breaking news
West Godavari
-
వాడవాడలా.. వైఎస్సార్ స్మృతిలో
అందుబాటులో విత్తనాలు విత్తనోత్పత్తి చేసే రైతులకు మార్టేరు వ్యవసాయ పరిశోధనా స్థానంలో బ్రీడర్ సీడ్ అందుబాటులో ఉన్నాయని పరిశోధనా సహా సంచాలకుడు తెలిపారు. 8లో uకొబ్బరి ధర అదుర్స్ కొబ్బరి రైతుల పంట పండింది. కొబ్బరికాయ ధర రూ.17 పలకడంతో కొబ్బరి రైతులు లాభాలను చూస్తున్నారు. అంతర పంటలతో కూడా ఆదాయం వస్తోంది. 8లో uబుధవారం శ్రీ 9 శ్రీ జూలై శ్రీ 2025సాక్షి, భీమవరం: జోహార్.. వైఎస్సార్.. అంటూ జనహృదయ నేత దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి 76వ జయంతిని జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్సీపీ శ్రేణులు, అభిమానులు మంగళవారం ఘనంగా నిర్వహించారు. మనసున్న మారాజు ఆ మహానేత విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. పెద్ద ఎత్తున రక్తదానం, అన్నదానంతో పాటు చీరలు, దుప్పట్లు, పండ్లు పంపిణీ చేసి సేవా కార్యక్రమాలతో అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడుతూ ప్రజలే ప్రాణంగా, పేదల అభ్యున్నతే లక్ష్యంగా వైఎస్సార్ పాలన సాగించారని కొనియాడారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, ఇందిరమ్మ, అర్హులందరికీ ప్రభుత్వ పథకాల లబ్ధిని చేకూర్చి పేదల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారన్నారు. ఆయన తెచ్చిన పథకాలనే తర్వాతి ప్రభుత్వాలు పేర్లు మార్చి కొనసాగిస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. తండ్రిని మించిన తనయుడిగా రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమాన్ని పరుగులు పెట్టించిన ఘనత వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి దక్కుతుందన్నారు. రాజన్న నిను మరువలేం.. భీమవరం పట్టణంలోని గునుపూడిలో వైఎస్సార్ విగ్రహానికి శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేన్రాజు, భీమవరం నియోజకవర్గ కోఆర్డినేటర్ చినమిల్లి వెంకటరాయుడు, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు కోడి విజయలక్ష్మి, జిల్లా అధికార ప్రతినిధిలు మేడిద జాన్సన్, కామన నాగేశ్వరరావు తదితరులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పేదలకు చీరలు, స్వీట్లు అందజేశారు. వీరవాసరం మండలం నవుడూరులో జరిగిన వేడుకల్లో ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్, కోఆర్డినేటర్ చినవెంకటరాయుడు సీహెచ్సీలోని రోగులు, గర్భిణీలు, బాలింతలకు పండ్లు, రొట్టెలు పంచారు. యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు చిగురుపాటి సందీప్ ఆధ్వర్యంలో నరసాపురంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన రక్తదాన శిబిరాన్ని పార్లమెంట్ కన్వీనర్ గూడూరి ఉమాబాల ప్రారంభించారు. శిబిరంలో యువత ఉత్సాహంగా పాల్గొని 87 మంది రక్తదానం చేశారు. తొలుత స్టీమర్ రోడ్డులోని వైఎస్సార్ విగ్రహం వద్దకు ఉమాబాల, మున్సిపల్ చైర్పర్సన్ బర్రే వెంకటరమణ, సందీప్, సోషల్ మీడియా జిల్లా కన్వీనర్ బందన పూర్ణచంద్రరావు తదితరులు భారీ ర్యాలీగా తరలివెళ్లి నివాళులర్పించారు. మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెంలో వైఎస్సార్ జయంతిని వేడుకగా నిర్వహించారు. పట్టణంలోని పోలీస్ ఐల్యాండ్, బస్టాండ్ సెంటర్లోని వైఎస్సార్ విగ్రహాల వద్దకు పార్టీ శ్రేణులతో భారీ ర్యాలీగా వెళ్లి నివాళులర్పించారు. తణుకులో మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ శ్రేణులతో భారీ ర్యాలీగా పట్టణంలోని జెడ్పీ బాయ్స్ హైస్కూల్, వైఎస్సార్ పార్కులోని వైఎస్సార్ విగ్రహాల వద్దకు చేరుకుని పూలమాలలు వేసి నివాళులర్పించారు. కేక్లు కట్ చేసి స్వీట్లు పంచారు. పాలకొల్లులో నరసాపురం పార్లమెంట్ పరిశీలకుడు ముదునూరి మురళీకృష్ణంరాజు, పార్టీ నాయకురాలు గుడాల మంగతాయారు, పార్టీ నేతలు గుణ్ణం నాగబాబు, చెల్లెం ఆనంద ప్రకాష్, యడ్ల తాతాజీ తదితరులు గాంధీబొమ్మల సెంటర్లోని వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆస్పత్రిలోని రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. ఉండి నియోజకవర్గంలో వైఎస్సార్ జయంతిని పార్టీ శ్రేణులు వేడుకగా నిర్వహించారు. ఆకివీడు మండలం సిద్దాపురంలో పండ్లు, రొట్టెలు, చెరుకుమిల్లిలో దుప్పట్లు పంపీణీ చేశారు. కాళ్ల మండలం పెదఅమిరంలో దుప్పట్లు, పండ్లు పంపిణీ చేశారు. పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు పెనుమత్స ప్రసాద్రాజు, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు కొండేటి శివకుమార్, ఆకివీడు జెడ్పీటీసీ వేగేశ్న వెంకటరాజు తదితరులు పాల్గొన్నారు. ఆచంటలో మాజీ మంత్రి చెరుకువాడ తనయుడు నరసింహరాజు ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా జరిగాయి. ఆచంట సెంటర్లోని వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి పండ్లు, స్వీట్లు అందజేశారు. న్యూస్రీల్ వాడవాడలా ఘనంగా వైఎస్సార్ 76వ జయంతి మహానేత విగ్రహాలకు నివాళులర్పించిన వైఎస్సార్సీపీ శ్రేణులు, అభిమానులు నరసాపురంలో రక్తదాన శిబిరం జిల్లా వ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలు -
పునరావాస కేంద్రం పరిశీలన
కుక్కునూరు: గోదావరి వరదల దృష్ట్యా కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఆదేశాల మేరకు మంగళవారం పలువురు అధికారులు మండలంలోని దాచారం ఆర్ అండ్ ఆర్ కాలనీలో ఏర్పాటు చేసిన పునరావాస సహాయక కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా వరద బాధితులకు పునరావాస కేంద్రంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా మౌలిక సదుపాయాలు అందేలా చర్యలు చేపట్టారు. దాచారం ఆర్ అండ్ ఆర్ కాలనీని సందర్శించిన వారిలో పంచాయతీరాజ్ ఎస్ఈ కె.శ్రీను, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ జి.త్రినాథ్బాబు, గృహనిర్మాణ శాఖ పీడీ జి.సత్యనారాయణ తదితరులున్నారు. ఉపాధ్యాయులను నియమించాలి ఏలూరు (ఆర్ఆర్పేట): నగరంలోని మౌలానా అబుల్ కలాం ఆజాద్ పాఠశాలలో ప్రస్తుతం ఎస్ఏ ఉర్దూ, ఎస్ఏ గణితం, ఎస్ఏ పీఎస్ ఉపాధ్యాయులు లేనందున వెంటనే అర్హత కలిగిన ఉపాధ్యాయులను నియమించాలని మంగళవారం జిల్లా విద్యాశాఖాధికారి ఎం.వెంకట లక్ష్మమ్మకు వినతిపత్రం సమర్పించారు. కొన్ని పాఠశాలలకు పాఠ్యపుస్తకాలు పూర్తిస్థాయిలో అందనందున పూర్తిస్థాయిలో చేరేలా తగు చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో పాటు తూర్పువీధి ఉర్దూ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల, తల్లిదండ్రుల కోరిక మేరకు ఇంగ్లీషు మీడియంలోనే బోధన కొనసాగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. డీఈఓకు వినతిపత్రం సమర్పించిన వారిలో ఏపీటీఎఫ్ ఆడిట్ కమిటీ సభ్యుడు ఎస్కే రంగావలి, రూరల్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రామశేషు కుమార్, శ్రీనివాస్ తదితరులున్నారు. బంద్ను జయప్రదం చేయాలి భీమడోలు: కార్మికులను బానిసలుగా మార్చే నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని కోరుతూ ఈ నెల 9న దేశ వ్యాప్తంగా తలపెట్టిన భారత్ బంద్ను విజయవంతం చేయాలని సీఐటీయు జిల్లా అధ్యక్షుడు ఆర్.లింగరాజు కోరారు. పూళ్ల రై్స్ మిల్లు వర్కర్లతో కలిసి గోడ పత్రికలు, కరపత్రాలను మంగళవారం ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అసంఘటిత రంగంలో పని చేస్తున్న కోట్లాది మంది కార్మికులు కనీస వేతనాలు లేక పీఎఫ్, ఈపీఎఫ్ పింఛన్ ప్రమాద బీమా లాంటివి లేనందున అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. స్కీం వర్కర్లను కార్మికులుగా గుర్తించాలన్నారు. పరిశ్రమల్లో పని చేసే కార్మికులకు భద్రత కల్పించాలని కోరారు. వివిధ శాఖల్లో పని చేసే ఉద్యోగులు, ఆశావర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలు, కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు వెంకటేశ్వరరావు, బెండి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ముగ్గురు అధికారులకు రాష్ట్ర స్థాయి అవార్డులు భీమవరం (ప్రకాశంచౌక్): పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ముగ్గురు జిల్లా అధికారులు జూలై 9న విజయవాడలో గవర్నర్ చేతుల మీదుగా రెడ్క్రాస్ అవార్డులు అందుకోనున్నారు. అవార్డులు పొందిన వారిలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జెడ్.వెంకటేశ్వరరావు, గ్రామీణ అభివద్ధి శాఖ అధికారి ఎం.ఎస్.ఎస్.వేణుగోపాల్, మాజీ విద్యా శాఖ అధికారి ఆర్.వెంకటరమణ ఉన్నారు. వీరు 2022–23, 2023–24 ఆర్థిక సంవత్సరాల్లో రెడ్క్రాస్ కోసం రూ.5 లక్షలకుపైగా నిధులు సమీకరించారన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్, రెడ్క్రాస్ అధ్యక్షురాలు చదలవాడ నాగరాణి, జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, రెడ్క్రాస్ చైర్మన్ డా.ఎం.ఎస్.వి.ఎస్.భద్రిరాజు, వైస్ చైర్మన్ వబిలిసెట్టి కనకరాజు తదితరులు అభినందనలు తెలిపారు. -
మహిళ దారుణ హత్య
కలిదిండి(కై కలూరు): భార్య వివాహేతర సంబంధానికి ఎదురింటి మహిళ సహకరిస్తోందనే అనుమానంతో వివాహితను హత్య చేసిన ఘటన కలిదిండి మండలం పోతుమర్రు శివారు గొల్లగూడెంలో మంగళవారం జరిగింది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కట్టా రామాంజనేయులు, కృష్ణవేణి భార్యభర్తలు. వీరికి ఇద్దరు సంతానం. రామాంజనేయులు చెరువులు సాగు చేస్తున్నాడు. ఇంటి ఎదురుగా నంగెడ్డ వరలక్ష్మీదేవీ(37) భర్తతో కలసి జీవిస్తోంది. ఆమె భర్త ఆటో నడపుతుంటాడు. గ్రామానికి చెందిన కట్టా నాగమల్లేశ్వరరావు(48) తరుచుగా రామాంజనేయులు ఇంటి వద్దకు వస్తున్నాడు. ఆ సమయంలో ఎదురింటి వరలక్ష్మీదేవితో మాట్లాడేవాడు. రామాంజనేయులు తన భార్య కృష్ణవేణికి నాగమల్లేశ్వరరావుతో వివాహేతర సంబంధం ఉందని, దీనికి మధ్యవర్తిగా వరలక్ష్మీదేవి వ్యవహరిస్తోందని అనుమానించాడు. మంగళవారం మధ్యాహ్నం వరలక్ష్మీదేవి కూలి పనుల నుంచి ఇంటికి వచ్చింది. ఆమె భర్త కుమార్తె టీసీ నిమిత్తం వెంకటాపురం స్కూల్ వద్దకు వెళ్ళాడు. వరలక్ష్మి ఇంట్లో ఒంటరిగా భోజనం చేస్తోంది. ఇదే అదనుగా వెళ్ళి కత్తితో ఆమె మెడపై నరికి రామాంజనేయులు పరారయ్యాడు. ఆమె రక్తపు మడుగులో కొట్టుకుని మరణించింది. కొన్ని గంటలకు భర్త వచ్చి చూసేసరికి అప్పటికే ఆమె మరణించింది. భర్త ఫిర్యాదుపై ఏలూరు డీఎస్పీ శ్రావణ్కుమార్, రూరల్ సర్కిల్, టౌన్ సీఐలు వి.రవికుమార్, పి.కృష్ణ, ఎస్సైలు వెంకటేశ్వరరావు, రాంబాబు, వీరభ్రదరావు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. డీఎస్పీ మాట్లాడుతూ భార్యపై అనుమానం.. ఎదురింటి వరలక్ష్మీదేవి అందుకు సహకరిస్తోందనే హత్యకు పాల్పడినట్లు చెప్పారు. నిందితుడిని త్వరలో పట్టుకుంటామన్నారు. మృతదేహాన్ని కై కలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. భార్య వివాహేతర సంబంధానికి సహకరిస్తోందని ఘాతుకం కలిదిండి మండలం గొల్లగూడెంలో ఘటన -
బాబు మోసాన్ని ఇంటింటికీ వివరించాలి
ఇరగవరం: ప్రజలకు మోసపూరిత హమీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి నాయకులు ఏ ఒక్క హమీ కూడా నేరవేర్చకుండా ప్రజలను దగా చేశారని మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. మంగళవారం ఇరగవరం మండలంలోని కొత్తపాడు గ్రామంలో ‘ాబు ష్యూరిటీ.. మోసం గ్యారంటీ’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మహిళలను, యువతను, ఉద్యోగులను మోసం చేశారన్నారు. చంద్రబాబు మోసపూరిత హమీలపై క్యూఆర్ కోడ్తో కూడిన బ్రోచర్ను ఇంటింటికీ అందించాలన్నారు. ప్రజలను మోసం చేయడలో చంద్రబాబును మించిన వారు లేరన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ కొప్పిశెట్టి అలివేలు మంగతాయారు, మాజీ డీసీఎంస్ డైరెక్టర్ పెన్మెత్స సుబ్బరాజు, పెన్మెత్స రాంభద్ర రాజు, పార్టీ మండల అధ్యక్షుడు కొప్పిశెట్టి దుర్గారావు, సత్తి వెంకట రెడ్డి, గుడిమెట్ల వీర్రెడ్డి, మేట్ల కిరణ్మయి, వీరమల్లు ఫణీంద్ర, కోవ్వూరి శ్రీనివాస్ రెడ్డి, సర్పంచ్ బొక్కా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
పండ్ల తోటల పథకంతో లబ్ధి
పాలకోడేరు: ఉపాధి హామీ పథకంలో సన్న, చిన్నకారు రైతుల ఆర్థిక అభివృద్ధికి పొలాల్లో పండ్లతోటల పెంపకం పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. మంగళవారం పాలకోడేరు మండలం కుముదవల్లి పంచాయతీలో కలిదిండి సూర్యనారాయణ రాజు వ్యవసాయ క్షేత్రంలో కొబ్బరి మొక్కలు నాటి పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పండ్ల తోటల పెంపకం ద్వారా సన్న చిన్నకారు రైతులకు ఆదాయాన్ని సమకూర్చాలనే ఆలోచనతో కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. ప్రస్తుతం 450 ఎకరాలలో ఉద్యాన తోటల పెంపకాన్ని ప్రారం భించామన్నారు. కార్యక్రమంలో డ్వామా పీడీ కేసీహెచ్ అప్పారావు, ఏపీడి పి.సుజాత, సర్పంచ్ భూపతి రాజు వంశీకృష్ణంరాజు పాల్గొన్నారు. 14 వరకూ పశుగ్రాస వారోత్సవాలు భీమవరం (ప్రకాశంచౌక్): పశుగణాభివృద్ధితో పాటు మేలు రకం పశుగ్రాసల సాగు ద్వారా అధిక పాల ఉత్పత్తి, పునరుత్పత్తి సామర్థ్యం పెంపుదలకు జూలై 7 నుంచి 14 వరకు పశుగ్రాస వారోత్సవాలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. వారోత్సవాలు సందర్భంగా పాడి రైతులకు 75 శాతం రాయితీపై పశుగ్రాస విత్తనాలను అందించనున్నట్లు తెలిపారు. సొంత భూమి కలిగిన ఎస్సీ, ఎస్టీ కుటుంబాలు, చిన్న, సన్నకారు రైతులు 10 సెంట్ల నుంచి 50 సెంట్ల విస్తీర్ణంలో మేలుజాతి పశుగ్రాసాలు పెంచితే ఉపాది హామీ పథకంలో లబ్ధి చేకూరుతుందన్నారు. -
కనకాయలంక కాజ్వే పరిశీలన
యలమంచిలి: గోదావరిలో వరద పెరుగుతున్న నేపథ్యంలో కనకాయలంక కాజ్ వే మునిగితే తీసుకోవలసిన రక్షణ చర్యలను పరిశీలించేందుకు మంగళవారం ఆర్డీఓ దాసి రాజు కనకాయలంక వచ్చారు. గ్రామంలో అడ్వాన్స్గా నెల రేషన్ సరుకులు నిల్వ ఉంచాలని, కాజ్వేను వరద నీరు ముంచితే ప్రజల రాకపోకలకు ఇబ్బంది కలగకుండా ఇంజన్ పడవలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. గ్రామంలోని తుపాన్ షెల్టర్ను పరిశీలించారు. అనంతరం పెదలంక వెళ్లి వరద వస్తే తీసుకోవాల్సిన రక్షణ చర్యలను వివరించారు. ఆయన వెంట తహసీల్దార్ గ్రంథి నాగ వెంకట పవన్కుమార్ వీఆర్వోలు కడిమి ఘనలక్ష్మీ, కాకితాపల్లి శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు. -
దిగొచ్చిన ‘చికెన్, మటన్’!
తణుకు అర్బన్: చికెన్, మటన్ ధరలు దిగిరావడంతో మాంసాహారులు లొట్టలేసుకుం టూ లాగించేస్తున్నారు. ఇప్పటి వరకు ఈ రెండు రకాల మాంసం ధరలు కొండెక్కి కూర్చోవడంతో మాంసాహార ప్రియులు కొనుగోళ్లకు కొంచెం వెనకాడే పరిస్థితి నెల కొంది. కానీ నేడు వ్యాపారుల మధ్య వచ్చిన పోటీ తదితర కారణాలతో చికెన్ బ్రాయిలర్ ధర కిలో రూ.159, మటన్ కిలో రూ.800 తమ దుకాణాల ముందు కొందరు వ్యాపా రులు ప్లెక్సీలు ఏర్పాటుచేసి విక్రయాలు చేస్తుండడంతో మాంసాహారులు ఉత్సాహంగా కొనుగోళ్లకు సిద్ధమవుతున్నారు.ఉత్పత్తి ఎక్కువ.. వాడకం తక్కువచికెన్ ఉత్పత్తి అధికంగా ఉండడంతో మేత ధరలు పెరగడంతో హోల్సేల్లో కోడి లైవ్ ధర విపరీతంగా తగ్గిపోయిందని వ్యాపారులు చెబుతున్నారు. ఈ ఏడాది ఫిబ్రవ రిలో బర్డ్ ఫ్లూ విలయ తాండవం అనంతరం చికెన్ కిలో ధర రూ.280 వరకు ఎగబాకిం ది. కానీ నేడు ఉత్పత్తి భారీగా రావడం, అమ్మకాలు తగ్గడంతో ధర తగ్గించి అమ్మ కాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.నేడు చికెన్ ఉత్పత్తి భారీగా నిల్వ ఉండడంతో హోల్సేల్ లైవ్ ధర రూ.80కి పడిపోయింది. దీంతో రిటైల్ వ్యాపారుల్లో కొందరు బాయిలర్ లైవ్ ధర రూ.99, కిలో ధర రూ.159 అమ్మకాలు చేస్తున్నారు. చికెన్ ప్రియులు గతం కంటే రెండింతలు మాం సం కొనుగోలు చేస్తున్నారు. ఇక మటన్ ధర పట్టణ పరిధిలో అధిక శాతం దుకాణాల వద్ద రూ.800 ఫ్లెక్సీలు పెట్టి విక్రయిస్తున్నారు. ఇక గ్రామాల్లో అయితే రూ.600 ఫ్లెక్సీలు పెట్టి విక్రయిస్తున్నట్లుగా తెలుస్తోంది. బర్డ్ ఫ్లూ సోకిన సమయంలో మటన్ విక్రయాలు విపరీతంగా పెరగడం తో అప్పట్లో రూ.1000 నుంచి రూ.1200 వరకు పెంచి అమ్మకాలు చేశారు. జీవాల ఉత్పత్తి పెరగడం, దానికి తోడు అమ్మకాలు నీరసంగా ఉండడంతో నేడు మటన్ వ్యాపా రులు భారీగా ధర తగ్గించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మాంసాహారులు భలే ఛాన్సులే అనుకుంటూ గతంలో అరకేజీ కొనుగోలు చేసే వారు సైతం నేడు కిలోకి పైగా కొను గోలు చేస్తున్నారు. మటన్ విక్రయాలకు సంబంధించి జీవాల శాతం పెరగడంతో పాటు పోషణ భారంగా మారిన పరిస్థి తుల్లో ధరలు తగ్గించి అమ్మకాలు పెంచా అనే ఉద్దేశ్యంతో వ్యాపారులు ఉన్నట్లు తెలువీరభద్రపురంలో బాయిలర్ కోడి మాంసం ధర తెలిపే ఫ్లెక్సీస్తోంది. వర్షాకాలం కావడంతో జీవాలను అధికంగా పెట్టుకున్నా పలు రకాల వ్యాధులు వచ్చే ప్రమాదం ఉండడంతో తక్కువ ధరలకు విక్రయాలు చేస్తున్నట్లుగా వ్యాపారులు చెబుతున్నారు.పోటాపోటీగా ప్లెక్సీలుచికెన్, మటన్ ధరలకు సంబంధించి తణుకు ఇతర పట్టణాల్లో పోటాపోటీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి మరీ అమ్మకాలు చేస్తున్నారు. అయితే ప్రస్తుతం వ్యాపారుల మధ్య పోటీ పెరిగి ఈ తరహా విక్రయాలు చేస్తున్నారని అతి కొద్ది రోజుల్లో రిటైల్ వ్యాపారులు సమావేశమై తిరిగి హోల్ సేల్ ధరలకు సంబంధం లేకుండా సిండికేట్గా మారి ధరలు పెంచి విక్రయాలు చేసేందుకు కార్యాచరణ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. -
బతికుండగానే ‘చంపేశారు’. !నాన్న వద్దంటున్న కొడుకు.. నాకు భర్తే లేడంటున్న భార్య!
తణుకు అర్బన్: వివాహ బంధాన్ని భార్య వద్దంటోంది. కన్నతండ్రితో అనుబంధాన్ని కుమారుడు తెంచు కుంటున్నాడు. ఏడేళ్ల క్రితం తెగిపోయిన రక్తసంబం ధం నేడు ఎదురైనా తమకు వద్దంటే వద్దని ఆ కుటుంబం తెగేసి చెబుతోంది. దీంతో ప్రమాదవ శాత్తు గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వృద్ధుడు అల్లాడుతున్నాడు. వివరాలిలా ఉన్నాయి.. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం ప్రకాశ రావుపాలెంకు చెందిన కలగర సుబ్బారావు ఏడేళ్ల కిత్రం ఇంటి నుంచి బయటకు వచ్చేశారు. ఆది వారం కాల్దరి స్టేషన్లో రైలు నుంచి జారిపడగా రైల్వే పోలీసులు తణుకు జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. వృద్ధుడిని ఆరా తీయగా కుటుంబసభ్యుల వివరాలు తెలిపారు. రైల్వే కానిస్టేబుల్ బాల విషయాన్ని వృద్ధుడి కుమారుడు సుధీన్ రాజుకు ఫోన్ ద్వారా తెలియజేయగా తనకు నాన్న అవసరం లేదని తెగేసి చెప్పాడు.అయినా కానిస్టేబుల్ బాల ప్రకాశరావుపాలెంలోని ఇంటికి వెళ్లి వృద్ధుడి భార్యతో విషయం చెప్పగా తన భర్త ఎప్పుడో చనిపోయాడని. అతడి మరణ ధ్రువీకరణ పత్రం తీసుకుని వితంతు పింఛను కూడా పొందుతున్నట్టు సమాధానం ఇవ్వ డంతో రైల్వే పోలీసులు ఆశ్చరుపోయారు.కేసు నమోదు చేసినా ఇబ్బందిలేదుసుధీన్ రాజును ఎట్టకేలకు రైల్వే పోలీసులు తణుకు ఆస్పత్రికి తీసుకురాగా సోమవారం ఆర్ఎంఓ డాక్టర్. ఏవీఆర్ఎస్ తాతారావు కౌన్సెలింగ్ ఇచ్చారు. తమకు సుబ్బారావు అవసరం లేదని, అవసరమైతే అలా రాసిస్తామని సుధీన్ రాజు సమాధానమిచ్చాడు. దీంతో సీఐ ఎన్.కొండయ్య ఆస్పత్రి వద్దకు వచ్చి కన్న తం డ్రిపై నిర్లక్ష్యం వహిస్తే కేసు నమోదు చేస్తామని హెచ్చరించగా.. కేసు నమోదు చేసుకోమని సుధీన్ రాజు తెగేసి చెప్పాడు. దీంతో చేసేదిలేక ఆస్పత్రి లో నే వైద్యులు సుబ్బారావుకు చికిత్స అందిస్తున్నారు. -
మదినిండా పెద్దాయనే..
ఏలూరు (ఆర్ఆర్పేట): ముఖ్యమంత్రిగా, ప్రజానేతగా వైఎస్ రాజశేఖర రెడ్డి అందించిన సేవలు ఇప్పటికీ ప్రజల హదయాల్లో పదిలమే. అందుకే ఆయన్ను రాష్ట్రమంతా పెద్దాయనగా పిలుచుకుంటుంది. ఆ మహానీయుడి జయంతి సందర్భంగా నగరానికి చెందిన మైక్రో ఆర్టిస్టులు తమ కళ ద్వారా వైఎస్కు ఘనంగా నివాళులర్పించారు. ఏలూరుకు చెందిన మైక్రో ఆర్టిస్ట్ ప్రసాద్ వైఎస్ చిత్రపటాన్ని రావి ఆకుపై చిత్రించి తన అభిమానాన్ని చాటుకోగా, మరో మైక్రో ఆర్టిస్ట్ మేతర సురేష్ అగ్గిపుల్లపై వైఎస్ చిత్రాన్ని చిత్రించి కృతజ్ఞత చాటుకున్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా ఎందరికో ప్రాణభిక్ష పెట్టడమే కాకుండా, ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా పేద విద్యార్థులు ఉన్నత చదువులకు కృషి చేసిన మహామనిషి వైఎస్సార్ అని మైక్రో ఆర్టిస్టులూ తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. కుమార్తె అదృశ్యంపై పిర్యాదు ముదినేపల్లి రూరల్: కుమార్తె అదృశ్యంపై ఆమె తల్లి చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు హెడ్కానిస్టేబుల్ శంకరరావు తెలిపారు. మండలంలోని చిగురుకోట శివారు నరసన్నపాలెంకు చెందిన మహిళ తన కుమార్తె పదో తరగతి వరకు చదువుకుని కూలి పనులకు వెళుతుందని, సోమవారం తెల్లవారుజాము నుంచి కనిపించడంలేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది. -
గీత కార్మికుల సమస్యలను పరిష్కరించాలి
తణుకు అర్బన్: కలెక్టర్కు చెప్పుకుందాం రండి కార్యక్రమంలో గీత కార్మికులు వారి కుటుంబాలు, పాల్గొనాలంటూ సోమవారం తణుకు మండలం తేతలి గ్రామంలో గీత కార్మికులు కరపత్రాలను పంపిణీ చేశారు .ఈ సందర్భంగా గీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు కామన మునిస్వామి మాట్లాడుతూ బెల్టు షాపు పెడితే తాట తీస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటిస్తున్నా జిల్లాలో సుమారు 4వేల బెల్ట్ షాపులు అక్రమంగా నడుస్తున్నాయని విమర్శించారు. గీత కార్మికులకు ఉపాధి కల్పించాలని, అలాగే ఏడాదిలో పనిలేని 8 నెలలను వర్క్ హాలిడేగా ప్రకటించి ప్రభుత్వం సాయం చేయాలని డిమాండ్ చేశారు. మత్స్యకారులకు ఇస్తున్నట్లుగా రూ.20వేలు అందించాలన్నారు. సమస్యల పరిష్కారం కోసం ఈనెల 14వ తేదీన గీత కార్మికులు కలెక్టరేట్కు ఐక్యంగా వచ్చి సమస్యలను తెలియజేయాలని పిలపునిచ్చారు. కార్యక్రమంలో గీత కార్మికులు కాసాని శ్రీనివాసు, కట్టా శ్రీరామమూర్తి, అయినా నాగులు, ఆరెవెల్లి సీతారామయ్య, అంగర పోతురాజు, చేబ్రోలు రాజు, ఆరేపల్లి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ స్తంభాన్ని ఢీకొని గిరిజనుడి మృతి వేలేరుపాడు: ద్విచక్ర వాహనం అదుపు తప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొని గిరిజన యువకుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రామవరం గ్రామానికి చెందిన మడకం ప్రకాష్ మొహర్రం (పీర్లపండుగ)ను పురస్కరించుకొని సోమవారం మధ్యాహ్నం కన్నాయిగుట్ట గ్రామానికి తన ద్విచక్రవాహనంపై బయలు దేరాడు. వేలేరుపాడు మండల పరిధిలోని విద్యుత్ సబ్స్టేషన్ సమీపంలో ద్విచక్రవాహనం అదుపు తప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టాడు ఈ ప్రమాదంలో అతడి తలకు తీవ్ర గాయమైంది. క్షతగాత్రుడ్ని వైద్యం నిమిత్తం జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. ప్రకాష్కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. వేలేరుపాడు ఎస్సై నవీన్ కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ట్రిపుల్ ఐటీలో కొరవడిన భద్రత
నూజివీడు: నూజివీడు ట్రిపుల్ ఐటీలో భద్రత కొరవడింది. ట్రిపుల్ ఐటీలోని శ్రీకాకుళం ఇంజినీరింగ్ విద్యార్థులు ఉంటున్న ఐ1 హాస్టల్ భవనంలోని మూడో అంతస్తులో ఉన్న హాస్టల్ గదులను ఆగంతకులు లూటీ చేశారు. ఇంజనీరింగ్ తృతీయ సంవత్సర విద్యార్థులు వేసవి సెలవులకు వెళ్లి జూలై ఐదో తేదీ నుంచి తిరిగి రావడంతో హాస్టల్ గదుల్లో చోరీ జరిగిన విషయం వెలుగు చూసింది. శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీకి చెందిన ఇంజినీరింగ్ నాలుగో సంవత్సరం, మూడో సంవత్సరం విద్యార్థులకు నూజివీడు ట్రిపుల్ ఐటీలోనే తరగతులు నిర్వహిస్తున్నారు. దీంతో ఐ1 హాస్టల్ వసతి గృహంలోని రెండో ఫ్లోర్లో నాలుగో సంవత్సరం విద్యార్థులు, మూడో అంతస్తులో తృతీయ సంవత్సర విద్యార్థులు ఉంటున్నారు. మే 15 నుంచి వేసవి సెలవులు ఇవ్వడంతో ఈ 4 విద్యార్థులు తమ సామగ్రినంతా తీసుకొని హాస్టల్ గదులను ఖాళీ చేసి వెళ్లిపోయారు. ఈ3 విద్యార్థులు మాత్రం తమ దుస్తులను, ట్రాలీ బ్యాగ్లను, పుస్తకాలను, షూలను ఇతర సామగ్రిని తమ గదుల్లోనే ఉంచి తాళాలు వేసుకొని ఇళ్లకు వెళ్లారు. అయితే ఈ విద్యాసంవత్సరం నుంచి ఈ4 విద్యార్థులకు తరగతులు శ్రీకాకుళంలోని ట్రిపుల్ ఐటీ క్యాంపస్లోనే నిర్వహిస్తున్నామని, నూజివీడులో ఈ3 పూర్తి చేసుకున్న విద్యార్థులందరూ శ్రీకాకళం ట్రిపుల్ ఐటీ క్యాంపస్కు వచ్చేయాలని ట్రిపుల్ ఐటీ అధికారులు ఫోన్లకు మెసేజ్లు పెట్టారు. దీంతో వారంతా తమ సామగ్రిని తీసుకెళ్లేందుకు నూజివీడు ట్రిపుల్ ఐటీకి వచ్చి తమ రూమ్లకు వెళ్లగా తాళాలు పగులగొట్టి, లోపలి దుస్తులను, పుస్తకాలను చిందరవందరగా పడేసి ఉండటం చూసి ఒక్కసారిగా అవాక్కయ్యారు. మూడో అంతస్తులో దాదాపు 100 గదులు ఉండగా 30 గదుల వరకు తాళాలు పగులగొట్టి, గడులు పగుల గొట్టి విద్యార్థుల పుస్తకాలను, దుస్తులను చిందరవందరగా పడేయడంతో పాటు సూట్కేసులు, ట్రాలీ సూట్కేసులు, కొందరి ల్యాప్ట్యాప్లు, విద్యార్థుల బూట్లు చోరీ చేశారు. ఇంత పెద్ద ఎత్తున లూటీ జరిగినా సమాచారం బయటకు పొక్కకుండా ట్రిపుల్ ఐటీ అధికారులు అది విషయమే కానట్లుగా వ్యవహరిస్తున్నారు. తమ గదుల్లోని వస్తువులు చోరికి గురికావడంపై విద్యార్థులు మెయిల్ ద్వారా యూనివర్సిటీ ఛాన్సలర్ దృష్టికి సైతం తీసుకెళ్లారు. హాస్టల్ గదులకు కూడా భద్రత లేకపోతే ఎలాగని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. సెక్యూరిటీ వ్యవస్థ నిద్రపోతోందా..! ట్రిపుల్ ఐటీలో 24 గంటలూ సెక్యూరిటీ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. షిఫ్టుకు 55 మంది చొప్పున మూడు షిఫ్టులు విధుల్లో ఉంటారు. అలాగే హాస్టల్ భవనంలో నూజివీడు ట్రిపుల్ ఐటీకి చెందిన కేర్ టేకర్, శ్రీకాకుళంకు చెందిన కేర్ టేకర్లు విధుల్లో ఉంటారు. హాస్టల్ భవనం వద్ద సైతం 24 గంటలూ సెక్యూరిటీ సిబ్బంది కాపలా కాస్తూ ఉంటారు. అంతేగాకుండా ట్రిపుల్ ఐటీలో పోలీస్ అవుట్పోస్టు సైతం ఉంది. అయినప్పటికీ విద్యార్థుల రూమ్ల తాళాలు పగులగొట్టి, గడులను విరగ్గొట్టి చోరీలకు పాల్పడటం సంచలనంగా మారింది. గతంలో రెండు సార్లు ఫ్యాకల్టీ గృహాల్లో సైతం దొంగతనాలు జరిగాయి. వాటికి సంబంధించి దర్యాప్తు ఇంత వరకు అతీగతీ లేదు. ఇప్పుడు తాజాగా విద్యార్థుల హాస్టల్ గదుల్లో జరగడం విస్మయాన్ని కలిగిస్తోంది. ఇప్పటికై నా చోరీకి పాల్పడిన వారు ఎవరో నిగ్గు తేల్చాల్సిన బాధ్యత యాజమాన్యంపైన, పోలీసులపైనా ఉంది. శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీ విద్యార్థుల హాస్టల్ గదుల లూటీ పలు రూమ్ల తాళాలు పగులగొట్టి, గడులు విరగ్గొట్టి చోరీ విద్యార్థులు వేసవి సెలవులకు వెళ్లి వచ్చాక వెలుగు చూసిన వైనం -
వైఎస్ పాలనలో ఏజెన్సీలో అభివృద్ధి పరుగులు
బుట్టాయగూడెం: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి పాలనలో పశ్చిమ ఏజెన్సీ ప్రాంతంలో అభివృద్ధి పరుగులు పెట్టిందని మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు అన్నారు. సోమవారం సాయంత్రం దుద్దుకూరులో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ వైఎస్సార్తో ఆయనకున్న అనుబంధం, వైఎస్సార్ చేసిన అభివృద్ధి పనులను వివరించారు. గిరిజన విద్యార్థులు ఉన్నత చదువులకు దూరమై డ్రాప్ఔట్స్గా మిగులుతున్న సమయంలో జూనియర్, డిగ్రీ, ఐటీఐ, పాల్టెక్నిక్ కళాశాలలు ఏర్పాటు చేసి ఉన్నత విద్యల్లో ముందుకు సాగే విధంగా వైఎస్ కృషి చేశారన్నారు. అదేవిధంగా నియోజకవర్గ స్థాయిలో 70 వేల ఇందిరమ్మ ఇళ్లను నిర్మించిన ఘనత వైఎస్సార్దే అని అన్నారు. 400 కిలోమీటర్ల మేర బీటీ రోడ్ల నిర్మాణానికి కృషి చేసి రహదారుల సమస్య లేకుండా చేశారన్నారు. అదేవిధంగా అటవీ హక్కుల చట్టంలో సుమారు 10 వేల ఎకరాలకు పైగా భూములను పేదలకు వైఎస్సార్ పంచడం జరిగిందని గుర్తుచేశారు. రూ. 26 కోట్ల వ్యయంతో గిరిజనుల బీడు భూములకు సాగు నీరు అందించే విధంగా పోగొండ రిజర్వాయర్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారన్నారు. ప్రతి ఏటా కొండ కాలువల ప్రవాహానికి అనేక మంది గిరిజనులు మృతి చెందుతుంటే వాటిని నివారించేందుకు రూ.26 కోట్లతో నాలుగు ప్రదేశాల్లో హైలెవెల్ బ్రిడ్జిల నిర్మాణానికి కృషి చేశారన్నారు. వైఎస్ చలువతోనే పోలవరం ప్రాజెక్టు పోలవరం మండలంలో ప్రతి ఏటా గోదావరి వరదనీరు ప్రవాహానికి 50 వేల ఎకరాల పంట భూములు ముంపునకు గురై రైతులు అనేక ఇబ్బందులు పడేవారన్నారు. దీంతో చిరకాల స్వప్నమైన పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వైఎస్ చలువతోనే ప్రారంభమైందని చెప్పారు. ఈ నేపథ్యంలో వైఎస్సార్ సుమారు రూ.70 కోట్లతో కొవ్వాడ ఔట్పాల్స్ క్లూయిస్ పనులకు శ్రీకారం చుట్టారని చెప్పారు. అలాగే గిరిజనులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని 5 ప్రభుత్వ ఆస్పత్రులతో పాటు జంగారెడ్డిగూడెంలో 100 పడకల నిర్మాణానికి కృషి చేశారని తెలిపారు. ఇలా వైఎస్సార్ పాలనలో తాము ఏ సమస్య అయినా దరఖాస్తు రూపంలో అందజేస్తే వెనువెంటనే నిధులు మంజూరు చేసేవారని చెప్పారు. నాడు వైఎస్సార్ చేసిన అభివృద్ధి పనులను చూసి రాజశేఖరరెడ్డిని దేవుడిగా కొలుచుకుంటున్నారని చెప్పారు. మళ్లీ అదే రీతిలో తండ్రి బాటలో పాలన చేస్తూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గిరిజన ప్రాంత అభివృద్ధికి ఎనలేని కృషి చేశారని చెప్పారు. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం
యలమంచిలి: లారీ ఢీకొని మోటార్సైక్లిస్టు మృతి చెందాడు. వివరాల ప్రకారం అంబేడ్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం రామరాజులంక గ్రామానికి చెందిన మేడిచర్ల పూర్ణచంద్ర ఉదయభాస్కర్ (64) తాపీమేసీ్త్రగా జీవనం సాగిస్తున్నాడు. పని నిమిత్తం చించినాడ వచ్చి తిరిగి బైక్పై వెళ్తుండగా చించినాడ వశిష్ట గోదావరి నది వంతెనపై సిమెంట్ లారీ వెనుక నుంచి ఢీకొంది. ఈ ప్రమాదంలో భాస్కర్ అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పాలకొల్లు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. భాస్కర్ సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై గుర్రయ్య వివరించారు. రానున్న మూడు రోజుల్లో భారీ వర్షాలు భీమవరం (ప్రకాశంచౌక్): రానున్న మూడు రోజుల్లో భారీ వర్షాల వస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు చేసిన నేపథ్యంలో ప్రజలు, అధికార యంత్రాంగం అప్రమత్తతతో ఉండాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. సోమవారం కలెక్టరేట్ టీఆర్ఎస్ సమావేశ మందిరం నందు కలెక్టర్ నాగరాణి వర్షాకాలం సీజన్లో తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. గతేడాది అనుభవాలను దృష్టిలో ఉంచుకొని జిల్లాలో భారీ వర్షాలు, వరదలు, తుపానులను సమర్థవంతం ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలన్నారు. క్షీరారామంలో ప్రదక్షిణకు పోటెత్తిన భక్తజనం పాలకొల్లు సెంట్రల్: పంచారామక్షేత్రం శ్రీ క్షీరారామలింగేశ్వరస్వామి ఆలయంలో సప్త సోమవారం ప్రదక్షిణలకు భక్తులు పోటెత్తారు. సోమవారం ప్రదోషకాలంలో భక్తులు ప్రదక్షిణలు ప్రారంభించారు. ఏడు మారేడు దళాలు చేత పట్టుకుని ఏడు ప్రదక్షిణలు చేసి దీపాలంకరణ వెలుతురులో ఉన్న స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం స్వామివారికి పంచహారతులు నిర్వహించారు. దాతలు భక్తులకు ప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో ముచ్చర్ల శ్రీనివాస్, సూపరింటెండెంట్ పసుపులేటి వాసు, అర్చకులు కిష్టప్ప, అనిల్, వీరబాబు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. హత్య కేసులో 8 మంది అరెస్ట్ దెందులూరు: మండలంలోని వీరభద్రపురం వద్ద ఇటీవల జరిగిన హత్య కేసులో 8 మందిని పెదవేగి సీఐ రాజశేఖర్ అరెస్ట్ చేసినట్లు దెందులూరు ఎస్సై ఆర్ శివాజీ తెలిపారు. 8 మంది నిందితులను భీమడోలు కోర్టులో హాజరుపరచుగా మేజిస్ట్రేట్ రిమాండ్ విధించినట్లు ఎస్సై చెప్పారు. -
నిట్లో సీట్లు ఫుల్
తాడేపల్లిగూడెం: జాయింట్ సీట్ అలొకేషన్ అఽథారిటీ (జోసా) పర్యవేక్షణలో జాతీయ విద్యాసంస్థలైన నిట్ తదితర సంస్థల్లో సీట్ల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటి వరకు రెండు రౌండ్లు ముగియగా మరో ఆరు రౌండ్లు మిగిలాయి. తొలి విడతలోనే ఏపీ నిట్లో ఉన్న 480 సీట్లకు ఆప్షన్లను విద్యార్థులు ఎంపిక చేసుకున్నారు. మొదటి రౌండ్లోనే సీట్లు భర్తీ అయ్యాయి. నిట్లో ఉన్న ఎనిమిది బ్రాంచిలలో చేరడానికి విద్యార్థులు ఫ్లోట్ ( బ్రాంచి మారడానికి వీలుగా) ఫ్రీజింగ్ ( సీటు నిర్ధారణ చేసుకోవడం)వంటి ఐచ్ఛికాలను ఎంపిక చేసుకున్నారు. హోమ్ స్టేట్ కోటా కింద 240 మంది, అదర్ స్టేట్ కోటా కింద 240 మంది ఆప్షన్లను ఎంపిక చేసుకోగా, మిగిలిన నాలుగు రౌండ్లు ముగిసిన తర్వాత వెరిఫికేషన్ కేంద్రాల్లో జోసా నుంచి తుది జాబితా వచ్చిన తర్వాత సర్టిఫికెట్లను పరిశీలన చేసిన తర్వాత నిట్లో విద్యార్థులు చేరే ప్రక్రియ పూర్తి కానుంది. తర్వాత ఇండక్షన్, తరగతుల ప్రారంభం కార్యక్రమాలు జరగాల్సి ఉంది. ఆగస్టు నెల వరకు విద్యార్థులు ప్రాంగణానికి వచ్చే అవకాశాలు లేవు. ఎంటెక్ సీట్ల భర్తీ ప్రక్రియ షురూ కొంతకాలం విరామం తర్వాత ఏపీ నిట్లో ఎంటెక్ కోర్సు ప్రారంభం కానుంది. ఎంటెక్ కోర్సులో ఇక్కడ 99 సీట్లు ఉన్నాయి. ఈ కోర్సు కోసం వచ్చిన దరఖాస్తులను పరిశీలించే ప్రక్రియ ప్రారంభమైంది. వంద సీట్లు పైన ఉంటేనే ఆయా నిట్కు వెరిఫికేషన్ సెంటర్ ఇస్తారు. ఏపీ నిట్లో 99 సీట్లు ఉండటంతో ఇక్కడకు వచ్చిన దరఖాస్తుల పరిశీలన కార్యక్రమం నిట్ రాయపూర్లో ఏర్పాటుచేశారు. హెఫా నిధుల కోసం నిరీక్షణ ఏపీ నిట్లో రెండోదశ పనుల కోసం రూ.430 కోట్ల ప్రతిపాదనతో కెనరా బ్యాంకు ద్వారా హైర్ ఎడ్యుకేషన్ ఫండింగ్ ఏజన్సీ(హెఫా) నుంచి నిధుల కోసం కేంద్ర ఉన్నత విద్యాశాఖకు వినతులు పంపారు. ఏపీ నిట్కు బోర్డు ఆఫ్ గవర్నెన్సు(బీఓజీ) చైర్మన్ లేకపోవడం, పాత చైర్పర్సన్ పదవీకాలం ముగిసి ఏడాది గడుస్తున్నా , ఇంకా ఆ స్థానంలో చైర్మన్ ఎంపిక జరుగలేదు. నిధుల్లో కదలిక లేకపోవడానికి ఇది ఒక కారణంగా తెలుస్తోంది. ఆరో రౌండ్ తర్వాత చేరికలు ఎంటెక్ తరగతులు త్వరలో ప్రారంభం హెఫా నిధుల కోసం నిరీక్షణ -
ప్రాణాంతకం.. గొంతువాపు
భీమవరం: పాడి రైతులు సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉంటూ పాడిని అభివృద్ధి చేసుకోవడం ద్వారా ఆదాయాన్ని పొందేందుకు అవకాశముంటుంది. వర్షాకాలంలో పశువులకు గొంతువాపు, గుది పెట్టు వ్యాధులు సోకే ప్రమాదమున్నందున రైతులు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. జిల్లాలో 1,78,137 గేదేలు, 45,539 ఆవులున్నాయి. పశువులకు సోకే వ్యాధుల పట్ల రైతులకు పెద్దగా అవగాహన లేకపోవడంతో వ్యాధి తీవ్రత ఎక్కువై పశు మరణాలు సంభవించడంతో తీవ్రంగా నష్టపోతున్నారు. వ్యాధులపై రైతులు సంపూర్ణ అవగాహన కలిగి ఉంటే ఇంటి వద్దనే నిరోధించేందుకు వీలుంటుందని పశు వైద్యులు చెబుతున్నారు. వర్షాకాలంలో గేదెలకు సోకే ప్రాణాంతక వ్యాధుల్లో గొంతువాపు ఒకటి. ఈ వ్యాధి పందుల్లో తరచుగా, గొర్రెలు, మేకల్లో చాలా అరుదుగా కనిపిస్తుంది. ఈ వ్యాధి ఏడాది పొడవునా ఎప్పుడైనా వ్యాపించే అవకాశం ఉంది. ఎక్కువగా వర్షాకాలంలో దీనిని గుర్తించవచ్చు. నదీ పరివాహక ప్రాంతాలు, డెల్టాలు, వరిసాగు అధికంగా ఉన్న ప్రదేశాల్లో ఉండే గేదెలకు ఈ వ్యాధి ఎక్కువగా సోకుతుంది. ఇది ఒక రకమైన సూక్ష్మజీవి ద్వారా పశువులకు వ్యాపిస్తుంది. వ్యాధి లక్షణాలు ఈ వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉండి వ్యాధి సోకిన 8 నుంచి 24 గంటల వ్యవధిలో పశువు చనిపోయే ప్రమాదముంది. వ్యాధి ప్రారంభ దశలో పశువు నీరసంగా ఉంటుంది. తరువాత నడవలేక పోవడం, అధిక జ్వరం, నోటి నుంచి సొంగ కారడం, ముక్కు నుంచి చిక్కటి ద్రవం స్రవించడం, కళ్లు ఎరబ్రడి నీరు కారుతూ ఉండటం లక్షణాలు. ముందుగా గొంతు భాగంలో వాపు ఉండి తరువాత వాపు చెంపలు, మెడ, ముందుకాళ్ల మధ్య భాగం, పొట్ట కింద భాగం వరకూ విస్తరిస్తుంది. పశువు ఆయాసపడుతూ శ్వాస పీలుస్తుంది. సాధారణంగా ఈ దశలో పశువు నాలుక బయటకు తీస్తూ శ్వాస తీసుకోవడం కష్టంగా ఉంటుంది. ఈ దశ తరువాత కొన్ని గంటల వ్యవధిలో పశువు చనిపోతుంది. వ్యాధి వ్యాప్తి ఇలా.. వ్యాధి సోకిన పశువుల నుంచి కారే సొంగ, ముక్కు నుంచి స్రవించే ద్రవాల ద్వారా వ్యాధి బ్యాక్టీరియా వ్యాప్తి చెందుతుంది. తరచుగా వ్యాధి సోకే ప్రాంతాల్లో నివసించే ఐదు శాతం పశువులు ఈ వ్యాధికి వాహకాలుగా ఉంటాయి. అలసిపోయిన, ఒత్తిడికి గురైన పశువులకు ఈ వ్యాధి త్వరగా వ్యాపిస్తుంది. సాధారణంగా కలుషితమైన మేత, గాలి ద్వారా వ్యాధి కారకం పశువుల శరీరంలోకి ప్రవేశిస్తుంది. శరీరంలోకి ప్రవేశించిన క్రిమి త్వరగా విభజన చెంది ఎండోక్సిన్స్ అనే విష పదార్థాలను విడుదల చేస్తుంది. ఇది రక్తంలోకి ప్రవేశించిన అనంతరం వ్యాధి లక్షణాలు బయటపడతాయి. పశువుల పట్ల ప్రత్యేక శ్రద్ధ అవసరం వర్షాకాలంలో ఈ వ్యాధి ఎక్కువగా వస్తుంది. వర్షాకాలానికి ముందు వ్యాధి నిరోధక టీకాలు వేయించాలి. వ్యాధి సోకిన పశువులను మంద నుంచి వేరు చేయాలి. పశువుల పాకలను ఎప్పటికప్పుడు శుభ్రపరచాలి. క్రమం తప్పకుండా వ్యాధి నిరోధక టీకాలు విధిగా వేయించాలి. పశువైద్యుడి సలహా మేరకు సల్ఫాన్మైడ్స్, టెట్రాసైక్లినన్స్, పెన్సులిన్, క్లోరామ్ ఫినికాల్ వంటి యాంటి బయోటిక్ మందులు ముందుగా వాడితే ఫలితం ఉంటుంది. వ్యాధి ముదిరిన తరువాత చికిత్స పెద్దగా ఫలితం ఇవ్వదు. పి.సుధీర్బాబు, పశుసంవర్ధశాఖ సహాయ సంచాలకుడు, భీమవరం -
సుబ్బారాయుడిని దర్శించుకున్న భక్తులు
ముదినేపల్లి రూరల్: ప్రసిద్ధి చెందిన సింగరాయపాలెం–చేవూరుపాలెం సెంటర్లోని శ్రీసుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం భక్తులు పోటెత్తారు. సదూర ప్రాంతాల నుంచి భారీసంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకుని స్వామి వారి పుట్టలో పాలు పోశారు. పాలపొంగళ్ల శాల వద్ద మహిళలు నైవేద్యాలు తయారుచేసి స్వామికి సమర్పించారు. నాగబంధాల వద్ద స్వామివారి మూర్తులను ప్రతిష్ఠించేందుకు అర్చకులతో పూజలు చేయించి ప్రతిష్ఠ తంతు నిర్వహించారు. నాగబంధాల వద్ద, గోకులంలోని గోవులకు మహిళలు పసుపు కుంకుమలతో పూజలు చేశారు. భక్తుల రద్దీకి అనుగుణంగా అన్నప్రసాద ఏర్పాట్లు చేశారు. గుబ్బల మంగమ్మ గుడికి పోటెత్తిన భక్తులు బుట్టాయగూడెం: మండలంలోని మారుమూల గ్రామమైన కాపవరం సమీపంలోని అటవీప్రాంతంలో కొలువై ఉన్న గుబ్బల మంగమ్మ గుడికి ఆదివారం భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు విజయవాడ, మచిలీపట్నం, తెలంగాణ రాష్ట్రంలోని భద్రాచలం, పాల్వంచ, కొత్తగూడెం, సత్తుపల్లి, అశ్వారావుపేట ప్రాంతాల నుంచి కూడా భక్తులు వాహనాలతో తరలివచ్చి అమ్మవారికి దూపదీప నైవేద్యాలతో ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఆలయ కమిటీ వారు సోలార్ విద్యుత్ సదుపాయం కల్పించడం, ఫ్యాన్లు ఏర్పాటు చేయడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. రేషన్ బియ్యం పట్టివేత పెదవేగి: అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సివిల్ సప్లయ్ అధికారులు పట్టుకున్నారు. విజిలెన్స్ ఎస్సై రంజిత్కుమార్ వివరాల ప్రకారం.. తడికలపూడి నుంచి దోసపాడు రైస్ మిల్లుకు రేషన్ బియ్యం తరలిస్తున్నట్లు సమాచారం మేరకు నిఘా పెట్టారు. పెదవేగి మండలం ముండూరు సమీపంలో వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా, ఆ వాహనంలో 4,700 కేజీల రేషన్ బియ్యాన్ని అధికారులు గుర్తించారు. తడికలపూడికి చెందిన ఈడ్పుగంటి శ్రీనివాస్ రైస్మిల్కు పంపుతున్నట్లు గుర్తించారు. సరుకు విలువ రూ.1,72000 ఉంటుందని చెప్పారు. 13 మంది అరెస్ట్ కామవరపుకోట: స్థల వివాదంలో 13 మందిని అరెస్టు చేసినట్లు తడికలపూడి ఎస్సై పి.చెన్నారావు తెలిపారు. రెండ్రోజుల క్రితం కామవరపుకోటలోని వీరభద్ర స్వామి ఆలయానికి సంబంధించిన స్థల వివాదం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ఘర్షణలో, ఒక వర్గానికి చెందిన ఇంటిపై మరో వర్గం దాడి చేసింది. ఆ ఇంటిని ధ్వంసం చేయడమే కాకుండా ఇంట్లో ఉన్న ముగ్గురు అన్నదమ్ములను తీవ్రంగా గాయపరిచారు. బాధితుడు షేక్ అబ్దుల్ నవీ ఫిర్యాదు చేయడంతో, కేసు నమోదు చేశారు. సీసీటీవీ ఫుటేజ్, ప్రత్యక్ష సాక్ష్యాల ఆధారంగా ఇంతవరకు 13 మందిని గుర్తించారు. వారిని చింతలపూడి కోర్టులో హాజరుపర్చగా, న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించినట్లు తెలిపారు. -
ఉద్యోగులు బాధ్యతలు గుర్తెరగాలి
తాడేపల్లిగూడెం రూరల్: ఉద్యోగులు హక్కులతో పాటు బాధ్యతలను గుర్తెరగాలని వ్యవసాయ విస్తరణాధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డి.వేణుమాధవరావు అన్నారు. ఆదివారం స్థానిక వ్యవసాయ శాఖ సీడ్ టెస్టింగ్ ల్యాబ్లో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యవసాయ విస్తరణాధికారుల కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు వేణుమాధవరావు మాట్లాడుతూ ఏఈవోల న్యాయమైన డిమాండ్ల కోసం ఏపీ జేఏసీ చైర్మన్ విద్యాసాగర్తో కలిసి పోరాడుతున్నామన్నారు. ఏఈవోలకు జాబ్చార్ట్, పేరు మార్పు, పదోన్నతుల స్కేల్ తదితర డిమాండ్ల కోసం ప్రభుత్వంతో సంప్రదింపులు చేస్తున్నామన్నారు. ఏఈవోలుగా పదోన్నతి చెందిన సభ్యులకు వ్యవసాయ విస్తరణాధికారుల సంఘంలో సభ్యత్వం కల్పించారు. జిల్లా అధ్యక్షుడు నెక్కంటి రాంబాబు, కార్యదర్శి ఎండిఆర్ శివప్రసాద్, కోశాధికారి బి.శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
పేరెంట్స్ మీట్పై టీచర్లకు షరతులు
నిడమర్రు: పాఠశాల విద్యా శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఈ నెల 10న నిర్వహించనున్న మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ 2.ఓ కార్యక్రమం నిర్వహణపై విద్యాశాఖ అధికారులు షరతు విధించారు. ఆ రోజు ఉదయం 9 గంటలకు ప్రారంభించి మధ్యాహ్నం 12.30 వరకూ జరుగుతుందీ లేనిది ఇతర శాఖ ఉద్యోగి పర్యవేక్షించాల్సి ఉంటుంది. ఆ ఉద్యోగి మెగా పీటీఎం రోజున 30 సెకన్ల వీడియో, నాలుగు ఫొటోలు, మొత్తం సమాచారాన్ని ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి. ప్రధానోపాధ్యాయులు ఉపయోగిస్తున్న లీప్ యాప్లో సాక్షిగా వచ్చిన వ్యక్తి అప్లోడ్ చేయాని గురువులకు విద్యాశాఖ అధికారులు షరుతు విధించారు. దీని ఉపాధ్యాయ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. యాప్ల భారంతో సతమతం ఉపాధ్యాయులకు యాప్ల భారం తగ్గించి అన్ని యాప్లను ఒకే వేదికపైకి తీసుకొచ్చి, సరికొత్త యాప్ రూపొందిస్తామని విద్యా శాఖ మంత్రి లోకేష్ ఉపాధ్యాయ సంఘాలతో జరిగిన తొలి సమావేశంలో ప్రకటించారు. లీప్ యాప్ను రూపొందించినా.. రోజూ మరుగుదొడ్లు, మధ్యాహ్న భోజనం నిర్వహణ వంటి కార్యక్రమాలతోపాటు స్టాక్ అందిన ప్రతిసారి పాత ఐఎంఎంఎస్లో నమోదు చేయాల్సిన పరిస్థితి ఉంది. ఇటీవల పాఠశాలలకు అందిస్తున్న సన్నబియ్యంపై ఉన్న క్యూఆర్ కోడ్ను స్టాక్ అందిన వెంటనే స్కాన్ చేయాలి. తర్వాత బస్తా ఓపెన్ చేసిన వెంటనే స్కాన్ చేయాలి. విద్యార్థులకు మొక్కలు, అపార్ ఐడీ క్రియేట్ వంటి అనేక అన్లైన్ కార్యక్రమాలతో బోధనకు దూరమవుతున్నామంటూ ఉపాధ్యాయులు అందోళన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. కుంటుపడుతున్న బోధన పాఠశాల తెరిచిన నాటి నుంచి పాఠశాలల్లో సంసిద్ధతా కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉంది. 1, 2 తరగతులకు 45 రోజులు, మిగిలిన ప్రాథమిక తరగతులకు 30 రోజులుగా అధికారులు షెడ్యూల్ ప్రకటించారు. ఇంతవరకూ గమనిస్తే ప్రారంభంలో బదిలీలు, జాయినింగ్లు, రిలీవింగ్లతో 10 రోజులు గడిచిపోయాయి. తర్వాత గిన్నిస్ రికార్డ్ కోసం అంటూ యోగాంధ్ర కార్యక్రమాలు, విద్యార్థుల రిజిస్ట్రేషన్లతో మరికొన్ని రోజులు గడిచాయి. జులై 1 నుంచి పూర్తిస్థాయిలో బోధనపై దృష్టి పెడతామంటే మరో గిన్నిస్ రికార్డు పేరుతో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 2.ఓ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. మొక్కల కోసం విద్యార్థుల వివరాలు ఆన్లైన్ రిజిస్ట్రేషన్, కమిటీల ఏర్పాటు, ఆహ్వానాలు, మండల స్థాయి నుంచి, పాఠశాల స్థాయి వరకూ ముందస్తు సమావేశాలతో ఉపాధ్యాయులంతా బిజీగా ఉండటతో, బోధనా కార్యక్రమాలు కుంటుపడినట్లు ఉపాధ్యాయ వర్గాలు చెబుతున్నాయి. కార్యక్రమం నిర్వహణపై ఇతర శాఖల ఉద్యోగులు సాక్ష్యంగా ఉండాలి విద్యా శాఖ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న టీచర్ సంఘాలు ఇతరుల పర్యవేక్షణ అంగీకరించం ఈ నెల 10న జరిగే మెగా పీటీఎంకు ఇతర శాఖల ఉద్యోగుల పర్యవేక్షణ ఉపాధ్యాయ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. గత పీటీఎంను విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రజల సహకారంతో విజయవంతం చేశాం. ఇప్పడు బాహ్య పరిశీలకుల పేరిట ఇతర శాఖ ఉద్యోగుల నియమించడం పాఠశాల నిర్వహణ వ్యవస్థను, ఉపాధ్యాయుల పనితీరు కించపరచడమే. –షేక్ రంగా వళి, జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి, ఏపీటీఎఫ్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే.. మెగా పీటీఎంను విద్యాశాఖ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. విద్యాశాఖకు సంబంధం లేని ఓ వ్యక్తిని బాహ్య పరిశీలకుడిగా నియమించుకోవాలని ఉన్నత అధికారుల ఆదేశాల మేరకే అమలు చేస్తున్నాం. సాక్షి సంతకం నిబంధన గిన్నిస్ బుక్ రికార్డు కోసమే అని, గిన్నిస్ రికార్డుల నమోదు బృందం సూచనల మేరకే సాక్షి సంతం తీసుకుంటున్నట్లు ఉన్నత అధికారులు తెలిపారు. ఏవీఎస్ఎస్ భాస్కర కుమార్, ఎంఈవో–2, నిడమర్రు -
ఆటో బోల్తా.. 10 మందికి గాయాలు
దెందులూరు: గోపన్నపాలెం గ్రామంలో ఆదివారం ఆటో బోల్తా పడిన సంఘటనలో పెదపాడు మండలం కొత్తూరు గ్రామానికి చెందిన ఇద్దరు కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి. ఎనిమిది మంది కూలీలకు స్వల్ప గాయాలయ్యాయి. వీరిని 108 అంబులెన్స్లో ఏలూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. తీవ్రంగా గాయపడిన డి.సాయికుమారి, సీహెచ్ నాగబాబులు ఏలూరు ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. కూలి పని కోసం కొత్తూరు నుంచి గోపన్నపాలెం గ్రామానికి వచ్చి పని ముగించుకొని తిరిగి వెళ్తుండగా ప్రమాదవశాత్తు కూలీల ఆటో బోల్తా పడింది. -
వచ్చే నెలలో షార్ట్ ఫిలిం పోటీలు
పాలకొల్లు సెంట్రల్: తెలుగు సాహిత్యం, సంస్కృతిని ప్రోత్సహిస్తూ పలు కార్యక్రమాలు నిర్వహించడమే ధ్యేయంగా పనిచేస్తున్నామని జాతీయ తెలుగు సారస్వత పరిషత్ అధ్యక్షుడు ముత్యాల శ్రీనివాస్ అన్నారు. ఆదివారం స్థానిక రోటరీ క్లబ్ భవనంలో మాట్లాడుతూ.. జాతీయ తెలుగు సారస్వత పరిషత్ షార్ట్ ఫిలిమ్స్ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ పరిషత్కు మాజీ ఎంపీ చేగొండి హరిరామజోగయ్య గౌరవ సలహాదారుగా వ్యవహరిస్తున్నారన్నారు. సంఘ పరిషత్ సభ్యులుగా కెఎస్పిఎన్ వర్మ, కె.రాంప్రసాద్, చేగొండి సత్యనారాయణమూర్తి, రాజా వన్నెంరెడ్డి, గుడాల హరిబాబు, బోణం వెంకట నర్సయ్య, విన్నకోట వెంకటరమణ, యిమ్మిడి రాజేష్ను నియమించినట్లు తెలిపారు. పోటీలు ఆగస్టు నెలాఖరులో నిర్వహిస్తామని చెప్పారు. ఆగస్టు 10 లోపు అప్లికేషన్స్ పంపించాలన్నారు. ఫిలిం 15 నిమిషాలు మించి ఉండరాదని అన్నారు. పోటీలకు దర్శకులు వీర శంకర్, రేలంగి నరసింహరావు, రాజా వన్నెంరెడ్డి, ఏఎన్ ఆదిత్య, రచయిత రాజేంద్రకుమార్లు జడ్జిలుగా వ్యవహరించనున్నట్లు తెలిపారు. -
‘ముసలమ్మ నొక్కిద్ది బటన్ అన్నారు..ఇప్పుడు బాబే బటన్ నొక్కలేకపోతున్నారు’
తణుకు(ప.గో.జిల్లా): సంపద సృష్టించి పేదవాడికి పంచుతామన్న చంద్రబాబు మోసపూరిత హామీలతో ప్రజలు విసిగిపోయారని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ఈరోజు(ఆదివారం, జూలై 6) తణుకులో బాబు షూరిటీ.. మోసం గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కారుమూరితో పాటు, నరసాపురం వైఎస్సార్సీపీ పరిశీలకులు మురళీకృష్ణం రాజు, వైఎస్సార్సీపీ కన్వీనర్ గూడూరి ఉమా బాల, పార్టీ శ్రేణులు పాల్గొన్నాయి. దీనిలో భాగంగా కారుమూరి మాట్లాడుతూ.. ‘ చంద్రబాబు పాలనతో ప్రజల్లో ఇప్పటికే విసుగు మొదలైంది. మంచం మీద పడుకున్న ముసలమ్మ నొక్కిద్ది బటన్ విశేషమా అన్నారు... ఇప్పుడు ఆ బటన్ నొక్కలేక పోతున్నారు. సంపద సృష్టించి పేదవాడికి పంచుతా అన్నారు. సూపర్ సిక్స్ హామీలు నెరవేరుస్తా అన్నారు.. మర్చిపోయారు. 18 సంవత్సరాలు నిండిన మహిళలకు నెలకు రూ. 1500 ఇస్తామన్నారు దానిని p4కు మార్చేశామంటున్నారునిరుద్యోగ భృతి అడిగితే స్కిల్ డెవలప్మెంట్లో కలిపేశాం అంటున్నారు. లోకేష్ గాని చంద్రబాబు గానీ పీఫోర్లో ఎంత ఇచ్చారు తమ నియోజకవర్గాల్లో. వారి సొంత డబ్బు ఒక్క రూపాయిఅయినా ఇచ్చారా..?, ప్రతి నెల పెన్షన్ పంపిణీ పేరుతో డ్రామాలాడుతున్నారు. సంవత్సర కాలంలో 1 లక్ష76 వేల కోట్లు అప్పు చేశారు. ఈవీఎంల తో మోసం చేసి గెలిచారు. జగన్మోహన్ రెడ్డి అబద్ధాలు చెప్పి మోసం చేయలేదు కూటమినేతల్లా వెన్నుపోట్లు పొడవ లేదు. పార్టీలు కులాలు మతాలు చూడకుండా ఓట్లు వేసిన వారికే కాదు వేయనివారికి సైతం మేలు చేయామని మా నాయకుడు జగన్ చెప్పారు. ైఎస్ఆర్ సీపీకి వారికి పథకాలు ఇవ్వద్దు అని అంటున్నారు చంద్రబాబు.. ఆయన బాబు సొమ్ము ఏమైనా పెడుతున్నారా...?, ఆరిమిల్లి రాధాకృష్ణ ఎన్నికల ముందు.. అనేక వాగ్దానాలు చేశారు.. ఎన్ని నెరవేర్చారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఎన్నికల ముందు ప్రతి ఇంటికి బాండ్లు ఇచ్చి ప్రజలను మోసం చేశారు’ అని ధ్వజమెత్తారు. -
తగ్గని పుస్తకాల మోత
భీమవరం: విద్యార్థులకు పుస్తకాల బరువు తక్కువగా ఉండేలా ప్రభుత్వం నిబఽంధనలు పెట్టినా ప్రైవేటు విద్యా సంస్థలు వాటిని పట్టించుకోవడం లేదు. ర్యాంకులు, ఫస్ట్క్లాస్లంటూ విద్యార్థులపై ఒత్తిడి పెంచి ఉదయం ఆరు గంటలకే తరగతులు ప్రారంభించి రాత్రి వరకు పుస్తకాలను బట్టీ పట్టిస్తున్నారు. పుస్తకాల బరువుతో అనేక సమస్యలకు గురవుతున్నారంటూ అధ్యయనంలో తేలినా.. విద్యార్థులకు మాత్రం కష్టాలు తప్పడం లేదు. ఏ క్లాస్కు ఎన్ని పుస్తకాలు ఇవ్వాలో ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు ప్రభుత్వ పాఠశాలల్లో పాఠ్య, నోటు పుస్తకాలు పంపిణీ చేస్తున్నారు. అయితే ప్రైవేటు విద్యాసంస్థలో విద్యార్థులకు మాత్రం బ్యాగ్ల బరువు తగ్గడం లేదు. విద్యా సామగ్రి విక్రయిస్తున్న ప్రైవేటు స్కూళ్లు విద్యా శాఖ లెక్కల ప్రకారం జిల్లా వ్యాప్తంగా 20 మండలాల పరిధిలో చిన్నా, పెద్ద ప్రైవేటు విద్యా సంస్థలు 435 వరకూ ఉన్నాయి. వీటిలో 96 ప్రైమరీ, 190 అప్పర్ ప్రైమరీ, 209 హైస్కూళ్లు ఉన్నాయి. తల్లికి వందనం పథకం ప్రైవేటు స్కూల్ విద్యార్థులకు కూడా వర్తింపచేయడంతో ఎక్కువ మంది తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేటు స్కూళ్లలో చదివించడానికి మక్కువ చూపుతున్నారు. దీంతో ప్రైవేటు స్కూల్ యాజమాన్యాలు పెద్ద మొత్తంలో ఫీజులు వసూలు చేయడమేగాక విద్యాసామగ్రి కూడా స్కూళ్ల వద్దనే విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. విద్యా సంస్థలు విద్యా సామగ్రి అమ్మకూడదనే నిబంధనలు గాలికి వదిలి విచ్చల విడిగా పుస్తకాలు, యూనిఫాం, బ్యాగ్లు వంటివి ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారు. విద్యాసామగ్రి విక్రయాలపై విద్యా శాఖ మొక్కుబడి దాడులు చేయడం మినహా కఠిన చర్యలు తీసుకున్న సంఘటనలు లేవు. నిబంధనల ప్రకారం పుస్తకాలు ఇలా.. ఒకటి, రెండు తరగతుల విద్యార్థులకు రెండు పుస్తకాలు, 3వ తరగతి నుంచి 5వ తరగతి వరకు నాలుగు, 6, 7తరగతులకు 8 పుస్తకాలు, 8వ తరగతికి 10, 9వ తరగతికి 12, టెన్త్ క్లాస్ విద్యార్థులకు 14 పుస్తకాలు మాత్రమే వినియోగించాల్సివుంది. దీంతో బ్యాగ్ బరువు తగ్గి విద్యార్థులకు ఊరట కలుగుతుంది. ప్రైవేటు విద్యా సంస్థలు మాత్రం నిబంధనలు లేకుండా ఒకటి, రెండు తరగతుల విద్యార్థులకు 8 పుస్తకాల వరకు కొనుగోలు చేయిస్తున్నారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు కేవలం 6.5 లక్షల పాఠ్యపుస్తకాలు మాత్రమే పంపిణీ చేస్తే ప్రైవేటు విద్యాసంస్థల్లో విద్యార్థులకు దాదాపు 15 లక్షల పుస్తకాలకు పైగా వినియోగిస్తున్నారని అంచనా. పుస్తకాల బరువుతో ఆరోగ్య సమస్యలే గాకుండా మానసికంగా ఒత్తిడికి గురవుతున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు అందోళన వ్యక్తం చేస్తున్నారు. నిబంధనలు పాటించాలి నిబంధనల ప్రకారం పుస్తకాలు బరువు తగ్గించాల్సిందే. దానిలో భాగంగానే ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు తక్కువ సంఖ్యలోనే నోట్ పుస్తకాలు పంపిణీ జరుగుతుంది. ప్రైవేట్ స్కూల్స్ కూడా అదే విధంగా నోటు పుస్తకాలు కొనుగోలు చేసుకునేలా తల్లిదండ్రులకు సూచించాలి. ప్రైవేట్ స్కూళ్ల వద్ద విద్యా సామగ్రి విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవు. – ఈ.నారాయణ, జిల్లా విద్యాశాఖాధికారి, భీమవరం ప్రభుత్వ నిబంధనలు పట్టించుకోని ప్రైవేటు స్కూళ్లు బ్యాగ్లు మోయలేక చిన్నారుల అవస్థలు -
ఆక్వా రైతుల ఆందోళన
యలమంచిలి: అప్రకటిత విద్యుత్ కోతలతో నష్టపోతున్నామని చించినాడ గ్రామానికి చెందిన ఆక్వా రైతులు శనివారం కాజ పడమర గ్రామంలోని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద ఆందోళన చేశారు. అర్థరాత్రి సమయంలో కనీస సమాచారం లేకుండా కోతలు విధించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చించినాడ లంకలో వర్షం కురిస్తే నడిచి వెళ్లడానికి కష్టంగా ఉందన్నారు. కనీస సమాచారం లేకుండా విద్యుత్ కోత విధించడంతో చెరువుల వద్దకు వెళ్లి జనరేటర్స్ వేసుకోవడం కష్టమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామానికి వెంటనే లైన్మెన్ను నియమించాలని, ఇకపై విద్యుత్ కోతలు ఉంటే సమాచారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎలక్ట్రికల్ ఏఈ కిరణ్కు వినతిపత్రం ఇచ్చారు. తిరువన్నామలైకు ప్రత్యేక రైలు పాలకొల్లు సెంట్రల్: నరసాపురం నుంచి తిరువన్నామలై (అరుణాచలం)కు ప్రత్యేక రైలు ఏర్పాటు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ డీఆర్యుసీసీ సభ్యుడు జక్కంపూడి కుమార్ తెలిపారు. నరసాపురం నుంచి అరుణాచలం 07219 నెంబరు, అరుణాచలం నుంచి నరసాపురం 07220 నెంబరుతో రైలు నడుస్తుందన్నారు. నరసాపురం నుంచి ప్రతి బుధవారం మధ్యాహ్నం ఒంటి గంటకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5 గంటలకు అరుణాచలం చేరుకుంటుందన్నారు. అరుణాచలంలో గురువారం ఉదయం 11 గంటలకు బయలుదేరి శుక్రవారం ఉదయం 3 గంటలకు నరసాపురం చేరుకుంటుందన్నారు. 8 వారాలు పాటు ఈ ప్రత్యేక రైలు నడుస్తుందన్నారు. -
సాయంపై స్పష్టత కరువు
భక్తుల రద్దీ సాధారణం ద్వారకాతిరుమల: శ్రీవారి ఆలయంలో శనివారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. స్వామివారికి ప్రీతికరమైన రోజు అయినప్పటికీ ఆషాఢ మాసం కావడంతో రద్దీ తగ్గింది.ఆదివారం శ్రీ 6 శ్రీ జూలై శ్రీ 2025సాక్షి, భీమవరం: తొలకరి పనులు మొదలయ్యాయి. నారుమడి తయారీ నుంచి పంట చేతికందే వరకు ప్రతీది ఖర్చుతో కూడుకున్న పని. నారు నుంచి నాట్లు వేయడానికే ఎకరాకు రూ. 12 వేలు వరకు వెచ్చించాల్సిన పరిస్థితి. గత ఏడాది అన్నదాత సుఖీభవ సాయానికి ఎసరు పెట్టిన చంద్రబాబు సర్కారు ఈ సీజన్లో సాయం విడుదలపై ఇంకా స్పష్టత ఇవ్వకపోవడం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. జిల్లాలో 2.08 లక్షల ఎకరాల్లో ఖరీఫ్ సాగు జరగనుంది. 10,142 ఎకరాల్లో నారుమడులు సిద్ధం చేశారు. ముందుగా మాసూళ్లు జరిగిన తాడేపల్లిగూడెం, పెంటపాడు, గణపవరం, తణుకు ప్రాంతంలో 10,212 ఎకరాల్లో నాట్లు వేశారు. పాలకొల్లు, ఉండి, కాళ్ల, ఆకివీడు, యలమంచిలి, నరసాపురం మండలాల్లో నారుమడులు సిద్ధం చేస్తున్నారు. నవంబరు చివరిలో వచ్చే తుఫాన్ల బారిన పడకుండా ఈపాటికే పనులు ముమ్మరం చేసి జూలై మూడో వారం నాటికి నాట్లు పూర్తిచేయాల్సి ఉంది. ప్రస్తుత జాప్యం నేపథ్యంలో ఆగస్టు నెల వరకూ నాట్లు పడే అవకాశం ఉంది. పెట్టుబడుల కోసం ఇక్కట్లు : సార్వాలో నారుమడులు సిద్ధం చేసిన నాటి నుంచి నాట్లు వేసే వరకు నెల రోజుల వ్యవధిలో నారుమడికి విత్తనాలు, పంట దమ్ము, పార లంకలు, నేలను చదునుచేసేందుకు, ఎరువులు, నాట్లు వేసేందుకు కూలీ ఖర్చులు తదితర రూపాల్లో రూ.12,000 వరకు ఖర్చవుతుంది. రబీ సీజన్కు ధాన్యం బకాయిలు దాదాపు రూ.150 కోట్లు విడుదల చేయకపోగా, గత నాలుగేళ్లుగా లేని నీటి తీరువాను వడ్డీతో సహా ఇప్పుడే చెల్లించాలని ప్రభుత్వం ఒత్తిడి చేస్తోంది. మరోపక్క జూన్ 1నే కాలువలకు నీరు విడుదల చేసినా నెలాఖరు వరకు శివార్ల వరకు నీరు చేరలేదు. ఆయా కారణాలతో పెట్టుబడులకు చేతిలో సొమ్ముల్లేక సాగు ఆలస్యమవుతోంది. గతంలో సాగుకు ముందే సాయం గతంలో పెట్టుబడులు కోసం ఇబ్బంది పడాల్సిన పనిలేకుండా సాగు ప్రారంభానికి ముందే వైఎస్సార్ రైతు భరోసా పథకం కింద ప్రభుత్వం రైతులకు సాయం అందించేది. కేంద్రం ఇచ్చే పీఎం కిసాన్ సాయం రూ.6000, రాష్ట్ర ప్రభుత్వం రూ.7500 జతచేసి ఏటా రూ.13,500 మొత్తాన్ని ఖరీఫ్ ప్రారంభానికి ముందు, కోతలు, రబీ ఆరంభంలో మూడు విడతలుగా అందించేవారు. తొలివిడతగా మే నెలలో రూ.7,500 రైతుల ఖాతాలకు జమచేసేవారు. పంట పెట్టుబడుల కోసం సన్న, చిన్నకారు రైతులకు ఈ సాయం ఎంతో ఉపయోగపడేది. గత ప్రభుత్వంలోని ఐదేళ్లలో జిల్లాలోని 1,17,999 మంది రైతులకు రూ.796.49 కోట్ల లబ్ధి చేకూరింది. ఈకేవైసీతో సరి :తాము అధికారంలోకి వస్తే ఏటా రూ.20 వేల చొప్పున రైతులకు అన్నదాత సుఖీభవ పథకం కింద సాయం చేస్తామని చెప్పిన కూటమి మొదటి ఏడాది సాయానికి ఎగనామం పెట్టింది. ప్రస్తుత సీజన్కు సాయం ఎప్పుడు విడుదల చేసేది ఇంకా స్పష్టత లేదు. సాయం విడుదల చేసే పేరిట జిల్లాలోని రైతులకు ఈకేవైసీ నిర్వహిస్తోంది. ఇంతవరకు 1,05,597 మందికి ఈకేవైసీ పూర్తి కాగా 355 మందికి చేయాల్సి ఉన్నట్లు వ్యవసాయాధికారులు చెబుతున్నారు. సాయం ఎప్పుడు విడుదల చేసేది స్పష్టత లేదంటున్నారు. తొలకరి పనులు ముమ్మరం కానున్న తరుణంలో పెట్టుబడులు పెట్టేందుకు చేతిలో సొమ్ములు లేక రైతులు దళారులను ఆశ్రయించాల్సి వస్తోంది. గురుకుల విద్య.. భద్రత మిథ్య శిథిలావస్థకు చేరిన భవనాల్లోనే గురుకుల విద్య తరగతులు నిర్వహిస్తుండడంతో ఏ క్షణాన ఏ భవనం కూలిపోతుందోనని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. 8లో uతొలకరిలో సాగు పెట్టుబడులు (సుమారుగా) విత్తనం ప్యాకెట్ రూ. 600 నారుమడి నిమిత్తం ఐదు సెంట్లలో దమ్ము, విత్తనాలు చల్లేందుకు, ఎరువుకు రూ.1,000 నాట్ల నిమిత్తం పొలాన్ని రెండు సార్లు దమ్ము చేసేందుకు రూ.3,000 పట్టి తోలేందుకు రూ.500 గట్లు చెక్కేందుకు ఇద్దరు కూలీలు రూ.1,400 నాట్లు వేసేందుకు కూలీలకు రూ.4,000 బస్తాన్నర యూరియా, డీఏపీ, 40 కేజీల పొటాష్కు రూ.2300, చల్లేందుకు కూలీ ఖర్చులు రూ.2100 కలుపు మందులు రూ.500, పురుగు మందులు రూ.2500, కూలీ ఖర్చులు రూ.2,100 పంట కోతకు రూ. 5,200 రవాణా, ఆరబెట్టేందుకు రూ.2,000, కూలీలు రూ.2,100 న్యూస్రీల్ జిల్లాలో మొదలైన తొలకరి పనులు నారుమడి నుంచి నాట్ల వరకు ఎకరాకు రూ.12,000 వరకు పెట్టుబడి అన్నదాత సుఖీభవ సాయం విడుదలపై సర్కారు మౌనం రైతులకు ఈకేవైసీతో సరి తొలి ఏడాది రూ.20,000 చొప్పున సాయానికి ఎగనామం పంట పెట్టుబడుల కోసం రైతుల అవస్థలు సకాలంలో సొమ్ములివ్వలేదు పది ఎకరాల వరకు సాగు చేస్తున్నాను. దాళ్వా ధాన్యం డబ్బులు నెలన్నర రోజులకు పైనే అందక ఎరువుల దుకాణాలు, ఫైనాన్స్ వ్యాపారులకు వడ్డీలతో అప్పులు చెల్లించాల్సి వచ్చింది. ఇప్పుడే నీటితీరువా చెల్లించాల్సిన దుస్థితి. తొలకరి పెట్టుబడులకు డబ్బుల్లేక ఇబ్బందులు పడుతున్నాం. అన్నదాత సుఖీభవ సాయం అందించి ఆదుకోవాలి. – జంగా వెంకటరెడ్డి, రైతు, పెనుమంట్ర ఎప్పుడు ఇచ్చేది ప్రకటించాలి ప్రభుత్వం గత ఏడాది అన్నదాత సుఖీభవ సాయం విడుదల చేయక ఒక్కో రైతు రూ. 20 వేలు చొప్పున నష్టపోయాం. ఇప్పటికే తొలకరి పనులు మొదలయ్యాయి. ఈ సీజన్కు ను ఎప్పుడు విడుదల చేసేది ఇంకా చెప్పకపోవడం వల్ల రైతులు ఆందోళనకు గురికావాల్సి వస్తోంది. గత ప్రభుత్వంలో పనులు మొదలుకాకముందే సాయం విడుదల చేసేవారు. – దేవరశెట్టి రాంబాబు, బి.కొండేపూడి, పెంటపాడు మండలం -
10న పేరెంట్స్, టీచర్స్ ఆత్మీయ సమావేశం
భీమవరం: జూలై 10న జిల్లాలో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలు, జూనియర్ కాలేజీలో నిర్వహించే మెగా పేరెంట్స్, టీచర్స్ ఆత్మీయ సమావేశానికి సంబంధించి శనివారం జాయింట్ కలెక్టర్ చాంబర్లో టి.రాహుల్ కుమార్ రెడ్డి అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సమావేశాలు పండుగ వాతావరణంలో నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు ప్రజాప్రతినిధులు, అధికారులు ఉపాధ్యాయులు, పూర్వపు విద్యార్థులను ఆహ్వానించాలన్నారు. పాఠశాలలకు హాజరయ్యే విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులకు కూడా భోజన ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రతి విద్యార్థి మొక్కను నాటేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో డీఆర్ఓ మొగిలి వెంకటేశ్వర్లు, జిల్లా విద్యాశాఖ ఏడీ ఎన్.సత్యనారాయణ, ఫారెస్ట్ అధికారి డి.ఆశా కిరణ్ తదితరులు పాల్గొన్నారు. -
స్కాంలకు సహకారం
అక్రమాలకు సహకరిస్తున్న విచారణాధికారులు విచారణాధికారి అన్ని విధాలా సహకారం అందించి ఆరు నెలల్లో జరగాల్సిన విచారణను నిలుపుదల చేస్తూ.. సొసైటీ సభ్యులు కోర్టుకు వెళ్లి స్టే తీసుకువచ్చేలా సాయపడుతున్నారు. సీజ్ చేసిన సొసైటీ రికార్డులు విచారణాధికారి వద్ద ఉంటాయి. దాంట్లో ఉద్యోగుల పదవీ విరమణ వయసు 60 నుంచి 62కు మార్చి కమిటీ తీర్మానం చేసినట్లు రికార్డు ట్యాపరింగ్ చేసి మరీ ప్రత్యేకంగా ఉత్తర్వులు తెచ్చారు. అనేక సొసైటీల్లో ఇదే తరహా వ్యవహారాలు జరిగాయి. గంగన్నగూడెంలో రూ.25 లక్షలు, జోగన్నపాలెంలో రూ.75 లక్షలు, చింతలపూడిలో రూ.30 లక్షలు, రాఘవాపురంలో రూ.40 లక్షలు, పోతునూరులో రూ.30 లక్షలకుపైగా జరిగిన అవినీతిలో కొద్ది మందిని సస్పెండ్ చేశారు. కీలక విచారణాధికారి మాత్రం విచారణ నిర్వహించి రిపోర్టును మాత్రం ప్రత్యేక వ్యవహారాలతో పెండింగ్లో ఉంచారని ఆరోపణలు ఉన్నాయి. సదరు విచారణాధికారికి ప్రత్యేకంగా నలుగురు అసిస్టెంట్ రిజిస్ట్రార్లు, ఒక సీనియర్ ఇన్స్పెక్టర్తో బృందం ఉంటుంది. సదరు బృందమే సొసైటీల్లోని తప్పులు తెలుసుకుని సొసైటీ కార్యదర్శులను పిలిచి మాట్లాడి రూ.లక్ష నుంచి రూ.5 లక్షలు, తీవ్రతను బట్టి రూ.20 లక్షల వరకు వసూలు చేసినట్లు ఆరోపణలున్నాయి. ప్రతి సొసైటీలో ఆడిట్ పూర్తి చేసి బేరం కుదిరితేనే సర్టిఫికెట్ ఇచ్చేలా వ్యవహారం సాగిస్తున్నారు. సొసైటీల్లో జరుగుతున్న అవినీతి వ్యవహారంపై ఇటీవల కొందరు ప్రభుత్వానికి కూడా ఫిర్యాదు చేసి సహకార శాఖకు సంబంధం లేని వ్యక్తితో విచారణ నిర్వహించాలని డిమాండ్ చేశారు. ● రైతుకు తెలియకుండానే రైతుల పేరుతో రుణాలు ● పలు సహకార సొసైటీల్లో అవినీతి ● విచారణాధికారులే కింగ్ మేకర్లుగా మారుతున్న వైనం ● చింతలపూడి సొసైటీలో గతంలో రూ.30 కోట్ల మేర అవినీతి ● డిపాజిట్లు ఇవ్వాలంటూ టి.నర్సాపురం సొసైటీ వద్ద రైతుల ఆందోళన సాక్షి ప్రతినిధి, ఏలూరు: రైతులకు తెలియకుండా రైతుల పేరుతో కోట్లలో రుణాలు తీసుకుంటారు. రైతుల నుంచి డిపాజిట్లు సేకరించి విచారణ పేరుతో కాలపరిమితి ముగిసినా తిరిగి చెల్లించరు. కార్యదర్శులు మినిట్ బుక్లో రాసిందే శాసనం. విచారణాధికారులే కింగ్ మేకర్లుగా మారి సమస్య సృష్టించి దానిని ఫిర్యాదుగా మలిచి దాని మీద విచారణ చేసి కావాల్సిన మేరకు దండుకుంటారు. ఇదీ జిల్లా సహకార శాఖ పరిధిలోని కొన్ని సొసైటీల్లో జరుగుతున్న అవినీతి. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా జిల్లాలోని కొన్ని సొసైటీల్లో రూ.కోట్ల అవినీతి జరుగుతున్నా ఉన్నతాధికారులు సైతం దృష్టి సారించడం లేదు. దీనిని బట్టి అవినీతి ఏ స్థాయికి చేరిందో అర్థం చేసుకోవచ్చు. తాజాగా టి.నర్సాపురం సొసైటీలో రూ.15 కోట్లకుపైగా డిపాజిట్లను తిరిగి ఇవ్వాలని రైతులు ఆందోళన నిర్వహించి సొసైటీకి తాళం వేయించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో 258 సహకార సంఘాలున్నాయి. వీటి పరిధిలో ఏటా సుమారు రూ.5 వేల కోట్ల మేర టర్నోవర్ జరుగుతుంది. ఐదారు గ్రామాలు కలిపి సొసైటీగా ఏర్పడి రైతులను సభ్యులుగా చేర్చుకుని సొసైటీ ద్వారా ఎరువులు, పురుగు మందులు విక్రయించడం, రైతుల నుంచి డిపాజిట్లు స్వీకరించడం, రైతులకు రుణాలు ఇస్తూ కార్యకలాపాలు నిర్వహిస్తుంటాయి. రూ.50 కోట్ల పైగా టర్నోవర్ జరిగే సొసైటీలు ఉమ్మడి జిల్లాలో అనేకం ఉన్నాయి. ఆదాయం పెరిగి వృద్ధిలోకి వస్తే సేవలు విస్తరించాలి. ఆదాయం పెరిగే ప్రతి సొసైటీలో అవినీతి పెరగడం స్థానిక ఉద్యోగులు మొదలుకొని జిల్లా స్థాయి అధికారుల వరకు పెంచి పోషిస్తూ వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారు. రూ.100 కోట్లకుపైగా అవకతవకలు జిల్లాలో గంగన్నగూడెం, విజయరాయి, జోగన్నపాలెం, చింతలపూడి, రాఘవాపురం, పోతునూరు, టీ. నర్సాపురం ఇలా సుమారు 25కుపైగా సొసైటీల్లో అవకతవకలు జరిగాయి. కొద్దిమందిపై విచారణ, సస్పెన్షన్లతో కోట్లాది రూపాయల అవినీతిని మరుగున పడేస్తున్నారు. కొన్నిచోట్ల వ్యవహారం బయటకు వచ్చినా ఇబ్బంది లేకుండా రికార్డులను తమదైన శైలిలో మార్చి మొక్కుబడి ఎంకై ్వరీ పేరుతో ఫైల్స్ మూసేస్తున్నారు. చింతలపూడి సొసైటీలో రూ.30 కోట్ల మేర అవినీతి జరిగింది. 8,928 మంది సభ్యులున్న సొసైటీలో ఏటా సగటున రూ.61.22 కోట్ల మేర టర్నోవర్ జరుగుతుంది. గతంలో ఈ సొసైటీలో రైతులకు తెలియకుండా రూ.కోట్ల రుణాలు సొసైటీ, శాఖలోని కీలక వ్యక్తులే తీసుకున్నారు. దీనిపై ఫిర్యాదులు రావడంతో విచారణ నిర్వహించారు. నిబంధనల ప్రకారం ఆరు నెలల్లోపు పూర్తి చేసి చర్యలు తీసుకోవాలి. అవకతవకలు పరిశీలిస్తాం సహకార సొసైటీలో జరిగిన అవినీతి, విచారణలు పూర్తిగా మా దృష్టికి రాలేదు. కొత్తగా ఇన్చార్జి బాధ్యతలు స్వీకరించాను. అన్నింటిని పరిశీలించి ఉన్నతాధికారులకు నివేదించి చర్యలు తీసుకుంటామం. – కే.వెంకటేశ్వరరావు, జిల్లా సహకార శాఖ ఇన్చార్జి టి.నర్సాపురం సొసైటీకి తాళం టి.నర్సాపురం సొసైటీలో గతంలో భారీ కుంభకోణం వెలుగుచూసింది. కొన్నేళ్లుగా త్రిసభ్య కమిటీతో సొసైటీ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. 370 మందికి సంబంధించి రూ.15 కోట్ల మేర మెచ్యూరిటీ పూర్తయినా డబ్బు ఖాతాల్లో జమ చేయలేదని ఆగ్రహించిన రైతులు డిపాజిట్లు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ గురువారం సొసైటీ సిబ్బందితోనే తాళాలు వేయించి సొసైటీ వద్ద నిరసన వ్యక్తం చేశారు. -
ప్లీజ్.. వెళ్లొద్దు టీచర్
ఆకివీడు: కొన్నేళ్లుగా తమ పాఠాలు చెప్పిన టీచరు వెళ్లిపోతుంటే ఆ విద్యార్థులంతా కన్నీరు పెట్టుకున్నారు. ఈ సంఘటన ఆకివీడు మండలం సిద్ధాపురంలో జరిగింది. సిద్ధాపురం ఎంపీపీ పాఠశాలలో 8 ఏళ్లు పనిచేసిన ఉపాధ్యాయురాలు బెజవాడ ప్రసన్న దుర్గ ఇటీవల దుంపగడప ఎంపీపీ పాఠశాలకు బదిలీ అయ్యారు. సిద్ధాపురం పాఠశాలలో శనివారం ఆమెకు వీడ్కోలు సభ నిర్వహించారు. అదే సమయంలో విద్యార్థులు శ్రీఅమ్మా నువ్వు వెళ్లవద్దు, మా స్కూల్లోనే ఉండు, మాతోనే ఉండుశ్రీ అంటూ కన్నీరు పెట్టుకున్నారు. విద్యార్థులతో పాటు అక్కడున్న తల్లిదండ్రులు, స్థానికులు కంట తడిపెట్టారు. పలువురు తల్లిదండ్రులు మాట్లాడుతూ పాఠశాలను నాడు–నేడులో ఎంతో సుందరంగా తీర్చిదిద్దారన్నారు. తమ పిల్లలకు కావాల్సిన వసతులు కల్పించారన్నారు. ఇలాంటి ఉపాధ్యాయురాలు బదిలీ అయితే తమకు, తమ గ్రామానికి కూడా నష్టమేనన్నారు. -
వైఎస్సార్సీపీ బీసీ సెల్ అధ్యక్షుడిగా కొండేటి
ఆకివీడు: వైఎస్సార్సీపీ జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడిగా కొండేటి శివకుమార్ గౌడ్ను నియమిస్తూ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి శనివారం ఆదేశాలు జారీ చేశారు. కాళ్ల మండలం జువ్వలపాలెం సర్పంచ్గా పనిచేసిన కొండేటి పార్టీ ఆవిర్భావం నుంచి చురుగ్గా పనిచేస్తున్నారు. తన సేవల్ని గుర్తించి బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడిగా నియమించినందుకు ధన్యవాదాలు చెప్పారు. పార్టీ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానన్నారు. స్మార్ట్ మీటర్లు బిగిస్తే ఉద్యమమే భీమవరం: టీడీపీ ప్రతిపక్షంలో ఉండగా విద్యుత్ స్మార్ట్ మీటర్లను నేలకేసి బద్ధలు కొడతామని ప్రగల్భాలు పలికి అధికారంలోకి వచ్చాక విద్యుత్ స్మార్ట్ మీటర్లను బిగించేస్తున్నారని దీనిపై ప్రభుత్వం పునరాలోచించకపోతే మరో బషీర్బాగ్ ఉద్యమం తప్పదని సీపీఐ పట్టణ కార్యదర్శి చెల్లబోయిన రంగారావు, సహాయ కార్యదర్శి మల్లుల శ్రీనివాసరావు హెచ్చరించారు. విద్యుత్ స్మార్ట్ మీటర్లు బిగించడాన్ని నిలిపివేయాలని, అదానీతో సోలార్ విద్యుత్ ఒప్పందం రద్దు చేయాలని, ట్రూఅప్ చార్జీలు రద్దు చేయాలని, విద్యుత్ చార్జీలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ భీమవరంలో విద్యుత్ ఏడీఈ కార్యాలయం వద్ద సీపీఐ, ఏఐటీయుసీ నాయకులు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా రంగారావు, శ్రీనివాసరావు మాట్లాడుతూ వినియోగదారుల గొంతు కోసి అదానీ, షిర్డీ సాయి కంపెనీలను ఉద్ధరించడానికే కూటమి సర్కారు ముందుకెళ్తుతోందని ఆరోపించారు. గీత కార్మికులపై కక్ష గట్టారు భీమవరం: వైఎస్సార్సీపీ పాలనలో బెల్ట్ షాపులు, అక్రమ మద్యం అమ్మకాలను కట్టడిచేస్తే నేటి కూటమి ప్రభుత్వంలో ప్రజా ప్రతినిధులు, మద్యం సిండికేట్లు, ఎకై ్సజ్ శాఖ ప్రత్యేక కూటమిగా ఏర్పడి రాజ్యాంగేతర శక్తిగా పాలన చేస్తున్నారని కల్లు గీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదరి జుత్తిగ నర్సింహమూర్తి విమర్శించారు. శనివారం కడలి పాండు అద్యక్షతన జరిగిన భీమవరం డివిజనన్ కల్లుగీత కార్మికుల సమావేశంలో గీత కార్మిక సంఘం కరపత్రం ఆవిష్కరించి మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఏడాది కాలంలో గీత కార్మికులకు ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. గీత కార్మికుల కుటుంబాలపై కక్ష గట్టి విచ్చలవిడిగా బెల్టుషాపులు పెట్టించి కల్లు అమ్మకాలు లేకుండా దెబ్బతీసిందని ఆవేదన వ్యక్తంచేశారు. ఎక్స్గ్రేషియో రద్దుచేసి గీతకార్మిక కుటుంబాలకు కూటమి ప్రభుత్వం తీరని అన్యాయం చేసిందన్నారు. సమావేశంలో చింతపల్లి చినవీరాస్వామి, తుంగ సాయిబాబు, కొప్పిశెట్టి వెంకట సత్యనారాయణ, దొంగ సత్యనారాయణ, వీరవల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. సముద్రపు రక్షణ గోడ పనుల పరిశీలన నరసాపురం రూరల్: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ దత్తత గ్రామం పీఎం లంకలో చేపట్టిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆర్థిక శాఖ మంత్రి వ్యక్తిగత కార్యదర్శి అనిరుథ్ ఎస్ పులిపాక, కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. పీఎం లంక గ్రామంలో డెలాయిట్ కంపెనీ, సీఎస్ఆర్ ఫండ్స్తో చేపట్టిన పలు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్తో కలిసి శనివారం పరిశీలించారు. డిజిటల్ భవన్లో నైపుణ్యాభివృద్ధి శిక్షణ తరగతులను పరిశీలించి విద్యార్థులు ఏఏ ప్రాంతాల నుంచి వచ్చి శిక్షణ పొందుతున్నారని అడిగి తెలుసుకున్నారు. సముద్రపు రక్షణ గోడ నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి వివరాలను తెలుసుకున్నారు. రక్షణ గోడ సకాలంలో పూర్తి చేయాలని కోరారు. కేంద్ర మంత్రి వ్యక్తిగత సహాయకుడు విష్ణు సింగ్, ఆర్డీవో దాసిరాజు పాల్గొన్నారు. -
తల్లికి వందనం కోసం టవర్ ఎక్కి నిరసన
భీమవరం: తన పిల్లలకు తల్లికి వందనం సొమ్ములు వేయకుండా ప్రభుత్వం మోసం చేసిందని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని మెంటేవారితోటకు చెందిన కోరుపల్లి శ్యామ్ విద్యుత్ టవర్ ఎక్కి శనివారం నిరసన తెలిపాడు. శ్యామ్, సునీత దంపతుల ఇద్దరు పిల్లలకు ప్రభుత్వం తల్లికి వందనం సొమ్ములు వేయకపోవడంతో అధికారులను ప్రశ్నించాడు. డబ్బులు జూలై 5న బ్యాంక్ ఖాతాలో పడతాయని చెప్పడంతో శనివారం వరకు వేచిచూశాడు.అయినప్పటికీ సొమ్ములు రాకపోవడంతో శ్యామ్..గరగపర్రులోని హెచ్టీ విద్యుత్ టవర్ ఎక్కాడు. స్థానికులు పోలీసులకు సమాచారమివ్వడంతో వెంటనే విద్యుత్ సరఫరా నిలుపుదల చేయించారు. పోలీసులు వెళ్లి శ్యామ్ను టవర్ దిగాలని కోరారు. శ్యామ్ వినకపోవడంతో అతని భార్యతో నచ్చజెప్పించి కిందకు దిగేలా చేశారు. అతడిని పోలీసుస్టేషన్కు తీసుకువెళ్లి కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు. -
స్నాతకోత్సవానికి గవర్నర్కు ఆహ్వానం
తాడేపల్లిగూడెం: రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ను డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం వీసీ కె.గోపాల్ రాజ్భవన్లో శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ నెల 10న కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం, ఆత్కూర్లోని స్వర్ణభారతి ట్రస్ట్లో నిర్వహించనున్న ఉద్యానవర్సిటీ ఆరో స్నాతకోత్సవానికి హాజరు కావాలని ఆహ్వానించారు. ఉద్యాన వర్సిటీ సాధించిన ప్రగతిని వీసీ గవర్నర్కు వివరించారు. ఆయన వెంట రిజిస్ట్రార్ బి.శ్రీనివాసులు ఉన్నారు. పార్సిల్ కార్యాలయాల తనిఖీ తాడేపల్లిగూడెం: పట్టణంలోని పార్సిల్ కార్యాలయాలను శుక్రవారం ఎకై ్సజ్ అధికారులు తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా ఎకై ్సజ్ సీఐ స్వరాజ్యలక్ష్మి మాట్లాడుతూ పార్సిల్స్ ద్వారా స్పిరిట్, గంజాయి, డ్రగ్స్ వంటివి తరలించే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఈ తనిఖీలు చేస్తున్నామన్నారు. నిబంధనలకు విరుద్ధంగా పార్సిల్ కార్యాలయాలు, కొరియర్ కార్యాలయాలు చట్ట విరుద్ధమైన వస్తువులు రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎస్ఆర్ఎంటీ, నవత, వీఆర్ఎల్ లాజిస్టిక్ , బ్లూడార్ట్, ఆర్టీసీ, రైల్వే పార్సిల్ కార్యాలయాలు, డీటీడీసి, ప్రొఫెషనల్ కొరియర్ సర్వీసుల కార్యాలయాలను, గోదాములను తనిఖీ చేశారు. అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి ముదినేపల్లి రూరల్: చేపల పట్టుబడికి వెళ్లి అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందిన సంఘటన మండలంలోని పెదగొన్నూరులో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం గ్రామానికి చెందిన ఎ.హేమంతరావు ఈ నెల 1న చేపల పట్టుబడికి వెళ్లి ప్రమాదవశాత్తూ తల తిరిగి జారిపడిపోయాడు. చికిత్స నిమిత్తం పెదఅవుటుపల్లి ఆసుపత్రికి తరలించగా మెరుగైన వైద్యం కోసం గురువారం విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికి త్స పొందుతూ శుక్రవారం మరణించాడు. మృతుడి భార్య రాఘవమ్మ పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
మెడికల్ షాప్, ల్యాబ్, క్లినిక్లలో తనిఖీలు
కామవరపుకోట: స్థానిక ప్రభుత్వ వైద్యాధికారి స్కే బీబీ జాన్, డీఎంహెచ్ఓ కార్యాలయ అడ్వకేట్ వడ్డీ సత్యా రవి స్థానిక కొత్తూరులో ఉన్న మందులు షాపు, క్లినిక్, ల్యాబ్లో శుక్రవారం తనిఖీలు నిర్వహించారు. సాయిరాం క్లినిక్, దుర్గా మెడికల్ షాప్, శ్రీ సాయిరాం డయాగ్నస్టిక్ సెంటర్, సాయిరాం క్లినిక్, సాయిరాం మెడికల్ షాప్లో తనిఖీలు చేయగా సాయిరాం క్లినిక్లో 20 ఏళ్లుగా వైద్యం చేస్తున్న వ్యక్తికి సరైన సర్టిఫికెట్లు లేవని, అతను వైద్యం చేసేందుకు అనర్హుడని గుర్తించారు. శ్రీ సాయిరాం డయగ్నొస్టిక్ సెంటర్ టెక్నీషియన్కు రిజిస్ట్రేషన్ లేదని తెలిపారు. స్థానికుల ఫిర్యాదు మేరకు ఈ తనిఖీలు చేస్తున్నట్టు ఆమె తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా ల్యాబ్లు, క్లినిక్లు నిర్వహిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. ఈ మేరకు అధికారులు నివేదికి ఇస్తామని వైద్యాధికారి పి.బీబీ జాన్ తెలిపారు. -
అల్లూరి సాంస్కృతిక కేంద్రం కోసం దీక్షలు
భీమవరం : పట్టణంలోని పాత బస్స్టాండ్ వద్ద తొలగించిన అల్లూరి సీతారామరాజు భవనం స్థానంలో అందరికీ ఉపయోగ పడే సీతారామరాజు సాంస్కృతిక కేంద్రం నిర్మించాలని అల్లూరి మెమోరియల్ హాలు సాధన కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం ప్రకాశంచౌక్ సెంటర్లో రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ముందుగా అల్లూరి జయంతి సందర్భంగా సాధన కమిటీ గౌరవ అధ్యక్షుడు కనుమూరి సత్యనారాయణరాజు, సీపీఎం రాష్ట్ర నాయకుడు మంతెన సీతారామ్ అల్లూరి చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సత్యనారాయణరాజు మాట్లాడుతూ గతంలో మెమోరియల్ హాలును విరాళాలు సేకరించి నిర్మించామన్నారు. హాలు శిథిలం కావడంతో దాన్ని తొలగించి తిరిగి నిర్మిస్తామని చెప్పి సంవత్సరాలు గడిచిపోయినా నిర్మాణం చేపట్టలేదని మండిపడ్డారు. రిలే నిరాహార దీక్షలలో సాధన కమిటీ సభ్యులు బి.బలరామ్, జేఎన్వీ గోపాలన్, బి.వాసుదేవరావు, డి.కళ్యాణి కూర్చున్నారు. సాధన కమిటీ నాయకులు కంతేటి వెంకటరాజు, శ్రీ విజ్ఞాన వేదిక కన్వీనర్ చెరుకువాడ రంగసాయి, దళిత ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు గంటా సుందర్కుమార్ పాల్గొన్నారు. -
వైద్యుడి ఇంట్లో భారీ చోరీ
ఏలూరు టౌన్: ఏలూరు శివారు ఆశ్రం హాస్పిటల్లో పనిచేస్తున్న వైద్యుడి ఇంట్లో శుక్రవారం పట్టపగటే భారీ చోరీ జరిగింది. ఏలూరు రూరల్ ఆరఽశం ఆస్పత్రిలో దాసరి లోకనాథం సీనియర్ వైద్యుడిగా పని చేస్తున్నారు. ఆయన భార్యతో కలిసి ఆశ్రం హాస్పిటల్ క్వార్టర్స్లోని ఇంట్లో నివాసం ఉంటున్నారు. వ్యక్తిగత పనులపై భార్య ఊరు వెళ్లగా ఆయన ఒక్కరే ఉంటున్నారు. ఈ నేపథ్యం శుక్రవారం ఉదయం యథావిధిగా వైద్యుడు లోకనాథం విధులకు వెళ్లారు. అనంతరం ఇంటికి తిరిగి వచ్చి చూసుకునే సరికి ఇంటి తాళం చెవులు కనిపించలేదు. కొంతసేపు వెదికిన అనంతరం ఆయనే ఇంటి తాళాలు స్వయంగా పగులగొట్టి లోనికి వెళ్లి చూసేసరికి బీరువా పగులగొట్టి ఉంది. బీరువా లోని సుమారు 70 కాసుల బంగారు ఆభరణాలు, వజ్రాలు, ఇతర విలువైన వస్తువులు, నగదు అపహరణకు గురైనట్లు గుర్తించారు. వేసిన తాళాలు వేసినట్లే ఉండి లోపల చోరీకి గురికావటంపై ఆయన షాక్ అయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఏలూరు వన్టౌన్ సీఐ సత్యనారాయణ, రూరల్ ఎస్సై దుర్గాప్రసాద్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చోరీకి గురైన బంగారు ఆభరణాలు విలువ భారీగా ఉంటుందని, ఇక వజ్రాలు విలువ సుమారు రూ.కోటికి పైగా ఉంటుందని సహచర వైద్యులు గుసగుసలాడుతున్నారు. ఈ వజ్రాలు చోరీ ఇంటి దొంగల పనేనా? లేక బయట నుంచి వచ్చిన దొంగలా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. వృద్ధుడైన డాక్టర్ తన జీవితకాలం సంపాదించిన బంగారు ఆభరణాలు, నగదు అపహరణకు గురి కావడం పట్టణంలో చర్చనీయాంశంగా మారింది. 70 కాసుల బంగారు ఆభరణాలు, వజ్రాలు, నగదు అపహరణ -
కండిగలమ్మ ఆలయంలో భారీ చోరీ
ద్వారకాతిరుమల: మండలంలోని గుండుగొలనుకుంట గ్రామంలో ఉన్న కండిగలమ్మ, పోతురాజు స్వామి వార్ల ఆలయంలో గురువారం అర్ధరాత్రి సమయంలో భారీ చోరీ జరిగింది. ఈ ఘటనలో అమ్మవారి మూలవిరాట్ మీద ఉన్న బంగారు, వెండి ఆభరణాలతో పాటు, హుండీలోని నగదు చోరీకి గురైంది. ఆలయ కమిటీ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం కొందరు గుర్తు తెలియని వ్యక్తులు సుమారు రాత్రి 1 గంట సమయంలో ఆలయం గేట్లకు ఉన్న తాళాలను, ద్వారాలను పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. అనంతరం అమ్మవారి మూలవిరాట్పై ఉన్న రెండున్నర కేజీల వెండి కిరీటం, ఒక వెండి కనురెప్ప, ఒక కాసు బంగారపు కళ్లు, అరకాసు బంగారు మంగళ సూత్రం, ముప్పావు కాసు బంగారు ముక్కుపుడక, బీరువా లోని విలువైన పట్టు చీరలను చోరీ చేశారు. అలాగే హుండీని పగలగొట్టి అందులోని సుమారు లక్ష రూపాయలను చోరీ చేశారు. ఆ తరువాత ఖాళీ హుండీని, అమ్మవారి మెడలోని గిల్టు మంగళ సూత్రాలను, చోరీకి ఉపయోగించిన సమిట, పలుగును ఆలయం పక్కనున్న కోకో తోటలో పడేశారు. రోజూలానే శుక్రవారం ఉదయం ఆలయాన్ని తెరిచేందుకు వెళ్లిన ఆలయ కమిటీ చైర్మన్ చిలుకూరి ధర్మారావు చోరీ జరిగినట్టు గుర్తించి, పోలీసులకు సమాచారం అందించారు. సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్సై టి.సుధీర్ ఆలయాన్ని, పరిసర ప్రాంతాలను, తోటలో దుండగులు పడవేసిన హుండీని, చోరీకి ఉపయోగించిన ఆయుధాలను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం పోలీస్ జాగిలంతో తనిఖీలు జరిపారు. అలాగే క్లూస్ టీమ్ వేలిముద్రలను సేకరించింది. ధర్మారావు ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై సుధీర్ తెలిపారు. -
ఇరువర్గాల ఘర్షణతో ఉద్రిక్తత
కామవరపుకోట : స్థానిక గుర్రాల చెరువు గట్టు వినాయక గుడి వెనుక శుక్రవారం రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణ నేపథ్యంలో మండల కేంద్రంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు కారణమైంది. గత కొంత కాలంగా ఈ ప్రాంతంలో రెండు వర్గాల మధ్య ఉన్న చిన్న చిన్న గొడవలు చినికి చినికి తీవ్రంగా మారాయి. గురువారం రెండు వర్గాల మధ్య చిన్నపాటి వివాదం జరగ్గా శుక్రవారం మధ్యాహ్నం దానికి కొనసాగింపుగా ఓ వర్గం వారు చేసిన దాడుల్లో ఓ కుటుంబానికి చెందిన టిప్టాప్ సామగ్రి ధ్వంసమై భారీ నష్టం జరిగిందని బాధితులు చెబుతున్నారు. పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా జంగారెడ్డిగూడెం డీఎస్పీ యు.రవిచంద్రతో ఆధ్వర్యంలో నలుగురు ఎస్సైలు, పలువురు పోలీసు సిబ్బంది పరిసర ప్రాంతాల్లో భారీగా మోహరించారు. డీఎస్పీ రవిచంద్ర రాత్రి 8 గంటలు అయినా కూడా అక్కడే ఉండి పరిస్థితి పర్యవేక్షిస్తున్నారు. ఈ సంఘటనపై డీఎస్పీని వివరణ కోరగా వివాదం పూర్తి వివరాలను పరిశీలించి చెబుతానని తెలిపారు. అయితే ఈ వివాదం జరిగిన ప్రాంతంలో ఉన్న భూమిని దేవదాయ శాఖ అధికారులు శుక్రవారం రాత్రి రంగంలోకి దిగి స్వాధీనం చేసుకునే పనులు మొదలు పెట్టారు. ఆ స్థలంలో ఉన్న తూములను కూలీలతో పక్కకు తొలగిస్తున్నారు. -
వృద్ధులే టార్గెట్గా దాడులు, చోరీలు
ఏలూరు టౌన్: ఏలూరు జిల్లాలో వృద్ధులను టార్గెట్ చేస్తూ దాడులు చేస్తూ చోరీలకు పాల్పడుతున్న కేసులను పోలీస్ యంత్రాంగం ఛేదించింది. కై కలూరు రూరల్ పరిధిలో వృద్ధులను కొట్టి బంగారు ఆభరణాలు దోచుకెళ్ళిన దొంగలను పట్టుకున్న పోలీసులు, భారీగా చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో ఊలూరు జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ కేసుల వివరాలు వెల్లడించారు. కై కలూరు మండలం రామవరంలో ఒంటరిగా జీవిస్తోన్న వృద్ధ మహిళలను టార్గెట్ చేస్తూ వరుస చోరీలకు పాల్పడుతున్న దొంగలను కై కలూరు రూరల్ సీఐ వి.రవికుమార్ పట్టుకున్నారు. రామవరం గ్రామంలో భర్త చనిపోయి గూడూరు నాగలక్ష్మి ఒంటరిగా ఉంటుంది. మే నెల 28తేదీ రాత్రి 9.20గంటల సమయంలో ఇంట్లోకి చోరబడిన ఇద్దరు దొంగలు ఆమె తలకు ముసుగు వేసి చేతులతో ముఖంపై తీవ్రంగా కొట్టి గోడకు తలను కొట్టారు. ఆమె సృహతప్పి పడిపోవటంతో మెడలోని ఐదు కాసుల బంగారు చైన్, రెండు చేతులకు ఉన్న రెండు బంగారపు గాజులు లాక్కుని చనిపోయిందనే ఉద్దేశ్యంతో పరారయ్యారు. కొంతసేపటికి కోలుకున్న వృద్ధురాలు చుట్టుపక్కల వారి సహాయంతో పోలీస్స్టేషన్కు వెళ్ళి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు కేసును దర్యాప్తు చేశారు. ఏలూరు డీఎస్పీ శ్రావణ్కుమార్ పర్యవేక్షణలో రూరల్ సీఐ రవికుమార్ ఆధ్వర్యంలో పోలీస్ బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. కై కలూరు మండలం రామవరం గ్రామానికి చెందిన పంతగాని జాన్కుమార్, గరికిముక్కు రాజ్కుమార్ అనే ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 40 గ్రాముల బంగారు చైన్, 24గ్రాముల రెండు బంగారు గాజులు రికవరీ చేశారు. బంగారు గాజుల చోరీ కై కలూరు మండలం రామవరంలో సోము సీతామహాలక్ష్మి ఒంటరిగా ఉంటూ కిరాణా కొట్టు పెట్టుకుని జీవనం సాగిస్తోంది. అయితే 2024 ఫిబ్రవరి 13న పగటి వేళ ఆమె దుకాణం వద్దకు వెళ్లి ఎవ్వరికీ అనుమానం రాకుండా లోనికి వెళ్లిరెండు బంగారు గాజులు చోరీ చేసి పరారయ్యారు. దీనిపై కై కలూరు రూరల్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీస్ అధికారులు రామవరం గ్రామానికి చెందిన భూపతి ప్రదీప్ అలియాస్ బన్ను, కురెళ్ళ సుబ్బారావు అలియాస్ సుబ్బు అనే ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. ఈ కేసులో నిందితుల నుంచి రూ.1 లక్ష నగదును స్వాదీనం చేసుకున్నారు. రికవరీ సొమ్ము అందజేత కై కలూరు రూరల్ సర్కిల్ పరిధిలో మూడు కేసులు, మండవల్లి స్టేషన్ పరిధిలో మూడు కేసులు, ముదినేపల్లి స్టేషన్ పరిధిలో రెండు కేసుల్లో మొత్తంగా సుమారు రూ.12,21,126 విలువైన బంగారు ఆభరణాలు, ఒక ఆటో, నగదును పోలీసులు స్వాదీనం చేసుకున్నారు. ఈ రికవరీ నగదు, నగలు, వస్తువులను బాధితులకు జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ చేతులమీదుగా అందజేశారు. సైబర్ నేరగాళ్ళబారిన పడి పోగొట్టుకున్న మరో రూ.2లక్షల నగదును సైబర్ సెల్ సీఐ దాసు, కానిస్టేబుల్ శివ ఆధ్వర్యంలో రికవరీ చేసి బాధితులకు అందజేశారు. ఈ సమావేశంలో ఏలూరు జిల్లా అదనపు ఎస్పీ నక్కా సూర్యచంద్రరావు, ఏలూరు డీఎస్పీ డి.శ్రావణ్కుమార్, ఎస్బీ సీఐ మల్లేశ్వరరావు, డీసీఆర్బీ సీఐ అభీబ్ భాషా ఉన్నారు. నలుగురు నిందితుల అరెస్ట్, భారీగా రికవరీ -
●ఇరుకు వంతెనతో యాతన
గరగపర్రులో భీమవరం–తాడేపల్లిగూడెం ప్రధాన రహదారిపై ఉన్న వంతెనపై భారీ కంటైనర్ శుక్రవారం సుమారు రెండు గంటల ప్రాంతంలో ఇరుక్కుపోయింది. దీంతో వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయి, భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. వంతెన శిథిలావస్థకు చేరడంతో ఈ వంతెనపై భారీ వాహనాలను అనుమతించేది లేదని గతంలో అధికారులు ప్రకటించినప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం పట్టించుకోకపోవడంతో యథావిధిగా వాహనాలు తిరుగుతున్నాయి. – పాలకోడేరు -
జల్లేరు ఆధునికీకరణ పనులు ప్రారంభం
బుట్టాయగూడెం: మండలంలోని దొరమామిడి సమీపంలో ఉన్న గుబ్బల మంగమ్మతల్లి జల్లేరు జలాశయం నిర్వహణ పనుల నిమిత్తం రూ. 20 లక్షల నిధులు మంజూరు చేసినట్లు మైనర్ ఇరిగేషన్ ఏఈ టి.సురేష్ తెలిపారు. శుక్రవారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ ఈ నిధులతో గేట్లు, రంగులు వేయడం, ఇరువైపులా జంగిల్ క్లియరెన్స్, ఆయిల్, గ్రీజు పనులు ఏడాది పాటు నిర్వహిస్తామని తెలిపారు. ప్రస్తుతం పనులు జరుగుతున్నట్లు, గతంలో రూ. 8 లక్షల వ్యయంతో స్పిల్వే గేట్లు మరమ్మతులు కూడా పూర్తి చేశామని తెలిపారు. మావుళ్లమ్మ సన్నిధిలో మహా సుదర్శన హోమం భీమవరం(ప్రకాశం చౌక్): పట్టణంలోని మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానం వద్ద శుక్రవారం ఉదయం 7.30 గంటలకు మహా సుదర్శన హోమం నిర్వహించారు. దేవస్థానం ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ, వేదపండితులతో అమ్మవారికి పూజా కార్యక్రమాలను నిర్వహించామని ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మీ నగేష్ తెలియజేశారు. ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు యాగాన్ని ప్రారంభించి, అమ్మవారిని దర్శించుకునారు. సుమారు 1500 మంది భక్తులకు అమ్మవారి లడ్డు ప్రసాదాన్ని, భోజన సదుపాయాన్ని కల్పించారు. ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాలి భీమవరం(ప్రకాశం చౌక్): భవ్య భీమవరం పేరిట చేపట్టిన వివిధ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాలని మున్సిపల్ అధికారులను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో కలెక్టర్ సీహెచ్ నాగరాణి భవ్య భీమవరం ప్రాజెక్టుల పురోగతిపై భీమవరం మున్సిపాలిటీ ప్రత్యేక అధికారి, ఆర్డీవో, మున్సిపల్ అధికారులతో సమావేశమై సమీక్షించారు. రాష్ట్రంలోనే ప్రసిద్ధిగాంచిన మావుళ్లమ్మ అమ్మవారి దేవస్థానం చుట్టుపక్కల ఆధ్యాత్మికతతో కూడిన ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పాటుకు మున్సిపల్ అధికారులు కృషి చేయాలన్నారు. నిబంధనలను అతిక్రమించి ఉన్న ఆక్రమణదారులకు వెంటనే నోటీసులు జారీ చేసి, తొలగింపుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. భీమవరంలో స్విమ్మింగ్ ఫూల్ ఏర్పాటుకు వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. ఇప్పటికే చేపట్టిన పాత బస్టాండ్ మోడ్రన్ బస్ స్టాప్ పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, ఆర్డీఓ, భీమవరం మున్సిపాలిటీ స్పెషలిటీ ఆఫీసర్ కె.ప్రవీణ్ కుమార్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ కె.రామచంద్ర రెడ్డి, సహాయ కమిషనర్ ఎ.రాంబాబు, జిల్లా టూరిజం అధికారి ఏవీ అప్పారావు, మున్సిపల్ ఇంజనీర్ పి.త్రినాథరావు తదితరులు పాల్గొన్నారు. -
కలల తీరాలకు తొలి అడుగు
ఏలూరు (ఆర్ఆర్పేట): ఎన్నో ఆశయాలు, మరెన్నో లక్ష్యాలు నిర్దేశించుకుంటున్న విద్యార్థులు వాటిని సాధించడానికి, చేరుకోవడానికి వేయి ఆశలతో ఎదురు చూస్తున్న వారికి శుభవార్త. తమ లక్ష్యాలను సాధించడానికి తొలి అడుగు వేసే తరుణం వచ్చేసింది. ఇంటర్మీడియట్ పూర్తి చేసి, ఈఏపీ సెట్లో మంచి ర్యాంకులు సాధించిన విద్యార్థులు ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. విద్యార్థులు, తల్లిదండ్రులు వెబ్ ఆప్షన్లపై పూర్తి స్థాయిలో ఆలోచించుకుని తుది నిర్ణయం తీసుకోవాలని విద్యారంగ నిపుణులు సూచిస్తున్నారు. ఏపీ ఈఏపీ సెట్ పరీక్షల్లో ఏలూరు జిల్లా నుంచి 4700 మంది పరీక్ష రాయగా వారిలో ఇంజనీరింగ్ కోర్సుకు 3409 మంది మాత్రమే అర్హత సాధించారు. ఈ కోర్సుల గురించీ తెలుసుకోండి.. ఇంజనీరింగ్లో సంప్రదాయ కోర్సులతో పాటు కొత్త కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. ఈసీఈ, మెకానికల్, ఈఈఈ, సీఎస్ఈ, సివిల్ వంటి సంప్రదాయ కోర్సులు ఇప్పటికే ఉన్నాయి. కొత్తగా సీఎస్ఈలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), మెషీన్ లెర్నింగ్, డేటా సైన్స్, రోబోటిక్స్, సైబర్ సెక్యూరిటీ, వెరీ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేషన్ (వీఎల్ఎస్ఐ) డిజైన్, అడ్వాన్స్డ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, ఏరోస్పేస్, కంప్యూటర్ ప్రోగ్రామింగ్, నెట్ వర్కింగ్, అల్గారిథమ్స్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ప్రోగ్రామ్ డిజైన్, కంప్యూటర్ సాఫ్ట్వేర్, కంప్యూటర్ హార్డ్వేర్, ఆపరేటింగ్ సిస్టమ్స్, అగ్రికల్చరల్, మైరెన్, మైనింగ్, స్కిల్ అండ్ టెక్స్టైల్ వంటి కొత్త బ్రాంచిలు వచ్చాయి. ఈ కోర్సుల్లో నైపుణ్యం సాధించినా అపార అవకాశాలు ఉన్నాయి. జిల్లాలో ఆరు ఇంజనీరింగ్ కళాశాలలు ఏలూరు జిల్లాలో ఆరు ఇంజనీరింగ్ కళాశాలలు ఉండగా మొత్తం 4,920 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఏలూరు సీఆర్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో 1,200 సీట్లు, ఏలూరు రామచంద్ర ఇంజనీరింగ్ కళాశాలలో 900 సీట్లు, ఏలూరు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కళాశాలలో 660 సీట్లు, హేలాపురి ఇంజనీరింగ్ కళాశాలలో 420 సీట్లు, ఆగిరిపల్లిలో ఎన్ఆర్ఐ ఇంజనీరింగ్ కళాశాలలో 1,320 సీట్లు, నూజివీడు సారథి ఇంజనీరింగ్ కళాశాలలో 420 సీట్లు ఉన్నాయి. ఇంజనీరింగ్ ప్రవేశాల ప్రక్రియ షురూ 7 నుంచి షెడ్యూల్ ప్రారంభం 10 నుంచి వెబ్ ఆప్షన్లకు అవకాశం ఆగస్టు 4 నుంచి తరగతులు ప్రారంభం షెడ్యూల్ ఇలా.. తొలి విడత కౌన్సెలింగ్ జూలై 7 నుంచి 16 వరకూ ఆన్లైన్ రిజిస్ట్రేషన్, ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు జూలై 7 నుంచి 17 వరకూ ఆన్లైన్లో విద్యా ర్థులు అప్లోడ్ చేసిన సర్టిఫికెట్ల వరిశీలన జూలై 10 నుంచి 18 వరకూ వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకునే అవకాశం జూలై 19న వెబ్ ఆప్షన్లు మార్చుకునేందుకు అవకాశం జూలై 22న సీట్ల కేటాయింపు. జూలై 23 నుంచి 26 వరకూ కళాశాలలో ప్రవేశాలు ఆగస్టు 4 నుంచి తరగతుల ప్రారంభం మలివిడత కౌన్సెలింగ్ జూలై 25 నుంచి 27 వరకూ ఆన్లైన్ రిజిస్ట్రేషన్, ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు జూలై 26 నుంచి 28 వరకూ ఆన్లైన్లో విద్యార్థులు అప్లోడ్ చేసిన సర్టిఫికెట్ల పరిశీలన జూలై 27 నుంచి 29 వరకూ వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకునే అవకాశం జూలై 30న వెబ్ ఆప్షన్లు మార్చుకునేందుకు అవకాశం ఆగస్టు 1న సీట్ల కేటాయింపు ఆగస్టు 2 నుంచి 5 వరకూ కళాశాలలో ప్రవేశాలు -
‘బాబు, పవన్లు గ్రామాల్లోకి రండి.. ఎవరి తాటతీస్తారో చూద్దాం’
భీమవరం(పశ్చిమగోదావరి జిల్లా): కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది దాటిపోయిందని, మరి సూపర్ సిక్స్ హామీలు ఏమైపోయాయని చంద్రబాబు, పవన్ కళ్యాణ్లను ప్రశ్నించారు వైఎస్సార్సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ. ఈరోజు(శుక్రవారం, జూలై 4వ తేదీ) పశ్చిమగోదావరి జిల్లాలోని భీమవరంలో ‘ చంద్రబాబు షూరిటీ.. మోసం గ్యారంటీ’ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉభయగోదావరి జిల్లాల రీజినల్ కోఆర్డినేటర్ బొత్స సత్యనారాయణ నర్సాపురం పార్లమెంట్ పరిశీలకు మురళీ కృష్ణంరాజు, కన్వీనర్ ఉమాబాల, జిల్లా అధ్యక్షుడు ముదునూరు ప్రసాద్ రాజు, మాజీ మంత్రులు కొట్టు సత్యనారాయణ, కారుమూరి వెంకట నాగేశ్వరరావులు పాల్గొన్నారు. దీనిలో భాగంగా బొత్స మాట్లాడుతూ.. ‘మేనిఫెస్టోను పవిత్ర గ్రంథం గా భావించిన నాయకుడు జగన్మోహన్రెడ్డి. ‘చంద్రబాబు, పవన్ కళ్యాణ్ బాండ్లు రాసి పేద ప్రజలను మోసం చేశారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ సంవత్సరం దాటిపోయింది మీరు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు ఏమైపోయాయి..?, సూపర్ సిక్స్ హామీలు.. అన్ని ఇచ్చేసాను ఎవరన్నా ప్రశ్నిస్తే ఆ నాలుక మందం అంటున్నారు. పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తే తాటతీస్తాను మధ్యలో ఇరగ కొడతా అంటున్నాడు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు దగా కోరులు మోసగాళ్లు.. పేద ప్రజల పక్షాన ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు కూటమినేతల మెడలు వంచుతాం. చంద్రబాబు పాలన ఎప్పుడు వచ్చినా మహిళలు రైతులు నష్టపోతు ఉంటారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ రండి గ్రామాల్లోకి వెళదాం... ఎవరి తాటతీస్తారో తేలిపోతుంది. చంద్రబాబు వచ్చి 100 అబద్ధాలు చెబుతాడు..లోకేష్ వచ్చి... 200 అబద్ధాలు చెబుతాడు. అన్నదాత సుఖీభవ రూ. 20000 ఇస్తా అన్నారు సంవత్సరమైంది ఎవరికైనా ఇచ్చారా....?, ప్రజల సమస్యలపై పోరాడటం మా పార్టీ ధ్యేయం. రాష్ట్రంలో ఏ పంటకైనా గిట్టుబాటు ధర ఉందా....?, సిండికేట్లుగా మారి ఆక్వా రైతులను ఇబ్బందులు పెడుతున్నారు. ’ అని ధ్వజమెత్తారు బొత్స. జగన్ 2.0 లో కార్యకర్త ఏది చెబితే అదే జరుగుతుందిజగన్ 2.0 లో కార్యకర్త ఏది చెబితే అదే జరుగుతుందని మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ స్పష్టం చేశారు. మన నాయకుడు మాటిస్తే మాట తప్పే పరిస్థితి లేదు.. తగ్గేదే లేదని ఈ సందర్భంగా తెలిపారు. కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ.. ‘చంద్రబాబు ప్రజలందరిని వంచించి మోసం చేశాడు. సంపదల సృష్టి కరెంటు బిల్లులు పెన్షన్ అంటూ అబద్ధాలు చెప్పాడు. చంద్రబాబు దుర్మార్గమైన మనిషి. ఒక పెద్ద మనిషి ప్రశ్నిస్తాను అన్నాడు. కాపు నేస్తమా అమలు చేయడం లేదు. దానిపై ప్రశ్నించడం లేదుచంద్రబాబు సంపద సృష్టించడంలో నెంబర్ వన్ కాదు అప్పులు చేయడంలో నెంబర్ వన్. సంవత్సరం తిరగకుండానే రూ. 1,50,000 కోట్లు అప్పులు చేశాడు’ అని మండిపడ్డారు. -
దోమలపై దండెత్తరే?
వైఎస్సార్ సీపీ హయాంలో.. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో పట్టణాలు, పల్లెల్లో ప్రత్యేక పారిశుద్ధ్య నిర్వహణ ద్వారా దోమల నిర్మూలన చర్యలు చేపట్టేవారు. డ్రెయినేజీల్లో ఆయిల్బాల్స్, స్ఫ్రేయింగ్ చేయించేవారు. క్రమం తప్పకుండా ఫాగింగ్ జరిగేది. జ్వరపీడితులను గుర్తించేందుకు వలంటీర్లు, ఆరోగ్య సిబ్బందితో ఇంటింటా ఫీవర్ సర్వే చేయించి రోగులకు వైద్య సాయం అందించేవారు. దోమల నిర్మూలనకు తీసుకోవాల్సిన చర్యలపై వలంటీర్లతో ఇంటింటా అవగాహన కల్పించేవారు. ప్రస్తుతం ఆ దిశగా చర్యలు కానరావడం లేదని ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. పశ్చిమగోదావరి జిల్లా కేంద్రం భీమవరంలో ఇండస్ట్రీయల్ ఏరియా, చినరంగనిపాలెం, బందరుపుంత, గంగమ్మగుడి ఏరియా, హౌసింగ్బోర్డు కాలనీ, మెంటే వారితోట, టిడ్కో ప్లాట్లు తదితర డ్రైనేజీలు అధ్వానంగా ఉన్నాయి. పలుచోట్ల మురుగునీరు నిలిచిపోయి అపారిశుద్ధ్యంతో దోమల ఉత్పత్తి కేంద్రాలుగా మారాయి. తమ వార్డుల్లో పారిశుద్ధ్య నిర్వహణ సరిగ్గా లేదని, వారం పది రోజులకు డ్రెయినేజీలను శుభ్రం చేస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దోమల నిర్మూలనకు పురపాలక సంఘం రూ. 10 లక్షలు బడ్జెట్లో కేటాయిస్తుండగా నివారణ చర్యలు అంతంతమాత్రంగానే ఉంటున్నాయంటున్నారు. దోమల బెడదతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు వాపోతున్నారు.సాక్షి, భీమవరం : ప్రస్తుతం రుతుపవనాల రాకతో జిల్లా అంతటా వర్షాలు కురుస్తున్నాయి. అందుకు తగ్గట్టుగా పట్టణాలు, పంచాయతీల్లో ప్రత్యేక పారిశుద్ధ్య నిర్వహణ జరుగుతున్న దాఖలాలు లేవు. ఎక్కడికక్కడ డ్రెయినేజీలపై గడ్డి, పిచ్చిమొక్కలతో అధ్వానంగా ఉన్నాయి. ఖాళీ స్థలాల్లో వర్షపు నీరు నిలిచిపోయి దోమల ఉత్పత్తి కేంద్రాలుగా తయారయ్యాయి. దోమల విజృంభణతో విష జ్వరాల బెడద ఆందోళనకు గురిచేస్తోంది. భీమవరం, నరసాపురం, పాలకొల్లు, తాడేపల్లిగూడెం, తణుకు పట్టణాలు, ఆకివీడు నగర పంచాయతీల్లో దోమల నిర్మూలన పేరిట రూ. 5 లక్షల నుంచి రూ.10 లక్షలు వరకు బడ్జెట్లో కేటాయిస్తున్నారు. జిల్లాలోని 20 మండలాల పరిధిలో 409 పంచాయతీలు ఉండగా పెద్ద పంచాయతీల్లో రూ.రెండు లక్షలు వరకు, చిన్న పంచాయతీల్లో రూ. 25 వేలు నుంచి రూ. లక్ష వరకు వెచ్చిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా రూ. 5 కోట్లకు పైగానే కేటాయిస్తున్నట్టు అంచనా. కానరాని నిర్మూలన చర్యలు దోమల నిర్మూలన చర్యల్లో భాగంగా లార్వా దశలోనే వాటిని నిర్మూలించేందుకు డ్రెయినేజీలు, నీరు నిల్వ ఉండే ఖాళీ ప్రదేశాలను శుభ్రం చేయించి ఆయిల్ బాల్స్, కెమికల్స్ స్ప్రేయింగ్, సాయంత్ర వేళల్లో ఫాగింగ్ చేయించాలి. డ్రెయినేజీల్లో నీరు నిల్వ ఉండకుండా మురుగునీరు పారే విధంగా ప్రతిరోజూ శుభ్రం చేయించాలి. క్షేత్రస్థాయిలో ఈ చర్యలు తూతూమంత్రంగానే ఉంటున్నాయి. నిధుల లేమితో పంచాయతీల్లో ఫాగింగ్ ఊసే ఉండటం లేదు. పాలకొల్లు, తాడేపల్లిగూడెం, తణుకు, నరసాపురం పట్టణాల్లోనూ ఫాగింగ్ జరగడం లేదని స్థానికులు అంటున్నారు. దీంతో పట్టణాలు, గ్రామాల్లో దోమలు విపరీతంగా పెరిగిపోవడంతో ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. దండయాత్ర ఊసేది? ‘దోమలపై దండయాత్ర’ అంటూ గతంలో టీడీపీ అధికారంలో ఉండగా సీఎం చంద్రబాబు హడావుడి చేసిన విషయం విధితమే. పట్టణాలు, గ్రామాల్లో డ్రెయినేజీలను శుభ్రం చేయడం, తుప్పలు తొలగించడం, చెత్తను ఎత్తడం తదితర కార్యక్రమాలకు అప్పట్లో పిలుపునిచ్చారు. ప్రత్యేక పారిశుద్ధ్య నిర్వహణకు నిధులు కేటాయించకపోవడంతో ఎక్కడికక్కడ ప్రచార ఆర్భాటంగానే దండయాత్ర సాగింది. పారిశుద్ధ్య కార్మికులతో పనులు చేయించి, ఉపాధ్యాయులు, విద్యార్థులతో ర్యాలీలు చేయించి మమ అనిపించడంతో అప్పట్లో ఈ కార్యక్రమంపై విమర్శలు వెల్లువెత్తాయి. రోజుకు రూ.50 లక్షలకుపైగా ఖర్చు జిల్లా జనాభా 18.48 లక్షలు. అర్బన్, రూరల్ ఏరియాల్లో నాలుగు లక్షలకు పైగా నివాస గృహాలు ఉన్నాయి. దాదాపు 4.62 లక్షల కుటుంబాలు నివసిస్తుండగా ఉపాధి కోసం ఒరిస్సా, బీహార్, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన వారు మరో లక్షకు పైగా ఉంటారు. దోమల బెడద నుంచి ఉపశమనం కోసం కాయిల్స్, స్టిక్స్, కెమికల్స్ తదితర వాటిపై సగటున ఒక్కో కుటుంబం రోజుకు రూ.10 చొప్పున జిల్లావ్యాప్తంగా రూ.50 లక్షలకు పైగానే వెచ్చిస్తున్నట్టు అంచనా. ఇప్పటికై నా మున్సిపల్, పంచాయతీ అధికారులు స్పందించి దోమల నివారణకు పూర్తిస్థాయిలో చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ప్రతికూల వాతావరణంలో పడకేసిన పారిశుద్ధ్యం గతంలో దోమలపై దండయాత్ర పేరిట హడావుడి చేసిన టీడీపీ ప్రభుత్వం దోమల బెడద ఎక్కువగా ఉంది భీమవరం టిడ్కో ప్లాట్లలో నివాసం ఉంటున్నాం. మా ప్రాంతంలో దోమలు బెడద ఎక్కువగా ఉండడంతో ఇబ్బందులు పడుతున్నాం. దోమల నివారణకు ఫాగింగ్ చేయడంగాని, నివారణ చర్యలు తీసుకోవడం లేదు. దోమలతో రాత్రిళ్లు కంటిమీద కునుకు ఉండటం లేదు. రాత్రిళ్లు రెండు కాయిల్స్ వెలిగిస్తున్నా తర్వాత మామూలుగా వచ్చేస్తున్నాయి. – వై.వీర్రాజు, భీమవరండ్రెయినేజీలు శుభ్రం చేయడం లేదు వర్షాకాలం కావడంతో ప్రస్తుతం దోమలు బెడద చాలా ఎక్కువగా ఉంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో వర్షాకాలంలో డ్రెయిన్లు శుభ్రం చేసేవారు. దోమల మందు, బ్లీచింగ్ పౌడర్ క్రమం తప్పకుండా చల్లేవారు. ఇప్పుడు ఎవరూ పట్టించుకోవడం లేదు. పగలు, రాత్రి తేడా లేకుండా దోమలు దండయాత్ర చేస్తున్నాయి. – నలభ పోతురాజు, ఎనంఆర్పీ అగ్రహారం -
ఎస్వీ రంగారావుకు భారతరత్న ఇవ్వాలి
తాడేపల్లిగూడెం (టీఓసీ): విశ్వనట చక్రవర్తి స్వర్గీయ ఎస్వీ రంగారావుకు భారతరత్న ఇవ్వాలని పలు సంఘాలు డిమాండ్ చేశాయి. స్థానిక ఎస్వీఆర్ సర్కిల్లో గురువారం ఎస్వీ రంగారావు జయంతిని ఘనంగా నిర్వహించారు. ఎస్వీఆర్ సేవా సమితి అధ్యక్షుడు భోగిరెడ్డి రాము మాట్లాడుతూ తెలుగు సినీ ప్రాముఖ్యతను ప్రపంచానికి చాటి చెప్పిన తొలి తెలుగు నటుడు ఎస్వీ రంగారావు అని కొనియాడారు. కాపునాడు అధ్యక్షుడు మాకా శ్రీనివాసరావు మాట్లాడుతూ అద్భుత నటనతో ప్రపంచాన్ని మెప్పించిన నటుడు ఎస్వీ రంగారావుకు తక్షణమే భారత రత్న అవార్డును ప్రకటించాలని డిమాండ్ చేశారు. తొలుత ఎస్వీ రంగారావు సర్కిల్ నుంచి ర్యాలీగా పోస్టాఫీస్ వరకు చేరుకున్నారు. భారతరత్న ఇవ్వాలనే విన్నపాన్ని రిజిస్టర్ పోస్టులో ప్రధాని నరేంద్ర మోదీ అడ్రస్కు పంపారు. కార్యక్రమంలో శ్రీకృష్ణదేవరాయ సేవా సంఘం అధ్యక్షుడు ఆకుల శ్రీనివాస్, బండి రామస్వామి, గంధం రాజశేఖర్, జంగా రామ్రాయ్, పి.కుమార్స్వామి, సామినేటి రంగారావు, బాకా వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
ఆటో, బ్యాటరీల దొంగల అరెస్ట్
భీమవరం: జల్సాలకు, చెడు వ్యసనాలకు అలవాటు పడి ఆటోలు, బ్యాటరీ దొంగతనాలకు పాల్పడుతున్న ఐదుగురు నిందితులను అరెస్టు చేసి, వారి నుంచి సుమారు రూ. 23 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నటు ఏఎస్పీ వి భీమారావు చెప్పారు. గురువారం భీమవరం వన్టౌన్ పోలీసుస్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వివరాలను వెల్లడించారు. వీరవాసరం గ్రామానికి చెందిన కంచర్ల శ్రీరామ్కుమార్ లారీలను కిరాయికి తిప్పుతుంటాడు. ఈ క్రమంలో పట్టణంలోని మెంటేవారితోట బైపాస్ రోడ్డులోని లారీ ట్రాన్స్పోర్ట్ కార్యాలయం వద్ద జూన్ 14న తన మూడు లారీల పార్క్చేసి ఉంచగా వాటిలోని 6 బ్యాటరీలు దొంగిలించారంటూ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వన్టౌన్ ఎస్సై ఎస్వీవీఎస్ కృష్ణాజీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ కేసులో పట్టణానికి చెందిన తీగల నరేంద్రభవాని, పైలా రాకేష్, యలగడ కోదండశివసాయివెంకట సత్యనారాయణలను అదుపులోనికి తీసుకుని విచారించగా భీమవరం వన్ టౌన్, భీమవరం టూ టౌన్, కాళ్ల, ఆకివీడు, ఉండి, వీరవాసరం, పాలకోడేరు పోలీసుస్టేషన్ల పరిధిలో దొంగిలించిన 65 బ్యాటరీలు దొంగతనం చేసినట్లు గుర్తించారు. దీంతో వారి వద్ద నుంచి సుమారు రూ. 6 లక్షల విలువైన 65 బ్యాటరీలను స్వాధీనం చేసుకున్నట్లు ఏఎస్పీ భీమారావు చెప్పారు. ఇద్దరు ఆటోల దొంగల అరెస్టు భీమవరం పోలీసు సబ్డివిజన్ పరిధిలో ఇటీవల ఆటో దొంగతనాలు ఎక్కువ జరగడంతో భీమవరం టుటౌన్ పోలీసుస్టేషన్ సిబ్బందితో నిఘా ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ఈ నెల 2న కృష్ణా జిల్లా మండవల్లి మండలం పేరికిగూడెం గ్రామానికి చెందిన పరస నాగరాజును అరెస్ట్ చేసి విచారించారు. విచారణలో భీమవరం పట్టణంలోని వన్టౌన్, టూటౌన్, రూరల్, ఆకివీడు, అమలాపురం, వైజాగ్ వన్టౌన్, టూటౌన్, మండవల్లి ప్రాంతాల్లో 13 ఆటోలను దొంగతనాలు చేశానని నేరం అంగీకరించారు. దీంతో నాగరాజుతో పాటు అనకాపల్లి మండలం సబ్బవరం గ్రామానికి చెందిన పోలిశెట్టి గణేష్లను అరెస్టు చేసి వారి నుంచి సుమారు రూ. 17 లక్షల విలువైన 10 ఆటోలు స్వాధీనం చేసుకున్నట్లు ఏఎస్పీ భీమారావు చెప్పారు. సమావేశంలో భీమవరం డీఎస్పీ ఆర్జీ జయసూర్య, సీఐలు ఎం.నాగరాజు, జి.కాళీచరణ్, ఎస్సై కృష్ణాజీ తదితరులు పాల్గొన్నారు. 10 ఆటోలు, 65 బ్యాటరీల స్వాధీనం -
సోలార్ లైట్లు, సీసీ కెమెరాలు ఏర్పాటు
బుట్టాయగూడెం : మండలంలోని ప్రసిద్ధ గుబ్బల మంగమ్మ గుడికి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో గురువారం సోలార్ ద్వారా లైట్స్, ఫ్యాన్లు, సీసీ కెమెరాలతోపాటు మంచినీటి సదుపాయం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ప్రతినిధి కొర్సా గంగరాజు మాట్లాడుతూ తెల్లవారుజామునే ఇక్కడికి చేరుకునే భక్తులు చీకటిగా ఉండడంతో మంగమ్మతల్లిని దర్శించుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఈ నేపథ్యంలో టెల్ టవర్స్ సోలార్ కంపెనీ ద్వారా మంగమ్మతల్లి ఆలయం వద్ద సోలార్ కరెంట్ సదుపాయం, సీసీ కెమెరా, ఫ్యాన్లు, మంచినీటి సదుపాయం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 14 నెలల తర్వాత బంగారం చోరీపై కేసు నమోదు కై కలూరు: బంగారు గాజులు చోరీ జరిగిన 14 నెలల తర్వాత ఓ మహిళ కై కలూరు రూరల్ స్టేషన్లో గురువారం ఫిర్యాదు చేసింది. రామవరం గ్రామానికి చెందిన సోము సీతామహాలక్ష్మీ(62) భర్త ఆరేళ్ల క్రితం మరణించాడు. కుమారుడు ఇతర ప్రాంతంలో ఉంటాడు. ఆమె ఇంటి వద్ద కిరాణా దుకాణం నడుపుతోంది. అయితే 2024 ఫిబ్రవరి 13న ఆమె రెండు బంగారు గాజులు గల్లా పెట్టెలో వేసి స్నానానికి వెళ్లింది. తిరిగి వచ్చి చూసుకునేసరికి కనిపించలేదు. కొన్నాళ్లు వెతికి ఊరుకుంది. ఇటీవల కుమారుడు ఇంటికి రావడంతో అతడికి విషయం చెప్పింది. దీంతో అతని సలహా మేరకు ఆమె పోలీసులను ఆశ్రయించింది. ఈ మేరకు రూరల్ ఎస్సై రాంబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మద్యం మత్తులో వ్యక్తిపై బ్లేడుతో దాడి భీమవరం: స్థానిక టూ టౌన్ ఏరియా బైపాస్ రోడ్డు దగ్గర ఓ వ్యక్తిని బ్లేడుతో గొంతుకోసిన సంఘటన కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం లంకపేటకు చెందిన సీహెచ్ సాయిబాబు, ఎస్కే వినోద్ ఇద్దరూ ఓ చోట మద్యం తాగుతున్నారు. ఆ సమయంలో ఇద్దరూ సరదా కబుర్లతో కోడిగుడ్లు విసురుకున్నారు. అంతలోనే వినోద్ కోపోద్రిక్తుడై బ్లేడుతో సాయిబాబు గొంతు కోసి పారిపోయాడు. బాధితుడు ప్రస్తుతం భీమవరం ప్రాంతీయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. సీఐ జి.కాళీచరణ్, పోలీసులు బృందాలుగా వెళ్లి నిందితుడి కోసం గాలిస్తున్నారు. -
అగ్గిపుల్లపై అల్లూరి
ఏలూరు (టూటౌన్) : అల్లూరి సీతారామరాజు జయంతిని పురస్కరించుకుని ఏలూరుకు చెందిన సూక్ష్మ కళాకారుడు మేతర సురేష్ అగ్గిపుల్లపై ఆయన చిత్రాన్ని నిర్మించి అబ్బుర పరుస్తున్నారు. వివిధ సందర్భాల్లో ఆయా నాయకుల చిత్రాలను తనదైన శైలిలో నిర్మించి నివాళులర్పించడం సురేష్కు పరిపాటి. ఈ క్రమంలోనే ఈ నెల 4వ తేదీ అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా ఆయన చిత్రాన్ని అగ్గిపుల్లపై నిర్మించి నివాళి అర్పించారు. ఏలూరులో ఈగల్ టీమ్ తనిఖీలు ఏలూరు టౌన్ : గంజాయి, మత్తు పదార్థాల రవాణా అడ్డుకునేందుకు ఈగల్ టీమ్, రైల్వే పోలీస్, జిల్లా పోలీస్ సంయుక్తంగా గురువారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఏలూరు రైల్వే స్టేషన్లో ఈగల్ టీమ్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ రవికృష్ణ స్వయంగా తనిఖీల్లో పాల్గొన్నారు. ఆయనతో పాటు ఈగల్ టీమ్ ఎస్పీ నాగేశ్వరరావు, ఏలూరు జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్, అదనపు ఎస్పీ నక్కా సూర్యచంద్రరావు ఉన్నారు. ఏలూరు రైల్వే స్టేషన్లో విస్తృతంగా తనిఖీలు చేశారు. డాగ్ స్క్వాడ్తో రైల్వే స్టేషన్లో క్షుణ్ణంగా తనికీలు చేశారు. కోరమాండల్ ఎక్స్ప్రెస్తో సహా పలు రైళ్ళలో తనిఖీలు చేశారు. కార్యక్రమంలో డీఎస్పీ డీ.శ్రావణ్కుమార్, రైల్వే పోలీస్ డీఎస్పీ రత్నరాజు, టూటౌన్ సీఐ అశోక్కుమార్, త్రీటౌన్ సీఐ కోటేశ్వరరావు, ఎకై ్సజ్ సీఐ ధనరాజ్ తదితరులు పాల్గొన్నారు. -
అప్రమత్తతతో రక్తహీనత దూరం
జంగారెడ్డిగూడెం: రక్తహీనత అనేది మనుషులతో పాటు పశువులనూ ఇబ్బంది పెట్టే ప్రధాన వ్యాధి. పశువుల విషయానికి వస్తే ఎర్ర రక్త కణాల సంఖ్య తగ్గడం లేదా హిమోగ్లోబిన్ స్థాయిలు తగ్గడం వల్ల రక్తంలో ఆమ్లజనకం సరఫరా తగ్గిపోవడం వల్ల రక్తహీనత వేధిస్తుంది. రక్తహీనత వల్ల పశువులు మేత మానేసి, పనిలో బలహీనత ఉంటాయి. దీంతో ఆవులు, గేదెల రోగనిరోధక శక్తిపై ప్రభావం చూపుతుంది. రక్తహీనత తగ్గించే చర్యలు చేపట్టి పాడి అభివృద్ధిని మెరుగుపరిచే సూచనలు, సలహాలు పశువైద్యాధికారి బీఆర్ శ్రీనివాసన్ వివరించారు. రక్తహీనత లక్షణాలు బలహీనత, అలసట, తెల్లబడ్డ లేదా పసుపు కొమ్ములు, మేత, నీరు తీసుకునే అలవాటు తగ్గిపోవడం, శ్వాసకష్టం, బరువు తగ్గడం, పని సామర్థ్యం తగ్గిపోవడం చికిత్స విధానాలు ● అల్లోపతి విధానంలో : తీవ్ర రక్తహీనతకు రక్త మార్పిడి అవసరం కావచ్చు. ● ఐరన్ లోపం కారణంగా రక్తహీనత ఉన్నప్పుడు ఐరన్ సప్లిమెంట్స్ ఇవ్వాలి. ● కీటకాల నివారణ, పరాన్నజీవాల మీద కట్టడి చేయడం ద్వారా రక్తహీనత నివారించవచ్చు. ● బాక్టీరియా లేదా పకిటీరియా సంక్రమణకు యాంటీబయోటిక్స్ ఇవ్వాలి. నేచురోపతి విధానంలో.. ● పచ్చ కూరలు, ఆకుకూరలు, ఆహారంలో ఇనుమును ఐరన్ను చేర్చాలి. ● హెర్బల్ చికిత్సా విధానంలో నెటిల్, స్పిరులినా వంటి ఐరన్ అధికంగా ఉన్న ఉత్పత్తులు ఎర్ర రక్తకణాల ఉత్పత్తిని పెంచడంలో సహాయపడతాయి. ● ఆక్యు పంక్చర్ విధానంలో చికిత్స రక్త ప్రసరణను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. హోమియోపతి విధానం ఫెర్రఫోస్పోరికమ్ చికిత్సలో రక్తహీనత ప్రారంభ దశలో ఉత్పత్తి స్థాయిలు పెంచడానికి ఉపయోగపడుతుంది. చైనా ఆఫిసినాలిస్ చికిత్సలో రక్త పోత తర్వాత రక్తహీనత ఉన్న జంతువులకు ఇది ఇవ్వవచ్చు. నాట్రమ్ మురియాటికమ్ చికిత్సలో జిగురు తగ్గిన రక్తహీనతకు ఉపయోగపడుతుంది. ఆర్సెనికమ్ ఆల్బమ్ చికిత్సలో తీవ్ర బలహీనత, శ్వాసకష్టం ఉన్న రోగులకి ఇది ఇవ్వవచ్చు. చికిత్సతో రక్తహీనత దూరం రక్తహీనతకు సమయానుకూలంగా చికిత్స ఇవ్వడం చాలా ముఖ్యం. అల్లొపతి, నాచురోపతి, హోమియోపతి పద్ధతులను సమ్మిళితం చేసి, వెటర్నరీ డాక్టర్ సలహా మేరకు జాగ్రత్తలు తీసుకుంటే, రోగం నుంచి కోలుకోవడం సులభం. – బీఆర్ శ్రీనివాసన్, పశు వైద్యాధికారి పాడి–పంట -
ఇంటి స్థలం వివాదం.. ఇద్దరిపై దాడి
నూజివీడు: మండలంలోని గొల్లపల్లిలో ఇంటి స్థలం విషయంలో జరిగిన గొడవలో ఒక వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా, మరొకరి చేతికి గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన బోనాల నాగేంద్రబాబు(34), బోనాల దశరథ రామాంజనేయులు ఇద్దరూ అన్నదమ్ములు. వీళ్లతో పాటు వాళ్ల బాబాయ్ బోనాల శ్రీనివాసరావులకు కలిపి ఏడు సెంట్ల ఇళ్ల స్థలం ఉంది. దీనిలో చెరి సగం కాగా బోనాల శ్రీనివాసరావు మొత్తం నాదేనంటూ బోనాల నాగేంద్రబాబు, దశరథ రామాంజనేయులను రానీయడం లేదు. ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం 4 గంటల సమయంలో ఇళ్ల స్థలంలోకి వెళ్లగా బోనాల శ్రీనివాసరావుతో పాటు అతని కుమారులు, భార్య కలిసి నాగేంద్రబాబు, బోనాల దశరథ రామాంజనేయులపై కత్తితో దాడి చేసి కొట్టారు. దీంతో నాగేంద్రబాబుకు తలపై తీవ్ర గాయమైంది. దశరథరామాంజనేయులకు చేతిపై దెబ్బ తగిలింది. దీంతో స్థానికులు వారిని హుటాహుటిన నూజివీడు ఏరియా ఆసుపత్రికి తరలించగా చికిత్స అందిస్తున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 51 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత నూజివీడు: పట్టణంలోని బైపాస్ రోడ్డులో బుధవారం అర్ధరాత్రి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ట్రక్కు వాహనంలో తరలిస్తున్న అక్రమ బియ్యాన్ని పట్టుకున్నారు. వారికి వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు బైపాస్ రోడ్డులో వాహనాలను తనిఖీ చేస్తుండగా ఓ వాహనంలో 51 క్వింటాళ్లు రేషన్ బియ్యం ఉన్నట్లుగా గుర్తించారు. ఈ బియ్యం ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేట ఏరియా నుంచి హనుమాన్ జంక్షన్కు రవాణా చేస్తున్నారు. దీంతో వాహనాన్ని స్వాధీనం చేసుకుని, బియ్యాన్ని సీజ్ చేశారు. వాహన డ్రైవర్ నక్కా శివ, రేషన్ బియ్యం సరఫరాదారులు ధనికొండ గోపిరాజు, ధనికొండ గణేష్, వారికి సాయం చేస్తున్న ఖాసీంబాబు, వాహన యజమాని నక్కా నాగగోపాలకృష్ణలపై 6ఏ, 7(1)కేసులను నమోదు చేశారు. విజిలెన్స్ ఎస్సై నాగరాజు, హెచ్సీ వెంకటేశ్వరరావు, సీఎస్ డీటీ జి.వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. రైలు నుంచి జారిపడి ఉపాధ్యాయుడి మృతి ఏలూరు టౌన్: నగరంలోని ఫిల్హౌస్ పేటకు చెందిన ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు నేతల చంద్రశేఖర్ ఆజాద్ (51) రైలు నుంచి జారిపడి మృతి చెందాడు. ఏలూరు రైల్వే ఎస్సై పి.సైమన్ తెలిపిన వివరాల ప్రకారం వన్టౌన్ ఫిల్హౌస్ పేటకు చెందిన చంద్రశేఖర్ ఆజాద్ శ్రీపర్రు జెడ్పీ స్కూల్లో బయాలజీ టీచర్గా పనిచేస్తున్నారు. బుధవారం రాత్రి విజయవాడలోని తన సోదరుడి ఇంటికి వెళ్లేందుకు ఏలూరు రైల్వేస్షేషన్లో కాకినాడ–తిరుపతి రైలు ఎక్కాడు. రైలు వట్లూరు సమీపానికి వచ్చేసరికి రైలు నుంచి ప్రమాదవశాత్తూ జారిపడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే ఆజాద్ విజయవాడ చేరుకోలేదని తెలియడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెంది పోలీసులను ఆశ్రయించారు. గురువారం మధ్యాహ్నం రైల్వే గ్యాంగ్మెన్ ఓ మృతదేహాన్ని గుర్తించి రైల్వే పోలీసులకు సమాచారం అందించాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే ఎస్సై సైమన్ మృతుడిని గుర్తించి పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు జీజీహెచ్ మార్చురీకి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఆయన తెలిపారు. -
కారు ప్రమాదంలో వ్యక్తి మృతి
పాలకొల్లు సెంట్రల్: కోనసీమ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పాలకొల్లు పట్టణానికి చెందిన బొండాడ వీఎల్ నరసింహరావు గుప్త (51) మృతి చెందారు. గురువారం గుప్త మిత్రులు తెలిపిన వివరాల ప్రకారం బొండాడ గుప్త పట్టణంలో ఎర్రవంతెన వద్ద దూది పరుపులు వ్యాపారం చేస్తుంటాడు. అతని భార్య దేవి ఇంటి వద్ద ఎంబ్రాయిడింగ్ డిజైన్ మెషీన్ వర్క్ చేస్తుంటారు. మెషీన్ మరమ్మతు రావడంతో రాజమండ్రిలో మరమ్మతు చేయించాలని భార్యాభర్తలిద్దరూ గురువారం వారికి తెలిసిన మిత్రుడి కారు తీసుకుని రాజమండ్రి బయలుదేరి వెళ్లారు. మార్గ మధ్యలో కోనసీమ జిల్లా రావులపాలెం మండలంలోని ఈతకోట వద్ద కారు ముందు టైరు పంక్చర్ అవ్వడంతో ఒక్కసారిగా కారు అదుపుతప్పి డివైడర్ దాటుకుని ఎదురుగా వస్తున్న మరో కారుని ఢీకొట్టిందని తెలిపారు. ఈ ప్రమాదంలో గుప్త అక్కడికక్కడే మృతి చెందగా భార్య దేవి, ఎదురుగా వస్తున్న కారులో వ్యక్తులకు తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో క్షతగాత్రులను రాజమండ్రి ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. -
కాంట్రాక్టర్లకు బిల్లుల బెంగ
భీమవరం (ప్రకాశం చౌక్): కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా మునిసిపాలిటీల్లో అభివృద్ధి పనులు ముందుకు సాగడం లేదు. ఏడాది కాలంగా కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. జిల్లాలోనే పెద్ద మునిసిపాలిటీ, గ్రేడ్ వన్ మున్సిపాలిటీగా ఉన్న భీమవరం మునిసిపాలిటీకి పుష్కలంగా నిధులు ఉన్నా కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో అభివృద్ధి కుంటుపడింది. భీమవరం మునిసిపాలిటీలో రెగ్యులర్గా పనులు చేసే కాంట్రాక్టర్లు 30 మంది వరకు ఉన్నారు. ఒక్కొక్క కాంట్రాక్టరుకు రూ.లక్షల్లో బిల్లులు బకాయి ఉండడంతో మళ్లీ పనులు చేసే పరిస్థితి వారి దగ్గర లేదు. ఇక్కడ కాంట్రాక్టర్ల బిల్లులు బకాయిలు చూసి బయట కాంట్రాక్టర్లు సైతం భీమవరం మునిసిపాలిటీ అంటేనే బిల్లులు రావు అని భయపడుతున్నారు. ఏడాదిగా చెల్లింపు నిల్ గత ప్రభుత్వంలో చివరి ఏడాది నుంచి కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ ఏడాది కాలంలో ఒకటి రెండు పనులు కలుపుకుని భీమవరం మునిసిపాలిటీలో చేసిన 446 పనులకు సంబంధించి రూ.33.50 కోట్లు బిల్లుల బకాయి ఉంది. అందులో మునిసిపాలిటీ సాధారణ నిధులతో చేసిన 111 పనులకు సంబంధించి రూ.16 కోట్లు, మెయింట్నెన్స్ నిధులతో చేసిన 222 పనులకుగాను రూ.5 కోట్లు, 15వ ఆర్థిక సంఘం నిధులతో చేసిన 7 పనులకుగాను రూ.2.5 కోట్లు కాంట్రాక్టర్లకు చెల్లించాల్సి ఉంది. అయితే కాంట్రాక్టర్లకు బిల్లుల బకాయిల చెల్లింపులో కూటమి ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యంగా ఉంది. దీంతో పట్టణంలో సీసీరోడ్లు, డ్రెయిన్ల నిర్మాణం, అఖరికి డ్రెయిన్ల బాగుచేత పనులు సైతం జరగడం లేదు. వాటికి టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్లు ఎవరూ ముందుకు రావడం లేదు. పెండింగ్ బిల్లులు కోసం నిత్యం మునిసిపాలిటీ అధికారులు చుట్టూ తిరుగుతున్నారు. అన్న క్యాంటీన్ల ఆధునికీకరణ బిల్లులు లేవు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత భీమవరం పట్టణంలో మూడు అన్న క్యాంటీన్లను తిరిగి ప్రారంభించడానికి వాటి ఆదునికీకరణ పనులను కాంట్రాక్టర్లు చేత చేయించింది. మూడు క్యాంటీన్లలో రెండు రూ.6 లక్షల చొప్పున, ఒకటి రూ.8 లక్షలతో అభివృద్ధి చేయించింది. వాటి బిల్లులు రూ.20 లక్షలు కూడా చెల్లించలేదు. గత ప్రభుత్వంలో రూ.130 కోట్ల పనులు గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో అంతకు ముందు టీడీపీ ప్రభుత్వంలో తీర్మానం చేసిన పనులకుగాను ఏడాది కాలంలోనే రూ.30 కోట్లు చెల్లించారు. సకాలంలో వారికి బిల్లులు చెల్లించడంతో గత 5 ఏళ్ల పాలనలో భీమవరం మునిసిపాలిటీలో రూ.130 కోట్ల పనులను కాంట్రాక్టర్లు పూర్తిచేశారు. ప్రస్తుతం భీమవరం మునిసిపాలిటీకి కోట్ల ఆదాయం ఉన్నా బిల్లులు చెల్లించడానికి కూటమి ప్రభుత్వానికి మనస్సు రావడం లేదు. ఇదే తీరు కొనసాగిస్తే మునిసిపాలిటీ అభివృద్ధి తిరోగమనం పడుతుంది. కాంట్రాక్టర్లు కడుపు మండి రోడ్డు ఎక్కే పరిస్థితి రాకముందే వారి కుటుంబాలను దృష్టిలో పెట్టుకుని వారికి వెంటనే బకాయిలు చెల్లించాలని పలువురు కోరుతున్నారు. కాంట్రాక్టర్లకు రూ.33.50 కోట్ల బకాయిలు అన్న క్యాంటీన్ ఆధునికీకరణ పనులకూ బిల్లుల్లేవు కొత్త పనులు చేసేందుకు ముందుకు రాని వైనం భీమవరం మునిసిపాలిటీలో కుంటుపడిన అభివృద్ధి అప్పుల ఊబిలోకి కాంట్రాక్టర్లు కూటమి ప్రభుత్వం బిల్లుల చెల్లించకుండా వ్యహరిస్తున్న తీరుతో కాంట్రాక్టర్లు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. వడ్డీకి అప్పు తెచ్చి చేసిన పనులకు సకాలంలో బిల్లులు రాకపోయే సరికి తీసుకున్న అప్పు తీర్చడానికి మరో అప్పు చేయడం ఇలా సతమతం అవుతున్నారు. కొందరు ఇంటిలో బంగారం, ఆస్తులు తాకట్టు పెట్టి తెచ్చిన డబ్బుతో పనులు పూర్తిచేశారు. బిల్లులు రాకపోవడంతో తనఖా పెట్టిన బంగారం, ఆస్తుల పరిస్థితిపై ఆందోళన చెందుతున్నారు. -
బాబు వంచనపై పోరుబాట
రీకాలింగ్ చంద్రబాబూస్ మేనిఫెస్టో ఆవిష్కరణ శురకవారం శ్రీ 4 శ్రీ జూలై శ్రీ 2025సాక్షి ప్రతినిధి, ఏలూరు: కూటమి ప్రభుత్వం వంచనపై ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరుబాటకు శ్రీకారం చుట్టింది. ప్రభుత్వం కొలువుదీరి ఏడాది గడిచినా ఇచ్చిన హామీలుగాని, సూపర్సిక్స్ హామీలు అమలు చేయని వైనంపై ప్రజా క్షేత్రంలో నిరంతర ఉద్యమాలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ క్రమంలో పార్టీ పిలుపుమేరకు బాబు ష్యూరిటీ– మోసం గ్యారంటీ పేరుతో ఉమ్మడి పశ్చిమగోదావరిలోని అన్ని నియోజకవర్గాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఇంటింటికీ వెళ్లి విస్తృత ప్రచారం నిర్వహించనున్నారు. దీనిలో భాగంగా జిల్లాస్థాయి సన్నాహాక సమావేశాలు శుక్రవారం ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో నిర్వహిస్తున్నారు. ఉభయగోదావరి జిల్లా రీజనల్ కోఆర్డినేటర్ బొత్స సత్యనారాయణ రెండు జిల్లాలో జరిగే సమావేశాల్లో పాల్గొని దిశానిర్దేశం చేయనున్నారు. బాబు ష్యూరిటీ–మోసం గ్యారంటీ పేరిట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించనున్న కార్యక్రమంపై సన్నాహక సమావేశం శుక్రవారం ఉదయం 9.30 గంటలకు ఏలూరు జిల్లాలోని పెదవేగి మండలం కొండలరావుపాలెంలో దెందులూరు నియోజకవర్గ ఇన్చార్జి కొఠారు అబ్బయ్యచౌదరి క్యాంపు కార్యాలయంలో నిర్వహించనున్నారు. అలాగే పశ్చిమగోదావరి జిల్లా సమావేశం మధ్యాహ్నం 2 గంటలకు భీమవరంలోని ఆనంద్ ఇన్లో నిర్వహించనున్నారు. ఉభయగోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ బొత్స సత్యనారాయణ, ప్రకాశం జిల్లా రీజనల్ కోఆర్డినేటర్, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, ఏలూరు పార్లమెంట్ పరిశీలకులు వంకా రవీంద్ర, మాజీ ఎంపీ కోటగిరి శ్రీధర్, పార్లమెంట్ ఇన్చార్జి కారుమూరి సునీల్, పార్టీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు, నియోజకవర్గ సమన్వయకర్తలు మేకా వెంకట ప్రతాప అప్పారావు, పుప్పాల వాసుబాబు, తెల్లం బాలరాజు, మామిళ్ళపల్లి జయప్రకాష్, కంభం విజయరాజుతోపాటు పార్టీ ముఖ్యులు, మండల నియోజకవర్గ నేతలు పాల్గొంటారు. అలాగే మధ్యాహ్నం పశ్చిమగోదావరిలో జరిగే సమావేశంలో జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజుతో పాటు పార్లమెంట్ ఇన్చార్జి గూడూరి ఉమాబాల, పార్లమెంట్ పరిశీలకులు ముదునూరి మురళీకృష్ణంరాజు, ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్, మాజీ మంత్రులు కొట్టు సత్యనారాయణ, కారుమూరి నాగేశ్వరరావు, చెరుకువాడ శ్రీరంగనాథరాజు, నియోజకవర్గ సమన్వయకర్తలు గుడాల గోపి, చినిమిల్లి వెంకట్రాయుడు, పీవీఎల్ నర్సింహరాజుతో పాటు పార్టీ ముఖ్యులు హాజరుకానున్నారు. రౌండ్టేబుల్ సమావేశంలో వక్తల డిమాండ్ న్యూస్రీల్దెందులూరులో టీడీపీ చిల్లర రాజకీయాలు ఏలూరు జిల్లా స్థాయి సమావేశాన్ని అడ్డుకోవడానికి అధికార టీడీపీ చిల్లర రాజకీయాలకు తెరతీసింది. తొలుత పెదపాడు మండలంలోని వట్లూరులోని శ్రీకన్వెన్షన్లో సమావేశాన్ని ఖరారు చేసి ఏర్పాట్లు పూర్తి చేశారు. అధికార పార్టీ ప్రజాప్రతినిధి చిల్లర రాజకీయాలతో కన్వెన్షన్ నిర్వాహకులపై ఒత్తిడి తెచ్చి సమావేశాన్ని అక్కడ జరగకుండా అడ్డుకున్నారు. అలాగే మరో రెండు ఫంక్షన్ హాల్స్కు కూడా ముందుస్తు హెచ్చరికలు జారీ చేసి అడ్డుకున్నారు. ఈ క్రమంలో వేదికను పెదవేగి మండలంలోని కొండలరావుపాలెంలోని మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేశారు. దగాపై ధర్మాగ్రహం ‘బాబు ష్యూరిటీ–మోసం గ్యారంటీ’ పేరిట వైఎస్సార్ సీపీ నిలదీత నేడు జిల్లాస్థాయి సమావేశాలకు రీజనల్ కోఆర్డినేటర్ బొత్స హాజరు ఉదయం కొండలరావుపాలెంలో ఏలూరు జిల్లాస్థాయి.. మధ్యాహ్నం భీమవరంలో ‘పశ్చిమ’ జిల్లాస్థాయి సమావేశం రీకాలింగ్ చంద్రబాబూస్ మేనిఫెస్టో ఆవిష్కరణ ఇంటింటికీ వైఎస్సార్సీపీ శ్రేణులు ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లోని 14 నియోజకవర్గాల్లో రీకాలింగ్ చంద్రబాబూస్ మేనిఫెస్టో కార్యక్రమాన్ని నిర్వహించడానికి వీలుగా రెండు జిల్లాల్లో జరిగే సమావేశాల్లో మేనిఫెస్టో పోస్టర్ను ఆవిష్కరించి కార్యక్రమం నిర్వహించాల్సిన తీరు విధి విధానాలపై శ్రేణులకు వివరించనున్నారు. సూపర్ సిక్స్ పేరుతో హామీలు, రాష్ట్రస్థాయిలో లెక్కకు మించిన హామీలు, జిల్లా స్థాయిలో పదుల సంఖ్యలో హామీలిచ్చి ఏడాది గడిచినా ఒక్క హామీ కూడా అమలు చేయకపోవడం, చంద్రబాబు ప్రభుత్వం అనుసరిస్తున్న కక్షపూరిత రాజకీయాలు, ఎన్నికల సమయంలో ప్రతి పథకానికి ఎంత నగదు కుటుంబానికి జమ అవుతుందో వివరిస్తూ టీడీపీ ఇచ్చిన ఎన్నికల బాండ్ల మోసాన్ని ప్రజలకు కళ్లకు కట్టినట్లు వివరించేలా ఐదు వారాలు పాటు ఈ కార్యక్రమాన్ని జిల్లాలో నిర్వహించనున్నారు. దీనిలో భాగంగా 4వ తేదీన దెందులూరు, 5న చింతలపూడి, పోలవరం, 6న నూజివీడు, 7న ఉంగుటూరు, 8న కై కలూరు, 10వ తేదీన ఏలూరులో ఈ కార్యక్రమాన్ని నిర్వహించేలా పార్టీ ముఖ్యులు నిర్ణయించారు. -
కొల్లేరును 3వ కాంటూరుకు కుదించాలి
కృష్ణలంక (విజయవాడ తూర్పు): కొల్లేరును 5వ కాంటూరు నుంచి 3వ కాంటూరుకు కుదించాలని, కొల్లేరు ప్రజలకు ఉరితాడుగా మారిన 120 జీఓను రద్దు చేయాలని, పర్యావరణంతో పాటు స్థానికుల జీవనోపాధిని కాపాడాలని రౌండ్టేబుల్ సమావేశంలో వక్తలు డిమాండ్ చేశారు. గవర్నర్పేటలోని బాలోత్సవ భవన్లో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీల ఆధ్వర్యంలో రైతు సంఘం సీనియర్ నాయకుడు వై.కేశవరావు అధ్యక్షతన గురువారం కొల్లేరు ప్రజల సమస్యలపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొల్లేరు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. కొల్లేరు ప్రజల ప్రస్తుత సమస్యలను పరిష్కరించడానికి బదులుగా వారు కొత్త సమస్యలను సృష్టిస్తున్నారని విమర్శించారు. కొల్లేరు ప్రజలకు హానికరమైన ఎకో సెన్సిటివ్ జోన్ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కొల్లేరు ప్రజల సమస్య శాశ్వత పరిష్కారానికి చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. కొల్లేరు ప్రజలకు సీపీఎం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. రైతు సంఘం సీనియర్ నాయకుడు వై.కేశవరావు మాట్లాడుతూ.. మూడో కాంటూరు నుంచి ఐదో కాంటూరు వరకు పది కిలోమీటర్ల దూరంలో సున్నితమైన పర్యావరణ ప్రాంతం పేరుతో 26 నిబంధనలు విధించి మొత్తం కొల్లేరును పూర్తిగా అటవీ శాఖ చేతుల్లో పెట్టబోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. దీని ప్రభావం నిడమర్రు, ఉంగుటూరు, భీమడోలు, దెందులూరు, ఏలూరు, పెదపాడు, మండవల్లి, కై కలూరు, ఆకివీడు మండలాల్లోని కొల్లేటి ప్రాంతంలోని 89 గ్రామాలపై పడుతుందన్నారు. అధికారులు తూతూ మంత్రంగా ప్రజాభిప్రాయాలను సేకరించి నివేదికలు పంపించడం దారుణమన్నారు. ఎకో సెన్సిటివ్ జోన్పై ప్రజలకు వాస్తవాలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో పలు తీర్మానాలు చేసి ఆమోదించారు. ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి.కృష్ణయ్య, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దడాల సుబ్బారావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.వెంకటేశ్వర్లు తదితరులు మాట్లాడారు. -
తీరంలో తాగునీటికి కటకట
దోమలపై దండెత్తరే? వర్షపు నీరు నిలిచిపోయి దోమల ఉత్పత్తి కేంద్రాలుగా తయారయ్యాయి. దోమల విజృంభణతో విష జ్వరాల బెడద ఆందోళనకు గురిచేస్తోంది. 8లో uనరసాపురం రూరల్: నరసాపురం మండలం మరితిప్ప గ్రామంలో కాలనీలో గత 8 నెలలుగా తాగునీరు అందకపోవడం దారుణమని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు కౌరు పెద్దిరాజు విమర్శించారు. గురువారం ఈ సమస్యపై స్థానిక ప్రజలు కాలనీలో ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పెద్దిరాజు మాట్లాడుతూ బలహీన వర్గాల కాలనీ ప్రజలకు తాగునీరు, మౌలిక సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. గతంలో ఈ సమస్యను ఆర్డబ్ల్యూఎస్ అధికారులు, ఆర్డీవో దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం కాలేదని తెలిపారు. వర్షాకాలంలో కూడా తాగునీటి సమస్యను పరిష్కారం చేయలేని దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉందని ఎద్దేవా చేశారు. తక్షణం తాగునీటి సమస్య పరిష్కారం కాకపోతే గ్రామ సచివాలయం వద్ద పెద్ద ఎత్తున నిరసన చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో పంచాయతీ వార్డు సభ్యురాలు గుబ్బల జయలక్ష్మి, నాగళ్ల వరలక్ష్మి, గుబ్బల లక్ష్మి, దాసరి పద్మ, గుబ్బల మౌనిక, గంగుల జ్యోతి తదితరులు పాల్గొన్నారు. -
పట్టిసీమ నీరు విడుదల
పోలవరం రూరల్: పట్టిసీమ ఎత్తిపోతల పథకం నుంచి జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గురువారం నీటిని విడుదల చేశారు. ముందుగా 24 పంపులకు పూజలు నిర్వహించి కుడి కాలువలోకి నీరు విడుదల చేసి ట్రయల్ రన్ నిర్వహించారు. అనంతరం రెండు పంపుల ద్వారా కుడి కాలువలోకి నీరు విడుదల చేస్తున్నారు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో నీటి విడుదలను క్రమేపీ పెంచే అవకాశం ఉందని జలవనరుల శాఖ అధికారులు పేర్కొన్నారు. నేడు మునిసిపల్ కార్మికుల మహాధర్నా ఏలూరు (టూటౌన్): విజయవాడలో శుక్రవారం నిర్వహించనున్న మహాధర్నాకు మునిసిపల్ ఇంజనీరింగ్, పారిశుధ్య విభాగాల కార్మికులు పెద్ద ఎత్తున తరలిరావాలని ఏపీ మునిసిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.సోమయ్య ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. మునిసిపల్ ఇంజనీరింగ్ కార్మికుల జీతాలు పెంచాలని, పారిశుద్ధ్య విభాగం వారికి 17 రోజుల సమ్మె కాలంలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతూ ఉదయం 10 గంటలకు విజయవాడ అలంకార్ సెంటర్లోని ధర్నాచౌక్లో ఈ మహాధర్నా జరుగుతుందని ఆయన తెలిపారు. -
నేడు భీమవరంలో ‘బాబు ష్యూరిటీ–మోసం గ్యారంటీ’
భీమవరం: కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించి మోసం చేసిన వైనాన్ని ప్రజలకు తెలియజేసేందుకు శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు బాబు ష్యూరిటీ.. మోసం గ్యారంటీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వైఎస్సార్ సీపీ భీమవరం నియోజకవర్గ సమన్వయకర్త చినమిల్లి వెంకటరాయుడు చెప్పారు. భీమవరం పట్టణంలోని ఆనంద్ ఇన్ ఫంక్షన్ హాల్లో పార్టీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు అధ్యక్షతన ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. పార్టీ రీజనల్ కో–ఆర్డినేటర్ బొత్స సత్యనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొంటారని, జిల్లాలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని వెంకటరాయుడు పిలుపునిచ్చారు. బడి ఈడు పిల్లలు తప్పక బడిలో ఉండాలి తాడేపల్లిగూడెం (టీఓసీ): ప్రతి పాఠశాల పరిధిలో బడి ఈడు పిల్లలు తప్పక బడిలో ఉండాలని, ఎన్రోల్మెంట్ డ్రైవ్ నిర్వహించాలని డీఈఓ నారాయణ అన్నారు. స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలలో గురువారం ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పాఠశాల సమయానికే ఉపాధ్యాయులు, విద్యార్థులు హాజరై ఇన్టైంలో అటెండెన్స్ నమోదు చేయాలన్నారు. ఉపాధ్యాయులకు సబ్జెక్టు వారీగా టీచర్ హ్యాండ్ బుక్స్ త్వరలోనే అందజేస్తామని, ఈనెల 10న జరగబోవు మెగా పేరంట్స్ టీచర్ మీటింగ్కు తల్లిదండ్రులు అందరూ హాజరయ్యేలా ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలన్నారు. తాడేపల్లిగూడెం ఎంఈఓలు వి.హనుమ, పీఎంకే జ్యోతి పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో హెచ్ఎం ఎం.సత్యనారాయణ, శ్రీనివాస్, కనకదుర్గ, సీఆర్పీలు పాల్గొన్నారు. ఆ ఫోన్ కాల్స్ నమ్మకండిభీమవరం (ప్రకాశంచౌక్): కమిషనర్ పేరుతో గుర్తు తెలియని వ్యక్తులు డబ్బులు చెల్లించాలని ఫోన్ చేస్తే తక్షణమే వార్డు సచివాలయ శానిటేషన్ సెక్రటరీ ద్వారా పురపాలక సంఘ అధికారులకు గానీ పోలీసులకు తెలియజేయాలని పురపాలక సంఘ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. భీమవరం పురపాలక సంఘ పరిధిలో గల కొన్ని వార్డుల్లోని కమర్షియల్ ప్రాంతాల్లో దుకాణాల యజమానులకు 91210 97923, కొన్ని ఇతర నెంబర్ల నుంచి కమిషనర్ పేరుతో ఫోన్ చేసి ఈ ట్రేడ్ లైసెన్సులు రుసుము చెల్లించాలని లేకుంటే షాపు లైసెన్స్ రద్దు చేస్తామని గుర్తు తెలియని వ్యక్తులు బెదిరింపులు పాల్పడుతున్నారని, అటువంటి వాటిని నమ్మవద్దని తెలిపారు. చెల్లించాల్సిన ఈ–ట్రేడ్ లైసెన్స్ బకాయిలు నేరుగా భీమవరం పురపాలక సంఘ కార్యాలయము నందు గాని లేదా సమీప వార్డు సచివాలయం నందు గాని చెల్లించాలని కోరారు. పరిశ్రమల స్థాపనకు వాట్సాప్ సేవలు భీమవరం (ప్రకాశంచౌక్): పరిశ్రమల స్థాపనకు అందిన దరఖాస్తులకు నిర్ణీత గడువులోగా అనుమతులు మంజూరు చేయాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లా పరిశ్రమలు, ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. గవర్నెన్స్ మనమిత్ర యాప్ 95523 00009 ద్వారా పరిశ్రమలకు సంబంధించి అందుబాటులో ఉన్న సేవలను వినియోగించుకునేలా విస్తృత ప్రచారం చేయాలని ఆదేశించారు. జిల్లాలో మే 27 నుంచి ఇప్పటివరకు వివిధ శాఖల అనుమతుల కోసం 465 దరఖాస్తులు అందగా, వాటిలో 458 దరఖాస్తులను ఆమోదించామని, మరో 7 దరఖాస్తులు పరిష్కరించాల్సి ఉందన్నారు. ఐచ్ఛిక సెలవుల కోసం వినతి ఏలూరు (ఆర్ఆర్పేట): నగరంలోని అన్ని యాజమాన్య పాఠశాలలకు క్యాలెండర్ సంవత్సరం ప్రకారం ఐచ్ఛిక సెలవులకు అనుమతులివ్వాలని జిల్లా విద్యాశాఖాధికారి ఎం.వెంకట లక్ష్మమ్మకు ఫ్యాప్టో నాయకులు గురువారం వినతిపత్రం సమర్పించారు. ఈ నెల 5వ తేదీన మొహర్రం, అక్టోబర్ 9న యజ్దహుకు షరీఫ్, నవంబర్ 5న కార్తీక పౌర్ణమి, డిసెంబర్ 26న బాక్సింగ్ డేలను పురస్కరించుకుని ఐచ్ఛిక సెలవులకు అనుమతులివ్వాలని కోరారు. వినతిపత్రం సమర్పించన వారిలో ఫ్యాప్టో ఛైర్మన్ జీ మోహన్రావు, నాయకులు పాల్గొన్నారు. -
రేషన్ కందిపప్పునకు ఎసరు
భీమవరం: చౌక ధరల దుకాణాల ద్వారా అన్ని రకాల నిత్యావరాలు అందిస్తామని ఎన్నికల్లో ప్రచారం చేసిన టీడీపీ కూటమి కేవలం బియ్యం, పంచదారకే పరిమితమైంది. గతంలో చౌక డిపోల ద్వారా బియ్యం, పంచదార, కందిపప్పు, గోధుములు పంపిణీ చేయగా కూటమి ప్రభుత్వం కందిపప్పుకు మంగళం పాడింది. జిల్లాలో సుమారు 5.58 లక్షల రేషన్ కార్డులకు ప్రతి నెలా దాదాపు 8,500 టన్నుల బియ్యం పంపణీ చేస్తున్నారు. వైఎస్ జగన్మోహర్రెడ్డి ప్రభుత్వ హయాంలో ఉచిత బియ్యంతో పాటు రేషన్ కార్డుకు అర కిలో పంచదార రూ.17, కిలో కందిపప్పు రూ.67కు ఎండీయు వాహనాల ద్వారా ఇంటింటికి పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత రెండు, మూడు నెలలు కందిపప్పు సరఫరా చేసి తరువాత చేతులెత్తాశారు. దీనితో పేదలు కందిపప్పు బహిరంగ మార్కెట్లో అధిక ధరకు కొనుగోలు చేయాల్సివస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తక్కువ ధరకు అందించే కందిపప్పు పేద, మధ్యతరగతి ప్రజలకు ఎంతో ప్రయోజనకరంగా ఉండేది. ఎదురుచూపులే మిగిలాయి కూటమి ప్రభుత్వం అన్ని నిత్యావసర సరుకులు చౌకడిపోల ద్వారా సరఫరా చేస్తుందని ఆశించిన ప్రజలకు కేవలం బియ్యం, పంచదార మాత్రమే ఇవ్వడంతో దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. ప్రతి నెలా దాదాపు 600 మెట్రిక్ టన్నుల కందిపప్పు సరఫరా చేయాలి. కందిపప్పు బహిరంగ మార్కెట్లో కిలో రూ.150 వరకు విక్రయించడంతో పేద, మధ్యతరగతి ప్రజలు అంత ధర చెల్లించి కొనుగోలు చేయలేక ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం కిలో రూ.67కే పంపిణీ చేసే కందిపప్పు కోసం ఎదురుచూసినా నిరాశే మిగులుతుంది. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి కందిపప్పు, ఇతర నిత్యావసరాలు రేషన్ షాపుల ద్వారా తక్కువ ధరకు అందించాలని కోరుతున్నారు. జిల్లాలో 5.58 లక్షల రేషన్ కార్డులు 600 టన్నుల కందిపప్పు అవసరం -
త్వరలో పోలీస్ అకాడమీ సెంటర్కు శంకుస్థాపన
ఆగిరిపల్లి: పోలీస్ అకాడమీ సెంటర్ నిర్మాణం కోసం త్వరలో శంకుస్థాపన చేస్తామని ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీష్కుమార్ గుప్తా తెలిపారు. ఏపీ పోలీస్ అకాడమీ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు కోసం బుధవారం మండలంలోని నూగొండపల్లి గ్రామంలో ఉన్న 94.49 ఎకరాల భూమిని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నూగొండపల్లిలో పోలీస్ శిక్షణ సదుపాయాల కోసం త్వరలో అధునాతన ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీ సెంటర్ నిర్మాణానికి శంకుస్థాపన నిర్వహిస్తామని తెలిపారు. పోలీస్ అకాడమీ సెంటర్ రాష్ట్ర పోలీస్ శాఖకు చాలా ఉపయోగకరంగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో లా అండ్ ఆర్డర్ అదనపు డీజీపీ మధుసూదన్ రెడ్డి, డీఐజీలు జీవీజీ అశోక్ కుమార్, ఎం.రవి ప్రకాష్, సత్య ఏసుబాబు, ఎస్పీ కే. ప్రతాప్ శివ కిషోర్, నూజివీడు సబ్ కలెక్టర్ స్మరణ్ రాజ్, డీఎస్పీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
మున్సిపల్ హైస్కూల్ తనిఖీ
భీమవరం: భీమవరం పట్టణంలోని చినరంగనిపాలెం మున్సిపల్ హైస్కూల్ను బుధవారం కలెక్టర్ చదలవాడ నాగరాణి సందర్శించారు. విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు మెనూ వివరాలను ఆరాతీసి వండిన పదార్థాలను రుచి చూశారు. పదో తరగతి విద్యార్థులతో ముచ్చటించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ పిల్లలకు పెట్టే ఆహారంలో ఎలాంటి తేడా వచ్చినా ఉపేక్షించేది లేదని రోజువారీ మెనూ ప్రకారం అన్నీ తయారు చేసి పెట్టాలని ఆదేశించారు. ధాన్యం సొమ్ములు తక్షణం చెల్లించాలి భీమవరం: కేంద్ర ప్రభుత్వం రైతు, ప్రజా వ్యతిరేక విధానాలను మార్చుకోవాలని డిమాండ్ చేస్తూ ఈనెల 9న జరిగే సమ్మె జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కమిటీ పిలుపునిచ్చింది. మంగళవారం పట్టణంలో తాళ్లూరి హరిహర లక్ష్మణ్ అధ్యక్షతన జరిగిన జిల్లా కమిటీ సమావేశంలో జిల్లా కార్యదర్శి ఆకుల హరేరామ్ మాట్లాడుతూ అన్ని పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తామని, రైతులకు రెట్టింపు ఆదాయం వచ్చేలా చూస్తామని చెప్పిన కేంద్ర ప్రభుత్వం రైతులను విస్మరించిందన్నారు. ఆక్వా, కోకో, మామిడి రైతులు పూర్తిగా నష్టపోయారని ఆందోళన వ్యక్తం చేశారు. దాళ్వాలో రైతులు విక్రయించిన ఇంతవరకు సుమారు రూ.300 కోట్లు చెల్లించకపోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. గుత్తుల శ్రీరామచంద్రుడు, కిలారి తవిటి నాయుడు, చెల్లబోయిన వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. నేడు ప్రైవేటు స్కూళ్ల మూసివేత భీమవరం: ప్రైవేటు పాఠశాలలపై ప్రభుత్వం తీసుకుంటున్న ఏకపక్ష చర్యలకు నిరసగా ఈ నెల 3న రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు, అన్ ఎయిడెడ్ స్కూళ్లను మూసివేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ అన్ ఎయిడెడ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ (ఏపీయూఎస్ఎంఏ) రాష్ట్ర అధ్యక్షుడు అక్కినేని కృష్ణకిషోర్ ఒక ప్రకటనలో తెలిపారు. కొంతమంది అధికారులు ప్రైవేటు స్కూల్స్ యాజమాన్యాలపై అతిగా స్పందించడం, త్రీమెన్ కమిటీలు, తనిఖీలు వంటి ఏకపక్ష నిర్ణయాలు దారుణమన్నారు. ఇంటర్మీడియెట్ అధికారిగా ప్రభాకరరావు భీమవరం: జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారిగా జి.ప్రభాకరరావు బాధ్యతలు బుధవారం స్వీకరించారు. ఆయన కార్యాలయ అధికారులు, సిబ్బంది, అధ్యాపకులు పుష్పగుచ్ఛం అందజేశారు. తణుకులోని చిట్టూరి ఇంద్రయ్య మెమోరియల్ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్గా పనిచేస్తున్న ఆయనకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. జాతీయ ఉపాధ్యాయ అవార్డుల కోసం దరఖాస్తుల ఆహ్వానం భీమవరం: జాతీయ ఉపాధ్యాయ అవార్డుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని జిల్లా విద్యాశాఖాధికారి ఇ.నారాయణ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జాతీయ ఉపాధ్యాయుల అవార్డుల స్వీయప్రతిపాదన కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ముగిసిన డీఎస్సీ పరీక్షలు భీమవరం: జిల్లాలో డీఎస్సీ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. మూడు పరీక్షా కేంద్రాల్లో బుధవారం నిర్వహించిన పరీక్షకు 98 శాతం హాజరయ్యారని జిల్లా విద్యాశాఖాధికారి ఉదయం పరీక్షకు 385 మందికి 380 మంది హాజరుకాగా మధ్యాహ్నం 383 మందికి 378 మంది హాజరయ్యారన్నారు. -
కోకో రైతుల నిరసన
పెదవేగి: ఈ నెల 15 వరకు కిలో కోకో గింజలకు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న రూ.50 ప్రోత్సాహంతో రూ.500 ధర రైతులకు వచ్చేలా ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వాలని కోకో రైతుల సంఘం ఆధ్వర్యంలో కొండలరావుపాలెంలో జరిగిన సమావేశంలో డిమాండ్ చేశారు. కొండరాలవు పాలెం,రైతు సేవా కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ కోకో రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు పాలడుగు నరసింహారావు అధ్యక్షతన కోకో రైతుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బి.రామకృష్ణ, ప్రధాన కార్యదర్శి కె.శ్రీనివాస్ మాట్లాడుతూ రైతు సేవా కేంద్రాల్లో అనేక చోట్ల కోకో రైతుల నుంచి సక్రమంగా దరఖాస్తులు తీసుకోకుండా ఇబ్బందులకు గురి చేయడం వల్ల ఇంకా గింజలు అమ్ముకోలేని పరిస్థితి ఉందన్నారు. కోకో రైతులు చేసిన పోరాట ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం ధరల స్థిరీకరణ పథకం వర్తింపజేసి కిలో కోకో గింజలకు రూ.50 ప్రోత్సాహం ఇస్తుందని, కంపెనీలు ఇస్తున్న ధర కిలోకు రూ.450 కలిపి రూ.500గా నిర్ణయించి జూన్ 30 వరకు కొనుగోలు చేశారని, మిగిలిన గింజలు కొనుగోలు చేసేలా ఈనెల 15 వరకు రైతుల నుంచి కోకో గింజలు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కోకో గింజలకు అంతర్జాతీయ మార్కెట్ ధర వచ్చేలా ఫార్ములా రూపొందించాలని కోరారు. సమావేశంలో ఆంధ్రప్రదేశ్ కోకో రైతు సంఘం నాయకులు గుదిబండి వీరారెడ్డి,పాలడుగు నరసింహారావు, యరకరాజు శ్రీనివాసరాజు, కోనేరు సతీష్ బాబు, కరెడ్ల సత్యనారాయణ, బింగిన శ్రీనివాసు తదితరులు పాల్గొన్నారు -
ఇదేం తీరువా బాబూ !
బాదుడే.. బాదుడు గురువారం శ్రీ 3 శ్రీ జూలై శ్రీ 2025నీటి తీరువా డివిజన్ల వారీగా రెవెన్యూ రైతు నీటి తీరువా డివిజన్ ఖాతాలు మొత్తం భీమవరం 99,329 రూ. 11.83 కోట్లు తాడేపల్లిగూడెం 90,475 రూ. 4 కోట్లు నరసాపురం 1,41,365 రూ. 5.98 కోట్లు సాక్షి, భీమవరం: సూపర్ సిక్స్లోని అన్నదాత సుఖీ భవ సాయం అందించకపోగా రైతులపై భారం మోపడమే పనిగా కూటమి పాలన సాగుతోంది. ఇప్పటికే గత ప్రభుత్వం తెచ్చిన ఉచిత పంటల బీమా పథకానికి ఎసరుపెట్టి ఏడాదికి దాదాపు రూ.28 కోట్ల ప్రీమియంను రైతులపై మోపింది. మరుగున పడిన నీటితీరువాను తాజాగా తెరపైకి తెచ్చి పన్నుల రూపంలో రూ.21.81 కోట్లు రైతుల నుంచి వసూలు చేసే పనిలో పడింది. తొలకరికి పెట్టుబడులకు సొమ్ముల్లేక ఇబ్బందులు పడుతున్న రైతులకు వేలకు వేలు నీటి తీరువా చెల్లించాల్సి రావడం భారంగా మారింది. సాగునీటి సరఫరాకు గతంలో నీటి తీరువా పేరిట రెవెన్యూ శాఖ రైతుల నుంచి పన్ను వసూలు చేసేది. క్షేత్రస్థాయిలో రెవెన్యూ సిబ్బంది ఈ సొమ్ములు వసూలు చేసేవారు. ఈ విధానంలో అక్రమాలు జరుగుతున్నట్టు ఆరోపణలు ఉండటంతో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఆన్లైన్ విధానం తీసుకురావాలని భావించినప్పటికీ రైతులకు ఊరటనిస్తూ ఆ ప్రక్రియను పక్కన పెట్టేసింది. వెబ్సైట్ సిద్ధం కాకపోవడంతో గత మూడేళ్లుగా నీటి తీరువా ఊసేలేకుండా పోయింది. నీటి తీరువా భారం రూ.21.81 కోట్లు అన్నదాత సుఖీభవ పథకం కింద ఏటా రూ.20 వేల సాయం అందిస్తామని చెప్పి గద్దెనెక్కిన కూటమి మొదటి ఇంతవరకూ చిల్లిగవ్వ ఇవ్వలేదు. తొలకరి పెట్టుబడుల కోసం సొమ్ముల్లేక రైతులు ఇబ్బందులు పడుతున్న తరుణంలో వారి నుంచి నీటి తీరువా వసూళ్ల కోసం రెవెన్యూ శాఖకు ఆదేశాలిచ్చింది. ఆన్లైన్ ప్రక్రియ పూర్తిచేయడం ద్వారా రెండు పంటలు పండే వ్యవసాయ భూములైతే ఎకరానికి మొదటి పంటకు రూ.200, రెండవ పంటకు రూ.150 వంతున మొత్తం రూ.350, ఆక్వా చెరువులకు ఏడాదికి ఒకే పంట లెక్కన ఎకరానికి రూ.500 వసూలుకు ఆదేశాలిచ్చింది. జిల్లాలోని 3,31,169 మంది రైతుల ఖాతాల నుంచి పాత బకాయిలు రూ.5.62 కోట్లకు వడ్డీ రూ.33.77 లక్షలు, ప్రస్తుత డిమాండ్ రూ.15.84 కోట్లు కలిపి రూ. 21.81 కోట్లు నీటితీరువా వసూలు చేయాల్సి ఉంది. ఈ మేరకు ఆర్డీఓలు, తహసీల్దార్లకు ఉత్తర్వులు రావడంతో పన్నుల వసూళ్లలో నిమగ్నమయ్యారు. మూడేళ్లకు పాత బకాయిలు, వడ్డీలతో కలిపి ఒక్కసారే రైతుల నుంచి వేలల్లో వసూలు చేస్తున్నారు. పంట పెట్టుబడులకు సొమ్ములు లేక ఇబ్బందులు పడుతుంటే మూడేళ్ల బకాయి ఒక్కసారే కట్టాలని రెవెన్యూ సిబ్బంది ఒత్తిడి చేస్తున్నారని రైతులు వాపోతున్నారు. ఆలస్యం చేస్తే పెనాల్టీతో చెల్లించాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. అయినకాడికి అప్పులు చేసి చెల్లిస్తున్నామంటున్నారు. నీటి తీరువా మొత్తం రూ.21.81 కోట్లకు గాను ఇంతవరకు రూ.8.36 కోట్లు వసూలైనట్లు రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. సర్వీస్ ట్యాక్స్ అదనం నీటి తీరువాతో పాటు రైతుల నుంచి సర్వీస్ ట్యాక్స్ వసూలు చేస్తుండటం గమనార్హం. పన్ను చెల్లింపు కోసం చేసే ప్రతి ట్రాన్సాక్షన్్కు అదనంగా రూ.35 సర్వీసు టాక్స్ వసూలు చేస్తున్నారు. గతంలో ఎప్పుడు ఇలాంటి ట్యాక్స్లు చూడలేదని రైతులు వాపోతున్నారు. న్యూస్రీల్ రైతులపై కక్ష కట్టిన కూటమి ప్రభుత్వం ఇప్పటికే ఉచిత పంటల బీమాకు ఎసరు తాజాగా నీటి తీరువా వసూలుకు ఆదేశం రైతుల నుంచి రూ. 21.81 కోట్లు వసూలు చేసే పనిలో రెవెన్యూ యంత్రాంగం నీటి తీరువా వసూలు చేయని గత వైఎస్సార్సీపీ సర్కారు పంట చేతికొచ్చిన ఆనందం లేదు గత ప్రభుత్వంలో నీటి తీరువా ఊసే ఉండేది కాదు. ఈ ప్రభుత్వం వచ్చాక పాత బకాయిలంటూ వడ్డీలు వేసి మరీ చెల్లించాలని రెవెన్యూ ఉద్యోగులు చెబుతున్నారు. మూడేళ్లకు కలిపి నీటితీరువా రూ. 21 వేలు చెల్లించాను. పంట డబ్బులు చేతికొచ్చాయన్న ఆనందం లేకుండా పన్నుకే సరిపోయింది. – వెలగల వెంకటేశ్వరరెడ్డి, రైతు, పెనుమంట్ర రైతులపై భారం మోపుతున్నారు రైతులను ఆదుకోవాల్సింది పోయి ఏదో రూపంలో ఈ ప్రభుత్వం మాపై భారం మోపుతోంది. ఉచిత పంటల బీమాను రద్దుచేయడంతో ప్రీమియం రైతులే చెల్లించుకోవాల్సి వస్తోంది. కొన్నేళ్లుగా నీటి తీరువా ఊసులేకుండా ఉంది. ఇప్పుడు వడ్డీలు, జరిమానాలు అంటూ రైతులపై భారం మోపుతున్నారు. – కందుల సత్యనారాయణ, రైతు, వీరవాసరం జగన్ సర్కారు 2019 ఖరీఫ్ నుంచి ఉచిత పంటల బీమా పథకాన్ని తెచ్చిన విషయం విదితమే. ఈ క్రాప్ నమోదు ప్రామాణికంగా సాగు విస్తీర్ణం అంతటికి రైతులు చెల్లించాల్సిన ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లిస్తూ వచ్చింది. కూటమి వచ్చాక ఈ పథకాన్ని ఎత్తివేయడంతో ప్రీమియం వాటాను రైతులే చెల్లించాల్సి వస్తోంది. ఎకరాకు పంట విలువ రూ. 41,000లో ప్రీమియంగా రెండు శాతం మొత్తం రూ. 820 బీమా కంపెనీకి చెల్లించాలి. దీనిలో ప్రభుత్వ వాటా 0.5 శాతం (రూ.205) కాగా, మిగిలిన 1.5 శాతం (రూ.615లు) రైతులే చెల్లించాలి. ఏడాదికి ప్రీమియం రూపంలో వరి రైతులపై రూ.28 కోట్ల భారం పడుతున్నట్టు అంచనా. -
కేరళ డీజీపీగా రావాడ చంద్రశేఖర్
స్వస్థలం వీరవాసరంలో ఆనందోత్సాహాలు వీరవాసరం: కేరళ రాష్ట్ర పోలీస్ బాస్గా పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరానికి చెందిన రావాడ ఆజాద్ చంద్రశేఖర్ బాధ్యతలు స్వీకరించారు. కేరళ నూతన డీజీపీగా ఆయనను నియమిస్తున్నట్టు ఆ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన విషయం తెలియడంతో చంద్రశేఖర్ స్వగ్రామం వీరవాసరంలో ఆయన బంధుమిత్రులు ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తున్నారు. 1991లో ఐపీఎస్కు ఎంపికై న చంద్రశేఖర్ కేరళ క్యాడర్లో ఉద్యోగ బాధ్యతలు స్వీకరించారు. కేరళలో పోలీస్ ఉన్నతాధికారిగా పలు కీలక బాధ్యతల్లో పనిచేసి రాష్ట్రపతి నుంచి ఉత్తమ సేవల అవార్డును అందుకున్నారు. అక్కడ నుంచి డిప్యుటేషన్పై కేంద్ర సర్వీసుల్లోకి వెళ్ళారు. సెంట్రల్ ఇంటెలిజెన్స్ బ్యూరో స్పెషల్ డైరెక్టర్ హోదాలో పనిచేస్తున్న చంద్రశేఖర్ను ఇటీవలే సెంట్రల్ క్యాబినెట్ సెక్రటేరియట్ (స్పెషల్ సెక్యూరిటీ) కార్యదర్శిగా కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఆ బాధ్యతల్లో చేరకముందే.. కేరళ ప్రభుత్వం చంద్రశేఖర్ను డీజీపీగా ప్రకటించింది. ఒక రాష్ట్రానికి పోలీస్ బాస్ తమ ఊరి వ్యక్తి కావడంతో చంద్రశేఖర్ బంధుమిత్రులు ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తున్నారు. చంద్రశేఖర్కు ఆత్మీయులైన జీవీవీ ప్రసాద్, నేతల జ్ఞాన సుందర్రాజు, పీతల సుబ్రహ్మణ్యం, బాజింకి కృష్ణారావు, రాయపల్లి వెంకట్, నక్కెళ్ల వెంకట్, గూడూరి ఓంకార్, వీరవల్లి చంద్రశేఖర్, గుండా రామకృష్ణ, వీరవల్లి రామకృష్ణ తదితరులు మాట్లాడుతూ.. కష్టపడే తత్వం ఉన్న ప్రతి ఒక్కరూ మహోన్నత వ్యక్తిత్వం గల చంద్రశేఖర్లా ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని చెప్పారు. చంద్రశేఖర్ నలుగురు అన్నదమ్ములు, ముగ్గురు అక్కాచెల్లెళ్లలో చిన్నవారు. ఇంటర్ వరకూ వీరవాసరంలోనే చదివారు. బాపట్లలో అగ్రికల్చర్ బీఎస్సీ, హైదరాబాద్లో అగ్రికల్చర్ ఎమ్మెస్సీ పూర్తి చేశారు. బంధువులు ఇళ్లలో వివాహాలు, ఇతర ఫంక్షన్లకు, సంక్రాంతికి తప్పనిసరిగా వీరవాసరం వస్తుంటారు. వీరవాసరంలోని కమ్యూనిటీ హాల్, రామాలయం, చర్చికి కుటుంబ సభ్యుల పేరిట పెద్ద మొత్తాల్లో ఆర్థిక సాయం చేశారు. రావాడ ఆజాద్ చంద్రశేఖర్ ఐపీఎస్ అధికారిగా ఎదగడం వీరవాసరానికి గర్వకారణమని, అందరితో చనువుగా ఉంటూ, చిన్నా పెద్ద తారతమ్యం లేకుండా మనసు విప్పి మాట్లాడే మంచి మనిషని ఆయన స్నేహితుడు నేతల జ్ఞాన సుందర్రాజు అన్నారు. -
రొయ్య రైతుల నిరసన
పాలకోడేరు: రొయ్యల తూకం సమయంలో జరుగుతున్న మోసాలను అరికట్టాలని జిల్లా రొయ్య రైతుల సంక్షేమ సంఘం నాయకులు కోరారు. కాటా మోసంపై రొయ్య రైతుల సంక్షేమ సంఘం నాయకులు పాలకోడేరు మండలం గొల్లలకోడేరు బుధవారం ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కొంతమంది ట్రేడర్లు, కొనుగోలుదారులు రొయ్యలు కొనుగోలు చేసినప్పుడు కాటా మోసాలకు పాల్పడుతున్నారన్నారు. కాటా మోసానికి పాల్పడటం వల్ల టన్ను రొయ్యలకు 60 కేజీలు నష్టం పోతున్నామన్నారు. ఈ మోసాలు బయటికి రాకుండా కొందరు రకరకాల ఒత్తిళ్లకు, ప్రలోభాలకు గురి చేస్తున్నారన్నారు. కొందరు ట్రేడర్లు, కొనుగోలుదారులు కాటా ట్యాపరింగ్ చేస్తున్నారన్నారు. కేజీ రొయ్యలకు 60 గ్రాములు ఎక్కువ వచ్చే విధంగా కాటాను ట్యాంపరింగ్ చేస్తున్నారని, లీటర్లలో వెయిట్ పెట్టి, కిలోల్లో రొయ్యలను చూస్తున్నారన్నారు. కార్యక్రమంలో జిల్లా రొయ్య రైతుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎన్.గజపతిరాజు, ప్రధాన కార్యదర్శి జీకేఎఫ్ సుబ్బరాజు, సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు. -
బిడ్డకు జన్మనిచ్చి తల్లి మృత్యు ఒడికి
పాలకొల్లు సెంట్రల్: పట్టణంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో డెలీవరి సమయంలో బిడ్డకు జన్మనిచ్చి తల్లి మృత్యు ఒడికి చేరింది. స్థానికులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం పట్టణంలోని 28వ వార్డుకు చెందిన సంగినీడి మనోజ్, జయశ్రీ (28) దంపతులు. ఎనిమిదేళ్ల క్రితం వేర్వేరు కులాలకు చెందిన వారు కావడంతో పెద్దలను ఒప్పించి ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆరేళ్ల క్రితం వీరికి ఒక బాబు జన్మించాడు. అనంతరం మరో బిడ్డకు జన్మనిస్తూ జయశ్రీ దురదృష్టవశాత్తూ మృతి చెందింది. మంగళవారం స్కానింగ్ తీసుకుని రమ్మని వైద్యులు సూచించడంతో స్కానింగ్ తీసుకువెళ్లారు. అంతాబాగానే ఉందని, నార్మల్ డెలీవరికి రిపోర్టులు కూడా అనుకూలంగానే ఉన్నాయని వైద్యులు చెప్పడంతో మంగళవారం ఆసుపత్రిలో చేర్చారు. బుధవారం ఉదయం డెలీవరి చేస్తుండగా పాప జన్మించినా తల్లి జయశ్రీకి అధికంగా బ్లీడింగ్ అవ్వడంతో మృతి చెందింది. దీంతో మృతురాలి బంధువులు ఆందోళనకు దిగారు. శిశువు పరిస్థితి ఆందోళన కరంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం పిల్లల ఆసుపత్రికి తరలించారు. ఎంతో ఇష్టపడి పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నామని, ఇటీవల ఆమె డీఎస్పీ పరీక్షలకు కూడా హాజరైందని, ఇంతలోనే ఇలా మృతి చెందిందని భర్త కన్నీరు మున్నీరుగా విలపించాడు. -
ఇంజనీరింగ్ కోర్సులు.. భవితకు బాటలు
ఏలూరు (ఆర్ఆర్పేట): ఇంటర్మీడియెట్ తరువాత డిగ్రీ కోర్సుల వైపు వెళ్లడం గత రెండు దశాబ్దాల క్రితం ఉండేది. అప్పట్లో డిగ్రీలు, పీజీలు చేసిన వారికి మంచి ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉండేవి. దానికి తోడు సివిల్స్, ఏపీపీఎస్సీ, బ్యాంకింగ్, రైల్వే ఉద్యోగాలకు క్రేజ్ ఉండేది. అనంతరం విద్యారంగంలో సమూల మార్పు వచ్చింది. సమాజంలో సాంకేతిక విప్లవం వేగంగా వ్యాప్తి చెందడంతో ఆ రంగంలో ఉపాధి అవకాశాలు అత్యధికంగా లభిస్తున్నాయి. దీనితో ఇంటర్మీడియెట్ తరువాత విద్యార్థుల తొలి ప్రాధాన్యత సాంకేతిక ఉన్నత విద్య ఇంజనీరింగ్ వైపే మొగ్గు చూపింది. కృత్రిమ మేథ (ఏఐ) వైపు చూపు రానున్నది కృత్రిమ మేథ శకమని నిపుణులు అంచనా వేస్తున్న తరుణంలో విద్యార్థులు అటువైపు ఎక్కువగా దృష్టి కేంద్రీకరిస్తునట్టు తెలుస్తోంది. గత నాలుగేళ్లుగా ఏఐ బ్రాంచ్లు అందుబాటులో ఉన్న అన్ని కళాశాలల్లోనూ, సీఎస్ఈతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లోని మెషీన్ లెర్నింగ్, డేటా సైన్స్ తదితర బ్రాంచ్లు సైతం పూర్తి సీట్లు భర్తీ కావడం చూస్తుంటే విద్యార్థులు ఏఐ వైపు ఎంత ఆసక్తిగా ఉన్నారో గ్రహించవచ్చు. ఎవర్గ్రీన్గా మెకానికల్ బ్రాంచ్ ఏ కోర్సు తీసుకుంటే తేలికగా ఉత్తీర్ణులవడంతో పాటు చదువు పూర్తి కాగానే ఉద్యోగాలు లభిస్తాయా అనేది విద్యార్థులను వేధిస్తున్న ప్రధాన ప్రశ్న. ముఖ్యంగా మెకానికల్ ఇంజనీరింగ్కు ఎవర్ గ్రీన్ బ్రాంచ్గా గుర్తింపు ఉంది. ద్విచక్ర వాహనాల నుంచి విమానాల తయారీ వరకూ మెకానికల్ ఇంజనీర్ల ప్రాతే కీలకంగా ఉంటుంది. అలాగే కెమిస్ట్రీ, ఫిజిక్స్, గణితం సమ్మిళితంగా ఉండే కెమికల్ ఇంజనీరింగ్కు సైతం మంచి భవిష్యత్ ఉందని తెలుస్తోంది. డీఎన్ఏ సీక్వెన్సింగ్, మానవ జీనోమ్ ప్రాజెక్టు, జెనెటిక్ ఇంజనీరింగ్ వంటివి కెమికల్ ఇంజనీరింగ్లో మార్పులకు తెరతీశాయి. సీఎస్ఈకే తొలి ప్రాధాన్యత ఈఏపీ సెట్లో మంచి ర్యాంకు సాధించిన విద్యార్థుల్లో ఎక్కువమంది సీఎస్ఈలో చేరడానికే ఆసక్తి చూపుతారు. ఈ బ్రాంచ్తో ఐటీ కొలువులు, ఆకర్షణీయ ప్యాకేజీలు లభిస్తాయనే నమ్మకమే కారణం. అందుకు తగ్గట్టుగానే క్యాంపస్ రిక్రూట్మెంట్లలో ఐటీ రంగ కంపెనీలు ముందుగా సీఎస్ఈ విద్యార్థులకే ప్రాధాన్యత ఇస్తున్నాయి. నాలుగేళ్ల కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ బ్రాంచ్లో ముఖ్యంగా కంప్యూటర్ ప్రోగ్రామింగ్, నెట్ వర్కింగ్, అల్గారిథమ్స్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ప్రోగ్రామ్ డిజైన్, కంప్యూటర్ సాఫ్ట్వేర్, కంప్యూటర్ హార్డ్వేర్, ఆపరేటింగ్ సిస్టమ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా బేస్, డేటా స్ట్రక్చర్స్ తదితర అంశాలను అధ్యయనం చేస్తారు. ఈసీఈతో రెండురకాల లాభం ఇంజనీరింగ్ చదివే విద్యార్థులకు రెండో ప్రాధాన్యంగా ఈసీఈ (ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూ నికేషన్ ఇంజినీరింగ్) నిలుస్తోంది. ఈ బ్రాంచ్లో ప్రధానంగా ఎలక్ట్రికల్ పరికరాలు, అనలాగ్ ఇంటిగ్రేటేడ్ సర్క్యూట్స్, శాటిలైట్ కమ్యూనికేషన్, మైక్రోవేవ్ ఇంజినీరింగ్, మైక్రో ప్రాసెసర్స్, మైక్రో కంట్రోలర్స్, ట్రాన్స్మీటర్, రిసీవర్, ఎలక్ట్రానిక్, కమ్యూనికేషన్ పరికరాల తయారీ, యాంటెన్నా, కమ్యూనికేషన్ సిస్టమ్స్ గురించి అవగాహన కలిగిస్తారు. ఈ బ్రాంచ్లో చేరడం వల్ల కోర్ సెక్టార్తో పాటు సాఫ్టవేర్ రంగాల్లోనూ కొలువులు సొంతం చేసుకునే అవకాశం ఉంది. ట్రిపుల్ ఈలో 2 లక్షల ఉద్యోగాలు రెడీ ప్రైవేట్ రంగంలో ఏర్పాటవుతున్న హైడల్ పవర్ ప్రాజెక్ట్ కారణంగా రానున్న నాలుగేళ్లలో రెండు లక్షల మంది ఈఈఈ ఇంజినీర్ల కోసం ఉద్యోగాలు ఎదురు చూస్తాయని నిపుణుల అంచనా. ఈఈఈ ద్వారా అటు ఎలక్ట్రికల్, ఇటు ఎలక్ట్రానిక్స్ రెండింటిపైనా పట్టు లభిస్తుంది. ఫలితంగా రెండు రంగాలకు చెందిన పరిశ్రమల్లో ఉద్యోగాలు సొంతం చేసుకోవచ్చు. అందుకే ఇంజినీరింగ్ విద్యార్థుల భవిష్యత్తుకు ఈ కోర్సు భరోసాగా నిలుస్తోంది. ఎలక్ట్రికల్ టెక్నాలజీ, మెషీన్, మోటార్లు, జనరేటర్లు, సర్క్యూట్ అనాలసిస్, పవర్ ఇంజినీరింగ్ తదితర అంశాలను ఇందులో చదువుతారు. జిల్లాలో 6 ఇంజనీరింగ్ కళాశాలలు ఏలూరు జిల్లాలో మొత్తం 6 ఇంజనీరింగ్ కళాశాలలు ఉన్నాయి. ఏలూరులోని సీఆర్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో 1,200 సీట్లు, రామచంద్ర కళాశాలలో 900, ఏలూరు ఇంజనీరింగ్ కళాశాలలో 600, హేలాపురి కళాశాలలో 360 సీట్లు, ఆగిరిపల్లిలోని ఎన్ఆర్ఐ కళాశాలలో 1,360, నూజివీడులోని సారథి కళాశాలలో 420 సీట్లు విద్యార్థులకు అందుబాటులో ఉన్నాయి. ఈ సీట్ల కోసం జిల్లా విద్యార్థుల నుంచి పోటీ తక్కువగానే ఉంటుంది. కాకపోతే ఇతర జిల్లాల విద్యార్థులు కూడా ఇక్కడి కళాశాలల్లో చేరేందుకు ఉత్సాహం చూపడంతో సీట్లు లభించడం కష్టతరంగా మారింది. ఈ ఏడాది నిర్వహించిన ఏపీ ఈఏపీ సెట్ పరీక్షల్లో ఏలూరు జిల్లా నుంచి 4,700 మంది పరీక్ష రాయగా వారిలో ఇంజనీరింగ్ కోర్సుకు 3,409 మంది మాత్రమే అర్హత సాధించారు. జిల్లాలో 6 కాలేజీలు.. 4,840 సీట్లు కృత్రిమ మేథ (ఏఐ) వైపు అందరి చూపు సీఎస్ఈకి తగ్గని క్రేజ్ బ్రాంచ్ ఏదైనా పట్టు సాధిస్తే విజయ తీరాలకు సృజనాత్మకతతో అద్భుతాలు పదును పెట్టి నూతన ఆవిష్కరణల దిశగా విద్యార్థులు అడుగులు వేయాల్సిన తరుణం ఆసన్నమైందని గుర్తించాలి. విద్యార్థులు తమ సృజనాత్మకతకు సానపెడితే అద్భుతాలు సాధ్యమౌతాయి. అటువంటి విద్యార్థులు వారి అబివృద్ధితో పాటు దేశాభివృద్ధిలో కూడా తమ భాగస్వామ్యాన్ని ఘనంగా చాటిచెప్పే అవకాశం ఉంటుంది. –డాక్టర్ కే వెంకటేశ్వరరావు, ప్రిన్సిపాల్, సీఆర్ఆర్ ఇంజనీరింగ్ కళాశాల, ఏలూరు -
రొయ్య పిల్లా.. సిద్ధం చేయండిలా..
కై కలూరు: రొయ్యల సాగును పసిబిడ్డను అమ్మ జాగ్రత్తగా సాకిన విధానంతో పోల్చుతారు. హేచరీలో రొయ్య విత్తనం కొనుగోలు నుంచి తిరిగి చెరువులో రొయ్య పిల్లలను వదలడం ఎంతో కీలకమైన ప్రక్రియ. పెనాయిస్ మోనోడాన్ (టైగర్ రొయ్యలు), లటోపెనియస్ వన్నామీ (వైట్ లెగ్ పసిఫిక్ రొయ్యలు) వంటి జాతుల పెంపకం వల్ల ప్రపంచ వ్యాప్తంగా ముఖ్యమైన రొయ్యల పరిశ్రమగా ఏపీ గుర్తింపు పొందింది. నాలుగు గోడల మధ్య తయారీ చేసిన రొయ్య విత్తనాలను ఆరుబయట చెరువుల్లో విడుదల చేస్తున్నప్పుడు యాజమాన్య పద్ధతులు పాటించకపోవడంతో రొయ్య పిల్లలు మరణించి, రైతులకు నష్టాన్ని మిగుల్చుతున్నాయి. రాష్ట్రంలో 5.75 లక్షల ఎకరాల విస్తీర్ణంలో ఆక్వా సాగు చేస్తున్నారు. వీరిలో రొయ్యల సాగు రైతులు 1.5 లక్షలు ఉన్నారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 2.90 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగు జరుగుతుండగా వీటిలో రొయ్యల సాగు 1.10 లక్షల ఎకరాల్లో సాగువుతోంది. ఉమ్మడి జిల్లాలో ఆక్వారంగం నుంచి వార్షిక ఉత్పత్తి 4 లక్షల టన్నులు ఉండగా, వార్షిక టర్నోవర్ రూ.18 వేల కోట్లుగా నమోదవుతోంది. రాష్ట్రంలో రెండు నెలల వ్యవధిలో సుమారు రూ.60 కోట్ల విలువైన రొయ్యలు చనిపోయాయి. రొయ్యల సాగులో ప్రధానంగా ఎంటెరోసైటటోజాన్ హెపాటోపెనాయ్(ఈహెచ్పీ), రన్నింగ్ మోర్టాలిటీ సిండ్రోమ్(ఆర్ఎంఎస్), వైట్ స్పాట్ సిండ్రోమ్ వైరస్(డబ్ల్యూఎస్ఎస్వీ), లూస్ షెల్ సిండ్రోమ్(ఎల్ఎస్ఎస్) వ్యాధుల వల్ల రూ.కోట్లలో రైతులు నష్టాల బారిన పడుతోన్నారు. ఎక్లిమైటెజేషన్ అంటే.. రొయ్యలు చెరువుల్లో సీడ్(రొయ్య విత్తనాలు)ను అలవాటు చేసే ప్రక్రియను ఎక్లిమైటెజేషన్ అంటారు. రొయ్యల ఆరోగ్యం చెరువు నీటి నాణ్యత, నిర్వహణ, వదిలే పిల్లల సంఖ్య, మేత నాణ్యత వంటి అంశాలపై ఆధారపడి ఉంటోంది. హేచరీలో రొయ్య విత్తనాలు అక్కడ ఉష్ణోగ్రత, సెలినిటీ(లవణీయత), పీహెచ్లకు అలవాటు పడి ఉంటాయి. వీటిని చెరువుల్లో వదిలే ముందు చెరువు నీటిలో ఉష్ణోగ్రత, పీహెచ్లకు తగ్గట్టుగా అలవాటు చేయాలి. హేచరీ నుంచి తెచ్చిన విత్తన సంచులను చెరువు నీటిలో అర్ధగంట కర్ర,తాడుతో కట్టివేయాలి. తర్వాత హేచరీ నుంచి తెచ్చిన సంచుల్లో స్థానిక చెరువు నీటిని నింపుతూ రెండు పర్యాయాలు చేయాలి. ఈ పక్రియ అనంతరం విత్తనాలను చెరువులో వదలాలి. ఇలా చేయకుండా అనేక మంది రైతులు నేరుగా రొయ్య విత్తనాలను చెరువులో వదలడం వల్ల ఉష్ణోగ్రతలకు అలవాటు పడక రొయ్య పిల్లలు మరణిస్తున్నాయి. రొయ్యల రైతులు ఇలా చేయండి ● రొయ్య విత్తనాలను చెరువులో వదిలేటప్పుడు ఉష్టోగ్రత 28– 32 డిగ్రీల సెంటీగ్రేట్, పీహెచ్ 7.5–8.5, లవణీయత 15–35 పీపీటీ (స్థానిక పరిస్థితులను బట్టి), కరిగిన ఆక్సిజన్ 5 పీపీఎం కంటే ఎక్కువ ఉండాలి. ● రవాణా సమయంలో ఒత్తిడి తగ్గించడానికి రొయ్యల సీడ్ను శుభ్రమైన, ఆక్సిజన్ బ్యాగులు, సింటెక్స్ కంటైనర్లలో రవాణా చేయండి. ● ప్రతి 10–20 నిమిషాలకు 10–20 శాతం చొప్పున కంటైనర్, బ్యాగ్లలో చెరువు నీటిని కలపండి. ఇది రొయ్యలు క్రమంగా పీహెచ్, ఉష్టోగ్రత, లవణియతలో తేడాలకు అనుగుణంగా మారడానికి సహకరిస్తుంది. ● ఉష్ణోగ్రతను ట్రాక్ చేయడానికి ధర్మామీటర్, లవణీయత కోసం రిఫ్రాక్టోమీటర్, నీటి విలువల కోసం పీహెచ్ మీటర్ను ఉపయోగించండి. ● సీడ్ను ఒకేసారి డంప్ చేసే బదులు చెరువు వాతావరణానికి సమర్థవంతంగా అనుగుణంగా ఉండేలా, వాటిని కొంత వ్యవధిలో చిన్న బ్యాచ్లుగా విడుదల చేయటం మంచిది. ● చెరువు నీటి నాణ్యత, ఉష్ణోగ్రత, లవణీయత, ఆక్సిజన్ స్థాయిలో మార్పులు ఎప్పటికప్పుడు గమనించాలి. రికార్డు చేయాలి. ● ఒత్తిడిని తగ్గించడానికి తక్కువ సంఖ్యలో రొయ్యలు విడుదల చేయాలి. ● వాతావరణానికి బాగా సర్దుబాటు అవుతున్నాయని నిర్ధారించుకోడానికి కొన్ని రోజుల పాటు రొయ్యల ఆరోగ్యం, ప్రవర్తన నిశితంగా గమనించండి. రొయ్యల సాగులో ఎక్లిమైటెజేషన్ ప్రక్రియ తప్పనిసరి హేచరీ నుంచి రొయ్య విత్తనం సరఫరా కీలకం నిర్లక్ష్యంతో నష్టాల బారిన పడుతున్న రైతులు ఉమ్మడి జిల్లాలో 1.10 లక్షల ఎకరాల్లో రొయ్యల సాగు బతుకు రేటు 90 శాతం మంచిది హేచరీ నుంచి చెరువులో రొయ్య పిల్లలు వేసే సమయంలో అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలి. హోపా(విత్తనాల నిల్వ తొట్టె) బతుకుదలను 24 గంటలు కంటే 48 గంటల తర్వాత మాత్రమే తనిఖీ చేయాలి. సుమారు 200 విత్తనాలకు హోపాలో 180 విత్తనాలు జీవిస్తే అటువంటి వాటిని విడుదల చేయాలి. రొయ్య విత్తనాలను నేరుగా చెరువులో విడదల చేయకూడదు. పంట విజయానికి చెరువు నీటికి రొయ్య విత్తనాలను అలవాటు చేయడమే ఉత్తమ మార్గంగా రైతులు భావించాలి. – డాక్టర్ పి.రామమోహనరావు, మాజీ డెప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ఫిషరీస్, కాకినాడ -
లైసెన్స్ లేని వ్యక్తుల నుంచి మద్యం కొనుగోలు ప్రమాదకరం
భీమవరం: రాష్ట్ర ఎకై ్సజ్ శాఖ ద్వారా లైసెన్స్ పొందిన రిటైల్ మద్యం దుకాణాల నుంచి మాత్రమే మద్యం కొనుగోలు చేయాలని జిల్లా ఎకై ్సజ్శాఖ సూపరింటెండెంట్ ఆర్ఎస్ కుమరేశ్వరన్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. లైసెన్స్ లేని వ్యక్తుల నుంచి మద్యం కొనుగోలు ప్రమాదకరమన్నారు. వేడుకలకు మద్యాన్ని తక్కువ ధరకు సరఫరా చేస్తామని చెప్పి మోసంచేసే అవకాశముందని హెచ్చరించారు. మద్యం అమ్మకాల్లో అనుమానిత వ్యక్తుల వివరాలను టోల్ఫ్రీ నంబర్: 14405, లేదా సెల్: 98482 03823 నంబర్కు సంప్రదించాలని కుమరేశ్వరన్ తెలిపారు. చికిత్స పొందుతూ వివాహిత మృతి జంగారెడ్డిగూడెం: మండలంలోని లక్కవరం గ్రామానికి చెందిన ఓ వివాహిత ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. లక్కవరం ఎస్సై బి.శశాంక తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన గౌతు వెంకట రామకృష్ణకు, నాగ వెంకట శిరీష (39)కు 19 ఏళ్ల క్రితం వివాహమైంది. మంగళవారం శిరీష, ఆమె అత్త కోడిపిల్లల విషయమై గొడవపడ్డారు. దీంతో మనస్తాపానికి గురైన శిరీష కలుపు మందు తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం విజయవాడ తరలించగా, చికిత్స పొందుతూ శిరీష మృతి చెందింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. లోక్ అదాలత్తో సత్వర పరిష్కారం ఏలూరు (టూటౌన్): కేసుల సత్వర పరిష్కారానికి జాతీయ లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్.శ్రీదేవి కోరారు. జిల్లా కోర్టు ఆవరణలోని న్యాయ సేవా సదన్ భవన్ నందు బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిలాల్లోని అన్ని కోర్టుల్లో ఈనెల 5వ తేదీన జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు 4,633 రాజీకాదగిన కేసులు గుర్తించామని, వీటిలో 1,891 క్రిమినల్, 2,501 సివిల్, 241 ఇతర కేసులు ఉన్నాయన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.రత్నప్రసాద్ మాట్లాడుతూ ఈనెల 5న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ నిర్వహణకు జిల్లాలో 34 బెంచ్లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కక్షిదారులు ఆన్లైన్ ద్వారా కూడా తమ కేసులను రాజీ మార్గం ద్వారా పరిష్కరించుకోవచ్చన్నారు. సమావేశంలో ఏలూరు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కోనే సీతారాం పాల్గొన్నారు. -
స్నేహితుడే హంతకుడు
● కీలకమైన హత్య కేసును ఛేదించిన పోలీసులు ●● డీఎన్ఏ రిపోర్టు ఆధారంగా దర్యాప్తు ● వివరాలు వెల్లడించిన ఎస్పీ నయీం అస్మి నరసాపురం: గుర్తు తెలియని మృతదేహాన్ని గుర్తించి, సదరు వ్యక్తి హత్య చేయబడ్డాడని నరసాపురం పోలీసులు నిర్ధారించారు. లోతైన దర్యాప్తు జరిపి హత్యగా తేల్చడమే కాకుండా డీఎన్ఏ రిపోర్టు ఆధారంగా మృతుడిని గుర్తించడం విశేషం. దీనికి సంబంధించి వివరాలను బుధవారం ఎస్పీ నయీం అస్మి నరసాపురం డీఎస్పీ కార్యాలయంలో వెల్లడించారు. పంట కాలువలో లభించిన మృతదేహం నరసాపురం మండలం కొప్పర్రు గ్రామంలో డంపింగ్ యార్డ్ సమీపంలో పంట కాలువలో ఈ ఏడాది జనవరి 27వ తేదీన సుమారు 30 నుంచి 40 సంవత్సరాల వయస్సు ఉన్న గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. మృతుడి తొడ ఎముక, మరికొన్ని లోపలి అవయవాలను పోస్టుమార్టం సమయంలో భధ్రపరిచారు. పోస్టుమార్టం నివేదికలో అతను నీటిలో పడిపోవడం వల్ల చనిపోలేదని తేలింది. పొట్టలో కుడివైపు గాయాలు కూడా ఉండటంతో హత్యచేసి పడేశారని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఫోరెన్సిక్ ఆధారాలతో మృతుడి గుర్తింపు పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి హత్యపై కూపీ లాగారు. ముందుగా ఉభయగోదావరి జిల్లాలు, పక్క జిల్లాల్లో నమోదైన మిస్సింగ్ కేసులు, అందులో గుర్తించిన వారి వివరాలు సేకరించారు. పెరవలి పోలీసు స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదై గుర్తింపు లభించని చుక్కల శ్రీనివాస్ విషయంలో దృష్టి పెట్టారు. శ్రీనివాస్ తల్లితండ్రుల డీఎన్ఏలను సేకరించి, మృతుడి భధ్రపరిచిన ఎముక డీఎన్ఏ ద్వారా సరిచూసి మృతుడు శ్రీనివాస్గా నిర్ధారించారు. హత్యగా గుర్తించింది ఇలా పెరవలి మండలం నడిపల్లి గ్రామానికి చెందిన చుక్కల శ్రీనివాస్ (37) డీఎస్సీకి ప్రిపేరవుతున్నాడు. అయితే అతని స్నేహితులు, దినచర్య వంటి అంశాలపై పోలీసులు దృష్టిపెట్టి విచారణ చేశారు. శ్రీనివాస్తో అత్యతం సన్నిహితంగా ఉండే పెరవలి మండలం కాకరపర్రుకు చెందిన పూల వ్యాపారి మల్లెపూడి శ్రీనివాస్ను అనుమానంతో అదపులోకి తీసుకుని విచారించగా అతడే చంపినట్టు తెలిసింది. స్నేహితుడే చంపేసి కాలువలో పడేశాడు చుక్కల శ్రీనివాస్ డీఎస్సీకి ప్రిపేర్ కావడానికి రాజమండ్రి వెళతానని స్నేహితుడు మల్లెపూడి శ్రీనివాస్కు చెప్పాడు. అయితే వెళ్లొద్దని స్నేహితుడితో ఓసారి గొడవపడ్డాడు. మళ్లీ 2025 జనవరి 3వ తేదీన రాత్రి 8 గంటల సమయంలో దువ్వ గ్రామం నుంచి ఒకే మోటార్సైకిల్పై వెళుతుండగా ఇదే విషయంపై మళ్లీ ఇద్దరూ వాదులాడుకున్నారు. పెరవలి సమీపంలో ప్లేబాయ్ ఫ్యాక్టరీ వద్ద నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతానికి మోటార్సైకిల్ను తీసుకెళ్లి అక్కడ కొంతసేపు వాదులాకున్నారు. ఈ క్రమంలో మల్లెపూడి శ్రీనివాస్ బీర్బాటిల్ పగలకొట్టి చుక్కల శ్రీనివాస్ పొట్టలో కుడివైపుపొడిచి హత్య చేశాడు. కాళ్లు, చేతులు కట్టి, దుస్తులు తొలగించి శవాన్ని పెరవలి కాలువలోకి తోసేశాడు. ఇక్కడ ఇంకో విశేషం ఏమిటంటే హత్య చేసిన ప్రదేశం నుంచి శవాన్ని కాలువలోకి నెట్టిన ప్రాంతం 3 కిలోమీటర్లు. 24 రోజుల తరువాత శవం దాదాపు 42 కిలోమీటర్లు దూరంలో కొప్పర్రు గ్రామంలో బయటపడటం మరో అంశం. ఇది దాదాపు అసాధ్యమైన కేసని వైద్య పరిజ్ఞానం, సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి కేసు ఛేదించినట్లు ఎస్పీ చెప్పారు. విలేకరుల సమావేశంలో అడిషనల్ ఎస్పీ భీమారావు, నరసాపురం డీఎస్పీ డాక్టర్ బి.శ్రీవేద ఉన్నారు. -
6న ఉచితంగా రేబిస్ నిరోధక టీకాలు
భీమవరం: ఈనెల 6వ తేదీన జంతు సంక్రమణ వ్యాధి నిరోధక దినం (జూనోసిస్ డే) సందర్భంగా భీమవరంలోని ప్రాంతీయ పశువైద్యశాఖలో ఉదయం 9 గంటల నుంచి రేబిస్ వ్యాధి నిరోధక టీకాలు ఉచితంగా వేస్తామని పశుసంవర్థక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ పి సుధీర్బాబు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జంతువుల నుంచి మనుషులకు, మనుషుల నుంచి జంతువులకు ప్రధానంగా రేబిస్వ్యాధి సోకుతుందని, ఈ వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమాన్ని రైతులు, జంతుప్రేమికులు సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ సుధీర్బాబు కోరారు. త్రుటిలో తప్పిన పెను ప్రమాదం పంట కాలువలోకి దూసుకెళ్లిన స్కూల్ బస్సు నరసాపురం రూరల్: ఓ ప్రైవేటు స్కూల్ బస్సుకు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన మొగల్తూరు మండలం రామన్నపాలెం గ్రామంలో చోటు చేసుకుంది. నరసాపురం పట్టణానికి చెందిన ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు బుధవారం సాయంత్రం స్కూల్ నుంచి విద్యార్థులను ఇంటికి తీసుకెళ్లే సమయంలో మొగల్తూరు మండలం రామన్నపాలెం గ్రామంలో అదుపుతప్పి పక్కనే ఉన్న పంట కాలువలోకి దూసుకెళ్లింది. ఈ సమయంలో బస్సులో ఉన్న 33 మంది విద్యార్థులు ఆర్తనాదాలు చేయడంతో అక్కడకు చేరుకున్న స్థానికులు స్పందించి పిల్లలను బస్సు నుంచి దించేశారు. ఈ ఘటనతో విద్యార్థులు తీవ్ర భయబ్రాంతులకు గురయ్యారు. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరుగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అతివేగమే ప్రమాదానికి కారణమని పలువురు స్థానికులు పేర్కొంటున్నారు. -
వేగవరం వద్ద భారీ రోడ్డు ప్రమాదం
జంగారెడ్డిగూడెం: జాతీయ రహదారి 516డి పై జంగారెడ్డిగూడెం మండలం వేగవరం వద్ద బుధవారం భారీ రోడ్డు ప్రమాదం సంభవించింది. ఒక లారీని మరో లారీ వెనుక నుంచి ఢీకొన్న ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా, పదుల సంఖ్యలో వాహనాలు ధ్వంసమయ్యాయి. దీనికి సంబంధించి పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ నుంచి వైజాగ్కు సిమెంటు లోడుతో వెళుతున్న లారీని, ముంబయి నుంచి రాజమండ్రికి పేపర్ లోడ్తో వెళుతున్న లారీ మండలంలోని వేగవరం ప్రధాన సెంటర్ వద్ద వెనుక నుంచి ఢీకొంది. దీంతో సిమెంట్ లోడు లారీ అదుపు తప్పి రోడ్డు ఎడమపక్క ఉన్న దుకాణాల్లో దూసుకుపోయింది. ఇదే సమయంలో పేపర్ లోడ్ లారీ కుడి పక్కన దుకాణాల్లోకి దూసుకువెళ్లింది. ఈ ప్రమాదంలో పేపర్ లోడ్ లారీ డ్రైవర్ పప్న పిన్నెబాయ్, అలాగే రోడ్డుపక్కనే ఉన్న కొప్పర్తి నాగేంద్రబాబుకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో, సీఐ సుభాష్ ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను తన వాహనంలో జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో రోడ్డు పక్కనే నిలిపి ఉంచిన ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయి. గ్రామస్తుల ఆందోళన రహదారికి ఇరువైపులా దుకాణాలు ముందుకు వచ్చేయడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని వేగవరం గ్రామస్తులు ఆందోళన చేశారు. జాతీయరహదారిపై బైఠాయించి నినాదాలు చేశారు. ప్రమాదం జరిగిన సమయంలో ప్రజలు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందన్నారు. వెంటనే అధికారులు స్పందించి అక్రమణలను తొలగించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఆందోళనకారులతో సీఐ సుభాష్ మాట్లాడి ఆందోళనను విరమింపజేశారు. దుకాణాల్లోకి దూసుకెళ్లిన లారీలు పదుల సంఖ్యలో ద్విచక్ర వాహనాలు ధ్వంసం ఇద్దరికి గాయాలు -
ఊరు.. బేజారు!
‘కొత్త బట్టలు ఎక్కడ్నుంచి తేవాలయ్యా...? అర్థం చేసుకోవేం? ఏడాదిగా శని పట్టుకుంది. ఎట్లా చెప్పాల్రా నీకు..?’ – తూర్పు గోదావరి జిల్లా కడియం మండలం వేమగిరిలో కుమారుడి ఎదుట వానపల్లి దుర్గాదేవి నిర్వేదం!‘నేనేం చేయనవ్వా? నన్నే తీసేశారు.. ఏడాదిగా దరిద్రాన్ని చూస్తున్నా..’ – జక్కంపూడి నగర్లో పెన్షన్ కోల్పోయిన 80 ఏళ్ల వృద్ధురాలి వద్ద మాజీ వలంటీర్ సయ్యద్ బాషా నిస్సహాయత!!‘పండగొస్తే గుండె దడ వస్తోంది. పైసా అప్పు కూడా పుట్టడం లేదు. చుట్టాలొస్తున్నారంటే భయమేస్తోంది. సంతోషంగా ఉన్న రోజు లేదు. ఊరంతా కలిసి పండగ చేసుకుని ఏడాది దాటింది...’ – అనపర్తి ఎస్సీ కాలనీలో లక్ష్మీ భవాని, కోటేశ్వరి ఆక్రోశం!‘అవును మరి.. తాపీగా కూసున్నా...! సెంద్రబాబు డబ్బులు పంపాడని...! వడ్లు కొని ఇరగదీశాడని...! మా ఆవిడ ఫ్రీ బసెక్కి ఊరెళ్లింది...ఇంటినిండా గ్యాస్ బండలున్నాయి..!’ – సింగగూడెం, లింగపాలెం దగ్గర గోదావరి జిల్లాల యాసలో గండుల సుబ్బారావు, పొట్టవూరు శ్రీనివాస్ వ్యంగ సంభాషణ!!వనం దుర్గాప్రసాద్ – ఉభయ గోదావరి జిల్లాల నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి : గోదారి పల్లెలంటే.. ఉప్పొంగే సంతోషాల పరవళ్లు! పచ్చని తోరణాల లోగిళ్లు! మర్యాదలతో అతిథులను ఉక్కిరిబిక్కిరి చేసే గోదారమ్మ తీరం ఏడాదిగా బావురుమంటోంది! పల్లె కళ తప్పింది. గత ప్రభుత్వ హయాంలో సాఫీగా సాగిన బతుకు బండి ఇప్పుడు గతుకుల బాటలో కూరుకుపోయి నరకం అనుభవిస్తోంది! వైఎస్ జగన్ పాలనలో ఏదో ఒక పథకం కింద నెలనెలా డబ్బులొచ్చేవి. అమ్మ ఒడి... విద్యా దీవెన.. వసతి దీవెన.. రైతు భరోసా... చేయూత... చేదోడు.. కాపునేస్తం... వాహన మిత్ర.. ఇలా ఒకదాని వెంట మరొకటిగా డబ్బులు అందేవి. పండుగలు వస్తే పేదలు సంతోషంగా జరుపుకొనేవారు. నెలకు సరిపడా సరుకులు ముందే తెచ్చుకునేవారు. స్కూళ్లు తెరవటమే ఆలస్యం.. పిల్లలకు యూనిఫాం, టై, బెల్ట్, బూట్లు, పుస్తకాలు.. విద్యా కానుక సిద్ధంగా ఉండేది! చేతిలో ట్యాబ్లతో పిల్లలు ఆత్మ విశ్వాసంతో ప్రభుత్వ స్కూళ్లకు వెళ్లేవారు. టీడీపీ కూటమి సర్కారు ఏడాది పాలనలో అంతా తిరగబడింది! బతుకు బండి తలకిందులైంది!! మావోడు ఏమయ్యాడు..? ఊరితో బంధం తెగిందవ్వా..! కాళ్ల మండలం వేంపాడులో గ్రామ సచివాలయానికి వచ్చిన ఓ 60 ఏళ్ల అవ్వ ‘మావోడు ఏమయ్యాడయ్యా?’ అంటూ వలంటీర్ గురించి ఆరా తీసింది. ఇంటికే వచ్చేవాడు. పెన్ష¯న్Œ తెచ్చి ఇచ్చేవాడు. బిడ్డలా అండగా ఉండేవాడు.. అంటూ పేగు బంధమే తెగినంతగా బా«ధ పడింది. ఉండి దగ్గర ఉప్పులూరు గ్రామ వలంటీర్ కనిపించడంతో ఊరిలో వారంతా చుట్టూ చేరి ఆప్యాయంగా పలుకరించారు. ‘ఏమయ్యావ్ తండ్రీ..?’ అంటూ 80 ఏళ్ల లక్ష్మి ఆదుర్దాగా ఆరా తీసింది. మాసిన దుస్తులు, పెరిగిన గడ్డం చూసి కన్నీళ్లు పెట్టుకుంది. రాజమహేంద్రవరంలో రోజూ కూలీకి వెళ్తున్నానని ఆ వలంటీర్ చెప్పాడు. ‘ప్రభుత్వం మారింది. మన ఊరితో బంధం తెగిందవ్వా..’ అంటూ కంట తడి పెట్టాడు. వీరవాసరం కొణితివాడలోనూ ఇదే సన్నివేశం. గణపవరం మండలం కొమ్మూరులో వలంటీర్ కోసం గ్రామస్తులు వాకబు చేస్తున్నారు. బడ్డీ కొట్టు బంద్.. కొవ్వూరు డివిజన్ పైడిమెట్ట, పోచారం, తాళ్లపూడి, బల్లిపాడు, చింతలపూడిలోని లింగపాలెం... ఇలా ఏ ఊరు చూసినా ఉసూరుమంటున్నాయి. ఆ పథకం... ఈ పథకం వచి్చందని, టీ కోసం నేను డబ్బులిస్తానంటే నేనిస్తానని పోటీ పడ్డ వాతావరణం ఇప్పుడు కానరావడం లేదు. బడ్డీ కొట్టు నరేష్ వ్యాపారం సాగక ఊరొదిలి వెళ్లాడు. ఊరందరికీ కూరలు అమ్మే సుజాత పట్నం చేరుకుంది. గ్రామంలో ట్యూషన్లు చెప్పే మాణిక్యం కాకినాడ కాలేజీలో అధ్యాపకుడిగా చేరాడు. పథకాలు వచ్చినన్నాళ్లు జనం చేతిలో డబ్బులుండేవి. పిల్లలకు ట్యూషన్లు చెప్పించేవాళ్లు! ఏడాదిగా పైసా రాకపోవడంతో గ్రామాల్లో గుబులు రేగుతోంది! చిన్న వ్యాపారాలు నడవడం లేదు. ఆటోవాలాలు డీలా పడ్డారు. ‘మేం టీడీపీనే... అయినా జగన్ పాలనే బాగుంది..’ ధర్మాజీ గూడెం వద్ద ఆటోవాలా నరేష్ తేల్చి చెప్పేశాడు! రైతుల ఆనందం ఆవిరి.. గోదావరి జిల్లాల్లో రైతన్న పరిస్థితి దయనీయంగా ఉంది. పంటలకు గిట్టుబాటు ధర లేదు.. ఈ ప్రభుత్వం దళారీల దయకు వదిలేసింది. ధాన్యం అమ్మితే డబ్బులివ్వకుండా తిప్పలు పెడుతోంది. తేమ శాతం అంటూ కోతలు పెడుతోంది. రైతు కూలీలకు పనులు లేవు. పట్టణాల్లో తాపీ పనులకు వెళ్తున్నారు. పిల్లల చదువులకు అప్పులే శరణ్యమయ్యాయి. వైఎస్ జగన్ పాలన సాగిన ఐదేళ్లూ స్వర్ణ యుగమని, ఇప్పుడు మాకు ఖర్మ పట్టుకుందని ఆవేదనగా చెబుతున్నారు. రైతుల ఆనందం ఆవిరైందని వ్యవసాయదారుడు సుబ్బారావు కండువాతో కన్నీళ్లు తుడుచుకున్నాడు. చెయ్యి తడిపితేనే అర్జీలు తీసుకునే పాడు రోజులు మళ్లీ దాపురించాయని చెప్పాడు.పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం కొమరాడకు చెందిన టైలర్ కృష్ణారావు ఏడాదిగా అష్ట కష్టాలు అనుభవిస్తున్నాడు. ఇప్పుడు పథకాలు ఏవీ రాకపోవడంతో బట్టలు కుట్టించేందుకు తనవద్దకు ఎవరూ రావడం లేదని, గతంలో నెలకు రూ.15 వేలు సంపాదించిన తాను రూ.3 వేలు ఆర్జించడం కూడా గగనంగా ఉందని చెబుతున్నాడు. కుమార్తెను చదివించేందుకు అప్పులు చేయాల్సి వచ్చిందని, భీమవరం వస్త్ర దుకాణంలో సగం రోజులు కూలీకి వెళ్తున్నానని చెప్పాడు. ఆ దేవుడి దయే..! ఆ దేవుడే నాకు తిండి పెట్టే ఏర్పాటు చేశాడు.. పెన్షన్ మంజూరు చేశాడు (వైఎస్ జగన్ను తలచుకుంటూ...) వలంటీర్ ఇంటికొచ్చి పలకరించేవాడు. ఇప్పుడు పలకరించే దిక్కులేదయ్యా. ఊరే బావురు మంటోంది – జోగి రామలక్ష్మి, (జక్కంపూడి నగర్, తూ.గో)బంధం తెగిపోయింది ఇంటర్ వరకు చదివా. జగనన్న పుణ్యమా అని వలంటీర్గా చేరి ఊరందరి కష్టసుఖాలు తెలుసుకునే భాగ్యం దక్కింది. మీకు ఐదు వేలు ఏమిటి.. పదివేలు ఇస్తానన్న చంద్రబాబు మమ్మల్ని రోడ్డున పడేశారు. దీనికి బాధపడటం లేదు గానీ మా పల్లెతో బంధం తెగిపోయిందని ఏడుపొస్తోంది. – సయ్యద్ బాషా (మాజీ వాలంటీర్) -
ఆనందం ‘ట్రిపుల్’
నూజివీడు: రోజువారీ కూలీ కుమారుడు ఒకరు... ఆటో డ్రైవర్ కొడుకు మరొకరు.. తండ్రి లేని నిరుపేద బాలిక ఇంకొకరు.. ఇలా అందరూ గ్రామీణ ప్రాంతాలకు చెందిన పేద విద్యార్థులే. అద్భుత ప్రతిభ కలిగిన వీరంతా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుని పదో తరగతిలో సత్తా చాటారు. గ్రామీణ పేద పిల్లలకు సైతం సాంకేతిక విద్యను అందించాలనే లక్ష్యంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అత్యుత్తమ ప్రమాణాలతో ఏర్పాటు చేసిన ట్రిపుల్ ఐటీల్లో సీట్లు పొందారు. తమ లక్ష్యానికి అనుగుణంగా తొలి అడుగు పడిందనే ఆనందంతో తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఏలూరు జిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీలో అడ్మిషన్లు పొందిన కొందరు విద్యార్థుల మనోగతం వారి మాటల్లోనే.. నూజివీడు ట్రిపుల్ ఐటీలో సీట్లు పొందిన గ్రామీణ పేద విద్యార్థులు కష్టానికి తగిన ప్రతిఫలం లభించిందని సంతోషం -
కూలికి వెళ్తూ చదివించారు
మాది ప్రకాశం జిల్లా మార్కాపురం. మా ఊరిలోని ఏపీ మోడల్ స్కూల్లో పదో తరగతి చదివా. 591 మార్కులు రావడంతో నూజివీడు ట్రిపుల్ ఐటీలో సీటు లభించింది. మా నాన్న కొండయ్య కూలి పనులకు వెళుతూ నన్ను చదివించారు. ట్రిపుల్ ఐటీలో సీటు లభించడం ఎంతో ఆనందంగా ఉంది. – బొప్పరాజు సాత్విక, మార్కాపురం, ప్రకాశం జిల్లా నా కల నెరవేరింది మాది ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం గొట్టిపడియ. మహాత్మా జ్యోతిబా పూలే బీసీ సంక్షేమ శాఖ స్కూల్లో చదువుకుని పదో తరగతిలో 580 మార్కులు సాధించా. మా అమ్మ చాలా కష్టపడి నన్ను చదివించింది. ట్రిపుల్ ఐటీలో చేరాలనే నా కల నెరవేరింది. ఎంతో సంతోషంగా ఉంది. – సాల్వ హిమచంద్రిక, గొట్టిపడియ, ప్రకాశం జిల్లా కష్టపడి చదువుతా మా నాన్న ఆటో నడిపి కుటుంబాన్ని పోషించేవాడు. అమ్మ కూలి పనులకు వెళ్తుంది. నేను జ్యోతిబా పూలే బీసీ సంక్షేమ శాఖ స్కూల్లో పదో తరగతి చదివి 592 మార్కులు సాధించా. ఇక్కడ సీటు రావడం ఎంతో ఆనందంగా ఉంది. ఇక ముందు కూడా కష్టపడి చదువుతా. – వాసిరెడ్డి వెంకటలక్ష్మి, పరవాడ మండలం, అనకాపల్లి జిల్లా ఉన్నత స్థానమే లక్ష్యంగా.. అమ్మ, నాన్న ఇద్దరూ కూలి పనులకు వెళ్లి కుటుంబాన్ని పోషిస్తున్నారు. జెడ్పీ హైస్కూల్లో పదో తరగతిలో 590 మార్కులు సాధించా. తల్లిదండ్రుల కష్టాన్ని రోజూ చూస్తుండేవాడిని. ట్రిపుల్ ఐటీలో సీటు సాధించినందుకు ఆనందంగా ఉంది. బాగా చదువుకుని ఉన్నత స్థానాలకు ఎదగడమే లక్ష్యం. – దామా చైతన్య, నలదలపూర్, పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సంతోషంగా ఉంది నా తండ్రి కూలి పనులకు వెళ్లి కుటుంబాన్ని పోషిస్తున్నారు. బీఎంఆర్ బాలికల హైస్కూల్లో చదివి పదో తరగతిలో 587 మార్కులు సాధించాను. నూజి వీడు ట్రిపుల్ ఐటీలో సీటు రావడం సంతోషంగా ఉంది. ఉన్నత స్థానాలకు చేరుకుని తల్లిదండ్రులను ఆనందంగా ఉండేలా చూడటం నా బాధ్యత. – మరుకుర్తి శ్రీకీర్తన, పిఠాపురం, కాకినాడ జిల్లా ఉన్నత విద్యకు అవకాశం మా నాన్న కూలికి వెళ్తేనే మా కుటుంబం గడిచేది. నేను కావలి మున్సిపల్ హైస్కూల్లో చదివి పదో తరగతిలో 582 మార్కులు సాధించాను. ఇక్కడ సీటు రావడంతో ఎంతో ఆనందంగా ఉంది. పేద కుటుంబానికి చెందిన నాకు ఉన్నత చదువుకు అవకాశం రావడం సంతోషంగా ఉంది. – బొగ్గవరపు తనూజ, లింగనపాలెం, నెల్లూరు జిల్లా ● -
● మా గోడు పట్టదా?
తమ న్యాయమైన కోర్కెలు పరిష్కరించాలంటూ మున్సిపల్ ఇంజినీరింగ్ కార్మికుల నిరాహార దీక్షలు తొమ్మిదో రోజుకు చేరాయి. ఆందోళనలో భాగంగా వాటర్వర్క్స్, వీధి దీపాల నిర్వహణ వంటి అత్యవసర సర్వీస్లను బహిష్కరించడంతో ప్రభావం సమ్మె ప్రభావం కనిపిస్తోంది. నరసాపురం పట్టణంలోని మార్కెట్ ఏరియాలో కుళాయిల ద్వారా నీటి సరఫరా నిలిచిపోయింది. దీంతో వ్యాపారులు ఇబ్బందులు పడ్డారు. మంగళవారం తణుకులో నిరాహారదీక్ష శిబిరం నుంచి బైక్ ర్యాలీ నిర్వహించారు. వేతన సవరణ చేసి, సమాన పనికి సమాన వేతనం ఇప్పించాలన్నారు. పాలకొల్లు, తాడేపల్లిగూడెంలో ఇంజినీరింగ్ కార్మికులు నిరసన కొనసాగించారు. పాలకొల్లు సెంట్రల్/ నరసాపురం/తణుకు అర్బన్/ తాడేపల్లిగూడెం(టీఓసీ) -
అరకొరగా మందు బిళ్లలు
బుధవారం శ్రీ 2 శ్రీ జూలై శ్రీ 2025సాక్షి, భీమవరం: వృద్ధుల్లో రక్తపోటు అదుపునకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులు ఎటన్లాల్ 50 మాత్రలను ఎక్కువగా సిఫార్సు చేస్తుంటారు. గతంలో పీహెచ్సీలకు క్రమం తప్పకుండా ఈ మాత్రలు సరఫరా జరిగేవి. కొన్ని నెలలుగా వీటి పంపిణీ అంతంత మాత్రంగానే ఉండడంతో రోగులు ఇబ్బంది పడాల్సి వస్తోంది. నొప్పులు తగ్గేందుకు వినియోగించే ప్రిగాబ్లిన్ టాబ్లెట్లు, రోగికి సత్తువ కోసం పెట్టే మెట్రోజిల్ సైలెన్లు, జ్వరాలు, నొప్పులకు వివిధ రకాల వ్యాధులను తగ్గించేందుకు వినియోగించే పారాసిటమాల్ 500 ఎంజీ, ఇన్సులిన్, అమాక్సిలిన్ టాబ్లెట్స్, అమాక్స్లినన్ ఇంజెక్షన్లు, సిట్రజన్, సిల్వర్ ఎక్స్ తదితర మందులది అదే దారి. ఏ రకం మందులు ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో అరకొర మందులతో తప్పనిసరి పరిస్థితుల్లో రోగులు మెడికల్ షాపులను ఆశ్రయించాల్సి వస్తోంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మందుల కొరత వేధిస్తోంది. జిల్లాలో ఒక జిల్లా ఆరోగ్య కేంద్రం, మూడు సీహెచ్సీలు, ఐదు ఏరియా ఆస్పత్రులు, 34 వరకు పీహెచ్సీలు, 18 యూపీహెచ్సీల వరకూ ఉన్నాయి. రోజుకు 15,500 వరకూ ఓపీ నమోదవుతుంది. ప్రతి మూడు నెలలకు ప్రభుత్వ ఆస్పత్రులకు అవసరమైన మందులను వైద్యారోగ్య శాఖ అందిస్తుంది. కొంతకాలంగా క్వార్టర్ కోటా విడుదలతో ప్రభుత్వం కోత పెడుతోంది. మూడు నెలలకు అవసరమైన డ్రగ్స్తో ఇండెంట్ పెడుతుండగా సెంట్రల్ డ్రగ్స్ స్టోర్స్ నుంచి పూర్తిస్థాయిలో మందులు రావడం లేదని వైద్య సిబ్బంది చెబుతున్నారు. గతంతో పోలిస్తే మందులకు సంబంధించిన బడ్జెట్ కేటాయింపులు తగ్గాయి. పత్తాలేని సురక్ష శిబిరాలు జగనన్న సురక్ష ద్వారా పేద వర్గాల వారికి రూపాయి ఖర్చు లేకుండా స్పెషలిస్ట్ వైద్యసేవలు పొందే సౌలభ్యాన్ని గత ప్రభుత్వం కల్పించింది. వైద్య సిబ్బంది, వలంటీర్లు ఇంటింటికి వెళ్లి బీపీ, సుగర్, హిమోగ్లోబిన్, అవసరాన్ని బట్టి మలేరియా, డెంగీ, కఫం పరీక్షలు నిర్వహించి ఆరోగ్య సమస్యలున్న వారిని గుర్తించేవారు. జిల్లాలోని విలేజ్ క్లినిక్లు, పట్టణ ఆరోగ్య కేంద్రాల పరిధిలో వైద్య శిబిరాలు ఏర్పాటుచేసి రక్తం, మూత్రం, ఈసీజీ తదితర 14 రకాల వైద్య పరీక్షలతో పాటు 172 రకాల మందులను అందుబాటులో ఉంచేవారు. స్పెషలిస్ట్ వైద్యులు, మెడికల్ ఆఫీసర్లు, ఇతర ఆరోగ్య సిబ్బంది వైద్యసేవలు అందించేవారు. పేదలకు వైద్య భరోసా కల్పించిన ఈ శిబిరాల నిర్వహణను కూటమి ప్రభుత్వం పక్కన పెట్టేసింది. గత్ర ప్రభుత్వంలో తమ సమీప ఆరోగ్య కేంద్రంలో స్పెషలిస్ట్ వైద్యసేవల్ని ఉచితంగా పొందిన గ్రామీణ ప్రాంత ప్రజలు ఇప్పుడు వాటి కోసం ఎన్నో వ్యయప్రయాసలకోర్చి పట్టణాలకు పరుగులు తీయాల్సి వస్తోంది. న్యూస్రీల్కొన్ని మందులు నిలిపివేసిన ప్రభుత్వం పీహెచ్సీలకు 172 రకాలు ఉంచాల్సి ఉండగా కొన్ని మందులను నిలిపివేసిన వైద్య ఆరోగ్యశాఖ మరికొన్ని అరకొరగానే అందజేస్తోంది. సీహెచ్సీల్లో 325 రకాల మందులకు 240 రకాలనే సరఫరా చేస్తున్నట్టు తెలుస్తోంది. బీపీ, సుగర్, దీర్ఘకాలిక వ్యాధులకు మందుల పంపిణీ అరకొరగానే ఉండటంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. వ్యాధిని నయం చేసేందుకు సరైన డ్రగ్ లేక బయట మెడికల్ షాపుల్లో కొనుగోలు చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటోందని రోగులు చెబుతున్నారు. ఇటీవల జరిగిన సర్వేలో ఉచిత మందులు సక్రమంగా అందడం లేదని 46 శాతం చెప్పగా, ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సేవలపై 30 శాతం మంది అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. అలంకారప్రాయంగా హెల్త్ క్లినిక్లు సాధారణంగా యూనివర్శల్ (యూ), సబ్ డివిజనల్ (ఎస్), టెరిసరీ (టి) కేటగిరీల్లో విలేజ్ హెల్త్ క్లినిక్లు, పీహెచ్సీలు, సీహెచ్సీలు, జిల్లా ఆస్పత్రులు, వైద్య కళాశాలలకు మందుల కేటాయింపు చేస్తుంటారు. స్థాయిని బట్టి అలాట్మెంట్, బడ్జెట్ కేటాయింపు లుంటాయి. రోజువారీ ఓపీ అధికశాతం నమోదయ్యే పీహెచ్సీలకు పూర్తిస్థాయిలో మందుల సరఫరా జరగక వీటికి అనుబంధంగా పనిచేసే హెల్త్ క్లినిక్లో్ూల్న మందుల కోరత వేధిస్తోంది. హెల్త్ క్లినిక్లకు రావాల్సిన మందులు అరకొరగానే సరఫరా అవుతున్నాయి. ఆస్పత్రుల్లో మందులకు కొరత లేదని, అలాట్మెంట్ మేరకు పూర్తిస్థాయిలో మందులు సరఫరా చేస్తున్నట్టు వైద్యారోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రులకు పూర్తిస్థాయిలో అందని వైనం మెడికల్ షాపులను ఆశ్రయిస్తున్న రోగులు అలంకార ప్రాయంగా హెల్త్ క్లినిక్లు గత ప్రభుత్వంలో అందుబాటులో అన్ని రకాల మందులు జగనన్న సురక్ష శిబిరాలతో చెంతకే మందులు -
వైఎస్సార్సీపీ బలోపేతానికి కృషి చేయాలి
ఏలూరు టౌన్: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో రాబోయే కాలంలో ఏలూరు జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేస్తూ.. క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలపై సమష్టిగా పోరాటం చేసి ప్రజలకు అండగా నిలవాలని మాజీ ఎంపీ, వైఎస్సార్సీపీ నాయకుడు కోటగిరి శ్రీధర్ అన్నారు. ఏలూరులోని ఆయన ఇంట్లో దెందులూరు మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి, ఏలూరు సమన్వయకర్త మామిళ్ళపల్లి జయప్రకాష్ మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లాలో వైఎస్సార్సీపీ బలోపేతానికి చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చించారు. జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలు, ఏలూరు పార్లమెంట్లో వైఎస్సార్సీపీ జెండా ఎగురవేసేలా పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు సమష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. కూటమి అరాచకాలు, పార్టీ నేతలపై అక్రమ కేసులు, దాడులు, దౌర్జన్యాలపై ప్రజలంతా తీవ్ర అసంతృప్తితో ఉన్నారని చెప్పారు. కూటమి నేతలు సూపర్ –6 హామీలు అమలు చేయలేక, ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని, గత వైఎస్సార్సీపీ హయాంలో ప్రజలకు ఏ విధంగా మేలు చేశామనేది ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. కార్యక్రమంలో ఏలూరు నగర అధ్యక్షుడు గుడిదేశి శ్రీనివాసరావు, ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి నూకపెయ్యి సుధీర్బాబు, బీసీ సెల్ జిల్లా అధ్యక్షులు నెరుసు చిరంజీవి, జిల్లా అధికార ప్రతినిధి మున్నుల జాన్ గురునాథ్, బీసీ సెల్ నగర అధ్యక్షులు కిలాడి దుర్గారావు పాల్గొన్నారు. -
పిడుగులతో అప్రమత్తం
వర్షాకాలంలో పిడుగుల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రాణాపాయంతో పాటు గృహోపకరణాలు కాలిపోయే ముప్పు ఉందని వాతావరణ శాఖ నిపుణులు హెచ్చరిస్తున్నారు. 10లో uప్రభుత్వ రంగాల ప్రైవేటీకరణ అమానుషం ఏలూరు (టూటౌన్): కేంద్రంలో అధికారంలోకి వచ్చిన మోదీ ప్రభుత్వం గత 11 ఏళ్ల పాలనలో ఉద్యోగ, కార్మిక వ్యతిరేక విధానాలతో పాటు రైతాంగ, ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తుందని, ప్రభుత్వ రంగాలను ప్రైవేటీకరణ చేస్తూ దేశ ఆర్థిక వ్యవస్థను దిగజారుస్తుందని ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు బండి వెంకటేశ్వరరావు విమర్శించారు. మున్సిపల్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో గేట్ మీటింగ్ మంగళవారం యూనియన్ ప్రధాన కార్యదర్శి అప్పలరాజు అధ్యక్షతన జరిగింది. బండి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కార్మిక వర్గం సాధించుకున్న హక్కులను కాలరాస్తూ మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక , ఉద్యోగ, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలపై జులై 9న జరుగుతున్న సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని పిలుపు నిచ్చారు. అప్పలరాజు మాట్లాడుతూ ప్రభుత్వ శాఖలలో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ సిబ్బందిని పర్మినెంట్ చేస్తామని కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిందని అమలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తుందని విమర్శించారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు సుబ్బారావు, దుర్గారావు, వెంకట్ తదితరులు పాల్గొన్నారు. -
మూలనపడ్డ 108.. ప్రైవేటు వాహనంలో తరలింపు
తణుకు అర్బన్: లారీ కిందపడి వ్యక్తి తీవ్రంగా గాయపడిన ఘటన మంగళవారం తణుకులో జరగగా.. స్థానికులు 108కు ఫోన్ చేసినప్పటికీ ఎంత సేపటికీ వాహనం రాలేదు. దీంతో ప్రైవేటు వాహనంలో ఆస్పత్రికి తరలించారు. సజ్జాపురానికి చెందిన దూసనపూడి దుర్గాప్రసాద్ను లారీ ఢీకొట్టింది. అతని కాలు నుజ్జయ్యింది. 108 రాకపోవడంతో స్థానికులు ప్రైవేటు వాహనంలో ప్రభుత్వాసుపత్రికి తరలించగా అక్కడ నుంచి రాజమండ్రికి తరలించారు. తణుకు 108 వాహనం కొన్ని రోజులుగా మరమ్మతుల్లో ఉంది. దీంతో ఇరగవరం, ఉండ్రాజవరం వాహనాలను ఉపయోగిస్తున్నారు. ఆ రెండు వాహనాలు కూడా దూరప్రాంతాలకు వెళ్లడంతో తణుకులో 108 వాహన సేవలు అందుబాటులో లేవు. డీఎస్సీ పరీక్షకు 97 శాతం హాజరు భీమవరం: జిల్లాలో మూడు పరీక్షాకేంద్రంలో మంగళవారం నిర్వహించిన మెగా డీఎస్సీ పరీక్షకు 97 శాతం హాజరయ్యారని జిల్లా విద్యా శాఖాధికారి ఇ.నారాయణ చెప్పారు. ఉదయం పరీక్షకు 385 మందికి 372 మంది, మధ్యాహ్నం పరీక్షకు 386 మందికి 378 మంది హాజరయ్యారన్నారు. ఎక్కడా మాల్ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని నారాయణ తెలిపారు. ఎంపీడీఓల సంఘం కార్యవర్గ ఎన్నిక భీమవరం అర్బన్: భీమవరంలోని మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం జిల్లా ఎంపీడీఓ సంఘం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఎంపీడీఓ ఎన్.గంగాధరరావు అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఎంపీడీఓ సంఘం అధ్యక్షుడిగా బీఎస్ఎస్ఎస్ కృష్ణ మోహన్, ప్రధాన కార్యదర్శిగా ఎన్. గంగా ధరరావు, ఉపాధ్యక్షులుగా డాక్టర్ జి.స్వాతి, ఎ. శ్రీనివాస్, కోశాధికారిగా సీహెచ్ త్రిశూలఫణి, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా ఎంవీఎస్ఎస్ శ్రీనివాస్, ప్రచార కార్యదర్శిగా టీఎస్ మూర్తి, సంయుక్త కార్యదర్శిగా పి.శామ్యూల్ను ఎన్నుకున్నారు. సమ్మెకు మద్దతివ్వాలి కొయ్యలగూడెం: కేంద్ర ప్రభుత్వ విధానాలకు నిరసనగా ఈ నెల తొమ్మిదిన చేపట్టే దేశవ్యాప్త సమ్మెకు ప్రజలు మద్దతివ్వాలని ఏపీ అంగన్ వాడీ వర్కర్స్ యూనియన్ నాయకులు కోరారు. మంగళవారం కొయ్యలగూడెంలో ఏర్పాటు చేసిన సమావేశంలో నాయకులు ప్రసంగించారు. కేంద్రం కార్మిక వ్యతిరేక విధానాలతో 29 కార్మిక చట్టాలను రద్దు చేసి, నాలుగు లేబర్ కోడ్లను తీసుకొచ్చి కార్మిక వర్గంపై బానిసత్వం రుద్దేందుకు ప్రయత్నిస్తోందన్నారు. అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు, మినీ వర్కర్లు ఈ సమ్మెలో పాల్గొని విజయవంతం చేయాలని జిల్లా కార్యదర్శి భారతి కోరారు. అనంతరం బయ్యనగూడెం, పొంగుటూరు, కొయ్యలగూడెం సెక్టార్ కమిటీల ఎన్నికలు నిర్వహించారు. వరదను ఎదుర్కొనేందుకు అప్రమత్తంగా ఉండాలి ఏలూరు(మెట్రో): గోదావరి వరదను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు విపత్తు నియంత్రణ కార్యాచరణను పటిష్టంగా చేపట్టాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ గౌతమీ సమావేశ మందిరంలో గోదావరి వరద నియంత్రణ, సహాయక చర్యలపై సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ గ్రామ, మండల, డివిజన్ స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేయడంతోపాటు మండల స్థాయిలో రెవెన్యూ, పోలీసు, విద్యుత్, ఫైర్, ఇరిగేషన్, ఆర్ అండ్ బీ, వ్యవసాయ అనుబంధ శాఖల అధికారుల పేర్లు, అత్యవసర ఫోన్ నెంబర్లు సిద్ధంగా ఉంచాలన్నారు. 24 గంటలు పనిచేసే కంట్రోల్ రూంలు ఏర్పాటు చేయాలన్నారు. కుక్కునూరు, వేలేరుపాడులో మొదటి, రెండవ, మూడో వరద ప్రమాద హెచ్చరికలకు అనుగుణంగా పునరావాస కార్యక్రమాలు చేపట్టాలన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో 8, 9 నెలలు నిండిన గర్బిణీల జాబితాను సిద్ధం చేసి సమీప ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. -
పిడుగులతో అప్రమత్తం
పాలకొల్లు సెంట్రల్: వర్షాకాలంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తుంటాయి. ఆ సమయంలో ఎక్కువగా పిడుగులు పడుతుంటాయి. పిడుగుల మూలంగా ఏటా సుమారు రెండువేల మంది చనిపోతున్నట్లు అంచనా. అలాగే పిడుగుల మూలంగా గృహోపకరణాలు కాలిపోతుంటాయి. ఈ నేపథ్యంలో వర్షాకాలంలో పిడుగుల పట్ల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ నిపుణులు సూచిస్తున్నారు. ఉరుములు, మెరుపులను చూసి కొందరు చాలా భయపడతారు. దీనిని అస్ట్రఫోబియా అంటారు. పిడుగు ఒకసారి పడినచోట రెండోసారి మళ్లీ పడదనుకోవడం అపోహ మాత్రమే. ఒకే చోట ఒకే ప్రదేశంలో ఎన్నిసార్లయినా పడే అవకాశం ఉంటుంది. పిడుగు పడిందంటే... పిడుగు శబ్ధం వినగలమే తప్ప చూడాలంటే మాత్రం చాలా అరుదుగా కనిపిస్తుంటుంది. పిడుగు పడే సమయంలో మెరుపు మేఘాల నుంచి భూమికి తాకినట్టుగా కనిపిస్తుంది. అలా తాకినప్పుడు మేఘాలలో తయారైన పాజిటివ్ శక్తి, భూమిలోని నెగెటివ్ శక్తిని చేరుతుంది. ఒకవేళ మేఘాలలో నెగటివ్ శక్తి తయారైతే అప్పుడు భూమిలో ఉన్న పాజిటివ్ శక్తిని చేరుతుంది. ఏ విధంగానైనా సర్క్యూట్ పూర్తవుతుంది. పిడుగు పడిన సమయంలో ఆ ప్రదేశంలో ఉష్ణోగ్రత కొన్ని వేల డిగ్రీల ఫారన్హీట్ ఉంటుందని నిపుణులు అంటున్నారు. కాపర్ ఎర్త్ ముఖ్యం పిడుగుల ప్రమాదాల నుంచి రక్షించుకోవాలంటే ఎత్తయిన భవనాల నుంచి లేదా టవర్లు, పొగ గొట్టాలు ఇలా ఏదైనా సరే పై నుంచి భూమిలోపలి వరకూ కాపర్ ఎర్త్ను తప్పనిసరిగా ఏర్పాటుచేసుకోవాలి. ఇది దాదాపుగా కిలో మీటరు దూరంలో పడిన పిడుగును సైతం నేరుగా భూమిలోకి లాక్కునే అవకాశం ఉంటుంది. కాపర్ ఎర్త్ వేసే ముందు ఉప్పు, కర్పూర బొగ్గు, నీటి మిశ్రమాలతో రాగి వైరు కలిగిన రాడ్ను భూమిలోపలకు ఏర్పాటుచేయడం వల్ల ప్రమాదాలను నివారించుకునే అవకాశం ఉంటుంది. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ● విపత్తుల నిర్వహణ సంస్థ నుంచి పిడుగులు పడే అవకాశం ఉందని సమాచారం రాగానే ప్రధానంగా పశువులు లేదా మేకలను చెట్లకింద కట్టకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలి. ● రహదారులపై హోర్డింగ్లు, ఎత్తయిన, బలహీనమైన చెట్లు కింద నిలబడరాదు. ● ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతున్నప్పుడు ఆరు బయట తిరగకూడదు. ● ఇంట్లో కేబుల్ టీవీ, కంప్యూటర్లు, ఫోన్, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను వాడకుండా కనెక్షన్లు తొలగించాలి. ● పొలం దగ్గర మైదాన ప్రాంతంలో ఉన్నట్లయితే ఎత్తయిన చెట్ల కింద నిలబడకూడదు. ట్రాక్టర్లతో పనులు నిలుపుదల చేసుకోవాలి. లేదంటే పిడుగు పడితే వాహనాల్లో ఉన్న లోహపు పరికరాలను ఆకర్షించే ప్రమాదం ఉంటుంది. ● హైటెన్షన్ వైర్లు, సెల్ టవర్లు కింద ఉండకుండా చూసుకోవాలి. ● చెరువు, కొలనులు ఉన్నట్లయితే దూరంగా ఉండాలి. ● మోటార్సైకిల్, స్కూటర్, సైకిల్ వంటి వాటికి దూరంగా ఉండాలి. ప్రయాణం చేసే సమయాల్లో వాహనాలు పక్కకు ఆపి ఎత్తయిన చెట్లు పక్కన కాకుండా నిలబడడం మేలు. ● ఉరుములతో వర్షం కురుస్తున్న సమయంలో ఇంట్లో షవర్బాత్ చేయడం, నీళ్లతో పాత్రలు శుభ్రం చేయడం వంటి పనులను చేయకూడదు. పైపుల గుండా పిడుగు ప్రయాణించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రధానంగా ఇంటికి ఎర్తింగ్ ఉండేలా చర్యలు తీసుకోవాలి. లైట్నింగ్ అరెస్టర్ అవసరం పిడుగు విద్యుత్ ప్రవాహం అధికంగా ఉండడం వల్ల విద్యుత్ పరివర్తకాలు, సామగ్రిని కాపాడుకోవడానికి లైట్నింగ్ అరెస్టర్ (పిడుగును అరెస్ట్ చేసేది) ఉపయోగిస్తుంటాము. ఎత్తయిన భవనాలకు కూడా ఇది అమర్చుకోవడం వల్ల ఉపయోగంగా ఉంటుంది. సోలార్ ప్యానల్లకు లైట్నింగ్ అరెస్టర్ ఏర్పాటుచేసుకోవాలి. సోలార్ ప్యానల్లోనే వీటిని బిగిస్తున్నారు. – చిటికెన రామకృష్ణ, డీఈఈ తూర్పు ప్రాంత విద్యుత్ శాఖ, పాలకొల్లు -
● నయనానందకరం.. జగన్నాథుని రథోత్సవం
ఏలూరు నగరంలో జగన్నాథుని రథోత్సవం నయనానందకరంగా సాగింది. అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం (ఇస్కాన్) ఆధ్వర్యంలో నిర్వహించిన జగన్నాథ రథోత్సవంలో భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారి రథాన్ని లాగారు. వందలాది మంది భక్తులు నృత్యాలు, కీర్తనలు, గానాలు, కోలాట ప్రదర్శనలతో నగర వీధుల్లో ఆనందోత్సాహాల నడుమ రథం వెంట నడిచారు. రథంపై ఊరేగిన జగన్నాథుడు, బలదేవ్, సుభద్ర మహారాణి ఉత్సవ విగ్రహాలను భక్తులు సందర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం నిర్వహించిన అన్నప్రసాద విందు కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రసాదం స్వీకరించారు. – ఏలూరు (ఆర్ఆర్పేట) -
వయ్యారిభామతో ముప్పు
యలమంచిలి: రైతులు తెగుళ్ల కంటే అధికంగా భయపడేది వయ్యారిభామ (పార్థీనియం) కలుపు మొక్కకే. ఎక్కడైనా పెరగడం ఈ మొక్క లక్షణం. ఈ కలుపు మొక్క ప్రధాన పంటకు నష్టం కలిగిస్తుంది. మొలిచిన నెల రోజుల్లోనే పూతకు వస్తుంది. ఒక్కో మొక్క 50 వేల విత్తనాలను ఉత్పత్తి చేయడంతో పాటు గాలి పాటుకు దూర ప్రాంతాలకు సైతం తేలికగా విస్తరిస్తుంది. ఈ కలుపు మొక్క గురించి మండల వ్యవసాయాధికారి షేక్ అబ్దుల్ రహీమ్ తెలిపిన వివరాలు.. జీవరాశికి ప్రమాదమే వయ్యారిభామ వల్ల పంటలకే కాదు మనుషులు, పశువులకూ ముప్పే. మనుషులకు జ్వరం, ఉబ్బసం వంటి వ్యాధులతో పాటు చర్మ సంబంధిత అలర్జీ వస్తుంది. జలుబు, కళ్లు ఎర్రబడడం, కనురెప్పల వాపు తదితర సమస్యలు వస్తాయి. ఈ మొక్కలను తింటే పశువులు అయితే హైపర్ టెన్షన్కు గురవుతాయి. ఇక పంటలకు నీరు, పోషకాలు అందకుండా వాటి కన్నా ముందుగా ఇవే శోషించుకుంటాయి. తద్వారా దిగుబడులు 40 శాతం వరకు తగ్గుతాయి. వంగ, మిరప, టమాట, మొక్కజొన్న పైర్లు పూత దశలో ఉన్నప్పుడు వాటిపై వయ్యారిభామ పుప్పొడి పడితే ఉత్పత్తి తగ్గుతుంది. పైర్లకు మొవ్వ, కాండం కుళ్లు తెగుళ్లు సోకే ప్రమాదముంది. ఈ మొక్కలు పశుగ్రాస పంటలకు కూడా నష్టం కలిగిస్తాయి. ఈ మొక్క ల్ని నిర్మూలించాలంటే రైతులు తప్పనిసరిగా సమగ్ర యాజమాన్య, సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. ఇలా తొలగించాలి వయ్యారిభామ మొక్కలు తక్కువ సంఖ్యలో ఉంటే చేతితో పీకేయాలి. మొక్కలు పూతదశకు రాక ముందే పీకి తగలబెట్టాలి. లేకపోతే వాటి వ్యాప్తిని నివారించడం కష్టం. ఒకవేళ పూత దశకు చేరుకున్న తర్వాత మొక్కలను పీకినట్లయితే వాటిని వెంటనే కుప్పగా వేసి తగలబెట్టాలి. రసాయనాలతో.. మొక్కజొన్న, జొన్న, చిరుధాన్యాల పంటల్లో విత్తనాలు మొలక రాకముందు లీటరు నీటికి 4 గ్రాముల చొప్పున అట్రాజిన్ కలిపి పిచికారీ చేస్తే వయ్యారిభామ మొక్కల బెడద ఉండదు. విత్తనాలు మొలకెత్తిన 15–20 రోజులకు లీటరు నీటికి 2 ఎంఎల్ పేరాక్వాట్ మందును కలిపి పిచికారీ చేసుకోవచ్చు. పశుగ్రాసం వేసేవారు పైరు వేయకముందే లీటరు నీటికి 5 గ్రాముల చొప్పున అట్రాజిన్ కలిపి పిచికారీ చేయాలి. ఈ కలుపు మొక్కతో పంటకు నష్టం, జీవరాశికీ ప్రమాదమే పూతకు ముందే తొలగించాలి కంపోస్ట్ తయారీ చేయవచ్చు వయ్యారిభామ మొక్కలు ఎంతో హానికరమైనప్పటికీ వాటిని ఉపయోగించి కంపోస్ట్ తయారు చేసుకోవచ్చు. ఇందుకు నీరు నిలవని చోట 3 మీటర్ల లోతు, 6 మీటర్ల వెడల్పు, 10 మీటర్ల పొడవు ఉండేలా గుంత తవ్వాలి. ఇందులో 50 కిలోల వయ్యారిభామ మొక్కలను వేసి, వాటిపై 5 కిలోల యూరియా, 50 గ్రాముల ట్రైకోడెర్మావిరిడి కూడా చల్లాలి. ఈ విధంగా పొరలు, పొరలుగా గుంతను డోము ఆకారంలో నింపుకోవాలి. పొరల పైన పేడ, మట్టి, ఊక మిశ్రమాన్ని వేసి కప్పేయాలి. నాలుగైదు నెలల్లో కంపోస్ట్ తయారవుతుంది. దానిని జల్లెడ పట్టి పంటకు వేసుకోవాలి. ఈ కంపోస్టులో నత్రజని, భాస్వరం, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం పోషకాలు అధికంగా ఉంటాయి. ఇలా తక్కువ ఖర్చుతో తయారు చేసుకుని అన్ని పంటలకు వేసుకోవచ్చు. – షేక్ అబ్దుల్ రహీమ్, యలమంచిలి మండల వ్యవసాయాధికారి -
నల్ల అద్దాలపై నిర్లక్ష్యమేల?
తణుకు అర్బన్ : నల్ల అద్దాలు కలిగిన కార్లు రోడ్లపై చక్కర్లు కొడుతున్నా రవాణా శాఖ, పోలీసు అధికారులు చోద్యం చూస్తుండడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. నల్ల అద్దాలు కలిగి ఉన్న కార్లలో అసాంఘిక కార్యకలాపాలు.. మద్యం అక్రమ రవాణా.. పిల్లల కిడ్నాప్లు.. సంఘ విద్రోహశక్తుల కదలికలను గుర్తించేందుకు వీలు పడదు. దీంతో ఈ తరహా అద్దాలను వాడకూడదని సుమారుగా పదేళ్ల క్రితమే ఉన్నత న్యాయస్థానం ఆదేశాలివ్వడంతో అప్పట్లో రవాణా శాఖ, పోలీసు శాఖల ఆధ్వర్యంలో ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. కార్లకు ఉన్న నల్ల అద్దాలు, నల్ల ఫిల్మ్లను తొలగింపజేశారు. కానీ ఇటీవల రహదారులపై తిరుగుతున్న కార్లు, ట్యాక్సీల్లో 30 శాతంపైగా నల్ల అద్దాలు, నల్ల ఫిల్మ్ ఏర్పాటుచేసుకుని లోపల ఉన్నవారు బయటకు కనిపించకూడదనే ఉద్ధేశ్యంతో హల్చల్ చేస్తున్నారు. మోటారు వెహికల్ యాక్ట్ 1989/100, సీఆర్పీసీ 188 ప్రకారం నలుపు రంగు ఫిల్మ్ వాడకూడదనే నిబంధనలు ఉన్నాయి. ఒకవేళ వేసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నా బయటవారికి 70 శాతం విజిబులిటీ ఉండేలా ఏర్పాటుచేసుకోవాలని రవాణా శాఖ అధికారులు చెబుతున్నారు. నల్ల అద్దాలతో యథేచ్ఛగా తిరుగుతున్న కార్లు ప్రస్తుతం జిల్లాలో తిరుగుతున్న సుమారు లక్షన్నరకుపైగా ఉన్న కార్లలో 30 శాతం కార్లకు నల్ల అద్దాలతో తిరుగుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. మద్యం అక్రమ రవాణాలో కార్లకు నూరు శాతం నల్ల రంగు అద్దాలతో కార్లు తిరుగుతున్న పరిస్థితులు నేడు కనిపిస్తున్నాయి. గతనెలలో యానాం నుంచి వస్తున్న కారులో తణుకు ఎకై ్సజ్ శాఖ అధికారులు అక్రమ మద్యాన్ని గుర్తించి పట్టుకున్న ఘటనలో సదరు కారుకు పూర్తిస్థాయిలో నల్ల అద్దాలను ఏర్పాటు చేసుకున్నారు. ప్రస్తుతం కారు తణుకు ఎక్సైజ్ శాఖ కార్యాలయం ముందే సీజ్ చేయబడి ఉంది. రహదారుల్లో ప్రయాణించే కార్లలో ఉన్న వారు రోడ్డుపై ప్రయాణించే వారికి పూర్తిగా బహిర్గతం కావాలని న్యాయస్థానం ఇచ్చిన నిషేదాజ్ఞలు కొందరు కార్ల యజమానులు పట్టించుకోకుండా యథేచ్ఛగా అదే కార్లలో తిరుగుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. అసాంఘిక కార్యకలాపాలే కాకుండా కార్లలో చిన్నారులు ఆడుకుంటూ డోర్ లాక్ అయిపోయి లోపల ఇరుక్కుని ప్రాణాలు వదలిన ఘటనలు ఇటీవల చోటుచేసుకున్నాయి. యథేచ్ఛగా తిరుగుతున్న నల్ల అద్దాల కార్లు అసాంఘిక కార్యకలాపాలకు అవకాశం ఉండే ప్రమాదం అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు అమలు కాని వైనం చర్యలు తీసుకోవాలంటున్న ప్రజానీకం జెడ్ ప్లస్కు ఓకే ప్రముఖుల భద్రతా ప్రమాణాల్లో భాగంగా జెడ్ప్లస్ కేటగిరీలో ఉన్న వారికి మాత్రమే బ్లాక్ ఫిల్మ్ వినియోగించుకునే వెసులుబాటును న్యాయస్థానం కల్పించింది. చివరకు మంత్రులు, ఎంపీలు, ప్రముఖులు, వ్యాపారవేత్తలు సైతం బ్లాక్ ఫిల్మ్లేని వాహనాలనే వినియోగించాలనే నిబంధనలు సైతం రవాణా శాఖ నియమావళిలో పొందుపరిచారు. తప్పనిసరి పరిస్థితుల్లో గోప్యంగా ప్రయాణం చేయాల్సి ఉన్న పరిస్థితుల్లో రాష్ట్ర హోం సెక్రటరీ ఆధ్వర్యంలో డీజీపీతోపాటు ఇతర ప్రముఖ అధికారులతో కూడిన కమిటీకి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. తుది నిర్ణయం ఆ కమిటీలో ఉన్న వ్యక్తులపై ఆధారపడి ఉంది.నిబంధనలు మీరితే చర్యలు తప్పవు కార్లకు ఉండే నల్ల అద్దాల విషయంలో కారులో ఉన్న వారిని బయటనుంచి చూసేవారికి 70 శాతం కనిపించే విధంగా ఏర్పాటుచేసుకోవాలి. నిబంధనలు మీరి వంద శాతం నల్ల అద్దాలు కలిగి ఉన్న వాహనాలకు రూ. వెయ్యి జరిమానా విధించి నల్ల అద్దాలు, నల్ల ఫిల్మ్ను తొలగింపజేస్తాం. నిబంధనలు పాటించకుండా రహదారులపై తిరిగే కార్లపై రానున్న రోజుల్లో స్పెషల్ డ్రైవ్ల ద్వారా చర్యలు తీసుకుంటాం. – ఎస్. శ్రీనివాస్, తణుకు మోటారు వెహికల్ ఇనస్పెక్టర్ -
మద్ది క్షేత్రానికి పోటెత్తిన భక్తులు
జంగారెడ్డిగూడెం: గురవాయిగూడెం మద్ది ఆంజనేయస్వామివారికి ఆలయ అర్చకులు ప్రభాతసేవ, నిత్యార్చన పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారు ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనం ఇచ్చారు. స్వామివారికి ప్రీతికరమైన మంగళవారం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో బారులుదీరి స్వామివారిని దర్శించి, 108 ప్రదక్షిణలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. మధ్యాహ్నం వరకు దేవస్థానానికి వివిధ సేవలు, విరాళాల ద్వారా రూ.1,75,143 సమకూరినట్లు ఈవో ఆర్వీ చందన తెలిపారు. సుమారు 1400 మంది భక్తులకు నిత్యాన్నదాన సత్రం నందు అన్నప్రసాద వితరణ చేసినట్లు చెప్పారు. ఆలయం వద్ద బొర్రంపాలెం ప్రాథమిక ఆరోగ్యకేంద్రం సిబ్బంది వైద్య శిబిరం నిర్వహించారు. తాడేపల్లిగూడెంలో చోరీ తాడేపల్లిగూడెం అర్బన్ : పట్టణంలోని ఝాన్సీరాణి ఆస్పత్రి సమీపంలో చోరీ జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు తాళం పగలగొట్టి ఇంట్లోకి చొరబడి రూ.7 లక్షల విలువైన బంగారం, వెండి ఆభరణాలు అపహరించారు. వివరాల ప్రకారం సుబ్బారావు పేటలో ఉంటున్న బల్ల వేణువర్మ, లలిత గత నెల 24వ తేదీన తిరుమల తిరుపతి వెళ్లి మంగళవారం వచ్చారు. ఇంటికి వచ్చి చూడగా తాళం పగులగొట్టి ఉండడం, ఇంటిలోని వస్తువులు చిందర వందరగా పడి ఉండడంతోపాటు బీరువాలో దాచిన ఆరు కాసుల బంగారు నగలు, కిలో వెండి సామగ్రి కనిపించలేదు. దీంతో బాధితురాలు బల్ల లలిత స్థానిక పట్టణ పోలీస్స్టేసన్లో ఫిర్యాదు చేయగా ఎసై నాగరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యం నరసాపురం: పట్టణ పరిధిలోని నరసాపురం–నిడదవోలు ప్రధాన పంట కాలువలో మంగళవారం సాయంత్రం గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. పంటకాలువలో మహిళ మృతదేహం ఉన్నట్టుగా స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో టౌన్ సీఐ బి.చాదగిరి, ఎస్సై జయలక్ష్మి అక్కడికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీయించారు. మృతురాలి వయస్సు సుమారు 53 సంవత్సరాలు ఉంటుందని సీఐ వివరించారు. పోస్టుమార్టం నిమిత్తం మహిళ మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రకి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ వివరించారు. -
ఆయిల్పామ్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ విరమించుకోవాలి
పెదవేగి: పెదవేగిలో ఏపీ ఆయిల్ ఫెడ్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఆయిల్పామ్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ ఆలోచన విరమించుకోవాలని దెందులూరు మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. కోకో రైతుల ఇబ్బందులను సోమవారం కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో ఎన్ని అమలు చేశారో గమనించాలన్నారు. లాభాల్లో ఉన్న పెదవేగి పామాయిల్ ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేయాలన్న కూటమి ప్రభుత్వ ఆలోచన సరైంది కాదని హెచ్చరించారు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని, దెందులూరు నియోజకరవ్గంలో రైతన్నల పరిస్థితి దారుణంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. 30 ఏళ్ల క్రితం ప్రభుత్వం పామాయిల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసిందని, ఉమ్మడి రాష్ట్రంలో ఏకై క ఫ్యాక్టరీ పెదవేగి అని అన్నారు. ఈ పంటపై ఆధారపడి 11 వేల మంది రైతులు దెందులూరు నియోజకవర్గంలో ఉన్నారని, ప్రస్తుతం రూ.10 నుంచి రూ.15 కోట్ల లాభాల్లో ఉందన్నారు. పెదవేగి ఫ్యాక్టరీని ప్రైవేటీకరిస్తే దాని మీద ఆధారపడిన రైతుల పరిస్థితి ఏంటని నిలదీశారు. రైతులను అన్ని విధాలుగా నష్టపరుస్తున్నామని దుయ్యబట్టారు. అప్పటి వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఫ్యాక్టరీని రూ.80 కోట్లతో ఆధునికీరించిందన్నారు. ధాన్యం డబ్బులు ఎప్పుడిస్తారు? ప్రతి రైతు ఇంటి దగ్గర కోకో గింజల నిల్వలతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారని, ఇంటర్నేషల్ మార్కెట్ లో కోకో రూ.1000 ధర ఉంటే, ఇక్కడ మాత్రం రూ.450 మాత్రమే ఇవ్వడమేంటని ప్రశ్నించారు. ధాన్యం డబ్బులు ఇంకా ఇవ్వలేదని వెంటనే రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వంలో ఏ పంటకు మద్దతు ధర దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ జిల్లా నాయకులు, దెందులూరు నియోజకవర్గ నాలుగు మండలాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
ఫిర్యాదులకు శాశ్వత పరిష్కారం చూపాలి
భీమవరం: ప్రజా సమస్యల పరిష్కార వేదికకు అందే ఫిర్యాదులకు చట్టపరిధిలో శాశ్వత పరిష్కారం చూపాలని జిల్లా అడిషినల్ ఎస్పీ వి.భీమారావు అన్నారు. సోమవారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదులను స్వీకరించిన అనంతరం సంబంధిత పోలీసు స్టేషన్ అధికారులతో ఫోన్లో మాట్లాడారు. ఈ సందర్భంగా 11 అర్జీలు స్వీకరించారు. వీటిలో వేధింపులు, భూ–ఆస్తి వివాదాలు, నకిలీ పత్రాలు, అధిక వడ్డీలు వంటివి ఉన్నాయి. డీఎస్సీ పరీక్షకు 96 శాతం హాజరు భీమవరం: జిల్లాలో సోమవారం నిర్వహించిన మెగా డీఎస్సీ పరీక్షకు 96 శాతం అభ్యర్థులు హాజరయ్యారని జిల్లా విద్యాశాఖాధికారి ఇ.నారాయణ చెప్పారు. మూడు పరీక్షా కేంద్రాల్లో మధ్యాహ్నం నిర్వహించిన పరీక్షకు 360 మందికి 347 మంది హాజరయ్యారన్నారు. ఎక్కడా మాల్ప్రాక్టీస్ కేసులు నమోదుకాలేదని తెలిపారు. పీజీ సెట్లో 3వ ర్యాంకు గణపవరం: రాష్ట్ర ఉన్నత విద్యామండలి నిర్వహించిన పీజీ సెట్ ఫలితాలలో గణపవరం ప్రభుత్వ డిగ్రీ కాలేజి విద్యార్థులు మంచి ర్యాంకులు సాధించినట్లు ప్రిన్సిపల్ నిర్మలకుమారి తెలిపారు. జువాలజీలో కె.కృష్ణప్రియ రాష్ట్ర స్థాయిలో 3వర్యాంకు సాధించినట్లు తెలిపారు. ఆమెతో పాటు మరో 8 మంది వెయ్యిలోపు ర్యాంకులు సాధించారన్నారు. రూపశ్రీ బోటనీలో 22వ ర్యాంకు, ఎస్.సంధ్యారాణి 70వ ర్యాంకు, కె.బాహ్యలహరి 74వ ర్యాంకు సాధించారని, కెమిస్ట్రీలో బేబీ శిరీష 96వ ర్యాంకు సాధించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా వెయ్యిలోపు ర్యాంకులు సాధించిన విద్యార్థులను ప్రిన్సిపల్, అధ్యాపకులు సోమవారం అభినందించారు. వైఎస్సార్సీపీ అనుబంధ విభాగాల్లో నియామకాలు పెదవేగి: వైఎస్సార్సీపీ నేతలకు కార్యకర్తలకు అన్ని విధాలుగా అండగా ఉండి ఆదుకుంటామని సీనియర్ న్యాయవాదులు అల్తి శ్రీనివాస్, బైగాని రంగరావులు అన్నారు. వైఎస్సార్సీపీ ఏలూరు జిల్లా లీగల్ సెల్ అధ్యక్షుడిగా భీమడోలుకు చెందిన అల్తి శ్రీనివాస్, జనరల్ సెక్రటరీగా పెదవేగి మండలం విజయరాయికి గ్రామానికి చెందిన బైగాని రంగారావు నియమితులయ్యారు. రాష్ట్ర లీగల్ సెల్ అధ్యక్షుడు ఎం.మనోహర్రెడ్డి వీరిని నియమించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న రెడ్బుక్ రాజ్యాంగాన్ని ఖండించారు. రానున్న రోజుల్లో ఎలాంటి సమస్య వచ్చినా సమాచారం అందిస్తే అండగా నిలుస్తామని భరోసా కల్పించారు. గిరి ప్రదక్షిణకు ప్రత్యేక బస్సులు ఏలూరు (ఆర్ఆర్పేట): గురు పౌర్ణమి పర్వదినం సందర్భంగా ఏలూరు జిల్లాలోని అన్ని డిపోల నుంచి అరుణాచలం గిరి ప్రదక్షిణకు ప్రత్యేక బస్సు సౌకర్యం ఏర్పాటు చేసినట్టు జిల్లా ప్రజా రవాణా అధికారి షేక్ షబ్నం ఒక ప్రకటనలో తెలిపారు. ఏలూరు, జంగారెడ్డిగూడెం, నూజివీడు డిపోల నుంచి బస్సులు అందుబాటులో ఉంటాయన్నారు. జూలై 8న సాయంత్రం 6 గంటలకు బస్సులు బయలుదేరి 9న శ్రీకాళహస్తి, కాణిపాకం, శ్రీపురం దర్శనం అనంతరం ఆ రోజు రాత్రికి అరుణాచలం చేరుకుంటాయన్నారు. 10వ తేదీ ఉదయం గిరి ప్రదక్షిణ అనంతరం కంచిలోని కామాక్షి అమ్మవారి దర్శనం చేసుకుని తిరిగి గమ్యస్థానాలకు సర్వీసులు బయలుదేరుతాయన్నారు. టిక్కెట్ రూ.3 వేలుగా నిర్ణయించామని తెలిపారు. మిగిలిన ఖర్చులు ప్రయాణికులు భరించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఆషాడ, శ్రావణ మాసాల్లో ప్రతి ఆదివారం అమ్మవార్ల దర్శనానికి ప్రత్యేక టూర్ ప్యాకేజీ ఏర్పాటు చేశామని, ఈ బస్సులు మూడు డిపోల నుంచి తెల్లవారు జామున 4 గంటలకు బయలుదేరి దర్శనానంతరం గమ్యస్థానానికి చేరుకోవచ్చునన్నారు. టిక్కెట్లు కావాల్సినవారు ఏలూరు 93467 67670, రిజర్వేషన్ కౌంటర్ 63038 59484, జంగారెడ్డిగూడెం 9194929 49350, నూజివీడు 73829 01757 నెంబర్లలో సంప్రదించవచ్చన్నారు. -
అలసత్వాన్ని సహించేది లేదు
భీమవరం(ప్రకాశం చౌక్): పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారంలో అలసత్వం సహించేది లేదని కలెక్టర్ సి.నాగరాణి అధికారులను హెచ్చరించారు. సోమవారరం కలెక్టరేట్లో నిర్వహించిన జిల్లా స్థాయి పీజీఆర్ఎస్లో ఆమె పాల్గొని ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. అనంతరం మాట్లాడుతూ అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలన్నారు. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీపసుకుంటామన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ టి.రాహూల్కుమార్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆరవల్లి ఘటనపై వినతులు అత్తిలి మండలం ఆరవల్లి గ్రామంలో ఇటీవల మాలలు, మాదిగల మధ్య జరిగిన గొడవలపై సోమవారం మాలలు, మాదిగలు వారి సంఘాల నాయకులతో వచ్చి కలెక్టర్కు వినతి పత్రాలు అందజేశారు. ధాన్యం డబ్బులు చెల్లించాలి : మూడు నెలలు దాటినా రైతులకు కూటమి ప్రభుత్వం ధాన్యం డబ్బులు చెల్లించకపోవడంపై సోమవారం కలెక్టరేట్ వద్ద ఆంధ్రప్రదేశ్ రైతు, కౌలు రైతు సంఘాల ఆధ్వర్యంలో రైతులు ధర్నా నిర్వహించారు. నెలలు గడుస్తున్నా డబ్బులు చెల్లించకపోవడం సిగ్గు చేటన్నారు. ర్యాలీగా వెళ్లి కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. తమ బడి తమకు కావాలంటూ పెనుమంట్ర మండలం బ్రాహ్మణచెర్వు వెలమపేట విద్యార్థులు తల్లిదండ్రులతో కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపారు. పాఠశాలను గ్రామంలో మరో పాఠశాలలో విలీనం చేశారని, దాంతో ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు అక్కడి వరకూ వెళ్లి చదువుకోడానికి ఇబ్బంది పడుతున్నారన్నారు. పంచాయతీరాజ్ సమస్యలపై వినతిపత్రం పంచాయతీరాజ్లోని సమస్యలు, సర్పంచ్లు, ఎంపీటీసీల సమస్యలపై వైఎస్సార్సీపీ పంచాయతీరాజ్ విభాగం నాయకులు, పార్టీ నాయకులు సోమవారం కలెక్టరేట్కు వచ్చి వినతి పత్రం అందజేశారు. వైఎస్సార్సీపీ పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తన్నేడి గిరి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో పంచాయతీల్లో అనేక సమస్యలు ఉన్నాయన్నారు. 15 ఆర్థిక సంఘం నిధులు మళ్లీంచి పంచాయతీల అభివృద్ధి కుంటిపడేలా చేశారన్నారు. అఖరికి సర్పంచ్లు, ఎంపీటీలకు వేతనాలు కూడా చెల్లిచడం లేదన్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పాలనలో పంచాయతీ అభివృద్ధి కోసం సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చారన్నారు. ఆయన పాలనలో పంచాయతీల అభివృద్ధి కోసం ప్రవేశపెట్టి కార్యక్రమాలను పక్కన పెట్టారన్నారు. కలెక్టర్గా ఏడాది పూర్తి పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్గా చదలవాడ నాగరాణి ఏడాది పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా అధికారులు శుభాకాంక్షలు తెలిపారు. జాయింట్ కలెక్టర్, పలువురు జిల్లా అధికారులు మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు పేదలకు అందేలా కలెక్టర్ నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. -
పల్లెల్లో పడకేసిన పారిశుద్ధ్యం
భీమవరం(ప్రకాశం చౌక్): పల్లెల్లో పారిశుద్ధ్యం పడకేసింది. భారీ వర్షాలకు డ్రెయినేజీ వ్యవస్థ అధ్వానంగా మారింది. కనీసం కచ్చడ్రైయిన్లు కూడా లేకపోవడంతో మురుగునీరు రోడ్లపై పారుతోంది. కొన్ని గ్రామాలల్లో డ్రెయినేజీల్లో పూడిక తీయక గడ్డి, పిచ్చి మొక్కలు పెరిగిపోయాయి. దీంతో మురుగునీరు వెళ్లే దారిలేక రోడ్లపైకి వస్తోంది. దోమల వృద్ధి చెందడంతో ప్రజలు రోగాల పాలువుతున్నారు. మలేరియా, టైఫాయిడ్ వంటి విష జ్వరాలు వ్యాపించే ప్రమాదం పొంచి ఉంది. జిల్లాలో మొత్తం 409 గ్రామ పంచాయతీలు ఉండగా.. ఎక్కువ శాతం పంచాయతీల్లో ఇదే పరిస్థితి. పట్టించుకోని పంచాయతీ సెక్రటరీలు పంచాయతీ సెక్రటరీలు కూడా ఎలాంటి చర్యలూ చేపట్టడం లేదు. ఎవరైనా ఫిర్యాదు చేస్తే అప్పుడు స్పందిస్తున్నారు. గ్రామం మొత్తం డ్రెయిన్లు బాగుచేయించడం లేదు. వర్షాకాలం రాక ముందే గ్రామాల్లోని డ్రెయిన్లు బాగు చేయించాలి. కనీసం కచ్చా కచ్చా డ్రెయిన్లు తవ్వించాలి. ఏ పంచాయతీలోనూ వీటిపై దృష్టిపెట్టడం లేదు. దాంతో మురుగునీరు రోడ్డుపైకి వచ్చి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని పంచాయతీల్లో ఈ సమస్య తీవ్రంగా ఉంది. కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ ఏడాదిలో గ్రామాల్లో బ్లీచింగ్, దోమల నివారణకు చర్యలు లేవు. కొన్ని గ్రామాల్లో చెత్త నుంచి సంపద సృష్టించే కేంద్రాల నిర్వహణ సక్రమంగా ఉండకపోవడంతో చెత్తను రోడ్లు, కాలువ గట్లపై డంప్ చేస్తున్నారు. వర్షాకాలంలో తాగునీటి క్లోరినేషన్ మాత్రమే చేయిస్తున్నారు. మండల స్థాయి అధికారులు రోజుకు ఒక గ్రామంలో తిరుగుతూ మంచి నీటి ట్యాంకుల శుభ్రం, క్లోరినేషన్ చేయించి చేతులు కడుక్కుంటున్నారు. అధ్వానంగా డ్రెయినేజీ వ్యవస్థ వర్షాలకు రోడ్లపైకి మురుగునీరు చర్యలు తీసుకుంటాం గ్రామ పంచాయతీల్లో పారిశుద్ధ్యం మెరుగుకు చర్యలు తీసుకుంటాం. డ్రెయినేజి వ్యవస్థ అభివృద్ధికి చర్యలు చేపడతాం. నీరు నిల్వ ఉండకుండా కచ్చా డ్రెయిన్లు తవ్విస్తాం. బ్లీచింగ్ చల్లించడంతో పాటు ఆరోగ్య శాఖ అధికారులతో సమన్వయం చేసుకుంటూ దోమల నివారణ మందులు పిచికారీ చేయిస్తాం. – ఎన్.రామనాథ్రెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి -
ప్రజలకు ఏం చెప్పాలి?
పోరు ఉద్ధృతం ఉద్యోగ భద్రత కోసం మునిసిపల్ ఇంజనీరింగ్, అవుట్ సోర్సింగ్ కార్మికుల పోరు ఉద్ధృతంగా సాగుతోంది. తమను పర్మినెంట్ చేయాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. 8లో uఅన్నదాత గోడు పట్టదా? మంగళవారం శ్రీ 1 శ్రీ జూలై శ్రీ 2025సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఎన్నికల్లో లెక్కకు మించి హామీలిచ్చాం.. ఏడాది కాలంలో చేసిందేమీ లేదు.. సుపరిపాలన అంటూ ఇప్పుడు ప్రజల వద్దకు వెళ్లి ఏం చెప్పాలి? ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పగలమా? ఇలాంటి పరిస్ధితుల్లో సుపరిపాలన పేరుతో ఇంటింటికి వెళితే అభాసుపాలవుతామని కూటమి ప్రజాప్రతినిధుల్లో అంతర్మథనం మొదలైంది. పొగాకు రైతులు మొదలుకొని మామిడి రైతుల వరకు, ఆక్వా ఇలా అన్ని రంగాలు పూర్తి నష్టాల బాటలో ఉంటే ప్రభుత్వం ఏం చేయలేకపోయిందనే భావన ప్రజల్లో ఉందని, ప్రతి నియోజకవర్గంలో రూ.10 కోట్లతో చేసిన అభివృద్ధి ఇది అని చెప్పుకోవడానికి ఏం లేదంటూ అధికార పార్టీల నేతల్లో తీవ్ర చర్చ సాగుతోంది. ఈ తరుణంలో బుధవారం నుంచి సుపరిపాలన పేరుతో ఇంటింటికి వెళ్లేలా షెడ్యూల్ ఖరారైంది. ఎన్నికల సమయంలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఆయన తనయుడు లోకేష్ లెక్కకు మించి హామీలిచ్చినా ఒక్కదానిపైన కూడా దృష్టి సారించకపోవడంతో సర్వత్రా విమర్శలతో పాటు ప్రజల్లో అసంతృప్తి పెరిగిపోతుంది. ఈ తరుణంలో ఇంటింటికి టీడీపీ అనే కార్యక్రమం ఇబ్బందికరమనే వాదన టీడీపీ నేతల్లో వ్యక్తమవుతోంది. ఊసేలేని కీలక హామీలు ఎన్నికల సమయంలో అధికారంలోకి రాగానే చింతలపూడి ఎత్తిపోతల పథకం పనులు ప్రారంభిస్తామని ప్రకటించారు. ఏడాది దాటినా తొలి అడుగు పడలేదు. మళ్లీ దాన్ని రూ.3700 కోట్లకు ప్రాజెక్టును ఖరారు చేస్తున్నట్లు రూ.1780 కోట్లు బడ్జెట్లో కేటాయిస్తామని 2026 మార్చికల్లా పూర్తి చేస్తామని ప్రకటించారు. మరో 8 నెలల సమయం ఉన్నప్పటికీ కనీసం ప్రాజెక్టు పనులపై క్షేత్రస్థాయిలో సమావేశం కూడా జరగలేదు. గతేడాది వరదల సమయంలో ముఖ్యమంత్రి ఏలూరులో పర్యటించి శనివారపుపేట కాజ్వేను రూ.15 కోట్లతో నిర్మిస్తామని ప్రకటించారు. ఇంతవరకూ దాని ఊసే లేకపోవడం గమనార్హం. క్రాప్ హాలిడేపై రాజకీయ ఒత్తిడి ఉమ్మడి జిల్లాలో 2.52 లక్షల ఎకరాల్లో ఆక్వా చెరువులు ఉన్నాయి. రొయ్య ధర పతనం కావడం, ఇతర సమస్యలతో నర్సాపురం, ఆచంట, పాలకొల్లు మూడు నియోజకవర్గాల పరిధిలో 55 వేల ఎకరాల్లో క్రాప్ హాలిడే ప్రకటించారు. రాష్ట్ర స్థాయిలో చర్చనీయాంశంగా మారడంతో రాజకీయ ఒత్తిడితో క్రాప్ హాలిడేను తెరమరుగు చేస్తున్నారు. నర్సాపురంలో ప్రతిష్టాత్మకమైన ఫిషరీస్ యూనివర్శిటీకి కూటమి పాలనలో గ్రహణం పట్టించారు. గత ప్రభుత్వం 40 ఎకరాల స్ధలాన్ని కేటాయించి రూ.100 కోట్ల నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభించింది. కొంతమేరకు పూర్తి చేసి తరగుతులు కూడా ప్రారంభించింది. కూటమి ప్రభుత్వం పూర్తిగా విస్మరించడంతో గత్యంతరం లేని పరిస్ధితుల్లో రైతుభరోసా కేంద్రాల్లో ఫిషరీస్ యూనివర్శిటీ విద్యార్థులు తరగతులకు హాజరవుతున్నారు. రేపు ప్రత్యేక పూజలు జంగారెడ్డిగూడెం: గుర్వాయిగూడెం అయ్యప్ప స్వామికి ఈ నెల 2న స్వామి వారి జన్మ నక్షత్రం ఉత్తరా నక్షత్రం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.సంక్రాంతి నాటికి రోడ్లు ఎక్కడ? జిల్లాలో రోడ్లను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తాం. చిన్నపాటి గుంతలు, మరమ్మతులకు ఆస్కారమే లేకుండా అన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతామని హడావుడి చేసి నవంబరులో టెండర్లు పిలుస్తున్నామని చెప్పారు. ఈ ఏడాది సంక్రాంతి కల్లా చిన్న సమస్య కూడా ఉండదని ప్రకటించారు. దాదాపు రూ.100 కోట్లకుపైగా పనులు గుర్తించినట్లు ప్రకటించారు. ఏ ఒక్కటీ పూర్తి కాకపోగా రోడ్లు మరింత అధ్వానంగా మారాయి. ప్రధానంగా ఏజెన్సీ ఏరియా రహదారులైతే అత్యంత దారుణంగా ఉన్నాయి. ఏజెన్సీలోని రేగులపాడు నుంచి రేపల్లి వరకు, పులిరామన్నగూడెం నుంచి గోగుమిల్లి వరకు, అలివేలు డ్యాం నుంచి అలివేలు వరకు ఇలా ప్రధాన రహదారులు అత్యంత దారుణంగా ఉన్నాయి. తడికలపూడి– జంగారెడ్డిగూడెం, శ్రీనివాసపురం– ములకలంపాడు, వీరవాసరం నుంచి బ్రాహ్మణచెరువు, పాలకోడేరు నుంచి అత్తిలి, భీమవరం– వెంప రహదారులది ఇదే పరిస్ధితి. ఏజెన్సీలో ఉన్న జాతీయ రహదారి, భీమడోలు నుంచి తణుకు జాతీయ రహదారిపై అనేక ప్రాంతాల్లో మరమ్మత్తులు చేయాల్సి ఉంది. ఈ నెల 15న నారాయణపురం వంతెనకు భారీ రంధ్రం పడి రాకపోకలు నిలిచిపోయాయి. న్యూస్రీల్ జిల్లాలో ఏడాదిగా ముందుకు పడని ప్రగతి గిట్టుబాటు ధర లేక అన్నదాతల ఆక్రందన ప్రతి నియోజకవర్గంలోనూ అధ్వాన్నంగా రహదారులు సుపరిపాలన అంటూ ప్రజల వద్దకు ఎలా వెళ్లాలి? టీడీపీ ఎమ్మెల్యేల్లో తీవ్ర అంతర్మథనం వ్యవసాయ ఆధారిత జిల్లాలో గత ఏడాది కాలంలో రైతులు పూర్తిగా నష్టపోయారు. 52 వేల ఎకరాల్లో విస్తరించి ఉన్న మామిడికి టన్ను రూ.80 వేల నుంచి రూ.లక్ష పలకాలి. అయితే రూ.8 వేల నుంచి రూ.10 వేలకు పతనమైంది. ప్రభుత్వ సబ్సిడీ లేకపోవడం, అనుబంధ పరిశ్రమలు లేక వేలాది మంది మామిడి రైతులు రోడ్డునపడే పరిస్థితి. గతంలో రూ.1140 పలికిన కిలో కోకో ఇప్పుడు రూ.400కు చేరింది. రాష్ట్రంలోనే ఏ జిల్లాలోని లేని విధంగా కోకో అత్యధిక సాగు ఏలూరు జిల్లాలో ఉంది. 36,150 ఎకరాల్లో కోకో సాగు చేసి ఏటా 12 వేల మెట్రిక్ టన్నుల దిగుబడి సాగిస్తున్నారు. ధరలు పతనం కావడంతో నెలలు తరబడి ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం లేదు. ఆయిల్ఫామ్ రైతులదీ ఇదే పరిస్థితి. టన్నుకు రూ.2 వేల వరకూ ధర పతనమైనా ప్రభుత్వం స్పందించని పరిస్ధితి. పొగాకు రైతులు కూడా గిట్టుబాటు ధర లేక తీవ్రంగా నష్టపోయారు. -
ఆటో అదృశ్యంపై కేసు నమోదు
భీమవరం: ఆటో అదృశ్యంపై భీమవరం వన్టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. వారు తెలిపిన వివరాల ప్రకారం భీమవరం పట్టణం చినఅప్పారావు తోటకు చెందిన చెన్ను సత్యనారాయణ ఆటోను ఫైనాన్స్లో తీసుకుని సుంకరపద్దయ్య వీధికి చెందిన బోడపాటి నానిబాబుకు అద్దెకు ఇచ్చేవాడు. ప్రతి రోజు నానిబాబు రాత్రిపూట సత్యనారాయణ ఇంటి వద్దనే ఆటోను పార్కింగ్ చేస్తుండగా గతేడాది నవంబర్ 15వ తేదీన ఆటో కనిపించలేదు. దానిపై సత్యనారాయణ నానిబాబును ప్రశ్నించగా తనకు తెలియదని చెప్పాడు. దీంతో సత్యనారాయణ సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. త్వరితగతిన కేసుల పరిష్కారానికి కృషి ఏలూరు (టూటౌన్): ఫ్రీ లీగల్ ఎయిడ్ ద్వారా అందించే కేసుల త్వరితగతిన పరిష్కారానికి ప్యానల్ న్యాయవాదులు కృషి చేయాలని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.రత్నప్రసాద్ సూచించారు. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ అమరావతి వారి ఆదేశాల మేరకు ఆయన సోమవారం స్థానిక జిల్లా న్యాయ సేవాధికార సంస్థ భవనంలో ప్యానల్ న్యాయవాదులతో వర్క్ రివ్యూ నిర్వహించారు. కక్షిదారులకు ఉచితంగా వాదించే కేసులు పై ఆరా తీశారు. జూలై 5న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్లో కేసుల పరిష్కారానికి న్యాయవాదులు కక్షిదారులకు కౌన్సెలింగ్ నిర్వహించి, కేసుల పరిష్కారాన్ని కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ పీఎన్వీ మునేశ్వర ప్యానెల్ న్యాయవాదులు పాల్గొన్నారు. -
లారీ ఢీకొని మోటార్సైక్లిస్టు మృతి
పాలకోడేరు: లారీ ఢీకొని మోటార్సైకిల్పై వెళుతున్న వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. ఈ ఘటన గొల్లలకోడేరులో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. పాలకోడేరు తూర్పు పేటకు చెందిన ఆవాల వెంకటేశ్వరరావు (40) మోటార్సైకిల్పై గొల్లలకోడేరు వెళ్లి తిరిగి వస్తుండగా గొల్లలకోడేరు బ్రిడ్జి దాటిన వెంటనే ఎదురుగా టిప్పర్ లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో వెంకటేశ్వరరావు తలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే 108కి సమాచారం అందించగా భీమవరం నుంచి వచ్చిన 108 అత్యవసర వాహన సిబ్బంది పరిశీలించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. వెంకటేశ్వరరావు భార్య దేవి ఆశా కార్యకర్తగా పనిచేస్తున్నట్లు స్థానికులు తెలిపారు. వెంకటేశ్వరరావుకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.చికిత్స పొందుతూ మహిళ మృతిఏలూరు టౌన్: ఒంటికి నిప్పంటించుకొని ఆత్మహత్యయత్నానికి పాల్పడిన మహిళ విజయవాడ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది. వివరాల ప్రకారం ఏలూరు బీడీకాలనీకి చెందిన లావేటి సోమేశ్వరరావు, మోహనమ్మకు 2024 ఆగస్టులో వివాహమైంది. కొంతకాలం కాపురం సజావుగా సాగినా అనంతరం ఇద్దరి మద్య విభేదాలతో గొడవలు ప్రారంభం అయ్యాయి. ఈ నేపథ్యంలో ఆమె ఏలూరు మహిళా పోలీస్స్టేషన్లో భర్తపై ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. కానీ భర్తను జైలులో పెట్టలేదంటూ ఈనెల 26న మోహనమ్మ జిల్లా జైలు సమీపంలో ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పు అంటించుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. తీవ్ర గాయాలైన ఆమెను ఏలూరు జీజీహెచ్కు తరలించగా వైద్యులు చికిత్స అందించి, అనంతరం మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం విజయవాడ తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మోహనమ్మ మృతిచెందింది. -
ట్రిపుల్ ఐటీ కౌన్సెలింగ్ తొలిరోజు ప్రశాంతం
నూజివీడు : ఏలూరు జిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీలో పీయూసీ ప్రథమ సంవత్సరానికి నిర్వహించిన ప్రవేశాల కౌన్సెలింగ్ ప్రక్రియ సోమవారం ప్రశాంతంగా జరిగింది. నూజివీడు ట్రిపుల్ ఐటీకి 1,010 మందిని ఎంపిక చేయగా వారిలో తొలిరోజు 505 మందిని కౌన్సెలింగ్కు ఆహ్వానించారు. ఉదయం 8 గంటల కల్లా కౌన్సెలింగ్ ప్రారంభించారు. ఈ కౌన్సెలింగ్లో ఎంపికై న విద్యార్థుల ఒరిజినల్ సర్టిఫికెట్లను పరిశీలించి ప్రవేశాలు కల్పించారు. దీనికి సంబందించిన ఫీజులను కూడా కట్టించుకున్నారు. తొలిరోజు 446 మంది అభ్యర్థులు కౌన్సెలింగ్కు హాజరవ్వగా వారందరికీ అడ్మిషన్లు కల్పించారు. ట్రిపుల్ ఐటీ అడ్మిషన్ల కన్వీనర్, ఇన్చార్జి డైరెక్టర్ ఆచార్య సండ్ర అమరేంద్రకుమార్, సీఏఓ బండి ప్రసాద్, సెంట్రల్ డీన్ దువ్వూరు శ్రావణి, అకడమిక్స్ డీన్ సాదు చిరంజీవి, అసిస్టెంట్ రిజిస్ట్రార్ మేరుగ అర్జునరావుల పర్యవేక్షణలో ఎలాంటి అవాంతరాలూ లేకుండా కౌన్సెలింగ్ జరిగింది. పలువురు మెంటార్లు, లెక్చరర్లు నిరంతరం కౌన్సెలింగ్ హాలులో ఉండి సర్టిఫికెట్ల పరిశీలనలో సిబ్బందికి కలిగే సందేహాలను నివృత్తి చేశారు. కౌన్సెలింగ్లో భాగంగా సర్టిఫికెట్ల పరిశీలన కోసం 20 కౌంటర్లను ఏర్పాటు చేసి 100 మంది సిబ్బందిని నియమించి కౌన్సెలింగ్ ప్రక్రియను తొలిరోజు ప్రశాంతంగా ముగించారు. ఎస్సీ, బీసీ, ఎస్టీ సంక్షేమ అధికారులను ఏర్పాటు చేసి విద్యార్థుల ధ్రువీకరణ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఎవరికీ ఎలాంటి అసౌకర్యం కలుగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. తాగునీరు, ప్రథమ చికిత్స కౌంటర్లు, ఎన్సీసీ క్యాడెట్ల సేవలు అందుబాటులో ఉండటంతో అంతా సజావుగా సాగింది. వచ్చిన అభ్యర్థులకు, వారి తల్లిదండ్రులకు తక్కువ ధరకే భోజన సదుపాయాన్ని కల్పించారు. కవలలకు సీట్లు ఎన్టీఆర్ జిల్లా కంచికచర్లకు చెందిన ఇద్దరు కవలలకు నూజివీడు ట్రిపుల్ ఐటీలో సీట్లు లభించాయి. సోమవారం కౌన్సెలింగ్ కోసం నూజివీడు ట్రిపుల్ ఐటీకి వచ్చిన నందికట్ల కుందన్ వెంకట నాగశ్రీ సాయి, నందికట్ల కుందన వెంకట నాగశ్రీ కంచికచర్లలోని జెడ్పీ హైస్కూల్లో పదో తరగతి చదువుకున్నారు. కుందన్కు 587 మార్కులు, కుందనకు 584 మార్కులు వచ్చాయి. వారిద్దరూ ట్రిపుల్ ఐటీలో సీట్ల కోసం దరఖాస్తు చేయగా, ఇద్దరికీ నూజివీడు ట్రిపుల్ ఐటీలోనే సీట్లు వచ్చాయి. దీంతో సోమవారం వారిద్దరూ పీయూసీలో చేరారు. ఈ సందర్భంగా వారిని డైరెక్టర్ ఆచార్య సండ్ర అమరేంద్రకుమార్ అభినందించారు. 446 మందికి ప్రవేశాలు -
మునిసిపల్ కార్మికుల పోరు ఉద్ధృతం
పోటీ కార్మికులను దింపడంపై అభ్యంతరం తాడేపల్లిగూడెం (టీఓసీ): మునిసిపాలిటీ ఆధ్వర్యంలో పాతూరు శివారు హెడ్ వాటర్ వర్క్స్, ఫిల్టర్ ప్లాంట్లు వద్ద పోటీ కార్మికులను దింపారన్న విషయాన్ని తెలుసుకున్న ఇంజనీరింగ్ సెక్షన్ కార్మికులు సాయంత్రం నిరసన శిబిరం వద్ద నుంచి బైక్ ర్యాలీగా స్థానిక హెడ్ వాటర్స్ వర్క్స్ గేటు వద్దకు చేరుకున్నారు. పోటీ కార్మికులను తీసుకురావడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. నిరసన కార్యక్రమం వద్దకు పోలీసులు చేరుకుని వాటర్ సప్లైను అడ్డుకోవడం సరికాదని, ప్రజలు ఇబ్బందులను గుర్తించాలని, లేని పక్షంలో అరెస్ట్ చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చే వరకు సమ్మె నుంచి వెనక్కి తగ్గబోమని, ఆందోళనను మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. తొలుత స్థానిక పురపాలక సంఘం కార్యాలయం వద్ద మునిసిపల్ ఇంజనీరింగ్ అవుట్ సోర్సింగ్ కార్మికులు సోమవారం 8వ రోజు చేపట్టిన నిరసన దీక్షలకు సీఐటీయూ నేతలు సంఘీభావం తెలిపారు. ఏలూరు (టూటౌన్): రాష్ట్రంలోని నగరపాలక సంస్థల్లో, పురపాలక సంఘాల్లో, నగర పంచాయతీల్లో పనిచేస్తున్న ఇంజనీరింగ్ విభాగంలోని అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగ సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాలని మునిసిపల్ ఇంజినీరింగ్ అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ కార్మికులు డిమాండ్ చేశారు. స్థానిక ఆర్ఆర్ పేట ఎస్ ఆర్ టు వద్ద ది జోనల్ మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన గేటు మీటింగ్లో వారు మాట్లాడారు. ఏళ్ల తరబడి అతి తక్కువ వేతనాలతో పనిచేస్తున్నా ప్రభుత్వం తమను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగ సిబ్బందిని పర్మినెంట్ చేస్తామని టీడీపీ ఇచ్చిన ఎన్నికల హామీని నిలబెట్టుకోవాలని ఏఐటీయూసీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు రెడ్డి శ్రీనివాస్ డాంగే, జిల్లా ఉపాధ్యక్షుడు బండి వెంకటేశ్వరరావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏఐటీయూసీ ఏలూరు ఏరియా కార్యదర్శి ఏ అప్పలరాజు, ది జోనల్ మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు బి నాగేశ్వరరావు, కోశాధికారి బి నారాయణరావు, యూనియన్ నాయకులు నారా శ్రీను, కందుల శ్రీనివాస్, అప్పారావు తదితరులు నాయకత్వం వహించారు. నరసాపురంలో అర్ధనగ్నంగా జలదీక్ష నరసాపురం: స్థానిక వశిష్టగోదావరి వలంధర్రేవు గోదావరిమాత విగ్రహం వద్ద కార్మికులు సోమవారం వినూత్నరీతిలో ఆందోళన చేశారు. అర్ధనగ్నంగా గోదావరిలో దిగి జలదీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రవమానికి జేఏసీ కమిటీ నాయకులు ఆర్ రత్నం, వి.ఫణి, ఎం.సత్యనారాయణ, కె.కాశీ, సీహెచ్ వాసు, ఎ.మధుబాబు, ఎం.సుజాత, టి.కళ్యాణి, ఎస్ దేవి, కె.అనంతలక్ష్మి నాయకత్వం వహించారు. ఇకపై పూర్తిస్థాయి సమ్మె తణుకు అర్బన్: ఇకపై పూర్తి స్థాయి సమ్మెకు దిగుతున్నట్లు మునిసిపల్ ఇంజనీరింగ్ అవుట్ సోర్సింగ్ జేఏసీ అధ్యక్ష, కార్యదర్శులు ఉండ్రాజవరపు శ్రీను, గెల్లా విజయ్కుమార్ తెలిపారు. ఈ మేరకు సోమవారం మునిసిపల్ కమిషనర్ టి.రామ్కుమార్కు వినతిపత్రం అందజేశారు. అనంతరం సమ్మెలో భాగంగా మునిసిపల్ కార్యాలయం వద్ద ఏర్పాటుచేసిన శిబిరంలో కార్మికులు తమ నిరాహారదీక్షలను కొనసాగించారు. ఈ కార్యక్రమంలో దాసరి సత్యనారాయణ, పిండి పెద్ధిరాజు, కాంతారావు తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ మద్దతు జంగారెడ్డిగూడెం: న్యాయమైన కోర్కెల కోసం మునిసిపల్ ఇంజనీరింగ్ వర్కర్లు చేపట్టిన ఆందోళనలకు వైఎస్సార్ సీపీ నాయకులు మద్దతు తెలిపారు. ఆందోళనల్లో భాగంగా యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం కమిషనర్కు సమ్మె నోటీస్ ఇచ్చినట్లు యూనియన్ అధ్యక్షుడు కంతేటి వెంకట్రావు తెలిపారు. ఇకపై పట్టణంలో వీధిదీపాలు నిలుపుదల చేస్తామని, దశలవారీగా మంచినీటి సప్లయ్ కూడా నిలుపుదల చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సమ్మెకు మద్దతుగా మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి, వైస్ చైర్పర్సన్ కంచర్ల వాసవి నాగరత్నం, ముప్పిడి వీరాంజనేయులు, వైఎస్సార్సీపీ టౌన్ ప్రెసిడెంట్ చిటికెల అచ్యుతరామయ్య, కౌన్సిలర్లు మద్దతు తెలిపారు. ఉద్యోగ భద్రత కోసం మునిసిపల్ ఇంజనీరింగ్, అవుట్ సోర్సింగ్ కార్మికులు చేపట్టిన పోరు ఉద్ధృతంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు వాటర్వర్క్స్, లైటింగ్ విభాగాల్లో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ఒక్కరి చొప్పున సహకరించామని, ప్రభుత్వం తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారంలో శ్రద్ధ చూపకపోవడంతో ఇకపై పూర్తిస్థాయి ఆందోళనలకు దిగుతామని హెచ్చరించారు. అధికారులకు సమ్మె నోటీసులు ఇచ్చారు. తమను పర్మినెంట్ చేసి టీడీపీ ఇచ్చిన ఎన్నికల హామీని నిలబెట్టుకోవాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిరాహార దీక్షలు, అర్ధ నగ్న ప్రదర్శనలు అధికారులకు సమ్మె నోటీసులు ఎన్నికల హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ ప్రభుత్వం దిగిరాకపోతే ఆందోళనలు మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరిక -
సప్త ప్రదక్షిణల్లో పాల్గొన్న భక్తులు
పాలకొల్లు సెంట్రల్: పంచారామక్షేత్రం శ్రీ క్షీరారామలింగేశ్వరస్వామి ఆలయంలో నాల్గవ సోమవారం సప్త ప్రదక్షిణలు నిర్వహించారు. చేతిలో ఏడు మారేడు దళాల పత్రాలను పట్టుకుని స్వామివారి మాడ వీధుల్లో వేలాది సంఖ్యలో భక్తులు ప్రదక్షిణలు చేశారు. అనంతరం స్వామివారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. రాత్రి 7 గంటలకు స్వామివారికి పంచహారతుల కార్యక్రమం జరిపారు. ఆలయ కార్యనిర్వహణాధికారి ముచ్చర్ల శ్రీనివాస్, సూపరింటెండెంట్ వాసు, అర్చకులు కిష్టప్ప తదితరులు పాల్గొన్నారు. కాట్రేనిపాడు విద్యార్థికి శ్రేష్ఠ ప్రవేశ పరీక్షలో 4వ ర్యాంకు ముసునూరు: కేంద్ర ప్రభుత్వం నిర్వహించే శ్రేష్ఠ ప్రవేశ పరీక్షలో ముసునూరు మండలం కాట్రేనిపాడుకు చెందిన దేవరపల్లి మోక్షజ్ఞ అక్షిత్ ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయిలో నాలుగో ర్యాంకును సాధించినట్లు తండ్రి సురేష్ తెలిపారు. తమ కుమారుడు విజయనగరం జిల్లాలోని కోరుకొండ సైనిక్ స్కూల్లో 8వ తరగతి చదువుతూ ఎస్సీ విద్యార్థుల కోసం కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న నేషనల్ లెవెల్ శ్రేష్ఠ ప్రవేశ పరీక్ష రాశాడన్నారు. నాలుగవ ర్యాంకుతో సీబీఎస్ఈ ఇంటర్నేషనల్ స్కూల్లో 9వ తరగతిలో ప్రవేశానికి అర్హత సాధించినట్లు చెప్పారు. విద్యార్థి మోక్షజ్ఞ అక్షిత్కు పలువురు అభినందనలు తెలియజేశారు. -
మొక్కజొన్న సాగులో మెలకువలు ఇలా..
చింతలపూడి : మొక్కజొన్న పంటను వర్షాధారంగాను, సాగునీటి కింద పండిస్తారు. మొక్కజొన్న ఆహార పంటగానే కాకుండ దాణా రూపంలో పశువులకు మేతగాను, వివిధ పరిశ్రమల్లో ముడి సరుకుగాను, పేలాల పంటగాను, కాయగూర రకంగాను రైతులు సాగు చేస్తున్నారు. ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాలో 48 వేల హెక్టారుల్లో రైతులు మొక్కజొన్న సాగు చేస్తున్నారు. ఏటా 4.40 లక్షల టన్నుల దిగుబడి సాధిస్తున్నారు. ఖరీఫ్ మొక్కజొన్న సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సాగు వివరాలను వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ వై సుబ్బారావు రైతులకు సూచించారు. విత్తే సమయం సాధారణంగా జూన్ 15 నుంచి జూలై లోగా విత్తుకోవాలి. అయితే వర్షాలు ఆలస్యంగా కురిస్తే నీటి వసతి కింద స్వల్పకాలిక హైబ్రీడ్ రకాలు ఆగస్టు రెండో వారంలో కూడా విత్తుకోవచ్చు. అనువైన రకాలు ● దీర్ఘకాలిక రకాలు: (100–120 ) రోజులు డీహెచ్ఎం –113, 900 ఎం గోల్డ్, బయో 9861, ప్రో–311, 30బి07 ● మధ్య కాలిక రకాలు : (90–100 రోజులు) డీహెచ్ఎం–111, 117, 119, కేహెచ్–510, బయో– 9657, కేఎం–9541, ఎంసీహెచ్–2 ● స్వల్పకాలిక రకాలు : (వీటి కాల పరిమితి 90 రోజుల కంటే తక్కువ) డీహెచ్ఎం– 115, ప్రకాశ్ కేహెచ్–5991, జేకేఎంఎచ్–1701 డీకేసీ–7074 ఆర్, ఎంఎంహెచ్–1701, డీకేసీ– 7074 ఆర్, ఎంఎంహెచ్– 133, 3342. ప్రత్యేక రకాలు ● తీపి మొక్కజొన్న (స్వీట్ కార్న్): మాధురి, ప్రియ, విన్ ఆరెంజ్, అల్మోరా స్వీట్ కార్న్ రకాలు, సుగర్–75, బ్రైట్జేన్ సంకర రకాలు. విత్తే విధానం ఎకరాకు సంకర రకాలైతే 7–8 కిలోల విత్తనం వాడి 60 సెం.మీ ఎడంగా బోదెలు చేసి సాళ్లలో 20 సెం.మీ ఎడంగా విత్తాలి. ఇలా విత్తితే ఎకరాకు సుమారు 33,333 మొక్కలు వస్తాయి. విత్తే ముందు కిలో విత్తనానికి 3 గ్రాముల కాస్టాన్ లేదా డైధేన్ ఎం.45 చొప్పున కలిపి విత్తన శుద్ధి చేసి బోదెకు ఒక పక్కగా విత్తాలి. ఎరువుల వాడకం ఖరీఫ్ పంటలో ఎకరాకు 72–80 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరం, 20 కిలోల పొటాష్నిచ్చే ఎరువులు వాడాలి. మొత్తం పొటాష్, భాస్వరం ఎరువులను పంట విత్తే సమయంలోనే వేసుకోవాలి. ఒకవేళ జింక్ లోపం ఉంటే ఎకరాకు 20 కిలోల జింక్ సల్ఫేట్ వేయాలి. పైరుపై జింక్లోపం గమనిస్తే జింక్ సల్ఫేట్ (20 గ్రా) పిచికారీ చేయాలి. కలుపు నివారణ పంట విత్తాక 45 రోజుల వరకు కలుపు లేకుండా చూసుకోవాలి. మొక్కజొన్న పంటను ఏక పంటగా వేసినప్పుడు నేల రకాన్ని బట్టి ఎకరాకు 800–1200 గ్రా, అట్రాజిన్ పొడి మందును 200 లీటర్ల నీటిలో కలిపి పంట విత్తిన వెంటనే లేదా 2–3 రోజుల్లోగా పిచికారీ చేసి కలుపును నివారించవచ్చును. వెడల్పాటి కలుపు మొక్కల నివారణకు విత్తిన 30 రోజుల తర్వాత ఎకరాకు అరకిలో 2, 4–డి సోడియం సాల్ట్తో పిచికారీ చేయాలి. నీటి తడులు వర్షాధారంగా సాగు చేసినా పూత దశలో వర్షాభావ పరిస్థితులేర్పడితే వీలున్న చోట నీరు తడిపితే మంచి దిగుబడులు వస్తాయి. పూత దశ, గింజలు ఏర్పడే దశల్లో నీటి ఎద్దడి లేకుండా చూసుకోవాలి. పైరు తొలి దశలో పొలంలో నీరు నిల్వ లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. సస్యరక్షణ పైరు తొలి దశలో ఆశించే మొవ్వ తొల్చే పురుగు నివారణకు ముందు జాగ్రత్తగా విత్తిన 10–12 రోజులకు పైరుపై మోనోక్రోటోఫాస్ (1.6 మి.లీ) లేదా కోరా.ఎన్ (03 మి.లీ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. లేదా కార్బోఫ్యూరాన్ 3జీ గుళికలను ఎకరాకు 3 కిలోల చొప్పున పైరు 25–30 రోజుల దశలో ఆకు సుడుల్లో వేయాలి. ఆకు మాడు తెగులు నివారణకు మాంకో జెట్ (2.5 గ్రా) లీటర్ నీటిలో కలిపి వారం, పది రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చేయాలి. పొడ తెగులు లక్షణాలు కనిపిస్తే మొక్క దిగువనున్న 2–3 ఆకులు తుంచివేసి ప్రొపికొనజోల్ (1 మి,లీ) లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. మొక్క ఎండు, కాండం మసికుళ్లు తెగుళ్లు రాకుండా ముందు జాగ్రత్తగా ఎదుర్కొనే రకాల సాగు, పంట మార్పిడి, వేసవిలో లోతు దుక్కులు, పూత దశ తర్వాత నీటి ఎద్దడి పరిస్థితులు తలెత్తకుండా జాగ్రత్తలు చూసుకోవాలి. పాడి–పంట -
సిఫార్సులబదిలీలలు
ఏలూరు (ఆర్ఆర్పేట) : రాష్ట్రంలో బదిలీలు అంటేనే ఉద్యోగుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఇటీవల కూటమి ప్రభుత్వం పలు శాఖల్లో బదిలీలకు కౌన్సెలింగ్లు నిర్వహించింది. అయితే ఎక్కడా సజావుగా సాగలేదు. ఆచరణ సాధ్యం కాని నిబంధనలతో ఉద్యోగులు రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి. తాజాగా గ్రామ సచివాలయాల్లో పనిచేస్తున్న వె ల్ఫేర్ అండ్ ఎడ్యుకేషనల్ సెక్రటరీలు సైతం బ దిలీల కౌన్సెలింగ్ కేంద్రం వద్ద ధర్నా చేయడం ప్రభుత్వ విధానానికి అద్దం పడుతోంది. వీరి బదిలీల్లో ఎమ్మెల్యేలు పెత్తనం చేయాలని చూడటంతో ఆగ్రహ జ్వాలలు ఎగసిపడుతున్నాయి. స్థానిక నాయకుల చెప్పుచేతల్లో పెట్టేలా.. గ్రామ సచివాలయాల్లో వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషనల్ సెక్రటరీల బదిలీలకు సంబంధించి ఎమ్మెల్యేల సిఫార్సు లేఖలకు ప్రాధాన్యమివ్వాలని అధికారులకు ప్రభుత్వ పెద్దలు మౌఖిక ఆదేశాలు ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. అయితే ఎమ్మెల్యేలు సచివాలయ ఉద్యోగులు పనిచేసే ప్రాంతంలోని స్థానిక కూటమి నాయకుని సిఫార్సు ఉంటేనే లేఖలు ఇస్తున్నట్టు సమాచారం. స్థానిక నాయకుల సిఫార్సులు తీసుకుంటే ఆ తర్వాత తమ ఉద్యోగాలు ఆ స్థానిక నాయకుల వద్దే చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని, దీని వల్ల అర్హులైన లబ్ధిదారులకు తీవ్ర అన్యాయం జరిగే ప్రమాదముందని సెక్రటరీలు అంటున్నారు. అదీ కాక ఎంత మందికి స్థానిక నాయకులతో సత్సంబంధాలు ఉంటాయని, అర్హత ఉన్న ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ర్యాంకులు పట్టించుకోరా? నియమ నిబంధనలు కాదని బదిలీల్లో సిఫార్సులపై ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాము సాధించిన ర్యాంకుల ఆధారంగా ఉద్యో గాలు ఎలా కేటాయించారో అలాగే బదిలీలు చేపట్టాలని, జాబితాలు సిద్ధం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. లేకుంటే తాము ర్యాంకులు సాధించి ఏం ప్రయోజనమని వాపోతున్నారు. ప్రతిభను ప్రోత్సహించాల్సిన ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా బదిలీలు చేపట్టడానికి ప్రయత్నించడం దారుణమని ఆవేదన చెందుతున్నారు. సీనియార్టీ జాబితా లేకుండానే.. ఏ శాఖలో అయినా సీనియార్టీ జాబితా ప్రదర్శించి దాని ఆధారంగానే బదిలీలు చేస్తారని, అయితే సచివాలయ ఉద్యోగుల విషయంలో అలా ఎందుకు చేయడం లేదని ప్రశ్నిస్తున్నారు. సీనియార్టీ జాబితా రూపొందించకుండా తమను మూడు ప్రాంతాలు కోరుకోమని, వాటిని ఫారంలో నింపి వెళ్లిపోవాలని సూచించడం నిబంధనలకు విరుద్ధమని మండిపడుతున్నారు. తాము కోరుకున్న మూడు ప్రాంతాలనే మరో పది మంది కోరుకుంటే తమకు ఎక్కడి స్థానాలు కేటాయిస్తారని ప్రశ్నిస్తున్నారు. అలాగే బదిలీల్లో ప్రాధాన్యత ఇవ్వాల్సిన అంధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, స్పౌజ్ కేటగిరీల్లో కూడా జాబితా రూపొందించకుండా తమతో ఫారాలు నింపించుకుని ఇష్టానుసారంగా బదిలీలు చేస్తే తమ కుటుంబాల పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. సచివాలయ ఉద్యోగుల గగ్గోలు బదిలీల్లో ఎమ్మెల్యేల పెత్తనం స్థానిక నాయకుల సిఫార్సుల మేరకే లేఖలు కూటమి నేతల చుట్టూ ఉద్యోగుల ప్రదక్షిణలు ర్యాంకుల ఆధారంగా బదిలీలు చేపట్టాలని డిమాండ్ సీనియార్టీ జాబితా లేకపోవడంపై ఆగ్రహం పారదర్శకంగా చేపట్టాలి గ్రామ సచివాలయ వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషనల్ అసిస్టెంట్ల బదిలీలు పారదర్శకంగా నిర్వహించాలి. ఎమ్మెల్యేల సిఫార్సు లేఖలకు ప్రాధాన్యమిస్తే అర్హులు నష్టపోతారు. బదిలీలకు సీనియార్టీ జాబితా తయారు చేయకుండా అధికారులు ఇష్టమొచ్చిన చోటుకు బదిలీ చేస్తామనడం నిబంధనలకు విరుద్ధం. సొంత మండలాల్లోకి బదిలీలు చేయమనే నిబంధన అమలు చేస్తున్నప్పుడు ఇతర నిబంధనలు కూడా అమలు చేయాలి. – కె.అజయ్బాబు, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మార్గదర్శకాలు మర్చిపోయారు ప్రభుత్వం బదిలీలపై జీఓ ఇచ్చి మార్గదర్శకాలు మర్చిపోయింది. గత 30, 40 ఏళ్లలో ఇలాంటి బదిలీలు చూడలేదు. ఇప్పటికే ప్రతి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయాల్లో బదిలీలు ముగిసినట్టు ప్రచారం జరుగుతుండటం సెక్రటరీలను కలవరపెడుతోంది. ఎమ్మెల్యేల లేఖలకే ప్రాధానమిస్తే ఇక బదిలీలకు కౌన్సెలింగ్ ఎందుకు. లేఖలు పొందిన వారు మినహా మిగిలిన వారంతా ఆందోళనలో ఉన్నారు. – ఈ.నరేష్, వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషనల్ సెక్రటరీవిధులకు దూరం.. ప్రదక్షిణల పర్వం సచివాలయాల వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషనల్ సెక్రటరీలు స్థానిక కూటమి నాయకుల ఇళ్ల వద్ద ప్రదక్షిణలు చేస్తున్నారు. ఈ క్రమంలో వారి విధులకు దూరం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొందరు ఉద్యోగులకు స్థానిక నాయకులతో నేరుగా సంబంధాలు ఉండటంతో వారు తొలి ప్రాధానత్యగా ఎమ్మెల్యేల సిఫార్సు లేఖలు అందుకున్నారు. మరికొందరు స్థానిక నాయకులతో బంధుత్వమో, స్నేహమో ఉన్న వారిని వెంటబెట్టుకుని వారి చుట్టూ తిరిగి ఇప్పటికే ఎమ్మెల్యేల లేఖలను సంపాదించి సాంఘిక సంక్షేమ అధికారులకు పంపినట్టు తెలిసింది. ఇదిలా ఉండగా తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే 19 మంది అభ్యర్థులతో కూడిన సిఫార్సు లేఖను జిల్లా పంచాయతీ అధికారికి పంపినట్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. -
చట్టాలపై అవగాహన అవసరం
చింతలపూడి: చింతలపూడి సబ్ జైలును ఆదివారం ఉమ్మడి జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ ఎస్.శ్రీదేవి సందర్శించారు. జైలులో ముద్దాయిలకు అందిస్తున్న ఆహారం, వసతి సదుపాయాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఖైదీలకు చట్టాలపై అవగాహన కల్పించారు. హింసా మా ర్గాన్ని వీడాలని, సత్ప్రవర్తనతో మెలగాలని సూచించారు. వంటశాల, స్టోర్ రూమును తనిఖీ చేసి ఆహారాన్ని పరిశీలించారు. సబ్జై లు ప్రాంగణంలోని ఉచిత న్యాయ సహాయ కేంద్రాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్త కార్యదర్శి కె.రత్నప్రసాద్, జూనియర్ సివిల్ జడ్జి సీహెచ్ మధుబాబు, సబ్ జైలు సూపరింటెండెంట్ కృపానందం, ప్యా నల్ లాయర్ టోకూరి వెంకటేష్, పీఎల్వీటీవీఎస్ రాజు, సీఐ క్రాంతికుమార్, ఎస్సై సతీష్కుమార్ ఉన్నారు. నేడు పీజీఆర్ఎస్ భీమవరం (ప్రకాశంచౌక్) : ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్ఎస్) కార్యక్రమాన్ని సోమవారం జిల్లాలోని కలెక్టరేట్, డివిజన్, మున్సిపల్, మండల స్థాయిల్లో నిర్వహించనున్నట్టు కలెక్టర్ సీహెచ్ నాగరాణి తెలిపారు. ప్రజల సమీపంలోని కార్యాలయానికి వెళ్లి అర్జీలు సమర్పించవచ్చన్నారు. అమలుకాని విద్యాహక్కు చట్టం ఏలూరు (ఆర్ఆర్పేట): విద్యాహక్కు చట్టం ప్రైవేట్ పాఠశాలల్లో పక్కాగా అమలయ్యేలా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎ.రవి ప్రకటనలో డిమాండ్ చేశారు. విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రైవేట్ పాఠశాలల్లో 25 శాతం సీట్లను పేద విద్యార్థులకు కేటాయించాల్సి ఉండగా.. జిల్లాలో పూ ర్తిస్థాయిలో అమలైన దాఖలాలు లేవని పేర్కొన్నారు. కొన్ని పాఠశాలల్లో పిల్లలను చేర్పించుకుంటున్నా వివక్ష చూపుతున్నారని, తల్లిదండ్రుల నుంచి అనధికారికంగా రుసుములు వ సూలు చేస్తున్నారని తెలిపారు. ఫీజుల విషయంలో ఇబ్బందులు పెడుతున్న సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయని, జిల్లా విద్యాశాఖాధికారులు సమగ్ర విచారణ జరపాలని కోరారు. రాట్నాలమ్మకు విశేష పూజలు పెదవేగి: పెదవేగి మండలం రాట్నాలకుంట లోని రాట్నాలమ్మ ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఆలయంలో విశేష పూజలు చేయించి మొ క్కులు తీర్చుకున్నారు. ఆలయానికి పూజా రు సుముల ద్వారా రూ.41,100, విరాళాల రూ పంలో రూ.1,401, లడ్డూ ప్రసాదం ద్వారా రూ.29,805, పులిహోర అమ్మకం ద్వారా రూ.1,380, ఫొటోల విక్రయం ద్వారా రూ.4,165 మొత్తం రూ. 77,851 ఆదాయం సమకూరినట్టు ఈఓ ఎన్.సతీష్కుమార్ తెలిపారు. -
సాగు.. జాగు
ఈ ఫొటోను గమనించారా? పాలకోడేరు మండలం మోగల్లులోని రేలంగి చానల్ దుస్థితి. తణుకు రూరల్ మండపాక నుంచి అత్తిలి, ఇరగవరం మండలాల మీదుగా పాలకోడేరు మండలం మోగల్లు వరకు దాదాపు 27 కి.మీ పరిధిలో వేల ఎకరాల ఆయకట్టుకు ఈ రేలంగి చానల్ ద్వారా సాగునీరు అందుతుంది. ముందస్తు సాగు కోసం పశ్చిమ డెల్టాకు జూన్ 1నే సాగునీటిని విడుదల చేసినట్టు ప్రభుత్వం ప్రకటించగా ఇప్పటికీ శివార్లకు సాగు నీరందని దుస్థితికి ఈ చిత్రం అద్దం పడుతుంది. పూర్తిస్థాయిలో సాగు నీరందక కాలువ పరిధిలోని తొలకరి పనులకు ఆటంకం కలుగుతోంది. సాక్షి, భీమవరం : జిల్లాలో ఖరీఫ్ సాగు నత్తను తలపిస్తోంది. ధాన్యం బకాయిలు విడుదల కాకపోవడం, పంట పెట్టుబడులకు సర్కారు నుంచి సాయం కొరవడటం, శివారు భూములకు సాగునీరు అందకపోవడం తదితర కారణాలతో జూన్ ముగిసిపోతున్నా తొలకరి పనులు ఇంకా జోరందుకోలేదు. జిల్లాలో 2.08 లక్షల ఎకరాల్లో ఖరీఫ్ సాగు జరుగనుండగా 50 శాతం విస్తీర్ణంలో ఎంటీయూ 1318 రకం, 25 శాతం విస్తీర్ణంలో ఎంటీయూ 7029 రకం, మిగిలిన విస్తీర్ణంలో ఎంటీయూ 1293, పీఎల్ఏ 1100 తదితర రకాలు సాగవుతాయని వ్యవసాయ శాఖ అంచనా. నవంబరు చివరిలో వచ్చే తుపానుల బారిన పడకుండా ముందుగానే పంటను ఒబ్బిడి చేసుకునే దిశగా గతంలో జూలై 15లోగా నాట్లు పూర్తిచేసే లక్ష్యంతో పనులు వేగవంతం చేసేవారు. జూన్ నెలాఖరుకు నారుమడులు వేయడం చాలా వరకు పూర్తికావడంతో పాటు ముందుగా వరి కోతలు జరిగే తాడేపల్లిగూడెం ప్రాంతంలో నాట్లు జోరందుకునేవి. ఈ సీజన్లో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. జూన్ నెల ముగిసిపోతున్నా ఇంకా పనులు ముమ్మరం కావడం లేదు. ఇప్పటివరకు 3,120 ఎకరాలకు సంబంధించి నారుమడులు వేయగా, 2,680 ఎకరాల్లో మా త్రమే నాట్లు పడ్డాయి. విడుదల కాని ధాన్యం సొమ్ములు ధాన్యం అమ్మిన 24 గంటల్లోనే చెల్లింపులు చేస్తున్నట్టు కూటమి ప్రభుత్వం చెబుతుండగా నెల రోజులైనా సొమ్ములు చేతికందక రైతులు తీవ్ర ఇబ్బందులకు గురికావాల్సి వస్తోంది. రబీ సీజన్లో జిల్లాలో దాదాపు 77 వేల మంది రైతుల నుంచి రూ.1,650 కోట్ల విలువైన 7.17 లక్షల టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది. వీటిలో రూ.1,360 కోట్లు రైతుల ఖాతాలకు జమచేయగా రూ.250 కోట్ల మేర బకాయిలు ఉన్నాయి. ధాన్యం విక్రయించి నెల రోజులు దాటినా ప్రభుత్వం నుంచి బకాయిలు రాలేదని రైతులు వాపోతున్నారు. తొలకరి పెట్టుబడుల కోసం చేతిలో సొమ్ముల్లేక అప్పులు చేయాల్సి వస్తోందని ఆవేదన చెందుతున్నారు. ఆదుకోని ‘అన్నదాత సుఖీభవ’ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో తొలకరి ప్రారంభంలోనే రైతు భరోసాగా రూ.7,500 మొత్తాన్ని పెట్టుబడి సాయంగా అందించారు. విత్తనాలు, నారుమడుల తయారీ, ఎరువుల కొనుగోలుకు రైతులు అప్పులు చేయాల్సిన పని ఉండేది కాదు. తాము అధికారంలోకి వస్తే పెట్టుబడి సాయంగా ఏటా రూ.20 వేల చొప్పున అందిస్తామని హామీ ఇచ్చిన కూటమి నాయకులు మొదటి ఏడాది సాయానికి ఎగనామం పెట్టారు. ఈ ఏడాదీ సాయం విడుదలపై స్పష్టత లేదు. దీంతో రైతులు పంట పెట్టుబడులకు దళారులను ఆశ్రయించాల్సి వస్తోంది. సాగునీరు.. అందని తీరు జిల్లాలో 11 ప్రధాన పంట కాలువల ద్వారా ఆయకట్టుకు సాగునీటి సరఫరా జరుగుతోంది. క్లోజర్లో భాగంగా సుమారు రూ.77 కోట్ల విలువైన 150 పనులతో అధికారులు ప్రతిపాదనలు పంపారు. వీటిలో కొన్నింటికి అనుమతులు రాగా సకాలంలో పనులు పూర్తికాకపోవడం తొలకరి పనులపై ప్రభావం చూపుతోంది. ముందస్తు కోసమంటూ జూన్ 1న కాలువలకు నీరు విడుదల చేస్తున్నట్టు ప్రకటించినా క్లోజర్ పనులు పూర్తికాకపోవడంతో ఇప్పటికీ పలుచోట్ల శివారు ప్రాంతాలకు సాగునీరు అందడం లేదు. కొన్ని ప్రాంతాల్లో తొలకరి వర్షాలపైనే సాగుకు సిద్ధమైన పరిస్థితులు ఉన్నాయి. ఖరీఫ్.. లేదు రిలీఫ్ జిల్లాలో నత్తనడకన తొలకరి పనులు జూన్ ముగుస్తున్నా జోరందుకోని నారుమడులు సర్కారు నుంచి కొరవడిన సహకారం సాగునీటి సరఫరాలో జాప్యం రూ.250 కోట్ల మేర ధాన్యం బకాయిలు జిల్లాలో 2.08 లక్షల ఎకరాల్లో సార్వా సాగు -
పేగు బంధం కాదన్నా.. మానవత్వం చాటి..
వృద్ధురాలికి అంత్యక్రియలు నిర్వహించిన ఆశ్రమ నిర్వాహకుడు జంగారెడ్డిగూడెం: పేగు బందం కానరాలేదు. ఒడిదుడుకులు ఎదుర్కొని కుటుంబాన్ని నిలబెట్టిన వృద్ధురాలిని అనాథగా వదిలేశారు. ఆమె ఆఖరి మజిలీలోనూ పట్టించుకోకపోగా మాన వత్వం చాటుతూ ఆశ్రమ నిర్వాహకుడు అంత్యక్రియలు నిర్వహించారు. వివరాలిలా ఉన్నాయి.. కోడూరి శకుంతల అనే వృద్ధురాలిని నాలుగేళ్ల క్రితం జంగారెడ్డిగూడెంలోని సీతామహాలక్ష్మి వృద్ధుల, వికలాంగుల, అనాథ ఆశ్రమంలో కుటుంబసభ్యులు చేర్పించారు. అప్పటి నుంచి ఆశ్రమంలోనే ఆమె జీవనం సాగిస్తోంది. ఇటీవల శకుంతల అనారోగ్యం పాలుకాగా కుటుంబసభ్యులు పట్టించుకోలేదు. దీంతో ఆశ్రమ నిర్వాహకుడు జయవరపు శేఖర్ ఆమెను ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స చేయించారు. ఈ విషయాన్ని ఆమె కుటుంబసభ్యులకు తెలియజేసినా స్పందించలేదు. చివరకు చికిత్స పొందుతూ శకుంతల (94) ఆదివారం కన్నుమూశారు. ఆమెకు అంత్యక్రియలు నిర్వహిస్తామని అప్పటివరకు చెప్పిన కుటుంబసభ్యులు చివరి నిమిషంలో ముఖం చాటేశారు. దీంతో ఆశ్రమ నిర్వాహకుడు శేఖర్ అన్నీ తానై వృద్ధురాలి అంత్యక్రియలను కుటుంబసభ్యులు, బంధువుల మధ్య నిర్వహించి సేవాతత్పరతను చాటారు. -
డీఎస్సీ పరీక్షలకు 94 శాతం హాజరు
భీమవరం: జిల్లాలోని రెండు కేంద్రాల్లో ఆదివారం నిర్వహించిన మెగా డీఎస్సీ పరీక్షకు 94 శాతం అభ్యర్థులు హాజరయ్యారని డీఈఓ ఈ.నారాయణ తెలిపారు. మధ్యాహ్నం నిర్వహించిన పరీక్షకు 210 మందికి 199 మంది హాజరయ్యారన్నారు. ఎక్కడా మాల్ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని చెప్పారు. ఏలూరు జిల్లాలో 455 మంది హాజరు ఏలూరు (ఆర్ఆర్పేట): ఏలూరులో ఆదివారం జరిగిన డీఎస్సీ పరీక్షలకు 455 మంది అభ్యర్థులు హాజరయ్యారు. సిద్ధార్థ క్వెస్ట్ కేంద్రంలో ఉదయం 100 మందికి 83 మంది, మ ధ్యాహ్నం 101 మందికి 94 మంది హాజర య్యారు. సీఆర్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఉ దయం 115 మందికి 95 మంది, మధ్యాహ్నం 201 మందికి 183 మంది హాజరయ్యారు. పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని డీఈఓ ఎం.వెంకట లక్ష్మమ్మ తెలిపారు. -
మున్సిపల్ కార్మికుల సమ్మె ఉధృతం
నరసాపురం/తణుకు అర్బన్/తాడేపల్లిగూడెం (టీఓసీ): మున్సిపల్ ఇంజనీరింగ్ సెక్షన్లో అవుట్ సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న కార్మికులు సమ్మెను ఉధృతం చేశారు. ఆదివారం నుంచి వీధి దీపాల నిర్వహణ, మంచినీటి సరఫరా పనులను సైతం బహిష్కరించారు. తమ సమస్యలపై ప్రభు త్వం సానుకూలంగా స్పందించే వరకూ ఆందోళన విరమించేది లేదని హెచ్చరించారు. నరసాపురం మున్సిపల్ కార్యాలయం వద్ద కార్మికుల రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. ఏపీ మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ జేఏసీ నాయకులు మాట్లాడుతూ చాలీచాలని జీతాలతో పనిచేస్తున్న తమకు న్యాయం చేయడంలో ప్రభు త్వం తాత్సారం చేయడం దారుణమన్నారు. కోటిపల్లి కాశీ, ఎం.రత్నం, సీహెచ్ సత్యనారాయణ, ఫణి నాయకత్వం వహించారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి తణుకు అర్బన్: తణుకులో కార్మికుల దీక్షలు కొనసాగుతున్నాయి. ఆదివారం శిబిరంలో జేఏసీ అధ్యక్షుడు ఉండ్రాజవరపు శ్రీను, కార్యదర్శి గెల్లా విజయ్కుమార్ మాట్లాడుతూ సమాన పనికి సమాన వేతనాలు చెల్లించే విధానం అమల్లోకి రావాలని కోరారు. 25 ఏళ్లకు పైబడి విధుల్లో ఉంటున్నా రూ. 13 వేల వేతనాలే అమల్లో ఉండటం బాధాకరమన్నారు. నాయకులు దాసరి సత్యనారాయణ, రాపాక సురేష్, ప్రసాద్, రాపాక రవి తదితరులు పాల్గొన్నారు. గూడెంలో ఏడో రోజుకు చేరిన దీక్షలు తాడేపల్లిగూడెం (టీఓసీ): తాడేపల్లిగూడెంలో కా ర్మికుల దీక్షలు ఆదివారం ఏడో రోజూ కొనసాగా యి. జేఏసీ నాయకులు మర్రిపూడి సతీష్ కుమార్, అవిడి కుమార్, ఎర్రంశెట్టి నాగేశ్వరరావు, బండారు శ్రీను, అడ్డాల చలపతి, ప్రత్తి రమేష్ మాట్లాడుతూ తమ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించకుంటే సమ్మె మరింత ఉధృతం చేస్తామని అన్నారు. -
ఉపాధ్యాయులకు బకాయిలు చెల్లించాలి
భీమవరం: ఉపాధ్యాయులకు ఆర్థిక బకాయిలు చెల్లించి 12వ పీఆర్సీ కమిషన్ వెంటనే నియమించాలని ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.సాయిశ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక ఏఆర్కేఆర్ మున్సిపల్ హైస్కూల్లో గుత్తుల శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. పెండింగ్, 11వ పీఆర్సీ, సరెండర్ లీవ్, ఏపీజీఎల్ఐ బకాయిలు చెల్లించకపోవడంతో టీచర్లు నష్టపోతున్నారన్నారు. ఖాళీగా ఉన్న ఉపాధ్యాయుల స్థానంలో డీఎస్సీ అభ్యర్థులు వచ్చే వరకూ అకడమిక్ ఇన్స్ట్రక్టర్లను నియమించాలన్నారు. 2008, 1998 ఎంటీఎస్ టీచర్లకు 62 ఏళ్ల వయో పరిమితిని పెంచి వారిని రెగ్యులర్ విధానంలో నియమించాలని డిమాండ్ చేశారు. జిల్లా ప్రధాన కార్యదర్శి సాయివర్మ, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు కేవీ రామచంద్రరావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి.దావీదు, జిల్లా ఆర్థిక కార్యదర్శి పీవీడీ ప్రసాద్ పాల్గొన్నారు. ఐటీఐ ప్రవేశాలకు దరఖాస్తులు ఉండి: జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐల్లో రెండో విడత ప్రవేశాలకు వచ్చేనెల 15లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ఐటీఐ జిల్లా కన్వీనర్ వి.శ్రీనివాసరాజు తెలిపారు. దరఖాస్తు అనంతరం సమీపంలోని ప్రభుత్వ ఐటీఐలో సర్టిఫికెట్లు పరిశీలన చేయించుకోవాలన్నారు. వీరు మాత్రమే కౌన్సెలింగ్కు అర్హులని తెలిపారు. టెన్త్ ఫెయిలైన విద్యార్థుల కోసం వెల్డర్ ట్రేడ్ అందుబాటులో ఉందన్నారు. మరిన్ని వివరాలకు 08816 297093, 9676099988 నంబర్లలో సంప్రదించాలని ఆయన కోరారు. -
AP: పాఠశాల ఉంది.. పాఠం వినేవారు లేరు..!
పెనుమంట్ర: పెనుమంట్ర మండలంలో విద్యా శాఖ నిర్లక్ష్యంతో పాఠశాలలు మూసివేసే పరిస్థితి నెలకొంది. సరిగా పాఠశాలల విభజన జరగకపోవడంతో కొన్ని స్కూళ్లలో కేవలం ఒకరిద్దరు విద్యార్థులు మాత్రమే ఉన్నారు. మండలంలో 47 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. అందులో వెలగలవారిపాలెం (ఆర్) పాఠశాలలో ముగ్గురు విద్యార్థులు, ఎంపీపీ నాగళ్లదిబ్బ, కొయ్యేటిపాడు స్పెషల్ పాఠశాలల్లో ఒక్కో విద్యార్థి ఇప్పటి వరకు చేరారు. వెలగలవారిపాలెం పాఠశాలలో సింగిల్ టీచర్ ఉన్నప్పటికీ నాగళ్ల దిబ్బ, కొయ్యేటిపాడు పాఠశాలలకు ఉపాధ్యాయులు లేకపోవడంతో ఈ పాఠశాలల్లో ఆన్లైన్ ద్వారా ఒక్కో విద్యార్థి చేరారు. ఈ పాఠశాలలకు వేరే పాఠశాల నుంచి ఉపాధ్యాయులను డిప్యుటేషన్పై పంపుతున్నట్లు ఎంఈవో యు.నాగేశ్వరరావు శనివారం తెలిపారు.వెలగలవారిపాలెం పాఠశాలలో ముగ్గురు విద్యార్థులు ఉన్నట్లు హాజరు చూపుతున్నప్పటికీ శనివారం ఆ పాఠశాలలో ఒక్క విద్యార్థిని మాత్రమే ఉన్నారు. దళితవాడలో పాఠశాలకు నాడు–నేడులో అధునాతన భవనాలు నిర్మించారు. గత ఏడాది ఈపాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులు, 30 మంది వరకు విద్యార్థులు ఉండగా, ఈ ఏడాది ఇద్దరు ఉపాధ్యాయులతో 12 మంది విద్యార్థులు మాత్రమే ఉన్నారు. ఇదే పరిస్థితి మండలంలో అనేక ప్రభుత్వ పాఠశాలల్లో ఉంది. ఇందుకు విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యమే కారణమని పలువురు తల్లిదండ్రులు విమర్శిస్తున్నారు. ఏపీలో ప్రస్తుతం గవర్నమెంట్ పాఠశాలల్లో ఇలాంటి పరిస్థితులు అనేక చోట్ల కనిపిస్తూ ఉండటంతో దీనిపై ప్రభుత్వం ఎంత వరకూ శ్రద్ధ చూపిస్తుందనేది కళ్లకు కట్టినట్లు కనిపిస్తోంది.వెలగలవారిపాలెంలో దళితవాడలో నాడు-నేడులో నిర్మించిన భవనం -
దిగుబడిలో విత్తన శుద్ధి కీలకం
భీమవరం: సార్వా వరి నారుమడి పనుల్లో రైతులు నిమగ్నయ్యారు. గత రాష్ట్ర ప్రభుత్వం రైతులకు వెన్ను దన్నుగా నిలబడి అనేక సంక్షేమ పథకాలను అమలు చేయడంతో రైతులు ఉత్సాహంగా వరి సాగు పట్ల ఆసక్తి చూపించారు. రైతులకు వరి కోత యంత్రాలు, ట్రాక్టర్లకు పెద్ద మొత్తంలో సబ్సిడీ ఇవ్వడమేగాక పంటల బీమా పథకం, ఇన్ఫుట్ సబ్సిడీ వంటివి అమలు చేశారు. ప్రస్తుతం సార్వా సాగుకు సిద్ధమవుతున్న రైతులకు రైతు భరోసా, గత సార్వాసీజన్లో వర్షాలు కారణంగా దెబ్బతిన్న రైతులకు ఇన్ఫుట్ సబ్సిడీ ఇవ్వకపోవడంతో ప్రస్తుత సీజన్లో వరి సాగుకు ఇబ్బందులు పడుతున్నారు. పథకాల మాటేలా ఉన్నా వరి సాగులో విత్తన ఎంపిక, విత్తనశుద్ధి, సస్యరక్షణ వంటి వాటిపై రైతులు దృష్టి పెట్టాలని వ్యవసాయశాఖ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాల్లో సుమారు సుమారు 5.40 లక్షల ఎకరాల విస్తీర్ణంలో వరి సాగు చేయనున్నారు. దీనిలో పశ్చిమగోదావరి జిల్లాలో 2.08 లక్షల ఎకరాలు, ఏలూరు జిల్లాలో సుమారు 3 లక్షలకు పైగా ఎకరాల్లో సాగు చేయాల్సి ఉంది. వరి నారుమళ్లు వేయడానికి ఎకరాకు 30 కిలోల వరకు విత్తనాలు అవసరమవుతాయి. విత్తన సేకరణ ఇలా పురుగులు, తెగుళ్లు ఆశించని పాలం నుంచి విత్తనాన్ని సేకరించుకోవాలి. రైతులు తమ సొంత విత్తనాన్నే వాడుకుంటుంటే పంట కోత కోసిన తరువాత విత్తనాలతో పాటు కలిసిపోయిన మట్టి, శీలీంద్ర బీజాలు, పురుగు తుట్టెలను తీసివేసి శుభ్రం చేసి నిలువ చేసుకోవాలి. బయట విత్తనాన్ని కొనుగోలు చేసే సమయంలో విత్తన శుద్ధి చేశారో లేదో నిర్ధారించుకోవాలి. కొనుగోలు చేసిన విత్తనానికి సంబందించిన బిల్లును తప్పనిసరిగా తీసుకోవాలి. విత్తనాల మొలక శాతం తప్పనిసరిగా పరీక్షించుకోవాలి. నాణ్యమైన విత్తనం అయినా ఎక్కువ ముంది రైతులు సొంతంగా విత్తనాలను పండించుకోవడం లేదా తోటి రైతుల నుంచి విత్తనాలను కొనుగోలు చేస్తుంటారు. విత్తనాలతో పాటు కొన్ని తెగుళ్లను కలుగచేసే శీలీంద్రాలు, బ్యాక్టీరియా, వైరస్ వంటివి పంటలను ఆశించి తీవ్రమైన నష్టాన్ని కలుగచేస్తుంటాయి. కొన్ని సందర్భాల్లో నాణ్యమైన విత్తనం అయినప్పటికీ భూమి నుంచి, వివిధ రకాల పురుగుల నుంచి తెగుళ్లు ఆశించి పంటను నష్టపరుస్తూ ఉంటాయి. అందువల్ల పంటను తొలిదశలోనే రక్షించుకోవడానికి సిఫారసు చేసిన శీలీంద్ర నాశినులతో గానీ, పురుగు మందులు లేదా జీవ శీలీంద్ర నాశినులతో తప్పని సరిగా విత్తన శుద్ధి చేసుకోవాలి. ఈ విత్తన శుద్ధి మందులు పొడి, ద్రవ రూపంలో, కాన్సస్ట్రేట్స్ రూపంలో మార్కెట్లో అందుబాటులో ఉంటాయి. విత్తన శుద్ధి పద్ధతులు ● పొడి విత్తన శుద్ధి : డ్రమ్ముల్లో మూడింట రెండొంతులు విత్తనం వేసి సిఫార్సు చేసిన మోతాదులో మందు వేసి బాగా తిప్పితే విత్తనానికి మందు పట్టుకుంటుంది. కొన్ని రకాల విత్తనాలకు జిగురు, బెల్లం ద్రావణం, చిక్కటి గంజి ద్రావణం వంటివి కలపడం వల్ల మందు బాగా పట్టుకుని విత్తనానికి రక్షణ కవచంగా ఏర్పడి చీడ పీడల నివారణకు సాధ్యమవుతుంది. ● తడి విత్తన శుద్ధి : ముఖ్యంగా వరి విత్తన శుద్ధికి తగినంత నీటిని తీసుకుని ఆ నీటిలో సిఫార్పు చేసిన మందు కలుపుకుని నీటిలో విత్తనాలను నానబెట్టడం ద్వారా చీడ పీడల నుంచి పంటలను రక్షించుకోవచ్చు. జీవ శిలీంద్ర నాశినులతో కొన్ని రకాల జీవ శీలీంద్ర నాశినులతో ముఖ్యంగా ట్రైకోడెర్మావిరిడి. సూడోమోనాస్ వంటి వాటితో విత్తన శుద్ధి చేయడం వల్ల తెగుళ్లను కలుగచేసే శీలీంధ్రాలను నాశనం చేయడమేగాక వంట చివరి వరకు కూడా రక్షణ కల్పిస్తాయి. ఈ మందులు భూమిలోనే అభివృద్ధి చెంది తరువాత వేసే పంటలకు కూడా ఉపయోగపడతాయి. వీటి మోతాదు కిలో విత్తనానికి 8 నుంచి 30 గ్రాముల వరకు వాడుకోవాలి. సిఫార్సు చేసిన మందులతో విత్తన శుద్ధి చేసుకోవడం ద్వారా తక్కువ ఖర్చుతో పంటలను చీడపీడల బారి నుంచి రక్షించుకోవచ్చు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో 5.40 లక్షల ఎకరాల్లో వరి సాగు విత్తన శుద్ధితో పంటకు రక్షణ వరిసాగులో విత్తనశుద్ధి ద్వారా పురుగుమందుల ఖర్చు తగ్గడమేగాక పంటలో అధిక దిగుబడులు సాధించవచ్చు. సార్వా సాగుకు సిద్ధమవుతున్న రైతులు తప్పనిసరిగా విత్తన శుద్ధిపై దృష్టిపెట్టాలి. విత్తనశుద్ధికి అవసరమైన సమాచారం కోసం అందుబాటులోని వ్యవసాయశాఖాధికారులను సంప్రదించాలి. – డాక్టర్ ఎంవీ కృష్ణాజీ, వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధానశాస్త్రవేత్త, మార్టేరు -
అంజన్నకు అభిషేక సేవ
జంగారెడ్డిగూడెం : గురవాయిగూడెం గ్రామంలో తెల్ల మద్ది చెట్టు తొర్రలో స్వయంభువై వెలిసిన శ్రీ మద్ది ఆంజనేయస్వామి ఆలయం వద్ద ప్రతి శనివారం నిర్వహించే అభిషేక సేవ సందర్భంగా ఆలయ ముఖమండపంపై స్వామివారి ఉత్సవమూర్తికి అర్చక స్వాములు శాస్త్రోక్తంగా పంచామృత అభిషేకం నిర్వహించారు. కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. వివిధ సేవలు, విరాళాల ద్వారా రూ.1,42,813 సమకూరినట్లు ఈవో ఆర్వీ చందన తెలిపారు. కాలువలో వ్యాన్ బోల్తా భీమవరం అర్బన్: భీమవరం పట్టణం నుంచి గొల్లవానితిప్ప రోడ్డులో అభయాంజనేయస్వామి గుడి వద్ద శనివారం రొయ్యల లోడుతో వెళ్తున్న బోలోరో బోల్తా పడింది. వ్యానులో ఉన్న డ్రైవర్, ప్యాకింగ్ బాయ్స్ త్రుటిలో తప్పించుకున్నారు. బోలోరో వాహనాన్ని క్రేన్ సహాయంతో బయటకు తీశారు. మలుపు వద్ద రోడ్డు ఇరుకుగా ఉండటంతో గతంలో భారీ చేపల లారీలు మలుపు తిరిగేందుకు ఇబ్బందులు ఎదురయ్యేవి. ఆర్ అండ్ బీ అధికారులు స్పందించకపోవడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి వీరవాసరం: రొయ్యల చెరువు వద్ద పనిచేస్తున్న వ్యక్తి విద్యుదాఘాతంతో మృతిచెందాడు. పాలకొల్లు మండలం అరట్లకట్టకు మట్ట ఆదినారాయణ( 57) వీరవాసరం మండలం రాయకుదురులో మడుగు వద్ద రొయ్యల చెరువులపై పనిచేస్తున్నాడు. శనివారం ఉదయం 6 గంటలకు ఇంటి నుంచి బయలుదేరి చెరువుల వద్దకు వెళ్లాడు. చెరువులో ఏరియేటర్లను బిగిస్తూ ఉండగా విద్యుత్ మోటార్కు ప్రమాదవశాత్తు తగిలి షాక్కు గురై మృత్యువాత పడ్డాడు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వీరవాసరం ఎస్సై రాజ్ కుమార్ తెలిపారు. -
పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్యాయత్నం
రక్షించిన నిమ్మకాయల యార్డు ముఠా కార్మికులు ఏలూరు టౌన్: ఏలూరు పెద్ద రైల్వే స్టేషన్ సమీపంలో ఒక మహిళ తన ముగ్గురు చిన్నారులతో తమ్మిలేరులో దిగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా.. వెంటనే నిమ్మకాయల యార్డు ముఠా కార్మికులు స్పందించి సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. రైల్వే ఎస్సై సైమన్ తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లా తెనాలి చెంచుపేట, డొంకరోడ్డు ప్రాంతానికి చెందిన పందల లక్ష్మి, జాన్పాల్ దంపతులకు ముగ్గురు కుమార్తెలు. భార్యాభర్తలు శుక్రవారం రాత్రి గొడవపడ్డారు. భర్తతో వివాదం నేపథ్యంలో పిల్లలను తీసుకుని శనివారం మధ్యాహ్నం జన్మభూమి రైలు ఎక్కిన లక్ష్మి ఏలూరు పెద్ద రైల్వే స్టేషన్లో దిగింది. సమీపంలోని తమ్మిలేరుులో దూకి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించింది. కార్మికులు వెంటనే స్పందించి ఆమెను, పిల్లలను బయటకు తీసుకొచ్చారు. పిల్లలు నీళ్ళు తాగారేమో అనే అనుమానంతో ఏలూరు జీజీహెచ్కు తరలించగా.. ఆరోగ్యంగానే ఉన్నట్లు నిర్ధారించారు. ఈ లోగా భర్త జాన్పాల్, మహిళ అన్న ఏలూరు చేరుకున్నారు. రైల్వే పోలీసులు జీజీహెచ్కు చేరుకుని లక్ష్మి, ఆమె ఇద్దరు చిన్నారులను భర్త జాన్పాల్కు అప్పగించారు. -
ఒకే ఒక్కడు
పెనుమంట్ర: పెనుమంట్ర మండలంలో విద్యా శాఖ నిర్లక్ష్యంతో పాఠశాలలు మూసివేసే పరిస్థితి నెలకొంది. సరిగా పాఠశాలల విభజన జరగకపోవడంతో కొన్ని స్కూళ్లలో కేవలం ఒకరిద్దరు విద్యార్థులు మాత్రమే ఉన్నారు. మండలంలో 47 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. అందులో వెలగలవారిపాలెం (ఆర్) పాఠశాలలో ముగ్గురు విద్యార్థులు, ఎంపీపీ నాగళ్లదిబ్బ, కొయ్యేటిపాడు స్పెషల్ పాఠశాలల్లో ఒక్కో విద్యార్థి ఇప్పటి వరకు చేరారు. వెలగలవారిపాలెం పాఠశాలలో సింగిల్ టీచర్ ఉన్నప్పటికీ నాగళ్ల దిబ్బ, కొయ్యేటిపాడు పాఠశాలలకు ఉపాధ్యాయులు లేకపోవడంతో ఈ పాఠశాలల్లో ఆన్లైన్ ద్వారా ఒక్కో విద్యార్థి చేరారు. ఈ పాఠశాలలకు వేరే పాఠశాల నుంచి ఉపాధ్యాయులను డిప్యుటేషన్పై పంపుతున్నట్లు ఎంఈవో యు.నాగేశ్వరరావు శనివారం తెలిపారు. వెలగలవారిపాలెం పాఠశాలలో ముగ్గురు విద్యార్థులు ఉన్నట్లు హాజరు చూపుతున్నప్పటికీ శనివారం ఆ పాఠశాలలో ఒక్క విద్యార్థిని మాత్రమే ఉన్నారు. దళితవాడలో పాఠశాలకు నాడు–నేడులో అధునాతన భవనాలు నిర్మించారు. గత ఏడాది ఈపాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులు, 30 మంది వరకు విద్యార్థులు ఉండగా, ఈ ఏడాది ఇద్దరు ఉపాధ్యాయులతో 12 మంది విద్యార్థులు మాత్రమే ఉన్నారు. ఇదే పరిస్థితి మండలంలో అనేక ప్రభుత్వ పాఠశాలల్లో ఉంది. ఇందుకు విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యమే కారణమని పలువురు తల్లిదండ్రులు విమర్శిఽస్తున్నారు. -
ఎస్సీ క్రైస్తవులు, పాస్టర్లపై దాడులు హేయం
ఏలూరు(టూటౌన్): దేశంలో, రాష్ట్రంలో ఎస్సీ క్రైస్తవులు, పాస్టర్లపై దాడులు హేయమని, దాడులను నిరసిస్తూ ఈ నెల 30న విజయవాడలో నిర్వహించే ఆత్మీయ సమావేశాన్ని విజయవంతం చేయాలని ఆల్ ఇండియా అంబేడ్కర్ యువజన సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ మెండెం సంతోష్కుమార్ పిలుపు నిచ్చారు. స్థానిక ఇండోర్ స్టేడియం ఎదురుగా లేడీస్ క్లబ్లో ఎస్సీ క్రైస్తవులు, పాస్టర్ల ఆత్మీయ సమావేశాన్ని శనివారం నిర్వహించారు. సంతోష్ కుమార్ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్సీ క్రైస్తవులు, పాస్టర్లు, చర్చిలపై దాడులు రాజ్యాంగ విరుద్ధమైన చర్యని ఇలాంటి సంఘటనలు ఖండిస్తున్నామన్నారు. ఫాదర్ ఇంజమాల మైఖేల్, కె.శాంతి సాగర్లు మాట్లాడుతూ రిజర్వేషన్ల పేరుతో దళితులకు మత స్వేచ్ఛ లేకుండా చేయడం దళితుల ఆత్మ గౌరవాన్ని కించపరచడమే అన్నారు. సమావేశంలో ప్రొఫెసర్ ఎన్ఏడీ పాల్, పెరికె వరప్రసాదరావు, దోమతోటి అబ్రహం, నూకపెయ్యి కార్తీక్ పాల్గొన్నారు. బైక్పై నుంచి పడిన వ్యక్తి మృతి ద్వారకాతిరుమల: కుక్క అడ్డు రావడంతో బైక్పై నుంచి పడి తీవ్ర గాయాలు పాలైన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనపై స్థానిక పోలీస్టేషన్లో శనివారం కేసు నమోదైంది. ఎస్సై టి.సుధీర్ తెలిపిన వివరాలు ప్రకారం.. మండలంలోని దేవినేనివారిగూడెంకు చెందిన కూచింపూడి నాగు(45) ఈనెల 23 న ఇసీ్త్ర పెట్టెలోని బొగ్గుల కోసమని పంగిడిగూడెంకు వెళ్లాడు. తిరిగి సాయంత్రం బైక్పై స్వగ్రామానికి వెళుతుండగా, ఘటనా స్థలమైన సూర్యచంద్రరావుపేట జెర్సీ పార్లర్ వద్దకు వచ్చేసరికి అకస్మాత్తుగా కుక్క అడ్డువచ్చింది. దాంతో కుక్కను ఢీకొట్టి రోడ్డుపై పడిపోయిన నాగుకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని ఏలూరు ఆశ్రం ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ నాగు శుక్రవారం రాత్రి మృతి చెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు. సొమ్ముల రికవరీకి చర్యలు వీరవాసరం: నందమూరి గరువులో డ్వాక్రా సంఘాల్లో జరిగిన స్కాం నగదును రికవరీ చేయడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ఏపీఎం కే.జ్యోతిరాణి శనివారం తెలిపారు. 2022 నుంచి 2025 మార్చి వరకు ఖాతాల నుంచి గ్రూపు సభ్యులకు తెలియకుండా పోతుల నాగ స్వాతి, బోడపాటి సత్యవాణి నగదును కాజేశారని వివరించారు. సుమారు రూ.85 లక్షల మేర అవినీతి చోటుచేసుకుందని, బోడపాటి సత్యవాణి నుంచి సుమారు రూ.18 లక్షల మేర రికవరీ చేశామన్నారు. నాగస్వాతిపై వీరవాసరం పోలీస్ స్టేషన్ కేసు నమోదు చేసి అరెస్ట్ చేయించామన్నారు. యంత్రాలు ఇప్పిస్తానని మోసం భీమవరం: వ్యవసాయ యంత్రాలు రాయితీపై ఇప్పిస్తానని రూ.8 లక్షలు తీసుకుని మోసగించినట్లు అందిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని సీఐ ఎం.నాగరాజు తెలిపారు. పాలకొల్లుకు చెందిన కత్తుల వెంకటేశ్వరరావు భీమవరానికి చెందిన యింకి వెంకటేశ్వరరావు దగ్గర నాలుగు దఫాలుగా నగదు తీసుకున్నారన్నారు. రాయితీపై యంత్రాలు ఇప్పించలేదని ఫిర్యాదులో పేర్కొనగా ఎస్సై కృష్ణాజీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
గ్రామీణ విద్యార్థులకు బంగారు భవిత
కౌన్సెలింగ్కు ఏం కావాలి? పదో తరగతి హాల్ టిక్కెట్, మార్కుల లిస్టు, టీసీ, కాండక్ట్ సర్టిఫికెట్, స్టడీ సర్టిఫికెట్(4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు), ఎస్సీ, ఎస్టీ, బీసీలు కుల ధృవీవకరణ పత్రం, ఆదాయ ధ్రువ పత్రం, ఈడబ్ల్యుఎస్ కోటాలో సీటు పొందిన వారు ఈడబ్ల్యుఎస్ సర్టిఫికెట్, అభ్యర్థి, అతని తండ్రిది గాని, తల్లిది కాని రెండు పాసుపోర్టు ఫొటోలు, రేషన్ కార్డు, అభ్యర్థి ఆధార్ కార్డు, విద్యార్థులకు ఎవరికై నా బ్యాంకు లోన్ అవసరమైతే పైన పేర్కొన్న సర్టిఫికెట్లన్నీ నాలుగు సెట్లు, అభ్యర్థి తండ్రి ఉద్యోగి అయితే ఎంప్లాయి ఐడెంటీ కార్డు, శాలరీ సర్టిఫికెట్, అభ్యర్థి తండ్రి పాన్కార్డు, ఆధార్ కార్డు, ఓటర్ ఐడీ కార్డు తెచ్చుకోవాలి. ఎలా రావాలంటే ● ప్రకాశం, గుంటూరు జిల్లా వైపు నుంచి వచ్చేవారు విజయవాడ బస్టాండుకు చేరుకున్న తరువాత అక్కడి నుంచి ప్రతి పది నిమిషాలకు నూజివీడుకు బస్సులు ఉన్నాయి. విజయవాడ నుంచి నూజివీడుకు 40 కి.మీ. దూరం మాత్రమే. నూజివీడు బస్టాండులో దిగిన తరువాత అక్కడి నుంచి మైలవరం రోడ్డులో ఉన్న ట్రిపుల్ ఐటీకి నిత్యం ఆటోలు ఉంటాయి. ● శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల నుంచి వచ్చే విద్యార్థులు హనుమాన్జంక్షన్ బస్టాండులో గాని, రైల్వేస్టేషన్లో గాని దిగితే అక్కడి నుంచి నూజివీడుకు నిత్యం బస్సులు, ఆటోలు ఉన్నాయి. బస్సు ప్రయాణమే తక్కువ శ్రమ, సురక్షితం అనేది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు గమనించాలి. నూజివీడు: గ్రామీణ పేద వర్గాలకు చెందిన ప్రతిభా వంతులైన విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి ఇంజినీరింగ్ విద్యను అందించేందుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి ఆలోచనకు రూపమే ట్రిపుల్ ఐటీలు. ఈ ట్రిపుల్ ఐటీలను ఆర్జీయూకేటీ నిర్వహిస్తోంది. ఆరు సంవత్సరాల సమీకృత ఇంజినీరింగ్ విద్యా బోధనకు నిలయమైన ట్రిపుల్ ఐటీలో ఆహ్లాదకరమైన వాతావరణం, క్రమశిక్షణ, ఉత్తమ విద్యాబోధన నూజివీడు ట్రిపుల్ ఐటీ సొంతం. విద్యతో పాటు విద్యార్థుల మానసిక, శారీరక వికాసానికి ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, క్రీడలు, శాసీ్త్రయ సంగీతం, నాట్యం, యోగా వంటి వాటిల్లో కూడా శిక్షణనిస్తారు. ఉదయం అల్పాహారం అనంతరం అసెంబ్లీ, 8 నుంచి 12 గంటల వరకు తరగతులు, 12 నుంచి 1గంట వరకు భోజన విరామం, మళ్ళీ ఒంటి గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు తరగతులు, అనంతరం టీ, స్నాక్స్, 6 గంటల వరకు ఆటలు, రాత్రి 7 గంటలకు భోజనం, అనంతరం రాత్రి 10 గంటల వరకు స్టడీ అవర్స్.. ఇవీ ట్రిపుల్ ఐటీ విద్యార్థుల దైనందిన కార్యక్రమాలు. నూజివీడు ట్రిపుల్ ఐటీలో ఈ నెల 30, వచ్చే నెల ఒకటిన 2025–26 విద్యా సంవత్సరానికి ప్రవేశాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ప్రవేశం పొందనున్న విద్యార్థుల, వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పించేందుకు ‘సాక్షి’ అందిస్తున్న సమగ్ర కథనం. కౌన్సెలింగ్కు ఏర్పాట్లు పూర్తి నూజివీడు ట్రిపుల్ ఐటీలో ప్రథమ సంవత్సరంలో ప్రవేశానికి నిర్వహిస్తున్న కౌన్సిలింగ్లో భాగంగా ఈనెల 30న 550 మంది అభ్యర్థులకు, వచ్చే నెల 1న 550 మంది అభర్థులకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ఈ కౌన్సెలింగ్కు రాష్ట్రంలోని నలుమూలల నుంచి సీట్లు వచ్చిన అభ్యర్థులు పాల్గొననున్నారు. కౌన్సెలింగ్కు రావాల్సిన అభ్యర్థులందరికీ ఇప్పటికే ట్రిపుల్ ఐటీ అధికారులు కాల్లెటర్లు పంపడంతో పాటు వారి సెల్ఫోన్లకు మెసేజ్లు కూడా పంపారు. ట్రిపుల్ ఐటీ ఆవరణలోని స్టూడెంట్ యాక్టివిటీ సెంటర్లో కౌన్సెలింగ్ నిర్వహణకు ఏర్పాటు చేశారు. ● ఆరేళ్ల సమీకృత ఇంజినీరింగ్ విద్యలో మొదటి రెండు సంవత్సరాలు ఇంటర్కు సమానమైన పీయూసీ కోర్సును, తరువాత నాలుగు సంవత్సరాలు ఇంజినీరింగ్ విద్యను బోధిస్తారు. ● ట్రిపుల్ ఐటీలో చేరిన తరువాత విద్యార్థులు మొదటి రెండు సంవత్సరాలు ఏడాదికి రూ.45 వేలు, తరువాత నాలుగు సంవత్సరాలు ఏడాదికి రూ.50 వేలు చొప్పున చెల్లించాలి. ఫీజు రీయింబర్స్మెంట్కు అర్హత కలిగిన విద్యార్థులకు ప్రభుత్వమే చెల్లిస్తుంది. ప్రభుత్వం చెల్లించిన నగదు పోను మిగిలిన సొమ్మును విద్యార్థులే చెల్లించాల్సి ఉంటుంది. ● అన్ని సబ్జెక్టులకు ప్రతి నెలా పరీక్షలు ఉంటాయి. నాలుగు నెలల తరువాత సెమిస్టర్ పరీక్షలు ఉంటాయి. ప్రతి సెమిస్టర్ 24 వారాలు ఉంటుంది. జులై 15 నుంచి తరగతులు ప్రారంభమై నవంబరు 30 వరకు తరగతులు జరుగుతాయి. అనంతరం సెమిస్టర్ పరీక్షలు ఉంటాయి. పీయూసీలో ఎంపీసీ, ఎంబైపీసీ స్ట్రీమ్లుంటాయి. ఇంజినీరింగ్లో కెమికల్ ఇంజినీరింగ్, సివిల్ ఇంజినీరింగ్, సీఎస్ఈ, ఈసీఈ, ట్రిపుల్ ఈ, సీఎస్ఈ విత్ స్పెషలైజేషన్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజన్స్ అండ్ మెషీన్ లెర్నింగ్, మెకానికల్, మెటలర్జికల్ అండ్ మెటీరియల్ ఇంజినీరింగ్ బ్రాంచిలున్నాయి. ● సెలవు రోజులలో తల్లిదండ్రులు వచ్చి తమ పిల్లలతో గడపడానికి అవకాశం ఉంటుంది. అత్యవసర పరిస్థితులలో పిల్లలను అవసరమైతే ఇళ్ళకు పంపుతారు. ఇచ్చిన గడువులోగా తిరిగి రాకపోతే ఫైన్ విధిస్తారు. ● విద్యార్థుల ఆరోగ్యంకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. దీనికి ట్రిపుల్ఐటీ ఆవరణలోనే 30 పడకల ఆసుపత్రి ఉంది. ఇందులో 24 గంటలు వైద్యులు అందుబాటులో ఉంటారు. ● ఫీజు రీయింబర్స్మెంట్ పథకం కిందకు రాని అభ్యర్థులు మొత్తం ఫీజును చెల్లించాల్సి ఉంటుంది కాబట్టి శ్రీ డైరెక్టర్, ఆర్జీయూకేటీ ట్రిపుల్ఐటీ నూజివీడుశ్రీ పేరున డీడీని ఏజాతీయ బ్యాంకు నుంచైనా తీసుకుని ఇవ్వాలి. ● రిజిస్ట్రేషన్ ఫీజు కింద వెయ్యి రూపాయలు, ఎస్సీ ఎస్టీలు రూ.500 చెల్లించాలి. గ్రూపు ఇన్సూరెన్స్ కింద రూ.1200, రిఫండబుల్ కాషన్ డిపాజిట్ కింద ప్రతి అభ్యర్థి వెయ్యి రూపాయలు, హాస్టల్ మెయింట్నెన్స్ చార్జి వెయ్యి రూపాయలు అడ్మిషన్ సమయంలో చెల్లించాలి. ఈ నెల 30, జూలై 1న నూజివీడు ట్రిపుల్ ఐటీలో కౌన్సెలింగ్ -
శాశ్వత బ్రిడ్జి కోసం ప్రతిపాదనలు
ఉంగుటూరు: నారాయణపురం ఆర్ అండ్ బీ బ్రిడ్జి నిర్మాణ పనులు మూడు నెలల్లో మొదలు పెట్టేందుకు చర్యలు చేపడతామని రోడ్లు, భవనాల శాఖ చీఫ్ ఇంజినీర్ ఎల్.శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. శనివారం ఆర్ అండ్ బీ చీఫ్ ఇంజనీరు ఎల్.శ్రీనివాస్రెడ్డి రంధ్రాన్ని పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. రూ. 20 లక్షలతో తాత్కాలికంగా ఐరన్ షీట్ వేసి బెయిలీ బ్రిడ్జి నిర్మించడం వల్ల ఉపయోగం ఉండదన్నారు. శాశ్వత బ్రిడ్జి నిర్మించాల్సిన అవసరముందని తెలిపారు. ప్రతిపాదనలు తయారుచేసి ప్రభుత్వానికి పంపుతామని, అనుమతి రాగానే పనులు మొదలుపెడతామని చెప్పారు. 11 మీటర్ల రోడ్డు, ఇరువైపులా పాదచారులు నడిచేందుకు పుట్పాత్ డిజైన్ రూపొందిస్తామని తెలిపారు. పాడైపోయిన బ్రిడ్జిని పరిశీలించిన అనంతరం రూ.60 లక్షల చేబ్రోలు –తల్లాపురం రోడ్డులో కలిసే పుంత రహదారి అభివృద్ధి కోసం తయారచేసిన ప్రతిపాదిత రహదారిని పరిశీలించారు. చేబ్రోలు పోలీస్టేషన్ నుంచి నారాయణఫురం ఊరిలోకి కాలువగట్టు రహదారిని పరిశీలించారు. త్వరలో పంపుతామని చీఫ్ ఇంజినీర్ వెల్లడి -
చంద్రబాబువి మోసపు హామీలు
తాడేపల్లిగూడెం అర్బన్: చంద్రబాబు మోసపు హామీల కత్తి మొనకు రాష్ట్ర ప్రజల జీవితాలు వేలాడుతున్నాయని, హామీలను అమలు చేయకపోవడాన్ని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. స్థానిక క్యాంపు కార్యాలయంలో శనివారం నియోజకవర్గ నాయకులు, కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనకు, ఇప్పుడు చంద్రబాబు పాలన ను ప్రజలు బేరీజు వేసుకుంటున్నారన్నారు. జగన్ ను మించి సంక్షేమ పాలన చంద్రబాబుకు సాధ్యం కాదని మరోసారి రుజువయ్యిందన్నారు. నేడు రాష్ట్రంలో అన్ని రంగాలు, వర్గాల ప్రజలు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారన్నారు. ఆరోగ్యశ్రీ నిలుపుదల చేసి కార్పొరేట్ వైద్యం ప్రజలకు దూరం చేసిన అసమర్థ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నిలిచారని మండిపడ్డారు. పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలులో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. విద్యార్థులకు సరిపడా భోజనం సరఫరా చేయడం లేదన్నారు. సూపర్సిక్స్ పథకాలు, సీ్త్రశక్తి, ఉచిత బస్సు, ప్రతి కుటుంబానికీ ఉద్యోగం, నిరుద్యోగభృతి రూ.3 వేలు, 18 ఏళ్లు నిండిన మహిళలకు ఆడబిడ్డ నిధి, 50 ఏళ్లకే పింఛన్ హామీలు ఎప్పుడు అమలు చేస్తారని కూటమి నాయకులను ప్రశ్నించారు. కోడిపందేలు.. పేకాట క్లబ్లు నియోజకవర్గంలో కోడిపందేలు, పేకాట క్లబ్లు, దందాలు, ఇళ్లు నిర్మించుకుంటున్న వారి నుంచి అక్రమ వసూళ్ల తీరుపై ప్రతిపక్ష నేతలు ప్రశ్నిస్తుంటే కూటమి నాయకులు తట్టుకోలేకపోతున్నారన్నారు. ప్రజాప్రతినిధులు తమ ద్వారా లబ్ధి పొందుతున్న వారితో కౌంటర్ ఆఫ్ ఫైర్ అనే కొత్త రీతిలో ప్రవర్తిస్తున్నారు తప్ప ప్రతిపక్ష నేతల ప్రశ్నలు జవాబు చెప్పలేకపోతున్నారని విమర్శించారు. శాంతి, భద్రతలను నీరుగార్చిన ఘనత వీరికే దక్కిందన్నారు. పోలీసులు, అధికారులు విధుల్లో విఫలమయ్యారని మాజీ మంత్రి కొట్టు ఆరోపించారు. అసమర్థ, అవినీతి పాలన కూటమి ప్రభుత్వ అసమర్థ, అవినీతి పాలనపై వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా జూలై నుంచి నిర్వహించే కార్యక్రమాలను నియోజకవర్గ నా యకులు, కార్యకర్తలు, అభిమానులు జయప్రదం చేయాలని కొట్టు పిలుపునిచ్చారు. చంద్రబాబు ఇచ్చిన ఎన్నికల హామీలను ప్రతి కుటుంబానికీ ఏ మేరకు అందాయో రాత పూర్వక పత్రాల ద్వారా ప్రజల నుంచి వివరాలు సేకరించాలన్నారు. సూపర్ సిక్స్, పీ–4 పథకాలు వల్ల ప్రజలకు కలిగిన లబ్ధి వివరాలూ సేకరించాలన్నారు. అలాగే చంద్రబాబు ఎన్నికల సమయలో ప్రజలకు ఇచ్చిన బాండ్ల ద్వారా ప్రజలకు ఏమేరకు సంక్షేమ పథకాల లబ్ధి చేకూరిందో తెలుసుకోవాలని కోరారు. అనంతరం రాష్ట్ర పార్టీ కార్యాలయం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు క్యూర్ కోడ్, ముందు మాట, చంద్రబాబు మోసపు హామీల చిట్టా వంటి పలు రకాల పత్రాలను మంతి కొట్టు చేతులమీదుగా ఆవిష్కరించారు. పార్టీ నాయకులు కొలుకులూరి ధర్మరాజు, ముప్పిడి సంపత్కుమార్, ఎంపీపీ దాసరి హై మావతి, వైఎస్సార్సీపీ మహిళా విభాగం నాయకురాలు హుస్సేన్ బీబీ, తాడిపర్తి రజని, జిడ్డు హరిబాబు, కై గాల శ్రీనువాసు, రెడ్డి సూరిబాబు, తాడేపల్లిగూడెం పట్టణ, నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ -
నాచు పెంపకంపై అవగాహన
భీమవరం: సముద్రపు నాచు (సీ వీడ్) పెంపకంపై నరసాపురం, మొగల్తూరులో మత్స్యకార మహిళా సంఘాలకు శిక్షణ ఇప్పించి అవగాహన కల్పించాలని జేసీ టి.రాహుల్కుమార్రెడ్డి ఆదేశించారు. కలెక్టరేట్లో శనివారం మత్స్యశాఖ అధికారులతో సమీక్షించారు. 1100, పీజీఆర్ఎస్లో వచ్చిన అర్జీలను సత్వరమే పరిష్కరించాలన్నారు. జిల్లా మ త్స్య శాఖ అధికారి ఆర్వీఎస్ ప్రసాదరావు, సహా య సంచాలకులు సీహెచ్ వెంకటేశ్వరరావు, ఎల్ఎన్ రాజు, ఎఫ్డీఓలు పాల్గొన్నారు. సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలి జిల్లా జూనియర్, యూత్ రెడ్ క్రాస్ గ్రూపుల్లో విద్యార్థులు సభ్యత్వం తీసుకుని సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని జేసీ సూచించారు. కలెక్టరేట్ నుంచి ఎంఈఓలు, ప్రిన్సిపాళ్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. -
చీటీల పేరుతో రూ.5 కోట్లకు టోకరా
భీమవరం అర్బన్: చీటీల పేరుతో తోకతిప్ప గ్రామానికి చెందిన పొన్నాల వీర వెంకట సత్యనారాయణ రూ.5 కోట్ల వరకు మోసం చేసి పరారయ్యాడంటూ భీ మవరం రూరల్ స్టేషన్ ఎస్సై ఐ.వీర్రాజుకు శనివారం బాధితులు వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ వీర వెంకటరమణ గ్రామంలో నమ్మకంగా ఉంటూ 15 ఏళ్ల నుంచి చీటీల వ్యాపారం చేస్తున్నాడన్నారు. తోకతిప్పతో పాటు చుట్టుపక్కల 10 గ్రామాల్లో ఆయన చీటీల వ్యాపారం చేస్తున్నాడని, ఆయన కుమారుడు, కుమార్తె ప్రతినెలా వాయిదా సొమ్ములు వసూళ్లు చేసేవారన్నారు. ఇటీవల ఒక్కొక్కరూ 2 నుంచి 5 చీటీల వరకూ వేశామని, చీటీల గడువు ముగియగా వాయిదా ల సొమ్ము ఇవ్వమని అడిగితే రేపు మాపు అంటూ రోజులు గడుపుతున్నాడన్నా రు. కొద్ది రోజులుగా వెంకటరమణ కనిపించడం లేదని, ఆయన భార్య పద్మా వతిని అడిగితే సమాధానం చెప్పకపోగా పోలీసు కేసు పెడతానని హెచ్చరించిందన్నారు. ఈ నేపథ్యంలో వెంకటరమణ కుటుంబంతో సహా కనిపించకుండా పో యాడని, చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని ఎస్సైను అభ్యర్థించారు. కేసు విచారణ చేసి చర్యలు తీసుకుంటానని ఎస్సై వీర్రాజు హామీ ఇచ్చారు. -
రాజీకి వెళితే తల పగలగొడతారా?
దెందులూరు: గతంలో జరిగిన గొడవ పరిష్కారం నిమిత్తం రాజీకి వెళితే తలపగలగొట్టడం ఏం సంప్రదాయమని దెందులూరు మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ వర్గీయుల తీరు మారదా అని ఆయన ప్రశ్నించారు. శనివారం టీడీపీ వర్గీయుల దాడిలో తలపగిలి తీ వ్రంగా గాయపడిన ఈదా భార్గవ్ను, అతని కుటుంబ సభ్యులను రాయన్నపాలెంలోని వారి నివాసంలో కలిసి పరామర్శించారు. వ్యక్తిగతంగా, పార్టీ పరంగా బాధితులకు, వారి కుటుంబాలకు అండగా ఉంటామని అబ్బయ్యచౌదరి చెప్పారు. అసలేం జరిగిందంటే.. గత ఆదివారం యాదవ కార్పొరేషన్ డైరెక్టర్ మహే ష్యాదవ్, స్నేహితులు రాట్నాలకుంట వెళ్లి తిరిగి వస్తుండగా రాయన్నపాలెం వద్ద కొంతమంది యు వకులతో ఘర్షణ జరిగింది. ఇరువర్గాలు పరస్పరం దాడి చేసుకున్నాయి. దీనిపై మహేష్యాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో మహేష్ యా దవ్పై దాడి చేసిన వారి తల్లిదండ్రులు స్థానిక టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని వద్దకు వెళ్లి సమస్యను పరిష్కరించాలని కోరడంతో మహేష్ యాదవ్ను వ్యక్తిగతంగా కలిసి రాజీ చేసుకోవాలని ఎమ్మెల్యే చెప్పారు. దీంతో శనివారం దెందులూరులోని మ హేష్ యాదవ్కు చెందిన దాబా వద్దకు దాడి చేసిన యువకులు, వారి తల్లిదండ్రులు వెళ్లారు. వారిపై టీడీపీ నాయకులు మన్నే శ్రీనివాసరావు, బొద్దు సు రేంద్ర, మహేష్ యాదవ్ అనుచరులు దాడికి పా ల్పడి తీవ్రంగా గాయపరిచారు. విషయం తెలిసిన చింతమనేని హోటల్ వద్దకు వెళ్లి బాధితులను పరామర్శించారు. తర్వాత ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పెదవేగి సీఐ రాజశేఖర్ ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి వివరాలు తెలుసుకుని కేసు నమోదు చేయాల్సిందిగా దెందులూరు ఎస్సైని ఆదేశించారు. -
అంతా మా ఇష్టం
● వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీల్లో అధికారుల పెత్తనం ● ఉద్యోగులతో ఆప్షన్ ఫారాలపై సంతకాలు ● పీహెచ్ ఉద్యోగుల విన్నపాలు బుట్టదాఖలు తాడేపల్లిగూడెం: వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీల వ్యవహారంలో అధికారుల పెత్తనాన్ని ఉద్యోగులు వ్యతిరేకిస్తున్నారు. ఒకే చోట ఐదేళ్లు పనిచేసిన వారిని కచ్చితంగా బదిలీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ప్రాతిపదికన మున్సిపాలిటీలు, ఏలూరు కార్పొరేషన్లో బదిలీల ప్రక్రియకు ఐచ్ఛికాలను ఇవ్వడానికి ఈనెల 28న ఏలూరులోని ప్రక్రియ ఇన్చార్జి వద్దకు ఉద్యోగులు నేరుగా హాజరు కావాలనేది ఉత్తర్వుల సారాంశం. రాష్ట్రవ్యాప్తంగా శనివారం బదిలీల ప్రక్రియ చేపట్టగా ఆయా జిల్లాల ప్రక్రియ ఇన్చార్జి వద్దకు ఉద్యోగులు నే రుగా హాజరయ్యారు. అయితే ఇందుకు భిన్నంగా జిల్లాలో బదిలీ ల ప్రక్రియ నిర్వహించడం విమర్శలకు తావిస్తోంది. ఉద్యోగులు నేరుగా హాజరై ఆప్షన్లు ఇవ్వాల్సి ఉండగా ఇక్కడ మాత్రం బదిలీల ఐచ్ఛిక పత్రాలపై ఉద్యోగుల సంతకాలు తీసుకుని ఇన్చార్జి అధికారికి ఆయా మున్సిపల్ కమిషనర్లు సమర్పించారు. కమిషనర్లకు బాధ్యతలు ఉమ్మడి జిల్లాలో నరసాపురం, పాలకొల్లు, భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, కొవ్వూరు, జంగారెడ్డిగూడెం ము న్సిపాలిటీలు, ఏలూరు కార్పొరేషన్ పరిధిలో బదిలీల ప్రక్రియను పర్యవేక్షించే బాధ్యతను మున్సిపల్ కమిషనర్లకు ప్రభుత్వం అప్పగించింది. వార్డు సచివాలయంలో ఉండే ప్లానింగ్ సెక్రటరీ, ఎమినిటీస్ సెక్రటరీ, అడ్డిన్, వార్డు ప్లానింగ్ రెగ్యులేషన్ కార్యదర్శి, ఎడ్యుకేషన్ డేటా ప్రాసెసింగ్ కార్యదర్శి, వెల్ఫేర్ సెక్రటరీ, శానిటేషన్ సెక్రటరీలను బదిలీ చేయాల్సి ఉంది. ఈ మేరకు మున్సిపల్ కమిషనర్లకు బాధ్యతలు అప్పగించారు. భీమవరం కమిషనర్కు వెల్ఫేర్ సెక్రటరీలు, తణుకు కమిషనర్కు అడ్మిన్ సెక్రటరీలు, నిడదవోలు కమిషనర్కు డేటా ప్రాసెసింగ్ కార్యదర్శులు, పాలకొల్లు కమిషనర్కు శానిటేషన్ కార్యదర్శి బదిలీల ప్రక్రియను అప్పగించి, మిగిలిన కార్యదర్శుల బదిలీల ప్రక్రియను ఏలూరులోని ఇన్చార్జి అధికారి చూస్తున్నారు. సీనియార్టీ, మెరిట్, ఫిజికల్లీ ఛాలెండ్జ్ ప్రాతిపదికన జాబితాలు తయారు చేసి అధికారులకు నివేదించడంతో పాటు, ఆప్షన్ల కోసం అభ్యర్థులు నేరుగా హాజరు కావాల్సి ఉంది. అంతా తూచ్ అభ్యర్థులు నేరుగా ఏలూరులోని ప్రక్రియ ఇన్చార్జి వద్దకు హాజరుకాకుండానే మున్సిపల్ కమిషనర్లు తమతో ఆప్షన్ ఫారాలపై సంతకాలు చేయించి జాబితాలను ఏలూరు పంపించినట్టు ఉద్యోగులు చెబుతున్నారు. ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ఉద్యోగుల అభ్యర్థలను బుట్టదాఖలు చేశారని అంటున్నారు. ప్రస్తుత మున్సిపాలిటీలో పనిచేయాలంటే మూడు ఆప్షన్లను ఎంచుకోవాలని, మిగిలిన విషయాలు పర్యవేక్షక అధికారులు చూసుకుంటారని ఉన్నతాధికారులు చెప్పినట్టు సమాచారం. ఆప్షన్ ఫారమ్స్ ఇవ్వని ఉద్యోగులకు వారి ఆప్షన్లతో సంబంధం లేకుండా బదిలీ చేస్తారని అధికారులు స్పష్టం చేశారు. పొలిటికల్ రిఫరెన్స్ లేఖలు, మెడికల్ సర్టిఫికెట్లు, స్పౌజ్ సర్టిఫికెట్లను ఆప్షన్ ఫామ్స్కు జత చేసి ఇవ్వాలని ఆదేశించారు. -
ఓటర్ల సవరణపై సమీక్ష
భీమవరం (ప్రకాశంచౌక్): 2025 ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్లో శనివారం రాజకీయ పార్టీల ప్రతినిధులతో డీఆర్వో మొగిలి వెంకటేశ్వర్లు సమావేశం నిర్వహించారు. కొత్త ఓటర్ల నమోదు, జాబితాలో సవరణలు, పోలింగ్ స్టేషన్లలో మౌలిక వసతులు, ఎలక్ట్రోరల్ రోల్స్ ప్యూరిఫికేషన్ విషయంలో సహకరించాలని కోరారు. ఈ ఏడాదిలో కొత్తగా ఓటరు దరఖాస్తులు 6,873 రాగా 6,187 ఆమోదించామని చెప్పారు. అలాగే ఓటరు జాబితా నుంచి తొలగింపుల కోసం 1,191 దరఖాస్తులు వచ్చాయన్నారు. ఓటర్ల మార్పులు, చేర్పులకు 15,735 దరఖాస్తులకు 14,788 ఆమోదించామన్నారు. జిల్లాలో పురుషులు 7,20,684 మంది, మహిళలు 7,50,377 మంది, థర్డ్ జెండర్స్ 77 మంది మొత్తం ఓటర్లు 14,71,138 ఉన్నారన్నారు. ఎన్నికల సూపరింటెండెంట్ ఎం.సన్యాసిరావు, ఐఎన్సీ ప్రతినిధి టి.వంశీ శ్రీనివాసరెడ్డి, రాజకీయ పార్టీల ప్రతినిధులు బి.జయశివ, ఎం.రత్నరాజు పాల్గొన్నారు. ధాన్యం సొమ్ముల కోసం రేపు ధర్నా భీమవరం: ప్రభుత్వానికి ధాన్యం విక్రయించిన రైతులకు సొమ్ములు చెల్లించకుండా తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని, ధాన్యం సొమ్ముల కోసం నిలదీసేందుకు ఏపీ కౌలురైతుల సంఘం ఆధ్వర్యంలో సోమవారం భీమవరం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించనున్నట్టు సంఘ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.సుబ్బరాజు, ఎం.రామాంజనేయులు శనివారం తెలిపారు. ధాన్యం అమ్మి రెండు నెలలు గడిచినా ఇప్పటికీ సొమ్ములు ఇవ్వకపోవడంతో పంట పెట్టుబడులకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. సార్వా పనుల కోసం ప్రైవేట్ వ్యక్తుల వద్ద వడ్డీలకు తేవాల్సి వస్తోందన్నారు. ధర్నాకు రైతులు పెద్ద సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని కోరారు. గీత వృత్తిపై ప్రభుత్వం కక్ష తణుకు అర్బన్: బెల్టు షాపులను అరికట్టి అక్రమ మద్యం అమ్మకాలను నిలుపుదల చేయాలని ఏపీ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జుత్తిగ నరసింహమూర్తి అన్నారు. శనివారం స్థానిక అమరవీరుల భవనంలో నిర్వహించిన ఏపీ కల్లుగీత సంఘం జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రకృతి సిద్ధమైన తాటికల్లుపై ప్రభుత్వం కక్ష కట్టి అక్రమ మద్యం, ఊరువాడా బెల్టు షాపుల్లో అమ్మకాలు చేస్తూ కల్లు అమ్మకాలను నిర్వీర్యం చేస్తున్నారన్నారు. గీత వృత్తిపై ప్రభుత్వం కక్ష కట్టిందన్నా రు. జిల్లా అధ్యక్షుడు కామన మునిస్వామి మా ట్లాడుతూ మద్యం విచ్చలవిడి అమ్మకాలతో ప లు కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయన్నారు. జూలై 14న కల్లుగీత కార్మికుల వెతలు కలెక్టర్కు చెప్పుకుందాం కార్యక్రమానికి భీమవరం తరలిరావాలని కోరారు. రాష్ట్ర సహాయ కార్యదర్శి బొక్క చంటి, జిల్లా ఉపాధ్యక్షుడు కడలి పాండు పాల్గొన్నారు. అత్యవసర సర్వీసుల విధుల బహిష్కరణ నరసాపురం: మున్సిపల్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల ఆందోళనలో భాగంగా అత్యవసర సేవల విధులు కూడా బహిష్కరించాలని నిర్ణయించినట్టు జేఏసీ నాయకులు తెలిపారు. ఆదివారం అర్ధరాత్రి నుంచి వీధి దీపాల నిర్వహణ, మంచినీటి సరఫరా పనులు నిర్వహణను కూడా బహిష్కరిస్తామన్నారు. తాము సమ్మెలో ఉన్నా ప్రజలు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ప్రస్తుతం ఈ విధులు నిర్వహిస్తున్నామని, అయితే ఆందోళనకు ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఆషాఢం ఎఫెక్ట్ ద్వారకాతిరుమల: చినవెంకన్న క్షేత్రంపై ఆషా ఢం ఎఫెక్ట్ పడింది. దీంతో శనివారం భక్తుల రద్దీ బాగా తగ్గింది. సాధారణంగా భక్తుల రాక ఎక్కువగా ఉండాల్సి ఉండగా సాధారణంగానే కనిపించింది. ఆలయంలో అన్ని విభాగాల్లో భక్తులు నామమాత్రంగా కనిపించారు. -
మున్సిపల్ కార్మికుల గోడు పట్టదా?
భీమవరం(ప్రకాశం చౌక్): చాలిచాలనీ జీతంలో జీవనం కష్టం మారింది.. కుటుంబాలను పోషించుకోలేకపోతున్నాం.. అంటున్న మున్సిపల్ మున్సిపల్ ఇంజనీరింగ్ అవుట్ సోర్సింగ్ కార్మికుల ఆవేదనను కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. వీరి సమస్యల పరిష్కారానికి దయ చూపడం లేదు. పలు మార్గాల్లో నిరసనలు, ఆందోళనలు తెలిపిన కార్మికులకు గత్యంతరం లేక సమ్మెబాట పట్టారు. రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న సమ్మెలో భాగంగా భీమవరం మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు దీక్షలు చేపట్టి నిరసన తెలుపుతున్నారు. భీమవరం మున్సిపల్ కార్యాలయం వద్ద ఆరు రోజులగా ఇంజనీరింగ్ విభాగంలోని ఎలక్ట్రికల్, ప్లంబింగ్, వాటర్ వర్క్స్ కార్మికులు సమ్మెలో పాల్గొంటున్నారు. పట్టణంలో రోడ్ల నిర్వహణ, తాగునీరు, విద్యుత్ సరఫరాలో వీరి సేవలు కీలకం. వీరంతా సమ్మెలో ఉండటంతో పట్టణ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కూటమి ప్రభుత్వ వంచన తాము అధికారంలోకి వస్తే మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులకు సంక్షేమ పథకాలు అమలు చేస్తామని మేనిఫెస్టోలో కూటమి నాయకులు ప్రకటించారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేసిన తల్లికి వందనం పథకం ఇంజనీరింగ్ కార్మికులు అందలేదు. భీమవరం మున్సిపాలిటిలో 65 మంది కార్మికులు పనిచేస్తున్నారు. వారంతా తల్లికి వందనం పథకానికి అర్హులైనా అమలు చేయలేదు. కార్మికులు.. అప్పులపాలు కార్మికులకు కటింగ్లు పోను వచ్చే వేతనాలు కుటుంబపోషణ, పిల్లల చదువులకు సరిపోక పోవడంతో వీరు అప్పులపాలవుతున్నారు. రోజురోజుకూ పెరుగుపోతున్న నిత్యావసర సరుకుల ధరలు, స్కూల్ ఫీజులు, ఇతర కుటుంబ ఖర్చుల భారంగా మారాయి. బడుగులు.. కుదేలు సమ్మెలోనే మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు ఆరు రోజులుగా దీక్షలు, నిరసనలు ఉద్యోగ భద్రత, వేతనాల పెంపునకు డిమాండ్ సమస్యలను పట్టించుకోని కూటమి ప్రభుత్వం ప్రధాన డిమాండ్లు కార్మికులకు టెక్నికల్ జీతం రూ.29,200, నాన్ టెక్నికల్ రూ.24,500 అమలు చేయాలి. కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారం సంక్షేమ పథకాలు ఇవ్వాలి. హెచ్ఆర్ పాలసీ పరిధిలోకి తీసుకురావాలి కార్మికులందరికీ మినిమం టైమ్ స్కేల్ వర్తింపజేయాలి అవుట్ సోర్సింగ్ పద్ధతిపై 20 ఏళ్ల నుంచి పనిచేస్తున్న వారికి సర్వీసు బట్టి 6 శాతం ఇంక్రిమెంట్తో జీతం పెంచాలి. రిటైర్మెంట్ బెన్ఫిట్స్ కింద కార్మికులకు రూ. 10 లక్షలు, నెలకి పెన్షన్ రూ.10 వేలు ఇవ్వాలి. కారుణ్య నియామకాలు అమలుచేయాలి కార్మికులకు గ్రాట్యూటీ ఇవ్వాలి జాతీయ పండుగలు, క్యాజువల్ లీవ్లు, వారాంతపు సెలవులు అమలు చేయాలి. హెల్త్కార్డులు, ఏడాదికి 30 మెడికల్ లీవ్లు మంజారు చేయాలి. రిటైర్మెంట్, చనిపోయినా, అనారోగ్యం పా లైతే వారి పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలి. -
కాలువలోకి దూసుకెళ్లిన టూరిస్టు బస్సు
చాకచక్యంగా వ్యవహరించిన డ్రైవర్ పెదకాకాని: ప్రయాణికులతో వస్తున్న బస్సు కాలువలోకి దూసుకెళ్లింది. ప్రమాదం తృటిలో తప్పింది. తణుకు నుంచి అరుణాచలం తీర్థయాత్రకు 39 మంది ప్రయాణికులతో టూరిస్టు బస్సు బయలు దేరింది. వారు శుక్రవారం రాత్రి గుంటూరు జిల్లా పెదకాకాని శివాలయంలో నిద్ర చేసి ఉదయం బ యలుదేరాలని నిర్ణయించుకోవడం డ్రైవర్ సర్వీసు రోడ్డులో బస్సును నడుపుతున్నాడు. వారు పెద కాకాని మండలం నంబూరు అరబిక్ స్కూల్ స మీపంలోకి చేరుకునే సరికి బస్సు నడుపుతున్న డ్రైవర్ ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యాడు. బస్సు అదుపుతప్పి జాతీయ రహదారి పక్కనే ఉన్న కల్వర్టు వంతెనపైకి ఎక్కి ఆగింది. బస్సులో ప్రయాణిస్తున్న వారంతా భయంతో కేకలు వేశారు. పలువురి స్వల్ప గాయాలయ్యాయి. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని విచారణ చేపట్టారు. -
పారిశుద్ధ్య నిర్వహణపై శ్రద్ధ
భీమవరం (ప్రకాశంచౌక్): భీమవరంలో చేపట్టిన అభివృద్ధి పనులు పూర్తిచేసేలా ప్రత్యేక శ్రద్ధ చూపా లని కలెక్టర్ సీహెచ్ నాగరాణి ఆదేశించారు. శుక్రవారాం క్యాంపు కార్యాలయం నుంచి భవ్య భీమవరం, పారిశుద్ధ్య నిర్వహణ, పార్కుల అభివృద్ధి, రోడ్ల ఆక్రమణల తొలగింపు తదితర అంశాలపై అధికారులతో సమీక్షించారు. భీమవరంలో దాతల సహకారంతో చేపట్టిన పనులు వేగంగా పూర్తిచేయాలన్నారు. మౌలిక సదుపాయాల కల్పనపై ఆరా తీశారు. అనుమతులు లేని హోర్డింగ్లు తొలగించాలని, వాహనాల పార్కింగ్ ప్రాంతాలు గుర్తించాలన్నారు. పారిశుద్ధ్య నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే సహించమన్నారు. జిల్లాలో ప్లాస్టిక్ నిషేధాన్ని పక్కాగా అమలు చేయాలన్నారు. సూర్యఘర్ పథకంపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. జేసీ టి.రాహుల్కుమార్రెడ్డి, ఆర్డీఓ కె.ప్రవీణ్కుమార్రెడ్డి, మున్సిపల్ కమిషనర్ కె.రామచంద్రా రెడ్డి, టౌన్ ప్లానింగ్ అధికారి పార్థసారథి, అధికారులు పాల్గొన్నారు. డీఎస్సీ పరీక్షలకు 84 శాతం హాజరు భీమవరం: జిల్లాలోని మూడు కేంద్రాల్లో శుక్రవారం నిర్వహించిన డీఎస్సీ పరీక్షలకు 84 శాతం అభ్యర్థులు హాజరయ్యారని డీఈఓ ఈ.నారాయణ శుక్రవారం తెలిపారు. ఉదయం 360 మందికి 303 మంది, మధ్యాహ్నం 360 మందికి 305 మంది హాజరయ్యారన్నారు. ఎక్కడా మాల్ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని చెప్పారు. -
అక్రమ కేసులకు భయపడే ప్రసక్తే లేదు
నరసాపురం: కూటమి ప్రభుత్వ అక్రమ కేసులకు భయపడే ప్రసక్తి లేదని, పార్టీ నాయకులు, కార్యకర్తలకు అండగా ఉంటామని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు అన్నారు. పట్టణంలోని పార్టీ కార్యాలయం వద్ద శుక్రవారం నరసాపురం మండల కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశాన్ని మండల అధ్యక్షుడు ఉంగరాల రమేష్నాయుడు అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్య అతిథిగా ముదునూరి మాట్లాడుతూ కార్యకర్తల త్యాగాలను పార్టీ అధినేత వైఎస్ జగన్ మరిచిపోలేదన్నారు. కార్యకర్తలు ఏమాత్రం అధైర్య పడొద్దని, ప్రజా సమస్యలపై పోరాడాలని పిలుపునిచ్చారు. మోసపూరిత హామీలతో గద్దెనెక్కిన కూటమి పాలన ఏడాదిలోనే ప్రజావిశ్వాశాన్ని కోల్పోయిందన్నారు. గత ప్రభుత్వంలో స్వర్ణయుగాన్ని చూసి ప్రజలు నేడు పలు అవస్థలు పడుతున్నారన్నారు. విద్యార్థులు, మహిళలు, కార్మికులు, ఉద్యోగులు, యు వత, రైతులు ఇలా అన్ని వర్గాలూ జగన్ని ఎందుకు ఓడించమనే ఆలోచనలో పడ్డాయన్నారు. హామీలపై నోరు మెదపరే? ఎన్నికల సమయంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్లు మాజీ సీఎం జగన్ కంటే ఎక్కువ పథకాలు ఇస్తామని ప్రజలను నమ్మించి మోసం చేశారని ముదునూరి మండిపడ్డారు. రైతు భరోసా రూ.20 వేలు, మహిళలకు ఉచిత బస్సు, ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు 50 ఏళ్లకే ఫించన్, 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1,500 వంటి ఎన్నో హామీలు ఇచ్చి ఇప్పుడు మొఖం చాటేశారని దుయ్యబట్టారు. గత ప్రభుత్వంలో రాష్ట్రంలో 68 లక్షల మందికి పింఛన్లు ఇస్తే ఇప్పుడు 60 లక్షల మందికే పరిమితం చేశారన్నారు. అలాగే ఏడాదిలోనే ప్రజలపై రూ.16 వేల కోట్లు విద్యుత్ భారాలను మోపారన్నారు. సూపర్సిక్స్ హామీలను గాలికి వదిలేశారన్నారు. కూటమి మోసాలను ప్రజలకు వివరించే బృహత్తర బాధ్యత వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై ఉందన్నారు. ప్రాజెక్టులను పట్టించుకోరా.. నరసాపురం నియోజకవర్గంలో రూ.650 కోట్లతో వశిష్ట వంతెన, రూ.400 కోట్లతో ఆక్వా యూనివర్సిటీ, బియ్యపుతిప్ప ఫిషింగ్ హార్బర్ వంటి ప్రాజెక్టులను గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో తీసుకువస్తే కూటమి నాయకులు ఇప్పుడు ఎందుకు పట్టించుకోవడంలేదని ముదునూరి ప్రశ్నించారు. పక్కా జీఓలతో, నిధులు మంజూరు చేయించిన ప్రా జెక్టులు పూర్తి చేసి ఆ ఘనతను కూటమి నాయకులే పొందచ్చు కదా అని అన్నారు. మున్సిపల్ చైర్పర్సన్ బర్రి శ్రీవెంకటరమణ, ఎంబీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పెండ్ర వీరన్న మాట్లాడుతూ జగన్ ఆందోళనలు తర్వాతే కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పథకం అమలు చేసిందన్నారు. పార్టీ అ గ్నికుల క్షత్రియ విభాగ రాష్ట్ర అధ్యక్షుడు తిరుమాని నాగరాజు, పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు పీడీ రాజు, జెడ్పీటీసీలు బొక్కా రాధాకృష్ణ, తిరు మాని బాబ్జి, స్టేట్ మైనార్టీ సెల్ అఫీషియల్ స్పోక్స్పర్సన్ షేక్ బులిమస్తాన్, సోషల్ మీడియా జిల్లా కన్వీనర్ బందన పూర్ణ, నరసాపురం ఎంపీపీ మైలాబత్తుల సోనీ, రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి పోలిశెట్టి గోపీ, స్టేట్ పబ్లిసిటీ విభాగ కార్యదర్శి ఇంజేటి జాన్ కెన్నడీ మాట్లాడారు. ఈపార్టీ నేతలు వైకేఎస్, పప్పుల రామారావు, కొల్లాబత్తుల రవి, కడలి రాంబాబు, పలువురు కౌన్సిలర్లు, సర్పంచ్లు, నాయ కులు, కార్యకర్తలు పాల్గొన్నారు. హామీలతో ఊదరగొట్టి.. అధికారంలోకొచ్చాక గాలికొదిలేశారు ఏడాదిలోనే కూటమి సర్కార్ ప్రజావిశ్వాసం కోల్పోయింది కార్యకర్తలు అధైర్య పడొద్దు.. రానున్న రోజులు మనవే వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి -
రిజిస్ట్రార్ కార్యాలయానికి ‘దారి’ చూపారు
ఉండి: ‘నీరు నిలిస్తే దారి గల్లంతే’ శీర్షికను ఈనెల 26న ‘సాక్షి’లో ప్రచురించిన కథనానికి అధికారులు స్పందించారు. ఉండిలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం దారి బురదతో నిండి ఉండటంతో చర్యలు తీసుకున్నారు. కార్యాలయ ముఖ ద్వారంతో పాటు కార్యాలయం చుట్టూ మెటల్ (చిప్స్) వేసి మరమ్మతులు చేపట్టారు. సమస్య పరిష్కారానికి కృషి చేసిన ‘సాక్షి’కి పలువురు కృతజ్ఞతలు తెలిపారు. కాల్ సెంటర్ అర్జీలపై ప్రత్యేక దృష్టి భీమవరం (ప్రకాశంచౌక్): సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటుచేసిన 1100 కాల్ సెంటర్కు అందిన అర్జీల పరిష్కారంపై తక్షణ చర్యలు తీసుకోవాలని జేసీ టి.రాహుల్కుమార్రెడ్డి ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో కాల్ సెంటర్ అర్జీల పురోగతిపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ అర్జీలను నిర్ణీత గడువులోపు క్షేత్రస్థాయిలో విచారణ చేసి పరిష్కరించాలన్నారు. అలాగే పీజీఆర్ఎస్ ద్వారా వచ్చిన ఫిర్యాదుల పరిష్కారంలో కొన్ని శాఖల అధికారులు నిర్లక్ష్య వైఖరి కనిపిస్తోందని, చర్యలు తప్పవని హెచ్చరించారు. డీఆర్వో మొగిలి వెంకటేశ్వర్లు, డ్వామా పీడీ కేసీహెచ్ అప్పారావు, డీపీఓ రామ్నాథ్రెడ్డి, డీఎంహెచ్ఓ గీతాబాయి తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ మీటర్ రీడర్లసమస్యలు పరిష్కరించాలి ఏలూరు (టూటౌన్): విద్యుత్ మీటర్ రీడర్ల సమస్యలను పరిష్కరించాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు రెడ్డి శ్రీనివాస్ డాంగే డిమాండ్ చేశారు. శుక్రవారం ఏపీ విద్యుత్ మీటర్ రీడర్స్ యూనియన్ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా సమావేశాన్ని ఏలూరులో యూనియన్ జిల్లా కోశాధికారి మల్లేశ్వరరావు అధ్యక్షతన నిర్వహించారు. జిల్లా గౌరవ అధ్యక్షుడు, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు రెడ్డి శ్రీనివాస్ డాంగే, జిల్లా నాయకులు పి.కిషోర్ మాట్లాడుతూ ఎస్క్రో అకౌంట్ను తక్షణమే ఓపెన్ చేయాలని, మీటర్ రీడర్లకు ప్రత్యామ్నాయ ఉపాధి చూపాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రామకృష్ణ, జిల్లా ఉపాధ్యక్షుడు పి.జాకబ్ మాట్లాడుతూ మీటర్ రీడర్లు కాంట్రాక్టర్లు, విద్యుత్ శాఖ అధికారులతో పలు సమస్యలు ఎదుర్కొంటున్నారన్నారు. జిల్లా సహాయ కార్యదర్శులు ఎ.దుర్గారావు, స్వామి, శంకర్ అప్పారావు, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ శేఖర్ నాగేశ్వరావు తదితరులు పాల్గొన్నారు. గ్రీన్ఫీల్డ్ పనులను అడ్డుకున్న రైతులు జంగారెడ్డిగూడెం: గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణంలో పొలాలకు వెళ్లేందుకు దారి ఏర్పాటు చేయకపోవడంతో ఇబ్బంది పడుతున్నామంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం మండలంలోని పుట్లగట్లగూడెం గ్రీన్ఫీల్డ్ హైవే వద్ద రైతులు రాస్తారోకో చేసి పనులను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హైవే సర్వీస్ రోడ్డు పక్క నుంచి పొలాలకు వెళ్లే దారి ఇస్తామని చెప్పి, ఇవ్వకుండా సర్వీసు రోడ్డు నిర్మాణం చేపట్టారన్నారు. అలాగే హైవే పక్కనే ఉన్న కొంగల చెరువు సర్ప్లస్ వాటర్ దిగువ ప్రాంతాలకు వెళ్లే మురుగు కాలువను పూడ్చడంతో వరద ముంపు నీరు పొలాలను ముంచెత్తుతోందన్నారు. -
మత్స్య విద్య ఎదురీత
డీఈడీ ప్రవేశ పరీక్షలో ప్రతిభ భీమవరం: భీమవరానికి చెందిన సంగడి ఏదిత హాసిని డీఈడీ (టీచర్స్ ట్రైనింగ్) కోర్సు ప్రవేశ పరీక్షలో రాష్ట్రస్థాయిలో ఏడో ర్యాంక్ సాధించింది. ఆమె తండ్రి శ్రీకృష్ణ మావుళ్లయ్య ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. జల విద్యుత్ కేంద్ర పనుల పరిశీలన పోలవరం ప్రాజెక్ట్ పూర్తయ్యే సమయానికి జల విద్యుత్ కేంద్రాన్ని కూడా సిద్ధం చేయాలని ఏపీ జెన్కో డైరెక్టర్ (హైడల్) ఎం.సుజయ్కుమార్ అన్నారు. 8లో uశనివారం శ్రీ 28 శ్రీ జూన్ శ్రీ 20258లో● నరసాపురంలోని ఏపీ ఫిషరీస్ యూనివర్సిటీకి నిర్లక్ష్యపు గ్రహణం ● కూటమి నిర్వాకం వల్ల ఏడాదిగా నిలిచిన వర్సిటీ నిర్మాణం ● రెండేళ్లుగా తాత్కాలిక భవనంలోనే కళాశాల నిర్వహణ ● సెకండ్ బ్యాచ్కు గదుల్లేక ఆర్బీకేలో తరగతులు ● హాస్టల్ వసతి లేక విద్యార్థుల ఇక్కట్లు సెక్యూరిటీ లేదు క్యాంపస్ హాస్టల్ సదుపాయం లేక బయట అద్దె గదుల్లో ఉండాల్సి వస్తోంది. భద్రతాపరంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. ఆకతాయిల బెడద ఉంటోంది. – సి.ధరణి, కర్నూలు, ద్వితీయ సంవత్సరం విద్యార్థిని చాలా ఇబ్బంది పడుతున్నాం క్యాంపస్ సదుపాయం లేకపోవడంతో చాలా ఇబ్బందిగా ఉంటోంది. హాస్టల్ నిమి త్తం నెలకు రూ.7 వేల వరకు ఖర్చరవుతున్నాయి. కాలేజీకి కిలోమీటరు పైగా నడవాల్సి వస్తోంది. – వి.రాకేష్, ఒంగోలు, మొదటి సంవత్సరం విద్యార్థి హాస్టల్ వసతి కల్పించాలి ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ చదువుకుంటున్నాం. క్యాంపస్ హాస్టల్ ఉంటే బాగుంటుంది. యూనివర్సిటీ భవనాలు వేగంగా పూర్తిచేయాలి. క్రీడా మైదానం, ల్యాబ్ వసతులు కల్పించాలి. – దేవీ ప్రసాద్దొర, పార్వతీపురం, మొదటి సంవత్సరం విద్యార్థి సాక్షి, భీమవరం: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా లోని నరసాపురంలో ఏర్పాటు చేసిన ఫిషరీస్ యూనివర్సిటీ వసతుల్లేక సతమతమవుతోంది. మత్స్య విద్య ఏటికేడు ఎదురీదుతోంది. దీనికి కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం. గత ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏపీ ఫిషరీస్ యూనివర్సిటీని మంజూరు చేశారు. రాష్ట్రంలో ఇది రెండో ఫిషరీస్ యూనివర్సిటీ. యూనివర్సిటీ క్యాంపస్ కోసం నరసాపురం పక్కనే 40 ఎకరాల స్థలాన్ని గత ప్రభుత్వం కేటాయించింది. అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్, కాలేజీ, బాయ్స్, గరల్స్ హాస్టల్ భవనాల కోసం రూ.100 కోట్లు మంజూరు చేసింది. రెండేళ్లుగా తాత్కాలిక భవనంలోనే.. తొలుత ఏడాది కాలానికి నరసాపురంలోని తుపా ను షెల్టర్ భవనంలో తాత్కాలికంగా 66 సీట్లతో 2023 జూన్లో నాలుగేళ్ల కాలపరిమితి కలిగిన బ్యాచిలర్ ఆఫ్ ఫిషరీస్ సైన్స్ కోర్సును ప్రారంభించారు. 2024 నాటికి క్యాంపస్లో తరగతులు నిర్వహించాలన్న లక్ష్యంతో శరవేగంగా నిర్మాణ పనులు చేపట్టారు. గత ఏడాది మార్చి నాటికే అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్, కళాశాల భవనాలు శ్లాబ్ దశకు చేరుకోగా, బాయ్స్, గరల్స్ హాస్టల్ భవనాల పునాదులు పూర్తయ్యాయి. దాదాపు రూ.35 కోట్ల విలువైన పనులు గత ప్రభుత్వ హయాంలోనే జరగగా.. కూటమి ప్రభుత్వం వచ్చాక నిర్మాణాలను అటకెక్కించింది. నిధులివ్వకపోవడంతో పనులు ముందుకు సాగడం లేదు. ఫలితంగా రెండేళ్ల నుంచి తాత్కాలిక భవనంలోనే తరగతులను నిర్వహించాల్సిన దుస్థితి నెలకొంది. ఇక్కడ వసతులు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఆర్బీకే భవనంలో సెకండ్ బ్యాచ్ ప్రస్తుత తాత్కాలిక భవనంలోని 12 గదులు 66 మంది స్టూడెంట్స్ కలిగిన ఒక బ్యాచ్కు మాత్రమే తరగతులు, ల్యాబ్ నిర్వహణకు సరిపోతున్నాయి. 2024 జూలై నుంచి మరో 66 మందితో సెకండ్ బ్యాచ్ మొదలు కావడంతో పక్కనే ఉన్న ఆర్బీకే భవనంలోని హాల్ను తరగతి గదిగా, స్టాఫ్ రూ మ్ను కంప్యూటర్ ల్యాబ్గా వినియోగిస్తుండటం గమనార్హం. ప్రైవేటు మెస్లు, అద్దె గదులే గతి! క్యాంపస్ హాస్టల్ లేక రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు ప్రైవేటు మెస్లు, అద్దె గదులను ఆశ్రయించాల్సి వస్తోంది. గదులను బట్టి ఒక్కో విద్యార్థికి నెలకు రూ.5 వేల నుంచి రూ.7 వేల వరకు ఖర్చవుతోంది. విద్యార్థినులు భద్ర తాపరంగా ఆందోళన చెందుతున్నారు. కళాశాలకు వచ్చే వెళ్లే దారిలో ఆకతాయిల బెడద ఎక్కువగా ఉంటోందని చెబుతున్నారు. కళాశాల వద్ద క్రీడా మైదానం కూడా లేకపోవడంతో విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు. కొత్త బ్యాచ్ పరిస్థితి ఏమిటి? సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ విద్యార్థులు 132 మంది ఉండగా, ప్రస్తుత విద్యా సంవత్సరానికి జూలై నుంచి 66 మందితో ఫస్ట్ ఇయర్ సీట్ల భర్తీ జరగనుంది. కొత్త బ్యాచ్కు అక్టోబరులో తరగతులు ప్రా రంభమవుతాయి. ఈ నేపథ్యంలో వీరికి క్లాసులు ఎక్కడ నిర్వహిస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది. స్థానికంగా ప్రైవేట్ విద్యాసంస్థలో తరగతుల నిర్వహణకు యత్నాలు జరుగుతున్నట్టు కళాశాల వర్గాలు చెబుతున్నాయి. న్యూస్రీల్ఆర్బీకేనే తరగతి..! రైతు భరోసా కేంద్రం (ఆర్బీకే) నుంచి వస్తున్న వీరంతా రైతులు కాదు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో నరసాపురం కేంద్రంగా గత ప్రభుత్వం ఏర్పాటుచేసిన ఏపీ ఫిషరీస్ యూనివర్సిటీ విద్యార్థులు వీరు. ప్రస్తుత కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఏడాది కాలంగా యూనివర్సిటీ నిర్మాణ పనులు నిలిచిపోవడంతో కళాశాల నిర్వహిస్తున్న తాత్కాలిక భవనంలో సెకండ్ బ్యాచ్ విద్యార్థులకు గదుల్లేవు. ఫలితంగా పక్కనే ఉన్న ఆర్బీకే భవనంలోని చాలీచాలని హాల్లోనే వీరికి తరగతులు నిర్వహించారు. -
పోక్సో కేసులో 20 ఏళ్ల జైలు
స్పీడ్ ట్రయల్ కోర్టు న్యాయమూర్తి తీర్పు ఏలూరు టౌన్ : బాలికలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్న నిందితులకు కఠిన శిక్షలు పడేలా ఏలూరు జిల్లా పోలీస్ యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. జంగారెడ్డిగూడెం సుబ్బంపేట కాలనీలో ఏడాదిన్నర క్రితం బాలికపై లైంగిక దాడికి పాల్పడిన షేక్ ఇబ్రహీంకు 20 ఏళ్ళ జైలు శిక్ష, రూ.5 వేల జరిమానా విధిస్తూ ఏలూరు స్పెషల్ కోర్టు ఫర్ స్పీడ్ ట్రయల్ ఆఫ్ అఫెన్స్ అండర్ పోక్సో యాక్ట్ కోర్టు న్యాయమూర్తి కే.వాణిశ్రీ తీర్పు చెప్పారు. బాధిత బాలికకు రూ.50 వేల నష్టపరిహారం అందజేయాలని ఆదేశించారు. జంగారెడ్డిగూడెం సాయిబాబా గుడి వెనుక సుబ్బంపేట కాలనీకి చెందిన షేక్ ఇబ్రహీం మెడికల్ షాపు నిర్వహిస్తున్నాడు. అతను బాధిత బాలిక పాఠశాలకు, ట్యూషన్కు వెళ్ళే సమయాల్లో తినుబండారాలు ఇస్తూ మాయమాటలు చెప్పి లోబర్చుకున్నాడు. 2024 ఫిబ్రవరి 6కు ముందు అనేక మార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలిక ఇంటికి ఆలస్యంగా రావటం గమనించిన నానమ్మ బాలికను ప్రశ్నించగా.. భయపడుతూ విషయాన్ని చెప్పింది. 2024 ఫిబ్రవరి 10న నానమ్మ జంగారెడ్డిగూడెం పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా అప్పటి ఎస్ఐ జ్యోతిబసు కేసు నమోదు చేశారు. అప్పటి సీఐ ఎం.ధనుంజయడు, జంగారెడ్డిగూడెం డీఎస్పీ యూ.రవిచంద్ర కేసును ప్రత్యేకంగా తీసుకుని దర్యాప్తు చేశారు. పోక్సో కోర్టు ప్రత్యేక ప్రభుత్వ న్యాయవాది వీ.అమర శ్రీనివాస్ వాదనలు వినిపించారు. నేరానికి పాల్పడినట్లు నిర్ధారిస్తూ ఇబ్రహీంకు 20 ఏళ్ళ జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. నిందితులకు కఠిన శిక్షలు పడడంతో ప్రతిభ చూపిన పోలీసు అధికారులు, సిబ్బందిని జిల్లా ఎస్పీ కేపీ శివకిషోర్ అభినందించారు. -
జల విద్యుత్ కేంద్రం పనుల పరిశీలన
పోలవరం రూరల్ : పోలవరం ప్రాజెక్ట్ పూర్తయ్యే సమయానికి జల విద్యుత్ కేంద్రాన్ని కూడా సిద్ధం చేయాలని ఏపీ జెన్కో డైరెక్టర్ (హైడల్) ఎం.సుజయ్కుమార్ అన్నారు. నిర్దేశిత సమయానికి ప్రాజెక్టును పూర్తి చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని జెన్కో అధికారులు కాంట్రాక్టు సంస్థకు సూచించారు. పోలవరం ప్రాజెక్ట్ డయాఫరం వాల్, ఈసీఆర్ఎఫ్ పనులకు సమాంతరంగా విద్యుత్ కేంద్రం పనులు చేపట్టాలన్నారు. శుక్రవారం పోలవరం జల విద్యుత్ కేంద్రంలో కీలకమైన 150/30 టన్నుల సామర్ధ్యం కలిగిన క్రేన్ పనితీరును పరీక్షించి పూజలు చేసి సుజయ్కుమార్ ప్రారంభించారు. జల విద్యుత్ కేంద్రంలో టర్బయిన్లు, జనరేటర్ వంటి కీలకమైన పరికరాలను బిగించేందుకు ఈ క్రేన్ను ఉపయోగిస్తారు. త్వరలో 225/40 టన్నుల సామర్ధ్యం కలిగిన రెండు క్రేన్లను ఏర్పాటు చేస్తామని ఎంఈఐఎల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సతీష్బాబు అంగర తెలిపారు. టర్బయిన్లు, జనరేటర్లను బిగించే పని త్వరలో ప్రారంభిస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో జెన్కో హెచ్పీసీసీ ఈ.నాగరాజు, సీఈ (సివిల్) రవీంద్రారెడ్డి, ఎస్ఈ (సివిల్) రామచంద్రరాజు తదితరులు పాల్గొన్నారు. -
రోడ్ల అవస్థపై గ్రామస్తుల నిరసన
కొయ్యలగూడెం : రహదారి అధ్వానంపై పొంగుటూరు గ్రామస్తులు నిరసన వ్యక్తం చేస్తూ శుక్రవారం ఆందోళన నిర్వహించారు. పొంగుటూరు, యర్నగూడెం గ్రామాల మధ్య పదిహేను కిలోమీటర్ల మేర ఉన్న రహదారి భారీ గోతులు పడి ప్రమాదకరంగా మారింది. గ్రీన్ ఫీల్డ్ హైవే వాహనాలు పరిమితికి మించి మెటీరియల్ రవాణా చేయడం వల్లే రోడ్డు పాడైంది. రెండేళ్ల క్రితం సుమారు రూ.30 లక్షలతో కన్నాయగూడెం నుంచి పొంగుటూరు వరకు రహదారిని నిర్మించగా పూర్తిగా పాడైంది. స్కూల్ బస్సులు మరమ్మతులకు గురవుతున్నాయని యాజమాన్యం రాకపోకలు నిలిపివేయడంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఇప్పటికై నా పాలకులు, అధికారులు తక్షణమే స్పందించి రహదారి అభివృద్ధి చేపట్టాలని కోరారు. గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వెట్రిసెల్విని మహిళలు కోరారు. ఈ ఆందోళనకు రైతు సంఘం నాయకులు మద్దతు తెలిపారు. ఏపీయూడబ్ల్యూజే కార్యవర్గ సభ్యుడిగా మురళీకృష్ణ భీమవరం : ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఏపీయూడబ్ల్యూజే) రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా తాడేపల్లిగూడెం సాక్షి విలేకరి యడ్లపల్లి మురళీకృష్ణ ఎన్నికయ్యారు. ఒంగోలులో మూడు రోజుల పాటు నిర్వహించిన యూనియన్ 36వ మహాసభల్లో ఆయనను ఎన్నుకున్నారు. ఐజేయూ కార్యదర్శి డి.సోమసుందర్, యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వీఎస్ సాయిబాబా, గజపతి వరప్రసాద్, నేషనల్ కౌన్సిల్ సభ్యులు బెల్లంకొండ బుచ్చిబాబు, ముత్యాల శ్రీనివాస్ తదితరులు ఆయనకు అభినందనలు తెలిపారు. గేదెలను చంపిన దుండగులు లింగపాలెం: మండలంలోని మఠంగూడెం శివారులో దారుణ ఘటన చోటుచేసుకుంది. గేదెలను దుండగులు తలలు నరికి చంపారు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. లింగపాలెం మండలం మఠంగూడెం శివారు సుందర్రావుపేట గ్రామంలో తొర్లపాటి రవి పశువుల పాకలో మూడు గేదెలను గురువారం రాత్రి సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు క్రూరంగా తలలు నరికి చంపారు. శుక్రవారం ఉదయాన్నే గుర్తించిన రైతు రవి ధర్మాజీగూడెం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేశారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా నిందితులను త్వరగా పట్టుకుని శిక్షించాలని చుట్టుపక్కల గ్రామాల వారు కోరుతున్నారు. -
అచ్చియ్యపాలెంలో విషాద ఛాయలు
బుట్టాయగూడెం: బుట్టాయగూడెం మండలం అచ్చియ్యపాలెం(చిన్నరవ్వారిగూడెం)లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు ఈతకొట్టేందుకు వెళ్ళి మృత్యువాత పడడం వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది. మృతి చెందిన తెల్లం సీతారామరాజు, తెల్లం కిశోర్లు అన్నదమ్ములు. తండ్రి తెల్లం పోసీరావు గోపాలపురం మండలం సాకిపాడులో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. మృతుడు సీతారామరాజుకు 2021 కరోనా సమయంలో వివాహమైంది. సీతారామరాజుకు భార్య, 4 నెలల పాప ఉంది. చిన్న కొడుకు కిశోర్ జంగారెడ్డిగూడెంలోని ఒక ప్రైవేటు పాఠశాలలో డిగ్రీ పూర్తి చేశాడు. ఇద్దరు కుమారుల మృతితో తల్లిదండ్రులు తమ పిల్లల మృతదేహాలను చూసి తల్లడిల్లిపోయారు. మృతుడు మాడి దేవేంద్రకుమార్ తండ్రి మాడి సోమరాజు వ్యవసాయ కూలీ. సోమరాజుకు ఇద్దరు కుమారులు. సోమరాజు మొదటి కుమారుడు చిన్నతనంలోనే కరెంట్ షాక్తో మృతి చెందాడు. దేవేంద్ర విజయవాడలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. సరదా కోసం వెళ్ళి ప్రాణాలు కోల్పోయాడు. ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు మృతితో గ్రామంలో విషాద చాయలు అలముకున్నాయి. యువకుల మృతి సమాచారం తెలుసుకున్న జీలుగుమిల్లి సీఐ వెంకటేశ్వరరావు, బుట్టాయగూడెం ఎస్సై దుర్గామహేశ్వరరావులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. వారు మాట్లాడుతూ ఈతకు ఐదుగురు వెళ్ళారని ఈత రాని కారణంగా ముగ్గురు మృతిచెందినట్లు గుర్తించామని చెప్పారు. దండిపూడి సమీపంలో ఉన్న కాల్వ సమీపానికి ఎవరూ కూడా ఈత కోసం వెళ్ళొద్దని సీఐ చెప్పారు. గతంలో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశామని, వర్షాల కారణంగా అవి కొట్టుకుపోయాయని చెప్పారు. మళ్లీ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేస్తామని చెప్పారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం జంగారెడ్డిగూడెం తరలించామని తెలిపారు. -
బస్టాండ్కాదు..బురదగుంట
ఉండి: ఆర్టీసీ ప్రయాణం సురక్షితమని ఊదరగొట్టే అధికారులు ఉండి బస్టాండ్ దుస్థితిని ఎందుకు పట్టించుకోవట్లేదని ప్రయాణికులు మండిపడుతున్నారు. ఉండిలో ఒకరోజు వర్షం కురిస్తే బస్టాండ్కు వెళ్ళే ప్రయాణికులకు వారం రోజులు కష్టాలు తప్పవు. బస్టాండ్ ప్రాంతం, రోడ్లు బురదమయంగా మారిపోతాయి. బస్టాండ్లో భీమవరం వైపు బస్సులు వెళ్ళాలంటే బురద, గణపవరం, ఆకివీడు వైపుగా వెళ్ళాలంటే బస్సులు తిరగబడిపోతాయేమోనని భయపడేంత పెద్ద పెద్ద గోతులు దర్శనమిస్తాయి. ఉండి బస్టాండ్ ఇక్కట్లపై ఎన్నిసార్లు మొరపెట్టుతున్నా ఫలితం శూన్యం. తాగేందుకు నీరు ఉండదు. బస్టాండ్ చుట్టూ మురుగు నీరే. బస్టాండ్లో బస్సు దిగాలంటే బురదలో కాలుపెట్టాల్సిందే. దీనివల్ల మహిళా ప్రయాణికులు, విద్యార్థులు, వృద్దులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. బస్సులో నుంచి దిగేటప్పుడు ఒక్కోసారి కాలుజారి పడిపోతున్నారు. బస్సులు బస్టాండ్ నుంచి బయటకు వెళ్ళాలంటే డ్రైవర్లు తీవ్రంగా శ్రమించాల్సిందే. ఒకవైపు బురద, మరోవైపు గోతుల వల్ల బస్సులు తిప్పడం ఇబ్బందిగా ఉంది. ఇప్పటికై నా అధికారులు, ప్రజాప్రతినిధులు కనీస మౌలిక వసతులపై దృష్టిపెట్టడంతో పాటు.. రోడ్లు వేసేలా తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు. -
దేవుడి విగ్రహాల ఏర్పాటుపై రగడ
నూజివీడు: మండలంలోని పాత రావిచర్లలో దేవుడి విగ్రహాల రగడ ఉద్రిక పరిస్థితులకు దారితీసింది. గ్రామంలోని ప్రధాన సెంటర్లో ఉన్న పంచాయతీకి చెందిన లైబ్రరీ బిల్డింగ్లో సోమవారం అర్ధరాత్రి ఒక వర్గం వారు కృష్ణుడి విగ్రహాన్ని పెట్టారు. మూడు రోజులైనా విగ్రహాన్ని తీయకపోవడంతో గ్రామస్తులంతా కలిసి అదే లైబ్రరీలో శుక్రవారం ఉదయం 9 గంటల సమయంలో వినాయకుడి విగ్రహం, అమ్మవారి విగ్రహాలను వేదమంత్రాల నడుమ మేళతాళాలతో ఏర్పాటు చేశారు. దీంతో గ్రామంలో విగ్రహాల ఏర్పాటు విషయం వర్గపోరుగా మారి లైబ్రరీ వద్దకు వందలాది మంది గ్రామస్తులు చేరుకోవడంతో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇరు వర్గాలు ఈ విషయమై తీవ్ర వాగ్వాదానికి దిగారు. మాజీ సర్పంచి బసవరాజు నగేష్ అక్కడకు చేరుకుని ఇరువర్గాలకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. పంచాయతీ భవనంలో విగ్రహాలు పెట్టడమేంటని ప్రశ్నించారు. రూరల్ ఎస్ఐ జ్యోతిబసు సిబ్బందితో అక్కడకు చేరుకున్నారు. గ్రామ పెద్దలు ఎంతగా సర్ది చెప్పినా.. ఆయా వర్గీయులు ఏమాత్రం వినకుండా విగ్రహాలు ఉండాల్సిందేనంటూ పట్టుబట్టారు. మాజీ సర్పంచ్ ఇరువర్గాలను అక్కడి నుంచి పంపించి వేశారు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో పోలీసుల బందోబస్తు మధ్య విగ్రహాలను తొలగించడంతో సమస్య తొలగిపోయింది. -
‘మత్స్య’ విద్య ఎదురీత
సాక్షి, భీమవరం: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని నరసాపురంలో ఏర్పాటు చేసిన ఫిషరీ యూనివర్సిటీ వసతుల్లేక సతమతమవుతోంది. మత్స్య విద్య ఏటికేడు ఎదురీదుతోంది. దీనికి కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం. గత ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏపీ ఫిషరీస్ యూనివర్సిటీని మంజూరు చేశారు. రాష్ట్రంలో ఇది రెండో ఫిషరీ యూనివర్సిటీ. యూనివర్సిటీ క్యాంపస్ కోసం నరసాపురం పక్కనే 40 ఎకరాల స్థలాన్ని గత ప్రభుత్వం కేటాయించింది. అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్, కాలేజీ, బాయ్స్, గరల్స్ హాస్టల్ భవనాల కోసం రూ.100 కోట్లు మంజూరు చేసింది. రెండేళ్లుగా తాత్కాలిక భవనంలోనేతొలుత ఏడాది కాలానికి నరసాపురంలోని తుపాను షెల్టర్ భవనంలో తాత్కాలికంగా 66 సీట్లతో 2023 జూన్లో నాలుగేళ్ల కాలపరిమితి కలిగిన బ్యాచిలర్ ఆఫ్ ఫిషరీ సైన్స్ కోర్సును ప్రారంభించారు. 2024 నాటికి క్యాంపస్లో తరగతులు నిర్వహించాలన్న లక్ష్యంతో శరవేగంగా నిర్మాణ పనులు చేపట్టారు. గత ఏడాది మార్చి నాటికే అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్, కళాశాల భవనాలు శ్లాబ్ దశకు చేరుకోగా, బాయ్స్, గరల్స్ హాస్టల్ భవనాల పునాదులు పూర్తయ్యాయి.దాదాపు రూ.35 కోట్ల విలువైన పనులు గత ప్రభుత్వ హయాంలోనే జరగగా.. కూటమి ప్రభుత్వం వచ్చాక నిర్మాణాలను అటకెక్కించింది. నిధులివ్వకపోవడంతో పనులు ముందుకు సాగడం లేదు. ఫలితంగా రెండేళ్ల నుంచి తాత్కాలిక భవనంలోనే తరగతులను నిర్వహించాల్సిన దుస్థితి నెలకొంది. ఇక్కడ వసతులు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఆర్బీకేనే తర‘గతి’..! రైతు భరోసా కేంద్రం (ఆర్బీకే) నుంచి వస్తున్న వీరంతా రైతులు కాదు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో నరసాపురం కేంద్రంగా గత ప్రభుత్వం ఏర్పాటుచేసిన ఏపీ ఫిషరీ యూనివర్సిటీ విద్యార్థులు వీరు. ప్రస్తుత కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఏడాది కాలంగా యూనివర్సిటీ నిర్మాణ పనులు నిలిచిపోవడంతో కళాశాల నిర్వహిస్తున్న తాత్కాలిక భవనంలో సెకండ్ బ్యాచ్ విద్యార్థులకు గదుల్లేవు. ఫలితంగా పక్కనే ఉన్న ఆబీకే భవనంలోని చాలీచాలని హాల్లోనే వీరికి తరగతులు నిర్వహించారు. ఆర్బీకే భవనంలో సెకండ్ బ్యాచ్ప్రస్తుత తాత్కాలిక భవనంలోని 12 గదులు 66 మంది స్టూడెంట్స్ కలిగిన ఒక బ్యాచ్కు మాత్రమే తరగతులు, ల్యాబ్ నిర్వహణకు సరిపోతున్నాయి. 2024 జూలై నుంచి మరో 66 మందితో సెకండ్ బ్యాచ్ మొదలు కావడంతో పక్కనే ఉన్న ఆర్బీకే భవనంలోని హాల్ను తరగతి గదిగా, స్టాఫ్ రూమ్ను కంప్యూటర్ ల్యాబ్గా వినియోగిస్తుండటం గమనార్హం. ప్రైవేటు మెస్లు, అద్దె గదులే గతి!క్యాంపస్ హాస్టల్ లేక రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు ప్రైవేటు మెస్లు, అద్దె గదులను ఆశ్రయించాల్సి వస్తోంది. గదులను బట్టి ఒక్కో విద్యార్థికి నెలకు రూ.5 వేల నుంచి రూ.7 వేల వరకు ఖర్చవుతోంది. విద్యార్థినులు భద్రతాపరంగా ఆందోళన చెందుతున్నారు. కళాశాలకు వచ్చే వెళ్లే దారిలో ఆకతాయిల బెడద ఎక్కువగా ఉంటోందని చెబుతున్నారు. కళాశాల వద్ద క్రీడా మైదానం కూడా లేకపోవడంతో విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు. సెక్యూరిటీ లేదు క్యాంపస్ హాస్టల్ సదుపాయం లేక బయట అద్దె గదుల్లో ఉండాల్సి వస్తోంది. భద్రతాపరంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. ఆకతాయిల బెడద ఉంటోంది. – సి.ధరణి, కర్నూలు, ద్వితీయ సంవత్సరం విద్యార్థినిహాస్టల్ వసతి కల్పించాలిఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ చదువుకుంటున్నాం. క్యాంపస్ హాస్టల్ ఉంటే అన్ని విధాలా బాగుంటుంది. యూనివర్సిటీ భవనాలు వేగంగా పూర్తిచేయాలి. క్రీడా మైదానం, ల్యాబ్ వసతులు కల్పించాలి. – దేవీ ప్రసాద్దొర, పార్వతీపురం, మొదటి సంవత్సరం విద్యార్థికొత్త బ్యాచ్ పరిస్థితి ఏమిటి?సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ స్టూడెంట్స్ 132 మంది ఉండగా, ప్రస్తుత విద్యా సంవత్సరానికి జూలై నుంచి 66 మందితో ఫస్ట్ ఇయర్ సీట్ల భర్తీ జరగనుంది. కొత్త బ్యాచ్కు అక్టోబరులో తరగతులు ప్రారంభమవుతాయి. ఈ నేపథ్యంలో వీరికి క్లాసులు ఎక్కడ నిర్వహిస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది. స్థానికంగా ప్రైవేట్ విద్యాసంస్థలో తరగతుల నిర్వహణకు యత్నాలు జరుగుతున్నట్టు కళాశాల వర్గాలు చెబుతున్నాయి. -
ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా మాణిక్యరావు
ఏలూరు (ఆర్ఆర్పేట): ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ రాష్ట్ర ఉపాధ్యక్షునిగా ఏలూరుకు చెందిన సీనియర్ జర్నలిస్ట్, ఎంటీవీ యూ ట్యూబ్ ఛానల్ చైర్మన్ కాగిత మాణిక్యరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శుక్రవారం ఒంగోలులో నిర్వహించిన సంఘ 36వ రాష్ట్ర మహాసభల్లో ఈ ఎన్నిక నిర్వహించారు. ఈ సందర్భంగా మాణిక్యరావును ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ జాతీయ అధ్యక్షుడు కే.శ్రీనివాసరెడ్డి, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు ఐవీ సుబ్బారావు, ప్రధాన కార్యదర్శి కంచర్ల జయరాజు, ఐజేయూ జాతీయ కార్యదర్శి దూసనపూడి సోమ సుందర్, అభినందంచారు. అలాగే మాణిక్యరావు ఎన్నికపట్ల ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు కేపీకే కిషోర్ శుభాకాంక్షలు తెలిపారు. గూడ్స్ రైలు ఢీకొని వ్యక్తి మృతి మండవల్లి: గూడ్స్ రైలు ఢీకొని ఒక వ్యక్తి మృతి చెందాడు. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కైకలూరు–మండవల్లి రైల్వే స్టేషన్ల మధ్య 68–17 కిలో మీటరు నెంబర్ వద్ద ఒక వ్యక్తి అజాగ్రత్తగా రైల్వే ట్రాక్ను దాటుతుండగా కై కలూరు వైపు నుంచి వస్తున్న గూడ్స్ రైలు ఢీకొని ప్రమాదవశాత్తు మృతి చెందాడు. మృతుడి వయస్సు 25 నుంచి 30 సంవత్సరాల మధ్య వయసు ఉంటుందన్నారు. మృతుడి వివరాలు తెలిస్తే గుడివాడ రైల్వే ఎస్సై ఫోన్ 94406 27570 లేదా 98662 21412 నంబర్లలో తెలియజేయాలని రైల్వే పోలీసులు కోరారు.యువతి అదృశ్యంపై కేసు నమోదు ఆకివీడు : యువతి అదృశ్యంపై స్థానిక పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఎస్సై హెచ్ నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం కలిదిండి మండలం కాళ్లపాలెంకు చెందిన యువతి (19) స్థానిక ఎస్ టర్నింగ్ ప్రాంతంలో నివసిస్తున్న తాత ఇంటి వద్దకు ఇటీవల వచ్చింది. ఈనెల 24వ తేదీ ఉదయం ఇంటి వద్ద నుంచి బయటకు వెళ్లిన యువతి తిరిగి రాలేదని, బంధువుల ఇళ్ల వద్ద వెతికినా ఆచూకీ లభించక పోవడంతో యువతి తాత పోలీసులకు ఫిర్యాదు చేశాడు. -
సర్కారు నిర్ణయం.. డీలర్లకు భారం
భీమడోలు: కూటమి సర్కారు నిర్ణయం రేషన్ డీలర్లకు భారంగా మారింది. ప్రభుత్వం ఎండీయూ వాహనాలను తొలగించి ఇంటింటికీ రేషన్ రద్దు చేయడంతో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. దీంతో ఒక అడుగు వెనక్కు వేసి 65 ఏళ్లు నిండిన వృద్ధులు, మహిళలు, దివ్యాంగుల ఇంటికే రేషన్ సరఫరా చేయాలని రేషన్ డీలర్లను ఆదేశించింది. జూలై నెల రేషన్ను ఈనెల 26వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ముందుగానే ఇంటింటికీ వెళ్లి డీలర్లు పంపిణీ చేయాలని పౌరసరఫరాల విభాగం అధికారులను ఆదేశించింది. అయితే క్షేత్రస్థాయిలో డీలర్ల ఇబ్బందులను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోకపోవడంతో వారి పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. డీలర్లకు కష్టాలు రేషన్ డీలర్లలో ఎక్కువ మంది వృద్ధులు, మహిళలు, వితంతువులు, వికలాంగులుండడం.. కిలోమీటర్ల దూరంలో ఉన్న వృద్ధుల ఇంటింటికీ వెళ్లి రేషన్ సరఫరా చేయాల్సి రావడం వారికి తలకు మించిన భారంగా మారింది. వృద్ధుల ఇంటికి వెళ్లి రేషన్ పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందే గానీ బియ్యం, సరుకుల పంపిణీకి వాహనాన్ని కేటాయించలేదని, ఒక్క సంచి కూడా ఇవ్వలేదని, కమీషన్ సైతం పెంచలేదని డీలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండల పరిధిలో 20 వేల రేషన్ కార్డులుండగా... 65 ఏళ్లు నిండిన వృద్ధుల రేషన్ కార్డులు 2406 ఉన్నాయి. వారందరికీ ఇళ్లకు వెళ్లి రేషన్ పంపిణీ చేయాలంటే తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని వాపోతున్నారు. ప్రభుత్వం తమ సమస్యలను గుర్తించి రేషన్ పంపిణీకి మండలానికి కొన్ని వాహనాలు కేటాయించాలని, దూరాభారాన్ని ఎదుర్కొంటున్న డీలర్లకు పారితోషికాన్ని పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా భీమడోలు సీఎస్ డీటీ భరత్కుమార్ మాట్లాడుతూ వయోభారంతో ఉన్న డీలర్లు ప్రత్నామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. -
ఏఐపై మరిన్ని పరిశోధనలు జరగాలి
తాడేపల్లిగూడెం (టీఓసీ): విశ్వ విద్యాలయ పరిధిలోని పరిశోధన, బోధన, విస్తరణ రంగాల పురోగతిని బలోపేతం చేసేందుకు డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వ విద్యాలయం, యూఎస్ఏ కాన్సాస్ స్టేట్ యూనివర్సిటీలు పరస్పర ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. విశ్వ విద్యాలయం ఉప కులపతి డాక్టర్ కే.గోపాల్, డాక్టర్ పీవీ వర ప్రసాద్, యూనివర్సిటీ ప్రొఫెసర్ ఆర్ఓ కృస్, ఎండోడ్ ప్రొఫెసర్, డైరక్టర్ సెంటర్ ఫర్ క్రాప్స్, క్లైమేట్ అండ్ కమ్యూనిటీస్, కాలేజీ ఆఫ్ అగ్రికల్చర్, యూఎస్ఏ కాన్సాస్ స్టేట్ యూనివర్సిటీ సభ్యులు గురువారం ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. గోపాల్ మాట్లాడుతూ రానున్న రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటిల్జెన్సీ, మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ వంటి ఉద్యాన సంబంధిత పరిశోధనలు మరిన్ని జరగాలన్నారు. డాక్టర్ వర ప్రసాద్ మాట్లాడుతూ విశ్వ విద్యాలయంలోని ఫ్యాకల్టీ, విద్యార్థులకు ఉపయోగపడేలా అనుబంధ పరిశోధన, అధ్యాపక అవకాశాలు కల్పిస్తారన్నారు. డాక్టర్ కే.ధనుంజయ్ రావు, అధికారులు ఎం.మాధవి, బి.శ్రీనివాసులు, ప్రసన్నకుమార్, ఎస్శ్రీ విజయపద్మ, జి.రామానందం అసోసియేషన్ డీన్లు, విద్యార్థినీ, విద్యార్థులు సిబ్బంది పాల్గొన్నారు. వివాహితపై హత్యాయత్నం కేసులో నిందితుడి అరెస్ట్ భీమవరం (ప్రకాశం చౌక్): బ్లేడుతో వివాహితపై హత్యాయత్నం జరిపిన కేసులో నిందితుడిని పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. భీమవరం డీఎస్పీ జయసూర్య స్థానిక వన్టౌన్ పోలీస్ స్టేషన్లో వివరాలు వెల్లడించారు. తనను వివాహం చేసుకోవాలని పట్టణానికి చెందిన పొలిశెట్టి హేమంత్ వివాహిత మామిడి నాగసూర్యమణిపై ఒత్తిడి చేశాడు. ఆమె నిరాకరించడంతో బుధవారం హేమంత్ బ్లేడుతో నాగమణిపై హత్యాయత్నానికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఎస్పీ, డీఎస్పీ పర్యవేక్షణలో వన్టౌన్ సీఐ ఆధ్వర్యంలో నాలుగు టీమ్లు ఏర్పాటు చేసి నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నిందితుడు హేమంత్ భీమవరం బైపాస్ రోడ్డులో ఉన్నట్లు గుర్తించి గురువారం ఉదయం 11 గంటలకు అతడిని అరెస్ట్ చేసి పోలీసు స్టేషన్కు తరలించారు. విచారణలో నాగమణి పెళ్లికి తిరస్కరించడంతో కోపంతోనే ఆమైపె హత్యాయత్నానికి పాల్పడినట్లు నిందితుడు హేమంత్ నేరం అంగీకరించాడని పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా సీఐ నాగరాజు, ఎస్సైలు కిరణకుమార్, కృష్ణాజీలను డీఎస్పీ అభినందించారు. -
లారీ రూపంలో కబళించిన మృత్యువు
భీమడోలు, మండవల్లి: మోటార్సైకిల్ను లారీ ఢీకొన్న ఘటనలో భార్య మృతి చెందగా భర్తకు గాయాలయ్యాయి. పూళ్ల పంచాయతీ కార్యాలయం వద్ద గురువారం ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల ప్రకారం మండవల్లి మండలం కొవ్వాడలంక గ్రామానికి చెందిన ఘంటసాల రామృష్ణ, సీతామహాలక్ష్మి పూళ్ల పంచాయతీ పరిధిలోని ఎంఎంపురం గ్రామంలో నివాసముంటున్నారు. కుమార్తె మోరు లక్ష్మీతిరుపతమ్మ ఆనారోగ్యం కారణంగా ఏలూరు ఆశ్రం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఆస్పత్రిలో ఉన్న కుమార్తెకు భోజనం తీసుకువెళ్లేందుకు రామకృష్ణ, సీతామహాలక్ష్మి మోటార్సైకిల్పై ఏలూరుకు బయలుదేరారు. మార్గమధ్యమైన పూళ్ల పంచాయతీ వద్దకు వచ్చేసరికి ఎదురుగా వస్తున్న టిప్పర్ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సీతామహాలక్ష్మి (61) అక్కడిక్కడే మృతి చెందింది. భర్త రామకృష్ణకు స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న భీమడోలు ఎస్సై వై.సుధాకర్ ఘటనా స్థలానికి చేరకుని పరిశీలించారు. రామకృష్ణ ఫిర్యాదు మేరకు ఎస్సై సుధాకర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సీతామహాలక్ష్మి మృతితో ఎంఎంపురం గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. మోటార్సైకిల్ను ఢీకొన్న లారీ భార్య మృతి, భర్తకు గాయాలు -
కర్తవ్య నిర్వహణలో విగతజీవులై..
ఆలమూరు : కర్తవ్య నిర్వహణలో ఉన్న పోలీసు సిబ్బంది రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందడం ఆ కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. మాదక ద్రవ్యాలు (గంజాయి) రవాణా చేస్తున్న నిందితుడిని పట్టుకోవడానికి వెళుతూ అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నియంత్రణ దినోత్సవం రోజునే ఆ ఇద్దరు అధికారులు అశువులు బాసారు. వివరాల్లోకి వెళితే.. ఆలమూరు మండల పరిధిలోని 216 ఏ జాతీయ రహదారిలో గతంలో గంజాయి అక్రమ రవాణా కేసు నమోదైంది. ఆ కేసులో నిందితుల్లో ఒకరు హైదరాబాద్లో ఉన్నాడన్న సమాచారంతో అతడ్ని పట్టకునేందుకు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బుధవారం రాత్రి ఆలమూరు ఎస్సై అశోక్, ఆత్రేయపురం కానిస్టేబుల్ ఎస్.బ్లెసన్ జీవన్, రావులపాలెం సీఐ కార్యాలయం ఐడీ పార్టీ హెడ్ కానిస్టేబుల్ దొంగ స్వామి, డ్రైవర్ జి.రమేష్ కారులో హైదరాబాద్ బయలు దేరారు. కోదాడ సమీపంలోని దుర్గాపురం వద్దకు వచ్చేసరికి వారు ఓ లారీని వెనుక నుంచి ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ఎస్సై అశోక్ (45) కానిస్టేబుల్ బ్లెసన్ (32) అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. డ్రైవర్ రమేష్, హెడ్ కానిస్టేబుల్ స్వామికి తీవ్ర గాయాలయ్యాయి. పదోన్నతి వస్తుందనుకునే లోపే.. అశోక్ ఎస్సైగా బాధ్యతలు చేపట్టిన అనతి కాలంలోనే ఉన్నతాధికారుల సాయంతో అనేక కేసులను ఛేదించి పలు అవార్డులు, రివార్డులను సొంతం చేసుకున్నారు.ఈ ఏడాది సర్కిల్ ఇన్స్పెక్టర్గా పదోన్నతి వస్తుందని కుటుంబ సభ్యులు భావిస్తున్న నేపథ్యంలో ఇంతటి ఘోరం జరగడం వారిని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. అశోక్ స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలోని రుస్తుంబాదా కాగా ప్రస్తుతం రాజమహేంద్రవరంలోని ఏవీ అప్పారావు రోడ్డులో కుటుంబ సభ్యులతో కలిసి నివసిస్తున్నారు. ఆయనకు భార్య శ్రీవల్లి, ఇద్దరు సోదరులు, ఒక సోదరి, ఇద్దరు కుమారులు ఉన్నారు. బ్లెసన్ మృతిపై విలపించిన సోదరులు విధి నిర్వహణలో ఎస్సై అశోక్కు తోడుగా వెళ్లి మృత్యు ఒడిలోకి వెళ్లిన కానిస్టేబుల్ బ్లెసన్ స్వస్థలం ఆలమూరు. ఆయన తన తల్లి హెప్సీబా, సోదరులు ప్రిన్స్ ఆదిత్య, అలెక్స్ కలసి ఉంటున్నారు. కష్టపడి చదివి ఉద్యోగం సాధించిన బ్లెసన్ తమ కుటుంబానికి అండగా ఉంటాడనుకుంటే హఠాత్తుగా మృతి చెందడంపై కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. వచ్చే ఏడాది కొత్త ఇల్లు నిర్మించుకుని పెళ్లి చేసుకుందామనుకుంటున్న తన సోదరుడు బ్లెసన్ ఆ ముచ్చట తీరకుండానే కానరాని లోకాలు వెళ్లిపోయాడని సోదరులు రోదిస్తున్న తీరు చూపరులను కంటతడి పెట్టించింది. రోడ్డు ప్రమాదంలో ఎస్సై, కానిస్టేబుల్ మృతి మరో ఇద్దరికి తీవ్ర గాయాలు గంజాయి రవాణా నిందితుడి అన్వేషణలో దుర్ఘటన నరసాపురంలో అంత్యక్రియలు నరసాపురంలో విషాదఛాయలు నరసాపురం: ఆలమూరు ఎస్సై ముద్దాల అశోక్ మృతిపై నరసాపురంలో విషాదచాయలు అలుముకున్నాయి. ఆయన మృతేహాన్ని గురువారం సాయంత్రం స్వస్థలమైన నరసాపురం తీసుకొచ్చారు. కోనసీమ జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు, ఇతర పోలీసు అధికారులు, ప్రజాప్రతినిధులు అశోక్కుమార్ భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. అనంతరం వశిష్ట గోదావరి గట్టున ఉన్న మహాప్రస్థానం శ్మశానవాటిక వద్ద పోలీసు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. అశోక్ తండ్రి నర్శింహమూర్తి సాధారణ రైతు. తల్లి గృహిణి. వారు గతంలోనే మృతి చెందారు. అశోక్ వారంరోజుల క్రితం ఇంటికి వచ్చి స్నేహితులను, బంధువును కలిసివెళ్లినట్టుగా చెబుతున్నారు. ఇక్కడున్న రెండు రోజులుచాలా సరదాగా గడిపినట్టు గుర్తు చేసుకున్నారు. -
కనులపండువగా శివ కల్యాణం
ద్వారకాతిరుమల : క్షేత్రపాలకునిగా విరాజిల్లుతోన్న శ్రీ భ్రమరాంబ మల్లేశ్వర స్వామివారి ఆలయంలో శివదేవుని కల్యాణ మహోత్సవం గురువారం కన్నులపండువగా జరిగింది. ఆరుద్రా నక్షత్రాన్ని పురస్కరించుకుని అట్టహాసంగా నిర్వహించిన ఈ వేడుక భక్తులకు కనువిందు చేసింది. మండపంలో ఏర్పాటు చేసిన వేదికపై స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను ఉంచి, అర్చకులు విశేష పుష్పాలంకారాలు చేశారు. ఆ తరువాత కల్యాణ తంతును ప్రారంభించి, సుముహూర్త సమయంలో నూతన వధువరుల శిరస్సులపై జీలకర్ర, బెల్లం ధరింపజేశారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, అర్చకులు, పండితుల వేద మంత్రోచ్ఛరణలు, భక్తుల శివనామస్మరణల నడుమ మాంగల్యధారణ, తలంబ్రాల వేడుకలను కనులపండువగా జరిపి, కల్యాణ మూర్తులకు హారతులిచ్చారు. ఈ వేడుకలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని, స్వామివారి తీర్థప్రసాదాలను స్వీకరించారు. -
జగన్నాథ ఉత్సవాలకు సర్వం సిద్ధం
ద్వారకాతిరుమల: శ్రీవారి ఆలయానికి దత్తత దేవాలయమైన లక్ష్మీపురంలోని జగన్నాథని ఆలయం రథయాత్ర ఉత్సవాలకు సర్వం సిద్ధమైంది. ప్రతి ఏటా పూరీలో వలె ఈ ఉత్సవాలు ఇక్కడ వైభవంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈనెల 27 నుంచి వచ్చేనెల 6 వరకు నిర్వహించనున్న ఉత్సవాలను పురస్కరించుకుని ఆలయాన్ని విశేషంగా అలంకరించారు. ఉత్సవాల తొలిరోజు సాయంత్రం 6 గంటల నుంచి జగన్నాథ రధయాత్ర ఆలయం నుంచి ద్వారకాతిరుమల క్షేత్రం వరకు జరుగనుంది. ఇదిలా ఉంటే ఈ సారి స్వామివారి దశావతారాలు ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నాయి. దేవస్థానం అధికారులు లక్షలాది రూపాయలు వెచ్చించి ఇత్తడితో దశావతారాల రూపాలను తయారు చేయించారు. ఉత్సవాల ప్రారంభాన్ని పురస్కరించుకుని జగన్నాథుడు శుక్రవారం ఆలయ యాగశాలలో మత్స్యావతార అలంకారంలో దర్శనమిస్తారని, భక్తులు దర్శించి తరించాలని ఆలయ ఈఓ ఎన్వీ సత్యన్నారాయణ మూర్తి కోరారు. -
చేదు మిగిల్చిన మామిడి
నూజివీడు : ఏ ఏటికాయేడు లాభాలను పంచుతుందేమోనని ఆశగా ఎదురుచూస్తున్న రైతుకు మామిడి చేదునే రుచిచూపిస్తోంది. ఈ ఏడాది మామిడి దిగుబడి తక్కువగా ఉండటం, ధర లేకపోవడంతో రైతులు కు ఆదాయం లేక నిరాశలో కొట్టుమిట్టాడుతున్నారు. పండ్లలో రారాజుగా మామిడికి పేరున్నప్పటికీ అదే మామిడిని సాగుచేస్తున్న రైతులు మాత్రం తీవ్రమైన నష్టాల ఊబిలో కూరుకుపోయారు. ఈ ఏడాదైనా పరిస్థితి బాగుంటుందనే ఆశాభావంతో మామిడి రైతు ముందుకు సాగుతున్నప్పటికీ పరిస్థితుల్లో మార్పు రాకపోగా ఏడాదికేడాదికి మరింత సంక్షోభంలో కూరుకుపోతున్నాడు. ఈ ఏడాది మామిడి దిగుబడి తక్కువగా ఉండటంతో మంచి ధర లభిస్తుందని రైతులు పెట్టుకున్న ఆశలు అడియాశలయ్యాయి. దీంతో జిల్లా వ్యాప్తంగా ఉన్న మామిడి రైతులు తీవ్ర నిరాశ నిస్పృహలో కొట్టుమిట్టాడుతున్నారు. జిల్లాలో 40 వేల ఎకరాల్లో మామిడి తోటలు విస్తరించి ఉన్నాయి. దీనిలో నూజివీడు నియోజకవర్గంలోనే 35 వేల ఎకరాల్లో మామిడి పంట సాగులో ఉంది. బంగినపల్లి, తోతాపురి, చిన్నరసాలు, పెద్ద రసాలు వంటి రకాలు ఇక్కడ ఎక్కువగా ఉన్నాయి. మామిడి పంట లక్షణం ఒక ఏడాది కాపు బాగా ఉంటే మరో ఏడాది దిగుబడి ఉండదు. అయితే గత కొన్నేళ్లుగా ఈ సహజ లక్షణానికి భిన్నంగా మామిడి దిగుబడి ఉంటోంది. గత నాలుగైదేళ్లుగా ప్రతిఏటా కాపు తక్కువగానే ఉంటోంది. పూత సమయంలో ఎక్కడ చూసినా దట్టంగా కనిపిస్తున్నప్పటికీ పిందెగా మారే శాతం మాత్రం చాలా తక్కువగా ఉంటోంది. పూత దశలో ఆశిస్తున్న నల్లతామర రైతులను కోలుకోలేని దెబ్బ కొడుతోంది. పతనమైన ధరలు రైతులు ఎక్కుగా బంగినపల్లి, తోతాపురి(కలెక్టర్), రసాల తోటలను సాగుచేస్తుండగా ఈ ఏడాది అన్ని రకాల దిగుబడి చాలా తక్కువగా ఉంది. కాపు పది నుంచి 20శాతం లోపు మాత్రమే ఉండటంతో మామిడికి సీజన్ ప్రారంభంలో మంచి ధర లభించింది. బంగినపల్లి రకం కాయలకు టన్నుకు ముంబాయి మార్కెట్లో రూ.50 వేల నుంచి రూ.60 వేల వరకు ధర లభించింది. అయితే రానురాను కొంతమేరకు ధర తగ్గుముఖం పట్టినప్పటికీ టన్ను రూ.25 వేల నుంచి రూ.30 వేల మధ్య ధర నిలబడింది. నూజివీడు, నున్న, విస్సన్నపేట తదితర ప్రాంతాల్లోని కమీషన్ షాపుల్లో టన్ను రూ.10 వేల నుంచి రూ.15 వేల లోపు మాత్రమే ఉంది. తోతాపురి పరిస్థితి కూడా అలాగే ఉంది. దీనికి ప్రారంభంలో టన్ను 12 వేల ధర లభించినప్పటికీ రానురాను పతనమవుతూ టన్ను రూ.3 వేలకు పడిపోయింది. అంతేగాకుండా మే నెల అంతా వర్షాలు కురవడం వల్ల కాయల్లో నాణ్యత సైతం తగ్గిపోయింది. దీంతో రైతులకు కోతఖర్చులు కూడా రాని పరిస్థితి నెలకొంది. నష్టాలు మిగలడంతో ఖరీఫ్ సీజన్లో మామిడి తోటల్లో దుక్కిదున్ని ఎరువులు వేసే పరిస్థితి లేదు. పట్టించుకోని ప్రభుత్వం మామిడి ధరలు పతనమైనా రైతులను ఆదుకునే ఆలోచన ప్రభుత్వం చేయలేదు. కనీసం ధరలు పతనమవ్వకుండా చర్యలు తీసుకోలేదు. నున్న మామిడి మార్కెట్లో మామిడి కాయలను కొనుగోలు చేసి దేశంలోని పలు ప్రాంతాలకు ఎగుమతి చేసే సేట్లతో సమావేశం ఏర్పాటు చేసి రైతులకు కనీస గిట్టుబాటు ధర ఇవ్వాలని చెప్పే అధికారి కూడా ఎవరూ లేకపోవడంతో మామిడి ధర పతనమై రైతులకు ఈ ఏడాది చేదును పంచింది. రూ.15 లక్షల నష్టం వాటిల్లింది ఈ ఏడాది ఎన్నడూ లేని విధంగా మామిడి ధరలు పతనమయ్యాయి. తోతాపురి టన్ను రూ.3 వేలకు పడిపోవడంతో కోత ఖర్చులు రాకపోవడంతో కాయలను కోయకుండా వదిలేశా. బంగినపల్లి ధర సైతం టన్ను రూ.10 వేలకు పడిపోయింది. 40 ఎకరాల్లో మామిడి కాపును కొంటే ధర లేక రూ.15 లక్షల నష్టం వాటిల్లింది. ఇంత దారుణమైన పరిస్థితిని గతంలో ఎన్నడూ చూడలేదు. ప్రభుత్వం మామిడి రైతులను, వ్యాపారులను ఆదుకోవాలి. – బాణావతు రాజు, లైన్తండా, నూజివీడు మండలం ధర లేక నిరాశలో రైతులు కోత ఖర్చులు కూడా రాని పరిస్థితి ఏటా నష్టాల్లో కూరుకుపోతున్నామని ఆవేదన -
అధినేతతో భేటీ
సాక్షి, భీమవరం: వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని మాజీ మంత్రి, తాడేపల్లిగూడెం నియోజకవర్గ వైఎస్సార్సీపీ కో–ఆర్డినేటర్ కొట్టు సత్యనారాయణ బుధవారం తాడేపల్లిలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో అధికార కూటమి సాగిస్తున్న అరాచకాలపై అధినేతతో చర్చించారు. ప్రజలకు అండగా ఉండాలని జగన్ సూచించినట్లు కొట్టు తెలిపారు.వైఎస్సార్సీపీ అనుబంధ కమిటీల్లో నియామకాలుఆకివీడు: వైఎస్సార్సీపీ రాష్ట్ర విభాగం అనుబంధ సంస్థ ఆర్టీఐ విభాగం కార్యదర్శిగా ఉండికి చెందిన బడుగు బాలాజీ, పార్టీ ఐటీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పడాల కిషోర్ రెడ్డిని నియమించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి బుధవారం ఉత్తర్వులు అందాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీని మరింత పటిష్టం చేయడానికి కృషి చేస్తామని చెప్పారు.మున్సిపల్ ఇంజినీరింగ్ కార్మికుల ర్యాలీభీమవరం(ప్రకాశం చౌక్): మున్సిపల్ ఇంజినీరింగ్ కార్మికుల సమ్మెలో భాగంగా 3 రోజు బుధవారం మున్సిపల్ ఆఫీస్ నుంచి అంబేడ్కర్ చౌక్ వరకు ర్యాలీ నిర్వహించారు. వారి సమస్యలపై అంబేద్కర్ విగ్రహానికి పూలమాల అలంకరించి వినతిపత్రం అందజేశారు. అనంతరం ర్యాలీగా తిరిగి వెళ్లి మున్సిపల్ కార్యాలయం వద్ద సమ్మె కొనసాగించారు. కార్యక్రమంలో భీమవరం మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. -
కలల వారధి కల్లేనా?
నరసాపురం: వశిష్ట గోదావరిపై నరసాపురంలో నిర్మించాలనుకున్న వంతెన నిర్మాణం సందిగ్ధంలో పడింది. జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ రూ 591.71 కోట్ల నిధులతో వంతెన నిర్మించడానికి గత వైస్సార్సీపీ హయాంలో టెండర్లు పిలిచారు. ఎన్నికలు రావడం, కోర్టు అడ్డంకులతో కూటమి నేతల కుట్రలతో పనులు ముందుకు సాగలేదు. ఈ నెల 11న టెండర్లు తెరవాల్సి ఉండగా, సాంకేతిక కారణాలతో టెండర్లు రద్దు చేస్తున్నట్టు ఢిల్లీలోని జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ కేంద్ర కార్యాలయం పేర్కొంది. ఇప్పటికే టెండర్లు తెరిచే ప్రక్రియను రికార్డు స్థాయిలో 13 సార్లు వాయిదావేసి, చివరిగా టెండర్లు రద్దు చేయడం మరో విశేషం. వంతెన నిర్మాణం జరగకుండా అడ్డుకునే క్రమంలో కూటమి నేతలు కోర్టుల ద్వారా చేస్తున్న కుట్రలు కొనసాగుతున్నాయి. సుప్రీంకోర్టులో కేసు విచారణ ఆగస్టుకు వాయిదా పడింది. దీంతో వశిష్ట వంతెన కల నెరవేరే అవకాశాలు ఇప్పట్లో లేనట్టే. ఉభయ గోదావరి జిల్లాలను కలుపుతూ వశిష్ట గోదావరిపై నరసాపురంలో వంతెన నిర్మించాలనేది దశాబ్దాల డిమాండ్. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా వంతెన నిర్మాణం ప్రారంభమవుతుందన్న తరుణంలో ఆయన అకాల మృతితో ఆ ప్రయత్నం ఆగిసోయింది. మళ్లీ ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక వంతెన నిర్మాణంపై దృష్టిపెట్టి పనిచేయడం, అప్పటి ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు చొరవతో వంతెన నిర్మాణం ముందుకు కదిలింది. రూ 591.71 కోట్ల అంచనాతో నరసాపురం మండలం రాజుల్లంక వద్ద వంతెన నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో వైఎస్సార్సీపీ ప్రభుత్వం పూనుకుంది. కోనసీమ జిల్లా చించినాడ మీదుగా నరసాపురం నుంచి ఒంగోలు వరకూ నిర్మించిన 216 జాతీయ రహదారికి బైపాస్ నిర్మించడం ద్వారా వంతెన నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. కోనసీమ జిల్లా శివకోడు నుంచి టేకిశెట్టిపాలెం మీదుగా ఉన్న స్టేట్హైవేను జాతీయ రహదారిగా మార్చి రామేశ్వరం మీదుగా ఇటు పశ్చిమగోదావరి జిల్లాలోని రాజుల్లంక, వైఎస్ పాలెం, సీతారామపురం మీదుగా జాతీయ రహదారికి బైపాస్ హైవే రోడ్డు నిర్మించాలని ప్రతిపాదనలు తయారు చేసి టెండర్లు పిలిచారు. మధ్యలో కోనసీమ జిల్లా రామేశ్వరం, నరసాపురం మండలం రాజుల్లంక వద్ద వశిష్ట గోదావరిపై వంతెన నిర్మించడం ద్వారా వంతెన కలను నిజం చేయడానికి జగన్ ప్రభుత్వం పూనుకుంది. మొత్తం 380 మీటర్ల మేర వంతెన నిర్మాణానికి అంచనాలు తయారు చేశారు. స్థల సేకరణకు ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన రూ.60 కోట్లు మంజూరు చేసింది. స్థల సేకరణ సొమ్ముతో కలసి మొత్తం రూ 651.71 కోట్లు వంతెన నిర్మాణానికి ఖర్చుచేయడానికి జగన్ సర్కార్ పూనుకుంది. మొదటి నుంచీ కూటమి నేతల కుట్రలు అప్పటి వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి మంచి పేరు ఎక్కడ వస్తుందోనని కూటమి నేతలు కొందరు కుట్రలు మొదలుపెట్టారు. కావాలని అడ్డంకులు సృష్టించడానికి స్థల సేకరణ అంశంలో కోర్టుకు వెళ్లి స్టే తీసుకొచ్చారు. అప్పటి ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు గట్టి ప్రయత్నం చేసి స్టేను వెకేట్ చేయించారు. కూటమి కుట్రలు కొనసాగడంతో.. వివాదం సుప్రీంకోర్టు వరకూ వెళ్లింది. అక్కడ కేసు క్లియర్ అయిన తరువాత గానీ మళ్లీ రీటెండర్లు పిలిచే అవకాశం లేదని జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ వివరణ ఇచ్చింది. వశిష్ట గోదావరి వంతెనకు మళ్లీ అడ్డంకులు వంతెన టెండర్లు రద్దు చేసిన జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ వంతెనకు టెండర్లు పిలిచిన గత వైస్సార్సీపీ ప్రభుత్వం రూ 591.71 కోట్లతో వంతెన నిర్మాణానికి చర్యలు రూ.60 కోట్లతో స్థల సేకరణ పూర్తి కూటమి నేతల కుట్రలతో వంతెన పనులకు బ్రేక్ ఇప్పటికే పనులు మొదలవ్వాలి వశిష్ట వంతెన గోదావరి జిల్లాల ప్రజల చిరకాల కోరిక. మా హయాంలో స్థల సేకరరణ కూడా పూర్తయ్యింది. భూమి తీసుకున్న రైతులకు చెల్లింపులు జరిగిపోయాయి. అప్పుడు వెంతెన నిర్మించడానికి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించడంలో వైస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. మా ప్రభుత్వ హయాంలో టెండర్లు పిలిచాం. ఇప్పుడు టెండర్లు తెరిచి వంతెన పనులు మొదలు పెట్టడంలో ఈ ప్రభుత్వానికి ఇబ్బంది ఏంటో అర్ధం కావడంలేదు. – ముదునూరి ప్రసాదరాజు, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు -
దివ్యాంగులకు జాబ్ మేళా
భీమవరం: రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో వికలాంగ యువతకు నిర్వహించిన మెగా జాబ్ మేళాలో ఎంపికై న వారు ఉద్యోగాలలో స్థిరపడి మంచిగా జీవనం కొనసాగించాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. భీమవరం ఆర్ఆర్డీఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆంధ్రప్రదేశ్ నైపుణ్య అభివృద్ధి సంస్థ (ఏపీఎస్ఎస్డీసీ) నేషనల్ కెరియర్ సర్వీస్ (ఎన్సీఎస్) ఆధ్వర్యంలో బుధవారం దివ్యాంగులకు నిర్వహించిన మెగా ఉద్యోగ మేళా కార్యక్రమానికి కలెక్టర్ చదలవాడ నాగరాణి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ మేళాలో 14 కంపెనీలు పాల్గొని ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. మేళాకు 65 మంది హాజరు కాగా.. 45 మంది వివిధ కంపెనీల్లో ఉద్యోగాలకు ఎంపికయ్యారని జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారి డాక్టర్ పి.లోకమాన్ వివరించారు. డీఎస్సీ పరీక్షకు 81.89 శాతం హాజరు భీమవరం: జిల్లాలోని అయిదు పరీక్షా కేంద్రాల్లో బుధవారం నిర్వహించిన డీఎస్సీ పరీక్షకు 81.89 శాతం అభ్యర్థులు హాజరయ్యారని జిల్లా విద్యాశాఖాధికారి ఇ.నారాయణ చెప్పారు. సెషన్ 1లో 580 మందికి 495 మంది హాజరుకాగా, సెషన్–2లో 276 మందికి 206 మంది హాజరయ్యారని ఎక్కడా మాల్ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని నారాయణ తెలిపారు. -
జయహో జగన్నాథా
ద్వారకాతిరుమల: పూరి క్షేత్రంలో వలే జగన్నాథ రధోత్సవాలను శ్రీవారి క్షేత్ర దత్తత దేవాలయమైన లక్ష్మీపురంలోని జగన్నాథుని ఆలయంలో ఈనెల 27 నుంచి వచ్చేనెల 6 వరకు వైభవంగా నిర్వహించేందుకు దేవస్థానం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఉత్సవాల్లో భాగంగా జగన్నాథ స్వామివారు ఆలయ యాగశాలలో రోజుకో అలంకారంలో భక్తులకు దర్వనమివ్వనున్నారు. దీన్ని పురస్కరించుకుని యాగశాల ప్రాంతాన్ని ముస్తాబు చేస్తున్నారు. అలాగే స్వామివారి రథయాత్రలకు వినియోగించే రథ వాహనాన్ని సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే ఆలయం ముందు చలువ పందిరిని నిర్మించారు. అదేవిధంగా ఆలయాన్ని, పరిసరాలను విద్యుద్దీప తోరణాలతో అలంకరించారు. ఉత్సవాల ప్రారంభం రోజు శుక్రవారం సాయంత్రం సుభద్ర, బలభద్ర సమేత జగన్నాథుడు రథ వాహనంలో కొలువుదీరి ద్వారకాతిరుమల క్షేత్రానికి వెళ్లనున్నారు. అలాగే వచ్చేనెల 6 న ఆలయం నుంచి సమీప గ్రామమైన తిమ్మాపురం వైపు రథయాత్ర సాగనుంది. ఉత్సవాలు జరిగే పదిరోజులు జగన్నాథుని దశావతారాలు భక్తులను అలరించనున్నాయి. ఈ ఉత్సవాల్లో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని తరించాలని ఆలయ ఈఓ ఎన్వీ సత్యన్నారాయణ మూర్తి కోరారు. ఉత్సవాల్లో భాగంగా రోజుకో ప్రత్యేక అలంకారంలో స్వామివారు దర్శనమివ్వనున్నారు. ఆలయ విశిష్టత ఈ ఆలయాన్ని ఒరిస్సా రాష్ట్రానికి చెందిన పూరీ వాస్తవ్యులు, మఠాధిపతులైన మంత్రరత్నం అమ్మాజీ అనే లక్ష్మీ అమ్మవారు 130 ఏళ్ల క్రితం నిర్మించారు. అందులో జగన్నాథునితో పాటు, వేంకటేశ్వర స్వామివారిని ప్రతిష్ఠించారు. అప్పటి నుంచి కల్యాణోత్సవ, పవిత్రోత్సవాలతో కై ంకర్యాలను వైభవంగా నిర్వహిస్తున్నారు. శ్రీవారి దేవస్థానం ఈ ఆలయాన్ని దత్తత తీసుకున్న తరువాత జీర్ణోద్ధరణ గావించి మరింత అభివృద్ధి చేసింది. ఈ ఆలయంలో వేంకటేశ్వర స్వామి, అమ్మవార్లతో పాటు జగన్నాథ స్వామి, బలరామస్వామి, సుభద్రాదేవుల సన్నిధి, ఆళ్వారుల సన్నిధి, శ్రీ సంతాన వేణుగోపాల స్వామి సన్నిధి ఉన్నాయి. రేపటి నుంచి లక్ష్మీపురం ఆలయంలో జగన్నాథ రథోత్సవాలు -
● మావుళ్లమ్మకు ఉయ్యాల సేవ
భీమవరం మావుళ్లమ్మ అమ్మవారి జ్యేష్ఠమాస జాతర మహోత్సవాల్లో భాగంగా ఆఖరి రోజు బుధవారం అమ్మవారికి ఉయ్యాల సేవ నిర్వహించారు. పుట్టింటి, అత్తింటి వారు అల్లూరి, మెంటే వంశస్తులచే ఆలయ ప్రధానార్చకులు బ్రహ్మ శ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ ఈ కార్యక్రమాన్ని జరిపారు. అలాగే అమావాస్య సందర్భంగా మావుళ్లమ్మ దేవస్థానంలో చండీహోమం నిర్వహించారు. ఈ హోమంలో 60 మంది దంపతులు పాల్గొన్నారు. కార్యక్రమాల్లో ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మీ నగేష్, ఆలయ అధికారులు, భక్తులు పాల్గొన్నారు. – భీమవరం (ప్రకాశం చౌక్) -
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
భీమడోలు: సూరప్పగూడెంలోని పాత సుగర్ ఫ్యాక్టరీలో సెక్యూరిటీ గార్డు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన సూరాబత్తుల సాయిబాబు(30) పాత షుగర్స్ ఫ్యాక్టరీలో సెక్యూరిటీ గార్డ్గా పని చేస్తున్నాడు. ఈనెల 24న ఫ్యాక్టరీలో మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 10 గంటల షిఫ్ట్లో పని చేసేందుకు వెళ్లాడు. రాత్రి 10 గంటలకు షిఫ్ట్ దిగాల్సి ఉండగా రిలీవర్కు ఆతను కనిపించలేదు. ఫ్యాక్టరీలో ఉన్న చెరువు పక్కన అతని దుస్తులు కనిపించడంతో చెర్వులో వెతకగా బుధవారం అతడి మృతదేహం లభ్యమైంది. మృతుడి తండ్రి చిరంజీవి ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు ఎస్సై వై.సుధాకర్ తెలిపారు. కాగా సాయిబాబుతో మనస్పర్థల కారణంగా అతడి భార్య పుట్టింటికి వెళ్లిపోవడంతో మనస్తాపం చెందిన సాయిబాబు ఆత్మహత్యకు పాల్పడినట్లు చెబుతున్నారు. -
ఇంకా వెలగని ‘దీపం’
దెందులూరు: ఎంతో అట్టహాసంగా ప్రారంభించిన దీపం పథకం ఫలితం నీరుగారుతోంది. సుమారు రెండు నెలలైనా దీపం–2 రెండో విడత నగదు లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ కాలేదు. తొలి విడతలో ఈ పథకం ద్వారా అరకొరగా నగదు విడుదల చేశారు. రెండో విడత పూర్తిగా విస్మరించారు. 2024 నవంబర్లో దీపం–2 పథకాన్ని ప్రారంభించిన ప్రభుత్వం 2025 మార్చి 31 వరకు స్కీంను అమలు చేసింది. మొదటి విడత కొంతవరకు నగదును బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. రెండో విడత 2025 ఏప్రిల్ నుంచి ప్రారంభమైంది. రెండు నెలలు గడుస్తున్నా లబ్ధిదారుల ఖాతాల్లో పైసా కూడా జమ కాలేదు. జిల్లాలో అన్ని గ్యాస్ కంపెనీలకు సంబంధించి 55 ఏజెన్సీలు ఉన్నాయి. వీటిలో సింగిల్, డబుల్ సిలిండర్ల కనెక్షన్లు కలిపి 6,92,825 ఉన్నాయి. మొదటి విడత జిల్లా వ్యాప్తంగా 4,40,278 మంది లబ్ధిదారులు గ్యాస్ బుక్ చేసుకున్నారు. 4,35,035 కనెక్షన్లకు మాత్రమే నగదు బ్యాంకు ఖాతాల్లో జమైంది. రూ.49,78,950 బకాయిలు బ్యాంకు ఖాతాల్లో జమ కాలేదు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూలై నెలాఖరుకు వరకు రెండో విడత గడువు నిర్ణయించారు. దీనికి సంబంధించిన నిధులు ఇంతవరకూ అందలేదు. రెండో విడతకు సంబంధించి రెండు నెలలుగా ఏప్రిల్, మే నెలల్లో జిల్లాలో సుమారుగా 1,77,040 మంది గ్యాస్ బుక్ చేసుకున్నారు. వారు ఇప్పటికే గ్యాస్ ఏజెన్సీలకు డబ్బులు చెల్లించారు. ఫిర్యాదులు బుట్టదాఖలు దీపం పథకం సిలిండర్ నగదు అందలేదని చాలా మంది లబ్ధిదారులు పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేస్తున్నారు. అయితే వారి నగదుకి సంబంధించిన సమాచారం లేకపోవడం, గ్యాస్ కంపెనీలు తమ వద్ద ప్రభుత్వ నగదు లేదని స్పష్టం చేయడంతో ఫిర్యాదులను బుట్టదాఖలు చేస్తున్నారు. రెండు నెలలైనా అందని గ్యాస్ సబ్సిడీ రెండో విడత సుమారు రూ.19.81 కోట్ల బకాయిలు -
బీజీబీఎస్ మహిళా కళాశాల వ్యవహారంపై విచారణ
నరసాపురం: పట్టణంలో పద్మశ్రీ అద్దేపల్లి సర్విశెట్టి స్థాపించిన బీజీబీఎస్ మహిళా కళాశాల పాలకవర్గంపై ఇటీవల వస్తున్న ఆరోపణలపై బుధవారం ఉన్నత విద్యామండలి ఆర్జేడీ (రాజమండ్రి) పీవీ కృష్ణారావుతో కూడిన అధికార బృందం కళాశాలలో విచారణ నిర్వహించింది. కళాశాల అధ్యక్షుడు, కార్యదర్శి, ట్రెజరర్ కలిపి కళాశాల ఆస్తులు ఇస్టానుసారం అమ్మేస్తున్నారని, కళాశాలలో అవకతవకలు జరుగుతున్నాయనే అంశాన్ని ఇటీవల ‘అమ్మకానికి మహాశయుడి ఆస్తులు’ శీర్షికన సాక్షి దినపత్రిక వెలుగులోకి తీసుకురావడంతో డొంక కదిలింది. కళాశాలలో పనిచేస్తున్న మహిళా అధ్యాపకురాలు ఒకరు బయటకు వచ్చి కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ నూలి శ్రీనివాస్ తమను లైంగికంగా వేధిస్తున్నాడంటూ మీడియాకు వివరించడం చర్చనీయాంశమైంది. కళాశాల వ్యవహరాలపై చర్యలు తీసుకోవాలని కావలి నాని అనే వ్యక్తి ఫిర్యాదు చేయడంతో అధికారులు విచారణ చేపట్టారు. లోపల విచారణ.. బయట ఆందోళన కళాశాలలో అధికారులు విచారణ జరుపుతుండగా, బయట కాంట్రాక్ట్ అధ్యాపకులు, సిబ్బందితో కలసి బీసీ సంఘ నేత చింతపల్లి గురుప్రసాద్ నాయకత్వంలో ఆందోళన నిర్వహించారు. కరస్పాండెంట్ నూలి శ్రీనివాస్ కబంధహస్తాల నుంచి కళాశాలను కాపాడాలని, పాలకవర్గంపై క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో టౌన్ ఎస్సై ముత్యాలరావు సిబ్బందితో వచ్చి బందోబస్తు నిర్వహించారు. విచారణ అధికారి కృష్ణారావు విద్యార్థులు, అధ్యాపకులను విచారించి వివరాలు రికార్డు చేసుకున్నారు. ఈ వ్యవహారానికి కేంద్ర బింధువైన నూలి శ్రీనివాస్ విచారణకు హాజరుకాకపోవడం విశేషం. అనంతరం కృష్ణారావు విలేకరులతో మాట్లాడుతూ నివేదికను ఉన్నతాధికారులకు అందిస్తామన్నారు. ఆందోళనలో బిళ్లు బ్రదర్స్, కోట్ల రామకృష్ణారావు, కోట్ల రాజా, స్వర్ణాంధ్ర త్రినాథ్ పాల్గొన్నారు. -
‘ఎస్’ వెనుక ఎవరు?
సాక్షి టాస్క్ఫోర్స్: నూజివీడు నియోజకవర్గంలోని మద్యం బెల్టుషాపులకు మద్యం సిండికేట్ సరఫరా చేస్తున్న మద్యం సీసాలపై ‘ఎస్’ స్టిక్కర్ ఉండటంతో నియోజకవర్గ వ్యాప్తంగా సర్వత్రా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఊరూరా పదుల సంఖ్యలో బెల్టుషాపులు, మద్యం దుకాణాల వద్ద బార్లను తలపించేలా అనధికార సిట్టింగ్లతో మద్యం వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలు అన్న చందంగా సాగుతోంది. ఇష్టారాజ్యంగా సిట్టింగ్లతో మద్యం వ్యాపారం జోరుగా సాగుతున్నప్పటికీ అనధికార సిట్టింగ్ల వైపు ఎకై ్సజ్ అధికారులు కన్నెత్తి కూడా చూడటం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మద్యం సిండికేట్ బెల్టుషాపులకు ‘ఎస్’ స్టిక్కర్తో మద్యం సీసాలను సరఫరా చేస్తుండటం తీవ్ర సంచలనంగా మారింది. ఈ స్టిక్కర్ అర్థం ఏమిటి, దీని వెనుక ఉన్నదెవరనే ప్రశ్నలు రాజకీయవర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. మద్యం షాపుల నుంచి బెల్టుషాపులకు మద్యం సీసాలు రవాణా అవుతుంటే స్టిక్కర్ వేయాల్సిన అవసరమేముందనే సందేహం ప్రతి ఒక్కరిలో వస్తోంది. అలా కాకుండా ఇంకేదైనా మద్యంను సరఫరా చేస్తున్నారా అనే అనుమానాలు ప్రబలడానికి ఆస్కారం ఏర్పడింది. బెల్టుషాపుల్లో ఎమ్మార్పీ కంటే రూ.40 అధికం ఏ గ్రామంలోనైనా బెల్టుషాపు పెట్టాలంటే రూ.25 వేలు చెల్లించాల్సిందే. బెల్టుషాపులకు అనుమతి లేదని, ఎమ్మార్పీ ధరలకే మద్యాన్ని విక్రయించాలని ప్రభుత్వం ప్రకటనలు ఇస్తుంటే ఇక్కడ మాత్రం ఒక్కో సీసాపై రూ.20 నుంచి రూ.40 అధిక ధరలకు విక్రయిస్తున్నారు. మద్యం సిండికేట్ బెల్టుషాపులకు ఏ మద్యం బ్రాండ్ అయినా సరే ఒక్కో సీసాపై ఎమ్మార్పీపై అదనంగా రూ.20కు విక్రయిస్తుండగా బెల్టుషాపుల నిర్వాహకులు మరో రూ.20 వేసుకొని మందుబాబులకు అమ్ముతున్నారు. దీంతో ఒక్కో సీసాకు ఎమ్మార్పీ కంటే రూ.40 అదనంగా చెల్లించి మందుబాబులు మద్యంను సేవించాల్సి వస్తోంది. పెద్ద ఎత్తున అధిక ధరలకు విక్రయిస్తూ ఇంత దారుణంగా దోపిడీ చేస్తుంటే పట్టించుకోవాల్సిన ఎకై ్సజ్ అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. అప్పుడప్పుడు దాడులు చేస్తూ బెల్టుషాపుల నిర్వహణకు అనుమతి లేదంటూ ప్రకటనలు ఇచ్చి మిన్నకుండిపోతున్నారు. మద్యం సీసాలపై ‘ఎస్’ స్టిక్కర్పై సర్వత్రా చర్చ -
ఏం సమాధానం చెబుతారు
మహిళలందరికీ ముఖ్యమంత్రి చంద్రబాబు, పవన్ కల్యాణ్, బీజేపీ పెద్దలు ఏం సమాధానం చెబుతారు. ఎన్నికల ముందు నాది హామీ అంటూ అన్ని ప్రచార సభల్లో హామీలిచ్చారు. ఇప్పుడు వంట గ్యాస్ విషయంలో కూడా మోసం చేస్తే ఎలా? – నిట్టా లీలా నవకాంతం, జెడ్పీటీసీ దెందులూరు సూపర్ సిక్స్ అమలు చేస్తారా? కూటమి ప్రభుత్వానికి సూపర్ సిక్స్ హామీలు అమలు చేసే ఉద్దేశం ఉందా లేదా? అన్ని వర్గాల ప్రజలు సూపర్ సిక్స్ హామీలు అమలు చేస్తారని ఎదురుచూస్తున్నారు. సంవత్సరం పూర్తయింది. గ్యాస్ కాకుండా ఉచిత బస్సు.. ఆడబిడ్డ నిధి ఎప్పుడు అమలు చేస్తారు. – అప్పన పద్మావతి, వైస్ ఎంపీపీ, పెదపాడు ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఎన్నికల ముందు అన్ని ప్రచార సభల్లో సూపర్ సిక్స్ పేరిట హామీలిచ్చారు. సంవత్సరం గడిచినా సూపర్ సిక్స్ హామీలు అమలు చేయడం లేదు. ఉచిత గ్యాస్, ఉచిత బస్సు, ఆడబిడ్డ నిధి మహిళలకు ఎంతో ఉపయోగపడే పథకాలు. అమలు చేయనప్పుడు హామీలు ఎందుకు ఇచ్చారు? – పర్వతనేని శ్రావణి, సర్పంచ్, రామారావుగూడెం సబ్సిడీ జమ చేస్తున్నాం 3.30 లక్షల మంది లబ్ధిదారులు గ్యాస్ సబ్సిడీ కోసం ఆన్లైన్ చేశారు. సబ్సిడీ జమ కార్యక్రమం జరుగుతుంది. లబ్ధిదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. లబ్ధిదారుల ఖాతాల్లో సబ్సిడీ సొమ్ము త్వరలోనే జమ అవుతుంది. – విలియమ్స్, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి, ఏలూరు -
9 కిలోల గంజాయి పట్టివేత
నలుగురు గంజాయి విక్రేతల అరెస్ట్ ఏలూరు టౌన్: గంజాయి విక్రయిస్తున్న నలుగురిని పోలీసులు అరెస్ట్ చేసి నిందితుల నుంచి 9 కిలోల గంజాయి, రెండు మోటారు సైకిళ్లు, రూ.4,100 నగదు, 4 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఏలూరు త్రీటౌన్ పోలీస్ స్టేషన్లో బుధవారం రాత్రి సీఐ వి.కోటేశ్వరరావు వివరాలు వెల్లడించారు. పెదవేగి మండలం దుగ్గిరాల గ్రామ పరిధిలోని ఏలూరు జాతీయ రహదారి–16 సర్వీస్ రోడ్డులో గంజాయి విక్రయిస్తున్నారని తెలియటంతో ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ ఆదేశాల మేరకు ఏలూరు డీఎస్పీ డీ.శ్రావణ్కుమార్ పర్యవేక్షణలో త్రీటౌన్ ఎస్సై రాంబాబు, సిబ్బంది చాకచక్యంగా దాడి చేసి నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని మధ్యవర్తుల సమక్షంలో అరెస్ట్ చేసినట్లు చెప్పారు. వీరిపై ఎన్డీపీఎస్ యాక్ట్–1985 మేరకు కేసు నమోదు చేశామన్నారు. విలాసాలు, సులువుగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశ్యంతో నిందితులు గంజాయి విక్రయిస్తున్నారని ఆయన తెలిపారు. నిందితులు బాపట్ల జిల్లా అద్దంకి మండలం ప్రాంతానికి చెందిన సైడ వేణు, ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం పాదర్తికి చెందిన సింబత్తుల సాయి, అదే గ్రామానికి చెందిన అలుగుల నాగవర్థన్గా గుర్తించామని, వీరితోపాటు ఒక మైనర్ బాలుడు కూడా ఉన్నట్లు సీఐ చెప్పారు. -
ఈవీఎం గోడౌన్ తనిఖీ
భీమవరం (ప్రకాశం చౌక్): భీమవరం పీపీ రోడ్డులోని ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ గోడౌన్లో భద్రపరిచిన ఈవీఎం యంత్రాలను కలెక్టర్ చదలవాడ నాగరాణి బుధవారం తనిఖీ చేశారు. గోడౌన్న్కు వేసిన సీళ్లను ఈవీఎంల రక్షణ, భద్రతకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం పర్యవేక్షణ రిజిస్టర్లో కలెక్టర్ సంతకం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ప్రతి మూడు నెలలకు ఒకసారి ఈవీఎంలు భద్రపరిచిన గోడౌన్ క్షుణ్ణంగా తనిఖీ చేసి సమగ్ర నివేదికను పంపడం జరుగుతుందని తెలిపారు. మా పాఠశాలను విలీనం చేయొద్దు సార్ భీమవరం అర్బన్: మా పాఠశాలను విలీనం చేయొద్దని దెయ్యాలతిప్పలోని ఎస్సీ పేటకు చెందిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కలక్టరేట్లోని డీఆర్వో మొగలి వెంకటేశ్వర్లుకు వినతిపత్రం అందజేశారు. ఇటీవల కూటమి ప్రభుత్వం విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్న పాఠశాలలను విలీనం చేసే ప్రక్రియలో భాగంగా ఎస్సీ పేటలో ఉన్న పాఠశాలను బీసీ పేటలో ఉన్న ప్రాథమిక పాఠశాలలో విలీనం చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అధికారులకు మొర పెట్టుకున్నారు. గతంలో బీసీ పేటలోని వ్యక్తులకు తమ పేటలోని వ్యక్తులకు గొడవలు అయ్యాయని, ఇప్పుడు విలీనం చేయడం వల్ల మళ్లీ గొడవలు జరిగే ప్రమాదం ఉందని వినతిపత్రంలో ఎస్సీ పేట వాసులు తెలిపారు. సమస్యను పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామని డీఆర్వో హామీ ఇచ్చారు. గ్యాస్ నొప్పితో మహిళ మృతి చాట్రాయి: గ్యాస్ నొప్పితో ఓ మహిళ మృతి చెందింది. వివరాల ప్రకారం మండలంలోని పోతనపల్లి గ్రామానికి చెందిన వడిత్యా కామాక్షి (35) బధవారం గ్యాస్ నొప్పిగా ఉందని భర్తతో కలిసి చాట్రాయి ఆర్ఎంపీ వైద్యులను ఆశ్రయించారు. టిఫిన్ చేసి రావాలని ఆర్ఎంపీ వైద్యుడు సూచించారు. అనంతరం టిఫిన్ చేసి వచ్చిన తరువాత బీపీ చూస్తుండగా ఆమె అకస్మాతుగా వాంతులు చేసుకుని అక్కడే సృహ తప్పి పడిపోయింది. వెంటనే పీహెచ్సీకి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు పీహెచ్సీ వైద్యురాలు విజయలక్ష్మి చెప్పారు. మృతురాలికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఆమె మృతితో భర్త, పిల్లలు కన్నీరుమున్నీరుగా విలపించారు. విజయలక్ష్మి భౌతికకాయాన్ని ఏపీ కో ఆపరేటివ్ యూనియన్ రాష్ట్ర మాజీ చైర్మన్ దేశిరెడ్డి రాఘవరెడ్డి, వైఎస్సార్ సీపీ నేత కారంగుల వాసు తదితరులు సందర్శించి నివాళులర్పించారు. -
నకిలీ మద్యం తయారీ గుట్టు రట్టు
పాలకొల్లు సెంట్రల్: ఎకై ్సజ్ పోలీసులు పట్టణంలో నకిలీ మద్యం తయారీ ముఠా గట్టును రట్టు చేశారు. శంభునిపేటలో నివాసం ఉంటున్న పులి శీతల్ అనే వ్యక్తి ఇంటిలో నకిలీ మద్యం తయారవుతుందని వచ్చిన సమాచారంపై ఎకై ్సజ్ పోలీసులు మంగళవారం తెల్లవారుజామున దాడులు నిర్వహించారు. ఈ దాడిలో శీతల్ ఇంటిలో 130 లీటర్ల స్పిరిట్తోపాటు ప్రమాదకర ఎసెన్స్, నకిలీ మద్యం తయారీ యూనిట్, మద్యం సీసాలకు మూతలు బిగించే మిషన్, ఖాళీ మద్యం సీసాలు, మూతలు స్వాధీనం చేసుకున్నారు. ఈ యూనిట్ నడుపుతున్న పులి శీతల్ని అరెస్ట్ చేశారు. పాలకొల్లు ఎకై ్సజ్ స్టేషన్లో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో జిల్లా ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ బి శ్రీలత, అసిస్టెంట్ కమిషనర్ ప్రభుకుమార్ మాట్లాడుతూ నిందితుడికి స్పిరిట్, ఎసెన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయో దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. శీతల్పై గుట్కా కేసు కూడా ఉందన్నారు. అమలాపురంలో ఈ ముఠాకు చెందిన నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు ఆమె చెప్పారు. అసిస్టెంట్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్లు అజయ్ సింగ్, ప్రసాదరెడ్డి ఆధ్వర్యంలో పాలకొల్లు ఎకై ్సజ్ సీఐ మద్దాల శ్రీనివాస్, భీమవరం స్క్వాడ్ సీఐ కల్యాణ చక్రవర్తి ఎస్సైలు రఘు, మహేష్, రమాదేవి ఈ దాడుల్లో పాల్గొన్నారు. -
ఖైదీల సౌకర్యాలపై ప్రతి నెలా తనిఖీలు
ఏలూరు టౌన్: ఏలూరు జిల్లా జైలును ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్.శ్రీదేవి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కే.రత్నప్రసాద్ మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీదేవి మాట్లాడుతూ జిల్లాలోని ప్రతి కారాగారాన్ని జిల్లా న్యాయసేవాధికార సంస్థ తనిఖీలు నిర్వహించాల్సి ఉందన్నారు. ప్రతి నెలా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఆధ్వర్యంలో తనిఖీలు ఉంటాయని, మూడు నెలలకు ఒకసారి జిల్లా చైర్మన్ తనిఖీలు చేస్తారని స్పష్టం చేశారు. జిల్లా జైలులోని ఖైదీల వివరాలు తెలుసుకుని, ఉచిత న్యాయ సహాయం ఏర్పాటు చేస్తామన్నారు. ఖైదీల కుటుంబ సభ్యులకు ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను పొందడంలో సమస్యలు ఏర్పడితే జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఉచితంగా అందిస్తుందన్నారు. కార్యక్రమంలో జిల్లా జైలు సూపరింటెండెంట్ సీహెచ్ఆర్వీ స్వామి, జైలర్ కే.శ్రీనివాసరావు, చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిలర్ పీవీఎన్. మునీశ్వరరావు తదితరులు ఉన్నారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్పర్సన్, ప్రధాన న్యాయమూర్తి శ్రీదేవి -
● మద్ది క్షేత్రానికి పోటెత్తిన భక్తులు
జంగారెడ్డిగూడెం: గురవాయిగూడెం శ్రీ మద్ది ఆంజనేయస్వామి ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు స్వామివారికి ప్రభాతసేవ, నిత్యార్చన పూజలు జరిపారు. అనంతరం స్వామివారు ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనం ఇచ్చారు. స్వామివారికి ప్రీతికరమైన మంగళవారం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో బారులుదీరి స్వామిని దర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. మధ్యాహ్నం వరకు దేవస్థానానికి వివిధ సేవలు, విరాళాల ద్వారా రూ.2,15,016 సమకూరినట్లు ఈవో ఆర్వీ చందన తెలిపారు. సుమారు 1200 మంది భక్తులకు స్వామివారి నిత్యాన్నదాన సత్రం నందు అన్నప్రసాదం స్వీకరించారని ఈవో తెలియజేశారు. -
దుగ్గిరాలలో వైఎస్సార్ విగ్రహం ధ్వంసం
పెదవేగి : ఏలూరు జిల్లా పెదవేగి మండలం దుగ్గిరాల గ్రామంలో దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని గుర్తుతెలియని వ్యక్తులు మంగళవారం ధ్వంసం చేశారు. ఈ ఘటనపై వైఎస్సార్సీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కక్షపూరిత చర్యలు, వికృత చేష్టలతో హద్దులు దాటి విచక్షణ కోల్పోయి ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారంటూ మండిపడ్డారు. గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో దుగ్గిరాల ప్రధాన కూడలిలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాల ఏర్పాటును స్థానిక కూటమి నాయకులు వ్యతిరేకించారని గుర్తుచేశారు. ప్రస్తుతం వారు అధికారంలోకి వచ్చిన తరువాత మహానేత వైఎస్సార్ విగ్రహం చెయ్యి విరగ్గొట్టి, తల వెనుక భాగంలో కర్ర పుల్ల గుచ్చి అవమానించడం నీచ సంస్కృతికి నిదర్శనమన్నారు. దీనిపై జిల్లా పోలీస్ అధికారులకు, కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామని, వారు స్పందించి నిందితులపై చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున నిరసనలు, ధర్నాలు చేపడతామని నాయకులు స్పష్టం చేశారు. విగ్రహ ధ్వంసం సరైంది కాదు దుగ్గిరాలలో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహ ధ్వంసం ఘటనను దెందులూరు మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి ఖండించారు. ప్రభుత్వాలు మారినంత మాత్రాన ఇలా విగ్రహాలు ధ్వంసం చేసే విధానం సరైంది కాదన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డిని ప్రజలు దైవంగా భావిస్తారని, అటుంవంటి మహనీయుని విగ్రహం ధ్వంసం చేయడం హేయమైన చర్య అని అన్నారు. ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వైఎస్సార్ సీపీ శ్రేణులు అధికారులు స్పందించకపోతే ఉద్యమిస్తామని వెల్లడి