breaking news
West Godavari
-
‘గ్రామాలను మద్యంతో ముంచేస్తున్నారు.. వరదలా పారిస్తున్నారు’
భీమవరం(ప.గో. జిల్లా): బెల్ట్ షాపులు తొలగించాలని, అదే సమయంలో తమ ఉపాధిని కాపాడాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ కల్లుగీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో భీమవరంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. శుక్రవారం(ఆగస్టు 22వ తేదీ) జరిగిన ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు పాల్గొన్నాయి. దీనిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ కొల్లు గీత కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి జుత్తిక నరసింహమూర్తి మాట్లాడుతూ.. ‘ కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చి 14 నెలలుగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలో అక్రమ మద్యం, కల్తీ మద్యం, బెల్టు షాపులతో మద్యాన్ని వరదలా పారిస్తున్నారు. గ్రామాలను మద్యంతో ముంచేస్తున్నారు. మంచినీళ్లు లేక అనేక గ్రామాలు ఉన్నాయి మంచినీళ్లు ఇవ్వటం మా వల్ల కాదు.. మద్యం తాగండి అని కూటమి ప్రభుత్వం చెబుతుంది. బెల్ట్ షాపులు తొలగించండి మా ఉపాధిని కాపాడండి తాటి చెట్టు పై నుంచి పడి మరణించిన వ్యక్తికి ఎక్స్ గ్రేషియా ఇవ్వండి అనే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ రాష్ట్రంలో 75 వేల బెల్టు షాపులు ఈ జిల్లాలో 4 వేల బెల్ట్ షాపులు తొలగించే వరకు మా పోరాటం ఆగదు. ఇదే ప్రభుత్వానికి మా హెచ్చరిక. ముఖ్యమంత్రి, ఎక్సైజ్ మంత్రి బెల్ట్ షాపులు తొలగిస్తాం. బెల్ట్ షాపులు పెడితే తోలు వలిచేస్తాం అని అన్నారు. ఇప్పటివరకు మీరు ఎంతమంది తోలు తీశారు ఎన్ని బెల్ట్ షాపుల్లో తొలగించారు చెప్పాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. ఈనెల 30వ తారీఖున భీమవరం ఎక్సైజ్ కార్యాలయం వద్ద వందలాదిమంది గీత కార్మికులు మోకులు ధరించి పెద్ద ఎత్తున ఆ కార్యాలయాన్ని ముట్టడిస్తాం’ అని హెచ్చరించారు. -
చింతమనేని.. నీ ఉడత ఊపులకు భయపడం: పేర్ని నాని
సాక్షి, పశ్చిమ గోదావరి: ఏపీలో ప్రజలకు రక్షణ లేకుండా పోయిందని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. టీడీపీ గూండాల దాడులు తారాస్థాయికి చేరాయన్నారు. అబ్బయ్య చౌదరిని చంపాలని చూస్తున్నారు. ఇప్పటికే అబ్బయ్య చౌదరి ఆస్తులను ధ్వంసం చేశారు. దాడులు చేస్తుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. చింతమనేని ఉడత ఊపులకు భయపడేది లేదు. అబ్బయ్యచౌదరివ వెంట జగన్, పార్టీ మొత్తం ఉంది’’ అని పేర్ని నాని అన్నారు.దెందులూరు నియోజకవర్గం పెదవేగి మండలం కొండలరావుపాలెంలో అబ్బయ్య చౌదరి పొలంలో చింతమనేని ప్రభాకర్ అనుచరుల దౌర్జన్యకాండను వైఎస్సార్సీపీ నేతలు ఖండించారు. కొఠారు అబ్బయ్య చౌదరిని ఆయన నివాసంలో వైఎస్సార్సీపీ ప్రతినిధుల బృందం పరామర్శించింది. మాజీ మంత్రులు పేర్ని నాని, సాకే శైలజానాథ్, ఎమ్మెల్సీలు లేళ్ళ అప్పిరెడ్డి, కవురు శ్రీనివాస్, చంద్రశేఖర్ రెడ్డి, బొమ్మి ఇజ్రాయిల్, ఏలూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు, లీగల్ సెల్ ప్రెసిడెంట్ మనోహర్ రెడ్డి తదితరులు.. పచ్చ మూకలు ధ్వంసం చేసిన పొలాలను పరిశీలించారు.. అనంతరం మీడియాతో మాట్లాడారు.రాబోయేది వైఎస్సార్సీపీ ప్రభుత్వమే.. అన్నీ లెక్కలు సరిచేస్తాం: సాకే శైలజానాథ్సాకే శైలజానాథ్ మాట్లాడుతూ.. ప్రత్యర్థుల ఆస్తులను ధ్వంసం చేస్తూ.. భయాన్ని క్రియేట్ చేయాలని చూస్తున్నారంటూ టీడీపీ నేతలపై ఆయన మండిపడ్డారు. ప్రతి వైఎస్సార్సీపీ కార్యకర్త మీ దౌర్జన్యాన్ని ఎదుర్కొంటారు. రాయలసీమ వాసులుగా దెందులూరులో జరిగిన ఘటనలు చూస్తుంటే భయమేస్తుంది. ఆర్థిక మూలాలు దెబ్బతీసి.. బలహీనపరచాలని చూస్తున్నారు. వైఎస్సార్సీపీ క్యాడర్ను భయపెట్టి రేపు అడ్డం లేకుండా చూసుకోవాలని చంద్రబాబు చూస్తున్నారు.వైఎస్సార్సీపీ కార్యకర్తలను భయపెట్టాలని చూస్తే చింతమనేనికి అది భ్రమ మాత్రమే.. పచ్చని చెట్లను నరికి వేయడం దారుణం. పోలీసులు స్వామి భక్తితో పని చేస్తున్నారు. రక్తం వచ్చేలాగా టీడీపీ వాళ్ళు దాడులు చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారు?. డీఎస్పీనే టీడీపీ మూకలు తోసేస్తుంటే ఏం చేస్తున్నారు?. ప్రతి వాటిని గుర్తు పెట్టుకుంటాం?. టీడీపీ నేతలు.. వైఎస్సార్సీపీ నేతల ఇళ్లకు వచ్చి వీరంగం సృష్టించడం దారుణం. ఇప్పటికైనా పోలీసులకు సోయి ఉండాలి. ఎమ్మెల్యే మీకు జీతాలు ఇవ్వడు. రాబోయేది వైఎస్సార్సీపీ ప్రభుత్వమే.. అన్ని లెక్కలు సరిచేస్తాం..దెందులూరులో పోలీసుల సాయం ధృతరాష్ట్ర కౌగిలి. నిలబడి సమాధానం చెప్పే రోజు వస్తుంది.. డేట్ నోట్ చేసుకోండి. అరాచకాలు చేసే వాళ్లని కేసులు పెట్టి లోపల వేయాల్సింది పోయి మా వాళ్లపై కేసులు పెడుతున్నారు. పోలీసుల ప్రభుత్వ అధికారులను గుర్తుపెట్టుకోవాలి. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏ వైఎస్సార్సీపీ నాయకుడు ఒంటరి కాదు. బాడుగకు తెచ్చిన వారితో కార్యక్రమాలు చేస్తే మంచి పద్ధతి కాదు. జాగ్రత్తగా ఉండండి. మంచికి మంచి.. చెడుకు చెడు లెక్కలు సరిచేసే కాలం ఉంటుంది. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక లెక్కలు సరిచేస్తాం’’ అని సాకే శైలజానాథ్రెడ్డి హెచ్చరించారు. -
ఆక్వా రైతులను ఆదుకోవాలి
ఉండి: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయాలతో ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన ఆక్వా రైతులను ఆదుకోవాలని రాష్ట్ర వ్యవసాయ రైతు సంఘ మాజీ అధ్యక్షుడు బి.బలరాం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం ఉండి ఏఎంసీ ప్రాంగణంలో రైతు సంఘ జిల్లా నాయకుడు జీను ఆదినారాయణ ఆధ్వర్యంలో ఆక్వా రైతు జిల్లా సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథులుగా రాష్ట్ర వ్యవసాయ సంఘ అధ్యక్షుడు వి.కృష్ణయ్య, కౌలు రైతు సంఘ రాష్ట్ర కార్యదర్శి ఎ.హరిబాబు, జిల్లా కార్యదర్శి ఆకుల హరే రామ్ మాట్లాడుతూ దేశంలో ఆక్వా సాగు వి స్తరించాలని పిలుపునిచ్చిన ప్రభుత్వాలు ఇప్పు డు ఆక్వా రైతు కష్టాల్లో ఉంటే ఎందుకు భరోసా ఇవ్వడం లేదన్నారు. రైతులను ఆదుకోకుంటే ఆక్వా రంగం మరింత కుదేలవుతుందన్నారు. రైతుల భాగస్వామ్యం లేకుండా అమరావతిలో అడ్వయిజరీ కమిటీని వేయడం వెనుక ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. ఆక్వా రైతులను వెంటనే ఆదుకోకుంటే పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. చెరుకువాడ సర్పంచ్ కొండవేటి సాంబశివరావు, నాయకులు ధనికొండ శ్రీనివాస్, మంగిన శ్రీహరి, ఆక్వా రైతులు పాల్గొన్నారు. -
పీఓపీ విగ్రహాలతో చేటు
శురకవారం శ్రీ 22 శ్రీ ఆగస్టు శ్రీ 2025భీమవరం(ప్రకాశం చౌక్): వినాయక చవితి ఉత్సవాలకు ఏర్పాటుచేసే ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (పీఓపీ) విగ్రహాలతో పర్యావరణానికి ముప్పు పొంచి ఉంది. ఏటా వీటిని కాలువలు, చెరువుల్లో నిమజ్జనం చేయడం జల కాలుష్యానికి కారణమవుతోంది. పీఓపీ విగ్రహాలపై నిషేధం ఉన్నా ఏటా వేలల్లో వీటిని ఏర్పాటు చేస్తున్నారు. అయినా కాలుష్య నియంత్రణ శాఖ అధికారులు చర్యలు తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఏటా జిల్లాలో 2 నుంచి 30 అడుగుల వరకు పీఓపీ విగ్రహాలను సుమారు 10 వేల వరకూ ఏర్పాట్టు చేస్తున్నట్టు అంచనా. జలచరాలకు హాని.. ప్రమాదకరమైన రంగులు, నీటిలో కరగని పదార్థాలతో పీఓపీ విగ్రహాలను తయారుచేస్తున్నారు. అయితే వీటిని నిమజ్జనం చేసిన సమయంలో 70 శాతం వరకు మాత్రమే నీటిలో కరిగి మిగిలిన రంగులు, పదార్థాలు కరగకపోవడం జలకాలుష్యానికి కారణమవుతోంది. అలాగే కాలువలు, గోదావరిలో జీవించే జల చరాలకు ముప్పు వాటిల్లుతోంది. ఇతర రాష్ట్రాల నుంచి కార్మికులు జిల్లాలో 90 శాతం పీఓపీ విగ్రహాలను ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కార్మికులు తయారుచేసి విక్రయిస్తున్నారు. వినాయకచవితికి రెండు, మూడు నెలల ముందే కుటుంబంతో సహా ఇక్కడకు వచ్చి తాత్కాలికంగా గుడారాలు ఏర్పాటుచేసుకుని వీటిని తయారుచేస్తున్నారు. ఇలా జిల్లాలో 50 వరకు కుటుంబాలు పీఓపీ విగ్రహాలను తయారుచేస్తున్నాయి. అయితే పీఓపీ విగ్రహాలను తయారు చేసే కార్మికుల ఆరోగ్యం కూడా దెబ్బతింటోంది. విగ్రహాలను తయారుచేసే సమయంలో రంగులను పీల్చడం ద్వారా ఊపిరితిత్తులు దెబ్బతినడం, క్యాన్సర్, చర్మవ్యాధులు, నేత్ర సమస్యలతో బాధపడుతున్నారు. జిల్లాలో జోరుగా విక్రయాలు జిల్లాలో అత్తిలి, పాలకొల్లు, భీమవరం, తాడేపల్లిగూడెం, పెనుగొండ, నరసాపురం, మొగల్తూరు, చించినాడ తదితర ప్రాంతాల్లో పీఓపీ విగ్రహాల తయారీ జోరుగా సాగుతోంది. ఏటా జిల్లాలోని 409 పంచాయతీలు, ఆరు మున్సిపాలిటీల్లో సు మారు 10 వేల వరకూ వినాయక విగ్రహాలను ఏర్పాటు చేస్తుంటారు. వీటిలో 90 శాతం వరకూ పీఓపీ విగ్రహాలే ఉంటున్నాయి. వీటి ధరలు రూ.2 వేల నుంచి రూ.25 వేల వరకు ఉన్నాయి. మట్టి విగ్రహాలే మేలు పీఓపీ విగ్రహాల ఏర్పాటు విషయంలో ఉత్సవ కమిటీ నిర్వాహకుల ఆలోచనల మారాలని, మట్టి విగ్రహాలను ఏర్పాటుచేసి నవరాత్రుల్లో పూజించాలని పర్యావరణ వేత్తలు కోరుతున్నారు. పీఓపీ విగ్రహాలపై అందరూ అవగాహన పెంచుకుని పర్యావరణానికి మేలు చేయాలని అంటున్నారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (పీఓపీ) నీటిలో కలిసినప్పుడు జిప్సంగా మారుతుంది. ఇది నీటిలో ఆక్సిజన్ స్థాయిలను తగ్గించి, జలచరాలకు హాని చేస్తుంది. విగ్రహాలను విషపూరిత రసాయనాలు, రంగులు, భారీ లోహాలతో (లెడ్, మెర్కూరీ, సీసం, పారాదీ) తయారు చేస్తారు. ఇవి నీటిని కలుషితం చేసి, పర్యావరణ వ్యవస్థను దెబ్బతీస్తాయి. అలాగే ఇవి మానవ ఆరోగ్యానికి కూడా హాని కలిగి స్తాయి. వీటిని నిమజ్జనం చేసినప్పుడు నీటిలో కొన్ని లోహాలు కరగకుండా అలానే ఉండిపోతాయి. ఈ నీటిని తాగిన పశువులు, మనుషులకు క్యాన్సర్లు, ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. పీఓపీ విగ్రహాల బదులు మట్టి ప్రతిమలను ఏర్పాటు చేసుకోవడం పర్యావరణానికి శ్రేయస్కరం. – డాక్టర్ పీఏఆర్కే రాజు, రిటైర్డ్ ప్రొఫెసర్, ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల, భీమవరం మట్టి ప్రతిమలే మేలు ఏటా 90 శాతానికి పైగా పీఓపీ విగ్రహాల ఏర్పాటు 5 నుంచి 30 అడుగుల వరకు ప్రతిమలు జిల్లాలో సుమారు 10 వేల విగ్రహాలు వీటి నిమజ్జనంతో జల కాలుష్యం అధికారుల చర్యలు శూన్యం మట్టి విగ్రహాలను పూజించాలంటున్న పర్యావరణ వేత్తలు ఏటా జిల్లా ఉన్నతాధికారులు వినాయక చవితికి ముందు పీఓపీ విగ్రహాలు నిషేధం అంటూ ప్రకటనలు ఇవ్వడంతోనే సరిపెడుతున్నారు. క్షేత్రస్థాయిలో తనిఖీలు చేసి విగ్రహా తయారీదారులపై చర్యలు తీసుకున్న దాఖలాలు కనిపించడం లేదు. అలాగే తయారీదారులకు, ఉత్సవ కమిటీలకు విగ్రహాల వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కార్యక్రమాలు చేపట్టడం లేదు. కాలుష్య నియంత్రణ బోర్డు అధికారులు సమావేశాలకు హాజరవడం తప్ప ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. -
అనుగృహమెప్పుడో..?
ఆకివీడు: పేదలకు సొంతింటి నిర్మాణం కలగానే మిగలనుంది. కూటమి ప్రభుత్వ 15 నెలల పాలనలో గృహ నిర్మాణాల ఊసెత్తకపోవడం పేదలకు శాపంగా మారింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇళ్ల నిర్మాణానికి రూ.4 లక్షల చొప్పున సాయం చేస్తామన్న నాయకుల హామీలు అమలుకావడం లేదు. జిల్లాలో ఒక్క ఇంటిని కూడా పేదలకు మంజూరు చేయకపోగా సెంటు స్థలం కూడా సేకరించిన దాఖలాలు లేవు. ఇళ్ల నిర్మాణాలకు వేలాది దరఖాస్తులు ప్రభుత్వ కార్యాలయాల్లో మూలుగుతున్నాయి. ఇళ్లకు సంబంధించి ఆన్లైన్ సైట్లు మూసివేయడంతో ప్రక్రియ ముందుకు సాగడం లేదు. ఆన్లైన్లో సైట్లు తెరవకపోవడం అనుమానాలకు తావిస్తోంది. అలాగే గత ప్రభుత్వంలో స్థలం మంజూరై ఇంటి నిర్మాణం చేపట్టిన లబ్ధిదారులకు కూటమి ప్రభు త్వం బిల్లులను ఇవ్వడం లేదు. దీంతో నిర్మాణాలు నిలిచిపోతున్నాయి. లబ్ధిదారులు అప్పులతో సతమతమవుతున్నారు. తమకు ఇళ్లను ఇవ్వకపోగా కూటమి ప్రభుత్వం ఉన్న పూరిళ్లను కూలదోస్తుందని పేదలు ఆవేదన చెందుతున్నారు. గత ప్రభుత్వంలో వేలాదిగా ఇళ్లు : గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో జిల్లాలో 73,392 మందికి ఇళ్ల నిర్మాణాల నిమిత్తం రూ.1.80 లక్షల చొప్పున సాయం, డ్వాక్రా రుణం రూ.30 వేల చొప్పున అందజేశారు. 35,778 మంది ఇళ్ల నిర్మాణాలు పూర్తిచేయగా మరో 25 వేల నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. అయితే కూటమి ప్రభుత్వంలో ఈ ఇళ్ల నిర్మాణాలకు బిల్లు లు అంతంతమాత్రంగా జమవుతున్నాయి. శ్లాబ్ పనులు పూర్తి చేసినవారికి రూ.1.80 లక్షలు జమ కావాల్సి ఉండగా బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. సర్వేలతో ఇళ్ల పట్టాలు వెనక్కి కూటమి ప్రభుత్వం జగనన్న కాలనీల్లో సర్వేను వేగవంతం చేసింది. నిర్మాణాలు చేపట్టని పేదల ఇంటి స్థలాలను వెనక్కి తీసుకుంటోంది. కేంద్రం నుంచి ఇళ్ల మంజూరు ఏదీ? కేంద్ర ప్రభుత్వం నుంచి పేదల ఇళ్ల నిర్మాణం కోసం అధిక మొత్తంగా నిధులు తీసుకురావాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా ఆలోచన చేయడం లేదు. 2.0 పథకం ద్వారా ఈ ఏడాది జిల్లాకు 595 ఇళ్లు మంజూరు చేసినా ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు. ఇళ్లను ఆన్లైన్లో మాత్రమే చూపిస్తున్నారని పలువురు అంటున్నారు. పేదల గూడును కూలదోసి.. కూటమి పాలనలో పేదలకు ఇళ్లు నిర్మించుకోకపోగా కాలువ గట్లు, రోడ్డు పక్కన నివసిస్తున్న వారి గుడిసెలను కూలదోస్తున్నారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆక్రమణల తొలగింపు పేరుతో పేదల పూరిళ్లను తొలగిస్తున్నారు. ఇళ్లకు చంద్ర గ్రహణం ఒక్క ఇంటికీ మోక్షం లేదు సెంటు భూమి పంపిణీ చేయలేదు ఇళ్ల నిర్మాణాలకు బిల్లులు లేవు పేదలకు కలగా సొంతింటి నిర్మాణం గత ప్రభుత్వంలో 73 వేల మందికి స్వగృహ ప్రాప్తి కూటమి పాలనలో పేదల కోసం భూసేకరణ చేయలేదు. ఒక్క సెంటు భూమి కొనలేదు. ఒక్క ఇల్లు కట్టలేదు. కాలనీల్లో మౌలిక వసతులు కల్పించలేదు. ఇంటి నిర్మాణాలపై తీవ్ర నిర్లక్ష్యం చూపుతున్నారు. ఇల్లు నిర్మించుకునే వారికి వెంటనే సాయం చేయాలి. రూ.5 లక్షల చొప్పున ఇవ్వాలి. – జేఎన్వీ గోపాలన్, సీపీఎం నేత పేదల ఇళ్ల నిర్మాణానికి కూటమి ప్రభుత్వం ఎలాంటి సహకారం అందించడం లేదు. 15 నెలలు గడిచినా పేదలకు ఇంటి నిర్మాణ బిల్లులు వేయడం లేదు. అప్పులతో ఇళ్లు నిర్మించుకుంటున్నారు. పెండింగ్ బిల్లులు వెంటే క్లియర్ చేయాలి. హామీ మేరకు రూ.4 లక్షల సాయం అందించాలి. – బి.రవివర్మ, పౌరహక్కుల సంఘం అధ్యక్షుడు, ఆకివీడు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో వైఎస్ జగన్ మోహన్రెడ్డి పాలనలో నాకు ఇంటి స్థలం ఇచ్చారు. ఇల్లు నిర్మించుకునేందుకు ఆర్థిక స్థోమత లేక ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూస్తున్నాం. గతంలోనే ఇల్లు మంజూరైంది. ఇంటి నిర్మాణం శ్లాబ్ వరకూ పూర్తయినా బిల్లులు రాలేదు. అప్పు లు చేసి ముందుకు వెళ్లలేకపోతున్నాం. – సోమరాజు లక్ష్మి, లబ్ధిదారురాలు, తాళ్లకోడు, ఆకివీడు మండలం -
పోటెత్తిన వశిష్ట గోదావరి
● లంక గ్రామాల్లోకి నీరు ● ముంపులోనే కనకాయలంక కాజ్వే ● నరసాపురంలో పంటు రాకపోకలు నిలిపివేత పెనుగొండ/యలమంచిలి/నరసాపురం: జిల్లాలో వశిష్ట గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. సిద్ధాంతం వద్ద కేదారీఘాట్, పుష్కర రేవులు వరద నీటిలో మునిగాయి. గురువారం మధ్యస్థ లంకలోకి నీరు ప్రవేశించడంతో కూరగాయలు, ఇతర ఉత్పత్తులను రైతులు పడవలపై గట్టుకు చేరుస్తున్నారు. వరద మరింత పెరిగే పశువులను ఏటిగట్టుపైకి తీసురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. శుక్రవారం ఉదయానికి సిద్ధాంతం, కోడేరు, అయోధ్యలంకల్లో ఉధృతి పెరగవచ్చని అంచనా వేస్తున్నారు. పడవ ప్రయాణాలపై అధికారులు నియంత్రణ విధించారు. వరద భయంతో లంక గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. యలమంచిలిలో స్థిరంగా.. యలమంచిలి: మండలంలో గోదావరి వరద స్థిరంగా ఉంది. మూడో రోజూ కూడా కనకాయలంక కాజ్వే ముంపులోనే ఉంది. దీంతో ఇంజన్ పడవలపై ప్రజలు రాకపోకలు సాగిస్తున్నారు. కాజ్వేపై మూడడుగుల మేర నీరు ప్రవహిస్తోంది. రెండు రోజుల పాటు వరద స్థిరంగా ఉంటుందని అధికారిక సమాచారం. పంటు రాకపోకలు బంద్ నరసాపురంలో వశిష్ట గోదావరి ఉగ్రరూపం దాల్చి ంది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా నీరు రావడంతో స్థానికంగా నదిలో నీటిమట్టం పెరిగింది. దీంతో నరసాపురం–సఖినేటిపల్లి మధ్య పంటు రాకపోకలు నిలిపివేశారు. దీంతో చించినాడ బ్రిడ్జి మీదుగా వెళ్లాల్సి వస్తోంది. అయితే చించినాడ బ్రిడ్జి మరమ్మతులతో పూర్తిస్థాయిలో రాకపోకలు సాగ డం లేదు. నరసాపురంలోని వలంధర్ రేవులో పిండ ప్రదానం షెడ్డు వరకూ నీరు చేరింది. అధికారు లు రేవులో స్నానాలను నిషేధించారు. సమర్థంగా ఎదుర్కొంటాం: జేసీ యలమంచిలి: గోదావరి వరదను సమర్థంగా ఎదుర్కొంటామని జేసీ టి.రాహుల్కుమార్రెడ్డి చెప్పా రు. కనకాయలంక గ్రామంలో ఆయన పర్యటించి లోతట్టు ప్రాంతాలు, మెడికల్ క్యాంపు, అంగన్వాడీ కేంద్రం, రేషన్ షాపులను పరిశీలించారు. ధవళేశ్వరంలో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ అయ్యిందని, జిల్లాలోని పెనుగొండ, ఆచంట, యలమంచిలి, నరసాపురం మండలాల్లోని ఏడెనిమిది లంక గ్రా మాలపై ప్రభావం ఉంటుందన్నారు. కనకాయలంకలో రాకపోకలకు ఆరు బోట్లు నడుపుతున్నామన్నారు. 50 నుంచి 60 లైఫ్ జాకెట్స్ సిద్ధం చేయ మని ఆదేశాలిచ్చామన్నారు. లంక గ్రామాల్లోని మంచం మీద ఉన్న రోగులు, గర్భిణులు, బాలింతలను సురక్షిత ప్రాంతాలకు తరలించామన్నారు. వరద ప్రభావిత గ్రామాల్లోని 34 రేషన్ షాపుల్లో మూడు నెలల రేషన్ సరుకులు నిల్వ ఉంచామన్నారు. వరద ప్రభావిత గ్రామాల్లో స్కూల్ పిల్లలకు సెలవులు ఇస్తున్నట్టు చెప్పారు. నరసాపురం ఆర్డీఓ దాసి రాజు, తహసీల్దార్ గ్రంథి నాగ వెంకట పవన్కుమార్, ఎలక్ట్రికల్ ఈఈ కె.మధుకుమార్, జిల్లా మత్స్యశాఖాధికారి నాగలింగాచార్యులు, ఎఫ్డీఓ ఏడుకొండలు ఉన్నారు. నరసాపురం: రేవులో నిలిచిన పంటు పెనుగొండ: సిద్ధాంతంలో లంక నుంచి వ్యవసాయ ఉత్పత్తులను గట్టుకు చేరుస్తూ.. -
అంగన్వాడీల నిరసన
ఆకివీడు/భీమవరం: అంగన్వాడీ కార్యకర్తలకు కనీస వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ గురువారం స్థానిక వైఎస్సార్ సెంటర్లో మానవహారం చేపట్టారు. సీఐటీయూ నాయకులు బి.రాంబాబు మాట్లాడుతూ పాత ఫోన్లతో తీవ్ర ఇబ్బంది పడుతున్న అంగన్వాడీలకు కొత్త ఫోన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అన్ని సంక్షేమ పథకాలు మంజూరు చేయాలని, కొత్తగా ప్రభుత్వం తీసుకువచ్చిన ఫేస్ యాప్ను రద్దుచేయాలన్నారు. అంగన్వాడీ సంఘ నాయకురాలు కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు. భీమవరంలో.. భీమవరం: అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి స్కేలు జీతం అమలు చేయాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు బి.వాసుదేవరావు డిమాండ్ చేశారు. భీమవరంలో నిరసన ధర్నా చేపట్టారు. సీఐటీయూ కార్యాలయం నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. కనీస వేతనాలు అమలు చేయాలని, పని ఒత్తిడి తగ్గించాలని, ఎఫ్ఆర్ఎస్ రద్దు చేయాలని నినాదాలు చేశారు. అంగన్వాడీ సంఘ నాయకురాలు మహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఏలూరు(ఆర్ఆర్పేట): జిల్లాలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు అంతర్ జిల్లా బదిలీలకు దరఖాస్తు చేసుకోవాలని డీఈఓ ఎం.వెంకటలక్ష్మమ్మ ప్రకటనలో తెలిపారు. ఈనెల 24లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని, ప్రింట్అవుట్లను 25 వరకు స్వీకరిస్తామన్నారు. -
దెందులూరులో చింతమనేని అనుచరుల వీరంగం
సాక్షి, పశ్చిమగోదావరి: దెందులూరులో చింతమనేని అనుచరులు వీరంగం సృష్టించారు. వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి ఇంటి వద్ద చింతమనేని అనుచరులు హల్చల్ చేశారు. కర్రలు, రాడ్లతో బీభత్సం సృష్టించారు. అబ్బయ్య చౌదరి పామాయిల్ తోటలోకి టీడీపీ నేతలు చొరబడ్డారు. వారిని వైఎస్సార్సీపీ నేతలు అడ్డుకున్నారు. టీడీపీ నేతలు రౌడీయిజం చేస్తున్నారని వైఎస్సార్సీపీ శ్రేణులు ఆందోళనకు దిగారు. -
దళితుల జోలికొస్తే సహించేది లేదు
వైభవంగా పవిత్రారోహణ ఐఎస్ జగన్నాధపురంలోని సుందరగిరిపై కొలువైన లక్ష్మీనరసింహ స్వామి దివ్య పవిత్రోత్సవాల్లో బుధవారం పవిత్రారోహణ వేడుక కన్నులపండువగా జరిగింది. 8లో uఉండి: వాండ్రం దళితపేట డ్రెయిన్కు ఆనుకుని ఉన్న ఇళ్లు పడగొట్టాలంటూ స్థానికంగా వున్న కొందరు ఓ భారీ పొక్లెయినర్ను తీసుకురావడంతో ఒక్కసారిగా దళితులు భగ్గుమన్నారు. గ్రామంలోని దళితులు బుధవారం రోడ్డెక్కారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొందరు రైతుల ముసుగులో అధికారులను అడ్డుపెట్టుకుని కూటమి నాయకుల సహకారంతో మా ఇళ్ళను పడగొట్టేందుకు కక్ష కట్టారని ఆరోపించారు. గ్రామంలో అధికారులు చెబుతున్న డ్రెయిన్ ప్రభుత్వ లెక్కల్లో లేదన్నారు. కొందరు వ్యక్తుల కోసం డ్రెయిన్ను అడ్డుపెట్టుకుని అక్కడ రోడ్డు వేయాలని చూస్తున్నారన్నారు. కొందరు స్థానిక ఎమ్మెల్యేకు తప్పుడు సమాచారం ఇచ్చి కక్షసాధింపు చర్యలకు దిగుతున్నారని ఆరోపించారు. ఇక నుంచి ప్రతీరోజు ప్రత్యేక కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. వాండ్రం గ్రామంలో దళితులకు చెందిన ఇళ్ళు కూల్చేస్తామని కొందరు అధికారులను కూడా మోసం చేస్తున్నారని దళిత మహిళలు కన్నీరుమున్నీరయ్యారు. రూపాయి రూపాయి కూడగట్టుకుని కట్టుకున్న మా ఇళ్లను మా ప్రాణాలు ఇచ్చయినా కాపాడుకుంటామన్నారు. కార్యక్రమంలో ఏఐసీసీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ మత్తి రాజ్కుమార్, మాజీ సర్పంచ్ యాడంగి యేసు, కోనాల రాజేంద్ర తదితరులు పాల్గొన్నారు. -
పకడ్బందీగా వినాయక చవితి ఉత్సవాలు
భీమవరం (ప్రకాశంచౌక్): వినాయక చవితి ఉత్సవాల్లో పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టర్ ఆఫ్ పారిస్తో తయారు చేసిన విగ్రహాలను నిషేధించాలని, అధికారులు, ప్రజా ప్రతినిధుల సహకారంతో సమన్వయంతో ప్రశాంతంగా నిర్వహించాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. బుధవారం కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరంలో వినాయక చవిత ఉత్సావాలు, నిమజ్జన కార్యక్రమాల నిర్వహణపై కలెక్టర్, ఎస్పీ అద్నాన్ నయీం అస్మి, జేసీ టి.రాహుల్ కుమార్ రెడ్డి, అన్ని శాఖల జిల్లా అధికారులు, తదితరులతో కలిసి సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నిమజ్జనంలో ఎలాంటి అపశృతులు జరగకుండా జాగ్రత్తగా నిర్వహించాలని అన్నారు. ఎస్పీ అద్నాన్ నయీం అస్మి మాట్లాడుతూ సింగిల్ విండో విధానంలో ఫైర్, విద్యుత్, పోలీస్, మున్సిపల్ తదితర అధికారులు ఒకే వేదికలో కూర్చునేలా ఏర్పాటుకు పర్మిషన్లు త్వరితగతిన ఇచ్చేలా చూడాలన్నారు. విగ్రహాల ఏర్పాటుకు రెండు మూడు రోజుల ముందే అనుమతులు ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. జేసీ టి.రాహుల్ కుమార్ రెడ్డి, డీఆర్ఓ మొగిలి వెంకటేశ్వర్లు, ఆర్డీవోలు కె.ప్రవీణ్ కుమార్ రెడ్డి, దాసిరాజు, కౌసర్ భానో పాల్గొన్నారు. -
టీడీపీలో ‘నామినేటెడ్’ ముసలం
సాక్షి, భీమవరం: భీమవరంలో టీడీపీలో నామినేటెడ్ ముసలం రాజుకుంది. నామినేటెడ్ పదవుల్లో ఒక సామాజిక వర్గానికి కొమ్ముకాస్తూ టీడీపీ పొలిట్బ్యూరో సభ్యురాలు, నియోజకవర్గ ఇన్చార్జి తోట సీతారామలక్ష్మి తమను అణగదొక్కే ప్రయత్నాలు చేస్తున్నారని నియోజకవర్గంలోని ఆ పార్టీకి చెందిన గౌడ, శెట్టిబలిజ సంఘం నేతలు మండిపడుతున్నారు. తమ పట్ల వివక్ష చూపుతున్న నాయకత్వంపై తాడోపేడో తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందని, అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లనున్నట్టు తెలిపారు. టీడీపీ భీమవరం నియోజకవర్గ గౌడ, శెట్టిబలిజ సంఘ సమావేశం బుధవారం స్థానిక సర్ధార్ గౌతు లచ్చన్న కమ్యూనిటీ హాలులో జరిగింది. టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి వీరవల్లి చంద్రశేఖర్, రాష్ట్ర శెట్టిబలిజ సాధికారిక కమిటీ డైరెక్టర్ బొక్కా సూర్యనారాయణ, గౌడ సాధికారిక డైరెక్టర్ జంపన ధనరాజు, జిల్లా సాధికారిక కమిటీ కార్యదర్శి వీరమల్లు శ్రీనివాస్, టీడీపీ సీనియర్ నేత కడలి మృత్యుంజయుడు తదితరులు మాట్లాడారు. బీసీల్లో అత్యధిక జనాభాగా ఉన్నా గౌడ, శెట్టిబలిజ సామాజిక వర్గాలకు దేవస్థానం బోర్డు, సొసైటీలు, నీటిసంఘాలు, వ్యవసాయ మార్కెట్ కమిటీ నామినేటెడ్ నియామకాల్లో ఎక్కడా ప్రాధాన్యత కల్పించకుండా తీవ్ర అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పేరుకు బీసీల పార్టీకి చెబుతూ పదవులు మాత్రం ఇతర సామాజిక వర్గాల వారికి పంచుతున్నారని మండిపడ్డారు. ఈ విషయమై ఇప్పటికే పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి సీతారామలక్ష్మి వద్ద తమ అసంతృప్తిని వెళ్లగక్కినా ఫలితం లేదన్నారు. కూటమి పేరు చెప్పి తమను బుజ్జిగిస్తున్నారు తప్ప న్యాయం చేయడం లేదన్నారు. బిస్కెట్ పడేస్తే సరిపోతుందన్న ధోరణీలో స్థానిక నాయకత్వం తీరుందని వారు మండిపడ్డారు. పార్టీ కోసం శ్రమిస్తే తమ పట్ల వివక్ష చూపుతూ గుర్తింపులేకుండా చేస్తున్నారన్నారు. తమ సామాజికవర్గాల పట్ల చిన్నచూపు చూస్తున్న నాయకత్వంపై తాడోపేడో తేల్చుకునే సమయం ఆసన్నమైందని, సమస్యను అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లనున్నట్టు తెలిపారు. మరోమారు సమావేశం ఏర్పాటుచేసుకుని భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తామన్నారు. భీమవరంలో గౌడ, శెట్టిబలిజ నేతల అసంతృప్తి దేవస్థానం, సొసైటీ, ఏఎంసీ, నీటి సంఘాల్లో ప్రాధాన్యత ఇవ్వలేదని ఆగ్రహం -
గోదావరి ఉగ్రరూపం
పోలవరం రూరల్/వేలేరుపాడు/కుక్కునూరు: గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఇంద్రావతి, ప్రాణహితలు పొంగి ప్రవహిస్తుండటం, దీనికి శబరి తోడు కావడంతో గోదావరి నీటిమట్టం పెరుగుతోంది. భద్రాచలం వద్ద బుధవారం రాత్రి 10 గంటలకు నీటి మట్టం 47 అడుగులు చేరడంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఇప్పటికే వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లో అనేక గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. పలుచోట్ల బాధితులను పడవలపై పునరావాస కేంద్రాలకు తరలించారు. పోలవరం వద్ద 32.20 మీటర్లకు నీటి మట్టం గోదావరి వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. పోలవరం ప్రాజెక్టు స్పిల్వే వద్ద 32.20 మీటర్లకు నీటిమట్టం చేరుకుంది. స్పిల్వే నుంచి సుమారు 10 లక్షలకు క్యూసెక్కులకు పైగా వరద నీరు దిగువకు చేరుతోంది. నీట మునిగిన వంతెనలు : వరద ప్రభావం వల్ల వేలేరుపాడు మండలంలో మేళ్ల వాగు, ఎద్దెల వాగు, టేకురు వాగు, పెద్దవాగు, వంతెనలు నీట మునిగాయి. దీంతో మండలంలో 26 గ్రామాలకు రాకపోకల స్తంభించాయి. వేలేరుపాడు నుంచి రుద్రమకోట, రేపాక గొమ్ము, కన్నాయగుట్ట, తిర్లాపురం, పాత నార్లవరం వెళ్లే రహదారులు నీట మునిగాయి. అధికారులు మొత్తం మూడు నాటు పడవలు, రెండు లాంచీలు ఏర్పాటు చేశారు. ఎద్దుల వాగు వద్ద నాటు పడవపై ప్రజలు దాటుతున్నారు. ఇంతవరకు 393 కుటుంబాలను కుక్కునూరు మండలంలోని రాయకుంట పునరావాస కాలనీ, తాడువాయిలోని చల్లవారిగూడెం కాలనీలకు తరలించారు వరద ప్రాంతాల్లో ఎస్పీ పర్యటన : వేలేరుపాడు మండలంలో ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ గోదావరి వరద ప్రభావిత ప్రాంతాలైన రేపాక గొమ్ము గ్రామంలో పర్యటించారు. గ్రామస్తులు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని కోరారు. పశువులను ముందస్తుగా గ్రామం నుంచి తరలించుకోవాలని తెలిపారు. అనంతరం వేలేరుపాడు రుద్రంకోట గ్రామాల మధ్య ఉన్న బ్రిడ్జి వద్ద పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. నీట మునిగిన రహదారి : వరద ఉధృతితో కుక్కునూరు గ్రామ శివారులోని జామాయిల్ తోటలు నీటమునిగాయి. వింజరం పంచాయతీలోని ఎర్రబోరు–ముత్యాలంపాడు గ్రామాల మధ్య రహదారి వరద నీటితో నిండిపోయింది. దీంతో ఆ రెండు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ల ఏర్పాటు దెందులూరు: కొల్లేరులో ఏలూరు రూరల్ మండలం కోమటిలంక గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి. కోమటిలంకలో 1500 మంది నివసిస్తున్నారు. బయటినుంచి కోమటిలంక గ్రామానికి వెళ్లే కల్వర్టు వరద నీటికి మునగిపోయింది. పడవలోనే విద్యార్థులు, ఉద్యోగులు నిత్యవసరాలకు వెళ్లేవారు ప్రయాణిస్తున్నారు. జిల్లా కేంద్రమైన ఏలూరుకు కూతవేటు దూరంలో ఉన్న కోమటిలంకను ఇప్పటికీ ఒక్క అధికారి తొంగి చూడలేదు. ఏలూరు(మెట్రో): జిల్లాలో వరద పరిస్థితిని బుధవారం కలెక్టరేట్లో అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్టాడుతూ.. వరద ఉధృతిపై ఎప్పటికప్పుడు అధికార యంత్రాంగంతో టెలీ కాన్ఫరెన్న్స్ నిర్వహిస్తున్నామన్నారు. జాయింట్ కలెక్టర్ కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షిస్తున్నారన్నారు. కలెక్టరేట్తో పాటు వేలేరుపాడులో 83286 96546, కుక్కునూరు 80962 74662 నెంబర్లతో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేశామన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు అందించేందుకు మూడు నెలల రేషన్ను ఉంచామన్నారు. 25 కేజీల బియ్యం, కేజీ కందిపప్పు, లీటరు పామాయిల్, కేజీ పంచదారతో పాటు ఉల్లిపాయలు, బంగాళాదుంపలు బాధిత కుటుంబాలకు అందించేందుకు అందుబాటులో ఉంచామన్నారు. వేలేరుపాడు మండలంలో 26 గ్రామాలకు రాకపోకలు బంద్ పునరావాస శిబిరాలకు వరద బాధితులు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన కలెక్టర్, ఎస్పీ భద్రాచలం వద్ద 53 అడుగులకు నీటిమట్టం చేరవచ్చని అంచనా అప్రమత్తమైన యంత్రాంగం.. కంట్రోల్రూమ్ల ఏర్పాటు పోలవరం స్పిల్వే నుంచి 10 లక్షల క్యూసెక్కులు విడుదల ముంపు ప్రాంతాల ప్రజలు అధికారులతో సహకరించి వరద సహాయ కేంద్రాలకు తరలి రావాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి విజ్ఞప్తి చేశారు. కలెక్టర్ అధికారులతో కలిసి బుధవారం ముంపు గ్రామాలైన కట్కూరు, ఎరత్రోలు, బోళ్లపల్లి,, చిత్తంరెడ్దిపాలెం తదితర గ్రామాలలో పర్యటించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. యడపల్లి గ్రామస్తులను పునరావాస కేంద్రాలకు తీసుకొచ్చేందుకు బోట్లను పంపించారు. కలెక్టర్ మాట్లాడుతూ పెద్దవాగు, ఎద్దువాగుల నుంచి కుక్కునూరు, వేలేరుపాడు మండలాలకు వరద ముంపు పొంచి ఉన్నందున, ఆయా ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసి సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. వరద ముంపు ప్రభావిత ప్రాంతాల ప్రజలకు టార్పాలిన్లు అందించామన్నారు. జిల్లాకు ఇప్పటికే 2 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకున్నాయని చెప్పారు. ముంపు ప్రాంతాల్లోని గర్భణులు, పిల్లలు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, వృద్ధులు, విభిన్న ప్రతిభావంతులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, ప్రసవానికి సిద్ధంగా ఉన్న గర్భిణులను దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాలన్నారు. వరద సహాయక చర్యలపై కలెక్టరేట్లో 1800 233 1077, 94910 41419 ఫోన్ నెంబర్లతో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేశామని, జంగారెడ్డిగూడెం, నూజివీడు డివిజన్లో, కుక్కునూరు, వేలేరుపాడులలో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేశామన్నారు. రవాణా సౌకర్యాలకు ఎలాంటి ఆటంకం కలగకుండా కూలిన చెట్లను తొలగించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. వేలేరుపాడు తహసీల్దార్ కార్యాలయంలో అధికారులతో సమావేశమై వరద పరిస్థితిని కలెక్టర్ సమీక్షించారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ రమణ, డీఆర్డిఏ పీడీ ఆర్.విజయరాజు తదితరులు ఉన్నారు. -
పంట కాలువ ప్రక్షాళన
ఉండి: ఈ నెల 19వ తేదీన సాక్షి దినపత్రికలో ప్రచురితమైన ఇదేనా పంటకాలువల ప్రక్షాళన అనే కథనానికి అధికారులు స్పందించారు. బుధవారం ఉండి పాములపర్రు పంటకాలువలో చెత్త, తూడును తొలగించి కాలువను ప్రక్షాళన చేశారు. దీంతో పాములపర్రు గ్రామ ప్రజలు, రైతులు హర్షం వ్యక్తం చేశారు. భీమవరం: జిల్లాలో గీత కార్మికులకు కేటాయించాల్సిన బార్లను ప్రకటించామని జిల్లా ఎకై ్సజ్ అధికారి నాగ ప్రభుకుమార్ తెలిపారు. భీమవరం, తాడేపల్లిగూడెం మున్సిపాలిటీల్లో శెట్టిబలిజ సామాజిక వర్గానికి, పాలకొల్లులో గౌడ సామాజిక వర్గానికి కేటాయించామని చెప్పారు. భీమవరం (ప్రకాశంచౌక్): గత సార్వత్రిక ఎన్నికల్లో ఎక్కువ సమయం ఓటింగ్ కొనసాగిన పోలింగ్ స్టేషన్లను గుర్తించి, అవసరమైన చోట అదనపు పోలింగ్ స్టేషన్ల ఏర్పాటుకు ప్రతిపాదనలను సిద్ధం చేయాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. బుధవారం కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమై ఓటర్ల జాబితా సవరణ, అదనపు పోలింగ్ స్టేషన్ల గుర్తింపు తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గత సంవత్సరం నిర్వహించిన సార్వత్రిక ఎన్నికల్లో కొన్ని పోలింగ్ స్టేషన్లలో ఎక్కువ సమయం పోలింగ్ నిర్వహించాల్సి వచ్చిందని, ఇలాంటి విషయాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. పోలింగ్ ఎక్కువ సమయం జరిగిన పోలింగ్ స్టేషన్లను గుర్తించి, ఎక్కువ సమయం పట్టడానికి గల కారణాలను విశ్లేషించడంతోపాటు, అవసరమైన చోట అదనపు పోలింగ్ స్టేషన్ల ఏర్పాటుకు ప్రతిపాదనలను సిద్ధం చేయాలని సూచించారు. సమావేశంలో డీఆర్ఓ మొగిలి వెంకటేశ్వర్లు, ఇన్చార్జి ఎలక్షన్ సూపరింటెండెంట్ మర్రాపు సన్యాసిరావు తదితరులు పాల్గొన్నారు. ఉండి: శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఎన్నార్పీ అగ్రహారంలోని ప్రభుత్వ ఐటీఐలో విద్యుత్ వినియోగదారుల సమస్యకు పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు సీజీఆర్ఎఫ్ చైర్మన్ బొక్కా సత్యనారాయణ పత్రికా ప్రకటన విడుదల చేశారు. విద్యుత్ వినియోగదారులు తమ సమస్యలను తెలియజేయవచ్చని ఏఈ తెలిపారు. యలమంచిలి: వరుసగా రెండో రోజు కూడా కనకాయలంక కాజ్వే వరద నీటిలో మునిగింది. ధవళేశ్వరం వద్ద బుధవారం సాయంత్రం 8.08 లక్షల క్యూసెక్కుల నీటిని కిందకు వదలడంతో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుంది. వరద ప్రభావానికి గురైన కనకాయలంకలో తహసీల్దార్ నాగ వెంకట పవన్కుమార్, ఇతర అధికారులు పర్యటించారు. తహసీల్దార్ మాట్లాడుతూ భద్రాచలం వద్ద నీటిమట్టం గురువారం 48 అడుగులకు చేరుకునే అవకాశం ఉందన్నారు. వరద పెరిగితే కనకాయలంక కాజ్వేతోపాటు పెదలంక కాజ్వే కూడా వరద నీటిలో చిక్కుకునే అవకాశం ఉందన్నారు. వరద పెరిగే అవకాశం ఉందన్న సమాచారం నేపథ్యంలో లంక గ్రామాలలో ప్రత్యేక అధికారులను నియమించి వారి పర్యవేక్షణలో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చర్యలు తీసుకున్నామన్నారు. గర్భిణులు, బాలింతలు, మంచంపై చికిత్స పొందుతున్న రోగులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు తీసుకున్నారన్నారు. ఏలూరు (టూటౌన్): కృష్ణ జిల్లా మచిలీపట్నంలోని ఆంధ్రప్రదేశ్ మైనార్టీస్ బాలుర రెసిడెన్షియల్ పాఠశాలలో 5వ తరగతి నుంచి 8వ తరగతి వరకు అడ్మిషన్లకు దరఖాస్తు చేసుకోవచ్చని జిల్లా మైనారిటీల సంక్షేమ శాఖాధికారి ఎస్.ఎస్.కృపావరం ఒక ప్రకటనలో తెలిపారు. -
కలెక్టరేట్ తరలింపు?
డిగ్రీ ప్రవేశాలకు నోటిఫికేషన్ డిగ్రీ ప్రవేశాల విషయంలో తాత్సారం చేసి వారి భవిష్యత్ను ప్రశ్నార్థకం చేసిన కూటమి ప్రభుత్వం ఎట్టకేలకు డిగ్రీ ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ చేసింది. 8లో uగురువారం శ్రీ 21 శ్రీ ఆగస్టు శ్రీ 2025సాక్షి, భీమవరం: జిల్లా కేంద్రం నుంచి కలెక్టరేట్ తరలిపోనుందా? పీ–4 పేరిట ఉండి నియోజకవర్గంలో ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయా? భీమవరానికి తలమానికంగా ఉన్న కలెక్టరేట్ను తరలించుకుపోతుంటే పట్టణానికి చెందిన కేంద్ర సహాయ మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేలు చూస్తూ ఊరుకుంటారా? ఈ విషయంలో వారి వైఖరి ఏ విధంగా ఉండబోతుంది? జిల్లాలోని రాజకీయ, సామాన్య వర్గాల్లో ఇప్పుడిదే హాట్ టాపిక్. పరిపాలన సౌలభ్యం, ప్రజలకు మెరుగైన సేవలందించే లక్ష్యంతో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం జిల్లాల పునర్విభజన చేసింది. నరసాపురం పార్లమెంట్లోని ఏడు నియోజకవర్గాలతో భీమవరం కేంద్రంగా 2022 ఏప్రిల్ 4న నూతన పశ్చిమ గోదావరి జిల్లా ఏర్పడింది. కలెక్టరేట్ను తాత్కాలికంగా స్థానిక 7వ వార్డులోని ప్రైవేట్ కళాశాల భవనంలో ఏర్పాటుచేశారు. అన్ని శాఖల జిల్లా అధికారులు ఒకే చోట ప్రజలకు అందుబాటులో ఉండేలా శాశ్వత ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ నిర్మాణానికి ప్రభుత్వం నిర్ణయించింది. అందుకోసం భీమవరంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) యార్డులో 20 ఎకరాల స్థలాన్ని ఎంపిక చేసింది. ఈ భూమిని మార్కెటింగ్ శాఖ నుంచి రెవెన్యూ శాఖకు భూమిని బదలాయిస్తూ 2023 మార్చి 20న జీవోను జారీచేశారు. ఈ మేరకు రెవెన్యూ రికార్డులు, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో మార్పులు చేసి రూ.80 కోట్లతో ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ భవన నిర్మాణానికి టెండర్ల ప్రక్రియను పూర్తి చేశారు. మళ్లీ తెరపైకి.. తాజాగా మళ్లీ కలెక్టరేట్ను తరలించుకుపోయేందుకు ప్రయత్నాలు ముమ్మరమైనట్టు రాజకీయ వర్గాలు, సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. పీ–4 పేరిట ఉండి నియోజకవర్గంలో కలెక్టరేట్ నిర్మాణానికి అనుమతులివ్వాలని కూటమి నేత ఒకరు సీఎం చంద్రబాబును కలిసినట్టుగా విస్తృత ప్రచారం జరుగుతోంది. ఈ విషయమై భీమవరానికి చెందిన కేంద్ర సహాయమంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, రాజ్యసభ సభ్యుడు పాకా సత్యనారాయణ, ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ఇంకా స్పందించిన దాఖలాలు లేవు. ఈ విషయంలో వారి స్టాండ్ ఏమిటన్న చర్చ నడుస్తోంది. భీమవరంలోని ఏఎంసీ స్థలం అందరికీ అందుబాటులో ఉంటుందని, ప్రజామోదం లేకుండా కలెక్టరేట్ తరలిస్తే ఉద్యమిస్తామని సీపీఎం నేతలు ప్రకటించారు. నూతన భవనం ఎక్కడ నిర్మించేది ప్రజాప్రతినిధులు, అధికారులు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. కొందరి ప్రయోజనాల కోసం కలెక్టరేట్ తరలింపు సరికాదంటున్నారు. భీమవరంలో శాశ్వత భవన నిర్మాణం జరిగితే గత ప్రభుత్వానికి పేరొస్తుందనే రాజకీయ కక్షతో కూటమి నేతలు కుట్ర రాజకీయాలకు తెరలేపారన్న విమర్శలున్నాయి. ఏఎంసీలో ఇంటిగ్రేటెడ్ భవన నిర్మాణానికి గత ప్రభుత్వం విడుదల చేసిన జీవోను ఆరు నెలల క్రితమే కూటమి ప్రభుత్వం రద్దుచేస్తూ ఉత్తర్వులిచ్చింది. భవన నిర్మాణం కోసం ఉండి నియోజకవర్గం పెదఅమిరంలోని 3.5 ఎకరాల స్థలాన్ని ఉన్నతాధికారులు పరిశీలన చేశారు. జిల్లా కేంద్రం మార్పుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అప్పట్లో సోషల్ మీడియాలో దుమారమే రేగింది. కలెక్టరేట్ తరలింపు ప్రయత్నాలను అడ్డుకుంటామని వైఎస్సార్సీపీ, ఇతర రాజకీయ పక్షాలు స్పందించాయి. పీ–4 పేరిట ఉండిలో ఏర్పాటుకు యత్నాలు జిల్లా కేంద్రం నుంచి తరలిపోతుందని జోరుగా ప్రచారం కలెక్టరేట్ భవనానికి భీమవరం ఏఎంసీలో స్థలాన్ని కేటాయించిన గత ప్రభుత్వం రూ.80 కోట్లతో ఇంటిగ్రేటెడ్ భవన నిర్మాణానికి అప్పట్లోనే టెండర్లు గత ప్రభుత్వానికి పేరొస్తుందని కూటమి నేతల కుట్రలు పెదఅమిరంలో ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నట్టు ప్రచారం ఉంది. ఈ పంచాయతీకి జువ్వలపాలెం రోడ్డు మీదుగా వెళ్లాలి. ఈ రోడ్డులో ట్రాఫిక్ రద్దీ తీవ్రంగా ఉంటుంది. సాధారణ రోజుల్లోనే డా.బీఆర్ అంబేడ్కర్ సెంటర్ నుంచి ఎస్ఆర్కేఆర్ కళాశాల వరకు 3.5 కి.మీ ప్రయాణానికి దాదాపు 20 నిమిషాల సమయం పడుతుంది. కలెక్టరేట్తో వాహనాల రద్దీ మరింత పెరిగి సమస్య అధికమవుతుందంటున్నారు. భీమవరంలోని ఏఎంసీకి పాల కొల్లు, ఆచంట, నరసాపురం, ఉండి, తాడేపల్లిగూడెం, తణుకు నియోజకవర్గాల నుంచి రోడ్డు సదుపాయం ఉంది. ఆయా నియోజకవర్గాల వారు భీమవరం పట్టణంలోకి రావాల్సిన పనిలేకుండా నేరుగా కలెక్టరేట్కు చేరుకునే వీలుంటుంది. దీనివలన పట్టణంలో ట్రాఫిక్ ఇబ్బందులు కొంత మేర తగ్గుతాయని స్థానికులు అంటున్నారు. -
కో–ఆపరేటివ్ బ్యాంకుల సేవలు విస్తృతం చేయాలి
తణుకు అర్బన్: కార్పొరేట్ బ్యాంకులకు ధీటుగా కోఆపరేటివ్ బ్యాంకుల సేవలు మరింత విస్తృతం చేయాలని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ కోరారు. ఏలూరు కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు తణుకు శాఖను బుధవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. కోఆపరేటివ్ బ్యాంకులు మెరుగైన సేవలు అందిస్తున్నాయని, పేద, మధ్య తరగతి ప్రజలకు తక్కువ వడ్డీతో రుణాలు అందించేందుకు సహకరించాలని కోరారు. ఏలూరు కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు చైర్మన్ అంబికా ప్రసాద్ మాట్లాడుతూ బ్రాంచి ప్రారంభోత్సవం పురస్కరించుకుని మూడురోజులపాటు అన్ని డిపాజిట్లపైనా ప్రత్యేక అదనపు వడ్డీ ఆఫర్ ఇవ్వనున్నట్లు చెప్పారు. ముక్కామల మహా పీఠాధిపతులు శ్రీధర్ స్వామీజీ, ఏలూరు మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణ, డీసీసీబీ మాజీ చైర్మన్ ఆకుల బాబు, వాణి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు చైర్మన్ మంత్రిరావు వెంకటరత్నం, రాజమండ్రి ఇన్నీసుపేట కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు చైర్మన్ కోళ్ల అచ్యుత రామారావు, కొవ్వూరు కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు చైర్మన్ మద్దిపట్ల శివరామకృష్ణ, సీఈవో ఎం.అచ్యుతరావు పాల్గొన్నారు. ఏలూరు టౌన్: ఉపాధ్యాయ నియామక ప్రక్రియ ప్రారంభం మొదలుకానున్న తరుణంలో డీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులను ఉద్యోగాల పేరుతో మోసం చేసేందుకు ఎవరైనా ప్రయత్నిస్తే కఠిన చర్యలు తప్పవని ఏలూరు డీఎస్పీ డీ.శ్రావణ్కుమార్ హెచ్చరించారు. ప్రభుత్వం చేపట్టిన ఉపాధ్యాయ నియామక పరీక్షల ఫలితాలు విడుదల కావటంతో అభ్యర్థులను టార్గెట్ చేస్తూ సైబర్ నేరగాళ్లు, ఇతర మోసగాళ్లు రంగంలోకి దిగారనీ, వారి మాయమాటలను ఎవరూ నమ్మి మోసపోవద్దని డీఎస్పీ కోరారు. కొందరు నేరగాళ్లు అభ్యర్థులకు ఫోన్ చేసి మార్కుల్లో మార్పులు చేసి మీకు ఉద్యోగాలు వచ్చేలా చేస్తామంటూ నమ్మించి, భారీగా డబ్బులు డిమాండ్ చేస్తున్నారనే ప్రచారం సాగుతుందనీ., ఈ నేపథ్యంలో డీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు అటువంటి వారి మాటలను నమ్మవద్దని తెలిపారు. ప్రభుత్వ ఉపాధ్యాయ నియామక ఎంపికలో ఎలాంటి ప్రలోభాలకు తావులేకుండా కేవలం ప్రతిభ ఆధారంగానే ఉద్యోగాలు కల్పిస్తారని స్పష్టం చేశారు. ఎవరైనా ఫోన్ చేస్తే వెంటనే డయల్ 112కు సమాచారం ఇవ్వాలని కోరారు. అభ్యర్థులు మోసపోకుండా జాగ్రత్తలు పాటించాలని ఏలూరు డీఎస్పీ శ్రావణ్కుమార్ తెలిపారు. -
సుందరగిరిలో వైభవంగా పవిత్రారోహణ
ద్వారకాతిరుమల: శ్రీవారి ఆలయానికి దత్తత దేవాలయమైన ఐఎస్ జగన్నాధపురంలోని సుందరగిరిపై కొలువైన శ్రీ కనకవల్లి సమేత లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయంలో దివ్య పవిత్రోత్సవాలు అట్టహాసంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో రెండవరోజు బుధవారం పవిత్రారోహణ వేడుక కన్నులపండువగా జరిగింది. ముందుగా అర్చకులు, పండితులు ఆలయ యాగశాలలో ఉదయం మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్ఛరణల నడుమ మండప పూజలు, నిత్య హోమాలు, బలిహరణ, మూలవరులకు, ఉత్సవ మూర్తులకు అభిషేకాలు, అలంకరణలు జరిపారు. ఆ తరువాత స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను బంగారు శేష వాహనంపై ఉంచి పూజలు నిర్వహించి అనంతరం దివ్య పవిత్రాలతో ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. ఆ తరువాత స్వామివారి మూలవిరాట్, ఉత్సవ మూర్తులపై దివ్య పవిత్రాలను వేసి పవిత్రారోహణ వేడుకను కన్నులపండువగా నిర్వహించారు. సాయంత్రం మండప పూజలు, నిత్య హోమములు, మూలమంత్ర హోమములు, బలిహరణ, నీరాజన మంత్రపుష్పాలు నిర్వహించారు. హైదరాబాద్కు చెందిన కొచ్చర్లకోట సత్యవెంకట లక్ష్మీనరసింహ గురూజీ సూచనలు, ఆలయ ఈఓ ఎన్వీ సత్యన్నారాయణ మూర్తి పర్యవేక్షణలో ఈ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. గురువారం జరిగే పవిత్రావరోహణతో ఉత్సవాలు పరిసమాప్తం కానున్నాయి. స్వామివారి మూలవిరాట్పై పవిత్రాలను ఉంచి హారతులిస్తున్న అర్చకుడు బంగారు శేష వాహనంపై స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు పూజలు నిర్వహిస్తున్న పండితులు -
పని భారంతో అవస్థలు
భీమవరం (ప్రకాశం చౌక్) : జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో పారిశుద్ధ్య కార్మికుల కొరత వేధిస్తోంది. దీంతో పనిచేస్తున్న కార్మికులపై పని భారం పెరిగి అవస్థలు పడుతున్నారు. 8 గంటలు చేయాల్సిన డ్యూటీని 12 నుంచి 15 గంటలపాటు చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక పక్క సక్రమంగా అందని జీతాలు, మరో పక్క పనిభారం, అధికారుల వేధింపులతో పారిశుద్ద్య కార్మికులు విసుగెత్తిపోతున్నారు. సగం మంది సిబ్బందితోనే కాలక్షేపం జిల్లాలో భీమవరం, పాలకొల్లు, తాడేపల్లిగూడెం, నర్సాపురం 100 పడకల ఆస్పత్రుల స్థాయిలో వైద్య సేవలు అందిస్తున్నాయి. ఆయా ఆసుపత్రుల్లో 20 మంది పారిశుద్ధ్య సిబ్బందికిగాను కేవలం 10 మంది మాత్రమే విధులు నిర్వహిస్తున్న పరిస్థితి. అలాగే జిల్లా ఆస్పత్రి తణుకులో 40 మంది కార్మికులకుగాను కేవలం 20 మంది కార్మికులతో నెట్టుకొచ్చేస్తున్నారు. అలాగే సీహెచ్సీలుగా ఉన్న పెనుగొడం, ఆచంట, ఆకివీడు ఆస్పత్రుల్లో 10 మంది చొప్పున సిబ్బందికిగాను కేవలం ఒకొక్క ఆస్పత్రిలో ఆరుగురితో పనిచేయిస్తున్నారు. రోగుల సంఖ్య పెరుగుతున్నా పారిశుద్ధ్య కార్మికుల సంఖ్య పెంచకపోవడంతో వారు పనిభారంతో ఘొల్లుమంటున్నారు. ఫినాయిల్, చెత్త కవర్లూ కొరతే జిల్లాలోని కొన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఫినాయిల్,, చెత్త వేసుకునే కవర్లు ఇతర మెటిరియల్ కోరత ఉంది. 100 పడకల స్థాయిలో ఉన్న ఆస్పత్రికి సైతం కేవలం 50 పడకల ఆస్పత్రికి సరిపోయే మెటీరియల్ను మాత్రమే సరఫరా చేస్తున్నారు. దాంతో ఆస్పత్రులు శుభ్రంగా ఉండడం లేదు. భీమవరం ప్రభుత్వ ఆస్పత్రిల్లో పారిశుద్ద్య కార్మికులు కొన్నిసార్లు తమ సొంత ఖర్చుతో ఫినాయిల్ కొనుగోలు చేసి ఆస్పత్రిని శుభ్రం చేస్తున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.పనిభారం పెరిగినా కష్టపడి పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు కాంట్రాక్టర్ సక్రమంగా జీతాలు చెల్లించడం లేదు. నాలుగు నెలలకు ఒకసారి జీతాలు ఇవ్వడం, ఒక నెల పెండింగ్ పెట్టడంతో బతుకు బండి నడిపేందుకు కార్మికులు అప్పులు చేయాల్సిన పరిస్థితి తలెత్తతోంది. ఇక జీతాల నుంచి పీఎఫ్ మినహాయింపు సైతం చేయడం లేదు. తమ కుటుంబాల కోసం ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా పనిచేస్తున్న తమపై అధికారులు చిన్నచూపు చూస్తున్నారని పారిశుద్ధ్య కార్మికులు వాపోతున్నారు. ఇప్పటికై న కూటమి ప్రభుత్వం స్పందించి ప్రభుత్వ ఆస్పత్రుల్లో పారిశుద్ధ్య కార్మికుల సంఖ్య పెంచి తమకు పని భారం తగ్గించాలని, అలాగే తమ ఉద్యోగాలను రెగ్యులర్ చేయాలని, పీఎఫ్ సమస్య పరిష్కరించాలని పారిశుద్ధ్య కార్మికులు కోరుతున్నారు. -
మాజీ మంత్రి వనిత కుటుంబంలో విషాదం
పాలకొల్లు సెంట్రల్: రాష్ట్ర వైఎస్సార్ సీపీ నాయకురాలు, మాజీ మంత్రి తానేటి వనిత మావయ్య తానేటి బాబూరావు (80) మంగళవారం అనారోగ్యంతో మృతి చెందారు. బుధవారం ఆయన భౌతికకాయాన్ని స్వగ్రామం పాలకొల్లు తీసుకువచ్చారు. కొంతకాలంగా ఆయన కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు. ఆయన పెద్ద కుమారుడు డాక్టర్ టి.శ్రీనివాస్కు చెందిన తాడేపల్లిగూడెం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. బుధవారం పాలకొల్లులో అంతిమ కార్యక్రమాలు జరిపారు. ఈయనకు భార్య జ్యోతమ్మ, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. మాజీ మంత్రి తానేటి వనిత పెద్ద కోడలు. బాబూరావు మృతిపై వైఎస్సార్ సీపీ నాయకులు, ఎమ్మెల్సీ కవురు శ్రీనివాసు, యడ్ల తాతాజీ, గోపాలపురం, కొవ్వూరు నియోజకవర్గాల నుంచి పెద్ద సంఖ్యలో నాయకులు పాల్గొని తమ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తంచేశారు. -
ఎట్టకేలకు డిగ్రీ ప్రవేశాలకు నోటిఫికేషన్
ఏలూరు (ఆర్ఆర్పేట): ఇంటర్ ఉత్తీర్ణులైన విద్యార్థులకు డిగ్రీ ప్రవేశాల విషయంలో తాత్సారం చేసి వారి భవిష్యత్ను ప్రశ్నార్థకం చేసిన కూటమి ప్రభుత్వం ఎట్టకేలకు డిగ్రీ ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ చేసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వం డిగ్రీ ప్రవేశాలపై సరైన నిర్ణయం తీసుకులేకపోవడంతో విద్యార్థులు గందరగోళ పరిస్థితిని ఎదుర్కొన్నారు. విద్యా సంవత్సరం ఆలస్యంగా ప్రారంభమైతే సిలబస్ పూర్తి కాకుండానే పరీక్షలను ఎదుర్కోవాల్సి వచ్చే ప్రమాదం ఉంటుందని, ఆ ప్రభావం డిగ్రీ మూడు సంవత్సరాలు పూర్తయ్యేవరకూ ఉంటుందని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా ఇంటర్మీడియెట్ పరీక్షల ఫలితాలు వెలువడిన నెలలోపే డిగ్రీ ప్రవేశాలకు ప్రభుత్వాలు చర్యలు తీసుకునేవి. అయితే కూటమి ప్రభుత్వం యువత భవితపై, విద్యారంగంపై చిన్నచూపుతో, ఇంజనీరింగ్, తదితర డిగ్రీ తత్సమాన కోర్సులను నిర్వహిస్తున్న కార్పొరేట్ కళాశాలలకు మేలు చేకూర్చే విధానాలు అనుసరించి డిగ్రీ ప్రవేశాలను ఆలస్యం చేసింది. నాలుగు నెలల తరువాత షెడ్యూల్ విడుదల 2024–25 విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియెట్ పరీక్షలు రాసిన విద్యార్థుల ఫలితాలను ప్రభుత్వం గత ఏప్రిల్ 12వ తేదీన విడుదల చేసింది. ఆ ఫలితాల్లో అనుత్తీర్ణులైన విద్యార్థులకు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించి ఆ పరీక్షల ఫలితాలను కూడా జూన్ 7వ తేదీన విడుదల చేసేసింది. ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షల ఫలితాలు విడుదలై నాలుగు నెలలు దాటిపోగా, అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదలై కూడా 75 రోజులు దాటిపోయింది. గతేడాది కూడా ప్రభుత్వం ఇలానే డిగ్రీ ప్రవేశాలను ఇంటర్ ఫలితాలు విడుదలైన రెండున్నర నెలల తరువాత చేపట్టగా అప్పట్లో ప్రభుత్వం నూతనంగా ఏర్పాటైనందున విధానాలు రూపొందించడంలో ఆలస్యమై ఉంటుందని సరిపెట్టుకున్నారు. అయితే ఈ ఏడాది కూడా డిగ్రీ ప్రవేశాలను మరింత ఆలస్యంగా అంటే నాలుగు నెలల తరువాత చేపట్టడం కూటమి ప్రభుత్వం వైఫల్యమని విద్యారంగ నిపుణులు చెబుతున్నారు. ప్రవేశాల షెడ్యూల్ ఇలా.. 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి డిగ్రీ ప్రవేశాలకు ఉన్నత విద్యామండలి బుధవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆర్ట్స్, సైన్స్, సోషల్ సైన్సెస్, కామర్స్, మేనేజ్మెంట్, కంప్యూటర్ అప్లికేషనన్ అండ్ సోషల్ వర్క్, ఆనర్స్ వంటి కోర్సుల్లో సీట్లను భర్తీ చేయనున్నారు. ప్రభుత్వ, అటానమస్, ప్రైవేటు ఎయిడెడ్, ప్రైవేట్ అన్ ఎయిడెడ్, ప్రైవేట్ అటానమస్ కళాశాలల్లో వివిధ కోర్సుల్లో ఆన్లైన్ ద్వారా ప్రవేశాలు కల్పించనున్నారు. ఈ మేరకు ఈనెల 20వ తేదీ నుంచి 26వ తేదీ వరకు విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించింది. 25 నుంచి 28వ తేదీ వరకూ కళాశాలల్లో ధ్రువపత్రాల పరిశీలన ఉంటుంది. 24వ తేదీ నుంచి 28వ తేదీ వరకు వెబ్ ఆప్షన్ల ఎంపికకు, 29వ తేదీన వెబ్ ఆప్షన్లు మార్చుకోవడానికి అవకాశం కల్పించింది. ఈనెల 31న తుది సీట్ల కేటాయింపు పూర్తిచేయనుంది. సీట్లు పొందిన విద్యార్థులకు సెప్టెంబర్ 1వ తేదీ నుంచి తరగతులు ప్రారంభించనున్నారు. ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో మొత్తం 91 డిగ్రీ కళాశాలలు విద్యార్థులకు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ఏలూరు జిల్లాలో 7 ప్రభుత్వ, 1 ప్రభుత్వ ఎయిడెడ్ అటానమస్, ఒక ప్రైవేట్ అటానమస్, 31 ప్రైవేట్ అన్ ఎయిడెడ్ కళాశాలలు మొత్తం కలిపి 40 డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో 4 ప్రభుత్వ, 2 ప్రభుత్వ అటానమస్, 4 ఎయిడెడ్ అటానమస్, ఒక ప్రైవేట్ అటానమస్ కళాశాలున్నాయి. అలాగే ఒక ప్రైవేట్ ఎయిడెడ్, 39 ప్రైవేట్ అన్ ఎయిడెడ్ కళాశాలలు మొత్తం కలిపి 51 డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. ఆయా కళాశాలల్లో మొత్తం వివిధ గ్రూపులకు సంబంధించిన సుమారు 60 వేల సీట్లు అందుబాటులో ఉన్నాయి. నాలుగు నెలల తరువాత ప్రవేశాలకు షెడ్యూల్ విడుదల సిలబస్ పూర్తికాకుండానే పరీక్షలు ఎదుర్కోవాలని విద్యార్థుల ఆందోళన -
ఆపరేషన్ ట్రేస్లో బంధువుల చెంతకు బాలుడు
ఏలూరు టౌన్: ఆపరేషన్ ట్రేస్లో భాగంగా ఒక బాలుడ్ని బంధువులకు అప్పగించినట్లు ఏలూరు మహిళా స్టేషన్ సీఐ, శక్తి టీమ్ ఇన్చార్జి ఎం.సుబ్బారావు తెలిపారు. ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ ఆదేశాలతో జిల్లాలో ఈనెల 1 నుంచీ 31తేదీ వరకూ ఆపరేషన్ ట్రేస్ కార్యక్రమంలో బాలల తల్లిదండ్రులు, బంధువులను గుర్తించేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. దీనిలో భాగంగా ఏలూరులోని చిల్డ్రన్ హోమ్లో గత 8 ఏళ్లుగా ఉంటున్న నాగరాజు అనే బాలుడి బంధువులను గుర్తించామన్నారు. బాలుడి మేనత్త బుధవారం ఏలూరు నగరంలోని చిల్డ్రన్ హోమ్కు చేరుకుని బాలుడ్ని గుర్తించి సంతోషాన్ని వ్యక్తం చేసింది. చదువు పూర్తి చేసిన అనంతరం ఆమెతో పంపేందుకు అధికారులు నిర్ణయించారు. కార్యక్రమంలో శక్తిటీమ్ కానిస్టేబుల్ సుజాత, కానిస్టేబుల్ గోపాలకృష్ణ, చిల్డ్రన్ హోమ్ సిబ్బంది ఉన్నారు.అదనపు కట్నం వేధింపులపై కేసు నమోదుఆకివీడు: అధనపు కట్నం వేధింపులపై కేసు నమోదు చేసినట్లు ఏఎస్ఐ సత్యనారాయణ చెప్పారు. స్థానిక గుమ్ములూరు సెంటర్లో నివసిస్తున్న సత్యవేణికి హైదరాబాద్కు చెందిన కన్నా నరేష్తో 2023లో వివాహమైంది. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. అదనపు కట్నం కోసం భర్త నరేష్, అత్తమామలు, ఆడపడుచు, చిన్నమామలు వేధిస్తున్నారని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. -
పనిచేయని లిఫ్టులు.. ఉద్యోగుల పాట్లు
నూజివీడు: ఆర్జీయూకేటీలోని అధికారుల అలసత్వం, నిర్లక్ష్యం కారణంగా బోధనా సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రెండు నెలలుగా లిఫ్టులు పనిచేయకపోయినా వాటిని బాగుచేయించాలన్న ఆలోచన కూడా లేకుండా అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. నూజివీడు ట్రిపుల్ ఐటీలో ఫ్యాకల్టీకి, ఇతర సిబ్బందికి, అధికారులు క్యాంపస్లో ఉండేందుకు బహుళ అంతస్థుల క్వార్టర్స్ ఉన్నాయి. ఐదు అంతస్థులుగా ఉన్న ఈ క్వార్టర్స్కు లిఫ్టులు పనిచేయకపోవడంతో అందులో ఉండే సుమారు 1,500 కుటుంబాలు తీవ్ర అవస్థలు పడుతున్నాయి. పనిచేయని లిఫ్టులు ట్రిపుల్ ఐటీలో బ్యాంకు పక్కనే ఉన్న పీ1 క్వార్టర్స్ లిఫ్ట్ రెండు నెలలుగా పనిచేయడం లేదు. విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని సిబ్బంది వాపోతున్నారు. అలాగే ఎన్1, ఎన్3, ఎం1 క్వార్టర్స్ లిఫ్టులు నెల రోజుల నుంచి పనిచేయడం లేదు. ఎన్1 క్వార్టర్స్ లిఫ్ట్ డోర్ నాలుగైదు నిమషాలకు పడుతుండటంతో అంతసేపు వేచి ఉండలేక ఫ్యాకల్టీ కుటుంబాలు మెట్లనే ఆశ్రయిస్తున్నారు. సరుకులు తెచ్చుకోవాలంటే నరకం మంచినీటి టిన్నులు, బియ్యం బస్తాలు, ఇతర బరువుతో కూడిన బస్తాలు రెండో అంతస్థు దగ్గర నుంచి ఐదో అంతస్థు వరకు తీసుకెళ్లాలంటే ఆయా అంతస్థుల్లో ఉన్న కుటుంబాలు పడుతున్న బాధ అంతా ఇంతా కాదు. 20 లీటర్ల టిన్నులు మోయలేక ఐదు లీటర్ల టిన్నులు కొనుక్కుంటున్నామని అంటున్నారు. కొందరు అధ్యాపకులు నాలుగైదుసార్లు ఎక్కి దిగలేక క్యాంపస్లోనే ఉంటూ మధ్యాహ్న భోజనం క్యారేజీని తీసుకెళ్తున్నారు. లిఫ్టులు పనిచేయకపోవడంతో పాలు పోసేవారు ఫ్లాట్ వద్దకు రావడం లేదని దీంతో కిందకు వెళ్లి పాలు తెచ్చుకుంటున్నామని అంటున్నారు. ఆపరేషన్ చేయించుకున్న వారు, బాలింతలు, వృద్ధులు, దివ్యాంగుల పాట్లు వర్ణనాతీతం. నూజివీడు ట్రిపుల్ ఐటీ సిబ్బంది క్వార్టర్స్లో నెలకొన్న దుస్థితి -
మనస్తాపంతో వివాహిత ఆత్మహత్య
ఆగిరిపల్లి: కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండలంలోని చిన్న ఆగిరిపల్లిలో మంగళవారం రాత్రి జరిగింది. ఎస్సై శుభశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని చిన్న ఆగిరిపల్లికి చెందిన చెందిన రాముకు కృష్ణాజిల్లా కూచిపూడికి చెందిన వెంకట సోనియాకు (28) ఆరేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు. కొద్ది రోజులుగా రాముకు, సోనియాకు మధ్య మనస్పర్థలతో గొడవలు జరుగుతున్నాయి. మూడు రోజుల క్రితం సోనియా పుట్టింటికి వెళ్లి వెంటనే తిరిగి రాలేదని భర్త ఆమెతో మాట్లాడటం లేదు. దీంతో మనస్తాపం చెందిన ఆమె మంగళవారం అర్ధరాత్రి తన ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సోనియా తండ్రి వీరస్వామి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దెందులూరు: ప్రమాదవశాత్తూ చెరువులో జారి పడి ఓ యువకుడు మృతి చెందాడు. కొవ్వలి వీఆర్ఓ రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం కొవ్వలి గ్రామానికి చెందిన కానూరి రామయ్య కుమారుడు అభిషేక్ డిగ్రీ చదువుతున్నాడు. బుధవారం సాయంత్రం అభిషేక్ అతని స్నేహితుడు ఇంకేటి రాహుల్తో కలిసి బహిర్భూమికని కుంటల చెరువు కు వెళ్లారు. అక్కడ ప్రమాదవశాత్తూ అభిషేక్ కాలుజారి చెరువులో పడిపోయాడు. అతడ్ని రక్షించేందుకు రాహుల్ ప్రయత్నించి చెరువులో పడిపోవడంతో అతడ్ని స్థానికులు రక్షించారు. ఈ ఘటనలో అభిషేక్ చెరువులో మునిగి మృతి చెందాడు. పోలవరం రూరల్ : మనస్తాపంతో ఓ వివాహిత ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడిన ఘటన పోలవరంలో చోటుచేసుకుంది. ఎస్సై ఎస్ఎస్ పవన్కుమార్ తెలిపిన వివరాలివి. ఆర్థిక ఇబ్బందులను తట్టుకోలేకపోతున్నామని, ఇక్కడ వ్యాపార లావాదేవీలు ఏవీ లేవని, రాజమండ్రి వెళ్లిపోదామని కిలపర్తి విజయ (40) భర్త శేఖర్తో ఇటీవల వాగ్వివాదం చేసింది. అనంతరం మనస్థాపానికి గురైన విజయ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కుమారుడు ఈశ్వర్ సాయిచంద్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. భీమడోలు: భీమడోలులోని గుర్రాల చెర్వు గట్టు వద్ద ఓ ఇంట్లో జరిగిన చోరీ ఘటనపై బుధవారం పోలీసులు కేసు నమోదు చేశారు. గ్రామానికి చెందిన దూబ లక్ష్మణరావు, నీలవేణి దంపతులు ఈనెల 19వ తేదీ ఉదయం ఇంటికి తాళం వేసి వ్యవసాయ పనికి వెళ్లారు. తిరిగి మధ్యాహ్నాం వచ్చేసరికి ఇంటి తాళాలు పగులకొట్టి ఉన్నాయి. బీరువాలోని ఆరు కాసుల బంగారు ఆభరణాలతో పాటు కొంత నగదును అపహరణకు గురైనట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సై వై.సుధాకర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఏపీలో ఉచిత బస్సు ప్రయాణం.. ఓ మహిళ ప్రాణాల మీదకు తెచ్చింది
సాక్షి,తూర్పుగోదావరి జిల్లా: ఏపీలో ఉచిత బస్సు ప్రయాణం మహిళ ప్రాణాల మీదకు తెచ్చింది. ఓ ప్రయాణికురాలి కాలును ఆర్టీసీ బస్సు నుజ్జునుజ్జు చేసింది. తూర్పుగోదావరి జిల్లా జగ్జంపేటలో రేవాడ రాజేశ్వరి అనే మహిళ తన సోదరి కుమార్తె ఆశ్వనీను బస్సు ఎక్కించేందుకు జగ్గం పేటకు వచ్చారు. జగ్గంపేట బస్టాండ్లో అశ్వినినీ బస్సు ఎక్కించి ఆమెకు బ్యాగ్ ఇస్తుండగా.. ఉచిత బస్సు ప్రయాణంతో రద్దీ విపరీతంగా పెరిగడంతో డ్రైవర్ బస్సును ముందుకు కదిలించాడు. దీంతో రాజేశ్వరి కాలుజారి కిందపడింది. బస్సు టైరు ఎక్కడంతో ఆమె కాలు నుజ్జునుజ్జయ్యింది. ప్రమాదంతో తోటి ప్రయాణికులు అంబులెన్స్కు సమాచారం అందించారు. కానీ సకాలంలో అంబులెన్స్ రాకపోవడంతో బాధితురాల్ని ఓ స్ట్రెచ్చర్ మీద రోడ్డు మీదకు తోసుకుంటూ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. -
గోదావరిలో వరద ఉధృతి పెరగడంతో
యలమంచిలి: గోదావరిలో వరద ఉధృతి పెరగడంతో కనకాయలంక కాజ్వే మంగళవారం నీట మునిగింది. దీంతో కనకాయలంక ప్రజలు అడుగున్నర లోతు వరదనీటిలో రాకపోకలు సాగిస్తున్నారు. వరదనీరు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు, స్కూల్ విద్యార్థుల రాకపోకలకు అంతరాయం కలగకుండా పడవలు ఏర్పాటు చేసినట్లు తహసీల్దార్ గ్రంధి నాగ వెంకట పవన్కుమార్ తెలిపారు. ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు రావాలని, వరద తగ్గే వరకు ఇళ్లకే పరిమితం కావాలని ఆయన కోరారు. భద్రాచలం వద్ద వరద తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో బుధవారం కాజ్వేపై వరదనీటి ప్రవాహం కొనసాగే అవకాశం ఉన్నా, సాయంత్రానికి తగ్గే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.డీఆర్ఓ వెంకటేశ్వర్లుకు కన్ఫర్డ్ ఐఏఎస్గా పదోన్నతి భీమవరం(ప్రకాశం చౌక్): డీఆర్ఓ మొగిలి వెంకటేశ్వర్లను కన్ఫర్డ్ ఐఏఎస్గా ప్రకటిస్తూ కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసిన సందర్భంగా మంగళవారం జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్ నాగరాణి, జేసీ టి.రాహుల్ కుమార్ రెడ్డి సత్కరించారు. వెంకటేశ్వర్లు గతంలో డిప్యూటీ కలెక్టర్, ఆర్డీవోగా పనిచేశారు. 2024 అక్టోబర్ నుంచి పశ్చిమగోదావరి జిల్లా రెవెన్యూ అధికారిగా పనిచేస్తున్నారు. ఆగస్టు 18న కేంద్రం కన్ఫర్డ్ ఐఏఎస్గా ఎంపిక చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా జిల్లా అధికారులు, రెవెన్యూ అసోసియేషన్ సిబ్బంది ఆయనకు అభినందనలు తెలిపారు.భీమవరం: ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యా పీఠం (ఓపెన్ స్కూల్) ద్వారా 2025–26 విద్యా సంవత్సరంలో 10వ తరగతి, ఇంటర్ చదవాలనుకునే అభ్యర్థులకు మరో అవకాశం వచ్చిందని జిల్లా విద్యాశాఖాధికారి ఇ.నారాయణ తెలిపారు. ప్రవేశాలకు వచ్చే నెల 16లోపు అపరాధ రుసుం రూ.200 చెల్లించి దరఖాస్తులు పొందాలని అన్నారు. ఓపెన్ స్కూల్ అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.భీమవరం (ప్రకాశంచౌక్): ఫేజ్–1, ఫేజ్–2 రీసర్వే నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని జాయింట్ కలెక్టర్ చాంబర్ నుంచి మంగళవారం రీసర్వే, గ్రామాల సరిహద్దుల నిర్ధారణ, జాయింట్ ఎల్పిఎంల ప్రగతిపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫేజ్ వన్–1 లో పూర్తి కావాల్సిన ఐదు గ్రామాలలో రీ సర్వే పనులను వచ్చే శనివారంలోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఫేజ్–2లో జరుగుతున్న 27 గ్రామాలకు సంబంధించి ప్రతి రైతుకు 9(2) నోటీసు అందించాలన్నారు. రీసర్వే చేయాల్సిన 72 గ్రామాల గ్రామ సరిహద్దులను రెండు రోజుల్లోగా నిర్ధారించాలన్నారు. భూమి సరిహద్దు సమస్య దరఖాస్తులు, ఆన్లైన్ సబ్ డివిజన్ దరఖాస్తులు, పీజీఆర్ఎస్లో అందిన దరఖాస్తుదారుల సమస్యలను సకాలంలో పరిష్కరించాలన్నారు. వచ్చే వారంలోగా సమస్యల పరిష్కారంపై ప్రగతి చూపించని వారిపై చర్యలు తీసుకుంటామని జాయింట్ కలెక్టర్ హెచ్చరించారు.కై కలూరు: కొల్లేటికోట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఏలూరు జిల్లా వైద్యాధికారి జాన్ అమృతం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ నెల 12న కొల్లేటికోట పీహెచ్సీ సమస్యలపై ‘లంకంత ఆస్పత్రి.. డాక్టర్లు లేరు’ శీర్షికతో కథనం వెలవడింది. దీనిపై డీఎంహెచ్వో పరిశీలన చేశారు. ఆస్పత్రిలో శుభ్రత పాటించాలని సూచించారు. ల్యాబ్ టెక్నీషియన్ పోస్టును త్వరగా భర్తీ చేస్తా మన్నారు. డాక్టర్ల నియామకం చేపడతామన్నారు. -
దివ్యాంగ పింఛన్లకు కోత
బుధవారం శ్రీ 20 శ్రీ ఆగస్టు శ్రీ 2025సాక్షి, భీమవరం : ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 ఏళ్లకే వృద్ధాప్య పింఛన్ హామీని గాలికొదిలేసిన చంద్రబాబు సర్కారు ప్రస్తుతం ఉన్న పింఛన్లు, ఇస్తున్న సాయానికి కోత పెట్టే పనిలో పడింది. తొలి విడతగా దివ్యాంగ, ఆరోగ్య పింఛన్లపై కన్నేసింది. జిల్లాలో దివ్యాంగ పింఛన్ లబ్ధిదారులు 27,193 మంది ఉండగా పక్షవాతం, కిడ్నీ, లివర్ ఇతర ఆరోగ్య సమస్యలతో పింఛన్ పొందుతున్న వారు 1,581 మంది వరకు ఉన్నారు. దివ్యాంగులకు నెలకు రూ.6,000, ఆరోగ్య పింఛన్ లబ్ధిదారులకు రూ.15,000, ఇతర సామాజిక పింఛన్లకు రూ.4,000 చొప్పున సాయం అందుతోంది. వెరిఫికేషన్, రీ అసెస్మెంట్ పేరిట లబ్ధిదారులకు ఇటీవల వైద్య బృందాలతో వైకల్య నిర్ధారణ, ఆరోగ్య పరీక్షలు చేయించారు. ఆరోగ్య పింఛన్ లబ్ధిదారులు 1,510 మందికి పరీక్షలు చేసి రూ.15,000 సాయం పొందేందుకు 566 మంది మాత్రమే అర్హులుగా నిర్ధారించారు. పింఛన్ నిలిపివేస్తామంటూ నోటీసులతో ఆందోళన మిగిలిన వారిలో 603 మందిని దివ్యాంగ పింఛన్లకు, 341 మందిని వృద్ధాప్య పింఛన్లకు మార్పుచేశారు. ఈ మేరకు వారికి అందించే సాయం భారీగా తగ్గనుంది. 15,596 మంది దివ్యాంగులకు పరీక్షలు నిర్వహించి 13,690 మంది మాత్రమే అర్హులుగా తేల్చారు. 1,289 మందిని వృద్ధాప్య పింఛన్లకు మార్పుచేయగా మిగిలిన వారికి తాత్కాలిక వైకల్యంగా, 40 శాతం లోపు ఉన్నట్టుగా సర్టిఫికెట్లు జారీచేయడంతో ఇప్పుడు వారి పింఛన్లు ఆగిపోయే పరిస్థితి వచ్చింది. వీరిలో పుట్టుక నుంచి వైకల్యంతో బాదపడుతున్న వారు, ఎన్నో ఏళ్లుగా పింఛన్ తీసుకుంటున్న వారు ఎంతోమంది ఉన్నట్టు చెబుతున్నారు. వైకల్య శాతం తక్కువ, తాత్కాలిక వైకల్యం కారణంగా పింఛన్ నిలిపివేస్తున్నట్లు మండల పరిషత్, మున్సిపల్ కార్యాలయాల నుంచి నోటీసులు అందడం లబ్ధిదారులను ఆందోళనకు గురిచేస్తోంది. నోటీసులు తీసుకుని సహాయకులతో కలిసి ప్రభుత్వ కార్యాలయాలకు పరుగులు తీస్తున్నారు. స్పౌజ్ పింఛన్లను కొత్తవి అంటూ ప్రచారం గతంలో పింఛన్ లబ్ధిదారుడు మృతిచెందితే మరుసటి నెల నుంచే అతని భార్య(స్పౌజ్)కు పింఛన్ మంజూరయ్యేది. కూటమి వచ్చాక పింఛన్ సైట్ను క్లోజ్ చేయడంతో ఈ తరహా పింఛన్ల మంజూరు ఆగిపోయింది. నవంబరు తర్వాత మృతిచెందిన వారికి మాత్రమే ఇస్తూ వచ్చారు. దీంతో అంతకు ముందు భర్తను కోల్పోయిన వారు స్పౌజ్ పింఛన్ల కోసం ఎదురుచూపులు చూడాల్సి వచ్చింది. ఎట్టకేలకు జిల్లాలోని 3,988 మందికి ఆగస్టు నుంచి స్పౌజ్ పింఛన్లు పంపిణీ చేశారు. వీటినే కొత్త మంజూరు అన్నట్టుగా కూటమి నాయకులు హడావుడి చేయడం గమనార్హం. భర్తను కోల్పోయి తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న నిరుపేద మహిళలు ఒక్కరికీ సాధారణ వితంతు పింఛన్ మంజూరు చేయలేదు.కుమార్రాజాకు వచ్చిన నోటీస్ చూపిస్తున్న దృశ్యం ఈ ఫొటోలో కనిపిస్తున్న అబ్బాయి పేరు కుమార్రాజా. వయస్సు ఆరేళ్లు. నరసాపురం రూరల్ ఎల్బీ చర్లకు చెందిన ఈ బాబుకు పుట్టుక నుంచే మెదడులో సమస్యతో కాళ్లు, చేతులు సరిగా పనిచేయవు. నడవలేడు. ఎక్కడికై నా ఎత్తుకుని తీసుకువెళ్లాల్సిందే. అన్నం కూడా ఎవరైనా తినిపించాల్సిందే. గతంలో విజయవాడలోని ప్రభుత్వ ఆస్పత్రిలో 90 శాతం వైకల్యం ఉన్నట్లు వైద్యులు నిర్ధారించడంతో గత ప్రభుత్వంలో దివ్యాంగ పింఛన్ మంజూరైంది. ఇటీవల చేసిన రీ వెరిఫికేషన్లో తాత్కాలిక వైకల్యంగా నిర్ధారణ అయ్యిందని, పింఛన్ నిలిపివేస్తున్నట్టు ఎంపీడీఓ కార్యాలయం నుంచి నోటీసు అందింది. ఎల్బీ చర్ల గ్రామంలో 65 దివ్యాంగ పింఛన్లకు 14 మందికి నోటీసులు జారీ చేయడం గమనార్హం. దివ్యాంగుల పింఛన్లు తొల గించేందుకు కూటమి ప్రభుత్వం చేస్తున్న కుట్రను ఉపేక్షించేది లేదు. దీనిపై త్వరలోనే రాష్ట్రవ్యాప్త ఉద్యమం చేపడతాం. కలెక్టరేట్లు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఇళ్లను ముట్టడిస్తాం. దివ్యాంగుల పింఛన్లు రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రం భారం కాదు. 1980 నుంచి దివ్యాంగుల ధ్రువీకరణ పత్రాలను తిరిగి పరిశీలించిన దాఖలాలు లేవు. దివ్యాంగుల వయసు పెరుగుతున్న కొద్దీ వైకల్యం కూడా పెరుగుతూనే ఉంటుంది. ప్రభుత్వాలు ఇవి గుర్తించాలి. – అల్లాడి నటరాజు, వికలాంగుల సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు, ఆకివీడు డిజేబుల్డ్, ఆరోగ్య పింఛన్లు తగ్గించే పనిలో చంద్రబాబు సర్కారు కొన్నింటిని ఓఏపీ పింఛన్లుగా మార్పు నడవలేని వారికి సైతం వైకల్యం 40 శాతం లోపుందని నోటీసులు ఆరోగ్య పింఛన్ లబ్ధిదారుల్లో సగానికి పైగా కత్తెరపాలన చేపట్టిన 15 నెలల కాలంలో కూటమి ప్రభుత్వం ఒక్క కొత్త పింఛన్ మంజూరు చేయకపోవడం గమనార్హం. చివరిగా 2024 జనవరిలో గత ప్రభుత్వం 4,274 కొత్త పింఛన్లు మంజూరు చేసింది. జూలైలో కొత్తవి మంజూరు కావాల్సి ఉండగా జూన్లో కూటమి రాకతో వాటికి బ్రేక్ పడింది. జూన్ నాటికి జిల్లాలో 2,32,885 మంది పింఛన్ లబ్ధిదారులు ఉండగా ప్రస్తుతం ఆ సంఖ్య 2,26,995కు తగ్గిపోవడం గమనార్హం. జిల్లా వ్యాప్తంగా 25 వేలకు పైగా దరఖాస్తులు పెండింగ్లో ఉన్నట్టు అంచనా. -
కూల్చివేతను అడ్డుకున్న దళితులు
ఉండి: ఉండి మండలం వాండ్రం దళితపేట డ్రెయిన్ను ఆనుకుని వున్న 30 ఇళ్లను కూల్చేందుకు పొక్లెయిన్ను తీసుకు రాగా దళితులు అడ్డుకున్నారు. గతంలో అక్కడ అధికారులు కొలతలు వేసి.. డ్రెయిన్ కొలతలు మీ ఇళ్ళల్లోకి వచ్చేశాయి ఇళ్ళు పడగొట్టాలని మార్కింగ్ చేసి వెళ్లారు. గత కొన్ని రోజులుగా ఈ విషయంపై గొడవ నడుస్తోంది. కొందరు దళితులు సోమవారం కలెక్టర్కు గ్రీవెన్స్ సెల్లో వినతిపత్రం అందజేశారు. వినతిపత్రం అందించి వచ్చిన కొద్దిసేపటికే కొందరు పొక్లెయిన్తో దళితపేటకు చేరుకున్నారు. దీంతో దళితులు అధికారులకు ఫోన్లు చేశారు. మాకెలాంటి సంబంధం లేదు, మేం పొక్లెయిన్ పంపించలేదని అధికారులు సమాధానమిచ్చారు. దీంతో దళితులు ఆందోళనకు సిద్ధపడ్డారు. ఈ పరిణామాలను గమనించిన అధికారులు వెంటనే ఆ ప్రాంతం నుంచి పొక్లెయిన్ను పంపించివేయడంతో సమస్య తాత్కాలికంగా సద్దుమణిగింది. ఇళ్ల పడగొట్టి రోడ్డు వేస్తాం అని ఎవరైనా వస్తే దానికి తగిన విధంగా సమాధానమిస్తామంటూ దళితులు నిరసన కార్యక్రమాలు చేపట్టేందుకు సిద్దమవుతున్నారు. ప్రభుత్వ లెక్కల్లో వాండ్రం దళితపేటకు ఆనుకుని మురుగుబోదె లేనే లేదని అంటున్నారు. ఇప్పుడు బోదెకు కొలతలు, దళితుల ఇళ్ళపై మార్కింగ్లు ఎక్కడ నుంచి వచ్చాయని కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. గ్రామంలోని మంచినీటి చెరువుకు సంబంధించిన మురుగు బయటకు పోయేలా సమీపంలోని కొందరు రైతుల విన్నపంతో చిన్న బోదెను ఏర్పాటు చేశారని తెలిపారు. కాలక్రమేణా అది పెద్దబోదెగా మారిందన్నారు. రైతుల కోసం తాము బోదె తవ్వకానికి ముందడుగు వేశామని, ఇప్పుడు ఇళ్లు పడగొడతామంటే చూస్తూ ఊరుకునేది లేదంటున్నారు. అధికారులు న్యాయం చేయకపోతే తామంతా పోరుబాట పడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కోనాల రాజేంద్రకుమార్, కోనాల జీవన్కుమార్, ఆలిండియా క్రిస్టియన్ కౌన్సిల్ వర్కింగ్ ప్రెసిడెంట్ మత్తి రాజ్కుమార్, దీన రాజు, పాము మధు, తదితరులు కలెక్టర్కు వినతిపత్రం అందజేసినవారిలో ఉన్నారు. -
కొల్లేరు ప్రక్షాళన ప్రశ్నార్థకం
కొల్లేరులో నీటి ప్రవాహానికి అడ్డంకులు తొలగించడానికి పంట కాల్వల్లో కలాసి వ్యవస్థ మాదిరిగా ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలి. ఎగువ నుంచి కొట్టుకొస్తున్న గుర్రపుడెక్క గుదిబండగా మారుతోంది. కొల్లేరు, ఉప్పుటేరులో పూడికలు తీయాలి. ఉప్పుటేరు నుంచి సముద్రానికి నీరు పోయేలా అడ్డంకులను తొలగించాలి. – సైదు సత్యనారాయణ, కొల్లేరు ప్రాంతీయ వ్యవసాయ, మత్స్య సంఘాల అభివృద్ధి సంఘం అధ్యక్షుడు ఉప్పుటేరు వద్ద ఆక్రమణలను యుద్ధప్రాతిపాదికన తొలగిస్తున్నాం. ప్రధానంగా ఉప్పుటేరుపై నిర్మించిన రైల్వే బ్రిడ్జి వద్ద గుర్రపుడెక్క, కిక్కిసను 6 పొక్లయిన్లతో తీస్తున్నారు. ప్రతి ఏటా మాదిరిగా కాకుండా ముందస్తు చర్యల్లో ఆక్రమణల తొలగింపు పనులు జరుగుతున్నాయి. – ఎం.రామకృష్ణ, డ్రెయినేజీ డీఈ, కై కలూరు కై కలూరు: కొల్లేరు డ్రెయిన్లకు మరమ్మతులు నిర్వహించకపోవడంతో ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో కొల్లేరు లోతట్టు గ్రామాలు జలమయమవుతున్నాయి. వరద నీరు బుడమేరు, తమ్మిలేరు, రామిలేరు, గుండేరు వంటి భారీ డ్రెయిన్లతో పాటు మరో 31 మీడియం, మైనర్ డ్రెయిన్లు, కాలువలు చానల్స్ ద్వారా పెద్ద ఎత్తున కొల్లేరుకు చేరుతుంది. వరదల సమయంలో 1,10,920 క్యూసెక్కులు కొల్లేరుకు వస్తుందని అంచనా. వీటిలో కేవలం 12 వేల క్యూసె క్కుల నీరు మాత్రమే ఉప్పుటేరు ద్వారా 62 కిలోమీటర్ల ప్రయాణించి బంగాళాఖాతం చేరుతుంది. ఏలూరు జిల్లాలోని కై కలూరు, మండవల్లి, పెదపాడు, ఏలూరు, దెందులూరు, భీమడోలు, ఉంగుటూరు, నిడమర్రు మండలాలతో పాటు పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు మండలంలో విస్తరించిన కొల్లేరులో 71 గ్రామాలు, కొల్లేరు అనుబంధ గ్రామాలు 150 కలిపి మొత్తం 227 గ్రామాలు ఉన్నాయి. కొల్లేరుకు చేరే నీటిని దిగువకు పంపించే మండవల్లి మండలం పెదఎడ్లగాడి వంతెన ఖానాల వద్ద గుర్రపుడెక్క భారీగా పేరుకుపోయింది. దీంతో నీటి ప్రవాహం మందగించి సమీప పెనుమాకలంక గ్రామానికి చేరే రోడ్డుపై నుంచి నీరు పారుతోంది. దీంతో రాకపోకాలు బంద్ చేశారు. ప్రజలు పడవలపై గ్రామాలకు చేరుతున్నారు. కమిటీలు సూచించినా కదలిక : వరదల సమయంలో కొల్లేరుకు వచ్చే నీటితో లాభాల కంటే నష్టాలు ఎక్కువగా జరుగుతున్నాయని 1895లో అప్పటి ఇరిగేషన్ అధికారులు గుర్తించారు. తమ్మిలేరు, బుడమేరుల వల్ల జరుగుతున్న పంట నష్టాల నివారణకు తీసుకోవాల్సిన చర్యని ప్రతిపాదించారు. 1964 వరదల తర్వాత మిత్ర కమిటీ కూడా ఇవే ప్రతిపాదనలు చేసింది. వరదల సమయంలో ఎగువ ప్రాంతాల నుంచి కొల్లేరుకు వచ్చే నీరు 47 టీఎంసీలకు పైనే ఉంటుందని, రిజర్వాయర్ల నిర్మాణం జరిగితే డెల్టాలో మరో 5 లక్షల ఎకరాల సాగులోనికి తీసుకురావడానికి ఈ నీరు పనికొస్తుందని సూచించారు. అటకెక్కిన కొల్లేరు చానలైజేషన్ తొలిదశలో కొల్లేరులో నీటిమట్టం 7 అడుగులు ఉంటే 15 వేల క్యూసెక్కుల నీరు అవుట్ప్లో ఉండేలా ఉప్పుటేరుని ఆధునికరించాలని కమిటీ సూచించింది. రెండో దశలో కొల్లేటి నీటిమట్టం 7 అడుగులు ఉంటే 20 వేల క్యూసెక్కుల నీరు అవుట్ ఫ్లో ఉండేలా పనులు చేపట్టాలని పేర్కొంది. రెండు దశల పనులకు దాదాపు రూ.7 కోట్లు ఖర్చు అవుతోందని అంచనా వేశారు. నిధులు కొరత, కొల్లేరు చుట్టూ ఆక్రమణలు ఇలా రకరకాల కారణాలతో 1981 వరకు పనులు ప్రారంభం కాలేదు. తర్వాత ప్రభుత్వం ప్రకటించిన రూ.40 కోట్లు ఏమాత్రం సరిపోవని తేల్చారు. కొన్ని సంవత్సరాల క్రితం డ్రెడ్జింగ్ పనులు తూతూ మంత్రంగా జరిగాయి. కలగా మారిన డ్రెయిన్ల మరమ్మతులు ఎగువ నుంచి భారీగా వర్షపు నీరు రెగ్యులేటర్ల నిర్మాణంతోనే సమస్యకు చెక్ -
●ఇదేనా.. పంట కాలువల ప్రక్షాళన?
లక్షలాది రూపాయలు వెచ్చించి పంట కాలువలను ప్రక్షాళన చేశారుగా.. అప్పుడే ఇలా అయిపోయాయి ఏంటి అంటూ రైతులు, స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఉండి నుంచి పాములపర్రు వెళ్లే పంట కాలువ ఓ వైపు చిట్టడవిలా మారితే.. మరోవైపు గుర్రపుడెక్క, చెత్తాచెదారంతో నిండిపోవడంపై అవాక్కవుతున్నారు. గత వేసవిలో కాలువల్లో పూడికతీత పనులను అధికారులు, కాంట్రాక్టర్లు తూతూమంత్రంగా కానిచ్చేశారని, కాలువల్లోని మట్టిని పొక్లెయిన్తో గట్టుపై వేసి చేతులు దులుపుకున్నారని అంటున్నారు. దీంతో కొద్దిరోజుల్లోనే పంట కాలువలు ఇలా తయారయ్యాయని వాపోతున్నారు. కాలువల్లో అడ్డంకులతో పొలాలకు నీరందడం లేదని ఆవేదన చెందుతున్నారు. – ఉండి -
ఉప్పుటేరులోకి వరద నీరు
ఆకివీడు: కొల్లేరు సరస్సులోకి కృష్ణా, గోదావరి జలాలతో పాటు, తమ్మిలేరు, బుడమేరు, ఎర్రకాలువ నీరు ప్రవేశించడంతో కొల్లేరు, ఉప్పుటేరుల్లో నీటి ప్రవాహం పెరుగుతోంది. సోమ వారం ఉప్పుటేరులో నీటి ప్రవాహాన్ని కలెక్టర్ నాగరాణి, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరా జు పరిశీలించారు. తాడినాడ వైపు ఉప్పుటేరుకు చేర్చి ఉన్న చేపల చెరువులను కలెక్టర్ పరిశీలించారు. రైల్వే వంతెనల వద్ద పేరుకుపోతున్న కిక్కిస, గుర్రపుడెక్కల తొలగింపును చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అంగన్వాడీ కేంద్రాల బలోపేతానికి కృషి భీమవరం (ప్రకాశంచౌక్): అంగన్వాడీ కేంద్రా ల్లో మౌలిక వసతుల కల్పనతో బలోపేతానికి అధికారులు కృషి చేయాలని కలెక్టర్ సీహెచ్ నాగరాణి అన్నారు. సోమవారం కలెక్టరేట్లో ఐసీడీఎస్, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులతో సమీక్షించారు. ఎకై ్సజ్శాఖ అధికారి నాగప్రభుకుమార్ భీమవరం: జిల్లాలో బార్లు ఏర్పాటుకు దర ఖాస్తు చేసుకోవడానికి నోటిఫికేషన్ జారీ చేసి నట్టు జిల్లా ప్రొహిబిషన్, ఎకై ్సజ్శాఖ అధికా రి కేవీ నాగప్రభుకుమార్ తెలిపారు. సోమ వారం భీమవరం ఎకై ్సజ్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో 28 బార్లు ఏర్పాటుచేయనున్నట్టు తెలిపారు. భీమవరం మున్సిపాలిటీ పరిధిలో ఏడు, నరసాపురంలో మూడు, పాలకొల్లులో ఆరు, తణుకులో ఆరు, ఆకివీడు నగర పంచాయతీ పరిధిలో ఒకటి చొప్పున కేటాయించామన్నారు. ఈనెల 26 వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. రిజర్వేషన్ ఖరారు కల్లుగీత కార్మికులకు కొత్తగా మంజూరైన మూ డు బార్లుకు కులాల వారీగా రిజర్వేషన్ ప్రక్రియను లాటరీ ద్వారా కలెక్టర్ సీహెచ్ నాగరాణి ఎంపిక చేశారు. భీమవరం, తాడేపల్లిగూడెంలో శెట్టి బలిజలకు, పాలకొల్లులో గౌడ కులస్తులకు ఒక్కోటి చొప్పున కేటాయించారు. వీరు ఈనెల 29 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని, 30న డ్రా తీసి బార్లు కేటాయిస్తామన్నారు. అత్తిలి: రాష్ట్రంలో దివ్యాంగుల పింఛన్లు తొల గించడం హేయమని వైఎస్సార్సీపీ దివ్యాంగ విభాగం జిల్లా అధ్యక్షులు బుడితి సుజన్కుమా ర్ అన్నారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వైకల్యం పునః పరిశీలన పేరుతో దివ్యాంగులను నెలలు తరబడి తీవ్ర మానసిక వేదనకు గురిచేసిందని అన్నారు. ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా కాలు కాదపలేని, ఏం పని చేసుకోలేని పలువురు దివ్యాంగుల పింఛన్లు తొలగించి వారి జీవనభృతిని లా క్కోవడం అత్యంత హేయమైన చర్య అని అన్నా రు. తొలగించిన పింఛన్లను తక్షణమే పునరుద్ధరించాలని కోరుతూ చిత్తూరు కలెక్టరేట్ను ది వ్యాంగులు ముట్టడించారని, ప్రభుత్వం తక్షణ మే స్పందించి సమస్య పరిష్కారించాలని, లే కపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు దిగుతామని సుజన్కుమార్ హెచ్చరించారు. -
పశువధపై మొద్దు నిద్ర
తణుకు అర్బన్: తణుకు మండలం తేతలి గ్రామం పశు ఘోషతో అల్లాడుతోంది. పశువులను నిర్ధాక్షిణ్యంగా వధిస్తున్నప్పటికీ పట్టించుకునే వారు లేకపోవడంతో బాధితులకు కంఠశోషే మిగిలింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత నుంచి పశువధ శాల తెరచుకుంది. అక్కడి నుంచి వస్తున్న దుర్వాసనకు తేతలి గ్రామస్థులు అల్లాడిపోతున్నారు. స్థానికంగా ఇళ్లలో ఉండలేకపోతున్నామని పశువధ శాలను మూయించాలని వేడుకుంటున్నారు. పశువధ శాల చుట్టూ 200పైగా ఇళ్లు ఉన్నా కూటమి ప్రభుత్వం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తుందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహిళలపై దాడులకు దిగిన వైనం పశు వధను నిలిపివేయాలని బాధితులు కర్మాగారం వద్ద నిరసనలు తెలుపుతూ వ్యాన్లను అడ్డుకుంటే దాడులు చేశారు. రోడ్డుపై బైఠాయిస్తే కేసులు పెట్టారు. పశువధను నిలిపించమని కాళ్లు పట్టుకుంటామన్నామని, రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేసినప్పటికీ కూటమి ప్రభుత్వానికి కనికరం లేదని బాధితులు మండిపడుతున్నారు. శాంతియుతంగా చేస్తున్న నిరసన శిబిరాలను పోలీసులు తొలగించారని, ఇదంతా కూటమి నేతల కనుసన్నల్లోనే జరుగుతుందని బాధిత వర్గాలు బాహాటంగానే విమర్శిస్తున్నాయి. టీడీపీ, జనసేన కార్యాలయాలకు వెళ్లినా.. పశువధ శాల బాధితులు తాడోపేడే తాడేపల్లిలోనే తేల్చుకుంటామని మంగళగిరిలోని టీడీపీ, జనసేన కార్యాలయాలకు బస్సులు వేసుసుని వెళ్లి వినతిపత్రాలు అందచేశారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ను కలిసి ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ ఫలితం లేదు. పశువధకు సంబంధించి తణుకు నియోజకవర్గంలో చోద్యం చూస్తున్న జనసేన, బీజేపీ వర్గాలపైనా బాధితులు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. టీడీపీతో అంటకాగుతూ బీజేపీ నాయకులు సైతం పశుఘోషలో భాగస్వామ్యమయ్యారని మండిపడుతున్నారు. మూడు జిల్లాల నుంచి పశువుల తోలకం తణుకు మండలం తేతలి గ్రామ పరిధిలో నిర్వహిస్తున్న పశువధ శాలకు పశ్చిమ గోదావరి జిల్లాలోని పలు గ్రామాలతోపాటు ఏలూరు, తూర్పు గోదావరి, కోనసీమ జిల్లాల నుంచి పశు బేరగాళ్లు పశువులను రవాణా చేస్తున్నారు. దొంగిలించిన గేదెలు సైతం తేతలిలోని పశువధ శాలకు తోలుకువస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పలు జిల్లాల నుంచి తమ గేదెలు దొంగిలించారంటూ పశుపోషకులు తణుకు ప్రాంతానికి వచ్చి వెతుకులాడే పరిస్థితి తెచ్చారు. గతంలో తణుకు మండలం వేల్పూరు గ్రామానికి చెందిన పశుశాలలో దొంగిలించిన రెండు ఖరీదైన గేదెలు కూడా ఇదే పశువధ శాలకు తరలించారని అందుకే పోలీసులు రికవరీ చేయలేకపోయారనే ఆరోపణలు అప్పట్లో గుప్పుమన్నాయి. ఆందోళనకు మద్దతు పలికిన వైఎస్సార్సీపీ పశువధ శాల నుంచి దుర్వాసన వస్తుందని బాధితులు నిరసన తెలిపిన వెంటనే వైఎస్సార్సీపీ హయాంలో అప్పట్లో మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు పశువధ శాల నిర్వహణకు తెరదించుతూ తాళాలు వేయించారు. కూటమి ప్రభుత్వం రాగానే తిరిగి పశువధ శాల గేట్లు తెరచుకున్నాయని, నిర్వహణ మొదలుపెట్టడంతో దుర్వాసనతో ఉండలేకపోతున్నామని స్థానిక బాధితులు రోడ్డెక్కగానే వైఎస్సార్సీపీ తరపున కారుమూరి వారికి అండగా నిలిచారు. దుర్వాసనతో ఉండలేకపోతున్నామని బాధితుల ఆందోళన టీడీపీ, జనసేన పార్టీ కార్యాలయాల్లో ఫిర్యాదు చేసినా పట్టించుకోని వైనం కర్మాగారానికి నిత్యం వ్యాన్లలో పశువులు గేదెలు అపహరణకు గురవుతున్నాయని పశుపోషకుల ఫిర్యాదు వ్యాపార, వాణిజ్య పరంగా దినదినాభివృద్ధి చెందిన పచ్చని తణుకు పరిసర ప్రాంతంలో పశువధ వద్దంటూ ప్రజలు రోడ్డెక్కినా ప్రభుత్వం దిగి రాలేదు. పశువుల నుంచి చిమ్ముతున్న రక్తం ఈ ప్రాంతానికి మంచిది కాదన్నా వినలేదు. చివరకు ఆ ప్రాంత వాసులు దుర్వాసనతో ఇళ్లలో ఉండలేకపోతున్నామని రోడ్డెక్కితే కేసులు పెట్టారు. పంచాయితీ ఎన్ఓసీ లేదని, ఆ కర్మాగారానికి ఎలాంటి అనుమతులు లేవని, వారు చూపిన సౌకర్యాలు అక్కడలేవని నిర్ధారణ చేసినా కానీ రాజకీయ ప్రోత్సాహంతో పశువధ నేటికీ ముమ్మరంగా సాగుతోంది. – జల్లూరి జగదీష్, గోసేవాసమితి సభ్యులు -
చోరీపై కేసు నమోదు
జంగారెడ్డిగూడెం: స్థానిక పద్మ థియేటర్ సమీపంలో తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ జరిగింది. మాచవరపు రాము ఈ నెల 12న కుటుంబసభ్యులతో విశాఖపట్నం వెళ్లాడు. ఈ నెల 17న తిరిగి వచ్చి చూసుకునే సరికి ఇంటి తాళాలు పగులగొట్టి ఉన్నాయి. బీరువాలో ఉంచిన బంగారు చెవిదుద్దులు, చైన్ చోరీకి గురైనట్లు గుర్తించారు. కేసు నమోదుచేసినట్లు ఎస్సై షేక్ జబీర్ తెలిపారు. భీమవరం: అండర్–19 బాల్ బ్యాడ్మింటన్ రాష్ట్ర స్థాయి పోటీలకు టి.జ్ఞానేశ్వర్ ఎంపికయ్యాడు. ఈ విషయాన్ని సోమవారం భీమవరం విష్ణు కాలేజీ ఫిజికల్ డైరెక్టర్ వెల్లడించారు. జ్ఞానేశ్వర్ గన్నవరం సిద్ధార్థ మెడికల్ కాలేజీలో ఈ నెల 17న జరిగిన ఎంపిక పోటీల్లో ప్రతిభ చాటడంతో అతన్ని రాష్ట్రస్థాయికి ఎంపిక చేశారని చెప్పారు. పాలకొల్లు సెంట్రల్: క్షీరారామలింగేశ్వరస్వామి ఆలయంలో సోమవారం సప్తప్రదక్షిణల్లో భాగంగా మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సాయంత్రం ప్రదోషకాలంలో భక్తులు ప్రదక్షిణలు మొదలుపెట్టారు. ప్రదక్షిణల అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులకు ప్రసాద వితరణ చేశారు. రాత్రి 7.30 గంటలకు స్వామికి పంచహారతులు కార్యక్రమం నిర్వహించారు. ఆలయ ఈవో ముచ్చర్ల శ్రీనివాసరావు, సూపరింటెండెంట్ పసుపులేటి వాసు, ఆలయ అర్చకులు వీరబాబు తదితరులు పాల్గొన్నారు. ముదినేపల్లి రూరల్: భార్యతో పాటు ఇద్దరు బిడ్డలు కనిపించకుండా పోయారంటూ వ్యక్తి చేసిన ఫిర్యాదుపై స్థానిక పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం మండలంలోని శ్రీహరిపురానికి చెందిన సనక రవీంద్ర తాపీపని చేస్తుంటాడు. రవీంద్ర, భార్య లక్ష్మీశిరీష మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ నెల 15న భార్య లక్ష్మీశిరీష తనతో పాటు కుమారులను తీసుకుని బయటకు వెళ్లిపోయింది. గ్రామంలో వెతకడంతో పాటు అత్తమామలను విచారించగా తమ వద్దకు రాలేదని చెప్పారు. ఈ నేపథ్యంలో భార్యపిల్లలు కనిపించడం లేదంటూ స్టేషన్లో సోమవారం ఫిర్యాదు చేయగా ఎస్సై వీరభద్రరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. జంగారెడ్డిగూడెం: యుువతి అదృశ్యంపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై షేక్ జబీర్ తెలిపారు. స్థానిక ప్రైవేట్ కాలేజీలో డిగ్రీ చదువుతున్న యువతి ఈనెల 17వ తేదీ ఉదయం కాలేజీకి వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. యువతి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. -
ఎడతెగని వాన
సాక్షి, భీమవరం: పశ్చిమ, మధ్య వాయవ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తన ప్రభావంతో సో మవారం జిల్లా అంతటా వర్షం కురిసింది. పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి. జనజీవనం స్తంభించింది. 32 వేల ఎకరాల్లో పంట పొలాలు నీట మునిగాయి. జిల్లాలో 15.4 మి.మీ. సగటు వర్షపాతం నమోదైంది. వేకువజాము మొదలై మధ్యాహ్నం వరకు వర్షం పడుతూనే ఉంది. కొన్నిప్రాంతాల్లో సాయంత్రం వరకు జల్లులు కొనసాగాయి. పాలకొల్లు, ఉండి, నరసాపురం, పెనుగొండ, తణుకు ప్రాంతాల్లో ఎక్కువగా, తాడేపల్లిగూడెం, భీమవరం, ఆకివీడు, అత్తిలి తదితర చోట్ల మో స్తరుగా వర్షం కురిసింది. పల్లపు ప్రాంతాలు, రోడ్లు జలమయమయ్యాయి. అధిక శాతం మంది ఇళ్లకే పరిమితం కాగా విద్యాసంస్థలు, కార్యాలయాలు, షాపులకు వెళ్లేవారు రాకపోకలకు ఇబ్బందులు పడ్డారు. జనం లేక మార్కెట్లు వెలవెలబోయాయి. రోడ్లు మరమ్మతుల్లో భాగంగా తూతూమంత్రంగా గుంతలు పూడ్చడంతో వర్షాలకు రాళ్లుపైకి లేచిప్రమాదభరితంగా తయారయ్యాయి. నీటమునిగిన పంట పొలాలు కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలతో పంట పొలాలు నీటమునిగాయి. జిల్లాలోని 2.8 లక్షల ఎకరాల్లో రైతులు తొలకరి సాగు చేస్తున్నారు. 88 శాతం విస్తీర్ణంలో నాట్లు పూర్తయ్యాయి. డెల్టా ఎగువ ప్రాంతమైన తాడేపల్లిగూడెం, ఉండి, భీమవరం, తణుకు నియోజకవర్గాల్లో నాట్లు దాదాపు పూర్తికాగా ఆచంట, నరసాపురం, పాలకొల్లు నియోజకవర్గాల్లోని శివార్లలో ఇంకా సాగుతున్నాయి. ముందుగా నాట్లు వేసిన చోట చేలు పిలకలు వేసే దశలో ఉన్నాయి. వర్షాలతో జిల్లావ్యాప్తంగా దాదాపు 32 వేల ఎకరాల్లో పొలాలు నీట మునిగినట్టు వ్యవసాయ వ ర్గాల ప్రాథమిక అంచనా. తాడేపల్లిగూడెం తదితర ప్రాంతాల్లో ఐదు రోజులుగా పొలాలు నీట మునిగి ఉన్నాయని, నాట్లు పనికి రాకుండా పోతాయని రైతులు చెబుతున్నారు. వర్షం తెరిపివ్వకుంటే మరిన్ని పొలాలు నీట మునిగే అవకాశం ఉందంటున్నారు. రెండు, మూడు రోజుల క్రితం ఊడ్చిన పొలాల్లోని నాట్లు పైకి తేలిపోతుండటం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. పొలాల్లోని ముంపు నీరు బయటకు పోయేందుకు రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని, నాట్లు వేసిన నీట మునిగి మొక్కలు చనిపోతే మనేదలు వేసుకోవాలని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు. వరిలో జాగ్రత్తలు తప్పనిసరి ముంపు పొలాల్లో నష్టనివారణకు మార్టేరులోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డా. ఎం.గిరిజారాణి పలు సూచనలు చేశారు. ● నారుమడి లేక ఎద పద్ధతిలో విత్తిన పొలం నీట మునిగితే మొలక శాతం తగ్గుతుంది. విత్తిన వారం రోజుల నుంచి నెల రోజుల్లో ఐదు రోజులకు పైగా నారుమడి నీట మునిగి ఉంటే నారు దెబ్బతినే అవకాశం ఉంది. వీలైనంత తొందరగా నీటిని బయటకు తీసివేసి, తర్వాత 5 సెంట్ల నారుమడికి ఒక కిలో యూరియా, కిలో పోటాష్ వేయాలి. ఈ వాతావరణంలో తెగుళ్లు సోకకుండా లీటరు నీటికి ఒక గ్రాము కార్బెన్డిజిమ్ లేదా 2.0 గ్రాములు కార్బెన్డిజిమ్, మాంకోజెబ్ కలిపి పిచికారీ చేసుకోవాలి. ● పిలకల దశలో సాధారణ రకాలు ఐదు రోజుల వరకు, ఎంటీయూ 1064, పీఎల్ఏ 1100 వారం రోజుల వరకు ముంపును తటు్ుట్కంటాయి. ఆకులు పైకి కనిపిస్తూ 30 నుంచి 40 సెంటీమీటర్ల నీరు నిలబడే పల్లపు ప్రాంతల్లోని మధ్యస్థ ముంపుని కూడా తట్టుకుంటాయి. ● ఎంటీయూ 1232 రకం 10 నుంచి 12 రోజుల పాటు తాత్కాలిక ముంపును కూడా తట్టుకుంటుంది. పిలకలు కట్టే దశలో నీట మునిగిన వరి పొలం త్వరగా పుంజుకోవడానికి, వీలైనంత త్వరగా నీటిని తీసివేసి ఎకరానికి 20 కిలోల యూరియా, 10 నుంచి 15 కిలోల పొటాష్ అదనంగా వేయాలి. అత్తిలి మండలం కొమ్మరలో నీట మునిగిన పొలాలు జేసీ రాహుల్కుమార్ రెడ్డి భీమవరం (ప్రకాశంచౌక్): భారీ వర్షాల నేపథ్యంలో అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని జేసీ టి.రాహుల్కుమార్రెడ్డి సూచించారు. భీమవరం కలెక్టరేట్ నుంచి అధికారులతో ఆయన వెబ్ఎక్స్ ద్వారా సమీక్షించారు. రానున్న రెండు రోజులు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని, అప్రమత్తంగా ఉంటూ ఎప్పటికప్పుడు సమాచారాన్ని జిల్లా యంత్రాంగానికి అందించాలన్నారు. ముంపు చేలల్లో నీరు బయటకు వెళ్లేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. కాలువలు, డ్రెయిన్లలో అడ్డంకులు తొలగించాలన్నారు. గట్లు బలహీనంగా ఉంటే పటిష్టం చేయాలన్నారు. లోతటు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. తాగునీరు కలుషితం కాకుండా చూడాలన్నారు. వర్షాలు తగ్గుముఖం పట్టే వరకూ జిల్లాలోని సచివాలయ సిబ్బంది షిఫ్టుల వారీగా విధుల నిర్వహించాలన్నారు. అధికారులంతా జిల్లా ప్రధాన కేంద్రంలోనే ఉండాలన్నారు. కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటుచేశామని, 24 గంటలు సేవలందిస్తారన్నారు. నిండా ముంచేను స్తంభించిన జనజీవనం లోతట్టు ప్రాంతాలు జలమయం 32 వేల ఎకరాల్లో నీట మునిగిన చేలు జిల్లాలో 15.4 మి.మీ సగటు వర్షపాతం నమోదు గణపవరం: మండలంలో భారీ వర్షాలతో దెబ్బతిన్న చేలను జేసీ టి.రాహుల్కుమార్రెడ్డి పరిశీలించి నష్టం వివరాలు తెలుసుకున్నారు. జల్లికొమ్మరలో నీట మునిగిన సార్వా పైరును పరిశీలించా రు. వియర్ మురుగుకోడు కారణంగా 500 ఎక రాల పైరు నీట మునిగిందని, ఐదు రోజులుగా నా ట్లు నీటిలో ఉన్నాయని రైతులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. శాశ్వత పరిష్కారంగా పంట, మురుగు కాలువలను పూర్తిస్థాయిలో తవ్వాలన్నా రు. పంటల బీమా పరిహారం ఇప్పించాలని కో రారు. ప్రభుత్వానికి నివేదిక సమర్పించి రైతులకు న్యాయం జరిగేలా చూస్తానని జేసీ అన్నారు. ముందుగా తహసీల్దార్ కార్యాలయాన్ని ఆయన తనిఖీ చేసి మ్యూటేషన్ ఫైల్స్ను పరిశీలించారు. వ్యవసా య అధికారి జెడ్. వెంకటేశ్వరరావు, తహసీల్దార్ వైకేవీ అప్పారావు, ఏఓ ఆర్ఎస్ ప్రసాద్ ఉన్నారు.మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ వర్షాల కారణంగా తాడేపల్లిగూడెం, పెంటపాడు మండలాల్లో ముంపు ప్రాంతాల్లో మాజీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ పర్యటించారు. కె.పెంటపాడు, బోడపాడు, వల్లూరుపల్లి, మంజిపాడు, యనమలపల్లి తదితర గ్రామాల్లో పంట పొలాలు, లోతట్టు ప్రాంతాలను పరిశీలించి రైతులు, స్థానికులతో మాట్లాడారు. డ్రెయిన్లు లాగక ఐదు రోజులుగా పొలాల్లోని ముంపు నీరు బయటకు పోవడం లేదని, నాట్లు ఎందుకు పనికి రాకుండా పోతాయని రైతులు వాపోయారు. ఈ సందర్భంగా పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ డిమాండ్ చేశారు. -
శ్రీనివాసుడి దివ్య పవిత్రోత్సవాలు ప్రారంభం
ద్వారకాతిరుమల: శ్రీవారి ఆలయానికి దత్తత దేవాలయమైన లక్ష్మీపురంలోని శ్రీ సంతాన వేణుగోపాల జగన్నాథ, వేంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీనివాసుడి దివ్య పవిత్రోత్సవాలు సోమవారం రాత్రి అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు యాగశాలలో అంకురార్పణ కార్యక్రమాన్ని జరిపి, ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. ఆలయంలో ఏడాది పొడవున తెలిసీ, తెలియక జరిగిన తప్పుల ప్రాయఃశ్చిత్తం నిమిత్తం ఈ పవిత్రోత్సవాలను నిర్వహించడం ఇక్కడ సంప్రదాయం. దివ్య పవిత్రోత్సవాల్లో భాగంగా మంగళవారం పవిత్రాధివాసం, బుధవారం పవిత్రారోహణ కార్యక్రమాలు జరుగుతాయని, గురువారం జరిగే పవిత్రావరోహణ, మహా పూర్ణాహుతితో ఉత్సవాలు పరిసమాప్తం అవుతాయని శ్రీవారి ఆలయ ఈఓ ఎన్వీ సత్యనారాయణ మూర్తి తెలిపారు. యలమంచిలి: అంబేడ్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం విశ్వేశ్వరాయపురం గ్రామానికి చెందిన గోకవరపు కృష్ణ (32) ఆదివారం గోదావరిలో గల్లంతైన సంగతి తెలిసిందే. అతని కోసం గోదావరిలో గాలించగా సోమవారం సాయంత్రం మృతదేహం లభ్యమైంది. దీంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పాలకొల్లు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్ కానిస్టేబుల్ శాంసన్రాజు తెలిపారు. దెందులూరు: కొల్లేరులో గేదెలు మేపడానికి వెళ్లిన వ్యక్తి నీట మునిగి మృతి చెందాడు. పైడి చింతపాడు గ్రామ వీఆర్ఓ శ్రీరామమూర్తి కథనం ప్రకారం పైడిచింతపాడు గ్రామానికి చెందిన నోరు రామారావు (38) స్థానికంగా కూలి పనులు చేస్తూ జీవిస్తున్నాడు. ఆదివారం గేదెలు మేపడానికి కొల్లేరులోకి వెళ్లిన వ్యక్తి తిరిగి రాలేదు. సోమవారం ఉదయం కొల్లేరులో శవమై దొరికాడు. అతను వికలాంగుడు కావడంతో నీట మునిగి మృతి చెంది ఉంటాడని భావిస్తున్నారు. ఈ ఘనపై పోలీసులకు సమాచారం ఇచ్చామన్నారు. -
నిరుపేదల బతుకులు రోడ్డు పాలు
ఉండి: డ్రెయిన్ గట్టున ఉంటున్న వారి గుడిసెలను కూలగొట్టి విద్యుత్ మీటర్లు తొలగించి వారిని వెళ్లగొట్టారు. నిరుపేదలైన ఏమీ చేయలేరు కదా అని వారిపై అధికారులు జులుం చేశారు. విద్యుత్ మీటర్లను పట్టుకుపోయారు. సోమవారం ఉదయం ఉండి 33 కేవీ విద్యుత్ సబ్స్టేషన్ వద్ద కొందరు పేదలు అధికారులను వేడుకుంటూ నిలబడ్డారు. ఈ సందర్భంగా వారి ఆవేదనంతా వెలిబుచ్చారు. కొంతకాలం క్రితం నుంచి ఉండిలో మసీదుకు ఎదురుగా అరుంధతీపేటకు వెళ్ళే దారిలో బొండాడ డ్రెయిన్ పక్కనే గుడిసెలు వేసుకుని ఉంటున్నారు. వాటికి విద్యుత్ మీటర్లు మంజూరు చేశారు. దీంతో నీడ లేక నానాపాట్లు పడుతున్న వారి జీవితాల్లో వెలుగులు వచ్చాయనుకున్నారు. ఊరూరా తిరిగి వేషాలు వేసుకుని జీవించే వారి జీవితాలకు ఒక స్థిర నివాసం, అడ్రస్సు ఏర్పడింది. రేషన్ కార్డు, ఆధార్ కార్డులు లభించాయి. వారి పిల్లలు ప్రస్తుతం స్థానిక ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్నారు. గౌరవప్రదంగా జీవించాలని వారు కన్న కలలు కూటమి నాయకుల రూపంలో దూరమవుతుందని వారు కలలో కూడా అనుకోలేదు. కూటమి నాయకులు చేసిన పనికి నాలుగు గుడిసెల్లో వుంటున్న 8 కుటుంబాలకు చెందిన నిరుపేదలు నిలువనీడ లేక రోడ్డుపై నిలబడ్డారు. స్థానిక ఎమ్మెల్యే ఏదో కడుతున్నారని గుడిసెలను తొలగించారు. ఇప్పటికీ ఏ పని ప్రారంభించలేదు. తమ జీవితాలు చిందర చేశారంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు. కాళ్లావేళ్లా పడ్డా కరుణించని అధికారులు అధికారులను, ప్రజాప్రతినిధులను ఎదురించే ధైర్యం లేక ఎంతో మందిని సహాయం కోసం అర్థించారు. ఎవ్వరూ ముందుకు రాకపోవడంతో వారికున్న కొన్ని సామాన్లు తీసుకుని ఉండిలోనే విద్యుత్ సబ్స్టేషన్ పక్కనే ఓ ఖాళీస్థలంలో బరకాలు, పాతబట్టలతో గుడిసెలు వేసుకున్నారు. ఒకవైపు విషసర్పాలు, మరోవైపు చిమ్మచీకటితో వారి జీవితాలు దుర్భరంగా మారాయి. పిల్లలు చదువులకు దూరం కావడంతో ఏం చేయాలో పాలుపోక సోమవారం విద్యుత్ అధికారులకు దండాలు పెడుతూ ఆఫీసు ముంగిట భార్య బిడ్డలతో నిలబడ్డారు. మమ్మల్ని కనికరించి మాకు విద్యుత్ మీటర్లు ఇప్పిస్తే మా బతుకులు మేం బతుకుతాం.. మాకు దారి చూపించండి బాబూ అంటూ కాళ్ళా వేళ్లా పడ్డారు. గత ఎన్నికల్లో కూటమి నాయకులు ఎన్నో వాగ్దానాలు చేశారని.. మా జీవితాల్లో చాలా అభివృద్ది వస్తుందని ఊహించిన వారికి నిలువనీడ లేకుండా పోతుందని అనుకోలేదని వారు ఆవేదన చెందుతున్నారు. విద్యుత్ మీటర్లు తొలగించాలని పంచాయతీ కార్యదర్శి అనిల్ లెటర్ పెట్టారని, అందుకే మీటర్లను తొలగించామని ఏఈ పులగం శ్రీనివాస్ తెలిపారు. పంచాయతీ కార్యదర్శిని వివరణ కోరేందుకు సంప్రదించగా ఆయన అందుబాటులో లేరు. బొండాడ డ్రెయిన్ గట్టుపైన గుడిసెలు కూల్చివేత నీడలేక నానా పాట్లు పడుతున్న పేదలు 15 మంది చిన్నారులు చదువులకు దూరం నా చిన్నతనం నుంచి ఉండిలోనే వుంటున్నాం. బతికేందుకు జాగా లేదు. చివరకు ఉండి బొండాడ డ్రెయిన్ పక్కగా గుడిసెలు వేసుకుని ఒక జీవితాన్ని ప్రారంభించాం. మా పిల్లలకు మా పరిస్థితి రాకుండా మంచి జీవితం ఇవ్వాలనుకున్నాం. ఇప్పుడు మా ఇళ్లు అడ్డొస్తున్నాయని తీసేసారు. తనుకు గొల్లమ్మ, బాధితురాలు, ఉండి మా పిల్లల్లి బాగా చదివించుకోవాలని స్కూళ్ళకు పంపుతున్నాం. మా గుడిసెలు తొలగించి మా పిల్లల చదువులకు అడ్డుపడ్డారు. మా పిల్లలు బడికి రావడం లేదని టీచర్లు ఫోన్లు చేస్తున్నారు. మేము రోజుకొక చోట ఉంటున్నాం. అందుకే మా పిల్లల్ని బడికి ఎలా పంపాలి. తనుకు మరిడమ్మ, బాధితురాలు, ఉండి -
జ్వరాల విజృంభణ
కాళ్ల మండలం బొండాడపేటకు చెందిన కె.లక్ష్మణరావుకు జ్వరం రావడంతో మూడు రోజులు ఇంటి వద్దే ఉన్నాడు. అప్పటికీ తగ్గకపోవడంతో భీమవరం ప్రభుత్వాస్పత్రిలో చేరి మూడు రోజుల నుంచి చికిత్స పొందుతున్నాడు. భీమవరానికి చెందిన లక్ష్మి అనే మహిళ ఆరు రోజులుగా జ్వరంతో బాధపడుతూ భీమవరం ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యం పొందుతున్నారు. భీమవరానికి చెందిన ఎండీ నిషార్ అనే వ్యక్తి వారం రోజులుగా జ్వరంతో బాధపడి భీమవరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇంటి వద్ద రెండు, మూడు రోజులపాటు జ్వరంతో బాధపడిన తర్వాత ఆస్పత్రిలో చేరాడు. ఇలా జిల్లావ్యాప్తంగా జ్వరాల కేసులు నమోదవుతున్నాయి. భీమవరం (ప్రకాశం చౌక్): జిల్లాలో వాతావరణంలో మార్పులు, క్షీణించిన పారిశుద్ధ్యం, దోమల బెడదతో జ్వరాలు విజృంభిస్తున్నాయి. కొద్ది రోజులపాటు ఎండ వేడిమి, మరి కొద్దిరోజులపాటు భారీ వర్షాలు వ్యాధులు ప్రబలేందుకు కారణమవుతున్నాయి. దీంతో జిల్లావ్యాప్తంగా వైరల్, టైఫాయిడ్ కేసులు నమోదవుతున్నాయి. జిల్లాలోని 20 మండలాల్లో 409 గ్రామాలు ఉండగా ప్రతి గ్రామంలో జ్వరపీడితులు కనిపిస్తున్నారు. జ్వరం వచ్చి రెండు, మూడు రోజులపాటు తగ్గకపోవడంతో ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. ఇలా పట్టణాల్లో ఆస్పత్రుల్లో రోజుకు 20 వరకు జ్వరాల కేసులు నమోదవుతున్నాయి. దీంతోపాటు ప్లేట్లెట్స్ తగ్గి ఆస్పత్రుల్లో చేరుతున్న వారు ఉంటున్నారు. సుమారు 1,500 కేసులు ఆగస్టు నెల ప్రారంభం నుంచి జ్వరపీడితులు పెరుగుతున్నారు. జిల్లాలో ఈనెల 11 నుంచి 17 వరకు 19 టైఫాయిడ్, ఒక డెంగీ కేసు నమోదయ్యాయి. జనవరి నుంచి ఇప్పటివరకూ 2 డెంగీ కేసులు నమోదయ్యాయి. ఈ నెలలో పది రోజుల్లో సుమారు 1,500కు పైగా జ్వరాలు కేసులు నమోదయినట్టు అంచనా. వైద్యారోగ్య శాఖ అధికారులు రక్తనమూనాలు సేకరించిన వారి వివరాలు మాత్రమే లెక్కల్లో చూపిస్తున్నారు. అయితే వాస్తవంగా జ్వరాల కేసులు చాలా ఎక్కువగా ఉంటున్నాయి. అరకొర సేవలు జిల్లాలోని ప్రభుత్వాస్పత్రుల్లో జ్వరపీడితులకు అరకొర వైద్య సేవలు అందుతున్నాయి. జనరల్ మెడిసిన్, ఎండీ స్థాయి వైద్యుల కొరత ఉంది. అలాగే సరైన రక్తపరీక్ష ల్యాబ్లు లేకపోవడం, ఉన్న ల్యాబ్లో సిబ్బంది కొరతతో పూర్తిస్థాయిలో సేవలందడం లేదు. దీంతో ప్రైవేట్ ఆస్పత్రులకు జనం క్యూ కడుతున్నారు. వాతావరణంలో మార్పులతో వ్యాధులు వైరల్, టైఫాయిడ్ బారిన ప్రజలు అధ్వానంగా పారిశుద్ధ్యం దోమల నివారణ చర్యలు శూన్యం 1,500కు పైగా కేసుల నమోదు దోమల నివారణకు చర్యలు లేవు జిల్లాలో వైరల్, టైఫాయిడ్ జ్వరాలు విజృంభిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దోమల నివారణకు చర్యలు తీసుకోకపోవడం కనీసం బ్లీచింగ్, ఫాగింగ్ చేయడం లేదని పట్టణవాసులు వాపోతున్నారు. పలుచోట్ల డ్రెయినేజీ నీరు రోడ్లపై ప్రవహిస్తోంది. రోడ్డు మార్జిన్లు చెత్తతో నిండిపోతున్నాయి. వైద్యారోగ్య శాఖ అధికారుల నిర్లక్ష్యంతో జ్వరాల కేసుల వివరాలు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడం లేదని పలువురు అంటున్నారు. వైద్యారోగ్య శాఖ అధికారులు లెక్కల్లో తక్కువ జ్వరాల కేసులు చూపిస్తున్నారని ఆరోపిస్తున్నారు. జ్వరాలపై సరైన సర్వే జరగడం లేదని తెలుస్తోంది. -
చివరి దశకు గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణం
చింతలపూడి: జిల్లాలో ఖమ్మం, దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే రహదారి పనులు చివరి దశకు చేరుకున్నాయి. భూములు ఇచ్చిన రైతులకు సర్వీసు రోడ్లు నిర్మించి అభివృద్ధి చేయాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. హైదరాబాద్– విశాఖ మధ్య దూరం తగ్గించడమే ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం. హైదరాబాద్– విశాఖపట్నం మధ్య 56 కిలోమీటర్ల దూరం తగ్గడమేకాక ప్రయాణ సమయం కూడా తగ్గుతుంది. 162 కిలోమీటర్ల నిడివి గల ఈ రహదారిలో 8 నుండి 10 ఇంటర్చేంజ్ పాయింట్లు ఉంటాయి. గంటకు 120 కిలోమీటర్ల వేగంతో కార్లు, 100 కిలోమీటర్ల వేగంతో భారీ వాహనాలు ప్రయాణించేలా హైవే నిర్మాణం చేపడుతున్నారు. కేంద్ర ఉపరితల రవాణా శాఖామంత్రి నితిన్ గడ్కడీ, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిలు రెండు ఫేజ్లలో చేపట్టనున్న ఈ జాతీయ రహదారి నిర్మాణానికి 2023లో శంకుస్థాపన చేసి పనులకు శ్రీకారం చుట్టారు. ఏలూరు జిల్లాలో 72 కిలోమీటర్ల మేర ఈ జాతీయ రహదారి నిర్మాణం చేపడుతున్నారు. 70 మీటర్ల వెడల్పుతో ఎకనామిక్ కారిడార్గా ఈ రహదారిని వర్గీకరించారు. జిల్లాలో రెండు దశల్లో నిర్మాణం చేపట్టనున్న ఈ ప్రాజెక్టును పూణేకు చెందిన బెకం ఇన్ఫ్రా సంస్ధ చేపట్టింది. ఖమ్మం జిల్లా కృష్ణాపురం, తుంబూరు వద్ద నుంచి ఆంధ్రప్రదేశ్లోకి ఈ జాతీయ రహదారి ప్రవేశిస్తుంది. చింతలపూడి మండలం, రేచర్ల గ్రామం నుంచి గుర్వాయిగూడెం వరకు 4 లేన్ల రహదారి నిర్మాణానికి 569.37 కోట్లు, గుర్వాయిగూడెం నుంచి దేవరపల్లి వరకు 711.94 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. మెట్ట ప్రాంతంలో నేషనల్ హైవే అందుబాటులోకి రానుండడంతో రవాణా సదుపాయాలు మెరుగయ్యే అవకాశం ఉంది. రహదారి కోసం మొత్తం 1,411 ఎకరాల భూమి అవసరమవుతుంది. అందులో 114 ఎకరాలు ప్రభుత్వ భూమి కాగా 1,297 ఎకరాలు సేకరించారు. గ్రీన్ ఫీల్డ్ రహదారి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం రూ.4,609 కోట్ల అంచనాలతో మొత్తం ఆంధ్ర, తెలంగాణాలో కలిపి 5 దశల్లో రహదారి నిర్మాణ పనులు చేపడుతున్నారు. సర్వీసు రోడ్ల హామీ నెరవేర్చాలి: రైతులు అయితే తమ వద్ద భూములు సేకరించే సమయంలో అధికారులు పంట పొలాల్లోకి వెళ్ళడానికి సర్వీసు రోడ్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారని, తీరా రహదారి నిర్మాణం పూర్తి కావస్తున్నా సర్వీసు రోడ్లు అభివృద్ధి చేయలేదని ఆరోపిస్తున్నారు. చింతలపూడి మండలంలో రేచర్ల, జంగారెడ్డిగూడెం మండలం పుట్లగట్లగూడెం వద్ద తప్ప ఎక్కడా గ్రీన్ ఫీల్డ్ రోడ్ ఎక్కే ఎంట్రీ పాయింట్ లేదు. దీంతో రైతులు, చిరు వ్యాపారులు తమ ఉత్పత్తులను సరుకులను అటు రాజమండ్రి, ఇటు విశాఖ, ఖమ్మం, హైద్రాబాద్ మార్కెట్లకు తీసుకుపోవాలంటే రేచర్ల , జంగారెడ్డిగూడెం లేదా ఖమ్మం జిల్లా వేంసూరు వద్ద తప్ప ఎక్కడా గ్రీన్ ఫీల్డ్ రోడ్డెక్కే వీలే లేదు. అండర్పాస్ బ్రిడ్జ్లు కూడ ఎత్తు తగ్గించి నిర్మించడంతో పామాయిల్ గెలల లోడ్ ట్రాక్టర్లు, లారీలు , బోర్వెల్స్ లారీలు వెళ్ళ డానికి అవకాశం లేదు. కనీసం అండర్ పాస్ బ్రిడ్జిల ఎత్తు పెంచి నిర్మించినా రైతులకు కొంత మేర ఉపయోగంగా ఉండేది. జిల్లాలో 72 కిలోమీటర్ల మేర నాలుగు లేన్ల రహదారి సర్వీసు రోడ్లు నిర్మించాలని కోరుతున్న రైతులు అండర్ పాస్ బ్రిడ్జ్లు తక్కువ ఎత్తు నిర్మించారని విమర్శలు భూములిచ్చిన రైతుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలి. సర్వీసు రోడ్లు అభివృద్ధి చేసి రైతులు పంట భూముల్లోకి వెళ్ళడానికి చర్యలు తీసుకోవాలి. రేచర్ల, వేంసూరు, జంగారెడ్డిగూడెం ఎంట్రీ పాయింట్లకు వెళ్ళి తిరిగి రావాలంటే రైతులు అనేక వ్యయ ప్రయాసలకు గురి కావాలి. గ్రీన్ ఫీల్డ్ రోడ్ పక్కనున్న గ్రామాల ప్రజలకు సైతం రోడ్డు ఎక్కే అదృష్టం లేదు. సమస్యను పరిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలి. –కంభం విజయరాజు, వైఎస్సార్సీపీ నియోజకవర్గ కన్వీనర్, చింతలపూడి -
గోదావరి వడివడి.. కొల్లేరులో అలజడి
సాక్షి ప్రతినిధి, ఏలూరు/కైకలూరు/పోలవరం/కుక్కునూరు: ఓ వైపు గోదావరి ఉధృతం.. మరోవైపు ప్రధాన కాలువల నుంచి కొల్లేరుకు భారీగా వచ్చి చేరుతున్న నీటితో ఏలూరు జిల్లాను వరద చుట్టుముడుతోంది. ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరువలో గోదావరి, కొల్లేరు నీరు చేరడంతో లంక, ముంపు గ్రామాల్లో ఆందోళన నెలకొంది. అల్పపీడన ప్రభావంతో జిల్లాతో పాటు ఎగువన కురుస్తున్న వర్షాలతో గోదావరి, శబరి నదులతో పాటు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. రెండు రోజుల్లో మొత్తంగా 9 లక్షల క్యూసెక్కుల నీరు ఎగువ ప్రాంతాల నుంచి పోలవరం ప్రాజెక్టుకు చేరింది. సోమవారం భద్రాచలం వద్ద 38 అడుగుల మేర నీటిమట్టం చేరింది. పోలవరం ప్రాజెక్టు స్పిల్వే 31.050 మీటర్ల ఎత్తు నుంచి 6,70,355 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. మరో 48 గంటల పాటు వరద ఉధృతి కొనసాగి మంగళవారం మొదటి ప్రమాద హెచ్చరిక జారీ అయ్యే అవకాశం ఉంది. గోదావరి, శబరికి ఎగువ నుంచి 15 లక్షలకుపైగా క్యూసెక్కుల నీటి ప్రవా హం కొనసాగుతుందని అంచనా. ముంపు మండలాల్లో.. వేలేరుపాడు మండలంలోని కొయిదా, కట్కూరు, సిద్ధారం, కాచారం, పూసుకుంది, తాళ్ల గొంది,పేరంటపల్లి, టేకుపల్లి, టేకూరు, బుర్రారెడ్డిగూడెం, ఎర్రమెట్ట, ఎడవల్లి, చిట్టం రెడ్డిపాలెం, మరో ఐదు గ్రామాలకు మండల కేంద్రంతో సంబంధాలు తెగి పోయాయి. ఎద్దుల వాగు వంతెన నీట మునగడంతో నాటు పడవ ద్వారా రాకపోకలు కొనసాగిస్తున్నారు. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ అయితే వేలేరుపాడులో పునరావాస శిబిరం ఏర్పాటు చేసి ఐదు గ్రామాల ప్రజలను తరలించడంపై అధికారులు దృష్టి సారించారు. కుక్కునూరులో గుండేటివాగు వంతెన నీటముగింది. ఉధృతంగా కొల్లేరుకొల్లేరు పూర్తి జలకళతో నిండుకుని రోడ్లపైకి నీరు చేరుతోంది. కృష్ణా జిల్లా నుంచి బుడ మేరు, రామిలేరు, తెలంగాణ నుంచి మున్నేరు, తమ్మిలేరుకు వరద ప్రవాహం ఉండటంతో అన్ని కాలువలు కొల్లేరులో కలుస్తున్నాయి. దీంతో ఆదివారం నుంచి కొల్లేరు లంక గ్రామాల్లో అలజడి మొదలైంది. సోమవారం మండవల్లి మండలం పెదఎడ్లగాడి వంతెన వద్ద 2.5 అడుగుల నీటిమట్టం నమోదైంది. ఉమ్మడి కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల నుంచి 67 డ్రెయిన్ల ద్వారా 1.10 లక్షల క్యూసెక్కుల నీరు కొల్లేరుకు చేరుతుంది. నీరంతా కై కలూరు నియోజకవర్గం మండవల్లి మండలం పెదఎడ్లగాడి, చినఎడ్లగాడి, పోల్రాజ్ కాల్వల ద్వారా ఉప్పుటేరు మీదుగా సముద్రంలో కలుస్తుంది. వాస్తవానికి కొల్లేరుకు చేరుతున్న 1.10 లక్షల క్యూసెక్కుల నీటిలో 12 వేల క్యూసెక్కుల నీరు మాత్రమే దిగువకు వస్తుంది. పెనుమాకలంకకు రాకపోకలు బంద్ మండవల్లి మండలం పెదఎడ్లగాడి నుంచి పెనుమాకలంక, నందిగామలకం, ఇంగిళిపాకలంక గ్రామాలకు చేరే రహదారిపై మూడు ప్రాంతాల్లో వరద నీరు ప్రవహిస్తోంది. పెదఎడ్లగాడి నుంచి పడవలపై ప్రజలు రాకపోకలు సాగిస్తున్నారు. పెనుమాకలంక రహదారి వద్ద ప్రవేశం లేదని పోలీసులు ఫ్లెక్సీ ఏర్పాటుచేశారు. మండవల్లి మండలంలో పులపర్రు, కొవ్వాడలంక, మణుగునూరులంక, తక్కెళ్లపాడు, చింతపాడు గ్రా మాలు, కై కలూరు మండలంలో పందిరిపల్లిగూడెం, కొట్డాడ, శృంగవరప్పాడు, పెంచికలమర్రు గ్రామా లు నీట మునిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. గుబులు పుట్టిస్తున్న గుర్రపుడెక్క కొల్లేరుకు చేరే నీటిని సముద్రానికి పంపించే ప్రధా న పెదఎడ్లగాడి వంతెనకు 56 ఖానాలకు గాను 20 ఖానాల్లో గుర్రపుడెక్క పేరుకుపోయింది. పొక్లెయిన్ తో డెక్కను తొలగిస్తున్నారు. గుర్రపుడెక్క పరిష్కారానికి శాశ్వత చర్యలు తీసుకోవాలని కొల్లేరు పరీవాహక ప్రజలు కోరుతున్నారు. డెక్కతో పచ్చటి తివాచీ పరుచుకున్నట్టు కొల్లేరు కనిపిస్తోంది. జిల్లాను చుట్టుముడుతున్న వరద పరవళ్లు తొక్కుతున్న గోదావరి తమ్మిలేరు, బుడమేరు, రామిలేరు నుంచి కొల్లేరులోకి నీరు పెనుమాకలంకకు రాకపోకలు బంద్ వేలేరుపాడులో ముంపులోనే ఎద్దులవాగు వంతెన పోలవరం నుంచి 6.70 లక్షల క్యూసెక్కులు దిగువకు.. -
రాష్ట్రంలో విద్యావ్యవస్థ నాశనం
భీమవరం: రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం విద్యావ్యవస్థను భ్రష్టు పట్టిస్తోందని, పేద విద్యార్థులు సక్ర మంగా చదువుకునే అవకాశం లేకుండా చేస్తోందని వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు అరిగేల అభిషేక్ ధ్వజమెత్తారు. విద్యావ్యవస్థలో ప్రభుత్వ అసంబద్ధ నిర్ణయాలను నిరసిస్తూ వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో సోమవారం భీమవరం అంబేడ్కర్ సెంటర్లో నిరసన తెలిపారు. అభిషేక్ మాట్లాడుతూ మాజీ సీఎం వైఎస్ జగన్ నాడు–నేడు పథకంతో సర్కారీ బడులను కార్పొరేట్కు దీటుగా తీర్చిదిద్దారని, పాఠశాలలు, కళాశాలల్లో మౌలిక వసతుల కల్పనతో పాటు విద్యార్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించారన్నా రు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక్క పాఠశాలను అభివృద్ధి చేయకపోగా.. పాఠశాలలు, హాస్టళ్లలో సమస్యలు తాండవిస్తున్నాయన్నారు. సమస్యల తాండవం జిల్లా ఉపాధ్యక్షుడు తమనంపూడి సూర్యరెడ్డి, స్టేట్ జాయింట్ సెక్రటరీ గంటా రాహుల్ మాట్లాడుతూ ఇటీవల వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో పాఠశాలలు, హాస్టళ్లను సందర్శించి అక్కడి సమస్యలను కలెక్టర్ నాగరాణి దృష్టికి తీసుకువెళ్లామన్నారు. ప్రభుత్వ విద్యాసంస్థలు, హాస్టళ్లలోని అవకతవకలు, ఇబ్బందులను ప్రజల దృష్టికి తీసుకువస్తుండటంతో విద్యార్థి సంఘాలు, రాజకీయ నాయకులు విద్యాసంస్థలు, హాస్టళ్లలోకి వెళ్లకూడదని మంత్రి నారా లోకేష్ ఉత్తర్వులు జారీ చేయడం అన్యాయమన్నారు. ఆ ఉత్తర్వులను వెంటనే వెనక్కి తీసుకోవాలని, లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. రాష్ట్రంలో యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించకుండా కూటమి ప్రభుత్వం నిరుద్యోగులను దగా చేస్తోందన్నారు. జిల్లా జాయింట్ సెక్రటరీ నేకూరి గణేష్, తాడేపల్లిగూడెం రూరల్ ప్రెసిడెంట్ తాడిపల్లి అనిల్ కుమార్, తాడేపల్లిగూడెం రూరల్ ఉపాధ్యక్షుడు జాలపర్తి సురేష్, సెక్రటరీ కొండపల్లి శివనాగ ఉదయ్ భాస్కర్, తణుకు నియోజకవర్గ ప్రెసిడెంట్ ఎడ్వర్డ్ పాల్, మేడిది జూన్సన్, అర్జున్ తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం నిరసన -
వంగవీటి రంగా హత్యపై జనసేన ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
సాక్షి, పశ్చిమ గోదావరి: తాడేపల్లిగూడెం జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వంగవీటి మోహన రంగాను ప్రభుత్వంతోనే చంపించారని అన్నారాయన. ఆరుగోలనులో సోమవారం రంగా విగ్రహ ఆవిష్కరణ సభలో బొలిశెట్టి మాట్లాడుతూ.. తనకు ప్రాణ రక్షణ కల్పించండి అని రంగా నిరాహార దీక్ష చేశారు. అలాంటి సమయంలో కొంత మంది నాయకులు ప్రభుత్వంతోనే ఆయన్ని చంపించారు అని అన్నారు. బొలిశెట్టి వ్యాఖ్యలతో అక్కడ ఒక్కసారిగా కలకలం రేగింది. ప్రస్తుతం ఆ కామెంట్లపై చర్చ నడుస్తోంది. ఇదిలా ఉంటే.. రంగా హత్య సమయంలో అధికారంలో టీడీపీ ప్రభుత్వం ఉన్న సంగతి తెలిసిందే. విజయవాడలో నిరహార దీక్షలో ఉన్న రంగాను 1988 డిసెంబర్ 26న కొందరు దుండగులు స్వామిమాలలో వచ్చి హత్య చేశారు. ఈ ఘటన తర్వాత విజయవాడలో తీవ్ర అల్లర్లు చెలరేగగా.. 40 రోజులపాటు కర్ఫ్యూ కొనసాగింది. ఆయన హత్య రాజకీయ, కుల, సామాజిక నేపథ్యంతోనే జరిగిందనే చర్చా ఇప్పటికీ నడుస్తోంది. -
ముంచుతున్న ముసురు
పెనుగొండ : వరుస ముసుర్లు సార్వా సాగును నిండా ముంచుతున్నాయి. గత వారం కురిసిన భారీ వర్షాలకు జిల్లాలో 21 వేల ఎకరాలు ఇంకా వర్షపు నీటి ముంపులోనే ఉన్నాయి. మరోవైపు ఆదివారం తెల్లవారుజాము నుంచి నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షంతో రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. భారీ వర్షాలకు పొలాలు చెరువులను తలపిస్తున్నాయి. ఇప్పటికే ఎకరాకు రూ.15 వేల వరకూ పెట్టుబడి పెట్టారు. జిల్లాలో 2.08 లక్షల ఎకరాల్లో సార్వా సాగుకు సన్నద్ధం కాగా, ఇప్పటికి 1.84 ఎకరాల్లో నాట్లు పూర్తి చేశారు. ఆచంట దిగువ, యలమంచిలి, నర్సాపురం మండలాల్లో నాట్లు పూర్తి చేయాల్సి ఉంది. ఈ తరుణంలో ముసుర్లు ప్రారంభం కావడంతో నాట్లు వేయడం మరింత ఆలస్యమవుతోంది. ఇదిలా ఉండగా, వరినాట్లు పూర్తి చేసిన 16 మండలాలకుగాను 164 గ్రామాల్లో సుమారు 21 వేల ఎకరాలు నీటి మునిగినట్లు అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. అత్తిలి, పెనుమంట్ర, ఆచంట, పెనుగొండ, పోడూరు, తణుకు, తాడేపల్లిగూడెంలో ముంపు తీవ్ర త అధికంగా ఉంది. మురుగు డ్రెయిన్ల ఆక్రమణలతో మురుగు కిందకు ప్రవహించే అవకాశం లేకుండా పోవడంతో రెండు మూడు రోజులుగా ముంపులోనే వరిచేలు ఉన్నాయి. దీంతో నాట్లు కుళ్లుపోయే అవకాశం ఉందని రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. ఏటా ముంపే.. ఈ ఏడాది రైతన్నల దుస్థితి అయోమయంగా మారింది. నిన్న మొన్నటి వరకూ అధిక ఎండ తీవ్రతతో సాగునీటి కొరతను ఎదుర్కొన్నారు. ఒక్కసారిగా వారంలోనే పరిస్థితి తారుమారైంది. సార్వా సాగు ఆదిలోనే ముసుర్లు ముంచుకొచ్చాయి. ఒక్కసారిగా భారీగా కురుస్తున్న వర్షాలతో ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఏపుగా ఎదిగిన వరిచేలు ముంపునకు గురి కావడంతో ఆవేదనకు గురవుతున్నారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో నాట్లు ముందుగా వేసిన రైతులు మొదటి దఫా ఎరువులు సైతం పూర్తి చేశారు. ముఖ్యంగా జిల్లాలో నక్కల డ్రయిన్, తాడేరు డ్రయిన్, గోస్తనీ నదుల ప్రాంతంలో ఉన్న వరిచేలు ఏటా ముంపునకు గురవుతూ తీవ్ర నష్టాన్ని మిగులుస్తున్నాయి. ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోకపోవడం వలనే మురుగు డ్రెయిన్ల వెంట ఉన్న రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ముంపునకు గురైన వరిచేలను గుర్తించి నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ముసురుతో వరిచేలు మునగడంతో కౌలు రైతు తీవ్రంగా నష్టపోతున్నాడు. ఇప్పటికే వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టాం. రెండు, మూడు రోజులుగా ముంపులోనే వరి చేలు ఉన్నాయి. ప్రభుత్వం కౌలు రైతును గుర్తించి నష్టపరిహారం అందించాలి. – రాపాక మోజేస్, కౌలు రైతు, పెనుగొండ నక్కల డ్రెయిన్లో ఆక్రమణలతో వరిచేలు మునుగుతున్నాయి. నక్కల డ్రెయిన్ ప్రక్షాళన ఇప్పటి వరకూ చేపట్టలేదు. అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకొన్నా పట్టించుకొన్న నాథుడే కరువయ్యాడు. 15 ఏకరాలు కౌలుకు చేస్తున్నా. పూర్తిగా నక్కల డ్రెయిన్ ముంపులోనే ఉన్నాయి. – నరసన్న, కౌలు రైతు,పెనుగొండ వరుస ముసుర్లుతో వరిచేలన్నీ ముంపునకు గురయ్యాయి. గోస్తనీ నదీ పరివాహక ప్రాంతమంతా నీట మునిగింది. ఏటా ఇదే పరిస్థితి నెలకొంటుంది. నాట్లు వేసిన తరువాత ముంపుతో వరి నాట్లు కుళ్లిపోతున్నాయి. మరోసారి నాటుకోవాల్సి వస్తోంది. – అంగర నాగరాజు, రైతు, పెనుమంట్ర ఇప్పటికీ ముంపులోనే 21 వేల ఎకరాలు తాజాగా మరోసారి ముసురుతో ఆందోళన డ్రెయిన్ల ఆక్రమణలతో ఏటా నష్టపోతున్న రైతులు -
పెన్షనర్లపై ప్రభుత్వం చిన్నచూపు
భీమవరం: రిటైర్డ్ ఉద్యోగులు, కార్మికుల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని ఆల్ పెన్షనర్స్, రిటైర్డ్ పర్సన్న్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే సత్తిరాజు ఆరోపించారు. ఆదివారం స్థానిక యూటీఎఫ్ కార్యాలయంలో టి.గంగరాజు అధ్యక్షతన జరిగిన జిల్లా సదస్సులో మాట్లాడుతూ పెన్షనర్లు తీవ్రంగా నష్టపోతున్నారని, ప్రతి సంవత్సరం వడ్డీ కింద రూ.54 వేల కోట్లు వస్తుంటే కేవలం రూ.14 వేల కోట్ల రూపాయలతో పెన్షన్లు ఇస్తున్నామని గొప్పలు చెప్పుకోవడం రిటైర్డ్ ఉద్యోగులు, కార్మికుల్ని మోసం చేయడమేనని ఆయన వివరించారు. రిటైర్డ్ ఉద్యోగులకు డీఏ ఇతర సౌకర్యాన్ని ఆపాలని నిర్ణయం తీసుకోవడం దారుణమని విమర్శించారు. ఈపీఎఫ్ పెన్షన్దారులకు కనీసం రూ.9000 పెన్షన్ ఉండాలని దేశవ్యాప్తంగా ఆందోళన జరుగుతుంటే కేంద్ర ప్రభుత్వం నీరెత్తినట్టుగా ఉండడం పాలకుల విధానాలను తెలియజేస్తుందని ఆరోపించారు. రాష్ట్రంలో పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని ఉద్యోగులు, ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉంటే ఎన్నికల ముందు వాగ్దానాలు చేసిన పాలకులు ఎన్నికల అనంతరం విస్మరించడం తగదని పేర్కొన్నారు. పెన్షనర్స్ సమస్యలపై ఈ నెల 25న కలెక్టరేట్ల వద్ద జరిగే నిరసన కార్యక్రమాన్ని, సెప్టెంబర్ 13న విజయవాడలో జరిగే రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఉద్యోగ ఉపాధ్యాయ ఫంక్షన్ హాల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు జి.జేమ్స్, అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి అజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
భారీ వర్షాలతో అప్రమత్తం
భీమవరం (ప్రకాశంచౌక్): భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. గంటకు 30–40 కి.మీ. వేగంతో తీరం వెంట ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంత ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని కలెక్టర్ సూచించారు. గోదావరికి వరద ఉధృతి దృష్ట్యా నదిలోకి వెళ్లవద్దని, ఈతకు వెళ్లడం, చేపలు పట్టడం వంటివి చేయవద్దన్నారు. లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి ప్రాణ, ధన నష్టం జరగకుండా చూడాలని సూచించారు. వైద్య ఆరోగ్య శాఖ ద్వారా అత్యవసర మందులు, క్లోరిన్, బ్లీచింగ్ తదితర సామగ్రితో సిద్ధంగా ఉండాలన్నారు. వ్యవసాయ అధికారులు, ఇరిగేషన్ అధికారులు వర్షాలు తగ్గే వరకు జాగ్రత్తగా ఉండాలన్నారు. అత్యవసర సమయంలో వినియోగం నిమిత్తం మోటార్ బోట్లు, గత ఈతగాళ్లను సిద్ధంగా ఉంచాలన్నారు. అధికారులంతా ప్రధాన కేంద్రాల్లోనే ఉండాలని, ఎవరికీ సెలవులు లేవని చెప్పారు. కలెక్టరేట్లో 08816 299181 నెంబరుతో కంట్రోల్ రూం ఏర్పాటు చేశామన్నారు. -
●బండి కాదు.. మొండి
ఆర్టీసీ బస్సులు ఎక్కడపడితే అక్కడ ఆగిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. జంగారెడ్డిగూడెం నుంచి ఏలూరు వెళ్తున్న ప్యాసింజర్ బస్సు కామవరపుకోట మండలం కొత్తూరు బస్టాండ్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఒక్కసారిగా ఆగిపోయింది. ప్రభుత్వం ఉచిత బస్సు అంటూ కాలం చెల్లిన బస్సులు తిప్పడమేంటని మహిళలు విమర్శిస్తున్నారు. ప్రయాణికులు ఎంత తోసినా బస్సు ముందుకు కదలకపోవడంతో చేసేది లేక, అక్కడే వదిలిపెట్టి, ప్రయాణికులను వేరే బస్సులో పంపించారు. – కామవరపుకోట -
ఆక్వాకు వాయు‘గండం’
గణపవరం: వాతావరణంలో తీవ్రమైన మార్పులు ఆక్వా సాగుకు గండంగా మారాయి. భారీవర్షాలు, చల్లబడిన వాతావరణం ఆక్వా సాగుకు ప్రతికూలంగా మారింది. ట్రంప్ సుంకాల దెబ్బతో విలవిల్లాడుతున్న రొయ్య రైతులు ప్రస్తుత వాతావరణ మార్పులతో బెంబేలెత్తిపోతున్నారు. వేసవిలో ఆదుకోవాల్సిన రొయ్యసాగు రైతును కుదేలు చేసింది. ఎడాపెడా తెగుళ్లు ఆశించడంతో రొయ్యల చెరువులు ఖాళీ అయ్యాయి. మరోవైపు చేప ధర తగ్గిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఇటీవల రొయ్యల ధర ట్రంప్ సుంకాల పెంపుతో పతనమయ్యాయి. చేప ధర కూడా కిలోకు రూ.10 నుంచి రూ.15 వరకూ పడిపోయింది. రెండు నెలలుగా వాతావరణం ఆక్వా సాగుకు ఏమాత్రం కలిసి రావడం లేదు. మే నెలలో అకాల వర్షాలతో పూర్తిగా చల్లబడగా, జూన్లో వాతావరణం వేసవిని తలపించింది. జూలైలో కూడా రెండు వారాల పాటు విపరీతమైన ఎండలు, ఉక్కబోతతో వేసవిని మించిన ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వారం రోజులుగా వాతావరణం చల్లబడింది. పూటకో రకంగా మారుతున్న వాతావరణం వల్ల ఆక్సిజన్ సమస్య తలెత్తుతుంది. చేపలు, రొయ్యలకు సరిపడ ఆక్సిజన్ అందకపోవడంతో నీటి ఉపరితలంపై తిరుగాడుతూ నీరసించిపోతున్నాయి. ఈ సమస్యను అధిగమించడానికి రైతులు నిరంతరం ఏరియేటర్లు తిప్పుతున్నారు. తెగుళ్ల బారిన చేపలు, రొయ్యలు చెరువులలో ఆక్సిజన్ లోటు పూడ్చడానికి రసాయనాలు చల్లుతున్నారు. రెండు రోజులుగా వాతావరణం పూర్తిగా చల్లబడి, ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గిపోయి చేపలు, రొయ్యలు తెగుళ్ల బారిన పడుతున్నాయి. దీంతో మేతలు సరిగా తినలేక నీరసించి పోతుండటంతో రైతులు చేపలు, రొయ్యలు అర్ధంతరంగా పట్టేసి అయినకాడికి అమ్ముకుంటున్నారు. ఉమ్మడి జిల్లాలో సుమారు 1.25 లక్షల ఎకరాలలో రొయ్య, మరో 1.50 లక్షల ఎకరాలలో చేపల సాగు జరుగుతుంది. వాతావరణం ప్రతికూలంగా మారడంతో రొయ్యలకు వైరస్ వ్యాధులు, చేపలకు మొప్పతెగులు వంటివి సోకుతుండటంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. ప్రస్తుత పరిస్థితిలో రొయ్య రైతులు నష్టపోకుండా తగిన చర్యలు తీసుకోవాలని మత్స్యశాఖ అధికారులు సూచిస్తున్నారు. ఆక్సిజన్ అందక చేపలు, రొయ్యలు ఉక్కిరిబిక్కిరి -
సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలి
తాడేపల్లిగూడెం (టీఓసీ): భవన నిర్మాణ కార్మికులు, వారి కుటుంబ సభ్యుల సంక్షేమం కోసం వెల్ఫేర్ బోర్డును ఏర్పాటు చేశారు. వెల్ఫేర్ బోర్డును పునరుద్ధరిస్తామని, కార్మికులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ప్రయోజనాలు తప్పక అందజేస్తామని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు. అప్పటి నుంచి నేటి వరకు ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి సంవత్సరం పైనే అవుతున్నా, ఎన్నికల హామీలు నేటి వరకు అమలు చేయలేదని, ఇబ్బందులలో ఉన్నామని నిర్మాణ రంగ కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 60 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులుండగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 5 లక్షల మంది కార్మికులు ఉన్నారు. వెల్ఫేర్ బోర్డులో సభ్యులుగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో సుమారుగా 1.20 లక్షల మంది నమోదు చేసుకున్నారు. ఒక వైపు పనులు లేకపోవడం, మరో వైపు నిత్యావసర ధరలు, అన్ని రకాల ధరలు ఆకాశాన్ని అంటుతున్న నేపధ్యంలో ఇప్పటికే కార్మికులు ఆవేదనలో ఉన్నారు. దీంతో చేసేది లేక భవన నిర్మాణ కార్మిక సంఘాలు హక్కుల సాధన కోసం పోరుబాట పట్టాయి. ఇసుకను అందుబాటులోకి తీసుకురావాలని, బోర్డును క్రియాశీలం చేసి పటిష్ట పరచాలని, అన్ని సంక్షేమ పథకాలు అమలు చేయాలని, భవన నిర్మాణ కార్మికుల సొమ్మును భవన కార్మికులకు ఖర్చు పెట్టాలని, బోర్డులో నెంబర్లును నియమించాలని కార్మికులు కోరుతున్నారు. ఆందోళనలు ఉధృతం ఇప్పటికే వార్డు సచివాలయాలు, తహసీల్దార్ కార్యాలయాలు, అసిస్టెంట్ లేబర్ కార్యాలయాలు వద్ద, జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన చేశారు. ధర్నాలు నిర్వహించి అధికారులకు సమస్యలు పరిష్కరించాలని వినతులు ఇచ్చారు. రాష్ట్రంలోని అందరు ఎమ్మెల్యేలకు, వెల్ఫేర్ బోర్డు చైర్మన్కు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ విన్నవించారు. పోస్టుకార్డుల ఉద్యమం చేపట్టారు. త్వరలో సమస్యల పరిష్కారం చూపుతామని అంటున్నారు తప్ప సమస్యలు తీర్చే పరిస్థితి కానరావడం లేదని నిర్మాణ రంగ కార్మికులు వాపోతున్నారు. కార్మికుల డిమాండ్లు ● భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును క్రియాశీలం చేసి పటిష్ట పరచాలి. ● బోర్డులో కార్మికుల నమోదు ప్రక్రియను సులభతరం చేసేందుకు వార్డు, గ్రామ సచివాలయంలో నమోదు చేయడానికి అవకాశం కల్పించాలి. ● పెండింగ్లో ఉన్న క్లైయిమ్స్ పరిష్కరించాలి, వెల్ఫేరు బోర్డులో నమోదైన కార్మికులకు వెంటనే గుర్తింపు కార్డులు మంజూరు చేయాలి ● వయోభారం లేదా అనారోగ్యం కారణంగా పని నుంచి విరమించుకున్న కార్మికులకు వెల్ఫేర్ బోర్డు ద్వారా పెన్షన్ మంజూరు చేయాలి ● ప్రమాదాలు వల్ల అనారోగ్యం వల్ల మంచాన పడిన కార్మికులకు వెల్ఫేర్ బోర్డు ద్వారా ఈఎస్ఐ తరహాలో ఉచిత వైద్య సౌకర్యం కల్పించాలి. ● భవన నిర్మాణ కార్మికులకు ఐదు రోజులు ఆసుపత్రిలో ఉండాలనే నిబంధన తొలగించాలి. ఆందోళన బాటలో భవన నిర్మాణ కార్మికులు భవన నిర్మాణ కార్మికులకు అందించే ఏకై క విభాగం వెల్ఫేర్ బోర్డు. బోర్డు ప్రస్తుతం అందుబాటులో లేదు. ఎన్నికల సమయంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు. వెల్ఫేర్ బోర్డును పునరుద్ధరించి, పెండింగ్ క్లైయింలు పరిష్కారం చేస్తామని చెప్పారు. బోర్డును తక్షణమే పునఃప్రారంభించాలి. వెల్ఫేర్ బోర్డును పునరుద్ధరించకుంటే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం. – మైలవరపు శ్రీరాంబాబు, ఆర్గనైజింగ్ సెక్రటరీ, జిల్లా భవన నిర్మాణ కార్మిక సంఘం భవన నిర్మాణ కార్మికులకు ప్రభుత్వం అందించాల్సిన సంక్షేమ పథకాలు నిలిచిపోవడంతో కార్మిక కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. బోర్డు నిధులను కార్మికుల సంక్షేమానికి, భద్రతకు, బీమాకు ఖర్చుచేయాలి. చేతినిండా పనులు లేక అనేక ఇబ్బందులు పడుతున్నాం. సంక్షేమాలు అమలు చేయకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తాం. – సింగవరపు సునీల్, ప్రధాన కార్యదర్శి నవాబుపాలెం భవన నిర్మాణ కార్మిక సంఘం -
గుగాంపునకు మెర్లిన్ అవార్డు
పెనుగొండ: అంతర్జాతీయ ఇంద్రజాలికుడు గుగాంపునకు ప్రతిష్టాత్మకమైన అమెరికన్ మెర్లిన్ అవార్డు వరించింది. ఈ మేరకు డాక్టర్ గుగాంపు వివరాలు వెల్లడించారు. అమెరికాలోని లాస్ వెగాస్లో ఆగస్టు 7న జరిగిన కార్యక్రమంలో మెర్లిన్ అవార్డును అందుకున్నట్లు తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా దేశవిదేశాల నుంచి ఈ అవార్డుకు 37 మంది అంతర్జాతీయ ఇంద్రజాలికులు ఎంపికయ్యారని తెలిపారు. 2016లో మొదటిసారి ఈ అవార్డు తీసుకున్నట్లు తెలిపారు. ఆకివీడు: దివ్యాంగులకు రీ–అసెస్మెంట్లో కొత్త సదరం ధ్రువపత్రాలు ఇవ్వకుండా పింఛన్లు తొలగించడం దారుణమని వికలాంగుల సంక్షేమ సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు అల్లాడి నటరాజు ఆవేదన వ్యక్తంచేశారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ సదరం ఇచ్చేంతవరకూ పింఛన్లపై జారీ చేసిన నోటీసులు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కొత్త ధ్రువీకరణ పత్రాలు ఇచ్చేంతవరకూ పింఛన్లు మంజూరు చేయాలన్నారు. భీమవరం (ప్రకాశంచౌక్): అల్పపీడనం కారణంగా రానున్న మూడు రోజులు అధిక వర్షాల నేపథ్యంలో నేడు నిర్వహించాల్సిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను రద్దు చేశామని కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. ఏలూరు (ఆర్ఆర్పేట): నిబంధనలకు విరుద్ధంగా పెదవేగి మండలం రామచంద్రపురం జెడ్పీ పాఠశాలలో ఉపాధ్యాయుడిని డిప్యుటేషన్పై పెదవేగి పాఠశాలకు పంపిన ఎంఈఓ–1పై చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ 1938 అకడమిక్ కమిటీ కన్వీనర్ గుగ్గులోతు కృష్ణ, అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రామ్మోహన్ రావు, మోహన్ రావు ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. రామచంద్రపురం పాఠశాలలో 100 మంది విద్యార్థులకు సోషల్ బోధించే ఉపాధ్యాయులు లేకపోవడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారన్నారు. ఏలూరు(మెట్రో): రైతులకు ఎరువులు విక్రయించిన తరువాత ఆ వివరాలను ఐఎఫ్ఎంఎస్ పోర్టల్లో నమోదు చేయాలని జిల్లా వ్యవసాయ అధికారి హబీబ్ బాషా అన్నారు. ఆదివారం పెదవేగి, కామవరపుకోట మండలాల్లో ఎరువుల షాపులను తనిఖీ చేశారు. డీలర్లు యూరియా, ఇతర ఎరువులను విక్రయించిన తక్షణమే పోర్టల్లో నమోదు చేయాలన్నారు. -
పశ్చిమాన అందాల కోన
బుట్టాయగూడెం: పశ్చిమ ఏజెన్సీ ప్రాంతంలో అటవీ ప్రకృతి అందాలు చూపరులను కనువిందు చేస్తున్నాయి. అరకు అందాలకు ఏ మాత్రం తీసిపోకుండా ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. చెట్ల లేలేత పచ్చదనం.. పక్షుల కిలకిలరావాలు ఇక్కడ నిత్యం వసంతాన్ని తలపిస్తాయి. కొండ వాగుల నీటి ప్రవాహాలు, ప్రకృతి వడిలో జలపాతాల హోయలు ప్రకృతి ప్రేమికుల హృదయాల్లో చిరు సవ్వడి చేస్తాయి. బుట్టాయగూడెం మండంలోని పులిరామన్నగూడెం నుంచి గోగుమిల్లి, గిన్నెపల్లి, గడ్డపల్లి, దారావాడ, చిలకలూరు మారుమూల అటవీ ప్రాంతంలో గల గ్రామాలు, ఆయా గ్రామాలకు వెళ్లే ప్రయాణంలో ప్రకృతి అందాలు ఎంతో కనువిందు చేస్తాయి. ప్రస్తుతం ఈ గ్రామాలకు సరైన రహదారి లేదు. ద్విచక్రవాహనాలు మాత్రం ప్రయాణించే సమయంలో రోడ్డుకు ఇరువైపులా పొడవైన పచ్చని చెట్లు, ఎత్తయిన కొండలు మైమరపింపజేస్తాయి. దట్టమైన అటవీప్రాంతంలో సెలయేర్లు, కనువిందుచేసే వాగులు, ఆహ్లాదాన్ని పంచే జలపాతాలు అణువణువు అందం తొణికిసలాడుతుంది. అలాగే గుబ్బల మంగమ్మ గుడి దర్శనం కూడా ఎంతో అనుభూతిని కలిగిస్తుంది. ఈ ప్రాంతాలను అభివృద్ధి చేస్తే అరకు అందాలకు ఏ మాత్రం తీసిపోదు. -
రన్నరప్గా బాలుర బాస్కెట్బాల్ జట్టు
ఏలూరు రూరల్: రాష్ట్రస్థాయి బాస్కెట్బాల్ చాంపియన్షిప్ పోటీల్లో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా బాలుర జట్టు ద్వితీయస్థానంలో నిలిచింది. ఈ నెల 14వ తేదీ నుంచి 17 వరకూ పిఠాపురంలో ఓబీసీ హైస్కూల్ గ్రౌండ్లో 10వ రాష్ట్రస్థాయి బాలబాలికల జూనియర్ బాస్కెట్బాల్ చాంపియన్షిప్ పోటీలు జరిగాయి. లీగ్ దశలో జిల్లా బాలురు జట్టు శ్రీకాకుళం జట్టుపై 25–08, విజయనగరంపై 31–11, కర్నూల్పై 58–45, గుంటూరుపై 47–31 స్కోర్ తేడాతో గెలిచి సెమీఫైనల్కు చేరింది. ఆదివారం వర్షం కురవడంతో మ్యాచ్లు జరగలేదు. దీంతో నిర్వాహకులు పూర్తిస్థాయి మ్యాచ్కు బదులుగా 5 ఫ్రీ త్రో బాస్కెట్స్ నిర్వహించి విజేతలను ప్రకటించారు. ఇందులో జిల్లా బాలుర జట్టు సెమీఫైనల్లో కృష్ణ జట్టుతో తలపడి 3–2 స్కోర్తో గెలిచింది. తర్వాత ఫైనల్లో అనంతపురం జట్టు చేతిలో 3–4 స్కోర్తో ఓటమి పాలై రన్నరప్గా నిలిచింది. అసోసియేషన్ సభ్యులు కృష్ణారెడ్డి, గవ్వ శ్రీనివాసరావు, కె మురళీకృష్ణ జట్టును అభినందించారు. బాలికల జట్టు లీగ్ దశలో ప్రకాశంపై 32–02, చిత్తూరుపై 39–13 స్కోర్తో గెలిచి, క్వార్టర్ఫైనల్లో విశాఖ జట్టు చేతిలో 57–48 స్కోర్తో ఓడి తిరుగుముఖం పట్టింది. క్వార్టర్ ఫైనల్లో ఓడిన బాలికల జట్టు -
శ్రీవారి క్షేత్రం.. భక్త జనసంద్రం
ద్వారకాతిరుమల: శ్రీవారి భక్తులు వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ఆదివారం పెద్దఎత్తున ఆలయానికి వచ్చారు. దాంతో క్షేత్ర పరిసరాలు భక్తజనంతో కళకళలాడాయి. దర్శనం క్యూలైన్లు, వైకుంఠం క్యూ కాంప్లెక్స్, అనివేటి మండపం, కల్యాణ కట్ట ఇలా అన్ని విభాగాలు భక్తులతో కిటకిటలాడాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు భక్తుల రద్దీ కొనసాగింది. వరుస సెలవులు ముగుస్తున్న నేపథ్యంలో వేలాదిగా భక్తులు ఆలయానికి విచ్చేసి స్వామివారిని దర్శించినట్టు దేవస్థానం అధికారులు తెలిపారు. బుట్టాయగూడెం: మండలంలోని మారుమూల గ్రామమైన కాపవరం సమీపంలోని అటవీప్రాంతంలో కొలువై ఉన్న గుబ్బల మంగమ్మ గుడికి ఆదివారం భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే ఉమ్మడి పశ్చి మ గోదావరి జిల్లాలతో పాటు విజయవాడ, మచిలీపట్నం, తెలంగాణ రాష్ట్రంలోని భద్రాచలం, పాల్వంచ, కొత్తగూడెం, సత్తుపల్లి, అశ్వారావుపేట ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు వాహనాల్లో తరలివచ్చి అమ్మవారికి దూపదీప నైవేద్యాలతో ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఉదయం నుంచి వర్షం కురుస్తున్నప్పటికీ భక్తులు వర్షంలోనే తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ఆలయ కమిటీ వారు, పోలీసులు ప్రత్యేక చర్యలు చేట్టారు. కై కలూరు: కొల్లేటికోట శ్రీపెద్దింటి అమ్మవారిని భక్తులు ఆదివారం భారీఎత్తున దర్శించుకున్నారు. శ్రావణమాసం కావడంతో అనేకమంది భక్తులు వివిధప్రాంతాల నుంచి వచ్చి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపారు. ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాలతో పాటు కృష్ణాజిల్లాకు చెందిన అనేక ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు విచ్చేశారు. ఈ సందర్భంగా లడ్డూ ప్రసాదం, రూమ్ల అద్దె, ఇతర మార్గాల ద్వారా ఆలయానికి రూ.40,405 ఆదాయం సమకూరినట్లు కార్యనిర్వహణాధికారి కూచిపూడి శ్రీనివాస్ తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో డ్రైవర్, క్లీనర్ మృతి
కొయ్యలగూడెం: కొయ్యలగూడెం– జంగారెడ్డిగూడెం జాతీయ ప్రధాన రహదారిపై ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ లారీ డ్రైవర్, క్లీనర్ మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. పాలకొల్లు నుంచి తెలంగాణ రాష్ట్రం బైసంకి వెళుతుండగా పవర్ గ్రిడ్ వద్దకు వచ్చేసరికి కొబ్బరికాయల లోడు ఒక వైపునకు ఒరిగింది. దీంతో డ్రైవర్ నవ్వుండ్రి రాజేష్ (30), తొడ దాసి లక్ష్మణరావు (35) లారీని రోడ్డు మార్జిన్ వైపునకు ఆపి లోడును సరి చేస్తుండగా కలకత్తా నుంచి హైదరాబాదు వెళుతున్న మరో లారీ మితిమీరిన వేగంతో వచ్చి ఢీకొట్టింది. దీంతో డ్రైవర్, క్లీనర్ల మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా ఛిద్రం అయ్యాయి. మృతుల బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై వి చంద్రశేఖర్ తెలిపారు. దెందులూరు: ద్విచక్రవాహనంపై వెళుతుండగా ప్రమాదవశాత్తూ ఓ మహిళ జారి పడిపోవడంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. వివరాల ప్రకారం ఆదివారం ద్విచక్రవాహనంపై ఏలూరు వైపు భార్యభర్తలు వెళుతుండగా జాతీయ రహదారిపై కొవ్వలి వద్దకు వచ్చేసరికి ద్విచక్రవాహనం నుంచి మహిళ ప్రమాదవశాత్తూ పడిపోవడంతో గాయాలపాలైంది. అంబులెన్స్కు ఫోన్ చేసినా సకాలంలో రాకపోవడంతో వారిని ఆశ్రమ వైద్యశాలకు తరలించి వైద్య సేవలు అందించినట్లు దెందులూరు ఎస్సై ఆర్ శివాజీ తెలిపారు. యలమంచిలి: అంబేడ్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం విశ్వేశ్వరాయపురం గ్రామానికి చెందిన గోకవరపు కృష్ణ (32) అదృశ్యంపై అతని సోదరుడు నాగ ప్రసాద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆదివారం కేసు నమోదు చేసినట్లు హెడ్ కానిస్టేబుల్ శాంసన్రాజు తెలిపారు. కృష్ణ ఒక ప్రైవేట్ కంపెనీలో చిరుద్యోగి. కృష్ణాష్టమి పండుగ సందర్భంగా శనివారం రాత్రి ఉట్టి వేడుక చూడడానికి ఇంటి నుంచి బయటకు వచ్చాడు. రాత్రి ఇంటికి వెళ్లకపోవడంతో సోమవారం ఉదయం నుంచి గాలిస్తుండగా కృష్ణ బైక్, చెప్పులు చించినాడ వంతెనపై కనిపించాయి. దీంతో అతడి అన్న నాగ ప్రసాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి కృష్ణ కోసం గోదావరిలో గాలిస్తున్నట్లు హెడ్ కానిస్టేబుల్ శాంసన్రాజు తెలిపారు. -
జోరుగా రేషన్ బియ్యం అక్రమ రవాణా
నూజివీడు: రేషన్ బియ్యం అక్రమ రవాణాకు నూజివీడు అడ్డాగా మారింది. రేషన్ మొబైల్ వాహనాలను ఎత్తేసి నెల రోజులు గడిచిందో లేదో రేషన్ బియ్యం అక్రమ రవాణా జోరందుకుంది. మొబైల్ వాహనాల వల్ల రేషన్ బియ్యం అక్రమ రవాణా పెరిగిందని సాకు చూపిస్తూ వాటిని రద్దు చేసిన ప్రభుత్వం ప్రస్తుతం జరుగుతున్న రేషన్ బియ్యం అక్రమ రవాణాపై నోరు మెదపడం లేదు. నూజివీడు ప్రాంతంలో గత నెలరోజుల వ్యవధిలోనే అక్రమంగా తరలిస్తున్న 118 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని నూజివీడు, ముసునూరు మండలంలో పట్టుకోవడం సంచలనంగా మారింది. జూలై 3వ తేదీన నూజివీడు బైపాస్ రోడ్డులో తరలిస్తున్న 51 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని, 5న నూజివీడు మండలం మొర్సపూడిలో 26 క్వింటాళ్లు, ఆగస్టు 7న ముసునూరు మండలం గుళ్లపూడిలో రేషన్ బియ్యంను అక్రమ రవాణా చేస్తుంటే విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. దీంతో రేషన్ బియ్యం అక్రమ వ్యాపారం ఎంత పెద్ద ఎత్తున జరుగుతుందో తెలుస్తోంది. పట్టణానికి చెందిన కొందరు వ్యాపారులు, మండలంలోని బత్తులవారిగూడెంకు చెందిన ప్రజాప్రతినిధి భర్త, టీడీపీకి చెందిన కార్యకర్త పెద్ద ఎత్తున బియ్యం అక్రమ వ్యాపారం చేస్తున్నాడు. అలాగే ఆగిరిపల్లికి చెందిన అధికార పార్టీకి చెందిన ఒక రేషన్ డీలరే యథేచ్ఛగా బియ్యం అక్రమ రవాణాను నిర్వహిస్తున్నాడు. అధికార పార్టీకి చెందిన వీరందరూ తమకు అడ్డుకునే వారెవరూ ఉండరనే ధీమాను వ్యక్తం చేస్తున్నారు. తమ అక్రమ వ్యాపారాన్ని మూడు లారీలు.. ఆరు ఆటోలుగా కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం ప్రతి నెలా పేదలకు పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యాన్ని వీరు కొందరు ఏజంట్ల ద్వారా సేకరించి తమ అడ్డాకు చేర్చుకొని అక్కడ నుంచి లోడులు ఎత్తుతున్నారు. కార్డుదారుల వద్ద రూ.10కు కొనుగోలు చేస్తున్న రేషన్ డీలర్లు డీలర్లు కార్డుదారుల వద్ద నుంచి రేషన్ బియ్యాన్ని కిలో రూ.10కు కొనుగోలు చేస్తున్నారు. రేషన్ బియ్యం అక్రమ రవాణా లాభాలు ఎక్కువగా ఉండటంతో కొందరు డీలర్లు ఏకంగా కార్డుదారుడి వద్దకే వెళ్లి బయోమెట్రిక్ వేయించుకొని కిలోకు రూ.10 చొప్పున చెల్లించి వెళ్తున్నారు. ఇలా సేకరించిన బియ్యాన్ని డీలర్ల వద్ద నుంచి అక్రమ రేషన్ బియ్యం వ్యాపారులు కిలో రూ.17కు కొనుగోలు చేస్తున్నారు. దీంతో ఇక్కడ డీలర్కు కిలోకు రూ.7 లాభం వస్తోంది. డీలర్ల వద్ద కొనుగోలు చేసిన బియ్యాన్ని అక్రమార్కులు కాకినాడ పోర్టుకు తరలించే మరొక పెద్ద వ్యాపారికి కిలో రూ.25 నుంచి రూ.27కు విక్రయించి కిలోకు రూ.7 నుంచి రూ.10 కు సొమ్ము చేసుకుంటున్నారు. గతంలో పట్టుబడి కేసులు పెట్టినా అక్రమ రేషన్ బియ్యం వ్యాపారాన్ని మానకుండా మళ్లీ అదే దందా నడుపుతున్నారు. బియ్యం దందాను అడ్డుకోవాల్సిన అధికారులు మొక్కుబడిగా 6ఏ కేసు పెట్టి చేతులు దులుపుకుంటున్నారు. దీంతో బియ్యం మాఫియా యథేచ్ఛగా అక్రమ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. దందాకు అడ్డాగా మారిన నూజివీడు -
ఎరువుల షాపుల్లో తనిఖీలు
కామవరపుకోట: వ్యవసాయ శాఖ జిల్లా అధికారి షేక్ హబీబ్ బాషా కాపువరపుకోట మండలంలో ఎరువుల దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పలు దుకాణాల్లో ఎరువుల నిల్వల్లో తేడాలున్నట్లు గుర్తించారు. కామవరపుకోటలోని కొండూరు రామ్మోహనరావు ఎరువుల దుకాణం వద్ద రూ.2,56,471 విలువచేసే 5 టన్నుల ఎరువులు, కొండూరు నాగేశ్వరరావు ఎరువుల షాపు వద్ద రూ.3,73,168 విలువచేసే 26.850 టన్నులు, శ్రీ సూర్య ఆగ్రోస్ షాప్లో రూ.20 వేలు విలువ చేసే 2 టన్నుల ఎరువుల నిల్వల్లో వ్యత్యాసాలు ఉండడంతో వాటి విక్రయాలను నిలుపుదల చేశారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ అధికారి మాట్లాడుతూ ప్రైవేటు డీలర్ల వద్ద యూరియా 98 మెట్రిక్ టన్నులు, సొసైటీల వద్ద 37.5 టన్నుల యూరియా నిల్వలు ఉన్నాయని, కావలసిన రైతులు అవసరం మేరకు వ్యవసాయంలో వినియోగించుకోవాలన్నారు. డీలర్లు ఎరువుల కృత్రిమ కొరత సృష్టిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో చింతలపూడి డివిజన్ సహాయ వ్యవసాయ సంచాలకులు వై. సుబ్బారావు, మండల వ్యవసాయ అధికారి డి.ముత్యాలరావు పాల్గొన్నారు. -
టెంకాయ అ‘ధర’హో
ద్వారకాతిరుమల: కొబ్బరికాయల ధరలు టాపు లేపుతున్నాయి. ఆలయాల వద్ద సైజును బట్టి రూ.25 నుంచి రూ.40కు విక్రయిస్తుండడంతో భక్తులు షాక్ అవుతున్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయాన్ని నిత్యం వేలాది మంది భక్తులు దర్శిస్తారు. అందులో అధిక శాతం మంది భక్తులు ఆలయంలో కొబ్బరికాయలు కొడతారు. అయితే కొబ్బరి కాయల ఉత్పత్తి తగ్గడంతో గత మూడు నెలల క్రితం వాటి ధరలు రెట్టింపయ్యాయి. ప్రస్తుత శ్రావణమాసంలో వివాహాది శుభకార్యాలు జరుపుకునేవారు, ఆలయాల్లో మొక్కులు తీర్చుకునే సాధారణ భక్తులు కొబ్బరికాయలు కొనేందుకు ఇబ్బంది పడుతున్నారు. ధరలు పెరగక ముందు వ్యాపారులు దళారుల వద్ద రూ.10 లకు కొన్న కొబ్బరి కాయను రూ.15కు, రూ.15 కాయను రూ.20 నుంచి రూ.25కు విక్రయించేవారు. ప్రస్తుతం దళారుల వద్ద రూ.20కు కొన్న కాయను రూ.25కు, రూ.25 కాయను రూ.30 నుంచి రూ.40కు అమ్ముతున్నారు. దాదాపు అన్ని ఆలయాల వద్ద ఇదే పరిస్థితి ఉంది. నెలకు 50 వేలకు పైగా విక్రయాలు శ్రీవారి క్షేత్రంలో చిన్నాపెద్దా మొత్తం 15 వరకు కొబ్బరికాయల దుకాణాలు ఉన్నాయి. వాటి ద్వారా వ్యాపారులు నెలకు 50 వేలకు పైగా కొబ్బరి కాయలు విక్రయిస్తారు. అయితే కొబ్బరికాయలు ధరలు బాగా పెరగడంతో గత మూడు నెలల నుంచి విక్రయాలు బాగా తగ్గాయని వ్యాపారులు చెబుతున్నారు. ప్రస్తుతం శ్రావణమాసం కావడంతో అవసరమైన వారు తప్పక కొబ్బరికాయలు కొంటున్నారు. కొందరు భక్తులైతే కొబ్బరికాయలు కొనకుండా ఆ డబ్బులను స్వామివారి హుండీల్లో వేసి దండం పెట్టుకుంటున్నారు. ఎండు కొబ్బరి, నూనె ధరలకు రెక్కలు కొబ్బరి కాయల ధరలు పెరగడంతో ఎండు కొబ్బరి, నూనె ధరలు సైతం అమాంతం పెరిగాయి. గత మూడు నెలల క్రితం కిలో ఎండు కొబ్బరి రూ.240 పలికితే, ప్రస్తుత మార్కెట్లో రెట్టింపై రూ.400కు చేరింది. కిలో కొబ్బరి నూనె గతంలో రూ.360 కాగా, ప్రస్తుత మార్కెట్లో రూ.500 పలుకుతుండటం విశేషం. కొబ్బరికాయల ధరల నియంత్రణకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని భక్తులు కోరుతున్నారు. టాపు లేపుతున్న కొబ్బరికాయ ధర సైజును బట్టి రూ.25 నుంచి రూ.40 వరకు విక్రయాలు శ్రీవారికి మొక్కు చెల్లించేందుకు క్షేత్రానికి వచ్చాను. కొండ కింద చిన్న కొబ్బరికాయను రూ.25కు కొన్నాను. ఆలయం వద్ద ఉన్న దుకాణంలో అడిగితే రూ.30, పెద్ద కాయ రూ.40 చెప్పారు. శివాలయం వద్ద షాపులో రూ.40కు అమ్ముతున్నారు. ఇదేంటని వ్యాపారులను అడిగితే మార్కెట్లో కొబ్బరికాయల ధరలు పెరిగాయని అంటున్నారు. ధరల నియంత్రణకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. – తమ్మిరెడ్డి కృష్ణ, భక్తుడు, కై కలూరు దళారుల వద్ద మేము చిన్నకాయను రూ.20కు కొంటున్నాము. వాటిని అమ్మడం చాలా కష్టంగా ఉంది. సామాన్య భక్తులు అంత ధర పెట్టి కొనడానికి ఇష్టపడటం లేదు. మొక్కులు తీర్చేవారు మాత్రమే కొబ్బరి కాయలు కొంటున్నారు. పెద్ద కాయ రూ.30 చెబుతుంటే వారు హడలిపోతున్నారు. విపరీతంగా పెరిగిన ధరల వల్ల విక్రయాలు బాగా తగ్గాయి. – యండపల్లి వీరయ్య, కొబ్బరికాయల వ్యాపారి, ద్వారకాతిరుమల -
పెద్ద పులులను సైతం హడలెత్తించే కుక్కలు..!
పశ్చిమ గోదావరి జిల్లా: అరుదైన జంతు జాలానికి నిలయమైన పాపికొండల అభయారణ్యంలో క్రూర జంతువులైన అడవి కుక్కలు (వైల్డ్ డాగ్స్) గుంపులుగా సంచరిస్తున్నాయి. ఇవి అటవీ ప్రాంతంలోని అనేక జంతువులను వేటాడుతుంటాయి. పులిని సైతం అడవి కుక్కలు భయపెట్టగలవని చెబుతుంటారు. అడవి కుక్కలు సంచరించే ప్రదేశాల్లో పులులు కూడా సంచరించవని.. వాటి ఉనికిని కనిపెట్టి తప్పించుకుని తిరుగుతాయని ఫారెస్ట్ అధికారులు చెబుతున్నారు. పరిమాణంలో ఊరకుక్కల కంటే కొంచెం పెద్దవిగా ఉండే వైల్డ్డాగ్స్ వాటి కంటే బరువు, శక్తి కలిగిన పెద్ద పులులను సైతం సమూహ శక్తితో తరిమికొట్టగలవు. అడవిలో సంచరించే అడవి పందిని ఈ వైల్డ్డాగ్స్ చిటికెలో వేటాడి ఆహారంగా మార్చుకుంటాయి. వాటి బరువుతో పోల్చుకుంటే ఎన్నో రెట్లు పెద్దవైన కణితి(సాంబార్ డీర్), మనిమేగం లాంటి పెద్ద జింక జాతి జంతువులను కూడా ఈ అడవి కుక్కల సమూహం వెంటాడి వేటాడతాయి. ఈ వైల్డ్డాగ్ గుంపులు ఒకే ప్రదేశంలో స్థిరంగా ఉండకుండా నిరంతరం వేర్వేరు ప్రాంతాలకు తిరుగుతూనే ఉంటాయి. ఇవి ఊర కుక్కల కంటే కాస్త పెద్దవిగా ఉంటాయి. వీటి తోకకు వెంట్రుకలు కుచ్చుగా ఉంటాయి. ఇవి యూరప్ దేశాల్లో నల్ల మచ్చలతో కనిపిస్తాయి. అభయారణ్యాల్లో అధికంగా సంచారం అభయారణ్యాలుగా ఉన్న పాపికొండలు, నాగార్జున సాగర్, శ్రీశైలం అభయారణ్యం, గుండ్ల బ్రహ్మేశ్వరం అభయారణ్యంలో అడవి కుక్కల సంచారం ఎక్కువగా ఉందని వైల్డ్లైఫ్ అధికారులు చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలోని కవ్వాల్ టైగర్ జోన్ పరిధిలో కూడా అడవి కుక్కల సంచారం అధికంగా ఉన్నట్లు ఫారెస్ట్ అధికారులు తెలిపారు. పాపికొండల అభయారణ్యంలో సుమారు 200 కుక్కలకు పైగా గుంపులుగా సంచరిస్తున్నట్లు గుర్తించామని ప్రస్తుతం వాటి జాడ అల్లూరి సీతారామరాజు అటవీ ప్రాంతంలో ఉన్నట్లు గుర్తించినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో గోదావరి పరీవాహక ప్రాంతాల్లో గ్రామాలు ఖాళీ అవుతున్న నేపద్యంలో ఇవి స్వేచ్ఛగా సంచరించడానికి మరింత అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. సమతుల్యతకు ప్రధాన భూమిక వైల్డ్ డాగ్స్ జీవావరణ సమతుల్యతలో ప్రధాన భూమిక పోషిస్తుంటాయి. మాంసాహార జంతువులైన చిరుత పులి, పెద్దపులి, అడవి కుక్కల సంఖ్య తగ్గిపోతే వాటి ఆహార జంతువులైన వివిధ జంతువులు, జింకల సంఖ్య అమాంతంగా పెరిగి అడవిలోని వృక్షాలు తగ్గిపోతాయి. రైతులకు ఇబ్బంది కలిగించే అడవి పందులు, జింకల సంఖ్య పెరుగుదల ప్రమాదకరంగా మారకుండా నియంత్రణలో ఈ అడవి కుక్కలు ప్రధాన భూమిక పోషిస్తాయని అధికారులు అంటున్నారు. -
పాములపర్రులో దళితులకు న్యాయం చేయాలి
ఉండి: పాములపర్రు దళితులకు న్యాయం చేయాలని బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుమ్మాపు చిత్రసేను అన్నారు. పాములపర్రులో దళితుల శ్మశాన ప్రాంతాన్ని బీఎస్పీ నాయకులు శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా చిత్రసేను మాట్లాడుతూ పూర్వీకుల ఆస్తికలున్న శ్మశాన వాటికను కాపాడుకునేందుకు ప్రాణాలైనా అర్పిద్దామని అన్నారు. శ్మశానంలో రోడ్డు వేయడానికి తెగించడమే కాకుండా వారిపైనే దాడికి తెగబడతారా అని ప్రశ్నించారు. శ్మశానంపై దళితులకు హక్కులున్నా అధికార పక్షం ఇష్టానుసారం వ్యవహరిస్తుందన్నారు. అధికారులంతా ఏకపక్షంగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిజంగా మంచి ప్రభుత్వం అయితే దళితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు కొల్లాబత్తుల ఏలియా రాజు, ఇన్చార్జి ఆలూరి చిన్నారావు, తూర్పుగోదావరి జిల్లా ఇన్చార్జి చల్లాబత్తుల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
నిర్వాసితుల సమస్యలపై పార్లమెంట్లో మాట్లాడతా
బుట్టాయగూడెం: సీపీఎం ఫ్లోర్ లీడర్, కేరళ ఎంపీ జాన్ బ్రిట్టాస్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తులసీదాస్, సీపీఎం నాయకుల బృందం శనివారం ఏజెన్సీ ప్రాంతంలో పర్యటించింది. బృంద సభ్యులు టేకూరు నిర్వాసిత కాలనీని సందర్శించారు. నిర్వాసితుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రెడ్డిగణపవరం వద్ద సభలో మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం సర్వం కోల్పోయిన నిర్వాసితుల సమస్యలు పరిష్కరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమవుతున్నట్లు కనిపించిందన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల లక్ష ఆరువేల గిరిజన కుటుంబాలు ముంపునకు గురువుతున్నాయన్నారు. నిర్వాసితులకు పునరావాసం, వసతులపై ఉత్సాహం చూపించడం లేదన్నారు. 80 శాతం గిరిజనులు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల తమ ఉనికిని కోల్పోతున్నారని వారికి సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు పూర్తి స్థాయిలో పునరావాసం, మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. నిర్వాసితుల సమస్యలను పార్లమెంట్లో మాట్లాడతానని చెప్పారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి ఏ. రవి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి. బలరామ్, తదితరులు పాల్గొన్నారు. -
శ్రీవారి భక్తులకు ‘సెల్’ కష్టాలు
ద్వారకాతిరుమల: దైవ దర్శనార్ధం ఏదైనా ఆలయానికి వెళ్లినప్పుడు దేవుడి దర్శనం కోసం క్యూలైన్లలో గంటల తరబడి వేచి ఉండటం సహజం. కానీ ద్వారకాతిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులు తమ సెల్ఫోన్లను డిపాజిట్ కౌంటర్లో భద్రపరచుకునేందుకు గంటల తరబడి క్యూ లైన్లో వేచి ఉండాల్సి వస్తోంది. ఇదంతా ఒక ఎత్తయితే కౌంటర్లో ఇచ్చిన ఫోన్లు భద్రంగా ఉన్నాయో లేదోనన్న ఆందోళన భక్తులను వెంటాడుతోంది. వివరాల్లోకి వెళితే.. శ్రీవారి దర్శనం నిమిత్తం ఆలయంలోకి వెళ్లే భక్తులు ముందుగా తమ సెల్ఫోన్లను వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్ద ఉన్న సెల్ఫోన్ డిపాజిట్ కౌంటర్లో అప్పగించాలి. భద్రపరచినందుకు ఒక్కో ఫోన్కు రూ.5 వసూలు చేస్తారు. శుక్రవారం వరకు ఒక కాంట్రాక్టర్ ఆధ్వర్యంలో నడిచిన ఈ కౌంటర్ నిర్వహణ బాధ్యతను, శనివారం నుంచి దేవస్థానమే స్వయంగా చేపట్టింది. ఈ క్రమంలో ఏర్పాటు చేసిన ఆరుగురు సిబ్బంది భక్తుల సెల్ఫోన్లను భద్రపరిచారు. ఇదిలా ఉంటే ఒక భక్తుడు తన రూ.1.50 లక్షలు విలువ చేసే సెల్ ఫోన్ పగిలిపోయిందని, దానికి సమాధానం చెప్పాలని గొడవ చేశాడు. సీసీ కెమెరాలను పరిశీలించిన అధికారులు సెల్ఫోన్ తమ వద్ద డ్యామేజ్ కాలేదని చెప్పారు. దాంతో ఆ భక్తుడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. సెల్ఫోన్ కౌంటర్ నిర్వహణకు రెండు నెలల క్రితం దేవస్థానం బహిరంగ వేలం నిర్వహించగా, ఒక కాంట్రాక్టర్ ఏడాదికి రూ.కోటి 20 లక్షలు దేవస్థానానికి చెల్లించేలా పాటను దక్కించుకున్నాడు. కౌంటర్ ప్రారంభించకుండానే చేతులెత్తేశాడు. దాంతో ఆ కాంట్రాక్టర్ పాట సమయంలో డిపాజిట్ చేసిన రూ.5 లక్షలను అధికారులు దేవస్థానం అకౌంట్కు జమ చేశారు. ఇదిలా ఉంటే మళ్లీ పాట నిర్వహించే వరకు కౌంటర్ నిర్వహణ బాధ్యతను చేబోలు రాజేష్ అనే కాంట్రాక్టర్కు అప్పగించారు. అతడు నష్టం వస్తోందని వదిలేశాడు. దాంతో భక్తుల సౌకర్యార్ధం, భద్రతా దృష్ట్యా ఆలయంలోకి సెల్ఫోన్లు అనుమతించ కూడదని దేవస్థానమే స్వయంగా ఈ సెల్ఫోన్లు భద్రపరిచే పనిని చేపట్టింది. అనుభవం లేక.. సిబ్బంది చాలక సెల్ ఫోన్ కౌంటర్ నిర్వహణలో దేవస్థానం సిబ్బందికి అనుభవం లేదు. శనివారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో సిబ్బంది కూడా చాల్లేదని తెలుస్తోంది. మధ్యాహ్నం 12 గంటల వరకు ఒక కంప్యూటర్ మీదే టికెట్లు కొట్టారు. ఆ తరువాత రెండో కంప్యూటర్ను ఏర్పాటు చేశారు. ఈ సమస్యల వల్ల భక్తులు గంటల తరబడి క్యూ లైన్లలో వేచి ఉండాల్సి వచ్చింది. స్వామివారి దర్శనానికి కంటే సెల్ఫోన్ భద్రపరచుకోవడానికే ఎక్కువ సమయం పట్టిందని భక్తులు వాపోయారు. కార్లలో దర్శనానికి వచ్చిన భక్తులు తమ ఫోన్లను వారి వాహనాల్లోనే వదిలేశారు. బైక్లపై వచ్చిన వారు క్యూలైన్లలో నిలబడక తప్పలేదు. సెల్ఫోన్లు భద్రపరిచేందుకు కౌంటర్ వద్ద క్యూ గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి కాంట్రాక్టర్లు చేతులెత్తేయడంతో దేవస్థానమే స్వయంగా చేపట్టిన వైనం అనుభవం లేక.. సిబ్బంది చాలక సమస్యలు -
నీరు లాగక.. వేదన తీరక
గణపవరం: సార్వా పైరు ఇంకా ముంపులోనే ఉంది. బుధవారం రాత్రి కనీవినీ ఎరుగని రీతిలో కురిసిన భారీ వర్షానికి మండలంలోని పలు గ్రామాల్లో సార్వా పైరు నీట మునిగింది. సుమారు 650 హెక్టార్ల విస్తీర్ణంలో పైరు నీట మునిగినట్లు ప్రాథమికంగా అంచనావేశారు. ఈ నష్టం దాదాపు రెట్టింపు ఉంటుందని రైతులు చెబుతున్నారు. కొందేపాడు, పిప్పర, కేశవరం, కోమర్రు, వెంకట్రాజపురం, సరిపల్లె, కొత్తపల్లి, గణపవరం తదితర గ్రామాలలో వరినాట్లు నీటమునిగాయి. చినరామచంద్రపురంలోని పల్లపుభూములలో నాట్లు మొత్తం నీటమునిగాయి. పిప్పర పరిసర గ్రామాలలో వరిపైరు చివరలు కనిపిస్తున్నాయి. పొలాలలో నీరు బయటకు పంపడానికి రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. చుక్కనీరు బయటకుపోయే మార్గం కనిపించడంలేదు. ఇంజిన్లు వేసి నీటిని బయటకు తోడుకుంటున్నారు. కాలువగట్లు పల్లంగా, బలహీనంగా ఉన్న చోట్ల గట్లను రైతులే మట్టి, కంకరతో పటిష్టం చేసుకుంటున్నారు. శుక్ర, శనివారాలలో వర్షం కురియక పోవడంతో పరిస్థితి కొంత కలిసివచ్చింది. -
వైఎస్సార్సీపీ బీసీ విభాగం కార్యదర్శిగా ధర్మరాజు
చింతలపూడి: వైఎస్సార్సీపీ బీసీ విభాగం రాష్ట్ర కార్యదర్శిగా జంగారెడ్డిగూడెం మండలానికి చెందిన కుక్కల ధర్మరాజును నియమిస్తూ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. తనకు రాష్ట్ర కార్యదర్శిగా అవకాశం ఇచ్చిన వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. వైఎస్సార్సీసీ బీసీ సెల్ కార్యదర్శిగా సూరిబాబు పెంటపాడు: వైఎస్సార్సీపీ రాష్ట్ర బీసీ సెల్ విభాగ కార్యదర్శిగా పెంటపాడుకు చెందిన ఎంపీటీసీ సభ్యుడు రెడ్డి సూరిబాబు నియమితులయ్యారు. ఈ మేరకు శనివారం పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. తనకు ఈ పదవి ఇచ్చినందుకు వైఎస్ జగన్మోహన్రెడ్డికి, మాజీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణకు కృతజ్ఞతలు తెలిపారు. చింతలపూడి: వైఎస్సార్సీపీ రాష్ట్ర పంచాయతీరాజ్ విభాగం కార్యదర్శులుగా చింతలపూడి మండలానికి చెందిన చిలుకూరి జ్ఞానారెడ్డి, జంగారెడ్డిగూడెం మండలానికి చెందిన మల్నీడి మోహనకృష్ణ(బాబి)లను నియమిస్తూ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. తమ సేవలను గుర్తించి రాష్ట్ర కార్యదర్శులుగా నియమించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. తణుకు అర్బన్ : పార్కింగ్ చేసిన కారులో మంటలు చెలరేగిన ఘటన శనివారం తణుకు పట్టణంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... ఇరగవరం మండలం కంతేరు గ్రామానికి చెందిన రుషి తన కుటుంబ సభ్యులతో తణుకు బ్యాంకు కాలనీలోని ఒక ప్రెవేటు ఆసుపత్రికి వచ్చారు. ఆసుపత్రి సమీపంలోని ఖాళీ స్థలంలో నానో కారు పార్కింగ్ చేసి ఆసుపత్రిలోకి వెళ్లారు. కొద్దిసేపటికే కారు నుంచి పొగలు వ్యాపించి నిమిషాల వ్యవధిలోనే మంటలు అంటుకున్నాయి. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అప్పటికే కారు పూర్తిగా దగ్థమైంది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లుగా భావిస్తున్నారు. చింతలపూడి: రాష్ట్ర స్థాయి ఆర్టిస్టిక్ యోగా పోటీలకు నాగిరెడ్డిగూడెం బాలికల గురుకుల పాఠశాల 9వ తరగతి విద్యార్థిని ఎస్.జాస్మిత ఎంపికై నట్లు పాఠశాల ప్రిన్సిపాల్ ఎస్.హేమలత తెలిపారు. ఈ సందర్భంగా శనివారం పాఠశాల ఆవరణలో విద్యార్థులను సత్కరించి వారికి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా హేమలత మాట్లాడుతూ ఈనెల 10న ఏలూరు లోని ఓల్డేజ్ హోంలో జిల్లా యోగా అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన జిల్లా స్థాయి ఆర్టిస్టిక్ పోటీల్లో ఎస్.జాస్మిత ఉత్తమ ప్రతిభ చూపి మొదటి స్థానంలో నిలిచి గోల్డ్ మెడల్ సాధించిందని చెప్పారు. మరో విద్యార్థిని అమలారాణి ట్రెడిషనల్ జూనియర్ యోగా పోటీలలో మూడో స్థానంలో నిలిచి మెడల్ సాధించిందన్నారు.మల్నీడి మోహనకృష్ణ(బాబి) చిలుకూరి జ్ఞానారెడ్డి -
నేరాలకు పాల్పడితే కఠిన శిక్షలు
ఏలూరు టౌన్: నేరాలకు పాల్పడితే కఠిన శిక్షలు తప్పదనే రీతిలో కోర్టు మానిటరింగ్ సెల్ సిబ్బంది చిత్తశుద్దితో పనిచేయాలని ఏలూరు జిల్లా అదనపు ఎస్పీ నక్కా సూర్యచంద్రరావు అన్నారు. ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఏలూరు జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ ఆదేశాలతో జిల్లాలోని కోర్టు మానిటరింగ్ సెల్ టీమ్ అధికారులు, సిబ్బందితో ఆయన సమీక్షించారు. ఏలూరు, జంగారెడ్డిగూడెం, నూజివీడు, పోలవరం పోలీస్ సబ్ డివిజన్కు చెందిన కోర్టు మానిటరింగ్ సెల్ టీమ్ సమీక్షకు హాజరయ్యారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ మాట్లాడుతూ.. నిందితులకు శిక్షలు పడేలా... బాధితులకు సత్వర న్యాయం జరిగేలా మరింత శ్రద్ధగా, సమర్ధవంతంగా పనిచేయాలని సూచించారు. నేరస్తులు తప్పించుకోకూడదని, బాధితులు పోలీస్, న్యాయస్థానాలపై నమ్మకం పెరిగేలా కృషి చేయాలని చెప్పారు. ప్రతి రోజూ కోర్టులో జరిగిన ప్రక్రియను డాక్యుమెంట్ రూపంలో స్టేషన్ అధికారికి నివేదించాలని తెలిపారు. ఏలూరు జిల్లాలో కోర్టు మానిటరింగ్ సెల్ మరింత సమర్ధవంతంగా పనిచేయాలని సూచించారు. సమీక్షలో టీడీసీ డీఎస్పీ ప్రసాదరావు, కోర్టు మానిటరింగ్ సెల్ సీఐ యం.సుబ్బారావు, డీసీఆర్బీ సీఐ హబీబ్ భాషా, సిబ్బంది ఉన్నారు. ఏలూరు (టూటౌన్): ఈ నెల 20న ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రికల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర సమావేశం శ్రీకాకుళంలో నిర్వహించనున్నట్టు యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు లింగమల్లు శ్రీనివాసరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్లకు కూటమి ప్రభుత్వం న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. సమావేశంలో పలు సమస్యలపై తీర్మానాలు చేసి సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లనున్నామని పేర్కొన్నారు. -
గంజాయి తరలిస్తున్న నలుగురి అరెస్టు
భీమడోలు: గంజాయిని తరలిస్తున్న నలుగురు యువకులను భీమడోలు పోలీసులు అరెస్ట్ చేశారు. భీమడోలు సీఐ యూజే విల్సన్ శనివారం కేసు వివరాలను వెల్లడిస్తూ.. శుక్రవారం సాయంత్రం ద్వారకాతిరుమల నుంచి భీమడోలు వైపుగా వస్తున్న వాహనాలను భీమడోలు పోలీసులు తనిఖీ చేస్తున్నారన్నారు. రెండు బైక్లపై ఉంగుటూరు మండలం చేబ్రోలుకు చెందిన మోటూకూరి శామ్యూల్, కై కరానికి చెందిన దొడ్డి లక్ష్మీనారాయణలు, తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం పుల్లలపాడుకు చెందిన దిరిసిపాము నిషాంత్, ముసళ్లకుంటకు చెందిన చీర రవిబాబు అనుమానాస్పద స్థితిలో పారిపోతుండగా పోలీసులు పట్టుకుని తనిఖీలు చేశారు. వారి నుంచి రూ. 40 వేల విలువ గల 2.13 కిలోల గంజాయిని పట్టుకున్నారు. రెండు బైక్లు, నాలుగు సెల్ఫోన్లను స్వానం చేసుకుని వారిని అరెస్ట్ చేసారు. వారిని భీమడోలు సివిల్ కోర్టులో హాజరుపర్చగా నిందితులకు రిమాండ్ విధించినట్లు సీఐ పేర్కొన్నారు. నిందితులంతా 19 నుంచి 23 ఏళ్ల లోపు వారేనని సీఐ తెలిపారు. -
గౌతు లచ్చన్న ఆదర్శనీయులు
భీమవరం(ప్రకాశంచౌక్): స్వాతంత్ర సమరయోధులు సర్దార్ గౌతు లచ్చన్న ఆదర్శనీయులని కలెక్టర్ సీహెచ్ నాగరాణి అన్నారు. శనివారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో లచ్చన్న జయంతి కార్యక్రమం నిర్వహించారు. ఆయన చిత్రపటానికి కలెక్టర్, జేసీ టి.రాహుల్కుమార్రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గౌతు లచ్చన్న మార్గం అనుసరణీయమ న్నారు. జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి కె.వెంకటేశ్వరరావు, హాస్టళ్ల అధికారులు సీహెచ్ మోహనరావు, కె.శ్రీనివాస్ పాల్గొన్నారు. -
ఉండలేక.. కట్టుకోలేక..!
కుక్కునూరు: పోలవరం ప్రాజెక్ట్లో ముంపునకు గురవుతున్న నిర్వాసిత గ్రామాల్లో ప్రజల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ప్రభుత్వం నిర్వాసితులకు పరిహారం చెల్లింపు, పునరావాస ప్రక్రియను చేపట్టకపోవడంతో నిర్వాసితులు అవస్థలు పడుతున్నారు. పరిహారం ఎప్పటిలోగా చెల్లిస్తారన్నది స్పష్టత ఇవ్వకపోవడంతో శిథిలావస్థకు చెందిన ఇళ్లలో ఉండలేక, కొత్త ఇంటి నిర్మాణం చేపట్టలేక నిర్వాసితులు ఇబ్బందులు పడుతున్నారు. విలీన మండలాల్లో ప్రభుత్వం ఇటీవల ప్రాజెక్ట్ 41.15 కాంటూర్ పరిధిలో ముంపునకు గురవుతున్న గ్రామాలకు ఆర్అండ్ఆర్ వ్యక్తిగత, ఇంటి నిర్మాణాలకు పరిహారం చెల్లించింది. అయితే ఇంకా కొందరికి పరిహారం రావాల్సి ఉంది. ప్రభుత్వం 41 కాంటూర్ అంటూ పరిహారం చెల్లించిన గ్రామాలను 2022లో వచ్చిన గోదావరి వరదలకు గిరిజనులు కనీసం ఖాళీ చేసింది లేదు. అయితే అదే వరదలో 45 కాంటూర్ అని పేర్కొన్న గ్రామాలు పూర్తిగా నీటమునిగాయి. అలా వరదలో దెబ్బతిన్న ఇళ్లనే నిర్వాసితులు బాగుచేసుకుని జీవనం సాగిస్తున్నారు. కొందరు వాటి స్థానంలో తాత్కాలికంగా కర్రలు, రేకులతో షెడ్డు వేసుకుని చుట్టూ బరకాలు కట్టుకుని బతుకుతున్నారు. స్పష్టత లేకపోవడంతో.. ప్రభుత్వం 45 కాంటూర్ పరిధి గ్రామాలకు పరిహారంపై స్పష్టత ఇస్తే ఇంటి నిర్మాణంపై ఓ నిర్ణయం తీసుకోవచ్చనే భావనలో నిర్వాసితులు వేచి చూస్తున్నారు. కొత్త ఇళ్లు నిర్మించుకుంటే, కొత్త వాటిని కాదని పాత ఇంటి విలువ ప్రకారం పరిహారం ఇస్తే నష్టపోవాల్సి వస్తుందని నిర్వాసితులు ఆవేదన చెందతున్నారు. ఇలానే 41 కాంటూర్ పరిధిలోని నిర్వాసితులు ఇప్పటికే నష్టాన్ని చవిచూశారు. అదీ కాక పరిహారం ఎప్పుడిస్తారు, గ్రామాలను ఎప్పుడు ఖాళీ చేయిస్తారు, అసలు చేయిస్తారా లేదా అనే విషయాలపై స్పష్టత లేనప్పుడు ఇంటి నిర్మాణాలపై ఎలా ముందుకు వెళతామని అంటున్నారు. 45 కాంటూర్ పరిధికి చెందిన నిర్వాసిత గ్రామాల పరిహారం విషయమై ప్రభుత్వం త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు. 2022 గోదావరి వరదకు మా గుడిసె దెబ్బతింది. దీంతో ఆ ఇంటిని సరిచేసుకుని దాని పక్కనే తాత్కాలికంగా రేకుల షెడ్డు వేసుకుని బరకాలు కట్టుకుని కుటుంబంతో నివసిస్తున్నా. ఇకనైనా ప్రభుత్వం మాకు ఆర్అండ్ఆర్ పరిహారం ఇవ్వాలి. – వేల్పుల రాజయ్య, సీఎం కాలనీ, కుక్కునూరు మండలంలో 45 కాంటూర్లో ఉన్న గ్రామాలకు పరిహారం ఎప్పడిస్తారనే విషయమై ప్రభుత్వం త్వరగా నిర్ణయం తీసుకోవాలి. పరిహారం ఇస్తారనే ఉద్దేశంతో నిర్వాసితులు పాత ఇళ్లలోనే ఉంటున్నారు. నిర్వాసితులకు త్వరితగతిన పరిహారం అందించాలి. – వీరమళ్ల ప్రవీణ్, వింజరం ముంపు గ్రామాల్లో తాత్కాలిక ఆవాసాలు పరిహారం చెల్లింపులో ప్రభుత్వ తాత్సారం నిర్వాసితులకు తప్పని అవస్థలు -
● శ్రీవారి కొండ.. భక్తజనమే నిండా
భక్తులతో మాట్లాడుతున్న ఈఓ మూర్తి ఉచిత బస్సు వద్ద భక్తులు శ్రీనివాసా గోవిందా.. వేంకట రమణా గోవిందా.. నామస్మరణలు మార్మోగాయి. వేలాదిగా వచ్చిన భక్తులు, నవ దంపతులతో చిన వెంకన్న క్షేత్రం భక్త సాగరాన్ని తలపించింది. శనివారం వేకువజాము నుంచి భక్తుల రాక మొదలైంది. ఆలయ ప్రాంగణం, దర్శనం క్యూలైన్లు, అనివేటి మండపం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్, కల్యాణ కట్ట ఇలా అన్ని విభాగాలూ కిటకిటలాడాయి. భక్తులకు అందుతున్న సౌకర్యాల ను ఆలయ ఈఓ ఎన్వీ సత్యనారాయణమూర్తి స్వయంగా పరిశీలించారు. నిత్యాన్నదాన భవనంలో అన్నప్రసాదంపై భక్తులను ఆరా తీశారు. స్వామివారి నిత్య కల్యాణ మండపంలో 192 కల్యాణాలు జరిగాయి. ఆదివారం సైతం భక్తుల రద్దీ కొనసాగనుంది. –ద్వారకాతిరుమల -
పాపికొండల్లో వైల్డ్ డాగ్స్
బుట్టాయగూడెం: అరుదైన జంతు జాలానికి నిలయమైన పాపికొండల అభయారణ్యంలో క్రూర జంతువులైన అడవి కుక్కలు (వైల్డ్ డాగ్స్) గుంపులుగా సంచరిస్తున్నాయి. ఇవి అటవీ ప్రాంతంలోని అనేక జంతువులను వేటాడుతుంటాయి. పులిని సైతం అడవి కుక్కలు భయపెట్టగలవని చెబుతుంటారు. అడవి కుక్కలు సంచరించే ప్రదేశాల్లో పులులు కూడా సంచరించవని.. వాటి ఉనికిని కనిపెట్టి తప్పించుకుని తిరుగుతాయని ఫారెస్ట్ అధికారులు చెబుతున్నారు. పరిమాణంలో ఊరకుక్కల కంటే కొంచెం పెద్దవిగా ఉండే వైల్డ్డాగ్స్ వాటి కంటే బరువు, శక్తి కలిగిన పెద్ద పులులను సైతం సమూహ శక్తితో తరిమికొట్టగలవు. అడవిలో సంచరించే అడవి పందిని ఈ వైల్డ్డాగ్స్ చిటికెలో వేటాడి ఆహారంగా మార్చుకుంటాయి. వాటి బరువుతో పోల్చుకుంటే ఎన్నో రెట్లు పెద్దవైన కణితి(సాంబార్ డీర్), మనిమేగం లాంటి పెద్ద జింక జాతి జంతువులను కూడా ఈ అడవి కుక్కల సమూహం వెంటాడి వేటాడతాయి. ఈ వైల్డ్డాగ్ గుంపులు ఒకే ప్రదేశంలో స్థిరంగా ఉండకుండా నిరంతరం వేర్వేరు ప్రాంతాలకు తిరుగుతూనే ఉంటాయి. ఇవి ఊర కుక్కల కంటే కాస్త పెద్దవిగా ఉంటాయి. వీటి తోకకు వెంట్రుకలు కుచ్చుగా ఉంటాయి. ఇవి యూరప్ దేశాల్లో నల్ల మచ్చలతో కనిపిస్తాయి. అభయారణ్యాల్లో అధికంగా సంచారం అభయారణ్యాలుగా ఉన్న పాపికొండలు, నాగార్జున సాగర్, శ్రీశైలం అభయారణ్యం, గుండ్ల బ్రహ్మేశ్వరం అభయారణ్యంలో అడవి కుక్కల సంచారం ఎక్కువగా ఉందని వైల్డ్లైఫ్ అధికారులు చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలోని కవ్వాల్ టైగర్ జోన్ పరిధిలో కూడా అడవి కుక్కల సంచారం అధికంగా ఉన్నట్లు ఫారెస్ట్ అధికారులు తెలిపారు. పాపికొండల అభయారణ్యంలో సుమారు 200 కుక్కలకు పైగా గుంపులుగా సంచరిస్తున్నట్లు గుర్తించామని ప్రస్తుతం వాటి జాడ అల్లూరి సీతారామరాజు అటవీ ప్రాంతంలో ఉన్నట్లు గుర్తించినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో గోదావరి పరీవాహక ప్రాంతాల్లో గ్రామాలు ఖాళీ అవుతున్న నేపద్యంలో ఇవి స్వేచ్ఛగా సంచరించడానికి మరింత అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. సమతుల్యతకు ప్రధాన భూమిక వైల్డ్ డాగ్స్ జీవావరణ సమతుల్యతలో ప్రధాన భూమిక పోషిస్తుంటాయి. మాంసాహార జంతువులైన చిరుత పులి, పెద్దపులి, అడవి కుక్కల సంఖ్య తగ్గిపోతే వాటి ఆహార జంతువులైన వివిధ జంతువులు, జింకల సంఖ్య అమాంతంగా పెరిగి అడవిలోని వృక్షాలు తగ్గిపోతాయి. రైతులకు ఇబ్బంది కలిగించే అడవి పందులు, జింకల సంఖ్య పెరుగుదల ప్రమాదకరంగా మారకుండా నియంత్రణలో ఈ అడవి కుక్కలు ప్రధాన భూమిక పోషిస్తాయని అధికారులు అంటున్నారు. అడవిలో సంచరించే వైల్డ్ డాగ్స్ పెద్ద పులులను సైతం ఎదిరించే ధైర్యం ఈ కుక్కల సొంతం ఆహారం కోసం నిరంతరం సంచారం -
ఉధృతంగా వరద గోదావరి
ఆదివారం శ్రీ 17 శ్రీ ఆగస్టు శ్రీ 2025సాక్షి ప్రతినిధి, ఏలూరు: గోదావరిలో మళ్లీ వరద మొదలైంది. ఈ సీజన్లో ముచ్చటగా మూడోసారి వరద తీవ్రత ప్రారంభమై నదిలో ఉధృతంగా ప్ర వహిస్తోంది. ఎగువ రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలతో గోదావరి, శబరి నదులు రెండు రోజుల నుంచి ఉధృతంగా మారాయి. శనివారం పోలవరం ప్రాజెక్టు నుంచి 4.31 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేశారు. మరో మూడు రోజులపాటు వరద ఉధృతి కొనసాగే అవకాశం ఉంది. భద్రాచలం వద్ద 29.80 అడుగులు భద్రాచలం వద్ద శనివారం 29.80 అడుగుల మేర నీరు ప్రవహిస్తుండటంతో పోలవరం ప్రాజెక్టు స్పిల్వే 29.680 మీటర్ల ఎత్తు నుంచి దిగువకు 4,31,813 క్యూసెక్కుల నీటిని సాయంత్రం 6 గంటల సమయానికి విడుదల చేశారు. ఆదివారం రాత్రికి 6 లక్షల క్యూసెక్కులు దాటుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అలాగే మరో నాలుగు రోజుల పాటు మహారాష్ట్ర, తెలంగాణలో అల్పపీడన ప్రభావంతో విస్తారంగా వర్షాలు అధికంగా కురుస్తాయని అంచనా వేశారు. దానికి అనుగుణంగా సోమవారం భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ అయ్యే అవకాశం ఉంది. తర్వాత రెండు రోజుల పాటు 6 నుంచి 7 లక్షల క్యూసెక్కుల నీరు పోలవరం ప్రాజెక్టుకు చేరుతుందని అంచనా వేస్తున్నారు. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ అయితే వేలేరుపాడులో 18 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయే అవకాశం ఉంది. మళ్లీ వరద హెచ్చరికలతో ముంపు గ్రామాల్లో భయం నెలకొంది. 30 టీఎంసీలు నిల్వ చేస్తూ.. ఏటా జూలై, ఆగస్టు నెలల్లో రెండు సార్లు వరదలు వస్తుంటాయి. అయితే ఈ ఏడాది ఇప్పటికే జూలైలో రెండుసార్లు వరద రాగా తాజాగా మూడోసారి మొదలైంది. గత నెలలో గోదావరి, శబరి మాత్రమే ఉధృతంగా ప్రవహించి 13, 14వ తేదీల్లో 7 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల కావడంతో ఏజెన్సీతో పాటు యలమంచిలిలోని లంక గ్రామాలకు నీరు చేరిన పరిస్థితి. ఈసారి గోదావరి, శబరితో పాటు తమ్మిలేరు, మున్నేరు కూడా భారీ వరద నీటితో ఉధృతంగా మారుతున్నాయి. దీంతో తీవ్రత ఎక్కువగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టులో 30 టీఎంసీల నీటిని మాత్రమే నిల్వ ఉంచి, ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న నీటిని యథాతథంగా విడుదల చేస్తున్నారు. ఈ ఏడాది వర్షాకాలం సీజన్లో గోదావరికి ముచ్చటగా మూడోసారి వరద ప్రారంభమైంది. గత నెలలో రెండుసార్లు వరదలు వచ్చాయి. మళ్లీ శుక్రవారం నుంచి వరద తీవ్రత ప్రారంభమైంది. ఏటా వర్షాకాలం సీజన్లో వరదల నేపథ్యంలో సగటున 1,900 టీఎంసీల నీరు సముద్రం పాలవుతున్నట్టు అధికారిక అంచనా. గత నెలలో రెండుసార్లు వచ్చిన వరదలతో ముంపు మండలాలైన వేలేరుపాడు, కుక్కునూరులో రాకపోకల్లో కీలకంగా ఉండే ఎద్దులవాగు, గుండేటి వాగు వంతెనలు కొన్ని రోజల పాటు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వేలేరుపాడులో 18 గ్రామాలకు రాకపోకలు నిలిచాయి. అలాగే 270 కుటుంబాలను పునరావాస కేంద్రాలకు కూడా తరలించిన పరిస్థితి. దీంతో పాటు జూలై నెలలో వచ్చిన రెండు వరదలకు రోజుకు సగటున 4 లక్షలకు పై గా క్యూసెక్కుల నీరు దిగువకు విడుదలై మొత్తంగా 420.26 టీఎంసీల నీరు కడలిపాలయ్యింది. నదిలో పెరుగుతున్న ఉధృతి 4.31 లక్షల క్యూసెక్కులు దిగువకు.. గత నెలలో 420 టీఎంసీలు కడలిపాలు ముంపు గ్రామాల్లో భయం.. భయం 18 నాటికి మొదటి ప్రమాద హెచ్చరిక జారీ అయ్యే అవకాశం -
నక్కల కాలువతో పొలాలకు ముంపు
పెనుగొండ: జిల్లాలో 30 వేల ఎకరాల ఆయకట్టు పరిధిలో ముంపునకు కారణమవుతున్న నక్కల కాలువ మురుగు డ్రెయిన్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ఏపీ కౌలు రైతుల సంఘం జిల్లాప్రధాన కార్యదర్శి మామిడిశెట్టి రామాంజనేయులు డిమాండ్ చేశారు. ఆచంట, పెనుగొండ మండలాల్లో భారీ వర్షాలతో ముంపు బారిన పడిన చేలను శనివారం ఆయన పరిశీలించారు. అధిక వర్షాలు, నక్కల కాలువ వల్ల శేషమ్మ చెరువు, మార్టేరు, తూర్పుపాలెం, నెగ్గిపూడి, కొఠాలపర్రు, సోమరాజు చెరువు గ్రామాల్లో పొలాలు ముంపు బారిన పడ్డాయన్నారు. వీటిని ఎక్కువగా కౌలు రైతులే సాగుచేస్తున్నారని, ఇప్పటికే ఎకరాకు రూ.15 వేల వరకు పెట్టుబడి పెట్టారన్నారు. పద్నాల చెరువు, తూర్పుపాలెం వద్ద కాలువపై ఉన్న వంతెన చిన్నగా నిర్మించి రెండు తూములే ఏర్పాటు చేయడంతో ముంపు నీరు లాగడం లేదన్నారు. దీనికి శాశ్వత పరిష్కారంగా వడ్డిలంక డ్యామ్ వద్ద లిఫ్ట్ ఇరిగేషన్ మోటర్లను ఆధునీకరించి, డ్యామ్ అవతలి వైపునకు పైపులు నిర్మించి ముంపునీరు బయటకు తోడేలా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే పంట కోల్పోయిన రైతులకు ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కౌలు రైతులు కేతా పద్మారావు, గుత్తుల ఏడుకొండలు, దొంగ సోమేశ్వరరావు, చింతపల్లి కొండయ్య పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీ శెట్టిబలిజ విభాగ అధ్యక్షుడిగా కవురు
పాలకొల్లు సెంట్రల్: వైఎస్సార్ సీపీ రాష్ట్ర శెట్టిబలిజ విభాగ అధ్యక్షుడిగా శాసనమండలి సభ్యుడు కవురు శ్రీనివాస్ను నియమించారు. శనివారం పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు నియామకం జరిగినట్టు పార్టీ కేంద్ర కార్యాలయం వెల్లడించింది. కవురు శ్రీనివాస్ మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ తనకు పలు పదవులు ఇచ్చి సముచిత స్థానం కల్పించిందన్నారు. తనపై నమ్మకంతో ఈ బాధ్యత అప్పగించిన పార్టీ అధినేత జగన్ మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. వైఎస్సార్ సీపీ నాయకులు, కమ్యూనిటీ సంఘ పెద్దలు, సభ్యులను కలుపుకుని పార్టీన మరింత బలో పేతం చేసేందుకు కృషి చేస్తానన్నారు. తాడేపల్లిగూడెం (టీఓసీ): న్యాయవాదులకు ప్రభుత్వం హెల్త్ కార్డులు ఇవ్వాలని ఆలిండియా లాయర్స్ యూనియన్ డిమాండ్ చేసింది. యూనియన్ జిల్లా కమిటీ సమావేశం శనివారం స్థానిక బార్ అసోసియేషన్ హాల్లో జరిగింది. సంఘ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు దిగుపాటి రాజగోపాల్ మాట్లాడుతూ కూటమి నాయకులు ఎన్నికల ముందు మ్యాచింగ్ గ్రాంట్ కింద మృతి చెందిన న్యాయవాదుల కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున ఇస్తానని వాగ్దానం చేశారని, అయితే రాష్ట్రంలో 1,275 మంది న్యాయవాద వృత్తిలో మృతి చెందితే 103 మందికి మాత్రమే ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయవాదుల రక్షణకు చర్యలు తీసుకోవాలని, కొత్తగా వచ్చిన న్యాయవాదులకు స్టయిఫండ్ ఇవ్వాలని అన్నారు. లా నేస్తం పథకాన్ని కొనసాగించాలని కోరారు. సమస్యలు పరిష్కారం కాకుంటే పోరాటాలే శరణ్యమన్నారు. లక్ష్మి, కౌరు వెంకటేశ్వర్లు, కామన మునిస్వామి తదితరులు పాల్గొన్నారు. భీమవరం(ప్రకాశంచౌక్): సనాతన ధర్మ పరిరక్షణ అందరి బాధ్యత అని, రాగద్వేషాలకు అతీతంగా జీవనం సాగిస్తే మానవ జన్మకు సార్థకత అని హరేరామ మూమెంట్ అక్షయ పాత్ర అధ్యక్షుడు వంశీధర్ దాసు అన్నారు. స్థానిక ఆనంద ఫంక్షన్ హాల్లో ఉద్దరాజు ఆనందరాజు ఫౌండేషన్ ఆధ్వర్యంలో శనివారం శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలను కలెక్టర్ నాగరాణి హాజరై ప్రారంభించారు. హరేరామ హరేకృష్ణ నామమే సుఖాల రుగ్మతలకు పరిష్కారమని దాసు అన్నారు. భగవద్గీత మానవుని మనుగడకు మార్గదర్శకమన్నారు. జేసీ టి.రాహుల్కుమార్రెడ్డి, మాజీ ఎంపీ కనుమూరి బాపిరాజు, ఆనందరాజు ఫౌండేషన్ చైర్మన్ ఉద్దరాజు కాశీ విశ్వనాథ్రాజు, విజయవాడ గోకుల క్షేత్రం సభ్యుడు మహత్రవ దాసు, వేడుకల కమిటీ సభ్యుడు కంతేటి వెంకటరాజు తదితరులు హాజరయ్యారు. చిన్నారులకు శ్రీకృష్ణుని వేషధారణ, చిత్రలేఖనం, స్వామి కీర్తనలు, సంప్రదాయ నృత్యాలు, శ్లోకాలు, చిత్రలేఖనం పోటీ లు నిర్వహించగా జిల్లానలుమూలల నుంచి 350 మంది హాజరయ్యారు. ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమల శ్రీవారి నిత్యాన్నదాన ట్రస్టుకు నూజివీడుకు చెందిన దాత నక్కా సత్యనారాయణ శనివారం 3 టన్నుల కూరగాయలను విరాళంగా అందజేశారు. దొండ, బెండ, దోస, సొర, టమోటాలు వంటి పలు రకాల కూరగాయలను అందజేసి, స్వామివారి అన్నప్రసాదంలో వినియోగించాలని కోరారు. -
ఉండి.. బస్టాండ్లో సమస్యలు దండి
ఉండి: ఉండి నియోజకవర్గాన్ని రాష్ట్రానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతామని పదేపదే చెబుతున్న కూటమి పాలకులు ఒక్కసారి ఉండి బస్టాండ్పై లుక్కేయండని ప్రయాణికులు అంటున్నారు. నియోజకవర్గాన్ని తలమానికంగా చేస్తామంటే ఏంటో అనుకున్నాం కానీ బస్టాండ్ ప్రాంగణాన్ని చెరువుగా మా ర్చడమా అని ఎద్దేవా చేస్తున్నారు. బస్టాండ్ ప్రాంగణమంతా భారీ గోతులు పడి కొద్దిపాటి వర్షానికీ మునిగిపోతోంది. నెలల తరబడి ప్రాంగణం ఇలా ఉన్నా కనీసం మరమ్మతులు కూడా చేయడం లేదు. బస్టాండ్ ఆవరణలో రోడ్డు కనీసం 100 మీటర్లు కూడా లేదని, దీనిని సీసీ రోడ్డుగా నిర్మించే ఆలోచన కూడా పాలకులకు లేదని అంటున్నారు. ఉండి బస్టాండ్కు విజయవాడ, ఏలూరు, గుడివాడ, తాడేపల్లిగూడెం తదితర ప్రాంతాలకు జంక్షన్గా ఉంది. బస్టాండ్లో కనీసం కూర్చునేందుకు కుర్చీలు, బల్ల లు లేవు. తాగునీటి సౌకర్యం లేదు. ప్రయాణికులు బస్టాండ్ లోనికి వెళ్లేందుకు, బయటకు వచ్చేందుకు చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రయాణికుల ఇ బ్బందులను ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టించుకోవడం లేదని, ప్రజలపై ఎందుకింత కక్ష అని వైఎస్సార్సీపీ నాయకులు జంపా నాగేశ్వరరావు, అంగర రాంబాబు, పీవీఆర్కే ఆంజనేయరాజు మండిపడుతున్నారు. మహిళలకు ఉచిత బస్సు ఇవ్వడమే కాదు బస్టాండ్లో కనీస వసతులు కల్పించాలని అంటున్నారు. కూటమి ప్రభుత్వం కనీసం బస్టాండ్లో రోడ్లు కూడా వేయించలేని దుస్థితిలో ఉందా అని ప్రశ్నిస్తున్నారు. ఉండి బస్టాండ్ ప్రాంగణంలో చెరువులను తలపిస్తున్న గోతులు చెరువును తలపిస్తున్న ప్రాంగణం పాలకులూ పట్టించుకోరా? -
ఉచిత బస్సు.. అంతా తుస్సు.. జనసేన నేత ఆడియో సంభాషణ వైరల్
సాక్షి, ఏలూరు జిల్లా: ఉచిత బస్సు పథకంపై ప్రయాణికులు, కూటమి నేతల్లో అయోమయం నెలకొంది. ఏలూరు ఏజెన్సీ ప్రాంతాలలో నడిచే బస్సులలో ఏ బస్సులో ఫ్రీ టికెట్ ఉంటుందో తెలియక ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే అంతర్రాష్ట్ర బస్ సర్వీసులకు ఫ్రీ టికెట్ లేదని ప్రభుత్వం ప్రకటించింది. ఏలూరు ఏజెన్సీ ప్రాంతం తెలంగాణ సరిహద్దుల్లో ఉండడంతో మహిళలు ఇబ్బందులు పడుతున్నారు.బోర్డర్ కొంచెం ఏపీలో, కొంచెం తెలంగాణలో ఉండడంతో అవి అంత ర్రాష్ట్ర సర్వీసులుగా గుర్తించారు. దాంతో వాటిలో ఫ్రీ లేదని అధికారులు చెబుతున్నారు. జంగారెడ్డిగూడెం డిపో నుంచి వేలేరుపాడు కుక్కునూరు, మండలాలకు వెళ్లే సర్వీసులన్నీ.. తెలంగాణ నుంచే వెళ్లడంతో స్థానికల్లో అయోమయం ఏర్పడింది. జంగారెడ్డి గూడెం నుంచి భద్రాచలం వెళ్లే బస్సుకి ఫ్రీ టికెట్ లేదని జంగారెడ్డిగూడెం బస్ డిపో డీఎం తెలిపారు. జంగారెడ్డిగూడెం బస్ డిపో డీఎంతో జనసేన నాయకుడి ఆడియో సంభాషణ సోషల్ మీడియాలో వైరల్గా మారింది.అదే విధంగా అశ్వరావుపేట షటిల్ సర్వీస్ ఫ్రీ టికెట్ వర్తించదని డీఎం చెబుతున్నారు. దాంతో జంగారెడ్డిగూడెం నుంచి వేగవరం, తాడువాయి, దర్భ గూడెం జీలుగుమిల్లి వెళ్లే ప్రయాణికులకు స్త్రీ శక్తి ఎలా ఉపయోగపడుతుందనే అనుమానం నెలకొంది. మరోవైపు, రాష్ట్ర వాప్తంగా మహిళలందరికి ఉచిత బస్సు ప్రయాణం అంటూ హామీలు ఇచ్చిన కూటమి సర్కార్.. ఆచరణలో మాత్రం ఆంక్షలు పెట్టడంపై తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తిరుపతి-తిరుమలకు వెళ్లే బస్సులో యాత్రికులకు షరతులు పెట్టారు. ఉచిత పథకం అమలు చేయాలని మహిళలు డిమాండ్ చేస్తున్నారు. -
డివైడర్ను ఢీకొని యువకుడి మృతి
ద్వారకాతిరుమల: బైక్పై వేగంగా వెళుతున్న యువకుడు ముందు వెళుతున్న టీవీఎస్ మోపెడ్ను, ఆ తరువాత డివైడర్ను ఢీకొట్టి తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందాడు. మోపెడ్ నడుపుతున్న వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన ద్వారకాతిరుమల మండలం సూర్యచంద్రరావుపేటలో శుక్రవారం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. భీమడోలు గ్రామానికి చెందిన మీసాల జగదీష్(25)కు ఏడాది క్రితం వివాహమైంది. జగదీష్, అతని అన్నయ్య ద్వారకాతిరుమలలోని స్వీట్లు తయారు చేసే పని చేస్తున్నారు. ఉదయం పనికి వెళ్లిన జగదీష్ తరువాత కడుపులో నొప్పిగా ఉందని చెప్పి, రూంకి వెళ్లి పడుకున్నాడు. మధ్యాహ్నం ఇంటికి వెళ్లేందుకు భీమడోలు బయల్దేరాడు. ముందు వెళ్తున్న మోపెడ్ను తప్పించబోయి డివైడర్ను ఢీకొట్టాడు. ఈ క్రమంలో మోపెడ్తో సహా దానిపై వెళ్తున్న ఫణి, అతని తాతయ్య రోడ్డుపై పడిపోయారు. తీవ్రంగా గాయపడ్డ జగదీష్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఫణికి తీవ్ర గాయాలుపాలు కాగా, అతని తాతయ్య స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. క్షతగాత్రులను 108 అంబులెన్స్లో ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనా స్థలాన్ని సీఐ యుజే విల్సన్, ఎస్సై టి.సుధీర్ పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు. -
నిండా ముంచిన గోస్తనీ
పెనుమంట్ర: బుధవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి పెనుమంట్ర మండలంలోని గోస్తిని, గొంతేరు, భగ్గేశ్వరం మురుగు కాల్వలు పొంగి ప్రవహించడంతో వరి నాట్లు నీట మునిగాయి. గోస్తనీ పరివాహక ప్రాంతంలో నత్తారామేశ్వరంలోని శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయం నీట మునగగా, జుత్తిగలో శ్రీ ఉమా వాసుకి రవి సోమేశ్వర స్వామి ఆలయ ఆవరణలోని శ్రీవల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, శ్రీ కామాక్షి అమ్మవారి ఆలయాల్లోకి వరదనీరు ప్రవేశించింది. గోస్తనీ మురుగు కాలువలో కిక్కిస, గురప్రు డెక్క పెరిగిపోవడంతో మురుగు నీటి ప్రవాహానికి అంతరాయం ఏర్పడి ఎస్.ఇల్లిందలపర్రు, మల్లిపూడి, జుత్తిగ, నత్తా రామేశ్వరం వెలగలవారి పాలెం, పెనుమంట్ర, మాముడూరు గ్రామాలకు చెందిన సుమారు 1000 ఎకరాల్లోని వరినాట్లు నీట మునిగాయి. గోస్తినిలో చెత్త తొలగింపు కార్యక్రమాన్ని 20 రోజుల క్రితం ప్రారంభించినప్పటికీ నత్త నడకన సాగుతోంది. దీంతో దిగువ భాగంలోని నత్త రామేశ్వరం, జుత్తిగ, వెలగలవారిపాలెం, పెనుమంట్ర, గరువు గ్రామాల మధ్య చెత్త పేరుకుపోయి మురుగునీరు వెళ్లకపోవడంతో పల్లపు ప్రాంతాల్లోని పంట పొలాలు నీటమునిగాయి. వరినాట్లు నీట మునిగడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. చెత్త తొలగింపు పనులను త్వరితగతిన పూర్తిచేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. భగ్గేశ్వరం మురుగు కాలువ కూడా ఆక్రమణకు గురై పూడుకుపోవడంతో ఆలమూరు, వెలగలేరు గ్రామాలకు చెందిన పల్లపు పొలాలు నీట మునిగాయి. నత్తారామేశ్వరంలో ముంపులో శ్రీరామలింగేశ్వర ఆలయం జుత్తిగ–పెనుమంట్ర మధ్య గోస్తనీలో పేరుకుపోయిన కిక్కిస, గుర్రపు డెక్క -
ఘర్షణలో వ్యక్తి మృతి
నూజివీడు: గేదెలు కట్టేయడానికి గుంజ పాతే విషయమై ఇద్దరు ఘర్షణ పడగా అందులో ఒకరు మృతి చెందిన సంఘటన నూజివీడు మండలం జంగంగూడెంలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. జంగంగూడెం ఎస్సీ ఏరియాలో తొమ్మండ్రు ఏసోబు(64), ముళ్లపూడి దేవసహాయం(62) కుటుంబాలు పక్కపక్కనే నివసిస్తున్నాయి. ఉదయం 9 గంటల సమయంలో దేవసహాయం స్థలం సరిహద్దులో గుంజను పాతుతుంటే అక్కడ పాతడానికి వీల్లేదంటూ ఏసోబు అడ్డు వెళ్లాడు. దీంతో ఇద్దరి మధ్య తోపులాట జరిగింది. దేవసహాయం భార్య కూడా వచ్చి ఘర్షణకు దిగింది. దేవసహాయం తన చేతిలో ఉన్న గడ్డపలుగును వెనకకు తిప్పి ఏసోబు డొక్కలో పొడవడంతో కింద పడిపోయాడు. ఇదే సమయంలో ఏసోబు భార్య అక్కడికి వచ్చి తన భర్తను ఇంటిలోకి తీసుకెళ్లి పడుకోబెట్టగా వెంటనే మృతిచెందాడు. ఈ విషయం తెలిసి రూరల్ ఎస్ఐ జ్యోతిబసు సిబ్బందితో గ్రామంలోకి వెళ్లి సంఘటనకు సంబంధించిన వివరాలను సేకరించారు. తన భర్తను గడ్డపలుగుతో పొడవడంతో మృతిచెందాడని రూరల్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు రూరల్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
నీటమునిగిన వరిచేలు
ఉంగుటూరు: ఉంగుటూరు మండలంలో బుధవారం రాత్రి కురిసిన వర్షానికి ఎక్కడికక్కడ నీరు నిలిచిపోయింది. మేజరు మురుగుకోడు, పందికోడు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. మీడియం డ్రెయిన్లు రంగారావు కోడు, రాచకోడు, సంతకోడు, లింగం కోడు, ఆస్మాకోడు నిండుగా ప్రవహిస్తున్నాయి. దాంతో వేలాది ఎకరాలు నీటమునిగాయి. వీఏ పురం, కాగుపాడు, కాకర్లమూడి, దొంతవరం, రావులపర్రు, రామన్నగూడెం, కై కరం ఆయకట్టులో పంటపొలాలు నీటమునిగి ఉన్నాయి. పంటచేల నుంచి నీరు కొల్లేరు వైపు ప్రవహిస్తోంది. నారాయణపురం ఆర్అండ్బీ రోడ్డు, యర్రమళ్ల, వెల్లమిల్లి, ఎ.గోకవరం రోడ్లపై నీరు ప్రవహిస్తోంది. మెట్ట ప్రాంతంలోని 22 మైనర్ ఇరిగేషన్ చెరువులు నిండిపోయాయి. నాచుగుంట పట్టెమ చెరువు, ఉంగుటూరు ఎర్ర చెరువు, వెల్లమిల్ల చెరువు, నల్లమాడు చెరువు, గోపినాథపట్నం పెద్ద చెరువు నిండి పొంగి పొర్లుతున్నాయి. రెండు రోజుల్లో నీరు లాగితే రైతులు ఊపిరి పీల్చుకుంటారు. లేకుంటే నష్టపోయే పరిస్థితి నెలకొంది. -
యువకుడిని కాపాడిన పోలీసులు
భీమడోలు: మనో వైకల్యంతో బాధపడుతూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఓ యువకుడిని శుక్రవారం సాయంత్రం భీమడోలు పోలీసులు కాపాడారు. పూళ్ల గ్రామానికి చెందిన గురువెల్లి రాజు తాపీ పని చేసేవాడు. ఇటీవల మద్యానికి బానిస కావడంతో తల్లి మందలించింది. దీనితో రాజు చనిపోతానంటూ ఇంటి నుంచి వెళ్లిపోయాడు. కుటుంబ సభ్యులు, బంధువులు పోలీస్ టోల్ ఫ్రీ నెంబరుకు ఫోన్ చేసి సమాచారం అందించారు. భీమడోలు ఎస్సై వై.సుధాకర్, ఏఎస్సై వెంకటేశ్వరరావు హుటాహుటిన పూళ్ల వెళ్లి అతని ఆచూకీ కోసం ప్రయత్నించారు. రైల్వే స్టేషన్లో ఆత్మహత్యయత్నానికి సిద్ధంగా ఉన్న రాజును వారు పట్టుకున్నారు. అతనికి భోజనం పెట్టించి కౌన్సెలింగ్ ఇచ్చి కుటుంబ సభ్యుల చెంతకు చేర్చారు. ఉంగుటూరు: మండలంలోని వెల్లమిల్లిలో పాఠశాల వద్ద జెండా ఆవిష్కరణకు ఉపయోగించిన ఐరన్ పైపు శుక్రవారం సాయంత్రం దించబోతుండగా.. పక్కనే ఉన్న విద్యుత్త్ వైర్లు మీద పడటంతో షాక్కు గురై ఉసురుమర్తి భీమరాజు(49) అక్కడకక్కడే మృతిచెందాడు. భీమరాజుకు కుమరుడు, కుమార్తె ఉన్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని తాడేపల్లిగూడెం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. -
కన్నాపురంలో వ్యక్తి ఆత్మహత్య
కొయ్యలగూడెం: ఇచ్చిన బాకీలు వసూలు కాకపోవడంతో మనస్తాపానికి గురైన కన్నాపురం గ్రామానికి చెందిన మజ్జి నరసింహారావు (40) ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కొందరికి నరసింహరావు అప్పు ఇవ్వగా, అవి వసూలు కాకపోవడంతో మనస్తాపంతో ఆత్మహత్యకు యత్నించాడు. గురువారం రాత్రి వాట్సప్లో తన కుటుంబ సభ్యులకు ఆత్మహత్య చేసుకుంటున్నానని మెసేజ్ చేశాడు. మృతుడు తండ్రి సత్యనారాయణ, బంధువులు నరసింహరావు కోసం వెతుకుతుండగా గ్రామ శివారులోని ఓ రైతుకు చెందిన బావి వైపు వెళ్ళినట్లు తెలుసుకున్నారు. అక్కడికి వెళ్లేసరికి వారిని చూసిన నరసింహారావు వెంటనే బావిలోకి దూకేశాడు. దీంతో స్థానికుల సాయంతో బయటకు తీసుకొచ్చి హాస్పటల్ కు తీసుకువెళ్లగా.. అప్పటికే మృతి చెందాడని వైద్యులు నిర్ధారించినట్లు ఎస్సై తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఉంగుటూరు: ఉంగుటూరు మండలం కై కరంలో శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో బైక్ను కారు ఢీకొన్న ప్రమాదంలో ఎంఎం.పురం గ్రామానికి చెందిన బూర్ల మహేష్కుమార్(35) అక్కడికక్కడే చనిపోయాడు. మహేష్కుమార్ బైక్పై తణుకు వెళ్తుండగా కై కరం శివారులో వెనుక నుంచి తాడేపల్లిగూడెం వైపు వెళుతున్న కారు బలంగా ఢీకొనడంతో అక్కడకక్కడే మరణించాడు. కారు డ్రైవరు నిర్లక్ష్యంగా నడపడం వల్లే ప్రమాదం జరిగినట్లు తెలిసింది. మృతుడి భార్య ఫిర్యాదు మేరుకు చేబ్రోలు ఎస్సై సూర్యభగవాన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కై కలూరు: స్వాతంత్య్ర దినోత్సవం రోజున మద్యం విక్రయాలు నిషేధం. అయినప్పటికీ బెల్టు దుకాణాల ద్వారా మద్యం విక్రయిస్తున్న ఇద్దరిని ఎకై ్సజ్ ప్రత్యేక బృందం దాడులు చేసి శుక్రవారం పట్టుకుంది. అధికారుల వివరాల ప్రకారం ముదినేపల్లి మండలం కాకరవాడకు చెందిన కాగిత నాగేశ్వరరావు నుంచి 9 క్వార్టర్ బాటిల్స్, మండవల్లి మండలం భైరవపట్నంలో వలపుల చంద్రరావు నుంచి 7 క్వార్టర్ బాటిల్స్ స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఆగస్టు 15 సందర్భంగా గురువారం రాత్రి 10 గంటల నుంచి శనివారం ఉదయం 10 గంటల వరకు నియోజకవర్గంలో 22 మద్యం దుకాణాలకు సీజ్ వేశామన్నారు. -
ప్రజాస్వామ్యం అపహాస్యం
మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ తాడేపల్లిగూడెం అర్బన్ : పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో కూటమి ప్ర భుత్వం దౌర్జన్యంగా ఓట్లు వేసుకొని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిందని మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ ఆరోపించారు. శుక్ర వారం వైఎస్సార్సీపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ఉప ఎన్నికల్లో ఓటమి చెందితే ప్రజలకు సమాధానం చెప్పుకోలేమన్న భయంతో అక్రమాలకు పాల్పడ్డారన్నారు. అ క్కడి కలెక్టర్, డీఐజీ, డీఎస్పీ ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేశారని విమర్శించారు. జ మ్మలమడుగు, కమలాపురం నియోజకవర్గాల నుంచి తెలుగుదేశం గుండాలను తీసుకువచ్చి స్థానిక ఓటర్ స్లిప్పులను లాక్కుని ఓట్లు వే యించారన్నారు. ఓటర్లు ప్రశ్నిస్తే వారిని పోలీసులు భయభ్రాంతులకు గురిచేశారన్నారు. గూడెంలో ఏబీసీడీ ట్యాక్స్ : తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో శాసనసభ్యుడి ఆధ్వర్యంలో ఏబీసీడీ ట్యాక్స్లు వసూలు చేస్తున్నారని కొట్టు ఆరోపించారు. ఏ అంటే అబ్బాయి ట్యాక్స్, బీ అంటే బొలిశెట్టి ట్యాక్స్, సీ అంటే కమిషనర్ ట్యాక్స్, డీ అంటే డెలప్మెంట్ ట్యాక్స్ అని అ న్నారు. ఏ పని కావాలన్నా ఏదో ఒక ట్యాక్స్ క ట్టాల్సిందే అన్నారు. ఇటీవల అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పట్టుకుంటే అబ్బాయి ట్యాక్స్ కట్టి వారు తప్పించుకున్నారన్నారు. పౌర సరఫరాల శాఖ మంత్రి జనసేనకి చెందిన నాదెండ్ల మనోహర్ చర్యలు తీసుకోవా ల ని కోరారు. వైఎస్సార్సీపీకి చెందిన కొందరిని పే కాట క్లబ్బులు పెట్టుకునేందుకు అనుమతిస్తామని ఎర చూపి జనసేనలో చేర్చుకున్నారని విమర్శంచారు. జెడ్పీటీసీ సభ్యులు రావాల్సిన బకాయి లు ఇస్తారన్న ఆశతోనే జనసేనలో చేరారని తెలి పారు. కొలుకులూరి ధర్మరాజు, ముప్పిడి సంపత్కుమార్, కర్రి భాస్కరరావు, జిడ్డు హరిబాబు, బండారు నాగు పాల్గొన్నారు. భీమవరం (ప్రకాశంచౌక్): మహిళలకు ఉచిత బస్సులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం సీ్త్ర శక్తి పథకాన్ని ప్రారంభించింది. భీమవరం కొత్త బస్టాండ్ ఆవరణలో పథకాన్ని రాజ్యసభ సభ్యుడు పాక వెంకట సత్యనారాయణ, కలెక్టర్ సీహెచ్ నాగరాణి, భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రా మాంజనేయులు ప్రారంభించారు. రాష్ట్ర మ హిళా సహకార ఆర్థిక కార్పొరేషన్ చైర్పర్సన్ పీతల సుజాత, మాజీ రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఏలూరు టౌన్: దేశ సమైక్యత, సమగ్రతకు ప్రతిఒక్కరూ పాటుపడాలని ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్కుమార్ అన్నారు. ఏలూరు రేంజ్ ఐజీ కార్యాలయంలో స్వాతంత్య్ర దినోత్సవాలను ఘనంగా నిర్వహించారు. గాంధీజీ చిత్రపటానికి ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జాతీయ జెండాను ఎగురవేశారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేలా పోలీసులు కృషి చేయాలని అన్నారు. ఏలూరు (టూటౌన్): యువత దేశభక్తితో పా టు స్ఫూర్తిని పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్.శ్రీదేవి అన్నారు. ఏలూరులోని జిల్లా కోర్టు కార్యాలయంలో ఆమె జాతీయ జెండాను ఆవిష్కరించారు. దేశ నాయకుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశ రక్షణ కోసం సైనికులు నిరంతరం కృషి చేస్తున్నారని, కాని దేశంలో అంతర్గతంగా భద్రత, అభివృద్ధి మరింత మెరుగు పరచాల్సిన అవసరం ఉందన్నారు. -
మువ్వన్నెల రెపరెపలు
నిండా ముంచిన గోస్తనీ భారీ వర్షాలకు పెనుమంట్ర మండలంలో గోస్తనీ న ది, గొంతేరు, భగ్గేశ్వరం మురుగు కాలువలు పొంగి పొర్లడంతో వందలాది ఎకరాలు నీటమునిగాయి. 8లో u● అంబరాన్నంటిన సంబరాలు ● పంద్రాగస్టు వేడుకల్లో చిన్నారులు శనివారం శ్రీ 16 శ్రీ ఆగస్టు శ్రీ 2025భీమవరం: భీమవరం కలెక్టరేట్ వద్ద 79వ స్వాతంత్ర దినోత్సవాలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం కలెక్టర్ సీహెచ్ నాగరాణి, ఎస్పీ అద్నాన్ నయీం అస్మితో కలిసి పరేడ్ కమాండర్ ఆధ్వర్యంలో పోలీసు గౌరవ వందనం స్వీకరించారు. అవార్డుల ప్రదానం జిల్లాలో స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్న వారి కుటుంబాలను సత్కరించారు. ప్రజాసేవలో నిమగ్నమైన స్వచ్ఛంద సంస్థలు, దాతలకు ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలను అందజేశారు. పలు రంగాల్లో ప్రతిభ కనబర్చిన సేవకులు, అధికారులు, సిబ్బందికి అవార్డులు, ప్రశంసా పత్రాలు, సర్టిఫికెట్లను అందజేశారు. ఉత్తమ ప్రతిభను చూపిన పోలీసుల కు పతకాలను బహూకరించారు. స్టాల్స్ సందర్శన : స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్యారోగ్య శాఖ శాఖ, మత్స్యశాఖ, విద్యాశాఖ–సమగ్ర శిక్ష, సహిత విద్యా–సమగ్రశిక్ష, వ్యవసాయశాఖ, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ, ఉద్యాన శాఖ, రాష్ట్ర సూక్ష్మ సేద్య పథకం, ఎస్ఈఆర్పీ జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, పరిశ్రమల కేంద్రం, యూనియన్ బ్యాంకు లీడ్ బ్యాంకు డిపార్ట్మెంట్, రాష్ట్ర విపత్తు స్పందన, అగ్నిమాపక సేవల శాఖ, పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) తదితర శాఖలు స్టాల్స్ ఏర్పాటుచేయగా మంత్రి నిమ్మల పరిశీలించారు. ఆకట్టుకున్న శకటాలు ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన శకటాలు ఆకట్టుకున్నాయి. వైద్యారోగ్య శాఖ, వ్యవసాయ శాఖ, అగ్నిమాపక శాఖ, విద్యాశాఖ, ఎస్ఈఆర్పీ–జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ, గృహ నిర్మాణ శాఖ, రవాణా శాఖల శకటాల ప్రదర్శన, పశుసంవర్థక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జంతు ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు దేశభక్తిని చాటేలా పాఠశాలల విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు, గీతాలు ఉత్తేజాన్ని రేకెత్తించాయి. వేడుకల్లో రాజ్యసభ సభ్యుడు పాక వెంకట సత్యనారాయణ, ఎమ్మెల్యేలు పులపర్తి రామాంజనేయులు, ఆరిమిల్లి రాధాకృష్ణ, జేసీ టి.రాహుల్కుమార్ రెడ్డి, అడిషనల్ ఎస్పీ వి.భీమారావు, ఆర్డీఓ ప్రసన్నకుమార్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జిల్లా అభివృద్ధి లక్ష్యం : జిల్లాలో మౌలిక వసతుల కల్పన, ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణం వంటి పలు పనులు చేయాల్సి ఉందని, భవిష్యత్తులో జిల్లాకు అవసరమైన వనరులు కల్పించి సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం కంకణం కట్టుకుందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పర్యావరణ పరిరక్షణకు కట్టుబడి స్థిరమైన అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. -
తాగునీటికి ఇక్కట్లు
భీమవరం కలెక్టరేట్ వద్ద జరిగిన స్వాతంత్య్ర దినోత్సవాల్లో తాగునీటికి ఇబ్బందులు తలెత్తాయి. ప్రజాప్రతినిధులు పూర్తిస్థాయిలో హాజరుకాకపోగా.. పథకాలను ప్రదర్శించే శకటాల సంఖ్య బాగా తగ్గింది. అలాగే విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. ఇదిలా ఉండగా ప్రాంగణం వద్ద మంచినీటి కోసం ఇబ్బందులు తప్పలేదు. వాటర్ టిన్నులు కొద్దిసేపటికే ఖాళీ అయ్యాయి. ప్లాస్టిక్ నిషేధం అని పెద్ద ఎత్తున ప్రచారం చేసినా అధికారులకు మాత్రం ప్లాస్టిక్ బాటిళ్లలో నీరు అందించారు. అలాగే ఓ పక్క వేడుకలు జరుగుతుండగానే.. ప్రాంగణంలో ఏర్పాటుచేసిన మొక్కలను వాహనంలోకి ఎక్కించి తరలించడం విశేషం. వేడుకలకు పెద్దగా ప్రజలు హాజరుకాలేదు. -
త్యాగధనుల స్ఫూర్తి.. స్వాతంత్య్ర దీప్తి
నరసాపురం/తాడేపల్లిగూడెం అర్బన్/తణుకు అర్బన్: ఎందరో మహానుభావుల బలిదానాలు, ప్రాణత్యాగాలు, పోరాటాలతో సాధించుకున్న స్వాతంత్య్ర భార తాన్ని వారి స్ఫూర్తితో ముందుకు తీసుకెళ్లాల్సిన బా ధ్యత అందరిపై ఉందని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు అన్నారు. నరసాపురంలోని పార్టీ కార్యాలయంలో ఆయన జాతీయ ప తాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం 70 అడుగుల జాతీయ పతాకంతో పట్టణంలో వైఎస్సార్సీపీ శ్రే ణులతో కలిసి ర్యాలీ చేశారు. స్వాతంత్య్ర నాయకులను ఆదర్శంగా తీసుకుని యువత ముందుకు సాగాలని మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. తాడేపల్లిగూడెంలోని పార్టీ కార్యాలయంలో ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. తణుకులోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు జాతీయ పతాకాన్ని ఎగురవేసి వేడుకలు నిర్వహించారు. స్వాతంత్య్ర స్ఫూర్తితో ముందుకు సాగాలని సూచించారు. తాడేపల్లిగూడెం అర్బన్: తాడేపల్లిగూడెంలో మాట్లాడుతున్న మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ తణుకు అర్బన్: తణుకులో జాతీయ పతకానికి సెల్యూట్ చేస్తున్న మాజీ మంత్రి కారుమూరి -
కూటమి పాలనలో ప్రజాస్వామ్యం ఖూనీ
భీమవరం: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి నిరంకుశ పాలన సాగిస్తోందని వైఎస్సార్సీపీ భీమవరం నియోజకవర్గ ఇన్చార్జి చినమిల్లి వెంకటరాయుడు విమర్శించారు. శుక్రవారం రాయలంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కూటమి అరాచక పాలనకు పులివెందుల, ఒంటిమిట్టలో జరిగిన జెడ్పీటీసీ ఎన్నికలే నిదర్శనమన్నారు. అడ్డగోలు హామీలతో అధికారం చేపట్టిన చంద్రబాబు గద్దెనెక్కిన తర్వాత హామీలు అమలుచేయాలని అడిగిన వారిపై దౌర్జన్యాలకు దిగుతున్నారన్నారు. ఓటర్లను పోలింగ్ బూత్లకు రానీయకుండా రిగ్గింగ్ చేసి గెలవడం హేయమన్నారు. సామాన్యులు ఓటు వేసే పరిస్థితి లేకుండా చేసిన ఘనత చంద్రబాబు ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. కూటమి ప్రజావ్యతిరేక పాలనను ప్రజలంతా గమనిస్తున్నారని, తగిన సమయంలో బుద్ధి చెబుతారని అన్నారు. పార్టీ నరసాపురం పార్లమెంట్ ఇన్చార్జి గూడూరి ఉమాబాల మట్లాడుతూ పులివెందుల, ఒంటిమిట్టలో జరిగిన ఉప ఎన్నికల్లో కూ టమి నాయకుల తీరును ప్రజలంతా గమనిస్తున్నారన్నారు. ఎన్నికల వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం సన్నగిల్లిందని తెలిపారు. పార్టీ నాయకులు కామన నాగేశ్వరరావు, చిరుగుపాటి సందీప్, మానుకొండ ప్రదీప్, గాదిరాజు రామరాజు, కోడే యుగంధర్, గంటా సుందరకుమార్, పాలవెల్లి మంగ, పెచ్చెట్టి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
స్వాతంత్య్ర దినోత్సవాలకు సర్వం సిద్ధం
భీమవరం(ప్రకాశం చౌక్): భీమవరంలోని కలెక్టరేట్ వద్ద పరేడ్ గ్రౌండ్స్ స్వాతంత్య్ర దినోత్సవాలకు సిద్ధమైంది. ఐదు వేదికలు, గ్యాలరీ, స్టాల్స్, శకటాలను గురువారం జేసీ టి.రాహుల్కుమార్రెడ్డి పరిశీలించారు. వేడుకల నిర్వహణ సందర్భంగా ప్రభుత్వ పథకాలను ప్రతిబింబించేలా శకటాలు, స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. ప్రొటోకాల్ను అనుసరించి సిట్టింగ్, స్టేజీ ఏర్పాట్లు, తాగునీటి సరఫరా, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్కు పటిష్ట ఏర్పాట్లు చేశామన్నారు. విద్యుత్లో సరఫరాలో ఆటంకం లేకుండా చూడాలన్నారు. వైద్య శిబిరం, అంబులెన్స్ సిద్ధంగా ఉంచాలన్నారు. ఉపరితల ద్రోణి కారణంగా భారీ వర్షాలు, బలమైన గాలులు వీచే అవకాశం ఉందని అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. డీఆర్వో మొగిలి వెంకటేశ్వర్లు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఏర్పాట్లను పరిశీలిస్తున్న జేసీ రాహుల్కుమార్రెడ్డి త్రివర్ణ కాంతులతో కలెక్టరేట్ భవనం -
ముంపు చేల పరిశీలన
అత్తిలి: మండలంలోని తిరుపతిపురం, వరిఘేడు ప్రాంతాల్లో నీట మునిగిన పంట పొలాలను గురువారం కలెక్టర్ సీహెచ్ నాగరాణి పరిశీలించారు. రైతులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో బుధవారం ఒక్కరోజు 1799.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందన్నారు. దీంతో సుమారు 400 నుంచి 500 ఎకరాల వరకు పొలాలు ముంపు బారిన పడ్డాయన్నారు. ప్రస్తుతం వ ర్షం ఆగినందున నీరు తొలగితే ఇబ్బంది ఉండదని, వ్యవసాయాధికారులు పంట నష్టం వివరాలు నమోదు చేస్తారన్నారు. తహసీల్దార్ దశిక వంశీ, సిబ్బంది ఉన్నారు. భీమవరం: జిల్లాలో గురువారం ఉదయం వర కు 20 మండలాల్లో సగటున 90 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా తణుకులో 236.6 మి.మీ., అత్యల్పంగా మొగల్తూరులో 8.6 మి.మీ. వర్షం పడింది. మండలాల వారీ గా వర్షపాతం ఇలా.. తాడేపల్లిగూడెంలో 162.2 మి.మీ, పెంటపాడులో 189, అత్తిలిలో 85.4, గణపవరంలో 144.4, ఆకివీడులో 77.2, ఉండిలో 54.4, పాలకోడేరులో 76.2, పెనుమంట్రలో 75.2 మి.మీ. వర్షపాతం నమోదైంది. ఇరగవరంలో 196.6, పెనుగొండలో 193.8, ఆచంటలో 40.2, పోడూరులో 82.6, వీరవాసరంలో 22.2, భీమవరంలో 27.6, కాళ్లలో 42.6, నరసాపురంలో 32.4, పాలకొల్లులో 35.2, యలమంచిలిలో 17.4 మి.మీ వర్షపాతం నమోదైంది. భీమవరం (ప్రకాశంచౌక్): భూగర్భ జలాల పెంపు, నీటి సంరక్షణ, నీటి నిర్వహణ తదితర అంశాలపై అమరావతి నుంచి గురువారం కలెక్టర్లు, సాగునీటి సంఘాల, ప్రాజెక్ట్ సంఘాల ప్రతినిధులు, జలవనరుల శాఖ అధికారులతో సీఎం చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. భీమవరం కలెక్టరేట్ నుంచి కలెక్టర్ సీహెచ్ నాగరాణి, జేసీ టి.రాహుల్కుమార్ రెడ్డి, డీఆర్వో ఎం.వెంకటేశ్వర్లు, అధికారులు హాజరయ్యారు. నీటి సంరక్షణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. మండవల్లి: మండవల్లిలోని స్టేషన్ రోడ్డులో తా గునీటి సమస్య పరిష్కరించాలంటూ గురువా రం జాతీయ రహదారిపై గ్రామస్తులు ధర్నాకు దిగారు. 20 రోజుల నుంచి కుళాయిల నుంచి తాగునీరు రావడం లేదని, తమను పట్టించుకునే నాథుడే లేడంటూ మహిళలు ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. సర్పంచ్, అధికారులు వచ్చి సమాధానం చెప్పాలంటూ భీష్మించారు. కొద్దిసేపటికి పోలీసులు వచ్చి వారికి నచ్చజెప్పి ధర్నాను విరమింపజేశారు. తమ గోడు ఎవరూ పట్టించుకోవడం లేదని, ఎన్ని రోజులు ఓపిక పట్టాలని మహిళలు పోలీసుల వద్ద వాపోయారు. బుట్టాయగూడెం: గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా జీలుగుమిల్లి మండలం వంకవారిగూడెం సమీపంలోని రోడ్డు గురువారం ఉదయం కొట్టుకుపోయింది. దీనితో పై గ్రామాలకు రహదారిపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. అధికారులు వెంటనే స్పందించి రహదారి మరమ్మతులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. ఏలూరు(మెట్రో): ఏలూరు కలెక్టరేట్లో గురువారం వికసిత్ భారత్ 2047 లక్ష్యంగా స్కూలింగ్–బిల్డింగు బ్లాక్స్ అనే అంశంపై విద్యాశాఖ అధికారులతో కలెక్టర్ వెట్రిసెల్వి వర్క్షాప్ నిర్వహించారు. దేశం మొదటి స్థానంలో నిలిచే లక్ష్యంగా అన్ని రంగాల్లో నిరంతర లక్ష్యాలు, నిర్దేశం, సాధన చాలా అవసరమన్నారు. మానవ వనరుల అభివృద్ధి యువత, వయోజనులు, మహిళలపై నిర్మించబడి ఉందన్నారు. -
గవర్నర్తో మీట్ ఎట్కు నాగేంద్రసింగ్
ఏలూరు (ఆర్ఆర్పేట): స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గవర్నర్ కార్యాలయంలో గవర్నర్ అబ్దుల్ నజీర్తో జరిగే మీట్ ఎట్ కార్యక్రమానికి ఏలూరు జిల్లా నుంచి నాగేంద్ర సింగ్ ఎంపికయ్యారు. నాగేంద్రసింగ్ ఏలూరు శ్రీరామ్నగర్లోని ఎంపీయూపీ స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నారు. అంతర్జాతీయస్థాయి దివ్యాంగుల క్రికెట్ పోటీలకు అంపైర్గా కూడా సేవలందిస్తున్నారు. శుక్రవారం సాయంత్రం గవర్నర్ ఇచ్చే తేనీటి విందులో పాల్గొని గవర్నర్ నుంచి సన్మానం అందుకోనున్నారు. తాడేపల్లిగూడెం: వెంకట్రామన్నగూడెంలోని ఉద్యా న వర్సిటీలో డిప్లమో హార్టీకల్చర్, డిప్లమో ల్యాండ్ స్కేపింగ్, నర్సరీ మేనేజ్మెంట్ కోర్సుల్లో ప్రవేశాలకు తుది విడత స్పాట్ కౌన్సెలింగ్ను ఈనెల 20న నిర్వహించనున్నారు. ఈ మేరకు రిజిస్ట్రార్ బి.శ్రీనివాస్ ప్రకటన విడుదల చేశారు. నాలుగు ప్రభుత్వ, మూడు గుర్తింపు పొందిన పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశానికి గతంలో దరఖాస్తు చేసుకున్నా, కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి ఉద్యాన వర్సిటీ ప్రాంగణంలో కౌన్సెలింగ్ నిర్వహిస్తామన్నారు. విద్యార్థులు ధ్రువీకరణ పత్రాలతో స్వయంగా హాజరుకావాలని సూచించారు. -
సేవకులకు వంచన
ఏరు దాటేదాకా ఓడ మల్లన్న.. ఏరు దాటాకా బోడి మల్లన్న చందాన ఉంది కూటమి తీరు. వలంటీర్లను కొనసాగిస్తాం, పారితోషికం నెలకు రూ.10 వేలకు పెంచుతామని చెప్పిన కూటమి పెద్దలు ఇప్పుడు ఆ ఊసే ఎత్తకపోవడంతో వలంటీర్ల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. రాష్ట్రంలో వలంటీర్ వ్యవస్థ మొదలై శుక్రవారానికి ఆరేళ్లు కాగా కూటమి ప్రభుత్వ నిర్వాకంతో 16 నెలలుగా వీరి సేవలు నిలిచిపోయాయి. సాక్షి, భీమవరం: కులమతాలు, రాజకీయాలకు అతీ తంగా అర్హుల చెంతకే సంక్షేమ పథకాలు చేరవేసే లక్ష్యంతో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వలంటీర్ల వ్యవస్థకు శ్రీకారం చుట్టారు. గ్రామాల్లో 50 ఇళ్లకు, పట్టణాల్లో 75 నుంచి 100 ఇళ్లకు ఒకరు చొప్పున జిల్లాలో 8,616 మంది వలంటీర్లను నియమించారు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిలా 2019 ఆగస్టు 15న వలంటీర్ వ్యవస్థను ప్రారంభించారు. క్షేత్రస్థాయిలో అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాల లబ్ధిని అందేలా చూడటం, అవసరమైన సర్టిఫికెట్లు మంజూరు చేయించడం, విద్యు త్ బిల్లుల చెల్లింపులు తదితర సేవలందించేవారు. కరోనాకు జడిసి సొంతవాళ్లు, చుట్టుపక్కల వారు దగ్గరకు రాలేని పరిస్థితుల్లో బాధితులకు బాసటగా నిలిచారు. హోం క్వారంటైన్లో ఉన్న వారికి ప్రభు త్వం ద్వారా ఆహారం, నిత్యావసర సరుకులు, మందులు అందజేసేవారు. కరోనా పరీక్షలు, వ్యాక్సినేషన్ ప్రక్రియలో వీరు ఎనలేని సేవలందించారు. గోదావరి వరదల సందర్భంగా నీట మునిగిన లంక గ్రామాల ప్రజలకు ప్రభుత్వం నుంచి అవసరమైన సరుకులు, మందులు ఇంటింటికి వెళ్లి అందజేస్తూ వలంటీర్లు అందించిన సేవలు చిరస్మరణీయం. అనారోగ్యంతో ఇతర రాష్ట్రాల్లో చికిత్స పొందుతున్న లబ్ధిదారుల చెంతకు సైతం వెళ్లి ప్రభుత్వ సాయాన్ని అందజేస్తూ ఆదర్శంగా నిలిచిన వారెందరో ఉన్నారు. కేవలం రూ.5 వేల గౌరవ వేతనంతో పారదర్శకంగా సేవలందించిన వలంటీర్ వ్యవస్థ దేశవ్యాప్తంగా ప్రముఖుల ప్రశంసలు అందుకుంది. వలంటీర్ వ్యవస్థపై మొదల్లో ‘గోనె సంచులు మోసే అవేం ఉద్యోగాలు’ అంటూ చిన్నచూ పు చూసిన చంద్రబాబు, మహిళల మిస్సింగ్కు వ లంటీర్లే కారణమంటూ విషం కక్కిన పవన్ కళ్యాణ్లు ఎన్నికలు వచ్చేసరికి మాట మార్చారు. ఎన్నికల సంఘానికి కూటమి అనుకూల వర్గాల ఫిర్యాదుల నేపథ్యంలో గతేడాది ఏప్రిల్ నుంచి వలంటీర్ల సేవలు నిలిచిపోయాయి. తాము అధికారంలోకి వస్తే వలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని, గౌరవ వేతనం రూ.10 వేలకు పెంచుతామని ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు హామీలు గుప్పించారు. మేనిఫెస్టోలోనూ ఈ అంశాన్ని చేర్చారు. కూటమి పాలన చేపట్టి ఏడాది పైబడినా హామీ అమలు దిశగా చర్యలు చేపట్టకపోగా వలంటీర్లను నిబంధనలు మేరకు తీసుకోలేదంటూ ప్రభుత్వ పెద్దలు ప్రకటనలు చేయడం గమనార్హం. ప్రభుత్వ తీరుతో తమ భవితవ్యం అగమ్యగోచరంగా మారిందని వలంటీర్లు ఆందోళన చెందుతున్నారు. కూటమి ఎన్నికల వాగ్ధానం అమలుకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కూటమి వెన్నుపోటు ప్రభుత్వానికీ ప్రజలకు వారధిలా పనిచేసిన వలంటీర్లు పారదర్శకంగా పథకాల అమలుకు దోహదం గౌరవ వేతనం రూ.10 వేలు చేస్తామని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ హామీ అధికారంలోకి వచ్చాక ఆ ఊసెత్తని కూటమి పెద్దలు నేటితో వలంటీర్ వ్యవస్థకు ఆరేళ్లు జిల్లాలో 8,616 మంది వలంటీర్ల సేవలు ‘వలంటీర్లలో చాలా సమర్థత ఉంది. మేం అధికారంలోకి వస్తే వారిని ఉద్యోగాల నుంచి తీయబోం. వలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తాం. వారికి ఇస్తున్న గౌరవ వేతనాన్ని రూ.10 వేలకు పెంచే బాధ్యత నేను తీసుకుంటాను’. – ఎన్నికల్లో చంద్రబాబు హామీ ‘వలంటీర్లు నా అక్కాచెల్లెళ్లు. ఏ రోజూ కూడా నాకు వారి పొట్టకొట్టాలన్న ఉద్దేశం లేదు. మీకు రూ.5 వేలు వస్తే.. మరో రూ.5 వేలు అదనంగా ఇచ్చే మనసున్న వాణ్ణి’. – ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ హామీ ప్రజలకు నిస్వార్థంగా సేవలందించాం. కోవిడ్కు జడిసి ఎవరూ బయటకురాని సమయంలో ఇంటింటికీ వెళ్లి మందులు అందజేశాం. వలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని, పారితోషికం రూ.10 వేలకు పెంచుతామని ఎన్నికల్లో ఇచ్చిన మాటను కూటమి ప్రభుత్వం నిలుపుకోవాలి. – హెచ్వీకే చక్రవర్తి, వెలగలేరు, పెనుమంట్ర మండలం వలంటీర్ల పొట్టకొట్టబోమని, తాము అధికారంలోకి వస్తే పారితోషికం రూ.10 వేలకు పెంచుతామని ఎన్నికల్లో పదేపదే చెప్పిన కూటమి నాయకులు తర్వాత ఆ ఊసే ఎత్తడం లేదు. ఎన్నికల వాగ్దానం అమలు కోసం రాష్ట్రవ్యాప్తంగా వలంటీర్లు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. – దిడ్ల సత్యానందం, తణుకు జగనన్న వలంటీర్ ఉద్యోగాలు ఇచ్చి స్థానికంగా ఉపాధి కల్పించారు. అయితే కూటమి నాయ కులు అధికారంలోకి వస్తే జీతాలు పెంచుతామని హామీ ఇచ్చి తుంగలో తొక్కారు. మా ఉద్యోగాలు ఊడగొట్టి నోటికాడ కూడు లాగేసుకున్నారు. – ఎన్.లీలా ప్రియ, కుముదవల్లి -
మా పొట్ట కొట్టొద్దు
గళమెత్తిన ఆటో కార్మికులు భీమవరం/తణుకు అర్బన్/తాడేపల్లిగూడెం (టీఓసీ)/పాలకోడేరు/అత్తిలి/పెనుమంట్ర/ఆకివీడు: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనున్న ఉచిత బస్సు పథకంతో తాము జీవనోపాధి కోల్పోతామంటూ గురువారం జిల్లావ్యాప్తంగా ఆటో డ్రైవర్లు, కార్మికులు నిరసన తెలిపారు. బంద్లు, ధర్నాలతో ఆందోళన వ్యక్తం చేశారు. భీమవరంలో ఆటో వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు యింటి సత్యనారాయణ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా సుమారు 6 లక్షల మంది, జిల్లాలో 16 వేల మంది ఆటోలనే ఆధారంగా జీవనం సాగిస్తున్నారన్నారు. వారంతా రోడ్డున పడతారన్నారు. తణుకులో రాష్ట్రపతి రోడ్డు, సొసైటీ రోడ్డు, వేల్పూరు రోడ్డు, ఉండ్రాజవరం రోడ్డుతోపాటు రైల్వేస్టేషన్ ప్రాంతంలోని ఆటో యూనియన్ల ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతంలోని భారతమాత ఆటోయూనియన్ అధ్యక్ష, కార్యదర్శులు పంగం రాంబాబు, కంచుమర్తి విశ్వేశ్వరరావు ఆధ్వర్యంలో ధర్నా చేశారు. తాడేపల్లిగూడెంలో సుమారు 22 యూనియన్ల నాయకులు, ఆటో డ్రైవర్లు టెంట్లు వేసి నిరసన తెలిపారు. పట్టణంలో 24 గంటల పాటు ఆటోలను నిలుపుదల చేశారు. పాలకోడేరులోని రావిచెట్టు సెంటర్ వద్ద మహాత్మా గాంధీ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. అత్తిలి బస్స్టేషన్ సెంటర్లో ఆటో కార్మికులు నిరసన తెలిపారు. పెనుమంట్ర మండలంలో ఆటో డ్రైవర్లు బంద్ పాటించి తహసీల్దార్కు వినతిపత్రం సమర్పించారు. ఆకివీడులో అంబేడ్కర్ ఆటో యూనియన్ నాయకులు నిరసన తెలిపారు. ఆటోలను నిలుపుదల చేసి బంద్ పాటించారు. -
మన్యం వీరుల పోరు అజరామరం
దేశం కోసం ప్రాణాలర్పించిన ధీరులుగిరిజన స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబాలను గుర్తించి ప్రభుత్వం వారిని అన్ని విధాలుగా ఆదుకోవాలి. కేఆర్పురం ఐటీడీఏకు కారుకొండ సుబ్బారావు పేరు పెట్టాలి. గిరిజన స్వాతంత్య్ర పోరాట యోధులకు తగిన గౌరవం ఇవ్వాలి. – అయినారపు సూర్యనారాయణ, ఆదివాసీ మహాసభ న్యాయ సలహాదారు నేను గిరిజన వీరుడు కారుకొండ సుబ్బారెడ్డి ముని మనవడను. మాది పోలవరం మండలం కోండ్రుకోట. తెల్ల దొరలపై మా తాత చేసిన పోరాటాన్ని మా పెద్దలు మాకు ఎప్పుడూ చెబుతూ ఉండేవారు. సమరయోధుల కుటుంబానికి చెందిన మాకు ఎటువంటి గుర్తింపు లేదు. ప్రభుత్వం ఇప్పటికై నా గుర్తించి మమ్మల్ని అన్ని విధాలుగా ఆదుకోవాలి. – కారుకొండ అబ్బాయిరెడ్డి, కోండ్రుకోట బుట్టాయగూడెం: బ్రిటీష్ వారిపై తిరుగుబాటు చేసి ఉరి కొమ్మలకు వేలాడి ప్రాణాలు విడిచిన గిరిజన పోరాట వీరులు ఎందరో ఉన్నారు. వారి పోరాటాలు, త్యాగాలకు చారిత్రక ఆధారాలు లేకపోయినా ఆనాటి శిథిల భవనాల్లో ఆ జ్ఞాపకాలు నేటికీ సజీవంగానే ఉన్నాయి. ఆ అమర వీరులను దేశ స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా స్మరించుకుందాం. వెలుగులోకి రాని వీరుల త్యాగం తెల్లదొరలను ఎదురించి ప్రాణాలు పోగొట్టుకున్న వారిలో నలుగురు అజ్ఞాత స్వాతంత్య్ర పోరాట వీరులు పశ్చిమ మన్యానికి చెందిన వారు ఉన్నారు. అల్లూరి సీతారామరాజుకి ముందే వీరు పోరాటం చేసి మృతి చెందినప్పటికీ ఆ గిరిజన వీరుల త్యాగాలు వెలుగులోకి రాలేదు. ఆ నలుగురు వీరులు కారుకొండ సుబ్బారెడ్డి, కుర్ల సీతారామయ్య, కుర్ల వెంకట సుబ్బారెడ్డి, గురుగుంట్ల కొమ్మురెడ్డి. వీరు 1858లో బ్రిటిష్ పాలనకు ఎదురు తిరిగి తమ ప్రాణాలను తృణప్రాయంగా విడిచినట్లు చరిత్ర తెలిసిన పూర్వీకులు చెబుతున్నారు. తిరుగుబాటులో కారుకొండ సుబ్బారెడ్డి కీలకం 1857లో యావత్ భారతదేశంలో స్వాతంత్య్ర సమరం ప్రారంభమైనప్పుడు దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో బ్రిటీష్ వారిపై తిరుగుబాటు జరిగింది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మండలం కొరుటూరుకు చెందిన కొండరెడ్డి గిరిజన తెగకు చెందిన కారుకొండ సుబ్బారెడ్డి పోలవరం పరిసరాల ప్రాంతంతో పాటు బుట్టాయగూడెం నుంచి యర్నగూడెం వరకూ ఉన్న గిరిజన గ్రామాలకు జమిందారుగా ఉండేవారు. ఆయన స్వాతంత్య్ర సమరం జరుగుతున్న సమయంలో యర్నగూడెంలో ఆంగ్లేయులపై తిరుగుబాటు చేశాడు. ఆ సమయంలో గోదావరి దిగువ ప్రాంతంలో ఉన్న సుమారు 40 గ్రామాలతో బ్రిటీష్ వారిపై దండయాత్ర చేసి విజయం సాధించారు. సుబ్బారెడ్డికి ముఖ్య అనుచరుడిగా కుర్ల సీతారామయ్య ఉండేవారు. అలాగే గురుగుంట్ల కొమ్మురెడ్డి, అప్పటి తూర్పుగోదావరి జిల్లా కొండమొదలు గ్రామానికి చెందిన కుర్ల వెంకటరెడ్డి కలిసి తెల్లదొరలపై వీరోచిత పోరాటం చేశారు. ఆ సమయంలో సుబ్బారెడ్డి తలకు బ్రిటిష్ వారు రూ.2,500 వెల కట్టారు. చివరకు కొందరు గిరిజనులు వెన్నుపోటు పొడిచి కారుకొండ సుబ్బారెడ్డితోపాటు అతని అనుచరులను, మరికొందరు విప్లవ వీరులను 1858 జూన్ 11వ తేదీన బ్రిటీష్ వారికి పట్టించారు. 1858 అక్టోబర్ 7వ తేదీన కోర్టు విచారణ అనంతరం 8 మందిని అండమాన్ జైలుకు పంపారు. 35 మంది గిరిజన వీరుల్ని గుంటూరు దగ్గరున్న జైలులో యావజ్జీవ కారాగార శిక్ష విధించారు. కారుకొండ సుబ్బారెడ్డి, కుర్ల సీతారామయ్యలను బుట్టాయగూడెంలో ఉరి తీశారు. మిగిలిన ఆరుగురిని పోలవరం సమీపంలో ఉన్న దివానం వద్ద ఉరి తీశారు. కారుకొండ సుబ్బారెడ్డి చేసిన పోరాటానికి కోపోద్రిక్తులైన బ్రిటీష్వారు సుబ్బారెడ్డి మరణించిన తర్వాత అతడి మృతదేహాన్ని చిన్న బోనులో పెట్టి రాజమండ్రి దగ్గర ఉన్న కోటగుమ్మం వద్ద ప్రజలు చూసేవిధంగా వేలాడదీశారు. స్వాతంత్య్రం రావడానికి కొన్నేళ్ల ముందు వరకూ కూడా సుబ్బారెడ్డి మృతదేహం కోటగుమ్మం వద్ద వేలాడుతూ ఉండేదని పాతతరం వారు చెబుతున్నారు. బ్రిటీష్ వారిపై తిరుగుబాటు చేసి ఉరి కొమ్మలకు వేలాడిన ఆ అమర వీరుల పోరు అజరామరం. బ్రిటీష్ వారిపై పోరాటం చేసి మరణించిన వీరుల గ్రామం కొరుటూరు ముంపునకు గురై శిథిలావస్థలో ఉన్న దృశ్యం పాత పోలవరంలో బ్రిటీష్ వారు స్వాధీనం చేసుకున్న రెడ్డిరాజుల భవనం శిథిలావస్థలో ఉన్న దృశ్యం తెల్ల దొరలను గడగడలాడించిన మన్యం బిడ్డలు బ్రిటీష్ వారికి పోరాటయోధులను పట్టించిన వెన్నుపోటుదారులు 8 మంది వీరులను ఉరితీసిన బ్రిటీష్ పాలకులు -
ద్వారకాతిరుమలలో లారీ బీభత్సం
● రెండు కార్లను, ఒక ఆటోను ఢీకొట్టిన లారీ ● ఆటో డ్రైవర్కు గాయాలు ద్వారకాతిరుమల: శ్రీవారి క్షేత్రంలో గురువారం తెల్లవారుజామున ఒక లారీ బీభత్సాన్ని సృష్టించింది. గుడి సెంటర్లో రెండు కార్లను, గరుడాళ్వార్ సెంటర్లో రోడ్డు మధ్యలోని డివైడర్ మీద నుంచి దూసుకెళ్లి ఒక టాటా ఏస్ ఆటోను ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన సమయంలో ఆ ప్రాంతాల్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. స్థానికుల కథనం ప్రకారం. ద్వారకాతిరుమల క్షేత్రంలో బుధవారం రాత్రి భారీగా వివాహాలు జరిగాయి. పెదపాడు మండలం అప్పన్నవీడు గ్రామానికి చెందిన మాతంగి వెంకటేష్ తన ఆటోలో పెళ్లి బృందాన్ని క్షేత్రానికి తీసుకొచ్చాడు. వారిని కల్యాణ మండపం వద్ద దింపిన తరువాత గరుడాళ్వార్ సెంటర్లోని దేవస్థానం బస్స్టేషన్ వద్ద ఆటోను నిలిపి, అందులో నిద్రిస్తున్నాడు. అలాగే మచిలీపట్నం, విశాఖపట్నంకు చెందిన పెళ్లి బృందాలు వేసుకొచ్చిన రెండు కార్లను గుడి సెంటర్లో నిలిపి, కల్యాణ మండపాల్లోకి వెళ్లారు. గురువారం తెల్లవారుజాము 2 గంటల సమయంలో చింతలపూడి నుంచి కాకినాడకు వెళుతున్న ఒక లారీ గుడి సెంటర్లో నిలిపి ఉన్న రెండు కార్లను ఢీకొట్టింది. అక్కడి నుంచి ఆగకుండా వెళ్లిన లారీ గరుడాళ్వార్ సెంటర్ వద్ద డివైడర్పైకి దూసుకెళ్లి రోడ్డుకు అవతల వైపు దేవస్థానం బస్ షెల్టర్ వద్ద నిలిపి ఉన్న ఆటోను ఢీకొట్టింది. ఆటో పక్కనే ఉన్న విద్యుత్ స్తంభానికి తగలడంతో స్తంభం కాస్తా విరిగిపోయింది. ఈ ప్రమాదంలో ఆటోలో నిద్రిస్తున్న డ్రైవర్ వెంకటేష్కు గాయాలయ్యాయి. రెండు కార్లు, ఆటో ధ్వంసమయ్యాయి. ఈ ప్రమాదానికి లారీ డ్రైవర్ మద్యం మత్తే కారణమని పోలీసులు గుర్తించారు. వర్షం వల్ల తప్పిన పెను ప్రమాదం.. క్షేత్రంలో వివాహాలు జరిగే ప్రతిసారి రహదారులు పెళ్లి జనాలతో రద్దీగా ఉంటాయి. అయితే బుధవారం రాత్రి కుండపోత వర్షం కురవడంతో పెళ్లివారు ఎవరూ రోడ్లపైకి రాలేదు. దాంతో ఈ ప్రమాదంలో ప్రాణనష్టం జరగలేదు. గురువారం ఉదయం విద్యుత్శాఖ అధికారులు, సిబ్బంది విరిగిపోయిన విద్యుత్ స్తంభాన్ని తొలగించి, కరెంటు సరఫరాను పునరుద్ధరించారు. ప్రమాదానికి కారణమైన కాకినాడకు చెందిన లారీ డ్రైవర్ చెరుకూరి లక్ష్మీపతిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై టి.సుధీర్ తెలిపారు. -
ఉపాధ్యాయులకూ పరీక్షే
● విద్యార్థి సామర్థ్యానికి మించి ప్రశ్నలు ● సిలబస్లో లేని ప్రశ్నలు ఇస్తుండటంతో తలలు పట్టుకుంటున్న ఉపాధ్యాయులు ‘ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో ఎఫ్ఏ–1 పరీక్షల గురించి ఆరా తీస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్..’ ‘ఎఫ్ఏ1 పరీక్షల స్ట్రాటజీని చూసి హార్వర్డ్, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీల డీన్స్ సైతం ఆశ్చర్యపోయి ముక్కున వేలేసుకున్న వైనం..’ ఇవీ ఉపాధ్యాయుల, ఉపాధ్యాయుల సంఘాల వాట్సాప్ గ్రూపుల్లో, వాట్సాప్ ఛానల్స్లో చక్కర్లు కొడుతున్నాయి. నూజివీడు : కూటమి ప్రభుత్వం అడ్డగోలు నిర్ణయాలు తీసుకుంటూ ప్రభుత్వ విద్యారంగాన్ని భ్రష్టుపట్టిస్తోందన్న వాదన వినిపిస్తోంది. ఇప్పటికే పాఠశాలల విలీనం చేసి తొమ్మిది రకాల పాఠశాలలను తీసుకురావడమే కాకుండా క్లస్టర్ విధానంను తీసుకువచ్చి అస్తవ్యస్తం చేసిన ప్రభుత్వం ఇప్పుడు పరీక్షల తీరు చూస్తుంటే పరిస్థితులు అత్యంత దారుణంగా ఉందని ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. సిలబస్లో చెప్పిన పాఠాలు ఒకటైతే పరీక్షల్లో ఇస్తున్న ప్రశ్నలు వేరేగా ఉన్నాయని, గణితం గాని, ఇంగ్లిష్ గాని సిలబస్లో పాఠ్యపుస్తకంలో చెప్పిన లెక్కలు నుంచి ఒక్క ప్రశ్న కూడా ఇవ్వలేదని ఉపాధ్యాయులు వాపోతున్నారు. ఇలా ఇస్తే విద్యార్థులు ఎలా పరీక్షలు రాయగలరని వారు ప్రశ్నిస్తున్నారు. ఈ పరీక్షలు చూస్తుంటే విద్యార్థులకు పెట్టినట్లు లేదని, ఉపాధ్యాయులకు పరీక్షలు అన్నట్లు ఉందని వాపోతున్నారు. ఈనెల 11 నుంచి నిర్వహిస్తున్న ఎఫ్ఏ–1 పరీక్షల తీరు, ప్రశ్నాపత్రాల రూపొందించిన విధానం పరిశీలిస్తే ఉపాధ్యాయులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులకు మార్కులు రాకుండా ప్రభుత్వ పాఠశాలలను మరింత బలహీనం చేసేందుకే ఇలా చేస్తున్నారా అనే అనుమానాలను ఉపాధ్యాయులు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదివించిన, ప్రభుత్వం నిర్ధేశించిన సిలబస్ ఒకటైతే ప్రశ్నాపత్రాలలో ఇచ్చింది మరొకటి కావడం గమనార్హం. దీనిపై ఉపాధ్యాయ వర్గాల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. దీనివల్ల చదివే పిల్లలు కూడా ఉపాధ్యాయులు చెప్పే ప్రశ్నలు చదివినా పరీక్షల్లో రావని చదవకుండా ఉండే అవకాశం ఉందని ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రశ్నాపత్రాలు తయారు చేసే వారు ఒకసారి ఆలోచించి చదివినవి, సిలబస్లోనుంచి ఇస్తే కనీసం ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థుల చదువులు ముందుకు వెళ్తాయని ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు. అన్ని ప్రశ్నలు కూడా అప్లికేషన్ మెథడ్లో ఇవ్వడం వల్ల చదివే వాళ్లు కూడా చదవకుండా పోయే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు. పరీక్షలనేవి విద్యార్థులు నేర్చుకున్న అంశాలను, వివిధ ప్రశ్నల ద్వారా అంచనా వేసే విధంగా ఉండాలే తప్ప భయపెట్టే విధంగా వారి స్థైర్యాన్ని దెబ్బతీసేలా ఉండకూడదని అంటున్నారు. ఒకటో తరగతి విద్యార్థికి ఏప్రిల్ నెలలో నేర్చుకోబోయే సిలబస్లో ప్రశ్నలు ఆగస్టులో జరిగే యూనిట్ పరీక్షలు ఇవ్వడంపై ఉపాధ్యాయులు విస్మయానికి గురవుతున్నారు. పరీక్షల్లో ఇచ్చిన కొన్ని ప్రశ్నలు ఇలా.. ఒకటో తరగతి పిల్లలు ఇప్పుడిప్పుడే పాఠశాలలకు అలవాటు అవుతున్నారు. ఇంకా కొందరు పాఠశాలకు రావడానికి మొరాయిస్తున్నారు. వీరు ఇప్పుడిప్పుడే తెలుగు, ఇంగ్లిష్ అక్షరాలను గుర్తు పడుతున్నారు. అలాంటి పిల్లలకు ఇంగ్లిష్లో పేరాగ్రాఫ్ ఇచ్చి దానిని విని ఇంగ్లిష్లోని ప్రశ్నలకు సమాధానాలు రాయడం, పదాలు తయారు చేయడం చేయాలి. అలాగే మూడో తరగతి విద్యార్థి తెలుగులో పుస్తక సమీక్ష చేసి, ఆ సమీక్షను సమర్పణ చేయాలి. అలా చేసినప్పుడే వాటికి మార్కులు ఇవ్వాలి. మూడో తరగతి ఆంగ్ల భాష పరీక్షకు నాలుగో తరగతిలోని పాఠాల నుంచి ప్రశ్నలు ఇచ్చారు. ఎస్సీఈఆర్టీలో ప్రశ్నాపత్రాలు రూపొందించే వారికి విద్యార్థి స్థాయి, సామర్థ్యంపై కనీస అవగాహన ఉండటం లేదని ఉపాధ్యాయులు అభిప్రాయ పడుతున్నారు. ఉపాధ్యాయులను, విద్యార్థులను ఇబ్బంది పెట్టడానికి తప్ప ఈ పరీక్షలు దేనికి ఉపయోగమనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహిస్తున్న పరీక్షలపై వాట్సాప్ గ్రూపుల్లో తిరుగుతున్న కార్టూన్లు -
పార్టీ కాకినాడ జిల్లా మహిళా విభాగం ఇన్చార్జిగా జయసరిత
పాలకొల్లు సెంట్రల్: వైఎస్సార్ సీపీ కాకినాడ జిల్లా మహిళా విభాగం ఇన్చార్జిగా పాలకొల్లుకు చెందిన రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి క్రరా జయసరితను నియమించారు. ఈ సందర్భంగా తనకు పదవి కల్పించిన పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి, రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు వరుది కళ్యాణి, ఉభయగోదావరి జిల్లాల కోఆర్డినేటర్ బొత్స సత్యనారాయణ, పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకుడు ముదునూరి మురళీకృష్ణంరాజు, జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్ర సాదరాజు, నియోజకవర్గ ఇన్చార్జి గుడాల శ్రీ హరిగోపాలరావుకు కృతజ్ఞతలు తెలియజేశారు. అత్తిలి: మంచిలి గ్రామానికి చెందిన దివ్యాంగ సంఘటన సంఘ నాయకుడు నండూరి రమేష్ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర గవర్నర్ నిర్వహించే ఎట్ హోం కార్యక్రమానికి ఎంపికయ్యారు. ఏటా స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర గవర్నర్ ప్రముఖులతో ఎట్ హోమ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అందులో భాగంగా దివ్యాంగుల కోట కింద మంచిలి గ్రామానికి చెందిన నండూరి రమేష్ను జిల్లా అధికారులు ఎంపిక చేశారు. దివ్యాంగుల సంక్షేమం కోసం రమేష్ పలు సేవా కార్యక్రమాలు నిర్వహించి జాతీయ స్థాయిలో ఉత్తమ అవార్డులు కూడా గతంలో పొందారు. నూజివీడు: దేవాలయాలు, ప్రార్థనా మందిరాల్లో హుండీలను చోరీ చేసిన దొంగను చాట్రాయి పోలీసులు అరెస్టు చేశారు. డీఎస్పీ కేవీవీఎన్వీ ప్రసాద్ గురువారం నూజివీడులో వివరాలు వెల్లడించారు. ఈనెల 13న సాయంత్రం చాట్రాయి ఊరి చివర పోలవరం వెళ్లే రోడ్డు మలుపులో ఉన్న ఆంజనేయస్వామి గుడి వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా చాట్రాయి వైపు నుంచి పోలవరం వైపునకు మోటార్సైకిల్పై వెళ్తూ అనుమానాస్పదంగా వ్యవహరిస్తున్న పటాన్ సలార్ఖాన్ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. ఏలూరు నగరంలోని పడమట వీధికి చెందిన పటాన్ సలార్ఖాన్(56)పై ఇప్పటి వరకు 51 దొంగతనం కేసులు ఉండగా ఏలూరు జిల్లాలో 25, నెల్లూరు జిల్లాలో 23, ఎన్టీఆర్ జిల్లాలో 3 చొప్పున కేసులు ఉన్నాయి. ఇతని వద్ద నుంచి రూ.5,900 నగదు, మోటర్ సైకిల్ను రికవరీ చేశారు. నిందితుడిని అరెస్టు చేయడంలో ప్రతిభ చూపిన నూజివీడు సీఐ కొప్పిశెట్టి రామకృష్ణ, చాట్రాయి ఎస్సై డీ రామకృష్ణ, హెడ్కానిస్టేబుళ్లు ఎం విజయ్భాస్కర్, జీ శ్రీనివాసరావు, కానిస్టేబుళ్లను అభినందించారు. టి.నరసాపురం: ఒంటరి జీవితాన్ని భరించలేక ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గురువారం కె.జగ్గవరంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి హెచ్సీ కె.వెంకటేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం కె.జగ్గవరం గ్రామానికి చెందిన బర్రి రాజేష్ (35) పదేళ్ల క్రితం తన పెద్దక్క కుమార్తెను వివాహం చేసుకున్నాడు. పెళ్లయిన నెల రోజులకే ఆమె రాజేష్ను విడిచి వెళ్లిపోయింది. ఈ క్రమంలో రాజేష్ తల్లి వద్ద ఉంటున్నాడని అతనికి చిన్నప్పటి నుంచి కొంచెం మతిస్థిమితం సరిగా లేకపోవడం వల్ల అప్పుడప్పుడు ఫిట్స్ వచ్చేదన్నారు. ఈ నేపథ్యంలో ఒంటరి జీవితాన్ని భరించలేక ఈనెల 13న గుర్తు తెలియని మందు తాగి ఇంటివద్ద ఆత్మహత్యాయత్నం చేసుకోవడంతో, స్థానికులు గుర్తించి చింతలపూడి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రాజేష్ మృతి చెందాడు. రాజేష్ అన్న ఏలియా ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు హెచ్సీ తెలిపారు. -
వాగులు పొంగి.. పొలాలు నీటమునిగి
దెందులూరు: భారీ వర్షాలకు కొవ్వలిలో మొండికోడు, బుడమేరు వాగులు పొంగిపొర్లుతున్నాయి. రెండు వాగుల వరద ఉద్ధృతికి కొవ్వలిలో 100 ఎకరాలు వరి పంట ముంపునకు గురైంది. ఈ రెండు వాగులు వరద పెరిగినా, వర్షాలు ఆగకపోయినా కొవ్వలిలో మరింత ముంపునకు గురయ్యే అవకాశం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. దెందులూరులో ౖసైఫెన్పై నీటి ప్రవాహం క్రమేపీ పెరుగుతోంది. పెరుగుతున్న నీటి ప్రవాహాన్ని అంచనా వేసి దెందులూరు తహసీల్దార్ బీ.సుమతి, ఎస్సై ఆర్ శివాజీ సైఫన్ పై రాకపోకలను నిలుపుదల చేశారు. స్టాప్ బోర్డులను ఏర్పాటు చేశారు. సైఫన్లో బ్రిడ్జిల వద్ద కాపలాగా గ్రామస్థాయి ఉద్యోగులను ప్రత్యేక డ్యూటీలు వేసి రెండు వైపులా పెట్టారు. చిన్న దళిత వాడ వద్ద పైనుంచి వచ్చే వర్షపు నీరు సీతంపేట కాలువ నుంచి బయటకు రాకుండా ముందుగానే అధికారులు, రైతులు సంయుక్తంగా ఇసుక బస్తాలను రక్షణ గోడగా రెండుచోట్ల ఏర్పాటు చేశారు. జాతీయ రహదారిపై సర్వీస్ రోడ్లో పొలాలకు వెళ్లే దారి గండి పడింది. పైనుంచి వర్షపు నీరు అధికంగా రావటంతో పొలాలకు వెళ్లే రైతులకు అసౌకర్యం కలిగింది. రోడ్డు పక్కన 10 ఎకరాలు వరి పొలం నీట మునిగింది. -
సత్యనారాయణపురంలో చోరీ
ఆకివీడు: మండలంలోని పెదకాపవరం శివారు సత్యనారాయణపురం గ్రామంలో తాళం వేసి ఉన్న ఓ ఇంట్లో చోరీ జరిగింది. గ్రామంలోని ఇందుకూరి సూర్యనారాయణరాజు బుధవారం ఉదయం తన ఇంటికి తాళం వేసి పిప్పర గ్రామంలోని బంధువుల ఇంటికి వెళ్లాడు. తిరిగి గురువారం ఉదయం ఇంటికి వచ్చేసరికి తాళం బద్దలుకొట్టి ఉండడంతో లోపలికి వెళ్లి చూడగా బీరువా తాళాలు తెరిచి ఉండడం, సుమారు రూ.1.60 లక్షల విలువైన ఆరు కాసుల బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎస్సై హనుమంతు నాగరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఏలూరు టౌన్: టిప్టాప్ దుకాణంలో కూలీగా పనిచేస్తున్న ఓ యువకుడిపై గోడ కూలిపోవటంతో మృతిచెందాడు. దీంతో ఆ కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. ఏలూరు నగరానికి చెందిన కోన సాయి (22) బాలబాలాజీ అనే టిప్టాప్ కంపెనీలో టెంట్లు వేసే కూలీగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. తంగెళ్ళమూడి ప్రాంతంలో నూతన భవన నిర్మాణానికి భూమిపూజ కోసం బుధవారం టెంట్లు వేశారు. అనంతరం గురువారం టెంట్లు తొలగించేందుకు సాయి అక్కడికి వెళ్లాడు. బుధవారం రాత్రి భారీ వర్షంతో గోడలు పూర్తిగా నానిపోయి ఉన్నాయి. ఈ నేపథ్యంలో టెంట్లు తీస్తూ ఉండగా ఆకస్మికంగా గోడ అతనిపై కూలిపోవడంతో సాయి అక్కడికక్కడే మృతిచెందాడు. దీంతో అతని బంధువులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. తమకు న్యాయం చేయాలంటూ మృతదేహంతో రోడ్డుపై బైఠాయించారు. సమాచారం అందుకున్న ఏలూరు టూటౌన్ సీఐ అశోక్కుమార్ ఘటనా స్థలానికి వెళ్లి కుటుంబ సభ్యులకు నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
నిండా ముంచేను
గణపవరం: భారీ వర్షంతో గణపవరం, కొత్తపల్లి, చినరామచంద్రపురం, కేశవరం, పిప్పర, మొయ్యేరు, కొందేపాడు తదితర గ్రామాల్లో వరి చేలు ముంపుబారిన పడ్డాయి. బుధవారం రాత్రి భారీ వర్షం కురవగా గణపవరం, చినరామచంద్రపురం ప్రాంతాల్లో చేలల్లో మోకాలి లోతు నిలిచిపోయింది. మండల వ్యవసాయ అధికారి ఆర్ఎస్ ప్రసాద్, వ్యవసాయ సిబ్బంది నష్టం అంచనాలు తయారుచేస్తున్నారు. మండలంలో 650 హెక్టార్ల విస్తీర్ణంలో వరి నాట్లు నీటమునిగినట్టు అంచనా వేశారు. అలాగే మండలంలోని పంట, మురుగు కాల్వలు నిండుకుండల్లా ప్రవహిస్తున్నాయి. గట్లు బలహీనంగా ఉన్న చోట్ల రైతులు మట్టితో గట్లను పటిష్టం చేసుకుంటున్నారు. పలుచోట్ల కాలువలకు గండ్లు పడగా రైతులు చేలు మునగకుండా కాపాడుకుంటున్నారు. భారీ వర్షంతో గణపవరం నుంచి భీమవరం వెళ్లే రోడ్డు గోతులమయంగా మారి ప్రయాణం ప్రమాదకరంగా తయారైంది. -
రాష్ట్రపతి విశిష్ట పురస్కారానికి పెద్దిరాజు ఎంపిక
పాలకోడేరు: సీబీఐ అధికారి పాలకోడేరు మండలం శృంగవృక్షం (బంటుమిల్లి) గ్రామానికి చెందిన బండి పెద్దిరాజు స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం అందించే రాష్ట్రపతి పోలీస్ పురస్కారానికి ఎంపికయ్యారు. ప్రస్తుతం న్యూఢిల్లీలోని కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) ప్రధాన కార్యాలయం సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డివిజన్లో ఆయన అదనపు పోలీసు సూపరింటెండెంట్గా విధులు నిర్వహిస్తున్నారు. 1993లో సీబీఐలో కానిస్టేబుల్గా చేరిన ఆయన తన 32 ఏళ్ల సర్వీసులో ఇప్పటివరకు 150 పైబడి రివార్డులు అందుకున్నారు. 2008లో ఇండియా ఉత్తమ దర్యాప్తు అధికారి గోల్డ్ మెడల్, 2017లో ఇండియన్ పోలీస్ మెడల్ – ఐపీఎం, 2014, 2018లో రెండుసార్లు అత్యుత్తమ దర్యాప్తు అధికారి అవార్డులు, 2019లో ‘డేటా సెక్యూరిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అవార్డు – ఇండియా సైబర్ కాప్ ఆఫ్ ది ఇయర్’ పొందారు. 1997లో సబ్ ఇన్స్పెక్టర్, 2003లో ఇన్స్పెక్టర్, 2016లో డిప్యూటీ ఏఎస్పీ, 2023లో అడిషనల్ ఎస్పీగా ఉద్యోగోన్నతులు పొందారు. కేసుల దర్యాప్తులో కీలకపాత్ర రామర్ హెర్బల్ ఫ్యూయల్ కేసు, పరిటాల రవి హత్య కేసు, న్యాయవాది సతీష్ హత్య అండ్ అంతర్రాష్ట్ర నారాయణన్ హత్య కేసులను మద్రాస్ హైకోర్టు ఆయనకు అప్పగించింది. ఏపీ హైకోర్టు న్యాయమూర్తులపై అసభ్యకరమైన సోషల్ మీడియా పోస్టుల కేసులు, బిట్స్ పిలానీ ఆన్లైన్ పరీక్ష కుంభకోణం, అంతర్జాతీయ ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపుల కేసు, మైక్రోసాఫ్ట్, అమెజాన్లను అనుకరిస్తూ అంతర్జాతీయ టెక్ సపోర్ట్ స్కామ్లు వంటి హై ప్రొఫైల్ కేసులను ఆయన దర్యాప్తు చేశారు. ఇటీవల ఆయన నీట్ 2024 ప్రశ్నపత్రం లీకేజ్ కేసులో చీఫ్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్గా పనిచేశారు. అక్కడ ఆయన ప్రయత్నాలు 45 మంది నిందితులను అరెస్టు చేయడానికి, సమగ్ర చార్జిషీట్లను దాఖలు చేయడానికి ఉపయోగపడ్డాయి. బండి పెద్దిరాజుకు రాష్ట్రపతి పోలీసు పతకం లభించడంపై శృంగవృక్షం శ్రీ వాసవీ ఆర్య వైశ్య సంఘం, వాసవీ క్లబ్, గ్రామాభివృద్ధి కమిటీ హర్షం వ్యక్తం చేశాయి. -
ఒలుపులో వెరైటీలెన్నో !
సాక్షి, భీమవరం: కొబ్బరి కాయ ఒలవడం తేలికేనని తీసి పారేయకండి. దానికీ ఓ పద్ధతుంది. బొండాం, ముప్పేట, ముదర కాయ, కురిడీ అంటూ కాయల్లో రకాలున్నట్టే.. పిలక, బొంబాయి సీలు, కసింగలు, పోర్పట్టా, బోరాలు, మూడు నామాలు.. అంటూ ఒలుపుల్లోనూ పదికి పైనే వెరైటీలు ఉన్నాయి. ప్రాంతాన్ని బట్టి ఒలుపులు మారుతుంటాయి. ప్రస్తుతం రికార్డు ధరతో పశ్చిమ గోదావరి జిల్లా నుంచి రోజుకు దాదాపు వంద లారీల కొబ్బరి కాయలు ఇతర రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్నాయి. అక్కడి అవసరాలకు తగ్గట్టు ఇక్కడి ఒలుపు కార్మికులు వడివడిగా కాయలను వలుస్తున్నారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని సుమారు 50 వేల ఎకరాల్లో కొబ్బరి సాగవుతోంది. ఆచంట, పాలకొల్లు, నరసాపురంలోని వశిష్ట గోదావరి, సముద్ర తీరం వెంబడి, భీమవరం, ఉండి, ఆకివీడు ప్రాంతాల్లోని ఆక్వా చెరువు గట్లు, తాడేపల్లిగూడెం, ఏలూరు, జంగారెడ్డిగూడెం, కొవ్వూరు, తణుకు ప్రాంతాల్లో తోటలు సాగు చేస్తున్నారు. జిల్లా నుంచి రాజస్తాన్, గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, పశ్చిమబెంగాల్, బీహార్, పంజాబ్, ఢిల్లీ తదితర రాష్ట్రాలకు కొబ్బరి ఎగుమతి అవుతున్నాయి. తమిళనాడు, కేరళ తర్వాత మన కొబ్బరికి దేశ వ్యాప్తంగా గిరాకీ ఉన్నట్టు వ్యాపారులు చెబుతున్నారు. తమిళనాడులో దిగుబడి తగ్గడంతో నెలన్నర రోజులుగా జిల్లా నుంచి ఎగుమతులకు డిమాండ్ ఏర్పడింది. మునుపెన్నడూ లేనివిధంగా రైతు ధర కాయకు రూ.18 నుంచి రూ.20 మధ్య నిలకడగా ఉంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రోజుకు వంద లారీల వరకు కాయలు ఎగుమతి అవుతున్నట్టు వ్యాపారులు చెబుతున్నారు. ఒలుపులో రకాలెన్నో.. హిందూ సంప్రదాయంలో కొబ్బరి కాయకు ఎంతో విశిష్టత ఉంది. పూజల్లో కొట్టడం నుంచి హోమాల్లో కాయ పళంగా వేయడం, దిష్టి, దిగదుడుపు తీయడం తదితర ప్రతి పనిలోనూ కొబ్బరికాయ ఉండాల్సిందే. మన ప్రాంతంలో ముచ్చిక, పిలకతో ఒలిచిన వాటిని వినియోగించినట్టే ఇతర ప్రాంతాల్లో వివిధ రూపాల్లో ఒలిచిన కాయలను వాడుతుంటారు. ఈ మేరకు జిల్లా నుంచి ఎగుమతులు జరిగే రాష్ట్రాల్లోని అవసరాలకు తగ్గట్టు కాయలను ఒలుస్తుంటారు. వీటిలో పిలక, బొంబాయి సీలు, రాయపూర్ సీలు, మూడు నామాలు, కసింగలు, బోరాలు, బెల్ట్ పోర్ పట్టా, బెల్ట్ లెస్ పోర్పట్టా, ఐదు పేళ్లు, ఆరు పేళ్లు, ఎనిమిది పేళ్లు తదితర పదికి పైనే ఒలుపుల్లో రకాలున్నాయి. ఎగుమతి అయ్యే ప్రాంతంలో ఆయా ఒలుపులకు ఏ పేర్లున్నా కానీ స్థానికంగా తాము ఈ విధంగా పిలుచుకుంటామని వ్యాపారులు, ఒలుపు కార్మికులు అంటున్నారు. రాయపూర్ సీలును కాయ వెనుక నుంచి మూడు పేళ్లుగా ఒలిస్తే, కసింగలను ముందు నుంచి మూడు, వెనుక నుంచి మూడు పేడులుగా కాయపైన పీచు ఉంచి డొక్కను ఒలుస్తారు. బెల్టు పోర్పట్టా కోసం కాయకు నాలుగు వైపులా మధ్యలో అరంగుల డొక్క ఉంచి మిగిలిన దానిని తీసివేస్తారు. బెల్టు లెస్ కోసం నాలుగు వైపులా స్క్వేర్ ఆకారంలో పీచు ఉండేలా డొక్కను ఒలుస్తారు. అదేమాదిరి ఐదు పేళ్లు, ఆరు పేళ్లు, ఎనిమిది పేళ్లు సంఖ్యను బట్టి అన్ని పేళ్లుగా పైడొక్కను తొలగిస్తారు. మూడు నామాల కోసం కాయకు మూడు వైపులా అంగుళం వెడల్పున పీచు ఉంచి మిగిలిన డొక్కను పీచు సహా తీసేస్తారు. బొంబాయి సీలు కోసం కాయకు సగభాగం పూర్తిగా పీచును ఒలిచేసి మిగిలిన సగభాగం ఉంచేస్తారు. ఇలా వివిధ రకాలుగా కాయలను ఒలుస్తుంటారు. అవసరాన్ని బట్టి ఒలుపు ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా ఒలిచిన కాయలను వినియోగిస్తుంటారు. ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన ఆర్డరు మేరకు వారికి అవసరమైన రీతిలో ఒలిపించి ఎగుమతి చేస్తుంటాం. తమిళనాడులో దిగుబడులు తగ్గడంతో ప్రస్తుతం జిల్లా నుంచి ఎగుమతులు బాగున్నాయి. రైతులకు రికార్డు ధర వస్తోంది. – కాసా సత్యనారాయణ, వ్యాపారి, యలమంచిలి, పశ్చిమగోదావరి జిల్లాఏ ఒలుపు ఎక్కడికి.. బెల్ట్లెస్ పోర్పట్టా కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాలకు ఎక్కువగా ఎగుమతి జరిగితే బోరాలు యూపీ, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు, ఆరు పేళ్లు యూపీ, కర్ణాటక, రాయపూర్ సీలు, ఐదు పేళ్లు మహారాష్ట్రకు, పిలకలు ముంబయి, బిహార్కు, మూడు నామాలు మహారాష్ట్రకు, కసింగలు అన్ని ప్రాంతాలకు ఎగుమతి అవుతుంటాయని వ్యాపారులు చెబుతున్నారు. ఆయా ప్రాంతాల్లో చాలా వరకు కొట్టకుండా వీటిని నేరుగా హోమాల్లో వేస్తారన్నారు. కాయపళంగా కన్నా ఒలిపించడం వల్ల బరువు తగ్గి ఎక్కువ కాయలు తీసుకువెళ్లే వీలుంటుందని అక్కడి అవసరాలకు తగ్గట్టు ఇక్కడే ఒలిపించుకుని తీసుకువెళతారని అంటున్నారు. కావాల్సిన ఆకారంలో వేగంగా కాయలు ఒలవడం అనుభవంతో కూడిన పని. ఒక్కో కాయ ఒలుపునకు రూ.1.50 చొప్పున ఇస్తారు. రోజుకు ఒక్కో కార్మికుడు 800 నుంచి 1000 కాయలను ఒలుస్తుంటారు. గండీర.. గటగట ఉత్తరాది రాష్ట్రాల్లో కురిడీ కొబ్బరి ఆహారంలోనూ భాగంగా ఉంటుంది. ఇవి ఎక్కువగా రాజస్తాన్, మధ్యప్రదేశ్కు వెళుతుంటాయి. బాగా తయారైన కాయలను ఎంపిక చేసి ఎనిమిది పేళ్లుగా ఒలుస్తారు. గోదాముల్లో గాలి తగిలేలా అరలు కట్టి కాయలను నిల్వ చేస్తారు. ఆరు నెలలకు లోపలి నీరు పూర్తిగా ఇంకిపోయి గుడ్డు మాత్రమే ఉంటుంది. మొదట్లో 600 గ్రాముల నుంచి 700 గ్రాములు ఉన్న కాయ బరువు కురిడీ అయ్యేసరికి 80 గ్రా. నుంచి 100 గ్రా.కు తగ్గిపోతుంది. నాణ్యమైన గండీర, సెకండ్ క్వాలిటీని గటగటగా పిలుస్తుంటారు. గండీరకు రూ.30 ఉండగా గటగటకు రూ.28 ధర ఉన్నట్టు చెబుతున్నారు. నాలుగు దశాబ్దాల అనుభవం నలభై ఏళ్లుగా ఒలుపు పని చేస్తున్నాను. ఒక్కో ప్రాంతం నుంచి వచ్చిన వారు ఒక్కో విధంగా ఒలవమని చెబుతుంటారు. ఏ రకంగా ఒలవాలన్నా దాదాపు ఒకే సమయం పడుతుంటుంది. ప్రస్తుతం సీజన్ కావడం వల్ల పని ఎక్కువగా ఉంది. – కొడవటి ఎర్రియ్య, ఒలుపు కార్మికుడు, పాలకొల్లు, పశ్చిమగోదావరి జిల్లా -
దంచికొట్టిన వాన
భీమవరం: పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా బుధవారం భారీ వర్షం ముంచెత్తింది. మధ్యాహ్నం మూడు గంటల నుంచి భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు, ఉండి, ఆచంట, నియోజకవర్గాల్లో కుండపోత వర్షంతో పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి. పాలకొల్లు, నరసాపురం నియోజకవర్గాల్లో మోస్తరు వర్షం కురిసింది. భారీ వర్షం కురిసిన ప్రాంతాల్లో ఽప్రధాన రహదారులపై వర్షం నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇక్కట్లకు గురయ్యారు. కొద్దిరోజులుగా ఎండ వేడి, ఉక్కపోతతో ఇబ్బందులు పడ్డ ప్రజలు భారీ వర్షంతో వాతావరణం చల్లబడి సేదతీరినా.. లోతట్టు ప్రాంతాల్లోని నీరు నిలిచిపోవడంతో ఆయా ప్రాంతాల ప్రజల అవస్థలు పడ్డారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలి భీమవరం(ప్రకాశం చౌక్): రానున్న 3 జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమతంగా ఉండాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదేశించారు. అందరూ ప్రధాన కేంద్రాల్లోనే ఉండాలని, ఎవరికీ సెలవులు మంజూరు చేయమని స్పష్టం చేశారు. నరసాపురం, మొగల్తూరు, ఆచంట మండలాల్లో ఎక్కువ దృషి్ట్ పెట్టాలని, మత్స్యకారులు వేటకు వెళ్లకుండా చూడాలని ఆదేశించారు. ఎలాంటి ప్రాణ, ధన నష్టం జరగకుండా చూడాలని సూచించారు. వైద్య ఆరోగ్య శాఖ అత్యవసర మందులు, క్లోరిన్, బ్లీచింగ్ తదితర సామగ్రితో సిద్ధంగా ఉండాలని తెలిపారు. వ్యవసాయ అధికారులు, ఇరిగేషన్ అధికారులు వర్షాలు తగ్గే వరకు జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. కలెక్టరేట్లో 08816 299181 నెంబరుతో కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. నేడు స్కూళ్లు, కాలేజీలకు సెలవు : భారీ వర్షాల నేపథ్యంలో 14న జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు, అంగన్వాడీలకు సెలవు ప్రకటించినట్లు కలెక్టర్ తెలిపారు. ఈ ఆదేశాలను ప్రైవేటు విద్యాసంస్థలు తప్పకుండా పాటించాలని, లేనిపక్షంలో చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఇరగవరంలో భారీ వర్షం జలమయమైన రహదారులు నీటమునిగిన లోతట్టు ప్రాంతాలు యంత్రాంగం అప్రమత్తం నేడు స్కూళ్లు, కాలేజీలకు సెలవు -
వ్యవసాయ రంగాన్ని కాపాడుకోవాలి
భీమవరం: కార్పొరేట్ల చెర నుంచి వ్యవసాయ రంగాన్ని దేశ సంపదను కాపాడుకోవాలని ఎస్కేఎం జిల్లా కన్వీనర్ ఆకుల హరే రామ్ పిలుపునిచ్చారు. క్విట్ కార్పొరేట్ కార్యక్రమంలో గొరగనమూడి రైస్ మిల్ నుంచి బైక్ ర్యాలీ ప్రకాశం చౌక్ చేరుకున్నాక అక్కడ సభ నిర్వహించారు. సభకు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి జక్కంశెట్టి సత్యనారాయణ అధ్యక్షత వహించారు. హరేరామ్ మాట్లాడుతూ దేశ ప్రజల సంపదను నల్ల కార్పొరేట్లకు దోచిపెట్టే మోదీ విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. రానున్న రోజుల్లో వ్యవసాయ రంగాన్ని కాపాడుకోవడానికి మరో స్వాతంత్ర పోరాటం చేయాలన్నారు. సీఐటీయు జిల్లా ఉపాధ్యక్షులు బి.వాసుదేవరావు మాట్లాడుతూ కేంద్రంలో మోదీ కార్మిక చట్టాలను రద్దుచేసి వాటి స్థానంలో నాలుగు లేబర్ కోడ్ల అమలుకు ప్రయత్నించి కార్మిక హక్కులను కార్పొరేట్లకు తాకట్టు పెడుతున్నారన్నారు. టీయూసీసీ జిల్లా నాయకులు దండు శ్రీనివాసరాజు, కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఎం.రామాంజనేయులు, ప్రజా సంఘాల నాయకులు ఎం.ఆంజనేయులు, బాతిరెడ్డి జార్జి, ఎస్.ఆశ్రీయ్య, బొర్రా అలమహారాజు, చల్లబోయిన వెంకటేశ్వరరావు, బి. నాగు. డి.త్రిమూర్తులు పాల్గొన్నారు. ఉచిత ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం భీమవరం: విద్యాహక్కు చట్టం–2009 పరిధిలో ప్రవేటు, అన్ ఎయిడెడ్ పాఠశాలలో ఉచిత ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలని సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ పి.శ్యాంసుందర్ తెలిపారు. 25 శాతం శాతం కోటాలో అర్హత గల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఓసీ వర్గాలు, అనాథలు, హెచ్ఐవీ బాధితులు, విభిన్న ప్రతిభావంతుల పిల్లలకు అర్హత ఉన్నవారికి ప్రవేశాలు ఉంటాయని తెలిపారు. వివరాలకు 86391 33614, 95533 80179 నెంబర్లలో సంప్రదించాలని కోరారు. కూటమి సంబరం వెలవెల భీమవరం: భీమవరంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో కూటమి పార్టీల నాయకులు బుధవారం నిర్వహించిన రైతు సంబరం రైతులు లేక వెలవెలబోయింది. రైతులకు ఏటా రూ.20 వేలు అందిస్తామని హామీ ఇచ్చిన నాయకులు తొలి ఏడాది ఎగ్గొట్టారు. దీనికితోడు దాళ్వా ధాన్యం సొమ్ములను రైతులకు ఇవ్వడంలో తీవ్ర జాప్యం చేయడం, ప్రస్తుత సార్వా సీజన్లో యూరియా కొరతతో ఇబ్బంది పడుతున్నారు. ఈ తరుణంలో కూటమి నాయకులు నిర్వహించిన కార్యక్రమానికి మొహం చాటేశారు. -
వైఎస్ ముద్రను చెరిపేసే కుట్ర
తాడేపల్లిగూడెం: తాడేపల్లిగూడెం మండలం వెంకట్రామన్నగూడెంలో ఏర్పాటుచేసిన డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం ముఖద్వారం వద్ద యోగముద్రలో ఉన్న వైఎస్ విగ్రహం ఏర్పాటుకు సంబంధించి ఏర్పాటును అడ్డుకునేందుకు వర్సిటీ అధికారులు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. వాస్తవానికి 2023లో ఇక్కడ విగ్రహం ఏర్పాటుచేయాల్సి ఉంది. దీని తయారీకి అప్పటి డిప్యూటీ సీఎం శిల్పికి రూ.10 లక్షలు బయానాగా ఇచ్చారు. వర్సిటీ ముఖద్వారం వద్ద విగ్రహం ఏర్పాటుకు అప్పటి పాలకమండలి తీర్మానం చేసింది. ఇది కార్యరూపంలోకి తేకుండా అక్కడ ఒక రైతు, అతని భార్య బొమ్మలను ఏర్పాటుచేశారు. దీంతో వర్సిటీలో వైఎస్ ముద్రను చెరిపే కుట్ర మరోసారి తేటతెల్లమైంది. ఈ విషయంపై మాజీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ కోర్టును ఆశ్రయించారు. విషయాన్ని పరిశీలించాల్సిన కోర్టు దీనికి సంబంధించిన వివరాలు అందచేయాల్సిందిగా ఉద్యాన వర్సిటీ అధికారులను ఆదేశించింది. రైతు ఉద్యాన పంటలతో ఆర్థిక స్వయం సమృద్ధి సాధించాలని వైఎస్ రాజశేఖరరెడ్డి ఆకాంక్షించారు. దక్షిణ భారత దేశంలో మొదటిది.. దేశంలో రెండవదిగా ఉద్యాన విశ్వవిద్యాలయాన్ని వెంకట్రామన్నగూడెంలో ఏర్పాటుచేశారు. తాడేపల్లిగూడెం ప్రాంతం వర్సిటీ ఏర్పాటుకు ఎందుకు అనుకూలమో కొట్టు సత్యనారాయణ అంకెలతో అసెంబ్లీలో విపులీకరించారు. గూడెంలో వర్సిటీని అడ్డుకొనే ప్రయత్నం చేసిన కొంతమంది నోటికి తాళం వేశారు. గూడెంలో రాజీవ్ గృహకల్ప సముదాయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి వచ్చిన దివంగత సీఎం రాజశేఖరరెడ్డి అదే వేదికపై నుంచి గూడెంలో ఉద్యాన వర్సిటీ ఏర్పాటు చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు. అనంతరం 2007లో వెంకట్రామన్నగూడెంలో ఏర్పాటుచేశారు. 2014లో టీడీపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. 2015లో డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం పేరును మార్చాలని జెడ్పీ సర్వసభ్య సమావేశంలో తీర్మానం చేశారు. దీనిపై అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ఈ ప్రతిపాదన అటకెక్కింది. తాజాగా రెండో కుట్ర : వైఎస్ విగ్రహాన్ని ఆయన స్మృతిచిహ్నంగా ముఖ ద్వారం వద్ద ఏర్పాటు చేయడానికి ప్లాట్ఫాం కట్టించారు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన శిల్పికి తయారీ బాధ్యత అప్పగించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ విగ్రహం ఏర్పాటుచేయాల్సిన ప్రాంతంలో రైతు దంపతుల బొమ్మను ఏర్పాటుచేసింది. దీంతో కొట్టు సత్యనారాయణ హైకోర్టును ఆశ్రయించారు. ఉద్యాన వర్సిటీ ముఖ ద్వారం వద్ద వైఎస్ విగ్రహం ఏర్పాటుకు అడ్డుపుల్ల కోర్టును ఆశ్రయించిన మాజీ మంత్రి కొట్టు మాట తప్పారు వైఎస్ కృషితో ఇక్కడ ఉద్యాన వర్సిటీ వచ్చింది. ఆయన సేవలకు గుర్తింపుగా వర్సిటీ ముఖద్వారం వద్ద యోగ ముద్రలో వైఎస్ విగ్రహాన్ని ఏర్పాటుచేయాలని 2023లో నిర్ణయం తీసుకున్నాం. ఈ మేరకు విగ్రహం తయారీకి బయానా ఇచ్చాం. నిర్ణయించిన ప్రాంతంలో విగ్రహం ఏర్పాటుకు అప్పటి పాలకమండలి తీర్మానం చేసింది. అది కాదని రైతు దంపతుల బొమ్మను పెట్టారు. దీనిపై న్యాయస్ధానాన్ని ఆశ్రయించా. విచారణ ఈ నెల 19కి వాయిదా పడింది. – కొట్టు సత్యనారాయణ, మాజీ డిప్యూటీ సీఎం కోర్టు ఆదేశాలు అందలేదు వైఎస్ విగ్రహం ఏర్పాటులో హైకోర్టు ఆదేశాలు ఇంకా మాకు అందలేదు. అందిన తర్వాత గత విషయాలు పరిశీలించి ఉన్నతాధికారి నిర్ణయం తీసుకుంటారు. – బి.శ్రీనివాసులు. రిజిస్ట్రార్, ఉద్యాన వర్సిటీ -
అధినేతకు నీరాజనం
భీమవరంలో హెలీప్యాడ్ వద్ద మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్కు స్వాగతం పలుకుతున్న శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేన్రాజు, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ, మాజీ మంత్రి తానేటి వనిత, పార్టీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు, నరసాపురం పార్లమెంట్ ఇన్చార్జి గూడూరి ఉమాబాల, పార్టీ భీమవరం, ఉండి సమన్వయకర్తలు చినమిల్లి వెంకటరాయుడు, పీవీఎల్ నరసింహరాజు జోరువానలోనూ అదే అభిమానం ● భీమవరంలో మాజీ సీఎం వైఎస్ జగన్కు ఘన స్వాగతం ● వర్షాన్ని సైతం లెక్కచేయకుండాపోటెత్తిన అభిమానులు ● తరలివచ్చిన ఉమ్మడి పశ్చిమ, తూర్పుగోదావరి నాయకులు ● హెలీప్యాడ్ నుంచి కల్యాణ మండపం వరకూ భారీ జనసందోహం భీమవరం/భీమవరం(ప్రకాశం చౌక్): పశ్చిమగోదావరి జిల్లా భీమవరం విచ్చేసిన మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డికి అ భిమానులు, పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు కుమార్తె వివాహ వేడుకకు బుధవారం సాయంత్రం వైఎస్ జగన్ విచ్చేశారు. భీమవరంలో హెలీప్యాడ్కు చేరుకున్న జగన్ను మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర నాయకులు, పార్టీ ముఖ్య నాయకులు పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతం పలికారు. తూర్పుగోదావరి, కోనసీమ జిల్లాల నాయకులు ఆయన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. అక్కడి నుంచి వైఎస్ జగన్ భీమవరంలోని వీఎస్ఎస్ గార్డెన్స్లో జరుగుతున్న వివాహ వేడుక వద్దకు వెళ్లారు. ఆయన కాన్వాయ్ వెంట అభిమానులు బైక్ ర్యాలీ గా తరలివెళ్లారు. జై జగన్.. అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. భారీ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా.. వైఎస్ జగన్ తాడేపల్లి నుంచి రాక ముందే భీమవరంలో వర్షం ప్రారంభమైంది. అప్పటికే జగన్ను చూసేందుకు భీమవరంలో హెలీప్యాడ్, కల్యాణ మండపానికి వెళ్లే దారిలో పార్టీ నాయకులు, కా ర్యకర్తలు, అభిమానులు భారీగా చేరుకున్నారు. భీమవరంలో జగన్ హెలీకాప్టర్ దిగే సమయంలోనూ భారీ వర్షం కురుస్తున్నా అభిమానులు అలా గే వేచి ఉన్నారు. ఆయన వెంట ఉత్సాహంగా కేరింతలు కొడుతూ కల్యాణ మండపం వరకూ తరలి వెళ్లారు. వర్షంలోనూ అభిమానులకు అభివాదం చేస్తూ వైఎస్ జగన్ ముందుకుసాగారు. కల్యాణ మండపం వద్ద.. వీవీఆర్ గార్డెన్స్లో వేదికపైకి వచ్చిన జగన్ను చూసేందుకు అభిమానులు పోటీపడ్డారు. సోపాలు, కుర్చీలు ఎక్కి మరీ ఆయన్ను చూడటంతో పాటు తమ అభిమాన నేతను సెల్ఫోన్లలో బంధించారు. వైఎస్ జగన్ను కలిసిన ప్రముఖులు : వైఎస్ జగన్కు హెలీప్యాడ్ వద్ద నాయకులు ఘన స్వాగతం పలి కారు. శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేన్రాజు, పార్టీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు, నరసాపురం పార్లమెంట్ పరిశీలకుడు ముదునూరి మురళీకృష్ణంరాజు, నరసాపురం పార్లమెంట్ ఇన్ చార్జ్ గూడూరి ఉమాబాల, మాజీ మంత్రులు చెరు కువాడ శ్రీరంగనాథరాజు, తానేటి వనిత, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, కారుమూరి వెంకటనాగేశ్వరరావు, కొట్టు సత్యనారాయణ ఎమ్మెల్సీలు కవురు శ్రీనివాస్, వంక రవీంద్రనాథ్, భీమవరం, ఉండి, చింతలపూడి, కైకలూరు, పోలవరం, ఉంగుటూరు, ఏలూరు, కొవ్వూరు, రామచంద్రాపురం, అమలాపురం ఇన్చార్జ్లు చినమిల్లి వెంకట్రాయుడు, పీవీఎల్ నర్సింహరాజు, కంభంపాటి విజయరాజు, దూలం నాగేశ్వరరావు, తెల్లం బాలరాజు, పుప్పాల వాసుబాబు, మామిళ్లపల్లి జయప్రకాష్, తలారి వెంకట్రావు, పిల్లి సూర్యప్రకాష్, పినిపే శ్రీకాంత్, ఏలూరు పార్లమెంట్ ఇన్చార్జి కారుమూరి సునీల్ కుమార్, పార్టీ బీసీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ నవు డు వెంకటరమణ, సంచార జాతుల విభాగం అధ్యక్షుడు పెండ్ర వీరన్న, పార్టీ నేతలు పేరిచర్ల విజయ నరసింహరాజు, మేడిది జాన్సన్, వేండ్ర వెంకటస్వామి, పాతపాటి శ్రీనివాసరాజు, కోడి విజయలక్ష్మి యుగంధర్, ఏఎస్ రా జు, చిగురుపాటి సందీప్, గాదిరాజు రామరాజు తదితరులు జగన్ను కలిసిన వారిలో ఉన్నారు. -
● బాలయోగి వంతెనకు పరదాలు
ఏలూరులోని తమ్మిలేరుపై నిర్మించిన బాలయోగి వంతెనపై కార్పొరేషన్ అధికారులు వంతెనకు ఇరువైపులా పరదాలు కట్టారు. బాలయోగి వంతెన తమ్మిలేరులో వ్యర్థాలు వేస్తున్నారని ‘సాక్షి’ మీడియాలో వస్తున్న వరుస కథనాలకు అధికారులు స్పందించి వ్యర్థాలు వేయకుండా ఇరువైపులా ఇదిగో ఇలా పరదాలు ఏర్పాటు చేశారు. అయినా చుట్టుపక్కల వారు చెత్త, వ్యర్థాలు వేయడం మాత్రం మానలేదు. స్థానికులకు అవగాహన కల్పించి తమ్మిలేరులో చెత్త, వ్యర్థాలు వేయకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్/ ఏలూరు -
నియోజకవర్గ విలీనంపై రచ్చ
ద్వారకాతిరుమల: ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటుపై కసరత్తు చేస్తోంది. అందులో భాగంగా జిల్లాల సరిహద్దులు, పేర్లు, మండలాల మార్పులపై ఏడుగురు మంత్రులతో కూడిన సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. నెలరోజుల్లోగా దీనిపై నివేదిక ఇవ్వాలని ఈ కమిటీని ఆదేశించింది. అయితే ఈ మార్పుల్లో గోపాలపురం నియోజకవర్గం పేరు తెరమీదకొచ్చింది. గతంలో రాష్ట్రంలో 13 జిల్లాలు ఉండగా, వైఎస్సార్ సీపీ ప్రభుత్వం విభజన ద్వారా ఆ జిల్లాల సంఖ్యను 26కు పెంచింది. తాజాగా కూటమి ప్రభుత్వం ఆ జిల్లాల సంఖ్యను 32కు పెంచడంతో పాటు, ప్రస్తుతం ఉన్న జిల్లాల సరిహద్దులు, పేర్లు, మండలాల మార్పునకు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న గోపాలపురం నియోజకవర్గాన్ని ఏలూరు జిల్లాలోకి మార్చేందుకు ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టు సమాచారం. పరిపాలనా సౌలభ్యం దృష్ట్యా జిల్లా కేంద్రాల దూరాన్ని తగ్గించాలన్న ఉద్దేశ్యంతో ప్రభుత్వం ఈ మార్పులు చేస్తోంది. గతంలో ప్రజల అభిప్రాయం మేరకే.. గోపాలపురం నియోజకవర్గంలో ద్వారకాతిరుమల, నల్లజర్ల, దేవరపల్లి, గోపాలపురం మండలాలు ఉన్నాయి. గత ప్రభుత్వంలో జిల్లాల విభజన జరిగిన సమయంలో గోపాలపురం నియోజకవర్గాన్ని తూర్పుగోదావరి జిల్లాలో కలపాలని నిర్ణయించినప్పుడు, ద్వారకాతిరుమల మండల ప్రజలు తమ మండలాన్ని ఏలూరు జిల్లాలో కలపాలని రాజకీయ పార్టీలకు అతీతంగా ఆందోళనలు చేశారు. అప్పటి మంత్రులు, ఎమ్మెల్యేలు చినవెంకన్న కొలువైన ద్వారకాతిరుమల మండలాన్ని ఏలూరు జిల్లాలో చేర్చాలని పట్టుబట్టారు. ప్రజాభీష్టం మేరకు అప్పటి ప్రభుత్వం ద్వారకాతిరుమల మండలాన్ని ఏలూరు జిల్లాలో, మిగిలిన మూడు మండలాలు(గోపాలపురం నియోజకవర్గాన్ని) తూర్పుగోదావరి జిల్లాలోకి మార్చారు. ఆ రెండు మండలాల వారికి ఇబ్బందే గోపాలపురం, దేవరపల్లి మండలాల వారికి తూర్పుగోదావరి జిల్లా కేంద్రం ప్రస్తుతం దగ్గరగా ఉంది. దేవరపల్లి నుంచి రాజమండ్రికి 33 కిలోమీటర్లు, గోపాలపురం నుంచి 39 కిలోమీటర్లు, నల్లజర్ల నుంచి 52 కిలోమీటర్లు దూరం. అదే ఈ మూడు మండలాలను ఏలూరు జిల్లాలోకి మారిస్తే దూరం పెరుగుతుంది. దేవరపల్లి నుంచి ఏలూరుకు 66 కిలోమీటర్లు, గోపాలపురం నుంచి 75 కిలోమీటర్లు, నల్లజర్ల నుంచి 45 కిలోమీటర్లు దూరం ఉంది. మండల శివారు గ్రామాల వారికి దూరం మరింత పెరుగుతుంది. సోషల్ మీడియాలో మొదలైన రచ్చ దేవరపల్లి, గోపాలపురం, నల్లజర్ల మండలాలను ఏలూరు జిల్లాలో మార్చేప్రయత్నం జరుగుతున్న నేపథ్యంలో ఆ మండలాల ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కొందరు సోషల్ మీడియా ద్వారా తమ అభిప్రాయాలను బహిర్గతం చేస్తున్నారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా జిల్లాలు మార్చడం సరికాదని, గోపాలపురం నియోజకవర్గాన్ని తూర్పుగోదావరి జిల్లాలోనే ఉంచాలని పోస్టులు పెడుతున్నారు. దీనిపై ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ఆలోచన చేయాలని కోరుతున్నారు. మరి కొందరు పార్టీలకు అతీతంగా ప్రజాభిప్రాయాన్ని ప్రభుత్వానికి తెలపాలని పోస్టులు పెడుతున్నారు. పరిగణనలోకి తీసుకుంటారా.. జిల్లాల సరిహద్దులు, పేర్లు, మండలాల మార్పులు చేసేటప్పుడు ప్రజాభిప్రాయాలను కూటమి ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుందా.? లేక సబ్ కమిటీ సూచనలనే అమలు చేస్తుందా.. అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఏది ఏమైనా గోపాలపురం నియోజ కవర్గాన్ని ఏలూరు జిల్లాలో కలిపే అంశంపై కూటమి ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.గోపాలపురం నియోజకవర్గ ముఖచిత్రం తెరమీదకొచ్చిన గోపాలపురం నియోజకవర్గం గోపాలపురం, దేవరపల్లి మండలాలను ఏలూరు జిల్లాలో కలపొద్దని డిమాండ్ నల్లజర్ల మండలం ఎటున్నా ఓకే.. -
సేంద్రియ ఎరువుల తయారీపై శిక్షణ
ద్వారకాతిరుమల: రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుత సంవత్సరంలో 3.5 లక్షల మంది రైతులను ప్రకృతి వ్యవసాయంలోకి తీసుకురావడమే లక్ష్యంగా రైతు సాధికార సంస్థ పనిచేస్తోందని ఆ సంస్థ ప్రకృతి వ్యవసాయ విభాగం ప్రాజెక్ట్ అధికారి రాథోడ్ ప్రవీణ్ తెలిపారు. మండలంలోని గుండుగొలనుకుంట గ్రామంలోని బయో రిసోర్స్ సెంటర్ యూనిట్లో ఎన్టీఆర్, ఏలూరు, కృష్ణా, పశ్చిమ, తూర్పు గోదావరి జిల్లాలకు చెందిన 50 మంది బయో రిసోర్స్ సెంటర్ యజమానులకు బుధవారం శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాథోడ్ ప్రవీణ్ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయంలో సాగు విస్తీర్ణాన్ని పెంచే దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయన్నారు. రాష్ట్రంలో మరిన్ని బయో రిసోర్స్ సెంటర్లను ఏర్పాటుచేసి, రాష్ట్రస్థాయి నిపుణులతో రిసోర్స్ ట్రైనర్లకు శిక్షణ అందించి, వారి ద్వారా బయో రిసోర్స్ సెంటర్ యజమానులకు ప్రకృతి వ్యవసాయం, సేంద్రియ ఎరువుల వినియోగంలో శిక్షణ అందిస్తామన్నారు. ఏలూరు ప్రకృతి వ్యవసాయం డీపీఎం వెంకటేష్, బయో రిసోర్స్ సెంటర్ యజమానులు గోపాల్ కృష్ణ, వెంకటరత్నాజీ, డీపీఎంయూ నుంచి జతిన్ (కమ్యూనికేషన్ ఇంటర్న్), ఎస్పీఎంయూ బృంద సభ్యులు పాల్గొన్నారు. వారు జీవ ఉత్పత్తుల నాణ్యత, బీఆర్సీ యూనిట్ల నిర్వహణ, ప్రకృతి వ్యవసాయం వల్ల నేల, మానవ ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలపై మార్గనిర్దేశం చేశారు. -
అనవసర పెట్టుబడితో నష్టపోవద్దు
గణపవరం: రైతులు అవసరం లేకుండా ఎరువులు, పురుగుమందులు వాడటం ద్వారా అనవసర పెట్టుబడితో నష్టపోతున్నారని, వ్యవసాయ నిపుణుల సూచనలు పాటించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్కుమార్ రెడ్డి అన్నారు. బుధవారం ఆయన గణపవరం మండలం కేశవరంలో వ్యవసాయ శాఖ నిర్వహిస్తున్న ఈపంట నమోదు కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈసందర్భంగా రైతులను కలిసి ఏ రకాల పంటలు వేసి, పెట్టుబడి, ఎరువుల లభ్యత వంటి అంశాలపై రైతుల నుంచి ఆరా తీశారు. వ్యవసాయ సిబ్బంది తాము ఎదుర్కొంటున్న సమస్యలను జేసీకి వివరించారు. సర్వే నంబరులో ఉన్న పొలానికి 20 మీటర్ల దగ్గరకు వెళ్తే కాని ఈపంట నమోదు కావడం లేదని తెలిపారు. కార్యక్రమంలో ఏవో ఆర్ఎస్ ప్రసాద్, రైతులు యాళ్ల పెద్దిరాజు, దండు గజపతిరాజు, దండు రామచంద్రరాజు పాల్గొన్నారు. -
గంజాయి కేసులో ఇద్దరి అరెస్ట్
మండవల్లి: గంజాయి కేసులో ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు రూరల్ సీఐ వి.రవికుమార్ చెప్పారు. మండపల్లి పోలీస్ స్టేషన్లో ఆయన వివరాలను వెల్లడించారు. కైకలూరు వెలమపేటకు చెందిన షేక్ ఫరీద్ అబ్బాస్, ముదినేపల్లి మండలం చైతన్యపురంనకు చెందిన ఎలికే రాజేష్ కొంతకాలంగా గుర్తు తెలియని వ్యక్తుల నుంచి గంజాయి క్రయ, విక్రయాలకు పాల్పడుతున్నారు. బుధవారం చావలిపాడు వద్ద వీరిని పోలీసులు అరెస్ట్ చేసి నిందితుల నుంచి 755 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. వారిపై ఎన్డీపీఎస్ చట్టం ననుసరించి కేసు నమోదు చేసి నిందితులను రిమాండ్కు తరలించినట్లు సీఐ చెప్పారు. సమావేశంలో రూరల్ ఎస్సై సీహెచ్ఎస్ రామచంద్రరావు, సిబ్బంది పాల్గొన్నారు. హెడ్ కానిస్టేబుల్ సత్యనారాయణకు సేవా పతకం దెందులూరు: దెందులూరు పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న ఎన్వీఆర్ సత్యనారాయణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలీస్ సేవా పతకం ప్రకటించింది. సత్యనారాయణ పోలీస్ శాఖలో 1993లో కానిస్టేబుల్గా చేరారు. ఆయనకు పోలీస్ సేవా పథకం రావడంపై ఎస్సై ఆర్.శివాజీ, హెడ్ కానిస్టేబుల్, ఇతర కానిస్టేబుళ్లు హర్షం వ్యక్తం చేశారు -
ఎకై ్సజ్ స్టేషన్పై దాడి
చింతలపూడి: చింతలపూడి ఎకై ్సజ్ పోలీస్స్టేషన్పై నాగిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన పలువురు బుధవారం దాడి చేశారు. గ్రామంలో సారా తయారు చేస్తున్న వడిత్యా రామదాసు అనే వ్యక్తిని ఎకై ్సజ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతనిపై పీడీ యాక్టు నమోదు చేస్తున్నారన్న అనుమానంతో బంధువులు, కుటుంబ సభ్యులు దాడి చేసినట్లు ఎకై ్సజ్ సిబ్బంది చెప్పారు. దాడిలో కార్యాలయంలోని కుర్చీలు, ఫర్నిచర్ ధ్వంసమయ్యాయన్నారు. ఆ సమయంలో అధికారులు ఎవరూ కార్యాలయంలో లేరు. జరిగిన ఘటనపై అధికారులకు, స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు సిబ్బంది చెప్పారు. విద్యుత్ షాక్తో వ్యక్తి మృతి కాళ్ల: కూలి పనికి వెళ్లి విద్యుత్ షాక్తో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఎస్సై ఎన్. శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం కాళ్ళకూరు గ్రామానికి చెందిన ఉబ్బా వెంకన్న(36) బుధవారం కూలి పని నిమిత్తం దొడ్డనపూడి గ్రామం వెళ్లాడు. అక్కడ పనిచేస్తుండగా వర్షపు చినుకుల వల్ల కరెంటు షాక్ కొట్టడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. స్థానికులు అతడ్ని వైద్యం నిమిత్తం కాళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భీమవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతునికి ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. మృతుని అన్నయ్య రాంబాబు ఫిర్యాదు మేరకు ఎస్సై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అథ్లెటిక్స్లో పతకాలు ఏలూరు రూరల్: ఈ నెల 9 నుంచి 11 వరకూ చీరాలలో జరిగిన 36వ ఏపీ ఇంటర్ డిస్ట్రిక్ట్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో సత్తా చాటిన ఏలూరు జిల్లా బాలికలకు డీఎస్డీఓ బి శ్రీనివాసరావు ఓ ప్రకనటలో అభినందనలు తెలిపారు. డీఎస్ఏ కోచ్ గంటా కృష్ణకుమారి వద్ద శిక్షణ పొందుతున్న వి రంజని 400 మీటర్ల పరుగు పందెంలో సిల్వర్, 200 మీటర్ల పరుగులో బ్రాంజ్ మెడల్ సాధించిందని వివరించారు. మిడిల్ రిలే విభాగంలో జె పల్లవితో పాటు రంజని సైతం బ్రాంజ్ మెడల్ సాధించారన్నారు. అండర్–20 విభాగంలో బి నీలిమ 400 మీటర్ల పరుగులో బ్రాంజ్ మెడల్, ఎం దొరబాబు పెంఠధలోన్లో బ్రాంజ్ మెడల్ చేజిక్కించుకున్నారని వివరించారు. -
నెత్తురు మరిగితే.. ఎత్తరా జెండా..
కై కలూరు: బ్రిటీష్ సామ్రాజ్యాన్ని అహింస అనే ఆయుధంతో గడగడలాడించిన మహాత్ముని మనోనిబ్బరాన్ని కసిగా చూసిన కళ్లు అవి.. తెల్లదొరల లాఠీ దెబ్బలకు తట్టకున్న శరీరాలు అవి.. స్వాతంత్య్ర సమరోధ్యమంలో జైలు గోడలను తడిమిన చేతులు అవి.. ఆంగ్లేయుల ఫిరంగిలకు దమ్ముగా రొమ్ము చూపు పోరాట పఠిమను చూపిన తెగువ వీరి సొంతం.. అప్పటి స్వాతంత్య్ర సమరయోథులు జీవించిలేకున్నా.. వారి ఆశయాలు సజీవం. గోదావరి నదీ పాయల చుట్టూ ఉద్యమాన్ని ఉరకలేయించారు.. కృష్ణమ్మ చెంత పౌరుషంతో నురగలు కక్కించారు.. 79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఉమ్మడి పశ్చిమతీరంలో ఉద్యమ తీరుపై అలనాటి అలవోకనం ఏలూరు.. సమరహోరు... బ్రిటిష్ పాలనలో ఏలూరు ఒక మిలటరీ స్టేషన్గా ఉండేది. రాజమండ్రి గోదావరి జిల్లాల ప్రధాన కేంద్రంగా ఏలూరు పేరు గడించింది. ఈ పట్టణానికి 1937లో మహాత్మా గాంధీ, 1940లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ విచ్చేసి స్వాతంత్య్ర సమరోత్సవాన్ని ప్రజల్లో రేకెత్తించారు. ఉమ్మడి జిల్లాలో గారపాటి సత్యనారాయణ, చింతలపాటి మూర్తిరాజు, మంగళంపల్లి చంద్రశేఖర్, ఉప్పాల కోదండరామయ్య వంటి ఎందరో స్వాతంత్య్ర పోరాటంలో ప్రతిభ చూపారు. భీమవరం, నరసాపురం, పాలకొల్లు, నూజివీడు, ఆచంట ప్రాంతాలు స్వాతంత్య్ర పోరాటంలో కీలకపాత్ర పోషించాయి. కదం తొక్కిన కై కలూరు స్వాతంత్య్ర పోరాటంలో కై కలూరు ప్రాంతం కదం తొక్కింది. విదేశీ వస్త్రాలను బహిష్కరించాలని మహాత్మా గాంధీ నుంచి ఆదేశాలు రావడంతో కై కలూరు తాలూకా నడిరోడ్డుపై విదేశీ వస్త్రాలను ధైర్యంగా తగలబెట్టారు. దీంతో బ్రిటీష్ పాలకులు లాఠీలకు పని చెప్పారు. తుపాకులను ఎక్కుపెట్టారు. అయినా దమ్ముగా రొమ్ము చూపి వారిని ఎదిరించారు. ఎంతోమందిని జైల్లో నెట్టేశారు. స్వాతంత్య్రం సిద్ధించి 25 సంవత్సరాలు గడిచిన సందర్భంగా అప్పట్లో కై కలూరు పాఠశాల వద్ద సమరవీరులు సేవలకు గుర్తుగా స్మారక స్థూపాన్ని ఏర్పాటు చేశారు. కై కలూరు పంచాయతీ తాలూకా పరిధికి చెందిన ఘంట పేరయ్య, కంతేటి కాశీవిశ్వనాథం, మాగంటి నాయుడమ్మ, గొట్టుముక్కల సూర్యనారాయణరాజు, మాగంటి సత్యనారాయణ, రుద్రరాజు సూర్యనారాయణరాజు, చిర్రవూరి అచ్యుత రామయ్య, పొన్నాడ శ్రీరామచంద్రుడు, మేక తిరుపతయ్య, గుంటూరు రామదాసు, ఉన్నూరి నరసింహరాజు స్వాతంత్య్ర సమరయోధుల పేర్లును లిఖించారు. బ్రిటీష్ పాలకుల అడ్డా.. పూర్వం కై కలూరుని కై ంకర్యపురి అని పిలిచేవారు. కొల్లేరు సరస్సు కారణంగా ప్రముఖంగా పేరు గడిచింది. కై కలూరు తాలూకాగా ఉండేది. ఇక్కడి నుంచి బ్రిటీష్ పాలకులు కార్యక్రమాలను కొనసాగించేవారు. కై కలూరు మండలం వింజరం లాకుల వద్ద బ్రిటీష్ పాలనలో పడవలపై కూరగాయల సంత జరిగేది. ఆ గ్రామ సమీపంలో బ్రిటీష్ పాలకులు సేద తీరడానికి కట్టడాలు నిర్మించుకున్నారు. ఇక ప్రధాన పరిపాలన కై కలూరు నుంచి సాగేది. అందుకే కోర్టు, రెవెన్యూ కార్యాలయం, పోలీస్ స్టేషన్, సబ్ ట్రెజరీ, ఆస్పత్రి, సబ్జైలు బ్రిటీష్ పాలకులు ఒకే వరుసలో నిర్మించారు. అప్పట్లో స్వాతంత్య్ర ఉద్యమ సమయంలో ఆందోళన చేసిన వారిని అరెస్టు చేసి కై కలూరు జైలుకు తరలించేవారు. శుక్రవారం ప్రంద్రాగస్టు సందర్భంగా అలనాటి స్వాతంత్య్ర సమరయోధుల వారసుల మనోభావాలు వారి మాటల్లోనే.. బ్రిటీష్ పాలకులపై గర్జించిన అలనాటి యోధులు ఉమ్మడి పశ్చిమలో ఉవ్వెత్తున ఎగసిన స్వాతంత్య్ర కసి కై కలూరులో కదం తొక్కిన ఉద్యమ వీరులు పంద్రాగస్టు వేడుకలకు సిద్ధమవుతున్న పల్లెలు -
విద్యుత్ విజిలెన్స్ దాడులు
కై కలూరు: విద్యుత్ మీటర్ల వినియోగంపై విజిలెన్స్ అధికారులు ఆకస్మిక దాడులు కై కలూరు మండలంలో బుధవారం చేశారు. విజిలెన్స్ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీరు చాగంటి వాసు నేతృత్వంలో 43 బృందాలు దాడుల్లో పాల్గొన్నాయి. మండలంలో కై కలూరు, ఆటపాక, గోపవరం, రాచపట్నం, తామరకొల్లు, వింజరం, వేమవరప్పాడు గ్రామాల్లో మొత్తం 3,009 వివిధ కేటగిరీల సర్వీసులను విజిలెన్స్ బృందాలు తనిఖీలు చేశాయి. వీటిలో మొత్తం 525 సర్వీసుల నిబంధనలు అతిక్రమించినట్లు నిర్థారించి వారి వద్ద నుంచి రూ.11,40,600 జరిమానాలు వసూలు చేశారు. కార్యక్రమాల్లో గుడివాడ ఈఈ జీబీ శ్రీనివాసరావు, కైకలూరు డీఈఈ బి.రామ య్య, కై కలూరు టౌన్ సెక్షన్ ఏఈ కె.శ్రీనివాసమూర్తి, గుడివాడ డివిజన్ ఏఈలు, డీఈఈలు, ఏ ఈఈ లు, జేఈలు,లైన్ ఇన్స్పెక్టర్లు సిబ్బంది పాల్గొన్నారు. పారిశుద్ధ్య కార్మికుడి మృతి నరసాపురం: దీర్ఘకాలంగా మున్సిపాలిటీలో పర్మినెంట్ పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేస్తున్న ఉల్లంపర్తి కృష్ణమూర్తి (59) గుండెపోటుతో బుధవా రం మృతి చెందారు. పట్టణంలోని అరుంధతి పేటకు చెందిన ఉల్లంపర్తి కృష్ణమూర్తి ప్రతి రోజూ మాదిరిగానే బుధవారం ఉదయం 4 గంటలకు వచ్చి 6వ వార్డులో విధులు నిర్వహిస్తున్నాడు. 11 గంటల ప్రాంతంలో కోవెలగుడి వీధిలో పనిచేస్తూ గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. సహచర కార్మికులు వెంటనే అతడిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కృష్ణమూర్తికి భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. కృష్టమూర్తి విధుల్లో అంకితభావంతో పనిచేస్తూ వార్డు ప్రజలతో తలలో నాలుకలా ఉంటాడని, అతడి మరణం బాధాకరమని పలువురు పేర్కొన్నారు. కృష్ణమూర్తి మృతిపట్ల మున్సిపల్ చైర్పర్సన్ బర్రి శ్రీవెంకటరమణ, కమిషనర్ అంజయ్య సంతాపం తెలిపారు. -
పొట్టి శ్రీరాములుతో కలిసి జైలు జీవితం
మా నాన్న పేరు కంతేటి కాశీ విశ్వనాథం. 4గురు మగ, 4గురు ఆడ సంతానం. మా నాన్న గుడ్లవల్లేరులో ఉండగా ఉద్యమంలో పాల్గొన్నందుకు బాపట్ల జైలులో పెట్టారు. అక్కడ పొట్టి శ్రీరాములు, నాన్న పక్కపక్కనే జైలు జీవితం అనుభవించారు. నాన్నకు ప్రభుత్వం తామ్రపత్రం అందించింది. కలిదిండి మండలంలో 5 ఎకరాలు పొలం ఇచ్చారు. కై కలూరులో కాశీరాజు కిరాణాకొట్టుగా నడిపారు. – కంతేటి శ్యామ్ సుందర జగన్నాథరావు, భీమవరం ఆదర్శవాది అచ్యుతరామయ్య మా నాన్న పేరు చిర్రవూరి అచ్యుతరామయ్య. ముగ్గురు ఆడ, ఒక మగ సంతానం. స్వాతంత్య్ర ఉద్యోమంలో అనేక పోరాటాలు చేశారు. మెడికల్ రిప్రజంటేటీవ్గా అప్పట్లో పనిచేశారు. ఆయన మాకు ఎన్నో స్వాతంత్య్ర ఘట్టాలను వివరించేవారు. కై కలూరు ప్రాంతంలో అనేక ఉద్యమాలకు స్ఫూర్తిగా నిలిచారు. ఆయన 1966లో మరణించారు. ఆయన కుమారుడిగా పుట్టడం గర్వంగా ఉంది. – చిర్రవూరి శివరామశాస్త్రి, హైదరాబాద్ ఆచార్య ఎన్జీ రంగా శిష్యుడు మా నాన్న పేరు ఉప్పాల కోదండరామయ్య. ఆచార్య ఎన్జీ రంగా ప్రియశిష్యులు. 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. ఆయనకు ఏడుగురు మగపిల్లలు, ముగ్గరు ఆడపిల్లలు సంతానం. రాజమండ్రి సెంట్రల్ జైలుకు తీసుకెళ్లి అక్కడ జైళ్లు నిండటంతో తెనాలిలో బంధించారు. ఆయన 101 సంత్సరాలు జీవించారు. ఆయన చూపిన మార్గం మాకు ఎంతో ఆదర్శం. – ఉప్పాల రవీంద్రబాబు, కై కలూరు -
అద్దె యజమానుల హడల్
సాక్షి, భీమవరం: ఊహించినట్టే మహిళలకు ఫ్రీ బస్సు హామీని చంద్రబాబు సర్కారు తుస్సుమనిపించింది. జిల్లాలోని పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ సర్వీసులకు మాత్రమే ఉచిత ప్రయాణాన్ని పరిమితం చేసింది. ఈ సర్వీసులు జిల్లాలో 197 ఉండగా వీటిలో 40 శాతం అద్దె బస్సులే ఉన్నాయి. ప్రయాణీకుల రద్దీ పెరిగితే తమ బస్సుల మైలేజీ పడిపోయి మెయింటినెన్స్ పెరిగిపోతుందన్న ఆందోళనలో హైర్ బస్సుల యజమానులు ఉన్నారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు రాష్ట్రమంతటా ప్రయాణం ఉచితమంటూ ఎన్నికల్లో ఊదరగొట్టిన కూటమి ప్లేటు ఫిరాయించింది. ఈ హామీ అమలుకు ఏడాదికి పైగా ఎగనామం పెట్టింది. ఇప్పుడు పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ సర్వీసులకు మాత్రమే ఫ్రీ అంటూ చేతులెత్తేసింది. ఏసీ, సూపర్ లగ్జరీ, అల్ట్రా డీలక్స్, నాన్స్టాప్ సర్వీసుల్లో టిక్కెట్ తీసుకోవాల్సిందేనని స్పష్టంచేసింది. జిల్లాలోని భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం, నరసాపురం డిపోల పరిధిలో డిపోల పరిధిలో వెన్నెల, స్టార్లైనర్, సూపర్ లగ్జరీ, అల్ట్రా డీలక్స్, పల్లె వెలుగు తదితర బస్సులు 295 ఉన్నాయి. ఇవి మొత్తం రోజుకు లక్ష కిలోమీటర్లు దూరం ప్రయాణిస్తుండగా, 90 వేల మంది ప్రయాణీకులు రాకపోకలు సాగిస్తున్నారు. 40 శాతం హైర్ బస్సులే ఉచిత ప్రయాణానికి నిర్ణయించిన పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ బస్సులు 197 ఉన్నాయి. వీటిలో 73 సర్వీసులను అద్దెకు తీసుకుని నడుపుతున్నారు. హైర్ బస్సులకు 56 సిటీంగ్ కెపాసిటీ ఉండాలి. లీటరు డీజిల్కు 5.6 కిలోమీటర్లు ప్రయాణించాలి. మైలేజ్ షార్టేజ్ వస్తే ఆ భారాన్ని తామే భరించాలని యజమానులు అంటున్నారు. మెయింటినెన్స్ కింద ఒప్పందం మేరకు కిలోమీటరుకు రూ.12 నుంచి రూ.13 చొప్పున ఇస్తున్నారు. ఫ్రీ బస్సు వలన ప్రయాణీకుల రద్దీ పెరుగుతుందని వారంటున్నారు. ఓవర్లోడ్ వలన టైర్లు అరుగుదల, ఇంజన్ సంబంధిత సమస్యలు తలెత్తి మెయింటినెన్స్ పెరిగిపోతుంది. ఆయిల్ షార్టేజీ వస్తుందని యజమానులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం ఆయిల్ షార్టేజీ వల్ల నెలకు రూ.5 వేల వరకు నష్టపోతుండగా రద్దీతో ఈ నష్టం రూ.20 వేలకు పెరిగే అవకాశముందంటున్నారు. మెయింటినెన్స్ నెలకు రూ.30 వేలు వరకు ఖర్చవుతుంటే రెట్టింపు అవుతుందని చెబుతున్నారు. రవాణశాఖ నిబంధనలు మేరకు సిటీంగ్ కెపాసిటీ 56 మందికే ప్రీమియం చెల్లిస్తామని, ఓవర్ లోడ్తో అనుకోని ప్రమాదం జరిగితే బీమా కొందరికే వర్తిస్తుందని చెబుతున్నారు. నిర్ణీత సమయం కంటే ఆలస్యమైతే తమకు పెనాల్టీలు వేస్తున్నారని, రద్దీ వల్ల జరిగే జాప్యానికి తమనే బాధ్యుల్ని చేస్తారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అగ్రిమెంట్లో ఫ్రీ బస్సు ప్రస్తావన లేదని, ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్టు మైలేజీ లీటరుకు 5.6 కి.మీ నుంచి 4.6 కి.మీ తగ్గించాలని, మెయింటినెన్స్ కి.మీ రూ.13 నుంచి రూ. 18కు పెంచాలని యజమానులు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు రాష్ట్ర యూనియన్ ఆధ్వర్యంలో ఆందోళనకు సిద్ధమవుతున్నట్టు జిల్లాకు చెందిన నాయకులు తెలిపారు. ఇప్పటికే నష్టపోతున్నాం ఎంఎస్ఎంఈలో బస్సు తీసుకుని ఆర్టీసీలో హైర్కు నడుపుతున్నాను. నెలకు రూ.1.4 లక్షల వరకు వస్తుంది. బస్సు ఫైనాన్స్ రూ.90 వేలు, డ్రైవర్ల జీతం రూ.40 వేలు, క్లీనర్కు రూ.6 వేలు, మెయింటినెన్స్ రూ.30 వేలు పోగా నెలకు రూ.30 వేలు నష్టం వస్తుంది. ఫ్రీ బస్సు వల్ల రద్దీ పెరిగి మైలేజీ షార్టేజీ, మెయింటినెన్స్ పెరిగిపోతాయి. ఈ మేరకు చార్జీల్లో మార్పులు చేయాలి. – రాపాక మహేష్, హైర్ బస్ యజమాని, సిద్ధాంతం జిల్లాలో పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ సర్వీసులు 197 వీటిలో 40 శాతం అద్దె బస్సులే 56 సీటింగ్ కెపాసిటీతో నడిపేందుకు ఆర్టీసీతో ఒప్పందం ఇప్పుడు ఉచితంతో రద్దీ పెరుగుతుందంటున్న బస్సు యజమానులు మైలేజీ పడిపోయి, నిర్వహణ పెరుగుతుందని ఆందోళన మైలేజీ పరిమితి తగ్గించాలని, నిర్వహణ ఖర్చు పెంచాలని డిమాండ్ సర్వీసులు మొత్తం అద్దె బస్సులు బస్సులు వెన్నెల 1 1 స్టార్ లైనర్ 4 – ఇంద్ర 11 – సూపర్ లగ్జరీ 33 – అల్ట్రా డీలక్స్ 26 1 ఎక్స్ప్రెస్ 20 9 అల్ట్రా పల్లెవెలుగు 19 17 పల్లెవెలుగు 158 47 స్పేర్ 23 – -
‘వికసిత్ భారత్’పై వర్క్షాప్
భీమవరం (ప్రకాశంచౌక్): వికసిత్ భారత్ దార్శనికతను సాకారం చేసుకోవడానికి అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో వికసిత్ భారత్ లక్ష్యంగా పాఠశాల విద్య అనే అంశంపై వర్క్ షాప్లో కలెక్టర్ పాల్గొని పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా వికసిత్ భారత్ లక్ష్యాలను వివరించారు. ఈ వర్క్ షాప్లో జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్, విద్యాశాఖ అధికారి ఇ.నారాయణ పాల్గొన్నారు. నులిపురుగులను నులిమేద్దాం భీమవరం అర్బన్: పిల్లలు, విద్యార్థులు నులిపురుగుల నివారణ మాత్రలను వేసుకుని కడుపులోనే నులి పురుగులను నులివేద్దామని కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. మండలంలోని చినఅమిరంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా మంగళవారం నులిపురుగు నివారణ మాత్రలను పంపిణీ కార్యక్రమాన్ని కలెక్టర్ సీహెచ్ నాగరాణి ప్రారంభించి మాట్లాడారు. 19 ఏళ్ల లోపు వారందరూ తప్పనిసరిగా నులిపురుగుల నివారణ మాత్రలు వేసుకుని ఆరోగ్యంగా ఉండాలన్నారు. తప్పనిసరిగా నులి పురుగుల నివారణ మాత్రలను వేసేలా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు, అధికారులు శ్రద్ధ తీసుకోవాలన్నారు. -
ఆటో డ్రైవర్లకు ఉపాధి కల్పించాలి
భీమవరం: ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంతో జీవనోపాధి కోల్పోతున్న ఆటో డ్రైవర్లకు ప్రత్యామ్నాయంగా ఉపాధి కల్పించాలంటూ మంగళవారం భీమవరం కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. యూనియన్ జిల్లా అధ్యక్షుడు యింటి సత్యనారాయణ ఆధ్వర్యంలో జిల్లాలోని వివిధ పట్టణాల ఆటో యూనియన్ల నాయకులు, కార్మికులు పెద్ద సంఖ్యలో కలెక్టరేట్కు చేరుకుని ఆందోళన చేశారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా అధ్యక్షుడు యింటి సత్యనారాయణ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాల అమలులో భాగంగా ఈ నెల 15 నుంచి మహిళలకు ఫ్రీ బస్ అమలుచేయడం వల్ల జిల్లాలో 16 వేల మంది ఆటో కార్మికులు ఉపాధిని కోల్పోతారని ఆందోళన వ్యక్తం చేశారు. ఉచిత బస్సు కారణంగా వీరంతా రోడ్డున పడే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆటో వర్కర్స్కు ప్రత్యామ్నాయంగా ఏదైనా ఉపాధి అవకాశాలు కల్పించాలని, కార్మికులకు తగిన న్యాయం చేసేంతవరకు పోరాటం ఆగదని హెచ్చరించారు. అనంతరం కలెక్టరేట్లో వినతిపత్రం అందచేశారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు కట్రెడ్డి వెంకటేశ్వరరావు, తలారి వాసు, టివీకే రాంబాబు, పంపన గోపీ, చెన్నెంశెట్టి వాసు, సంజీవరావు, దుర్గారావు, ములుగుర్తి కృష్ణ, పాలవలస జగన్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. -
డిప్యూటీ స్పీకరైతే.. చట్టాలు మీరి వ్యవహరిస్తారా?
ఉండి: డిప్యూటీ స్పీకరైతే చట్టాలను అతిక్రమించి వ్యవహరిస్తారా? అని ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజుపై మాజీ ఎమ్మెల్యే దిగుబాటి రాజగోపాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలంలోని పాములపర్రు దళితుల శ్మశానంలో నుంచి ఇద్దరు ఆక్వా రైతుల కోసం రోడ్డు వేసే ప్రయత్నం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అడ్డుకున్న దళితులపై పోలీసులు దాడులు చేయడం ఉద్రిక్తతకు దారితీసింది. ఈ వ్యవహారం రోజురోజుకూ తీవ్ర రూపం దాలుస్తున్న నేపథ్యంలో కులవివక్ష వ్యతిరేక పోరాట సమితి (కేవీపీఎస్) నాయకుల బృందం మంగళవారం పాములపర్రులో పర్యటించింది. మాజీ ఎమ్మెల్యే దిగుబాటి రాజగోపాల్ దాడులు చేసిన ప్రాంతాన్ని, రోడ్డు వేయాలని భావిస్తున్న శ్మశాన భూమిని స్థానిక దళితులు, బృంద సభ్యులతో కలసి పరిశీలించారు. రాజగోపాల్ మాట్లాడుతూ దళితులకు రక్షణగా ఉన్న చట్టాలు, జీవోలను పక్కన పెట్టి, వారి జోలికిరావడం చాలా దారుణమని అన్నారు. శ్మశాన భూమి హద్దులు మార్చాలని గ్రామ పంచాయతీ కార్యదర్శి ఎలా కోరతారని ఆయన ప్రశ్నించారు. తహసీల్దారు పంచాయతీ కార్యదర్శి ద్వారా ఎలా తీర్మానం తీసుకుంటారని నిలదీశారు. నాలుగో తేదీన కార్యదర్శి లేఖ రాస్తే ఐదో తేదీన శ్మశాన సరిహద్దులు మారుస్తూ తహసీల్దారు ఆర్డర్ ఇచ్చేస్తారా? అంటూ మండిపడ్డారు. పేదవారు రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేస్తే అధికారులకు వారాలు, నెలలు పడతాయి కానీ.. భూస్వాములకు కొమ్ముకాస్తే మాత్రం ఒక్కరోజు కూడా సమయం అవసరం లేకుండానే ఆర్డర్లు ఇచ్చేస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదంతా ఎమ్మెల్యే, అధికారులు కలసి ఆడిన నాటకమని తీవ్రంగా మండిపడ్డారు. అందుకే అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు. దమ్ముంటే ఆక్రమణలు బయటపెట్టాలి డిప్యూటీ స్పీకర్, రఘురామకృష్ణరాజుకు దమ్ముంటే, చిత్తశుద్ధి ఉంటే నియోజకవర్గంలో ఎంత ఆక్రమణ ఉందో తెలుసుకునేందుకు సర్వే చేయించి దాని వివరాలు పంచాయతీ కార్యాలయాల్లో అందుబాటులో ఉంచాలని రాజగోపాల్ సవాల్ చేశారు. పేదల శ్మశానం ఆక్రమణ అంటారా.. ఎవరు ఆక్రమణదారులో తెలుస్తుంది అంటూ మండిపడ్డారు. కేవీపీఎస్ జిల్లా బృందం సభ్యులు క్రాంతి బాబు, విజయ్లతో కలసి ఈ ఘటనపై పోరాటం మరింత ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని ఇంతటితో ముగించకపోతే నియోజకవర్గమంతా ఇదే సమస్య తలెత్తుతుందని చెప్పారు. రోడ్డు వేసేందుకు ముందుకు వెళితే అన్ని రాజకీయ పార్టీలు, దళిత సంఘాలతో కలసి ముందుకు వెళ్తామని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కోర్టులో కేసులు వేస్తామన్నారు. ఇప్పటికై నా రోడ్డు నిర్మాణం విరమించుకోకపోతే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తాం, చలో పాములపర్రుకు పిలునిస్తాం.. కలెక్టర్ను కలుస్తాం.. ఇలా పాములపర్రు దళితులకు న్యాయం జరిగే వరకు పోరాడతామని తేల్చిచెప్పారు. తాను పదేళ్ళు ఎమ్మెల్యేగా పనిచేశానని గుర్తుచేశారు. ఉండి నియోజకవర్గం ప్రశాంతంగా ఉండాలంటే వెంటనే శ్మశానంలో రోడ్డు వేసే ఆలోచన విరమించుకోవాలని డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్యే దిగుబాటి రాజగోపాల్ పాములపర్రు ఘటనపై గ్రామంలో పర్యటన భూస్వాములకు అండగా ఉండి దళితులను వేధిస్తారా? అని ఆగ్రహం -
పుంత రోడ్లు ఎక్కడ?
పొలాలకు వెళ్లే దారిలేక ఆక్వా, వరి రైతుల అవస్థలు ఉండి: చోట్ల పుంత రోడ్లు ఆక్వా, వరి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాకాలంలో పుంతలు, కాలువ గట్లపై రోడ్లు లేకపోవడంతో చేలకు వెళ్లాలన్నా, పొలాలకు ఎరువులు, పురుగు మందులు, ఆక్వా చెరువులకు మేత తీసుకుపోవాలన్నా రైతులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. పుంతలు లేని చోట్ల రోడ్లు వేసి రైతులకు అండగా నిలబడతామని చెప్పే ప్రజా ప్రతినిధులు ఉండి నియోజకవర్గంలో వందలాది పుంతలు, కాలువ గట్లపై రోడ్లు లేక రైతులు ఇక్కట్లు పడుతుంటే పట్టించుకోవట్లేదు. వందలాది పుంతలపై రోడ్లు వేయాల్సి ఉండగా.. పాములపర్రులో శ్మశాన వాటికను పుంతగా చూపిస్తూ రోడ్డు వేయడానికి మాత్రం హడావుడి చేస్తున్నారు. అడుగు వేస్తే జారిపడిపోయే పరిస్థితుల్లో పుంతరోడ్లు ఉండగా వరి పొలాలకు ఎరువులు, ఆక్వా చెరువులకు మేతలు వంటివి తీసుకువెళ్ళేందుకు రైతులు అదనపు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అదనపు ఖర్చుతో రైతుల ఇక్కట్లు చేపలు, రొయ్యలు పట్టుబడి చేసేందుకు అదనపు ఖర్చుతో రైతులు భయపడిపోతున్నారు. వేసవి సమయంలో చెరువుల వద్దకు వెళ్ళే వాహనాలు ఇప్పుడు మెయిన్రోడ్డు కూడా దిగలేకపోవడంతో పట్టుబడి పట్టిన సరుకును మెయిన్రోడ్డుకు చేర్చేందుకు ఖర్చు చేయాల్సి వస్తోంది. దీంతో ఆక్వా రైతులు మరింత నష్టాల్లోకి వెళ్లిపోతున్నారు. అమెరికా సుంకాల భయాలతో ఇప్పటికే రైతులు తీవ్ర నిరాశలో ఉండగా.. పట్టిన సరుకు ఒడ్డుకు చేర్చేందుకు అదనపు ఖర్చుచేయాల్సి రావడంతో మరింత ఆర్థిక భారాన్ని మోయాల్సి వస్తోంది. పుంత రోడ్లు ఎప్పుడు వేస్తారు? నియోజకవర్గంలో వందలాది పుంతల్లో రోడ్ల నిర్మాణం చేయాలని రైతులు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు. రైతుల ప్రయోజనం కోసం పుంత రోడ్డు నిర్మిస్తున్నామంటూ కబుర్లు చెబుతున్నారు. రైతులు గగ్గోలు పెడుతున్న పుంతల్లో, కాలువ గట్లపై రోడ్లు వేయాలి. – దానం విద్యాసాగర్, న్యాయవాది, పాములపర్రు దళితుల ప్రాంతమే కావాలా? పుంతరోడ్ల నిర్మాణానికి మేం వ్యతిరేకం కాదు. పుంతలేని ప్రాంతంలో ఉందని చెప్పి కేవలం ఇద్దరు ఆక్వారైతుల కోసం అధికారులు తమ అధికారాన్ని దుర్వినియోగం చేసి రోడ్డు వేస్తారా? దళితుల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరించి రోడ్డు వేయడం ఏంటి? – తాళ్ళూరి మధు, బహుజన జేఏసీ కన్వీనర్ మా శ్మశానం జోలికి రావద్దు రైతులు మా జోలికి రాలేదు. మేం వారి జోలికి వెళ్ళలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వాన్ని అడ్డుపెట్టుకుని కొందరు స్వార్థపరులు అవకాశమే లేని చోట రోడ్డు వేయమంటున్నారు. మా శ్మశానం జోలికి ఎవ్వరూ రావద్దు. ఒకరినొకరు గౌరవించుకుంటూ ముందుకు సాగుదాం. – దర్శి సాల్మన్, వార్డు సభ్యుడు, పాములపర్రు -
ఆత్మీయ కలయిక
తణుకు అర్బన్: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని మాజీ మంత్రి, పార్టీ రీజనల్ కో–ఆర్డినేటర్ కారుమూరి వెంకట నాగేశ్వరరావు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జగన్ను కలిశారు. వైఎస్ జగన్ పర్యటన ఏర్పాట్ల పరిశీలన సాక్షి, భీమవరం: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం భీమవరం రానున్న నేపథ్యంలో హెలీప్యాడ్ ప్రాంతాన్ని పార్టీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు, భీమవరం నియోజకవర్గ ఇన్చార్జి చినమిల్లి వెంకటరాయుడు మంగళవారం పరిశీలించారు. వీఎస్ఎస్ గార్డెన్స్లో జరగనున్న ఉంగటూరు మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు కుమార్తె వివాహ వేడుకకు హాజరయ్యేందుకు జగన్ వస్తున్న విషయం తెలిసిందే. జననేతకు స్వాగతం పలుకుతూ పార్టీ శ్రేణులు, అభిమానులు హెలీపాడ్ నుంచి వేదిక వరకూ ఫ్లెక్సీలతో ముంచెత్తారు. -
పుప్పాల వాసుబాబు కుమార్తె వివాహ వేడుకకు వైఎస్ జగన్
సాక్షి, పశ్చిమ గోదావరి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇవాళ(బుధవారం) భీమవరంలో పర్యటించారు. విఎస్ఎస్ గార్డెన్స్లో ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు కుమార్తె వివాహ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు.నూతన వధూవరులు ప్రజ్ఞ, నాగ సత్తిరాజులకు శుభాకాంక్షలు తెలిపిన వైఎస్ జగన్.. వారిని ఆశీర్వదించారు. వివాహ వేడుకలకు మాజీ హోం మంత్రి తానేటి వనిత, మాజీ మంత్రులు కారుమూరు వెంకట నాగేశ్వరరావు, పినిపే విశ్వరూప్, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ హాజరయ్యారు. -
నేడు భీమవరంలో పర్యటించనున్న మాజీ సీఎం వైఎస్ జగన్
సాక్షి,అమరావతి: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పర్యటించనున్నారు. ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు కుమార్తె వివాహ వేడుకల్లో పాల్గొననున్నారు. వైఎస్ జగన్ మధ్యాహ్నం 3.15 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి భీమవరం చేరుకుంటారు. అక్కడ విఎస్ఎస్ గార్డెన్స్లో జరిగే పుప్పాల వాసుబాబు కుమార్తె వివాహ వేడుకలో పాల్గొంటారు. అనంతరం అక్కడి నుంచి తిరుగు పయనమవుతారు. -
అసభ్యకర పోస్టులపై చర్యలు తీసుకోవాలి
తూర్పుగోదావరి ఎస్పీకి ఫిర్యాదు చేసిన వైఎస్సార్సీపీ నేతలు ద్వారకాతిరుమల: మాజీ హోం మంత్రి, వైఎస్సార్సీపీ గోపాలపురం నియోజకవర్గ ఇన్చార్జి తానేటి వనితపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టిన టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వైఎస్సార్సీపీ తూర్పుగోదావరి జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు సాలి వేణు సోమవారం జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్కు ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో ద్వారకాతిరుమల మండలానికి చెందిన పార్టీ నేతలు పలువురు పాల్గొన్నారు. దళిత మహిళ అని కూడా చూడకుండా నల్లజర్ల గ్రామానికి చెందిన సవలం రామకృష్ణ ఈ నెల 7న రాత్రి తన ఫేస్బుక్ అకౌంట్ నుంచి వనితను అవమానపరిచేలా పోస్టు పెట్టాడన్నారు. ఈ పోస్ట్ను వేళ్లచింతలగూడెంకు చెందిన మద్దిపాటి మహేష్, నేకూరి చంద్రం, దేవరపల్లి మండలం లక్ష్మీపురానికి చెందిన నగ్గిన నాగేంద్రలు షేర్లు చేశారన్నారు. వీరిపై చట్టపరమైన చర్యలు తీసుకుని, భవిష్యత్తులో పునరావృతం కాకుండా చూడాలని ఎస్పీని కోరినట్టు చెప్పారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ ద్వారకాతిరుమల మండల కన్వీనర్ ప్రతాపనేని వాసు, పార్టీ మండల మహిళా అధ్యక్షురాలు మల్లిపూడి నాగమణి, మండల ఎస్సీసెల్ అద్యక్షుడు దాసరి రాంబాబు, బంకా అప్పారావు, పొనమాల ఉమామహేశ్వరరావు, పార్టీ రాష్ట్ర సోషల్ మీడియా వింగ్ సెక్రటరీ వామిశెట్టి పరమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
వర్షాభావంతో రైతు దిగాలు
ఏలూరు (మెట్రో): పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో వర్షాభావ సమస్య నెలకొంది. భూగర్భ జలాలు రోజురోజుకు అడుగంటుతున్నాయి. సాగు పనులు 60 శాతం పూర్తి కావాల్సి ఉండగా సరైన వర్షాలు లేక ప్రస్తుతం 30 నుంచి 40 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయి.పూర్తిస్థాయిలో వర్షాలు కురవకపోవడంతో ఈ సంవత్సరం సాగు చేసుకోవాలా, వద్దా అన్న సందిగ్ధంలో రైతు ఉన్నాడు. పశ్చిమగోదావరి జిల్లాలో గత నెలలో 246.5 మి.మీ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా 128.88 మీ.మీ వర్షపాతం మాత్రమే నమోదైంది. జూన్ నెల నుంచి ఆగస్టు 4 నాటికి 365.99 మిమి వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా కేవలం 254.04 మి.మీ వర్షపాతం మాత్రమే నమోదైంది. మెట్ట ప్రాంతంగా ఉన్న ఏలూరు జిల్లాలోనూ ఇదే దుస్థితి నెలకొంది. గత జూలైలో 242.52 మి.మీ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా 179.81 మి.మీ వర్షపాతం మాత్రమే నమోదైంది. ఆగస్టు నెల ఆరంభం నుంచి గత 10 రోజులుగా సాధారణ వర్షపాతం 81.45 మిమి నమోదు కావాల్సి ఉండగా కేవలం 21.54 మి.మీ వర్షపాతం మాత్రమే నమోదైంది. సరాసరి జూన్ నెల నుంచి ఆగస్టు 10 నాటికి పరిశీలిస్తే 438.28 మి.మీ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా 274.69 మి.మీ వర్షపాతం నమోదైంది. పూర్తిగా మెట్ట ప్రాంతం, బోర్లు, వర్షాధారంపైనే ఏలూరు జిల్లా రైతులు ఆధార పడ్డాడు. భారీ వర్షాలను ఏలూరు జిల్లా రైతులు ఆశిస్తారు. భారీ వర్షాలు కురిస్తేనే మెట్ట ప్రాంతంలో జలాశయాలు, చెరువులు పూర్తిస్థాయిలో నిండుతాయి. ప్రస్తుతం వర్షాలు కురవకపోవడంతో పంటలు వేసేందుకు రైతులు జంకుతున్నారు. అడుగంటుతున్న భూగర్భ జలాలు భూగర్భ జలాలు రోజురోజుకూ కిందికి వెళ్లిపోతున్నాయి. డెల్టా ప్రాంతంగా ఉన్న పశ్చిమగోదావరి జిల్లాలో గతేడాది జూలైలో 8.9 మీటర్ల స్థాయిలో ఉన్న భూగర్భ జలాలు 9.54 మీటర్ల లోతుకు వెళ్లాయి. ఏలూరు జిల్లాలో గతేడాది జూలైలో 20.26 మీటర్లుగా ఉన్న భూగర్భ జలాలు ప్రస్తుత జూలైలో 21.98 మీటర్ల లోతుకు చేరాయి. వర్షాకాలం ఆరంభంలోనే ఇలా ఉంటే మున్ముందు ఎలా ఉంటుందోనని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వేసవిని తలపిస్తున్న ఎండలు సరైన వానలు లేక మరింత లోతుకు భూగర్భ జలాలు ఇలాగైతే సాగు ఎలా? వర్షాలు కురవక సాగుకు వీలు లేకుండా పోతుంది. వర్షాకాలం ఆరంభంలోనే సమృద్ధిగా కురిస్తే సాగు పనులకు వీలుంటుంది. ప్రస్తుతం వర్షాకాలం వేసవిని తలపిస్తోంది. వర్షాకాలం ప్రారంభమై రెండు నెలలవుతున్నా.. సమృద్ధిగా వర్షాలు కురిసిన పాపాన పోలేదు. – దేవళ్లరాజు రాజశేఖర్, రైతు, కొండలరావుపాలెం ఉక్కబోతతో ఇక్కట్లు ఎండలు వేసవిలో మండినట్లు మండిపోతున్నాయి. దీనికి తోడు ఉక్కబోత. పగలు ఎండలు మండిపోతుంటే రాత్రి సమయంలో ఉక్కపోతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. వర్షాలు కురిస్తే కాస్త ఉపశమనం కలుగుతుంది. – శ్రీరామ శ్రావణి, కొవ్వలి, గృహిణి -
డిగ్రీ కళాశాలల్లో బదిలీలు చేపట్టాలి
ఏలూరు (ఆర్ఆర్పేట): రాష్ట్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో సాధారణ బదిలీలను ప్రభుత్వం వెంటనే చేపట్టాలని ఏలూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకులు భోజన విరామ సమయంలో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. బదిలీలతో పాటు అధ్యాపకుల రీ డిజిగ్నేషన్, సీఏఎస్ వంటి విషయాలపై సత్వరం నిర్ణయం తీసుకోవాలని గవర్నమెంట్ కాలేజ్ టీచర్స్ అసోసియేషన్, గవర్నమెంట్ కాలేజ్ గెజిటెడ్ టీచర్స్ అసోసియేషన్ సంయుక్తంగా ఇచ్చిన పిలుపుమేరకు ఈ నిరసన ప్రదర్శన చేశారు. జీసీటీఏ జిల్లా అధ్యక్షుడు ఎం. రాంబాబు, ట్రెజరర్ టీవీ దుర్గాప్రసాద్, జీజీటీఏ జిల్లా ట్రెజరర్ కే. రమేష్, ఇతర అధ్యాపకులు కార్యక్రమంలో పాల్గొని ప్రభుత్వ విధానాలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. బుట్టాయిగూడెంలో.. బుట్టాయగూడెం: భోజన విరామ సమయంలో స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పనిచేస్తున్న అద్యాపకులు నిరసన కార్యక్రమం చేశారు. నిరసన కార్యక్రమం అనంతరం ప్రిన్సిపాల్ డాక్టర్ మహేంద్రరావుకు వినతిపత్రాన్ని అందజేశారు. గుడాల గోపికి వైఎస్ జగన్ పరామర్శ వీరవాసరం: వైఎస్సార్సీపీ పాలకొల్లు నియోజకవర్గ ఇన్చార్జి గుడాల శ్రీహరి గోపాలరావు (గోపి) సోదరుడు గుడాల వెంకట సుబ్బయ్య (చిన్న) (49) అనారోగ్యంతో సోమవారం ఉదయం వీరవాసరంలో మృతి చెందారు. ఈ నేపథ్యంలో గోపిని మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫోన్లో పరామర్శించారు. అందరితో కలుపుగోలుగా ఉండే చిన్న మృతితో గ్రామంలో విషాద చాయలు అలముకున్నాయి. చిన్నకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. యడ్ల తాతాజీ, కర్రా జయసరిత, గాదిరాజు రామరాజు, జుత్తిగ నాగరాజు, డీవీడీ ప్రసాద్, పార్టీ నాయకులు గోపిని పరామర్శించారు. డ్రంక్ అండ్ డ్రైవ్లో 13 మందికి జరిమానా భీమవరం: భీమవరం టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అంబేడ్కర్ సెంటర్, గరగపర్రురోడ్డులోని బీవీ రాజు విగ్రహం ప్రాంతాల్లో మద్యం సేవించి బైక్ నడుపుతున్న 13 మందిని అరెస్టు చేసినట్లు టూటౌన్ సీఐ జి.కాళీచరణ్ సోమవారం చెప్పారు. పట్టుబడిన వారిని మేజిస్ట్రేట్ ముందు హాజరు పర్చగా ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున జరిమానా విధించారని, అతి వేగంగా బైక్ నడిపిన వ్యక్తికి రూ.3 వేల జరిమానా విధించారని సీఐ కాళీచరణ్ చెప్పారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో జరిమానా ఉండి: ఈ నెల 11న ఉండి పోలీస్స్టేషన్ పరిధిలో నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్లో నమోదైన 15 కేసుల్లో ముద్దాయిలను కోర్టుకు తరలించగా సోమవారం వారికి జరిమానాలు విధించినట్లు ఉండి ఎస్సై నసీరుల్లా తెలిపారు. వ్యాసరచన పోటీల్లో విజేతలు వీరే భీమవరం: స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సర్వోదయ మండలి ఆధ్వర్యంలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా స్థాయిలో గాంధీజీ ఆశించిన స్వరాజ్యం అంశంపై నిర్వహించిన వ్యాసరచన పోటీల విజేత వివరాలను సోమవారం ప్రకటించారు. సీనియర్స్ విభాగంలో ఎం.నాగలక్ష్మి(గోపాలపురం), ఎండీ సుమయ్య(నరసాపురం), ఎ.పూజిత(చినఅమిరం), పి.మంజుశ్రీ(గూట్లపాడు), కేఎస్.అమూల్య(వైఎస్ పాలెం), కె.రిషిత(కేఎస్ రామవరం), కె.దివ్య(మండపాక), ఎస్.అమృత లక్ష్మీసాయి(చిననిండ్రకొలను) విజేతలుగా నిలిచారు. జూనియర్స్ విభాగంలో కె.కుషాలి(బొర్రంపాలెం), డి.కోమలశ్రీ(వేగివాడ కల్లచెరువు), కె.యామిని ఐశ్వర్య(నరసాపురం), ఎన్.అక్షిత(చినఅమిరం), ఎ.సరసాదేవి(అరట్లకట్ట), కె.వర్షిత(భీమవరం), పి.ఆనందిత(పెదనిండ్రకొలను), కళాశాల స్థాయిలో ఎం.విజయమణి(తాడేపల్లిగూడెం), ఇ.వరుణ్(పెన్నాడ), వై.అవినాష్(భీమవరం) విజేతలుగా నిలిచారని వీరికి 13న పెదఅమిరం మహాత్మాగాంధీ ట్రస్ వద్ద, ఏలూరులో 14న పెదనిండ్రకొలను మహాత్మాగాంధీ భవనంలో బహుమతులు అందజేస్తారు. గుర్తు తెలియని మృతదేహం లభ్యం భీమవరం అర్బన్: మండలంలోని దెయ్యాలతిప్ప వద్ద కాళీపట్నం చానల్లో సోమవారం గుర్తు తెలియని మహిళ మృత దేహం కొట్టుకువచ్చింది. స్థానికులు గమనించి వీఆర్వోకు సమాచారం అందించారు. రూరల్ ఐ.వీర్రాజు అక్కడికి చేరుకుని బయటకు తీయించారు. ఆమె వయసు 35 నుంచి 40 మధ్య ఉండవచ్చని నీలం టవల్ కట్టుకుని పైన తెల్లటి జాకెట్ ఉందని ఎస్సై తెలిపారు. కాలువలో ఎక్కువ రోజులు ఉండటం వల్ల గుర్తుపట్టలేని విధంగా ఉందన్నారు. -
వీధి కుక్కల దాడిలో గాయాలు
భీమడోలు: భీమడోలు మండలంలోని పలు గ్రామాల్లో వీధి కుక్కలు స్వైర విహారం చేసి దాడి చేశాయి. వేర్వేరు గ్రామాలకు చెందిన వీధి కుక్కల బాధితులు సోమవారం భీమడోలు ఆసుపత్రికి వచ్చారు. వారికి వైద్యులు యాంటీ రాబీస్ వ్యాక్సిన్ వేసి ఇళ్లకు పంపారు. పోలసానిపల్లికి చెందిన నాలుగేళ్ల చిన్నారి షేక్ అమ్మన్, భీమడోలు పంచాయతీ శివారు ఆర్జావారిగూడెంకు చెందిన పాము సుశాంత్(24), ఉమర్(9), మాధవరానికి చెందిన మడిచారాల ఆదిలక్ష్మీ(41), ఎం.నాగులపల్లికి చెందిన తులసి రామ్(34), సండ్రగుంటకు చెందిన కె.రాజు(66), గుణ్ణంపల్లికి చెందిన నక్కా చంద్రవతి(70) వీధి కుక్కల దాడిలో గాయపడ్డారు. కుటుంబ సభ్యులు భీమడోలు సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ఆసుపత్రి సూపరిండెంటెంట్ ఆనంద్ ఆధ్వర్యంలో వ్యాక్సిన్ వేశారు. ఇటీవల భీమడోలు సమీపంలోని ఎం.నాగులపల్లి పంచాయతీ పరిధిలో ఓ ప్రైవేటు పాఠశాలలోకి కుక్కలు చొరబడి ముగ్గురు విద్యార్థులను కరిచాయి. గ్రామాల్లో వీధి కుక్కల సంచారం పెరిగి పోయిందని, వాటి నుంచి ప్రజలను రక్షించాలని గ్రామాల ప్రజలు వేడుకుంటున్నారు. -
బాస్కెట్బాల్ జిల్లా జట్ల ఎంపిక
ఏలూరు రూరల్: ప్రభుత్వం స్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆటల పోటీలను క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని డీఎస్డీఓ బి.శ్రీనివాసరావు అన్నారు. సోమవారం జిల్లా జట్ల ఎంపిక పోటీలు జరిగాయి. జాతీయ క్రీడా దినోత్సవం పురస్కరించుకుని ప్రభుత్వ ఆదేశాల మేరకు అండర్–22 విభాగంలో మహిళలు, పురుషులకు 10 క్రీడాంశాల్లో ఆటల పోటీలు నిర్వహించనున్నామన్నారు. జిల్లా జట్లకు ఎంపికై న వారు జోనల్ పోటీల్లో తలపడతారన్నారు. పరిశీలకురాలిగా హాజరైన శాప్ డైరక్టర్ కొవ్వాసు జగదీశ్వరి మాట్లాడుతూ క్రీడాకారుల్లో ఉత్సాహం నింపేందుకు శాప్ పోటీలు చేపడుతోందన్నారు. ఏలూరు అల్లూరి సీతారామరాజు స్టేడియంలో ఖోఖో, వాలీబాల్, బాస్కెట్బాల్, హాకీ క్రీడాంశాల్లో పోటీలు చేపట్టి జట్ల ఎంపిక పూర్తి చేశారు. ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్ రాజ్యాంగ విరుద్ధం తాడేపల్లిగూడెం (టీఓసీ): రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన షెడ్యూల్డ్ కులాల ఉప వర్గీకరణ ఆర్డినెన్స్ రాజ్యాంగ విరుద్ధమని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చీకటిమిల్లి మంగరాజు పేర్కొన్నారు. రాష్ట్రంలోని 59 షెడ్యూల్డ్ కులాలను జనాభా ఆధారంగా మూడు గ్రూపులుగా విభజించి రిజర్వేషన్లు కేటాయించడం సరికాదని కలెక్టర్కు సోమవారం వినతిపత్రం అందించినట్లు చెప్పారు. షెడ్యూల్ కులాల జాబితాలో మార్పులు చేసే అధికారం కేంద్రానికే ఉందని, రాష్ట్రానికి లేదన్నారు. ఆర్డినెన్స్ను రద్దు చేయాలని కోరారు. -
యోగా పోటీల్లో విద్యార్థుల ప్రతిభ
నూజివీడు: యోగాసన పోటీల్లో నూజివీడు ట్రిపుల్ ఐటీ విద్యార్థులు ప్రతిభ కనబరిచి పతకాలు సాధించారు. ఈ నెల 10న ఏలూరులోని ప్రేమాలయ ఓల్డేజ్ హోంలో జరిగిన ఈ పోటీలో 14 మంది విద్యార్థులు వేర్వేరు ఆసనాలలో 16 పతకాలను సాధించారు. 9 మంది గోల్డ్ మెడల్స్, ఆరుగురు సిల్వర్ మెడల్స్, ఒకరు బ్రాంజ్ మెడల్ సాధించడం విశేషం. జూనియర్స్ విభాగంలో తనూష, హరిత, దివాకర్లు గోల్డ్ మెడల్స్ సాధించగా, సీనియర్స్ విభాగంలో అశోక్, అభిషేక్, దీపక్ నాయుడు గోల్డ్ మెడల్స్ సాధించారు. హరిత, అశోక్, దీపక్ నాయుడులు యోగాసనాలలోని వివిధ ఈవెంట్లలో రెండేసి చొప్పున గోల్డ్ మెడల్స్ సాధించడం విశేషం. జూనియర్స్ విభాగంలో దేవిశ్రీ, స్పందన, ప్రమీల, వెంకటలక్ష్మి, యుగంధర్, దామోదర్లు సిల్వర్ మెడల్స్ సాధించగా, గీతిక అనే విద్యార్థిని బ్రాంజ్ మెడల్ సాధించింది. యోగాసనాలలో పతకాలు సాధించిన విద్యార్థులను ఇన్చార్జి డైరెక్టర్ ఆచార్య సండ్ర అమరేంద్రకుమార్, ఏఓ లక్ష్మణరావు, అకడమిక్ డీన్ చిరంజీవి, అకడమిక్ అసోసియేట్ డీన్ రఘు, యోగా టీచర్ పి. చంద్రశేఖర్ లు అభినందించారు. అభయాంజనేయ స్వామి హుండీ ఆదాయం లెక్కింపు పెదపాడు: మండలంలోని అప్పనవీడులోని వేంచేసియున్న శ్రీ అభయాంజనేయస్వామి హుండీ ఆదాయం 10,32,522 వచ్చినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. మండలంలోని మొండూరు గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ కార్యనిర్వహణాధికారి ఎం.రాంబాబు పర్యవేక్షణలో హుండీ లెక్కించారు. 76 రోజులకు ఈ లెక్కింపు చేసినట్లు తెలిపారు. ఆక్వా రంగ సమస్యల పరిష్కారానికి కృషి భీమవరం: ఆక్వా రంగ సమస్యల పరిష్కారానికి తన వంతు కృషిచేస్తానని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అన్నారు. సోమవారం పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో వెస్ట్ గోదావరి ప్రాన్ ఫార్మర్స్ వెల్ఫేర్ ఫెడరేషన్ మంత్రిని కలిసి ఆక్వా ఉత్పత్తుల ఎగుమతిపై అమెరికా 50 శాతం పన్ను విధించడంతో ధరల్లో తీవ్ర వ్యత్యాసం వచ్చిందని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను ఆదుకోవాలని అధ్యక్ష, కార్యదర్శులు ఎన్.జగపతిరాజు, గాదిరాజు వెంకట సుబ్బరాజు వినతిపత్రం అందించారు. శ్రీనివాసవర్మ మాట్లాడుతూ రొయ్యల రైతుల కష్టాలు తనకు తెలుసుని ఆక్వా సాగుకు గతంలో ఉన్న మంచి పరిస్థితులు ఇప్పుడు లేవన్నారు. రైతుల ఇబ్బందులను కేంద్ర మంత్రి పియూష్ గోయల్ దృష్టికి తీసుకువెళ్లి సమస్యల పరిష్కారానికి కృషిచేస్తానని శ్రీనివాసవర్మ చెప్పారు. -
●ఎమ్మెల్యే తాలూకా..
ఏలూరు నగరంలో ప్రతి రోజు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు లారీలు, ఇతర భారీ వాహనాల రాకపోకలు నిషేధం. ఈ సమయంలో వాహనాలు పొరపాటున ప్రవేశిస్తే రూ.2 వేలు అంతకుమించి అపరాధ రుసుం చెల్లించాల్సిందే.. ఇదంతా కేవలం సామాన్యులకే వర్తించే రూల్స్.. జూట్మిల్లు సమీపంలో సోమవారం ఉదయం 10.30 గంటలకు వరుసగా నాలుగు లారీలు రావటంతో ట్రాఫిక్ పోలీసులు వాహనాలు ఆపారు. కానిస్టేబుల్ సీఐకు సమాచారం ఇచ్చారు. మేం ఎమ్మెల్యే గారి తాలుకా మా వాహనాలే అపుతారా.. అంటూ డ్రైవర్ ఏవరికో ఫోన్ చేసి ట్రాఫిక్ పోలీసులకు ఇచ్చాడు. వెంటనే ఆ లారీలను నగరంలోకి వెళ్లడానికి అనుమతి ఇచ్చారు. – సాక్షి ఫొటోగ్రాఫర్/ఏలూరు -
రోల్బాల్ జట్టు ఎంపిక
తణుకు అర్బన్: ఆంధ్రప్రదేశ్ రోల్ బాల్ స్టేట్ సెలక్షన్ క్యాంప్ ఈనెల 7 నుంచి 10 వరకు తణుకు సిల్వర్ జూబ్లీ కాలనీలోని మునిసిపల్ స్కేటింగ్ పార్కులో నిర్వహించారు. వివిధ విభాగాల్లో జాతీయస్థాయి పోటీలకు జట్టు ఎంపిక చేశారు. మొత్తం 100 మంది క్రీడాకారులు పాల్గొన్న ఈ క్యాంపులో 60 మందిని ఎంపిక చేసినట్లు రోల్బాల్ స్టేట్ సెక్రటరీ అనిల్కుమార్రెడ్డి తెలిపారు. సెప్టెంబర్ 13, 14 తేదీల్లో కేరళలోని కొల్లాంలో నిర్వహించే సౌత్ జోనల్స్కి జట్టును సంసిద్ధం చేశామని చెప్పారు. 60 మంది ఎంపిక కాగా.. పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి తణుకుకు చెందిన 9 మంది క్రీడాకారులు ఉన్నట్లుగా వివరించారు. కార్యక్రమంలో స్టేట్ టెక్నికల్ చైర్మన్ వీజీ ప్రేమ్నాథ్, స్టేట్ ఆర్గనైజింగ్ డైరెక్టర్ తోట లలిత ప్రియ, కోచెస్ కమిటీ డైరెక్టర్ పూసర్ల సంతోష్ కుమార్, ఉమెన్ కమిషన్ డైరెక్టర్ వానపల్లి లావణ్య, కోచెస్ కమిటీ అసిస్టెంట్ డైరెక్టర్ మధుబాబు, రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన కోచ్లు పాల్గొన్నారు. -
రేపు వైఎస్ జగన్ పర్యటన షెడ్యూల్ ఇలా..
సాక్షి, భీమవరం: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం భీమవరం విచ్చేయనున్నారు. ఉంగటూరు మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు కుమార్తె వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించనున్నారు. జగన్ పశ్చిమగోదావరి జిల్లా పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ను సోమవారం పార్టీ కేంద్ర కా ర్యాలయం విడుదల చేసింది. 13న మ ధ్యాహ్నం 3.15 గంటలకు తాడేపల్లిలోని నివాసం వద్ద నుంచి 3.20 గంటలకు హెలీప్యాడ్కు వస్తారు. 3.30 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 4.15 గంటలకు భీమవరంలోని వీఎస్ఎస్ గార్డెన్స్ సమీపంలోని హెలీప్యాడ్కు చేరుకుంటారు. రోడ్డు మార్గం గుండా 4.35 గంటలకు వివాహ వేదిక వీఎస్ఎస్ గార్డెన్కు చేరుకుని నూతన వధూవరులను ఆశీర్వదిస్తారు. అనంతరం 5.10 గంటలకు హెలీప్యాడ్ నుంచి తాడేపల్లి బయలుదేరి వెళతారు. పాములపర్రు సమస్యను పరిష్కరించాలి ఉండి: మండలంలోని పాములపర్రులో జరుగుతున్న శ్శశాన వాటికలో రోడ్డు నిర్మాణ వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించాలని వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్చార్జి పీవీఎల్ నర్సింహరాజు అన్నారు. సోమవారం పెదఅమిరంలోని పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ పాములపర్రులో దళితులపై దాడి ఘటన బాధాకరమన్నారు. శ్మశాన వాటిక వంటి సున్నిత అంశాల్లో అధికారులు మరింత జాగ్రత్త తీసుకుంటే బాగుండేదని అన్నారు. ఎవరి మనోభావాలు, విశ్వాసాలు దెబ్బతినకుండా నిర్ణయం తీసుకోవాలన్నారు. దళితుల సమస్య పరిష్కారానికి అన్ని పార్టీలు ముందుకు రావాలని కోరారు. దళితులకు న్యాయం జరిగేలా వైఎస్సార్సీపీ అండగా ఉంటుందన్నారు. ఘటనను నిశితంగా పరిశీలిస్తున్నామని, పార్టీ అధినాయకులకు సమాచారం అందించామన్నారు. అధికార పార్టీ వారు ముందుకు వస్తే తాము కూడా ముందుకు వస్తామని, సమస్యను పరిష్కరించేలా కృషి చేద్దామని పీవీఎల్ అన్నారు. గుంతలు పూడ్చివేత కాళ్ల: రాష్ట్రీయ రహదారిపై కాళ్ల పరిధిలో హై స్కూల్ సమీపంలో గుంతలను పూడ్చారు. ‘గుంతలు పూడ్చండి.. చింతలు తీర్చండి’ శీర్షికన ‘సాక్షి’లో ప్రచురించిన కథనానికి అధికారులు స్పందించారు. హైస్కూల్ సమీపంలోని టర్నింగ్లో గుంతలను సోమవారం పూడ్పించారు. పరిష్కారంలో జాప్యం తగదు భీమవరం: పోలీసు శాఖకు వచ్చే ప్రజా ఫిర్యా దుల పరిష్కారానికి ప్రాధాన్యమిస్తూ అర్జీలు పునరావృతం కాకుండా నిర్ణీత గడువులోపు పరిష్కారం చూపాలని ఎస్పీ అద్నాన్ నయీం అస్మి అన్నారు. సోమవారం స్థానిక జిల్లా పో లీసు ప్రధాన కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా 12 మంది నుంచి ఆయన వినతులు స్వీకరించారు. ఆయా సమ స్యల పరిష్కారానికి సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడారు. అదనపు ఎస్పీ (అడ్మిన్) వి.భీమారావు పాల్గొన్నారు. నులి పురుగుల నివారణతో ఆరోగ్యం భీమవరం(ప్రకాశం చౌక్): జిల్లా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించనున్న జాతీయ నులి పురుగుల నిర్మూలన కార్యాక్రమం పోస్టర్ను కలెక్టర్ సీహెచ్ నాగరాణి ఆవిష్కరించారు. నులి పురుగులతో పిల్లల్లో ఎదుగుదల లోపిస్తుందని, వీటిని నివారించడం ద్వారా ఆరోగ్యం సమకూరుతుందన్నారు. జిల్లా వ్యాప్తంగా పిల్లలకు మాత్రల పంపిణీపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని అధికారులకు సూచించారు. డీఎంహెచ్ఓ జి.గీతాబాయి, ఆర్బీఎస్కే పీఓ సీహెచ్ భావన తదితరులు పాల్గొన్నారు. -
అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం సహించం
కలెక్టర్ నాగరాణి భీమవరం (ప్రకాశం చౌక్): ప్రజాసమస్యల పరి ష్కార వ్యవస్థ (పీజీఆర్ఎస్)లో అర్జీల పరిష్కారంలో జిల్లా వెనుకబడి ఉండటంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యాన్ని సహించబోమని హెచ్చరించారు. సోమవారం కలెక్టరేట్లో పీజీఆర్ఎస్లో భాగంగా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అర్జీలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టా లని అధికారులకు సూచించారు. మొత్తం 180 అర్జీలను స్వీకరించారు. డీఆర్వో ఎం.వెంకటేశ్వర్లు, డ్వా మా పీడీ కేసీహెచ్ అప్పారావు, సచివాలయాల అధికారి వై.దోసిరెడ్డి, అధికారులు పాల్గొన్నారు. అర్జీల్లో కొన్ని.. ● భీమవరం 12 వార్డు బ్రిడ్జి పేట పంట కాలువ పక్క రోడ్డును ఆనుకుని 40 ఏళ్లగా నివాసం ఉంటున్నామని, రోడ్డు విస్తరణలో మా ఇళ్లు తొలగించారని ఈ ప్రాంత వాసులు కలెక్టర్ వద్ద మొరపెట్టుకున్నారు. ● పాలకోడేరు మండలం కొరుకోల్లులోని దళితపేటలో ప్రభుత్వానికి చెందిన 2 సెంట్ల భూమి ఎస్సీ కమ్యూనిటీ హాల్ కోసం కేటాయించగా అధికారులు ఇంటి స్థలంగా పట్టాలు ఇచ్చారని దళితపేటవాసులు ఫిర్యాదు చేశారు. ఎస్సీ వర్గీకరణతో మాలలకు అన్యాయం ఎస్సీ వర్గీకరణతో మాలలకు తీవ్ర అన్యాయం జరిగిందని, మాలల హక్కుల కోసం రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు చేస్తామని మాలమహనాడు జాతీయ అధ్యక్షుడు చీకటిమిల్లి మంగరాజు, మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు నల్లి రాజేష్, దళిత ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు గంటా సుందర్కుమార్ అ న్నారు. కలెక్టరేట్ వద్ద మాల సంఘాల జేఏసీ ఆద్వర్యంలో ధర్నా నిర్వహించి అనంతరం కలెక్టర్కు వినతిపత్రం అందించారు. దేశ సమైక్యతకు పాటుపడాలి భీమవరం: యువత దేశ సమగ్రత, సమైక్యతకు పాటుపడాలని కలెక్టర్ సీహెచ్ నాగరాణి అన్నారు. సోమవారం ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా హర్ ఘర్ తిరంగా ర్యాలీని స్థానిక ఎస్ఆర్కేఆర్ కళాశాల వద్ద ఆమె ప్రారంభించారు. ఈనెల 13 నుంచి 15 వరకు ఇళ్లు, కార్యాలయాలు, బహిరంగ ప్రదేశాల్లో జెండాలను ఎగురవేయాలని ఆమె అన్నారు. అనంతరం సుమారు 2 వేల మంది విద్యార్థులతో 200 మీటర్ల భారత త్రివర్ణ పతాకాన్ని చేతబూని ర్యాలీ నిర్వహించారు. -
ఏపీలో ఉన్నది ప్రజాస్వామ్యమా? రాచరికమా?
మాజీ మంత్రి కారుమూరి మండిపాటు తణుకు అర్బన్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా.. రాచరిక వ్యవస్థ నడుస్తోందా అనే సందే హాలు ప్రజల్లో సైతం వ్యక్తమవుతున్నాయని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ రీజనల్ కో–ఆర్డినేటర్ కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. తణుకులోని పార్టీ కార్యాలయంలో సోమవారం విలేకరులతో మాట్లాడుతూ పులివెందులలో జెడ్పీటీసీ ఎన్నికల్లో పట్టు కోసం కూటమి నేతలు వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీతో పాటు పార్టీ శ్రేణులపై దాడికి దిగి నీచపు రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిప డ్డారు. ఒక గ్రామానికి చెందిన ఓటర్లు మరో గ్రా మం వెళ్లి ఓటేయాల్సిన పరిస్థితులను ఎప్పుడైనా చూశామా అని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం ఓట్ల శాతాన్ని తగ్గించేందుకు ఇటువంటి కుట్రలకు దిగుతోందని మండిపడ్డారు. పోలీసులు వారికి తొత్తులుగా మారారని, డీఐజీ స్థాయి అధికారి వెటకారంగా మాట్లాడటం హేయమన్నారు. పులివెందులలో బ్యాలెట్ పేపర్ ఓటింగ్తో చంద్రబాబుకు భ యం పట్టుకుందని ఎద్దేవా చేశారు. ఈవీఎం ముఖ్యమంత్రి.. ఈవీఎం ఎమ్మెల్యేలు రాష్ట్ర ప్రజలంతా కూటమి ప్రభుత్వాన్ని ఈవీఎం ప్ర భుత్వంగా భావిస్తున్నారని, ఈవీఎం సీఎం గాను, ఈవీఎం ఎమ్మెల్యేలు గాను అంటున్నారని కా రుమూరి అన్నారు. ఈవీఎం స్కామ్ గురించి వైఎస్ జగన్మోహన్రెడ్డి సైతం ముందుగానే అనుమానం వ్యక్తం చేశారన్నారు. ఈవీఎం మిషన్లు చూపించిన ఓటింగ్కు, ఈవీఎం ప్యాడ్ల సంఖ్యకు భారీగా తేడా వచ్చినా ఎన్నికల అధికారులు పట్టించుకోకుండా కూటమి ప్రభుత్వానికి వంతపాడారని విమర్శించా రు. వీటన్నింటిపై పార్టీ తరఫున న్యాయస్థానానికి వెళ్లినట్టు చెప్పారు. 45 ఏళ్ల ఇండస్ట్రీగా చెప్పుకునే చంద్రబాబు తనకు ఓట్లు వచ్చినచోట అభివృద్ధి చేయాల్సింది గాను, వైఎస్సార్సీపీ వాళ్లకు ఏ పనులూ చేయరాదని అధికారులకు సూచించడం దుర్మార్గమన్నారు. ఎన్నికల ముందు సంపద సృష్టించి సంక్షేమం అందిస్తామని చెప్పి, ఇప్పుడు పీ4 విధా నాన్ని అమలుచేస్తున్నామంటూ చేతులెత్తేశారన్నా రు. ఆ పీ4 ప్రక్రియను మీ పచ్చ చానల్లోనే ఉతికి ఆరేశారంటూ గుర్తుచేశారు. తణుకులో ఆవులు, గే దెల కోతలు, బెల్టు దుకాణాలు, సెటిల్మెంట్లతో దోపిడీ జరుగుతుందని విమర్శించారు. పంచాయ తీరాజ్ రాష్ట్ర కార్యదర్శి వడ్లూరి సీతారాం, పట్టణ అధ్యక్షుడు మారిశెట్టి శేషగిరి, జిల్లా ఆర్గనైజేషన్ సెక్రటరీ యిండుగపల్లి బలరామకృష్ణ, నియోజకవర్గ మహిళాధ్యక్షురాలు మెహర్ అన్సారీ, పట్టణ మహిళాధ్యక్షురాలు నూకల కనకదుర్గ పాల్గొన్నారు. -
వైద్యానికి నిర్లక్ష్య రోగం
సాక్షి, భీమవరం: ప్రభుత్వ ఆస్పత్రులకు కూటమి సర్కారు నిర్లక్ష్య రోగం పట్టింది. సమ య పాలన పాటించని వైద్యులు.. అరకొర మందులు.. వైద్య సిబ్బంది కొరత.. సౌకర్యాల లేమి.. రోగులకు చుక్కలు చూపిస్తున్నాయి.. ఓపీ వద్ద నుంచే పడిగాపులు మొదలవుతున్నాయి. అడుగడుగునా సమస్యలతో అత్యవసర వైద్యం గగనమవుతోంది. సోమవారం జిల్లాలోని పలు ప్రభుత్వ ఆస్పత్రుల్లో ‘సాక్షి’ జరిపిన పరిశీలనలో సకాలంలో వైద్యులు రాక రోగుల పడిగాపులు, సిబ్బంది కొరతతో వారంలో మూడు రోజులు మాత్రమే అందుబాటులో ఉంటున్న ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మాసిస్టులు, దీర్ఘ కాల వ్యాధులకు చెందిన మందులు సైతం అందుబాటులో లేని పరిస్థితులు, పారిశుద్ధ్య లేమి తదితర వెతలెన్నో వెలుగుచూశాయి. తణుకు.. ‘ఓపి’క పట్టలేక : తణుకులోని జిల్లా కేంద్ర ఆస్పత్రి 200 పడకలతో సేవలందిస్తున్నా 100 పడకలకు చెందిన వైద్య సిబ్బంది మాత్రమే అందుబాటులో ఉన్నారు. ఓపీ వద్ద నుంచే రోగులను కష్టాలు వెంటాడుతున్నాయి. డేటా ఆన్లైన్ ప్రక్రియ ఆలస్యమై క్యూలైన్లో నిల్చోలేక కూలబడిపోతున్నారు. హెల్ప్డెస్క్ లేక ఏ పరీక్షకు ఎక్కడకు వెళ్లాలనే విషయం తెలియక తికమకపడుతున్నారు. పూర్తిస్థాయిలో చీపుర్లు, బ్లీచింగ్ పౌడర్, చేటలు, బయోమెడికల్ కవర్స్, శానిటరీ సామగ్రి సరఫరా లేక తరచూ పారిశుద్ధ్య లేమి పరిస్థితులు తలెత్తుతు న్నాయి. ఇరగవరం, రేలంగి పీహెచ్సీల్లోని వైద్యులు వేళకు రావడం లేదనే ఆరోపణలున్నాయి. అత్తిలి పీహెచ్సీలో ల్యాబ్ టెక్నీషియన్ లేక రేలంగి పీహెచ్సీ నుంచి వారానికి మూడు రోజులు వస్తున్నారు. మంచిలి పీహెచ్సీలో ఫార్మాసిస్ట్ లేక అత్తిలి పీహెచ్సీ నుంచి మూడు రోజులు వస్తున్నారు. భీమవరం.. సౌకర్యాలు గగనం జిల్లా కేంద్రం భీమవరంలోని ఏరియా ఆస్పత్రిలో జనరల్, బాలింతల వార్డుల్లో తాగడానికి మంచి నీటి సౌకర్యం లేదు. నాలుగు ఏసీలు ఉండగా ఒకటి పనిచేయడం లేదు. టాయిలెట్స్ అధ్వానంగా ఉన్నాయి. ఎక్స్రే, స్కానింగ్ల్లో ఇద్దరు టెక్నీషియన్లకు ఒక్కరే ఉన్నారు. ఈసీజీ టెక్నీషియన్ లేడు. ఓపీ వద్ద కూర్చునేందుకు సరిగా బల్లలు లేక రోగులు ఇబ్బంది పడుతున్నారు. పాలకొల్లు.. రోగుల ఘొల్లు : పాలకొల్లు ఏరియా ఆస్పత్రిలో సమయానికి వైద్యులు రాకపోవడంతో రోగులు క్యూలైన్లో బారులు తీరి పడిగాపులు కాస్తున్న పరిస్థితి. గర్భిణులు, బాలింతల వార్డు అధ్వానంగా ఉంది. 23 మంది వైద్యులకు 21 మంది వైద్యులు ఉన్నారు. ఎక్స్రే, ఈసీజీలు ఉన్నా స్కానింగ్ కోసం బయటకు వెళ్లాల్సిందే. కొందరు వైద్యులు సెలవుపై వెళ్లడంతో రోగులు ఇబ్బంది పడుతున్నారు. తాడేపల్లిగూడెం.. మందుల కొరత తాడేపల్లిగూడెం ఏరియా ఆస్పత్రిలో మందుల కొ రత తీవ్రంగా ఉంది. స్కానింగ్లు బయటకు రాస్తున్నారు. దంత వైద్యానికి వచ్చే వారికి పళ్లు చెక్ చేయడానికి సరైన పరికరాలు లేవు. వెంకట్రామన్నగూ డెం, మాధవరం పీహెచ్సీల్లో ల్యాబ్ టెక్నీషియన్లు వారానికి మూడు రోజులు మాత్రమే అందుబాటులో ఉంటున్నారు. పెంటపాడు మండలంలో షుగర్, బీపీ మాత్రలు అందుబాటులో ఉండటం లేదు. నాలుగు నెలలుగా 104 ద్వారా సరఫరా నిలిచిపోయినట్టు రోగులు చెబుతున్నారు. నరసాపురం.. సిబ్బంది లేమి నరసాపురం పట్టణంలోని రెండు పీహెచ్సీల్లో అసౌకర్యాలు వెంటాడుతుండటంతో రోగుల సంఖ్య గణనీయంగా తగ్గింది. రూరల్లోని ఎల్బీచర్ల, తూర్పుతాళ్లు పీహెచ్సీల్లో పార్మాసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్, ల్యాబ్ అసిస్టెంట్, వాచ్మెన్ పోస్టులు ఖాళీగా ఉ న్నాయి. మొగల్తూరు పీహెచ్సీలో 19 మంది ఏఎన్ ఎంలకు 12 మంది మాత్రమే ఉన్నారు. ఫార్మాసిస్ట్, ల్యాబ్ టెక్నిషియన్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గర్భి ణులకు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండాల్సిన స్టాఫ్ నర్సుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఉండి.. సమస్యలు దండి ఉండి నియోజకవర్గంలోని ఆకివీడు సీహెచ్సీలో షు గర్ మాత్రలు, ఇన్సులిన్ కొరత ఎక్కువగా ఉంది. సీహెచ్సీతో పాటు పెదకాపవరం, ఉండి, యండగండి పీహెచ్సీల్లో వైద్యుల కొరత వేధిస్తోంది. పాలకోడేరు పీహెచ్సీకి అధిక సంఖ్యలో రోగులు రాగా ఇద్దరు వైద్యులకు ఒక్కరే విధులకు హాజరయ్యారు. దీంతో గర్భిణులు, రోగులు వేచి ఉండాల్సి వచ్చింది. ఆచంట.. క్షీణించిన పారిశుద్ధ్యం ఆచంట నియోజకవర్గంలోని పెనుగొండ సీహెచ్సీలో పారిశుద్ధ్యం లోపించింది. సీహెచ్సీ చుట్టూ రోడ్డు సరిగాలేక బురదమయంగా మారడంతో రాకపోకలకు రోగులు ఇబ్బంది పడుతున్నారు. ఆస్పత్రిలో లేని మందులను బయటి నుంచి తెప్పించి ఇస్తుండటంతో అప్పటివరకు రోగులు వేచి ఉండాల్సి వస్తుంది. జనరల్ మెడిసిన్ ఆఫీసర్, జనరల్ డ్యూటీ సిబ్బంది కొరతతో మిగిలిన వైద్య సిబ్బందిపై పనిభారం పడుతోంది. ఆస్పత్రులకు సుస్తీ వేళకు విధులకు హాజరు కాని వైద్యులు పూర్తిస్థాయిలో సరఫరా అవ్వని మందులు సేవల కోసం రోగుల పడిగాపులు ఓపీ నమోదుకు తప్పని తిప్పలు వేధిస్తున్న వైద్య సిబ్బంది కొరత గగనంగా అత్యవసర వైద్యం పట్టించుకోని కూటమి ప్రభుత్వం వైద్యుల కొరత ఇలా.. ఆస్పత్రి మంజూరు పనిచేస్తున్నవారు ఖాళీలు తణుకు జిల్లా ఆస్పత్రి 34 27 7 నరసాపురం ఏరియా ఆస్పత్రి 23 18 5 పాలకొల్లు ఏరియా ఆస్పత్రి 23 21 2 భీమవరం ఏరియా ఆస్పత్రి 23 18 5 తాడేపల్లిగూడెం ఏరియా ఆస్పత్రి 23 16 7 ఆచంట సీహెచ్సీ 8 6 2 ఆకివీడు సీహెచ్సీ 8 6 2 పెనుగొండ సీహెచ్సీ 8 7 1 ఇన్సులిన్ ఇవ్వడం లేదు ఆకివీడు సీహెచ్సీలో రెండు నెలల నుంచి సుగర్ మాత్ర ఒక్కటే ఇస్తున్నారు. రెండో మాత్ర లేదంటున్నారు. చాలా ఇబ్బందిగా ఉంది. ఇన్సులిన్ ఇవ్వడం లేదు. బయట కొనుగోలు చేయాలంటే ఖరీదు ఎక్కువ, ఆర్థిక భారంగా ఉంది. పేదలకు ఇన్సులిన్ అందుబాటులోకి తీసుకురావాలి. – కె.భాగ్యలక్ష్మి, షుగర్ బాధితురాలు, ఆకివీడు చాలా ఇబ్బంది పడుతున్నా.. మాది నరసాపురం. నాకు షుగర్. ఉదయం, రాత్రి ఇన్సులిన్ చేసుకోవాలి. నరసాపురం ప్రభుత్వాస్పత్రిలో ఇంజక్షన్ బాటిల్ అడిగితే లేవంటున్నారు. దీంతో పాలకొల్లు ప్రభుత్వాస్పత్రికి వస్తున్నా. ఇంజక్షన్ కోసం మూడు రోజులకోసారి ఇక్కడకు రావడం చాలా ఇబ్బందిగా ఉంది. – దేవి నాగేశ్వరరావు, షుగర్ బాధితుడు, నరసాపురం జిల్లాలో ఆస్పత్రులు జిల్లా ఆస్పత్రి 1 సీహెచ్సీలు 3 ఏరియా ఆస్పత్రి 5 పీహెచ్సీలు 34 యూపీహెచ్సీలు 18 రోజుకు సగటున ఓపీ 15,285 -
విద్యుత్ శాఖలో సిఫార్సు బదిలీలలు!
ఏలూరు (ఆర్ఆర్పేట): తూర్పుప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్)లో త్వరలే జరిగే పదోన్నతులు, బదిలీలపై ఉద్యోగుల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. కొందరికి పదోన్నతులు వచ్చే అవకాశం ఉండటంతో వారు పనిచేసే స్థానాలను ఆశిస్తూ ఇప్పటికే కొందరు అధికారులు ఎమ్మెల్యేల సిఫార్సు లేఖలను ఆ సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్కు సమర్పించినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. వ్యూహాత్మకంగా పావులు ఏలూరు ఆపరేషన్ సర్కిల్ ఎస్ఈ పి.సాల్మన్రాజుకు రానున్న జనవరిలో చీఫ్ జనరల్ మేనేజర్గా పదోన్నతి లభించనుంది. దీంతో ఈ పోస్టు ఖాళీ కానుంది. అలాగే భీమవరం సర్కిల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎం.ఝాన్సీకి ఇప్పటికే ఎస్ఈగా పదోన్నతి కల్పించాల్సి ఉంది. అయితే కొన్ని సమీకరణాల కారణంగా ఆమె స్వయంగా పదోన్నతిని వాయిదా వేసుకున్నట్టు ప్రచారం సాగుతోంది. భీమవరం ఎస్ఈ ఎ.రఘునాథబాబు ఈనెల 24 వరకూ సెలవు పెట్టారు. దీంతో ఈ స్థానానికి ఏలూరు ఎస్ఈని ఇన్చార్జిగా నియమిస్తూ సీఎండీ ఇటీవల ఉత్తర్వులు ఇచ్చారు. కాగా ఏలూరు ఎస్ఈ సాల్మన్ రాజు ఏలూరు స్థానానికి వచ్చి మూడేళ్లు ముగుస్తున్నందున ఆయన్ను తప్పనిసరిగా బదిలీ చేయాల్సి ఉంది. దీంతో ఆయనకు తొలుత భీమవరం సర్కిల్కు ఎఫ్ఏసీగా బాధ్యతలు ఇచ్చి, అనంతరం భీమవరం స్థానాన్ని కేటాయించడానికే వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. సీఎండీకి సిఫార్సు లేఖలు ఏలూరు ఎస్ఈ స్థానం ఖాళీ అయితే భీమవరం సర్కిల్ ఈఈ (టెక్నికల్) ఝాన్సీని అక్కడికి బదిలీ చేస్తారని ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. ఆమె స్థానంలోకి (భీమవరం) కాకినాడ జిల్లా జగ్గంపేటలో పనిచేస్తున్న ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ను బదిలీ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయంటున్నారు. ఇదిలా ఉండగా సంస్థ కార్పొరేట్ కార్యాలయంలో ఎస్ఈ హోదాలో పనిచేస్తున్న ఓ అధికారి సైతం ఏలూరు ఎస్ఈ స్థానానికి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. ఆయన గతంలో ఏలూరు సర్కిల్ పరిధిలో వివిధ హోదాల్లో పనిచేసినందున సర్కిల్పై పట్టు ఉండటంతో కొందరు కూటమి ఎమ్మెల్యేలు ఆయన్ను ఇక్కడ నియమించాలని పట్టుపడుతున్నట్టు తెలిసింది. అలాగే భీమవరం టౌన్ ఏఈఈగా పనిచేస్తున్న అధికారికి ఈఈ గా పదోన్నతి కల్పించి ఆయన్ను జగ్గంపేట ఈఈగా నియమించే అవకాశం ఉందంటున్నారు. ఈ మేరకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని పలువురు కూటమి ఎమ్మెల్యేలు సిఫార్సు లేఖలను కూ డా సీఎండీకి పంపినట్టు చర్చించుకుంటున్నారు. వేధింపులతో.. కూటమి ఎమ్మెల్యేల వేధింపులతో ఓ అధికారి బలి అవుతున్నాడనే చర్చ ఉద్యోగవర్గాల్లో జోరుగా సాగుతోంది. వారం క్రితం టెలీ కాన్ఫరెన్స్లో భీమవరం ఎస్ఈ రఘునాథబాబు పనితీరుపై సీఎండీ అందరి ముందు మందలించడంతో ఆయన కినుక వహించి సెలవు పెట్టారనే చర్చ జరుగుతోంది. దీనికి తోడు భీమవరం సర్కిల్లో అధిక శాతం ఓ సామాజిక వర్గానికి చెందిన అధికారులే పనిచేస్తుండటం, వారంతా రఘునాథబాబుపై ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులకు ఫిర్యాదులు చేస్తూ వేధిస్తున్నారని అంటున్నారు. వీటిని భరించలేక ఆయన సీఎండీ కార్యాలయంలో స్వచ్ఛంద పదవీ విరమణకు దరఖాస్తు చేసుకున్నారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసిందంటూ ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. బదిలీలు, పదోన్నతులపై చర్చ ఇప్పటికే ఎమ్మెల్యేల సిఫార్సు లేఖలంటూ గుసగుసలు వేధింపులు భరించలేక భీమవరం ఎస్ఈ వీఆర్ఎస్కు దరఖాసు ్త! -
శ్శశాన భూమి హద్దులు మార్చేందుకు కుట్ర
దళిత మహిళల నిరసన ఉండి: పాములపర్రు ఘటనలో శ్శశాన వాటిక భూ మి రికార్డుల తారుమారుపై పంచాయతీ కార్యదర్శి అప్పారావును నిలదీసేందుకు వెళ్లిన దళిత మహిళలకు నిరాశ ఎదురైంది. శ్శశాన భూమిపై వాదోపవాదాలు, దళితులపై దాడి జరిగిన ఘటనల నేపథ్యంలో గ్రామానికి కొత్తగా వచ్చిన పంచాయతీ కార్యదర్శి శ్శశాన భూమి సరిహద్దులు మార్చాలంటూ పంచాయతీ పాలకవర్గానికి, దళితులకు సమాచారం లేకుండా తహసీల్దార్కు లేఖ రాశారు. దీంతో అధికారులు ఆఘమేఘాలపై శ్శశాన భూమి సరిహద్దులు మార్చేయడంపై దళితులు ఉలిక్కిపడ్డారు. దీనిపై ఆరా తీసేందుకు సోమవారం ఉదయం పంచాయతీ కార్యాలయానికి వెళ్లగా పంచాయతీ కార్య దర్శి రాలేదు. కార్యాలయంలో ఉన్న సచివాలయ ఉద్యోగులు తమకేమీ తెలియదని చెప్పారు. కార్యదర్శికి ఫోన్ చేసినా స్పందించకపోవడంతో సాయంత్రం వరకు కార్యాలయం వద్దనే కూర్చుని దళిత మహిళలు తిరిగి వెళ్లిపోయారు. పంచాయతీ కార్యాలయంలో తమకు సమాధానం చెప్పేవారే లేరని, అధికారులు చిన్నచూపు చూస్తున్నారంటూ దళిత మహిళలు ఆరోపించారు. శ్మశానంలో రోడ్డు వే యాలని పట్టుదలకు పోవడంతో రికార్డులు తారుమారుతో కుట్ర జరుగుతుందనే అనుమానం కలుగుతుందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఎంపీడీఓ శ్రీనివాస్ను ఆరా తీయగా పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్కు కలిసిపూడి, పాములపర్రు రెండు పంచాయతీల బాధ్యతలు ఉన్నాయని, సోమవారం కలిసిపూడిలో ఉన్నారన్నారు. ఎంపీడీ ఓ కార్యాలయానికి కూడా వచ్చి వెళ్లారని చెప్పారు. -
ఆటో డ్రైవర్ల ఆక్రందన
కూటమి ఏకపక్ష నిర్ణయం తమ ఉపాధిని దెబ్బతిసేలా ఉచిత బస్సు పథకం అమలుపై కూటమి ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయం తీసుకుందని ఆటో యూనియన్ నాయకులు ఆందోళన చెందుతున్నారు. ఆటో యూనియన్లతో కనీసం చర్చించలేదని అంటున్నారు. ఆటోల ద్వారా ప్రభుత్వానికి పలురకాలుగా ఆదాయం వస్తుందని చెబుతున్నారు. డ్రైవర్లకు ప్రత్యామ్నాయ ఉపాధి, ఆర్థిక సాయం వంటి వాటిపై మాట్లాడకపోవడం దారుణమని వాపోతున్నారు. ఈ నేపథ్యంలో తమను ఆదుకోవాలని కోరుతూ జిల్లాలోని ఆటో కార్మికులు మంగళవారం కలెక్టర్కు వినతిపత్రం అందించడానికి సన్నద్ధమవుతున్నారు. భీమవరం(ప్రకాశం చౌక్): కూటమి ప్రభుత్వం అ మలు చేయనున్న ఉచిత బస్సు (సీ్త్ర శక్తి) పథకంతో తాము ఉపాధి కోల్పోతామంటూ ఆటో డ్రైవర్లు ఆందోళన చెందుతున్నారు. అప్పులు చేసి, ఫైనాన్స్లపై ఆటోలు కొనుగోలు చేసి జీవనం సాగిస్తున్నామని, ఉచిత బస్సుతో ప్రయాణికులు లేక, ఆటోలు నడవక తాము బతికేదెలా అంటూ ఆవేదన చెందుతున్నారు. తమకు ప్రత్యామ్నాయ ఉపాధి, ఆర్థిక సాయంపై మాట్లాడకుండా ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం తగదని అంటున్నారు. ఉచిత బస్సు పథకంతో ఆటో డ్రైవర్ల పరిస్థితి అగమ్యగోచరంగా మారనుంది. ఉమ్మడి పశ్చిమలో 20 నుంచి 60 ఏళ్ల వయసున్న సుమారు 47 వేల మంది కార్మికులు ఆటోలపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. తమ పొట్ట కొట్టడానికి ఈ పథకాన్ని తీసుకువచ్చారని వీరు మండిపడుతున్నారు. ఇప్పటికే ఉచిత బస్సుపై పలు రూపాల్లో ఆందోళనలు తెలుపుతున్నారు. ఫైనాన్స్లో కొనుగోలు జిల్లాలో నడుస్తున్న 90 శాతం ఆటోలను డ్రైవర్లు ఫైనాన్స్లో కొనుగోలు చేశారు. ఆటో ధర రూ.4 లక్షల వరకు ఉండగా.. నెలకు రూ.10 వేల నుంచి రూ.15 వేలకు వాయిదా కడుతున్నారు. అలాగే నెలకు ఆటో నిర్వహణకు రూ.2 వేలు, మరమ్మతులకు రూ.3 వేలు మొత్తంగా రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు ఖర్చవుతుంది. వీటితో పాటు రవాణా శాఖ అధికారుల కేసులు, ఏడాదికి బ్రేక్, ఫిట్నెస్స్ కోసం ఖర్చులు అదనం. ఈ పరిస్థితుల్లో రోజుకు డీజిల్ ఖర్చులు కాకుండా వీటి కోసమే రూ.800కు పైగా వెచ్చించాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో ఉచిత బస్సుతో ప్రయాణికులు లేక ఆటోలు నడపకపోతే జీవ నం ఎలా సాగుతుందని డ్రైవర్లు ఆందోళన చెందుతున్నారు. అప్పు లు తీర్చలేక ఆత్మహత్యలే శరణ్యమని వాపోతున్నారు. మాకు న్యాయం చేయాలి ఇప్పటికే ఆటోలు పెరిగి డ్రైవర్లకు ఉపాధి అంతంతమాత్రంగా ఉంది. ఉచిత బస్సు తో పూర్తిగా ఉపాధి కోల్పో యి ఆటోలను ఫైనాన్స్ కంపెనీలకు అప్పగించాల్సిందే. డ్రైవర్లంతా ఆటోలు వదిలి కూలీ పనులకు వెళ్లి కుటుంబాన్ని పోషించుకోవాలి. ఆటో డ్రైవర్ల కుటుంబాలకు న్యాయం జరిగేలా చూడాలి. – డి.నరేష్, ఆటోడ్రైవర్, పొలమూరు చాలా ఆందోళనగా ఉంది ఉచిత బస్సుపై చాలా ఆందోళన చెందుతున్నాం. ఆటో లు ఎక్కేవారి సంఖ్య బాగా తగ్గిపోతుంది. ట్రిప్పులు లేక, ఆదాయం లేక కుటుంబా లను ఎలా పోషించుకోవాలో అర్థం కావడం లేదు. మాకు ప్రత్యామ్నాయ ఉపాధి లేదా మరేదైనా ఆదాయ మార్గం చూపించిన తర్వాత కూటమి ప్రభుత్వం ఉచిత బస్సు పథకాన్ని అమలు చేయాలని కోరుతున్నాం. – పి.జగన్, ఆటోడ్రైవర్, భీమవరం మహిళా ప్రయాణికులే ఎక్కువ ఆటోలో 90 శాతం మహిళలే ప్రయాణిస్తారు. వారి ద్వారానే మేం ఉపాధి పొందుతున్నాం. ఇప్పుడు ఉచిత బస్సుతో ఆటోలు ఎక్కేవారు తగ్గిపోతే మా పరిస్థితి ఏంటి. కూలీ పనులకు, ఆక్వా పరిశ్రమలకు మహిళలను తీసుకువెళుతూ ఉపాధి పొందుతున్నా. ఉచిత బస్సుతో అప్పుల ఊబిలో కూరుకుపోవడం ఖాయం. – పి.గోపి, ఆటోడ్రైవర్, భీమవరం ఉపాధికి ఇబ్బందులు ఉచిత బస్సుతో ఆటో డ్రైవర్లకు ఇబ్బందులు తప్పవు. ఆటోలకు ఫైనాన్స్లు కట్టలేక, కు టుంబాలను పోషించుకోలేక అవస్థలు పడాల్సిన పరిస్థితి. కూటమి ప్రభుత్వం ఆటో కార్మికుల కష్టాలు గురించి ఆలోచన చేసి మాకు మేలు జరిగేలా నిర్ణయం తీసుకోవాలి తప్ప ఏకపక్షంగా ఉచిత బస్సు పథకాన్ని అమలుచేయడం తగదు. – సీహెచ్ రామకృష్ణ, ఆటోడ్రైవర్, వేండ్ర ప్రత్యామ్నాయం చూపాలి ఉచిత బస్సుకు మేం వ్యతిరేకం కాదు గానీ ఆటో కార్మికుల సమస్యలను దృష్టిలో పెట్టుకుని యూనియన్లతో చర్చించాల్సింది. ఆటో కార్మికులకు ప్రత్యామ్నాయ ఉపాధి చూపాలి. ఆటో కార్మికులను ఆదుకునేలా ప్రకటన చేయాలి. నెలనెలా ఆటో కార్మికులకు భృతి ఇవ్వాలి. చాలా మంది అప్పులు చేసి ఆటోలు కొన్నారు. వారందరినీ ఆదుకోవాలి. – ఇంటి సత్యనారాయణ, జిల్లా ఆటో యూనియన్ అధ్యక్షుడు ●ఆటో.. భవిత ఎటో ఉచిత బస్సుతో ఉపాధికి ముప్పు ఫైనాన్స్లపై 90 శాతానికి పైగా ఆటోల కొనుగోలు నెలనెలా వాయిదాలతో ఇప్పటికే ఇబ్బందులు ప్రత్యామ్నాయ ఉపాధికి డ్రైవర్ల డిమాండ్ కూటమి ప్రభుత్వ ఏకపక్ష నిర్ణయంతో కష్టకాలం ఉమ్మడి జిల్లాలో 40 వేల మంది డ్రైవర్లు40 వేల ఆటోలు.. 47 వేల మంది కార్మికులు ఉమ్మడి పశ్చిమలో సుమారు 40 వేల ఆటోలు ఉన్నాయి. ఏలూరు జిల్లాలో 24 వేలు, పశ్చిమగోదావరి జిల్లాలో 16 వేల వరకు ఆటోలు ఉండగా మొత్తంగా 40 వేల ఆటో డ్రైవర్ల కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. వీరితో పాటు ఆటో మెకానిక్, సీటు వర్క్, స్పేర్ పార్ట్స్ విక్రయదారుల కుటుంబాలు మరో 7 వేల వరకు ఉంటాయి. ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు తీసుకురావడం ద్వారా ఆటోలు నడపటం కష్టం కాగా ఉపాధి లేక సుమారు 47 వేల కుటుంబాలకు ఇబ్బందులు తలెత్తవచ్చు. -
హుండీ దొంగతనం కేసులో నిందితుల అరెస్ట్
నిడమర్రు: గత నెల 26న పెదనిండ్రకొలను, పత్తేపురం గ్రామాల్లో దేవాలయాల్లో హుండీలు బద్దలుగొట్టి నగదు దోచుకున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసినట్లు నిడమర్రు సీఐ ఎన్.రజనీ కుమార్ తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ ఉండి మండలం అరేడు గ్రామానికి చెందిన ప్రత్తిపాటి మహిమ కుమార్, గణపవరానికి చెందిన యంబల జోషి, పాలకొల్లు మండలం లంకలకోడేరుకు చెందిన మరొకరిని హుండీ దొంగతనం కేసులో నిందితులుగా గుర్తించినట్లు తెలిపారు. సీసీ కెమెరాల సాయంతో నిందితులను అరెస్ట్ చేసామన్నారు. వీరు గతంలో ద్వారకా తిరుమల్లో షాపు దొంగతనంలో, దెందులూరు పోలీస్ స్టేషన్ పరిధిలో హుండీ దొంగతనం కేసులో నిందితులుగా ఉన్నట్లు తెలిపారు. వీరిని ఆదివారం సాయంత్రం అరెస్ట్ చేసి బైక్, రూ.5,721 నగదు, రెండు రాడ్లు స్వాదీనం చేసుకున్నామని, సోమవారం తాడేపల్లిగుడెం కోర్టులో హాజరుపరుస్తామన్నారు. -
కూర్మ విలాపం
కై కలూరు: తాబేళ్ల అక్రమ రవాణాకు కొల్లేరు ప్రాంతం కేంద్రంగా మారింది. పర్యావరణానికి వెలకట్టలేని మేలు చేస్తున్న నల్లచిప్ప తాబేళ్లను కాసులకు కక్కుర్తిపడి రాత్రి సమయంలో సరహద్దులు దాటించేస్తున్నారు. ఒడిశా రాష్ట్రంలో తాబేలు మాంసానికి మంచి గిరాకీ ఉండటంతో అడ్డదారుల్లో గుట్టు చప్పుడు కాకుండా తరలించి అక్రమార్కులు జేబులు నింపుకుంటున్నారు. తాబేళ్ల స్మగ్లర్ కుమార్ రెండేళ్లుగా ఒడిశాలో ఉంటూ కొల్లేరు ప్రాంతం నుంచి వచ్చే తాబేళ్లను మార్కెట్ చేస్తున్నాడు. అతనిపై తాబేళ్ల అక్రమ రవాణాలో పలు కేసులున్నాయి. అక్రమ రవాణా ఇలా.. ఉమ్మడి జిల్లాలో చేపలు 1.80 లక్షలు, రొయ్యలు 1.10 లక్షల ఎకరాల్లో సాగు చేస్తున్నారు. చేపల పట్టుబడుల వలలో తాబేళ్లు చిక్కుకుంటాయి. వలల మేసీ్త్ర సమాచారంతో కొందరు వీటిని సేకరిస్తున్నారు. ఎక్కువ మంది కొల్లేరు డ్రెయిన్లు, పంట బోదెలలో వీటిని పట్టుకుంటున్నారు. ఏజంట్లు సేకరించిన తాబేళ్ళను గోనె సంచులు, నీటి డ్రమ్ములలో దాస్తున్నారు. సేకరించిన వీటిని సైజును బట్టి కేజీ రూ.30 నుంచి రూ.40 వరకు ఇక్కడ కొనుగోలు చేసి ఒడిశాలో కేజీ రూ.300పైగా విక్రయిస్తోన్నారు. ఉదాహరణకు వాహనంలో సుమారు 5 టన్నుల తాబేళ్లు రవాణా చేస్తే రూ.15 లక్షలు ముడుతోంది. అన్ని ఖర్చులు పోయి అక్రమార్కులకు మినిమం రూ.10 లక్షల వరకు మిగులుతోంది. దీంతో అక్రమ మార్గాన్ని ఎంచుకుంటున్నారు. కేంద్ర బిందువుగా భీమవరం ఆక్వా హబ్గా పేరొందిన భీమవరం అక్రమ తాబేళ్లకు స్టాకింగ్ పాయింట్గా మారింది. కై కలూరు, కలిదిండి, మండవల్లి, ముదినేపల్లి మండలాల్లో సేకరించిన తాబేళ్లను కోరుకొల్లు, కలిదిండి, కాళ్ళ మీదుగా భీమవరం తరలిస్తున్నారు. అక్కడ నుంచి పెద్ద వాహనాల్లో ఒడిశా చేర్చుతున్నారు. కొల్లేరు ప్రాంతం నుంచి బొలోరో వాహనాల్లో అడుగున తాబేళ్లను పరిచి పైన చేప గురక పిల్లలను ఉంచుతున్నారు. ఎవరైన చెకింగ్కు వస్తే చేపలు కనిపిస్తాయి. అడుగున తాబేళ్లను గుర్తించలేకపోతున్నారు. మండవల్లి మండలం కొవ్వాడలంక, కలిదిండి మండలం బొబ్బిలిగూడెంకు చెందిన ఇద్దరు గతంలో తాబేళ్ళ రవాణాలో కీలకంగా వ్యవహరించారు. నియోజకవర్గంలో కలిదిండి, వెంకటాపురం, ఏలూరు రోడ్, ముదినేపల్లి ప్రాంతాల్లో అటవీ, పోలీసు అధికారులు అక్రమ తాబేళ్ల రవాణాను పలుమార్లు అడ్డుకున్నారు. కొల్లేరు చుట్టూ తాబేళ్ల అక్రమ రవాణా అంతరించిపోతున్న నల్లచిప్ప తాబేళ్లు గుట్టుచప్పుడు కాకుండా ఒడిశాకు తరలింపు అంతరించిపోతున్న నల్లచిప్ప తాబేలు ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్(ఐయూసీఎన్) 2002లోనే అంతరించిపోతున్నా జాతులలో నల్లచిప్ప తాబేలును చేర్చింది. ఇండియాలో అసోం, త్రిపుర, బంగ్లాదేశ్లోని చిట్టగాంగ్ తదితర ప్రాంతాల్లో ఇవి ఎక్కువగా ఉన్నాయి. ఇవి 31 అంగుళాల వెడల్పు, 28 అంగుళాల పొడవు పెరుగుతాయి. సాధారణంగా 38 గుడ్లు పెడతాయి. మొక్కలు, చేపలు, పురుగులతో పాటు నీటిలో హనికర క్రిములను తింటాయి. అంతరించిపోతున్న తాబేలు జాతిని అన్ని దేశాలు షెడ్యూల్ –1 కేటగిరిలో చేర్చాయి. వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 ప్రకారం తాబేలును వేటాడడం, రవాణా చేయడం నేరం. ఏడేళ్లు కారగార శిక్ష విధించవచ్చు. అటవీ శాఖ చట్టాల సెక్షన్లు 27, 29, 31బీల ప్రకారం కేసులు నమోదు చేయొచ్చు. నిఘా ముమ్మరం చేశాం తాబేళ్ళ రవాణా నేరం. కొల్లేరు పరివాహక ప్రాంతాలు కాకుండా బయట ప్రాంతాల్లో వీటి రవాణా జరిగితే టెరిటోరియల్ ఫారెస్టు అధికారులు కేసులు నమోదు చేస్తారు. కొల్లేరు పరివాహక ప్రాంతాల్లో రవాణా చేస్తే అటవీశాఖ సిబ్బందికి సమాచారం అందించాలి – కేపీ రామలింగాచార్యులు, ఫారెస్టు రేంజర్, కై కలూరు -
13న మాజీ సీఎం జగన్ రాక
భీమవరం : ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే పు ప్పాల వాసుబాబు కుమార్తె వివాహ వేడుకకు ఈనెల 13న మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి భీమవరం రానున్నారు. ఆదివారం హెలీప్యాడ్ ప్రాంతాన్ని శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేన్ రాజు పరిశీలించారు. భీమవరం శివారు వీఎస్ఎస్ గార్డెన్స్లో వివాహ వేడుక జరుగనున్నందున సమీపంలో హెలీప్యాడ్ ఏర్పాటుకు అనుకూల పరిస్థితులను పరిశీలించారు. ఆయన వెంట వాసుబాబు, వైఎస్సార్సీపీ భీమవరం ని యోజకవర్గ సమన్వయకర్త చినమిల్లి వెంకటరాయుడు, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ వేండ్ర వెంకటస్వామి, భీమవరం పట్టణ అధ్యక్షుడు గా దిరాజు రామరాజు తదితరులు ఉన్నారు. టోల్గేట్ క్రాంటాక్టర్కు నోటీసులు ద్వారకాతిరుమల : ద్వారకాతిరుమల శ్రీవారి కొండపైన టోల్గేట్ నిర్వహిస్తున్న కాంట్రాక్టర్కు దేవస్థానం ఈఓ ఎన్వీ సత్యనారాయణమూర్తి ఆదివారం నోటీసు జారీ చేశారు. బైక్లు, మోపెడ్లకు రూ.10ల రుసుం వసూలు చేయాల్సి ఉండగా రూ.20లు వ సూలు చేస్తున్నారు. దీనిపై ఆదివారం ‘సాక్షి’లో ‘శ్రీవారి కొండపై టోల్ బాదుడు’ శీర్షికన కథనం ప్రచురించగా ఈఓ స్పందించారు. మూడు రోజుల్లోపు సంజాయిషీ ఇవ్వాలని కాంట్రాక్టర్కు నోటీసు ఇచ్చారు. 16న ప్రైవేట్ పాఠశాలల సమస్యలపై చర్చ ఏలూరు (ఆర్ఆర్పేట): చీరాలలో ఈనెల 16న జరిగే అపుస్మా (ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ అన్ ఎయిడెడ్ స్కూల్ మేనేజ్మెంట్స్ అసోసియేషన్) రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ప్రైవేట్ పాఠశా లల యాజమాన్యాల సమస్యలపై చర్చిస్తా మని అపుస్మా రాష్ట్ర అధ్యక్షుడు కె.తులసీ ప్ర సాద్ తెలిపారు. ఆదివారం స్థానిక శ్రీశ్రీ పా ఠశాలలో నిర్వహించిన జిల్లా కార్యనిర్వాహక కమిటీ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వి ద్యాహక్కు చట్టం ప్రకారం అడ్మిషన్ పొందిన వారికి ప్రభుత్వం కొత్త బ్యాంకు ఖాతాలు ఓపెన్ చేసుకోమనడం సరికాదదన్నారు. స్టార్ రేటింగ్ ప్రకారం కేవలం రూ.8 వేలు ఫీజులుగా ఇస్తామంటున్నారని, తల్లికి వందనం ఉచిత విద్యలో భాగమే కాబట్టి విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రవేశాలు పొందిన వారికి కనీసం రూ.13 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి ఎంబీఎస్ శర్మ మా ట్లాడుతూ యాప్లు, బోధనేతర పనులను ఉ పాధ్యాయులకు కేటాయించడం, ట్రాన్స్పోర్ట్, గ్రీన్ టాక్స్ వంటి సమస్యలపై చర్చించి ప్ర భుత్వం దృష్టికి తీసుకువెళతామన్నారు. -
వాహనం అదుపుతప్పి వ్యక్తి మృతి
తణుకు అర్బన్: ద్విచక్ర వాహనం అదుపుతప్పి ప్రచార బోర్డును ఢీకొట్టిన ఘటనలో వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. ఇరగవరం కాలనీ శివారు ప్రాంతంలో శనివారం అర్థరాత్రి జరిగిన ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం పసలపూడి గ్రామానికి చెందిన కత్తుల చక్రధరరావు అలియాస్ చక్రి (32) ఉపాధి నిమిత్తం కొన్నేళ్లుగా కువైట్లో ఉంటూ 20 రోజుల క్రితం సొంతూరుకు వచ్చాడు. తూర్పు విప్పర్రులోని అత్తవారింటి నుంచి ద్విచక్ర వాహనంపై వెళ్తూ ఇరగరం రోడ్డులో వాహనం అదుపుతప్పి బోర్డును ఢీకొట్టగా తలకు తీవ్రగాయమై ఘటనా ప్రాంతంలోనే కన్నుమూశాడు. బంగారు ఆభరణాల చోరీ ఆకివీడు: ఇంట్లో దొంగలు చొరబడి తొమ్మిది తులాల బంగారు ఆభరణాలు దోచుకుపోయిన ఘటన కాకరపర్తి చెంచయ్య వీధిలో జరిగింది. ఈ నెల 7న ఉదయం ఇంటికి తాళం వేసి నర్సాపురంలో వివాహ వేడుకకు విశ్రాంతి ఉపాధ్యాయుడు పులవర్తి వెంకటేశ్వరరావు కుటుంబం వెళ్లింది. ఆదివారం తిరిగి వచ్చే సరికి తాళాలు బద్ధలుకొట్టి ఉండడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. రూరల్ సీఐ జగదీశ్వరరావు, సిబ్బంది సంఘటనా స్థలానికి వచ్చి దొంగతనం జరిగిన తీరును పరిశీలించారు. 9 తులాల బంగారం చోరీకి గురైనట్లు ఫిర్యాదు చేశారని ఏఎస్ఐ బీ.సత్యనారాయణ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి తణుకు అర్బన్: తణుకు పైడిపర్రు రైల్వే ఓవర్ బ్రిడ్జి ప్రాంతంలో ఆర్టీసీ బస్సు కిందపడి తీవ్రగాయాలపాలైన తణుకు మండలం దువ్వ గ్రామానికి చెందిన యార్లగడ్డ రవి (50) శనివారం రాత్రి రాజమండ్రి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. తణుకు కోర్టులో గుమస్తాగా విధులు నిర్వర్తిస్తున్న రవి ఈనెల 9వ తేదీన ఉదయం పైడిపర్రు ప్రాంతంలో ఏలూరుకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టిన ఘటనలో కాలు నుజ్జునుజ్జయ్యింది. రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రిలో పంచానామా అనంతరం పోస్టు మార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు మృతదేహాన్ని అప్పగించినట్లు రూరల్ ఎస్సై చంద్రశేఖర్ తెలిపారు. జంగారెడ్డిగూడెంలో చోరీ జంగారెడ్డిగూడెం: పట్టణంలో గుండాబత్తుల వారి వీధిలో ప్రైవేటు ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్న డి.శిరీష ఇంట్లో చోరీ జరిగింది. ఈనెల 8న ఇంటికి తాళం వేసి స్వగ్రామమైన టి.నరసాపురం మండలం ప్రకాశ్నగర్ వెళ్లింది. ఆదివారం ఉదయం వచ్చి చూసేసరికి ఇంటి తలుపులు పగలకొట్టి ఉన్నాయి. అల్మరాలో ఉంచిన బంగారం ఉగరం, రూ.3 వేల నగదు చోరీకి గురయ్యాయి. వృద్ధుడి ఆత్మహత్య ఏలూరు టౌన్: అనారోగ్యంతో బాధపడుతూ మనస్తాపానికి గురైన వృద్ధుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఏలూరు రూరల్ రంగారావు కాలనీకి చెందిన పిల్లా తాతారావు (67) రెండేళ్ళుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు. మనస్థాపానికి గురై శనివారం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు అతడిని చికిత్స నిమిత్తం ఏలూరు జీజీహెచ్కు తరలించారు. చికిత్స పొందుతూ ఆరోగ్య పరిస్థితి విషమించి ఆదివారం మృతిచెందాడు. -
అయ్యవార్లపై మూల్యాంకన భారం
నిడమర్రు: కూటమి ప్రభుత్వం సంస్కరణల పేరుతో విద్యావ్యవస్థలో తీసుకువస్తున్న పరీక్షల విధానాన్ని చూసి ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లావ్యాప్తంగా సోమవారం నుంచి జరిగే సెల్ఫ్ అసెస్మెంట్ (ఎఫ్ఏ–1) పరీక్షలు అటు విద్యార్థికి, ఇటు ఉపాధ్యాయులకు పరీక్షే అంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పాఠశాలలకు అందించిన మూల్యాంకన పుస్తకాలతో మరో బోధనేతర పనికి సిద్ధమవ్వాలని ఉపాధ్యాయులు ఆవేదన చెందుతున్నారు. పొందుపరిచి.. స్కాన్ చేసి.. ఈ విద్యా సంవత్సరంలో నిర్వహించే ఎఫ్ఏ, ఎస్ఏ పరీక్షల మొ త్తం సమాచారాన్ని విద్యాశాఖ అందించిన మూల్యాంకన పుస్తకంలో ఉపాధ్యాయులు పొందుపరచాలి. అలాగే విద్యార్థుల సా మర్థ్యాలకు సంబంధించిన 15 మార్కుల అంశాలను ఉపాధ్యాయుడే స్వయంగా నమోదుచేయాలి. ఆయా సబ్జెక్టుల్లో ఆయా సామర్థ్యంలో ఎందుకు మార్కులు తక్కువ వచ్చాయి.. ఎక్కువ వస్తే ఎలా గుర్తించావు.. అనే విషయం వివరంగా రాయల్సి ఉంటుంది. అనంతరం వాటిని స్కాన్ చేసి యాప్లో అప్లోడ్ చేయాలి. ఇప్పటికే పెరుగుతున్న బోధనేతర పనులకు తరగతికి దూరమవుతున్న ఉపాధ్యాయులు ప్రభుత్వం తాజాగా మూల్యాంకన భారం మోపడంపై తలలు పట్టుకుంటున్నారు. ఉరుకులు.. పరుగులు మూల్యాంకన పుస్తకాలు ఆటోలో తెచ్చుకోవడం, బ్యాలెన్స్ పుస్తకాల కోసం ఎంఈఓ కార్యాలయాల చుట్టూ తిరగడం, మూ ల్యాంకన పుస్తకాల్లో విద్యార్థుల ప్రతిస్పందనలు రాయడం ఒక ఎత్తయితే.. విద్యార్థులతో ఓఎంఆర్ షీట్లో జవాబులు రాయించడం మరో ఎత్తు. 1వ తరగతి విద్యార్థి కూడా ఓఎంఆర్ షీట్స్లోనే పరీక్షలు రాయడం ఆ ఉపాధ్యాయులకు పరీక్షే. అలాగే మొత్తం అంశాలు, ఓఎంఆర్ షీట్స్ను స్కాన్ చేసి యాప్లో అప్లోడ్ చేయడం, ఆన్లైన్లో మార్కులు నమోదు చేయడం వంటి పనులకే సమయం సరిపోతుందని టీచర్లు ఆవేదన చెందుతున్నారు. గురువులకే పరీక్ష ! ప్రభుత్వ ఉపాధ్యాయులకు బోధనేతర పనులు ప్రతి తరగతి, సబ్జెక్టుకు మూల్యాంకన పుస్తకాల పంపిణీ ఆ పుస్తకాల స్కానింగ్తో సమయం వృథా నేటి నుంచి ఎఫ్ఏ–1 పరీక్షలు ఉపాధ్యాయ సంఘాల నేతల ఆందోళన బోధనేతర భారం పెరిగి.. మూల్యాంకన పుస్తకాలతో ఉపాధ్యాయులకు బోధనేతర భారం మరింత పెరుగుతుంది. విద్యార్థి ప్రతిస్పందనలతో పాటు ఓఎంఆర్ షీట్లో కోడ్లు, అపార్ ఐడీలు, పెన్ ఐడీలను తప్పులు లేకుండా రాసేలా చూడటం, జవాబులను దిద్దిన తర్వాత స్కోరింగ్ ఇవ్వడం, దీనికి వివరణ రాయడంతో పాటు పేజీలన్నింటినీ స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. వీటి కోసం అవుట్ సోర్సింగ్లో డేటా ఎంట్రీ ఆపరేటర్స్ను నియమించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. – లంకలపల్లి సాయిశ్రీనివాస్, స్టేట్ ఫ్యాప్టో చైర్మన్ సమయం హరిస్తుంది సంస్కరణలు విద్యార్థులకు మేలు చేయాలే తప్ప కీడు కాదు. మూల్యాంకన పుస్తకం వి ధానంతో ఉపాధ్యాయులకు అదనపు భారం తప్ప విద్యార్థులకు ప్రయోజనం కనిపించడం లేదు. కొత్త విధానంలో తరగతి గదిలోనే విద్యార్థుల ప్రతిస్పందనలు పరిశీలించి మూల్యాంకన పుస్తకంలో నమోదు చే యాల్సి ఉంటుంది. ఉన్నత పాఠశాలల్లో పదుల సంఖ్యలో వి ద్యార్థులు ఉంటారు. దీంతో బోధనా కాలం హరిస్తుంది. దీంతో విద్యా ప్రమాణాలు తగ్గే ప్రమాదముంది. – బొర్రా గోపీ మూర్తి, టీచర్స్ ఎమ్మెల్సీశిక్షణ లేదు.. స్పష్టత లేదు మూల్యాంకనంలో మార్పులపై ఉపాధ్యాయులకు ఎలాంటి శిక్షణ ఇవ్వకుండా ఎఫ్ఏ–1 పరీక్షలకు విద్యాశాఖ సిద్ధం చేసింది. దీంతో వాట్సాప్లో వస్తున్న సమాచారం ఆధారంగానే పరీక్షలు నిర్వహించేందుకు ఉపాధ్యాయులు సిద్ధమవుతున్నా రు. అకడమిక్ క్యాలెండర్ ప్రకారం ఈనెల 4 నుంచి ఎఫ్ఏ–1 పరీక్షలు నిర్వహించాల్సి ఉండగా మూల్యాంకన పుస్తకాలు మండలాలకు అందకపోవడంతో వాయిదా వేశారు. అయితే ఈ పుస్తకాలను ఎలా నిర్వహించాలి, ఏఏ అంశాలు పూరించాలనే విషయాలపై కేవలం వాట్సాప్లో వస్తున్న మెసేజ్లే తప్ప ఏ అధికారి సమగ్రంగా వివరించే అవకాశం లేకుండానే పరీక్షలు ప్రారంభించడాన్ని ఉపాధ్యాయులు తప్పుపడుతున్నారు. -
గుబ్బల మంగమ్మతల్లి గుడికి పోటెత్తిన భక్తులు
బుట్టాయగూడెం: కాపవరం సమీపంలోని అటవీప్రాంతంలో కొలువై ఉన్న గుబ్బల మంగమ్మ గుడికి ఆదివారం భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు విజయవాడ, మచిలీపట్నం, తెలంగాణ రాష్ట్రంలోని భద్రాచలం, పాల్వంచ, కొత్తగూడెం, సత్తుపల్లి, అశ్వారావుపేట ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు వాహనాలతో తరలివచ్చి అమ్మవారికి దూపదీప నైవేద్యాలతో ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. సుబ్బారాయుడిని దర్శించుకున్న భక్తులు ముదినేపల్లి రూరల్: సింగరాయపాలెం–చేవూరుపాలెం సెంటర్లోని శ్రీసుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం భక్తులు పోటెత్తారు. స్వామివారి పుట్టలో పాలు పోసి స్వామివారిని దర్శించుకున్నారు. పాలపొంగళ్ల శాల వద్ద మహిళలు నైవేద్యాలు తయారుచేసి స్వామికి సమర్పించారు. నాగబంధాల వద్ద స్వామివారి మూర్తులను ప్రతిష్ఠించేందుకు అర్చకులతో పూజలు చేయించి ప్రతిష్ఠ తంతు నిర్వహించారు. నాగబంధాల వద్ద, గోకులంలోని గోవులకు మహిళలు పసుపుకుంకుమలతో పూజలు చేశారు. భక్తుల రద్దీకి అనుగుణంగా అన్నప్రసాద ఏర్పాట్లు చేశారు. మద్దిలో హనుమద్ హోమం జంగారెడ్డిగూడెం: గుర్వాయిగూడెం శ్రీ మద్ది ఆంజనేయ స్వామి దేవస్థానంలో హనుమద్ హోమం ఆలయ అర్చకులు, వేద పండితులు ఆద్వర్యంలో వైభవంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈవో ఆర్వీ చందన మాట్లాడుతూ స్వామి వారి సన్నిధిలో ఈ హోమం ప్రతీ ఆదివారం భక్తులకు ఆర్జిత సేవగా దేవస్థానం నిర్ణయించిందన్నారు. హోమ కార్యక్రమం పర్యవేక్షణ ఆలయ పర్యవేక్షకుడు జవ్వాది కృష్ణ నిర్వహిస్తారని ఈవో తెలిపారు. పెద్దింట్లమ్మ దేవస్థానంలో భక్తుల రద్దీ కై కలూరు: కొల్లేటికోట పెద్దింట్లమ్మను సమీప జిల్లాల నుంచి భక్తులు ఆదివారం దర్శించుకున్నారు. దేవస్థానం సమీప పవిత్ర కోనేరులో స్నానాలు ఆచరించిన భక్తులు అమ్మకు వేడి నైవేద్యాలు, పొంగళ్లు సమర్పించారు. ఆలయ ప్రధాన అర్చుకుడు పేటేటి పరమేశ్వరశర్మ పూజా కార్యక్రమాలు చేపట్టారు. ఆలయ ఈవో కూచిపూడి శ్రీనివాస్ మాట్లాడుతూ ఒక్క ఆదివారం రోజున మొత్తం రూ.38,9085 ఆదాయం వచ్చిందని చెప్పారు. -
రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయి
మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తణుకు అర్బన్: రాష్ట్రవ్యాప్తంగా శాంతిభద్రతలు క్షీ ణించాయని, పోలీసు యంత్రాంగం పూర్తిస్థాయిలో రెడ్బుక్ను అమలుచేసే పనిలో ఉన్నారని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ రీజనల్ కో–ఆర్డినేటర్ కా రుమూరి వెంకట నాగేశ్వరరావు మండిపడ్డారు. త ణుకులోని ఆయన నివాసంలో ఆదివారం పార్టీ శ్రేణులతో సమావేశమై మాట్లాడారు. కూటమి నా యకులు తమకు వ్యతిరేకంగా ఉన్న ప్రాంతాల్లో రౌడీయిజం చేయిస్తూ ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, ఇప్పుడు పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో భాగంగా ఏకంగా వందలాది మంది పచ్చ గూండాలు బీసీ వర్గీయులపై దాడికి దిగడం, పోలీసులు ప్రేక్షకపాత్ర వహించడం దుర్మార్గమన్నారు. చంద్రబాబు ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తూ ఖాకీలు తప్పులమీద తప్పులు చేసుకుంటూ పోతున్నారని, ఒక పక్క న్యాయస్థానాలు తప్పుపడుతున్నా వీరి తీరు మారడం లేదని విమర్శించారు. వైఎస్సార్సీపీ నేతలపై ఐటీడీపీ సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెడుతున్నారని ఫిర్యాదులు చేస్తున్నా పోలీసులు పట్టించుకోకపోగా వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలను టార్గెట్ చేసి వేధిస్తున్నారని అన్నారు. రోజులు ఎప్పుడూ ఒకలానే ఉండవని, మీరు చూపిస్తున్న మార్గం ఎదుటివారికి కూడా కనిపిస్తుందనే విషయాన్ని మరచిపోవద్దని కారుమూరి హెచ్చరించారు. ఇది వంచన ప్రభుత్వంనా రాజకీయ జీవితంలో ఇంతటి అరాచకం, అఘాయిత్యాలు, మోసం, దాడులు, వంచన చేసిన ప్రభుత్వాన్ని ఎన్నడూ చూడలేదని, మొదటిసారి ఇప్పుడే చూస్తున్నానని కారుమూరి అన్నారు. కూటమి ప్రభుత్వం తన పొరపాట్లను కప్పిపుచ్చుకునేందుకు, ప్రజల దృష్టి మార్చేందుకు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై, నాయకులపై బురద జల్లే ప్రయత్నం చేస్తుందన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని అన్నారు. కూటమి ప్రభుత్వం 13 నెలల కాలంలో సుమారు రూ.2 లక్షల కోట్లు అప్పులు చేసిందని, దీంతో ప్రజలకు ఏం మంచి చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. సూపర్ సిక్స్ ఎప్పుడు అమలుచేస్తారని ప్రజలే ప్రశ్నిస్తున్నారని కారు మూరి నాగేశ్వరరావు అన్నారు. -
దోమ తెరలు ఎక్కడ?
బుట్టాయగూడెం: జిల్లాలోని మన్య ప్రాంతంలో మలేరియా జ్వరాలు విజృంభిస్తున్నా కూటమి ప్రభుత్వంలో ఏమాత్రం చలనం కనిపించడంలేదని గిరిజన సంఘాల నాయకులు విమర్శిస్తున్నారు. సీజనల్ జ్వరాలతో పాటు మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్ జ్వరాలు స్వైరవిహారం చేస్తున్నాయి. దోమల నియంత్రణలో కీలకమైన దోమ తెరల పంపిణీని గతేడాది గాలికి వదిలేసిన ప్రభుత్వం ఈ ఏడాది కూడా అదే ధోరణిలో వ్యవహరిస్తుందనే విమర్శలు విల్లువెత్తుతున్నాయి. గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది అత్యధికంగా మలేరియా కేసులు నమోదవుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. గత ఏడాది జనవరి నుంచి ఆగస్టు నెలాఖరు నాటికి కేవలం 93 మలేరియా కేసులు నమోదు కాగా ఈ ఏడాది జనవరి నుంచి ఆగస్టు 10 నాటికి సుమారు 570 కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. గత ఏడాది కంటే ఈ ఏడాది 477 కేసులు అధికంగా నమోదయ్యాయి. గిరిజన గ్రామాల్లో దోమల నివారణకు ప్రస్తుతం మూడో దశలో మలాథియన్ స్పేయింగ్ పనులు జరుగుతున్నటు ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే మలేరియా కేసులు అధికంగా పెరుగుతునే ఉన్నాయి. దోమలను నివారించాలంటే దోమ తెరలతోనే సాధ్యమని ఈ ప్రాంత వాసులు చెబుతున్నారు. వైఎస్సార్సీపీ పాలనలో దోమతెరల పంపిణీ పశ్చిమ ఏజెన్పీ ప్రాంతంలోని గిరిజన గ్రామాల్లో మలేరియా నియంత్రణకు గత వైస్సార్సీపీ ప్రభుత్వం ఎంతో చిత్తశుద్ధితో కృషి చేసింది. గ్రామాల్లో దోమలను అరికట్టేందుకు అధికారులు పగడ్బందీగా చర్యలు చేపట్టారు. 2021లో అప్పటి మఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న నేషనల్ వెక్టర్ బోర్న్ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రాం సంస్థ (ఎన్విబీడీసీపీ) నుంచి సుమారు 2 లక్షల 50 వేల దోమ తెరలను రప్పించి బుట్టాయగూడెం, పోలవరం, జీలుగుమిల్లి, వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లో ఉన్న గిరిజన గ్రామాల్లో ప్రజలకు పంపిణీ చేశారు. గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థులకు దోమ తెరలు పంపిణీ చేశారు. దోమ తెరల కాలపరిమితి మూడేళ్ల లోపు కావడంతో మళ్లీ 2024 జనవరిలో దోమ తెరల కోసం వైఎస్సార్సీపీ ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖ ద్వారా ప్రతిపాదనలు పంపింది. కానరాని దోమ తెరల పంపిణీ కూటమి ప్రభుత్వం దోమ తెరల పంపిణీపై ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. గత ఏడాది దోమ తెరల పంపిణీ జరగలేదు. ఈ ఏడాది వేసవిలో వర్షాలు కురవడం, వర్షా కాలంలో తీవ్రమైన ఎండలు, వేడి గాలులు ఉక్కపోతలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. సీజనల్ జర్వాలతో పాటు మలేరియా జ్వరాలు అధికంగా ఉన్నాయి. ఇప్పటికై న ప్రభుత్వం దోమ తెరలు పంపిణీ చేసి మలేరియా జ్వరాల నివారణకు కృషి చేయాలని గిరిజన సంఘాల ప్రతినిధులు కోరుతున్నారు. మన్యంలో విజృంభిస్తున్న మలేరియా జ్వరాలు గతేడాది కంటే అధికంగా పెరుగుతున్న కేసులు మొక్కుబడిగా నియంత్రణ చర్యలు గత ఏడాది నుంచి పంపిణీ చేయని దోమ తెరలు జిల్లాలో మలేరియా సమసాత్మక గ్రామాలు – 153 బుట్టాయగూడెం, పోలవరం, జీలుగుమిల్లి మండలాల్లో – 117 వీలీన మండలాలైన కుక్కునూరు, వేలేరుపాగు మండలాల్లో – 36 గ్రామాలు -
పాత తెరలు చిరిగిపోయాయి
గత రెండు సంవత్సరాల నుంచి మాకు దోమ తెరలు పంపిణీ చేయలేదు. గతంలో ఇచ్చిన దోమ తెరలు చిరిగిపోయాయి. మా గ్రామాల్లో దోమలు విపరీతంగా ఉన్నాయి. దోమ తెరల కోసం ఎదురు చూస్తున్నాం. ప్రభుత్వం దోమ తెరలు పంపిణీ చేయాలి. నడపల ముక్కారెడ్డి, గడ్డపల్లి, పోలవరం మండలం ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు కూటమి ప్రభుత్వానికి దోమ తెరల పంపిణీపై చిత్తశుద్ధి ఉన్నట్లు కనిపించడం లేదు. గతేడాది పంపిణీ చేయలేదు. ఈ ఏడాది పంపిణీ చేస్తారో లేదో అనే అనుమానం వస్తుంది. ప్రస్తుతం గిరిజన గ్రామాల్లో మలేరియా జ్వరాలు విజృంభిస్తున్నాయి. కారం రాఘవ, ఏఐకేఎంఎస్ నాయకుడు, అలివేరు, బుట్టాయగూడెం మండలం ప్రత్యేక దృష్టి పెట్టాం జిల్లాలో మలేరియా నివారణపై ప్రత్యేక దృష్టి పెట్టాం. దీని కోసం సుమారు 2 లక్షల 50 వేలు దోమ తెరలు అవసరమని ప్రతిపాదనలు పంపించారు. అవి వచ్చిన వెంటనే మలేరియా సమస్యత్మక గ్రామాల్లో పంపిణీ చేస్తాం. ఎన్ఎస్ఎస్ ప్రసాద్, జిల్లా మలేరియాధికారి, కేఆర్పురం, బుట్టాయగూడెం మండలం -
వాణిజ్య ఒప్పందాలతో వ్యవసాయానికి తీవ్ర నష్టం
ఏలూరు (టూటౌన్): కేంద్రంలోని మోదీ ప్రభుత్వం చేసుకుంటున్న విదేశీ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలతో దేశ వ్యవసాయ రంగానికి తీవ్ర నష్టం జరుగుతున్నదని రైతు సంఘాలు, కార్మిక సంఘాల నాయకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం ఏలూరు అన్నే భవనంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల సమన్వయ జిల్లా కమిటీ, కార్మిక సంఘాల జిల్లా సమన్వయ కమిటీ సంయుక్త సమావేశం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కట్టా భాస్కరరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో వక్తలు మాట్లాడుతూ ఈ నెల 13న సంయుక్త కిసాన్ మోర్చా, కేంద్ర కార్మిక సంఘాల సమన్వయ కమిటీ ఇచ్చిన పిలుపుమేరకు ఏలూరులో నిర్వహించే క్విట్ కార్పొరేట్స్ నిరసన కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి డీఎన్వీడీ ప్రసాద్, కాంగ్రెస్ కిసాన్ సెల్ జిల్లా నాయకులు రాజనాల రామ్మోహనరావు, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు రెడ్డి శ్రీనివాస డాంగే, జిల్లా నాయకులు పుప్పాల కన్నబాబు, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పి. రామకృష్ణ పాల్గొన్నారు. -
సీసీ కెమెరా ఏర్పాటుపై మండిపాటు
ఉండి: మేమేమైనా నేరస్తులమా? లేక తీవ్రవాదులమా.. మా ప్రాంతంలో పోలీసులు సీసీ కెమెరా ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందని పాములపర్రులో దళితులు ఆదివారం నిరసన తెలిపారు. ఇప్పటికే దళితపేట వద్ద పోలీసులు పహారా కాస్తూ తమ స్వేచ్ఛను హరిస్తున్నారని, ఇప్పుడే ఏకంగా సీసీ కెమెరా ఏర్పాటు చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. శాంతి భద్రతల కోసం అయితే గ్రామంలోని సెంటర్లో కెమెరాలు పెట్టాలని, దళితులను కించపరిచేలా ఇక్కడ ఏర్పాటుచేయడం ఏంటని ప్రశ్నించారు. అంతేకాకుండా సీసీ కెమెరా ఓ ప్రైవేట్ వ్యక్తి పోలీసులకు ఇచ్చారని, అతడి మ నుషులే పాములపర్రుకు తెచ్చారని వార్డు సభ్యుడు దర్శి సాల్మన్రాజు, దళిత యువకులు మామిడిపల్లి ఏసేబు, దర్శి పరదేశి, తేలి మహేష్,శ్రీనివాస్, ఊబా రమేష్ ఆరోపించారు. దీనిపై ఎస్సై ఎండీ నసీరుల్లాను వివరణ కోరగా సీసీ కెమెరాను తామే ఏర్పాటు చేశామన్నారు. శాంతిభద్రతలకు విఘా తం కలిగించేలా ఎవరైనా అల్లర్లకు పాల్పడినా, లేదా రెచ్చగొట్టేందుకు ప్రయత్నించినా, ఇతర ప్రాంతాల వారు వచ్చి ఇబ్బందులు తలెత్తేలా వ్యవహరించినా ముందు జాగ్రత్త చర్యలు తీసుకునేందుకే కెమెరా ఏర్పాటు చేశామన్నారు. -
పశువుల్లో ఈనిక సమస్యలు
జంగారెడ్డిగూడెం: ఆవులు, గేదెల్లో ఈనికకు ముందు, సమయంలో, తర్వాత జరిగే వ్యాధులు పశువుల ఆరోగ్యం, పాల ఉత్పత్తి, రోగనిరోధక శక్తిని ప్రభావితం చేస్తాయి. ముందుగా గుర్తించడం, నివారించడం, తగిన చికిత్స ఇవ్వడం ద్వారా పశువుల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. పశువుల రైతులకు ఈ వ్యాధులను ఎలా నివారించాలో, ఎలా నిర్వహించాలో పశువైద్యాధికారి బీఆర్ శ్రీనివాసన్ వివరించారు. ఈనికకు ముందు వ్యాధులు ● పాల జ్వరం: పాల జ్వరం అనేది రక్తంలో కాల్షియం స్థాయి తగ్గడంతో కలిగే వ్యాధి. ఇది సాధారణంగా ఆవులు, గెదెలలో ఈనికకు ముందు లేదా తరువాత కనిపిస్తుంది. లక్షణాలు: కాళ్ళలో బలహీనత, నిలబడలేకపోవడం, చల్లని పాదాలు, తీవ్రమైన పరిస్థితిలో పశువు పడిపోయే ప్రమాదం ఉంటుంది. చికిత్స: వెంటనే కాల్షియం ఐవీ చుక్కల రూపంలో ఇవ్వాలి. పశువైద్యుడి సలహా మేరకు అధిక ప్రమాదం ఉన్న పశువులకు ముందస్తుగా కాల్షియం అందించాలి. నివారణ: ఆహారంలో సరైన పరిమాణంలో కాల్షియం, ఫాస్ఫరస్ ఉండేలా చూసుకోవాలి. ఈనికకు ముందు కాల్షియం సప్లిమెంట్స్ ఇవ్వడం వల్ల కాల్షియం స్థాయిలను కాపాడుకోవచ్చు. ● కీటోసిస్: కీటోసిస్ అనేది పశువు శక్తి లోటుతో కలిగే వ్యాధి, ఇది ఈనికకు ముందు ఎక్కువగా జరుగుతుంది. లక్షణాలు: పాల ఉత్పత్తి తగ్గిపోవడం, ఆకలి తగ్గడం, బరువు తగ్గడం. మూత్రంలో ఎసిటోన్ వాసన చికిత్స: ప్రొపైలీన్ గ్లైకాల్ రూపంలో ఇచ్చి గ్లూకోజ్ స్థాయిని పెంచాలి. నివారణ: ముఖ్యంగా అధిక పాల ఉత్పత్తి చేసే పశువులకు సమతుల్య ఆహారం అందించాలి. శరీరంలో తగిన శక్తి నిల్వల కోసం సరైన ఆహారం ఇవ్వాలి. ఈనిక సమయంలో వ్యాధులు ● కష్ట సాధ్యం: కష్టసాధ్యమైన ఈనిక సమయంలో.. లక్షణాలు: సుదీర్ఘ ఈనిక సమయంలో పిల్లలు బయటకు రాకపోవడం. చికిత్స: అవసరమైనపుడు ఈనికకు సహాయం చేయాలి. తీవ్ర పరిస్థితుల్లో సిజేరియన్ చేయవచ్చు. నివారణ: పెద్ద పిల్లలను ఈనే అవకాశం ఉన్న ఆవులకు తగిన ఆహారం, శ్రద్ధ తీసుకోవాలి. సరైన సమయానికి పశువైద్యుడి సలహాలు తీసుకోవాలి. ● గర్భపాతాల నిలుపు గర్భపాతం 12 గంటలలోపు బయటకు రాకపోతే ఇది ఒక సమస్యగా మారుతుంది. లక్షణాలు: జనన మార్గం నుండి చెడిపోయిన వాసన రావడం చికిత్స: పశువైద్యుడు సూచించిన విధంగా యాంటీబయోటిక్స్ ఇవ్వాలి. నివారణ: సరైన పోషకాహారం ఇవ్వడం, ముఖ్యంగా విటమిన్–ఇ, సెలీనియం తగిన మోతాదులో ఉండాలి. ఈనిక తరువాత వ్యాధులు ● మెట్రిటిస్: ఇది ఒక బాక్టీరియా ఇన్ఫెక్షన్. సాధారణంగా కష్ట్రపసవం లేదా గర్భపాతం తర్వాత కలుగుతుంది. లక్షణాలు: చెడు వాసన, జ్వరం, ఆకలి తగ్గడం. చికిత్స: యాంటీబయోటిక్స్, పశువైద్యుడి సూచనలతో సరైన చికిత్స చేయాలి. నివారణ: ఈనిక సమయంలో పరిశుభ్రత పాటించడం. ● మస్తిటిస్: మస్తిటిస్ అనేది పాలు ఉత్పత్తి చేసే గ్రంథులలో ఇన్ఫెక్షన్ ద్వారా కలిగే వ్యాధి. లక్షణాలు: ఉబ్బిన, వేడిగా ఉండే పొట్ట, మరియు పాలు అసాధారణంగా ఉండటం (గడ్డలు, రక్తం). చికిత్స: పశువైద్యుని సూచన మేరకు యాంటీబయోటిక్స్ ఇవ్వాలి. నివారణ: పాల యంత్రాల పరిశుభ్రత, పశువుల శుభ్రతతో పాటించాలి. సమతుల ఆహారాన్ని అందించాలి ఈనికకు ముందు, సమయంలో, తర్వాత వ్యాధులు పశువుల ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. ఇవి నివారించడం ద్వారా పశువుల పాల ఉత్పత్తిని పెంచి, వాటి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ముఖ్యంగా సమతుల ఆహారం, ముఖ్యంగా ఈనికకు ముందు, తర్వాత అందించాలి. పశువులు ఉండే వాతావరణం పరిశుభ్రంగా ఉంచాలి. పశువైద్యుడి పర్యవేక్షణలో వ్యాధులు గుర్తించడం, చికిత్స చేయడం చేయించాలి. – డా. బి. ఆర్. శ్రీనివాసన్, పశు వైద్యాధికారి, -
పవిత్రోత్సవం.. పరిపూర్ణం
ద్వారకాతిరుమల: చినవెంకన్న ఆలయంలో నా లుగు రోజులపాటు జరిగిన శ్రీవారి దివ్య పవిత్రోత్సవాలు ఆదివారం ముగిశాయి. ఉదయం ఆలయంలో పవిత్రావరోహణ, శ్రీ మహా పూ ర్ణాహుతి హోమం అనంతరం మహదాశీర్వచనాన్ని అర్చకులు, పండితులు వైభవంగా నిర్వహించారు. శ్రీవారి ములవిరాట్, పద్మావతి, ఆండాళ్ అమ్మవార్లు, ఉత్సవమూర్తులపై ఉంచిన దివ్య పవిత్రాలను అర్చకులు వేద మంత్రోచ్ఛరణల నడుమ తొలగించారు. అనంతరం వి విధ దినుసులతో మహాపూర్ణాహుతి హోమాన్ని జరిపించారు. పవిత్రోత్సవాలను పురస్కరించుకుని నాలుగు రోజులుగా ఆలయంలో నిలిపివేసిన నిత్యార్జిత కల్యాణాలు, ఆర్జిత సేవలను సోమవారం నుంచి పునరుద్ధరిస్తామని ఆలయ ఈఓ ఎన్వీ సత్యనారాయణమూర్తి తెలిపారు. -
ఇంటి పక్కనే ఉంటాడు.. నా భార్యను వేధిస్తున్నాడు..
జంగారెడ్డిగూడెం: తన భార్యను ఓ యువకుడు లైంగికంగా వేధిస్తున్నారని ఓ భర్త శుక్రవారం పోలీసులను ఆశ్రయించాడు. వివరాల ప్రకారం ఫిర్యాదుదారుడు తన కుటుంబసభ్యులతో కలిసి జంగారెడ్డిగూడెంలో నివాసం ఉంటున్నాడు. అయితే తన ఇంటి సమీపంలో ఉన్న ఓ వ్యక్తి ఫిర్యాదుదారిడి భార్యను లైంగికంగా వేధిస్తున్నాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే అక్రమ సంబంధం ఉందని ప్రచారం చేస్తానని బెదిరిస్తున్నాడు. ఈ విషయాన్ని భార్య భర్తకు చెప్పడంతో ఈ నెల 7న రాత్రి ఫిర్యాదుదారుడు ఆ యువకుడిని పిలిచి మాట్లాడుతుండగా ఒక్కసారిగా ఆ యువకుడు దాడికి యత్నించాడు. దాడి సమయంలో యువకుడి బావమరిది కూడా సహకరించాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెచ్సీ టి.బాబూరావు తెలిపారు. -
తప్ప తాగించేందుకు పర్మిట్
శనివారం శ్రీ 9 శ్రీ ఆగస్టు శ్రీ 2025సాక్షి, భీమవరం: మద్యం నుంచి సంపద సృష్టి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఇప్పటికే బెల్టులు, సమయ పాలన లేకుండా విచ్చలవిడిగా అమ్మకాలు చేస్తూ మద్యాన్ని ఏరులై పారి స్తోంది. మందుబాబుల్ని మరింత తప్పతాగించి ఆదాయాన్ని పెంచుకునే పనిలో ఉంది. షాపులకు అనుబంధంగా పర్మిట్ రూంల ఏర్పాటుకు రంగం సిద్ధం చేసింది. గీత కార్మికులకు చెందిన 18 షాపులతో కలిపి జిల్లాలో 193 మద్యం షాపులు ఉన్నాయి. నెలకు రూ.120 కోట్ల వరకు అమ్మకాలు జరుగుతున్నాయని అంచనా. మునుపటి ఏడాది ప్రామాణికంగా 20 శాతం అమ్మకాలు పెంచాలంటూ మొదట్లో ఎకై ్సజ్ అధికారులకు టార్గెట్లు విధించేవారు. ప్రైవేట్ పాలసీ తెచ్చిన గత ఏడాది అక్టోబరు 16 నుంచి ఈ ఏడాది మార్చి నెలాఖరు నాటికి లిక్కర్, బీర్లు అమ్మకాల్లో 30 శాతం నుంచి 80 శాతం పెరుగుదలను గుర్తించింది. మరింత ఆదాయాన్ని రాబట్టేందుకు నెలవారీ టార్గెట్ మొత్తాన్ని రూ. 175 కోట్లకు పెంచేసినట్టు సమాచారం. లక్ష్యాన్ని చేరేందుకు ఉన్నతస్థాయి నుంచి రోజువారీ సమీక్షలతో ఎకై ్సజ్ అధికారులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. చూసీచూడనట్టుగా.. షాపుల వద్దనే మద్యం సేవించేందుకు వీలుగా టేబుళ్లు, కుర్చీలతో సిట్టింగ్ ఏర్పాట్లు, మంచింగ్ కోసం ఫాస్ట్ఫుడ్ సెంటర్లు, సోడాలు, కూల్డ్రింక్స్, లూజ్ సేల్స్తో మద్యం దుకాణాలను ‘బార్’ల మాదిరి నిర్వహిస్తున్నారు. నైట్పాయింట్లు పేరిట తెల్లవార్లూ అమ్మకాలు చేస్తున్నారు. ఒక్కో షాపు పరిధిలో పది వరకు బెల్టు విక్రయాలు షరామామూలే. నిబంధనలకు విరుద్ధంగా అమ్మకాలు చేస్తున్నా కూటమి నేతల ఒత్తిళ్లు, టార్గెట్ల కోసం అధికారులు చూసీచూడనట్టుగా వ్యవహరిస్తున్నారు. బెల్టుషాపులు లేవని ప్రభుత్వం చెబుతుండగా జిల్లాలో ఇప్పటి వరకు 370 మంది బెల్టుషాపుల నిర్వాహకులను అరెస్టుచేసి 800 లీటర్ల మద్యాన్ని ఎకై ్సజ్ అధికారులు స్వాధీనం చేసుకోవడం గమనార్హం. పర్మిట్కు పచ్చజెండా సిండికేట్కు మేలుచేస్తూ 2014–19 మధ్య కాలంలో లిక్కర్ విధానాన్ని చంద్రబాబు సర్కారు మళ్లీ ఆచరణలో పెడుతోంది. అందులో భాగంగా మద్యాన్ని ప్రైవేట్ పరం చేసింది. షాపులకు అనుబంధంగా పర్మిట్ రూమ్లు తెరిచే పనిలో ఉంది. సెప్టెంబరు 1 నుంచి కొత్త బార్లకు లైసెన్సులు అమలుల్లోకి వచ్చాక పర్మిట్ రూమ్ల ఏర్పాటుకు మార్గం సుగమం కానుంది. జిల్లాలోని దాదాపు అన్ని షాపులకు పర్మిట్ రూమ్ల ఏర్పాటుకానున్నట్టు ఎకై ్సజ్ వర్గాలు అంటున్నాయి. ప్రస్తుతం మద్యం దుకాణాల వద్ద మద్యం సేవించడం నిబంధనలకు విరుద్ధం. అయినప్పటికి సిండికేట్లు పర్మిట్ రూంల మాదిరి ఏర్పాట్లతో మద్యం, గ్లాసులు, వాటర్ బాటిల్స్, ఫాస్ట్ఫుడ్స్ తదితర అన్నిటి ధరలను పెంచేసి మందబాబులను దోచేస్తున్నారు. వీటిని అధికారికం చేయడం ద్వారా సిండికేట్ దోపిడీకి అడ్డుండదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం చాలావరకు దుకాణాలు జనావాసాల మధ్యలో ఉండగా మందుబాబుల ఆగడాలతో చుట్టుపక్కల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురికావాల్సి వస్తోంది. పర్మిట్ రూమ్తో వారు మరింత రెచ్చిపోయి స్థానికంగా ప్రశాంత వాతావరణానికి భంగం కలుగుతుందని స్థానికులు ఆందోళన వ్యక్తమవుతోంది. న్యూస్రీల్ మద్యం నుంచి సంపద సృష్టిలో చంద్రబాబు సర్కారు షాపుల వద్ద పర్మిట్ రూంలకు గ్రీన్సిగ్నల్ త్వరలో వెలువడనున్న ఆదేశాలు ఇప్పటికే విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు నాడు వైఎస్సార్సీపీ హయాంలో మద్యం దుకాణాలు ఊరికి దూరంగా ఉండేవి. ప్రభుత్వమే నిర్వహించడం వలన నిబంధనలు ఖచ్చితంగా అమలయ్యేవి. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు నిర్ణీత వేళల్లో మాత్రమే అమ్మకాలు చేసేవారు. షాపు వద్ద మద్యం కొనుగోలు చేసి తీసుకుపోవడమే తప్ప అక్కడే కూర్చుని తాగే వీలుండేది కాదు. బెల్టుషాపులు, పర్మిట్ రూమ్లకు ఆస్కారమే లేదు. ఎమ్మార్పీకి మించి అధిక ధరల ఊసే లేదు. మద్యంపై వచ్చే ఆదాయం మొత్తం ప్రభుత్వ ఖజానాకు చేరేది. నేడు కూటమి తెచ్చిన పైవేట్ పాలసీతో మద్యం దుకాణాలు జనావాసాలు, రద్దీ ప్రాంతాల్లోకి వచ్చేశాయి. ఊరురా బెల్టుషాపులు వెలిశాయి. క్వార్టర్ బాటిల్కు ఎమ్మార్పీపై మద్యం దుకాణాల్లో రూ.10, బెల్టుషాపుల్లో రూ.30 వరకు వసూలు చేస్తున్నారు. ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ మద్యం దొరుకుతుండటంతో మందుబాబులు మత్తులో ఒకరిపై ఒకరు దాడులకు తెగబడుతూ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నారు. ఒక్కోసారి హత్యలకు సైతం దారితీస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. -
12న వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ సమావేశం
కై కలూరు: వైఎస్సార్సీపీ ఏలూరు జిల్లా విస్తృత స్థాయి సమావేశ పోస్టర్ను పార్టీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు(డీఎన్నార్) శుక్రవారం అవిష్కరించారు. ఈ సందర్భంగా ఏలూరు జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు తేర ఆనంద్ మాట్లాడుతూ ఈ నెల 12న కండ్రికగూడెం సుఖీభవ కల్యాణ మండపంలో ఉదయం 9 గంటలకు సమావేశం జరుగుతుందన్నారు. సమావేశానికి పార్టీ రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్.సుధాకర్బాబు, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మరి కనకారావు, ఇతర రాష్ట్ర, జిల్లా స్థాయి నాయకులు విచ్చేస్తారన్నారు. కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నూకపెయ్యి సుధీర్ బాబు, జిల్లా అధికార ప్రతినిధి మున్నుల జాన్ గురునాథం, దేవదాసు ప్రేమబాబు, యూత్ నాయకులు కోడిచుక్కల నాగశేషు తదితరులు పాల్గొన్నారు. విద్యాశక్తిపై నిర్బంధం తగదు ఏలూరు (ఆర్ఆర్పేట): విద్యాశక్తి కార్యక్రమాన్ని నిర్బంధం చేయడం తగదని స్కూల్ టీచర్స్ అసోసియేషన్(ఎస్టీఏ) రాష్ట్ర అధ్యక్షుడు కాడిశెట్టి శ్రీనివాసులు అన్నారు. రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు జీజేఏ స్టీవెన్తో కలిసి ఏలూరులోని జీజె రెసిడెన్సీలో జరిగిన ఏలూరు జిల్లా కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాశక్తి కార్యక్రమం ఐచ్ఛికంగా నిర్వహించాలని పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ తెలిపారని, కొన్ని జిల్లాల్లో విద్యాశక్తి కార్యక్రమాన్ని నిర్బంధంగా నిర్వహించమనడం సబబు కాదన్నారు. విద్యార్థులు సాయంత్రం నాలుగు గంటలకు అలసిపోతారని, ఆ సమయంలో విద్యాశక్తి అని చెప్పి అదనంగా తరగతులు నిర్వహించడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు. విద్యాశక్తిపై ఎవరినీ నిర్బంధం చేయవద్దన్నారు. చాలామంది ఉపాధ్యాయులు అదనపు తరగతులు నిర్వహించి వారి సిలబస్ను పూర్తి చేసి వెనుకబడిన విద్యార్థులకు రెమిడియల్ తరగతులు నిర్వహిస్తున్నారన్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటై సంవత్సరం దాటినా పీఆర్సీ, డీఏల ఊసెత్తకపోవడం దారుణమన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు రావాల్సిన పెండింగ్ బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. లీవ్ ఎన్క్యాష్మెంట్ బిల్లులు పెట్టి సంవత్సరాలు గడుస్తున్నా చెల్లింపులు చేయకపోవడం సమంజసం కాదన్నారు. కార్యక్రమానికి ఏలూరు జిల్లా అధ్యక్షుడు కాటి వెంకటరమణ అధ్యక్షత వహించగా, జిల్లా ప్రధాన కార్యదర్శి తోట ప్రసాద్, గౌరవ అధ్యక్షుడు ఉర్ల గంధర్వరావు, అసోసియేట్ అధ్యక్షుడు పిట్ట ఫెడ్రిక్ బాబు, మహిళా అధ్యక్షురాలు జీ సంధ్యారాణి, సీనియర్ నాయకులు కే బాలరాజు, టీ అంజిబాబు, దాసరి యేసు పాదం, కే జేమ్స్, డీ వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. రేషన్ బియ్యం పట్టివేత ద్వారకాతిరుమల: మండలంలోని జి.కొత్తపల్లిలో రేషన్ బియ్యం అక్రమంగా నిల్వ చేసిన ఓ ఇంటిపై సివిల్ సప్లై అధికారులు శుక్రవారం రాత్రి దాడి చేశారు. దాడిలో రూ. 1.50 లక్షలు విలువైన 3,750 కేజీల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. గ్రామానికి చెందిన మాటూరి దుర్గారావు జి.కొత్తపల్లి గ్రామంతో పాటు, చుట్టుపక్కల గ్రామాల్లో లబ్ధిదారుల నుంచి రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేసి.. బియ్యాన్ని జి.కొత్తపల్లిలోని ఉపాధిహామీ కూలి దాసరి రాజు ఇంట్లో నిల్వ చేస్తున్నాడు. రాత్రి సమయాల్లో గుట్టుచప్పుడు కాకుండా ఆ బియ్యాన్ని బయటకు తరలిస్తున్నాడు. దీనిపై సమాచారం అందుకున్న ద్వారకాతిరుమల, జంగారెడ్డిగూడెం సివిల్ సప్లై డిప్యుటీ తహసీల్దార్లు నాగరాజు, వెంకటేశ్వరరావు, వీఆర్ఏ బ్రహ్మయ్యలు ఆ ఇంటిపై దాడి చేశారు. అనంతరం పోలీసుల సమక్షంలో గది తలుపులు తెరచి 75 రేషన్ బియ్యం బస్తాలను స్వాధీనం చేసుకున్నారు. -
టేబుల్ టెన్నిస్లో విద్యార్థి ప్రతిభ
ఆగిరిపల్లి : రాష్ట్ర స్థాయిలో జరిగిన టేబు ల్ టెన్నిస్ పోటీల్లో ఆగిరిపల్లి మండల విద్యార్థి కాంస్య పతకం సాధించాడు. చొప్పరమెట్లలోని కేకేఆర్ హ్యాపీ వ్యాలీ పాఠశాల విద్యార్థి గోపాలకృష్ణ అండర్ 19 సింగిల్ విభాగంలో పాల్గొని ప్రతిభ చాటాడు. ఈ విజయం ద్వారా సీబీఎస్ఈ నేషనల్ లెవెల్ టేబుల్ టెన్నిస్ పోటీలకు అర్హత సాధించాడు. విద్యాసంస్థల చైర్మన్ కొసరాజు కోటేశ్వరరావు, సిబ్బంది విద్యార్థిని అభినందించారు.వరకట్నం వేధింపులపై కేసు నమోదుభీమవరం: అదనపు కట్నం కోసం వేదిస్తున్నారంటూ భీమవరం పట్టణానికి చెందిన గోడి అనిత శుక్రవారం పోలీసులను ఆశ్రయించింది. వివరాల ప్రకారం అనితకు రాజమహేంద్రవరం మండలం మారంపూడికి చెందిన కోడి జాషువాజైకుమార్తో సుమారు ఆరేళ్ల క్రితం వివాహమైంది. పెళ్లి సమయంలో రూ.5లక్షల నగదు, బంగారం కట్నంగా ఇచ్చారు. కొంతకాలం తరువాత భర్త కోడి జాషువాజైకుమార్ అతని కుటుంబ సభ్యులు రూ.10 లక్షలు అదనపు కట్నం తీసుకొని రావాలంటూ శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నారు. ఈ మేరకు అనిత ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై కిరణ్కుమార్ చెప్పారు.బావిలో పడిన ఎద్దుకై కలూరు: ప్రమాదవశాస్తూ బావిలో పడిన ఎద్దును స్థానిక అగ్రిమాపక సిబ్బంది చాకచక్యంగా రక్షించిన ఘటన కై కలూరు రైతు బజారు ఎదురుగా శుక్రవారం జరిగింది. ఉదయం ఓ బలమైన ఎద్దు పాడుబడిన నూతిలో పడింది. భారీ శబ్ధం రావడంతో ఓ వ్యక్తి గమనించి సమీపంలోని ఫైర్ ఆఫీస్లో సమాచారం అందించారు. హుటాహుటీన వచ్చిన సిబ్బంది శ్రీనివాసరావు, రాజేష్బాబు, రవీంద్రబాబు మరో కొందరి స్థానికుల సాయంతో తాళ్లు కట్టి ఎద్దును రక్షించారు. ఇదే నూతిలో కొద్ది రోజుల క్రితం దూడ పడితే రక్షించామని స్థానికులు చెప్పారు. బావిపై మూత ఏర్పాటు చేయాలని యజమానికి సూచించారు.ఆత్మహత్యాయత్నాన్ని అడ్డుకున్న పోలీసులుకైకలూరు: క్షణికావేశంలో ఆత్మహత్య చేసుకుంటానని బంధువులకు సెల్ ఫోన్ మెసేజ్ పెట్టిన యువకుడిని కై కలూరు టౌన్ ఎస్సై ఆర్.శ్రీనివాస్ చాకచక్యంగా శుక్రవారం పట్టుకుని తండ్రికి అప్పిగించారు. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం ఏలూరు జిల్లా తడికలపూడి గ్రామానికి చెందిన అందుగుల థామస్(20) కారు డ్రైవర్గా పని చేస్తున్నాడు. ఈ నెల 4న కుటుంబ సభ్యులతో చిన్నపాటి గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఏలూరు నుంచి పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మావుళ్లమ్మ దేవాలయం వరకు కారుకు ఆప్టింగ్ డ్రైవర్గా వెళ్ళాడు. అక్కడ నుంచి సమీప సోదరుడు రత్నారావుకు తాను ఇటీవల జరిగిన గొడవకు మనస్థాపం చెందానని తనువు చాలిస్తోన్నానని మెసేజ్ పెట్టాడు. దీంతో వెంకటరత్నం టోల్ఫ్రీ నంబర్ 112కు పోన్ చేసి పోలీసులకు వివరాలు చెప్పాడు. సెల్ సిగ్నిల్ ఆధారంగా ఆకివీడు నుంచి కై కలూరు మీదుగా ఏలూరు వెళ్లడానికి ఆర్టీసీ బస్సు ఎక్కిన థామస్ను కై కలూరులో టౌన్ ఎస్సై శ్రీనివాస్ గుర్తించి స్టేషన్కు తీసుకొచ్చారు. యువకుడి తండ్రి లక్ష్మణరావును పిలిపించి ఇద్దరికి కౌన్సిలింగ్ ఇచ్చారు. అనంతరం యువకుడిని గుర్తించడంలో చొరవ చూపిన హెడ్కానిస్టేబుల్ నాగరాజును అభినందించారు. -
అడవి తల్లి బిడ్డలు.. కొండరెడ్డి గిరిజనులు
బుట్టాయగూడెం: పశ్చిమ ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసీ గిరిజన తెగల్లో కొండరెడ్డి గిరిజనుల తెగ ఒకటి. వీరు నేటికీ కొండలపై ఆవాసాలు ఏర్పాటు చేసుకుని నివాసం ఉంటున్నారు. అక్కడే వారి సాంప్రదాయ పంటలైన జొన్న, సామలు, మొక్కజొన్న వంటి పంటలను పండిస్తూ జీవనం సాగిస్తున్నారు. అలాగే పలు గ్రామాల్లో వెదురు అల్లికలు, తేనె, చింతపండు, ఇప్ప పువ్వు వంటి అటవీ ఉత్పత్తులను సేకరిస్తుంటారు. వారాంతపు సంత, ఇతర ప్రభుత్వ కార్యాలయ పనుల మీద మాత్రమే కొండ దిగి కిందకు వస్తుంటారు. వీరికి ప్రధానంగా పోడు వ్యవసాయమే జీవనాధారం. సాతంత్య్రం వచ్చి 79 ఏళ్లు కావొస్తున్నా నేటికీ కొండరెడ్డి గిరిజనులు కొండ ప్రాంతంలోనే జీవనం సాగిస్తూ వస్తున్నారు. ప్రకృతి మాత వడిలోనే జీవిస్తున్నారు. నేటికీ చెక్కుచెదరని సాంప్రదాయం నేటి ఆధునిక ప్రపంచంలో ఎవరి బ్రతుకులు వారివే, ఎవరి పనులు వారివే. అయితే కొండరెడ్డి గిరిజనులు నేటికీ నాటి సాంప్రదాయాలు, ఆచారాలకు కట్టుబడి ఉన్నారు. వ్యవసాయమే కాదు పెళ్లిళ్లు, పేరంటాలు ప్రతిదీ సమష్టిగా చేసుకునే సాంప్రదాయం కొనసాగుతూనే ఉంది. శుభకార్యాల్లో ఒకరికి ఒకరు సహకరించుకోవడం వంటివి నేటికీ చేస్తుంటారు. ప్రకృతే గిరిజనుల ఆరాధ్య దైవం ఆదివాసీ గిరిజనులు ప్రకృతినే ఆరాధ్య దైవంగా కొలుస్తుంటారు. రావి, వేప చెట్లను ముత్యాలమ్మగా భావిస్తారు. ముఖ్యంగా బాట పండుగ, పప్పుల పండుగ, మామిడికాయ పండుగ వంటి పండుగలను ఎంతో వైభవంగా చేస్తారు. అయితే గిరిజనుల్లోనే కోయ తెగ వారు భూదేవి పండుగను తొలకరి సమయంలో ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. నేటికీ ఈ పండుగ సాంప్రదాయం కొనసాగుతూనే ఉంది. గత ప్రభుత్వ పాలనలో గిరిజన సంక్షేమానికి పెద్దపీట గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ పాలనలో పెద్దపీట వేశారు. సుమారు 3,220 మంది గిరిజనులకు 69814.72 ఎకరాల్లో పోడు భూములకు పట్టాలిచ్చారు. అదేవిధంగా రైతు భరోసా పథకంలో రైతులకు ప్రతీ ఏటా రూ. 15000 పెట్టుబడి సాయం అందేలా కృషి చేశారు. అలాగే ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ విధానంతో కొండ ప్రాంతంలో నివసిస్తున్న గిరిజనులకు సైతం మెరుగైన వైద్యసేవలు అందించే విధంగా కృషి చేశారు. అలాగే వలంటీర్ వ్యవస్థ ద్వారా పింఛన్లు కూడా కొండపైన ఉన్నవారికి కూడా ఇంటికే అందే విధంగా చర్యలు తీసుకున్నారు. గిరిజనులకు మెరుగైన వైద్యసేవలు అందేలా సుమారు రూ. 50 కోట్లతో మల్టీస్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి పూనుకున్నారు. అయితే ప్రస్తుతం నిర్మాణ పనులు నిలిచిపోయాయి. అలాగే మారుమూల గ్రామాల నుంచి డోలి కష్టాలు కూడా లేకుండా బైక్ అంబులెన్స్ సేవలను అందించారు. ప్రకృతే వారి ఆరాధ్య దైవం నేడు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం గిరిజనులకు మళ్లీ కష్టాలు మొదలు.. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన పథకాలకు ఒక్కొక్కటిగా మంగళం పలకుతుంది. గతంలో ఎండీయూ వాహనాల ద్వారా ఇంటింటికి రేషన్ అందించేవారు. అయితే ప్రస్తుతం దానిని తొలగించడంతో మళ్లీ గిరిజనులకు వాగులు దాటుతూ తలపై బియ్యం పెట్టుకుని మైళ్ల దూరం నడిచే పరిస్థితులు వచ్చాయి. గతంలో వలంటరీ వ్యవప్థ ద్వారా కోడి కూయక ముందే మారుమూల కొండ ప్రాంతాల్లో ఉన్న వారికి సైతం అన్ని రకాల పింఛన్లు అందేవి. ప్రస్తుతం ఆ పింఛన్లు వారం రోజులు దాటితేకానీ అందే పరిస్థితి లేదని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా వైద్యసేవలపై కూడా ఆందోళన చెందుతున్నారు. అయితే ప్రస్తుత ప్రభుత్వ పాలకులు తమకు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా పాలన సాగించాలని గిరిజనులు కోరుతున్నారు. -
వరలక్ష్మీ వ్రతం పేరిట ధరల దోపిడీ
భీమవరం(ప్రకాశం చౌక్): వరలక్ష్మీ వ్రతం అంటేనే ఏడాదిలో తొలి పండగా భావించి ఏంతో భక్తిశ్రద్ధలతో నిర్వహించుకుంటారు. భక్తుల సెంటిమెంట్ను ఆసరాగా తీసుకొని పూజకు అవసరమైనన పండ్లు, పూలు, అరటి పండ్లు, కొబ్బరికాయల ధరలను పెంచి వ్యాపారస్తులు దోపిడీ చేశారు. జిల్లా వ్యాప్తంగా పూజా సామగ్రి ధరలు గురువారం మధ్యాహ్నం నుంచి అనూహ్యంగా పెరిగిపోయాయి. సాధారణ రోజుల్లో డజను అరటి పండ్లు రూ.50 నుంచి రూ.60 ఉంటే రూ.100 రూపాయలకు విక్రయించారు. లక్ష్మీదేవి అమ్మవారికి పూజకు ఎక్కువగా చామంతి పూలు వినియోగిస్తుంటారు. ఈ నేపథ్యంలో చామంతి పూల రేటు పెంచి కేజీ చామంతులు రూ.600 వరకు విక్రయించారు. కనకాంబరాలను కూడా మర రూ.150 నుంచి రూ.200, మల్లెపూలు రూ.100 నుంచి రూ.150 వరకు అమ్మకాలు చేశారు. తమలపాకులు మోద రూ.50 నుంచి 70 రూపాయలు, కొబ్బరి కాయలు చిన్నవి రూ.30, పెద్దవి రూ.40 రూపాయలు చొప్పున అమ్మకాలు చేశారు. వరలక్ష్మీ వ్రతం పండుగ పేరట ధరల బాగా పెంచడంతో సామాన్యుల వరలక్ష్మీ పూజ ఖర్చుకు ఇబ్బందులు పడ్డారు.