో 19 డిపోలను ప్రైవేట్ విద్యుత్ బస్సు ఆపరేటర్లకు అప్పజెప్పేలా సన్నాహాలు జరుగుతున్నాయని సుందరయ్య విమర్శించారు. జిల్లా అధ్యక్షుడు టీవీఎస్ మూర్తి జెండా ఆవిష్కరణ చేసి మహాసభకు అధ్యక్షత వహించారు. జిల్లా కార్యదర్శి ఏఎస్ రాయుడు, రాష్ట్ర ప్రచార కార్యదర్శి టీపీఆర్ దొర, డిపో కార్యదర్శులు ఎన్.శ్రీనివాస్, ఆర్.ఆంజనేయులు, నరసింహారావు, కట్ట సత్యనారాయణ, సీఐటీయూ జిల్లా నాయకులు కామన మునిస్వామి తదితరులు పాల్గొన్నారు. -
రాజకీయాలతో ముడిపెట్టి వేధింపులు
లింగగూడెంతో గత పదేళ్లుకు పైగా ంఆవోఏగా కొనసాగుతున్నాను. ని భర్త గత ఎన్నికల్లో వైఎస్సార్సీపీలో తిరిగారనే సాకుతో ఉద్యోగానికి రాజీనామా చేయాలని కోరుతున్నారు. స్థానిక నేతలు నేరుగానే బెదిరింపులకు దిగుతున్నారు. రాజకీయాలతో ముడిపెట్టి వేధింపులు, ఇబ్బందులకు గురిచేయడం ఎంత వరకు సమంజసం. మల్లెల్లి ద్వారకా, లింగగూడెం, చింతలపూడి మండలం ఉంగుటూరు మండలం బొమ్మిడిలో 2009 నుంచి పనిచేస్తున్నారు. ఇటీవల ఎన్నికల అనంతరం గ్రామానికి చెందిన టీడీపీ నేత మానాలని వేధింపులకు దిగారు. దీంతో వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యాయత్నం చేశాను. బంధువులు సకాలంలో ఆస్పత్రికి తరలించడంతో బతికి బయటపడ్డా. కుటుంబ సభ్యులకు మాత్రం రూ.1.80 లక్షల ఖర్చు మిగిల్చింది. వంపుగడప శారద, బొమ్మిడి, ఉంగుటూరు మండలం విధుల్లోంచి తొలగించిన వీవోఏలను తక్షణం విధుల్లోకి తిరిగి తీసుకోవాలి. వారికి గత ఐదు నెలలుగా బకాయి పడ్డ వేతనాలు విడుదల చేయాలి. ఎక్కడైనా ఎవరైనా తప్పు చేస్తే వారిపై శాఖపరమైన విచారణ చేపట్టి అవసరమైన చర్యలు తీసుకోవాలే తప్ప ఈ విధంగా చేయడం తగదు.రాజకీయ వేధింపులు, కక్ష సాధింపు ధోరణులు అమానవీయం. ఆర్.లింగరాజు, జిల్లా అధ్యక్షుడు, సీఐటీయూ, ఏలూరు వీవోఏలకు జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో నేరుగా వార్నింగ్లు ఇస్తున్నారు. మీరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్డెక్కి ఆందోళనలు, నిరసనలు చేస్తే సహించేది లేదని హెచ్చరిస్తున్నారు. చింతలపూడి మండలంలో ఒక టీడీపీ నాయకుడు ఏకంగా ఎవరూ రోడ్డెక్కడానికి వీల్లేదని అతిక్రమిస్తే ఆ రోజు నుంచి విధుల్లోకి రావాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. ఎస్కె.సుభాషిణి, వీవోఏల సంఘం జిల్లా కార్యదర్శి, ఏలూరు -
వేద నిలయం.. ఇరగవరం
పాలేశ్వర స్వామివారు కొలువై ఉన్న ఈ గ్రామంలో జన్మించడం పూర్వజన్మ సుకృతం. స్వామి వారి అనుగ్రహంతోనే గ్రామం వేద నిలయంగా పేరొందింది. ఉమ్మడి రాష్ట్రవ్యాప్తంగా సామాన్యుల నుంచి సినీ, రాజకీయ ప్రముఖులు, పారిశ్రామిక, వ్యాపార వేత్తలు ఎంతో మందికి జ్యోతిష్యం, వాస్తు సలహాలు చెప్పడం, ఆలయ నిర్మాణాలకు యజ్ఞయాగాది క్రతువులు నిర్వహించే భాగ్యం కలగడం పరమేశ్వరానుగ్రహంగా భావిస్తాం. – తంగిరాల ప్రదీప్ సిద్ధాంతి, శ్రీపంచముఖి హనుమద్ పీఠం, ఇరగవరం సాక్షి, భీమవరం/ ఇరగవరం: తణుకు నియోజకవర్గంలో మండల కేంద్రంగా ఉన్న ఇరగవరం జనాభా 5585 మంది. కుటుంబాల సంఖ్య 1825. వీరిలో 250 వరకు బ్రాహ్మణ కుటుంబాల వారు ఉన్నారు. చాలా కుటుంబాల్లో వేదం, ఆగమనం, శాస్త్రం, జ్యోతిష్యం, స్మార్థం, మంత్ర శాస్త్రం తదితర కళలను అవపోసన పట్టి వేదపండితులు, ఘనాపాఠీలు, సిద్ధాంతులుగా ప్రసిద్ధి చెందినవారు ఉంటారు. తిరుమల తిరుపతి, విజయవాడ ఇంద్రకీలాద్రి, అన్నవరం సత్యనారాయణస్వామి, సింహాచలం అప్పన్న తదితర రాష్ట్రవ్యాప్తంగా పేరొందిన ఎన్నో దేవాలయాలు, వేద పాఠశాలల్లోని ప్రముఖ వేద పండితుల్లో అధికంగా ఇరగవరం మూలాలు ఉన్నవారే ఉంటారని ప్రసిద్ధి. వేదాభివృద్ధికి చేసిన కృషికి సాంగత్రి వేదాచార్య, అహోరాత్రి పారాయణ, వేద తపస్వి, నిత్యాగ్నిహోత్రులుగా ప్రముఖుల నుంచి సత్కారాలు, పురస్కారాలను, గండభేరుండాలను అందుకున్నవారు ఎంతోమంది ఉన్నారు. ఎందరో మహానుభావులు... వేదాధ్యయనం చేసిన బ్రాహ్మణుడు సాక్షాత్తూ పరమేశ్వర స్వరూపంగా భావిస్తారు. రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డును అందుకున్న బ్రహ్మశ్రీ తంగిరాల బాలగంగాధరశాస్త్రి, దేశవ్యాప్తంగా అనేక చోట్ల అహోరాత్ర వేదపారాయణలు చేసిన బ్రహ్మశ్రీ గుళ్ల్లపల్లి ఆంజనేయ ఘనాపాటి, యావత్ జీవితాన్ని వేదానికి అంకితం చేసిన గుళ్లపల్లి సీతారామశాస్త్రి, నిత్యాగ్నిహోత్రకులుగా, పంచాంగకర్తలుగా పేరొందిన సోమయాజి, ప్రేసపాటి పాలశంకర అవధాని, సంస్కృతంలోని ఆరు గ్రంథాలను తెలుగులోకి అనువదించిన గుళ్లపల్లి శ్రీరామశర్మ, ప్రముఖ సిద్ధాంతిగా పేరొందిన పీసపాటి వెంకప్ప సోమయాజి తదితర ఎందరో వేద పండితులు ఈ గ్రామానికి చెందినవారే. గ్రామానికి చెందినవారు ఎందరో తంగిరాల కృష్ణానందతిలక, తంగిరాల రామసోమయాజులు, పీసపాటి సుబ్బరాయశాస్త్రిలు స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొని తామ్రపత్రాలు పొందారు. వీరిలోని తంగిరాల రామసోమయాజులు 36 ఏళ్లు ఏకగ్రీవంగా గ్రామ సర్పంచ్గా సేవలందించారు. 1962లో అష్ట గ్రహ కూటమి వచ్చి అరిష్టాలు సంభవించినప్పుడు ప్రముఖ మంత్రవేత్త తంగిరాల సుబ్రహ్మణ్య సిద్ధాంతి, తంగిరాల బాలగంగాధర శాస్త్రి, పేసపాటి వెంకప్ప సోమయాజి సిద్ధాంతి తదితరులు దేశ క్షేమం కోసం 12 రోజులు స్వామివారికి అతిరుద్ర యాగం నిర్వహించినట్టుగా పెద్దలు చెబుతారు. ప్రస్తుత తరంలోనూ గ్రామానికి చెందిన ఎందరో వేదపండితులు పెద్దలు చూపిన మార్గంలో నడుచుకుంటూ దేశవ్యాప్తంగా జ్యోతిష్య, వాస్తు విషయాలపై ప్రజలకు పరిష్కార మార్గాలను చూపుతూ వేదాభివృద్ధికి కృషి చేస్తున్నారు. సినీ, రాజకీయ ప్రముఖులు ఎందరో ఇక్కడికి వచ్చి పూజలు చేయించుకుంటుంటారు. బ్రహ్మశ్రీ గుళ్లపల్లి సీతారామశాస్త్రి కుటుంబ సభ్యులు గ్రామంలో నిర్వహిస్తున్న శ్రీ కామకోటి చంద్రశేఖర వేద పాఠశాల ద్వారా ఎంతోమంది విద్యార్థులు వేద విద్యను అభ్యసిస్తున్నారు. ఇరగవరంలో పూజలు నిర్వహిస్తున్న సినీ నటుడు శ్రీకాంత్ (ఫైల్) వేదపఠనం చేస్తున్న విద్యార్థులుపూర్వం బ్రాహ్మణులు ఇరగవరంలో నిత్యం యజ్ఞయాగాది క్రతువులు చేసేవారు. వేద ప్రియుడైన ఈశ్వరుడు ఈ గ్రామానికి వచ్చి ఆకలితో పిల్లిగా మారి అక్కడి ఉట్టిలోని పాలు, పెరుగు, నెయ్యి ఆరగించేవారని చెబుతారు. పూజకు వినియోగించే ఈ ద్రవ్యాలు రోజూ మాయమైపోతుండటం చూసి గోసంరక్షకుణ్ణి కాపలాగా ఉంచారని, పిల్లి పాలు తాగుతుండటాన్ని గమనించి గొడ్డలితో కొట్టగా తల నాలుగు ముక్కలైందని, పిల్లి శరీరాన్ని విడిచిన ఈశ్వరుడు వేదపండితులు, పెద్దలకు కలలో ప్రత్యక్షమై పిల్లి శరీరం పడిన చోట ఉద్భవించిన శివలింగానికి ఆలయం నిర్మించాలని చెప్పాడని ఇక్కడ బహుళ ప్రాచుర్యంలో ఉంది. పాలగుండం, పాల వృక్షాల వనం, పాలరాతి శివలింగం, పాలబుడ్డి ఆకారంలో గుడి, పాలేశ్వరస్వామి వారి పేర్లతో పంచపాల క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. పాలబుడ్డి ఆకారంలోని శివలింగాన్ని యోగ లింగంగా చెబుతారు. వేదః శివః శివో వేదః వేదాధ్యాయి సదా శివః వేదమే శివుడు. శివుడే వేదం. ఈశ్వరుని ఉచ్ఛ్వాస, నిశ్వాసాలే వేదాలుగా చెబుతారు. ఆ పరమేశ్వరుడే స్వయంభువుగా వెలసి పాలేశ్వరునిగా పూజలందుకుంటున్న గ్రామం. యజ్ఞయాగాదులు, నిత్య వేదఘోషతో వేద నిలయంగా పేరొందింది పశ్చిమగోదావరి జిల్లా ఇరగవరం. గ్రామం నుంచి వేద పండితులుగా, సిద్ధాంతులుగా, ఘనాపాఠీలుగా ఎంతోమంది దేశవ్యాప్తంగా ఖ్యాతి పొందారు. పాలేశ్వరుడు కొలువైన గ్రామం వేదపండితులు, ఘనాపాఠీలు, సిద్ధాంతులకు ప్రసిద్ధి ప్రముఖ ఆలయాల్లోని వేదపండితుల్లో పలువురు ఈ గ్రామ మూలాలు ఉన్నవారే -
చిన్నతిరుపతి క్షేత్రం.. భక్తజన సంద్రం
ద్వారకాతిరుమల: చిన్నతిరుపతి క్షేత్రం శనివారం భక్తజన సంద్రమైంది. శ్రీవారికి ప్రీతికరమైన రోజు, అందులోనూ దసరా సెలవులు ముగియడంతో ఊళ్లకు వెళ్తున్న వారు, విజయవాడ దుర్గమ్మ ఆలయంలో ఇరుముడులు సమర్పించిన భవానీ భక్తులు వేలాదిగా ఆలయానికి తరలివచ్చారు. దాంతో తెల్లవారుజాము నుంచి ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడాయి. తూర్పురాజగోపుర ప్రాంతం, అనివేటి మండపం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్, దర్శనం క్యూలైన్లు, ప్రసాదం, టికెట్ కౌంటర్లు, కల్యాణ కట్ట, అన్నదాన విభాగాల వద్ద భక్తులు పోటెత్తారు. కొండపై, అలాగే కొండ కింద గుడి సెంటర్లో ఎక్కడ చూసినా భక్తులే కనిపించారు. రాత్రి వరకు ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగింది. పలు భజనల మండలి సభ్యులు అనివేటి మండపంలో ప్రదర్శించిన కోలాట నృత్యాలు చూపరులను ఆకట్టుకున్నాయి. -
చంద్రబాబు దళిత ద్రోహి
పెనుగొండ: ముఖ్యమంత్రి చంద్రబాబు దళిత ద్రోహిగా చరిత్రలో నిలిచిపోతారని ఆచంట నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు పిల్లి రుద్ర ప్రసాద్ విమర్శించారు. చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం దేవళంపేటలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి నిప్పు పెట్టడంపై నిరసన వ్యక్తం చేస్తూ ఆచంటలో అంబేడ్కర్ విగ్రహానికి క్షీరాభిషేకం చేసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు సుంకర సీతారామ్, కోట వెంకటేశ్వరరావు మాట్లాడుతూ అంబెడ్కర్ భావజాలంపై టీడీపీ మొదటి నుంచి విషం జిమ్ముతుందని అన్నారు. సీఎం సొంత జిల్లాలోనే ఇలాంటి దురగతం జరగడం బాధాకరమన్నారు. ఘటనకు కారణమైన టీడీపీ నేత సతీష్ నాయుడు పై అట్రాసిటీ కేసు నమోదు చేసి, కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు తప్పేట్ల వెంకట్రావు, చదలవాడ ఆనంద్, పీతల అంబేడ్కర్, చదలవాడ ముత్యాల రావు, కొంబోత్తుల దుర్గా ప్రసాద్, పుచ్చకాయల నాగార్జున, వడ్లపాటి అంబేడ్కర్, కోట గిరిధర్, పుచ్చకాయల భీమారావు, వడ్లపాటి నవీన్, వేమన అప్పారావు తదితరులు పాల్గొన్నారు. -
మున్సిపల్ కార్మికుడి ఆత్మహత్యాయత్నం
తాడేపల్లిగూడెం అర్బన్ : తాడేపల్లిగూడెం మున్సిపాల్టీలో పారిశుద్ధ్య కార్మికుడిగా ఔట్ సోర్సింగ్ విధానంలో విధులు నిర్వహిస్తున్న పూనకం మునియ్య కలుపు మందు తాగి శనివారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వార్డు శానిటరీ సెక్రటరీ, శానిటరీ ఇన్స్పెక్టర్ తనను వేధిస్తున్నారని వారి వేధింపులు తాళలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డానని బాధితుడు తెలిపాడు. మునియ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. పెదపాడు: గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఆటోలో ప్రయాణిస్తున్న ఎనిమిది మందికి గాయాలైన సంఘటన కలపర్రు టోల్గేట్ సమీపంలోని బాపులపాడు మండలం బొమ్ములూరులో పరిధిలో చోటు చేసుకుంది. బాపులపాడు హనుమాన్ జంక్షన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రాజమండ్రి నుంచి విజయవాడకు ఆటోలో 8 మంది బయలు దేరారు. కలపర్రు టోల్ గేట్ దాటి కృష్ణా జిల్లా బాపులపాడు మండలం బొమ్ములూరు సమీపంలోకి వచ్చేసరికి గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న ఏడుగురికి స్వల్ప గాయాలు కాగా, మరో వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. దీంతో వారిని ఏలూరు ప్రభుత్వాసుపత్రికి అంబులెన్స్లో తరలించారు. -
దేదీప్యం.. దివ్య తేజం
● సూర్యప్రభ వాహనంపై ఊరేగిన శ్రీవారు ● సరస్వతీదేవి అలంకరణలో దర్శనం ● మూడో రోజుకు చేరిన శ్రీవారి బ్రహ్మోత్సవాలు బ్రహ్మోత్సవాల్లో నేడు ● ఉదయం 7 గంటల నుంచి హనుమద్వాహనంపై శ్రీవారి తిరువీధి సేవ ● ఉదయం 8 గంటల నుంచి భజన కార్యక్రమాలు ● ఉదయం 9 గంటల నుంచి భక్తిరంజని ● ఉదయం 10 గంటల నుంచి కూచిపూడి నృత్య ప్రదర్శనలు ● సాయంత్రం 4 గంటల నుంచి నాదస్వర కచేరి ● సాయంత్రం 5 గంటల నుంచి కూచిపూడి నృత్య ప్రదర్శనలు ● రాత్రి 7 గంటల నుంచి ఎదుర్కోలు ఉత్సవం, అనంతరం వెండి శేషవాహనంపై గ్రామోత్సవం ● శ్రీవారి ప్రత్యేక అలంకారం : భూ వరాహ స్వామి ద్వారకాతిరుమల: చైతన్యమూర్తినే వాహనంగా మలచుకుని విహరించిన కలియుగ వైకుంఠవాసుడిని వీక్షించిన భక్తజనులు పులకించారు. ద్వారకాతిరుమల శ్రీవారి ఆశ్వయుజమాస దివ్య బ్రహ్మోత్సవాల్లో మూడో రోజు శనివారం ఉదయం సూర్యప్రభ వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. సూర్యుడు తేజోనిధి.. సకల రోగాలను నివారిస్తాడు. అందుకే వాహన సేవల్లో ఈ వాహనానికి అత్యంత ప్రాధాన్యం. తొలుత ఆలయంలో పంచాయుధాలను ధరించి నారాయణమూర్తి అలంకరణలో సూర్యప్రభ వాహనాన్ని అధిరోహించిన శ్రీవారికి అర్చకులు విశేష పుష్పాలంకారాలు చేసి హారతులిచ్చారు. అనంతరం ఆలయ ప్రధాన రాజగోపురం మీదుగా వాహనం క్షేత్ర పురవీధులకు పయనమైంది. తిరువీధుల్లో ఊరేగిన శ్రీవారికి భక్తులు నీరాజనాలు అర్పించారు. సూర్యప్రభ వాహనంపై ఉన్న స్వామివారిని దర్శిస్తే సకల విద్య, ఆరోగ్య, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని పండితులు తెలిపారు. ఇదిలా ఉండగా రాత్రి జరగాల్సిన చంద్రప్రభ వాహన సేవ వర్షం కారణంగా రద్దయ్యింది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలు అలరిస్తున్నాయి. భరత నాట్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. చదువుల తల్లిగా శ్రీవారు : బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శ్రీవారు ఆలయ ముఖ మండపంలో చదువుల తల్లి సరస్వతీ దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఈ అలంకారంలోని స్వామిని దర్శిస్తే ఇతి బాధలు ఉండవని, విద్య అపారంగా కలుగుతుందని పండితులు చెబుతున్నారు. సరస్వతీదేవి అలంకారంలో శ్రీవారు -
నేవీ డిపోపై పోరుబాట
వంకావారిగూడెం పరిసర ప్రాంతాల్లో సాగు భూ ములు ఎక్కువగా ఉన్నా యి. పత్తి, వేరుశెనగ, ఆ యిల్పామ్ వంటి పంటలు పండించుకుంటున్నాం. ఆ భూములను ప్రభుత్వం తీసుకోవాలని చూస్తే ఊరుకోం. ఆ భూములే మాకు జీవనాధారం. నేవీ డిపో ఏర్పాటును మేం వ్యతిరేకిస్తున్నాం. మా అభిప్రాయాన్ని ప్రభుత్వం గౌరవించాలి. – తెల్లం సోమరాజు, రైతు, వంకావారిగూడెం నాకు రెండున్నర ఎకరాల భూమి ఉంది. వరి, వేరుశనగ పండిస్తూ జీవనం సాగిస్తున్నాను. మా భూములను బలవంతంగా లాక్కునే ప్రయత్నం అధికారులు, పాలకులు చేస్తున్నారు. దీని వల్ల తీవ్రంగా నష్టపోతాం. మా భూములు తీసుకుంటే పూర్తిగా జీవనాధారం కోల్పోతాం. మా నిర్ణయాన్ని గౌరవించకపోతే ఎంతటి పోరాటానికై నా సిద్ధం. – బుద్దుల తులసమ్మ, రైతు, వంకావారిగూడెం సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఏలూరు జిల్లా గిరిపల్లెల్లో నేవీ డిపో ఏర్పాటుపై నిప్పు రాజుకుంది. గిరిజనులు ముక్తకంఠంతో వ్యతిరేకిస్తూ గ్రామసభలో వ్యతిరేక తీర్మానాలు చేసినా సర్కారు దూకుడు కొనసాగిస్తూనే ఉంది. ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ ప్రత్యేక ఆసక్తితో పల్లెలు వ్యతిరేకిస్తున్నా ప్రాజెక్టు ఏర్పాటుకు చకచకా ముందుకు సాగడంపై తీవ్ర నిరసనలు కొనసాగుతున్నాయి. జీలుగుమిల్లి మండలం వంకావారిగూడెంలో డిపో ఏర్పాటును నిర సిస్తూ మూడుసార్లు గ్రామసభలు డిపో వద్దంటూ తీర్మానం చేసినప్పటికీ అక్కడే డిపో పెడతామని ముందుకు సాగడంపై గిరిజన సంఘాలు మండిపడుతున్నాయి. ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం వంకావారిగూడెం పంచాయతీలో నేవీ ఆయుధ డిపో ఏర్పాటుకు ముమ్మర ప్రయత్నాలు సాగుతున్నాయి. 1,166 ఎకరాల నాణ్యమైన సాగుభూమిని సేకరించడానికి వీలుగా అధికార యంత్రాంగం సన్నద్ధమైంది. వంకావారిగూడెం పంచాయతీ పరిధిలో దాట్లగూడెం, రమణక్కపేట, మడకంవారిగూడెం, వంకావారిగూడెం, తదితర గ్రామాల పరిధిలో 1,166 ఎకరాలు సేకరిస్తున్నారు. భూ సేకరణకు, ప్రాజెక్టుకు వ్యతిరేకంగా మూడుసార్లు గ్రామసభలు నిర్వహించి వ్యతిరేకంగా తీర్మానాలు చేశారు. అయినా సర్కారు హడావుడి కొనసాగుతుండటంతో నిరసన ర్యాలీ, ఆందోళనలు గిరిజన సంఘాలు నిర్వహించిన క్రమంలో సెక్షన్–30తో అడ్డుకునే ప్రయత్నం చేశారు. తాజాగా గ్రామసభలు, పంచాయతీ తీర్మానాలతో నిమిత్తం లేకుండా స్థానిక ప్రజాప్రతినిధుల ద్వారా మండల పరిషత్లో తీర్మానం చేయించే దిశగా ముందుకు సాగుతున్నారు. భూసేకరణకు సిద్ధం చేసిన భూముల్లో ప్రస్తుతం వేరుశనగ, వర్జీనియా పొగాకు, ఆయిల్పామ్ వంటి పంటలు పండే నాణ్యమైన భూములున్నాయి. ఆ భూముల్లోనే పనిచేసుకుంటూ ఆయా గ్రామాల గిరిజన ప్రజలు జీవనం సాగిస్తున్నారు. అయితే ఆ భూములను డిపో ఏర్పాటుకు సేకరిస్తే తమ జీవనం కష్టతరంగా మారుతుందని, తాము డిపోను వ్యతిరేకి స్తున్నామని గిరిజనులు చెబుతున్నారు. వంకావారిగూడెంలో తన భూమిలోని వేరుశనగ పంటను చూపిస్తున్న రైతు మడకం శేషారావు జీలుగుమిల్లి మండలం వంకావారిగూడెంలో గిరిజన రైతుల ఆయిల్పామ్ తోట గిరిజనులు వ్యతిరేకిస్తున్నా దూకుడుగా సర్కారు యత్నాలు గ్రామసభల్లో వ్యతిరేక తీర్మానం చేసినా ముందుకు.. మండల పరిషత్లో తీర్మానం చేసేలా స్థానిక ప్రజాప్రతినిధులపై ఒత్తిళ్లు పొగాకు సహా మంచి పంటలు పండే భూమి సేకరణకు యత్నం నేవీ డిపోపై తీవ్రమైన తిరుగుబాటు నేవీ డిపో ఏర్పాటుకు గ్రామసభల తీర్మానం లేకుండా ప్రభుత్వం యత్నాలు చేస్తుందని గిరిజనులు మండిపడుతున్నారు. ఇప్పటివరకూ మూడుసార్లు వ్యతిరేకంగా 5 గ్రామాల గిరిజనులు తీర్మానం చేశారు. అంతేకాకుండా పెద్ద ఎత్తున ఆందోళన సైతం కొనసాగించారు. అయినా బలవంతంగా నేవీ డిపోను వంకావారిగూడెం పంచాయతీ పరిధిలోనే ఏర్పాటు చేయాలని మొండిగా ముందుకు సాగుతుందని గిరిజనులు మండిపడుతున్నారు. 5 గ్రామాల ప్రజలు గ్రామ సభల్లో డిపోకు వ్యతిరేకంగా తీర్మానం చేసిన నేపథ్యంలో నిబంధనలకు విరుద్ధంగా మండల పరిషత్లో ఎంపీటీసీలతో అనుకూలంగా తీర్మానం చేసి ముందుకు సాగాలనే ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. నేవీ డిపోకు అనుకూలంగా సంతకాలు చే యాలని రాజకీయ నాయకులు ఎంపీటీసీలకు ఫోన్లు చేస్తున్నట్టు ప్రచారం సాగుతోంది. నిబంధలకు వి రుద్ధంగా ముందుకు సాగితే తీవ్ర ప్రతిఘటనలు తప్పవని వంకావారిగూడెం ప్రజలు హెచ్చరిస్తున్నారు. నేవీ ఆయుధ డిపో ఏర్పాటుకు జీలుగుమిల్లి మండల వంకావారిగూడెం పంచాయతీ పరిధిలో రమణక్కపేట, మడకంవారిగూడెం, దాట్లవారిగూడెం, కొత్తచీమలవారిగూడెం గ్రామాల్లో మొత్తం 1,166 ఎకరాల్లో భూములు సేకరించాలని అధికారులు ప్రజాప్రతినిధులు తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. అయితే పంట భూములను ఇచ్చేది లేదని గిరిజనులు తెగేసి చెబుతున్నారు. అయినా డిపో ఏర్పాటుపై ఎంపీ పుట్టా మహేష్యాదవ్, ఎమ్మెల్యే చిర్రి బాలరాజు మొండిగా ముందుకు సాగుతున్నారని గిరిజనులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయం చేసుకునే తమ భూములు కాకుండా అదే మండలంలో గ్రీన్ఫీల్డ్ హైవేకు ఆనుకుని ఉన్న బర్రింకలపాడు అటవీ భూముల్లో గానీ, వేరే ప్రాంతాల్లో కానీ పెట్టుకోవాలని ఇక్కడి గిరిజన ప్రజలు సూచిస్తున్నారు. తాము వద్దంటున్నా ఎంపీ పుట్టా మహేష్ పట్టుబట్టడం పట్ల ప్రజలు తీవ్రంగా మండిపడుతున్నారు. -
7న ఉపాధ్యాయుల ‘చలో విజయవాడ’
భీమవరం: ఉపాధ్యాయ, ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ఫ్యాప్టో ఆధ్వర్యంలో ఈనెల 7న చేపట్టిన చలో విజయవాడ పోరుబాట కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఫ్యాప్టో జిల్లా చైర్మన్ పీఎస్ విజయరామరాజు పిలుపునిచ్చారు. శనివారం మున్సిపల్ పాఠశాలల్లో కరపత్రాలు, పోస్టర్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జనరల్ సెక్రటరీ జి.ప్రకాశంతో కలిసి ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయుల న్యాయమైన కోర్కెలను పరిష్కరించాలని ప్రభుత్వానికి పలు విజ్ఞప్తులు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా చలో విజయవాడ పోరుబాట కార్యక్రమం చేపట్టామన్నారు. దీనికి సంబంధించిన కరపత్రాలు, పోస్టర్లను ఉపాధ్యాయులకు పంపిణీ చేసి ధర్నాకు హాజరుకావాలని కోరామన్నారు. ఫ్యాప్టో నాయకులు మల్లేశ్వరరావు, నరేష్ తదితరులు పాల్గొన్నారు. భీమవరం (ప్రకాశంచౌక్): జిల్లాలో పరిశ్రమలు, టూరిజం, వ్యవసాయ అనుబంధ రంగాలు, ఆ క్వా రంగంలో ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించి జిల్లా అభివృద్ధికి తోడ్ప డాలని జేసీ టి.రాహుల్కుమార్రెడ్డి అన్నారు. శనివారం కలెక్టరేట్లో పెట్టుబడుల సమన్వయ సమావేశాన్ని జేసీ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాడేపల్లిగూడెంలో ఊక నుంచి రైస్బ్రాన్ ఆయిల్, సిలికాన్ జెల్, ఫుడ్ ప్రాసెసింగ్లో చిన్నపాటి పరికరాల తయారీపై దృష్టి పెట్టాలన్నారు. జిల్లాలో 19 కిలోమీటర్ల మేర గోదావరి తీర ప్రాంతంలో (అయోధ్యలంక నుంచి నరసాపురం వరకూ) రిసార్ట్స్, కాటేజీల ఏర్పాటుపై పరిశీలించాలన్నారు. లేసు ఉత్పత్తులు ప్రోత్సహించేలా, పెట్టుబడులు ఆకర్షించేలా చర్యలు చేపట్టాలని జిల్లా టూరిజం అధికారి ఏవీ అప్పారావును ఆదేశించారు. వ్యవసాయ క్షేత్రాల్లో కాటేజీలు, ఓపెన్ రిసార్ట్స్ నెలకొల్పేలా వ్యవసాయ శాఖ అధికారులు పరిశీలించాలని సూచించారు. డీఆర్వో బి.శివనా రాయణరెడ్డి, డీపీఓ ఎం.రామనాథరెడ్డి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జెడ్.వెంకటేశ్వరరావు, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి యు. మంగపతి రావు, ఎల్డీఎం ఎ.నాగేంద్రప్రసాద్, గ్రామ, వార్డు సచివాలయ అధికారి వై.దోసిరెడ్డి, జిల్లా చేనేత శాఖాధికారి కె.అప్పారావు, జిల్లా కార్మిక శాఖ అధికారి ఆకన లక్ష్మి పాల్గొన్నారు. పురుషుల విజేత తూర్పుగోదావరి నూజివీడు: దసరా సందర్భంగా నూజివీడులో నిర్వహిస్తున్న 73వ అఖిలభారత పురుషుల, మహిళల కబడ్డీ పోటీలు శనివారం రాత్రి ముగిశాయి. మహిళల కబడ్డీ విజేతగా శ్రీకాకుళం జట్టు నిలిచింది. ఫైనల్ మ్యాచ్ శ్రీకాకుళం–చిత్తూరు జట్ల మధ్య జరగ్గా చిత్తూరు జట్టుపై 40–29 స్కోర్తో శ్రీకాకుళం జట్టు గెలుపొందింది. చిత్తూరు జట్టు ద్వితీయస్థానంతో సరిపెట్టుకుంది. పురుషుల ఫైనల్ మ్యాచ్ గుంటూరు–తూర్పుగోదావరి జట్ల మధ్య జరిగింది. తూర్పుగోదావరి జట్టు 59–39 స్కోర్ తేడాతో గుంటూరు జట్టుపై గెలుపొంది విజేతగా నిలిచింది. విజేతలకు మాజీ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు నగదు బహుమతులను, ట్రోఫీలను అందజేశారు. ఆటలకు నిలయం నూజివీడు: మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారావు మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారావు మాట్లాడుతూ నూజివీడులో పూర్వకాలం నుంచి ఆటలకు గొప్ప పేరుందని అన్నారు. ఆటలు, క్రీడలకు నూజివీడులో లభించే ప్రోత్సాహం జిల్లా లో మరెక్కడా లభించదన్నారు. ప్రతిఒక్కరూ క్రీడలను ప్రోత్సాహించాలన్నారు. తల్లిదండ్రులు పిల్లలకు చదువుతో పాటు ఆటల గురించి తెలియజేయడంతో పాటు ఆడుకునేలా అవకాశం కల్పించాలన్నారు. క్రీడల్లో ప్రతిభను కనబరిస్తే నలుదిశలా పేరు ప్రఖ్యాతలు లభిస్తాయన్నారు. స్పోర్టింగ్ క్లబ్ అధ్యక్షుడు రామిశెట్టి మురళీకృష్ణ, సెక్రటరీ టీవీ కృష్ణారావు, జాయింట్ సెక్రటరీ మల్లెపూడి రాజశేఖర్, జడ్పీ వైస్ చైర్మన్ గుడిమళ్ల కృష్ణంరాజు, రిటైర్డ్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు, ఉపాధ్యక్షుడు కోటగిరి సతీష్, మున్సిపల్ వైస్ చైర్మన్ కొమ్ము వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
అరకొర బస్సులు.. ప్రయాణికుల పాట్లు
● గొడవలు, తోపులాటలతో పోలీసుల రంగప్రవేశం ● రాత్రి వరకూ కొనసాగిన రద్దీ ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమల శ్రీవారి క్షేత్రా నికి వచ్చే యాత్రికులకు బస్సు ప్రయాణం.. ప్రహసనంగా మారింది. శనివారం క్షేత్రానికి వేలాది మంది భక్తులు విచ్చేశారు. తిరుగు ప్రయాణమయ్యే క్ర మంలో బస్టాండ్కు చేరుకున్నారు. అయితే బస్సులు అరకొరగా ఉండటంతో బస్సులు ఎక్కేందుకు పోటీపడ్డారు. దీంతో గొడవలు, కేకలతో బస్టాండ్ ప్రాంతం దద్దరిల్లింది. బస్టాండ్లోకి వస్తున్న బస్సులకు ఎదురెళ్లి ఎక్కుతుండటంతో దిగేవారు నానా అవస్థలు పడ్డారు. డ్రైవర్లు, కండక్టర్లు వారిస్తున్నా వినకుండా పలువురు ఫుట్బోర్డులపై నిలిచి మరీ ప్రమాదకర ప్రయాణాలు సాగించారు. చాలీచాలని బస్సులు, యాత్రికుల గొడవలతో స్థానిక ఎస్సై టి.సుధీర్ సిబ్బందితో కలిసి బస్టాండ్కు చేరుకుని ప్రయాణికులను నియంత్రించారు. మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు బస్టాండ్లో ప్రయాణికుల రద్దీ కొనసాగింది. అయితే కొందరు భక్తులు బస్సులు ఎక్కలేమంటూ ఆటోలు ఎక్కి గమ్యస్థానాలకు చేరుకున్నారు. ప్రభుత్వ నిర్వాకం కారణంగా పోలీసులు బస్టాండుల్లో బస్సుల వద్ద విధులు నిర్వర్తించాల్సి వస్తోందని, ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు భయపడాల్సి వస్తోందని పలువురు వాపోయారు. అయినా యాత్రికులకు సురక్షితమైన ప్రయాణం లేదని పలువురు అంటున్నారు. -
పేదల బియ్యం పక్కదారి
● రేషన్ డీలర్లే కొనుగోలు ● షాపుల్లోనే నిల్వలు.. రాత్రిళ్లు తరలింపు లింగపాలెం: ‘కంచే చేను మేసిన’ చందంగా రేషన్ డీలర్లే పేదలకు అందించాల్సిన బియ్యాన్ని పక్క దారి పట్టిస్తున్నారు. కార్డుదారుల నుంచి నేరుగా కొనుగోలు చేసి రేషన్ షాపుల్లోనే నిల్వ ఉంచుతూ, రాత్రిళ్లు గుట్టుచప్పుడు కాకుండా అక్రమ బియ్యం వ్యాపారులకు ఎగుమతి చేస్తున్నారు. ఇదంతా బహిరంగంగా జరుగుతున్నా విజిలెన్స్, రెవెన్యూ అధికారులు మిన్నకుండిపోతున్నారు. ముఖ్యంగా లింగపాలెం మండలంలో కొందరు డీలర్లు పోటీపడి మరీ కార్డుదారుల నుంచి బియ్యం కొనుగోలు చేస్తున్నారు. బియ్యం కోసం రేషన్ షాపులకు వస్తున్న కార్డుదారులకు కిలోకు రూ.15 చొప్పున చెల్లిస్తున్నారు. బియ్యం కావాలా, డబ్బులు కావాలా అని అడుగుతుండటంతో కార్డుదారులు ఆశ్చర్యపోతున్నారు. గతంలో చాటుమాటున జరిగే ఈ వ్యవ హారం కూటమి ప్రభుత్వ పాలనలో బహిరంగంగానే జరుగుతోంది. లింగపాలెం మండలంలో నెల కు సుమారు 600 టన్నుల వరకూ ఇలా సేకరించడం, రేషన్ మాఫియా ఆగడాలకు అద్దూ అదుపులేకపోవడం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. లింగపాలెం, చింతలపూడి మండలాల్లో సుమారు 47 వేలకు పైగా బియ్యం కార్డులు ఉన్నాయి. వీరికి ప్రతినెలా బియ్యం కోసం ప్రభుత్వం రూ.9 కోట్లకు పైగా ఖర్చు చేస్తోంది. ప్రధానంగా రేషన్ బియ్యం వ్యాపారానికి డీలర్లు సహకరిస్తున్నారని, అయినా అధికారులు తనిఖీలు, చర్యలు తీసుకోవడం లేదని మండల ప్రజలు విమర్శిస్తున్నారు. -
బాలిక అప్పగింత
నరసాపురం రూరల్: పేరుపాలెం బీచ్లో తప్పిపోయిన బాలికను మొగల్తూరు పోలీసులు గంట వ్య వధిలో గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించినట్టు శ నివారం ఎస్పీ అద్నాన్ నయీం అస్మి ఓ ప్రకటనలో తెలిపారు. భీమవరానికి చెందిన ఓ కుటుంబం తమ ఎనిమిదేళ్ల బాలిక తప్పిపోయిందంటూ సా యంత్రం 4 గంటలకు బీచ్ అవుట్ పోస్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే అప్రమత్తమైన అవు ట్ పోస్ట్ పోలీసులు బాలిక ఆచూకీ గుర్తించి కుటుంబసభ్యులకు అప్పగించారు. పోలీసుల కృషిని ఎస్పీ అభినందించారు. బీచ్కు వచ్చే సందర్శకులు, ముఖ్యంగా తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల మరింత శ్రద్ధ వహించాలని, తక్షణ సహాయం కోసం పోలీసులను సంప్రదించాలని సూచించారు. -
వైద్య కళాశాలల ప్రైవేటీకరణ విరమించకపోతే ఉద్యమం
పాలకొల్లు సెంట్రల్: రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య కళాశాలల్ని పీపీపీ విధానం పేరిట ప్రైవేటీకరించేందుకు కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని విరమించుకోకుంటే ఉద్యమం తప్పదని పశ్చిమ గోదావరి జిల్లా ప్రభుత్వ మెడికల్ కళాశాలల పరిరక్షణ సమితి హెచ్చరించింది. శనివారం పాలకొల్లులోని పూలపల్లి అంబేడ్కర్ భవనంలో సీపీఎం ఆధ్వర్యంలో ‘పాలకొల్లు ప్రభుత్వ మెడికల్ కళాశాల పీపీపీ పద్ధతిలో ప్రైవేటీకరణ’ అంశంపై నిర్వహించిన రౌండ్టేబుల్ సమావేశంలో పలువురు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరికీ వైద్య విద్య అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ప్రతి పార్లమెంటరీ నియోజకవర్గంలో ఒకటి చొప్పున ఒక మెడికల్ కళాశాల ఏర్పాటు చేయాలని వైఎస్ జగన్ ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.ఇందులో భాగంగా 17 మెడికల్ కళాశాలలను జగన్మోహన్రెడ్డి ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. ఇందుకోసం గత ప్రభుత్వం రూ.2,400 కోట్లు ఖర్చు చేసిందని చెప్పారు. ఇంకా దాదాపు రూ.5 వేల కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుందన్నారు. రాష్ట్ర బడ్జెట్ రూ.3 లక్షల కోట్లు అని గొప్పలు చెబుతున్న చంద్రబాబు ప్రభుత్వం కనీసం రూ.5 వేల కోట్లు ఖర్చు చేసి ప్రభుత్వ మెడికల్ కళాశాలలను పూర్తి చేయలేదా అని ప్రశ్నించారు. గత ప్రభుత్వం అరకొర పనులు చేపట్టిందని కూటమి ప్రభుత్వం అబద్ధాలు చెబుతూ వాటిని ప్రైవేటుకు అప్పగించాలని నిర్ణయించామని కబుర్లు చెబుతూ ప్రజలకు చేసిన ద్రోహాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. పీపీపీ అంటూనే వైద్యకళాశాలలు ప్రైవేటుపరం కావని చెప్పడం హాస్యాస్పదమని మండిపడ్డారు. పీపీపీ పద్ధతి ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకే కాకుండా ఓసీ కులాల్లోని పేద విద్యార్థులకూ నష్టం కలిగిస్తుందన్నారు.వైద్యం, విద్య రెండూ ప్రభుత్వ రంగాల్లో ఉంటేనే ప్రజలకు మేలు కలుగుతుందన్నారు. ఇప్పటికే విద్య, వైద్యం రెండూ ఖరీదయ్యాయని, మరింత ఖరీదు కాకుండా ఉండాలంటే కూటమి ప్రభుత్వ నిర్ణయం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. సమావేశంలో ఎమ్మెల్సీ బొర్రా గోపిమూర్తి, మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు, మాజీ ఎమ్మెల్యే దిగుపాటి రాజగోపాల్, ప్రత్యేక హోదా సాధన సమితి కన్వీనర్ చలసాని శ్రీనివాస్, సీపీఎం నేత జేఎన్వీ గోపాలన్, దళిత ఐక్యవేదిక అధ్యక్షుడు గంటా సుందర్కుమార్, సంచార జాతుల సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు పెండ్ర వీరన్న, ఉపాధ్యాయ ఉద్యమ నాయకుడు జవ్వాది శ్రీనివాసరావు, జేవీవీ జిల్లా నాయకుడు యర్రా అజయ్కుమార్, దగ్గులూరు సర్పంచ్ పేరయ్య, పట్టణ జేఏసీ చైర్మన్ గుడాల హరిబాబు తదితరులు మాట్లాడారు. -
సీఈసీనీ లెక్కచేయక..
సుప్రీంకోర్టు ఆదేశాలతో సీఈసీ కమిటీ సభ్యులు పర్యటించినా కొల్లేరులో అక్రమ చేపల సాగు యథేచ్చగా సాగుతోంది. అటవీ శాఖ అధికారులు రాజకీయ నాయకుల ఒత్తిళ్లు తట్టుకోలేక అక్రమ చేపల చెరువులకు గండ్లు కొట్టామని తప్పుడు సమాచారం ఇచ్చారు. చేపల చెరువులకు చిన్నపాటి గండ్లు పెట్టి ఫొటోలు తీసుకున్న తర్వాత అక్రమ సాగుదారులు వెంటనే గండ్లు పూడ్చేశారు. ఏలూరు జిల్లాలో పలు కొల్లేరు గ్రామాల్లో అటవీ శాఖ గండ్లు పెట్టిన చెరువుల్లో దర్జాగా చేపల సాగు జరుగుతోంది. అక్రమ చెరువులు ధ్వంసం చేయడానికి అటవీ సిబ్బంది గ్రామాల్లోకి వెళుతుంటే కొల్లేరులో కూటమి నేతలు మహిళలను ముందు వరుసలో ఉంచి ఆందోళనలు చేయిస్తున్నారు. -
ధాన్యం సేకరణకు సన్నద్ధం కావాలి
భీమవరం: జిల్లాలో ఖరీఫ్ ధాన్యం సేకరణకు అధికారులు సన్నద్ధం కావాలని, మిల్లర్ల నుంచి నాణ్యమైన గోనె సంచులను సేకరించి రైతులకు అందించేందుకు చర్యలు చేపట్టాలని జేసీ టి.రాహుల్కుమార్రెడ్డి అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో ధాన్యం సేకరణ, రీ సర్వే, జీఎస్టీ, సుమోటో క్యాస్ట్ వెరిఫికేషన్, ఇళ్ల స్థలాలు తదితర అంశాల ప్రగతిపై మండలాల వారీగా డీఆర్వో, ఆర్డీఓ, ఎంపీడీఓలు, తహసీల్దార్లు, వాణిజ్య, వ్యవసాయ శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ధాన్యం సేకరణలో రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా, వివాదాలకు తావులేకుండా పక్కా ఏర్పాట్లు చేయాలన్నారు. రీ సర్వేకు సంబంధించి గ్రామసభలు నిర్వహించి రైతులకు అవగాహన కల్పించాలన్నారు. డీఆర్వో బి.శివన్నారాయణ రెడ్డి, ఆర్డీఓ దాసి రాజు, వ్యవసాయశాఖ అధికారి జెడ్.వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. జీఎస్టీ అమ్మకాలపై ఆరా భీమవరం (ప్రకాశంచౌక్): స్థానిక జువ్వలపాలెం రోడ్డులోని సోనోవిజన్ షోరూమ్ను జేసీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రభుత్వం తగ్గించిన జీఎస్టీ మేరకు అమ్మకాలు జరపాలని ఆదేశించారు. దుకాణదారులు జీఎస్టీ తగ్గించకుంటే వినియోగదారులు ఫిర్యాదు చేయవచ్చన్నారు. వాణిజ్య పన్నుల శాఖ డీసీ కేపీ శైలజ, జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ వి.కేదారేశ్వరరావు ఉన్నారు. -
స్ఫూర్తి ప్రదాత గాంధీజీ
ఏలూరు టౌన్: మహాత్మాగాంధీజీ ఆశయాలైన సత్యం, అహింస, దేశభక్తి మార్గాల్లో నడవాలని, సత్ప్రవర్తనతో కొత్త జీవితాలు మొదలు పెట్టేందుకు సిద్ధం కావాలని ఖైదీలకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్.శ్రీదేవి హితవు పలికారు. ఏలూరులోని ఏలూరు వన్టౌన్లోని జిల్లా కేంద్ర కారాగారంలో గురువారం గాంధీ జయంతి వేడుకలను పురస్కరించుకుని ఖైదీల సంక్షేమ దినోత్సవాన్ని నిర్వహించారు. ముందుగా ఆమె గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ ఖైదీలు తమ పాత జీవన విధానాన్ని విడిచిపెట్టి నూతన జీవనం ప్రారంభించాలని ఆకాంక్షించారు. ఎందరో శిక్ష అనుభవించిన అనంత రం మంచిగా మారి సమాజంలో మంచి వ్యక్తులుగా గుర్తింపు పొందారన్నారు. న్యాయసేవా ధికార సంస్థ కార్యదర్శి రత్నప్రసాద్ మాట్లాడు తూ జిల్లా జైలులోని ఖైదీలకు ఉచిత న్యా యసహాయం అందిస్తున్నామనీ, బెయిల్ వస్తే ష్యూరిటీ మొత్తం కట్టుకోలేని రిమాండ్ ఖైదీలకు ప్రభుత్వమే ఆ డబ్బులు చెల్లించి విడుదల చేయిస్తున్నామని తెలిపారు. జైలు సూపరింటెండెంట్ సీహెచ్ఆర్వీ స్వామి, జిల్లా అదనపు ఎస్పీ నక్కా సూర్యచంద్రరావు, డీఆర్వో వి.విశ్వేశ్వరరావు, ప్రతినిధులు కూన కృష్ణారావు, లేళ్ల వెంకటేశ్వరరావు, డాక్టర్ అబ్బూరి అరుణ, వైద్య అధికారి డాక్టర్ స్వరూప్, న్యాయవాదులు మునేశ్వరరావు, వెంకటేశ్వరరావు, జైలర్లు వి.రమేష్, కె.శ్రీనివాసరావు, కె.వీర వసంతరావు ఉన్నారు. భీమవరం(ప్రకాశం చౌక్): టైమ్ బౌండ్ ప్రమోషన్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ ప్రైమరీ హెల్త్ సెంటర్ డాక్టర్స్ అసోసియేషన్ (ఏపీపీహెచ్సీడీఏ) ఆధ్వర్యంలో భీమవరం కలెక్టరేట్లోని డీఎంహెచ్ఓ కార్యాలయం ఎదుట శుక్రవారం నిరసన తెలిపారు. పీహెచ్సీ వైద్యులు పదోన్నతులు లేక ఇబ్బంది పడుతున్నారని, టైమ్ బౌండ్ ప్రమోషన్లు తమ న్యాయమైన హక్కు అని నినదించారు. పీహెచ్సీ వైద్యులు కరోనా మహమ్మారి సమయంలో తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి ప్రజల ప్రాణాలను రక్షించారన్నారు. పదోన్నతుల కోసం ఇప్పటికే పలుమార్లు ముఖ్యమంత్రి, ఉన్నతాధికారులకు విన్నవించినా సమస్య పరిష్కారం కాకపోవడంతో ఉద్యమ బాట పట్లామన్నారు. ప్రభుత్వం తక్షణమే తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని వైద్యాధికారులు కోరారు. భీమవరం (ప్రకాశంచౌక్): స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమాల్లో భాగంగా పశ్చిమగోదావరి జిల్లా రాష్ట్రస్థాయిలో ఒకటి, జిల్లాస్థాయిలో 49 అవార్డులు గెలుపొందినట్టు కలెక్టర్ సీహెచ్ నాగరాణి తెలిపారు. 17 విభాగాల్లో నిర్వహించిన సర్వేలో అవార్డు గ్రహీతలను ఎంపిక చేశారన్నారు. రాష్ట్రస్థాయిలో బెస్ట్ స్వచ్ఛత వారియర్స్ విభాగంలో తాడేపల్లిగూడెం మున్సిపాలిటీ పరిధిలో బొబ్బిలి రామాంజనేయులను ఎంపిక చేశారన్నారు. అలాగే జిల్లాస్థాయిలో బెస్ట్ స్వచ్ఛత గ్రీన్ అంబాసిడర్స్, బెస్ట్ స్వచ్ఛత ఎన్జీవోస్, బెస్ట్ స్వచ్ఛత వారియర్స్, స్వచ్ఛ అంగన్వాడీలు, బెస్ట్ బస్స్టేషన్, స్వచ్ఛ ప్రభుత్వ కార్యాలయాలు, స్వచ్ఛ గ్రామ పంచాయతీలు, స్వచ్ఛ ప్రభుత్వ హాస్పిటల్స్, స్వచ్ఛ వసతి గృహాలు, స్వచ్ఛ పరిశ్రమలు, స్వచ్ఛ మున్సిపాలిటీస్, స్వచ్ఛ రైతు బజార్లు, స్వచ్ఛ పాఠశాలలు, స్వచ్ఛ ఎస్ఎల్ఎఫ్ఎస్, స్వచ్ఛ విలేజ్ ఆర్గనైజేషన్స్ విభాగంలో మొత్తం 49 అవార్డులకు ఎంపికై నట్టు కలెక్టర్ వివరించారు. భీమవరం (ప్రకాశంచౌక్): భీమవరంలో ఈనెల 10న నిర్వహించనున్న పెన్షన్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ ఎస్.శాంతి ప్రియ శుక్రవారం ఓ ప్రకటనలో కోరారు. పెన్షన్ అదాలత్–ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ ఎట్ యువర్ డిస్ట్రిక్ట్ కార్యక్రమాన్ని జిల్లాల వారీగా చేపట్టామన్నారు. భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహిస్తామని రాష్ట్ర, జిల్లాస్థాయి అధికారులు పాల్గొంటారన్నారు. ప్రభుత్వ శాఖల డ్రాయింగ్ ఆఫీసర్లు, పెన్షన్ మంజూరు అధికారులకు మార్గనిర్దేశం, ఉద్యోగులు, పెన్షనర్లకు పెన్షన్ ప్రతిపాదనలపై అవగాహన కల్పించడం, ఫిర్యాదుల పరిష్కారం, దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న సమస్యల పరిష్కారమే ఈ కార్యక్రమం లక్ష్యమని పేర్కొన్నారు. -
ఎరువు.. దరువు
ఏలూరు (మెట్రో): ఎరువుల ధరలు పెరుగుదలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే యూరియా కొరతతో అవస్థలు పడుతున్న రైతుల నెత్తిన ఎరువుల ధరల పెరుగుదల మరో పిడుగులా మారింది. ఓ పక్క ధరల పెరుగుదల, మరోపక్క దుకాణాల్లో ఎమార్పీకి మించి విక్రయించడంతో అన్నదాతలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. జీఎస్టీ తగ్గింపుతో కారులు, ద్విచక్రవాహనాలు, గృహోపకరాణాలు తదితర వస్తువుల ధరలు తగ్గినా రైతులకు అవసరమయ్యే ఎరువుల ధరలు మాత్రం తగ్గలేదు. రైతే దేశానికి వెన్నెముక అని చెబుతున్నా అన్నదాతల సంక్షేమానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని రైతు సంఘాల నాయకులు విమర్శిస్తున్నారు. ఎరువులు వాడాల్సిన పరిస్థితి ఏలూరు జిల్లాలో ప్రధానంగా వరి, మొక్కజొన్న ప్రధాన పంటలు కాగా వేరుశనగ, పెసర, మినుము పంటలను రైతులు సాగు చేస్తున్నారు. జిల్లాలో వ్యవసాయ సాగు 1,97985 ఎకరాలు ఉండగా, ఉద్యాన పంటల సాగు 2,72,939 ఎకరాలు ఉంది. ఉద్యాన పంటల్లో ప్రధానంగా ఆయిల్పామ్, కోకో, కొబ్బరి సాగవుతున్నాయి. ప్రస్తుతం పంటలపై వస్తున్న చీడపీడలను తట్టుకునేందుకు, దిగుబడులు వచ్చేందుకు రైతులు తప్పనిసరిగా ఎరువులపై ఆధార పడాల్సిన పరిస్థితి. అయితే ధరల పెరుగుదల వారికి భారంగా మారింది. దుకాణాల్లో ఎమ్మార్పీకి అదనంగా విక్రయించడం మరింత ఇబ్బంది పెడుతోంది. ఎరువుల ధరల నియంత్రణ, ఎమ్మార్పీకి విక్రయించేలా చర్యలు తీసుకోవడంలో కూటమి సర్కారు విఫలమైందని రైతులు అంటున్నారు. సాగు చేయాలంటేనే ఎరు వుల ధరలు భయపెడుతున్నాయి. వీటిపై నియంత్రణ లేకపోతే ఏటా పెట్టుబడులు పెరిగిపోతాయి. రైతులు పండించిన పంటలకు మాత్రం గిట్టుబాటు ధరలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. ఎరువుల ధరలను నియంత్రణలో ఉంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. – రావూరి రవి, రైతు, బాపిరాజుగూడెం ఎరువు రకం గతం ప్రస్తుతం 20–20–0 1,250 1,350 10–26–26 1,470 1,850 15–15–15 1,450 1,650 14–15–14 1,700 1,850 పొటాష్ 1,550 1,800 28–28 1,700 1,850 20–20–0–13 1,300 1,450 24–24 1,700 1,850 రైతులపై ముప్పేట దాడి ధరల పెరుగుదలతో అన్నదాతలు సతమతం పట్టించుకోని కూటమి సర్కారు జిల్లాలో 4.70 లక్షల ఎకరాల్లో సాగు -
హత్య చేసి.. గోనె సంచిలో కుక్కి..
● వీడిన యువకుడి హత్యకేసు మిస్టరీ ● సఖినేటిపల్లిలో సురేష్ మృతదేహం లభ్యం తణుకు అర్బన్: తణుకులో మొదట అదృశ్యం.. ఆపై హత్యగా మారి సంచలనం సృష్టించిన కేసులో ఎట్టకేలకు మిస్టరీ వీడింది. చించినాడ గోదావరి తీరంలో పోలీసులు ఈతగాళ్ల సాయంతో చేపట్టిన గాలింపు చర్యల్లో భాగంగా ఈనెల 2న తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లిలోని చొదిమెళ్ల గ్రామ పరిధిలో తాడేపల్లిగూడేనికి చెందిన యువకుడు మడుగుల సురేష్ (25) మృతదేహం నీటిపై తేలుతూ కనిపించింది. గత నెల 23న తణుకు వెళ్లిన సురేష్ తిరిగి తాడేపల్లిగూడెం రాలేదని న్యాయవాది తిర్రే సత్యనారాయణరాజుపై అనుమానం వ్యక్తం చేస్తూ 25న తణుకు పట్టణ పోలీస్స్టేషన్లో సురేష్ సోదరి శిరీష ఇచ్చిన ఫిర్యాదుతో అదృశ్యం కేసుగా పోలీసులు నమోదుచేశారు. అయితే పోలీసుల దర్యాప్తులో బయటపడ్డ ఆధారాలతో ముందుగా తణుకు గోస్తనీ కాలువలో, అనంతరం చించినాడ గోదావరిలో రెండురోజులపాటు గాలింపు చేపట్టగా సురేష్ మృతదేహం ఉన్న గోనె సంచి మూట గోదావరిలో లభ్యమైంది. అప్పటికే శవం కుళ్లిపోయి, పురుగులు పట్టిన పరిస్థితుల్లో ఉండగా మృతుడి చేతిపై ఉన్న పచ్చబొట్టుతోపాటు ఒంటిపై ఉన్న దుస్తుల ఆధారంగా బాధిత వర్గాలు గుర్తించిన అనంతరం శుక్రవారం పోలీసులు పంచనామా నిర్వహించి రాజోలు ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం చేయించారు. అనంతరం కుటుంబసభ్యులకు సురేష్ మృతదేహాన్ని అప్పగించారు. వివాహేతర సంబంధం వ్యవహారంలో.. వివాహేతర సంబంధం వ్యవహారంలో న్యా యవాది తిర్రే సత్యనారాయణరాజు పట్టణానికి చెందిన నలుగురు యువకుల సాయంతో గతనెల 23న సురేష్పై దాడి చేశారని, దాడి ఘటనలో సురేష్ తలకు తీవ్రగాయమైనట్టు తెలుస్తోంది. మృతి చెందాడని నిర్ధారించుకున్న అనంతరం మృతదేహాన్ని గోనె సంచిలో కుక్కి తణుకు నుంచి ఒక కారులో ఎక్కించుకుని చించినాడ బ్రిడ్జిపై నుంచి గోదావరిలో పారవేసినట్టుగా పోలీసుల దర్యాప్తులో తేలినట్టు సమాచారం. అయితే నిందితులు అంతా ఒకే మాటపై ఉండి మృతదేహం దొరకకుండా ఉండేందుకు పోలీసులకు తప్పుగా సమాచారం ఇస్తూ వారిని ముప్పుతిప్పలు పెట్టారు. సురేష్ సెల్ఫోన్ను సైతం తాడేపల్లిగూడెంలో పారవేసి పోలీసులను తప్పుదారి పట్టించేందుకు నిందితులు పక్కా ప్లాన్ చేశారని సమాచారం. అయినా పోలీసులు తమదైన రీతిలో విచారణ చేసి చివరకు పదో రోజున మృతదేహాన్ని గుర్తించారు. మృతదేహం లభ్యం కాని పక్షంలో కేసు వీగిపోతుందనే ఉద్దేశంతో నిందితులు చాకచక్యంగా వ్యవహరించినా చివరకు మిస్టరీ వీడిందని, అయితే మృతదేహం తరలింపులో నిందితులు విని యోగించిన కారును కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. సఖినేటిపల్లి గోదావరి తీరంలో లభ్యమైన సురేష్ మృతదేహం ఉన్న మూటమడుగుల సురేష్ (ఫైల్) యువకుడి అదృశ్యం ఘటన గతనెల 25 నుంచి ప్రసార సాధనాలు, సామాజిక మాధ్యమాల్లో సంచలనం సృష్టిస్తున్న నేపథ్యంలో తణుకు పోలీసులు కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.తణుకు పట్టణ స్టేషన్లో ఇద్దరు ఎస్సైలు, కానిస్టేబుళ్లు విజయవాడ కనకదుర్గమ్మ ఆలయ బందోబస్తుకు వెళ్లిన నేపథ్యంలో స్టేషన్లో సగం సిబ్బంది కూడా లేని పరిస్థితి. అయినా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తణుకు సీఐ ఎన్.కొండయ్య నేర విభాగ పోలీసుల సహకారంతో కేసును ఛేదించారు. అలాగే గతనెల 27న తణుకు వారణాసి వారి వీధిలో వృద్ధురాలిని భయపెట్టి 70 కాసుల బంగారు ఆభరణాల చోరీ కేసులో సైతం పురోగతి లభించినట్టు తెలిసింది. అనుమానితులను గుర్తించి, మహారాష్ట్రకు ప్రత్యేక నేర విభాగం సిబ్బంది వెళ్లి నిందితులను పట్టుకున్నట్టు సమాచారం. చోరీకి సంబంధించిన సొత్తును సైతం సేకరిస్తున్నట్టు తెలుస్తోంది. -
రూప్చంద్ ధర పాతాళానికి
● నష్టాల ఊబిలో రైతులు ● సంక్షోభంలో రూప్చంద్ సాగు ● కిలో రూ.82కు పడిపోయిన ధర గణపవరం: ఏడాది కాలంగా మంచి ధర పలుకుతున్న రూప్చంద్ ధర హఠాత్తుగా పడిపోవడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. రెండు నెలల వ్యవధిలోనే కిలోపై రూ.30 మేర పడిపోగా, గత జనవరితో పోలిస్తే ఏకంగా కిలోకి రూ.45 వరకూ తగ్గిపోయింది. దీంతో రూప్చంద్ రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. ప్రస్తుత ధర కిలో రూ.82కు అమ్మితే కనీసం పెట్టుబడులు సైతం దక్కవని రైతులు ఆందోళన చెందుతున్నారు. ధర పెరుగుతుందన్న ఆశతో రైతులు పట్టుబడికి వచ్చిన చేపలను చెరువులలోనే ఉంచి రోజుల తరబడి మేపుతున్నారు. తగ్గిన రూప్చంద్ ఎగుమతులు ధర పడిపోవడంతో రైతులు పట్టుబడులు నిలిపివేశారు. దసరా తర్వాతైనా ధర పెరుగుతుందన్న ఆశతో ఎదురుచూస్తున్నారు. జిల్లా నుంచి రోజూ సుమారు 30 నుంచి 40 లారీల రూప్చంద్ చేపల ఎగుమతులు జరిగేవి. ప్రస్తుతం రోజుకు 15 లారీలకు మించి జరగడంలేదని చెబుతున్నారు. గత జూలై వరకూ కిలో రూ.112 నుంచి రూ.115 వరకూ పలికిన ధర క్రమంగా తగ్గుతూ వారం రోజుల్లో కిలో రూ.82కు పడిపోయింది. ఎకరాకు లక్ష రూపాయల నష్టం రూప్చంద్ ధర అమాంతం పడిపోవడంతో రూప్చంద్ సాగుచేసిన రైతులు లబోదిబోమంటున్నారు. కరోనా సమయంలో తప్ప ఇంతటి గడ్డు పరిస్థితి ఎప్పుడూ చూడలేదని రైతులంటున్నారు. ప్రస్తుత ధరకు రూప్చంద్ అమ్మితే ఎకరాకు రూ.లక్ష వరకూ నష్టపోవాల్సి వస్తుందంటున్నారు. ఈ ధర ఇంకా తగ్గే అవకాశం ఉందన్న ప్రచారంతో ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుత చెరువుల నిర్వహణ రీత్యా రూప్చంద్ ధర కనీసం కిలో రూ.95 ఉంటే పెట్టుబడులతో బయటపడతామని, ఈ ధరకు ఎంత తక్కువకు అమ్మితే ఆ మేరకు నష్టం తప్పదని రైతులు చెబుతున్నారు. ఏడాదిన్నర కాలంగా రూప్చంద్ ధర బాగుండటంతో రైతులు ఎక్కువ మంది రూప్చంద్ సాగులోకి దిగారు. కిలో రూ.110 దాటని ధర ఏడాది కాలంగా పెరుగుతూ కిలో రూ.127 వరకూ పెరిగింది. దీంతో చాలామంది రైతులు లాభపడ్డారు. ఏడాది కాలంగా ఈ ధర నిలకడగా ఉండటంతో ధర బాగుందన్న ఉద్దేశ్యంతో గత అక్టోబర్, నవంబర్ నెలల్లో చాలామంది రూప్చంద్ సాగు చేపట్టారు. అప్పట్లో రొయ్యసాగు చేసి తీవ్రంగా నష్టపోయిన చాలామంది రైతులు రూప్చంద్ సాగు చేపట్టారు. దీంతో రూప్చంద్ సాగు విస్తీర్ణం తెల్లచేపను మించిపోయింది. రాబడి మేతలకే సరి ప్రస్తుత ధరలో చేపను అమ్మితే వచ్చే సొమ్ము మేత ఖర్చులకే సరిపోతుందని, చెరువు లీజులు, సీడ్, మందులు, విద్యుత్ బిల్లులు, కాపలాదారుల ఖర్చు, నిర్వహణ వ్యయం రైతు భరించక తప్పదని వాపోతున్నారు. ఇవన్నీ కలిపితే ఎకరాకు కనీసం రూ.లక్ష వరకూ నష్టం వస్తుందని రైతులు గగ్గోలు పెడుతున్నారు. కొంతకాలం వేచి చూస్తే చేప ధర పెరుగుతుందన్న ఆశతో రోజుల తరబడి చేపలను చెరువులో ఉంచి మేపడం వల్ల మరింత నష్టం తప్పడం లేదని వాపోతున్నారు. ప్రస్తుతం రూప్చంద్ పట్టుబడులకు సిద్ధంగా ఉంది. ఈ సమయానికి చేప ధర దారుణంగా తగ్గిపోవడంతో రైతుల పరిస్థితి అయోమయంగా తయారైంది. సరిగా పట్టుబడి సమయానికి ధర తగ్గిపోవడాన్ని రైతులు జీర్ణించుకోలేక పోతున్నారు. రెండేళ్ల క్రితం కూడా ఇదే విధంగా రూప్చంద్ ఎక్కువ విస్తీర్ణంలో పట్టుబడికి వచ్చిన సందర్భంగా చేప ధర కిలో రూ.60కు పడిపోయి రైతులు దారుణంగా నష్టపోయారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 2.25 లక్షల ఎకరాలలో ఆక్వాసాగు జరుగుతుండగా, సుమారు 1.30 లక్షల ఎకరాలలో చేపల సాగు చేస్తున్నారు. ఆక్వా రంగంలో దళారులు, వ్యాపారులదే రాజ్యం. ప్రభుత్వ కనీస ధరలు నిర్ణయించినా అమలుకు నోచుకోవడం లేదు. నేను 27 ఎకరాలలో రూప్చంద్ సాగుచేస్తున్నాను. ప్రస్తుతం చేపలు పట్టుబడికి సిద్ధంగా ఉన్నాయి. ఈ సమయంలో ధర కిలో రూ.82కు పడిపోవడంతో ఏంచేయాలో పాలుపోవడంలేదు. ఈ ధరలో అమ్మితే రైతులకు పెట్టుబడి కూడా దక్కే పరిస్థితిలేదు. దీనికి తోడు ఆక్వాచెర్వులపై ఎడాపెడా విద్యుత్ బిల్లుల మోత మోగుతుంది. – సంకు శ్రీనివాసరావు, రైతు చేపఽల సాగు నష్టాలలో నడుస్తుండటంతో ఆ ప్రభావం సీడ్, చేప పిల్లపై పడింది. రూప్చంద్కు ధర లేకపోవడంతో మూడేళ్లుగా చేప పిల్లల వ్యాపారం నష్టాలలో నడుస్తుంది. గతంలో ఐదు అంగుళాల సైజు ఉన్న రూప్చంద్ చేపపిల్ల ధర రూ.9 పలికేది. రూప్చంద్ ధర పడిపోవడంతో సాగు తగ్గిపోతుంది. ప్రస్తుతం రూప్చంద్ సీడ్ కొనే నాధుడు కనిపించడంలేదు. – సమయం వీరరాఘవులు, రూప్చంద్ పిల్ల పెంపకందారు ఏడాదిన్నరగా చేపల సాగు నష్టాలతో నడుస్తుంది. వ్యాపారులు ధర తగ్గించేయడం, కంపెనీలు మేత ధర పెంచేయడంతో రైతులు నలిగిపోతున్నారు. ఇటీవల పది ఎకరాలలో రూప్చంద్ సాగుచేసి పది లక్షలు నష్టపోయాను. కొంత కాలంగా రూప్చంద్ ధర బాగుండటంతో మళ్లీ 20 ఎకరాలలో రూప్చంద్ వేశాను. ప్రస్తుతం పట్టుబడి దశకు చేరింది. గత నెలలో మిడిల్ క్రాప్ తీస్తే కిలోలోపు సైజుకు రేటు రూ.90 వచ్చింది. ఇప్పుడు కిలోసైజు చేపధర రూ.80కు పడిపోయింది. – రమేష్రాజు, ఆక్వా రైతు -
ఎరుపెక్కిన శ్రీవారి క్షేత్రం
ద్వారకాతిరుమల: శ్రీవారి దివ్య క్షేత్రం శుక్రవారం భవానీ దీక్షాదారులతో ఎరుపెక్కింది. దేవీ శరన్నవరాత్రుల ముగింపును పురస్కరించుకుని విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ ఆలయంలో దీక్షలు విరమించిన భక్తులంతా ద్వారకాతిరుమల క్షేత్రానికి చేరుకుంటున్నారు. దాంతో ఉదయం నుంచి రాత్రి వరకు ఆలయ పరిసరాలు భవానీలు, సాధారణ భక్తులతో కిక్కిరిశాయి. దర్శనం క్యూలైన్లు, ఆలయ తూర్పు రాజగోపుర ప్రాంతం, అనివేటి మండపం, పరిసర ప్రాంతాలు, కల్యాణకట్ట తదితర విభాగాలు భక్తులతో పోటెత్తాయి. కొండపై ఎక్కడ చూసినా భవానీ దీక్షాధారులే కనిపించారు. ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్ తణుకు అర్బన్: ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ సమావేశంలో లేవనెత్తిన దొమ్మరి కుల పేరును, దొమ్మరి (గిరి బలిజ) గా మార్పు చేసిన అంశంపై అభ్యంతరం వ్యక్తం చేసిన సందర్భంలో ఆ జీవోను నిలుపుదలచేస్తూ ఆదేశాలు జారీచేయడం మంచి పరిణామమని మండలి సభ్యుడు వంక రవీంద్ర నాథ్ అన్నారు. ఇప్పటికే రాయలసీమ ప్రాంతంలో బలిజ (కాపు) వర్గాల్లో అలజడి మొదలై అనేక జిల్లాలు, మండలాల్లో ప్రభుత్వానికి విజ్ఞాపన పత్రాలు అందచేశారని అన్నారు. పోలవరం రూరల్: గోదావరి వరద తగ్గుముఖం పట్టింది. ఎగువ ప్రాంతాల నుంచి నదిలోకి చేరే నీరు క్రమేపీ తగ్గుతుండటంతో వరద ఉధృతి తగ్గుతూ ప్రవహిస్తోంది. పోలవరం ప్రాజెక్టు స్పిల్వే వద్ద 31.720 మీటర్లకు నీటిమట్టం చేరుకుంది. స్పిల్వే నుంచి 8 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు చేరుతోంది. ఎగువన భద్రాచలం వద్ద కూడా వరద బాగా తగ్గింది. 36.90 అడుగులకు నీటిమట్టం చేరుకుంది. వేలేరుపాడు: ఏజెన్సీ ప్రాంతంలో సేవలందిస్తున్న వైద్యుల డిమాండ్లు పరిష్కరించాలని ఆదివాసీ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాద్యక్షుడు మిడియం సువర్ణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూసం వెంకటేశ్వరరావు, జిల్లా అధ్యక్షులు శ్రీరాములు డిమాండ్ చేశారు. వారు మాట్లాడుతూ గత నెల 25 నుంచి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పని చేస్తున్న వైద్యులకు ఇన్ సర్వీస్లో ఉన్న వారికి పీజీ కోటా సీట్లు క్లినికల్ 30 శాతం నుంచి 15 శాతం, నాన్ క్లినికల్ కోటాలో 50 శాతం నుంచి 30 శాతం వరకు తగ్గించారన్నారు. పెదవేగి: పెదవేగి మండలం ముండూరు శివారులోని పోలవరం కాలువలో గుర్తు తెలియని వృద్ధురాలి మృతదేహం శుక్రవారం మధ్యాహ్నం గుర్తించారు. వెంటనే పెదవేగి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటన స్థలానికి చేరుకున్న పెదవేగి ఎస్సై రామకృష్ణ మృతదేహాన్ని వెలికి తీయించారు. ఆమె వయసు 60 నుంచి 70 సంవత్సరాలు మధ్య ఉంటుందని వివరాలు తెలిసినవారు పెదవేగి ఎస్సై 9440796638 నెంబర్కు సంప్రదించాలని సూచించారు. -
బ్రహ్మాండం.. బ్రహ్మోత్సవం
● తొలిరోజు వరుడైన శ్రీవారు ● రెండో రోజు నేత్రపర్వంగా ధ్వజారోహణం ● ప్రత్యేక అలంకారాల్లో స్వామివారి దర్శనం ద్వారకాతిరుమల: శ్రీవారి ఆశ్వయుజమాస దివ్య బ్రహ్మోత్సవాలు దసరా పండుగ రోజు గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా స్వామిని పెండ్లి కుమారుడు, అమ్మవార్లను పెండ్లి కుమార్తెలను చేయు వేడుక వైభవంగా జరిగింది. ముందుగా ఉత్సవమూర్తులను ఆలయం నుంచి తొళక్క వాహనంపై తీసుకెళ్లి, నిత్యకల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై వేంచేపు చేశారు. ఆ తరువాత అర్చకులు సర్వాభరణ భూషితులైన శ్రీవారు, అమ్మవార్లకు బుగ్గన చుక్క, కల్యాణ తిలకాలను దిద్దారు. ఈ సందర్భంగా ఆలయ డీఈఓ భద్రాజీ, ఏఈఓ పి.నటరాజారావులు స్వామి, అమ్మవార్లకు పట్టు వస్త్రాలు, పూలు, పండ్లను సమర్పించారు. ఆ తరువాత పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తెను చేసే వేడుకను అట్టహాసంగా నిర్వహించారు. ఆఖరిలో అర్చకులు, పండితులకు అధికారులు నూతన వస్త్రాలను అందజేశారు. తొలిరోజు స్వామివారు ఆలయ ముఖ మండపంలో శ్రీ మహావిష్ణువు అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. చరాచర సృష్టికి ఆహ్వానం.. బ్రహ్మోత్సవాల్లో రెండోరోజు శుక్రవారం రాత్రి ఆలయంలో ధ్వజారోహణ వేడుక వైభవంగా జరిగింది. ఉత్సవాలకు ఇంద్రాది అష్టదిక్పాలకులను, సర్వ దేవతలను, గంధర్వ, కిన్నెర, కింపురుషాది దేవగణాలను, సప్త అధోలోక జీవులను స్వాగతిస్తూ వేద మంత్రోచ్ఛరణలతో అర్చకులు ఆలయ ధ్వజస్తంభంపై గరుడ పటాన్ని ఎగురవేశారు. ఆ తరువాత గరుడ ప్రసాదాన్ని భక్తులకు, సంతానం లేని మహిళలకు అందించారు. అంతకు ముందు రుత్విగ్వరణ, మృద్గ్రహణ, అంకురార్పణ కార్యక్రమాలను జరిపారు. అంకురార్పణలో భాగంగా ఆలయ యాగశాలలో ఏర్పాటు చేసిన పాలికల్లో అర్చకులు పుట్టమన్నును ఉంచారు. ఆ తరువాత వాటిలో నవధాన్యాలను పోసి అంకురార్పణను నిర్వహించారు. రాత్రి హంస వాహనంపై గ్రామోత్సవం కనులపండువగా జరిగింది. ఆలయ ముఖ మండపంలో స్వామివారు మురళీకృష్ణ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. తొలిరోజు మహావిష్ణువు అలంకారంలో శ్రీవారు రెండోరోజు మురళీకృష్ణ అలంకారంలో ఉదయం 7 గంటల నుంచి సూర్యప్రభ వాహనంపై గ్రామోత్సవం ఉదయం 8 గంటల నుంచి భజన కార్యక్రమాలు ఉదయం 9 గంటల నుంచి భక్తిరంజని ఉదయం 10 గంటల నుంచి కూచిపూడి భరతనాట్య ప్రదర్శనలు సాయంత్రం 4 గంటల నుంచి నాదస్వరకచేరి సాయంత్రం 5 గంటల నుంచి కూచిపూడి భరతనాట్య ప్రదర్శనలు. రాత్రి 7 గంటల నుంచి చంద్రప్రభ వాహనాలపై గ్రామోత్సవం ప్రత్యేక అలంకారం : సరస్వతి -
గజలక్ష్మి భయపెట్టింది
ద్వారకాతిరుమల: శ్రీవారి గ్రామోత్సవం జరుగుతున్న సమయంలో గుర్రం దగ్గరకు వెళ్లడంతో దాని నీడచూసి భయపడిన దేవస్థానం ఏనుగు గజలక్ష్మి ఒక్కసారిగా అడ్డం తిరిగింది. దాంతో వాద్యకారులు, భక్తులు భయంతో రోడ్డుపై పరుగులు తీశారు. దేవస్థానం ఆటోను అడ్డు పెట్టడంతో గజలక్ష్మి నిలిచిపోయింది. దాంతో అక్కడున్నవారంతా ఊపిరి పీల్చుకున్నారు. శ్రీవారు ఉభయ దేవేరులతో కలసి సెమీ పూజ నిమిత్తం దసరా మండపం వద్దకు గురువారం రాత్రి తరలి వెళుతున్నారు. గుడి సెంటర్ దాటిన తరువాత అశ్వం దగ్గరకు వెళ్లడంతో దాని నీడను చూసి గజలక్ష్మి కంగారుపడింది. -
చీటీల పేరుతో మోసం
నూజివీడు: నూజివీడులోని ఎన్టీఆర్ కాలనీకి చెందిన శిరిగిరి వెంకటేశ్వరరావు అలియాస్ మోషే చీటీ పాటల పేరుతో 52 మంది నుంచి రూ.2.50 కోట్లు వసూలు చేసి మోసం చేశాడని పేర్కొంటూ బాధితులు శుక్రవారం పట్టణ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నూజివీడుతో పాటు హనుమాన్జంక్షన్, ధర్మాజీగూడెం, బంటుమిల్లి, పెడన, చిల్లకల్లు, ప్రగడవరం, కుక్కునూరు, రామాపురం, కొత్తపల్లి గ్రామస్తుల దగ్గర బుడజంగాల సెక్రటరీ అంటూ మాయమాటలు చెప్పి చీటీపాటల పేరుతో మోసం చేశాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. తమను నమ్మించి మోసం చేశాడని ఆవేదన వ్యక్తం చేశారు. చీటీ పాటలు కడితే అవసరానికి ఉపయోగపడతాయని చెప్పి ఈ విధంగా మోసం చేయడం దారుణమని, అతనికి నూజివీడులో రెండు బట్టల షాపులున్నాయని, మూడు ఇల్లు కట్టించాడని, ఇతర ఆస్తులున్నాయని, బంధువుల పేరుతో రిజిస్ట్రేషన్ చేసి ఐపీ నోటీసులు ఇచ్చాడని పేర్కొన్నారు. చాట్రాయి: అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పట్టుకున్నట్లు సివిల్ సప్లయిస్ డీటీ వెంకటేశ్వరావు తెలిపారు. శుక్రవారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ మండలంలోని గుడిపాడు గ్రామానికి చెందిన ధనికొండ గోపిరాజు, కోట సురేష్ బాబు, తిరువూరుకు చెందిన చారి రేషన్ బియ్యం అక్రమంగా కొనుగోలు చేసి మండలంలోని గుడిపాడు నుంచి చనుబండ మీదుగా తిరువూరు తరలిస్తుండగా 40 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని గురువారం రాత్రి పట్టుకున్నట్లు ఆయన చెప్పారు. -
ఖైదీల ఆరోగ్య పరిరక్షణకు చర్యలు
ఏలూరులో ఖైదీల ఆరోగ్య పరిరక్షణ కోసం వాటర్ ప్లాంట్, మహిళా ఖైదీల నైపుణ్యాలను పెంపొదించేందుకు స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమం ద్వారా బేకరీ ఏర్పాటు చేశాం. జైళ్లశాఖ ఆధ్వర్యంలో పోలవరంలో హెచ్పీసీఎల్ పెట్రోల్ బంక్ను ఏర్పాటు చేశాం. భీమవరంలో కూడా సీఎస్ఆర్ ఫండ్స్ ద్వారా ఐఓసీఎల్ సహకారంతో ఫీమెల్ ప్రిజనర్ బ్యారెక్స్, కిచెన్, స్టోర్ రూం, డే టాయిలెట్స్, ఇంక్యూబిలేషన్ సెంటర్ కట్టించాం. ఖైదీల రిహాబిలిటేషన్లో భాగంగా ఐఓసీఎస్ ద్వారా పెట్రోల్ బంక్ నిర్మాణం పూర్తి చేశాం. – సీహెచ్ ఆర్వీ స్వామి జిల్లా సబ్జైళ్ల అధికారి, జిల్లా జైల్ సూపరింటెండెంట్ ఏలూరు జిల్లా -
యువకుడి అదృశ్యం కేసులో వీడని మిస్టరీ
తణుకు అర్బన్ : తణుకులో అదృశ్యమైన తాడేపల్లిగూడేనికి చెందిన మడుగుల సురేష్ (25) కేసులో నెలకొన్న మిస్టరీ ఇంకా వీడలేదు. అదృశ్యమై పది రోజులు గడిచిపోవడం, తణుకు గోస్తనీ కాలువతోపాటు చించినాడ గోదావరిలో సైతం ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినా ఎలాంటి ఆనవాళ్లు దొరక్కపోవడంతో పోలీసులు తలలుపట్టుకుంటున్నారు. ఈ కేసులో బాధిత వర్గాల నుంచి ఆరోపణలు ఎదుర్కొంటున్న న్యాయవాది తిర్రే సత్యనారాయణరాజుతో పాటు పట్టణానికి చెందిన మరో నలుగురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించినప్పటికీ సురేష్ జాడ తెలుసుకోలేకపోవడం గమనార్హం. సురేష్ది హత్యగా నిర్ధారించుకుని విచారణ చేస్తున్నా నిందితులు మృతదేహాన్ని మాయం చేసిన తీరు పోలీసులను గందరగోళానికి గురి చేస్తుంది. బుధవారం చించినాడ గోదావరిలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సురేష్ జాడ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయినప్పటికీ ఎలాంటి సాక్ష్యాలు బయటపడకపోడంతో గురువారం మళ్లీ తిరిగి గాలింపు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. ఈనెల 23న సురేష్ తన సన్నిహితురాలు శిరీష ఇంటికి వచ్చిన విషయాన్ని స్థానికంగా ఉన్న నిందితుడి అనుచరుడు ఇచ్చిన సమాచారంతో రెక్కీ నిర్వహించి కిడ్నాప్ చేశారని, ఈ క్రమంలో చేసిన దాడిలో సురేష్కు తీవ్రగాయాలు కాగా కారులో తరలించి చించినాడలోని గోదావరిలో పారవేసినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. భీమవరం: పట్టణంలో బుధవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారని టూటౌన్ ఎస్సై ఫజుల్ రహమాన్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం పట్టణంలోని లంకపేటకు చెందిన బొబ్బనపల్లి హరీష్బాబు తన స్నేహితుడు కొరాడ లక్ష్మీనారాయణతో కలిసి దుర్గాపురం నుంచి టీ తాగడానికి మోటారు సైకిల్పై వస్తుండగా వేగంగా వస్తున్న కారు రోడ్డుపై ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. అనంతరం ఆగకుండా హరీష్బాబు ప్రయాణిస్తున్న మోటారుసైకిల్ను ఢీకొట్టింది. దీంతో మోటారుసైకిల్పై ఉన్న ఇద్దరు రోడ్డుపైపడి గాయపడ్డారు. వీరిని స్థానికులు చికిత్స కోసం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై రహమాన్ పేర్కొన్నారు. -
నాకో, ఏపీశాక్స్, రాష్ట్ర జైలు శాఖ సహకారంతోనే..
నాకో, ఏపీ శాక్స్, రాష్ట్ర జైలు శాఖ సహకారంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా 83 జైళ్లల్లో హెచ్ఐవీ, టీబీ, సుఖవ్యాధులు, హెపటైటిస్ వ్యాధులపై అవగాహన కల్పిస్తూ క్షేత్ర స్థాయిలో పరీక్షలు చేశాం. వ్యాధి నిర్ధారణైన వ్యక్తులకు అవసరమైన మందులను, ఆరోగ్య సదుపాయాలను అందిస్తున్నాం. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పరిధిలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ, దిశ, జైళ్ల శాఖ సంయుక్త సహకారంతో ఈ కాార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నాం. –ఎం రాధిక, లెప్రసొసైటీ సీనియర్ మేనేజర్, విజయవాడ -
శ్రీకృష్ణా సుజుకీలో దసరా ఆఫర్లు
ఏలూరు టౌన్: ఏలూరులోని శ్రీకృష్ణా సుజుకీ షోరూమ్లో దసరా వేడుకల నేపథ్యంలో సందడి వాతావరణం నెలకొంది. ఒకవైపు జీఎస్టీ తగ్గింపు, మరోవైపు శ్రీకృష్ణా సుజుకీ యాజమాన్యం నారా శేషు కొనుగోళ్లపై ఆఫర్లు ప్రకటించటంతో కొనుగోలుదారులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం సుజుకీ వాహనం కొనుగోళ్లపై సుమారు రూ.15వేల వరకూ జీఎస్టీ ఆదా అవుతుందని నిర్వాహకులు చెబుతున్నారు. వీటితోపాటు క్యాష్ బ్యాక్ ఆఫర్లు కొనుగోలుదార్లను ఆకర్షిస్తున్నాయి. ప్రతి సుజుకీ యాక్సెస్ కొనుగోలుపై రూ.3వేలు, అవినీస్ కొనుగోలుపై రూ.5వేలు క్యాష్బ్యాక్ ఆఫర్ వర్తిస్తుందని షోరూమ్ ప్రతినిధులు చెబుతున్నారు ప్రతి మోటారు సైకిల్ కొనుగోలుపై ఏకంగా రూ.20 వేల క్యాష్బ్యాక్ ఇస్తుండగా, డౌన్పేమెంట్ సైతం కేవలం రూ.5999 మాత్రమే ఉందని యజమాని నారా శేషు తెలిపారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని ఏలూరు, భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం, పాలకొల్లు, కొవ్వూరులోని తమ షోరూమ్స్లో ఆఫర్లు కొనసాగుతున్నాయని ఆయన స్పష్టం చేశారు. కై కలూరు: స్థానిక మాగంటి థియేటర్లో ఈ నెల 30న థియేటర్ సిబ్బందిపై దాడి చేసిన ఘటనలో నలుగురిపై కేసు నమోదు చేసి, తహసీల్దార్ వద్ద బైండోవర్ చేశామని కై కలూరు టౌన్ ఎస్సై డి.వెంకట్కుమార్ బుధవారం విలేకరులకు తెలిపారు. వివరాల ప్రకారం కలిదిండి మండలం పడమటిపాలెంకు చెందిన పాము సూర్యకుమార్(23), గంగుల ధన్రాజ్(29), కలిదిండి హేమంత్కుమార్(30), కరేటి సాయికుమార్(23)లు మద్యం తాగి ప్రక్షుకులతో గొడవకు దిగారని పేర్కొన్నారు. టిక్కెట్లు డబ్బులు వాపసు ఇస్తామని బయటకు వెళ్లాలని థియేటర్ మేనేజర్ గణేష్, సిబ్బంది సుంకర వెంకటేశ్వరరావులు చెప్పారు. దీంతో అక్కడ శుభ్రం చేసే కర్రతో వీరిపై నలుగురు దాడి చేశారు. నిందితులను కై కలూరు తహసీల్దారు మందు హాజరుపర్చగా ఏడాదికి ఒక్కొక్కరికీ రూ.5 లక్షలు బైండవర్ విధించినట్లు ఎస్సై చెప్పారు. యువకులకు కౌన్సెలింగ్ ఇచ్చి స్టేషన్ బెయిల్పై పంపించామన్నారు. ముదినేపల్లి రూరల్ అదనపు కట్నం కోసం వేధిస్తున్న భర్త, అత్తలపై వివాహిత ఇచ్చిన ఫిర్యా దు మేరకు స్థానిక పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. వివరాల ప్రకారం మండలంలోని పెయ్యేరు శివారు అప్పారావుపేటకు చెందిన డి.ప్రియాంకకు పెడన మండలం కోటవానిపాలెం గ్రామానికి చెందిన పరసా శ్రీకాంత్తో 2018లో వివాహం జరిగింది. వివాహ సమయంలో ఇచ్చిన లాంఛనాలతో పాటు అనంతరం మరికొంత నగదు ముట్టజెప్పారు. అయినప్పటికీ భర్త శ్రీకాంత్తో పాటు అత్త శేషమ్మ అధిక కట్నం తేవాలని తరచూ శారీరకంగా, మానసికంగా వేధిస్తూ కాపురానికి తీసుకువెళ్లడం లేదు. దీంతో బాధితురాలు ప్రియాంక పోలీసులను ఆశ్రయించింది. -
శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం
ద్వారకాతిరుమల: శ్రీవారి వైశాఖమాస దివ్య బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధమైంది. గురువారం ప్రారంభమయ్యే ఈ ఉత్సవాలు ఈన ెల 9 వరకు వైభవంగా జరగనున్నాయి. ఆలయాన్ని, పరిసరాలను విద్యుత్ దీప తోరణాలతో శోభాయమానంగా అలంకరించారు. దాంతో ఆలయ రాజగోపురాల సముదాయం, అనివెట్టి మండపం, కొండపైన ఘాట్ రోడ్లు పరిసర ప్రాంతాలు విద్యుత్ దీప కాంతులతో మిరమిట్లు గొలుపుతున్నాయి. ఆలయంలో పుష్పాలంకరణ పనులు బుధవారం రాత్రి ప్రారంభమయ్యాయి. స్వామివారు ఉదయం, రాత్రి వేళల్లో విహరించే వాహనాలను ముస్తాబు చేశారు. సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు ఆలయ తూర్పురాజగోపుర ప్రాంతంలోని శ్రీహరి కళాతోరణ వేదిక సిద్ధమైంది. గురువారం ఉదయం 9.30 గంటలకు స్వామి, అమ్మవార్లను పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తెలను చేయడంతో ఈ ఉత్సవాలు ప్రారంభమవుతాయని ఆలయ ఈఓ ఎన్వీఎస్ఎన్ మూర్తి తెలిపారు. -
ఖైదీల్లో పరివర్తన.. నైపుణ్య శిక్షణ
ఏలూరు (మెట్రో) : సీసీసీ పేరుతో కస్టడీ, కేర్, కరెక్షన్ పేరుతో జైళ్ల శాఖ ఖైదీల పట్ల అనేక సేవలు అందిస్తుంది. వివిధ రకాల నేరాలు చేసి జైలు శిక్షకు వచ్చిన వారి పట్ల ఉదార స్వభావంతో అధికారులు వ్యవహరించి వారి మానసిక, శారీరక స్థితిగతులను బేరీజు వేసుకుంటారు. వారి నేరప్రవత్తి మార్చేందుకు జైలు అధికారులు ప్రతి ఒక్కరికీ కౌన్సెలింగ్, గ్రూప్ కౌన్సెలింగ్ వంటివి నిర్వహించి తద్వారా వారిలో మార్పు సాధించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అంతేకాకుండా నిరంతరం యోగా సాధనతో ఖైదీలకు తమ దైనందిక జీవితంలో మార్పులు తీసుకొచ్చేందుకు సైతం జైళ్ల సిబ్బంది చర్యలు తీసుకుంటున్నారు. ఖైదీలతో పాటు, సిబ్బందిని సమన్వయం చేస్తూ జిల్లా సబ్జైళ్ల అధికారి, జిల్లా జైల్ సూపరింటెండెంట్ సీహెచ్ ఆర్వీ స్వామి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇలా.. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా జైళ్లశాఖ ఆధ్వర్యంలో ఏలూరు జిల్లా జైలు, భీమవరం స్పెషల్ సబ్జైలు, చింతలపూడి సబ్జైలు, తణుకు సబ్జైల్, నరసాపురం సబ్జైల్, పోలవరం సబ్జైల్లు ఉన్నాయి. జైళ్లలో ఖైదీలకు వారి నైపుణ్యాలను ఆధారంగా ప్రస్తుతం మూడు రకాల వేతనాలను అందిస్తున్నారు. పనిలో ఏ నైపుణ్యం లేని వారికి రోజుకు రూ.160, తక్కువ నైపుణ్యం కలిగిన వారికి రూ.180, నైపుణ్యం కలిగిన వారికి రూ.200 ఇస్తున్నారు. పెట్రోల్ బంక్లో పని చేసే వారికి రూ.200, ముద్దాయిల అంగీకారంతో కిచెన్, క్లీనింగ్, తదితర పనులు చేసే వారికి రోజుకు రూ.160 రూపాయలు ఇస్తూ వారు జైలు శిక్ష అనంతరం వారి భవిష్యత్కు భరోసా ఇచ్చేందుకు జైళ్లశాఖ చర్యలు తీసుకుంటుంది. కఠిన శిక్షలే కాదు... అనేక నేరాలు చేసి వచ్చిన వారిలోనూ సత్ప్రవర్తన తీసుకొచ్చేందుకు తీవ్రంగానే శ్రమిస్తారు. కరుడు కట్టిన నేరస్తులైనా జైలులోకి వచ్చిన తరువాత వారి చేసిన నేరాలు పక్కన పెట్టి వారిలో మార్పు తీసుకొచ్చేందుకు కృషి చేస్తారు. ఏదో క్షణికావేశంలో చేసిన నేరానికి ఖైదీలు జీవితాన్నే కోల్పోవాల్సిన పరిస్థితి. ఆ జీవితాన్ని కోల్పోకుండా శిక్షానంతరం వారి బంగారు భవితకు బాటలను వేస్తున్నారు జైళ్ల శాఖ అధికారులు. నేడు ఖైదీల సంక్షేమ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం. నేర ప్రవృత్తి మార్చేందుకు కృషి శిక్షానంతరం భవిష్యత్కు బాటలు జైళ్ల శాఖ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు నేడు ఖైదీల సంక్షేమ దినోత్సవం -
ఇరిగేషన్ భూముల స్వాహా
బుధవారం శ్రీ 1 శ్రీ అక్టోబర్ శ్రీ 2025సాక్షి, టాస్క్ఫోర్స్: కై కలూరులో కబ్జాల పర్వం యథేచ్చగా కొనసాగుతోంది. కూటమి పాలనలో ప్రభుత్వ భూములకు రక్షణ కరువైంది. రూ.కోట్ల విలువైన ఇరిగేషన్, ఆర్అండ్బీ, పుంత పొరంబోకు భూములను పట్టపగలు ఆక్రమించేస్తున్నారు. జిల్లా అధికారులకు పదేపదే ఫిర్యాదులు చేస్తున్న చర్యలు శూన్యం. జాతీయ రహదారుల పక్కనే ప్రభుత్వ భూముల్లో షాపింగ్ కాంప్లెక్సు కట్టి ఏకంగా అద్దెలకు ఇస్తున్నారు. అధికారం మాది.. అడిగేవాడెవడురా? అంటూ అధికారులపై అరుస్తున్నారు. జిల్లాల పునర్విభజనలో భాగంగా కై కలూరు నియోజకవర్గం ఏలూరు జిల్లాలో చేరింది. దీంతో మా పరిధి కాదంటే.. మాది కాదంటూ అధికారులు కావాలని ఆక్రమణ ఫిర్యాదులను పట్టించుకోవడం లేదు. ఇరిగేషన్, ఆర్ఆండ్బీ అధికారులు ఆక్రమణలపై నోరెత్తలేని పరిస్థితి నియోజకవర్గంలో కనిపిస్తోంది. డ్రెయిన్లు, కాల్వలకు మరమ్మత్తులు చేస్తున్నామని ఒక పక్కన గొప్పలు చెబుతూనే మరోవైపు ఆక్రమణల పర్వాన్ని కొందరు నాయకులు ప్రొత్సహిస్తున్నారు. ఎన్నికల్లో విజయానికి కృషి చేశాం.. ఎంతో డబ్బు ఖర్చుచేశాం.. ఆ మాత్రం ఆక్రమణలు చేస్తే తప్పేంటీ..! అనే ధోరణి అక్రమార్కులలో స్పష్టంగా బయటపడుతోంది. ఆక్రమణల స్థలాల్లో అధికారులు హెచ్చరిక బోర్డులు పెడితే గంటల వ్యవధిలో అవి మాయమవుతున్నాయి. రెవెన్యూ, ఇరిగేషన్, పంచాయతీరాజ్ శాఖల అధికారులు చేష్టలుడిగి చూస్తున్నారు. ఆక్రమణలపై కఠిన చర్యలు తీసుకోకపోతే మరిన్ని ఆక్రమించడం ఖాయం కనిపిస్తోంది. మండవల్లి మండలం భైరవపట్నంలో హెచ్చరిక బోర్డులు పెట్టిన ఇరిగేషన్ సిబ్బందిఇరిగేషన్ భూమిలో అనుమతులు లేకుండా నిర్మించిన బోదెఆక్రమణదారులకు నోటీసులు పంపుతున్నాం. అయినా లెక్క చేయడం లేదు. బోర్డులు పెడుతున్నా పీకేస్తోన్నారు. ఇరిగేషన్ ఈఈ త్వరలో ఆక్రమణల భూములను పరిశీలిస్తారు. అక్రమ కట్టడాలపై తగు చర్యలు తీసుకుంటాం. – ఎం.శిరీష, ఇరిగేషన్ సబ్ డివిజన్ డీఈ, కై కలూరు పామర్రు–దిగమర్రు జాతీయ రహదారి 216లో మండవల్లి మండలం పాత భైరవపట్నం శోభనాద్రిపురం రోడ్డు పక్కన సర్వే నంబరు 36లో సుమారు 60 సెంట్ల ఇరిగేషన్ భూమిని ఆక్రమించారు. ఏకంగా 12 దుకాణ సముదాయాలను నిర్మించారు. ఈ దుకాణాల ద్వారా ఆక్రమణదారుడికి నెలకు రూ.2 లక్షల పైనే ఆదాయం వస్తుంది. ఆక్రమణలపై సెప్టెంబరు 15న ఏలూరు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదు చేశారు. పంచాయతీ నోటీసులు అందించింది. కరెంటు సర్వీసును సైతం కట్ చేశారు. ఇరిగేషన్ అధికారులు హెచ్చరిక బోర్డులు పెట్టారు. అయినా నియోజకవర్గ ప్రజాప్రతినిధి ఆత్మగా భావించే నాయకుడు కొమ్ముకాస్తున్నాడు. కై కలూరు – కోరుకొల్లు దారిలో 30 సెంట్ల ఇరిగేషన్ భూమిని ఆక్రమించారు. కై కలూరు – ఏలూరు రోడ్లో ఆర్అండ్బీ రోడ్డు పక్కన షాపింగ్ కాంప్లెక్స్ కట్టారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ లిస్టు చాంతాడంత ఉంది. కై కలూరులో రూ.కోట్ల విలువైన భూముల కబ్జాపై నోరెత్తని అధికారులు హెచ్చరిక బోర్డులు పెట్టినా లెక్క చేయని వైనం కూటమి పాలనలో పేట్రేగిపోతున్న భూ దందా -
ప్రైవేటీకరణ వద్దే వద్దు
వైద్య కళాశాలల ప్రైవేటీకరణ నిర్ణయంపై వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ నిరసన నరసాపురం: రాష్ట్రంలో వైద్యకళాశాలను ప్రైవేటు పరం చేయాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని విరమించుకోవాలని కోరుతూ వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలో ఎస్సీ సెల్ చేపట్టిన నిరసన కార్యక్రమం నరసాపురంలో విజయవతంగా సాగింది. 30 యాక్ట్ను పోలీసులు అమలు చేసినా.. పార్టీ శ్రేణులు భారీ ర్యాలీతో నిరసన గళం వినిపించారు. పేదలు, మధ్య తరగతి వారికి వైద్య విద్యను దూరం చేసి వైద్య కళాశాలలను ప్రైవేటు పరం చేస్తే ఊరుకునేది లేదంటూ దళితులు కదం తొక్కారు. ప్రభుత్వం తీరుమారకుంటే రానున్న రోజుల్లో ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ముందుగా పార్టీ ఎస్సీ సెల్ నాయకులు పార్టీ కార్యాలయం నుంచి పాదయాత్రగా భారీ నిరసన ర్యాలీ చేశారు. వైఎస్సార్సీపీ జెండాలు పట్టుకుని ట్యాక్సీ స్టాండ్ వద్ద ఉన్న అంబేడ్కర్ విగ్రహం వరకూ ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వం ఆటలు సాగనివ్వమని, వైద్య విద్యను ప్రైవేటీకరణ చేయనివ్వమని నినదించారు. ర్యాలీ అనంతరం అంబేడ్కర్ విగ్రహం వద్ద బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమంలో పార్టీ కేంద్రపాలక మండలి సభ్యుడు పీడీ రాజు మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన 17 మెడికల్ కళాశాలల్లో కొన్నింటిలో తరగతులు కూడా ప్రారంభమయ్యాయన్నారు. పెండింగ్ పనులు పూర్తి చేసి, మెడికల్ కళాశాలలు నడిపించడం చేతకాని కూటమి ప్రభుత్వం అబద్ధాలు చెబుతుందన్నారు. మధ్య తరగతి ప్రజల ప్రయోజనాలను విస్మరించడం చంద్రబాబుకు కొత్తకాదన్నారు. పార్టీ యూత్ విభాగం రాష్ట్ర కార్యదర్శి గంటా రాహుల్ మాట్లాడుతూ వెంటనే 590 జీవో రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఒకప్పుడు రాజశేఖరరెడ్డి ఫీజు రీయింబర్స్మెంట్తో వైద్య విద్యను పేద, మధ్య తరగతికి చిక్కేలా చేశారన్నారు. జగన్ ప్రభుత్వం రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు ఏర్పాటుకు శ్రీకారం చుట్టిందన్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం మెడికల్ కళాశాలలను ప్రైవేట్ సంస్థలకు అప్పగించాలనడం దారుణమన్నారు. పార్టీ ఆచంట నియోజకవర్గ పరిశీలకుడు ఖండవల్లి వాసు, నరసాపురం ఎంపీపీ మైలాబత్తుల సోనీ మాట్లాడుతూ వైఎస్సార్సీపీ హయాంలో ఏర్పాటైన మెడికల్ కళాశాలల విషయంలో కూటమి ప్రభుత్వం అబద్ధపు ప్రచారాలు మానుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పార్టీ యూత్ విభాగం జిల్లా అధ్యక్షుడు చిగురుపాటి సందీప్, కౌన్సిలర్లు జిల్లెళ్ల దిలీప్, సిర్రా కాంతమ్మ, పార్టీ ఎస్సీ సెల్ నరసాపురం నియోజకవర్గ అధ్యక్షుడు కోడెల్ల వెంకట్రావు, పార్టీ మేధావుల ఫోరం జిల్లా కన్వీనర్ వంగలపూడి జక్కరయ్య, పార్టీ ట్రేడ్ విబాగం రాష్ట్ర కార్యదర్శి ఎండీ షాన్వాజ్ఖాన్, ఎస్సీ సెల్ నాయకులు పడవల సత్యనారాయణ, కొల్లాబత్తుల రవికుమార్, కాకిలేటి ఆనంద్, వర్ధనపు చంటి, వర్ధనపు సుధాకర్, తణుకుల చంటి తదితరులు పాల్గొన్నారు. -
ఆశ్రం సెంటర్ పొదల్లో బాలిక
ఏలూరు టౌన్: ఏలూరు శివారు ఆశ్రం హాస్పిటల్ సెంటరు రైల్వే బ్రిడ్జి సమీపంలో ముళ్ళ పొదల్లో బాలికను వదిలేయడం కలకలం రేపింది. డీఎస్పీ డి.శ్రావణ్కుమార్ ఆధ్వర్యంలో వన్టౌన్ సీఐ జీ.సత్యనారాయణ, పెదవేగి సీఐ సీహెచ్ రాజశేఖర్, రూరల్ ఎస్సై నాగబాబు, పోలీస్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బాలికను గుర్తు తెలియని వ్యక్తులు రైల్వే బ్రిడ్జి పక్కన పొదల్లో వదిలేసి వెళ్ళినట్లు ప్రాథమిక అంచనా. డీఎస్పీ మాట్లాడుతూ.. స్థానికుల సమాచారంతో హుటాహుటిన వెళ్ళి బాలికను వెంటనే ఆశ్రం హాస్పిటల్కు తరలించామన్నారు. బాలిక పుట్టుకతోనే మానసికంగా ఎదగని స్థితిలో, శారీరక అనారోగ్యంతో బాధపడుతుందని తెలిపారు. వివరాలు ఇంకా తెలియలేదని, పూర్తిస్థాయిలో విచారణ చేస్తామని చెప్పారు. -
కొల్లేరు తిప్పలు
● కొల్లేరు ముంపు బారిన పెనుమాకలంక రహదారి ● ప్రమాదం అంచున తప్పని ప్రయాణం కై కలూరు: కొల్లేరు చుట్టూ నీరు ఉంది.. తాగడానికి చుక్క నీరు లేదు. పేరుకే పెనుమాకలంక రహదారి.. ఎగువ నుంచి కొల్లేరుకు నీరొస్తే కనిపించకుండా మునిగిపోతుంది. ఈ పరిస్థితులు కొల్లేరు దుర్భర పరిస్థితులకు అద్దం పడుతున్నాయి. మండవల్లి మండలం పెదఎడ్లగాడి వంతెన నుంచి పెనుమాకలంక, ఇంగిలిపాకలంక వెళ్లే రహదారి అనేక రోజులుగా నీటిలో నానుతూ, ప్రయాణం నరకప్రాయంగా మారుతోంది. ఇక్కడ రోడ్డుపై బాగా ఎక్కువ నీరు పారితే పడవలపై ప్రజలు వెళుతున్నారు. కాస్త తగ్గితే ద్విచక్రవాహానాలతో పడుతూ లేస్తూ ప్రమాదకరంగా ప్రయాణం సాగిస్తున్నారు. కొత్త వ్యక్తులు ఏ మాత్రం పట్టుతప్పిన కొల్లేరులో మునిగిపోవడం ఖాయం. కలెక్టర్కు ఫిర్యాదు.. పెనుమాకలంక రహదారి నీటిలో మునగడంపై కలెక్టర్ వెట్రిసెల్వికి సోమవారం ప్రజా సమస్యల ఫిర్యాదుల వేదికలో కొందరు ఫిర్యాదులు చేశారు. సుప్రీం కోర్టు అమలు చేస్తున్న 120 జీవో ప్రకారం అక్రమ చేపల సాగు అభయారణ్యంలో నిషిద్దం. పెనుమాకలంక రహదారిలో అక్రమ చెరువుల సాగు యథేచ్చగా సాగుతుంటే పట్టించుకోని ఫారెస్టు అధికారులు ప్రజలకు ఉపయోగపడే రహదారిని నిర్మించడానికి నిబంధనలు అడ్డుచెప్పడం ఏం న్యాయమని ప్రశ్నిస్తున్నారు. ఇటీవల తెలంగాణలో వర్షాలు అధికంగా కురియడంతో వివిధ డ్రెయిన్ల ద్వారా వచ్చిన నీరు ఏలూరు–కై కలూరు రహదారిలో పెదఎడ్లగాడి ద్వారా కిందకు చేరాలి. వంతెన ఖానాల వద్ద గుర్రపుడెక్క పేరుకుపోవడంతో నీరు వెనక్కి మళ్లీ పెనుమాకలంక రహదారిని ముంచేత్తుతుంది. శాశ్వత పరిష్కారం చూపాలని ప్రజలు కోరుతున్నారు. ఏలూరు టౌన్: ఏలూరు జిల్లా కై కలూరు దానగూడెం దళితులకు, మరో సామాజికవర్గానికి మధ్య వినాయక నిమజ్జనం ఊరేగింపులో చోటుచేసుకున్న ఘర్షణపై సోషల్ మీడియాలో తప్పుడు కథనాలు ప్రచారం చేస్తున్న వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఏపీ మాల ఉద్యోగుల సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుడు బేతాళ సుదర్శనం ఏలూరు డీఎస్పీ డీ.శ్రావణ్కుమార్కు ఫిర్యాదు చేశారు. కొందరు యూట్యూబర్లు, ఇన్ఫ్లూయన్సర్లు ఇష్టారాజ్యంగా వీడియోలు, రీల్స్ చేస్తూ రెండు సామాజికవర్గాల మద్య విభేధాలు, విద్వేషాలు రగిలించేలా సోషల్ మీడియాలో ప్రచారం చేయటాన్ని ఆయన తప్పుబట్టారు. ఎస్సీ, ఎస్టీలను అవమానించేలా, రెచ్చగొట్టేలా, వారి మనోభావాలను కించపరిచేలా సోషల్మీడియాలో పోస్ట్లు పెట్టిన వారిపై ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం మేరకు కఠిన చర్యలు తీసుకోవచ్చని సుప్రీంకోర్టు తీర్పును ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయా యూట్యూబర్ల వివరాలను ఏలూరు డీఎస్పీ శ్రావణ్కుమార్కు అందజేశారు. ఫిర్యాదు చేసిన వారిలో ఏపీ మాల ఉద్యోగుల సంఘం ప్రతినిధులు బేతాళ నాగరాజు, టీఎన్డీవీ ప్రసాద్, ములగల బెన్హర్, బంటుమిల్లి కెనడీ, దండబత్తుల రవికుమార్ ఉన్నారు. ఏలూరు టౌన్: గంజాయి కేసులో ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు ఏలూరు వన్టౌన్ సీఐ జీ.సత్యనారాయణ తెలిపారు. ఏలూరు రూరల్ పోలీస్స్టేషన్ ఇన్చార్జి ఎస్సై బి.నాగబాబు తన సిబ్బందితో సెప్టెంబర్ 29న సాయంత్రం 4.30గంటల సమయంలో ఏలూరు తంగెళ్ళమూడి ప్రాంతంలో వాహన తనిఖీలు నిర్వహించగా, ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. వారిని తనిఖీ చేయగా 2.396 కిలోల గంజాయి లభించడంతో అరెస్ట్ చేసినట్లు చెప్పారు. నిందితులు ఏలూరు 29వ డివిజన్ తాపీమేసీ్త్ర కాలనీకి చెందిన దుడ్డె ప్రశాంత్కుమార్, బీడీ కాలనీ ద్వారకానగర్కు చెందిన సిద్దాంతపు రాములపై కేసు నమోదు చేసి, న్యాయస్థానం ముందు హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ విధించారని తెలిపారు. ఆకివీడు: ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక ఓ వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్సై హనుమంతు నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం స్థానిక శ్రీరామపురంకు చెందిన పాలకుర్తి సంతోష్ కుమార్ (36) అమెజాన్ కంపెనీలో సీనియర్ ఎగ్యిక్యూటివ్గా పనిచేసేవాడు. ఇటీవల ఉద్యోగం నుంచి తొలగించడంతో ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాడు. ఈఎంఐ బకాయిలు కట్టలేక మనస్తాపంతో మంగళవారం తెల్లవారు జామున ఇంటిలోని వరండాలోని ఇనుప రాడ్డుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతని భార్య కీర్తన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చెప్పారు. -
కూటమి ప్రభుత్వంలో అవినీతి రాజ్యం
మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ తాడేపల్లిగూడెం అర్బన్: రాష్ట్రం, నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వ అవినీతి పాలన అంతులేకుండా ఉందని మాజీ ఉపముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ దుయ్యబట్టారు. మంగళవారం ఆయన కార్యా లయంలో విలేకరుల సమావేశంలో కొట్టు మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చిన 18 నెలల్లో రూ.2 లక్షల కోట్లు అప్పుచేసిన చంద్రబాబు ఆ సొమ్మును ఏం చేశాడో లెక్క చెప్పాలన్నారు. సూపర్ సిక్స్ సూపర్ ఫ్లాప్ అయిందని చెప్పారు. తల్లికి వందనం 87 లక్షల మంది విద్యార్థులకు అందచేయాల్సి ఉండగా కేవలం కొంతమందికే ఇచ్చారన్నారు. ఏడాదికి మూడు గ్యాస్ సిలెండర్లు ఇస్తామని గ్యాస్ కొట్టి వదిలారని విమర్శించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో లిక్కర్ షాపులు నిర్వహిస్తే రూ.3,500 కోట్ల అవినీతి జరిగిందని చంద్రబాబు గోల చేసి, నిరూపించలేక నోరు మెదపకుండా ఉన్నాడన్నారు. ఏడాదికి 20 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగులకు నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి పథకాలు అమలు చేయలేని చేతకాని చంద్రబాబు హామీలు ఎందుకు ఇచ్చాడని ప్రశ్నించారు. ఫీజు రీయింబర్స్మెంటు, రైతులకు అన్నదాత సుఖీభవ పథకాలను అమలు చేయలేపోయిన అసమర్థ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నిలిచాడన్నారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు తమ అవినీతి పాలనన బహిరంగంగానే చెబుతున్నారని కొట్టు ఎద్దేవా చేశారు. మట్టి, ఇసుక, పేకాట, కోడిపందేలు ఏడాది పొడవునా కొనసాగించడం వారికి చెల్లుతుందన్నారు. ఇసుక ఉచితం అంటూనే 6 యూనిట్లకు రూ.16,500 వసూలు చేస్తున్నారన్నారు. కోరుమిల్లి ఎంపీటీసిని మభ్యపెట్టి తమ పార్టీలో చేర్చుకొని అభివృద్ధి జరగలేదని చెప్పడం హాస్యాస్పదమన్నారు. తాను చేసిన అభివృద్ధిని చూపిస్తానని, ప్రస్తుత ఎమ్మెల్యే చేసిన అభివృద్ధిని ప్రజలకు చూపించాలని చాలెంజ్ విసిరారు. నియోజకవర్గంలో రూ.200 కోట్లుతో మూడు బ్రిడ్జిలు నిర్మిస్తామని చెప్పిన ప్రజా ప్రతినిధి టెండర్లు పిలిచారా? నిధులు మంజూరు చేయించారా? నిర్మాణాలు ఎప్పుడు చేపడుతున్నారో చెప్పగలరా? అని ప్రశ్నించారు. గతంలో ఇదే ప్రజాప్రతినిధి మున్సిపల్ చైర్మన్గా ఎల్ఈడీ లైట్ల పేరుతో రూ.కోట్లు దండుకున్నారని ఆరోపించారు. ఇప్పుడు క్రీడల పేరుతో దోపిడీ చేస్తున్నారన్నారు. -
జిల్లా అభివృద్ధికి కృషి చేయాలి
భీమవరం (ప్రకాశంచౌక్): కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు ద్వారా పశ్చిమగోదావరి జిల్లా సమగ్ర అభివృద్ధికి అధికారులు చిత్తశుద్ధితో కృషి చేయాలని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ అన్నారు. మంగళవారం కలెక్టరేట్ పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో జిల్లా అభివృద్ధి, సమన్వయ, పర్యవేక్షణ కమిటీ(దిశ) సమావేశం కేంద్ర మంత్రి అధ్యక్షతన జరిగింది. సమావేశంలో జెడ్పీ చైర్పర్సన్ ఘంటా పద్మశ్రీ, కలెక్టర్ చదలవాడ నాగరాణి, పీఏసీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు, ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్ అండ్ బీ, ఆర్ డబ్ల్యుఎస్, వైద్య ఆరోగ్యశాఖ, వ్యవసాయ, ఉద్యాన శాఖ, పౌర సరఫరాలు తదితర శాఖల ద్వారా కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు తీరును సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ ప్రజా సంక్షేమం, అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను దేశవ్యాప్తంగా అమలు చేస్తోందని వాటి ఫలాలు ప్రజలకు చేరాలంటే అధికారులు క్షేత్రస్థాయిలో చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు. భీమవరం ఎమ్మెల్యే మాట్లాడుతూ భీమవరం యనమదుర్రు డ్రెయిన్పై అసంపూర్తిగా ఉన్న మూడు వంతెనలకు అప్రోచ్ రోడ్డు వేయాలని, అంచనా వేయగా రూ.36 కోట్లు ఖర్చవుతుందని తెలిపారు. తాడేపల్లిగూడెం, తణుకు ఎమ్మెల్యేలు మాట్లాడుతూ గుంతలు పూడ్చడంతో ప్రయోజనం లేదని, సింగిల్ లేయర్ రోడ్ల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని కోరారు. సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ ప్రచార కార్యక్రమంలో భాగంగా చేపడుతున్న ప్రచార ప్రక్రియను మంత్రికి వివరించారు. -
హత్యగా మారిన మిస్సింగ్ కేసు?
తణుకు అర్బన్: గత నాలుగు రోజులుగా తణుకులో సంచలనం రేకెత్తించిన యువకుడి అదృశ్యం కేసు కాస్త హత్య కేసుగా మలుపు తిరిగింది. తాడేపల్లిగూడెంకు చెందిన మడుగులు సురేష్ (25) ఆచూకీ కోసం మంగళవారం పోలీసు అధికారులు గోస్తనీ కాలువ, చించినాడ బ్రిడ్జి ప్రాంతాల్లో చేసిన గాలింపు చర్యలు చేపట్టారు. తాడేపల్లిగూడెం డీఎస్పీ డి.విశ్వనాథ్ గాలింపు చర్యలను పరిశీలించారు. ఆజ్ఞాతంలో ఉన్న న్యాయవాది తిర్రే సత్యనారాయణరాజు, నలుగురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకుని వారిచ్చిన సమాచారంతోనే గాలింపు చర్యలు చేపట్టారంటూ గుప్పుమంది. అయితే సురేష్, న్యాయవాది భార్య శిరీషతో అత్యంత సన్నిహితంగా ఉండేవాడని ఇటీవల గౌరీపట్నం కూడా కలిసివెళ్లారని తెలుస్తోంది. దీంతో వివాహేతర సంబంధం కారణంగానే హత్య జరిగిందా అనేది చర్చనీయాంశంగా మారింది. ఇందుకు నిదర్శనంగా సురేష్, శిరీష కలిసి ఉన్న ఫొటోలను సురేష్ కుటుంబ సభ్యులు బయటకు విడుదల చేశారు. 25న వెలుగులోకి మిస్సింగ్.. ఈనెల 23వ తేదీన సురేష్ తణుకు వచ్చి మరలా తాడేపల్లిగూడెం రాలేదని అతడి సోదరి ప్రశాంతి ఈనెల 25న తణుకు పట్టణ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసిన నేపథ్యంలో వెలుగులోకి వచ్చిన మిస్సింగ్ వ్యవహారం తణుకులో సంచలనం రేకెత్తించింది. న్యాయవాది తిర్రే సత్యనారాయణరాజు భార్య శిరీషతో సురేష్ సన్నిహితంగా ఉంటాడని ఆయనపైనే అనుమానంగా ఉందంటూ చేసిన ఫిర్యాదుతో పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేశారు. అయితే న్యాయవాదితోపాటు తణుకుకు చెందిన మరో నలుగురు వ్యక్తులు అజ్ఞాతంలోకి వెళ్లడంతో ఆరోపణలకు బలం చేకూరింది. పట్టణ సీఐ ఎన్.కొండయ్య ప్రత్యేక బృందాన్ని నియమించి నిందితుల కోసం గాలింపు చేపట్టారు. మంగళవారం ఉదయం నిందితులను తణుకు తీసుకువచ్చి విచారిస్తున్నట్లుగా సమాచారం. స్టేషన్ వద్ద ఉద్రిక్తత... సురేష్ అదృశ్యంపై ఫిర్యాదు చేసి వారం రోజులు గడిచినా ఇంతవరకు పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోలేదంటూ తాడేపల్లిగూడెంకు చెందిన బాధితవర్గాలు తణుకు పట్టణ పోలీస్స్టేషన్ ముందు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఒక దశలో ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. సీఐ కొండయ్య బయటకు వచ్చి విచారణకు సహకరించాలని విజ్ఞప్తి చేయడంతో గొడవ సద్దుమణిగింది. పోలీసులను పక్కదారి పట్టిస్తున్న నిందితులు! పోలీసులను నిందితులు పక్కదారి పట్టిస్తున్నారని సురేష్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మంగళవారం ఉదయం డీఎస్పీ విశ్వనాథ్ ఆధ్వర్యంలో పోలీసులు ఈతగాళ్లు, బాఽధిత వర్గాల సాయంతో తణుకు గోస్తనీ కాలువలో గాలింపు చర్యలు చేపట్టారు. తీరా మధ్యాహ్నం మరలా చించినాడ బ్రిడ్జి ప్రాంతంలో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. దీంతో నిందితులు ముందుగానే పక్కా ప్రణాళిక వేసుకుని పోలీసులను పక్కదారి పట్టిస్తున్నారని అంటున్నారు. ఈనెల 23న కొందరు వ్యక్తులు సురేష్ను తణుకులోని ఒక శ్మశానవాటికలో గట్టిగా కొట్టినట్లుగా తెలిసిందని బాధితవర్గాలు చెబుతున్నారు. -
చంద్రబాబు ప్రభుత్వ కుట్ర
పెనుమంట్ర: పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేసేందుకు చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తూ మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేయడానికి సిద్ధమవుతుందని పెనుమంట్ర జెడ్పీటీసీ కర్రి గౌరీ సుభాషిణి అన్నారు. మంగళవారం నియోజకవర్గ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో మార్టేరు సెంటర్లో అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. గౌరీ సుభాషిని మాట్లాడుతూ తక్షణం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిలిపివేయలని డిమాండ్ చేశారు. ఎస్సీ సెల్ నియోజకవర్గ అధ్యక్షుడు పిల్లి రుద్ర ప్రసాద్ మాట్లాడుతూ కేవలం దళిత వర్గాలకు అన్యాయం చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం వ్యతిరేక విధానాలను ప్రారంభిస్తుందని అన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ మట్టకుమారి రాము, సుంకర సీతారాం, కోట వెంకటేశ్వరరావు, మండల పార్టీల అధ్యక్షులు గూడూరు దేవేంద్రుడు, జక్కశెట్టి సంటి, జక్కం శెట్టి శ్రీరామ్, మండలాల ఎస్సీ సెల్ అధ్యక్షులు పలివెల శ్రీనివాస్, బుర్ర రవికుమార్, గొట్టుముక్కల సునీల్ వర్మ, జి ఏసురత్నం, దుర్గాప్రసాద్ ,కోట గిరిధర్, వడ్లపాటి అంబేద్కర్, సాగర్ సుబ్రహ్మణ్యం, కొడమంచిలి రాజు తదితరులు పాల్గొన్నారు. -
బ్రహ్మాండనాయకుని ఉత్సవాలకు వేళాయె
ద్వారకాతిరుమల: ద్వారకామహర్షి తపోఫలితం.. శ్రీవారి దివ్య క్షేత్రం. ఈ క్షేత్రంలో గురువారం నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఉత్సవాలను నేత్రపర్వంగా నిర్వహించేందుకు దేవస్థానం అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. 8 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో శ్రీవారు ఉభయ దేవేరులతో కలసి ఉదయం, సాయంత్రం వేళల్లో పలు వాహనాలపై తిరువీధుల్లో విహరిస్తారు. అలాగే ఆలయ ముఖ మండపంలో స్వామివారు రోజుకో విశేష అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు. ఆలయ తూర్పురాజగోపుర ప్రాంతంలోని శ్రీహరి కళాతోరణ వేదికపై ఉదయం నుంచి రాత్రి వరకు పలు సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. ఉత్సవ ఏర్పాట్లకు సంబంధించిన విద్యుద్దీప అలంకారాలు, ఇతర పనులు తుది దశకు చేరుకున్నాయి. రెండుసార్లు బ్రహ్మోత్సవాలు మహర్షి తపస్సుకు మెచ్చిన శ్రీవేంకటేశ్వరస్వామి స్వయంభూ ఈ క్షేత్రంలో పుట్టలో వెలిశారు. అందువల్ల పాదపూజ కోసం పెద్దతిరుపతి నుంచి శ్రీవారిని తెచ్చి స్వయంభూ వెనుక ప్రతిష్టించారు. దాంతో ఒకే అంతరాలయంలో స్వామివారు ద్విమూర్తులుగా కొలువై ఉండటంతో ఏటా వైశాఖ మాసంలో చినవెంకన్నకు, ఆశ్వయుజ వూసంలో ప్రతిష్ఠ స్వామికి ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. తిరుమల తిరుపతి శ్రీవారు ఇక్కడ ఉండటం వల్ల, అక్కడి మొక్కులు ఇక్కడ తీర్చుకునే సాంప్రదాయం ఉంది. కానీ ఇక్కడ మొక్కులు పెద్ద తిరుపతిలో తీర్చకూడదు. పెద్ద వెంకన్న ఉన్న తిరుమల తిరుపతిని పెద్దతిరుపతిగా, చిన్నవెంకన్న ఉన్న ద్వారకాతిరుమలను చిన్నతిరుపతిగా పిలుస్తారు. ఉత్సవ విశేషాలు ఇవీ.. ● 2 న ఉదయం 9.30 గంటలకు శ్రీవారిని పెండ్లి కుమారునిగా, అమ్మవార్లను పెండ్లి కుమార్తెలుగా చేస్తారు. ఆ రోజు రాత్రి 7 గంటలకు గజవాహనంపై స్వామివారి గ్రామోత్సవం. ● 3 న రాత్రి 9 గంటలకు ధ్వజారోహణ, అనంతరం హంసవాహనంపై స్వామివారి గ్రామోత్సవం. ● 4 న ఉదయం 7 గంటలకు సూర్యప్రభ వాహనంపై, రాత్రి 7 గంటలకు చంద్రప్రభ వాహనంపై స్వామివారి గ్రామోత్సవం. ● 5 న ఉదయం 7 గంటలకు హనుమద్వాహనంపై స్వామివారి గ్రామోత్సవం, రాత్రి 7 గంటలకు ఎదుర్కోలు ఉత్సవం, అనంతరం వెండి శేష వాహనంపై గ్రామోత్సవం. ● 6 న ఉదయం 7 గంటలకు సింహ వాహనంపై శ్రీవారి గ్రామోత్సవం, రాత్రి 8 గంటల నుంచి శ్రీ స్వామివారి తిరుకల్యాణ మహోత్సవం, అనంతరం వెండి గరుడ వాహనంపై గ్రామోత్సవం. ● 7 న రాత్రి 8 గంటల నుంచి రధోత్సవం. ● 8 న ఉదయం 10.30 గంటలకు చక్రస్నానం, రాత్రి 9 గంటలకు ధ్వజావరోహణ, అనంతరం అశ్వ వాహనంపై గ్రామోత్సవం. ● 9 న ఉదయం 9 గంటలకు చూర్ణోత్సవం, వసంతోత్సవం, రాత్రి 7 గంటలకు ద్వాదశ కోవెల ప్రదక్షిణలు, పవళింపుసేవ, శ్రీపుష్పయాగం కార్యక్రమాలు జరుగుతాయి. వీటితో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. పెరుగుతున్న భక్తుల తాకిడి దినదినాభివృద్ధి చెందుతున్న ఈ క్షేత్రాన్ని సందర్శించే భక్తుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. వారికి అన్ని సౌకర్యాలు కల్పించాలన్న లక్ష్యంతో అధికారులు పలు అభివృద్ధి పనులు చేపట్టారు. అందులో భాగంగా కోట్లాది రూపాయల వ్యయంతో జరుగుతున్న అనివేటి మండప విస్తరణ, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. ఇవి అందుబాటులోకి వస్తే భక్తులకు మరిన్ని సౌకర్యాలు సమకూరుతాయి. ఈ క్షేత్రంలో 40 అడుగులకు పైగా ఉన్న గరుత్మంతుడు, అభయాంజనేయుడు, అన్నమాచార్యుని విగ్రహాలు భక్తులకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. రేపటి నుంచి ద్వారకాతిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు 6 న రాత్రి తిరుకల్యాణం, 7న రాత్రి రథోత్సవం రోజుకో ప్రత్యేక అలంకారంలో దర్శనమివ్వనున్న శ్రీవారు ఉత్సవాలు జరిగే రోజుల్లో ఆర్జిత సేవలు రద్దు ప్రత్యేక అలంకారాలు ఇలా.. 2న మహావిష్ణువు 3న మురళీకృష్ణ 4న సరస్వతి 5న భూ వరాహ స్వామి 6న మోహిని 7న రాజమన్నార్ 8న వైకుంఠ నారాయణుడు 9న శయన మహావిష్ణువు దూరప్రాంతాల నుంచి వచ్చే భక్తులు రైల్వే మార్గంగుండా ద్వారకాతిరుమలకు 17 కిలో మీటర్ల దూరంలో ఉన్న భీమడోలు రైల్వేస్టేషన్కు చేరుకొని అక్కడినుంచి ఆర్టీసీ బస్సులు, ఆటోలు ద్వారా క్షేత్రానికి చేరుకోవాలి. ఏలూరు, నరసాపురం, తాడేపల్లిగూడెం, జంగారెడ్డిగూడెం, రాజమండ్రి ప్రాంతాల బస్సుల ద్వారా నేరుగా క్షేత్రానికి చేరుకోవచ్చు. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. 8 రోజులపాటు జరిగే ఈ ఉత్సవాలను వీక్షించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలిరావాలి. సాధారణ భక్తులకు పెద్దపీట వేస్తాం. 6న స్వామివారి కల్యాణం, 7న రథోత్సవాన్ని నిర్వహిస్తాం. ఉత్సవాలను పురస్కరించుకుని ఈనెల 2 నుంచి 9 వరకు ఆలయంలో నిత్యార్జిత కల్యాణాలు, ఆర్జిత సేవలను రద్దు చేస్తున్నాం. భక్తులు గమనించాలి. – ఎన్వీఎస్ఎన్ మూర్తి, శ్రీవారి దేవస్థానం ఈఓ -
సమస్యల పరిష్కారం కోసం చలో విజయవాడ
భీమవరం: రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు గడిచిపోతున్నా నేటికీ ఉద్యోగ, ఉపాధ్యాయులకు సంబంధించి ఏ ఒక్క సమస్యను పరిష్కరించలేదని రాష్ట్ర ఫ్యాప్టో చైర్మన్ ఎల్.సాయి శ్రీనివాస్ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయుల విద్యా, ఆర్థిక రంగ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ఫ్యాప్టో పోరుబాట కార్యక్రమంలో భాగంగా అక్టోబర్ 7న ‘చలో విజయవాడ’కు పిలుపునివ్వడంతో మంగళవారం భీమవరం యూటీఎఫ్ కార్యాలయంలో ఫ్యాప్టో జిల్లా చైర్మన్ పీఎస్.విజయరామరాజు, జనరల్ సెక్రటరీ జి.ప్రకాశం నేతృత్వంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. త్వరిత గతిన 30 శాతం మధ్యంతర భృతిని ప్రకటించాలని, బకాయి ఉన్న నాలుగు డీఏలను విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బొర్రా గోపిమూర్తి మాట్లాడుతూ ఉపాధ్యాయులను బోధనేతర పనుల నుంచి తప్పించి బోధనకు మాత్రమే పరిమితం చేయాలని, ఉపాధ్యాయులకు యాప్ల భారం నుంచి విముక్తి కలిగించాలన్నారు. అనంతరం చలో విజయవాడ పోస్టర్ను ఆవిష్కరించారు. ఏలూరు(ఆర్ఆర్పేట): ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో మెగా డీఎస్సీ–2025లో ఎంపికై న నూతన ఉపాధ్యాయులకు ఇండక్షన్ ట్రైనింగ్ ఉంటుందని విద్యాశాఖాధికారి వెంకటలక్ష్మమ్మ అన్నారు. ఈ నెల 3 నుంచి 10 వరకు డీఎస్సీలో నూతనంగా ఎంపికై న ఉపాధ్యాయులు ఇండక్షన్ ట్రైనింగ్కు హాజరుకావాలన్నారు. ఈ ట్రైనింగ్ ఎవరికి ఏ విధమైన మినహాయింపులు ఉండవని, ట్రైనింగ్ క్యాంపునకు హాజరుకాని ఉపాధ్యాయులు తదుపరి విడతలో నిర్వహించే ట్రైనింగ్ హాజరైన తరువాత మాత్రమే పోస్టింగ్ ఆర్డర్ ఇస్తారన్నారు. ట్రైనింగ్కు అవసరమైన వస్తువులన్నీ తెచ్చుకోవాలన్నారు. ట్రైనింగ్కు హాజరయ్యే నూతన ఉపాధ్యాయుల వారి బెడ్షీట్స్, ఇతర వ్యక్తిగత సామగ్రి, ఉదయం జాగింగ్ నిమిత్తం రన్నింగ్ షూస్, ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్స్ తప్పనిసరిగా తెచ్చుకోవాలన్నారు. జంగారెడ్డిగూడెం: రోడ్డు నిర్మాణం కోసం ప్రజలు రోడ్డెక్కారు. జంగారెడ్డిగూడెం నుంచి ఏలూరు రోడ్డు నిర్మించాలని మంగళవారం పాదయాత్ర నిర్వహించారు. గ్రీన్ఫీల్డ్ హైవే నుంచి రావికంపాడు వరకు ప్రధాన రహదారి గోతులతో అస్తవ్యస్తంగా ఉందన్నారు. ఎమ్మెల్యే గానీ ప్రజాప్రతినిధులు గానీ పట్టించుకోవడం లేదన్నారు. రోడ్డు దుస్థితిని చూపించే ఉద్దేశంతో పాదయాత్ర చేసినట్లు చెప్పారు. కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాదిన్నర దాటినా రోడ్ల పరిస్థితిలో మార్పు లేదన్నారు. జంగారెడ్డిగూడెం – ఏలూరు రోడ్డు నెల రోజుల్లో నిర్మించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని తెలిపారు. జంగారెడ్డిగూడెం: పేషెంట్పై టెక్నీషియన్ దాడి చేసిన ఘటన జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రిలో జరిగింది. రోగి బంధువులు, ఆసుపత్రి వర్గాల సమాచారం ప్రకారం.. తాడువాయి పంచాయతీ గొల్లగూడెంకు చెందిన ములకాల వీరరాఘవులు జంగారెడ్డిగూడెం ఏరియా ఆసు పత్రిలో డయాలసిస్ చేయించుకుంటున్నారు. మంగళవారం ఉదయం షిప్ట్లో డయాలసిస్ చేయించుకోవాల్సి ఉండగా, ఇంటి వద్ద పని ఉందని, మధ్యాహ్నం షిప్ట్కు వస్తానని డయాలసిస్ టెక్నీషియన్ సుధాకర్కు విషయం తెలిపారు. ఆయన కుదరదని చెప్పడంతో ఆసుపత్రికి వచ్చి డయాలసిస్ చేయించుకుంటున్నాడు. ఈ క్రమంలో కాలు తిమ్మిర్లు ఎక్కి వీరరాఘవులు కాలుపై కాలువేసుకుని పడుకున్నాడు. అక్కడకు వచ్చిన సుధాకర్ గమనించి వాగ్వాదానికి దిగాడు. మాటా మటా పెరగడంతో సుధాకర్ ట్రేతో వీరరాఘవులపై దాడి చేశాడు. దీంతో పేషెంట్ బంధువులు ఆసుపత్రిలో ఆందోళనకు దిగారు. -
ఆంధ్రా ‘పెరటి’లో ఆఫ్రికా ‘రక్కసి’
తాడేపల్లిగూడెం : పెరటి తోటల రైతులను ఆఫ్రికా నత్తలు వణికిస్తున్నాయి. మొన్నటి దాకా విశాఖ, మన్యం జిల్లా రైతులను కలవరానికి గురిచేసి.. తాజాగా ఉభయగోదావరి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలపై దాడి చేశాయి. అయితే వీటి ఉనికిని రైతులు ఐదు నెలల తర్వాత గుర్తించడంతో అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. బొప్పాయి, జామ వంటి పంటలతో పాటు మినుము పైరుకూ తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ పరిస్థితుల్లో ఆఫ్రికా నత్తల సమస్యకు పరిష్కారం చూపేందుకు డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు తోటల బాట పట్టారు. వందేళ్ల కిందటే వలస ఆఫ్రికా నత్తలు వందేళ్ల కిందటే భారత దేశానికి వలసొచ్చాయి. తోట పంటలపై వీటి దాడి మూడేళ్లగా మొదలైంది. ముఖ్యంగా తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో ఆఫ్రికా నత్తలు విజృంభించాయి. కేరళ నుంచి వక్క చెట్లను ఇక్కడకు దిగుమతి చేసుకోవడంతో ఆఫ్రికా నత్తల ప్రభావం ఉభయగోదావరి, మన్యం, విశాఖ జిల్లాలకు వ్యాపించింది. పార్వతీపురం, మన్యం జిల్లా, విశాఖ జిల్లా ఎస్.కోట ప్రాంతాల్లో ఆఫ్రికా నత్తల దాడిని రైతులు వెంటనే గుర్తించారు. తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలోని జొన్నాడ ప్రాంతంలోనూ వీటి ఉనికి బయటపడింది. తాజాగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా నల్లజర్ల మండలం మినుము తోటపై ఆఫ్రికా నత్తల దాడిని గమనించారు. ఇదే మండలంలోని ఆవపాడులోనూ ఈ నత్తల ఆనవాళ్లను కనిపెట్టారు. ఆఫ్రికా నత్తలు గుడ్లను ఏటా జూలై నుంచి ఫిబ్రవరి వరకు పెడతాయి. ఒక్కో నత్త వంద నుంచి 400 వందల వరకు గుడ్లు పెడుతుంది. నత్త జీవితకాలం ఐదేళ్ల నుంచి ఆరేళ్లు. ఈ సమయంలో ఒక్కో నత్త సుమారు వెయ్యి నుంచి 1,200 పిల్లలకు జన్మనిస్తుంది. తుప్పలు, ఆకుల కింద, వెలుతురు తగలని ప్రాంతాల్లో ఇవి నివశిస్తాయి. బొప్పాయి, అరటి, జామ, కూరగాయలు, మొక్కజొన్న, పత్తి, వక్క, ఆయిల్పామ్ పంటలతో పాటుగా నర్సరీలను ఆశ్రయించి రైతులకు అపార నష్టం కలిగిస్తాయి. ఏమరుపాటుతో భారీ మూల్యం ఇతర ప్రాంతాల నుంచి మొక్కలను ఇక్కడకు తీసుకొచ్చే సమయంలో వాటిపై నత్తల గుడ్లు, చిన్న చిన్న నత్తలు వంటివి ఉన్నాయేమో రైతులు జాగ్రత్తగా గమనించాలి. వాటిని నిర్మూలించాకే వక్క వంటి మొక్కలను ఇక్కడకు తెచ్చుకోవాలి. ఈ విషయాన్ని విస్మరించామో.. ఆ తర్వాత భారీమూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితులు తలెత్తుతాయి. నీరు ఎక్కువగా ఉండే వరి పంటను ఆఫ్రికా నత్తలు ఆశించవు. వీటికి వాతావరణం అనుకూలించే చిత్తడి నేలల్లోకి వెవెళ్లి ఉంటాయి. జాగ్రత్తలిలా.. ● పంట తోటలను ఒత్తుగా వేసుకోకూడదు. ● తోటల్లో కలుపు, చెత్త పేరుకుపోకుండా చూసుకోవాలి. ● అంతర సేద్యంపై దృష్టి పెట్టాలి. ● రాత్రులు తోటల్లో నీరు పారించకూడదు. ● తోటల్లో కోళ్లు, బాతులను పెంచుకోవాలి. ఆఫ్రికా నత్తల నివారణకు ఒక కిలో ఉప్పును నాలుగు లీటర్ల నీటిలో కలిపి ఆ నీటిలో గోనె సంచిని తడిపి గట్లపై వేస్తే ఈ సంచులపైకి వెళ్లిన నత్తలు ద్రావణం ఘాటుకు చనిపోతాయి. ఆకర్షక ఎర ఏర్పాటులో భాగంగా 25 కిలోల వరి తవుడుకు వంద గ్రాముల థయోడీకార్బ్ గుళికలు, మూడు కిలోల బెల్లం, వంద గ్రాముల ఆముదాన్ని కలిపి చిన్న ఉండలుగా చేయాలి. ఈ ఉండలను బొప్పాయి, క్యాబేజీ ఆకుల కింద పెట్టాలి. వీటిని తిన్న ఆఫ్రికా నత్తలు చనిపోవడం లేదా నిర్వీర్యం అయిపోతాయి. అనంతరం వీటిని ఉప్పు ద్రావణంలో వేస్తే చనిపోతాయి. ఇలా వారానికి రెండు మూడు రోజుల పాటు 15 రోజుల వరకూ చేయాలి. నత్తలను ఏరివేసే సమయంలో చేతికి గ్లౌజులు ధరించాలి. – గోవిందరాజులు, విస్తరణ సంచాలకులు, చలపతిరావు, శాస్త్రవేత్త పెరటి తోటలను కబళిస్తున్న ఆఫ్రికా నత్తలు నిన్న విశాఖ, మన్యం.. నేడు ఉభయగోదావరి జిల్లాలపై దాడి బొప్పాయి, జామ, అరటి, కూరగాయల పంటలకు తీవ్ర నష్టం వణికిపోతున్న అన్నదాతలు ఉప్పు ద్రావణంతో నిర్మూలన చేయాలంటున్న ఉద్యాన శాస్త్రవేత్తలు -
గోదావరి ఉగ్రరూపం
యలమంచిలి: గోదావరి ఉగ్రరూపం దాల్చింది. దీంతో కనకాయలంక కాజ్ వే పై సుమారు ఆరడుగుల మేర నీరు ప్రవహిస్తుంది. దీంతో ప్రజలు పడవలపై రాకపోకలు సాగిస్తున్నారు. గోదావరిలో నీరు మరింత పెరుగుతుండడంతో మరో వారం రోజుల వరకు కాజ్వే వరద ముంపులోనే ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. వరద పెరిగితే మిగిలిన లంక గ్రామాలు కూడా వరద ముంపునకు గురయ్యే అవకాశం ఉన్నందున అధికారులందరూ విధులు నిర్వహణకు సిద్ధంగా ఉంచామని తహసీల్దార్ గ్రంథి నాగ వెంకట పవన్కుమార్ తెలిపారు. స్థానిక సిబ్బంది అప్రమతంగా ఉండాలన్నారు. -
జాతీయస్థాయి బ్యాడ్మింటన్లో రన్నర్స్కు అభినందనలు
తణుకు అర్బన్: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నిర్వహించిన సీఐఎస్సీఈ బోర్డ్ 68వ నేషనల్ స్కూల్ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ పోటీల్లో తణుకు పట్టణానికి చెందిన పోతుల నవ్యగీతిక, తాడేపల్లిగూడెంకు చెందిన కొండ్రెడ్డి రాగ అండర్ 17 డబుల్స్ విభాగంలో రన్నర్స్గా నిలిచారు. పెంటపాడు మండలం అలంపురంలోని సరస్వతీ విద్యాలయ స్కూలులో 10వ తరగతి చదువుతున్న వీరు ఈనెల 26 నుంచి 28వ తేదీ వరకు కొయంబత్తూరులో నిర్వహించిన పోటీల్లో ఈ ఘనత సాధించినట్లు పోతుల నవ్యగీతిక తండ్రి శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులను పలువురు ప్రముఖులు అభినందించారు. నూజివీడు: పట్టణానికి చెందిన ఎన్వీఎన్ కావ్యశ్రీ, డీ ఇందుప్రియ బాస్కెట్బాల్ ఏపీ జట్టుకు ఎంపికై నట్లు కోచ్ వాకా నాగరాజు మంగళవారం తెలిపారు. ఇటీవల చిత్తూరులో నిర్వహించిన రాష్ట్ర స్థాయి అండర్–14 బాస్కెట్బాల్ పోటీల్లో ఉమ్మడి కృష్ణాజిల్లా జట్టు తృతీయ స్థానంలో నిలిచింది. ఈ జట్టులో ఉత్తమ ప్రతిభ కనబరిచిన కావ్యశ్రీ, ఇందుప్రియలను సెలక్షన్ కమిటీ రాష్ట్ర జట్టులోకి ఎంపిక చేసింది. వీరు ఈనెల 4 నుంచి 10 వరకు డెహ్రడూన్లో నిర్వహించే జాతీయ స్థాయి బాస్కెట్బాల్ పోటీల్లో ఆంధ్రప్రదేశ్ జట్టు తరుఫున ఆడతారని కోచ్ తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర జట్టుకు ఎంపికై న క్రీడాకారులను, కోచ్ను పలువురు పీడీలు అభినందించారు. జంగారెడ్డిగూడెం: గురవాయిగూడెంలోని శ్రీమద్ది ఆంజనేయస్వామి ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో పెద్దసంఖ్యలో భక్తులు, భవానీ దీక్షాదారులు బారులుదీరి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయం చుట్టూ 108 ప్రదక్షణలు చేసి, మొక్కులు చెల్లించుకున్నారు. మంగళవారం మధ్యాహ్నం వరకు దేవస్థానానికి వివిధ సేవలు, విరాళాల ద్వారా రూ.2,70,623 సమకూరినట్లు కార్యనిర్వాహణాధికారిణి ఆర్వీ చందన తెలిపారు. భక్తులకు స్వామివారి నిత్యాన్నదాన సత్రం నందు అన్నప్రసాద వితరణ చేశారు. జంగారెడ్డిగూడెం: స్థానిక సాయి సౌజన్య నగర్లో తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ జరిగిన ఘటనపై కేసు నమోదైంది. రైటర్ పి.బాబురావు తెలిపిన వివరాల ప్రకారం పెండ్ర మోహనకృష్ణ ప్రైవేట్ టీచర్గా పనిచేస్తున్నాడు. ఆయన కుటుంబ సభ్యులతో సహా సెప్టెంబర్ 19న బుట్టాయగూడెం మండలం గంగవరం గ్రామం వెళ్లాడు. తిరిగి 29న ఇంటికి వచ్చి చూసే సరికి తలుపులు తాళాలు పగులగొట్టి ఉండటాన్ని గుర్తించారు. ఇంట్లోకి వెళ్లి చూసే సరికి బీరువాలో ఉంచిన 60 తులాల వెండి వస్తువులు చోరీకి గురైనట్లు గుర్తించారు. దీనిపై మంగళవారం ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసినట్లు పోలీసులు చెప్పారు. భీమవరం: భీమవరం ఇందిరమ్మ కాలనీలోని జరిగిన చోరీపై పోలీసులు కేసు నమోదు చేశారు. మంగళవారం తాళం వేసి ఉన్న ఇంట్లో దొంగలు పడి బీరువాలోని నగదు, ఆభరణాలను అపహరించారని బాధితురాలు సీహెచ్ నాగలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ఎం.నాగరాజు తెలిపారు. -
ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి
భీమవరం (ప్రకాశంచౌక్): ఆరోగ్యంతమైన మహిళ ద్వారా బలమైన కుటుంబం ఏర్పడుతుందని కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. సోమవారం భీమవరం కలెక్టరేట్లో ‘స్వస్థ నారీ–సశక్తి పరివార్ అభియాన్’ కార్యక్రమంలో భాగంగా ప్రత్యేకంగా మహిళా ఉద్యోగినిల కోసం ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపులో కలెక్టర్ చదలవాడ నాగరాణి ముఖ్యఅతిథిగా పాల్గొని వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆరోగ్యమంతమైన మహిళ ద్వారా బలమైన కుటుంబాలు ఏర్పడతాయని, ఆర్థిక అభివృద్ధితో పాటు, పిల్లలు కూడా మంచి విద్యను నేర్చుకోవడానికి తోడ్పడుతుందన్నారు. మహిళలు ఆరోగ్యానికి తక్కువ ప్రాధాన్యత ఇస్తారని, పిల్లలు, భర్తకు పెట్టిన తర్వాత తల్లి త్యాగానికి, ప్రేమకి చిహ్నంగా మిగిలితే తినడం సర్వసాధారణమన్నారు. ప్రభుత్వ కార్యాలయంలో పనిచేసే మహిళలు కూడా సరైన సమయంలో వైద్య పరీక్షలు చేయించుకోవడం లేదని, ఇలాంటి చర్యల కారణంగా ఒకేసారి వారి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందన్నారు. జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, రెవెన్యూ అధికారి బి.శివన్నారాయణ రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జి.గీతాబాయి, ఐసీడీఎస్ పీడీ డి.శ్రీలక్ష్మీ, తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ అక్టోబర్ 1న చేపట్టనున్నట్లు కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. సెప్టెంబర్ 30న పండుగ కావడంతో ఒకరోజు ముందుగానే పింఛన్ల మొత్తాలను బ్యాంకుల నుంచి డ్రా చేశామన్నారు. జిల్లాలో సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్పై జీఎస్టీ ఛాంపియన్న్స్ ద్వారా ప్రజలకు పూర్తి అవగాహన కల్పించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. సూపర్ జీఎస్టీ.. సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో భాగంగా మొదటి వారం ప్రచారంలో ‘గృహ పొదుపు’ కార్యక్రమాన్ని సోమవారం భీమవరం 32వ వార్డు ఎడ్వర్డ్ ట్యాంక్ మీటింగ్ హాలులో కలెక్టర్, జాయింట్ కలెక్టర్ జీఎస్టీ తగ్గిన వస్తువుల ప్రదర్శనను తిలకించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. -
చదువుల తల్లీ కరుణించమ్మా..
తాడేపల్లిగూడెం మండలం వీరంపాలెం శ్రీబాలాత్రిపుర సుందరీ పీఠంలో అక్షరాభ్యాసాలు సరస్వతీ దేవి అలంకరణలో మావుళ్లమ్మ ద్వారకా తిరుమలలో సరస్వతీ దేవి అలంకారంపెనుగొండ వాసవీ శాంతి థాంలో చిన్నారుల పూజలుశరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సోమవారం మూలా నక్షత్రం కావడంతో అమ్మవారు సరస్వతీ దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. చదువుల తల్లి అనుగ్రహం పొందేందుకు తల్లిదండ్రులు తమ చిన్నారులతో అక్షరాభ్యాసం చేయించారు. రాష్ట్రంలోనే పేరెన్నికగన్న తాడేపల్లిగూడెం మండలం వీరంపాలెం శ్రీబాలాత్రిపుర సుందరీ పీఠంలో సామూహిక అక్షరాభ్యాసాలు అట్టహాసంగా నిర్వహించారు. బాసర తర్వాత మేధా సరస్వతీ నిలయమైన ఈ పీఠానికి రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు తరలివచ్చారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ఆలయాల్లో అక్షరాభ్యాసాలు, సరస్వతీ పూజలు నిర్వహించారు. – సాక్షి నెట్వర్క్ -
16 నెలల్లో రూ.2 లక్షల కోట్లకు పైగా అప్పులు
పెనుగొండ: సంక్షేమ పథకాలు పూర్తిగా అమలు చేయకుండానే కూటమి ప్రభుత్వం 16 నెలల కాలంలో రూ.2 లక్షల కోట్లకు పైగా అప్పులు చేసిందని వైఎస్సార్సీపీ అడ్వయిజరీ కమిటీ సభ్యుడు, మాజీ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు విమర్శించారు. సోమవారం తూర్పుపాలెంలో డిజిటల్ బుక్ క్యూఆర్ కోడ్ను నాయకులు, కార్యకర్తలతో కలసి ఆవిష్కరించారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలు అమలు చేయలేని స్థితిలో కూటమి ప్రభుత్వం ఉందని దుయ్యబట్టారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలులో పూర్తిగా విఫలమైందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 50 ఏళ్లకే పింఛన్ అని గాలికొదిలేశారన్నారు. ఆడబిడ్డ నిధికీ నేటి వరకూ అతీగతీ లేదన్నారు. రాష్ట్రంలో ఏ ఒక్క పేదవాడికీ నేటి వరకూ ఒక్క సెంటు భూమి ఇవ్వలేదన్నారు. ఇల్లు మంజూరు చేయలేదన్నారు. గృహ నిర్మాణానికి ఒక్క రూపాయి ఇచ్చారా? అని ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ నాయకులు, మహిళలు, రైతులు, విద్యార్థులు, వ్యాపార వేత్తలకు కూటమి ప్రభుత్వంలో అన్యాయానికి గురైన ప్రతీ ఒక్కరికీ డిజిటల్ బుక్ శ్రీరామరక్షగా నిలుస్తుందన్నారు. ఐవీఆర్ఎస్ నెంబర్ 040 49171718కు డయల్ చేసి నమోదు చేసుకోవచ్చన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి మేడపాటి సాయి చంద్రమౌళీశ్వర రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి దంపనబోయిన బాబూరావు, మండల కన్వీనర్లు గూడూరి దేవేంద్రుడు, జక్కంశెట్టి చంటి, పిల్లి నాగన్న, సర్పంచ్లు సుంకర సీతారాం, బుర్రా రవికుమార్, చిట్టు గుళ్ల పూర్ణిమ, కర్రి వేణుబాబు, కోట వెంకటేశ్వరరావు, ముత్యాల నాగేశ్వరరావులు పాల్గొన్నారు. -
సీహెచ్సీలో శిశువు మృతి
పురుడు పోసిన నర్సు ఆకివీడు: ప్రసవించిన కొన్ని నిమిషాలకే ఆడ శిశువు మృతి చెందిన సంఘటన పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు పట్టణంలోని సామాజిక ఆరోగ్య కేంద్రం(సీహెచ్సీ)లో సోమవారం ఉదయం జరిగింది. స్థానిక సమతానగర్లో చేపల చెరువులపై కాపలా ఉంటున్న ఏనుగుపల్లి పౌలు, శ్రావణిలకు మూడో కాన్పులో ఆడ శిశువు జన్మించింది. జన్మించిన 20 నిమిషాలకే మృతి చెందిందని ఆసుపత్రి సూపరింటెండెంట్ ఆదిలక్ష్మి చెప్పారు. శిశువు మెడకు మూడు మెలికలతో ప్రేగు ఉండటం వల్ల చనిపోయి ఉంటుందని ఆమె వివరించారు. ప్రసవ సమయంలో వైద్యులు అందుబాటులో లేకపోవడం, స్టాప్ నర్సు వైద్యం అందించారు. శిశువు మృతి వైద్యుల నిర్లక్ష్యమేనని, డ్యూటీ వైద్యులు లేకపోవడం వల్ల స్టాఫ్నర్సు పురుడు పోయడం దారుణమని సీపీఎం నాయకులు కె.తవిటినాయుడు, పెంకి అప్పారావు ఆరోపించారు. -
సమ్మెలోకి పీహెచ్సీ వైద్యులు
సాక్షి, భీమవరం: డిమాండ్ల సాధన కోసం రూరల్ పీహెచ్సీ వైద్యులు సమ్మె సైరన్ మోగించారు. సోమ వారం నుంచి అత్యవసర సేవలు మినహా ఓపీ, స్వస్థ్ నారీ స్వశక్త్ పరివార్ అభియాన్ వైద్య శిబిరాలను బహిష్కరించారు. ఆనారోగ్య సమస్యలతో వైద్యం కోసం వచ్చిన రోగులకు నర్సులు, ఇతర వైద్య సిబ్బంది ప్రాథమికంగా మాత్రలు అందించారు. జిల్లాలోని 34 రూరల్ పీహెచ్సీల పరిధిలో దాదాపు 74 మంది వైద్యులు సేవలందిస్తున్నారు. కూటమి ప్రభుత్వం తగ్గించిన పీహెచ్సీ వైద్యుల పీజీ కోర్సుల కోటాను 20 శాతానికి పునరుద్ధరించాలని, టైం బాండ్ ప్రమోషన్స్ కల్పించాలని, గిరిజన ప్రాంతాల్లో పనిచేసేవారికి బేసిక్పై 50 శాతం అలవెన్స్ ఇవ్వాలని, చంద్రన్న సంచార చికిత్స కార్యక్రమానికి రూ. 5,000 అలవెన్స్ ఇవ్వాలని, కౌన్సెలింగ్ విషయంలో అర్బన్ అండ్ నేటివిటీపై ఆరేళ్ల గడువును ఐదు సంవత్సరాలకు కుదించడం, నేటివిటీపై స్పష్టత కోరుతూ కొద్దిరోజులుగా పీహెచ్సీ వైద్యులు ఆందోళన చేస్తున్నారు. సమస్యల పరిష్కారం కోరుతూ ఏపీ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ డాక్టర్ అసోసియేషన్ (ఏపీపీహెచ్సీడీఏ) ఆధ్వర్యంలో ఈ నెల 19న ఉన్నతాధికారులకు నోటీసు అందజేశారు. నిర్ణీత గడువులోగా ప్రభుత్వం స్పందించకుంటే సమ్మెలోకి వెళ్లనున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు సోమవారం నుంచి ఆందోళన బాట పట్టారు. వైద్య శిబిరాల బహిష్కరణ మహిళల్లో ఆనారోగ్య సమస్యలను గుర్తించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈనెల 17 నుంచి అక్టోబరు 2 వరకు స్వస్థ్ నారీ స్వశక్త్ పరివార్ అభియాన్ వైద్య శిబిరాలను నిర్వహిస్తోంది. బీపీ, సుగర్, నోటి, రొమ్ము, గర్భాశయ క్యాన్సర్లను గుర్తించేందుకు వైద్య పరీక్షలు చేస్తున్నారు. సమ్మెలో భాగంగా చాలాచోట్ల వైద్యులు శిబిరాలను బహిష్కరించారు. నర్సులు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, ఆరోగ్య సిబ్బంది శిబిరాలు వైద్యసేవలు అందించి మమ అనిపించారు. వైద్యులు లేకుండా వైద్య శిబిరాలేంటని నరసాపురం రూరల్ మోడీ గ్రామంలో శిబిరానికి వచ్చిన మహిళలు బహిరంగంగానే మాట్లాడుకున్నారు. సమస్యల పరిష్కారం కోసమే : ప్రజలను ఇబ్బంది పెట్టడం తమ ఉద్దేశ్యం కాదని, న్యాయమైన తమ డిమాండ్లు సాధించుకునేందుకు తప్పనిసరి పరిస్థితుల్లో సమ్మెకు దిగాల్సి వచ్చిందని ఏపీపీహెచ్సీడీఏ నాయకులు అంటున్నారు. పీహెచ్సీ వైద్యుల పీజీ కోటా సీట్లను గత ఏడాది 30 శాతం నుంచి 20 శాతానికి తగ్గించిన కూటమి ప్రభుత్వం ఈ ఏడాది 15 శాతానికి తగ్గించినట్టు చెబుతున్నారు. సీహెచ్సీల్లో పనిచేసే సివిల్ అసిస్టెంట్ సర్జన్లు మూడు నాలుగేళ్లకే డిప్యూటీ సివిల్ సర్జన్స్గా పదోన్నతులు పొందుతుంటే తాము మాత్రం సీనియర్ మెడికల్ ఆఫీసర్లుగానే మిగిలిపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆయా సమస్యలపై ప్రభుత్వం స్పందించకుంటే అక్టోబరు 3 నుంచి విజయవాడలో నిరాహార దీక్ష చేపట్టనున్నట్టు చెబుతున్నారు. జిల్లాలో జిల్లా ఆరోగ్యకేంద్రం, మూడు సీహెచ్సీలు, ఐదు ఏరియా ఆస్పత్రులు, 34 పీహెచ్సీలు, 18 అర్బన్ పీహెచ్సీలు ఉన్నాయి. రోజుకు దాదాపు 15 వేల వరకు ఓపీ నమోదవుతుంది. వీటిలో 40 శాతం వరకు రూరల్ పీహెచ్సీల్లోనే ఓపీ కేసులు ఉంటాయని అంచనా. రూరల్ పీహెచ్సీ వైద్యులు సోమవారం యథావిధిగా విధులకు హాజరైనప్పటికీ అత్యవసర సేవలు మినహా ఓపీ సేవలకు దూరంగా ఉన్నారు. అవుట్ పేషెంట్లుగా వైద్యం కోసం వచ్చిన గ్రామీణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. కొంతమంది నిరాశతో వెనుదిరిగి వెళ్లిపోగా మరికొందరు అక్కడే ఉన్న ఏఎన్ఎంలతో సమస్య చెప్పుకుని వారిచ్చిన మందులు తీసుకెళ్లిన పరిస్థితి కనిపించింది. నరసాపురం నియోజకవర్గంలోని తూర్పుతాళ్లు, ఎల్బీ చర్ల, మొగల్తూరు, ఉండి నియోజకవర్గంలోని ఆకివీడు, ఉండి, కాళ్ల, పాలకోడేరు పీహెచ్సీలు, భీమవరం రూరల్లోని గొల్లవానితిప్ప, తుందుర్రు, పాలకొల్లులోని యలమంచిలి, మేడపాడు, దొడ్డిపట్ల, అలాగే ఆచంట, తాడేపల్లిగూడెం, తణుకు నియోజకవర్గాలోని రూరల్ పీహెచ్సీ వైద్యులు ఓపీ విధులను బహిష్కరించారు. ఆస్పత్రులకు వచ్చిన రోగులకు స్టాఫ్ నర్సులు, ఫార్మాసిస్టులు ఓపీ సేవలు అందించారు. ప్రస్తుతం ప్రతికూల వాతావరణ పరిస్థితులతో విషజ్వరాలు ప్రబలుతుండగా వైద్యుల సమ్మెతో సామాన్య ప్రజలు ఆందోళన చెందుతున్నారు. సమస్య పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపాలని కోరుతున్నారు. రూరల్ పీహెచ్సీల్లో సేవలకు దూరంగా వైద్యులు అత్యవసర సేవలు మినహా ఓపీ, వైద్య శిబిరాల బహిష్కరణ రోగుల ఇక్కట్లు, వైద్యుల అవతారమెత్తిన వైద్య సిబ్బంది -
సాగని దారిలో ఆగిన గుండె!
వేలేరుపాడు: ఆ గ్రామాన్ని గోదావరి వరద చుట్టుముట్టింది.. ప్రభుత్వం కనీసం బోట్ కూడా ఏర్పాటు చేయలేదు. ప్రాణాలు దక్కించుకునేందుకు అష్టకష్టాలు పడినా.. ఆ కుటుంబానికి ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల చివరికి గుండెకోతే మిగిలింది. వేలేరుపాడు మండలంలోని తిర్లాపురానికి చెందిన కాకాని వెంకటేశ్వర్లు (41) ఆదివారం మధ్యాహ్నం గుండెనొప్పి రావడంతో ఇంట్లోనే సొమ్మసిల్లి పడిపోయాడు. వైద్యం నిమిత్తం వేలేరుపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించాలన్నా ఆ ఊరిని గోదావరి వరద చుట్టుముట్టింది. బంధువులు గోదావరి వరదలో ప్రాణాలకు తెగించి, థర్మాకోల్ షీట్పై పడుకోబెట్టి వరద దాటించి, కన్నాయిగుట్ట వరకు చేరుకున్నారు. కన్నాయిగుట్టకు వెళ్ళాక అంబులెన్స్ కోసం అరగంట సేపు వేచి చూశారు. అంబులెన్స్ రాకపోవడంతో ద్విచక్ర వాహనంపై కూర్చోబెట్టుకొని ఐదు కిలోమీటర్ల దూరంలోని బుర్రతోగు వరకు వెళ్ళారు. అక్కడికి అంబులెన్స్ రావడంతో వేలేరుపాడు ఆరోగ్య కేంద్రానికి తరలించారు. వెంకటేశ్వర్లు ప్రాణాలు కోల్పోయినట్టు వైద్యులు ధ్రువీకరించారు. మేళ్ళవాగు వంతెన గోదావరి వరద నీటిలో మునగడం వల్ల చాగరపల్లి, బుర్రతోగు, భూదేవిపేట మీదుగా ఎనిమిది కిలోమీటర్ల దూరం ఉంది. అధికారులు కనీసం ఒక బోట్ కూడా ఏర్పాటు చేయకపోవడం వల్ల వైద్యం అందక నిండు ప్రాణం పోయింది. -
ఆర్యవైశ్య విద్యార్థులకు ప్రోత్సాహం అభినందనీయం
పెనుగొండ: విద్యను ప్రోత్సహించడానికి అఖిల భారత శ్రీవాసవీ పెనుగొండ టెంపుల్ ట్రస్ట్ చేస్తున్న సేవలు అభినందనీయమని కర్నాటక తంకూరు యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ఎం.వెంకటేశ్వర్లు అన్నారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉభయగోదావరి జిల్లాల్లో ప్రతిభ కనబరిచిన ఆర్యవైశ్య విద్యార్థులను ఆదివారం స్థానిక వాసవీ శాంతి థాంలో ఘనంగా సత్కరించారు. 2024–25లో టెన్త్, ఇంటర్, డిగ్రీ, పీజీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచినవారితో పాటు రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలోని ఆర్యవైశ్య క్రీడాకారులను కలిపి మొత్తంగా 400లకు పైగా విద్యార్థులతో పెనుగొండలో భారీ ర్యాలీ నిర్వహించారు. పెనుగొండ క్షేత్ర పీఠాధిపతి బాల స్వామీజీ, ట్రస్ట్ అధ్యక్షుడు డాక్టర్ పీఎన్ గోవిందరాజులు ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. ఆర్యవైశ్య విద్యార్థులంతా వాసవీ మాత స్ఫూర్తిగా పట్టుదలతో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని వెంకటేశ్వర్లు అన్నారు. ట్రస్ట్ అధ్యక్షుడు డాక్టర్ పీఎన్ గోవిందరాజులు మాట్లాడుతూ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. పెనుగొండ క్షేత్ర పీఠాధిపతి బాల స్వామిజీ, ఏపీ ఆర్యవైశ్య డెవలప్ మెంట కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్, ఏపీ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు చిన్ని రామసత్యనారాయణ, ట్రస్ట్ ఉపాధ్యక్షుడు బొండాడ రాంపండు, కార్యదర్శి కేఆర్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
దిగుబడిపై దోమ‘పోటు’
మండవల్లి: వరి పంటను ఆశిస్తున్న పురుగులు, తెగుళ్లతో దిగుబడులు తగ్గుతున్నాయి. సుడిదోమ వరి పంటను ఆశించి తీవ్ర నష్టాన్ని కలుగజేస్తుంది. వివిధ రకాల వైరస్ వ్యాధులను కారణమవుతోంది. దీని నివారణకు తగిన యాజమాన్య పద్ధతులు పాటించాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. గోధుమ రంగు సుడి దోమ: గోధుమ రంగు దోమ నీటి వసతి గల ప్రాంతంలో పంటను ఎక్కువగా ఆశిస్తుంది. తల్లి పురుగులు గోధుమ వర్ణం నుంచి ముదురు గోధుమ వర్ణంలో ఉంటాయి. నష్టం: పిల్ల, తల్లి దోమలు కాండంలోని పోషకాలు సరఫరా చేసే కణజాలం నుంచి రసాన్ని పీల్చడం వల్ల పంట క్రమేపి పసుపు రంగుకు మారుతుంది. దీంతో ఎదుగుదల కోల్పోయి గిడస బారిపోతుంది. ఆలస్యంగా పిలకలు వేస్తాయి. అలాగే పిలకల నుంచి వచ్చిన వెన్నులో గింజలు సరిగా రావు. తెల్ల మచ్చ దోమల ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు ఇవి వెన్నును కూడా ఆశిస్తాయి. ఎక్కువ విస్తీర్ణంలో సుడి తెగులులా వ్యాపించడంతో పొలం అంతా ఎండిపోతుంది. నత్రజని ఎరువులు ఎక్కువ మోతాదులో వాడటం, పొటాష్ ఎరువులు వాడకపోవడం, నీటి యాజమాన్య పద్ధతులు సరిగా పాటించకపోవడం వల్ల ఈ దోమ వ్యాపిస్తుంది. యాజమాన్యం: దోమలను తట్టుకునే రకాలను సాగు చేయాలి. ఇంద్ర(ఎంటీయూ 1061), శ్రీ ధ్రుతి (ఎంటీయు 112), చంద్ర (ఎంటీయూ 1153) తరంగిణి రకాలు సాగుచేయాలి. సుడులు సుడులుగా ఎండిపోవడాన్ని సుడితెగులు అని పిలుస్తారు. దోమ ఉధృతి ఎక్కువగా ఉంటే సుడులు ఒకదానితో ఒకటి కలిసి చేనంతా ఎండిపోతుంది. అలాంటి పరిస్థితులో దిగుబడి తగ్గుతుంది. తెల్ల వీపు మచ్చ దోమ: దోమ శరీరం తెల్లగా ఉండి ఉదరం మాత్రం నల్లగా ఉంటుంది. రెక్కల మధ్య స్పష్టమైన తెల్లటి మచ్చ ఉంటుంది. ఈ కారణంగా దీనిని తెల్ల వీపు మచ్చ దోమ అంటారు. నష్టం: పిల్ల, తల్లి దోమలు కాండంలోని మొక్కలకు పోషకాలు సరఫరా చేసే కణజాలం నుంచి రసాన్ని పీల్చడం వల్ల మొక్కలు పసుపు రంగుకు మారి, ఎదుగుదల కోల్పోయి గిడసబారి పోతాయి. ఆలస్యంగా పిలకలు వేస్తాయి. పిలకల నుంచి వచ్చిన వెన్నులో గింజలు సరిగా రావు. తెల్ల మచ్చ దోమ వల్ల ఎక్కువ విస్తీర్ణంలో సుడి తెగులు వ్యాపించి, పొలం అంతా ఎండిపోతుంది. ● నత్రజని ఎక్కువ మోతాదులో వాడటం, పొటాష్ ఎరువులు వాడకపోవడం, నీటి యాజమాన్యం సరిగా లేకపోవడం ఉధృతికి కారణాలు ● దోమ నివారణకు అంకురం ఏర్పడే దశలో కార్బోప్యూరాన్ 3జీ గుళికలు 10 కిలోలు ఒక ఎకరానికి వేయాలి. -
బుడతడే గానీ ఘటికుడు
పాలకొల్లు సెంట్రల్: ఈ బుడతడు.. ప్రపంచంలో 78 దేశాల జాతీయ జెండాలను గుర్తిస్తాడు. తన టాలెంట్తో ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్లోకి ఎక్కాడు. పాలకొల్లు పట్టణంలోని 18వ వార్డు పిన్నివారి వీధిలో ఉంటున్న శ్రిఖాకొళ్లపు రాజేష్, లలిత దంపతుల పెద్ద కుమారుడు జెష్విన్ ప్రసాద్. లలితకు చదువుపై మక్కువ కావడంతో పిల్లాడిని కూడా అలాగే తీర్చిదిద్దాలనే సంకల్పంతో అతనికి ఆరు నెలలు వచ్చేసరికి ఇతర దేశాల జాతీయ జెండాలను చూపిస్తూ శిక్షణ ఇచ్చేది. జాతీయ జెండాలతో పాటు, వాహనాలు, జంతువులు, పండ్లు, పక్షులు ఇలా 300 పదాల వరకూ నేర్పించారు. ఏదైనా వస్తువు పేరు, ఆట పేరు, వ్యక్తుల పేర్లు చెపితే వాటిని చూపిస్తాడు. ఇంగ్లీషు, తెలుగులో చెబుతాడు. పిల్లాడికి నేర్పించేందుకు ప్రత్యేక కార్డులు తయారుచేశారు. జెస్విన్ టాలెంట్ను చిత్రీకరించి గిన్నిస్ బుక్ ఇంటర్నేషనల్ రికార్డ్స్, సూపర్ టాలెంటెడ్ కిడ్ పోటీలకు దరఖాస్తు చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ పిల్లాడి ప్రతిభను గుర్తిస్తూ ప్రశంసాపత్రాన్ని పంపించారు. -
యువకుడిపై గంజాయి బ్యాచ్ దాడి
● తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స ● గ్రామస్తుల భారీ ఆందోళన.. విరమణ సాక్షి, టాస్క్ఫోర్స్: భీమడోలులో శనివారం రాత్రి గంజాయి ముఠా రెచ్చిపోయి దాడి చేయడంతో ఈతకోట రవికిరణ్ అనే యువకుడు తీవ్ర గాయాలపాలయ్యాడు. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. బాధిత యువకుడిని ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. రెండు నెలలుగా గ్రామంలో గంజాయి బ్యాచ్ పేట్రేగిపోతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదంటూ గ్రామస్తులు పెద్ద సంఖ్యలో ఆందోళనకు దిగారు. భీమడోలు సీఐ యూజే విల్సన్ వారికి సర్దిచెప్పేందుకు రాగా ఆయన జీపు ను చుట్టుముట్టారు. 10 మంది గంజాయి ముఠా సభ్యుల్లో పలువురు రవికిరణ్పై ఇప్పటికే రెండు సార్లు దాడి చేసినా, చంపేస్తామని బెదరిస్తున్నట్టు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లే దంటూ గ్రామస్తులు మండిపడ్డారు. ఏలూరు డీఎ స్పీ శ్రావణ్కుమార్ ఇక్కడకు వచ్చి ఆందోళన విరమించాలని కోరగా సమస్య తీవ్రతను ఆయనకు తెలియజేశారు. చివరకు అల్లరిమూకలపై కేసులు నమోదుచేస్తామని ఎస్పీ కె.ప్రతాప్ శివకిషోర్ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. రాత్రి 10.30 గంటల నుంచి వేకువజాము 2.30 గంటల వరకు ఆందోళన కొనసాగింది. అనంతరం గ్రామస్తుల ఫిర్యాదు మేరకు 10 మందిపై కేసు నమోదు చేసినట్టు సీఐ విల్సన్ తెలిపారు. చవితి ఉత్సవాల్లో గొడవ ప్రారంభం భీమడోలు గణపతి సెంటర్లో నిర్వహించిన వినా యక చవితి ఉత్సవాల్లో భాగంగా నిమజ్జనోత్స వాన్ని పురస్కరించుకుని ఈనెల 6న పోలీసుల ఆదేశాలతో ఉత్సవ కమిటీ సభ్యులు డీజే సౌండ్స్ను నిలిపివేశారు. దీనిపై ఆగ్రహించిన కూటమి నాయకులు (గంజాయి బ్యాచ్) గుబ్బాల శివ, వణుకూరి బాలు, నందవరపు ప్రసాద్, ముదరబోయిన సుధాకర్, పిల్లి రాజశేఖర్, ఖాదా శ్రీను, ననుబోలు జగదీష్, రామకుర్తి సురేష్, ఆడపా మణికంఠ గంజా యి సేవించి ఉత్సవ కమిటీ సభ్యులను దుర్భాషలాడారు. దీనిపై అదేరోజు రాత్రి ఉత్సవ కమిటీ సభ్యు లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో 7న ఉత్సవ కమిటీ సభ్యుడు ఈతకోట రవికిరణ్పై గుబ్బాల శివ, పిల్లి రాజశేఖర్, ఖాదా శ్రీను, ముదరబోయిన సుధాకర్ దాడి చేశారు. దీనిపై ఎంఎల్సీ కేసు నమోదైనా పోలీసులు చర్యలు తీసుకోలేదు. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి రవికిరణ్పై గంజాయి బ్యాచ్కు చెందిన ఇద్దరు రాళ్లతో దాడి చేసి తీవ్రంగా గాయపర్చారు. గంజాయికి అడ్డాగా భీమడోలు రాష్ట్రంలో గంజాయి తరలింపులో భీమడోలు రెండో స్థానంలో ఉన్నట్టు సోషల్ మీడియాలో ఓ మె సేజ్ చక్కర్లు కొడుతోంది. గంజాయికి అడ్డాగా భీమడోలు మారిందని, దీంతో విద్యార్థుల నుంచి యువత వరకూ గంజాయికి బానిసలవుతున్నారని పోలీసులకు పలు ఫిర్యాదులు అందాయి. పోలీసుల అదుపులో నిందితులు రవికిరణ్పై దాడికి కారణమైన 10 మంది యువకులపై పోలీసులు కేసు నమోదు చేసి ఎని మిది మందిని అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. నిందితులు గుబ్బల శివకృష్ణ, జక్కంశెట్టి వీర వెంకట సత్యనారాయణ, ఖాజా శ్రీనివాసరావు, పిల్లి రాజశేఖర్, వణుకూరి బాలకృష్ణ, ముదరబోయిన సుధాకర్, నందవరపు ప్రసాద్, అడపా మణికంఠలను అదుపులోకి తీసుకున్నారు. నానుబోలు జగదీష్, రామిశెట్టి సురేష్ పరారీలో ఉన్నట్టు ఇన్చార్జి ఎస్సై సుధీర్ ఆదివారం రాత్రి తెలిపారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఈతకోట రవికిరణ్, భీమడోలులో రోడ్డుపై బైఠాయించిన గ్రామస్తులు -
దొంగలు బాబోయ్ దొంగలు
● జిల్లాలోకి మధ్యప్రదేశ్, రాజస్థాన్ గ్యాంగ్ ● వరుస చోరీలతో ప్రజలు బెంబేలు ● అప్రమత్తంగా ఉండాలంటున్న పోలీసులు తణుకు అర్బన్ : చీకటిపడితే చాలు ఇంటి తలుపు లు భద్రంగా వేసుకున్నా దొంగల భయంతో ప్ర జలు ఆందోళన చెందుతున్నారు. దాడులు చేసి కొందరు, భయపెట్టి మరికొందరు దొంగలు దొరికినకాడికి దోచుకుపోతూ బెంబేలెత్తిస్తున్నారు. తాళం వేసిన ఇళ్లతో పాటు ఒంటరిగా ఉన్న మహిళలు, వృద్ధుల ఇళ్లపై తెగబడుతూ చోరీలకు పాల్పడుతున్నారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో నెల రోజుల వ్యవధిలో జరిగిన పలు చోరీ సంఘటనలు భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. భయాందోళనలో వృద్ధులు ఇటీవల దొంగల ప్రస్తావన వస్తుండటంతో ఒంటరిగా ఉంటున్న వృద్ధులు భయాందోళన చెందుతున్నారు. దొంగలు డబ్బు, ఆభరణాలు అపహరించడంతో పాటు దాడులు చేయడంతో భయపడుతున్నారు. ము ఖ్యంగా దొంగలు బంగారు ఆభరణాలను దోచుకుంటున్నారు. ఇటీవల బంగారం ధరలు ఆకాశాన్నంటడంతో దొంగలు వీటిపై దృష్టి సారించారు. తణుకులో వాచ్మెన్ను తీవ్రంగా గాయపరచడంతో దుకాణాలు, సంపన్నుల ఇళ్లకు వాచ్మెన్లుగా ఉన్న వృద్ధులు ఎక్కువగా ఆందోళన చెందుతున్నారు. పోలీసుల హెచ్చరికలు జిల్లాలో మధ్యప్రదేశ్, రాజస్థాన్కు ఆరుగురు అంతర్జాతీయ దొంగల ముఠా సంచరిస్తున్నట్టు సమాచారం ఉందని పోలీసులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఈ నెలలో సదరు గ్యాంగ్ నెల్లూరు జిల్లా కావలి, కాకినాడ జిల్లా పత్తిపాడు, తూర్పుగోదావరి జిల్లా నల్లజర్లలో చోరీలకు తెగబడిందని చెబుతున్నారు. వీరంతా తక్కువ అద్దె ఉన్న లాడ్జీల్లో తలదాచుకుంటూ పగలు రెక్కీ నిర్వహించి రాత్రిళ్లు నేరాలకు పాల్పడుతున్నారని, అనుమానాస్పదంగా వ్యవహరించే వారి సమాచారాన్ని 112కి ఫోన్ చేసి తెలియజేయాలని పోలీసులు కోరుతున్నారు. అలాగే ఎస్హెచ్ఓల ఫోన్ నంబర్ల సమాచారాన్ని ఇస్తున్నారు. ఇదిలా ఉండగా ప్రస్తుత పరిస్థితుల్లో పోలీసు అధికారులు రాత్రిళ్లు ప్రత్యేక నిఘా పెట్టాలని ప్రజలు కోరుతున్నారు. తణుకులో ఈనెల 26న రాత్రి వృద్ధురాలు ఒంటరిగా ఉన్నారన్న పక్కా సమాచారంతో ఇంట్లోకి చొరబడి 70 కాసుల బంగారు ఆభరణాలు, రూ.70 వేల నగదు దోచుకుపోయా రు. దొంగలను చూసి భయపడిన వృద్ధురాలు తననేమీ చేయవద్దని ఇంట్లో దాచుకున్నవి, ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలు సైతం స్వయంగా ఇవ్వాల్సిన పరిస్థితి. ఈనెల 23న రాత్రి జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం గ్రామంలో ముగ్గురు దొంగలు ఒంటరిగా ఉంటున్న వృద్ధ దంపతుల ఇంట్లోకి ప్రవేశించి వారిపై దాడి చేసి, కాళ్లూ చేతులు కట్టి అందిన కాడికి దోచుకుపోయారు. ఈనెల 20న రాత్రి తణుకు సజ్జాపురంలోని జ్యూపిటర్ ఎగ్ ట్రేడర్స్ కార్యాలయంలో విధు ల్లో ఉన్న వాచ్మెన్ను తీవ్రంగా గాయపరిచి రూ.లక్ష నగదు దోచుకున్నారు. ఈనెల 15న ఏలూరులో కిరాణా దుకాణం నిర్వహిస్తున్న మహిళపై ఒక అగంతకుడు కత్తితో తీవ్రంగా దాడి చేసి ఆమె ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలు ఎత్తుకుపోయాడు. -
సబ్ జైలు సందర్శన
భీమవరం: భీమవరంలో ప్రత్యేక సబ్ జైలును ఆదివారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్పర్సన్ ఎస్.శ్రీదేవి, సంస్థ సెక్రటరీ కె.రత్నప్రసాద్ సందర్శించారు. ముద్దాయిలు కోరితే మండల న్యాయ సేవా సంస్థ ద్వారా ఉచితంగా న్యాయవాదిని ఏర్పాటు చేస్తామన్నారు. ముద్దాయిలు సత్ప్రవర్తన కలిగి ఉండాలని సూచించారు. జైలులో ఏర్పాట్లపై ఆరా తీశారు. రోజూ యోగా చేస్తే మానసికంగా ఉల్లాసంగా ఉంటారన్నారు. జైలు పరిసరాలను, మహిళా బ్యారక్ను, సోషల్ ఇంక్యుబేషన్ సెంటర్, ఉచిత న్యాయ సహాయ కేంద్రాన్ని పరిశీలించారు. స్టోర్ రూమ్ను, వంటశాలను తనిఖీ చేసి, భోజనాన్ని రుచిచూశారు. పరిసరాల్లో మొక్కలు పెంచాలని జైలు పర్యవేక్షణాధికారిని సూచించారు. జైలు ఆధ్వర్యంలో నడుపుతున్న పెట్రోల్ బంకును చూసి ప్రశంసించారు. జైలు సూపరింటెండెంట్ డి.వెంకటగిరి, న్యాయవాదులు ఉన్నారు. యలమంచిలి: గోదావరిలో వరద ఉధృతి పెరగడంతో కనకాయలంక వద్ద కాజ్వే మునిగింది. కాజ్వేపై నుంచి సుమారు నాలుగడుగుల నీరు ప్రవహించడంతో అధికారులు ఇంజన్ పడవలు ఏర్పాటుచేశారు. ఈ ఏడాది వరదలకు కాజ్వే మునగడం ఇది నాలుగోసారి. ప్రస్తుతం భద్రాచలం వద్ద 43 అడుగుల నీరు ఉంది. ఇది మరింత పెరిగే అవకాశం ఉందని హెచ్చరికలు వస్తున్న నేపథ్యంలో నాలుగు రోజుల వరకూ కాజ్వే ముంపులోనే ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. సిద్ధాంతంలో.. పెనుగొండ: వశిష్ట గోదావరి నిండుగా ప్ర వహిస్తోంది. రెండు రోజుల్లో సుమారు ఏడడుగుల మేర నీరు పెరిగింది. సిద్ధాంతంలో కేదార్ఘాట్, పుష్కర ఘాట్లు పూర్తిగా మునిగిపోవడానికి కేవలం మూడు మెట్లు మాత్రమే ఉన్నాయి. వరద నీరు సిద్ధాంతం పుష్కరాల రేవులను పూర్తిగా ముంచెత్తింది. పడవలపై రాకపోకలు సాగించే లంక రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. మధ్యస్థ లంకలోకి రాకపోకలు యథావిధిగా సాగుతున్నాయి. కోడేరు, అయోధ్యలంక, ఇతర లంక గ్రామాల్లోకి వరద నీరు చేరుతుంది. అయితే ప్రస్తుతం ఎలాంటి ప్రమాదం లేదని ఆయా ప్రాంతాల ప్రజలు చెబుతున్నారు. నరసాపురం: ఎగువ ప్రాంతం నుంచి నరసాపురంలో వశిష్ట గోదావరికి భారీగా వరద నీరు వస్తోంది. దీంతో నరసాపురం–సఖినేటిపల్లి పడవల రేవులో ప్రవాహ ఉధృతి భారీగా పెరిగింది. రేవులో ప్రమాదకర పరిస్థితుల దృష్ట్యా ఆదివారం పంటు రాకపోకలను అధికారులు నిలుపుదల చేశారు. పరిస్థితిని బట్టి సోమ, మంగళవారాల్లో పంటు రాకపోకలు పునరుద్ధరిస్తామని తహసీల్దార్ అయితం సత్యనారాయణ తెలిపారు. -
వేటగాళ్ల మరణ మృదంగం
● కొల్లేరులో నాటు తుపాకులకు విహంగాల బలి ● గుట్టుచప్పుడు కాకుండా విక్రయాలు ● చేతులెత్తేసిన అటవీశాఖ అధికారులు కై కలూరు: ప్రకృతి సౌందర్యాలకు నిలయమైన కొల్లేరు సరస్సు.. పక్షుల కిలకిలరావాలతో కళకళలాడే విహంగాల స్వర్గధామం. ఇప్పుడు ఆ స్వర్గంలో మరణమృదంగం మోగుతోంది. వేటగాళ్లు విదేశీ పక్షులపై విరుచుకుపడుతున్నారు. తుపాకీ గుండ్లతో మూగజీవాల గుండెలను చీల్చేస్తూ, వలల ఉచ్చులతో ఊపిరి తీయకుండా చేస్తున్నారు. అటవీ అభయారణ్య చట్టాలు కేవలం పుస్తకాలకే పరిమితమైపోయాయి. నియంత్రించాల్సిన అధికారుల కళ్లముందే వేటగాళ్ల దౌర్జన్యం పెరుగుతోంది. కూటమి ప్రభుత్వంలో మరింత బరితెగించి కొల్లేరు ఒడిలో సేదతీరుతున్న పక్షుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. చెరువులపై వాలితే ఆయువు తీరినట్లే ఆక్వా చెరువులపై వాలిన అరుదైన పక్షి జాతులు సైతం వేటగాళ్ల నాటు తుపాకులకు బలవుతున్నాయి. రాష్ట్రంలో 5.75 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగు జరుగుతుండగా, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ఈ విస్తీర్ణం 2.90 లక్షల ఎకరాలుగా ఉంది. ఎక్కువ విస్తీర్ణం కలిగిన చేపల రైతులు సాగు ప్రారంభంలో చేప పిల్లలను పక్షులు తినకుండా నాటు తుపాకుల వేటగాళ్లను నియమించుకుంటారు. ఇందుకోసం తమిళనాడు, సూళ్లూరుపేట నుంచి వచ్చిన దాదాపు 150 కుటుంబాలు కై కలూరు, ఉండి నియోజకవర్గాల్లో నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. తుపాకీతో ఒక్క పక్షిని చంపితే వీరికి రూ.200 నుంచి రూ.300 వరకూ పనికి తీసుకెళ్లిన చెరువు రైతులు చెల్లించాలి. ఈ క్రమంలో కొల్లేరులో సంచరించే పక్షులు చెరువులపై వాలితే వేటగాళ్లు కాల్చేస్తున్నారు. చేపలు పెద్దవైన తర్వాత సైతం వేటగాళ్లు తమ పక్షుల వేటను కొనసాగిస్తుండడం గమనార్హం. నాటు తుపాకుల మందు పేలి అనేక మంది వేటగాళ్లు మరణించిన ఘటనలు కొల్లేరు ప్రాంతంలో చోటుచేసుకోవడం గమనార్హం. అక్రమ వేటకు ఎన్నో ఆనవాళ్లు.. ● గుడివాకలంక, నిడమర్రు, అడవి కొలను, శృంగవరప్పాడుతో పాటు నడికొల్లేరులోని అనేక ప్రాంతాల్లో వేట సాగిస్తున్నారు. ● ఆగస్టు 29న ఏలూరు జిల్లా గుడివాకలంక వద్ద కొల్లేరు పక్షులను వేటాడి తెస్తున్న వ్యక్తిని ఫారెస్టు సిబ్బంది పట్టుకున్నారు. కై కలూరు మండలం కొల్లేటికోట ప్రాంతంలో వేటాడానని అతను చెప్పాడు. ఇదే ప్రాంతంలో కొన్ని నెలల క్రితం బతికి ఉన్న పక్షుల తీసుకెళ్తున్న ఒకరిని పట్టుకున్నారు. కేసు నమోదు చేసి మేజిస్ట్రేట్ తీర్పుతో పక్షులను వదిలేశారు. ● సెప్టెంబర్ 4న నరసాపురం మండలం లక్ష్మణేశ్వరం చేపల మార్కెట్లో విక్రయానికి ఉంచిన 13 మృతి చెందిన పక్షులను, ఏడుగురు వేటగాళ్లను, 3 నాటు తుపాకులను భీమవరం ఫారెస్టు సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. ● కొద్దిరోజుల క్రితం వేటగాళ్లు గుళికలతో చంపిన గ్లోసి ఐబీస్ కొల్లేరు పక్షుల ఫొటోలు సామాజిక మాద్యమాల్లో ప్రత్యక్షమయ్యాయి. కొల్లేరు సరస్సు ముఖ్యాంశాలు ప్రాంతం: 901 చ.కి.మీ. విస్తీర్ణం: 2,22,300 ఎకరాలు అభయారణ్యం: 77,138 ఎకరాలు (9 మండలాలు) గ్రామాలు: 122 f¯é¿ê: 3.50 ÌS„ýSË$ ÑçßæÇ…^ól 糄ìS gê™èl$Ë$: 182 Ð]lÌSçÜ ç³„ýS$Ë$: {ç³™ólÅMýS BMýS-Æý‡Û׿ వేటకు గురవుతున్న ప్రధాన పక్షులు పర్పూల్ శాంఫన్ (కొండింగాయి) కామన్ మోర్హెన్ (జమ్ముకోడి) కామన్ కూట్ (నామాల కోడి) టీల్ (పరజా) గ్లోసీ ఐబీస్ (నల్ల కంకణాల పిట్ట) విజిటింగ్ టీల్ (సిలువ బాతులు) గ్రేహెరాన్ (నారాయణ పక్షి) కార్బోరెంట్ (నీటి కాకులు) కొల్లేరు ప్రాంతంలో పక్షుల వేటగాళ్లపై నిఘాను ముమ్మరం చేశాం. వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 ప్రకారం వేటాడినా, వాటి ఆవాసాలను నాశనం చేసినా, అభయారణ్యంలో ప్రవేశించినా నేరంగా పరిగణిస్తాం. రెండేళ్లు జైలు, రూ.20 వేల జరిమానాతో పాటు రెండు శిక్షలను ఏకకాలంలో అనుభవించాల్సి ఉంటుంది. నాటు తుపాకులతో అభయారణ్యంలో ప్రవేశం నేరం. –కె.రామలింగాచార్యులు, జిల్లా ఫారెస్టు రేంజ్ ఆఫీసర్, ఏలూరు -
కూటమిపై భగ్గుమంటున్న ఉద్యోగులు
భీమవరం(ప్రకాశం చౌక్): కూటమి సర్కారు పాలనలో ప్రభుత్వ ఉద్యోగులు సమస్యలతో సతమ తమవుతున్నారు. సమస్యల పరిష్కారం, ఎన్నికల హామీల అమలు, హక్కుల సాధన కోసం రోడ్డెక్కి నిరసనలు తెలుపుతున్నారు. పనిఒత్తిడి, వేధింపులు తదితర సమస్యలపై ప్రభుత్వ ఉద్యోగులతో పాటు కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉద్యమ బాట పట్టారు. కూటమి ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై తిరుగు బావుటా ఎగురవేశారు. జిల్లాలో సచివాలయ ఉద్యోగులు మొదలు ఉపాధ్యాయులు, వైద్యులు, విద్యుత్, రెవెన్యూ ఉద్యోగులు, అంగన్వాడీ వర్కర్లు, సహకార ఉద్యోగులు, ఆశావర్కర్ల వరకూ నిరసన గళమెత్తారు. ప్రతి సోమవారం భీమవరంలో కలెక్టరేట్ వద్ద ఆందోళనలు, ధర్నాలు చేపట్టి కలెక్టర్కు వినతిపత్రాలు సమర్పిస్తున్నారు. రాష్ట్రంలోని పలు శాఖల ఉద్యోగులు తారాస్థాయిలో పోరాటా లు చేస్తున్నా కూటమి ప్రభుత్వం వీరిని పట్టించుకోవడం లేదు. రోజులు తరబడి ఉద్యమాలు చేసినా, మంత్రులు హామీలు ఇచ్చినా సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదు. కూటమి ప్రభుత్వ 16 నెలల పాలనలో జిల్లాలో శాఖల వారీగా నిరసన గళాలు, ధర్నాలు ఇలా.. గురువులకు బోధనేతర భారం ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు బోధనేతర విధులతో సతమతమవుతున్నారు. ప్రభుత్వం యో గాంధ్ర, పేరెంట్ మీటింగ్స్, యాప్లు, శిక్షణ, ఫొ టోల అప్లోడ్ వంటి పనులు అప్పగించడంతో విసుగు చెందుతున్నారు. బోధనేతర భారం తగ్గించడంతో పాటు ఎన్నికల సమయంలో ఇచ్చిన హా మీలు అమలు చేయాలంటూ ధర్నాలు చేశారు. సచివాలయ ఉద్యోగుల ఆత్మగౌరవ ఉద్యమం పని ఒత్తిళ్లు, సర్వేల భారం, ఆత్మగౌరవాన్ని దిగజార్చడంపై సచివాలయ ఉద్యోగులు ఆత్మగౌరవ ఉద్యమం చేపట్టారు. దశల వారీగా నిరసనలు తెలుపుతున్నారు. జిల్లా కేంద్రం, మండలాల్లో అధికారులకు సమ్మె నోటీసులు ఇచ్చి రోజువారీ నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. సీహెచ్ఓల అలుపెరుగని పోరాటం ఉద్యోగ భద్రత, సమస్యల పరిష్కారమే లక్ష్యంగా విలేజ్ క్లినిక్లలో పనిచేసే కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు (సీహెచ్ఓలు) అలుపెరుగని పోరాటం చేశారు. 22 రోజుల పాటు దీక్షలు చేశారు. గర్జించిన విద్యుత్ ఉద్యోగులు విద్యుత్ సంస్థ గతంలో ఇచ్చిన హామీలు అమలు చేయాలంటూ సంస్థ ఉద్యోగులు పోరాటానికి దిగారు. ఈనెల 19 నుంచి 21 వరకు నిరసనలు తెలిపి, 22న భారీ ర్యాలీగా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. విద్యుత్ శాఖ ప్రధాన కార్యాలయాల ముట్టడికి సమాయత్తమయ్యారు. ‘రెవెన్యూ’కు క్లస్టర్ కష్టాలు రెవెన్యూ శాఖలో వీఆర్వోలు, వీఆర్ఏలు క్లస్టర్ సమస్యతో సతమతమవుతున్నారు. ఒక్కొక్కరూ రెండు, మూడు గ్రామాలకు సేవలు అందించడంలో ఇబ్బంది పడుతున్నారు. సమస్యల పరిష్కారానికి వీఆర్వోలు ఉన్నతాధికారులకు వినతిపత్రాలు అందించగా.. వీఆర్ఏలు ధర్నాలు చేశారు. అంగన్‘వాడీవేడిగా’.. జీతాల పెంపు హామీని కూటమి ప్రభుత్వం అమలు చేయకపోవడంతో అంగన్వాడీ టీచర్లు కలెక్టరేట్ వద్ద ధర్నాలు చేశారు. జీతాల పెంపు, ఎక్స్గ్రేసీయా, యాప్ల భారం తగ్గింపు, పెన్షన్ తదితర డిమాండ్లతో ఆందోళనలు నిర్వహించారు. పీహెచ్సీ వైద్యుల సమ్మెబాట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు సోమవారం నుంచి సమ్మె బాట పట్టనున్నారు. ఐదు డిమాండ్లను ప్రభుత్వం ముందుంచి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని గళమెత్తుతున్నారు. ప్రభుత్వం నుంచి అందని ‘సహకార’ం జిల్లాలోని సహకార సంఘాల ఉద్యోగులు 16 డిమాండ్ల సాధన కోసం పోరాటం చేస్తున్నారు. జనవరిలో భీమవరంలో కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. అలాగే ఆస్పత్రుల్లో పారిశుద్ధ్య కార్మికులు, ఆశావర్కర్లు, ఆరోగ్యమిత్రలు వారివారి సమస్యలపై ఉద్యమాలు చేస్తున్నారు. హక్కుల సాధనే లక్ష్యంగా.. సమస్యల పరిష్కారానికి పోరాటాలు ఎన్నికల హామీలు అమలు చేయాలంటూ.. పలు ప్రభుత్వ శాఖల ఉద్యోగుల నిరసన గళం పోరాటాల వేదికగా కలెక్టరేట్ ఉద్యోగుల సమస్యలు పట్టని కూటమి సర్కారు ఎన్నికల హామీ మేరకు అంగన్వాడీ కార్యకర్తలకు జీతాలు పెంచాలి. ఇప్పటికే సమస్యల పరిష్కారానికి కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించాం. అయి నా కూటమి ప్రభుత్వం ఎ లాంటి నిర్ణయం తీసుకోలేదు. పనికి తగిన వేతనం, ఎక్స్గ్రేసియా, పెన్షన్ అడుగుతున్నాం. –సీహెచ్ మహలక్ష్మి, ప్రాజెక్టు లీడర్, భీమవరంవిద్యార్థులకు పాఠాలు చెప్పే సమయం ఉపాధ్యాయులకు తగ్గిపోయింది. బోధనేతర పనులు భారంగా మారాయి. యాప్ల భారం, పని ఒత్తిడి తో టీచర్ల ప్రాణాలు పోతున్నాయి. ఎన్నికల్లో ఇచ్చిన హమీ మేరకు ప్రభుత్వం పీఆర్సీ కమిషన్ వేసి ఐఆర్ ప్రకటించాలి. –పి.విజయరామరాజు యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు కూటమి ప్రభుత్వం వలంటీర్ వ్యవస్థను రద్దు చేసి సచివాలయ ఉద్యోగులపై క్లస్టర్ భారం వేసింది. దీంతో పనిభారం బాగా పెరిగింది. మా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లినా స్పందించడం లేదు. దీంతో సచివాలయ ఉద్యోగులు ఆత్మ గౌరవ ఉద్యమం చేపట్టారు. – ఎ.శ్రీనివాస్ ఏపీఎంఎంఈఏ రాష్ట్ర ప్రచార కార్యదర్శి -
గోపాలకృష్ణకి రాష్ట్రస్థాయి అవార్డు
చింతలపూడి: చింతలపూడికి చెందిన కిసాన్ అంగడి వ్యవస్థాపకుడు మరికంటి గోపాలకృష్ణ ఉత్తమ ప్రకృతి వ్యవసాయ విస్తరణ నిపుణుల రాష్ట్రస్థాయి అవార్డుకు ఎంపికయ్యారు. ఏరువాక ఫౌండేషన్ ఆధ్వర్యంలో శనివారం వడ్డేశ్వరంలోని కేఎల్ యూనివర్సిటీలో జరిగిన కార్యక్రమంలో తాను అవార్డు అందుకున్నట్టు గోపాల కృష్ణ ఆదివారం తెలిపారు. ఎనిమిదేళ్లుగా గోపాలకృష్ణ తన భూమిలోనే ప్రకృతి వ్యవసాయాన్ని అమలు చేస్తూ రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. కిసాన్ అంగడి ద్వారా ఆంధ్ర–తెలంగాణ రాష్ట్రాల్లో ప్రకృతి వ్యవసాయాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తూ అవగాహన, శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. -
ఏకై క మెంటల్ ఎమ్మెల్యే బాలకృష్ణ
● అన్న చిరంజీవిని తిట్టినా మాట్లాడని పవన్ కల్యాణ్ ● విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి కారుమూరి ధ్వజం తణుకు అర్బన్: దేశంలోనే ఏకై క మెంటల్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అని మాజీ మంత్రి కారు మూరి వెంకట నాగేశ్వరరావు ఎద్దేవా చేశారు. ఆయ న మెంటల్ ఉన్న వ్యక్తిగా సర్టిఫికెట్ కూడా పొందారని గుర్తుచేశారు. అసెంబ్లీ సమావేశాల్లో బాలకృష్ణ తాగి వచ్చి చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలపై త ణుకులో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల స మావేశంలో ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవాలయం లాంటి అసెంబ్లీలో విచిత్ర వేషధారణతో పాటు అసభ్యకరంగా మాట్లాడిన బాలకృష్ణ ధోరణిని ఏ ఒక్కరూ తప్పుపట్టకపోవడం విచారకరమన్నారు. చంద్రబాబు ప్లాన్ ప్రకారమే ఎమ్మెల్యే కామినేని జగన్పై దురుసుగా మాట్లాడటం, ఆపై సినీ పెద్దగా ఉన్న చిరంజీవిని సైతం బాలకృష్ణ వాడు, వీడు అన డం బాధాకరమన్నారు. బాలకృష్ణ ఇంట్లో కాల్పుల ఘటనలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఎప్పుడూ రాజకీయం చేయలేదని కారుమూరి తెలిపారు. ఆనాడు వైఎస్సారే ఆయన్ని కాపాడిన విషయాన్ని గుర్తుచేశారు. పవన్ కల్యాణ్ మాట్లాడరేం? ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గతంలో తన తల్లిని తిట్టినవారినే ఇప్పుడు చంకనేసుకుని తిరుగుతున్నా రని కారుమూరి ఎద్దేవా చేశారు. నేడు సొంత అన్న చిరంజీవిని సైతం అసెంబ్లీ సాక్షిగా కించపరిచేలా మాట్లాడినా ఆయన ఏమాత్రం స్పందించకపోవడం గమనార్హమన్నారు. బాలకృష్ణ వ్యాఖ్యలపై చిరంజీవి స్పందించి గతంలో జగన్ చూపిన ప్రేమను స్పష్టంగా చెప్పారని వివరించా రు. కానీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాత్రం బాలకృష్ణ చేసిన విమర్శలపై ఎందుకు మాట్లాడడం లేదని కారుమూరి ప్రశ్నించారు. కూటమి ఎమ్మెల్యేల నోటే పాలనా వైఫల్యాలు కూటమి ప్రభుత్వం పాలనలో విఫలమైందని కా రుమూరి విమర్శించారు. ఆ విషయాన్ని వారి ఎ మ్మెల్యేలే బాహాటంగా చెబుతున్నారని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. యూరియా పూర్తిస్థాయిలో అందుబాటులో ఉందని చంద్రబాబు చెబు తున్నారని, దీనిపై ఎవరైనా మాట్లాడితే జైల్లో వేస్తామంటున్నారని చెప్పారు. కానీ తమ తమ ప్రాంతాల్లో యూరియా దొరకడం లేదని, బ్లాక్లో అ మ్మేసుకుంటున్నారని వారి ఎమ్మెల్యేలే చెబుతున్నా రని గుర్తుచేశారు. రోడ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయని, ఆ గుంతల్లో బస్సులు దిగిపోతున్నాయని, మోటార్ సైకిళ్లు కూడా రోడ్లపై వెళ్లలేనంత దారుణ స్థితిలో ఉన్నాయని వారి ఎమ్మెల్యేలే చెబుతున్నారని ఆ యన తెలిపారు. రోడ్లు ఇలా ఉంటే.. ప్రభుత్వం పట్టించుకోకపోతే ప్రజల ముందుకు వెళ్లలేని ప రిస్థితి నెలకొందని బాహాటంగా విమర్శిస్తున్నారని గుర్తుచేశారు. రోడ్లు వేయాలని డిమాండ్ చేస్తున్నారని వివరించారు. అభివృద్ధి పనులు చేసేందుకు ప్రభుత్వం నిధులు విడుదల చేయడం లేదు కాబట్టి.. లంచాలు తీసుకొని పనులు చేయిస్తున్నామని ఒక ఎమ్మెల్యే చెబుతున్నారని తెలిపారు. ఎమ్మెల్యేలను వారి కార్యకర్తలే విమర్శిస్తున్నారని గుర్తుచేశారు. కూటమి ప్రభుత్వ ఎమ్మెల్యేలు అడ్డగోలుగా దోపిడీకి పాల్పడుతున్నారని విమర్శించారు. -
పెద్దింట్లమ్మ దేవస్థానంలో భక్తుల రద్దీ
కై కలూరు: పెద్దింట్లమ్మ దేవస్థానంలో ఆదివారం భక్తుల రద్దీ కనిపించింది. సమీప జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మను దర్శించుకున్నారు. పవిత్ర కోనేరులో స్నానాలు అచరించి పెద్దింట్లమ్మకు పొంగళ్లు సమర్పించారు. ఆలయ ఈవో కూచిపూడి శ్రీనివాసు మాట్లాడుతూ ఒక్క ఆదివారం ప్రత్యేక, అంతరాలయ దర్శనాలు, కేశఖండన, పెద్ద, చిన్న తీర్థాలు, లడ్డూ ప్రసాదం, గదుల అద్దెలు, అమ్మవారి ఫొటోల అమ్మకం, వాహన పూజలు, భక్తుల విరాళాల ద్వారా రూ.33,675 ఆదాయం వచ్చిందని చెప్పారు. భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించామని ఈవో చెప్పారు. కొల్లేటికోట పెద్దింట్లమ్మ దేవస్థానంలో భక్తుల పూజలు -
క్షేత్రంలో కొనసాగిన రద్దీ
ద్వారకాతిరుమల: శ్రీవారి క్షేత్రంలో ఆదివారం సైతం భక్తుల రద్దీ కొనసాగింది. దసరా ఉత్సవాలు సందర్భంగా విజయవాడ దుర్గమ్మను దర్శిస్తున్న భవానీ దీక్షాదారులు నేరుగా చిన్నతిరుపతికి చేరుకుంటున్నారు. దాంతో కొండపైన, ఆలయ పరిసరాలు భక్తులతో సందడిగా మారాయి. దర్శనం క్యూలైన్లు, వైకుంఠం క్యూ కాంప్లెక్స్, ఆలయ తూర్పురాజగోపుర ప్రాంతం, అనివేటి మండపం, కేశఖండనశాల తదితర విభాగాలు భక్తులతో పోటెత్తాయి. సెల్ఫోన్లు భద్రపరచే కౌంటర్ వద్ద భక్తులు బారులు తీరారు. తిరుగు ప్రయాణంలో వారంతా క్షేత్ర దేవత కుంకుళ్లమ్మ ఆలయాన్ని సందర్శిస్తున్నారు. రాత్రి వరకు క్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగింది. -
పండగ వేళా పస్తులే!
ఏలూరు (ఆర్ఆర్పేట): సమగ్ర శిక్షా అభియాన్లో ఏళ్ల తరబడి కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న ఉద్యోగులు కూటమి ప్రభుత్వం నిర్వాకంతో ఆకలితో అలమటిస్తున్నారు. రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా పనిచేస్తున్నా జీతాలు సక్రమంగా రాక కుటుంబంతో సహా పస్తులు ఉండాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఆగస్టు నెల జీతాలు ఇప్పటికీ వారి బ్యాంకు ఖాతాల్లో పడలేదు. అలాగే సెప్టెంబర్ నెల జీతాల విడుదలపై కూడా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పష్టత రాకపోవడంతో వీరు దసరా పండగ వేళ కూడా ప్రభుత్వం తమను పస్తులు పెడుతుందా అనే ఆవేదన చెందుతున్నారు. ఉమ్మడి జిల్లాలో సుమారు 1,000 మంది.. సమగ్ర శిక్షాలో ఆర్ట్, క్రాఫ్ట్, పీఈటీ వంటి పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్స్, ఎంఐఎస్ కో–ఆర్డినేటర్లు, క్లస్టర్ రీసోర్స్ పర్సన్లు, పీఈటీలు, ఫిజియోథెరపిస్టులు, సైట్ ఇంజనీర్లు, మెసెంజర్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, డ్రైవ ర్లు వంటి అన్ని వర్గాలకు చెందిన కాంట్రాక్టు ఉద్యోగులు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో సుమారు 1,000 మంది ఉన్నారు. వీరందరికీ కలిపి ఒక నెల వేతనం సుమారుగా రూ.7 కోట్లు ఉంటుంది. ఆగస్టు నెల జీతాలు ఇప్పటికీ విడుదల చేయకపోవడం, సెప్టెంబర్ నెల జీతాలపై స్పష్టత ఇవ్వకపోవడం వీరిని మరింత ఆందోళనకు గురిచేస్తోంది. మినిట్స్ అమలుకు డిమాండ్ : తమ డిమాండ్ల సాధన కోసం సమగ్ర శిక్ష ఉద్యోగులు గత ప్రభుత్వ హయాంలో దాదాపు 21 రోజులు సమ్మె చేశారు. ఆ సమయంలో ప్రభుత్వం వీరిని చర్చలకు పిలిచి వీరి డిమాండ్లను పరిష్కరించడానికి సానుకూలంగా స్పందించింది. ప్రభుత్వ ప్రతినిధులు, సమగ్ర శిక్ష రాష్ట్ర ఉన్నతాధికారులు వీరితో చర్చించి మినిట్స్ రూపొందించారు. దాని ప్రకారం వారి గౌరవ వేతనాన్ని 23 శాతం పెంచడానికి అంగీకరించి ఆ మేరకు పెంచిన వేతనాలను అమలు చేసింది. అయితే హెచ్ఆర్ పాలసీ అమలుకు, మినిమమ్ టైమ్ స్కేల్ వర్తింప జేయడానికి గల సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేయడానికి, పీఎఫ్ అమలు చేయడానికి, జాబ్ చార్ట్ తయారు చేయడానికి, సమగ్ర శిక్షా ఉద్యోగ నియామకాల్లో వీరికి వెయిటేజీ ఇవ్వడానికి, గత అవకాశాలను పరిశీలించడానికి కమిటీలు వేయడానికి అప్పటి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈలోపు ఎన్నికలు రావడంతో ఆ మినిట్స్ అమలు కాలేదు. ఎన్నికల సమయంలో చంద్రబాబు, లోకేష్ వీరి డిమాండ్లు సమంజసమైనవేనని వాటిని తమ ప్రభుత్వం వచ్చి న తరువాత తప్పకుండా పరిష్కరిస్తామని స్పష్టమైన హామీని కూడా ఇచ్చినట్టు సమగ్ర శిక్షా కాంట్రాక్ట్ ఉద్యోగులు గుర్తు చేస్తున్నారు. ప్రభుత్వం ఆమోదించిన మినిట్స్ను అమలు చేయాలని అప్పట్లో నారా లోకేష్ తన ట్విట్టర్ అకౌంట్లో సైతం ట్వీట్ చేసి సమగ్రశిక్ష ఉద్యోగులను ఆకర్షించారు. ఇదిలా ఉండగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలు గడిచినా ఇప్పటివరకూ తమ సమస్యలు పరిష్కరించే దిశగా ప్రభుత్వం చొరవ తీసుకోకపోవడం దారుణమని సమగ్ర శిక్ష ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జీతాలు రాక సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగుల ఆకలి కేకలు ఎన్నికల్లో హామీ ఇచ్చిన మినిట్స్ అమలు చేయాలని డిమాండ్ ఆగస్టు నెల జీతం బకాయి సుమారు రూ.7 కోట్లు ఉమ్మడి జిల్లాలో సుమారు వెయ్యి మంది కాంట్రాక్టు ఉద్యోగులు గత ప్రభుత్వం ఆమోదించిన మినిట్స్ తాము అధికారంలోకి వస్తే అమలు చేస్తామని లోకేష్ హామీ ఇచ్చారు. కానీ ఇప్పటివరకూ ఆయన స్పందించకపోవడం దారుణం. అక్టోబర్ 12లోపు మా డిమాండ్లు పరిష్కరించకపోతే విజయవాడలో జరిగే ఆవిర్భావ సభలో సమ్మెకు కార్యాచరణ రూపొందిస్తాం. – వాసా శ్రీనివాసరావు, సమగ్ర శిక్షా ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర చైర్మన్ సమగ్ర శిక్షాలో పని చేస్తున్న అన్ని విభాగాల కాంట్రాక్టు ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలి. మా పని వేళలు, బాధ్యతలకు సంబంధించి స్పష్టత లేకపోవడం వల్ల సమస్యలు తలెత్తుతున్నాయి. కచ్చితమైన జాబ్ చార్ట్, పని సమయాలపై మార్గదర్శకాలు జారీ చేయాలి. హెచ్ఆర్ పాలసీ, పీఎఫ్ వర్తింపజేయాలి. – వినోద్, సమగ్ర శిక్షా ఉద్యోగుల జిల్లా అధ్యక్షుడు -
గళమెత్తిన సచివాలయ ఉద్యోగులు
పాలకొల్లు సెంట్రల్: తమ న్యాయబద్ధమైన కోరికలు వెంటనే పరిష్కరించాలని సచివాలయ ఉద్యోగుల నూతన కమిటీ అధ్యక్షుడు దేవరకొండ రాజ్కుమార్ అన్నారు. శనివారం రాష్ట్ర ఏపీవీడబ్ల్యూఎస్ఈ జేఏసీ కమిటీ పిలుపు మేరకు స్థానిక మున్సిపల్ కార్యాలయంలో సచివాలయ నూతన కమిటీ ఆధ్వర్యంలో గాంధీజీ, అంబేడ్కర్ విగ్రహాలకు వినతిపత్రాలు ందించారు. ఈ సందర్భంగా రాజ్కుమార్ మా ట్లాడుతూ సచివాలయ ఉద్యోగుల నోషనల్ ఇంక్రిమెంట్లు, వారి బకాయిలు, ప్రమోషన్స్, మదర్ డిపార్ట్మెంట్లలో విధుల నిర్వహణ, డోర్ టు డోర్ సర్వీస్ అందించే విధానానికి స్వస్తి పలకడం వంటి డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందించినట్టు తెలిపారు. నూతన కమిటీ సభ్యులు పాల్గొన్నారు. తణుకు అర్బన్: ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు పారిశుద్ధ్య కార్మికుల నాలుగు నెలల వేతన బకాయిలు, 40 నెలల పీఎఫ్ బకాయిలు తక్షణమే చెల్లించాలని, తణుకు జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రి 150 పడకల స్థాయికి అనుగుణంగా కనీసం 50 మందికి తగ్గకుండా పారిశుద్ధ్య కార్మికులను నియమించాలని కోరుతూ ఈనెల 29 నుంచి సమ్మెలోకి వెళుతున్నట్టు ఏపీ మెడికల్ కాంటాక్టు వర్కర్స్ యూనియన్ తణు కు శాఖ అధ్యక్షుడు కోనాల భీమారావు అ న్నా రు. యూనియన్ ఆధ్వర్యంలో శనివారం స్థాని క జిల్లా కేంద్ర ప్రభుత్వాస్పత్రి ఆవరణలో కార్మికులతో కలిసి నిరసన తెలిపి అనంతరం సూపరింటెండెంట్ కె.సాయికిరణ్కు సమ్మె నోటీసు అందజేశారు. భీమారావు మాట్లాడుతూ కార్మి కులకు తక్కువ వేతనాలు కూడా ప్ర తినెలా సక్రమంగా ఇవ్వడం లేదన్నారు. ఆస్పత్రి స్థా యికి తగ్గట్టు కార్మికులు లేకపోవడంతో ఉన్నవారికి భారం పడుతోందన్నారు. కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. నాయ కులు ధర్మాని పుష్పలత, భారతి, సీహెచ్ మంగమ్మ తదితరులు పాల్గొన్నారు. తణుకు అర్బన్: గీత కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జుత్తిగ నరసింహమూర్తి డిమాండ్ చేశారు. శనివారం సంఘ జిల్లా ఆఫీస్ బ్యారర్స్ సమావేశం తణుకు అమరవీరుల భవనంలో నిర్వహించారు. ఈ సందర్భంగా నరసింహమూర్తి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం గ్రామాల్లో మద్యాన్ని ఏరులై పారిస్తూ లక్షలాది మంది గీత కార్మికుల ప్రయోజనాలను దిగజార్చించిందన్నారు. గీత కార్మికులు ఉన్న ఊరిలో బతకలేక వలసలు వెళ్లే పరిస్థితి వచ్చిందన్నారు. సంఘ జిల్లా అధ్యక్షుడు కామన మునిస్వామి మాట్లాడుతూ ప్ర మాదవశాత్తూ చెట్టుపై నుంచి పడి మృతిచెంది న కార్మికులకు పక్క రాష్ట్రంలో రూ.5 లక్షల పరిహారం ఇస్తున్నారని, రాష్ట్రంలో మాత్రం ఒక్క రూపాయి కూడా ఇవ్వడం లేదన్నారు. జిల్లా ఉపాధ్యక్షుడు బొక్క చంటి పాల్గొన్నారు. భీమవరం(ప్రకాశం చౌక్): జీఎస్టీ తగ్గింపు ఫ లాలు అందరికీ తెలిసేలా విస్తృత ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ సీహెచ్ నాగరాణి తెలిపారు. శనివారం కలెక్టరేట్లో వాణిజ్యపన్నుల శాఖ ఆధ్వర్యంలో జీఎస్టీ సంస్కరణల అమలులో భాగం ఆటోమొబైల్స్, పౌల్ట్రీ, ఆక్వా, రవాణా, నిర్మాణ, బీమా, చాంబర్ ఆఫ్ కామర్స్, కిరాణా మర్చంట్ తదితర వ్యాపార సంస్థలు అసోసియేషన్స్ ప్రతినిధులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. జీఎస్టీ 2.0పై ప్రజల్లో అవగాహన కల్పించేంతమ వంతు సహకారం అందించాలని కోరా రు. జేసీ టి.రాహుల్కుమార్రెడ్డి, ఏలూరు డివిజన్ వాణిజ్య పన్నుల డిప్యూటీ కమిషనర్ కేపీ శైలజ, డీపీఓ ఎం.రామనాథరెడ్డి పాల్గొన్నారు. -
జూనోటిక్ వ్యాధుల రక్షణ ఇలా..
జంగారెడ్డిగూడెం: రేబిస్ అనేది ఒక ప్రాణాంతక జూనోటిక్ వ్యాధి. అంటే ఇది జంతువుల నుంచి మనుషులకు సంక్రమిస్తుంది. ముఖ్యంగా కుక్కలు, పిల్లుల్లో రేబిస్ వైరస్ కారణమవుతుంది. ఈ వ్యాధి ఎన్సెఫాలైటిస్ (గుర్తింపు లోపం), మానసిక స్థితి మార్పులకు దారితీస్తుంది. ఇది చివరకు ప్రాణాంతకం అవుతుంది. సెప్టెంబర్ 28న ప్రపంచ రేబిస్ దినోత్సవం సందర్భంగా రేబీస్ వ్యాప్తి, నివారణ చర్యలపై కథనం. రేబిస్ వ్యాధి వ్యాప్తి ● రేబిస్ వ్యాధి ప్రధానంగా వైరస్ సోకిన జంతువుల గోరు, దంతాలు లేదా ముక్కు ద్వారా వ్యాపిస్తుంది. ● కుక్కలు, పిల్లులు లేదా ఇతర రేబిస్–సోకిన వన్య జంతువులు కరిచినప్పుడు రేబిస్ వ్యాధి వ్యాప్తి చెందుతుంది. ● రక్తంలోకి రేబిస్ వైరస్ ప్రవేశించి, నాడీ వ్యవస్థ ద్వారా మెదడుకు చేరి తీవ్ర నాడీ సంబంధిత రుగ్మతలను కలిగిస్తుంది. ఇతర పశువుల్లో... ● మేత తినకపోవడం, డిప్రెషన్, డల్నెస్, కనుపాప పెద్దదవడం, కళ్లు వెంబడి నీరు కారడం, చొంగ, కదలికలో మార్పు, నడవలేకపోవడం, పక్షవాతం, చిక్కిపోవడం, మరణాలు సంభవిస్తాయి. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ● కుక్క కాటు లేదా గాయానికి వెంటనే నీటితో, సబ్బుతో శుభ్రంగా కడగాలి. ● యాంటీసెప్టిక్ లేదా ఆల్కహాల్ ఉపయోగించి కాటు ప్రాంతాన్ని శుభ్రపరచాలి. ● కాటు లేదా గాయానికి వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. రేబిస్ వ్యాధి గురించి ఖచ్చితమైన నిర్ధారణ కోసం వైద్య పరీక్షలు నిర్వహించుకోవాలి. ● రేబిస్ వ్యాధి సోకిన గాయాల తర్వాత వెంటనే పీఈపీ (పోస్ట్ ఎక్స్పోజర్ ప్రోపీలాక్సిస్) టీకాలు ఇవ్వడం ద్వారా రక్షణ పొందవచ్చు. ● ఒకసారి కాటు గాయం జరిగిన తర్వాత 0వ రోజు, 3వ రోజు, 7వ రోజు, 14వ రోజు, 28వ రోజు టీకాలు వేయించాలి. ● రేబిస్ వ్యాధి సోకకుండా ముందస్తు రక్షణ కోసం ప్రీ ఎక్స్పోజర్ వ్యాక్సిన్ వేయించుకోవడం ఉత్తమం. ముఖ్యంగా జంతువులతో ఎక్కువగా పని చేసే వాళ్లకు అత్యవసరం. పెంపుడు జంతువులకు చేయవలసిన చర్యలు ● పెంపుడు కుక్కలు, పిల్లులకు రేబిస్ వ్యాధికి వ్యతిరేకంగా టీకాలు వేయించడం అత్యంత అవసరం. ● చిన్న వయస్సులోనే (తొలకరి నెల) రేబిస్ టీకా మొదలవుతుంది. తరువాత ప్రతి సంవత్సరం టీకాలు వేయించాలి. ● జంతువులకు బాహ్య, అంతర్గత పరాన్నజీవాలను నివారించడానికి యాంటీ–పరాన్నజీవా మందులు ఇవ్వాలి. ● కీటకాలు, ఫ్లీస్, టిక్స్ వంటి జీవులను పర్యవేక్షించాలి. వ్యాధి లక్షణాలు 14 రోజుల నుంచి ఏడాదిలోపు బయటపడతాయి. ఇది కుక్క కరిచిన ప్రదేశాన్ని బట్టి ఉంటుంది. మనుషులలో వ్యాధి లక్షణాలు రెండు రకాలుగా ఉంటాయి. అవి ప్యారలైటిక్, హైడ్రో ఫోబియా. 80 శాతం కేసుల్లో హైడ్రోఫోబియా లక్షణాలు ఉంటాయి. వీటిలో మనుషులు నీటిని చూసి భయపడటం, కరిచిన చోట జిలగా ఉండటం, గట్టిగా గాలివీచినా, వెలుగు పడినా భయపడుతుండటం కనిపిస్తాయి. ఈ లక్షణాలు కనిపిస్తే 3 నుంచి 5 రోజులు మాత్రమే జీవిస్తారు. ఫ్యారలైటిక్ఫాంలో నీటిని చూసి భయపడటం ఉండదు. గొంతు పడిపోవడం, పక్షవాతం లక్షణాలు కనిపిస్తాయి. ఇక కుక్కల్లో ప్యూరియన్ ఫాం, డంబ్ ఫాం లక్షణాలు ఉంటాయి. ప్యూరియస్ ఫాంలో మేత తినకపోవడం, జ్వరంతో బాధపడటం, పరివర్తనలో మార్పు రావడం, చీకటిలో దాగడం, పరుగులు తీయడం, మనుషులను కరవడానికి ప్రయత్నించడం, వస్తువులను కరవడం, అరుపులో మార్పులు రావడం, చొంగలు కార్చడం, ఏ వస్తువునంటే వాటిని తీసుకుని నోట్లో పెట్టుకోవడం, కదలికలో తేడాలు, కాళ్లకు పక్షవాతం, మరణాలు సంభవిస్తాయి. డంబ్ఫాంలో దవడ కిందకు జారడం, పక్షవాతం, కోమా, మరణం 10 రోజుల లోపు సంభవిస్తుంది. రేబిస్ అనేది ప్రాణాంతకమైన వ్యాధి. కుక్కలు, పిల్లుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం, టీకాలు వేయించడం చాలా ముఖ్యం. కాటు సంభవించినప్పుడు వెంటనే వైద్యుడిని సంప్రదించి రేబిస్ వ్యాధి వ్యాప్తిని నిరోధించడం చాలా అవసరం. – బీఆర్ శ్రీనివాసన్, పశువైద్యాధికారి -
రసాయన మందుల పిచికారీలో జాగ్రత్తలు
నూజివీడు: పంటలకు ఆశించే తెగుళ్ల నివారణకు రైతులు పురుగుమందులు వాడతారు. రసాయన మందులు విషపూరితమైనవి కావడం వల్ల వీటిని పంటలకు పిచికారీ చేసేటపుడు జాగ్రత్తలు పాటించాలి. వరి, మొక్కజొన్న, మినుము, పెసర, కూరగాయలు తదితర పంటలకు క్రిమిసంహారక మందులను పిచికారీ చేసేటప్పుడు ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ప్రాణపాయం సంభవించే ప్రమాదం ఉంది. అలాగే మామిడి సీజన్లో రైతులు పూత రావడం దగ్గర నుంచి పిందె దశ వరకు విడతలు వారీగా రసాయన మందులను పిచికారీ చేస్తుంటారు. ఈ నేపథ్యంలో పురుగుమందులను పిచికారీ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వ్యవసాయాధికారి పలగాని చెన్నారావు పలు సూచనలు చేశారు. పాటించాల్సిన జాగ్రత్తలు ● పురుగుమందులను పిచికారీ చేసేటప్పుడు వ్యక్తి ముఖానికి మందంగా ఉండే కండువా లేదా మాస్క్ను ధరించాలి. ● చేతులకు గ్లౌజ్, కాళ్లకు పొడవాటి దళసరి బూట్లు వేసుకోవాలి. నిండుగా దుస్తులు ధరించాలి. ● పురుగు మందులను పిచికారీ చేసిన తరువాత మందు డబ్బాలను భూమిలో పాతిపెట్టాలి. చేతులను శుభ్రంగా రెండుసార్లు సబ్బుతో కడుక్కోవాలి. ● ఏ పంటకు ఎంత మోతాదులో పిచికారీ చేయాలో సంబంధిత అధికారులను గానీ, శాస్త్రవేత్తలను గానీ అడిగి తెలుసుకోవాలి. ● కళ్లు మంట పుట్టడం, దురద పుట్టడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉన్నా నిర్లక్ష్యం వహించకుండా వైద్యుడిని సంప్రదించాలి. ● పురుగుమందుని నీటితో కలిపేటప్పుడు చేతిని కాకుండా కర్రను ఉపయోగించి కలపాలి ● పురుగు మందు డబ్బాల మూతను నోటితో తీయకూడదు. ● మందును పిచికారీ చేసిన చేతులతో బీడీ, సిగరెట్, చుట్ట తాగకూడదు. ● పురుగు మందులను మధ్యాహ్న సమయంలో పిచికారీ చేయకూడదు. ● గాలికి ఎదురుగా పురుగు మందులను పిచికారీ చేయకూడదు. అలా చేయడం వల్ల మందు మొక్కలపై పడకుండా పిచికారీ చేసే వ్యక్తిపైనే పడుతుంది. ● ఒకే వ్యక్తి ఎక్కువ విస్తీర్ణానికి మందులను పిచికారీ చేయకూడదు. ● పురుగు మందులను వేర్వేరుగానే పిచికారీ చేయాలి. ఒక పురుగు మందుని, కలుపు మందుతో కలపకూడదు. తెగులు మందుని, కలుపు మందుని కలపకూడదు. ● పురుగు మందులు శరీరంలోకి స్పర్శ, శ్వాస లేదా నోటి ద్వారా ప్రవేశించే ప్రమాదం ఉంది. ● పురుగు మందులను పిచికారీ చేసేటప్పుడు పురుగుమందు ప్యాకెట్పైన, పాంప్లెట్పైన ముద్రించిన సూచనలను చదివి పాటించాలి. పాడి–పంట -
కమ్యూనిటీ సైన్స్ కోర్సులో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం
డాక్టర్ ఎన్ దెబోరా మెస్సియానా, హోంసైన్స్ శాస్త్రవేత్త, కేవీకే ఉండి: కమ్యూనిటీ సైన్స్ (హోం సైన్స్) కోర్సులో ప్రవేశానికి ఈనెల 30వ తేదీ వరకు మాత్రమే గడువు ఉందని ఎన్నార్పీ అగ్రహారం కృషీ విజ్ఞాన కేంద్రం హోంసైన్స్ శాస్త్రవేత్త డాక్టర్ ఎన్ దెబోరా మెస్సియానా ఒక ప్రకటనలో తెలిపారు. నాలుగేళ్ల కాలపరిమితి గల ఈ డిగ్రీ కోర్సును బీఎస్సీ ఆనర్స్గా పిలుస్తున్నారని, ఇందులో చేరేందుకు ఇంటర్ బైపీసీ, ఎంపీసీ ఉత్తీర్ణులైన విద్యార్థులు, 3 ఏళ్ల హోంసైన్స్, అగ్రికల్చర్ డిప్లమో గ్రూపులో పాసైన విద్యార్థులు అర్హులన్నారు. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కమ్యూనిటీ సైన్స్ కోర్సులో చేరి విద్యార్థులు తమ భవిష్యత్ను ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలని సూచించారు. అభ్యర్థులు ఏఎన్జీఆర్ఏయూ.ఏసీ.ఇన్ అనే వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. బాలకృష్ణది కొవ్వెక్కిన భాష●అసెంబ్లీ సాక్షిగా చిరంజీవికి క్షమాపణ చెప్పాలి ●జనసేన అధికార ప్రతినిధి సజ్జా సుబ్బు తాడేపల్లిగూడెం: బాలకృష్ణ చిరంజీవిని వాడు వీడు అని మాట్లాడటం ఎంత కొవ్వెక్కిన భాష.. ఈ విషయంలో బాలకృష్ణ చిరంజీవికి అసెంబ్లీ సాక్షిగా బేషరతుగా క్షమాపణ చెప్పాలి.. అంటూ జనసేన అధికార ప్రతినిధి సజ్జా సుబ్బు డిమాండ్ చేశారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో బాలకృష్ణ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ప్రజలంతా చూస్తున్న రికార్డెడ్ ప్రోగ్రాంలో బాలకృష్ణ ఇలా మాట్లాడటం సరికాదన్నారు. బాలకృష్ణ అసలు చిరంజీవి గురించి ప్రస్తావించకూడదన్నారు. కొవ్వెక్కిన భాషను బాలకృష్ణ వాడారన్నారు. జనసేన పార్టీ కూటమిలో ఉన్నందున చిరంజీవి వేరు, పవన్ వేరని బాలకృష్ణ అనుకుంటున్నట్టున్నారని చెప్పారు. చిరంజీవి గురించి బాలకృష్ణ అవాకులు, చవాకులు పేలితే ఆయన అసలు అసెంబ్లీకి రాకపోదురేమో అనిపిస్తోందన్నారు. ఈ విషయంలో జనసేన చాలా సీరియస్గా ఉందన్నారు. బాలకృష్ణ అసెంబ్లీ సాక్షిగా చిరంజీవిపై చేసిన వ్యాఖ్యల విషయంలో క్షమాపణ చెప్పాల్సిందేనని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను: ఎమ్మెల్యే బొలిశెట్టితాడేపల్లిగూడెం: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయనని ప్రభుత్వ విప్, పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఒక వెబ్ చానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. రాజకీయాల్లో అలసిపోయానని, వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని తెలిపారు. వ్యవసాయం చేసుకుంటానన్నారు. జనసేనలో అంతర్గత ప్రజాస్వామ్యం లేదన్నారు. ప్రజా సేవ చేయాలనే ఆకాంక్ష ఉన్నవారికి మద్దతు ఇస్తానని చెప్పారు. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆకివీడు: ఖరీఫ్ పంట సాగుకు మళ్లీ ముంపు బెడద తప్పడంలేదు. ఇటీవల కురిసిన వర్షానికి పలు గ్రామాల్లోని పల్లపు ప్రాంతాల్లోని పంట నీట మునిగింది. కొల్లేరు తీరంలోనూ, ఉప్పుటేరు, వెంకయ్య వయ్యేరు పంట కాల్వకు చేర్చి, చినకాపవరం డ్రెయిన్ ప్రాంత ఆయుకట్టు ముంపునకు గురవుతోంది. మండలంలో అధికారిక లెక్కల ప్రకారం 250 ఎకరాల్లో పంట పూర్తిగా నీట మునిగి పనికిరాకుండా పోయింది. ఇప్పటికే ఉప్పుటేరు గుండా ముంపు నీరు భారీగా సముద్రంలోకి చొచ్చుకుపోతోంది. ఉప్పుటేరులో రైల్వే ఖానాల వద్ద, బైపాస్ వంతెన నిర్మాణం వద్ద మేటలు వేయడంతో నీటి ప్రవాహానికి కొంత ఇబ్బంది కరంగా ఉంది. ముంపు తీవ్రత అధికంగా ఉంటే మండలంలోని పలు గ్రామాల్లో వరి పంట నీట మునిగే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన చెందుతున్నారు. ద్వారకాతిరుమల: చినవెంకన్న దర్శనంతో భక్తజన మది పులకించింది. శ్రీవారికి ప్రీతికరమైన రోజు కావడంతో శనివారం వేలాది మంది భక్తులు ఆలయానికి తరలివచ్చారు. అలాగే దసరా ఉత్సవాల సందర్భంగా విజయవాడ కనక దుర్గమ్మను దర్శిస్తున్న వివిధ ప్రాంతాలకు చెందిన భవానీ దీక్షాదారులు, తిరుగు ప్రయాణంలో పెద్ద ఎత్తున ఈ క్షేత్రానికి విచ్చేశారు. దాంతో కొండపైన, ఆలయ పరిసరాలు కళకళలాడాయి. స్వామి దర్శనం తరువాత ఉచిత ప్రసాదాన్ని స్వీకరించిన భక్తులు, ఆలయ తూర్పు రాజగోపుర ప్రాంతంలోకి చేరుకుని సెల్ఫీలు, ఫొటోలు దిగి సందడి చేశారు. అనివేటి మండపంలో పలు భజన మండలి సభ్యులు ప్రదర్శించిన కోలాట నత్యాలు చూపరులను అలరించాయి. సాయంత్రం వరకు క్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగింది. -
బాలకృష్ణది పశు ప్రవృత్తి
మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ తాడేపల్లిగూడెం: హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణది పశు ప్రవృత్తి అని మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ విమర్శించారు. తాడేపల్లిగూడెంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రజాదరణ పొంది, అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించిన మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి గురించి బాలకృష్ణ అసెంబ్లీలో సంస్కారహీనంగా, సభ్యత లేకుండా మాట్లాడటం సరికాదని కొట్టు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయం చూశాక ఆయన తండ్రి సంస్కారం బాలకృష్ణలో ఏ కోణంలో కూడా లేదనిపించిందని ఘాటుగా విమర్శించారు. సినీ నటుడు చిరంజీవి అందరూ గౌరవించే సినీ పెద్ద అని, ఆయన ఉన్నతిని బాలకృష్ణ స్వీకరించలేడని విమర్శించారు. బాలకృష్ణ అనుచిత వ్యాఖ్యలు చేస్తుండగా సభాస్థానంలో ఉన్న వ్యక్తి నవ్వడం చూస్తుంటే సభాస్థానాన్ని కించపర్చడమేనని మండిపడ్డారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇలా జరగదన్నారు. బాలకృష్ణ ప్రవర్తన, మాట తీరు చూస్తుంటే అసెంబ్లీకి వచ్చే సభ్యులకు బ్రీత్ ఎనలైజర్ పరీక్షలు చేసి లోపలికి అనుమతించాల్సించిన పరిస్థితి ఉందేమో అని సందేహం వ్యక్తం చేశారు. అలాగే ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ వయసుకు తగ్గట్టుగా మాట్లాడాలని కొట్టు హితవు పలికారు. బాలకృష్ణ ఒక సైకో బాలకృష్ణ ఒక సైకో అని కొట్టు విమర్శించారు. ఆయన ఇంట్లో ఒక సినీ నిర్మాతను తుపాకీతో కాల్చి చంపారని, దానికి గత కారణం అందరికీ తెలుసని కొట్టు అన్నారు. ఆనాడు బాలకృష్ణ ఎర్రగడ్డ ఆస్పత్రి నుంచి మెంటల్ సర్టిఫికెట్ తెచ్చుకున్న సంగతి తెలిసిందేనని గుర్తుచేశారు. గతంలో ఇలానే మహిళలను కించపరిచేలా బాలకృష్ణ మాట్లాడారన్నారు. చిరంజీవి పట్ల జగన్ ఎంత అభిమానంగా, ఆప్యాయంగా ఉన్నారో.. సినీ పరిశ్రమ సమస్యలను చిరంజీవి బృందంతో పరిష్కరించే విషయంలో జగన్ ఎంత హుందాగా ప్రవర్తించారో అందరికీ తెలిసిందేనని చెప్పారు. తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఎంత హుందాగా ప్రవర్తించారో, అదే ఒరవడితో జగన్ పాలనను అందించారని కొట్టు అన్నారు. -
తణుకులో భారీ చోరీ
వృద్ధురాలిని భయపెట్టి 70 కాసుల బంగారు ఆభరణాల అపహరణ తణుకు అర్బన్: ఒంటరిగా నివసిస్తున్న వృద్ధురాలి ఇంట్లోకి చొరబడి బంగారు ఆభరణాలు దోచుకున్న ఘటన తణుకులో సంచలనం రేకెత్తించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... తణుకు లయన్స్ క్లబ్ ప్రాంతంలోని వారణాసి వారి వీధిలో నివసిస్తున్న వాకలపూడి కనకదుర్గ ఇంట్లోకి శుక్రవారం రాత్రి సుమారు 2 గంటల సమయంలో ప్రవేశించిన దొంగలు సుమారుగా 70 కాసుల బంగారు ఆభరణాలు, రూ.70 వేలు నగదు దోచుకున్నారు. నోరెత్తితే చంపేస్తామని బెదిరించిన దొంగలను చూసి హడలెత్తిపోయిన వృద్ధురాలు వారికి సహకరించాల్సిన దుస్థితి నెలకొంది. వృద్ధురాలి భర్త మాజీ కౌన్సిలర్ వాకలపూడి వీరరాఘవులు గతంలోనే మృతిచెందగా కుమారులు ఇతర దేశాల్లో ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఇంట్లో ఎవరూ లేరనే పక్కా సమాచారంతో ఇంట్లోకి ప్రవేశించిన దొంగలు వృద్ధురాలిని భయబ్రాంతులకు గురిచేసి అందినకాడికి దోచుకుపోయారు. ఇంటి వెనుక భాగం నుంచి లోపలకు దొంగలు వచ్చారని, చోరీలో నలుగురు దుండగులు ఉన్నట్లుగా బాధితవర్గాలు చెబుతున్నారు. తెల్లవారుజామున పోలీసులకు బాధితురాలు సమాచారం ఇవ్వడంతో తాడేపల్లిగూడెం డీఎస్పీ డి.విశ్వనాథ్ హుటాహుటిన వచ్చి ఘటనా ప్రాంతాన్ని పరిశీలించారు. తణుకు పట్టణ సీఐ ఎన్.కొండయ్యకు కేసు దర్యాప్తుపై పలు సూచనలు చేశారు. -
ఆక్వా వర్సిటీపై నిర్లక్ష్యం
తణుకులో భారీ చోరీ ఒంటరిగా నివసిస్తున్న వృద్ధురాలి ఇంట్లోకి చొరబడి బంగారు ఆభరణాలు దోచుకున్న ఘటన తణుకులో సంచలనం రేకెత్తించింది. IIలో uనరసాపురం రూరల్: గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో తలపెట్టిన ఆక్వా యూనివర్సిటీ నిర్మా ణ పనులను పూర్తిచేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి జేఎన్వీ గోపాలన్ కోరారు. శనివారం పార్టీ ప్రతినిధుల బృందం యూనివర్సిటీ నిర్మాణాలను పరిశీలించింది. గోపాలన్ మాట్లాడుతూ ఆక్వా అభివృద్ధికి తోడ్పడే వర్సిటీ నిర్మాణంపై కూటమి ప్రభు త్వం నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తోందని విమర్శించారు. పనులు ప్రారంభించి మూడేళ్లు దాటినా పు నాది దశ కూడా పూర్తికాకపోవడం సిగ్గుచేటన్నారు. దీంతో మత్స్య కళాశాల విద్యార్థులు రెండేళ్లుగా తుపాను రక్షిత భవనంలో ఇరుకు గదుల్లో అవస్థలు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వర్సిటీపై ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. జిల్లా కార్యదర్శి వర్గ స భ్యుడు కవురు పెద్దిరాజు, పట్టణ కార్యదర్శి ము చ్చర్ల త్రిమూర్తులు తదితరులు పాల్గొన్నారు. -
పీహెచ్సీ వైద్యుల సమ్మెబాట
ఆదివారం శ్రీ 28 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025సాక్షి, భీమవరం: జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్సీ) వైద్యులు సమ్మె సైరన్ మోగిస్తున్నారు. డిమాండ్ల సాధన కోసం సోమవారం నుంచి పోరుబాటకు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు ఏపీ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ డాక్టర్స్ అసోసియేషన్ (ఏపీపీహెచ్సీడీఏ) నాయకులు వారం క్రితమే ఉన్నతాధికారులకు నోటీసు అందజేశారు. ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో తదుపరి కార్యాచరణ అమలు చేసే యోచనలో నిమగ్నమయ్యారు. 52 పీహెచ్సీలు.. 80 మంది వైద్యులు జిల్లాలో అర్బన్ పీహెచ్సీలు 18, రూరల్ పీహెచ్సీలు 34 ఉన్నాయి. వీటి పరిధిలో దాదాపు 80 మంది వైద్యులు సేవలందిస్తున్నారు. పీహెచ్సీ వైద్యులు పీజీ కోర్సులు చేసేందుకు గతంలో క్లినికల్కు 30 శాతం, ఫిజియాలజీ, ఎనాటమీ, ఫార్మసీ, ఫోరెన్సిక్ మెడిసిన్, కమ్యూనిటీ మెడిసిన్ తదితర నాన్ క్లినికల్కు 50 శాతం సీట్లు ఉండేవి. కూటమి ప్రభుత్వం గతేడాది క్లినికల్కు 15 శాతానికి, నాన్ క్లినికల్ 30 శాతానికి తగ్గించింది. అప్పట్లో వైద్యులు ఆందోళనకు దిగడంతో క్లినికల్ 20 శాతానికి పెంచారు. తాజాగా మళ్లీ 15 శాతానికి తగ్గించేసినట్టుగా ఏపీపీహెచ్సీడీఏ చెబుతోంది. సీహెచ్సీల్లో పనిచేస్తే మూడు, నాలుగేళ్లకే డిప్యూటీ సివిల్ సర్జన్స్గా ప్రమోషన్స్ ఇస్తుంటే 20 ఏళ్లుగా పీహెచ్సీల్లో సివిల్ అసిస్టెంట్ సర్జన్స్ పదోన్నతలు రాక సీనియర్ మెడికల్ ఆఫీసర్స్గానే మిగిలిపోతున్నారని ఆవేదన చెందుతున్నారు. 3 నుంచి దీక్షలు : సమస్యల పరిష్కారం కోసం ఏపీపీహెచ్సీడీఏ ఆధ్వర్యంలో ఈనెల 19న పీహెచ్సీ వైద్యులు నోటీసులు అందజేశారు. దశలవారీగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నారు. అందులో భాగంగా దశలవారీగా సేవలను నిలుపుదల చేస్తున్నారు. సోమవారం నుంచి అత్యవసర సేవలు మినహా ఓపీని బహిష్కరించనున్నట్టు అసోసియేషన్ నేతలు చెబుతున్నారు. అక్టోబర్ 3 నుంచి అమరావతిలో నిరాహార దీక్షలు నిర్వహించనున్నట్టు తెలిపారు. ఆందోళనలో ప్రజలు ప్రతికూల వాతావరణ పరిస్థితులతో విషజ్వరాలు విజృంభిస్తున్న తరుణంలో పీహెచ్సీ వైద్యుల పోరుబాట సామాన్య ప్రజానీకాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు, అపారిశుద్ధ్య వాతావరణంతో టైఫాయిడ్, విషజ్వరాలు ప్రబలుతున్నాయి. ఏ ఆస్పత్రిలో చూసినా జ్వరాలతో బాధపడుతున్న వారు కనిపిస్తున్నారు. రోజూవారి వచ్చే కేసుల్లో జ్వరపీడితులు ఎక్కువగా ఉంటున్నట్టు వైద్య సిబ్బంది చెబుతున్నారు. ఈ తరుణంలో పీహెచ్సీ వైద్యులు ఓపీ బహిష్కరిస్తే పేదవర్గాల వారు వైద్యం కోసం తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందంటున్నారు. ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయించి ఆర్థిక ఇబ్బందులు పడాల్సి వస్తుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. సర్వీస్లోని పీహెచ్సీ వైద్యులకు పీజీ కోటాలో సీట్లను పునరుద్ధరించాలి. టైం బాండ్ ప్రమోషన్స్ కల్పించాలి. గిరిజన ప్రాంతాల్లో పనిచేసేవారికి బేసిక్పై 50 శాతం అలవెన్స్ ఇవ్వాలి. చంద్రన్న సంచార చికిత్స కార్యక్రమానికి రూ.5 వేలు అలవెన్స్ ఇవ్వాలి. కౌన్సెలింగ్ విషయంలో అర్బన్ అండ్ నేటివిటీపై ఆరేళ్ల గడువుని ఐదేళ్లకు కుదించాలి, నేటివిటీపై స్పష్టత ఇవ్వాలి. సర్వీస్ వైద్యుల పీజీ కోటా తగ్గింపు ఇంక్రిమెంట్లలోనూ మొండిచేయి డిమాండ్ల సాధనకు సోమవారం నుంచి సమ్మెలోకి.. అత్యవసర కేసులు మినహా ఓపీ విధుల బహిష్కరణకు నిర్ణయం జిల్లాలో 54 పీహెచ్సీల్లో 80 మంది వైద్యులు పీహెచ్సీ వైద్యులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాం. ఇప్పటికే దశలవారీగా ఆందోళన ప్రారంభించాం. ప్రభుత్వం స్పందించకుంటే ఏపీపీహెచ్సీడీఏ పిలుపుమేరకు సోమవారం అత్యవసర సేవలు మినహా ఓపీ విధులను బహి ష్కరిస్తాం. అక్టోబరు 3న విజయవాడలో ని రాహార దీక్షలు చేపడతాం. –డా.సీహెచ్ వెంకటరంగం నాయుడు, ఏపీపీహెచ్సీడీఏ జిల్లా అధ్యక్షుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన సర్వేలు, పల్స్ పోలియో, వరదలు, విపత్తుల సమయంలో క్షేత్రస్థాయిలో సేవలందిస్తున్న సివిల్ అసిస్టెంట్ సర్జన్లకు పదోన్నతలు రావడం లేదని, జాయిన్ అయినప్పుడు ఉన్న కేడర్లోనే రిటైర్ అవుతున్న పరిస్థితి ఉంటుందని వైద్యులు అంటున్నారు. గిరిజన ప్రాంతాల్లో కనీస వసతులు లేకుండా పనిచేస్తున్న పీహెచ్సీ వైద్యులు ఎంతోమంది ఉన్నారని, అద్దెకు ఇళ్లు కూడా దొరకని పరిస్థితుల్లో సేవలందిస్తున్న వారికి అలవెన్స్ కూడా ఇవ్వడం లేదంటున్నారు. అప్పటికప్పుడు రిపోర్టులు కోరడం, వైద్య విభాగానికి సంబంధం లేని వారి అజమాయిషీ ఇలా ఎన్నో విషయాల్లో పీహెచ్సీ వైద్యులను ఇబ్బందులు పాల్జేస్తున్నారని ఏపీపీహెచ్సీడీఏ నేతలు చెబుతున్నారు. -
ఆర్జీయూకేటీ ఎంఓయూలు
నూజివీడు: ఆర్జీయూకేటీ అధికారులు నూజివీడు ట్రిపుల్ఐటీలో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో పలు సంస్థలతో రెండు అవగాహన ఒప్పందాలను కుదుర్చుకున్నారు. ఫిజిక్స్ వాలా లిమిటెడ్తో ఒప్పందం మేరకు నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ఐటీల విద్యార్థులకు 14 కోర్సులను ఉచితంగా అందుబాటులోకి తీసుకువస్తారు. వీటిలో వీటిలో గేట్, క్యాట్లతో పాటు ప్రొ ఫెషనల్ సర్టిఫికేషన్ ప్రోగ్రాంలు, సెమినార్లు, వెబి నార్లు, మాక్ పరీక్షలు, మెంటార్ షిప్ ఉంటాయి. అలాగే కౌన్సిల్ ఫర్ స్కిల్ అండ్ కాంపెటెన్సీస్తో ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. దీని ద్వారా పారిశ్రామిక అనుభవం, ఇంటర్న్షిప్లు, నిపుణుల ఉపన్యాసాలు, వ్యాపార శిక్షణ, వర్చువల్ లెర్నింగ్ అవకాశాల ద్వారా విద్యార్థుల శిక్షణను మెరుగుపరుస్తా రు. రిజిస్ట్రార్ ఆచార్య సండ్ర అమరేంద్రకుమార్, సీఏఓ బండి ప్రసాద్, సెంట్రల్ డీన్ దువ్వూరు శ్రావణి తదితరులు పాల్గొన్నారు. -
నిందితులు పాత నేరస్తులేనా?
చోరీకి గురైన నివాసంలో దొరికిన ఆనవాళ్లతోపాటు సమీపంలోని సీసీ కెమేరాల పుటేజీల ప్రకారం నిందితులను పోలీసు అధికారులు గుర్తించినట్లుగా తెలుస్తోంది. భీమవరం జిల్లా పోలీసు కార్యాలయం నుంచి నిందితుడి ఫొటోతోపాటు వారి వివరాలు విడుదల చేశారు. పాత నేరస్తుడైన ఉత్తరప్రదేశ్కు చెందిన నాగేంద్ర సహాని, మహారాష్ట్రకు చెందిన సందీప్ మీరా రామ్ నేరానికి పాల్పడ్డారని, వీరు తెలుపు రంగు కారులో వచ్చి చోరీ సొత్తుతో అదే కారులో ఉడాయించారని వివరించారు. సదరు దొంగలకు సంబంధించిన వివరాలు తెలిస్తే సమాచారం ఇవ్వాల్సిందిగా పోలీసులు కోరుతున్నారు. సీఐ కొండయ్య కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు విడుదల చేసిన నిందితుడి ఫొటో -
కుల బహిష్కరణపై ఫిర్యాదు
పాలకోడేరు: మండలంలోని పెన్నాడ అగ్రహారంలో తమ మాట వినడం లేదని కుల పెద్దలు సుమారు 28 మందిని కులం నుంచి వెలి వేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పాలకోడేరు పోలీసులకు అందిన సమాచారం మేరకు గ్రామంలోని శెట్టిబలిజ పెద్దలు దొమ్మేటి వేణుగోపాలం, పంపన వెంకటేశ్వరరావు, పాల శేషు, గుత్తుల కొండలరావు, జక్కంశెట్టి బాలమురళీకృష్ణ, చింతపల్లి రామకృష్ణ తమ మాట వినడం లేదంటూ మూడేళ్ల క్రితం కొంత మందిని, ఏడాది క్రితం కొంత మందిని, ఏడు నెలల క్రితం మరో కొంత మందిని మొత్తం 28 మందిని కులం నుంచి వెలి వేశారు. ప్రేమ పెళ్లి విషయంలోనూ, స్థలం అమ్మకం విషయంలోనూ, డ్రెయినేజీ నిర్మాణ విషయంలోనూ ఇలా మమ్మల్ని బహిష్కరించినట్లు దొంగ నాగలక్ష్మి, దొమ్మేటి వెంకటేశ్వరరావు, పి సురేష్, గుత్తుల నాగరాజు, జక్కం శెట్టి సత్య నాగరాజు, సిహెచ్ సుబ్రమణ్యం, చింతపల్లి శివప్రసాద్, గుత్తుల శ్రీనివాస్, చీరబోయిన శ్రీనివాసరావు, బొక్కా రమేష్, పంపన రవి మొత్తం 28 మందిని బహిష్కరించారు. అప్పటి నుంచి శుభకార్యాలకు పిలవడం లేదు. అంతేగాక ఇళ్లకు వచ్చిన చుట్టాలను కూడా అవమానిస్తున్నారంటూ బాధితులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు శుక్రవారం భీమవరం రూరల్ సీఐ బి.శ్రీనివాస్, పాలకోడేరు ఎస్సై రవి వర్మ, పంచాయతీ కార్యదర్శి కె.వెంకటరాజు, ఆర్ఐ రాఘవ రాజు, వీఆర్వో సుబ్రహ్మణ్యం తదితరులు స్థానిక పంచాయతీ కార్యాలయంలో బాధితులను విచారించారు. కాగా నిందితులు తాము గ్రామాంతరం వెళ్లామని చెప్పడంతో విచారణ రేపటికి వాయిదా వేశారు. -
అథ్లెటిక్స్ పోటీల్లో కాంస్య పతకం
ఏలూరు రూరల్: అథ్లెటిక్స్ పోటీల్లో ఏలూరు బాలిక ప్రతిభ చాటిందని జిల్లా క్రీడాభివృద్ధి అధికారి బి.శ్రీనివాసరావు శుక్రవారం ఓ ప్రకటన లో తెలిపారు. ఈ నెల 23 నుంచి 25 వరకు గుంటూరు నాగార్జున యూనివర్సిటీలో సౌత్ జోన్ జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీలు నిర్వహించారని పేర్కొన్నారు. ఈ పోటీల్లో 18 ఏళ్ల వయసు విభాగంలో పాల్గొన్న జిల్లా అథ్లెట్ వి.రంజని మిడిల్ రిలే రన్నింగ్ పోటీల్లో కాంస్య పతకం సాధించిందని వివరించారు. శాప్కోచ్ గంట కృష్ణకుమారి వద్ద శిక్షణ పొందిన రంజని అందరిలో స్ఫూర్తి నింపిందని ఆమెను అభినందించారు. ఆగిరిపల్లి : అదుపుతప్పి కుంపిని వాగులోకి ఓ లారీ దూసుకెళ్లిన ఘటన శోభనాపురం వద్ద చోటుచేసుకుంది. శుక్రవారం ఉదయం కొండపల్లి నుంచి కంకర లోడుతో వస్తున్న లారీ శోభనాపురం కుంపిని వాగు వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి కుంపిని వాగులోకి దూసుకుపోయింది. కుంపిని వాగు ఉధృతంగా ప్రవహిస్తూ ఉండడంతో లారీని బయటికి తీయడం సాధ్యపడడం లేదు. ఈ ఘటనలో లారీ డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఏలూరు (ఆర్ఆర్పేట): సామాజిక న్యాయానికి వైఎస్సార్ సీపీ కట్టుబడి ఉందని నేషనల్ దళిత జేఏసీ చైర్మన్ పెరికే వరప్రసాద్ పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 2010లో కడప ఎంపీగా ఉన్నప్పుడే ఏబీసీడీ వర్గీకరణకు మద్దతు తెలియజేశారని గుర్తు చేశారు. సామాజిక న్యాయానికి పెద్దపీట వేశారని, రిజర్వేషన్ ఫలాలు ఎస్సీల్లో ఉన్న 59 ఉప కులాలకు చివర కులాల వరకు రిజర్వేషన్ ఫలాలు అందాలన్న సదుద్దేశంతోనే శాసనసభ మండలిలో ఆమోదించిన మండలి ఛైర్మన్ కొయ్యే మోషేన్ రాజు, మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణలకు కృతజ్ఞతలు తెలిపారు. గతంలో వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వంలో మంత్రి మండలిలో కూడా సామాజిక న్యాయం చేశారని కొనియాడారు. ముదినేపల్లి రూరల్: భూమిలో వాటా పంచి ఇవ్వమని దౌర్జన్యానికి వచ్చి వ్యక్తిని గాయపరిచిన సంఘటన మండలంలోని పేరూరులో శుక్రవారం చోటు చేసుకుంది. వివరాల ప్రకారం గ్రామానికి చెందిన పుట్టి వీరనారాయణ కలిదిండి మండలం కొండూరుకు చెందిన తోలేటి చుక్కమ్మ సోదరి అవుతుంది. వీరనారాయణకు పేరూరులో కొంత భూమి ఉంది. దీనిలో కొంత భూమిని చుక్కమ్మకు ఇవ్వాలంటూ తోలేటీ శ్రీనివాసరావు, సాయి, రేష్మా, పెంటయ్య, బి.మాసయ్య, టి సుబ్బారావు వీరనారాయణ ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి గాయపరిచినట్లు ఫీర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదు మేరకు హెడ్కానిస్టేబుల్ ఎస్వీ రామారావు కేసు నమోదు చేశారు. ముదినేపల్లి రూరల్: మహిళను లైంగికంగా వేధిస్తున్నట్లు వచ్చిన ఫిర్యాదుపై స్థానిక పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు. వివరాల ప్రకారం మండలంలోని చేవూరుకి చెందిన మహిళను అదే గ్రామానికి చెందిన రాకేష్ కొంతకాలంగా తన కోర్కెను తీర్చమని వేధింపులకు గురిచేస్తున్నాడు. ఈ విషయాన్ని మహిళ తన భర్తతో పాటు అత్తమామలతో చెప్పగా వీరంతా కలిసి రాకేష్ ఇంటికి వెళ్లగా రాకేష్తో పాటు అక్కడే ఉన్న బి.పృథ్వీరాజ్ మహిళతో పాటు భర్త, అత్తమామలపై దాడి చేశారు. అనంతరం బాధిత మహిళ పోలీసులను ఆశ్రయించింది. -
శ్రీవారి బ్రహ్మోత్సవాలకు చురుగ్గా ఏర్పాట్లు
ద్వారకాతిరుమల: శ్రీవారి ఆశ్వయుజమాస దివ్య బ్రహ్మోత్సవాలకు క్షేత్రంలో ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. వచ్చే నెల 2 నుంచి 9 వరకు జరగనున్న ఈ ఉత్సవాలను పురస్కరించుకుని ఇప్పటికే ఆలయంలో ధ్వజస్తంభం వద్ద చలువ పందిరిని నిర్మించారు. శుక్రవారం గుడి సెంటర్లో 40 అడుగుల స్వామివారి భారీ విద్యుత్ కటౌట్ నిర్మాణ పనులను ప్రారంభించారు. అలాగే ఆలయ రాజగోపురాలకు, ఆళ్వార్ల మండపాలకు, పరిసర ప్రాంతాలను విద్యుత్ దీపాలతో అలంకరిస్తున్నారు. అలాగే క్షేత్రంలో పలు చోట్ల రంగులు వేసే పనులు చురుగ్గా సాగుతున్నాయి. -
పండగల వేళ.. పసిడి పరుగు
నరసాపురం: బంగారం ధరలు ప్రతిరోజూ ఆల్టైం హై నమోదు చేసుకుంటూ దూసుకుపోతున్నాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర ఏకంగా రూ.11 వేలు దాటింది. 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర కూడా రూ.10 వేలు దాటేసింది. ప్రస్తుతం అంతర్జాతీయంగా బులియన్ మార్కెట్లో నెలకొన్న పరిస్థితులు, మరోవైపు షేర్ మార్కెట్ ఒడిదుడుకులు, ఇంకో వైపు ట్రంప్ సుంకాల బాదుడు, రూపాయిలో డాలర్ మారకం విలువ రూ.100కు చేరువుగా ఉండడం వంటి కారణాల నేపథ్యంలో ఇప్పట్లో ధరలు పెరగడమే కానీ, తగ్గేది ఉండదనేది బులియన్ ట్రేడ్ వర్గాల అంచనా వేస్తున్నారు. అందనంత ఎత్తుకు చేరుకున్న బంగారం ధరల ఎఫెక్ట్ అమ్మకాలపై పడింది. పెళ్లిళ్లు వంటి సామాజిక అవసరాల కోసం బంగారం కొనుగోలు చేయాలనుకునే మధ్య తరగతి వారు బంగారం ధరలు చూసి కనీసం గోల్డ్ షాపుల మెట్లెక్కాలన్నా భయపడే పరిస్థితి నెలకొంది. శుక్రవారం నరసాపురం బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.1,16,910 వద్ద ట్రేడయ్యింది. 22 క్యారెట్ల 916 కేడీఎం బంఽగారం ధర రూ. 1,05,500కు చేరింది. అంటే కాసు ఆభరణాల బంగారం ధర రూ.84,400. కాసు బంగారు వస్తువులు చేయించుకోవాంటే తరుగు, మజూరులను కలుపుకుంటే రూ 90 వేల కంటే పెట్టాలి. పండగల విక్రయాలపై ప్రభావం దసరా, దీపావళి పండగల రోజుల్లో బంగారం విక్రయాలు జోరుగా సాగుతాయి. ఇక క్రిస్మస్, సంక్రాంతి పండగలు కూడా సమీపానే ఉన్నాయి. మరోవైపు పెళ్లిళ్ల సీజన్ కూడా మొదలైంది. అయితే బంగారం ధరల పెరుగుదల బంగారం అమ్మకాలపై తీవ్ర ప్రభావం చూపింది. వరుస పండగలు, పెళ్లిళ్ల సీజన్లో కళకళలాడాల్సిన జ్యూయలరీ షాపులు ఉమ్మడి పశ్చిమలో వెలవెలబోతున్నాయి. గోదావరి జిల్లాలోనే అతిపెద్ద బులియన్ మార్కెట్గా పేరున్న ఒక్క నరసాపురం మార్కెట్లోనే హోల్సేల్, రిటైల్ కలిపి రోజుకు రూ.4 కోట్లు వరకూ బంగారం అమ్మకాలు జరుగుతాయి. ఉమ్మడి పశ్చిమలోని ఏలూరు, తుణుకు, తాడేపల్లిగూడెం, భీమవరం పట్టణాల్లో పెద్దెత్తున అమ్మకాలు సాగుతాయి. పెరిగిన ధరలతో ఉమ్మడి పశ్చిమలో రోజుకు రూ.2 కోట్లుపైనే అమ్మకాలు తగ్గినట్టుగా అంచనా. దాదాపు 40 శాతం అమ్మకాలు తగ్గిపోయాయయని బులియన్ వర్తకులు చెబుతున్నారు. నరసాపురంలో ఓ జ్యూయలరీ షాపు గోల్డ్ వస్తువులు బంగారం ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉంది. చాలా నెలలుగా ధరలు పెరగడమే కానీ, తగ్గడం కనిపించలేదు. మధ్యలో ఒకరోజు స్వల్పంగా తగ్గినా, మర్నాడు మళ్లీ రెట్టింపు పెరుగుండడంతో బంగారం ధరలను అంచనా వేయలేకపోతున్నాం. ప్రస్తుతం అమ్మకాలు దాదాపు 40 శాతం తగ్గాయి. లిక్విడ్ క్యాష్తో ఎవరూ బంగారం కొనుగోళ్లు చేయడంలేదు. పాత బంగారం మార్చుకుని కొత్త వస్తువులు ఆర్డర్లు ఇస్తున్నారు. ప్రస్తుతం ఇదే వ్యాపారం ఎక్కువగా సాగుతోంది. – వినోద్కుమార్జైన్, నరసాపురం బులియన్ మర్చంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ధరలు దారుణంగా పెరగడంతో ఆభరణాల అమ్మకాలు పడిపోయాయి. పెళ్లిళ్లు వంటి సామాజిక అవసరాలకు బంగారం కొనేవారు కూడా వాయిదాలు వేసుకుంటున్నారు. పెట్టుబడిగా కొనే బిస్కెట్ అమ్మకాలు మాత్రం కాస్త బాగానే సాగుతున్నాయని చెబుతున్నారు. ఇక పాత బంగారం మార్పిడి జోష్ అన్ని పట్టణాల్లో కొనసాగుతోంది. ధరలు హైలో ఉండటంతో పాతబంగారం మార్పిడికి ఇదే అనుకూల సమయంగా కొనుగోలుదారులు భావిస్తున్నారు. ప్రస్తుతం జరుగుత్ను అమ్మకాల్లో 50 శాతం వాటా పాత బంగారం మార్పిడితోనే జరుగుతుందని చెబుతున్నారు. 10 గ్రాముల బంగారం ధర రూ.లక్ష ఎప్పుడో దాటేసింది. సాధారణంగా వాడుకభాషలో జనం మాట్లాడుకుంటే 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర గురించి మాట్లాడుకుంటారు. కాసు బంగారం... ఇవాళ రేటెంతుందని అడుగుతారు. ప్రస్తుతం 22 క్యారెట్ల ఆభరణాల బంగారం కాసు(8గ్రాములు) ధర రూ.84,400గా ఉంది. మరికొన్ని రోజుల్లోనే కాసు ధర కాస్త రూ.లక్ష మార్కును చేరుతుందని భావిస్తున్నారు. అప్పుడు తరుగు, మజూరులతో కాసు బంగారు వస్తువు కొనాలంటే లక్షపైనే చూసుకోవాలి. రూ.11 వేలు దాటిన గ్రాము ధర వెండిదీ.. అదే జోరు తగ్గిన అమ్మకాలు ఉమ్మడి పశ్చిమలో రోజుకు రూ.2 కోట్లకుపైనే అమ్మకాలు డౌన్ అన్ని పట్టణాల్లో పాత బంగారం మార్పిడి జోష్ -
లక్కవరం చోరీ కేసు ఛేదన
● నలుగురు నిందితుల అరెస్ట్, ఒకరు పరారీ ● 246 గ్రాముల బంగారు వస్తువులు స్వాధీనం ఏలూరు టౌన్: ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం గ్రామంలో ఇంటి తలుపులు పగులగొట్టి బెడ్రూమ్లో నిద్రిస్తోన్న భార్యభర్తను కొట్టి బీరువాలోని సుమారు 40కాసుల బంగారు ఆభరణాలు, 2కిలోల వెండిని దోచుకుపోయారు. ఈ చోరీ కేసును పోలీసులు వేగంగా ఛేదించారు. నిందితులను అరెస్ట్ చేసిన, పోలీసులు చోరీ సోత్తును స్వాదీనం చేసుకున్నారు. ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఏలూరు జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ శుక్రవారం కేసు వివరాలను వెల్లడించారు. లక్కవరంలోని రామాలయం వీధిలో ప్రాంతానికి చెందిన వందనపు లక్ష్మీకుమారి తన భర్తతో కలిసి జీవిస్తోంది. ఈ నెల 23 తెల్లవారుజామున సుమారు 2 గంటల సమయంలో ముగ్గురు వ్యక్తులు గది తలుపులు పగులగొట్టి బెడ్రూమ్లోకి ప్రవేశించి, భర్తను నోరుమూసివేసి, కర్రలతో కొట్టి బీరువాలోని సుమారు 40కాసుల బంగారు ఆభరణాలు, 2 కిలోల వెండి వస్తువులు దోచుకువెళ్లారు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో ప్రత్యేక బృందాలతో దర్యాప్తు ప్రారంభించారు. పాత నేరస్తుడే సూత్రదారి ఈ దర్యాప్తులో పాతనేరస్తుడి నిర్వాకం వెలుగులోకి వచ్చింది. లక్కవరం గ్రామానికి చెందిన దేవర శ్రీరామ్మూర్తి అనే వ్యక్తిపై కేడీ షీట్ ఉంది. పాతనేరస్తుడు కాగా వయసు రీత్యా తాను చోరీలకు పాల్పడకుండా తనకు తెలిసిన నేరగాళ్లతో చోరీలు చేయిస్తున్నాడు. బాపట్ల జిల్లా స్టువర్టుపురానికి చెందిన దొంగలను తీసుకువచ్చి చోరీలు చేయిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. బాధితురాలు లక్ష్మీకుమారి ఇంటి పక్కనే నివాసం ఉంటోన్న బాజీ అనే వ్యక్తి ఆమె ఇంట్లో డబ్బు, బంగారం భారీగా ఉందని శ్రీరామ్మూర్తికి సమాచారం ఇచ్చాడు. దీంతో శ్రీరామ్మూర్తి బాపట్ల స్టువర్టుపురం నుంచి అంగడి విల్సన్బాబు, గజ్జెల వాసు, కావేటి ప్రసాద్ అలియాస్ రమేష్ అలియాస్ చిన్న అనే ముగ్గురు దొంగలను లక్కవరం గ్రామానికి పిలిపించి చోరీ చేయించాడు. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేయగా కావేటి ప్రసాద్ అనే నిందితుడు పరారీలో ఉన్నాడు. ఈ నిందితులపై నల్లజర్ల, పెరవలి స్టేషన్లలోనూ కేసులు ఉన్నాయి. పాత నేరస్తుడు శ్రీరామ్మూర్తిపై ఏకంగా 14 కేసులు ఉండగా, విల్సన్బాబుపై ఆరు కేసులు, వాసుపై ఏడు కేసులు, పరారీలో ఉన్న ప్రసాద్పై 12కేసులు ఉన్నాయని పోలీసు అధికారులు చెబుతున్నారు. నిందితుల నుంచి 246 గ్రాముల బంగారు ఆభరణాలు, ఇనుప రాడ్డు, రెండు కర్రలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ చోరీ కేసును ఛేదించటంలో జంగారెడ్డిగూడెం సీఐ సుభాష్, చింతలపూడి సీఐ క్రాంతికుమార్, ఫింగర్ప్రింట్స్ సీఐ పి.శ్రీనివాసరావు, జంగారెడ్డిగూడెం ఎస్సై ఎస్కే జబీర్, ఏఎస్సై సంపత్కుమార్తో సహా కానిస్టేబుల్స్ను జిల్లా ఎస్పీ కేపీ శివకిషోర్ ప్రత్యేకంగా అభినందించారు. -
హరిత హోటల్ ప్రైవేటీకరణ అంశంపై చర్చ
ద్వారకాతిరుమల: రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ పరిధిలోని హరిత హోటల్స్, రిసార్ట్స్ను కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేసేందుకు టెండర్ ప్రక్రియను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే శ్రీవారి దేవస్థానం గతంలో కొండపైన కోట్లాది రూపాయలు విలువైన భూమిని పర్యాటక అభివృద్ధి సంస్థకు నామమాత్రపు ధరకు విక్రయించగా, అందులో హోటల్ నిర్మించారు. దాన్ని సక్రమంగా నడపలేక గతంలో ఒకసారి ప్రైవేటీకరణ చేసేందుకు ప్రయత్నించారు. అప్పట్లో దేవస్థానం అధికారులు దాన్ని అడ్డుకున్నారు. మళ్లీ ఇప్పుడు ప్రైవేటీకరణ అంశం తెరమీదకు వచ్చింది. ఈ నేపథ్యంలో ఈనెల 19న సాక్షిలో శ్రీటెంపుల్ జాగా.. ప్రైవేట్ పరం దిశగాశ్రీ శీర్షికతో కథనం ప్రచురితమైంది. దీనిపై దేవస్థానం ఈఓ ఎన్వీఎస్ఎన్ మూర్తి, ఆలయ అనువంశిక ధర్మకర్త ఎస్వీఎన్ఎన్ నివృతరావులు స్పందించారు. ఈ క్రమంలో టూరిజానికి సంబంధించిన ఫైల్ను పరిశీలించిన ఈఓ, ఈనెల 21న శ్రీవారి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రిక ఇచ్చే సమయంలో గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజుతో ఈ అంశంపై చర్చించడంతో ఆయన ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని పేర్కొన్నారు. ఏది ఏమైనా కొండపైన భూమి ప్రైవేట్ వ్యక్తుల పరం కావడం మంచిది కాదని, అది క్షేత్ర పవిత్రతకు, భద్రతకు ముప్పని శ్రీవారి భక్తులు అంటున్నారు. -
విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం
ఉంగుటూరుః విద్యుత్ వినియోగదారుల ఫోరమ్ దృష్టికి వచ్చిన సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని విద్యుత్ వినియోగదారుల ఫోరమ్ అధ్యక్షుడు డాక్టర్ బి.సత్యనారాయణ వెల్లడించారు. శుక్రవారం నారాయణపురం సబ్స్టేషన్ వద్ద నిర్వహించిన సమావేశంలో సత్యనారాయణ మాట్లాడుతూ ఇప్పటివరకు 939 సమస్యల పరిష్కారానికి దరఖాస్తులు రాగా 746 సమస్యలను పూర్తిగా పరిష్కరించినట్లు తెలిపారు. సమావేశంలో ఎస్.రాజబాబు, ఎస్.సుబ్బారావు, ఎం. మురళీ క్రష్ణ, ఏఈ కేఎం అంబేత్కర్, డిప్యూటీ ఏఈ రాళ్ల పల్లి భీమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
యువకుడి అదృశ్యం
తణుకు అర్బన్: యువకుడు అద్యశ్యమైన ఘటన పట్టణంలో సంచలనం సృష్టిస్తుంది. వివరాల ప్రకారం తాడేపల్లిగూడేనికి చెందిన మడుగుల సురేష్ (29) ఈనెల 23న తెల్లవారుజామున తణుకు వచ్చాడని ఆ రోజు నుంచి తన సోదరుడు కనిపించడం లేదని అతని సోదరి ముచ్చె ప్రశాంతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ నెల 25న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సురేష్ గతంలో తణుకు మునిసిపాలిటీ అవుట్ సోర్సింగ్లో పారిశుద్ధ్య నిర్వహణ పనుల్లో పని చేస్తూ రాష్ట్రపతి రోడ్డులోని సాయిబాబా గుడి వెనుక ప్రాంతంలో నివాసం ఉండేవారు. అయితే ఇటీవల తాడేపల్లిగూడెంలో పెయింటింగ్ పనులు చేసుకుంటూ ఉపాధి పొందుతున్నట్లుగా తెలుస్తోంది. అదృశ్యంపై అనుమానాలు ఈ నెల 23వ తేదీన తనకు సన్నిహితంగా ఉండే స్నేహితురాలిని కలిసేందుకు తాడేపల్లిగూడెం నుంచి తణుకు వచ్చినట్లుగా సురేష్ కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఆ రోజు నుంచి కనిపించకపోవడంతో పాటు మొబైల్ కూడా స్విచ్చాఫ్ అవడంతో ఆ కుటుంబం ఆందోళనతో ఈనెల 25న తణుకు పట్టణ పోలీసులను ఆశ్రయించారు. అయితే ఈ ఘటనకు సంబంధించి తణుకులో ఒక న్యాయవాది కుటుంబంలో తలెత్తిన వివాదానికి, యువకుడి అదృశ్యానికి సంబంధం ఉన్నట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. సదరు న్యాయవాది కూడా పరారీలో ఉన్నారని పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నట్లుగా సమాచారం. ఐదు రోజులుగా సురేష్ కనిపించకపోవడంతో కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. -
కై కలూరు.. పొట్టేళ్ల పందేల జోరు
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఉమ్మడి పశ్చిమ గోదావరిలో కొత్త ట్రెండ్ ప్రారంభమైంది. కోడిపందేలకు రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే పశ్చిమగోదావరి జిల్లా ఖ్యాతిగాంచింది. గత రెండు, మూడేళ్ల నుంచి జిల్లాలో ఒక ప్రాంతంలో పందులతో పందేలు నిర్వహించిన పందేలరాయుళ్లు తెలంగాణలో నిషేధించిన పొట్టేళ్ల పందాలకు జిల్లాను అడ్డాగా మారుస్తున్నారు. ప్రధానంగా కై కలూరు నియోజకవర్గంలోని కొల్లేరు చెరువు గట్లను పందెం అడ్డాలుగా మారుస్తూ లక్షల్లో పందేలు నిర్వహిస్తూ అధికార పార్టీ నేతలు కాసులు దండుకుంటూ అనేక మంది జేబులు గుల్ల చేస్తున్నారు. జిల్లాలో సంక్రాంతి సమ యంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా కోడిపందేలు నిర్వహిస్తుంటారు. హైకోర్టు నిషేధాజ్ఞలు ఉన్నా పోలీసులు హడావిడి చేసినా ఏమీ లెక్కచేయకుండా అధికార పార్టీ ముసుగులో భారీగా కోడిపందేలు నిర్వహిస్తుంటారు. జూన్ నుంచే పందెం కోళ్లకు ప్రత్యేకంగా శిక్షణ శిబిరాలను నిర్వహించి పందెం కోళ్లను సన్నద్ధం చేస్తుంటారు. ముఖ్యంగా ఏలూరు జిల్లాలో కై కలూరు ప్రాంతంలోని కొల్లేరులో ఉన్న చేపల చెరువు గట్ల వద్ద భారీ జీతాలతో ట్రైనర్లను నియమించి ప్రత్యేక బ్రీడ్ పందెం పుంజులను ఎంపిక చేసి శిక్షణ ఇస్తుంటారు. అలాంటి శిక్షణా కేంద్రాలే బెట్టింగ్ అడ్డాలుగా మారుతున్నాయి. పేకాట శిబిరం, కోడి పందేల బదులు పొట్టేళ్ల పందేలకు తెరతీయడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. నిర్మానుష్య ప్రాంతాల్లో ఆక్వా చెరువులు ఉండటంతో పోలీసుల హడావిడి ఉండదంటూ ఇతర ప్రాంతాల నుంచి జూదరులను ఆహ్వానిస్తున్నారు. తాజాగా చెరువు గట్లపై పొట్టేళ్ల పందేలను సైతం నిర్వహిస్తూ బరితెగింపునకు తెరలేపుతున్నారు. ఒక్కొక్క పందెం కనీసం రూ.లక్ష నుంచి పొట్టేలు స్థాయిని బట్టి రూ.3 లక్షల వరకు కూడా కాస్తున్నారు.జిల్లాలో సంక్రాంతి వంటి పెద్ద పండుగలకే పరిమితమైన కోడిపందేలు, పేకాట, పొట్టేళ్ల పందేలు కూటమి నేతలకు ఇప్పుడు నిత్య ఆదాయ వనరుగా మారిపోయాయి. చేపల చెరువు గట్లపై గుట్టు చప్పుడు కాకుండా పేకాట శిబిరాలు నిర్వహిస్తున్నారు. కై కలూరులో రోజంతా ప్రజాప్రతినిధి వెంట తిరుగుతూ రాత్రి సమయంలో టిప్పర్ల మైనింగ్ అవతారం ఎత్తే నేత తాజాగా పొట్టేళ్ల పందేలకు శ్రీకారం చుట్టాడు. పోలీసు శాఖపై కూడా ఇతనికే పెత్తనం చేసే పని అప్పగించడంతో ఇతని వైపు పోలీసులు కన్నెత్తి చూడటం లేదు. ఇతని చెరువు గట్టుపై వేసే ఒక్కో పందెం రూ.లక్ష నుంచి రూ.5 లక్షల వరకు పలుకుతుంది. శని, ఆదివారాల్లో పొట్టేళ్ల పందేలు జరుగుతున్నట్టు సమాచారం. రెండు పొట్టేళ్లు కొమ్ములతో కొట్టుకుంటూ ఏది పారిపోతే అది ఓడిపోయినట్టు లెక్క. కోడిపందేలకు అలవాటు పడిన వ్యసనపరులు తెలియని పొట్టేళ్ల పందేలలో రూ.లక్షలు తగలేసుకుని ఇంటి ముఖం పడుతున్నారు.బెట్టింగులతో పొట్టేళ్ల పందేలు నిర్వహిస్తే తెలంగాణలో కేసులు నమోదు చేస్తారు. దీంతో ఈ ఏడాది సంక్రాంతికి కై కలూరు నియోజకవర్గం చావలిపాడులో కోడిపందేలతో పాటు పొట్టేళ్ల పందేలు నిర్వహించారు. వివిధ రాష్ట్రాల నుంచి 150 పొట్టేళ్లను తీసుకొచ్చారు. గొప్ప కోసం ఓ కూటమి నేత మహిళలతో కూడిన 30 మంది బౌన్సర్లను తీసుకొచ్చి ఆకర్షించాడు. దీంతో పొట్టేళ్ల పందేలకు వచ్చిన క్రేజ్ను కూటమి నేతలు ఉపయోగించుకుంటున్నారు. గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో సంక్రాంతికి పొట్టేళ్ల పందేలు నిర్వహిస్తారు. ఆ తర్వాత ఏడాది వరకు వాటి జోలికి వెళ్లరు. తాజాగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాల్లో పొట్టేళ్ల సంస్కృతిని తీసుకొస్తున్నారు.కొల్లేరు చెరువు గట్లు కేంద్రంగా నిత్యం నిర్వహణఒక్కొక్క పందెం రూ.లక్ష నుంచి ప్రారంభంఉమ్మడి పశ్చిమలో కొత్త ట్రెండ్కు శ్రీకారంపందేల మాటున భారీగా వసూళ్లకు పాల్పడుతున్న కూటమి నేతలుకోడిపందేల కంటే ముందుగానే పొట్టేళ్ల పందేలతో హడావుడికృష్ణా, పశ్చిమగోదావరి నుంచి నిత్యం పందేలరాయుళ్లు కై కలూరుకు రాకఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో 9 మండలాల్లోని 122 గ్రామాల్లో కొల్లేరు సరస్సు విస్తరించి ఉంది. సరస్సు సమీపంలో లక్షలాది ఎకరాల్లో చేపల చెరువుల సాగు చేస్తున్నారు. ఇవే పేకాట జూదరులకు అవకాశంగా మారుతున్నాయి. చెరువుల్లో వేసే మేతల నిల్వ కోసం, కాపలాదారుల కోసం గృహాలు నిర్మిస్తారు. కొందరు చెరువు వద్ద విశ్రాంతి భవనాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. ప్రధానంగా పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు, భీమవరం నుంచి ఏలూరు జిల్లా సరిహద్దు కై కలూరు మండలంలో ఉప్పుటేరు సమీపంలోని చేపల చెరువులపై పేకాట శిబిరాలు జరుగుతున్నాయి. పోలీసులు డ్రోన్లు ఎగురవేసి మమ అనిపిస్తున్నారు. పొట్టేళ్ల పందేల నిర్వహణపై కై కలూరు సీఐ కృష్ణను వివరణ కోరగా.. పొట్టేళ్ల పందేలపై నిఘా ఉంచి చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
బీసీలకు అన్యాయం చేస్తే పోరాటమే
భీమవరం: రాష్ట్రంలో బీసీ కులాలను అణగదొక్కాలని చూస్తున్నారని, బీసీలకు జరుగుతున్న అన్యాయాలపై పోరాటాలు చేస్తామని నేషనల్ బీసీ సమాఖ్య సంక్షేమ సంఘం నేషనల్ ప్రెసిడెంట్ గుత్తుల తులసీగురి, ఏపీ స్టేట్ ప్రెసిడెంట్ ఎన్ గంగారామ్ అన్నారు. గురువారం భీమవరంలో నేషనల్ బీసీ సమాఖ్య సంక్షేమ సంఘం కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల హామీల్లో భాగంగా బీసీ కులాలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించి, బీసీలకు రక్షణ చట్టాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. జాతీయ అధ్యక్షుడిగా గుత్తుల తులసీగురి, ఉపాధ్యక్షుడిగా మోపాటీ బలపరమేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి దొంగ కృష్ణ, జాయింట్ సెక్రటరీ ఎం.విజయ్ ఎన్నికకాగా రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులుగా ఎన్ గంగారామ్, కండిబోయిన సుబ్రహ్మణ్యం, ఉపాధ్యక్షునిగా కొమ్మోజు కన్నబాబు, జాయింట్ సెక్రటరీ గుబ్బల నాగేశ్వరరావు, ప్రచార కమిటీ చైర్మన్గా వాస రామ ఎన్నికయ్యారు.పెరుగుతున్న గోదావరి వరద పోలవరం రూరల్: గోదావరి వరద ఉధృతంగా పెరుగుతోంది. నదీ పరీవాహక ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు కొండ వాగుల నీరు నదిలోకి చేరడంతో క్రమేపీ పెరుగుతోంది. పోలవరం ప్రాజెక్టు స్పిల్వే వద్ద 30.740 మీటర్లకు నీటిమట్టం చేరుకుంది. స్పిల్వే 48 గేట్ల నుంచి దిగువకు 6.16 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు చేరుతోంది. దిగువన వరద ప్రవాహం పెరిగింది. ఎగువన భద్రాచలం వద్ద 37.10 అడుగులకు నీటిమట్టం చేరుకుంది. నేవీ డిపోకు వ్యతిరేకంగా ఉద్యమంఏలూరు(ఆర్ఆర్పేట): నేవీ ఆయుధ డిపో పేరుతో చేస్తున్న భూసేకరణను వెంటనే నిలిపివేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వీ.శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. గురువారం ఏలూరు పవరుపేటలో పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నేవీ ఆయుధ డిపోకు సంబంధించి భూసేకరణకు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్, ఎమ్మెల్యే చిర్రి బాలరాజు, కలెక్టర్ వెట్రిసెల్వి, నేవీ అధికారులు చేసిన ప్రకటనను వ్యతిరేకిస్తున్నామన్నారు. గిరిజనులు ఆయుధ డిపోను వ్యతిరేకిస్తున్నా భూసేకరణకు ముందుకు సాగడం దారుణమన్నారు. సీపీఎం కేసులకు భయపడదని, ప్రజా సమస్యలపై పోరాడుతుందన్నారు. విలేకరుల సమావేశంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి సభ్యులు బీ. బలరాం, జిల్లా కార్యదర్శి ఏ. రవి, కార్యదర్శి సభ్యులు తెల్లం రామకృష్ణ, పార్టీ రాష్ట్ర కార్యదర్శి డీఎన్వీడీ ప్రసాద్, ఆర్. లింగరాజు, ఎం.నాగమణి, జీ.రాజు, కే.శ్రీనివాస్, పీ.రామకృష్ణ పాల్గొన్నారు. 27న జాబ్మేళా రెండో విడత ప్రవేశాలుఏలూరు (ఆర్ఆర్పేట): నేషనల్ కెరీర్ సర్వీస్, సెట్వెల్ ఆధ్వర్యంలో ఈ నెల 27న ఉదయం 10 గంటలకు ఏలూరు కలెక్టరేట్ కాంపౌండ్లోని సెట్వెల్ కార్యాలయంలో జాబ్మేళాను నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి వీ.వరలక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు. జాబ్మేళాలో హ్యాపీ మొబైల్స్, వేరియంట్ ప్రైమరీ స్కూల్, ఎల్ఐసీ ఆఫ్ ఇండియా వంటి ప్రముఖ కంపెనీల్లో వివిధ ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుందన్నారు.డిగ్రీ కళాశాలల్లో రెండో విడత ప్రవేశాలుఏలూరు (ఆర్ఆర్పేట): డిగ్రీ కళాశాలల్లో రెండో విడత ప్రవేశాలకు ఈనెల 29వ తేదీ వరకు గడువు ఉందని ఏలూరు జిల్లా నోడల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రధానాచార్యుడు గుత్తా గిరిబాబు ప్రకటనలో తెలిపారు. 2025–26 విద్యా సంవత్సరానికి గాను డిగ్రీ కోర్సుల్లో చేరడానికి ఇంటర్ లేదా తత్సమాన పరీక్ష పాసైన విద్యార్థులు ఈ నెల 26 నుంచి 29వ తేదీ వరకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. -
ఏజెన్సీలో భూసేకరణ నిలుపుదల చేయాలి
బుట్టాయగూడెం: జీలుగుమిల్లి, బుట్టాయగూడెం మండలాల్లో భూసేకరణ నిలుపుదల చేయాలని, నేవీ ఆయుధ కర్మాగార నిర్మాణం అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేయాలని ఆదివాసీ సంక్షేమ పరిషత్ డిమాండ్ చేసింది. గురువారం ఆదివాసీ సంక్షేమ పరిషత్ జిల్లా ప్రధాన కార్యదర్శి కుంజా కృష్ణంరాజు అధ్యక్షతన ఆదివాసీ ముఖ్య నాయకుల సమావేశం బుట్టాయగూడెంలో జరిగింది. ఏపీ ఆదివాసీ జాయింట్ యాక్షన్ కమిటీ వైస్ చైర్మన్ మొడియం శ్రీనివాసరావు మాట్లాడుతూ ఇప్పటికే సేకరించి వివాదాల్లో ఉన్న వేల ఎకరాల భూమిని పోలవరం నిర్వాసితులకు కేటాయించడం వల్ల భూవివాదాలతో స్థానిక ఆదివాసీ నిర్వాసితులు, ఆదివాసీలు నిరంతరం గొడవలు పడుతూ అశాంతితో జీవిస్తున్నారని అన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఏడు మండలాల పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులను తీసుకువచ్చి వారికి బుట్టాయగూడెం, జీలుగుమిల్లి మండలాల్లో పునరావాసం కల్పించడం ఎంతవరకూ సమంజసమని ప్రశ్నించారు. పెద్ద మొత్తంలో ప్రభుత్వం సొమ్మును దోచుకోవడానికి ఎల్టీఆర్ భూములను సేకరించడానికి అధికారులు, ప్రజాప్రతినిధులు, దళారులు పడుతున్న తాపత్రయం, హడావిడి చూస్తుంటే భారీ కుంభకోణం జరుగుతుందని అర్థమవుతుందని చెప్పారు. ఏటీఏ నాయకులు తెల్లం రాములు, తెల్లం గంగరాజు, కోర్సా నాగేశ్వరరావు, కుంజా రమేష్ పాల్గొన్నారు. -
సర్కారుపై సమర శంఖం
అన్నదాన కష్టాలు మావుళ్లమ్మ దేవస్థానంలో అన్నదాన కష్టాలు వెంటాడుతున్నాయి. ఇరుకు గదిలో భక్తులు ఒకరిపై ఒకరూ పడుతూ అన్నప్రసాదం తినాల్సి వస్తోంది. 10లో uకష్టపడి ఉన్నత చదువులు చదివారు. పోటీ పరీక్షల్లో ప్రతిభ చాటి సచివాలయ ఉద్యోగులుగా సర్కారు కొలువులు సాధించారు. సెలవులు, వేళాపాలా లేకుండా సర్వేల పేరుతో కూటమి ప్రభుత్వం ఇంటింటికీ తిప్పుతూ తమ ఆత్మగౌరవానికి భంగం కలిగిస్తోందన్న ఆవేదనతో పోరుబాట పట్టారు. ఐక్యవేదిక పిలుపు మేరకు నల్లబ్యాడ్జీలు ధరించి వివిధ రీతుల్లో నిరసనలు తెలుపుతున్నారు. ఇసుక అక్రమాలపై చర్యలేవి? ఆందోళనలో భాగంగా నేటి నుంచి ఉద్యమాన్ని మరింత విస్తరించనున్నారు. అందులో భాగంగా శుక్రవారం మధ్యాహ్న భోజన విరామ సమయంలో మండల, మున్సిపల్ కార్యాలయాల ముందు ఫ్లకార్డులతో నిరసన తెలియజేయనున్నారు. ● 27న జాతీయ నాయకులు మహాత్మాగాంధీ, డా.బీఆర్ అంబేడ్కర్ విగ్రహాలకు వినతిపత్రాలు అందజేయడం. ● 28న విశాఖపట్నం వేదికగా ప్రాంతీయ సభ, అలాగే సచివాలయ ఉద్యోగుల ఆత్మగౌరవ శంఖారావం పేరిట 26 జిల్లాల్లో స్టీరింగ్ కమిటీల సమావేశాల నిర్వహణ. ● 29న పింఛన్ నగదు బ్యాంకుల నుంచి విత్డ్రా చేసిన అనంతరం అధికారిక వాట్సప్ గ్రూపుల నుంచి వైదొలగడం. ● 30న దుర్గాష్టమి సెలవుదినం. అక్టోబరు 1న నల్లబ్యాడ్జీలు ధరించి యథావిధిగా ఇంటింటికీ లబ్ధిదారులకు పింఛన్ల పంపిణీ. ● 2న గాంధీ జయంతి రోజు ప్రత్యక్ష్య కార్యక్రమాలకు విరామం. మహాత్మా మా ఘోష వినంటూ వాట్సప్ స్టేటస్ అప్లోడ్ చేయడం. ● 3న మండల, మున్సిపల్ స్టీరింగ్ కమిటీల సన్నాహాక సమావేశం. 4న జిల్లా స్టీరింగ్ కమిటీ, 5న రాజమహేంద్రవరం వేదికగా ప్రాంతీయ సభలకు ఐక్యవేదిక పిలుపునిచ్చింది. శురకవారం శ్రీ 26 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025సాక్షి, భీమవరం : ప్రజల చెంతకే ప్రభుత్వ సేవల్ని చేరువచేస్తూ గత ప్రభుత్వం సచివాలయ వ్యవస్థ తెచ్చింది. గ్రామాల్లో రెండు వేలు, పట్టణ ప్రాంతాల్లో నాలుగు వేల జనాభా చొప్పున జిల్లాలో 535 సచివాలయాలను ఏర్పాటు చేసింది. రాజకీయ జోక్యం, పైరవీలకు తావివ్వకుండా ఉద్యోగ నియామకాలు చేయడంతో పాటు సర్వీసు రూల్స్ వర్తింపచేసి అప్పట్లోనే రెగ్యులరైజ్ కూడా చేశారు. ఇంజినీరింగ్, వెల్ఫేర్, ఎడ్యుకేషన్, అగ్రికల్చర్, హార్టీకల్చర్, వెటర్నరీ, డిజిటల్ అసిస్టెంట్లు, ఏఎన్న్ఎం, విలేజ్ సర్వేయర్ తదితర హోదాల్లో 4,331 మంది పనిచేస్తున్నారు. పనిభారం పెంచేసిన కూటమి గతంలో క్షేత్రస్థాయిలో అర్హులందరికి ప్రభుత్వ పథకాలు చేరేలా వలంటీర్లను సమన్వయం చేసుకుంటూ సచివాలయ ఉద్యోగులు పనిచేసేవారు. కూటమి ప్రభుత్వం జాబ్చార్ట్లో లేని పనులు చేయిస్తూ పనిభారం మొత్తం సచివాలయ ఉద్యోగులపై మోపింది. గతంలో నలుగురు వలంటీర్లు చేసే పని ఇప్పుడు ఒక సచివాలయ ఉద్యోగిపై పడింది. పండుగలు, సెలవురోజులు తేడా లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు సర్వేల పేరుతో ఇంటింటికీ తిప్పుతున్నారని ఉద్యోగులు మండిపడుతున్నారు. ఆత్మగౌరవం కోసం.. ఇంటింటికీ తిప్పడం ద్వారా తమను పెద్ద వలంటీర్లుగా మార్చేశారని, క్షేత్రస్థాయిలో అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తోందని ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు. తమ ఆత్మగౌరవానికి భంగం వాటిల్లకుండా విద్యార్హతల ఆధారంగా విధులు నిర్వర్తించే అవకాశం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఏపీ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ఐక్య వేదిక పేరిట సచివాలయ ఉద్యోగులు అంతా ఒకే గొడుగు కిందకు వచ్చి తమ సమస్యలను పరిష్కరించాలంటూ గళమెత్తుతున్నారు. ఈమేరకు ఈనెల 22వ తేదీ వరకు ప్రభుత్వానికి గడువిస్తూ 8వ తేదీన అధికారులకు నోటీసు అందజేశారు. పోరుబాటలో ఉద్యోగులు ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో ఈనెల 23వ తేదీ నుంచి అక్టోబరు 5 వరకు తదుపరి కార్యాచరణను ఐక్యవేదిక విడుదల చేసింది. ఈమేరకు మూడు రోజులుగా ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరవుతున్నారు. మధ్యాహ్న భోజన విరామ సమయంలో సచివాలయం ముందు ఫ్లకార్డులతో నిరసనలు తెలుపుతున్నారు. ఇంటింటా సర్వేలు, ఇతర పనుల నుంచి విముక్తి కల్పించాలి. నోషనల్ ఇంక్రిమెంట్లు మంజూరు చేయాలి. ఆరేళ్ల పాటు ఒకే కేడర్లో సర్వీస్ చేసిన వారికి ఏఏఎస్ ప్రకారం స్పెషల్ ఇంక్రిమెంట్ మంజూరు చేయాలి. ఉద్యోగులకు ప్రస్తుతం అమలు అవుతున్న రికార్డు అసిస్టెంట్ కేడర్ను జూనియర్ అసిస్టెంట్ కేడర్కు మార్చాలి. అన్ని విభాగాల్లో ప్రమోషన్ ఛానల్స్ ఏర్పాటు చేసి జిల్లాల వారీగా సీనియారిటీ జాబితా విడుదల చేయాలి. స్టేషన్ సీనియారిటీ ఆధారంగా పారదర్శక బదిలీలకు ప్రత్యేక విధి విధానాలు తేవాలి. ఉద్యోగులను మాతృశాఖలకు అప్పగించాలి. సమయ పాలన లేని ఒత్తిడితో కూడిన విధుల నుంచి విముక్తి కల్పించాలి. కార్యాలయ పనివేళలు పాటించకుండా వీడియో కాన్ఫరెన్స్లు నిర్వహించడం, సెలవులు, పండుగలు, ఆదివారాల్లో బలవంతపు విధులు చేయించరాదు. శాసనమండలిలో ఎమ్మెల్సీ వంక గళం ఉలిక్కిపడి సర్దుకుంటున్న అక్రమార్కులు ఆత్మగౌరవం కోసం సచివాలయ ఉద్యోగుల పోరుబాట అక్టోబరు 5 వరకు వివిధ పద్ధతుల్లో నిరసనలు 29న అధికారిక వాట్సప్ గ్రూప్ల నుంచి వైదొలగడం అక్టోబరు 1న నల్లబ్యాడ్జీలు ధరించి పింఛన్ల పంపిణీ ఐక్యవేదిక యాక్షన్ ప్లాన్ మేరకు నిరసనల్లో పాల్గొంటున్న సచివాలయ ఉద్యోగులు -
ఫుడ్ పాయిజన్తో ఇద్దరు పిల్లలకు అస్వస్థత
కామవరపుకోట: ఫుడ్ పాయిజన్ వల్ల ఇద్దరు పిల్లలు అస్వస్థతకు గురైన సంఘటన గురువారం కొత్తూరు యానాదుల కాలనీలో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం యానాదుల కాలనీకు చెందిన పొట్లూరి రమేష్, రమణ దంపతుల కుమారుడు మనోజ్ స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఒకటో తరగతి చదువుతుండగా, కుమార్తె రేణుకమ్మ సమీప అంగన్వాడి కేంద్రానికి వెళుతుంది. ఈ క్రమంలో మనోజ్కి సెలవులు కావడంతో గురువారం అన్నా చెల్లెలు ఇద్దరు ఇంటిదగ్గర భోజనం చేసి అంగన్వాడీ కేంద్రానికి వెళ్లారు. అక్కడ కొంతసేపటికి ఇద్దరికీ వాంతులు కావడంతో కుటుంబ సభ్యులు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి తీసుకువెళ్లగా అక్కడ వైద్యులు ఇద్దరు పిల్లలకు ఫుడ్ పాయిజన్ అయ్యిందని నిర్ధారించి చికిత్స చేసి, మెరుగైన వైద్యం కోసం 108లో ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలవరం రూరల్: బ్యాంకు ఖాతా కలిగిన ప్రతి వ్యక్తి బీమా పథకాలు సద్వినియోగం చేసుకోవాలని ఆర్బీఐ రీజినల్ డైరెక్టర్ బషీర్ తెలిపారు. పోలవరం మండలంలోని పాత పట్టిసీమ గ్రామంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో గ్రామ స్థాయి జన సురక్ష కార్యక్రమం గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న బషీర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ బ్యాంక్ ఖాతాలను సమయానికి రీ–కేవైసీ చేయించుకోవాలని, తద్వారా లావాదేవీల్లో ఎటువంటి అంతరాయం లేకుండా సులభంగా సేవలు పొందవచ్చని సూచించారు. బ్యాంకుల్లో అందుబాటులో ఉండే వివిధ బీమా పథకాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎల్డీవో నవీన్, కెనరా బ్యాంక్ డీజీఎం మాధవరావు, ఎస్బీఐ డీజీఎం పంకజ్ కుమార్, ఆర్ఎం రమేష్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. తణుకు అర్బన్: చైనాలో నిర్వహించనున్న జూనియర్ ఏషియన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ పోటీలకు తణుకు శ్రీచిట్టూరి సుబ్బారావు గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీ క్రీడాకారుడు సమ్మెట్ల హేమంత్శ్రీ ఎంపికై నట్లు ఎస్కేఎస్డీ మహిళా కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్, జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షురాలు చిట్టూరి సత్య ఉషారాణి తెలిపారు. ఈ నెల 13 నుంచి 21 వరకు హర్యానాలో పంచకుల నగరంలో నిర్వహించిన ఆల్ ఇండియా జూనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ పోటీల్లో విజేతగా నిలిచి చాంపియన్షిప్లో పోటీల్లో పాల్గొనే జట్టులో చోటు సంపాదించినట్లు వివరించారు. అక్టోబర్ 21 నుంచి 26 వరకు చైనాలో జరిగే అంతర్జాతీయ బ్యాడ్మింటన్ పోటీలకు హేమంత్శ్రీ వెళ్లనున్నట్లు అసోసియేషన్ సెక్రటరీ మెంటే వంశీకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా హేమంత్శ్రీని కళాశాల జాయింట్ సెక్రటరీ చిట్టూరి వెంకట కృష్ణారావు, చిట్టూరి రీనాసాయి, కోచ్లు సమ్మెట్ల సతీష్బాబు యు.సుదర్శన్, ఫిజికల్ డైరెక్టర్ ఎం.రత్నకుమారి అభినందించారు. -
భర్త వేధింపులతో భార్య ఆత్మహత్య?
పాలకొల్లు సెంట్రల్ : మండలంలోని పూలపల్లి గ్రామానికి చెందిన తోట ఝాన్సీ (33) తన భర్త వేధింపులు భరించలేక బుధవారం రాత్రి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు మృతురాలి తండ్రి ముదరకొల ప్రభుదాసు పోలీసులను ఆశ్రయించాడు. వివరాల ప్రకారం భీమవరం మండలం వెంప గ్రామ శివారు కొత్తపేటకు చెందిన ఝాన్సీకి 13 ఏళ్ల క్రితం దుర్గా పెద్దిరాజుతో వివాహమైంది. వివాహం తరువాత వీరిద్దరు పూలపల్లి నివాసం ఉంటున్నారు. రెండు సంవత్సరాలు ఇద్దరు బాగానే ఉన్నా పెద్దిరాజు మద్యానికి బానిసై భార్యను అనుమానిస్తూ తిడుతూ, కొడుతూ మానసికంగా, శారీరకంగా వేధింపులకు గురి చేసేవాడు. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి పెద్దిరాజు మద్యం తాగి వచ్చి భార్యతో గొడవపడడంతో ఝాన్సీ తన తమ్ముడికి పిల్లలని బాగా చూసుకోమని, తన భర్త వేధింపులు భరించలేనని మెసేజ్ పెట్టింది. మెసేజ్ చూసుకుని పూలపల్లి వచ్చేసరికి ఝాన్సీ బెడ్ రూమ్లో ఫ్యాన్కి చీర కట్టి ఉరేసుకుంది. మృతురాలి తండ్రి ప్రభుదాసు పిఫిదు మేరకు తోట దుర్గా పెద్దిరాజు, అతని తల్లిదండ్రులు వీరభద్రరావు, సత్యవతిలపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై ప్రసాద్ తెలిపారు. -
మావుళ్లమ్మ భక్తులకు అన్నదాన కష్టాలు
● కూర్చొని తినే సౌకర్యం లేక ఇబ్బందులు ● ఏళ్ల తరబడి ఇరుకు గదిలోనే అన్నదానం భీమవరం(ప్రకాశం చౌక్): రాష్ట్రంలోనే ప్రముఖ దేవస్థానం శ్రీమావుళ్లమ్మ వారి దేవస్థానంలో భక్తులను అన్నదాన కష్టాలు వెంటాడుతున్నాయి. కనీసం ముప్పై మంది కూడా పట్టని గదిలో అన్నప్రసాదాన్ని అందించడంతో భక్తులు నిలబడి ఒకరిపై ఒకరూ పడుతూ అన్నప్రసాదం తినాల్సి వస్తుందని వాపోతున్నారు. అమ్మవారి ప్రసాదంగా భావించి భోజనం చేయాలంటే బయట రోడ్డుపై క్యూలైన్లో నుంచి చినపాటి సందులోకి వెళ్లి ఇరుకు గదిలో భోజనం చేసి రావాలి. దీంతో మహిళలు, చిన్న పిల్లలతో వచ్చేవారు, వృద్ధులు చాలా చాలా ఇబ్బందులు పడుతు న్నారు. అమ్మవారి వార్షికోత్సవాలు, దసరా ఉత్సవా ల వంటి సమయంలో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చినా కొందరికే అమ్మవారి భోజనం దక్కుతుంది. రెండు సెంట్లల్లోనే ఆఫీసు, భోజనశాల మావుళ్లమ్మ దేవస్థానంలో రెండు సెంట్లల్లో నిర్మించిన భవనంలో పైన దేవస్థానం ఆఫీసు, కింద గదిలో భోజనశాల ఉంది. ఈ భవనం ఇరుగ్గా ఉండడం వల్ల అటు ఆఫీసుకు ఇటు భోజనశాలకు కూడా సరిపోక దేవస్థానం సిబ్బంది, భక్తులు ఇబ్బందులుపడుతున్నారు. లోపల భవనంలో కనీసం నిలబడడానికి కూడా వీలు లేకపోవడంతో రోడ్డుపై భక్తులు క్యూలో నిల్చుంటున్నారు. భక్తుల వల్ల ఈ రోడ్డులో ట్రాఫిక్ సమస్య కూడా పెరుగుతుందని స్థానికులు చెబుతున్నారు. టోకెన్ లెక్కల ప్రకారమే భోజనం మావుళ్లమ్మ దర్శనం కోసం హైదరాబాద్, విశాఖ, విజయవాడ, గుంటూరు, రాజమండ్రి వంటి దూర ప్రాంతాలతో పాటు ఉభయగోదావరి జిల్లాల నలుమూల నుంచి కూడా భక్తులు వస్తూ ఉంటారు. అయితే ఎంత మంది వస్తే అంత మందికి భోజనం పెట్టకుండా టోకెన్ల ప్రకారమే ఇక్కడ భక్తులకు భోజనం పెడుతున్నారు. సాధారణ రోజుల్లో 170 నుంచి 200 మందికి, ఉత్సవాల సమయంలో 250 నుంచి 300 మందికి మాత్రమే భోజన సౌకర్యం కల్పిస్తున్నారు. ఆ భోజనం కూడా ఇరుకు గదిలో పెట్టడం వల్ల అవస్థలు పడుతూ తినాల్సి వస్తుందని భక్తులు వాపోతున్నారు. అమ్మవారికి భక్తులు సమర్పించే కానుకలు, శాశ్వత నిత్యన్నదానం కోసం వచ్చే విరాళాలతో మంచి ఆదాయం వస్తున్నప్పటికీ అమ్మవారి భోజన ప్రసాదం కొందరి భక్తులకే దొరుకుతుంది. ఆలయం వద్ద ఇన్ని ఇబ్బందులు ఉన్నా దేవదాయ ఉన్నతాధికారులు ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఇరుకు గదిలో భోజనం చేస్తున్న భక్తులు రోడ్డుపై క్యూలైన్లో టోకెన్ల కోసం భక్తుల అవస్థలుదసరా మహోత్సవాల్లో మావుళ్లమ్మ వారిని దర్శించుకోవడానికి ప్రతి ఏడాదీ వస్తాం. అయితే అమ్మవారి భోజన ప్రసాదం సెంటిమెంట్గా భావించి ఇరుకు గదైనా ఇబ్బందిగా ఉన్నా భోజనం చేస్తున్నాం. అయితే పిల్లలతో వచ్చేవారు భోజన గదికి వెళ్లే సందులో, లోపల భోజనం చేయడానికి ఖాళీ సరిపోక చాలా ఇబ్బందులు పడుతున్నారు. – కె.భాగ్యలక్ష్మి, హనుమాన్ జంక్షన్మేము ప్రతి ఏడాది దసరా, వార్షికోత్సవాల్లో మావుళ్ల మ్మను దర్శించుకోవడానికి వస్తాం. ప్రతిసారీ కూడా అమ్మవారి భోజన ప్రసాదం కోసం అవస్థలు పడుతున్నాం. చిన్న గదిలో భోజన ప్రసాదం పెట్టడం వల్ల ప్రసాదం ప్రశాంతంగా సంతృప్తిగా తినలేకపోతున్నాం. భోజనశాల విషయంలో అధికారులు చర్యలు తీసుకోవాలి. – కె.భాస్కరలక్ష్మి, హైదరాబాద్శ్రీ మావుళ్లమ్మ వారి దేవస్థానం వెనుక వైపు సుమారు 3 సెంట్లల్లో ఉన్న మున్సిపల్ స్థలంలో అద్దె ప్రాతిపదికన పలు షాపులు ఉన్నాయి. వాటిని తొలగించి ఆ స్థలం అమ్మవారికి దేవస్థానానికి నిబంధనలు మేరకు అప్పగిస్తే అన్నదాన కష్టాలు తీరుతాయని భక్తులు చెబుతున్నారు. మావుళ్లమ్మ ఆలయం కారణంగానే మున్సిపాలిటీకి షాపుల ద్వారా ఏటా రూ.5.90 లక్షల ఆదాయం సమకూరుతుంది. భక్తుల ఇబ్బందుల దృష్ట్యా మున్సిపల్ అధికారులు, దేవదాయ శాఖ ఉన్నతాధికారులు సమన్వయంతో నిర్ణయం తీసుకుంటే సమస్య పరిష్కారమవుతుందని పట్టణవాసులు చెబుతున్నారు. -
ఫార్మాసిస్ట్లు నిబంధనలు పాటించాలి
తణుకు అర్బన్: మందుల విక్రయాల్లో ఫార్మాసిస్ట్లు పూర్తిస్థాయిలో నిబంధనలు పాటించాలని డ్రగ్స్ ఇన్స్పెక్టర్ పి.మల్లికార్జునరావు అన్నారు. ప్రపంచ ఫార్మాసిస్ట్ డే సందర్భంగా తణుకు డ్రగ్గిస్ట్ కెమిస్ట్ అసోసియేషన్ హాలులో గురువారం నిర్వహించిన ఫార్మాసిస్టుల అసోసియేషన్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ మత్తు మందులు వినియోగించే వారిని గుర్తించి వారికి ఆ మందుల వాడకం వల్ల కలిగే దుష్పరిణామాలపట్ల అవగాహన కల్పించాలని సూచించారు. ఫార్మాసిస్ట్లు వైద్యులు సూచనల మేరకు మాత్రమే మందులు విక్రయిచాలని సూచించారు. అనంతరం రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంకులో 15 మంది అసోసియేషన్ సభ్యులు రక్తదానం చేశారు. సీనియర్ ఫార్మాసిస్ట్లను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో అసోసియేషన్ కార్యదర్శి రామ్చందర్, ఫార్మాసిస్ట్ల సంక్షేమ రాష్ట్ర ఉప కార్యదర్శి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం: డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్లుగా పనిచేసే వారి ఉద్యోగ విరమణ వయస్సు 62 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాలకు పెంచాలనే పంచాయితీలు పెరుగుతున్నాయి. ప్రస్తుతం ఉద్యాన విశ్వవిద్యాలయం ఉపకులపతిగా ఆగస్టు 31వరకు పని చేసిన, కె.గోపాల్ తన వయస్సు 65 ఏళ్లు వచ్చే వరకు వీసీ పదవిలో ఉంచాలని హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఉద్యాన వర్సిటీ వీసీ వ్యవహారం 25 రోజులుగా ఇంకా తేలలేదు. తాజాగా ఇటీవల వెంకట్రామన్నగూడెం ఉద్యాన విశ్వవిద్యాలయంలో డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్గా పని చేసి 62 ఏళ్లు ముగియడంతో ఉద్యోగ విరమణ చేసిన డాక్టర్ నారం నాయుడు, సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ రమాదేవి, ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో పని చేసి తాజాగా ఉద్యోగ విరమణ చేసిన ఓబయ్య అనే వ్యక్తి కూడా ఉద్యోగ విరమణ వయస్సును 62 నుంచి 65 సంవత్సరాలకు పెంచాలని హైకోర్టులో రిట్ పిటిషన్లు వేసినట్టు సమాచారం. ఏలూరు (ఆర్ఆర్పేట): ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఆర్సీటీసీ) ఆధ్వర్యంలో అక్టోబర్ 7 నుంచి భారత్ గౌరవ్ యాత్ర ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు ఐఆర్సీటీసీ విజయవాడ యూనియన్ మేనేజర్ ఎం. రాజా తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన ఏలూరులో ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ యాత్ర సికింద్రాబాద్ నుండి ప్రారంభమై ద్వారకా, సోమనాథ్, అహ్మదాబాద్, మోథేరా, పటాన్, స్టాట్యూఆఫ్ యూనిటీ వరకు సాగుతుందని పేర్కొన్నారు. ఈ యాత్రలో ద్వారకాదీష్ టెంపుల్, నాగేశ్వర్ టెంపుల్, ద్వారకా, సోమనాథ్ ఆలయం, శబర్మతి ఆశ్రం, మోథేరాజ్ సూర్యదేవాలయం, రాణి కి వాప్ (పటాన్), సర్ధార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం (ఏక్తానగర్లను సందర్శించవచ్చని వివరించారు. ఈ యాత్రకు స్లీపర్క్లాస్లో పెద్దలకు రూ.18,400లు, 11 సంవత్సరాలోపు పిల్లలకు రూ.17,300లు, థర్డ్క్లాస్ ఏసీలో పెద్దలకు రూ.30,200, పిల్లలకు రూ. 28,900లు, సెకండ్క్లాస్ ఏసీలో పెద్దలకు రూ.39,900, పిల్లలకు రూ. 38,300గా టిక్కెట్ రేటు నిర్ణయించినట్లు తెలిపారు. మరిన్ని వివరాలకు 9281495848, 9281030714 నంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు. తాడేపల్లిగూడెం రూరల్: మోటారు సైక్లిస్ట్ను వెనుక నుంచి కారు ఢీకొన్న ప్రమాదంలో ఒక బాలుడు మృతి చెందినట్లు రూరల్ హెడ్ కానిస్టేబుల్ ఎండీ జిలానీ తెలిపారు. గురువారం ఆయన తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని కొండ్రుప్రోలు కేఎస్ఎన్ కాలనీకి చెందిన రెడ్డి నాగబాబు(16) సుజుకీ యాక్సెస్ మోపెడ్పై తణుకు నుంచి ఏలూరు వైపుగా వస్తుండగా కొండ్రుప్రోలు జాతీయ రహదారిపై వెనుక నుంచి వచ్చిన కారు ఢీకొట్టడంతో మృతి చెందాడు. బుధవారం రాత్రి చోటు చేసుకున్న ఈ ఘటనపై మృతుని తల్లి రెడ్డి మోహన లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెచ్సీ జిలానీ తెలిపారు. -
శ్రమదానంతో ఆరోగ్య సమాజం
ఏలూరు (ఆర్ఆర్పేట): ప్రతిఒక్కరూ రోజూ కనీసం కొంత సమయం పాటు శ్రమదానం చేస్తే ఆరోగ్యవంతమైన పట్టణాలు, గ్రామాలుగా కళకళలాడతాయని ఏపీ స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ఎండీ బి.అనిల్కుమార్రెడ్డి సూచించారు. స్థానిక పంపుల హెడ్ వాటరు వర్క్స్ వద్ద గురువారం స్వచ్ఛతా హీ సేవ – 2025లో భాగంగా ఏక్ దిన్, ఏక్ ఘంటా, ఏక్ సాథ్ అనే థీమ్తో కలెక్టర్ కె.వెట్రిసెల్వితో కలిసి ఆయన ప్రత్యేక శుభ్రతా డ్రైవ్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనిల్కుమార్రెడ్డి మాట్లాడుతూ మంచిసేవలు అందించిన క్లాప్ మిత్రలకు అక్టోబరు 02న రాష్ట్ర ముఖ్యమంత్రి పాల్గొనే విజయవాడలో సభలో బహుమతులు అందించి సన్మానిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో నగర పాలక సంస్థ కమిషనర్ ఎ.భాను ప్రతాప్, జెడ్పీ సీఈఓ ఎం.శ్రీహరి, డిప్యూటీ కమిషనర్ బీ. శివారెడ్డి పాల్గొన్నారు. -
పరిమితి మేరకు వర్జీనియా సాగు చేయాలి
జంగారెడ్డిగూడెం: వర్జీనియా సాగు బోర్డు సూచించిన పరిమితి మేరకు పండిస్తూనే ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులు ఆలోచన చేయాలని పొగాకు బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బి.విశ్వశ్రీ అన్నారు. జంగారెడ్డిగూడెంలోని వర్జీనియా వేలం కేంద్రాలను ఆమె గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ పొగాకు పైరుకు ప్రత్యామ్నాయ పంట వైపు రైతు దృష్టి సారించాలన్నారు. 365 రోజుల పచ్చదనం, పంట మార్పిడి, సేద్యంలో మెళకువలపై నిరంతరం అవగాహన కలిగి ఉండాలన్నారు. పొగాకు రైతులు వర్జీనియా పొగాకు మాత్రమే కాకుండా ఇతర వాణిజ్య పంటలను సాగు చేయాలన్నారు. మేలు రకమైన పంటను పండిస్తే మంచి ధర వస్తుందన్నారు. 2025–26 పంట కాలానికి వర్జీనియా పొగాకు బోర్డు 142 మిలియన్ కేజీల పొగాకును అనుమతించిందన్నారు. కాబట్టి రైతులు పరిమితిలోపు పంటను సాగు చేస్తూ మేలు రకమైన పొగాకును ఉత్పత్తి చేయాలని సూచించారు. అనంతరం రైతులు పలు సమస్యలను ఈడి విశ్వశ్రీ దృష్టికి తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా పొగాకు బోర్డు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ను ఆమె పరిశీలించి, శిక్షణ పొందుతున్న విద్యార్థులతో మాట్లాడారు. కాగా పొగాకు వేలం కేంద్రానికి సంబంధించి ఉద్యోగుల భర్తీ ప్రక్రియను త్వరలోనే నిర్వహిస్తామని విశ్వశ్రీ తెలిపారు. కార్యక్రమంలో ఆర్ఎం జీఎల్కే ప్రసాద్, ఆక్షన్ మేనేజర్ కేవీ రామాంజనేయులు, ఏఎస్లు శ్రీహరి, సురేంద్ర, రైతు నాయకులు పరిమి రాంబాబు, కరాటం రెడ్డి బాబు, ఘంటసాల గాంధీ, అల్లూరి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
అదును చూసి దోచేస్తున్నారు!
● రైతులతో ధాన్యం దళారుల ఆటలు ● ధాన్యం కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో ఇష్టారీతిగా కొనుగోళ్లుతాడేపల్లిగూడెం రూరల్: వరుస తుఫాన్లు, వాయుగుండాలతో ఒక పక్క రైతు హడలిపోతుంటే మరో పక్క ధాన్యం కమీషన్దారులు మాత్రం పండుగ చేసుకుంటున్నారు. వర్షాల ప్రభావంతో పండించిన ధాన్యాన్ని ఒబ్బిడి చేసుకునే పనిలో తాడేపల్లిగూడెం మండలంలోని రైతులు నిమగ్నమయ్యారు. అయితే ఈ వర్షాలను సాకుగా చేసుకుని రైతు నుంచి అయినకాడికి ధాన్యాన్ని దళారులు కొనుగోలు చేస్తున్నారు. ఒక్క తాడేపల్లిగూడెం మండలంలోనే ఈ ఖరీఫ్ సీజన్లో 24,300 ఎకరాల్లో వరి సాగు చేశారు. పీఆర్–126 ఏడు వేల నుంచి ఎనిమిది వేల ఎకరాలు కాగా, స్వర్ణ రకం 10 వేల ఎకరాలు, సంపత్ స్వర్ణ 7 వేల ఎకరాల్లో సాగు చేశారు. ప్రస్తుతం పీఆర్–126 రకం వరి చేలు చేతికి రావడంతో రైతులు కోతలు ప్రారంభించారు. నాలుగు వేల ఎకరాల్లో కోతలు పూర్తి ఇప్పటికే మండలంలోని నాలుగు వేల ఎకరాల్లో కోతలు పూర్తయ్యాయి. ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ధాన్యాన్ని గట్టెక్కించేందుకు రైతులు వివిధ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే గత నాలుగు రోజుల క్రితం వరకు 75 కిలోల బస్తా ధాన్యం రూ.1190కు కొనుగోలు చేయగా, నేడు రూ.1160కు కమీషన్దారులు కొనుగోలు చేస్తున్నట్లు రైతులు వాపోతున్నారు. నాలుగు రోజుల వ్యవధిలో బస్తాకు రూ.30 తగ్గించారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాతావరణ పరిస్థితులను బట్టి రైతుల నుంచి కమీషన్దారులు ఒక్కో రోజు ఒక్కో ధరకు ధాన్యం కొనుగోలు చేస్తున్నారని చెబుతున్నారు. ఇదిలా ఉంటే మెట్ట గ్రామాల్లో వరి కోతలు దాదాపు పూర్తి కావస్తున్నా నేటికీ ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిన ధాన్యం కొనుగోలు కేంద్రాలు కనుచూపు మేరలో కానరావడం లేదు. ఇదే అదనుగా కమీషన్దారులు ముందస్తుగానే అయిన కాడికి ధాన్యాన్ని కొనుగోలు చేసి, సొమ్ము చేసుకుంటున్నారు. ధాన్యం 75 కిలోల బస్తా వెయ్యి రూపాయలకు కొనుగోలు చేసేది లేదంటూ కమీషన్దారులు భీష్మించుకుని కూర్చున్నారు. ఎట్టకేలకు రూ.1160లకు కొనుగోలు చేసేందుకు ముందుకొచ్చారు. దీంతో అప్పటికప్పుడు మెషీన్లను పెట్టి వరి కోతలు చేపట్టాం. ఏ క్షణాన వాతావరణం ఎలా ఉంటుందోనని ఆందోళన వెంటాడుతుంది. – మైనం సత్యనారాయణ, లింగారాయుడిగూడెం -
అద్దాల మండప నిర్మాణానికిరూ.కోటి విరాళం
ద్వారకాతిరుమల: ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమల శ్రీవారి ఆలయంలో అద్దాల మండప నిర్మాణానికి ఒక భక్తుడు రూ.కోటి విరాళం అందించారు. అనకాపల్లికి చెందిన బొండాడ కొండలరావు ముందుగా స్వామి, అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం విరాళం చెక్కును ఆలయ ఈఓ ఎన్వీఎస్ఎన్ మూర్తికి అందించారు. ఈ సందర్భంగా దాతకు శ్రీవారి శేష వస్త్రాన్ని కప్పి, ప్రసాదాలను అందించడంతోపాటు ప్రత్యేకంగా అభినందించారు. నిత్యాన్నదాన పథకానికి విరాళం ద్వారకాతిరుమల: శ్రీవారి నిత్యాన్నదాన పథకానికి ఒక భక్తుడు సోమవారం రూ.10,01,116 విరాళంగా అందజేశారు. హైదరాబాద్కు చెందిన తాడికొండ శేషగిరిరావు ముందుగా సతీసమేతంగా స్వామి, అమ్మవార్లను దర్శించి, ప్రత్యేక పూజలు జరుపుకున్నారు. అనంతరం ఈ విరాళం చెక్కును ఆలయ ఈఓ ఎన్వీఎస్ఎన్ మూర్తికి అందజేయగా, ఆయన దాతను సత్కరించి, అభినందించారు. దాత వెంట గ్రామానికి చెందిన పుసులూరి శ్రీధర్ తదితరులున్నారు. ఏలూరు (మెట్రో): వాహనమిత్ర పథకం అర్హుడైన ప్రతి లబ్ధిదారుడికి అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఎంపీడీఓలను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ నుంచి సోమవారం వాహనమిత్ర పథకం కింద అందిన దరఖాస్తులపై జిల్లా పరిషత్ సీఈఓ, ఎంపీడీఓలతో కలెక్టర్ టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ వాహనమిత్ర పథకం కింద అందిన దరఖాస్తుల పరిశీలన కార్యక్రమం వెంటనే పూర్తిచేయాలన్నారు. జిల్లాలో వాహనమిత్ర పథకానికి 11,770 దరఖాస్తులు అందాయని, వాటిలో 7,581 దరఖాస్తులు ఈ–కేవైసీ పూర్తి అయ్యాయని, మిగిలిన దరఖాస్తుదారుల ఈ–కేవైసీ పనులు వెంటనే పూర్తిచేసి, అర్హులైన దరఖాస్తుదారుల పరిశీలన వెంటనే పూర్తి చేయాలనీ కలెక్టర్ అధికారులను ఆదేశించారు. భీమవరం: ఆట్యా–పాట్యా సీనియర్స్ జిల్లా స్థాయి సెలక్షన్స్ ఈనెల 23వ తేదీన భీమవరం శ్రీచింతలపాటి బాపిరాజు స్మారకోన్నత పాఠశాలలో నిర్వహిస్తున్నట్లు జిల్లా అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు మంతెన రామచంద్రరాజు, జి.కిరణ్ వర్మ తెలిపారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఎంపిక పోటీలు జరుగుతాయ న్నారు. ఎంపికై న జట్లు ఈనెల 25, 26 తేదీల్లో పల్నాడు జిల్లాలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటాయని తెలిపారు. ఆసక్తి గల క్రీడాకారులు సెలక్షన్స్కు హాజరుకావాలని కోరారు. -
విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శిగా రాహుల్
నరసాపురం రూరల్ : వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శిగా నరసాపురం మండలం సీతారామపురం గ్రామానికి చెందిన రాహుల్ గంటా నియమితులయ్యారు. రాహుల్ తండ్రి సుందరకుమార్ దళిత సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేస్తున్నారు. రాహుల్ విద్యార్థి సమస్యలపై పోరాడి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని వైఎస్సార్సీపీ నాయకులు నల్లిమిల్లి జోసఫ్, ఇంజేటి జాన్ కెనడీ, కాకిలేటి ఆనందకుమార్ (మధు) పలువురు సర్పంచ్లు, ఎంపీటీసీలు, పార్టీ నాయకులు కోరారు.ముగిసిన టెన్నిస్ పోటీలు భీమవరం: పట్టణంలోని కాస్మోక్లబ్ ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ టేబుల్ టెన్నీస్ ర్యాంకింగ్ పోటీల్లో విజేతలకు క్లబ్ సెక్రటరీ బీవీ రామరాజు బహుమతులు అందజేశారు. ఆంధ్రప్రదేశ్ టేబుల్ టెన్నీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో టేబుల్ టెన్నీస్ ర్యాంకింగ్ పోటీలను నిర్వహించారు. బాలికల అండర్ 17 విభాగంలో మౌపర్ణదాస్, అండర్ 19 విభాగంలో మౌపర్ణదాష్, మహిళల విభాగంలో కాజోల్ సునార్, బాలుర అండర్ 17 విభాగంలో చేతన్ సాయి పటనాన, అండర్ 19 విభాగంలో వపన్ సత్య వెంకటేష్, పురుషుల విభాగంలో తేజా తెలిదేవర సూర్య విజేతలుగా నిలిచినట్లు నిర్వాహకుడు జీపీసీ శేఖరరాజు తెలిపారు.పిడుగుపాటుకు గేదెల మృతి ఆగిరిపల్లి: మండలంలో ఆదివారం రాత్రి భారీ వర్షంతోపాటు కొన్నిచోట్ల పిడుగులు పడ్డాయి. రాజవరంలో రైతు తోట రాజబాబుకు చెందిన పశువుల కొట్టం వద్ద పిడుగు పడింది. దీంతో రెండు గేదెలు మృతి చెందాయి. ఒకొక్క గేదె విలువ సుమారు రూ.లక్ష ఉంటుందని రైతు ఆవేదన చెందుతున్నాడు. కుటుంబ పోషణ కోల్పోయిన రైతును ఆదుకోవాలని సర్పంచ్ జాలాభూషణం ప్రభుత్వాన్ని కోరారు. -
అక్రమ నిర్మాణాల తొలగింపు
తాడేపల్లిగూడెం: ‘కూటమి నేతల ఇష్టారాజ్యం’ శీర్షికన గతనెల 14న ‘సాక్షి’లో ప్రచురించిన కథనానికి స్పందన వచ్చింది. తాడేపల్లిగూడెంలోని కామాక్షి కమర్షియల్ కాంప్లెక్సులో పార్కింగ్కు కేటాయించిన స్థలంలో నిర్మించిన అక్రమ నిర్మాణాల్లో కొన్నింటిని ఓ నిర్మాణదారుడు స్వచ్ఛందంగా తొలగించారు. నలుగురు భాగస్వాముల్లో ఒక్కరుగా ఉన్న టీడీపీ నియోజకవర్గ సమన్వయకర్త వలవల బాబ్జీ తన వాటా కింద ఉండాల్సిన పార్కింగ్ స్థలంలో నిర్మించిన మూడు దుకాణాల గోడలను బద్దలు కొట్టించి పార్కింగ్ కోసం ఇచ్చేశారు. ఇదిలా ఉండగా ఈ నిర్మాణాల్లో భాగస్వాములుగా ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారి, ఎరువుల వ్యాపారి, బంగారు నగల వ్యాపారులు మాత్రం స్పందించలేదు. వారి దుకాణాలనూ తొలగించాల్సి ఉంది. -
బ్రాందీ షాపులను తొలగించాలంటూ ధర్నా
నూజివీడు: మండలంలోని అన్నవరంలో నివాస గృహాలకు దగ్గరగా, పట్టణంలో మున్సిపల్ కార్యాలయం ఎదురుగా ఉన్న బ్రాందీ షాపులను వెంటనే అక్కడి నుంచి తొలగించాలని సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి నిమ్మగడ్డ నరసింహా డిమాండ్ చేశారు. రెండు షాపులను అక్కడి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ పట్టణంలోని ఎకై ్సజ్ స్టేషన్ వద్ద సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్నవరంలో ఉన్న బ్రాందీ షాప్ వల్ల ఆకతాయిలు చేస్తున్న చేష్టలతో మహిళలు, విద్యార్థినులు తీవ్ర భయాందోళనలకు గురి అవుతున్నారన్నారు. అలాగే పట్టణ నడిబొడ్డున మున్సిపల్ కార్యాలయం ఎదురుగా మద్యం వ్యాపారం చేస్తూ ప్రజలకు తీవ్ర అసౌకర్యం కలుగజేస్తున్నా ప్రభుత్వ అధికారులకు గానీ, ప్రజాప్రతినిధులకు గాని చీమకుట్టినట్టు కూడా లేదన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి నివాస గృహాల మధ్య, మున్సిపల్ కార్యాలయం ఎదుట ఉన్న మద్యం షాపులను తొలగించాలన్నారు. నాయకులు మడుపల్లి నాగేంద్రరావు, చెంగల వెంకటేశ్వరావు, ఆకునూరి విఘ్నేష్, బాధిత మహిళలు పాల్గొన్నారు. -
యాజమాన్య పద్ధతులతో అధిక దిగుబడులు
చింతలపూడి: మేలైన యాజమాన్య పద్ధతుల ద్వారా అధిక దిగుబడులు సాఽధించవచ్చునని చింతలపూడి వ్యవసాయ సబ్ డివిజన్ సహాయ సంచాలకులు వై సుబ్బారావు అన్నారు. ఎంటీయూ 1064 రకం 10,032 ఎకరాలు, ఎంటీయూ 1061 రకం, ఎంటీయూ 1318 రకం , పీఎల్ 1100 రకం , బీపీటీ 5,204 రకాలను రైతులు సాగు చేస్తున్నారు. ప్రస్తుతం వరి పిలక దశలో ఉంది. వెదజల్లే పద్ధతిలో ఖర్చు తక్కువ డివిజన్ పరిధిలో వెదజల్లే పద్ధతిలో కూడా రైతులు వరిసాగు చేస్తున్నారు. మెట్టలో ఎక్కువగా నారుడులు, నాట్లు పద్ధతిలోనే సాగవుతుంది. వెదజల్లే పద్ధతిలో ఖర్చు తగ్గుతుంది. నేరుగా వెదజల్లడం వల్ల కలుపు బెడద ఉంటుంది. గడ్డి, కలుపు నిర్మూలనకు ప్రిటెలక్లోర్, సిఫినర్ ఎకరాకు 600 మి.లీ ద్రావణాన్ని 200 లీటర్ల నీటిలో కలిపి విత్తనాలు వెదజల్లిన 3వ రోజులోపు పిచికారీ చేయాలి లేదా బ్యూటక్లోర్ ఎకరానికి 1.2 లీటర్ల ద్రావణాన్ని 20 కేజీల పొడి ఇసుకతో కలిపి పొలమంతా సమానంగా పడేట్లు విత్తిన 3వ రోజు లోపు చల్లాలి. విత్తిన 20 నుంచి 25 రోజుల లోపు వెడల్పాకు కలుపు సమస్య ఉంటే 3డి సోడియం సాల్డ్ పొడి మందును ఎకరాకు 400 గ్రాములు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి సాధారణ పద్ధతిలో సస్యరక్షణ నాట్లు పూర్తయిన పొలానికి చిరు పొట్టదశలో వేయాల్సిన ఎరువులో నత్రజనితో పాటు మ్యూరెట్ ఆఫ్ పొటాష్ని ఎకరానికి 150 నుంచి 200 కిలోల చొప్పున తప్పక వేయాలి. ఆలస్యంగా నాట్లు వేసిన, నీళ్లు నిల్వ ఉండే పల్లపు భూముల్లో జింకు ధాతు లోపం రావడానికి అవకాశం ఉంది. పంటపై జింక్ ధాతు లోపం కనిపించినప్పుడు రెండు దఫాలుగా వారం వ్యవధిలో 2 గ్రాముల జింక్ సల్ఫేట్ను లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. వరిసాగు చేస్తున్న రైతులు నీటి వినియోగం మీద అవగాహన పెంచుకోవాలి. అనవసరంగా ఎక్కువగా నీటిని వాడటం ద్వారా ఎరువుల వినియోగ సామర్ధ్యం తగ్గడమే కాకుండా, నీరు కూడా వృథా అవుతోంది. పిలక దశలో ఒక అంగుళం, చిరుపొట్టదశలో రెండు అంగుళాల నీటిని వినియోగించుకుని మెరుగైన దిగుబడులు సాధించాలి. సార్వాలో ముందుగా ఊడ్చిన పొలాల్లో కాండం తొలుచు పురుగు, ఆకుముడత పురుగు ఆశించే అశకాశం ఉంది. వీటి నివారణకు లీటరు నీటికి కార్టాప్ హైడ్రాక్లోరైడ్ 2 గ్రాములు లేదా క్లోరాంట్రనిలిప్రోల్ 0.3 మి.లీటర్లు లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. చిరుపొట్ట దశలో ఎకరానికి కార్టాఫ్ హైట్రాక్లోరైడ్ 4జి గుళికలు 8 కిలోలు లేదా కార్బోప్యూరాన్ 3జి గుళికలు 10 కిలోలు లేదా క్లోరాంట్రనిలిప్రోల్ 0.4జి గుళికలు 4 కిలోలు వేసుకోవాలి. వరిలో ప్రొఫెనోపాస్ను నల్లి నివారణకు కొంత మంది రైతులు పిచికారీ చేస్తున్నారని, వరిలో ప్రొఫెనోపాస్ వాడటం వల్ల దోమపోటు అధికం అవుతుంది. అందువల్ల ప్రొఫెనోపాస్ బదులు ఎసిఫైట్ వాడాలి. వై సుబ్బారావు, సబ్ డివిజన్ సహాయ సంచాలకులు -
డీజేలతో గుండె గుబేల్ !
యలమంచిలి: పండుగలు, పెళ్లిళ్లు, ఉత్సవాలు శుభకార్యం ఎలాంటిదైనా సరే డీజే శబ్దాలు ఉండాల్సిందే. డీజే సంగీతానికి దాని దగ్గర ఉండి ఉత్సాహంగా నృత్యం చేసే వారికి ఆనందంగా ఉంటుందేమో గానీ కొందరికి అదే ప్రాణ సంకటంగా మారుతోంది. పలు ప్రాంతాల్లో డీజేల వద్ద నృత్యం చేస్తూ గుండె ఆగి చనిపోయారన్న వార్తలు ఇటీవల తరచూ చూస్తున్నాం. అంతేగాక దీని వల్ల శబ్ద కాలుష్యం పెరగడంతో పాటు చెవిటి, గుండె సమస్యలు, మానసిక సమస్యలు కూడా వస్తున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అయినా వీటి నియంత్రణకు అధికారులు ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా డీజే సౌండ్ బాక్స్ వినియోగం బాగా పెరిగింది. వివాహం అనంతరం ఇంటికి నూతన దంపతులను తీసుకొచ్చే తరుణంలో చేసే ఊరేగింపు (మెర్వణి), రాజకీయ నాయకులకు స్వాగతం పలికేందుకు చేసే ఊరేగింపు, ఏదైనా పోటీలో గెలిచినప్పుడు చేసే ఊరేగింపు ఇలా ఒక్కటేమిటి ఆనందం వచ్చినప్పుడు చేసుకునే ఎలాంటి ఊరేగింపునకై నా డీజే బాక్స్తో సంబంరం ఉండాల్సిందే. ఈ సందర్భంగా డీజే సౌండ్ బాక్సులు చేసే శబ్దాలకు యువత ఉత్సాహపు నృత్యాలతో ఆ ప్రాంతం మార్మోగిపోవాల్సిందే. దీని వల్ల అధిక శబ్ద కాలుష్యం వెలువడుతున్నా, హృద్రోగులు, సున్నిత మనస్సు గలవారు, పిల్లలు, వృద్ధులు ఇబ్బందులు పడుతున్నా ఎవ్వరికీ పట్టింపు ఉండదు. వారి ఆనందం వారిదేనన్న విధంగా పరిస్థితులు మారిపోయాయి. విపరీతమైన శబ్దాలతో ఊరేగే డీజే బాక్సులు ప్రమాదకరమని వైద్యులు చెబుతున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. అధిక శబ్ధాలు ఆరోగ్యానికి చేటు! మనం రోడ్డుపై వెళుతుంటే పెద్దగా శబ్దాలు చేస్తూ వాహనాలు వెళ్తుంటేనే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అలాంటిది గంటల తరబడి రోడ్లపై డీజే శబ్దాలతో ఊరేగింపు సాగితే ఇంకెలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. కొందరు అర్ధరాత్రి వరకు డీజే శబ్దాలతో చేసే ఊరేగింపుతో ఎంతో మంది తీవ్ర అనారోగ్యానికి గురవున్నారు. డీజే శబ్దాలతో గుండె సమస్యలు, మానసిక సమస్యలు, వినికిడి లోపాలు, చిన్నారులు, వృద్ధుల ఆరోగ్యానికి ఇబ్బంది ఏర్పడుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వాహనాలకు సౌండ్ హారన్లను నియంత్రిస్తున్న అధికారులు డీజేలను ఎందుకు నియంత్రించలేకపోతున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బహిరంగ ప్రదేశాల్లో 10 డెసిబుల్స్కు మించి శబ్దం చేయరాదు. ప్రైవేటు ప్రదేశాల (ఇల్లు, హాళ్లు)లో డీజే శబ్దాలు చేయరాదు. లిఖిత పూర్వక అనుమతి లేకుండా లౌడ్ స్పీకర్లు, సౌండ్ బాక్సులు వాడకూడదు. నిషిద్ధ ప్రాంతాలుగా గుర్తించిన ప్రదేశాల్లో సంగీత ధ్వనులు, డ్రమ్స్ కొట్టడం, ఇతర శబ్దాలు చేయకూడదు. సినిమా థియేటర్లలో సైతం 65 డెసిబుల్స్కు మించి శబ్దం రాకూడదు. వైద్యశాలలు, విద్యా సంస్థలు, దేవాలయాలు, న్యాయ స్థానాలకు వంద మీటర్ల పరిధిలోని ప్రాంతాలను నిషిద్ధ ప్రాంతాలుగా పరిగణిస్తారు. ఇక్కడ శబ్దాలు చేయడంపై నిషేధం విధించారు. పెరిగిన డీజేల వాడకం అధిక శబ్దాలతో కాలుష్య కాటు గర్భిణులు, చిన్నారులు, వృద్ధులు, గుండె వ్యాధుల వారికి ప్రమాదం పట్టించుకోని అధికారులు -
పారదర్శకంగా ఆక్వాజోనైజేషన్
భీమవరం: ఆక్వాజోనైజేషన్ నిర్ధారణలో నిబంధనల మేరకు పారదర్శకతతో కూడిన ప్రతిపాదనలను సిఫార్సు చేయాలని జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం జాయింట్ కలెక్టర్ చాంబర్లో మత్స్య, వ్యవసాయ శాఖ అధికారులు, ఉండి, ఆకివీడు, కాళ్ళ, భీమవరం, పెంటపాడు, గణపవరం మండలాల ఎఫ్డీఓలు, ఎంఏఓలతో జాయింట్ కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెప్టెంబర్ 19న నిర్వహించిన ఆక్వా జోనైజేషన్ ప్రకటన కమిటీలో ఆమోదించిన 31,307.4 ఎకరాల విస్తీర్ణంతో కలిపి ప్రస్తుతం జిల్లాలో 1,32,562.9 ఎకరాల ఆక్వా సాగు విస్తీర్ణం ఉందని తెలిపారు. ఆక్వా జోనైజేషన్ సర్వేలో వివిధ కారణాలతో తిరస్కరించిన 9,855.31 ఎకరాల విస్తీర్ణంపై జాయింట్ కలెక్టర్ అధ్యక్షతన సోమవారం పునఃపరిశీలన జరిగింది. సమావేశంలో మత్స్య శాఖ సహాయ సంచాలకుడు ఆర్.వి.ఎస్.ప్రసాద్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జెడ్.వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
డాక్టర్ బాబ్జీకి జగన్ పరామర్శ
పాలకొల్లు సెంట్రల్: ప్రముఖ వైద్యుడు, మాజీ ఎమ్మెల్యే సీహెచ్ సత్యనారాయణమూర్తి(బాబ్జీ) కుమారుడు అంజిబాబు మృతి పట్ల మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం తెలిపారు. సోమవారం డాక్టర్ బాబ్జీకి ఫోన్ చేసిన జగన్మోహన్రెడ్డి అంజిబాబు మృతిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. తాడేపల్లిగూడెం (టీఓసీ): సెలవు రోజుల్లో తరగతులు నిర్వహిస్తున్న ప్రైవేటు విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని ఆలిండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (ఏఐఎస్ఏ) జిల్లా కార్యదర్శి టి.అప్పలస్వామి డిమాండ్ చేశారు. పట్టణంలో సోమవారం డీవైఈఓ రామాంజనేయులకు ఏఐఎస్ఏ నాయకులు వినతిపత్రం ఇచ్చారు. అప్పలస్వామి మాట్లాడుతూ ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు దసరా సెలువులు ప్రభుత్వం ఈ నెల 22 నుంచి వచ్చే నెల 2 వరకు ఇచ్చిందని, అయితే సెలవులు ఇవ్వని వారిపై చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం జీఓ విడుదల చేసిందని, పట్టణంలోని ప్రైవేటు విద్యా సంస్థలు యథావిధిగా స్కూల్స్ నడిపారన్నారు. విద్యార్థి సంఘాలు స్కూల్స్ నడిపే వారి వద్దకు వెళ్తే మాకు పర్మిషన్ ఉందని సమాధానాలు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. తాడేపల్లిగూడెం రూరల్: తాడేపల్లిగూడెం పట్టణ, పరిసర గ్రామాల్లో గడిచిన 24 గంటల్లో 30.2 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైందని తహసీల్దార్ ఎం.సునీల్ కుమార్ సోమవారం తెలిపారు. పెంటపాడు మండలంలో 18.0 మిల్లీమీటర్లుగా వర్షపాతం నమోదైందన్నారు. సోమవారం సాయంత్రం 5.40 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు భారీ వర్షం కురిసింది. దాదాపు గంటన్నరకు పైగా కురిసిన వర్షంతో పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్, తాలూకా ఆఫీస్ సెంటర్, పంచాయతీ రాజ్ కార్యాలయం తదితర లోతట్టు ప్రాంతాల్లోకి వర్షపు నీరు చేరింది. ఏలూరు(ఆర్ఆర్పేట): ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా డీఎస్పీ–2025లో నూతనంగా ఎంపికై న ఉపాధ్యాయులందరూ ఈ నెల 25న అమరావతిలో నియామకపు లేఖ అందిస్తారని జిల్లా విద్యాశాఖాధికారి ఎం. వెంకటలక్ష్మమ్మ తెలిపారు. ఈ నెల 24న సాయంత్రం 4 గంటలకు ఏలూరులో నిర్వహించే వెన్యూకి వచ్చి రిపోర్ట్ చేయాలని, అక్కడి నుంచి 25న ఉదయం 8 గంటలకు బస్సు ద్వారా మధ్యాహ్నం 12 గంటలకు నేరుగా అమరావతిలో జరిగే కార్యక్రమ ప్రాంగణానికి చేరుకుంటారన్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు అమరావతిలో నియామక లేఖ అందచేస్తారన్నారు. భీమవరం (ప్రకాశంచౌక్): ఇన్చార్జ్ జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారిగా ఏవీ సూరిబాబు నియమితులయ్యారు. సోమవారం కలెక్టరేట్ చాంబర్లో కలెక్టర్ని ఆయన మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. టి.నరసాపురం: మండలంలో కురిసిన భారీ వర్షానికి ముగ్గురాళ్ళ వాగు, జలవాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. ఇటీవల భారీ వర్షాలతో వాగులు ఉధృతంగా ప్రవహించడంతో మండలంలోని బండివారిగూడెం–మక్కినవారిగూడెం, టి.నరసాపురం – మక్కినవారిగూడెం గ్రామాల మధ్య రెండు రోజుల పాటు వాహన రాకపోకలు నిలిచిపోయాయి. ఆదివారం రాత్రి మరోసారి భారీ వర్షం కురవడంతో ముగ్గురాళ్ళవాగు, జలవాగులు వంతెనపై నుంచి పొంగి ప్రవహిస్తుండడంతో ఆ మార్గంలో వాహన రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. అధికారులు, పోలీసు సిబ్బంది వాగును పరిశీలించి రోడ్ల వద్ద హెచ్చరికలు ఏర్పాటు చేశారు. -
కూటమి ప్రభుత్వం విఫలం
పెనుగొండ: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు విమర్శించారు. సోమవారం తూర్పుపాలెంలో క్యాంపు కార్యాలయంలో మండల గ్రామ కమిటీల నియామకంపై కార్యకర్తలు, నాయకులతో సమీక్ష నిర్వహించారు. అలవికాని హామీలను ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కూటమి హామీలు అమలు చేయకుండా మోసం చేసిందన్నారు. రైతులను తీవ్రంగా ఇబ్బందుల పాలు చేసిందన్నారు. నేటి వరకూ వారికి ఇన్పుట్ సబ్సిడీ చెల్లించలేదని, ధాన్యం సొమ్ములు సకాలంలో చెల్లించడంలో విఫలమైందని అన్నారు. పేదలకు ఉన్నత విద్య అందనివ్వకుండా ప్రైవేటీకరణ చేస్తూ తీవ్ర అన్యాయం చేస్తుందన్నారు. వీటిపై పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పోరాటాలను విజయవంతం చేయడానికి కార్యకర్తలు, నాయకులు అందరూ కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి దంపనబోయిన బాబూరావు, రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు చిన్నం రామిరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి మేడపాటి సాయి చంద్రమౌలీశ్వర రెడ్డి, నల్లిమిల్లి వేణు ప్రతాపరెడ్డి, ముత్యాల నాగేశ్వరరావు, ఇళ్ల చంద్రకళ, చింతపల్లి గురుప్రసాద్, పులిదిండి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మాజీ మంత్రి శ్రీరంగనాథరాజు -
అర్జీల పరిష్కారంపై దృష్టి పెట్టాలి
కలెక్టర్ నాగరాణిభీమవరం (ప్రకాశంచౌక్): పీజీఆర్ఎస్లో అందిన దరఖాస్తుల పరిష్కారంపై అధికారులు దృష్టి పెట్టాలని కలెక్టరు చదలవాడ నాగరాణి సూచించారు. సోమ వారం కలెక్టరేట్లో జిల్లా స్థాయి పీజీఆర్ఎస్లో ఆమె పాల్గొని పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అనంతరం మాట్లాడుతూ పీజీఆర్ఎస్కు 194 అర్జీలు అందాయని వాటిని ఆయా శాఖాధికారులకు పంపి వేగంగా పరిష్కరించాలని ఆదేశించినట్లు చెప్పారు. అక్టోబర్ 2 నుంచి జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రముఖ దేవాలయాల్లో సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ వినియోగించరాదని, జిల్లా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. అనంతరం సమిత్వ ప్రగతిపై సమీక్షించారు. ఈ నెల 27 నాటికి సర్వే ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, డీఆర్ఓ బి.శివన్నారాయణ రెడ్డి, పీజీఆర్ఎస్ నోడల్ అధికారి వై.దోసిరెడ్డి, డ్వామా పీడీ కేసీహెచ్ అప్పారావు పాల్గొన్నారు. -
మధ్యాహ్న భోజనం బిల్లులు చెల్లించండి
భీమవరం: మధ్యాహ్న భోజన కార్మికుల పెండింగ్ బిల్లులు, జీతాలు వెంటనే విడుదల చేయాలని, పనికి తగ్గ జీతాలు ఇవ్వాలని మధ్యాహ్న భోజన వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి ఎన్.నాగమణి డిమాండ్ చేశారు. బుధవారం సీఐటీయూ ఆఫీసులో ఎండీ మదీనా అధ్యక్షతన జరిగిన జిల్లా సమావేశంలో ఆమె మాట్లాడుతూ గత 23 సంవత్సరాల నుండి పనిచేస్తున్నా కేవలం రూ.3000 ఇస్తున్నారని అది కూడా గత పది సంవత్సరాల నుంచి పెంచలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత ఐదు సంవత్సరాల నుండి మధ్యాహ్నం భోజనంలో అనేక మార్పులు చేశారని వంట పెరిగిందని, ఖర్చులు పెరిగినయని ఖర్చులకు తగ్గట్టు బిల్లులు పెంచలేదని బిల్లులు కూడా నాలుగైదు నెలల పాటు పెండింగ్ పెట్టడాన్ని ఆమె తీవ్రంగా వ్యతిరేకించారు. మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలపై ఐక్యంగా ఆందోళన చేయాలన్నారు. స్థానిక పెద్దల ఒత్తిడితో అనేక ఇబ్బందులతో మధ్యాహ్న భోజన కార్మికులు పని చేస్తున్నారని వారి సమస్యల పట్ల, చిరు ఉద్యోగులపై అధికారులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు సహకరించాలని తోడ్పాటు ఇవ్వాలని కోరారు. సీఐటీయు జిల్లా ఉపాధ్యక్షుడు బి.వాసుదేవరావు తదితరులు మాట్లాడారు. అనంతరం ఎండీ మదీనా అధ్యక్షులుగా ఎన్.నాగమణి జిల్లా ప్రధాన కార్యదర్శిగా నూతన కమిటీని ఎన్నుకున్నారు. అక్టోబర్ 6న జిల్లాలో మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యల పరిష్కారానికి కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించాలని సమావేశం తీర్మానించింది. -
శ్రీవారి హుండీ ఆదాయం రూ. 2.18 కోట్లు
ద్వారకాతిరుమల: ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయ హుండీల నగదు లెక్కింపు స్థానిక ప్రమోద కల్యాణ మండపంలో బుధవారం జరిగింది. ఈ లెక్కింపులో శ్రీవారికి విశేష ఆదాయం సమకూరింది. గత 31 రోజులకు నగదు రూపేణా స్వామికి రూ.2,18,84,539 ఆదాయం లభించినట్టు ఆలయ ఈఓ ఎన్వీ సత్యన్నారాయణ మూర్తి తెలిపారు. కానుకల రూపేణా భక్తులు సమర్పించిన 120 గ్రాముల బంగారం, 4.079 కేజీల వెండితో పాటు, అధికంగా విదేశీ కరెన్సీ లభించిందన్నారు. లెక్కింపులోకి రాని రద్దయిన పాత రూ.2000, రూ.500 నోట్ల ద్వారా రూ. 12 వేలు లభించినట్టు చెప్పారు.జగన్మోహన్రెడ్డిని కలిసిన మురళీకృష్ణంరాజు భీమవరం: వైఎస్సార్సీపీ తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో బుధవారం సమీక్షా సమావేశంలో నరసాపురం పార్లమెంటు పరిశీలకుడు ముదునూరి మురళీకృష్ణంరాజు పాల్గొన్నారు. పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. నరసాపురం పార్లమెంటుకు సంబంధించి పలు అంశాలపై చర్చించి, పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు.పెరుగుతున్న గోదావరి వరదపోలవరం రూరల్: గోదావరి వరద ఉధృతి పెరుగుతోంది. నదీ పరీవాహక ప్రాంతంలో నీరు కలవడంతో వరద ప్రవాహం కొనసాగుతోంది. పోలవరం ప్రాజెక్టు స్పిల్వే వద్ద 30.400 మీటర్లకు నీటి మట్టంచేరుకుంది. స్పిల్వే నుంచి 5.50 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు చేరుతోంది. ఎగువన భద్రాచలం వద్ద కూడా క్రమేపీ వరద పెరుగుతూ 34.80 అడుగులకు నీటిమట్టం చేరుకుంది.ఉప్పొంగిన ఎర్రకాలువకొయ్యలగూడెం: ఎర్రకాలువ గేట్లు ఎత్తడంతో కొయ్యలగూడెం మండలం మంగపతిదేవిపాలెం జంగారెడ్డిగూడెం మండలం పంగిడిగూడెం గ్రామాల మధ్య బుధవారం రాకపోకలు స్తంభించాయి. ఏజెన్సీలోని ఎగువ కురిసిన భారీ వర్షాలతో ఎర్రకాలువ జలాశయం నిండింది. దీంతో ఇరిగేషన్ శాఖ అధికారులు కరాటం కృష్ణమూర్తి ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో ఎర్రకాలువ ఉధృతి కొనసాగింది. రెండు మండలాల మధ్య ఉన్న కల్వర్టుకి ఇరువైపులా రెవెన్యూ సిబ్బందిని గస్తీకి నియమించారు.‘నారాయణ’కు కొమ్ముకాస్తున్న డీఈవోఏలూరు (ఆర్ఆర్పేట): జిల్లా విద్యాశాఖాధికారి నారాయణ విద్యా సంస్థలకు కొమ్ము కాస్తున్నారని ఎస్ఎఫ్ఐ నాయకులు విమర్శించారు. దసరా సెలవుల్లో నారాయణ జూనియర్ కాలేజీలో హైస్కూల్ నడుపుతుంటే ఎస్ఎఫ్ఐ వెళ్ళి విద్యార్థులను ఇంటికి పంపించిందని తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి లెనిన్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల్ని ధిక్కరిస్తూ నారాయణ విద్యాసంస్థలు నడపటం దుర్మార్గమని, బుధవారం జూనియర్ కళాశాలలో 6వ తరగతి నుంచి పదో తరగతి వరకు విద్యార్థులను గదుల్లో బంధించి స్కూల్ నడపడం దుర్మార్గమన్నారు. 22 నుంచి అక్టోబర్ 2 వరకు దసరా సెలవులు కాగా నారాయణ స్కూల్ ఇప్పటి వరకు సెలవులు ఇచ్చింది లేదన్నారు. -
రోడ్లపై తిరగలేం
సాక్షి, భీమవరం : అసెంబ్లీ సాక్షిగా జిల్లాలోని రోడ్లు దుస్థితికి ఎమ్మెల్యేల వ్యాఖ్యలు అద్దం పడుతున్నాయి. ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హామీల్లో ఒకటైన రోడ్లను అభివృద్ధి చేయక ఇప్పటికే ప్రభుత్వానికి వ్యతిరేకంగా జనం రోడ్డెక్కుతున్నారు. ఎమ్మెల్యేలకు ఈ సెగ తాకుతోంది. రోడ్లపై ప్రజలు తమను ప్రశ్నిస్తున్నారంటూ అసెంబ్లీలో వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం ప్రశ్నోత్తరాల సమయంలో జిల్లాకు చెందిన జనసేన ఎమ్మెల్యేలు పులపర్తి, బొలిశెట్టిలు ఈ విషయమై నిలదీశారు. మున్నాళ్ల ముచ్చట రోడ్లను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయడంలో చేతులెత్తేసిన కూటమి సర్కారు మరమ్మతులు తూతూమంత్రంగా చేసింది. ప్యాచ్ వర్కులు, అత్యవసర మరమ్మతుల నిమిత్తం జిల్లాకు రూ.42.57 కోట్లు మంజూరు చేసింది. స్టేట్ హైవే(ఎస్హెచ్) రోడ్లలో రూ. 10.45 కోట్లు విలువైన 41 పనులు, మేజర్ డిస్ట్రిక్ట్ రోడ్ల(ఎండీఆర్)లో రూ.32.12 కోట్లు విలువైన 140 పనులు ఉన్నాయి. వీటిలో దాదాపు 70 శాతం మేర పనులు మాత్రమే పూర్తయినట్టు అంచనా. నిర్ణీత ప్రమాణాలు పాటించకుండా చాలాచోట్ల నాసిరకంగా పనులు చేశారు. వాహనాల తాకిడికి రాళ్లు పైకిలేచి రోడ్డంతా చెల్లాచెదురై అధ్వానంగా తయారయ్యాయి. ప్రయాణికుల అగచాట్లు జిల్లాలోని తాడేపల్లిగూడెం–ప్రత్తిపాడు, భీమవరం–తాడేపల్లిగూడెం, మోగళ్లు– అత్తిలి, బ్రాహ్మణచెరువు–వీరవాసరం, సిద్దాంతం–పెనుగొండ, పెదకాపవరం–క్రొవ్విడి, నౌడూరు– కొండేపూడి తదితర రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. ఎక్కడికక్కడ పెద్దపెద్ద గోతులతో ఆందోళనకు గురిచేస్తున్నాయి. కొన్నిచోట్ల మడుగులను తలపిస్తున్నాయి. వర్షం నీరు చేరి గోతులు కనిపించక ప్రయాణికులు ప్రమాదాలు పాలవుతున్నారు. వాహనాల తాకిడికి రోడ్లుపై ఉన్న బురద దారిన వెళ్లే వారిపై పడి తీవ్ర అసౌకర్యానికి గురికావాల్సి వస్తోంది. ఉద్యోగం, వ్యాపారం నిమిత్తం రోజూ రాకపోకలు సాగించేవారు, ద్విచక్ర వాహనచోదకులు నడుంనొప్పి, వెన్నునొప్పితో బాదపడుతున్నామని, వాహననాలు తరచూ మరమ్మతులకు గురవుతున్నాయని వాపోతున్నారు. నవుడూరులో రోడ్డెక్కిన జనం నరకానికి నకలు ఈ రోడ్డంటూ ఇటీవల బ్రాహ్మణచెరువు– వీరవాసరం రోడ్డులోని నవుడూరు వద్ద గ్రామస్తులు రోడ్డెక్కి ఆందోళనకు దిగారు. మడుగులను తలపిస్తున్న గోతులతో రాకపోకలు సాగించలేకున్నామని వాహనాలను రోడ్డుపై నిలిపి నిరసన తెలిపారు. ప్రయాణికులు వాహనాలు నిలిపి వారికి మద్దతు తెలిపారు. గత ప్రభుత్వంలో మంజూరైన రూ.2.5 కోట్లతో రోడ్డు అభివృద్ధి పనులు చేపట్టాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. అసెంబ్లీ సాక్షిగా రోడ్ల దుస్థితిని చాటి చెప్పిన కూటమి ఎమ్మెల్యేలు జిల్లాలో అధ్వానంగా రోడ్లు మూన్నాళ్ల ముచ్చటైన మరమ్మతులు రాకపోకలు సాగించలేక ప్రయాణికుల అవస్థలు నవుడూరులో గోతుల్లో వాహనాలు నిలిపి నిరసన తెలిపిన ప్రజలు అధికారంలోకి వచ్చి పదిహేను నెలలైనా రోడ్ల సమస్య అలానే ఉంది. ఆర్అండ్బీ మంత్రి గారికి చాలాసార్లు చెప్పాం. రోడ్లు బాగుచేయడం లేదని.. ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వస్తోంది. బిల్లులు ఇవ్వడం లేదని కాంట్రాక్టర్లు ముందుకురావడం లేదు. రోడ్లపై తిరిగే పరిస్థితి లేకుండా ఉంది. సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టాలి. – తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ యనమదుర్రు డ్రెయిన్పై అసంపూర్తిగా నిలిచిపోయిన మూడు అప్రోచ్ రోడ్ల సమస్యను ప్రభుత్వం దృష్టికి ఎన్నోమార్లు తీసుకువచ్చాను. మంత్రికి పలుమార్లు వినతిపత్రాలు ఇచ్చాను. అవి పూర్తయితే ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది. భీమవరంలో ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. – భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు బ్రాహ్మణచెరువు–వీరవాసరం రోడ్డులో నౌడూరు వద్ద 300 మీటర్లు మేర రోడ్డు ధ్వంసమైంది. మా మెకానిక్ షాపు ఇక్కడే ఉండటం వల్ల కళ్లెదుటే ఎంతోమంది ప్రయానికులు గోతుల్లో అదుపుతప్పి పడిపోవడం చూస్తుంటే ఎంతో బాధేస్తోంది. – మేనేడి సత్యనారాయణ, మాజీ ఉపసర్పంచ్, పొలమూరు రోడ్లు అధ్వానంగా తయారవ్వడంతో నిత్యం ప్రయాణికులు ప్రమాదాల పాలవుతున్నా ప్రభుత్వం, అధికారులు పట్టించుకోవడం లేదు. ప్యాచ్ వర్కులు పూర్తిగా చేయలేదు. రోడ్ల నిర్మాణం కూడా చేపట్టలేదు. – పోతంశెట్టి లక్ష్మి, పెంటపాడు నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉంది. ఎక్కడ చూసినా గోతులే. మరమ్మతులు తూతూమంత్రంగా చేయడంతో కొద్దిపాటి వర్షానికే అవి పాడైపోయాయి. ఈ రోడ్లపై రాకపోకలకు ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. – అంబటి రమేష్, ఆకివీడు -
●మాకెందుకీ అవస్థలు!
మెగా డీఎస్సీ ఉద్యోగాల పబ్లిసిటీ కోసం రాష్ట్రంలో ఎంపికై న ఉపాధ్యాయులకు మునుపెన్నడూ లేని విధంగా అమరావతిలో నియామకపత్రాలు అందచేయడానికి శ్రీకారం చుట్టారు. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చేవారికి ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఇస్తామని చేసిన పబ్లిసిటీ నూతన గురువులకు అవస్థలు తెచ్చిపెట్టాయి. ఉమ్మడి జిల్లాలో 1146 మంది ఎంపికై న ఉపాధ్యాయులకు, సహాయకులకు కలిపి ఏలూరు నగరంలో వివిధ పాఠశాలల్లో వసతి ఏర్పాటు చేశారు. తీరా వచ్చి చూస్తే సరైన వసతులు లేక, నేలపైనే టార్పాలిన్పై పడుకున్నారు. పాఠశాలల్లో సుమారు 300 మందికి సరిపడా బాత్రూమ్లు లేక వచ్చిన వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏ జిల్లాకు ఆ జిల్లా అధికారులతో నియామకపు పత్రాలు అందచేస్తే ఏ ఇబ్బందులు ఉండవుకదా.. పబ్లిసిటీ కోసం మమ్మల్ని బలి చేస్తారా? అంటూ ఎంపికై న ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. –సాక్షి ఫొటోగ్రాఫర్/ఏలూరు -
వీసీ ఎంపికపై వీడని చిక్కుముడి
తాడేపల్లిగూడెం: డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయ వైస్ చాన్సలర్ నియామకంపై ఇంకా చిక్కుముడి వీడలేదు. వీసీ ఆగస్టు 31న ఉద్యోగ విరమణ చేశారు. ఇంతవరకు ఎవరినీ ఇన్చార్జిగా కూడా నియమించలేదు. యుజీసీ నిబంధనల మేరకు ప్రకారం వయస్సు పొడిగింపు వ్యవహారానికి సంబంధించి హైకోర్టులో దాఖలైన రిట్ పిటిషన్ను కోర్టు కొట్టేసింది. ఈ క్రమంలో ఉద్యాన వర్సిటీ ఇన్చార్జి వీసీగా నియమించడానికి అర్హులైన మూడు పేర్లను పంపించాలని ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు సుబ్రహ్మణ్యం, ప్రసన్నకుమార్, గోవిందరాజులు పేర్లు ప్రభుత్వానికి వెళ్లాయి. అక్కడి నుంచి వ్యవసాయ శాఖ మంత్రి పేషీకి పంపించారు. ఈ ఫైల్ను సుమారు పది రోజులకు పైగా మంత్రి పేషీలో ఉంచారు. ఈ ఫైల్ను కదపకుండా మంత్రి దృష్టికి తీసుకెళ్లకుండా కొందరు అధికారులు గోప్యత పాటించారని తెలుస్తోంది. ఉద్యాన వర్సిటీ స్థాపించిన 18 ఏళ్లలో వీసీ కుర్చీ ఇన్నాళ్ల పాటు ఖాళీగా లేదు. ఇన్చార్జి లేదా పూర్తిస్థాయి బాధ్యతలతో వీసీగా పనిచేసి ఇంకో నెల రోజుల్లో ఉద్యోగ విరమణ చేస్తారనగా క్రియాశీలక నిర్ణయాలు, కీలక అంశాలకు సంబంధించిన ఫైళ్లపై సంతకాలు చేయడం కుదరదని, వర్సిటీ మార్గదర్శకాలు ఉన్నాయి. అత్యవసర విషయాలైతేనే చివరి నెలలో కూడా వీసీ సంతకాలు చేయొచ్చు. ఉద్యాన వర్సిటీలో ఆగస్టు నెలలో కొన్ని కీలక విషయాలపై సంతకాలు జరిగాయనే ప్రచారం ఉంది. వర్సిటీలో పనిచేసే కొందరు ప్రొఫెసర్లకు సీనియర్ ప్రొఫెసర్గా పదోన్నతిపై సంతకాలు చేశారని సమాచారం. బోధనా విధుల కోసం నెలకు రూ.35 వేలు, రూ.45 వేలు, రూ.55 వేలు వేతనం చెల్లించేలా టీచింగ్ అసోసియేట్స్ను వీసీ విచక్షణాధికారంతో నియమించుకోవచ్చు. ఇలాంటి నియామకాల ఫైల్పై గత నెలలో సంతకాలు జరిగాయనే చర్చ నడుస్తోంది. కేవలం వెబ్సైట్లో ప్రకటన ఇచ్చి ఈ పోస్టులను భర్తీ చేసుకోవచ్చు, కాని ఉద్యోగ విరమణ సమయంలో చేయకూడదనే నిబంధన ఉందంటున్నారు. వీసీ లేకపోవడంతో ఆఫ్కాస్ కింద పనిచేసే సెక్యూరిటీ, కాంట్రాక్టు సిబ్బందికి కొద్ది నెలలుగా జీతాలు లేకున్నా బాధ్యులు పట్టించుకోలేదని సమాచారం. ఉద్యానవర్సిటీ పాలనా భవనం -
గర్భిణులకు పౌష్టికాహారం అందించాలి
భీమవరం(ప్రకాశం చౌక్): గర్భిణులు, బాలింతలకు అంగనవాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారం అందించాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. మంగళవారం కలెక్టరేట్ పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ప్రగతిపై కలెక్టర్ సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళలు, పిల్లలు ఆరోగ్యంగా ఉంటేనే సమాజం అభివృద్ధి చెందుతుందన్నారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు అందుతున్న పౌష్టికాహారం తింటున్నారా? లేదా? పరిశీలించి గర్భిణీ సీ్త్రలకు ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు అవగాహన కల్పించాలన్నారు. తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడే తల్లీబిడ్డల ఆరోగ్యంపై అంగన్వాడీ కార్యకర్తలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. జిల్లాలో ఎక్కడా కూడా బాల్యవివాహాలు నమోదు కాకూడదన్నారు. సమావేశంలో మహిళాభివృద్ధి,శిశు సంక్షేమ శాఖ అధికారి డి.శ్రీలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి అత్యంత ప్రాధాన్యతనిచ్చి, అవసరం మేరకు వెంటనే నిర్మాణాలు చేపట్టాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో డిస్ట్రిక్ట్ వాటర్ అండ్ శానిటేషన్ మిషన్ మీటింగ్ నిర్వహించారు. స్వచ్ఛభారత్ మిషన్ పనులు, స్వచ్ఛతాహి సేవ –2025 కార్యక్రమాలు, జల జీవన్ మిషన్ పనులు, విలేజ్ వాటర్ అండ్ శానిటేషన్ కమిటీ సభ్యుల చొరవ, తదితర అంశాలపై సమీక్షించారు. పెనుగొండ: ములపర్రు సర్పంచ్ చెక్ పవరు రద్దు కేస్తూ డీపీఓ రామ్నాథ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల పంచాయతీపై అవినీతి ఆరోపణ నేపథ్యంలో విచారణ నిర్వహించారు. అవినీతి జరిగినట్లు గుర్తించడంతో గ్రామ కార్యదర్శులుగా విధులు నిర్వహించిన నలుగురుకు నోటీసులు జారీచేస్తూ, సర్పంచ్ చెక్ పవర్ రద్దు చేస్తున్నట్లు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. చింతలపూడి: పశ్చిమ గోదావరి జిల్లాలో మూడు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు తోడు ఖమ్మం జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు తమ్మిలేరు రిజర్వాయర్కు వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ఇరిగేషన్ అధికారులు అప్రమత్తమయ్యారు. జలాశయం నుంచి 1,072 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. భారీ వర్షాలకు ఎగువ ఖమ్మం జిల్లా నుంచి తమ్మిలేరుకు వరద నీరు చేరుతోంది. తమ్మిలేరు ప్రాజెక్టు నీటిమట్టం ప్రస్తుతం 348.60 అడుగులకు చేరుకుందని, గోనెలవాగు నీటిమట్టం 348.27 అడుగులకు చేరుకున్నట్లు తమ్మిలేరు ఇరిగేషన్ ఏఈ లాజర్బాబు తెలిపారు. ప్రాజెక్టు సామర్ధ్యం 3 టీఎంసీలు కాగా 1.883 టీఎంసీలకు చేరుకున్నట్లు చెప్పారు. -
ఆయాలకు అందని జీతాలు
భీమవరం: ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేటు, కార్పొరేట్ స్కూల్స్కు ధీటుగా గత ప్రభుత్వం మనబడి నాడు–నేడు పథకంలో అభివృద్ధి చేయడమేగాక విద్యార్థులకు పూర్తిస్థాయిలో మరుగుదొడ్ల సౌకర్యం కల్పించింది. వాటి నిర్వహణకు ప్రత్యేకంగా ఆయా లను నియమించి ప్రతి రోజు నాలుగు సార్లు మరుగుదొడ్లు శుభ్రం చేసేలా చర్యలు తీసుకోవడమేగాక వాటికి అవసరమైన మెటీరియల్ ప్రభుత్వం పంపిణీ చేసింది. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న నిర్ణయంతో పాఠశాల విద్యార్థినులకు మరుగుదొడ్లు ఇబ్బంది తీరింది. వాటిని శుభ్రంచేసే పనితో అనేకమందికి ఉపాధి లభించింది. ఆయాలకు అప్పటి ప్రభుత్వం నెలకు రూ.6 వేల జీతమే నేటి కూటమి ప్రభుత్వం ఇవ్వడంతో పెరిగిన ధరలతో కుటుంబం గడవడం ఇబ్బందిగా ఉందని ఆయాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సుమారు 1,440 మంది ఆయాలు గత ప్రభుత్వం స్కూల్స్లో సకల సౌకర్యాలు కల్పించి అభివృద్ధి చేసింది. జిల్లాలోని సుమారు 1,360 జిల్లా పరిషత్ ఉన్నత, ప్రాథమికోన్నత, ప్రాథమిక పాఠశాలల్లో 1,440 మంది ఆయాలు, దాదాపు 100 మంది నైట్వాచ్మెన్లను నియమించింది. నెలకు రూ.6 వేల జీతం నిర్ణయించింది. పాఠశాలలో విద్యార్థుల సంఖ్య 300 కంటే తక్కువగా ఉంటే ఒకరు, 600 వరకు ఇద్దరు, 600కు పైగా విద్యార్థులున్న పాఠశాలకు ముగ్గురు ఆయాలను నియమించారు. ఆయాలు ప్రతి రోజు నాలుగు సార్లు మరుగుదొడ్లు శుభ్రం చేయడంతోపాటు, పాఠశాల గదులు, ఆవరణ శుభ్రం చేయాల్సివుంటుంది. సక్రమంగా అందని జీతాలు : తక్కువ మొత్తంలో జీతాలు ఇస్తున్న ప్రభుత్వం మూడు, నాలుగు నెలలకు ఒకసారి జీతాలు ఇవ్వడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం టాయిలెట్స్ మెయింటెనెన్స్ ఫండ్(టీఎంఎఫ్) అప్పుడప్పుడు విడుదల చేయడం వల్ల సక్రమంగా జీతాలు అందడం లేదు. మరుగుదొడ్లు శుభ్రం చేసేందుకు కెమికల్స్ వినియోగించడం వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా ఉత్పత్నమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాము చేసే పనిని దృష్టిలో పెట్టుకుని నెలకు రూ. 15 జీతం, ఈఎస్ఐ, పీఎఫ్, మెడికల్ అలవెల్స్ వంటి సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నారు. జిల్లాలో 1,440 మంది ఆయాల నియామకం ఉదయం నుంచి సాయంత్రం వరకు పనిచేస్తున్నా నెలకు రూ. 6 వేలే జీతం ప్రభుత్వం బడ్జెట్ విడుదల చేస్తేనే జీతాలు