breaking news
West Godavari
-
తణుకులో పోలీసుల ఓవరాక్షన్..
సాక్షి, పశ్చిమగోదావరి జిల్లా: తణుకులో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. వైఎస్సార్ విగ్రహం వద్ద 144 సెక్షన్ విధించారు. జనవరి 5న వైఎస్సార్ విగ్రహావిష్కరణ చేస్తామని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు ప్రకటించగా.. వైఎస్సార్ విగ్రహం చుట్టూ రెవెన్యూ అధికారులు ఇనుక కంచె వేశారు.ఎట్టిపరిస్థితుల్లోనూ వైఎస్సార్ విగ్రహాన్ని ప్రారంభిస్తామన్న కారుమూరి తేల్చి చెప్పారు. ఇప్పటికే మాజీ మంత్రి కారుమూరి సహా 13 మందిపై పోలీసులు అక్రమ కేసులు నమోదు చేశారు. విగ్రహం వద్ద పోలీసులు పహారా కొనసాగుతుంది.కాగా, ప్రశాంతతకు మారుపేరుగా నిలిచే తణుకు ప్రాంతం రాష్ట్రంలోనే వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి జరిగిన సంఘటనలతో ఈ ప్రాంత ప్రజలు ఆందోళన చెందుతున్నారు. తాజాగా తణుకు వై.జంక్షన్లోని వైఎస్సార్ విగ్రహం వద్ద చంద్రబాబు ఫ్లెక్సీ కట్టి టీడీపీ సానుభూతిపరులు చేసిన నిర్వాకం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే.వైఎస్సార్ విగ్రహానికి చంద్రబాబు ఫ్లెక్సీ కట్టడంపై ప్రజలు దుమ్మెత్తి పోశారు. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, వైఎస్సార్సీపీ శ్రేణులు ఆందోళనకు దిగడం, తమ ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం, ఆపై రెండు ఫ్లెక్సీలు పోలీసులు తొలగింపచేయడం రాష్ట్రంలో హాట్టాపిక్గా మారింది. -
కలెక్టరేట్లో ఎంప్లాయీస్ గ్రీవెన్స్ డే
భీమవరం (ప్రకాశంచౌక్): భీమవరం కలెక్టరేట్లో ఎంప్లాయీస్ గ్రీవెన్స్ డే కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. జిల్లా రెవెన్యూ అధికారి బి.శివన్నారాయణకు ఉద్యోగుల సమస్యలపై వినతిపత్రం అందజేశారు. యలమంచిలి మండలం ఏనుగువానిలంక గ్రామ సచివాలయ ఉద్యోగులకు 10 నుంచి 12 శాతం హెచ్ఆర్ఏ చెల్లింపు సమస్య, గ్రామ వార్డు సచివాలయాల్లో పని చేస్తున్న ఏఎన్ఎంలకు ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం మెడికల్ డిపార్టుమెంట్కు సంబంధం లేని విధులు కేటాయించవద్దని కోరారు. డిజిటల్ అసిస్టెంట్లకు ఎన్నికల బీఎల్ఒ డ్యూటీ వేయవద్దని కోరారు. భీమవరం: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నూతన క్యాలెండర్ను మంగళవారం కలెక్టర్ నాగరాణి క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఉద్యోగుల పాత్ర కీలకమని మరింత ఉత్సాహంతో నూతన సంవత్సరంలో విధులు నిర్వహించాలన్నారు. సంఘం జిల్లా అధ్యక్షుడు వై.మోహనరావు, జిల్లా కార్యదర్శి జి.జకరయ్య, జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు షేక్ ఉమర్ అలీషా, ట్రెజరర్ పి.నాగభూషణం, ఉపాధ్యక్షుడు కె.కనకరాజు తదితరులు పాల్గొన్నారు. భీమవరం (ప్రకాశంచౌక్): సామాజిక డిసెంబర్ 31న ఉదయం నుంచి అందజేయనున్నారు. జిల్లాలో 2,24,521 మంది లబ్ధిదారులకు రూ.97.19 కోట్ల పింఛన్లను సచివాలయం సిబ్బంది వెళ్లి పంపిణీ చేయాలని కలెక్టర్ నాగరాణి ఆదేశించారు. వంద శాతం పింఛన్ల పంపిణీ పూర్తి చేయాలని, ఎవరైనా మిగిలిపోతే జనవరి 2న అందజేస్తారని తెలిపారు. పంపిణీలో లబ్ధిదారులకు ఏమైనా సమస్య ఉంటే ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకురావాలని తెలిపారు. ఏలూరు (టూటౌన్): బుట్టాయిగూడెం మండలం ఇనుమూరు గిరిజనులపై అక్రమంగా బనాయించిన పోలీసు కేసులు ఎత్తివేయాలని, దౌర్జన్యంగా దున్నేసిన గిరిజనుల పంటకు నష్ట పరిహారం చెల్లించాలని, రైతు సంఘం నాయకుడు ఎం.అప్పలరాజుపై పీడీ యాక్ట్ ఉపసంహరించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ఏలూరు కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. గిరిజనులపై పోలీసు నిర్బంధం ఆపాలని, గిరిజన భూ సమస్యలు పరిష్కరించాలని నినాదాలు చేశారు. రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు రాజనాల రామ్మోహనరావు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పి.రామకృష్ణ తదితరులు మాట్లాడారు. జీవో 1049 ప్రకారం ఏజెన్సీ భూ సమస్యలలో పోలీసులు జోక్యం చేసుకోకూడదన్నారు. చట్టాలను ఉల్లంఘిస్తూ ఏజెన్సీ ప్రాంతంలో రెవెన్యూ, పోలీస్ అధికారులు గిరిజనేతర భూస్వాముల కొమ్ము కాస్తూ గిరిజనులు, గిరిజనుల నాయకులపై తప్పుడు కేసులు బనాయించడం దుర్మార్గమని విమర్శించారు. ఏలూరు (టూటౌన్): 2026 సీజన్కు సంబంధించి కొబ్బరికి కేంద్ర ప్రభుత్వం పెంచిన కనీస మద్దతు ధర రైతులకు ఏమాత్రం గిట్టుబాటు కాదని కొబ్బరి రైతుల సంఘం రాష్ట్ర కన్వీనర్ కె.శ్రీనివాస్ విమర్శించారు. స్థానిక పవరుపేటలోని అన్నే భవనంలో కొబ్బరి మద్దతు ధరపై మంగళవారం ఆయన మాట్లాడారు. ఈ ఏడాది సరాసరి ధర కొద్దిగా పెరిగినా రైతులకు పెట్టుబడి ఖర్చులు రాక తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం ప్రభుత్వ విదేశాల నుంచి కొబ్బరి ఉత్పత్తుల దిగుమతులకు అవకాశం కల్పించడం వల్ల దేశీయంగా కొబ్బరి రైతులు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. చెట్టు నుంచి కొబ్బరికాయలు కోసి గుట్టగా పోయడానికి ఒక్కో కాయకు రైతుకు రూ.4కు పైగా ఖర్చు అవుతున్నదని వివరించారు. -
అండర్–14 క్రికెట్ జట్టుకు దీపక్ ఎంపిక
ఏలూరు టౌన్: ఏలూరు జిల్లా పోలీస్ విభాగంలో హోంగార్డుగా పనిచేస్తున్న కే.సూరిబాబు కుమారుడు కే.సాయిదీపక్ అండర్–14 జాతీయ క్రికెట్ జట్టుకు ఎంపికయ్యాడు. ఈ నేపథ్యంలో మంగళవారం ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఎస్పీ శివకిషోర్ బాలుడు దీపక్ను ప్రత్యేకంగా అభినందిస్తూ... క్రికెట్ బ్యాట్ను బహూకరించారు. హోంగార్డు కుటుంబం నుంచి రాష్ట్రానికి అండర్–14 క్రికెట్ జట్టులో స్థానం సాధించటం సంతోషంగా ఉందనీ, మరింత ఉన్నత స్థితికి చేరుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఆర్ఐ పవన్కుమార్, తండ్రి సూరిబాబు ఉన్నారు. -
14 నుంచి జాతీయ స్థాయి కబడ్డీ పోటీలు
నరసాపురం: నరసాపురం రుస్తుంబాదలో గోగులమ్మ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో జాతీయస్థాయి పురుషుల, మహిళల కబడ్డీ పోటీలు జనవరి 14 నుంచి 18వతేదీ వరకూ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రతి ఏడాది వలె 32వ జాతీయస్థాయి ఇన్విటేషన్ కప్ కబడ్డీ పోటీలు ఈ ఏడాది మరింత ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. మంగళవారం గోగులమ్మ ఆలయం వద్ద విలేకరుల సమావేశంలో పోటీల కన్వీనర్ మాజీ ఎమ్మెల్యే కొత్తపల్లి జానకీరామ్, జాతీయ కబడ్డీ అసోసియేషన్ మాజీ కార్యదర్శి వి.వీర్లెంకయ్య టోర్నమెంట్ వివరాలు వెల్లడించారు. వివిధ రాష్ట్రాల నుంచి పురుషుల విభాగంలో 20, మహిళల విభాగంలో 20 మొత్తం 40 జట్లకు ఆహ్వానం పంపామని చెప్పారు. ఫ్రొకడ్డీ పోటీల్లో ఆడిన ఆటగాళ్లు కూడా పాల్గొంటున్నారని చెప్పారు. లీగ్కమ్ నాకౌట్ పద్ధతిలో మ్యాచ్లు జరుగుతుతాయన్నారు. విజేతలకు మొదటి బహుమతిగా రూ.1.50 లక్షలు, రెండో బహుమతిగా రూ.లక్ష, మూడవ బహుమతిగా రూ.75 వేలు, నాల్గో బహుమతిగా రూ.50 వేలు పురుషులు, మహిళల విభాగాల్లో అందిస్తామన్నారు. 50 మంది రిఫరీలు, ఆటగాళ్లు, సిబ్బంది కలిపి 500 మంది పాల్గొంటారని చెప్పారు. ఈ సమావేశంలో గోగులమ్మ ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. -
తాళ్లతో కట్టేసి.. నగలు దోచేసి!
అల్లిపురం: ఇంటి యజమానురాలిని తాళ్లతో కట్టేసి.. 10 తులాల బంగారు ఆభరణాలు, 8 తులాల వెండి వస్తువులను దోచుకుపోయిన కేసులో తల్లీకూతుళ్లు సహా మొత్తం నలుగురు నిందితులను ఆరిలోవ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. వారి నుంచి 10 తులాల బంగారు ఆభరణాలు, రూ.10 వేల నగదు, 4 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నగర పోలీస్ కమిషనరేట్లో మంగళవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో క్రైం డీసీపీ కె.లతామాధురి ఈ కేసు వివరాలను వెల్లడించారు. ఈ నెల 14వ తేదీ రాత్రి 9.50 గంటల సమయంలో ధారపాలెం, బంగారుతల్లి లే–అవుట్లో నివసిస్తున్న మొండు వసంత తన ఇంట్లో నిద్రకు ఉపక్రమించారు. ఆమె లోపల గడియ పెట్టుకుని నిద్రించగా, రాత్రి 10 గంటల సమయంలో కాళ్ల వద్ద ఎవరో సంచరిస్తున్నట్లు అలికిడి అయింది. వెంటనే ఆమె లేచేందుకు ప్రయత్నించగా.. ఒక వ్యక్తి ఆమె కాళ్లను గట్టిగా పట్టుకుని తాడుతో కట్టేశాడు. ఆమె అరవకుండా నోటిని అక్కడే ఉన్న లంగాతో కట్టేశారు. అనంతరం ఆమె మెడలోని 5 తులాల బంగారు పలక సరలు, నెమలి బిల్ల గల రెండు పేటల గొలుసు, చేతులకు ఉన్న 4 తులాల బంగారు గాజులు, లాకెట్తో కూడిన మరో గొలుసు, తులం బరువుగల రెండు ఉంగరాలు, 8 తులాల వెండి ఆభరణాలను బలవంతంగా తీసుకున్నారు. అనంతరం నిందితులు బయటకు వెళ్లి, తలుపులకు బయటి నుంచి గడియపెట్టి పారిపోయారు. తర్వాత బాధితురాలు అతికష్టం మీద కట్లు విప్పుకుని ఆరిలోవ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీలు, సెల్ఫోన్ టవర్ లోకేషన్ల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. దాదాపు వెయ్యి సెల్ఫోన్ల డేటాను విశ్లేషించి నిందితులను గుర్తించారు. పశ్చిమ గోదావరి జిల్లా రామాయణపురానికి చెందిన నెల్లి నిర్మల కుమారి, ఆమె కుమార్తె నెల్లి లిఖిత, అంబేడ్కర్ కోనసీమ జిల్లా సోంపల్లి (ఇందిరాకాలనీ)కి చెందిన భూపతి అభిరామ్, బి.సావరం గ్రామానికి చెందిన నల్లి మణిరత్నంలను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి చోరీ సొత్తును స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు. బంధువుల పరిచయంతో.. ప్రధాన నిందితురాలు నెల్లి నిర్మల కుమారి.. ఆరిలోవలోని బంగారుతల్లి లే–అవుట్లో నివాసం ఉంటున్న తన పెదనాన్న కుమారుడు దుర్గాప్రసాద్ ఇంటికి తరచూ వచ్చి వెళ్తుండేది. ఆ సమయంలో దుర్గాప్రసాద్ ఇంటి యజమానురాలైన వసంత మెడలో ఎక్కువ బంగారు ఆభరణాలు ఉండటం గమనించింది. తనకు ఉన్న అప్పులు తీర్చుకోవడానికి ఆమెను దోచుకోవాలని పథకం వేసింది. భీమవరం కలెక్టర్ ఆఫీస్లో క్యాంటీన్ నడుపుతున్న నిర్మల కుమారి.. తన కుమార్తె లిఖితకు, క్యాంటీన్లో పనిచేస్తున్న అభిరామ్, మణిరత్నంలకు డబ్బు ఆశ చూపించి విశాఖ తీసుకువచ్చింది. 13వ తేదీన దొంగతనం చేసేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. మరుసటి రోజు బాధితురాలికి ‘సెండాఫ్’ చెప్పే నెపంతో నిర్మల కుమారి, లిఖిత ఆమెను బయటకు పిలిచారు. ఆ సమయంలోనే అభిరామ్, మణిరత్నం రహస్యంగా ఇంట్లోకి దూరి దాక్కున్నారు. రాత్రి బాధితురాలు ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసుకుని నిద్రపోయాక, లోపల ఉన్న నిందితులు ఆమెను బంధించి చోరీకి పాల్పడ్డారు. ఈ కేసును ఛేదించడంలో చొరవ చూపిన ద్వారకా సబ్ డివిజన్ క్రైం సీఐ వి.చక్రధర్, ఆరిలోవ క్రైం ఎస్సై ఎ.హరికృష్ణ, ఎంవీపీ క్రైం ఎస్సై సీహెచ్.రామదాసు, ద్వారకా క్రైం ఎస్సై ఎల్. శ్రీనివాసరావు, సీసీఎస్ ఇన్స్పెక్టర్లు రామారావు, చంద్రశేఖర్లను నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి అభినందించారు. మహిళను బంధించి ఆభరణాలు దోచుకెళ్లిన ముఠా తల్లీకూతుళ్లు సహా నలుగురి అరెస్ట్ 10 తులాల బంగారం, రూ.10 వేలు స్వాధీనం -
సైబర్ వల
ఈవీఎం గోడౌన్ తనిఖీ భీమవరం (ప్రకాశంచౌక్): భీమవరం పీపీ రోడ్డులోని గోడౌన్్లో భద్రపరిచిన ఈవీఎం యంత్రాలను కలెక్టర్ చదలవాడ నాగరాణి మంగళవారం తనిఖీ చేశారు. ఏడాదికాలంలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోయారు. డిజిటల్ అరెస్టుల పేరుతో అమాయకులను బెదిరించి వారి బ్యాంకు ఖాతాలు ఖాళీ చేశారు. జిల్లా వ్యాప్తంగా చోటుచేసుకున్న 30 ఘటనల్లో దాదాపు రూ.9 కోట్ల నగదును మళ్లించేశారు. ఏడాదికాలంలో జిల్లా వ్యాప్తంగా పోలీస్ రికార్డుల్లో నమోదైన మొత్తం వివిధ నేరాలు 5,076 కాగా మహిళలపై దాడులు, లైగింక వేధింపులు తదితర ఘటనలు 697, చోరీలు 516 ఉన్నాయి. బుధవారం శ్రీ 31 శ్రీ డిసెంబర్ శ్రీ 2025సాక్షి, భీమవరం/భీమవరం: గత ఏడాదితో పోలిస్తే జిల్లాలో సైబర్ నేరాలు పెరిగాయి. 2024 సంవత్సరంలో 16 ఘటనల్లో రూ. 3 కోట్ల వరకు సైబర్ నేరగాళ్లు కొల్లగొట్టారు. 2025లో డిజిటల్ అరెస్టులంటూ వృద్దులు లక్ష్యంగా సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడ్డారు. సెప్టెంబరు నెలలో భీమవరానికి చెందిన వృద్ద దంపతులను డిజిటల్ అరెస్ట్ చేశామంటూ బెదిరించి దాదాపు రూ.99 లక్షలు కాజేశారు. నవంబరులో భీమవరానికి చెందిన రిటైర్డ్ ప్రొఫెసర్ను డిజిటల్ అరెస్టు పేరుతో బెదిరించి బ్యాంకు ఖాతా నుంచి రూ.78.60 లక్షలు చోరీ చేశారు. జిల్లా వ్యాప్తంగా 30 ఘటనలకు సంబంధించి రూ. 9 కోట్ల వరకు చోరీ అయినట్టు పోలీసులకు ఫిర్యాదులు అందాయి. పోలీస్ స్టేషన్ల వరకు చేరని సైబర్ నేరాలు మరెన్నో. ఎస్పీ అద్నాన్ నయిం అస్మీ ఆధ్వర్యంలో ఆధునిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి సైబర్ నేరాలపై జిల్లా పోలీసులు పురోగతి సాధించారు. రిటైర్డ్ ప్రొఫెసర్ కేసు దర్యాప్తులో 14 మంది అంతర్రాష్ట్ర ముఠా గుట్టు రట్టుచేశారు. కంబోడియా కేంద్రంగా ‘కార్డ్ డీల్’ అనే పద్ధతిని ఉపయోగించి వీరంతా నేరాలకు పాల్పడుతున్నట్టు గుర్తించారు. వీరిలో 13 మందిని అరెస్టు చేసి రూ.42.1 లక్షల నగదు రికవరీతో పాటు రూ.19.9 లక్షల మొత్తాన్ని బ్యాంకు ఖాతాల్లో ఫ్రీజ్ చేయించారు. జిల్లా వ్యాప్తంగా నమోదైన కేసులకు సంబంధించి సైబర్ నేరగాళ్ల చేతికి అందకుండా మొత్తం రూ.96.92 లక్షల నగదు హోల్డ్లో పెట్టించారు. జిల్లాలో 60 మంది నిందితులను అరెస్టు చేసి 1,236 కిలోల గంజాయిని ధ్వంసం చేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షల్లో 815 మందిపై, మూడు డ్రోన్లు సాయంతో 186 బహిరంగ మద్యపానం కేసులు నమోదుచేశారు. ఏడాదిలో మొత్తం ప్రమాదాలు 512 మరణాలు చోటుచేసుకున్న ఘటనలు 216 గాయపడిన ఘటనలు 296 రోడ్డు ప్రమాదాల్లో మృతులు 223 మంది సైబర్ నేరాలు 30 చోరీ కేసులు 516మహిళలపై దాడులు, లైంగిక వేధింపులు, అత్యాచారాల కేసులు ఎస్టీ ఎస్టీ అట్రాసిటీ కేసులు33697రోడ్డు ప్రమాదాల్లో గాయపడ్డవారు 432 మంది మిగిలిన కేసులు దాడులు, అల్లర్లు, హత్యలు, ప్రమాదాలకు సంబంధించినవి రూటు మార్చిన కేటుగాళ్లు డిజిటల్ అరెస్టుల పేరుతో 30 ఖాతాల నుంచి రూ.9 కోట్ల ఖాళీ ఏడాదిలో నమోదైన మొత్తం కేసులు 5,076 512 ప్రమాదాల్లో 223 మంది మృతి, 432 మందికి గాయాలు 1236 కేజీల గంజాయి ధ్వంసం -
బాల్ బ్యాడ్మింటన్ పోటీలకు నన్నయ్య జట్టు ఎంపిక
తాడేపల్లిగూడెం : పట్టణంలోని ఆదికవి నన్నయ్య వర్సిటీ ఆవరణలో మంగళవారం ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం, పురుషుల ఇంటర్ కాలేజీయేట్, ఇంటర్ యూనిట్ జట్టు బాల్ బ్యాడ్మింటన్ జట్టు ఎంపిక పోటీలు నిర్వహించారు. ఈ పోటీలకు నన్నయ్య విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన వందమంది పాల్గొనగా నాకౌట్, లీగ్ విధానంలో పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో ఎస్కేవీటి.డిగ్రీ కళాశాల, డీఆర్జీ డిగ్రీ కళాశాల, పీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల కాకినాడ జట్లు ఎంపికయ్యాయి. తిరుచిరాపల్లిలో భారతీ దాసన్ విశ్వవిద్యాలయంలో 14వ ఆలిండియా ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్లలో ఎంపికై న జట్లు పాల్గొననున్నాయి. ఎంపికై న క్రీడాకారులకు తాడేపల్లిగూడెం, రాజమహేంద్రవరంలో శిక్షణ శిబిరం ఏర్పాటుచేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఎంపికై న క్రీడాకారులు రాణించి విద్యాసంస్థకు పేరు తీసుకురావాలని ప్రిన్సిపాల్ టి.అశోక్ కోరారు. -
ఆహ్లాదం.. పాపికొండల విహారం
ప్రకృతి రమణీయత నడుమ పాపికొండల విహారం పర్యాటకులను ఆకట్టుకుంటోంది. దీంతో పాపికొండల పర్యాటకంపై అటవీ శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. 8లో uనిరంతర గస్తీ, నిఘాతో గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది జిల్లాలో నేరాల సంఖ్య 19.03 శాతం తగ్గించాం. మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యమిస్తున్నామం. పోక్సో కేసుల్లో 25 మందికి శిక్షలు పడగా వీరిలో ఆరుగురికి జీవిత ఖైదు, ఒకరికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష పడింది. లైంగిక నేరాలకు పాల్పడే 68 మందిపై రౌడీ షీట్లు తెరిచాం. జిల్లా వ్యాప్తంగా 3742 సీసీ కెమెరాలు, మూడు డ్రోన్లు సాయంతో నిరంతర పహారా కాస్తున్నాం. ఆధునిక సాంకేతికత సాయంతో రూ.77 లక్షలు విలువ చేసే 515 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నాం. ట్రాఫిక్ ఉల్లంఘనలపై 31,208 ఈ చలానాల ద్వారా రూ.1.57 కోట్ల జరిమానాలు వేశాం. శాంతి భద్రతల దృష్ట్యా 343 రౌడీషీట్లు క్రియాశీలకంగా ఉంచి నలుగురిపై పీడీ యాక్టు ప్రయోగించాం. నరసాపురం మండలంలో మృతదేహం కేసును కేవలం డీఎన్ఏ ప్రొఫైలింగ్ సాంకేతికను ఉపయోగించి ఛేదించాం. – అద్నాన్ నయిం అస్మీ, ఎస్పీ -
యూరియా కోసం తప్పని పాట్లు
పెనుగొండ: యూరియా సమృద్ధిగా ఉందంటూ వ్యవసాయాధికారులు, జిల్లా స్థాయి అధికారులు పదేపదే ప్రకటనలు గుప్పిస్తున్నా క్షేత్ర స్థాయిలో యూరియా కోసం రైతన్నలకు పాట్లు తప్పడం లేదు. సొసైటీల్లో యూరియా కావాలంటే ఇతర రకాలు తీసుకోవాలని మెలిక పెడుతుండడంతో సార్వాలో నష్టపోయిన రైతన్నలు అదనపు భారం భరించలేక అష్టకష్టాలు పడుతున్నారు. ఇదే పరిస్థితి సోమవారం ఆచంటలోని మృత్యుంజయ సొసైటీ వద్ద నెలకొంది. తొలుత యూరియా కావాలంటే ఇతర రకాలు తీసుకోలంటూ మెలికపెట్టడంతో ఉదయం సొసైటీ వద్ద గందరగోళం నెలకొంది. యూరియా మాత్రమే ఇవ్వాలంటూ రైతులు పట్టుబట్టి కొద్దిసేపు వాగ్విదానానికి దిగారు. దీంతో ఉన్నతాధికారులు కలగజేసుకొని సమస్యను సర్దుబాటు చేసి, యూరియాపై నియంత్రణ విధించారు. పూర్తి స్థాయిలో ఇవ్వకుండా కోటాగా సరఫరా చేయడంతో రైతులు ఇబ్బందులు పడ్డారు. కేటాయించిన మేర యూరియా తీసుకువెళ్లడానికి రైతులు గంటలు తరబడి వేచి ఉండాల్సి వచ్చింది. కాగా కొందరు కూటమి నాయకులు యూరియా అందరికీ అందనివ్వకుండా అడ్డుకొంటున్నారని రైతులు ఆరోపించారు. రైతులకు అందించాల్సిన యూరియాలోనూ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. -
ఇల వైకుంఠం
ద్వారకాతిరుమల: చిన్నతిరుపతి క్షేత్రం మంగళవారం వైకుంఠాన్ని తలపించింది. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని స్వామివారు ఉత్తర ద్వారం వద్ద భక్తులకు దర్శనమిచ్చారు. భానుడి లేలేత కిరణాలు పుడమిపై ప్రసరించే వేళ.. మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, అర్చకులు, పండితుల వేద మంత్రోచ్ఛరణలు, భక్తుల గోవింద నామస్మరణల నడుమ ఉభయ దేవేరులతో శ్రీవారు ఉత్తర ద్వారం వద్ద వెండి గరుడ వాహనంపై సాక్షాత్కరించారు. ఈ వేడుక ఆద్యంతం భక్తులకు నేత్రపర్వమైంది. ముందుగా సిబ్బంది ఉత్తర ద్వారాన్ని పచ్చిపూలతో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన వెండి గరుడ వాహనంపై స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను వేంచేపు చేసి, విశేషంగా అలంకరించారు. తెల్లవారుజాము 4.15 గంటలకు ఉత్తర ద్వారాలను తెరవగా, దేవస్థానం ఈఓ ఎన్వీఎస్ఎన్ మూర్తి, ఆలయ అనువంశిక ధర్మకర్త ఎస్వీఎన్ఎన్ నివృతరావు, గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు తదితరులు తొలి దర్శనం చేసుకుని, పూజాదికాలు జరుపుకున్నారు. అనంతరం భక్తులకు సర్వదర్శన భాగ్యాన్ని కల్పించారు. ఊహించని విధంగా వేలాది మంది భక్తులు, గోవింద స్వాములు స్వామివారి దివ్యమంగళ స్వరూపాన్ని వీక్షించి పరవశించారు. ఉదయం 7.30 గంటల సమయంలో స్వామి, అమ్మవార్లు ఉత్తర ద్వారం నుంచి వెండి గరుడ వాహనంపై గ్రామోత్సవానికి బయల్దేరి వెళ్లారు. గజ, అశ్వ సేవల నడుమ ఈ వేడుక అట్టహాసంగా జరిగింది. ఆ తరువాత ఉత్తర ద్వారం వద్ద వెండి శేష వాహనంపై కొలువైన స్వామి, అమ్మవార్లు రాత్రి 9 గంటల వరకు భక్తులకు దర్శనమిచ్చారు. సుమారు 50 వేల మంది భక్తులు శ్రీవారిని దర్శించినట్టు ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే గోవింద దీక్షాదారులు తెల్లవారుజామున ఆలయ ప్రధానరాజగోపుర మెట్ల మార్గంలో కర్పూరంతో స్వామివారి శంఖు, చక్ర, నామాలను ఏర్పాటు చేసి, వాటిని వెలిగించారు. అనంతరం ఇరుముడులతో స్వామివారి ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు. ఆ తరువాత దీక్షను విరమించారు. రూ. 40 లక్షల ఆదాయం.. శ్రీవారి రూ. 500 ప్రత్యేక దర్శనం టికెట్లు మధ్యాహ్నం వరకే విక్రయించారు. మొత్తం 2 వేల టికెట్లను విక్రయించారు. రాత్రి వరకు రూ. 200 టికెట్లు దాదాపు 3,500, రూ.100 టికెట్లు 3,500, 50 వేలకు పైగా లడ్డూ ప్రసాదాలు, 27,600 పులిహోర ప్యాకెట్లు, 10,530 శర్కర పొంగలి ప్యాకెట్లు విక్రయించారు. అదేవిధంగా వేలాది మంది భక్తులు తలనీలాలను సమర్పించారు. వీటి ద్వారా స్వామివారికి సుమారు రూ. 40 లక్షల మేర ఆదాయం లభించింది. తోపులాటలో కింద పడిన భక్తులు : తెల్లవారు జామున క్యూకాంప్లెక్స్ వద్ద గేటు ఒక్కసారిగా తెరవడంతో తోపులాట జరిగి, కొందరు భక్తులు కింద పడిపోయారు. రూ. 500 టికెట్లు కొనుగోలు చేసిన భక్తులను, అలాగే గ్రామస్తులను, గోవింద స్వాములను ఒకే దర్శనం క్యూలైన్లో పంపడం వివాదాస్పదమైంది. వీఐపీల పేరుతో పెద్ద ఎత్తున టీడీపీ నాయకులను తూర్పు రాజగోపురం మీదుగా తీసుకెళ్లి, ధ్వజస్తంభం వద్ద ఉన్న మెయిన్ గేటులోంచి ఆలయంలోకి పంపారు. దాంతో క్యూలైన్లలో ఉన్న భక్తులు పలుమార్లు అరుపులు, కేకలు వేయడంతో ఆలయం గందరగోళంగా మారింది. టీడీపీ నాయకులకు, వీఐపీలకు ఉన్న విలువ తమకు లేదంటూ కొందరు సిబ్బంది గుసగుసలాడారు. సాయంత్రం 5 గంటలకు సాయంకాలార్చన నిమిత్తం నిలుపుదల చేయాల్సిన స్వామివారి దర్శనాన్ని, భక్తులు గొడవ చేయడంతో గంట అదనంగా కొనసాగించి, 6 గంటలకు నిలుపుదల చేశారు.ఉత్తర ద్వారం వద్ద వెండి గరుడ వాహనంపై కొలువైన స్వామి, అమ్మవార్లు ఆలయంలో భక్తుల తోపులాట గరుడ వాహనంపై గ్రామోత్సవంద్వారకాతిరుమల: ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయాన్ని మంగళవారం ఉదయం రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బి.కృష్ణమోహన్, జస్టిస్ వి.గోపాలకృష్ణారావు వేర్వరుగా సందర్శించారు. కుటుంబ సమేతంగా ఆలయానికి విచ్చేసిన వారికి ముందుగా దేవస్థానం ఈఓ అర్చకులు మర్యాద పూర్వకంగా స్వాగతం పలికారు. న్యాయమూర్తులు ఉత్తర ద్వారం వద్ద స్వామి, అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు జరుపుకున్నారు. ద్వారకాతిరుమలలో వైభవంగా శ్రీవారి ఉత్తర ద్వార దర్శనం 50 వేల మందికిపైగా స్వామిని దర్శించిన భక్తులు, గోవింద స్వాములు గరుడ వాహనంపై నేత్రపర్వంగా గ్రామోత్సవం -
ఆయుధ డిపోకు వ్యతిరేకంగా ధర్నా
కొయ్యలగూడెం: నేవీ ఆయుధ కర్మాగార డిపో ఏర్పాటుకు వ్యతిరేకంగా తహసీల్దార్ కార్యాలయం వద్ద రైతులు మంగళవారం ధర్నా నిర్వహించారు. బోడిగూడెం పంచాయతీ పరిధిలో బర్కెట్నగర్ ప్రాంతంలో నేవీ డెక్ నిర్మాణాన్ని ప్రభుత్వం చేపడుతున్నందుకు నిరసనగా నిరసన వ్యక్తం చేశారు. ఒకప్పుడు బీడు భూములుగా ఉన్న తమ పొలాల్లో పోలవరం ప్రాజెక్టు వల్ల బోరులు పడుతున్నాయని రెండు పంటలు పండే భూములను డిపో ఏర్పాటు వల్ల కోల్పోతామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కర్మాగార డిపో నిర్మాణానికి 1200 ఎకరాలు అవసరం కాగా అందులో 400 ఎకరాల భూములు సన్న చిన్న కారు రైతులకు చెందినవేనన్నారు. భూములు కోల్పోతే కుటుంబాలతో సహా నడిరోడ్డున పడతామంటూ గోడు వెళ్లబోసుకున్నారు. నేవీ డాక్ యార్డ్ స్థాపించడానికి స్థానికంగా ఉన్న రైతులందరూ ఒప్పుకున్నట్టు త్వరలో భూసేకరణ జరుగుతున్నట్లు వార్త వచ్చిందని, ఇది పూర్తిగా అసత్యమని, రైతులు వద్దకు ఎవరు సంప్రదింపులకు రాలేదని ఖండించారు. కనీసం గ్రామసభ కూడా నిర్వహించకుండా ప్రచారం చేయడాన్ని రైతులంతా తప్పుబట్టారు. బోడిగూడెం పరిధిలో ఉన్న భూములు చిన్న సన్నకారు రైతులవని, ఈ భూములు ఇవ్వడానికి ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది లేదని రైతులు పేర్కొన్నారు. -
స్మార్ట్ మీటర్లతో మీటర్ రీడర్ల ఉపాధికి ప్రమాదం
తాడేపల్లిగూడెం (టీఓసీ): స్మార్ట్ మీటర్లు బిగించడంతో మీటర్ రీడర్లు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందని పలువురు ఆందోళన వ్యక్తం చేశారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా మీటర్ రీడర్ల సమావేశం స్థానిక ఏఐటీయూసీ కార్యాలయంలో గౌరవాధ్యక్షుడు ఎం.నాగేశ్వరరావు అధ్యక్షతన మంగళవారం జరిగింది. వక్తలు మాట్లాడుతూ విద్యుత్ సంస్థను నమ్ముకుని మీటర్ రీడర్లు 20 సంవత్సరాలు పైబడి బిల్లింగ్ చేస్తూ కుటుంబాలు పోషించుకుంటారని, ఇప్పుడు స్మార్ట్ మీటర్ల ఏర్పాటుతో జిల్లాలోని 356 మంది మీటర్ రీడర్లు పని లేక రోడ్డున పడే పరిస్థితి వచ్చిందని వాపోయారు. తమను ఆదుకోవాలని గత రెండేళ్లుగా ప్రభుత్వానికి మొరపెట్టుకుంటున్నా పట్టించుకోవడం లేదన్నారు. దీనిపై రానున్న రోజుల్లో మీటర్ రీడర్ల యూనియన్ ఆధ్వర్యంలో వైజాగ్, విజయవాడలో జరిగే కార్యాచరణ రూపొందిస్తారని, మీటర్ రీడర్లు హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జి.దుర్గారావు, మల్లేశ్వరరావు, ఆశోక్, ప్రకాష్, శశిధర్, వెంకటరత్నం, మహేష్, శ్రీను, మోజేష్ తదితరులు పాల్గొన్నారు. -
ఆయన ఏ పార్టీ?
● మావుళ్లమ్మ ట్రస్ట్బోర్డు సభ్యుడిగా నాగభూషణం ● టీడీపీ, జనసేన పార్టీల్లో నాగభూషణంకు సభ్యత్వం సాక్షి, భీమవరం: ఇంతకీ ఆయన ఏ పార్టీ?.. టీడీపీనా? జనసేనా? భీమవరం కూటమి వర్గాల్లో ఇప్పుడిదే చర్చ. ఏడాదికాలంగా నలుగుతున్న భీమవరం మావూళ్లమ్మ వారి దేవస్థానం ట్రస్టు బోర్డు ఎట్టకేలకు ఖరారైంది. రాష్ట్రవ్యాప్తంగా ఖ్యాతిగాంచిన అమ్మవారి ఆలయ చైర్మన్ పదవిని టీడీపీ, జనసేన నుంచి ఎంతోమంది ఆశించారు. టీడీపీకి చెందిన వారికే ఇస్తారని.. లేదు జనసేన పార్టీకి వస్తుందని టాక్ నడిచింది. అమ్మ దయ మాత్రం స్థానిక ఎమ్మెల్యేకు సన్నిహితునిగా పేరొందిన బొండాడ నాగభూషణంకు ఇచ్చారు. పట్టణానికి చెందిన నాగభూషణంతో పాటు 13 మంది సభ్యులతో కూడిన పాలక మండలిని నియమిస్తూ మంగళవారం దేవాదాయశాఖ ఉత్తర్వులు విడుదల చేసింది. దేవాదాయశాఖ సభ్యులతో ప్యానెల్ను విడుదల చేస్తే, ప్రమాణ స్వీకార సమయంలో వారిలోంచి ఒకరిని చైర్మన్గా మిగిలిన వారు ఎన్నుకుంటారు. చాలావరకు చైర్మన్గా ఎంపికయ్యే వారి పేరే ప్యానెల్లో మొదటి సభ్యుడిగా పేర్కొంటుంటారు. పాలక మండలి సభ్యుల్లో నాగభూషణం పేరే మొదటిగా ఉండటంతో ఆయనే ఆలయ చైర్మన్గా ప్రచారం జరుగుతోంది. నాగభూషణంకు టీడీపీ, జనసేన రెండు పార్టీల్లోను సభ్యుత్వాలు ఉన్నట్టు గుర్తింపు కార్డులు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుండటం హాట్ టాపిక్గా మారింది. కూటమి ప్రభుత్వంలో ఎప్పుడు ఏ నామినేటెడ్ పదవికి ఎవరికి కేటాయిస్తారో తెలీని పరిస్థితులు ఉండటంతో ఎందుకై నా మంచిదని రెండు పార్టీల్లోను సభ్యత్వాలు తీసుకుని ఉంటారన్న ప్రచారం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. జనసేన, టీడీపీలో నాగభూషణం సభ్యత్వ కార్డులు -
కీచక ఉపాధ్యాయుడిపై సస్పెన్షన్ వేటు
పెనుగొండ, పాలకొల్లు (సెంట్రల్), భీమవరం : విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడిపై సస్పెన్షన్ వేటు పడింది. పోడూరులోని మండల ప్రజా పరిషత్ మెయిన్ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుడు ఎం నాగేశ్వరరావు నాలుగు రోజులు క్రితం అదే పాఠశాలలో 4, 5వ తరగతులు చదువుతున్న ఇద్దరు విద్యార్థినులను పాఠశాల భవనంపైకి పిలిచి అసభ్యకరంగా ప్రవర్తించాడు. వెంటనే ఆ చిన్నారులు భయంతో కేకలు వేసుకుంటూ కిందకు వచ్చి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. దీంతో సోమవారం రాత్రి ఓ విద్యార్థిని తల్లి పోడూరు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన కారణంగా ఉపాధ్యాయుడు ఎం నాగేశ్వరరావును సస్పెండ్ చేస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి ఇవీవీఎస్ఎస్ఎస్ఎస్ బీఎల్ నారాయణ మంగళవారం ప్రకటనలో తెలిపారు. ఉండి: ఉండి మండలం చెరుకువాడ గ్రామానికి చెందిన బాలిక దివ్యాన్ ఫణిశ్రీ వెలిగట్ల గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్లో చోటు సంపాదించుకుంది. ఈ నెల 27వ తేదీన హైదరాబాద్లోని గచ్చిబౌలీ స్టేడియంలో ఏడు వేల మందితో నిర్వహించిన సామూహిక కూచిపూడి నృత్య ప్రదర్శన పోటీల్లో దివ్యాన్ ఫణిశ్రీ పాల్గొని గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్లో భాగమైనట్లు బాలిక తండ్రి సత్యప్రసాద్ మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా నిర్వాహకులు బాలికకు గిన్నిస్ వరల్డ్ రికార్డు సర్టిఫికెట్తో పాటు జ్ఞాపికను అందజేసినట్లు చెప్పారు. కొంతకాలంగా కూచిపూడి నాట్యం నేర్చుకుంటూ హైదరాబాద్లోనే ఉండి చదవుకుంటున్న తన కుమార్తె ప్రపంచ రికార్డు సాధనలో భాగం అయినందుకు గర్వపడుతున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఫణిశ్రీకి పలువురు అభినందనలు తెలిపారు. జంగారెడ్డిగూడెం: వైకుంఠ ఏకాదశి, మంగళవారం సందర్భంగా గురవాయిగూడెం శ్రీ మద్ది ఆంజనేయస్వామి వారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. శ్రీ స్వామి వారి దేవస్థానమునకు ఉపాలయం అయిన శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో శ్రీ స్వామి వారిని భక్తులు ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకున్నారు. ఉంగుటూరు ఎమ్మెల్యే పి.ధర్మరాజు స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వివిధ సేవల రూపేణా ఆలయానికి రూ.4,45,370 ఆదాయం సమకూరినట్టు ఈవో తెలిపారు. 4,950 మంది భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించారని ఈవో ఆర్వీ చందన చెప్పారు. తాడేపల్లిగూడెం (టీఓసీ): పట్టణంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు జరిగిన 28వ ఐపీఎస్జీఎం–2025 రీజనల్ మీట్ క్రీడా పోటీల్లో ఓవరాల్ చాంపియన్షిప్ను ఏలూరు సర్ సీఆర్రెడ్డి పాలిటెక్నిక్ విద్యార్థులు కై వసం చేసుకున్నారు. ప్రధానాచార్యులు డి.ఫణీంద్ర ప్రసాద్ అధ్యక్షతన వాలీబాల్, బాల్ బ్యాడ్మింటన్, కోకో, షటిల్, అథ్లెటిక్స్ పోటీలు జరిగాయి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని 2 ప్రభుత్వ, 10 ప్రైవేట్ పాలిటెక్నిక్లలోని 550 మంది విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. ఈ పోటీలకు నిట్ రిజిస్ట్రార్ దినేశ్ శంకరరెడ్డి హాజరుకాగా కాకినాడ ఆర్జేడీటీఈ పి.సుబ్రహ్మాణ్యం, సివిల్ హెచ్ఓడీ జీవీవీఎల్ సత్యనారాయణ, మెకానికల్ హెచ్ఓడీ ఎ.గోపి, పీడీ కమల్ బాషా, విశ్రాంత పీడీ కె.రవికుమార్ పర్యవేక్షించారు. రీజనల్ మీట్లో ప్రతిభ చూపిన క్రీడాకారులు జనవరి నెలలో తిరుపతిలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై నట్లు వివరించారు. -
భగవన్నామ స్మరణ శక్తివంతమైంది
ఉంగుటూరు : భగవన్నామ స్మరణచాలా శక్తి వంతమైనదని ప్రముఖ ప్రవచన కర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు అన్నారు. మంగళవారం గోపినాథపట్నంలో ముక్కోటి ఉత్సవాలలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొట్టు వెంకటేశ్వరరావు, సరస్వతీ కల్యాణ మండపంలో మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ ఆధ్వర్యంలో ప్రవచన కార్యక్రమం నిర్వహించారు. మానవ జన్మ సార్ధకతకు భగవన్నామ స్మరణ ఒకటే మార్గమని చాగంటి అన్నారు. గోవిందా నామం కలియుగంలో ఎంతో సంతోషాన్ని ఇస్తుందన్నారు. అనితర సాధ్యం కాని దానిని భగవన్నామస్మరణ సాధ్యం చేస్తుందని వివరించారు. మాజీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ కాకినాడలో గోవులకు స్థలం అందచేశారని చెప్పారు. కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ చాగంటి కోటేశ్వరరావు మూడోసారి గోపినాథపట్నం వచ్చి ప్రవచనం చెప్పడం ఆనందంగా ఉందన్నారు. -
ఆహ్లాదం.. పాపికొండల విహారం
పాపికొండల దగ్గరగా అటవీశాఖ నిర్మించిన కాటేజీలు బుట్టాయగూడెం: చుట్టూ ఎత్తయిన పర్వతశ్రేణులు.. వాటి మధ్యలో గలగలా గోదావరి ప్రవాహం. ఆ కొండల్లో పచ్చటి వృక్షాలు, పక్షుల కిలకిలరావాలు, ఎటు చూసినా ప్రకృతి రమణీయత, సుందర దృశ్యాల సమాహారం పాపికొండల విహారం. ఏలూరు, రంపచోడవరం జిల్లాల నడుమ తూర్పు కనుమల్లో దట్టమైన అడవుల్లో కూడిన పర్వతశ్రేణి పాపికొండలు. ఇంతటి విశిష్టత కలిగిన పాపికొండల పర్యాటకంపై అటవీశాఖ ప్రత్యేక దృష్టి సారించింది. పర్యాటకంగా ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే కొరుటూరు సమీపంలో ఉడెన్ కాటేజీలు నిర్మించి పర్యాటకులు ఆహ్లాదకరమైన వాతావరణంలో పాపికొండల అందాలను తిలకించేలా ఏర్పాట్లు చేసింది. దేవీపట్నం మండలం గండిపోచమ్మ అమ్మవారి గుడి సమీపంలో ఉన్న బోటు పాయింట్ నుంచి కొరుటూరు ఫారెస్ట్ కాటేజీలకు చేరుకున్న పర్యాటకులు బస చేసి ప్రకృతి రమణీయమైన అందాలను తిలకించవచ్చు. 15 పర్యాటక కాటేజీలు పాపికొండల పర్యాటకుల కోసం కొరుటూరు సమీపంలోని ఎత్తయిన కొండప్రాంతంలో 15 కాటేజీలు నిర్మించారు. వీటిలో ఉడెన్ కాటేజీలు 5, బేంబో కాటేజీలు 5, టెంట్ హౌస్లు 5 చొప్పున ఏర్పాటు చేశారు. వీటితోపాటు శివగిరి సమీపంలో పర్యాటకుల సౌకర్యార్థం కాటేజీలు ఏర్పాటు చేయనున్నారు. ఈ కాటేజీలు మొత్తం పాపికొండలకు అతిసమీపంలోనే ఉన్నాయి. ఎత్తయిన కొండపై వీటిని నిర్మించడంతో అక్కడి నుంచి పాపికొండల అందాలతోపాటు గోదావరి నదిపై బోట్లను, ప్రకృతి అందాలను కూడా తిలకించవచ్చు. అదేవిధంగా పర్యాటకులు ట్రెక్కింగ్ చేసేందుకు కూడా అధికారులు ఏర్పాటు చేశారు. ట్రెక్కింగ్ చేసే సమయంలో ఇద్దరు ఫారెస్ట్ సిబ్బంది వారితోపాటు కొండపైకి వెళ్లే విధంగా అన్ని ఏర్పాట్లు చేశారు. పాపికొండల పర్యాటకుల కోసం ఫారెస్ట్ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక కాటేజీలు ఏర్పాటు చేశాం. కాటేజీలకు సోలార్ ద్వారా విద్యుత్ సదుపాయం కూడా కల్పించాం. పర్యాటకుల మనసుదోచేలా కాటేజీల నిర్మాణం జరిగింది. అందరికీ అందుబాటులో ఉండే విధంగానే కాటేజీల ధర నిర్ణయించారు. – ఎస్కె వల్లి, అటవీశాఖ అధికారి, పోలవరం రేంజ్ కొరుటూరు సమీపంలో ఫారెస్ట్ శాఖ నిర్మించిన ఉడెన్ కాటేజీలు అటవీశాఖ ఏర్పాటు చేసిన టెంట్ హౌస్లు పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు చర్యలు అటవీశాఖ ఆధ్వర్యంలో కాటేజీల ఏర్పాటు పర్యాటకులకు ట్రెక్కింగ్కు కూడా అవకాశం -
అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించాలి
భీమవరం(ప్రకాశం చౌక్): పీజీఆర్ఎస్ అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సి.నాగరాణి అన్నారు. సోమవారం కలెక్టరేట్ పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఆమె పాల్గొని వివిధ ప్రాంతాల నుంచి అందిన అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అర్జీలపై ప్రత్యేక శ్రద్ధ వహించి నిర్ణీత గడువులోగా పరిష్కారం చూపాలన్నారు. తమ శాఖ పరిధిలో లేని ఫిర్యాదులు వస్తే వాటిని తక్షణమే సంబంధిత శాఖ అధికారులకు పంపించాలన్నారు. అర్జీలు పునరావృతం కాకుండా నాణ్యతతో పరిష్కరించాలన్నారు. అనంతరం సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ జనవరి 3, 4 తేదీలలో గోదావరి క్రీడోత్సవాల జిల్లా స్థాయి పోటీలు నిర్వహిస్తామన్నారు. డివిజనల్ స్థాయిలో జరిగిన క్రీడా పోటీలలో గెలుపొందిన వారు జిల్లాస్థాయి పోటీలలో పాల్గొంటారన్నారు. సోమారామం ఈఓపై చర్యలు తీసుకోవాలి దివ్యాంగురాలినని కూడా చూడకుండా క్యూలైన్లోంచి తనను పక్కకు నెట్టేసి అమర్యాదగా ప్రవర్తించిన భీమవరం పంచారామ ఆలయ ఈఓ రామకృష్ణంరాజుపై చర్యలు తీసుకోవాలని మద్దింశెట్టి మాధవి లక్ష్మీ కుమారి రెండోసారి పీజీఆర్ఎస్లో ఫిర్యాదుచేశారు. లక్ష్మీకుమారి కార్తీకమాసం చివరి సోమవారం స్వామివారి దర్శనం కోసం క్యూలైన్లో వేచి ఉన్న సమయంలో.. ఈఓ తన భుజంపై చెయ్యి వేసి పక్కకు లాగి రద్దీలో గుడికి రావడం అవసరమా అంటూ తనను చులకన చేసి మాట్లాడారని తెలిపారు. -
వస్త్ర వ్యాపారం వెలవెల
● ఖాళీగా దర్శనమిస్తున్న దుకాణాలు ● గతంలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితి లేదన్న వ్యాపారులు తణుకు అర్బన్: పండుగ రోజుల్లో కూడా తణుకు మార్కెట్ వెలవెలబోతోంది. క్రిస్మస్ పండుగకు పూర్తిగా వ్యాపారం జరగకపోగా, సంక్రాంతి పండుగకు పదిహేను రోజులు మాత్రమే ఉన్నప్పటికీ మార్కెట్లో దుకాణాలన్నీ ఖాళీగా ఉండడం వ్యాపారులకు మింగుడుపడడంలేదు. ప్రజల దగ్గర డబ్బుల్లేవ్ అనే మాటలు ప్రతి వ్యాపారస్తుడి నోటి నుంచి వినిపిస్తోంది. ఇలాంటి రోజులు గతంలో ఎన్నడూ చూడలేదని ఆందోఽళన వ్యక్తం చేస్తున్నారు. పండుగ అంటే వస్త్ర వ్యాపారం ఎక్కువ. గతంలో నెలరోజుల ముందునుంచే దుకాణాలు కిక్కిరిసిపోయేవి. నేడు ఇంకా బోణీ కాని రోజులు నడుస్తున్నాయంటే వ్యాపారం ఏ రకంగా పడిపోయిందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే చాలా దుకాణాలు వ్యాపారం జరగక మూతపడేందుకు సిద్ధంగా ఉన్నాయని వ్యాపారులే చెబుతున్నారు. వ్యాపారాలు జరగకపోవడంతో దుకాణాలు ఖాళీ చేస్తున్న పరిస్థితుల్లో తణుకులో రాష్ట్రపతి రోడ్డు, వేల్పూరు రోడ్డుల్లో సైతం పదుల సంఖ్యలో దుకాణాలు ఖాళీ కావడంతో టూలెట్ బోర్డులు కనిపిస్తున్నాయి. వస్త్ర వ్యాపారానికి తణుకు పేరు వస్త్ర వ్యాపారానికి తణుకు పట్టణం పేరుగాంచింది. పట్టణ ప్రాంత వాసులతోపాటు చుట్టుపక్కల వంద గ్రామాల నుంచి సైతం ప్రజలు తణుకులో ఉన్న వస్త్ర దుకాణాలకు వచ్చి తమకు ఇష్టమైన వస్త్రాలను కొనుగోలు చేస్తుంటారు. ఈ క్రమంలోనే నగరాల్లో పేరుగాంచిన భారీ వ్యాపార సంస్థలు సైతం తణుకులో ఏర్పాటుచేసిన షోరూంలు గతం నుంచి అందుబాటులో ఉన్నాయి. రెడీమేడ్ దుస్తులు సైతం బ్రాండెడ్ కంపెనీలు విక్రయించే పేరుగాంచిన షోరూంలు ఉన్నాయి. రద్దీ లేని ప్రధాన వీధులు సంక్రాంతి పండుగకు ఇంకా పదిహేను రోజులు మాత్రమే ఉన్నా అధికసంఖ్యలో వస్త్ర, ఫ్యాన్సీ దుకాణాలున్న వీధులు సైతం ఇంకా నిర్మానుష్యంగానే దర్శనమిస్తున్నాయి. ముఖ్యంగా తణుకు నరేంద్ర సెంటర్ నుంచి వేల్పూరు రోడ్డు తణుకు పట్టణ వస్త్ర వ్యాపారానికి గుండెకాయ లాంటిది. అటువంటి ప్రధాన వీధికి ఇంకా పండుగ సందడి రాలేదు. బాబు ఎంపోరియం వీధి, ఆలమూరి వారి వీధుల్లో వస్త్ర దుకాణా లతోపాటు మగువలు మెచ్చే ఫ్యాన్సీ, గాజులు, ఎంబ్రాయిడరీ, లేడీస్ డ్రెస్ మెటీరియల్ వంటి దుకాణాలు సైతం ఖాళీగానే ఉండడం వ్యాపారులకు అర్థంకాని పరిస్థితి. రాష్ట్రపతి రోడ్డులోని చెప్పుల, గిఫ్ట్, బంగారు దుకాణాలు సైతం ఖాళీగా ఉన్నాయి. పండుగ వ్యాపారాన్ని నమ్ముకుని ఉన్న వ్యాపారులు కనీసం దుకాణాల్లో పనిచేసే వర్కర్లకు కూడా జీతాలివ్వలేని స్థితిలో ఉన్నామని వాపోతున్నారు. సంక్షేమ నిధులతో సుభిక్షంగా వ్యాపార రంగం గత వైఎస్సార్సీపీ హయాంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంక్షేమం రూపంలో అందచేసిన నగదు మార్కెట్లో చలామణి కావడంతో వ్యాపార రంగం విరాజిల్లిందని వ్యాపారులే చెబుతున్నారు. ప్రతి నెలా ఏదోక పథకం పేరుతో లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ అయిన సొమ్ముతో కొనుగోళ్లు చేయడంతో మార్కెట్లో డబ్బు మారకం జరిగేది. నేటి ఇబ్బందులు చూస్తుంటే ఆర్థికమాంద్యం వంటి పరిస్థితులు ఏర్పడ్డాయా అనే సందేహం కలుగుతోంది. మా 20 సంవత్సరాల వ్యాపార అనుభవంలో ఎన్నడూ ఇలాంటి దుస్థితి లేదు. మార్కెట్లో నగదు మారకం సమస్యతోపాటు ఆన్లైన్ వ్యాపారం, మాల్స్ కూడా ఒక మాదిరి వ్యాపారాలను కుంగదీస్తున్నాయి. క్రిస్మస్ పండుగలో సైతం వ్యాపారం జరగలేదు. సంక్రాంతి పండుగలోనైనా వ్యాపారం జరుగుతుందేమోనని చూస్తుంటే ఇప్పటి వరకు అదికూడా లేదు. – జె.సుజాత, రెడీమేడ్ షాపు యజమాని -
విద్యా విధానం.. అస్తవ్యస్తం
వేతనాలు పెరగక వెతలు ట్రిపుల్ ఐటీలోని కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్ల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. వేతనాలు పెరగక.. ఉద్యోగ భద్రత లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 8లో u● ప్రైవేటు స్కూళ్లలో ఇష్టారాజ్యం ● తల్లికి వందనంలో భారీగా కోత మంగళవారం శ్రీ 30 శ్రీ డిసెంబర్ శ్రీ 2025భీమవరం: జిల్లాలో గత ఏడాదిగా విద్యావిధానంగా అస్తవ్యస్థంగా మారింది. పాఠశాలల అభివృద్ధికి నిధులు కేటాయించకపోవడం, విద్యాబుద్ధులు నేర్పాల్సిన గురువులు విద్యార్థినిల పట్ల అసభ్య ప్రవర్తన, పాఠశాలల్లో రాజకీయ నాయకుల ప్రమేయం ఎక్కువ కావడంతో ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతున్నాయి. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా మన బడి నాడు–నేడు పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ విద్యాసంస్ధలకు దీటుగా తయారుచేసి సకల సౌకర్యాలు కల్పించారు. గత ప్రభుత్వం చేపట్టిన పనులు, ఎన్నికల అనంతరం నిలిచిపోయిన అనేక పనులకు మోక్షం లేకుండా పోయింది. జిల్లాలోని 20 మండలాల్లో దాదాపు 1,427 ప్రభుత్వ పాఠశాలల్లో సుమారు లక్షకు పైగా విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. నలుగురు టీచర్ల సస్పెండ్ : పాఠశాలలకు వచ్చే విద్యార్ధులను కన్నబిడ్డలుగా చూసి విద్యాబుద్ధులు నేర్పాల్సిన నలుగురు ఉపాధ్యాయులు అసభ్యకరంగా ప్రవర్తించారు. దీంతో భయపడిన బాలికలు తల్లిదండ్రుల దృష్టికి తీసుకువెళ్లడంతో జిల్లాలోని పాలకొల్లు మండలం అగర్తిపాలెం, భీమవరం మండలం గొల్లవానితిప్ప, భీమవరం పట్టణంలోని రెండు పాఠశాలల్లోని ఉపాధ్యాయులను సస్పెండ్ చేశారు. గొల్లవానితిప్ప స్కూల్ ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు నమోదు చేశారు. విద్యను వ్యాపారంగా మార్చిన ప్రైవేటు స్కూల్స్ ప్రైవేటు స్కూల్పై ప్రభుత్వ పర్యవేక్షణ లేకపోవడంతో విద్యను వ్యాపారంగా మార్చారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రైవేటు స్కూళ్లలో పుస్తకాలు, యూనిఫాం వంటివి విక్రయించకూడదనే నిబంధనలు గాలికి వదిలి యథేచ్చగా అమ్ముకున్నారు. జిల్లాలోని తణుకు, భీమవరం తదితర పట్టణాల్లో ప్రైవేటు స్కూళ్లలో విక్రయాలను విద్యార్థి సంఘాల నాయకులు అడ్డుకుని విద్యాశాఖాధికారులకు ఫిర్యాదుచేసినా చర్యలు తీసుకోలేదు. ఫీజులతో పాటు పుస్తకాలు, యూనిఫాంకు అధిక మొత్తంలో వసూలు చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. పది విద్యార్థులకు అందని పౌష్టికాహారం పదో తరగతిలో ఉత్తీర్ణత శాతం పెంచడానికి గత ప్రభుత్వం విద్యార్థులకు అదనపు తరగతులు నిర్వహించి వారికి పౌష్టికాహారంగా ప్రత్యేకంగా స్నాక్స్ అందించేవారు. ప్రస్తుతం అదనపు తరగతులు నిర్వహిస్తున్నారు తప్ప ఎలాంటి స్నాక్స్ లేవు. దీంతో ఉదయం నుంచి రాత్రి వరకు విద్యార్థులు తరగతిలో ఉండడం వల్ల నీరసించిపోతున్నారని విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేటు విద్యాసంస్థల వాహనాలను నిర్లక్ష్యంగా నడపడంతో అనేక చోట్ల ప్రమాదాలు జరిగాయి. దీంతో విద్యార్థులు గాయాల పాలయ్యార. భీమవరం పట్టణంలోని తిరుమల విద్యాసంస్ధల బస్సు డ్రెయిన్లోనికి ఒరిగి బోల్తా పడింది. వీరవాసరం మండలంలో లిటిల్ బడ్స్ స్కూల్ బస్సు చెట్టును ఢీకొట్టినా విద్యార్థులకు పెద్దగా గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. తాడేపల్లిగూడెం, పాలకొల్లు తదితర ప్రాంతాల్లో ప్రమాదాలు జరిగినా అధికారులు పట్టించుకోలేదనే ఆందోళన వ్యక్తమవుతోంది. -
ఉత్తర ద్వార దర్శనానికి సర్వం సిద్ధం
ద్వారకాతిరుమల: శ్రీవారి ఆలయంలో ఉత్తర ద్వార దర్శనానికి సర్వం సిద్ధమైంది. మంగళవారం తెల్లవారుజామున 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఉత్తర ద్వారం వద్ద స్వామివారి దర్శనం భక్తులకు కల్పించనున్నట్టు ఆలయ ఈఓ ఎన్వీఎస్ఎన్ మూర్తి తెలిపారు. అందులో భాగంగా ఆలయ పరిసరాలను, ఉత్తర ద్వారాన్ని సోమవారం రాత్రి పచ్చిపూలతో శోభాయమానంగా అలంకరించారు. ఉత్తర ద్వారంలో స్వామివారు ఆసీనులయ్యే ప్రాంతాన్ని అలంకరించి, ప్రత్యేక మండపాన్ని నిర్మించారు. అర్ధరాత్రి వరకు ఈ పనులు సాగాయి. స్వామివారి వాహన సేవకు వెండి గరుడ, శేష వాహనాలను సిద్ధం చేశారు. సోమవారం రాత్రి 7 గంటల నుంచి నిజరూపంలో ఉన్న శ్రీవారిని వేలాది మంది భక్తులు దర్శించుకున్నారు. క్షేత్రానికి చేరుకున్న దీక్షాధారులు తొలి ఉత్తర ద్వార దర్శనం చేసుకునేందుకు దూరప్రాంతాల నుంచి గోవింద స్వాములు సోమవారం రాత్రి ఆలయానికి చేరుకున్నారు. మంగళవారం ఉదయం స్వామిని దర్శించిన తరువాత ఇరుముడులు సమర్పించనున్నారు. రెండు వాహనాలపై.. ముక్కోటి పర్వదినాన స్వామివారు ఉత్తర ద్వారం వద్ద ఉదయం 10 గంటల వరకు వెండి గరుడ వాహనంపై భక్తులకు దర్శనమిస్తారు. ఆ తరువాత అదే వాహనంపై గ్రామోత్సవానికి వెళతారు. ఆ సమయం నుంచి రాత్రి 9 గంటల వరకు ఉత్తర ద్వారం వద్ద స్వామి, అమ్మవార్లు వెండి శేష వాహనంపై భక్తులకు దర్శనమిస్తారు. అలాగే సాయంత్రం వరకు స్వామివారు గర్భాలయంలో నిజరూప దర్శనంలో భక్తులను కటాక్షిస్తారు. నేడు తెల్లవారుజామున 5 గంటల నుంచి స్వామి దర్శనం రెండు వాహనాలపై దర్శనమివ్వనున్న శ్రీవారు ముందు రోజు రాత్రే వేలాదిగా ఆలయానికి చేరుకున్న భక్తులు -
తల్లికి వందనంలో 20 వేల మందికి కోత
పేదల విద్యార్థులు సైతం విద్యాభ్యాసానికి ఇబ్బంది పడకూడదనే సంకల్పంతో వైఎస్ జగన్మోహన్రెడ్డి అమ్మ ఒడి పథకం ద్వారా విద్యార్థులకు రూ.15 వేలు అందిస్తే అదే పథకాన్ని చంద్రబాబు ప్రభుత్వం తల్లికి వందనంగా మార్చి విద్యార్థులందరికీ రూ.15 వేలు ఇస్తామని ప్రచారం చేసి అధికారంలోకి వచ్చాక దాదాపు 20 వేల మంది విద్యార్థులకు కోత పెట్టారు. ఎన్నో ఏళ్ల అనుభవం ఉన్న ఉపాధ్యాయులు సైతం టెట్ పరీక్షలో ఉత్తీర్ణత కావాలనే నిబంధన ఉపాధ్యాయులకు గుదిబండగా మారింది. సర్వీస్లో ఉన్న ఉపాధ్యాయులకు దీనిపై మినహాయింపు ఇచ్చేలా కేంద్రం సుప్రీంకోర్టులో ఎస్ఎల్పీ దాఖలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తేవాలని ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన చేపట్టినా ఇంతవరకు ఎలాంటి ఫలితం లభించలేదు. -
మావుళ్లమ్మ మూల విరాట్ దర్శనం పునః ప్రారంభం
భీమవరం (ప్రకాశం చౌక్): మావుళ్లమ్మ వారి 62వ వార్షికోత్సవం సందర్భంగా అలంకరణ పనుల కోసం ఈ నెల 17న మూల విరాట్ దర్శనాన్ని నిలిపివేశారు. అలంకరణ పనులు పూర్తి చేయడంతో సోమవారం ఉదయం ఆలయ ప్రధాన అర్చకుడు మద్దిరాల మల్లికార్జున శర్మ కళాన్యాసం ప్రత్యేక పూజలను నిర్వహించగా అమ్మవారి మూల విరాట్ పునః దర్శనం భక్తులకు కల్పించారు. అమ్మవారి ఆలయ సన్నిధిలో ప్రత్యేక హోమాలు, పూజలు నిర్వహించారు. అమ్మవారిని స్థానిక ఎమ్మెల్యే అంజిబాబు దర్శించుకున్నారు. అనంతరం మాట్లాడుతూ అమ్మవారి ఉత్సవాల్లో భక్తులకు ఇబ్బందులు లేకుండా దర్శనం కల్పించాలన్నారు. భీమవరం: ఫిర్యాదులపై సానుకూలంగా స్పందించి పూర్తిస్థాయి విచారణ జరిపి పరిష్కారం చేయాలని అడిషనల్ ఎస్పీ వి.భీమారావు చెప్పారు, సోమవారం భీమవరం వన్టౌన్ పోలీస్ స్టేషన్ కార్యాలయంలో ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా 21 మంది బాధితులు తమ సమస్యలను వివరించారు. అనంతరం సంబంధిత పోలీసు స్టేషన్ల అధికారులతో మాట్లాడి ఫిర్యాదులకు శాశ్వత పరిష్కారం చూపాలని ఆదేశించారు. భీమవరం(ప్రకాశం చౌక్): దివ్యాంగులకు ప్రతినెల మూడో శుక్రవారం ప్రత్యేక గ్రీవెన్స్ డే నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. కలెక్టరేట్ పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో సోమవారం కలెక్టర్ అధికారులతో మాట్లాడుతూ దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి కలెక్టరేట్లో ప్రతి నెల మూడో శుక్రవారం ప్రత్యేక గ్రీవెన్స్ డే ఏర్పాటుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. దివ్యాంగులు తమ సమస్యలను మూడో శుక్రవారం ప్రత్యేక గ్రీవెన్న్స్ డే రోజున అందజేసి సమస్యలను పరిష్కరించుకోవచ్చన్నారు. విజువల్లీ చాలెంజ్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రూపొందించిన వికలాంగుల హక్కుల చట్టం–2016 పుస్తకాన్ని కలెక్టర్ చదలవాడ నాగరాణి చేతులమీదుగా ఆవిష్కరించారు. భీమవరం(ప్రకాశం చౌక్): రెవెన్యూ సమస్యల పరిష్కారానికి క్లినిక్లు ప్రజల సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ నాగరాణి సూచించారు. కలెక్టరేట్ ఆవరణలో సోమవారం రెవిన్యూ క్లినిక్లు ప్రారంభించి, పనితీరును పరిశీలించారు. కలెక్టరేట్లో 5 కౌంటర్లు ఏర్పాటు చేసి 59 అర్జీలు స్వీకరించారు. భీమవరం: నూతన సంవత్సర వేడుకల్లో నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ అద్నాన్ నయీం అస్మి హెచ్చరించారు. న్యూఇయర్ వేడుకలను సురక్షితమైన, ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించుకోవాలన్నారు. వేడుకల పేరుతో రోడ్లపై హంగామా చేస్తూ, నిబంధనలు ఉల్లంఘించేవారిపై పోలీస్ శాఖ ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసిందని శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలను ఏమాత్రం సహించబోమని ఆయన స్పష్టం చేశారు. -
వైఎస్సార్సీపీ ఫ్లెక్సీల తొలగింపు
యనమదుర్రులో ఘటనభీమవరం అర్బన్: భీమవరం మండలంలోని యనమదుర్రు గ్రామంలో సోమవారం వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల తొలగింపు వివాదంగా మారింది. గ్రామానికి చెందిన ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఫ్లెక్సీలపై మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి, వైఎస్సార్సీపీ నాయకుల ఫొటోలతో క్రిస్మస్, నూతన సంవత్సరం, సంక్రాంతి శుభాకాంక్షలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు వస్తున్నారని పంచాయతీ సిబ్బంది, కూటమి నాయకులు ఫ్లెక్సీలను తొలగించారని వైఎస్సార్సీపీ నాయకులు చెబుతున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఉన్న జనసేన ఫ్లెక్సీలు తొలగించకుండా కక్షతో వైఎస్సార్సీపీవి తొలగించడంపై నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మండి పడుతున్నారు. -
గుండెల నిండా గోవిందుడు
తరిస్తూ.. చినవెంకన్నను స్మరిస్తూ.. ● అట్టహాసంగా శ్రీవారి గిరి ప్రదక్షిణ ● 30 వేల మందికి పైగా భక్తుల రాక ● మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభమైన ధర్మప్రచార రథం రథాన్ని జెండా ఊపి ప్రారంభిస్తున్న దేవస్థానం ఈఓ మూర్తి, ఆలయ అనువంశిక ధర్మకర్త నివృతరావు ద్వారకాతిరుమల: భక్తవత్సలుడైన ఆ ఏడు కొండల వాడిపై గుండెల నిండి అపారమైన భక్తితో.. అచంచలమైన విశ్వాసంతో.. భక్తులు, గోవింద దీక్షాదారులు సోమవారం గిరి ప్రదక్షిణ చేశారు. ఇసుకేస్తే రాలనంత భక్తజన సందోహం నడుమ జరిగిన ఈ వేడుకతో ద్వారకాతిరుమల క్షేత్రం పులకించింది. తొలుత ఆలయ ప్రధాన కూడలి (గుడి సెంటర్)లో ప్రత్యేక రథంలో కొలువైన స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు దేవస్థానం ఈఓ ఎన్వీఎస్ఎన్ మూర్తి, ఆలయ అనువంశిక ధర్మకర్త ఎస్వీఎన్ఎన్ నివృతరావు పూజలు నిర్వహించారు. ఆ తరువాత ఆ రథం వెనుక విశేష పుష్పాలంకారాల్లో ఉన్న శ్రీవారి ధర్మప్రచార రథాన్ని వారు జెండా ఊపి ప్రారంభించారు. దాంతో గిరి ప్రదక్షిణ వేడుక ప్రారంభమైంది. గజ, వృషభ, అశ్వాలు ప్రచార రథం ముందు నడువగా, వాటి వెనుక భక్తులు, గోవింద స్వాములు, గ్రామస్తులు మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ భక్తి ప్రపత్తులతో గిరి ప్రదక్షిణ చేపట్టారు. ఈ యాత్ర మల్లేశ్వరం (దొరసానిపాడు), రాళ్లకుంట, కొండపైన ఆశ్రమం, లింగయ్య చెరువు, ఉగాది మండపం మీదుగా సాగుతూ ఆలయానికి చేరుకుంది. సుమారు 5 కిలోమీటర్లు మేర 30 వేల మందికి పైబడిన భక్తులతో జరిగిన ఈ వేడుక చినవెంకన్న వైభవాన్ని చాటింది. శ్రీనివాసా గోవిందా.. శ్రీ వేంకటేశా గోవిందా.. అంటూ భక్తులు చేసిన గోవింద నామస్మరణలు క్షేత్ర పరిసరాల్లో మార్మోగాయి. ఇదిలా ఉంటే గిరి ప్రదక్షిణ మార్గంలో భక్తుల సౌకర్యార్థం దాతల సహకారంతో ఏర్పాటు చేసిన పండ్లు, టీలు, పాలు, ట్యాబ్లెట్లు, మంచి నీరు సక్రమంగా అందక భక్తులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఏదేమైనా ఎన్నడూ లేని విధంగా ఈసారి గిరి ప్రదక్షిణలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొనడం విశేషం. -
ఏలూరు రైల్వేస్టేషన్లో హెల్ప్లైన్ ఏర్పాటు
ఏలూరు (టూటౌన్): యలమంచిలి రైల్వే స్టేషన్లో సోమవారం ఉదయం జరిగిన టాటానగర్–ఎర్నాకులం రైలు ఫైర్ యాక్సిడెంట్కు సంబంధించి ఏలూరు రైల్వే స్టేషన్ నందు హెల్ప్లైన్ ఏర్పాటు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. హెల్ప్లైన్ నెంబర్ 75693 05268 కు కాల్ చేసి ప్రమాద వివరాలు, ప్రయాణ వివరాలు తెలుసుకోవచ్చునని తెలిపారు. సంక్రాంతికి ప్రత్యేక రైళ్లు సంక్రాంతి రద్దీకి అనుగుణంగా ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. జనవరి 8న రైలు నెం.07460 కాకినాడ టౌన్–వికారాబాద్, 9, 11 తేదీల్లో రైలు నెం.07461 పార్వతీపురం–వికారాబాద్, 10న ట్రైన్ నెం.07462 పార్వతీపురం–వికారాబాద్, 12న ట్రైన్ నెం.07463 పార్వతీ పురం–కాకినాడ టౌన్ ప్రత్యేకరైళ్లు నడుపనున్నారు. అలాగే జనవరి 8న ట్రైన్ నెం.07464 సికింద్రాబాద్–పార్వతీపురం, 9న ట్రైన్ నెం.07465 పార్వతీపురం–సికింద్రాబాద్, 7, 9 తేదీల్లో ట్రైన్ నెం.07186 కాకినాడ టౌన్–వికారాబాద్, 8న ట్రైన్ నెం.07185 వికారాబాద్–కాకినాడ టౌన్, 10న ట్రైన్ నెం.07187 వికారాబాద్–కాకినాడ మధ్య ప్రత్యక రైళ్లు నడుస్తాయని తెలిపారు. భీమవరం: వచ్చే నెల 3వ తేదీ నుంచి నాలుగు రోజులపాటు జరుగనున్న సౌత్జోన్ బ్యాడ్మింటన్ పోటీలకు భీమవరం విష్ణు ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థి బి జాయ్కుమార్ ఎంపికై నట్లు కళాశాల ఫిజికల్ డైరెక్టర్ ఎం శ్రీనివాసరావు చెప్పారు. ఈ నెల 26, 27 తేదీల్లో విజయవాడ వీఆర్ సిద్దార్ధ ఇంజనీరింగ్ కళాశాలలో జేఎన్టీయూకే బ్యాడ్మింటన్ సెలక్షన్స్లో తమ విద్యార్థి జాయ్కుమార్ ఎంపికయ్యాడన్నారు. ఈ సందర్భంగా ఎంపికై న విద్యార్థిని కళాశాల ప్రిన్సిపాల్ ఎం వేణు, వైస్ ప్రిన్సిపాల్ ఎం శ్రీలక్ష్మి, శ్రీనివాసరావు అభినందించారు. ఉండి: నిమ్మలపేటలో చోరీ జరిగింది. వివరాల ప్రకారం ఉండి నిమ్మలపేటకు చెందిన పేడ్డ రాము వ్యవసాయ కూలీ. అతడు కుటుంబంతో సహా గత కొంతకాలంగా ఇతర ప్రాంతాల్లో కూలీపనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. సోమవారం తెల్లవారుజామున ఇంటికి వచ్చే సరికి ఇంటి తలుపులు తెరచివున్నాయి. లోపలికి వెళ్లి పరిశీలించగా చోరీ జరిగినట్లు గుర్తించాడు. ఈ చోరీలో 4 కాసుల బంగారం, కొంత వెండి దోపిడీకి గురైనట్లు బాధితులు చెబుతున్నారు. అయితే ఈ చోరీపై తమకు ఫిర్యాదు అందలేదని ఎస్సై ఎండీ నసీరుల్లా తెలిపారు. తాడేపల్లిగూడెం రూరల్: అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి చెందిన ఘటన మండలంలోని ఎల్.అగ్రహారం రాళ్ల సాహెబ్ల కాలనీ సమీపంలో సోమవారం జరిగింది. రూరల్ పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. తాడేపల్లిగూడెం పట్టణం వీకర్స్ కాలనీకి చెందిన ఈగల గణేష్ (20) తాపీ పని చేస్తుంటాడు. ఆదివారం రాత్రి ఇంటికి రాకపోవడంతో ఎల్.అగ్రహారం జగనన్న కాలనీలో నిర్మాణంలో ఉన్న ఇంటిని పరిశీలించగా ఫ్యాన్ హుక్కు ఉరివేసుకుని ఉండటాన్ని బంధువులు గుర్తించారు. సమాచారం అందుకున్న రూరల్ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అప్పుల బాధ తాళలేక ఆత్మహత్యకు పాల్పడినట్లుగా రూరల్ పోలీసులు తెలిపారు. మృతుని సోదరుడు సతీష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, రూరల్ ఎస్సై జేవీఎన్. ప్రసాద్ దర్యాప్తు చేస్తున్నారు. నరసాపురం రూరల్: బహిర్బూమికి వెళ్లిన దివ్యాంగుడు ప్రమాదవశాత్తు కాలువలో పడి మృతి చెందిన ఘటనపై సోమవారం పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్సై జి వాసు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని రామన్నపాలెం గ్రామానికి చెందిన కుక్కల భాస్కరరావు (45) బహిర్బూమికి వెళ్లి ప్రమాదవశాత్తు కాలువలో మునిగి మృతి చెందాడు. అతడికి భార్య, దత్తత కుమార్తె ఉన్నారు. ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పెన్షన్ ద్వారానే ఆయన కుటుంబ జీవనం సాగిస్తున్నాడు. భాస్కరరావు భార్య పద్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చెప్పారు. -
వేతనాలు పెరగక వెతలు
నూజివీడు: ట్రిపుల్ ఐటీలోని కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్ల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. వేతనాలు పెరగక.. ఉద్యోగ భద్రత లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నూజివీడు, ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీల్లో 2011 నుంచి 2014 వరకు ఇంజినీరింగ్ విద్యార్థులకు బోధన చేసేందుకు నూజివీడు, ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీల్లో 200 మంది కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లను నియమించారు. అప్పట్లో ఆర్జీయూకేటీ వీసీ వి.రాజ్కుమార్ ఐఐటీలకు, ఎన్ఐటీలకు, సెంట్రల్ యూనివర్సిటీకి వెళ్లి అక్కడే ఇంటర్వ్యూలు నిర్వహించి మెరిట్ ఉన్న వారిని ఎంపిక చేసుకొని వారిని నియామక పత్రాలు ఇచ్చి నియమించారు. మీ అందరిని పర్మినెంట్ చేయిస్తాననే హామీతో అప్పట్లో వీరిని తీసుకువచ్చారు. అయితే పర్మినెంట్ సంగతేమో గాని కనీస వేతనాలను సైతం చెల్లించడం లేదని కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లు వాపోతున్నారు. తమకు వేతనాలు పెరిగి ఏడేళ్లు అవుతోందని, గతంలో పలుమార్లు అడిగినా వేతనాలు పెంచకుండా తమకేమీ పట్టనట్టు ఆర్జీయూకేటీ ఉన్నతాధికారులు వ్యవహరిస్తున్నారని కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏడేళ్లుగా కేవలం రూ.49 వేల వేతనానికే వారు పనిచేస్తున్నారు. ప్రస్తుతం నూజివీడు ట్రిపుల్ ఐటీలో 38 మంది, ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో 12 మంది పనిచేస్తున్నారు. వీరంతా బోధన చేయడమే కాకుండా అదనపు బాధ్యతలను సైతం నిర్వర్తిస్తున్నారు. 200ల నుంచి 50 మందికి తగ్గిన వైనం వేతనాలు పెంచక.. పర్మినెంట్ చేయకుండా అనేక బాధ్యతలు అప్పగిస్తూ 24 గంటలూ పనిచేయించుకుంటున్న నేపథ్యంలో అత్యధిక శాతం మంది వేరే ప్రైవేటు సంస్థలు, ఇనిస్టిట్యూట్లలో అత్యధిక శాలరీ లభిస్తుండటంతో ట్రిపుల్ ఐటీలో ఉద్యోగాలు మానేశారు. ఇలా 200 మందిలో 150 మంది కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఇతర ఉద్యోగాలు చూసుకొని బయటకు వెళ్లిపోయారు. వెళ్లిపోయిన వారంతా రూ.లక్షల్లో వేతనాలను పొందుతూ ఆర్థికంగా ఉన్నత స్థానంలోకి వెళ్లడంతో తామెందుకు ఇక్కడ ఉన్నామా అని మిగిలిన వారు ఆవేదన చెందుతున్నారు. నల్ల రిబ్బన్లతో నిరసన కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లు తమ వేతనాలను పెంచాలని డిమాండ్ చేస్తూ గత ఐదు రోజులుగా ఏలూరు జిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీలో నిరసన ప్రదర్శన చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. సోమవారం నల్ల రిబ్బన్లు ధరించి విధులకు హాజరయ్యారు. మధ్యాహ్నం భోజన విరామం సమయంలో కొద్దిసేపు డైరెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం డైరెక్టర్ ఆచార్య సండ్ర అమరేంద్రకుమార్ను కలిసి వేతనాలను పెంచాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. ఏడేళ్లుగా చాలీచాలని వేతనాలతో అవస్థలు ఇతర ఉద్యోగాలకు వెళ్లిపోయిన 150 మంది ఆందోళనకు దిగిన కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లు ప్రభుత్వ టీచర్ ఉద్యోగం మానేసి భవిష్యత్ బాగుంటుందేమోనని ట్రిపుల్ ఐటీలో చేరా. టీచర్ ఉద్యోగంలోనే ఉండి ఉంటే నేడు రూ.1.50 లక్షల పైగా జీతం వచ్చేది. రిటైర్ అయ్యాక పింఛన్ వచ్చేది. ఇక్కడ జీతం లేదు, ఉద్యోగ భద్రత లేదు. – జాడ సీతాపతిరావు, తెలుగు అసిస్టెంట్ ప్రొఫెసర్ నాది ఉత్తరప్రదేశ్ కాగా గౌహతీ ఐఐటీలో పీహెచ్డీ చేశా. పర్మినెంట్ చేస్తామని హామీ ఇవ్వడంతో 2013లో ఇక్కడ అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేరా. కానీ ఇంతవరకు పర్మినెంట్ చేయకపోగా.. వేతనాలు కూడా చాలా తక్కువ ఇస్తున్నారు. – విజయ్కుమార్ మిశ్రా, బయోసైన్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ -
పాము కాటు మరణంపై విచారణ
కలిదిండి(కై కలూరు): ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యంతో తన భార్య మరణించిందని కలెక్టర్కు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఇటీవల ఫిర్యాదు అందింది. దీనిపై వైద్యాధికారులు కలిదిండి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సోమవారం విచారణ చేపట్టారు. కలిదిండి మండలం వెంకటాపురం గ్రామంలో అక్టోబరు 30న సిద్దాబత్తుల విజయ(32) దుకాణ ప్రిజ్లో పాలప్యాకెట్ విక్రయానికి తీస్తుండగా కింద నక్కిన నాగుపాము కాటు వేసింది. విషయాన్ని భర్త దుర్గారావుకు చెప్పడంతో కలిదిండి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లాడు. అక్కడ నుంచి కై కలూరు, చివరకు ఏలూరు తీసుకెళ్లగా చికిత్స పొందుతూ ఆమె మరణించింది. సకాలంలో వైద్యం అందలేదనే దుర్గారావు ఫిర్యాదుతో వైద్యశాఖ జిల్లా ఫొగ్రాం ఆఫీసర్ నరేంద్ర కృష్ణ తన బృందంతో విచారణ చేశారు. దుర్గారావు మాట్లాడుతూ పాము కాటు నిమిత్తం తన భార్యను కలిదిండి పీహెచ్సీకి తీసుకువెళ్లినప్పుడు డాక్టర్ అందుబాటులో లేరన్నారు. నర్సు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పి రెండు ఇంజక్షన్లు చేశారన్నారు. అక్కడ నుంచి కై కలూరు సీహెచ్సీకి వెళ్లామని, చికిత్స అనంతరం పరిస్థితి విషమించడంతో ఏలూరు ప్రభుత్వాసుపత్రికి పంపారన్నారు. అక్కడ తన భార్య మరణించిందని, వైద్యుల నిర్లక్ష్యమే కారణమని వీడియో, లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. నివేదికను ఉన్నతాధికారులకు వివరిస్తామని విచారణ బృందం తెలిపింది. వ్యక్తిపై దాడి.. 15 మందిపై కేసు నమోదు ఉండి: ఓ వ్యక్తిపై జరిగిన దాడికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల ప్రకారం చెరుకువాడ గ్రామానికి చెందిన ఆరేపల్లి శివనాగువెంకట సర్వేశ్వరరావు అనే వ్యక్తి బడ్డీకొట్టు, మాంసం వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ నెల 28వ తేదీన ఆకివీడు గ్రామానికి చెందిన జేమ్స్ అనే వ్యక్తి దుకాణానికి వచ్చి సిగరెట్ కావాలని అడిగాడు. ఈ విషయంలో ఇరువురి మద్య వాగ్వివాదం ఏర్పడింది. దీంతో జేమ్స్ మళ్లీ మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో మరో 15 మందిని వెంటబెట్టుకుని వచ్చి షాపు ధ్వంసం చేసి, తనను, తన తల్లిని, కుమారుడిని, అతని వద్ద పనిచేస్తున్న పిల్లి దుర్గా వెంకటరావులను కొట్టినట్లు సర్వేశ్వరరావు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
గిరిజనులపై దాడులు దుర్మార్గం
జంగారెడ్డిగూడెం: గిరిజనులపై దాడులు దుర్మార్గమని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.వెంకటేశ్వర్లు అన్నారు. ఇనుమూరు గిరిజనులపై దాడులను ఖండించాలని, తప్పుడు కేసులు ఎత్తివేయాలని, గిరిజన భూ సమస్యలు పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఆదివాసీ గిరిజన సంఘం, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో స్థానిక రెవెన్యూ డివిజనల్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. గిరిజన సంఘం జిల్లా నాయకులు మొడియం నాగమణి అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర్లు, సీపీఎం జిల్లా కార్యదర్శి ఎ.రవి, ఏజెన్సీ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి కుంజా రామారావు మాట్లాడారు. ఇనుమూరు గ్రామంలో మొత్తం 57 గిరిజన కుటుంబాల వారు సాగు చేసుకుంటున్న మొక్కజొన్న పంటను నాశనం చేయడంతోపాటు గిరిజన మహిళలపై విచక్షణారహితంగా దాడి చేసిన పోలీసు, రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వమే ఈ దాడులను ప్రోత్సహిస్తున్ననట్లు స్పష్టంగా కనిపిస్తోందని ఆరోపించారు. గిరిజనులపై తప్పుడు కేసులు ఎత్తివేయాలని, దాడికి పాల్పడ్డ తహసీల్దార్, ఎస్సై, భూస్వాములపై ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ యాక్ట్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం కార్యాలయం సూపరింటెండెంట్కు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. వ్య.కా.స.జిల్లా అధ్యక్షురాలు తామా ముత్యాలమ్మ, గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కారం భాస్కర్, మడకం సుధారాణి, బొరగం భూచంద్రరావు, తెల్లం సంకురుడు, రైతు సంఘం, డీవైఎఫ్ఐ, ఏజెన్సీ గిరిజన సంఘం నాయకులు పాల్గొన్నారు. -
సైడ్ లైట్స్
● సెయింట్గ్జేవియార్ పాఠశాల వద్దకు వచ్చేసరికి ఎదురుగా వాహనాలు రావడంతో భక్తులకు ఇబ్బందులు తప్పలేదు. సెక్యూరిటీ విఫలమైనట్టు కొట్టొచ్చినట్టు కనిపించింది.● గిరి ప్రదక్షిణ మార్గంలో భక్తుల పాదాల రక్షణ నిమిత్తం దారి పొడవునా పరచిన ఎండు గడ్డిలో కొందరు భక్తులకు ముళ్లు గుచ్చుకోవడంతో ఇబ్బంది పడ్డారు. ● మంచినీరు, అల్పాహారం, పండ్లు, టీలు అందించే స్టాల్స్ వద్ద సిబ్బంది సరిపోకపోవడంతో స్టాల్స్ వద్ద తోపులాటలు జరిగాయి. దాంతో అవి భక్తులకు సక్రమంగా అందలేదు. ● భక్తులు నడిచేటప్పుడు గడ్డిలోంచి దుమ్ము విపరీతంగా పైకి లేవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ● మధ్యాహ్నం 3.30 గంటలకు ఆలయ ప్రధాన కూడలిలో గిరి ప్రదక్షిణ వేడుకను ప్రారంభించారు. ● గతంలో వలె ఈ ఏడు గిరి ప్రదక్షిణ వేడుకలో విచిత్ర వేషధారణలను ఏర్పాటు చేయలేదు. ● గిరి ప్రదక్షిణను వేగంగా ముగించారు. సాయంత్రం సుమారు 6.15 గంటకే ఈ వేడుక పూర్తయ్యింది. -
ఆట అదరగొట్టారు
నవంబర్ నెలలో నరసరావుపేటలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆద్వర్యంలో జరిగిన పోటీల్లో ధనుష్ సాయి 50, 100 మీటర్ల బట్టర్ఫ్లై విభాగంలో రెండు గోల్డ్ మెడల్స్, 100 మీటర్ల ఫ్రీ స్టయిల్లో సిల్వర్ మెడల్ సాధించారు. మరో క్రీడాకారిణి పూర్వి 50 మీటర్ల బటర్ ఫ్లై, 200 మీటర్ల ఐవీ విభాగంలో రెండు గోల్డ్మెడల్స్, 200 మీటర్ల ఫ్రీ స్టయిల్లో బ్రాంజ్మెడల్ సొంతం చేసుకోగా, మోక్ష ప్రియ 50, 100 మీటర్ల బ్యాక్ స్ట్రోక్ విభాగంలో రెండు సిల్వర్ మెడల్స్, 200 మీటర్ల ఐఎం విభాగంలో బ్రాంజ్ మెడల్ చేజిక్కించుకున్నారు. డిసెంబర్లో ఏలూరులో 7వ పారా స్విమ్మింగ్ చాంపియన్షిప్ పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో పాల్గొన్న దివ్యాంగులు అద్భుత ప్రతిభ చాటారు. ఏలూరు జిల్లా క్రీడాప్రాధికార సంస్థ స్విమ్మింగ్ కోచ్ బలగా గణేష్ పాక్ జలసంఽధి ఈధి అరుదైన ఘనత సాదించాడు. శ్రీలంక, భారతదేశం సరిహద్దుల మధ్య 31 కిలోమీటర్ల మేర సముద్రంలో పాక్ జలసంధిలో ఈత కొట్టారు. ఏలూరు రూరల్: 2025వ సంవత్సరం ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా క్రీడాకారులకు కొత్త అనుభూతినిచ్చింది. 2025లో సైతం ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లా క్రీడాకారులు ఉమ్మడి జిల్లా జట్లగానే పోటీపడ్డారు. బాస్కెట్బాల్, అథ్లెటిక్స్, వెయిట్లిఫ్టింగ్, స్విమ్మింగ్, బాక్సింగ్ తదితర క్రీడల్లో జిల్లా బాలబాలికలు జాతీయ, రాష్ట్ర స్థాయిలో రాణించారు. క్రీడా వికాస కేంద్రాలు అభివృద్ధి చేస్తామని కూటమి ప్రభుత్వం ప్రకటించినప్పటికీ పనులు ముందుకు సాగలేదు. క్రీడా ప్రాంగణాలు, ఆట స్థలాలు, మౌలిక వసతులు అభివృద్ది కాలేదు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేపట్టిన వైఎస్ఆర్ క్రీడా పురస్కారాలు, ఆడుదాం ఆంధ్ర పోటీలను కూటమి ప్రభుత్వం అటకెక్కించింది. జాతీయ పోటీలకు ఎంపిక ఏప్రిల్ నెల 9వ తేదీ నుంచి 16 వరకూ పాండిచ్చేరిలో జరిగిన 40వ జాతీయస్థాయి అండర్–16 యూత్ బాస్కెట్బాల్ పోటీల్లో రాష్ట్ర జట్టుకు ఏలూరుకు చెందిన ఏ రుత్విక, ఎం.సోమశేఖర్, కస్తూరిబా బాలికల పాఠశాల విద్యార్థిని నందిని ప్రాతినిథ్యం వహించారు. ఏలూరు సాయ్ సెంటర్లో శిక్షణ పొందుతున్న పి.దివ్య వెయిట్ లిఫ్టింగ్లో రాణించింది. ఏప్రిల్లో జూనియర్ నేషనల్ వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో సిల్వర్ చేజిక్కించుకుంది. స్కేటింగ్లో పతకాలు జూన్ 13 నుంచి 15 వరకూ కాకినాడలోని జోనల్ స్థాయి స్కేటింగ్ పోటీలు జరిగాయి. ఇందులో పాల్గొన్న శిఖా సహస్ర అండర్–12 విభాగంలో మూడు సిల్వర్ మెడల్స్, ఒక బ్రాంజ్ మెడల్ సాధించింది. అండర్–10 విభాగంలో శిఖా రమేష్బాబు బ్రాంజ్ మెడల్ చేజిక్కించుకున్నాడు. అథ్లెటిక్స్లో విజయాలు ఆగస్టులో డిసెంబరు 9 నుంచి 11 వరకూ బాపట్ల జిల్లా చీరాలలో జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో సాకిల్బాబు 100 మీటర్ల పరుగు పందెంలో విజేతగా నిలిచాడు. కొన్నేళ్లుగా నిలకడగా రానిస్తున్న సాకిల్ బాబు బెస్ట్ అథ్లెట్గా అవార్డు అందుకున్నాడు. డిసెంబర్ 7న తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో జరిగిన ఆంధ్రప్రదేశ్ కరాటే చాంపియన్షిప్ పోటీల్లో ఏలూరు అమలొద్బవి పాఠశాల విద్యార్థి లక్కపాము సుహాన్ బ్రాంజ్ మెడల్ సొంతం చేసుకున్నాడు. బాక్సింగ్లో పతకాలు డిసెంబర్ 21, 22 తేదీల్లో పిఠాపురంలో జరిగిన ఎలైట్ సీనియర్ ఉమెన్ బాక్సింగ్ పోటీల్లో పాల్గొనన ఆశ్రం వైధ్య కళాశాల విద్యార్థిని భావన లక్ష్మీ సిల్వర్ మెడల్ సాధించింది. సెయింట్ జోసఫ్ డెంటల్ కళాశాల విద్యార్థిని వాణి 65 కేజీల కేటగిరిలో బ్రాంజ్ మెడల్ చేజిక్కించుకుంది. ఆంధ్ర క్రికెట్ జట్టులో మునీష్వర్మ జిల్లా క్రికెటర్ బి.మునీష్వర్మ ఆంధ్ర టీ20 క్రికెట్ జట్టుకు ఎంపికయ్యాడు. డిసెంబర్లో జరిగిన అంతర జిల్లాల పోటీల్లో పాస్ట్ బౌలర్, బ్యాట్స్మెన్గా ప్రతిభ చాటిన మునీష్వర్మను సెలక్టర్లు ఆంధ్ర జట్టుకు ఎంపిక చేసారు. ఈ ఏడాది వివిధ క్రీడాంశాల్లో సత్తాచాటిన ఉమ్మడి జిల్లా క్రీడాకారులు బాస్కెట్బాల్ పోటీల్లో విజేతగా నిలిచిన పశ్చిమ జట్టు వెయిట్లిఫ్టింగ్, స్విమ్మింగ్ పోటీల్లో పతకాలు రాష్ట్రస్థాయి బాస్కెట్బాల్ పోటీల్లో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా బాస్కెట్బాల్ బాలికల జట్టు జయకేతనం ఎగరేసింది. విజయవాడలో బాస్కెట్బాల్ అసోసియేషన్ మొట్టమొదట సారి నిర్వహించిన అండర్–23 చాంపియన్షిప్ టోర్నీ సొంతం చేసుకుంది. ఫైనల్లో తూర్పుగోదావరి జట్టుపై 47–17 స్కోర్తో గెలిచి విజేతగా అవతరించింది. నవంబర్ 7 నుంచి 10 వరకూ విశాఖపట్నంలో జరిగిన ఇంటర్ డిస్ట్రిక్ట్ మహిళల, పురుషుల బాస్కెట్బాల్ చాంపియన్షిప్ పోటీల్లో ఉమ్మడి పశ్చిమగోదావరి మహిళల జట్టు జయకేతనం ఎగరేసింది. విశాఖపట్నంతో హోరాహోరీగా తలపడింది. ఫైనల్ పోరులో 54–52 స్కోర్తో విజేతగా నిలిచింది. -
కొత్త సంస్కృతి
తణుకులో కొత్త సంస్కృతికి తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీకారం చుట్టారు. ప్రశాంతంగా ఉండే తణుకులో వివాదాలు సృష్టించి గొడవలు పెట్టేందుకు చూస్తున్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా వైఎస్సార్ విగ్రహానికి చంద్రబాబు ఫ్లెక్సీ ఏర్పాటుచేసి తణుకులో కవ్వింపు చర్యలకు టీడీపీ నేతలు తెరదీశారు. మేమెప్పుడూ టీడీపీ పార్టీ పెద్దలకు కూ డా గౌరవాన్ని ఇచ్చే రకంగానే నడుచుకున్నాం. అంతేకాకుండా టీడీపీ మాజీ ఎమ్మెల్యే వైటీ రాజా తీసుకున్న నిర్ణయాలను పలు సందర్భాల్లో ఇప్పటికీ స్వాగతిస్తూనే ఉన్నాం. సుగర్స్ అధినేత ముళ్లపూడి హరిశ్చంద్రప్రసాద్ విగ్రహాన్ని ఏర్పాటుచేసి ఆ ప్రాంతాన్ని పార్కుగా తీర్చిదిద్దాం. అలాంటి మంచి కార్యక్రమాలను నిర్వహించామే కానీ ఎప్పుడూ గీత దాటి చెత్త రాజకీయాలు చేయలేదు. అయితే నేడు గొ డవ లు సృష్టించి పోలీసులను పావులుగా వాడుకుంటున్న దుస్థితి నెలకొంది. – కారుమూరి వెంకట నాగేశ్వరరావు, మాజీ మంత్రి -
గిరి ప్రదక్షిణకు సర్వం సిద్ధం
ద్వారకాతిరుమల: శ్రీవారి క్షేత్రంలో స్వామి గిరి ప్రదక్షిణకు, ఉత్తర ద్వార దర్శనానికి సర్వం సిద్ధమైంది. ఏటా ముక్కోటి ఏకాదశి పర్వదినం ముందు రోజు గిరి ప్రదక్షిణను నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. ఈ క్రమంలోనే ఈ సారి కూడా ఈ వేడుకను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. 5 కిలోమీటర్ల మేర జరిగే గిరి ప్రదక్షిణలో పాల్గొనే గోవింద స్వాములు, భక్తుల పాదాల రక్షణకు మార్గంలో ఎండు గడ్డిని పరిచారు. దారి పొడవున టెంట్లు నిర్మించి, ఫ్లడ్ లైట్లను ఏర్పాటు చేశారు. గిరి ప్రదక్షిణ మహోత్సవం సోమవారం మధ్యాహ్నం 2.30 గంటలకు స్వామివారి తొలిమెట్టు (పాదుకా మండపం) వద్ద ప్రారంభం అవుతుంది. గజ, అశ్వ, వృషభ సేవలు, చిత్రవిచిత్ర వేషధారణలు, డప్పు వాయిద్యాలు, కోలాట నృత్యాల నడుమ ఈ గిరి ప్రదక్షిణ మల్లేశ్వరం(దొరసానిపాడు రోడ్డు) మీదుగా గిరి చుట్టూ తిరిగి ఆలయానికి చేరుతుంది. ఉత్తర ద్వార దర్శనానికి దాదాపుగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. క్యూలైన్ల వద్ద షామియానా పందిళ్లు నిర్మించారు. సప్తగోకులం పక్కన ఉత్తర ద్వార దర్శనం స్వాగత ద్వారం ఏర్పాటు చేశారు. విద్యుద్దీప అలంకారాలు పూర్తి కాగా.. క్షేత్రం కాంతులీనుతోంది. ధర్మప్రచార రథాన్ని ముస్తాబు చేస్తున్నారు. మంగళవారం తెల్లవారుజామున 5 గంటల నుంచి శ్రీవారు దర్శనమిచ్చే ఉత్తర ద్వారం వద్ద పూల అలంకరణ పనులు సోమవారం సాయంత్రం నుంచి ప్రారంభం కానున్నాయి. సేవకు సిద్ధం గిరి ప్రదక్షిణ, ఉత్తర ద్వార దర్శనంలో పాల్గొనే భక్తులకు సేవలందించేందుకు 400 మంది సేవకులు సిద్ధంగా ఉన్నారు. గిరి ప్రదక్షిణలో దారి పొడవున భక్తులకు మంచినీరు, బిస్కెట్లు, పండ్లు, పాలను అందించనున్నారు. గిరి ప్రదక్షిణ, ఉత్తర ద్వార దర్శనంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చేసుకోకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. జిల్లాలోని 110 మంది పోలీస్ సిబ్బందిని ఈ ఉత్సవాల్లో నియమిస్తున్నారు. నేటి రాత్రి నుంచి నిజరూప దర్శనం.. గిరి ప్రదక్షిణ అనంతరం భక్తులకు శ్రీవారి నిజరూప దర్శన భాగ్యం కలగనుంది. ఏడాదిలో ఒకసారి మాత్రమే స్వామివారు ఎలాంటి అలంకరణలు లేకుండా, దీపపు వెలుగుల్లో భక్తులకు దర్శనమిస్తారు. ఈ దర్శనం సోమవారం రాత్రి 7 గంటల నుంచి మంగళవారం సాయంత్రం వరకు ఉంటుంది. గిరి ప్రదక్షిణ మార్గంలో పరిచిన ఎండు గడ్డి దారి పొడవునా టెంట్లు, ఫ్లడ్ లైట్ల ఏర్పాటు నేడు రాత్రి 7 గంటల నుంచి స్వామి నిజరూప దర్శనం 110 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు -
వివాదాలకు కేంద్రంగా తణుకు
సాక్షి టాస్క్ఫోర్స్: ప్రశాంతతకు మారుపేరుగా నిలి చే తణుకు ప్రాంతం రాష్ట్రంలోనే వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. రాష్ట్రంలో చంద్రబాబు ప్ర భుత్వం ఏర్పడినప్పటి నుంచి జరిగిన సంఘటనలతో ఈ ప్రాంత ప్రజలు ఆందోళన చెందుతున్నారు. తాజాగా తణుకు వై.జంక్షన్లోని వైఎస్సార్ విగ్రహం వద్ద చంద్రబాబు ఫ్లెక్సీ కట్టి టీడీపీ సానుభూతిపరులు చేసిన నిర్వాకం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. వైఎస్సార్ విగ్రహానికి చంద్రబాబు ఫ్లెక్సీ కట్టడంపై ప్రజలు దుమ్మెత్తి పోశారు. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, వైఎస్సార్సీపీ శ్రేణులు ఆందోళనకు దిగడం, తమ ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం, ఆపై రెండు ఫ్లెక్సీలు పోలీసులు తొలగింపచేయడం రాష్ట్రంలో హాట్టాపిక్గా మారింది. అత్తిలి ఎంపీపీ ఎన్నికల్లో.. తణుకు నియోజకవర్గంలోని అత్తిలి ఎంపీపీ ఎన్నికల్లో సైతం మెజార్టీ వైఎస్సార్సీపీ వైపు ఉన్నా ఎ న్నికల కేంద్రానికి ఎంపీటీసీలను చేరకుండా ఏకంగా మాజీ మంత్రి కారుమూరి నివాసంపై కూటమి శ్రేణులు దౌర్యన్యానికి దిగిన తీరు, పోలీసులు ఆవైపు కన్నెత్తి చూడకపోవడం వంటి వ్యవహారం కూడా రాష్ట్రంలో వైరల్గా మారాయి. తేతలిలలో పశు ఘోష తణుకు మండలం తేతలి గ్రామ పరిధిలో పశువధ కర్మాగారం నిబంధనలకు వ్యతిరేకంగా నడుస్తుందని స్థానిక మహిళలు రోడ్డెక్కినా చంద్రబాబు సర్కారు పట్టించుకోకపోవడం, తాజాగా విశాఖలో పట్టుబడిన గోమాసం తణుకుకు సంబంధించినదేనని కేంద్ర నిఘా విభాగం ఈ ప్రాంత పశు వైద్యాధికారిని విశాఖ పిలిపించడం వంటి ఘటనలతో రాష్ట్రవ్యాప్తంగా తణుకు గోవధ ప్రాంతంగా ఖ్యాతి సాధించిందంటూ ప్రజలు శాపనార్థాలు పెడుతున్నారు. యథేచ్ఛగా పేకాట.. గంజాయి పేకాట, గంజాయి, మద్యం మత్తులో దాడులు, మ ర్డర్లు వంటి ఘటనలు తణుకు ప్రాంతానికి మా యని మచ్చలు మారాయని ప్రజలు చర్చించుకుంటున్నారు. చంద్రబాబు సర్కారు వచ్చిన తర్వాత తణుకు సంతలో మైనర్లు బహిరంగంగా మద్యం విక్రయించిన వ్యవహారం జరగ్గా ఇది వైరల్గా మారింది. అలాగే తణుకు అన్న క్యాంటీన్లో కడిగిన నీటిలోనే ప్లేట్లు కడిగిన సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అధికారులు సతమతం తణుకులో ప్రస్తుతం ఏర్పడ్డ పరిస్థితులతో అధికార యంత్రాంగం మల్లగుల్లాలు పడుతున్నారు. ము ఖ్యంగా పోలీసు శాఖలో అధికారుల నుంచి సిబ్బంది వరకు ఒత్తిళ్లతో తలపట్టుకునే పరిస్థితులు వ చ్చాయని వాపోతున్నారు. కూటమి కవ్వింపు చర్యలు ప్రశాంతతకు మాయని మచ్చ వైఎస్సార్ విగ్రహం వద్ద చంద్రబాబు ఫ్లెక్సీతో రగడ దాడులు, దౌర్జన్యాలు, విచ్చలవిడిగా మద్యం విక్రయాలు -
మంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు
బుట్టాయగూడెం : కోర్కెలు తీర్చే తల్లిగా, వరాలిచ్చే అమ్మగా, గిరిజన ఆరాధ్య దేవతగా పూజలందుకుంటున్న గుబ్బల మంగమ్మ తల్లి గుడికి ఆదివారం భక్తులు పోటెత్తారు. చలికాలం అయినప్పటికీ, మంచు కురుస్తున్నప్పటికీ తెల్లవారుజాము నుంచే అధిక సంఖ్యలో భక్తులు మంగమ్మ తల్లి గుడికి చేరుకుని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. వివిధ జిల్లాల నుంచి ద్విచక్ర వాహనాలు, కార్లు, ఆటోలు, బస్సుల్లో అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు తరలివచ్చారు. ముదినేపల్లి రూరల్ : ప్రసిద్ధి చెందిన సింగరాయపాలెం–చేవూరుపాలెం సెంటర్లోని శ్రీసుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. ఉదయానికే జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకుని స్వామి పుట్టలో పాలుపోసి దర్శించుకున్నారు. మహిళలు పాలపొంగళ్ల శాల వద్ద నైవేద్యాలు తయారుచేసి స్వామికి సమర్పించారు. నాగబంధాల వద్ద అధిక సంఖ్యలో భక్తులు పూజలు చేశారు. గోకులంలోని గోవులకు మహిళలు పసుపు,కుంకుమలతో పూజలు చేశారు. భక్తుల రద్దీకి అనుగుణంగా అదనపు ప్రసాదాల కౌంటర్లను ఏర్పాటుచేశారు. నూజివీడు : నూజివీడు ట్రిపుల్ ఐటీలో ఈ నెల 29న ప్రారంభం కానున్న టెక్జైట్ 25–2.0లో భాగంగా విద్యార్థులకు హ్యాకథాన్ పోటీలు ఆదివారం ప్రారంభమయ్యాయి. కృత్రిమ మేథస్సు, మెషిన్ లెర్నింగ్ రంగాల్లో నూతన ఆలోచనలు, సృజనాత్మక పరిష్కారాలను ప్రోత్సహించడమే లక్ష్యంగా హ్యాకథాన్ పోటీలను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా సీఎస్ఈ అసిస్టెంట్ ప్రొఫెసర్ పీ శ్యామ్ మాట్లాడుతూ నేటి సాంకేతిక యుగంలో కృత్రిమ మేథస్సు, మిషన్ లెర్నింగ్ వంటి ఆధునిక సాంకేతికతలు యువత భవిష్యత్తును తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయన్నారు. ఇలాంటి హ్యాకథాన్లు విద్యార్థులలో ఆవిష్కరణ శక్తిని, సమస్య పరిష్కార నైపుణ్యాలను పెంపొందిస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు అధ్యాపకులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం: నకిలీ కంపెనీ పెట్టి మోసం చేసిన కేసులో ప్రధాన నిందితుడు వీరంకి శ్రీరాములను అరెస్టు చేసినట్లు ఎస్సై ఎన్వీ ప్రసాద్ తెలిపారు. తాళ్లపూడి మండలం తిరుగుడు మెట్టకు చెందిన వీరంకి శ్రీరాములు, వంకాయల సతీష్, పట్టణానికి చెందిన మండపాక వినోద్కుమార్లు జంగారెడ్డిగూడెంకు చెందిన ఒక కంపెనీలో పనిచేస్తున్నారు. వీరు కంపెనీ నుంచి బయటకు వచ్చిన తరువాత అదే కంపెనీ పేరు వచ్చేలా మరో కంపెనీ పెట్టారు. ఖాతాదారులను, రైతులను మభ్య పెట్టి మోసం చేయడంతో వీరు పనిచేసే కంపెనీ చైర్మన్ బాలకృష్ణ ఫిర్యాదు చేశారు. ఈ కేసులో గతంలో సతీష్, వినోద్కుమార్ను అరెస్టు చేయగా.. కోర్టు రిమాండ్ విధించింది. ప్రధాన నిందితుడైన శ్రీరాములు పరారీలో ఉన్నాడు. ఆదివారం జీలుగుమిల్లి చెక్పోస్టు వద్ద నిందితుడు శ్రీరాములను చేసి కోర్టులో హాజరుపర్చగా.. కోర్టు 15 రోజులు రిమాండ్ విధించినట్లు చెప్పారు. -
ఎట్టకేలకు లైన్ కట్టారు
ఆకివీడు: స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ నుంచి మూలలంక బోదె వరకు డ్రెయిన్ నిర్మాణానికి ఎట్టకేలకు లైన్ కట్టి నిర్మాణ పనులు చేపట్టారు. ఇటీవల ‘సాక్షి’లో వచ్చిన కథనానికి స్పందించి ట్రాన్స్ఫార్మర్లు, రిలయన్స్ మార్ట్ వద్ద వంకర్లు లేకుండా లైన్ లాగి ముగ్గువేసి పనులు నిర్వహిస్తున్నారు. స్థానికంగా జాతీయ రహదారికి చేర్చి ఉన్న వ్యాపార సంస్థలు, ఇళ్ల దారుల వద్ద నుంచి కొంత సొమ్ము సేకరించి నిర్మాణ పనులు చేపట్టారు. పనులు పీపీపీ పద్ధతిపై జరుగుతుండటం, నాణ్యతలేమిపై స్థానికులు పెదవి విరుస్తున్నారు. పక్కాగా డ్రెయి నేజీ నిర్మించాలని కోరుతున్నారు. యలమంచిలి: కుమారుడిపై కన్నతండ్రి కత్తితో దాడి చేసిన సంఘటన మండలంలోని కొంతేరులో చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. కొంతేరులో సిర్రా సుబ్బారావుకు రెండు పోర్షన్ల ఇల్లు ఉంది. ఒక పోర్షన్లో సుబ్బారావు, మరో పోర్షన్లో కుమారుడు మధు ఉంటున్నారు. కొన్నాళ్లుగా కుమారుడిని ఇల్లు ఖాళీ చేయమని తండ్రి చెబుతున్నా ఖాళీ చేయడం లేదు. ఈ నేపథ్యంలో ఆదివారం మధ్యాహ్నం సుబ్బారావు బండ కత్తితో మధుపై దాడి చేశాడు. మధు తలపై మోదడంతో గాయమైంది. మధును పాలకొల్లు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. యలమంచిలి హెడ్ కానిస్టేబుల్ వై.మనోహర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భీమవరం(ప్రకాశంచౌక్): జిల్లా కలెక్టరేట్తో పాటు మండల, మున్సిపల్ కార్యాలయాల్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు కలెక్టర్ సీహెచ్ నాగరాణి తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు అర్జీలు స్వీకరిస్తామన్నారు. అలాగే ప్రజలు 1100 టోల్ఫ్రీ నంబర్కు సంప్రదించి సమస్యలను తెలియజేయవచ్చని సూచించారు. భీమవరం(ప్రకాశంచౌక్): రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ సమస్యల సత్వర పరిష్కారానికి రె వెన్యూ క్లినిక్లు ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేసిందని, దీని ద్వారా జిల్లాలో రెవెన్యూ సమస్యలు వేగవంతమైన పరిష్కారానికి కృషి చేస్తామని జాయింట్ కలెక్టర్ టి.రాహుల్కుమార్రెడ్డి అన్నారు. ప్రతి సోమవారం పీజీఆర్ఎస్కు సమాంతరంగం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటుచేసి అర్జీలు స్వీకరిస్తామన్నారు. అర్జీ పరిశీలించిన వెంటనే సంబంధిత రెవెన్యూ అధికారితో మా ట్లాడి పరిష్కారానికి కృషిచేస్తామన్నారు. పట్టాదారు పాస్ బుక్లు, ఆర్ఓఎఫ్ఆర్, రెగ్యులేషన్ ఆఫ్ 1/70, రీ సర్వే, అడంగల్, వెబ్ల్యాండ్, ఎఫ్లైన్ పిటిషన్ తదితర అంశాలపై సమస్యలపై అర్జీలను సమర్పించవచ్చన్నారు. తణుకు అర్బన్: వైఎస్సార్ విగ్రహానికి టీడీపీ నాయకులు చంద్రబాబు ఫ్లెక్సీ ఏర్పాటుచేసి వి వాదాస్పదం చేసిన ప్రాంతంలో తణుకు రూ రల్ పోలీసులు 144 సెక్షన్ విధించినట్టు ప్రకటించారు. తణుకు వై.జంక్షన్లోని వైఎస్సార్ విగ్రహం వద్ద 144 సెక్షన్ ఏర్పాటుచేశామని, ప్రజలు గుంపులుగా చేరడం, ర్యాలీలు, సమావేశాలు, ధర్నాలు, ప్రదర్శనలు తదితర కార్యక్రమాలు నిర్వహించడం నిషేధమంటూ ఆదివారం రాత్రి ఫ్లెక్సీ ఏర్పాటుచేశారు. అలాగే ఆటోలో మైక్ ద్వారా ప్రచారం చేస్తున్నారు. నూజివీడు: తమకు వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ నూజివీడు ట్రిపుల్ఐటీలోని కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లు నాలుగో రోజైన ఆదివారం నిరసన కొనసాగించారు. పలువురు మాట్లాడుతూ తమ న్యాయమైన డి మాండ్లపై ఆర్జీయూకేటీ ఉన్నతాధికారులు స త్వరమే స్పందించాలని డిమాండ్ చేశారు. ఏ డేళ్లుగా తాము ఒకే జీతంతో పనిచేస్తున్నామని, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినా తమ వేతనాలను మాత్రం పెంచలేదని వాపోయారు. పలువురు మెంటార్ల వీరికి సంఘీభావం తెలిపారు. -
‘పోలవరం’ లేకుండానే కొత్త జిల్లా
బుట్టాయగూడెం: జిల్లాల పునర్విభజన నేపథ్యంలో రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లా ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చేస్తున్న కసరత్తు కొలిక్కి వచ్చింది. గత నెల 27న తొలి నోటిఫికేషన్లో పేర్కొన్న విధంగానే చింతూరు, రంపచోడవరం డివిజన్ల పరిధిలో ఉన్న 11 మండలాలతో రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లా ఏర్పాటుకు ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల చేసి ఆయా ప్రాంతాల ప్రజల అభ్యంతరాలు తెలిపేందుకు నెల రోజులు వ్యవధి ఇచ్చింది. ప్రజల నుంచి వచ్చిన అభ్యంతరాలను సీఎం సమీక్షించిన అనంతరం పోలవరం జిల్లా ఏర్పాటులో ఎలాంటి మార్పులు, చేర్పులు లేవని ప్రాథమికంగా ప్రభుత్వం తెలిపింది. దీనితో పోలవరం లేకుండానే రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లా ఏర్పాటు కానుంది. దీనికి సంబంధించి ఈ నెల 31న తుది నోటిఫికేషన్ జారీ కానుంది. ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేస్తున్న పోలవరం జిల్లా పోలవరం లేకుండా ఏర్పాటు చేయడంపట్ల నియోజకవర్గంలోని మండలాల్లో గిరిజన సంఘాల నుంచి అభ్యంతరాలు వచ్చాయి. తమ అభిప్రాయాలను తెలియజేస్తూ పలువురు నాయకులు కలెక్టర్ కె. వెట్రిసెల్వికి, ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు అందజేశారు. అభ్యంతరాల గడువు ముగియడంతో వాటిని పరీశీలించిన ప్రభుత్వం డిసెంబర్ 31న తుది నోటిఫికేషన్ విడుదల చేయనుంది. -
సంక్షేమం.. దూరం
ఆట అదరగొట్టారు 2025 ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా క్రీడాకారులకు కొత్త అనుభూతినిచ్చింది. పలు విభాగాల్లో క్రీడాకారులు పతకాలు సాధించారు. 8లో uసోమవారం శ్రీ 29 శ్రీ డిసెంబర్ శ్రీ 2025భీమవరం (ప్రకాశంచౌక్): 2025.. చంద్రబాబు ప్రభుత్వ పాలనలో సంక్షేమానికి సంకెళ్లు పడ్డాయి. సంక్షేమ పథకాలపై ఇచ్చిన హామీలను ప్రభుత్వం సంపూర్ణంగా అమలు చేయకుండా ఏడాదంతా గడిపేసింది. కూటమి మేనిఫెస్టో, సూపర్సిక్స్లో భాగంగా చెప్పిన ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి, పెన్షన్ తదితర పథకాల ఊసెత్తలేదు. సంక్షేమం అందక పేద, మధ్యతరగతి మహిళలు ఆర్థిక ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా మహిళా సాధికారత, సంక్షేమం దిశగా ప్రభుత్వం ఎలాంటి కార్యక్రమాలూ చేపట్టలేదు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అందించిన సాయంతో చిన్నపాటి వ్యాపారాలు ప్రారంభించిన పలువురు మహిళలు ఈ ఏడాది వ్యాపారాలు నడపలేక నిలిపివేశారు. ప్రకటనలు, బ్యానర్లతో ప్రభు త్వం గొప్పలు చెప్పుకోవడం తప్ప చేసిందేమీ లేద ని జిల్లావాసులు పెదవి విరుస్తున్నారు. సూపర్సిక్స్ హామీల్లో భాగంగా 18 ఏళ్ల నిండిన మహిళలకు ఆడబిడ్డ నిధి పథకం ద్వారా నెలకు రూ.1,500 చొప్పున ఇస్తామన్న హామీ 2025లోనూ అమలు కాలేదు. అధికారంలోకి వచ్చిన వెంటనే పథకాన్ని అమలు చేస్తామని చెప్పి 18 నెలలు గడిచినా అమలు చేయకుండా మహిళలను ప్రభుత్వం మోసం చేసింది. జిల్లాలో సుమారు 7 లక్షల మంది అర్హులు ఉన్నారు. జిల్లాలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు చంద్రబాబు ప్రభుత్వం ఈ ఏడాదిలో ఒక్క కొత్త ఇల్లు కూడా మంజూరు చేయలేదు. అలాగే ఇప్పటికే మంజూరు చేసిన ఇళ్లకు సంబంధించి బిల్లు బకాయిలు ఉండటంతో పలువురు నిర్మాణాలు నిలిపివేశారు. జిల్లాలోని 20 మండలాల్లో 409 గ్రామాలు ఉండగా.. ప్రతి గ్రామంలో 10 నుంచి 100 కుటుంబాల వరకూ ఇళ్ల మంజూరు కోసం ఎదురుచూస్తున్నారు. పేద, మధ్యతరగతి వర్గాల్లోని వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు ఈ ఏడాది ఒక్క కొత్త పింఛన్ కూడా మంజూరు చేయలేదు. ఈ ఏడాదిలో కొత్త పింఛన్లు ఇస్తారని ఆశగా ఎదురుచూసిన వారికి నిరాశ ఎదురైంది. కొత్త పెన్షన్ల మంజూరు చేయకుండా సదరం పరిశీలన పేరిట పలువురు దివ్యాంగులకు పింఛన్లను ప్రభుత్వం తొలగించింది. దీంతో వీరు కలెక్టరేట్ వద్ద ధర్నాకు దిగిన సంఘటనలు ఉన్నాయి. సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా నిరుద్యోగ భృతి ఈ ఏడాదీ అమలు కాలేదు. నిరుద్యోగులకు నెలకు రూ. 3 వేల చొప్పున భృతి ఇస్తామన్న హామీని కూటమి సర్కారు ఈ ఏడాదీ నెరవేర్చలేదు. దీనిపై విద్యార్థి సంఘాలు గళమెత్తాయి. జిల్లాలో సుమారు 2 లక్షల మంది నిరుద్యోగులు భృతి కోసం ఎదురుచూస్తున్నారు. ఏడాది ప్రారంభంలో ప్రభుత్వం బీసీ, కాపు కార్పొ రేషన్ల ద్వారా సబ్సిడీపై రుణాలిస్తామని దరఖాస్తులు స్వీకరించింది. అయితే ఒక్కరికీ కూడా రుణాలు మంజూరు చేయలేదు. మహిళలు, నిరుద్యోగ యువత స్వయం ఉపాధి యూనిట్లు ఏర్పాటుచేయాలని భావించారు. వీరి ఆశలపై చంద్రబాబు ప్రభుత్వం నీళ్లు చల్లింది. జిల్లాలో దాదాపు 4 లక్షల మందిపైగా కార్పొషన్ రుణాలకు దరఖాస్తు చేసుకున్నారు. మహిళా సాధికారత కరువు అమలుకాని ఆడబిడ్డ నిధి రుణాలివ్వక వ్యాపారాలు ఢీలా నిరుద్యోగ భృతి ఊసేలేదు కొత్త ఇళ్లు, పింఛన్ల మంజూరు లేదు 2025లో సంక్షోభంలో సంక్షేమం -
ముగిసిన నృత్యోత్సవాలు
ఏలూరు (ఆర్ఆర్పేట): నగరంలోని వైఎంహెచ్ఏ హాలులో రాష్ట్ర ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ సహకారంతో మూడు రోజులుగా నిర్వహిస్తున్న అభినయ నృత్యభారతి 30వ జాతీయ స్థాయి నృత్యోత్సవాలు, నృత్య పోటీలు ఆదివారం ఘనంగా ముగిశాయి. చివరి రోజు 150 వారి ప్రతిభా పాటవాలు ప్రదర్శించారు. విజేతలకు జ్ఞాపికలు, నగదు బహుమతులు అందించారు. లయన్స్ జిల్లా గవర్నర్ ఎన్వీవీఎస్ పాపారావు నాయుడు నృత్యోత్సవాలను ప్రారంభిస్తూ భవిష్యత్తులో ద్వారా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో యూత్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రాంలు నిర్వహిస్తామని తెలిపారు. గాయత్రి కూచిపూడి నృత్యం, కుమారి తులిక రెడ్డి ఒడిస్సీ నృత్యం, డీ.చక్రవర్తి కూచిపూడి నృత్యం, సంతోష్ పేరిణి శివతాండవం, చక్రవర్తుల పవన్ కుమార్ కూచిపూడి, వరంగల్లుకు చెందిన వైష్ణవి పేరిణి లాస్యం, కాకినాడకు చెందిన బీ. మల్లిఖార్జునరావు ప్రదర్శించిన భరతనాట్యం ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేశాయి. వీరికి సంస్థ తరపున నృత్య కౌముది అవార్డులు అందించారు. ప్రఖ్యాత కూచిపూడి నృత్య గురువు పసుమర్తి శేషుబాబును భరత కళాప్రపూర్ణ కోరాడ నరసింహారావు స్మారక నృత్య రంగ సేవా తపస్వి అవార్డుతో సత్కరించారు. అనంతరం జాతీయ స్థాయి నృత్య పోటీల్లో విజేతలకు అతిథుల ద్వారా బహుమతులు అందచేశారు. -
బాడీ బిల్డింగ్లో సత్తా చాటిన భానుప్రకాష్
ఈ ఏడాది మార్చిలో ఏలూరుకు చెందిన భానుప్రకాష్ బాడీ బిల్డింగ్లో పతకం సాధించాడు. షిర్డీలో జరిగిన సీనియర్, జూనియర్ ఇండియన్ బాడీ బిల్డింగ్, ఫిట్నెస్ ఫెడరేషన్ నిర్వహించిన పోటీల్లో 55 కేజీల విభాగంలో బంగారు పతకం సొంతం చేసుకున్నాడు. భానుప్రకాష్ ఏలూరు, భీమవరం, ఆకివీడు, రాజమండ్రి, కడప, శ్రీకాకుళం, చింతలపూడి, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో జరిగిన జిల్లా, జోనల్, రాష్ట్ర స్థాయి పోటీల్లో పదుల సంఖ్యలో గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ మెడల్స్ చేజిక్కించుకున్నాడు. వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో మహిళలు అద్భుత ప్రతిభ, ప్రదర్శించారు. ఏలూరు ఖేలో ఇండియా సెంటర్ బాలికలు 15 పతకాలు సాధించారన్నారు. ఇందులో 10 గోల్డ్మెడల్స్, 5 సిల్వర్ మెడల్స్ ఉన్నాయి -
పురోహిత క్రికెట్ లీగ్ విజేతగా వైజాగ్ టీం
భీమవరం (ప్రకాశంచౌక్): భీమవరం డీఎన్నార్ కళాశాల క్రీడా మైదానంలో గత 8 రోజులుగా జరుగుతున్న రాష్ట్రస్థాయి పురోహిత క్రికెట్ పోటీలు ఆదివారంతో ముగిశాయి. (విశాఖ), (హైదరాబాద్) టీంల మధ్య ఫైనల్స్ జరగగా వైజాగ్ విజేతగా నిలిచింది. హైదరాబాద్ 101 పరుగులు చేయగా వైజాగ్ 102 పరుగులు చేసి విజయం సాధించిందని నిర్వాహకులు తెలిపారు. విజేతలకు డీఎన్నార్ కళాశాల ఉపాధ్యక్షులు గోకరాజు పాండు రంగరాజు, డా.గౌతమ్ కుమార్ బహుమతులను అందజేశారు. బుట్టాయగూడెం: ద్విచక్ర వాహనంపై గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి నుంచి సుమారు 10.150 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు పోలవరం డీఎస్పీ ఎం.వెంకటేశ్వరరావు తెలిపారు. ఆదివారం సాయంత్రం జీలుగుమిల్లి సర్కిల్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో డీఎస్పీ మాట్లాడుతూ జీలుగుమిల్లి మండలం సరిహద్దు ప్రాంతంలో పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా ద్విచక్ర వాహనంపై అనుమానాస్పదంగా వెళ్తున్న ఇద్దరు వ్యక్తులను ఆపి తనిఖీ చేసినట్లు తెలిపారు. ఈ తనిఖీల్లో ద్విచక్ర వాహనం సీటు కింద గంజాయి ప్యాకెట్లు ఉన్నట్లు గుర్తించామన్నారు. ఆ ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారణ చేయగా.. నిందితులిద్దరూ ఒడిశా బోర్డర్ పరిసర ప్రాంతం నుంచి గంజాయి కొనుగోలు చేసి కామారెడ్డి వైపు అక్రమంగా తరలిస్తున్నట్లు వెల్లడైందని అన్నారు. పట్టుబడిన ద్విచక్ర వాహనాన్ని సీజ్ చేయడంతో పాటు. రాజ్పుత్ కమల్సింగ్, ఆకుల వంశీలను గుర్తించి కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నామని తెలిపారు. -
బైక్పై ఫొటోలుంటే దాడి చేసేస్తారా..?
దెందులూరు: బైక్పై మా ఫొటోలు ఉంటే దాడి చేసేస్తారా.. అసలు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా అనే అనుమానం కలుగుతోందని దెందులూరు మా జీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పెదపాడు మండలం ఏపూరు సర్పంచ్ రామకృష్ణ తన బైక్ నంబర్ ప్లేట్పై మాజీ సీఎం వైఎస్ జగన్, కొఠారు ఫొటోలు పెట్టుకోవడంతో రామకృష్ణపై టీడీపీ నేతలు చేసిన దాడిన ఖండించారు. దాడులు, దౌర్జన్యాలు అక్రమ కేసులు పెట్టి వేధించడం మంచి సంప్రదాయం కాదన్నారు. ప్రజలతో ఎన్నుకున్న సర్పంచ్కి పట్టపగలే గ్రామంలో రక్షణ లేకపోతే చంద్రబాబు ప్రభుత్వం ఇంక ఎవరికి రక్షణ కల్పిస్తుందని ప్రశ్నించారు. ఈ తరహా దాడులు, దౌర్జన్యాలను తానెప్పుడూ చూడలేదన్నారు. దెందులూరు నియోజకవర్గంలో తెలుగుదేశం శ్రేణు లు చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొత్త సంప్రదాయాన్ని తీసుకువచ్చి వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, సానుభూతిపరులు, అభిమానులను వేధి స్తున్నారని మండిపడ్డారు. బాధిత సర్పంచ్ రామకృష్ణని అబ్బయ్యచౌదరి ఫోన్లో పరామర్శించి ధైర్యం చెప్పారు. వైఎస్సార్సీపీతోపాటు పార్టీ లీగల్ సెల్ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. రామకృష్ణపై జరిగిన దాడిని జిల్లా ఎస్పీకి వివరించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరానన్నారు. రామకృష్ణ కేసును దగ్గరుండి పర్యవేక్షించాలని వైఎస్సార్సీపీ లీగల్ సెల్ సభ్యులకు సూచించారు. మాజీ ఎమ్మెల్యే అబ్బయ్యచౌదరి ఆగ్రహం -
శిక్షణతో జీవనోపాధి
‘పోలవరం’ లేకుండానే కొత్త జిల్లా జిల్లాల పునర్విభజన నేపథ్యంలో రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లా ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చేస్తున్న కసరత్తు కొలిక్కి వచ్చింది. 8లో uనరసాపురం రూరల్: యువత, మహిళల జీవనోపాధికి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ దోహదపడుతుందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఆదివారం మండలంలోని పెదమైనవానిలంకలో ఆమె పర్యటించారు. డిజిటల్ భవనంలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్–ఫ్యూచర్ స్కిల్స్ హబ్ను ఆమె ప్రారంభించారు. తమ ఫౌండేషన్ 120కి పైగా ప్రభుత్వ పాఠశాలలను డిజిటలైజ్ చేసి 35,000 మందికి పైగా విద్యార్థులకు డిజిటల్ అక్షరాస్యతతో చేరువైందని సైయెంట్ వ్యవస్థాపక చైర్మన్ బీవీఆర్ మోహన్రెడ్డి తెలిపారు. అభివృద్ధి పనులకు శ్రీకారం గ్రామంలో పలు అభివృద్ధి పనులకు కేంద్ర మంత్రి శ్రీకారం చుట్టారు. సముద్ర కోతకు గురికాకండా చే పట్టిన రక్షణ గోడ నిర్మాణ పనులు త్వరలోనే పూర్తవుతాయన్నారు. 146 మందికి పీఎం ఆవాస్ యో జన కింద ఏడాదిలోపు ఇళ్లు నిర్మించి ఇవ్వాలని ఆదేశించారు. మత్స్యకారులకు బోట్లు, వలల కోసం దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని, వాటిని త్వర గా మంజూరు చేయాలన్నారు. కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, రాష్ట్ర మంత్రులు ప య్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు మా ట్లాడారు. సభలోఎమ్మెల్యేలు బొమ్మిడి నాయకర్, పితాని సత్యనారాయణ, కలెక్టర్ నాగరాణి తదితరులు పాల్గొన్నారు. -
అన్నదానం జమాఖర్చుల్లో మతలబు
పాలకొల్లు సెంట్రల్: పంచారామక్షేత్రం పాలకొల్లు క్షీరారామలింగేశ్వరస్వామి ఆలయంలో కార్తీకమాస నిత్యాన్నదాన కార్యక్రమంలో లాభనష్టాల లీలలేమిటో ఆ పరమశివుడికే ఎరుక. ఈ ఏడాది దేవస్థానం పాలక మండలి, అన్నదాన కమిటీ ఆధ్వర్యంలో కార్తీక మాసంలో భక్తులకు అన్నసమారాధన కార్యక్రమం నిర్వహించారు. దాతలు, భక్తుల నుంచి విరాళాలు సేకరించారు. అయితే ఈ ఏడాది ప్రకటించిన జమాఖర్చుల లెక్కల్లో సుమారు రూ.లక్ష వరకు నష్టం చూపడం పాత కమిటీ సభ్యులతో పాటు పట్టణ ప్రజలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అలాగే దేవస్థానం అధికారులు పెట్టిన జమాఖర్చుల పట్టికలు (పాత, కొత్త) చూస్తే అనుమానాలు కలుగుతున్నా యి. దేవస్థానం ఇచ్చిన లెక్కల ప్రకారం రూ.29.36 లక్షల ఆదాయం రాగా ఖర్చులు రూ. 30.36 లక్షలుగా చూపారు. దాతల సహకారంతో అన్నదానం నిర్వహించినప్పుడు కేటరింగ్ వారికి రూ.40 చొప్పున చెల్లిస్తున్నారు. కార్తీకమాసంలో సుమారు 60 వేల మందికి అన్నదానం నిర్వహించినా రూ.24 లక్షలు అవుతుందని, అయితే రూ.30 లక్షలకు పైగా ఖర్చు ఎలా చూపారనే ప్రశ్న తలెత్తుతోంది. ఇదిలా ఉండగా ఓ తెలుగు తమ్ముడు తనకున్న పలుకుబడితో దాదాపు 10 నుంచి 15 రోజులపాటు అన్నసమారాధనకు దాతలను తీసుకువచ్చారు. ఈ క్రమంలో ముందుగా ఓ జమాఖర్చుల పట్టికను చూపారు. ఇదిలా ఉండగా ఆలయ అధికారి, పాలకమండలి సభ్యులు, మరో వ్యక్తి కలిసి తాము చెప్పిందే శాస నం అన్నట్టు వ్యవహరించడంతో కొందరు తెలుగు తమ్ముళ్లు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. దీంతో దాతల వివరాలు, ఖర్చులకు సంబంధించిన పూర్తి వివరాలతో జమాఖర్చులు చెప్పాలనే డిమాండ్ రావడంతో కొత్త పట్టికను ఏర్పాటుచేశారు. అయితే పలు ఖర్చులకు సంబంధించి పాత, కొత్త పట్టికలో తేడాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పాత, కొత్త పట్టికలపై చర్చ జరగకుండానే చేతికి జమాఖర్చులు పట్టిక ఇచ్చినట్లు పాలకమండలి సభ్యులు చెప్పడం గమనార్హం. జమాఖర్చుల పట్టిక (కొత్త) కార్తీకమాసం పూర్తయిన వెంటనే అన్నదానానికి సంబంధించి జమాఖర్చుల బోర్డు ఏర్పాటుచేసి రూ.లక్ష నష్టం వచ్చిందని సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. దీనిపై విమర్శలు రావడంతో వెంటనే డిలీట్ చేశారు. ఈ మధ్య కొత్త పట్టిక ఏర్పాటుచేశారు. చిత్రం ఏమిటంటే దాదాపు నగదులో తేడా లేకపోయినా వినియోగించిన సరుకులను స ర్దుబాటు చేసి మొత్తాన్ని సరిపెట్టేశారు. పాత పట్టిక లో రూ.5 వేల ధరపై 94 క్వింటాళ్ల బియ్యాన్ని రూ.4.70 లక్షలకు కొనుగోలు చేసినట్టు చూపగా కొత్త పట్టికలో కిలోల్లో 9,776 కిలోల అని చూపి, క్వింటాళ్లలో మాత్రం 47 అని కిలో ధర రూ.48గా చూపారు. క్వింటాళ్లను పరిగణనలోకి తీసుకుంటే రూ.2.44 లక్షలు తేడా కనిపిస్తుంది. వాటర్ ప్యా కెట్లు, టిప్టాప్ సప్లయీర్స్, లేబర్ ఖర్చులు, సప్లయీర్ ఖర్చు ఇలా పలు వివరాల్లో తేడాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అలాగే పాత పట్టికలో రూ.34,500 విలువైన కూరగాయలను సిద్దాంతం నుంచి హోల్సేల్లో కొనుగోలు చేసినట్టు చూపా రు. అయితే సుమారు రూ.10 లక్షల విలువ చేసే కిరాణా సరుకులు మాత్రం ఓ రిటైల్ షాపులో కొ నుగోలు చేశామనడం విమర్శలకు తావిస్తోంది. క్షీరారామం నిత్యాన్నదాన కమిటీపై విమర్శలు జమాఖర్చుల్లో నష్టం చూపడంపై అనుమానాలు పాత, కొత్త పట్టికలో స్పష్టంగా తేడాలు -
ట్రిపుల్ఐటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ల నిరసన
నూజివీడు: ఎనిమిదేళ్లుగా జీతాలను పెంచకుండా ట్రిపుల్ఐటీ యాజమాన్యం తమకు తీరని అ న్యాయం చేస్తోందని కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొ ఫెసర్లు ఆవేదన వ్యక్తం చేశారు. జీతాలను పెంచాలని డిమాండ్ చేస్తూ శనివారం డైరెక్టర్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. తమకు 6వ వేతన సంఘం సిఫార్సుల ఆధారంగా వేతనాన్ని ఫిక్స్ చేశారని, చివరిసారిగా 2018లో జీతాలను పెంచారన్నారు. అప్పటినుంచి జీతాలు పెంచకపోవడంపై ట్రిపుల్ఐటీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోవడం లేదని వాపోయారు. 2010–14 కాలంలో కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా ఎంతమంది చేరారు, వారి నియామకం ఎలా జరిగిందనే వాటికి సమాధానం ఇవ్వమని ప్రభుత్వం కోరినా ట్రిపుల్ఐటీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. మూడు నెలలుగా సమాధానం రాసి ప్రభుత్వానికి పంపకుండా జాప్యం చేయడమేంటని ప్రశ్నించారు. ఆర్జీయూకేటీ రిజిస్ట్రార్ సూచన మేరకు రెండు రోజుల పాటు నిరసన ప్రదర్శనను వాయిదా వేసుకున్నామని, అయినా ఉన్నతాధికారులను కలిసే అవకాశం రా లేదని వాపోయారు. తమ న్యాయమైన డిమాండ్లను ఆర్జీయూకేటీ పరిష్కరించాలని కోరారు. -
సబ్ జైలు సందర్శన
భీమవరం (ప్రకాశంచౌక్): పట్టణంలోని ప్రత్యే క ఉప కారాగారాన్ని శనివారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి, న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షురాలు ఎస్.శ్రీదేవి సందర్శించి ముద్దాయిలతో మాట్లాడారు. భోజన వసతులు, వైద్య సదుపాయాలపై ఆరా తీశారు. న్యాయవాదిని పెట్టుకునే స్థోమతలేని వారికి ఉచిత న్యాయవాదిని ఏర్పాటు చేస్తామన్నారు. మహిళా బ్యారక్, ములాఖత్ గదిని పరిశీలించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సివిల్ జడ్జి (సీనియర్ డివిజన్) కె.రత్నప్రసాద్, 2వ అదనపు జుడీషియల్ మొదటి తరగతి మేజిస్ట్రేట్ ఎన్.జ్యోతి, జైలు సూపరింటెండెంట్ డి.వెంకటగిరి, జైలు సందర్శన న్యాయవాది బి.లోకేశ్వరరావు పాల్గొన్నారు. భీమవరం (ప్రకాశంచౌక్): జిల్లాలో 83.690 కిలోమీటర్ల మేర రహదారుల అభివృద్ధికి రూ.41.33 కోట్లు మంజూరు చేసినట్టు కలెక్టర్ సీహెచ్ నాగరాణి తెలపిఆరు. రెండు రాష్ట్ర రహదారులకు 12.580 కిలోమీటర్ల పరిధిలో రూ.9 కోట్లు, 16 ప్రధాన రహదారులు 71.110 కిలోమీటర్ల పరిధిలో రూ.32.33 కోట్లు ఖర్చు చేయనున్నామన్నారు. 31న పింఛన్ల పంపిణీ ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పింఛన్లను ఒక రోజు ముందుగానే ఈనెల 31న పంపిణీ చేయాలని కలెక్టర్ సీహెచ్ నాగరాణి తెలిపారు. పెనుమంట్ర: ఇటీవల విజయవాడలో నిర్వ హించిన రాష్ట్రస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో పె నుమంట్ర జెడ్పీ హైస్కూల్ విద్యార్థులు ప్రతిభ కనబర్చారు. వీరి ప్రాజెక్టు ‘పరాయి వలయంలో అద్భుతాలు’ జాతీయస్థాయి పోటీలకు ఎంపికైనట్టు హెచ్ఎం లింగం శారద శనివారం ప్రకటనలో తెలిపారు. తమ పాఠశాల 9వ తరగతి విద్యార్థులు పెచ్చిటి పావని కళ్యాణి, పుచ్చ శ్రీవిద్య తయారుచేసిన ప్రాజెక్టు జిల్లా నుంచి ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. వి ద్యార్థులతో పాటు ఈ ప్రాజెక్టు తయారీకి గైడ్గా వ్యవహరించిన ఉపాధ్యాయులు ఎమ్మెస్ శివకుమార్, ఎ.వీరభద్రంను అభినందించారు. ఏలూరు (ఆర్ఆర్పేట): నగరానికి చెందిన ప్రముఖ కూచిపూడి నా ట్య గురువు, కళారత్న కేవీ సత్యనారాయణకు ఆంధ్ర సారస్వత పరిషత్తు పూర్ణకుంభ పురస్కారాన్ని ప్రకటించింది. జనవరి 3 నుంచి గుంటూరులో జరిగే 3వ ప్రపంచ తెలుగు మహాసభలు కార్యక్రమాల్లో కేవీఎస్కు పురస్కారం ప్రదానం చేయనున్నట్టు ఆంధ్ర సారస్వత పరిషత్తు అధ్యక్షుడు గజల్ శ్రీనివాస్ ప్రకటనలో తెలిపారు. ఏలూరు (టూటౌన్): బుట్టాయగూడెం మండలం ఇనుమూరు గిరిజనులపై దాడులు, నిర్బంధాలు, అక్రమ పోలీసు కేసులు ఆపాలని, గిరిజన భూసమస్యలు పరిష్కరించి న్యాయం చే యాలని ఆదివాసీ గిరిజన, వ్యవసాయ కార్మిక, రైతు సంఘాల ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు డిమాండ్ చేశారు. ఇనుమూరు గిరిజనులకు అండగా ఈనెల 29న జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కార్యాలయం, 30న ఏలూరు కలెక్టరేట్ వద్ద ధర్నాలు నిరసనలు చేపట్టాలని నిర్ణయించారు. శనివారం ఏ లూరు అన్నే భవనంలో ఏపీ రైతు సంఘం జి ల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్ అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సీపీఎం జిల్లా కార్యదర్శి ఎ.రవి, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షు డు రాజనాల రామ్మోహనరావు, సీపీఐ జిల్లా నాయకులు పుప్పాల కన్నబాబు, ఎంసీపీఐ (యు) జిల్లా కార్యదర్శి శావనంపూడి నాగరాజు, ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ జిల్లా నాయకుడు కట్టా సత్యనారాయణ, ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా నాయకుడు కారం భాస్కర్, ఇనుమూరు గిరిజన భూ బాధితులు పాల్గొన్నారు. -
పట్టిసం ఉత్సవాలపై సమావేశం
పట్టిసంలో జరిగే మహాశివరాత్రి ఉత్సవాల ఏర్పాట్లపై తొలి సమావేశం జరిగింది. ఫిబ్రవరి 15న ఉత్సవాలు నిర్వహించనున్నారు. 8లో uయనమదుర్రు డ్రెయిన్పై భీమవరం రెస్ట్హౌస్ రోడ్డు, భీమవరం రూరల్ గొల్లవానితిప్ప, దొంగపిండి వద్ద వంతెనలకు వద్ద అప్రోచ్ రోడ్డులు నిర్మాణానికి గత ప్రభుత్వం రూ.36.71 కోట్లు మంజూరు చేసి టెండర్ ప్రక్రియ చేపట్టింది. చంద్రబాబు ప్రభుత్వం ఈ పనులను అటకెక్కించడంతో రాకపోకలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. చినమిల్లిపాడు–ఆకివీడు మెయిన్రోడ్డు విస్తరణ పనుల కోసం రూ. 25 కోట్లు, భీమవరం నుంచి కలిదిండి మీదుగా గుడివాడ వెళ్లే రోడ్డులోని బొండాడ డ్రెయిన్పై వంతెనకు రూ.12 కోట్లు, ఆచంట నియోజకవర్గం నెగ్గిపూడి, తాడేపల్లిగూడెంలో ఆర్అండ్బీ ఇన్స్పెక్షన్ బంగ్లాల మరమ్మతులకు కేటాయించిన రూ.1.57 కోట్ల పనులను రద్దు చేసింది. -
ప్రగతి అధోగతి
ప్రభుత్వ స్థలాలపై కన్ను పేదలకు ఇళ్ల స్థలాల కోసం ప్రభుత్వం సేకరించిన భూమిపై అక్రమార్కుల కన్ను పడింది. చేపల చెరువుల కోసం తవ్వకాలు మొదలు పెట్టారు. 8లో uసంక్షేమాన్ని అటకెక్కించిన కూటమి ప్రభుత్వం అభివృద్ధినీ గాలికొదిలేసింది. జిల్లాకు తలమానికంగా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం మంజూరు చేసిన ఆక్వా వర్సిటీకి ఏడాది కాలంలో ఒక్క ఇటుకై నా పేర్చలేదు. ప్రైవేటీకరణ పేరిట మెడికల్ కళాశాల పనులు అర్ధాంతరంగా ఆపేసింది. టెండర్ల దశలోని రూ.75 కోట్ల విలువైన పనులను రద్దు చేసింది. కొద్దిపాటి పనులు చేస్తే వినియోగంలోకి వచ్చే పలుసచివాలయ, ఆర్బీకే, హెల్త్ క్లినిక్ భవనాలను అసంపూర్తిగా వదిలేసింది. ఆదివారం శ్రీ 28 శ్రీ డిసెంబర్ శ్రీ 2025సాక్షి, భీమవరం : సుపరిపాలన, ప్రజారోగ్యం, రైతు ప్రయోజనాలకు పెద్దపీట వేస్తూ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో జిల్లాలో రూ.141.2 కోట్లతో 353 సచివాలయ, రూ.65 కోట్లతో 298 ఆర్బీకే, రూ.53.5 కోట్లుతో 214 హెల్త్ క్లినిక్ భవనాల నిర్మాణం చేపట్టారు. అప్పట్లోనే 270 వరకు సచివాలయ, 211 ఆర్బీకే, 96 హెల్త్ క్లినిక్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. మిగిలినవి వివిద దశల్లో అసంపూర్తిగా ఉన్నాయి. వీటిని పూర్తిచేసి వినియోగంలోకి తెచ్చేందుకు చొర వ చూపని చంద్రబాబు ప్రభుత్వం సచివాలయ, ఆర్ బీకే భవనాల్లో పోలీస్స్టేషన్, తహసీల్దార్, డివిజినల్ డెవలప్మెంట్ ఆఫీసర్ తదితర కార్యాలయాలు ఏర్పాటు చేస్తుండటం గమనార్హం. ఆక్వా వర్సిటీకి ‘చంద్ర’ గ్రహణం ఆక్వా రంగానికి ఊతంగా నరసాపురం రూరల్ లిఖితపూడిలోని 40 ఎకరాల స్థలంలో చేపట్టిన ఆక్వా వర్సిటీ పనులు ఎక్కడికక్కడే ఉన్నాయి. అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్, క్యాంపస్ కాలేజీ, బా య్స్, గరల్స్ హాస్టల్ భవన ని ర్మాణాల కోసం గత ప్రభుత్వం రూ.100 కోట్లు మంజూరు చేసింది. రూ.40 కోట్ల వ్యయంతో అడ్మినిస్ట్రేటివ్, కళాశాల భవనాలు శ్లాబ్ దశకు, బాయ్స్, గరల్స్ హాస్టల్ భవనాలకు పునాదులు పూర్తయ్యాయి. అయితే చంద్రబాబు ప్రభుత్వం బిల్లులు విడుదల చేయక పనులు అసంపూర్తిగా మిగిలిపోయాయి. యూనివర్సిటీకి అనుబంధంగా కళాశాల తరగతులను గత నెల వరకు లక్ష్మణేశ్వరంలోని తుపాను షెల్టర్, రైతు భరోసా కేంద్రాల్లో నిర్వహించగా ఇటీవల నరసాపురంలోని ప్రైవేట్ కళాశాల భవనంలోకి మార్చారు. మెడి‘కిల్’ కళాశాల నిర్మాణం పేద విద్యార్థులకు వైద్య విద్యను చేరువ చేసేందుకు, ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు రూ.475 కోట్లతో పాలకొల్లు రూరల్ దగ్గులూరులోని 60 ఎకరాల విస్తీర్ణంలో తలపెట్టిన మెడికల్ కళాశాల పనులకు ప్రైవేటీకరణ గ్రహణం పట్టింది. గత ప్రభుత్వంలోనే ఇన్ పేషెంట్, అవుట్ పేషెంట్, ఎమర్జన్సీ సేవల బ్లాకులకు సంబంధించి సుమారు రూ.74.5 కోట్ల విలువైన పనులు పూర్తయ్యాయి. కూటమి ప్రభుత్వం బిల్లులు విడుదల చేయక నిర్మాణ సంస్థ పనులను నిలిపివేసింది. మెడికల్ కళాశాలను ప్రైవేట్పరం చేసేందుకు ప్రభుత్వం కుట్రలు చేస్తోంది. రోడ్డు ‘షో’ రోడ్ల అభివృద్ధి పేరిట మరమత్ములతో కనికట్టు చేస్తూ ప్రభుత్వం ఏడాది గడిపేసింది. గతేడాది సంక్రాంతికి ముందు రూ.42.57 కోట్లతో చేపట్టిన ప్యాచ్ వర్కులు నాణ్యత లేక మున్నాళ్ల ముచ్చటే అయ్యాయి. కొద్దిరోజులకే రాళ్లుపైకి లేయిపోయి ప్రమాదభరితంగా తయారై రాకపోకలకు ప్రయాణికులు తీవ్ర అగచాట్లు పడ్డారు. రానున్న సంక్రాంతి పండగ చుట్టాల ముందు మరోమారు రోడ్డు షో చేసే పనిలో ప్రభుత్వం ఉంది. నాబార్డ్, ప్లాన్, ఎస్సీసీ వర్క్స్, అడిషనల్ ఫండ్స్ రూ.141 కోట్లతో జిల్లాలో పలు రోడ్లలో 37 వర్క్లు మంజూరు చేసింది. వీటిలో రూ.53 కోట్ల విలువైన 16 వర్కులు మాత్రమే మొదలయ్యాయి. మిగిలిన వాటికి టెండర్లు జరగాల్సి ఉంది. యాన్యువల్ మెయింటినెన్స్ నిధులు రూ.3 కోట్లతో 650 కిలోమీటర్లు మేర చేపట్టిన ప్యాచ్ వర్కుల్లో పలుచోట్ల నాణ్యత లోపిస్తున్నట్టు విమర్శలు వస్తున్నాయి.పాలకొల్లులో అర్ధాంతరంగా నిలిచిపోయిన మెడికల్ కళాశాల నిర్మాణంతణుకులో ప్యాచ్ వర్క్లు నిర్మాణం.. నిర్లక్ష్యం కూటమి నిర్లక్ష్యంతో కుంటుపడిన అభివృద్ధి ఆక్వా వర్సిటీకి ఇటుకై నా పేర్చలేదు ప్రైవేటీకరణ గ్రహణంతో నిలిచిన వైద్య కళాశాల పనులు అసంపూర్తిగానే సచివాలయ, ఆర్బీకేలు, హెల్త్ క్లినిక్ల నిర్మాణాలు రూ.75 కోట్ల విలువైన పనులు రద్దు 2025లో అభివృద్ధిలో వెనుకబాటు -
ఆకట్టుకున్న నృత్యోత్సవాలు
ఏలూరు (ఆర్ఆర్పేట): స్థానిక వైఎంహెచ్ఏ హాల్ లో అభినయ నృత్యభారతి సంస్థ 30వ వార్షిక జా తీయ స్థాయి నృత్యోత్సవాలు, నృత్య పోటీలు రెండో రోజు శనివారం ఆకట్టుకున్నాయి. టి.కావ్యారా వు (హైదరాబాద్) భరతనాట్యం, నిధికా లూంభా (బెంగళూరు) కథక్, వైష్ణవి మార్గం (వరంగల్) కూచిపూడి, రామ కౌండిన్య శ్రీభాష్యం (శ్రీకాకుళం)కూచిపూడి, ఛార్మిళా వెంకట్ (హైదరాబాద్) కూచిపూడి నృత్యాలతో అలరించారు. వీరందరికీ సంస్థ నిర్వాహకులు నృత్యకౌముది పురస్కారాలు అందించి సత్కరించారు. వీరితో పాటు సేవామూర్తులు ఆ లపాటి నాగేశ్వరరావు (మానవత సేవలు), బీవీ రమణ మూర్తి (విద్యారంగం), ఎంఎస్ చౌదరి (సినీ, నాటక రంగం), కమ్ముల ఆదినారాయణ (యోగా గురువు), పిలగల కొండలరావు (ప్రభుత్వసేవలు), లయన్ చిల్లపల్లి రామమోహనరావు (లయనిజం), ఎస్ఎం ఖాసీం ( సంగీతం), సాలా భోగేశ్వరరావు (సామాజిక సేవ), సాతుపాటి శ్యాంబాబు (స్వచ్ఛంద సేవలు)లకు సేవా తపస్వి అవార్డులు అందించినట్టు సంస్థ వ్యవస్థాపక కార్యదర్శి దువ్వి హేహసుందర్ తెలిపారు. -
మృత్యువు మాటేసి.. తీరని శోకాన్ని మిగిల్చి..
ద్వారకాతిరుమల: తమకు ఆసరాగా ఉంటారనుకున్న కుమారులు మృత్యువాత పడటం ఆ తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చింది.. ఇప్పుడే వచ్చేస్తానంటూ బయటకు వెళ్లిన పిల్లలు విగత జీవులుగా పడి ఉండటాన్ని చూసి కన్నపేగు కన్నీళ్లు పెడుతోంది.. దేవుడా ఇంత అన్యాయం చేశావేంటయ్యా.. ఆశలన్నీ పిల్లలపైనే పెట్టుకున్నామంటూ తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. ద్వారకాతిరుమల, తిమ్మాపురం గ్రామాల్లో తీవ్ర విషాదఛాయలు అలముకున్నాయి. వివరాల్లోకి వెళితే.. ద్వారకాతిరుమలకు చెందిన సయ్యద్ రఫీ (22), కొయ్యగూర శ్రీరామ్ (బన్నీ)(21), తిమ్మాపురానికి చెందిన మాండ్రాజు చరణ్ (25) స్నేహితులు. వీరంతా స్థానికంగా డెకరేషన్ పనులు చేస్తుంటారు. ఈ నేపథ్యంలో ద్వారకాతిరుమలలో జరిగే ఓ ఫంక్షన్కు డెకరేషన్ కోసం పూలు కొనేందుకు చరణ్ తమ్ముడు రాజేష్కు చెందిన బైక్పై వీరు ముగ్గురు శుక్రవారం రాత్రి ఏలూరు వెళ్లారు. రాత్రి 1 గంట సమయంలో చరణ్కు రాజేష్ ఫోన్ చేసి ఎక్కడున్నావని అడగ్గా, వచ్చేస్తున్నానని చెప్పాడు. ఎంతకీ రాకపోయే సరికి శనివారం వేకువజామున 4 గంటలకు రాజేష్ మళ్లీ ఫోన్ చేశాడు. అయితే ఆ ఫోన్ లిఫ్ట్ చేసిన కానిస్టేబుల్ భీమడోలు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో చరణ్, మరో ఇద్దరు మృతి చెందిన విషయాన్ని చెప్పారు. బైక్ చరణ్ నడుపుతున్నట్టుగా నిర్ధారించారు. ఇది లా ఉంటే పోలీసులు మరో మృతుడు శ్రీరామ్ ఫోన్ తీసి, అతడి ఫింగర్ ప్రింట్ ద్వారా లాక్ తీసి, పూల డెకరేషన్ యజమాని మొయ్యే శివకు సమాచారం అందించారు. దీంతో ద్వారకాతిరుమల, చుట్టుపక్కల గ్రామాలకు చెందిన మృతుల స్నేహితులు హుటాహుటిన ఘటనా స్థలానికి వెళ్లారు. పోస్టుమార్టం అనంతరం ఆంబులెన్స్లో గ్రామానికి చేరుకున్న మృతదేహాలను స్నేహితులు భారీ బైక్ ర్యాలీతో ఇళ్లకు చేర్చారు. కంగారుగా వెళుతూ.. ప్రమాదానికి గురై.. తన అన్న కుమారుడు శ్రీరామ్ మృతి చెందాడన్న వార్త తెలుసుకున్న కొయ్యగూర రవి కంగారుగా బైక్పై భీమడోలు వెళుతుండగా కుక్క అడ్డురావడంతో కింద పడి తీవ్ర గాయాలపాలయ్యాడు. ఘటనా స్థలంలో శ్రీరామ్ కొన ఊపిరితో ఉన్నట్టు తనకు తెలిసిందని, వెళుతుండగా ప్రమాదం జరిగిందని రవి చెప్పాడు. తల్లిదండ్రుల ఆశలు ఆవిరి చేతికందొచ్చిన కొడుకులు దూరం రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం తిమ్మాపురం, ద్వారకాతిరుమలలో విషాద ఛాయలు సయ్యద్ రఫీ తల్లిదండ్రులు షేక్ సలీమా, షుకూర్లు 20 ఏళ్ల నుంచి వేరుగా ఉంటున్నారు. సలీమా స్థానికంగా ఓ చెప్పుల షాపులో పనిచేస్తోంది. 10వ తరగతితో చదువు మానేసిన రఫీ పూల డెకరేషన్ పనిచేస్తున్నాడు. శుక్రవారం రాత్రి డెకరేషన్ పనికి వెళుతున్నట్టు రఫీ తన తల్లికి చెప్పి బయటకు వెళ్లాడు. తెల్లవారే సరికి కొడుకు మరణవార్త విని సలీమా కుప్పకూలిపోయింది. ఆధారంగా ఉంటాడనుకున్న కొడుకు దూరమయ్యాడంటూ తల్లడిల్లిపోతోంది. కొయ్యగూర సుబ్బారావు, కుసుమకుమారి దంపతులకు శ్రీరామ్ రెండో సంతానం. డిగ్రీ మధ్యలో ఆపేసి పూల డెకరేషన్ పని చేస్తున్నాడు. శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో బయటకు వెళుతున్నానని ఇంట్లో చెప్పాడు. తల్లి కుసుమ కుమారి, అక్క శిరీష వద్దన్నా వినకుండా.. వెంటనే వచ్చేస్తానంటూ వెళ్లాడు. తిరిగి విగతజీవిగా ఇంటికి చేరాడు. శ్రీరామ్ అకాల మరణాన్ని కుటుంబ సభ్యులు, బంధువులు జీర్ణించుకోలేక పోతున్నారు. మండ్రాజు సర్వేశ్వరరావు, సుజాత దంపతులకు ఇద్దరు సంతానం కాగా చరణ్ పెద్దవాడు. ఇంటర్ మధ్యలో ఆపేసి పూల డెకరేషన్ పనిచేస్తున్నాడు. శుక్రవారం రాత్రి తమ్ముడి కొత్త బైక్ను తీసుకుని రఫీ, శ్రీరామ్ లతో కలసి ఏలూరు వెళ్లాడు. అదే బైక్ నడుపుతూ ప్రమా దానికి గురై మృత్యువాత పడ్డాడు. వీరి కుటుంబానికి తెల్లవారు 4 గంటలకు విషయం తెలియగా.. బంధువులతో పాటు తిమ్మాపురం ప్రజలు శోకసంద్రంలో మునిగిపోయారు. -
పట్టిసం శివరాత్రి ఏర్పాట్లపై మొదటి సమావేశం
పోలవరం రూరల్: మహాశివరాత్రి ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఉత్సవ కమిటీ చైర్మన్, జంగారెడ్డిగూడెం ఆర్డీవో ఎంవీ రమణ అధికారులను ఆదేశించారు. శనివారం పోలవరం మండలం పట్టిసం రేవులో ఫిబ్రవరి 15న జరిగే మహాశివరాత్రి ఉత్సవాలకు సంబంధించి చేసే ఏర్పాట్లపై తొలి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ గతంలో మహాశివరాత్రి ఉత్సవాల్లో జరిగిన లోటుపాట్లను సరిచేసుకుంటూ ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. ప్రణాళికాబద్ధంగా పనులు చేపట్టాలన్నారు. 2వ సమావేశం నాటికి అధికారులందరూ చేసే ఏర్పాట్లపై ఉన్నతాధికారులకు తెలియజేయాలన్నారు. జమా ఖర్చుల విషయంలో నిబద్ధతతో వ్యవహరించాలన్నారు. డీఎస్పీ ఎం.వెంకటేశ్వరరావు పోలీసు శాఖ నిర్వహించే విధులపై వివరించారు. ప్రధానంగా గతేడాది ఇసుక తిన్నెలు, శివక్షేత్రం వైపు విద్యుత్ అలంకరణ విషయంలో కొంత లోటు కనబడిందని అది సరిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు. లడ్డూ ప్రసాదం వేలం నిర్వహించడం లేదు ఎంపీపీ సుంకర వెంకటరెడ్డి మాట్లాడుతూ గతేడాది ఉత్సవాలకు ముందు రూ.10 టిక్కెట్ ధర పెంచారని, ఈ మేరకు వచ్చిన ఆదాయాన్ని ఎందుకు ఖర్చు చేశారనే విషయాన్ని తెలియజేయలేదన్నారు. అలాగే దేవస్థానం వద్ద లడ్డూ ప్రసాదం వేలం నిర్వహించడం లేదని, గతంలో వేలం నిర్వహించడం వల్ల లడ్డూలో నాణ్యతను పాటించేవారని పేర్కొన్నారు. లడ్డూ ప్రసాదాన్ని భక్తులకు సంతృప్తికరంగా అందించాలన్నారు. ఉత్సవాలకు ఆదాయం సమకూరడం లేదు సర్పంచ్ సబ్బారపు శ్రీరామమూర్తి మాట్లాడుతూ పట్టిసం ఫెర్రీ వేలం పాట ఆదాయం రూ.13 లక్షలు చేకూరుతుందని, ఖర్చులు రూ.25 లక్షల వరకు అవుతున్నాయని, ప్రతి ఏటా ఉత్సవాలకు ఖర్చు చేసిన ఆదాయం సమకూరడం లేదని, పంచాయతీలో ఏర్పాట్లు చేసిన వారికి బకాయిలు ఉన్నాయన్నారు. దేవస్థానం అధికారులు కొంత సొమ్ము ఇస్తామని ప్రకటించినా గత రెండేళ్లుగా ఒక్క రూపాయి కూడా పంచాయతీకి చెల్లించలేదన్నారు. అన్ని విషయాలను చర్చించామని, ఏర్పాట్ల విషయంలో ఏ విధమైన రాజీ పడవద్దని ఉత్సవ కమిటీ చైర్మన్ ఆదేశించారు. కార్యక్రమంలో పోలవరం సీఐ బాల సురేష్బాబు, ఎస్సై ఎస్ఎస్ పవన్కుమార్, దేవస్థానం ఈవో సీహెచ్ వెంకటలక్ష్మి, డీఎల్పీవో సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. -
చిన వెంకన్నా.. వస్తున్నాం
ద్వారకాతిరుమల శ్రీవారి క్షేత్రంక్యూలైన్లలో ప్రతి 30 అడుగులకు ఒక అత్యవసర ఎగ్జిట్ గేటును ఏర్పాటు చేశారు. అడుగడుగునా మంచినీటి సౌకర్యం, అల్పాహారం, స్నాక్స్ అందించేందుకు 400 మంది సేవా సిబ్బందిని వినియోగించనున్నారు. అలాగే ప్రథమ చికిత్సా కేంద్రాన్ని అనివేటి మండపం వద్ద ఏర్పాటు చేస్తారు. ద్వారకాతిరుమల: శ్రీవారి గిరి ప్రదక్షిణకు సమయం ఆసన్నమైంది. మల్లేశ్వరం మీదుగా 5 కిలోమీటర్ల కొండ చుట్టూ ప్రదక్షిణ చేసే సమయం వచ్చింది. ముక్కోటి ఏకాదశి పర్వదినం ముందు రోజు సోమవారం గిరి ప్రదక్షిణ వేడుక అట్టహాసంగా జరగనుంది. ఈ ఏడాది వేలాది మంది భక్తులు గిరి ప్రదక్షిణ చేస్తారని ఆలయ అధికారులు అంచనా వేశారు. ఇదిలా ఉంటే గిరి ప్రదక్షిణ మరుసటి రోజు మంగళవారం వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని స్వామివారు ఉత్తర ద్వార దర్శనాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఉత్తర ద్వార దర్శనం ఆరోజు తెల్లవారుజామున 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఉంటుందని ఆలయ ఈఓ ఎన్వీఎస్ఎన్ మూర్తి తెలిపారు. గిరి ప్రదక్షిణ, ఉత్తర ద్వార దర్శనానికి క్షేత్రంలో ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే క్యూలైన్ల నిర్మాణం, ఉత్తర ద్వారాల ముస్తాబు, విద్యుత్ అలంకారాల పనులు పూర్తయ్యాయి. ప్రస్తుతం భక్తులు, గోవింద స్వాముల పాదాల రక్షణ కోసం గిరి ప్రదక్షిణ మార్గంలో గడ్డిని పరిచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దారి పొడవునా విద్యుత్ లైట్లు, సేదతీరేందుకు షామియానా పందిళ్లను నిర్మించనున్నారు. గిరి ప్రదక్షిణలో శ్రీవారు కొలువుదీరనున్న ధర్మప్రచార రథాన్ని ముస్తాబు చేస్తున్నారు. ఉత్సవాల ఏర్పాట్లను జంగారెడ్డిగూడెం ఆర్డీవో ఎంవీ రమణ శనివారం సాయంత్రం పరిశీలించారు. శ్రీవారి ధర్మప్రచార రథంవివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు రైల్వే మార్గం గుండా ద్వారకాతిరుమలకు 17 కిలో మీటర్ల దూరంలో ఉన్న భీమడోలు రైల్వేస్టేషన్కు చేరుకొని, అక్కడినుంచి ఆర్టీసీ బస్సులు, ఆటోల ద్వారా క్షేత్రానికి చేరుకోవాలి. అలాగే జిల్లాలోని ఏప్రాంతం నుంచి అయినా బస్బుల ద్వారా క్షేత్రానికి చేరుకోవచ్చు. -
మహిళ హత్యకేసును ఛేదించిన పోలీసులు
బుట్టాయగూడెం: మర్లగూడెం అటవీప్రాంతంలో జరిగిన మహిళ హత్యకేసును పోలవరం సబ్ డివిజన్, జీలుగుమిల్లి సర్కిల్ పోలీసులు 48 గంటల్లోనే ఛేదించారు. నిందితుడు యడ్లపల్లి గణేష్ను అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరిచారు. శనివారం బుట్టాయగూడెం పోలీస్ స్టేషన్లో జీలుగుమిల్లి సీఐ వెంకటేశ్వరరావు వివరాలను వెల్లడించారు. బుట్టాయగూడెం మండల పరిధిలోని మర్లగూడెం అటవీప్రాంతంలో ఈనెల 24న గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. కేసు నమోదు చేసిన పోలీసులు హత్యా కోణంలో దర్యాప్తు చేశారు. మృతురాలు నల్లజర్ల మండలం పోతవరం గ్రామానికి చెందిన పామర్తి శిల్పారాణి(25)గా గుర్తించారు. భర్త వెంకటేశ్వరరావు మరణించడంతో శిల్పారాణి తన స్వగ్రామం కొయ్యలగూడెం మండలం సరిపల్లిలో తల్లిదండ్రుల వద్ద నివసిస్తోంది. ప్రస్తుతం జంగారెడ్డిగూడెం పాతబస్టాండ్ సమీపంలో ఉన్న దళితవాడలో నివాసం ఏర్పాటు చేసుకుని జీవిస్తోంది. కొయ్యలగూడెం మండలం రామానుజపురంనకు చెందిన యడ్లపల్లి గణేష్ అనే యువకుడు, మృతురాలికి మధ్య ఉన్న వ్యక్తిగత తగాదాల కారణంగా ఆమెను అటవీ ప్రాంతానికి తీసుకువచ్చి తలపై కర్రతో మోది హత్యకు పాల్పడినట్లు దర్యాప్తులో తేలిందని సీఐ చెప్పారు. మృతదేహం వద్ద ఆధారాలు లభించకపోయినా సాంకేతిక ఆధారాలతో కేసు చేధించామన్నారు. కేసును ఉన్నతాధికారుల సహకారంతో త్వరితగతిన చేధించిన బుట్టాయగూడెం ఎస్సై డి.దుర్గామహేశ్వరరావు, జీలుగుమిల్లి ఎస్సై, సిబ్బంది తదితరులను ఎస్పీ కె. ప్రతాప్ శివకిషోర్, పోలవరం డీఎస్పీ వెంకటేశ్వరరావు అభినందించారన్నారు. -
ప్రభుత్వ స్థలాలపై అక్రమార్కుల కన్ను
సాక్షి నెట్వర్క్: పేదలకు ఇళ్ల స్థలాల కోసం ప్రభుత్వం సేకరించిన భూమిపై అక్రమార్కుల కన్ను పడింది. ఇంకేముంది రాత్రి పూట అక్రమంగా చేపల చెరువుల కోసం తవ్వకాలు మొదలు పెట్టేశారు. విషయం తెలుసుకున్న అధికారులు వెళ్లి అడ్డుకుని వాటిని నిలుపుదల చేశారు. అయినా తవ్వకాలు జరుగుతుండడంతో సాక్షాత్తూ తహసీల్దార్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయాల్సి వచ్చింది. వివరాల ప్రకారం వడ్డిగూడెం గ్రామ శివారు ఆర్పీ పాలెంలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకుగాను అదే గ్రామానికి చెందిన రాళ్లపల్లి అచ్యుతరావు నుంచి ఎకరం భూమిని, వారి సోదరులకు చెందిన మరికొంత భూమిని ప్రభుత్వం సేకరించింది. గత కొంతకాలంగా ఖాళీగా ఉన్న ఆ భూమిలో కొందరు చేపల చెరువు తవ్వేందుకు ఈనెల 11వ తేదీన ఉపక్రమించారు. విషయం తెలిసిన అచ్యుతరావు పెదపాడు పోలీసులకు, తహసీల్దార్కు ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు చేపల చెరువు తవ్వుతున్న పొక్లెయిన్లను బయటకు పంపి తవ్వకాలు నిలుపుదల చేశారు. మా ఎమ్మెల్యేగారు తవ్వుకోమన్నారు.. ఎవరు వచ్చినా తవ్వకాలు ఆపం అంటూ అక్రమార్కులు బదులివ్వడంతో జిల్లా కలెక్టరుకు ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ చెరువు తవ్వకం ఆగకపోగా, కూటమి నాయకుల అండదండలతో చెరువు తవ్వకం పూర్తి చేశారని అచ్యుతరావు ఆవేదన వ్యక్తం చేశారు. రెవెన్యూ అధికారులు ప్రభుత్వ భూమి అని ఎలాంటి చర్యలు చేపట్టరాదని బోర్డు పెట్టినా.. ఆ బోర్డును తొలగించి మరీ తవ్వకాలు చేపట్టారంటూ వాపోయారు. దీంతో పెదపాడు తహసీల్దార్ కూడా పోలీసులకు రాత పూర్వకమైన ఫిర్యాదు చేసి సంబంధిత కాపీలను ఉన్నతాధికారులకు నివేదించారు. చేపల చెరువుల కోసం అక్రమంగా తవ్వకాలు ఇళ్ల స్థలాల కోసం ఆ భూమి సేకరణ అక్రమ తవ్వకాలపై పోలీసులకు తహసీల్దార్ ఫిర్యాదు చేపల చెరువు తవ్విన భూమి ప్రభుత్వ భూమి. అక్కడ చెరువు తవ్వకూడదని చెప్పినా రాత్రి సమయాల్లో తవ్వకాలు చేశారు. దీంతో సంబంధిత వ్యక్తులపై పెదపాడు పోలీసులకు ఫిర్యాదు చేశాను. వీఆర్వోకు షోకాజ్ నోటీస్ జారీచేశాం. – ఏ కృష్ణ జ్యోతి, పెదపాడు తహసీల్దార్ -
ఉత్తర ద్వార దర్శనానికి ఏర్పాట్లు ఇలా..
● స్వామివారి తొలిమెట్టు (పాదుకా మండపం) వద్ద సోమవారం మధ్యాహ్నం 2.30 గంటలకు ఆలయ చైర్మన్ ఎస్వీ సుధాకరరావు, అనువంశిక ధర్మకర్త ఎస్వీఎన్ఎన్ నివృతరావు, ఈఓ ఎన్వీఎస్ఎన్ మూర్తి, ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్ డీవీ భాస్కర్, తదితరులు కొబ్బరికాయలు కొట్టి, జెండా ఊపి గిరి ప్రదక్షిణ వేడుకను ప్రారంభిస్తారు. ● ఈ యాత్ర మల్లేశ్వరం (దొరసానిపాడు రోడ్డు) మీదుగా గిరి చుట్టూ తిరిగి కొండపైన ఆశ్రమం వద్దకు చేరుతుంది. అక్కడి నుంచి ఉగాది మండపం మీదుగా ఆలయానికి చేరుకుంటుంది. ● 5 కిలోమీటర్లు మేర సాగే ఈ గిరి ప్రదక్షిణలో పాల్గొనే భక్తులకు మార్గ మధ్యలో మంచినీరు, పండ్లు, అల్పాహారాలు, టీలు అందించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ● అలాగే ఆంబులెన్స్, నడవలేని భక్తుల సౌకర్యార్థం దేవస్థానం ఉచిత బస్సును ఏర్పాటు చేస్తున్నారు. గిరి ప్రదక్షిణ అనంతరం భక్తులకు శ్రీవారి నిజరూప దర్శన భాగ్యాన్ని కల్పిస్తారు. ఏడాదికి ఒకసారి మాత్రమే ఉండే ఈ నిజరూప దర్శనం మంగళవారం సాయంత్రం వరకు ఉంటుంది. ఉచిత దర్శనం భక్తులు, అలాగే రూ.100, రూ.200 టికెట్లు ద్వారా వెళ్లేవారు షాపింగ్ కాంప్లెక్స్ వెనుక ఉన్న క్యూలైన్ల ద్వారా తాత్కాలిక క్యూ కాంప్లెక్స్లోకి చేరుకుంటారు. అక్కడి నుంచి ఉత్తర రాజగోపురం మీదుగా ఆలయంలోకి ప్రవేశిస్తారు. ఆన్లైన్లో రూ.100, రూ.200 టికెట్లు తీసుకున్న వారు షాపింగ్ కాంప్లెక్స్ వెనుక నుంచి ప్రత్యేక క్యూలైన్ ద్వారా ఆలయంలోకి వెళ్తారు. రూ.500 టికెట్లు తీసుకున్నవారు, అలాగే గోవింద స్వాములు, గ్రామస్తులు కొత్త అనివేటి మండపం నుంచి కొత్త క్యూ కాంప్లెక్స్లోకి ప్రవేశిస్తారు. అక్కడి నుంచి దక్షిణ రాజగోపురం మీదుగా ఆలయంలోకి చేరుకుంటారు. గ్రామస్తులు ఆధార్ కార్డు చూపించాల్సి ఉంటుంది. వీవీఐపీలు, వీఐపీలు, ప్రజాప్రతినిధులు తూర్పురాజగోపురం మీదుగా ఆలయంలోకి చేరుకుంటారు. నిత్యార్జిత కల్యాణంలో పాల్గొన్న భక్తులు పడమర రాజగోపురం పక్కనున్న ప్రత్యేక క్యూలైన్ ద్వారా, ఉత్తర రాజగోపురం నుంచి ఆలయంలోకి వెళ్తారు. దర్శనానంతరం భక్తులంతా ఆలయంలోంచి తూర్పు రాజగోపురం మీదుగా బయటకు వెళ్తారు. అక్కడ ఉచిత ప్రసాదాన్ని స్వీకరిస్తారు. పడమర రాజగోపురం నుంచి ఆలయ అర్చకులు, పండితులకు మాత్రమే ప్రవేశం. దర్శనం టికెట్లను క్యూలైన్లలోనే విక్రయిస్తారు. -
షూటింగ్ సందడి
పాలకొల్లు సెంట్రల్ : హరి గాడి హరికథ చిత్రం షూటింగ్ రెండో రోజు స్థానిక శ్రీ క్షీరారామలింగేశ్వరస్వామి ఆలయంలో జరిగింది. శనివారం ఆలయం వెనుక భాగంలో మాంటెజ్ సాంగ్లో భాగంగా నటీనటులపై కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. సురభి ఎంటర్టైన్మెంట్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి నూతనంగా హరి యడ్లపల్లి, ప్రియా హెగ్డే హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. నూతన దర్శకుడు, రచయిత వైవీ సర్వేష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఏలూరు(మెట్రో)/ భీమవరం (ప్రకాశం చౌక్): రాష్ట్రంలో పనిచేస్తున్న గ్రామ రెవెన్యూ అధికారులపై జీఎస్డబ్ల్యూఎస్ అధికారులు ఇచ్చిన ఆదేశాలు అమలు చేయాలని ఒత్తిడి చేయడంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు భూపతిరాజు రవీంద్ర రాజు శనివారం ఒక ప్రకటనలో తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రెవెన్యూలో అనేక విధులతో వీఆర్వోలు ఇబ్బందులు పడుతూ ఉంటే, గ్రామ, వార్డు, సచివాలయల అధికారులు ఇచ్చిన సర్వేలు, బయోమెట్రిక్, ఇతర ఆదేశాలు అమలు చేయాలని ఒత్తడి చేయడం తగదన్నారు. సమస్యలపై ఈ నెల 19న రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ దృష్టికి తీసుకువెళ్లామని, 24న సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఉన్నత అధికారులను మంత్రి ఆదేశించారన్నారు. అయినా అధికారుల ఒత్తిడులు ఆగడం లేదన్నారు. సమస్యల పరిష్కారంపై స్పష్టమైన ఆదేశాలు ఇవ్వని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడుతామన్నారు. ప్రకటన విడుదల చేసిన వారిలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.అప్పలనాయుడు ఉన్నారు. పాలకొల్లు సెంట్రల్ : ఉచితం అని ఆర్టీసీ బస్ ఎక్కితే ఓ మహిళకు చెందిన 12 గ్రాముల బంగారు ఆభరణం పోయింది. శనివారం పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ నుంచి కందరవల్లి వెళుతున్న బస్లో జనం కిటకిటలాడారు. పాలకొల్లు నుంచి అడవిపాలెం వరకూ వెళ్లవలసిన వరలక్ష్మి అనే మహిళ టికెట్ కోసం ఆధార్ కార్డు తీయడానికి తన హ్యాండ్ బ్యాగ్ను ఓపెన్ చేసింది. బ్యాగ్లో ఉండాల్సిన కాసున్నర ఆభరణం కనిపించలేదు. వెంటనే డ్రైవర్ బస్సును నేరుగా పాలకొల్లు పట్టణ పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లగా పోలీసులు ప్రయాణికుల బ్యాగ్లన్నీ తనిఖీ చేయించారు. ఎవరి వద్ద బంగారం దొరకకపోవడంతో వరలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
నరసాపురం కూటమిలో విభేదాలు
● వేర్వేరుగా జనవాణి, ప్రజావాణి కార్యక్రమాలు ● అయోమయంలో ప్రజలు, కార్యకర్తలునరసాపురం: నరసాపురం నియోజకవర్గంలో జనసేన, టీడీపీల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఎవరికి వారే అన్నట్లుగా ఆ రెండు పార్టీల నేతలకు పడడం లేదు. ఇప్పటికే రెండు పార్టీలు కలిసి నిర్వహించిన అనేక కార్యక్రమాల్లో నాయకులు మధ్య విభేదాలు తెరమీదకు వచ్చాయి. ఏఎంసీ, ఇతర నామినేడెట్ పోస్టుల నియమకాల్లో పార్టీ నేతల మధ్య విభేదాలు రోడ్డెక్కాయి. శుక్రవారం పట్టణంలో టీడీపీ, జనసేన ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించి వాటిని పరిష్కరించే కార్యక్రమం చేపట్టాచి. ఈ కార్యక్రమాన్ని రెండు పార్టీలు పోటాపోటీగా రెండు చోట్ల నిర్వహించడం చర్చనీయాంశమైంది. ప్రజలు ఎక్కడ తమ ఫిర్యాదులివ్వాలో తెలియక తలలు పట్టుకున్నారు. ఒకరికిస్తే మరొకరు అలుగుతారోమోనని.. అర్ధంకాక చివరికి ఎవరికీ ఇవ్వకుండానే నిట్టూరుస్తూ వెనుదిరిగారు. ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్ స్థానిక జనసేన కార్యాలయంలో ప్రజా సమస్యల తక్షణ పరిష్కారం పేరుతో జనవాణి కార్యక్రమం నిర్వహించారు. ఇదే కార్యక్రమాన్ని పేరుమార్చి టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ పొత్తూరి రామరాజు స్థానిక టీడీపీ కార్యాయంలో ఏర్పాటు చేశారు. ఒకరేమో ఎమ్మెల్యే, మరొకరేమో టీడీపీ ఇన్చార్జ్. నియోజకవర్గంలో అనధికార ఎమ్మెల్యే. దీంతో ప్రజలకు ఎవరికి ఫిర్యాదులు ఇవ్వాలో అర్ధంకాలేదు. ఎవరికిస్తే తమ సమస్యలు వెంటనే పరిష్కారం అవుతాయోనని ఆలోచనలో పడ్డారు. అధికారులు ఎమ్మెల్యే మాట విని తమ పనులు చేస్తారా? లేక టీడీపీ ఇన్చార్జ్ చెబితే స్పందిస్తారా? అనే సందిగ్ధంలో పడ్డారు. విభేదాలు తారాస్థాయికి ఈ రెండు పార్టీల్లోని నాయకుల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయని నాయకులు, కార్యకర్తలు గుసగుసలాడుకుంటున్నారు. నియోజకవర్గంలో టీడీపీ నేతల పెత్తనం ఏంటనే అభిప్రాయం జనసేన శ్రేణుల్లో ఉంది. ఇక రెండు నెలల క్రితం ఏఎంసీ కమిటీ ప్రమాణ స్వీకార సమయంలో ఆహ్వాన పత్రికలో మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు పేరువేయలేదని ఆయన వర్గీయులు పెద్ద గొడవే చేశారు. పొత్తూరిని ఇన్చార్జ్ బాధ్యతల నుంచి తొలగించాలని నిరసన తెలిపారు. ముందుగాా ఏఎంసీ చైర్మన్గా జనసేన నాయకుడి పేరును ప్రకటించారు. దీనిపై రెండు పార్టీల్లో పెద్ద గొడవే జరిగింది. మళ్లీ టీడీపీ నాయకుడికి ఈ పదవి కట్టబెట్టారు. దీంతో టీడీపీ ఆధిపత్యం ముందు జనసేన ఎమ్మెల్యే మాట నెగ్గలేదనే చర్చసాగుతోంది. కాపు కార్పొరేషన్ చైర్మన్గా ఉన్న కొత్తపల్లి సుబ్బారాయుడు ఎమ్మెల్యే చేపడుతున్న కార్యక్రమాలకు హాజరుకావడంలేదు. బండారు మాధవనాయుడు ఇంకా అలకవీడలేదు. ఇన్చార్జ్ బాధ్యతలు ఎలాగైనా పొత్తూరి నుంచి లాక్కుని తిరిగి తన రాజకీయ ప్రయాణం పరిగెట్టించాలని ప్రయత్నం చేస్తున్నారు. సీనియర్ నేత కొత్తపల్లి నుంచి పొంచి ఉన్న ప్రమాదాన్ని ఎలా తప్పించకోవాలా? అతని ఎమ్మెల్యే నాయకర్ తంటాలు పడుతున్నట్టుగా చెబుతున్నారు. మరోవైపు టీడీపీ కీలకపేత, ఎన్నారై కొవ్వలి యతి రాజరామ్మోహన్నాయుడు అమెరికా నుంచి వచ్చి పట్టణంలోనే ఉన్నారు. ఆయన రెండు చోట్లకు హాజరుకాకపోవడంపై చర్చ సాగుతోంది. ప్రభుత్వ మైనార్టీ సలహాదారుగా ఎంఏ షరీఫ్ తన మార్కు రాజకీయంతో టీడీపీని గందరగోళంలోకి నెడుతున్నారు. మొత్తానికి నియోజకవర్గంలో కూటమిలో రసవత్తర రాజకీయం నడుస్తోంది. -
కర్షకులకు కష్టకాలం
ఈఓ నియామకంపై ఉత్కంఠ చినవెంకన్న దేవస్థానం కొత్త ఈఓ నియామకంపై ఉత్కంఠ కొనసాగుతోంది. ప్రస్తుత ఈఓ ఉద్యోగ విరమణతో కొత్త ఈఓ ఎవరొస్తారన్న దానిపై చర్చ జరుగుతోంది. 8లో uశనివారం శ్రీ 27 శ్రీ డిసెంబర్ శ్రీ 2025సాక్షి, భీమవరం : రబీ నాట్లతో 2025 సంవత్సరాన్ని స్వాగతించిన రైతులకు ప్రారంభంలోనే ఎరువులు చుక్కలు చూపించాయి. 10:26:26 కాంప్లెక్స్ ఎరువు బస్తా (50 కేజీలు) రూ.230 పెరగ్గా, 14:35:14 బస్తా రూ.100, 20:20:013 బస్తా రూ.50 వరకు పెరిగాయి. ఎకరాకు రూ.500 వరకు రైతులపై అదనపు భారం పడింది. 2.30 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయగా 9.25 లక్షల టన్నుల దిగుబడికి తొలుత ఆరు లక్షల టన్నులు మాత్రమే సేకరణ లక్ష్యంగా నిర్ణయించారు. రైతుల నుంచి నిరసనలు రావడంతో 7 లక్షలకు పెంచారు. మాసూళ్ల సమయంలో అకాల వర్షాలకు తోడు గోనె సంచుల కొరతతో రైతులు ఇబ్బంది పడ్డారు. ఇదే అదనుగా తేమశాతం ఎక్కువగా ఉందని చెప్పి బస్తాకు రూ.400 వరకు దళారులు కోత పెట్టడంతో రైతులు నష్టపోవాల్సి వచ్చింది. జిల్లాలో 77 వేల మంది రైతుల నుంచి రూ.1,650 కోట్ల విలువైన 7.17 లక్షల టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది. వీరిలో 18 వేల మందికి పైగా రైతులకు సంబంధించి రూ.290 కోట్లు దాదాపు నెలన్నర రోజుల పాటు ధాన్యం సొమ్ములు జమచేయక ఖరీఫ్ సాగు పెట్టుబడుల కోసం రైతులు ఇబ్బంది పడాల్సి వచ్చింది. కలిసిరాని ఖరీఫ్ సాగునీటి ఎద్దడి, వర్షాభావ పరిస్థితులతో ఖరీఫ్ సాగు ఆలస్యమైంది. యలమంచిలి, పోడూరు, ఆచంట మండలాల్లో నీరందక నారుమడులు బీటలు తీశాయి. జిల్లాలో 2,20 లక్షల ఎకరాల్లో ఖరీఫ్ సాగవగా పంట పాలుపోసుకునే, గింజ గట్టిపడే కీలక దశల్లో మోంథా తుపాను తీవ్ర నష్టం కలిగించింది. స్వర్ణ, సంపద స్వర్ణ సాగుచేసిన పొలాల్లో పంట నేలకొరిగింది. ఎంటీయూ 1318, పీఎల్ఏ 1100, తదితర రకాల్లో తాలు గింజలు పెరిగి దిగుబడులు తగ్గిపోయాయి. ఆకివీడు, నరసాపురం, భీమవరం, పెంటపాడు మొగల్తూరు తదితర మండలాల్లోని 25 వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్టు అధికారులు తేల్చారు. ఖరీఫ్లో ఎకరాకు సగటున 26.25 క్వింటాళ్ల చొప్పున 5.77 లక్షల టన్నుల దిగుబడి రావాల్సి ఉంది. తుపాను ప్రభావంతో సగటున 21 క్వింటాళ్లతో 4.62 లక్షల టన్నులు మాత్రమే వచ్చింది. క్వింటాల్కు మద్దతు ధర రూ.2369 కాగా.. 1.15 లక్షల టన్నుల దిగుబడి తగ్గడంతో రూ 242.43 కోట్ల మేర రైతులు నష్టపోయారు. మూలిగేనక్కపై తాటికాయ పడ్డట్టు మాసూళ్లు సమయంలో దిత్వా తుపాను మరింత నష్టం కలిగించింది. ధాన్యంలో తేమ శాతం ఎక్కువగా ఉందంటూ దళారులు దోపిడీకి తెరలేపారు. చంద్రబాబు సర్కారు మెడలు వంచి ఓబీసీ రిజర్వేషన్లు సాధించాలని వైఎస్సార్సీపీ పాలకొల్లు నియోజకవర్గ ఇన్చార్జ్ గుడాల గోపి అన్నారు. 8లో uజిల్లాలో 1.2 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగు జరుగుతోంది. 60 శాతం మేర వనామీ సాగవుతుండగా మిగిలిన విస్తీర్ణంలో చేపలు పెంచుతున్నారు. మార్చిలో అమెరికా సుంకాల పెంపును సాకుగా చూపించి కంపెనీలు ఒక్కసారిగా రొయ్య ధరలను అమాంతం తగ్గించేశాయి. కౌంట్ను బట్టి కేజీకి రూ.30 నుంచి రూ.70 వరకు కోత పెట్టారు. ఫీడ్, ప్రాసెసింగ్ ప్లాంట్ల యజమానులు, ఎక్స్పోర్టర్స్ సిండికేట్గా మారి తమ కష్టాన్ని దోచుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో రైతులు రోడ్డెక్కి నిరసన తెలిపారు. గతంలోని 30 కౌంట్ రూ.470–490, 50 కౌంట్ రూ.370, 60 కౌంట్ రూ.350 కనీస మద్దతు ధర ఉండాలని, మేత ముడిసరుకు ధరలు భారీగా తగ్గిన నేపథ్యంలో ఫీడ్ కంపెనీలు మేత ధరలను టన్నుకు రూ.20 వేలకు తగ్గించాలని డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారం కోసం ఆక్వా రైతు సంఘాలు క్రాప్ హాలీడేకు పిలుపునిచ్చాయి. ఈ మేరకు మంత్రి నిమ్మల సొంత నియోజకవర్గమైన పాలకొల్లు నుంచి మొదలైన క్రాప్ హాలీడే నిరసన మిగిలిన నియోజకవర్గాలకు పాకింది. పంట విరామం పాటిస్తున్నట్టు చెరువుల వద్ద రైతులు ఫ్లెక్సీలు ఏర్పాటుచేయగా ప్రాన్స్ కో–ఆర్డినేషన్ కమిటీ కంటి తుడుపు హామీలతో ఉద్యమాన్ని నీరుగార్చింది. ఆక్వాజోన్, నాన్ ఆక్వాజోన్తో నిమిత్తం లేకుండా రైతులందరికి యూనిట్ విద్యుత్ను రూ.1.50కే అందిస్తామన్న కూటమి ఎన్నికల హామీ ఈ ఏడాది కార్యరూపం దాల్చపోవడం రైతులకు నిరాశనే మిగిల్చింది. ప్రభుత్వ సహకార లేమికి ప్రతికూల వాతావరణం తోడైంది. దాళ్వా, సార్వా చివరిలో అకాల వర్షాలు రైతులను నిండా ముంచాయి. ధాన్యం సేకరణ లక్ష్యాన్ని ప్రభుత్వం కుదించడం దళారీ వ్యవస్థకు గేట్లు తెరిచినట్లైంది. తేమ శాతం పేరిట రైతులకు మద్దతు గగనమైంది. మరోపక్క ఫీడ్, సీడ్ కంపెనీలు, ఎక్స్పోర్టర్స్ సిండికేట్ దోపిడీని అరికట్టాలని కోరుతూ ఆక్వా రైతులు క్రాప్ హాలిడేకు సిద్ధమయ్యారు. వెరసి 2025 సంవత్సరం కర్షకులకు కలిసి రాలేదు. ప్రతికూల వాతావరణం.. కొరవడిన సహకారం రబీ ధాన్యం సేకరణ లక్ష్యం కుదించి దళారులకు గేట్లు తెరిచిన ప్రభుత్వం ఖరీఫ్ చివరిలో ముంచేసిన మోంథా సిండికేట్ దోపిడీతో రొయ్య రైతు విలవిల ఆక్వా క్రాప్ హాలిడేకు పిలుపు జిల్లాలో 2.2 లక్షల ఎకరాల్లో వరి, 1.6 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలుచేసిన ఉచిత పంటల బీమా పథకాన్ని చంద్రబాబు ప్రభుత్వం ఎత్తివేయడంతో ప్రీమియం భారాన్ని రైతులే మోయాల్సి వచ్చింది. జగన్ హయాంలో ఏ సీజన్లో పంట నష్టం వాటిల్లితే అదే సీజన్లో పరిహారం అందించి రైతులను ఆదుకుంటే ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదు. జిల్లాలో 70 వేల మందికి పైగా కౌలు రైతులు ఉండగా అన్నదాత సుఖీభవ పథకాన్ని వర్తింప చేయక వారు నష్టపోవాల్సి వచ్చింది. -
వైఎస్సార్సీపీ క్యాలెండర్ ఆవిష్కరణ
నరసాపురం: పేరుపాలెం సౌత్ గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ సీనియర్ నేత ఉంగరాల పాణీకృష్ణ ముద్రించిన పార్టీ 2026 క్యాలెండర్ను శుక్రవారం పార్టీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు తన నివాసంలో ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కొత్త సంవత్సరంలో రెట్టించిన ఉత్సాహంతో పార్టీ నాయకులు, కార్యకర్తలు పనిచేయాలని సూచించారు. చంద్రబాబు ప్రభుత్వ అరాచకాలను ఎండగడుతూ ప్రజలకు అండగా నిలబడాలని చెప్పారు. నియోజకవర్గం మొత్తం క్యాలెండర్లు పంపిణీ చేయనున్నట్టు చెప్పారు. కార్యక్రమంలో పార్టీ బీసీ సెల్ జిల్లా కార్యదర్శి పాలా రాంబాబు, నియోజకవర్గ యూత్ విభాగం అధ్యక్షుడు చినిమిల్లి చందు, ఎస్సీ సెల్ నియోజకవర్గ అధ్యక్షుడు కొడెల్లి వెంకట్రావు, మాజీ ఏఎంసీ చైర్మన్ కొల్లాబత్తుల రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. కొత్త కమిషనర్గా వెంకట్రామరెడ్డి నరసాపురం: అవినీతి ఆరోపణలు, కౌన్సిల్తో విభేధాల నేపథ్యంలో నరసాపురం మున్సిపల్ కమిషనర్ ఎం.అంజయ్యను ఎట్టకేలకు బదిలీ చేశారు. ఆయనను అనంతపురం మున్సిపల్ డిప్యూటీ కమిషనర్గా బదిలీ చేస్తూ శుక్రవారం ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ఆయన స్థానంలో గతంలో నూజివీడు కమిషనర్గా పనిచేస్తూ సీడీఎంఏ కార్యాలయానికి సరెండర్ అయిన వెంకట్రామరెడ్డిని నియమించారు. అంజయ్య ఏడాదిన్నర క్రితం పుట్టపర్తి నుంచి నరసాపురం వచ్చారు. తొలిరోజు నుంచే ఆయన తీసుకున్న నిర్ణయాలు వివాదాస్పదమయ్యాయి. తీవ్ర అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు. నవంబర్లో జరిగిన కౌన్సిల్ సమావేశంలో కమిషనర్ను ప్రభుత్వానికి సరెండర్ చేస్తూ కౌన్సిల్ ఏకగ్రీవ తీర్మానం చేసింది. రాజకీయ అండదండలు ఉండటంతో ఆయనపై చర్యలు తీసుకోవడంలో జాప్యం జరిగింది. భీమవరం(ప్రకాశంచౌక్): జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ చదలవాడ నాగరాణిని భీమవరం కొత్త డీఎస్పీ రఘువీర్ విష్ణు శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ రఘువీర్కు అభినందనలు తెలిపారు. భీమవరం డివిజన్లో లా అండ్ ఆర్డర్ అమలు, ట్రాఫిక్ నియంత్రణకు తీసుకోనున్న చర్యలను వివరించారు. కలెక్టర్ మాట్లాడుతూ నెల రోజులు పండుగ వాతావరణం ఉంటుందని, అప్రమత్తంగా ఉండాలని, అన్ని విధాలుగా నిఘా ఉంచేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఏలూరు (టూటౌన్): ఇన్–సర్వీస్లో ఉన్న ప్రభుత్వ ఉపాధ్యాయులు రెండేళ్లలోపు టెట్ పరీక్ష పాస్ కావాలన్న నిబంధనపై ఉపాధ్యాయుల్లో తీవ్ర ఆందోళన నెలకొందని ఆంధ్రప్రదేశ్ మాల ఉద్యోగుల సంఘం ఏలూరు జిల్లా శాఖ పేర్కొంది. ఈ మేరకు డీఈవోకు శుక్రవారం మెమోరాండం స్పందించారు. ఈ నిబంధనను వెంటనే ఉపసంహరించుకోవాలని, ప్రభుత్వ దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లాలని డీఈవోని కోరారు. ఇన్–సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపునివ్వాలని, లేదా ఈ నిబంధనను పూర్తిగా ఉపసంహరించాలని, అందుకోసం సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయాలని సంఘం ప్రభుత్వాన్ని కోరింది. కార్యక్రమంలో రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు బేతాళ సుదర్శనం, సహా అధ్యక్షుడు అంగుళూరు సర్వేశ్వరరావు, జిల్లా అధ్యక్షుడు కాకర్ల దొరబాబు, కోశాధికారి కుర్మా ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. -
రేపు ఆర్థిక శాఖ మంత్రి సీతారామన్ పర్యటన
నరసాపురం రూరల్: ఈ నెల 28న నరసాపురం మండలం పెదమైనవానిలంకలె కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పర్యటిస్తారని, పటిష్ట ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు. ఈ సందర్బంగా శుక్రవారం పెదమైనవానిలంకలో ఏర్పాట్లను ఆమె పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ పెదమైనవానిలంకలో సముద్రపు కోత అడ్డుకట్ట పనులను పరిశీలిస్తారని, అనంతరం మన్కీ బాత్ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. డిజిటల్ భవన్లో ఏర్పాటుచేసిన డ్రోన్, ఏఐ నైపుణ్య శిక్షణ తరగతులు ప్రారంభిస్తారన్నారు. వికసిత్ భారత్.. డిజిటల్ ఇండియాపై విద్యార్థులకు నిర్వహించిన పెయింటింగ్ పోటీలు, వందేమాతరం పాటల పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేస్తారన్నారు. అధికారులు సమన్వయంతో పనిచేసి పర్యటనను విజయవంతం చేయాలని కోరారు. -
నలుగురు అధికారులపై వేటు
రక్షణ వలయంలో ప్రత్తిపాడు ప్రతిమాంబ ఆలయం పెంటపాడు: ప్రత్తిపాడు–ఆరుగొలను రోడ్డులో జెడ్పీ భూముల్లో ప్రతిమాంబ సమేత సదాశివ స్వామి ఆలయ శివాలయ నిర్మాణం చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. దీని వల్ల కొన్ని ప్రాంతాలకు నీరు వెళ్లడంలేదనే కారణంతో ఆలయ నిర్మాణం నిలిపివేయాలని కోరుతూ కొందరు హైకోర్టులో కేసు వేశారు. గుడి నిర్మాణం కొనసాగిస్తూ ఇటీవల విగ్రహాలు ప్రతిష్టించిన విషయం కలెక్టర్ దృష్టికివ వెళ్లింది. కలెక్టర్ నాగరాణికి తెలియడంతో పెంటపాడు మండలంలో నలుగురు అధికారులను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పెంటపాడు తహసీల్దార్ రాజరాజేశ్వరి, గ్రామ కార్యదర్శి పి.నాగేశ్వరరావు, ఈవోపీఆర్డీ ప్రసాద్, ఇన్చార్జి వీఆర్వో ఉమాదేవిని సస్పెండ్ చేశారు. డీఎల్డీవో ప్రభాకరావు, గూడెం ఆర్డీవోలకు మెమో జారీ చేశారు. గూడెం రూరల్ సీఐ, పెంటపాడు ఎస్సైపై చర్యలు తీసుకోవాలని ఎస్పీకి ఆదేశాలు జారీ చేశారు. జెడ్పీ భూమిలో గ్రామస్తులు చందాలు వేసుకొని శివాలయ నిర్మాణం చేపట్టారు. ఈ నిర్మాణం వల్ల తమకు ఇబ్బంది కలుగుతోందని, మంచినీరు రావడం లేదని గ్రామస్తులు కోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వ భూమిని పరిరక్షించే క్రమంలో నిర్మాణం చేయవద్దని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. వచ్చే నెల 5న కోర్టు ధిక్కరణ కేసు విచారణకు రానున్న నేపథ్యంలో కలెక్టర్ అధికారులను సస్పెండ్ చేసారు. శుక్రవారం ఎస్పీ అద్నాన్ నయీం అస్మి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. హైకోర్టు ఉత్తర్వులు అమలులో ఉన్నందున జనవరి 6 వరకు ఎవరూ శివాలయ ప్రాంతానికి రాకూడదని, గుమి కూడవద్దని, మతపరమైన కార్యక్రమాలు చేయవద్దని ఆర్డీవో నోటీసులు అంటించారు. -
తణుకులో సద్దుమణిగిన ఫ్లెక్సీ వివాదం
తణుకు అర్బన్: వైఎస్సార్ విగ్రహం వద్ద చంద్రబాబు ఫ్లెక్సీ కట్టిన వివాదం ప్రస్తుతానికి సద్దుమణిగింది. తణుకు వై.జంక్షన్ ప్రాంతంలోని వైఎస్సార్ విగ్రహం వద్ద ఫ్లెక్సీ ఏర్పాటు అనంతరం ఏర్పడిన ఉద్రిక్తత పరిస్థితుల్లో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అక్కడ వైఎస్సార్సీపీ ఫ్లెక్సీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. శుక్రవారం సాయంత్రానికి రెండు ఫ్లెక్సీలు తీసేస్తామని చెప్పిన పోలీసులు గురువారం తెల్లవారుజామునే రెండు ఫ్లెక్సీలు తీసేశారు. దీంతో శుక్రవారం గొడవ సద్దుమణిగింది. ఆ ప్రాంతంలో శాంతి భద్రతలకు ఇబ్బందులు తలెత్తకుండా పోలీసు అధికారులు తమ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటుచేశారు. వైఎస్సార్ విగ్రహం వద్ద జరుగుతున్న ఘటనపై తణుకు వాసులు సైతం ముక్కున వేలేసుకున్నారు. వైఎస్సార్ విగ్రహం వద్ద చంద్రబాబు ఫ్లెక్సీ కట్టడమేంటని చర్చించుకుంటున్నారు. తణుకులో గతంలో ఎన్నడూ లేని విధంగా టీడీపీ నేతలు కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
ద్వారకాతిరుమల ఈఓ నియామకంపై ఉత్కంఠ
ద్వారకాతిరుమల: ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమల చినవెంకన్న దేవస్థానం కొత్త ఈఓ నియామకంపై ఇంకా ఉత్కంఠత కొనసాగుతోంది. ప్రస్తుత ఈఓ ఎన్వీఎస్ఎన్ మూర్తి ఈనెల 31న ఉద్యోగ విరమణ పొందనున్నారు. ఈ నేపథ్యంలో కొత్త ఈఓ ఎవరొస్తారన్న దానిపై ఉద్యోగుల్లో చర్చ జరుగుతోంది. గతంలో జంగారెడ్డిగూడెం ఆర్డీఓగా పనిచేసి, ప్రస్తుతం ఒంగోలు జీజీహెచ్లో పరిపాలనాధికారి (డిప్యుటీ కలెక్టర్)గా విధులు నిర్వర్తిస్తున్న కె.అద్దయ్య ఈఓగా నియమితులవుతారని కొందరు చెబుతున్నారు. అయితే ప్రస్తుతం అన్నవరం దేవస్థానం ఇన్చార్జి ఈఓగా పని చేస్తున్న ఆర్జేసీ వేండ్ర త్రినాథరావు వస్తారని మరికొందరు అంటున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం శ్రీవారి దేవస్థానంలో డీఈఓగా విధులు నిర్వర్తిస్తున్న వై.భద్రాజీని కొద్దిరోజుల పాటు ఇన్చార్జి ఈఓగా నియమిస్తారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఏది ఏమైనా ఈఓ నియామకంపై మరో రెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే చివరి రోజుల్లో ప్రస్తుత ఈఓ పాలన గాడి తప్పుతుందన్న భక్తులు ఆరోపిస్తున్నారు. నూతన క్యూ కాంప్లెక్స్ను భక్తుల రద్దీ అధికంగా ఉండే ముక్కోటి రోజున ట్రయల్రన్ వేసేందుకు చేస్తున్న ప్రయత్నమే ఆరోపణలకు ప్రధాన కారణంగా ఉంది. జరగరానిది ఏదైనా జరిగితే.. ఆలయ అనివేటి మండపం పక్కన రూ. 12.50 కోట్లతో నూతనంగా శాశ్వత క్యూ కాంప్లెక్స్ను నిర్మించారు. అది ఇంకా ప్రారంభం కాలేదు. అయితే ఈనెల 30న ముక్కోటి ఏకాదశి నాడు ఆ క్యూ కాంప్లెక్స్ను ట్రయల్ రన్ వేసేందుకు ఇంజనీరింగ్ విభాగ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. వేలాది మంది భక్తులు వచ్చే పర్వదినం నాడు ట్రయల్రన్ వేయడం ఏంటి? పలువురు విమర్శిస్తుంటే, కనీసం విశ్వక్సేన పూజ, పుణ్యహవాచనం కూడా చేయకుండా ట్రయల్ రన్ చేయడం మంచిది కాదని అంటున్నారు. 2002 మార్చి నెలలో శ్రీవారి ఆలయ నూతన తూర్పురాజగోపురం ప్రారంభం కాకుండానే అప్పటి లోక్సభ స్పీకర్ జీఎంసీ బాలయోగిని కొందరు నాయకులు ఆ గోపురంలో నుంచి ఆలయంలోకి తీసుకెళ్లారు. మరుసటి రోజు ఆయన ప్రమాదానికి గురై మృతి చెందాడు. దాన్ని గ్రామస్తులు, భక్తులు ఇప్పటికీ మరచిపోలేదు. అది సెంటిమెంట్గా మిగిలిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో కనీసం పూజలు నిర్వహించకుండా ట్రయల్ రన్ పేరుతో క్యూ కాంప్లెక్స్ను ప్రారంభిస్తే.. ఆ తరువాత జరగరానిది ఏదైనా జరిగితే దానికి పూర్తి బాద్యత ఈఓనే వహించాల్సి వస్తుందని మండిపడుతున్నారు. శ్రీవారి ఆలయ రాజగోపురాల సముదాయం ఈ విషయంపై ఆలయ ఈఓ ఎన్వీఎస్ఎన్ మూర్తిని విరణ కోరేందుకు ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు. అయితే ఏఈఓ మెట్టపల్లి దుర్గారావును వివరణ కోరగా ముక్కోటి ఏకాదశి నాడు వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో నుంచి గ్రామస్తులను, గోవింద దీక్షాదారులను, రూ.500ల ప్రత్యేక దర్శనం చేసుకునే భక్తులను పంపించాలనే ప్రతిపాదన ఉందని, అది ఇంకా ఫైనల్ కాలేదని స్పష్టం చేశారు. మరో నాలుగు రోజుల్లో రిటైర్ కానున్న ప్రస్తుత ఈఓ క్యూ కాంప్లెక్స్ ట్రయల్ రన్పై ఈఓపై భక్తుల మండిపాటు -
తిరు వీధుల్లో శ్రీవారి దివ్య దర్శనం
ద్వారకాతిరుమల: తిరువీధుల్లో శ్రీవారి దివ్య దర్శనాన్ని పొందుతున్న భక్తులు తన్మయత్వం చెందుతున్నారు. ధనుర్మాస ఉత్సవాలను పురస్కరించుకుని నిత్యం ఉభయ దేవేరులు, గోదాదేవితో పాటు శ్రీవారు క్షేత్ర పుర వీధుల్లో ఊరేగుతున్నారు. శుక్రవారం ఉదయం జరిగిన గ్రామోత్సవం నేత్రపర్వంగా సాగింది. ముందుగా ఆలయంలో విశేషంగా అలంకరించిన తొళక్క వాహనంపై సామి, అమ్మవార్లు, గోదాదేవి ఉత్సవ మూర్తులను ఉంచి, అర్చకులు విశేష పూజలు జరిపారు. ఆ తరువాత మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, అశ్వ, గజ సేవల నడుమ స్వామివారి వాహనం ఆలయ ప్రధాన రాజగోపురం మీదుగా క్షేత్ర పుర వీధులకు పయనమైంది. ప్రతి ఇంటి ముంగిట పెద్ద ఎత్తున భక్తులు శ్రీవారికి నీరాజనాలు సమర్పించారు. అనంతరం స్థానిక ధనుర్మాస మండపంలో స్వామి, అమ్మవార్లకు అర్చకులు, పండితులు ప్రత్యేక పూజలు జరిపి, భక్తులకు తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. తణుకు అర్బన్: దోమల మందు కొట్టే ఆటో అగ్నికి ఆహుతైన ఘటన తణుకు కోర్టు ఆవరణలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. దోమల మందు వెదజల్లే ఫాగింగ్ మెషీన్తో తణుకు మునిసిపాలిటీకి చెందిన ఆటో సుమారుగా రాత్రి 9.15 గంటల సమయంలో ఫాగింగ్ చేస్తూ కోర్టు ఆవరణలోకి వచ్చింది. అకస్మాత్తుగా ఫాగింగ్ మెషీన్ నుంచి మంటలు వ్యాపించి ఆటో తగలబడడంతో డ్రైవర్ అయ్యప్ప వెంటనే ఆటో నుంచి దిగిపోయాడు. నిమిషాల వ్యవధిలోనే మంటలు తీవ్రంగా వ్యాపించడంతో సమాచారం అందుకున్న అగ్నిమాపక అధికారి అజయ్కుమార్ తమ సిబ్బందితో కలసి వచ్చి మంటలను అదుపుచేశారు. అయితే అప్పటికే ఆటో పూర్తిగా దగ్ధమైపోయింది. ఆటోతోపాటు, ఫాగింగ్ మెషీన్ నష్టం తెలియాల్సి ఉంది. -
బ్యారన్ సామగ్రి చోరీ
బుట్టాయగూడెం: తమ బ్యారన్లో ఉన్న సామగ్రిని గుర్తు తెలియని వ్యక్తులు దొంగలించినట్లు మహిళా రైతు బళ్లా భూలక్ష్మి తెలిపారు. శుక్రవారం సాయంత్రం ఆమె ముప్పినవారిగూడెంలో విలేకరులతో మాట్లాడుతూ గ్రామ సమీపంలో తనకు, నందిన సతీష్కు చెందిన ఆరు బేరన్లు ఉన్నాయని చెప్పారు. అయితే ఐదు నెలల క్రితం పొగాకు సీజన్ పూర్తయిన తర్వాత ఆరు బ్యారన్ల సామాగ్రిని గొట్టాలు, పొయ్యిలు, కర్రలు అన్నీ కలిపి ఒక బ్యారన్లో దాచిపెట్టినట్లు చెప్పారు. శుక్రవారం ఉదయం బ్యారన్లను పరిశీలించేందుకు వెళ్లగా అక్కడ తాళాలు పగలకొట్టి ఉండటాన్ని గమనించి, లోపలికి వెళ్లి చూడగా సామగ్రి లేదని చెప్పారు. అయితే ఈ సామాగ్రి ఖరీదు రూ. 4 లక్షల వరకూ ఉంటుందని చెప్పారు. ఈ చోరీ ఘటనపై పోలీసులను ఆశ్రయిస్తామని వెల్లడించారు. నూజివీడు: మండలంలోని తుక్కులూరులో శుక్రవారం వృద్ధురాలి మెడలో బంగారు గొలుసును దుండగులు చోరీ చేశారు. వివరాల ప్రకారం గ్రామానికి చెందిన పొన్నం నాగేశ్వరమ్మ(65) మెయిన్రోడ్డులో బడ్డీకొట్టు పెట్టుకుని జీవిస్తుంది. సాయంత్రం 4 గంటల సమయంలో బైక్పై ఇద్దరు వ్యక్తులు వచ్చి సిగరెట్లు కొనుగోలు చేసి ఫోన్పే ద్వారా రూ.50 చెల్లించారు. ఆ తర్వాత అదును చూసి మెడలో మూడు కాసుల గొలుసును తెంపుకుని పరారయ్యారు. ఘటనపై బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో రూరల్ ఎస్సై లక్ష్మణ్బాబు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఏలూరు (టూటౌన్): 500 జనాభా ఉన్న ప్రతి గిరిజన తండాలను, గూడాలను ప్రత్యేక గ్రామపంచాయతీలుగా విభజించాలని ఎస్టీ బంజారా సుగాలి లంబాడి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జి.కృష్ణ నాయక్, డి.రాజా బాబు నాయక్ డిమాండ్ చేశారు.ఈ మేరకు శుక్రవారం వారు ఒక ప్రకటనలో విడుదల చేశారు. ఏలూరు జిల్లాలోని చింతలపూడి మండలంలోని నామవరం, రేచర్ల, పంతంగుల గూడెం తండాలను, టి.నర్సాపురం మండలంలోని కృష్ణాపురం తండాను, చాట్రాయి మండలంలోని పోతనపల్లి ( గంటిపాడు) తండాలను పరిపాలన సౌలభ్యం కోసం, గిరిజన ప్రజల అభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన జీఓ ఎంఎస్ నెంబర్ 97 ప్రకారం మేజర్ పంచాయతీల నుండి విభజించి ప్రత్యేక గ్రామపంచాయతీలుగా ప్రకటించాలని కోరారు. -
పుష్కరాలకు 43 ఘాట్ల ఏర్పాటు
జంగారెడ్డిగూడెం: జంగారెడ్డిగూడెం రెవెన్యూ డివిజన్ పరిధిలో గోదావరి పరీవాహక ప్రాంతాల్లో రానున్న పుష్కరాలకు 43 పుష్కర ఘాట్లు ఏర్పాటు చేస్తున్నట్లు జంగారెడ్డిగూడెం ఆర్డీఓ ఎంవీ రమణ తెలిపారు. 2027 పుష్కరాలకు సంబంధించి ఆయా పనులకు అంచనాలు, సన్నాహక కార్యక్రమాలపై శుక్రవారం ప్రాథమిక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పోలవరంలో 35 ఘాట్లు, కుక్కునూరులో 3 ఘాట్లు, వేలేరుపాడులో 5 ఘాట్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. టూరిజం శాఖ ద్వారాకాతిరుమల, మద్ది ఆంజనేయస్వామి, పారిజాతగిరి, జీలకర్రగూడెం బౌద్దాలాయాలు, గుబ్బలమంగమ్మ గుడి, పలు ఆలయాలను కలుపుతూ టూరిజం ప్యాకేజీలు ప్రకటిస్తుందని స్పష్టం చేశారు. ఆయా శాఖల చేపట్టే పనులపై అంచనాలు తయారు చేసి జిల్లా కలెక్టర్కు నివేదించనున్నట్లు ఆర్డీఓ వెల్లడించారు. పోలవరం డీఎస్పీ ఎం.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ గోదావరి పుష్కరాలకు సంబంధించి పోలీసు శాఖను సన్నద్ధం చేస్తున్నామన్నారు. యాత్రికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రమాదాలు జరగకుండా సీసీ కెమేరాలు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందిని నియమిస్తామని లైఫ్ జాకెట్లతో గోదావరిపై బోట్లను 24 గంటలు మూడు షిప్టులుగా నియమించి యాత్రికుల భద్రతే లక్ష్యంగా చర్యలు చేపడుతున్నామని చెప్పారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ కేవీ రమణ, విద్యుత్ డీఈ యు.సుబ్బారావు, ఆర్టీఓ ఎస్ఎస్ రంగనాయకులు పాల్గొన్నారు. -
అటవీ ప్రాంతంలో జామాయిల్ చెట్ల నరికివేత
కుక్కునూరు: అటవీ భూముల్లో చెట్లకు రక్షణ కరువైంది. అటవీశాఖ నిర్లక్ష్యం మూలంగా అటవీ భూముల్లోని జామాయిల్ చెట్లను కొందరు వ్యక్తులు అడ్డగోలుగా నరికివేసి వాటిని అమ్మి సొమ్ము చేసుకుంటున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మండలంలోని అమరవరం అటవీరేంజ్ పరిధిలోని కొండపల్లి గ్రామ సమీపంలోని అటవీప్రాంతంలో జామాయిల్ చెట్లను నరికేసి తరలించినట్లు సమాచారం. గతంతో ఇదే రేంజ్ పరిధిలో అటవీప్రాంతంలోని మారుజాతి కలపను, మాధవరం టేకు ప్లాంటేషన్లోని టేకు చెట్లను కొందరు వ్యక్తులు నరికి తరలించికెళ్లినట్టు ఆరోపణలొచ్చాయి. అంతేకాక ఇదే రేంజ్ పరిధిలో అటవీభూముల్లో జామాయిల్ నర్సరీలను నిర్వహిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఇలా అటవీప్రాంతంలో అక్రమాలు, ఆక్రమణలు జరుగుతున్న అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు మండిపడుతున్నారు. ఉంగుటూరు: మండలంలోని సీతారామపురం గ్రామంలో చేపలు చెరువుల వద్ద కాపలా ఉండే జల్లూరి జనార్దన్ (30) చేపలకు వేసే గ్యాస్ బిళ్లలు మింగి శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నాడు. చేబ్రోలు ఎస్సై సూర్య భగవాన్ తెలిపిన వివరాల ప్రకారం నిడమర్రు మండలం తోకలపల్లి గ్రామానికి చెందిన జల్లూరి జనార్దన్ కుటుంభసబ్యులతో కలసి సీతారామపురం ఆయకట్టులో చేపలు చెరువులు మీద కాపలాదారుడిగా ఉంటున్నాడు. మద్యానికి బానిసైన జనార్దన్ కుటుంబాన్ని సరిగ్గా చూసుకోలేకపోతున్నానంటూ శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో చేపలకు వేసే గ్యాస్ బిళ్లలను మింగేశాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే బాధితుడిని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ జనార్దన్ చనిపోయాడు. ఈ మేరకు ఎస్సై సూర్య భగవాన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చాట్రాయి: మండలంలోని నరసింహారావుపాలెం పీఏసీఎస్లో గురువారం రాత్రి చోరీ జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు షట్టరు తాళాలు పగలకొట్టి బీరువాలో ఉన్న రూ.1.80 లక్షలు ఎత్తుకుపోయారు. శుక్రవారం ఉదయం స్వీపర్ చోరీ జరిగిన విషయాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్సై రామకృష్ణ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. క్లూస్ టీమ్ వచ్చి ఆధారాలను సేకరించింది. ఈ మేరకు ఘటనపై విచారణ చేస్తున్నామని ఎస్సై రామకృష్ణ పేర్కొన్నారు. -
విద్యుత్ షాక్తో యువకుడి మృతి
నరసాపురం రూరల్: క్రిస్మస్ వేడుకల కోసం ఏర్పాట్లు చేస్తుండగా విద్యుత్ షాక్కు గురై యువకుడు మృతి చెందిన ఘటన మండలంలోని సీతారామపురంసౌత్ గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం సీతారామపురం వెంకట్రావుతోటలో శుక్రవారం రాత్రి జరుగనున్న క్రిస్మస్ వేడుకలకు సంబంధించి విద్యుత్ దీపాలను అలంకరించే పనులు చేస్తుండగా శీలం అభిరామ్ (19) అనే యువకుడికి 11 కేవీ విద్యుత్ వైర్లు తగలడంతో కిందపడ్డాడు. వెంటనే బాధితుడిని నరసాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. పాలకొల్లు మండలంలోని దిగమర్రు గ్రామానికి చెందిన వీరి కుటుంబం కొంతకాలంగా మొగల్తూరు మండలంలోని జెట్టిపాలెం గ్రామంలోని అమ్మమ్మ ఇంటి వద్దనే ఉంటున్నారు. మృతుని తల్లిదండ్రులు ఇరువురూ ఉపాది నిమిత్తం విదేశాల్లో ఉంటున్నారు. తల్లి నెల రోజులక్రితమే విదేశాలకు వెళ్లింది. మృతుని సోదరుడు సాయి శరత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తున్నామని మొగల్తూరు ఎస్సై వై నాగలక్ష్మి తెలిపారు. పాలకొల్లు సెంట్రల్: స్థానిక బ్రాడీపేట బైపాస్ రోడ్డులో నాలుగు రోజులుక్రితం జరిగిన మోటర్ సైకిల్ చోరీ కేసులో ఇద్దరు వ్యక్తులను రూరల్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. వివరాల ప్రకారం ఈ నెల 21న రాత్రి బ్రాడీపేట బైపాస్ రోడ్డు పరిధిలోని ఉల్లంపర్రు గ్రామం ప్రార్వతినగర్లో ఇంటి వద్ద బయట పార్క్ చేసిన మోటర్ సైకిల్ను చోరీ చేశారు. ఈ ఘటనపై వాహన యజమాని కర్నేని నాగ అవినాష్ ఫిర్యాదు చేయగా రూరల్ ఎస్సై సురేంద్ర కుమార్ కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా పార్వతి నగర్లో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకోవడంతో చోరీ విషయం తెలిపారు. దీంతో మార్టేరుకు చెందిన పి.రెడ్డి, తూర్పుపాలేనికి మైనర్ యువకుడిని అరెస్ట్ చేశారు. నిందితులను కోర్టులో హాజరుపరిచినట్లు పోలీసులు తెలిపారు. ద్వారకాతిరుమల: శ్రీవారి నిత్యాన్నదాన ట్రస్ట్కు విజయవాడకు చెందిన పలువురు దాతలు ఐదు టన్నుల కూరగాయలను శుక్రవారం విరాళంగా అందజేశారు. అవ్వారు వెంకటలక్ష్మి, అరవపల్లి సుబ్రహ్మణ్యం, బాలాజీ ఎలక్ట్రానిక్స్ అన్నపరెడ్డి లింగారెడ్డి, సాడి శ్రీనివాసరెడ్డి, స్వాతిలు ఈ కూరగాయలను అన్నదాన ట్రస్ట్ సూపరింటెండెంట్ కోటగిరి కిషోర్కు అందజేశారు. ఈ నెల 30న ముక్కోటి ఏకాదశి పర్వదినం నాడు శ్రీవారిని దర్శించే భక్తులకు అందించే అన్నప్రసాదంలో వీటిని వినియోగించాలని దాతలు కోరారు. -
బెంబేలెత్తిస్తున్న నకిలీ ఈ–చలాన్లు
ఆగిరిపల్లి: మండలవాసులను నకిలీ ట్రాఫిక్ ఈ– చలాన్లు బెంబేలెత్తిస్తున్నాయి. రెండు రోజుల క్రితం మండలంలో కొంతమందికి సైబర్ నేరస్తులు నకిలీ ఈ–చలాన్ లింకు వాట్సాప్నకు పంపి దోపిడీకి పాల్పడ్డారు. ఆగిరిపల్లికి చెందిన పల్లగాని కోటేశ్వరరావు అనే వ్యక్తికి వాట్సాప్ ద్వారా రెండు రోజుల క్రితం సైబర్ నేరగాళ్ల నుంచి ఈ –చలాన్ లింకు వచ్చింది. లింకు వచ్చిన కాసేపటికి సైబర్ కేటుగాళ్లు అతడి ఖాతాను హ్యాక్ చేసి తన ప్రమేయం లేకుండానే ఓటీపీలు వచ్చి అకౌంట్లో ఉన్న రూ.50 వేలను దోచుకున్నారు. అలాగే గ్రామానికి చెందిన మరో ఇద్దరు వ్యక్తులు లింకును క్లిక్ చేయగానే రూ.60 వేలు, మరో యువకుడివి రూ.5 వేలు కేటుగాళ్లు దోచేశారు. అంతేకాకుండా మండలంలో అనేకమంది ఫోన్లు కూడా హ్యాక్ అయ్యాయి. దీంతో ఫోన్కి ఏదైనా కొత్త మెసేజ్ వస్తేనే హడలిపోతున్నారు. ఈ విషయంపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇదే విషయమై ఎస్సై శుభ శేఖర్ మాట్లాడుతూ నకిలీ వెబ్సైట్లపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఎస్ఎంఎస్ ద్వారా వచ్చే లింకుల ద్వారా నగదు చెల్లించవద్దని విజ్ఞప్తి చేశారు. ఎవరైనా సైబర్ మోసాలు గురైతే వెంటనే 1930 కి ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు. -
పాలకొల్లులో సినిమా షూటింగ్ సందడి
పాలకొల్లు సెంట్రల్: పాలకొల్లులో హరి గాడి హరికథ చిత్రం నిర్మాణం షూటింగ్తో సందడి వాతావరణం నెలకొంది. శుక్రవారం స్థానిక యడ్లబజారు సెంటర్ వద్ద పశువులు ఆసుపత్రిలో మాంటెజ్ సాంగ్ షూటింగ్ చేశారు. సురభి ఎంటర్టెయిన్మెంట్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి నూతనంగా హరి యడ్లపల్లి, ప్రియా హెగ్డేలు హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి రచయిత వైవీ సర్వేష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సందర్భంగా సర్వేష్ మాట్లాడుతూ పాలకొల్లు , అడవిపాలెం, శిరగాలపల్లి, చించినాడ, పేరుపాలెం ప్రాంతాల్లో చిత్రీకరిస్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకూ 50 శాతం చిత్ర షూటింగ్ పూర్తయ్యిందని పేర్కొన్నారు. ఆర్ట్ డైరెక్టర్ పెద్దిరాజు అడ్డాల, నిర్మాత సురభి హరినాఽథరావు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ పూజ్యం శ్రీరామచంద్రమూర్తి పాల్గొన్నారు. -
ఓబీసీ రిజర్వేషన్ల కోసం ప్రభుత్వం మెడలు వంచాలి
పాలకొల్లు సెంట్రల్: కూటమి ప్రభుత్వం మెడలు వంచి ఓబీసీ రిజర్వేషన్లు సాధించాలని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ గుడాల శ్రీహరిగోపాలరావు (గోపి) అన్నారు. శుక్రవారం పట్టణంలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో శుక్రవారం తూర్పుకాపు సామాజికవర్గం సభ్యులు ఓబీసీ రిజర్వేషన్ అంశంపై వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకువెళ్లాలని కోరుతూ గుడాల గోపితో పాటు పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకులు ముదునూరి మురళీకృష్ణంరాజులకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా గుడాల గోపి మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో తూర్పు కాపుల ఓబీసీ రిజర్వేషన్ల కోసం ప్రయత్నం చేయగా ఎన్నికల కోడ్ రావడంతో ఆగిపోయిందని వివరించారు. అనంతరం అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం 18 నెలలు గడిచినా ఇప్పటికీ ఓబీసీ రిజర్వేషన్ విషయాన్ని తేల్చలేదని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వం కూడా కలిసే ఉంది కాబట్టి తూర్పుకాపులు పార్టీలకతీతంగా కలిసిమెలసి పోరాటం చేస్తే ఓబీసీ రిజర్వేషన్లు సాధించవచ్చని అన్నారు. అనంతరం ముదునూరి మురళీకృష్ణంరాజు గతంలో ఓబీసీ రిజర్వేషన్లు 50 శాతం ముందుకు తీసుకువెళ్లిన ఘనత జగన్నన్నదేనని అన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ పార్లమెంటు రాష్ట్ర కార్యదర్శి యడ్ల తాతాజీ, కోరాడ శ్రీనివాస్, తూర్పుకాపు సంఘ సభ్యులు లోపింటి చిరంజీవి, వాకాడ అప్పారావు, ఇజ్జాడ చినబాబు, జమ్ము కాశీ విశ్వనాథ్, జామాను బుజ్జి పాల్గొన్నారు. -
వైఎస్సార్ విరగహం వద్ద చంద్రబాబు ఫ్లెక్సీ
● తణుకులో ఉద్రిక్తత ● నిరసన తెలిపిన వైఎస్సార్సీపీ శ్రేణులు ● ధ్వజమెత్తిన మాజీ మంత్రి కారుమూరితణుకు అర్బన్: రాష్ట్రంలో ఎవరి ఇంట్లోకై నా వెళ్లిపో వచ్చన్నట్టుగా ఈ ప్రభుత్వం ఉందని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు విమర్శించారు. మహానేత వైఎస్సార్ విగ్రహానికి చంద్రబాబు ఉన్న ఫ్లెక్సీ కట్టారంటే ఈ ప్రభుత్వం ఏ స్థాయికి దిగజారిపోయిందో అర్థమవుతుందని మండిపడ్డారు. ఏనాడైనా తాము ఎన్టీఆర్ విగ్రహానికి తమ నాయకుడి ఫ్లెక్సీ పెట్టామా అని ప్రశ్నించారు. తణుకు–తేతలి వై.జంక్షన్లోని వైఎస్సార్ విగ్రహం వద్ద చంద్రబా బు, స్థానిక ఎమ్మెల్యే ఉన్న ఫ్లెక్సీ కట్టిన ప్రాంతంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన మా ట్లాడారు. చంద్రబాబు ఫ్లెక్సీ విప్పనీయకుండా, తమ ఫ్లెక్సీ ఏర్పాటుచేయకుండా పోలీసులు కాప లా కాస్తున్నారని ఇది మరింత సిగ్గుచేటని మండిపడ్డారు. ఎమ్మెల్యే ఆదేశాలతో ఫ్లెక్సీని తీయనీయకుండా పోలీసులు కాపలా కాస్తున్నారని, ఇదే తరహాలో అత్తిలి ఎంపీపీ ఎన్నికల్లో సైతం తన ఇంటి ముందు ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడినా ఒక్క పోలీసు కూడా రాకుండా ఆరోజు ఎమ్మెల్యే చెప్పినట్టుగా నడుచు కుని పోలీసులు లా అండ్ ఆర్డర్ సమస్య తీసుకువచ్చారని విమర్శించారు. తణుకులో లా అండ్ ఆర్డర్ సమస్య అంతా పోలీసుల కారణంగానే వస్తుందని విమర్శించారు. ఫ్లెక్సీ తొలగించకపోతే రోడ్డుపైనే ఉంటామని తమ రాష్ట్ర నాయకులు అంతా తణుకు వస్తారని హెచ్చరించారు. ఎటువంటి ఫ్లెక్సీలు లేకుండా చేస్తే విగ్రహం వద్ద నిర్మాణ పనులు చేసుకుంటామని చెప్పారు. ఉద్రిక్తంగా తణుకు తణుకు–తేతలి వై.జంక్షన్లోని మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం వద్ద క్రిస్మస్, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపే ఫ్లెక్సీ పెట్టుకునేందుకు గురువారం సాయంత్రం వచ్చిన వైఎస్సార్సీపీ శ్రేణులకు అప్పటికే చంద్రబాబు, ఎమ్మెల్యే తదితరులు ఉన్న ఫ్లెక్సీ ఆ ప్రాంతంలో ఏర్పాటు చేయడంతో నిరసనకు దిగారు. వైఎస్సార్సీపీ ఫ్లెక్సీ ఏర్పాటు చేసేందుకు పార్టీ శ్రేణులు దిగడంతో పోలీసులు ఫ్లెక్సీని లాక్కుని స్వాధీనం చేసుకున్నారు. దీంతో వివాదం ముదరడంతో పార్టీ శ్రేణులు రోడ్డుపై బైఠాయించారు. విషయం తీవ్రత తెలుసుకున్న మాజీ మంత్రి కారుమూరి హుటాహుటిన హైదరాబాద్ నుంచి రాత్రి సమయంలో తణుకు ఘటనా ప్రాంతానికి చేరుకుని పార్టీ శ్రేణులతో కలిసి రోడ్డుపై బైఠాయించారు. అంతకుమందు పోలీసులు వైఎస్సార్సీపీ శ్రేణులతో చర్చలు జరిపి నిరసన విరమించాలని కోరినా చంద్రబాబు ఫ్లెక్సీ తీయాల్సిందేనని నాయకులు పట్టుబట్టారు. ఘటనా ప్రాంతానికి తాడేపల్లిగూడెం డీఎస్పీ విశ్వనాథ్, తణుకు పట్టణ రూరల్ సీఐలు ఎన్.కొండయ్య, కృష్ణకుమార్, తాడేపల్లిగూడెం సీఐ బాదం శ్రీనివాస్, ఎస్సైలు తమ సిబ్బందితో కలిసి మొహరించారు. నిరసన కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు మారిశెట్టి శేషగిరి, పంచాయతీరాజ్ రాష్ట్ర కార్యదర్శి వడ్లూరి సీతారామ్, పబ్లిసిటీ వింగ్ జిల్లా అధ్యక్షుడు జల్లూరి జగదీష్, జిల్లా ఆర్గనైజేషన్ సెక్రటరీ యిండుగపల్లి బలరామకృష్ణ, తణుకు నియోజకవర్గ ప్రచార కమిటీ అధ్యక్షుడు గెల్లా జగన్, ఎస్సీసెల్ అధ్యక్షుడు పెనుమాల రాజేష్, ఎడ్వర్డ్ పాల్, పైడి సాయిసూర్య, యారబాటి రామకృష్ణ, గెద్దా శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ముగిసిన వివాదం మాజీ మంత్రి కారుమూరి పోలీసులతో తీవ్ర వా గ్వాదాల నడుమ చంద్రబాబు ఫ్లెక్సీ ముందు వైఎస్సార్సీపీ ఫ్లెక్సీ ఏర్పాటుచేయడంతో వైఎ స్సార్సీపీ శ్రేణులు శాంతించారు. శుక్రవారం సాయంత్రం రెండు ఫ్లెక్సీలు తొలగింపచేసేలా పోలీసులు, వైఎస్సార్సీపీ శ్రేణుల మధ్య ఒప్పందం కుదరడంతో వివాదానికి తాత్కాలికంగా తెరపడింది. -
సస్యరక్షణ చేపట్టాలి
పెనుగొండ : గత కొన్నిరోజులుగా మంచు శాతం అధికంగా ఉండడంతో నారుమడులపై ప్రభావం చూపుతుందని, రైతులు తక్షణం రక్షణ చర్యలు చేపట్టాలని మండల వ్యవసాయాధికారి పి స్పందన సూచించారు. సాగుకు ఆదిలోనే హంసపాదు శీర్షికన ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి ఆమె స్పందించి, పలు సూచనలు చేశారు. మంచు తీవ్రంగా ఉన్నందున నారుమడి ఎదుగుదలపై ప్రభావం చూపుతుందని వివరించారు. మంచు ప్రభావం నుంచి బయట పడడానికి 5 సెంట్లు నారుమడికి 4.4 కేజీ 6.25 కేజీ సింగిల్ సూఫర్ ఫాస్పెట్, 1.6 కేజీ పాటాష్ ఎరువులు అందించడం ద్వారా నారుమడి ఎదుగులకు ఇబ్బందులు లేకుండా, వేగంగా పెరుగుతుందన్నారు, వాటితో పాటు జింక్ సల్ఫేట్ 2 గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలన్నారు. నారుమడికి పలుచగా తాజా నీరు అందిస్తుండాలన్నారు. అయినా నారుమడి సరైన ఎదుగుదల లేనిచో 17–17–17 ను 10 గ్రాముల నీటికి బూస్టర్ మోతాదుగా పిచికారీ చేయాలన్నారు. రాజమహేంద్రవరం రూరల్: స్థానిక ఈపీఎఫ్ఓ ప్రాంతీయ కార్యాలయం పరిధిలో ఈ నెల 29న నిధి ఆప్ కే నికట్ జిల్లా ఔట్రీచ్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అసిస్టెంట్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ యు.శ్రీనివాసరావు గురువారం ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపారు. తూర్పు గోదావరి జిల్లాకు సంబంధించి రామచంద్రపురంలోని వీఎస్ఎం ఇంజినీరింగ్ కళాశాల, కాకినాడ జిల్లాకు వాకలపూడిలోని ప్యారీ షుగర్స్, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి అయినవిల్లి మండలం పోతుకుర్రులోని త్రీ సీజన్స్ ఎగ్జిమ్ లిమిటెడ్లోను, ఏలూరు జిల్లాకు దేవరపల్లి గ్రామంలోని గోపాలపురం రోడ్డులో ఉన్న పరమేశు బయోటెక్లోను, పశ్చిమగోదావరి జిల్లాకు పాలకోడేరులోని ఆనంద ఎంటర్ప్రైజెస్లోను, అల్లూరి సీతారామరాజు జిల్లాకు మారేడుమిల్లి కేజీబీవీ స్కూల్లోనూ ఈ కార్యక్రమాలు జరుగుతాయని వివరించారు. అంతర్జాతీయ కార్మికుల ప్రయోజనాలు, కవరేజ్ సర్టిఫికెట్, ఈపీఎఫ్, సభ్యుడు తనిఖీ చేయాల్సిన అంశాలు, 15జి/15హెచ్, పన్ను సంబంధిత ఈపీఎఫ్ గురించి ఈ సందర్భంగా వివరిస్తారని తెలిపారు. పీఎఫ్ సభ్యులు, పింఛనుదార్లు, వివిధ సంస్థలు ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకోవాలన్నారు. పీఎఫ్ అంశాలపై ఈ సందర్భంగా ఫిర్యాదులు సమర్పించవచ్చన్నారు. పింఛనుదారులు డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ కూడా ఈ శిబిరాల్లో అందించవచ్చని శ్రీనివాసరావు తెలిపారు. ద్వారకాతిరుమల: చిన వెంకన్న దివ్య క్షేత్రంలో గురువారం శ్రీవారి తిరువీధి సేవ నేత్రపర్వంగా నిర్వహించారు. ధనుర్మాస ఉత్సవాలను పురస్కరించుకుని నిత్యం ఆలయంలో విశేష కార్యక్రమాలు చేస్తున్నారు. అందులో భాగంగా ఉదయం స్వామి, అమ్మవార్లు, గోదాదేవి ఉత్సవ మూర్తులను ప్రత్యేకంగా అలంకరించిన తొళక్క వాహనంపై ఉంచి విశేష పుష్పాలంకారాలు చేశారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, అర్చకులు, పండితుల వేద మంత్రోచ్ఛరణలు, గజ, అశ్వ సేవల నడుమ స్వామి వారి వాహనం క్షేత్ర పురవీధుల్లో తిరుగాడింది. ఆ తరువాత స్థానిక ధనుర్మాస మండపంలో శ్రీవారు, అమ్మవార్లకు అర్చకులు విశేష పూజలు చేసి, భక్తులకు తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. -
శోభనాచలుని సొమ్ము అప్పగించాల్సిందే
ఆగిరిపల్లి : శోభనాచలుని సొమ్ము వడ్డీతో సహా చెల్లించిన తర్వాతే మాఘమాస రథసప్తమి ఉత్సవాలు జరిపించాలని గ్రామస్తులు, కుల సంఘాల వారు డిమాండ్ చేశారు. జిల్లాలో పవిత్ర పుణ్యక్షేత్రమైన శోభనాచల వ్యాఘ్ర లక్ష్మీ నరసింహస్వామి మాఘ మాస రథసప్తమి ఉత్సవాలపై గురువారం ఆలయ ఆవరణలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కార్య నిర్వహణ అధికారి సాయి మాట్లాడుతూ ఉత్సవాలు జనవరి 19 నుంచి 29 వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో కుల సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ గత 20 ఏళ్ల నుంచి స్వామివారి అన్నదానానికి భక్తుల నుంచి వసూలు చేసిన లక్షలాది రూపాయల చందాలు వివరాలు, నగదును అప్పచెబుతామని చెప్పి ఏడాది అవుతున్నా, అన్నదాన కమిటీ సభ్యులు ఇప్పటివరకు వివరాలు ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. అన్నదాన చందాలకు వసూలు చేసిన డబ్బులతో కొందరు వ్యక్తులు వడ్డీ వ్యాపారం చేయటం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడేళ్ల క్రితం అప్పటి ఎమ్మెల్యే, ఆలయ వంశపారంపర్య ధర్మకర్త మేకా వెంకట ప్రతాప్ అప్పారావు చొరవ తీసుకొని గ్రామ పెద్దలతో కమిటీ ఏర్పాటు చేసి అన్నదానం నిర్వహించారు. రెండు సంవత్సరాలకు ఖర్చులు పోను రూ.5.75 లక్షలు మిగలగా వాటిని బ్యాంక్ ఖాతాలో జమ చేశారు. మరి 20 సంవత్సరాలకి ఎన్ని లక్షలు ఉండాలో చెప్పాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. స్వామివారికి అన్నదాన కమిటీ సభ్యులు ఇవ్వాల్సిన లక్షలాది రూపాయలకు వడ్డీతో సహా చెల్లించిన తర్వాతే మాఘమాస రథసప్తమి ఉత్సవాలు జరిపించాలని గ్రామస్తులు, కుల సంఘాల వారు డిమాండ్ చేశారు. డిమాండ్ చేసిన గ్రామస్తులు -
ఆడుకుంటూ మాయమై అనంత లోకాలకు
పెనుగొండ: ఆడుతూ..పాడుతూ కానరాని లోకాలకు చేరి తల్లిదండ్రులకు పుత్ర శోకాన్ని మిగిల్చాడో బాలుడు. గురువారం పెనుగొండ పంచాయతీ పార్కు వద్ద ఆటలాడుతూ మాయమై చివరికి చెరువులో శవమై తేలాడు. వివరాల్లోకి వెళితే ఇరగవరం మండలం తూర్పువిప్పరు శివారు ఆర్ ఖండ్రికకు చెందిన జొన్నల ధనరాజు పెనుగొండ పంచాయతీ పార్కు వద్ద స్వీట్సు, బేకరీ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. ధనరాజుకు కుమారుడు, కుమార్తే సంతానం. గురువారం క్రిస్మస్ సెలవుకు కావడంతో కుమారుడు ఈశ్వర దుర్గా సత్య వెంకటేష్ అలియాస్ ఈశ్వర్ (5)ను తీసుకువచ్చి పార్కులో కుమారుడుతో కలసి ఆటలాడాడు. ఇంతలో బేకరీలో బేరం రావడంతో ధనరాజు పనిలో నిమగ్నం కాగా తరువాత బాలుడి కనిపించలేదు. ఎంత వెతికినా కపించకపోవడంతో గ్రామ సర్పంచ్ నక్కా శ్యామలాసోనీ చొరవతో, పెనుగొండ ఎస్సై కే గంగాధర్ సిబ్బంది చెరువులో గాలించగా బాలుడి మృతదేహం లభ్యమైంది. దీంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించడంతో పార్కు వద్ద తీవ్ర విషాదం నెలకొంది. కాగా బాలుడు మాయం కావడంతో పెనుగొండలో కిడ్నాప్ అంటూ ప్రచారం జరిగింది. ఈ తరుణంలో అనుమానంతో చెరువులో గాలింపు చర్యలు చేపట్టగా బాలుడి మృతదేహం లభ్యం కావడంతో కిడ్నాప్ ప్రచారానికి తెరపడింది. -
అన్నదాతపై ‘ఎరువు’ దరువు
నిడమర్రు: సార్వాలో అధిక వర్షాల కారణంగా దిగుబడులు పడిపోయి రైతన్నలు కుదులేయ్యారు. ప్రస్తుతం రబీలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుమ్మకై ్క ఎరువుల ధరలు పెంచడంతో అన్నదాతల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. కాంప్లెక్స్ ఎరువుల ధరలు భారీగా పెంచడం వలన రైతు నెత్తిన అదనంగా పెట్టుబడి భారం పడుతోంది. ఎరువుల నుంచి డీజిల్, పెట్రోల్ ధరల పెరుగుదల రైతులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. రబీ సీజన్లో ఉంగుటూరు నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో 48,883 ఎకరాల్లో రైతులు వరి సాగు చేస్తున్నారు. మరో రూ.30 వేల ఎకరాల్లో పాయాయిల్, మామిడి, కూరగాయలు వంటి ఇతర పంటలు సాగవుతున్నాయి. వరి సాగులో రైతులు ఎకరాకు 6 నుంచి 7 బస్తాల వరకూ ఎరువులు ఉపయోగిస్తారు. ఇందులో మూడు బస్తాల కాంప్లెక్స్ ఎరువు ఉంటుంది. దీంతో నియోజకవర్గంలో అధికారుల గణాంకాల ప్రకారం 26 వేల బస్తాల వరకూ కాంప్లెక్స్ ఎరువులు వినియోగిస్తున్నట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. రైతులు ఎక్కువగా 28–28–0, 10–26–26, వంటి కాంప్లెక్స్ ఎరువులను వినియోగిస్తారు. బ్లాక్ మార్కెట్లోనే యూరియా అధికారులు రైతు భరోసా కేంద్రాలు, సొసైటీల ద్వారా రైతులకు అవసరమైన యూరియా అందిస్తున్నట్లు చెబుతున్నా, క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితిలేదని రైతులు చెబుతున్నారు. సొసైటీల ద్వారా ఇచ్చే యూరియాను మొదటి కోటా అంటూ ఎకరాకు 1 బస్తా చొప్పునే ఇస్తున్నారు. దీంతో మిగిలిన బస్తాలను ప్రైవేట్ మార్కెట్లో కొనుగోలు చేస్తున్నారు. యూరియా బస్తా ఎంఆర్పీ రూ.266 ఉంటే హోల్ సెల్ మార్కెట్లో రూ.290తో పాటు రవాణా కిరాయి రూ.41 కలుపుకుంటున్నారు. దీంతో రూ.266కు బదులు అదనంగా రూ.350 వరకూ పెట్టి రైతులు కొనుగోలు చేయాల్సి వస్తోంది. దీంతో యూరియాపై బస్తాకు రూ.90 అదనపు భారం పడుతోందని రైతులు చెబుతున్నారు. మరి కొందరు డీలర్లు మిశ్రమ ఎరువులతోపాటు జింక్, దుబ్బుగుళికలు తప్పనిసరిగా తీసుకోవాలని రైతులపై ఒత్తిడి తెస్తున్నట్లు వాపోతున్నారు. ధరల నియంత్రణలో చంద్రబాబు సర్కారు మరోసారి రైతులను మోసం చేసిందంటూ స్థానిక రైతులు విమర్శిస్తున్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వంలో రైతులకు ఊరట 2019 నుంచి 2024 వరకు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఆ సమయంలో రసాయన ఎరువుల ధరలు ఒక్కసారి కూడా పెరిగిన ధాఖలాలు లేవు. ఎరువుల ధరలు నిలకడగా ఉంటంతో రైతులకు ఊరట లభించింది. కానీ ప్రస్తుతం ఎరువుల ధరలు పెంచడంలో టీడీపీ, జనసేనలు కేంద్రానికి పూర్తి మద్దతు ఇచ్చాయనే ప్రచారం సాగుతోంది. ఎరువు పాత రబీలో ధర రూ. ధర రూ. 14–35–14 1,800 1,900 20–20–0–13 1,350 1,450 28–28––0 1,750 1950 10–26–26 1,700 1,800 16–16–16 1450 1,600 16–20–0–13 1,150 1,250 పొటాష్ 1,700 1,800గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడూ బీజేపీ సర్కారు ఎరువుల ధరలు పెంచినా వ్యతిరేకించలేదు. నేడు ఎరువుల ధరలు పెరిగి రైతులు ఆందోళన చెందుతున్నా పట్టించుకోవడం లేదు. ఎన్నికల్లో మాత్రం రైతు పక్షపాతిని అంటూ ఊదరగొట్టి అధికారంలోకి వచ్చి ఏడాదిన్నరలో 3 సార్లు ఎరువుల ధరలు పెంచి రైతుల నడ్డివిరచడం దారుణం. – అలుమోలు గంగారాం, రైతు, బువ్వనపల్లి సార్వాలో వరుస తుపాన్లు, అధిక వర్షాల కారణంగా దిగుబడి గణనీయం పడిపోయింది. దీంతో కౌలు రైతులకు పెట్టుబడులు కూడా రాని పరిస్థితి. ఇప్పుడు అమాంతం ఎరువుల ధరలు పెంచడం వలన రబీలో పెట్టుబడి మరింత పెరుగుతోంది. పెరిగిన ధరను రాష్ట్ర ప్రభుత్వం భరించాలి. – మచ్చకర్ల సాయిబాబా, కౌలు రైతు, బువ్వనపల్లి అడ్డగోలుగా ధరలు పెంచిన ఎరువుల కంపెనీలు బస్తాపై రూ.100 నుంచి రూ.200 వరకు పెంపు యూరియా బ్లాక్ మార్కెట్లో కొనుగోలు చేస్తున్న రైతులు -
బరితెగింపు ఆగేనా..?
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఉమ్మడి పశ్చిమలో సంక్రాంతి కోడిపందేల సన్నాహాలకు తెరలేచింది. గ్రామాలవారీగా నిర్వహించుకునే చిన్నపాటి పందెం బరులు మొదలు కూటమి నేతలు ఏర్పాటు చేసే భారీ బరులు, అలాగే కొన్నిచోట్ల ప్రజాప్రతినిధులే తెరచాటు నిర్వాహకులుగా ఏర్పాటు చేసే పందెంబరులపై పోలీసులు దృష్టి సారించలేదు. ఇప్పటికే పల్లెల్లో సంక్రాంతి సందడి ప్రారంభమై వచ్చే వారం నుంచి అక్కడక్కడా కోడిపందేల నిర్వహణకు సన్నద్ధమవుతున్నా పోలీసులు మాత్రం కట్టడి దిశగా కనీస కార్యాచరణ ప్రారంభించలేదు. రాష్ట్రంలోనే ఖ్యాతి : ఉమ్మడి పశ్చిమ కోడిపందేల నిర్వహణకు రాష్ట్రంలో ఖ్యాతిగాంచింది. తీవ్రస్థాయి అడ్డంకులు, కోర్టు ఉత్తర్వులు ఇలా ఎన్ని ఉన్నా చట్ట పరిధిలోబడి అంటూ ముసుగులో భారీ ఎత్తున కోడిపందేలు, పేకాట, గుండాట జూద క్రీడలు నిర్వహిస్తుంటారు. సాధారణంగా సంక్రాంతి మూడు రోజులు అంత సీరియస్గా తీసుకోకపోయినా మిగిలిన రో జుల్లోనైనా కట్టడి చేయాల్సిన పరిస్థితి. అయితే పోలీసులు మాత్రం స్టేషన్ల వారీ వ్యవహారాలకు బైండోవరై యథేచ్ఛగా పందేల నిర్వహణకు పరోక్షంగా సహకరిస్తున్నారనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. ప్రధానంగా సంక్రాంతి సీజన్ ప్రారంభంలో పందెంకోళ్ల పెంపకందారులపై కేసులు, గతంలో పందెం బరులు నిర్వహించినవారిపై, బెట్టింగ్రాయుళ్లు, కోడికత్తులు తయారీదారులపై బైండోవర్ కేసులు నమోదు చేసి విచ్చలవిడి క్రీడలు కొంత మేరకై నా కట్టడి చేసేవారు. ఈసారి అలాంటి చర్యలేవీ తీసుకోని పరిస్థితి. దీంతో అన్ని నియోజకవర్గాల్లో భారీ బరులకు మంతనాలు తీవ్రస్థాయిలో జరుగుతున్నా యి. పేకాటకు, గుండాటకు కోడిపందేల బరులకు ఇ లా ఒక్కోదానికి ఆటస్థాయి బట్టి రేట్లు ఖరారు చేసి స్థానిక స్టేషన్ మొదలు ప్రజాప్రతినిధి వరకూ ఒక మొత్తాన్ని ఇచ్చేలా చర్యలు జోరుగా సాగుతున్నా యి. ఇక అధికార పార్టీ నాయకులే పూర్తిగా కోడిపందేల బరులు నిర్వహించేలా ఇప్పటికే మండలాల్లో ఖరారు చేసుకుని ముందుకు సాగుతున్నారు. ప్ర ధానంగా తాడేపల్లిగూడెంలో ఒక బరి కేవలం రా యలసీమ నుంచి వచ్చే అతిథుల కోసం సన్నద్ధం చే స్తుండగా ఉండి, పాలకొల్లు, భీమవరం, ఉంగుటూ రు నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో భారీ బరులను ఏర్పాటు చేసేలా హడావుడి చేస్తున్నారు. కోడి.. రె‘ఢీ’ పల్లెల్లో సంక్రాంతి బరులకు సన్నాహాలు పొలిటికల్ బరులపై రెగ్యులర్ పంచాయితీలు మొక్కుబడి కేసులకే పోలీసు శాఖ పరిమితం ముందస్తు బైండోవర్లపై దృష్టి సారించని వైనం కోడికత్తుల తయారీదారులపై తీసుకోని చర్యలు గతంలో హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో పోలీసు యంత్రాంగం కోడిపందేల నియంత్రణకు నెల రోజు ల ముందు నుంచే చర్యలు తీసుకునేది. డిసెంబర్ 15 నుంచే పందెం నిర్వాహకులు, పేకాట, గుండాట, కోడికత్తుల తయారీదారులపై కేసులు నమోదు చేసేది. ఉమ్మడి పశ్చిమలో 2024లో 187 కేసులు, 360 మందికి నో టీసులు, 700ల మందికిపైగా బైండోవర్లు, 1,856 కోడికత్తులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ ఏడాదిలో ఇంకా బైండోవర్లపై అధికారులు దృష్టి సారించని పరిస్థితి. -
శుభోదయం.. శాంతి సందేశం
క్రిస్మస్ అంటే ఐక్యత, శాంతి, కరుణ, ప్రేమ, ఓర్పు సందేశాలను చాటిచెప్పే శుభదినం. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా గురువారం క్రిస్మస్ వేడుకలు అంబరాన్నంటా యి. క్రైస్తవ మందిరాల్లో విశ్వాసులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పాస్టర్లు శాంతి సందేశాన్ని ఇచ్చి క్రిస్మస్ ఔన్నత్యాన్ని వివరించారు. – సాక్షి నెట్వర్క్ ద్వారకాతిరుమల: దొరసానిపాడులో ఏసు పల్లకి ఊరేగింపు నరసాపురం: లూథరన్ చర్చిలో ప్రార్థనలు చేస్తున్న విశ్వాసులు, (ఇన్సెట్లో) ఏలూరు: సెయింట్ థెరిస్సా చర్చిలో ప్రార్థనలు చేస్తున్న బిషప్ పొలిమేర జయరావు -
పీయూసీ విద్యార్థులకు గ్రాఫిక్ డిజైనింగ్ వర్క్షాప్
నూజివీడు: నూజివీడు ట్రిపుల్ ఐటీలో పీయూసీ విద్యార్థులకు గురువారం గ్రాఫిక్ డిజైనింగ్ వర్క్షాపును నిర్వహించారు. ఈ వర్క్షాప్కు హాజరైన ప్రముఖ గ్రాఫిక్ డిజైనర్ కేవీ ప్రతాప్ గ్రాఫిక్ డిజైనింగ్ రంగానికి సంబంధించిన అనేక అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. డిజైన్ అనేది ఒక బ్రాండ్కు మౌన రాయబారి అనే భావనతో విద్యార్థులకు ప్రేరణ కల్పించారు. వర్క్షాప్లో భాగంగా గ్రాఫిక్ డిజైన్, దాని మౌలిక సూత్రాలు, గ్రాఫిక్ డిజైన్ ఉపయోగించే రంగాలు, వివిధ డిజైనింగ్ టూల్స్, కాన్సెప్ట్, స్ట్రాటజీ వంటి అంశాలను సులభమైన ఉదాహరణలతో వివరించారు. విద్యార్థుల సందేహాలకు ప్రత్యక్షంగా సమాధానాలు ఇవ్వడంతో పాటు, డిజైన్ రంగంలో ఉన్న అవకాశాలు, కెరీర్ దిశగా తీసుకోవాల్సిన చర్యలపై కూడా స్పష్టత ఇచ్చారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను మరిన్ని రంగాల్లో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థుల్లో నూతన ఆలోచనలు, సాంకేతిక అవగాహన పెంపొందించడమే లక్ష్యంగా ఇలాంటి వర్క్షాపులు నిర్వహిస్తున్నామన్నారు. భీమవరం: కాలువలోకి దూకి ఓ వృద్ధురాలు ఆత్మహత్యకు పాల్పడింది. భీమవరం రెండో పట్టణానికి చెందిన డి.పద్మావతి(62) లోసరి– గూట్లపాడు కాలువలో పడి ఆత్మహత్య చేసుకుంది. కొంతకాలం నుంచి ఆమె మానసిక అనారోగ్యంతో ఇబ్బంది పడుతూ చికిత్స పొందుతుందని, బుధవారం రాత్రి నుంచి ఆమె కనిపించడం లేదని కుటుంబ సభ్యులు తెలిపారు. ఎస్సై రామారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. -
రహదారి ప్రమాదాల నివారణే లక్ష ్యం
జంగారెడ్డిగూడెం: ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ఏఎస్పీ సుస్మిత రామనాథన్ అన్నారు. రహదారి ప్రమాదాల నివారణే లక్ష్యంగా జంగారెడ్డిగూడెం పట్టణంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో భారీ స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. హెల్మెట్లు ధరించకుండా, నంబర్ ప్లేట్లు లేకుండా తిరిగే వాహనాలను నిలుపుదల చేసి, జరిమానాలు విధించడంతో పాటు, సదరు వాహదారులతో హెల్మెట్లను కొనుగోలు చేయించారు. ఇకపై ఎవరైనా నబర్ ప్లేట్లు లేకుండా వాహనాలు నడిపితే వాహనాలను సీజ్ చేస్తామని ఏఎస్పీ సుచిత్ర రామనాథన్ హెచ్చరించారు. హెల్మెట్ లేని వాహనదారులకు, సరైన పత్రాలు లేని వారికి రహదారి భద్రతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఏఎస్పీ సుచిత్ర రామనాథన్ మాట్లాడుతూ రహదారి ప్రమాదాల్లో మరణిస్తున్న వారిలో అత్యధికులు యువతే ఉండటం ఆందోళనకరమని పేర్కొన్నారు. ఈ తనిఖీలో జంగారెడ్డిగూడెం ఇన్స్పెక్టర్ ఎంవీ సుభాష్, ఎస్సై వీర ప్రసాద్, ట్రాఫిక్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఆకివీడు: రెండు మోటార్సైకిళ్లు ఢీకొన్న ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి. స్థానిక ఐ భీమవరం రహదారిలో మూడు తుమ్ముల వద్ద గురువారం సాయంత్రం రెండు మోటార్ సైకిళ్లు వేగంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో భీమవరంనకు చెందిన సుదీప్ కాలు విరగడంతో ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మరో వ్యక్తి 108లో వెళ్లి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. దీనిపై ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. క్షతగాత్రులు మద్యం సేవించి వాహనాలను నడుపుతున్నట్లు స్థానికులు చెప్పారు. -
బంగారయ్యకు రాష్ట్ర స్థాయి అవార్డు
ఆకివీడు : వినియోగదారులకు విశిష్ట సేవలందిస్తున్న జిల్లా వినియోగదారుల సంఘాల అధ్యక్షుడు బొబ్బిలి బంగారయ్య గురువారం రాష్ట్ర స్థాయి అవార్డును అందుకున్నారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన జాతీయ వినియోగదారుల దినోత్సవంలో సివిల్ సప్లయ్ ఎండీ ఢిల్లీరావు, డైరెక్టర్ గోవిందరావు, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా చేతుల మీదుగా అవార్డు అందుకున్నట్లు బంగారయ్య చెప్పారు. గత 36 ఏళ్లుగా వినియోగదారులకు చేసిన సేవల్ని గుర్తించి ఈ అవార్డు బహుకరించారన్నారు. ద్వారకాతిరుమల: శ్రీవారి క్షేత్రం గురువారం భక్తజన సంద్రమైంది. క్రిస్మస్ పండుగ సందర్భంగా సెలవు కావడంతో వేలాది మంది భక్తులు తెల్లవారుజాము నుంచే ఆలయానికి తరలివచ్చారు. దాంతో క్షేత్ర పరిసరాలు సందడిగా మారాయి. మధ్యాహ్నం అనుకోకుండా భక్తుల తాకిడి విపరీతంగా పెరిగింది. దాంతో ఆలయ తూర్పురాజగోపుర ప్రాంతం, దర్శనం క్యూలైన్లు, వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని కంపార్ట్మెంట్లు, కేశఖండనశాల ఇతర విభాగాలు భక్తులతో పోటెత్తాయి. కొండపైన ఘాట్ రోడ్లు భక్తుల వాహనాలతో నిండిపోయాయి. రాత్రి వరకు క్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగింది. పాలకొల్లు సెంట్రల్: తండ్రి అంతిమ సంస్కారాల్లో కుమార్తె తలకొరివి పెట్టిన ఘటన పాలకొల్లులో చోటుచేసుకుంది. పట్టణంలోని గుత్తులవాని పేటకు చెందిన పంపన నరసింహస్వామి (రాజు) (43) ఎలక్ట్రిషీయన్గా పని చేస్తుంటాడు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రాజు గురువారం మృతి చెందాడు. అతనికి భార్య, కుమార్తె ఉన్నారు. అంతిమ సంస్కారాల్లో భాగంగా అబ్బాయిలు లేకపోవడంతో కుమార్తె ముందుకు వచ్చి తండ్రి రాజుకు తలకొరివి పెట్టింది. ఈ ఘటన చూసిన పలువురు కంటతడి పెట్టారు. భీమవరం: రాష్ట్రస్థాయి పురోహిత క్రికెట్ పోటీల్లో మరో 2 జట్లు క్వార్టర్స్ దశకు చేరాయి. భీమవరంలో జరుగుతున్న పోటీల్లో భాగంగా గురువారం అమలాపురం, తిరుపతి జట్లు క్వార్టర్స్కు చేరుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు. గురువారం జరిగిన పోటీల్లో వైజాగ్ జట్టుపై తిరుపతి, భీమవరంపై అమలాపురం, వైజాగ్పై చైన్నె, కాకినాడ కార్తికేయ టీమ్పై కాకినాడ రుద్ర టీమ్, ఖమ్మంపై తిరుపతి, విజయవాడపై చైన్నె కాకినాడపై వైజాగ్, వైజాగ్పై అమలాపురం జట్లు విజయం సాధించాయి. -
గోదావరి మాత పురస్కారాల ప్రదానం
గణపవరం: గణపవరానికి చెందిన రుద్రరాజు ఫౌండేషన్ ఆధ్వర్యంలో కన్యకాపరమేశ్వరి వర్తకసంఘ భవనంలో గురువారం గోదావరి మాత అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా సర్వోదయ మండలి కార్యదర్శి ఇందుకూరి ప్రసాదరాజు మాట్లాడుతూ ఆయా రంగాల్లో నిష్ణాతులైన వారిని గుర్తించి, సత్కరించడం ద్వారా నేటి తరానికి వారి సేవలను పరిచయం చేసే అవకాశం లభిస్తుందన్నారు. గణపవరంలో గోదావరి మాత పేరిట మూడు దశాబ్దాలుగా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ రంగాల్లో లబ్దప్రతిష్టులైన పలువురు ప్రముఖులను సన్మానించడం అభినందనీయమని అన్నారు. ఈకార్యక్రమాన్ని నిర్వహిస్తున్న రుద్రరాజు ఫౌండేషన్ చైర్మన్ ఆర్వీఎస్ రాజు దంపతులను అభినందించారు. ఈఏడాది డీవీడీ సత్యనారాయణ (పద్యకవిత రంగం), జి.అన్నపూర్ణ (సంగీతం), బత్తులు రాజు (చిత్రకళారంగం, పిప్పర), చిలువూరి రామకృష్ణంరాజు (సినీ నాటకరంగం దర్శకులు)లకు గోదావరి మాత అవార్డులు, నగదు, జ్ఞాపికలను అందచేసి సత్కరించారు. ఈ కార్యక్రమంలో వర్తక సంఘ భవనం ఉపాధ్యక్షుడు వంకాయల రామారావు, కార్యదర్శి నడింపల్లి రాంపండు, త్యాగరాజ కళాక్షేత్రం కార్యదర్శి మాదేటి సురేష్, తెలుగు రచయితల సంఘం జిల్లా కార్యదర్శి తెన్నేటి లక్ష్మీనర్సింహమూర్తి, యండపల్లి పాండు రంగారావు తదితరులు పాల్గొన్నారు. -
భీమవరం డీఎస్పీగా రఘువీర్ విష్ణు
భీమవరం: భీమవరం డీఎస్పీ రావూరి గణేష్ జయసూర్య బదిలీ అ య్యారు. ఆయన స్థానంలో కాకినాడ నుంచి రఘువీర్ విష్ణు డీఎస్పీగా నియమితులయ్యారు. అవినీతి ఆరోపణల నేపథ్యంలో జయసూర్యపై విచారణకు అక్టోబర్లో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశించిన సంగతి తెలిసిందే. జయసూర్య తన పరిధిలో పేకాట క్లబ్బుల నిర్వహణ, కోడి పందేలు, ప్రైవేట్ సెటిల్మెంట్లు చేస్తున్నారంటూ ఫిర్యాదులు అందాయి. ఈ క్రమంలో ఆయనపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇటీవల సత్యసాయి జిల్లాలో ప్రధాని మోదీ పర్యటన బందోబస్తుకు వెళ్లిన జయసూర్య గాయం కావడంతో సెలవులో ఉన్నారు. ఈ తరుణంలో జయసూర్యను వీఆర్కు పంపిస్తూ మంగళగిరి డీఐజీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశించినట్టు తెలిసింది. భీమవరం: మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జయంతి, సుపరిపాలన దినోత్సవం సందర్భంగా నరసాపురం పార్లమెంట్ పరిధిలో సంసద్ ఖేల్ మహోత్సవ్ ముగింపు వేడుకలు భీమవరం విష్ణు కాలేజీ ఆడిటోరియంలో గురువారం నిర్వహించారు. దేశవ్యాప్తంగా 300పైగా పా ర్లమెంట్ స్థానాల్లో నిర్వహించిన ఈ పోటీల్లో విజేతలుగా నిలిచిన క్రీడాకారులతో ప్రధాని మోదీ వర్చువల్ విధానంలో పాల్గొని ప్రసంగించారు. ప్రధాని మాట్లాడుతూ 2014కు ముందు క్రీడాకారుల ఎంపికలో అవినీతి, బంధుప్రీతి రాజ్యమేలేవని, గత దశాబ్ద కాలంలో ఆ వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేసి పారదర్శకతను తీసుకువచ్చామని పేర్కొన్నారు. క్రీడాకారులు కేవలం వ్యక్తిగత విజయం కోసమే కాకుండా దేశ గౌరవం కోసం, మువ్వన్నెల జెండా కీర్తిని విశ్వవ్యాప్తం చేయడం కోసం ఆడాలని ఆయన పిలుపునిచ్చారు. కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమలశాఖ సహాయమంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ ఆధ్వర్యంలో నరసాపురం పార్లమెంట్ పరిధిలోని వివిధ ప్రాంతాలలో ఈనెల 23 నుంచి సంబరాల్లో భాగంగా క్రీడాకారులకు చెస్, వాలీబాల్, బాస్కెట్బాల్, కబడ్డీ పోటీలను నిర్వహించారు. ముగింపు వేడుకల్లో పోటీల్లో విజేతలకు జాయింట్ కలెక్టర్ టి.రాహుల్కుమార్రెడ్డి బహుమతులు అందించారు. ద్వారకాతిరుమల: ప్రభుత్వ పోరంబోకు భూమి కబ్జా వ్యవహారంపై టీడీపీ నేతలు దొంగాట ఆడుతున్నారు. భూకబ్జా నువ్వే చేశావంటే.. కాదు నువ్వే చేశావంటూ ఆరోపణలు చేసుకుంటున్నా రెవెన్యూ అధికారులు తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నా రు. వివరాల్లోకి వెళితే.. ద్వారకాతిరుమల మండ లం తిమ్మాపురంలోని ఆర్ఎస్ నం.220లో 9 ఎకరాల ప్రభుత్వ పోరంబోకు భూమిని టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు గంటా శ్రీనివాసరావు అధికారాన్ని అడ్డంపెట్టుకుని కబ్జా చేశారని అదే గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు తూంపాటి పద్మవరప్రసాద్ ఆరోపించారు. భూమి లో చేపల చెరువు తవ్వతున్నారని అధికారులకు ఫిర్యాదు కూడా చేశారు. దీనిపై ‘సాక్షి’లో గురువారం ‘ఈ భూ కబ్జాను అడ్డుకునేదెవరూ?’ శీర్షికన కథనం ప్రచురితమైంది. దీంతో శ్రీనివాసరావు వర్గీయులు అసలు కబ్జాదారుడు పద్మవరప్రసాదే అంటూ ఆరోపణా స్త్రాలను సంధిస్తున్నారు. వరప్రసాద్ తన తల్లి సత్యవతి పేరున ఈ ఏడాది అక్టోబర్లో వివాదాస్పద భూమి తనదేనంటూ రెవెన్యూ అధికారులు, కలెక్టర్కు పెట్టిన అర్జీ పత్రాన్ని శ్రీనివాసరావు వర్గీయులు బహిర్గతం చేశారు. హైకోర్టులో సైతం దీనిపై కేసు వేశారని చెబుతున్నారు. శ్రీనివాసరావు కబ్జా చేశారని చెబుతున్న అదే భూమి తనదంటూ వరప్రసాద్ తల్లి సత్యవతి పేరున అర్జీ ఎలా పెట్టారని ప్రశ్నిస్తున్నారు. ఆర్ఎస్ నం.220లోని 11 ఎకరాల భూమిలో 5 ఎకరాల భూమిని దశాబ్దాల క్రి తం శ్రీనివాసరావు ఒక ఎక్స్ సర్వీస్మెన్ నుంచి కొనుగోలు చేశారని, భూమిలో కొంత దారులకు పోగా, మిగిలిన భూమిని వరప్రసాద్ కబ్జా చేశారని ఆరోపిస్తున్నారు. -
ప్రమాదంలో ప్రజారోగ్యం
సుస్తీ చేసి ప్రభుత్వాస్పత్రికి వెళ్తే మందుల కొరత.. వైద్యుల కొరత.. సౌకర్యాల లేమి.. ఉచిత వైద్యం కోసం ప్రైవేట్ ఆస్పత్రులకు వెళితే నిలిచిన ఆరోగ్యశ్రీ సేవలు.. పీహెచ్సీ వైద్యులు, సీహెచ్ఓలు, ఆశావర్కర్ల ధర్నాలు.. మంజూరు కాని 108, 104 వాహనాలు.. పింఛన్ల తొలగింపుతో దివ్యాంగుల ఆందోళనలు.. ఆస్పత్రుల్లో పనిచేసే పారిశుద్ధ్య కార్మికుల ఆకలి కేకలు.. మొత్తంగా జిల్లాలో 2025లో ప్రభుత్వ వైద్యం దినదిన గండంగా సాగింది.. పేదలకు ఉచిత వైద్యం అందని ద్రాక్షలా మారింది. చంద్రబాబు ఏలుబడిలో ప్రజారోగ్యంపై నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపించింది. భీమవరం(ప్రకాశం చౌక్): చంద్రబాబు ప్రభుత్వ పాలనలో వైద్యరంగంపై తీవ్ర నిర్లక్ష్యం కనిపిస్తోంది. ముఖ్యంగా 2025లో జిల్లాలో జరిగిన సంఘటనలు ఇందుకు సాక్ష్యంలా నిలుస్తున్నాయి. ప్రజల ప్రాణాలతో కూటమి సర్కారు చెలగాటమాడిందనే విమ ర్శలు వెల్లువెత్తాయి. చిన్నపాటి వైద్యానికి పేదలు వేలల్లో ఖర్చు చేయాల్సి పరిస్థితి వచ్చింది. పేదలపాలిట సంజీవనిలా నిలిచే ఆరోగ్యశ్రీ సేవలకు మే, అక్టోబర్లో అవాంతరాలు ఏర్ప డ్డాయి. నెట్వర్క్ ఆస్పత్రులకు ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో సేవలు నిలిచిపోయాయి. జిల్లాలో 30 వరకు నెట్వర్క్ ఆస్పత్రుల్లో సేవలు నిలిచి రోగులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్ వంటి అత్యవసర సేవలు అందక , అప్పులు చేసి వైద్యం చేయించుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడటంతో తల్లడిల్లిపోయారు. గ్రామాల్లో స్థానికంగానే వైద్య సేవలు అందాలని లక్ష్యంతో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి విలేజ్ క్లినిక్లను ఏర్పాటు చేసి వాటిలో సీహెచ్ఓలను నియమించారు. అయితే చంద్రబాబు ప్రభు త్వం విలేజ్ క్లినిక్లపై తీవ్ర నిర్లక్ష్యం వహించడంతో సీహెచ్ఓలు నిరసన బాట పట్టారు. మే నెలలో దాదాపు నెల రోజులపాటు వేతనాలు, సౌకర్యాల కోసం కలెక్టరేట్ వద్ద ధర్నాలు, నిరసనలు చేపట్టారు. ఆ సమయంలో గ్రామాల్లో వైద్య సేవలు అందక ప్రజలు అవస్థలు పడ్డారు. వైద్యారోగ్య శాఖలో పనిచేసే ఆశావర్కర్లు, ఏఎన్ఎంలు, ఆరోగ్యమిత్రలు, 104 ఉద్యోగులు, పీహెచ్సీ వైద్యులు ధర్నాలకు దిగారు. భీమవరం కలెక్టరేట్ వద్ద మే నెల నుంచి అక్టోబర్ వరకు పలు రూపాల్లో నిరసనలు తెలిపారు. ఆశావర్కర్లు, ఆరోగ్య మిత్రలు, 104 ఉద్యోగులు పనికి తగిన వేతనం చెల్లించాలని, పీహెచ్సీ వైద్యులు పదోన్నతుల కోసం నినదించారు. అయినా వారి డిమాండ్లను ప్రభుత్వం పూర్తిస్థాయిలో నెరవేర్చలేదు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భీమవరానికి 100 పడకల ఆస్పత్రిని మంజూరు చేయగా తొలుత రూ.10 కోట్లు, తర్వాత రూ. 28 కోట్ల నిధుల విడుదల చేశారు. అయితే చంద్రబాబు ప్రభుత్వం ఈ ఆస్పత్రి నిర్మాణాన్ని పట్టించుకోలేదు. దీంతో భవన నిర్మాణ పనులు మందగించాయి. జిల్లాలోని ప్రభుత్వాస్పత్రులు, పీహెచ్సీల్లో వైద్యు లు, సౌకర్యాల కొరత వేధిస్తోంది. వైద్యుల నియామకం, సౌకర్యాల కల్పనపై ప్రభు త్వం దృష్టి సారించలేదు. అలాగే మందులలేమితో రోగుల ఇబ్బంది పడ్డారు. గత ప్రభుత్వంలో జిల్లాకు కేటాయించిన 108,104 వాహనాలు తప్ప 2025లో రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఎలాంటి వాహనాలు కేటా యించలేదు. దీంతో పాత వాహనాలతోనే సేవలు అందిస్తున్నారు. 2025లో పెన్షన్ల పరిశీలన పేరిట దివ్యాంగులను దూరప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వాస్పత్రులకు రప్పించడంతో వీరంతా చాలా ఇబ్బంది పడ్డారు. పెన్షన్ తీసివేస్తారని మానసికంగా తీవ్ర ఆందోళన పడేలా ప్రభుత్వం వ్యవహరించింది. పరిశీలన పేరుతో పలువురి పింఛన్లు తొలగించింది. జిల్లాలోని ఏరియా, జిల్లా ప్రభుత్వాస్పత్రుల్లో సుమారు 200 మంది వరకు పారిశుద్ధ్య కార్మికులు పనిచేస్తున్నారు. వారికి ఏడాదంతా సజావుగా జీతాలు అందలేదు. మూడు, నాలుగు నెలలకోసారి కాంట్రాక్టర్ ద్వారా జీతాలు అందించడంతో వీరంతా నిరసనలు తెలిపారు. తమతో వెట్టిచాకిరీ చేయించుకుంటున్నారంటూ వినతిపత్రాలూ అందించారు. వైద్యం.. పూజ్యం ప్రజారోగ్యంపై ప్రభుత్వ నిర్లక్ష్యం రెండుసార్లు ఆరోగ్యశ్రీ సేవలు బంద్ పీహెచ్సీ వైద్యులు, సీహెచ్ఓల ధర్నాలు గ్రామాల్లో పూర్తిస్థాయిలో అందని సేవలు ఎక్కడికక్కడే నిలిచిన ఆస్పత్రి నిర్మాణాలు దవాఖానాల్లో వైద్యులు, సౌకర్యాలు, మందుల కొరత ఏడాదంతా దినదిన గండంలా సర్కారీ వైద్యం -
గిరి ప్రదక్షిణకు శరవేగంగా ఏర్పాట్లు
ఎరువు దరువు ప్రస్తుత రబీ సీజన్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుమ్మకై ్క ఎరువుల ధరలు పెంచడంతో అన్నదాతల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. కాంప్లెక్స్ ఎరువుల ధరలు భారీగా పెరిగాయి. 8లో uద్వారకాతిరుమల: ద్వారకాతిరుమల చినవెంకన్న గిరి ప్రదక్షిణకు ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా సిబ్బంది గిరి ప్రదక్షిణ మార్గంలోని రాళ్లను తొలగించి, మట్టితో వాటిని పూడ్చివేశారు. ప్రస్తుతం బ్లేడ్ ట్రాక్టర్తో చదును చేసే పనులు చురుగ్గా సాగుతున్నాయి. గోవింద స్వాములు, భక్తులు నడిచేందుకు వీలుగా ఈ మార్గంలో ఎండు గడ్డి వేయాలని అధికారులు నిర్ణయించారు. గోవింద స్వాములు ఇరుముడులు సమర్పించేందుకు బుకింగ్ కౌంటర్ల వద్ద హోమగుండాన్ని నిర్మించారు. దానికి పందిరి వేస్తున్నారు. గిరి ప్రదక్షిణ, స్వామివారి ఉత్తర ద్వార దర్శనం ఏర్పాట్లపై దేవస్థానం ఈఓ ఎన్వీఎస్ఎన్ మూర్తి ఐదు రోజుల క్రితం ఆలయ ప్రధానార్చకులు పీవీఎస్ఎస్ఆర్ జగన్నాథాచార్యులు, ఈఈ డీవీ భాస్కర్, డీఈఓ వై.భద్రాజీ, డీఈ టి.సూర్యనారాయణ, ఏఈఓలు మెట్టపల్లి దుర్గారావు, పి.నటరాజారావు, ఐ.రమణరాజు, జి.ఉమాపతి, సూపరింటెండెంట్లు, ఇంజనీరింగ్ విభాగ అధికారులు, సిబ్బందితో సమావేశం నిర్వహించి సూచనలు ఇచ్చారు. ఈనెల 29న శ్రీవారి గిరి ప్రదక్షిణ స్వామివారి తొలిమెట్ట (పాదుకా మండపం) వద్ద ప్రారంభమవుతుందని ఈఓ తెలిపారు. అదేరోజు రాత్రి 7 గంటల నుంచి స్వామివారి నిజరూప దర్శనం, మరుసటిరోజు 30న ఉదయం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఉత్తర ద్వార దర్శన భాగ్యాన్ని భక్తులకు కల్పిస్తామన్నారు. -
ఎరువులు అధిక ధరలకు అమ్మితే చర్యలు
భీమవరం : ఎరువులను ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు విక్రయించకూడదని జిల్లా వ్యవసాయాధికారి జెడ్.వెంకటేశ్వరరావు అన్నారు. బుధవారం చాంబర్ ఆఫ్ కామర్స్లో భీమవరం సబ్ డివిజన్ పరిధిలోని భీమవరం, పాలకోడేరు, వీరవాసరం మండలాల ఎరువుల డీలర్లకు, కోపరేటివ్ సొసైటీ సెక్రటరీలకు అవగాహన సమావేశం నిర్వహించారు. సమావేశంలో వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఎరువులను అధిక ధరలకు విక్రయిస్తే సంబంధిత డీలర్లపై ఎఫ్సీఓ 1985 యాక్ట్ ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. యూరియాను రైతులకు అందుబాటు ధరల్లో అందించాలన్నారు. ఎరువులు వచ్చిన వెంటనే రిజిస్టర్ నమోదు చేయడం, అమ్మిన, స్టాక్ రిజిస్టర్లు సక్రమంగా నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో ఏడీఏ కె.శ్రీనివాసరావు, ఏఓలు వైవీఎస్ ప్రసాద్, బి.సంధ్య, బిన్సిబాబు, డీలర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ హనుమంతరావు, డీలర్లు పాల్గొన్నారు. భీమవరం (ప్రకాశంచౌక్): పర్యావరణ హితమైన పరిశ్రమల స్థాపనకు నూతన పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ అధ్యక్షతన జిల్లా పరిశ్రమలు, ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశం బుధవారం నిర్వహించారు. గత సమావేశంలో తీసుకున్న చర్యల నివేదికను జిల్లా పరిశ్రమల శాఖ అధికారి సమావేశంలో వివరించారు. అనంతరం కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ జిల్లాలో వ్యవసాయం, ఆక్వా రంగాలలో అభివృద్ధి సంతృప్తికరంగానే ఉన్నదని, పారిశ్రామికంగా అభివృద్ధికి మరింత కృషి చేయాలన్నారు. జిల్లాలో కొత్తగా పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి అనేకమంది పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్నారని, నూతన పరిశ్రమల స్థాపనకు అనుమతులు, బ్యాంకు రుణాలు మంజూరు, మౌలిక వసతుల కల్పనలో అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. పాలకొల్లు సెంట్రల్ : పట్టణంలో ఓ మద్యం షాపు వద్ద కొనడానికి వెళ్లగా అదనంగా రూ.20 తీసుకున్నారని, ఎందుకని ప్రశ్నించిన వ్యక్తిపై దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితుల వివరాల ప్రకారం మంగళవారం రాత్రి మోకా వెంకట్ తన మిత్రుడైన పాలా సీతయ్యను మద్యం బాటిల్ తీసుకురమ్మని రూ.200 ఇచ్చాడు. బస్టాండ్ వద్ద షాపు వద్దకు వెళ్లి రూ.120 బాటిల్ అడిగాడు. అయితే రూ.140 తీసుకున్నాడు. ఇదేంటని ప్రశ్నించగా.. షాపులో ఉన్న వ్యక్తి సిండికేట్ పెంచమన్నారని తెలిపాడు. ఇలా దోచేస్తారా అని సీతయ్య ప్రశ్నించాడు. ఇంతలో షాపు లోపల ఉన్న మరో వ్యక్తి బయటకు వచ్చి సీతయ్యపై దాడి చేశాడు. నీకు దిక్కున్నచోట చెప్పుకో.. ఎవడొస్తాడో చూస్తానని బెదిరించాడు. ఇచ్చిన బాటిల్పై ఉన్న సీల్ను కూడా తీసేసి ఇచ్చారని సీల్ ఎందుకు తీసేశారో తెలియదని అన్నారు. దీంతో వెంకట్ కేసు పెట్టడానికి సిద్దమయ్యాడు. తమకు తెలుగుదేశం అంటే ప్రాణమని అదనంగా రూ.20 ఎందుకు తీసుకుంటున్నారని ప్రశ్నిస్తే కొట్టేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తంచేశాడు. టీడీపీ ప్రభుత్వంలో తగిన గుణపాఠం చెప్పారని ఆవేదన వ్యక్తంచేశాడు. పోలవరం రూరల్: పోలవరం మండలం కోండ్రుకోటలో పునరావాస కేంద్రాన్ని పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ) సీఈవో యోగేష్ పైథాంకర్ పరిశీలించి నిర్వాసితులతో మాట్లాడారు. పునరవాస కేంద్రంలోని నిర్వాసితుల కాలనీ, పాఠశాల, అంగన్వాడీ సెంటర్లు, సచివాలయం పరిశీలించారు. నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ అమలు, ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల అమలు తీరును గమనించి తెలుసుకున్నారు. నిర్వాసితులు సంతృప్తి వ్యక్తం చేశారన్నారు. అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలల్లో విద్యార్థులకు అందుతున్న విద్య, పౌష్టికాహారం పరిశీలించారు. గ్రామ సచివాలయాల్లో నిర్వాసితులకు అందుతున్న సౌకర్యాలు, అందిస్తున్న ఉద్యోగుల సేవలను అడిగి తెలుసుకున్నారు. నిర్వాసితుల సమస్యలను కూడా తెలుసుకున్నారు. -
ఇసుక బంద్
● ర్యాంపుల్లో అదనపు వసూళ్లు నిలిపివేసి నిర్ణీత ధరకే లోడింగ్ చేయించాలి ● లోడింగ్ ధరల పట్టికలు ఏర్పాటుచేయాలి ● జరిమానాలు రద్దుచేయాలి. లేనిపక్షంలో బిల్లు ఇవ్వకుండా లోడింగ్ చేస్తున్న ర్యాంపు నిర్వాహకులకు జరిమానాలు వేయాలి. ● ఆధార్పై ఆఫ్లైన్/ఆన్లైన్లో రోజువారీ సాండ్ బిల్లు ఇచ్చే వెసులుబాటు కల్పించాలి. ● టాస్క్ఫోర్సు పేరిట మైనింగ్ అధికారుల వేధింపులు ఆపాలి. ● గతంలో మాదిరి అదనపు రెండు మూడు టన్నులకు మినహాయింపు నివ్వాలి. సాక్షి, భీమవరం: ర్యాంపుల్లో అనధికార వసూళ్లు ఆపాలని, ధరల పట్టికలు ఏర్పాటుచేయాలని, అక్రమ జరిమానాలు రద్దుచేయాలని డిమాండ్ చేస్తూ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా క్వారీ లారీ అసోసియేషన్ తలపెట్టిన సమ్మె ఐదో రోజుకు చేరింది. జిల్లా వ్యాప్తంగా ఎక్కడి లారీలు అక్కడే నిలిచిపోవడంతో ఇసుక కోసం వినియోగదారులు ఇబ్బంది పడాల్సి వస్తోంది. ఉమ్మడి జిల్లాలోని 2 వేల క్వారీ లారీలు ఉన్నాయి. అధిక శాతం ఇసుక రవాణ ద్వారానే వీటికి పని దొరికేది. ఒక్కో లారీపై ఓనర్, ఇద్దరు డ్రైవర్లు, ఇద్దరు క్లీనర్లు చొప్పున ఐదు వేల కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయి. జిల్లాలోని సిద్దాంతం, నడిపూడి తదితర ర్యాంపులు సీఆర్జెడ్ పరిధిలోకి వెళ్లి మూతపడటంతో ఏడాది కాలంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలోని పెండ్యాల, తీపర్రు, జొన్నాడ, కొవ్వూరు, కపిలేశ్వరపురం తదితర ర్యాంపుల నుంచి ఇసుక రవాణ చేస్తున్నారు. ఉచిత ఇసుక పాలసీలో ర్యాంపు నిర్వాహకుల అక్రమాలతో లారీ యజమానులు నష్టపోవాల్సి వస్తుంది. ఇసుక ఉచితమని, ర్యాంపుల్లో కేవలం లోడింగ్ చార్జి చెల్లిస్తే సరిపోతుందని చంద్రబాబు ప్రభుత్వం చెబుతోంది. ర్యాంపుల్లో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంటోందని లారీ ఓనర్లు అంటున్నారు. ఆరు యూనిట్లు లారీకి ఇసుక లోడింగ్ నిమిత్తం రూ.1,900 చెల్లిస్తే సరిపోతుంది. బిల్లు కావాలంటే అదనంగా రూ.3,600 కలిపి రూ.5,500, బిల్లు లేకుండా అయితే రూ.4,500 వసూలు చేస్తున్నారని చెబుతున్నారు. అదనపు మొత్తం ఎవరి జేబుల్లోకి వెళుతుందో తెలీదు కాని భారం మాత్రం ప్రజలపైనే పడుతోందని యూనియన్ నాయకులు అంటున్నారు. లారీకి 18 టన్నులకు సరిపడా ఇసుక లోడింగ్ చేసేందుకు ర్యాంపుల వద్ద వే బ్రిడ్జిలు ఏర్పాటుచేసుకోవాల్సి ఉండగా ఉజ్జాయింపుగా లోడింగ్ చేస్తున్నారని, మూడు నాలుగు టన్నులు అదనంగా ఉంటే తనిఖీల్లో అధికారులు తమపై కేసులు నమోదు చేస్తున్నారంటున్నారు. ప్రజలకు చేరేదేనన్న భావనతో రెండు మూడు టన్నులు అదనంగా ఉన్నా గతంలో మినహాయింపు ఇచ్చేవారన్నారు. అప్పట్లో బిల్లు లేకుండా రవాణ చేసే లారీలకు రూ.25 వేల వరకు పెనాల్టీలు వేసేవారని, ఇప్పుడు ఇసుక ఉచితమే అయినప్పటికి అదే భారీ మొత్తంలో జరిమానాలతో మైనింగ్ అధికారులు వేధిస్తున్నారన్నారు. బిల్లు ఇవ్వకుండా ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్న ర్యాంపుల నిర్వాహకుల జోలికి మాత్రం పోవడం లేదని, వారు వే బ్రిడ్జిలు పెట్టకపోయినా తమపైనే కేసులు నమోదుచేస్తున్నారని విమర్శిస్తున్నారు. కొవ్వూరు – పెరవలి మధ్య టాస్క్ఫోర్సు అధికారుల పేరిట కొందరు మైనింగ్ ఉద్యోగులు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్టు చెబుతున్నారు. సాండ్ బిల్లుకు సంబంధించిన సాప్ట్వేర్ సరిగా పనిచేయక లారీకి వారం పదిరోజులకు ఒక్క బిల్లు మాత్రమే వస్తుండటంతో రోజువారీ ట్రిప్పులకు ఇబ్బంది కలుగుతోందంటున్నారు. సమస్యల పరిష్కారం కోసం ఈనెల 21వ తేదీ నుంచి టిప్పర్ లారీల్లో ఇసుక రవాణ నిలిపివేసి నిరసన తెలుపుతున్నారు. ఇసుక కొరతతో ఇక్కట్లు ఐదు రోజులుగా ఇసుక రవాణ నిలిపివేయడంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇసుక కొరతతో వినియోగదారులు ఇబ్బంది పడాల్సి వస్తోంది. లారీల స్ట్రైక్తో ఇసుక దొరక్క పనులు ఆపుకోవాల్సి వస్తుందని వినియోగదారులు అంటున్నారు. త్వరితగతిన సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. సమ్మె కొనసాగితే సమస్య తీవ్రమై పండుగ రోజుల్లో పనులకు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. కదలని క్వారీ లారీ సమస్యల పరిష్కారం కోసం ఉమ్మడి జిల్లా క్వారీ లారీ యూనియన్ పోరుబాట ఐదు రోజులుగా సమ్మెలోనే క్వారీ లారీలు ఇసుక దొరక్క వినియోగదారుల ఇక్కట్లు జిల్లాలో రెండు వేల క్వారీ లారీలు, వాటిపై ఆధారపడ్డ కుటుంబాలు ఐదు వేలు న్యాయమైన మా డిమాండ్లను పరిష్కరించాలని ఇప్పటికే పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి జిల్లా అధికారులను కలిసి వినతులు అందజేశాం. చర్చలు ఇంకా ఫలించకపోవడంతో సమ్మె కొనసాగుతుంది. – రావూరి రాజా, ఉమ్మడి జిల్లా క్వారీ లారీ అసోసియేషన్ అధ్యక్షుడుర్యాంపుల వద్ద కాటాలు ఉండటం లేదు. బిల్లులు ఇవ్వడం లేదు. వాళ్లని వదిలేసి లారీలపై కేసులు కడుతున్నారు. జురిమానాలు రద్దుచేయాలి. టాస్క్ఫోర్సు పేరిట అధికారులు వేదింపులు ఆపాలి. – కోలా సత్యనారాయణ, భీమవరం టిప్పర్ లారీ యూనియన్ అధ్యక్షుడు -
మరియ తనయ.. కరుణ హృదయ
ఏలూరు మన్నా చర్చిలో కొవ్వొత్తులతో ప్రార్థనలు కరుణ, శాంతి, సహనానికి ప్రతీక క్రిస్మస్. లోకరక్షకుడు ఏసుక్రీస్తు జననాన్ని స్వాగతిస్తూ క్రైస్తవ మందిరాలు కాంతులీనాయి. క్రిస్మస్ ట్రీలు, స్టార్లు, ఏసు జనన వృత్తాంతాన్ని తెలిపే సెట్టింగులతో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. బుధవారం రాత్రి నుంచి క్రిస్మస్ వేడుకలు ప్రారంభం కాగా.. విశ్వాసులు చర్చిల్లో కేక్ కటింగ్లు, గీతాలాపనలు నిర్వహించారు. కొవ్వొత్తులతో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. – సాక్షి నెట్వర్క్ -
మారని ఎమ్మెల్యే నాయకర్ తీరు
● పట్టణ ప్రథమ పౌరురాలిని అవమానించిన వైనం ● కార్యక్రమం బహిష్కరించిన వైఎస్సార్సీపీ నేతలు స్వచ్ఛంద సంస్థ సాయం చేస్తుంటే దానిని ఎమ్మెల్యే నాయకర్ రాజకీయం చేయడం దారుణమని అన్నారు. బుధవారం రాత్రి ఆమె తన నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. తమను అవమానించడం సరికాదన్నారు. స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు తమను ఆహ్వానించిన కార్యక్రమంలో పొట్రోకాల్ పాటించలేదని తప్పుపట్టారు. వైఎస్సార్సీపీ కేంద్రపాలకమండలి సభ్యుడు పెండ్ర వీరన్న మాట్లాడుతూ కార్యక్రమానికి వచ్చిన ఎమ్మెల్యే వైఎస్సార్సీపీ నాయకులు ఉంటే చెక్కుల పంపిణీ చేయనని సంస్థ ప్రతినిధులను బ్లాక్మెయిల్ చేశారన్నారు. తుపాను సమయంలో టీడీపీ ప్రభుత్వం రూపాయి సాయం చేయలేదని, ఇప్పుడు స్వచ్ఛంద సంస్థ సొమ్ములు ఇస్తే వారి ప్రభుత్వ చేతకానితనం బయటపడుతుందదనే భయంతోనే ఎమ్మెల్యే బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తున్నారని పేర్కొన్నారు. నరసాపురం: పట్టణ ప్రథమ పౌరురాలు, నరసాపురం మున్సిపల్ చైర్పర్సన్ ప్రొటోకాల్ అంశంలో ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ తీరు మారడం లేదు. తాజాగా బుధవారం సాయంత్రం పట్టణంలోని అంబేడ్కర్ భవన్లో ఓ స్వచ్ఛంధ సంస్థ ఏర్పాటు చేసిన సేవా కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ బర్రి శ్రీవెంకటరమణను, వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను ఎమ్మెల్యే అవమానించారు. కార్యక్రమానికి సంస్థ ప్రతినిధుల ఆహ్వానం మేరకు అతిథులుగా వెళ్లిన చైర్పర్సన్, కౌన్సిలర్లును వేదికపైకి పిలుస్తుంటే నిర్వాహకులకు వద్దని వారించి ఎమ్మెల్యే ఒక్కరే చెక్కులు పంపిణీ చేశారు. దీంతో చైర్పర్సన్, కౌన్సిలర్లు ఎమ్మెల్యేతో వాగ్వివాదానికి దిగారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఒంగోలుకు చెందిన సినార్డ్ సంస్థ మోంథా తుపాను బాధిత కుటుంబాలకు రూ.1.12 కోట్ల విలువచేసే నగదు, రూ.2 వేలు విలువచేసే కిట్ల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. చైర్పర్సన్తో పాటు అన్ని వార్డుల కౌన్సిలర్లును ఆహ్వానించారు. ఎమ్మెల్యే, చైర్పర్సన్ను కౌన్సిలర్లను చూడగానే నిర్వహకులను పక్కకు తీసుకెళ్లి కొద్దిసేపు మాట్లాడారు. తరువాత ఆయన ఒక్కడే వేదిక ఎక్కి చెక్కులు పంపిణీ చేసి వెళ్తుండగా.. చైర్పర్సన్, ఎంబీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పెండ్ర వీరన్న, వైస్ చైర్పర్సన్ కామన నాగిని, కౌన్సిలర్లు యర్రా శ్రీను, సిర్రా కాంతమ్మలు ఎమ్మెల్యేతో వాగ్వాదానికి దిగారు. ఇది స్వచ్ఛంధ సంస్థ కార్యక్రమమా? లేక మీ పార్టీ కార్యక్రమామా? అని ప్రశ్నించారు. పట్టణ ప్రథమ పౌరురాలికి గౌనవం ఇవ్వరా అన్నారు. ఎమ్మెల్యే సమాధానం చెప్పకుండా అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో వైఎస్సార్సీపీ నేతలు అంబేడ్కర్ భవన్ వద్ద ఆందోళన వ్యక్తం చేశారు. -
క్రిస్మస్ శుభాకాంక్షలు
కలెక్టర్ చదలవాడ నాగరాణి భీమవరం (ప్రకాశంచౌక్): క్రిస్మస్ను పురస్కరించుకుని కలెక్టర్ చదలవాడ నాగరాణి క్రైస్తవులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. త్యాగం, ప్రేమ, కరుణ గొప్పతనాన్ని ఏసుక్రీస్తు తన బోధనలు ద్వారా విశ్వ మానవాళికి తెలియజేశారన్నారు. క్రీస్తు అనుసరించిన మార్గం ఆదర్శమన్నారు. శత్రువులను సైతం క్షమించమని చెప్పిన కరుణామూర్తి క్రీస్తు అని తెలిపారు. ఆయన చూపిన శాంతి మార్గంలో పయనించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ అన్నారు. భీమవరం(ప్రకాశం చౌక్): జిల్లాలో ఎస్హెచ్జీ మహిళలచే నెలకొల్పిన వివిధ ప్రాజెక్టుల అభివృద్ధికి ఊతమిచ్చేలా యువ విద్యార్థుల భాగస్వామ్యం అవసరమని కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ చదలవాడ నాగరాణి బుధవారం విష్ణు కాలేజీ ఎంబీఏ, సాఫ్ట్వేర్ విద్యార్థులతో సమావేశమై జిల్లాలో ఎస్హెచ్జీ మహిళలు నెలకొల్పిన చాక్లెట్ ఫ్యాక్టరీల అభివృద్ధికి మార్కెటింగ్, బ్రాండింగ్, ఆకర్షణీయమైన ప్యాకింగ్ బాక్సులు తయారీ, తదితర విషయాలపై వినూత్న ఆలోచనలను, ప్రాజెక్టులు రూపొందించాల్సిందిగా సూచించారు. డీఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎంఎస్ఎస్ వేణుగోపాల్, భీమవరం ఇంజనీరింగ్ కాలేజ్ ప్రొఫెసర్ వర్మ, ఎంబీఏ, ఇంజనీరింగ్ విద్యార్థులు పాల్గొన్నారు. -
అమర జవాన్కు కన్నీటి వీడ్కోలు
పెనుమంట్ర: పశ్చిమగోదావరి జిల్లా పెనుమంట్ర మండలం ఆలమూరు గ్రామానికి చెందిన అమర జవాన్ రాజశేఖర్ భౌతికకాయం బుధవారం స్వగ్రామానికి చేరుకుంది. గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు. దేశ రక్షణలో భాగంగా పశ్చిమ బెంగాల్లో విధులు నిర్వహిస్తున్న సమయంలో బోట్ బోల్తా పడిన ఘటనలో రాజశేఖర్ అమరుడయ్యారు. ఖండవల్లి, పెనుగొండ, మార్టేరు గ్రామాల మీదుగా అంతిమయాత్ర కొనసాగింది. యాత్రలో తోటి జవాన్లు, పోలీస్ అధికారులు, విద్యార్థులు, గ్రామస్తులు, స్థానిక యువత పెద్ద సంఖ్యలో పాల్గొని నివాళులర్పించారు. దేశ భక్తి నినాదాలు చేశారు. అధికార లాంచనాలతో రాజశేఖర్ దుస్తులు, జాతీయ జెండాను ఆయన తల్లిదండ్రులకు అందజేశారు. ఆర్మీ అధికారులు మాట్లాడుతూ మంచి నైపుణ్యం కలిగిన జవాన్ను కోల్పోయామన్నారు. స్వగ్రామం ఆలమూరు చేరిన భౌతిక కాయం -
నేరాల నియంత్రణే లక్ష్యంగా పనిచేయాలి
తాడేపల్లిగూడెం అర్బన్ : పశ్చిమ గోదావరి జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ లక్ష్యంగా పోలీసులు విధులు నిర్వహించాలని జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి ఆదేశించారు. తాడేపల్లిగూడెం సబ్ డివిజన్ పరిధిలోని పోలీసు అధికారులతో సమగ్ర నేర సమీక్షా సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. సబ్డివిజన్ వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న కేసులు, దర్యాప్తులో ఉన్న కేసుల పురోగతిపై భవిష్యత్ కార్యాచరణపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. నేరాల నివారణ, ప్రజల రక్షణ విషయంలో ఏ మాత్రం రాజీ పడవద్దని ఎస్పీ నయీం ఆదేశించారు. ముఖ్యంగా మహిళలు, మైనర్ల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. మహిళలు, బాలికలపై అకృత్యాలపై కఠిన చర్యలు చర్యలు తీసుకోవాలని నిందితులకు త్వరితగతిన శిక్ష విధించేలా పక్కా ఆధారాలతో దర్యాప్తు చేయాలని సూచించారు. మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక దృష్టి సారించాలని, గంజాయి, డ్రగ్స్ సరఫరా వినియోగంపై ఉక్కుపాదం మోపాలన్నారు. యువత మాదక ద్రవ్యాల భారిన పడకుండా నిరంతరం నిఽఘా ఉంచాలని జిల్లా ఎస్పీ సూచించారు. అదనపు ఎస్పీ వి.భీమారావు, తాడేపల్లిగూడెం డీఎస్పీ డి.విశ్వనాఽథ్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రధాన పంట కాలువనూ పట్టించుకోరా?
నరసాపురం: నిడదవోలు–నరసాపురం ప్రధాన పంటకాలువ నరసాపురం ప్రాంతంలో కాలుష్య కోరల్లో చిక్కుకుంది. కాలువ పొడవునా గుర్రపు డెక్క, చెత్త పేరుకుపోయి అధ్వానంగా ఉన్నా ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టనట్లు వ్యవహించడం విమర్శలకు తావిస్తోంది. ప్రతిఏటా వేసవిలో ఈ కాలువను బాగు చేస్తారు. తూడు, చెత్త తొలగించి పూడికతీత చేస్తారు. కానీ ఈ వేసవిలో కాలువ శుభ్రం చేసే పనులు చేపట్టలేదు. దీంతో కాలువ పొడవునా చెత్త పేరుకుపోయింది. పూర్తిగా తూడుతో కాలువ నిండిపోయింది. ప్రధాన కాలువ ఎంతో ప్రాధాన్యం నరసాపురం నుంచి మొగల్తూరు వరకూ 12 కిలోమీటర్లు మేర కాలువ అధ్వానంగా ఉంది. నరసాపురం మున్సిపాలిటీలోని 31 వార్డులకు, నరసాపురం మండలంలోని 28 పంచాయతీలకు, మొగల్తూరు మండలంలోని 17 పంచాయతీలకు సంబంధించి మంచినీటి చెరువును ఈ కాలువ నీటిద్వారానే నింపుతారు. సుమారు 6 లక్షల జనాభా తాగునీటికి ఈ కాలువ నీటినే సరఫరా చేస్తున్నారు. కాలువ పూర్తిగా కాలుష్యం భారిన పడటంతో పాటు, అటు మున్సిపాలిటీలోనూ, గ్రామాల్లోని మంచినీటి ప్రాజెక్టుల్లో మంచినీటి శుద్ధిప్రక్రియ సవ్యంగా సాగడంలేదు. దీంతో కాలుష్య నీటితో ప్రజలు రోగాల భారిన పడుతున్నారు. చెత్త కూడా కాలువలోనే పోస్తున్నారు కొన్ని నెలలుగా మున్సిపాలిటీలో డంపింగ్యార్డ్ సమస్యతో చెత్తవేసే జాగాలేక ఎక్కడి చెత్తను అక్కడే వదిలేస్తున్నారు. దీంతో కొందరు ఇళ్లలోని చెత్తను రాత్రివేళల్లో కాలువలో పోస్తున్నారు. దీంతో కాలువ మరింత కాలుష్య కారకంగా తయారైంది. ఈ కాలువ ద్వారా 10 ఎకరాలకు సాగునీరు అందుతుండగా, చెత్త పేరుకుపోవడంతో నీరు పారే అవకాశం లేక సాగునీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతోంది. దీంతో రైతులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. కాలుష్య కోరల్లో నరసాపురం ప్రధాన పంట కాలువ 3 లక్షల మందికి కలుషిత జలమే దిక్కు సాగునీటి సరఫరాలోనూ తప్పని ఇబ్బందులు -
సౌత్జోన్ బాస్కెట్బాల్ పోటీలకు ఎంపిక
భీమవరం: కాకినాడ జేఎన్టీయూలో ఈనెల 23వ తేదీన జరిగిన బాస్కెట్బాల్ సెలక్షన్స్లో విష్ణు ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విద్యార్థి జె.సుభాష్ రాజు ఎంపికయ్యారని కళాశాల ఫిజికల్ డైరక్టర్ ఎం.శ్రీనివాసరావు తెలిపారు. చైన్నె ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో ఈనెల 24 నుంచి 28 వరకూ నిర్వహించనున్న సౌత్జోన్ బాస్కెట్ బాల్ పోటీల్లో సుభాష్రాజు పాల్గొంటాడని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థిని కళాశాల ప్రిన్సిపాల్ ఎం.వేణు, వైస్ ప్రిన్సిపాల్ ఎం.శ్రీలక్ష్మి, అధ్యాపకులు అభినందించారు. చాట్రాయి: విద్యుత్ షార్ట్సర్క్యూట్తో తాటాకిల్లు దగ్ధమైన ఘటన చాట్రాయి మండలంలోని జనార్థనవరంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన నడిపింటి రాంబాబు తాటాకింటిలో బుధవారం సాయంత్రం మంటలు చెలరేగాయి. వంట సామాగ్రి, పిల్లల సర్టిఫికెట్లతోపాటు బంగారం, నగదు, ధాన్యం దగ్ధమవ్వడంతో బాధితులు కట్టుబట్టలతో మిగిలారు. విద్యుత్ షార్ట్సర్క్యూట్ వల్ల ప్రమాదం చోటుచేసుకుందని, సుమారు రూ.10 లక్షల ఆస్తి నష్టం వాటిల్లినట్లు బాధితులు చెబుతున్నారు. ఏలూరు (టూటౌన్): ఉంగుటూరు మండలం బాదంపూడిలోని దేశీయ జల మత్స్య సంవర్థన శిక్షణా కేంద్రంలో శిక్షణ పొందుటకు ఈనెల 30వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా మత్స్య శాఖ అధికారి బి.రాజ్కుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉపకార వేతనాలు లేకుండా 20 సీట్లు ఉన్నాయని, దరఖాస్తుదారులకు ఈ నెల 31వ తేదీ ఉదయం 11 గంటలకు బాదంపూడిలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తామన్నారు. మత్స్య క్షేత్రాలు, రిజర్వాయర్లలో చేపల పెంపకం గురించి బోధనా, ప్రాక్టికల్స్తో కూడిన కోర్సు బోధించడం జరుగుందని, శిక్షణానంతరం పరీక్షలు నిర్వహించి, ఉతీర్ణులైన విద్యార్థులకు సర్టిఫికెట్లు జారీ చేస్తారన్నారు. 5వ తరగతి ఆపైన చదువుకున్న 18 నుంచి 30 సంవత్సరాల లోపు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలన్నారు. వివరాలకు 95733 37484, 72869 93033, 94923 37469 నంబర్లలో సంప్రదించాలన్నారు. మండవల్లి: కుక్కను తప్పించబోయి మోటార్సైకిల్పై వెళుతున్న ఓ వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. ముదినేపల్లి మండలం వడాలి గ్రామానికి చెందిన మట్టా ఏడుకొండలు (36) స్క్రాప్ వ్యాపారం చేసుకుని జీవిస్తుంటాడు. తాడేపల్లి సమీపంలోని జగన్నాధపురంలో నివాసముంటున్న భార్యను తీసుకురావడానికి ఈనెల 23వ తేదీన వడాలి నుంచి మోటార్ సైకిల్పై మండవల్లి వైపుకు వస్తున్నాడు. కానుకొల్లు జాతీయ రహదారిపై కుక్క అడ్డురావడడంతో తప్పించబోయే క్రమంలో వాహనం అదుపు తప్పి రోడ్డుపై పడిపోయాడు. తీవ్ర గాయాలైన అతడ్ని స్థానికులు 108 వాహనంపై గుడివాడ ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి అన్నయ్య సత్యప్రసాద్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
డైట్ బిల్లుల కోసం ఎదురుచూపులు
● రెండు నెలలుగా అందని వైనం ● సుమారు రూ.కోటి వరకూ విడుదల కావాల్సిన నిధులు బుట్టాయగూడెం: ఐటీడీఏ పరిధిలో నిర్వహిస్తున్న గిరిజన సంక్షేమ పాఠశాలల్లోని విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందించేందుకు ఇస్తున్న డైట్ బిల్లులు గత రెండు నెలలుగా అందక నిర్వాహకులు అవస్థలు పడుతున్నారు. ఈ బిల్లులు ప్రతి నెలా 4, 5 తేదీల్లోపు సంబంధిత నిర్వాహకులు పంపుతున్నప్పటికీ అవి జమకాని పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం తమకు అక్టోబర్, నవంబర్ నెలలకు సంబంధించి రెండు నెలల బిల్లుల బకాయిలు జమ కావాల్సి ఉందని, డిసెంబర్ మాసం కూడా ముగుస్తున్నందున ఈ నెల బిల్లు కూడా వస్తుందో లేదో అని నిర్వాహకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలలకు సరుకుల సరఫరా ఇలా బుట్టాయగూడెం మండలం కేఆర్పురం ఐటీడీఏ పరిధిలోని బుట్టాయగూడెం, జీలుగుమిల్లి, పోలవరం, వేలేరుపాడు, కుక్కునూరు, టి. నర్సాపురం మండలాల పరిధిలో గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు 25, కళాశాల వసతిగృహాలు 9 ఉన్నాయి. ఆశ్రమ పాఠశాలల్లో 5,965 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. కాలేజీ వసతిగృహాల్లో 1,219 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు సంబంధించి నెలకు ఒక్కో విద్యార్థికి రూ.1,400, కళాశాల విద్యార్థులకు నెలకు రూ. 1,600 చొప్పున ప్రభుత్వం అందజేస్తుంది. 2022 సంవత్సరంలో రూపొందించిన ఆహార పట్టిక(మెనూ)ను ప్రస్తుతం అమలు చేస్తున్నారు. దీనిప్రకారం ఆదివారం, మంగళవారాలు చికెన్, ఆరురోజులపాటు గుడ్డు, ప్రతిరోజూ ఉదయం అల్పాహారం విద్యార్థులకు ఇవ్వాలి. దీనికి సంబంధించి నిత్యవసర సరుకులు, బియ్యాన్ని ప్రభుత్వమే జీసీసీ ద్వారా సరఫరా చేస్తుంది. అయితే గ్యాస్ను మాత్రం నిర్వాహకులే కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే వీటికి సంబంధించి నిర్వాహకులు డైట్ బిల్లులు పెట్టుకున్నప్పటికీ అక్టోబర్, నవంబర్ నెల నుంచి మంజూరు కాలేదు. రెండు నెలలకు సంబంధించి సుమారు రూ.కోటి వరకూ బిల్లులు మంజూరు కావాల్సి ఉందని నిర్వాహకులు చెబుతున్నారు. అలాగే డిసెంబర్ నెల కూడా పూర్తి కావొచ్చింది. ఈ నేపద్యంలో 3 నెలల బిల్లు రావాల్సి ఉంటుందని నిర్వాహకులు చెబుతున్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా రాని బిల్లులు ప్రస్తుతం గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో 2022 నాటి మెనూ ప్రకారమే విద్యార్థులకు పౌష్టికాహారం అందిస్తున్నప్పటికీ గత రెండేళ్లుగా పెరిగిన నిత్యవసర వస్తువుల ధరలకు, ప్రభుత్వం ఇచ్చే ధరలకు చాలా వ్యత్యాసం ఉందని నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో గుడ్డు రూ.ఏడున్నర ఉండగా ప్రభుత్వం రూ.ఐదున్నర మాత్రమే ఇస్తుందని చెబుతున్నారు. అలాగే నిత్యవసర సరుకుల ధరలు కూడా పెరిగాయని, ప్రభుత్వం మాత్రం కేజీ రూ.30 కు మించి బిల్లులు ఇవ్వడంలేదని వాపోతున్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా ప్రభుత్వం బిల్లులు పెంచి ఇవ్వాలని వారు కోరుతున్నారు. -
రోగాల బారిన పడుతున్నారు
నియోజకవర్గంలో అన్ని పంటకాలువల పరిస్థితి దారుణంగా ఉంది. కనీసం ప్రధాన పంటకాలువను బాగు చేయాలన్న ఆలోచన కూడా ప్రజాప్రతినధులకు, అధికారులకు లేకపోవడం దారుణం. అందరూ ఈ కాలువ ద్వారా వచ్చేనీటినే తాగి రోగాల బారిన పడుతున్నారు. సాగునీరు సరఫరా కాక రైతులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. –కడలి పెద్దిరాజు, న్యాయవాద గుమస్తా, 3 లక్షల జనాభాకు తాగునీరు, 10 వేల ఎకరాలకు సాగునీరు అందించే కాలువను ప్రతి ఏటా వేసవిలో బాగు చేసేవారు. ఇంత ముఖ్యమైన కాలువను ఈ ఏడాది ఎందుకు బాగు చేయలేదు. ప్రజల ఆరోగ్యం, సాగు, తాగునీటి సమస్యలు ప్రజాప్రతినిధులకు, అధికారులకు పట్టావా? వెంటనే కాలువ బాగు చేయాలి. – బర్రి శంకరం, నరసాపురం -
ఎరువుల దుకాణాల తనిఖీ
అత్తిలి: మండలంలోని ఎరువుల దుకాణాలను మండల వ్యవసాయ అధికారి టీకే రాజేష్ బుధవారం తనిఖీ చేశారు. ఎరువుల డీలర్లు స్టాక్ నిల్వలను ఎప్పటికప్పుడు స్టాక్ బోర్డులపై రాయాలని, ఈపాస్ నందు నమోదు చేసి బిల్లులు కచ్చితంగా ఇవ్వాలని ఆదేశించారు. అత్తిలి మండలంలో 210 టన్నుల యూరియా అందుబాటులో ఉందని, అవసరమైన యూరియా సొసైటీల ద్వారా, ప్రైవేటు డీలర్ల ద్వారా రైతులకు సరఫరా చేస్తామన్నారు. విత్తనశుద్ధి తప్పనిసరి దాళ్వాసాగులో రైతులు ఖచ్చితంగా విత్తన శుద్ధి చేయాలని మండల వ్యవసాయశాఖ అధికారి టీకే రాజేష్ అన్నారు. బుధవారం అత్తిలి మండలం వరిఘేడు గ్రామంలో ఎరువుల యాజమాన్యంపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. కార్బన్డిజమ్ ఒక లీటర్ నీటికి ఒక గ్రాము కలిపి అందులో విత్తనం నానబెట్టాలన్నారు. విత్తనశుద్ధి అనంతరం నారుమడి చల్లుకోవాలని, కచ్చితంగా మురగదమ్ములు చేయాలన్నారు. -
సౌత్ ఇండియన్ సైన్స్ ఫెయిర్కు ఎంపిక
వీరవాసరం: విజయవాడలో ఈనెల 23, 24 తేదీల్లో రాష్ట్ర స్థాయిలో జరిగిన సైన్స్ ఫెయిర్లో వీరవాసరం మండలం రాయకుదురు హైస్కూలు విద్యార్థుల ప్రదర్శించిన ప్రాజెక్టుతో సౌత్ ఇండియన్ సైన్స్ ఫెయిర్కు ఎంపికై నట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కె.శ్రీనివాసరావు బుధవారం తెలిపారు. విద్యార్థులు జి.సాయి సుజిత్, డి.జయసాయి శ్రీనివాస, గణేష్ ఎడారిలో మంచును సాంద్రీకరించి, ఆనీటిని తాగునీటి అవసరాలకు ఎలా వాడుకోవచ్చో ప్రాజెక్టు రూపొందించి ప్రథమ స్థానం సాధించారన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను, గైడ్ టీచర్స్ పి.గజేంద్రగట్కర్, లక్ష్మీదుర్గను కలెక్టర్ సీహెచ్ నాగరాణి, జిల్లా విద్యాధికారి నారాయణ, ఉప విద్యాశాఖాధికారి ఎన్. రమేష్, రాయకుదురు సర్పంచ్ గెడ్డం భారతి, ఎంపీపీ అడ్డాల శ్రీరామచంద్రమూర్తి తదితరులు అభినందించారు. -
ఆరోపణలు అవాస్తవం
ఉండి: కృష్ణా జిల్లా కృత్తివెన్ను మండలం బంటుమిల్లి సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలోని ఏలూరి రంగబాబు అతని కుటుంబ సభ్యులకు చెందిన భూములు ఉండి సబ్రిజిస్ట్రార్ కార్యాలయంలో అక్రమంగా ఇతరులకు రిజిస్ట్రేషన్లు చేస్తున్నారని చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని ఉండి ఇన్చార్జి సబ్ రిజిస్ట్ట్రార్ వీరవల్లి సురేష్ బుధవారం స్పష్టం చేశారు. వివిధ సర్వే నంబర్లలోని 36 ఎకరాల భూములు ఇతరుల పేరున ఉండి సబ్రిజిస్ట్రార్ కార్యాలయంలో అక్రమంగా రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయని చేస్తున్న ఆరోపణలు నిరాధారమని చెప్పారు. ఈ భూములన్నీ బంటుమిల్లి సబ్రిజిస్ట్రార్ పరిధిలో ఉన్నాయన్నారు. కోర్టు ఉత్తర్వుల ప్రకారం ఇప్పటికే ఈ భూములు నిషేదిత జాబితాలో నమోదు కాబడి ఉన్నాయని, ఈ భూముల రిజిస్ట్రేషన్లు కాని రిజిస్ట్రేషన్ పెండింగ్ కానీ లేవని సురేష్ తెలిపారు. -
క్రీస్తు బోధనలు అనుసరణీయం
ఏలూరు (ఆర్ఆర్పేట): శాంతియుత సమాజ స్థాపనకు ప్రతి ఒక్కరూ ఏసుక్రీస్తు బోధనలను అనుసరించాలని బిషప్ పొలిమేర జయరావు సూచించారు. స్థానిక బిషప్ హౌస్లో బుధవారం రాత్రి క్రిస్మస్ వేడుకను ఘనంగా నిర్వహించారు. జయరావు క్రీస్తు బోధనలను వివరించారు. ప్రత్యేక ప్రార్థనల అనంతరం కేక్ను కట్ చేసి ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలన్నారు. కార్యక్రమంలో సెయింట్ మైఖేల్ చర్చి ఫాదర్ దిరిసిన ఆరోన్, ఏలూరు మేత్రాసనం ప్రోక్యురేటర్ ఫాదర్ బేతంపూడి రాజు, నిర్మలగిరి నిత్య అన్నదాన కాంట్రాక్టర్ కల్లే నాగేశ్వరరావు, ఏలూరు మేత్రాసనం ఛాన్సలర్ ఫాదర్ ఇమ్మానియేల్, ఫాదర్ మైఖేల్ ఇంజమాల తదితరులు పాల్గొన్నారు. -
సప్త సూత్రాలతో సుపరిపాలన
కలెక్టర్ చదలవాడ నాగరాణి భీమవరం (ప్రకాశంచౌక్): నాణ్యత ప్రమాణాలు విధిగా పాటిస్తూ ప్రజలకు సుపరిపాలన అందించాలని అధికారులకు కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదేశాలు జారీ చేశారు. కలెక్టరేట్లో మంగళవారం అధికారులకు సుపరిపాలనపై దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎవరు ఓపికతో వింటారో వారు మంచి అధికారిగా పేరు తెచ్చుకుంటారన్నారు. పరిపాలన ఏ స్థాయిలో ఉన్న సమానత్వం చాలా అవసరం అన్నారు. సుపరిపాలన అందించాలంటే సప్త సూత్రాలను విధిగా పాటించాలని కలెక్టర్ అన్నారన్నారు. -
వైద్య సేవల్లో నిర్లక్ష్యాన్ని ఉపేక్షించం
వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సౌరభ్ గౌర్ ఏలూరు టౌన్: ఏలూరు సర్వజన ఆసుపత్రిలో పేదలకు వైద్యసేవలు అందించటంలో నిర్లక్ష్యాన్ని ఉపేక్షించేది లేదని.. విధుల్లో అలసత్వం వహించే సిబ్బందిపై కఠిన చర్యలు తప్పవని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సౌరభ్ గౌర్ హెచ్చరించారు. కలెక్టర్ వెట్రిసెల్వితో కలిసి జీజీహెచ్ను మంగళవారం రాత్రి ఆయన తనికీ చేశారు. హాస్పిటల్లోని వివిధ విభాగాలను పరిశీలించారు, వార్డుల్లో రోగులకు ఏ విధమైన వైద్యసేవలు అందుతున్నాయో ఆరా తీశారు. రోగులను ఆయనే స్వయంగా అడిగి వివరాలు తెలుసుకున్నారు. జీజీహెచ్లోని ప్రతి విభాగంలోనూ వైద్య చికిత్సలు, సౌకర్యాలు, సిబ్బంది సేవలపై వైద్య అధికారులను ఆరా తీశారు. ప్రసూతి, చిన్నపిల్లల వార్డులు, క్యాజువాలిటీ వార్డులను పరిశీలించి సేవలపై రోగుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేద ప్రజల ఆరోగ్య సంరక్షణకు ప్రభుత్వం ఏటా వేల కోట్లు ఖర్చు చేస్తోందని, దానికి అనుగుణంగా వైద్య సిబ్బంది జవాబుదారీతనంతో పనిచేయాల్సిందేనని స్పష్టం చేశారు. సర్వజన ఆసుపత్రికి వచ్చే రోగులు సంతృప్తిగా ఇంటికి వెళ్ళే పరిస్థితి రావాలని, వైద్యులు, సిబ్బంది దానికి తగినట్లు సేవలు అందించాలని చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలపై రోగులు ఫిర్యాదు చేస్తే వెంటనే విచారణ చేసి శాఖాపరమైన చర్యలు చేపడతామని హెచ్చరించారు. హాస్పిటల్ పరిసరాలను, మరుగుదొడ్లను పరిశుభ్రంగా ఉంచాలని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పీజే అమృతం, హాస్పిటల్స్ సేవల సమన్వయాధికారి డాక్టర్ పాల్సతీష్, జీజీహెచ్ సూపరింటిండెంట్ డాక్టర్ ఎంఎస్ రాజు, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. -
ముస్తాబవుతున్న శ్రీవారి ఆలయ ఉత్తర ద్వారాలు
క్షేత్రంలో ఊపందుకున్న ముక్కోటి ఏర్పాట్లు ద్వారకాతిరుమల: ముక్కోటి ఏకాదశి పర్వదినం దగ్గర పడటంతో క్షేత్రంలో శ్రీవారి ఉత్తర ద్వారదర్శనానికి ఏర్పాట్లు ఊపందుకున్నాయి. అందులో భాగంగా ఆలయ ఉత్తర ద్వారాలను ముస్తాబు చేసే పనులు మంగళవారం ఉదయం ప్రారంభమయ్యాయి. యంత్రాల సహాయంతో ద్వారాలను సిబ్బంది శుభ్రం చేస్తున్నారు. అలాగే ఆలయ ప్రాకారంలో విద్యుద్దీప అలంకారాల పనులు శరవేగంగా జరుగుతున్నాయి. షాపింగ్ కాంప్లెక్స్ వెనుక ప్రాంతంలో నిర్మించిన తాత్కాలిక క్యూలైన్లకు రంగులు వేస్తున్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఈ నెల 30న ఉదయం 5.30 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు స్వామివారి ఉత్తర ద్వార దర్శన భాగ్యం భక్తులకు కలగనుంది. ముందురోజు 29న మధ్యాహ్నం 2.30 గంటలకు తొలిమెట్టు (పాదుకా మండపం) వద్ద గిరి ప్రదక్షిణ ప్రారంభం అవుతుందని ఆలయ ఈఓ ఎన్వీఎస్ఎన్ మూర్తి తెలిపారు. గిరి ప్రదక్షిణ అనంతరం రాత్రి 7 గంటల నుంచి భక్తులకు స్వామివారి నిజరూప దర్శనాన్ని కల్పిస్తామన్నారు. ఉత్తర ద్వార దర్శనానికి ప్రత్యేక రూ.500 టికెట్లను అందుబాటులో ఉంచుతామన్నారు. ఆలయ ప్రాకారంలో విద్యుద్దీప అలంకారాల పనులు ఉత్తర ద్వారాలను ముస్తాబు చేస్తున్న సిబ్బంది -
పండుగ రోజుల్లోనూ పస్తులే?
బుధవారం శ్రీ 24 శ్రీ డిసెంబర్ శ్రీ 2025ఏలూరు (టూటౌన్): కొత్త సంవత్సరం, సంక్రాంతి పండుగ సమీపిస్తున్నా తమకు ఇప్పటికీ వేతనాలు చెల్లించరా అని పంచాయతీ కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏలూరు జిల్లా వ్యాప్తంగా పంచాయతీ ఉద్యోగులు, కార్మికులకు గత మూడు నుంచి ఏడు నెలల వేతన బకాయిలు పేరుకుపోయాయి. తమకిచ్చే కొద్ది పాటి వేతనాలను సైతం చెల్లించకపోవడం పట్ల ఉద్యోగ, కార్మికులు ఆవేదన చెందుతున్నారు. పంచాయతీ సర్పంచ్ల ద్వారా తమ బకాయి వేతనాలు చెల్లించేలా జిల్లా అధికారులు చర్యలు తీసుకోవాలంటూ వేడుకుంటున్నారు. ఏలూరు జిల్లాలో 517 గ్రామ సచివాలయాల పరిధిలో మొత్తం 547 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటి పరిధిలో 2 వేల మంది వరకు వివిధ రకాల కార్మికులు పనిచేస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో 380 సచివాలయాల పరిధిలో 409 గ్రామ పంచాయతీలు ఉండగా వీటి పరిధిలో దాదాపు 1,400 మంది కార్మికులు పనిచేస్తున్నారు. వీరిలో బిల్లు కలెక్టర్లు, పంప్ ఆపరేటర్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, ఎలక్ట్రీషియన్లు, ట్రాక్టర్ డ్రైవర్లు, స్వీపర్లు పనిచేస్తున్నారు. వీరంతా కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్, టెండర్ పద్ధతిలో పనిచేస్తున్నారు. వీరికి ఉద్యోగ భద్రత లేకపోగా, కనీస వేతనాలు కూడా అమలు కావడం లేదు. మైనర్ పంచాయతీల్లో రూ.5 నుంచి రూ.7 వేలు, మేజర్ పంచాయతీలు రూ.10 వేల నుంచి రూ.13 వేల జీతాలు ఇస్తున్నారు. జాతీయ లేబర్ కమిషన్ సిఫార్సుల ప్రకారం ఒక కుటుంబం బతకాలంటే కనీసం రూ.26 వేల నెలవారీ జీతం ఇవ్వాలని నిర్ణయం ఉంది. గ్లౌజులు, యూనిఫాంలకూ కొరతే.. గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న స్కావెంజర్లకు కనీసం రక్షణకు చేతి గ్లౌజులు, చెప్పులు, కొబ్బరి నూనె వంటివి ఇవ్వడం లేదు. పంచాయతీ కార్మికులందరికీ ప్రతి సంవత్సరం యూనిఫాం అందించాలి. అది కూడా ఎక్కడా అమలు కావడం లేదు. వారికి ఇస్తున్న కొద్దిపాటి వేతనాలు రెగ్యులర్గా ఇవ్వడం లేదు. జిల్లాలో మూడు నెలల నుంచి ఏడు నెలల వరకు బకాయిలు పేరుకుపోయాయి. ఇటీవల కై కలూరు పంచాయతీలో ఏడు నెలల జీతాల బకాయిలు చెల్లించాలని కార్మికులంతా పనిని ఆపి రోడ్డెక్కిన సంగతి తెలిసిందే. పంచాయతీ కార్మికులకు మద్దతుగా వైఎస్సార్సీపీ నాయకులు కూడా మద్దతు తెలిపారు. ప్రస్తుతం క్రిస్మస్, సంక్రాంతి పండుగలు దగ్గర పడ్డాయి. జీతాలు రాకపోవడంతో పండగ పూట కూడా పస్తులు ఉండాల్సి వస్తోందని కార్మికులు చెబుతున్నారు. గ్రామ పంచాయతీకి వచ్చే ఆదాయం నుంచి మొదట పంచాయతీ సిబ్బంది జీతాలు చెల్లించాలనే నిబంధనను అమలు చేయాలని కోరుతున్నారు. పంచాయతీల్లో గ్రామ పంచాయతీ కార్మికులకు నెలనెలా సక్రమంగా జీతాలు రావడం లేదు. జిల్లా కేంద్రం దగ్గరలో ఉన్న పెదపాడు పంచాయతీలో బకాయిలు ఇప్పటికీ రాని పరిస్థితి. ఏలూరు రూరల్ మండలం జాలిపూడి పంచాయతీలో నాలుగు నెలలు జీతాలు బకాయిలు ఉన్నాయి. అత్యధిక పంచాయతీల్లో ఇదేవిధంగా నెలల తరబడి జీతాల బకాయిలు పేరుకుపోయాయి. కార్మికులకు జాతీయ లేబర్ కమిషన్ సిఫారసు ప్రకారం కనీస వేతనం రూ.26,000 ఇవ్వాలి. గ్రామ పంచాయతీ కార్మికులకు మరీ తక్కువగా రూ.10 వేల లోపు జీతాలు ఇస్తున్నారు. పంచాయతీల ఆదాయంలో కార్మికుల జీతాలకు మొదటి ప్రాధాన్యత కల్పించాలి. పండుగ రోజుల్లో కూడా పస్తులతో కార్మికులు పనిచేస్తున్నారు. దీనిపై జిల్లా అధికారులు దృషి సారించి వేతనాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలి. – రెడ్డి శ్రీనివాస డాంగే, ప్రధాన కార్యదర్శి, ఏఐటీయూసీ, ఏలూరు జిల్లా జిల్లా వ్యాప్తంగా పంచాయతీ కార్మికులకు బకాయిలు ఉన్న వేతనాలను తక్షణం చెల్లించాలి. పారిశుద్ధ్య కార్మికులకు ఇవ్వాల్సిన చెప్పులు, కొబ్బరినూనె, సేఫ్టీ పరికరాలు, కార్మికులందరికీ యూనిఫాం వంటివి అందజేయాలి. చాలా పంచాయతీల్లో కార్మికులకు ఎరియర్స్ పెండింగ్లో ఉన్నాయి. వాటిని జీతాలతో పాటు చెల్లించాలి. పండుగ వేళల్లో చిరు ఉద్యోగులను ఉసూరు మన్పించడం పాలకులకు తగదు. – పి.కిషోర్, పంచాయతీ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి వేతనాల కోసం పంచాయతీ కార్మికుల ఎదురుచూపులు జిల్లా వ్యాప్తంగా పేరుకుపోయిన 3 నుంచి 7 నెలల బకాయిలు తక్షణం బకాయిలు చెల్లించాలని డిమాండ్ -
యూరియాకు కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు
జేసీ రాహుల్కుమార్రెడ్డి భీమవరం: జిల్లాలో దాళ్వా సీజన్కు అవసరమైన యూరియా నిల్వలు సొసైటీలు, ఆర్ఎస్కె, ప్రైవేట్ డీలర్స్ వద్ద అందుబాటులో ఉన్నాయని జాయింట్ కలెక్టర్ టి.రాహుల్కుమార్రెడ్డి తెలిపారు. కలెక్టరేట్ నుంచి ఎరువుల లభ్యత, వినియోగం, క్షేత్రస్థాయి సమస్యలు, రైతుల సందేహాల నివృత్తిపై వ్యవసాయ శాఖ అధికారులు, రైతులతో గూగుల్ మీట్ ద్వారా సమీక్షించిన సందర్బంగా ఆయన మాట్లాడారు. యూరియాకు ఎమ్మార్పీ ధర కంటే అదనంగా చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. సొసైటీలు, ఆర్ఎస్కేల్లో రాబోయే 20 రోజులకు సరిపడా యూరియా నిల్వ అందుబాటులో ఉండేలా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఎరువుల కృత్రిమ కొరత సృష్టించినా, అధిక ధరలకు విక్రయించినా చర్యలు తప్పవని హెచ్చరించారు. భీమవరం (ప్రకాశంచౌక్):కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ మొగల్తూరు మండలం పెద్దమైనవానిలంక గ్రామాన్ని ఈనెల 28న సందర్శించి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారని కలెక్టర్ నాగరాణి తెలిపారు. మంగళవారం కలెక్టరేట్లో మాట్లాడుతూ.. కవిటంలో నిర్మించిన దేవాలయం ప్రారంభోత్సవ కార్యక్రమం, అనంతరం పెద్దమైన వానిలంక వద్ద సముద్రపు కోతకు గురవుతున్న ప్రాంతంలో రూ.13.5 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న అడ్డుకట్ట పనులను పరిశీలించనున్నారని చెప్పారు. డ్రోన్, ఏఐ నైపుణ్య శిక్షణ తరగతులు ప్రారంభిస్తారన్నారు. కాగా కాలువ గట్లు, రోడ్డు మార్జిన్లు అక్రమించుకొని గుళ్ళు, విగ్రహాలు ఏర్పాటును అనుమతించవద్దని కలెక్టర్ సూచించారు. ఆగిరిపల్లి: మండలంలోని పోతవరప్పాడు మ్యాంగో బే కల్చర్ అసోసియేషన్లో ఆదివారం పోలీసులు దాడిలో పట్టుబడిన 281 మందిని డీఎస్పీ ప్రసాద్ ఆధ్వర్యంలో ఐదు బస్సులలో తరలించి నూజివీడు కోర్టులో హాజరు పర్చారు. స్వాధీనం చేసుకున్న రూ.32 లక్షలను కోర్టుకు అప్పగించారు. జడ్జి ఆదేశాల మేరకు వారికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఏలూరు (మెట్రో): గిరిజన ప్రాంతాల అభివృద్ధి, సంక్షేమం, ఇతర సమస్యలపై అధికారులతో కలెక్టరు కె.వెట్రిసెల్వి మంగళవారం సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టరు మాట్లాడుతూ జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోతు హుస్సేన్ జిల్లా పర్యటనలో లేవనెత్తిన అంశాల విషయంలో నూరుశాతం లక్ష్యాలు సాధించాలన్నారు. మోదెల గ్రామ ప్రజల కోరిక ప్రకారం బుట్టాయిగూడెం మండలంలోకి మోదెల గ్రామాన్ని కలిపేందుకు ప్రతిపాదనలు పంపించాలని ఆదేశించారు. రెడ్డిగూడెం, రాజానగరం, కోటరామచంద్రపురంలో సెల్ ఫోన్లు సిగ్నల్స్ లేవని ఫిర్యాదులు వస్తున్నాయని, అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి సెల్ టవర్స్ రిపేర్లు ఉంటే చేయించి, కొత్తగా అవసరమైన చోట టవర్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. గిరిజన ప్రాంతాలు అభివృద్ధి కార్యక్రమాలకు భూసేకరణలో భూమికి భూమి ఇవ్వాలని, అర్హత ఉన్నవారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు, జాబు మేళా ద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించవచ్చని అన్నారు. హెల్త్ సబ్ సెంటర్లకు 108 వాహనం వెళ్ళేలా రహదారుల ఏర్పాటుపై దృష్టి పెట్టాలన్నారు. ఏలూరు (మెట్రో): ఎరువులు పంపిణీ, ఎరువులు, విత్తనాల నాణ్యతపై వ్యవసాయాధికారులతో జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి మంగళవారం అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వ్యవసాయాధికారులు వారి పరిధిలో కావలసిన ఎరువులు తదితర అంశాలపై పూర్తిస్థాయిలో అవగాహన కలిగి ఉండాలని, ప్రస్తుత వ్యవసాయ సీజన్లో జిల్లాలోని రైతులకు ఎరువుల కొరత లేకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు. రానున్న 10 రోజులకు అవసరమైన ఎరువులు నిల్వ ఉండేలా చూసుకోవాలన్నారు. -
ఉత్సాహంగా పోలీస్ స్పోర్ట్స్ మీట్
ఏలూరు టౌన్: ఏలూరు జిల్లా వార్షిక పోలీస్ స్పోర్ట్స్ మీట్ ఉత్సాహకర వాతావరణంలో సాగింది. మూడు రోజులపాటు పోలీసు అధికారులు, సిబ్బంది ఉల్లాసంగా వివిధ పోటీల్లో తమ సత్తా చాటారు. మంగళవారం రాత్రి పోలీస్ స్పోర్ట్స్ మీట్ ముగింపు వేడుకల్లో ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్కుమార్ హాజరుకాగా, జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ పుష్పగుచ్ఛం అందజేసి సాదరంగా ఆహ్వానం పలికారు. ఏలూరు, జంగారెడ్డిగూడెం, పోలవరం, నూజివీడు పోలీస్ సబ్ డివిజన్ అధికారులు, ఆర్మ్డ్ రిజర్వ్ క్రీడాకారులు ఆయనకు గౌరవ వందనం సమర్పించారు. అనంతరం ఆయా క్రీడా పోటీల్లో విజేతలకు ఐజీ చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు. ఈ పోటీల్లో ఓవరాల్ చాంపియన్గా జిల్లా ఆర్మ్డ్ రిజర్వ్ సిబ్బంది, ఓవరాల్ సింగిల్ చాంపియన్గా ఏఆర్ కానిస్టేబుల్ కిషోర్ ఎంపికయ్యారు. జిల్లా ఎస్పీ, ఏలూరు రేంజ్ ఐజీ టగ్ ఆఫ్ వార్లో పాల్గొని సిబ్బందిలో ఉత్సాహాన్ని నింపారు. ఐజీ మాట్లాడుతూ నిత్యం తీవ్రమైన పని ఒత్తిడిలో క్రీడా పోటీలు నిర్వహించడం అభినందనీయం అన్నారు. నేటి ఆధునిక విధానంలో ఒత్తిడి, శారీరక వ్యాయామం లేకపోవటంతో చిన్న వయస్సులోనే గుండెపోటు వ్యాధులకు బలికావటం బాధాకరమని, ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఖర్చు లేని వ్యాయామం నడకను ఎంచుకోవాలని సూచించారు. జిల్లా ఎస్పీ శివకిషోర్ మాట్లాడుతూ.. పోలీస్ సిబ్బంది ఎంతో ఒత్తిడితో విధులను నిర్వర్తిస్తుంటారని, క్రీడా పోటీలు మానసిక ఉల్లాసం, శారీరక దృఢత్వానికి దోహదం చేస్తాయని చెప్పారు. అదనపు ఎస్పీ నక్కా సూర్యచంద్రరావు ఎఎస్పీ సుస్మిత, ఏఆర్ అదనపు ఎస్పీ జీ.మునిరాజా, డీఎస్పీలు శ్రావణ్కుమార్, వెంకటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు. -
అన్ని సేవలూ ఆన్లైన్లోనే
ద్వారకాతిరుమల: ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమల చినవెంకన్న దర్శనార్ధం ఆలయానికి విచ్చేసే భక్తులకు దేవస్థానం అధికారులు గత శనివారం నుంచి అన్ని ఆన్లైన్ సేవలను అందుబాటులోకి తెచ్చారు. అందులో భాగంగా ఆలయ తూర్పు ప్రాంతంలోని మొబైల్ కౌంటర్ సమీపంలో తాత్కాలికంగా టెంటు వేసి, అందులో ఓ కౌంటర్ను ఏర్పాటు చేశారు. రెండు కంప్యూటర్లు, రెండు ప్రింటర్ల ద్వారా భక్తులకు సిబ్బంది ఆన్లైన్ సేవలను అందిస్తున్నారు. కొందరు భక్తులు ఇప్పటి వరకు కేవలం వెబ్సైట్ ద్వారా మాత్రమే ఆన్లైన్ సేవలను పొందారు. తాజాగా ఫోన్పే, గూగుల్పే వంటి ఆన్లైన్ సేవలను భక్తులకు చేరువ చేశారు. పారదర్శకమైన, వేగవంతమైన సేవలను భక్తులకు అందించడానికి ఆన్లైన్ సేవలను మరింత విస్తృతం చేయాలని ఇటీవల రాష్ట్ర దేవాదాయశాఖ కమిషనర్ కె.రామచంద్రమోహన్ దేవాలయాల అధికారులకు సూచించారు. ఈ క్రమంలోనే చిన్నతిరుపతి దేవస్థానం అధికారులు చర్యలు చేపట్టారు. ఇప్పుడు అన్నీ సేవలూ.. మనమిత్రా వాట్సప్ (9552300009) నెంబర్కు హాయ్ అని పంపి ఆలయంలో అన్ని సేవలను పొందొచ్చు. అలాగే www. aptemples.ap.gov.in వెబ్సైట్ ద్వారా, ఏపీ టెంపుల్ మొబైల్ యాప్ ద్వారా శ్రీవారి దర్శనం, ప్రత్యక్ష – పరోక్ష సేవలు, ప్రసాదాలు ఇతర ఆన్లైన్ సేవలను సులభంగా పొందొచ్చని అధికారులు చెబుతున్నారు. ఆన్లైన్, మనమిత్ర వాట్సప్ ద్వారా టికెట్లు పొందిన భక్తులకు ప్రత్యేక క్యూలైన్ ద్వారా దర్శన సదుపాయం ఏర్పాటు చేసినట్టు తెలిపారు. విశేష స్పందన : ప్రస్తుతం అధిక శాతం మంది ప్రజలు ఫోన్పే, గూగుల్పేను ఎక్కువగా వాడుతున్నారు. మార్కెట్లో ఏ చిన్న వస్తువు కొన్నా.. వాటి ద్వారానే చెల్లింపులు జరుపుతున్నారు. శ్రీవారి ఆలయంలో కూడా ఈ సేవలు మొదలవడంతో ఆన్లైన్ సేవలకు విశేష స్పందన లభిస్తోంది. అధిక శాతం మంది భక్తులు రూ.100, రూ.200 దర్శనం టికెట్లతో పాటు, నిత్యార్జిత కల్యాణం, అంతరాలయ దర్శనం రూ.500 టికెట్లు, ప్రసాదం, వసతి టికెట్లను ఆన్లైన్ ద్వారా పొందుతున్నారు. గోపూజ, కుంకుమార్చన, గరుడసేవ, ఆర్జిత బ్రహ్మోత్సవాలు, సహస్రదీపాలంకరణ సేవ, స్నపన టికెట్ల విక్రయాలు ఆన్లైన్ ద్వారా తక్కువగా జరుగుతున్నాయి. ఆన్లైన్ సేవలు ఎలా పొందాలి, వాటి వల్ల కలిగే ప్రయోజనాలను భక్తులకు కౌంటర్లోని సిబ్బంది వివరిస్తున్నారు. శ్రీవారి ఆలయంలో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటునగదు చెల్లింపుల నిమిత్తం క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తున్న సిబ్బంది శ్రీవారి ఆలయ తూర్పు ప్రాంతంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక ఆన్లైన్ సేవల కౌంటర్ -
మంటగలుస్తున్న నూజివీడు ప్రతిష్ట
జూదాలపై మండిపడ్డ మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారావు నూజివీడు: ఏలూరు జిల్లాలో ప్రసిద్ధిగాంచిన నూజివీడు చరిత్ర కూటమి ప్రభుత్వ హయాంలో జూదాల నిర్వహణతో మంట గలిసిపోయిందని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్చార్జి మేకా వెంకట ప్రతాప్ అప్పారావు ధ్వజమెత్తారు. ఆగిరిపల్లి మండలం పోతవరప్పాడులోని మ్యాంగో బే కల్చరల్ రిక్రియేషన్ సొసైటీలో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా భారీ ఎత్తున పేకాట జరుగుతున్న తీరుపై మంగళవారం ప్రతాప్ అప్పారావు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వాతంత్య్రం తరువాత నూజివీడుకు ఎందరో ప్రముఖులు ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా పనిచేశారని, ఏనాడూ పేకాటను, ఇతర జూదాలను ప్రోత్సహించలేదని చెప్పారు. టీడీపీ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి నియోజకవర్గంలోని గ్రామాల్లో పేకాట, కోడి పందేలు, చిత్తులాటలు పబ్లిక్గా నిర్వహిస్తున్నారన్నారు. గోవాలోని క్యాసినోలను తలపించేలా పోతవరప్పాడులోని మ్యాంగో బే కల్చరల్ రిక్రియేషన్ సొసైటీలో పేకాట నిర్వహించడం చూస్తుంటే జూదాలను అరికట్టడంలో టీడీపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నది స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ఇంత పెద్ద ఎత్తున జూదాలు నిర్వహిస్తుంటే నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి ఏం చేస్తున్నారో? తెలియడం లేదని దుయ్యబట్టారు. మూడేళ్ల క్రితం మ్యాంగో బేలో పేకాట నిర్వహించుకుంటామని కొందరు తన చుట్టూ తిరిగారని, దానికి తాను అంగీకరించలేదని చెప్పారు. 281 మంది జూదరులు, 140 కార్లు, 40 ద్విచక్ర వాహనాలు దొరకడం రాష్ట్రంలో ఇదే ప్రథమమని మేకా ప్రతాప్ తెలిపారు. ఇప్పుడే ఇలా ఉంటే రాబోయే మూడేళ్లలో నూజివీడు నియోజకవర్గంలో ఎంత పెద్ద స్థాయిలో జూదాలు జరుగుతాయోనని ఆందోళన వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో గ్రావెల్, మట్టి అక్రమ తవ్వకాలు జోరుగా సాగుతున్నా పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. జూదాలు, గ్రావెల్, మట్టి తవ్వకాలపై గతంలో పలుమార్లు తాము జిల్లా కలెక్టర్ దృష్టికి సైతం తీసుకెళ్లామన్నారు. జూదాలు, అక్రమ తవ్వకాలను ప్రభుత్వం నిలువరించకపోతే చూస్తూ ఊరుకునేది లేదని స్పష్టంచేశారు. -
యూరియా కొరతతో రైతులకు ఇక్కట్లు
ట్రిపుల్ ఐటీలో అధ్యాపకుల నిరసన వేతనాలను పెంచాలని కోరుతూ నూజివీడు ట్రిపుల్ ఐటీలో పనిచేస్తున్న కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లు మంగళవారం నిరసన ప్రదర్శన చేశారు. 8లో uవైఎస్సార్సీపీ రైతు విభాగం(ఆక్వా కల్చర్) వర్కింగ్ ప్రెసిడెంట్ వడ్డి రఘురాం తాడేపల్లిగూడెం: రాష్ట్రంలో యూరియా కొరత తీవ్రంగా ఉన్నా, రైతులు ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్నా ప్రభుత్వం పట్టించుకోకుండా రైతుల జీవితాలతో ఆటలాడుకుంటోందని వైఎస్ఆర్సీపీ రైతు విభాగం (ఆక్వా కల్చర్) వర్కింగ్ ప్రెసిడెంటు వడ్డి రఘురాం ధ్వజమెత్తారు. సోమవారం విలేకర్లతో మాట్లాడుతూ.. యూరియా విషయంలో ప్రభుత్వం వాస్తవాలు దాస్తోందన్నారు. మార్క్ఫెడ్ వద్ద ఎంత నిల్వలు ఉన్నాయి, ప్రైవేటు డీలర్లకు ఎంత కేటాయించారనే విషయాలను బహిరంగంగా వెలువరించడంలేదన్నారు. సాగు మొదలవ్వకముందే యూరియా కొరత ఎలా ఏర్పడిందని.. నానో యూరియా కొనాలని ఒత్తిడి చేసే డీలర్లపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. యూరియా బ్లాక్ మార్కెట్కు తరలిపోతోందని విమర్శించారు. డిసెంబర్ చివరి నాటికి 3.93 లక్షల టన్నుల యూరియా అవసరమని అంచనావేస్తే.. ఇప్పటికే 3.23 లక్షల టన్నులు అమ్మినట్టు రికార్డుల్లో చూపించడం ఆశ్చర్యకరంగా ఉందన్నారు. రాష్ట్రంలో యూరియా వాడకం, నిల్వలపై ప్రభుత్వం వాస్తవాలు వెల్లడించాలన్నారు. రబీ సీజన్కు 5.5 నుంచి ఆరు లక్షల టన్నుల యూరియా అవసరమవగా , ప్రభుత్వం 9.38 లక్షల టన్నుల యూరియా డిమాండ్ ఉన్నట్టు చూపిస్తోందన్నారు. రబీ ప్రాఽథమిక దశలోనే యూరియా కొరత రావడం వెనుక ఏదో మతలబు ఉందని అనుమానం వ్యక్తం చేశారు. యూరియా కట్ట కావాలంటే, రూ.450 విలువైన గుళికలు లేదా నానో యూరియా కొనాలని డీలర్లు రైతులను వేధిస్తున్నారన్నారు. -
మొక్కుబడిగా ఇంధన పొదుపు వారోత్సవాలు
● జిల్లాలో కానరాని అవగాహన కార్యక్రమాలు ● వారోత్సవాల బడ్జెట్.. మోంథా ఖర్చులు రాక నీరసం తణుకు అర్బన్: విద్యుత్ శాఖ ప్రతి ఏడాది ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలు చంద్రబాబు సర్కారులో మొక్కుబడిగా నిర్వహించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈనెల 14 నుంచి 20వ తేదీ వరకు పొదుపు వారోత్సవాలు నిర్వహించాల్సి ఉండగా ఎటువంటి అలికిడి లేకుండానే గడిచిపోయాయని అంటున్నారు. వారోత్సవాల కోసం ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు అందకపోవడం కూడా కారణంగా చెబుతున్నారు. మొత్తానికి సర్కారు పర్యవేక్షణ లోపమో, విద్యుత్ శాఖ ఉన్నతాధికారుల నిర్లక్ష్యమో కానీ జిల్లాలోని కొన్ని విద్యుత్ సబ్ డివిజన్లలో వారోత్సవాలు అరకొరగాను, మొక్కుబడిగాను నిర్వహించారని, వినియోగదారులకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదని ప్రజానీకం ఆరోపిస్తున్నారు. గతంలో అట్టహాసంగా.. గత ప్రభుత్వ హయాంలో జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలకు ఎంతో ప్రాధాన్యతనిచ్చేవారు. వారోత్సవ నిర్వహణలో భాగంగా విద్యుత్ శాఖ అధికారులు వారంరోజుల పాటు సబ్ డివిజన్ కార్యాలయాల్లో వివిధ కార్యక్రమాలు, విద్యార్థులకు వ్యాసరచన పోటీలు, ర్యాలీలు నిర్వహించి ప్రజలకు తెలిసే విధంగా చర్యలు తీసుకున్నారు. ఇంధన పొదుపుతోపాటు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించేవారు. ఇంధనం పొదుపు చేద్దాం.. భావితరాలకు వెలుగునిద్దాం. విద్యుత్ విలువైనది.. వృథా కాకుండా ఆదా చేద్దాం. మూడు లేక అంతకన్నా ఎక్కువ స్టార్లు ఉన్న గృహోపకరణాలు వాడుదాం.. 30 శాతానికిపైగా విద్యుత్ బిల్లు ఆదా చేద్దాం అంటూ వినియోగదారులకు అవగాహన కల్పించేవారు. కానీ ఈ ఏడాది ఎక్కడా అవగాహన కార్యక్రమాలు కానరాకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బడ్జెట్ అందకపోవడమే కారణమా? జాతీయ ఇంధన వారోత్సవాల నిర్వహణకు జిల్లాకు కొంత మొత్తం బడ్జెట్ను కేటాయిస్తుంటారు. జిల్లాకు సుమారుగా రూ.లక్ష నిధులు కేటాయింపులు చేసి ఆయా సబ్ డివిజన్ కార్యాలయాలకు కొంత మొత్తం చొప్పున అందించాల్సి ఉంది. అయితే ఈ ఏడాది ఇంకా సదరు బడ్జెట్ నిధులు అందకపోవడంతో కొన్ని సబ్ డివిజన్లలో తూతూమంత్రంగా నిర్వహించి చేతులు దులిపేసుకున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే మోంథా తుపాను కారణంగా విద్యుత్ శాఖ నిర్వహించిన పనులకు గాను ఆయా సబ్ డివిజన్లకు చేసిన ఖర్చుల తాలూకా నిధులు అందలేదని దీంతో విద్యుత్ శాఖ అధికారులు తలలు పట్టుకుంటున్నట్లుగా తెలుస్తోంది. వారోత్సవాల విషయంమై తాడేపల్లిగూడెం విద్యుత్ డివిజనల్ ఇంజనీరు కె.నరసింహమూర్తిని ‘సాక్షి’ వివరణ కోరగా తాడేపల్లిగూడెం డివిజన్ అంతా జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలు నిర్వహించామని చెప్పారు. అయితే బడ్జెట్ ఇంకా రావాల్సి ఉందని చెప్పారు. ఇంధన పొదుపు వారోత్సవాల పేరుతో గతంలో విద్యుత్ వాడకం, పొదుపుపై అవగాహన కల్పించే విధంగా కార్యక్రమాలు నిర్వహించే వారు. కానీ ఈ ఏడాది వారోత్సవాలపై వినియోగదారులకు సమాచారం లేదు. అసలు ఇంధన పొదుపు వారోత్సవాలు నిర్వహించినట్లు కనిపించలేదు. – పి.సాయిసూర్య, వినియోగదారుడు, తణుకు -
రబీ మొక్కజొన్న సాగుకు ఇదే అదును
చింతలపూడి: మొక్కజొన్న పంటను ఆహార పంటగానే కాకుండా దాణా రూపంలోను, పశువులకు మేతగాను, వివిధ పరిశ్రమల్లో ముడి సరుకుగాను ఉపయోగిస్తున్నారు. రబీ సీజన్లో మొక్కజొన్న పంటను విత్తుకోవడానికి ఇదే సరైన సమయమని వ్యవసాయ సబ్ డివిజన్ సహాయ సంచాలకులు వై సుబ్బారావు రైతులకు సూచిస్తున్నారు. ఎలాంటి నేలలు అనువు మొక్కజొన్న సాగుకు మురుగు పొయే లోతైన ఎర్ర గరప, మధ్యస్థ నేలలు బాగా అనుకూలం. రబీ సీజన్లో అక్టోబర్ 15 నుంచి నవంబర్ 30 లోగా విత్తితే ఎక్కువ దిగుబడులు పొందడానికి అవకాశం ఉంది. వరి మాగాణి తరువాత జీరో టిల్లేజ్ పద్ధతిలో డిసెంబర్ చివరి వరకు రైతులు విత్తుకోవచ్చు. హైబ్రీడ్ విత్తనాలైతే ఎకరానికి 8 కేజీలు సరిపోతాయి. విత్తటానికి ముందు నేలను 3, 4 సార్లు నాగలితో దుక్కి దున్నాలి. ఎకరానికి 10 టన్నుల బాగా మాగిన పశువుల ఎరువును ఆఖరి దుక్కిలో వేసి కలియ దున్నాలి. తరువాత బోదె నాగలితో బోదెలు, కాలువలు చేసుకోవాలి. 8 కేజీల విత్తనానికి 24 గ్రాముల మాంకోజెబ్ పొడి మందుతో విత్తన శుద్ధి చేసుకుంటే లేత దవలో తెగుళ్ల బారి నుంచి కాపాడుకోవచ్చు. విత్తనాలను చేళ్ల మధ్య 60 సెం.మీటర్ల దూరంలో, మొక్కల మధ్య 20 సెం.మీటర్ల దూరం ఉండేటట్లు విత్తుకోవాలి. మొలకెత్తిన 10 రోజుల తరువాత ఒక మొక్కను ఉంచి మిగిలిన మొక్కలను తీసివేయాలి. భూసార పరీక్షల ఆధారంగా.. భూసార పరీక్షల ఫలితాలను అనుసరించి ఎరువులను వాడితే నాణ్యమైన దిగుబడులకు అవకాశం ఉంటుంది. ఎకరానికి 20 కేజీల జింక్ సల్ఫేట్, 96 కేజీల నత్రజని, 32 కేజీల భాస్వరం, 32 కేజీల పొటాష్ ఇచ్చే ఎరువులను వాడుకోవాలి. మొక్కల్లో జింక్ లోపం కనిపించినప్పుడు లీటర్ నీటికి 2 గ్రా చొప్పున జింక్ సల్ఫేట్ కలిపి పిచికారీ చేయాలి. కలుపు నివారణ పంట విత్తిన 2, 3 రోజుల్లోపు అట్రాజిన్ అనే కలుపు మందును ఎకరాకు 800 గ్రా 200 లీటర్ల నీటిలో కలిపి తగినంత తేమ ఉన్నప్పుడు పిచికారీ చేయడం వలన కలుపు మొక్కలను నెల రోజుల వరకు అదుపు చేయవచ్చు. విత్తిన 30 రోజుల్లోపల వెడల్పాటి కలుపు మొక్కలను గమనిస్తే 2, 4–డీ సోడియం సాల్ట్ ఎకరానికి 500 గ్రాముల పొడి మందు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. కాండం తొలుచు పురుగు మొక్కజొన్న పంట మొలకెత్తిన 10, 20 రోజులకు కాండం తొలుచు పురుగు ఆశిస్తుంది. పిల్ల పురుగులు మొదట ఆకులపై పత్రహరితాన్ని గోకి తింటాయి. తరువాత ముడుచుకుని ఉన్న ఆకుల ద్వారా కాండం లోపలకు చేరతాయి. ఈ ఆకులు విచ్చుకున్న తరువాత గుండుసూది మాదిరి రంధ్రాలు లేదా పొడవాటి చిల్లుల వరుస క్రమంలో కనిపిస్తాయి. లార్వాలు ఎదిగే అంకురాన్ని తినడం వల్ల మొవ్వ చనిపోతుంది. దీనిని డెడ్హార్ట్ అంటారు. కాండం లోపల గుండ్రని లేదా ఎస్ ఆకారంలో సొరంగాలు ఏర్పరుస్తుంది. కంకిని ఆశించడం వలన దిగుబడి తగ్గిపోతుంది. నివారణ మొక్కజొన్న నాటిన 20–30 రోజులకు కార్బోఫ్యూరాన్ 3 జి గుళికలను ఎకరాకు 3 కిలోల చొప్పున ఆకుల సుడులలో వేయడం ద్వారా కాండం తొలిచే పురుగును సమర్థవంతంగా నిలువరించవచ్చు. -
విషాదం నింపిన రోడ్డు ప్రమాదం
● మోటార్సైకిల్ను ఢీకొన్న కారు ● భార్యాభర్తలు మృతి కంకిపాడు: రోడ్డు ప్రమాదం ఆ కుటుంబంలో విషాదం నింపింది. కంకిపాడులో మోటార్సైకిల్ను కారు ఢీకొన్న ఘటనలో భర్త మృతి చెందగా, భార్య ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఏలూరు జిల్లా మండవల్లి మండలం కానుకొల్లు గ్రామానికి చెందిన పాలెపు వెంకన్న (45), తన భార్య గృహలక్ష్మితో కలిసి మోటరుసైకిల్పై పరిటాలలో ఇంజినీరింగ్ చదువుతున్న కుమార్తెను చూసేందుకు ఈ నెల 21న బయలుదేరారు. మార్గమధ్యంలో వీరి మోటార్సైకిల్ను కంకిపాడు నుంచి గుడివాడ వైపు వెళ్తున్న కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఘటనలో తీవ్రంగా గాయపడ్డ పాలెపు వెంకన్న విజయవాడ ఆసుపత్రికి తీసుకెళ్లే క్రమంలో మృతి చెందాడు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితికి చేరుకున్న వెంకన్న భార్య గృహలక్ష్మిని వైద్యం నిమిత్తం విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆమె చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. శివ సహస్ర నామ పూజలు పాలకొల్లు సెంట్రల్: స్థానిక శ్రీ క్షీరారామలింగేశ్వరస్వామి ఆలయంలో సప్త సోమవార ప్రదక్షిణల్లో భాగంగా ఏడు సోమవారాలు ఏడు ప్రదక్షిణలు పూర్తి చేసుకున్న భక్తులు మంగళవారం శివసహస్రనామ పూజలు జరుపుకున్నారు. ఆలయంలో అభిషేకాలు నిర్వహించుకుని మండపంలో ఏర్పాటుచేసిన పూజా కార్యక్రమాల్లో 12 మంది భక్తులు పాల్గొన్నారు. ఆలయ అభిషేక పండిట్ భమిడపాటి వెంకన్న బ్రహ్మత్వంలో పూజా కార్యక్రమాలు జరిగాయి. అనంతరం భక్తులకు ప్రసాద వితరణ చేశారు. ఆలయ చైర్మన్ మీసాల రామచంద్రరావు, ఈవో ముచ్చర్ల శ్రీనివాసరావు, సూపరింటెండెంట్ వాసు, అర్చకులు కిష్టప్ప, అనిల్, వీరబాబు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. ద్వారకాతిరుమల: శ్రీవారి దివ్య క్షేత్రంలో చినవెంకన్న తిరువీధి సేవ మంగళవారం నేత్రపర్వంగా జరిగింది. పద్మావతి, ఆండాళ్ అమ్మవార్లు, గోదాదేవితో కలసి స్వామివారు ఉదయం క్షేత్ర పురవీధుల్లో అట్టహాసంగా ఊరేగారు. ధనుర్మాస ఉత్సవాలను పురస్కరించుకుని ముందుగా ఆలయంలో ప్రత్యేకంగా అలంకరించిన తొళక్క వాహనంపై శ్రీవారు, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను ఉంచి విశేష పుష్పాలంకారాలు చేశారు. పూజాధికాల అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, అర్చకులు, పండితుల వేద మంత్రోచ్ఛరణలు, అశ్వ, గజ సేవల నడుమ స్వామివారి వాహనం క్షేత్ర పురవీధుల్లో తిరుగాడింది. ప్రతి ఇంటి ముంగిటా భక్తులు స్వామివారికి నీరాజనాలు సమర్పించారు. ఆ తరువాత స్థానిక ధనుర్మాస మండపంలో స్వామి, అమ్మవార్లు, గోదాదేవికి అర్చకులు విశేష పూజలు జరిపి, భక్తులకు తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. -
ట్రిపుల్ ఐటీలో అధ్యాపకుల నిరసన
నూజివీడు: వేతనాలను పెంచాలని కోరుతూ నూజివీడు ట్రిపుల్ ఐటీలో పనిచేస్తున్న కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లు మంగళవారం వారు నిరసన ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతిష్టాత్మక ఐఐటీలు, సెంట్రల్ యూనివర్సిటీలలో చదువుకుని కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా 2010–14 సంవత్సరాల మధ్య కాలంలో ట్రిపుల్ ఐటీలో చేరామని, అయితే తమకు వేతనాలను పెంచి ఎనిమిదేళ్లయిందన్నారు. ఈ విషయంపై ఎన్నిసార్లు యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినా అదిగో ఇదిగో అంటూ జాప్యం చేస్తున్నారని వాపోయారు. గతంలో ఆర్జీయూకేటీ గవర్నింగ్ కౌన్సిల్ నిర్ణయం ద్వారా సంస్థాగత స్థాయిలోనే నేరుగా అధ్యాపకుల జీతాలను పెంచేవారని, ప్రస్తుతం జీతాల పెంపు విషయాన్ని ఉన్నత విద్యాశాఖ ద్వారా ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని అధికారులు చెబుతున్నారన్నారు. ఉన్నత విద్యా శాఖ లేవనెత్తిన పలు అంశాలకు సంబంధించి ట్రిపుల్ ఐటీ అధికారులు రెండు నెలలుగా ఎలాంటి సమాధానం ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం దారుణమన్నారు. యాజమాన్యం నుంచి సరైన స్పందన లేకపోవడంతో ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసనకు దిగామన్నారు. అనంతరం డైరెక్టర్ ఆచార్య సండ్ర అమరేంద్రకుమార్కు వినతిపత్రాన్ని అందజేశారు. -
పేదల ఇళ్లు కూల్చివేయడం దుర్మార్గం
ఆకివీడు: కొందరి ప్రయోజనం కోసం పేదల ఇళ్లు పీకివేయడం దుర్మార్గమని సీపీఎం జిల్లా కార్యదర్శి జేఎన్వీ గోపాలన్ ధ్వజమెత్తారు. మండలంలోని కోళ్లపర్రు బ్రిడ్జిపేట వాసులకు ఇళ్లు తొలగింపు నోటీసుల్విడం పట్ల ఆయన విస్మయం వ్యక్తం చేశారు. బాధితుల వద్దకు వెళ్లి వారి సమస్యల్ని తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నాలుగు దశాబ్దాలుగా, రెండుమూడు తరాలవారు నివసిస్తున్న పేదల ఇళ్లను తొగించడం కక్ష సాధింపు చర్యలన్నారు. నాడు పట్టాలిచ్చి, నేడు చంద్రబాబు ప్రభుత్వమే తొలగించడం దారుణమన్నారు. చంద్రబాబు ప్రభుత్వానికి పేదల ఇళ్లు తప్ప, ధనికుల ఆక్రమణలు, భవనాల నిర్మాణం కన్పించడంలేదని ఆరోపించారు. బ్రిడ్జిపేట వాసులకు ఇచ్చిన నోటీసులు వెనక్కి తీసుకోవాలని గోపాలన్ డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఎం ఏరియా కార్యదర్శి తవిటినాయుడు, సాకా కిసింజర్, బాధిత మహిళలు పాల్గొన్నారు. -
26 నుంచి జాతీయస్థాయి నృత్య పోటీలు
ఏలూరు (ఆర్ఆర్పేట): ఈ నెల 26, 27, 28 తేదీల్లో ఏలూరుకు చెందిన ప్రముఖ నృత్య సంస్థ అభినయ నృత్యభారతి 30వ వార్షిక జాతీయ స్థాయి నృత్యోత్సవాలు, నృత్యపోటీలు నిర్వహించనున్నట్టు సంస్థ గౌరవ అధ్యక్షుడు అంబికా కృష్ణ, వ్యవస్థాపక అధ్యక్షుడు మనోహర్ గోపాల్ లునాని, వ్యవస్థాపక కార్యదర్శి నాట్యాచార్య దువ్వి హేమసుందర్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ, వివిధ స్వచ్ఛంద సేవా సంస్థలు, కళా సంస్థల సహకారంతో నిర్వహించనున్న ఈ కార్యక్రమాల్లో యువ నర్తకులకు, నాట్యాచార్యులకు, సేవా మూర్తులకు అవార్డులు అందజేస్తామన్నారు. అలాగే ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన చిన్నారి నర్తకులకు కూచిపూడి, జానపద, బృంద నృత్య పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమాలకు ముందుగా ఈ నెల 25వ తేదీ సాయంత్రం తూర్పు వీధి శ్రీ గంగానమ్మ అమ్మవారి జాతరలో అభినయ నృత్యభారతి ఆధ్వర్యంలో ప్రత్యేక నృత్యోత్సవం నిర్వహించనున్నట్టు చెప్పారు. అంతకు ముందు ఈ కార్యక్రమాలకు సంబంధించిన కరపత్రాలను అంబికా కృష్ణ ఆవిష్కరించారు. -
ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు యువకులు మృతి
పశ్చిమగోదావరి జిల్లా: ఆచంట నియోజకవర్గ పరిధిలోని పెనుమంట్ర మండలం పోలమూరు గ్రామంలో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న ముగ్గురు యువకులు అతివేగంతో రోడ్డుపై ఉన్న డివైడర్ను ఢీకొట్టడంతో ముగ్గురూ అక్కడికక్కడే మృతి చెందారు.ఈ ప్రమాదంలో పోలమూరు గ్రామానికి చెందిన సత్యనారాయణ (28), అంజిబాబు (25), రాజు (19) మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు. ముగ్గురూ ఒకే గ్రామానికి చెందినవారు కావడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.స్థానికుల కథనం ప్రకారం, క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న అనంతరం అర్ధరాత్రి 12.30 సమయంలో ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. అతివేగంతో ప్రయాణిస్తున్న వాహనం అదుపుతప్పి రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్ను ఢీకొనడంతో ముగ్గురు యువకులు తీవ్ర గాయాలకు గురై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.సమాచారం అందుకున్న పెనుమంట్ర పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను పంచనామా నిమిత్తం తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి అతివేగమే ప్రధాన కారణమని స్థానికులు చెబుతుండగా, ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
మన్యం బంద్ ప్రశాంతం
కుక్కునూరు: పోలవరం నియోజకవర్గంలోని మండలాల్ని పోలవరం జిల్లాలో కలపాలని కోరుతూ ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన బంద్ ప్రశాంతంగా ముగిసింది. బంద్ సందర్బంగా మండలంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంక్లు, వ్యాపార సముదాయాలు మూతపడ్డాయి. ఈ సందర్భంగా బంద్ను ఉద్దేశించి ఆదివాసీ సంఘాల నాయకులు మాట్లాడుతూ, పోలవరం జిల్లాలో పోలవరం నియోజకవర్గంలో ఉన్న మండలాలు లేకపోవడం సిగ్గుచేటన్నారు. చంద్రబాబు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. బంద్లో సీపీఎం మండల కార్యదర్శి యర్నం సాయికిరణ్, ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కూరం సంజీవరావు, మండల అధ్యక్షుడు వేణుగోపాల్, గిరిజన సంఘం మండల ఉపాధ్యక్షులు కాక ఆనంద్, నవదీప్, తదితరులు పాల్గొన్నారు. వేలేరుపాడు మండలంలో.. వేలేరుపాడు: రంపచోడవరం కేంద్రంగా ప్రకటించిన పోలవరం జిల్లాలో పోలవరం నియోజకవర్గ లేకపోవడంతో మండలంలో జిల్లా సాధన కమిటీ ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. మండల కేంద్రం నుంచి సాధన కమిటీ ఆధ్వర్యంలో గుల్లవాయీ సెంటర్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ సెంటర్లో సదస్సు జిల్లా సాధన కమిటీ సభ్యుడు మడివి దుర్గారావు అధ్యకతన జరిగింది. నాయకులు ధర్ముల రమేష్, ఊకె ముత్యాలరావు, సొడే సీతారామయ్య, కారం వెంకట్రావు, మడకం ఏసుబాబు, పొట్ల మోహన్, మిరియాల శ్రీను, కట్టి ఉదయ్లు మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వాసిత ప్రాంతం అంతా ఒక జిల్లాగా ప్రకటిస్తానని ఇచ్చిన హామీ విస్మరించి, పోలవరం జిల్లాని ప్రకటించటం నియోజకవర్గ ప్రజలను నిరాశ పరచడమేనని విమర్శించారు. నియోజకవర్గంలో నిర్వాసితుల సమస్యలు పరిష్కారం అవ్వాలన్నా, ఈ ప్రాంతం అభివృద్ధి అవ్వాలంటే పోలవరం నియోజకవర్గంని కలిపి పోలవరం జిల్లా ప్రకటించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కరాటం ప్రకాష్, కుడియం రాజు, రాంబాబు, ప్రేమ కుమార్, కొత్త వెంకటేశ్వర్లు, మల్లేష్, నాగు రాముడు తదితరులు ఉన్నారు. పోలవరం మండలంలో.. పోలవరం రూరల్: పోలవరం నియోజకవర్గాన్ని పోలవరం జిల్లాలో కలపాలని సీపీఎం మండల కార్యదర్శి కారం భాస్కర్ డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా సాధన కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఏజెన్సీ బంద్ కార్యక్రమంలో మండలంలో షాపులను మూయించి నిరసన వ్యక్తం చేశారు. ఏటిగట్టు సెంటర్లో నినాదాలు చేశారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు పోలవరం జిల్లా కేంద్రంగా పోలవరం జిల్లా ప్రకటిస్తానని మాటిచ్చి మాట తప్పారని, పోలవరం నియోజకవర్గం లేకుండా పోలవరం జిల్లా ఏర్పాటు చేయడం అన్యామన్నారు. ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా జిల్లాను ఏర్పాటు చేయడం తగదన్నారు. సీపీఎం నాయకులు బొరగం భూ చంద్రరావు, సముద్రాల సాయికృష్ణ, తామా బాలరాజు తదితరులు పాల్గొన్నారు. టి.నరసాపురం మండలంలో.. టి.నరసాపురం: మండలంలో ఉన్న 18 గిరిజన గ్రామాలు షెడ్యూల్ ఏరియాలో కలపాలని సీపీఎం జిల్లా నాయకులు గుడెల్లి వెంకట్రావు డిమాండ్ చేశారు. పోలవరం నియోజకవర్గంలో ఏజెన్సీ మండలాలను రంపచోడవరం కేంద్రంగా ఏర్పాటు చేసే పోలవరం జిల్లాలో కలపాలని ఏజెన్సీ మండలాల బంద్లో భాగంగా సోమవారం సీపీఎం ఆధ్వర్యంలో టి.నరసాపురంలో బంద్కు మద్దతు తెలిపారు. మల్లప్పగూడెం గ్రామంలో ధర్నా నిర్వహించారు. సీపీఎం జిల్లా నాయకులు గుడెల్లి వెంకటరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పోలవరం జిల్లాలో పోలవరం లేదని ఇప్పుడైనా ఏజెన్సీ ప్రాంతం కలుపుతూ టి.నరసాపురం, జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం, గోపాలపురం మండలాల్లో ఉన్న 28 గిరిజన గ్రామాలను రంపచోడవరం పోలవరం జిల్లాలో కలపాలని గ్రామాలన్నింటికి గిరిజన భారత ప్రాంతంగా చేయాలని డిమాండ్ చేశారు. -
‘చిన్ని చిన్ని మనసులు’కు మరో అవార్డు
వీరవాసరం: కొమ్మిరెడ్డి క్రియేషనన్స్ బ్యానర్పై కొమ్మిరెడ్డి శ్రీనివాస్ నిర్మాతగా, రచయిత అడబాల లక్ష్మీనారాయణ దర్శకత్వం వహించిన చిన్ని చిన్ని మనసులు లఘు చిత్రం ప్రత్యేక అవార్డు గెలుచుకుంది. డిసెంబర్ 21న రాజమండ్రిలో జరిగిన అభినయ గోదావరి కళానికేతన్ అంతర్జాతీయ తెలుగు లఘు చిత్రాల పోటీలలో బెస్ట్ అఫ్ టెన్ ఫిల్మ్ అవార్డుతో పాటు, ఉత్తమ సంగీతం అవార్డును గెలుచుకుంది. ఈ అవార్డులను డైరెక్టర్, కో–డైరెక్టర్ అందుకున్నారు. షార్ట్ ఫిల్మ్ బృందాన్ని సర్పంచ్ గెడ్డం భారతి, వైస్ ఎంపీపీ అడ్డాల శ్రీరామచంద్రమూర్తి, కె.సర్వేశ్వరరావు, గెడ్డం భాస్కరరావు అభినందించారు. ఏలూరు (టూటౌన్): అగ్రవర్ణాల వేధింపులు, అరాచకాల నుంచి విముక్తి కల్పించాలని కోరుతూ కై కలూరు నియోజకవర్గం ముదినేపల్లి మండలం పేరూరుకు పుట్టి శివభాస్కర్ తన కుటుంబ సభ్యులతో కలిసి కలెక్టరేట్ వద్ద సోమవారం నిరసన వ్యక్తం చేశారు. బాధితుడు మాట్లాడుతూ తన 6.64 ఎకరాల భూమి హద్దులను రైతులు బొప్పన రామలింగేశ్వరరావు, అతని అనుచరులు తొలగించి అక్రమంగా ప్రవేశించి చేపల చెరువు త్రవ్వే ప్రయత్నం చేశారని, తన చెరువును వారికి లీజుకి ఇవ్వాలని ఒత్తిడి చేశారని ఆరోపించారు. నిరాకరించడంతో స్థానిక ఎస్సై అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు. సంబంధిత రైతులతో రాజీ కుదుర్చుకోవాలని బెదిరిస్తున్నారన్నారు. -
ట్రిపుల్ఐటీ విద్యార్థులకు అవగాహన సదస్సు
నూజివీడు: ట్రిపుల్ ఐటీ మెటలర్జికల్ విద్యార్థులు ప్రదర్శిస్తున్న సాంకేతిక పరిజ్ఞానం, నేర్చుకోవాలనే ఆసక్తి అభినందనీయమని మురుగప్ప అసోసియేట్ ఉపాధ్యక్షుడు, టెక్నికల్ హెడ్ సూర్యనారాయణ అన్నారు. స్థానిక ట్రిపుల్ఐటీలో మురుగప్ప గ్రూపు ఆధ్వర్యంలో ఎంఎంఈ విద్యార్థులకు సోమవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న సూర్యనారాయణ మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాల వల్ల విద్యార్థులు పరిశ్రమల అంచనాలను ప్రారంభదశలోనే తెలుసుకోవడానికి సాయపడతాయన్నారు. మురుగప్ప గ్రూపు హెచ్ఆర్ అండ్ సేఫ్టీ హెడ్ అరుణాచలం మాట్లాడుతూ ప్రతిభావంతులైన విద్యార్థులను గుర్తించి పరిశ్రమలకు ఉపయోగపడేలా వారిలో నైపుణ్యాలను పెంపొందించడానికి తగిన శిక్షణ ఇస్తామన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ ఆచార్య సండ్ర అమరేంద్రకుమార్, ఎంఎంఈ, కెమికల్ ఇంజినీరింగ్ అధ్యాపకులు పాల్గొన్నారు. ఎంఎంఈ విద్యార్థులకు ఉత్తమ భవిష్యత్ కోసం నూతన మిశ్రమలోహాలు అనే అంశంపై వర్క్షాపు నిర్వహించారు. హైదరాబాద్ విశ్వవిద్యాలయానికి చెందిన ఆచార్య కోటేశ్వరరావు విద్యార్థులకు అనేక అంశాలపై అవగాహన కల్పించారు. నరసాపురం రూరల్: పేరుపాలెం బీచ్లో పర్యాటకుల భద్రతను మెరుగుపరచడానికి డ్రోన్ల వినియోగం విప్లవాత్మక మార్పని, వీటి సహకారంతో సముద్ర తీరాల్లో ప్రమాదాలు జరిగినప్పుడు వేగంగా సహాయం చేసేందుకు వీలు పడుతుందని ఎస్సై జి.వాసు అన్నారు. మొగల్తూరు మండలంలోని పేరుపాలెం సౌత్, కేపీ పాలెం సౌత్ గ్రామాలలో బీచ్లో పర్యాటకుల రక్షణ కోసం సమకూర్చిన డ్రోన్ను ప్రొఫెసర్ జయశంకర్ ఆధ్వర్యంలో సిబ్బంది సోమవారం పరిశీలించారు. ప్రొఫెసర్ జయశంకర్ మాట్లాడుతూ రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతాలను గమనిస్తూ, ప్రమాదకరమైన ప్రాంతాలకు పర్యాటకులు వెళ్లకుండా హెచ్చరించవచ్చన్నారు. దాతలు అందే కాశీ విశ్వేశ్వరరావు రూ.5 లక్షలు, పోలిశెట్టి శ్రీనివాస్ రూ.లక్ష రూపాయలు విరాళంగా అందించిన నిధులతో సమకూర్చిన డ్రోన్ను బీచ్లో ఎగరవేసి పరిశీలించారు. -
నేషనల్ గేమ్స్లో మధురశ్రీకి ద్వితీయ స్థానం
కొయ్యలగూడెం: నేషనల్ లెవల్ సెపక్ తక్రా పోటీల్లో తమ కళాశాల విద్యార్థిని ద్వితీయ స్థానం సాధించిందని వీఎస్ఎన్ కళాశాల ప్రిన్సిపాల్ స్వామి సోమవారం తెలిపారు. జూనియర్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న పాక మధురశ్రీ జోధ్పూర్లో అండర్–17 విభాగంలో పోటీల్లో పాల్గొని విజయం సాధించిందన్నారు. మధురశ్రీని ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు అభినందించారు. బుట్టాయగూడెం: జీలుగుమిల్లి మండలం కామయ్యపాలెం సమీపంలో నాటుసారా స్థావరంపై ఎకై ్సజ్ అధికారులు సోమవారం దాడి చేశారు. నాటుసారా తయారీకి సిద్ధంగా ఉన్న 200 లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేసినట్లు ఎకై ్సజ్ ఇన్స్పెక్టర్ కె.శ్రీనుబాబు తెలిపారు. ఇద్దరిపై కేసు నమోదు చేశామన్నారు. ద్వారకాతిరుమల: తమ ఇంటి ముంగిటకు వచ్చిన శ్రీవారికి భక్తులు సోమవారం పూజలు నిర్వహించి, నీరాజనాలు సమర్పించారు. చినవెంకన్న దివ్య క్షేత్రంలో ధనుర్మాస ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా నిర్వహించిన తిరువీధి సేవ భక్తులకు నేత్రపర్వమైంది. తొలుత ఆలయంలో స్వామి, అమ్మవార్లు, గోదాదేవి ఉత్సవ మూర్తులను తొళక్క వాహనంపై ఉంచి ప్రత్యేక పుష్పాలంకారాలు చేశారు. అనంతరం మేళతాళలు, మంగళ వాయిద్యాలు, అర్చకులు, పండితుల వేద మంత్రోచ్ఛరణలు, గజ, అశ్వ సేవల నడుమ తిరువీధి సేవను కన్నులపండువగా జరిపారు. ఆ తరువాత ఆలయ ప్రధాన కూడలిలోని ధనుర్మాస మండపంలో శ్రీవారికి, అమ్మవార్లకు అర్చకులు విశేష పూజలు నిర్వహించి, భక్తులకు తీర్ధప్రసాదాలను పంపిణీ చేశారు. తణుకు అర్బన్: శ్రీశ్రీ కళావేదిక ఆధ్వర్యంలో ఈ నెల 21న అమలాపురంలో నిర్వహించిన 160వ శతాధిక కవి సమ్మేళనంలో తణుకు పట్టణానికి చెందిన ప్రముఖ కవి వీఎస్వీ ప్రసాద్ ప్రతిభ చూపించారు. నూతన ఆంగ్ల సంవత్సరానికి స్వాగతం పేరుతో ఆయన రాసి చదివి వినిపించిన కవితకు కవితా హృదయాల నుంచి విశేష స్పందన లభించింది. కళావేదిక అంతర్జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కత్తిమండ ప్రతాప్, జాతీయ అధ్యక్షుడు జి.ఈశ్వరి భూషణం, డాక్టర్ కావూరి శ్రీనివాసశర్మ, బొంతు వీవీ సత్యనారాయణ తదితరులు కవి ప్రసాద్ను ఘనంగా సత్కరించారు. కై కలూరు: మద్యం మత్తులో స్నేహితుడిపై బీరు సీసాతో దాడి చేసిన ఘటన వరహాపట్నం మద్యం దుకాణం వద్ద సోమవారం జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం రాచపట్నంకు చెందిన పెనుమాల వాసు, వరహాపట్నానికి చెందిన తోట రాజేష్ స్నేహితులు. రాజేష్ వరహాపట్నం బ్రాందీ దుకాణం వద్ద మద్యం మత్తులో మరొకరితో గొడవ పడుతుండగా.. అటుగా వెళ్తున్న వాసు రాజేష్కు సర్ది చెప్పాడు. కోపంతో బీరు సీసాతో వాసు తలపై రాజేష్ కొట్టాడు. తీవ్ర గాయాలైన వాసును కై కలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించి, అక్కడ నుంచి మెరుగైన చికిత్స కోసం ఏలూరు తీసుకెళ్ళారు. -
ఊపాధి హామీ పథకానికి తూట్లు
భీమవరం: జీ రామ్ జీ పేరుతో కొత్త చట్టం పేదలకు ఉపాధి గ్యారెంటీ లేకుండా చేయడమేనని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు బి.బలరాం అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ చట్టానికి సవరణ చేయడంపై నిరసనగా సోమవారం భీమవరంలో సీపీఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పార్టీ జిల్లా కార్యదర్శి జెఎన్వీ గోపాలన్ అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉపాధి హామీ చట్టం, సమాచార హక్కు చట్టం వంటి వాటిని నేడు మోదీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని విమర్శించారు. గ్రామీణ పేదల ఉపాధికి నష్టం కలిగించే జీ రామ్ జీ చట్టం అమలుకు చేసే ప్రయత్నాలను ఐక్యంగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పాతపాటి హరికుమార్ రాజు మాట్లాడుతూ వలసల నివారణకు యూపీఏ ప్రభుత్వం చట్టాన్ని తెస్తే నేడు జాతిపిత గాంధీ పేరు తొలగించి రాంజీ పేరు పెట్టడం పేదలను మోసం చేయడమేనన్నారు. వైఎస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధి కామన నాగేశ్వరరావు మాట్లాడుతూ పార్లమెంట్లో వైఎస్సార్సీపీ ఎంపీలు స్టాండింగ్ కమిటీ ముందు చర్చ పెట్టాలని డిమాండ్ చేసినా కేంద్రం మొండిగా చట్టాన్ని ఆమోదింప చేసిందని విమర్శించారు. రానున్న రోజుల్లో ఉపాధి హామీ చట్టాన్ని రక్షించే పోరాటంలో వైఎస్సార్సీపీ పూర్తి సహకారం అందిస్తుందన్నారు. ఫార్వర్డ్ బ్లాక్ జిల్లా కార్యదర్శి లంక కృష్ణమూర్తి. ఎంసీపీఐయు జిల్లా నాయకుడు గురుగుబెల్లి రాంబాబు, బీఎస్పీ జిల్లా నాయకులు మురాల రత్నంరాజు, ఈది శేఖర్బాబు, దళిత ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు గంటా సుందరకుమార్, కోన జోసప్, ఈది రవికుమార్, బోకూరి విజయరాజు, బి.వాసుదేవరావు తదితరులు పాల్గొన్నారు. -
రబీకి నీటి కష్టాలు తప్పవా?
● గోదావరి డెల్టాలో 8.99 లక్షల ఎకరాల్లో సాగు ● మొత్తం 93 టీఎంసీలు అవసరం కాగా.. 19 టీఎంసీల కొరత ఆకివీడు: ఈ ఏడాది వేసవిలో సాగు, తాగు నీటి అవసరాలకు కొరత తప్పేలా లేదు. ఇప్పటికే శివారు ప్రాంతాలకు సాగునీటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. జనవరి నెలాఖరునాటికి నీటి సరఫరాలో కొరత ఉండే అవకాశం ఉందని జలవనరుల శాఖ చెబుతోంది. ఫిబ్రవరి మొదటి వారంలో వంతుల వారీగా నీటిని సరఫరా చేయాలని ప్రణాళికలు రూపొందించారు. గోదావరి డెల్టా ప్రాంతంలో ఈ రబీ సీజన్లో సుమారు 8.99 లక్షల ఎకరాల్లో వరి సాగు చేపడుతుండగా.. సాగు పూర్తయ్యేవరకూ 93 టీఎంసీల నీటి అవసరాల్ని జలవనరుల శాఖ గుర్తించింది. గోదావరి, సీలేరు నుంచి నీటిని సరఫరా చేసేందుకు నిర్ణయించారు. గోదావరి వెస్ట్రన్ డివిజన్లో 4.62 లక్షల ఎకరాలు, సెంట్రల్ డివిజన్లో 1.72 లక్షల ఎకరాలు, ఈస్ట్రన్ డివిజన్లో 2.65 లక్షల ఎకరాల్లో రబీ సాగు చేపట్టనున్నారు. వీటితో పాటు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలోని గ్రామాల్లో మంచినీటి అవసరాలు, ఇతర అవసరాలకు నీటి వినియోగం ఉంటుంది. ప్రస్తుత రబీ సీజన్కు 19 టీఎంసీల నీటి కొరత ఉన్నట్లు జలవనరుల శాఖ నిర్ధారించింది. నీటి కొరతను అధిగమించేందుకు వంతుల వారీ విధానాన్ని ఫిబ్రవరి మొదటి వారం నుంచి అమలుజేయనున్నారు. మంచినీటికీ ఇక్కట్లు? రానున్న రోజుల్లో మంచినీటి సమస్య తీవ్రమయ్యే ప్రమాదం ఏర్పడింది. గోదావరి, పోలవరం, సీలేరు ప్రాంతాల్లో నీటి నిల్వలు అంతంత మాత్రంగానే ఉన్నట్లు అధికారులు స్పష్టంచేశారు. దీంతో సాగునీటికి, తాగునీటికి, చెరువులకు నీటి కష్టాలు తప్పేలా లేవు. పోలవరం ప్రాజెక్టుతో నీటి కష్టాలు తీరుతాయని భావించిన రైతులకు, ప్రజలకు ఆదిలోనే హంసపాదులా మారింది. ఈ ఏడాది ఖరీఫ్లోనే కొన్నిచోట్ల నీటి సమస్య తలెత్తింది. ఇప్పటికే గ్రామాల్లోని మంచినీటి చెరువుల్లో నీరు నిండుకుంటోంది. చేపలు, రొయ్యల చెరువులకు, ఇతర అవసరాలకు నీరు ఏవిధంగా అందుతుందోననే ఆందోళనలో ప్రజలు, రైతులు ఉన్నారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
ద్వారకాతిరుమల: లారీ, బైక్ పరస్పరం ఢీకొన్న ఘటనలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా, మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన మండలంలోని దొరసానిపాడు శివారులో ఓ దాబా ముందు సోమవారం మధ్యాహ్నం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం... కామవరపుకోట మండలం తాడిచర్లకు చెందిన కొప్పుల రాజేష్(20) వ్యాన్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. రాజేష్, ఆడమిల్లిలోని ఓ పెట్రోల్ బంకులో పనిచేస్తున్న అదే గ్రామానికి చెందిన తన స్నేహితుడు సర్వేపల్లి నవదీప్లు బైక్ సైలెన్సర్ రిపేర్ నిమిత్తం ద్వారకాతిరుమలకు వచ్చారు. అనంతరం స్వగ్రామానికి వెళుతున్నారు. కామవరపుకోట నుంచి ద్వారకాతిరుమల వైపుకు వెళుతున్న లారీ, వీరి బైక్ పరస్పరం వేగంగా ఢీకొన్నాయి. రాజేష్ తల భాగం నుజ్జునుజ్జయ్యి అక్కడికక్కడే మృతి చెందగా, నవదీప్కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రుడిని 108లో పీహెచ్సీకి తరలించారు. అనంతరం ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు. మృతుడి తండ్రి ఫిర్యాదుపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రజా అర్జీలపై ప్రత్యేక దృష్టి
జేసీ రాహుల్కుమార్రెడ్డి భీమవరం (ప్రకాశంచౌక్): ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)లో ప్రజలు అందిస్తున్న అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించాలని జాయింట్ కలెక్టర్ టి. రాహుల్కుమార్రెడ్డి ఆదేశించారు. సోమవారం క లెక్టరేట్లో డీఆర్వో బి.శివన్నారాయణరెడ్డి, గ్రామ, వార్డు సచివాలయాల అధికారి వై.దోసిరెడ్డి, డ్వామా పీడీ కేసీహెచ్ అప్పారావు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జెడ్.వెంకటేశ్వరరావుతో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. వృద్ధాప్య, ఒంటరి మహిళ, దివ్యాంగ పింఛన్లు మంజూరు చేయాలని, వృద్ధాప్యంలో ఉన్న వారిని పిల్లలు చూడటం లేదని, రేషన్ కార్డుల మంజూరు, డ్రైనేజీ, సరిహద్దు సమస్యలు ఆక్రమణలు తదితర అంశాలపై పలువురు అర్జీలు అందించారు. మొత్తంగా 265 అర్జీలను స్వీకరించారు. ప్రతి అర్జీని ఆడిట్ చేస్తామని, క్షేత్రస్థాయిలో సిబ్బందితో సమన్వయం చేసుకుని అర్జీదారుడికి సంతప్తికరమైన సమాధానాలు ఇవ్వాలని జేసీ అన్నారు. అర్జీలు రీ ఓపెన్ అయితే కారణాలను పిటిషనర్కు వివరింఆచలన్నారు. వృద్ధుల సంక్షేమ అప్పిలేట్ ట్రిబ్యునల్ సభ్యుడు మేళం దుర్గాప్రసాద్ పాల్గొన్నారు. -
వైజ్ఞానిక ప్రదర్శనలతో సృజనాత్మకత
వీరవాసరం: విద్యార్థుల్లో సృజనాత్మకత పెంపొందించేందుకు, నూతన ఆవిష్కరణలకు వైజ్ఞానిక ప్రదర్శనలు దోహదపడతాయని కలెక్టర్ సీహెచ్ నాగరాణి, ఎమ్మెల్సీలు కవురు శ్రీనివాస్, బి.గోపిమూర్తి అన్నారు. వీరవాసరం ఎమ్మార్కే జెడ్పీ హైస్కూల్లో జిల్లాస్థాయి సైన్స్ ఫెయిర్ను వారు ప్రారంభించారు. అలాగే మ్యాజికల్ సైన్స్ పోస్టర్ను ఆవిష్కరించారు. గణిత దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీనివాస రామానుజన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన విద్యార్థులు సుమారు 146 ఎగ్జిబిట్లను ప్రదర్శించారు. కలెక్టర్ మాట్లాడుతూ చదువుతోపాటు ఇలాంటి కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొనాలని అన్నారు. డీఈఓ ఈ.నారాయణ మాట్లాడుతూ జిల్లాలో 233 పాఠశాల్లో మండల స్థాయి పోటీలు నిర్వహించగా, 146 ప్రాజెక్టులు జిల్లాస్థాయి ప్రదర్శనకు ఎంపికయ్యారన్నారు. వీరిలో ప్రతిభ చూపిన వారిని రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేస్తామన్నారు. సమగ్ర శిక్ష ఏపీసీ పి.శ్యాంసుందర్, హెచ్ఎం జె.శ్రీనివాసరావు, డిప్యూటీ డీఈఓలు రమేష్, సత్యనారాయణ, జిల్లా సైన్స్ ఆఫీసర్ వి.పూర్ణచంద్రరావు, ఎంపీపీ వీరవల్లి దుర్గభవానీ, తహసీల్దార్ ఏవీ రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. -
ఎన్హెచ్ 165 విస్తరణకు మోక్షమెప్పుడో..!
● ఏళ్ల తరబడి సాగుతున్న పనులు ● ఆకివీడు–దిగమర్రు మార్గంలో మొదలు కాని వైనం ● డీపీఆర్ మార్పుతో సరిపెట్టిన ప్రభుత్వం ఆకివీడు: జాతీయ రహదారి 165 విస్తరణ పనులకు మోక్షమెప్పుడో అని జిల్లావాసులు ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్నారు. 2019లో అప్పటి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆకివీడులో పనులకు శంకుస్థాపన చేశారు. అయితే రహదారి విస్తరణపై కొందరు కోర్టుకు వెళ్లడంతో పనులు నిలిచాయి. ఆ తర్వాత డీపీఆర్ మార్చి ఆకివీడులోని ఉప్పుటేరు వద్ద నుంచి అయిభీమవరం మీదుగా ఆకివీడు, కలిసిపూడి, పెదపుల్లేరు, సీసలి, జక్కరం, పెదమిరం, చిన అమిరం, రాయలం, గునుపూడి, తాడేరు, విస్సా కోడేరు శివారు వంకాయలపాలెం, పెన్నాడు శివా రు పెన్నాడుపాలెం, శృంగవృక్షం, వీరవాసరం కలిసేలా కొత్త మార్గానికి అనుమతి ఇచ్చారు. నిర్మాణం కోసం గతంలో రూ.1,400 కోట్లు కేటాయించగా, ప్రస్తుతం అడ్డదారులు, అష్టవంకర్లుగా వెళుతున్న నాలుగు లైన్ల రోడ్డుకు రూ.3,200 కోట్లు కేటాయించారు. ఆకివీడు ప్రాంతంలో భూసేకరణ పనులు పూర్తయ్యాయి. అయితే ఉప్పుటేరు వద్ద నుంచి పనులు ప్రారంభించాల్సి ఉండగా ఇప్పటికీ ప్రారంభానికి నోచుకోలేదు. ట్రాఫిక్ ఇబ్బందులు తొలగించేలా.. జాతీయ రహదారిలో ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా ప్ర త్యామ్నాయంగా బైపాస్ రోడ్డు నిర్మించాల్సి ఉంది. అయితే జాతీయస్థాయిలో డీపీఆర్ రెండోసారి మార్చడం విమర్శలకు తావిచ్చింది. కొందరికి లబ్ధి చేకూర్చేందుకు ఈ డీపీఆర్ రూపొందించారనే ఆరోపణలు ఉన్నాయి. జాతీయ రహదారి అంటే ప్ర యాణం సాఫీగా సాగాలని, అయితే ఈ డీపీఆర్ ప్ర కారం మార్గం అలా లేదనే విమర్శలు ఉన్నాయి. పాలకొల్లు–పామర్రు రోడ్డుగా ఉన్న సమయంలోనే నాలుగు లైన్లకు సరిపడా రోడ్డుకు స్థలం ఉంది. పట్టణాల మధ్యలో కిలోమీటరు మేర డబుల్ లైన్గా ఉంది. అయినా నాలుగైన్ల బైపాస్ కోసం రూ.3,200 కోట్లు కేటాయించడంలో ఆంతర్యమేంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఎప్పటికీ పూర్తయ్యేనో.. జాతీయ రహదారి బైపాస్ రోడ్లుతో కలిపి నాలుగు లైన్ల రోడ్డు నిర్మాణం ఎప్పటికి పూర్తయ్యేనో అని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వేల కోట్లు కేటాయించినా ఈ రోడ్డు నిర్మాణ పనుల ప్రారంభోత్సవం ఎండమావిగానే ఉందని, ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి పనులు వేగిరపర్చాలని ఈ ప్రాంత వాసులు కోరుతున్నారు. ఉప్పుటేరుపై తుప్పుపట్టిన వంతెన నిర్మాణాలు ఆకివీడులో నిలిచిన పనులు -
రియల్.. ఢమాల్
మంగళవారం శ్రీ 23 శ్రీ డిసెంబర్ శ్రీ 2025సాక్షి, భీమవరం: జిల్లాలో రియల్ ఎస్టేట్ రంగం నేలచూపులు చూస్తోంది. క్రయవిక్రయాలు మందగించి రిజిస్ట్రేషన్ల శాఖ రాబడి లక్ష్యాన్ని చేరుకోవడం గగనమవుతోంది. గతంతో పోలిస్తే గత ఆర్థిక సంవత్సరంలో రిజిస్ట్రేషన్లు గణనీయంగా తగ్గినట్టు గణాంకాలు చెబుతున్నాయి. అమ్మేవారున్నా ప్రజల్లో కొనుగోలు శక్తి తగ్గిపోవడమే స్థిరాస్తి రంగం కుదేలవ్వడానికి కారణమని రియల్ ఎస్టేట్ వర్గాలంటున్నాయి. జిల్లాలోని పట్టణ, మండల కేంద్రాలు, సమీప గ్రామాల్లో వెయ్యికి పైగా లేఅవుట్లు ఉన్నాయి. ఎక్కడికక్కడ అపార్ట్మెంట్లు పుట్టుకొచ్చాయి. స్థలాలు, ప్లాట్లు క్రయ విక్రయదారులతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు కళకళలాడేవి. పశ్చిమగోదావరి జిల్లాలోని 15 సబ్ రిజిస్ట్రార్ కా ర్యాలయాల పరిధిలో నెలకు 10 వేలకు పైగా రిజిస్ట్రేషన్లు జరుగుతాయని అంచనా. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో వీటి సంఖ్య 15 వేలకు పైబడి ఉండగా గత ఆర్థిక సంవత్సరంలో 10 వేలలోపే జరిగాయి. చంద్రబాబు ప్రభుత్వం సంక్షేమ పథకాలను అటకెక్కించడంతో జనం వద్ద డబ్బుల్లేక మార్కెట్లో మనీ రొటేషన్ తగ్గింది. వ్యాపారుల పరిస్థితి దిగజారింది. ప్రతికూల వాతావరణం, దళారుల దోపిడీతో జిల్లాలో ప్రధానమైన ఆక్వా, వరిసాగులో రైతులు నష్టాలు చవిచూస్తున్నారు. రియల్ ఎస్టేట్ రంగంలో క్రయవిక్రయాలు గణ నీయంగా తగ్గిపోయాయి. సైట్లు అమ్ముడుపోక అప్పులు చేసి వెంచర్లు వేసిన వారి పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. పిల్లల చదువులు, వివాహాలు, ఇతర అవసరాల నిమిత్తం ఉన్న కాస్త ఆస్తిని అమ్మకానికి పెట్టినా కొనే వారు లేక సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు. గతంలో నెలకు రెండు, మూడు ప్లాట్లు అయినా విక్రయించే వారు కొంతకాలంగా ఒక్క ప్లాటు కూడా విక్రయించలేని పరిస్థితి ఉందని మీడియేటర్స్ అంటున్నారు. రిజిస్ట్రేషన్ శాఖలో గత ఆర్థిక సంవత్సరంలో కేవలం 63 శాతం మాత్రమే ఆదాయం లక్ష్యం నమోదైంది. ఎనీవేర్ రిజిస్ట్రేషన్లు ఎక్కువగా జరిగే ఉండి, మొగల్తూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు మినహా జిల్లాలోని మిగిలిన 13 చోట్ల ఆదాయం లక్ష్యం 48 శాతం నుంచి 70 శాతంలోపే ఉంది. మూలిగేనక్కపై తాటికాయ పడ్డట్టు ఫిబ్రవరి నుంచి భూముల విలువను 10 నుంచి 40 శాతం వరకు పెంచడం రియల్ ఎస్టేట్ రంగాన్ని మరింత దెబ్బతీసింది. చార్జీల పెంపుతో ఉన్న అరకొర మొత్తాన్ని ప్రజలు బంగారంపై పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపుతుండటం రిజిస్ట్రేషన్లు మందగించడానికి కారణంగా చెబుతున్నారు. 2019 నుంచి 2024 మధ్య కాలం స్థిరాస్థి రంగానికి స్వర్ణయుగం అయ్యింది. విద్య, వైద్యం, ఉపాధి తదితర రంగాల్లో గత ప్రభుత్వం ప్రజలకు అండగా నిలిచింది. అన్నివర్గాల వారికి మేలుచేసేలా అమలుచేసిన సంక్షేమ పథకాలు వారి ఆదాయాన్ని మరింత పెంచాయి. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరగడం, వ్యవసాయం, సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమలకు రాయితీలు, ప్రోత్సాహకాల రూపంలో ప్రభుత్వ సహకారంతో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడి స్థిరాస్థి రంగంలో కొనుగోళ్లు పెరిగాయి. గత ఐదేళ్లలో ఏటా ప్రభుత్వం నిర్దేశించిన రాబడి లక్ష్యం 70 శాతానికి తగ్గలేదు. కరోనా విలయతాండవం చేసిన 2020, 2021లో సైతం 76 శాతం నుంచి 95 శాతం వరకు లక్ష్యాన్ని చేరుకుంది. నేలచూపులు చంద్రబాబు సర్కారులో రియల్ ఎస్టేట్ పతనం స్థిరాస్తి రంగంలో మందగించిన క్రయవిక్రయాలు జిల్లాలో తగ్గిన రిజిస్ట్రేషన్లు గత ఆర్థిక సంవత్సరంలో 63 శాతమే చేరుకున్న లక్ష్యం సంవత్సరం రిజిస్ట్రేషన్లు ఆదాయం లక్ష్యం వచ్చిన మొత్తం శాతం (రూ.కోట్లల్లో) (రూ.కోట్లల్లో) 2020–21 85,620 318.9 241.26 76 2021–22 1,23,536 365.59 361.68 99 2022–23 1,39,731 486.79 380.37 78 2023–24 1,83,180 517.13 399.66 70 2024–25 98,790 616.76 388.22 63 -
చర్చిల కూల్చివేత దారుణం
ఆకివీడు: చర్చిలు, పేదల ఇళ్లు కూల్చడమే చంద్రబాబు ప్రభుత్వం పనిగా పెట్టుకుందని, ఇందుకు కారకులైన వారిని ఆ ప్రభువే శిక్షిస్తాడని వైఎస్సార్సీపీ ఉండి నియోజకవర్గ ఇన్చార్జి పీవీఎల్ నర్సింహరాజు అన్నారు. దుంపగడప శివారు పల్లెపాలెంలో సోమవారం సెమీ క్రిస్మస్ వేడుకలకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా పీవీఎల్ మాట్లాడుతూ జగన్ ప్రభుత్వంలో పేదలకు ఇళ్లు నిర్మిస్తే, చంద్రబాబు పాలనలో పేదల ఇళ్లు కూల్చివేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్రానికి మబ్బు పట్టినట్టుగా పాలన ఉందన్నారు. జగన్ పేదలకు సంక్షేమాన్ని అందిస్తే చంద్రబాబు బడాబాబులకు కొమ్ముకాస్తున్నారని ఆరోపించారు. క్రైస్తవులకు కిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ పట్టణ అధ్యక్షుడు అంబటి రమేష్, కేశిరెడ్డి మురళీ, మంతెన సునిల్ వర్మ, నగర పంచాయతీ విప్ పడాల శ్రీనివాసరెడ్డి, కిషోర్రెడ్డి, కౌన్సిలర్ గేదల అప్పారావు, మాజీ సర్పంచ్ పిన్నమరాజు సూర్యనారాయణరాజు, గ్రామ పార్టీ అధ్యక్షుడు కొట్టు మాణిక్యాలరావు తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీలోకి భారీగా చేరికలు
● చంద్రబాబు పాలనపై విసుగు చెందిన కూటమి నేతలు ● వైఎస్సార్సీపీ తీర్థం పుచ్చుకున్న టీడీపీ, జనసేన నాయకులు కుక్కునూరు: చంద్రబాబు ప్రభుత్వ పాలనపై విసుగు చెందిన టీడీపీ, జనసేన శ్రేణులు ఆయా పార్టీలను వీడుతున్నారు. ప్రజాసంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా సాగుతున్న వైఎస్సార్సీపీ తీర్థం పుచ్చుకుంటున్నారు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టినరోజు వేడుకల్లో భాగంగా ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో పార్టీలో చేరికలు భారీగా జరిగాయి. కుక్కునూరు మండలం గణపవరం గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్తలు టి.శేషుకుమార్, జి.మోహన్రావుకు వైఎస్సార్సీపీ పోలవరం నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు. అలాగే మాధవరం పంచాయతీలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కాక తిరుపతిరావు, సున్నం బాబురావు, మల్లం సత్యం, సున్నం వీరభద్రం, తుర్సం రాఘవయ్య, సారంగి కృష్ణ వైఎస్సార్సీపీ మండల యువజన విభాగం అధ్యక్షుడు చేకూరి నవీన్వర్మ, గ్రామ కన్వీనర్ గంజిశ్రీను, కుండా అశోక్ ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీలో చేరారు. కామవరపుకోటలో.. కామవరపుకోట: కామవరపుకోటలోని కొండగూడెంలో తెలుగుదేశం పార్టీకి చెందిన 10 కుటుంబాలు వైఎస్సార్సీపీలో చేరినట్టు మండల కన్వీనర్ రాయంకుల సత్యనారాయణ తెలిపారు. చింతలపూడి నియోజకవర్గ ఇన్చార్జి కంభం విజయరాజు వారికి కండువాలు వేసి వైఎస్సార్సీపీలోకి ఆహ్వానించారు. యాదవుల కాలనీలో దొడ్డకుల చెన్నారావు, ములకాల అశోక్, ములకాల నాగార్జున, పాత కొండగూడెంలో మల్లెల్లి రాఖీ, గూట్ల నాని, బండి చిన్న, గుడిపూడి నంది రాజు, ఆడమిల్లి చక్రవర్తి, కూసుమీ బాలు వైఎస్సార్సీపీలో చేరారు. కొన్నేళ్లుగా తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్నా ఎ లాంటి గుర్తింపు లేకపోగా, తమ ప్రాంతానికి ఎ లాంటి మంచి జరగలేదని వారు అన్నారు. కూటమి ప్రభుత్వ నాయకులతో ఇమడలేక వైఎస్సార్సీపీలో చేరామన్నారు. పాలకొల్లులో.. పాలకొల్లు సెంట్రల్: రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలో ఉన్నా కూటమి పార్టీలకు చెందిన నేతలు వైఎస్సార్సీపీలో చేరుతున్నారంటే పాలన ఎంత అధ్వానంగా ఉందో అర్థమవుతుందని వైఎస్సార్సీపీ పాలకొల్లు నియోజకవర్గ ఇన్చార్జి గుడాల గోపి అన్నారు. పాలకొల్లులో జరిగిన కా ర్యక్రమంలో జనసేన, టీడీపీకి చెందిన పది మంది కార్యకర్తలు వైఎస్సార్సీపీలో చేరారు. వారికి గోపి పార్టీ కండువాలు వేసి సాదరంగా స్వాగతించారు. ఈ సందర్భంగా గోపి మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర ప్రజలకు ఎన్ని సంక్షేమ పథకాలు ఇచ్చారో అందరికీ గుర్తుందన్నారు. అబద్ధాలతో చంద్రబాబు మోసం చేసిన విషయం ప్రజలు ఇప్పడిప్పుడే గ్రహిస్తున్నారన్నారు. మజ్జి ప్రసాద్, తాడి సింహాచలం, తాడి శ్రీను తదితరులు వైఎస్సార్సీపీలో చేరారు. అలాగే జోగాడ ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. పార్టీ నాయకులు యడ్ల తాతాజీ, వీరా మల్లికార్జునుడు, శంకరాపు శ్రీను పాల్గొన్నారు. కుక్కునూరు: కండువా వేసి ఆహ్వానిస్తున్న మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు పాలకొల్లు సెంట్రల్: కండువా వేసి ఆహ్వానిస్తున్న నియోజకవర్గ ఇన్చార్జి గుడాల గోపి -
సహకార ఉద్యోగుల సమస్యలు పట్టవా?
ఏలూరు(ఆర్ఆర్పేట): ప్రాథమిక వ్యవసాయ పర పతి సహకార సంఘాల ఉద్యోగుల సమస్యలు వెంటనే పరిష్కరించకపోతే భవిష్యత్లో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని సహకార సంఘాల ఉద్యోగుల యూనియన్ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు, సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పి.అజయ్కుమార్ హె చ్చరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగుల యూనియన్ల ఐక్యవేదిక (జేఏసి) పిలుపులో భాగంగా సోమవారం జిల్లా సహకార కేంద్ర బ్యాంకు వద్ద ధర్నా నిర్వహించారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లావ్యాప్తంగా ఉద్యోగులు పెద్ద సంఖ్యలో ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అజయ్కుమార్ మాట్లాడుతూ ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన వాగ్దానాలు తక్షణమే అమలు చేయాలన్నారు. సొసైటీ ఉద్యోగులకు జీఓ 36 అమలు చేయాలని, వేతన సవరణ వెంటనే చేయాలని, గ్రాట్యూటీ చెల్లించాలని, పదవీ విరమణ వయసు 62 ఏళ్లకు పెంచాలని, సొసైటీల ప్రైవేటీకరణ, సిబ్బందిని కుదించే ఆలోచనలు మానుకోవాలన్నారు. ఉమ్మడి జిల్లా యూనియన్ నాయకులు కేవీవీ సత్యనారాయణ, టి.గంగరాజు, సీహెచ్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ డీసీసీబీ, ఆప్కాబ్ తమ వంతు నిధులు సమకూర్చడం లేదని ఆవేదన వ్యక్తం చేశా రు. సీఐటీయూ నాయకులు సీహెచ్ సుందరయ్య, రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్, యూనియన్ ప్రధాన కార్యదర్శి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. -
18 రోజులు.. రూ.1.75 కోట్లు
చినవెంకన్న హుండీ ఆదాయం లెక్కింపు ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయ హుండీల ఆదాయాన్ని స్థానిక ప్ర మోద కల్యాణ మండపంలో సోమవారం లె క్కించారు. శ్రీవారికి విశేష ఆదాయం సమకూ రింది. గత 18 రోజులకు గాను నగదు రూపేణా రూ.1,75,47,176 ఆదాయం లభించినట్టు ఆలయ ఈఓ ఎన్వీఎస్ఎన్ మూర్తి తెలిపారు. అలాగే కానుకల రూపేణా భక్తులు సమర్పించిన 138 గ్రాముల బంగారం, 4.574 కేజీల వెండితో పాటు, అధికంగా విదేశీ కరెన్సీ లభించిందన్నారు. లెక్కింపులోకి రాని రద్దయిన పాత రూ.500, రూ.2,000 నోట్ల ద్వారా రూ.1,13,000 లభించాయన్నారు. ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. భీమవరం: ప్రజాసమస్యలపై త్వరితగతిన స్పందించి, నిర్ణీత గడువులోపు చట్ట పరిధిలో శాశ్వత పరిష్కారం చూపాలని ఎస్పీ అద్నాన్ నయీం అస్మి పోలీసు అధికారులు ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ప్రజాసమస్యల పరిష్కార వేదికలో భాగంగా వినతులు స్వీకరించిన అనంతరం పోలీసు అధికారులతో ఫోన్లో మాట్లాడారు. ఫిర్యాదుల పరిష్కారానికి మొదటి ప్రాధాన్యత ఇచ్చి అర్జీలు పునరావృతం కాకుండా పరిష్కా రం చూపాలన్నారు. పోలీస్ కార్యాలయాలకు వచ్చే బాధితులకు భరోసాగా పోలీస్ శాఖ ఉండాలన్నారు. జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్) వి.భీమారావు, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ దేశంశెట్టి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. భీమవరం: ప్రభుత్వ ఉద్యోగుల మానసిక ఒత్తిడిని తగ్గించి శారీరక దృఢత్వాన్ని పెంపొందించేందుకు గోదావరి క్రీడా ఉత్సవాలు జిల్లాస్థాయిలో ఈనెల 27, 28 తేదీల్లో భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించనున్నట్టు జాయింట్ కలెక్టర్ టి.రాహుల్కుమార్రెడ్డి తెలిపారు. సోమవారం కలెక్టరేట్లో జిల్లాస్థాయి గోదావరి క్రీడోత్సవాలపై అధికారులతో ఆయన సమీక్షించారు. డివిజన్ స్థాయి పోటీల్లో విజేతలు జిల్లాస్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు. క్రికెట్, వాలీబాల్, బ్యాడ్మింటన్, క్యారమ్స్, చెస్, షాట్పుట్ తదితర 9 రకాల పోటీలు నిర్వహిస్తామని, క్రీడాకారులు మంగళవారంలోపు వెబ్సైట్లో నమోదు చేసుకోవాలని సూచించారు. భీమవరం: రాజకీయ నాయకులు, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనుకునే వారికి నిత్య స్ఫూర్తి ప్రదాత అటల్ బిహరీ వాజ్పేయి అని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడు అన్నారు. సోమవారం భీమవరంలో నిర్వహించిన అటల్–మోదీ సుపరిపాలన యాత్ర బైక్ ర్యాలీ, వాజ్పేయి విగ్రహావిష్కరణకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మాజీ ప్రధాని వాజ్పేయి స్ఫూర్తితో తాను పనిచేస్తున్నానన్నారు. కేంద్ర ఉక్కు, భా రీ పరిశ్రమ శాఖ సహాయ మంత్రి భూపతి రా జు శ్రీనివాసవర్మ మాట్లాడుతూ రాజకీయాల్లో వి లువలు కలిగిన నేత వాజ్పేయి అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ మాట్లా డుతూ భీమవరంలో 9 అడుగుల వాజ్పేయి కాంస్య విగ్రహాన్ని ఏర్పాటుచేయడం అభినందనీయమన్నారు. రాష్ట్ర మంత్రి సత్యకుమార్ యాదవ్ పాల్గొన్నారు. ఏలూరు(మెట్రో): జిల్లాలో గోదావరి పుష్కరాల నిర్వహణకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేయాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఆదేశించారు. పుష్కరాల నిర్వహణ ఏర్పాట్లపై సోమవారం కలెక్టరేట్లో సమీక్షించారు. పోలవరం, కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో 29 స్నాన ఘట్టాలు ఏర్పాటు చేస్తామన్నారు. -
మా కుటుంబంలో వెలుగులు
ఆకివీడు మండలం సిద్ధాపు రం గ్రామానికి చెందిన య ర్లపాటి రాణిది పేద కుటుంబం. భర్త ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించడం కష్టంగా ఉండేది. ఆమెకు ఇద్దరు పిల్లలు కాగా కుమారుడు ఇంటర్ చదివి హైదరాబాద్లో ఉంటున్నాడు. కుమార్తె పదో తరగతి పూర్తిచేసి ఇంటర్లోకి వచ్చింది. అమ్మాయిని ఎలా చదివించాలని ఆలోచిస్తున్న సమయంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాయి. అమ్మఒడి సాయం ద్వారా కుమార్తెను ఇంటర్లో చేర్పించారు. తర్వాత బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చదివించారు. రాణి మనుమలు (కుమారుడు బిడ్డలు) ఇక్కడే ఉంటూ చదువుకుంటున్నారు. వారికీ అమ్మఒడి సాయం అందింది. అలాగే డ్వాక్రా రుణమాఫీలో భాగంగా రాణి కుటుంబానికి ఆసరా పథకం ద్వారా ఏడాదికి రూ.16 వేల చొప్పున రూ.64 వేల సాయం అందింది. చేయూత పథకం ద్వారా ఏడాదికి రూ. 18,750 చొప్పున రూ.75 వేలు అందుకున్నారు. రాణి ఉపాధి హామీ పనులకు వెళ్లగా రోజువారీ కూలీ సక్రమంగా అందేది. దీంతో వీరి ఆర్థిక ఇబ్బందులు తొలగాయి. జగనన్న పాలనలో తమ కుటుంబంతో ఎంతో సంతోషంగా జీవించామని, ఆ ఐదేళ్ల పాలనా పండుగలా ఉందని రాణి అంటోంది. – ఆకివీడు ఈ చిత్రంలో కనిపిస్తున్న రైతు పేరు గుడాల సురేష్. యలమంచిలి మండలం పెనుమర్రుకు చెందిన ఆయన రెండు ఎకరాలు సొంతంగా, నాలుగెకరాలు కౌలుకు వ్యవసాయం చేస్తున్నారు. 2019కి ముందు కష్టనష్టాలతో వ్యవసాయం మానేద్దామనుకున్నారు. అప్పుడే వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చింది. సాగు సమయంలో రైతు భరోసా పథకం కింద ప్రతి సీజన్లో పెట్టుబడులకు డబ్బులు అందా యి. రైతు భరోసా కేంద్రాల ద్వారా నాణ్యమైన వి త్తనాలు, ఎరువులు, పురుగు మందులు అందేవి. ధాన్యం విక్రయించిన రెండు రోజులకే ఖాతాల్లో సొమ్ములు జమయ్యేవి. ప్రకృతి విపత్తుల వేళ ఉచిత పంటల బీమా అండగా నిలిచింది. అలాగే సురేష్ పశువుల పెంపకం ద్వారా వచ్చిన పాలను గ్రామంలోని అమూల్ కేంద్రంలో విక్రయించడం ద్వారా అదనపు ఆదాయం సమకూరేది. ఇలా జగన్ ప్రభుత్వంలో అన్నిరకాలుగా మేలు జరిగిందని, సకాలంలో డబ్బులు అందడంతో కుటుంబమంతా ఆనందంగా జీవించేవాళ్లమని, మళ్లీ జగన్ ముఖ్యమంత్రి అయితేనే రైతులు బతుకులు బాగుపడతాయని సురేష్ అంటున్నారు. – యలమంచిలి -
రోడ్డున పడ్డ పేదలు
ఆకివీడు: స్థానిక అమృతరావు కాలనీ ప్రాంతంలోని శ్మశాన వాటికలో 40 ఏళ్లుగా నివసిస్తున్న పేదల ఇళ్లను శనివారం నగర పంచాయతీ అధికారులు తొలగించారు. తమకు ఇళ్ల స్థలం ఇవ్వలేదని, తాతముత్తాతల కాలం నుంచీ ఇక్కడే జీవనం సాగిస్తున్నామని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ఇంటి స్థలం ఇవ్వాలని, ఇల్లు నిర్మించుకునేందుకు రూ.4 లక్షలు సహా యం అందజేయాలని బాధితుడు మోండెం స తీష్ ప్రభుత్వానికి కోరారు. దీనిపై తహసీల్దార్ ఫరూక్ మాట్లాడుతూ ఆక్రమణదారుడికి గతంలో ఇంటి స్థలం ఇచ్చామని, ఆ ప్రాంతంలో కా లువ ఉండటంతో ఇబ్బందికరంగా ఉండగా మరోచోట పట్టా ఇచ్చామన్నారు. భీమవరం: జిల్లాలో శనివారం నిర్వహించిన టెట్ పరీక్షలకు 91.83 శాతం అభ్యర్థులు హాజరయ్యారని డీఈఓ ఈ.నారాయణ తెలిపారు. ఉదయం 900 మందికి 831 మంది, మధ్యాహ్నం 801 మందికి 731 మంది హాజరయ్యారన్నారు. ఏలూరులో 652 మంది హాజరు ఏలూరు (ఆర్ఆర్పేట): ఏలూరులో జరుగుతున్న ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)కు శనివారం 652 మంది అభ్యర్థులు హాజరయ్యారు. సిద్ధార్థ క్వెస్ట్, సీఆర్ఆర్ ఇంజనీరింగ్ కళాశాల కేంద్రాల్లో ఉదయం 376 మందికి 347 మంది, మధ్యాహ్నం 309 మందికి 276 మంది హాజరయ్యారు. పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని డీఈఓ ఎం.వెంకట లక్ష్మమ్మ తెలిపారు. భీమవరం (ప్రకాశంచౌక్): మనమిత్ర వాట్సాప్ సేవల వినియోగంలో జిల్లా ముందంజలో నిలిచేలా కృషిచేయాలని సీహెచ్ నాగరాణి అన్నారు. వాట్సాప్ గవర్నెన్స్ సేవల ఇంటింటి ప్రచార ప్రగతిపై ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు, సచివాలయ సిబ్బందితో శనివారం ఆమె గూగుల్ మీట్ ద్వారా సమీక్షించారు. ద్వారకాతిరుమల: శ్రీవారి క్షేత్రం శనివారం భక్తులతో కిటకిటలాడింది. వేలాది మంది భక్తులు తరలివచ్చారు. క్షేత్రంలోని అన్ని విభాగాలూ భక్తులతో కిటకిటలాడాయి. హరే శ్రీనివాస భ జన బృంద సభ్యులు (రామానుజపురం) అనివేటి మండపంలో ప్రదర్శించిన కోలాట నృత్యాలు చూపరులను అలరించాయి. సాయంత్రం వరకు భక్తుల రద్దీ కొనసాగింది. నరసాపురం రూరల్: హస్త కళాకారుల సృజనాత్మకతను, నైపుణ్యాన్ని, ఉత్పత్తులను ప్రదర్శించడానికి ఎక్స్పోలు దోహదపడతాయని కలెక్టర్ సీహెచ్ నాగరాణి అన్నారు. అన్నారు. శనివారం రుస్తుంబాదలోని అంతర్జాతీయ లేసు ట్రేడ్ సెంటర్ (ఐఎల్టీసీ)లో ఈపీసీహెచ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన హ్యాండీక్రాఫ్ట్స్ ఎక్స్పోను ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్తో కలిసి ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అల్లికలకు నరసాపురం పుట్టిల్లు వంటిదన్నారు. ఐఎల్టీసీ కన్వీనర్ కలవకొలను తులసీరావు, కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు, ఈపీసీహెచ్ మెంబర్ రవి, రీజనల్ డైరెక్టర్ ఎ.లక్ష్మణరావు, ఆర్డీఓ దాసిరాజు, డీఆర్డీఏ పీడీ వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. ఏలూరు (ఆర్ఆర్పేట): రాష్ట్ర యూనియన్ల జేఏసీ పిలుపు మేరకు సోమవారం సహకార సంఘాలు బంద్ పాటించి ఏలూరు డీసీసీబీ ప్రధాన కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించనున్నట్టు రాష్ట్ర జేఏ సీ నాయకుడు, ఏలూరు జిల్లా అధ్యక్షుడు కాళింగి వీర వెంకట సత్యనారాయణ, ఏలూరు జిల్లా ప్రధాన కార్యదర్శి పూజారి సుబ్బారావు ప్రకటనలో తెలి పారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సుమారు 1,200 మంది 255 సంఘాల నుంచి హాజరుకానున్నారన్నారు. -
సంక్షేమ సారథి.. అభివృద్ధి వారధి
అక్కచెల్లెమ్మలకు ‘ఆసరా’గా నిలిచారు.. ఆడబిడ్డల ఉన్నతికి ‘చేయూత’ అందించారు.. పేదల కంటికి ‘వెలుగ’య్యారు.. పిల్లల భవితకు ‘విద్యాకానుక’ తెచ్చారు.. వ్యవసాయానికి ‘భరోసా’నిచ్చారు.. ‘ఫ్యామిలీ డాక్టర్’ను ఇంటి వద్దకే పంపారు.. ఆపద వేళ ‘బీమా’తో ఆదుకున్నారు.. ఇలా అన్నివర్గాలకు ‘నేస్తం’గా పేదల ఇంట ‘నవరత్నాల’ కాంతులు నింపారు. ప్రగతిలో ‘నాడు–నేడు’ వ్యత్యాసం చూపించి అభివృద్ధి ప్రదాత అయ్యారు. కులమత వర్గాలకు అతీతంగా ‘సచివాలయం’ వ్యవస్థతో పాలనను పేదల ముంగిళ్లకు చేర్చారు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి. ఆదివారం ఆయన పుట్టినరోజు సందర్భంగా వైఎస్సార్సీపీ శ్రేణులు విస్తృత ఏర్పాట్లు చేశారు. జిల్లావ్యాప్తంగా రక్తదాన శిబిరాలు, సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. సాక్షి, భీమవరం : తండ్రి దివంగత వైఎస్సార్ చూపిన బాటలో సంక్షేమం, అభివృద్ధిని పరుగులు పెట్టించారు వైఎస్ జగన్. 2019 మే 30న ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన మరుక్షణం నుంచే నవరత్నాలను అమల్లోకి తెచ్చారు. ప్రతినెలా 1వ తారీ ఖున వేకువజామునే పింఛన్ సొమ్మును అవ్వాతాతల చేతికందించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతో పాటు అగ్రవర్ణాల్లోని పేదల అభివృద్ధికి బా టలు వేశారు. టైలర్లు, రజకులు, నాయిబ్రాహ్మణు లు, ఆటో డ్రైవర్లు, మత్య్సకారులు, చేనేత కార్మికులు తదితర అన్ని వర్గాలకు మేలు చేస్తూ ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకువచ్చారు. డీబీటీ, నాన్ డీబీటీ రూపంలో జిల్లాలోని పేదలకు సుమారు రూ.11,333.57 కోట్లు లబ్ధి చేకూర్చడంతో పాటు రూ.6,988.37 కోట్లతో అభివృద్ధి పనులు చేశారు. ● ఉచిత పంటల బీమా రైతుల కోసం ఉచిత పంటల బీమాను తెచ్చారు. ఏ సీజన్లో పంట నష్టం వాటిల్లితే అదే సీజన్లో పరిహారం అందించి ఆదుకున్నారు. జిల్లాలోని రైతులకు రూ. 796.49 కోట్ల రైతు భరోసా సాయం అందించారు. ఆర్బీకేల ద్వారా నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అందుబాటులో ఉంచారు. ● ప్రజారోగ్యమే పరమావధిగా.. జగనన్న ఆరోగ్య సురక్ష, ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రాం కింద స్పెషలిస్ట్ వైద్యులతో విలేజ్ క్లినిక్లు, పట్టణ ఆరోగ్య కేంద్రాల పరిధిలో వైద్యశిబిరాలు నిర్వహించారు. 14 రకాల వైద్య పరీక్షలతో పాటు 172 ర కాల మందులను అందుబాటులో ఉంచి 15 లక్షల మందికి పైగా రోగులకు వైద్యసేవలందించారు. ఆరోగ్యశ్రీలో రూ.5 లక్షల వరకు ఉన్న వ్యయ పరిమితిని రూ.25 లక్షలకు, 1,059గా ఉన్న చికిత్సల సంఖ్యను 3,257కు పెంచారు. ● నాడు–నేడు.. అభివృద్ధి చూడు నాడు–నేడు ద్వారా జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్కు ధీటుగా అభివృద్ధి చేశారు. పేద విద్యార్థులు ప్రపంచంతో పోటీపడేలా డిజిటల్ విద్యాబోధన చేపట్టారు. 8వ తరగతి విద్యార్థులకు రూ.30 వేలు విలువ చేసే ట్యాబ్లు అందజేశారు. జగనన్న అమ్మఒడి పథకం కింద 1,48,342 మంది తల్లులకు రూ.887.9 కోట్లు, పేద విద్యార్థుల ఉన్నత చదువుల కోసం జగనన్న విద్యాదీవెన, వసతి దీవెనలుగా రూ.770 కోట్లు సాయం అందించారు. ● పేదలకు గృహయోగం పేదల సొంతింటి కలను సాకారం చేస్తూ జిల్లాలోని సుమారు 76,069 మంది పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేసి ఇళ్ల నిర్మాణం చేపట్టారు. ● తలమానికం ఆక్వా వర్సిటీ.. వైద్య కళాశాల నరసాపురంలో రూ.332 కోట్ల వ్యయంతో ఆక్వా వర్సిటీ మంజూరు చేశారు. పాలకొల్లు మండలం దగ్గులూరులో రూ.475 కోట్ల వ్యయంతో 61 ఎకరాల విస్తీర్ణంలో మెడికల్ కళాశాల పనులు చేపట్టి రూ.80 కోట్ల విలువైన పనులు పూర్తిచేశారు. ● ఆస్పత్రుల అభివృద్ధి పాలకొల్లులో రూ.13.50 కోట్ల వ్యయంతో 150 పడకల ఆస్పత్రి నిర్మాణం చేయగా, నరసాపురంలో 50 పడకల ప్రభుత్వ ఆస్పత్రిని 100 పడకల ఏరియా ఆసుపత్రిగా అభివృద్ధి చేశారు. భీమవరంలో రూ.40 కోట్ల వ్యయంతో 100 పడకల ఆస్పత్రి నిర్మాణం చేపట్టారు. ● ప్రగతి ‘బాట’లు తాడేపల్లిగూడెంలో రూ.36 కోట్లతో కోడేరు–నల్లజర్ల (కేఎన్ రోడ్డు)ను నాలుగు లైన్లుగా విస్తరించారు. రూ.వందల కోట్లు వెచ్చించి జిల్లాలోని ఎ న్నో రోడ్లను అభివృద్ధి చేశారు. జగనన్న సురక్ష శిబిరాల ద్వారా ఏ విధమైన సర్వీస్ చార్జీ లేకుండానే 6,05,780 మందికి కుల, ఆదాయ, జనన, మరణ, మ్యారేజ్ రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ తదితర సర్టిఫికెట్లు అందజేశారు. ● గ్రామ స్వరాజ్యమే లక్ష్యంగా.. రూ.540 కోట్ల వ్యయంతో గ్రామాల్లో సచివాలయలు, ఆర్బీకేలు, హెల్త్ క్లీనిక్లు, బల్క్మిల్క్ యూనిట్లు, డిజిటల్ లైబ్రరీల నిర్మాణం చేపట్టారు. పేదింటి తలుపు తట్టిన సంక్షేమం జిల్లాలో పేదలకు రూ.11 వేల కోట్లకు పైగా లబ్ధి రూ.6,988 కోట్లతో అభివృద్ధి పనులు నేడు మాజీ సీఎం జగన్ పుట్టినరోజు జిల్లావ్యాప్తంగా రక్తదాన శిబిరాలు, సేవా కార్యక్రమాలకు ఏర్పాట్లు మాజీ సీఎం జగన్ పుట్టినరోజు ను పురస్కరించుకుని ఆదివారం జిల్లా అంతటా వేడుకల నిర్వహణకు వైఎస్సార్సీపీ శ్రేణులు, అభిమానులు భారీ ఎత్తున ఏ ర్పాట్లు చేశారు. రక్తదాన శిబిరాలు, కేక్ కటింగ్లు, పేదలకు అన్నదానం, దుస్తుల పంపిణీ, ఆస్పత్రుల్లో రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ తదితర సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నాం. – ముదునూరి ప్రసాదరాజు, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు నా కుమార్తె సాయిసింధూజ డాక్టర్ కావాలన్న కల నెరవేరుతోందంటే జగన్ చలవే. రెండేళ్ల క్రితం నీట్ పరీక్ష రాసిన తర్వాత మచిలీపట్నంలో జగన్ ప్రభుత్వం నూతనంగా ఏర్పాటుచేసిన ప్రభుత్వ మెడికల్ కళాశాలలో సీటు వచ్చింది. అప్పుడే రెండేళ్లు పూర్తిచేసుకుని థర్డ్ ఇయర్ చదువుతోంది. త్వరలో డాక్టర్ కోర్సు పూర్తిచేసుకుని పేదలకు సేవ చేయనుండటం మాకు ఎంతో ఆనందంగా అనిపిస్తుంది. థాంక్యూ జగన్ సర్. – నిమ్మకాయల రామకృష్ణ, కొంతేరు, యలమంచిలి మండలంఈ చిత్రంలోని విద్యార్థిని పేరు జాలపర్తి మేఘన. కడియద్ద హైస్కూల్లో చదువుతోంది. జగన్ ప్రభుత్వంలో ఈ హైస్కూల్ను కార్పొరేట్ హుంగులతో తీర్చిదిద్దారు. భవనాలను అభివృద్ధి చేశారు. తాగేందుకు సురక్షిత నీరు, అధునాతన బోధనా పద్ధతులు, రుచికరమైన పోషకాహారం, కార్పొరేట్ స్కూళ్లను తలదన్నేలా యూనిఫాం, పుస్తకాలు, ఆధునికీకరించిన మరుగుదొడ్లు అందుబాటులోకి వచ్చాయి. అలాగే తల్లులకు ఏటా అమ్మఒడి సాయం అందింది. గతంలో టాయ్లెట్కు వెళ్లాలంటే చాలా కష్టంగా ఉండేదని, సమీపంలోని ఆయిల్పామ్, జామ తోటల్లోకి వెళ్లాల్సి వచ్చేదని, జగన్ మామ దయతో తమ పాఠశాలలో అధునాతన మరుగుదొడ్లు ఏర్పాటుకావడంతో ఇప్పుడు ఆ కష్టం తప్పిందని మేఘన అంటోంది. ఎలాంటి ఇబ్బంది లేకుండా చదువుకుంటున్నానంటే అది జగన్ మామ చలవేనని, ఆయన మేలు మరువలేమని చెబుతోంది. –తాడేపల్లిగూడెం -
జీ రామ్ జీ బిల్లు రద్దు చేయాలి
ఏలూరు (టూటౌన్): గ్రామీణ పేదల జీవన విధానాన్ని పూర్తిగా మార్చిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వికసిత్ భారత్ – గ్యారెంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవిక మిషన్ (వీబీ జీ రామ్ జీ) బిల్లును రద్దు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. శనివారం వ్యవసాయ కార్మిక సంఘం, సీఐటీయూ, రైతు సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి 197 జీవో కాపీలను ఏలూరు కలెక్టరేట్ వద్ద దహనం చేశారు. గతంలో వేతనాలు వంద శాతం కేంద్రమే భరించేదని, ఇప్పుడు రాష్ట్రాలపై 40 శాతం భారం వేయడం వల్ల ఏపీకి సుమారు రూ.5 వేల కోట్ల నిధులు తగ్గి, పథకం అటకెక్కే ప్రమాదం ఉందని అన్నారు. రైతు సంఘం జిల్లా కార్యదర్శి కే శ్రీనివాస్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పి రామకృష్ణ, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షడు ఏ.రవి, ఎం.జీవరత్నం, జిల్లా నాయకులు లాజర్ మణి, డి.నాగేంద్ర, పి.అనందరావు, జాన్ రాజు, బాలయ్య, సుబ్బారావు, లక్ష్మి, దీవెనమ్మ, ఏసుమణి తదితరులు పాల్గొన్నారు. ప్రజలను మభ్య పెట్టేందుకే పని దినాల పెంపు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన ‘జీ రామ్ జీ’ బిల్లులో 125 రోజుల పని కల్పిస్తామనటం ప్రజలను మభ్యపెట్టడమే అని ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి షేక్ బాషా శనివారం ఒక ప్రకటనలో విమర్శించారు. ఉపాధి హామీ పథకంలో 100 రోజుల పనిదినాలే కష్టతరంగా ఉంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆ పథకాన్ని శ్రీవికసిత్ భారత్ –గ్యారంటీ ఆఫ్ రోజ్ గార్ అండ్ అజీవకా మిషన్ –గ్రామీణ్ శ్రీ(వీబీ –జీ రామ్ జీ)గా పేరు మార్పు, అనేక సవరణలతోపాటు 125 రోజుల పని కల్పిస్తామనటం ప్రజలను మభ్యపెట్టడానికే అన్నారు. ఉపాధి హామీ పథకంలో చెల్లించాల్సిన వేతనాలను ఇప్పటివరకు 90 శాతం కేంద్రం, 10 శాతం ఆయా రాష్ట్రాలు భరిస్తుండగా.. ప్రస్తుతం ప్రతిపాదించిన బిల్లులో 60 శాతం మాత్రమే కేంద్రం భరిస్తామనటం...రాష్ట్రాలపై మరింత భారాన్ని మోపటమే అన్నారు. ఏలూరు (టూటౌన్): ఏలూరు కలెక్టరేట్ వద్ద ధర్నా చేస్తున్న వివిధ సంఘాల నాయకులు, కార్యకర్తలు ఇరగవరం: ఉపాధి కూలీలతో కలిసి 197 జీవో కాపీలను దహనం చేస్తున్న నాయకులు ఇరగవరం: ఉపాధి హామీ చట్టం పేరు మార్పు మహాత్మా గాంధీని అవమానపరచడమేనని ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కేతాగోపాలన్, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు బళ్ళ చిన వీరభద్రరావు విమర్శించారు. ఉపాధి కూలీల పొట్ట కొట్టడానికి జారీ చేసిన 197 జీవో కాపీలను శనివారం యర్రాయి చెరువు గ్రామంలో ఉపాధి కూలీలతో కలిసి ప్రజా సంఘాల నాయకులు దహనం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ అనేక పోరాటాలు చేసే సాధించుకున్న ఉపాధి హామీ చట్టాన్ని కాపాడుకోవడానికి కూలీలంతా ఐక్యంగా పోరాడాలన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ మండల కన్వీనర్ జుత్తిగ రామాంజనేయులు, పితాని నాగేశ్వరరావు, జుత్తిగ వెంకటలక్ష్మి, పితాని లక్ష్మీ, జుత్తిగ గౌరీ, కుడిపూడి ఆనంద కుమారి, జుత్తిగ కోమలి దుర్గ తదితరులు పాల్గొన్నారు. -
మాజీ సీఎం వైఎస్ జగన్కు వినూత్న రీతిలో శుభాకాంక్షలు
ఏలూరు (టూటౌన్): మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టిన రోజును పురస్కరించుకుని ఏలూరుకు చెందిన సూక్ష్మ కళాకారుడు మేతర సురేష్బాబు తనదైన శైలిలో శుభాకాంక్షలు తెలియజేశారు. సూది దారం గుచ్చే ప్రాంతంలోనూ, అగ్గిపుల్లపైనా వైఎస్ జగన్ చిత్రాలను రూపొందించారు. ఈ విధంగా తన అభిమాన నాయకుడికి శుభాకాంక్షలు తెలపడం పట్ల మైక్రో ఆర్టిస్ట్ సురేష్ బాబు సంతోషాన్ని వ్యక్తం చేశారు. గణపవరం: వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షునిగా గణపవరం మండలం పిప్పర గ్రామానికి చెందిన కాకర శ్యాంసుందర్ క్రెస్ట్సన్ నియమితులయ్యారు. ఈమేరకు రాష్ట్ర వైఎస్సార్ టీఏ అధ్యక్షుడు కె.జాలిరెడ్డి నియమాక ఉత్తర్వులు పంపారు. కేశవరం ఆదర్శ ప్రాధమిక పాఠశాల ప్రధానోపాధ్యాయునిగా పనిచేస్తున్న శ్యాంసుందర్ గతంలో వైఎస్సార్ టీఎఫ్ జిల్లా శాఖలో పనిచేశారు. శ్యాంసుందర్ నియామకం పట్ల జిల్లా వైఎస్సార్ టీఏ జిల్లా అధ్యక్షుడు మూరాల సుధాకర్, ప్రధాన కార్యదర్శి బొడ్డు రాంబాబు, గౌరవాధ్యక్షుడు రమేష్బాబు అభినందనలు తెలిపారు. తనను నియమించిన రాష్ట్ర అధ్యక్షుడు జాలిరెడ్డికి శ్యాం సుందర్ కృతజ్ఞతలు తెలిపారు ఉపాధ్యాయుల సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తానని చెప్పారు. ఏలూరు(మెట్రో): భూ సర్వేలు, భూ రికార్డులు, ఉప విభజనలు తదితర ప్రజాసేవలకు సంబంధించిన సమాచారాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచడంలో ఆర్టీఐ చట్టం కీలక పాత్ర పోషించిందని డిస్ట్రిక్ట్ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడీ షేక్ మహ్మద్ అన్సారీ అన్నారు. సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) ఏర్పడి 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా డిస్ట్రిక్ట్ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ శాఖ, ఏలూరు ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించినట్లు చెప్పారు. గత రెండు దశాబ్దాలుగా ఈ చట్టం ద్వారా శాఖ కార్యకలాపాల్లో పారదర్శకత పెరిగి, ప్రజల నమ్మకం మరింత బలపడిందన్నారు. ఆర్టీఐ దరఖాస్తులను నిర్ధేశిత గడువులోగా పరిష్కరించాల్సిన అవసరం, చట్టంలోని నిబంధనల పట్ల అవగాహన, సెక్షన్–4 ప్రకారం ముందస్తు సమాచార ప్రకటన ప్రాధాన్యతపై అధికారులు, సిబ్బందికి అవగాహన కల్పించారు. నరసాపురం: పేరుపాలెం బీచ్లో తాబేళ్ల పరిరక్షణ చర్యలను శనివారం ఆటవీశాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. స్కూల్ విద్యార్థులతో కలసి తీరాన్ని శుభ్రం చేశారు. ప్లాస్లిక్ వ్యర్థాలు, చెత్తను తీసి శుభ్రం చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఫారెస్ట్ అధికారి ఎం.కరుణార్ మాట్లాడుతూ సముద్రంలో అరుదైన ఆలివ్రిడ్లే తాబేళ్లు గుడ్లు పెట్టే కాలంలో తీరాన్ని శుభ్రంగా, వాటికి అనుకూలంగా ఉంచాలన్నారు. ఈ కార్యక్రమంలో అటవీశాఖ అధికారులు వి.ప్రభాకర్, సురేష్కుమార్, మైరెన్ పోలీస్ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. ఏలూరు టౌన్: పోగొట్టుకున్న బంగారు గొలుసును బాధితురాలికి పోలీసులు అప్పగించారు. పోస్టల్ కాలనీకి చెందిన గోవాడ విజయలక్ష్మి తన బంగారు గొలుసును తాకట్టు పెట్టేందుకు ఏలూరు వన్టౌన్ ప్రాంతానికి వెళుతుండగా.. హాయ్ హోటల్ సమీపంలో గొలుసు జారిపడిపోయింది. దీనిపై బాధితురాలు ఏలూరు వన్టౌన్ సీఐ జీ.సత్యనారాయణకు ఫిర్యాదు చేసింది. కోడేలు ప్రాంతానికి చెందిన అడ్డగార్ల లక్ష్మీ ఇందిర తనకు రోడ్డుపై దొరికిన బంగారు గొలుసుని వన్టౌన్ పోలీస్స్టేషన్లో అప్పగించడంతో వెంటనే డీఎస్పీ శ్రావణ్కుమార్ ఆ బంగారు గొలుసును బాధితురాలు విజయలక్ష్మికి అందజేశారు. సూది మొదలులో, అగ్గిపుల్లపై వైఎస్ జగన్ చిత్రాలు రూపొందించిన దృశ్యం -
శ్రీవారి క్షేత్రం.. ముక్కోటికి ముస్తాబు
ద్వారకాతిరుమల: శ్రీవారి క్షేత్రం ముక్కోటికి ముస్తాబవుతోంది. ఈ ఏడు స్వామివారి ఉత్తర ద్వార దర్శనానికి వేలాది మంది భక్తులు తరలివస్తారని అంచనా వేస్తున్న ఆలయ అధికారులు అందుకు అనుగుణంగా భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో తాత్కాలిక క్యూలైన్ల నిర్మాణం, ఆలయానికి, పరిసరాలకు విద్యుద్దీప అలంకారాలు చేసే పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అలాగే కొబ్బరికాయలు కొట్టే ప్రదేశం నుంచి ఆలయ దక్షిణ (ప్రధాన) రాజగోపురం వరకు భక్తులు రాకపోకలు సాగించేందుకు వీలుగా ఆ ప్రాంతంలో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ని నిర్మిస్తున్నారు. ముక్కోటి ఏకాదశి పర్వదినం ఈనెల 30న కావడంతో, ముందు రోజు 29న మధ్యాహ్నం 2.30 గంటల నుంచి నిర్వహించే గిరి ప్రదక్షిణకు సైతం ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఉత్తర ద్వార దర్శనానికి వచ్చే వీఐపీలతో పాటు, సాధారణ భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించే దిశగా ఏర్పాటు చేస్తున్నారు. గోవింద స్వాములు, స్థానికుల సౌకర్యార్థం ప్రత్యేక క్యూలైన్ ఏర్పాటు చేస్తున్నారు. రూ. 100, రూ.200 టికెట్లతో పాటు, శ్రీవారి ఉత్తర ద్వార దర్శనం ప్రత్యేక రూ.500 టికెట్లను భక్తులకు అందుబాటులో ఉంచినట్టు ఆలయ ఈఓ ఎన్వీఎస్ఎన్ మూర్తి తెలిపారు. భక్తులు గమనించాలని ఆయన కోరారు. శరవేగంగా విద్యుద్దీప అలంకారాలు, క్యూలైన్ల నిర్మాణాలు -
చర్చి నిర్మాణంపై న్యాయం చేయండి
ఉండి: చర్చి నిర్మాణం కూల్చివేతపై పాస్టర్ దంపతులు కన్నీటి పర్యంతమయ్యారు. తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. పాస్టర్ కొయ్యగర్ల దానియేలు దంపతులు తెలిపిన వివరాల ప్రకారం ఉండి శివారు రామాపురం, పాములపర్రు సరిహద్దులో 13 ఏళ్లగా సీయోను రారాజు ప్రార్థనా మందిరం ఉందని, సుమారు 70 మంది విశ్వాసులతో ప్రార్థనలు జరుపుకుంటున్నామని చెప్పారు. గతేడాది నవంబర్ 7న పాములపర్రుకు చెందిన కూటమి నాయకులు తమకు మాయమాటలు చెప్పి గ్రామాభివృద్ధి కోసం పక్కనే కాలువ కల్వర్టు నిర్మాణం చేయాలంటూ చెప్పి చర్చి కూల్చివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ సమయంలో చర్చి తొలగించేందుకు అనుమతిస్తే రూ.50 వేలు ఇచ్చి, మరో ప్రాంతంలో 2 సెంట్లు భూమి ఇప్పించి, చర్చి నిర్మాణానికి సహకరిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. కానీ చర్చి తొలగింపు అనంతరం వారేవరూ పత్తా లేకుండా పోయారని, కనీసం ఫోన్ చేసినా స్పందించేవారు కాదని వాపోయారు. క్రిస్మస్ పండుగ జరుపుకునేందుకు పాములపర్రు గ్రామ పెద్దలకు సమాచారం ఇచ్చి గతంలో చర్చి ఉండే పక్కనే ఖాళీస్థలంలో శుక్రవారం మధ్యాహ్నం నుంచి చిన్న చర్చి నిర్మాణం చేసుకుంటున్నట్లు చెప్పారు. అయితే శనివారం ఉండి పంచాయతీ అధికారులు, పోలీసులు, ఇరిగేషన్ సిబ్బంది చర్చి నిర్మాణాన్ని కూల్చివేశారని, తమకు న్యాయం చేయాలని కోరారు. ఇదే ప్రాంతంలో ఎన్నో ఆక్రమణలు ఉన్నా అధికారులు వాటివైపు కన్నెత్తి చూడకపోవడం కొసమెరుపు. ఉండి శివారు రామాపురంలో ఓ పాస్టర్ దంపతుల ఆవేదన -
ఆర్వో ప్లాంట్లకు మోక్షం ఎప్పుడో?
● నాటి జగనన్న ప్రభుత్వంలో మంజూరైన ఆర్వో ప్లాంట్లు ● నేటికీ పాఠశాలల్లో మూలన పడి ఉన్న వైనం పాలకొల్లు సెంట్రల్: నాటి వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో నాడు నేడు రెండో విడతలో కొన్ని పాఠశాలలకు ఆర్వో ప్లాంట్ మెటీరియల్స్ను పంపించారు. అవి పంపించి దాదాపు రెండేళ్లు కావస్తున్నా నేటికీ ఆయా పాఠశాలల్లో అవి సీల్ కవర్లలోనే ఉండడం గమనార్హం. ఆర్వో ప్లాంట్ సిస్టం అమర్చడానికి టెక్నీషియన్లు దొరకలేదని చెబుతుండడం విశేషం. గతంలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో నాడు నేడు కార్యక్రమంలో ఆర్వో ప్లాంట్లను ఇన్నోవేటివ్ ఆక్వా ఏజెన్సీ సంస్థ సప్లయి చేసిందని ఉపాధ్యాయులు చెబుతున్నారు. ఆ ఆర్వో ప్లాంట్ మెటీరియల్స్ పాఠశాలల్లో బిగించాల్సి ఉంది. ఆ సమయంలో ఎన్నికల కోడ్ రావడంతో వాటిని పాఠశాలల్లో అమర్చే పనులు తాత్కాలికంగా నిలుపుదల చేశారు. అప్పటి నుంచి నేటివరకు కూటమి ప్రభుత్వం వాటిని పాఠశాలల్లో అమర్చలేకపోయింది. ప్రధానోపాధ్యాయులపై అభాండం వేసే ఉద్దేశమా..? కూటమి ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి ఆర్వో ప్లాంట్లు పాఠశాలల్లో మూలకు చేరి ఉన్నాయి. వాటిని అమర్చాలంటే టెక్నీషియన్లు ఉండాలి. దీనిపై జిల్లా నోడల్ ఆఫీసర్లు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తుంది. వీటిపై నేడు కదలిక వచ్చి ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాలతో గత 20 రోజులు క్రితం సమావేశం ఏర్పాటుచేశారు. ఆ సమావేశంలో ఆర్వో ప్లాంట్లకు సంబంధించిన ఏజెన్లీ వాళ్లు కాంట్రాక్ట్ అయిపోయిందని ముందుకు రావడంలేదు. కాబట్టి ఆయా పాఠశాలల్లో ఉపాధ్యాయులే ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఆర్వో ప్లాంట్లను ఏర్పాటుచేసే విదంగా కృషి చేయాలని మండల విద్యాశాఖాధికారులు సూచించినట్లు సమాచారం. ఒకవేళ ఉపాధ్యాయులు వాటిని పాఠశాలల్లో అమర్చలేకపోతే ఓ రెండు నెలలు తరువాత ఆర్వో ప్లాంట్లను ఎందుకు అమర్చలేకపోయారని హెచ్ఎంలను బాధ్యులను చేస్తూ నిలదీసే అవకాశం ఉంటుందని కొందరు హెచ్ఎంలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దాదాపుగా మండలంలో సుమారు 16 వరకూ పాఠశాలల్లో ఆర్వో ప్లాంట్ మెటీరియల్స్ బాక్స్ల్లో భద్రంగా మూలన ఉన్నాయి. నేటి మనబడి మన భవిష్యత్లో భాగంగా పాఠశాలల్లో ఆర్వో ప్లాంట్లను ఏర్పాటుచేయడానికి కృషి చేస్తున్నాం. వాటిని అమర్చే టెక్నీషియన్లు దొరకకపోవడం వల్ల ఆలస్యం అవుతుంది. ఓ వారం పది రోజుల్లో ఆర్వో ప్లాంట్లను బిగించడం జరుగుతుంది. మండలంలో 20 ఆర్వో ప్లాంట్లు మంజూరుకాగా ఎనిమిది పాఠశాలల్లో అమర్చాల్సి ఉంది. – ఆర్ఎన్వీవీ శర్మ, ఎంఈవో 2, పాలకొల్లు మండలంప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే ప్రతి విద్యార్థి తాను కూడా కార్పొరేట్ స్థాయి పాఠశాలల్లో చదువుకుంటున్నాననే భరోసా కల్పించేలా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నాడు – నేడు ద్వారా పాఠశాలలను కోట్లాది రూపాయల వ్యయంతో ఆధునీకరించారు. అలాగే మంచి పోషకాహారంతో మధ్యాహ్న భోజనం ఏర్పాటుచేశారు. స్కూల్ పిల్లలకు దుస్తులు, పుస్తకాలు, బ్యాగ్లు, బల్లలు, డిజిటల్ బోర్డులు, ట్యాబ్లు ఇలా అనేక వసతులు కల్పిస్తూ పాఠశాలల రూపురేఖలను మార్చేశారు. దానితో నాడు ఎందరో తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలల నుంచి తీసుకువచ్చి ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించారు. ఒకానొక సమయంలో పట్టణంలో ఓ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో హౌస్పుల్ బోర్డు పెట్టుకునే పరిస్థితి వచ్చింది. నాటి అభివృద్ధి అలా ఉండేది. -
కార్పొరేట్ల ప్రయోజనాల కోసమే అధీక్షక్ బిల్లు
ఏలూరు (ఆర్ఆర్పేట): కార్పొరేట్ శక్తుల ప్రయోజనాల కోసమే కేంద్ర ప్రభుత్వం వికసిత్ భారత్ శిక్షా అధీక్షక్ బిల్లు 2025ను తీసుకువచ్చిందని ఎస్ఎఫ్ఐ నాయకులు మండిపడ్డారు. ఈ బిల్లును వ్యతిరేకిస్తూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో శనివారం స్థానిక కోటదిబ్బ ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద బిల్లు ప్రతులను దహనం చేశారు. ఎస్ఎఫ్ఐ నాయకులు మాట్లాడుతూ గతంలో 2018లో ప్రవేశపెట్టిన హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా బిల్లును, ఇప్పుడు వికసిత్ భారత్ శిక్షా అధీక్షక్ పేరుతో మార్చి ఒకే నియంత్రణ సంస్థను తీసుకురావడం ద్వారా ఉన్నత విద్యా రంగాన్ని కేంద్రీకరించడమే ఈ బిల్లు లక్ష్యమన్నారు. రాష్ట్రాల్లోని విద్యా సంస్థలపై కేంద్రం తన భావజాలాన్ని రుద్దడానికి, వాటిపై పట్టు సాధించడానికి ఈ బిల్లును ఒక సాధనంగా ఉపయోగించుకునే ప్రమాదం ఉందన్నారు. తక్షణమే ఈ బిల్లును ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎస్ఎఫ్ఐ నగర అధ్యక్షుడు ఎస్.శివాజీ, ఉపాధ్యక్షుడు ఎం.జయంత్, సహాయ కార్యదర్శి ఎం.శివ, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. -
కలెక్టరేట్ ఊసేది?
సాక్షి, భీమవరం: కలెక్టరేట్కు అనుమతులొచ్చేశాయి. భూమి పూజే తరువాయి అంటూ ఒక నేత ప్రకటిస్తే.. కలెక్టరేట్ భీమవరం దాటిపోదంటూ మరో నేత.. మిగిలిన వారిది తలోమాట.. రెండు నెలల క్రితం కూటమిలో కాక రేపిన కలెక్టరేట్ అంశం తెరమరుగైపోయింది. నాయకులు సైలెంట్ అయిపోగా శాశ్వత భవనం ఎప్పుడు? ఎక్కడ కడతారో ? జిల్లావాసులకు ప్రశ్నగానే మిగిలిపోయింది. గత ప్రభుత్వంలో 20 ఎకరాల కేటాయింపు పాలనా సౌలభ్యం, మెరుగైన సేవల కోసం వైఎస్సార్సీపీ ప్రభుత్వం తలపెట్టిన జిల్లాల పునర్విభజన లో భీమవరం కేంద్రంగా నూతన పశ్చిమగోదావరి ఆవిర్భవించింది. పట్టణంలోని ప్రైవేట్ కళాశాల భవనంలో తాత్కాలిక కలెక్టరేట్ను ఏర్పాటుచేశారు. అన్ని శాఖలు ఒకేచోట ఉండేలా శాశ్వత ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ భవనం కోసం ఏఎంసీ యార్డులో 20 ఎకరాల స్థలాన్ని గత ప్రభుత్వం కేటాయించింది. ఈ మేరకు రెవెన్యూ, సబ్ రిజిస్ట్రార్ రికార్డుల్లో మార్పులుచేసి 2023 మార్చిలో జీఓ 124ను విడుదల చేశారు. దాదాపు రూ.80 కోట్ల వ్యయంతో భవన నిర్మాణానికి అప్పట్లోనే అడుగులు వేసినప్పటికి ఈలోపు సార్వత్రిక ఎన్నికల హడావుడి మొదలుకావడంతో టెండర్ల ప్రక్రియ ముందుకు సాగలేదు. తర్వాత చంద్రబాబు ప్రభుత్వం రాగా ఈ అంశం మరుగునపడిపోయింది. రోడ్డెక్కిన ప్రజలు కలెక్టరేట్ను భీమవరంలోనే నిర్మించాలని కోరుతూ అఖిల పక్షం ఆధ్వర్యంలో ప్రజాసంఘాలు, వివిధ రాజకీయ పార్టీల కార్యకర్తలు, స్థానికులు రోడ్డెక్కి ధర్నాలు, శాంతియుత ప్రదర్శనలు చేశారు. అప్పట్లో భీమవరంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో జిల్లా కేంద్రంలోనే కలెక్టరేట్ నిర్మాణం చేయాలని వివిధ రాజకీయ పార్టీల నేతలు తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు. వైఎస్సార్సీపీది స్పష్టమైన వైఖరి కలెక్టరేట్ భవనాన్ని భీమవరంలోనే నిర్మించాలని వైఎస్సార్సీపీ తన స్టాండ్ను ప్రకటించింది. ఏఎంసీలోనే నిర్మించాలని పార్టీ భీమవరం నియోజకవర్గ కో–ఆర్డినేటర్ చినమిల్లి వెంకటరాయుడు, పార్టీ నేతలు స్పష్టం చేశారు. కలెక్టరేట్ నిర్మాణం విషయమై ప్రజల్లో అపోహలు సృష్టించవద్దని శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేన్రాజు కూటమి నేతలకు హితవుపలికారు. గతంలో ఏఎంసీలో కేటాయించిన 20 ఎకరాలతో పాటు అవసరమైతే పట్టణంలో అనువైన ప్రభుత్వ భూములను సైతం ఆయన సూచించారు. కూటమి కప్పదాట్లు రెండు నెలల క్రితం కూటమిలో కాకరేపిన కలెక్టరేట్ నిర్మాణ స్థలంపై నేతల విరుద్ధ ప్రకటనలు నేతల వైఖరితో ప్రజల్లో గందరగోళం ప్రశ్నగానే కలెక్టరేట్ నిర్మాణం భవనం కోసం భీమవరంలో 20 ఎకరాలు కేటాయించిన గత ప్రభుత్వం రూ.80 కోట్లతో ఇంటిగ్రేటెడ్ భవన నిర్మాణానికి అప్పట్లోనే టెండర్లు భీమవరం పక్కనే పెద అమిరంలోని 3.6 ఎకరాల ఇరిగేషన్ స్థలంలో కలెక్టరేట్ నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నట్టు ఈ ఏడాది ఆగస్టులో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు చేసిన ప్రకటన కూటమిలో కలకలం రేపింది. ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లామని, సర్వే నంబర్ భీమవరంలో కలిపేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఆయన చెప్పారు. భీమవరం ఎమ్మెల్యే, రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు కలెక్టరేట్ భవనానికి మూడు, లేక నాలుగు ఎకరాల స్థలం సరిపోదన్నారు. భీమవరంలో 25 ఎకరాల స్థల సేకరణకు దిరుసుమర్రు, గొల్లవానితిప్ప, తాడేరు రోడ్లలో అనువైన స్థలం చూస్తున్నట్టు చెప్పారు. కలెక్టరేట్ భవనం కోసం విశాలమైన స్థలం అవసరమని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, భీమవరం పరిసరాల్లోనే భవన నిర్మాణం జరుగుతుందని రాజ్యసభ సభ్యుడు పాకా సత్యనారాయణ అభిప్రాయపడ్డారు. భవన నిర్మాణం ఎక్కడ జరుగుతుందనే విషయమై పందేలు జరుగుతున్నట్టు అప్పట్లో ప్రచారం కూడా జరిగింది. కొద్దిరోజుల పాటు హైడ్రామానే నడిచింది. తర్వాత నేతలంతా సైలెంటైపోయారు. మూడు నెలలుగా ఆ ఊసే లేదు. కలెక్టరేట్ నిర్మాణం ఎక్కడ? ఎప్పుడు నిర్మించేది స్పష్టత లేకుండా మిస్టరీగానే మిగిలిపోయింది. -
ఇళ్లు కూలిస్తే రోడ్డున పడతాం
కోళ్లపర్రు పట్టాదారుల ఆవేదన ఆకివీడు: రెక్కాడితే గాని డొక్కాడని బతుకులు మావి.. రోడ్డు, డ్రెయిన్ పోరంబోకు ప్రాంతంలో 35 ఏళ్లుగా నివాసం ఉంటున్నాం.. 25 ఏళ్ల క్రితం ప్రభుత్వం పట్టాలిచ్చింది.. అప్పులు చేసి రేకుల షెడ్లు, చిన్నపాటి భవనాలు నిర్మించుకుని జీవిస్తున్నాం.. తాజాగా చంద్రబాబు ప్రభుత్వం తమ ఇళ్లు కూలుస్తామంటూ, రో డ్డుకు ఈడుస్తోంది.. అంటూ కోళ్లపర్రుకు చెందిన బ్రిడ్జిపేట వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. 15 రోజుల్లో ఇళ్లు ఖాళీ చేయాలంటూ అధికారులు హుకుం జారీ చేయడంతో సుమారు 70 కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు శుక్రవారం ఇన్చార్జి తహసీల్దార్ ఎండీ ఫరూక్కు వినతిపత్రం సమర్పించారు. అలాగే వైఎస్సార్సీపీ పట్టణ అధ్యక్షుడు అంబటి రమేష్ దృష్టికి వైఎస్సార్సీపీ గ్రామ అధ్యక్షుడు పాశం నర్సింహం, బాధితులు సమస్యను తీసుకువెళ్లారు. బాధితులకు పునరావాసం కల్పించే వరకూ పట్టా భూములను ఖాళీ చేయించవద్దని, ఇతర ఆక్రమణదారులకు కూడా స్థలం కేటాయించాలని డిమాండ్ చేశారు. విషయాన్ని నియోజకవర్గ ఇన్చార్జి పీవీఎల్ నర్సింహరాజు దృష్టికి తీసుకువెళ్లి బాధితులకు న్యాయం జరిగేంత వరకూ అండగా ఉంటామని చెప్పారు. ఎమ్మె ల్యే ఆదేశాల మేరకే ఇళ్లు ఖాళీ చేయిస్తున్నారని రమేష్ ఆరోపించారు. ఇన్చార్జి తహసీల్దార్ మాట్లాడుతూ గతంలో పట్టాలిచ్చిన వారి వివ రాలు, పట్టాల జెరాక్సులు అందించాలని, ఉ న్నతాధికారులతో మాట్లాడతానని చెప్పారు. ఉండి: కేంద్ర ప్రభుత్వం నూతన విద్యాబిల్లుకు ఆమోదం తెలపడంపై ఎస్ఎఫ్ఐ నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. నిరసనగా ఉండి సెంటర్లో శుక్రవారం బిల్లు ప్రతులను దహనం చేశారు. ఎస్ఎఫ్ఐ మండలాధ్యక్షుడు కె.రోహిత్ మాట్లాడుతూ 2018లో ప్రవేశపెట్టిన హయ్యర్ ఎడ్యుకేషన్ ఆఫ్ ఇండియా బిల్లును మార్చి వికసిత్ భారత్ శిక్షా అధిక్షక్ పేరుతో ఆమోదించడం దారుణమన్నారు. యూజీసీ, ఏఐసీటీఈ, ఎన్సీటీఈ వంటి సంస్థల స్థానంలో హెచ్ఈసీఐ వంటి ఒకే నియంత్రణా సంస్థను తీసుకురావడం ద్వారా ఉన్నత విద్యారంగాన్ని ఏకఛత్రాదిపత్యం కిందకు తేవడమే అన్నారు. ఎన్డీఏ ఆధ్వర్యంలో కార్పొరేట్లు, ఆర్ఎస్ఎస్ ప్రయోజనం కోసం విద్యారంగంలో మతతత్వం పెంపొందించేందుకు ఇలా చేస్తున్నారన్నారు. ఇది పేద విద్యార్థులకు విద్యను దూరం చేయడమే అని ఆవేదన వ్యక్తం చేశారు. బిల్లును తక్షణ మే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఎస్ ఎఫ్ఐ నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఏలూరు (ఆర్ఆర్పేట): ఆర్టీసీలో అప్రంటీస్కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన కార్యక్రమంలో ఈనెల 24 నుంచి నిర్వహించనున్నట్టు ఆర్టీసీ జోనల్ సిబ్బంది శిక్షణ కళాశాల ప్రిన్సిపాల్ వి.నీలియ ఓ ప్రకటనలో తెలిపారు. 24న మోటార్ మెకానిక్, ఫిట్టర్, డ్రాఫ్ట్స్మన్ సివిల్, వెల్డర్, పెయింటర్, మెషినిస్ట్, 26, 27 తేదీల్లో ఎలక్ట్రీషియన్, 29, 30 తేదీల్లో డీజిల్ మెకానిక్ ట్రేడ్ అభ్యర్థులకు సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుందని పేర్కొన్నారు. అభ్యర్థులు విజయవాడ విద్యాధరపురం చెరువు సెంటర్లో ఉన్న ఆర్టీసీ జోనల్ శిక్షణ కళాశాలకు ఆయా తేదీల్లో ఉదయం 10 గంటలకు హాజరుకావాలన్నారు. ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు రెండు సెట్ల జెరాక్సులు తీసుకురావాలని సూచించా రు. మరిన్ని వివరాలకు సెల్ 7382900591, 7382900299, 7989790054, 8142188168 నంబర్లలో సంప్రదించాలని కోరారు. ఏలూరు (ఆర్ఆర్పేట): ఏలూరులో ఉపాధ్యాయ అర్హత పరీక్షలు (టెట్) శుక్రవారం కొనసాగాయి. 312 మంది అభ్యర్థులు హాజరయ్యారు. సిద్ధార్థ క్వెస్ట్ కేంద్రంలో ఉదయం 175 మందికి 148 మంది, మధ్యాహ్నం 175 మందికి 164 మంది హాజరయ్యారు. పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని, మాల్ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని డీఈఓ ఎం.వెంకటలక్ష్మమ్మ తెలిపారు. -
నాణ్యత ‘తారు’మారు
తణుకు అర్బన్: గుంతలు పడ్డ రహదారులకు పండుగ షోగా చేస్తున్న పనులు నాసిరకంగా ఉన్నా యని పలువురు ఆరోపిస్తున్నారు. ఆర్అండ్బీ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో 1,568 కిలోమీటర్ల మేర వార్షిక నిర్వహణ పనుల్లో భాగంగా తణుకులోని ఉండ్రాజవరం రోడ్డులో చేస్తున్న తారు ప్యాచ్వర్కు పనుల్లో నాణ్యత లోపం స్పష్టం కనిపిస్తోంది. వార్షిక నిర్వహణలో భాగంగా ఈ రోడ్డులో రూ.3 లక్షల నిధులతో ప్యాచ్వర్కు పనులు శుక్రవారం చేపట్టారు. అయితే గోతుల్లో పూర్తిస్థాయిలో మట్టి శుభ్రం చేయలేదని, గొయ్యి చిన్నదైనా ప్యాచ్ పెద్దదిగా చూపిస్తున్నారని, గొయ్యి ప్రాంతంలో నాలుగు పక్కలా కట్ చేయకుండా ఉల్లిపొర మాదిరిగా తారు కలిపిన చిప్స్ వేస్తున్నారనే ఆరోపణలు అధికంగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా మట్టిపైనే తారు వేయడంతో ఈ ప్యాచ్లు పెద్ద పండుగ వరకు అయినా ఉంటాయా అని ప్రజలు చర్చించుకుంటున్నారు. రూ.10 లక్షల పనులు : ఈ ఏడాది ఫిబ్రవరిలో రాష్ట్రపతి రోడ్డు, ఆర్వోబీ, పైడిపర్రు ప్రాంతాల్లో రూ.10 లక్షల నిధులతో వేసిన ప్యాచ్ వర్కు పనులు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి. రెండు నెలల్లోనే ప్యాచ్వర్కు పనులు ఛిద్రమై రాళ్లు బయటకురాగా, తాజాగా ఇక్కడ పనులు చేసిన ఆనవాళ్లే కనిపించకపోవడం విశేషం. చంద్రబాబు సర్కారులో చేస్తున్న ప్యాచ్వర్కు పనుల్లో ఉన్న డొల్లతనాన్ని చూసి ప్రజలు నివ్వెరపోతున్నారు. సంక్రాంతి పండుగలోపు రహదారులు అభివృద్ధి చేస్తామని చెప్పారని మొదటి ఏడాదిలోపు వేసిన ప్యాచ్వర్కు పనులు రెండో ఏడాది పండుగకు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయని, రెండో ఏడాది పండుగ వస్తుండగా ఉండ్రాజవరం రోడ్డులో వేస్తున్న ప్యాచ్వర్కు పనులు ఎంతకాలం ఉంటాయోనని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఈ పనులపై ఆర్అండ్బీ విభాగ ఏఈ యశ్వంత్ను ‘సాక్షి’ వివరణ కోరగా గతంలో చేసిన రూ.10 లక్షల ప్యాచ్వర్కు పనులకు తిరిగి మరమ్మతులు చేస్తామని, తాజాగా ఉండ్రాజవరం రోడ్డులో వేస్తున్న వార్షిక నిర్వహణ పనులు తమ సిబ్బంది పర్యవేక్షణలోనే జరుగుతున్నాయని, ప్యాచ్వర్కు చేసేప్పుడు రోడ్డును కట్ చేసేందుకు కూలీల కొరతతో ఇబ్బందులు వచ్చాయని, ఇకపై కట్ చేసే ప్యాచ్వర్కు చేస్తామని చెప్పారు. పండుగ షో నాసిరకంగా రోడ్డు మరమ్మతులు ఉల్లి పొరలా ప్యాచ్ వర్కు పనులపై ప్రజల పెదవివిరుపు -
చెత్తశుద్ధి కరువాయె!
భీమవరంలో అధ్వానంగా పారిశుద్ధ్య నిర్వహణ భీమవరం(ప్రకాశం చౌక్): జిల్లా కేంద్రం భీమవరంలోని శివారు ప్రాంతాలు డంపింగ్ యార్డులుగా మారుతున్నాయి. ఖాళీ స్థలాలు, మురుగు కాలువ లు, డ్రెయిన్లు చెత్తాచెదారంతో నిండిపోయాయి. ప ట్టణంలోని డీఎన్నార్ కళాశాల సమీపంలోని డంపింగ్ యార్డుకు చెత్తను తరలించాల్సి ఉంది. అయి తే మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యంతో ఎక్కడి చెత్త అ క్కడే కనిపిస్తోంది. పలు వార్డుల్లోనూ చెత్త రోజుల తరబడి నిలిచి దోమలు విజృంభిస్తున్నాయని ప్రజ లు వాపోతున్నారు. దోమల నివారణ చర్యలను మున్సిపల్ అధికారులు చేపట్టడం లేదు. భీమవరం.. పారిశుద్ధ్యం అధ్వానం పట్టణంలోని డ్రెయిన్ల నిర్వహణ సరిగా లేక మురుగునీరు పారడం లేదు. కాస్మోక్లబ్ నుంచి రవాణా శాఖ అధికారి కార్యాయాలనికి వెళ్లే రోడ్డులోని ము రుగు కాలువ వద్ద భారీగా చెత్త, ఖాళీ కొబ్బరి బొండాలు పేరుకుపోయాయి. అలాగే కలెక్టరేట్కు వెళ్లే దారిలోని మురుగు కాలువలు, మెంటేవారితోట మ ధ్యలో ఉన్న డ్రెయిన్ చెత్తతో నిండిపోయాయి. రా యలం డ్రెయిన్లో గాయత్రి ఆస్పత్రి సమీపాన ఉన్న వంతెన వద్ద చెత్తగా భారీగా అడ్డుపడి దారుణంగా మారింది. పట్టణంలో ప్రవహిస్తున్న జంట కాలువల్లో పలుచోట్ల చెత్త పేరుకుపోయింది. పారిశుద్ధ్యం ఇంతలా క్షీణిస్తున్నా మున్సిపల్, డ్రెయినేజీ అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. కాలువలు, డ్రెయిన్లలో చెత్త వేస్తున్న వారిపై చర్యలు కూడా చేపట్టడం లేదంటున్నారు. చెత్త వేసే ప్రాంతాల్లో అధికారులు కనీసం హెచ్చరిక బోర్డులు కూడా పెట్టడం లేదు. తీరని డంపింగ్ యార్డు సమస్య భీమవరంలో పెరుగుతున్న జనాభా నేపథ్యంలో రోజురోజుకూ చెత్త పెద్ద సమస్యగా మారింది. పట్టణంలో డంపింగ్ యార్డ్ సమస్య పరిష్కరిస్తామని ఎన్నికల ముందు చెప్పిన కూటమి నేతలు ప్రభు త్వం ఏర్పడి 17 నెలలు గడుస్తున్నా ఈ దిశగా ఎ లాంటి చర్యలు తీసుకోలేదు. డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ డంపింగ్ యార్డ్ ఏర్పాటుకు కృషి చేస్తానని హమీ ఇచ్చారు. అయినా ఇప్పటివరకూ పట్టించుకోలేదనే విమర్శలు ఉన్నాయి. -
పుష్కరాలకు కార్యాచరణ
భీమవరం (ప్రకాశంచౌక్): గోదావరి పుష్కరాలకు జిల్లాల వారీగా కార్యాచరణ ప్రణాళికలను సిద్ధం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ సూచించారు. గోదావరి పుష్కరాలు, కొల్లేరు గ్రామాల సరిహద్దుల గుర్తింపు, పర్యావరణ పరిరక్షణ తదితర అంశాలపై శుక్రవారం రాష్ట్ర సచివాలయం నుంచి ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లతో సమీక్షించారు. భీమవరం కలెక్టరేట్ నుంచి కలెక్టర్ నాగరాణి, జేసీ టి.రాహుల్కుమార్రెడ్డి హాజరయ్యారు. సీఎస్ మాట్లాడుతూ 2027 జూన్ 26 నుంచి జూలై 7 వరకు పుష్కరాలు నిర్వహించనున్నారన్నారు. ఈ మేరకు తగిన ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు. కొల్లేరుపై సమీక్ష చేస్తున్న సందర్భంలో కలెక్టర్ నాగరాణి మాట్లాడుతూ కొల్లేరు అభయారణ్యంలో ఆకివీడు మండలంలో 10 గ్రామాలు ఉన్నాయని, 5 గ్రామాల సరిహద్దులను గుర్తించామని, మరో 5 గ్రామాల సరిహద్దుల సర్వే సత్వరమే పూర్తి చేస్తామన్నారు. అలాగే అటవీ, రెవెన్యూ, ఇరిగేషన్ శాఖలతో బృందాన్ని ఏర్పాటుచేసి కొల్లేరులో ప్రభుత్వ భూముల ఆక్రమణలు, చట్టవిరుద్ధంగా సాగు చేస్తున్న ఆక్వా చెరువులను గుర్తించి సర్వే ప్రక్రియను మూడు వారాల్లో పూర్తి చేస్తామని చెప్పారు. ఆర్డీఓ కె.ప్రవీణ్కుమార్రెడ్డి పాల్గొన్నారు. -
బాబు నోట.. ఆరుసార్లు అదే మాట
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటనకు వచ్చిన ప్రతిసారీ ముఖ్యమంత్రి చంద్రబాబు అలవోకగా చెప్పేది చింతలపూడి ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు పూర్తిచేస్తాం అనే మాట. గతేడాది ముఖ్యమంత్రి అయిన తరువాత చంద్రబాబు ఇప్పటికి ఆరుసార్లు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటించారు. ఆరుసార్లు ఇదేమాట చెప్పారు. ఈనెల 1న ఉంగుటూరులో జరిగిన పింఛన్ల పంపిణీ సభలో పాల్గొన్న ముఖ్యమంత్రి ‘చింతలపూడి ఎత్తిపోతల పథకం ప్రాజెక్ట్ పూర్తి చేస్తాం. చింతలపూడి, నూజివీడు లాంటి మెట్ట ప్రాంతాలను సస్యశామలం చేస్తాం. ప్రాజెక్ట్ పూర్తయితే ఉమ్మడి పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో 4.80 లక్షల ఎకరాలకు సాగు, తాగునీరు అందుతుంది. ఇది మా ప్రభుత్వ ప్రాధాన్యత..’అని చెప్పారు. కానీ క్షేత్రస్థాయిలో ఆ ప్రాజెక్టు పనుల కోసం తీసుకున్న చర్యలే లేవు. 2008లో వైఎస్సార్ శ్రీకారం గోదావరి జలాలను మెట్ట ప్రాంతాలకు తరలించాలనే సంకల్పంతో 2008 అక్టోబర్ 30న చింతలపూడి ఎత్తిపోతల పథకానికి అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి శంకుస్థాపన చేశారు. కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లోని 15 మెట్ట ప్రాంత మండలాలకు సాగునీరు అందించడమే ప్రధాన లక్ష్యంగా ఈ పథకాన్ని రూపొందించారు. జలయజ్ఞంలో భాగంగా రూ.1,701 కోట్లతో అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టు నిర్మించి రెండులక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వాలని పనులు చేపట్టారు. వైఎస్సార్ హఠాన్మరణంతో ప్రాజెక్ట్ అటకెక్కింది. మళ్లీ 2014లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాజెక్ట్ వ్యయాన్ని భారీగా పెంచి అదనపు ఆయకట్టును దీని పరిధిలోకి తెచ్చేలా మార్పులు చేశారు. ప్రాజెక్టు వ్యయాన్ని రూ.4,909.80 కోట్లకు పెంచి ఉమ్మడి కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లో 4.80 లక్షల ఎకరాలకు తాగు, సాగునీరు ఇచ్చేలా రూపొందించారు. అక్కడి నుంచి ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. భూ సేకరణ సమస్యలు చెప్పి ఈ ప్రాజెక్టును అటకెక్కించారు. 2024 ఎన్నికలకు ముందు ఈ ప్రాజెక్టును పూర్తిచేస్తామని ఎన్నిసార్లు హామీలు ఇచ్చారో లెక్కేలేదు. ఏలూరు, చింతలపూడి, నూజివీడు, దెందులూరు.. ఇలా అన్ని నియోజకవర్గాల్లోను ఎన్నికల సభల్లో అధికారంలోకి వస్తే వెంటనే ఈ ప్రాజెక్టును పూర్తిచేస్తామని చెప్పారు. ఒట్టి మాటలే ఉమ్మడి జిల్లాకు వచ్చిన ప్రతిసారీ చింతలపూడి ఎత్తిపోతలు పూర్తిచేస్తామని చెప్పిన సీఎం చంద్రబాబు ఎన్నికల సమయంలో ఎన్నిసార్లు చెప్పారో లెక్కేలేదు అడుగు ముందుకు పడని ప్రాజెక్టు పనులు గతంలో సీఎంగా ఉన్నప్పుడే అంచనా వ్యయం భారీగా పెంచిన చంద్రబాబు జలయజ్ఞంలో ప్రాజెక్టుకు శంకుస్థాపనచేసిన దివంగత సీఎం వైఎస్సార్ రైతులకు ఆమోదయోగ్యమైన నష్టపరిహారం ఇచ్చి ప్రాజెక్ట్ పనులు వెంటనే ప్రారంభించాలి. ఎన్నికలకు ముందు పదేపదే హామీలిచ్చిన చంద్రబాబునాయుడు, పవన్కళ్యాణ్.. అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అయినా సమస్య పరిష్కారంపై దృష్టిపెట్టకపోవడం సరికాదు. – కంభం విజయరాజు, వైఎస్సార్సీపీ చింతలపూడి నియోజకవర్గ ఇన్చార్జ్ 2024లో సీఎం అయిన తరువాత చంద్రబాబు ఆగిరిపల్లి, పోలవరం, ఏలూరు, కై కలూరు, ఉంగుటూరు నియోజకవర్గాల్లో వివిధ ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వచ్చిన ప్రతిసారి.. 2026 జూన్కల్లా చింతలపూడి పూర్తిచేస్తామని చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో రూ.222 కోట్లు కేటాయించినా.. ఒక్క రూపాయి కూడా మంజూరు చేయలేదు. ముఖ్యమంత్రి ఎన్నిసార్లు చెప్పినా.. క్షేత్రస్థాయిలో ఈ ప్రాజెక్ట్ పనులకు సంబంధించి ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. భూసేకరణ సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం చొరవ చూపలేదు. ప్రధానంగా చింతలపూడి నియోజకవర్గంలో 14 కిలోమీటర్ల కాలువ నిర్మాణానికి సంబంధించి భూసేకరణ విషయంలో ఇబ్బందులున్నాయి. కాలువ కోసం భూమి కోల్పోతున్న రైతులకు ఎకరాకు రూ.19 లక్షల పరిహారం ఇస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో రైతులు వ్యతిరేకించారు. అప్పటి నుంచి ఈ సమస్య తీరలేదు. -
ఉపాధ్యాయులకు టెట్పై పిటిషన్ వేయాలి
భీమవరం: టెట్ నిర్వహణపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయాలని, భేషరతుగా ఇన్స ర్వీస్ టీచర్లందరినీ టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ (టెట్) నుంచి మినహాయించాలని ఎమ్మెల్సీ బి.గోపిమూర్తి డిమాండ్ చేశారు. ఇన్సర్వీస్ టీచర్లకు టెట్ నిర్వహణను మినహాయించాలని గురువారం ఏపీ యూటీఎఫ్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడారు. ధర్నా శిబిరానికి యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు పీఎస్ విజయరామరాజు అధ్యక్షత వహించారు. జిల్లా ప్రధాన కార్యదర్శి ఏకేవీ రామభద్రం మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో టెన్త్ విద్యార్థులకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలో మార్పులు చేయాలని, సెలవు ది నాలు, పండగ రోజుల్లో తరగతులు రద్దు చే యాలని డిమాండ్ చేశారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని జేసీ రాహుల్కుమార్రెడ్డి, డీఈఓ ఈ.నారాయణకు అందజేశారు. జిల్లా గౌరవాధ్యక్షుడు పీహెచ్ పట్టాభిరామయ్య, సహాధ్యక్షుడు కె.రాజశేఖర్, కోశాధికారి పి.క్రాంతికుమార్, జిల్లా కార్యదర్శులు పి.శివప్రసాద్, ఎస్.రత్నరాజు పాల్గొన్నారు. పాలకొల్లు సెంట్రల్: యూపీఎస్సీ నిర్వహించిన ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీస్ (ఐఈఎస్)లో మండలంలోని లంకోడేరుకు చెందిన యువతి ప్రతిభ చాటింది. గ్రామానికి చెందిన గోపిశెట్టి సత్యనారాయణ, హైమావతి కుమార్తె కవిత బేబీ 48వ ర్యాంకుతో సత్తాచాటింది. సత్యనారాయణ పంచాయతీ సెక్రటరీగా పనిచేసి నాలుగేళ్ల క్రితం మృతి చెందారు. కవిత బేబి ప్రాథమిక విద్య పూలపల్లిలో, ఇంటర్ ప్రైవేట్ కళాశాలలో చదివింది. ఎన్ఐటీ సూరత్లో బీ టెక్, ఐఐటీ ఖరగ్పూర్లో ఎంటెక్ పూర్తిచేసింది. తనకు చిన్ననాటి నుంచి మినిస్ట్రీ ఆఫ్ టెలీ కమ్యూనికేషన్స్లో ఉద్యోగం సాధించాలనే ల క్ష్యం ఉండేదని, తన ర్యాంకును బట్టి తాను అ నుకున్న టెలీ కమ్యూనికేషన్స్లో ఉద్యోగం వ స్తుందని భావిస్తున్నానన్నారు. ఆమెకు గ్రామ ప్రజలు అభినందనలు తెలిపారు. భీమవరం: పదో తరగతి పరీక్షల ఫీజు చెల్లించేందుకు రూ.500 అపరాధ రుసుంతో రెండు రోజులు అవకాశం కల్పించినట్టు డీఈఓ ఈ.నారాయణ గురువారం ప్రకటనలో తెలిపారు. శుక్ర, శనివారాల్లో ఫీజులు చెల్లించవచ్చని పేర్కొన్నారు. భీమవరం (ప్రకాశంచౌక్): ప్రజల సానుకూల స్పందనలో పశ్చిమగోదావరి జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిందని కలెక్టర్ సీహెచ్ నాగరాణి తెలిపారు. రెండు రోజుల కలెక్టర్ల సదస్సు గురువారం ముగిసింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. పోలవరం రూరల్: పోలవరం ప్రాజెక్టులో సీఎస్ఎంఆర్ఎస్ బృందం సభ్యులు ప్రాజెక్టులో జరుగుతున్న పనులకు సంబంధించి నాణ్యత ప్రమాణాలను పరిశీలించారు. గురువారం శా స్త్రవేత్తలు లలితకుమార్ సోలంకి, రవి అగర్వాల్ నేతృత్వంలోని బృందం సభ్యులు డయా ఫ్రమ్వాల్లో వినియోగిస్తున్న కాంక్రీట్ నాణ్యతను తనిఖీ చేశారు. ప్రాజెక్టులో ఉపయోగిస్తున్న కాంక్రీట్ నమూనాలను ల్యాబ్లో నా ణ్యత ప్రమాణాలను పరిశీలించారు. పోలవ రం ప్రాజెక్టులో గ్యాప్–1, గ్యాప్–2 ప్రాంతాల్లో మరో రెండు రోజుల పాటు కాంక్రీట్ నాణ్యతపై పరిశీలన చేయనున్నట్టు తెలిపారు. ఎస్ ఈ రామచంద్రరావు, డీఈలు శ్రీనివాస్, బాలకృష్ణ, మేఘ జనరల్ మేనేజర్ గంగాధర్, డిప్యూటీ జీఎం మురళీకృష్ణ ఉన్నారు. ఏలూరు (ఆర్ఆర్పేట): వినియోగదారుల ప్ర యోజనాల కోసం ఆర్టీసీ కార్గో సేవలను విస్తృతపరుస్తున్నామని ఏలూరుజిల్లా ప్రజా రవాణా అధికారి షేక్ షబ్నం తెలిపారు. ఈనెల 20 నుంచి వచ్చేనెల 19 వరకూ జరిగే కార్గో డోర్ డెలివరీ మాసోత్సవాలకు సంబంధించిన వాల్ పోస్టర్లను గురువారం స్థానిక డీపీటీఓ కార్యాలయం వద్ద ఆవిష్కరించారు. ఆమె మాట్లాడుతూ కార్గో సేవలు ప్రజల మన్ననలు పొందాయన్నారు. డోర్ డెలివరీ మాసోత్సవాలను విజయవంతం చేయాలని ఆదేశించారు. -
డీజిల్ అరకమ విరకయాలపై చర్యలు
కొయ్యలగూడెం: డీజిల్ అక్ర మ విక్రయాలపై రెవెన్యూ అధికారులు కొరడా ఝుళిపించారు. ‘సాక్షి’లో ఈనెల 3న ప్రచురించిన ‘యథేచ్ఛగా హైవేలో డీజిల్ దందా’ కథనానికి అధికారులు స్పందించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తహసీల్దార్ ఎన్.నాగరాజు గురువారం సోదాలు చేశారు. ఏలూరు, తూర్పుగోదావరి జిల్లాల (ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా) సరిహద్దుల ప్రాంతంలో అచ్యుతాపురం, జగన్నాథపురం గ్రామాల మధ్య నిబంధనలకు విరుద్ధంగా సేకరించిన సుమారు 250 లీటర్ల డీజిల్ని గుర్తించినట్టు తహసీల్దార్ తెలిపారు. రాకపోకలు సాగిస్తున్న లారీల నుంచి టీ క్యాంటీన్ య జమాని ఆయిల్ బంకులోని ధర కంటే లీటరు రూ.20 తక్కువకు కొనుగోలు చేసి ఇతర పార్టీలకు విక్రయిస్తున్నట్టు విచారణలో తెలిసిందన్నారు. క్యాంటీన్ నిర్వాహకుడిపై చర్యలు తీసుకోవడానికి ఉన్నతాధికారులకు నివేదించడంతో పాటు గుర్తించిన డీజిల్ని గోపాలపురం రెవెన్యూ అధికారులకు స్వాధీనం చేశామని చెప్పారు. భీమవరం: జిల్లాలోని ఆరు పరీక్షా కేంద్రాల్లో గురువారం నిర్వహించిన ఏపీ టెట్ పరీక్షలకు 89.3 శాతం అభ్యర్థులు హాజరయ్యారని డీఈఓ ఈ.నారాయణ తెలిపారు. ఉదయం 702 మందికి 629 మంది, మధ్యాహ్నం 100 మందికి 85 మంది హాజరయ్యారని, ఎక్కడా మాల్ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని చెప్పారు. -
ప్రభుత్వంపై గళమెత్తిన ఉపాధ్యాయులు
ఏలూరు (టూటౌన్): అపరిష్కృతంగా ఉన్న ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గురువారం యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఏలూరు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. పలువురు వక్తలు మాట్లాడుతూ 2010 ముందు నియామకం పొందిన టీచర్లకు టెట్ రద్దు చేయాలని, ఈ మేరకు సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయాలని డిమాండ్ చేశారు. పదో తరగతి కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ఆదివారాలు, సెలవు రోజుల్లో తరగతులు రద్దు చేయాలన్నారు. సింగిల్ టీచర్లు ఓహెచ్లు ఉపయోగించుకునే విషయంలో ఇబ్బందులు తొలగించాలన్నారు. గురుకుల సంక్షేమ పాఠశాలల్లో గురువులపై అధికారులు వ్యవహరిస్తున్న తీరు మార్చుకోవాలన్నారు. మహిళా ఉపాధ్యాయులపై ఎంఈఓలు వ్యవహరిస్తున్న తీరు మార్చుకోవాలని కోరారు. అనంతరం డీఆర్వో, డీఈఓలకు ప్రా తినిధ్యాలు ఇచ్చారు. జిల్లా అధ్యక్షులు బొర్రా సు భాషిణి, జిల్లా ప్రధాన కార్యదర్శి రవికుమార్, గౌరవాధ్యక్షుడు శ్యాంబాబు, సహాధ్యక్షురాలు ఎస్.సుధారాణి, కోశాధికారి జీవీ రంగమోహన్, రాష్ట్ర కౌన్సిలర్ షేక్ ముస్తఫా అలీ, జిల్లా కార్యదర్శులు, మండల అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు. -
జిల్లాలో మహోద్యమంలా కోటి సంతకాల సేకరణ
నరసాపురం: మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరిస్తూ కూటమి ప్రభుత్వం తీసుకున్న దుర్మార్గపు నిర్ణయానికి వ్యతిరేకంగా జిల్లాలో 4,19,650 మంది సంతకాలు చేశారని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు తెలిపారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో ప్రతి గ్రామం, పట్టణాల్లోని ప్రతి వార్డులోనూ వైఎస్సార్సీపీ సభలు, రచ్చబండ కా ర్యక్రమాలు విస్తృతంగా నిర్వహించిందన్నారు. అ న్ని వర్గాల ప్రజలు పార్టీ చేపట్టిన సంతకాల ఉ ద్యమానికి బాపటగా నిలిచారని పేర్కొన్నారు. ని యోజకవర్గాల వారీగా నరసాపురంలో 55,000 మంది, ఆచంటలో 71,200 మంది, భీమవరంలో 55,000 మంది, పాలకొల్లులో 60,200 మంది, తణుకులో 80,250 మంది, తాడేపల్లిగూడెంలో 45,000 మంది, ఉండిలో 53,000 మంది స్వచ్ఛందంగా వచ్చి సంతకాలు చేశారని వివరించారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణపై రాష్ట్రవ్యాప్తంగా పార్టీ చేపట్టిన కోటి సంతకాల ఉద్యమం ఓ చరిత్ర అన్నారు. వైద్య విద్యను పేదలు, మధ్యతరగతి వారికి చేరువ చేయాలనే బృహత్తర లక్ష్యంతో వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో 17 మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేస్తే, వాటిని నిర్వహించడంలో చిత్తశుద్ధి లేని కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణకు పూనుకుందని విమర్శించారు. ప్ర జలు మంచి చేయమని చంద్రబాబును గద్దెనెక్కించారని గుర్తుచేశారు. ప్రభుత్వం మంచి పనులు చేస్తే బాధ్యత గల ప్రతిపక్ష పార్టీగా వైఎస్సార్సీపీ స్వాగతిస్తుందని చెప్పారు. ఇప్పుడు కోటి మంది ప్రజలు రాతపూర్వకంగా మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకించారని చెప్పారు. ప్రజాస్వామ్యంలో ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా పనిచేసే హక్కు ప్రభుత్వానికి లేదన్నారు. ఇప్పటికై నా చంద్రబాబు ప్రభుత్వం కళ్లు తెరచి ప్రజల ఇష్టాన్ని గౌరవించి ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ప్రసాదరాజు డిమాండ్ చేశారు. 4,19,650 సంతకాల ప్రతుల సేకరణ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై పెల్లుబికిన ఆగ్రహం వైఎఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు -
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై మండిపాటు
భీమవరం: మెడికల్ కళాశాలలను ప్రభుత్వమే నిర్మించి నిర్వహించాలని డిమాండ్ చేస్తూ గురువారం భీమవరం కలెక్టరేట్ వద్ద సీపీఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు మాట్లాడుతూ మెడికల్ కళాశాలలకు ప్రైవేట్ భాగస్వామ్యం కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీఓ 590ని ఉపసంహరించుకోవాలని, పీపీపీ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో వైద్య కళాశాలలను ప్రైవేటీకరించడం వల్ల బడుగు, బలహీన వర్గాలకు తీరని నష్టం కలుగుతుందని చెప్పారు. ప్రభుత్వం నిర్ణయాలను ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. నిరుపేదలు, బలహీన వర్గాలకు అండగా ఉండి వారి సంక్షేమానికి పాటుపడాల్సిన ప్రభుత్వం వైద్యాన్ని అందకుండా చేయడం దారుణమని విమర్శించారు. ప్రైవేటు వైద్య కళాశాలలతో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని చెప్పారు. మెడికల్ కళాశాలలను ప్రభుత్వం నిర్వహిస్తే వేలాది మందికి ప్రభుత్వ ఉద్యోగాలు లభిస్తాయన్నారు. ప్రభుత్వం తన ఆలోచనలను విరమించుకోకపోతే మరిన్ని ఉద్యమాలకు వెనుకాడబోమని భీమారావు హెచ్చరించారు. అనంతరం ఏపీ వైద్య విధాన పరిషత్ డీసీహెచ్ఎస్ డాక్టర్ పి.సూర్యనారాయణరాజుకు వినతిపత్రం అందజేశారు. సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చెల్లబోయిన రంగారావు, ఎం.సీతారాంప్రసాద్, కలిశెట్టి వెంకట్రావు, సనపల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.


