breaking news
West Godavari
-
రక్తపు మడుగులో బాలుడు
ఏలూరు టౌన్: ఏలూరు శివారు కలపర్రు జాతీయ రహదారికి వెళ్ళే ప్రధాన రహదారిపై పొలాల్లో తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలో ఉన్న బాలుడిని గుర్తించిన సమీపంలోని రైతు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు ఆ బాలుడిని అంబులెన్స్లో ఏలూరు సర్వజన ఆసుపత్రికి తరలించారు. బాలుడు అపస్మారక స్థితిలో ఉండడంతో వివరాలు తెలియవని పోలీసులు చెబుతున్నారు. బిఆలుడి తల, చెవుల పక్కన తీవ్ర గాయాలున్నాయి. కత్తితో, పదునైన చాకుతో పొడిచి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఏకంగా పదికి పైగా కత్తిపోట్లు ఉన్నాయని చెబుతున్నారు. బాలుడి వయసు 14 నుంచి 15 ఏళ్లు ఉంటుందని, ఖాకీ రంగు నిక్కరు, ఎరుపు టీషర్ట్ వేసుకుని ఉన్నాడనీ, వివరాలు తెలిస్తే.. 9440796637 నెంబరులో సంప్రదించాలని కోరారు. ఏలూరు డీఎస్పీ డీ.శ్రావణ్కుమార్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. త్రీటౌన్ సీఐ కోటేశ్వరరావు, పెదవేగి సీఐ రాజశేఖర్, పెదపాడు ఎస్ఐ సంఘటనా స్థలంలో పరిస్థితులను పరిశీలించారు. ఎవరైనా నిర్మానుష్య ప్రదేశానికి తీసుకొచ్చి కత్తితో పొడిచి పారిపోయారా? అనే అనుమానం వ్యక్తమవుతోంది. -
టైలర్లను ఆదుకోవాలి
గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం కులమతాలకు అతీతంగా సంక్షేమం అందజేసింది. టైలర్లు, కుమ్మరులు, రజకులు, ఆటోవారికి, నాయీ బ్రాహ్మణులకు ఆర్థిక సాయం చేశారు. నేటి ప్రభుత్వం ఆ దిశగా ఆలోచన చేసి టైలర్లకు, చేతివృత్తిదారులకు కూడా సాయం ప్రకటించాలి. – చింతకాయల సత్యనారాయణ, సీనియర్ టైలర్, తాడేపల్లిగూడెం గత ప్రభుత్వం నాలుగేళ్ల పాటు ఏడాదికి రూ.10 వేలు ఇచ్చి ఆదుకుంది. నేటి ప్రభుత్వం కూడా ఆర్థిక సాయం ప్రకటించాలి. నేడు ఆటో కార్మికులకు సంక్షేమం అందజేసేందుకు సిద్ధంగా ఉన్న తరుణంలో టైలర్లకు కూడా సాయం ప్రకటించాలి. ఆ దిశగా ప్రభుత్వం కృషి చేయాలి – టి.సుబ్రహ్మణ్యం, టైలర్, తాడేపల్లిగూడెం గత ప్రభుత్వ హయాంలో 2 సార్లు రూ.10 వేలు సాయం అందుకున్నాను. ప్రస్తుత ప్రభుత్వం కూడా పేద మహిళా టైలర్లను ఆదుకోవాలి. ఈ ప్రభుత్వం ఇంతవరకు టైలర్ల సంక్షేమానికి ఎలాంటి ప్రకటన చేయలేదు. కార్పోరేట్ శక్తులు కారణంగా మహిళా టైలర్లు చితికిపోతున్నారు. – ఎస్.కృష్ణవేణి, మహిళా టైలర్, తాడేపల్లిగూడెం -
రోడ్డెక్కిన దస్తావేజు లేఖర్లు
పెదవేగి: తమ సమస్యల పరిష్కారానికి రోడ్డెక్కనున్నట్టు దస్తావేజుల లేఖర్ల సంక్షేమ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు పెనుమాక వెంకట సుబ్బారావు తెలిపారు. జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద ఆయన నేతృత్వంలో జిల్లా స్థాయి లేఖర్లు బుధవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సుబ్బారావు మీడియాతో మాట్లాడుతూ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఓటీపీ వ్యవస్థను రద్దు చేయాలని, వీలునామాలు రాయించుకున్న వారి ఇళ్లకు వెళ్లి నేరుగా అక్కడే రిజిస్ట్రేషన్ చేసుకునేలా అనుమతి కల్పించాలని, ఎక్కడైనా రిజిస్ట్రేషన్ చేసుకునేలా ఇచ్చే గ్రాంట్ను రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. దస్తావేజు రాసుకున్న వ్యక్తి రిజిస్ట్రేషన్ కోసం 72 గంటలు సమయం వేచి ఉండాల్సిన దుస్థితి ఏర్పడిందని, ప్రభుత్వం 15 నిమిషాల్లో రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పడం సరైంది కాదన్నారు. పెన్ డౌన్ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 294 రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో దస్తావేజు లేఖర్లంతా శుక్ర, శని వారాల్లో నిర్వహించే పెన్డౌన్లో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. -
ప్రభుత్వ స్థలాల పరిశీలన
ఉండి: ఉండి, ఎన్నార్పీ అగ్రహారం గ్రామాల్లోని ప్రభుత్వ స్థలాలను కలెక్టర్ సీహెచ్ నాగరాణి బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఉండి ఆర్అండ్బీ బంగ్లా, అక్విడెక్టు, ఇరిగేషన్ స్థలాలను కలెక్టర్ పరిశీలించారు. అనంతరం అధికారులతో మాట్లాడుతూ ప్రభుత్వ స్థలాలను సర్వే చేయించి వెంటనే సరిహద్దు రాళ్ళు ఏర్పాటు చేసి చర్యలు తీసుకోవాలని ఆర్డీవో కే ప్రవీణ్కుమార్కు సూచించారు. స్థలాలు ఆక్రమణలో ఉంటే సంబంధిత వ్యక్తులకు నోటీసులు జారీ చేసి ఆక్రమణలు తొలగించాలని తహసీల్దారు నాగార్జునకు ఆదేశాలు జారీ చేశారు.అధినేతతో భేటీ తాడేపల్లిగూడెం: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రైతు విభాగం, ఆక్వా కల్చర్ వర్కింగ్ ప్రెసిడెంటు వడ్డి రఘురాం బుధవారం కలిశారు. మర్యాదపూర్వకంగా కలిసినట్లు ఆయన తెలిపారు.ఆందోళన బాటలో విద్యుత్ ఉద్యోగులుభీమవరం(ప్రకాశంచౌక్): రాష్ట్ర విద్యుత్ జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపులో భాగంగా బుధవారం భీమవరంలోని జిల్లా సర్కిల్ కార్యాలయం ఎదుట విద్యుత్ ఉద్యోగులు భోజన విరామ సమయంలో ఆందోళనలో పాల్గొన్నారు. అపరిమితమైన మెడికల్ పాలసీని అమలు చేయాలని, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా 2004 వరకూ ఉద్యోగం పొందిన వారికి జీపీఎఫ్ కొనసాగించాలని కోరారు. బకాయిపడిన కరువు భత్యాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.మెడికల్ కాలేజీలపై 20న రౌండ్ టేబుల్ సమావేశంభీమవరం: ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయడాన్ని నిరసిస్తూ.. ఈ నెల 20న రౌండ్టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నట్లు సీపీఎం జిల్లా కార్యదర్శి జెఎన్వీ గోపాలన్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. శనివారం ఉదయం 11 గంటలకు భీమవరం మెంటేవారితోటలోని సీపీఎం కార్యాలయంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో 10 మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం చేయాలనే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రభుత్వ రంగంలోనే వైద్య విద్య, ప్రజారోగ్యం కొనసాగాలని కోరుతూ రౌండ్టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నట్లు గోపాలన్ తెలిపారు.ఆచంటలో అత్యధికంగా 120 మి.మీ. వర్షంభీమవరం: జిల్లాలోని ఆచంట మండలంలో బుధవారం ఉదయం అత్యధికంగా 120.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు సమాచారశాఖ తెలిపింది. వీరవాసరంలో 74 మి.మీ, భీమవరంలో 67.2, పెనుమంట్రలో 70.2, పాలకోడేరు 56.4, ఉండి 19.4, గణపవరం 19.4, అత్తిలి 23.4, ఇరగవరం 42.2, పెనుగొండ 67.8, పోడూరు 46.4, పాలకొల్లు 66.4, యలమంచిలి 29.4, నరసాపురం 29.4, మొగల్తూరు 4.2, పెంటపాడు 6, తాడేపల్లిగూడెం 3.4, తణుకులో 2.4, ఆకివీడులో 1.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు తెలిపారు.రేపు చేబ్రోలులో జాబ్ మేళాఏలూరు (ఆర్ఆర్పేట): నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో చేబ్రోలు గీతాంజలి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఈ నెల 19న జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి తెలిపారు. 11 కంపెనీల ప్రతినిధులు పాల్గొంటారని, 81848 87146, 7710177767 నెంబర్లలో సంప్రదించాలన్నారు. -
జగన్ హయాంలోనే సాకారం
వాగులు దాటాలంటే వణుకే వర్షాకాలం వస్తే చాలు.. ఏజెన్సీ ప్రాంతంలో కొండవాగులు బుసలు కొడుతూ ప్రవహిస్తూ ఉంటాయి. వాగు దాటాలంటే ప్రజలు వణుకుతున్నారు. 8లో u● 2024 ఎన్నికల నాటికిగురువారం శ్రీ 18 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025ఏలూరు టౌన్: వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఏలూరులో మెడికల్ కాలేజీ నిర్మించారు. మాజీ సీఎం జగన్ జిల్లా ప్రజల కలను నిజం చేస్తూ.. ప్రతి పేదవాడికి అత్యుత్తమ స్థాయి వైద్యచికిత్సలు, సేవలు అందాలనే సంకల్పంతో ప్రభుత్వ మెడికల్ కాలేజీని తేవడమే కాదు, యుద్దప్రాతిపదికన భవనాల నిర్మాణం చేపట్టారు. 2023 సెప్టెంబర్ 15న మొదటి ఏడాది ఎంబీబీఎస్ క్లాస్లు ప్రారంభమయ్యాయి. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో నిర్మాణ పనులు ప్రారంభించిన భవనాల వద్ద ఇప్పుడు కూటమి నేతలు ఫొటోలు దిగుతూ ... తమ హయాంలోనే జరిగిందనే రీతిలో ప్రచారం చేసుకోవటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. జగన్ హయాంలో నిర్మాణ పనులు ప్రారంభించి 50 శాతం పనులు పూర్తి చేయగా.. కూటమి 15 నెలల పాలనలో మిగిలిన 50శాతం పనులు నేటికీ పూర్తి చేయలేదు. మరోవైపు ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు కూటమి సర్కారు కుట్ర చేస్తోంది. దీనిని నిరసిస్తూ ఈ నెల 19న వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపడుతున్నారు. ఏడాదిలోపే భవన నిర్మాణం 2019 అక్టోబర్ 4న మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏలూరు జీజీహెచ్కు శంకుస్థాపన చేశారు. అప్పటికే అక్కడ భారీ భవనాలు ఉండడంతో ముందుగా వాటిని తొలగించారు. ఈలోగా కరోనా వైరస్ విలయంతో రెండేళ్ల పాటు కరోనాతో పనులన్నీ నిలిచిపోయాయి. అనంతరం 2022 అక్టోబర్లో పాత బస్టాండ్ సెంటర్ సమీపంలో డీఎంహెచ్వో కార్యాలయం వద్ద రూ.60 కోట్లతో శరవేగంగా కేవలం ఏడాదిలోపే భవన నిర్మాణం పూర్తి చేశారు. 2023 సెప్టెంబర్ 15న ఎంబీబీఎస్ మొదటి ఏడాది తరగతులు ప్రారంభించారు. కూటమి రాకతో పనుల్లో జాప్యం : కూటమి ప్రభుత్వం ఏర్పడిన అనంతరం మెడికల్ కాలేజీ నిర్మాణంలో తీవ్ర జాప్యం ఏర్పడింది. కాంట్రాక్టర్ను తొలగిస్తారని, నిధులు విడుదల చేస్తారో లేదో అన్న సందేహాలతో పనులు నత్తనడకన సాగాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు కావస్తున్నా... నేటికీ శాశ్వత భవనం, హాస్టల్స్ భవనాలను పూర్తి చేయలేదు. తామే కట్టామంటూ కూటమి నేతల ప్రగల్భాలు ఏలూరు జీజీహెచ్లో నిర్మిస్తున్న ప్రభుత్వ మెడికల్ కాలేజీ భవనం వద్ద కూటమి నేతలు ఫొటోలు దిగటాన్ని ప్రజలు ఎద్దేవా చేస్తున్నారు. ఏలూరులో ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటుకు ప్రయత్నం చేయని సీఎం చంద్రబాబు.. మాజీ సీఎం జగన్ పనులు ప్రారంభించిన భవనాల వద్ద తమ హయాంలోనే అంటూ ప్రచారం చేసుకోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. కనీసం మూడో ఏడాది ప్రారంభం నాటికై నా పనులు పూర్తి చేయలేని దుస్థితిలో కూటమి ప్రభుత్వం ఉందనే అభిప్రాయం ప్రజల్లో వ్యక్తం అవుతోంది. రాయలంలో మాట్లాడుతున్న వైఎస్సార్సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు సందీప్ మాట్లాడుతున్న మాజీ మంత్రి కారుమూరి ఏడాదిలోనే ఎంబీబీఎస్ క్లాస్లకు మెడికల్ కళాశాల సిద్ధం శాశ్వత కళాశాల పనులూ వైఎస్సార్సీపీ హయాంలోనే కూటమి ప్రభుత్వంలో పనుల జాప్యంతో క్లాస్లకు ఇబ్బంది ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు కూటమి సర్కారు యత్నం ఈ నెల 19న వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం ఏలూరు జీజీహెచ్ ప్రాంగణంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటుకు... కాలేజీ శాశ్వత భవనాలు, పరిపాలన భవనం, విద్యార్థులకు హాస్టల్స్ భవనాలు, అధునాతన బోధనాసుపత్రి(జీజీహెచ్), టీచింగ్, నాన్ టీచింగ్, నర్సింగ్ స్టాఫ్కు నివాసాలకు క్వార్టర్లు, అత్యాధునిక సౌకర్యాలతో ల్యాబ్లు, ఇలా పూర్తిస్థాయి మెడికల్ కళాశాల తీర్చిదిద్దేందుకు రూ.525 కోట్లు నిధులను మంజూరు చేయించారు. ఏలూరు జీజీహెచ్లో శాశ్వత మెడికల్ కాలేజీ భవనం, వైద్య విద్యార్థుల హాస్టల్ భవనాల నిర్మాణ పనులను 2023 జనవరిలో ప్రారంభించారు. ఈ భవనాలను యుద్ధప్రాతిపదికన 2024 సెప్టెంబర్ కల్లా పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 2024 జూన్ 4 నాటి వరకూ పనులు శరవేగంగా సాగాయి. -
టైలర్ల్కు చేదోడుగా నిలవాలి
● ఆటో డ్రైవర్లకు ఇస్తున్నట్లే రూ.15 వేలు అందించాలి ● టైలర్ల డిమాండ్ తాడేపల్లిగూడెం (టీఓసీ): గత ప్రభుత్వంలో చేదోడు పథకంలో ప్రతి టైలర్కు ఏడాదికి రూ.10 వేల చొప్పున నాలుగేళ్లు అందజేశారు. తమకు కూడా చేదోడు పథకం తరహాలో ప్రస్తుత కూటమి ప్రభుత్వం కూడా టైలరింగ్ స్కీంను అమలు చేయాలని, టైలర్స్కు ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అర్హత కలిగిన దర్జీలకు వారి వ్యాపార ఉన్నతికి, పరికరాల కొనుగోలు నిమిత్తం చేదోడు పేరుతో ప్రతి టైలర్కు ఏడాదికి రూ.10 వేలు చొప్పున సాయం అందించారు. నాలుగేళ్ల పాటు ఈ పథకం అమలు చేశారు. ఐదో సంవత్సరం ఎన్నికల కోడ్ కారణంగా అమలు చేయలేకపోయారు. ప్రస్తుత ప్రభుత్వం వాహన మిత్ర పేరుతో రూ.15 వేలు ఆటో కార్మికులకు అందిస్తున్న నేపథ్యంలో టైలర్లకు కూడా రూ.15 వేలు ఇచ్చి ఆదుకోవాలని కోరుతున్నారు. పనులు లేక ఆర్థికంగా ఇబ్బందులు ఇప్పటికే టైలర్లు వృత్తిపరంగా అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నారు. రెడిమేడ్ వస్త్రాలతో వారికి పనిలేకుండా పోతోంది. గతంలో టైలరింగ్ షాపులలో యాజమానితో పాటు పనివారు ఉండే వారు. నేడు ఎవరికీ పనులు లేకపోవడంతో టైలర్లు ఆర్థికంగా చితికి పోతున్నారు. నాడు రద్దీగా ఉండే టైలరింగ్ షాపులు వారికి నేడు పని లేకుండా పోవడంతో టైలర్స్ ఆర్థికంగా చితికిపోయారు. టైలర్స్కు పనులు లేకపోవడంతో షాపులకు అద్దెలు చెల్లించలేకపోతున్నారు. విద్యుత్ బిల్లులు కట్టలేని స్థితిలో ఉన్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ బిల్లుల్లో రాయితీలు ఇవ్వాలని, ప్రభుత్వ షాపుల్లో తక్కువ అద్దెకు టైలర్లకు షాపులు కేటాయించాలని, ఎక్కడైనా టైలర్లకు ఇచ్చిన ప్రభుత్వ షాపులు పాడైతే వాటికి మరమ్మతులు చేయించాలని కోరుతున్నారు. -
మాజీ సర్పంచ్ ఇంట్లో భారీ చోరీ
పెనుమంట్ర: మండలంలోని సోమరాజు ఇల్లింద్రపర్రు గ్రామంలో మాజీ సర్పంచ్ కర్రి కమల ఇంట్లో మంగళవారం సాయంత్రం భారీ చోరీ జరింది. వివరాల ప్రకారం బీజేపీ యువమోర్చా నాయకుడు కర్రి బ్రహ్మానంద రెడ్డి ఇంట్లో లేని సమయంలో ఇద్దరు గుర్తు తెలియని దొంగలు ప్రవేశించి అతని తల్లి కమల, భార్య జ్ఞాన చంద్రికను తాళ్లతో బంధించి అరిస్తే చంపేస్తామని బెదిరిస్తూ ఇంట్లో ఉన్న సుమారు 30 కాసుల బంగారం, లక్ష రూపాయలు పైగా నగదును అపహరించారు. బ్రహ్మానంద రెడ్డి కుమార్తె ట్యూషన్కి వెళ్లి తిరిగి వచ్చే సమయానికి నాన్నమ్మ కమల, తల్లి జ్ఞాన చంద్రిక కట్లతో బంధించబడి ఉండటాన్ని గమనించి కట్లను తొలగించింది. అప్పటివరకు వారి ఇరువురు బయటికి రాలేకపోవడంతో చోరీ జరిగిన విషయం బయట వ్యక్తులు ఎవరికీ తెలియ రాలేదు. ఈ ఘటనపై బ్రహ్మానంద రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బుధవారం ఉదయం నర్సాపురం డీఎస్పీ శ్రీ వేద, పెనుగొండ సీఐ రాయుడు విజయ్ కుమార్ ఘటనా స్థలానికి చేరుకుని బాధితులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. డాగ్స్ స్క్యాడ్, క్లూస్ టీం తనిఖీలు నిర్వహించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఎ.స్వామి చెప్పారు. -
డీజిల్ మాఫియా.. పట్టుబడ్డ ట్యాంకర్
● పన్నులు చెల్లించకుండా అక్రమంగా డీజిల్ రవాణా ● ద్వారకాతిరుమల మండలం లక్ష్మీనగర్లో పట్టుకున్న అధికారులు ద్వారకాతిరుమల: ప్రభుత్వానికి ఎటువంటి పన్నులు చెల్లించకుండా దొడ్డిదారిన అక్రమంగా డీజిల్ రవాణా చేస్తున్న ట్యాంకర్ను పౌర సరఫరాల శాఖ అధికారులు ద్వారకాతిరుమల మండలం లక్ష్మీనగర్లోని జాతీయ రహదారిపై ఉన్న హెచ్పీ పెట్రోల్ బంకు వద్ద బుధవారం సీజ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ డీజిల్ మాఫియాకు సంబంధించి ట్యాంకర్ పట్టుబడటం ఇదే తొలిసారి. వివరాల్లోకి వెళితే. హైదరాబాద్ నుంచి లక్ష్మీనగర్కు ట్యాంకర్ ద్వారా అక్రమంగా డీజిల్ రవాణా అవుతున్నట్టు కమర్షియల్ ట్యాక్స్ అసిస్టెంట్ కమిషనర్ (తాడేపల్లిగూడెం) డీపీ కిరణ్ కుమార్ సమాచారం అందుకున్నారు. ఈ క్రమంలో ిసిబ్బందితో కలసి ఆయన మంగళవారం సాయంత్రం ట్యాంకర్ను లక్ష్మీనగర్ జాతీయ రహదారిపై వలపన్ని పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఉత్తరప్రదేశ్కు చెందిన ట్యాంకర్ డ్రైవర్ రాజేంద్ర ప్రసాద్ను అదుపులోకి తీసుకుని విచారించారు. ట్యాంకర్ యజమాని హైదరాబాద్కు చెందిన ఎం.రాధిక అని, అందులోని డీజిల్ ఏలూరు మండలం చాటపర్రు గ్రామానికి చెందిన కోనా శ్రీనివాసరావుదని డ్రైవర్ తెలిపాడు. అనంతరం భద్రతలో భాగంగా ట్యాంకర్ను లక్ష్మీనగర్లోని హైవే పార్కింగ్లో ఉన్న వెంకట దుర్గ ఫిల్లింగ్ స్టేషన్ (హెచ్పీ పెట్రోల్ బంకు) వద్ద నిలుపుదల చేయించారు. ట్యాంకర్ను తనిఖీ చేయాలని కిరణ్ కుమార్ ఏలూరు జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి ఇమానియేల్ను కోరారు. అందులో భాగంగా డీఎస్ఓ ఆదేశాల మేరకు ఏఎస్వో ప్రతాప్రెడ్డి (ఏలూరు), ద్వారకాతిరుమల, భీమడోలు, జంగారెడ్డిగూడెం సివిల్ సప్లయి డీటీలు టి.నాగరాజు, ఎన్.భరత్ కుమార్, జి.వెంకటేశ్వరరావు, వీఆర్వో కొత్తపల్లి చంద్రలీల, వీఆర్ఏ కంకిపాటి నరసింహమూర్తి బుధవారం ట్యాంకర్ను తనిఖీ చేశారు. ట్యాంకర్లో 10 వేల లీటర్ల డీజిల్ విలువ రూ.9,74,200గా గుర్తించారు. ట్యాంకర్, డీజిల్ యజమానులు, డ్రైవర్పై కేసు నమోదు చేశారు. ప్రభుత్వానికి, కమిషనర్లకు ముందే ఫిర్యాదు డీజిల్ మాఫియాపై స్టేట్ పెట్రోల్ డీలర్స్ అసోసియేషన్ వారు ఇప్పటికే పలుమార్లు రాష్ట్ర ప్రభుత్వానికి, కమర్షియల్ ట్యాక్స్, సివిల్ సప్లయి, వెయిట్స్ అండ్ మెజర్స్ కమిషనర్లకు ఫిర్యాదు చేశారు. ఈ డీజిల్ ఆయిల్ గుజరాత్ నుంచి అక్రమంగా రాష్ట్రంలోకి వస్తోందని తెలిపారు. బంకు యజమానులు లీటర్ డీజిల్ను రూ.97.42లకు విక్రయిస్తే, ఈ అక్రమార్కులు రూ.75కే విక్రయిస్తున్నారు. దీంతో గడిచిన ఏడాదిలోనే ప్రభుత్వానికి రూ.వెయ్యి కోట్లు మేర నష్టం వాటిల్లిందని కమిషనర్లకు తెలిపారు. టాక్స్లు కట్టకుండా ఒక ట్యాంకర్ డీజిల్ విక్రయిస్తే రూ.5 లక్షల వరకు మిగులుతుందని, దీన్ని బట్టి అక్రమార్కులు ఏ స్థాయిలో దందా చేస్తున్నారో అర్థమవుతుందన్నారు. -
ఆక్వా దుకాణాలపై విజిలెన్స్ దాడులు
కై కలూరు: విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్, వ్యవసాయశాఖ అధికారులు సంయుక్తంగా బుధవారం కై కలూరులోని ఆక్వా ఎరువులు, మందుల దుకాణాలపై దాడులు నిర్వహించారు. సంతమార్కెట్ వద్ద ఏ టూ జడ్ ఆక్వా రైతు బజార్, వాసవి ఆక్వా రైతు బజార్లలో తనిఖీ చేయగా రెండింటిలో రూ.1,45,260 విలువ కలిగిన 10.800 టన్నుల ఎరువుల్లో వ్యత్యాసం గుర్తించారు. ఎరువులను సీజ్ చేసి కేసు నమోదు చేశారు. దాడుల్లో విజిలెన్స్ డీఎస్పీ సింగులూరి వెంకటేశ్వరరావు, ఏవో ఎ.మీరయ్య, ఎస్సై రంజిత్ కుమార్, వ్యవసాయశాఖ కై కలూరు సబ్ డివిజన్ ఏడీఏ ఏ.పార్వతి మండల వ్యవసాయ శాఖాధికారి ఆర్ దివ్య, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. పాలకోడేరు : బాలుడి మృతదేహాన్ని వేండ్ర రైల్వే స్టేషన్ సమీపంలో అట్టల ఫ్యాక్టరీ ఎదురుగా గోస్తనీ డ్రెయిన్లోని డొంకల్లో మంగళవారం గుర్తించారు. వేండ్ర అగ్రహారం శివారు కట్టావారిపాలెం గ్రామానికి చెందిన బొక్కా శ్రీనివాసరావు కుమారుడు జైదేవ్ (7) ఆదివారం సాయంత్రం సైకిల్ తొక్కుతుండగా చైను తెగిపోవడంతో దానిని పెట్టుకునే క్రమంలో గోస్తని డ్రెయిన్ వంతెనపై నుంచి జారి గల్లంతయ్యాడు. అప్పటినుంచి పోలీసులు, స్థానికులు, కాకినాడకు చెందిన ఎస్డీఎఫ్ బలగాలు గాలిస్తున్నారు. వేండ్ర రైల్వే స్టేషన్ సమీపంలో అట్టల ఫ్యాక్టరీ ఎదురుగా గోస్తనీ డ్రెయిన్లో డొంకలను కూలీలు బాగుచేస్తుండగా మృతదేహాన్ని గుర్తించడంతో ఎస్డీఎఫ్ బలగాలకు సమాచారం అందించారు. వారు బాలుడి మృతదేహాన్ని వెలికితీసి శవపంచనామా నిర్వహించి తల్లిదండ్రులకు అప్పగించినట్లు ఎస్సై మంతెన రవివర్మ తెలిపారు. చింతలపూడి: వీధి కుక్క దాడిలో ముగ్గురికి గాయాలైన ఘటన చింతలపూడి పట్టణంలో బుధవారం చోటుచేసుకుంది. స్థానిక శ్రీ చైతన్య టెక్నో స్కూల్ ఆవరణలో ఒక వీధి కుక్క విద్యార్థులను కరిచే ప్రయత్నం చేయగా అక్కడే ఉన్న ఓ వ్యక్తి అడ్డుకోవడంతో అతడ్ని గాయపరిచింది. స్థానికులు ఆ కుక్కను తరమడంతో పారిపోయే క్రమంలో ఒక ట్రాక్టర్ డ్రైవర్ని, ఒక వెల్డింగ్ పనిచేసే కార్మికుడిని కరిచి గాయపరిచింది. కుక్కలు విచ్చలవిడిగా తిరుగుతూ ప్రజలను కరుస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. ఆగిరిపల్లి: ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్సై శుభశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని ఈదులగూడెంకి చెందిన ఈర్ల దుర్గారావు(42) లారీ డ్రైవర్గా జీవనం సాగిస్తున్నాడు. అతనికి భార్య, కొడుకు, కూతురు ఉన్నారు. ఇటీవల ఆర్థిక బాధలు ఎక్కువ కావడంతో మంగళవారం సాయంత్రం ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్నాయత్నానికి ప్రయత్నించాడు. కుమార్తె చుట్టుపక్కల వాళ్ల సహాయంతో దుర్గారావును నూజివీడు అమెరికన్ హాస్పిటల్కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు. దుర్గారావు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. -
వాగులు దాటాలంటే వణుకే..
బుట్టాయగూడెం: వర్షాకాలం వచ్చిందంటే చాలు.. ఏజెన్సీప్రాంతంలోని గిరిజనులు భయం నీడలో కాలం వెళ్లదీయాల్సిన పరిస్థితి. ఎత్తయిన కొండలు, దట్టమైన అటవీప్రాంతం కావడంతో ఈ ప్రాంతంలో అత్యధికంగా వర్షాలు కురుస్తూ ఉంటాయి. కొద్దిపాటి వర్షం వచ్చినా కొండవాగులు బుసలు కొడుతూ ఉధృతంగా ప్రవహిస్తూ ఉంటాయి. వాగులపై బ్రిడ్జిల నిర్మాణం లేకపోవడంతో తప్పని పరిస్థితుల్లో గిరిజనులు నిత్యావసర పనుల నిమిత్తం పొంగుతున్న వాగులను దాటాల్సిందే. ఆ సమయంలో అనేక మంది ప్రమాదాల బారిన పడుతున్నారు. గతంలో ఈ వాగులు దాటే ప్రయత్నం చేసినవారిలో అనేక మంది మృత్యువాత పడిన ఘటనలు కూడా చోటుచేసుకున్నాయి. ప్రతి ఏటా వర్షాకాలంలో వాగులు దాటేందుకు గిరిజనులు అనేక అవస్థలు పడుతున్నారు. మన్యంలో వాగుల గండాలు మన్యప్రాంతంలోని అనేక ప్రాంతాల్లో అనేక వాగు గండాలు ఉన్నాయి. వాటిని దాటి వెళ్లాలంటే ఎంతో సాహసం చేయాల్సిందే. ముఖ్యంగా గురుగుమిల్లి నుంచి చింతకొండ వాగు, అదేవిధంగా రెడ్డికోపల్లి, వీరన్నపాలెం వాగు, ముంజులూరు వెళ్లే జారుడు కాల్వ వాగు, ఇప్పలపాడు సమీపంలోని జల్లేరు వాగు, రెడ్డిగణపవరం సమీపంలోని జల్లేరు వాగు, రామారావుపేట సెంటర్ నుంచి జంగారెడ్డిగూడెం వెళ్లే రహదారి మధ్యలో ఉన్న జల్లేరు వాగు, కేఆర్పురం తూర్పు, పడమర వాగులు బుట్టాయగూడెం శివారులో ఉన్న అల్లికాల్వతోపాటు అనేక వాగులు ప్రతి ఏటా ఉధృతంగా ప్రవహిస్తుంటాయి. అలాగే గుబ్బల మంగమ్మ గుడికి వెళ్లే మార్గంలో ఒకేవాగు మూడు ప్రదేశాల్లో ఎదురవుతూ ఉంటుంది. వీటిని దాటాలంటే సాహసం చేయాల్సిందే. రెడ్డిగణపవరం, ఇప్పలపాడు, కేఆర్పురం, కన్నాపురం సమీపంలోని పడమర కాల్వ, అల్లికాల్వలతోపాటు చింతకొండ, వీరన్నపాలెం కాల్వలపై అత్యవసరంగా బ్రిడ్జిలు నిర్మించాల్సిన అవసరం ఉందని, ఆ దిశగా ప్రభుత్వం కృషి చేయాలని గిరిజనులు కోరుతున్నారు. నాలుగు బ్రిడ్జిలు నిర్మించిన వైఎస్సార్ ఏజెన్సీప్రాంతంలో వాగుల ప్రవాహానికి అనేక మంది మృతి చెందిన ఘటనలు చోటుచేసుకున్నాయి. వీటిని నివారించేందుకు గతంలో మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు అప్పటి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. ఆ సమయంలో సుమారు రూ.26 కోట్లతో గాడిదబోరు, నందాపురం, రెడ్డిగణపవరం, రౌతుగూడెం, పడమర రేగులకుంట గ్రామాల్లోని మార్గాల్లో హైలెవెల్ బ్రిడ్జిలు నిర్మించారు. వీటి నిర్మాణం వల్ల ఆయా గ్రామాల మధ్యలో రాకపోకలు సులభతరమయ్యాయి. వర్షాకాలంలో ఏజెన్సీలో పొంగుతున్న కొండకాల్వలు, వాగులు పలు గ్రామాల్లో బ్రిడ్జిలు లేక ఆదివాసీల అవస్థలు మృత్యువు పొంచి ఉన్నా.. వాగులు దాటేందుకు సాహసం గిరిజన సమస్యలను పట్టించుకోని పాలకులు, అధికారులు ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. ప్రజలు తమ నిత్యావసర పనులమీద వాటినే దాటే ప్రయత్నం చేస్తున్నారు. దీనివల్ల ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. కొండకాల్వలు ప్రవహించే ప్రధాన రహదారిపై హైలెవెల్ బ్రిడ్జిలు నిర్మించేలా ప్రభుత్వం కృషి చేయాలి. – కారం రాఘవ, న్యూడెమోక్రసీ నాయకుడు, అలివేరు రెడ్డిగణపవరం నుంచి బుట్టాయగూడెం వెళ్లే మార్గంలో ఉన్న జల్లేరువాగు వర్షాకాలంలో ఉధృతంగా ప్రవహిస్తుంది. బిక్కుబిక్కుమంటూనే ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితి. ఈ మార్గంలోనే స్కూల్ బస్లు సైతం తిరుగుతున్నాయి. పై హైలెవెల్ బ్రిడ్జిల నిర్మాణానికి ప్రభుత్వం కృషి చేయాలి. – కోర్సా జంపాలు, మాజీ సర్పంచ్, రెడ్డిగణపవరం -
అత్యవసర వైద్యం.. అందని దైన్యం
భీమవరానికి చెందిన జి.భీమేశ్వరరావు అనే వ్యక్తికి శనివారం రాత్రి గుండె నొప్పి రావడంతో భీమవరంలో గతంలో ఆరోగ్యశ్రీ సేవలందించిన నెట్వర్క్ ఆస్పత్రికి తీసుకువచ్చారు. అక్కడ వైద్యులు పరీక్షించి గుండెకు సంబంధించిన సమస్య ఉందని చెప్పారు. అయితే తమ వద్ద ఆరోగ్యశ్రీ ఉచిత సేవలు లేవని చెప్పారు. భీమవరంలోని మరే నెట్వర్క్ ఆస్పత్రిలోనూ గుండె చికిత్సలు అందించకపోవడంతో చేసేది లేక అదే ఆస్పత్రిలో సొంత ఖర్చులతో వైద్యం చేయించుకున్నారు. పాలకోడేరు మండలం పెన్నాడకి చెందిన ఆరుగుల మహలక్ష్మి అనే వృద్ధురాలికి గురువారం రాత్రి గుండె నొప్పి రావడంతో భీమవరంలో ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. వైద్యులు పరీక్షించి గుండెలో నీరు పట్టిందని, వెంటనే వైద్యం చేయాలన్నారు. భీమవరంలో గుండె చికిత్సకు సంబంధించి ఏ ఆస్పత్రిలో ఆరోగ్యశ్రీ లేకపోవడం, దూరప్రాంతాలకు తీసుకువెళ్లే పరిస్థితి లేకపోవడంతో అదే ఆస్పత్రిలో మహాలక్ష్మికి కుటుంబసభ్యులు సొంత ఖర్చులతో వైద్యం చేయించారు. భీమవరం(ప్రకాశం చౌక్): రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదవాడి ఆరోగ్యానికి భరోసా లేకుండా పోయింది. అపర సంజీవని వంటి ఆరోగ్యశ్రీ సేవలు పూర్తిస్థాయిలో అందడం లేదు. భీమవరంలో ఆరోగ్యశ్రీలో మల్టీ స్పెషాలిటీ సేవలు నిలిపివేయడంతో నెల రోజులుగా భీమవరం, ఉండి, నరసాపురం, పాలకొల్లు, ఆచంట నియోజకవర్గాల ప్రజలు అత్యవసర వైద్యానికి అవస్థలు పడటమే ఇందుకు నిదర్శనం. భీమవరంలోని నెట్వర్క్ ఆస్పత్రుల్లో గుండె, మెదడు, కిడ్నీ, వెన్నెముక తదితర సమస్యలకు సంబంధించి ఆరోగ్యశ్రీ సేవలు లేకపోవడంతో పేద, మధ్య తరగతి ప్రజలు తణుకు, రాజమండ్రి, కాకినాడ, ఏలూరు ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోంది. 80 కిలోమీటర్ల వరకూ దూరం భీమవరం, నరసాపురం, పాలకొల్లు ప్రాంతాల వారికి గుండెపోటు, బ్రెయిన్స్టోక్ వంటి సమస్య తలెత్తితో 50 నుంచి 80 కిలోమీటర్లు వెళ్లి ఆరోగ్యశ్రీ సేవలు పొందాల్సి వస్తుంది. ఎమర్జెన్సీ కేసులు ఉంటే ప్రైవేట్ ఆస్పత్రిలో సొంత ఖర్చులు రూ.లక్షలు వెచ్చించి వైద్యం చేయించుకోవాల్సి వస్తుంది. ఇది పేద, మధ్యతరగతి వర్గాలకు భారంగా మారింది. భీమవరం, నరసాపురం, పాలకొల్లు, తణుకు ప్రభుత్వాస్పత్రుల్లో కూడా గుండె, మెదడుకు సంబంధించి అత్యవసర వైద్యం అందుబాటులో లేదు. తాడేపల్లిగూడెం, తణుకులో మాత్రమే నెట్వర్క్ ఆస్పత్రుల్లో సౌకర్యం ఉంది. ప్రజారోగ్యంపై కూటమి నిర్లక్ష్యం భీమవరంలో నెల రోజులుగా మల్టీస్పెషాలిటీ వైద్యసేవలు నిలిచిపోయినా కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఐదు నియోజవర్గాల్లో కూటమి ఎమ్మెల్యేలు ఉన్నా సేవల పునరుద్ధరణ, ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించడం లేదు. గత ప్రభుత్వంలో పక్కాగా అమలు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ సేవలు పూర్తిస్థాయిలో అందాయి. జిల్లాలోని అన్ని ప్రాంతాల ప్రజలకు అందుబాటులో మల్టీ స్పెషాలిటీ సేవలు ఉచితంగా అందించేవారు. కార్డియాక్, న్యూరో సమస్యలకు సంబంధించి నెట్వర్క్ ఆస్పత్రులు ఉండేవి. అలాగే ఆరోగ్యశ్రీలో సేవలు పొందిన వారికి ఆరోగ్య ఆసరా పేరిట నగదు సాయం కూడా అందించేవారు. అయితే ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ సేవలు నిర్వీర్యం అవడంతో పాటు ఆరోగ్య ఆసరా పథకం అమలు కావడం లేదు. వైద్య సేవ.. అందని తోవ నెల రోజులుగా ఆరోగ్యశ్రీ సేవలు దూరం భీమవరంలో మల్టీ స్పెషాలిటీ వైద్యం నిల్ గుండె, మెదడు వైద్యానికి దూర ప్రాంతాలకు వెళ్లాల్సిందే.. లేదంటే రూ.లక్షల్లో వెచ్చించాల్సిందే.. పేదవాడి ప్రాణాలతో ఎన్టీఆర్ వైద్యసేవ ట్రస్టు చెలగాటం -
శ్రీగంధం స్మగ్లింగ్ గ్యాంగ్ అరెస్ట్
జంగారెడ్డిగూడెం: శ్రీగంధం స్మగ్లింగ్ చేసే మధ్యప్రదేశ్కు చెందిన ఆదివాసీ గ్యాంగ్ను అరెస్టు చేసినట్లు జంగారెడ్డిగూడెం డీఎస్పీ యు.రవిచంద్ర వెల్లడించారు. నిందితుల నుంచి 30 శ్రీగంధం చెక్కల దుంగలు, రెండు మోటార్సైకిళ్లు, గొడ్డలి, రంపాలు 3, బంగారపు చైన్ 2 కాసులు, రూ.వెయ్యి నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు. వీటి మొత్తం విలువ రూ.5.50 లక్షలు ఉంటుందని చెప్పారు. బుధవారం స్థానిక పోలీసు సర్కిల్ కార్యాలయంలో ఆయన వివరాలు వెల్లడించారు. పగలు పూసలు విక్రయిస్తూ రెక్కీ మధ్యప్రదేశ్ నుంచి వచ్చిన నిందితులు రోడ్డు పక్కన టెంట్లు వేసుకుని పగలు పూసలు, రుద్రాక్షలు విక్రయిస్తున్నట్లు నటిస్తూ రెక్కీ నిర్వహించి రైతుల పొలాల్లో శ్రీగంధం చెట్లను గుర్తిస్తారు. రాత్రి సమయాల్లో ఆ రైతుల పొలాల్లో ఉన్న శ్రీగంధం చెట్లను నరికి స్మగ్లింగ్ చేస్తుంటారు. కామవరపుకోట మండలం రత్నగిరి గ్రామానికి చెందిన రైతు తమ్మినేని సూర్యచంద్ర వరప్రసాద్ పొలంలో శ్రీగంధం చెట్లను నరుకుతుండగా అడ్డుకునేందుకు ప్రయత్నించాడు. స్మగ్లింగ్ గ్యాంగ్ రైతుని బెదిరించి అతని వద్ద నుంచి రెండు కాసుల బంగారపు చైన్ లాక్కొని పోయారు. దీంతో అతను ఇచ్చిన ఫిర్యాదు, గతంలో ఆయా మండలాల నుంచి రైతులు ఇచ్చిన ఫిర్యాదులు మేరకు పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు. ప్రత్యేక బృందం ఏర్పాటు శ్రీగంధం స్మగ్లింగ్ గ్యాంగ్ను పట్టుకునేందుకు ఎస్పీ కేపీఎస్ కిషోర్ ఆదేశాలపై డీఎస్పీ యు.రవిచంద్ర ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం సీఐ కె.సుభాష్ పర్యవేక్షణలో తడికిలపూడి ఎస్సై చెన్నారావు, జంగారెడ్డిగూడెం ఎస్సై షేక్ జబీర్, క్రైం పార్టీ ఏస్సై ఎన్వీ సంపత్కుమార్, కానిస్టేబుళ్లు ఎన్.రమేష్, చిట్టిబాబు, షేక్ షాన్బాబులతో ప్రత్యేక బృందం ఏర్పాటు చేశారు. విస్తృతంగా గాలించిన ప్రత్యేక బృందం నిందితులైన మధ్యప్రదేశ్ రాష్ట్రం కటని టౌన్, జిల్లా హర్దువా గ్రామానికి చెందిన ఆదివాసీ రాజా, ఇలాజ్కుమార్, జెండు, పెన్కుమార్ను అరెస్టు చేశారు. వీరిపై గత నాలుగేళ్లుగా జిల్లాలోని చింతలపూడిలో 2, కామవరపుకోటలో 2, టి.నరసాపురంలో 3, ధర్మాజీగూడెంలో 1, పెదవేగిలో 2, ముసునూరు మండలంలో 2 కలిపి మొత్తం 12 కేసులు నమోదయ్యాయి. కేసు చేధించడంలో ప్రతిభ చూపిన సీఐ, ఎస్సైలు, సిబ్బందికి రివార్డుకోసం ఎస్పీకి సిఫార్సు చేయనున్నట్లు డీఎస్పీ చెప్పారు. సమావేశంలో సీఐ ఎంవీ సుబాష్, ఎస్సైలు చెన్నారావు, షేక్జబీర్, ఏఎస్సై ఎన్వీ సంపత్కుమార్ సిబ్బంది పాల్గొన్నారు. నిందితులంతా మధ్యప్రదేశ్కు చెందిన వారు రూ. 5.50 లక్షల విలువైన సొత్తు స్వాధీనం వివరాలు వెల్లడించిన డీఎస్పీ -
వీవోఏల సమస్యలు పరిష్కరించాలి
వీవోఏల సమస్యలు పరిష్కరించాలి భీమవరం: వీవోఏల సమస్యలు పరిష్కరించాలంటూ భీమవరం వెలుగు కార్యాలయం వద్ద మంగళవారం ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయు జిల్లా సహాయ కార్యదర్శి పీవీ ప్రతాప్ మాట్లాడుతూ.. ప్రభుత్వం వీవోఏలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చడంలో ఘోరంగా విఫలమైందన్నారు. స్వయం సహాయక బృందాలను ఏర్పాటు చేసి ప్రభుత్వం ద్వారా వారికి రుణాలు అందించే ప్రక్రియలో కీలక పాత్ర పోషిస్తున్న వీవోఏలు కేవలం సభల జన సమీకరణ విషయంలోనే గుర్తుకు వస్తున్నారని దుయ్యబట్టారు. వీవోఏలకు నెలల తరబడి జీతాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సీఐటీయు జిల్లా నాయకుడు ఎం.ఆంజనేయులు మాట్లాడుతూ పాలకులు చెప్పుకుంటున్నట్లు రాష్ట్రంలో ప్రభుత్వ పాలన గొప్పగా ఉంటే ప్రజలు రోడ్డెక్కి ఎందుకు ఆందోళన చేస్తున్నారని ప్రశ్నించారు. కార్యక్రమంలో వీవోఏల సంఘం జిల్లా కార్యదర్శి నిర్మలాదేవి తదితరులు మాట్లాడారు. అనంతరం వెలుగు పీడీకి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా నాయకుడు ఇంజేటి శ్రీనివాస్, వీవోఏల సంఘం జిల్లా అధ్యక్షురాలు నాగిడి గోవిందమ్మ, జి.లక్ష్మి, ఎ.సుబ్బలక్ష్మి, పుష్పలత, రమ్య తదితరులు పాల్గొన్నారు.కండక్టర్పై కక్ష సాధింపా?జంగారెడ్డిగూడెం: ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం ఆర్టీసీ డిపోలో విధులు నిర్వర్తిస్తున్న మహిళా కండక్టర్ వై.కుసుమ కుమారికి మంగళవారం విధులు కేటాయించలేదు. ఉచిత బస్సు ప్రయాణం కల్పించిన తరువాత బస్సుల్లో మహిళలు పరిమితికి మించి ప్రయాణించడంతో కండక్టర్లు పడుతున్న ఇబ్బందులపై కుసుమకుమారి ఒక వీడియోలో తన ఆవేదన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఆర్టీసీ అధికారులు విచారణ చేపట్టినట్టు తెలిసింది. విచారణ పూర్తయ్యేవరకు విధులు కేటాయించకూడదని నిర్ణయించినట్టు సమాచారం. మంగళవారం డిపోలో ఆమెను విచారణ చేసిన అధికారులు.. ఆమె స్టేట్మెంట్ను రికార్డు చేసి నివేదిక తీసుకున్నట్టు తెలిసింది. ఆ నివేదికను ఆర్టీసీ ఉన్నతాధికారులకు పంపించనున్నట్టు సమాచారం.ఐటీఐ సీట్లకు దరఖాస్తుల ఆహ్వానంఉండి: జిల్లాలోని ఉండి మండలం ఎన్నార్పీ అగ్రహారం, ఆచంటలోని రెండు ప్రభుత్వ ఐటీఐల్లో మిగిలిపోయిన సీట్ల కోసం ఈ నెల 27 సాయంత్రం 5 గంటలలోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ఐటీఐ జిల్లా కన్వీనర్, ప్రిన్సిపల్ డీ ఆనంద్ వేణుగోపాల్ మంగళవారం తెలిపారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు సమీపంలోని ప్రభుత్వ ఐటీఐల్లో ఒరిజినల్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేయించుకుని తప్పనిసరిగా రసీదు పొందాలన్నారు. ఈ నెల 29న నిర్వహించే కౌన్సెలింగ్ సమయంలో రసీదు తప్పనిసరిగా చూపించాలన్నారు. 8వ తరగతి పాస్, పదో తరగతి ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం వెల్డర్ ట్రేడ్లో అవకాశం ఉందన్నారు. మరిన్ని వివరాలకు 9666407468 నెంబరులో సంప్రదించాలన్నారు.వేగా జ్యువెలర్స్ ఆషాఢం విజేతలుఏలూరు (ఆర్ఆర్పేట): వేగా జ్యువెలర్స్ ఏలూరు షోరూంలో ఆషాఢ మాసం సందర్భంగా నిర్వహించిన లక్కీడిప్లో గెలుపొందిన విజేతల పేర్లను మంగళవారం ప్రకటించింది. లక్కీ డ్రాలో జగ్గవరానికి చెందిన వి.వీరభద్రరావు, ఏలూరుకు చెందిన ఎస్.సతీష్కుమార్, జి.రమేష్, దుగ్గిరాలకు చెందిన వి.సత్యప్రియ, ఏలూరుకు చెందిన బి.శారద గెలుపొందారని తెలిపింది. ఈ సందర్భంగా సంస్థ చైర్మన్ బండ్లమూడి రామ్మోహన్, మేనేజింగ్ డైరక్టర్ నవీన్ వనమా మాట్లాడుతూ ఆఫర్ల కాలంలో ఆభరణాలు కొనుగోలు చేసిన ఖాతాదారులకు లక్కీ డ్రా తీసి విజేతలను ప్రకటిస్తున్నామని చెప్పారు. అనంతరం విజేతలకు రూ.2 లక్షల విలువైన బంగారు/డైమండ్ నెక్లెస్లు బహుమతిగా అందజేశారు. వేగా జ్యువెలర్స్ అన్ని షోరూంలలో రాబోయే దసరా, దీపావళి పండుగలకు, వివాహ వేడుకల కోసం సరికొత్త డిజైన్ల ఆభరణాలను విస్తృత శ్రేణుల్లో అందుబాటులో ఉంచినట్టు సంస్థ ప్రతినిధి తెలిపారు. -
కుండపోత వాన
సమస్యలు పరిష్కరించాలి రాష్ట్రంలో విద్యుత్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను వెంటనే పరిష్కరించాలని విద్యుత్ ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర నాయకులు డిమాండ్ చేశారు. 8లో uబుధవారం శ్రీ 17 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025సాక్షి, భీమవరం: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో రెండు రోజులుగా జిల్లా అంతటా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. మంగళవారం ఎడతెరిపిలేకుండా కుండపోతగా వర్షం కురవడంతో పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో జనజీవనం స్తంభించింది. జిల్లా వ్యాప్తంగా 41.6 మి.మీ వర్షపాతం నమోదుకాగా అత్యధికంగా తాడేపల్లిగూడెంలో 62.4 మి.మీ వర్షపాతం నమోదైంది. ఉదయం ఏడు గంటల ప్రాంతంలో మొదలైన వర్షం మధ్యాహ్నం వరకు ఏకధాటిగా పడుతూనే ఉంది. పల్లపు ప్రాంతాలు నీటమునిగాయి. తాడేపల్లిగూడెం, ఆచంట, భీమవరం, తణుకు నియోజకవర్గాల్లో భారీగా మిగిలిన చోట్ల మోస్తరుగా వర్షం కురిసింది. పెనుమంట్ర ప్రాంతంలో 59.4 మి.మీ వర్షం కురవగా, ఇరగవరంలో 48.6, గణపవరంలో 36.4, పెంటపాడులో 35.6, భీమవరం, ఉండిలో 25.6 మి.మీ చొప్పున, తణుకులో 24.4, పెనుగొండలో 21.2, అత్తిలిలో 13.2 మి.మీ వర్షం కురిసింది. తెరిపివ్వకుండా వర్షం పడడంతో అధిక శాతం మంది ఇళ్లకే పరిమితం కాగా విద్యాసంస్థలు, ఆఫీసులకు వెళ్లేవారు రాకపోకలు సాగించేందుకు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. జనం లేక మార్కెట్లు వెలవెలబోయాయి. భీమవరం, తాడేపల్లిగూడెం, పాలకొల్లు ఆర్టీసీ బస్టాండుల వద్ద మోకాలు లోతు నీటితో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. రోడ్లపై గోతులు కనిపించక పలుచోట్ల ద్విచక్ర వాహనచోదకులు ప్రమాదాలు పాలయ్యారు. భీమవరంలో నీట మునిగిన రోడ్లు భీమవరంలో ఉదయం 6 గంటలకు వర్షం చినుకులుగా ప్రారంభమై తరువాత సుమారు మూడు గంటల పాటు ఎడతెరపిలేకుండా భారీ వర్షం కురవడంతో పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి. పట్టణంలోని హౌసింగ్ బోర్డు, బ్యాంక్ కాలనీలు, ఏఎస్ఆర్ నగర్, మెంటేవారితోట, నాచువారిసెంటర్, గునుపూడి, ఫైర్స్టేషన్ ప్రాంతాల్లో రోడ్లపై వర్షం నీరు నిలిచిపోవడంతో ప్రయాణికులు, ప్రజల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వర్షం కారణంగా రోడ్ల పక్కన తోపుడు బండ్ల వ్యాపారం చేసుకుని జీవించే చిరువ్యాపారులు నష్టపోయారు. పట్టణంలోని గరగపర్రురోడ్డు, మెంటేవారితోట, ఎఫ్సీఐ తదితర ప్రాంతాల్లోని రైల్వే అండర్పాస్ల్లో వర్షపు నీరు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. వీరవాసరం – వడ్డిగూడెం వెళ్లే ప్రధాన రహదారిపై రెండు భారీ వృక్షాలు పడిపోవడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మండలంలోని పలుచోట్ల విద్యుత్ స్తంభాలు గాలికి ఒరిగిపోయారు. లోతట్టు ప్రాంతాలు జలమయం స్తంభించిన జనజీవనం జిల్లాలో 20 మి.మీ వర్షపాతం నమోదు అత్యధికంగా తాడేపల్లిగూడెంలో 62.4 మి,మీ వర్షం -
కై కలూరులో కొల్లి అరాచకం
సాక్షి ప్రతినిధి, ఏలూరు: అధికార పార్టీ నేత కొల్లి బాబి అరాచకాలకు తాత్కాలిక బ్రేక్ పడింది. మాజీ మంత్రి, కై కలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ అండదండలతో పేట్రేగిపోతున్న బాబి దళిత ఉద్యమంతో దిగొచ్చాడు. దాడులు, దౌర్జన్యాలు, దందాలతో నిత్యం వివాదాస్పద వ్యక్తిగా ఉండే బాబి తాజాగా కై కలూరు మండలం దానిగూడెంలో దళిత యువకులపై దాడిలో కీలక వ్యక్తి. ఘటన జరిగాక పోలీసులు పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో దళిత సంఘాలు రోడ్డెక్కి తీవ్ర ఆందోళనకు దిగాయి. కామినేని డైరెక్షన్లో పరారైన కొల్లి 12 రోజులు తరువాత ఏలూరు డీఎస్పీ కార్యాలయంలో లొంగిపోయాడు. జనసేన కార్యకర్తగా ప్రస్థానం ప్రారంభించి షాడో ఎమ్మెల్యే తరహాలో కై కలూరులో ప్రతి వివాదానికి కేరాఫ్ అడ్రస్గా మారాడు. కై కలూరుకు చెందిన కొల్లి వరప్రసాద్ అలియాస్ బాబి జనసేనలో క్రియాశీలక కార్యకర్తగా కొనసాగుతూ గత ఎన్నికల్లో నియోజకవర్గంలో జనసేన ఎలక్షన్ ఇన్చార్జిగా పనిచేశాడు. పేరుకే జనసేన అయినప్పటికీ 24 గంటలూ ఎమ్మెల్యే కామినేని వెంటే ఉంటూ దందాలు కొనసాగించాడు. గతంలోనూ కొల్లి బాబిది వివాదాస్పద వైఖరి. దళితుల ఉద్యమంతో లొంగుబాటు ఈ నెల 5న కై కలూరు శివారులోని దానిగూడెం దళితవాడలో ఇద్దరు యువకులపై జనసేన కార్యకర్తలు హత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ కేసులో 8 మందిని అరెస్టుచేశారు. ప్రధాన సూత్రధారిగా ఉన్న కొల్లి బాబి.. కామినేని డైరెక్షన్తో పరారయ్యాడు. దళితులు రోడ్డెక్కి ఆందోళన చేయడం, సామాజిక వర్గాల పోరుగా మారడం, ఇతర ప్రాంతాల నుంచి దళిత సంఘాలు కీలక నేతలు వచ్చి పరామర్శించి పోలీసుల తీరుపై మండిపడుతున్న క్రమంలో 12 రోజులుగా పరారీలో ఉండి మంగళవారం మధ్యాహ్నం ఏలూరు డీఎస్పీ కార్యాలయంలో లొంగిపోయాడు. లొంగిపోవడానికి ముందు సోషల్ మీడియాలో ప్రత్యేకంగా వీడియో పోస్టు చేశాడు. బయటకు వచ్చిన తరువాత కొల్లి బాబి 2.0 చూపిస్తానని, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు సంగతి తేలుస్తానంటూ బెదిరింపులకు దిగడం గమనార్హం. కామినేని అండతో రెచ్చిపోతున్న వైనం కూటమి అధికారంలోకి వచ్చాక దందాలు, దాడులు దానిగూడెం దళితులపై దాడి ఘటనలో కొల్లి కీలక సూత్రధారి 12 రోజుల పరారీ తరువాత లొంగిపోయిన వైనం కామినేని డైరెక్షన్తోనే పోలీసుల ఎదుట లొంగుబాటు! బయటకు వచ్చాక కొల్లి బాబి 2.0 చూపిస్తానంటూ బెదిరింపులు పదేళ్ళ క్రితం అటవీశాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగిగా పనిచేస్తూ కృష్ణా, ఏలూరు జిల్లాల్లో అటవీ శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ 25 మందికిపైగా మోసం చేసి డబ్బులు వసూలు చేసిన ఘటనలో అతనిపై కేసు నమోదైంది. సుమారు 7 చీటింగ్ కేసులు, 3 చెక్బౌన్స్ కేసులున్నాయి. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో ఏ–2గా కొల్లి ఉన్నాడు. కూటమి ప్రభుత్వం వచ్చిన సమయంలో కై కలూరులో చెలరేగిపోతాడు. గతేడాది కూటమి అధికారంలోకి రాగానే మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు హయాంలో చేసిన పనులకు సంబంధించిన శిలాఫలకాల తొలగింపుతో దౌర్జన్యకాండ మొదలుపెట్టాడు. మార్చి 27న కై కలూరు వైస్ ఎంపీపీ ఎన్నిక సందర్భంగా భుజబలపట్నంలో ఎంపీటీసీ ఇంటి వద్ద జరిగిన ఘర్షణను చిత్రీకరిస్తున్న స్థానిక జర్నలిస్టు కురెళ్ళ కిషోర్పై బాబి, అతని అనుచరులు దాడి చేశారు. ఆ తరువాత టీడీపీకి చెందిన రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ పైడిమర్రి మాల్యాద్రి కార్యాలయంపై జరిగిన దాడి కొల్లి డైరెక్షన్లో జరిగినట్లు ఆరోపణలున్నాయి. కై కలూరులో కాల్మనీ కేసులో దంపతులపై దాడి, ఫ్లెక్సీ ప్రింటింగ్ డబ్బులు అడిగినందుకు షాపు యజమానిని భయపెట్టిన సంఘటన, మార్కెట్ సమీపంలోని ఓ ఎలక్ట్రికల్ షాపుపై దాడి చేసి షాపు తాళాలు వేసిన ఘటన ఇలా చాలా ఘటనల్లో అతని ప్రమేయముంది. ప్రేమ పెళ్లి చేసుకుని తిరిగి వస్తున్న ప్రేమ జంటపై దాడి చేయడం, అయ్యప్ప మాలలో ఉన్న వ్యక్తిపై దాడి ఘటన, ఏలూరుకు చెందిన జర్నలిస్టు ఉర్ల శ్రీనివాస్ కారును అవసరాలకు తీసుకుని అమ్మేసిన ఘటన, సంతమార్కెట్ వద్ద విశ్రాంత రైల్వే ఉద్యోగిపై దాడి ఇలా అనేక ఘటనల్లో కీలక వ్యక్తి. నియోజకవర్గంలో ఎమ్మెల్యే కామినేని అండతో అక్రమ మైనింగ్, మద్యం విక్రయాలతో పాటు పేకాట శిబిరాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తుంటాడు. -
ప్రభుత్వమే వైద్య కళాశాలలు నడపాలి
పాలకొల్లు సెంట్రల్: ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటు పరం చేయడమంటే విద్యను వ్యాపారం చేయడమేనని సీపీఎం జిల్లా కార్యదర్శి జేఎస్వి గోపాలన్ మండిపడ్డారు. మంగళవారం దగ్గులూరు మెడికల్ కళాశాలను సందర్శించారు. ఈ సందర్భంగా గోపాలన్ మాట్లాడుతూ ప్రభుత్వమే వైద్య కళాశాలను నిర్వహించాలని డిమాండ్ చేశారు. నాడు మెడికల్ కళాశాల నిర్మాణం కోసం 60 ఎకరాల భూమిని కొనుగోలు చేశారని తెలిపారు. ల్యాండ్ ఫిల్లింగ్ పూర్తిచేసి ఫౌండేషన్ ప్రాథమిక స్థాయిలో ఉందన్నారు. ప్రభుత్వం మారడంతో పనులు ఆగాయని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సుమారు సంవత్సరంన్నర కావస్తున్నా ఇంతవరకూ నిర్మాణం పనులు కొనసాగించలేదన్నారు. ప్రైవేటు వాళ్లకు అప్పగించడం అన్యాయమన్నారు. ఇప్పటికే విద్యారంగం ప్రైవేటు పరమైందని, దీనివల్ల విద్యార్థుల తల్లిదండ్రులు అప్పులపాలవుతున్నారన్నారు. ప్రభుత్వమే ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టాలని చూడడం దారుణన్నారు. దీనివల్ల విద్య మరింత ఖరీదుగా మారుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. ప్రభుత్వమే కళాశాలలను నడపాలని లేదంటే ప్రజా ఉద్యమం లేవనెత్తుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు కానేటి బాలరాజు, జవ్వాది శ్రీనివాస్, బాతిరెడ్డి జార్జి, కె క్రాంతిబాబు, గొల్ల ఏడుకొండలు, టి.శ్రీనివాస్, ఎస్.మాణిక్యం, వీరభద్రం తదితరులు పాల్గొన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి డిమాండ్ -
ఉపాధ్యాయుల నిరసన
భీమవరం: ఉపాధ్యాయుల ఆర్థిక, విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్(ఏపీటీఎఫ్)ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద మంగళవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు జి.ప్రకాశం మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి 15 నెలలు పూర్తయినా ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని ఆందోళన వ్యక్తంచేశారు. ఇప్పటికే రెండేళ్లు పూర్తయిపోయినా పీఆర్సీ కమిషన్ వేయకపోవడం శోచనీయమని వెంటనే కమిషన్ వేసి 30 శాతం మధ్యంతర భృతి ప్రకటించాలని, పెండింగ్లో ఉన్న నాలుగు డీఏలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రధాన కార్యదర్శి బీవీ నారాయణ మాట్లాడుతూ సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని, కేంద్రం మెమో నెంబర్ 57 ప్రకారంగా 2003 డీఎస్సీ వారికి పాత పెన్షన్ విధానం అమలు చేయాలని, అన్ని రకాల బకాయిలు వెంటనే చెల్లించాలని కోరారు. జిల్లా గౌరవ అధ్యక్షుడు పీఎన్వీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
ఆక్వా జోన్ సర్వే పూర్తి చేయాలి
భీమవరం (ప్రకాశంచౌక్): జిల్లాలో ఆక్వా జోన్ సర్వేను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో జాయింట్ కలెక్టర్ ఆక్వా జోన్ సర్వేపై జిల్లాలోని మత్స్య శాఖ అధికారులతో సమీక్షించారు. అన్ని మండలాల్లో సర్వే పూర్తి చేసి నివేదికలు అందజేస్తామన్నారు. జిల్లాలో 1,32,562.72 ఎకరాల విస్తీర్ణంలో ఆక్వా సాగు చేస్తున్నారని, వీటిలో 1,04,792.5 ఎకరాలు మాత్రమే ఆక్వా జోన్ పరిధిలో ఉన్నాయని తెలిపారు. ముంపు, తక్కువ సారం కలిగిన వ్యవసాయ భూములు, ఆక్వా చెరువుల చుట్టూ వున్న భూముల్లో ఆక్వా సాగు అనుకూలంగా మరో 6,540 ఎకరాలను సర్వేలో గుర్తించారన్నారు. పోలవరం రూరల్: రెండు నెలలుగా గోదావరి వరద పెరుగుతూ తగ్గుతూ ఒకే విధంగా కొనసాగుతోంది. ఎగువ ప్రాంతంలో భారీ వర్షాలకు నదిలోకి నీరు చేరడంతో వరద ఉధృతి కొనసాగుతోంది. పోలవరం స్పిల్ వే వద్ద 31.6 మీటర్లకు నీటిమట్టం చేరుకుంది. 48 గేట్ల నుంచి 7.69 క్యూసెక్కుల వరద దిగువకు చేరుతోంది. దిగువన వరద ప్రవాహం ఇంకా కొనసాగుతోంది. భద్రాచలం వద్ద సోమవారం 40 అడుగులకు చేరుకున్నప్పటికీ మంగళవారం సాయంత్రానికి 37.70 అడుగుకుల నీటిమట్టం చేరుకుంది. -
ఉద్యాన పంటల్లో సస్యరక్షణ
అధిక వర్షాల నేపథ్యంలో ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లే అవకాశం ఉందని, సస్యరక్షణ చర్యలు చేపట్టాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. 8లో u● పాలకొల్లు పట్టణంలోని హౌసింగ్బోర్డు కాలనీ, బస్టాండ్ సెంటర్, సలాదివారి తోట, బంగారువారి చెరువుగట్టు, బ్రాడీపేట తదితర చోట్ల రోడ్లు జలమయమయ్యాయి. బస్టాండ్లో మోకాలులోతు నీటితో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ● పెనుగొండ, ఆచంట, పెనుమంట్ర, పోడూరు మండలాల్లో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఏకధాటిగా వర్షం పడడంతో రోడ్లన్నీ వర్షపునీటితో నిండిపోయాయి. పెనుగొండ, గటాలదిబ్బ, సిద్ధాంతంలో జగనన్న కాలనీలు జలమయం కావడంతో స్థానికులు ఇబ్బందులు పడ్డారు. ● ఇరగవరం మండలంలో కత్తవపాడులోని ఎస్సీ కాలనీ, రేలంగిలోని ఇందిరానగర్లు జలమయమయ్యాయి. ఇరగరవరం మెయిన్రోడ్డులో డ్రెయినేజీ పనులు జరుగుతుండంతో ఇళ్ల ముందు వర్షపు నీరు నిలిచిపోయి స్థానికులు ఇబ్బందులు పడ్డారు. ఇరగవరం గొంతేరు డ్రెయిన్లో గరిగమ్మలకాలువ, పేకేరులో నక్కల కాలువలు పొంగి ప్రవహిస్తున్నాయి. ● తాడేపల్లిగూడెంలో తెల్లవారుజామునుంచి భారీ వర్షం కురిసింది. జిల్లాలో అత్యధికంగా 62.4 మి.మీ. భారీ వర్షపాతం నమోదైంది. దీని వల్ల పట్టణంలోని రహదారులు నీట మునిగాయి. పల్లపు ప్రాంతాల్లోకి నీరు చేరింది. తాడేపల్లిగూడెం మండలం మెట్ట ప్రాంతాల్లోని వరికోతలకు విఘాతం ఏర్పడింది. -
పత్రికా స్వేచ్ఛకు విఘాతం
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి పత్రికా స్వేచ్ఛకు తీవ్ర విఘాతం ఏర్పడింది. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే పత్రికా స్వేచ్ఛను హరించే విధంగా కేసులు నమోదు చేయడం దారుణం. జర్నలిస్టులపైనే కాకుండా ఎడిటర్లపై కూడా కేసులు పెట్టడానికి కూటమి సర్కారు వెనుకాడడం లేదు. ప్రభుత్వంపై పెరుగుతున్న ప్రజా వ్యతిరేకతను తట్టుకోలేక పత్రికలపై దాడికి తెగబడుతున్నారు. – కంభం విజయరాజు, వైఎస్సార్ సీపీ చింతలపూడి నియోజకవర్గ కన్వీనర్ -
క్రికెట్ జట్టు ఎంపిక వాయిదా
ఏలూరు రూరల్: ఈ నెల 18వ తేదీన భీమవరం డీఎన్ఆర్ కళాశాల ఆవరణలో నిర్వహించనున్న ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా అండర్–14 బాలుర క్రికెట్ జట్టు ఎంపిక పోటీలు అధిక వర్షాల కారణంగా వాయిదా వేసామని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా త్రిసభ్య కమిటీ సభ్యుడు ఎస్కే షాకిర్హుస్సేన్ ఓ ప్రకటనలో తెలిపారు. తదుపరి ఎంపిక తేదీలను త్వరలో ప్రకటిస్తామని వెల్లడించారు.ఎలుకల మందు తిని మహిళ మృతి ఆకివీడు: ఎలుకల మందు తిని ఓ మహిళ మృతి చెందింది. ఎస్సై నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం కలిదిండి మండలం ఇవరంపాడు గ్రామానికి చెందిన స్వాతికి రెండేళ్ల కిందట వివాహమైంది. భర్తతో గొడవపడి మరో వ్యక్తితో సహజీవనం గడుపుతున్న ఆమె స్థానిక పెద్దపేటలో నివసిస్తోంది. ఈనెల 10వ తేదీన ఎలుకల మందు తిని అపస్మారక స్థితిలో పడి ఉన్న ఆమెను స్థానిక ప్రైవేటు ఆసుపత్రిలో, అనంతరం మెరుగైన వైద్యం కోసం ఆకివీడు ఆ తరువాత ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం ఆమె మృతి చెందింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చెప్పారు.హత్య కేసులోముద్దాయికి జైలుకామవరపుకోట, ఏలూరు (టూటౌన్): హత్య కేసులో నేరం రుజువు కావడంతో ముద్దాయికి నాలుగేళ్ల జైలు శిక్ష విధిస్తూ కోర్టు మంగళవారం తీర్పు వెలువరించింది. తడికలపూడి ఎస్సై పి.చిన్నారావు తెలిపిన వివరాల ప్రకారం 2024 సంవత్సరంలో రావికంపాడు గ్రామంలోని రామాలయం ఎదురుగా ఉన్న మండపంలో ఇస్సాక్ అనే వ్యక్తి మద్యం సేవించి నిద్రించాడు. లేచిన తరువాత తన ఫోన్ కనిపించకపోవడంతో అక్కడే నిద్రించి ఉన్న అదే గ్రామానికి చెందిన మద్దిపట్ల నాగేశ్వరరావును సెల్ ఫోన్ తీసావా అని అడగడంతో వారి ఇద్దరి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. అనంతరం నిందితుడు నాగేశ్వరరావు పాత గొడవల నేపథ్యంలో ఇస్సాకుపై కక్ష పెంచుకుని అక్కడే ఉన్న కరత్రో ఇస్సాకును కొట్టి తీవ్రంగా గాయపరచడంతో అతను మృతి చెందాడు. దీనిపై అప్పటి తడికలపూడి ఎస్సై ఎం.జయబాబు కేసు నమోదు చేసి నిందితుడు నాగేశ్వరరావును అరెస్ట్ చేశారు. ఈ కేసులో అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ డీవీ రామాంజనేయులు, చింతమనేని రమేష్ వాదనలు వినిపించగా నేరం రుజువు కావడంతో ఏలూరు ఐదవ అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి ఆర్వీవీఎస్ మురళీకృష్ణ ముద్దాయి నాగేశ్వరరావుకి నాలుగేళ్ల జైలు శిక్ష, వెయ్యి రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించినట్లు ఎస్సై చెన్నారావు తెలిపారు. -
శ్రీవారి క్షేత్రంలో ‘ఉట్టి’ ఉత్సవం
ద్వారకాతిరుమల: శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను పురస్కరించుకుని ద్వారకాతిరుమల చినవెంకన్న దివ్య క్షేత్రంలో మంగళవారం సాయంత్రం జరిగిన ఉట్లు పండుగ, శ్రీవారి తిరువీధి సేవ భక్తులకు నేత్రపర్వమైంది. ముందుగా ఆలయంలో స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను రాజాధిరాజ వాహనంపై ఉంచి అర్చకులు విశేష పుష్పాలంకారాలు చేసి పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి వాహనం ఆలయ ప్రధాన రాజగోపురం మీదుగా క్షేత్ర పురవీధులకు పయనమైంది. తొలుత స్వామివారి కల్యాణ మండపం వద్ద ఏర్పాటు చేసిన ఉట్టిని యువకులు ఆనందోత్సాహాల నడుమ కొట్టారు. ఉట్టికొట్టిన యువకుడిని ఆలయ ఈఓ ఎన్వీఎస్ఎన్ మూర్తి అభినందించారు. ఆ తరువాత స్థానిక తూర్పు వీధి, పలు కూడళ్లలో ఏర్పాటు చేసిన ఉట్లను యువకులు ఉత్సాహంగా కొట్టారు. ఈ సందర్భంగా తూర్పు వీధిలో పలువురు చిన్నారులు చిన్ని కృష్ణుడు, గోపికల వేషధారణలతో సందడి చేశారు. -
విద్యుత్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
ఏలూరు (ఆర్ఆర్పేట): రాష్ట్రంలో విద్యుత్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను వెంటనే పరిష్కరించాలని విద్యుత్ ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక శుభలేఖ కళ్యాణ మండపంలో విద్యుత్ ఉద్యోగుల జేసీ రాష్ట్ర సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర నాయకులు మాట్లాడుతూ కార్మిక సంఘాలు గతంలో ఉద్యమాల ద్వారా సాధించుకున్న ప్రయోజనాలను ఉపసంహరిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా డిస్ట్రిబ్యూషన్ కంపెనీల యాజమాన్యం కార్మిక చట్టాలకు, విద్యుత్ బోర్డ్ విభజనకు ముందు ఉద్యోగ సంఘాలతో కుదుర్చుకున్న త్రైపాక్షిక ఒప్పందానికి విరుద్ధంగా గత ఆరు దశాబ్దాల నుంచి అమలులో ఉన్న సర్వీస్ నిబంధనలను ఏకపక్షంగా మార్పులు చేస్తున్నారని ఆరోపించారు. త్రైపాక్షిక ఒప్పందం ప్రకారం బోర్డు విభజనకు ముందు అమలులో ఉన్న సర్వీస్ నిబంధనలు, పని ప్రమాణాలు, కారుణ్య నియామకాలు తదితర ప్రయోజనాలు యథావిధిగా కొనసాగుతాయని, ఏవైనా మార్పులు చేయాలంటే ఉద్యోగ సంఘాలతో చర్చించి ప్రస్తుత ప్రయోజనాలకు భంగం వాటిల్లకుండా పరస్పర అవగాహనతో ఒప్పందాలు చేస్తామని చెప్పారని గుర్తు చేశారు. అదే విధంగా జీతభత్యాల విషయంలో ప్రస్తుతం అమలులో ఉన్న పరస్పర చర్చల ద్వారా వేతనాలు నిర్ణయించే పద్ధతి ఇకముందు ఏర్పడబోయే సంస్థల్లో కూడా కొనసాగిస్తామని త్రైపాక్షిక ఒప్పందంలో స్పష్టంగా పేర్కొన్నారన్నారు. కానీ ఇందుకు భిన్నంగా 2022 వేతన సవరణపై నిర్ణయాల కోసం గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక మాజీ ఐఏఎస్ అధికారిని నియమించారన్నారు. పూర్వం నుంచి అమలులో ఉన్న ‘వెయిటేజ్’ ఫార్ములాను రద్దుచేసి, అతి తక్కువ శాతం (8శాతం) ఫిట్మెంట్ బెనిఫిట్ను, పాత పద్ధతికి విరుద్ధంగా ఇంక్రిమెంట్లు, మాస్టర్ స్కేలు రూపొందించారని, దీనివల్ల ఉద్యోగులు చాలా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. దశలవారీ ఆందోళనలకు పిలుపు తమ సమస్యల పరిష్కారం కోసం విద్యుత్ ఉద్యోగులు దశలవారీ ఆందోళనా కార్యక్రమాలకు పిలుపునిచ్చినట్లు విద్యుత్ ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర నాయకులు ఈ సందర్భంగా తెలిపారు. ఈ నెల 17, 18 తేదీల్లో అన్ని సర్కిల్ కార్యాలయాల్లో, జనరేటింగ్ స్టేషన్ల వద్ద భోజన విరామ సమాయాల్లో ధర్నా, 19, 20 తేదీల్లో సర్కిల్ కార్యాలయాల వద్ద రిలే నిరాహార దీక్షలు, 22న అన్ని జిల్లా కేంద్రాల్లో శాంతియుత ర్యాలీ నిర్వహించి కలెక్టర్లకు వినతిపత్రాలు సమర్పిస్తామన్నారు. అప్పటికీ తమ సమస్యలు పరిష్కరించకుంటే అన్ని సంఘాల నాయకులతో చర్చించి భవిష్యత్లో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర జేఏసీ చైర్మన్ ఎస్.కృష్ణయ్య, కన్వీనర్ రాఘవరెడ్డి, కో కన్వీనర్ కే శేషారెడ్డి, కే శ్రీనివాస్, ఎం.గోపీ, డిస్కమ్ జేఏసీ నేతలు భూక్యా నాగేశ్వరరావు, తురగా రామకృష్ణ, సీహెచ్ సాయిబాబా, జిల్లా నాయకులు ఎం.రమేష్, వీ రాము, అబ్బాస్, కాంట్రాక్ట్ కార్మిక సంఘం నాయకులు ఎం.బాలకాశీ, కే నాగరాజు, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నలుమూలల నుంచి వందలాదిగా ఉద్యోగులు, కార్మికులు, అధికారులు పాల్గొన్నారు. -
ట్రిపుల్ ఐటీలో స్మార్ట్ ఇండియా హ్యాకథాన్
నూజివీడు: నూజివీడు ట్రిపుల్ ఐటీలో స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ 2025ను మంగళవారం నిర్వహించారు. విద్యార్థుల సృజనాత్మకత, వినూత్న ఆలోచనలకు ఈ హ్యాక్థాన్ వేదికై ంది. ఇంజినీరింగ్ విద్యార్థుల నుంచి ఈ హ్యాకథాన్లో 185 జట్లు పాల్గొని 210 ప్రజంటేషన్లు సమర్పించారు. తమ పాఠ్యాంశాలను మించి యాప్లను, ఏఐ ఆధారిత వర్క్ఫ్లోలను రూపొందించి జ్యూరీని ఆకట్టుకున్నారు. స్మార్ట్ ఎడ్యుకేషన్, మెడ్టెక్, వ్యవసాయం, క్లీన్ టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీ, పునరుత్పాదక ఇంధనాలు, విపత్తు నిర్వహణ వంటి విభిన్న అంశాలపై విద్యార్థులు తమ ప్రజంటేషన్లను సమర్పించారు. వీటిల్లో నుంచి 50 ఉత్తమ జట్లను జ్యూరీ ఎంపిక చేయనుంది. హాకథాన్ పోటీలు బుధవారం కూడా జరగనున్నాయి. ఈ కార్యక్రమంలో డీన్ ఈఐటీపీ పీ శ్యామ్, శివలాల్, వినోద్, డాక్టర్ దుర్గాబాబు, రాజమోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
గంటల వ్యవధిలో యువతుల ఆచూకీ గుర్తించిన పోలీసులు
భీమవరం: భీమవరం ఒకటో పట్టణానికి చెందిన ఇద్దరు యువతులు అదృశ్యం కాగా వారి ఆచూకీని గంటల వ్యవధిలో పోలీసులు గుర్తించారు. పట్టణంలోని ఓ దుకాణంలో పనిచేస్తున్న ఇద్దరు యువతులు ఈ నెల 15న రాత్రి ఇంటికి వెళ్లలేదు. రాత్రి 12.30 గంటలకు యువతుల తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్పీ అద్నాన్ నయీం అస్మి ఆదేశాలతో డీఎస్పీ ఆర్జీ జయసూర్య పర్యవేక్షణలో సీఐ ఎం.నాగరాజు, ఎస్సై బీవై కిరణ్కుమార్, సిబ్బంది సాంకేతిక పరిజ్ఞానంతో యువతుల చరవాణి లోకేషన్ను గుర్తించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి సమీపంలో ఉన్న ఆ ఇద్దరినీ గుర్తించి పట్టుకుని భీమవరం తీసుకొచ్చి కౌన్సెలింగ్ అనంతరం తల్లిదండ్రులకు అప్పగించారు. నరసాపురం ఎంపీ టికెట్ ఇస్తే తిరస్కరించా ఎంపీ పాక సత్యనారాయణ తాడేపల్లిగూడెం (టీఓసీ): గత ఎన్నికల్లో బీజేపీ అధిష్టానం తనకు నరసాపురం ఎంపీ టికెట్ ఇస్తే సున్నితంగా తిరస్కరించానని రాజ్యసభ సభ్యుడు పాక సత్యనారాయణ తెలిపారు. మంగళవారం తాడేపల్లిగూడెంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నరసాపురం ఎంపీ సీటు పోటీకి అన్ని పార్టీలు తన పేరును సిఫార్సు చేశాయని చెప్పారు. తనకు రాజ్యసభ సీటు పొందడం కన్నా నరసాపురం లోక్సభ సీటుకు అన్ని పార్టీలూ కలిపి తన పేరు చెప్పడం సంతోషం కలిగించిందన్నారు. కార్మిక బోర్డు చైర్మన్ వి.బాబ్జీ, బీజేపీ నేతలు బి.ఆదిలక్ష్మి, పి.అన్నవరం తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఉంగుటూరు మండలం నాచుగుంటలో జరిగిన ఆర్ఎస్ఎస్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. -
ప్లాస్టిక్తో మత్స్య ఉత్పత్తులకు ముప్పు
నరసాపురం రూరల్: ప్లాస్టిక్ వినియోగం వల్ల సముద్ర జీవులకు, ఉత్పత్తులకు తీవ్ర ముప్పు వాటిల్లుతుందని ఫిషరీష్ సర్వే ఆఫ్ ఇండియా శాస్తవేత్త జీవీఏ ప్రసాద్ అన్నారు. మంగళవారం నరసాపురం మండలం లక్ష్మణేశ్వరం గ్రామంలోని ఆక్వా యూనివర్సిటీలో విద్యార్థులకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. భారతదేశానికి సంబంధించిన వివిధ సముద్ర మత్స్యవనరులు, సముద్రంలోకి వచ్చి చేరిన ప్లాస్టిక్ వ్యర్థాల వలన ఈ వనరులకు కలుగుతున్న నష్టాలను తెలియజేశారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఆక్వా యూనివర్సిటీ ఓఎస్డీ టి సుగుణ, మైరెన్ ఇంజనీరింగ్ హెడ్ సి.ధనుంజయ్రావు మాట్లాడుతూ సముద్ర జీవులకు ప్లాస్టిక్ వాడకం వలన ముప్పు వాటిల్లుతుందని, ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ వాడకం తగ్గించాలని అన్నారు. ఈ సందర్భంగా వినిధ రకాల సముద్ర మత్స్య వనరులు, తీర ప్రాంత మత్స్య సంపద, మత్స్యరంగ పరిశోధనలో ఫిషరీస్ సర్వేఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఐ) వారు ఉపయోగిస్తున్న వివిధ రకాల పడవలకు సంబంధించిన వివరాలను పోస్టర్ల రూపంలో, వివిధ రకాల వలల నమూనాలను ప్రదర్శించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సీడీ రావు, మత్స్య కళాశాల విద్యార్థులు, కళాశాల ఉపాధ్యాయ, ఉపాధ్యాయేతర సిబ్బంది పాల్గొన్నారు. ఫిషరీస్ సర్వే ఆఫ్ ఇండియా శాస్త్రవేత్త ప్రసాద్ -
ఉద్యాన పంటల్లో సస్యరక్షణ చర్యలు
నూజివీడు: ఇటీవల అధిక వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సాగులో ఉన్న ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లే అవకాశం ఉండటంతో నివారణకు చేపట్టాల్సిన చర్యలపై నూజివీడు హెచ్ఓ ఆర్ హేమ రైతులకు పలు సూచనలు, సలహాలు అందజేశారు. వీటిని ఆచరించి ఉద్యాన పంటలకు నష్టం కలగుకుండా చూసుకోవాలని ఆమె కోరారు. మామిడిలో... ఆకులకు 5 గ్రాముల పొటాషియం నైట్రేట్ని ఒక లీటర్ నీటిలో కలిపి వారం రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి. కాంటాఫ్ 2ఎంఎల్ లీటర్ నీటిలో కలిపి తెగుళ్లు రాకుండా పిచికారీ చేయాలి. బోరాన్, జింక్ 2ఎంఎల్ లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. ఆయిల్ పామ్లో... లేత మొక్కలు మువ్వ మునిగినట్లయితే బావిస్టిన్ 3 గ్రా లీటరు నీటిలో కలిపి మువ్వలో పోసి మొక్కంతా తడిచేలా పిచికారీ చేయాలి. తోటలో మురుగునీరు బయటకు పంపి 2.5 కేజీల యూరియా, 3.7 కేజీల సింగల్ సూపర్ ఫాస్ఫేట్, 2 కేజీల పొటాష్ , 50 గ్రాముల మెగ్నీషియం సల్ఫేట్, 100 గ్రా బోరాన్ ప్రతి మొక్కకు మూడు దఫాలుగా 15–20 రోజుల వ్యవధిలో అందజేయాలి. కొబ్బరిలో... కొబ్బరి తోటల్లో వారం రోజుల మించి నీరు నిల్వ ఉన్నట్లయితే మువ్వ భాగం బాగా తడిచేలా కాపర్ ఆక్సిక్లోరైడ్ లీటర్ నీటికి 3 గ్రాముల చొప్పున కలిపి పిచికారీ చేయాలి. ఆకులు, గెలలపై 0.1 శాతం పొటాషియం నైట్రేట్ను పిచికారీ చేయాలి. కొబ్బరి తోటలు సాధారణ స్థితికి వచ్చిన వెంటనే ఎరువులు 500 గ్రాముల యూరియా, కేజీ సింగల్ సూపర్ ఫాస్ఫేట్, 1.5 కేజీల పోటాష్ చెట్టుకి ఇవ్వాలి. కోకోలో... కోకో తోటల్లో నిలిచిన వరద నీటిని మురుగు కాలువల ద్వారా బయటకు పంపించి విరిగిన కొమ్మలను కత్తిరించి ఒక శాతం బోర్డో మిశ్రమం లేదా 3 గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్ పేస్టులా పూయాలి. పండు బారిన కోకో మొక్కలకు 13:0:46 లేదా 19:19:19లను 5 గ్రాముల లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. ఎరువులు 100 గ్రాముల నత్రజని, 40 గ్రాముల సూపర్, 140 గ్రాముల పొటాష్ ఒక్కో మొక్కకు వేయాలి. అరటిలో... మూడు నెలల కంటే చిన్న వయసు గల మొక్కలు 4–5 రోజుల పాటు 2 నుంచి 3 అడుగుల లోతు నీటిలో మునిగినట్లయితే వేరు కుళ్లి మొక్కలు చనిపోతాయి. అలాగే 6 నెలలు దాటిన తోటలు 5 రోజుల కంటే తక్కువ నీటి ముంపునకు గురైనప్పుడు వేరు వ్యవస్థ పాక్షికంగా దెబ్బతింటుంది. మురుగునీటిని కాలువల ద్వారా బయటకు పంపి తేలికపాటి దుక్కు చేసి మొక్క ఒక్కింటికి 100 గ్రాముల యూరియా, 80 గ్రాముల పొటాష్ను 20 నుంచి 25 రోజుల వ్యవధిలో 2, 3 దఫాలు వేయాలి. ఆకులకు 5 గ్రాముల పొటాషియం నైట్రేట్ని ఒక లీటర్ నీటిలో కలిపి వారం రోజుల వ్యవధిలో 3 సార్లు పిచికారీ చేయాలి. సిగటోక ఆకు మచ్చ తెగులుకు ప్రోపికోనజోల్ ఒక ఎంఎల్ ఒక లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. దుంపకుళ్లుకు 25 గ్రాముల బ్లీచింగ్ పొడి ఒక లీటర్ నీటిలో కలిపి మొదలులో పోయాలి. 15 రోజుల వ్యవధిలో 2–3 సార్లు చేయాలి. తర్వాత మొక్క మొదళ్లలో 50 గ్రాములు సూడోమోనాస్ 250 గ్రాముల వేప పిండి కలిపి వేయాలి. బొప్పాయిలో... అధిక వర్షాల వలన మొక్కలు పసుపు రంగులోకి మారడం, కాండం కుళ్లు వంటి లక్షణాలు ఉన్నట్లయితే రెడోమిల్ 2 గ్రాములు ఒక లీటర్ నీటికి లేదా ఎలైట్ 2 గ్రాములు ఒక లీటర్ నీటికి కలిపి మొక్క మొదలు పోయాలి. పండు ఈగ ఉధృతి ఎక్కువ ఉన్న యెడల మిథైల్ యూజినాల్ ఎరలను ఎకరాకు 10 నుంచి 15 ఏర్పాటు చేసుకోవాలి. సూక్ష్మ పోషకాలైన జింక్ సల్ఫేట్ 2.5 గ్రా, బోరాన్ 1 గ్రా, యూరియా 10 గ్రా లీటరు నీటికి కలిపి 20 రోజుల వ్యవధిలో పిచికారీ చేసుకోవాలి. కూరగాయల్లో... కూరగాయలపై అధిక వర్షాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. వర్షాలు ఆగిన వెంటనే 19:19:19 లేదా 13:0:45 లేదా యూరియా వంటి పోషకాలు పిచికారీ చేయాలి. ఎండు తెగులు నివారణకు కాపర్ ఆక్సి క్లోరైడ్ 3గ్రా లీటరు నీటికి లేదా మెటలాక్సిల్తోపాటు మంకోజేబ్ 2గ్రా లీటరు నీటికి కలిపి మొక్కల మొదళ్లలో పోయాలి. ఆకు మచ్చ తెగుళ్ల నివారణకు కార్బండిజం ఒక గ్రాము లీటరు నీటికి లేదా మంకోజేబ్ 2.5 గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. బ్యాక్టీరియా మచ్చ తెగులు నివారణకు కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాములు లీటరు నీటికి, ప్లాంటమైసిన్ 2 గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలని సూచించారు. -
కుక్కల దాడిలో ఏడుగురికి గాయాలు
తాడేపల్లిగూడెం: తాళ్లముదునూరుపాడు, గూడెం పట్టణంలో మంగళవారం వీఽధి కుక్కలు చేసిన దాడిలో ఏడుగురికి గాయాలయ్యాయి. ముదునూరుపాడులో రెండు కుక్కలు చేసిన దాడిలో చిన్నారులు గాయపడ్డారు. పెంటపాడుకు చెందిన ఎస్.విజయనాగమల్లేశ్వరరావు, బోడపాడుకు చెందిన బి.దుర్గాప్రసాద్, ముదునూరుపాడుకు చెందిన కే.నరేంద్రరెడ్డి, ఇ.సందీప్, జి.రితీష్, యు.విఘ్నేష్ కల్యాణ్లకు తీవ్రగాయాలయ్యాయి. గూడెం పట్టణంలో మరో కుక్క దాడి చేసిన ఘటనలో జి.సూర్య అనే యువకుడు గాయపడ్డాడు. వీరిని ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా వైద్యులు చికిత్స అందిస్తున్నారు. వీధుల్లో కుక్కలు విచ్చలవిడిగా తిరుగుతున్నా మునిసిపల్ అధికారులు పట్టనట్టు వ్యవహరించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు -
అక్రమంగా మట్టి నిల్వలు
ఆగిరిపల్లి: టీడీపీ నేతల ఆధ్వర్యంలో మండలంలో మట్టి దందా మూడు పువ్వులు, ఆరు కాయలుగా సాగుతోంది. మూడు నెలల క్రితం పొలాల మెరక కోసమని గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు అనుమతులు తీసుకున్నారు. కానీ చెరువులోని మట్టిని ఇష్టారాజ్యంగా తవ్వి మట్టిగుట్టలు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ఈదులగూడెంలోని ఈము కోళ్ల ఫామ్ ఎదురు రోడ్లో వ్యవసాయ పొలాన్ని కౌలుకు తీసుకొని దానిలో సుమారు 4 వేల ట్రక్కుల మట్టిని అక్రమంగా నిల్వ ఉంచారు. ఈ మట్టి మొత్తం ఇటుక బట్టీలకు తరలించడానికి సిద్ధం చేశారని గ్రామస్తులు తెలిపారు. ఈ మట్టిని ఇటుక బట్టీల వాళ్లకి రూ.50 లక్షలకు బేరం కూడా కుదిరినట్టు సమాచారం. బట్టీలకు మట్టిని తరలించడానికి 2 ఎస్కలేటర్లు, 25 ట్రాక్టర్లను సిద్ధం చేయగా గత వారం రోజుల నుంచి వర్షాలు కురవడంతో మట్టిని తరలించడానికి వీలుపడలేదు. అధికార పార్టీ నాయకులు కావడంతో అధికారులు చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. అక్రమంగా మట్టి నిల్వలు ఏర్పాటు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
నిమ్మల రామానాయుడికి తెలుగు తమ్ముళ్ల ఝలక్
సాక్షి ప్రతినిధి, ఏలూరు: రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుకు పాలకొల్లు తెలుగు తమ్ముళ్లు ఝలక్ ఇచ్చారు. నియోజకవర్గంలో కేడర్ నుంచి లీడర్ వరకు తానేనంటూ.. తక్కువ పనితో ఎక్కువ పబ్లిసిటీతో నిత్యం ఫోకస్లో ఉండే మంత్రి తీరుపై తిరుగుబాటు జెండా ఎగురేస్తున్నారు. నియోజకవర్గంలో భవిష్యత్లో కూడా తనకు పోటీగా ఎవరూ ఉండకూడదని.. దానికనుగుణంగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ కీలక నామినేటెడ్ పదవులు తన నియోజకవర్గంలో దక్కకుండా తెరవెనుక చక్రం తిప్పుతున్నారు. తెరమీద పదవులు ఇవ్వాలి కాబట్టి డైరెక్టర్ పదవులతో మమా అనిపించడంతో తిరుగుబాటు మొదలైంది. పదేళ్లు మాజీ ఎమ్మెల్సీగా పనిచేసిన అంగర రామ్మోహనరావును జలవనరుల శాఖ బోర్డు డైరెక్టర్గా నియమించడంపై ఆయన తీవ్ర అసహనంతో ఉన్నారు. తాను పదవి తీసుకోలేనంటూ చంద్రబాబుకే లేఖ రాశారు. ఇదే రీతిలో నామినేటెడ్ పదవులు పొందిన మరో ఇద్దరు డైరెక్టర్లు కూడా తమకు ఈ పదవులు వద్దని బహిరంగంగా ప్రకటించడం టీడీపీలో హాట్ టాపిక్గా మారింది. పాలకొల్లు నియోజకవర్గంలో మంత్రి రామానాయుడు రాజకీయ ఎత్తుగడలకు టీడీపీ కేడర్ చెక్పెడుతోంది. బీసీ సామాజిక వర్గంలో పట్టు ఉన్న అంగర రామ్మోహనరావు పార్టీ ఆవిర్భావం నుంచి తెలుగుదేశంలో పనిచేస్తున్నారు. ఎన్టీఆర్ హయాంలో పాలకొల్లు ఎంపీపీగా, ఉమ్మడి పశ్చిమగోదావరి జెడ్పీ వైస్ చైర్మన్గా పనిచేశారు. ఆ తరువాత చంద్రబాబు హయాంలో పాలకొల్లు ఎంపీపీగా, రెండు పర్యాయాలు మండలి సభ్యుడిగా ఉన్నారు. మండలి విప్గా, లెజిస్టేటివ్ లైబ్రరీ చైర్మన్గా పనిచేశారు. పార్టీ ఆదేశాల మేరకు పశ్చిమగోదావరి జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి అనేక కార్యక్రమాలు నిర్వహించానని రాష్ట్ర ఇరిగేషన్ బోర్డు సభ్యుడి పదవి తాను స్వీకరించలేకపోతున్నానని ముఖ్యమంత్రికి లేఖ రాయడం తీవ్ర కలకలం రేపింది. వాస్తవానికి అంగర ప్రభుత్వంలో కీలక పదవి లేదా రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పదవి ఆశించారు. పార్టీ అధిష్టానం కూడా ఆ మేరకు స్పష్టమైన హామీ ఇచ్చినట్లు సమాచారం. అదే నియోజకవర్గంలో మంత్రిగా నిమ్మల రామానాయుడు ఉన్నారు. రాజకీయంగా అంగర పాలకొల్లులో సీనియర్. అలాంటిది జూనియర్ నేత మంత్రిగా ఉన్న శాఖలో చైర్మన్ కాకుండా డైరెక్టర్ పదవితో అవమానించారనేది రామ్మోహనరావు ఆవేదన. దీంతో గత వారం లేఖ ద్వారా అసంతృప్తిని తెలియజేశారు. అంగర బాటలో మరో ఇద్దరు మొత్తంగా పాలకొల్లు నియోజకవర్గానికి ఇటీవల మూడు నామినేటెడ్ పదవులు దక్కాయి. విచిత్రమేమిటంటే ఒక్క రాష్ట్ర స్థాయి చైర్మన్ పదవి దక్కిన నేత ఈ నియోజకవర్గంలో లేకపోవడం గమనార్హం. పారీ్టలో సీనియర్ నేతలు అనేక మంది ఉన్నా ఎంతటి ట్రాక్ రికార్డు ఉన్నా ఈ నియోజకవర్గంలో డైరెక్టర్ పదవే ఫైనల్. ఈ క్రమంలో ఇటీవల క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్గా పార్టీలో సీనియర్ నేతగా ఉన్న గొట్టుముక్కల సూర్యనారాయణరాజును నియమించారు. ఆయన కూడా ఈ పదవి అక్కర్లేదని తేల్చి చెప్పారు. టీడీపీ రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి కడలి గోపాలరావు గతంలో జెడ్పీటీసీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. పారీ్టలో బీసీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. రాష్ట్ర ఇండస్ట్రీయల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ డైరెక్టర్ పదవి కట్టపెట్టారు. గోపాలరావు తనకు ఈ పదవి వద్దంటూ సోషల్ మీడియావేదికగా ప్రకటించారు. మొత్తం మీద ముగ్గురు నేతలు మూడు డైరెక్టర్ల పదవులు తిరస్కరించడం టీడీపీలోనే తీవ్ర చర్చకు దారితీసింది. మంత్రి నిమ్మల వ్యవహారంపైన విస్తృతంగా చర్చ సాగుతోంది. -
పత్రికా స్వేచ్ఛ అణ చివేత
తమ వైఫల్యాలను ప్రశ్నించి, నిజాలు వెలికితీస్తున్న ‘సాక్షి’పై కూటమి ప్రభుత్వం అక్కసు వెళ్లగక్కుతోంది. పత్రికా స్వేచ్ఛను హరిస్తూ, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ పాత్రికేయులపై కేసులు నమోదు చేయడం హేయమైన చర్య. పత్రికలపై కేసులు బనాయించడం దేశంలో ఎక్కడా చూడలేదు. ప్రజాస్వామ్యంలో వాక్ స్వాతంత్య్రాన్ని పత్రికా స్వేచ్ఛను కూటమి ప్రభుత్వం దారుణంగా అణచివేస్తోంది. తక్షణమే సాక్షి యాజమాన్యం, పాత్రికేయులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలి. – కవురు శ్రీనివాస్, ఎమ్మెల్సీ -
మంత్రి సుభాష్ నోరు అదుపులో పెట్టుకోవాలి
వీరవాసరం: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై లేనిపోని ఆరోపణలతో అవాకులు, చవాకులు పేలుతున్న కార్మిక మంత్రి వాసంశెట్టి సుభాష్ నోరు అదుపులో పెట్టుకోవాలని ఎమ్మెల్సీ, వైఎస్సార్సీపీ శెట్టిబలిజ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కవురు శ్రీనివాస్ తీవ్రంగా హెచ్చరించారు. వీరవాసరం మండలం నౌడూరు జంక్షన్లో సోమవారం విలేకరులతో మాట్లాడుతూ.. శెట్టిబలిజ సర్టిఫికెట్ల విషయంలో రోజుకో మాట, పూటకో మాట మాట్లాడుతున్న మంత్రి సుభాష్కు మతిస్థిమితం తప్పిందన్న అనుమానం వస్తుందన్నారు. బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేసిన నేత ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క వైఎస్ రాజశేఖర్ రెడ్డి మాత్రమే అన్నారు. అనంతరం ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్ని వర్గాల ప్రజలను అక్కున చేర్చుకొని బీసీ వర్గాలకు ఎమ్మెల్యే, ఎంపీ టికెట్లతో పాటు నామినేటెడ్ పోస్టుల్లో సైతం పెద్ద ఎత్తున న్యాయం చేశారన్నారు. తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో శెట్టిబలిజ సామాజిక వర్గం అత్యధికంగా ఉంటుందన్న ఉద్దేశ్యంతో అప్పటి వైఎస్సార్ హయాంలో ఎందరికో రాజకీయంగా ప్రోత్సాహాన్నిచ్చి ఎమ్మెల్యేలు, మంత్రులుగా చేశారన్నారు. రాబోయే రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలోనూ గ్రామాల్లోనూ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి బీసీలను ఐక్యం చేసి బీసీ వర్గీయులంతా వైఎస్ఆర్సీపీకి అండగా ఉండేలా చైతన్యవంతం చేస్తామని వివరించారు. రాబోయే రోజుల్లో సుభాష్కు తగిన బుద్ధి చెప్పడం ఖాయమని హెచ్చరించారు. సమావేశంలో వైఎస్సార్సీపీ బీసీ నాయకులు గూడూరి ఓంకారం, కోడె యుగంధర్, వీరవల్లి శ్రీనివాసరావు, కడలి శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు. -
విద్యుత్ మోటార్లు, కేబుల్ వైర్ల దొంగల అరెస్టు
నూజివీడు: రైతుల పొలాల్లో విద్యుత్ మోటార్లు, కరెంటు తీగలను దొంగతనం చేసే ఇద్దరు దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. నూజివీడు సీఐ కొప్పిశెట్టి రామకృష్ణ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. చాట్రాయి మండలంలోని పలు గ్రామాల పరిధిలోని పంట పొలాల్లోని వ్యవసాయ మోటార్లు, కరెంటు తీగలు ఇటీవల చోరీకి గురవుతున్నాయి. దీంతో రైతులు చాట్రాయి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఎస్సై డీ రామకృష్ణ దర్యాప్తు చేపట్టారు. దీనిలో భాగంగా ఫోన్ సిగ్నళ్లు ఆధారంగా చాట్రాయి మండలం తుమ్మగూడెంకు చెందిన యర్రా నాగవాసు, మాదాల భవానీశంకర్లను నిందితులుగా గుర్తించారు. వారిని సోమవారం తుమ్మగూడెం శివారు ఎన్నెస్పీ కాలువ వద్ద అరెస్టు చేసి, వారి నుంచి మూడు విద్యుత్ మోటార్లు, ఒక పంపుసెట్, 900 అడుగుల విద్యుత్ తీగను స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.1.50 లక్షలు ఉంటుందని సీఐ తెలిపారు. నిందితులను పట్టుకోవడంలో కృషి చేసిన ఎస్సై డీ రామకృష్ణతో పాటు హెడ్కానిస్టేబుల్ జీ శ్రీనివాసరావు, కానిస్టేబుళ్లు కే మునీంద్రరావు, పీ వెంకటేశ్వరరావులను సీఐ అభినందించారు. -
యథేచ్ఛగా గ్రావెల్ అక్రమ తవ్వకాలు
కొయ్యలగూడెం: రాజవరం పంచాయతీ గంగవరం గ్రామంలో గ్రావెల్ అక్రమ తవ్వకాలు గత కొద్ది రోజులుగా యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. గంగవరం సమీపంలోని కొండ ప్రాంతమైన సర్వే నెంబర్ 205, 206, 207లలో సుమారు 20 ఏళ్ల క్రితం అప్పటి వైఎస్సార్ ప్రభుత్వం దళితులకు అరవై ఎకరాలకు పైగా సాగు భూమిగా కేటాయించి పట్టాలు అందజేశారు. వాటిలో రైతులు కొందరు జీడి మామిడి తోటలు వేయగా మరికొన్ని భూములు ఖాళీగా ఉన్నాయి. అటువంటి వాటిని గుర్తించి అక్రమార్కులు గ్రావెల్ తవ్వకాలు చేస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. రోజుకు 40 నుంచి 60 ట్రిప్పుల గ్రావెల్ మట్టి ట్రక్కుల ద్వారా సుదూర ప్రాంతాలకు రవాణా అవుతోందని ఇందులో అన్ని రాజకీయ పార్టీల నాయకుల భాగస్వామ్యం ఉందని ప్రజలు పేర్కొంటున్నారు. కొద్ది నెలల క్రితం డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్ ఇదే ప్రాంతంలో కొనసాగుతున్న అక్రమ గ్రావెల్ తవ్వకాలను స్వయంగా చూడడం జరిగిందన్నారు. గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణానికి సేకరిస్తున్న గ్రావెల్ మట్టిపై విచారణ చేసి అక్రమ తవ్వకాలపై తనకు నివేదిక ఇవ్వాల్సిందిగా అధికారులను ఆదేశించారు. తిరిగి అదే కొండ ప్రాంతంలో ఇప్పుడు భారీ ఎత్తున గ్రావెల్ అక్రమ తవ్వకాలు కొనసాగుతుండడంపై ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి. కాగా అక్రమ గ్రావెల్ తవ్వకాల విషయాన్ని తహసీల్దార్ ఎన్.నాగరాజు దృష్టికి తీసుకువెళ్లగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. సూదిగట్టు తవ్వేస్తున్నారు ఆగిరిపల్లి: కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటినుంచి మండలంలోని సహజ వనరులను దర్జాగా దోచుకుంటున్నారు. రాత్రి అయితే చాలు మండలంలో కొండలను, గుట్టలను, అడిగే వారు లేకపోవడంతో అడ్డగోలుగా తవ్విస్తున్నారు. వడ్లమానులో సూది గట్టు వద్ద ఆదివారం అర్ధరాత్రి అక్రమంగా తవ్వకాలు జరిపి గ్రావెల్ను తరలించిపోతుండగా గ్రామస్తులు అధికారులకు ఫిర్యాదు చేశారు. వారు వచ్చి కనీసం ఎటువంటి కేసులు నమోదు చేయకుండా వెళ్లిపోయారు. ఆ తర్వాత యథావిధిగా గ్రావెల్ తవ్వకాలు జరిగాయి. అమ్మవారి గూడెం గ్రామంలోని మాల గట్టు, ఈదులగూడెం, నరసింగపాలెంలో కూడా గ్రావెల్ మాఫియా అడ్డగోలుగా తవ్వేస్తున్నారు. ఇంత జరుగుతున్న అధికారులు మాత్రం తమకేమీ సంబంధం లేనట్టుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి సహజ వనరులైన మట్టి, గ్రావెల్ను అక్రమార్కులు తరలించకుండా కఠిన చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు. -
రామిలేరులో గల్లంతైన యువతి మృతదేహం లభ్యం
నూజివీడు: రామిలేరులో గల్లంతైన తుక్కులూరు దళితవాడకు చెందిన బడిపాటి నీరజ(20) మృతదేహం సోమవారం లభ్యమైంది. ఆదివారం చర్చికి వెళ్లి తిరిగి వస్తూ తుక్కులూరు, మర్రికుంటల మధ్యలో రామిలేరుపై ఉన్న లోలెవెల్ కాజ్వేను దాటుతూ వరద ఉద్ధృతిలో ఆమె కొట్టుకుపోయింది. ఈ నేపథ్యంలో ఎన్డీఆర్ఎఫ్ బృందం రామిలేరు వాగులో సోమవారం ఉదయం గాలించగా ఘటన జరిగిన ప్రాంతానికి సమీపంలో మృతదేహం లభ్యమైంది. నూజివీడు ఏరియా ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం నీరజ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. గాలింపు చర్యలను తహసీల్దార్ గుగులోతు బద్రూనాయక్ పర్యవేక్షించారు. నూజివీడు: నూజివీడు ట్రిపుల్ ఐటీలో సోమవారం ఇంజినీర్స్ డే ను నిర్వహించారు. దీనిలో భాగంగా సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ఏఓ బీ లక్ష్మణరావు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏఓ మాట్లాడుతూ దేశ నిర్మాణంలో భారతరత్న సర్ మోక్షగుండం విశ్వేశ్వరాయ పాత్ర వెలకట్టలేనిదన్నారు. దేశంలోని అనేక నదులపై ఆనకట్టలు, వంతెనలు నిర్మించి నీటి పారుదల రంగంలో విశేష అభివృద్ధికి కారణమయ్యారన్నారు. దేశం గర్వించదగ్గ సుప్రసిద్ధ ఇంజినీర్ మోక్షంగుండం విశ్వేశ్వరయ్యను స్ఫూర్తిగా తీసుకొని సివిల్ ఇంజినీరింగ్ విద్యార్థులు దేశ నిర్మాణంలో తమ వంతు పాత్ర పోషించాలన్నారు. అనంతరం సివిల్ ఇంజనీరింగ్ విద్యార్థులకు క్విజ్, వ్యాసరచన పోటీలను నిర్వహించారు. కార్యక్రమంలో డీన్ అకడమిక్స్ సాదు చిరంజీవి, డీఎస్డబ్ల్యూఓ రాజేష్, సివిల్ హెచ్ఓడీ సునీల్భగత్, ఫ్యాకల్టీ పాల్గొన్నారు. ద్వారకాతిరుమల: శ్రీవారి దేవస్థానంలోని లీజెస్ విభాగంలో అవకతవకలకు పాల్పడిన రికార్డ్ అసిస్టెంట్ అనుమంచిపల్లి సాయి రామానుజన్ను సస్పెండ్ చేస్తూ ఆలయ ఈఓ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ద్వారకాతిరుమల మండలంలోని దేవినేనివారిగూడెంకు చెందిన జూనుపూడి సిద్ధయ్య స్థానిక టీటీడీ కాంప్లెక్స్ లోని 11 వ నెంబర్ షాపును దేవస్థానం నుంచి బహిరంగ వేలం ద్వారా లీజుకు తీసుకుని, అందులో ఫొటో స్టూడియో నడుపుతున్నాడు. అద్దె సొమ్ము రూ.58 వేలు చెల్లించాల్సి ఉండగా, గతనెల 6న రూ.51 వేలను లీజెస్ విభాగం రికార్డ్ అసిస్టెంట్ రామానుజన్కు ఇచ్చాడు. అతడు దేవస్థానానికి మరుసటి రోజు రూ. 42 వేలను జమ చేసి, రూ.9 వేలను పక్కదారి పట్టించాడు. సిద్ధయ్యకు రసీదును కూడా ఇవ్వలేదు. లీజెస్ విభాగం ఏఈఓ ఐనంపూడి రమణరాజు షాపు నిర్వాహకుడు సిద్ధయ్యకు మూడు రోజుల క్రితం ఫోన్చేసి బ్యాలెన్స్ అద్దె డబ్బులు రూ. 16 వేలను వెంటనే చెల్లించాలని సూచించారు. తాను సాయి రామానుజన్కు రూ.51 వేలు చెల్లించానని, మరో రూ. 7 వేలు చెల్లిస్తే సరిపోతుందని చెప్పాడు. వెంటనే ఎమ్మార్లను పరిశీలించిన ఏఈఓ రమణరాజు పక్కదారి పట్టిన రూ.9 వేలను వెంటనే దేవస్థానానికి జమ చేయాలని ఉద్యోగిని హెచ్చరించారు. దాంతో సదరు ఉద్యోగి ఈనెల 14 న రూ.9 వేలను జమ చేశాడు. ఈ వ్యవహారం బయటకు పొక్కడంతో పాటు, సిద్ధయ్య సోమవారం ఫిర్యాదు చేయడంతో అధికారులు ప్రాథమిక విచారణ జరిపారు. ఉద్యోగి సాయి రామానుజన్పై సస్పెన్షన్ వేటు వేశారు. -
బాధితులకు భరోసా కల్పించాలి
భీమవరం: వివిధ సమస్యలతో పోలీస్ కార్యాలయాలకు వచ్చే బాధితులకు పోలీస్ శాఖ భరోసాగా ఉండాలని ఎస్పీ అద్నాన్ నయీం అస్మి అన్నారు. భీమవరం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అర్జీలు స్వీకరించిన సందర్భంగా పోలీసు స్టేషన్ అధికారులతో ఫోన్లో మాట్లాడారు. పీజీఆర్ఎస్ కార్యక్రమంలో వచ్చిన అర్జీలు తిరిగి పునరావృతం గాకుండా పూర్తి స్థాయిలో విచారించి శాశ్వతంగా పరిష్కారం చూపాలని ఎస్పీ ఆదేశించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి 9 మంది బాధితులు అర్జీలను అందచేశారు. నరసాపురం రూరల్: సీతారాంపురం సౌత్ ఎస్టీ కాలనీలో ఉంటున్న యానాదులకు ఆధార్ కార్డులు ఇవ్వాలని స్థానిక ఎస్టీ కాల నీవాసులు సోమవారం సచివాలయం వద్ద ధర్నా చేశారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు మాట్లాడుతూ ఆధార్ కార్డు లేనివారు 19 మంది, అడ్రస్ మార్చాల్సిన వారు 12 మంది, ఇంటి పేర్లు మార్చాల్సిన వారు 15 మంది కలిపి మొత్తం 50 మంది వరకు ఉన్నారన్నారు. కార్డుల్లో అడ్రస్లు సక్రమంగా లేకపోవడం, పిల్లలకు కొత్త ఆధార్ కార్డులు లేకపోవడంతో అనేక సంక్షేమ పథకాలు అందడం లేదని తెలిపారు. యానాదుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం తగదని వారు అన్నారు. అనంతరం సచివాలయం కార్యదర్శి, వీఆర్వోలకు వినతిపత్రం అందజేశారు. భీమవరం(ప్రకాశంచౌక్): పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారం పారదర్శకంగా, నాణ్యతతో ఉండాలని జాయింట్ కలెక్టర్ టి.రాహుల్కుమార్రెడ్డి అన్నారు. సోమవారం కలెక్టరేట్లో జిల్లా స్థాయి పీజీఆర్ఎస్లో ఆయన పాల్గొని పలు ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పప్రతి అర్జీకి నాణ్యమైన పరిష్కారం ఉండాలన్నారు. ప్రత్యేక శ్రద్ధ తీసుకుని అర్జీలు పరిష్కరించాలని అదేశించారు. ఫిర్యాదులు తమ పరిధిలోనివి కానప్పుడు వెంటనే సంబంధిత శాఖకు పంపాల న్నారు. ఈ సందర్భంగా దరఖాస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియను పరిశీలించారు. యూరియా సమస్యపై రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ పిలుపు మేరకు కలెక్టరేట్ వద్ద సోమవారం కాంగ్రెస్ నాయకులు నిరసన తెలిపి జేసికి వినతిపత్రం అందజేశారు. విభిన్న ప్రతిభావంతుల హక్కుల పరిరక్షణ చట్టం పూర్తి స్థాయిలో అమలు చేయాలని, పాత సదరం సర్టిఫికెట్లు కొనసాగించాలని కోరుతూ వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ఆధ్వర్యంలో వినతిపత్రం సమర్పించారు.ఏలూరు టౌన్: ఏలూరు రేంజ్ పరిధిలో ప్రజలకు అత్యుత్తమ సేవలు అందించేలా పోలీస్ అధికారులు శ్రద్ధ వహించాలని.. శాంతిభద్రతల పరిరక్షణలో రాజీపడే ప్రసక్తే లేదని ప్రజలకు జవాబుదారీగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్కుమార్ అన్నారు. జిల్లా ఎస్పీలుగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన పోలీస్ అధికారులు ఐజీని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందజేశారు. కృష్ణా జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్ నాయుడు, బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ రాహుల్ మీనా ఏలూరు రేంజ్ ఐజీని మర్యాదపూర్వకంగా కలిశారు. -
కాలువలో బాలుడి గల్లంతు
పాలకోడేరు: వేండ్ర అగ్రహారం శివారు కట్టావారిపాలెంలోని గోస్తని డ్రెయిన్లో ఆదివారం సాయంత్రం ప్రమాదవశాత్తూ ఓ బాలుడు పడి గల్లంతయ్యాడు. గ్రామానికి చెందిన బొక్కా శ్రీనివాస్రావు రెండవ కుమారుడు జైదేవ్ (7) నౌడూరులోని ప్రైవేట్ స్కూల్లో ఒకటవ తరగతి చదువుతున్నాడు. ఆదివారం సెలవు కావడంతో మరో బాలుడు చరణ్తో కలిసి సైకిల్ తొక్కుకుంటూ గ్రామంలోని గోస్తని డ్రెయిన్పై ఉన్న బ్రిడ్జి పైకి వెళ్లారు. ప్రమాదవశాత్తు బ్రిడ్జిపై నుంచి బాలుడు జైదేవ్ కాలువలోకి పడిపోయాడు. సమాచారం అందిన వెంటనే పోలీసులు, ఫైర్ అధికారులు గాలింపు చర్యలు చేపట్టినా ఆచూకీ లభించలేదు. సోమవారం కాకినాడ నుంచి ఏపీఎస్డీఆర్ఎఫ్ బలగాలు వచ్చి గాలిస్తున్నారు. జై దేవ్ తండ్రి శ్రీనివాస్ రావు లారీ డ్రైవర్గా పని చేస్తున్నాడు. బాలుడి ఆచూకీ లభించకపోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. -
యువ ఇంజనీర్ల పాత్ర కీలకం
భీమవరం: సమాజ నిర్మాణంలో యువ ఇంజనీర్ల పాత్ర ఎంతో కీలకమని నిరంతరం కొత్త విషయాలను నేర్చుకుంటూ ముందుకు సాగాలని జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్రెడ్డి అన్నారు. సోమవారం భీమవరం డీఎన్నార్ కళాశాలలో నిర్వహించిన మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. నేటి ఇంజనీరింగ్ రంగంలో జరుగుతున్న తాజా మార్పులు, సాంకేతిక ఆవిష్కరణల గురించి వివరించారు. ఈ సందర్భంగా వివిధ పోటీల్లో విజేతలైన విద్యార్ధులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ ఎం.అంజన్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ఇదే.. ప్రభుత్వ వైద్య కళాశాల
ఏలూరు టౌన్ : ‘ఇదిగో.. చంద్రబాబు గారూ... ఏలూరులో వైఎస్ జగన్ హయాంలో నిర్మించిన ప్రభుత్వ వైద్య కళాశాల భవనం.. కూటమి నేతలూ... చూశారా’ అంటూ వైఎస్సార్సీపీ నేతలు ఆ భవనాల వద్ద సెల్ఫీలు దిగారు. ఏలూరు జిల్లాకే ప్రతిష్టాత్మకంగా.. జిల్లా ప్రజల చిరకాల కోరికను నెరవేర్చుతూ వైఎస్సార్సీపీ హయాంలో ఈ ప్రభుత్వ మెడికల్ కళాశాలను ఏర్పాటు చేశారు. వైఎస్సార్సీపీ హయాంలో ఒక్క మెడికల్ కాలేజీ కట్టలేదంటూ చంద్రబాబు అసత్య ప్రచారం చేస్తోన్న తరుణంలో వైఎస్సార్సీపీ ఏలూరు సమన్వయకర్త మామిళ్ళపల్లి జయప్రకాష్, మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి ఆధ్వర్యంలో పార్టీ నేతలు ఏలూరులోని మెడికల్ కాలేజీని సోమవారం సందర్శించారు. అత్యాధునిక సౌకర్యాలతో, కార్పొరేట్ తరహా లుక్తో మెరిసిపోతున్న వైద్య కళాశాల భవనాలను రాష్ట్ర ప్రజలకు చూపించే ప్రయత్నం చేశారు. ‘మీ కళ్ళకు కనిపిస్తోందా?’ అంటూ.. వీడియోలు, సెల్ఫీలు దిగారు. జోహార్ వైఎస్సార్.. జై జగన్ అంటూ నినాదాలు చేశారు. కూటమి నేతలు చేస్తున్నట్లు ఇది గ్రాఫిక్స్ కాదంటూ మెడికల్ కాలేజీ భవనం వద్ద ఫొటోలు తీశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ఏలూరు నగర అధ్యక్షుడు గుడిదేశి శ్రీనివాసరావు, ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నూకపెయ్యి సుధీర్బాబు, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు నెరుసు చిరంజీవి, ప్రధాన కార్యదర్శి లంకలపల్లి గణేష్, అధికార ప్రతినిధి మున్నుల జాన్గురునాథ్, ఎస్సీ సెల్ కార్యదర్శి ఇమ్మానుయేల్, నగర మహిళా అధ్యక్షురాలు జిజ్జువరపు విజయనిర్మల, ఎస్సీ సెల్ నగర అధ్యక్షుడు ఇనపనూరి జగదీష్, బీసీ సెల్ కార్యదర్శి కొల్లిపాక సురేష్, జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలు చిలకపాటి డింపుల్జాబ్ తదితరులు పాల్గొన్నారు. రెండేళ్లు పూర్తిచేసుకున్న ఏలూరు మెడికల్ కాలేజీ వైఎస్ జగన్ హయాంలో అత్యాధునిక సౌకర్యాలతో నిర్మాణం వైఎస్సార్సీపీ హయాంలో ఒక్క మెడికల్ కాలేజీ కట్టలేదంటూ బాబు అసత్య ప్రచారం వైద్య కళాశాలను సందర్శించి ఫొటోలు దిగిన అబ్బయ్యచౌదరి, జయప్రకాష్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేబితే చేసి చూపిస్తారు. గ్రాఫిక్స్ చేయడం మాకు చేతకాదు. 2022 నవంబర్లో మెడికల్ కాలేజీ నిర్మాణ పనులు ప్రారంభించి 2023 సెప్టెంబర్ 2 నాటికే క్లాస్లు ప్రారంభించేలా పూర్తి చేసి చూపించారు. రూ.60 కోట్లతో అత్యాధునిక సౌకర్యాలు కల్పించి మెడికల్ కాలేజీని నిర్మించారు. రెండేళ్ళు పూర్తిచేసుకున్న సందర్భంగా కేక్ కట్ చేసి వేడుకలు చేసుకున్నాం. వైద్య విద్యార్థులు, మెడికల్ కాలేజీ స్టాఫ్కు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపాం. రాష్ట్రంలో 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీల ఏర్పాటుకు రూ.8500 కోట్లతో ప్రణాళిక రూపొందించి, తొలి దశలో ఐదు మెడికల్ కాలేజీలు ప్రారంభించారు. – మామిళ్ళపల్లి జయప్రకాష్ , ఏలూరు సమన్వయకర్త వైఎస్సార్సీపీ హయాంలో ఒకేసారి 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు అనుమతులు తెచ్చిన గొప్ప నాయకుడు జగన్మోహన్రెడ్డి. విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల మెడికల్ కాలేజీలను అధికారంలో ఉండగానే ప్రారంభించగా.. ఎన్నికల నాటికి పాడేరు, పులివెందుల మెడికల్ కాలేజీలు పూర్తి చేశారు. కూటమి ప్రభుత్వం హయాంలో ఒక్క కొత్త భవనం నిర్మించారా?. జగన్ హయాంలో రైతు భరోసా కేంద్రాలు, సచివాలయ భవనాలు, విలేజ్ క్లీనిక్స్ నిర్మించారని, కూటమి నేతలు ఒక్క కొత్త భవనం నిర్మించారా? ప్రజలకు మంచి చేయటానికి ప్రయత్నం చేయాలి. – కొఠారు అబ్బయ్య చౌదరి, మాజీ ఎమ్మెల్యే ఏలూరులో వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో నిర్మించిన ప్రభుత్వ వైద్య కళాశాల భవనం ప్రారంభించి రెండేళ్లు పూర్తయ్యింది. 2023 సెప్టెంబర్ 2న ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం క్లాస్లు ప్రారంభించగా.. రెండేళ్లు పూర్తవడంతో వైఎస్సార్సీపీ నేతలు మెడికల్ కాలేజీ వద్ద కేక్ కట్ చేసి వేడుకలు చేసుకున్నారు. వైద్య విద్యార్థులకు, కాలేజీ ప్రొఫెసర్లు, నాన్ టీచింగ్ స్టాఫ్కు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. తొలుత కాలేజీలోని మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం వద్ద నివాళులు అర్పించారు. కళాశాలలో అత్యాధునిక డిజిటల్ క్లాస్రూంలు, ల్యాబ్స్, టీచింగ్ రూమ్స్ పరిశీలించారు. అనంతరం కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సావిత్రిని మర్యాదపూర్వకంగా కలిసి కళాశాల నిర్వహణపై పలు అంశాలు అడిగి తెలుసుకున్నారు. 2023 సెప్టెంబర్ 2న 150 మంది ఎంబీబీఎస్ వైద్య విద్యార్థులతో క్లాస్లు ప్రారంభించారని, 2024లో మరో 150 మంది చేరారని, ప్రస్తుతం 300 మంది విద్యార్థులు చదువుతున్నారని చెప్పారు. -
కుమారుడి మరణం జీర్ణించుకోలేక తల్లి మృతి
చింతలపూడి: కుమారుడి మరణాన్ని జీర్ణించుకోలేని ఓ తల్లి మృతి చెందిన ఘటన గురుభట్ల గూడెం గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన చక్రపు వాసు (65) గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆదివారం వాసు తీవ్ర అనారోగ్యంతో మృతి చెందాడు. దీంతో కుమారుడు మరణించడం తెలుసుకున్న వాసు తల్లి శాంతమ్మ(90) తీవ్ర మనోవేదనకు గురైంది. తన కళ్లముందే కుమారుడు మృతి చెందిన విషాదాన్ని జీర్ణించుకోలేక సోమవారం శాంతమ్మ కూడా తనువు చాలించింది. రెండు రోజుల వ్యవధిలో ఒకే కుటుంబంలోని తల్లి, కుమారుడు మృతి చెందడంతో గురుభట్లగూడెంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. -
తప్పుల తడకగా స్మార్ట్ రేషన్కార్డులు
నూజివీడు: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా పంపిణీ చేస్తున్న స్మార్ట్ రేషన్ కార్డులు తప్పుల తడకగా తయారయ్యాయి. ప్రభుత్వం ప్రచారానికి ఇస్తున్న ప్రాధాన్యత స్మార్ట్కార్డుల ముద్రణ విషయంలో లేకపోవడంతో స్మార్ట్ రేషన్ కార్డుల్లో తప్పులు నమోదయ్యాయి. దీంతో కార్డుదారులు లబోదిబోమంటున్నారు. ఇంటి పేర్లు, ఇంటి నెంబర్లు, ఊరి పేర్లు తప్పుగా నమోదు కావడం, పాతకార్డులో ఉన్న వారి పేర్లన్నీ కొత్తగా జారీ చేసిన స్మార్ట్ రేషన్ కార్డులో లేకపోవడం వంటి తప్పులు ఎక్కువగా చోటు చేసుకున్నాయి. దీంతో వీటిని సరిచేయించుకోవడానికి కార్డుదారులు గ్రామ, వార్డు సచివాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. తప్పుల తడకలుగా ఉన్న స్మార్ట్ రేషన్ కార్డులను చూసి ప్రభుత్వం కార్డుల ముద్రణ విషయంలో ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించిందో అర్థమవుతోందని కార్డుదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొందరి పేర్లు స్మార్ట్ రేషన్కార్డుపై లేకపోవడంతో రాబోయే రోజుల్లో పింఛన్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హత లేకుండా పోతుందని ఆందోళన చెందుతున్నారు. నూజివీడు నియోజకవర్గంలో 170 రేషన్ దుకాణాల పరిధిలో 94,185 రేషన్కార్డులున్నాయి. వీటిల్లో నూజివీడు పట్టణంలో 13,648 కార్డులు, నూజివీడు మండలంలో 23,922 కార్డులు, ఆగిరిపల్లిలో 20,769 కార్డులు, ముసునూరు మండలంలో 18,515 కార్డులు, చాట్రాయి మండలంలో 17331 చొప్పున కార్డులున్నాయి. వీటిలో దాదాపు 25 నుంచి 30 శాతం కార్డుల్లో తప్పులు నమోదయ్యాయి. ఏకంగా కాలనీ పేరే తప్పుగా నమోదు జిల్లాలోనే అతి పెద్ద కాలనీగా ఉన్న పట్టణంలోని ఎమ్మార్ అప్పారావు కాలనీ పేరునే తప్పుగా నమోదు చేశారు. ఎమ్మార్ అప్పారావు పేరులో ఎమ్మార్ లేకుండా శ్రీ అప్పారావు కాలనీగా స్మార్ట్ రేషన్ కార్డుల్లో నమోదైంది. ఇలా కాలనీ పేరునే మార్చేయడమేమిటో అర్థం కావడం లేదని కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ కాలనీలో దాదాపు వెయ్యి కుటుంబాలకు చెందిన 5వేల మంది వరకు నివసిస్తున్నారు. తప్పుగా నమోదు కావడం వల్ల వీరందరి కార్డులపైన కాలనీ పేరును సరిచేయాల్సిన అవసరం నెలకొంది. పాత రావిచర్లలో మెతుకుపల్లి శ్రీనివాసరావు, అతని భార్య పద్మావతిలకు కలిపి స్మార్ట్ రేషన్కార్డు రావాల్సి ఉండగా కేవలం మెతుకుమిల్లి పద్మావతి ఒక్కరి పేరునే కార్డు రావడంతో ఆమె భర్త శ్రీనివాసరావు వారం రోజులుగా గ్రామ సచివాలయం, తహసీల్దార్ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. తమ అర్జీని ఆన్లైన్లో నమోదు చేయడానికి రూ.80కు వరకు ఫీజు చెల్లించాల్సి వస్తోంది. తప్పుల సవరణను ఉచితంగా చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. ఆందోళనలో రేషన్ కార్డుదారులుఇటీవల ఇచ్చిన స్మార్ట్ రేషన్కార్డులో నా భార్య పేరు ఉంచి నా పేరును తొలగించారు. స్మార్ట్ రేషన్కార్డును తీసుకొని సరుకులు తెచ్చుకుందామని రేషన్ దుకాణానికి వెళ్లగా నీపేరు లేదు కదా, ఒక్కరికే సరుకులు వస్తాయని రేషన్ డీలరు చెప్పాడు. నా పేరును కార్డులో నుంచి ఎందుకు తీసేశారో తెలియడం లేదు. – మెతుకుమిల్లి శ్రీనివాసరావు, పాతరావిచర్ల, నూజివీడు మండలం నూతనంగా ఇచ్చిన స్మార్ట్ రేషన్ కార్డుల్లో పట్టణంలోని ఎమ్మార్ అప్పారావు కాలనీ పేరునే మార్చేశారు. ఎమ్మార్ అప్పారావు బదులుగా శ్రీ అప్పారావు అని ముద్రించారు. ఇలా తప్పుగా నమోదు చేయడంతో కార్డుదారులందరూ తప్పులను సరిచేయించుకోవాలి. షేక్ మస్తాన్, ఎమ్మార్ అప్పారావు కాలనీ, నూజివీడు -
డ్వాక్రా సొమ్ము రూ.58 లక్షలు స్వాహా
ఆగిరిపల్లి: డ్వాక్రా మహిళా సంఘాల సభ్యులు అక్రమార్కుల చేతిలో మోసపోవడం పరిపాటిగా మారింది. ఆగిరిపల్లి మండలం సీతారామపురంలో ఏవోఏగా పనిచేస్తున్న దిడ్డి భార్గవి డ్వాక్రా మహిళల సొమ్ము ఏకంగా రూ.58 లక్షలు స్వాహా చేసింది. ఏపీఎం రికార్డుల పరిశీలనతో ఈ వ్యవహారం బయటపడింది. వివరాల ప్రకారం దిడ్డి భార్గవి 12 ఏళ్లుగా వీవోఏగా విధులు నిర్వహిస్తోంది. ఆమె పరిధిలో 38 స్వయం సహాయక సంఘాలు ఉన్నాయి.వీరి ఖాతాలు ఈదర గ్రామంలోని ఇండియన్ బ్యాంకులో ఉన్నాయి. గ్రామానికి బ్యాంకు దూరంగా ఉండటం, నిరక్షరాస్యులైన మహిళల అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని మహిళలు బ్యాంకుకు చెల్లించాల్సిన డ్వాక్రా రుణాలను తానే చెల్లిస్తానని నమ్మించి కొన్ని నెలలు సజావుగానే చెల్లించింది. గత కొన్ని నెలలుగా సుమారు 28 స్వయం సహాయక సంఘాల్లో ఒక నెల సభ్యులు బ్యాంకుకు వెళ్లి చెల్లిస్తుండగా, మరో నెల భార్గవికి ఇస్తున్నారు. ఆమె బ్యాంకులో చెల్లిస్తున్నానని నమ్మించి సొమ్ములు కట్టడం లేదు. ఇటీవల బదిలీపై వచ్చిన ఏపీఎం రాజశేఖర్ స్వయం సహాయక సంఘాల రికార్డులను పరిశీలించడంతో ఈమె వ్యవహారం బయటపడింది. డీఆర్డీఏ డీపీఎంలు విజయ్ కుమారి, ఎంఎస్డీ భూషణం నిధుల స్వాహాపై సోమవారం గ్రామంలో బహిరంగ విచారణ చేపట్టారు. విచారణలో రూ.58 లక్షలు అక్రమాలకు పాల్పడినట్లు అధికారులు గుర్తించారు. వీవోఏ భార్గవి డబ్బులు వెంటనే చెల్లించాలని మహిళలు నిరసన వ్యక్తం చేశారు. తనకు రెండు నెలల సమయం ఇస్తే ఆ డబ్బులు చెల్లిస్తానని భార్గవి అధికారులను కోరింది. ఈ సందర్భంగా డీఆర్డీఏ అధికారులు మాట్లాడుతూ వీవోఏ అవినీతికి పాల్పడినట్లు గుర్తించామని, ఉన్నతాధికారులకు నివేదిక పంపిన తర్వాత తదుపరి విషయాలు తెలియజేస్తామన్నారు. సీ్త్ర నిధి ఏజీఎం చెన్నకేశవులు, సర్పంచ్ అత్తి మురళి, ఏపీఎం డి.రాజశేఖర్, సీసీ దివ్య పాల్గొన్నారు. -
మహిళా కండక్టర్ ఆవేదన
జంగారెడ్డిగూడెం: ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం ఆర్టీసీ డిపోలో పనిచేస్తున్న వై.కుసుమకుమారి మహిళలకు ఉచిత బస్సు పథకంపై స్పందిస్తూ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాము పడుతున్న ఇబ్బందులు, బాధలను వివరిస్తూ ఆర్టీసీ ఉన్నతాధికారులకు వీడియో పంపినట్టు ఆమె పేర్కొన్నారు. ఆ వీడియోలో ఏముందంటే.. ‘ఆర్టీసీ ఉన్నతాధికారులకు మా మనవి.. మీకో వీడియో పెడుతున్నాను చూడండి. పరిమితికి మించి 150 నుంచి 170 మంది బస్సు ఎక్కుతున్నారు. చాలా రెక్లెస్గా ఉన్నారు. డోర్లో ప్రమాదకరంగా నిలబడుతున్నారు.. డోర్ వద్ద నిలబడొద్దు.. పైకి ఎక్కమంటే కండక్టర్పై ఎదురు తిరుగుతున్నారు.. ఉద్యోగాలు చేయలేకపోతున్నాం.. ఎందుకు సర్, మా ఉద్యోగాలతో, మా ఊపిరితో, మా కుటుంబాలతో ఇలా ఆడుకుంటున్నారు.. అధికారులకు మా సేవల పట్ల కనీస జాలి, దయ లేదు.. పారిశుధ్య కార్మికుల కన్నా హీనంగా తయారైంది మా ఉద్యోగం.. కిక్కిరిసిన జనాలతో మా ఊపిరి ఆర్టీసీ బస్సులోనే పోయేలా ఉంది.. బస్సులో కొట్టుకోవడం, కండక్టర్పై తిరగబడటం, గొర్రెలా అరుస్తున్నా పైకి ఎక్కకపోవడం, ఏంటండి ఇది మాకు.. మీరిచ్చే జీతాల కన్నా ఎక్కువ కష్టపడుతున్నాం.. అయినా సరే సరైన రక్షణ, మా సేవల పట్ల గుర్తింపు లేకుండా పోయింది..’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మరి కండక్టర్ ఆవేదనపై ప్రభుత్వం, అధికారులు స్పందన ఎలా ఉంటుందనేది వేచిచూడాలి. -
అథ్లెటిక్స్ జిల్లా జట్ల ఎంపిక
తణుకు అర్బన్: పశ్చిమ గోదావరి జిల్లా అండర్ 14, 16, 18, 20 బాలుర, బాలికల జిల్లా జట్ల ఎంపికలు తణుకు జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల క్రీడా ప్రాంగణంలో సోమవారం నిర్వహించినట్లు అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి సంకు సూర్యనారాయణ తెలిపారు. ఎంపికై న జట్లలోని క్రీడాకారులు ఈ నెల 27 నుంచి 29వ తేదీల్లో ఏలూరులో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని వివరించారు. ఈ ఎంపికలకు జిల్లా నలుమూలల నుంచి 200 మంది క్రీడాకారులు హాజరుకాగా వీరిలో ప్రతిభ కనబరచిన 42 మందిని ఎంపిక చేసినట్లు చెప్పారు. అసోసియేషన్ చైర్మన్ మానేపల్లి శ్రీనివాస్ క్రీడాకారులకు భోజన వసతి కల్పించి సర్టిఫికెట్లు, మెడల్స్ అందచేశారు. హెచ్ఎం కె.పద్మావతి, అసోసియేషన్ అధ్యక్షుడు సీహెచ్ సత్యనారాయణ, కోశాధికారి కె.బాబురావు, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఉత్సాహంగా అథ్లెటిక్స్ జట్ల ఎంపిక ఏలూరు రూరల్: ఏలూరు అల్లూరి సీతారామరాజు స్టేడియంలో సోమవారం జిల్లా అథ్లెటిక్స్ జట్ల ఎంపిక పోటీలు ఉత్సాహంగా జరిగాయి. అండర్–14, 16, 18, 20 విభాగంలో బాలబాలికలకు వేరు వేరుగా ఎంపిక పోటీలు చేపట్టారు. రన్నింగ్, షాట్పుట్, జావలిన్, డిస్కస్, హేమర్త్రో పాటు హైజంప్, లాంగ్జంప్ అంశాల్లో అథ్లెట్లు నువ్వా నేనా అన్నట్టు పోటీ పడ్డారు. సుమారు 250 మంది బాలబాలికలు పోటీలకు హాజరయ్యారని అసోసియేషన్ కార్యదర్శి ప్రసాద్ చెప్పారు. ఎంపికై న అథ్లెట్లు ఈ నెల 26వ తేదీ నుంచి 29 వరకూ ఏలూరు అల్లూరి సీతారామరాజు స్టేడియంలో జరిగే అంతర జిల్లాల పోటీల్లో పాల్గొంటారని వివరించారు. -
కేసులు పెట్టడం సరికాదు
ప్రజా సమస్యల పరిష్కారం కోసం వాస్తవాలను వెలుగులోకి తీసుకువచ్చే పత్రికా రంగంపై కేసులు పెట్టే ధోరణి మంచిది కాదు. ప్రచురితమైన వార్తా కథనాల్లో ఏమైనా అవాస్తవాలు దొర్లితే న్యాయపరంగానో, ఇతర మార్గాల్లోనో సంప్రదించాలే తప్ప విలేకరులపై కేసులు నమోదుచేసే పరిస్థితులు తీసుకురాకూడదు. సమాజంలో పత్రికా స్వేచ్ఛకు గండి కొట్టేలా ఏ ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోరాదు. నాలుగో స్తంభంగా ఉన్న పాత్రికేయ వ్యవస్థకు సమాజంలో జరుగుతున్న విషయాలను తెలిపే హక్కు ఉంటుంది. – వంక రవీంద్రనాథ్, ఎమ్మెల్సీ -
కలెక్టరేట్కు మార్కెట్ యార్డ్ అనువైన ప్రాంతం
భీమవరం: భీమవరంలో కలెక్టరేట్ ఏర్పాటుకు వ్యవసాయ మార్కెట్ యార్డు ప్రాంతమే అన్ని విధాలుగా అనువైందని సీపీంఎ జిల్లా కార్యదర్శి జేఎన్వీ గోపాలనన్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ నిర్మాణ సాధన కమిటీ ఆధ్వర్యంలో సీపీఐ, సీపీఎం, ఎంసీపీఐయు, ఫార్వర్డ్బ్లాక్, ప్రజాసంఘాల నాయకులు భీమవరంలో కలెక్టరేట్ ఏర్పాటుకు గత ప్రభుత్వం కేటాయించిన వ్యవసాయ మార్కెట్యార్డులోని స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గతంలో కలెక్టరేట్ నిర్మాణానికి 20 ఎకరాలు మార్కెట్యార్డు ప్రాంతంలో కేటాయించగా అక్కడ కొంతమేరకు గొడౌన్ నిర్మించినా ఎక్కువ భాగం ఖాళీగా గడ్డి, చెట్లతో ఉందన్నారు. కలెక్టరేట్ ఏర్పాటుకు గతంలో ఇచ్చిన జీవో ప్రకారం భవనాలు నిర్మించడం వల్ల జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకు అనువుగా ఉంటుందన్నారు. ప్రజలకు రవాణా సౌకర్యాలు అందుబాటులో ఉన్న ప్రాంతం మార్కెట్ యార్డే తప్ప మరొకటి కాదని గోపాలన్ స్పష్టం చేశారు. సీపీఐ కార్యదర్శి చెల్లబోయిన రంగారావు మాట్లాడుతూ ప్రజలకు అనువైన ప్రాంతాన్ని కూటమి ప్రభుత్వం వచ్చాక రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. ఎంసీపీఐయు, ఫార్వర్డ్బ్లాక్ నాయకులు మహంకాళి, దండు శ్రీనివాసరాజు, సీపీఐ, సీపీఎం నాయకులు మల్లుల సీతారాంప్రసాద్, మల్లిపూడి ఆంజనేయులు, బొక్క సత్యనారాయణ పాల్గొన్నారు. -
శివయ్య ఆలయాన్ని ముంచెత్తిన గంగమ్మ
ద్వారకాతిరుమల: తిరుమలంపాలెంలో శ్రీ భ్రమరాంబ ఆది మల్లేశ్వర స్వామి ఆలయాన్ని గంగమ్మ ముంచెత్తింది. సోమవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షం కారణంగా ఆలయ ఆవరణలోకి, అలాగే శివయ్య, అమ్మవారి గర్భాలయాల్లోకి భారీగా నీరు చేరింది. పురోహితుడు ఆ నీటిలోంచే స్వామి, అమ్మవార్లకు పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంతం లోతట్టుగా ఉండటం వల్ల వర్షపు నీరు ఆలయంలోకి చేరుతోందని, ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. పోలవరం రూరల్: గోదావరి వరద ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు నదిలో నీటి ప్రవాహం పెరుగుతుండటంతో వరద ఉద్ధృతి పెరిగింది. పోలవరం ప్రాజెక్టు స్పిల్వే వద్ద 31.200 మీటర్లకు నీటిమట్టం చేరుకుంది. స్పిల్వే 48 గేట్ల నుంచి సుమారు 7 లక్షల క్యూసెక్కుల వరద నీరు దిగువకు చేరుతోంది. ఎగువన భద్రాచలం వద్ద 39.70 అడుగులకు నీటిమట్టం చేరుకుంది. అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు నదిలోకి నీరు చేరడంతో వరద మరో రెండు రోజులు పెరిగే పరిస్థితి ఉందని జలవనరుల శాఖ అధికారులు చెబుతున్నారు. -
ఇదిగో.. ప్రభుత్వ వైద్య కళాశాల..‘మీ కళ్ళకు కనిపిస్తోందా’?
ఏలూరు టౌన్ : ‘ఇదిగో.. చంద్రబాబు గారూ... ఏలూరులో వైఎస్ జగన్ హయాంలో నిర్మించిన ప్రభుత్వ వైద్య కళాశాల భవనం.. కూటమి నేతలూ... చూశారా’ అంటూ వైఎస్సార్సీపీ నేతలు ఆ భవనాల వద్ద సెలీ్ఫలు దిగారు. ఏలూరు జిల్లాకే ప్రతిష్టాత్మకంగా.. జిల్లా ప్రజల చిరకాల కోరికను నెరవేర్చుతూ వైఎస్సార్సీపీ హయాంలో ఈ ప్రభుత్వ మెడికల్ కళాశాలను ఏర్పాటు చేశారు. వైఎస్సార్సీపీ హయాంలో ఒక్క మెడికల్ కాలేజీ కట్టలేదంటూ చంద్రబాబు అసత్య ప్రచారం చేస్తోన్న తరుణంలో వైఎస్సార్సీపీ ఏలూరు సమన్వయకర్త మామిళ్ళపల్లి జయప్రకా‹Ù, మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి ఆధ్వర్యంలో పార్టీ నేతలు ఏలూరులోని మెడికల్ కాలేజీని సోమవారం సందర్శించారు. అత్యాధునిక సౌకర్యాలతో, కార్పొరేట్ తరహా లుక్తో మెరిసిపోతున్న వైద్య కళాశాల భవనాలను రాష్ట్ర ప్రజలకు చూపించే ప్రయత్నం చేశారు. ‘మీ కళ్ళకు కనిపిస్తోందా?’ అంటూ.. వీడియోలు, సెలీ్ఫలు దిగారు. జోహార్ వైఎస్సార్.. జై జగన్ అంటూ నినాదాలు చేశారు. కూటమి నేతలు చేస్తున్నట్లు ఇది గ్రాఫిక్స్ కాదంటూ మెడికల్ కాలేజీ భవనం వద్ద ఫొటోలు తీశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ఏలూరు నగర అధ్యక్షుడు గుడిదేశి శ్రీనివాసరావు, ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నూకపెయ్యి సు«దీర్బాబు, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు నెరుసు చిరంజీవి, ప్రధాన కార్యదర్శి లంకలపల్లి గణే‹Ù, అధికార ప్రతినిధి మున్నుల జాన్గురునాథ్, ఎస్సీ సెల్ కార్యదర్శి ఇమ్మానుయేల్, నగర మహిళా అధ్యక్షురాలు జిజ్జువరపు విజయనిర్మల, ఎస్సీ సెల్ నగర అధ్యక్షుడు ఇనపనూరి జగదీ‹Ù, బీసీ సెల్ కార్యదర్శి కొల్లిపాక సురేష్, జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలు చిలకపాటి డింపుల్జాబ్ తదితరులు పాల్గొన్నారు. 300 మంది విద్యార్థులు చదువుతున్నారు: ప్రిన్సిపాల్ ఏలూరులో వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో నిర్మించిన ప్రభుత్వ వైద్య కళాశాల భవనం ప్రారంభించి రెండేళ్లు పూర్తయ్యింది. 2023 సెప్టెంబర్ 2న ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం క్లాస్లు ప్రారంభించగా.. రెండేళ్లు పూర్తవడంతో వైఎస్సార్సీపీ నేతలు మెడికల్ కాలేజీ వద్ద కేక్ కట్ చేసి వేడుకలు చేసుకున్నారు. వైద్య విద్యార్థులకు, కాలేజీ ప్రొఫెసర్లు, నాన్ టీచింగ్ స్టాఫ్కు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. తొలుత కాలేజీలోని మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం వద్ద నివాళులు అర్పించారు. కళాశాలలో అత్యాధునిక డిజిటల్ క్లాస్రూంలు, ల్యాబ్స్, టీచింగ్ రూమ్స్ పరిశీలించారు. అనంతరం కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సావిత్రిని మర్యాదపూర్వకంగా కలిసి కళాశాల నిర్వహణపై పలు అంశాలు అడిగి తెలుసుకున్నారు. 2023 సెప్టెంబర్ 2న 150 మంది ఎంబీబీఎస్ వైద్య విద్యార్థులతో క్లాస్లు ప్రారంభించారని, 2024లో మరో 150 మంది చేరారని, ప్రస్తుతం 300 మంది విద్యార్థులు చదువుతున్నారని చెప్పారు. జగన్ చెప్పింది చేసి చూపిస్తారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేబితే చేసి చూపిస్తారు. గ్రాఫిక్స్ చేయడం మాకు చేతకాదు. 2022 నవంబర్లో మెడికల్ కాలేజీ నిర్మాణ పనులు ప్రారంభించి 2023 సెపె్టంబర్ 2 నాటికే క్లాస్లు ప్రారంభించేలా పూర్తి చేసి చూపించారు. రూ.60 కోట్లతో అత్యాధునిక సౌకర్యాలు కల్పించి మెడికల్ కాలేజీని నిర్మించారు. రెండేళ్ళు పూర్తిచేసుకున్న సందర్భంగా కేక్ కట్ చేసి వేడుకలు చేసుకున్నాం. వైద్య విద్యార్థులు, మెడికల్ కాలేజీ స్టాఫ్కు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపాం. రాష్ట్రంలో 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీల ఏర్పాటుకు రూ.8500 కోట్లతో ప్రణాళిక రూపొందించి, తొలి దశలో ఐదు మెడికల్ కాలేజీలు ప్రారంభించారు. – మామిళ్ళపల్లి జయప్రకాష్ , ఏలూరు సమన్వయకర్తప్రైవేటు పరం చేయటం న్యాయమా? వైఎస్సార్సీపీ హయాంలో ఒకేసారి 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు అనుమతులు తెచ్చిన గొప్ప నాయకుడు జగన్మోహన్రెడ్డి. విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల మెడికల్ కాలేజీలను అధికారంలో ఉండగానే ప్రారంభించగా.. ఎన్నికల నాటికి పాడేరు, పులివెందుల మెడికల్ కాలేజీలు పూర్తి చేశారు. కూటమి ప్రభుత్వం హయాంలో ఒక్క కొత్త భవనం నిర్మించారా?. జగన్ హయాంలో రైతు భరోసా కేంద్రాలు, సచివాలయ భవనాలు, విలేజ్ క్లీనిక్స్ నిర్మించారని, కూటమి నేతలు ఒక్క కొత్త భవనం నిర్మించారా? ప్రజలకు మంచి చేయటానికి ప్రయత్నం చేయాలి. – కొఠారు అబ్బయ్య చౌదరి, మాజీ ఎమ్మెల్యే -
పెనుగొండ సర్పంచ్కు అరుదైన గౌరవం
పెనుగొండ: పెనుగొండ సర్పంచ్ నక్కా శ్యామలా సోనీ శాస్త్రికి అరుదైన గౌరవం దక్కింది. ఢిలీల్లో భారత నాణ్యతా మండలి ఆధ్వర్యంలో కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ సహకారంతో ఈ నెల 15న నిర్వహించబోయే సదస్సుకు ఆహ్వానం పంపారు. ఈ సదస్సులో పాల్గొనడానికి దేశవ్యాప్తంగా 75 మంది సర్పంచ్లను ఎంపిక చేయగా పెనుగొండ సర్పంచ్కు చోటు దక్కించింది. గ్రామీణాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ నిధుల వినియోగం, తాగునీరు, పారిశుధ్య సమస్యలకు పరిష్కారంపై సర్పంచ్ల అభిప్రాయాలు తీసుకోనున్నారు. భీమవరం: యనమదుర్రు డ్రెయిన్లోకి దూకిన మహిళ మృతదేహం లభ్యమైంది. టూటౌన్ ఎస్సై కె.రామారావు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని చినఅప్పారావు తోటకు చెందిన బరువు నాగమణి(55) కుమారుడు అప్పులు పాలవడంతో నాలుగేళ్లక్రితం ఇంటి నుంచి వెళ్లిపోయాడు. అప్పటినుంచి మానసిక ఆర్యోగం దెబ్బతిన్న నాగమణికి వైద్యం చేయిస్తున్నారు. ఈనెల 8న ఇంటి నుంచి వచ్చిన ఆమె పట్టణంలోని యనమదుర్రు డ్రెయిన్ కాలిబాట వంతెన వద్ద డ్రెయిన్లోకి దూకింది. శనివారం నాగమణి మృతదేహం భీమవరం రూరల్ మండలం లోసరి వద్ద తేలడంతో ఆమె భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసినట్లు ఎస్సై రామరావు చెప్పారు. -
ఆక్రమణలను అడ్డుకున్న అటవీ అధికారులు
చాట్రాయి: మండలంలోని పోతనపల్లికి చెందిన గిరిజనులు శనివారం అటవీ భూములను ఆక్రమించుకునే యత్నాన్ని ఫారెస్టు అధికారులు అడ్డుకున్నారు. సుమారు 60 మంది ఉదయం అడవిలో తుప్పలు కొడుతుండగా సమాచారం అందుకున్న అధికారులు అడ్డుకోవడంతో గిరిజనులు, అధికారుల మధ్య కొద్ది సేపు వాగ్వాదం చోటు చేసుకుంది. తమ్మిలేరు వల్ల తమ భూములు కోల్పోయామని వాటికి ప్రత్యామ్నాయంగా ముంపు భూములను సాగు చేసుకుంటామని చెప్పగా తమ్మిలేరు రిజర్వాయర్ ప్రాజెక్టు అధికారులు ఫారెస్టు అధికారులు జాయింట్ సర్వే చేసి ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని అంతవరకు ఆక్రమణలు చేపట్టవద్దని సూచించారు. ప్రభుత్వ అనుమతి ఇస్తే వనసంరక్షణ సమితి ఏర్పాటు చేసి ఆదాయం కలిగేలా చేస్తామని ఫారెస్టు అధికారులు గిరిజనులకు చెప్పారు. అనంతరం కొంత మందిపై ఆక్రమణలు చేసినందుకు స్థానిక పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేసినట్లు ఫారెస్టు అధికారి సత్యనారాయణ తెలిపారు. కొయ్యలగూడెం: అచ్చుతాపురం వద్ద శనివారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందాడు. ఎస్సై వి.చంద్రశేఖర్ వివరాల ప్రకారం.. రాజమండ్రికి చెందిన నల్లమాటి రాంబాబు (58) కొయ్యలగూడెం వ్యాపారం నిమిత్తం వచ్చి తిరిగి రాజమండ్రి వైపు వెళుతుండగా గోపాలపురం మండలం బుచ్చంపేట నుంచి కొయ్యలగూడెం వైపు బైక్పై తల్లితో వస్తున్న తామా శ్రీరామ్ ఢీకొట్టాడు. రాంబాబు తలకు తీవ్ర గాయం కావడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. 108 సిబ్బంది చేరుకొని గాయపడిన శ్రీరామ్, అతని తల్లిని కొయ్యలగూడెం పీహెచ్సీకి, అక్కడ నుండి జంగారెడ్డిగూడెం ఏరియా హాస్పిటల్ కి తరలించారు. ఏలూరు రూరల్: ఈ నెల 16న ఏలూరు జిల్లా బాల బాలికల జూనియర్ కబడ్డీ జట్ల ఎంపిక పోటీలు చేపట్టనున్నామని ఏలూరు జిల్లా కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి రంగారావు, అధ్యక్షుడు ఎం.శ్రీనివాసరావు ఓ ప్రకటనలో తెలిపారు. వట్లూరు సర్ సీఆర్ఆర్ ఇంజినీరింగ్ కళాశాల ఆవరణలో మధ్యాహ్నం 2 గంటలకు ఎంపిక జరుగుతుందన్నారు. 2006 జనవరి 1 తర్వాత పుట్టిన వారే పాల్గొనేందుకు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి గలవారు 99519 31133 నెంబర్లో సంప్రదించాలన్నారు. పెనుగొండ: తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ జరిగినట్లు ఎస్సై కొప్పిశెట్టి గంగాధర్ తెలిపారు. శనివారం రాత్రి మాట్లాడుతూ పెనుగొండ ఎంఎస్ఆర్ నగర్లో బిక్కవోలు కేశవ రామాచార్యులు ఈ నెల 9న ఇంటికి తాళం వేసి పొరుగూరు వెళ్లారని 13న వచ్చే సరికి తలుపులు, బీరువా తలుపు బద్దలు కొట్టి ఉండడంతో చోరీ జరిగినట్లు గుర్తించారు. రెండు కాసుల బంగారం, 400 గ్రాముల వెండికాయిన్స్ మాయమవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసారు. నర్సాపురం రూరల్: నరసాపురం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రుస్తుంబాద గ్రామ సమీపంలో నరసాపురం ప్రధాన కాలువలో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైనట్లు రూరల్ ఎస్సై సురేష్ తెలిపారు. శుక్రవారం గ్రామస్తులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నామన్నారు. మృతురాలి ఒంటిపై ఎరుపు రంగు చీర, తెల్ల చుక్కల డిజైన్ గచ్చకాయ రంగు జాకెట్ ఉందన్నారు. వివరాలు తెలిస్తే 94407 96616 నెంబరులో సంప్రదించాలని తెలిపారు. చింతలపూడి: విజిలెన్సు, రెవిన్యూ, వ్యవసాయ శాఖ అధికారులు శనివారం చింతలపూడి మండలంలోని ఎరువులు షాపులను తనిఖీ చేశారు. మండలంలోని సీతానగరంలో గణేష్ ట్రేడర్స్, శ్రీ లక్ష్మి ట్రేడర్స్ షాపుల్లో తనిఖీ చేయగా రూ.15,67,650 విలువ కలిగిన 64.5 టన్నుల ఎరువులు తేడా ఉన్నట్లు గుర్తించి వాటిని సీజ్ చేశారు. షాపు యజమానులపై కేసులు నమోదు చేసినట్లు ఏఓ మురళీ కృష్ణ తెలిపారు. -
అలరించిన నాట్య విన్యాసాలు
ఏలూరు (ఆర్ఆర్పేట): నగరానికి చెందిన నటరాజ నాట్య కళాకేంద్రం, కళాదీపిక నృత్య అకాడమీ, శ్రీశ్రీ కల్చరల్ ఫైన్ ఆర్ట్స్ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో 12వ జాతీయ స్థాయి నృత్య అవార్డుల ప్రదాన కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. వైఎంహెచ్ఏ హాలులో ఈ కార్యక్రమం రాత్రి 10 గంటల వరకూ కొనసాగింది. 150 మంది చిన్నారులు చేసిన నృత్య విన్యాసాలు మంత్రముగ్ధులను చేశాయి. 20 మంది నృత్య గురువులకు నాట్య విదాత అవార్డులు ప్రదానం చేసి సత్కరించారు. ఈ సందర్భంగా నిర్వాహకుడు ఎన్.రాజ్కుమార్ మాట్లాడుతూ ఎంతోమంది చిన్నారులను ప్రోత్సహించడానికి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో నాట్య గురువు వేదాంతం రాధేశ్యామ్, కళారత్న ఏ.పార్వతి రామచంద్రన్, నాట్యాచార్య డీ.హేమసుందర్ అతిథులుగా పాల్గొనగా, నటరాజ నాట్య కళాకేంద్రం నిర్వాహకురాలు ఎన్.కృష్ణవేణి కార్యక్రమాలు పర్యవేక్షించారు. -
బియ్యం ధరల మోత
పాలకొల్లు సెంట్రల్: బియ్యం ధరలకు రెక్కలు వచ్చాయి. ఆగస్టు మొదటి వారం నుంచి క్వింటాల్కు ఒక్క నెలలో ఏకంగా రూ.1000 రూపాయలు ధర పెరిగింది. ధాన్యం దొరకడం లేదని రైస్ మిల్లర్లు, బ్రాండెడ్ బియ్యం అమ్మే వ్యాపారులు సాకుగా చెబుతున్నారు. అయితే బియ్యం ధరలు కావాలనే పెంచుతున్నారని విమర్శలు వస్తున్నాయి. సామాన్య, మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో లేని విధంగా రైస్మిల్లర్లు, ట్రేడర్లు ఇష్టానుసారం ధరలు పెంచేసి ప్రజల అవసరాన్ని అవకాశంగా మలుచుకుంటున్నారు. భగ్గుమంటున్న బ్రాండెడ్ ధర మార్కెట్లో సోనా, హెచ్ఎంటీ, ఆర్ఎన్ఆర్ సోనా రకాల్ని ఆగస్టు మొదటి వారం నుంచి బ్రాండెడ్ కంపెనీలు క్వింటాల్ రూ.4000 నుంచి రూ.4200 వరకూ విక్రయించారు. ఆగస్టు 23 నాటికి బ్రాండెడ్ కంపెనీలు రూ.4,800, అన్బ్రాండెడ్ రూ.4,250కి అమ్మారు. సెప్టెంబర్ 1 నాటికి బ్రాండెడ్ బియ్యం టన్ను రూ.5,000, అన్ బ్రాండెడ్ రూ.4,350, సెప్టెంబర్ 8కి బ్రాండెడ్ రూ.5,200, అన్ బ్రాండెడ్ రూ.4,650కి అమ్ముతున్నారు. ఒక్క నెలలో క్వింటాల్ సుమారు రూ.1000 వరకూ పెరిగింది. దీన్ని బట్టి రైస్మిల్లర్లు, వ్యాపారులు ఎంత ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారో అర్ధమవుతుంది. మున్ముందు ధరలు పెరుగుతాయోనని వినియోగదారులు, మార్కెట్ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. బియ్యం ధరలు నియంత్రించాలి ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో సుమారు 380 మంది వరకూ రైస్మిల్లులు ఉన్నారు. వీరిలో కొందరు మాత్రమే ప్రైవేటు వ్యాపారం చేస్తుంటారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా, మిర్యాలగూడ, ఖమ్మం, కోదాడ, నెల్లూరు, కర్ణాటక, బళ్లారి, సిరిగుప్పల ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో బియ్యం ప్రైవేటు వ్యాపారాలు చేస్తుంటారు. మన ప్రాంతంలో 90 శాతం తూర్పుగోదావరి జిల్లా మండపేట, గొల్లప్రోలు, పెద్దాపురం ప్రాంతాల నుంచి బ్రాండెడ్ బియ్యం సరఫరా చేస్తున్నారు. అధిక ధరలపై వినియోగదారులు స్థానిక వ్యాపారులను ప్రశ్నిస్తున్నా తాము ఏం చేయలేమని రైస్ మిల్లర్లు, ట్రేడర్లు పెంచుతున్న ధరలకు తమ మెయింట్నెన్స్ నిమిత్తం రూ.50 నుంచి రూ.100 వరకూ వేసుకుని విక్రయిస్తున్నామని చెబుతున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి ఆకాశాన్ని అంటుతున్న బియ్యం ధరలను నియంత్రించేలా చర్యలు చేపట్టాలని వినియోగదారులు, మార్కెట్ వర్గాలు కోరుతున్నాయి. గతంలో కొందరు రైస్ మిల్లర్లు, ట్రేడర్లు ప్రభుత్వానికి తెలివిగా పన్ను చెల్లించకుండా టోకరా వేసేశారు. బ్రాండెడ్ రైస్కు ట్యాక్స్లు చెల్లించాల్సి వస్తుందని బ్రాండ్కు ముందు ట్యాగ్లైన్ తగిలించి పేరు మారినట్లు చూపి పన్నులు ఎగవేసేవారు. ఓ వ్యాపారి బియ్యం ప్యాకింగ్పై అంతవరకూ నాగవల్లి అని బ్రాండ్ ఉంటే పన్ను ఎగ్గొట్టడానికి దానిని పి.కె.నాగవల్లిగా మార్చి పన్ను చెల్లించకుండా వ్యాపారాన్ని కొనసాగించేవారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం బ్రాండ్తో సంబంధం లేకుండా కేజీ నుంచి 25 కేజీల వరకూ ప్యాకింగ్ ఉన్న ప్రతి బ్రాండ్కు 5 శాతం జీఎస్టీ విధించింది. దీంతో వ్యాపారులు కొత్త ఎత్తుగడతో పన్నుకు ఎగనామం పెడుతున్నారు. బియ్యం బస్తాను 25, 50 కేజీలు ప్యాకింగ్ చేసేవారు. తరువాత 5, 10, 25 కేజీలుగా ప్యాకింగ్లు చేస్తూ విక్రయించేవారు. 5 శాతం పన్ను నుంచి తప్పించుకోడానికి కొంతకాలంగా 26 కేజీలు, 30 కేజీల ప్యాకింగ్లు చేస్తున్నారు. 25 కేజీలు ప్యాకింగ్ దాటితే పన్ను లేదు. ఒకవైపు పన్ను ఎగ్గొడుతున్నా బియ్యం ధరలు మాత్రం తగ్గించకపోవడం గమనార్హం. వీటిపై అధికారులు దృష్టి పెట్టకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. రైస్ మిల్లర్లు, వ్యాపారుల ఇష్టారాజ్యం నెల రోజుల్లో క్వింటాల్కు రూ.1000 పెరుగుదల మరోవైపు 26, 30 కేజీల ప్యాక్లతో పన్ను ఎగనామం -
పత్రికా స్వేచ్ఛను హరించడమే
భీమవరం: సాక్షి దినపత్రికపై ఉద్దేశ్య పూర్వకంగా కేసులు పెట్టడం పత్రికా స్వేచ్ఛను హరించడమేనని దళిత ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు గంటా సుందరకుమార్ అన్నారు. భీమవరం పట్టణం ప్రకాశంచౌక్ సెంటర్లో శనివారం నిర్వహించిన ఐక్య వేదిక ముఖ్యనాయకులు సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజల పక్షాన ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను సాక్షి పత్రికలో ప్రచురించడాన్ని జీర్ణించుకోలేని కూటమి ప్రభుత్వం అక్రమంగా కేసులు పెట్టి వేధిస్తోందని దీనిలో భాగంగానే సాక్షి ఎడిటర్ ధనుంజయరెడ్డిపై కేసులు పెట్టారని దీనికి దళిత ఐక్యవేదిక తీవ్రంగా ఖండిస్తునట్లు చెప్పారు. ఈ సమావేశంలో గొల్ల రాజ్కుమార్, ఆలమూరి బాబ్జి, తుళ్లూరి చంటి, పట్టెం శుభాకర్ తదితరులు పాల్గొన్నారు. ఏలూరు (ఆర్ఆర్పేట): ఈ నెల 16, 17 తేదీల్లో ఏలూరు జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జిల్లాలోని అన్ని యాజమాన్యాల ఉన్నత పాఠశాలల్లో చదివే విద్యార్థులకు అండర్–14, అండర్–17 బాలబాలికల క్రీడా జట్ల ఎంపికలు నిర్వహించనున్నట్టు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి కే అలివేలు మంగ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు ఈ నెల 16న అండర్–17 బాలబాలికల వెయిట్ లిఫ్టింగ్ జట్ల ఎంపిక అల్లూరి సీతారామరాజు స్టేడియంలో జరుగుతుందన్నారు. అండర్–14, 17 బాలబాలికల స్విమ్మింగ్ జట్ల ఎంపికలు అల్లూరి సీతారామ రాజు స్విమ్మింగ్ పూల్లో, అండర్–14, 17 కరాటే జట్ల ఎంపికలు స్థానిక కాస్మోపాలిటన్ క్లబ్ ప్రాంగణంలో జరుగుతాయన్నారు. అండర్–14 జట్లకు వచ్చే విద్యార్థులు 2012 జనవరి 1న కానీ ఆ తరువాత కానీ పుట్టి ఉండాలన్నారు. అండర్–17 జట్ల ఎంపికకు 2009 జనవరి 1న కానీ ఆ తరువాత పుట్టి ఉండాల న్నారు. ఇతర వివరాలకు 9030894311 నెంబర్లో సంప్రదించవచ్చన్నారు. -
నూతన పద్ధతులతో ఆక్వా రంగ అభివృద్ధి
కాళ్ల: రైతులు నూతన పద్ధతులను అవలంభిస్తే ఆక్వా మరింత అభివృద్ధి చెందుతుందని మండలి చైర్మన్ రాజు మోషేన్రాజు ఆశాభావం వ్యక్తం చేశారు. కాళ్ల మండలం పెదఅమీరం రాధాకృష్ణ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహిస్తున్న ఆక్వా ఎక్స్ ఇండియా కార్యక్రమం శనివారంతో ముగిసింది. మూడో రోజు మండలి చైర్మన్ సందర్శించారు. స్టాల్స్ను సందర్శించి ఆక్వా సాగుపై పలు విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత తొమ్మిదేళ్లుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న దంతులూరి వేణు రాజును ఆయన అభినందించారు. ఆక్వా రంగంలో కొత్త టెక్నాలజీని ఈ ప్రాంతానికి తీసుకురావడం శుభ పరిణామం అన్నారు. ఆక్వా ఎక్స్పోతో ఈ ప్రాంత రైతులకు ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. ఎక్స్పో నిర్వహిస్తూ రైతులకు మేలు చేస్తున్న సీఈవో దంతులూరి వేణును అభినందించారు. -
ఉచితం.. అవస్థల ప్రయాణం!
ప్రముఖ క్షేత్రంలో బస్సుల కోసం ఇన్ని ఇబ్బందులు పడాలా? మరీ ఇంత దారుణంగా ఉంటుందని అనుకోలేదు. రెండు గంటల నుంచి రాజమండ్రి బస్సు కోసం బస్టాండ్లో వేచి ఉన్నాం. కనీసం భీమడోలు వరకు అయినా వెళదామంటే బస్సు ఎక్కడానికి వీలు లేకుండా ఉంది. – కుడిపూడి సత్యనారాయణ, భక్తుడు, రాజమహేంద్రవరం శనివారం భక్తులు ఎక్కువగా ఉంటారని ఆర్టీసీ అధికారులకు తెలియదా? రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు బస్సు సర్వీసులను పెంచాలి కదా. గంటకో బస్సు వస్తోంది. అది ఎక్కేందుకు వందల మంది పోటీ పడుతున్నారు. క్షేత్రంలో ఇలాంటి ఇబ్బందులు ఎప్పుడూ ఎదుర్కోలేదు. – వేగి వీరమ్మ, భక్తురాలు, పాలకొల్లు బస్సులు నడపలేనప్పుడు ఉచిత బస్సు పథకం ఎందుకు పెట్టారు? మహిళలను ఇబ్బంది పెట్టడానికా? శ్రీవారి దర్శనార్థం యానాం నుంచి వచ్చాం. తిరిగి వెళ్లేందుకు బస్సులు లేవు. పిల్లలు, దివ్యాంగులు, వృద్ధులతో ఎన్నో కష్టాలు పడుతున్నాం. ఉచిత బస్సులను తీసేసి, పూర్తి స్థాయిలో బస్సులను నడపండి. – జిత్తుగ శ్రీదేవి, భక్తురాలు, యానాం నేను దివ్యాంగుడిని. నా తల్లి సాయంతో వచ్చి శ్రీవారిని దర్శించుకున్నాను. బస్టాండుకు వస్తే జనంతో నిండిపోయింది. నాలాంటి వారు బస్సు ఎలా ఎక్కాలి? – ప్రవీణ్కుమార్, దివ్యాంగ భక్తుడు, ఉయ్యూరుద్వారకాతిరుమల: ఓ వైపు చాలీచాలని బస్సులు.. మరో వైపు ఇళ్లకు చేరుకోవాల్సిన భక్తులు.. ఏం చేయాలో పాలుపోక వృద్ధులు, చంటి పిల్లలు, దివ్యాంగులతో బస్టాండ్లో గంటల తరబడి పడిగాపులు.. ఇదీ ద్వారకాతిరుమలలోని శ్రీవారి భక్తుల దీన స్థితి. ఈ దుస్థితికి ఉచిత బస్సు ప్రయాణాలే కారణమని కొందరు మహిళా భక్తులు ఆవేదన వ్యక్తం చేయడం గమనార్హం. చిన్న తిరుపతి క్షేత్రాన్ని శనివారం వేలాది మంది భక్తులు దర్శించారు. అనంతరం తిరిగి బస్సుల్లో స్వగ్రామాలకు చేరుకునేందుకు వారంతా బస్టాండ్కు చేరుకున్నారు. భక్తుల రద్దీకి సరిపడా బస్సులు లేకపోవడంతో బస్టాండ్ మొత్తం యాత్రికులతో నిండిపోయింది. దానికి తోడు మధ్యాహ్నం వర్షం కురవడంతో నిలవడానికి చోటు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. బస్సులే లేవు.. ఉచిత బస్సు ఏమిటి? ఉచిత బస్సు ప్రయాణం వల్లే ఇబ్బందులు ఏర్పడ్డాయని మహిళా భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు. తాము గతంలో శ్రీవారి దర్శనానికి వచ్చినప్పుడు తిరుగు ప్రయాణంలో ఇన్ని ఇబ్బందులు ఎప్పుడూ పడలేదని, ప్రస్తుత పరిస్థితికి ఉచిత ప్రయాణాలే కారణమని అన్నారు. బస్సులు తక్కువగా వస్తుండటంతో, వచ్చిన వాటిలో సామర్థ్యానికి మించి ప్రయాణికులు ఎక్కుతున్నారని, దీంతో అవి పక్కకు ఒరిగిపోతున్నాయని విమర్శించారు. గుడి సెంటర్లో బస్సులు ఆపకపోవడం వల్ల బస్టాండుకు వచ్చామని, కానీ ఇక్కడ అసలు నిలబడడానికి కూడా దారిలేదని వాపోయారు. పునరుద్ధరించని బస్సు సర్వీసులు భీమవరం, నరసాపురం ఆర్టీసీ డిపోలు ద్వారకాతిరుమలకు పలు బస్సు సర్వీసులను రద్దు చేశాయి. దానికి తోడు చాలీచాలని బస్సుల కారణంగా యాత్రికులు పడుతున్న ఇబ్బందులపై సాక్షి దినపత్రికలో గతనెల 31న ఉచిత బస్సు.. ప్రయాణం తుస్సు శీర్షికన కథనం ప్రచురితమైంది. దీనిపై స్పందించిన ఏలూరు ప్రజారవాణా శాఖ అధికారి ఎస్కే షబ్నం భక్తుల రద్దీకి అనుగుణంగా బస్సు సర్వీసులను పెంచుతామని, రద్దయిన సర్వీసులను త్వరలో పునరుద్ధరిస్తామని తెలిపారు. కానీ ఇప్పటివరకు అవి అమలు కాలేదు. ద్వారకాతిరుమల క్షేత్రంలో యాత్రికులకు ప్రయాణ కష్టాలు చాలీచాలని బస్సులు.. భక్తుల కొట్లాటలు ఉచిత బస్సుల్లో రద్దీ ఇబ్బందులు బస్సుల ద్వారాల వద్ద నిలబడి ప్రమాదకర ప్రయాణాలు బస్సు ఎక్కే సమయంలో యాత్రికులు తోపులాటకు దిగి ఒకానొక దశలో కొట్లాటలకు దిగారు. దీంతో బస్టాండ్లో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు బస్టాండ్లో ఇదే పరిస్థితి కొనసాగింది. సమాచారం అందుకున్న పోలీసులు రంగప్రవేశం చేసి యాత్రికులను నియంత్రించే ప్రయత్నం చేశారు. పోలీసులను సైతం లెక్కచేయలేదు. దాదాపు అన్ని బస్సుల్లోనూ ద్వారాల వద్ద నిలబడే యాత్రికులు ప్రయాణాలు సాగించారు. ఈ ప్రమాదకర ప్రయాణాలు తోటి యాత్రికులను ఆందోళనకు గురిచేశాయి. -
హెచ్ఐవీని పారదోలుదాం
ఏలూరు (ఆర్ఆర్పేట): నివారణ ద్వారానే ఎయిడ్స్ వ్యాధిని సమాజం నుంచి తరిమివేయగలమని, జిల్లాలో హెచ్ఐవీ కేసులు పెరగకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందని డీఎంహెచ్ఓ పీజే అమృతం అన్నారు. స్థానిక సీఆర్రెడ్డి మహిళా కళాశాల నుంచి శుక్రవారం జిల్లా వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో యూత్ ఫెస్ట్ 2025–26, ఐఈసీ మారథాన్ 5కే రెడ్రన్ ర్యాలీని ఎర్రబెలూన్లు ఎగురవేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎయిడ్స్ వ్యాప్తిని అరికట్టడానికి, వ్యాధి నివారణపై అవగాహన కలిగించడానికి, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు మద్దతుగా నిలవడానికి మారథాన్ 5కే రెడ్రన్ నిర్వహించనున్నామన్నారు. హెచ్ఐవీ సంబంధిత సమాచారం కోసం జాతీయ హెల్ప్లైన్ నంబర్ 1097ను సంప్రదించాలని కోరారు. సెట్వెల్ సీఈఓ కేఎస్ ప్రభాకరరావు, ఆర్ఐఓ ప్రభాకర్, దిశ క్లస్టర్ ప్రోగ్రాం మేనేజర్ జి.ఆదిలింగం పాల్గొన్నారు. ర్యాలీ కలెక్టరేట్ వద్ద గల ఇండోర్ స్టేడియం వరకు చేరింది. ఏలూరు (టూటౌన్): జిల్లాలోని పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనాల కోసం 25,099 మంది విద్యార్థులకు 22,142 మంది వివరాలు రెన్యూవల్ చేసినట్టు జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి వై.విశ్వమోహన్రెడ్డి శుక్రవారం తెలిపారు. మిగిలిన 2,498 మందిలో 2,000 మంది విద్యార్థుల బయోమెట్రిక్ కళాశాలల్లో పెండింగ్లో ఉందని, ప్రిన్సిపాళ్లు వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. విద్యార్థులు గ్రా మ, వార్డు సచివాలయంలో 5 స్టెప్ వెరిఫికేషన్ పూ ర్తి చేసుకోవాలన్నారు. ఈనెల 30లోపు కొత్త రిజిస్ట్రేషన్లు, రెన్యూవల్స్ ప్రక్రియ పూర్తికావాలన్నారు. -
బీసీలకిచ్చిన హామీలు అమలు చేయాలి
భీమవరం: ఎన్నికల ముందు కూటమి నాయకులు బీసీ వర్గాలకు ఇచ్చిన వాగ్దానాలను తక్షణమే అమలు చేయాలని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు వర్తనపల్లి కాశీ డిమాండ్ చేశారు. శుక్రవారం భీమవరం కలెక్టరేట్లో ఐదు ప్రధాన డిమాండ్లను అమలు చేయాలని బీసీ సంఘం నాయకులు వినతిపత్రం సమర్పించారు. కాశీ మాట్లాడుతూ చట్టసభల్లో 33 శాతం, స్థానిక సంస్థలు–నామినేటెడ్ పదవులు, నామినేషన్ పనుల్లో 34 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారన్నా రు. అయితే వీటిని నెరవేర్చకపోగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే తరుణంలో ఇప్పటికీ రాష్ట్రంలో కులగణన నిర్వహించకుండా, స్థానిక ప్రాదేశిక నియోజక వర్గాల విభజన పూర్తి చేయకుండా, బీసీలకు రిజర్వేషన్లు ఎలా కల్పిస్తారని నిలదీశారు. ఏప్రిల్ తర్వాత ఆరు నెలల్లోపు ఎన్నికలు జరిగే అవకాశమున్నందున ఈలోపు కులగణన జరిపి ప్రా దేశిక నియోజక వర్గాల విభజన పూర్తి చేసి, బీసీల కు 34 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డి మాండ్ చేశారు. బీసీ సబ్ప్లాన్ రూపొందించి బడ్జెట్లో నిధులు కేటాయించాలన్నారు. జిల్లా నాయీబ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షుడు కొడవర్తి శివప్రసాద్, అగ్నికుల క్షత్రియ యూత్ ఫోర్స్ రాష్ట్ర అధ్యక్షుడు నాగిడిపాలెం శ్యామ్, కేశవభట్ల విజయ్, అత్తిలి బాబి, సుధీర్ పాల్గొన్నారు. -
అక్షరంపై కక్ష సాధింపు తగదు
అక్షరం ప్రశ్నిస్తుంది.. అక్రమం ఎక్కడుంటే అక్కడ గర్జిస్తుంది. ఒక అక్షరాన్ని బహిష్కరిస్తే లక్ష అక్షరాలు పుట్టుకొస్తాయి. పత్రికా స్వేచ్ఛ రాజ్యాంగం కల్పించిన హక్కు. కూటమి ప్రభుత్వం ‘సాక్షి’ మీడియాపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది. తప్పులు ఎత్తిచూపుతున్న ఎడిటర్, పాత్రికేయులపై కేసులు పెట్టడం కూటమి ప్రభుత్వ దిగజారుడుతనానికి నిదర్శనం. సమాజంలో ప్రతిఒక్కరూ పత్రికా స్వేచ్ఛను పరిరక్షించాలి. – దూలం నాగేశ్వరరావు (డీఎన్నార్), వైఎస్సార్సీపీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు -
కలెక్టరేట్ నిర్మాణంపై రాద్ధాంతం తగదు
భీమవరం: పశ్చిమగోదావరి జిల్లా కలెక్టరేట్ను ఎక్కడ నిర్మించాలనే దానిపై కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకా లేనిపోని చర్చ, అనవసరమైన రా ద్ధాంతం జరుగుతోందని సీపీఎం జిల్లా కార్యదర్శి జేఎన్వీ గోపాలన్ విమర్శించారు. శుక్రవారం స్థానిక సీపీఎం కార్యాలయంలో కలెక్టరేట్ సమస్యపై వామపక్షాల ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. మూడేళ్ల కిందటే కలెక్టరేట్ నిర్మాణానికి భీమవరం మార్కెట్ యార్డులో 20 ఎకరాల స్థలా న్ని కేటాయిస్తూ ప్రభుత్వం జీఓ విడుదల చేసిందన్నారు. ఇది ఆమోదయోగ్యమైంది కావడంతో ఎవరూ అభ్యంతరం చెప్పలేదన్నారు. గతంలో ప్రకటించిన విధంగానే కలెక్టరేట్ నిర్మించాలని, దీనిలో భాగంగా ఈనెల 15న మార్కెట్ యార్డు స్థల పరిశీలనకు అందరూ రావాలని పిలుపునిచ్చారు. సీపీఐ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు మాట్లాడుతూ ప్రస్తుతం కలెక్టరేట్ నిర్మాణానికి సూచిస్తున్న ప్రాంతాలు అనువైనవి కాదన్నారు. ఫార్వర్డ్ బ్లాక్ జిల్లా కార్యదర్శి లంకా కృష్ణమూర్తి, ఎంసీపీఐయూ జిల్లా నాయకుడు జి.రాంబాబు మాట్లాడుతూ గతంలో కేటాయించిన విధంగానే కలెక్టరేట్ను మార్కెట్ యార్డులో నిర్మించాలన్నారు. సమావేశంలో సీపీఎం పట్టణ కార్యదర్శి బి.వాసుదేవరావు, సీపీఐ కార్య దర్శి చెల్లబోయిన రంగారావు, మల్లుల సీతారాంప్రసాద్, దండు శ్రీనివాసరాజు, బొక్కా సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
కూటమి చిన్నచూపు
సాక్షి, భీమవరం: కంటి వైద్యసేవలపై కూటమి ప్ర భుత్వం చిన్నచూపు చూస్తోంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఏర్పాటుచేసిన ముఖ్యమంత్రి ఈఐ కేంద్రాల్లో ఏడాది కాలంగా వైద్య సేవలు నిలిచిపోవడంతో పేదవర్గాల వారు ఇబ్బందులు పడుతున్నారు. కంటి పరీక్షల కోసం ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. 2018లో ఏర్పాటు : ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని ఆచంట, ఆకివీడు, భీమవరం, భీ మడోలు, దెందులూరు, చింతలపూడి, పోలవరం, పాలకొల్లు, నరసాపురంలలోని సీహెచ్సీల్లో 2018 లో అప్పటి ప్రభుత్వం ముఖ్యమంత్రి ఈఐ కేంద్రా లను ఏర్పాటుచేసింది. వీటి నిర్వహణను ప్రైవేట్ సంస్థకు అప్పగించింది. ఒక్కో కేంద్రంలో ఒక ఆఫ్త్తమాలజీ అసిస్టెంట్, ఒక ఎక్యుప్మెంట్ అసిస్టెంట్ అందుబాటులో ఉండేవారు. ఆధునాతన ఆటోమెటిక్ రిఫ్రాక్టర్ మీటర్, కంటి లోపల భాగాలను పరీక్షించే ఫండస్ కెమెరాలతో కంప్యూటర్ ద్వారా డీఆర్, గ్లకోమా, కేటరాక్ట్, మాక్యులర్ డీజనరేషన్, హైపర్టెన్సివ్ రెటీనోపతి తదితర పరీక్షలు చేసేవారు. అవసరమైన వారికి మందులు, కళ్లజోళ్లు అందజేసేవారు. కంటి సమస్యలు, శస్త్రచికిత్సలు అవసరమైన వారిని తొలిదశలోనే గుర్తించి మెరుగైన వైద్య నిమిత్తం సమీపంలోని ఆరోగ్యశ్రీ రిఫరల్ ఆస్పత్రులకు పంపేవారు. పేదవర్గాల వారికి ఈ కేంద్రాలు ఎంతో ప్రయోజనకరంగా ఉండేవి. ఏడాదిగా నిలిచిన సేవలు గతేడాది సెప్టెంబరు 4తో కాంట్రాక్టు సంస్థతో ఉన్న ఎంఓయూ గడువు ముగియడంతో సేవలు నిలిచిపోయాయి. అప్పట్లో రెన్యూవల్ చేయకపోవడంతో ఆస్పత్రుల్లోని ఆటోమెటిక్ రిఫ్రాక్టర్ మీటర్, ఫండస్ కెమెరాలు, ఇతర సామగ్రిని కాంట్రాక్టు సంస్థ తరలించుకుపోయింది. దీంతో కంటి వైద్య పరీక్షల కోసం పేదవర్గాల వారు ఇబ్బంది పడాల్సి వస్తోంది. కంటి పరీక్షలు చేసి కళ్లజోడు ఇచ్చేందుకు దాదాపు రూ.1,000 నుంచి రూ.1,500 వరకు ఖర్చవుతుంది. మొత్తం ఆయా పరీక్షలకు రూ.3,000 వరకు ఖర్చవుతుందని అంచనా. గతంలో ఈ సేవలన్నీ ఉచితంగా అందేవి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కంటి వైద్యులు అందుబాటులో ఉన్న భీమవరం తదితర చోట్ల కొన్ని రకాల కంటి పరీక్షలు నిర్వహిస్తున్నా, ఉ చితంగా కళ్లజోళ్లు, పూర్తిస్థాయిలో సేవలు అందించలేని పరిస్థితి ఉందని రోగులు అంటున్నారు. గతంలో మాదిరి కంటి వైద్య పరీక్షల నిర్వహణకు, ఉచితంగా కళ్లజోళ్లు పంపిణీకి ప్రభుత్వం చొరవ చూపాలని ప్రజలు కోరుతున్నారు. గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి ఈఐ కేంద్రాల నిర్వహణతో పాటు వృద్ధులు, విద్యార్థుల కోసం గ్రామాల్లో, పాఠశాలల్లో వైఎస్సార్ కంటి వెలుగు శిబిరాలను నిర్వహిస్తూ వచ్చారు. ముఖ్యమంత్రి ఈఐ కేంద్రాల కాంట్రాక్టు సంస్థ మెమోరాండమ్ ఆఫ్ అండర్ స్టాండింగ్ (ఎంఓయూ)ను ఎప్పటికప్పుడు రెన్యూవల్ చేస్తూ వైద్యసేవలకు అంతరాయం కలగకుండా చూసేవారు. ఈఐ కేంద్రాలు ప్రారంభం నుంచి గతేడాది నిలిచేనాటి వరకు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మొత్తం 2,35,943 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. 2,199,37 మందికి రిఫ్రాక్షన్ చెక్స్, 98,950 మందికి ఫండస్ చెక్స్ చేయగా, 1,50,656 మందికి కళ్లజోళ్లు అందజేశారు. 884 డీఆర్, 626 గ్లకోమా, 140 మాకులర్ డిజనరేషన్, 14,080 కాటరాక్ట్, 76 హైపర్టెన్సివ్ రెటినోపతి రోగులను గుర్తించి సంబంధిత వైద్యసేవలు, శస్త్రచికిత్సలు నిర్వహించారు. ఒక్కో కేంద్రంలో రోజూ వంద మందికి పైగా రోగులు వచ్చి కంటి వైద్యసేవలను ఉచితంగా పొందేవారు. కేంద్రం మొత్తం పరీక్షలు రిఫ్రాక్షన్ చెక్స్ కళ్లజోళ్లు ఫండస్ చెక్స్ఆచంట 27,970 27,832 18,131 13,831 ఆకివీడు 20,576 20,407 13,688 7,246 భీమడోలు 25,179 21,208 14,020 10,556 భీమవరం 23,944 23,638 17,807 8,899 చింతలపూడి 29,747 25,631 17,625 13,619 దెందులూరు 24,401 22,320 13,499 11,815 పాలకొల్లు 30,553 29,815 21,443 12,491 పోలవరం 25,883 22,420 15,453 9,858 నరసాపురం 27,690 26,666 18,990 10,635 కానరాని కంటి వెలుగు ముఖ్యమంత్రి ఈఐ కేంద్రం సేవలు నిలిచి ఏడాది కాంట్రాక్టు సంస్థతో గతేడాది సెప్టెంబరులో ముగిసిన ఎంఓయూ కంటి వైద్య సేవల కోసంపేదల ఇబ్బందులు ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయించాల్సిన దుస్థితి గతంలో ఉమ్మడి జిల్లాలో 2.35 లక్షల మందికి ఉచితంగా కంటి పరీక్షలు -
వర్జీనియా అధరహో
● రికార్డు స్థాయిలో ధర ● కిలోకు అత్యధికంగా రూ.418 ● కంపెనీలకు ఆర్డర్లతో రైతులకు ఊరట జంగారెడ్డిగూడెం: వర్జీనియా పొగాకుకు రికార్డుస్థాయి లో ధర పలికింది. కిలోకు రూ.418 అత్యధిక ధర లభించింది. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని ఐ దు వేలం కేంద్రాలు ఉండగా, జంగారెడ్డిగూడెం–2, కొయ్యలగూడెం కేంద్రాల్లో కిలోకు రూ.418, జంగారెడ్డిగూడెం–1లో రూ. 417, దేవరపల్లి, గోపాలపురం కేంద్రాల్లో రూ.416 అత్యధిక ధర లభించింది. ఇక కనిష్ట ధర జంగారెడ్డిగూడెం–1, 2, కొయ్యలగూడెం కేంద్రాల్లో కిలోకు రూ.200 రాగా గోపాలపురం, దేవరపల్లిలో రూ.140 లభించింది. గతేడాది రూ.411 : గతేడాది అత్యధికంగా కిలో కు రూ.411 ధర లభించగా, ఎన్ఎల్ఎస్ సరిధిలో సరాసరి ధర కిలోకు రూ.300 దక్కింది. అయితే ఈ ఏడాది ఇప్పటివరకు ఉత్తర ప్రాంత తేలిక నేలల్లో (ఎన్ఎల్ఎస్) పరిధిలో సరాసరి ధర రూ.296.57 లభించింది. ఇదిలా ఉండగా అత్యధిక ధర రూ.418 నంబర్–1 పొగాకుకు దక్కింది. లోగ్రేడ్ పొగాకుకు సరైన ధర లేదు. లోగ్రేడ్కు కూడా మంచి ధర లభిస్తేనే సరాసరి ధర పెరిగి రైతులకు లాభం చేకూరుతుంది. ఇదే ఆశతో వర్జీనియా రైతులు ఎదురుచూస్తున్నారు. కిలోకు సరాసరి ధర రూ.330 రావాలని ఆశిస్తున్నారు. ఆల్టైం హైకు చేరి.. వారం రోజులుగా నిలకడగా కిలోకు రూ.350 లభించిన ధర క్రమేపీ పెరుగుతూ శుక్రవారం ఆల్టైం హైకు చేరుకుంది. గతేడాది కంటే రూ.7 అదనంగా పలికింది. ఆయా కంపెనీలకు విదేశీ ఎగుమతుల ఆర్దర్లు రావడమే ధర పెరుగుదలకు కారణంగా తెలుస్తోంది. దీంతో కంపెనీలు పోటీ పడి బిడ్ వేస్తున్నాయి. మొన్నటివరకు సిండికేట్ అయ్యి తక్కువ ధరకు కొనుగోలు చేయగా, ప్ర స్తుతం పోటీపడి మరీ కొంటున్నారు. అంతేకాక ఎన్ఎల్ఎస్లో పండిన వర్జీనియా పొగాకుకు సిగరెట్ తయారీలో సుగంధ ద్రవ్యంగా పరిగణిస్తారు. గతేడాది దేశీయ పొగాకుకు డిమాండ్ ఎక్కువగా ఉండటంతో అప్పట్లో మంచి ధర లభించింది. అలాగే గతేడాది బ్రెజిల్, జింబాబ్వేలో ఉత్పత్తి తగ్గింది. మనకు బ్రెజిల్, జింబాబ్వేలు ఎగుమతుల్లో ప్రధాన పోటీగా ఉన్నాయి. ఈ ఏడాది ఆయా దేశాల్లో కూడా పొగాకు ఉత్పత్తి బాగానే ఉందని చెబుతున్నారు. అలాగే రాష్ట్రంలో కూడా ఈ ఏడాది ఎక్కువ పంటను రైతులు పండించారు. ఎల్ఎల్ఎస్ పరిధిలోనూ నిర్దేశిత పంట కన్నా ఎక్కువగానే పండించారు. వేలం కేంద్రం గరిష్ట కనిష్ట సరాసరి జంగారెడ్డిగూడెం–1 417 200 298.60 జంగారెడ్డిగూడెం–2 418 200 296.58 కొయ్యలగూడెం 418 200 296.38 గోపాలపురం 416 140 300.00 దేవరపల్లి 416 140 290.37 -
మూలనపడ్డ ఎన్హెచ్–165 పనులు
ఆకివీడు: జాతీయ రహదారి–165 నిర్మాణంలో భాగంగా స్థానిక ఉప్పుటేరుపై నిర్మించనున్న వంతెన పనులు పూర్తిగా స్తంభించిపోయాయి. పామర్రు–ఆకివీడు, ఆకివీడు–దిగమర్రు జాతీయరహదారి నిర్మాణానికి అడుగడుగునా అవాంతరాలతో కాలం గడిచిపోతుంది. పీపీ రోడ్డుగా ఉన్న ఈ రహదారిని 1999లో జాతీయ రహదారిగా గుర్తించి ఆ శాఖ విలీనం చేసుకుంది. అప్పటి నుంచి పాత రహదారి పునర్నిర్మాణ పనులు చేపట్టకపోయినా, తూట్లు పడ్డ ప్రాంతంలో మాట్లు వేసి ఎన్హెచ్ అధికారులు చేతులు దులుపుకుంటున్నారు. ప్రజలు, ప్రయాణికులు జాతీయరహదారిగా గుర్తింపు పొందిన తరువాత కొత్త రోడ్డు వేస్తారు.. రోడ్డు విస్తరణ జరుగుతుందని ఎంతో ఆశపడ్డారు. చివరకు నిరాశే మిగిలింది. ప్రస్తుతం ఏలూరు జిల్లా పరిధిలో ఉన్న పామర్రు–ఆకివీడు ప్రాంతంలో రహదారి విస్తరణ, అభివృద్ధి పనులు వేగంగా జరుగుతూ చాలా వరకూ పనులు పూర్తి చేశారు. ఏలూరు జిల్లా తాడినాడ ప్రాంతంలోని ఉప్పుటేరు గట్టు నుంచి, ఆకివీడు మండలంలోని అయిభీమవరం గుండా బైపాస్ వెళ్లేందుకు ఉప్పుటేరుపై వంతెన నిర్మాణ పనులు రెండేళ్ల క్రితమే ప్రారంభించారు. ఉప్పుటేరులో పిల్లర్ల నిర్మాణం వేగంగా చేపట్టారు. రెండు వేసవిలు పూర్తయిన తరువాత నిర్మాణ పనుల్ని అర్థంతరంగా మూసివేశారు. ఎక్కడ పిల్లర్లు అక్కడే ఉప్పుటేరులో తుప్పుపట్టిపోతున్నాయి. పామర్రు–ఆకివీడు మధ్య ప్రాజెక్టు పనులలో భాగంగా ఈ వంతెన నిర్మాణ పనులు చేపట్టాల్సి ఉందని చెబుతున్నారు. పిల్లర్లకు ఉన్న ఇనుప రాడ్లు తుప్పు పడుతుండటంతో వంతెన నిర్మాణానికి మళ్ళీ పిల్లర్లు వేయాలా అన్న సందేహం వ్యక్తమవుతోంది. పాత రోడ్డుకు తెర ఆకివీడు–దిగమర్రు మధ్య బైపాస్ రోడ్ల నిర్మాణంతో పాత రోడ్లు కనుమరుగయ్యే ప్రమాదం ఏర్పడింది. బైపాస్ రోడ్లతో కలిపి 46 కిలోమీటర్ల మేర ఫోర్లైన్ రోడ్డు నిర్మాణానికి మొదట్లో రూ.1,200 కోట్లు, ఆ తరువాత రూ.2,400 కోట్లు, ప్రస్తుతం రూ.3,100 కోట్ల నిధులు కేటాయించారు. పాత అలైన్మెంట్ ప్రకారం ఫోర్లైన్ రోడ్డు నిర్మాణానికి అంచనా రూ.2,400 కోట్లతో ప్రతిపాదనలు ఆమోదించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత కొత్త అలైన్మెంట్ ప్రకారం మరో రూ.700 కోట్లు అదనంగా కేటాయించారు. పాత రోడ్డుకు మోక్షం కల్పించండి జాతీయ రహదారి 165 పాత రోడ్డుకు మోక్షం కల్పించేలా ఆ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు తక్షణం చర్యలు తీసుకోవాలని ప్రజలు, ప్రయాణికులు కోరుతున్నారు. బైపాస్తో కొత్త రోడ్డు నిర్మాణానికి మరో 10 ఏళ్లు పట్టినా ఆశ్చర్యపడాల్సిన అవసరంలేదని పలువురు పేర్కొంటున్నారు. పాతరోడ్డును నాలుగు లైన్లకు గానీ, కనీసం మూడు లైన్లకు గానీ విస్తరింపజేసి, ప్రజలకు మెరుగైన రహదారి సౌకర్యం కల్పించాలని పలువురు కోరుతున్నారు. జాతీయ రహదారి విస్తరణ, నిర్మాణ పనులు రెండు దశాబ్దాలుగా ఈ ప్రాంతంలో ప్రతిపాదనల రూపంలోనే ఉండిపోయింది. ప్రభుత్వాలు మారినా, ప్రజా ప్రతినిధులు మారినా ఎన్హెచ్–165 రూపురేఖలు మారడంలేదు. ప్రస్తుతం ఉన్న రోడ్డును అభివృద్ది చేయాలి. – అంబటి రమేష్, ఆకివీడు జాతీయ రహదారి–165 అభివృద్ధి జరగకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురువుతున్నాము. వాహనాల సంఖ్య పెరగడంతో ట్రాఫిక్ పెరిగిపోతుంది. జాతీయ రహదారిని నాలుగు లైన్లుగా త్వరితగతిని అభివృద్ధి చేయాలి. బైపాస్ రోడ్లకు పనుల్ని వేగవంతం చేయాలి. నిత్యం ట్రాఫిక్తో సతమతమవుతున్నాం. – కె.లాజరు, కుముదవల్లి, పాలకోడేరు మండలం -
22 నుంచి శరన్నవరాత్రి ఉత్సవాలు
ద్వారకాతిరుమల: ఏటా తొమ్మిది రోజుల పాటు ఘనంగా జరిగే శ్రీ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఈ ఏడు 11 రోజుల పాటు జరగనున్నాయి. అందులో భాగంగా ఈనెల 22 నుంచి వచ్చేనెల 2 వరకు జరగనున్న ఉత్సవాలను పురస్కరించుకుని ద్వారకాతిరుమల శ్రీవారి ఆలయానికి ఉపాలయమైన, క్షేత్ర దేవత శ్రీ కుంకుళ్లమ్మ అమ్మవారి ఆలయం సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. ప్రస్తుతం విద్యుద్దీప అలంకారాల పనులు శరవేగంగా జరుగుతున్నాయి. రహదారికి ఇరువైపులా విద్యుత్ తోరణాలు అమర్చుతున్నారు. ఆలయం వద్ద అమ్మవారి భారీ విద్యుత్ కటౌట్ నిర్మిస్తున్నారు. ఉత్సవాలు జరిగే రోజుల్లో అమ్మవారు రోజుకో ప్రత్యేక అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారని ఆలయ ఈఓ ఎన్వీఎస్ఎన్ మూర్తి తెలిపారు. అలంకారాలు ఇవీ.. దసరా ఉత్సవాలు సందర్భంగా అమ్మవారు ఈనెల 22న శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవిగా, 23 న శ్రీ గాయత్రీ దేవిగా, 24 న శ్రీ అన్నపూర్ణా దేవిగా, 25 న శ్రీ కాత్యాయని దేవిగా, 26న శ్రీ మహాలక్ష్మి దేవిగా, 27న లలితా త్రిపుర సుందరీ దేవిగా, 28న మహాచండీగా, 29 న శ్రీ సరస్వతీ దేవిగా(మూలానక్షత్రం), 30 న శ్రీ దుర్గాదేవిగా భక్తులకు దర్శనమిస్తారని చెప్పారు. అలాగే వచ్చేనెల 1న మహిషాసురమర్దినిగా, ఉత్సవాల ముగింపు రోజైన(దసరా పండుగ) 2న శ్రీ రాజరాజేశ్వరి దేవిగా అమ్మవారు భక్తులను కటాక్షిస్తారని తెలిపారు. అదేరోజు సాయంత్రం క్షేత్రంలో అమ్మవారి రథోత్సవం, 3న దీక్షాధారుల ఇరుముడి సమర్పణ, చండీహోమాన్ని నేత్రపర్వంగా నిర్వ హిస్తామని పేర్కొన్నారు. 4న ఆలయం వద్ద భారీ అన్నసమారాధన నిర్వహిస్తామని తెలిపారు. ద్వారకాతిరుమలకు కిలోమీటరు దూరంలో ఉన్న ఈ కుంకుళ్లమ్మ అమ్మవారి క్షేత్రానికి వచ్చే భక్తులకు యాత్రలో కష్టనష్టాలు కలుగనివ్వరని భక్తుల నమ్మకం. అందుకే శ్రీవారిని దర్శించిన అనంతరం భక్తులు తిరుగు ప్ర యాణంలో తప్పనిసరిగా ఈ అమ్మవారిని దర్శిస్తారు. ఆలయం వద్ద అమ్మవారి భారీ విద్యుత్ కటౌట్ నిర్మాణ పనులు ద్వారకాతిరుమలలో క్షేత్ర దేవత కుంకుళ్లమ్మ అమ్మ ఆలయం శరన్నవరాత్రి ఉత్సవాలు ఈ ఏడాది 11 రోజులు రావడం విశేషం. తిధుల్లో హెచ్చుతగ్గులు రావడమే ఇందుకు కారణం. ఉత్సవాలు జరిగే రోజుల్లో విజయవాడ దుర్గమ్మ ఏ రోజు ఏ అలంకారంలో దర్శనమిస్తారో, ఇక్కడ కుంకుళ్లమ్మ అమ్మవారు కూడా అదే అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు. – భైరవ స్వామి, కుంకుళ్లమ్మ ఆలయ ప్రధాన్చాకుడు, ద్వారకాతిరుమల ఈసారి 11 రోజుల పాటు వేడుకలు ముస్తాబవుతున్న క్షేత్ర దేవత కుంకుళ్లమ్మ ఆలయం రోజుకో అలంకారంలో దర్శనమివ్వనున్న అమ్మవారు -
రోడ్డు ప్రమాదంలో వీఆర్వో మృతి
గణపవరం (నిడమర్రు): పిప్పర గ్రామంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎస్.కొండేపాడు వీఆర్వో అడబాల రామకృష్ణ ప్రసాద్ మృతిచెందారు. గణపవరం ఎస్సై మణికుమార్ తెలిపిన వివరాల ప్రకారం రామకృష్ణ ప్రసాద్ స్వగ్రామం వీరేశ్వరపురం నుంచి విధుల నిమిత్తం ఎస్.కొండేపాడు వెళ్తుండగా.. మధ్యలో పిప్పరలోని రాజ్ కళ్యాణ మండపం వద్ద వ్యాన్ వెనక నుంచి ఢీకొనడంతో ప్రసాద్ అక్కడికక్కడే మృతిచెందాడు. డ్రైవర్ పరారీలో ఉన్నాడు. కేసు నమోదు చేసి తాడేపల్లిగుడెం ప్రభుత్వ అసుపత్రిలో పోస్ట్మార్ట్ అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు ఎస్సై తెలిపారు. తహసీల్దారు అప్పారావు, కార్యాలయం సిబ్బంది వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. దెందులూరు: గోదావరి కాలువలో దెందులూరు మండలం సత్యనారాయణపురం వద్ద మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని గమనించిన గ్రామస్తులు దెందులూరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతుడి చేతి మీద సత్య అని రాసి ఉందని 40 సంవత్సరాలు వయసు ఉంటుందని ఎస్సై ఆర్.శివాజీ తెలిపారు. మృతుడి వివరాలు తెలిస్తే సంప్రదించాలన్నారు. -
లోక్ అదాలత్ను విజయవంతం చేయాలి
ఏలూరు (టూటౌన్): ఈ నెల 13న జరిగే జాతీయ లోక్ అదాలత్లో ఎక్కువ కేసులు పరిష్కారమయ్యేలా చూడాలని సంబంధిత అధికారులకు ప్రధాన న్యాయమూర్తి ఎస్.శ్రీదేవి ఆదేశించారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా 13న లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామని తెలిపారు. శుక్రవారం జిల్లా న్యాయమూర్తి చాంబరులో మాట్లాడుతూ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా 34 లోక్ అదాలత్ బెంచ్లు ఏర్పాటు చేశామని, మండల న్యాయ సేవాధికార సంస్థలను సంప్రదించి ఎక్కువ కేసుల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. ఈ లోక్ అదాలత్లో 4,802 పెండింగ్ కేసులను రాజీయోగ్యంగా గుర్తించామని, 2,225 ప్రీ లిటిగేషన్ కేసులను గుర్తించామని చెప్పారు. బార్ అసోసియేషన్ ప్రెసిడెంటు కోనె సీతారాం, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.రత్నప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
యాజమాన్య పద్ధతులు పాటించాలి
పోలవరం రూరల్: యాజమాన్య పద్ధతులు పాటించడం ద్వారా వరిలో ఆశించే ఎండాకు తెగులు, ఉల్లికోడు, ఆకునల్లి తెగుళ్లను నివారించవచ్చని ఏలూరు జిల్లా ఏరువాక కేంద్రం జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ కె.ఫణి కుమార్ అన్నారు. గూటాల, కొత్త పట్టిసీమ రైతులకు వరి పొలంలో ఆశించే ఎండాకు తెగులు, ఉల్లికోడు, ఆకు నల్లిపై రైతులకు అవగాహన కార్యక్రమం గూటాలలో శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరిలో ఆశించే ఎండాకు తెగులు నత్రజని ఎరువులు అధికంగా వాడడం వల్ల, వాతావరణ పరిస్థితులు వల్ల ఆశిస్తుందన్నారు. నత్రజని ఎరువులు వాడకాన్ని తక్కువ మోతాదులో వాడటం– పోటాష్ ఎరువును అధిక మోతాదులో వాడుకుంటే ఈ ఎండాకు తెగులు కొంతవరకు అరికట్టవచ్చన్నారు. మురికి నీటిని ఎప్పటికప్పుడు తీస్తూ కాలువలో ఉన్న నీరుని ఎప్పటికప్పుడు చేల్లో పెట్టుకుంటూ ఉండాలన్నారు. ఎండాకు తెగులు ఆశించిన పొలాల్లో కాప్రాక్సీ క్లోరైడ్ రెండు గ్రాములు లీటరు నీటికి, లేదా ప్లాంటు మైసనోగ్రామ్ లీటరు నీటికి కలిపి చేనంతా తడిచేలా పిచికారీ చేయాలన్నారు. వరి దుబ్బుకు రెండు కన్నా ఎక్కువగా ఉల్లికోడు ఉన్నట్లయితే నివారణ చర్యలు చేపట్టుకోవాలన్నారు. పెప్రోనిల్ 2 ఎంఎల్ లీటరు నీటికి లేదా క్లోరీఫైరిపాస్ 2.5 ఎంఎల్ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలన్నారు. ముదురునారు నాటడం వల్ల ఉల్లికోడు ఎక్కువగా ఆశించే అవకాశం ఉందన్నారు. దీని నివారణకు నీటిలో కరిగే గంధకం 3 గ్రాములు లీటరు నీటికి లేదా డైకో ఫాలో 5 ఎంఎల్ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలన్నారు. -
రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక
కొయ్యలగూడెం: జిల్లా స్థాయిలో నిర్వహించిన ఫుట్బాల్, సెపక్తక్రా పోటీలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై నట్లు విద్యాసంస్థల ప్రతినిధులు శుక్రవారం పేర్కొన్నారు. ఈనెల 11న పెదవేగిలో నిర్వహించిన ఫుట్బాల్ అండర్–19 విభాగంలో పదో తరగతి చదువుతున్న కోమటి గుంట మనోజ్ కుమార్, రామని బాలాజీ, గుర్రం వెంకటలక్ష్మి ప్రతిభ చూపి ఆకట్టుకున్నారన్నారని ప్రధానోపాధ్యాయుడు కె.రవికుమార్ తెలిపారు. దీంతో వీరిని రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేశారని తెలిపారు. అదేవిధంగా కొయ్యలగూడెం వీఎస్ఎన్ కళాశాలలో ఇంటర్ అభ్యసిస్తున్న పాక దుర్గా మధుర శ్రీ జిల్లా స్థాయి పోటీలలో పాల్గొని సెపక్తక్రా విభాగంలో ప్రతిభ చూపి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై ంది ఈ సందర్భంగా విద్యార్థులను ఎస్ఎంసి చైర్మన్ కోడి నాగలక్ష్మి, పీఈటి సురేష్ అభినందించారు. తాడేపల్లిగూడెం (టీఓసీ): స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల సెకండియర్ విద్యార్థి హేమంత్ కుమార్ ఏలూరులో జరిగిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అండర్–19 బ్యాడ్మింటన్ సింగిల్స్లో ప్రథమ స్థానంలో నిలిచాడు. దీంతో రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. హేమంత్ కుమార్, వ్యాయామ అధ్యాపకుడు మాణిక్యం రాజాను ప్రిన్సిపాల్ నాగవేణి, అధ్యాపక బృందం అభినందించారు. భీమవరం: తెలుగు రాష్ట్రాల ర్యాపిడ్ చెస్ చాంపియన్షిప్ పోటీలు అక్టోబర్ 12న భీమవరంలో నిర్వహించనున్నట్టు జిల్లా చెస్ అసోసియేషన్ అధ్యక్షుడు మాదాసు కిషోర్ తెలిపారు. దీనికి సంబంధించిన బ్రోచర్ల ఆవిష్కరణ శుక్రవారం నిర్వహించారు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు విజేతలకు రూ.లక్ష నగదు బహుమతులు, క్రీడాకారులకు ఉచిత భోజన సదుపాయం కల్పిస్తున్నట్టు ఆయన తెలిపారు. తాడేపల్లిగూడెం: ఎన్సీసీ బెటాలియన్ ఆధ్వర్యంలో ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాలకు సంబంధించి ఐజీసీఆర్డీసీ సెలక్షన్ క్యాంపు కమాండెంటు కల్నల్ అమిత్ పాండే ఆధ్వర్యంలో శుక్రవారం వరకు నిర్వహించారు. ఈ శిబిరంలో డ్రిల్ ఫైరింగ్, కల్చరల్ ప్లాగ్ విభాగాల్లో పరీక్షలు నిర్వహించారు. ఇక్కడ ఎంపికై న వారు గుంటూరులో జరగనున్న క్యాంపులో పాల్గొంటారు. భీమవరం (ప్రకాశంచౌక్): ప్రస్తుత ఖరీఫ్లో రైతుల నుంచి ధాన్యం సేకరణకు లక్ష్యాలను నిర్దేశించినట్టు జాయింట్ కలెక్టర్ రాహుల్కుమార్రెడ్డి తెలిపారు. కాకినాడలో శుక్రవారం ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల అధికారుల సమావేశంలో మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ విషయం వెల్లడించారని తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లాలో 5 లక్షలు, ఏలూరు జిల్లాలో 4 లక్షల టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యమన్నారు. -
బాలికపై దాడికి యత్నించిన వీధి శునకాలు
ద్వారకాతిరుమల : వీధి కుక్కలు ప్రజలను హడలెత్తిస్తున్నాయి. చిన్న పిల్లలపై తరచూ ఎక్కడో ఒకచోట దాడులు చేస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో ద్వారకాతిరుమలలోని రాణీ చిన్నయమ్మారావు పేటలో గురువారం రెండు వీధి కుక్కలు ఒక బాలికపై దాడికి ప్రయత్నించాయి. అయితే వాటి బారి నుంచి తప్పించుకుని ఆ బాలిక ప్రమాదం నుంచి బయటపడింది. వివరాల ప్రకారం స్థానికంగా నివాసం ఉంటున్న భార్గవి తన పాప కాషికను ఉదయం పాఠశాలకని ఇంటి నుంచి పంపింది. కాషిక నడుచుకుంటూ కాస్త దూరం వెళ్లగానే రెండు వీధి కుక్కలు అరుచుకుంటూ కాషిక మీదకు వచ్చాయి. ప్రమాదాన్ని గమనించిన కాషిక పెద్దగా అరుస్తూ తన ఇంటి వైపునకు పరుగులు తీసింది. ఆ అరుపులు విన్న భార్గవి కంగారుగా రోడ్డు మీదకు వచ్చింది. వెంటనే కాషిక పరిగెట్టుకుంటూ వచ్చి తల్లిని పట్టుకుంది. వణికిపోతున్న పాపను దగ్గరకు తీసుకోగా, ఆ శునకాలు వెనక్కి వెళ్లిపోయాయి. ఇది చూసిన స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పాప శునకాలకు చిక్కితే పెనుప్రమాదం జరిగేదని, రోడ్డు మీదకు రావాలంటేనే భయమేస్తోందని స్థానికులు వాపోతున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి, వీధి కుక్కల బెడదను తొలగించాలని కోరుతున్నారు. -
బండివారిగూడెం వద్ద లారీ బోల్తా
టి.నరసాపురం: మండలంలోని బండివారిగూడెం సమీపంలో జామాయిల్ పుల్ల లోడు లారీ బోల్తాపడింది. వివరాల ప్రకారం చింతలపూడి మండలం యర్రగుంటపల్లికి చెందిన లారీ జామాయిల్ పుల్లల లోడుతో చింతలపూడి నుంచి రాజమండ్రి పేపర్ మిల్లుకు వెళుతోంది. బండివారిగూడెం సమీపంలో రోడ్డుపై ఉన్న గుంతలో పడి అదుపు తప్పి పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టి బోల్తాకొట్టింది. ఈ ప్రమాదం నుంచి లారీ డ్రైవర్, క్లీనర్లు సురక్షితంగా బయటపడ్డారు. అయితే లారీ బోల్తా పడటంతో ట్రాఫిక్కు అంతరాయం కలిగింది. తణుకు అర్బన్: రాష్ట్ర స్థాయిలో నిర్వహించనున్న అంతర్ జిల్లాల జూనియర్ కబడ్డీ పోటీల్లో పాల్గొనబోయే జిల్లా బాలురు, బాలికల కబడ్డీ జట్ల ఎంపిక ఈ నెల 14న నిర్వహించనున్నట్లు జిల్లా కబడ్డి అసోసియేషన్ సెక్రటరీ వై.శ్రీకాంత్ తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. పెద తాడేపల్లిలోని శ్రీవాసవి ఇంజనీరింగ్ కళాశాలలో మధ్యాహ్నం 2 గంటలకు ఎంపికలు ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. ఈ ఎంపిక పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు 2006 జనవరి 1వ తేదీ తరువాత జన్మించిన వారై ఉండాలని, 75 కేజీలు లోపు బాలురు, 65 కేజీలు లోపు బాలికలు బరువు కలిగి ఉండాలని స్పష్టం చేశారు. జిల్లా జట్టుకు ఎంపికై న క్రీడాకారులు సెప్టెంబర్ 22 నుంచి 24 వరకు విజయవాడ గొల్లపూడిలో నిర్వహించే అంతర్ జిల్లాల జూనియర్ కబడ్డీ పోటీలో పాల్గొంటారని వివరించారు. ఇతర వివరాలకు 94913 33906, 96424 96117 నంబర్లకు ఫోన్ చేయాలని కోరారు. -
2003 డీఎస్సీ ఉపాధ్యాయుల నిరసన
ఏలూరు (ఆర్ఆర్పేట): 2003–డీఎస్సీ ఉపాధ్యాయులకు కేంద్ర ప్రభుత్వ మెమో 57 ప్రకారం పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని 2003 డీఎస్సీ ఫోరమ్ నాయకులు డిమాండ్ చేశారు. ఫోరం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గురువారం స్థానిక ఏలూరు అర్బన్ తహసీల్దార్ కార్యాలయం వద్ద నల్లబ్యాడ్జీలతో నిరసన ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా ఫోరమ్ నాయకులు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీపీఎస్ విధానం అమలు 2004 సెప్టెంబన్ 1కు ముందు నోటిఫికేషన్ వెలువడినప్పటికీ, నియామకాలు తర్వాత జరిగిన కారణంగా సుమారు 11,000 మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు పాత పెన్షన్ నష్టపోయారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ మెమో 57 ప్రకారం వీరందరికీ పాత పింఛన్ను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం ఏలూరు తహసీల్దార్ గాయత్రికి వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో ఇప్పిలి శంకర్ రావు, నండూరి గణేష్, మరక బాలసుబ్రహ్మణ్యం, ఎం. శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
ఆక్వా సాగులో మెలకువలతో లాభాలు
కాళ్ల: ఆక్వా సాగులోని మెలకువులతో రైతులు లాభసాటిగా ముందుకు సాగాలని కేంద్ర సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాసవర్మ, రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) అన్నారు. పెదఅమిరంలోని ఆర్ కన్వెన్షన్ హాల్లో మూడురోజులపాటు నిర్వహించే ఆక్వా ఎక్స్ ఇండియాను గురువారం వారు ప్రారంభించారు. ఆక్వా ఎక్స్పోలను రొయ్య, చేపల రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. నిర్వాహకులు దంతులూరి వేణు మాట్లాడుతూ 9 ఏళ్లుగా అనేక చోట్ల ఆక్వా ఎక్స్ ఇండియా ఆధ్వర్యంలో ఆక్వా ఎక్స్పో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, 100 స్టాల్స్తో ప్రదర్శన జరుగుతుందన్నారు. మొదటి రోజు జరిగిన ఈ కార్యక్రమంలో దాదాపు 3000 మంది రైతులు పాల్గొని వివిధ ఆక్వా కంపెనీలు ఏర్పాటు చేసిన 80 స్టాల్స్ ను సందర్శించి వాళ్లకి కావాల్సిన సమాచారం, ప్రొడెక్షన్ గురించి తెలుసుకున్నారన్నా రు. అలాగే మిగిలిన రెండు రోజులలో జరిగే కార్యక్రమానికి దాదాపు 6000 మంది పైగా వివిధ కంపెనీ ల ప్రతినిధులు, రైతులు, ప్రజలు పాల్గొంటారని చెప్పారు. కార్యక్రమంలోఆక్వా ఎక్స్పో టైటిల్ పార్టనర్ నెక్సజెన్ కంపెనీ నుంచి అక్కిన శేషు, సీఓఓ టి. శ్రీనివాస్, సూర్యమిత్ర ఎగ్జిమ్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత యిర్రింకి సూర్యారావు, పొత్తూరి బాపిరాజు, రైతులు తదితరులు పాల్గొన్నారు. -
వరిని ఆశించే పురుగులతో ఇక్కట్లు
మండవల్లి: కాండం తొలుచు పురుగు, ఆకునల్లి తదితర రకాల పురుగుల వల్ల వరి రైతులు తీరని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాండం తొలుచు పురుగు వరి పంటలో కనిపించే అతి ముఖ్యమైన పురుగు. ఇది ఖరీఫ్ రబీల్లో కూడా కనిపిస్తూ ఎక్కువ నష్టాని కలుగజేస్తుంది. ఇది ఒకే పంటను ఆశించి ఎక్కువ నష్టాన్ని కలుగజేస్తాయి. ఈ పురుగులు లైంగిక గుడ్డు నుంచి వచ్చే చిన్న పురుగులు కొన్ని గంటల పాటు ఆకులపై తిరుగుతూ చద్విరూకత కలిగి ఉంటాయి. ఆడ పురుగులు, మగ పురుగులు కొన్ని గుర్తింపు చిహ్నాల ద్వారా లింగ భేదం చేయవచ్చు, ఆడ పురుగు మగ పురుగుకన్నా పెద్దగా లావుగా ఉండి , లేత పసుపు రంగులో ఉంటుంది. ఆడ పురుగు మొదటి జత రెక్కలపైన మధ్యలో ఒక నల్లటి చుక్క ఉంటుంది. మగ పురుగు ముందు రెక్కలపై నల్లటి మచ్చ ఉండదు. వరికాండానికి పెద్ద దెబ్బ ఈ పురుగులు గుడ్డు నుంచి వచ్చే చిన్న పురుగులు కొన్ని గంటల పాటు ఆకులపై తిరుగుతూ ఊలు దారంతో వేలాడుతాయి. ఇవి ఆకుల తొడిమి లోకి ప్రవేశించి కాండంను తింటూ లోపలకు చేరి లోపలి భాగాన్ని తింటాయి. ఈ పురుగు వరిపైరును పిలకలు వేసే దశ, చిరుపొట్ట దశల్లో ఆశించి నష్టాన్ని కలుగజేస్తాయి. ఈ పురుగులు పైరును వరి పంటను పిలకలు వేసే దశలో ఆశించి నష్టాన్ని కలుగజేస్తాయి. క్లోరో నియంతప్రోల్ మందు ఎకరానికి 60 మి.లీ, కార్ట్ ఆఫ్ హైడ్రోక్లోరైడ్ మందు 2 గ్రాములు ఒక లీటరు నీటికి అసెఫెట్ ఒక గ్రాము లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. కాండం తొలుచు పురుగు వరిపైరును పిలకలు వేసేదశ, చిరుపొట్ట దశల్లో ఆశించి నష్టాన్ని కలుగజేస్తాయి. వ్యవసాయాధికారుల సూచనలతో దీనిని నివారించుకోవచ్చు. – నల్లమోతు వేణుగోపాలరావు, మండవల్లి ఇవి ఆకుల తొడిమిలోకి ప్రవేశించి కాండంను తింటూ లోపలికి చేరి లోపలి భాగాన్ని తింటాయి. దీంతో వరిపైరుకు బాగా నష్టం ఏర్పడుతుంది. – పందిళ్ళ సూర్యనారాయణ, మండవల్లివరిని ఆశించే ఆడ, మగ కాండం తొలుచు పురుగులు -
చెరువు తయారీ నిర్వహణ ఇలా
● మట్టి, నీటి నాణ్యత సమతుల్యానికి చెరువు అడుగు భాగాన్ని ఎండబెట్టాలి. ● చెరువును ఎండబెట్టి దున్నడం వల్ల ఖనిజాలు స్థిరంగా ఉంటాయి. ● సున్నం చల్లడం వల్ల ఆమ్లత తటస్తంతో పాటు ఉపయోకర సూక్ష్మజీవుల పెరుగుదలకు సహాయపడుతుంది. ● అవాంఛిత చేపలను, జీవులను తొలగించడానికి సహజ చేపల నాశకాలైన సాయిల్ కేక్, టీ సీడ్ కేక్లు ఉపయోగించాలి. ● ఎరువులు, ప్లాంక్టాన్ పెరుగుదలను ప్రేరేపిస్తాయి. అధిక బ్లూమ్లను నివారించడానికి ఎరువులను జాగ్రత్తగా వాడాలి. ● ఆక్సిజన్ స్థాయిలను క్రమబద్ధీకరించడానికి, హానికరమైన పదార్థాలు పేరుకుపోకుండా ఉండటానికి బురద (స్లడ్జ్) తొలగింపు చాలా అవసరం. -
నీరు.. నేలతో ఆక్వా వహ్వా..!
● ఆక్వా సాగులో ఆ రెండే కీలకమంటున్న నిపుణులు ● కొల్లేరు నల్లరేగడి నేలలు సాగుకు అనుకూలం కై కలూరు: ఆక్వా సాగు అంటే రైతులకు సిరులు అందించే కల్పతరువుగా భావిస్తారు. ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఆక్వా సాగు ఎక్కువగా చేస్తారు. అయితే ఇటీవల ఆక్వా సాగులో రైతులు నష్టాలను చవిచూస్తున్నారు. సాగుపై సరైన అవగాహన లేకపోవడంతో ఆర్థికంగా నష్టపోతున్నారు. చేపలు, రొయ్యల పెంపకం నీరు, నేల యాజమాన్య పద్ధతులపై ఆధారపడి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. చెరువు అడుగున వీటి మధ్య పరస్పర చర్య జరుగుతుంది. నీటి నాణ్యత, ప్లాంక్టాన్ పెరుగుదల పంట దిగుబడిని నేరుగా ప్రభావితం చేస్తోంది. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో 2.90 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగు చేస్తున్నారు. ప్రధానంగా కొల్లేరు ప్రాంతంలో నల్లరేగడి నేలల్లో సాగు ఎక్కువుగా జరుగుతోంది. నేల స్వభావం దెబ్బతింటే స్థూల, సూక్ష్మ మూలకాలు పెరిగి పంట ఎదుగుదలపై ప్రభావం చూపుతాయి. నీటి నాణ్యత లోపం వల్ల బ్యాక్టీరియా వృద్ధి చెంది పేను, తాటాకు తెగులు, శంకు జలగ, జిగురు వ్యాధులు వ్యాప్తి చెందుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో నీరు, నేలపై ఆక్వా నిపుణులు తెలిపే సూచనలను ఓ సారి తెలుసుకుందాం. నీటి నాణ్యతపై శ్రద్ధ అవసరం మంచి నేల నిర్వహణ ఎంతో ముఖ్యమో సరైన నీటి నాణ్యత పర్యవేక్షణ కూడా అంతే ముఖ్యం. సాగు చేసే చెరువు నీటి ఉష్ణోగ్రతలు 28 డిగ్రీల నుంచి 32 డిగ్రీల సెంటీగ్రేట్ మధ్య ఉంటాయి. ఉష్ణోగ్రత 20 డిగ్రీల సెంటీగ్రేట్ కంటే తగ్గితే, పెరుగుదల బాగా తక్కువగా ఉంటుందని అర్థం. పారదర్శకత 25–40 సెంటీమీటర్లు ఉండాలి. చేపలు, రొయ్యల పెరుగుదలను నిర్ధారించడానికి కరిగిన ఆక్సిజన్ 5 పీపీఎం అంతకంటే ఎక్కువ ఉంచాలి. పగటిపూట అధిక హెచ్చుతగ్గులు లేకుండా నీటి పీహెచ్ 7.5–8.5 మధ్య ఉండాలి. రైతులు అమ్మోనియా, నైట్రేట్, హైడ్రోజన్ సల్ఫయిడ్ వంటి విష వాయువుల నుంచి కూడా జాగ్రత్త వహించాలి. ఆక్వాసాగులో నేల పాత్ర ఇలా చెరువు సాగులో ఒండ్రు, నల్లరేగడి నేలలు నీటి నిలుపుదల శక్తిని కలిగి ఉంటాయి. ఇవి సేంద్రియ పదార్థాల విచ్ఛిన్నతను నియంత్రిస్తాయి. పీహెచ్ (6.5–7.5) సమతుల్యంగా ఉంచితే మంచి నేలలుగా పరిగణించాలి. నేలలో కాల్షియం, కార్బోనేట్ 5 శాతం కంటే ఎక్కువుగా ఉంటే మంచి సామర్థ్యం కలిగిన నేలలుగా భావించాలి. అల్యూమినియం, మాంగనీస్ వంటి విషవారిత లోహాలు నీటిలో కరిగిపోకుండా నేలలు నిరోధిస్తుంది. సేంద్రియ పదార్థం 2 శాతం కంటే ఎక్కువ ఉన్న నేలలు నీటి లీకిజీని తగ్గించి, సూక్ష్మజీవుల అభివృద్ధికి మద్దతు ఇస్తాయి. చౌడు నేలలు సేంద్రియ పదార్థం విచ్ఛిన్నాన్ని తగ్గించి, ప్లాంక్టాన్ పెరుగుదలను పరిమితం చేస్తాయి. నేల, నీటి మధ్య రసాయనాల మార్పిడి చెరువు అడుగున, నేల, నీరు నిరంతరం ఒకదానితో ఒకటి పరస్పర చర్యలకు గురవుతాయి. ఆమ్ల నేలలు చెరువు పీహెచ్ని తగ్గిస్తాయి. క్షార నేలలు కార్బోనేట్ నిక్షేపాలను పెంచుతాయి. నేలలు నత్రజని, భాస్వరం గిడ్డంగులుగా పనిచేస్తాయి. ఫ్లాంక్టన్ పెరుగుదలకు తోడ్పడటానికి లవణాలను క్రమంగా విడుదల చేస్తాయి. వృథా అయిన మేత, జంతువుల వ్యర్థాలు పేరుకుపోయినప్పుడు, ఆక్సిజన్ స్థాయిలు తగ్గి, అమ్మోనియా స్థాయిలు పెరుగుతాయి. బాగా ఆక్సిజన్ నిండిన నేలలు ఆరోగ్యకరమైన విచ్ఛేదనాన్ని ప్రోత్సహిస్తాయి. ఆక్సిజన్ తక్కువగా ఉన్న నేలలు హైడ్రోజన్ సల్ఫైడ్, మీథేన్ వంటి విష వాయువులను విడుదల చేస్తాయి. రొయ్యల చెరువులో తిరుగుతున్న ఏరియేటర్లు(ఫైల్) చేపల పట్టుబడి చేస్తున్న కార్మికులునేల, నీరు కలిసి చెరువు పర్యావరణ సమతుల్యతను నిర్ధారిస్తాయి. ఆక్వాసాగులో ఈ రెండు వీడదీయరాని బంధంగా ఉంటాయి. చేపల, రొయ్యల రైతులు నేల, నీరు, మేతలు వంటి వాటిపై సరైన అవగాహనతో ఉండాలి. నీటి, మట్టి పరీక్షలను ఆక్వా ల్యాబ్లో పరీక్షలు చేయించుకోవాలి. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా సాగు పద్ధతులను పాటించాలి. సమస్య గుర్తిస్తే ఆక్వా నిపుణులను సంప్రదించాలి. – డాక్టర్ పి.రామమోహన్రావు, విశ్రాంత డిప్యూటి డైరెక్టర్ ఆఫ్ ఫిషరీస్, కాకినాడ -
ఉత్సాహంగా స్కూల్ గేమ్స్ ఎంపిక పోటీలు
భీమవరం : స్థానిక బ్రౌనింగ్ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో గురువారం ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా 69వ స్కూల్ గేమ్స్ అండర్ 19 బాల, బాలికల నెట్ బాల్, మాల్కంబ్ క్రీడల్లో ఎంపికలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అండర్–19 స్కూల్ గేమ్స్ సెక్రటరీ కె.జయరాజు మాట్లాడుతూ 100 మంది క్రీడాకారులు ఎంపికలో పాల్గొన్నారన్నారు. ఎంపికై న క్రీడాకారులు త్వరలో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీల్లో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా జట్లకు ప్రాతినిధ్యం వహిస్తారన్నారు. ఈ ఎంపిక కార్యక్రమానికి వీరవాసరం ప్రభుత్వ జూనియర్ కాలేజీ ఫిజికల్ డైరెక్టర్ నాగమణి, బ్రౌనింగ్ కళాశాల పీడీ దావుద్ ఖాన్, పీడీలు శ్రీనివాస్, జీపీసీ శేఖర్ రాజు తదితరులు సహకరించారు. అనంతరం ఎంపికై న క్రీడాకారులను బ్రౌనింగ్ కళాశాల చైర్మన్ మేడిది జాన్సన్, సెక్రటరీ మేడిది ఎస్తేరుప్రియాంక, అభినందించారు. భీమవరం: జిల్లా చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం భీమవరం పట్టణంలోని ఆర్యవైశ్య యువజన భవనంలో అనసూయ చెస్ అకాడమీ ఇన్విటేషన్ చెస్ పోటీలు నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు మాదాసు కిషోర్ తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. అండర్–7,9,11,13,13 విభాగాల్లో బాల, బాలికలకు నిర్వహించే పోటీల్లో మొదటి, రెండో స్థానంలో విజేతలకు రూ. 20 వేలు నగదు బహుమతులు అందజేయనున్నట్లు చెప్పారు. ఇతర వివరాల కోసం 90632 24466 నంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు. -
పెరిగిన వర్జీనియా పొగాకు ధర
కేజీకి రూ.395 రికార్డు ధరజంగారెడ్డిగూడెం: చాలా రోజులు స్థిరంగా కొనసాగిన వర్జీనియా పొగాకు ధర ఈ నెల ప్రారంభం నుంచి పెరుగుతూ వచ్చింది. ఇలా పెరుగుతూ వచ్చిన ధర గురువారం కేజీ ధర రూ. 395కు చేరుకుంది. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో జంగారెడ్డిగూడెం–1, –2, కొయ్యలగూడెం, గోపాలపురం, దేవరపల్లిలో వర్జీనియా పొగాకు వేలం కేంద్రాలు ఉన్నాయి. ఈ ఏడాది వర్జీనియా వేలం ప్రారంభం సమయంలో కేజీకి రూ.290 మాత్రమే లభించింది. గత ఏడాది అత్యధికంగా కేజీకి రూ.411 లభించగా, కేజీ సరాసరి ధర రూ.330 లభించింది. ఈ ఏడాది వర్జీనియా వేలం ప్రారంభం నాడు రూ.290 ధర రాగా, క్రమేపీ పెరుగుతూ జూలై నెల చివరి వరకు కేజీ ధర అత్యధికంగా రూ.390 లభించింది. కేజీ ధర అత్యల్పంగా రూ.200 లభించింది. ఆ తరువాత జూలై 26 నుంచి ఆగస్టు మొదటి వారం వరకు అత్యధిక ధర రూ.20 పడిపోయి రూ.370 లభించింది. అత్యల్ప ధర రూ.200 లభించింది. ఆ తరువాత ఆగస్టు 9 నుంచి సెప్టెంబర్ 2 వరకు ఈ ధర మరింత పడిపోయి అత్యధిక ధర కేజీ రూ.350, అత్యల్పధర రూ. 200 లభించింది. దీంతో రైతులు తీవ్ర నిరాశకు గురయ్యారు. కేజీ ధర రూ.390 నుంచి రూ. 350కు పడిపోవడంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. ఆయా కంపెనీలు సిండికేట్గా మారి పొగాకు ధరను తగ్గించి కొంటున్నారని రైతులు ఆరోపించారు. రూ.390 నుంచి రూ.350కు పడిపోయిన ధర సుమారు 25 రోజుల పాటు రూ.350 వద్ద స్థిరంగా కొనసాగింది. సెప్టెంబర్ 3న కొద్దిగా పెరిగి కేజీ ధర రూ.362, 4న రూ.375, 6 నుంచి 8 వరకు రూ.376 లభించింది. 9, 10వ తేదీన ఈ ధర మరింతగా పెరిగి రూ.390కు చేరుకుంది. గురువారం ధర రూ. కేజీ ఒక్కింటికి రూ.395 రాగా, అత్యల్పం రూ. 200 లభించింది. కాగా గురువారం నాటి వేలంలో జంగారెడ్డిగూడెం –1, 2 వేలం కేంద్రాలు, కొయ్యలగూడెం, గోపాలపురం వేలం కేంద్రాల్లో అత్యధిక ధర కేజీ ఒక్కింటికి రూ. 395 లభించగా, గోపాలపురం వేలం కేంద్రంలో రూ.394 లభించింది. అలాగే గురువారం నాటికి సరాసరి ధర రూ. 296.34 లభించింది. -
అమృత్ పై నీలినీడలు
భీమవరం(ప్రకాశం చౌక్): పశ్చిమగోదావరి జిల్లాలోని ఆరు పట్టణాలకు సురక్షిత తాగునీటిని పుష్కలంగా అందించే అమృత్ 2.0 (అటల్ మిషన్ ఫర్ రిజువెనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్) మంచినీటి సరఫరా ప్రాజెక్టు ముందుకు కదలడం లేదు. జిల్లాలోని భీమవరం, పాలకొల్లు, తణుకు, తాడేపల్లిగూడెం, నరసాపురం, ఆకివీడు మున్సిపాలిటీల్లో శివారు ప్రాంతాలకు సైతం రెండు పూటలా మంచినీటిని అందించి శాశ్వతంగా తాగునీటి సమస్య లేకుండా చేసే బృహత్తర ప్రాజెక్టు పనులు నత్తనడక కంటే దారుణంగా సాగుతున్నాయి. మొదట అమృత్ 2.0 ప్రాజెక్టుకు రూ.286.54 కోట్లు మంజూరు చేయగా 2025 నాటికి పూర్తి చేయాలని నిర్ధేశించారు. దీంతో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమృత్ 2.0 ప్రాజెక్టుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి ప్రాజెక్టుకు సంబంధించి డీపీఆర్లు సైతం పూర్తి చేసి టెండర్లు ప్రక్రియ వరకు తీసుకువెళ్లింది. అనంతరం సార్వత్రిక ఎన్నికలు రావడం, ప్రభుత్వం మారిపోవడంతో ప్రాజెక్టు పనులు నిలిచిపోయాయి. ఆ తరువాత కేంద్ర ప్రభుత్వం మళ్లీ ప్రాజెక్టు వ్యయం రూ.770.85 కోట్లతో భారీ ప్రాజెక్టుగా మార్చింది. 15 నెలలుగా ముందుకు కదలడం లేదు పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ద్వారా జరిగే ఈ ప్రాజెక్టుకు కూటమి ప్రభుత్వం నుంచి పూర్తి సహాయ సహకారం అందడం లేదని సృష్టంగా తెలుస్తోంది. గత 15 నెలలుగా ఒక పనికి కూడా టెండర్ వరకు అమృత్ 2.0 ముందుకు వెళ్లలేదు. ఆరు పట్టణాల్లో ఎక్కడ కూడా ఇప్పటివరకు ఒక పనికి కూడా టెండర్లు ఖరారు కాలేదు. పూర్తిగా డీపీఆర్లు కూడా తయారీ కాలేదు. జిల్లాలో ముఖ్యమైన పట్టణాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ అధ్వర్యంలో చేపట్టాల్సిన మంచినీటి ప్రాజెక్టు గురించి కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. దీంతో పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ శాఖ అధికారులు సైతం ప్రభుత్వ బాటలోనే పయనిస్తూ ప్రాజెక్టు పనులపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దృష్టి సారించని కేంద్ర మంత్రి జిల్లా కేంద్రమైన భీమవరంలో కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ ఉన్నా కేంద్ర ప్రాజెక్టు అమృత్ 2.0పై శ్రద్ధ వహించడం లేదు. ప్రజలకు తాగునీరు అందించే ప్రాజెక్టుపై శ్రద్ధ చూపడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఇప్పటివరకు జిల్లాలోని ఆరు పట్టణాలకు సంబంధించిన ఏ ఎమ్మెల్యే గానీ, రాష్ట్ర మంత్రి నిమ్మల రామనాయుడు గానీ అమృత్ 2.0 గురించి అధికారులను కనీసం ఆరా తీసిన దాఖలా లేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే ఆయా పట్టణాల్లో చివరి ప్రాంతాల ప్రజలు మంచినీళ్లు కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పట్టణాల్లో రోజురోజుకూ పెరుగుతున్న జనాభా, అలాగే కొన్ని మున్సిపాలిటిల్లో విలీన గ్రామాలు కూడా భవిష్యత్లో కలిసే అవకాశం ఉన్న నేపథ్యంలో పెరిగే జనాభా దృష్టిలో పెట్టుకుని ప్రాజెక్టు వేగవంతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అమృత్ 2.0 ప్రాజెక్ట్కు సంబంధించి మారిన షెడ్యూల్ రేట్ల ప్రకారం డీపీఆర్లు సిద్ధం చేసి టెండర్లకు చర్యలు తీసుకుంటున్నాం. – ఆర్.విజయ్ జిల్లా పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ శాఖ అధికారి అమృత్ 2.0 ప్రాజెక్టు నిధులు ఆరు పట్టణాలకు రూ. 770.85 కోట్లు కాగా అందులో ముఖ్యమైన పనుల్లో విజ్జేశ్వరం నుంచి ఆరు పట్టణాలకు వాటర్ గ్రిడ్ పైపులైన్, మొత్తం 12 ఓహెచ్ఆర్లు (వాటర్ ట్యాంకులు), ఎస్టీపీలు 2 (మురికినీళ్లు శుద్ధిచేసే ప్లాంట్లు), ఫిల్టరేషన్ ప్లాంట్లు 3, సమ్మర్ స్టోరేజీ ట్యాంకు, అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ పనులు ఉన్నాయి. భీమవరం రూ.167.72 కోట్లు విజ్జేశ్వరం నుంచి 54 కీలోమీటర్లు మేర వాటర్ గ్రిడ్ ద్వారా పైపులైన్ వేయడం, పట్టణంలో మంచినీటి సరఫరా కోసం పైపులైన్లు, ఇతర వాటర్ సరఫరా పనులు. తాడేల్లిగూడెం రూ.163.50 కోట్లు సమ్మర్ స్టోరేజి ట్యాంకు, ఓహెచ్ఆర్ 1, ఎస్టీపీలు 2, అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ, పైపులైను పనులు నరసాపురం రూ.125.92 కోట్లు ఓహెచ్ఆర్లు 3, ఫిల్టరేషన్ ప్లాంట్ 1, సంపులు, పైపులైన్ల పనులు పాలకొల్లు రూ.119.26 కోట్లు వాటర్ పైపులైన్లు, ఇతర వాటర్ సరఫరా పనులు తణుకు రూ 118.119 కోట్లు ఓహెచ్ఆర్లు 4, ఫిల్టరేషన్ ప్లాంట్ 1, పైపులైన్ల పనులు ఆకివీడు రూ.76.34 కోట్లు ఓహెచ్ఆర్లు 4, ఫిల్టరేషన్ ప్లాంట్ 1, పైపులైన్ల పనులు కూటమి అలసత్వం జిల్లాలో ఆరు పట్టణాలకు సంబంధించి మంచినీటి సరఫరా ప్రాజెక్టు డీపీఆర్లు సిద్ధం చేసిన గత ప్రభుత్వం టెండర్ల దశలో సార్వత్రిక ఎన్నికలు 15 నెలలుగా కూటమి హయాంలో పట్టాలు ఎక్కని ప్రాజెక్టు పనులు -
అటవీ అమరవీరులకు నివాళి
భీమవరం: అటవీ, వన్యప్రాణి సంరక్షణ కోసం అశువులు బాసిన అమరవీరులను స్ఫూర్తిగా తీసుకుని అటవీ సిబ్బంది నిబద్ధతతో పనిచేయాలని జిల్లా అటవీశాఖాధికారి డీఏ కిరణ్ అన్నారు. గురువారం జిల్లా అటవీ శాఖాధికారి కార్యాలయంలో జాతీయ అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవం నిర్వహించారు. గంధం చెక్కల స్మగ్లర్ వీరప్పన్ చేతిలో మృతి చెందిన రాజమహేంద్రవరానికి చెందిన ఫారెస్ట్ అధికారి పందిరిపల్లి శ్రీనివాసరావు చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. భీమవరం రేంజ్ అటవీ క్షేత్రాధికారి మురాల కరుణాకర్ మాట్లాడుతూ 1730 సెప్టెంబర్ 11న రాజస్థాన్ రాష్ట్రం జోదపూర్లో అటవీ సంరక్షణకు సుమారు 363 మంది బలిదానం కావడంతో మహారాజా అభయ్ సింగ్ పశ్చాత్తాపంతో అటవీ అమరవీరుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ జాతీయ అటవీ సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహించారని చెప్పారు. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ భారతి, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ సురేష్కుమార్, బీట్ ఆఫీసర్ రాంప్రసాద్, సీనియర్ అసిస్టెంట్ పోచమ్మ పాల్గొన్నారు. -
సమస్యలు పరిష్కరించకుంటే రాష్ట్రవ్యాప్త నిరసనలు
సచివాలయ ఉద్యోగుల హెచ్చరిక యలమంచిలి: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యలను 15 రోజుల్లో పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతామని ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ఐక్యవేదిక స్పష్టం చేసింది. రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు గురువారం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మున్సిపాలిటీలో, మండలంలో మున్సిపల్ కమిషనర్లకు, ఎంపీడీఓలకు సచివాలయ ఉద్యోగులు అధికారిక నోటీసులు అందజేశారు. ఈ మేరకు యలమంచిలి మండల ఉద్యోగులు ఈఓపీఆర్డీ జేడీవీ ప్రసాద్కు వినతిపత్రం ఇచ్చారు. ఇంటింటికీ తిరుగుతూ చేసే సర్వేల నుంచి సచివాలయ ఉద్యోగులకు విముక్తి కల్పించాలని, గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగులను వారి సంబంధిత మాతృశాఖలకే అనుసంధానం చేయాలని, సమయపాలన లేకుండా ఆదివారాలు, పండుగలు, సెలవులు, అర్ధ రాత్రుల్లో బలవంతపు విధులు చేయించడం నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ప్రొబేషన్ పీరియడ్ పూర్తయిన వారికి నోషనల్ ఇంక్రిమెంట్లు మంజూరు చేయాలని, ఆరేళ్లుగా ఒకే క్యాడర్లో కొనసాగుతున్న వారికి స్పెషల్ ఇంక్రిమెంట్ ఇవ్వాలని, ప్రస్తుత రికార్డ్ అసిస్టెంట్ క్యాడర్ను జూనియర్ అసిస్టెంట్ క్యాడర్గా మార్పు చేయాలని, జిల్లాల వారీగా సీనియారిటీ జాబితాలు విడుదల చేయాలని, స్టేషన్ సీనియారిటీ ఆధారంగా పారదర్శక బదిలీలకు ప్రత్యేక విధి విధానాలు రూపొందించాలని వారు అధికారిక నోటీసులో పేర్కొన్నారు. -
కర్నూలు ఉల్లి.. రైతులు తల్లడిల్లి
తాడేపల్లిగూడెం: ఆరుగాలం కష్టించి పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక కర్నూలు ఉల్లి రైతులు తల్లడిల్లుతున్నారు. రాష్ట్రంలోనే ప్రధానమైన తాడేపల్లిగూడెం మార్కెట్కు కర్నూలు ఉల్లి లారీలు వస్తున్నా తేమశాతం, నాణ్యత లేమితో వ్యాపారులు కొనుగోలు చేయకపోవడంతో ఏం చేయాలో పాలుపోక అల్లాడుతున్నారు. ప్రభుత్వ సాయం అందక, అధికారులు చేస్తున్న ప్రయత్నాలు ఫలించకపోవడంతో నెల రోజులుగా రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఉల్లి బస్తాలను రోడ్ల పక్కన వదిలేస్తూ నిట్టూరుస్తున్నారు. 70 ఏళ్లుగా ఇక్కడికే.. రాష్ట్రంలోని ఉల్లి అవసరాన్ని మహారాష్ట్ర ఉల్లి తర్వాత కర్నూలు, కడప ఉల్లి తీరుస్తుంది. ఖరీఫ్, రబీ సీజన్లలో వేలాది ఎకరాల్లో ఉల్లి పండించడంతో పాటు అధిక శాతం పంటను 70 ఏళ్లుగా ప్రధాన మార్కెట్గా ఉన్న తాడేపల్లిగూడేనికి రైతులు తీసుకొస్తున్నారు. ఇక్కడ బస్తా బస్తా గ్రేడింగ్ చేసి ధర నిర్ణయిస్తారు. బహిరంగ వేలంలో ఉల్లిని విక్రయిస్తారు. అదే రోజు రైతుల చేతికి సొమ్ములు అందుతాయి. కర్నూలు మార్కెట్ దీనికి భిన్నం కావడంతో ఈ రకం గూడెం మార్కెట్కే ఎక్కువగా వస్తుంది. ఇది చాలా కాలంగా వ్యాపార బంధంగా కొనసాగుతోంది. అక్కడి ఉల్లి రైతులకు కష్టం వచ్చినా కూడా ఆదుకొనేది తాడేపల్లిగూడెం వ్యాపారులే కావడం విశేషం. విస్తీర్ణం తగ్గినా.. ధర లేదు కర్నూలు జిల్లాలో ఉల్లి సాగు విస్తీర్ణం క్రమేపీ తగ్గుతోంది. 2019–20లో 33,829 ఎకరాల్లో సాగు చేయగా 7.78 లక్షల టన్నుల దిగుబడి వచ్చింది. అదే 2024–25లో 19,546 ఎకరాల్లో సాగు చేయగా 3.51 లక్షల టన్నులకు దిగుబడి అంచనా వేశారు. ఎకరాకు రైతుకు రూ.70 వేలు ఖర్చవుతుంది. కనీస దిగుబడి 50 క్వింటాళ్లు రావాలి. అలాగే ధర క్వింటాలు రూ.2 వేలు పలికితేనే రైతు గట్టెక్కుతారు. అయితే ఈ ఏడాది ధరలు దారుణంగా పడిపోయాయి. కిలోకు రూ.4 రావడం గగనంగా మారింది. నాణ్యత ఉంటే రూ.9 వరకు వస్తుంది. కిలో గరిష్ట ధరను రూ.11గా నిర్ణయించారు. దీంతో రైతులు ఉల్లిని మార్కెట్లకు తెస్తున్నారు. వాటిని మార్క్ఫెడ్ కొనుగోలు చేసి తర్వాత ప్రధాన మార్కెట్కు పంపిస్తోంది. నాలుగు రోజుల తర్వాత గూడెంకు.. మహారాష్ట్ర ఉల్లితో పోలిస్తే కర్నూలు ఉల్లిలో నాణ్యత తక్కువ. మార్క్ఫెడ్ కొనుగోలు చేసిన వెంటనే పంటను మార్కెట్లు తరలించాల్సి ఉండగా అలా జరగడం లేదు. ఉల్లిని కర్నూలు మార్కెట్ యార్డులో కొనుగోలు చేసి, నెట్టులు కట్టి నాలుగు రోజుల తర్వాత తాడేపల్లి గూడెం మార్కెట్కు పంపిస్తున్నాయి. వాస్తవానికి ఉల్లి లారీ 30 నుంచి 35 టన్నులు ఉంటుంది. నాసిరకం, కుళ్లిపోయే గుణం కర్నూలు ఉల్లిని పది టన్నులకు మించి పంపకూడదు. సామర్థ్యానికి మించి పంపితే ఆవిరి పెరిగి, పై బస్తాలు కింద బస్తాలను నొక్కడంతో ఉల్లిపాయలు మరింత రసం కారేలా తయారవుతున్నాయి. దీంతో ఈ రకం మార్కెట్కు వచ్చినా ఎవరూ కొనుగోలు చేయకపోవడంతో రోడ్లపై పడేసే పరిస్థితి వచ్చింది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ధరల స్థిరీకరణ పేరుతో ఏటా రూ.3 వేల కోట్లను బడ్జెట్లో కేటాయించి రైతులకు పంటల విషయంలో సమస్య వచ్చినప్పుడు కనీస ధర ఇచ్చి ఆదుకునేది. ప్రస్తుత కూటమి పాలనలో ఈ పరిస్థితి లేకపోవడంతో రైతులు అల్లాడుతున్నారు. తాడేపల్లిగూడెం మార్కెట్కు వచ్చే కర్నూలు ఉల్లిలో నాణ్యత లేకపోవడంతో వ్యాపారులు కొనడం లేదు. ఇంకా మహారాష్ట్ర ఉల్లిపాయలు వస్తున్నాయి. మహారాష్ట్రలో కూడా 60 శాతం పంట ఉంది. సాధారణంగా కర్నూలు ఉల్లి సీజన్లో రోజుకు 80కు పైగా లారీలు గూడెం మార్కెట్ వస్తుంటాయి. అయితే ప్రస్తుతం ఏడెనిమిది లారీలు మాత్రమే వస్తున్నాయి. కడప, మైదుకూరు ప్రాంతాల నుంచి వచ్చే రకంలో కాస్త నాణ్యత ఉంటుండగా.. కర్నూలు రకం ఇక్కడకు వచ్చేసరికి కుళ్లిపోతున్నాయి. దీంతో కిలో రూ. 2 కు కూడా కొనడం లేదు. వాటిని దుకాణాల్లో ఉంచుకోలేం. దీంతో వ్యాపారులు తాము తీసుకునే కమీషన్ సొమ్ములను రైతుల నుంచి తీసుకోవడం లేదు. ప్రభుత్వం ఆదేశాల మేరకు కర్నూలు ఉల్లి రైతులకు న్యాయం చేయడానికి మా వంతు కృషి చేస్తున్నాం. – ఎన్కే, ఉల్లి వ్యాపారి గిట్టుబాటు ధర లేని వైనం నాణ్యతలేమి, తేమ శాతంతో ఇబ్బందులు ఆదుకోని కూటమి సర్కారు నలిగిపోతున్న ఉల్లి రైతులు -
ధాన్యం కొనుగోలుకు పటిష్ట కార్యాచరణ
భీమవరం: ఖరీఫ్ సీజన్ ధాన్యం కొనుగోలుకు పటిష్ట కార్యాచరణ సిద్ధం చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని జాయింట్ కలెక్టర్ ఛాంబర్ నందు ఖరీఫ్ సీజన్లో ధాన్యం కొనుగోలు ఏర్పాట్లపై పౌర సరఫరాలు, వ్యవసాయ, సహకార, రవాణా శాఖలు, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ సభ్యులతో జేసీ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్టోబర్ మొదటి వారం నుంచి రైతుల ధాన్యం కొనుగోలుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మొదటి వారంలో తాడేపల్లిగూడెంలో ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు చేయాలన్నారు. పెనుగొండ: ములపర్రులో మద్యం ధరలను ఇష్టారాజ్యంగా వసూలు చేస్తుండడంపై మద్యం ప్రియులు గురువారం దుకాణం వద్ద నిరసన తెలిపారు. మద్యం ధరలు తగ్గించాలంటూ నినాదాలు చేశారు. సమయానుకూలంగా ధరలు మారుస్తున్నారంటూ విమర్శించారు. అధికంగా ఎందుకు తీసుకుంటున్నారని ప్రశ్నిస్తే ధర ఇంతేనంటూ వెటకారంగా సమాధానం ఇస్తున్నారని వాపోయారు. ధరలు తగ్గించకపోతే పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఏలూరు(మెట్రో): ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పంచాయతీరాజ్ పర్యవేక్షక ఇంజనీర్గా రమేష్ గరువారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం జిల్లా పరిషత్ క్యాంపు కార్యాలయంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఘంటా పద్మశ్రీని ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. పంచాయతీ రాజ్ విభాగం ద్వారా జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులపై సమగ్రంగా చర్చించారు. తాడేపల్లిగూడెం: రాష్ట్రంలో పండిన కర్నూలు ఉల్లిపాయలను వినియోగించి రైతులకు బాసటగా నిలవాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి పిలుపునిచ్చారు. గురువారం తాడేపల్లిగూడెంలో మార్కెట్లో ఉల్లిపాయల క్రయ విక్రయాలను ఆమె పరిశీలించారు. పరిస్థితిపై కలెక్టర్ రైతులను నేరుగా అడిగి తెలుసుకున్నారు. కర్నూలు ఉల్లిపాయలతో వంట చేయించి, వ్యాపారులు, రైతులతో కలిసి కలెక్టర్ అక్కడే భోజనం చేశారు. షోలాపూర్ ఉల్లి కన్నా, కర్నూలు ఉల్లి ఎంతో రుచికరం అని, జిల్లా ప్రజలు, విద్యాసంస్థలు కర్నూలు ఉల్లినే వినియోగించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉల్లి రైతులను ఆదుకొనేందుకు ఎప్పటికప్పుడు సమీక్షిస్తుందన్నారు. గురువారం వచ్చిన ఉల్లిపాయలకు కిలోకు రూ.6 వచ్చాయని రైతు తెలుపగా, కలెక్టర్ కోరిక మేరకు రూ.9 వంతున చెల్లించడానికి వ్యాపారులు అంగీకరించారు. విద్యాసంస్థల్లో, మార్టుల్లో కర్నూలు ఉల్లిపాయల విక్రయాలు చేపట్టడానికి చర్యలు తీసుకున్నట్టు ఆమె చెప్పారు. మార్కెటింగ్ రీజినల్ జేడీ.కె.శ్రీనివాసరావు, ఏడీ సునీల్కుమార్, తహసీల్దార్ సునీల్, కమిషనర్ ఎం. ఏసుబాబు, తదితరులు ఉన్నారు. టి.నరసాపురం: మండలంలో బుధవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో ఆయా మార్గాల్లో గురువారం వాహన రాకపోకలు నిలిచిపోయాయి. మండలంలోని మక్కినవారిగూడెం – టి.నరసాపురం మార్గంలో కనకదుర్గ గుడి వద్ద జలవాగు, బండివారిగూడెం – మక్కినవారిగూడెం గ్రామాల మద్య గల ముగ్గురాళ్ళ వాగు, అప్పలరాజుగూడెం – మధ్యాహ్నపువారిగూడెం గ్రామాల మధ్య ఎర్రకాలువ వాగులు భారీ వర్షం కారణంగా పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో ఆయా గ్రామాల మధ్య వాహన రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. -
ఉపాధ్యాయుల పోరుబాట
భీమవరం: తమ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ మొండివైఖరిని నిరసిస్తూ ఉపాధ్యాయులు పోరుబాట పట్టారు. జిల్లాలోని ఉపాధ్యాయులంతా గురువారం నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. పెండింగ్లో ఉన్న 4 డీఏలను తక్షణం విడుదల చేయాలని, 12వ పీఆర్సీ కమిషన్ నియమించి ఐఆర్ ప్రకటించాలని, అన్ని రకాల బకాయిలు చెల్లించాలని, ఈహెచ్ఎస్ పరిమితిని రూ.25 లక్షలకు పెంచాలని, యాప్లు, అసెస్మెంట్ బుక్లెట్ విధానాలను రద్దుచేయాలని డిమాండ్ చేశారు. వారం రోజుల పాటు నిరసన కార్యక్రమాలకు ప్రణాళిక రూపొందించినట్లు ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు జి.ప్రకాశం తెలిపారు. ఈనెల 12న మండల కేంద్రాల్లో నిరసన ప్రదర్శనలు, 13, 14 తేదీల్లో ప్రజాప్రతినిధులకు వినతిపత్రాలు అందించడం, 15న తాలూకా కేంద్రాల్లో, 16న జిల్లా కేంద్రాల్లో నిరసన ప్రదర్శనలు, 17న ముఖ్యమంత్రి, సీఎస్లకు వాట్సాప్, ఈ మెయిల్ ద్వారా వినతులు పంపించి నిరసనలు తెలుపుతామని, అప్పటికీ ప్రభుత్వం సమస్యలు పరిష్కరించకుంటే ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని చెప్పారు. -
ఆధిపత్యం కోసమే హత్య
ఏలూరు టౌన్: ఏలూరు రూరల్ కొమడవోలు ఇందిరమ్మ కాలనీలో ఇటీవల జరిగిన దారుణ హత్య కేసులో ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఏలూరు డీఎప్పీ డి.శ్రావణ్కుమార్ బుధవారం ఏలూరు పోలీస్ సబ్ డివిజన్ కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. కొమడవోలు ఇందిరమ్మ కాలనీకి చెందిన పూనూరు రాజేష్ కొందరు రాజకీయ నేతల అండతో గొడవలకు సెటిల్మెంట్లు చేస్తూ ఉంటాడు. ఇదే ప్రాంతానికి చెందిన బూరగ నాని అలియాస్ చిన్న నాని మృతుడితో సన్నిహితంగా మెలిగేవాడు. కానీ కొన్ని సందర్భాల్లో రాజేష్ కఠినంగా ప్రవర్తిస్తూ చిన్న నానిని మందలించటం... కొట్టటం చేసేవాడు. రాజేష్కు తెలిసిన ఒక మహిళతో నాని చనువుగా ఉండటాన్ని గమనించిన ఆమె బంధువులు గతంలో నానితో గొడవపడి కొట్టారు. దీనిలోనూ రాజేష్ కీలకపాత్ర పోషించాడని నాని మనసులో కక్ష పెంచుకున్నాడు. పైగా ఇందిరమ్మ కాలనీలో సెటిల్మెంట్లు చేస్తున్న రాజేష్ లేకుంటే... తానే పెద్దమనిషిగా చలామణి అవ్వచ్చు అనే ఆలోచనతో రాజేష్ను చంపేందుకు తన స్నేహితులతో కలిసి పక్కా స్కెచ్ వేశాడు. కత్తులతో దాడి చేసి.. ముందుగా వేసుకున్న పథకం ప్రకారం ఆగస్టు 31 తేదీ ఆదివారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఇందిరమ్మ కాలనీలో రాజేష్ తన ఇంట్లో ఉండగా బూరగ నాని అతని ఇంటికి వెళ్లి బయటకు రావాలని పిలిచాడు. చర్చి సమీపంలోకి తీసుకువెళ్లి నాని, మరో ఐదుగురు కత్తులతో దాడి చేసి కారులో పరారయ్యారు. ఈలోగా అరుపులు, కేకలకు రాజేష్ కుమార్తె, కుమారుడు, చెల్లి బయటకు వచ్చి చూడగా తీవ్ర గాయాలతో ఉన్నాడు. కుటుంబ సభ్యులు అతడ్ని ఏలూరు జీజీహెచ్కు తరలించగా వైద్యులు పరీక్షించి మృతిచెందినట్లు నిర్థారించారు. మృతుడి భార్య ఫిర్యాదుపై ఏలూరు రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. కేసును ఛేదించిన పోలీసులు ఈ కేసు విచారణకు సంబంధించి ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ ఆదేశాలతో ఏలూరు డీఎస్పీ శ్రావణ్కుమార్ పర్యవేక్షణలో ఏలూరు వన్టౌన్ సీఐ జీ.సత్యనారాయణ, ఏలూరు టూటౌన్ సీఐ కే.అశోక్కుమార్ ఆధ్వర్యంలో పోలీస్ బృందాలను ఏర్పాటు చేశారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈనెల 10న ఏలూరు జాతీయ రహదారిపై రత్నాస్ రెస్టారెంట్ వెనుక నిందితులు ఉన్నారనే సమాచారంతో ఏలూరు వన్టౌన్ సీఐ సత్యనారాయణ, రూరల్ ఇన్చార్జి ఎస్సై నాగబాబు, సిబ్బంది కలిసి ఆరుగురు నిందితులను పట్టుకున్నారు. వారి నుంచి స్కూటీ, కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు వీరే.. ఏలూరు రూరల్ ఇందిరమ్మ కాలనీకి చెందిన ప్రధాన నిందితుడు బూరగనాని అలియాస్ చిన్ననానితోపాటు, ఏలూరులోని వివిధ ప్రాంతాలకు చెందిన సామంతుల అజయ్సూర్య అలియాస్ బెస్సీ, లంకపల్లి బాలకృష్ణ అలియాస్ బాలు, సిగిరెడ్డి సుధాకర్ అలియాస్ సుధా, ఉగ్గిన షణ్ముక వేణుగోపాల్ అలియాస్ వేణు, కటారి పూర్ణచంద్ర శేఖర్ అనే ఆరుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వీరిలో ముగ్గురిపై ఏలూరు నగరంలో పాత కేసులు ఉన్నాయి. ఈ కేసును ఛేదించిన సీఐలు సత్యనారాయణ, అశోక్కుమార్, ఎస్సై నాగబాబు, ఏఎస్సై సురేష్, హెచ్సీ సత్యారావు, కానిస్టేబుళ్లు బీ.నాగార్జున, ఆర్.మోహన్, పీ.నాగరాజు, ఎండీ రుహుల్లా, ఎన్.శేషుకుమార్ను ఏలూరు డీఎస్పీ శ్రావణ్కుమార్ ప్రత్యేకంగా అభినందించారు. -
పశువుల్లో ‘లంపీ’తో అప్రమత్తం
● శ్రీవారి క్షేత్రంలో తాత్కాలికంగా గోదానం, గోదత్తత నిలుపుదల ● గోసంరక్షణ శాలలో పశువులకు టీకాలు ద్వారకాతిరుమల : పశువులకు ముద్దచర్మ (లంపీ స్కిన్) వ్యాధి వ్యాపిస్తుండటంతో శ్రీవారి దేవస్థానం అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే గోదానం, గోదత్తత పథకాలను తాత్కాలికంగా నిలుపుదల చేశారు. ప్రస్తుతం గోసంరక్షణశాలలో మొత్తం 326 పశువులు ఉన్నాయి. పశువైద్యాధికారులు ఇప్పటికే వాటన్నిటికి లంపీ స్కిన్ వ్యాధి నివారణా టీకాలు వేశారు. అయితే ఇటీవల ఓ భక్తుడు ఆవు, దూడను దానంగా ఇవ్వగా అందులో దూడకు లంపీ స్కిన్ వ్యాధి ఉన్నట్టు గుర్తించిన వైద్యులు, దానికి చికిత్స అందించారు. ప్రస్తుతం ఆ దూడ కోలుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో గోదానాన్ని స్వీకరిస్తే గోసంరక్షణశాలలోని అన్ని గోవులకు ఆ వ్యాధి సోకే ప్రమాదం ఉందని పశువైద్యులు దేవస్థానం అధికారులకు సూచించారు. దాంతో గోదానం, గోదత్తతను ఈనెల 6 నుంచి తాత్కాలికంగా నిలిపివేశారు. ప్రతిష్టాత్మకంగా గోసంరక్షణ గోదానం ఎంతో విశిష్టమైనదిగా ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. అందుకే భక్తులు శ్రీవారికి గోవులను దానంగా ఇస్తుంటారు. వాటిలో కొన్నింటిని దేవస్థానం రైతులకు వ్యవసాయ పనుల నిమిత్తం దత్తత ఇస్తోంది. ముందుగా దరఖాస్తు చేసుకున్న రైతులకు ప్రతినెలా రెండవ, నాల్గవ శనివారాల్లో ఆవులను దత్తత ఇస్తున్నారు. ఏడాదిలో ఒకసారి దేవస్థానం అధికారులు రైతుల వద్దకు వెళ్లి వారిచ్చిన గోవులను పరిశీలిస్తున్నారు. అలాగే గోసంరక్షణశాలలో ఉన్న గోవుల పోషణపట్ల అధికారులు, సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. తెల్ల పశువుల్లోనే వ్యాధి తీవ్రత తెల్ల పశువులు అయిన ఆవులు, ఎద్దుల్లోనే ఎక్కువగా ఈ వ్యాధి తీవ్రత కనిపిస్తుంది. లంపీ స్కిన్ అనే వైరస్ వల్ల కలిగే ఈ వ్యాధి పశువుల రక్తం పీల్చే దోమలు, ఈగలు, పిడుదుల ద్వారా ఒక పశువు నుంచి మరో పశువుకు సులభంగా వ్యాపిస్తుంది. అది కూడా అక్టోబర్ నుంచి జనవరి మధ్యలోనే ఈ వ్యాధి వ్యాప్తి చెందే అవకాశాలు ఉన్నాయి. అందుకే పశువైద్యాధికారులు, సిబ్బంది గోసంరక్షణశాలలోని గోవులకు సెప్టెంబర్లోనే టీకాలు వేశారు. జాగ్రత్తలు తప్పనిసరి పశువులకు లంపీ స్కిన్ వ్యాధి సోకకుండా ముందుగానే టీకాలు వేయించాలి. 104 నుంచి 106 డిగ్రీల జ్వరం వచ్చి, చర్మంపై బొబ్బలు, బుడిపెలు, పొక్కులు ఏర్పడి, నెమ్మదిగా అవి పగిలి పుండ్లుగా మారి, మేత సరిగ్గా తినకపోవడం, నోరు, ముక్కు నుంచి చొంగ కారడం, పాల దిగుబడి తగ్గడం, అలసటగా ఉండటం వంటి లక్షణాలు ఉంటే దాన్ని లంపీ స్కిన్ వ్యాధిగా గుర్తించాలి. వాటిని మంద నుంచి వేరు చేసి, చికిత్స అందించాలి. దోమ తెరలు, లేదా వేపాకు పొగ వేయాలి. గంజి వంటి ఆహార పదార్థాల్లో కాస్త ఉప్పు కలిపి తాగించాలి. జ్వరం తగ్గే వరకు ఓఆర్ఎస్ ద్రావణాన్ని ఇవ్వాలి. జ్వరం తగ్గడానికి మెలోక్సికామ్, ఆనాల్జిన్ మందులను వైద్యుల సూచనల మేరకు వాడాలి. సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉంటే యాంటీ బయాటిక్, న్యూమోనియా లక్షణాలు ఉంటే అవిల్, సీపీఎం వంటి మందులు వాడాలని పశువైద్యులు తెలిపారు. వ్యాధి పూర్తిగా తగ్గిన ఆవులనే దానంగా ఇవ్వాలి. గోసంరక్షణశాలలోని షెడ్డులో ఉన్న ఆవులు , గోసంరక్షణశాలలో లంపీ స్కిన్ వ్యాధి నుంచి కోలుకున్న ఆవుదూడ శ్రీవారి గోసంరక్షణశాల లోని ఆవులకు, గిత్తలకు, దూడలకు నెల క్రితమే లంపీ స్కిన్ వ్యాధి నివారణా టీకాలు వేశాం. బయట నుంచి కొత్తగా పశువులు లోపలికి వస్తే ప్రస్తుతం ఉన్న ఆవులకు వ్యాధి సోకే ప్రమాదం ఉంది. అందుకే కొత్త వాటిని రాకుండా చూడాలని ఆలయ అధికారులకు సూచించాం. వారు వెంటనే అప్రమత్తమై గోదానం, గోదత్తతను నిలిపివేశారు. – అంగర సురేష్, పశువైద్యాధికారి, ద్వారకాతిరుమలలంపీ స్కిన్ వ్యాధి విస్తరిస్తున్న నేపధ్యంలో పశువైద్యాధికారుల సూచనల మేరకు భక్తుల నుంచి గోవులను దానంగా తీసుకోవడం, అలాగే రైతులకు గోవులను దత్తత ఇవ్వడాన్ని తాత్కాలికంగా నిలుపుదల చేశాం. వ్యాధి తీవ్రత తగ్గిన తరువాత మళ్లీ వాటిని పునఃప్రారంభిస్తాం. ఆ సమాచారాన్ని ముందుగా మీడియా ద్వారా అందరికీ తెలియజేస్తాం. – ఎన్వీఎస్ఎన్ మూర్తి, శ్రీవారి దేవస్థానం ఈఓ -
15న కృష్ణాష్టమి వేడుకలు
ద్వారకాతిరుమల: శ్రీవారి దివ్య క్షేత్రంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఈనెల 15 న అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్టు ఆలయ ఈఓ ఎన్వీఎస్ఎన్ మూర్తి తెలిపారు. అందులో భాగంగా ఆరోజు ఆలయంలో స్వామివారికి నిత్యార్జిత కల్యాణాలు, ఆర్జిత సేవలను రద్దు చేస్తున్నట్టు చెప్పారు. అలాగే 16న సాయంత్రం క్షేత్రంలో ఉట్ల పండుగ, శ్రీవారి గ్రామోత్సవాన్ని నిర్వహిస్తామన్నారు. భక్తులు గమనించాలని ఆయన కోరారు. ఏలూరు(మెట్రో): జిల్లాలో ఎన్ఎంఆర్ కార్మికులకు 2025 –26 సంవత్సరానికి వేతనాల పెంపును ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కలెక్టర్ కె.వెట్రిసెల్వి అధ్యక్షతన జరిగిన జిల్లా కమిటీ సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఉప కార్మిక కమిషనర్ పి.శ్రీనివాస్ బుధవారం తెలిపారు. ఒక రోజుకి స్కిల్డ్ కార్మికునికి రూ.710 నుంచి రూ.730, సెమీ స్కిల్డ్ కార్మికునికి రూ.640 నుంచి రూ.665, అన్స్కిల్డ్ కార్మికునికి రూ.595 నుంచి రూ.615గా నిర్ణయించారని, ఈ వేతనాలు ఏప్రిల్ 01, 2025 నుంచి అమలులోకి వస్తాయన్నారు. -
కేవీకే హెడ్ సైంటిస్ట్కు అవార్డు
ఉండి: ఏరువాక ఉత్తమ శాస్త్రవేత్త అవార్డుకు ఎన్నార్పీ అగ్రహారం కృషీ విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ ఎన్.మల్లిఖార్జునరావు ఎంపికయ్యారు. ఏరువాక ఫౌండేషన్ ఏటా వ్యవసాయ అనుబంధ రంగాల్లోని వివిధ విభాగాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచే శాస్త్రవేత్తలను ఎంపిక చేసి అవార్డులు అందజేస్తుంది. దీనిలో భాగంగా 2023–24కి గాను ఉత్తమ విస్తరణ నిపుణుడు ఎంటొమోలోజీ విభాగంలో డాక్టర్ మల్లిఖార్జునను ఉత్తమ శాస్త్రవేత్తగా ఎంపిక చేశారు. ఈమేరకు ఫౌండేషన్ నుంచి తనకు సమాచారం అందినట్లు మల్లిఖార్జునరావు తెలిపారు. ఈ నెల 26, 27 తేదీల్లో గుంటూరు కేఎల్ యూనివర్సీటీలోని కాలేజ్ ఆఫ్ ఆగ్రికల్చర్ ఆర్అండ్డీ థియేటర్లో నిర్వహించే ప్రత్యేక కార్యక్రమంలో ఈ అవార్డు అందజేస్తారని ఆయన చెప్పారు. టి.నరసాపురం: బొర్రంపాలెం అన్నపూర్ణ ఫెర్టిలైజర్స్ అండ్ జనరల్ స్టోర్స్లో బుధవారం విజిలెన్స్ అధికారుల బృందం తనిఖీలు నిర్వహించారు. షాపులో ఆయా ఎరువులు ఉండాల్సిన దానికన్నా 3.245 టన్నులు తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. రూ.6,98,663 విలువ కలిగిన యూరియా, పొటాష్, 10–26, సూపర్ 39.585 టన్నులను సీజ్ చేశారు. షాప్ యజమాని అశోక్ కుమార్పై 6 ఏ కేసు నమోదు చేశారు. దాడుల్లో విజిలెన్స్ ఎస్సై రంజిత్ కుమార్, విజిలెన్స్ ఏవో మీరయ్య, మండల వ్యవసాయ అధికారిణి బి.ప్రియాంక తదితరులు పాల్గొన్నారు. ఉండి: ఈ నెల 17వ తేదీ నుంచి ఎన్నార్పీ అగ్రహారంలోని కృషీ విజ్ఞాన కేంద్రంలో మిద్దెతోటల పెంపకంపై శిక్షణ, అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ ఎన్ మల్లిఖార్జునరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. మిద్దెతోటల పెంపకంతో పాటు తేనెటీగలు, కోళ్లు, చేపల పెంపకం, బయోడీకంపోజర్స్ వినియోగం తయారీపై సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించడంపై శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి మిద్దెతోటల పెంపకం నిపుణుడు వేణుగోపాలరావు తదితర జిల్లా మండల అధికారులు హాజరువుతారని తెలిపారు. మిద్దెతోటలు తదితర వాటిపై అవగాహన, శిక్షణలో ఆసక్తి గల మహిళలు హాజరు కావాలని కోరారు. పెదవేగి : ఎస్జీఎఫ్ అండర్ 19 జిల్లా జట్ల ఎంపిక పోటీలు బుధవారం పెదవేగి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురుకులంలో ఉత్సాహంగా జరిగాయి. ఫెన్సింగ్ జూడో, బాక్సింగ్, బీచ్ వాలీబాల్, రగ్బీ, తైక్వాండో, గక్కా క్రీడాంశాలలో పోటీలు నిర్వహించి జిల్లా జట్లను ఎంపిక చేసినట్లు డీవైఈఓ టి శేఖర్బాబు, ఆర్గనైజింగ్ కార్యదర్శి కె జయరాజు తెలిపారు. ఈ పోటీల్లో కళాశాల ప్రిన్సిపాల్ ఏవీ శివప్రసాద్, ఇతర పీడీలు పాల్గొన్నారు. భీమవరం: భీమవరం ఒకటో పట్టణంలోని శ్రీనివాసా కూడలిలో ఇంట్లో ఉరివేసుకుని సునీల్ (39) అనే వ్యక్తి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. సునీల్ పట్టణంలోని ఓ దుకాణంలో మోటార్సైకిల్ మెకానిక్గా పనిచేస్తున్నాడు. బుధవారం రాత్రి ఆత్మహత్య సమాచారం అందడంతో ఎస్సై బీవై కిరణ్కుమార్ సంఘటనా స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు. -
క్వాంటం వ్యాలీ హేకథాన్ పోటీలు
భీమవరం: ఉభయగోదావరి జిల్లాలకు సంబంధించి భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన అమరావతి క్వాంటం వ్యాలీ హేకథాన్ 2025 సెమీఫైనల్స్లో విజేతలకు కలెక్టర్ చదలవాడ నాగరాణి చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు. విన్నర్స్గా భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజీ, శ్రీ విష్ణు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ భీమవరం, బీవీసీ ఇంజనీరింగ్ కాలేజ్, రాజమండ్రి, గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ రాజమండ్రి, ఆదిత్య కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ సూరంపాలెం, ప్రగతి ఇంజనీరింగ్ కాలేజీ సూరంపాలెం, ఆదిత్య డిగ్రీ అండ్ పీజీ కాలేజీ ఫర్ ఉమెన్ రాజమండ్రి, ఆదిత్య డిగ్రీ అండ్ పీజీ కాలేజీ కాకినాడ వారికి దక్కగా, ఒక్కొక్క టీంకి రూ.10 వేల చెక్కును కలెక్టర్ చదలవాడ నాగరాణి చేతుల మీదుగా అందించారు. రన్నర్స్గా నిలిచిన కళాశాలలకు ఒక్కొక్క టీంకు రూ.5 వేల చొప్పున అందించారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కేవీ మురళీకృష్ణంరాజు అధ్యక్షతన జరిగిన ఈ పోటీలకు ఉన్నత విద్యా మండల్ నుంచి ప్రత్యేక పరిశీలకులు డాక్టర్ పి అనిల్కుమార్ హాజరుకాగా రీజినల్ సెంటర్ కోఆర్డినేటర్ డాక్టర్ పి రవికిరణ్ వర్మ, కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ సాగి రామకృష్ణ నిషాంత వర్మ, ఉపాధ్యక్షుడు ఎస్వీ రంగరాజు, డైరెక్టర్ డాక్టర్ ఎం జగపతి రాజు, ప్రిన్సిపాల్ డాక్టర్ కేవీ మురళీకృష్ణంరాజు, చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సీహెచ్ దిలీప్ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు. -
మన్యంలో ప్రకృతి సేద్యం
● 10 వేల ఎకరాల్లో రసాయన రహిత సాగు ● స్వయంగా కషాయాలు తయారు చేస్తున్న గిరిజన రైతులు బుట్టాయగూడెం: రసాయన ఎరువులు, పురుగు మందుల వినియోగంతో వ్యవసాయం భారంగా మారుతోంది. మిత్ర పురుగుల నాశనంతో చీడపీడల బెడద పెరుగుతుంది. దీనితో అధికారుల ప్రోత్సాహంతో తక్కువ పెట్టుబడి కలిగిన ప్రకృతి వ్యవసాయంపై గిరిజన రైతులు ఆసక్తి కనబరుస్తున్నారు. మన్యంలో ప్రకృతి వ్యవసాయంపై గిరిజన రైతులకు ఐటీడీఏ, ప్రకృతి వ్యవసాయ రైతులు అవగాహన కలిగిస్తున్నారు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో సుమారు 1,596 మందికి పైగా సుమారు 10 వేల ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేపట్టినట్లు అధికారులు చెబుతున్నారు. ప్రకృతి సాగులో పంటలు కేఆర్పురం ఐటీడీఏ పరిధిలోని బుట్టాయగూడెం, జీలుగుమిల్లి, పోలవరం మండలాలతోపాటు జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం మండలాల్లో గిరిజనులు సుమారు 10 వేల ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేపట్టారు. వరి, మొక్కజొన్న, వేరుశనగ, మినుము పంటలతోపాటు జీడిమామిడి, అన్ని రకాల ఆకుకూరలు, కూరగాయల పంటలను ప్రకృతి వ్యవసాయంగా సాగు చేసి పండిస్తున్నారు. వీటిలో బుట్టాయగూడెం, జీలుగుమిల్లి, పోలవరం మండలాల పరిధిలో 4 వేల ఎకరాల్లో జీడిమామిడి, 2 వేల ఎకరాల్లో మొక్కజొన్న, 270 ఎకరాల్లో వరి, 200 ఎకరాల్లో మిర్చి, 250 ఎకరాల్లో మినుము, 280 ఎకరాల్లో కూరగాయలు, 3 వేల ఎకరాల్లో చిరుధాన్యాల పంటలు సాగు చేస్తున్నట్లు అధికారులు చెప్పారు. స్వయంగా కషాయాల తయారీ ప్రకృతి వ్యవసాయ పంటలకు కషాయాలను స్వయంగా గిరిజన రైతులు తయారు చేసుకుంటున్నారు. రసాయన ఎరువులు, పురుగు మందులకు బదులుగా పంటలకు జీవామృతం, ఘనామృతం, బీజామృతం, ద్రవ జీవామృతం, పంచగవ్య, అగ్నాస్త్రం, బ్రహ్మాస్త్రం వంటి రసాయనాలను గిరిజన రైతులు స్వయంగా తయారు చేసుకుని పంటలకు వినియోగించుకుంటున్నారు. -
సీసలిలో 144 సెక్షన్ అమలు
కాళ్ల: సీసలి గ్రామంలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా మంగళవారం నుంచి 15 రోజులపాటు గ్రామంలో 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు ఆకివీడు సీఐ జగదీశ్వరరావు, తహసీల్దార్ జి.సుందర్ సింగ్ తెలిపారు. సీసలిలో గ్రామదేవత పోలేరమ్మ గుడి పక్కన ఉన్న పోరంబోకు స్థలం విషయమై సోమవారం రాత్రి జరిగిన వివాదంలో పలువురికి గాయాలైన విషయం తెలిసిందే. దీనిపై మంగళవారం కాళ్ల తహసీల్దార్ కార్యాలయంలో ఇరువర్గాల పెద్దలతో పోలీసు, రెవెన్యూ, ఇరిగేషన్, పంచాయతీరాజ్ అధికారులు శాంతి సమావేశం నిర్వహించారు. సదరు వివాదాస్పద భూమిని ఇరిగేషన్ అధికారులు స్వాధీన పరుచుకోవాలని, ఇరిగేషన్ ఏఈ ఫణిశంకర్కు తహసీల్దార్ సూచించారు. గ్రామంలో 144 సెక్షన్ అమలు చేస్తున్నామని, ఎక్కడా గుంపులుగా గాని, ఐదుగురు కంటే ఎక్కువ వ్యక్తులు గాని ఉండరాదని స్పష్టం చేశారు. బయట నుంచి వచ్చి గ్రామంలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా, శాంతిభద్రతలకు విఘాతం కలిగించినా చట్టపరమైన క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
సచివాలయ ఉద్యోగుల నిరసన
యలమంచిలి: ప్రభుత్వం చేపట్టిన ఇంటింటికి వాట్సప్ గవర్నెన్స్ రిజిస్ట్రేషనన్, క్లస్టర్ మ్యాపింగ్ పనులను సచివాలయ ఉద్యోగులతో చేయించడాన్ని నిరసిస్తూ రాష్ట్ర గ్రామ, వార్డు సచివాలయం జేఏసీ పిలుపు మేరకు మంగళవారం సచివాలయ ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరై నిరసన తెలిపారు. వలంటీర్ వ్యవస్థను రద్దు చేసి ఆ పనులను సచివాలయ ఉద్యోగులతో చేయించడం సచివాలయ ఉద్యోగుల ఆత్మ గౌరవానికి భంగం కలిగించేదిగా ఉందని వారు పేర్కొన్నారు. ఈ మేరకు ఈఓపీఆర్డీ ప్రసాద్ను కలిసి వినతిపత్రం ఇచ్చారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు షేక్ ఉమర్ అలీషా, డియువి సత్యనారాయణ, గోనిపాటి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
థింక్ ఇండియా దక్షిణాపథ్ సమ్మిట్ పోస్టర్ ఆవిష్కరణ
తాడేపల్లిగూడెం (టీఓసీ): థింక్ ఇండియా ఆధ్వర్యంలో ఈ నెల 20, 21 తేదీల్లో తమిళనాడులోని ఐఐటీ మద్రాసు (ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్)లో నిర్వహించనున్న దక్షిణాపథ్ సమ్మిట్ పోస్టర్ను ఏపీ నిట్లో మంగళవారం నిట్ డీన్ రీసెర్చ్ అండ్ కన్సల్టెన్సీ డాక్టర్ జి.రవికిరణ్ శాస్త్రి ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ కృత్రిమ మేథ వంటి అధునాతన సాంకేతికతను ఉపయోగించి విద్యార్థులను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడం, యువత సృజనాత్మక ఆలోచనలు, ప్రతిభను సద్వినియోగం చేసుకుని దేశాన్ని ప్రపంచ దేశాలకు దీటుగా పురోగతివైపు నడిపించడం వంటి అంశాలపై నిపుణులు చర్చించనున్నారని చెప్పారు. పోస్టర్ ఆవిష్కరణలో రిజిస్ట్రార్ డాక్టర్ పి.దినేష్ శంకరరెడ్డి, అసోసియేట్ డీన్లు డాక్టర్ రాజేశ్వర్రెడ్డి, డాక్టర్ కార్తికేయ శర్మ తదితరులు పాల్గొన్నారు. -
నాసిరకం ఉల్లిపాయలు అమ్మలేం
తాడేపల్లిగూడెం: కర్నూలు నుంచి వచ్చే ఉల్లిపాయలను కొనుగోలు చేయడానికి వ్యాపారులు ఎవ్వరూ ముందుకు రాకపోవడంతో వాటిని అమ్మలేకపోతున్నామని బ్రహ్మానందరెడ్డి మార్కెట్లో వ్యాపారులు ఆర్డీఓ ఖతీబ్ కౌసర్ భానోకు తెలిపారు. మార్కెట్లో ఉల్లి లావాదేవీలను మంగళవారం ఆర్డీఓ పరిశీలించారు. వ్యాపారవర్గ ప్రతినిధి నంద్యాల కృష్ణమూర్తి ఆర్డీఓతో మాట్లాడుతూ వచ్చిన ఉల్లిపాయల్లో నాణ్యత లేనందున పాట పెట్టినా కొనేందుకు ఎవ్వరూ లేని కారణంగా వీటిని విక్రయించలేకపోతున్నామన్నారు. కామవరపుకోట:: ప్రోహిబిషన్, ఎకై ్సజ్, ఎన్ఫోర్స్మెంట్ అధికారుల ఆధ్వర్యంలో మంగళవారం సారా బట్టీలపై దాడులను నిర్వహించి పలువురిపై కేసు నమోదు చేసినట్లు చింతలపూడి ఎకై ్సజ్ సీఐ పి.అశోక్ తెలిపారు. చింతలపూడి మండలం తలార్లపల్లిలో 100 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేసి, 5 లీటర్ల సారాను స్వాధీనం చేసుకుని, నిందితుల పరారీపై కేసు నమోదు చేశామన్నారు. అలాగే కామవరపుకోట మండలం తాడిచెర్లలో పాత సారా కేసులో ఏ2 నిందితుడిగా పరారీలో ఉన్న వాక దేవాంజనేయులును అదుపులో తీసుకొని చింతలపూడి కోర్ట్ మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచగా రిమాండ్ విధించినట్లు చెప్పారు. ఏలూరు రూరల్: ఈ నెల 27, 28, 29 తేదీల్లో ఏలూరులో రాష్ట్రస్థాయి బాలబాలికల అథ్లెటిక్స్ పోటీలు చేపట్టనున్నట్లు ఏలూరు జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ కార్యదర్శి ప్రసాద్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ పోటీల్లో పాల్గొనే ఏలూరు జిల్లా జట్లు ఎంపిక పోటీలు ఈ నెల 15వ తేదీన నిర్వహించనున్నామని వెల్లడించారు. అండర్–14, 16, 18, 20 విభాగాల్లో పోటీలు జరుగుతాయని, ఆసక్తి గలవారు 15వ తేదీ ఉదయం 8 గంటలకు పుట్టినతేదీ, ఆధార్ ధ్రువీకరణ పత్రాలతో ఏలూరు అల్లూరి సీతారామరాజు స్టేడియంకు హాజరుకావాలన్నారు. వివరాలకు 86865 40555 నంబర్లలో సంప్రదించాలన్నారు. కాళ్ల: సీసలి గ్రామంలో దళితులపై దాడులను నిరసిస్తూ మంగళవారం గ్రామంలోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ విగ్రహం వద్ద మాలమహనాడు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు నల్లి రాజేష్ మాట్లాడుతూ గత కొంతకాలంగా సీసలి గ్రామంలో రెండు వర్గాల మధ్య ఏర్పడిన భూ వివాదాన్ని అధికారులు పరిష్కరించలేకపోయారన్నారు. దళిత యువకులు, మహిళలపై దాడి చేసిన వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుతోపాటు 307 కేసును పెట్టాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో దళిత ఐక్యవేదిక అధ్యక్షుడు గంటా సుందర్కుమార్, మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు గుండె నగేష్బాబు, రాష్ట్ర కార్యదర్శి కర్ని జోగయ్య, కోన జోసెఫ్ మీసాల జయరాజు, కాళ్ళ ఉండి అధ్యక్షుడు గుజ్జుల నిరీక్షణ రావు తదితరులు పాల్గొన్నారు. -
భీమవరంలో కలెక్టరేట్ కోసం దీక్ష
భీమవరం(ప్రకాశం చౌక్): స్థానిక మార్కెట్ యార్డ్లోనే కలెక్టరేట్ భవనం నిర్మించాలని భీమవరానికి చెందిన నాయ్యవాది జవ్వాది సత్యనారాయణ (సత్తిబాబు), రాట్నాల శ్రీనివాసరావు స్థానిక ప్రకాశం చౌక్ సెంటర్లో మంగళవారం రిలే నిరహార దీక్ష చేపట్టారు. గతంలో ఇచ్చిన జీవో ప్రకారం మార్కెట్యార్డ్లోనే కలెక్టరేట్ నిర్మాణం చేపట్టాలని, భీమవరం నుంచి కలెక్టరేట్ తరలింపు ప్రయత్నాలు మానుకొవాలని కోరారు. రిలే నిరాహార దీక్షలకు వైఎస్సార్సీపీ మద్దతు తెలిపింది. వైఎస్సార్ సీపీ నరసాపురం పార్లమెంట్ ఇన్చార్జి గూడూరి ఉమాబాల, భీమవరం నియోజకవర్గ ఇన్చార్జి చినిమిల్లి వెంకటరాయుడు దీక్షాదారులకు సంఘంభావం ప్రకటించారు. భీమవరంలోనే కలెక్టరేట్ ఉండాలని పోరాటం చేసే ప్రతి ఒక్కరికీ పార్టీ తరుఫున మద్దతు తెలియజేస్తామన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ పట్టణాధ్యక్షుడు గాదిరాజు రామరాజు, పాలవెల్లి మంగ, బొత్స ధర్మ తదితరులు పాల్గొన్నారు. దీక్షకు సీపీఐ పట్టణ కార్యదర్శి చెల్లబోయిన రంగారావు మద్దతు తెలిపారు. -
పాలనలో విఫలం.. సమస్యలతో సావాసం
● నూజివీడు ట్రిపుల్ ఐటీలో ఏడాదిగా ఇన్చార్జులే దిక్కు ● విద్యార్థులపై కొరవడిన పర్యవేక్షణ నూజివీడు: ఏలూరు జిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీలో ఏడాది కాలంగా ఇన్చార్జి అధికారుల పాలన కొనసాగుతుండటంతో రోజురోజుకూ పరిస్థితులు దిగజారుతున్నాయి. పాలనలో విఫలం కావడంతో నిరంతరం సమస్యలు చుట్టుముడుతున్నాయి. అకడమిక్ క్యాలెండర్ గాని, బీఓఎస్ సమావేశాలు గాని, ఇతర అకడమిక్ అంశాలపై సుదీర్ఘ అనుభవం కలిగిన నిష్ణాతులతో సంప్రదించకుండానే ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకుంటూ ట్రిపుల్ ఐటీని పురోగమనంలోకి కాకుండా తిరోగమనంలోకి నెడుతున్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై 15 నెలలు గడిచినా నేటికి రెగ్యులర్ చాన్సలర్ను గాని, వైస్ చాన్సలర్ను గాని, నాలుగు ట్రిపుల్ ఐటీలకు డైరెక్టర్లను గాని నియమించలేదు. ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో పనిచేస్తున్న ప్రొఫెసర్ సండ్ర అమరేంద్రకుమార్కు నూజివీడు ట్రిపుల్ ఐటీకి ఇన్చార్జి డైరెక్టర్గాను, అలాగే ఆర్జీయూకేటీకి ఇన్చార్జి రిజిస్ట్రార్గాను నియమించింది. ఒకే వ్యక్తికి రెండు కీలకమైన బాధ్యతలు అప్పగించడంతో తలకు మించిన భారంగా మారింది. నూజివీడు ట్రిపుల్ ఐటీలో నిరంతరం ఎదురయ్యే సమస్యలను పరిష్కరంచడానికే ఉన్న సమయం చాలక సతమతమవుతుంటే రిజిస్ట్రార్గా కూడా బాధ్యతలు ఉండటంతో మిగిలిన మూడు ట్రిపుల్ ఐటీలలో ఏ సమస్య ఉత్పన్నమైనా అక్కడికి ఉరుకులు, పరుగులు పెట్టాల్సి వస్తోంది. దీంతో దేనిపైనా శ్రద్ధ పెట్టలేక పాలన క్రమంగా బలహీనంగా మారి అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. అలాగే ఇక్కడ పనిచేస్తున్న ఏఓ సైతం ఇన్చార్జి బాధ్యతలు నిర్వర్తిస్తుండగా ఇటీవలే ఏడాది కాలపరిమితి పూర్తవ్వగా మరలా ఒక నెల ఇన్చార్జి బాధ్యతలను పొడిగించారు. ప్రొఫెసర్పై ఎంటెక్ విద్యార్థి కత్తులతో దాడికి దిగడం చూస్తుంటేనే ఇక్కడ పాలన ఎలా ఉందో అర్థమవుతోంది. టెండర్లు పిలవడంలో జాప్యం సెక్యూరిటీ, హౌస్ కీపింగ్ ఏజన్సీల కాలపరిమితి ముగిసిన నేపథ్యంలో మరలా ఏజెన్సీల ఎంపికకు టెండర్లు పిలవాల్సి ఉన్నా నెలలు గడుస్తున్నా ఇప్పటికీ టెండర్లు పిలవలేదు. ఇది ఎప్పటికీ పిలుస్తారో కూడా తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. అలాగే శ్రీకాకుళం, ఒంగోలు పీయూసీ ప్రథమ సంవత్సర విద్యార్థులకు నూజివీడు క్యాంపస్లోనే తరగతులు నిర్వహిస్తున్న నేపథ్యంలో పరిపాలన లోపం కారణంగానే తెలుగు సబ్జెక్టు బోధనకు సంబంధించి మెంటార్లకు, సర్ప్లస్లో ఉన్న కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లకు మధ్య వివాదం తలెత్తి కొద్దిరోజులు పాటు నడిచింది. ఈ వివాదాన్ని పరిష్కరించడానికి యాజమాన్యానికి తల బొప్పి కట్టింది. చివరకు మెంటార్లు వెనక్కు తగ్గడంతో ఎలాగోలా సమస్య సద్దుమణిగింది. క్యాంపస్లోకి మందు సీసాలు విద్యార్థులకు స్వేచ్ఛ ఎక్కువైపోవడంతో క్యాంపస్లోకి ఏకంగా మందుసీసాలే వచ్చేస్తున్నాయి. ఇటీవల పార్టీ చేసుకునేందుకు 10 మంది విద్యార్థులు మందు సీసాలను ఒక విద్యార్థితో తెప్పించుకోవడం తీవ్ర సంచలనంగా మారింది. ఆ విద్యార్థి గోడ దూకి వెళ్లి మద్యం సీసాలు తీసుకురావడం గమనార్హం. అలాగే క్యాంపస్లో బాలురకు, బాలికలకు వేరు వేరుగా ఫుడ్ కోర్టులున్నా బాలికలు కూడా బాలుర ఫుడ్కోర్టు వద్దకు వచ్చి బాలురతో దగ్గరగా కలిసి కూర్చొని తింటూ కాలక్షేపం చేస్తున్నారు. దీంతో ఫ్యాకల్టీ, సిబ్బంది ఫుడ్కోర్టు వైపు వెళ్లడమే మానివేశారు. సెమిస్టర్ పరీక్షలు ఎత్తేశారు దేశ వ్యాప్తంగా హైస్కూల్ స్థాయిలో విద్యార్థులకు ఉన్న వార్షిక పరీక్షలను ఎత్తేసి సెమిస్టర్ పరీక్షల విధానాన్ని తీసుకొస్తుండగా ట్రిపుల్ ఐటీలో మాత్రం పీయూసీ ప్రథమ, ద్వితీయ సంవత్సర విద్యార్థులకు ఈ ఏడాది నుంచి సెమిస్టర్ పరీక్షలను ఎత్తేసి వార్షిక పరీక్షలను నిర్వహించాలని నిర్ణయించారు. అధికార బాధ్యతలను చూస్తున్న వారికి అవగాహన లేకో, ఒకరిద్దరూ ఐఏఎస్ అధికారుల మెప్పు పొందడానికో గాని సెమిస్టర్ పరీక్షలను ఎత్తేసి వార్షిక పరీక్షలను ఏర్పాటుచేశారు. దీనికి గవర్నింగ్ కౌన్సిల్ అనుమతి గాని, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అనుమతులు గాని ఏమీ లేవని ట్రిపుల్ ఐటీలోని అధ్యాపక వర్గాలు పేర్కొంటున్నాయి. దీంతో పురోగమిస్తుందో, తిరోగమిస్తుందో అర్థం కావడం లేదని అధ్యాపకులు వాపోతున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి పటిష్టమైన చర్యలు చేపట్టాలని సర్వత్రా అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
యూరియా కోసం రోడ్డెక్కిన రైతులు
పోలవరం రూరల్: పోలవరం మండలం ప్రగఢపల్లి గ్రామంలో యూరియా కోసం రైతులు రోడ్డెక్కారు. మంగళవారం సొసైటీ గోడౌన్కు 270 బస్తాల యూరియా వచ్చింది. సమాచారం తెలుసుకున్న రైతులు యూరియా దొరకదేమోననే ఆందోళనతో ఒక్కసారిగా గోడౌన్ వద్దకు వచ్చి గుమిగూడారు. ఎల్ఎన్డీపేట, జిళ్లేళ్లగూడెం, వింజరం పంచాయతీ పరిధిలోని సుమారు 18 గ్రామాలకు చెందిన 500 మంది రైతులు యూరియా కోసం క్యూ కట్టారు. సరిపడా యూరియా లేదని అర్ధమైన రైతులు ఆగ్రహించి రోడ్డెక్కెరు. రైతులందరికీ యూరియా సరఫరా చేయాలని నినదించారు. సమాచారం తెలుసుకున్న పోలీసు వ్యవసాయ శాఖ అధికారులు అక్కడికి చేరుకుని రైతులకు నచ్చజెప్పారు. మరో లారీ యూరియా మంగళవారం రాత్రికే వచ్చేవిధంగా ఏర్పాట్లు చేస్తున్నామని, బుధవారం అందరికీ అందజేస్తామని వ్యవసాయ శాఖ అధికారులు హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. తీరని యూరియా కష్టాలు ఆగిరిపల్లి: రోజులు గడుస్తున్నా రైతులు యూరియా కోసం పడుతున్న కష్టాలు తీరడం లేదు. మంగళవారం ఆగిరిపల్లి సొసైటీలో యూరియా పంపిణీ చేస్తారని సమాచారం రావడంతో ఉదయం నుంచి రైతులు బారులు తీరారు. 250 బస్తాలు ఉండగా ఒకొక్కరికి ఒక్క బస్తా యూరియా ఇచ్చారు. గంటల కొద్ది నిలబడితే మాకు ఇవ్వకుండా టీడీపీ వారికి ఇవ్వడం ఎంత వరకు సమంజమని రైతులు ఆగ్రహం వ్యక్తంచేశారు. గురువారం ఆగిరిపల్లికి యూరియా వస్తుందని వ్యవసాయ అధికారి భవానీ తెలిపారు. -
కాంట్రాక్టర్పై చర్యలు
పాలకొల్లు సెంట్రల్: పాలకొల్లు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ద్విచక్ర వాహనంతో నేరుగా పేషెంట్ల వార్డులోకి వెళ్లి ఫుడ్ సప్లయి చేస్తున్న కాంట్రాక్టర్పై వైద్యాధికారులు చర్యలు చేపట్టారు. మంగళవారం సెలవులో ఉన్న ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మాధురి ఫోన్లో మాట్లాడుతూ పత్రికల్లో వచ్చిన వార్తపై నర్సింగ్ సిబ్బందికి మెమో ఇచ్చినట్లు తెలిపారు. మంగళవారం కాంట్రాక్టర్ ఫుడ్ ప్యాకెట్లు కాకుండా పాత్రల్లో ఫుడ్ తీసుకువచ్చారన్నారు. ఓ ట్రాలీలో డిష్లు ఏర్పాటుచేసి డెలివరీ చేసేలా చర్యలు చేపట్టామన్నారు. కాంట్రాక్టర్ నేడు వివరణ ఇస్తానని చెప్పినట్లు డాక్టర్ మాధురి తెలిపారు. -
మొగల్తూరు ముత్యాలమ్మ పూరిపాక దగ్ధం
నరసాపురం రూరల్: మొగల్తూరు గ్రామదేవత నడివీధి ముత్యాలమ్మ అమ్మవారి పూరిపాక సోమవారం అర్ధరాత్రి దగ్థమైంది. ఈ ఘటనతో భక్తులు, పరిసర గ్రామాల ప్రజలు ఆందోళనకు గురయ్యారు. ఆలయ ధర్మకర్త, కమిటీ నిర్వాహకులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో హుటాహుటీన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మత సామరస్యానికి ఇబ్బంది కలుగకుండా అధికార యంత్రాంగం అన్ని చర్యలు తీసుకుంది. అడిషనల్ ఎస్పీ వాసుపల్లి భీమారావు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ సమాచారం అందిన వెంటనే డీఎస్పీ శ్రీవేద, సీఐలు, ఎస్సైలు సంఘటనా స్థలంలోనే ఉన్నారన్నారు. ఇప్పటికే డాగ్స్స్క్వాడ్, వేలిముద్ర నిపుణులు వచ్చి సమాచార సేకరణలో నిమగ్నమయ్యారన్నారు. ఆలయ ధర్మకర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు భీమారావు తెలిపారు. -
మొబైల్ విప్లవంతో సాగు సమాచారం
పెనుమంట్ర: మొబైల్ విప్లవం ద్వారా వ్యవసాయ సమాచారాన్ని రైతులకు ఎప్పటికప్పుడు చేరువచేయాలనే ఉద్దేశ్యంతో కాబి ఇంటర్నేషనల్ సంస్థ ప్లాంట్వైజ్ప్లస్ అనే మొబైల్ అప్లికేషన్ని తీసుకువచ్చిందని మార్టేరు వరిపరిశోధనా స్థానం సహా పరిశోధనా సంచాలకులు టి.శ్రీనివాస్ తెలిపారు. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం, మార్టేరు, కాబి ఇంటర్నేషనల్ సంయుక్త ఆధ్వర్యంలో ప్లాంట్వైజ్ప్లస్ మొబైల్ అప్లికేషన్పై మంగళవారం శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డా.టి.శ్రీనివాస్ అధ్యక్షత వహించగా, కాబి సంస్థ నుంచి ముఖ్య అతిథిగా హాజరైన అగ్రి–డిజిటల్ కోఆర్డినేటర్ మధు మంజరి మాట్లాడారు. ఈ మొబైల్ సాధనం వ్యవసాయ నిపుణులకు తగిన సమాచారం అందిస్తుందని, తద్వారా వారు రైతులకు మెరుగైన సలహాలను అందించడానికి ఉపయోగపడుతుందని తెలిపారు. పంటపై పురుగుల నివారణకు సంబంధించిన పూర్తి సమాచారంతో పాటూ సిఫార్సుచేసిన పురుగు మందుల సమాచారం కూడా రైతులకు అందుబాటులో ఉంటుందని చెప్పారు. కార్యక్రమంలో మార్టేరు, నెల్లూరు, బాపట్ల వరి పరిశోధనా స్థానానికి చెందిన శాస్త్రవేత్తలు, విస్తరణ కేంద్రాల శాస్త్రవేత్తలు, వివిధ డివిజన్ల వ్యవసాయ సహాయ సంచాలకులు పాల్గొన్నారు. -
అన్నదాత పోరు
సీసలిలో 144 సెక్షన్ సీసలిలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా మంగళవారం నుంచి 15 రోజులపాటు గ్రామంలో 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 8లో uఆంక్షలు అధిగమించి.. సాగును నిర్వీర్యం చేస్తూ కూటమి దగాకోరు పాలనపై కర్షకులు కదం తొక్కారు. అన్నదాత పోరు విఫలయత్నానికి ఆంక్షల రూపంలో ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు కల్పించినా లెక్కచేయకుండా విజయవంతం చేశారు. రైతుల సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్సీపీ నాయకుల ఆధ్వర్యంలో భీమవరం, నరసాపురం, తాడేపల్లిగూడెంలోని ఆర్డీఓ కార్యాలయాల్లో వినతిపత్రాలు అందజేశారు. బుధవారం శ్రీ 10 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025తణుకు అర్బన్: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని మంగళవారం మాజీ మంత్రి, రీజనల్ కో–ఆర్డినేటర్ కారుమూరి వెంకట నాగేశ్వరరావు, రాష్ట్ర యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కారుమూరి సునీల్కుమార్లు మర్యాదపూర్వకంగా కలిశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో కలిసి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న అక్రమ పరిపాలనపై చర్చించినట్లు కారుమూరి తెలిపారు. పాలకొల్లు సెంట్రల్: వైఎస్సార్సీపీ బీసీ విభాగం సంయుక్త కార్యదర్శిగా యలమంచిలి మండలానికి చెందిన మామిడిశెట్టి చిట్టిబాబును నియమించారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల ప్రకారం పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఆదేశాలు అందాయి. భీమవరం: జిల్లాలో ఉపాధి హామీ వేతన బకాయిలు వెంటనే విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బాతిరెడ్డి జార్జి, జక్కంశెట్టి సత్యనారాయణ మాట్లాడుతూ పనిచేసిన 15 రోజుల్లో వేతనాలు ఇవ్వాలని చట్టంలో ఉన్నా మూడు నెలలుగా ఇవ్వకపోవడంతో కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇప్పటికై నా ఉపాధి కూలీల ఇబ్బందులను గుర్తించి వేతనాలు వెంటనే వేయాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టరేట్లోని జిల్లా డ్వామా పీడీ కెసీహెచ్ అప్పారావుకు వినతిపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో సంఘం జిల్లా సహాయ కార్యదర్శి బల్ల చిన వీరభద్రరావు, శేషపు అశ్రియ్య, జిల్లా ఉపాధ్యక్షురాలు జక్కంశెట్టి వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. భీమవరం: వెలుగు వీవోఏల సమస్యలను తక్షణం పరిష్కరించాలని లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా పీడీ ఆఫీసులు ముట్టడిస్తామని వెలుగు వీవోఏల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ధనలక్ష్మి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. భీమవరం మార్కెట్యార్డ్లో మంగళవారం వెలుగు వీవోఎల జిల్లా మహాసభ నాగిడి గోవిందమ్మ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ధనలక్ష్మి మాట్లాడుతూ తమతో ప్రభుత్వం వెట్టి చాకిరి చేయిస్తుందని, యాప్ల ద్వారా పని భారం పెంచుతుంది కానీ సెల్ఫోన్లు ఇవ్వడం లేదని విమర్శించారు. సెల్ఫోన్స్ ఇస్తామని హామీ ఇచ్చి ఏడాది గడిచినా నేటికీ అమలు చేయలేదని విమర్శించారు. జూమ్ మీటింగ్ పేరుతో వీవోఏలను రాత్రి, పగలు వేధిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఒకపక్క విపరీతంగా నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతుంటే మరోపక్క జీతాలు పెరగక తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్నారని ఆవేదనవ్యక్తం చేశారు. కనీస వేతనం రూ.26 వేలు అమలు చేయాలని, రూ.10 లక్షలు బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. సీఐటీయు ప్రధాన కార్యదర్శి కె.రాజా రామ్మోహన్రాయ్, జిల్లా ఉపాధ్యక్షుడు బి.వాసుదేవరావు తదితరులు పాల్గొన్నారు. ఏలూరు(మెట్రో): ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ స్థాయీ సంఘ సమావేశాలు ఈనెల 12 ఉదయం 10 గంటల నుంచి ఏలూరు జిల్లా పరిషత్ కార్యాలయంలో జరుగుతుందని జెడ్పీ సీఈఓ శ్రీహరి ఒక ప్రకటనలో తెలిపారు. సాక్షి, భీమవరం/నరసాపురం/తాడేపల్లిగూడెం: పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని, ఉచిత పంటల బీమా పథకాన్ని పునరుద్ధరించాలని, ఎరువుల బ్లాక్ మార్కెట్ను అరికట్టాలని, రైతులందరికీ పూర్తిస్థాయిలో అన్నదాత సుఖీభవ పథకం వర్తింపచేయాలని తదితర డిమాండ్లతో రైతుల పక్షాన మంగళవారం వైఎస్సార్సీపీ నేతృత్వంలో అన్నదాత పోరు జిల్లాలో విజయవంతమైంది. పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపునందుకుని పార్టీ శ్రేణులు, రైతు సంఘాల నేతలు, రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఉత్సాహంగా కార్యక్రమంలో పాల్గొన్నారు. సర్కారు విఫల యత్నం అన్నదాత పోరును అడ్డుకునేందుకు కూటమి ప్రభుత్వం విఫలయత్నం చేసింది. సెక్షన్ 30 అమల్లో ఉందని, ర్యాలీలకు అనుమతిలేదంటూ మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ పార్టీ కోఆర్డినేటర్ల నివాసాలు, పార్టీ కార్యాలయాల వద్ద పోలీసులను మోహరించి చెదరగొట్టే ప్రయత్నాలు చేసినా పార్టీ శ్రేణులు, రైతులు లెక్కచేయలేదు. నియోజకవర్గాల నుంచి ఆర్డీఓ కార్యాలయాలకు చేరుకుని ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నిరసనలు తెలిపారు. ఆర్డీఓ కార్యాలయాల వద్ద వినతిపత్రాలు అందజేసేందుకు పోలీసులు ఆంక్షలు పెట్టి పరిమిత సంఖ్యలో మాత్రమే అనుమతించారు. నరసాపురంలో.. నరసాపురంలోని రైల్వేస్టేషన్ రోడ్డులోని వైఎస్సార్సీపీ కార్యాలయం నుంచి పార్టీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు, మాజీ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, పాలకొల్లు కో–ఆర్డినేటర్ గుడాల శ్రీహరిగోపాలరావు, పార్టీ శ్రేణులు, రైతులు ర్యాలీగా సబ్ కలెక్టర్ కార్యాలయానికి వెళ్లారు. అడుగడుగునా పోలీసులు మోహరించి అడ్డంకులు కల్పించినా లెక్కచేయకుండా నిరసన ప్రదర్శన కొనసాగించారు. రైతులను ఆదుకోవాలని, కూటమి సర్కారు కళ్లు తెరవాలంటూ దారిపొడవునా నినాదాలు చేశారు. సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద పోలీసులు గేటు మూసివేసి కొంత మందిని మాత్రమే లోపలికి అనుమతించారు. దీంతో సబ్ కలెక్టర్ కార్యాలయ గేటు వద్ద స్వల్ప ఉద్రిక్తత ఏర్పడింది. అనంతరం ఆర్డీఓ దాసిరాజుకు వినతిపత్రం అందజేశారు. తాడేపల్లిగూడెంలో.. మాజీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ, నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గ అబ్జర్వర్ ముదునూరి మురళీకృష్ణంరాజు పార్టీ కార్యాలయం వద్ద నుంచి భారీ ర్యాలీగా, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు పెద్ద ఎత్తున తణుకు నియోజకవర్గ శ్రేణులతో కలిసి ఆర్డీఓ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ ఉన్న పోలీసులు పార్టీ శ్రేణులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. మాజీ మంత్రులు కొట్టు, కారుమూరి, అబ్జర్వర్ మురళీకృష్ణంరాజులు రైతు సమస్యలను ఆర్డీఓ ఖతీఫ్ కౌసర్ బానోకు వివరించి వినతిపత్రం అందజేశారు. భీమవరంలో.. రైతు విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వడ్డి రఘురాం, భీమవరం నియోజకవర్గ కోఆర్డినేటర్ చినమిల్లి వెంకటరాయుడు, ఉండి నియోజకవర్గ కో–ఆర్డినేటర్ పీవీఎల్ నరసింహరాజు, మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు గూడూరి ఉమాబాల, పార్టీ శ్రేణులు, రైతులు ప్రదర్శనగా భీమవరం మునిసిపల్ కార్యాలయ ప్రాంగణంలోని ఆర్డీఓ కార్యాలయానికి చేరుకుని వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రఘురాం మాట్లాడుతూ యూరియా కోసం అవస్థలు పడుతున్న రైతులను ఆదుకోవాలంటూ వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఆందోళన చేపడితే పోలీసులతో అడ్డుకోవాలని ప్రభుత్వం ప్రయత్నించడం దారుణమన్నారు. భీమవరం కో–ఆర్డినేటర్ వెంకటరాయుడు మాట్లాడుతూ యూరియా కూడా సరఫరా చేయలేని దుస్థితిలో కూటమి ప్రభుత్వం ఉందని విమర్శించారు. ఉండి కో–ఆర్డినేటర్ పీవీఎల్ మాట్లాడుతూ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రైతుల సంక్షేమం కోసం రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేస్తే కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేసిందన్నారు. మహిళ నేత ఉమాబాల మాట్లాడుతూ అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల కష్టాలు గుర్తించి వారి పక్షాన వైఎస్సార్సీపీ ఎప్పుడూ పోరాటం సాగిస్తుందన్నారు. తాడేపల్లిగూడెం: ఆర్డీఓ కార్యాలయంలోకి వెళుతున్న మాజీ మంత్రులు కొట్టు, కారుమూరి నరసాపురం: ఆర్డీఓ కార్యాలయం వద్ద పార్టీ శ్రేణులను అడ్డుకుంటున్న పోలీసులు భీమవరం: ఆర్డీఓ కార్యాలయంలో వినతిపత్రం అందిస్తున్న పార్టీ నాయకులు చినమిల్లి, పీవీఎల్, కవురు, రఘురామ్, ఉమాబాల ఏలూరు (టూటౌన్): విద్యుత్ స్మార్ట్ మీటర్లు బిగించవద్దని.. పెంచిన విద్యుత్ చార్జీలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో ఏలూరులో కొత్త బస్టాండ్ సమీపంలోని వంతెన వద్ద మంగళవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. అదానీ మీటర్లు వద్దు.. పెంచిన విద్యుత్ ఛార్జీలు రద్దు చేయాలంటూ నినాదాలు చేశారు.ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కె.శ్రీనివాస్, ఆర్.లింగరాజు, డీఎన్వీడీ ప్రసాద్ మాట్లాడారు. గత ఎన్నికల ముందు విద్యుత్ స్మార్ట్ మీటర్లు బిగిస్తే పగలగొట్టండని లోకేష్ పిలుపునిచ్చారని గుర్తు చేశారు. ఇప్పుడు ప్రజలపై భారంపడేలా స్మార్ట్ మీటర్లు ఏ విధంగా బిగిస్తున్నారని ప్రశ్నించారు. ఇప్పటికే వ్యాపార సంస్థలకు, షాపులకు స్మార్ట్ మీటర్లు బిగించారని ఈ స్మార్ట్ మీటర్లతో బిల్లుల భారం పెరిగిందన్నారు. ఇప్పుడు గృహ వినియోగదారులకు స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నారని, దొంగ చాటుగా ప్రజలు ఆమోదం లేకుండా మీటర్లు బిగించడం దుర్మార్గమన్నారు. బిగించిన స్మార్ట్ మీటర్లకు బిల్లు ఇవ్వడం లేదని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ ట్రూ ఆఫ్ చార్జీలు పేరుతో ప్రజలపై రూ.12 వేల కోట్లు భారం వేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. పెంచిన విద్యుత్ ఛార్జీలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు పి.మంగరాజు, ఎస్.మహంకాళి రావు, తామా ముత్యాలమ్మ, నగర కార్యదర్శి పంపన రవికుమార్, నగర కమిటీ సభ్యులు వైఎస్ కనకారావు తదితరులు పాల్గొన్నారు. భీమవరం (ప్రకాశంచౌక్): జిల్లాలో నిర్మాణం పూర్తయిన మల్టీ పర్పస్ గోడౌన్లను తక్షణమే వినియోగంలోకి తీసుకురావాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ సహకార శాఖలో చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాకు నాబార్డ్ మంజూరు చేసిన 500 మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన 24 మల్టీ పర్పస్ గోడౌన్స్లో 14 పూర్తి చేశామని, ఇంకా 10 నిర్మాణాలను పూర్తి చేయాల్సి ఉందన్నారు. పూర్తయిన 14 గోడౌన్లు రిజిస్ట్రేషన్లను కూడా పూర్తి చేసి, పీఎసీఎస్లకు అప్పగించామన్నారు. ఇప్పటికే పూర్తయిన వాటిని వినియోగంలో తీసుకురావాలని ఆదేశించారు. పోలవరం మండలం ప్రగఢపల్లిలో యూరియా కోసం రైతులు రోడ్డెక్కారు. మంగళవారం సొసైటీ గోడౌన్కు సరిపడా యూరియా రాకపోవడంతో రైతులు ఆగ్రహించారు. 8లో uముదునూరి ప్రసాదరాజు చంద్రబాబు పాలన మొత్తం ప్రజలను మోసం చేయడం, వంచించడమేనని మరోసారి రుజువైందని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు విమర్శించారు. నరసాపురంలో మాట్లాడుతూ రైతులకు ప్రభుత్వం నుంచి పెట్టుబడి సాయం అందడం లేదన్నారు. ఇన్పుట్ సబ్సిడీ, పంటకు బీమా వంటి సదుపాయాలు లేవన్నారు. పంటను అమ్ముకునే పరిస్థితిలేని దయనీయ స్థితిలో రైతులు కొట్టుమిట్టాడుతున్నారని వాపోయారు. నేడు యూరియా సక్రమంగా దొరక్క రైతులు అవస్థలు పడుతున్నారన్నారు. తమ గొంతునొక్కాలని చూసినా ప్రజల కోసం వైఎస్సార్సీపీ బలంగా నిలబడుతుందన్నారు. కొట్టు సత్యనారాయణ, మాజీ డిప్యూటీ సీఎం కూటమి ప్రభుత్వం రైతుల పట్ల దుర్మార్గంగా వ్యవహరిస్తోందని మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. జగన్ పాలనలో ఏర్పాటు చేసిన వ్యవస్ధలను మార్చేయాలని దుర్మార్గమైన ఆలోచనతో కూటమి ప్రభుత్వం ఉందన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రికి వ్యవసాయం అంటే అసహ్యం. పంటలకు యూరియా వేస్తే క్యాన్సర్ వస్తుందని సీఎం అంటున్నారని రైతులను, ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని అబద్ధాలు చెప్పడంలో సిద్ధహస్తుడు చంద్రబాబు అని విమర్శించారు. యూరియాను కూటమిలోని ఒక పార్టీ నాయకులు దారి మళ్లిస్తున్నారు. రూ.200 నుంచి రూ.300 కోట్లు చేతులు మారాయని విమర్శించారు. కారుమూరి నాగేశ్వరరావు, మాజీ మంత్రి యూరియాను నల్లబజార్లో కొనాల్సి వస్తోంది. రైతుల పక్షాన జగన్ నిలబడి నిరసన కార్యక్రమాలు చేపట్టాక కూటమి ప్రభుత్వం మేల్కొంటుంది. మామిడి, పొగాకు, పత్తి రైతులు ప్రభుత్వ తీరు వల్ల తీవ్రంగా నష్టపోయారు. ఉల్లి రైతుదీ అదే పరిస్థితి. కూటమి ప్రభుత్వంలో దళారీ వ్యవస్ధ పెరిగిపోయింది. వైఎస్ జగన్ వ్యవసాయం పండుగ అంటే, ప్రస్తుత సీఎం దండగ అంటున్నారు. రాష్ట్రంలో రైతులకు యూరియా కొరత లేకుండా అందించాలి. రైతుల పక్షాన వైఎస్సార్సీపీ పోరాటం కొనసాగిస్తుంది. శ్రీ రంగనాథరాజు, మాజీ మంత్రి ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని ఆచంట నియోజకవర్గ కన్వీనర్, మాజీ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు ఆవేదన వ్యక్తం చేశారు. గత వైఎస్సార్సీపీ 5 ఏళ్ల పాలనలో రైతులకు ఇలాంటి కష్టాలు లేవన్నారు. యూరియా కృత్రిమ కొరత సృష్టించి బ్లాక్మార్కెట్ను ప్రోత్సహిస్తూ రైతుల నడ్డివిరుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరిగేషన్ మంత్రి రామానాయుడు సొంత ఇలాకా పాలకొల్లులో అక్రమ ఇసుక దందా సాగుతుందని విమర్శించారు. గోదావరి గట్లను కూడా అక్రమంగా తవ్వడానికి సిద్దంగా ఉన్నారన్నారు. సీపీఎం ఆధ్వర్యంలో నిరసన వైఎస్సార్సీపీ అన్నదాత పోరు విఫలయత్నానికి కూటమి కుట్రలు అడుగడుగునా పోలీసులతో ఆంక్షలు వెనక్కి తగ్గకుండా రైతు పోరును విజయవంతం చేసిన పార్టీ శ్రేణులు, రైతులు ఆర్డీఓ కార్యాలయాల్లో వినతిపత్రాల సమర్పణ గుడాల గోపీ, కన్వీనర్ 14 నెలల పాలనలో కూటమి నేతల పాపాలు పండుతున్నాయని పాలకొల్లు నియోజకవర్గ కన్వీనర్ గుడాల గోపీ అన్నారు. యూరియా దొరక్క, పంట సాయం అందక రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని వాపోయారు. ముదునూరి మురళీకృష్ణంరాజు రైతుల పక్షాన పోరాడి ప్రభుత్వ మెడలు వంచుతాం. కష్టంలో రైతుల పక్షాన నిలబడాల్సిన కూటమి ప్రభుత్వం వారిని నిర్లక్ష్యం చేస్తోంది. ఇన్ఫుట్ సబ్సిడీ, బీమా గాలికొదిలేసింది. జగన్ ప్రభుత్వం రైతులు నష్టపోయిన సందర్భంలో అన్ని రకాలుగా ఆదుకుంది. -
ఉద్యోగాలకు ట్రిపుల్ ఐటీ విద్యార్థుల ఎంపిక
నూజివీడు: నూజివీడు ట్రిపుల్ ఐటీలో నాలుగో సంవత్సరం ఈసీఈ చదువుతున్న విద్యార్థులు ఇద్దరు ఉద్యోగాలకు ఎంపికయ్యారు. విద్యార్థి యుగంధర్ ఓమ్నీ డిజైన్స్ అనే కంపెనీకి ఇంటర్న్షిప్తో పాటు ఉద్యోగానికి ఎంపికయ్యాడు. ఇంటర్న్షిప్లో నెలకు రూ.50 వేలు ఏడాది పాటు ఇవ్వనున్నారు. అనంతరం ఏడాదికి రూ.18 లక్షల వార్షిక వేతనాన్ని కంపెనీ ఆఫర్ చేసింది. అలాగే మరో విద్యార్థిని కమలప్రియ ఎన్ఎక్స్పీ సెమీ కండక్టర్ కంపెనీకి ఎంపికై ంది. ఆరు నెలల పాటు ఇంటర్న్షిప్కు వెళ్లనుంది. ఇంటర్న్షిప్లో నెలకు రూ.40 వేల స్టైఫండ్ను కంపెనీ అందించనుంది. అనంతరం ఏడాదికి రూ.25 లక్షల వార్షిక వేతనంను అందించనుంది. విద్యార్థులను నూజివీడు ట్రిపుల్ఐటీ డైరెక్టర్ ఆచార్య సండ్ర అమరేంద్రకుమార్, ఏఓ బీ లక్ష్మణరావు అభినందించారు. -
కనకదుర్గ గోల్డ్ ఫైనాన్స్లో భారీ చోరీ
రూ.3 కోట్ల బంగారు ఆభరణాలతో ఆడిటర్ పరార్ చింతలపూడి: చింతలపూడి పట్టణంలోని కనకదుర్గ గోల్డ్ ఫైనాన్స్లో భారీ చోరీ జరిగింది. సుమారు రూ.3 కోట్ల విలువైన బంగారు ఆభరణాలతో అదే సంస్థలో పనిచేస్తున్న ఆడిటర్ వడ్లమూడి ఉమా మహేష్ పరారయ్యాడు. సంస్థ ఉద్యోగులు, ఖాతాదారులు తెలిపిన వివరాల ప్రకారం విజయవాడ ప్రధాన కార్యాలయం నుంచి ఆడిటర్ మహేష్ మంగళవారం ఉదయం 11 గంటలకు స్థానిక కనకదుర్గ ఫైనాన్స్ సంస్థకు చేరుకున్నాడు. మేనేజర్ యాదల ప్రవీణ్ కుమార్, క్యాషియర్ అమృతాల ఆషాలను బయటకు పంపించి 380 పాకెట్లలో ఉన్న గోల్డ్తో మహేష్ పరారయ్యాడు. సమాచారం అందుకున్న సీఐ క్రాంతికుమార్, ఎస్సై సతీష్ కుమార్ ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. సాయంత్రం 5 గంటల సమయంలో తనకు హెల్త్ బాలేదని, కొబ్బరి నీళ్లు తీసుకురమ్మని తమను బయటికి పంపించి మహేష్ గోల్డ్ బ్యాగ్తో పరార్ అయినట్లు సంస్థ ఉద్యోగులు తెలిపారు. అతడు బంగారం ఉన్న బ్యాగ్తో ఏలూరు వైపు వెళ్లినట్లు అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అన్నదాతకు అండగా..
నాలుగు ఎకరాలు సాగు చేస్తున్నాను. ఈ సీజన్లో యూరియా దొరకడం చాలా కష్టంగా ఉంది. సొసైటీలు, బయటి దుకాణాల్లో ఎక్కడా స్టాకు లేదంటున్నారు. గతంలో ఎప్పుడూ ఇంత ఇబ్బంది రాలేదు. ఈ తొలకరికే యూరియాకు కొరత వచ్చింది. – గణపాబత్తుల ఏసుబాబు, గుంపర్రు, యలమంచిలి మండలం యూరియా మొదటి కోటాకు ఇబ్బంది రాలేదు. ఇప్పుడు రెండో కోటా వేద్దామంటే ఎక్కడా దొరకడం లేదు. ఎరువుల దుకాణంలో ఖాతా ఉంది. అక్కడ లేకపోవడంతో డీలర్ సూచనపై పెనుమంట్ర డీసీఎంఎస్కు వస్తే ఇక్కడ స్టాకు లేదని చెప్పారు. – పి.రాము, రైతు, మాముడూరు, పెనుమంట్ర మండలం యలమంచిలి మండలంలో మొత్తం 9 సొసైటీలకు గాను కొంతేరు, యలమంచిలి, శిరగాలపల్లి, నారినమెరక, చించినాడ సొసైటీల్లో ఎరువుల విక్రయం చేస్తున్నారు. ఈ సీజన్లో యలమంచిలి సొసైటీకి 50 టన్నులు, కొంతేరుకు 36, శిరగాలపల్లికి 80, నారినమెరకకు 36, చించినాడకు 36 టన్నులు వచ్చింది. అరకొర నిల్వలతో స్టాకు వచ్చిన వెంటనే రైతులు ఎగరేసుకుపోతున్నారు. ఒక్కోసారి ఎకరాకు అర బస్తా (22.5 కిలోలు) మాత్రమే ఇస్తున్నట్టుగా రైతులు చెబుతున్నారు. కొంతేరు సొసైటీకి 12.5 టన్నుల వరకు రాగా సోమవారం రైతులు ఎగబడిమరీ తీసుకువెళ్లారు. పెనుమంట్రలోని డీసీఎంఎస్ గోడౌన్కు జూన్ 20న 25.200 టన్నులు, జూలై 23న 25.200 టన్నులు, జూలై 31న 6.300 టన్నుల యూరియా వచ్చింది. వచ్చిన రెండు మూడు రోజుల్లోనే ఈ స్టాకు అయిపోయింది. ఆగస్టు, సెప్టెంబరులో ఇప్పటి వరకు స్టాకు రాలేదని సిబ్బంది చెబుతున్నారు. ఈ–పోస్ యంత్రంలో స్టాకు ఉన్నట్టుగా చూపిస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం ప్రైవేట్ డీలర్ల వద్ద కూడా దొరకడం లేదని ఇక్కడి రైతులు అంటున్నారు. సాక్షి, భీమవరం: జిల్లాలో 2.15 లక్షల ఎకరాల్లో వరి, 25 వేల ఎకరాల్లో ఉద్యాన పంటలు సాగవుతున్నాయి. వ్యవసాయ శాఖ లెక్కల ప్రకారం ఖరీఫ్ సీజన్కు 21,270 మెట్రిక్ టన్నుల యూరియా అవసరమవుతుంది. ఇప్పటివరకు 20,310 మెట్రిక్ టన్నులు రాగా 18,329 మెట్రిక్ టన్నులు రైతులకు అందజేసినట్టు వ్యవసాయాధికారులు చెబుతున్నారు. ఎరువుల కొరత లేదని, సొసైటీల్లో అవసరమైన యూరియా నిల్వలు ఉన్నాయని.. అధికారులు చేస్తున్న ప్రకటనలకు, క్షేత్రస్థాయిలో పరిస్థితికి పొంతన ఉండటం లేదు. కొన్ని సొసైటీల్లో స్టాకు లేదని సిబ్బంది రైతులను వెనక్కి పంపిస్తున్నారు. వినియోగం తక్కువే రబీతో పోలిస్తే ఖరీఫ్లో యూరియా వినియోగం తక్కువగా ఉంటుంది. దాళ్వాలో మూడు నుంచి నాలుగు బస్తాలు (ఒక్కో బస్తా 45 కిలోలు) వినియోగిస్తే తొలకరిలో రెండు దఫాలుగా రెండు బస్తాల వరకు మాత్రమే వేస్తుంటారు. ముందుగా నాట్లు జరిగిన తాడేపల్లిగూడెం, తణుకు, ఉండి, భీమవరం నియోజకవర్గాల్లో దాదాపు రెండు కోటాలు పూర్తయ్యాయి. నీటి ఎద్దడి, వర్షాభావ పరిస్థితులతో సాగు ఆలస్యమైన ఆచంట, పాలకొల్లు, నరసాపురం నియోజకవర్గాల్లో చాలాచోట్ల మొదటి కోటా మాత్రమే వేశారు. కొన్ని సొసైటీల్లో యూరియా లభ్యత లేక రైతులు ఇబ్బంది పడుతున్న పరిస్థితులు ఉన్నాయి. యలమంచిలి మండలంలో కొన్నిచోట్ల అర బస్తా మాత్రమే ఇస్తుండగా, పెనుగొండ, ఆచంట మండలాల్లో యూరియాకు కాంప్లెక్స్ ఎరువుల లింక్ పెడుతున్నట్టు రైతులు చెబుతున్నారు. వైఎస్సార్సీపీ పిలుపుతో ఉలికిపాటు యూరియా కొరత, రైతుల సమస్యల పరిష్కారంలో అలసత్వంపై వైఎస్సార్సీపీ ఈ నెల తొమ్మిదో తేదీన అన్నదాత పోరుకు పిలుపునివ్వడం కూటమి ప్రభుత్వానికి మింగుడుపడటం లేదు. సాగుకు ముందే నిల్వలు పక్కదారి పట్టడం ప్రస్తుత దుస్థితికి కారణమని వైఎస్సార్సీపీ నేతలు విమర్శిస్తున్నారు. డెల్టా జిల్లాలో యూరియాకు కొరత రావడం ప్రభుత్వ చేతగానితనానికి నిదర్శనమంటూ మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ఎరువుల గోడౌన్లు, దుకాణాలపై విజిలెన్స్ తనిఖీలు, కేసుల నమోదు పేరిట ప్రభుత్వం హడావిడి చేస్తోంది. జిల్లాలో 13 (6ఏ) కేసులు నమోదు చేసి రూ.16.86 లక్షల విలువైన 76.65 మెట్రిక్ టన్నుల యూరియాను సీజ్ చేసినట్టు అధికారులు చెబుతున్నారు. రైతు సంక్షేమాన్ని గాలికొదిలేసిన కూటమి ప్రభుత్వ తీరును నిరసిస్తూ మంగళవారం రైతులతో కలిసి వైఎస్సార్సీపీ అన్నదాత పోరు నిర్వహించనుంది. రెవెన్యూ డివిజన్ పరిధిలోని పార్టీ శ్రేణులు, రైతులు ఆర్డీఓ కార్యాలయాలకు చేరుకుని వినతిపత్రాలు అందజేస్తారు. భీమవరం, ఉండి నియోజకవర్గాల నుంచి భీమవరం ఆర్డీఓ కార్యాలయం, తణుకు, తాడేపల్లిగూడెం నుంచి తాడేపల్లిగూడెంలోను, నరసాపురం, ఆచంట, పాలకొల్లు నుంచి నరసాపురంలోను రైతు సమస్యలపై వినతులు ఇస్తారు. ఎరువుల కొరత లేదంటున్న అధికారులు యూరియా దొరకడం లేదంటున్న రైతులు సొసైటీలు, డీలర్ల చుట్టూ ప్రదక్షిణలు రైతుల పక్షాన నేడు వైఎస్సార్సీపీ పోరు ఆర్డీఓ కార్యాలయాల వద్ద రైతులతో కలసి కార్యక్రమం -
దొడ్డిపట్ల గోదావరిలో పంటు ప్రారంభం
యలమంచిలి: మండలంలోని దొడ్డిపట్ల వద్ద వశిష్ట గోదావరి నదిలో పంటు ప్రయాణం పునః ప్రారంభమైంది. గత నెల 29న గోదావరిలో వరద నీరు పెరిగి కనకాయలంక కాజ్వే మునిగిపోవడంతో అధికారుల ఆదేశాల మేరకు దొడ్డిపట్ల రేవులో పంటు ప్రయాణాన్ని నిలిపివేశారు. 11 రోజుల తరువాత వరద తగ్గి కనకాయలంక కాజ్వే వరద నుంచి పూర్తిగా బయటపడడంతో సోమవారం నుంచి పంటు ప్రయాణం ప్రారంభించారు. దీంతో ఉభయ గోదావరి జిల్లాల్లోని డెల్టా, కోనసీమ ప్రజలకు ప్రయాణం సులభతరమైంది.అర్జీలకు శాశ్వత పరిష్కారం : ఎస్పీ భీమవరం: ప్రజా ఫిర్యాదులపై నిర్లక్ష్యం వహించకుండా నిర్ణీత గడువులోగా చట్ట పరిధిలో శాశ్వత పరిష్కారం చూపాలని ఎస్పీ అద్నాన్ నయీం అస్మి జిల్లా పోలీసు అధికారులను ఆదేశించారు. సోమవారం భీమవరం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఆయన అర్జీలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రాంతాలకు చెందిన 13 మంది బాధితులు అర్జీలు అందజేశారు. అర్జీలను స్వీకరించిన అనంతరం సంబంధిత పోలీస్స్టేషన్ల అధికారులతో ఆయన ఫోన్లో మాట్లాడారు. ప్రజా సమస్యలపై పూర్తిస్థాయి విచారణ జరిపి అర్జీలు తిరిగి పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కారం చూపాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్) వి.భీమారావు, జిల్లా స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ వి.పుల్లారావు, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ దేశంశెట్టి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.కలెక్టరేట్ కోసం 3 రోజుల నిరాహార దీక్ష భీమవరం (ప్రకాశం చౌక్) : భీమవరం మార్కెట్ యార్డులోనే కలెక్టరేట్ నిర్మించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల తొమ్మిదో తేదీ మంగళవారం నుంచి మూడు రోజులపాటు భీమవరం ప్రకాశం చౌక్ సెంటర్లో రిలే నిరాహార దీక్ష చేపట్టనున్నట్టు ప్రముఖ న్యాయవాది, బార్ అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ జవ్వాది సత్యనారాయణ (సత్తిబాబు) తెలిపారు. పార్టీలకు అతీతంగా భీమవరం పౌరులు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆయన కోరారు.కొనసాగుతున్న యూరియా కష్టాలుపోలవరం రూరల్: యూరియా కొరత లేదంటూ ప్రభుత్వం చెప్పే లెక్కలకు, క్షేత్రస్థాయిలో పరిస్థితులకు పొంతన లేని పరిస్థితి కనిపిస్తోంది. పోలవరం మండలంలోని కృష్ణారావుపేట, పట్టిసీమ, గూటాల, ప్రగడపల్లి సొసైటీల్లో 50.460 మెట్రిక్ టన్నుల యూరియా ఉన్నట్టు వ్యవసాయశాఖ అదికారులు చెబుతున్నారు. సోమవారం ఉదయం పట్టిసీమ, పోలవరం సొసైటీల వద్ద యూరియా కోసం రైతులు బారులు తీరారు. ఆధార్ కార్డులు పట్టుకుని క్యూ కట్టారు. రైతుకు రెండు బస్తాలు యూరియా వంతున పంపిణీ చేపట్టారు. కొన్ని గంటల్లోనే ఉన్న సరకు అయిపోయింది. దీనిపై రైతులు సిబ్బందిని నిలదీయగా, వాదోపవాదాలు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో పోలవరం ఎస్సై ఎస్ఎస్ పవన్కుమార్ అక్కడికి చేరుకొని రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. క్యూలో ఉన్నవారికి మాత్రమే బస్తాలు ఇవ్వడంతో ఆ తర్వాత వచ్చినవారు మిగిలిపోయారు. మిగిలిన రైతులు సుమారు 150 మంది వరకు ఉండటంతో వారికి వచ్చే కోటాలో యూరియా ఇస్తామని నచ్చజెప్పారు. వారికి స్లిప్పులు ఇచ్చి యూరియా వచ్చిన వెంటనే ముందుగా ఇచ్చేందుకు ఏర్పాటు చేయడంతో రైతులు శాంతించి వెనుదిరిగారు. యూరియా కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారనడానికి ఇదో తాజా ఉదాహరణ. -
మెడికల్ పింఛన్ అందడం లేదు..
కలెక్టర్కు విన్నవించిన దివ్యాంగుడి కుటుంబసభ్యులు కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ అర్జీల స్వీకరణ కార్యక్రమ ప్రాంగణం వద్ద వీల్చైర్లో మెలికలు తిరిగిపోతున్న దివ్యాంగుడిని చూసి కలెక్టర్ నాగరాణి చలించిపోయారు. అతని వద్దకు వచ్చి ఏమైందంటూ అతని తల్లిదండ్రులను ఆరా తీశారు. తమ కుమారుడి పేరు బొడ్డు రాఘవేంద్ర అని, చిన్ననాటి నుంచీ ఇదే పరిస్థితని ఈ సందర్భంగా వారు కలెక్టర్కు వివరించారు. వీల్చైర్లో కూడా నిలకడగా కూర్చోబెట్టలేని పరిస్థితని తెలిపారు. దివ్యాంగుల పింఛన్ ప్రస్తుతం రూ.6 వేలు అందుతోందని, సదరం సర్టిఫికెట్లో అంగవైకల్యం 45 శాతం మాత్రమే నమోదవడంతో మెడికల్ పింఛన్ అందుకోలేకపోతున్నామని వివరించారు. తమ కుమారుడిని చూసుకోవడం చాలా కష్టంగా ఉందని, ఎప్పుడూ ఇద్దరు వ్యక్తులు పనులు మానుకుని దగ్గరుండి చూసుకోవాల్సిన పరిస్థితని వారు వాపోయారు. దీంతో కలెక్టర్ స్పందిస్తూ డీసీహెచ్ఎస్ని పిలిచి కొత్తగా సదరం సర్టిఫికెట్ మంజూరుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీనిని ప్రత్యేక కేసుగా ప్రభుత్వానికి సిఫార్సు చేస్తూ పంపడానికి ప్రతిపాదన సిద్ధం చేయాలని చెప్పారు. అధైర్యపడొద్దని అతని తల్లిదండ్రులకు ధైర్యం చెప్పారు. -
గ్యాంబ్లింగ్ హబ్గా ‘గూడెం’
మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ ఆగ్రహం తాడేపల్లిగూడెం అర్బన్ : కూటమి ప్రభుత్వ హయాంలో తాడేపల్లిగూడెం నియోజకవర్గాన్ని గ్యాంబ్లింగ్ హబ్గా మార్చేశారని మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ విమర్శించారు. ఏ వీధిలో చూసినా బెల్టు దుకాణాలు, ఎక్కడ చూసినా జూదం, కోడి పందేలు, పేకాట.. ఇక గూడెంను ఏం చేద్దామనుకుంటున్నారు.. అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్థానిక ప్రజాప్రతినిధికి చెందినవారు వేసిన ఇసుక కొండల నుంచే అధిక ధరకు ఇసుక కొనుగోళ్లు చేయాలంటూ లారీ డ్రైవర్లపై బెదిరింపులకు పాల్పడతున్నారని విమర్శించారు. షాడోలు, షాడోల వారసుల ముసుగులో నియోజకవర్గంలో అక్రమ దందాలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ అనుమతులతో మట్టి తవ్వకాలు చేస్తున్నవారిని సైతం బెదిరించి.. ఇక్కడి నేతల అనుమతి తీసుకోవాల్సిందే అంటూ వసూళ్లకు పాల్పడుతున్నారని విమర్శించారు. రైతుల సమస్యలపై చిత్తశుద్ధి ఏదీ? డెల్టా ప్రాంతంలో అకాల వర్షాలకు పంటలు మునిగిపోతే ఆయా రైతుల గురించి పట్టించుకున్న పరిస్థితి లేదని కొట్టు సత్యనారాయణ విమర్శించారు. కాలువల్లో పూడుకుపోయిన తూడును తొలగించారా అని ప్రశ్నించారు. పంట మునిగిన రైతులకు కాకుండా ఎగువ ప్రాంత రైతులకు పరిహారం అందిస్తారా అంటూ నిలదీశారు. యూరియా కొరత వస్తుందని ముందే గమనించి.. స్థానిక కూటమి నేతలు భారీస్ధాయిలో గోదాముల్లో యూరియా నిల్వ చేశారని ఆయన విమర్శించారు. వాటిపై తనిఖీల కోసం విజిలెన్స్ సీఐ నేతృత్వంలో వచ్చిన బృందాన్ని తనిఖీలు చేయనివ్వకుండా ఎవరు ప్రభావితం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. పడమరవిప్పర్రు గ్రామంలో యూరియా బస్తా రూ.400కు మించి అమ్ముతుంటే వ్యవసాయాధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. మద్యం బాటిల్కు ఎంఆర్పీ కంటే అధికంగా పది రూపాయలు, డాబాలలో అదనంగా 40 రూపాయలు వసూలు చేస్తూ విక్రయాలు చేస్తుంటే ఎకై ్సజ్ అధికారులు ఏం చేస్తున్నారని నిలదీశారు. వేరే పార్టీల వారు అధికార పార్టీలో చేరితే విచ్చలవిడిగా జూదం ఆడించుకోవచ్చా అని ప్రశ్నించారు. పెద్ద ఎత్తున కోడి పందేలు జరుగుతుంటే అధికారులు ఏం చేస్తున్నారని నిలదీశారు. కాకినాడ బియ్యం అక్రమ రవాణాలో తాడేపల్లిగూడెం క్రియాశీలకంగా ఉందంటున్నారని, దీనికి సూత్రధారులు ఎవరని ప్రశ్నించారు. రాష్ట్ర మీడియాలో సైతం ఇక్కడి అక్రమాలను ప్రత్యేక కథనాలతో వెలికితీస్తోందని, వీటిపై జిల్లా పర్యవేక్షణాధికారిగా ఉన్న కలెక్టర్ పట్టించుకోకపోతే ఎలా అని ప్రశ్నించారు. తాము అఽధికారంలో ఉండగా, శాంతిభద్రతలను అదుపులో ఉంచి, మహిళలకు రక్షణ కల్పించలేదా అన్నారు. ట్రాఫిక్ పద్మవ్హూహ సమస్య పరిష్కారానికి రెండో ఫ్లెవోవర్ వంతెనను చేతిలో ఫైల్స్ పట్టుకొని సెక్రటేరియట్, మంత్రుల చుట్టూ తిరిగి నిర్మిస్తే, ఏదో బిల్డింగ్ కట్టుకున్నానని మాట్లాడుతున్నారు. ఇటీవల ఈ ప్రభుత్వం మూడు వంతెనలను 200కోట్లతో నిర్మిస్తున్నామంటున్నారు. వారు ఏం చేస్తారో. నెత్తిమీద పదిరూపాయలు పెడితే పది పైసలకు పలుకని నాయకులతో నకిలీ ప్రెస్మీట్లు పెడుతుంటారు. ఏంటి ఈ విధానం అన్నారు. కాకినాడ బియ్యం అక్రమ రవాణాలో గూడెం క్రియాశీలకంగా ఉందంటున్నారు. ఎవ్వరు దీనికి సూత్రధారులన్నారు. రాష్ట్ర మీడియా ఇక్కడి విషయాలపై ప్రత్యేక కధనాలను ప్రచురిస్తున్నాయి. జిల్లా పర్యవేక్షణాధికారిగా ఉన్న కలెక్టర్ ఇలాంటి విషయాలను పట్టించుకోవాలి కదా అన్నారు. నియోజకవర్గంలో రౌడీయిజం, నాన్ లేఅవుట్ల దందా పెరిగిపోయిందన్నారు. అధికారం చేతిలో ఉందని అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారని, ప్రజలు వాస్తవాలను గుర్తించి కూటమి నేతలను తిరస్కరించడానికి ఎంతో కాలం పట్టదన్న విషయాలను గమనించాలని హెచ్చరించారు. రైతులకు ఏ కష్టం వచ్చినా వారికి అండగా ఉండటానికి వైఎస్సార్సీపీ ముందు వరుసలో ఉంటుందన్నారు. రైతుల సమస్యల పరిష్కారం కోసం మంగళవారం చేపట్టిన కార్యక్రమం విజయవంతం చేయాలని, పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు, రైతులు పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. -
స్కూటీతో నేరుగా ఆస్పత్రి వార్డుల్లోకి..
● ఇష్టానుసారంగా కాంట్రాక్టర్ తీరు ● వైద్యాధికారులు చెప్పినా డోంట్ కేర్ పాలకొల్లు సెంట్రల్ : ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు అందించే ఆహారాన్ని కాంట్రాక్టర్ నేరుగా తన ద్విచక్ర వాహనంతో వార్డుల్లోకి తీసుకువెళ్లి అందించడంపై రోగులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అక్కడున్న ఒక వ్యక్తి ఫొటో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో ఈ విషయం బహిర్గతమైంది. ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు ఉదయం టిఫిన్, మధ్యాహ్న, రాత్రి వేళల్లో భోజనం కాంట్రాక్టర్ ద్వారా ఏర్పాటు చేస్తుంటారు. ఈ కాంట్రాక్టర్ గత కొంతకాలంగా ఆహారాన్ని నేరుగా వార్డుల్లోకి తన ద్విచక్ర వాహనంతో వెళ్లి సరఫరా చేస్తుండటం గమనార్హం. ఆస్పత్రి వైద్యాధికారులు ద్విచక్ర వాహనంతో లోపలికి రావద్దని వారించినా, తాను గత కొంతకాలంగా ఇలానే ఇస్తున్నానంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పినట్టు సమాచారం. సోషల్మీడియాలో ఈ విషయం వైరల్ కావడంతో ద్విచక్ర వాహనాన్ని వార్డు వద్ద పెట్టి.. లోపలికి పేషెంట్లను తీసుకెళ్లే వీల్ చైర్లో పెట్టుకుని తీసుకెళ్లడం గమనార్హం. మరి అత్యవసర సమయంలో వీల్ చైర్ అవసరమైతే ఏం చేస్తారని ఆసుపత్రికి వచ్చిన రోగుల బంధువులు ప్రశ్నిస్తున్నారు. దీనిపై వైధ్యాధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
ఎన్నికల హామీ అమలు చేయాలి
భీమవరం (ప్రకాశంచౌక్): ఇమామ్లకు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం రూ.10 వేలు, రూ.5 వేల గౌరవ వేతనం అమలు చేయాలని వైఎస్సార్సీపీ మైనారిటీ సెల్ ఆధ్వర్యంలో కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. సోమవారం భీమవరంలోని జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన పీజీఆర్ఎస్ అర్జీల స్వీకరణ కార్యక్రమంలో వారు కలెక్టర్ చదలవాడ నాగరాణిని కలిసి ఈ మేరకు అర్జీని అందించారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ మైనారిటీ సెల్ జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ జహంగీర్ మాట్లాడుతూ ఇమామ్లు, మౌజన్లకు పెండింగ్లో ఉన్న గౌరవ వేతనాలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆటో డ్రైవర్లకు న్యాయం చేయాలి కూటమి ప్రభుత్వం తీసుకున్న ఉచిత బస్సు నిర్ణయం వల్ల ఆటో డ్రైవర్ల కుటుంబాల ఆర్థిక పరిస్థితి దారుణంగా తయారైందంటూ ఆటో యూనియన్ జిల్లా అధ్యక్షుడు ఇంటి సత్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని జిల్లా కలెక్టర్కు అందజేశారు. ఆటో డ్రైవర్లకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా కోరారు. ప్రజల నుంచి 192 అర్జీలు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి కలెక్టర్తో పాటు అధికారులు ఫిర్యాదులను స్వీకరించారు. వివిధ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ప్రజల నుంచి 192 అర్జీలు అందాయి. కలెక్టర్తో పాటు జాయింట్ కలెక్టర్ టి.రాహుల్కుమార్రెడ్డి, డీఆర్వో బి.శివన్నారాయణరెడ్డి, డ్వామా పీడీ డాక్టర్ కేసీహెచ్ అప్పారావు, గ్రామ వార్డు సచివాలయ అధికారి వై.దోసిరెడ్డి తదితరులు వాటిని స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ఫిర్యాదుదారులతో స్వయంగా మాట్లాడి నిర్ణీత గడువులోపుగా వారి సమస్యలకు పరిష్కారం చూపాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో ఉత్పన్నమయ్యే సమస్యలకు అక్కడే మంచి పరిష్కార మార్గాలు చూపించాలని, అర్జీలు రీఓపెన్ ఆస్కారం లేకుండా చూడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, వయోవృద్ధుల సంక్షేమ ట్రిపునల్ సభ్యుడు దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. పీజీఆర్ఎస్లో కలెక్టర్కు వైఎస్సార్సీపీ మైనారిటీ సెల్ వినతి మైనర్ ఇరిగేషన్ ట్యాంకుల పునర్నిర్మాణానికి చర్యలు జిల్లాలోని మైనర్ ఇరిగేషన్ ట్యాంకుల పునర్నిర్మాణానికి వెంటనే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ చాంబర్లో ఆమె డ్వామా, ఇరిగేషన్, గ్రౌండ్ వాటర్, ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్ అధికారులతో మాట్లా డుతూ తాడేపల్లిగూడెం మెట్ట ప్రాంతంలో గుర్తించిన 54 మైనర్ ఇరిగేషన్ ట్యాంకుల పునర్నిర్మాణం చేసి భూగర్భ జలాల పెంపునకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఈ పనులను ఉపాధి హామీ పథకం నిధులతో చేపట్టేందుకు అంచనాలు సిద్ధం చేయాలన్నారు. వీటిలో డీసిల్టింగ్, గట్ల పటిష్టత, స్లూయిస్, ష్టటర్లు, జంగిల్ క్లియరెన్స్ తదితర పనులు చేపట్టేందుకు అంచనాలు సిద్ధం చేసి డ్వామా పీడీకీ అందించాలన్నారు. డ్వామా పీడీ డాక్టర్ కేసీహెచ్ అప్పా రావు, ఏపీడీ జీవీకే మల్లికార్జునరావు పాల్గొన్నారు. -
పశువుల్లో ప్రమాదకరంగా గాలికుంటు
భీమవరం: వ్యవసాయమే జీవనాధారమైన పశ్చిమగోదావరి జిల్లాలో వరిసాగు తరువాత రైతులు ఎక్కువగా పశువుల పెంపకంపై ఆధారపడతారు. వేణ్నీళ్లకు చన్నీళ్లు సాయం అనే నానుడితో వ్యవసాయంతో పాటు పాడిపశువులను పెంచుతున్నారు. ప్రస్తుతం వాతావరణ పరిస్థితులను బట్టి పశువులకు గాలికుంటు వ్యాధి (పుట్ అండ్ మౌత్ డీసీజెస్) సోకే అవకాశముంది. ఈ వ్యాధి కారణంగా పాల దిగుబడి తగ్గిపోవడం, పనిసామర్ధ్యం తగ్గిపోయే ప్రమాదముంది. వ్యాధి సోకిన పశువుల పాలు తాగిన లేగ దూడలు చనిపోయే అవకాశం ఉంది. గాలికుంటు వ్యాధి తీవ్రమైన అంటువ్యాధి. ఇది పశువులకు, పందులకు, మేకలకు, గొర్రెలు వంటి జంతువులకు సోకుతుంది. ఈ వ్యాధికి కారణం పిక్కోర్నావిరిడే అనే వైరస్.అధిక జ్వరం, నోట్లో పుండ్లు లక్షణాలుగాలికుంటు వ్యాధి సోకిన పశువులకు అధిక జ్వరం వస్తుంది. పశువుల నోటి లోపల, నాలుకపై, చిగుళ్ళ, పెదవులపైన నీటి పొక్కులు ఏర్పడతాయి. ఇవి పగిలి పుండ్లుగా మారతాయి. దీని కారణంగా పశువులు మేత తినడానికి ఇబ్బంది పడతాయి. పశువుల పాదాల మధ్య, గాలికుంటుపైన, కాళ్ళ పైన నీటి పొక్కులు ఏర్పడి అవి పగిలి పుండ్లుగా మారి పశువులు నడవడానికి ఇబ్బంది పడతాయి. దీనివల్ల పశువులు కుంటుతూ నడుస్తాయి. అందుకే ఈ వ్యాధిని గాలికుంటు వ్యాధి అంటారు. నోట్లో పుండ్ల కారణంగా పశువులు నోటి నుంచి ఎక్కువగా లాలాజలాన్ని స్రవిస్తాయి.పాలు ఉత్పత్తిపై ప్రభావంపశువులు మేత సరిగా తినకపోవడం వల్ల వాటి బరువు తగ్గిపోతుంది. దూడలలో ఈ వ్యాధి గుండె కండరాలను ప్రభావితం చేస్తుంది. అందువల్ల గుండె పోటు వచ్చి మరణాలు సంభవించే అవకాశం ఉంది.గాలికుంటు ఎలా వ్యాపిస్తుందివ్యాధి సోకిన పశువుల నుంచి ఆరోగ్యంగా ఉన్న పశువులకు నేరుగా వ్యాధి వ్యాపిస్తుంది. కలుషితమైన మేత, నీరు, పరికరాల ద్వారా వ్యాపిస్తుంది. అంతేకాకుండా గాలి ద్వారా కూడా ఈ వైరస్ కొంత దూరం వరకు వ్యాపిస్తుంది.వ్యాధి చికిత్స, నివారణ● ఈ వ్యాధి నివారణకు నిర్దిష్టమైన చికిత్స లేదు. సాధారణంగా వ్యాధి లక్షణాల ఆధారంగా చికిత్స చేయాలి.● పుండ్లలో ఇన్ఫెక్షన్ రాకుండా ఉండటానికి యాంటీబయోటిక్స్ ఉపయోగించవచ్చు. నోట్లోని పుండ్లను శుభ్రం చేయడానికి పొటాషియం పర్మాంగనేట్ వంటి ద్రావణాలను ఉపయోగించాలి. పాదాల పుండ్లకు అయోడిన్ లేదా ఇతర యాంటిసెప్టిక్ ద్రావణాలను ఉపయోగించవచ్చు. వ్యాధి నివారించడానికి టీకాలు వేయించడం చాలా ముఖ్యం. పశువులకు ప్రతి ఆరు నెలలకొకసారి టీకాలు వేయించాలి. పాడి పశువులు ఉండే స్థలాన్ని శుభ్రంగా ఉంచాలి. పశువులను ఒకదానికొకటి దూరంగా ఉంచాలి.15 నుంచి ఉచితంగా టీకాలుపశువుల్లో గాలికుంటు వ్యాధి నివారణకు ఈనెల 15 నుంచి జిల్లా వ్యాప్తంగా ఉచితంగా టీకాలు వేస్తున్నారు. సుమారు 45 రోజులపాటు పశుసంవర్ధకశాఖ ఆధ్వర్యంలో టీకాలు వేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. వ్యాధిని నిర్లక్ష్యం చేస్తే అనేక నష్టాలు ఏర్పడనున్నందున ఉచిత టీకాలను పాడి రైతులంతా సద్వినియోగం చేసుకోవాలి.పి.సుధీర్బాబు, ఏడీ, పశుసంవర్ధకశాఖ, భీమవరం -
దళిత కుటుంబాలకు పరామర్శ
కై కలూరు: దానిగూడెం దళితులపై దాడి నేపధ్యంలో కై కలూరు పట్టణంలో నాలుగు రోజులుగా పోలీసులను మెహరించారు. నిందితులను రిమాండ్కు తరలించినప్పటకీ ప్రధాన సూత్రదారుడిని అదుపులోకి తీసుకోవాలంటూ దళిత నాయకులు డిమాండ్ చేస్తున్నారు. సోమవారం నియోజకవర్గం, ఇతర ప్రాంతాల నుంచి దాదాపు 150 మంది దళిత యువకులు పోలీసుల వలయాన్ని చేధించుకుని దానిగూడెం చేరుకున్నారు. దానిగూడెం ప్రజలు వంటా, వార్పుతో మద్దతు తెలపడానికి వచ్చిన వారికి భోజనాలు అందించారు. డీఎస్పీ, పలువురు సీఐలు, ఎస్ఐలు కలిపి దాదాపు 200 మంది పోలీసులు విధులు నిర్వహించారు. రాష్ట్రంలో అభివృద్ధి లేదు.. సంక్షేమం లేదు.. రోజు రోజుకు దళితులు, బీసీలు, ఎస్టీలు, మైనార్టీ కులాలపై అత్యాచారాలు, హత్యలు, అరాచకాలు జరుగుతున్నాయని ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ రాష్ట్ర అధ్యక్షులు చింతపల్లి గురుప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. దానిగూడెంకు పోలీసులు వెళ్ళనీయకపోవడంతో అసహనం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో కీలక వ్యక్తులను అరెస్టు చేసి అందరిపై రౌడీషీట్లు ఓపెన్ చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు చర్యలు తీసుకోని పక్షంలో ఆందోళన చేస్తామని హెచ్చరించారు. దళితులపై దాడులు అరికట్టడంలో ప్రభుత్వం విఫలమవుతోందని రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర కన్వీనర్ ఉప్పులేటి దేవీ వరప్రసాద్ విమర్శించారు. ఇటీవల తెనాలి, తణుకు, ఇప్పుడు కై కలూరులో దళితులపై దాడులు జరిగాయన్నారు. రోడ్డుపై ఆందోళనలు చేశారంటూ దళితులపై పోలీసులు నమోదు చేసిన కేసులను ఉపసంహరించాలన్నారు. ప్రధాన నిందితుడు కొల్లి బాబీని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. మాలమహాడు రాష్ట్ర అధ్యక్షుడు నాగ జగన్ బాబూరావు, కృష్ణాజిల్లా మాలమహానాడు అధ్యక్షుడు దోవా గోవర్థన్, దళిత నాయకులు పాల్గొన్నారు. సున్నితమైన అంశంపై కావాలని ఘర్షణలకు పాల్పడితే సహించమని డీఎస్పీ డి.శ్రావణ్కుమార్ హెచ్చరించారు. 144 సెక్షన్ అమలులో ఉందన్నారు. దళితులపై దాడి కేసులో ఇప్పటికే అరెస్టులు చేసి రిమాండ్కు పంపామన్నారు. మరొకరిపై ఆరోపణలను నిర్ధారణ చేసుకుని చర్యలు తీసుకుంటామన్నారు. కై కలూరులో 144 సెక్షన్, భారీగా పోలీసుల మోహరింపు -
గుర్తు తెలియని మృతదేహం లభ్యం
ఇరగవరం: మండలంలోని అయినపర్రు పొలాల్లో సోమవారం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు ఇరగవరం హెడ్ కానిస్టేబుల్ ఐ.కృష్ణారావు తెలిపారు. నీలం రంగు జీన్స్, ఆరెంజ్ రంగు టీ షర్టు ధరించాడని, 30 నుంచి 40 ఏళ్ల వయస్సు ఉంటుందని.. ఎత్తు 5 అడుగుల 8 అంగుళాలు ఉంటుందని చెప్పారు. వీఆర్వో సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహన్ని పంచనామా నిమిత్తం తణుకు ఏరియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి ఆచూకీ తెలిసిన వారు 9440796681, 9440796639 నెంబర్లకు తెలియజేయాలని కోరారు. విశ్వసనీయ సమచారం ప్రకారం మృతుడి జేబులో నాలుగు సెల్ఫోన్లు ఉన్నాయని అతను ఫోన్లు దొంగిలించడానికి వచ్చిన దొంగగా భావిస్తున్నారు. పాలకొల్లు సెంట్రల్: పంచారామక్షేత్రం శ్రీ క్షీరారామలింగేశ్వరస్వామి ఆలయంలో చంద్రగ్రహణం విడుపుకాలం సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామిని దర్శించుకున్నారు. కొందరు భక్తులు దానాలు సమర్పించుకున్నారు. క్యూలైన్లు నిండిపోయాయి. సాయంత్రం ప్రదోషకాలంలో భక్తులు సప్త సోమవారం ప్రదక్షిణల్లో పాల్గొన్నారు. అనంతరం పంచహారతుల కార్యక్రమం నిర్వహించారు. -
10న క్వాంటం వ్యాలీ హ్యాకథాన్ సెమీస్
భీమవరం: భీమవరం పట్టణంలోని ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో అమరావతి క్వాంటం వ్యాలీ హ్యాకథాన్ సెమీఫైనల్స్ ఈ నెల 10న జరుగుతాయని కళాశాల డైరెక్టర్ ఎం.జగపతిరాజు సోమవారం తెలిపారు. ప్రిన్సిపల్ కేవీ మురళీకృష్ణంరాజు, టెక్నాలజీ సెంటర్ హెడ్ ఎన్.గోపాలకృష్ణమూర్తితో కలసి ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ విషయం వెల్లడించారు. ఈ పోటీలకు ఉభయ గోదావరి జిల్లాల్లోని 20 ఇంజనీరింగ్ కళాశాలల నుంచి 40 బృందాలకు సంబంధించి 240 మంది విద్యార్థులు హాజరవుతున్నట్టు చెప్పారు. బుధవారం ఉదయం 8:30 గంటలకు కళాశాల ఓపెన్ ఆడిటోరియంలో జరిగే ప్రారంభ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జేఎన్టీయూ కాకినాడ వైస్ చాన్స్లర్ సీఎస్ఆర్కె ప్రసాద్ హాజరవుతారని న్యాయ నిర్ణేతగా ఉన్నత విద్యా మండలి మాజీ వైస్ చైర్మన్, ఆంధ్ర యూనివర్సిటీ సీఎస్ఎస్ఈ విభాగం ప్రొఫెసర్ వి.వల్లికుమారి వ్యవహరిస్తున్నారన్నారు. -
ఉలిక్కిపడ్డ ట్రిపుల్ ఐటీ
● ప్రొఫెసర్పై దాడితో అప్రమత్తం ● ఆందోళనలో ఫ్యాకల్టీ, నాన్టీచింగ్ సిబ్బంది నూజివీడు: ట్రిపుల్ ఐటీలో పనిచేస్తున్న సీనియర్ ప్రొఫెసర్పై ఎంటెక్ విద్యార్థి కత్తితో దాడి చేయడంతో ట్రిపుల్ ఐటీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఇక్కడ పనిచేస్తున్న మెంటార్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ప్రొఫెసర్లు, గెస్ట్ ఫ్యాకల్టీ, నాన్ టీచింగ్ సిబ్బంది అందరూ దాడి సంఘటనతో ఆందోళనకు గురయ్యారు. ఆర్జీయూకేటీకి గతంలో రిజిస్ట్రార్గా, నూజివీడు ట్రిపుల్ ఐటీకి డైరెక్టర్గా, ఏఓగా, అడ్మిషన్ల కన్వీనర్గా పనిచేసిన సివిల్ ఇంజినీరింగ్ ప్రొఫెసర్ ఎస్ఎస్ఎస్వీ గోపాలరాజుపై ఎంటెక్ ప్రథమ సంవత్సరం విద్యార్థి వినయ్ పురుషోత్తం కత్తితో దాడి చేయడాన్ని ఫ్యాకల్టీ, నాన్ టీచింగ్ స్టాఫ్, మెంటార్ల యూనియన్లు ముక్తకంఠంతో తీవ్రంగా ఖండించాయి. ఒక విద్యార్థి జేబులో రెండు కత్తులు పెట్టుకొని తరగతి గదికి రావడంపై ఆందోళన వ్యక్తం చేశాయి. ఇలా అయితే తమకు రక్షణ ఏముంటుందని ఫ్యాకల్టీ ముక్తకంఠంతో ప్రశ్నిస్తోంది. 9,900 మంది విద్యార్థులున్న నూజివీడు ట్రిపుల్ ఐటీలో మున్ముందు తమ పరిస్థితి దారుణంగా ఉంటుందేమోననే ఆందోళన వ్యక్తం చేస్తోంది. దాడి జరిగింది తరగతి గదిలో కాబట్టి మిగిలిన విద్యార్థులందరూ వచ్చి నిలువరించారని, ఇదే సంఘటన ప్రొఫెసర్ కేబిన్లో జరిగి ఉంటే దాడి నుంచి ప్రొఫెసర్ను ఎవరు కాపాడేవారని ప్రశ్నిస్తున్నారు. ఇలంటి పరిస్థితుల్లో ఫ్యాకల్టీకి భద్రత డొల్లేనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తరగతులకు హాజరుకాకుంటే ఏం చేస్తున్నారు? ప్రొఫెసర్పై దాడికి పాల్పడిన ఎంటెక్ ప్రథమ సంవత్సరం విద్యార్థి వినయ్ పురుషోత్తం ప్రారంభం నుంచి తరగతులకు, ల్యాబ్లకు గానీ హాజరయ్యేవాడు కాదని ట్రిపుల్ ఐటీ వర్గాలు పేర్కొంటున్నాయి. రెసిడెన్షియల్ విధానంలో నిర్వహిస్తున్న ట్రిపుల్ ఐటీలో తరగతులకు రాకుండా హాస్టల్ గదిలోనే ఉంటున్నప్పుడు పరిపాలన చేసే అధికారులు ఏం చేస్తున్నారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. హెచ్ఓడీ, డీన్ అకడమిక్స్, డైరెక్టర్లు నిత్యం గైర్హాజరవుతున్న విద్యార్థులను గుర్తించి ఎందుకు గైర్హాజరవుతున్నారో తెలుసుకొని ఆ విద్యార్థి తల్లిదండ్రులకు తెలియజేయాల్సి ఉన్నప్పటికీ అలా చేసిన దాఖలాలు లేవు. ఈ విద్యార్థి తన రూమ్లో ఉండే మరికొందరు విద్యార్థులతో కూడా మాట్లాడకుండా ఉంటాడని పలువురు పేర్కొంటున్నారు. హాస్టల్లో ఉండే విద్యార్థులు సహజంగా పండ్లు కోసుకోవడానికి ఇంటి వద్ద నుంచే చాకులు తెచ్చుకుంటారు. అయితే ఇతను రెండు చాకులను జేబులో పెట్టుకొని తరగతి గదికి రావడాన్ని బట్టి చూస్తుంటే దాడి చేయాలనే లక్ష్యంతోనే ఉద్దేశపూర్వకంగా తెచ్చుకున్నట్లుగా ఉందని అధ్యాపకులు పేర్కొంటున్నారు. ఇప్పటికై నా యాజమాన్యం కఠినంగా వ్యవహరించాలనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. -
సీసలిలో ఉద్రిక్తత
కాళ్ల: కాళ్ల మండలం సీసలిలో రెండు వర్గాల మధ్య తలెత్తిన వివాదం ఘర్షణకు దారి తీసింది. గ్రామ దేవత గుడి పక్కన ఉన్న పోరంబోకు స్థలం విషయంలో వివాదం తలెత్తగా.. ఇరువర్గాల దాడిలో పలువురు గాయపడ్డారు. దీంతో పెద్ద సంఖ్యలో పోలీసులు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. సీసలి హరిజన పేటకు చేర్చి కాలువ ఒడ్డున తాడిచెట్టు ఉండగా, అక్కడ కొన్ని సంవత్సరాలుగా పోలేరమ్మకు పూజలు చేస్తున్నారు. జూన్లో అదే ప్రాంతంలో పోలేరమ్మ విగ్రహాన్ని ప్రతిష్టించారు. గుడికి పక్కనే కొంత స్థలం ఉంది. ఈ స్థలాన్ని స్థానిక దళితులు అంబేడ్కర్ జయంతి రోజున భోజనాలు వండేందుకు వాడుకునేవారు. ఈ స్థలంలోనే పోలేరమ్మ గుడికి సంబంధించిన ఉత్సవాలు జరిగినప్పుడు భోజనాలు పెట్టుకునేందుకు షెడ్డు కట్టాలనే ఆలోచనను స్థానిక దళితులు వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలో అక్కడ అంబేడ్కర్ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. ఈ విషయంలో ఇరువురి పెద్దలు మాట్లాడుకునే ప్రయత్నం చేశారు. కొందరు సోమవారం సాయంత్రం అక్కడికి వెళ్లి స్థలాన్ని శుభ్రం చేసే ప్రయత్నం చేశారు. ఫెన్సింగ్ తొలగించే క్రమంలో అంబేద్కర్ ఫ్లెక్సీ పాడయింది. విషయం తెలిసి దళితులు పెద్ద ఎత్తున చేరుకుని ఆందోళన చేశారు. ఈ క్రమంలో ఇరు వర్గాలు రాళ్లు విసురుకోవడంతో పలువురికి గాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం భీమవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. -
సచివాలయ ఉద్యోగుల పోరు బాట
● ఒకే మాతృ శాఖ కింద ఆత్మగౌరవంతో పనిచేయడానికి ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలి. ● అన్ని సర్వేలను సంబంధిత శాఖల ద్వారానే నిర్వహించి సచివాలయ సిబ్బందిపై భారం తొలగించాలి. ● పదోన్నతుల్లో జాప్యాన్ని నివారించి, జిల్లాల వారీగా, యూఎల్బీ వారీగా సీనియార్టీ లిస్టులు ప్రకటించి, ప్రక్రియను 2 నుంచి 3 నెలల్లో పూర్తి చేయాలి. ● ప్రతి యూఎల్బీ ఖాళీల్లో కనీసం 50 శాతం ఖాళీలను సచివాలయ సిబ్బందితో భర్తీ చేయాలి. ● 5 నుంచి 6 ఏళ్లు సర్వీస్ పూర్తిచేసిన ఉద్యోగులకు ఆటోమేటిక్ అడ్వాన్స్డ్ స్కీమ్ వర్తింపజేసి, రెండు అదనపు ఇంక్రిమెంట్లు ఇవ్వాలి. ● ప్రొబేషన్ పీరియడ్లో రావాల్సిన నోషనల్ ఇంక్రిమెంట్లకు స్పష్టమైన టైమ్ ఫ్రేమ్ నిర్ణయించాలి. కూటమి ప్రభుత్వం వలంటీర్ వ్యవస్థను రద్దు చేసి సచివాలయ ఉద్యోగులపై భారం వేసింది. గతంలో ఒక వలంటీర్ క్లస్టర్ (50 ఇళ్లు) చూసుకుంటే సచివాలయ ఉద్యోగికి ప్రస్తుతం మూడు నుంచి ఐదు క్లస్టర్ల బాధ్యతలు అప్పగించారు. దీంతో తీవ్ర పని ఒత్తిళ్లతో విధులు నిర్వహించాల్సి వస్తోంది. శాఖాపరమైన పనులతో పాటు బీఎల్ఓ, అదనపు పనులు, సర్వేల భారాన్ని మోపారు. సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం లేదు. ఇప్పటికైనా మా సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఆత్మ గౌరవ ఉద్యమం చేపట్టాం. – ఎ.శ్రీనివాస్, ఏపీ ఎంఎంఈఏ రాష్ట్ర ప్రచార కార్యదర్శి, వార్డు సెక్రటరీ, భీమవరంక్లస్టర్ మ్యాపింగ్ సిస్టమ్ సచి వాలయ సిబ్బందికి గుదిబండ వంటిది. గతంలో వలంటీర్లు ఉండటంతో సర్వేలు, పెన్షన్ల పంపిణీ సులభంగా జరిగేది. వలంటీర్లు లేకపో వడంతో సచివాలయ ఉద్యోగులపై భారం పెరిగింది. ఉదయం 8 గంటలలోపు, సాయంత్రం 5 గంటల తర్వాత కూడా సేవలందించాల్సి వస్తుంది. ఒక్కో ఉద్యోగి మూడు నుంచి ఐదు క్లస్టర్ల బాధ్యతలు చూసుకోవడం చాలా భారంగా ఉంది. ఒక్కో ఉద్యోగి 150 నుంచి 250 కుటుంబాల బాధ్యతలు నిర్వహించడం కష్టంగా ఉంది. ప్రభుత్వం కొన్ని సర్వేలను థర్డ్ పార్టీ వారితో చేయించాలి. సచి వాలయ ఉద్యోగుల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలి. –కె.శ్రీనివాస్, రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్, ఏపీ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంక్షేమ సంస్థ భీమవరం(ప్రకాశం చౌక్): కూటమి ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిరసనగా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ఆత్మగౌరవ ఉద్యమ బాట పట్టారు. పనిఒత్తిళ్లు, సర్వేల భారం, తమ ఆత్మగౌరవాన్ని దిగజార్చడంపై ఇప్పటికే పలుమార్లు వినతిపత్రాలు సమ ర్పించినా ప్రభుత్వం స్పందించకపోవడంతో ఏడు రోజులపాటు నిరసనలకు పిలుపునిచ్చారు. గ్రామ స్వరాజ్యమే లక్ష్యంగా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాలు, వలంటీర్ వ్యవస్థల ను తీసుకువచ్చింది. గత ప్రభుత్వంలో ఐదేళ్లపాటు పూర్తిస్థాయిలో ఈ వ్యవస్థల ద్వారా ముంగిళ్లలోకే ప్రజలకు పాలనను చేరువ చేశారు. అయితే కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు వలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని హామీ ఇచ్చి గద్దెనెక్కిన తర్వాత ని ర్దాక్షిణ్యంగా వలంటీర్ వ్యవస్థను రద్దు చేసింది. దీంతో రాష్ట్రంలో లక్షలాది మంది వలంటీర్లు ఉపాధి కో ల్పోయారు. ఈ క్రమంలో సచివాలయ ఉద్యోగులపై పనిభారం మరింత పెరిగింది. ఇంటింటా సర్వేలు, పింఛన్ల పంపిణీ, మల్టీ టాస్కింగ్ విధులతో సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు. రోజురోజుకూ ఉద్యో గుల ఆత్మగౌరవాన్ని దిగజార్చేలా ప్రభుత్వం వ్యవహరించడంపై రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు ఆత్మ గౌరవ ఉద్యమం పేరట నిరసనలు తెలుపుతున్నారు. దీనిలో భాగంగా జిల్లాలోని 380 గ్రామ, 155 వార్డు సచివాలయ ఉద్యోగులు మొత్తం 4,331 మంది నిరసనలు తెలుపుతున్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని గళమెత్తుతున్నారు. ఉద్యమ కార్యాచరణ సచివాలయ ఉద్యోగులు ఏడు రోజుల పాటు నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు. దీనిలో భాగంగా తొలిరోజు (శనివారం) ఉన్నతాధికారులకు వినతిపత్రాలు సమర్పించారు. 2, 3 రోజుల్లో (సోమ, మంగళవారాలు) నల్ల బ్యాడ్జీలతో విధులకు హా జరు, 4, 5 రోజుల్లో (బుధ, గురువారాలు) అధికారిక వాట్సాప్ గ్రూపుల నుంచి వైదొలగడం, 6,7 రో జుల్లో (శుక్ర, శనివారాలు) పెన్డౌన్ కార్యక్రమాల ద్వారా నిరసన తెలుపనున్నారు. ఆత్మగౌరవ ఉద్యమం సర్వేల భారంతో సతమతం ఒత్తిళ్లతో విధుల నిర్వహణ మహిళా, దివ్యాంగ సిబ్బందికి తప్పని ఇబ్బందులు ప్రభుత్వ వైఖరిపై మండిపాటు జిల్లాలో 4,331 మంది ఉద్యోగుల నిరసన గళం వలంటీర్ల వ్యవస్థను రద్దు చేయడంతో ఒక్కో ఉద్యోగి మూడు నుంచి ఐదు క్లస్టర్ల పరిధిలో సేవలందించాల్సి వస్తోంది. ఈ లెక్కన ఒక్కో ఉద్యోగి 150 నుంచి 250 కుటుంబాల బాధ్యతలను నిర్వహించడం కష్టంగా మారింది. సామాజిక, ఆర్థిక, విద్య, వైద్య, ఉపాధి తదితర సర్వేల భారాన్ని ప్రభుత్వం మోపడాన్ని వీరంతా వ్యతిరేకిస్తున్నారు. మల్టీటాస్కింగ్ పేరుతో మాతృశాఖ పనులతో పాటు ఇతర శాఖల పనులు కూడా చేయమని బలవంతం చేస్తున్నారు. డాష్ బోర్డులు, టార్గెట్ల పేరిటపై అధికారులు వేధిస్తున్నారు. సర్వేలకు వెళ్లినప్పుడు మహిళా సిబ్బంది సామాజిక వేధింపులకు గురవుతున్నారు. రక్షణపై ఆందోళన చెందుతున్నారు. సర్వే కోసం ఇంటింటా తిరగడం దివ్యాంగ సిబ్బందికి ఇబ్బందిగా ఉంది. సర్వే సమయంలో ఆధార్, బయోమెట్రిక్, ఓటీపీలు చెప్పేందుకు కొందరు సహకరించడం లేదు. సంక్షేమం, ఉద్యోగ ప్రయోజనాలు వంటి విషయాల్లో అధికారులు శ్రద్ధ చూపడం లేదు. సర్వేల విషయంలో ఒత్తిడి పెంచడం, సర్వే కాలేదనే కారణంతో సస్పెండ్ చేయడం ఉద్యోగులను ఆందోళన కలిగిస్తోంది. పని ఒత్తిళ్లతో కుటుంబ జీవనానికి దూరమవుతున్నామని ఉద్యోగులు వాపోతున్నారు. కొందరు ఆత్మహత్యలకు సైతం పాల్పడ్డారు. -
●చంద్ర గ్రహణం.. ఆలయాల మూసివేత
సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా ఆలయాల తలుపులకు మూతలు పడ్డాయి. ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయం, భీమవరం మావుళ్లమ్మవారు, భీమవరం పంచారామక్షేత్రం, జంగారెడ్డిగూడెం మండలం గుర్వాయిగూడెంలో మద్ది ఆంజనేయ తదితర ఆలయాలను ఆదివారం మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో మూసివేశారు. ప్రధాన ద్వారాలు, గోపుర ద్వారాలను మూసివేసి తాళాలు వేశారు. సోమవారం ఉదయం శుద్ధి, సంప్రోక్షణ, పుణ్యహవచనం అనంతరం భక్తులను అనుమతిస్తారు. – ద్వారకాతిరుమల/భీమవరం (ప్రకాశం చౌక్)/జంగారెడ్డిగూడెం గుర్వాయిగూడెంలో మద్ది అంజనేయస్వామి వారి ఆలయం వద్ద.. భీమవరంలో సోమేశ్వరస్వామి ఆలయగోపుర ద్వారం మూసివేసిన దృశ్యం -
కూటమి పాలనలో ఎరువుల కృత్రిమ కొరత
తాడేపల్లిగూడెం అర్బన్: కూటమి ప్రభుత్వం ఎరు వులు కృత్రిమ కొరత సృష్టించి రైతులను ఆర్థికంగా దోచుకుంటోందని మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక క్యాంపు కార్యాలయంలో ఆదివారం విలేకరుల సమావేశాన్ని వైఎస్సార్సీపీ పట్టణ అధ్యక్షుడు కొలుకులూరి ధర్మరాజు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కొట్టు మాట్లాడుతూ వ్యవసాయానికి అవసరమైన నీటి కాలువలు నిర్వహణ చేయడం లేదని, గుర్రపుడెక్కను నియంత్రించడంలో అధికారులు విఫలమయ్యారన్నారు. కూట మి ప్రభుత్వం ఏర్పడి 16 నెలలు గడస్తున్నా రైతులకు న్యాయం చేయలేపోయిందని ఎద్దేవా చేశారు. ఏడాదికి రూ.20 వేలు ఇస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం ఇప్పటికీ రూ.5 వేలు మాత్రమే ఇచ్చిందన్నారు. ఇటీవల ఎరువుల కొరత సృష్టించి వాటా లు, కోటాల పేరుతో యూరియా బస్తాలను అధిక ధరలకు విక్రయిస్తున్నారని ఆరోపించారు. ఎరువుల సరఫరాలో తాడేపల్లిగూడెం కేంద్రంగా ఇతర ప్రాంతాలకు తరలిస్తారన్నారు. మార్క్ఫెడ్, మార్కె ట్ వాటాలు ఎంతో తెలియజేయాలన్నారు. ఎరువులు ఎవరికి కోటా ఇచ్చారో ఇన్వాయిస్లను వెల్లడించాలని డిమాండ్ చేశారు. రైతుల ఇబ్బందులు సీఎం చంద్రబాబు, వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడికి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. రైతులను చులకన చేసి మాట్లాడటం తగదన్నారు. పడమర విప్పర్రులో ఎరువులు జనసేన, టీడీపీ వర్గీయులైన రైతులకు మాత్రమే ఇచ్చారని, కూటమి అనుయాయులకే ప్రాధాన్యమిచ్చి మిగిలిన వారిపై నిర్లక్ష్యం తగదన్నారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో షాడో ఎమ్మెల్యే ఎవరో తెలియజేయాలన్నారు. నియోజకవర్గంలో రైతుల కష్టాలు ప్రజాప్రతినిధులకు కానరావడం లేదన్నారు. 9న అన్నదాత పోరు రైతుల విషయంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న అక్రమాలు, అవినీతికి వ్యతిరేకంగా ఈనెల 9న వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో అన్నదాత పోరు కార్యక్రమాన్ని ఆర్డీఓ కార్యాలయాల వద్ద నిర్వహించనున్నామని మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. రైతులు, పార్టీ శ్రేణులు, అభిమానులు తరలిరావాలని పిలుపునిచ్చారు. అనంతరం అన్నదాత పోరు పోస్టర్లను ఆవిష్కరించారు. నాయకులు ముప్పడి సంపత్కుమార్, ఆరేపల్లి సుబ్బారావు, కర్రి భాస్కరరావు, వెలిశెట్టి నరేంద్రకుమార్, చెన్నా జనార్దన్, గార్లపాటి వీరకుమార్, సిర్రాపు శాంతకుమార్, మహ్మద్ రఫీ తదితరులు పాల్గొన్నారు. మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ -
రైతులను అప్పులపాలు చేసిన ప్రభుత్వం
తణుకు అర్బన్: కూటమి ప్రభుత్వం ఏర్పడిన రోజు నుంచి వ్యవసాయ రంగం అధోగతిపాలై రైతులు అప్పులపాలైపోయారని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు మండిపడ్డారు. వైఎస్సార్, జగన్ల హయాంలో వ్యవసాయాన్ని పండుగ చేసి చూపించారని, వ్యవసాయం దండగన్న చంద్రబాబు ఆ వ్యాఖ్యలను కొనసాగిస్తూ రైతుల ఉసురు తీస్తున్నారని విమర్శించారు. తణుకు వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులు తమ పంటలకు మంచి దిగుబడి రావాలనే ఉద్దేశంతో యూరియా కోసం పాకులాడుతున్నారని, క్యూ లైన్లలో మహిళలు కూడా నిల్చోవాల్సి వస్తుంటే చంద్రబాబు వెటకారంగా యూరియా వేస్తే క్యాన్సర్ వస్తుందని, పురుగు మందుల వాడకం తగ్గించాలని అనడం బాధాకరమన్నారు. ఏడాది పొడవునా వరి పంట పండుతూ ఉండే అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్ను ఎడారిగా మార్చి రైతులను కన్నీళ్లు పెట్టిస్తున్నాడని దుయ్యబట్టారు. పెట్టుబడి సాయం లేక, ఇన్పుట్ సబ్సిడీ, పంటల బీమా వంటివి అమలు చేయకపోవడంతో రైతులు పంట పండించేందుకు అప్పులపాలవ్వాల్సి వస్తోందని చెప్పా రు. రైతులను పట్టించుకోని కూటమి ప్రభుత్వం అమరావతికి కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తూ భ్రమరావతిని తయారు చేస్తోందని ఎద్దేవా చేశారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన పిలుపుమేరకు ఈనెల 9న తాడేపల్లిగూడెం ఆర్డీఓ కార్యాలయం వద్దకు ర్యాలీగా తరలివెళ్లి వినతిపత్రాన్ని ఇవ్వనున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వంలో ఎరువుల బ్లాక్ మార్కెట్పై ‘అన్నదాత పోరు’ పోస్టర్ను కారుమూరితో పాటు పార్టీ శ్రేణులు ఆవిష్కరించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన రోజు నుంచి తణుకులో గతంలో ఎన్నడూ లేనివిధంగా ఆర్కే ట్యాక్స్ గొడవ మార్కెట్లో తీవ్ర చర్చనీయాంశమైందని మాజీ మంత్రి కారుమూరి విమర్శించారు. టీడీఆర్ బాండ్లు, మట్టి, పేకాటలు, క్రికెట్ బుకింగ్లు, మద్యం దుకాణాలు, పంచాయతీల్లో కమీషన్లతో పాటు ఆవులు, గేదెల కోతకు సంబంధించి ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ మొత్తం రూ.1,200 కోట్లు దోపిడీ చేశారని ఆధారాలు సైతం బయటకు వచ్చాయని స్పష్టం చేశారు. ఆ పార్టీ వారి వద్ద కూడా ఆధారాలు ఉన్నాయని వారే చెబుతున్నారని విమర్శించారు. నియోజకవర్గంలో ఏ పనికి వెళ్లినా ఎమ్మెల్యే ట్యాక్స్ వేస్తున్నారని ప్రజలు, టీడీపీ వర్గాలవారే చెబుతున్నారని అన్నారు. తణుకు ప్రాంతంలో గతంలో ఎన్నడూ ఇటువంటి ట్యాక్స్లు ఏ ప్రభుత్వంలో కూడా తాము ఎప్పుడూ చూడలేదని టీడీపీ వర్గీయులే చెబుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు మారిశెట్టి శేషగిరి, ఎంపీపీ రుద్రా ధనరాజు, వైఎస్సార్సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు సత్తి వెంకటరెడ్డి, పబ్లిసిటీ వింగ్ జిల్లా అధ్యక్షుడు జల్లూరి జగదీష్, నియోజకవర్గ మహిళాధ్యక్షురాలు మెహర్ అన్సారీ, తణుకు మండల అధ్యక్షుడు పెనుమర్తి వెంకటరామన్న, పట్టణ మహిళాధ్యక్షురాలు నూకల కనకదుర్గ, తణుకు మండల మహిళాధ్యక్షురాలు ఉండవల్లి జానకి, డాక్టర్ దాట్ల సుందరరామరాజు, తేతలి మాజీ సర్పంచ్ కోట నాగేశ్వరరావు పాల్గొన్నారు. యూరియా కూడా అందించలేక చతికిలపడ్డ దుస్థితి మహిళా రైతులు సైతం క్యూలో ఉన్నా చోద్యం చూస్తున్న వైనం తణుకులో ఎమ్మెల్యే ఆరిమిల్లి అవినీతి రూ.1,200 కోట్లు విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి కారుమూరి విమర్శలు -
కూటమి పాలనలో రౌడీ సంస్కృతి
● వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు డీఎన్నార్ ధ్వజం ● దానిగూడెం దళితవాడలో బాధిత కుటుంబాలకు పరామర్శ కై కలూరు: కై కలూరు నియోజకవర్గంలో ఎన్నడూచూడని కత్తులు, కర్రలతో దాడులు చేసే సంస్కృతి కూటమి పాలనలోనే కనిపిస్తోందని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు (డీఎన్నార్) విమర్శించారు. వినాయక ఊ రేగింపు సందర్భంగా జనసేన కార్యకర్తల దాడిలో తీవ్రంగా గాయపడిన దానిగూడెం దళితవాడ బాధిత కుటుంబాలను ఆదివారం ఆయన పరామర్శించి చర్చిలో మాట్లాడారు. ఈ సందర్భంగా దళితులు మాట్లాడుతూ వినాయక ఊరేగింపులో డీజే సౌండ్ల వద్ద హారన్ కొట్టినందుకు జనసేన కార్యకర్తలు విచక్షణారహితంగా పయ్యేద్దు అజయ్, గొంతుపులి దినేష్బాబుపై బ్లేడు, కత్తులు, రాడ్లతో దా డి చేశారన్నారు. దీనిపై దళితులు ఆందోళన చేస్తే పోలీసులు తమపైనే లాఠీ చార్జీ చేశారని, తగిలిన దెబ్బలను డీఎన్నార్కు చూపించారు. గొడవలకు ప్రధాన సూత్రధారి, జనసేన నేత కొల్లి బాబీని కే సు నుంచి తప్పించడానికి ప్రయత్నిస్తున్నారని ఆ రోపించారు. తీవ్ర గాయాలైన అజయ్, దినేష్బా బు తండ్రులు శ్రీను, నానీలు కన్నీళ్లు పెట్టుకుని త మకు న్యాయం చేయాలని కోరారు. డీఎన్నార్ మాట్లాడుతూ కూటమి పాలనలో రౌడీలమంటూ అరాచక శక్తులు చెలరేగిపోతున్నాయన్నారు. పోలీసులు వారం ముందు అన్నసమారాధనలో జరిగిన ఘర్షణపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటే ఇటువంటి హత్యయత్నాలు జరిగేవి కావన్నారు. కేసు విషయమై ఏలూరు ఎస్పీతో మాట్లాడానన్నా రు. నిందితులకు శిక్ష పడేవరకూ పార్టీ పరంగా దళితులకు అండగా ఉంటామన్నారు. రోడ్డుపై చేసిన ఆందోళనపై దానిగూడెం దళితులపై కేసు నమోదు చేసినట్టు తెలిసిందని, తక్షణమే ఈ కేసును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దోషులను కఠినంగా శిక్షంచకపోతే పార్టీపరంగా ఆందోళన చేస్తామని హె చ్చరించారు. స్థానిక ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ ప క్కన కూర్చుని రౌడీయిజం చేస్తున్న సంఘ విద్రోహులను పక్కన పెట్టి ప్రశాంత వాతావరణం కల్పించాలని డీఎన్నార్ కోరారు. -
బ్రిటన్ మినిస్టర్ కావడమే లక్ష్యం
సాక్షి, భీమవరం: బ్రిటన్ మినిస్టర్ కావడమే తన లక్ష్యమని లండన్లోని రాయల్ బరో ఆఫ్ కెన్జింగ్టన్ అండ్ చెల్సియా డిప్యూటీ మేయర్ ఆర్యన్ ఉదయ్ ఆరేటి చెప్పారు. యూకే కాలేజీలో తెలుగు విద్యార్థుల పట్ల వివక్షకు వ్యతిరేకంగా పోరాడి స్టూడెంట్ ఎన్నికల్లో గెలవడమే తన రాజకీయ ప్రవేశానికి కారణమని తెలిపారు. అనంతరం కన్జర్వేటివ్ పార్టీలో చేరి రెండుసార్లు కౌన్సిలర్గా గెలిచినట్లు చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం సమీపంలోని తుందుర్రు గ్రామానికి చెందిన ఆర్యన్ ఉదయ్ శుక్రవారం.. భీమవరం వచ్చారు. తాను చదువుకున్న సెయింట్ మెరీస్ స్కూల్లో విద్యార్థులతో మమేకమయ్యారు. ఈ సందర్భంగా ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. తన బాల్యం, చదువు, బ్రిటన్ రాజకీయాల్లో ఎదుగుదల, తన లక్ష్యాల గురించి వివరించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. టెన్నిస్ కోసం లండన్కు మాది భీమవరం పక్కనే ఉన్న తుందుర్రు గ్రామం. ఆరేటి వీరాస్వామి, గొబ్బిలమ్మ తాత నాయనమ్మ. తండ్రి వెంకటసత్యనారాయణ కేజీఆర్ ప్రిన్సిపల్గా పనిచేశారు. తల్లి విజయలక్ష్మి, సోదరి ఇంద్రాణి. 7వ తరగతి వరకు భీమవరంలోని సెయింట్ మేరీస్ స్కూల్లో చదువుకున్నా. అప్పటికే ఏపీ తరఫున టెన్నిస్ ఆడుతున్న నేను ఆటపై ఆసక్తితో 8వ తరగతి హైదరాబాద్లో చేరాను. స్కూల్ నేషనల్స్, ఇంటర్ స్టేట్ కాంపిటీషన్స్కు ఏపీ కెపె్టన్గా వ్యవహరించాను. నా స్నేహితులు చాలామంది యూఎస్, యూకే వెళ్లేవారు. గ్రాడ్యుయేషన్ తరువాత టెన్నిస్ కోసం యూకే వెళ్లాను. 2006లో ఏయూ స్కాలర్షిప్ రావడంతో లండన్లో ఎంఎస్ చేశాను. రాజకీయాల్లోకి.. యూకే కాలేజీలో తెలుగు విద్యార్థుల పట్ల వివక్ష పూరిత సంఘటనలకు వ్యతిరేకంగా పోరాడేవాడిని. అప్పుడే స్టూడెంట్స్ ఎన్నికల్లో గెలవడం నాలో ఆత్మస్థైర్యం, నమ్మకం పెంచాయి. చదువు అనంతరం అక్కడే ఉండి బిజినెస్ చేసుకుంటూ కన్జర్వేటివ్ పార్టీ ఫాలోవర్గా ఉన్నాను. అక్కడి సిటిజన్షిప్ కూడా వచ్చింది. బ్రిగ్జిట్ టైంలో డేవిడ్ కేమరూన్ టీంలో చేరాను. నా అనాలసిస్, స్ట్రాటజీని చూసి కన్జర్వేటివ్ పార్టీ తరఫున పనిచేయాలని ప్రోత్సహించేవారు. 2014లో పార్టీలో సభ్యుడిగా చేరాను. రెండు, మూడు సంవత్సరాలు పార్టీ విధివిధానాలు, రాజకీయ పరిస్థితులను సైలెంట్గా అబ్జర్వ్ చేస్తూ వచ్చాను. ఇక్కడి మాదిరి అక్కడ కూడా రాజకీయ పారీ్టల్లో అంతర్గత విభేదాలు, వివక్ష కామనే. ఈ పరిస్థితులను బట్టి బ్రిటిష్ వాళ్లు మనల్ని రూల్ చేయలేదు. మన అంతర్గత కొట్లాటలతో మనమే పాలించబడ్డామని నా అభిప్రాయం. ఎవరినీ తక్కువ అంచనా వేయకూడదు యువత కులమతాలు, ప్రాంతీయ విభేదాలు విడిచిపెట్టి కలిసుండాలి. అనవసరమైన ఆర్భాటాలు, పబ్లిసిటీలకు దూరంగా ఉండాలి. ఎవరినీ తక్కువ అంచనా వేయకుండా లక్ష్యాన్ని చేరేందుకు ముందుకు సాగాలి. 2018, 2022ల్లో సెంట్రల్ కౌన్సిలర్గా ఎన్నిక నిజాం కాలేజీలో ఇంటర్ చదువుతున్న రోజుల్లో ఆర్ఎస్ఎస్కు ఆకర్షితుడినయ్యాను. లండన్లోను దేవాలయాలకు వెళ్లి దీపారాధన చేసేవాడిని. భారతీయులు, మన సంప్రదాయాలను ఎంతో గౌరవించే పార్టీ చైర్మన్, మాజీ మేయర్ జూలీమీల్స్ నన్ను ఎంతో ప్రోత్సహించేవారు. అందరితో కలుపుగోలుతనం నాకు కలిసొచ్చింది. ఇంటర్నల్ ఓటింగ్లో తెల్లవాళ్లకంటే అత్యధిక మెజార్టీ సాధించడంతో 2017లో నాకు సీట్ డిక్లేర్ అయ్యింది. 2018లో జరిగిన ఎన్నికల్లో మొదటిసారి సెంట్రల్ కౌన్సిలర్గా గెలిచాను. కౌన్సిలర్ అంటే ఇక్కడ ఎమ్మెల్యేతో సమానం.2022 ఎన్నికల్లోను వరుస విజయాన్ని అందుకున్నాను. లండన్లోని ముఖ్యమైన ప్రాంతానికి డిప్యూటీ మేయర్గా సుమారు రెండున్నర లక్షలమందికి ప్రాతినిధ్యం వహిస్తున్నాను. ప్లానింగ్, లైసెన్సింగ్, ఎని్వరాన్మెంట్ తదితర కీలక కమిటీల్లో సభ్యుడిగా ఉన్నాను. మేయర్ అందుబాటులో లేని సమయంలో ఆ బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంటుంది. భారత్, బ్రిటన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లో ఆక్వా, ఎన్విరాన్మెంట్కు సంబంధించి కొన్ని పాలసీలు చేయాలని అనుకున్నాం. కానీ సెంట్రల్ స్థాయిలో మా పార్టీ ఓడిపోవడంతో అది సాధ్యం కాలేదు. భవిష్యత్తులో ఆ దిశగా కృషిచేస్తాను. దేవుడి దయతో ఈ స్థాయికి వచ్చాను. వచ్చే ఎన్నికల్లో మేయర్ కావాలన్నదే నా లక్ష్యం. ఎంపీ కావడం, అనంతరం మినిస్టర్ అవడం తదుపరి లక్ష్యాలు. -
జీడిమామిడి కనుమరుగు
● సరైన ప్రోత్సాహం లేక తోటలు నరికివేత ● ఏజెన్సీ మండలాల్లో 6 వేల ఎకరాలకు పడిపోయిన విస్తీర్ణం బుట్టాయగూడెం: ఏజెన్సీ ప్రాంతంలోని గ్రామాల్లో పోడు వ్యవసాయం తర్వాత అత్యధికంగా గిరిజనులు జీడిమామిడి సాగు చేస్తున్నారు. ఐటీడీఏ ద్వారా ఈ ప్రాంతంలో సుమారు 20 వేల ఎకరాల వరకూ రైతులు జీడిమామిడి పంట వేశారు. ప్రస్తుతం జీడిమామిడి పంటల స్థానంలో రైతులు ప్రత్యామ్నాయ పంట వైపు దృష్టి సారించారు. దీంతో జీడిమామిడి తోటలను తొలగిస్తున్నారు. తోటల స్థానంలో పామాయిల్, మొక్కజొన్న, పొగాకు, అరటి వంటి వాణిజ్యపంటలను పండిస్తున్నారు. ప్రస్తుతం 5 వేల ఎకరాల వరకూ రైతులు జీడిమామిడి తోటలను తొలగించినట్లు సమాచారం. భవిష్యత్లో ఇంకా తగ్గే అవకాశం ఉంది. ప్రోత్సాహం కరువు ఐటీడీఏ పరిధిలో ఉన్న గిరిజన మండలాల్లో గిరిజన రైతులు జీడిమామిడి పంటల సాగుతో అధిక లాభాలను సాధిస్తున్నారు. అయితే గిట్టుబాటు ధరతోపాటు సరైన ప్రోత్సహం ఐటీడీఏ ద్వారా అందించకపోవడం వల్ల వాణిజ్యపంటలపై రైతులు దృష్టి సారిస్తున్నారు. ముఖ్యంగా కొండరెడ్డి గ్రామాల్లో పోడు వ్యవసాయం తర్వాత జీడిమామిడి పంటలే ప్రధానం. దీనిని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందంటున్నారు.జీడిమామిడి రైతులను ఐటీడిఏ అధికారులు ప్రోత్సహించాలి. జీసీసీ ద్వారా జీడిగింజలను కొనుగోలు చేసి గిరిజన రైతులు ఆదాయం పొందేలా చూడాలి. రానురానూ జీడిమామిడి పంటల విస్తీర్ణం తగ్గిపోతోంది. కారం రాఘవ, న్యూడెమోక్రసీ నేత, అలివేరు, బుట్టాయగూడెం మండలం గిరిజన ప్రాంతంలో ఎంతో మంది రైతులకు లాభాలు అందించిన జీడిమామిడి తోటలు నేడు నరికేస్తున్నారు. బుట్టాయగూడెం, జీలుగుమిల్లి మండలాల్లో అత్యధికంగా జీడిమామిడి పంటలను రైతులు తొలగిస్తున్నారు. చెట్లను నరికి కట్టెలుగా మార్చి బేరన్ పుల్లగా తరలిస్తున్నారు. కలపను తరలించి ఆ భూముల్లో ప్రత్యామ్నాయ పంటల కోసం భూములను సిద్ధం చేస్తున్నారు. -
పరిహారం లేదు.. పథకమూ అందదు
● కూటమి ప్రభుత్వ నిర్వాకం ● ఘొల్లుమంటున్న విలీన మండలాల రైతులు కుక్కునూరు: రాష్ట్రంకోసం.. పోలవరం ప్రాజెక్టు కోసం సర్వం త్యాగం చేసిన విలీన మండలాల రైతులపై కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. పోలవరం ముంపు పేరుతో అటు అభివృద్ధి పనులు చేయకుండా, ఇటు పరిహారం ఇవ్వకపోవడమే కాకుండా ప్రభుత్వ పథకాలు కూడా వారికి అందకపోవడంతో నిర్వాసితులు తామేం పాపం చేశామని వాపోతున్నారు. రైతుకు పెట్టుబడి సాయం కింద ఇస్తామన్న అన్నదాత సుఖీభవ రూ.7 వేలు ఆర్థిక సాయం గత ప్రభుత్వం పట్టాదారు లేకపోతే వారి వారసులకు అందించగా కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక నామినీలను అనర్హులుగా పేర్కొంది. ఆ తరువాత రైతుల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో మరలా వారంరోజులు సమయం ఇచ్చి ఆన్లైన్ చేయించుకునే అవకాశం కల్పించింది. దీంతో చాలా మంది రైతులు అన్నదాత సుఖీభవ పథకానికి దూరమయ్యారు. ఎల్టీ అగ్రికల్చర్ కలెక్షన్లు లేవు ప్రభుత్వం వ్యవసాయం కోసం అందించే ఎల్టీ అగ్రికల్చర్ కనెక్షన్ను తాజాగా రైతులకు దూరం చేసింది. గత జనవరి వరకు ప్రభుత్వం కొత్త అగ్రికల్చర్ కనెక్షన్లు మంజూరు చేయగా ప్రస్తుతం ఎల్టీ అగ్రికల్చర్ కనెక్షన్ కొరకు స్థానిక సబ్స్టేషన్కు రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు వెళ్లిన రైతులకు వెబ్ల్యాండ్ ఫ్రీజ్లో ఉండడంతో ఆధార్ కార్డ్ నెంబర్లు టైప్ చేస్తే ఆన్లైన్లో ఎటువంటి డేటా చూపించడంలేదని విద్యుత్ సిబ్బంది చెబుతున్నారు. దీంతో రైతులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. మండలంలో ముంపునకు గురవుతున్న భూములకు సంబంధించి పోలవరం భూసేకరణ పూర్తికాగా ఇంకా ముంపునకు గురికాని భూములు దాదాపు 50 శాతంకు పైగా ఉన్నాయి. ఇప్పుడు ఆ భూ యజమానులు మా భూములకు పరిహారం అయినా అందించండి లేకపోతే సాగు చేసుకునేందుకు విద్యుత్ కనెక్షన్ అయినా అందించాలని కోరుతున్నారు. అంతేకాక రాష్ట్రమంతా ఓ న్యాయం మాకో న్యాయమా అని బహిరంగంగానే కూటమి ప్రభుత్వ తీరును విమర్శిస్తున్నారు. బిందు సేద్యం దూరం ప్రభుత్వం ఉద్యాన రైతులకు అందించే బిందు సేద్యాన్ని కూడా విలీన రైతులు దరఖాస్తు చేసుకునే అవకాశం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బిందు సేద్యం చేస్తున్న గిరిజనేతర రైతులకు కేంద్ర ప్రభుత్వం 90 శాతం సబ్సిడీ ఇస్తుండగా, గిరిజన రైతులకు వందశాతం సబ్సిడీ ఇస్తుంది. ప్రస్తుతం బిందు సేద్యం కోసం దరఖాస్తు చేసుకునేందుకు వెబ్ల్యాండ్ ఫ్రీజింగ్ కారణంగా జియోట్యాగింగ్ చేసుకునేందుకు పలు గ్రామాల పేర్లు చూపించకపోవడంతో రైతులకు బిందు సేద్యానికి దరఖాస్తు చేసుకునే అవకాశం లేదని అధికారులు చెబుతున్నారు. నాకు కివ్వాక గ్రామంలో 2.5 ఎకరాల సాగు భూమి ఉంది. సదరు భూమి ముంపులో లేదు. ఆ భూమిలో సాగు చేసుకునేందుకు అగ్రికల్చర్ కనెక్షన్ కొరకు దరఖాస్తు చేసుకుందామంటే విద్యుత్ సిబ్బంది ఆన్లైన్ చేసేందుకు మీ గ్రామం సైట్లో చూపించడంలేదంటున్నారు. మా భూములకు పరిహారం అయినా ఇవ్వండి లేదంటే విద్యుత్ కనెక్షన్కు అవకాశం కల్పించండి. – పగిళ్ల ప్రసాద్, కివ్వాక, కుక్కునూరు మండలంవ్యవసాయ విద్యుత్ మోటార్ కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకునే రైతుల ఆధార్ వివరాలు కుక్కునూరు మండల వెబ్ ల్యాండ్ ఫ్రీజింగ్లో ఉండడంతో రిజిస్ట్రేషన్ చేసే సమయంలో ఆన్లైన్లో రైతుల వివరాలు చూపించడం లేదు. దీంతో రైతులకు కొత్త కనెక్షన్ పొందే అవకాశం లేకుండా పోయింది. ఈ సమస్యకు పరిష్కారం చూపాలి. – ఎంఎం పాపారావు, అసిస్టెంట్ ఇంజనీర్, కుక్కునూరుమా భూములకు సంబంధించి వెబ్ ల్యాండ్ ఫ్రీజింగ్లో ఉండడంతో మిర్చి తదితర పంటలకు డ్రిప్ వేసుకునేందుకు దరఖాస్తు చేసుకునే అవకాశం లేకుండా పోయింది. ముంపులో లేని భూములకు పథకాలు వర్తింపజేసేలా అధికారులు చర్యలు చేపట్టాలి. – మచ్చా రాజులు, ఇసుకపాడు, కుక్కునూరు మండలం -
నాటుసారా కేంద్రాలపై దాడి
కుక్కునూరు: నాటుసారా తయారీ కేంద్రాలపై ఆదివారం కుక్కునూరు పోలీసులు దాడి చేసి 600 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. కుక్కునూరు ఎస్సై రాజారెడ్డి వివరాల ప్రకారం, మండలంలోని సీతారామనగరం గ్రామ శివారులోని కిన్నెరసాని వాగు ఒడ్డున నాటుసారా తయారు చేస్తున్నారన్న సమాచారం మేరకు ఆదివారం దాడులు నిర్వహించినట్టు చెప్పారు. దాడులలో సారా తయారు చేసేందుకు సిద్ధంగా ఉంచిన 600 లీటర్ల బెల్లం ఊటను స్వాధీనం చేసుకోని ధ్వంసం చేసినట్టు తెలిపారు. 10 లీటర్ల నాటుసారాను ఓ వ్యక్తి నుంచి స్వాధీనం చేసుకుని అతనిపై కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. సారా నియంత్రణకు పోలీసులు తీసుకుంటున్న చర్యలకు ప్రజలు సహకరించాలని భవిష్యత్తులో ఇలాంటి దాడులు కొనసాగుతాయని తెలిపారు. -
బ్రిటన్ మంత్రి కావడమే లక్ష్యం
సాక్షి, భీమవరం: బ్రిటన్ మంత్రి కావడమే తన లక్ష్యమని లండన్లోని రాయల్ బరో ఆఫ్ కెన్సింగ్టన్ అండ్ చెల్సియా డిప్యూటీ మేయర్ ఆర్యన్ ఉదయ్ ఆరేటి చెప్పారు. యూకే కాలేజీలో తెలుగు విద్యార్థుల పట్ల వివక్షకు వ్యతిరేకంగా పోరాడి స్టూడెంట్ ఎన్నికల్లో గెలవడమే తన రాజకీయ ప్రవేశానికి కారణమని తెలిపారు. అనంతరం కన్జర్వేటివ్ పార్టీలో చేరి రెండుసార్లు కౌన్సిలర్గా గెలిచినట్లు చెప్పారు. భీమవరం సమీపంలోని తుందుర్రు గ్రామానికి చెందిన ఆర్యన్ ఉదయ్ ఇటీవల భీమవరం వచ్చారు. ఈ సందర్భంగా ఆయన శ్రీసాక్షిశ్రీతో మాట్లాడారు. తన బాల్యం, చదువు, బ్రిటన్ రాజకీయాల్లో ఎదుగుదల, తన లక్ష్యాల గురించి వివరించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. టెన్నిస్ కోసం లండన్కు మాది భీమవరం పక్కనే ఉన్న తుందుర్రు. తాత నాయనమ్మల పేర్లు ఆరేటి వీరాస్వామి, గొబ్బిలమ్మ. తండ్రి వెంకటసత్యనారాయణ కేజీఆర్ ప్రిన్సిపల్గా పనిచేశారు. తల్లి విజయలక్ష్మి, సోదరి ఇంద్రాణి. 7వ తరగతి వరకు భీమవరంలోని సెయింట్ మేరీస్ స్కూల్లో చదువుకున్నా. అప్పటికే ఏపీ తరఫున టెన్నిస్ ఆడుతున్న నేను ఆటపై ఆసక్తితో 8వ తరగతి హైదరాబాద్లో చేరాను. స్కూల్ నేషనల్స్, ఇంటర్ స్టేట్ కాంపిటీషన్స్కు ఏపీ కెప్టెన్గా వ్యవహరించాను. నా స్నేహితులు చాలామంది యూఎస్, యూకే వెళ్లేవారు. గ్రాడ్యుయేషన్ తరువాత టెన్నిస్ కోసం యూకే వెళ్లాను. 2006లో ఏయూ స్కాలర్షిప్ రావడంతో లండన్లో ఎంఎస్ చేశాను. రాజకీయాల్లోకి.. యూకే కాలేజీలో తెలుగు విద్యార్థుల పట్ల వివక్ష పూరిత సంఘటనలకు వ్యతిరేకంగా పోరాడేవాడిని. అప్పుడే స్టూడెంట్స్ ఎన్నికల్లో గెలవడం నాలో ఆత్మస్థైర్యం, నమ్మకం పెంచాయి. చదువు అనంతరం అక్కడే ఉండి బిజినెస్ చేసుకుంటూ కన్జర్వేటివ్ పార్టీ ఫాలోవర్గా ఉన్నాను. అక్కడి సిటిజన్షిప్ కూడా వచ్చింది. బ్రెగ్జిట్ టైంలో ప్రధాని డేవిడ్ కేమరూన్ టీంలో చేరాను. నా అనాలసిస్, స్ట్రాటజీని చూసి కన్జర్వేటివ్ పార్టీ తరఫున పనిచేయాలని ప్రోత్సహించేవారు. 2014లో పార్టీలో సభ్యుడిగా చేరాను. రెండు, మూడు సంవత్సరాలు పార్టీ విధివిధానాలు, రాజకీయ పరిస్థితులను సైలెంట్గా అబ్జర్వ్ చేస్తూ వచ్చాను. ఇక్కడి మాదిరి అక్కడ కూడా రాజకీయ పార్టీల్లో అంతర్గత విభేదాలు, వివక్ష కామన్. సెంట్రల్ కౌన్సిలర్గా ఎన్నిక నిజాం కాలేజీలో ఇంటర్ చదువుతున్న రోజుల్లో ఆర్ఎస్ఎస్కు ఆకర్షితుడినయ్యాను. లండన్లోను దేవాలయాలకు వెళ్లి దీపారాధన చేసేవాడిని. భారతీయులను, మన సంప్రదాయాలను ఎంతో గౌరవించే పార్టీ చైర్మన్, మాజీ మేయర్ జూలీమీల్స్ నన్ను ఎంతో ప్రోత్సహించేవారు. అందరితో కలుపుగోలుతనం నాకు కలిసొచ్చింది. ఇంటర్నల్ ఓటింగ్లో తెల్లవాళ్లకంటే అత్యధిక మెజార్టీ సాధించడంతో 2017లో నాకు సీట్ డిక్లేర్ అయ్యింది. 2018లో జరిగిన ఎన్నికల్లో మొదటిసారి సెంట్రల్ కౌన్సిలర్గా గెలిచాను. కౌన్సిలర్ అంటే ఇక్కడ ఎమ్మెల్యేతో సమానం. 2022 ఎన్నికల్లోను వరుస విజయాన్ని అందుకున్నాను. లండన్లోని ముఖ్యమైన ప్రాంతానికి డిప్యూటీ మేయర్గా సుమారు రెండున్నర లక్షలమందికి ప్రాతినిధ్యం వహిస్తున్నాను. ప్లానింగ్, లైసెన్సింగ్, ఎన్విరాన్మెంట్ తదితర కీలక కమిటీల్లో సభ్యుడిగా ఉన్నాను. మేయర్ అందుబాటులో లేని సమయంలో ఆ బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంటుంది. భారత్, బ్రిటన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లో ఆక్వా, ఎన్విరాన్మెంట్కు సంబంధించి కొన్ని పాలసీలు చేయాలని అనుకున్నాం. కానీ సెంట్రల్ స్థాయిలో మా పార్టీ ఓడిపోవడంతో అది సాధ్యం కాలేదు. భవిష్యత్తులో ఆ దిశగా కృషిచేస్తాను. దేవుడి దయతో ఈ స్థాయికి వచ్చాను. వచ్చే ఎన్నికల్లో మేయర్ కావాలన్నదే నా లక్ష్యం. ఎంపీ కావడం, అనంతరం మినిస్టర్ అవడం తదుపరి లక్ష్యాలు. ఎవరినీ తక్కువ అంచనా వేయకూడదు యువత కులమతాలు, ప్రాంతీయ విభేదాలు విడిచిపెట్టి అందరితో కలిసుండాలి. అనవసరమైన ఆర్భాటాలు, పబ్లిసిటీలకు దూరంగా ఉండాలి. ఎవరినీ తక్కువ అంచనా వేయకుండా లక్ష్యాన్ని చేరేందుకు ముందుకు సాగాలి యూకే స్టూడెంట్స్ ఎన్నికల్లో గెలుపే రాజకీయాల వైపు నడిపించింది రెండుసార్లు కౌన్సిలర్గా గెలుపొందా అందరితో కలుపుగోలుతనమే నా విజయ రహస్యం ‘సాక్షి’తో లండన్లోని కెన్సింగ్టన్ అండ్ చెల్సియా డిప్యూటీ మేయర్ ఆర్యన్ ఉదయ్ స్వస్థలం భీమవరంలో సహ విద్యార్థులతో మమేకం -
పెద్దింట్లమ్మ దేవస్థానంలో భక్తుల రద్దీ
కై కలూరు: కొల్లేటికోట పెద్దింట్లమ్మ దేవస్థానం భక్తులతో ఆదివారం కిటకిటలాడింది. సమీప జిల్లాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు విచ్చేశారు. దేవస్థాన సమీప పవిత్ర కోనేరులో స్నానాలు ఆచరించి అమ్మవారికి వేడి నైవేద్యాలను సమర్పించారు. ఆలయ ఉప ప్రధాన అర్చకుడు పేటేటి పరమేశ్వరశర్మ పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఆలయ ఈవో కూచిపూడి శ్రీనివాసు మాట్లాడుతూ రూ.19,185 ఆదాయం వచ్చిందని తెలిపారు. దెందులూరు: రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. పోలీసుల వివరాల ప్రకారం.. సీతంపేట సమీపంలోని రైల్వేస్టేషన్ వద్ద వ్యక్తి మృతదేహాన్ని గుర్తించారు. అతని ముఖం గుర్తించడానికి వీలు లేకుండా ఉంది. మృతుడు ఎరుపు రంగు చొక్కా ధరించాడు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉందని.. ఇతర వివరాలకు ఏలూరు రైల్వే పోలీసులను సంప్రదించాలన్నారు. -
పీ–సెట్ నోటిఫికేషన్ విడుదల
దెందులూరు: ఆంధ్రప్రదేశ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (పీ సెట్) నోటిఫికేషన్ నాగార్జున యూనివర్సిటీ విడుదల చేసిందని గోపన్నపాలెం ప్రభుత్వ వ్యాయామ విద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్.నతానియేలు అన్నారు. ఆదివారం వ్యాయామ కళాశాలలో ఆయన మాట్లాడుతూ బీపీఈడీ, డీపీఈడీ కోర్సులలో అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ నెల 13 వరకు దరఖాస్తు చేసుకోవటానికి గడువు ఉందన్నారు. ముసునూరు: మద్యం మత్తులో కింద పడడంతో తలకు తీవ్రగాయమై వ్యక్తి మృతి చెందిన సంఘటన మండలంలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. మండలంలోని రమణక్కపేటకు చెందిన తోట మురళీకృష్ణ(31) శనివారం సాయంత్రం మద్యం సేవించి ఇంటికి వచ్చాడు. అర్థరాత్రి మూత్ర విసర్జనకు బయటకు వస్తూ, తూలి గచ్చుపై పడ్డాడు. గచ్చు కోణం తలకు తగలడంతో తీవ్రంగా గాయపడి, అధిక రక్తస్రావమైంది. క్షతగాత్రుడిని బంధువులు నూజివీడు ఏరియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. ద్వారకాతిరుమల: మండల కేంద్రమైన ద్వారకాతిరుమలలో ఆదివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఉన్నట్టుండి ఒక్కసారిగా మొదలైన వర్షం అరగంట పాటు ఏకధాటిగా పడింది. దాంతో డ్రైనేజీలు పొంగి పొర్లడంతో మురుగు, చెత్తాచెదారం రోడ్లపైకి చేరింది. వర్షపు నీరు రోడ్లపై ప్రవహించడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొండపై నుంచి లింగయ్య చెరువులోకి భారీగా నీరు ప్రవహించింది. పెనుగొండ: పౌర్ణమి సందర్భంగా ఆదివారం గోదావరి మాతకు హిందూ ధర్మ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో హరతులనిచ్చారు. కలగభద్రుడు అర్చకత్వంలో ఏకముఖ, ద్విముఖ, చతుర్థ, పంచమ, కుంభ, నక్షత్ర, పూర్ణ, కుంభ, సర్ప హారతులనిచ్చారు. కార్యక్రమంలో హిందూ ధర్మ సమితి సభ్యులు పాల్గొన్నారు. -
భీమవరంలో రఘురామ పెత్తనమేంటి?
భీమవరం: భీమవరం మున్సిపాలిటీ మంచినీటిని విస్సాకోడేరు పంచాయతీలోని నాన్ లేఅవుట్కు తరలించడంపై ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు స్పందించకుండా ఉండి ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ కనుమూరు రఘురామకృష్ణరాజు మాట్లాడటం విడ్డూరంగా ఉందని వైఎస్సార్సీపీ నాయకులు దుయ్యబట్టారు. శనివారం రాయలంలో వైఎస్సార్సీపీ భీమవరం నియోజకవర్గ సమన్వయకర్త చినమిల్లి వెంకటరాయుడు నివాసంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పార్టీ జిల్లా అధికార ప్రతినిధి కామన నాగేశ్వరరావు మాట్లాడుతూ భీమవరంలోని శివారు ప్రాంతాలకు తాగునీరు అందక ప్రజలు ఇబ్బంది పడుతుంటే ఎమ్మెల్యే అంజిబాబు, మున్సిపల్ అఽధికారులు పట్టించుకోవడం లేదన్నారు. అయినా ఉండి నియోజవకర్గంలోని విస్సాకోడేరు పరిధిలోని నాన్ లే అవుట్కు ప్రత్యేకంగా పైప్లైన్ వేసి నీటిని సరఫరా చేయడాన్ని తాము ప్రశ్నిస్తే డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు తనపై వ్యక్తిగత దూషణలతో మాట్లాడటం బాధాకరమన్నారు. రఘురామకు రాజకీయాలు తెలియని రోజుల నుంచి తాను ప్రజాసమస్యలపై పోరాటం చేస్తున్నానని, విద్యార్థి సంఘ నాయకుడిగా, మున్సిపల్ వైస్ చైర్మన్గా సమస్యలపై పోరాడానన్నారు. వ్యక్తిగత దూషణ సరికాదు ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్ మాట్లాడుతూ వైఎస్సార్సీపీతో ఎదిగిన డిప్యూటీ స్పీకర్ ఆ పార్టీని కించపర్చేలా, బీసీ నాయకుడు నాగేశ్వరరావును వ్యక్తిగతంగా దూషించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చే శారు. వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు గూడూరి ఉమాబాల మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్రెడ్డికి ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి రూల్స్ ఒప్పుకోవని చెబుతున్న డిప్యూటీ స్పీకర్ మున్సిపాలిటీ తాగునీటిని గ్రామ పంచాయతీకి ఇవ్వడానికి రూల్స్ ఎలా ఒప్పుకుంటాయో చెప్పాలన్నారు. వెంకటరాయుడు మాట్లాడుతూ గతంలో రాయలం గ్రామానికి మున్సిపల్ నీరు ఇవ్వాలని కోరితే అభ్యంతరం చెప్పిన అధికారులు ఇప్పుడు విస్సాకోడేరు పంచాయతీకి పైప్లైన్ ఎలా వేశారని ప్రశ్నించారు. భీమవరం నియోజకవర్గంపై ఉండి ఎమ్మెల్యే పెత్తనం ఏంటని నిలదీశారు. పార్టీ నాయకులు ఏఎస్ రాజు, చవాకుల సత్యనారాయణ, గాదిరాజు రామరాజు, చిగురుపాటి సందీప్, పాలవెల్లి మంగ, మానుకొండ ప్రదీప్ పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ నాయకుల ధ్వజం -
శ్శశానంలో ట్రాన్స్ఫార్మర్తో ప్రాణాపాయం
ఉండి: పాములపర్రు దళితుల శ్శశాన వాటికలో అక్రమంగా ఏర్పాటుచేసిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ను తొలగించాలంటూ పాములపర్రు గ్రామానికి చెందిన దళిత మహిళలు ఉండి విద్యుత్ సబ్స్టేషన్ లోని ఏఈ కార్యాలయాన్ని ముట్టడించారు. గత నెల 22న విద్యుత్ సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదు చేయగా ట్రాన్స్ఫార్మర్ విద్యుత్ కనెక్షన్ తొలగించిన అధికారులు తిరిగి ఈనెల 4న విద్యుత్ కనెక్షన్ను పునరుద్ధరించడంపై శనివారం మండిపడ్డారు. సదరు రైతుకు నోటీసు పంపిస్తామని, ఇందుకు వారం రోజులు సమయం కావాలని ఏపీ పి.శ్రీనివాసరావు తెలపగా మహిళలు ససేమిరా అన్నారు. మహిళలు కార్యాలయం ఎదుటే బైఠాయించి, అక్కడే భోజనాలు చేసి నిరసన తెలిపారు. విషయం తెలిసిన ఎస్సై ఎండీ నసీరుల్లా ఆధ్వర్యంలో పోలీసులు ఇక్కడకు చేరకుని మహిళలను చెదరగొట్టేందుకు ప్రయత్నించారు. అయినా మహిళలు పట్టువీడలేదు. పోలీసులు, విద్యుత్ అధికారులు, మహిళలకు మధ్య జరిగిన చర్చలు ఫలించకపోవడంతో నిరసన కార్యక్రమం శనివారం రాత్రి వరకు కొనసాగింది. గతంలో తాము ఫిర్యాదు చేయగా విద్యుత్ సరఫరా కట్ చేశారని, మరలా కూటమి నాయకుల ఒత్తిళ్లతో కనెక్షన్ను పనరుద్ధరించారని దళితులు ఆవేదన వ్యక్తం చేశారు. దళితుల శ్శశాన వాటికలో ట్రాన్స్ఫార్మర్ ప్రమాదకరంగా ఉందన్నారు. దీనిపై ఏఈ పి.శ్రీనివాసరావును వివరణ కోరగా ట్రాన్స్ఫార్మర్ విషయమై సదరు రైతుకు నోటీసులు ఇస్తామని, పరిశీలన చేసి చర్యలు తీసుకుంటామన్నారు. దళిత మహిళలు దర్శి మెర్సీ, ఆండ్రు సునీత, బడుగు మరియమ్మ తదితరులు పాల్గొన్నారు. -
ట్రంప్ పెత్తనాన్ని తిప్పికొట్టాలి
భీమవరం: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారతదేశంపై చేస్తున్న పెత్తనాన్ని తిప్పికొట్టాలని, భారత్పై సుంకాల పేరుతో సాగిస్తున్న కక్ష సాధింపులను విరమించుకోవాలని సీపీఐ, సీపీఎం జిల్లా కార్యదర్శులు కోనాల భీమారావు, జేఎన్వీ గోపాలన్ డిమాండ్ చేశారు. భారత దిగుమతులపై ట్రంప్ భారీగా సుంకాలు విధించడాన్ని నిరసిస్తూ స్థానిక ప్రకాశం చౌక్ వద్ద వామపక్షాల ఆధ్వర్యంలో శనివారం ధర్నా చేశారు. సుంకాలను రద్దు చేసేలా కేంద్ర ప్రభుత్వం అమెరికాపై ఒత్తిడి తేవాలన్నారు. అమెరికా సుంకాలతో ఆక్వా, ఫార్మా, ఆటోమొబైల్ ఇలా పలు రంగాలు కుదేలయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించడానికి కూటమి ప్రభుత్వం కూడా ఏ మాత్రం నిరసన వ్యక్తం చేయకపోవడం దుర్మార్గమన్నారు. ఫార్వర్డ్ బ్లాక్ జిల్లా కార్యదర్శి లంక కృష్ణమూర్తి, ఎంసీపీయూ నాయకుడు జి.రాంబాబు, సీపీఐ, సీపీఎం నాయకులు పాల్గొన్నారు. వామపక్షాల ఆధ్వర్యంలో నిరసన -
మమ అనిపించారు
ఉండి: ఉండి బస్టాండ్లో రోడ్ల దుస్థితిపై ‘సాక్షి’లో ప్రచురించిన కథనానికి అధికారులు స్పందించా రు. శనివారం బస్టాండ్ ప్రాంగణంలో రోడ్లపై గోతులను కంకరతో పూడ్చించి నామమాత్రంగా పనులు చేయించారు. అయితే మెత్తటి కంకరతో రోడ్లు పూడ్చించడంతో ప్రయాణికులకు ఇబ్బందులు తప్పవని పలువురు అంటున్నారు. వర్షం వస్తే బస్టాండ్లోనికి వెళ్లేందుకు గతంలో కొద్దోగొప్పో అవకాశం ఉండేదని, ఇప్పుడు చా లా ఇబ్బంది పడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉండి: చెరుకువాడలో దళితులపై దాడి చేసి కులం పేరుతో దూషించిన వారిపై అట్రాసిటీ కేసులు నమోదు చేసి, దళితులకు రక్షణ కల్పించాలని దళిత ఐఖ్యవేదిక రాష్ట్రాధ్యక్షుడు గంటా సుందర్కుమార్ డిమాండ్ చేశారు. శనివారం చెరుకువాడలో దళితులు చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. భీమవరం (ప్రకాశంచౌక్)/తాడేపల్లిగూడెం (టీ ఓసీ): తాడేపల్లిగూడెం మండలం ఆరుగొలనులోని ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూ ల్స్ పీజీటీ భీమడోలు రాజారావును సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. పాఠశాలకు చెందిన బ్యాక్ పైపర్ బ్యాండ్ విద్యార్థుల బృందాన్ని అనుమతి లేకుండా నరసాపురంలోని ఓ ప్రైవేటు కళాశాల కార్యక్రమానికి పంపడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే జిల్లా కో–ఆర్డినేటర్ ఉమాకుమారికి షోకాజ్ నోటీసు ఇవ్వాల్సిందిగా ఆదేశించారు. -
మోసం చంద్రబాబు నైజం
పెంటపాడు: మోసపూరిత హామీలు ఇవ్వడం, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని దాటవేయడం చంద్రబాబు నైజమని మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ విమర్శించారు. శనివారం పడమరవిప్పర్రులో బాబు ష్యూరిటీ.. మోసం గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా ఇంటింటా ఆయన కూటమి ప్రభుత్వ వైఫల్యాలను వివరించారు. ఈ సందర్భంగా కొట్టు మాట్లాడుతూ మోసం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని, సూపర్సిక్స్ పేరుతో ప్రజలను వంచించారన్నారు. కూటమి నాయకులు ప్రజలకిచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ కూడా ఆలోచించాలన్నారు. చంద్రబాబు ఏం చెబితే దానికి తల ఊపడం సరికాదన్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలకు సీఎం చంద్రబాబు తూట్లు పొడిచారన్నారు. ప్రతి కార్యకర్త కూటమి వైఫల్యాలను ఇంటింటా వివరించాలని పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విచ్చలవిడి మద్యంతో ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. మద్యం మాఫియా సిండికేట్గా ధరలను ఇష్టారాజ్యంగా పెంచేస్తున్నారన్నా రు. ముందుగా పత్సా అంజిబాబు నివాసం వద్ద కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. పార్టీ అ ధ్యక్షులు జడ్డు హరిబాబు, వెలిచేటి నరేంద్ర, బండా రు నాగు, ములకాల రాంబాబు, పత్సా అంజిబా బు, ములకాల ప్రసాద్, ముప్పిడి సంపత్కుమార్, కర్రి భాస్కరరావు, కొలుకులూరి ధర్మరాజు తదితరులు పాల్గొన్నారు. మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ -
9న వైఎస్సార్సీపీ అన్నదాత పోరు
కాళ్ల: రాష్ట్రంలో వ్యవసాయం దండగ అన్న చంద్రబాబు పాలన నడుస్తోందని, రైతుల పక్షాన వైఎస్సార్సీపీ పోరుబాట పట్టిందని, ఈనెల 9న ఆర్డీఓ కార్యాలయాల వద్ద అన్నదాత పోరు కార్యక్రమం ద్వారా నిరసన తెలియజేయనున్నట్టు వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు తెలి పారు. పెదఅమిరంలోని పార్టీ కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రైతులపై కూటమి ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని, రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై అన్నదాతలతో కలిసి పోరాటం చేస్తామన్నారు. రైతుల సంక్షేమానికి దివంగత వైఎస్సార్, ఆయన తనయుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పెద్దపీట వేశారని, గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పెట్టుబడి సాయం, ఇన్పుట్ సబ్సిడీ, సున్నావడ్డీకే రుణాలు, సబ్సిడీపై పురుగు మందులు, ఎరువులు అందించామని గుర్తు చేశారు. ఉచిత బీమాతో రైతులను ఆదుకున్నామన్నారు. రాష్ట్రంలో 10,500 రైతు భరోసా కేంద్రాలు నిర్మిస్తే కూటమి ప్రభుత్వం వాటికి తాళాలు వేసిందని మండిపడ్డారు. బ్లాక్ మార్కెట్కు ఎరువులు ప్రస్తుత కూటమి పాలనలో విత్తనాలు, ఎరువులు బ్లాక్ మార్కెట్కు తరలిపోతున్నాయని ప్రసాద రాజు ఆరోపించారు. అయినా ముఖ్యమంత్రి, వ్య వసాయశాఖ మంత్రి స్పందించకపోగా రైతులను అవమానించేలా మాట్లాడుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో యూరియా బస్తా దొరకని పరిస్థితి నెలకొందని, ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమే అ న్నారు. రైతులు బ్లాక్లో రూ.200 నుంచి రూ.300 వరకు అదనంగా చెల్లించి కొనుగోలు చేయాల్సి వస్తుందని వాపోయారు. ఆక్వా రైతుల పరిస్థితి కూడా దయనీయంగా మారిందని, వరదల వల్ల పంట నష్టపోయిన రైతులకు ఇప్పటికీ పరిహారం అందలేదన్నారు. రైతుల పక్షాన ఈనెల 9న భీమవరం, నరసాపురం, తాడేపల్లిగూడెంలోని ఆర్డీఓ కా ర్యాలయాల వద్ద నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నామని, రైతులు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. అనంతరం అన్నదాత పోరు కరపత్రాలు ఆవిష్కరించారు. ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్, ఉండి, భీమవరం నియోజకవర్గాల ఇన్చార్జిలు పీవీఎల్ నరసింహరాజు, చినమిల్లి వెంకటరా యుడు, నరసాపురం పార్లమెంటరీ అధ్యక్షురాలు గూడూరి ఉమాబాల, కామన నాగేశ్వరరావు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. రైతులపై ప్రభుత్వానికి చిన్నచూపు యూరియా సరఫరాలో విఫలం రైతుల పక్షాన వైఎస్సార్సీపీ ఉద్యమం పార్టీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు -
ఎనీవేర్కు కేరాఫ్ ఉండి
దళితులపై దాడులు దారుణం కై కలూరు మండలం దానగూడెంలో దళితులపై జరిగిన దాడులను వివిధ సంఘాలు, పలు పార్టీల నాయకులు ఖండించారు. 8లో uమేం బానిసలం కాదు.. ప్రభుత్వ ఉద్యోగులమంటూ సచివాలయ ఉద్యోగులు పోరుబాట పట్టారు. నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. 8లో uఆదివారం శ్రీ 7 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025సాక్షి, భీమవరం/ ఉండి: పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలోని ఉండి, ఆకివీడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు లోపభూయిష్టంగా జ రుగుతున్నాయా? అమరావతి, చుట్టుపక్కల జి ల్లాల వారు రిజిస్ట్రేషన్ల కోసం ఇక్కడికి క్యూ కడుతున్నారా?.. అంటే అవుననే ఆరోపణలు వినిపిస్తు న్నాయి. ఇటీవల చోటుచేసుకున్న సంఘటనలు ఇందుకు బలం చేకూరుస్తున్నాయి. క్రయ, విక్రయదారులు ఇబ్బంది పడకుండా భూములు, స్థలాలను ఎక్కడైనా రిజిస్ట్రేషన్ చేసుకునే విధంగా ప్రభుత్వం ‘ఎనీవేర్ రిజిస్ట్రేషన్’ వీలు కల్పించింది. సాధారణంగా నిషేధిత జాబితాలోని భూములు, స్థలాలపై స్థానిక సబ్ రిజిస్ట్రార్లకు అవగాహన ఉంటుంది. ధ్రువీకరణ పత్రాలు, వ్యక్తులను క్షుణ్ణంగా పరిశీలించి అన్నీ సవ్యంగా ఉన్నాయనుకుంటేనే రిజిస్ట్రేషన్ చేస్తుంటారు. బయటి ప్రాంతాల్లోని వారికి ఈ భూములపై అవగాహన ఉండదు. బయటి ప్రాంతాల డా క్యుమెంట్లను క్షుణ్ణంగా పరిశీలించి, సంబంధిత ఏ రియాలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి అ న్నీ ధ్రువీకరించుకున్న తర్వాతనే రిజిస్ట్రేషన్లు చేయా లి. అయితే ఎనీవేర్ సాఫ్ట్వేర్ను దుర్వినియోగం చేస్తూ కొందరు అక్రమాలకు తెరలేపుతున్నారు. గతంలో మొగల్తూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో బయ టి ప్రాంతాలకు చెందిన నిషేధిత జాబితాలోని భూముల రిజిస్ట్రేషన్ చేశారన్న విషయంలో సబ్ రిజిస్ట్రార్పై చర్యలు తీసుకున్నారు. అయినా కొందరి తీరులో మార్పు రావడం లేదు. వందలాది ఎనీవేర్ రిజిస్ట్రేషన్లు ప్రస్తుతం ఉండి, ఆకివీడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనూ ఈ తరహా రిజిస్ట్రేషన్లు జరుగుతున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత మూడు నెలల్లో ఉండి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో 1,013 డాక్యుమెంట్లకు రిజిస్ట్రేషన్లు చేయగా వీటిలో 300 లకు పైగా ఇతర జిల్లాలకు చెందిన వారివే ఉన్నాయి. ఆకివీడులో వెయ్యికి పైనే రిజిస్ట్రేషన్లు జరగ్గా అక్కడ కూడా ఇదే పరిస్థితి ఉన్నట్టు సమాచారం. కృష్ణా జిల్లా బంటుమిల్లి, పెడన, మచిలీపట్నం, మండవల్లి, ఉయ్యూరు, ఏలూరు జిల్లా కై కలూరు, ప్రకాశం జిల్లా కనిగిరి, పల్నాడు జిల్లా గురజాల, గుంటూరు జిల్లా పెదకాకాని, జంగారెడ్డిగూడెం, భీమవరం తదితర ప్రాంతాలకు చెందిన వారి రిజిస్ట్రేషన్లు ఉన్నట్టు తెలుస్తోంది. ఎనివేర్ రిజిస్ట్రేషన్లకు సంబంధించి పూర్తి సమాచారం ఇచ్చేందుకు ఉన్నతాధికారుల అనుమతులు కావాలంటూ అధికారులు దాటవేత ధోరణి అవలంబిస్తున్నారు. మంగళ, శుక్రవారాలు, అమావాస్య రోజుల్లోనూ బయట జిల్లాల వారితో ఆయా కార్యాలయాలు కళకళలాడుతుంటాయని తెలిసింది. ఆయా కార్యాలయాల వద్ద లేఖర్లదే ఇష్టారాజ్యమంటున్నారు. ఎన్నో ఏళ్లుగా ఇక్కడ పాతుకుపోయిన కొందరు అన్నీ తామై వ్యవహరిస్తుంటారన్న ఆరోపణలు ఉన్నాయి. నా భూమిని నాకు స్వాధీనం చేయకపోవడంతో పాటు వేరే వారి పేరిట తప్పుడు రిజిస్ట్రేషన్ చేసిన అధికారులు, లేఖర్లపైనా చర్యలు తీసుకోవాలి. ఉన్నతాధికారులను అడుగుతుంటే సబ్ రిజిస్ట్రార్ సెలవులో ఉన్నారని చెబుతున్నారు. ఈ విషయమై పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేసినా నాకు న్యాయం జరగలేదు. సమస్యను పరిష్కరించినట్టుగా ఫేక్ ఫొటో అప్లోడ్ చేసి నా అర్జీని క్లోజ్ చేశారు. – కురెళ్ల రాజ్కుమార్, గణపవరం కాళ్ల మండలం కలవపూడిలో దాదాపు రూ.2.50 కోట్ల విలువైన 1.68 ఎకరాల గ్రామ కంఠం భూమిని జూన్ 30న ఒక సబ్ రిజిస్ట్రార్ తన భర్త పేరిట రిజిస్ట్రేషన్ చేసేశారు. ఈ విషయమై ఫిర్యాదు అందడంతో జూలై 15న రిజిస్ట్రేషన్ రద్దు చేస్తూ ఉన్నతాధికారులు ఆదేశాలిచ్చారు. ప్రస్తుతం ఈ విషయమై విచారణ కొనసాగుతున్నట్టు అధికారులు చెబుతున్నారు. కృష్ణా జిల్లా చినగొల్లపాలెంకు చెందిన ఏలూరి రంగబాబు కుటుంబానికి చినగొల్లపాలెంలో 32 ఎకరాల సాగు భూమి ఉంది. కొందరు ఉండి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఫేక్ రిజిస్ట్రేషన్ చేయించి ఈ భూమిని కాజేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు రంగబాబు ఆందోళనకు దిగారు. రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు అందుకు కొమ్ముకాస్తున్నారంటూ టెంట్ వేసి నిరసన తెలిపారు. గణపవరానికి చెందిన కురెళ్ల రాజ్కుమార్కు ఏలూరు జిల్లా కలిదిండి మండలం పటమటిపాలెంలోని 9 సెంట్ల భూమి ఉంది. ఏప్రిల్ 24న ఉండి సబ్ రిజిస్ట్రార్ ఈ భూమిని అదే గ్రామానికి చెందిన మరొకరి పేరిట రిజిస్ట్రేషన్ చేసేశారు. విషయం తెలుసుకున్న రాజ్కుమార్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో సవరణ పేరుతో తప్పుడు రిజిస్ట్రేషన్ చేసినట్టుగా విచారణలో నిర్ధారణ అయ్యింది. సబ్ రిజిస్ట్రార్ దాదాపు రెండు నెలలుగా సెలవులో ఉన్నారు. అక్రమ రిజిస్ట్రేషన్ రద్దు చేయాలని కోరుతూ బాధితుడు పీజీఆర్ఎస్ లో ఫిర్యాదు చేశారు. ఈ విషయమై ఇప్పటికీ అధికారులు చర్యలు తీసుకోలేదు. కాగా సమస్యను పరిష్కరించి ఉండి ఎస్సై చేతులమీదుగా రాజ్కుమార్కు ఎండార్స్మెంట్ ఇచ్చినట్టు నాలుగు రోజుల క్రితం పీజీఆర్ఎస్ సైట్లో అధికారులు ఫేక్ ఫొటోను అప్లోడ్ చేశారని బాధితుడు ఆరోపిస్తున్నారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అక్రమాలు దండి ఒకరి భూమి మరొకరి పేరుపై ఉండిలో రిజిస్ట్రేషన్ రెండు నెలలుగా సెలవులోనే సబ్ రిజిస్ట్రార్ గ్రామ కంఠం భూమిని రిజిస్టర్ చేసేసిన మరో సబ్ రిజిస్ట్రార్ రిజిస్ట్రేషన్ల కోసం పొరుగు జిల్లాల నుంచి జనం క్యూ చోద్యం చూస్తున్న ఉన్నతాధికారులు -
గంజాయి కేసులో ముగ్గురి అరెస్ట్
నరసాపురం రూరల్: గంజాయి కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేసి వారి నుంచి రూ.40 వేలు ఖరీదు చేసే 1.938 కిలోల (సుమారు రెండు కిలోలు) గంజాయి, మూడు సెల్ఫోన్లు, రూ.4 వేలు నగదును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. గంజాయి అక్రమ రవాణాపై నరసాపురం ఎస్సై సీహెచ్ జయలక్ష్మికి వచ్చిన సమాచారం మేరకు నరసాపురం– పాలకొల్లు రోడ్డులోని వీరభవాని ఆలయం వెనుక గల ఖాళీ స్థలంలో పోలీసులు నిఘా వేశారు. ఉండి ఎన్ఆర్పీ అగ్రహారంనకు చెందిన కాలుకురస ఏసురాజు నరసాపురం వీవర్స్ కాలనీకి చెందిన పృధ్వీసాయి శివకుమార్, పిచ్చుక ఉదయ్కిరణ్లకు విక్రయిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. నిందితులను అరెస్టు చేసి కోర్టుకు పంపగా రిమాండ్ విధించినట్లు చెప్పారు. ఏసురాజు ఏలూరుకు చెందిన మణికంఠ వద్ద గజాయిని కొని నరసాపురానికి చెందిన వ్యక్తులకు విక్రయిస్తున్నాడని, మణికంఠను అరెస్ట్ చేయాల్సి ఉందన్నారు. నరసాపురం డీఎస్పీ శ్రీవేద ఆదేశాల మేరకు టౌన్ సీఐ బి యాదగిరి ఆధ్వర్యంలో జరిపిన ఈ దాడుల్లో ఎస్సై ముత్యాలరావు, హెడ్ కానిస్టేబుళ్లు వేణుగోపాలరావు, ప్రకాష్ బాబు, కానిస్టేబుల్ చక్రవర్తి పాల్గొన్నారు. -
దళితులపై దాడులు దారుణం
ఏలూరు (టూటౌన్): కై కలూరు మండలంలో దానగూడెంలో దళితులపై జరిగిన దాడులను వివిధ సంఘాలు, పలు పార్టీల నాయకులు ఖండించారు. బాధితులను పరామర్శించి దోషులను వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక దళితులపై దాడులు పెరిగిపోయాయని ఆల్ ఇండియా అంబేడ్కర్ యువజన సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ మెండెం సంతోష్ కుమార్ విమర్శించారు. స్థానిక ఎన్ఆర్పేటలోని సంఘం రాష్ట్ర కార్యాలయంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దళితులపై ఆదిపత్య కులాల వారు దాడులకు తెగబడటం సరికాదన్నారు. తమకు న్యాయం జరగకపోతే రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు సిద్ధమని హెచ్చరించారు. సమావేశంలో గొల్ల కిరణ్, కనికెళ్ల రవి ప్రసాద్, పెరియార్ పాల్గొన్నారు. తక్షణమే అరెస్టు చేయాలి దళితులపై హత్యాయత్నం చేసిన దోషులను తక్షణమే అరెస్టు చేసి శిక్షించాలని దళిత బహుజన్ సీనియర్ నాయకులు నేతల రమేష్ బాబు డిమాండ్చేశారు. ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధిత యువకులను ఆయన పరామర్శించారు. దళితులపై హత్యాయత్నానికి పాల్పడిన జనసేన నాయకులను ఎస్సీ, ఎస్సీ అట్రాసిటీ యాక్టు కింద తక్షణమే అరెస్ట్ చేయాలన్నారు. కై కలూరులో జరిగిన దాడిని పోలీసులు ఇరువర్గాల ఘర్షణగా చిత్రీకరించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వమే బాధ్యత వహించాలి దళిత యువకులపై దాడి చేసి హత్యాయత్నానికి ఒడిగట్టిన బాధితులను శిక్షించాలని కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి ఏ.ఫ్రాన్సిస్ డిమాండ్చేశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధిత యువకులను ఆయన శనివారం పరామర్శించారు. గతంలో జనసేన సైనికులు పిఠాపురంలో దళితుల ఊరు మీద పడి దారుణంగా కొట్టారని, ఇప్పుడు కై కలూరులో అలాగే దాడులకు పాల్పడినా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏమీ మాట్లాడకపోవడం సిగ్గు చేటన్నారు. దీనికి ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలన్నారు. విచారణ జరిపించాలి కై కలూరు మండలం దానగూడెం దళితులపై జరిగిన దాడి ఘటనకు సంబంధించి పోలీసు ఉన్నతాధికారులతో విచారణ జరిపించాలని సీపీఎం ఏలూరు జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. దోషులపై అట్రాసిటీ చట్టం పెట్టి అరెస్టు చేయాలని సీపీఎం జిల్లాకార్యదర్శి ఏ.రవి డిమాండ్ చేశారు. తాము అధికారంలోకి వస్తే హత్యలు, అత్యాచారాలు, దాడులను అరికడతామని చెప్పిన కూటమి నాయకులు ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారంటూ ప్రశ్నించారు. బాధితులను పరామర్శించిన సంఘాలు, పార్టీల నాయకులు -
రూ.16.63 లక్షలకు లడ్డూ వేలం
నూజివీడు: మండలంలోని మిట్టగూడెం వినాయక చవితి నవరాత్రుల్లో విఘ్నేశ్వరుడికి ప్రసాదంగా ఏర్పాటుచేసిన 11 కేజీల లడ్డూకు శనివారం వేలం నిర్వహించగా రూ.16.63 లక్షలకు మాజీ ఎంపీటీసీ కొనకళ్ల మాధవరావు దక్కించుకున్నారు. గతేడాది సైతం లడ్డూను వేలంలో రూ.9.09 లక్షలకు మాధవరావు సొంతం చేసుకున్నారు. సర్పంచ్ కొనకాల నరసింహారావు, ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. బుట్టాయగూడెం: కలకత్తా నుంచి హైదరాబాద్కు వెళ్తున్న ఒక కంటైనర్ను జీలుగుమిల్లి పోలీసులు శనివారం తనిఖీ చేసి అందులో సుమారు 12,100 కేజీల గోమాంసాన్ని పట్టుకున్నారు. గ్రామశివారులోని హెచ్పీ గ్యాస్ గోడౌన్ సమీపంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా కంటైనర్లో ఏదో తరలిస్తున్నట్లు అనుమానంతో తనిఖీ చేయగా గోమాంసాన్ని గుర్తించారు. ఇద్దరిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. ఈ మాంసాన్ని నిర్జీవ ప్రదేశంలో ఖననం చేశారు. -
ఉపకార వేతన పరీక్షకు సిద్ధం
● డిసెంబర్ 7న పరీక్ష ● ఆన్లైన్ ద్వారా ఈ నెలాఖరులోగా దరఖాస్తుకు అవకాశంభీమవరం: ఆర్థిక ఇబ్బందులతో ప్రతిభావంతులైన పేద విద్యార్థులు చదువులో మధ్యలో నిలిపివేయకుండా సహకారం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం జాతీయస్థాయి నేషనల్ మీన్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ (ఎన్ఎంఎంఎస్) (ఉపకార వేతనం) అందిస్తుంది. ఎంపికై న విద్యార్థులకు నాలుగేళ్లపాటు అంటే 9వ తరగతి నుంచి ఇంటర్ వరకు ఏడాదికి రూ.12 వేల చొప్పున స్కాలర్షిప్ అందజేస్తారు. దేశవ్యాప్తంగా లక్షమంది విద్యార్థులకు ఎన్ఎంఎంఎస్ స్కాలర్షిప్ను అందిస్తారు. ఇందుకుగాను అర్హులైన విద్యార్థులను ఎంపిక చేసేందుకు ఏటా 8వ తరగతి విద్యార్థులకు పరీక్షను నిర్వహిస్తుంది. పరీక్ష విధానం ఇలా.. డిసెంబర్ 7వ తేదీన ఎన్ఎంఎంఎస్ పరీక్ష నిర్వహించనున్నారు. తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ, హిందీ భాషల్లో పరీక్ష ఉంటుంది. పరీక్ష ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్నల విధానంలో 180 మార్కులకు ఉంటుంది. మూడు గంటలు పరీక్షా సమయం. ఈ పరీక్ష పేపర్ రెండు విభాగాలుగా నిర్వహిస్తారు. మెంటల్ ఎబిలిటీలో 90 మార్కులు, స్కొలాస్టిక్ ఆప్టిట్యూడ్ టెస్ట్లో 90 మార్కులకు ప్రశ్నాప్రతం ఉంటుంది. అన్ని రెవెన్యూ డివిజనల్ ప్రధాన కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహిస్తారు. దరఖాస్తు విధానం ఈనెల 10వ తేదీ నుంచి పరీక్ష ఫీజు చెల్లింంపు ప్రారంభం. ఈనెల 30వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అక్టోబర్ 10వ తేదీలోపు పరీక్ష ఫీజు చెల్లించిన తరువాత విద్యార్థుల దరఖాస్తు, పరీక్ష ఫీజు చెల్లించిన రశీదు పత్రం, కుల, ఆదాయ ధ్రువీకరణ, 8వ తరగతి సర్టిఫికేట్, 7వ తరగతి మార్కుల జాబితా పత్రాలను జిల్లా విధ్యాశాఖాదికారి కార్యాలయంలో అక్టోబర్ 15వ తేదీలోపు అందజేయాలి. ఓసీ, బీసీ విద్యార్థులకు పరీక్ష ఫీజు రూ.100 కాగా ఎస్సీ, ఎస్టీ, వికలాంగ విద్యార్థులు రూ.50 ఆన్లైన్ ద్వారా చెల్లించాలి. అర్హులు ఎవరంటే.. ప్రస్తుతం 8వ తరగతి చదువుతూ 7వ తరగతిలో ఓసీ, బీసీ విద్యార్థులు 55 శాతం మార్కులు, ఎస్సీ, ఎస్టీ, వికలాంగ విద్యార్థులు 50 శాతం మార్కులను సాధించి ఉండాలి. అలాగే ప్రస్తుతం ప్రభుత్వ, జిల్లా పరిషత్, మునిసిపల్, ప్రభుత్వ ఎయిడెడ్, ఆదర్శ, మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలలోని 8వ తరగతి విద్యార్థులు మాత్రమే పరీక్ష రాయడానికి అర్హులు. విద్యార్థి తల్లిదండ్రుల ఆదాయం ఏడాదికి రూ.3.50 లక్షలలోపు ఉండాలి. ఎన్ఎంఎంఎస్ స్కాలర్షిస్ విద్యార్థులకు ఎంతో ఉపయోగకరం. పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తే 9వ తరగతి నుంచి ఇంటర్ వరకు ఏటా రూ.12 వేలు చొప్పున ఉపకారవేతం పొందవచ్చు. గత పరీక్ష పేపర్ల అధ్యయనం ద్వారా విద్యార్థులు తమ ప్రిపరేషన్ సాగించి మంచి మార్కులతో స్కాలర్షిప్ పొందవచ్చు. – వీరవల్లి వేంకటేశ్వరరావు, ఏపీసీపీఎస్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు, స్కూల్ అసిస్టెంట్, మత్స్యపురిపాలెం -
గణితం అంటే భయం పోగొట్టి..
రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఉస్మాన్ పాషాకు పురస్కారం లింగపాలెం: ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ధర్మాజిగూడెం హైస్కూల్ ప్లస్ అధ్యాపకుడు ఉస్మాన్ పాషా రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడి పురస్కారం అందుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేతులమీదుగా అవార్డు అందుకున్న ఆయన తన ఆనందాన్ని ‘సాక్షి’తో పంచుకున్నారు. 2008 డీఎస్సీలో ఎంపికై వట్లూరు జిల్లా పరిషత్ హైస్కూల్ నందు ఉపాధ్యాయ వృత్తిలో ప్రవేశించిన ఆయన 2023 నుంచి పీజీటీ (లెక్కలు) అధ్యాపకునిగా ధర్మాజీగూడెం హైస్కూల్ ప్లస్లో పనిచేస్తున్నట్లు చెప్పారు. వినూత్నమైన టీఎల్ఎం ఉపయోగించి ప్లేవే మెథడ్లో బోధించి మంచి ఫలితాలు సాధించానన్నారు. ఐసీటీ ద్వారా టెక్నాలజీని ఉపయోగించి పీపీటీఎస్ యానిమేటెడ్ వీడియోలు తయారు చేయడం, జియోజీబ్రా, రోబో కంపాస్ లాంటి యాప్స్ ఉపయోగించి బోధించడం ద్వారా విద్యార్థుల్లో గణితం పట్ల భయాన్ని పోగొట్టడంతో దాదాపు పది మంది విద్యార్థులు ఐఐటీలో సీట్లు, ప్రతిభ అవార్డులు సాధించారన్నారు. 2019లో సాంకేతిక శిక్షణ నేస్తం సీబీటీ పోటీ పరీక్షల్లో స్టేట్ రెండవ ర్యాంకు సాధించి ఏపీ ఎస్సీఈఆర్టీ టెక్ట్స్ బుక్స్ ఆథర్గా సెలెక్ట్ అయ్యి గణిత పుస్తక రచనలో సేవలు అందించినట్లు వివరించారు. -
బానిసలం కాదు.. ప్రభుత్వ ఉద్యోగులం
సాక్షి, భీమవరం: మేము బానిసలం కాదు.. ప్రభుత్వ ఉద్యోగులమంటూ సచివాలయ ఉద్యోగులు పోరుబాట పట్టారు. ఇంటింటి సర్వేలు నిషేధించాలంటూ శుక్రవారం నిర్వహించాల్సిన వాట్సప్ గవర్నెన్స్ ఇంటింట అవగాహన సర్వేను బహిష్కరించి నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 15,004 సచివాలయాలకు గాను కేవలం 12 సచివాలయాల్లో మాత్రమే సర్వే చేసినట్టుగా డాష్బోర్డులో అప్లోడ్ చేయగా.. జేఏసీ పిలుపు మేరకు మిగిలిన ఉద్యోగులు సర్వేను బహిష్కరించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనుల కోసం వ్యయప్రయాసలకోర్చి ప్రజలు మండల, జిల్లా కేంద్రాలకు తిరగాల్సిన పనిలేకుండా మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సచివాలయ వ్యవస్థకు శ్రీకారం చుట్టారు. రాజకీయ జోక్యం, అవినీతి, అక్రమాలకు తావులేకుండా పూర్తి పారదర్శకంగా సచివాలయ ఉద్యోగుల నియామకాలు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో రెండు వేలు, పట్టణ ప్రాంతాల్లో నాలుగు వేల జనాభా ప్రాతిపదికన జిల్లాలో 535 సచివాలయాల పరిధిలో ప్రస్తుతం 4,434 మంది ఉద్యోగులు సేవలందిస్తున్నారు. వీరిలో సచివాలయ సెక్రటరీ, ఇంజినీరింగ్, వెల్ఫేర్, ఎడ్యుకేషన్, అగ్రికల్చర్, హార్టీకల్చర్, వెటర్నరీ, డిజిటల్ అసిస్టెంట్లు, ఏఎన్ఎం, విలేజ్ సర్వేయర్ తదితర ఉద్యోగులు ఉన్నారు. సచివాలయానికి వెళితే చాలు అన్ని పనులు జరిగేలా 500కు పైగా సేవలను అందుబాటులోకి తెచ్చారు. ఆయా సేవలను బట్టి తక్షణ, కొన్ని 72 గంటలు, మరికొన్ని వారం నుంచి రెండు వారాల వ్యవధిలో పరిష్కరించేలా గడువు పెట్టారు. గత ప్రభుత్వంలో కేవలం దరఖాస్తు చేసుకున్న గంటలోనే రేషన్ కార్డులు, పింఛన్లు మంజూరుచేసిన సచివాలయాలు ఎన్నో ఉన్నాయి. కూటమి కుట్రలు గతంలో నవరత్న పథకాలు క్షేత్రస్థాయిలో అర్హులైన ప్రతి ఒక్కరి గడప చెంతకు చేరేలా వలంటీర్లను సమన్వయం చేసుకుంటూ సచివాలయ ఉద్యోగులు పనిచేసేవారు. కాగా సంక్షేమాన్ని అటకెక్కించిన కూటమి ప్రభుత్వం సచివాలయ ఉద్యోగులతో జాబ్చార్ట్లో లేని పనులు చేయిస్తూ వారిని తీవ్ర ఒత్తిడికి గురిచేస్తోంది. వలంటీర్ల పనులను వారితో చేయిస్తూ మొత్తం పనిభారం ఉద్యోగులపై మోపింది. హౌస్హోల్డ్, ఎంఎస్ఎం తదితర సర్వేల పేరిట ఇంటింటికి తిప్పుతూ వెట్టిచాకిరీ చేయిస్తోంది. కూటమి వచ్చాక కొందరు ప్రజాప్రతినిధులు, అధికారులు తమ సొంత సర్వేలకు సచివాలయ ఉద్యోగులను వినియోగించుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. హేతుబద్దీకరణ పేరిట 3,500 జనాభా పైబడిన సచివాలయాల్లో ఎనిమిది మంది, 2,500 నుంచి 3,500 జనాభా ఉన్న చోట ఏడుగురు, 2,500 లోపు జనాభా ఉన్నచోట ఆరుగురు ఉద్యోగులను కొనసాగించే అంశాన్ని కూటమి తెరపైకి తెచ్చింది. మరోపక్క ఉద్యోగుల బదిలీల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రుల సిఫార్సు లెటర్లకు ప్రాధాన్యమిస్తూ రాజకీయ జోక్యానికి తెరలేపింది. తాజాగా ప్రతి శుక్రవారం వాట్సప్ గవర్నెస్ అవగాహన సర్వేలు నిర్వహించాలంటూ గురువారం సచివాలయ ఉద్యోగులకు మౌఖిక ఆదేశాలందాయి. ఈ విషయమై సచివాలయ ఉద్యోగుల జేఏసీ స్పందించింది. ఉద్యోగుల ఆత్మగౌరవానికి భంగం కలిగించే వలంటీర్ విధులను బహిష్కరించి నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరుకావాలని జేఏసీ పిలుపునిచ్చింది. ఈ మేరకు శుక్రవారం భీమవరం, ఆకివీడు, జిల్లా వ్యాప్తంగా సచివాలయ ఉద్యోగులు వాట్సప్ సర్వీస్ రిజిస్ట్రేషన్లను ఉద్యోగులు బహిష్కరించి నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరయ్యారు. దీంతో జిల్లాలో 535 సచివాలయాల పరిధిలో ఒక్కచోట కూడా వాట్సప్ రిజిస్ట్రేషన్లు జరుగలేదు. సచివాలయ ఉద్యోగుల పోరుబాట సర్వే డాష్బోర్డు నింపకుండా నిరసన ఇంటింటి సర్వేలు నిషేధించాలని డిమాండ్ నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరు -
బీవీ రాజు కళాశాలకు జాతీయస్థాయి గుర్తింపు
భీమవరం : భీమవరంలోని బీవీరాజు కళాశాల ఆర్ట్స్ అండ్ సైన్స్ విభాగంలో జాతీయస్థాయి గుర్తింపు దక్కించుకుందని ప్రిన్సిపాల్ ఐఆర్ కృష్ణంరాజు తెలిపారు. కేంద్ర విద్యా శాఖ ఈ నెల 4న విడుదల చేసిన ర్యాంకింగ్స్లో ఈ ఘనత సాధించిందని చెప్పారు. శనివారం రాజమహేంద్రవరంలో ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయ ఉపకులపతి ఎస్.ప్రసన్నశ్రీ, రిజిస్ట్రార్ కేవీ స్వామి అభినందనలు తెలియజేస్తూ సర్టిఫికెట్ అందించారని వివరించారు. ఈ సందర్భంగా అధ్యాపకులు, సిబ్బందిని విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్ కేవీ విష్ణురాజు, వైస్ చైర్మన్ ఆర్.రవిచంద్రన్, సెక్రటరీ కె.ఆదిత్య విస్సం, జాయింట్ సెక్రటరీ కె.సాయి సుమంత్, డైరెక్టర్లు తదితరులు అభినందించారు. తాడేపల్లిగూడెం: డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయ ఇన్చార్జి వీసీ నియామకం కోసం ముగ్గురు సీనియర్ల పేర్లను రిజిస్ట్రార్ ప్రభుత్వానికి పంపించినట్టు తెలిసింది. ఇన్చార్జి వీసీ నియామకానికి అర్హులైన సీనియర్ల పేర్లను వెంటనే పంపాలని రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ, సహకార శాఖ ఎక్స్అఫీషియో స్పెషల్ చీఫ్ సెక్రటరీ టు గవర్నమెంటు తరపున ఈ నెల నాలుగున లేఖ పంపిన నేపథ్యంలో జాబితాను పంపినట్టు సమాచారం. మహానందిలోని ఉద్యాన పరిశోధనా స్థానం ప్లాంట్ పథాలజీ విభాగంలో పనిచేసే డాక్టర్ కె.సుబ్రహ్మణ్యం, సీడీహెచ్ ఉద్యాన విభాగం పార్వతీపురంలో పనిచేసే అసోసియేట్ డీన్ డాక్టర్ బి.ప్రసన్నకుమార్, కేవీకే పెరియవరంలో పనిచేసిన డాక్టర్ బి.గోవిందరాజులు పేర్లు ప్రభుత్వానికి చేరినట్టు తెలిసింది. మరోపక్క 65 ఏళ్ల వయస్సు వచ్చే వరకు యూజీసీ యాక్టును వర్సిటీల ప్రొఫెసర్లకు వర్తింపచేపిన విధంగా తనుక వర్తింప చేయాలని ప్రస్తుత వీసీగా ఉన్న కె.గోపాల్ హైకోర్టులో దాఖలు చేసిన రిట్ పిటిషన్పై వాదనలను ఈ నెల 11న జరుగనున్నాయి. తాత్కాలికంగా గోదానం, గో దత్తత నిలుపుదల ద్వారకాతిరుమల: రాష్ట్రంలో లంపి స్కిన్ వ్యాధి వేగంగా వ్యాపిస్తున్నందు వల్ల భక్తుల నుంచి గోదానాన్ని, అలాగే భక్తులకు ఇచ్చే గోదత్తతను శ్రీవారి దేవస్థానం తాత్కాలికంగా నిలుపుదల చేస్తున్నట్టు ఆలయ ఈఓ ఎన్వీ సత్యన్నారాయణ మూర్తి శనివారం ఒక ప్రకటన ద్వారా తెలిపారు. అంటు వ్యాధులు తగ్గిన తరువాత మళ్లీ వీటిని పునః ప్రారంభిస్తామన్నారు. ఇరగవరం: కె కుముదవల్లిలో రేషన్ బియ్యం అక్రమంగా నిల్వచేశారనే సమాచారం మేరకు వీఆర్వోతో కలిసి శుక్రవారం రాత్రి దాడులు చేసినట్లు సివిల్ సప్లయిస్ ఆర్ఐ కేవీవీ సత్యనారాయణ తెలిపారు. ఈ దాడుల్లో బందెల సాయి రామ్ అనే వ్యక్తి ఇంటి వద్ద 5 క్వింటాల్ రేషన్ బియ్యంను స్వాధీనం చేసుకుని అతడిపై 6ఏ కేసు నమోదు చేసినట్లు చెప్పారు. ఉత్తమ లఘు చిత్రం ‘చివరి శ్వాస’పాలకొల్లు సెంట్రల్: పాలకొల్లులో శనివారం నిర్వహించిన నాలుగో అంతర్జాతీయ లఘు చలన చిత్ర పోటీల్లో ‘చివరి శ్వాస’ ఉత్తమ చిత్రంగా నిలిచింది. జాతీయ తెలుగు సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీల్లో ప్రదర్శించిన లఘు చిత్రాలు అందరినీ ఆకట్టుకోవడంతో పాటు ఆలోచింపజేశాయి. 733, పదిలం.. లఘు చిత్రాలు ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి నిమ్మల రామానాయుడు.. ప్రముఖ సినీ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ, ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ వైజాగ్ సెక్రటరీ చెరుకూరి శ్రీనివాసరాజు, మాజీ మంత్రి చేగొండి హరిరామజోగయ్య, కాస్మో కల్చరల్ స్పోర్ట్స్ అధ్యక్షుడు గొట్టుముక్కల గాంధీభగవాన్రాజులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో తెలుగు సారస్వత పరిషత్ అధ్యక్షుడు ముత్యాల శ్రీనివాస్, సినీ దర్శకుడు రేలంగి నరసింహరావు తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం: నకిలీ కరెన్సీ ముఠాను జంగారెడ్డిగూడెం పోలీసులు శనివారం అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించి సీఐ ఎంవీ సుభాష్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నకిలీ కరెన్సీతో ప్రజలను మోసం చేస్తున్నారన్న సమాచారం మేరకు డీఎస్పీ యు.రవిచంద్ర ఆధ్వర్యంలో ఎస్సై షేక్ జబీర్, సిబ్బందితో కలిసి స్థానిక బాట గంగానమ్మ ఆలయ సమీపంలో తనిఖీ చేపట్టామన్నారు. ఈ తనిఖీల్లో ఏలేటి చంద్రశేఖర్ అలియాస్ ఇస్మార్ట్ శంకర్ అలియాస్ కిక్ (గోపాలపురం), లాగు శ్రీను (పేరంపేట), మోతరపు వంశీకుమార్ (నాగులగూడెం)లను అరెస్టు చేసి విచారించామన్నారు. వీరు నకిలీ రూ.500 నోట్లను నల్ల రంగులో ముద్రించి, ఈ నోట్లు ప్రత్యేక ద్రావణంలో ముంచితే అసలైన నోట్లుగా మారుతాయని ప్రజలను నమ్మించి మోసం చేస్తున్నారన్నారు. ఏలూరు టౌన్: ఏలూరు నగర శివారు జాతీయ రహదారిపై రామచంద్ర ఇంజనీరింగ్ కాలేజీ సమీపంలో వ్యాన్ బోల్తా పడి 15 మంది కూలీలు గాయాలపాలయ్యారు. తూర్పుగోదావరి జిల్లా తుని ప్రాంతానికి చెందిన వీరు చేపల వేటకు వైఎస్సార్ కడప జిల్లా బద్వేల్ ప్రాంతానికి వెళ్లి తిరుగు ప్రయాణమయ్యారు. ఏలూరు వచ్చే సరికి వాహనం టైర్ పంక్చర్ కావటంతో అదుపుతప్పి రోడ్డు డివైడర్పైకి బోల్తా కొట్టింది. క్షతగాత్రులను హైవే పెట్రోలింగ్ పోలీసులు 108 అంబులెన్స్ల్లో ఏలూరు సర్వజన ఆసుపత్రికి తరలించారు. 15 మందిలో నలుగురికి తీవ్ర గాయాలు కావటంతో అత్యవసర విభాగంలో చికిత్స అందిస్తున్నారు. -
సచివాలయ ఉద్యోగుల ఉద్యమ పిడికిలి
సాక్షి, అమరావతి/ భీమవరం (ప్రకాశం చౌక్): గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగులు పోరుబావుటా ఎగరవేశారు. ప్రజల గడప వద్దకే ప్రభుత్వ సేవలను అందించేందుకు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వలంటీర్ల వ్యవస్థను అధికారంలోకి రాగానే రద్దు చేసిన కూటమి ప్రభుత్వం... తాజాగా వలంటీర్ల బాధ్యతలను గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగులకు అంటగట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు అప్పట్లో ఉన్న వలంటీర్ల క్లస్టర్లను సచివాలయ ఉద్యోగులకు కేటాయించాలని జిల్లాలకు సమాచారమిచ్చింది. గతంలో 50 ఇళ్లకు ఓ వలంటీర్ను నియమించి క్లస్టర్లుగా విభజించగా, ఇప్పుడు నాలుగైదు క్లస్టర్లను ఓ సచివాలయ ఉద్యోగికి కేటాయించి సమాచార సేకరణ, ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని సూచించింది. ఇందుకు సంబంధించి గ్రామ, వార్డు సచివాలయ శాఖ అధికారిక వెబ్సైట్లో ప్రత్యేక ఆన్లైన్ లింకును ఏర్పాటు చేయడంతోపాటు వలంటీర్ల క్లస్టర్లను సచివాలయ ఉద్యోగులకు ఎలా మ్యాపింగ్ చేయాలో తెలిపే ఛార్ట్ ఫ్లోనూ శుక్రవారం సాయంత్రమే అన్ని సచివాలయాలకూ చేరవేసింది. దీనిపై సచివాలయ ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు. కూటమి సర్కారు తీరు తమ ఆత్మగౌరవం దెబ్బతీసేలా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఆందోళనే శరణ్యమని పోరుబావుటా ఎగరవేశారు. జూమ్ మీట్లో ఉద్యమానికి సిద్ధం సర్కారు తీరుపై శుక్రవారం రాత్రి అత్యవసరంగా జూమ్ యాప్లో వర్చువల్గా సమావేశమైన గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగ సంఘాల నేతలు జేఏసీగా ఏర్పడి ఉద్యమం ద్వారానే సమస్యలను పరిష్కరించుకోవాలని నిర్ణయించారు. వాట్సాప్ సేవలపై శనివారం ఇంటింటి ప్రచారం చేయాలని, ర్యాలీలు చేపట్టాలని ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను బహిష్కరించాలని తీర్మానించారు. ఉద్యోగ సంఘాల జేఏసీ పిలుపు మేరకు శనివారం ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని సచివాలయ ఉద్యోగులు బహిష్కరించారు. నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరై నిరసన తెలిపారు. పలుచోట్ల సమస్యలపై ఎంపీడీవోలకు, మున్సిపల్ కమిషనర్లకు వినతిపత్రాలు అందజేశారు. భీమవరంలో 40 వార్డుల సచివాలయ ఉద్యోగులు ప్రభుత్వ తీరును నిరసిస్తూ మున్సిపల్ కార్యాలయంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. -
‘ఈ ప్రభుత్వం రైతుల్ని చిన్నచూపు చూస్తుంది’
పశ్చిమగోదావరి జిల్లా : చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రైతుల్ని చిన్నచూపు చూస్తోందని జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు ముదునూరి ప్రసాద్రాజు ధ్వజమెత్తారు. గత ప్రభుత్వంతో రైతు భరోసా కేంద్రాలు నిర్మిస్తే, ఇప్పుడు వాటిన్నంటికీ తాళాలు వేశారని మండిపడ్డారు. రైతులకు విత్తనం మొదలు అమ్మేవరకూ పూర్తి భరోసా ప్రభుత్వానిదేనని, ఇప్పుడు యూరియా కోసం రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగం క్యూలైన్లో ఉండి ఇబ్బంది పడటం చూస్తున్నామన్నారు.ప్రభుత్వ తరుపున కట్టే ఇన్సురెన్స్ ఈ ప్రభుత్వం కట్టడం లేదన్నారు.రాష్ట్రంలో రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై 9వ తేదీన ఆర్డీవో కార్యాలయాలో రిప్రజెంటేషన్ ఇచ్చే కార్యక్రమం ఉంటుందన్నారు. జిల్లాలోని నర్సాపురం, తాడేపల్లిగూడెం, భీమవరం ఆర్డివో కార్యలయంలో ఈ కార్యక్రమం చేపడతామన్నారు.వైఎస్ఆర్సిపి పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి పిలుపుమేరకు ఈనెల తొమ్మిదో తారీఖున ప్రతి ఆర్డీవో కార్యాలయం వద్ద రైతులందరితో కలిపి రైతు సమస్యల పైన వినత పత్రాన్ని అందజస్తామన్నారు. గత వైఎస్ జగన్ ప్రభుత్వంలో రైతుల్ని అన్ని విధాలా ఆదుకుంటే, కూటమి ప్రభుత్వం మాత్రం రైతు సమస్యలపై మొద్దు నిద్ర వహిస్తుందన్నారు. -
ఉపాధి పనుల్లో అక్రమాలు
బుట్టాయగూడెం: ఉపాధి హామీ పథకం పనుల్లో భాగంగా గత ఏడాదిపాటు జరిగిన గ్రామీణ అభివృద్ధి పనులు, పంచాయతీరాజ్, ఐటీడీఏ సోషల్ ఫారెస్ట్, టెరిటోరియల్ ఫారెస్ట్, కూలీలకు కలిపి సుమారు రూ. 16.27 కోట్ల నిధులకు సంబంధించి పనులు చేశారు. ఈ పనులపై సామాజిక తనిఖీ బృందం అధికారులు ఆగస్టు 21 నుంచి ఒక్కొక్కటిగా పరిశీలించారు. పనుల వివరాలను మండల స్థాయిలో వెల్లడించేందుకు స్థానిక మండల పరిషత్ కార్యాలయం వద్ద సామాజిక తనిఖీ ప్రజావేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వేదికలో బుట్టాయగూడెం మండలంలోని 21 పంచాయతీల పరిధిలో జరిగిన పనుల్లో సుమారు రూ.1.73 కోట్ల అక్రమాలు జరిగినట్లు గుర్తించామని అధికారులు తెలిపారు. కొలతలు, మస్తర్లు, అంగన్వాడీ కేంద్రాల్లో చేపట్టిన పనులు, ఐటీడీఏ ద్వారా చేపట్టిన పనులు, తదితర పనుల్లో అక్రమాలు జరిగినట్లు గుర్తించామని చెప్పారు. వీటిలో రూ. 27.86 లక్షలను అధికారులు రికవరీకి ఆదేశించారు. మరో రూ.27 లక్షలకు సంబంధించి ఎంకై ్వరీకి ఆదేశించినట్లు తెలిపారు. రూ.86.86 లక్షలతో వివిధ పనులతోపాటు మొక్కలు వేయించేలా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఈ ప్రజావేదికలో రూ.66 లక్షలు తొలగించినట్లు చెప్పారు. అదేవిధంగా ఏపీఓ, ఈసీ, జేఏ, ఫీల్డ్ అసిస్టెంట్లకు సుమారు రూ. 2.81 లక్షల జరిమానా విధించినట్లు తెలిపారు. అదేవిధంగా ఎన్ఆర్పాలెంలో కాంపౌండ్ వాల్, రాజానగరం, లక్ష్ముడుగూడెంలో పాల కేంద్రం నిర్మాణాలు చేపట్టకుండానే సుమారు రూ.8 లక్షల వరకూ డబ్బులు చెల్లించినట్లు గుర్తించామన్నారు. ఆ సొమ్ము మొత్తం రికవరీ చేసినట్లు తెలిపారు. డ్వామా పీడీ వెంకటసుబ్బారావు ఆధ్వర్యంలో ప్రజావేదిక కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ కె.జ్యోతి, ఏపీఓ ఎం.స్వర్ణకుమారి, తదితరులు పాల్గొన్నారు. గురువారం ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9:30 వరకూ ఈ కార్యక్రమం జరిగింది. -
చాలీచాలని జీతాలతో పనిచేస్తున్నాం
ద్వారకాతిరుమల: శ్రీవారి ఆలయంలో ఏళ్ల తరబడి చాలీచాలని జీతాలతో పనిచేస్తున్నామని, తమను రెగ్యులర్ చేయాలని కోరుతూ దేవస్థానం ఎన్ఎంఆర్ ఉద్యోగులు గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు, తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్లకు శుక్రవారం వినతి పత్రాలను అందజేశారు. ముందుగా ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ను వారి క్యాంపు కార్యాలయాల్లో మర్యాద పూర్వకంగా కలసి, తమ సమస్యలను వివరించారు. ఆ తరువాత దుశ్శాలువాలు కప్పి, శ్రీవారి చిత్రపటాలను అందించి సత్కరించారు. ఈ సందర్భంగా ఉద్యోగులు తాము శ్రీవారి దేవస్థానంలో సుమారు 25 ఏళ్లుగా పనిచేస్తున్నామని తెలిపారు. చాలీచాలని జీతంతో పనిచేస్తూ, ఆలయానికి వచ్చే భక్తులకు మెరుగైన సేవలు అందిస్తున్నామని చెప్పారు. దేవస్థానం ఎస్టాబ్లీష్మెంట్ చార్జెస్ 30 శాతం లోపు ఉంటే ప్రభుత్వంపై ఎలాంటి భారం పడదని, తమ దేవస్థానం ఎస్టాబ్లీష్మెంట్ చార్జెస్ కేవలం 16 శాతం లోపే ఉందని పేర్కొన్నారు. దీన్ని బట్టి చూస్తే ప్రస్తుతం ఆలయంలో పనిచేస్తున్న ఎన్ఎంఆర్, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు అందరినీ రెగ్యులర్ చేయొచ్చన్నారు. అప్పుడు కూడా హుండీల ద్వారా వచ్చే ఆదాయంతోనే తమకు జీతభత్యాలు అందుతాయని, ప్రభుత్వంపై ఎటువంటి భారం పడదన్నారు. తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి రెగ్యులర్ అయ్యేలా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎంఆర్ ఉద్యోగులు చవలం శ్రీనివాసరావు, సర్నాల రంగారావు, విజ్జురోతి కుంకుళ్లు, గోపా బాలు, నాగేశ్వరరావు, మంగరాజు తదితరులున్నారు. శ్రీవారి దేవస్థానం ఎన్ఎంఆర్ ఉద్యోగుల ఆవేదన -
ప్రత్తిపాడు– బాదంపూడి రోడ్డెక్కితే టెర్రరే
సంక్రాంతికి రోడ్లు వేస్తామన్నారు. చివరకు అరకొర మరమ్మతులతో సరిపెట్టారు. తాడేపల్లిగూడెంలో ఒక్క ప్రధాన రహదారి నిర్మాణం పూర్తి చేయకుండానే మమా అనిపించారు. బాదంపూడి నుంచి ప్రత్తిపాడు వరకూ ఉన్న ప్రధాన రహదారి తాడేపల్లిగూడెం పట్టణానికే కాకుండా, తణుకు, రావులపాలెం వంటి ప్రాంతాలకు ఎంతో కీలకం. తాము అధికారంలోకి రాగానే ఈ రోడ్డు వేస్తామని జనసేన ఎమ్మెల్యే ఊదరగొట్టారు. ఇప్పుడు ఏడాదిన్నర దాటినా కనీసం దీనివైపు కన్నెత్తి చూడడం లేదు. చిన్నాచితకా రోడ్లకు చేసినా మరమ్మతులు కూడా చేయకపోవడంతో ఈ రోడ్డు నరకాన్ని తలపిస్తోంది. ఇటీవల పలువురు ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురై కాళు,్ల చేతులు విరగ్గొట్టుకున్నారు. గతంలో చిన్నపాటి గోతులపై రాజకీయం చేసిన కూటమి నేతలు ఇప్పుడు భారీ గుంతలతో రోడ్లు అధ్వానంగా తయారైనా పట్టించుకోవడం లేదు. –పెంటపాడు -
బైబిల్ విరుద్ధమైన బోధనలు అడ్డుకుంటాం
పాలకొల్లు సెంట్రల్: బైబిల్కు విరుద్ధమైన బోధనలు చేసే వారిని అడ్డుకుంటామని తెలుగు క్రైస్తవ సంఘాల పరిరక్షణ సమితి అధ్యక్షుడు ఎస్.ఎబినేజర్ అన్నారు. శుక్రవారం పట్టణ శివారు అడబాల గార్డెన్స్లో జరుగుతున్న క్రైస్తవ తెలాభిషేకం ఆరాధన కార్యక్రమాన్ని పాలకొల్లు తెలుగు క్రైస్తవ సంఘాల పరిరక్షణ సమితి సభ్యులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంగా గార్డెన్స్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పెద్ద ఎత్తున పోలీసులను మోహరించారు. కొంత కాలంగా ప్రార్థనా శక్తి నిర్వాహకుడు ఇస్సాక్ అడబాల గార్డెన్స్లో ప్రతి నెలా మొదటి శుక్రవారం తైలాభిషేకం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని నిలిపివేయాలంటూ స్థానిక తెలుగు క్రైస్తవ సంఘాల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో గురువారం రాత్రి నుంచి నిరసన చేపట్టారు. సంఘ అధ్యక్షుడు ఎబినేజర్ మాట్లాడుతూ అమాయక ప్రజలను, విశ్వాసులను మభ్యపెట్టి ప్రలోభాలకు గురిచేస్తున్నారన్నారు. ఆరాధన ఆదివారం మాత్రమే జరగాలని.. అలా కాకుండా ఏ రోజైనా చేస్తే వాక్యానికి విరుద్ధమన్నారు. తైలాభిషేకం బైబిల్లో ఎక్కడా లేదని, అందువల్ల ఈ బోధనను ఖండించేందుకు నిరసన చేపట్టామన్నారు. బోధకుడు ఇస్సాక్ అనుచరులు వచ్చి కోర్టు ఆర్డర్ ఉందని చెప్పారని.. అయితే కోర్టు నుంచి ఎలాంటి ఆర్డర్ రాలేదన్నారు. -
వరద ముంపులోనే కనకాయలంక ప్రజలు
యలమంచిలి: గోదావరిలో వరద స్థిరంగా ఉండిపోవడంతో కనకాయలంక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కనకాయలంక చుట్టూ వరద చుట్టుముట్టడంతో ప్రజలు తమ దైనందిన అవసరాల కోసం పడవల మీద ప్రయాణిస్తున్నారు. గత నెల 29న వరదముంపునకు గురయిన కాజ్వే మీద ఎనిమిది రోజులుగా వరద నీరు ప్రవహిస్తుంది. ముఖ్యంగా తాగునీటి కోసం లంక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గ్రామంలో తాగునీరు దొరకడం లేదు. దీంతో ప్రతి ఒక్కరూ చాకలిపాలెం వెళ్లి ఫౌండేషన్ నీరు తెచ్చుకుంటారు. మామూలు సమయంలో బైక్, సైకిల్ మీద తెచ్చుకుంటారు. వరద రావడంతో పడవపై తెచ్చుకోవాల్సి వస్తుంది. దీంతో ఒంటరి మహిళలు తాగునీరు తెచ్చుకోవడం కష్టమవుతుందని వాపోతున్నారు. ప్రభుత్వం కనీసం వాటర్టిన్స్ పంపిణీ చేయాలని కోరుతున్నారు. -
గురువుల పాత్ర కీలకం
తాడేపల్లిగూడెం: సమాజంలో గురువుల పాత్ర ఎంతో కీలకమని శుక్రవారం ఏపీ నిట్లో జరిగిన గురుపూజోత్సవం కార్యక్రమంలో నిట్ డీన్ స్టూడెంట్స్ వెల్ఫేర్ డాక్టర్ కె.హిమబిందు అన్నారు. ఆమె మాట్లాడుతూ ఉపాధ్యాయుల పాత్ర సమాజంలో ఎంతో అమూల్యమైందన్నారు. గురువే విద్యార్థుల జీవితానికి మార్గదర్శి అన్నారు. విద్యార్థులను అజ్ఞానం నుంచి విజ్ఞాన వెలుగుల దిశగా నడిపించేది ఉపాధ్యాయులే అన్నారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి నివాళులర్పించారు. అసోసియేట్ డీన్లు డాక్టర్ రాజేశ్వర్రెడ్డి ,శ్రీనివాసన్, ఆచార్యులు పి.శంకర్, కార్తికేయశర్మ, అమరేంద్రరెడ్డి, కిషోర్, ప్రత్యూష తదితరులు పాల్గొన్నారు. తణుకు అర్బన్: బెల్టు దుకాణాలు, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడంపై ఎకై ్సజ్ శాఖ దాడులు నిర్వహించినట్లు తణుకు ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ శాఖ సీఐ సత్తి మణికంఠరెడ్డి తెలిపారు. తణుకు ఎకై ్సజ్ స్టేషన్ పరిధిలో శుక్రవారం నిర్వహించిన దాడుల్లో దువ్వ గ్రామానికి చెందిన ఇందుకూరి నాగరాజు, తేతలి గ్రామానికి చెందిన పంది గోగులు నుంచి 6 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. బెల్టు దుకాణాలు నిర్వహించినా, మద్యం దుకాణాల్లోని పర్మిట్ రూంలలో కాకుండా బహిరంగంగా మద్యం సేవిస్తే కఠిన చర్యలు తప్పవని అన్నారు. పోలవరం రూరల్: గోదావరి వరద తగ్గుముఖం పట్టింది. ఎగువ ప్రాంతాల నుంచి నదిలోకి చేరుతున్న నీటితో వరద ప్రవాహం కొనసాగుతోంది. పోలవరం ప్రాజెక్టు స్పిల్వే వద్ద 32.250 మీటర్ల మేర నీటిమట్టం కొనసాగుతోంది. స్పిల్వే 48 గేట్ల నుంచి దిగువకు 9.10 లక్షల క్యూసెక్కుల నీరు చేరుతోంది. భద్రాచలం వద్ద 40.90 అడుగులకు నీటిమట్టం చేరుకుంది. వరద మరింత తగ్గే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. పాలకొల్లు సెంట్రల్: జాతీయ తెలుగు సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో నేడు లఘు చలన చిత్రాల పోటీలు నిర్వహించనున్నారు. శనివారం పట్టణంలోని బ్రాడీపేట బైపాస్ రోడ్డులో ఉన్న రామచంద్ర గార్డెన్స్లో ఈ పోటీలు ఉదయం 9 గంటల నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ ప్రదర్శనకు 30 లఘు చిత్రాలు రాగా వాటిలో 12 చిత్రాలను ఎంపిక చేసినట్లు తెలిపారు. ప్రత్యేక జ్యూరీ ప్రదర్శనకు మరో ఆరు చిత్రాలను ఎంపిక చేశారు. ఈ షార్ట్ ఫిలిం పెస్టివల్లో పాలకొల్లు పట్టణానికి చెందిన కళాకారుడు, సినీ నిర్మాత తుమ్మలపల్లి రామ సత్యనారాయణను సన్మానించనున్నారు. -
సంచార జాతులకు ఏం చేశారో చెప్పాలి?
కాళ్ల: సంచార జాతులకు బీజేపీ ప్రభుత్వం తరపున న్యాయం చేస్తామని విజయవాడలో నిర్వహించిన సంచార జాతుల దినోత్సవం సభలో బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ అన్నారని, గత 11 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం సంచార జాతులకు ఏం చేసిందో చెప్పాలని ఎంబీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పెండ్ర వీరన్న కౌంటర్ ఇచ్చారు. పెద అమీరంలోని జిల్లా పార్టీ క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ డీఎన్టీ, ఎన్టీ సర్టిఫికెట్లు ఇవ్వాలని, ఆ నెపం రాష్ట్ర ప్రభుత్వంపై నెట్టివేయడం సరికాదన్నారు. మతం పేరుతో ఓట్ల కోసం ఈ జాతులను వాడుకోవటం సరికాదని, సర్టిఫికెట్లు ఇవ్వాలంటే రాజ్యాంగ సవరణ చేసి భారత రాజ్యాంగంలోని 341, 342 ఆర్టికల్ పరిధిలోకి తీసుకొచ్చి న్యాయం చేయాలన్నారు. గతంలో అనేక కమిషన్లు కేంద్ర ప్రభుత్వానికి నివేదికలు ఇచ్చాయని ఇంతవరకు చర్చకు కూడా తీసుకురాకుండా ఈ వర్గాలకు న్యాయం చేస్తామని అబద్ధాలు చెప్పడం మాధవ్ మానుకోవాలని పెండ్ర వీరన్న అన్నారు. ఆగస్టు 31న ప్రధానమంత్రి మోదీ ఏం అద్భుతమైన సంక్షేమ పథకాలు ప్రకటించారో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. గత ప్రభుత్వం సంచార జాతులకు వివిధ సంక్షేమ పథకాల కింద రూ.1288.44 కోట్ల లబ్ధి చేకూర్చిందన్నారు. గుర్తింపు లేని సంచార జాతులను గుర్తించి కుల ధ్రువీకరణ పత్రాలు ఇప్పించే కార్యక్రమానికి గత ప్రభుత్వం స్వీకారం చుట్టిందని గుర్తు చేశారు. కార్యక్రమంలో సంచార జాతుల సంఘ జిల్లా అధ్యక్షుడు చుండూరి ముసలయ్య, ప్రధాన కార్యదర్శి చింత వీర్రాజు, కార్యదర్శి చుండూరి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. -
భవనం పైనుంచి దూకి వృద్ధుడి ఆత్మహత్య
తణుకు అర్బన్: గుర్తుతెలియని వృద్ధుడు భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన శుక్రవారం రాత్రి తణుకులో జరిగింది. తణుకు సూర్యాలయం వీధిలోని ప్రైవేటు ఆస్పత్రి భవనం పైనుంచి దూకగా.. మృతుడికి 65 ఏళ్లు ఉంటాయని భావిస్తున్నారు. ఆస్పత్రి వర్గాలు ఇచ్చిన సమాచారంతో ఘటనా ప్రాంతానికి వెళ్లిన ఎస్సై ప్రసాద్ సీసీ పుటేజీ పరిశీలించారు. వృద్ధుడు ఆస్పత్రిలోకి వచ్చి మెట్ల మార్గంలో మూడో అంతస్తులోకి వెళ్లి రెయిలింగ్పై నుంచి దూకినట్లుగా నిర్ధారించారు. పైనుంచి కిందపడిన వెంటనే తలకు తీవ్రగాయమై రక్తస్రావం కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి చొక్కా జేబులో బిస్కట్ ప్యాకెట్ తప్ప మరే వివరాలు లేకపోవడంతో ఆ వృద్ధుడు ఎవరనేది తెలియరాలేదు. దీంతో మృతదేహాన్ని తణుకు జిల్లా కేంద్ర ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు. మృతుడి ఫొటోతోపాటు వివరాలను పోలీసులు పలు వాట్సాప్ గ్రూపుల్లో పెట్టడంతో వివరాలు బయటపడ్డాయి. అత్తిలి మండలం బల్లిపాడులోని ఇందిరమ్మ కాలనీకి చెందిన కాకర్ల ఆదినారాయణ (65)గా పోలీసులు గుర్తించారు. ఉదయం 10 గంటలకు ఇంటినుంచి బయటకు వచ్చిన ఆదినారాయణ మళ్లీ రాలేదని కుటుంబసభ్యులు చెప్పారు. మృతుడికి భార్యతోపాటు కుమారుడు, కుమార్తె ఉన్నారని పోలీసులు చెబుతున్నారు. ఎస్సై ప్రసాద్ కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఉపాధ్యాయుల పాత్ర కీలకం
కలెక్టర్ నాగరాణి భీమవరం: దేశ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని కలెక్టర్ సీహెచ్ నాగరాణి, డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణరాజు అన్నారు. శుక్రవారం స్థానిక అల్లూరి సీతారామరాజు సాంస్కృతిక కేంద్రంలో నిర్వహించిన గురు పూజోత్సవ కార్యక్రమంలో వారు మాట్లాడారు. ముందుగా సర్వేపల్లి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ విద్యార్థులను ఆదర్శంగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల బాధ్యత ఎనలేనిదన్నారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ మహోన్నతమైన వ్యక్తి అని, అందరికీ ఆదర్శనీయులన్నారు. భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు(అంజిబాబు) మాట్లాడుతూ సంస్కృతి, సంప్రదాయాలను అలవర్చి ఉత్తమ విద్యార్థిగా తీర్చిదిద్దే గురువు పాత్ర అమోఘమైందన్నారు. ఎమ్మెల్సీ బొర్రా గోపిమూర్తి, రాష్ట్ర మహిళల సహకార ఆర్థిక కార్పొరేషన్ చైర్పర్సన్ పీతల సుజాత, జిల్లా విద్యాశాఖ అధికారి ఈ.నారాయణ మాట్లాడారు. అనంతరం జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికై న 56 మంది ఉపాధ్యాయులకు పూలమాల వేసి, శాలువా కప్పి, జ్ఞాపిక, ప్రశంసాపత్రాలతో సన్మానించారు. విద్యార్థుల నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. సహకార మార్కెటింగ్ సొసైటీ చైర్మన్ చాగంటి మురళీకృష్ణ, మత్స్యకార సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ కొల్లి పెద్దిరాజు, ఆర్యవైశ్య సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ పద్మనాభుని మురళీమోహన్, సమగ్ర శిక్ష ఏపీసీ పి.శ్యాంసుందర్, సహాయ సంచాలకుడు సత్యనారాయణ పాల్గొన్నారు.