West Godavari
-
జిల్లా ఎకై ్సజ్ శాఖాధికారిగా సుబ్బారావు
భీమవరం: జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అధికారిగా బి.సుబ్బారావు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు పనిచేసిన కుమరేషన్ బదిలీపై అమలాపురం వెళ్లారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం సుబ్బారావు కలెక్టర్ చదలవాడ నాగరాణిని కలెక్టరేట్లో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించారు. భీమవరం (ప్రకాశంచౌక్): కలెక్టర్ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే పీజీఆర్ఎస్కు హాజరయ్యే అర్జీదారుల సౌకర్యార్థం, శ్రీ సుభాశిష్ చక్రవర్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత మినీ వ్యాన్ సౌకర్యం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని కలెక్టర్ చదలవాడ నాగరాణి సోమవారం భీమవరం పాత బస్టాండ్ వద్ద జెండా ఊపి ప్రారంభించారు. మినీ వ్యాన్ ప్రతి సోమవారం ఉదయం భీమవరం పాత బస్టాండ్ నుంచి ప్రారంభమై, కొత్త బస్టాండ్ మీదుగా జిల్లా కలెక్టరేట్కు చేరుకుంటుందని కలెక్టర్ తెలిపారు. ప్రజా సేవకు ముందుకొచ్చిన శ్రీ సుభాశిష్ చక్రవర్తి ఫౌండేషన్ నిర్వాహకులు డీటీడీసీ బాబుకు కలెక్టర్ కృతజ్ఞతలు తెలిపారు. భీమవరం: దీర్ఘకాలికంగా అపరిస్కృతంగా ఉన్న ఉపాధ్యాయ సమస్యల పరిస్కార కోసం ఫ్యాప్టో ఆధ్వర్యంలో మూడోదశ పోరాటంలో భాగంగా ఈ నెల 25 నుంచి మూడు రోజులపాటు విజయవాడ ధర్నా చౌక్ వద్ద రిలే నిరాహార దీక్షలు చేపట్టనున్నట్లు జిల్లా ఫ్యాప్టో సన్నాహక సమావేశం జిల్లా చైర్మన్ పీఎస్.విజయ రామరాజు, సెక్రటరీ జనరల్ జి.ప్రకాశం చెప్పారు. సోమవారం భీమవరంలో మాట్లాడుతూ 25న జిల్లా నుంచి 1000 మంది ఉపాధ్యాయులు రిలే నిరాహార దీక్షకు హాజరుకానున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో డిప్యూటీ సెక్రటరీ జనరల్ కేవీ.రామచంద్రరావు, కో–కన్వీనర్లు శ్రీనివాస్, వెంకటేశ్వరరావు, ట్రెజరర్ పట్టాభిరామయ్య తదితరులు పాల్గొన్నారు. భీమవరం: ప్రజా సమస్యలపై త్వరితగతిన స్పందించి నిర్ణీత గడువులోగా చట్ట పరిధిలో శాశ్వత పరిష్కారం చూపాలని ఎస్పీ అద్నాన్ నయీం అస్మి జిల్లా పోలీసు అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. అనంతరం ఎస్పీ సంబంధిత పోలీస్స్టేషన్స్ అధికారులతో ఫోన్లో మాట్లాడుతూ ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ఎంతో ఆశతో పోలీసు కార్యాలయాలను ఆశ్రయిస్తారని వారికి పోలీసు శాఖ వెన్నుముకగా నిలిచి భరోసా కల్పించి సమస్యలను పరిష్కరించాలన్నారు. నూజివీడు: నూజివీడు కేంద్రీయ విద్యాలయంలో నాలుగు, ఐదో తరగతిలో మిగిలిన సీట్ల భర్తీకి అర్హుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ మహమ్మద్ ఫరూఖ్ సోమవారం తెలిపారు. మిగిలిన సీట్లు ఎస్టీ కేటగిరి విద్యార్థులకు సంబంధించినవి కావడంతో ఆ కేటగిరికి చెందిన విద్యార్థులు ఈనెల 28లోగా దరఖాస్తులను కేంద్రీయ విద్యాలయంలో అందజేయాలని విజ్ఞప్తి చేశారు. -
ఆక్వా విలవిల
● ఎండల దెబ్బకు చుట్టుముడుతున్న వ్యాధులు ● కొల్లేరులో 39 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు ● ఉమ్మడి జిల్లాలో సుమారు 3 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగు ఆక్వా రంగాన్ని అధిక ఉష్ణోగ్రతలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఈ ఏడాది ఎల్నినో ప్రభావంతో ఎండలు తీవ్రత ఎక్కువగా ఉంటుందనే హెచ్చరికల నేపథ్యంలో ఆందోళన వ్యక్తమవుతోంది. కై కలూరు: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాల్లో సుమారు 3 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగు చేస్తున్నారు. చెరువులకు నీటి వనరులు సమృద్ధిగా అందకపోవడంతో ప్రస్తుతం నీటి స్థాయిలు తగ్గాయి. ఎండాకాలంలో వాతావరణ మార్పుల వల్ల చేపలు చనిపోతే సమ్మర్ కిల్ అంటారు. మరోపక్క చేపలు, రొయ్యల్లో వ్యాధులు పెరగుతోన్నాయి. ఈ నేపథ్యంలో అధిక ఉష్ణోగ్రతలు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. చేపలు 20 నుంచి 30 డిగ్రీల సెల్సియస్ మధ్య బాగా పెరుగుతాయి. కొద్ది రోజులుగా కొల్లేరు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 39 డిగ్రీలకు చేరింది. ఈ పరిణామం చేపల, రొయ్యల రైతులను కలవరపెడుతోంది. చెరువుల్లో నీరు ఆవిరవడం వల్ల ఉష్ణోగ్రతలు పెరిగి ఆక్సిజన్ లేమి, నీటి కాలుష్యం, విషవాయువుల ఉత్పతి వంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. అధిక ఉష్ణోగ్రతల ప్రభావంతో నీటి నాణ్యతలో ఆకస్మిక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. దీనికి తోడు వేసవి కాలం చివరలో వచ్చే తొలి వర్షాల వల్ల ఆక్సిజన్ లేమి సమస్యతో రూ.కోట్లలో ఆక్వా రైతులు నష్టపోతున్నారు. చుట్టుముడుతున్న వ్యాధులు : చేపల, రొయ్యల చెరువులకు నీటి వనరులు సమృద్ధిగా లేకపోవడంతో నీటిలో మార్పులు సంభవిస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో చేపల్లో జిగురు, జలగ, శంఖుజలగ, సన్న జలగ, తాటాకు తెగుళు, పొట్టఉబ్బు వ్యాధి, ఎర్ర మచ్చల వ్యాధి, రొయ్యల సాగులో వైట్ స్పాట్, ఈహెచ్సీ, ఆర్ఎంఎస్ వ్యాధులు ఆందోళన కలిగిస్తున్నాయి. వేసవిలో సూర్యరశ్మి పెరగడం వల్ల చెరువుపై భాగంలో రెండడుగుల మేర నీరు వేడెక్కుతోంది. వేడి నీరు తేలికగా ఉంటుంది. అడుగు భాగాన చల్లగా ఉన్న నీరు బరువుగా ఉంటుంది. ఇదే సమ్మర్ కిల్లింగ్కు దారితీస్తోంది. రాష్ట్రంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ఆక్వా రైతులు తీసుకోవల్సిన జాగ్రత్తల్ని మత్స్యశాఖ అధికారులు వివరిస్తున్నారు. వేసవిలో ఆక్వా సాగు రైతులు అప్రమత్తంగా వ్యవహరించాలి. మత్స్యశాఖ ఆధ్వర్యంలో ఆక్వా సాగు ప్రాంతాల్లో వేసవిలో తీసుకోవల్సిన జాగ్రత్తలను వివరిస్తున్నాం. కై కలూరు ప్రభుత్వ మత్స్య లేబోరేటరీలో నీటి, మట్టి పరీక్షలు రైతులకు అందుబాటులో ఉన్నాయి. సద్వినియోగం చేసుకోవాలి. –సీహెచ్ గణపతి, మత్స్యశాఖ అభివృద్ధి అధికారి, కై కలూరు -
నిలువునా ముంచిన నీటి నిర్లక్ష్యం
కై కలూరు: ఆక్వారంగం ఆర్థిక ప్రగతికి దోహదపడుతున్నప్పటికీ అంతే పర్యావరణ కాలుష్యానికీ కారణమవుతోంది. చేపల, రొయ్యల చెరువుల్లో నీటిని బయటకు పంపడానికి సరైన డ్రెయినేజీ వ్యవస్థ లేకపోవడంతో పంట కాల్వలోకి సైతం రసాయనాలు కలిసిన ఆక్వా చెరువుల నీరు చేరుతోంది. దీంతో ఎగువ గ్రామాల ప్రజలకు కలుషిత నీరే దిక్కవుతోంది. ప్రధానంగా చెరువుల సమీపంలో రహదారులు ఆక్వా రైతుల నిర్లక్ష్యానికి దెబ్బతింటున్నాయి. వరహాపట్నం గ్రామంలో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. రొయ్యల చెరువు నీరు రోడ్లపైకి.. ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ స్వగ్రామం వరహాపట్నం నుంచి రామవరం వెళ్లే రహదారిలో వరహాపట్నం పంచాయతీ పరిధిలో సుమారు 8 ఎకరాల రొయ్యల రైతు సాగు దెబ్బతినడంతో ఆదివారం రాత్రి నుంచి పైపుతో నీటిని రోడ్డుపై వదులుతున్నాడు. దీంతో సోమవారం ఉదయం రోడ్డు పెద్ద చెరువులాగా మారింది. నిండు వేసవిలో రహదారి మునగడంపై వాహనదారులు మండిపడ్డారు. రోడ్డుపై గుంతలు పడటంతో అనేక మంది అతికష్టం మీద భయంభయంగా ప్రయాణించారు. రైతు శ్రీనివాసరావును నీటిని వదలడంపై వివరణ కోరితే ముందు రైతులు డ్రెయిన్కు అడ్డుగా వేయడంతోనే నీరు నిలిచాయని చెప్పుకొచ్చాడు. పాత సమస్య పునరావృతం వరహాపట్నం పరిధిలో అన్నవా డ్రెయిన్ సమీపంలో సుమారు 350 ఎకరాల విస్తీర్ణంలో ఆక్వా చెరువులు సాగు చేస్తున్నారు. చెరువుల్లో నీటిని డ్రెయిన్ ద్వారా పంపించాలి. ఇందుకు అనేక మంది అవకాశం లేకపోవడంతో పంట కాల్వలోకి వదులుతున్నారు. ఇటీవల వరహాపట్నంలో చెరువుల రైతులు నీటిని రోడ్డుపైకి వదలడంతో అడుగు నీటిలో రోడ్డు ముంపుబారిన పడింది. దీంతో ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ స్వయంగా వెళ్లి రహదారిని పరిశీలించారు. ఆక్వా రైతులు పూడుకుపోయిన డ్రెయిన్లకు మరమ్మతులు చేసుకుని నీటిని వదలాలని హెచ్చరించారు. ఇది జరిగి 6 నెలలు దాటుతున్నా రోడ్డు వెంబడి డ్రెయిన్లకు ఆక్వా రైతులు మరమ్మతులు చేసుకోలేదు. ఈ రహదారిలో మరికొందరు రైతులు చెరువుల నీటిని వదిలితే వరహాపట్నం – రామవరం రహదారి పూర్తిగా మునిగి ప్రయాణాలు నిలిచిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. వరహాపట్నంలో అన్నవా డ్రెయిన్ మరమ్మతులు చేయించాం. వరహాపట్నం – రామవరం రహదారిలో రోడ్డుకు ఇరువైపుల ఆక్వా రైతులు జేసీబీ యంత్రంతో బోదెలను మరమ్మతులు చేసుకోవాలి. సమస్యను ఎమ్మెల్యే కామినేని దృష్టికి తీసుకువెళతాం. రహదారుల సమీపంలో ఆక్వా రైతులు నీటిని రోడ్లపైకి విడిచిపెడితే చర్యలు తీసుకుంటాం. –ఎం.రామకృష్ణ, డ్రెయినేజీశాఖ, డీఈఈ, కై కలూరు రొయ్యల చెరువు నీరు రహదారిపైకి ఎమ్మెల్యే కామినేని స్వగ్రామంలో వీడని సమస్య వరహాపట్నం – రామవరం రహదారిలో ప్రజల అవస్థలు పంట కాల్వలకు చేరుతున్న అక్వా చెరువుల కలుషిత నీరు -
అర్జీల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి
ముంచిన నీటి నిర్లక్ష్యం చేపల, రొయ్యల చెరువుల్లోని నీరు పంట కాల్వలోకి చేరడంతో తాగునీరు కలుషితమవుతోంది. రహదారిపైకి చేరడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. 8లో uకలెక్టర్ చదలవాడ నాగరాణి భీమవరం (ప్రకాశంచౌక్): ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు మరింత బాధ్యతతో వ్యవహరించి, పీజీఆర్ఎస్ రెవెన్యూ క్లినిక్లలో అందిన అర్జీలను నిర్ణీత గడువులోపు నాణ్యమైన విధంగా పరిష్కరించాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదేశించారు. సోమవారం భీమవరం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ చదలవాడ నాగరాణి, జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, జిల్లా స్వర్ణ గ్రామం – స్వర్ణ వార్డు అధికారి వై.దోసిరెడ్డి, డ్వామా పీడీ డా.కె.సి.హెచ్.అప్పారావు, కలెక్టరేట్ పరిపాలనాధికారి ఎన్.వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొని జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, 133 అర్జీలు స్వీకరించినట్లు తెలిపారు. పాలకోడేరు నుంచి పెద్ద సంఖ్యలో మహిళలు తరలి వచ్చి కలెక్టరేట్ వద్ద తమ ఇళ్ల తొలగింపునకు మార్కింగ్ చేస్తున్నారని నిరసన తెలియచేసి పీజీఆర్ఎస్లో కలెక్టర్ను కలిసి న్యాయం చేయాలని కోరారు. ఆకివీడు మండలంలో డ్వాక్రా సొమ్ములు కాజేసిన ఇద్దరు మెప్మా ఆర్పీలు, వారికి సహకరించిన బ్యాంకు అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆ మండలానికి చెందిన పలువురు డ్వాక్రా మహిళలు, బాధితులు పీజీఆర్ఎస్లో వినతిపత్రం అందచేశారు. -
ఉరి వేసుకుని వివాహిత మృతి
తణుకు అర్బన్ : ఉరి వేసుకుని ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. పైడిపర్రులో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. పైడిపర్రుకు చెందిన లక్ష్మీనారాయణకు, పెరవలి మండలం కానూరు అగ్రహారం గ్రామానికి చెందిన అనుమోలు దేవిలకు 11 ఏళ్ల క్రితం వివాహం కాగా వీరికి ఇద్దరు ఆడపిలల్లలు సంతానం ఉన్నారు. లక్ష్మీనారాయణ హైదరాబాదులో పండ్ల వ్యాపారం చేసుకుంటూ ఉండగా దేవి స్థానికంగా మోటారు సైకిళ్ల షోరూంలో పని చేస్తోంది. దాదాపు 20 రోజుల క్రితం స్వగ్రామానికి వచ్చిన లక్ష్మీనారాయణ కొద్దిరోజులుగా భార్యతో గొడవ పడుతున్నాడు. ఈ క్రమంలో మనస్తాపం చెందిన దేవి భర్త ఇద్దరు పిల్లలను స్కూలుకు తీసికెళ్లిన సమయంలో ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఇంటికి వచ్చిన లక్ష్మీనారాయణ దేవిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు. భర్త వేధింపుల కారణంగానే తమ కుమార్తె ఆత్మహత్య చేసుకుందని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఇన్చార్జి రూరల్ ఎస్సై జానా సతీష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
శ్రీవారి క్షేత్రంలో తోటమాలి నిజాయతీ
ద్వారకాతిరుమల: శ్రీవారి క్షేత్రంలో ఓ తోటమాలి నిజాయతీ కారణంగా ఒక మహిళ పోగొట్టుకున్న పర్సు తిరిగి ఆమెకు దక్కింది. వివరాల ప్రకారం. డీఆర్డీఏలో పనిచేస్తున్న ద్వారకాతిరుమల మండలం దొరసానిపాడు గ్రామానికి చెందిన నాగలక్ష్మి సోమవారం కొండపైన సీతా నిలయంలో ఉన్న అధికారులను కలిసేందుకు వెళ్లిన సమయంలో పర్సు పొగొట్టుకున్నారు. ఆ పర్సులో రూ.5 లక్షల విలువైన నాలుగు కాసుల బంగారు గొలుసు, కొంత నగదు ఉంది. అక్కడ గార్డెన్లో పనిచేస్తున్న తోటమాలి సీతయ్యకు ఆ పర్సు దొరకగా దేవస్థానం ఎలక్ట్రికల్ డీఈ టి.సూర్యనారాయణకు అందజేశాడు. ఈ విషయాన్ని ఆయన మైక్ ద్వారా చెప్పడంతో నాగలక్ష్మి సూర్యనారాయణను సంప్రదించగా, ఆ పర్సును తోటమాలి సీతయ్య చేతుల మీదుగా ఆమెకు అప్పగించారు. ఈ సందర్భంగా సీతయ్య నిజాయతీని పలువురు అభినందించారు. పోగొట్టుకున్న పర్సును మహిళకు అప్పగింత -
పత్తాలేని సోపానం
‘పాలకొల్లుకు చెందిన ఒకరు కాపు కార్పొరేషన్ సబ్సిడీ రుణానికి దరఖాస్తు చేసుకుని ఇంటర్వ్యూకు హాజరయ్యారు. రుణ సాయానికి ఎంపికయ్యారని, త్వరలో రుణం మంజూరవుతుందని అధికారులు చెప్పారు. ఇది జరిగి ఏడాదైనా ఇంతవరకు అతనికి రుణం మంజూరుకాలేదు. అధికారులను అడిగితే సబ్సిడీ సొమ్మును ప్రభుత్వం విడుదల చేయలేదని, ఎప్పుడు వస్తుందో ఇంకా స్పష్టత లేదని చెబుతున్నారు’.మంగళవారం శ్రీ 21 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026సాక్షి, భీమవరం: ఎస్సీ, బీసీ కార్పొరేషన్ల ద్వారా సబ్సిడీ రుణాలు అందజేయనున్నట్టు గత ఏడాది మార్చిలో కూటమి ప్రభుత్వం ప్రకటించింది. ‘స్వయం ఉపాధి సోపానం’ పేరిట దరఖాస్తుల స్వీకరణ, లబ్ధిదారుల ఎంపిక పేరిట అప్పట్లో రెండు నెలల పాటు పెద్ద తతంగమే నడిచింది. మండల, మున్సిపల్ స్థాయిలో బ్యాంకుల ప్రతినిధులు, అధికారులు కలిసి దరఖాస్తుదారులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఈ ప్రక్రియ కోసం జిల్లా యంత్రాంగాన్ని ఉరుకులు పరుగులు పెట్టించిన ప్రభుత్వం తర్వాత స్వయం ఉపాధిని అటకెక్కించింది. ఏడాది దాటినా చర్యలు శూన్యం ఎస్సీ, బీసీ–ఏ, బీసీ–బీ, బీసీ–డీ, బీసీ–ఇ, ఈడబ్ల్యూఎస్ వర్గాల్లోని రెడ్డి, కమ్మ, వైశ్య, బ్రాహ్మణ తదితరులకు స్వయం ఉపాధి, జనరిక్ ఫార్మసీలు, ఎంఎస్ఎంఈ యూనిట్ల ఏర్పాటు పేరిట సబ్సిడీ రుణాల మంజూరుకు గత ఏడాది మార్చిలో కూటమి ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు దాదాపు రూ.260 కోట్ల విలువైన 10,554 యూనిట్లు కేటాయించింది. వీటిలో పశ్చిమకు రూ.122.5 కోట్ల విలువైన 3,728 యూనిట్లు, మిగిలినవి ఏలూరు జిల్లాకు కేటాయించారు. రూ.రెండు లక్షలు, రూ. 2 నుంచి రూ. 3 లక్షలు, అలాగే రూ. 3 నుంచి రూ. 5 లక్షల కేటగిరీలుగా విభజించారు. జనరిక్ మెడికల్ షాపుల యూనిట్ ధర రూ.8 లక్షలుగా ఉంది. యూనిట్ వ్యయం మొత్తంలో 40 శాతం వరకు ప్రభుత్వ సబ్సిడీ, మిగిలింది బ్యాంకు రుణంగా ప్రభుత్వం నిర్ణయించింది. తొలుత గత ఏడాది మార్చి నెలాఖరు నాటికి యూనిట్లను గ్రౌండ్ చేయాలని భావించగా ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ రావడంతో మే నెలాఖరు వరకు పొడిగించింది. ఎంపిక చేసిన వారికి మార్చి చివరి వారం నుంచి ఏప్రిల్ మొదటి వారం మధ్యలో ఇంటర్వ్యూలు నిర్వహించి త్వరలోనే రుణాలు మంజూరవుతాయని అధికారులు చెప్పుకొచ్చారు. త్వరలోనే కార్పొరేషన్ రుణాలు మంజూరవుతాయని కూటమి నేతలు చెబుతున్నట్టు సమాచారం. కొద్ది నెలల్లో మున్సిపల్ ఎన్నికలు వస్తాయన్న ప్రచారం నేపథ్యంలో కావాల్సిన వారికి సబ్సిడీ రుణాలు కట్టబెట్టే ఆలోచన చేస్తున్నట్టు కూటమి నేతలు చర్చించుకుంటున్నారు. కార్పొరేషన్ రుణాల విషయమై బీసీ కార్పొరేషన్ అధికారులను సంప్రదించగా ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కావాల్సి ఉందని అంటున్నారు. పేరుకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించినప్పటికి లబ్ధిదారుల ఎంపిక అంతా అధికార పక్షాల నేతల కనుసన్నల్లోనే జరిగింది. నియోజకవర్గాలకు కేటాయించిన యూనిట్లను కూటమి నాయకులు పంచుకుని కావాల్సిన వారిని ఎంపికలు చేసుకున్నారన్న విమర్శలున్నాయి. చాలాచోట్ల సింహభాగం టీడీపీనే తన్నుకు పోయిందన్న అసంతృప్తిలో జనసేన, బీజేపీ నాయకులు ఉన్నారన్న ప్రచారం జరిగింది. ఒక్కో గ్రామానికి మంజూరైన యూనిట్లు ఐదు నుంచి పదిలోపే ఉండగా దరఖాస్తులు మాత్రం పదుల సంఖ్యలో వచ్చాయి. లబ్ధిదారుల ఎంపిక జరిగి ఏడాదైనా ఇప్పటి వరకు ఒక్క యూనిట్ గ్రౌండ్ కాకపోవడం గమనార్హం. రుణాల మంజూరు కోసం గత వార్షిక బడ్జెట్లో నిధులు కేటాయింపులు చేసినట్టు ప్రజాప్రతినిధులు ప్రకటించినప్పటికీ వాటిని దారి మళ్లించారన్న విమర్శలున్నాయి. సబ్సిడీ రుణాల పేరిట కొందరు నాయకులు చెక్కులు పంపిణీ చేసిన ఘటనలు ఉన్నాయి. కాగా రుణాలు రాని వారి అసంతృప్తి కూటమికి చేటు చేస్తుందన్న భావనలో సోపానంపై ప్రభుత్వం సైలెంటై పోయి ఉండవచ్చని, మరోపక్క సబ్సిడీ సొమ్ములు జమచేసేందుకు ప్రభుత్వం వద్ద నిధులు లేకపోవడం కారణమన్న అనుమానాలు ఉన్నాయి. లబ్ధిదారుల జాబితాలను ప్రస్తుతానికి హోల్డ్లో ఉంచారు. సబ్సిడీ రుణాల ఊసెత్తని సర్కారు ఉమ్మడి జిల్లాకు రూ.260 కోట్ల విలువైన రూ.10,554 యూనిట్ల కేటాయింపు దరఖాస్తుదారులకు ఇంటర్వ్యూల పేరిట హడావుడి ఏడాదైనా కార్యరూపం దాల్చని వైనం -
శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు
● ఈనెల 26న ప్రారంభం కానున్న ఉత్సవాలు ● 30న రాత్రి శ్రీవారి తిరుకల్యాణం, మే 1న రథోత్సవం ద్వారకాతిరుమల: క్షేత్రంలో శ్రీవారి వైశాఖమాస దివ్య బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. ఈనెల 26 నుంచి మే 3 వరకు జరగనున్న చినవెంకన్న తిరుకల్యాణ మహోత్సవాల్లో భాగంగా 30న రాత్రి స్వామివారి కల్యాణం, వచ్చేనెల 1న రాత్రి రథోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ఉత్సవాలను పురస్కరించుకుని జరుగుతున్న ఏర్పాట్లలో భాగంగా ఆలయ ధ్వజస్తంభం వద్ద ఐరన్ పందిరిని నిర్మిస్తున్నారు. గతంలో ఇక్కడ కర్రల పందిరి ఉండేది. అయితే భక్తుల రక్షణలో భాగంగా దీన్ని ఐరన్తో నిర్మిస్తున్నారు. పందిరి నిర్మాణ పనులు పూర్తయిన తరువాత దానిపై తాటాకులు వేయనున్నారు. ఇదిలా ఉంటే గోపురాలపై మొలిచిన రావి, మర్రి మొక్కలను పారిశుధ్య కార్మికులు తొలగిస్తున్నారు. సోమవారం ఈ పనులు శరవేగంగా జరిగాయి. -
ప్రవేశ పరీక్షలకు పక్కా ఏర్పాట్లు
భీమవరం: జిల్లాలో ఈనెల 24, 25 తేదీల్లో నిర్వహించే ప్రవేశ పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు. ఏపీఆర్ఎస్ క్యాట్, ఏపీఆర్జేసీ, డీసీసెట్, పాలిసెట్ పరీక్షల నిర్వహణపై అధికారులతో ఆమె సమీక్షించారు. ఏపీఆర్ఎస్ క్యాట్ పరీక్ష 24న ఉదయం 10 గంటలకు భీమవరం భాష్యం హైస్కూల్లో నిర్వహిస్తామన్నారు. అలాగే ఏపీఆర్జేసీ, డీసీ సెట్ పరీక్ష మధ్యాహ్నం 2.30 గంటల నుంచి భీమవరంలోని భాష్యం హైస్కూల్, పీఎస్ఎం గరల్స్స్ హైస్కూల్, ఎస్సీహెచ్ బీఆర్ఎం హైస్కూళ్లలో ఏర్పాటుచేసిన సెంటర్లలో పరీక్షలు జరగుతాయన్నారు. 25న పాలిసెట్ పరీక్ష నిర్వహణకు తాడేపల్లిగూడెంలో 4, తణుకులో 10, భీమవరంలో 8, నర్సాపురంలో 4 సెంటర్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. విద్యార్థులు ఒక గంట ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలన్నారు. డీఈఓ ఈ.నారాయణ, సమగ్ర శిక్ష ఏపీసీ పి.శ్యామ్ సుందర్, పరీక్ష కేంద్రాల ప్రిన్సిపాళ్లు తదితరులు పాల్గొన్నారు. అత్తిలి: క్రికెట్ బెట్టింగ్లు నిర్వహిస్తున్న ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై కేఎన్ విశ్వనాథ్ సోమవారం తెలిపారు. అత్తిలి గ్రామంలో ఎంఎంస్కూల్ రోడ్డులో తోట వెంకట సత్యనారాయణ అలియాస్ సతీష్ ఇంట్లో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారన్న సమాచారం మేరకు తమ సిబ్బందితో దాడి చేసి తోట వెంకట సత్యనారాయణ, దిరిశాల సురేష్ అనే వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి నుంచి నగదు, లాప్టాప్, 4 సెల్ఫోన్లు స్వాధీన పర్చుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై విశ్వనాఽథ్ చెప్పారు. అంతా గోప్యం క్రికెట్ బెట్టింగ్ పాల్పడిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఈనెల 19వ తేదీన అత్తిలి పోలీసులు దాడి చేసి బెట్టింగ్ రాయుళ్లను అదుపులోకి తీసుకున్నప్పటికీ కేసులో వ్యక్తుల వివరాలు గోప్యంగా ఉంచడం పలు అనుమానాలకు తావిస్తోంది. అత్తిలికి చెందిన అధికారపార్టీ కీలకనాయకులు ఈ బెట్టింగ్ వ్యవహారంలో పట్టుబడ్డారని సమాచారం. కొయ్యలగూడెం: విద్యుదాఘాతానికి గురై ఓ వ్యక్తి మృతి చెందాడు. దిప్పకాయలపాడు దళితవాడకు చెందిన కూనపాము లాజరు (62) కౌలుకి వ్యవసాయం చేసుకుని జీవిస్తున్నాడు. సోమవారం ఉదయం ఇంటి వద్ద బట్టల తీగ నుంచి టవల్ తీసుకుంటుండగా సర్వీస్ వైర్ నుంచి విద్యుత్ సరఫరా కావడంతో విద్యుదాఘాతానికి గురై కుప్పకూలిపోయాడు. బంధువులు కొయ్యలగూడెం ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించగా అప్పటికే లాజర్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడికి భార్య ముగ్గురు పిల్లలు ఉన్నారు. రెవెన్యూ, విద్యుత్ శాఖల అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఫ్యాక్టరీల్లో భద్రతా ప్రమాణాలు పాటించాలి
భీమవరం: బాణసంచా తయారీలో అధిక విస్పోటన సామర్థ్యం గల రసాయనాల వినియోగం పెరగడంతో ప్రమాదాల తీవ్రత పెరుగుతోందని కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. అగ్నిమాపక వారోత్సవాల ముగింపు సందర్భంగా సోమవారం భీమవరం విష్ణు కళాశాలలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ఫ్యాక్టరీ యాజమాన్యాలు నిబంధనల మేరకు భద్రతా ప్రమాణాలను పాటిస్తూ ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం అగ్ని ప్రమాదాల నివారణలో ఉత్తమ సేఫ్టీ ప్రమాణాలు పాటిస్తున్న సంస్థలకు అవార్డులందించారు. ఫ్యాక్టరీల విభాగంలో తణుకు ఆంధ్ర సుగర్స్, పాలకోడేరు ఆనంద ఎంటర్ ప్రైజెస్, ఏలూరుపాడు సుమిత్ నారాయణ ఎక్స్పోర్ట్స్ సంస్థలు ఎంపిక కాగా.. హాస్పిటల్స్ విభాగంలో భీమవరం హాస్పిటల్, తణుకు నిమ్మగడ్డ హాస్పిటల్, తాడేపల్లిగూడెం జీఆర్ రెడ్డి ఐ హాస్పిటల్కు అవార్డులు అందచేశారు. కార్యక్రమంలో జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి బి.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
సప్త కోటేశ్వరునికి వెండి ఆభరణాల సమర్పణ
పెనుమంట్ర: నత్తరామేశ్వరం గ్రామంలో గోస్తనీ నదిలో కొలువైయున్న (సప్త కోటేశ్వర) శ్రీ రామలింగేశ్వర స్వామికి దాతలు రూ.36 లక్షలు విలువ చేసే వెండి ఆభరణాలను సమర్పించారు. గ్రామానికి కర్రి అచ్చిరెడ్డి, లక్ష్మి తులసి దంపతులు 6 కిలోల వెండితో కవచం, కర్రి అప్పిరెడ్డి, లక్ష్మీ కాంతం దంపతులు 6 కిలోల వెండితో నాగాభరణాన్ని తయారు చేయించి స్వామికి సమర్పించారు. సోమవారం ప్రత్యేక పూజల అనంతరం వాటిని స్వామికి అలంకరించారు. కార్యక్రమంలో దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ ద్వారంపూడి సుబ్బారెడ్డి, ఎంపీటీసీ సభ్యులు తమలపూడి నాగ వెంకట సత్యనారాయణ రెడ్డి, ట్రస్ట్ బోర్డ్ సభ్యులు పాల్గొన్నారు. తొలి సోమవార పూజలు గోస్తని నదిలో వేంచేసి ఉన్న శ్రీ సప్త కోటేశ్వర లింగానికి వైశాఖమాస పర్వదినం పురస్కరించుకుని తొలి సోమవార పూజలు నిర్వహించారు. ఉదయం పంచామృతాలతో మహా రుద్రాభిషేకాలు, విశేష అలంకరణలు జరిగాయి. నరసాపురం రూరల్ : మొగల్తూరు మండల ముత్యాలపల్లి మోడి గ్రామంలోని వినాయకుని ఆలయంలో సోమవారం తెల్లవారుజామున చోరీ జరిగింది. ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో ఆలయ కమిటీ సభ్యులు గుడికి తాళాలు వేసి వెళ్లారు. సోమవారం తెల్లవారుజామున సుమారు 4 గంటల సమయంలో స్థానికుడైన మారెళ్ల ముత్యాలరావు ఆలయం వద్దకు రాగా, తలుపుల తాళాలు పగులగొట్టి ఉండటాన్ని గమనించారు. వెంటనే కమిటీ సభ్యులకు సమాచారం అందించగా వారు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి హుండీ చోరీ జరిగినట్లు గుర్తించారు. హుండీలో సుమారు రూ.పది వేల వరకు కానుకలు ఉంటాయని తెలిపారు. ఆలయ కమిటీ సభ్యుడు దాసరి వెంకట శివాజీ ఫిర్యాదు మేరకు ఎస్సై జి.వాసు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఏలూరు టౌన్: ఏలూరు శివారు క్రాంతి కళ్యాణమండపం సమీపంలో ఖాళీ స్థలంలో కుళ్లిన మహిళ మృతదేహం లభ్యమైంది. పశువుల కాపరులు మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించారు. ఏలూరు డీఎస్పీ డీ.శ్రావణ్కుమార్, త్రీటౌన్ సీఐ కోటేశ్వరరావు, ఎస్సై రాంబాబు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. క్లూస్టీం, డాగ్ స్క్వాడ్ను రంగంలోకి దించి దర్యాప్తు చేపట్టారు. ఏలూరు త్రీటౌన్ పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
నవధాన్యాలతో జవసత్వాలు
భీమవరం: వ్యవసాయమే జీవనాధారమైన జిల్లాలో రైతులు గతంలో ఆరుగాలం కష్టపడి ఏటా మూడు పంటలు పండించేవారు. సార్వా, దాళ్వా వరిసాగే కాకుండా దాళ్వా పంట అనంతరం ఆరుతడి పంటలుగా మినుము, పెసర, మొక్కజొన్న, బొబ్బర్లు, నువ్వులు వంటివాటితోపాటు పశుగ్రాసానికి పిల్లిపెసర, జనుము, జొన్న వంటివాటిని పండించేవారు. మూడవ పంటగా అపరాలు, పశుగ్రాసం పండించడం వల్ల భూమికి సహజంగా పోషకపదార్థాలు లభించేవి. అయితే కొన్నేళ్లుగా వరిసాగులో జాప్యం కారణంగా దాళ్వా వరి పంట ఏప్రిల్, మే నెలల్లో చేతికి రావడంతో మూడవ పంట వేయడానికి సమయం సరిపోవడం లేదు. దీంతో మిగిలిన రెండు పంటల్లో దిగుబడి పెంచుకునేందుకు రైతులు పెద్ద మొత్తంలో ఎరువులు వేయాల్సి రావడంతో పెట్టుబడుడులు పెరిగి రైతులు నష్టపోతున్నారు. అయితే పాత విధానంతో మూడు పంటలు పండించడానికి వ్యవసాయశాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. మూడో పంటకు ప్రోత్సాహం జిల్లాలోని 20 మండలాల పరిధిలో దాదాపు 2.30 లక్షల ఎకరాల్లో వరిసాగు చేస్తుండగా దీనిలో మూడవ పంట పండించేందుకు రైతులను ప్రోత్సహిస్తున్నారు. ప్రస్తుత దాళ్వా సీజన్ ఊపందుకుంటున్న తరుణంలో అపరాల సాగుతోపాటు పశుగ్రాసం పెంచేందుకు రైతులకు ఏపీ అగ్రికల్చర్ కమ్యూనిటీ నేషనల్ ఫార్మింగ్ సిస్టం ద్వారా 50 శాతం సబ్సిడీపై విత్తనాలు సరఫరా చేస్తున్నారు. దీనికిగాను వ్యవసాయశాఖ, డ్వాక్రా సంఘాలతో ప్రత్యేకంగా సేకరించిన మినుము, పెసర, జీలుగు, రాగి, సజ్జలు, నువ్వులు, వేరుశెనగ, ఆవాలు, పిల్లిపెసర, జనుము, మొక్క వంటివాటితోపాటు ఆరుకూరలైన తోటకూర, పాలకూర, మెంతుకూర, చుక్కుకూర, గొంగూర, బీర, అనప, దోస వంటి సుమారు 12 రకాలు కలిగిన 12 కిలోల విత్తనాలను కిట్లుగా తయారుచేసి పంపిణీ చేశారు. ప్రయోజనం ఏమిటంటే.. భూమిలో సారాన్ని సహజంగా పెంచడానికి వేరు వ్యవస్థ ఎంతగానో దోహదం చేస్తుంది. అందువల్ల వివిధ రకాల విత్తనాలు కలగలిపి చేలలో వేయడం వల్ల రైతులకు కొంతమేరకు ఆదాయంతోపాటు ఇంటి అవసరాలు తీర్చుకునే అవకాశం ఏర్పడుతుంది. ప్రధానంగా వివిధ రకాల తీగ, ఆకుజాతి మొక్కల వేర్లు వల్ల భూమిలో బ్యాక్టీరియా వృద్ధిచెంది సహజ సిద్ధంగా భూసారం పెరుగుతుంది. దీనితో వరి పండించడానికి ఎక్కువ మోతాదులో ఎరువులు వాడే అవసరం లేకపోవడమేగాక తెగుళ్లు కూడా తగ్గే అవకాశముంటుంది. భూమిలో బ్యాక్టీరియా వృద్ధి చెందడం వల్ల రైతులు పంటలకు కొద్దిమొత్తంలో ఎరువులు వేసినా వాటి సామర్ధ్యం పెరిగి పంటకు ప్రయోజనం కలుగుతుంది. దాళ్వా మాసూళ్లు వరికోత యంత్రాలతో చేస్తున్నా విత్తనాలు వేసుకోడానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. వరిపైరు కోత కోసేముందు భూమిలో కొద్దిపాటి తేమ ఉండే విధంగా చూసుకుంటే విత్తనాలు జల్లుకోడానికి అనువుగా ఉంటుంది. దాళ్వా అనంతరం నవధాన్యాల సాగు గతేడాది ప్రయోగాత్మకంగా చేపట్టాం. దీనివల్ల రైతులకు కొంత ఆదాయం రావడమేగాక భూసారాన్ని సహజసిద్ధంగా పెంచుకునే అవకాశం ఏర్పడుతుంది. ప్రస్తుత సీజన్లో దాదాపు 40 వేల మంది రైతులకు విత్తనాలు పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. అన్ని రైతు సేవాకేంద్రాలు, డ్వాక్రా సంఘాల వద్ద విత్తనాల కిట్లు అందుబాటులో ఉన్నాయి. ఇంకా ఎక్కువమంది రైతులకు కావాలన్నా సరఫరా చేయిస్తాం. దీనిని రైతులు సద్వినియోగం చేసుకోవాలి. – జెడ్ వెంకటేశ్వరరావు, జిల్లా వ్యవసాయశాఖాధికారి నవధాన్యాల సాగుకు 50 శాతం సబ్సిడీపై విత్తన కిట్ల పంపిణీ 40 వేల మంది రైతులకు లక్ష్యం భూసారం పెరగడంతోపాటు రైతులకు ఆదాయం -
గంజాయి కలకలం.. వృద్ధురాలి మృతి
ద్వారకాతిరుమల: గంజాయి కేసులో ఇరుక్కున్న తన కుమారుడి భవిష్యత్తు ఎక్కడ నాశనం అవుతుందోనన్న భయంతో తూర్ల లక్ష్మీపురానికి చెందిన వృద్ధురాలు సెనగన స్వరాజ్యం(76) గుండె పోటుతో సోమవారం మృతి చెందింది. దీనికి స్థానిక కూటమి నాయకుడు, రౌడీ షీటర్ సుంకర ఆంజనేయులే కారణమంటూ బాధిత కుటుంబసభ్యులు వృద్ధురాలి మృతదేహాన్ని అతని ఇంటి ముందు ఉంచి ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న ఎస్సై టి.సుధీర్ సిబ్బందితో కలసి రంగప్రవేశం చేసి, ఆందోళనకారులకు హామీ ఇవ్వడంతో వివాదం సద్దుమణిగింది. స్థానికుల కథనం ప్రకారం.. సెనగన శ్రీనివాసరావు ఇంటి వద్ద గంజాయి ఉందని ఈనెల 16న గుర్తు తెలియని వ్యక్తి 112కు కాల్చేసి సమాచారం ఇచ్చాడు. దాంతో భీమడోలు సీఐ పి.కృష్ణ, ఎస్సై సుధీర్ సిబ్బందితో కలసి శ్రీనివాసరావు ఇంటికి వెళ్లి తనిఖీలు చేశారు. ఇంటికి దక్షిణం వైపు ఉన్న ప్రహరీ గోడ సందులో ఒక సంచిలో రూ.40 వేలు విలువైన గంజాయి ప్యాకెట్లు, రూ.6,501 విలువైన 5 మద్యం బాటిళ్లను గుర్తించిన పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. తనిఖీ సమయంలో ఇంట్లో ఎవరూ లేరు. ఆ తరువాత శ్రీనివాసరావు వచ్చి తన తండ్రికి, సుంకర ఆంజనేయులకు మద్య గొడవలు ఉన్నాయని, అతనే వీటిని ఇక్కడ పెట్టించి ఉంటాడని పోలీసులకు చెప్పాడు. దీనిపై కేసు నమోదు చేసిన ఎస్సై సుధీర్ దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసు వల్ల తన కుమారుడికి ఏం జరుగుతుందోనన్న ఆందోళనతో శ్రీనివాసరావు తల్లి స్వరాజ్యం గుండె పోటుతో మృతి చెందింది. తమపై ఆంజనేయులు కేసు బనాయించేందుకు ప్రయత్నించడం వల్లే స్వరాజ్యం మృతి చెందిందిని ఆరోపిస్తూ, అతని ఇంటి ముందు శవ పేటికతో బైఠాయించి, ధర్నా చేశారు. గంజాయి కలకలం రేగి మూడు రోజులైనా పోలీసులు ఆంజనేయులపై ఎందుకు చర్యలు తీసుకోలేదని మృతురాలి కుటుంబసభ్యులు ప్రశ్నించారు. పల్లెటూరిలోకి గంజాయి ఎలా వచ్చిందనే విషయాన్ని ఇప్పటికై నా పోలీసులు నిగ్గుతేల్చాలని డిమాండ్ చేశారు. సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్సై సుధీర్ ఆందోళనకారులతో మాట్లాడారు. రెండు రోజుల్లో ఈ కేసుతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరినీ అరెస్టు చేస్తామని హామీ ఇవ్వడంతో బాధిత కుటుంబసభ్యులు ఆందోళన విరమించారు. రోడ్డుపై మృతదేహంతో ధర్నా -
అదుపు తప్పి కారు బోల్తా
దెందులూరు: అదుపు తప్పి కారు బోల్తా పడిన ఘటనలో విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటన 16వ నంబర్ జాతీయ రహదారిపై సోమవారం చోటుచేసుకుంది. ఆగిరిపల్లికి చెందిన ప్రైవేట్ కళాశాల విద్యార్థులు 8 మంది ద్వారకాతిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనానికి కారులో వెళుతున్నారు. దెందులూరు వద్ద కారు అదుపుతప్పి గుండేరు గట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ఉన్న విద్యార్థులు స్వల్ప గాయాలతో బయటపడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. క్షతగాత్రులను వైద్య చికిత్స నిమిత్తం ఏలూరు వైద్యశాలకు తరలించారు. -
కలెక్టర్కు రెడ్క్రాస్ అవార్డు
భీమవరం (ప్రకాశం చౌక్) : రెడ్క్రాస్ గవర్నర్ అవార్డుకు పశ్చిమగోదావరి కలెక్టర్ సీహెచ్ నాగరాణి ఎంపికయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ టి.రాహుల్కుమార్రెడ్డి ఆమెకు పుష్పగుచ్ఛం అందించి సత్కరించారు. జిల్లా అధికారులు శుభాకాంక్షలు తెలిపారు. జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, పశ్చిమ గోదావరి జిల్లాలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా అమలు చేస్తున్న కార్యక్రమాల్లో విశేష కృషికి గుర్తింపుగా ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు తెలిపారు. వచ్చేనెల 8న విజయవాడలో జరిగే కార్యక్రమంలో అవార్డు అందిస్తారన్నారు. జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ డా.ఎంఎస్వీఎస్ భద్రిరాజు, జిల్లా రెడ్ క్రాస్ కమిటీ వైస్ చైర్మన్ వబిలిసెట్టి కనకరాజు, ట్రెజరర్ కేబీ తిరుపతి రాజు, సభ్యులు జి.కృష్ణారావు, కేఆర్ఎస్ రాజు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. భీమవరం: నెట్సెంటర్, ఏటీఎం మెషీన్ ఏర్పాటు చేస్తామంటూ మాయమాటలు చెప్పి తన కుమారుడు గంధం రామకృష్ణ వద్ద రూ.13.50 లక్షలు కాజేశారంటూ భీమవరం పట్టణానికి చెందిన గంధం హరిప్రసాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వన్టౌన్ ఎస్సై బీవై కిరణ్కుమార్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణానికి చెందిన హరిప్రసాద్ రిటైర్డ్ ఉద్యోగి. ఆయన అనేక పర్యాయాలు పట్టణంలోని ఎడ్వర్డ్ట్యాంక్ ప్రాంతంలో జిరాక్స్ షాపు నిర్వహిస్తున్న పెన్నాడ శ్రీసత్యకిరణ్ వద్దకు వెళ్లడంతో హరిప్రసాద్ కుమారుడు రామకృష్ణకు పరిచయమయ్యాడు. దీనిని ఆసరాగా తీసుకుని శ్రీసత్యకిరణ్ అతని భార్య హరిత, అశోక్సామ్రాట్ నెట్సెంటర్, ఏటీఎం మెషీన్ ఏర్పాటుచేస్తామని మాయమాటలు చెప్పి రామకృష్ణ నుంచి పలు దఫాలుగా రూ.13.50 లక్షలు కాజేశారు. అంతేగాకుండా పి రామరావు, గన్నాబత్తుల వెంకటేశ్వరరావు వద్ద కూడా సుమారు రూ.17 లక్షలు కాజేశారని హరిప్రసాద్ ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీనిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై కిరణ్కుమార్ చెప్పారు. ఏలూరు రూరల్: శాప్ లీగ్స్ పోటీల్లో భాగంగా రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 28వ తేదీ నుంచి 30 వరకూ విశాఖపట్టణంలో బాక్సింగ్, అనంతరపురంలో ఫుట్బాల్ రాష్ట్రస్థాయి పోటీలు జరగనున్నాయని ఏలూరు జిల్లా క్రీడాప్రాధికార సంస్థ అధికారి ఎస్ఏ అజీజ్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ పోటీల్లో పాల్గొనే జిల్లా జట్ల ఎంపిక ఈ నెల 24వ తేదీన ఏలూరు అల్లూరి సీతారామరాజు స్టేడియంలో ఉదయం 9 గంటలకు చేపడతామన్నారు. బాక్సింగ్ విభాగంలో అండర్–15, 19 బాలబాలికలు, ఫుట్బాల్ విభాగంలో అండర్–15, అండర్–21 బాలబాలికల జట్లు ఎంపిక జరుగుతుందని వెల్లడించారు. మరిన్ని వివరాలకు కోచ్ ఖాసిం 94927 01324 నంబరలో సంప్రదించాలని సూచించారు. -
వెంచర్ దందా ఇలా..
రెండేళ్ల క్రితం అదే ప్రాంతానికి చెందిన అధికార పార్టీ నేత ఈ భూమిపై కన్నేశాడు. హక్కుదారు లుగా ఉన్న వాళ్ల దగ్గర అడంగల్లో ఒకరి పేరు మినహా ఎలాంటి రికార్డు లేదని తెలుసుకుని భూమిని అమ్మకానికి పెట్టడం, అధికారాన్ని అడ్డం పెట్టుకుని వారిని బెదిరించి హద్దులు మార్చి సర్వే నంబర్లు మార్చి, కాగితాలు సృష్టించి మరీ వెంచర్ సిద్ధం చేశారు. ఏడాదిన్నర క్రితమే వెంచర్ను ఏర్పాటు చేసి ఎలాంటి అనుమతులు లేకుండా గజం రూ.14 వేల చొప్పున అనేక మందికి విక్రయించేశారు. ప్రభుత్వ భూమి 50 సెంట్లను కూడా వెంచర్లో కలిపేశారు. ఏడుగురు హక్కుదారుల ను తమదైన శైలిలో బెదిరించి మీ ఎవరికీ ఎలాంటి హక్కు లేదని.. ఉంటే ఒరిజినల్ కాగితాలు తీ సుకుని రావాలని హడావుడి చేసి, లేని సమస్యను సృష్టించి చివరికి భూమిని తనకే అప్పగించేలా దారికి తెచ్చుకున్నాడు. వీరిలో అందరూ కాకుండా ఇద్దరు సదరు అధికార పార్టీ నేతతో భాగస్వాము లుగా మారి భూమి సరిహద్దులను మార్చి సరికొ త్త డాక్యుమెంట్లను సృష్టించి విక్రయించారు. సర్వే నం.874లోని ప్రభుత్వ భూమిని కూడా 872లో ఉన్నట్లుగా చూపించి విక్రయించారు. -
కూలిపోయిన గ్రీన్ షేడ్ పందిరి
ఎంపీ విజయోత్సవ ర్యాలీపై మండిపాటు తాడేపల్లిగూడెం (టీఓసీ): ఆర్టీసీ ప్రయాణికులు వేసవి ఎండలను తట్టుకునేందుకు వీలుగా రెండు చోట్ల మున్సిపాలిటీ ఆధ్వర్యంలో గ్రీన్ షేడ్ పందిళ్లు వేశారు. స్థానిక ఎన్టీఆర్ బొమ్మ వద్ద వేసిన గ్రీన్ షేడ్ పందిరి పడిపోయింది. రాత్రి సమయంలో గుర్తు తెలియని వాహనం గ్రీన్ షేడ్ నిమిత్తం ఏర్పాటు చేసిన నిచ్చెన మెట్లు, ఇనుప స్తంభాన్ని లాక్కెళ్లినట్లు భావిస్తున్నారు. ఇనుప స్తంభాలు పడిపోవడంతో పాటు వంగిపోయాయి. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ఎటువంటి ప్రమాదం జరగలేదు. ఆదివారం రాత్రి వరకు పందిరిని పునరుద్ధరించలేదు. ఏలూరు (టూటౌన్): డ్రగ్స్ కేసులో పట్టుబడిన ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ ఏలూరులో విజయోత్సవ ర్యాలీ నిర్వహించడాన్ని సీపీఎం ఏలూరు జిల్లా కమిటీ తరఫున పార్టీ జిల్లా కార్యదర్శి ఎ.రవి తీవ్రంగా వ్యతిరేకించారు. డ్రగ్స్ కేసుల్లో ఇరుక్కున్న ఎంపీ సిగ్గు లేకుండా ఏ విధంగా నియోజకవర్గంలో పర్యటించడానికి వచ్చారో చెప్పాలన్నారు. కేసులో ఇరుక్కున్న తర్వాత ఏలూరు నియోజకవర్గంలో అడుగుపెడుతూ విజయోత్సవ ర్యాలీలు నిర్వహించడం సిగ్గుచేటన్నారు. డ్రగ్స్ కేసుల్లో పట్టుబడినప్పుడు తెలుగుదేశం పార్టీ హడావుడిగా నోటీసులు ఇచ్చినట్టు ప్రకటించిందని, ఆ నోటీసుకు ఏం సమాధానం చెప్పారు.. ఆ సమాధానాలకు తెలుగుదేశం పార్టీ ఏ నిర్ణయం తీసుకుందనే వివరాలు ఇప్పటికీ బయటకు రాలేదన్నారు. పర్యటనలు, విజయోత్స ర్యాలీలు నిర్వహించడం ద్వారా యువతకు ఇచ్చిన సందేశం ఏంటని ప్రశ్నించారు. యువత డ్రగ్స్కు బానిసలు అవ్వాలని, ఒకవేళ పట్టుబడితే కొంతకాలం అగి తర్వాత విజయోత్సవ ర్యాలీలతో రావాలని సందేశం ఇస్తున్నారా? అని ప్రశ్నించారు. జిల్లాలో మొక్కజొన్న రైతులకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని, మద్దతు ధర చెల్లించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. -
అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి
ఏలూరు (ఆర్ఆర్పేట): అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని గవర్నమెంట్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు పాణ్యం వేణు, ఏలూరు, పశ్చి మగోదావరి జిల్లాల ఏపీ జేఏసీ అధ్యక్షుడు చోడగిరి శ్రీనివాస్, యూవీ పాండురంగారావు డిమాండ్ చే శారు. సంఘ ఏలూరు జిల్లాస్థాయి ఉద్యోగుల ఆత్మీ య సమావేశం ఆదివారం స్థానిక జెడ్పీ మందిరంలో నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలపై అవగాహన ఉందని వారికి హెచ్ఆర్ పాలసీని అమలుచేయాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన జీతాలు ఇవ్వాలని, పని భా రం తగ్గించాలని, 12వ పీఆర్సీ అమలు చేసి అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పాండు రంగారావు మాట్లాడుతూ అవుట్ సోర్సింగ్ వ్యవస్థకి జీతాలు తక్కువే ఇస్తున్నారన్నారు. ఎన్జీఓ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆర్ఎస్ హరనాఽథ్ మాట్లాడుతూ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలను ఆప్కాస్ ద్వారా కూడా సరైన విధానంలో భర్తీ చేయడం లేదని, జీతాలు పెంచి సామాజికంగా వారి స్థాయిని పెంచాలని కోరారు. పాణ్యం వేణు మాట్లాడుతూ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు అతి తక్కువ వేతనానికి అంకితభావంతో పనిచేస్తూ అభద్రతాభావానికి గురి అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును 62 ఏళ్లకు పెంచాలన్నారు. జిల్లా నూతన కమిటీ ఏర్పాటు గవర్నమెంట్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ అ సోసియేషన్ (ఏపీ) ఉమ్మడి పశ్చిమగోదావరి జి ల్లాకు సంబంధించి నూతన కమిటీ ఎన్నికయ్యింది. జిల్లా అధ్యక్షుడిగా నాగభూషణం (గృహనిర్మాణ శా ఖ), జిల్లా ప్రధాన కార్యదర్శిగా సుబ్బారావు (పశుసంవర్ధక శాఖ), మరో 20 మందితో జిల్లా కమిటీని ఎన్నుకున్నారు. నూతనంగా ఎంపికై న జిల్లా కమిటీ సభ్యులను ముఖ్య అతిథులు సన్మానించారు. -
పోలీసు అధికారులు కావలెను!
స్టేషన్లలో ఇన్చార్జిలే దిక్కు ● కేసుల్లో పురోగతి కరువు ● స్టేషన్ల చుట్టూ తిరుగుతున్న బాధితులు ● అర్ధంతర బదిలీలు, ఆరోపణలతో వీఆర్కు అధికారులు ● జిల్లాలోని పలు స్టేషన్లలో ఇదే పరిస్థితి తణుకు అర్బన్: పోలీస్స్టేషన్లలో అధికారులు లేక బాధితులకు అందాల్సిన సేవలు కునారిల్లుతున్నాయి. జిల్లాలోని కొన్ని పోలీస్స్టేషన్లలో బాస్లుగా ఇన్చార్జిలకు బాధ్యతలు అప్పగించడంతో స్టేషన్లకు వచ్చే ఫిర్యాదుదారులు, బాధితులు ఇబ్బంది పడుతున్నారు. అధికారులతోపాటు సిబ్బంది కొరతతోపాటు వివిధ బందోబస్తులకు వేరే ప్రాంతాలకు వెళ్తుండడంతో ప్రజానీకం తమ ఇబ్బందులను చెప్పుకునేందుకు పడిగాపులు పడాల్సి వస్తుంది. క్రైమ్ రేటు అధికంగా ఉండే తణుకు రూరల్, పట్టణ స్టేషన్లలో స్టేషన్ హౌస్ ఆఫీసర్స్ అందుబాటులో లేకపోవడంతో బాధితులకు పూర్తిస్థాయిలో సేవలు అందడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లాలో ఖాళీలు ఇలా.. జిల్లాలో తణుకు పట్టణ, ఆకివీడు స్టేషన్లలో సర్కిల్ ఇన్స్పెక్టర్లు లేకపోవడంతో క్షేత్రస్థాయి పర్యవేక్షణ లేకుండా పోయింది. తణుకు రూరల్, తణుకు పట్టణ స్టేషన్లలో ఇద్దరు ఎస్సైల స్థానాలు భర్తీ చేయాల్సి ఉంది. ఈ కారణంగా సీఐలు చేయాల్సిన బాధ్యతలు ఎస్సైలు చేస్తుండటం, ఎస్సైల బాధ్యతలు కిందిస్థాయి సిబ్బంది నిర్వహించాల్సి వస్తుందంటూ సిబ్బంది సైతం గుసగుసలాడుకుంటున్నారు. అధికారులు నిర్వర్తించాల్సిన పనులు కింది స్థాయి సిబ్బంది చేయాల్సి రావడంతో కొన్ని కేసుల్లో పూర్తిస్థాయి న్యాయం జరగడం లేదనేది ఫిర్యాదుల వాదన. జిల్లావ్యాప్తంగా పోలీస్ స్టేషన్లలో దీర్ఘకాలంగా తిష్ట వేసిన కొందరు సిబ్బంది సైతం అధికారుల విధులను తామే చేస్తుండటంతో కిందిస్థాయి సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. వివాదాస్పదంగా తణుకు స్టేషన్లు తణుకు పట్టణ స్టేషన్లో ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన ఏసీబీ దాడి సంచలనం రేకెత్తించింది. అప్పటివరకు అవినీతి కంపు కొట్టిన స్టేషన్లో రైటర్ సుబ్బారావు రూ.25 వేలు లంచం తీసుకుంటూ ఏబీసీ అధికారులకు దొరికిపోగా, మరి కొందరు బతికి బయటపడ్డారు. అయితే ఈ ఘటన తర్వాత పోలీసు శాఖ ఉన్నతాధికారుల పరిశీలనలో మరి కొందరిపై వచ్చిన ఆరోపణల మేరకు అప్పటి సీఐతోపాటు ఎస్సైను రేంజ్ వీఆర్కు పంపించారు. కొందరు కిందిస్థాయి అధికారులను సైతం బదిలీపై పంపించారు. ఆ ఘటన తరువాత సీఐ, ఎస్సై పోస్టులు భర్తీ కాకుండా పోయాయి. ప్రస్తుతం ఒక్క ఎస్సైతోనే స్టేషన్ను నెట్టుకురావాల్సి వస్తోంది. తణుకు రూరల్ సర్కిల్ అధికారుల వ్యవహారం అత్యంత వివాదాస్పదంగా మారింది. సర్కిల్లో ఫ్లెక్సీల వివాదాలు, ఇతర వ్యవహారాలతోపాటు కొన్ని కారణాలతో సీఐతోపాటు తణుకు రూరల్ ఎస్సై, అత్తిలి ఎస్సైలు రెండు రోజుల వ్యవధిలో మెడికల్ లీవుల్లోకి వెళ్లడం అప్పట్లో వివాదాస్పదమైంది. జనవరి నెల 25న రూరల్ సీఐ బి.కృష్ణకుమార్, ఎస్సై చంద్రశేఖర్లు సెలవులోకి వెళ్లగా అదేనెల 27న అత్తిలి ఎస్సై ప్రేమ్రాజ్ సైతం మెడికల్ లీవులోకి వెళ్లారు. దీంతో సర్కిల్ సగానికిపైగా ఖాళీ అయ్యింది. ఇటీవల అత్తిలి స్టేషన్ ఎస్సై పోస్టు భర్తీ అయ్యింది. తణుకు రూరల్ సీఐగా దేశంశెట్టి వెంకటేశ్వరరావు ఫిబ్రవరి 7న బాధ్యతలు స్వీకరించారు. పట్టణ ఇన్చార్జ్ సీఐగా కూడా ఆయనే బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆకివీడులో సైతం ఈ ఏడాది కొన్ని కారణాలతో సీఐని బదిలీ చేయడంతో అప్ప టి నుంచి ఇన్చార్జ్ పాలన సాగుతోంది. అత్యంత వివాదాస్పదంగా మారిన తణుకు పట్టణ, రూరల్ స్టేషన్లలో విధి నిర్వహణకు అధికారులు వచ్చేందుకు కూడా వెనుకంజ వేసే పరిస్థితులు కనిపిస్తున్నాయని పోలీసు వర్గాలే చెబుతున్నారు. -
అభయారణ్యంలోనే పెద్దపులి
పోలవరం రూరల్: పాపికొండల అభయారణ్య ప్రాంతంలోని రిజర్వు అటవీ ప్రాంతంలోనే పెద్దపులి సంచారం కొనసాగుతోంది. పోలవరం ప్రాజెక్టు సమీపంలోని ముంపు గ్రామాలైన సింగన్నపల్లి, కొత్తూరు పరిసర ప్రాంతాల్లోని గోదావరి నదీ తీరంలో కూడా పులి సంచరించినట్లు అడుగు జాడలను బట్టి అటవీ శాఖాధికారులు గుర్తించారు. ప్రాజెక్టు ప్రాంతంలో కార్మికులు అప్రమత్తంగా ఉండాలని, అటవీ ప్రాంతం వైపు ఎవరూ వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేశారు. చీఫ్ కన్జర్వేటర్ నీలకాంతనాథరెడ్డి, జిల్లా అటవీశాఖ అధికారి సందీప్రెడ్డిలు ప్రాజెక్టు ప్రాంతంలో పులి సంచరించిన ప్రాంతాలను పరిశీలన చేశారు. పులి దూడపై దాడి చేసిన ప్రాంతాన్ని కూడా పరిశీలించారు. రిజర్వు ఫారెస్ట్లో తాగునీటి వసతితో పాటు చల్లని దట్టమైన అటవీ ప్రాంతం ఉండటంతో ఈ ప్రాంతంలోనే కదలికలు ఉన్నట్టు పేర్కొన్నారు. పులి జనావాస ప్రాంతాల్లోకి సంచరించడం లేదని తెలిపారు. పులి మెడకు అమర్చిన శాటిలైట్ రేడియో ఫ్రీకెన్సీ ద్వారా నిరంతరం అటవీశాఖ సిబ్బంది పర్యవేక్షిస్తున్నారన్నారు. పులి అటవీ ప్రాంతంలో ఉన్నప్పుడు సిగ్నల్స్ అందని పరిస్థితులు కూడా ఉన్నాయన్నారు. సబ్ డీఎఫ్ఓ వెంకట సుబ్బయ్య, రేంజర్ ఎస్కే వలీ, సిబ్బందితో కలిసి ఎప్పటికప్పుడు పులి అడుగు జాడలను కదలికలను గుర్తిస్తున్నట్టు చెప్పారు. పులిని పట్టుకోవడం కోసం శ్రీశైలం అటవీ శాఖ నుంచి ప్రత్యేక రెస్క్యూ సిబ్బందిని ట్రాక్వలైజర్ గన్స్ వలలు, ఇతర సామగ్రిని కూడా అందుబాటులో ఉంచామన్నారు. -
విద్యుదాఘాతంతో యువకుడి మృతి
యలమంచిలి: గోదావరి మధ్యలంకలో ఉన్న ఆక్వా చెరువుల వద్ద పని చేస్తున్న యువకుడు ఆదివారం విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడని స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ మనోహర్ తెలిపారు. పశ్చిమ బెంగాల్కు చెందిన పూర్మాజిత్ బైబ్యా (27) కొంతకాలంగా ఆక్వా చెరువుల మీద పని చేస్తున్నాడు. ఈ క్రమంలో విద్యుత్ వైర్లు కాలికి తగలడంతో పడిపోయాడు. హుటాహుటిన రాజోలు ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఏలూరు టౌన్: జాతీయ రహదారి గుర్తు తెలియని వాహనం ఢీకొనటంతో వృద్ధుడు మృతిచెందాడు. వీరవల్లి పోలీస్స్టేషన్ పరిధిలో ఆదివారం ఉదయం 16వ నెంబర్ జాతీయ రహదారిపై వాహనం ఢీకొనడంతో వృద్ధుడు తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న వీరవల్లి పోలీసులు క్షతగాత్రుడిని ఏలూరు సర్వజన ఆసుపత్రికి 108 అంబులెన్స్లో తరలించారు. గుర్తు తెలియని వృద్ధుడికి ఏలూరు జీజీహెచ్ వైద్యులు చికిత్స అందిస్తుండగా మృతిచెందాడు. మెడికో లీగల్ కేసుగా నమోదు చేసి హాస్పిటల్ ఔట్పోస్ట్ పోలీసులకు సమాచారం అందించారు. ఏలూరు టౌన్: ఏలూరు అమీనాపేటకు చెందిన కారు డ్రైవర్ ఆర్థిక ఇబ్బందులతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అమీనాపేటకు చెందిన మూల్పూరి చైతన్య ఏలూరులోని బిషప్ హౌస్లో కారు డ్రైవర్గా పనిచేస్తున్నాడు. చైతన్య భార్య పదేళ్ళుగా సౌదీ అరేబియాలో ఉంటుంది. చైతన్యకు ఇద్దరు పిల్లలు ఉండగా బంధువుల వద్దనే ఉంటూ చదువుకుంటున్నారు. ఒంటరిగా ఉంటున్న చైతన్య మద్యానికి బానిసగా మారాడు. ఈ నేపధ్యంలో ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ మానసికంగా ఇబ్బంది పడుతున్నారు. ఈ నెల 18న అర్థరాత్రి ఇంట్లో ఉరివేసుకున్నాడు. తెల్లవారిన అనంతరం తలుపులు తీయకపోవటంతో పక్కన వారు గమనించి బంధువులకు సమాచారం అందించారు. త్రీటౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఉండి: ఉండి పంట కాలువలో ఎన్నార్పీ అగ్రహారం శివారు చెరువుగట్టుపాలెం వద్ద గుర్తు తెలియని మృతదేహం పోలీసులకు ఆదివారం లభ్యమైంది. పోలీసులకు అందిన సమాచారం మేరకు శనివారం ఉండి పంటకాలువలో మృతదేహం కొట్టుకువస్తుందని తెలియగానే పోలీసులు చెరువుగట్టుపాలెవం పరిధిలోని కాలువ పొడవునా వెదికారు. కాలువలో చెత్తా చెదారంతో పాటు గుర్రపుడెక్క పెద్ద ఎత్తున మేటలు వేయడంతో మృతదేహం లభ్యం కాలేదు. దీంతో ఆదివారం పోలీసులు ఎస్సై ఎండీ ససీరుల్లా ఆధ్వర్యంలో మరోసారి ఉండి కాలువను జల్లెడపట్టారు. చెరువుగట్టుపాలెం వంతెన వద్ద మేటలు వేసిన గుర్రపుడెక్కలో పురుషుడి మృతదేహం లభ్యమైంది. వయసు సుమారు 35 నుండి 40 ఏళ్ళ మధ్యలో ఉంటుందని తెలిపారు. ఏలూరు టౌన్: ప్రేమ పెళ్ళికి యువతి తల్లితండ్రులు నిరాకరించటంతో యువకుడు పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జంగారెడ్డిగూడెం ఆర్టీసీ బస్టాండ్ సమీప ప్రాంతానికి చెందిన నంబూరి వేణు బెంగుళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. బెంగుళూరులోనే బాపట్ల పట్టణానికి చెందిన యువతిని ప్రేమించాడు. యువతి తల్లిదండ్రులు వారి ప్రేమను నిరాకరించారు. తీవ్ర మనస్థాపానికి గురైన వేణు రెండు రోజుల క్రితం జంగారెడ్డిగూడెంలోని ఇంటికి వచ్చాడు. ఈనెల 18న పురుగుమందు తాగటంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. అతడ్ని ఏలూరు జీజీహెచ్కు తరలించగా... వైద్యులు చికిత్స అందిస్తున్నారు. చికిత్స పొందుతున్న వేణు ఆదివారం ఉదయం మృతిచెందాడు. చాట్రాయి: మండలంలోని చాట్రాయికి చెందిన అంబటి అనుదీప్ మృతిపై పోలీసులు సక్రమంగా దర్యాప్తు చేయాలని కాపు జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు చందూ జనార్దన్ డిమాండ్ చేశారు. ఆదివారం మృతుడి కుటుంబ సభ్యులతో సమావేశం అయ్యారు. ఈ సందర్బంగా అనుదీప్ హత్యను ఆత్మహత్యగా చిత్రీకరిస్తూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని జనార్దన్ ముందు తల్లిదండ్రులు వాపోయారు. ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్న పోలీసులు సక్రమంగా దర్యాప్తు చేసేలా లేరని మృతుడి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. సక్రమంగా దర్యాప్తు చేయకపోతే ఆందోళన కార్యక్రమాలు చేపడతామని త్వరలోనే ఏలూరు కలెక్టర్ కార్యాలయం వద్ద రాష్ట కాపు జేఏసీ ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేపడతామని జనార్దన్ తెలిపారు. -
క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు
జంగారెడ్డిగూడెం: జంగారెడ్డిగూడెం పోలీసులు క్రికెట్ బెట్టింగ్ రాకెట్ను చేధించారు. ఏఎస్పీ సుస్మిత రామనాథన్ వివరాలు వెల్లడించారు. జంగారెడ్డిగూడెం ఎస్సైకు ఈ నెల 17న రాత్రి వచ్చిన సమాచారం మేరకు దాడులు నిర్వహించారు. దాడుల్లో పుల్లూరి నాగ వెంకటనరసింహాచార్యులను అరెస్టు చేసి అతని నుంచి ఎలక్ట్రానిక్ పరికరాలు స్వాధీనం చేసుకున్నారు. ఉంగుటూరు మండలం గొల్లగూడెంకు చెందిన అతనిని విచారించగా, పల్నాడు జిల్లా మొకలనూరుకు చెందిన మల్లెల వీరాజంనేయులు, ఎడ్లపాడుకు చెందిన తులబంతుల తాండవ కృష్ణ, ప్రకాశం జిల్లా ఉలగల్లుకు చెందిన పర్వతనేని వేణుబాబు అలియాస్ వేణు, కడప జిల్లా ఒంటిమిట్టకు చెందిన గజ్జల రవీంద్రరెడ్డి, అన్నమయ్య జిల్లా నిమ్మపల్లికి చెందిన పల్లెపాగ రవి కలిసి హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారన్నారు. దీంతో సీఐ ఎంవీ సుభాష్, ఎస్సైలు ఎన్వీ ప్రసాద్, ఎస్కే జబీర్, ఏఎస్సై సంపత్కుమార్, పీసీలు షాన్బాబు, రమేష్, రామాంజనేయులు, హెచ్జీ సతీష్తో కలిసి హైదరాబాద్లోని కూకట్పల్లి ప్రాంతంలో వీరిని అరెస్టు చేశారన్నారు. నిందితులు పెద్ద స్థాయిలో క్రికెట్ బెట్టింగ్లు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సాధారణ టీవీ ప్రసారానికి ముందుగానే ఆన్లైన్ ఫ్లాట్ఫారమ్ ద్వారా ప్రత్యక్ష మ్యాచ్ ఫీడ్ను వీక్షించి బెట్టింగ్ నిర్వహిస్తున్నారని, అన్ని లావాదేవీలు డిజిటల్ లెడ్జర్ సాప్ట్వేర్ ద్వారా నమోదు చేసుకుంటున్నారని తెలిపారు. మిగిలిన నిందితులను అరెస్టు చేయడానికి దర్యాప్తు చేస్తున్నామన్నారు. నిందితుల నుంచి ల్యాప్టాప్, ఐప్యాడ్, కమ్యూనికేటర్ బాక్స్, వైఫై పరికరం, రెండు టీవీలు, 13 మొబైల్ ఫోన్లు, హెడ్ఫోన్లు, రూ.2,30,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. లావాదేవీలు నిర్వహించే అకౌంట్లో ఉన్న రూ.4 లక్షలు ీసీజ్ చేశారు. -
ఆక్ర‘ముంచేస్తున్నారు’
సాక్షి ప్రతినిధి, ఏలూరు : ఏలూరులో అధికార పార్టీ నేతలు పేట్రేగిపోతున్నారు. ఇరిగేషన్ స్థలాలు, చెరువులు, పోరంబోకు స్థలాలను టార్గెట్గా చేసి మరీ వాటి సమీపంలో కొద్దిభూమి కొనుగోలు చేయడం అది కూడా బెదిరింపులతో అడ్డగోలు వ్యవహారాలతో అక్రమ రిజిస్ట్రేషన్లు చేయించుకుని ప్రభుత్వ భూములను కలుపుకుని దర్జాగా వెంచర్లు వేసి మధ్యతరగతి ప్రజలకు అంటకట్టి కోట్లు గడిస్తున్నారు. స్థలం కొనుగోలు చేసి చివరికీ బ్యాంకు లోన్కు వెళ్లి ఇల్లు కట్టుకోవడానికి ప్రయత్నిస్తే రెడ్మార్క్లో ఉందని, లోన్ రాదు.. అనుమతి ఉండదని అసలు సంగతి తెలుసుకుని షాక్ అవుతున్న పరిస్థితి. ఇదే కోవాలో ఏలూరు శివారులోని వెంకటాపురం బ్లాక్–3లో రూ.3 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కబ్జా చేసి సమీపంలోని వివాదాస్పద భూమిని దౌర్జన్యంగా దురాక్రమించి ప్లాట్లు వేసి మరీ సొమ్ములు చేసుకున్నారు. అడ్డగోలుగా.. అనుమతులు లేకుండా.. ఏలూరు నగర శివారులో అనుమతులు లేకుండా అడ్డగోలుగా పొలిటికల్ వెంచర్లు కొలువు తీరుతున్నాయి. డీటీసీపీ అనుమతులుగాని, నగరపాలక సంస్థలో ప్లాన్ అప్రూవల్గాని, ఇడాలో అనుమతులు లేకుండా ఇష్టానుసారంగా పొలిటికల్ అండదండలతో కొందరు అధికార పార్టీ నాయకులు ప్రత్యక్ష భాగస్వాములుగా మారి రియల్ దందాకు తెరదీశారు. ప్రతి వెంచర్లోనూ ఇరిగేషన్ కాల్వ, ప్రభుత్వ పోరంబోకు, సర్కారు బాటలను కలుపుకుని వెంచర్లు వేసి మరీ విక్రయిస్తున్నారు. ఏలూరు శివారులోని వెంకటాపురం బ్లాక్–3లో ఇదే తరహా వెంచర్ దందా కొనసాగింది. సుంకరవారితోట వంతెన సమీపంలో మూడు కుటుంబాలు ప్రైవేట్ శ్మశానవాటికగా వినియోగించుకోవడానికి వీలుగా 2.05 ఎకరాల భూమిని సర్వే నంబర్ 872లో కేటాయించుకుని వందేళ్ల నుంచి వినియోగించుకున్నారు. దాని సమీపంలోని 874 సర్వే నంబర్లో 50 సెంట్ల ప్రభుత్వ భూమి ఉంది. అయితే కాలక్రమేణా ప్రాంతం పెరగడం, నగరపాలక సంస్థ పరిధిలోకి రావడం చుట్టుపక్కల నివాసాలు ఏర్పడటంతో సుమారు 40 ఏళ్ల నుంచి శ్మశాన వాటికగా వినియోగించుకోవడాన్ని నిలిపివేసి భూమిని ఆధీనంలో తీసుకున్నారు. అయితే వారసత్వపు భూమి కావడంతో అడంగల్ రికార్డులో నమోదైంది. అలాగే ఏళ్ల తరబడి సదరు కుటుంబాల ఆధీనంలోనే 2.05 ఎకరాల సెంట్ల భూమి ఉంది. సదరు కుటుంబాల ఆధీనంలోని భూమిపై పొలిటికల్ కన్ను పడి ముక్కలుగా విడిదీసి హద్దులు మార్చి ఏలూరులో కాకుండా ఇతర సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఒక రిజిస్ట్రేషన్తో మొదలుపెట్టి అన్నిచోట్ల భారీ వ్యవహారాలతో చక్కపెట్టి వెంచర్ను సిద్ధం చేసేశారు. వెంచర్లో భవన నిర్మాణం వెంచర్లో రహదారిఈ వెంచర్ దందాలో ప్రైవేటు భూమి యజమానులుగా ఉన్నవారిని అధికారం అడ్డం పెట్టుకుని బెదిరించి దందాలో కారుచౌకగా తీసుకోవడం, దీంతో పాటు మరో రూ.3 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని స్వాహా చేశారు. 15 సెంట్ల ఇరిగేషన్ కాలువను కలిపేసుకుని దానిని రోడ్డుగా మార్చి కాలువను మూసేశారు. గతేడాది సెప్టెంబర్ 12న పంట కాలువ అకస్మాతుగా పొంగడంతో రోడ్లన్నీ జలమయంగా మారి ఆ ప్రాంతమంతా నీటితో నిండిపోవడంతో భూదందా వెలుగులోకి వచ్చింది. నగరపాలక సంస్థ అధికారులు హడావుడిగా పరిశీలించి వచ్చారు తప్ప పట్టించుకోకపోవడం గమనార్హం. పొలిటికల్ వెంచర్ కాలువ, పోరంబోకు కలుపుకుని వెంచర్ డీటీసీపీ, ఇడా అనుమతులు లేకుండా స్థలాల విక్రయాలు సర్వే నంబర్లు మార్చి మరీ రిజిస్ట్రేషన్లు అధికార పార్టీ నేతల అండతో అడ్డగోలు తంతు రూ.3 కోట్ల విలువైన ప్రభుత్వ భూమి కబ్జా ఏలూరు శివారు వెంకటాపురంలో ఆక్రమణలు కాలువ పొంగితే చెరువుగా స్థలాలు -
ఎఫెక్ట్
భీమవరం అర్బన్ : మండలంలోని గొల్లవానితిప్ప గ్రామంలో వాడుక చెరువులో కర్రనాచు, తూడు పేరుకుపోవడంతో జలాలు కలుషితమయ్యాయని ఈనెల 17న ‘సాక్షి’లో ‘తూడుతో నిండి.. అధ్వానంగా ఉండి’ శీర్షికన ప్రచురించిన కథనానికి అధికారులు స్పందించారు. పంచాయతీ అధికారులు, పెద్దలు కలిసి చెరువులో కర్రనాచు, తూడు, సిల్టు తొలగింపునకు చర్యలు తీసుకున్నారు. చెరువులో స్వచ్ఛమైన నీటిని నింపి గ్రామస్తులకు అందుబాటులోకి తీసుకురానున్నట్టు పంచాయతీ సిబ్బంది తెలిపారు. భీమవరం (ప్రకాశంచౌక్): రాష్ట్రంలో జనాభా గణన–2027 మొదటి దశలో స్వీయగణన, ఇండ్ల జాబితా, ఇండ్ల గణన కార్యకలాపాల ప్రక్రియ ప్రారంభమైందని కలెక్టర్ సీహెచ్ నాగరాణి తెలిపారు. ఈ ప్రక్రియలో భాగంగా ప్రజలు తమ వివరాలను స్వయంగా నమోదు చేసుకునే సౌకర్యం మే 30 వరకు అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. ఇళ్ల వివరాలను డిజిటల్ విధానంలో నమోదు చేసుకోవాలని, ఎటువంటి అపోహలకు గురికావద్దని సూచించారు. మే 1 నుంచి ఎన్యుమరేటర్లు ఇళ్లకు వచ్చి వివరాలను నమోదు చేస్తారని తెలిపారు. భీమవరం: భీమవరం టూటౌన్ పోలీస్స్టేషన్ పరిధిలోని చినఅమిరంలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఇద్దరిని అరెస్టు చేశామని సీఐ కాళీచరణ్ తెలిపారు. ఆదివారం రాత్రి నిర్వహించిన దాడుల్లో రెండు సెల్ఫోన్లు, రూ.29,160 నగ దు స్వాధీనం చేసుకున్నామని, మరో ఇద్దరు పరారీలో ఉన్నారని చెప్పారు. -
కష్టపడి పనిచేస్తే సముచిత స్థానం
చింతలపూడి: పార్టీ కోసం అంకితభావంతో, కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకు, నాయకుడికి భవిష్యత్తులో సముచిత స్థానం లభిస్తుందని శా సనమండలి చైర్మన్ కొయ్యే మోషేన్రాజు అ న్నారు. ఆదివారం చింతలపూడి పర్యటనలో భాగంగా వైఎస్సార్సీపీ మున్సిపల్ విభాగం ఏలూరు జిల్లా అధ్యక్షుడు బొడ్డు వెంకటేశ్వరరావు నివాసానికి విచ్చేశారు. పార్టీ పట్టణ నాయకులు ఆయన్ను మర్యాదపూర్వకంగా క లుసుకున్నారు. మోషేన్రాజు మాట్లాడుతూ పార్టీ అభివృద్ధి కోసం క్షేత్రస్థాయిలో కష్టపడే వారిని పార్టీ ఎల్లప్పుడూ గుర్తిస్తుందన్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కార్యకర్తలు, నాయకులు అధైర్యపడకుండా ఐ క్యమత్యంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. రాబోయే రోజుల్లో పార్టీకి తిరిగి మంచి రోజులు వ స్తాయని అన్నారు. జిల్లా ప్రచార విభాగం అధ్యక్షుడు త్సల్లాబత్తుల శ్రీనివాసరావు, నాయకులు సీహెచ్ జానారెడ్డి, కొప్పుల నాగేశ్వరరావు, కనుమ రెడ్డి చండీప్రియ, ఎం. దుర్గారావు, డోకల రాము తదితరులు ఉన్నారు. ఏలూరు (ఆర్ఆర్పేట): పూర్వ పశ్చిమగోదావరి జిల్లాలోని జెడ్పీ, మండల పరిషత్, మున్సిపాలిటీలు–మున్సిపల్ కార్పొరేషన్ల కింద పనిచేస్తున్న ఉపాధ్యాయుల సాధారణ సీనియార్టీ జాబిత రూపొందించి మూడు విడతల్లో అభ్యంతరాలు తీసుకుని సరిచేశామని ఏలూరు డీఈఓ ఎం.వెంకట లక్ష్మమ్మ ఓ ప్రకటనలో తెలిపారు. సాధారణ సీనియార్టీ, సబ్జెక్టు వారీగా సీనియార్టీ జాబితాలు సంబంధిత పూర్వ పశ్చిమగోదావరి జిల్లా, పాఠశాల విద్యాశాఖ వెబ్సైట్లో, నోటీసు బోర్డుల్లో సోమవారం నుంచి అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. ఏ మైనా అభ్యంతరాలు ఉంటే 25వ తేదీ సాయంత్రం 5 గంటల్లోపు సంబంధిత డీవైఈఓ, ఎంఈఓల ద్వారా పూర్వ పశ్చిమగోదావరి జిల్లా వి ద్యాశాఖ కార్యాలయం, ఏలూరులో సమర్పించాలని సూచించారు. గడువు తర్వాత వచ్చిన వినతులు స్వీకరించబోమని, ఇదే చివరి అవకాశంగా భావించాలని డీఈఓ తెలిపారు. ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమల చినవెంకన్న క్షేత్రంలో జరిగిన రూ.200 నకిలీ దర్శనం టికెట్ల స్కామ్ కేసులోని నిందితులకు కోర్టు ఇచ్చిన రెండు రోజుల పోలీస్ కస్టడీ ఆదివారంతో ముగిసింది. భీమడోలు స్టేషన్లో సీఐ పి.కృష్ణ ఐదుగురు నిందితులను విచారించి స్టేట్మెంట్లు రికార్డ్ చేశారు. ఆదివారం సాయంత్రం వారి ని భీమడోలు కోర్టు న్యాయమూర్తి ఎస్.ప్రియదర్శిని నూతక్కి ముందు హాజరుపరిచారు. అనంతరం రిమాండ్కు తరలించారు. కేసుకు సంబంధించి తొమ్మిది మంది నిందితుల్లో ఐఎస్జే రాజు, ఎం.రమేష్, ఎస్.శేషుబాబు, ఎం.సతీష్, టి.సత్యనారాయణను పోలీసులు కస్టడీకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా కస్టడీకి సంబంధించిన అంశాలు, కేసు పురోగతి తదితర అంశాలపై క్షేత్రంలో చర్చ జరుగుతోంది. అలాగే 2025 జనవరి 1 నుంచి శ్రీవారి ఆల యంలో రూ.100, రూ.200 టికెట్ కౌంటర్లలో పనిచేసిన సిబ్బంది వివరాలను తెలపాలని పో లీసులు ఆదివారం దేవస్థానానికి లేఖ రాశారు. దీనిని బట్టి చూస్తే విచారణ ఇంకా కొనసాగుతున్నట్టు స్పష్టమవుతోంది. సాఫ్ట్వేర్ సంగతేంటి.. కేసులో ఎ–9 నిందితుడిగా ఉన్న సాఫ్ట్వేర్ ఉ ద్యోగి డేటాబేస్ లేకుండా కేవలం టికెట్ ప్రింట్ వచ్చేలా సాఫ్ట్వేర్ను రూపొందించాడు. అయితే తన స్నేహితుడు రమేష్ అడగడం వల్ల దేవస్థానానికి అనుకుని సాఫ్ట్వేర్ తయారు చేశానని పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఉన్నతాధికారుల ఆథరైజేషన్ లేకుండా సాఫ్ట్వేర్ ఎలా తయారుచేస్తారనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఉన్నతాధికారులు మరింత దృష్టి సారించా లని భక్తులు కోరుతున్నారు. ఉంగుటూరు: బాదంపూడిలోని మత్స్య శిక్షణా కేంద్రం (మంచినీటి చేపల కేంద్రం)లో మూ డు నెలల శిక్షణ కోర్సుకు ధరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మత్స్యశాఖ అధికారి బి.రాజకుమార్ ప్రకటనలో తెలిపారు. ఈనెల 23లోపు దరఖాస్తు చేసుకోవాలని, 28న ముఖాముఖీగా అభ్యర్థులను ఎంపిక చేస్తామని పేర్కొన్నారు. వచ్చేనెల 1 నుంచి జూలై 31 వరకు శిక్షణ ఇ స్తామన్నారు. చేపల పెంపకంలో మెలకువలు, సాగుపై అవగాహన, వ్యాధులు, నివారణ, చేప నారు ఉత్పత్తి వంటి అంశాలపై శిక్షణ ఇస్తామన్నారు. ఐదో తరగతి చదివి 18 నుంచి 30 ఏళ్ల వయసున్న యువత అర్హులన్నారు. శిక్షణ అనంతరం సర్టిఫికెట్లు ప్రదానం చేస్తామని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు సెల్ 95733 37484, 7286993033, 9492337649 నంబర్లలో సంప్రదించాలని కోరారు. -
రాట్నాలమ్మ ఆలయ ఆదాయం రూ.94,423
దెందులూరు: పెదవేగి శ్రీ రాట్నాలమ్మ తల్లి ఆలయంలో ఆదివారం అమ్మవారికి వివిధ రకాల పుష్పాలతో విశిష్ట అలంకరణ చేశారు. వివిధ మండలాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఆలయ ఈవో సతీష్ కుమార్, జూనియర్ అసిస్టెంట్ విడుదల సత్యనారాయణ మాట్లాడుతూ.. పూజ టికెట్లపై రూ. 61,790, విరాళాల ద్వారా రూ.8,763, లడ్డు ప్రసాదాలకు రూ.21,750, ఫొటోలకు రూ.2,120 లు కలిపి మొత్తం రూ. 94,423 వచ్చాయని వివరించారు. ముసునూరు: విద్యుదాఘాతంతో పూరిళ్లు దగ్ధం కాగా, మూడు కుటుంబాలు కట్టుబట్టలతో రోడ్డున పడిన సంఘటన మండలంలో జరిగింది. ఆదివారం సాయంత్రం మండల కేంద్రం ముసునూరు ఎస్సీ ఏరియాలో తాడి రాజు, తన కుమార్తెల కుటుంబాలకు చెందిన పూరిళ్లు విద్యుదాఘాతంతో అగ్నికి ఆహుతయ్యాయి. ఈ దుర్ఘటనలో రెండు గ్యాస్ సిలిండర్లు పేలడంతో భారీ శబ్దాలతో మంటలు చెలరేగాయి. మంటలు అధికంగా ఎగసిపడి వ్యాపించడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. నూజివీడు నుంచి అగ్నిమాపక శకటం సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు. ఆగిరిపల్లి: ఆగిరిపల్లి మండలంలోని వడ్లమానులో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కొడుకు మృతిని తట్టుకోలేక తల్లి మృతి చెందింది. గ్రామానికి చెందిన సులేమాన్ రాజు (40) శనివారం కృష్ణా జిల్లా ఉప్పులూరు వద్ద ఉన్న ఏలూరు కాలువలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఉయ్యూరు ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఆదివారం గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించిన కొద్దిసేపటికి, కొడుకు మృతిని తట్టుకోలేక తీవ్ర మనోవేదనకు గురైన తల్లి రెడ్డి లక్ష్మీ నరసమ్మ (65) గుండెపోటుతో కుప్పకూలిపోయి మరణించింది. జంగారెడ్డిగూడెం: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతిచెందినట్లు ఎస్సై ఎన్వీ ప్రసాద్ తెలిపారు. పుట్లగట్లగూడెం గ్రామానికి చెందిన మద్దాల వెంకటేశ్వర్లు పేరంపేటలో సెక్యురిటీ సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు. ఆదివారం పేరంపేట వెళ్తుండగా.. వెనుక నుంచి ఓ కారు ఢీకొట్టింది. దీంతో ఘటనాస్థలిలోనే మృతిచెందాడు. వెంకటేశ్వర్లు కుటుంబ సభ్యులు న్యాయం చేయాలంటూ ధర్నా చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు బాధితులతో మాట్లాడి, ట్రాఫిక్ను క్రమబద్దీకరించారు. -
ఫంక్షన్ హాల్లో అగ్ని ప్రమాదం
తాడేపల్లిగూడెం (టీఓసీ): టూ టౌన్ శివారు జయలక్ష్మి థియేటర్ ఫంక్షన్ హాల్లో ఆదివారం మధ్యాహ్నం అగ్ని ప్రమాదం సంభవించింది. భారీగా మంటలు ఎగసిపడ్డాయి. సమాచారం అందుకున్న ఫైర్ ఆఫీసర్ కేవీ మురళీ కొండబాబు, సిబ్బంది మంటలను అదుపు చేశారు. అగ్నిమాపక అధికారుల వివరాల ప్రకారం.. అగ్ని ప్రమాదానికి కారణం తెలియరాలేదు. థియేటర్ చాలా కాలంగా మూతపడి ఉందని, కొంతకాలం ఫంక్షన్ హాల్గా నడిపారని, ప్రస్తుతం భవనం శిథిలమైందని తెలిపారు. సుమారు రూ. 2 నుంచి 3 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లినట్లు అధికారులు పేర్కొన్నారు. -
మెరుగైన సేవలందించడమే లక్ష్యం
శ్రీవారి దేవస్థానం ఈఓ వేండ్ర త్రినాథరావు ద్వారకాతిరుమల: భక్తులకు మెరుగైన సేవలు అందించడమే తన లక్ష్యమని ద్వారకాతిరుమల శ్రీవారి దేవస్థానం నూతన ఈఓ వేండ్ర త్రినాథరావు అన్నారు. అన్నవరం దేవస్థానం నుంచి బదిలీపై వచ్చిన ఆయన శనివారం చినవెంకన్న దేవస్థానంలో ఈఓగా బాధ్యతలు చేపట్టారు. తొలుత త్రినాధరావు దంపతులు స్వామి, అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు జరుపుకున్నారు. అనంతరం ఆలయ ముఖ మండపంలో అర్చకులు, పండితులు ఆయనకు శ్రీవారి శేష వస్త్రాన్ని కప్పి, వేద ఆశీర్వచనాన్ని పలికారు. ఆ తరువాత ఆలయ కార్యాలయంలో డీఈఓ వై.భద్రాజీ నుంచి ఆయన చార్జ్ స్వీకరించారు. ఈ సందర్బంగా సాక్షితో మాట్లాడుతూ.. ద్వారకాతిరుమల శ్రీవారి ఆలయంలో సుదీర్ఘకాలం పనిచేసిన అనుబంధం ఉందని గుర్తి చేసుకున్నారు. మరోసారి ఈ ఆలయానికి ఈఓగా రావడాన్ని అదృష్టంగా భావిస్తున్నానని.. ఇన్ని సార్లు ఈఓగా రావడానికి శ్రీవారి కృపా, కటాక్షాలే కారణమని నమ్ముతున్నానని చెప్పారు. 2017–2018 మధ్య సుమారు రూ.70 కోట్లతో వకుళమాత నిత్యాన్నదాన భవనం, పవర్ హౌస్, బుకింగ్ కౌంటర్లు, కల్యాణకట్ట, ఘాట్ రోడ్లు, ధర్మఅప్పారాయ నిలయం, శ్రీవారి నిత్య కల్యాణ మండపం, క్యాంటీన్, సెంట్రల్ స్టోర్స్ వంటి భవనాలను ఈఈ డీవీ భాస్కర్ సహాయంతో నిర్మించామని ప్రస్తుతం ప్రారంభానికి సిద్ధంగా ఉన్న అనివేటి మండప విస్తరణ, క్యూ కాంప్లెక్స్ భవనం, ధర్మ అప్పారాయ నిలయం భవనంపైన మరో అంతస్తు నిర్మాణాలకు తన హయాంలోనే శంకుస్థాపనలు జరిగాయన్నారు. ఆలయ పరువు, ప్రతిష్ఠలను కాపాడుకోవాల్సిన బాధ్యత అధికారులు, సిబ్బందిపైనే ఉందని, భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రతి ఒక్కరూ మరింతగా కృషి చేయాలని సూచించారు. -
హైస్కూల్ ప్లస్.. ఫలితాల బోనస్
భీమవరం: గ్రామీణ ప్రాంతాల్లోని పేదలు సైతం ఉన్నత విద్యనభ్యసించడానికి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ఏర్పాటుచేసిన హైస్కూళ్లలో ఇంటర్ విద్యకు ఆదరణ పెరుగుతోంది. గతంలో టెన్త్ అనంతరం బాలికలను దూరప్రాంతాలకు ఉన్నత విద్య అభ్యసించడానికి పంపించడానికి తల్లిదండ్రులు అనేక మంది అంగీకరించేవారు కాదు. దీనితో అనేక మంది బాలికలు టెన్త్తోనే చదువుకు స్వస్తి చెప్పేవారు. ఉన్నత విద్య అభ్యసించాలనే కాంక్ష ఉన్నా అవకాశం లేని బాలికల కోసం ప్రతి మండలంలోను హైస్కూల్లోనే ఒక చోట జూనియర్ కళాశాల మాదిరిగా హైస్కూల్ ప్లస్ పేరుతో ఇంటర్ విద్యనందించే ఏర్పాటుచేశారు. ఈ విధంగా 2022–23 విద్యాసంవత్సరంలో జిల్లాలోని 20 మండలాలకుగాను భీమవరం, పెంటపాడు, ఉండి, ఆకివీడు, నరసాపురం, పాలకోడేరు, పెనుగొండ, అత్తిలి తదితర మండలాల్లో 16 హైస్కూళ్లను ఇంటర్ విద్యనందిండం ప్రారంభించారు. ఉచిత విద్యతోపాటు భోజన సదుపాయం హైస్కూల్ ఫ్లస్ విద్యను ప్రభుత్వం ఉచితంగా అందించడమేగాక విద్యార్థులు యూనిఫాంతోపాటు ఉచిత భోజన సదుపాయం కల్పించడంతో గ్రామీణ ప్రాంతాల్లోని పేద విద్యార్థులు ఉన్నత విద్యపట్ల ఆసక్తి చూపిస్తున్నారు. కొన్ని కళాశాలల వద్ద విద్యార్థులకు దాతల సహకారంతో విద్యాసామాగ్రి నందించడం, ఇతర సదుపాయాల కల్పన వంటి వాటికి అక్కడి అధ్యాపకులు ప్రాధాన్యత ఇవ్వడంతో విద్యార్థుల సంఖ్య మరింత పెరగడానికి అవకాశం ఏర్పడింది. పెరుగుతున్న విద్యార్థుల సంఖ్య హైస్కూల్ ప్లస్ విద్యనభ్యసించే విద్యార్థుల సంఖ్య ప్రతి ఏటా గణనీయంగా పెరుగుతోంది. ఎంపీసీ, బైపీసీ, సీఈసీ కోర్సులను అందిస్తుండగా ప్రారంభించి 2022–23 ఏడాది 16 కళాశాలల్లో కేవలం 97 మంది విద్యార్థులు మాత్రమే చేరగా వారిలో 26 మంది ఉత్తీర్ణత సాధించారు. 2023–24లో విద్యార్థులు సంఖ్య 232కు చేరగా వారిలో 121 మంది ఉత్తీర్ణులయ్యారు. 2024లో ప్రభుత్వం మారడంతో హైస్కూల్ ప్లస్ వ్యవస్థను కూటమి ప్రభుత్వం రద్దుచేస్తుందంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరగడంతో విద్యార్థుల సంఖ్య 126కు పడిపోయింది. వారిలో 86 మంది ఉత్తీర్ణులయ్యారు. అయితే ప్రభుత్వం హైస్కూల్ ప్లస్ కొనసాగించడంతో 2025–26 విద్యాసంవత్సరంలో 344 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా 195 మంది ఉత్తీర్ణత సాధించారు. విద్య వ్యాపారంగా మారిన ప్రస్తుత తరుణంలో ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లోని హైస్కూల్ ఫ్లస్ విద్యపట్ల మరింత శ్రద్ధ వహించే పూర్తిస్థాయిలో ల్యాబ్లు వంటి ఇతర సౌకర్యాలు కల్పిస్తే విద్యార్థుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశముంటుందని అధ్యాపకులు చెబుతున్నారు. ఫలిస్తున్న గత ప్రభుత్వ చర్యలు మాజీ సీఎం జగన్ హయాంలో హైస్కూళ్ల అప్గ్రేడ్ జిల్లాలో 16 బాలికల కళాశాలల ఏర్పాటు 2022–23లో 97 మందితో ప్రారంభం ఈ ఏడాది 344కి పెరిగిన విద్యార్థుల సంఖ్య ఉన్నత విద్యకు అవకాశం ఏర్పడిందంటున్న విద్యార్థులు నేను ఇంటర్ చదవాలంటే భీమవరం, పాలకొల్లు, వీరవాసరం వంటి ప్రాంతాలకు వెళ్లాలి. అయితే ఆర్టీసీ బస్ సదుపాయం అంతగా లేకపోవడంతో దగ్గరలో ఉన్న మా గ్రామంలోని హైస్కూల్లోనే ఇంటర్లో చేరాను. బైపీసీలో 1000 మార్కులకు 963 మార్కులు సాధించాను. నీట్ పరీక్షకు సిద్ధం అవుతున్నాను. – కె సంతోషి, రాయకుదురు నేను రాయకుదురు గ్రామంలోని హైస్కూల్లోనే ఎంపీసీ గ్రూప్లో చేరాను. విద్యాభోదన బాగుండడంతో 1000 మార్కులకు గాను 972 మార్కులు సాధించాను. మా అన్న సురేష్ సహకారంతో ప్రస్తుతం ఎంసెట్కు ఇంటి వద్దనుంచే శిక్షణ పొందుతున్నాను. – శీలం జోత్స్న, రాయకుదురు -
అంబటి దీక్షకు మద్దతు
భీమవరం: గుంటూరు కలెక్టర్ కార్యాలయం ఎదురుగా నిరసన నిరాహార దీక్ష చేపట్టిన వైఎస్సార్సీపీ నాయకుడు అంబటి రాంబాబుకు భీమవరం నియోజకవర్గ సమన్వయకర్త చినమల్లి వెంకటరాయుడు మద్దతు ప్రకటించారు. అనంతరం దీక్ష నిర్వహించిన రాంబాబుకు శాలువా కప్పి సత్కరించారు. ఎస్పీ అద్నాన్ నయీం అస్మి భీమవరం: భీమవరం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయ ఆవరణలో శనివారం స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా పోలీసు అధికారులు, సిబ్బందితో కలిసి పరిసరాలను శుభ్రపర్చారు. ఈ సందర్భంగా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి మాట్లాడుతూ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం ద్వారా అనారోగ్యం దరి చేరకుండా చూసుకోవచ్చన్నారు. జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లలో ప్రతినెల మూడో శనివారం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఆర్మర్డ్ రిజర్వ్ డీఎస్పీ ఎంవీవీ సత్యనారాయణ, జిల్లా స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ కెవీవీఎన్ సత్యనారాయణ, ఆర్మడ్డ్ రిజర్వ్ ఇన్స్పెక్టర్ కె.వెంకట్రావు, తదితరులు పాల్గొన్నారు. ఏలూరు (ఆర్ఆర్పేట)/దెందులూరు: జిల్లా ఉమ్మడి పరీక్షల నిర్వహణ సంస్థ (డీసీఈబీ) కార్యదర్శిగా పి.సురేష్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఇంతవరకూ ఆ స్థానంలో తడికలపూడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఏ.సర్వేశ్వరరావు బాధ్యతలు నిర్వహించారు. ఆయన మూడు సంవత్సరాల పదవీ కాలం ముగియడంతో, దెందులూరు మండలం మేదినరావుగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా పని చేస్తున్న సురేష్ను నియమించారు. సురేష్ను జిల్లా విద్యాశాఖాధికారి ఎం.వెంకటలక్ష్మమ్మ, ఏలూరు ఉప విద్యాశాఖాధికారి, అధికారులు, ఉపాధ్యాయులు అభినందించారు. భీమడోలు: ధాన్యం కొనుగోలులో రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాల్సిన బాధ్యత సంబంధిత అధికారులదేనని జాయింట్ కలెక్టర్ ఎం.జె. అభిషేక్ గౌడ్ అన్నారు. జాతీయ రహదారి సూరప్పగూడెం వద్ద రోడ్డుపై ఆరబోసిన ధాన్యాన్ని శనివారం ఆయన పరిశీలించారు. రైతు సేవా కేంద్రాన్ని సందర్శించి రైతుల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ధాన్యం తరలింపు, గోనె సంచుల విషయంలో ఎటువంటి ఇబ్బందులు లేవని రైతులు చెప్పడంతో ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రబీ కోతలు ముమ్మరంగా సాగుతున్నందున ధాన్యం కొనుగోలుకు అవసరమైన నాణ్యమైన సంచులను అందుబాటులో ఉంచామన్నారు. -
నీలినీడలు
కాలువల మరమ్మతులపై ● శిథిలావస్థలో లాకులు, అధ్వానంగా కాలువలు ● రూ.30 కోట్లతో అభివృద్ధికి ప్రతిపాదనలు ● కాలువలు మూసే సమయం దగ్గరపడినా ఇంకా రాని మంజూరు ● గత ఏడాది నాసిరకం పనులతో ముంపు సమస్య గోస్తనీ పంట కాలువపై నిర్మించిన లాకులు 20 ఏళ్లుగా శిథిలావస్థలో ఉన్నాయి. ఇరగవరం, పెనుమంట్ర మండలానికి చెందిన సుమారు 10 గ్రామాలకు చెందిన 3,500 ఎకరాలకు సాగునీరు అందుతుంది. ఈ లాకులు శిథిలావస్థకు చేరుకున్నాయి. పదేళ్లుగా ఈ ప్రాంతాల రైతులు సాగునీరు సక్రమంగా అందక ఇబ్బంది పడుతున్నారు. పాత లాకుల రహదారి కూడా పూర్తిగా మూసివేయడంతో రాకపోకలకు కూడా ఇబ్బంది పడుతున్నారు. – మారిశెట్టి శ్రీనివాస్, రైతు, ఎస్.ఇల్లిందలపర్రు కాలువలు, డ్రెయిన్లు గుర్రపు డెక్క, చెత్తా చెదారంతో పూడుకుపోయాయి. సాగునీరు అందక నానా కష్టాలు పడుతున్నాం. పూడికతీత చర్యలు చేపట్టి సాగునీరు అందించాలి. మురుగు బోదెలు ప్రక్షాళన చేసి రానున్న సార్వా సాగులో చేలు ముంపు బారిన పడకుండా చర్యలు తీసుకోవాలి. – ఎం జగన్మోహనరావు, రైతు, మోగల్లు సాక్షి, భీమవరం: ‘వెంకయ్య వయ్యేరు పంట కాలువ శివారు ఏలూరుపాడు లాకుల షట్టర్లు శిథిలావస్థకు చేరాయి. తలుపుల కింది భాగం పూర్తిగా దెబ్బతినడంతో సాగునీరు వృథాగా ఉప్పుటేరులోకి వెళ్లిపోతుంది. లాకుల పరిధిలోని ఏలూరుపాడు, జువ్వలపాలెం, కలవపూడి, మోడీ, ఎస్సీ బోస్ కాలనీ తదితర గ్రామాలకు ఏటా సాగు, తాగునీటి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. జిల్లాలోని మిగిలిన చోట్ల దాదాపు ఇదే పరిస్థితి.’ జిల్లాలో 357 కి.మీ పొడవునా 11 మేజర్ కెనాల్స్, 1776 బ్రాంచ్ కెనాల్స్ ద్వారా 2.3 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు, చెరువులకు తాగునీరు సరఫరా అవుతోంది. కాలువలు పూడికతో నిండిపోయాయి. వాటర్ లెవల్స్ నిర్వహణలో కీలకమైన లాకులు శిథిలస్థితికి చేరుకుంటున్నాయి. నరసాపురం, తణుకు, ఉండి, తాడేపల్లిగూడెం సబ్ డివిజన్లలోని 20 లాకులకు చినకాపవరం, ఏలూరుపాడు, ఎస్.ఇల్లింద్రపర్రు, పరిమెళ్ల, చిలకంపాడు తదితర లాకుల షట్టర్లు, చాంబర్ గేట్లు బాగా దెబ్బతిన్నాయి. వీటి మరమ్మతులు చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని రైతులు అంటున్నారు. లీకేజీలతో సాగునీరు వృథాగా పోతుండటం, పంటకాలువల పూడికతో శివారు ప్రాంతాలకు సాగు, తాగునీటి ఎద్దడి ఎదురవుతోంది. గత సీజన్లో కాలువలకు నీరు విడుదల చేసిన నెల రోజుల తర్వాత కూడా శివారు భూములకు నీరందక పోడూరు, ఆచంట, యలమంచిలి తదితర మండలాల్లో నారుమడులు ఎండిపోయి పొలాలు బీటలు తీశాయి. నీటి ఎద్దడిపై పలుచోట్ల రైతులు నిరసన వ్యక్తంచేశారు. జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ప్రాతినిథ్యం వహిస్తున్న పాలకొల్లులో సైతం అప్పట్లో సాగునీటి సమస్యతో రైతులు ఇబ్బంది పడ్డారు. గత సీజన్లో కాలువల నిర్వహణకు రూ.12.73 కోట్లు మంజూరయ్యాయి. ప్రస్తుత సీజన్కు ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్(ఓ అండ్ ఎం)తో పాటు లాకుల మరమ్మతులు, పూడికతీత తదితర పనులు చేపట్టేందుకు దాదాపు రూ.17 కోట్లతో ప్రతిపాదనలు పంపగా ప్రభుత్వం నుంచి మంజూరు రాకపోవడం గమనార్హం. పనులు క్లోజ్ ? ఏటా ఏప్రిల్ రెండో వారం తర్వాత కాలువలు మూసివేసి జూన్ 1న తెరుస్తుంటారు. ఈనెల 20 నాటికి కాలువలు మూసివేయనున్నట్టు మొదట్లో అధికారులు ప్రకటించినా ఆచంట, పాలకొల్లు, నరసాపురం నియోజకవర్గాల్లో ఖరీఫ్ ఆలస్యం కావడంతో సాగు అవసరాల నిమిత్తం మరికొద్ది రోజులు పొడిగించే వీలుంది. ముందస్తు సాగులో భాగంగా ఈ ఏడాది మే రెండో వారం తర్వాత నీటిని విడుదల చేస్తారన్న ప్రచారం ఉంది. పంట కాలువల్లో నీరు అడుగంటి పనులు మొదలు పెట్టేందుకు కనీసం పది రోజులు సమయం పడుతుంది. ఈ వ్యవధిలో తూడు తొలగింపు, కల్వర్టులకు రివిట్మెంట్లు నిర్మాణం, లాకులకు చిన్నపాటి మరమ్మతులకు మాత్రమే ఈ సమయం సరిపోతుంది. పూర్తిస్థాయిలో కాలువలు, లాకుల అభివృద్ధికి వీలుకాదని రైతులు అంటున్నారు. ఈ పరిస్థితుల్లో గత రెండేళ్ల మాదిరి ఈ ఏడాది కూడా క్లోజర్ పనులకు ఎగనామం పెట్టినట్టేనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో 294 కిలోమీటర్లు పొడవునా 13 మేజర్, 330 కిలోమీటర్లు పొడవున 41 మీడియం, 956 కిలోమీటర్లు పొడవున 454 మైనర్ డ్రెయిన్లు ఉన్నాయి. 2025–26లో వీటి నిర్వహణకు నిమిత్తం రూ.11.28 కోట్లు విలువైన 265 పనులు మంజూరయ్యాయి. 61 పనులు పూడికతీత, షట్టర్స్ మరమ్మతులకు కాగా, మిగిలినవి గుర్రపుడెక్క, తూడు తొలగింపు పనులు. ఏప్రిల్ నుంచి మార్చి నెలాఖరు వరకు డ్రెయిన్ల నిర్వహణ చేయాలి. నీటిసంఘాల మాటున నామినేషనన్ పద్దతిపై కూటమికి చెందిన వారు పనులు దక్కించుకున్నారు. తొలకరికి ముందే పనులు చేపట్టాల్సి ఉండగా తీవ్ర జాప్యం చేశారు. తూతూమంత్రంగా తూడు తొలగించి తంతు నడిపించారు. ఖరీఫ్ చివరిలో వచ్చిన మోంథా తుఫాను పెద్దగా ప్రభావం చూపకపోయినా డ్రెయినేజీ వ్యవస్థ సరిగాలేక ముంపు సమస్యతో జిల్లాలోని 20,174 మంది రైతులు 22 వేల ఎకరాల్లోని పంట నష్టపోయారు. రబీ కోతలు మొదలైనా రైతులకు ఇంకా తొలకరి పంట నష్టపరిహారం అందలేదు. ఈ ఏడాది కేవలం పూడికతీత, తూడు తొలగింపునకు రూ.13 కోట్లు విలువైన 244 పనులకు ప్రతిపాదనలు పంపారు. ఇప్పటి వరకు మంజూరు రాలేదని అధికారులు అంటున్నారు. -
అగ్నిప్రమాదాలపై అవగాహన అవసరం
భీమవరం: సంస్థల్లో అగ్ని ప్రమాదాలు సంభవించకుండా కచ్చితమైన భద్రతా ప్రమాణాలు పాటించాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి పేర్కొన్నారు. అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా శనివారం పట్టణంలోని హాస్పిటల్ ప్రాంగణంలో నిర్వహించిన అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. భీమవరం పరిధిలోని వివిధ ఆసుపత్రులకు చెందిన వైద్య సిబ్బంది, భద్రతా సిబ్బంది, అగ్నిమాపక శాఖ సిబ్బంది పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం అగ్నిమాపక వారోత్సవాలను నిర్వహించడం ద్వారా ప్రజల్లో అగ్ని ప్రమాదాలపై అవగాహన పెంపొందించడమే లక్ష్యమన్నారు. ఈ నెల 14వ తేదీ నుండి 20వ తేదీ వరకు నిర్వహిస్తున్న ఈ వారోత్సవాల సందర్భంగా జిల్లావ్యాప్తంగా విస్తత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ స్వయంగా గ్యాస్ లీకేజీ వల్ల ఏర్పడిన మంటలను నియంత్రించి చైతన్యం కల్పించారు. అనంతరం అగ్ని ప్రమాదాల నివారణపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు రూపొందించిన గోడపత్రికను ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి బి.శివన్నారాయణ రెడ్డి, అగ్నిమాపక అధికారి బి.శ్రీనివాసరావు, సహాయ అగ్నిమాపక అధికారి కె.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
మామిడి సాగులో ఏపీకి రెండో స్థానం
తాడేపల్లిగూడెం: దేశంలో మామిడి సాగులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండో స్థానంలో ఉందని ఉద్యాన విశ్వ విద్యాలయం ఉపకులపతి డాక్టర్ కె.ధనుంజయరావు అన్నారు. రాష్ట్రంలోని వివిధ విశ్వ విద్యాలయాల పరిధిలో 23 కృషి విజ్ఞాన కేంద్రాల్లో పనిచేస్తున్న శాస్త్రవేత్తలకు మామిడి పంట, సమీకృత యాజమాన్య ఆధునిక పద్ధతులపై శనివారం ఒక రోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. జ్యోతి ప్రజల్వనతో శిక్షణను ప్రారంభించారు. ఉపకులపతి ధనుంజయరావు మాట్లాడుతూ మారుతున్న వాతావరణ పరిస్థితులు కొన్ని రకాల చీడపీడలకు కారణం అవుతున్నాయని, ముఖ్యంగా నల్ల తామర, పండు ఈగ వంటి సమస్యలు వల్ల మామిడి రైతులు ఎక్కువగా నష్టపోతున్నారని తెలిపారు. తెగుళ్ల నివారణ, నాణ్యమైన దిగుబడి, సాగు ఖర్చు నియంత్రణలకు నూతన సాంకేతిక విధానాలను నూజివీడు మామిడి పరిశోధన కేంద్రం అభివృద్ధి చేసిందని, వీటిని మామిడి రైతులకు అందించాలని ఆయన శాస్త్రవేత్తలను కోరారు. అనంతరం మామిడి తోట యాజమాన్యానికి అవసరమైన పంట క్యాలెండర్ను ఆవిష్కరించారు. 23 కేవీకేల నుంచి శాస్త్రవేత్తలు హాజరై వారి జిల్లాల్లోని మామిడి పంట పరిస్థితులను వెల్లడించారు. సందేహాలకు సీనియర్ శాస్త్రవేత్తల నుంచి సలహాలు తీసుకున్నారు. విస్తరణ సంచాలకులు డాక్టర్ సీహెచ్ రూత్, జి.రామానందం, బీకేఎం లక్ష్మి, కె.రాధారాణి, ఈ.కరుణ శ్రీ పాల్గొన్నారు. -
అభయారణ్యంలోనే పులి మకాం
పోలవరం రూరల్: పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంతంలోని మామిడిగొంది, దేవరగొంది ట్విన్ టన్నెల్స్ ప్రాంతంలో ఉన్న కుడి ప్రధాన కాలువ, హెడ్ రెగ్యులేటర్ సమీపంలో ఉన్న రిజర్వు అటవీ ప్రాంతంలో పులి మకాం వేసింది. శాడిల్ డ్యామ్ నుంచి స్పిల్వే దిగువకు చేరుకుని అక్కడకు మేతకు వెళ్లిన ఆవు దూడపై దాడి చేసి చంపి తిరిగి వచ్చిన దారినే వెళ్ళినట్లు పాదముద్రలు ఉన్నాయని అటవీశాఖాధికారులు చెబుతున్నారు. పులి కదలికలపై ట్రాక్టర్ ద్వారా గుర్తిస్తున్నారు. పులి సంచరించిన ప్రాంతాల్లో ట్రాప్ కెమెరాలు అమర్చారు. పులిని పట్టుకోవడానికి రెస్క్యూ టీంను సిద్దం చేసినట్లు పేర్కొన్నారు. ప్రాజెక్టులోకి పర్యాటకుల రాకపోకలు, కొత్త వ్యక్తుల సంచారం నిషేధించారు. ప్రాజెక్టులోకి పనులు నిమిత్తం వెళ్ళే కార్మికులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రాజెక్టు ప్రాంతంలో పశువులను మేపుకునే వారు తమ పశువులను మైదాన ప్రాంతాలకు తరలించాలని అటవీశాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ప్రాజెక్టు ప్రాంతంలో దూడపై పెద్ద పులి దాడి చేయడంతో ప్రాజెక్టు ప్రాంతంలోని కార్మికులు, మైదాన ప్రాంతంలోని ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. శుక్రవారం రాత్రి పెద్దపులి కొండపై నుంచి దిగువకు చేరి గోదావరి నది ప్రాంతంలో ఆవుదూడను చంపి నీరు తీగి వెళ్ళినట్లు చెబుతున్నారు. పులి మెడకు అమర్చిన రేడియో ఫ్రీక్వెన్సీ ట్రాకర్ ద్వారా పులి సంచరించే ప్రాంతాన్ని పరిశీలిస్తున్నారు. 8 ప్రాంతాల్లో ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు అటవీ శాఖ రేంజ్ అధికారి ఎస్కే వలీ తెలిపారు. గత వారం రోజులుగా పోలవరం మండలంలోని అభయారణ్య ప్రాంతంలో పులి సంచరిస్తూ ఇప్పటి వరకు 2 ఆవు దూడలపై దాడి చేసింది. ప్రాజెక్టు ప్రాంతంలో దూడపై దాడి -
నిబంధనలకు నీళ్లు
శనివారం శ్రీ 18 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026సాక్షి, భీమవరం: ఎండలు ముదురుతున్నాయి. ఒక పక్క గొంతెండుతుంటే ఉన్న నీరు ఎంత వరకు సురక్షితమనే సందేహం కలుగుతోంది. అడపాదడపా క్లోరినేషన్ మినహా గ్రామీణ ప్రాంతాల్లో చాలాచోట్ల ట్యాంకులు సరిగా క్లీనింగ్కు నోచుకోని పరిస్థితి. వీటికి తోడు పైప్లైన్ లీకేజీలు రక్షిత నీటిని కలుషితం చేస్తున్నాయి. ఎప్పటికప్పుడు గ్రామాల్లోని ఓవర్హెడ్ ట్యాంకులు, తాగునీటి చేతిపంపులు, తాగునీటి బావుల్లో నీటిని పరీక్షించి లోపాలు ఉంటే అవసరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంది. అవసరాన్ని బట్టి 15 రోజులకు, నెలరోజులకోసారి పరీక్షలు చేయాలి. ఈ రక్షిత నీటి పరీక్షలు ఏ మేరకు జరుగుతున్నాయనేది ప్రశ్నార్ధకమే. జిల్లాలోని 16 మండలాలు పరిధిలో 862 గ్రామాలను కలుపుతూ రూ.1400 కోట్లతో చేపట్టిన జలజీవన్ మిషన్ ఫేజ్–1 పనులు నత్తనడకన సాగుతున్నాయి. 55 క్లియర్ వాటర్ సంపులు, 40 ఓహెచ్బీఆర్ఎస్, 69 ఓహెచ్ఆర్ఎస్లు నిర్మాణం చేపట్టాల్సి ఉండగా 17 ఓహెచ్ఆర్ఎస్ వివిధ దశల్లో నిర్మాణాల్లో ఉన్నాయి. పుట్టగొడుగుల్లా ప్లాంట్లు పంచాయతీలు, మున్సిపాల్టీలు సరఫరా చేస్తున్న రక్షిత నీరు కలుషితమవుతుండటం, శివారు ప్రాంతాలకు తాగునీటి ఎద్దడితో మినరల్ వాటర్ వినియోగిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. జిల్లా వ్యాప్తంగా రివర్స్ అస్మోసిస్ (ఆర్ఓ) ప్లాంట్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. ఐఎస్ఐ సర్టిఫికెట్ ప్లాంటు పెట్టాలంటే గ్రౌండ్ వాటర్, ఫుడ్, జీఎస్టీ, లేబర్, ఐఎస్ఐ, నో అబ్జక్షన్, కమర్షియల్ తదితర పది వరకు లైసెన్సులు ఉండాలి. ల్యాబ్, ప్లాంట్ సామాగ్రి, అనుమతులు తదితర వాటికి రూ.50 లక్షలకు పైనే ఖర్చవుతుంది. రూ. రెండు నుంచి మూడు లక్షలతో పెట్టిన ప్లాంట్లు ఐఎస్ఐ పేరిట చలామణి చేసేస్తున్నారు. గ్రామాల్లో రెండు నుంచి ఐదు వరకు ఆర్ఓ ప్లాంట్లు ఉండగా, పట్టణాల్లో పదుల సంఖ్యలో ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా 700లకు పైనే మినరల్ వాటర్ ప్లాంట్లు ఉన్నట్టు అంచనా. ఐఎస్ఐ ధృవీకరణ కలిగిన మినరల్ వాటర్ ప్లాంట్లలో ఓజేనేషన్ సిస్టమ్ తప్పనిసరి. అధికశాతం ప్లాంట్లలో కేవలం ఆర్ఓ టెక్నాలజి ద్వారా నీటిలోని మలినాలను మాత్రమే శుద్ది చేస్తున్నారు. కొన్నిచోట్ల బ్యాక్టీరియాను శుద్ది చేసే యూవీ సిస్టమ్ లేదని తెలుస్తోంది. క్రమం తప్పకుండా పిల్టర్లు శుభ్రం చేయడం, నీటిలోని రంగు, ఐరెన్, హార్డ్నెస్, కాల్షియం, ఫ్లోరైడ్, మెగ్నీషియం, సల్ఫేట్ తదితర వాటి శాతం పరీక్షించే పరీక్షలు క్రమం తప్పకుండా చేస్తున్న దాఖలాలు అంతంతమాత్రమే. కొందరు వ్యాపారులు కనీస ప్రమాణాలు పాటించకుండా బాట్లింగ్ చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. మరోపక్క వాటర్ ప్యాకెట్లు ప్యాకింగ్ కోసం నిర్ణీత మందం కన్నా పల్చటి కవర్లు వినియోగిస్తున్నారు. దీనివలన పర్యావరణానికి హాని కలగడంతో పాటు ఎండ తీవ్రతకు కవర్లోని నీరు వేడెక్కి కెమికల్స్ నీటిలోకి చేరడం వలన ప్రజారోగ్యానికి హాని కలుగుతుంది. తూతూమంత్రంగా నీటి పరీక్షలు ఆర్వో ప్లాంట్లపై అజమాయిషీ కరువు అధిక శాతం ప్లాంట్లలో కానరాని యూవీ సిస్టమ్ జిల్లాలో చాపకింద ‘నీరు’లా మినరల్ నీటి వ్యాపారం జిల్లాలో 700 ఆర్ఓ ప్లాంట్లు ‘కొద్దిరోజుల క్రితం పాలకొల్లు రూరల్ చిత్రాయి చెరువుగట్టు ఏరియాలో తాగునీరు కలుషితమై స్థానికులు 54 మంది చర్మ సంబంధిత సమస్యలకు గురైనట్టు అధికారులకు ఫిర్యాదు అందింది. అధికారయంత్రాంగం అప్రమత్తమై ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటుచేసి బాధితులకు వైద్యసేవలు అందించారు. వాటర్ ట్యాంకును క్లీన్ చేసి తాగునీటి సరఫరాలోని లోపాలను సరిచేశారు. జిల్లాలోని రక్షిత నీటి ట్యాంకులు, పైప్లైన్ లీకేజీలను పరిశీలించి సత్వర చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సీహెచ్ నాగరాణి ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీ అధికారులను ఆదేశించారు’.గ్రామీణ ప్రాంతాల్లో 20 లీటర్లు రూ. 5 నుంచి రూ. 20 వరకు, కూలింగ్ వాటర్ రూ.30కి అమ్మకాలు చేస్తుండగా, పట్టణ ప్రాంతాల్లో ఈ ధరలు మరింత ఎక్కువగా ఉంటున్నాయి. ఇళ్లకు చేరవేస్తే రవాణ చార్జీలు అదనం. ప్లాంట్లలో నీటిని వాటర్ ప్యాకెట్లుగా, బాటిళ్లుగా ప్యాకింగ్ చేసి పాన్షాపుల ద్వారా అమ్మకాలు చేస్తున్నారు. సాధారణ ప్లాంట్లలో రోజుకు రెండు లక్షలు చొప్పున జిల్లా వ్యాప్తంగా రూ. కోటికి పైనే అమ్మకాలు జరుగుతాయని అంచనా. భారీ ఎత్తున జిల్లాలో మినరల్ నీటి అమ్మకాలు జరుగుతున్నా నీటి నాణ్యతను పరిశీలించే దిశగా స్థానిక సంస్థలు కనీసం శాంపిల్స్ కూడా సేకరించడం లేదన్న విమర్శలున్నాయి. ప్రజలకు నాణ్యమైన నీటి సరఫరా చేసేందుకు అధికారయంత్రాంగం చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. -
ఉపాధి కూలీలకు ఫేస్ యాప్ రద్దు చేయాలి
తణుకు అర్బన్: ఉపాధి హామీ పనుల్లో కొత్తగా తీసుకువచ్చిన ఫేస్యాప్ను తక్షణమే రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు బళ్ళ చిన వీరభద్ర రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండలంలోని తేతలి గ్రామం కొండయ్య పాలెం రోడ్డులో పని చేస్తున్న ఉపాధి కూలీలను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వీరభద్ర రావు మాట్లాడుతూ ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఉపాధి పనులు చేస్తున్న కూలీలకు ముఖ గుర్తింపు హాజరు అమలు చేస్తున్న కారణంగా చాలా చోట్ల పని ప్రదేశాల్లో హాజరు నమోదు కాకపోవడంతో అత్యధిక మంది కూలీలు పని కోల్పోయి తిరిగి ఇంటికి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని స్పష్టం చేశారు. కూలీలు చేసిన పనికి ఇచ్చే నామమాత్రపు వేతనానికి రెండు పూటలా పని చేయాలని షరతులు విధించడం దుర్మార్గమని ఆయన మండిపడ్డారు. సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 20న విజయవాడ కమిషనర్ ఆఫీస్ వద్ద జరిగే ధర్నా కార్యక్రమంలో ఉపాధి కూలీలందరూ అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. భీమవరం: ఆకివీడు పెదపేట రామాలయం విషయంలో వివాదంపై శుక్రవారం బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) నాయకులు ఆకివీడు వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో భీమవరంలో భీమవరం డీఎస్పీ రఘువీర్ విష్ణు ఆధ్వర్యంలో సీఐలు నాగ రాజు, కాళీచరణ్, శ్రీనివాస్, ఎస్సై రామారావు, కిరణ్ కుమార్తో పాటు పోలీసులు పెద్ద ఎత్తున మోహరించి వారిని అడ్డుకున్నారు. ఆకివీడులో 144 సెక్షన్ అమలులో ఉందని, అక్కడికి ఎవరూ వెళ్లవద్దని సూచించడంతో బహుజన సమాజ్ పార్టీ నాయకులు భీమవరంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు గౌతమ్ కుమార్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చాక దళితులు, దళిత క్రిస్టియన్లపై దాడులు పెరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. -
చిన్న వెంకన్న ఆలయ గోపురాలు శుభ్రం
ద్వారకాతిరుమల: శ్రీవారి ఆలయ గోపురాలపై మొలి చిన మొక్కల తొలగింపునకు అధికారులు శుక్రవారం చర్యలు చేపట్టారు. రావి, మర్రి మొక్కలతో ఆలయ రాజగోపురాలు కళావిహీనంగా దర్శనమిస్తున్నాయని, శిల్ప సంపద ధ్వంసం కావడానికి కారణం అవుతు న్నాయని సాక్షి దినపత్రికలో శుక్రవారం ‘మొక్క’వోని నిర్లక్ష్యం శీర్షికన కథనం ప్రచురితమైంది. దీనికి స్పందించిన అధికారులు గోపురాలపై ఉన్న మొక్కల తొలగింపు పనులు చేప ట్టారు. తొలిరోజు ఈ పనులు ముందుకు సాగలేదు. ప్రధాన(దక్షిణ) రాజగోపురానికి నిచ్చెన వేసుకుని మొక్కలు తొలగించడం సిబ్బందికి సాధ్యం కాకపోవడమే ఇందుకు కారణం. -
అభయారణ్యంలోనే పెద్దపులి
చోరీ కేసుల్లో ఇద్దరి అరెస్టు రెండు వేర్వేరు చోరీ కేసుల్లో ఇద్దరిని అరెస్టు చేసినట్లు జంగారెడ్డిగూడెం ఏఎస్పీ సుస్మిత రామనాథన్ తెలిపారు. నిందితుల నుంచి చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నారు. 2లో uపోలవరం రూరల్: పోలవరం ప్రాజెక్టు ముంపు గ్రామమైన చేగొండిపల్లి సమీపంలోని రిజర్వు అటవీ ప్రాంతంలోకి పెద్ద పులి చేరింది. కొత్తూరు, గుంజవరం, మెత్తాపుకోట, చేగొండిపల్లి గ్రామాల పరిధి లోని అభయారణ్య ప్రాంతంలో కదలికలు సాగిస్తోంది. గత ఐదు రోజులుగా పులి కదలికలపై ఎప్పటికప్పుడు ప్రత్యేక సిబ్బందితో నిఘా పెట్టి అడుగు జాడలను గుర్తిస్తున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పెద్దపులిని పట్టుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు అటవీశాఖాధికారి ఎస్కే వలీ పేర్కొన్నారు. పులులు సంరక్షణ కేంద్రం నుంచి వచ్చిన సిబ్బందితో పాటు ట్రాన్క్విలైజర్ గన్మెన్లు, రెస్క్యూ బృందాలతో పాటు, ప్రాజెక్టు ప్రాంతంలో స్పెషల్ ఫోర్స్తో పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు. పులికి అమర్చిన రేడియో ట్రాకర్ ద్వారా కదలికలను గుర్తిస్తున్నారు. శుక్రవారం ప్రాజెక్టు సమీప ప్రాంతంలో కనిపించినట్లు వచ్చిన సమాచారం మేరకు అటవీశాఖ ప్రత్యేక టాస్క్ఫోర్స్ సిబ్బందితో వెళ్లింది. ఒకవేళ మైదాన ప్రాంతానికి చేరుకుంటే పులిని పట్టుకునేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. -
కేవీకే ఉత్పత్తులకు కేంద్రం పేటెంట్లు
తాడేపల్లిగూడెం: డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యానవన వర్శిటీ పరిధిలోని పశ్చిమగోదావరి జిల్లా వెంకట్రామన్నగూడెంలోని కృషి విజ్ఞాన కేంద్రం ఉత్పత్తులు తేనెపట్టు, మైనం ఆధారిత ఉత్పత్తులకు ఉద్యాన కళాశాలకు కేంద్రం మూడు పేటెంట్లు జారీ చేసింది. ఈ మేరకు కేంద్ర వాణిజ్య మంత్రిత్వశాఖ, భారత ప్రభుత్వం పరిధిలోని ఇండియన్ పేటెంట్ ఆఫీసు మూడు పేటెంట్లు జారీ చేసింది. ఈ విషయాన్ని ఉద్యానవన వర్సిటీ వీసీ కె.ధనుంజయరావు శుక్రవారం స్థానిక విలేకరులకు తెలిపారు. వీఆర్గూడెం ఉద్యాన కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ ఎన్,ఇమ్మానుయేల్ ఆధ్వర్యంలో హర్టీకల్చర్ బీఎస్సీ చివరి సంవత్సరం విద్యార్థులు ఎక్స్పీరియెన్షియల్ లెర్నింగ్ ప్రోగ్రామ్లో భాగంగా తేనెపట్టు, మైనం ఆధారంగా రూపొందించిన తేనెపట్టు పెయిన్బామ్, తేనెపట్టు మైనం దోమల నివారణ క్రీమ్, తేనెపట్టు మైనం మాయిశ్చరైజింగ్ క్రీమ్ మూడు వినూత్న ఉత్పత్తులు ఈ పేటెంట్ సాధించాయి. కార్యక్రమంలో అసోసియేట్ డీన్ ఎన్బీవి.చలపతిరావు ,డీన్ ఆఫ్ హార్టీకల్చర్ డాక్టర్ ప్రసన్నకుమార్, వర్సిటీ రిజిస్ట్రార్ ఎం.మాధవి, పరిఽశోధనా సంచాలకులు ఎం.రామానందం తదితరులు పాల్గొన్నారు. -
జనసేన వర్సెస్ టీడీపీ
సాక్షి టాస్క్ఫోర్స్: ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగుల నుంచి కోట్లు దోచేసిన మోసగాళ్ల వ్యవహారం కాస్తా కూటమిలో కుంపట్లు రేపింది. ఉద్యోగాలకు నియామక పత్రాలు, సిఫార్సు లేఖలు, శిక్షణ తరగతులంటూ హల్చల్ చేస్తున్న లేఖలు బయటకు రావడంతో నిగ్గు తేల్చాలని ఒకరంటే, మాకేమీ సంబంధం లేదని మరొకరు పోలీసులకు చెప్పడం సంచలనంగా మారింది. నిరుద్యోగులకు ఉద్యోగాల ఎర చూపించి కోట్లు గుంజేయడమే కాకుండా ఉప ముఖ్య మంత్రి పవన్ కల్యాణ్ పేరుమీద ఫేక్ లెటర్ సృష్టించడాన్ని జనసేన నాయకులు తీవ్రంగా వ్యతిరేకించారు. తక్షణమే మోసగాళ్లను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలంటూ రెండు రోజుల వ్యవధిలో జనసేన నాయకులు తణుకు పట్టణ పోలీస్ స్టేషన్, అత్తిలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. శుక్రవారం ఆరవల్లి టీడీపీ నాయకులు అత్తిలి పోలీస్ స్టేషన్కు వచ్చి ఉద్యోగాలు ఇస్తామని లక్షలు వసూలు చేశారంటూ మాపై అసత్య ప్రచారం చేశారని, టీడీపీ నాయకుల ప్రమేయం లేదని పోలీసులు విచారణ చేసి అసలైన దోషులను పట్టుకోవాలంటూ ఫిర్యాదు చేశారు. సుమారుగా రూ.3 కోట్ల వ్యవహారంలో 50 మంది వరకు ఉన్న బాధితులు ఒక్కరూ కూడా బయటకు రాకపోవడంతో సదరు మోసగాళ్లు బాధితులను తమ గుప్పిట్లో పెట్టుకున్నట్లుగా తెలుస్తోంది. మార్మోగుతున్న ఆరవల్లి పేరు తాజాగా అత్తిలి మండలం ఆరవల్లికి చెందిన ఒక యువతి పేరుమీద ఉద్యోగానికి సంబంధించి అధికారులు, మంత్రుల పేరిట నకిలీ సిఫార్సు లేఖలు బయటకు రావడంతో సదరు యువతి సైతం శుక్రవారం బయటకు వచ్చి తాను ఉద్యోగం కోసం ఎవరినీ కలువలేదని, ఎలాంటి డబ్బు ఇవ్వలేదని చెప్పడం చర్చనీయాంశంగా మారింది. ఉద్యోగాల పేరిట డబ్బులు వసూలు చేసిన వారిని పట్టుకోవాలని, ఫేక్ లెటర్స్ వ్యవహారం తేల్చాలని నియోజకవర్గ పరిధిలోని జనసేన పార్టీ ప్రధాన నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఈ వ్యవహారంలో ఎలాంటి సంబంధం లేదని ఆరవల్లి టీడీపీ నాయకులు చెప్పడం వంటి పరిణామాలు కూటమిలో విభేదాలకు ఆజ్యం పోశాయి. నిగ్గు తేలేదెలా? ఈ వ్యవహారంలో మోసపోయామని చెప్పాల్సిన బాధితులు ముందుకు రాకపోవడం, కూటమి నాయకులు ఒకరి తరువాత మరొకరు నిజం నిగ్గుతేల్చాలని పోలీసులకు ఫిర్యాదు చేయడం వంటి పరిణామాలు ప్రజల్లో చర్చకు దారితీస్తున్నాయి. ఇప్పటికే ఆరవల్లి గ్రామంలోని వైఎస్సార్ కాలనీలో (ఇందిరమ్మ కాలనీ) ఫ్యాన్లు తిరగడంలేదని, లైట్లు సరిగా వెలగడం లేదంటూ మెరుగైన ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటుకోసం ఏసీ ఉన్న ఇంటి నుంచి రూ.1500, ఏసీ లేని ఇంటి నుంచి రూ.300 చొప్పున డబ్బులు వసూలు చేసిన విషయం తెలిసిందే. ఈ సమస్యకు సంబంధించి ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటులో టీడీపీ నేతల చేతివాటం శీర్షికన సాక్షిలో ప్రచురితమైన కథనంతో టీడీపీ నాయకులు పంచాయితీ చేసి తిరిగి ఎవరి డబ్బు వారి ఇళ్లకు పంపించారు. ఈ వ్యవహారంతో ఆరవల్లి టీడీపీ నాయకుల పరువు దిగజారడం ఆపై తాజాగా ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను మోసం చేసిన వ్యవహారం ఆరవల్లి చుట్టూ తిరగడంతో గ్రామస్తులు సైతం తలపట్టుకుంటున్నారు. తణుకు నియోజకవర్గంలో హీటెక్కిన కొలువుల భాగోతం నిరుద్యోగులను మోసం చేసిన వారిని శిక్షించాలని జనసేన డిమాండ్ మాకు సంబంధం లేదంటున్న ఆరవల్లి టీడీపీ నాయకులు -
పెద్దవాగు ప్రాజెక్టుపై నిర్లక్ష్యం తగదు
వేలేరుపాడు: పెద్దవాగు ప్రాజెక్టు పునర్నిర్మాణానికి రూ.500 కోట్లు కేటాయించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీపీఐ ఏలూరు జిల్లా సమితి ఆధ్వర్యంలో శుక్రవారం తెలంగాణలోని అశ్వారావుపేట మండలం గుమ్మడివల్లి సమీపంలో పెద్దవాగు ప్రాజెక్టు నుంచి వేలేరుపాడు మండల తహసీల్దార్ కార్యాలయం వరకు 21 కిలోమీటర్ల పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఈశ్వరయ్య మాట్లాడుతూ వేలాది ఎకరాల పంటలు ఎండిపోతున్నా, వేలాది కుటుంబాలు దాహానికి అల్లాడిపోతున్నా, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తున్నారన్నారు. ఏడు మండలాలను పట్టించుకోవాలి రాష్ట్ర విభజన సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో 7 మండలాలను ఆంధ్ర రాష్ట్రంలో కలుపుకున్న పాలకులకు వారి బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యత లేదా..? ప్రశ్నించారు. ప్రాజెక్టు మరమ్మతులు చేపట్టాలని కోరుతూ ప్రభుత్వ కార్యాలయాలు, ప్రజా ప్రతినిధులు చుట్టూ తిరుగుతూ రెండు సంవత్సరాలుగా కుక్కునూరు, వేలేరుపాడు మండలాల ప్రజలు గగ్గోలు పెడుతున్నా కూటమి ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉందన్నారు. ప్రాజెక్టు ఆవశ్యకత తెలిసి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. కార్యక్రమంలో జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ, ఏలూరు జిల్లా కార్యదర్శి మన్నవ చైతన్య, భద్రాద్రి, కొత్తగూడెం జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా, ఆంధ్రప్రదేశ్ గిరిజన సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు కారం దారయ్య తదితరులు పాల్గొన్నారు. -
గ్రీన్ఫీల్డ్ హైవేపై రోడ్డు ప్రమాదం
టి.నరసాపురం: గ్రీన్ఫీల్డ్ హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తికి గాయాలయ్యాయి. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. శుక్రవారం గ్రీన్ఫీల్డ్ హైవేపై వెళ్తున్న లారీకి డీజిల్ అయిపోవడంతో మండలంలోని శ్రీరామవరం సమీపంలో అకస్మాత్తుగా ఆగిపోయింది. లారీ ఒక్కసారిగా ఆగిపోవడంతో వెనుక వేగంగా వస్తున్న లారీ ఆగిన లారీ వెనుక భాగంలో ఢీకొంది. ఆ వెనుకే వస్తున్న మరో లారీ ముందు లారీని ఢీకొంది. ఈ ప్రమాదంలో చివరిగా ఢీకొన్న లారీలోని డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. జంగారెడ్డిగూడెం: జంగారెడ్డిగూడెం అటవీశాఖ లాగింగ్ రేంజ్ ఎఫ్ఎస్వో నాగ వాసునాయుడు అంతర్జాతీయ స్థాయిలో తన ప్రతిభను మరోసారి చాటారు. శుక్రవారం థాయ్లాండ్లో జరిగిన వరల్డ్ మాస్టర్స్ గేమ్స్ ఛాంపియన్షిప్లో 5 కిలోమీటర్ల రేస్ వాక్లో విజేతగా నిలిచారు. ఆయనకు అటవీ శాఖ అధికారులు, నాయకులు అభినందనలు తెలిపారు. కుక్కునూరు: ఇసుకను తీసుకెళుతున్న లారీల నుంచి ఇసుక రోడ్డుపై పడి వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ దాచారం గ్రామస్తులు శుక్రవారం ఇసుక లారీలను అడ్డుకున్నారు. శుక్రవారం ఉదయం నుంచి లారీల్లో ఇసుక రోడ్డుపై పడుతుందని, గ్రామాల్లో లారీలను నెమ్మదిగా నడపాలని గ్రామస్తులు లారీ డ్రైవర్లకు చెప్పినా వినకుండా వేగంగా నడపడంతో రోడ్డుపై ఇసుక పడి ద్విచక్ర వాహనదారులు ఇద్దరు ప్రమాదాలకు గురవడంతో ఆగ్రహించిన గ్రామస్తులు తమ రహదారి గుండా ఇసుక లారీలను నడవనివ్వమని అడ్డుకున్నారు. దీంతో లారీ యజమానులు ఈ సారి అటువంటి పొరబాటు జరగకుండా చూసుకుంటామని హామీ ఇవ్వడంతో లారీలను వదిలిపెట్టారు. ఉండి: తలనొప్పి తట్టుకోలేక ఓ మహిళ ఆత్యహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఉండి గ్రామానికి చెందిన గోడి సురేఖ(29)కు సుమారు 15 ఏళ్లుగా మైగ్రేన్ తలనొప్పితో బాధపడుతుంది. అయితే ఆసుపత్రిలో చూపించుకోకుండా ట్యాబ్లెట్స్ వేసుకుంటుంది.అయితే ఈ నెల 16న, గురువారం ఉదయం 11 గంటల సమయంలో తలనొప్పి విపరీతంగా రావడంతో దానిని తట్టుకోలేక మజ్జిగలో ఎలుకల మందు కలిపుకుని తాగింది. కొద్దిసేపటికి ఆమెకు కళ్లు తిరుగుతున్నట్లు ఉండడంతో పరిస్థితిని గమనించిన ఆమె భర్త ఆరా తీయగా తాను ఎలుకలమందు తాగినట్లు చెప్పింది. దీంతో హుటాహుటిన ఆమెను భీమవరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. అయితే మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం విజయవాడకు తరలించారు.అక్కడ చికిత్స పొందుతున్న ఆమె పరిస్థితి విషమించడంతో శుక్రవారం ఉదయం మృతి చెందిందిం. ఈ మేరకు మృతురాలి చెల్లెలు దిడ్ల రమ్య ఫిర్యాదుతో హెడ్ కానిస్టేబుల్ ఏసయ్య కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. భీమవరం (ప్రకాశంచౌక్): జిల్లాలో స్వమిత్వ సర్వే పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి సూచించారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి శుక్రవారం ఆర్డీఓలు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, మండల సర్వేయర్లతో స్వమిత్వ, యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే, ఈ–కేవైసీ తదితర అంశాలపై మండలాల వారీగా ప్రగతిని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఇంకా పూర్తి చేయాల్సిన స్వమిత్వ సర్వే పనులను తక్షణమే ప్రారంభించి వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు. ఎంపీడీఓలు క్షేత్రస్థాయిలో పనులను నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. -
ఊపందుకోని దాళ్వా మాసూళ్లు
● మూడో పంటకు అవకాశం లేక రైతుల ఆందోళన ● జిల్లాలో 2.35 లక్షల ఎకరాల్లో దాళ్వా సాగు భీమవరం: ధాన్యాగారంగా పేరొందిన జిల్లాలో దాళ్వా మాసూళ్లు ఇంకా ఊపందుకోలేదు. దీంతో ప్రతి ఏటా మూడవ పంటగా వేసే పైరు పంటలు చేతికి వచ్చే అవకాశంలేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయమే జీవనాధారమైన జిల్లాలోని 20 మండలాల్లో దాదాపు 2.35 లక్షల ఎకరాల్లో వరిసాగు చేస్తున్నారు. ప్రతిఏటా సార్వా, దాళ్వా వరి పంటతో పాటు దాళ్వా మాసూళ్లు అనంతరం మూడో పంటగా మినుము, పెసర, మొక్కజొన్న, నువ్వులు వంటి పంటలతోపాటు పశుగ్రాసంగా పిల్లిపెసర, జనుము వంటి పంటలను పండించేవారు. అయితే ఈ ఏడాది దాళ్వానాట్లు ఆలస్యం కావడంతో ఇప్పుడిప్పుడే మాసూళ్లు ప్రారంభమయ్యాయి. ఈ నెలాఖరుకుగానీ మాసూళ్లు ఊపందుకునే పరిస్థితి కన్పించడం లేదు. ఈనెల 20వ తేదిన కాలువలకు నీటి సరఫరా నిలుపుదల చేయనుండడంతో చేలల్లో పదునులేక పైరు, పశుగ్రాసం పంటలు వేసుకునే అవకాశం లేకుండా పోతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 10 శాతమే వరి కోతలు పూర్తి జిల్లా వ్యాప్తంగా 2.35 ఎకరాల్లో రైతులు ఎక్కువగా ఎంటీయూ 1121, పీఆర్ 126 వంటి వరి రకాలను పండిస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలోని తాడేపల్లిగూడెం, పెంటపాడు, తణుకు, గణపవరం ప్రాంతాల్లో పంట మాసూళ్లు ముమ్మరంగా సాగుతుండగా మిగిలిన ప్రాంతాల్లో ఇప్పుడిప్పుడే మాసూళ్లు ప్రారంభమయ్యాయి. ఎకరాకు 50 బస్తాల ధాన్యం దిగుబడి వస్తున్నందున జిల్లాలో సుమారు 9.5 లక్షట మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని దానిలో 7.75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకుంది. మూడో పంటకు విరామం దాళ్వా వరి పంట పెట్టుబడులు పెరగడంతోపాటు రైతులకు ఎంతో కొంత ఆదాయం వచ్చే మూడో పంటకు అవకాశం లేకపోవడంతో దాళ్వాలో నష్టాలు తప్పవని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
అధ్యాపకుల చిల్లర వేషాలు
నూజివీడు: విద్యాబుద్ధులు నేర్పాల్సిన అధ్యాపకులు విద్యార్థినులతో అనుచితంగా ప్రవర్తించిన వ్యవహారంలో ప్రేమ కవితలు పంపడం తాజాగా బయటపడింది. నూజివీడు ట్రిపుల్ ఐటీలో విద్యార్థునులతో అనుచితంగా వ్యవహరించిన ముగ్గురు అధ్యాపకుల్లో ఓ అధ్యాపకుడు పీయూసీ విద్యార్థినికి వాట్సాప్లో పంపిన కవిత వెలుగుచూసింది. ఇలా ముగ్గురు అధ్యాపకులు పీయూసీకి చెందిన ముగ్గురు విద్యార్థునులతో నిర్వహించిన ప్రేమ కవితల పాఠాలు చూసి ప్రతిఒక్కరూ ముక్కున వేలేసుకుంటున్నారు. అందాన్ని పొగడటం, మార్కులు వేస్తామంటూ ప్రలోభపెట్టడం, ఆపై లొంగదీసుకోవడం.. ఇవీ ట్రిపుల్ఐటీ ఇంటర్నల్ కంప్లయింట్ కమిటీ (ఐసీసీ) నిర్వహించిన విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగు చూసినట్టు సమాచారం. విచారణ నివేదిక సమర్పణ విద్యార్థినులపై అనుచితంగా వ్యవహరించిన ముగ్గురు అధ్యాపకులపై నియమించిన ఇంటర్నల్ కంప్లయింట్ కమిటీ విచారణ నిర్వహించి, తమ నివేదికను ఈనెల 15న ట్రిపుల్ఐటీ డైరెక్టర్ ఆచార్య ఎస్ఎస్ఎస్వీ గోపాలరాజు ద్వారా చాన్సలర్ ఆచార్య కొత్తా మధుమూర్తికి పంపారు. ఈ నివేదికను పరిశీలించిన అనంతరం ఆ ముగ్గురిపై చర్యలు తీసుకోనున్నారు. అయితే కమిటీ నిర్వహించిన విచారణలో అనేక విషయాలు కమిటీ దృష్టికి వచ్చినట్టు సమాచారం. తమకు లొంగిన విద్యార్థినులకు అనేక విధాలుగా ముగ్గురు అధ్యాపకులు సాయపడుతున్నట్టు తెలిసింది. ఐటీ మెంటార్, ఇంగ్లిష్, కెమిస్ట్రీ అధ్యాపకులుండగా విద్యార్థినులకు మార్కులు ఎక్కువ వేయడం, పరీక్షకు హాజరు కాకపోయినా మార్కులు వేసేవారని ప్రచారం సాగుతోంది. ఒక సెక్షన్ విద్యార్థులకు ఎక్కువ మార్కులు వస్తుండటంతో మరో సెక్షన్ విద్యార్థులు తమకు తక్కువ మార్కులు వేస్తున్నారని వారికి బోధించే అధ్యాపకులపై, మెంటార్లపై ఒత్తిడి చేసేవారు. బయటపడిందిలా.. పీయూసీకి బోధించే ఒక మెంటార్ తరగతి గదిలో విద్యార్థినులతో ఒంటరిగా జీవించే మహిళలపై, భర్త లేని మహిళలపై అసభ్యకరంగా మాట్లాడుతుండటంతో ఒక విద్యార్థిని తమ హాస్టల్ రూమ్ వద్దకు వచ్చిన డీఎస్డబ్ల్యూఓకు ఆ విషయాన్ని తెలియజేసింది. అంతేగాకుండా అదే రూమ్లో ఉండే తోటి విద్యార్థినితో చేస్తున్న వాట్సాప్ చాటింగ్ గురించి సైతం తెలిపింది. దీంతో డీఎస్డబ్ల్యూఓ, చీఫ్ వార్డెన్ (బాలికలు) కలిసి ఫోన్ను తీసుకుని పరిశీలించగా అనుచితంగా చేసిన చాటింగ్ బయటపడింది. దీంతో మరో ఇద్దరు విద్యార్థినులతో మరో ఇద్దరు అధ్యాపకులు సైతం ఇలాగే చాటింగ్ చేసిన వ్యవహారం వెలుగు చూసింది. దీంతో ఆ విద్యార్థినులు దీనిపై డైరెక్టర్కు ఫిర్యాదు చేయగా విచారణ కమిటీని నియమించారు. విచారణ కమిటీ మరింత లోతుగా విచారించడంతో అనేక విషయాలు వెలుగుచూశాయి. తమ బండారం బయటపడటంతో ఈ ముగ్గురు అధ్యాపకులు తమ కాంట్రాక్టు ఉద్యోగాలకు రాజీనామా చేసి క్యాంపస్ నుంచి వెళ్లిపోయారు. అలాగే ట్రిపుల్ఐటీ అధికారులు కూడా వారిని సస్పెండ్ చేశారు. ఈ ముగ్గురిలో ఒకరు నాలుగేళ్ల క్రితం హౌస్ కీపింగ్, సెక్యూరిటీ సిబ్బంది హాజరు నమోదులో అవకతవకలకు పాల్పడి ఆరు నెలల పాటు సస్పెండ్కు గురయ్యాడు. అయినా తన ప్రవర్తనలో మార్పు తెచ్చుకోకుండా ఇప్పుడు విద్యార్థినుల పట్ల అనుచితంగా ప్రవర్తించి దొరికిపోయాడు. ఈ పరిస్థితుల్లో ట్రిపుల్ఐటీ యాజమాన్యం ఏమి చర్యలు చేపడుతుందోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రేమ కవితలతో విద్యార్థినులతో చాటింగ్ మార్కులు ఎక్కువ వేస్తూ ప్రలోభాలు నూజివీడు ట్రిపుల్ ఐటీలో ముగ్గురు అధ్యాపకుల నిర్వాకం -
ఉద్యోగులను ప్రభుత్వం పట్టించుకోవాలి
● పేరుకుపోయిన బకాయిలు తక్షణం చెల్లించాలి ● వైఎస్సార్సీపీ ఎంప్లాయీస్, పెన్షనర్స్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్రెడ్డి బోట్క్లబ్ (కాకినాడ సిటీ): తాము అధికారంలోకి వస్తే ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు బకాయిలు పూర్తిగా చెల్లిస్తామన్న హామీని చంద్రబాబు ప్రభుత్వం గాలిలో కలిపేసిందని వైఎస్సార్సీపీ ఎంప్లాయీస్, పెన్షనర్స్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు నల్లమర్రు చంద్రశేఖర్రెడ్డి మండిపడ్డారు. కాకినాడ వైఎస్సార్ సీపీ కార్యాలయంలో వైఎస్సార్ సీపీ ఎంప్లాయీస్, పెన్షనర్స్ విభాగం రీజనల్ సమావేశం శుక్రవారం నిర్వహించారు. బకాయిలు ఏటా కొండలా పేరుకుపోతున్నాయని, రూ.30 వేల కోట్లకు రూ.7,900 కోట్లు మాత్రమే ఇచ్చారని, అవికూడా పూర్తిస్థాయిలో చెల్లించకుండా కాలయాపన చేస్తున్నారన్నారు. ఉద్యోగ విరమణ చేసిన ఉద్యోగులు ప్రయోజనాలు అందక వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయన్నారు. పెండింగ్ డీఏలు ఎప్పుడిస్తారు? చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగు డీఏలు పెండింగ్ పెట్టిందని, అవి ఎప్పుడు ఇస్తుందో చెప్పాలని చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. కార్పొరేట్ ఆస్పత్రులకు బకాయిలు పేరుకుపోవడంతో హెల్త్కార్డులు నిరుపయోగంగా మారిపోయాయన్నారు. కొంత మంది లక్షలాది రూపాయలు చెల్లించి వైద్యం చేయించుకోలేక.. ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ సచివాలయ ఉద్యోగులతో వెట్టి చాకిరీ చేయించడం వల్ల సుమారు 250 మంది వరకు చనిపోయారని ఆందోళన వ్యక్తం చేశారు. పదవీ విరమణ చేసిన అధికారిని అదే శాఖలో అదే పోస్టులో ఉంచడం వల్ల చాలా మంది ఉద్యోగుల పదోన్నతులు నిలిచిపోతున్నాయన్నారు. ఒకటో తేదీన ఎప్పుడైనా జీతం ఇచ్చావా..? ఉద్యోగులుకు, పెన్షనర్స్కు ఒకటో తేదీన జీతాలు ఇస్తానని చెప్పిన చంద్రబాబు ఈ 22 నెలల్లో ఎవరికై నా ఒకటో తేదీన జీతం ఇచ్చారా అని నిలదీశారు. వెంటనే పీఆర్సీ కమిషన్ వేయాలని, ఉద్యోగులకు ఐఆర్, పీఆర్సీ ఇవ్వాలన్నారు. సీపీఎస్ రద్దు చేస్తానని హామీ ఇచ్చి ఈ దశగా ఒక్క సమావేశం కూడా నిర్వహించలేదన్నారు. అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులకు ప్రభుత్వ పథకాలు అమలు చేయాలన్నారు. పెన్షన్ కార్పొరేషన్ ఊసే లేదన్నారు. జగన్మోహన్రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రి చేసుకోవడమే లక్ష్యంగా అందరూ పనిచేయాలని పార్టీ నాయకులను ఆయన కోరారు. వైఎస్సార్ సీపీ ఎంప్లాయీస్, పెన్షనర్స్ విభాగం రాష్ట్ర సెక్రటరీ శివారెడ్డి, జాయింట్ సెక్రటరీ చిలకమర్తి సాయి ప్రసాద్, ఉభయగోదావరి జిల్లాల కో–ఆర్డినేటర్ లావణ్య పాల్గొన్నారు. -
జాతరలో ఘర్షణ.. వృద్ధుడి మృతి
యలమంచిలి: ప్రశాంతంగా ఉండే గోదావరి తీరంలో కొందరి అల్లరిమూకలు మత్తు పదార్థాలు తీసుకుని చేసిన అల్లరి వల్ల దేవరపు వీరాస్వామి (75) అనే వృద్ధుడు మృతి చెందాడు. వివరాల ప్రకారం బూరుగుపల్లి గ్రామ దేవతలు బూరుగులమ్మ, మారెమ్మ, నూకాలమ్మ అమ్మవార్ల జాతర గురువారం రాత్రి చేశారు. ఈ జాతరలో ఇరు వర్గాల మధ్య తలెత్తిన వివాదం ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. ఒకే సామాజిక వర్గానికి చెందిన బోనం శ్రీరామకృష్ణ, బోనం గణేష్ల మధ్య వ్యక్తిగత వివాదాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో గణేష్ భీమవరం ప్రాంతం నుంచి కొంతమంది రౌడీషీటర్లను తీసుకుని జాతరలో గొడవలు సృష్టించడానికి ప్రయత్నం చేశాడు. జాతర ప్రారంభమవుతున్న సమయంలో రోడ్డుపై కార్లు నిలపడంతో స్థానికులు కారులు తీయాలని కోరారు. కారులు తీయకపోగా మత్తు పదార్థాలు తీసుకుని కారు పైకి ఎక్కి కొంత సమయం హల్చల్ చేశారు. దీంతో ఎస్సై కర్ణీడి గుర్రయ్య, పోలీసులు రంగప్రవేశం చేసి కారు తీయాలని చెప్పిన పట్టించుకోలేదు. పోలీసులు అక్కడ ఉండగానే ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. ఆ సమయంలో కారు డ్రైవర్ పలివెల భరత్ కారును మితిమీరిన వేగంతో నడిపి దేవరపు వీరాస్వామి(75)ని ఢీ కొట్టాడు. దీంతో గాయపడిన వీరాస్వామిని దొడ్డిపట్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లి ప్రథమ చికిత్స చేయించారు. వాహనంపై రాళ్లు రువ్విన వైనం వీరాస్వామిని మెరుగైన చికిత్స కోసం పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా తాడిమెరక వద్ద ఆసుపత్రికి వెళ్తున్న వాహనంపై రాళ్లు మద్యం సీసాలతో మరొకసారి దాడి చేశారు. ఆఖరికి దాడి నుంచి తప్పించి వీరాస్వామిని పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే అతను మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతుడు వీరాస్వామికి భార్య, కుమార్తె ఉన్నారు. పోలీసుల సమక్షంలో రాళ్లతో రువ్వుకోవడం, కారుతో ఢీ కొట్టడం, ఆసుపత్రికి తరలిస్తున్న వాహనంపై కూడా దాడి చేయడం వంటి ఘటన పూర్తిగా పోలీసుల వైఫల్యం వల్లే అని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై బోనం గణేష్తో పాటు మరో 14 మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ వీరిలో ఏడుగురిని అదుపులోకి తీసుకున్నట్లు పాలకొల్లు రూరల్ సీఐ గుత్తుల శ్రీనివాస్ తెలిపారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎస్సై కర్ణీడి గుర్రయ్యపై సస్పెన్షన్ విధిస్తూ ఎస్పీ నయీం అస్మీ ఆదేశాలిచ్చినట్లు ఆయన వివరించారు. -
రెండు వేర్వేరు చోరీ కేసుల్లో ఇద్దరి అరెస్టు
జంగారెడ్డిగూడెం: రెండు వేర్వేరు చోరీ కేసుల్లో ఇద్దరిని అరెస్టు చేసినట్లు జంగారెడ్డిగూడెం ఏఎస్పీ సుస్మిత రామనాథన్ తెలిపారు. జంగారెడ్డిగూడెం సర్కిల్ కార్యాలయంలో శుక్రవారం ఆమె చోరీకి సంబంధించిన వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ మండలంలోని కేతవరంలో ఓ ఇంట్లో జరిగిన చోరీకి సంబంధించి జంగారెడ్డిగూడెం పట్టణం వైఎస్సార్ కాలనీకి చెందిన ముగ్గళ్ల శ్రీనివాసరావు అనే వ్యక్తిని అరెస్టు చేసినట్లు చెప్పారు. అతన్ని నుంచి 102 గ్రాముల బంగారు వస్తువులు, రూ.12820 నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితుడు ముగ్గళ్ల శ్రీనివాసరావుపై జంగారెడ్డిగూడెం, లక్కవరం, ద్వారకాతిరుమల పోలీస్స్టేషన్లలో 20 కేసులు ఉండగా, జంగారెడ్డిగూడెం స్టేషన్లో సస్పెక్ట్ షీట్ కూడా ఉందన్నారు. అలాగే మోటార్ సైకిల్చోరీ కేసులో మరో వ్యక్తిని అరెస్టు చేసినట్లు ఆమె చెప్పారు. మండలంలోని మద్ది ఆంజనేయస్వామి ఆలయం వద్ద ఈ నెల 14న పార్క్ చేసి ఉంచిన తన మోటార్సైకిల్ చోరీకి గురైంది. దీనిపై బాధిడుతు ఫిర్యాదు చేయగా, విచారణ చేపట్టామన్నారు. విచారణలో భాగంగా తెలంగాణ రాష్ట్రం సత్తుపల్లి గ్రామానికి చెందిన షేక్ రహీమ్ అనే వ్యక్తి చోరీ చేసినట్లు తేలిందన్నారు. ఇతను ప్రస్తుతం చింతలపూడిలో నివాసం ఉంటున్నట్లు ఏఎస్పీ తెలిపారు. నిందితుడు రహీమ్ను విచారించగా, 6 మోటార్సైకిళ్లు, ఒక ఆటో చోరీ చేసినట్లు తెలిపాడన్నారు. లక్కవరం, జంగారెడ్డిగూడెం, ద్వారకాతిరుమల, తడికలపూడి పోలీస్స్టేషన్ల పరిదిలో 4 మోటార్ సైకిళ్ల, తెలంగాణ రాష్ట్రం అశ్శారావుపేటలో ఒక మోటార్సైకిల్, భద్రాచలం ఒక ఆటోను రహీమ్ చోరీ చేశాడన్నారు. మొత్తం ఈ వాహనాలన్నీ నిందితుడి వద్ద నుంచి రికవరీ చేశామన్నారు. కాగా, నిందితుడు రహీమ్ ద్వారకాతిరుమల మండలం తిమ్మాపురానికి చెందిన తిక్కిరెడ్డి శ్రీను వద్ద 3 మోటార్ సైకిళ్లు తాకట్టు పెట్టినట్లు తెలిపారు. దీంతో తాకట్టు పెట్టుకుని తిక్కిరెడ్డి శ్రీనుపై కూడా కేసు నమోదు చేసి అరెస్టు చేశామన్నారు. సమావేశంలో జంగారెడ్డిగూడెం సీఐ ఎంవీ సుభాష్, జంగారెడ్డిగూడెం, లక్కవరం ఎస్సైలు ఎన్వీ ప్రసాద్, షేక్ జబీర్, సిబ్బంది పాల్గొన్నారు. అయితే ఈ రెండు కేసులను చేధించిన సీఐ, ఎస్సైలు, ఏఎస్సై ఎన్వీ సంపత్కుమార్, కానిస్టేబుళ్లు ఎన్.రమేష్, షేక్ షానుబాబు, బి.మంగారావు, కె.మహేష్లను అభినందించి వీరికి రివార్డు కోసం జిల్లా ఎస్పీకి సిఫార్సు చేసినట్లు తెలిపారు. -
శ్రీవారి హుండీ ఆదాయం రూ.1.70 కోట్లు
ద్వారకాతిరుమల: ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమల శ్రీవారి ఆలయ హుండీల నగదు లెక్కింపు గురువారం స్థానిక ప్రమోద కల్యాణ మండపంలో, ఏలూరు జిల్లా దేవాదాయశాఖ అధికారి కె.శ్రీనివాసు పర్యవేక్షణలో నిర్వహించారు. గడచిన 17 రోజులకు గాను నగదు రూపేణా రూ. 1,70,80,167 ఆదాయం లభించినట్టు ఆలయ ఈఓ వై.భద్రాజీ తెలిపారు. అలాగే కానుకల రూపేణా భక్తులు సమర్పించిన 116 గ్రాముల బంగారం, 2.135 కేజీల వెండితో పాటు, అధికంగా విదేశీ కరెన్సీ లభించిందన్నారు. అదేవిధంగా లెక్కింపులోకి రాని రద్దయిన పాత రూ. 2,000, రూ.500 నోట్ల ద్వారా రూ.3,500 లభించినట్టు చెప్పారు. ఇదిలా ఉంటే హుండీల ఆదాయాన్ని పరిశీలిస్తే సగటున రోజుకి శ్రీవారికి రూ.10,04,716 ఆదాయం వచ్చినట్టు ఈఓ పేర్కొన్నారు. ఈ లెక్కింపులో శ్రీవారి దేవస్థానం అధికారులు, సిబ్బంది, సేవాదళం సభ్యులు పాల్గొన్నారు. -
ఆక్వా రంగం అభివృద్ధికి కృషి
భీమవరం (ప్రకాశంచౌక్): జిల్లాలో ఆక్వా రంగం అభివృద్ధి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందని చీఫ్ ఎగ్జిక్యూటివ్ డాక్టర్ బిజయ్ కుమార్ బెహన్ తెలిపారు. భీమవరం కలెక్టరేట్ పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో మత్స్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘‘బ్రాకిష్ వాటర్ ఆక్వా కల్చర్ క్లస్టర్’’ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గత ఐదేళ్లలో క్లస్టర్ సాధించిన పురోగతి, ఇంకా చేపట్టాల్సిన చర్యలను ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా అధికారులు రైతుల సమస్యలు తెలుసుకొని తక్షణ పరిష్కార చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కేంద్ర సెక్రటరీ డాక్టర్ అభిలక్ష్ లిఖీ మాట్లాడుతూ ఆక్వాకల్చర్ రంగం రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి కీలకమని పేర్కొన్నారు. ముఖ్యంగా రొయ్యల సాగులో ఆధునిక సాంకేతికతలను వినియోగించడం ద్వారా అధిక దిగుబడులు, మెరుగైన ఆదాయం సాధ్యమని తెలిపారు. రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బుడితి రాజశేఖర్ మాట్లాడుతూ జిల్లాలో ఆక్వా రైతులు 83 శాతం తమ చెరువులను రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఇంకా 17 శాతం రైతులు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉందన్నారు. ముందుగా కలెక్టరేట్ ప్రాంగణంలో ఆక్వా ఎక్స్ఛేంజ్ సంస్థ ఏర్పాటు చేసిన ఆధునిక యంత్ర పరికరాల ప్రదర్శనను అధికారులు పరిశీలించారు. రాష్ట్ర మత్స్యశాఖ కమిషనర్ రామ శంకర్ నాయక్, కలెక్టర్ నాగరాణి మత్స్యశాఖ అధికారులు, శాస్త్రవేత్తలు, రైతులు పాల్గొన్నారు. -
సీనియర్లకు ఉద్వాసన
తోటకు తీవ్ర అవమానం సాక్షి ప్రతినిధి, ఏలూరు: టీడీపీ కమిటీలో సీనియర్లకు ఉద్వాసన పలికారు. తమ్ముళ్లూ.. మీ సేవలు ఇక చాలు.. సర్దుకోండని పొమ్మనకుండా పొగపెట్టారు. రాష్ట్ర స్థాయి పదవుల్లో పనిచేసిన నేతలకు సైతం చంద్రబాబు షాక్ ఇచ్చారు. పార్టీ ఆవిర్భావం నుంచి జెండా మోసిన కార్యకర్తలను పక్కనపెట్టి కరెన్సీ, పరపతి బలంగా ఉన్న నేతలకు పదవులు కట్టబెట్టడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఈ పర్యాయం మరీ ముఖ్యంగా రాజ్యసభ సభ్యురాలు, పొలిట్ బ్యూరో సభ్యురాలుగా పనిచేసిన తోట సీతారామలక్ష్మిని పూర్తిగా పక్కన పెట్టడం, ఏలూరు జిల్లాలో సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్న చింతమనేనిని సైడ్ చేయడం ఇలా కీలక నేతలందరిని పక్కకు సర్దేయడంపై అసమ్మతి స్వరం రేగింది. కీలక నేతలకు దక్కని పదవులు టీడీపీ జాతీయ, రాష్ట్ర స్థాయి కమిటీల్లో జిల్లాలో కీలక నేతలకు పార్టీ పదవులు దక్కలేదు. సామాజిక కోణంలో కరెన్సీ లాబీయింగ్ చేసే కొందరు నేతలకు, అలాగే నియోజకవర్గాల్లో పెద్ద పరిచయాలు లేకుండా పార్టీ కార్యాలయాల్లోనే మకాం వేసే నేతలకు పదవులు దక్కాయి. మళ్లీ యథావిధిగా యూజ్ అండ్ త్రో అనే పాలసీ ప్రకారమే పార్టీలో పదవుల పంపిణీ జరిగిందనే ప్రచారం తెరలేచింది. ఉమ్మడి పశ్చిమలో ఏలూరు, ఉంగుటూరు నియోజకవర్గాల్లో సిఫార్సులకు నామమాత్రపు ప్రాధాన్యత లేకపోవడం, జిల్లాలో బడా నేతలుగా హడావిడి చేస్తూ పార్టీలో పదవులు పొందే విషయంలో కొందరికి పరపతి లేకపోవడం హాట్టాఫిక్ మారింది. సామాజిక కోణంలో అన్ని వర్గాలను కలుపుకుని పదవులు ఇచ్చామని ప్రకటించుకున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి పూర్తి భిన్నం. ఇక టీడీపీలో సర్వం తామే అంటూ నిత్యం వివాదాల్లో ఉండే ఎమ్మెల్యేలను అసలు పట్టించుకోకపోవడం విశేషం. ఇక ఎవరూ ఊహించని రీతిలో జిల్లాకు చెందిన కొందరు జాతీయ కమిటీలో పదవులు పొందడంపై సదరు నేతలు కూడా అవాక్కవడం గమనార్హం. ఇక అధికార పార్టీలో మరో చర్చ కొనసాగుతోంది. నూజివీడు టిక్కెట్ ఆశించి భంగపడ్డ ముద్దరబోయిన వెంకటేశ్వరరావుకు అధికారంలోకి రాగానే ఎమ్మెల్సీ ఇస్తామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్సీ, అన్ని నామినేటెడ్ పదవులు భర్తీ చేసి యథావిధిగా హ్యాండ్ ఇచ్చారు. చివరికి జాతీయ ఉపాధ్యక్షుడిగా పార్టీ పదవి ఇచ్చామంటూ కొత్త కలరింగ్తో హడావిడి చేస్తున్నారు. మాజీ మంత్రి పీతల సుజాతకు సామాజిక కోణంలో భీమవరం కోటా నుంచి జాతీయ ఉపాధ్యక్ష పదవి దక్కింది. అలాగే టీడీపీలో మొదటిసారి గెలిచిన జూనియర్ ఎమ్మెల్యే మద్దిపాటికి రీజనల్ కోఆర్డినేటర్ను సామాజిక కోణంలో కట్టబెట్టారు. ఉమ్మడి పశ్చిమ నుంచి పొలిట్ బ్యూరోలో నిమ్మల రామానాయుడు, మహహ్మద్ షరీఫ్, మంతెన రామరాజు, పితాని సత్యనారాయణలకు చోటు దక్కింది. తెలుగు తమ్ముళ్లకు ఝలక్ సీనియర్లూ.. ఇక సర్దుకోండి భీమవరంలో తోట సీతారామలక్ష్మి, దెందులూరులో చింతమనేనికి మొండిచేయి ఎంపీ పుట్టా సిఫార్సులూ.. బుట్టదాఖలే ఎన్నికల వరకే సామాజిక కోణంలో పదవుల పంపిణీ టీడీపీలో కొనసాగుతున్న యూజ్ అండ్ త్రో పాలసీ ఏలూరు, ఉంగుటూరు నియోజకవర్గ నేతలకు దక్కని పదవులు టీడీపీ కమిటీపై సర్వత్రా విమర్శల వెల్లువ మాజీ ఎంపీ, పొలిట్బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మిని పూర్తిగా పక్కన పెట్టారు. జాతీయ కమిటీ మొదలుకొని రాష్ట్ర స్థాయి కమిటీ వరకు దేనిలోనూ ప్రాధాన్యం దక్కలేదు. భీమవరం కేంద్రంగా సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో కొనసాగుతూ కాపు సామాజిక కోణంలో ఆమె బలమైన నేతగా పశ్చిమలో ఉన్నారు. మున్సిపల్ చైర్మన్గా ప్రస్తానం ప్రారంభించి ఎంపీ వరకు పనిచేసి ప్రస్తుతం ఏ పదవి లేకుండా మిగిలిపోయారు. ఇక నర్సాపురంలోనూ ఇదే పరిస్థితి. మాజీ ఎమ్మెల్యేలుగా ఉన్న బండారు మాధవనాయుడు, రామరాజుకు పూర్తిగా మొండిచెయ్యి చూపారు. అలాగే ఏలూరు జిల్లాలో 4 వ సారి గెలిచిన చింతమనేనికి రాష్ట్ర కమిటీలో చిన్నపాటి పదవి కూడా పేరు పరిగణనలోనికి తీసుకోకపోవడం జిల్లాలో చర్చగా మారింది. అలాగే పాలకొల్లు నుంచి రెండుసార్లు ఎమ్మెల్సీగా పార్టీలో సుదీర్ఘకాలం నుంచి పనిచేస్తున్న అంగర రామ్మోహన్కు గతంలో ఇరిగేషన్ బోర్డు సభ్యుడిగా పదవిని ప్రకటించిన నేపథ్యంలో బహిరంగ లేఖ ద్వారా తాను ఈ పదవి తీసుకోలేనని తన స్థాయికి తగిన పదవి కాదంటూ చంద్రబాబుకు లేఖ రాశారు. మళ్లీ యథావిధిగా రాష్ట్ర కమిటీలో అంగర రామ్మోహనరావును అవమానించి 59 మంది రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శుల్లో ఒకరిగా నియమించారు. ఇక ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ జిల్లా మాజీ అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులుకు మొండిచెయ్యి చూపారు. నిత్యం పార్టీ కండువా వేసుకుని తిరిగే గన్నిని పార్టీ పట్టించుకోకపోవడం విశేషం. అలాగే ఏలూరు నియోజకవర్గంలో ఏ ఒక్కరికీ పదవి దక్కలేదు. ఏలూరు ఎమ్మెల్యే ప్రతిపాదనలను కనీసం పట్టించుకోలేదని చర్చ సాగుతోంది. ఇక అంతా తానే అన్నట్లు నిన్న, మొన్నటి వరకు హడావిడి చేసిన ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ డ్రగ్స్ కేసులో అడ్డంగా బుకై ్క నియోజకవర్గంలో తలెత్తుకు తిరిగే పరిస్థితి లేకపోవడంతో ఏలూరుకు పూర్తిగా దూరంగా ఉన్నారు. అయితే కొద్ది నెలల ముందే పదవులకు సంబంధించి ఎంపీ కొన్ని సిఫార్సులు చేశారని వాటన్నింటిని బుట్టదాఖలు చేసినట్లు సమాచారం. -
శ్రీవారి హుండీ ఆదాయం రూ.1.70 కోట్లు
ద్వారకాతిరుమల: ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమల శ్రీవారి ఆలయ హుండీల నగదు లెక్కింపు గురువారం స్థానిక ప్రమోద కల్యాణ మండపంలో, ఏలూరు జిల్లా దేవాదాయశాఖ అధికారి కె.శ్రీనివాసు పర్యవేక్షణలో నిర్వహించారు. గడచిన 17 రోజులకు గాను నగదు రూపేణా రూ. 1,70,80,167 ఆదాయం లభించినట్టు ఆలయ ఈఓ వై.భద్రాజీ తెలిపారు. అలాగే కానుకల రూపేణా భక్తులు సమర్పించిన 116 గ్రాముల బంగారం, 2.135 కేజీల వెండితో పాటు, అధికంగా విదేశీ కరెన్సీ లభించిందన్నారు. అదేవిధంగా లెక్కింపులోకి రాని రద్దయిన పాత రూ. 2,000, రూ.500 నోట్ల ద్వారా రూ.3,500 లభించినట్టు చెప్పారు. ఇదిలా ఉంటే హుండీల ఆదాయాన్ని పరిశీలిస్తే సగటున రోజుకి శ్రీవారికి రూ.10,04,716 ఆదాయం వచ్చినట్టు ఈఓ పేర్కొన్నారు. ఈ లెక్కింపులో శ్రీవారి దేవస్థానం అధికారులు, సిబ్బంది, సేవాదళం సభ్యులు పాల్గొన్నారు. -
వేడుకగా శ్రీపుష్ప యాగోత్సవం
ముగిసిన శ్రీనివాసుని కల్యాణ మహోత్సవాలు ద్వారకాతిరుమల: శ్రీవారి ఆలయానికి ఉపాలయమైన లక్ష్మీపురంలోని శ్రీ సంతాన వేణుగోపాల జగన్నాథ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీనివాసునికి జరుగుతున్న కల్యాణ మహోత్సవాలు బుధవారం జరిగిన విశేష కార్యక్రమాలతో ముగిశాయి. ఈ సందర్భంగా ఉదయం ఆలయంలో శ్రీనివాసునికి, పద్మావతి, అండాళ్ అమ్మవార్లకు అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ యజ్ఞశాలలో హోమాది కార్యక్రమాలను జరిపారు. రాత్రి ఆలయంలో ద్వాదశ కోవెల ప్రదక్షిణలను ఆలయ అర్చకులు, పండితులు, ఆగమ విద్యార్థులు వైభవోపేతంగా నిర్వహించారు. అనంతరం స్వామివారికి, అమ్మవార్లకు శ్రీ పుష్పయాగోత్సవాన్ని అర్చకులు వేద మంత్రోచ్ఛరణలతో జరిపారు. ఈ వేడుకల్లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. -
వంక నాగమణి జీవితం ఆదర్శనీయం
● మాజీ మంత్రి అంబటి రాంబాబు ● తణుకులో నాగమణి సంస్మరణ సభ తణుకు అర్బన్: మాజీ ఎమ్మెల్యే వంక సత్యనారాయణ సతీమణి వంక నాగమణి జీవితం ఆదర్శనీయమని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. తణుకు కమ్మ కల్యాణ మండపంలో బుధవారం నిర్వహించిన వంక నాగమణి సంస్మరణ సభలో ఆయన మాట్లాడారు. సీపీఐ తరపున స్వాతంత్య్ర పోరాటం నుంచి ఇతర ఉద్యమాల్లో భర్త సత్యనారాయణ అకుంఠిత దీక్ష వెనుక మహిళా శక్తి రూపంలో నాగమణి ప్రోత్సాహం ఎంతో ఉందన్నారు. కుటుంబ వ్యవస్థను మంచి క్రమశిక్షణతో నడుపుతూ తల్లిగా పిల్లలను ఉన్నత స్థానాలకు చేర్చేందుకు ఆమె వ్యవహరించిన తీరు అజరామరమన్నారు. కమ్యూనిస్టు సిద్ధాంతాలతో.. కమ్యూనిస్టు సిద్ధాంతం పట్ల అంకిత భావం, కుటుంబ బాధ్యతలను సమన్వయం చేసుకున్న వంక నాగమణి జీవితం నేటి తరానికి ఆదర్శప్రాయమని సీపీఐ జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ డాక్టర్ కె.నారాయణ అన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు అధ్యక్షతన నిర్వహించిన సంస్మరణ సభలో ఆయన మాట్లాడారు. 1948లో బెజవాడలో జరిగిన శిక్షణ తరగతుల్లో పోలీసుల లాఠీచార్జీని ఎదుర్కొని అరెస్టు అయ్యారని ప్రస్తుత ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మహిళా సమాఖ్యను బలోపేతం చేయడంలో ఆమె పాత్ర చిరస్మరణీయమని స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్ మాట్లాడుతూ మా అమ్మ నేర్పిన క్రమశిక్షణే మా ఉన్నతికి మార్గదర్శకమని అన్నారు. ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే వంక సత్యనారాయణ, వంక నాగమణి దంపతులు సమాజానికి ఎంతో సేవచేశారని వారి పేరుమీద తణుకులో పార్కు నిర్మాణం చేసి వారి విగ్రహాలను నెలకొల్పుతానని స్పష్టం చేశారు. సభకు హాజరైన మాజీ మంత్రి చెరకువాడ శ్రీరంగనాథరాజు, భీమవరం వైఎస్సార్సీపీ ఇన్చార్జి చినిమిల్లి వెంకటరాయుడు, వైఎస్సార్ సీపీ సీఈసీ సభ్యుడు చీర్ల రాధయ్య, భీమవరం పట్టణ అద్యక్షుడు గాదిరాజు రామరాజు, మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్, మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్, సీపీఐ నేతలు ముప్పాళ్ల నాగేశ్వరరావు, అక్కినేని వనజ, పెన్మెత్స దుర్గా భవాని, డేగా ప్రభాకర్, దారిదీపం సంపాదకులు డీవీవీఎస్ వర్మ, సీపీఎం జిల్లా కార్యదర్శి జేఎన్వీ గోపాలన్, వంక రవీంద్రనాథ్, వంక రాజకుమారి, వంక రామదాసు, వంక మోహన్, కుటుంబసభ్యులు నాగమణి చిత్రపటం వద్ద నివాళులర్పించారు. -
మెత్తాపుకోటలో పులి సంచారం
బిక్కుబిక్కుమంటున్న ఏజెన్సీ వాసులుపోలవరం రూరల్: పాపికొండల అభయారణ్యంలో ఏజెన్సీ ప్రాంతంలో నాలుగు రోజులుగా పులి సంచరిస్తుండగా, ఏజెన్సీ వాసులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఏలూరు జిల్లా పోలవరం మండలం గుంజవరం సమీపంలో దూడపై దాడి చేసిన పులి అదే ప్రాంతంలో మంగళవారం రాత్రి సంచరించింది. బుధవారం నాటికి అభయారణ్యంలోని మెత్తాపుకోట ప్రాంతంలో సంచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు. పులికి అమర్చిన రేడియో ఫ్రీక్వెన్సీ ట్రాకర్ ద్వారా అటవీశాఖ అధికారులు ఎప్పటికప్పుడు పులి అడుగుజాడలు గుర్తిస్తున్నారు. పులి కదలికలను బట్టి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కొండ కాలువల నీరు, చల్లని గుబురుపొదలు ఉండటంతో ఈ ప్రాంతంలోనే పులి సంచారం జరుగుతోంది. నాలుగు రోజుల క్రితం తూర్పుగోదావరి జిల్లా నుంచి గోదావరి నది దాటి ఏలూరు జిల్లా పోలవరం మండలంలో ప్రవేశించింది. అప్పటి నుంచి ఈ ప్రాంతంలో సంచరిస్తుండటంతో వ్యవసాయ కూలీలు, రైతులు, ఏజెన్సీవాసులు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. పులి ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి చేరేందుకు మళ్లీ ఈ ప్రాంతంలోకి చేరి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. అటవీ శాఖ సబ్ డీఎఫ్వో వెంకటసుబ్బయ్య, రేంజ్ అధికారి ఎస్కే వలీలు సిబ్బందితో కలిసి గుంజవరం రామన్నపాలెం, వెంకటరెడ్డిగూడెం, మెత్తాపుకోట, ఉడతపల్లి గ్రామాల్లో పులి కదలికలను పరిశీలిస్తున్నారు. ప్రజలు ఒంటరిగా సంచరించవద్దని, అప్రమత్తంగా ఉండాలని సూచించారు. -
దొంగను పట్టించిన సీసీ కెమెరాలు
కై కలూరు: బంగారు దుకాణాలే టార్గెట్గా చోరీలకు పాల్పడుతున్న వ్యక్తి సీసీ కెమెరాల సాయంతో కై కలూరు టౌన్ పోలీసులకు పట్టుబడ్డాడు. నిందితుడిపై ఆంధ్రా, తెలంగాణల్లో పలు కేసులు ఉన్నాయన్నారు. పట్టణ సీఐ ఏవీఎస్.రామకృష్ణ, టౌన్ ఎస్సై డీ.వెంకట్కుమార్ బుధవారం సర్కిల్ కార్యాలయంలో కేసు వివరాలు వెల్లడించారు. ఈ నెల 9వ తేదీన కై కలూరు కన్యకాపరమేశ్వరీ అమ్మవారి దేవస్థాన సమీపంలో గుర్రం సత్య వినోద్కు చెందిన బంగారు దుకాణంలో పశ్చిమగోదావరి జిల్లా, ఆకివీడు మండలం ఐ.భీమవరంనకు చెందిన గొర్రెల సత్యనారాయణ(37) అనే వ్యక్తి పట్టపగలు కట్టర్తో గేట్లు పగలగొట్టడానికి ప్రయత్నించాడు. సమీప వ్యక్తి యజమానికి ఫోన్ చేయడం గమనించి పరారయ్యాడు. దీంతో యజమాని ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ముఖానికి మాస్క్, తలకు టోపీ పెట్టుకున్న నిందితుడిని సీసీ కెమెరాల సాయంతో గుర్తించి అరెస్ట్ చేసినట్లు పోలీసులు చెప్పారు. నిందితుడిపై ఆంధ్రా, తెలంగాణ ప్రాంతాల్లో పలు బంగారపు దుకాణాల చోరీ కేసులు ఉన్నాయన్నారు. -
ఇండస్ట్రియల్ పార్కులపై అవగాహన అవసరం
భీమవరం: ప్రైవేట్ ఇండస్ట్రియల్ పార్కుల ఏర్పాటు కోసం ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలు, మౌలిక సదుపాయాల అభివృద్ధికి సదుపాయాల కల్పనపై అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. బుధవారం భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో జిల్లా పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో పారిశ్రామికవేత్తలు, భూస్వాములు, రైతులతో ఎంఎస్ఎంఇ పార్క్ పాలసీపై ఏర్పాటుచేసిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. భూ యజమానులు తమ భూములను రియల్ ఎస్టేట్కు విక్రయించడం కంటే పారిశ్రామికాభివృద్ధికి వినియోగిస్తే వారికి దీర్ఘకాలిక లాభాలు ఉంటాయని, ఎంఎస్ఎంఇ పార్కులు ఏర్పాటు ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు విస్తృతంగా ఏర్పడతాయన్నారు. ఏపీఐఐసీ చైర్మన్ మంతెన రామరాజు మాట్లాడుతూ యువతకు విస్తృత స్థాయిలో ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఆర్డీవో కె.ప్రవీణ్ కుమార్ రెడ్డి, పరిశ్రమల శాఖ జీఎం యు.మంగపతి రావు, వ్యవసాయ శాఖాధికారి జెడ్.వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. బాధితులకు తక్షణ ఉచిత వైద్యంభీమవరం (ప్రకాశంచౌక్): రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన బాధితులకు తక్షణ వైద్యం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన శ్రీపీఎం–రాహత్శ్రీ పథకం అత్యంత కీలక పాత్ర పోషిస్తుందని కలెక్టర్ సీహెచ్ నాగరాణి తెలిపారు. ఈ పథకం అమలుపై ప్రతి ఒక్కరూ పూర్తి స్థాయి అవగాహన కలిగి ఉండాలని, సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని ఆదేశించారు. -
ఉత్తమ ప్రదర్శనగా ‘అగ్నిసాక్షి’ ఎంపిక
భీమవరం: పట్టణంలో కళారంజని నాటక అకాడమి 15వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన జాతీయస్థాయి తెలుగు నాటిక పోటీల్లో చైతన్య కళాస్రవంతి విశాఖపట్నం వారి ‘అగ్నిసాక్షి’ నాటిక ఉత్తమ ప్రదర్శనగా బహుమతి అందుకుంది. పోటీల్లో విజేతల వివరాలను బుధవారం పోటీల న్యాయనిర్ణేత గంటా ముత్యాలరావునాయుడు విలేకర్లకు తెలిపారు. ద్వితీయ ఉత్తమ ప్రదర్శనగా శ్రీరమణకళానిలయం గుంటూరు వారి ‘మాతృత్వం’ ఎంపికై ంది. ఉత్తమ నటులుగా ఫొటో నాటికలోని సోములు పాత్రధారి చిల్లర సుబ్బారావు, అందరూ మంచివారే కానీ.. నాటికలో సౌజన్య పాత్రధారిణి సురభి పూజిత, మాతృత్వం నాటికలో సంతోష్ పాత్రధారి పొగర్తి నాగేశ్వరరావు, మరో పుత్తడిబొమ్మ నాటికలో కమల పాత్రధారిణి అమృతవర్షిణి ఎంపికయ్యారు. ఉత్తమ దర్శకుడిగా బాలాజీ నాయక్, ఉత్తమ రచయితగా జరుగుల రామారావు, ఉత్తమ సంగీత దర్శకుడిగా లీలామోహన్ ఎంపికయ్యారు. ఉత్తమ ఆహార్యం ఇవి కదా ముగింపు నాటిక, ఉత్తమ రంగాలంకరణకు అందరూ మంచివారే కానీ.. నాటికకు లావు అనిల్చౌదరి, జ్యూరీ అవార్డులను ఇది కదా ముగింపు నాటికలో వై వాసు, యశోద కై వసం చేసుకున్నారని ముత్యాలరావునాయుడు చెప్పారు. కార్యక్రమంలో అకాడమీ వ్యవస్థాపక అధ్యక్షుడు జవ్వాది దాశరధీ శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి మెంటే పూర్ణచంద్రరావు, కార్యదర్శి మల్లుల సీతారామప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
మట్టి తవ్వకాలపై రైతుల నిరసన
పెనుగొండ: నక్కల డ్రైయిన్లో ఆచంట వద్ద జరుగుతున్న అక్రమ మట్టి తవ్వకాలను వ్యతిరేకిస్తూ రైతులు నిరసన గళం విప్పారు. బుధవారం భారీ సంఖ్యలో రైతులు ఆచంట తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని ధర్నా నిర్వహించారు. గత వారం రోజులుగా నక్కల డ్రైయిన్ తవ్వకాలను రైతులు అడ్డుకుంటున్నప్పటికీ, అధికార పార్టీ నాయకులు, అధికారుల అండతో తవ్వకాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. జిల్లా కలెక్టర్కు, మంత్రి అచ్చెన్నాయుడుకు వినతి పత్రాలు సమర్పించినా ఫలితం లేకపోవడంతో రైతులు మంగళవారం నక్కల డ్రైయిన్ వద్దే బైఠాయించారు. స్థానిక నాయకుల ఒత్తిడితో పోలీసులు రైతులను అదుపులోకి తీసుకుని పక్కకు తరలించారు. ఈ నేపథ్యంలో, బుధవారం అధికారుల నుంచి ముందస్తు అనుమతి పొంది రైతులు ధర్నా చేపట్టారు. అడగడుగునా అడ్డంకులే.. అక్రమ తవ్వకాలకు లేని అడ్డంకులు రైతుల ధర్నాకు ఎదురయ్యాయి. ఎండ తీవ్రత దృష్ట్యా రైతులు నీడ కోసం టెంట్ వేయడానికి ప్రయత్నించగా, ఉన్నతాధికారుల సూచన మేరకు స్థానిక అధికారులు అనుమతి లేదంటూ అడ్డుతగిలారు. అక్రమంగా మట్టి తవ్వుతుంటే చర్యలు తీసుకోని అధికారులు, కనీసం టెంట్ వేసుకోనివ్వకపోవడంపై రైతులు పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. పొంతన లేని సమాధానం ధర్నా అనంతరం రైతులు తహసీల్దార్ బి.సోమేశ్వరరావుకు వినతి పత్రం సమర్పించారు. తవ్వకాలను ఎందుకు అడ్డుకోవడం లేదని ప్రశ్నించగా.. చర్యలు తీసుకోవాల్సింది డ్రైనేజీ శాఖాధికారులు, మేము కాదుఅని ఆయన సమాధానం ఇవ్వడంతో రైతులు విస్మయానికి గురయ్యారు. సొంత పొలంలో మట్టి తవ్వితే వంద ఆంక్షలు పెట్టే రెవెన్యూ అధికారులు, ఇక్కడ అక్రమాలు జరుగుతుంటే ఏం చేస్తున్నారని నిలదీశారు. దీనికి తహసీల్దార్ స్పందిస్తూ.. నన్ను ప్రశ్నించడం ఏమిటి? అని రైతులపై ఆగ్రహం వ్యక్తం చేయడం గమనార్హం. ప్రత్యక్ష పోరాటానికి సిద్ధం ఇప్పటివరకు ప్రశాంతంగా నిరసన తెలిపామని, ఇప్పటికై నా తవ్వకాలు ఆపకపోతే ప్రత్యక్ష పోరాటానికి దిగుతామని రైతులు హెచ్చరించారు. నక్కల డ్రైయిన్ వద్దే నిరాహార దీక్షలు చేపట్టి తవ్వకాలను అడ్డుకుంటామని స్పష్టం చేశారు. రైతులను ఇబ్బంది పెట్టేలా మట్టి, ఇసుక మాఫియాలు రాజ్యమేలుతున్నాయని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ అడ్వయిజరీ కమిటీ సభ్యుడు చెరుకువాడ శ్రీరంగనాథరాజు విమర్శించారు. ఆచంట నక్కల డ్రెయిన్లో జరుగుతున్న అక్రమ తవ్వకాలను బుధవారం పరిశీలించారు. వారం రోజులుగా పోరాటం చేస్తున్నామని అధికారులు, స్థానిక నాయకులు మట్టి మాఫియాకు వత్తాసు పలుకుతున్నారంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. డ్రెయిన్ వలన వర్షాకాలంలో ఆచంట, పాలకొల్లు, నర్సాపురం నియోజకవర్గంలోని వందలాది ఎకరాలు ముంపు బారిన పడుతున్నాయని, ఈ తరుణంలో డ్రెయిన్ గట్టులు తవ్వడం వలన ముంపు ప్రమాదం మరింత ఉందన్నారు. కొన్ని ప్రాంతాల్లో నక్కల డ్రెయిన్ మరీ వెడల్పుగా ఉండడంతో ఆయా ప్రాంతాలు మట్టిమాఫియాకు వరంగా మారిందన్నారు. దీంతో అక్రమ తవ్వకాలకు ప్రయత్నిస్తున్నారన్నారు. పాలకొల్లు, భీమవరం ప్రాంతాల్లోని లేఅవుట్లకు లక్షలాది రూపాయల విలువ గల మట్టిని తరలిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. అక్రమ మట్టి తవ్వకాలపై రైతులు ఫిర్యాదు చేస్తే, వారినే పోలీసులు అదుపులోకి తీసుకోవడం దారుణమని రంగనాథరాజు అన్నారు. మట్టి తరలిస్తున్న వారికి రెవెన్యూ అధికారులు, పోలీసలు వత్తాసు పలకడం దారుణమన్నారు. సత్వరం తవ్వకాలు నిలుపుదల చేయకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. రైతులతో కలసి పోరాటం చేస్తామని తెలిపారు. -
అంబేడ్కర్ అందరివాడు
భీమవరం: భారత రాజ్యాంగ నిర్మాత, దళితుల ఆశాజ్యోతి బీఆర్ అంబేడ్కర్ అందరివాడని, అన్నివర్గాల్లోని పేదల అభ్యున్నతికి కృషిచేశారని శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేన్రాజు అన్నారు. భీమవరం పట్టణం గునుపూడి గురువుపేటలో అంబేడ్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన అంబేడ్కర్ విగ్రహాన్ని మంగళవారం రాత్రి ఆయన ఆవిష్కరించారు. భీమవరం నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త చినిమిల్లి వెంకటరాయుడు మాట్లాడుతూ అంబేడ్కర్ ఆశయసాధనకు ప్రతి ఒక్కరూ కృషిచేయాలన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి ఏఎస్ రాజు, దళిత మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు చింతపల్లి గురుప్రసాద్, ఎంబీసీ మాజీ చైర్మన్ పెండ్ర వీరన్న, వైఎస్సార్సీపీ నాయకులు కామన నాగేశ్వరరావు, చిగురుపాటి సందీప్, గాదిరాజు రామరాజు, కాటం స్టాలిన్, బోకూరి విజయరాజు తదితరులు పాల్గొన్నారు. -
బిడ్డ కోసం.. ‘తల్లి’డిల్లే హృదయం
సాక్షి టాస్క్ఫోర్స్: బిడ్డ కోసం ఓ కన్నతల్లి కంటి నిండా ఒత్తులతో ఎదురుచూస్తోంది. కన్నపేగు కనిపించక గర్భశోకాన్ని అనుభవిస్తోంది. ఏ చిన్న అలికిడి వినిపించినా తీసుకొచ్చారా.. నా బాబూను అంటూ కన్నీళ్లతో దేవులాడుతోంది. బుడిబుడి అడుగులతో చలాకీగా ఇంటి బయట ఆడుకుంటున్న రెండున్నరేళ్ల ఆకేటి మోక్షిత్ కనిపించకుండా పోయి మూడు నెలలు కావస్తోంది. ముదినేపల్లి మండలం శ్రీహరిపురంలో మోక్షిత్ మిస్సింగ్ కేసు పోలీసు వ్యవస్థకు సవాల్ విసురుతోంది. సాంక్షేతిక పరిజ్ఞానంతో పెద్ద కేసులను ఇట్టే పట్టేసుకుంటున్న పోలీసులకు కనీసం చిన్న ‘క్లూ’ కూడా మోక్షిత్ కేసులో లభించలేదు. ముద్దుముద్దు మాటలతో ముచ్చట గొలిపే ఆకేటి మోక్షిత్ ఆటలాడుకుంటూ ఈ ఏడాది జనవరి 20న శ్రీహరిపురం ఇంటి బయట కనిపించలేదు. తల్లి శిరీష వెంటనే ముదినేపల్లి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ముందుగా ఇంటి వద్ద పెద్ద కాల్వలో పడి కొట్టుకుపోయాడనే అనుమానాలు పెరిగాయి. ఇదే కాల్వలో కొద్ది రోజులు ముందు ఓ వృద్ధుడు కొట్టుకుపోయి మరణించాడు. పోలీసులు, బంధువులు కాల్వ లాకులు దింపు మరీ జల్లిడ పట్టినా బాబు జాడ లేదు. పోలీసులు సమీపంలో సీసీ కెమెరాలను పరిశీలించినా మోక్షిత్ అనవాళ్లు కనిపించలేదు. స్థానిక ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు(డీఎన్నార్) బాధితురాలిని పరామర్శించి జిల్లా ఎస్పీతో మాట్లాడారు. జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్, డీఎస్పీలు స్వయంగా వచ్చి విచారణ చేశారు. అయినా ఇంకా మిస్టరీ వీడలేదు. భర్తను కోల్పోయి.. బిడ్డను పోగొట్టుకుని.. బిడ్డను పోగొట్టుకున్న తల్లి శిరీష దీనాగాథ మనసును కలిచివేస్తోంది. వరసుకు మేనత్త కుమారుడు కానుకొల్లుకు చెందిన అకేటి శ్రీహరితో 2020లో ముదినేపల్లి మండలం శ్రీహరిపురం గ్రామానికి చెందిన శిరీషకు వివాహం జరిగింది. వీరికి ఆకాష్ (5), మోక్షిత్ (రెండున్నర) సంతానం. భర్త శ్రీహరి ఆక్వా చెరువుల సాగు చేసేవాడు. అన్యోన్యంగా సాగుతున్న ఆ కుటుంబంలో పెద్ద విషాదం చోటుచేసుకుంది. గతేడాది జూన్ 21న పేయ్యేరు సమీప కానుకొల్లు రోడ్డులో ఆగివున్న లారీని ఢీకొట్టి శిరీష భర్త శ్రీహరి మృతి చెందాడు. పిల్లలతో శిరీష పుట్టిళ్లు శ్రీహరిపురంలో ఉంటుంది. భర్త చనిపోయిన దాదాపు 7 నెలలకే చిన్న కుమారుడు మోక్షిత్ మిస్సింగ్ కేసుగా మారాడు. అటు భర్త పోయి పుట్టెడు దుఖఃంతో పాటు కన్న బిడ్డ కనిపించకపోవడంతో ఆ మాతృమూర్తి తల్లిడిల్లిపోతుంది. పెద్ద కుమారుడు చదువు సైతం ప్రశ్నార్థకంగా మారింది. అనుమానాలు ఆజ్యం పోసిన పసిపిల్లల విక్రయాలు కేసు మోక్షిత్ మిస్సింగ్ కేసు దుమారం రేపుతోంటే ముదినేపల్లి మండలంలో పసిపిల్లల విక్రయాలు కేసు పలు అనుమానాలకు అజ్యం పోసింది. నియోజకవర్గంలో అన్నవరం, కానుకొల్లు, మండవల్లి వంటి ప్రాంతాల్లో ఐదుగురు పిల్లల విక్రయాలు జరిగాయని 9 మందిపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఈడేపల్లికి చెందిన అబ్బిశెట్టి వీరాకుమారి(వీరమ్మ)ను ఏ–1 ముద్దాయిగా చేర్చారు. ఆమె ఓ రాజకీయ నేత తల్లికావడంతో ఇది పెద్ద చర్చకు దారితీసింది. ఇదిలా ఉంటే పిల్లల విక్రయాల్లో పలు పర్యాయాలు జైలు జీవితం అనుభవించిన విజయవాడకు చెందిన ఫరానాతో ఈ ప్రాంతంలో కొందరికి సంబంధాలు ఉన్నాయి. అయితే పోలీసులు మాత్రం పిల్లల విక్రయాలకు మోక్షిత్ కేసునకు సంబంధం లేదంటున్నారు. మరొపక్క మోక్షిత్ జాడ చూపించాలని శ్రీహరిపురం గ్రామస్తులు రోడ్లుపై ఆందోళనలు సైతం చేస్తున్నారు. బిడ్డను పోగొట్టుకున్నాను. దాదాపు మూడు నెలలు కావస్తోంది. మోక్షిత్ జ్ఞాపకాలు కలిచివేస్తున్నాయి. ముదినేపల్లి పోలీసుల శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నారు. నా బిడ్డను నాకు అప్పగించండి. మాకు ఎవరితోనూ విభేదాలు లేవు. ఒక తల్లి పడే ఆవేదన అర్థం చేసుకుని నా బిడ్డను నా చెంతకు చేర్చండి. –ఆకేటి శిరీష, మోక్షిత్ తల్లి, శ్రీహరిపురం మోక్షిత్ తల్లి ఫిర్యాదు చేసినప్పటి నుంచి బాలుడి ఆచూకీ కోసం పోలీసు వ్యవస్థ మొత్తం నూరుశాతం ప్రయత్నాలు చేస్తోంది. బిడ్డ కనిపించని రోజున పెద్ద కాల్వలో నీటి ప్రవాహం అధికంగా ఉంది. దీంతో కాల్వలో గాలించాం. ఈ కేసులో ఉన్నతాధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. అన్ని కోణాల నుంచి కేసును దర్యాప్తు చేస్తున్నాం. – వీరభద్రరావు, ఎస్సై, ముదినేపల్లి. మిస్టరీగా మారిన శ్రీహరిపురం చిన్నారి మోక్షిత్ మిస్సింగ్ కేసు మూడు నెలలు కావస్తున్నా పురోగతి నిల్ ఆగ్రహం కట్టలు తెంచుకుని గ్రామస్తుల నిరసన ముదినేపల్లి పిల్లల మిస్సింగ్ కేసుతో పెరిగిన అనుమానాలు -
యథేచ్ఛగా మట్టి తవ్వకాలు
కుక్కునూరు: మండలంలో గ్రావెల్ తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. ఎటువంటి అనుమతులు లేకుండా పట్ట పగలే దర్జాగా జేసీబీలతో గ్రావెల్ ని తవ్వి అమ్మకాలు చేపడుతున్నారు. ఒక ట్రాక్టర్ లోడ్ కు రూ. 600 వసూలు చేస్తున్నట్టు సమాచారం. జిల్లాలో అక్రమ గ్రావెల్, ఇసుక తోలకాలు జరగకుండా చూడాలని జిల్లా కలెక్టర్ ఇటీవల అధికారుల సమావేశంలో ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్ ఆదేశాలను మండల స్థాయిలో రెవెన్యూ యంత్రాంగం పటిష్టంగా అమలు చేయకపోవడంతోనే మట్టి అక్రమ దందాకు అడ్డు అదుపు లేకుండా పోయిందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. వింజరం, కుక్కునూరులో మట్టి తవ్వకాలు మంగళవారం వింజరం, కుక్కునూరు గ్రామాల్లో గ్రావెల్ తవ్వకాలు కొనసాగాయి. వింజరంలో జరిగిన మట్టి తోలకాలపై స్థానికులు 112 టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేసి ఫిర్యాదు చేయగా వీఆర్ఓ, పోలీసులు వచ్చి ఆపారు. ఆపిన కొద్దిసేపటికే మళ్లీ మట్టి తోలకాలు ప్రారంభించినట్టు గమనార్హం. ఈ విషయం అధికారులకు తెలిసిన ఆపే ప్రయత్నం చేయకపోవడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి . మట్టితోలకాలు జరుగుతున్న ప్రాంతం ప్రభుత్వ భూమని స్థానికులు అంటుండగా, అధికారులు మాత్రం రైతుకు చెందిన పట్టా భూమని చెబుతుండడంపై గందరగోళం నెలకొంది. వింజరం గ్రామంలో గ్రావల్ తోలకాలపై వీఆర్వో నాగేశ్వరరావుని వివరణ కోరగా, వింజరం గ్రామంలో మట్టి తవ్వకాలకు ఎలలాంటి పర్మిషన్ లేదన్నారు. రైతు తన పట్టా భూమిలో మట్టిని తవ్వుకుంటున్నట్టు వత్తాసు పలికారు. -
బస్టాండ్లో చోరీలు చేస్తున్న మహిళ అరెస్టు
ఏలూరు టౌన్: ఏలూరు ఆర్టీసీ బస్టాండ్లో బంగారు ఆభరణాల చోరీ చేస్తున్న మహిళను మంగళవారం పోలీసులను అరెస్ట్ చేశారు. బస్టాండ్ సమీపంలో అనుమానస్పదంగా తిరుగుతున్న మహిళను అదుపులోకి తీసుకుని విచారించగా... చోరీలకు పాల్పడుతున్నట్లు ఒప్పుకోవటంతో అరెస్ట్ చేశారు. ఈ మేరకు ఏలూరు త్రీటౌన్ పోలీస్స్టేషన్లో సీఐ కోటేశ్వరరావు విలేకరుల సమావేశంలో వివరాలు తెలిపారు. మార్చి 23న మచిలీపట్నానికి చెందిన కోసి కృష్ణవేణి తన కుమార్తెతో కలిసి ఆర్టీసీ బస్సులో తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి నుంచి మచిలీపట్నం వెళ్తూ... ఏలూరు కొత్తబస్టాండ్లో వేరొక బస్సు మారేందుకు కిందికి దిగారు. వేరే బస్సు ఎక్కుతున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తి ఆమె చేతి బ్యాగులోని బంగారు ఆభరణాలను అపహరించారు. బాధితురాలు ఫిర్యాదు చేయగా ఏలూరు త్రీటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణ చేపట్టగా తూర్పుగోదావరి జిల్లా కాటేరు గ్రామానికి చెందిన ముప్పవరపు సత్యనారాయణమ్మ (62) అనే మహిళ బంగారు ఆభరణాలను చోరీ చేస్తున్నట్లు గుర్తించారు. నిందితురాలి నుంచి 14 కాసుల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. కేసును ఛేదించటంలో ప్రతిభ చూపిన ఎస్సై రాంబాబు, క్రైమ్ సిబ్బందిని జిల్లా ఎస్పీ శివకిషోర్ ప్రత్యేకంగా అభినందించారు. -
అంగన్వాడీ కేంద్రానికి కోడిగుడ్లు సరఫరా
ద్వారకాతిరుమల: మండలంలోని వేంపాడు గ్రామ బీసీ కాలనీలోని అంగన్వాడీ కేంద్రానికి మంగళవారం కోడి గుడ్లు సరఫరా అయ్యాయి. ఈ పాఠశాలకు సరఫరా చేయాల్సిన కోడి గుడ్లును గత మంగళవారం వ్యాన్ డ్రైవర్ రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయన్న కారణంగా, అదే గ్రామంలోని సరిహద్దు సుజాత ఇంట్లో వాటిని పెట్టాడు. వారం గడిచినా వాటిని అంగన్వాడీ టీచర్ పట్టుకెళ్లలేదు. దాంతో అవి సుజాత ఇంట్లోనే మూలనపడి ఉన్నాయి. దీనిపై పలు పత్రికల్లో మంగళవారం కథనాలు ప్రచురితమయ్యాయి. వాటికి స్పందించిన జంగారెడ్డిగూడెం ఐసీడీఎస్ సీడీపీఓ బ్యూలా, సెక్టార్ సూపర్వైజర్ మేరి వెంటనే గుడ్లు సరఫరా చేసే కాంట్రాక్టర్తో మాట్లాడారు. సకాలంలో, సక్రమంగా గుడ్లు సరఫరా చేయాలని కాంట్రాక్టర్ను ఆదేశించారు. అలాగే గుడ్లు స్టాక్ సమయానికి అందుబాటులో లేకపోతే వెంటనే సెక్టార్ సూపర్వైజర్కు తెలపాలని అంగన్వాడీ కార్యకర్తలకు సూచించారు. -
ట్రిపుల్ ఐటీలో ముగ్గురు అధ్యాపకుల సస్పెన్షన్
నూజివీడు: విద్యార్థినులపై అనుచితంగా ప్రవర్తించిన ముగ్గురు అధ్యాపకులను విధుల నుంచి సస్పెండ్ చేసినట్లు డైరెక్టర్ ఆచార్య ఎస్ఎస్ఎస్వీ గోపాలరాజు తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. వీరిపై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో విచారణ ముగిసే వరకు ప్రాథమిక చర్యలలో భాగంగా సస్పెండ్ చేశామని పేర్కొన్నారు. కమిటీ తుది నివేదిక సమర్పించిన అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. భీమవరం: ప్రేమ విఫలం కావడంతో తన సోదరుడు గడ్డి మందుసేవించి మృతిచెందినట్లు ఏలూరు జిల్లా అరిగిపల్లి గ్రామానికి చెందిన జంగం శిరీష ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదుచేసినట్లు భీమవరం వన్టౌన్ హెడ్కానిస్టేబుల్ వెంకటేశ్వరరావు చెప్పారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కృష్ణా జిల్లా బంటుమిల్లి మండలం మల్లంపూడి గ్రామానికి చెందిన ఎస్ రాజేష్(23) ప్రేమలో విఫలం కావడంతో ఈనెల 3వ తేదిన భీమవరం బస్టాండ్ దగ్గరలో గడ్డి మందు సేవించాడు. దీనిని గమనించి 108 వాహనంలో భీమవరం ప్రభుత్వాసుపత్రిలో చేర్పించగా మెరుగైన చికిత్స కోసం ఏలూరు, విజయవాడ తరలించారు. పరిస్థితి విషమించడంతో ఈనెల 13వ తేది మృతి చెందాడు. దీంతో మృతుడి సోదరి శిరీష పోలీసులను ఆశ్రయించింది. భీమవరం: రైలు పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు భీమవరం రైల్వే ఎస్సై సుబ్రహ్మణ్యం మంగళవారం విలేకరులకు తెలిపారు. భీమవరం పట్టణంలోని ఉండి రైల్వేగేటు వద్ద సోమవారం రాత్రి పట్టాలు దాటుతుండగా గుంటూరు ఫాస్ట్ ప్యాసింజర్ రైలు ఢీ కొనడంతో తీవ్రంగా గాయపడిన వ్యక్తిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించామన్నారు. అయితే అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారన్నారు. మృతుని వయస్సు సుమారు 40 ఏళ్లు ఉంటుందని పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామనిచ, మృతుడి వివరాలు తెలియాల్సి ఉందని సుబ్రహ్మణ్యం చెప్పారు. ఏలూరు (టూటౌన్): జిల్లాలో ఉపాధి హామీ పనిలో తలెత్తుతున్న యాప్ కష్టాల వలన ఉపాధి హామీ కూలీలు పనులు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎ.రవి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు మంగళవారం ఆయనఒక ప్రకటన విడుదల చేశారు. మార్చి 1 నుండచి జాతీయ మొబైల్ పర్యవేక్షణ విధానం అమల్లోకి తీసుకువచ్చి, ముఖ హాజరు నమోదు చేసి పని కల్పిస్తూ వేతనం అందిస్తున్నారని తెలిపారు. అయితే యాప్ ఎర్రర్ వచ్చి హాజరు నమోదు కావడంలేదని వాపోయారు. వెంటనే యాప్ ద్వారా హాజరు పద్ధతి రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఏలూరు టౌన్: ఏలూరు కండ్రికగూడెం టైటస్నగర్ ప్రాంతానికి చెందిన ఒక మహిళ తన ఇద్దరు పిల్లల్ని తీసుకుని ఇంటినుంచి వెళ్లి తిరిగి రాలేదని ఆమె అత్త పిల్లనగ్రోవి నవమ్మ ఏలూరు టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాల ప్రకారం కండ్రికగూడెం టైటస్నగర్ ప్రాంతానికి చెందిన పిల్లనగ్రోవి ఝాన్సీ (25) కుమారుడు అశ్విత్ ముఖిల్ అలియాస్ జాషువా (3), కుమార్తె గ్లోరియా (8నెలలు)తో ఈనెల 11న ఇంటినుంచి వెళ్లిపోయింది. దీంతో ఆమె కోసం ఎంత వెదికినా అచూకీ లేకపోవటంతో అత్త నపమ్మ పోలీసులను ఆశ్రయించింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఏలూరు టౌన్: ఏలూరు త్రీటౌన్ పరిధిలో ఒక విద్యార్థిని హాస్టల్ నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదని త్రీటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయటంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విశాఖపట్నం మధురవాడకు చెందిన ఎస్ దీక్షిత (19) తల్లిదండ్రి మరణించడంతో మేనమామ ఆకుల రాజశేఖర్ కుటుంబంతో కలిసి ఉంటుంది. దీక్షితను ఏలూరు సమీపంలోని ఒక డెంటల్ కళాశాలలో చేర్పించగా, ప్రస్తుతం మొదటి ఏడాది విద్య అభ్యసిస్తోంది. ఈ నెల 12న కాలేజీహాస్టల్ నుంచి బయటకు వెళ్లి తిరిగి రాకపోవటం, వెతికినా ఆచూకీ లభించకపోవటంతో విశాఖపట్నం నుంచి వచ్చిన మేనమామ రాజశేఖర్ ఏలూరు త్రీటౌన్ పోలీసులను ఆశ్రయించారు. భీమవరం (ప్రకాశంచౌక్): స్థానిక కలెక్టరేట్ కార్యాలయ ఆవరణలో మంగళవారం ఏపీ షెడ్యూల్ క్యాస్ట్ కో–ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ పథకం పీఎంఏజేఏవై పథకాన్ని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సర్ఫ్) సమన్వయంతో లబ్ధిదారులకు ఆర్థిక సహాయం అందజేశారు. 135 మంది ఎస్సీ ఎస్ హెచ్ జి లబ్ధిదారులకు 1 కోటి 58 లక్షల రూపాయల కార్పొరేషన్ సబ్సిడీతో కూడిన ఉన్నతి, వడ్డీ లేని రుణాలను కలెక్టర్ చదలవాడ నాగరాణి పంపిణీ చేశారు. -
గొంతు తడవాలంటే ట్రాక్టర్ తోయాల్సిందే!
పాలకొల్లు సెంట్రల్: పాలకొల్లు శివారు ప్రాంతాల్లో మంచినీటి సమస్య వేధిస్తుంది. అయితే ఈ ప్రాంత మహిళలకు నీటి కష్టాలతో మరో బంపర్ ఆఫర్ తగిలింది. నీరు కావాలంటే దాన్ని సరఫరా చేసే వాటర్ ట్యాంకర్ తోయాల్సిన పరిస్థితి నెలకొంది. పట్టణంలోని అచ్చుగట్లపాలెం శివారు చిత్రావిచెరువుగట్టు ప్రాంతంలో నివాసం ఉంటున్న ప్రజలకు తాగునీటి కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఇటీవల మండలంలోని యాళ్లవాని గరువు రూరల్ పంచాయతీ చిత్రావిచెరువు గట్టు ప్రాంతంలో నివాసం ఉంటున్న ప్రజలు పంచాయితీ అందించే తాగునీరు వాడకానికి మాత్రమే ఉపయోగిస్తుంటారు. అలా ఉపయోగించిన కలుషితమైన తాగునీటి వల్ల ఒంటిపై దద్దుర్లు, దురదలు రావడంతో ప్రజల్లో కలకలం రేగింది. జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి మెడికల్ అధికారులను పంపించి వైద్య పరీక్షలు చేయించారు. అలాగే రూరల్ ఓహెచ్ఆర్ ట్యాంక్ను శుభ్రం చేయించారు. అయితే ఈ ప్రాంత ప్రజలకు ఎప్పటి నుండో మునిసిపల్ వాటర్ ట్యాంకర్ ద్వారా తాగునీరు అందిస్తున్నారు. ట్యాంకర్ వచ్చిందంటే చాలు ఆ ప్రాంతం మహిళలందరూ క్యూలైన్లో నిలబడి బిందెలు, గిన్నెల్లో ట్యాంకర్ వద్ద నీటిని పట్టుకుని తీసుకుకెళ్తుంటారు. క్యూలో నిలబడి నీళ్లు పట్టుకోవడం ఒక ఎత్తయితే నీళ్లు పట్టుకున్న తరువాత ఆ ట్యాంకర్ను మహిళలే గెంటాల్సి వస్తుంది. లేదంటే ఆ ట్యాంకర్ మొరాయిస్తు అక్కేడే ఉంటుంది. 45 ఏళ్ల ట్రాక్టర్ ఈ ట్యాంకర్ ట్రాక్టర్ సుమారు 1981లో కొనుగోలు చేసినట్లు సమాచారం. అంటే ఇప్పటికి దాదాపు 45 ఏళ్ల నుండి ఎన్ని మరమ్మతులు వచ్చినా ఆ ట్రాక్టర్నే తిప్పుతున్నారు. ఈ ట్యాంకర్ ద్వారా పట్టణంలో సుమారు పది ట్రిప్పులు వరకూ వేస్తుంటారు. పట్టణంలో అచ్చుగట్లపాలెం, సత్యసాయి కాలని, అన్నా క్యాంటీన్, నాగరాజు పేట, ఛాంబర్స్ కళాశాల ప్రాంతం, న్యూ జర్నలిస్ట్ కాలనీ వంటి పట్టణ శివారు ప్రాంతాలకు ట్యాంకర్ ద్వారా తాగునీటిని అఽందిస్తున్నారు. కానీ ఈ ఓల్డ్ ట్యాంకర్ ట్రాక్టర్ చాలా ప్రమాదకరంగా ఉంటుంది. బ్రేకులు, టైర్లు, ఇంజన్ ఆయిల్ కారడం, సెల్ఫ్ లేకపోవడం వంటి అనేక సమస్యలతో సతమతమవుతున్నా ఈ ట్రాక్టర్నే ఉపయోగిస్తున్నారు. అలంకారప్రాయంగా కొత్త ట్రాక్టర్ ట్రాక్టర్పై పర్యవేక్షణ చేయాల్సిన ఇంజనీరింగ్ అధికారులు ఇంకా ఎదురుచూస్తున్నారు. ఉగాది పర్వదినానికి ముందు రోజు తాడేపల్లిగూడెం నుండి మునిసిపల్ కార్యాలయానికి నూతన ట్రాక్టర్ తీసుకువచ్చి భద్రవరిచారు. ఈ ట్రాక్టర్ వాటర్ వర్క్స్కు వచ్చి సుమారు నెల రోజులు కావస్తుంది. మరి ఈ నూతన వాహనాన్ని ఇంకా ఎన్నిరోజులకు ప్రారంభిస్తారో ఆ ఇంజనీరింగ్ అధికారులకే తెలియాలి. ఇప్పటికై నా అధికారులు స్పందించి కొత్త ట్రాక్టర్ ద్వారా నీటిని సరఫరా చేయాలని మహిళలు కోరుతున్నారు. పాలకొల్లు శివారు ప్రాంతాల్లో మంచినీటి సమస్య ట్యాంకర్ ద్వారా నీటి సరఫరా మొరాయిస్తున్న ట్రాక్టర్తో ఇబ్బందులు కొత్త ట్రాక్టర్ అందుబాటులోనే ఉంది. ఇంకా ట్యాంకర్ రావాల్సి ఉంది. రావడానికి మరో నాలుగు రోజులు సమయం పడుతుంది. ఈ వారంలో నూతన వాటర్ ట్యాంక్ వాహనాన్ని ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తాం. పాత వాహనం మొరాయిస్తుంది. ఈ సమస్యను అతి త్వరలోనే పరిష్కరిస్తాం. – రాజ్కుమార్, మునిసిపల్ ఇంజనీర్, పాలకొల్లు -
నాటుసారా విక్రయిస్తే కఠిన చర్యలు
నూజివీడు: నాటు సారా తయారుచేసి విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎకై ్సజ్ శాఖ జిల్లా సూపరింటెండెంట్ ఎ. ఆవులయ్య హెచ్చరించారు. మంగళవారం నూజివీడులోని ఎకై ్సజ్ స్టేషన్ ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా స్టేషన్ లో రికార్డులను పరిశీలించి, సిబ్బందితో సమావేశమయ్యారు. చట్ట విరుద్ధంగా సారా తయారీ, విక్రయాలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజా ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని సారా నివారణ కోసంఅవగాహన కార్యక్రమాలపై దృష్టి పెట్టాలని సూచించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూసారాను నివారించడం వలన నూజివీడు నియోజకవర్గంలో లో నెలలో రూ.5 కోట్ల లిక్కర్ వ్యాపారం పెరిగిందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎకై ్సజ్ సీఐ ఎ.మస్తానయ్య, సిబ్బంది పాల్గొన్నారు. -
అప్రమత్తతే శ్రీరామరక్ష
● వేసవిలో పొంచి ఉన్న అగ్ని ప్రమాదాల ముప్పు ● ఏడాదిగా జిల్లాలో 362 అగ్నిప్రమాదాలు భీమవరం(ప్రకాశం చౌక్): జిల్లాలో ఎండలు మండుతున్నాయి. సూర్యుడు తన ప్రతాపాన్ని ఏప్రిల్లోనే చూపిస్తున్నాడు. ప్రస్తుతం జిల్లాలో రోజుకు 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదవుతుంది. ఎండల తీవ్రత బట్టి వడగాల్పులపై వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. అయితే వేసవిలో అగ్ని ప్రమాదాల ముప్పు పొంచి ఉంటుంది. వేసవిలో అగ్ని ప్రమాదాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అగ్ని ప్రమాదాల్లో ప్రాణాలతో పాటు కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరుగుతుంది. సకాలంలో స్పందించి ప్రాణాలు రక్షించినా అగ్నికి ఆస్తి ఆహుతి కావడం వల్ల సర్వం కోల్పుతున్నారు. నిర్లక్ష్యం, సరైన అవగాహన లేకపోవడంతో వేసవిలో అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వేసవిలో జరిగే అగ్ని ప్రమాదాలపై ప్రజలను అప్రమత్తం చేసేందుకు ప్రతి ఏడాది ఏప్రిల్ 14 నుంచి 20 వరకూ అగ్ని మాపక వారోత్సవాలు నిర్వహిస్తుంటారు. ఈ ఏడాది కూడా ఏప్రిల్ 14 తేదీ నుంచి జిల్లా వ్యాప్తంగా అగ్నిమాపక వారోత్సవాలు ప్రారంభించారు. 20 తేదీ వరకు జిల్లాలోని ఏడు అగ్నిమాపక కేంద్రాల పరిధిలో వారోత్సవాల నిర్వహణకు సంబంధిత అధికారులు ఏర్పాట్లు చేశారు. గతేడాది జిల్లాలో 362 ప్రమాదాలు గతేడాది పశ్చిమగోదావరి జిల్లాలో ఏడు అగ్నిమాపక కేంద్రాల పరిధిలో మొత్తం 362 అగ్ని ప్రమాదాలు సంభవించాయి. వాటిలో అతి ప్రమాదకరమైనవి 2, మధ్యస్థాయి అగ్ని ప్రమాదాలు 21, చిన స్థాయి ప్రమాదాలు 339 జరిగాయి. రూ.18 కోట్ల మేర ఆస్తి నష్టం ఏర్పడింది. రూ.120 కోట్ల ఆస్తి ,30 మంది ప్రాణాలను రక్షించారు. వారోత్సవాలు ఇలా ● ఈ నెల 14న అగ్నిమాపక దళ పతాకావిష్కరణ, విధి నిర్వహణలో అసువులు బాసిన సిబ్బందికి నివాళి, కరపత్రాల ఆవిష్కరణ. ● 15న బస్టాండ్, మాల్స్, మార్కెట్లు, సినిమా థియేటర్లు, మురికివాడల్లో అగ్నిమాపక పరికరాల ప్రదర్శన, అవగాహన కల్పించడం. ● 16న నివాస ప్రాంతాల్లో ముఖ్యంగా అపార్ట్మెంట్ల వద్ద, ఎల్పీజీ సేఫ్టీ, అగ్నిమాపక నియంత్రణ పరికరాల వినియోగం, అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన ● 17న విద్యా సంస్థల్లో మాక్ డ్రిల్, 18న ఎల్పీజీ నిల్వ ఉంచే విధానం, పరిశ్రమల్లో అగ్నిప్రమాదాల నివారణపై అవగాహన, ● 19న ఆస్పత్రుల్లో వైద్యులు, స్టాఫ్ నర్సులు, రోగు లకు అగ్నిమాపక నియంత్రణపై అవగాహన, ● 20న అంగన్వాడీ కేంద్రాలు, స్వచ్ఛంద సంస్థల్లో అగ్నిప్రమాదాల నివారణపై అవగాహన కల్పిస్తారు. అగ్ని ప్రమాదాలు సంభవించకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ● గ్యాస్ స్టౌను సిలిండర్ కన్నా ఎత్తులో ఉంచాలి. వంట గ్యాస్కు కిరోసిన్, డీజిల్, దూరంగా ఉంచాలి. ● చిన్నారులకు అగ్గిపెట్టెలు, లైటర్లు అందుబాటులో ఉంచకూడదు. ● వంట పూర్తయిన వెంటనే రెగ్యులేటర్ను తప్పనిసరిగా ఆపివేయాలి. ● ఐఎస్ఐ మార్కు ఉన్న ఎల్పీజీ సురక్ష ట్యూబులనే వాడాలి. ● గ్యాస్ లీక్ అయితే కిటికిలు, తలుపులు వెంటనే తెరవాలి. ఎలక్ట్రికల్ స్విచ్ ఆన్, ఆఫ్ చేయకూడదు. ● ఇళ్లు వదిలి దూర ప్రాంతాలకు వెళ్లేటప్పుడు విద్యుత్ మెయిన్ ఆఫ్ చేయాలి. ● విద్యుత్ పరికరాలకు నిప్పు అంటుకుంటే మెయిన్ ఆఫ్ చేసి పొడి ఇసుక లేదా డ్రై కెమికల్ పౌడర్ జల్లాలి. ● కాల్చిన సిగరెట్లు, బీడీలు, అగ్గిపుల్లలు ఆర్పివేసి పారేయాలి. ● ఎలక్ట్రిక్ పాయింట్లను ఓవర్ లోడు చేయకూడదు. ● గడ్డివాములను ఇళ్లకు తప్పనిసరిగా 60 అడుగుల దూరంలో వేసుకోవాలి. లాగే గడ్డివాములను సరైన గాలివాటంలో ఏర్పాటు చేసుకోవాలి. ● పశువుల పాకలో పొగ పెట్టె సమయంలో అప్రమత్తంగా ఉండాలి. ● కర్మాగారాల్లో కార్మికులు పని చేసే స్థలాల్లో కనీసం రెండు ఫైర్ ఎగ్జిట్స్ ఏర్పాటు చేయాలి. ● చెత్తచెదారం తగలబెట్టె ముందు నీళ్లు దగ్గర ఉంచుకోవాలి. ● ఇళ్లు, విద్యుత్ వైరు,ట్రాన్స్ఫార్మర్లు వద్ద చెత్తచెదారం తగలబెట్టరాదు. ● ఆరుబయట ఉపయోగించే పోయ్యిల వద్ద వంటలు పూర్తి అయిన వెంటనే పూర్తిగా మంటను ఆర్పివేయాలి. ● మందు గుండు సామాగ్రి వంటివి ఎండలో ఆరబెట్టకూడదు. ● ఇంటిలో బాణసంచా నిల్వ చేయకూడదు. అలాగే అనుమతులు లేకుండా బాణసంచా తయారు చేయకూడదు. జిల్లాలో ఫైర్ స్టేషన్ల నంబర్లు భీమవరం: ల్యాండ్ నంబర్ 08816 233299, సెల్: 9963725882 పాలకొల్లు :ల్యాండ్ నెంబరు 08814 222299, సెల్: 9963726039 నరసాపురం: ల్యాండ్ నెంబరు 08814 275399, సెల్: 9963726487 ఆకివీడు : ల్యాండ్ నెంబరు 088816 252044, సెల్:9963726735 అత్తిలి : ల్యాండ్ నెంబరు 08819 257977, సెల్: 9963726771 తణుకు : ల్యాండ్ నెంబరు 08819 222101, సెల్: 9963725758 తాడేపల్లిగూడెం: ల్యాండ్ నెంబరు 08818 221299 సెల్: 9963725443. వేసవిలో అగ్నిప్రమాదాలకు అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రజలు అగ్ని ప్రమాదాలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలి. ఏటా మాదిరిగానే ఏప్రిల్లో 14 నుంచి 20 వరకూ అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహిస్తాం. వారోత్సవాల సందర్భంగా అగ్నిప్రమాదాలపై అవగాహన కల్పిస్తాం. – బి. శ్రీనివాసరావు జిల్లా విపత్తు స్పందన, అగ్నిమాపక అధికారి -
బైక్ నుంచి జారిపడి..
పెంటపాడు: జట్టు పనిచేసే వ్యక్తి స్వగ్రామం వెళుతూ ప్రమాదవశాత్తూ మృతి చెందాడు. స్థానికులు, పెంటపాడు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బోడపాడు గ్రామానికి చెందిన సబ్బవరపు ధనరాజు (33) ఆదివారం రాత్రి పొద్దుపోయాక పని ముగించుకొని గూడెం నుంచి స్వగ్రామం బోడపాడు మోటార్సైకిల్పై వెళుతుండగా బిళ్లగుంట వద్ద ప్రమాదవశాత్తూ బైక్ నుంచి జారి పడి తీవ్ర గాయాలయ్యాయి, స్థానికులు గమనించి గూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. కాగా చికిత్సపొందుతూ ధనరాజు మృతి చెందాడు. పెంటపాడు ఎస్సై స్వామి ఆధ్వర్యంలో పోస్టుమార్టం చేసి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. గ్రామ మాజీ సర్పంచ్ మట్టా సత్యనారాయణ సహాయ కార్యక్రమాలు పర్యవేక్షించారు. ఏలూరు రూరల్: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా బాస్కెట్బాల్ జట్ల ఎంపిక పోటీలు ఈనెల 16వ తేదీ ఉదయం 8.30 గంటలకు ఏలూరు కస్తూరిభా బాలికల పాఠశాలలో నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ అధ్యక్షుడు కె కృష్ణారెడ్డి, కార్యదర్శి గవ్వ శ్రీనివాసరావు ఓ సంయుక్త ప్రకటనలో తెలిపారు. జూనియర్ బాలికలు, సబ్జూనియర్ బాలబాలికల విభాగంలో ఈ ఎంపికలు ఉంటాయన్నారు. జూనియర్ విభాగంలో పాల్గొనే క్రీడాకారులు జనవరి 1, 2008 తర్వాత, సబ్జూనియర్ విభాగంలో బాలబాలికలు జనవరి 1, 2013 తర్వాత జన్మించిన వారై ఉండాలన్నారు. ఆసక్తి గల గల క్రీడాకారులు పుట్టినతేదీ, ఆధార్ ఒరిజినల్ పత్రాలతో పాటు రెండు పాస్పోర్జు సైజు ఫొటోలతో హాజరుకావాలని సూచించారు. ఎంపికై న క్రీడాకారులు మే నెలలో జరగబోయే అంతర జిల్లాల పోటీల్లో పాల్గొనాల్సి ఉంటుందని వివరించారు. వివరాలకు 94411 71933, 77804 84313 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. పెనుగొండ: సంచలనం సృష్టించిన కోడేరు ఉత్తరం పాలెంలోని కోడి పందేల నిర్వాహకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నెల 11వ తేదీన కోడి పందేల స్థావరంపై దాడి చేసి 42 మందిని అరెస్ట్చేసిన సంగతి పాఠకులకు తెలిసిందే. కాగా, కోడి పందేల్లో కీలకంగా వ్యవహరించిన ఉత్తర పాలెంకు చెందిన ఓ వ్యక్తిని, పోడూరు మండలం కవిటంకు చెందిన మరో వ్యక్తిని అరెస్ట్ చేసి పాలకొల్లు కోర్టులో హాజరుపరిచినట్లు ఎస్సై కట్టా వెంకట రమణ తెలిపారు. ముదినేపల్లి(కై కలూరు): గురజ గ్రామంలో సోమవారం ఓ పాన్ షాప్ వద్ద క్రికెట్ బెట్టింగులు నిర్వహిస్తున్న 8 మందిని ఆదుపులోకి తీసుకుని వారి నుంచి రూ.4,500 నగదు, 7 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై వీరభద్రరావు చెప్పారు. క్రికెట్ బెట్టింగులు నిర్వహించడం నేరమని, చట్టరీత్యా చర్యలు ఉంటాయని ఎస్సై హెచ్చరించారు. -
కూటమి గృహ ప్రవేషాలు
సొంతింటి కల సాకరంమంగళవారం శ్రీ 14 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026సాక్షి, భీమవరం: ఎట్టకేలకు గృహప్రవేశాలు చేయించారన్న ఆనందం టిడ్కో లబ్ధిదారులకు క్షణకాలం నిలవలేదు. మార్చి 30న జిల్లాలోని భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెంలలోని 5,056 ఫ్లాట్లలోకి సామూహిక గృహప్రవేశాలు చేయించినా ఇంత వరకు లబ్ధిదారులకు ఫ్లాట్లు స్వాధీనం చేయలేదు. విద్యుత్, తాగునీరు, ఇతర మౌలిక పరమైన పనులు పూర్తిచేయకపోడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. పట్టణ ప్రాంతాల్లోని పేదల కోసం 2016లో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన అందరికీ ఇళ్లు పథకానికి భీమవరం, పాలకొల్లు, తాడేపల్లిగూడెం, తణుకులో 21,424 మంది లబ్ధిదారులు ఎంపికయ్యారు. టౌన్ షిప్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (టిడ్కో) పర్యవేక్షణలో షీర్వాల్ టెక్నాలజీ పద్దతిలో నాటి టీడీపీ ప్రభుత్వం ఫ్లాట్ల నిర్మాణం చేపట్టింది. 2019 ఎన్నికలకు ముందు ప్రజలను మభ్య పెట్టేందుకు ఫ్లాట్ల నిర్మాణం, మౌలిక వసతుల పనులు పూర్తికాకుండానే అప్పట్లో హడావుడిగా ప్రారంభోత్సవాలు చేయించి చేతులు దులుపుకుంది. కూటమి అధికారంలోకి వచ్చి దాదాపు రెండేళ్లు కావస్తోంది. టిడ్కో లబ్ధిదారులకు మిగిలిన ఫ్లాట్ల అప్పగింత కోసం శ్రావణ మాసం, వంద రోజుల పండుగ, ఏడాది పాలన అంటూ వాయిదాలు వేసుకుంటూ వచ్చారు. ఎట్టకేలకు మార్చి 30న పాలకొల్లు, భీమవరం, తాడేపల్లిగూడెంలో కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు చేతుల మీదుగా ప్రభుత్వం సామూహిక గృహప్రవేశాలు చేయించింది. సొంతింటి కలను సాకారం చేశామంటూ పాలకులు చెప్పుకొచ్చారు. ఇక ఫ్లాట్లలోకి వెళ్లడమే తరువాయి అనుకున్న లబ్ధిదారుల ఆశలపై అసంపూర్తి పనులు నీళ్లు చల్లుతున్నాయి. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు, తాగునీరు తదితర మౌలిక పనులు ఇంకా పూర్తికాక నివాసయోగ్యంగా లేవు. వాటర్ పైపులైన్లకు సంబంధించిన వాల్వులను దొంగలు ఎత్తుకెళ్లడంతో కొత్తవి ఏర్పాటుచేయాల్సి ఉంది. మూడు పట్టణాల్లోని టిడ్కో సముదాయాల వద్ద ఆయా పనులు నత్తనడకన సాగుతున్నాయి. వేలమంది సామూహిక గృహప్రవేశాలు చేసినప్పటికి ఫ్లాట్లు స్వాధీనం చేయక టిడ్కో సముదాయాలు జనసంచారం లేక నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఏళ్ల తరబడి అద్దె ఇళ్లలో కాలం వెల్లదీస్తున్నామని, నెలనెలా ఇంటి అద్దెలకు తోడు ఫ్లాటు కోసం బ్యాంకులు ఇచ్చిన రుణాల వాయిదాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని లబ్ధిదారులు అంటున్నారు. పనులు పూర్తికానప్పుడు గృహప్రవేశాలు చేయించడం ఎందుకని ప్రశ్నిస్తున్నారు. కాగా భీమవరంలో ఫ్లాట్లు పూర్తయ్యాయని, లబ్ధిదారులు విద్యుత్ మీటరుకు దరఖాస్తు చేసుకుని కనెక్షన్ తెచ్చుకుంటే తాళాలు స్వాధీనం చేస్తామని నిర్మాణసంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. ‘పాలకొల్లులో ఆర్భాటంగా 2,016 ఫ్లాట్లలోకి గృహప్రవేశాలు చేయించినా ఇంతవరకు ఒక్క ఫ్లాటు తాళం కూడా లబ్ధిదారులకు అప్పగించలేదు. స్వయంగా మంత్రులు దగ్గరుండి గృహప్రవేశం చేయించిన ఫ్లాట్ల పరిస్థితి అంతే. బ్లాకుల వద్ద ట్రాన్న్స్ఫార్మర్లు పూర్తి స్థాయిలో అమర్చకపోవడం వల్ల కొన్ని ఫ్లాట్లకు విద్యుత్ సౌకర్యం లేదు. డ్రెయినేజి వ్యవస్థ పూర్తి స్థాయిలో నిర్మించలేదు. తలుపులు పాడైపోయాయి’.‘భీమవరం టిడ్కో సముదాయంలో 1920 ఫ్లాట్లలో ఇటీవల సామూహిక గృహప్రవేశాలు అంటూ హాడావుడి చేశారు. రెండు వారాలైనా ఒక్కరికి ఫ్లాటు అప్పగించలేదు. ఇంకా పనులు జరుగుతున్నాయని, ఫ్లాటు ఇచ్చేందుకు కొంత సమయం పడుతుందని టిడ్కో సిబ్బంది చెబుతున్నట్టు లబ్ధిదారులు అంటున్నారు. ఫ్లాట్ల వద్ద ఇంకా విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటు పనులు పూర్తికాలేదు. ఇదిలా ఉండగా లబ్ధిదారులు ఇంకా ఫ్లాట్లలోకి అడుగు పెట్టకుండానే గోడలు, స్లాబులు పగుళ్లు తీస్తుండటం, గుమ్మాలకు చెదలు పట్టి పాడైపోవడం వంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి’.‘తాడేపల్లిగూడెంలోని 1,120 ఫ్లాట్లలో సామూహిక గృహప్రవేశాలు చేశారు. వాటర్ ట్యాంకు నిర్మాణం చేసినప్పటికి బోరు పని పూర్తికాలేదు. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు పూర్తిస్థాయిలో ఏర్పాటుచేయకపోవడం, ఇతర మౌలిక సమస్యలతో నివాస యోగ్యంగా లేవు. దీంతో లబ్ధిదారులు ఫ్లాట్ల వద్దకు వచ్చి ఉసూరుమంటూ వెనుదిరుగుతున్నారు.’ టిడ్కో లబ్ధిదారులతో కూటమి ఆటలు భీమవరం, పాలకొల్లు, తాడేపల్లిగూడెంలో 5,056 ఫ్లాట్లలో గృహ ప్రవేశాలు విద్యుత్, తాగునీటి పనులు పూర్తిచేయకుండానే హడావుడి ఇప్పటికీ ఒక్కరికి ఫ్లాటు అప్పగించని వైనం వైఎస్సార్సీపీ హయాంలో పనులు పూర్తిచేసి 8,736 మందికి అప్పగింత టిడ్కో ఫ్లాట్ల వద్ద పనులు పూర్తిచేసి లబ్ధిదారులకు ఇళ్లను స్వాధీనం చేసేందుకు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం చొరవ చూపింది. తాగునీరు, సెప్టిక్ ట్యాంకు, రోడ్లు, డ్రైన్లు, మౌలిక వసతులతో నివాసయోగ్యంగా పనులు పూర్తయిన మేర జిల్లాలోని 8,736 ఫ్లాట్లను లబ్ధిదారులకు అప్పగించారు. 2019 ఎన్నికల ప్రచారంలో మాట ఇచ్చినట్టుగానే 300 చ.అ ఫ్లాట్లను లబ్ధిదారులకు పూర్తి ఉచితంగా ఇవ్వగా, 365 చ.అ కేటగిరీలో లబ్ధిదారుల డిపాజిట్ సొమ్ము రూ. 50 వేలలో రూ. 25 వేలు, 430 చ.అ కేటగిరీలోని లబ్ధిదారుల డిపాజిట్ సొమ్ము రూ.లక్షలో రూ.50 వేలు మినహాయింపునిచ్చారు. -
పోషకాహారంపై పర్యవేక్షణ కరువు
వారం రోజులుగా నిల్వ ఉన్న అంగన్వాడీ కోడిగుడ్లు ద్వారకాతిరుమల: కొన్ని అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు, గర్భిణులకు, బాలింతలకు అందాల్సిన పౌష్టికాహారం పక్కదారి పడుతోంది. దాంతో లబ్దిదారులకు అవి సక్రమంగా అందడం లేదు. ద్వారకాతిరుమల మండలం వేంపాడులోని బీసీ కాలనీలో ఉన్న అంగన్వాడీ కేంద్రానికి చెందిన కోడిగుడ్లు సోమవారం ఓ ఇంట్లో దర్శనమించ్చాయి. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామంలోని బీసీ కాలనీకి చెందిన అంగన్వాడీ కేంద్రానికి, జెడ్పీ ఉన్నత పాఠశాలకు కలిపి గత మంగళవారం ఉదయం సప్లయర్ సుమారు 600 కోడిగుడ్లను సరఫరా చేశాడు. ఆ సమయంలో కేంద్రానికి వెళ్లే రహదారి నిర్మాణంలో ఉండటంతో వ్యాన్ డ్రైవర్ ఆ కోడిగుడ్లను, హైస్కూల్కు సంబంధించిన చిక్కీలను గ్రామంలోని సరిహద్దు సుజాత ఇంట్లో పెట్టాడు. ఈ విషయన్ని అప్పుడే వారికి తెలియజేశాడు. దాంతో హైస్కూల్ ప్రధానొపాధ్యాయురాలు గౌతమి సూచనలతో ఆ పాఠశాల సిబ్బంది 400 గుడ్లను అదేరోజు సాయంత్రం తీసుకెళ్లిపోయారు. అంగన్వాడీ టీచర్ మాత్రం కోడిగుడ్లను తీసుకెళ్లలేదు. దాంతో గుడ్లను తీసుకెళ్లాలని అంగన్వాడీ టీచర్కు సుజాత పలుమార్లు సూచించింది. అయినా ఆమె స్పందించకపోవడంతో వారం రోజులుగా 200 కోడి గుడ్లు సుజాత ఇంట్లోనే మూలనపడి ఉన్నాయి. పొంతనలేని సమాధానాలు : దీనిపై గుడ్లు సప్లయర్ గాబు నాగు, మరి కొందరు పొంతనలేని సమాధానాలు చెబుతున్నారు. అంగన్వాడీ టీచర్ గత బుధవారం ఫోన్ చేసి గుడ్లు రాలేదని చెప్పగా, పరిశీలించి మళ్లీ పంపుతానని సమాధానం ఇచ్చినట్టు నాగు తెలిపాడు. మళ్లీ ఆమె ఫోన్ చేయకపోవడంతో గుడ్లు అందాయని అనుకున్నానని పేర్కొన్నాడు. తాను అంగన్వాడీ టీచర్కు పలుమార్లు తెలిపానని, అయితే ఆమె నాకు అప్పగించకుండా, గుడ్లు అక్కడ దింపితే ఎలా.. తీసుకెళ్లనని సమాధానమిచ్చినట్టు సుజాత చెబుతోంది. ఈ గుడ్లు హెచ్.లింగపాలెం, చవలవారిగూడెం, వేంపాడు గ్రామాల్లోని అంగన్వాడీ కేంద్రాలకు సంబంధించినవి కావడంతో ఎవరికి వారు తీసుకెళ్లి ఉంటారులే అని టీచర్లు ముగ్గురూ గుడ్లు వదిలేశారని కొందరు అంటున్నారు. వ్యాన్ డ్రైవర్ కనీసం సమాచారం ఇవ్వకుండా సుజాత ఇంటి వద్ద గుడ్లు దింపేశాడు. ఈ నెల 10న అంగన్వాడీ ఆయా సుజాత ఇంటికి వెళ్లి అడగ్గా.. ఆమె గుడ్లు లేవని సమాధానం ఇచ్చినట్టు టీచర్ తెలిపింది. సమాచారం లోపం వల్ల ఈ సమస్య తలెత్తింది. – మేరీ, ఐసీడీఎస్ సూపర్వైజర్ -
శీతల పానీయాల దుకాణాలపై 15 కేసులు
ఏలూరు (ఆర్ఆర్పేట) : వేసవిలో ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకుని శీతల పానీయాలను అధిక ధరలకు విక్రయిస్తున్న వ్యాపారులపై తూనికలు, కొలతల శాఖ అధికారులు కొరడా ఝుళిపించారు. శీతల పానీయాలను అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు ప్రజల నుంచి అందిన ఫిర్యాదుల మేరకు ఆ శాఖ డిప్యూటీ కంట్రోలర్ పీవీ రంగారెడ్డి ఆదేశాల మేరకు నూజివీడు ఇన్స్పెక్టర్ సీహెచ్ వాసుదేవరావు తన సిబ్బందితో కలిసి గత శని, సోమవారాల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. స్థానిక ఆర్టీసీ కొత్త బస్టాండు, పాత బస్టాండు, ఏలూరు రైల్వేస్టేషన్, ఏలూరు రూరల్ పరిధిలోని పలు దుకాణాల్లో ఈ తనిఖీలు నిర్వహించారు. శీతల పానీయాలపై ముద్రించిన ధరలకటే అధిక ధరలకు విక్రయిస్తున్న 15 దుకాణదారులపై కేసులు నమోదు చేశారు. ఈ సందర్భంగా డీసీ రంగారెడ్డి మాట్లాడుతూ నికర ధర కంటే అదనపు ధరకు ఎవరైనా విక్రయిస్తే చట్టరీత్యా కేసులు నమోదు చేసి అపరాధ రుసుము వసూలు చేస్తామని హెచ్చరించారు. -
●పిట్ట పిడికెడు.. తోక బారెడు
మెడ నుంచి తల వరకు నీలం రంగులో, తలపై పెద్ద కొప్పు, బారెడు తోకతో ఆకట్టుకుంటోంది ఈ అరుదైన పక్షి. బయన్నగూడెంలోని ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ మద్దు బాల నాగేశ్వరరావు ఇంటి ప్రాంగణంలోని నేరేడు చెట్టును కొద్దిరోజులుగా ఆవాసంలా మార్చుకుని సంచరిస్తోంది. నేరేడు పండ్లు ఆరగిస్తూ సందడి చేస్తోంది. దీని శాసీ్త్రయ నామం ఆసియన్ పార్యరడైజ్ ఫ్లైక్యాచర్ అని.. మగ పక్షులకు మాత్రమే తోక ఉంటుందని ఆర్నికాలజీ (పక్షి శాస్త్రం)పై అధ్యయనం చేసిన ఎం.తేజవిశ్వనాథ్ తెలిపారు. –కొయ్యలగూడెం -
ప్రాన్ ఫార్మర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం
భీమవరం: ప్రాన్ ఫార్మర్స్ అసోసియేషన్ జిల్లా నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైంది. సోమవారం భీమవరంలో నిర్వహించిన రొయ్యల రైతుల ప్రత్యేక సమావేశంలో నూతన కమిటీ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా మళ్ల తులసీరామ్ (రాంబాబు), గాదిరాజు వెంకటసుబ్బరాజులను ఎన్నుకున్నారు. కోశాధికారిగా కె విజయ్, అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడిగా నంబూరి గజపతిరాజు, పొత్తూరి బాపిరాజు, ప్రత్యేక ఆహ్వానితునిగా వీరవల్లి చంద్రశేఖర్ మరో 45 మంది కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. రొయ్య రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని నూతన కార్యవర్గం తెలిపింది. సంఘ నాయకులు వి సత్యనారాయణ రాజు, భోగిరెడ్డి శ్రీనివాసరావు, రాయపరాజు, కాకర్ల వినయ్, వెంకట్రామయ్య, ముత్యాల బుజ్జి, తోట విజయకుమార్, భాస్కరరాజు, గుండా నర్సింహ రావు పాల్గొన్నారు. -
జంగారెడ్డిగూడెం వాటర్ స్పోర్ట్స్ జట్టు విజయకేతనం
జంగారెడ్డిగూడెం: ఆంధ్రప్రదేశ్ శాప్ లీగ్స్–2026లో భాగంగా నిర్వహించిన వాటర్ స్పోర్ట్స్లో జంగారెడ్డిగూడెం జట్టు పతకాలు సాధించినట్లు జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఎస్ఏ అజీజ్ తెలిపారు. ఈ నెల 11, 12 తేదీల్లో జరిగిన జంగారెడ్డిగూడెం కేకేఎం ఎర్రకాలువ జలాశయంలో జిల్లా స్థాయి వాటర్ స్పోర్ట్స్లో జంగారెడ్డిగూడెం జట్టు ప్రతిభ చూపి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారన్నారు. అలాగే రాష్ట్రస్థాయిలో కయాకింగ్, కానోయింగ్, రోయింగ్, డ్రాగన్ బోడ్ పోటీల్లో అండర్–15, అండర్–18 విభాగాల్లో 11 బంగారు, 5 వెండి, 2 రజత పతకాలు సాధించినట్లు చెప్పారు. ఈ సందర్భంగా క్రీడాకారులను పలువురు అభినందించారు. భీమవరం: తమ పిల్లలను ప్రైవేటు విద్యాసంస్ధల్లో చేర్చే తల్లిదండ్రులు ఆయా విద్యాసంస్థలకు అనుమతులు ఉన్నదీ లేనిదీ నిర్ధారించుకుని, అనుమతులు ఉన్న విద్యాసంస్థల్లోనే చేర్చాలని జిల్లా విద్యాశాఖాధికారి ఇ నారాయణ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో కొన్ని ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు రానున్న విద్యాసంవత్సరం ప్రారంభ అనుమతులు లేకుండా, భవన నిర్మాణాలు పూర్తికాకుండా అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు ప్రచారం చేస్తున్నారని, అలాగే ముఖ్యకూడళ్లలో పెద్ద పెద్ద హోర్డింగ్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఇటువంటి వాటిని అడ్డుకోడానికి మండల విద్యాశాఖాఽధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. అనుమతులు లేని విద్యాసంస్థల హోర్డింగ్లు, ఫ్లెక్సీలు పెట్టుకోడానికి పంచాయతీ, మునిసిపల్ అధికారులు అనుమతులు జారీ చేయవద్దని నారాయణ కోరారు. చింతలపూడి: ఎరగ్రుంటపల్లి గ్రామానికి చెందిన పాములపాటి నారాయణరెడ్డి సతీమణి కమల (86) గత మూడు వారాలుగా అనారోగ్యంతో ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతి చెందారు. ఆమె భౌతికకాయాన్ని ఏలూరులోని ఆశ్రం వైద్య కళాశాలకు దానం చేసి మానవత్వాన్ని చాటుకున్నారు ఆమె కుటుంబ సభ్యులు. కమల కుమారుడు, సింగరేణి విశ్రాంత అధికారి పి. శ్యామ్ సుందర్ రెడ్డి, కుమార్తెలు కంఠం సరళ, జగ్గవరపు సుధారాణి, పాములపాటి రాధారాణి కలిసి కమల భౌతికకాయాన్ని ఆశ్రం వైద్యకళాశాలకు అప్పగించారు. -
పింఛను మంజూరు చేయండి
నాకు బ్రెయిన్ స్టోక్ వచ్చింది. ఎటువంటి ఆధారం లేని నన్ను వృద్ధాప్యంలో ఉన్న తల్లి చూసుకుంటుంది. బతుకు దెరువు కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. పింఛన్ మంజూరు చేసి ఆదుకొవాలని కలెక్టర్కు అర్జీ పెట్టుకున్నాను. – కారుమంచి సీతమ్మ, రేలంగి సుగర్ వల్ల నా ఎడమ కాలు మోకాలి వరకు తొలగించారు. కుడికాలు కూడా దెబ్బతిని కదలలేని స్థితిలో ఉన్నాను. పింఛను కోసం కలెక్టర్కు అర్జీ పెట్టుకున్నాను. ప్రభుత్వం త్వరితగతిన పింఛన్ మంజూరు చేసి ఆదుకోవాలి. – సానబోయిన సీతామహలక్ష్మి, మల్లిపూడి ప్రమాదంలో కాళ్లు, చేతులు తీవ్రంగా గాయపడడంతో కదలలేని స్థితిలో ఉంటున్నాను. చూసేవారు లేక ఇబ్బందులు పడుతున్నాను. ప్రభుత్వం పింఛను మంజూరు చేసి ఆదుకోవాలని కలెక్టర్కు అర్జీ పెట్టుకున్నాను. – నల్లి అబ్రహం లింకన్, చెరుకువాడ -
అంబేడ్కర్ ఆలోచనా విధానం ఆదర్శనీయం
పెంటపాడు: రాజ్యాంగ రూపకర్త అంబేడ్కర్ అలోచన విధానం నేడు ప్రపంచ దేశాలకు ఆదర్శమని శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేన్రాజు పేర్కొన్నారు. పెంటపాడు మండలం ముదునూరులో మాజీ సర్పంచ్ అద్దంకి పెద వెంకటరత్నం కుటుంబసభ్యులు నెలకొల్పిన భారీ అంబేడ్కర్ విగ్రహాన్ని మాజీ ఉపముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణతో కలిసి ఆయన ప్రారంబించారు. ఈ సందర్భంగా మోషేన్రాజు మాట్లాడుతూ.. ప్రపంచంలో పలు యూనివర్శిటీల్లో అంబేడ్కర్ విగ్రహాలను నెలకొల్పడం ఆయన గొప్పతనం చాటిచెబుతుందన్నారు. ఆయన రచనలు పలువురికి ఆదర్శంగా నిలిచాయన్నారు. మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయుడిగా అంబేడ్కర్ నిలిచారన్నారు. అద్దంకి పెదవెంకటరత్నం కుమారుడు విజయరత్నం, వారి కుటుంబసభ్యులను అభినందించారు. -
బాధితుల పట్ల అలసత్వం వద్దు
భీమవరం: పోలీస్ స్టేషన్లకు వివిధ సమస్యలతో వచ్చే బాధితుల పట్ల అలసత్వం ప్రదర్శించకూడదని, బాధితులకు త్వరితగతిన న్యాయం జరిగేలా చూడాలని ఎస్పీ అద్నాన్ నయీం అస్మి ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఎస్పీ బాఽధితుల నుంచి ఫిర్యాదులను స్వీకరించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా 20 ఫిర్యాదులు స్వీకరించి సంబంధిత పోలీసు స్టేషన్ అధికారులతో ఫోన్లో మాట్లాడారు. ప్రతి దరఖాస్తును క్షుణ్నంగా పరిశీలించి నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ యు.రవిచంద్ర, జిల్లా స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ కెవీవీఎన్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. భీమవరం: పేదలకు అండగా ఉంటామని గొప్పగా చెప్పుకుంటున్న ప్రభుత్వం సమాన పనికి సమాన వేతనం ఇచ్చేలా ఆదేశాలు ఎందుకు ఇవ్వడం లేదని శ్రామిక మహిళ జిల్లా కన్వీనర్ డి.కళ్యాణి ప్రశ్నించారు. భీమవరంలో సోమవారం నిర్వహించిన శ్రామిక మహిళా రంగం జిల్లా సదస్సుకు చింతపల్లి లక్ష్మి, ఆర్.భాగ్యలక్ష్మి, గోవిందమ్మ అధ్యక్షత వహించారు. సదస్సులో కళ్యాణి మాట్లాడుతూ అన్నిరంగాల్లో సగ భాగంగా ఉన్న మహిళలకు నేటికీ సరైన గుర్తింపు లేదని, సమాన పనికి సమాన వేతనం లేకపోగా ఉద్యోగ భద్రత, లైంగిక వేధింపులు వంటి అనేక సమస్యలు మహిళలు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. డ్యూటీలో గంటల తరబడి నిలబడే పనిచేయాల్సి వస్తుందని కనీసం వసతులు కల్పించడం లేదని వాపోయారు. సీఐటీయు జిల్లా ప్రధాన కార్యదర్శి బి.వాసుదేవరావు మాట్లాడుతూ శ్రామిక మహిళల సమస్యల పరిష్కారం కోసం సమాన పనికి సమాన వేతనం, ఉద్యోగ భద్రత, లైంగిక వేధింపులు అరికట్టడం వంటి వాటికి సీఐటీయు సంపూర్ణ మద్దతు ఇస్తుందన్నారు. తణుకు అర్బన్: వ్యాపారస్తులు తమ వ్యాపార రవాణాలో ఆర్టీసీ కార్గో సేవలు సద్వినియోగం చేసుకోవాలని ఏపీఎస్ ఆర్టీసీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కమర్షియల్ మేనేజర్ జీఎల్పీవీ సుబ్బారావు పేర్కొన్నారు. సోమవారం తణుకు కార్గో సెంటర్ తనిఖీకి వచ్చిన ఆయన పట్టణంలోని మామిడికాయల వ్యాపారులు, ఇతర పండ్ల వ్యాపారులను కలిసి కార్గో ద్వారా అందిస్తున్న సేవలను వివరించారు. వెంకటేశ్వర థియేటర్ సెంటర్లో కొత్తగా ఏజెంట్ను నియమిస్తున్నట్లుగా చెప్పారు. గతేడాది కన్నా ఈ ఏడాది తణుకు కార్గో ద్వారా డిపోకు రూ. 24 లక్షలు అధికంగా ఆదాయం వచ్చిందని, కార్గో డోర్ డెలివరీ మాసోత్సవాల్లో తణుకు డిపో అత్యధిక డోర్ డెలివరీ బుకింగ్ చేసిందని స్పష్టం చేశారు. తణుకు కార్గో కార్యాలయంలో రెండో బుకింగ్ కౌంటర్ ప్రారంభిస్తామని అన్నారు. ఏలూరు (ఆర్ఆర్పేట): నూజివీడు ట్రిపుల్ ఐటీ (ఆర్జీయూకేటీ)లో పీయూసీ విద్యార్థినులను వేధిస్తున్న అధ్యాపకులపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కే.లెనిన్ డిమాండ్ చేశారు. సోమవారం స్థానిక ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ విద్యార్థినులకు అనుచిత సందేశాలు పంపుతూ, మానసిక వేధింపులకు పాల్పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. బాధిత విద్యార్థినులు ఉన్నతాధికారులకు నేరుగా ఫిర్యాదు చేసినా, కేవలం ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీకి విచారణ అప్పగించి, నివేదిక వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటామని చెప్పి కాలయాపన చేస్తోందన్నారు. -
ఫిర్యాదుల పరిష్కారంపై శ్రద్ధ చూపాలి
భీమవరం (ప్రకాశంచౌక్): జిల్లాలో ప్రజల నుంచి అందుతున్న ఫిర్యాదుల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించి, నాణ్యమైన సేవలందించేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి సూచించారు. కలెక్టరేట్ పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ పాల్గొన్నారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పీజీఆర్ఎస్లో 160 అర్జీలు, రెవెన్యూ క్లినిక్లో 38 అర్జీలు స్వీకరించినట్లు తెలిపారు. ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో, అధికారులు అందిన ప్రతి అర్జీపై బాధ్యతాయుతంగా వ్యవహరించి, నిర్ణీత గడువులోగా పరిష్కారం చూపాలని ఆదేశించారు. అర్జీల పరిష్కారం నాణ్యతతో ఉండి, పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని, అవసరమైతే లబ్ధిదారులతో నేరుగా మాట్లాడి సమస్యను లోతుగా అర్థం చేసుకుని పరిష్కరించాలని సూచించారు. తమ గ్రామంలోని పాలకోడు మురికి కాలువ ఆనుకుని దాదాపుగా 50 ఏళ్లగా ఉంటున్నామని, తమకు ఎక్కడో ఇళ్ల స్థలాలు ఇచ్చారని ఉండి మండలం ఉణుదుర్రు గ్రామానికి చెందిన పలువురు మహిళలు ఫిర్యాదు చేశారు. అక్కడికి వెళ్లలేక ఇక్కడే ఉంటున్నామని తమ ఇళ్లు తొలగించాలని కుట్రలు చేస్తున్నారని, తమకు న్యాయం చేయాలని పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేశారు. మంచి ఆహారపు అలవాట్లు నేర్పాలి పిల్లల సమగ్ర అభివృద్ధికి తల్లిదండ్రులు ప్రతిరోజూ కొంత సమయం కేటాయించి, మంచి ఆహారపు అలవాట్లు అలవర్చేలా మార్గనిర్దేశం చేయాలని కలెక్టర్ సూచించారు. కలెక్టరేట్లో సోమవారం ఎనిమిదో పోషణ్ పక్వాడా– 2026 కార్యక్రమ అమలుపై అధికారులతో సమీక్షించారు. -
మట్టి తవ్వకాలపై రైతుల కన్నెర్ర
పెనుగొండ: మట్టి మాఫియా మరోసారి అక్రమ తవ్వకాలకు ప్రయత్నించడంతో రైతులు అడ్డుకున్నారు. సోమవారం ఆచంటలో నక్కల డ్రెయిన్లో మరోసారి తవ్వకాలు ప్రారంభించడంతో పార్టీలకతీతంగా నాయకులు, పరిసర ప్రాంత రైతులు భారీగా తరలివెళ్లి అడ్డుకొన్నారు. నక్కల డ్రెయిన్ను అభివృద్ధి చేయడం మాని, అక్రమ తవ్వకాలకు పాల్పడుతూ రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ తీవ్ర విమర్శలు చేశారు. అనుమతులు తీసుకున్నామంటూ మట్టి మాఫియా చెప్పడంతో రైతులు వాగ్వాదానికి దిగారు. కొందరు టీడీపీ నాయకుల ఒత్తిడితో పోలీసులు రంగ ప్రవేశం చేసి రైతులను సముదాయించడానికి ప్రయత్నించారు. రైతులు మాత్రం తవ్వకాలకు ససేమిరా అన్నారు. అక్రమ తవ్వకాలు నిలపాలంటూ మంత్రికి వినతిపత్రం అందించినా అధికారులు సహకరించడం లేదన్నారు. మట్టిని యథేచ్చగా తవ్వుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. తప్పుడు వినతి పత్రాలు తయారుచేసి తవ్వకాలకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. అక్రమ తవ్వకాలు నిలపకపోతే ఆందోళన చేపడతామని హెచ్చరించారు. హైకోర్టు అడ్వకేట్ ఐ.రామానుజం తవ్వక ప్రాంతాన్ని పరిశీలించారు. మట్టి తోడేళ్లు విలయ తాండవం చేస్తున్నా జిల్లా అఽధికారులు చర్యలు తీసుకోక పోవడం దారుణమని విమర్శించారు. నక్కల డ్రెయిన్లో తవ్వకాలకు ఎలాంటి అనుమతులు లేవని డ్రెయిన్స్ శాఖ ఏఈ సాయి తెలిపారు. ఎవరికీ అనుమతులు ఇవ్వలేదని చెప్పారు. -
వెంకట్రామన్నగూడెంలో దారుణ హత్య
● కిటికీ అద్దంతో మణికట్టు కోసి హత్యకు పాల్పడిన వైనం ● భార్యపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో దారుణం తాడేపల్లిగూడెం రూరల్: మండలంలోని వెంకట్రామన్నగూడెంలో సోమవారం సాయంత్రం దారుణ హత్య చోటు చేసుకుంది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన దెయ్యాల సూర్యనారాయణ (50) చేతి మణికట్టుపై కిటికీ అద్దంతో కోసి అదే గ్రామానికి చెందిన నాయుడు అలియాస్ కిషోర్ హత్యకు పాల్పడ్డాడు. తీవ్ర రక్తస్రావమైన సూర్యనారాయణ అక్కడ నుంచి గ్రామంలోని ఒక ఇంటి అరుగుపై కుప్పకూలి మృతి చెందాడు. రక్తపు మడుగులో ఉన్న సూర్యనారాయణను చూసి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఆ వెంటనే రూరల్ సీఐ భీమేశ్వర రవికుమార్, ఎస్సై రవికుమార్ తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతుడు సూర్యనారాయణ ఒక ప్రైవేట్ సెక్యూరిటీ సర్వీస్లో పనిచేస్తుండగా, నిందితుడు కిషోర్ స్థానికంగా ఒక చికెన్ సెంటర్లో పనిచేస్తున్నాడు. కిషోర్ భార్యపై సూర్యనారాయణ అనుచిత వ్యాఖ్యలు చేయడమే ఈ దారుణానికి కారణంగా తెలుస్తోంది. ఈ హత్యతో ప్రశాంతంగా ఉన్న గ్రామం ఉలిక్కిపడింది. మృతుని కుటుంబ సభ్యుల రోదనలతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. హత్యకు గల పూర్తి కారణాలు తెలియవలసి ఉంది. -
పర్వతారోహణకు దివ్యాంగ విద్యార్థి
పెంటపాడు: పెంటపాడు ప్రభుత్వ పోస్టుబేసిక్ పాఠశాలలో పదోతరగతి చదువుతున్న దివ్యాంగ విద్యార్థి అన్నంనీడి సత్యనారాయణ లడక్ హై ఆల్టిట్యూడ్ శిక్షణకు ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా సాహస యాత్రకు బయలుదేరుతున్న విద్యార్థిని ప్రత్యేకంగా సోమవారం అభినందించారు. స్కూల్లో 10వ తరగతి చదువుతున్న సత్యనారాయణ చదువులో చురుగ్గా ఉంటాడు. దీంతో పాటు విలీన ఉపాధ్యాయిని సాయి స్వరూప బోధనలో పర్వతారోహణపై ఆసక్తి పెంచుకున్నాడు. సాయి స్వరూప మాట్లాడుతూ డిసెంబర్ 26న అమలాపురం, కడపలో జరిగిన శిక్షణలో ప్రతిభ చూపిన సత్యనారాయణ గండికోట అడ్వెంచర్స్ స్పోర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో నెలరోజుల పాటు శిక్షణ పొందాడన్నారు. తుది స్దాయిలో రాష్ట్రానికి చెందిన 25 మంది దివ్యాంగ విద్యార్థులతో పోటీపడి ఉన్నతశిక్షణకు ఎంపికై న సత్యనారాయణను ప్రత్యేకంగా అభినందించారు. ద్వారకాతిరుమల: అన్నవరం దేవస్థానం ఈఓగా పనిచేస్తున్న వేండ్ర త్రినాథరావును ద్వారకాతిరుమల చినవెంకన్న దేవస్థానానికి పూర్తి అదనపు బాధ్యతలతో ఈఓగా నియమిస్తూ సోమవారం జీఓ జారీ చేశారు. త్రినాధరావుకు ద్వారకాతిరుమల దేవస్థానం ఈఓగా సుదీర్ఘకాలం పనిచేసిన అనుభవం ఉంది. ఆయన హయాంలోనే క్షేత్రంలో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు జరిగాయి. మళ్లీ బదిలీపై ఈయన శ్రీవారి దేవస్థానానికి ఈఓగా నియమితులు కావడం పట్ల ఆలయ సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
ఉప్పుటేరు మార్జిన్కు ముప్పు
భీమవరం అర్బన్: భీమవరం మండలంలోని లోసరి గ్రామంలో ఉప్పుటేరు డ్రైయిన్ ఆనుకుని మార్జిన్ను ఆక్రమార్కులు తవ్వేస్తున్నా.. డ్రైయినేజీ, మత్స్యశాఖ, రెవెన్యూ అధికారులు మాముళ్ల మత్తులో జోగుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత వారంలో ఈ మార్జిన్ తవ్వుతున్నారని సీపీఐ ఆధ్వర్యంలో వినతి పత్రాలు ఇచ్చినా ఇంతవరకూ ఆయా శాఖల అధికారులు కన్నెత్తి చూడలేదు. లోసరిలో ఉప్పు టేరు డ్రైయిన్కు పీడబ్ల్యూడీ మార్జిన్ సుమారు 500 మీటర్లకుపైగా ఉండటంతో కొంతమంది అక్రమార్కులు చేపలు, రొయ్యలు చెరువులు తవ్వడంతో డ్రెయిన్ కుచించుకుపోయింది. దీంతో వర్షాకాలంలో తుఫాన్లు, భారీ వర్షాలు వల్ల వచ్చే వరదనీరు గ్రామాలలోకి చేరి పంట పొలాలు, రొయ్య, చేపల చెరువులు ముంపుకు గురవుతున్నాయి. అవేమీ పట్టించుకోకుండా ఆక్రమార్కులు కిందిస్థాయి ఉద్యోగులకు మాముళ్లిచ్చి తమ పని కానిచ్చుకుంటున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మాముళ్ల మత్తులో అధికారులు : డ్రెయినేజీ, రెవెన్యూ, మత్స్య శాఖ అధికారులు మాముళ్ల మత్తులో జోగుతున్నారన్న విమర్శలు వెల్లువెతున్నాయి. అధికారులు నిర్లక్ష్యం కారణంగా తీర ప్రాంతంలో పల్లపు గ్రామాల ప్రజలు, ఎగువన ఉన్న వరి, చేపలు, రొయ్యలు చెరువుల ముంపునకు గురవుతున్నాయి. అధికారులు స్పందించి వెంటనే ఉప్పుటేరు డ్రెయిన్ను ఆనుకుని పీడబ్ల్యూడీ మార్జిన్ను ఆక్రమించుకున్న వారిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
చిన్నారులపై ట్రాక్టర్ బోల్తా
బాలుడి పరిస్థితి విషమం.. కాలు విరిగిన మహిళ ఉండి: చెరుకువాడలో మట్టి తరలిస్తున్న ట్రాక్టర్ ప్రమాదవశాత్తూ బోల్తా పడిన ఘటనలో ఓ చిన్నారికి ప్రాణాపాయం ఏర్పడగా మరో మహిళ కాలు విరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామంలోని వడ్డిగూడెం ప్రాంతంలో ఆక్వారైతులు తమకు వచ్చే పంట బోదెను పొక్లయినర్ సహాయంతో తవ్వకం చేస్తున్నారు. తవ్విన మట్టిని ప్రమాదం జరిగిన ప్రాంతానికి ఎదురుగా తెచ్చి రైల్వే స్టేషన్కు ఆనుకుని ఉన్న ఖాళీస్థలంలో ట్రాక్టర్ల సహాయంతో పోస్తున్నారు. అయితే అదే మట్టిని తనకు చెందిన ఖాళీస్థలంలో పోయాలని గుర్రం దావీదు అడగడంతో ఓ ట్రాక్టర్ డ్రైవర్ మట్టిని పోసేందుకు వచ్చాడు. మట్టి పోసే సమయంలో ట్రాక్టర్లో చిన్న సమస్య రావడంతో డ్రైవర్ ట్రాక్టర్ దిగి సరిచేస్తుండగా దావీదు ట్రాక్టర్ పైకి ఎక్కి ట్రక్ను పైకి లేపే క్రమంలో అదుపు తప్పి ట్రక్కు మట్టితో సహా ఒక పక్కకు ఒరిగిపోయింది. ఆ సమయంలో ఆ పక్కనే ట్రాక్టర్ను చూస్తున్న ముగ్గురు చిన్నారులపై కొబ్బరి ఆకులదడి, మట్టి పడిపోవడంతో చిక్కుకుపోయారు. గమనించిన స్థానికులు ముగ్గురు పిల్లల్ని బయటకు తీశారు. ఇందులో రెండేళ్ల బాలుడు దావులూరి అయాన్స్ ఆరోగ్య పరిస్థితి ఇబ్బందిగా మారిపోవడంతో హుటాహుటిన ఆకివీడులోని ప్రైవేటు ఆసుపత్రికి అనంతరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో భీమవరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అలాగే బంకమట్టి కాలిపై పడటంతో దావీదు భార్య మేరీ కాలు విరిగింది. ఆమెను కూడా భీమవరం ప్రైవేటు ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. మిగిలిన ఇద్దరు చిన్నారుల ఆరోగ్యానికి ఎటువంటి ఇబ్బంది లేదని స్థానికులు తెలిపారు. గుర్రం దావీదు భార్య మేరీ, బాలుడు దావులూరి అయాన్స్ కాళ్లకూరు నుంచి అమ్మమ్మ ఇంటికి వచ్చాడు. -
పొట్టకూటి కోసం వచ్చి పరలోకాలకు..
భీమడోలు: రోడ్డు దాటుతున్న ఇద్దరు వ్యక్తులను గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. సూరప్పగూడెం జాతీయ రహదారిపై సోమవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. సూర్యాపేట జిల్లాకు చెందిన వరి కోత మెషీన్పై డ్రైవర్లుగా పని చేసేందుకు పంజాబ్ రాష్ట్రంలోని పత్వాల జిల్లా, స్వంతా గ్రామానికి చెందిన సర్ప్రీతిసింగ్, హర్యానా రాష్ట్రానికి చెందిన కురుక్షేత్ర జిల్లా సల్వాన కలణన్ విలేజ్కు చెందిన సుభాష్కుమార్ (39) ఈనెల 4వ తేదీన సూరప్పగూడెం వచ్చారు. వారు అదే గ్రామంలో ఓ ఇంట్లో నివాసముంటున్నారు. ఆదివారం అర్ధరాత్రి తర్వాత నిద్రపట్టకపోవడంతో వారిద్దరు జాతీయ రహదారిపై రోడ్డు దాటుతుండగా గుర్తు తెలియని వాహనం వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సుభాష్కుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు. అతడి మృతదేహాన్ని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టమ్ నిమిత్తం తరలించారు. తీవ్ర గాయాలతో ఉన్న సర్ప్రీత్సింగ్కు మెరుగైన వైద్యం కోసం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న ఎస్సై మదీనా బాషా ఘటనా స్థలాన్ని పరిశీలించారు. సర్ప్రీత్సింగ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రోడ్డు దాటుతుండగా ఢీకొట్టిన గుర్తు తెలియని వాహనం ఒకరి దుర్మరణం, మరొకరికి తీవ్ర గాయాలు సూరప్పగూడెం జాతీయ రహదారిపై ప్రమాదం -
వైభవంగా శ్రీనివాసునికి గరుడోత్సవం
ద్వారకాతిరుమల: శ్రీవారి ఆలయానికి దత్తత దేవాలయమైన లక్ష్మీపురంలోని శ్రీ సంతాన వేణుగోపాల జగన్నాధ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో జరుగుతున్న శ్రీనివాసుని కల్యాణ మహోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి స్వామివారికి గరుడోత్సవం కన్నులపండువగా జరిగింది. ఆలయం నుంచి పక్క గ్రామమైన తిమ్మాపురం వరకు ఉత్సవం నిర్వహించారు. ముందుగా ఉభయ దేవేరులతో స్వామివారిని గరుడ వాహనంపై ఉంచి ప్రత్యేక పుష్పాలంకారాలు చేశారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, అర్చకులు, పండితుల వేద మంత్రోచ్ఛరణలు, భక్తుల గోవింద నామస్మరణల నడుమ జరిగిన ఈ ఉత్సవానికి తిమ్మాపురం ప్రజలు నీరాజనాలు అర్పించారు. -
విలపింఛెన్
భీమవరం (ప్రకాశం చౌక్): కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి రెండేళ్లు గడుస్తున్నా ఇప్పటివరకు నూతన పింఛన్ల మంజూరుపై దృష్టి పెట్టకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. దీంతో అర్హత కలిగి ఉన్నవారికి సైతం పింఛన్ మంజూరు కావడం లేదు. జిల్లాలో కొత్త పింఛన్ల మంజూరు కోసం అర్హత కలిగిన వారు దాదాపు 20 వేల మంది ఉన్నారు. వారిలో అధికంగా వృద్ధులు, దివ్యాంగులు ఉన్నారు. అలాగే కదలేని స్థితిలో ఉండి రూ.15 వేలు పింఛను మంజూరు చేయాలని కోరుతున్న వారు దాదాపు 500 నుంచి 1000 మంది వరకు ఉన్నారు. పింఛను పెంచి ఇస్తున్నామని సీఎం చంద్రబాబు, కూటమి నేతలు ప్రచారంతో ఊదరగొడుతున్నా వేలాది మంది అభ్యాగులకు కనీసం పింఛను మంజూరు కాక అవస్థలు పడుతున్నారు. పింఛన్ల కోసం వినతుల వెల్లువ ప్రతి సోమవారం జిల్లా కలెక్టరేట్లో జరిగే జిల్లా స్థాయి పీజీఆర్ఎస్కు వచ్చే అర్జీల్లో అధిక శాతం అన్ని రకాల పింఛన్లకు సంబంధించి ఉంటున్నాయి. ఈ విషయం కూటమి ప్రభుత్వానికి తెలిసి కూడా కొత్త పింఛన్లు మంజూరు చేయకుండా కాలయాపన చేస్తోంది. జిల్లా నలుమూల నుంచి దివ్యాంగులు, వృద్ధులు, వితంతువులు, ఆరోగ్యం దెబ్బతిన్న వారు పింఛను మంజూరు చేయండి మహోప్రభో అని దూర ప్రాంతాల నుంచి మండుటెండలో అవస్థలు పడుతూ కలెక్టరేట్కు వచ్చి అర్జీలు పెట్టుకుంటున్నారు. దీనిపై అధికారులు దరఖాస్తుదారులకు ఏం చెప్పాలో తెలియక సతమతమవుతున్నారు. బతుకు దెరువు కోసం కష్టాలు భర్త చనిపోయినవారు, వృద్ధాప్యంతో బాధపడుతున్నవారు, దివ్యాంగులు ప్రభుత్వం నుంచి పింఛను రాక బతుకు దెరువు కోసం అనేక కష్టాలు పడుతున్నారు. ఒక రోజు యోగా కోసం వందల కోట్లు ఖర్చు పెడుతున్న ప్రభుత్వం.. నూతన పింఛన్లు మంజూరులో జాప్యం చేయడం సరికాదని పలువురు బహిరంగంగా విమర్శిస్తున్నారు. కొత్త పింఛన్లు మంజూరు చేయని కూటమి ప్రభుత్వం నూతన పింఛన్ల కోసం దాదాపు 20 వేల మంది ఎదురుచూపులు పింఛన్లు మంజూరు చేయాలని అధికారుల చుట్టూ తిరుగుతున్న వైనం దివ్యాంగుల పింఛను పెంచాలని లబ్ధిదారుల మొర -
రొయ్యల చెరువులో విషప్రయోగం
అత్తిలి: గుర్తుతెలియని వ్యక్తులు రొయ్యల చెరువులో విష ప్రయోగం చేయడంతో రొయ్యలు మృతిచెందిన ఘటన పశ్చిమగోదావరి జిల్లా అత్తిలి మండలం ఆరవల్లిలో జరిగింది. దీనిపై బాధితుడు అత్తిలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆరవల్లి గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు, మాజీ సర్పంచ్ వెలగల అమ్మిరెడ్డి, ఆయన సోదరులు స్కిన్నెరపురం, కంచుమర్రు గ్రామాల సరిహద్దులో ఉన్న 4.20 ఎకరాల చెరువును లీజుకు తీసుకుని కొన్నేళ్లుగా రొయ్యల సాగు చేస్తున్నారు. చెరువులో 3 లక్షల పిల్లలను వేయగా ప్రస్తుతం 94 కౌంట్కు చేరుకున్న రొయ్యలను మరో వారం రోజుల్లో పట్టుబడి పట్టనున్నారు.ఈ తరుణంలో రొయ్యల చెరువులో విష ప్రయోగం జరగడంతో సుమారుగా ఆరు టన్నుల రొయ్యలు మృతిచెందినట్లుగా చెబుతున్నారు. వీటి విలువ సుమారుగా రూ.15.90 లక్షలు ఉంటుందని బాధితుడు వెలగల అమ్మిరెడ్డి వెల్లడించారు. దీనిపై ఆయన అత్తిలి పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు చెరువును పరిశీలించి దర్యాప్తు చేపట్టారు. దీనిపై వెలగల అమ్మిరెడ్డి మాట్లాడుతూ ఆరవల్లిలో తనను రాజకీయంగా ఎదుర్కోలేకే తన కుటుంబానికి చెందిన రొయ్యల చెరువులో గ్రామానికి చెందిన కొందరు టీడీపీ నాయకులు విషం కలిపారని ఆరోపించారు. -
సుబ్రహ్మణ్యేశ్వరా.. శరణు.. శరణు..
ముదినేపల్లి (కై కలూరు): రాష్ట్రంలో ప్రసిద్ధి గాంచిన ముదినేపల్లి మండలం, శింగరాయపాలెం–చేవూరుపాలెంలో కొలువైన వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో భక్తులు ఆదివారం పోటెత్తారు. స్వామివారికి ఆలయ ప్రధాన అర్చకుడు తోలేటి వీరభద్రశర్మ ప్రత్యేక అభిషేకాలు చేశారు. దేవస్థాన ఆవరణలో పుట్టిలో వెలిసిన స్వామివారికి అనేక మంది భక్తులు పాలు పోసి మొక్కులు తీర్చుకున్నారు. ముఖ్యంగా ఓ జంట యజ్ఞాన్ని నిర్వహించి నాగ ప్రతిష్ట చేశారు. ఆలయ సహాయ కమిషనరు, కార్యనిర్వహణాధికారిణి ఆర్.గంగా శ్రీదేవి, ఆలయ చైర్మన్ బొంగు రవికుమార్ ఆధ్వర్యంలో భక్తులకు ఉచిత అన్నప్రసాదాన్ని నిర్వహించారు. కామవరపుకోట: స్థానిక రామన్నపాలెం రోడ్డులోని తపస్య ఎడ్యుకేషనల్ స్కూల్, జూనియర్ కాలేజీలో ఏలూరు చెస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కిరణ్ కుమార్ పాలూరి, సెక్రటరీ కన్నా సూర్య నాగేశ్వరరావు ఆధ్వర్యంలో జిల్లాస్థాయి అండర్ 9 చెస్ పోటీలు నిర్వహించారు. ఏలూరుకు చెందిన బాలురు విభాగంలో శివనాగ్ 4 పాయింట్లు, అఖిలేష్ 3 పాయింట్లు, బాలికల విభాగంలో చిర్నవి 3 పాయింట్లు, బిస్మి యాస్మిన్ జారా 2 పాయింట్లు సాధించి ఎంపికయ్యారు. విద్యాసంస్థల యాజమాన్యం జగన్ పాల్గొన్నారు. ముసునూరు: మండలంలోని చింతలవల్లిలో రూ.4.02 కోట్లతో నిర్మించ తలపెట్టిన 33/11 కేవీ విద్యుత్తు ఉప కేంద్ర నిర్మాణానికి ఆదివారం గృహ నిర్మాణ శాఖా మంత్రి కొలుసు పార్థసారధి భూమి పూజ చేశారు. అనంతరం రూ.83 లక్షలతో నిర్మించిన అంతర్గత సీసీ రహదారులను ప్రారంభించారు. కార్యక్రమంలో ఏపీ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ డైరెక్టరు టీవీఎన్ఎస్.మూర్తి, ఎస్ఈ యు.హనుమయ్య, విద్యుత్ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులు, మహిళలు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం: పట్టణంలో ఓ ఇంట్లోకి ప్రేవేశించిన పామును స్నేక్ సేవియర్స్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షుడు చదలవాడ క్రాంతి చాకచక్యంగా పట్టుకున్నారు. జంగారెడ్డిగూడెం గ్రాండ్–2 సాయి బాలాజీ టౌన్షిప్ 3వ రోడ్లో దినేష్పటేల్ మార్వాడి వ్యాపారి ఇంట్లోకి నాలుగు అడుగుల గోధుమ తాచుపాము ప్రవేశించింది. ఆదివారం ఉదయం నిద్రలేచి ఇంట్లో నుంచి బయటకు రాగానే గుమ్మం వద్ద గోధుమ తాచు పడుకుని ఉంది. భయభ్రాంతులకు గురైన దినేష్ పటేల్ వెంటనే స్నేక్ సేవియర్స్ సొసైటీకి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి వచ్చిన క్రాంతి పామును చాకచక్యంగా పట్టుకుని సమీపంలోని అటవీప్రాంతలో విడిచిపెట్టాడు. కై కలూరు: కొల్లేటికోట పెద్దింట్లమ్మ దేవస్థానంలో ఆదివారం భక్తులు పోటెత్తారు. పవిత్ర కోనేరులో స్నానాలు ఆచరించి అమ్మకు వేడి నైవేద్యాలను సమర్పించారు. ఆలయ ప్రధాన అర్చకుడు పేటేటి పరమేశ్వరశర్మ పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో కూచిపూడి శ్రీనివాసు మాట్లాడుతూ ఒక్క అదివారం మాత్రమే ప్రత్యేక, అంతరాలయ దర్శనాలు, కేశఖండన, పెద్ద, చిన్న తీర్థాలు, లడ్డూ ప్రసాదం, గదుల అద్దెలు, అమ్మవారి చిత్రపటాల విక్రయం, వాహన పూజలు, విరాళాల ద్వారా మొత్తం రూ.84,926 ఆదాయం వచ్చిందని తెలిపారు. అమ్మ దర్శనానికి విచ్చేసిన భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించామని ఈవో చెప్పారు. -
గూడెంలో రేషన్ దందా
తాడేపల్లిగూడెం: పట్టణంలో ఇద్దరు యువకులు రేషన్ దందా సాగిస్తున్నారు. పట్టణం, పరిసర ప్రాంతాల్లో రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేసి, సరిహద్దులు దాటించి సొమ్ము చేసుకుంటున్నారని ప్రచారం సాగుతోంది. ఇందులో ఒకరు స్లీపింగ్, మరొకరు యాక్టివ్ పార్టనర్గా కొనసాగుతున్నారు. స్లీపింగ్ పార్టనర్గా చెప్పుకొనే వ్యక్తి గతంలో దొంగ బియ్యాన్ని కొనుగోలు చేసే మిల్లుల సమాచారం తెలుసుకొని ఇతరులకు ఉప్పు అందించి సొమ్ములు చేసుకొనేవాడని ప్రతీతి. ప్రస్తుతం అతడు అక్రమ బియ్యంలో ఉండడమే కాక, ఒక పెద్దతలకాయ పేరు చెప్పి ఉద్యోగుల బదిలీలు చక్కపెడుతున్నాడంటున్నారు. ఏడాదికి ముందు రేషన్ మాఫియా సవితృపేటకు చెందిన వారసత్వ బియ్యం అక్రమ రవాణా చేసే ఒక కుటుంబంలో ఉండేదనేది బహిరంగ రహస్యం. పెదతాడేపల్లి మార్గంలో ఎరువుల గోదాములు కేంద్రంగా అక్రమ బియ్యం నిల్వలు చేసి, జిల్లాను దాటించి సొమ్ములు చేసుకొనే వారు. విజిలెన్సు దాడులు జరిగినా కూడా అక్రమ వ్యవహారాలకు అడ్డుకట్ట పడలేదు. చివరికి వ్యవహారం తలబొప్పి కట్టేలా తయారవుతున్న తరుణంలో ఈ అక్రమ వ్యవహారానికి బలవంతంగా బ్రేక్ వేశారు. అక్రమ రేషన్ వ్యవహారం తాత్కాలికంగా ఆగినట్టుగా కనిపించినా ఏడాదిగా మళ్లీ పురుడుపోసుకుంది. ఈ నూతన ద్వయం అక్రమ రేషన్ వ్యవహారం యథేచ్ఛగా సాగిస్తోంది. యాక్టివ్గా ఉన్న భాగస్వామి ఇటీవల అక్రమ బియ్యం తరలిస్తున్న తరుణంలో విజిలెన్స్ అధికారులు భీమడోలులో బియ్యం పట్టుకున్నారు. పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో, ఆరో వార్డులోని మామిడితోటలోనూ బియ్యాన్ని అధికారులు పట్టుకున్నారు. అయినప్పటికీ అక్రమ రేషన్ వ్యాపారం మూడు మూటలు, ఆరు బస్తాలుగా సాగుతోందని తెలుస్తోంది. పెద్దతలకాయల పేరుచెప్పి స్లీపింగ్ పార్టనర్ పేట్రేగిపోతున్న వ్యవహారం కూడా చర్చనీయాంశమైంది. దీనిపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. రేషన్ మాఫియా సాగిస్తున్న నయా ద్వయం విచ్చలవిడిగా అక్రమ బియ్యం వ్యాపారం మా వెనుక పెద్దలున్నారంటూ బ్లాక్ మెయిలింగ్ -
స్వచ్ఛతకు ‘కృష్ణా’ర్పణం
ఏలూరు (టూటౌన్): అపరిశుభ్రమైన ప్రస్తుత కృష్ణా నది జలాలను పంపుల చెరువులో నింపొద్దని నగర ప్రజలు కోరుతున్నారు. ఏలూరు ప్రజానీకానికి వేసవి దాహార్తిని తీర్చేందుకు పంపుల చెరువు నింపడం కోసం విజయవాడ నుంచి కృష్ణా నది జలాలను కిందికి, ఏలూరు కృష్ణా కెనాల్ లోకి వదిలారు. అయితే ప్రస్తుతం కృష్ణా కెనాల్లోకి వస్తున్న, కాలువలో ప్రవహిస్తున్న నీరు చాలా అపరిశుభ్రంగా, కలుషితంగా, దుర్వాసనతో మురుగు నీటిలా ఉన్నాయి. ఈ అపరిశుభ్రమైన నీటిని పడమటి లాకుల ద్వారా కిందికి వదిలి పరిశుభ్రమైన నీరు వచ్చిన తర్వాతనే పంపుల చెరువులు నింపాలని ఐఎఫ్టీయూ ఏలూరు నగర కమిటీ మున్సిపల్, ప్రభుత్వ అధికారులను కోరింది. ఈ మేరకు ఐఎఫ్టీయూ బృందం ఆదివారం పడమటిలాకుల వద్ద కృష్ణా కెనాల్ నీటిని పరిశీలించారు. అనంతరం పంపుల చెరువు వద్ద నీటిని పరిశీలించారు. మూడు నెలల తర్వాత కృష్ణా కాలువకు నీరు ఏలూరు నగరానికి గోదావరి, కృష్ణా జలాలలతో వేసవిలో దాహార్తిని తీర్చేందుకు ఒక పక్క అధికారులు కసరత్తు చేస్తున్నారు. అయితే కృష్ణా కాలువకు విజయవాడ ఎనికేపాడు వద్ద బుడమేరుకు అండర్ టన్నెల్ నిర్మిస్తున్న కారణంగా గత మూడు నెలలుగా ఏలూరుకు వచ్చే కృష్ణా కాలువను మూసివేశారు. ప్రస్తుతం వేసవిలో దిగువ ప్రాంతాల్లోని తాగునీటి చెరువులకు నీటిని అందించే ఉద్దేశ్యంతో ఇటీవల నీటిని విడుదల చేశారు. కానీ ఎగువ ప్రాంతంలో కాలువలో ఉన్న వ్యర్థాల కారణంగా దిగువ ఏలూరు వచ్చేసరికి కృష్ణా కాలువ నీరు కలుషితంగా మారుతోంది. ఈనెల 7వ తేదీ సాయంత్రానికి ఏలూరు చేరుకున్న కృష్ణా నీరు పంపుల చెరువులోకి తోడేందుకు పనికి రాకుండా పోయింది. తాగునీటికి పనికిరావంటూ రిపోర్టు ప్రస్తుతం కృష్ణా కాలువలో వస్తున్న నీరు తాగునీటికి పనిరావంటూ ల్యాబ్ రిపోర్టు వచ్చినట్లు మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులు చెబుతున్నారు. మురుగు నీరు ఆగిపోయిన తర్వాతనే కృష్ణా కాలువ నీటిని పంపుల చెరువులోకి తోడటం జరుగుతుందని అంటున్నారు. మరో పక్క కాలువలోకి కొద్ది రోజులు మాత్రమే నీరు విడుదల చేస్తారనే కారణంగా చెరువును నింపేందుకు మున్సిపల్ అధికార యంత్రాంగం తొందర పడుతున్నట్లు కన్పిస్తోంది. అయితే మురుగు నీరు పూర్తిగా దిగువ కొల్లేరులోకి వదిలేసిన తర్వాతనే శుభ్రమైన నీరు వచ్చాకే పంపుల చెరువులోకి నీటిని మళ్లించాలని నగర ప్రజలు కోరుతున్నారు. తాగునీరు.. తాగలేరు ప్రస్తుతం కృష్ణా కాలువలో కలుషిత వ్యర్థాలతో కూడిన నీరు ప్రవహిస్తోంది కాలువలో పరిశుభ్రమైన నీరు వచ్చాకనే కృష్ణా నీటిని పంపుల చెరువులోకి నింపాలి. లేని పక్షంలో ఉన్న నీరు మొత్తం కలుషితమయ్యే ప్రమాదం పొంచి ఉంది. గతంలో ఏలూరు ప్రజలు తెలియని వింత రోగాలతో బాధపడిన సంఘటన గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. అధికార యంత్రాంగం ముందస్తు చర్యలు తీసుకుని జాగ్రత్తలు పాటించాలి. – బి.సోమయ్య, నగర అధ్యక్షుడు, ఇఫ్టూ ఏలూరు నగర కమిటీ, ఏలూరు డ్రెయినేజీ నీటిని తలపిస్తున్న కృష్ణా నీరు ఆ నీటినే పంపుల చెరువులోకి నింపేందుకు సిద్ధమవుతున్న యంత్రాంగం మురుగు నీరు నింపడంపై నగరవాసుల్లో ఆందోళన స్వచ్ఛమైన నీటినే చెరువులోకి పంపింగ్ చేయాలని డిమాండ్ -
నెరవేరని సొంతింటి కల
● వైఎస్పార్ కాలనీలో నిలిచిపోయిన ఇళ్ల నిర్మాణాలు ● రుణం కోసం లబ్ధిదారుల ఎదురుచూపులు ● పట్టించుకోని కూటమి ప్రభుత్వం మండవల్లి: పేదల సొంతింటి కళ నెరవేరే పరిస్థితి కనిపించడం లేదు. కూటమి ప్రభుత్వం కక్షపూరిత ధోరణే ఇందుకు కారణంగా కనిపిస్తోంది. గత వైఎస్ జగన్ ప్రభుత్వం పేదలకు సొంతిల్లు సమకూర్చేందేకు వైఎస్సార్ కాలనీలో ఇళ్ల స్థలాలు కేటాయించింది. వారు ఇళ్లు నిర్మించుకునేందుకు సైతం రుణం మంజూరు చేసింది. ఈ క్రమంలో చాలా చోట్ల పేదలు ఇళ్లు నిర్మించుకున్నారు. అయితే తరువాత ఎన్నికలు రావడంతో ప్రభుత్వం మారిపోవడం జరిగిపోయింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత వైఎస్సార్ కాలనీలోని ఇళ్ల నిర్మాణాలపై పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. దీంతో వైఎస్సార్ కాలనీలో మౌలిక సౌకర్యాలు లేక, రుణం మంజూరు కాకపోవడంతో ఇళ్లు నిర్మించుకునే వీలు లేక లబ్ధిదారులు నానా అవస్థలు పడుతున్నారు. మండవల్లిలోని వైఎస్సార్ కాలనీలో 174 మందికి ఒక్కొక్కరికీ సెంటున్నర చొప్పున ఇళ్ల స్థలాలు గతంలో కేటాయించారు. 74 ఇళ్లు వివిధ దశల్లో నిర్మాణాలు జరుగుతున్నాయి. కొన్ని ఫౌండేషన్ దశలో, 30 ఇళ్లకు భీములు పోసి, మరో 10 ఇళ్లు శ్లాబ్ దశలో, 10 ఇళ్లు పూర్తికాబడి ఉన్నాయి. మిగిలిన వంద మంది లబ్ధిదారులకు రుణ సౌకర్యం మంజూరు కాకపోవడంతో ఇళ్ల నిర్మాణాలు ప్రారంభం కాలేదు. రుణ సౌకర్యం కలిగిస్తేనే గృహాలు నిర్మించుకోగలమని చెబుతున్నారు. మౌలిక వసతులు శూన్యం కాలనీ పొలాల మధ్యలో ఉండడం.. ఇక్కడ ఎలాంటి తాగునీటి వసతి కల్పించకపోవడంతో కాలనీలోని లబ్ధిదారులు తాగునీటికి నానా ఇబ్బందులు పడుతున్నారు. అలాగే కాలనీకి వెళ్లే రహదారి పల్లపు ప్రదేశంలో ఉండటంతో వర్షం నీరు నిలిచిపోయి రాకపోకలు సాగించడానికి అవస్థలు పడుతున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి వైఎస్సార్ కాలనీలో మౌలిక సౌకర్యాలు కల్పించడంతోపాటు, మిగిలిన లబ్ధిదారుల ఇళ్ల నిర్మాణాలకు రుణాలు మంజూరు చేయాలని పలువురు కోరుతున్నారు. అస్తవ్యస్తంగా కాలనీ రహదారి మండవల్లి వైఎస్సార్ కాలనీలో ఇళ్ల నిర్మాణాల పరిస్థితి సుమారు 100 ఇళ్లు రుణ సౌకర్యం లేక ఖాళీ స్థలాలతో ఉన్నాయి. లబ్ధిదారులంతా రెక్కాడితే గానీ డొక్క నిండని పేదవారు. ప్రభుత్వం రుణ సౌకర్యం కల్పిస్తేనే ఇళ్ల నిర్మాణాలు ప్రారంభమవుతాయి. అధికారులు త్వరితగతిన వారికి రుణాలు మంజూరు చేయాలి. – సుంకర కనకరాజు, మండవల్లి కాలనీలో ఉన్నవారందరూ పేదలే. ప్రభుత్వం రుణం మంజూరు చేయకుండా ఇంటి నిర్మాణాలు ప్రారంభించడం కష్టమే. స్థలాలు ఉన్నా ఇళ్ల నిర్మాణాలు జరుగకుంటే ప్రయోజనం లేదు. అధికారులు లబ్ధిదారులందరికీ రుణాలు మంజూరు చేసి సహకరించాలి. – రాజేంద్ర, మండవల్లి -
శ్రీవారి దేవస్థానం ఈఓగా వేండ్ర త్రినాథరావు
ద్వారకాతిరుమల: అన్నవరం శ్రీ వీరవెంకట సత్యన్నారాయణ స్వామివారి దేవస్థానం ఈఓ వేండ్ర త్రినాథరావును, ద్వారకాతిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి దేవస్థానం ఈఓగా నియమించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నియామకానికి సంబంధించిన జీఓ మరో రెండు రోజుల్లో విడుదల కానుంది. రాజమహేంద్రవరం ఆర్జేసీగా పనిచేస్తున్న ఆయన్ను గతేడాది డిసెంబర్ 9న అన్నవరం దేవస్థానం ఈఓగా పూర్తి అదనపు బాధ్యతలతో నియమించారు. అయితే ద్వారకాతిరుమల దేవస్థానం ఈఓగా పనిచేసిన ఎన్వీఎస్ఎన్ మూర్తి గతేడాది డిసెంబర్ 31తో పదవీ విరమణ పొందగా, అప్పటి ఇదే దేవస్థానంలో డీఈఓగా పనిచేస్తున్న యర్రంశెట్టి భద్రాజీ ఇన్చార్జి ఈఓగా విధులు నిర్వర్తిస్తున్నారు. త్రినాథరావు ఈఓగా బాధ్యతలు చేపట్టిన తరువాత, భద్రాజీ మళ్లీ డీఈఓగా ఇదే దేవస్థానంలో కొనసాగుతారు. టి.నరసాపురం: బంగారం, వెండి ఆభరణాల చోరీపై బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు హెచ్సీ ఎం.రాజు తెలిపారు. ఏపిగుంట గ్రామానికి చెందిన యిర్ల సత్యనారాయణ ఈ నెల 10న భార్యతో కలిసి జంగారెడ్డిగూడెంలో బంధువుల గృహ ప్రవేశానికి వెళ్లారు. తిరిగి ఈ నెల 11న ఇంటికి వచ్చేసరికి ఇంటి తాళం పగులగొట్టి ఉంది. బీరువాలోని 24 గ్రా. బంగారం, 1050 గ్రా. వెండి ఆభరణాలు అపహరణకు గరైనట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
వనరూపిణి.. వర ప్రదాయిని
బుట్టాయగూడెం: బుట్టాయగూడెం మండలం కామవరం సమీపంలో అటవీప్రాంతంలో కొలువై ఉన్న గుబ్బల మంగమ్మ గుడికి ఆదివారం భక్తులు పోటెత్తారు. ద్విచక్ర వాహనాలు, ఆటోలు, ప్రత్యేక బస్సుల్లో తెల్లవారుజాము నుంచే భక్తులు అమ్మవారి సన్నిధికి చేరుకున్నారు. విజయవాడకు చెందిన భక్తులు డప్పు వాయిద్యాల నడుమ అమ్మవారికి నైవేద్యాలను సమర్పించారు. అధికంగా తరలివచ్చిన భక్తుల వల్ల ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయ కమిటీవారితోపాటు పోలీసులు కూడా బందోబస్తు నిర్వహించారు. ఉండి: ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొన్న ప్రమాదంలో ఓ మహిళ దుర్మరణం పాలైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఉంగుటూరు మండలం బొమ్మిడి గ్రామానికి చెందిన నాగరాజు నర్సింహరాజు, అతని భార్య ఉదయశ్రీ (50) పెదపుల్లేరులో మల్లిఖార్జునస్వామి ఆలయ ప్రతిష్టకు ద్విచక్రవాహనంపై వెళ్తున్నారు. ఉండి రైల్వే గేటు దాటిన వెంటనే వీరి ద్విచక్రవాహననాన్ని వెనక నుంచి లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనం వెనుక కూర్చుని ఉన్న ఉదయశ్రీ కింద పడిపోవడం, ఆమైపె నుంచి లారీ వెళ్లడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. లారీ విడిచిపెట్టి డ్రైవర్ పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఉదయశ్రీ మృతదేహాన్ని భీమవరం ప్రభుత్వాసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు హెడ్ కానిస్టేబుల్ యెషయా కేసు నమోదు చేశారు. -
శ్రీనివాస కల్యాణం.. కడు రమణీయం
ద్వారకాతిరుమల: శ్రీవారి ఆలయానికి దత్తత దేవాలయమైన లక్ష్మీపురంలోని శ్రీ సంతాన వేణుగోపాల జగన్నాధ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఆదివారం రాత్రి శ్రీనివాసుని దివ్యకల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, అర్చకులు, పండితులు, ఆగమ విద్యార్థుల వేద మంత్రోచ్ఛరణల నడుమ జరిగిన ఈ కల్యాణ తంతు భక్తులకు నేత్రపర్వమైంది. ముందుగా ఆలయంలో స్వామి, అమ్మవార్లను పల్లకీ వాహనంలో ఉంచి అర్చకులు ప్రత్యేక పుష్పాలంకారాలు చేశారు. అనంతరం అట్టహాసంగా పల్లకీ వాహనాన్ని ఆలయ ఆవరణలోని కల్యాణ మండపం వద్దకు తీసుకొచ్చారు. అంతక ముందే కల్యాణ మండపంలో విశేషంగా అలంకరించిన వేదికపై స్వామి, అమ్మవార్ల కల్యాణ మూర్తులను ఉంచి అర్చకులు పుష్పాలంకారాలు చేశారు. ఈ సందర్భంగా స్వామి, అమ్మవార్లకు ఆలయ ఈఓ వై.భద్రాజీ పట్టు వస్త్రాలను సమర్పించారు. అనంతరం అర్చకులు, పండితులు స్వామి, అమ్మవార్లకు నీరాజనాలు సమర్పించి కల్యాణ తంతును ప్రారంభించారు. సుముహూర్త సమయంలో నూతన వధూవరుల శిరస్సులపై జీలకర్ర, బెల్లం ధరింపజేసి, మాంగల్యధారణ, తలంబ్రాల వేడుకలను భక్తుల గోవింద నామస్మరణల నడుమ వైభవంగా జరిపారు. అనంతరం భక్తులకు తీర్ధప్రసాదాలను అందజేశారు. లక్ష్మీపురంలో అట్టహాసంగా వేడుక -
వంతెన.. ఇంకెన్నాళ్లీ యాతన
● నిలిచిన రావులపర్రు వంతెన నిర్మాణం ● బిల్లులు అవ్వక పనులు నిలిపివేసిన కాంట్రాక్టర్ ● వంతెన కోసం ప్రజల ఎదురుచూపులుఉంగుటూరు: పత్తేపురం పంటకాలువపై వంతెన నిర్మాణం మళ్లీ నిలిచిపోయింది. బిల్లులు పూర్తికాకపోవడంతో కాంట్రాక్టర్ పనులు ఆపేసినట్లు తెలిసింది. ఈ వంతెన నిర్మాణం కోసం రావులపర్రు గ్రామ ప్రజలు కొన్నేళ్లుగా ఎదురు చూస్తున్నారు. 2019కి ముందు పత్తేపురం పంటకాలువపై ఉన్న వంతెన శిథిలమై కూలిన నాటి నుంచి ప్రజలకు కష్టాలు మొదలయ్యాయి. వ్యవసాయ ఉత్పుత్తులు, ఎరువులు పురుగుమందులు గ్రామంలోకి తేవాలన్నా, గ్రామం నుంచి బయటకు తోలాలన్నా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక్కడి ప్రజలు మండల కేంద్రం ఉంగుటూరు చేరాలంటే చుట్టూ తిరిగి నారాయణఫురం మీద నుంచి రావాల్సి వస్తోంది. దీంతో కూలిన వంతెన స్థానంలో నూతన వంతెన నిర్మించాలని ప్రజాప్రతినిధులకు, అధికారులకు గ్రామ ప్రజలు విజ్ఞప్తులు చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇద్దరు ఎమ్మెల్యేలు మారినా పని పూర్తి కాలేదు. ప్రస్తుతం ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు వంతెన నిర్మాణానికి రూ.70 లక్షలు నిధులు మంజూరు చేయించడంతో పనులు ప్రారంభమయ్యాయి. ఆర్అండ్బీ శాఖ వారి పర్యవేక్షణలో ఈ వంతెన పనులు పూర్తి కావాల్సి ఉంది. గతేడాది కొంతవరకు పనులు చేశారు. పక్క గోడలు కూడా పూర్తయ్యాయి. అయితే ఆ తరువాత నుంచి పనులు నిలిచిపోయాయి. చేసిన పని వరకు బిల్లు అవ్వకపోవడం వల్ల కాంట్రాక్టరు పని ఆపేసినట్లు తెల్సింది. -
విషాదం మిగిల్చిన విహారం
వాగులో పడి యువకుడి మృతి దెందులూరు/చింతూరు: పోలవరం జిల్లా చింతూరు మండలం తులసిపాక సమీపంలోని ఘాట్రోడ్డు సోకిలేరు వ్యూ పాయింట్ వద్ద వాగులో పడి ఏలూరు జిల్లా పెదవేగి మండలం రామసింగవరానికి చెందిన కంతేటి రమేష్ (28) శనివారం మృతి చెందాడు. పది మంది స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళ్లాడు. అనంతరం స్నానం చేయడానికి సోకిలేరు వాగులో దిగగా, లోతు అంచనా తెలియక మునిగిపోయాడు. రమేష్ను కాపాడేందుకు స్నేహితులు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. అనంతరం మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం కోసం చింతూరు ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై మోతుగూడెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రమేష్ ఇంటర్ వరకు చదివి కొబ్బరి దింపు కూలీగా జీవనం సాగిస్తున్నాడు. రమేష్కు ఏడాది క్రితం వివాహం కాగా భార్య, కుమారుడు ఉన్నారు. మూడు రోజుల క్రితం స్నేహితులతో కలిసి రామసింగవరం నుంచి బొలెరో వాహనంలో వెళ్లినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఏలూరు (టూటౌన్): కాలువలు కట్టేలోగా చెరువులను నీటితో నింపుకోవాలని జలవనరుల శాఖ ఎస్ఈ చిలకపాటి దేవప్రకాష్ సూచించారు. ఈ వేసవిలో ఏలూరు నగర ప్రజల దాహార్తిని తీర్చడం కోసం జలవనరుల శాఖ సూపరింటెండింగ్ ఇంజినీర్ చిలకపాటి దేవ ప్రకాష్ జలవనరుల శాఖ ఇంజినీర్లకు ఆదేశాలు జారీ చేిశారు. మున్సిపల్ కార్పోరేషన్ ఇంజినీర్లతో సమన్వయం చేసుకొని కాలువలు కట్టే లోపు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్కు నీరు చేరేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. -
హిజ్రాలను అడ్డుకున్న పోలీసులు
ద్వారకాతిరుమల: శ్రీవారి క్షేత్రంలో శనివారం రాత్రి కొందరు హిజ్రాలకు ఎస్సై టి.సుధీర్ వార్నింగ్ ఇచ్చారు. మరోసారి క్షేత్రంలో కనిపిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈనెల 5న ‘సాక్షి’లో ‘శ్రీవారి ఆలయంలో హిజ్రాల రౌడీయిజం’ శీర్షికన ప్రచురితమైన కథనానికి పోలీస్ అధికారులు స్పందించారు. శనివారం రాత్రి క్షేత్రంలో భారీగా వివాహాలు జరుగుతున్న నేపథ్యంలో హిజ్రాలను అడ్డుకునేందుకు ప్రత్యేకంగా 15 మంది పోలీస్ సిబ్బందిని నియమించారు. ఈ సందర్భంగా టవేరా కారులో కొండపైకి వెళుతున్న 10 మంది హిజ్రాలను ఎస్సై టి.సుధీర్ సిబ్బందితో కలిసి టోల్గేటు వద్ద అడ్డుకున్నారు. పెళ్లిళ్లకు వెళ్లి డబ్బులు డిమాండ్ చేసి, దౌర్జన్యాలకు పాల్పడటం సరికాదన్నారు. క్షేత్రంలో జరిగే పెళ్లిళ్లకు వెళ్లడానికి ఇక వీల్లేదన్నారు. కేసులు నమోదు చేసి, చట్టపరమైన చర్యలు చేపడతామని హెచ్చరించారు. ఏలూరు (టూటౌన్): ఏలూరు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో శనివారం ఎం.రవికుమార్ అధ్యక్షతన నిరసన కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వం అవలంబిస్తున్న ఉద్యోగ వ్యతిరేక నిర్ణయాలను నిరసిస్తూ ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది నిరసనలో పాల్గొన్నారు. 12వ పీఆర్సీ కమిషన్ను ఏర్పాటు చేయాలని, 36 శాతం ఐఆర్ మంజూరు చేయాలని, పాత పెన్షన్ పద్ధతి అమలు చేయాలని డిమాండ్ చేశారు. ద్వారకాతిరుమల: శ్రీవారి క్షేత్రంలో శనివారం సాయంత్రం ఓ భక్తుడు పాము కాటుకు గురయ్యాడు. స్థానికులు వెంటనే పీహెచ్సీకి, అక్కడి నుంచి ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. విజయవాడకు చెందిన ఆర్అండ్బి ఉద్యోగి వెంకటేశ్వరరావు కుటుంబ సభ్యులతో కలసి ఉదయం క్షేత్రానికి విచ్చేశాడు. ఆదివారం ఉదయం నిత్యకల్యాణంలో పాల్గొనాలని ధర్మఅప్పారాయ నిలయంలో గదిని అద్దెకు తీసుకున్నాడు. సాయంత్రం వెంకటేశ్వరరావు బయటకు వెళ్లే క్రమంలో, సత్రం ముఖ ద్వారం వద్దకు వచ్చేసరికి అక్కడ మెట్లపై ఉన్న పాము ఆయన కాలి బొటన వేలుపై కరిచింది. వెంటనే ఆయనను స్థానిక పీహెచ్సీకి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం అక్కడి నుంచి 108 ఆంబులెన్స్లో ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తాడేపల్లిగూడెం (టీఓసీ): వచ్చే డిసెంబర్లో నిర్వహించే నాలుగో ప్రపంచ తెలుగు మహాసభలు (బాలలు) జాతీయ సమన్వయకర్తగా తాడేపల్లిగూడెంకు చెందిన కొల్లి రమావతి నియమితులయ్యారు. ఒంగోలులో జరిగిన కార్యక్రమంలో నియామకపత్రాన్ని ఆంధ్ర సారస్వత పరిషత్తు అధ్యక్షుడు గజల్ శ్రీనివాస్, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి, ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్లు అందించారు. రమావతి ప్రస్తుతం విశ్వ సాహితీ వేదిక వ్యవస్థాపక అధ్యక్షురాలిగా ఉన్నారు. -
రాధాకృష్ణను అరెస్టు చేయాలి
చింతలపూడి: మహిళల పట్ల అనుచితంగా, అవమానకరంగా వ్యాఖ్యలు చేసిన ఏబీఎన్ రాధాకృష్ణ, యాంకర్ వెంకటకృష్ణలను వెంటనే అరెస్ట్ చేయాలని చింతలపూడి నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్చార్జి కంభం విజయరాజు డిమాండ్ చేశారు. శనివారం చింతలపూడి పోలీస్ స్టేషన్లో మహిళా విభాగం నేతలతో కలిసి ఆయన ఫిర్యాదు అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యలు అత్యంత బాధ్యతారాహిత్యంగా ఉన్నాయని మండిపడ్డారు. మహిళలను లక్ష్యంగా చేసుకుని అసభ్యకరంగా మాట్లాడటం కేవలం రాజకీయ విమర్శ కాదని, ఇది సమాజంలో మహిళల గౌరవాన్ని కించపరిచే ప్రమాదకర చర్య అని ధ్వజమెత్తారు. సోషల్ మీడియా కార్యకర్తలను టీం బ్యాచ్ అంటూ కించపరచడం, వారిపై వ్యక్తిగత దూషణలకు దిగడం అనైతికమని పేర్కొన్నారు. రాధాకష్ణ, వెంకటకష్ణలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని యన డిమాండ్ చేశారు. ఎంపీపీ డా.బి.రాంబాబు నాయక్, పట్టణ అధ్యక్షుడు కొప్పుల నాగేశ్వరరావు, జిల్లా మున్సిపల్ విభాగం అధ్యక్షుడు బొడ్డు వెంకటేశ్వరరావు, జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు కనమతరెడ్డి చండీప్రియ, జిల్లా ప్రచార విభాగం అధ్యక్షుడు త్సల్లాబత్తుల శ్రీనివాసరావు, మున్సిపల్ విభాగం కార్యదర్శి ఎ.సుబ్బారావు, ఎస్సీ సెల్ నియోజకవర్గ అధ్యక్షుడు ఎస్.కాంతారావు, బీసీ విభాగం అధ్యక్షుడు ఎం గురుబ్రహ్మం తదితరులు పాల్గొన్నారు. -
అమ్మకానికి సర్కారీ కొలువులు
సిఫార్సు పత్రాలు ఆదివారం శ్రీ 12 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026సాక్షి, భీమవరం: ‘మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్ ఉద్యోగం కావాలా?.. ఎస్సై ఉద్యోగం కావాలా?.. సివిల్ సప్లయిస్ డిపార్ట్మెంట్లోనా.. కలెక్టరేట్లోనా..’ ఎక్కడైనా ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ సర్కారు కొలువుల పేరిట కొందరు కూటమి నేతలు నిరుద్యోగులకు వలవేసి రూ.3 కోట్ల మేర వసూళ్లకు పాల్పడినట్టు తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. తణుకు నియోజకవర్గంలోని అత్తిలి మండలంలో గత పది నెలల కాలంగా ఈ వ్యవహారం గుట్టుచప్పుడు కాకుండా సాగుతోంది. సొమ్ములు చెల్లించి నెలలు గడుస్తున్నా ఉద్యోగం రాకపోవడంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో బాధితులు ఉన్నారు. తెలిసిన వారి వద్ద తమ ఆవేదన చెబుతుండటంతో ఈ విషయం వెలుగుచూస్తోంది. అత్తిలి మండలంలోని ఒక గ్రామానికి చెందిన కొందరు నేతలు ప్రభుత్వంలో తమకున్న పలుకుబడితో పోలీస్, రెవెన్యూ, సివిల్ సప్లయిస్, రవాణా, కలెక్టరేట్ కార్యాలయం, తదితర ఏ ప్రభుత్వ శాఖలోనైనా ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగులను నమ్మించినట్టు సమాచారం. విద్యార్హతను బట్టి కాసులు కుమ్మరించగలిగితే ఏలూరు, విజయవాడ, విశాఖపట్నం తదితర ఏరియాల్లో ఆయా ఉద్యోగాల్లో కూర్చోబెడతామని నమ్మించి ఉద్యోగ స్థాయిని బట్టి రూ. 3 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు వసూలు చేసినట్టు తెలుస్తోంది. అవసరమైతే స్థానికంగాను ఉద్యోగాలు ఇస్తామని నమ్మించినట్టు చెబుతున్నారు. తమ పిల్లలకు సర్కారు కొలువు దొరుకుతుందన్న ఆశతో కొందరు తల్లిదండ్రులు అప్పో సొప్పో చేసి సదరు నేతల చేతిలో పెట్టారంటున్నారు. అత్తిలి మండలంతో పాటు జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన దాదాపు 50 మంది వరకు రూ.3 కోట్ల మేర వారికి కుమ్మరించినట్టు తణుకులో హాట్ టాపిక్గా మారింది. ఉద్యోగాల కోసం సంబంధిత శాఖల మంత్రులు, ఉన్నతస్థాయి నుంచి స్థానిక అధికారులకు సిఫార్సు చేస్తున్నట్టుగా ఉన్న పత్రాలను సొమ్ములు ఇచ్చిన వారికి అందజేసినట్టు సమాచారం. శిక్షణ పేరిట గత ఏడాది కొందరిని ఏలూరు తీసుకువెళ్లి పలు కార్యాలయాల్లో కూర్చోబెట్టినట్టు తెలుస్తోంది. ఏడాది కావస్తున్నా ఇంకా ఉద్యోగాలు రాకపోవడంతో కొందరు సదరు నాయకుల ఇళ్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తుండగా మరికొందరు ఉద్యోగం వద్దని, తాము చెల్లించిన సొమ్ములు తిరిగి ఇవ్వాలని పట్టుబడుతున్నట్టు పేరు చెప్పేందుకు నిరాకరించిన బాదితుడు ఒకరు తెలిపారు. అధికార కూటమిలో స్థానికంగా పలుకుబడి ఉన్న నాయకులు కావడంతో ఏ విధమైన ఆధారాలు లేకుండానే రూ.లక్షలు తీసుకువెళ్లి వాళ్ల చేతిలో పోశామన్నారు. ఉన్నతస్థాయిలో వారికి చెల్లించామని, అవి రావాల్సి ఉందని రేపు మాపు అంటూ తిప్పుకుంటున్నారని అంటున్నారు. బాదితులంతా చిన్నస్థాయి వారు కావడంతో ఈ విషయం బయటపెడితే ఉద్యోగం మాట ఎలా ఉన్నా తమ డబ్బులు తిరిగిరావన్న ఆందోళనతో ఎవరూ ముందుకురాని పరిస్థితి నెలకొంది. ఇదిలాఉండగా ఈ వ్యవహారం బయటకు పొక్కుతుండటంతో సదరు నేతలు బాధితుల ఇళ్లకు వెళ్లి వారిని బుజ్జగించే పనిలో పడ్డట్టు సమాచారం. ఉద్యోగాలు వద్దు.. మా సొమ్ములు మాకు తిరిగి చెల్లించమని ఒత్తిడి తెస్తున్న ముగ్గురికి తిరిగి సొమ్ములు చెల్లించినట్టు తెలుస్తోంది. నిరుద్యోగ యువతకు తణుకులో కూటమి నేతల ఎర ఉద్యోగాల పేరిట రూ.3 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు వసూళ్లు దాదాపు 50 మంది నుంచి రూ.3 కోట్ల వసూళ్లు! మంత్రులు, ఐఏఎస్ అధికారుల పేరిట సిఫార్సు లేఖలు పది నెలలుగా ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న బాధితులు -
కార్యకర్తలకు అండగా ఉంటాం
కాళ్ల: చంద్రబాబు పాలనలో కుల మతాల మధ్య చిచ్చు పెట్టి ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని, ఏ ఒక్కరికి అన్యాయం జరిగినా వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని పార్టీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు తెలిపారు. కాళ్ళ మండలం పెదఅమిరంలో పదవీ విరమణ చేసిన ఉండి నియోజకవర్గ వైఎస్సార్సీపీ సర్పంచులకు సత్కార కార్యక్రమం నియోజకవర్గ ఇన్చార్జి పీవీఎల్ నరసింహరాజు ఆధ్వర్యంలో శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రసాదరాజు మాట్లాడుతూ సర్పంచులుగా ఐదేళ్ల పదవీకాలం పూర్తి చేసుకోవడం అభినందనీయమన్నారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో గ్రామాల్లో సచివాలయ వ్యవస్థ, రైతు భరోసా కేంద్రాలు, హెల్త్ సెంటర్లను తీసుకొచ్చి వలంటీర్ వ్యవస్థతో గ్రామాల్ని అభివృద్ధి చేశారని గుర్తు చేశారు. కూటమి పరిపాలనలో రెండేళ్లు సర్పంచ్లకు ప్రోటోకాల్ కూడా లేకుండా చేశారన్నారు. కార్యక్రమంలో నరసాపురం నియోజకవర్గ పరిశీలకుడు ముదునూరి మురళీకృష్ణరాజు, ఆకివీడు మండల పార్టీ అధ్యక్షుడు నంద్యాల సీతారామయ్య, జెడ్పీటీసీలు రణస్తుల మహంకాళి, వేగేశ్న వెంకట రాజు, ఆకివీడు మున్సిపల్ చైర్పర్సన్ జామి హైమా వతి మాట్లాడారు. పదవీ విరమణ చేసిన సర్పంచులు, ఉప సర్పంచ్లను ఘనంగా సత్కరించారు. ముందుగా మహాత్మా జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. జిల్లా ఉపాధ్యక్షుడు దుర్గాప్రసాద్ రాజు, ఉండి ఎంపీపీ ఇందుకూరి శ్రీహరి రాజు, ఉండి మండల అధ్యక్షుడు ఆంజనేయరాజు, పాలకోడేరు మండల అధ్యక్షులు పాపారావు, ఆకివీడు పట్టణ అధ్యక్షుడు అంబటి రమేష్, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు శివకుమార్ పాల్గొన్నారు. ఉండి నియోజవర్గంలో కులమతాల మధ్య చిచ్చు పెట్టడంతో ప్రజలు భయపడే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా ప్రతినిధులను గెలిపిస్తే సంపద సృష్టిస్తాం, ప్రత్యేక నిధులు తీసుకొచ్చి గ్రామాలను అభివృద్ధి చేస్తారని అనుకుంటారని, ఉండి నియోజకవర్గంలో మాత్రం దాని విరుద్ధంగా నడుస్తుందన్నారు. ఇప్పుడు అమరావతిలో రూ.2 లక్షల కోట్లు ఖర్చుపెట్టి రాజధానిగా చేస్తానని చెబుతున్నారని.. రాజధాని నిర్మాణానికి రూ. 10 లక్షల కోట్లు ఉంటే తప్ప పూర్తి కాదని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సూచించారన్నారు. గుంటూరు, మచిలీపట్నం, విజయవాడ మూడు ప్రాంతాల అభివృద్ధి దృష్టిలో పెట్టుకుని మావిగన్ను జగన్ సూచించారని, కూటమి నాయకుల దుష్ప్రచారాన్ని తిప్పుకొట్టాలని పిలుపునిచ్చారు. నియోజకవర్గ ఇన్చార్జి పీవీఎల్ నరసింహరాజు మాట్లాడుతూ కూటమి నాయకుల ఒత్తిళ్లకు లొంగకుండా కట్టుబడి ఉన్న సర్పంచులకు అభినందనలు తెలిపారు. రాష్ట్రంలో పేద ప్రజలకు ఆరోగ్య శ్రీ లేదని, ఫీజు రీయింబర్స్మెంట్ లేదని, ఒక్క పథకం కూడా కూటమి ప్రభుత్వం ఇవ్వటం లేదన్నారు. ఉండి నియోజకవర్గంలో ఇళ్లు పడగొట్టడం వంటివి చేశారని, ఇప్పుడు మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి ఓట్లు పొందేందుకు చూస్తున్నారని విమర్శించారు. రానున్న రోజుల్లో పోరాటాలకు సిద్ధం కావాలని ఏ ఒక్కరికి ఇబ్బంది వచ్చినా అండగా ఉండాలని కోరారు. కుల మతాల మధ్య చిచ్చు పెడుతున్నారు ఉండి నియోజకవర్గంలో భయపడే పరిస్థితి తీసుకొచ్చారు వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు -
వన్యప్రాణుల దాహార్తి తీర్చేలా..
● అడవిలో సోలార్ పంపులతో నీటి సదుపాయం ● వన్యప్రాణుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు బుట్టాయగూడెం: వేసవిలో అటవీ ప్రాంతంలోని వన్యప్రాణుల దాహర్తిని తీర్చేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. గత రెండేళ్లుగా వన్యప్రాణి సంరక్షణ కోసం అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన నీటితొట్టెలు సత్ఫలితాలనిస్తున్నాయి. గతంలో వేసవిలో నీటి కోసం పలు రకాల వన్యప్రాణులు అటవీ పరిసర ప్రాంతాల్లోని జనావాసాల్లోకి వచ్చేవి. ఆ సమయంలో పలు వన్యప్రాణులు కుక్కల బారిన లేదా వాహనాల కింద పడి మృతి చెందిన సంఘటనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అటవీశాఖ అధికారులు వన్యప్రాణులు సంచరించే ప్రాంతాల్లో నీటితొట్టెలు ఏర్పాటు చేసి వాటి దాహర్తి తీర్చేలా కృషి చేస్తున్నారు. 60 నీటికుంటల ఏర్పాటు పాపికొండల అభయారణ్యం పరిసర ప్రాంతాల్లో వన్యప్రాణులకు వేసవిలో దాహర్తిని తీర్చేవిధంగా సుమారు 60 నీటి తొట్టెలను ఏర్పాటు చేసినట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు. వీటితోపాటు అటవీ ప్రాంతంలోని కాల్వల్లో 20 చెలమలను తీసి, వన్యప్రాణులకు నీటి సౌకర్యం లభించేలా చర్యలు తీసుకున్నారు. అవి కాకుండా 25 చెక్డ్యామ్స్ ద్వారా నీటిని నిల్వ ఉంచేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయా నీటితొట్టెల్లో వేసవికాలంలో నాలుగు రోజులకు ఒకసారి ట్యాంకర్ల ద్వారా బేస్ క్యాంప్ సిబ్బంది, బీట్ అధికారులు నీటిని తీసుకొచ్చి నింపుతున్నారు. వాహనాల్లో వెళ్ళలేని నీటి తొట్టెల వద్దకు బేస్క్యాంప్ సిబ్బంది వెళ్లి నింపుతారు. పక్కన ఉప్పు ముద్దలను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. నీటి కోసం వచ్చిన వన్యప్రాణులు దాహర్తిని తీర్చుకుని ఉప్పు ముద్దను నాకుతాయని దీనితో వడదెబ్బ బారి నుంచి కాపాడుకునే అవకాశాలు ఉంటాయని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. నీటిని నింపేందుకు రూ.1.50 లక్షల కేటాయింపు వేసవి కాలంలో వన్యప్రాణుల దాహార్తి తీర్చేలా ప్రభుత్వం సుమారు రూ. 1.50 లక్షలు మంజూరు చేస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు చెబున్నారు. ఈ నిధులతో వేసవిలో అడవుల్లో నీటి తొట్టెలు నింపేందుకు మాత్రమే ఖర్చు చేస్తామని అధికారులు తెలిపారు. పాపికొండల్లో 14 రకాల జంతువుల సంచారం 1,12,500 లక్షల హెక్టార్లలో పాపి కొండల అభయారణ్యం విస్తరించి ఉంది. పశ్చిమ ఏజెన్సీ ప్రాంతంలో పాపికొండల అభయారణ్యం పరిధిలో ఉన్న బుట్టాయగూడెం, పోలవరం, కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లోని అటవీ ప్రాంతంలో వన్యప్రాణుల కదలికలు ఎక్కువగా ఉన్నాయి. వైల్డ్లైఫ్ అధికారులు ఏర్పాటు చేసిన ట్రాప్ కెమేరాలకు చిక్కుతున్నాయి. వాటి సంరక్షణకు అటవీశాఖ అధికారులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు, పాపికొండ అభయారణ్యంలో ఎలుగు బంట్లు, కొండ గొర్రెలు, జింకలు, కొండ చిలువలు, అడవి పందులు, ఆగలి, చిరుతలు, ముళ్ల పందులు, దున్నలు వంటి అనేక జంతువులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. పాపికొండల అభయారణ్యం లోని వన్యప్రాణుల సంరక్షణకు ప్రత్యేక కృషి చేస్తున్నాం. సుమారు 60 నీటి తొట్టెలు వన్యప్రాణులు సంచరించే ప్రదేశాల్లో ఏర్పాటు చేశాం. వేసవిలో నాలుగు రోజులకు ఒకసారి ట్యాంకర్ల ద్వారా నీటిని పోసి తొట్టెలు నింపుతున్నాం, జంతువులకు నీటి సమస్య తలెత్తకుండా తగు చర్యలు తీసుకుంటున్నాం. – ఎస్కే వలీ, అటవీశాఖ రేంజ్ అధికారి, పోలవరం -
బడుగుల ఆశాజ్యోతి ఫూలే
అంతర్ జిల్లా నేరస్తుడి అరెస్టు చోరీలకు పాల్పడుతున్న అంతర్జిల్లా నేరస్తుడిని నరసాపురం పోలీసులు అరెస్టు చేశారు. 108 గ్రాముల బంగారు ఆభరణాలు, కిలో వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. 8లో uభీమవరం(ప్రకాశంచౌక్): బడుగు బలహీన వర్గాల విద్యా అవకాశాలకు పునాది వేసిన మహనీయుడు మహాత్మ జ్యోతిరావు ఫూలే అని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. జ్యోతిరావు పూలే 200వ జయంతి వేడుకలను జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శనివారం జిల్లా కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి కలెక్టర్ చదలవాడ నాగరాణి ముఖ్య అతిథిగా హాజరై, ఫూలే చిత్రపటానికి పూలమాలలు అర్పించి ఘనంగా నివాళులర్పించారు. డిఆర్ఓ బి.శివన్నారాయణ రెడ్డి, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి ఏవీ సూరిబాబు, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి ఎన్వీ అరుణకుమారి, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి డి.పుష్పరాణి, ఎన్టీఆర్ వైద్య సేవ జిల్లా కోఆర్డినేటర్ డా.కీర్తి శ్రవణ్ పాల్గొన్నారు. జిల్లాలో జలధార–జలహారతి కార్యక్రమాన్ని సమర్ధంగా అమలు చేసేందుకు పటిష్ట కార్యాచరణ సిద్ధం చేయాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదేశించారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి శనివారం జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాలో జలధార–జల హారతి– సాగునీటి సంఘాల బాధ్యత 100 రోజుల స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం అమలుపై సమీక్షించారు. -
కన్నూమన్నూ కానరంతే!
అరకమ తవ్వకాలపై రైతుల ఆవేదన శనివారం శ్రీ 11 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026సాక్షి, భీమవరం: జిల్లాలోని ప్రధాన డ్రెయిన్లలో నక్కల డ్రెయిన్ ఒకటి. ఆచంట, పాలకొల్లు, తదితర నియోజకవర్గాల మీదుగా సాగే ఈ డ్రెయిన్పై వేల ఎకరాల ఆయకట్టు ఉంది. రెండు నియోజకవర్గాలు వశిష్ట గోదావరి, సముద్ర తీరానికి దగ్గరగా కోస్టల్ రెగ్యులేటరీ జోన్ పరిధిలో ఉండటంతో వరదలు, విపత్తుల సమయంలో ముంపు బెడద ఎక్కువగా ఉంటుంది. దీనిని నివారించేందుకు పూర్వం డ్రెయిన్ నక్కల డ్రెయిన్ గట్లను దాదాపు పది మీటర్లు వెడల్పున విశాలంగా అభివృద్ధి చేశారు. కొన్ని చోట్ల గట్ల వెడల్పు 15 మీటర్లకు పైనే ఉంటుంది. ఇప్పటికే ఆక్రమణలతో గట్లు కుచించుకుపోతుండగా అక్రమ తవ్వకాలతో ఇవి మరింత బలహీనంగా మారుతున్నాయి. యలమంచిలి మండలంలో గోదావరి ఏటిగట్టును పటిష్టం చేసే పేరిట గత ఏడాది ఆచంట మండలం ఆచంట వేమవరంలో నక్కల డ్రెయిన్ను ఆనుకుని డ్రెయినేజీ శాఖకు చెందిన సుమారు ఐదెకరాల స్థలంలో రూ.కోటికి పైగా విలువైన మట్టి తవ్వకాలు చేసినట్టు అంచనా. ఏటిగట్టు పనుల ముసుగులో పాలకొల్లు, పరిసరాల్లో కొత్తగా వెలుస్తున్న లే అవుట్లు, మెరక పనుల కోసం ఈ మట్టిని తరలించేశారన్న ఆరోపణలున్నాయి. పరిమితులు పాటించకుండా ఇష్టానుసారంగా తవ్వకాలు చేశారని అప్పట్లో రైతులు అధికారులకు ఫిర్యాదులు చేశారు. తాజాగా ఆచంటతో పాటు ఆచంట వేమవరంలో నక్కల డ్రెయిన్లో అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా సాగిస్తున్నారు. కాలువలో పూడికతీత పేరిట రెండు వారాల క్రితం ఆచంట వేమవరం వద్ద డ్రెయిన్ గట్టును గుల్ల చేసేశారు. లోతుగా తవ్వేసి మట్టిని తరలించుకుపోవడంతో గట్టు ప్రమాదకరంగా మారింది. దీనిని గమనించిన స్థానిక రైతులు తవ్వకాలను అడ్డుకున్నారు. ఇదిలా ఉండగా వారం రోజుల క్రితం ఆచంట వద్ద కొందరు వ్యక్తులు అక్రమ తవ్వకాలు చేయడాన్ని రైతులు అడ్డుకుని లారీలు, జేసీబీలను అధికారులకు అప్పగించారు. తవ్వకాలు చేసిన చోట ట్రాక్టర్ వెళ్లే దారి లేకుండా గట్టు కాలువలోకి జారిపోయి ప్రమాదభరితంగా తయారైందని రైతులు అంటున్నారు. గోతులు పూడ్చి పంట ఉత్పత్తులను తరలించుకునేందుకు వీలుగా గట్టును సరిచేయాలని, అక్రమ తవ్వకాలు చేసిన వారిపై రికవరీకి చర్యలు తీసుకుని అక్రమ తవ్వకాలకు అడ్డుకట్ట వేయాలని కోరుతున్నారు. ఈ మేరకు బుధవారం మార్టేరులో జరిగిన కిసాన్ మేళాలో పార్టీలకు అతీతంగా రైతులు కూటమి ప్రజాప్రతినిధులు, అధికారులకు వినతిపత్రం అందజేశారు.పాలకొల్లు, పరిసరాల్లోని లే అవుట్లకు ఈ మట్టి తరలిపోతున్నట్టు తెలుస్తోంది. డ్రెయిన్ గట్టుకు తూట్లు పొడుస్తూ లక్షలాది రూపాయల మట్టిని కొల్లగొడుతున్నారు. కూటమి నేతల అండదండలతోనే తవ్వకాలు సాగుతుండటంతో అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అక్రమ తవ్వకాలతో గట్లు కృంగిపోయి బలహీన పడుతుండటం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. వర్షాలు, వరదల సమయంలో గండిపడి ముంపునకు గురయ్యే ప్రమాదముందని వారంటున్నారు. అక్రమ తవ్వకాలకు అడ్డుకట్ట వేసేందుకు అధికారులు చర్యలు చేపట్టాలని, గట్లను పటిష్టం చేయాలని కోరుతున్నారు. అక్రమ తవ్వకాలు గూర్చి పాలకొల్లు డ్రెయినేజీ డీఈ సీహెచ్ మురళీకృష్ణను సంప్రదించగా ఆచంట వేమవరంలో మట్టి తవ్వకాలు చేసిన వారిపై ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. ఆచంట వద్ద తవ్వకాలు జరుగకుండా సిబ్బందిని కాపలా పెట్టినట్టు తెలిపారు. నక్కల డ్రెయిన్లో మట్టి తోడేళ్లు ఆచంట వేమవరం, ఆచంటలో అక్రమ తవ్వకాలు కూటమి నేతల కనుసన్నల్లో వ్యవహారం పూడికతీత మాటున గట్లుకు తూట్లు పాలకొల్లులో లేఅవుట్లకు రూ.లక్షలు విలువ చేసే మట్టి తరలింపు ముంపు ముప్పుతో ఆందోళనలో రైతులు చర్యలు తీసుకోవాలని అధికారులకు వినతులు ఆచంటలోని నక్కల కాలువ గట్టుపై గుర్తు తెలియని వ్యక్తులు 2వ తేదీ గురువారం రాత్రి నుంచి జేసీబీలు, టిప్పర్ల సాయంతో అక్రమంగా మట్టి తవ్వకాలు చేపట్టారు. శుక్రవారం విషయం తెలిసి రైతులమంతా అడ్డుకున్నాం. అప్పటికే 150 అడుగులు పొడవున, 50 అడుగుల వెడల్పు, 15 అడుగుల లోతున గట్టును తవ్వి మట్టి తరలించేశారు. అక్రమ తవ్వకాలతో గట్టు బలహీనపడింది. ఆగస్టు, సెప్టెంబరులో కురిసే భారీ వర్షాలు, గోదావరి వరదల సమయంలో గట్టుకు గండిపడితే పొలాలు ముంపునకు గురికావడంతో పాటు, ఈ భారీ గోతిలో ప్రమాదవశాత్తు మనుష్యులు, పశువులు పడి మృత్యువాత పడే ప్రమాదం ఉంది. గోతిని పూడ్చి గట్టును పటిష్టం చేయాలి. అక్రమ తవ్వకాలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం.రెండు రోజుల క్రితం మార్టేరులోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనస్థానంలో జరిగిన కిసాన్ మేళాలో నక్కల డ్రెయిన్లో అక్రమ తవ్వకాలపై ఆచంటకు చెందిన రైతుల ఆవేదన ఇది. -
ఆగని మట్టి అక్రమ తవ్వకాలు
ద్వారకాతిరుమల: మండలంలోని సత్తాలచెరువులో మట్టి అక్రమ తవ్వకాలకు అడ్డుకట్ట పడడం లేదు. ఓ పచ్చ నాయకుడు రాత్రి వేళల్లో యథేచ్ఛగా ఈ దందాను సాగిస్తున్నాడు. పెద్దస్థాయిలో మట్టి తరలింపు జరుగుతన్నా అధికారులెవరూ ఆ వైపు కన్నెత్తి చూడటం లేదు. దాంతో అద్దూఅదుపు లేకుండా ఈ దందా సాగిపోతోంది. గ్రామంలోని సత్తాల ఇరిగేషన్ చెరువులో ఓ టీడీపీ నాయకుడు రాత్రి, పగలు తేడా లేకుండా మట్టి అక్రమ తవ్వకాలు జరుపుతున్నాడు. జేసీబీ సహాయంతో మట్టిని తవ్వి, టిప్పర్ల ద్వారా మట్టిని బయటకు తరలించేస్తున్నాడు. ఒక్కో టిప్పర్ మట్టిని దూరాన్ని బట్టి రూ. 7 వేల నుంచి 12 వేలకు విక్రయిస్తున్నాడు. ప్రజాధనాన్ని బహిరంగంగా దోచేస్తున్నా పట్టించుకునే నాథుడు లేకపోవడం దారుణమని గ్రామస్తులు అంటున్నారు. అధికారుల తీరుపై పలువురు మండిపడుతున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించాలని కోరుతున్నారు. -
ఇదెక్కడి ‘పచ్చ’పాతం?
ఏలూరు (టూటౌన్): జిల్లా పరిషత్ సెంటర్లో ఆక్రమణల తొలగింపు విషయంలో అధికారుల వైఖరిపై ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఆక్రమణలను తొలగిస్తున్నా టీడీపీ నాయకులకు చెందిన షాపులను ఎందుకు వదిలేస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే నిత్యం రద్దీగా ఉండే జిల్లాపరిషత్ సెంటర్ నుంచి ఇండోర్ స్టేడియం, కలెక్టరేట్కు వెళ్లే మార్గంలో జిల్లాపరిషత్ దుకాణ సముదాయాల వద్ద ఫుట్పాత్లు, డ్రెయిన్లు ఆక్రమించేసి వ్యాపారాలు చేస్తున్నారు. దీంతో ట్రాఫిక్ ఇక్కట్లు ఏర్పడుతున్నాయి. అలాగే డ్రెయిన్లలో సిల్ట్ తొలగింపు ఇబ్బందిగా మారుతుంది. ఈ నేపథ్యంలో ఈ సమస్య పరిష్కరించాలని ఇటీవల కాలంలో ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో కార్పొరేషన్ అధికారులు శుక్రవారం జిల్లాపరిషత్ కూడలిలో ఉన్న పుట్పాత్, డ్రెయిన్ల ఆక్రమణలు తొలగింపునకు శ్రీకారం చుట్టారు. అయితే ఇక్కడా పచ్చపాతమే చూపించారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎలాంటి రాజకీయ పలుకుబడి లేని వారి దుకాణాలు ముందు యథేచ్చగా యంత్రాలతో పగుల గొట్టిన సిబ్బంది, రాజకీయ పలుకుబడి మెండుగా ఉన్న ఓ టీడీపీ నాయకుడి షాపు ముందు పుట్ ఫాత్పై నిర్మించిన జ్యూస్ షాపు జోలికి మాత్రం వెళ్లక పోవడం గమనార్హం. దీంతో ఇదెక్కడి న్యాయం? అంటూ జనం ముక్కున వేలేసుకుంటున్నారు. రాజకీయ పైరవీలకు తావివ్వకూడదు పట్టణంలో ఇటీవల కాలంలో ఆక్రమణలు భారీగా పెరిగాయి. అయితే ప్రజల ఫిర్యాదులతో ఆక్రమణల తొలగింపు పనులు చేపట్టారు. అయితే ఆక్రమణలు తొలగించే విషయంలో వీడు మనవాడా? కాదా అనే విషయాలతో పాటు రాజకీయ పైరవీలకు చోటివ్వకుండా ఎవ్వరైనా ఒక్కటే అన్న చందంగా ఆక్రమణలు తొలగించాలని పట్టణవాసులు కోరుతున్నారు. సాధారాణ వ్యక్తుల దుకాణాలకు సంబంధించిన ఆక్రమణలు తొలగిస్తున్న నగరపాలక సంస్థ సిబ్బంది, రాజకీయ నాయకులు జోలికి వెళ్లకపోవడం పట్ల విమర్శలు వినిపిస్తున్నాయి. ఏ అండా లేని వారి, ప్రతిపక్షనాయకులకు చెందిన వాటిని ధ్వంసం చేసి తమ పార్టీకి చెందిన వారికి మాత్రం వెసులుబాటు కల్పించడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లా పరిషత్ సెంటర్లో ఆక్రమణలు తొలగింపులో అధికారుల వింత వైఖరి డ్రెయిన్లపై కట్టిన టీస్టాల్, ఇతర నిర్మాణాల తొలగింపు టీడీపీ నాయకుడి జ్యూస్ షాపు జోలికి వెళ్లని వైనం -
శ్రీవారి రథానికి అశ్వాలు
ద్వారకాతిరుమల: శ్రీవారి దివ్య రథానికి చెక్క అశ్వాలను ఏర్పాటు చేసే పనులు శుక్రవారం రథశాలలో ప్రారంభమయ్యాయి. ఏడేళ్ల క్రితం లక్షలాది రూపాయలతో తయారు చేయించిన శ్రీవారి రథనికి అశ్వాలు లేవు. అవి లేకుండానే బ్రహ్మోత్సవాల సమయంలో స్వామివారికి ఈ రథంలో రథోత్సవాలను నిర్వహిస్తున్నారు. దీనిపై ఈనెల 3న సాక్షి దినపత్రికలో దేవదేవా శ్రీఅశ్వాలుశ్రీ లేవా? శీర్షికన కథనం ప్రచురితమైంది. దీనికి స్పందించిన అధికారులు రథానికి అశ్వాలు ఏర్పాటు చేయించే పనులు చేపట్టారు. ఈనెల 26 న స్వామి వారి వైశాఖ మాస దివ్య బ్రహ్మత్సవాలు ప్రారంభం కానుండగా, వచ్చే నెల 1న రథోత్సవాన్ని జరపనున్నారు. ఉత్సవాలకు తక్కువ సమయం ఉండటంతో క్షేత్ర దేవత కుంకుళ్లమ్మ అమ్మవారి రథనికి ఉన్న అశ్వాలను తీసి, శ్రీవారి రథనికి ఏర్పాటు చేస్తున్నారు. బ్రహ్మోత్సవాలు ముగిసిన తరువాత కొత్త అశ్వాలను ఏర్పాటు చేస్తామని అధికారులు తెలిపారు. భీమవరం (ప్రకాశంచౌక్): రాష్ట్ర, జిల్లా న్యాయ సేవాధికార సంస్థల ఆదేశాల మేరకు భీమవరం మండల న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో జాతీయ లోక్ అదాలత్ మే నెల 9న నిర్వహిస్తున్నామని 3వ అదనపు జిల్లా జడ్జి సంస్థ చైర్మన్గా పూర్తి అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న పోక్సో కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి డాక్టర్ బి.లక్ష్మీనారాయణ అన్నారు. ఈ జాతీయ లోక్ అదాలత్లో అన్ని సివిల్ కేసులు, ప్రో నోటు బాకీ కేసులు, రాజీ చేసుకనే క్రిమినల్ కేసులు, మోటార్ యాక్సిడెంట్, బీమా కేసులు, భార్యభర్తల వివాదాలు, మనోవర్తి కేసులు, గృహ హింస కేసులు, చెక్కు బాకీ కేసులు తదితర కేసులు రాజీ చేసుకోవచ్చన్నారు. తాడేపల్లిగూడెం (టీఓసీ): అన్నమయ్య జిల్లాలో న్యాయవాది ఎల్లయ్యను దారుణంగా హత్య చేసిన ఘటనను ఖండిస్తూ తాడేపల్లిగూడెం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు శుక్రవారం కోర్టు ఆవరణలో నల్ల బ్యాడ్జీలు ధరించి, నిరసన తెలిపారు. విధులను బహిష్కరించారు. బార్ అసోసియేషన్ అధ్యక్షులు కె.అప్పిరెడ్డి మాట్లాడుతూ న్యాయవాదుల భద్రత కోసం ప్రభుత్వం తక్షణమే ప్రత్యేక రక్షణ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. న్యాయం కోసం పోరాడే న్యాయవాదులపై ఇలాంటి దాడులు జరగడాన్ని తీవ్రంగా ఖండించారు. అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కంకట శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులు జి.శేఖర్, కోశాధికారి డి.మహాలక్ష్మి, న్యాయవాదులు మాకా శ్రీనివాసరావు, సూర్యమణి ముఖర్జీ, తోట సత్యనారాయణ తదితరులు పాల్గొని నిరసన వ్యక్తం చేశారు. భీమవరం (ప్రకాశంచౌక్): జనగణన ప్రక్రియను సమర్థవంతంగా అమలు చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందని కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. శుక్రవారం భీమవరం మున్సిపల్ కార్యాలయ కాన్ఫరెనన్స్ హాలులో సూపర్వైజర్లు, ఎన్యూమరేటర్లకు జన గణన 2027కు సంబంధించిన మూడు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని కలెక్టర్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కేంద్రం గృహాల జాబితా ప్రక్రియకు కేంద్ర ప్రభుత్వం సమగ్ర ప్రణాళిక సిద్ధం చేసిందన్నారు. ఈవీఎం గోడౌన్ తనిఖీ పట్టణంలోని పీపీ రోడ్డులో ఈవీఎంలు భద్రపరిచిన ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ గోదాంను కలెక్టర్ శుక్రవారం తనిఖీ చేశారు. గోదాములో ఏర్పాటు చేసిన భద్రతా చర్యలను సమగ్రంగా పరిశీలించారు. భీమవరం(ప్రకాశంచౌక్): పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరం జనసేన జెడ్పీటీసీ సభ్యుడు గుండా జయప్రకాష్నాయుడు తనను వేధింపులకు గురిచేశాడని భీమవరానికి చెందిన ఓ మహిళ చేసిన ఫిర్యాదు మేరకు భీమవరం టూటౌన్ పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. కేసు దర్యాప్తు చేస్తున్నామని, దర్యాప్తు అనంతరం వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. -
ఆరోగ్యవంతమైన జీవనాన్ని గడపాలి
వీరవాసరం: పైలేరియా వ్యాధిగ్రస్తులు డాక్టర్ల సూచనలు, సలహాలను పాటిస్తూ ఆరోగ్యవంతమైన జీవనాన్ని గడపాలని డీఎంహెచ్ఓ గీతాబాయి తెలిపారు. అండలూరులో శుక్రవారం నిర్వహించిన ఫైలేరియా నివారణ వారోత్సవాల్లో ఆమె పాల్గొని, వ్యాధిపై ప్రత్యేక అవగాహన కల్పించారు. ఫైలేరియాకు సంబంధించిన ఎంఎండీటీ కిట్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా మలేరియా అధికారి వి.క్రాంతి కుమార్, కొణితివాడ పీహెచ్సీ వైద్యులు యు.నవనీత్, ఎంపీహెచ్ఓ పి.ప్రభాకర్ రావు, ఫైలేరియా యూనిట్ ఆఫీసర్ మూర్తి తదితరులు పాల్గొన్నారు. భీమవరం (ప్రకాశంచౌక్): చిత్తూరులో నిర్వహించనున్న ఉమెన్స్ జూనియర్ హాకి టోర్నమెంట్కు జిల్లా తరపున మహిళా జట్టు ఎంపికలను ఆదివారం నిర్వహించనున్నామని జిల్లా హాకి అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు కలిదిండి ఆనందరాజు, కె.వి.ఎస్ భరత్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం వారు ఓ ప్రకటన విడుదల చేశారు. ఏప్రిల్ 16 నుంచి 19 వరకూ రాష్ట్ర హాకీ టోర్నమెంట్ ఉంటుందని పేర్కొన్నారు. ఈ టోర్నమెంట్కు క్రీడాకారిణుల ఎంపిక కోసం పోటీలను భీమవరం సెయింట్ మేరీస్ హైస్కూల్ గ్రౌండ్లో ఏర్పాటు చేశామని వివరించారు. 2007 జనవరి 1 తర్వాత జన్మించిన వారే అర్హులని, ఆసక్తి గల క్రీడాకారిణిలు ఆధార్ కార్డు, బర్త్ సర్టిఫికెట్తో సంప్రదించాలని కోరారు. మరిన్ని వివరాలకు 90301 06037 నంబర్కు ఫోన్ చేయాలని సూచించారు. దెందులూరు: మహాత్మా జ్యోతిబా పూలే ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల పాఠశాలలో 2026–27 విద్యా సంవత్సరానికి 5 వ తరగతి ప్రవేశానికి ఈ నెల 12న పరీక్ష నిర్వహించనున్నారు. హాల్ టికెట్స్ https://mjpapbcwreis.apcfss.in వెబ్సైటులో ఉంచారని సమన్వయకర్త, ఏలూరు బాలికల గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ ఎస్.భాగ్యలక్ష్మి శుక్రవారం ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు వెబ్సైట్ నుంచి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకుని పరీక్షకు హాజరుకావాలని కోరారు. తణుకు అర్బన్ : విద్యుత్ షాక్ తగిలి యువకుడు మృతి చెందిన ఘటన శుక్రవారం తణుకులో చోటు చేసుకుంది. స్థానిక సజ్జాపురానికి చెందిన సింహం భవానిశంకర్ (36) టైల్స్ అతికించే వృత్తిలో ఉపాధి పొందుతున్నారు. గురువారం సాయంత్రం ఇరగవరం రోడ్డు కాలనీలోని ఒక భవనంలో పని చేస్తుండగా ప్రమాదవశాత్తూ విద్యుత్ షాక్ తగిలింది. ఫోకస్ లైటుకు సంబంధించిన కనెక్షన్ తీసే క్రమంలో ప్రమాదవశాత్తూ విద్యుత్ షాక్ తగలడంతో అక్కడే కుప్పకూలాడు. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తీసుకువచ్చినా అప్పటికే భవాని శంకర్ మృతి చెందినట్లు వైద్యులు నిర్థారించారు. భవానిశంకర్కు ఇంకా వివాహం కావాల్సి ఉండగా తల్లితో కలిసి సజ్జాపురంలో నివాసం ఉంటున్నారు. సోదరి మాదాసు కల్యాణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు తణుకు పట్టణ ఎస్సై కె.శ్రీనివాస్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భీమడోలు: జాతీయ రహదారి పొలసానిపల్లి రహదారిపై ఓ కూరగాయల రైతును ఐషర్ వ్యాన్ ఢీకొట్టింది. ప్రమాదంలో గుణ్ణంపల్లికి చెందిన రైతు ఎం.రత్తయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళ్లితే.. ఎం.రత్తయ్య కూరగాయలను ద్వారకాతిరుమల మండలం తిమ్మాపురం జరిగే సంతలో వేసేందుకు తన బైక్పై వెళ్తున్నాడు. ఈ క్రమంలో భీమడోలు నుంచి పొలసానిపల్లి మధ్య రహదారిపైకి వచ్చేసరికి ఎం.రత్తయ్యను వెనుక నుంచి ఐషర్ వ్యాన్ అతివేగంగా వచ్చి ఢీకొట్టి వెళ్లిపోయింది. సమాచారం అందుకున్న భీమడోలు 108 సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రుడు రత్తయ్యకు ప్రాథమిక చికిత్స చేశారు. మెరుగైన చికిత్స నిమిత్తం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు భీమడోలు పోలీసులు కేసు నమోదు చేసి, విచారణ చేస్తున్నారు. -
భూసర్వేపై గిరిజనుల కన్నెర్ర
కుక్కునూరు: మండలంలోని అరవపల్లి రెవెన్యూ పరిధిలో నిర్వాసితుల కోసం సేకరించే భూముల సర్వేను స్థానిక గిరిజన రైతులు శుక్రవారం అడ్డుకున్నారు. వివరాల ప్రకారం పోలవరం జిల్లా, ముంపు మండలాల్లో ప్రాజెక్టు బ్యాక్ వాటర్ పరిధిలో ముంపునకు గురవుతున్న గిరిజన నిర్వాసితులకు భూమికి భూమి పరిహారం అందించేందుకు మండలంలోని అర్వపల్లి రెవెన్యూ పరిధిలో భూములను సేకరించే దిశగా అధికారులు శుక్రవారం సర్వే చేపట్టారు. విషయం తెలుసుకున్న స్థానిక గిరిజన రైతులు సర్వే జరుగుతున్న ప్రాంతానికి వెళ్లి తమకు తెలియకుండా ఎలా సర్వే నిర్వహిస్తారు? అని అడ్డుకున్నారు. తహసీల్దార్కు వినతి సర్వే అడ్డుకున్న అనంతరం కుకునూరు తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి తహసీల్దార్కు సర్వే నిలిపేయాలని కోరుతూ మెమోరాండం అందజేశారు. ఈ సందర్భంగా స్థానిక దాచారం, గొమ్ముగూడెం గిరిజన రైతులు మాట్లాడుతూ, తాత ముత్తాతల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని కొంతమంది గిరిజనేతరులు గిరిజనులు సాగు చేసుకుంటున్న భూములకు పట్టాదారులుగా వారి పేర్లను మార్పు చేసుకున్నారని ఆరోపించారు. ఇప్పుడు ఆ భూములను ప్రభుత్వానికి అప్పగించి పరిహారాన్ని పొందాలని గిరినేతర్లు చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులు ఆధీనంలో ఉన్న భూములను కనీస సమాచారం తెలియపరచకుండా పిసా గ్రామసభలు నిర్వహించకుండా ప్రభుత్వం ఏకపక్షంగా నిర్వహిస్తున్న ఈ సర్వేను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో దీనిపై గిరిజనులంతా ఏకమై పోరాటం చేస్తామని హెచ్చరించారు. అధికారులను సర్వే నిలిపేయాలని అడ్డుకుంటున్న గిరిజన రైతులు తహసీల్దార్ కార్యాలయం ధర్నా చేస్తున్న గిరిజన రైతులు భూముల సర్వేకు వచ్చిన అధికారులు పైనుంచి ఆర్డర్స్ వచ్చాయని అందుకే సర్వే చేస్తున్నామని చెబున్నారు. తాత ముత్తాతల తరాల నుండి సాగు చేసుకుంటున్న గిరిజన భూములకు పిసా గ్రామ సభలు నిర్వహించకుండా ప్రభుత్వం సర్వే చేయమని ఎలా ఆర్డర్స్ ఇస్తుంది. ఈ భూములను గిరిజన రైతుల పేర్లపై మార్చాలని మేము గతంలో ఉన్నతాధికారులు కలిసి దరఖాస్తు కూడా అందించాం. –సోడే వెంకటేష్, పిసా కమిటీ అధ్యక్షుడు, అరవపల్లి, కుక్కునూరు గిరిజన ఆధీనంలో ఉన్న భూములను గిరిజనులకు తెలియజేయకుండా ప్రభుత్వం గిరినేతర్లకు కట్టబెట్టాలని చూస్తుంది. ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని సర్వేను నిలిపివేయాలి. గిరిజన రైతులకు న్యాయం చేయాలి. లేకపోతే పెద్దస్థాయిలో ఉద్యమిస్తాం. – సోడే చంద్రయ్య, గిరిజన రైతు, అరవపల్లి, కుక్కునూరు మండలం -
జర్నలిస్టుల ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యం
భీమవరం (ప్రకాశంచౌక్): జర్నలిస్టులు ఆరోగ్యంగా ఉంటేనే సమాజానికి మెరుగైన సేవలు అందించగలరని కలెక్టర్ చదలవాడ నాగరాణి ఉన్నారు. జర్నలిస్టులకు ఉచిత ఆరోగ్య శిబిరాన్ని శుక్రవారం కలెక్టరేట్ ప్రాంగణంలో కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జర్నలిస్టులు వృత్తిపరంగా ఎల్లప్పుడూ బిజీగా ఉండటం వల్ల వారి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పేర్కొన్నారు. పాత్రికేయులు ఆరోగ్యంగా ఉంటేనే సమాజం కూడా ఆరోగ్యంగా ఉంటుందన్నారు. ప్రతి జర్నలిస్టు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవడం అవసరమని సూచించారు. 25 రకాల వైద్య పరీక్షలు నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి జర్నలిస్టు తప్పనిసరిగా వైద్య పరీక్షలు చేయించుకోవాలని అన్నారు. ఉచిత వైద్య శిబిర నిర్వహణలో సేవలందించిన వైద్యులకు కలెక్టర్ అభినందనలు తెలియజేసి సత్కరించారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ స్టేట్ చైర్మన్ సీహెచ్ కృష్ణంరాజు, ఒమిక్స్ నెక్స్ట్ జెన్ లేబరేటరీస్ మేనేజింగ్ డైరెక్టర్ కొమ్ముల మురళీకృష్ణ, డీఆర్వో బి.శివన్నారాయణ రెడ్డి, డీఎంహెచ్ఓ డాక్టర్ జి.గీతాభాయి, డీసీఎచ్ఎస్ డాక్టర్ పి.సూర్యనారాయణ, డీపీర్ఓ తలుపుల నాగేశ్వరరావు పాల్గొనగా.. వైద్యులు బి.ఐశ్వర్య, రఘువీర, ప్రియాంక, సూర్య లలిత, శ్వేత, శ్రీవిద్య, శిల్ప, స్రవంతి, నిరుపమ, ప్రియాంక, గోపీనాథ్, విజయానంద్, కిరణ్, వినయ్ కుమార్, శ్వేత తదితరులు వైద్య సేవలందించారు. -
తోకతిప్ప పంట కాలువ మురుగునీటితో కలుషితం
భీమవరం అర్బన్: మండలంలోని తోకతిప్ప పంట కాలువలోకి కొంతమంది ఆక్వా రైతులు యనమదుర్రు డ్రైయిన్లోని మురుగునీరు మోటార్లతో తోడేయడంతో కలుషితమవుతుంది. ఈ పంటకాలువ గొల్లవానితిప్ప, గూట్లపాడు రేవు, తోకతిప్ప, బరువానిపేట గ్రామాలకు సాగు, తాగు నీరు అందుతుంది. ఈ నెల 15 పంట కాలువలకు నీరు నిలుపుదల చేయనున్న నేపథ్యంలో ముందస్తుగా తోకతిప్ప గ్రామంలోని రక్షిత మంచినీటి చెరువుకు తాగునీటిని నింపాల్సి ఉంది. అంతేకాకుండా ప్రతి ఏటా చేపలు, రొయ్యల చెరువులకు వంతుల వారీ విధానం ద్వారా నీటిని నింపుకుంటున్నారు. తోకతిప్ప– బరువానిపేట గ్రామాల మధ్యలో కొంతమంది రైతులు యనమదుర్రు డ్రెయిన్లోని కలుషిత మురుగునీటిని పంట కాలువల్లోకి తోడుకుని అక్కడి నుంచి తమ చెరువుల్లోకి నీటిని మోటార్లతో నింపుకోవడంపై పలువురు గ్రామస్తులు మండిపడుతున్నారు. ఈ చర్యలను అడ్డుకోవాల్సిన ఇరిగేషన్, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం. నిబంధనలకు విరుద్ధంగా పంటకాలువల్లోకి యనమదుర్రు డ్రెయిన్లోని మురుగునీటి తోడుతున్నా పట్టించుకోవడం లేదని దీంతో తోకతిప్ప, గూట్లపాడు రేవు వరకు పంట కాలువలోని జలాలు కలుషితమవుతున్నాయని రైతులు వాపోతు న్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి పంటకాలువల్లోని మురుగునీటిని తోడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. -
నిందితుడి షాపు తొలగింపు
పెనుగొండ: ఆచంట మండలం కొడమంచిలిలో ఆరేళ్ల పాపపై అఘాయిత్యానికి పాల్పడిన వెలగన వెంకటస్వామి షోడా షాపును పోలీసులు తొలగించారు. చాక్లెట్ ఆశ చూపి ఆరేళ్ల పాపపై 70 ఏళ్ల వృద్ధుడు బుధవారం అఘాయిత్యానికి పాల్పడిన సంగతి విధితమే. కాగా, నిందితుడు పరారీలో ఉండడంతో రోడ్డు ఆక్రమణలో ఉన్న అతడి దుకాణాన్ని పెనుగొండ సీఐ రాయుడు విజయ్కుమార్ ఆధ్వర్యంలో ఆచంట ఎస్సై కె.వెంకట రమణ జేసీబీతో కూల్చివేశారు. నిందితుడు కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇప్పటికే కేసు నమోదు చేశామని వివరించారు. అయితే బాధితురాలికి అందించాల్సిన ప్రభుత్వ సహాయం వెంటనే అందించాలని మానవ హక్కుల వేదిక డిమాండ్ చేసింది. ముక్కు పచ్చలారని బాలికపై అఘాయిత్యానికి పాల్పడినా ప్రభుత్వ పరంగా ఎలాంటి ప్రకటనలు లేకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బలహీన వర్గానికి చెందిన కుటుంబం కావడంతో ఎవరి అండదండలు లేకపోవడంతో న్యాయం జరగడం లేదంటూ పలువురు విమర్శిస్తున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. -
నకిలీ టికెట్ల కేసు దర్యాప్తుపై అనుమానాలు
● సాఫ్ట్వేర్ తయారు చేసిన వ్యక్తి ఏ–9 నిందితుడా? ● నిష్పక్షపాతంగా కేసు దర్యాప్తు జరపాలి ● డిమాండ్ చేస్తున్న హిందూ మత వాదులు ద్వారకాతిరుమల: పెద్ద తిరుపతి తరువాత ప్రాముఖ్యత కలిగిన క్షేత్రం చిన తిరుపతి. అటువంటి క్షేత్రంలో గతనెల 15న బయటపడ్డ శ్రీవారి నకిలీ దర్శనం టికెట్ల స్కామ్ సంచలనాన్ని రేకెత్తించింది. ఈ స్కాంతో సంబంధం ఉన్న ఏ ఒక్కరినీ విడిచి పెట్టకూడదని భక్తజన లోకం మొదటి నుంచి కోరింది. ఇంతవరకు జరిగిన ఈ కేసు దర్యాప్తుపై వస్తున్న ఆరోపణలు హిందూ మతవాదులను తీవ్రంగా కలచివేస్తోంది. ఆ దేవదేవుడికే న్యాయం జరగకపోతే.. ప్రజలకు చట్టాలపై నమ్మకం పోతుందని భక్తులు వాపోతున్నారు. సాఫ్ట్వేర్ కట్టుకథ : కేసులో నిందితులుగా ఉన్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగి రమేష్, సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎంఎన్వీఎస్ శ్రీనివాసరావు స్నేహితులు. రమేష్ కోరిన విధంగా శ్రీనివాసరావు సాఫ్ట్వేర్ తయారు చేశాడు. శ్రీవారి దేవస్థానానికని చెప్పడంతో శ్రీనివాసరావు తమ వద్ద డబ్బులు తీసుకోకుండా సాఫ్ట్వేర్ తయారు చేసి ఇచ్చాడని రమేష్ తన స్టేట్మెంట్లో పేర్కొన్నాడు. అదే నిజమైతే డేటాబేస్, యూజర్ ఐడీ, పాస్వర్డ్, లావాదేవీల లాగ్, ఆడిట్ నియంత్రణలు లేకుండా, డైనమిక్ క్యూఆర్ కోడ్ పెట్టి, దేవస్థానానికి ఏవిధమైన లెక్క తెలిసే వీలు లేకుండా, కేవలం టికెట్ మాత్రమే ప్రింట్ వచ్చేలా సాఫ్ట్వేర్ ఎందుకు తయారు చేయాల్సి వచ్చిందని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇదంతా ఉద్దేశపూర్వకంగానే జరిగిందని అంటున్నారు. అసలు దేవస్థానం ఉన్నతాధికారుల ఆథరైజేషన్ లెటర్ లేకుండా సాఫ్ట్వేర్ తయారు చేయడం, దాన్ని బయటకు ఇవ్వడం కూడా నేరమే. దీనిని పోలీసులు ఎందుకు తీవ్రంగా పరిగణించడం లేదో ఆ చిన వెంకన్నకే తెలియాలి. ఏ9 నిందితుడా? ప్రత్యేకంగా సాఫ్ట్వేర్ తయారు చేసి ఉండకపోతే ఈ టెక్నికల్ స్కాం జరిగేది కాదు. అలాంటి స్కామ్కు కారణమైన వ్యక్తిని పోలీసులు ఏ–9 నిందితుడిగా (ఆఖరిలో) చేర్చడం తమను విస్మయానికి గురిచేసిందని పలువురు భక్తులు అంటున్నారు. రాజకీయ ఒత్తిళ్లే దానికి కారణమన్న ఆరోపణలు లేకపోలేదు. ఇలాంటి పరిస్థితుల్లో కేసు దర్యాప్తు నిస్పక్షపాతంగా జరుగుతుందా.. అన్న అనుమానాలు భక్తుల్లో వ్యక్తమవుతున్నాయి. సీబీ సీఐడీకి అప్పగించాలి : కేసు దర్యాప్తు ఇంకా జరుగుతోందని డీఎస్పీ డి.శ్రావణ్ కుమార్ ఇప్పటికే మీడియాకు తెలిపారు. దాంతో ఈ స్కామ్తో సంబంధం ఉన్న దేవాలయంలోని కీలకమైన వ్యక్తులు ఎవరైనా బయట పడతారా.. లేకపోతే పోలీసులు ఇంతటితో సరిపెడతారా.. అన్న చర్చకూడా క్షేత్రంలో జోరుగా సాగుతోంది. ఇదిలా ఉంటే జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో కేసు దర్యాప్తును పోలీసులు నిష్పక్షపాతంగా జరపాలని, లేనిపక్షంలో సీబీ సీఐడీకి అప్పగించాలని భక్తులు కోరుతున్నారు. పోలీసుల దర్యాప్తు ఎలా సాగుతుందో వేచి చూడాలి. -
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
ముమ్మిడివరం: స్థానిక జాతీయ రహదారి కాశివాని తూము బైపాస్ రోడ్లో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ప్రమాదంలో పాలకొల్లు ప్రాంతం గగ్గిపర్రుకు చెందిన రందికట్ల ఏసురాజు (18) మృతి చెందగా లంకల కోడేరుకు చెందిన కొయ్య రాజకుమార్ తీవ్రంగా గాయపడ్డాడు. వీరు యానాం నుంచి మోటారు సైకిల్పై వస్తూ ఆర్టీసీ బస్సును ఓవర్టేక్ చేయబోయి ఈ ప్రమాదానికి గురయ్యారు. వాహనంపై వెనుక కూర్చున్న ఏసురాజు జారిపడడంతో బస్సు వెనుక చక్రం కింద పడి మృతి చెందాడు. రాజ్కుమార్ కొంచెం దూరం వెళ్లి రోడ్డుపై పడి తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని 108లో స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఏసురాజు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ మేరకు ఎస్సై డి.జ్వాలాసాగర్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
శ్మశాన భూములకు రక్షణ కల్పించాలి
ఏలూరు (టూటౌన్): శ్మశాన భూముల్లో చెరువులు తవ్వుతున్న భూస్వాములపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పి.రామకృష్ణ డిమాండ్ చేశారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్లో డీఆర్ఓకి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ కలిదిండి మండలం, పేదలంక పంచాయతీ పరిధి రామకృష్ణాపురం శివారు గ్రామాల్లో పేదల శ్మశాన భూమి పక్కనున్న భూస్వాములు చేపల చెరువు తవ్వడానికీ ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కలిదిండి రెవెన్యూ శాఖ అధికారులకు, గ్రామ పంచాయతీ వెన్యూ అధికారులకు విన్నవించుకున్నా సమస్య పరిష్కారం కాలేదని మండిపడ్డారు. పేదల భూములను అభివృద్ధి పేరుతో లాక్కుంటూనే మరోపక్క పేదల ఉసురు తీస్తున్న పాలక ప్రభుత్వాలు పేదల శ్మశాన భూములను కూడా లాగేసుకుంటున్నాయని మండిపడ్డారు. ఇప్పటికై నా ఇరిగేషన్ అధికారులు స్పందించి శ్మశాన భూములకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి ఎస్.మహంకాళిరావు, గంటా సుబ్రహ్మణ్యం, వెంకట సుబ్బారావు, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
రాధాకృష్ణవి చెత్త పలుకులు
● మహిళలకు క్షమాపణలు చెప్పాలి ● ఏలూరులో వైఎస్సార్సీపీ బైక్ ర్యాలీ ఏలూరు టౌన్: వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తల కుటుంబాల్లోని మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ.. చెత్త పలుకులు పలికిన ఏబీఎన్ రాధాకృష్ణ తక్షణమే మహిళలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ఏలూరు నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ సమన్వయకర్త మామిళ్ళపల్లి జయప్రకాష్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఏలూరు వైఎస్సార్సీపీ కార్యాలయం నుంచి తొలుత కొద్ది దూరం ర్యాలీగా వస్తూ.. అనంతరం భారీ బైక్ ర్యాలీతో నగరంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. పాతబస్టాండ్ రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జి మీదుగా పాతబస్టాండ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సెంటర్, కర్రల వంతెన, జూట్మిల్లు సెంటర్, ఫైర్స్టేషన్ సెంటర్ మీదుగా మోటారు సైకిల్ ర్యాలీ చేశారు. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో హాజరై ఆందోళన చేశారు. జర్నలిజం ముసుగులో ఒక రాజకీయ పార్టీకి కొమ్ము కాస్తూ ఇష్టారాజ్యంగా నీచపు రాతలతో మహిళల మనోభావాలను కించపరుస్తావా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. భారీ ర్యాలీగా ఏలూరు టూటౌన్ పోలీస్స్టేషన్కు చేరుకుని టూటౌన్ సీఐ అశోక్కుమార్కు వినతిపత్రం సమర్పించారు. ఏబీఎన్ రాధాకృష్ణపై కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఏలూరు సమన్వయకర్త మామిళ్ళపల్లి జయప్రకాష్ మాట్లాడుతూ.. ప్రజా సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకువస్తూ ప్రజలకు న్యాయం జరిగేలా పత్రికలు, మీడియా తనవంతు పాత్ర పోషిస్తుందని, ఏబీఎన్ రాధాకృష్ణ వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తల కుటుంబాల్లోని మహిళల వ్యక్తిత్వాలను అవహేళన చేస్తూ.. పార్టీ నేతలకు వెన్నెముక లేనివారంటూ తన వీకెండ్ కామెంట్లో చెప్పటం నీచమైన విధానానికి నిదర్శనం అన్నారు. చంద్రబాబు ఏమి చెబితే అది టీడీపీ నేతలు, కార్యకర్తలు పాటిస్తారనీ వారిపై ఇలాంటి వీకెండ్ కామెంట్ ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. ఇప్పటికై నా వైఎస్సార్సీపీ పార్టీలోని మహిళలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ నిరసనలో నగర అధ్యక్షుడు గుడిదేశి శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యదర్శి దాసరి రమేష్, కై కలూరు పరిశీలకుడు నూకపెయ్యి సుధీర్బాబు, వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి గంటా మోహనరావు, అధికార ప్రతినిధి మున్నుల జాన్గురునాథ్, బీసీ సెల్ నగర అధ్యక్షుడు కిలాడి దుర్గారావు, మహిళ ప్రధాన కార్యదర్శి తుమరాడ స్రవంతి, వాణిజ్య విభాగం కార్యదర్శి భాస్కర్ల బాచి, కార్పొరేటర్ ఇనపనూరి కేదారేశ్వరి, ఎస్సీ సెల్ నగర అధ్యక్షుడు ఇనపనూరి జగదీష్, నగర మహిళ అధ్యక్షురాలు జిజ్జువరపు విజయనిర్మల, జిల్లా మహిళ ఉపాధ్యక్షురాలు చిలకపాటి డింపుల్, మహిళ నేతలు కంచుమర్తి తులసి, అచ్యుతకుమారి, రుబీనా, రావి సునీత, బీసీ సెల్ జిల్లా కార్యదర్శి కొల్లిపాక సురేష్, యువజన విభాగం ప్రధాన కార్యదర్శి గేదెల సూర్యప్రకాష్, వైఎస్సార్టీయూ జిల్లా అధ్యక్షుడు పల్లి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి లంకపల్లి గణేష్ తదితరులు పాల్గొన్నారు. -
నేత్రపర్వం.. ధ్వజారోహణం
ద్వారకాతిరుమల: శ్రీవారి ఆలయానికి దత్తత దేవాలయమైన లక్ష్మీపురంలోని శ్రీ సంతాన వేణుగోపాల జగన్నాథ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో ధ్వజారోహణ వేడుక శుక్రవారం రాత్రి నేత్రపర్వంగా సాగింది. శ్రీనివాసుని దివ్యకల్యాణ మహోత్సవాలను పురస్కరించుకుని ఈ వేడుకను భక్తుల గోవింద నామస్మరణల నడుమ అట్టహాసంగా నిర్వహించారు. ఉదయం ఆలయంలో కల్యాణమూర్తులకు అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. రాత్రి ధ్వజారోహణ కార్యక్రమం నిమిత్తం యాగశాలలో ధ్వజపటంపై గరుత్మంతుని చిత్రపటాన్ని అర్చకులు, పండితులు వేద మంత్రోచ్ఛరణలతో లిఖించారు. పూజలు, హోమాది కార్యక్రమాల అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, అర్చకులు, పండితుల వేదమంత్రోచ్ఛరణల నడుమ ధ్వజపటానికి హారతులిచ్చి, దానిని ధ్వజస్తంభంపై ఎగురవేశారు. శ్రీనివాసుని కల్యాణ మహోత్సవాలను వీక్షించేందుకు సర్వాది దేవతలను ఆహ్వానించే క్రమంలో ఈ ధ్వజారోహణ తంతును నిర్వహిస్తామని అర్చకులు జరిపారు. -
ధాన్యం విక్రయానికి ట్రక్ షీట్ తప్పనిసరి
పాలకొల్లు సెంట్రల్: రైతులు ధాన్యం విక్రయించేందుకు రైస్ మిల్లులకు పంపాలంటే ట్రక్ షీట్ తప్పనిసరిగా ఉండాలని జిల్లా వ్యవసాయ అధికారి జెడ్ వెంకటేశ్వరరావు అన్నారు. గురువారం మండలంలోని లంకలకోడేరు గ్రామంలో కోఆపరేటివ్ సొసైటీ వద్ద ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. రైతులు ధాన్యం తోలిన వెంటనే నగదు జమచేస్తామని, రవాణా చార్జీలు కూడా చెల్లిస్తామన్నారు. ట్రక్ షీట్ లేకుండా పంపిన ధాన్యాలకు నగదు పడడం ఆలస్యమవుతుందన్నారు. ఆర్డీవో దాశి రాజు మాట్లాడుతూ క్వింటా ధాన్యం మద్దతు ధర కామన్ రకానికి రూ.2,369, గ్రేడ్ ఏ రకానికి రూ.2,389 నిర్ణయించడం జరిగిందన్నారు. గోనె సంచులు రైతు సేవీ కేంద్రాల ద్వారా రైతులకు అందజేయడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో సివిల్ సప్లయి డీఎం ఇబ్రహీం, ఏఎంసీ చైర్మన్ కోడి విజయభాస్కర్, ఏడీఏ మురళీకృష్ణ, అంగర రామ్మోహన్, పాముల రజనీకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
మూల్యాంకనం.. ప్రశ్నార్థకం!
ఏలూరు (ఆర్ఆర్పేట): ఇటీవల జరిగిన పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు సంబధించి విద్యార్థులు రాసిన జవాబుపత్రాల మూల్యాంకనం ఉపాధ్యాయులకు సవాలు విసురుతోంది. ముఖ్యంగా ట్యాబ్ ఆధారిత మార్కుల నమోదు ప్రక్రియ ఉపాధ్యాయులకు పెను సవాలు విసురుతోంది. స్పెషల్ అసిస్టెంట్లకు ఈ విధానం తలకుమించిన భారంగా మారింది. ప్రతి స్పెషల్ అసిస్టెంట్ రోజుకు 80 జవాబు పత్రాలకు సంబంధించి ట్యాబ్ల్లో మార్కులు అప్లోడ్ చేయాల్సి వస్తోంది. దీంతో సాంకేతికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒక్కో పేపర్ స్కానింగ్ చేయడానికే వారికి 15 నుంచి 20 నిమిషాలకు పైగా సమయం పడుతోంది. ఈ లెక్కన వారు ప్రతిరోజూ సుమారు 640 నిమిషాలకు పైగా సమయం ఇందుకోసం వెచ్చించాల్సి వస్తోంది. అంతేకాకుండా ఎక్కువ మంది స్పెషల్ అసిస్టెంట్లు ఒకేసారి నెట్వర్క్ వినియోగిస్తుండడంతో ట్యాబ్లు సైతం మొరాయిస్తున్నాయి. తరగని పని : సాధారణంగా జవాబుపత్రాల మూల్యాంకనం ఉదయం 9 నుంచి ప్రాంభమై సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది. అయితే ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన ట్యాబ్ ఆధారిత మార్కుల నమోదు ప్రక్రియ కారణంగా రాత్రి 9 గంటలు దాటిన తరువాత కూడా జరుగుతూనే ఉంటోంది. నెట్వర్క్ సమస్య ఒక కారణం కాగా విద్యార్థి రాసిన జవాబుపత్రంలోని ప్రతి పేజీని స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి రావడం, అసిస్టెంట్ ఎగ్జామినర్ దిద్దిన పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించాల్సి రావడం ప్రధాన సమస్యగా తలెత్తింది. మార్కుల విషయంలో ఎటువంటి తేడా వచ్చినా పూర్తి బాధ్యతను స్పెషల్ అసిస్టెంట్లదేనని చెప్పడంతో వారిలో తీవ్ర ఒత్తిడి నెలకొంటోంది. వేతనం పెంచాలని డిమాండ్ : జవాబు పత్రాల మూల్యాంకనం విధుల్లో ఉన్న అసిస్టెంట్ ఎగ్జామినర్లు, స్పెషల్ అసిస్టెంట్లకు ఇస్తున్న వేతనం ఏమాత్రం న్యాయసమ్మతం కాదని ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరో నాలుగు గంటలకు పైగా అదనపు సమయం పని చేస్తున్నందున వేతనం పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. అసిస్టెంట్ ఎగ్జామినర్లకు పేపర్కు రూ. 10 చొప్పున చెల్లించడంతో పాటు రోజుకు రూ.400 డీఏగా చెల్లించనున్నారు. వారికి మొత్తం రోజుకు రూ. 800 చెల్లించే అవకాశం ఉంది. అయితే వారితో పాటు సమానంగా పని చేస్తున్న స్పెషల్ అసిస్టెంట్లకు మాత్రం 80 పేపర్లు వెరిఫికేషన్ చేసినందుకు గాను కేవలం రోజుకు రూ. 300 మాత్రమే చెల్లించే ఏర్పాటు చేయడం దారుణమంటున్నారు. మూల్యాంకన ప్రక్రియలో స్పెషల్ అసిస్టెంట్లు తీవ్ర అన్యాయానికి గురౌతున్నారు. అసిస్టెంట్ ఎగ్జామినర్లు దిద్దిన 80 పేపర్లను వీరు పరిశీలించి ట్యాబ్ల ద్వారా స్కానింగ్ చేసి మార్కులను నమోదు చేయించడం వెట్టి చాకిరీ చేయించడమే. పైగా వారికి రోజుకు కేవలం రూ. 300 వేతనం ఇస్తామనడం శ్రమదోపిడీగా పరిగణించాల్సి ఉంటుంది. – గుగ్గులోతు కృష్ణ, ఏపీటీఎఫ్ 1938, రాష్ట్ర అకడమిక్ కన్వీనర్ ట్యాబ్ ఆధారిత మూల్యాంకనంలో తలెత్తుతున్న సాంకేతిక సమస్యలను తక్షణమే పరిష్కరించాలి. ట్యాబ్ల పనితీరు సక్రమంగా ఉండేలా చూడాలి. వేగవంతమైన నెట్వర్క్ను వినియోగించేలా చర్యలు తీసుకోవాలి. మూల్యాంకన విధుల్లో ఉన్న ఉపాధ్యాయులందరికీ నిత్యం ద్రవపదార్థాలు పంపిణీ చేయాలి. దీనితో పాటు గదుల్లో గాలి, వెలుతురు సరిగా ఉండేలా చర్యలు తీసుకోవాలి. – గెడ్డం సుధీర్, వైఎస్ఆర్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధికార ప్రతినిధి సవాలు విసురుతున్న జవాబుపత్రాల మూల్యాంకనం నెట్వర్క్ లేక మొరాయిస్తున్న ట్యాబ్లు స్పెషల్ అసిస్టెంట్లకు పని భారం ఉదయం 9 నుంచి రాత్రి 9 గంటల వరకూ చేసినా తరగని పని వేతనం పెంచాలని డిమాండ్ -
ఉపాధ్యాయుల నిరసన
భీమవరం (ప్రకాశంచౌక్): కూటమి ప్రభుత్వం ఏర్పాటై 31 నెలలు గడుస్తున్నా 12వ పీఆర్సీ కమిటీని నియమించకపోవడం విచారకరమని ఫ్యాప్టో చైర్మన్ ఎల్.సాయిశ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. భీమవరంలోని స్పాట్ వాల్యూయేషన్ కేంద్రం వద్ద గురువారం ఉపాధ్యాయులు నిరసన తెలిపారు. ఎమ్మెల్సీ గోపీమూర్తి, సాయిశ్రీనివాస్ ఈ ఆందోళనకు మద్దతు తెలిపారు. వారు మాట్లాడుతూ 12వ వేతన సవరణ సంఘాన్ని తక్షణమే ఏర్పాటు చేయాలని, 30 శాతం మధ్యంతర భృతిని ప్రకటించాలని కోరారు. ఉపాధ్యాయ, విద్యా రంగ సమస్యల పట్ల ప్రభుత్వ ఉదాసీన వైఖరికి నిరసనగా ఈనెల 25, 26, 27 తేదీల్లో విజయవాడలో నిరాహార దీక్షలు నిర్వహిస్తామని సాయిశ్రీనివాస్ తెలిపారు. డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించకపోతే ఉద్యమం ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. భీమవరం (ప్రకాశంచౌక్): జిల్లాలోని అక్రిడిటేటెడ్ జర్నలిస్టుల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక ఉచిత మెడికల్ హెల్త్ చెకప్ కార్యక్రమం నిర్వహణకు చర్యలు చేపట్టినట్లు కలెక్టర్ సీహెచ్ నాగరాణి తెలిపారు. ఈ కార్యక్రమం భీమవరం, వీరవాసరం, ఉండి, కాళ్ల, ఆకివీడు, పాలకోడేరు జర్నలిస్టులకు ఈనెల 10వ తేదీ ఉదయం భీమవరం జిల్లా కలెక్టర్ ప్రాంగణంలో భీమవరం లయన్స్ క్లబ్, ఫెమినా లయన్స్ క్లబ్, ఒమిక్స్ నెక్ట్స్ లేబోరేటరీస్ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపు ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. అలాగే మిగతా నియోజకవర్గాల్లో ఈ ఆరోగ్య శిబిరాలు ఈనెల 13న నిర్వహిస్తామన్నారు. నరసాపురం, పాలకొల్లు, తణుకు, తాడేపల్లిగూడెం ఏరియా ఆస్పత్రుల్లో వైద్య పరీక్షలు నిర్వహిస్తామన్నారు. భీమవరం (ప్రకాశంచౌక్): రబీ సీజన్ ప్రారంభాన్ని దృష్టిలో ఉంచు కొని జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినట్లు జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి తెలిపారు. గురువారం గూగుల్ మీట్ ద్వారా నిర్వహించిన సమీక్ష సమావేశంలో జేసీ మాట్లాడారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కనీసం 50 శాతం గోనె సంచులు సిద్ధంగా ఉంచాలన్నారు. జిల్లాకు 7.25 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా నిర్ణయించినట్లు తెలిపారు. ధాన్యం రవాణా కోసం 1000 వాహనాలను సిద్ధం చేయగా, ఇప్పటి వరకు 438 వాహనాలకే రిజిస్ట్రేషన్ పూర్తయిందన్నారు. కొనుగోలు ప్రక్రియ పారదర్శకంగా సాగి రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగ కుండా చూడాలని సూచించారు. అనంతరం గ్యాస్ సరఫరా వ్యవస్థపై పౌరసరఫరాలు, రెవెన్యూ శాఖల అధికారులతో సమీక్షించారు. జిల్లాలో ఎక్కడా గ్యాస్ కొరత లేకుండా చర్యలు తీసుకో వాలని, వినియోగదారులు బుకింగ్ చేసిన తేదీ ఆధారంగా సరఫరా జరిగే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. డొమెస్టిక్ గ్యాస్ను అక్రమంగా ఇతర అవసరాలకు వినియోగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆగిరిపల్లి: మండలంలోని తోటపల్లి, గన్నవరం మండలం గొల్లనపల్లి సరిహద్దులో ఉన్న అర్లగట్టును గురువారం రెవెన్యూ అధికారులు పరిశీలించారు. అర్లగట్టుపై గ్రావెల్ తవ్వకాలు పెచ్చు మీరుతుండడంతో ‘కొండలనూ తవ్వేస్తున్నారు’ శీర్షికన సాక్షి కథనం ప్రచురించింది. దీనిపై తహసీల్దార్ పీఎన్వీ ప్రసాద్ ఆదేశాలతో ఆర్ఐ యూనస్, వీఆర్వో సుబ్బయ్య గ్రావెల్ తవ్వకాలు జరుగుతున్న ప్రాంతాన్ని పరిశీలించారు. అర్లగట్టుపై గ్రావెల్ తవ్వకాలను పరిశీలించి కలెక్టర్కు నివేదికను పంపిస్తామని తహసీల్దార్ ప్రసాద్ తెలిపారు. అనుమతులు లేకుండా గ్రావెల్, మట్టి అక్రమ తవ్వకాలు చేసిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. -
రిజిస్ట్రేషన్ల ఆదాయం రూ.364 కోట్లు
నూజివీడు: ఏలూరు జిల్లాలోని 12 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ల ద్వారా గత ఆర్థిక సంవత్సరానికి రూ.472.5 కోట్ల లక్ష్యం కాగా రూ.364.6 కోట్లు ఆదాయం వచ్చినట్లు ఏలూరు జిల్లా రిజిస్ట్రార్ కే శ్రీనివాసరావు పేర్కొన్నారు. నూజివీడులోని సబ్రిజిస్ట్రార్ కార్యాలయాన్ని గురువారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. దీనిలో భాగంగా రిజిస్ట్రేషన్ నిమిత్తం వచ్చిన ప్రజలకు సదుపాయాలు సక్రమంగా ఉన్నాయా, లేవా అని పరిశీలించారు. అలాగే రికార్డులను తనిఖీ చేసిన అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ నూజివీడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంకు గతేడాది టార్గెట్ రూ.69.48 కోట్లు కాగా రూ.54.55 కోట్లు ఆదాయం మాత్రమే వచ్చిందన్నారు. 1983 ముందు నుంచి ఉన్న రికార్డులను డిజిటలైజ్ చేస్తున్నామని, దీనివల్ల భూముల వివరాలన్నీ ప్రజలకు సులువుగా అందుబాటులోకి వస్తాయన్నారు. వివాహ రిజిస్ట్రేషన్లకు సంబంధించి ముందుగానే స్లాట్ బుక్ చేసుకుంటే ప్రక్రియ అరగంటలో పూర్తవుతుందన్నారు. అపార్ట్మెంట్లు, ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్లు గతంలో కంటే ప్రస్తుతం తగ్గాయని, వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు మాత్రం యథావిధిగా ఉన్నాయన్నారు. నూజివీడు పట్టణంలో ప్రస్తుతం కొనసాగుతున్న సబ్ రిజిస్టర్ కార్యాలయం వద్ద అసౌకర్యాలను గుర్తించామని, త్వరలోనే మరొక సౌకర్యవంతమైన భవనంలోనికి సబ్ రిజిస్టర్ కార్యాలయాన్ని మార్చడం జరుగుతుందన్నారు. స్థానిక సబ్ రిజిస్ట్రార్ నడింపల్లి ఫణిసీతారామరాజు ఉన్నారు. -
రోత వ్యాఖ్యలపై ప్రజాగ్రహం
శాశ్వత భవనం లేని కలెక్టరేట్ పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో కలెక్టరేట్ ఏర్పడి నాలుగేళ్లు పూర్తయింది. ఇప్పటివరకు శాశ్వత భవనం లేక అద్దె భవనంలో కొనసాగుతోంది. 8లో uవైఎస్సార్ సీపీ హయాంలో నిర్మించిన సచివాలయం, రైతు భరోసా కేంద్రాలను కూటమి ప్రభుత్వం పోలీస్ స్టేషన్లుగా మార్చి గ్రామ స్వరాజ్యానికి తూట్లు పొడుస్తోంది. 8లో uశురకవారం శ్రీ 10 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026సాక్షి ప్రతినిధి, ఏలూరు: నీచమైన రాతలతో రాక్షాసానందం పొందే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు గట్టిగా బుద్ధి చెబుతామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తలు హెచ్చరించారు. మహిళల ఆత్మగౌరవాన్ని కించపరిచేలా మరీ ముఖ్యంగా వైఎస్సార్సీపీ నేతల కుటుంబ సభ్యులను రోత పదజాలంతో మాట్లాడడంపై ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిరసన ర్యాలీలు వెల్లువెత్తాయి. అదే విధంగా అనేక మండలాల్లో పార్టీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేసి, చట్టపరంగా అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే తణుకులో బుధవారం జిల్లాస్థాయిలో ఆందోళనలు నిర్వహించగా గురువారం పోలవరం, నూజివీడు, ఉండి, భీమవరం, ఉంగుటూరు, తాడేపల్లిగూడెం, పాలకొల్లు నియోజకవర్గాల్లో నిరసన ర్యాలీలు, పోలీసు ఫిర్యాదులు చేశారు. ● తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో.. ఏబీఎన్ రాధాకృష్ణ్ణపై చర్యలు తీసుకోవాలని తాడేపల్లిగూడెం నియోజకవర్గ కోఆర్డినేటర్ వడ్డి రఘురామ్ నాయుడు డిమాండ్ చేశారు. రాధాకృష్ణ వ్యాఖ్యలకు నిరసనగా తాడేపల్లిగూడెం పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీగా వెళ్లి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వడ్డి రఘురామ్ నాయుడు మాట్లాడుతూ రాధాకృష్ణ వైఎస్సార్సీపీ నాయకుల భార్యలనే కాకుండా యావత్ మహిళా సమాజాన్ని కించపరిచేలా మాట్లాడారన్నారు. మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా నీచమైన, నికృష్టమైన భాష ఉపయోగించడం అనాగరికమన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ల మెప్పు కోసం ఇలా దిగజారి వ్యాఖ్యలు చేయడం దారుణమన్నారు. వెంటనే క్షమాపణలు చెప్పకపోతే ఆంధ్రజ్యోతి కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ● భీమవరం నియోజకవర్గంలో.. మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణపై గురువారం భీమవరం వన్టౌన్ పోలీస్స్టేషన్లో భీమవరం నియోజకవర్గ ఇన్చార్జి చినమిల్లి వెంకటరాయుడు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ఫిర్యాదు అందజేశారు. ఈ సందర్భంగా చినమిల్లి మాట్లాడుతూ వైఎస్సార్సీపీ ఎప్పుడూ మహిళా పక్షపాతిగానే ఉంటూ, మహిళలకు పదవులు ఇచ్చి గౌరవించిందన్నారు. మహిళల పట్ల ఏబీఎన్ రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. వైఎస్సార్సీపీలోని నాయకులు, కార్యకర్తల భార్యల గురించి చాలా దుర్మార్గమైన వ్యాఖ్యలను చేసిన రాధాకృష్ణపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ● ఉండి నియోజకవర్గంలో.. ఉండి నియోజకవర్గ ఇన్చార్జి పీవీఎల్ నర్సింహరాజు ఆధ్వర్యంలో ఉండి సెంటర్ నుంచి ఉండి పోలీస్ స్టేషన్ వరకూ పార్టీ శ్రేణులతో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పీవీఎల్ మాట్లాడుతూ పార్టీకి అహర్నిశలు పాటుడుడుతున్న వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తల భార్యలపై చేసిన మురికి వ్యాఖ్యలకు రాధాకృష్ణ సిగ్గుపడాలన్నారు. రాజకీయాల్లో మహిళలను ఉద్దేశించి వ్యాఖ్యలు చేయడం ఎంత వరకూ సబబని ప్రశ్నించారు. నీచమైన మాటలకు క్ష మాపణ చెప్పకపోతే తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. అనంతరం ఉండి స్టేషన్ వద్ద నిరసన వ్యక్తం చేసి ఎస్సై ఎండీ నసీరుల్లాకు ఫిర్యాదు చేశారు. ● పాలకొల్లు నియోజకవర్గంలో.. కలానికే కళంకం తీసుకువచ్చిన ఏబీఎన్ రాధాకృష్ణపై చర్యలు తీసుకోవాలని పాలకొల్లు నియోజకవర్గ ఇన్చార్జ్ గుడాల శ్రీహరిగోపాలరావు (గోపి) అన్నారు. పట్టణ పోలీస్స్టేషన్లో ిసీఐ కోలా రజనీకుమార్కు ఫిర్యాదు చేశారు. పత్రికల్లో ఏది రాసినా చెల్లుబాటు అవుతుందనే అహంకారంతో మహిళలను కించపరుస్తూ కథనాలు రాసి పైశాచికానందం పొందుతున్న రాధాకృష్ణ నిరంకుశత్వ ధోరణిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వైసీపీ నేతల మహిళలపై దాడులు, దౌర్జన్యాలు మితిమీరుతున్నాయన్నాయని ఆందోళన చెందారు. రాధాకృష్ణ బహిరంగంగా మహిళలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ● నూజివీడు నియోజకవర్గంలో.. నూజివీడు నియోజకవర్గంలో పార్టీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు నేతృత్వంలో ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణపై ఫిర్యాదు చేశారు. ప్రతాప్ అప్పారావు మాట్లాడుతూ మహిళల గౌరవానికి భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. గౌవరమైన జర్నలిజం వృత్తిలో మహిళలను కించపరచడంపై ఆత్మ విమర్శ చేసుకోవాలని హితవుపలికారు. తక్షణమే రాధాకృష్ణ చేయించిన రోత వ్యాఖ్యలపై మహిళలకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ● పోలవరం నియోజకవర్గంలో.. పోలవరం నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు ఆధ్వర్యంలో ఏబీఎన్ రాధాకృష్ణపై కేసు నమోదు చేయాలని కోరుతూ బుట్టాయగూడెం పోలీస్ స్టేషన్ ఎదుట పార్టీ శ్రేణులు నిరసన కార్యక్రమం చేశారు. ఈ సందర్భంగా బాలరాజు మాట్లాడుతూ రాజకీయ స్వార్థ ప్రయోజనాలకు కార్యకర్తల భార్యలపై సైతం వ్యాఖ్యలు చేయించడం రాధాకృష్ణ మానసిక స్థితికి అద్దం పడుతుందన్నారు. ఇటువంటి చర్యలను సభ్యసమాజం ఏనాడు స్వాగతించదని, రాధాకృష్ణ తక్షణమే మహిళలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అదే విధంగా కొయ్యలగూడెం మండల కేంద్రంలో గురువారం వైఎస్సార్సీపీ శ్రేణులు నిరసన కార్యక్రమం చేపట్టారు. మహిళలపై ఏబీఎన్ రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. రాధాకృష్ణపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ కొయ్యలగూడెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తల కుటుంబ సభ్యులపై రాధాకృష్ణ చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఉంగుటూరు నియోజకవర్గం చేబ్రోలులో వైఎస్సార్సీపీ శ్రేణులు నిరసన తెలిపారు. చేబ్రోలు బస్టాండ్ సెంటర్ల నుంచి ర్యాలీగా బయల్దేరి పోలీస్ స్టేషన్లో ఎస్సై సూర్యభగవాన్కు ఆంధ్రజ్యోతి ఎడిటర్ రాధాకృష్ణపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. అలాగే నరసాపురం, ఆచంటలోని పోలీస్స్టేషన్లలో స్థానిక నాయకులు ఫిర్యాదులు చేశారు. చెత్త పలుకుకు ఛీత్కారం నీచానికి పరాకాష్టగా పిచ్చి రాతలు వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో నిరసనలు, ఫిర్యాదులు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ ఆత్మగౌరవం కించపరిస్తే గట్టిగా బుద్ధి చెబుతామని హెచ్చరిక ఉమ్మడి పశ్చిమలో వెల్లువెత్తిన నిరసనలు -
జిల్లా ఆర్చర్లకు పతకాలు
భీమవరం (ప్రకాశంచౌక్): గుంటూరులో ఇటీవల నిర్వహించిన చెరుకూరి వోల్గా– లెనిన్ మెమోరియల్ అండర్ 15 నేషనల్ ఆర్చరీ చాంపియన్షిప్లో కాంపౌండ్ విభాగంలో జిల్లా ఆర్చర్లు పతకాలు గెలుచుకున్నారు. మాగాపు సుహాస్ వ్యక్తిగత విభాగంలో గోల్డ్మెడల్ సాధించాడని ఆర్చరీ జిల్లా అధ్యక్షుడు ఎల్.జయరాజు గురువారం విలేకరులకు తెలిపారు. మిక్సిడ్ విభాగంలో అల్లూరు కనిష్కతో సిల్వర్ మెడల్, బాలుర విభాగంలో బ్రాంజ్ మెడల్ను కై వసం చేసుకున్నాడన్నారు. అల్లూరు కనిష్క, కలిదిండి హేమశ్రీ కాంపౌండ్ గర్ల్స్ టీమ్ సిల్వర్ మెడల్ సాధించిందని తెలిపారు. మెడల్స్ సాధించిన ఆర్చర్లను, కోచ్ సాహిత్ను పలువురు అభినందించారు. టి.నరసాపురం: ప్రభుత్వం నిషేధించిన కలుపు మందు గ్లైసెల్ 360 లీటర్లను వ్యవసాయ అధికారులు గురువారం స్వాధీనం చేసుకున్నారు. జిల్లా వ్యవసాయశాఖ అధికారి ఎస్కే హబీబ్ మాట్లాడుతూ మండలంలోని గుర్వాయిగూడెం గ్రామానికి చెందిన రైతు కె.నాగేశ్వరావుకు చెందిన ఆయిల్ పామ్ తోటలో ఉన్న షెడ్డులో నిషేధిత గ్లైసెల్ కలుపు మందు అక్రమ నిల్వలు ఉన్నాయని సమాచారం వచ్చిందన్నారు. దీంతో మండల వ్యవసాయ శాఖ అధికారి ప్రియాంక, చింతలపూడి ఎడిఎ సుబ్బారావుతో కలిసి తనిఖీలు నిర్వహించామన్నారు. తనిఖీల్లో 360 లీటర్ల గ్లైసెల్ బాటిళ్లు గుర్తించి, వీవీఆర్ఓ సమక్షంలో ఆ మందులను స్వాధీనం చేసుకుని రైతుపై 6ఏ కేసు నమోదు చేసి విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. పురుగుమందుల నియంత్రణ చట్టం 1968, జీవో నెంబర్ 649ప్రకారం గ్లైసెల్ 41 శాతం కలుపు మందును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తయారీ వినియోగం నిషేధించాయన్నారు. గ్లైసెల్ క్రయ విక్రయాలు చట్టరీత్యా నేరమని, ఆ మందును కొన్నా అమ్మినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. యలమంచిలి: మండలంలోని ఆర్యపేట గ్రామానికి చెందిన కవల లక్ష్మీ కుమారి (44) అనే మహిళ కువైట్ దేశంలో గుండెపోటుతో మృతి చెందింది. ఆమె గత నాలుగేళ్లుగా కువైట్లోని ఒక ఇంట్లో పనిచేస్తున్నారు. ఈ నెల 4న ఛాతీలో నొప్పి రావడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా ఆమె అప్పటికే గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. దీంతో స్థానిక భారతీయులు, ఇండియన్ ఎంబసీ సహకారంతో మృతదేహాన్ని కార్గో విమానంలో శుక్రవారం భారతదేశం తీసుకువస్తున్నారు. -
శాశ్వత భవనం.. ఇంకెంత దూరం?
● భీమవరం కలెక్టరేట్కు నాలుగేళ్లు పూర్తి ● గత ప్రభుత్వంలో శాశ్వత భవనానికి జీఓ ● కూటమి ప్రభుత్వం వచ్చాక కలెక్టరేట్ తరలింపునకు కుట్రలు భీమవరం (ప్రకాశం చౌక్) : పరిపాలన సౌలభ్యం, ప్రజలకు అధికార యంత్రాంగం అందుబాటులో ఉండాలని లక్ష్యంతో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి నరసాపురం పార్లమెంట్ను నూతన పశ్చిమగోదావరిగా జిల్లాగా భీమవరం జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేశారు. అయితే జిల్లా కలెక్టరేట్ ఏర్పడి నాలుగేళ్లు పూర్తయ్యింది. జిల్లాలోని ఏడు నియోజవర్గాల ప్రజలకు కలెక్టరేట్ ద్వారా అన్ని సేవలు సులభంగా వేగంగా అందుతున్నాయి. ఏలూరు 70 కిలోమీటర్లు వెళ్లే దూరాభారం తగ్గంది. అయితే కలెక్టరేట్కు శాశ్వత భవనం లేక ఇప్పటికీ అద్దె భవనంలో కొనసాగుతుంది. పట్టించుకోని కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత భీమవరం నుంచి కలెక్టరేట్ను వేరేచోటుకు తరలించాలని కుట్రలు జరిగాయి. భీమవరం ప్రజలు నుంచి తిరుగుబాటు రావడంతో ఆ ప్రయత్నాలు మానుకున్నారు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపు 20 నెలలు అవుతున్నా నేటికీ కలెక్టరేట్కు శాశ్వత భవనం నిర్మాణానికి మాత్రం ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అసలు కలెక్టరేట్ భవనం నిర్మాణం ఊసే ఎత్తడం లేదు. జిల్లాలోని కూటమి ప్రభుత్వం ప్రజాప్రతినిధులు, కేంద్ర ప్రభుత్వ ప్రజాప్రతినిధులు మంత్రులు కలెక్టరేట్ శాశ్వత భవనం నిర్మాణం గురించి పట్టించుకోవడం లేదు ఈ ఏడాది నిర్మాణంపై నీలినీడలు భీమవరం మార్కెట్ యార్డ్లోనే కలెక్టరేట్ భవనం నిర్మాణం ఉంటుందని స్థానిక ఎమ్మెల్యే అంజిబాబు స్పష్టం చేసి నెలలు గడస్తున్నాయి. కానీ ఇప్పవరకు నిర్మాణానికి సంబంధించి కనీసం అధికారులు పరిశీలన కూడా చేయలేదు. నిర్మాణానికి అనుకూలమైన వాతవారణం ఉండే వేసవిలో కలెక్టరేట్ శాశ్వత భవనం నిర్మాణం పనులు చేపట్టకపోతే ఈ ఏడాది కూడా కలెక్టరేట్ భవనం నిర్మాణం లేనేట్టా? అనే సందేహం కలుగుతుందని ప్రజలు చెబుతున్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి కలెక్టరేట్కు శాశ్వత భవనం ఉండాలని అన్నింటికి అనుకూలమైన భీమవరం మార్కెట్ యార్డ్ను ఎంపిక చేసి అక్కడ ఇంటిగ్రేటెడ్ భవనం నిర్మాణానికి జీఓ జారీ చేశారు. అప్పట్లో పలు రాజకీయ పార్టీలు, మేథావులు, సీనియర్ రాజకీయ నాయకులు. నేడు కూటమిలో నాయకులు కూడా అందరు కూడా మార్కెట్ యార్డులో కలెక్టరేట్ నిర్మాణం మంచి నిర్ణయమని ప్రశంసించారు. అలాంటి మార్కెట్ యార్డులో కలెక్టరేట్ భవనం నిర్మాణానికి ఈకూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోకుండా మౌనంగా ఎందుకు ఉంది? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇప్పటికై నా కూటమి ప్రభుత్వ ప్రజా ప్రతినిధులు కలెక్టరేట్ భవన నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు. -
గుబ్బల మంగమ్మ గుడి వద్ద టూరిజం అభివృద్ధికి కృషి
బుట్టాయగూడెం: మండలంలోని మారుమూల గ్రామమైన కామవరం సమీపంలో ఉన్న గుబ్బల మంగమ్మ తల్లి గుడిని ఏపీ ఫారెస్ట్ పీసీసీఎఫ్ మాజీ అధికారి, ప్రభుత్వ రాష్ట్ర అటవీశాఖ సలహాదారు మల్లికార్జునరావు గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా గుబ్బల మంగమ్మ గుడి పరిసర ప్రాంతాల్లో అటవీశాఖ ఆధ్వర్యంలో టూరిజం పరంగా అభివృద్ధి చేసేందుకు అవసరమైన వనరులపై, అధికారులను, కమిటీ ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుబ్బల మంగమ్మ గుడి అటవీప్రాంతంలో ఉన్నందున ఆ పరిసర ప్రాంతాల్లో ప్లాస్టిక్ వల్ల కలిగే కాలుష్యాన్ని నివారించేందుకు అధికారులు, కమిటీ సభ్యులు ప్రత్యేక చొరవ చూపాలన్నారు. ముఖ్యంగా భక్తులు ప్లాస్టిక్ గ్లాసులు, కవర్లు వాడకుండా అవగాహన కలిగించాలన్నారు. ఆలయ పరిసరాల్లో డీఎఫ్ఓ పర్యవేక్షణలో స్టాగ్ (ప్రదర్శన బోర్డు చిహ్నం) ఏర్పాటు చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో డీఎఫ్ఓ సందీప్ రెడ్డి, సబ్ డీఎఫ్ఓ వెంకట సుబ్బయ్య, జంగారెడ్డిగూడెం రేంజ్ అధికారి దుర్గాకుమార్బాబు, ములగలంపల్లి సెక్షన్ ఆఫీసర్ కె.రాంబాబు, ఆలయ కమిటీ ప్రతినిధులు కోర్సా రాంబాబు, కె. గంగరాజు, తదితరులు పాల్గొన్నారు. -
గ్రామ స్వరాజ్యానికి తూట్లు
● గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రాల్లో పోలీస్ స్టేషన్లు ● గత ప్రభుత్వ గుర్తులను చెరిపేస్తున్న వైనం సాక్షి, టాస్క్ఫోర్స్: గత ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వం గ్రామ స్వరాజ్యం నెరవేర్చేందుకు స్వగ్రామంలోనే పాలన ప్రజల ముంగిటకు తీసుకొచ్చారు. ముఖ్యంగా దెందులూరు నియోజకవర్గంలో దెందులూరు, పెదపాడు, పెదవేగి, ఏలూరు రూరల్ మండలాల్లో సచివాలయాలు రైతు భరోసా కేంద్రాలు, వైఎస్సార్ హెల్త్ క్లినిక్లు అన్ని కలిపి దాదాపు 250 నిర్మించారు. నాడు–నేడు పథకంలో భాగంగా ఎన్నో పాఠశాలలు ఆధునికీకరించారు. వంతెనలు, రోడ్లు నిర్మించారు. కూటమి చర్యలతో విస్మయం వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో పెదపాడులో నిర్మించిన సచివాలయాన్ని, పెదవేగిలో నిర్మించిన రైతు భరోసా కేంద్రాన్ని గురువారం పోలీస్ స్టేషన్లుగా మార్చి ప్రజా ప్రతినిధులు ప్రారంభించారు. అయితే ఈ చర్యలతో గ్రామీణ ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో ఎటువంటి ప్రభుత్వ కార్యాలయ భవన నిర్మాణాలు చేపట్టలేదని చెబుతున్నారు. ప్రజలకు సేవలను అందించిన సచివాలయం, రైతు భరోసా కేంద్రాన్ని పోలీస్ స్టేషన్లుగా మార్చి ప్రారంభించడం ఏంటి? అని ప్రశ్నిస్తున్నారు. 500కు పైగా శిలాఫలకాలు ధ్వంసం ఈ రెండు ప్రభుత్వ కార్యాలయాలపై గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి స్థానిక ప్రజాపతినిధుల పేర్లు ఉన్న శిలాఫలకాలను కూటమి ప్రభుత్వం వచ్చిన కొత్తల్లోనే ధ్వంసం చేశారు. అంతే కాకుండా నియోజకవర్గంలో దాదాపు 500పైగా శిలాఫలకాలను ధ్వంసం చేశారు. ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోకపోగా ‘నూతన భవనం’ అనే పేరుతో ప్రారంభోత్సవం చేయడం ఏంటి? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. పెదవేగిలో పోలీస్ సర్కిల్ ఆఫీస్గా మారిన రైతు భరోసా కేంద్రం -
ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులతో ఆరోగ్యం
ఏలూరు (టూటౌన్): స్థానిక ఐఏడీపీ హాలులో గురువారం ప్రకృతి వ్యవసాయ అమలుపై విస్తృత స్థాయీ శిక్షణ కార్యక్రమం ఘనంగా నిర్వహించామని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి యస్.కె.హబీబ్ భాషా తెలిపారు. లింగపాలెం, నిడమర్రు, టి.నర్సాపురం, చింతలపూడి, పెదపాడు, నూజివీడు, జంగారెడ్డిగూడెం, పెదవేగి, వేలేరుపాడు వివిధ మండలాలు నుండి సుమారు 120 మంది కేడర్ సభ్యులు ఈ శిక్షణలో పాల్గొన్నారని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ అధికారి హబీబ్ బాషా, జిల్లా ప్రాజెక్ట్ మేనేజరు బి.వెంకటేష్ మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయాన్ని విస్తృతంగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరాన్ని వివరించారు. -
నకిలీ టికెట్ల కేసులో నిందితుల అరెస్ట్
ఏలూరు టౌన్/ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమల దేవస్థానంలో నకిలీ టికెట్ల వ్యవహారంలో కీలకమైన నిందితులను గురువారం పోలీసులు అరెస్ట్ చేశారు. ద్వారకాతిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో నకిలీ టికెట్లను కౌంటర్ ద్వారా భక్తులకు విక్రయించి, భారీ ఎత్తున అక్రమార్జన చేసినట్లు పోలీసుల విచారణలో నిర్థారణ అయ్యింది. ఏలూరు పోలీస్ సబ్ డివిజన్ కార్యాలయంలో ఏలూరు డీఎస్పీ డి.శ్రావణ్కుమార్ నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ రూ.100, రూ.200 విలువైన నకిలీ టికెట్లను ముఖ్యంగా శని, ఆదివారాల్లో రద్దీ సమయంలో విక్రయిస్తూ భారీగా సొమ్ములు కాజేసినట్లు తెలిపారు. కీలక నిందితుడు దేవస్థానం ఔట్సోర్సింగ్ ఉద్యోగి ఐనంపూడి సాయి జగన్నాథరాజు అనే వ్యక్తితో పాటు మరికొందరు ఔట్ సోర్సింగ్ సిబ్బంది, సెక్యూరిటీ సిబ్బంది సైతం నకిలీ టికెట్ల వ్యవహారంలో భాగస్వాములుగా ఉన్నారని స్పష్టం చేశౠరు. ఒక సాప్ట్వేర్ ఉద్యోగి సహాయంలో కంప్యూటర్, ప్రింటర్లను ఏర్పాటు చేయటమే కాకుండా ప్రత్యేకంగా సాఫ్ట్వేర్ను రూపొందించినట్లు విచారణలో తేలింది. పెన్డ్రైవ్లో సాఫ్ట్వేర్ను వేసుకుని అప్పటికప్పుడు నకిలీ టికెట్లు ప్రింట్ తీస్తూ అవినీతికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ప్రతిరోజూ రూ.100ల టికెట్లు వంద, రూ.200 టికెట్లు వంద చొప్పున భక్తులకు విక్రయిస్తూ సొమ్మును కాజేసినట్లు పోలీసుల విచారణలో తెలిసింది. ఈ నకిలీ వ్యవహారంపై దేవస్థానం ఈఓ భద్రాజీ ఫిర్యాదుతో ద్వారకాతిరుమల పోలీస్స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కీలక నిందితుల అరెస్ట్ నకిలీ టికెట్ల వ్యవహారంలో ఏడుగురు కీలక నిందితులను ద్వారకాతిరుమల పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటికే ఏ3 సముద్రాల శేషుబాబు, ఏ4 మేక సతీష్ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు పంపారు. ప్రధాన నిందితుడు ద్వారకాతిరుమలకు చెందిన ఐనంపూడి సాయి జగన్నాథరాజు, ములగాల రమేష్, తొంటపాక సత్యనారాయణ, దెందులూరు మండలం పెరుగు గూడెం గ్రామానికి చెందిన ఉప్పలపాటి శ్రీనివాస్, కొమ్మర గ్రామానికి చెందిన కీర్తి అశోక్కుమార్, మానుకొండ ఆంజనేయులు, ఉంగుటూరు మండలం ఉప్పాకపాడు గ్రామానికి చెందిన ముత్యాల నాగవెంకట సత్యశ్రీనివాసరావును పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు. వీరివద్ద రూ.200 విలువైన 61 నకిలీ టికెట్లు, టికెట్ల ముద్రణకు వినియోగించే ల్యాప్ట్యాప్, థర్మల్ ప్రింటర్, 5 సెల్ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ అంశంపై లోతైన విచారణ చేస్తున్నామనీ, ఇంకా ఎవరైనా ప్రమేయం ఉందా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతుందనీ, రెగ్యులర్ ఉద్యోగులు ఏమైనా దీనిలో భాగస్వాములు అయ్యారా? అనేది విచారణ చేస్తున్నామని ఏలూరు డీఎస్పీ శ్రావణ్కుమార్ తెలిపారు. ఈ నకిలీ టికెట్ల కేసు దర్యాప్తులో ప్రతిభ చాటుకున్న భీమడోలు సీఐ పీ.కృష్ణ, ద్వారకాతిరుమల ఎస్సై టి.సుధీర్, కానిస్టేబుల్స్ జి.ధర్మరాజు, టి.లక్ష్మీనారాయణ, హోంగార్డు వీజే ప్రకాష్బాబును జిల్లా ఎస్పీ కేపీ శివకిషోర్, డీఎస్పీ శ్రావణ్కుమార్ ప్రత్యేకంగా అభినందించారు. ఈ కేసులో ఇద్దరు నిందితులకు, సాంకేతిక పరిజ్ఞానం కలిగిన ఓ నిందితుడు స్పెషల్ ఆఫర్ ఇచ్చాడు. సాఫ్ట్వేర్ తయారు చేసింది మీరేనని కోర్టులో ఒప్పుకుంటే రూ. 10 లక్షలు ఇస్తానని అతడు బంపర్ ఆఫర్ ఇచ్చాడు. అయితే ఆ ఆఫర్ను ఇద్దరు నిందితులు ఒప్పుకోలేదు. అయినా పట్టువిడవకుండా రాత్రి వరకు తమ ప్రయత్నాలు సాగించడం విశేషం.. అలా ఎలా తయారు చేశారు..? నకిలీ టికెట్ల స్కామ్కు వినియోగించిన సాఫ్ట్వేర్ను బయట వ్యక్తులు ఇష్టానుసారంగా ఎలా తయారు చేస్తారని పలువురు ప్రశ్నిస్తున్నారు. దేవదాయశాఖ ప్రిన్సిపాల్ కార్యదర్శి, కమిషనర్ స్థాయి అధికారులు ఆర్డర్ కాపీ ద్వారా అనుమతిస్తేనే గానీ సాఫ్ట్వేర్ను తయారు చేయకూడదు. కానీ తన స్నేహితుడు రమేష్ అడిగాడని ఉంగుటూరు మండలం, ఉప్పాకపాడు గ్రామానికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎమ్ఎన్వీఎస్ శ్రీనివాసరావు దేవస్థానం టికెట్ల సాఫ్ట్వేర్ను తయారు చేసేశాడు. ఇదిలా ఉంటే సాఫ్ట్వేర్ తయారు చేసినందుకు శ్రీనివాసరావును పోలీసులు ఎఫ్ఐఆర్లో ఏ9 (ఆఖరి) నిందితుడిగా చేర్చారు. తెలిసి చేసినా.. తెలియక చేసినా ఈ తప్పు కారణంగా నకిలీ టికెట్ల జారీ యథేచ్ఛగా సాగిపోయింది. -
నాలుగు సంస్థలతో కీలక ఎంఓయూలు
తాడేపల్లిగూడెం: డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వ విద్యాలయం ఒకే రోజు నాలుగు ప్రతిష్టాత్మక సంస్థలతో నాలుగు కీలక అవగాహన ఒప్పందాలు (ఎంఓయూ)లు కుదుర్చుకుందని ఉపకులపతి డాక్టర్ కె.ధనుంజయరావు హర్షం వ్యక్తం చేశారు. ఉద్యాన విశ్వ విద్యాలయం పరిపాలన భవనంలో గురువారం నిర్వహించిన ఎంఓయూల కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ ఒప్పందాలు కేవలం కాగితాలపై సంతకాలతో ఆగిపోకుండా ఆచరణలో గొప్ప ఫలితాలు అందిస్తాయని ఆయన తెలిపారు. నాలుగు ఒప్పందాలు భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి (ఐసీఏఆర్), బెంగళూర్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చర్ రీసెర్చ్ (ఐఐహెచ్ఆర్)తో కుదుర్చుకున్నామని తెలపారు. ఈ కార్యక్రమంలో ఐఐహెచ్ఆర్ డైరెక్టర్ డాక్టర్ తుషార్ కాంతి బెహరా, రిజిస్ట్రార్ డాక్టర్ ఎం.మాధవి, డాక్టర్ సీహెచ్ రూత్, డాక్టర్ బి.ప్రసన్నకుమార్, ఎస్.సూర్యకుమారి ప్రేమానందం తదితరులు పాల్గొన్నారు. పెదపాడు: రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన పెదపాడు మండలంలోని తాళ్లమూడిలో చోటు చేసుకుంది. పెదపాడు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బాపట్ల జిల్లా నగరం మండలం మెడపల్లి గ్రామానికి చెందిన పేరుమాని ఏడుకొండల రెడ్డి (40) తన టాటా ఇంట్రా వాహనంలో పచ్చిమిర్చి, చిలగడ దుంపల లోడును చీరాల సమీపంలోని చినగంజాం వద్ద లోడు చేసుకుని రాజమండ్రికి బయలుదేరాడు. మార్గమధ్యలో గురువారం తెల్లవారు జామున మూడు గంటల సమయంలో పెదపాడు మండలంలోని తాళ్లమూడి గ్రామానికి వచ్చేసరికి నిద్రమత్తులో ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టాడు. దీంతో తలకు బలమైన గాయం కావడంతో డ్రైవర్ సీట్లోనే ఇరుక్కుపోవడంతో హైవే పెట్రోలింగ్ అఽధికారులు బయటకు లాగేందుకు ప్రయత్నించారు. అయితే అప్పటికే ఏడుకొండలు రెడ్డి మృతి చెందాడు. బంధువుల ఫిర్యాదు మేరకు పెదపాడు ఎస్సై ఆర్.శ్రీనివాస్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఉండి: గ్రామంలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ద్విచక్రవాహనదారుడికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని పాములపర్రు గ్రామానికి చెందిన కఠారి శ్రీనివాసులు తన ద్విచక్రవాహనంపై బుధవారం సాయంత్రం 6:30 గంటల సమయంలో ఉండి గ్రామానికి టిఫిన్ కోసం వెళ్లాడు. తిరిగి వస్తుండగా గ్రామంలోని వెలివర్రు జంక్షన్ వద్దకు రాగానే పాములపర్రు వైపు నుంచి ఉండి వైపుగా ఎదురుగా వస్తున్న లారీ అతనిని వేగంగా ఢీ కొట్టింది. దీంతో అతనికి తలతో పాటు తీవ్ర గాయాలయ్యాయి. బాధితుడి సోదరుడు అంబులెన్స్లో భీమవరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. అక్కడి నుంచి అందిన సమాచారం, భార్య దుర్గ ఇచ్చి న ఫిర్యాదు మేరకు ఎస్సై ఎండీ నసీరుల్లా కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు. -
వైభవంగా శ్రీనివాసుని కల్యాణోత్సవాలు
ద్వారకాతిరుమల: శ్రీవారి ఆలయానికి దత్తత దేవాలయమైన లక్ష్మీపురంలోని శ్రీ సంతాన వేణుగోపాల జగన్నాథ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీనివాసుని దివ్యకల్యాణ మహోత్సవాలు గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి. కల్యాణ మహోత్సవాల్లో భాగంగా ఉదయం ఆలయంలో స్వామి వారిని పెండ్లి కుమారుడిగా, పద్మావతి, ఆండాళ్ అమ్మవార్లను పెండ్లి కుమార్తెలుగా చేశారు. అర్చకులు, పండితులు, ఆగమ విద్యార్ధుల వేద మంత్రోచ్ఛరణలు, భక్తుల గోవింద నామస్మరణలు, మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఈ వేడుక అత్యంత వైభవంగా నిర్వహించారు. ముందుగా ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికను ఆలయ అర్చకులు విశేషంగా అలంకరించారు. అనంతరం సింహాసనంపై కల్యాణ మూర్తులను ఉంచి ఈ తంతును నేత్రపర్వంగా నిర్వహించారు. ఆలయ ఈఓ వై.భద్రాజీ, సూపరింటెండెంట్ దుర్గాప్రసాద్ తదితరులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. -
జనసేన సేత రాసలీలల కేసు.. పోలీసుల నిర్లక్ష్యం
భీమవరం: పశ్చిమగోదావరి జిల్లా కేంద్రమైన భీమవరంలో జనసేన సేత రాసలీలల కేసులో పోలీసుల నిర్లక్ష్య వైఖరి స్పష్టంగా కనబడింది. జనసేన నేత జయప్రకాశ్పై పోలీసులు కేసు నమోదు చేయలేదు. అదే సమయంలో బాధితురాలిగా అండగా నిలవాల్సిన పోలీసులు.. కూటమి ప్రభుత్వ నాయకులకు కొమ్ముకాస్తున్న వైనం కొట్టొచ్చినట్లు కనబడింది. రాజకీయ ఒత్తిళ్లతో కేసు నమోదు చేయకుండా నిర్లక్ష్యం వ్యవహరించారు. భీమవరం వన్టౌన్ పోలీస్ స్టేషన్లో సీఐ, ఎస్సైలు ఉన్నా జయప్రకాశ్పై కేసు నమోదు చేయకుండా కాలయాపన చేశారు. బాధితురాలని నాలుగు గంటల పాటు స్టేషన్లోనే ఉంచారు. చివరకు ఈ కేసు తమ పరిధిలోకి రాదంటూ చేతులు దులుపుకున్నారు. ప్రభుత్వ పెద్దల ఒత్తిళ్లతో జనసేన నేతపై కేసు నమోదు చేయకుండా ఉండటమే కాకుండా, చివరకు బాధితురాలని నాలుగు గంటలపైగా స్టేషన్లో ఉంచడంపై విమర్శలు వస్తున్నాయి. కూటమి ప్రభుత్వంలో బాధితులకి న్యాయం జరగకపోవడం సర్వత్రా విమర్శల వర్షం కురుస్తోంది. -
రాధాకృష్ణ వ్యాఖ్యలపై కన్నెర్ర
తణుకు అర్బన్: మహిళలను కించపరిచే విధంగా ఏబీఎన్ చానల్లో రాధాకృష్ణ చేసిన అనుచిత వ్యాఖ్యలు దారుణమని వైఎస్సార్ సీపీ నేతలు ధ్వజమెత్తారు. వెంటనే ఆ వ్యాఖ్యలను రాధాకృష్ణ వెనక్కి తీసుకోకపోతే మహిళల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. రాధాకృష్ట వ్యాఖ్యలపై నిరసన వ్యక్తం చేస్తూ బుధవారం తణుకు నరేంద్ర సెంటర్లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు మాట్లాడుతూ సభ్యసమాజం తలదించుకునేలా ఒక తల్లి, అక్క, చెల్లి, భార్యగా ఉన్న మహిళలను అవమానపరిచే విధంగా రాధాకృష్ణ మాట్లాడడం దుర్మార్గమని అన్నారు. అమరావతి రాజధాని కోసం లక్షల కోట్లు ఖర్చుచేసే కంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాలను మావిగన్ కారిడార్గా మలచాలంటూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన విన్నపం ప్రజలకు చేరువైంది. ఇది తట్టుకోలేక సీఎం చంద్రబాబుకు బినామీ అయిన ఏబీఎన్ రాధాకృష్ణ ఈ నీచ జర్నలిజానికి ఒడిగట్టాడని మండిపడ్డారు. ఏబీఎన్ రాధాకృష్ణ వ్యవహారం అందరికీ తెలుసునని అన్నారు. తక్షణమే క్షమాపణ చెప్పాలి రాధాకృష్ణ వ్యాఖ్యలను మహిళలంతా ఛీకొడుతున్నారని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. మహిళలపై మీకు గౌరవం ఉంటే వెంటనే ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. జగన్మోహన్రెడ్డి చెప్పిన విధంగా మావిగన్ కారిడార్గా మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాలను అభివృద్ధి చేస్తే సుమారుగా రూ.10 వేల కోట్లతోనే ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవచ్చని దీంతో పరిశ్రమలు కూడా వస్తాయని అన్న వ్యాఖ్యలకు డైవర్షన్గా ఇంతకు దిగజారుతావా అని ప్రశ్నించారు. ఎన్నికల ముందు సంపద సృష్టిస్తామని వచ్చి 18 నెలల కాలంలోనే 2 లక్షల కోట్లు పైగా అప్పులు చేసి ఏం చేశారని అన్నారు. సంపద సృష్టించడమంటే జగన్కే దక్కిందని పోర్టుల నిర్మాణం, మెడికల్ కళాశాలలు, భవన నిర్మాణాలు కనిపిస్తాయని గుర్తుచేశారు. మాట్లాడుతున్న పార్టీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుతణుకులో ఆంధ్రజ్యోతి పేపర్లు చించుతూ నిరసన తెలుపుతున్న మాజీ మంత్రి కారుమూరి, పార్టీ జిల్లా అధ్యక్షుడు ప్రసాదరాజు మహిళలంటే చులకన భావంతో నీచమైన జర్నలిజాన్ని నడుపుతున్న ఏబీఎన్ ఛానల్ను మహిళలు చీదరించుకుంటున్నారని వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు గూడూరి ఉమాబాల అన్నారు. ఎమ్మెల్సీ కవురు శ్రీనివాసు, సీఈసీ సభ్యుడు కొట్టు వెంకట నాగు, భీమవరం పార్టీ ఇన్చార్జ్ చినమిల్లి వెంకటరాయుడు, పాలకొల్లు ఇన్చార్జ్ గుడాల గోపి, పార్లమెంట్ సెక్రటరీ యడ్ల తాతాజీ, ఎంబీసీ మాజీ చైర్మన్ పెండ్ర వీరన్న తదితరులు ఏబీఎన్ వ్యాఖ్యలకు నిరసనగా ఫ్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. కార్యక్రమంలో పార్టీ తణుకు పట్టణ అధ్యక్షుడు మారిశెట్టి శేషగిరి, వెలగల సాయిబాబారెడ్డి, వడ్లూరి సీతారాం, పొట్ల సురేష్, యిండుగపల్లి బలరామకృష్ణ, జల్లూరి జగదీష్, మెహర్ అన్సారీ, నూకల కనకదుర్గ, పెనుమాల రాజేష్, జంగం ఆనంద్కుమార్, ఎస్వీ జాకబ్బాబు, డీజే అమూల్యారావు, గెద్దా శ్రీకాంత్, యారబాటి రామకృష్ణ, షేక్ జిలానీ, బిరుదుకోట చింతన్న, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. మావిగన్ డైవర్షన్ కోసమే మహిళలపై అనుచిత వ్యాఖ్యలు ఏబీఎన్ రాధాకృష్ణ క్షమాపణ చెప్పాలి లేకుంటే మహిళల ఆగ్రహానికి గురికాక తప్పదు మాజీ మంత్రి కారుమూరి, పార్టీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి హెచ్చరిక తణుకులో వైఎస్సార్ సీపీ నేతల నిరసన -
ఫుట్బాల్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక
భీమవరం (ప్రకాశంచౌక్): స్థానిక రైల్వే స్టేషన్ రోడ్డు లోని ఏఎస్ రాజు రెసిడెన్సీ భవనంలో బుధవారం నిర్వహించిన సమావేశంలో పశ్చిమగోదావరి జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఎలక్షన్ అబ్జర్వర్, ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా చైర్మన్ బడేటి వెంకట్రామయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎలక్షన్ ఆఫీసర్గా గూడూరి సాంబమూర్తి వ్యవహరించగా జిల్లా అసోసియేషన్ అధ్యక్షుడిగా వేమిరెడ్డి హరికృష్ణ, ఉపాధ్యక్షులుగా ఏఎస్ఎన్ రాజు, ఇళ్ళ మధుసూదనరావు, కార్యదర్శిగా వానపల్లి రమేష్, సంయుక్త కార్యదర్శిగా జ్యోతి, కోశాధికారిగా ఆర్.సూరిబాబు, కార్యవర్గ సభ్యులుగా పి.ధీరేశ్వరనాధ్, విక్రమరావు, టి.సుధా దేవి, వి.దేవి, కో–ఆప్షన్ సభ్యులుగా నందమూరి విష్ణుమూర్తి, పి.సత్యనారాయణ, గౌరవ చైర్మన్గా ఇళ్ల రాధాకృష్ణ, గౌరవ అధ్యక్షులుగా పాపోలు ఏడుకొండలు, మిడతాని సురేష్ కుమార్లు నియమితులయ్యారు. నూతన కమిటీ నాలుగు సంవత్సరాల పాటు పదవీకాలంలో ఉంటుందని ఎన్నికల అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఫుట్బాల్ అసోసియేషన్ ప్రతినిధి జి.పవన్ తదితరులు పాల్గొన్నారు. -
మట్టి దొంగలపై చర్యలు తీసుకోవాలి
పెనుగొండ: ఆచంట నక్కల డ్రెయిన్లో మట్టి దొంగలపై చర్యలు తీసుకోవాలని నక్కల డ్రెయిన్ పరివాహక ప్రాంత రైతులు మంత్రి అచ్చెన్నాయుడుకు ఫిర్యాదు చేశారు. మార్టేరులో నిర్వహించిన కిసాన్ మేళాలో మట్టి మాఫియాపై రైతులు మంత్రికి వినతి పత్రం ఇచ్చారు. నక్కల కాలువ పడమర గట్టును ఆనుకుని 150 అడుగుల పొడవున, 50 అడుగుల వెడల్పులో 15 అడుగుల లోతున మట్టి అక్రమంగా తరలించుకుపోయారన్నారు. దీంతో రైతులు సమష్టిగా అడ్డుకుని మట్టిని అక్రమంగా తరలిస్తున్న మూడు వాహనాలను, జేసీబీపైనా అఽధికారులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. రెండు రోజుల్లో సుమారు 100 వాహనాల్లో మట్టిని తరలించారని తెలిపారు. దీంతో భారీ గోతులు ఏర్పడి దాళ్వా ధాన్యం రవాణా కష్ట సాధ్యంగా మారుతుందని, వర్షాకాలంలో గట్టు బలహీన పడి పరివాహక వరిచేలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. మట్టి మాఫియాపై అధికారులు చర్యలు తీసుకునే విధంగా ఆదేశాలు జారీ చేయాలని రైతులు మంత్రి అచ్చెనాయుడిని కోరారు. -
జనసేన జెడ్పీటీసీ సభ్యుడి వేధింపులు
సాక్షి ప్రతినిధి, ఏలూరు/భీమవరం (ప్రకాశం చౌక్): పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం మండల జనసేన జెడ్పీటీసీ సభ్యుడు గుండా జయప్రకాష్ నాయుడు తనను వేధించాడని, రూ.10 లక్షలు, బంగారం తీసుకుని మోసం చేశాడని ఆవేదన వ్యక్తం చేస్తూ భీమవరం గునుపూడికి చెందిన మద్దాల విజయలక్ష్మి అనే మహిళ వీడియో రిలీజ్ చేసింది. వీడియోలో ఆమె మాట్లాడుతూ... పవన్ కళ్యాణ్ అంటే అభిమానంతో భీమవరంలోని జనసేన పార్టీ ఆఫీసుకు ప్రతి కార్యక్రమానికి వెళ్లేదానినని, జెడ్పీటీసీ గుండా జయప్రకాష్ నాయుడుతో తనకు పరిచయం ఏర్పడిందన్నారు. నేను అంటే ఇష్టమని, లవ్ చేస్తున్నాను, పెళ్లి చేసుకుంటానని జయప్రకాష్ అడిగాడన్నారు. నాకు పెళ్లి అయిపోయిందని, విడాకులు కూడా తీసుకున్నానని... సెట్ అవ్వదని చెప్పానన్నారు. తనకూ పెళ్లి అయ్యిందని, తన భార్య కూడా వదిలేసిందని, బాగా చూసుకుంటానని చెప్పడంతో జయప్రకాష్ తో రెండేళ్లు కలిసి ఉన్నానని బాధితురాలు చెప్పారు. ఈ క్రమంలో ఇల్లు కొంటున్నానని, ఆర్థిక ఇబ్బంది ఉందని చెప్పి రూ.10 లక్షలు, బంగారం తీసుకున్నాడని... తర్వాత నుంచి అతడి ప్రవర్తన మారి తనను ఇష్టం లేకుండా చూడటం, కొట్టడం, గంజాయి కలిపిన స్వీట్స్ పెట్టడం, గంజాయి మత్తులో శారీరకంగా తనను టార్చర్ చేయడం వంటివి చేసేవాడని ఆవేదన వ్యక్తం చేసింది. తాను భరించలేక మా పుట్టింటికి వెళ్లిపోయానని, అయినా మళ్లీ ఫోన్ చేయడంతోపాటు, మా అమ్మతో మాట్లాడి... తీసుకెళ్లి మరలా టార్చర్ చేశాడని వాపోయింది. ఓ సారి టార్చర్ చేసిన తర్వాత ఆస్పత్రిలో చూపించి ఇంటికి పంపించాడని ఆమె రిలీజ్ చేసిన వీడియోలో తెలిపింది. ఈ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఆది నుంచి వివాదాస్పదుడే.. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గం వీరవాసరం జెడ్పీటీసీ గుండా జయప్రకాష్నాయుడు(జేపీ) ఆది నుంచి వివాదాస్పద వ్యక్తి. ఆయనపై భూఆక్రమణలు, సివిల్ వివాదాలు, కొట్లాటలకు సంబంధించి కేసులున్నాయి. అలాగే బ్యాంకు రుణాలకు సంబంధించిన, తెలంగాణలో మత్స్యశాఖలో చేపల సాగు టెండర్ల విషయంలోనూ నకిలీ ధ్రువీకరణపత్రాలు, బ్యాంకు గ్యారెంటీలు సమర్పించారని ఆరోపణలపైనా తెలంగాణ ప్రభుత్వం రెండేళ్ల కిందట విచారణ నిర్వహించింది. తణుకు, భీమవరం, వీరవాసరంలోనూ ఆయనపై కేసులున్నాయి. -
చాక్లెట్ ఆశ చూపి చిన్నారిపై లైంగిక దాడి
పెనుగొండ: రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక మహిళలు, బాలికలపై లైంగిక దాడులు నిత్యకృత్యం అయ్యాయి. తాజాగా పశ్చిమగోదావరి జిల్లాలో ముక్కుపచ్చలారని ఏడేళ్ల చిన్నారికి చాక్లెట్ ఆశ చూపి 70 ఏళ్ల వృద్ఢుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ బాలిక నొప్పి అంటూ విలపించడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. తల్లి ఆరా తీయడంతో వ్యవహారం బట్టబయలైంది. పశ్చిమగోదావరి జిల్లా ఆచంట మండలంలోని ఓ గ్రామంలో వెలగన వెంకటస్వామి (70) సోడా షాపు నిర్వహిస్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన చిరు వ్యాపారం చేసుకునే దంపతుల ఏడేళ్ల కుమార్తె ఎల్కేజీ చదువుతోంది. మంగళవారం మధ్యాహ్నం బాలిక సోడా దుకాణానికి వెళ్లడంతో వెంకటస్వామి చాక్లెట్ ఇస్తానంటూ లోపలకు తీసుకువెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఇంటికి వెళ్లిన బాలిక రాత్రి సమయంలో అమ్మానొప్పి అంటూ విలపిస్తూ విషయాన్ని తల్లికి తెలియజేసింది. దీంతో బాలిక తల్లిదండ్రులు ఆచంట పోలీసులకు ఫిర్యాదు చేశారు. నరసాపురం ఇన్చార్జి డీఎస్పీ రఘవీర్ విష్ణు ఘటనాస్థలికి చేరుకుని ఆరా తీశారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి పంపారు. పెనుగొండ సీఐ రాయుడు విజయకుమార్, ఆచంట ఎస్ఐ కె.వెంకటరమణ ఘటనపై విచారిస్తున్నారు. నిందితుడు వెలగల వెంకటస్వామి పోలీసుల అదుపులో ఉన్నట్టు సమాచారం. -
గర్బిణుల ప్రాణాలతో చెలగాటం
ఏలూరు టౌన్: వైద్యులను దేవుడితో సమానంగా గౌరవిస్తూ ఉంటారు... ప్రాణాపాయ స్థితిలో హాస్పిటల్కు వెళితే వైద్యుడు తన ప్రాణాలను కాపాడతారనే నమ్మకంతో ఉంటారు. ఏలూరు సర్వజన ఆసుపత్రిలోని మాతాశిశు విభాగం (ఎంసీహెచ్)లో గర్భిణుల ప్రాణాలతో చెలగాటం ఆడుతుందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది. నవమాసాలు మోసి... పండంటి బిడ్డకు జన్మనిస్తున్న గర్భిణుల ప్రాణాలకు భరోసా లేకుండా పోతుందంటూ బంధువులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకటీ...రెండో కాదు ఏకంగా పదుల సంఖ్యలో నిత్యం ఇదే తరహా తంతు సాగుతున్నా... జిల్లా స్థాయి అధికారులు సైతం ఏమీ చేయలేకపోవడంపై ప్రజల్లో అసంతృప్తి వ్యక్తం అవుతుంది. గర్భిణులకు ఆపరేషన్లు చేయగా... కుట్లు విడిపోవటం, తీవ్ర ఇన్ఫెక్షన్లతో అనారోగ్యం బారినపడటం, ప్రాణాపాయ స్థితి ఎదుకావడం ఇక్కడ సర్వసాధారణ అంశంగా మారిపోయింది. ప్రాణాలంటే... నిర్లక్ష్యమా ? ఏలూరు జీజీహెచ్లోని ఎంసీహెచ్ విభాగం వైద్యులు, వైద్య సిబ్బందికి మనుషుల ప్రాణాలంటే లెక్కలేదనీ... తీవ్ర నిర్లక్ష్యం కారణంగానే గర్భిణుల ఆపరేషన్ల విషయంలో విఫలం అవుతున్నారని అంటున్నారు. గత ఏడాది కాలంలో సుమారు 50 నుంచి 60మందికి పైగా గర్భిణులు ప్రాణాపాయ స్థితిని ఎదుర్కొంటూ హాస్పిటల్ నుంచి బలవంతంగా బయటకు వెళ్లిపోవటం పరిస్థితికి అద్దం పడుతుంది. తాజాగా ఎంసీహెచ్ బ్లాక్లో నిడిగట్టు మౌనిక, కొడాలి సుప్రియ, వెన్నెల, పెనుమాల రమ్య, లావణ్య ఇలా గర్బిణిలు వైద్యులు, సిబ్బంది అలసత్వంతో అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆపరేషన్ చేసిన అనంతరం కనీసం కుట్లు సరిగ్గా వేయకపోవటంతో కుట్లు విడిపోయి, తీవ్ర ఇన్ఫెక్షన్తో విలవిల్లాడుతున్నారు. పోనీ బయటకు వెళ్ళి వేరే హాస్పిటల్లో వైద్య చికిత్స చేయించుకుందామని అనుకుంటే... డిశ్చార్జ్ చేయకుండా వైద్య సిబ్బందితో బెదిరింపులకు పాల్పడడం నిత్య కృత్యంగా మారిపోయిందనే ఆరోపణలు ఉన్నాయి. ఎంసీహెచ్ బ్లాక్ వద్ద ఆందోళన ఏలూరు జీజీహెచ్లోని ఎంసీహెచ్ బ్లాక్ వద్ద గర్భిణులపై వైద్యులు, వైద్య సిబ్బంది తీరుకు నిరసనగా మాలమహానాడు రాష్ట్ర నాయకులు అబ్బూరి అనిల్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బాధితుల తరఫున ఆందోళనకు దిగారు. హాస్పిటల్ గేటు వద్ద బైఠాయించి బాధితుల బంధువులు, యువతతో కలిసి ధర్నా చేశారు. ప్రజలకు సరైన వైద్యం చేయకుండా నిర్లక్ష్యం వహిస్తూ అధికారులు చర్యలు చేపట్టకపోవటంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతోమంది పేదవర్గాల మహిళలు ప్రసూతి కోసం జీజీహెచ్కు వస్తుంటే... ఇలా ప్రాణాలతో చెలగాటం ఆడటం దారుణమంటూ నిరసన తెలిపారు. పీజీలతో వైద్యం చేయిస్తూ...చోద్యం చూస్తున్న అధికారులు కుట్లు విడిపోయి... ఇన్ఫెక్షన్లతో తీవ్ర అనారోగ్యం ఏలూరు జీజీహెచ్లో వైద్యసేవలపై తీవ్ర అసంతృప్తి ఏలూరు జీజీహెచ్లో వైద్యులు, సిబ్బంది తీరు దారుణంగా ఉంది. పేద మహిళలు ప్రసూతికి వస్తే ... తిరిగి ఇంటికి క్షేమంగా వెళ్లే పరిస్థితి లేకుండా చేస్తున్నారు. రెండు, మూడు సార్లు కుట్లు వేయటానికి వాళ్ళు మనుషులేనా ? అంటూ మండిపడ్డారు. కుట్లు విడిపోయి ఇన్ఫెక్షన్లతో బాధపడుతూ ఉంటే కనీస వైద్యచికిత్స చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఆపరేషన్ చేశాక 20 నుంచి నెలరోజుల వరకూ హాస్పిటల్లోనే ఉంచుతూ... మందులు బయటకు రాస్తూ వ్యాపారం చేస్తున్నారు. – అబ్బూరి అనిల్, మాలమహానాడు, రాష్ట్ర నాయకులు నేను కడుపులో నొప్పితో సుమారు ఆరునెలల నుంచీ ఏలూరు జీజీహెచ్కు తిరుగుతూ ఉన్నా. మేము ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లి చూపించుకునే స్తోమత లేక జీజీహెచ్కు వస్తే... ఇక్కడ వైద్యులు కనీసం చేయి పట్టుకుని కూడా చూడలేదు. రక్త పరీక్షలు పేరుతో తిప్పుతూ ఉన్నారు. కడుపులో గడ్డలు ఉన్నాయంటారు.. కానీ చికిత్స మాత్రం చేయడం లేదు. పేదలకు సరైన వైద్యం అందే పరిస్థితి కనిపించడం లేదు. ఆసుపత్రి అధికారులు దీనిపై చర్యలు తీసుకోవాలి. – దానం భవానీ, తంగెళ్లమూడి -
నేడు కార్పొరేషన్ కార్యాలయం వద్ద ధర్నా
ఏలూరు (ఆర్ఆర్పేట): ఏలూరు నగర పాలక సంస్థలో పనిచేసే మున్సిపల్ ఆప్కాస్ కార్మికులు 1000 మందికి మార్చి నెలలో ఇవ్వాల్సిన జీతాలు నేటికి ఇవ్వలేదని, వెంటనే జీతాలు ఇవ్వాలని కోరుతూ ఏపీ మున్సిపల్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో బుధవారం ఉదయం 10 గంటలకు కార్పొరేషన్ ఆఫీసు వద్ద ధర్నా నిర్వహించాలని ఫెడరేషన్ ఏలూరు నగర కమిటీ సమావేశం నిర్ణయించిందని ఆ సంఘ నాయకులు తెలిపారు. స్థానిక ఐఎఫ్టీయూ కార్యాలయంలో ఫెడరేషన్ సమావేశం యూనియన్ అధ్యక్షుడు లావేటి కృష్ణారావు అధ్యక్షతన మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఫెడరేషన్ నగర కార్యదర్శి జి.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ నిధి పోర్టల్ పేరుతో కార్మికుల జీతాలను ఆలస్యం చేస్తున్నారని, దానివల్ల కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. సమావేశంలో యూనియన్ గౌరవాధ్యక్షుడు ఇఫ్టూ ఏలూరు నగర అధ్యక్షుడు బి.సోమయ్య, పంతం చిన్న నాగరాజు, బంగారు వెంకటేశ్వరరావు, తానంకి జార్జి పాల్గొన్నారు. -
లక్ష్మీపురంలో చోరీ
దెందులూరు: పెదవేగి మండలం లక్ష్మీపురం గార్డెన్స్లో రైతు మన్నె సుబ్రహ్మణ్యం ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. గత నాలుగు రోజుల నుంచి యజమానులు ఇంట్లో ఉండకపోవడంతో అదును చూసి చోరీ చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఇంటి తలుపులు పగలగొట్టి ఇంట్లో ఉన్న 12 కాసుల బంగారు ఆభరణాలను దోచుకున్నారు. మంగళవారం చోరీ జరిగిన విషయాన్ని గుర్తించిన సుబ్రహ్మణ్యం పోలీసులను ఆశ్రయించాడు. సంఘటన తెలుసుకున్న పెదవేగి సీఐ సీహెచ్ రాజశేఖర్, పెదవేగి ఎస్సై హరి సంఘటన స్థలాన్ని పరిశీలించి, బాధితుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ వివరించారు. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ బాధితులను పరామర్శించారు. భీమవరం (ప్రకాశంచౌక్): శోభిత వర్మ ఛారిటబుల్ ట్రస్ట్ ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా రాజమండ్రి నగరంలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ప్రఖ్యాత ఇంద్రజాలికుడు, రచయిత, మ్యాజిక్ స్టార్ డాక్టర్ బోస్ను ‘మార్నింగ్ స్టార్’ బిరుదుతో సత్కరించారు. మ్యాజిక్ రంగానికీ, రచనా రంగానికీ బోస్ చేస్తున్న విశిష్ట సేవలను ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ శ్రీనివాస వర్మ కొనియాడారు. ఎస్వీ కళాకారుల సంఘం ఆధ్వర్యంలో ఇంద్రజాల ప్రదర్శనలు, ఏక పాత్రాభినయ పోటీలు, కవితా పఠనాలు వంటి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ద్వారకాతిరుమల: రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాలైన ద్వారకాతిరుమల, అన్నవరం, సింహాచలం దేవస్థానాలకు నూతన ట్రస్ట్బోర్డు ఏర్పాటు చేసినట్టు ఓ లిస్ట్ సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. అందులో భాగంగా ద్వారకాతిరుమల శ్రీవారి దేవస్థానానికి చైర్మన్గా ఎస్వీ సుధాకరరావుతో కలిపి 17 మంది సభ్యులతో ట్రస్టుబోర్డు ఏర్పాటు చేసినట్టు అందులో పేర్కొన్నారు. చైర్మన్ మినహా మిగిలిన 16 మందిలో 13 మంది టీడీపీ, 2 జనసేన, 1 బీజేపీకి చెందిన వారు ఉన్నట్టు లిస్ట్లో పేర్కొన్నారు. ద్వారకాతిరుమల మండలం వేంపాడుకు చెందిన చింతమనేని హనుమంతరావు, ద్వారకాతిరుమలకు చెందిన కంపసాటి నాగసీత, నల్లజర్లకు చెందిన యలమాటి శ్రీనివాసరావు, ఆవపాడుకు చెందిన అచ్యుత సత్యనారాయణ, యర్నగూడేఇకి చెందిన పాలూరి వెంకట చరిత, దుద్దుకూరుకు చెందిన కడియం సత్యవతి, హుకుంపేటకు చెందిన హోట వీరభద్రరావు ఎంపికై నట్టు లిస్ట్లో ఉంది. అలాగే ఏలూరుకు చెందిన చలువాది శివకృష్ణ, అనపర్తికి చెందిన పల్లి శ్రీనివాసరెడ్డి, తణుకుకు చెందిన కాకి సురేష్ కుమార్, అల్లి సత్యనారాయణ, నెల్లిమర్లకు చెందిన కింతాడ కళావతి, గూడూరుకు చెందిన బత్తిన ప్రమీల, ప్రత్తిపాడుకు చెందిన చిరుగూరి సుశీల, తాడేపల్లిగూడేనికి చెందిన కాసిరెడ్డి మధులత, ఎమ్మిగనూరుకు చెందిన యుకే సుహాసిని ఎంపికై నట్టు ఉంది. ఆకివీడు: డ్వాక్రా యానిమేటర్ల అవినీతిలో అధికారులు, బ్యాంకు అఽధికారుల భాగస్వామ్యం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని ఐద్వా జిల్లా అధ్యక్షురాలు సందక ఉదయ కుమారి ఆరోపించారు. స్థానిక సంఘ కార్యాలయంలో మంగళవారం ఐద్వా సభ్యుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆకివీడులోని సంతపేట, సమతానగర్ ప్రాంతాల్లోని డ్వాక్రా గ్రూపు సభ్యులకు రూ. 2 కోట్ల మేర టోకరా వేసిన సంఘటనపై నేటికీ చర్యలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. అవినీతితో దుర్వినియోగమైన సొమ్మును డ్వాక్రా సభ్యుల వద్ద నుంచి వసూలు చేసేందుకు ఆదేశాలివ్వడం దారుణమన్నారు. గతంలో మేము తీసుకున్న సొమ్ము మాత్రమే తిరిగి చెల్లిస్తామని, అవినీతికి గురై బ్యాంక్లో డ్రా చేసిన సొమ్ముకు మాకు సంబంధంలేదని డ్వాక్రా సభ్యులు చెప్పినా పట్టించుకోకపోవడం దారుణమని ఆమె ఆవేదన వ్యక్తంచేశారు. దీనిపై గతంలో ఇచ్చిన ఫిర్యాదుపై పోలీస్ అధికారులు స్పందించకపోతే డ్వాక్రా సభ్యులతో జిల్లా అధికారుల కార్యాలయాలు ముట్టడిస్తామని ఉదయకుమారి హెచ్చరించారు. కార్యక్రమంలో డోకల లక్ష్మి, గేదల లావణ్య, ఎర్రా కృష్ణవేణి, బొక్కా కళ్యాణి, అర్జి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
ప్రశాంతంగా పోలీస్ పదోన్నతుల అర్హత పరీక్షలు
ఏలూరు టౌన్: ఉమ్మడి ఉభయగోదావరి జిల్లా, ఉమ్మడి కృష్ణాజిల్లాలో పని చేస్తున్న హెడ్ కానిస్టేబుల్స్, ఏఎస్ఐలు ఫిట్ఫర్ ఎస్ఐ ప్రమోషన్స్లో భాగంగా ప్రీ ప్రమోషనల్ ట్రైనింగ్ క్వాలిఫైయింగ్ పరీక్షలు ఏలూరు పోలీస్ ప్రధాన కార్యాలయం సమీపంలోని శ్రీ సురేష్చంద్ర బహుగుణ స్కూల్లో ప్రశాతంగా జరిగాయి. ఏలూరు జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ ప్రత్యేక పర్యవేక్షణలో మంగళవారం ఉదయం 9గంటల నుంచి 11.30గంటల వరకూ పరీక్షలు నిర్వహించారు. పేపర్–1 పరీక్షకు మొత్తం 112మంది హాజరుకాగా, వారిలో మహిళలు 29మంది, పురుషులు 83మంది ఉన్నారు. మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 4.30గంటల వరకూ పేపర్–2 పరీక్ష నిర్వహించారు. ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్ కుమార్ పరీక్ష కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్షల నిర్వహణ, సదుపాయాలను పరిశీలించారు. ఎక్కడా అవకతవకలకు తావులేకుండా పారదర్శకంగా, పటిష్టమైన ఏర్పాట్లు మధ్య పరీక్షలు సాగుతున్నాయని తెలిపారు. బుధవారం ఏలూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్స్లో పరీక్షలకు హాజరైన సిబ్బందికి టర్న్ అవుట్, స్వ్కాడ్ డ్రిల్, ఆర్మ్స్డ్రిల్, ఆయుధాల కోల్నా జోల్నా, వైవా, నేరస్థల పరిశీలన, నేర స్థలంలో వినియోగించే సాంకేతిక పరిజ్ఞానం వంటి అంశాలపై పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ఈ రెండు పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులకు పోలీస్ ట్రైనింగ్ కాలేజ్లో శిక్షణ అనంతరం వారికి సబ్ ఇన్స్పెక్టర్లుగా పదోన్నతులు లభిస్తాయని ఐజీ అశోక్కుమార్ స్పష్టం చేశారు. కార్యక్రమంలో జంగారెడ్డిగూడెం ఏఎస్పీ ఆర్.సుస్మిత, పోలవరం డీఎస్పీ యం.వెంకటేశ్వరరావు, డీటీసీ డీఎస్పీ సీహెచ్జీవీ ప్రసాద్, డీఏఆర్ అదనపు ఎస్పీ ఎల్.చెంచిరెడ్డి, తూర్పుగోదావరి జిల్లా ఈస్ట్జోన్ డీఎస్పీ బీ.విద్య, డీఏఆర్ డీఎస్పీ బీ.చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
15 నాటికి నీటి సరఫరా నిలిపివేత
పాలకొల్లు సెంట్రల్: సాగునీటి సంఘాల అధ్యక్షుల సమన్వయంతో మురుగు కాలువలు ప్రక్షాళణ చేసే దిశగా చర్యలు చేపడతామని డిస్ట్రిబ్యూషన్ కమిటీ చైర్మన్ పెన్మెత్స రామభద్రరాజు అన్నారు. మంగళవారం సాగునీటి సంఘాల అధ్యక్షులు, అధికారులతో స్థానిక డ్రెయినేజీ శాఖ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈఈ సీహెచ్ మురళీకృష్ణ మాట్లాడుతూ ఈ నెల 15 నాటికి ప్రధాన కాలువలకు నీటి కట్టడం జరుగుతుందన్నారు. అనంతరం మురుగు కాలువల ప్రక్షాళనపై చర్యలు చేపడతామని చెప్పారు. వీటి బాధ్యతను సాగునీటి సంఘ అధ్యక్షులు చేపడతారని తెలిపారు. గతంలో ఉన్న రేట్లకు పని చేయడానికి ఎవరూ ముందుకు రావడంలేదని అన్నారు. కార్మికుల వేతనాల పెంపుపై ఉన్నతాధికారులతో మాట్లాడతామని చెప్పారు. కార్యక్రమంలో ఏఈఈలు ఎ.దుర్గాప్రసాద్, జి.సతీష్, బి.సాయిశాంతం, సాగునీటి సంఘాల అధ్యక్షులు గొట్టుముక్కల సూర్యనారాయణరాజు, ఇంటి శ్రీరాములు, ఆరుమిల్లి రామశ్రీనివాస్, దేవరపు దొరబాబు, దేవళ్ల మోహన్, మాతా రత్నరాజు, కుక్కల సత్యనారాయణ, పులంకడం రాఘవులు, టి.వెంకట కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. -
సెప్సిస్ ప్రాణాంతకం..
● తీవ్ర అనారోగ్యానికి గురువుతున్న బాధితులు ● జాగ్రత్తలు తప్పనిసరి అంటున్న వైద్యులు యలమంచిలి: ప్రస్తుతం వాతావరణ మార్పులతో ప్రజలు రోగాల బారినపడుతున్నారు. చాలారోగాలు ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంటాయి. సాధారణంగా నలతగా ఉందంటే ఇన్ఫెక్షన్ సోకిందంటూ ఉంటా. వైద్యులు వివిధ పరీక్షలు చేసిన తరువాత ఏ ఇన్ఫెక్షనో చెబుతారు. అయితే ఈ సమస్యపై అంతులేని నిర్లక్ష్యం వహిస్తుంటాం. ఇన్ఫెక్షన్ ప్రాణాంతకం అయినా చాలామంది కొంచెం నలతగా ఉంటే సొంత వైద్యం చేస్తుంటారు. ఇలాంటి సందర్భాల్లో అనేక మంది ఇన్ఫెక్షన్ల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. ఇన్ఫెక్షన్ను సకాలంలో గుర్తించి చికిత్స అందిస్తే ప్రాణాలు కాపాడవచ్చు. తీవ్రమైన ఇన్ఫెక్షన్ను సెప్సిస్ అంటారు. శరీరంలో సోకే ఎలాంటి ఇన్ఫెక్షన్ అయినా అదుపు చేయకపోతే అది తీవ్రమైన ఇన్ఫెక్షన్కు (సెప్సిస్)కు దారి తీయవచ్చు. తొలుత ఇన్ఫెక్షన్ నిర్ధారణ కచ్చితంగా జరగాలి. అనంతరం నియంత్రణకు అవసరమైన చికిత్స చేయించాలి. మల్టిఫ్లెక్స్ పీసీఆర్ అనే అధునాతన వైద్య పరీక్ష ద్వారా త్వరితగతిన సెప్సిస్ను నిర్ధారించవచ్చు. బయోఫయర్ ద్వారా మూడు గంటల్లో నిర్ధారణ చేయవచ్చు. నిర్ధారణతోపాటు ఇన్ఫెక్షన్ నియంత్రణకు కావాల్సిన మందులు వాడాలి. వ్యక్తిగత పరిశుభ్రతతోపాటు యాంటిబయాటిక్స్ వైద్యుల సలహాలు మేరకు మాత్రమే వాడాలి. – డాక్టర్ ఆర్ శ్రీ సాహిత్య ఎమర్జెన్సీ,ఐసీయూ, అత్యవసర చికిత్స వైద్య నిపుణురాలు, పాలకొల్లు ముఖ్యంగా 60 సంవత్సరాలు దాటిన వారికి, చిన్న పిల్లలకు, ఊపిరితిత్తులు, గుండె, లివర్ లాంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి, హెచ్ఐవీ బాధితులకు, సుగర్ వ్యాధి బాధితులకు, వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి సోకే అవ కాశం ఉంది. ప్రతి సంవత్సరం ఐదు కోట్ల మంది సెప్పిస్ వ్యాధి బారిన పడుతున్నారు. వీరిలో కోటిమంది ప్రాణాలు ప్రమాదస్థితికి చేరుకుంటున్నా యి. ప్రపంచవ్యాప్తంగా 50శాతం మంది సెప్సిస్వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు. లక్షణాలు ఇది సూక్ష్మ క్రిముల ద్వారా వస్తుంది. శరీరంలో ఉష్ణోగ్రతలు హెచ్చు తగ్గులుగా ఉండటం, గుండె వేగంగా కొట్టుకోవడం, శ్వాస వేగంగా తీసుకోవడం, విపరీతమైన నీరసం, తీవ్రమైన చలి, ఆయాసం, మూత్ర విసర్జన తగ్గిపోవడం, బీపీ తగ్గడం, పెరగడం, రోగి తికమక పడడం తదితర లక్షణాలు వ్యాధి బాధితుల్లో కనిపిస్తాయి. వ్యాధి సోకే భాగాలు నూటికి 50 శాతం ఊపిరితిత్తులు. కిడ్నీలు, బ్రెయిన్, యూరినరి ట్రాక్, చర్మం, ఇతర భాగాల్లో వ్యాధి ఇన్ఫెక్షన్లు సోకుతాయి. కడుపులో ఇన్ఫెక్షన్లు రావడం ద్వారా అల్సర్లు ఏర్పడతాయి. కాళ్లల్లో పుండ్లు ఏర్పడి చీము పట్టి పరిస్థితి ప్రమాదంగా మారి కొన్నిసార్లు ఆపరేషన్ల ద్వారా ఆ గాయాలను తొలగించాల్సి వస్తుంది. బ్లడ్ కల్చర్, కార్బాఆర్, బయోఫైయర్ (అన్ని రకాల సూక్ష్మ క్రిములకు) పరీక్షల ద్వారా సెప్సిస్ని నిర్ధారిస్తారు. అంటువ్యాధి కారకాలు, వాటి విషపూరిత పదార్థాల వ్యాప్తి, వాటి స్థానం నుంచి రక్త ప్రవాహంలో కలవడం ద్వారా ఇన్ఫెక్షన్ సోకుతుంది. ఇది ఒక ప్రమాదకరమైన, ప్రాణాంతకమైన జబ్బు అని వైద్యులు హెచ్చరిస్తున్నారు. తక్షణమే గుర్తించి చికిత్స చేయని పక్షంలో శరీరంలోని పలు అవయవాలు ఇన్ఫెక్షన్ల వల్ల పనిచేయడం మానేస్తాయని వివరిస్తున్నారు. చివరికి రోగి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. వీరికి సకాలంలో వ్యాధి నిర్ధారణ చేసి వైద్యం అందించని పక్షంలో తీవ్రమైన ఇన్ఫెక్షన్ (సెప్సిస్) మారి రోగులను ఐసీయూలో అడ్మిట్ చేయాల్సి వస్తుందని చెబుతున్నారు. -
వైఎస్సార్ విగ్రహ మరమ్మతులకు అనుమతివ్వండి
ఏలూరు టౌన్: మాజీ ముఖ్యమంత్రి, దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం వద్ద మరమ్మతులు చేపట్టేందుకు అనుమతులు ఇవ్వాలని కోరుతూ వైఎస్సార్ సీపీ ఏలూరు సమన్వయకర్త మామిళ్ళపల్లి జయప్రకాష్ ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వికి వినతిపత్రం సమర్పించారు. ఏలూరు ఫైర్స్టేషన్ సెంటర్లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్ విగ్రహం చుట్టూ ఉన్న రెయిలింగ్, ఫ్లోరింగ్ మరమ్మతులకు అనుమతులు మంజూరు చేయాలని కోరారు. గతంలో వైఎస్సార్ విగ్రహం వద్ద వాటర్ ఫౌంటెయిన్ నిర్మిస్తామంటూ రైలింగ్, ఫ్లోరింగ్ తొలగించారనీ, కానీ నేటికీ అభివృద్ధికి నోచుకోలేదన్నారు. ప్రభుత్వ నిధులతో కాకుండా తామే సొంత ఖర్చులతో మరమ్మతులు చేసేందుకు అనుమతి ఇవ్వాలని కలెక్టర్ను కోరారు. ఏలూరు నగరంలోనూ ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారనీ వాటి పరిష్కారానికి జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి చర్యలు చేపట్టాలని కోరినట్లు సమన్వయకర్త జయప్రకాష్ తెలిపారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ఎస్సీసెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నూకపెయ్యి సుధీర్బాబు, బీసీ సెల్ జిల్లా అధ్యక్షులు నెరుసు చిరంజీవి, జిల్లా అధికార ప్రతినిధి మున్నుల జాన్గురునాథ్, రాష్ట్ర మహిళ ప్రదాన కార్యదర్శి తుమరాడ స్రవంతి, రాష్ట్ర కార్యదర్శి దాసరి రమేష్, వాణిజ్య విభాగం రాష్ట్ర కార్యదర్శి భాస్కర్ల బాచి, నగర మహిళ అధ్యక్షురాలు జిజ్జువరపు విజయనిర్మల ఉన్నారు. కలెక్టర్ వెట్రిసెల్వికి వైఎస్సార్ సీపీ నాయకుల వినతి -
కాలువ వంతెనను ఢీకొట్టిన లారీ
తణుకు అర్బన్: తణుకు మండలం తేతలి జాతీయ రహదారిపై అదుపు తప్పిన లారీ కాలువ వంతెన రెయిలింగ్ను ఢీకొట్టి నిలిచింది. సోమవారం ఉదయం జరిగిన ఈ ఘటనలో పెను ప్రమాదం తప్పింది. రావులపాలెం నుంచి తాడేపల్లిగూడెం వైపు వెళుతున్న లారీ తేతలి జాతీయ రహదారిపై కాల్వ వంతెన వద్దకు వచ్చేసరికి అదుపుతప్పి రెయిలింగ్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. వంతెన రెయిలింగ్తోపాటు లారీ ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. ఘటనా స్థలానికి హైవే, తణుకు రూరల్ పోలీసులు చేరుకుని ట్రాఫిక్కు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టారు. తణుకు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
వేప చెట్లను పరిశీలించిన శాస్త్రవేత్తలు
ఏలూరు (టూటౌన్): వివిధ మండలాల్లో పురుగు, తెగుళ్ల కారణంగా చనిపోతున్న వేప చెట్లను సోమవారం నూజివీడు మామిడి పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డా. బీకే లక్ష్మీ, వెంకటరామన్నగూడెం ఉద్యాన కళాశాల అసోసియేట్ డీన్ డా. ఎన్బీవీ చలపతిరావు, ఏలూరు జిల్లా ఏరువాక కేంద్రం సమన్వయకర్త డా. కె. ఫణికుమార్ సంయుక్తంగా పరిశీలించారు. డైబ్యాక్ కారణంగా వేప చెట్లు చనిపోతున్నట్లు గుర్తించారు. డైబ్యాక్ అన్ని వయసుల వేప చెట్ల ఆకులు, కొమ్ములు, పుష్పాలను ప్రభావితం చేస్తుందన్నారు. దీని ప్రభావంతో చెట్టు పైభాగం నుంచి కిందివరకు కొమ్మలు క్రమంగా ఎండిపోతాయన్నారు. దీంతో చెట్లలో పూర్తిగా పండ్ల ఉత్పత్తి నష్టం సంభవిస్తుందన్నారు. డైబ్యాక్ ఒక ఫంగల్ రోగం అయినప్పటికీ, వేప చెట్లు కొన్నిసార్లు టీ మస్కిటో బగ్ కీటకం ద్వారా కూడా ప్రభావితమవుతాయన్నారు. డైబ్యాక్ సోకిన కొమ్ములను కత్తిరించి తొలగించాలని, తర్వాత కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రా లేదా కార్బెండెజిం 1 గ్రా, ప్రోఫెనోఫాస్ 2 మి.లీ లీటరు నీటికి కలిపి చెట్టు చిగురు, కొమ్మలు బాగా తడిచేలాగా పిచికారీ చేయాలని సూచించారు. -
కొల్లేరు.. ఎడారి తీరు
● మాయమవుతున్న పచ్చదనం ● సముద్రపు ఉప్పునీరు కొల్లేరులోకి.. ● రెగ్యులేటర్ల నిర్మాణంపై చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యంకై కలూరు: కోటి అందాల కొల్లేరు కళ తప్పింది. ఏప్రిల్లోనే చుక్క నీరు లేక ఎడారిని తలపిస్తోంది. పచ్చదనం మాయమైంది. కొల్లేరు పక్షులు నీటికోసం, ఆహారం కోసం అల్లాడుతున్నాయి. అధికారుల నిర్లక్ష్యం, పాలకుల పర్యవేక్షణ కొరవడడంతో దక్షిణ కాశ్మీరంగా పేరొందిన కొల్లేరు కన్నీరు పెడుతోంది. కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల నుంచి 67 డ్రెయిన్లు, వాగుల ద్వారా లక్షా 10 వేల క్యూసెక్కుల నీరు వరదల సమయంలో కొల్లేరులోకి చేరుతుంది. ప్రధానంగా బుడమేరు, తమ్మిలేరు, రామిలేరు డ్రెయిన్ల నుంచి ఎక్కువ నీరు వస్తుంది. వర్షాభావ పరిస్థితుల కారణంగా ఈ ఏడాది కొల్లేరులోకి నీటి ప్రవాహం తగ్గింది. దీంతో లక్షాలాది ఎకరాల కొల్లేరు భూములు బీటలు వారాయి. పర్యాటకులను ఆకర్షించే సహజసిద్ధ అందాలు నీరులేక కళావిహీనంగా తయారయ్యాయి. అలమటిస్తున్న కొల్లేరు పక్షులు కొల్లేరు సరస్సుకు ఏటా సైబీరియా, ఆస్ట్రేలియా, నైజీరియా వంటి పలు దేశాల నుంచి వలస పక్షులు విడిది కోసం వస్తాయి. మొత్తం 189 రకాల పక్షులు కొల్లేరుపై ఆధారపడి జీవిస్తున్నాయి. ఏటా డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి నెలలు పక్షుల సంతానోత్పత్తికి అనుకూల కాలం. కొల్లేరులో వింటర్ సీజన్ ముగిసినప్పటీకీ కొన్ని విదేశీ పక్షులతో పాటు స్వదేశీ పక్షులు కొల్లేరులోనే ఆవాసాలు ఏర్పాటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా పక్షి ప్రేమికుల స్వర్గథామంగా పేరుగడించిన ఆటపాక పక్షుల కేంద్రం విహార చెరువులో కేవలం రెండున్నర అడుగుల నీరు మాత్రమే ఉంది. ప్రస్తుత ఎండలు బట్టి మరో 20 రోజుల్లో నీరు అడుగంటే ప్రమాదం ఉంది. దీంతో పక్షులకు వేసవి ఆహార కష్టాలు ఈ ఏడాది తప్పడం లేదు. రెగ్యులేటర్ల నిర్మాణం కలేనా..? కొల్లేరు సరస్సులో నిత్యం నీరు నిల్వ ఉండాలంటే రెగ్యులేటర్ల నిర్మాణమే శరణ్యమని పలు కమిటీలు తేల్చిచెప్పాయి. వైఎస్సార్సీపీ పాలనలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్రలో కొల్లేరు ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు రెగ్యులేటర్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నిల్ ఇచ్చారు. ఉప్పుటేరు ముఖద్వారం, చినగొల్లపాలెం, పెదలంక డ్రెయిన్పై డబుల్ లైన్ బ్రిడ్జి. గరిసిపూడి అండర్ టెన్నల్ నిర్మాణాలకు రూ.452 కోట్లు కేటాయించారు. రెగ్యులేటర్ల నిర్మాణం జరిగితే కై కలూరు, ఆకివీడు, భీమవరం, పెడన, దెందులూరు నియోజకవర్గాలకు మేలు జరుగుతుంది. చంద్రబాబు ప్రభుత్వం రెగ్యులేటర్ల అంశాన్ని పక్కన పడేసింది. కొల్లేరులో నీరు లేకపోవడంతో సముద్రపు ఉప్పునీరు పైకి ఎగదన్నుతోంది. దీంతో పంట పొలాలు చౌడుబారుతున్నాయి. ఇప్పటికే కై కలూరు నియోజకవర్గంలో కలిదిండి మండలం ఉప్పుటేరు పరివాహక ప్రాంతాల్లో లక్షలాది ఎకరాల భూములు చౌడబారాయి. ప్రతి ఏటా ఏప్రిల్ నెల నుంచి మూడు నెలలు సముద్రపు నీరు కొల్లేరులో కలవడం వల్ల సరస్సులో సహజ సిద్ధంగా పెరిగే నల్ల జాతి చేపలు అంతరించిపోతున్నాయి. ఉప్పుశాతం ఎక్కువై కొల్లేరులో మట్టి బీటలు వేస్తోంది. మావులు (చేపలను పట్టే బుట్ట)ను కొల్లేరు సరస్సులో పెడుతోన్నా మత్స్యకారులకు రిక్తహస్తాలే మిగులుతున్నాయి. కొల్లేరుకు గోదావరి జలాలు మళ్లించాలి. చింతలపూడి వద్ద ఈ అవకాశం ఉంది. పోలవరం నిర్మాణం జరిగితే ఖచ్చితంగా కొల్లేరుకు నీరు వస్తుంది. అసలు కొల్లేరు సమస్యకు గుదిబండగా మారిన 120 జీవోను రద్దు చేయాలి లేదా సవరించాలి. కొల్లేరు ప్రజలతో చర్చలు జరిపి సమస్య పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేయాలి. – చింతపల్లి వెంకటనారాయణ, కొల్లేరు ప్రాంత సాహితీవేత్త, కై కలూరు రెగ్యులేటర్లు నిర్మిస్తే కొల్లేరు సరస్సులో నిత్యం నీరు నిల్వ ఉంటుంది. సముద్రపు నీరు ఏటా కొల్లేరులో ప్రవేశించకుండా షెట్టర్లు మూసుకునే అవకాశం కలుగుతుంది. నిల్వ చేసిన నీటిలో 2 అంగుళాల చేప పిల్లలను వదిలితే కొల్లేరు ప్రజలకు వేట ఉంటుంది. దీంతో కొల్లేరులో వలసలు నివారించవచ్చు. వైఎస్సార్సీపీలో కేటాయించిన పనులను చంద్రబాబు ప్రభుత్వం రాజకీయ కోణంలో చూడవద్దు. – ముంగర నరసింహారావు, కొల్లేరు నాయకుడు, ఆకివీడు -
బ్యాంకు ఉద్యోగి ఇంట్లో భారీ చోరీ
నరసాపురం: పట్టణంలోని 10వ వార్డులో బ్యాంకు ఉద్యోగికి చెందిన ఇంటిలో భారీ చోరీ జరిగింది. ఇంటి తాళాలు పగలగొట్టి పెద్దమొత్తంలో బంగారం, వెండి, నగదు అపహరించుకుపోయారు. వివరాలు ఇలా ఉన్నాయి. నరసాపురానికి చెందిన జి.శ్రీనివాస్ జాతీయబ్యాంకులో పనిచేస్తున్నారు. పది రోజుల క్రితం ఇంటికి తాళం వేసి కుటుంబంతో సహా షిరిడీ వెళ్లారు. సోమవారం యాత్ర ముగించుకుని ఇంటికి వచ్చి చూడగా ఇంటి తాళాలు పగలగొట్టి ఉన్నాయి. ఇంట్లో బీరువాలో దాచిన 18 కాసుల బంగారు నగలు, 2.50 కిలోల వెండి వస్తువులతో పాటు రూ.2 లక్షల నగదు దోచుకుపోయారని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సై జయలక్ష్మి సిబ్బందితో వచ్చి చోరీ జరిగిన ఇంటిని పరిశీలించారు. క్లూస్టీమ్ ఆధారాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు ఎస్సై వివరించారు. -
డివైడర్ ఎక్కిన కారు
తణుకు అర్బన్: తణుకు జాతీయ రహదారిపై సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక కారు డివైడర్ పైకి దూసుకెళ్లింది. స్థానిక శర్మిష్ట సెంటర్ వద్ద జరిగిన ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాకపోడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఉండ్రాజవరం మండలానికి చెందిన వ్యక్తి విజయవాడ నుంచి స్వగ్రామానికి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. నిద్రమత్తులోనే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. డివైడర్పై ప్రమాద సూచికలు ధ్వంసం కాగా కారు ముందు భాగం నుజ్జుయింది. చికిత్స పొందుతూ మృతి మంగళగిరి టౌన్, నిడమర్రు: ఎస్సై కొట్టాడని ఓ యువకుడు పురుగుల మందు తాగి చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన సోమవారం చోటుచేసుకుంది. ఏలూరు జిల్లా నిడమర్రు గ్రామానికి చెందిన నండూరి శివకార్తికేయ (38)తన మేనకోడలు బంగారం గొలుసు పోవడానికి అదే గ్రామానికి చెందిన వేణుగోపాల్ కారణమని ఆరోపించడంతో ఇరు వర్గాలు మార్చి 29వ తేదీ ఘర్షణ పడ్డారు. ఇరువర్గాలు మార్చి 30న నిడమర్రు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. 31వ తేదీన నిడమర్రు బాల వెంకటేశ్వరస్వామి కల్యాణ మహోత్సవాల్లో బందోబస్తు నిర్వహిస్తున్న ఎస్సై రమేష్, పోలీస్ సిబ్బందితో శివకార్తికేయ కేసు విషయమై వాగ్వివాదానికి దిగాడు. తనపై కేసు నమోదు చేసి వేణుగోపాల్పై ఎందుకు చర్యలు తీసుకోలేదని ఎస్సైను ప్రశ్నించాడు. దీంతో శివకారిక్తేయను జీపులో స్టేషన్కు తీసుకువెళ్లి ఎస్సై రమేష్ కొట్టినట్లు శివకార్తికేయ కుటుంబ సభ్యులు ఆరోపించారు. కల్యాణ మహోత్సవాల్లో అందరూ చూస్తుండగా ఎస్సై రమేష్ కొట్టాడని, విచారణ పేరుతో స్టేషన్కు తీసుకువెళ్లారని బాధితుడు శివకార్తికేయ ఏప్రిల్ 1వ తేదీన పురుగుల మందు తాగాడు. చికిత్స నిమిత్తం మంగళగిరిలోని ఎయిమ్స్ ఆసుపత్రికి కుటుంబ సభ్యులు తీసుకువచ్చారు. శివకార్తికేయ చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మృతి చెందాడు. పోలీసుల వేధింపులే మృతికి ప్రధాన కారణమని శివకార్తికేయ బంధువులు ఆరోపించారు. పాలకొల్లు సెంట్రల్: పోడూరు పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న హోంగార్డు రఘుమండ వెంకటరమణ (57) రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. విధి నిర్వహణలో భాగంగా ఆదివారం రాత్రి స్టేషన్కు వెళుతూ పాలకొల్లు మార్టేరు రోడ్డులో ఉల్లంపర్రు వద్ద ఉన్న ఓ పెట్రోల్ బంక్లో తన వాహనంలో పెట్రోలు కొట్టించుకున్నాడు. బంక్ నుంచి బయటకు వస్తుండగా ఓ కారు ఢీకొట్టడంతో రోడ్డుపై పడిపోయిన రమణ తలకు తీవ్ర గాయమైంది. గాయాలపాలైన రమణను స్థానికులు హుటాహుటిన ప్రభుత్వ ఆశుపత్రికి తరలించగా మెరుగైన వైద్యం కొరకు భీమవరం తరలించారు. అక్కడి నుంచి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందినట్లు తెలిపారు. రమణకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. -
పేకాటలో పట్టుబడ్డ ఏలూరు టీడీపీ ఎమ్మెల్యే గన్మెన్
● గతనెల 28న భీమడోలులో పేకాట శిబిరంలో గన్మెన్ అరెస్ట్ ● పదిరోజుల తరువాత ఇప్పుడు సస్పెండ్ చేస్తూ ఎస్పీ ఉత్తర్వులు ● ఈ పదిరోజులు ఎమ్మెల్యే బడేటి వెంటే గన్మెన్ సాక్షి, టాస్క్ఫోర్స్: ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య (చంటి) గన్మెన్ పేకాట ఆడుతూ పోలీసులకు పట్టుబడ్డారు. కేసు నమోదు చేసి అరెస్టు చేసిన పోలీసులు స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపేశారు. పదిరోజుల తరువాత సోమవారం అతడిని సస్పెండ్ చేస్తూ ఎస్పీ ఉత్తర్వులు జారీచేశారు. సాధారణంగా పోలీసుశాఖలో సిబ్బంది ఏదైనా తప్పు చేసినా, క్రమశిక్షణ ఉల్లంఘించినా వెంటనే వీఆర్కు పంపడం లేదా విచారణ నిర్వహించి సస్పెండ్ చేయడం సర్వసాధారణం. కానీ ఈ కానిస్టేబుల్ విషయంలో మాత్రం పదిరోజులు ఉన్నతాధికారులు పట్టించుకోలేదు. గతనెల 28న ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి గన్మెన్ శనపతి శ్రీఆంజనేయులు భీమడోలు పోలీస్స్టేషన్ పరిధిలో ఓ పేకాట శిబిరంలో పేకాడుతూ పోలీసులకు రెడ్హ్యాండెడ్గా చిక్కారు. అతడితో సహా ఎనిమిదిమందిని పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం గన్మెన్కు భీమడోలు పోలీసులు స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపారు. శాఖాపరమైన విషయం కావడంతో ఎస్పీ కార్యాలయానికి సమాచారం ఇచ్చారు. ఎస్పీ కూడా చర్యలేమీ తీసుకోలేదు. అప్పటినుంచి గన్మెన్ ఎమ్మెల్యే వెంట అన్ని కార్యక్రమాల్లో భద్రత నిమిత్తం పాల్గొంటున్నారు. సోమవారం ఉదయం చొదిమెళ్లలో జరిగిన సాగునీటి భద్రత–సాగునీటి సంఘాల బాధ్యత అనే కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే వెంట ఆయన కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో శ్రీ ఆంజనేయులును సస్పెండ్ చేస్తూ ఎస్పీ సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. -
26 నుంచి చిన్న వెంకన్న బ్రహ్మోత్సవాలు
● 30న రాత్రి 8 గంటల నుంచి తిరుకల్యాణం ● వచ్చేనెల 1న రథోత్సవంద్వారకాతిరుమల: ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమల చిన్నవెంకన్న వైశాఖమాస దివ్య బ్రహ్మోత్సవాలు ఈనెల 26 నుంచి వచ్చే నెల 3 వరకు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. వైఖానస ఆగమాన్ని అనుసరించి పాంచాహ్నిక దీక్షతో ఈ ఉత్సవాలను 8 రోజుల పాటు అట్టహాసంగా నిర్వహిస్తామని ఆలయ ఈఓ వై.భద్రాజీ తెలిపారు. ఉత్సవాలు జరిగే రోజుల్లో శ్రీవారికి ఉదయం, సాయంత్రం వేళల్లో గ్రామోత్సవాలను, శ్రీహరి కళాతోరణ వేదికపై సాంస్కృతిక కార్యక్రమాలను వైభవంగా జరుపుతామన్నారు. అలాగే ఆలయ ముఖ మండపంలో స్వామివారు రోజుకో ప్రత్యేక అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారని తెలిపారు. ఈ బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఈనెల 26 నుంచి వచ్చేనెల 3 వరకు ఆలయంలో స్వామివారికి నిత్యార్జిత కల్యాణాలు, ఆర్జిత సేవలను రద్దు చేస్తున్నట్టు చెప్పారు. యావన్మంది భక్తులు ఈ వేడుకల్లో పాల్గొని, స్వామివారిని దర్శించి తరించాలని ఈఓ కోరారు. ఉత్సవాలు జరిగేదిలా.. ● ఈనెల 26 న ఉదయం 9.30 గంటలకు శ్రీవారిని పెండ్లి కుమారునిగాను, అమ్మవార్లను పెండ్లి కుమార్తెలుగా చేసి ఉత్సవాలకు శ్రీకారం చుడతారు. ఆ రోజు రాత్రి 7 గంటలకు గజవాహనంపై స్వామివారి గ్రామోత్సవాన్ని నిర్వహిస్తారు. ● 27న రాత్రి 9 గంటలకు ధ్వజారోహణ, అనంతరం హంసవాహనంపై స్వామివారి గ్రామోత్సవాన్ని నిర్వహిస్తారు. ● 28న ఉదయం 7 గంటలకు సూర్యప్రభ వాహనంపై, రాత్రి 7 గంటలకు చంద్రప్రభ వాహనంపై స్వామివారి గ్రామోత్సవాన్ని నిర్వహిస్తారు. ● 29న ఉదయం 7 గంటలకు హనుమద్వాహనంపై స్వామివారి గ్రామోత్సవం, రాత్రి 7 గంటలకు ఎదుర్కోలు ఉత్సవం, అనంతరం వెండి శేష వాహనంపై గ్రామోత్సవాన్ని నిర్వహిస్తారు. ● 30న ఉదయం 7 గంటలకు సింహ వాహనంపై శ్రీవారి గ్రామోత్సవం, రాత్రి 8 గంటల నుంచి శ్రీ స్వామివారి తిరుకల్యాణ మహోత్సవం, అనంతరం వెండి గరుడ వాహనంపై గ్రామోత్సవాన్ని నిర్వహిస్తారు. ● వచ్చేనెల 1న రాత్రి 8 గంటల నుంచి రథోత్సవాన్ని నిర్వహిస్తారు. ● 2న ఉదయం 10.30 గంటలకు చక్రస్నానం, రాత్రి 9 గంటలకు ధ్వజావరోహణం, అనంతరం అశ్వ వాహనంపై గ్రామోత్సవాన్ని నిర్వహిస్తారు. ● 3న ఉదయం 9 గంటలకు చూర్ణోత్సవం, వసంతోత్సవం, రాత్రి 7 గంటలకు ద్వాదశ కోవెల ప్రదక్షిణలు, పవళింపుసేవ, శ్రీపుష్పయాగం కార్యక్రమాలు జరుగుతాయి. వీటితో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. -
మరణంలోనూ కలిసే పయనం
కొంగుముడులు వేసుకుని, ఏడడుగులు నడిచి, నాతిచరామి అంటూ పెళ్లినాడు చేసిన ప్రమాణాలను ఆ రెండు జంటలూ బహుశా మరువలేదేమో! కడవరకూ కలిసే తమ పయనాన్ని సాగించాయి. మరణంలోనూ పరస్పరం వీడలేక.. కానరాని లోకాలకు వెళ్లిపోయాయి. బంధువుల ఇంట జరిగిన శుభకార్యంలో ఆనందంగా గడిపి.. కారులో తిరుగు ప్రయాణమైన ఓ జంట.. తమ బిడ్డకు మంచి భవిష్యత్తును అందించాలనే తపనతో హైదరాబాద్ బయలుదేరిన మరో జంట.. వేర్వేరు ప్రమాదాల్లో దుర్మరణం పాలయ్యారు. ఈ రెండు సంఘటనలూ అటు కుటుంబ సభ్యుల్లోను, ఇటు స్థానికంగాను తీరని విషాదాన్ని నింపాయి. కపిలేశ్వరపురం (మండపేట): బంధువుల ఇంట శుభకార్యంలో అప్పటి వరకూ ఆనందంగా గడిపారు. ఉత్సాహంగా కబుర్లు చెప్పుకొంటూ తిరుగు ప్రయాణమయ్యారు. అంతలోనే విధి చిన్నచూపు చూసింది. వారు ప్రయాణిస్తున్న కారు రెప్పపాటులో అదుపు తప్పి, కాలువలోకి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో బోగిళ్ల వీర వెంకట సతీష్ (40), కిరణ్మయి (36) దంపతులు అక్కడికక్కడే మృతి చెందారు. వారితో పాటు కారులో ప్రయాణిస్తున్న మృతుల పిల్లలు, తల్లిదండ్రులను స్థానికులు కాపాడారు. మండపేట మండలం తాపేశ్వరం గ్రామ శివారు పేకేటిపాకలు వద్ద సోమవారం అర్ధరాత్రి 12.45 గంటలకు జరిగిన ఈ ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. మండపేట మండలం వెలగతోడు గ్రామానికి చెందిన వీర వెంకట సతీష్ రాజమహేంద్రవరం పేపర్ మిల్లులో ఎలక్ట్రికల్ ఇంజినీర్గా పని చేస్తున్నారు. వెలగతోడులోని చిన్నాన్న కుమారుడి వివాహ వేడుకలో పాల్గొనేందుకు ఈ నెల 3న కాకినాడ వెళ్లారు. ఆదివారం రాత్రి జరిగిన ఫస్ట్నైట్ ఫంక్షన్కు హాజరయ్యారు. అనంతరం, కుటుంబ సభ్యులతో కలిసి కాకినాడ నుంచి కారులో స్వగ్రామం వెలగతోడు బయలుదేరారు. సతీష్ కారు నడుపుతూండగా ముందు సీటులో భార్య కిరణ్మయి, వెనుక సీట్లలో తండ్రి వెంకట్రావు, తల్లి పద్మ, పదేళ్ల కుమారుడు మోక్షజ్ఞ, ఏడేళ్ల కుమారుడు జితేష్ ఉన్నారు.ఏం జరిగిందో ఏమో కానీ పేకేటిపాకలు – వెలగతోడు రోడ్డులో పేకేటి పాకలు శివారున కారు అదుపు తప్పి కాలువలోకి దూసుకుపోయింది. ప్రవాహం ఉధృతంగా ఉండటంతో కారు ముందు భాగం లోతు నీళ్లలోకి కూరుకుపోవడంతో సతీష్ కిరణ్మయి దంపతులు అక్కడిక్కడే దుర్మరణం పాలయ్యారు. ప్రమాద సమాచారం తెలుసుకున్న స్థానికులు హుటాహుటిన వచ్చి, పైకి కనిపిస్తున్న భాగంలోని కారు అద్దాలు పగులగొట్టి చిన్నారులు మోక్షజ్ఞ, జితేష్ తల్లిదండ్రులు వెంకట్రావు, పద్మలను కాపాడారు. సమాచారం అందుకున్న మండపేట రూరల్ సీఐ పి.దొరరాజు, రూరల్ ఎస్సై వి.కిశోర్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్రేన్ సాయంతో కారును బయటకు తీశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మండపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సోమవారం మధ్యాహ్నం రెండు గంటలకు మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. తండ్రి వెంకట్రావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని సీఐ దొరరాజు తెలిపారు. కళ్ల ముందే జలసమాధి తమ ఒక్కగానొక్క కొడుకు సతీష్, ప్రేమానురాగాలతో చూసుకునే కోడలు కిరణ్మయి తమ కళ్ల ముందే జలసమాధి కావడాన్ని తల్లిదండ్రులు వెంకట్రావు, పద్మ జీరి్ణంచుకోలేకపోయారు. చీకట్లో సాగిన ప్రయాణం తమ కుటుంబాన్ని విషాదంలోకి నెడుతుందని ఏమాత్రం ఊహించలేదని బావురుమన్నారు. ముక్కుపచ్చలారని చిన్నారులు మోక్షజ్ఞ, జితేష్ లు అమ్మా నాన్నా ఏరని అడుగుతూంటే ఏం చెప్పాలో దిక్కు తోచడం లేదంటూ వారు రోదిస్తున్న తీరు చూపరులను కంటతడి పెట్టించింది. శుభకార్యంలో సందడిగా గడిపిన కొడుకు, కోడలు కానరాని లోకానికి వెళ్లిపోవడంతో గుండెలు పగిలేలా విలపించారు. చిరునవ్వుతో ప్రేమగా పలకరించిన సతీష్ దంపతుల పలకరింపులు ఇంకా మరువక ముందే దుర్వార్త వినాల్సి వచ్చిందంటూ బంధువులు విషాదంలో మునిగిపోయారు. ఆ దంపతుల మృతదేహాలను చూసి గ్రామస్తులు కన్నీరు పెట్టుకున్నారు.


