West Godavari
-
రైతులను విచారించిన అధికారులు
తాబేళ్ల రక్షణకు చర్యలు తాబేళ్ల సంరక్షణకు చర్యలు చేపట్టారు. నరసాపురం మండలంలోని తాబేళ్ల గుడ్ల సేకరణ, పునరుత్పత్తి కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. 8లో uనిడమర్రు: ఎఫ్ఎస్వో శ్రీనివాస్బాబుపై రైతులు చేస్తున్న లంచాల ఆరోపణలపై నిడమర్రు సచివాలయం కార్యాలయంలో మంగళవారం అటవీ శాఖ రేంజర్ పి.మోహినీ విజయలక్ష్మి విచారణ నిర్వహించారు. ‘అడిగినంత ఇస్తేనే ఆక్వా సాగు’ అనే శీర్షికన ఈ నెల 14న సాక్షిలో కథనం ప్రచురితమైన సంగతి తెలిసిందే. డీఎఫ్వో స్పందించి విచారణకు రేంజర్ను నియమించారు. విచారణలో జాప్యంతో విచారణ పక్కదారి పడుతోందంటూ నిడమర్రు రైతులు సాక్షిని ఆశ్రయించడంతో ‘లంచాల బాగోతంపై మీనమేషాలు’ అంటూ సాక్షి దినపత్రికలో వచ్చిన వార్తకు స్పందించారు. మంగళవారం ఉదయం 10 గంటలకు విచారణాధికారి నిడమర్రు వస్తున్నట్లు ఫిర్యాదుదారుడు మండా పోలయ్యకు సమాచారం అందించారు. జి రాయితీ భూముల్లో సాగు చేసుకునేందుకు ఎఫ్ఎస్వో తన దగ్గర రూ. 40 వేలు లంచం తీసుకున్నాడని, ఇంకా డిమాండ్ చేయడంతో వీడియోలు తీసి ఫిర్యాదు చేసినట్లు పోలయ్య లిఖిత పూర్వకంగా రేంజర్కు వివరాలు అందించారు. గ్రామంలో విచారణ పూర్తయ్యిందని నివేదికను ఉన్నతాధికారులకు సమర్పిస్తామని తెలిపారు. -
ఉద్యాన పంటలకు ఉపాధి నిధులు
పాలకొల్లు అర్బన్: ఉపాధి హామీ పథకం నిధులతో నూరు శాతం సబ్సిడీ అందించి ఉద్యాన పంటలు పెంచుకోవడానికి రైతులను గుర్తించాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులకు ఆదేశాలిచ్చారు. పాలకొల్లు మున్సిపల్ కార్యాలయంలో నియోజకవర్గ స్థాయిలో పట్టణం, పాలకొల్లు, యలమంచిలి, పోడూరు మండలాల అధికారులతో మంగళవారం సమీక్షా నిర్వహించారు. నీటి యాజమాన్య సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఉద్యాన పంటల సాగును పెంచే దిశగా సంబంధిత శాఖ అధికారులు కృషి చేయాలని కోరారు. ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేసుకుని రైతులను గుర్తించాలన్నారు. ఉపాధి హామీ పథకం నిధులతో నూరుశాతం సబ్సిడీ అందిస్తున్నట్లు వివరించారు. ఎస్సీ, ఎస్టీలకు చెందిన సన్న, చిన్నకారు రైతులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఒక్కొక్క రైతుకు నూరుశాతం సబ్సిడీ అందజేస్తారన్నారు. మూడేళ్ల కాలానికి అత్యల్పంగా మునగ సాగుకు రూ.27,515, దానిమ్మ సాగుకు ఎకరానికి రూ.2,16,417 అందజేస్తారన్నారు. ఉద్యాన పంటల సాగుకు రైతులను గుర్తించి జాబితాలను జిల్లా నీటి యాజమాన్య సంస్థ అధికారికి అందజేయాలని కోరారు. కార్యక్రమంలో డ్వామా పీడీ డా.కేసీహెచ్ అప్పారావు, జిల్లా ఉద్యానశాఖ అధికారి ఆర్.దేవేంద్రకుమార్, మునిసిపల్ కమిషనర్ బి.విజయసారథి తదితరులు పాల్గొన్నారు. బ్యాంకర్లు సమన్వయంతో పనిచేయాలి భీమవరం (ప్రకాశంచౌక్): ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకాన్ని సంబంధిత అధికారులు, బ్యాంకర్లు సమన్వయంతో పనిచేసి మంచి ప్రగతి సాధించాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరంలో సూర్య ఘర్ యోజన పథకం అమలుపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 13,202 దరఖాస్తులు రిజిస్టర్ కాగా కేవలం 633 గృహాలకు మాత్రమే సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేశారన్నారు. ఈ పథకం అమలు సంతప్తికరంగా లేదన్నారు. సోలార్ ప్యానల్ ఏర్పాటుపై అవగాహన కల్పిస్తే పెద్ద ఎత్తున ప్రజలు ముందుకు వచ్చి ఏర్పాటుకు సంసిద్ధంగా ఉంటారన్నారు. పథకం ప్రారంభించి సంవత్సరం పూర్తయిన పూర్తిస్థాయిలో ప్రజల్లో అవగాహన కల్పించడంలో వెనుకబాటు కనిపిస్తుందన్నారు. -
నిరుద్యోగ భృతి కల్పించాలి
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుద్యోగులకు నెల నెల ఇస్తానన్న భృతిని వెంటనే చెల్లించాలి, అలాగే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానని ఎన్నికల ముందు లోకేష్ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. – తంగెళ్ల రాధాకృష్ణ. తూర్పుతాళ్ళు జాబ్ క్యాలెండర్ ప్రకటించాలి నిరుద్యోగులను కూటమి ప్రభుత్వం మోసం చేసింది. జనవరిలోనే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తానని నారా లోకేష్ యువ గళం పాదయాత్రలో ఆర్భాటంగా ప్రకటించడమే కాక ఎన్నికల్లో హామీ ఇచ్చారు. నేటి వరకు జాబ్ క్యాలెండర్ ఊసే లేదు. నిరుద్యోగ భృతి సైతం మరిచిపోయారు. – సాకా సుబ్రహ్మణ్యం దేవ, బీఎస్సీ బీఈడీ హామీ నెరవేర్చలేకపోయారు నేను ఎంఏ చేశాను. కూటమి ప్రభుత్వం వస్తే నిరుద్యోగ భృతిగా రూ.3 వేలు ఇస్తామని చంద్రబాబు ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. కానీ ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది నెలలు గడిచిన ఇంతవరకు ఆ ఊసే లేదు. ఎన్నికల హామీల అమలులో ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. – అంబేడ్కర్, వేల్పూరు జాబ్ లేక వ్యవసాయం.. ఎంఏ సోషల్ చేసి జాబ్ లేక వ్యవసాయం చేస్తున్నాను. ఏటా జనవరిలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పారు. ప్రభుత్వం ఏర్పడగానే డీఎస్సీ ఇస్తామన్నారు, ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది నెలలు కావస్తున్నా ఏ ఒక్క దానికి ప్రభుత్వం కట్టుబడి లేదు. – పడవల నాని, బాలేపల్లి, ఎంఏ సోషల్ ● -
ఇళ్ల తొలగింపుల్లో ఉద్రిక్తత
పాలకోడేరు: పాలకోడేరు శివారు ఏఎస్ఆర్ నగర్లో 21 కుటుంబాలు ఇళ్లు ఖాళీ చేయాలని లేదంటే తొలగిస్తామని హెచ్చరికలు జారీ చేయడంతో మంగళవారం ఉదయం నుంచి వారంతా మెయిన్ రోడ్డుపై ఆందోళన నిర్వహించారు. చివకు పోలీసు, పంచాయతీ, రెవెన్యూ యంత్రాంగం చర్చలు జరిపారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి జక్కంశెట్టి సత్యనారాయణ మాట్లాడుతూ.. 21 మందికి ప్రత్యామ్నాయం చూపినట్లుగా నోటీసులు ఇచ్చి విద్యుత్తు కనెక్షన్లు కట్ చేయడం సరైన కాదని ఆరుగురు మాత్రమే ఇల్లు నిర్మించుకున్నారని మిగిలిన వారందరికీ విద్యుత్ కనెక్షన్లు పునరుద్ధరించాలన్నారు. ఇల్లు నిర్మించుకున్న ఆరుగురు ఈ రోజే వెళ్ళిపోతారని తెలిపారు. రెండు నెలల్లో అందరికీ ప్రత్యామ్నాయం చూపిన తర్వాతే ఇల్లు ఖాళీ చేయాల్సి ఉంటుందన్నారు. విద్యుత్ కనెక్షన్లన్నీ ఈరోజే పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు. -
బలివే తీర్థానికి తమ్మిలేరు నీరు విడుదల
చింతలపూడి: మహా శివరాత్రి పండుగను పురస్కరించుకుని బలివే తీర్థానికి తమ్మిలేరు జలాశయం నుంచి నీటిని విడుదల చేసినట్లు తమ్మిలేరు ఇరిగేషన్ డీఈ సీతారామ్ మంగళవారం తెలిపారు. ప్రాజెక్టులో ఉన్న నీటి నిల్వను దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతానికి 100 క్యూసెక్కుల నీరు ప్రాజెక్టు నుంచి విడుదల చేశామని తెలిపారు. దాదాపు 40 కిలోమీటర్లు ప్రధాన కాల్వ ద్వారా ప్రయాణించి నడిపల్లి చెరువులోనికి చేరుతుందని చెప్పారు. అక్కడి నుంచి బలివేకు భక్తుల కోసం నీటిని వంతుల వారీగా తరలిస్తామన్నారు. బలివేకు వచ్చే భక్తులకు నీటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నా మని చెప్పారు. మొత్తం తీర్థానికి 500 క్యూసెక్కుల నీరు వినియోగిస్తున్నట్లు తెలిపారు. గురుకులంలో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం ద్వారకాతిరుమల: గురుకులంలో 5వ తరగతి, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో చేరే విద్యార్థినుల నుంచి దరఖాస్తులను ీస్వీకరిస్తున్నట్టు స్థానిక డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల కళాశాల ప్రిన్సిపాల్ బి.రాణి తెలిపారు. మార్చి 6తో ఈ గడువు ముగుస్తుందన్నారు. అర్హులైన విద్యార్థినులు సంబంధిత వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఏప్రిల్ 1న అడ్మిట్ కార్డులు జారీ, అదే నెల 6న ఉదయం 10 గంటల నుంచి 5వ తరగతి ప్రవేశ పరీక్ష జరుగుతుందన్నారు. విద్యార్ధి తల్లిదండ్రుల వార్షిక ఆదాయం ఏడాదికి లక్ష రూపాయలు కలిగిన ధ్రువీకరణ పత్రం ఉన్న వారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులన్నారు. 5వ తరగతి ప్రవేశానికి దరఖాస్తు చేసుకునే ఎస్సీ, ఎస్టీ విద్యార్థినులు 2012 సెప్టెంబర్ 1 నుంచి, 2016 ఆగస్టు 31 మధ్య జన్మించాలన్నారు. జూనియర్ ఇంటర్ ప్రవేశానికి దరఖాస్తు చేసుకునే వారికి 2025 ఆగస్టు 31 నాటికి 17 ఏళ్లు మించకూడదన్నారు. నరసాపురం ఆసుపత్రిలో దివ్యాంగుల పాట్లు నరసాపురం: నరసాపురం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం దూరప్రాంతాల నుంచి వచ్చిన దివ్యాంగులు నానా ఇబ్బందులు పడ్డారు. సదరం సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పేరుతో ఆసుపత్రికి పిలిపించి గంటల సేపు నిలబెట్టారు. దీంతో దివ్యాంగులు అవస్థలు పడ్డారు. ఆసుపత్రిలో గత 15 రోజుల నుంచి సదరం సర్టిఫికెట్ల వెరిఫికేషన్ క్యాంపు నిర్వహిస్తున్నారు. నరసాపురం, మొగల్తూరు మండల పరిధిలో గతంలో సదరం సర్టిఫికెట్లు పొందిన వారిలో ఫేక్ సర్టిఫికెట్లు గుర్తించడం కోసమని ఏఎన్ఎంలు, ఆశ వర్కర్ల ద్వారా దివ్యాంగులను ఆసుపత్రికి పిలుస్తున్నారు. వారికి టైం స్లాట్ల సౌకర్యం, వెలుసుబాటు కల్పించకపోవడంతో ఉదయం 9 గంటలకు వచ్చిన వారు సాయంత్రం 5 గంటల వరకూ వేచి ఉండి ఇబ్బందులు పడుతున్నారు. -
చంపింది ప్రియురాలి భర్త, మామలే!
నిడమర్రు: బావాయిపాలెంలో సంచలనం రేకెత్తించిన మజ్జి ఏసు హత్య కేసు కొలిక్కివచ్చినట్లు తెలుస్తోంది. వివాహేతర సంబంధమే ఈ హత్యకు ప్రధాన కారణంగా ఉంది. నిందితులు ఏసు ప్రియురాలి భర్త, మామలే.. వారు పోలీసులు అదుపులో ఉన్నట్లు సమాచారం. కాగా ఈ హత్యకు సహకరించిన ఉండి మండలంకు చెందిన మరో వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు. పోలీసుల విచారణలో... బావాయిపాలెంలో ఏసు రాజు ఇంటి సమీపంలో ఉంటున్న ఒక మహిళతో వివాహేతర సంబంధమే సాగించడమే ఈ హత్యకు కారణంగా చెబుతున్నారు. హత్య జరిగిన రోజు పోలీసు జాగిలాలు సదరు మహిళ ఇంటి వద్దనే తిరగడంతోపాటు.. ఆ ఇంటికి చెందిన తండ్రి, కొడుకులు (పిల్లి అన్నవరం, పిల్లి ఏసు) ఫోన్లో కూడా అందుబాటులోకి రాకపోవడంతో పోలీసులు ఆదిశగా విచారణ ప్రారంభించారు. ఈ వివాహేతర సంబంధం తెలిసి ఏడాదిగా రెండు కుటుంబాల మధ్య గొడవలు జరుగుతున్నాయి. పంచాయతీ పెద్దల వరకు గొడవ వెళ్లగా వారు సర్దిచెప్పినట్లు తెలిసింది. పథకం ప్రకారం హత్య నిందుతులుగా భావిస్తున్న తండ్రి కొడుకులు పిల్లి అన్నవరం, పిల్లి ఏసు పథకం ప్రకారం మజ్జి ఏసును హత్య చేసినట్లు తెలిసింది. ఈనెల 15వ తేదీ రాత్రి బావాయిపాలెం గ్రామంలో కాపవరం కాలువ గట్టు వద్దకు ముగ్గురూ కలిసి మద్యం సేవించారు. మద్యం మత్తులో ఉండగా తండ్రి, కొడుకులు కలిసి దాడి చేసి పదునైన కత్తితో మృతుడు ఏసురాజు కుడి చెయ్యి నరికేశారు. ఆ తర్వాత పీక నొక్కి చంపేసినట్లు సమాచారం. నరికిన చెయ్యిని కాపవరం కాలువలో విసిరేశారు. ఈ తతంగంలో మూడో వ్యక్తి ఉన్నట్లు తెలిసింది. కనిపించకుండా పోయిన మృతుడి కుడి చెయ్యి భాగాన్ని పోలీసులు కాపవరం కాలువలో గుర్తించి సేకరించారు. అయితే మృతుడు ఏసు రాజు పలువురు మహిళలతో వివాహేతర సంబంధాలు కొనసాగిస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. నిందితులైన తండ్రి, కొడుకులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారని, వీరికి సహకరించిన మరో వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నట్లు సమాచారం. కొలిక్కివచ్చిన మజ్జి ఏసు హత్య కేసు పోలీసుల అదుపులో నిందితులు! హత్యకు సహకరించిన మరోవ్యక్తి కోసం పోలీసుల గాలింపు -
స్నేహితుల సహకారం మరువను
రక్తం అందక నిండు గర్భిణీ మరణం నన్ను కలచివేసింది. సమాజానికి మేలు చేయాలని అప్పుడే భావించాను. నాకు స్నేహితులందరూ అండగా నిలిచారు. ఆపదలో ఉన్న వారికి మేము ఉన్నాం.. అనే చిన్న భరోసా కల్పించడానికి ఏర్పాటు చేసిన ఈ సంస్థలో ఇప్పుడు ఇంత మంది తోడుగా రావడం సంతోషం. మరిన్నీ సేవా కార్యక్రమాలు చేస్తాం. – అల్లాడి రవితేజ, సంస్థ ఫౌండర్, ఆడిటర్, హైదరాబాద్ సేవే లక్ష్యంగా పనిచేస్తున్నాం సేవే పరమార్థంగా అందరం పనిచేస్తున్నాం. రెండు తెలుగు రాష్ట్రాల్లో సభ్యులందరూ సకాలంలో స్పందిస్తున్నారు. శనివారం భీమవరంలో మహిళకు రక్తం అవసరమయ్యింది. అర్ధరాత్రి 2 గంటలకు వెళ్లి ఆమెకు రక్తదానం చేశాను. ఇలా అందరూ సభ్యులు చేస్తున్నారు. అపోహలు విడనాడి అందరూ రక్తదానానికి ముందుకు రావాలి. – ఉండి రాజశేఖరరెడ్డి, సభ్యుడు, మూలలంక, కలిదిండి మండలం -
కుటుంబ కలహాలే కారణమా!
● గోస్తనీ కాలువలో దూకి ఆదివారం మహిళ ఆత్మహత్య● సోమవారం కాలువలో లభ్యమైన మృతదేహం● విలపిస్తున్న కుటుంబసభ్యులుతణుకు అర్బన్: తణుకు సజ్జాపురంలో నివసించే గుమ్మళ్ల శాంతి (48) మంగళవారం ఆంధ్రాసుగర్స్ ప్రాంతంలోని కాలువలో శవమై తేలింది. ఆమె ఆదివారం రాత్రి 2.30 గంటలకు ఇంటి నుంచి బయటకు రావడం, సోమవారం ఉదయం గోస్తనీ కాలువ జాతీయరహదారి వంతెనపై ఆమె బూట్లు కనిపించడంతో ఆమె ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చునని నిర్థారణకు రావడంతో పోలీసులు, అగ్నిమాపక అధికారులు కాలువలో గాలింపు చర్యలు చేపట్టారు. చివరికి ఆమె మృతదేహం ఆంధ్రా సుగర్స్ ప్రాంతంలో లభ్యమైంది. ఇటీవల కుటుంబ కలహాలతో కొన్ని మనస్పర్ధలు ఏర్పడ్డాయని అందుకే ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లుగా తెలుస్తోందని పోలీసులు చెబుతున్నారు. మృతదేహాన్ని తణుకు జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించి పోలీసుల పంచనామా అనంతరం పోస్టుమార్టం జరిపించి కుటుంబ సభ్యులకు అప్పగించారు.కుటుంబమంతా వెల్నెస్పైనే ఉపాధిశాంతి కుటుంబమంతా వెల్నెస్ సెంటర్లపై ఆధారపడి ఉపాధి పొందుతున్నారు. వృద్ధులైన తన తల్లిదండ్రులతోపాటు ఇద్దరు కుమారులతో సజ్జాపురం పార్కు ప్రాంతంలో శాంతి నివసిస్తోంది. పెద్దకుమారుడు దుర్గాప్రసాద్ వివాహానంతరం కాకినాడలో వెల్నెస్ సెంటర్ నడుపుతూ అక్కడే నివసిస్తుండగా, చిన్న కుమారుడు పవన్ తణుకు బొమ్మల వీధిలో వెల్నెస్ సెంటర్ కోచ్గా ఉన్నారు. అయితే గతంలో స్థూలకాయంతో ఉండే శాంతి వెల్నెస్ సెంటర్లో వాడిన మందులతో సన్నబడి ఎంతో హుషారుగా ఉండేవారని స్థానికులు చెబుతున్నారు. తను మారిన విధానాన్ని అందరికీ తెలిసేలా ఫొటోలు, వీడియోలను సైతం సామాజిక మాధ్యమాల్లో పోస్టులు చేసేవారని, తన కుటుంబంతో కూడా ఎంతో సంతోషంగా గడిపేవారని, కుమారులిద్దరితో కలిసి దిగిన ఫొటోలను షేర్ చేసేవారని అటువంటి ఆమె ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చిందోనని స్థానిక ప్రజానీకం చర్చించుకుంటున్నారు. గోస్తనీ కాలువలో ఆమె శవమై తేలడాన్ని కుటుంబసభ్యులు జీర్ణించుకోలేకపోయారు. ఆమె విగతజీవిగా కనిపించడంతో కుటుంబసభ్యులు దుఃఖసాగరంలో మునిగిపోయారు. -
గ్రామ బహిష్కరణపై ఫిర్యాదు
మండవల్లి: తనకు గ్రామ బహిష్కరణ లేకుండా రక్షణ కల్పించాలని ఓ గొర్రెల పెంపకందారుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వివరాలు ఇలా ఉన్నాయి. కొవ్వాడలంక గ్రామవాసి త్రిమూర్తులు గొర్రెల పెంపకందారుడు. గొర్రెల పెంపకం వలన గ్రామ వాతావరణం కాలుష్యమౌతుందంటూ గ్రామం నుంచి బహిష్కరిస్తామని సర్పంచ్తోపాటు స్థానిక పెద్దలు గ్రామ సభ ద్వారా హెచ్చరికలు జారీ చేశారని త్రిమూర్తులు మంగళవారం మండవల్లిలో పేర్కొన్నాడు. గ్రామసభ ఏర్పాటు చేసి, గొర్రెలను స్వాధీనం చేసుకుని కఠినమైన చర్యలు తీసుకుంటామని గ్రామ చావడి మైక్ ద్వారా తెలియజేశారన్నాడు. తనకు గ్రామ బహిష్కరణ లేకుండా రక్షణ కల్పించాలని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపాడు. ఐటీఐలో ఉచిత కంప్యూటర్ కోర్సుకు దరఖాస్తుల ఆహ్వానం ఉండి: ఎన్నార్పీ అగ్రహారంలోని ప్రభుత్వ ఐటీఐలో ఏపీ ఎస్ఎస్డీసీ వారి ఆధ్వర్యంలో 45 రోజుల కంప్యూటర్ కోర్సుపై ఉచిత శిక్షణ ఇవ్వడం జరుగుతుందని, జిల్లాలో ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని ఐటీఐ జిల్లా కన్వీనర్, ప్రిన్సిపాల్ వీ శ్రీనివాసరాజు మంగళవారం తెలిపారు. పదో తరగతి ఆపైన పాస్ అయ్యి ఉండాలని, 18 నుంచి 30 ఏళ్లలోపు వయసు గలవారు అర్హులన్నారు. మహిళలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని, అభ్యర్థులు ఈ నెల 28వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని కోరారు. కోర్సు పూర్తి చేసిన వారికి సర్టిఫికెట్తోపాటు ఉద్యోగ అవకాశం కల్పించబడుతుందన్నారు. వివరాలకు 94928 85556, 08816 297093 నంబర్లలో సంప్రదించాలన్నారు. యువతి ఆత్మహత్య నరసాపురం రూరల్: కొప్పర్రు గ్రామానికి చెందిన ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. గ్రామస్తులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామంలోని పంటకాలువ సమీపంలో ఇంటర్ చదివి ఇంటి వద్దే ఉంటున్న ఎరిచర్ల సిరి అనే యువతి సోమవారం రాత్రి ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై మృతురాలి సోదరుడు చందు ఫిర్యాదు మేరకు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిసింది. అయితే ఈ సమాచారంపై పోలీసులను సంప్రందించగా వారు స్పందించలేదు. బంగారు, వెండి ఆభరణాలతో నవ వధువు పరారీ ఏలూరు (టూటౌన్): నవ వధువు బంగారం, వెండి ఆభరణాలు పట్టుకుని పరారైన ఘటన ఏలూరు నగరంలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం ఏలూరు గజ్జల వారి చెరువు సమీపంలో వి.శివ నాగ సాయి కృష్ణ జ్యూస్ దుకాణాన్ని నిర్వహిస్తూ జీవనాన్ని సాగిస్తున్నాడు. గత నెల 31వ తేదీన అతనికి విశాఖపట్టణం కంచరపాలెం ప్రాంతానికి చెందిన బోడేపు చంద్రహాసినితో వివాహమైంది. అత్తవారింటి నుంచి ఏడు రోజుల క్రితం ఏలూరు నగరానికి చేరుకున్న కొత్తజంట కొత్త కాపురాన్ని బిట్టుబారు సమీపంలో ఉన్న అద్దె ఇంట్లో మొదలుపెట్టారు. అయితే ఈ నెల 16వ తేదీన భార్యాభర్తలు ఇద్దరు నిద్రకు ఉపక్రమించగా, 17వ తేదీన శివ నిద్రలేచి చూసేసరికి నవవధువు ఇంటి నుంచి పరారైనట్లు గుర్తించాడు. ఆమె వెళ్తూవెళ్తూ నాలుగు కాసుల బంగారు గొలుసు, ఉంగరం, వెండి పట్టీలు సెల్ఫోన్తో పరారైనట్లు శివ గుర్తించాడు. ఆమె ఆచూకీ కోసం ఆమె తండ్రితో కలిసి వెతికినా ఆచూకీ లభించకపోవడంతో ఒకటో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. -
నిరుద్యోగుల్లో నిరుత్సాహం
బుధవారం శ్రీ 19 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025సాక్షి, భీమవరం: డీఎస్సీ, గ్రూపు పరీక్షలు, పోలీస్ రిక్రూట్మెంట్, ఏపీపీఎస్సీ తదితర వాటి ద్వారా ప్రభుత్వ కొలువుల కోసం ఇంటి వద్ద, జిల్లాలో, విశాఖ, విజయవాడ, హైదరాబాద్ తదితర నగరాల్లోని కోచింగ్ సెంటర్లలో ప్రిపేర్ అవుతున్న వారు ఎందరో ఉన్నారు. వీరంతా వేలు, లక్షల్లో ఫీజులు చెల్లించి శిక్షణ తీసుకుంటున్నారు. తమ బిడ్డల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు అయినకాడికి అప్పులు చేసి శిక్షణ ఇప్పిస్తున్నారు. బయటి ప్రాంతాల్లో ఉంటున్న వారికి హాస్టల్, మెస్ నిమిత్తం నెలకు ఆరు వేలకు పైనే ఖర్చవుతుంది. మరోపక్క డిగ్రీ, ఇంజినీరింగ్, ఇతర చదువులు చదువుకుని కుటుంబ ఆర్ధిక పరిస్థితులతో చాలీచాలనీ జీతంపై వివిధ వ్యాపార, ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న వారి సంఖ్య లక్షల్లో ఉంటుంది. వీరిలో ఎంతోమంది తమ చదువుకు తగిన ఉద్యోగం కోసం వేచి చూస్తున్నారు. పత్తాలేని హామీలు కూటమి ఉమ్మడి మేనిఫెస్టో సూపర్ సిక్స్లో నిరుద్యోగ యువతకు పెద్దపీట వేశామని చెప్పారు. ఏటా జనవరిలో జాబ్ క్యాలెండర్ విడుదల చేసి నిరుద్యోగ యువతకు ఉద్యోగ కల్పన చేస్తామన్నారు. అంతవరకూ నిరుద్యోగ భృతి అందజేస్తామంటూ ఊదరగొట్టారు. కూటమి ప్రభుత్వం కొలువుదీరి తొమ్మిది నెలలైనా వాటి ఊసెత్తకపోవడం ఆయా వర్గాలను తీవ్ర నిరాశకు గురిచేస్తుంది. మరోపక్క తొలి సంతకం పేరిట 16 వేల పోస్టులతో డీఎస్సీ ప్రకటించినా షెడ్యూల్ విడుదల చేయకుండా విద్యాసంవత్సరం పాటు కాలయాపన చేసింది. ఇప్పుడు ఉన్న పోస్టులకు కోత పెట్టేందుకు మోడల్ ప్రైమరీ స్కూళ్ల ఎత్తుగడ వేసింది. పశ్చిమ గోదావరి జిల్లాలో దాదాపు 5.17 లక్షలు, ఏలూరు జిల్లాలో ఐదు లక్షల కుటుంబాలు ఎన్నికల వాగ్దానాల అమలుకోసం ఎదురుచూస్తున్నారు. పెల్లుబుకుతున్న అసంతృప్తి నీకు పదిహేను వేలు.. నీకు పదిహేను వేలు.. అంటూ ఎన్నికల్లో ఊదరగొట్టి అధికారంలోకి వచ్చాక ఖజానా ఖాళీగా ఉందంటూ సూపర్ సిక్స్ హామీలను అటకెక్కించిన విషయం విదితమే. నిరుద్యోగులకు సంబంధించిన జాబ్ క్యాలెండర్, నిరుద్యోగభృతి హామీలదీ అదే దారి. సామాజిక మాద్యమాల ద్వారా ఇప్పటికే వివిధ వర్గాలు ప్రభుత్వంపై అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. ప్రస్తుత తరుణంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు కూటమి నేతలకు తలనొప్పిగా తయారయ్యాయి. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో 1,08,019 గ్రాడ్యుయేట్ ఓటర్లు ఉండగా వీరిలో కొత్త పశ్చిమగోదావరి జిల్లాలో 64,327 మంది, ఏలూరు జిల్లాలో 43,692 మంది ఉన్నారు. ఈ నెల 27న పోలింగ్ జరుగనుంది. ఎన్నికల్లో గెలుపుకోసం ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు కూటమి నేతలు ఆపసోపాలు పడుతున్నారు. 2024 జూన్ నుంచే హామీలు అమలని చెప్పి ముఖం చాటేసి ఇప్పుడు ఎలా ఓట్లు అడుగుతారని నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల కోడ్ ముగిశాక డీఎస్సీ షెడ్యూల్ విడుదల చేస్తామంటూ కూటమి నేతల మాటలను ఎన్నికల జిమ్మిక్కుగానే కొట్టిపారేస్తున్నారు. న్యూస్రీల్రాసిపెట్టుకోండి తమ్ముళ్లు.. అధికారంలోకి వచ్చాక ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేసి ఉద్యోగాలు భర్తీ చేస్తాం. మొదటిగా 2025 జనవరి 1న జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాం. – జిల్లాలో యువగళం పాదయాత్రలో నారా లోకేష్ ఏపీలోని యువతను ప్రపంచ ఆర్ధిక వ్యవస్థకు అనుసంధానం చేస్తాం. పరిశ్రమలు తెస్తాం. ఉద్యోగాలిస్తాం. హైటెక్ టవర్లు నిర్మించి వర్క్ఫ్రం హోమ్ తెస్తాం. మీకు ఉద్యోగం వచ్చే వరకు నెలకు రూ.3,000 నిరుద్యోగ భృతి ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటాను. – పశ్చిమ గోదావరి జిల్లా ఎన్నికల సభల్లో చంద్రబాబు జాడలేని జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ భృతి మెగా డీఎస్సీపై నోరు మెదపని సర్కారు హామీల అమలు కోసం నిరుద్యోగుల ఎదురుచూపు పట్టభద్రుల ఓట్లు వేటలో కూటమి నేతల అంతర్మథనం ఉమ్మడి జిల్లాలో 1,08,019 గ్రాడ్యుయేట్ ఓటర్లు నిరుద్యోగులకుప్రతి నెలా రూ.3 వేల భృతితొమ్మిది నెలలైంది. హామీల అమలు ఎప్పుడు ?మెగా డీఎస్సీ -
పోక్సో కేసులో 8 ఏళ్ల జైలు
ఇరగవరం: పోక్సో కేసులో ముద్దాయికి 8 ఏళ్ల జైలు శిక్ష, రూ.60 వేలు జరిమానా విధిస్తూ మంగళవారం భీమవరం పోక్సో కోర్టు తీర్పు వెలువరించింది. ఎసై జానా సతీష్ తెలిపిన వివరాలివి. గొల్లమాలపల్లికి చెందిన బాలికను అదే గ్రామానికి చెందిన తోట నరేష్ (27) లైంగికంగా వేధించేవాడు. అడ్డుపడిన వారిని సైతం చంపుతానని బెదిరించడంతో బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా 2022 జనవరి 27వ ఎసై జానా సతీష్ కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేశారు. కోర్టు విచారణలో నేరం నిర్ధారణ కావడంతో ముద్దాయి నరేష్కు భీమవరం పోక్సో కోర్టు జడ్జి బి లక్ష్మీనారాయణ ఎనిమిదేళ్ల జైలు, రూ.60 వేలు జరిమానా విధించారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ బి బ్రహ్మయ్య వాదనలు వినిపించగా హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వరరావు సహకరించారు. చెల్లని చెక్కు కేసులో జైలు శిక్షనూజివీడు: చెల్లని చెక్కు కేసులో నిందితుడికి ఆరు నెలల జైలు శిక్ష, రూ.12 లక్షల జరిమానా విధిస్తూ నూజివీడు స్పెషల్ మేజిస్ట్రేట్ వేల్పుల కృష్ణమూరి మంగళవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం నూజివీడు మండలం గొల్లపల్లికి చెందిన మల్లవల్లి ప్రవీణ్కుమార్ 2020 ఆగస్టు 2న జంగారెడ్డిగూడెంకు చెందిన ఎర్నెస్ట్ కుమార్కు రూ.10 లక్షలు అప్పుగా ఇచ్చారు. కొంతకాలం తరువాత బాకీ తీర్చమని అడుగగా ఎర్నెస్ట్ కుమార్ 2020 డిసెంబర్ 27న ప్రవీణ్కుమార్కు ఒకొక్కటి రూ.5లక్షలు చొప్పున రెండు చెక్కులను ఇచ్చారు. ఆ చెక్కులను నగదు నిమిత్తం బ్యాంకులో వేయగా ఖాతాలో నగదు లేదని వెనక్కు తిరిగి వచ్చాయి. దీంతో ప్రవీణ్కుమార్ కోర్టులో కేసు వేశారు. విచారణ అనంతరం ఎర్నెస్ట్ కుమార్కు న్యాయమూర్తి జైలుశిక్ష, జరిమానా విధించారు. -
పెద్దింట్లమ్మ జాతరను విజయవంతం చేద్దాం
కై కలూరు: రాష్ట్రంలో ప్రసిద్దిగాంచిన కొల్లేటికోట పెద్దింట్లమ్మ జాతరను అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని ఆర్డీవో, జాతర నిర్వాహణ చైర్మన్ డాక్టర్ అచ్యుత అంబరీష్ చెప్పారు. మార్చి 1 నుంచి 13 వరకు జరిగే జాతర(తీర్థం) నిమిత్తం కొల్లేటికోట దేవస్థానం వద్ద రెండో విడత వివిధ శాఖల అధికారుల సమన్వయ సమావేశం మంగళవారం జరిగింది. ఆలయ ఈవో కూచిపూడి శ్రీనివాసు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆర్డీవో మాట్లాడుతూ జాతర సమయంలో భక్తులకు ఎటువంటి అసౌక్యరాలు లేకుండా ముందస్తు ప్రణాళికతో అందరూ పనిచేయాలన్నారు. జాతర అన్ని రోజులు పారిశుద్ధ్య కార్మికులతో పాటు తాత్కలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేస్తున్నట్లు ఈఓపీఆర్డీ చెప్పారు. ముందుగా జాతర గోడపత్రి, బుక్లెట్, కరపత్రాలను అవిష్కరించారు. కార్యక్రమంలో ఇన్చార్జి తహసీల్దారు ఎండీ.ఇబ్రహీం, డిప్యూటీ ఫారెస్టు రేంజ్ ఆఫీసర్ ఆర్.రంజిత్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
తాబేళ్ల రక్షణకు ప్రత్యేక చర్యలు
నరసాపురం రూరల్: సముద్ర పర్యావరణ సమతుల్యతను పరిరక్షించేందుకు తాబేళ్ల సంరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. మంగళవారం నరసాపురం మండలం సముద్ర తీర ప్రాంతమైన చినమైనవానిలంక గ్రామంలో అటవీశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన తాబేళ్ల గుడ్ల సేకరణ, సంరక్షణ, పునరుత్పత్తి కేంద్రాన్ని జేసీ రాహుల్కుమార్రెడ్డితో కలసి ఆమె పరిశీలించారు. అటవీశాఖ అధికారులను గుడ్లు సంరక్షణకు చేపట్టిన ప్రత్యేక చర్యలపై అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ నాగరాణి మాట్లాడుతూ సముద్ర వాతావరణ సమతుల్యత దెబ్బతినకుండా సముద్రజీవులను రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందన్నారు. గత నెలలో పదుల సంఖ్యలో తాబేళ్లు చనిపోయి సముద్రతీర ప్రాంతానికి కొట్టుకురావడం చాలా బాధ కలిగించిందన్నారు. ఈ విషయమై సంబందిత అధికారులతో సమావేశమై తాబేళ్లు చనిపోవడానికి గల కారణాలను విశ్లేషించేందుకు పోస్టుమార్టం చేయించామన్నారు. ఆ నివేదక ఇంకా అందాల్సి ఉందన్నారు. తదుపరి చర్యల్లో బాగంగా అటవీశాఖ పర్యవేక్షణలో తాబేళ్లు వచ్చి గుడ్లు పెట్టే ప్రాంతాలను గుర్తించి వాటిని సంరక్షించేందుకు ప్రత్యేక సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అక్టోబరు నుంచి ఏప్రిల్ వరకూ తాబేళ్లు సముద్రపు ఒడ్డున అనువైన ప్రాంతంలో గుడ్లు పెట్టే సమయం అని, అనంతరం ఆ గుడ్లనుంచి పిల్లలు బయటకు వస్తాయన్నారు. ఆలీవ్రెడ్లీ జాతి తాబేళ్లు పెట్టిన సుమారు 4,400 గుడ్లను హేచరీలో ఉంచామని, రానున్న రెండు నెలల కాలంలో మరో 25 వేల గుడ్లు పెట్టే అవకాశం ఉందని ఆమె పేర్కొన్నారు. గుడ్ల నుంచి పిల్లలు బయటకు వచ్చిన అనంతరం వాటిని సముద్రంలోని విడచి పెట్టే కార్యక్రమంలో విద్యార్థులు, ప్రజలు, ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేస్తామన్నారు. తద్వారా సముద్ర జీవుల పట్ల అవగాహన కలుగుతుందన్నారు. తాబేళ్లు ఒడ్డుకు వచ్చి గుడ్లు పెట్టేందుకు అనువుగా సముద్రం అంచున వలలను అడ్డంకిగా లేకుండా చూడాలని మత్స్యకారులకు సూచించారు. మానవ మనుగడకు సముద్ర వాతావరణం సమతుల్యత దెబ్బతినకుండా చూసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మడ అడవులను నరికితే చర్యలు చినమైనవానిలంకలో తాబేళ్ల సంరక్షణ కేంద్రాన్ని పరిశీలించిన అనంతరం కలెక్టర్ నాగరాణి దర్బరేవు, రాజల్లంక ప్రాంతాల్లోని మడ అడవులను బోటులో వెళ్లి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మడ అడవులను పెరగనివ్వాలని, వాటిని అక్రమంగా నరికితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. సముద్రతీర ప్రాంతం కోతకు గురికాకుండా మడ అడవులు రక్షణగా నిలుస్తాయన్నారు. ఇప్పటికే సముద్రం పెదమైనవానిలంక, చినమైనవానిలంక ప్రాంతాల్లో ముందుకు చొచ్చుకుని వచ్చిన విషయం తెలిసిందన్నారు. కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ దత్తత గ్రామమైన పెదమైనవానిలంక గ్రామంలో ఒక కిలోమీటర్ మేర నిర్మించనున్న సముద్ర రక్షణ గోడకు రూ.35 కోట్లు వ్యయం అవుతుందని ఈ నిధులను మంత్రి కేటాయించారన్నారు. పనులను ఎలైట్ కంపెనీ త్వరలో ప్రారంభిస్తుందన్నారు. వాస్తవంగా ఏడు కిలోమీటర్ల మేర ఈ రక్షణ గోడను నిర్మించాల్సి ఉందని ప్రస్తుతం ఒక కిలోమీటరు మాత్రమే ఈ గోడను నిర్మిస్తారన్నారు. చినమైనవానిలంకలోని నల్లీక్రీక్పై వంతెనను ఆర్అండ్బీ అధికారులతో కలసి కలెక్టర్ పరిశీలించారు. వంతెన నిర్మాణానికి రూ.20 లక్షలు మంజూరయ్యాయని వెంటనే పనులు ప్రారంభించాలని ఆమె అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట జేసీ రాహుల్ కుమార్ రెడ్డి, జిల్లా అటవీ అధికారి ఆశాకిరణ్, ఆర్డీవో దాసి రాజు, డీఎస్పీ శ్రీవేద, నరసాపురం తహసీల్దార్ రాజరాజేశ్వరి, వివిధ శాఖల అధికారులు ఉన్నారు. తాబేళ్ల గుడ్ల సంరక్షణకు హేచరీ ఏర్పాటు మడ అడవులను పరిశీలించిన పశ్చిమ కలెక్టర్ తీరప్రాంత గ్రామాల్లో కలెక్టర్ నాగరాణి పర్యటన -
● దివ్యం.. శేష సాయి దర్శనం
● సాయిబాబాపై ‘సర్పం’ దర్శనం స్థానిక సాయిబాబా ఆలయంలో మంగళవారం రాత్రి బాబా విగ్రహంపై ఒక తాచు పాము దర్శనమిచ్చింది. ఆలయంలోకి ప్రవేశించిన ఈ పాము బాబా శిరస్సుపై ఉండటం ఆలయ నిర్వాహకుడు పుప్పాల మురళీకి కనిపించింది. విషయం తెలుసుకున్న భక్తులు పెద్ద ఎత్తున ఆలయం వద్దకు చేరుకోవడంతో, పాము నెమ్మదిగా బాబా విగ్రహం నుంచి ఫొటో మీదకు అక్కడి నుంచి బయటకు వెళ్లిపోయింది. – ద్వారకాతిరుమలద్వారకాతిరుమల: స్థానిక సాయిబాబా ఆలయంలో మంగళవారం రాత్రి బాబా విగ్రహంపై ఒక తాచు పాము దర్శనమిచ్చింది. ఆలయంలోకి ప్రవేశించిన ఈ పాము తొలుత బాబా శిరస్సుపై ఉండటం భక్తులకు, ఆలయ నిర్వాహకుడు పుప్పాల మురళీకి కనిపించింది. అయితే విషయం తెలుసుకున్న భక్తులు పెద్ద ఎత్తున ఆలయం వద్దకు చేరుకోవడంతో, ఆ అలజడికి పాము నెమ్మదిగా బాబా విగ్రహం పైనుంచి, పక్కనే ఉన్న బాబా ఫొటో మీదకు వెళ్లి, కొద్దిసేపు అక్కడే ఉంది. చివరకు నెమ్మదిగా బయటకు వెళ్లిపోయింది. -
బర్డ్ఫ్లూ పంజా
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో బర్డ్ఫ్లూ విజృంభన కొనసాగుతోంది. బర్డ్ఫ్లూతో ఇప్పటికే లక్షల సంఖ్యలో చనిపోయాయి. దాదాపు 19 ఏళ్ళ తరువాత జిల్లాలో బర్డ్ఫ్లూ వల్ల పౌల్ట్రీ రంగం తీవ్ర సంక్షోభంలోకి జారుకుంది. సంక్రాంతి ముందు నుంచే వైరస్ లక్షణాలతో కోళ్ళు చనిపోతుండగా శీతల ప్రభావమంటూ అధికారులు కొట్టిపడేశారు. ఒక్కసారిగా గత వారం పది రోజుల నుంచి బర్డ్ఫ్లూ పంజా విసరడంతో సుమారు 15 లక్షల వరకు లేయర్ కోళ్ళు, 50 వేల వరకు బ్రాయి లర్ కోళ్ళు చనిపోయినట్టు అంచనా. కోళ్ళ మేత, గుడ్లు, అన్నింటి విలువ కలుపుకొని సుమారు రూ. 70 కోట్ల నుంచి రూ.80 కోట్ల వరకు నష్టం వాటిల్లింది. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో పౌల్ట్రీ రంగం గణనీయంగా విస్తరించింది. జిల్లాలో సుమారు 200 పౌల్ట్రీలు ఉండగా వాటిలో 2.20 కోట్ల లేయర్ కోళ్లు ఉన్నాయి. ప్రస్తుతం సగటున ప్రతిరోజూ 1.30 కోట్ల కోళ్ల ద్వారా 1.10 కోట్ల గుడ్ల ఉత్పత్తి జరుగుతోంది. ప్రధానంగా ఒడిశా, బిహార్, పశ్చిమ బెంగాల్, అస్సాం రాష్ట్రాలకు 70 శాతం గుడ్ల ఎగుమతులు జరుగుతుండగా, మిగిలిన 30 శాతం గుడ్లు స్థానిక అవసరాలకు వినియోగిస్తున్నారు. 2006లో రూ.50 పైసలకు పడిపోయిన గుడ్డు 2006లో జిల్లాలో మొట్టమొదటిసారిగా పౌల్ట్రీల్లో బర్డ్ఫ్లూను గుర్తించారు. అప్పట్లో జిల్లాలో లక్షల సంఖ్యలో కోళ్ళు చనిపోయాయి. రూ.1.90 ఉన్న గుడ్డు ధర రూ.50 పైసలకు పడిపోవడంతో పౌల్ట్రీలు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయాయి. ఈ క్రమంలో వ్యాక్సినేషన్లు, ఇతర జాగ్రత్తల ద్వారా వైరస్లను అధిగమిస్తూ రెండేళ్ళలోనే పౌల్ట్రీల వ్యవస్థను గాడిలో పెట్టారు. 19 ఏళ్ళ తరువాత జిల్లాలో వైరస్ను గుర్తించడం, అది కూడా లక్షల సంఖ్యలో కోళ్ళు చనిపోయాక గుర్తించడం గమనార్హం. వ్యాక్సినేషన్ ప్రక్రియ సరిగ్గా చేయకపోవడం వల్లే వైరస్ వ్యాప్తి చెందిందనేది పౌల్ట్రీ వర్గాల భావన. జిల్లాలో ఉంగుటూరు, బాదంపూడి, తణుకు రూరల్, వేల్పూరు, పెరవలి, తాడేపల్లిగూడెంతో పాటు అనేక ప్రాంతాల్లో కోళ్ళ ఫారాలున్నాయి. 11న జిల్లాలో వైరస్ గుర్తింపు ఈ నెల 11న జిల్లాలో వైరస్ను గుర్తించారు. ఉమ్మడి జిల్లాలో బాదంపూడిలోని పౌల్ట్రీలో రోజుకు 3 నుంచి 4 వేల కోళ్లు చనిపోవడం గుర్తించారు. అధికార యంత్రాంగం వారం రోజుల తరువాత అలెర్ట్ అయింది. వాస్తవానికి ప్రతి రోజూ పౌల్ట్రీల్లో సాధారణ పరిస్థితులను బట్టి లక్షల కోళ్ళు ఉన్నచోట 30 నుంచి 50 కోళ్లు చనిపోతుంటాయి. బాదంపూడి, వేల్పూరు, తణుకు రూరల్లో ఎక్కువగా కోళ్లు చనిపోవడంతో వాటిని ల్యాబ్కు పంపగా ఏమియాన్ ఇన్ఫ్లుయాంజ్ (హెచ్ 5ఎన్–1) వైరస్గా గుర్తించారు. లక్షల కోళ్లు, గుడ్లు పూడ్చివేత జిల్లా వ్యాప్తంగా 15 లక్షల ఫారం కోళ్లు, 50 వేల బ్రాయిలర్ కోళ్లు వైరస్తో చనిపోయాయని పౌల్ట్రీ వర్గాల అంచనా. ఈ క్రమంలో జిల్లా వ్యాప్తంగా పశుసంవర్ధక శాఖాధికారులు వైరస్ గుర్తించిన పౌల్ట్రీలకు 10 కిలోమీటర్ల దూరం వరకు అలెర్ట్ జోన్లుగా ప్రకటించి చికెన్, గుడ్ల విక్రయాలను నిషేధించారు. వైరస్ ఉన్న కోళ్ళ ఫారాల ప్రాంతాలను ఇన్ఫెక్షన్ జోన్లుగా ప్రకటించి వెటర్నరీ వైద్యులతో 25 బృందాలను ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు ఏలూరు జిల్లాలో 1.24 లక్షల కోళ్ళు, 1.85 లక్షల కోళ్ళ మేతలు, లక్షకు పైగా గుడ్లను భూమిలో పూడ్చివేశారు. పశ్చిమగోదావరి జిల్లాలో 2 పౌల్ట్రీల్లో 22 వేల కోళ్ళు, 24,660 గుడ్లు, 20 కిలోల మేతను పూడ్చివేశారు. ఇంతవరకు 15 లక్షల లేయర్ కోళ్ల మృత్యువాత సుమారు రూ.70 కోట్లకు పైగా పౌల్ట్రీలకు నష్టం జిల్లా వ్యాప్తంగా ఇన్ఫెక్షన్ జోన్ల గుర్తింపు రెడ్ జోన్ పరిధిలోని పౌల్ట్రీలు మూడు నెలల పాటు మూసివేత మూడు రోజులుగా కొనసాగుతున్న శానిటేషన్ ప్రక్రియ -
రక్తదానమే లక్ష్యంగా.. హోప్ పయనం
కై కలూరు: నిండు ప్రాణాలను కాపాడటంలో కలిగే సంతోషం ఎన్ని లక్షలు పెట్టినా రాదు. ఇదే నినాదంతో 2022లో ఏర్పాటైన హోప్ చారిటబుల్ ట్రస్ట్ సేవలందిస్తోంది. కై కలూరు నియోజకవర్గం కలిదిండి మండలం పడమటిపాలెం గ్రామానికి చెందిన అల్లాడి రవితేజ స్నేహితులతో కలసి ఓ వాట్సాప్ గ్రూఫ్ను క్రియేట్ చేశాడు. ఒక్క అడుగుతో మొదలైన సేవా ప్రస్థానం ఇప్పుడు ఏకంగా 200 మంది సభ్యులకు చేరింది. రక్తదానమే పరమావధిగా సామాజిక సేవే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. నేడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 25 ప్రముఖ బ్లడ్ బ్యాంకులలో రక్తాన్ని అందించే స్థాయికి చేరింది. ఇప్పటివరకు రోడ్డు ప్రమాదాలు, గర్భిణీలు, క్యాన్సర్ పేషెంట్లు, తలసేమియా చిన్నారులు, అత్యవసర చికిత్సలు ఇలా 16,700 యూనిట్ల రక్తదానం సభ్యులు చేశారు. సేవే పరమార్థంగా పనిచేస్తున్న సభ్యులను ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు. తలసేమియా చిన్నారులకు దేవుళ్లు తలసేమియా చిన్నారులకు ప్రతి 21 రోజులకు రక్తమార్పిడి జరగాలి. వీరి ఇబ్బందులను గుర్తించిన సంస్థ సభ్యులు భీమవరం, ఉండి, కై కలూరు, కలిదిండి, పాలకొల్లు, నరసాపురం, తణుకు ఇలా అనేక ప్రాంతాల్లో జల్లిడ పట్టి మొత్తం 52 మంది చిన్నారులను గుర్తించారు. వీరి కోసం పశ్చిమగోదావరి జిల్లా భీమవరం ఆనంద్ బ్లడ్ బ్యాంకులో వివిధ గ్రూఫుల రక్తాన్ని నిల్వ చేస్తున్నారు. చిన్నారులకు అమృత హాస్పటల్లో రూ.1000 ఖరీదు కలిగిన రక్తం ఎక్కించే ఫిల్టర్లను సైతం వీరే అందిస్తున్నారు. మహాత్మా గాంధీ, అబ్దుల్ కలాం, అంబేడ్కర్, వైఎస్ రాజశేఖరరెడ్డి, ఎన్టీ రామారావుల వర్ధంతి, చిరంజీవి, పవన్ కల్యాణ్, ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్ పుట్టిన రోజులు ఇలా పలు సందర్భాల్లో రక్తదానం సేకరించి ప్రమాదంలో ప్రజలకు సంస్థ సభ్యులు సేవ చేస్తున్నారు. ఏపీ, తెలంగాణలో 25 బ్లడ్ బ్యాంకులకు రక్తదానం వాట్సాప్లో 200 మంది సభ్యుల చేరిక 52 మంది తలసేమియా చిన్నారులకు ప్రతినెలా రక్తదానం రెండు తెలుగు రాష్ట్రాల్లో 15 వేల మందికి రక్తదానం -
ఉపాధి కూలీలను ఢీకొన్న ట్రాక్టర్
కొయ్యలగూడెం: ఉపాధి పనుల కోసం వెళుతున్న కూలీలను ట్రాక్టర్ ఢీకొన్న ఘటన కుంతలగూడెం సమీపంలో మంగళవారం సంభవించింది. ఈ ప్రమాదంలో ఒక మహిళ మృతి చెందగా మరో ముగ్గురికి గాయాలయ్యాయి. వివరాల ప్రకారం కుంతలగూడెంకు చెందిన కొందరు కూలీలు మంగళవారం ఉపాధి పనుల కోసం వెళ్తున్నారు. ఆ సమయంలో చిన్నాయగూడెం వైపు వెళుతున్న ట్రాక్టర్ అతి వేగంగా వచ్చి కూలీలను ఢీకొంది. ఈ ప్రమాదంలో అల్లె భాగ్యవతి తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈమెతో పాటుగా మరో ముగ్గురు కూలీలు రాపాక నాగమణి, చాపల ఇమ్మెలియా, బాసుబోయిన పోసమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 వాహనంలో మెరుగైన వైద్యం నిమిత్తం తరలించినట్లు ఏపీవో నాగేశ్వరరావు తెలిపారు. ఇందులో ఇమ్మెలియా పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో ఆమెను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినట్లు 108 టెక్నీషియన్ బద్రి పేర్కొన్నారు. ట్రాక్టర్ డ్రైవర్ అజాగ్రత్త వలనే ప్రమాదం సంభవించిందని కూలీలు ఆరోపించారు. ట్రాక్టర్ డ్రైవర్ పరారీలో ఉన్నాడు. ఘటనా స్థలానికి ఎస్సై వి.చంద్రశేఖర్ చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఒకరి మృతి.. ముగ్గురికి గాయాలు -
విధుల్లో ఉన్న కానిస్టేబుల్పై దాడి
ఆకివీడు: విధుల్లో ఉన్న కానిస్టేబుల్పై ముగ్గురు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనపై కానిస్టేబుల్ ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. ఎస్సై హనుమంతు నాగరాజు తెలిపిన వివరాలివి. మంగళవారం స్థానిక గుంటూరు సెంటర్లోని ఖాళీ ప్రదేశంలో ఓ టెంట్ వద్ద సత్తినీనీనీడి ధనరాజు, మణికంఠ, తోట అయ్యప్ప గుమికూడి ఉన్నారు. దీనిపై 100కు వచ్చిన ఫిర్యాదు మేరకు కానిస్టేబుల్ శివ అక్కడికి వెళ్లి వారిని వెళ్లిపోవాలని ఆదేశించారు. అనంతరం శివ మరో కానిస్టేబుల్ కోటేశ్వరరావుతో సాయంత్రం డ్యూటీకి వెళుతుండగా అదే ప్రాంతంలోని బ్రాందీ షాపు వద్ద కాపు కాసి కానిస్టేబుల్ శివపై మణికంఠ, ధనరాజు, అయ్యప్ప దాడికి పాల్పడ్డారు. స్థానికులు అడ్డుకుని గొడవను నిలుపుదల చేశారు. కానిస్టేబుల్ శివ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై చెప్పారు. -
క్షేత్రస్థాయి పర్యటనకు నిధుల విడుదల
భీమవరం: జిల్లాలోని ప్రాథమిక, ఉన్నత పాఠశాలలో విద్యనభ్యసించే విద్యార్థుల క్షేత్రస్థాయి పర్యటనకు ప్రభుత్వం ఆదేశాలు జారీచేసినట్లు సమగ్రశిక్ష అడిషినల్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ పి.శ్యామ్సుందర్ సోమవారం ఒక ప్రటకనలో తెలిపారు. ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల రాష్ట్ర పర్యటనకు జిల్లాలోని 82 పాఠశాల ఎంపికచేయగా ఒక్కొకరికి రూ.200 చొప్పున రూ.16,400 కేటాయించిందని, రాష్ట్రేతర పర్యటనకు 82 మంది విద్యార్థులను ఎంపిక చేసి వారికి రూ.1.64 లక్షలు కేటాయించినట్లు చెప్పారు. ఉన్నత పాఠశాల విద్యార్థుల్లో 20 మంది బాలురు, 40 మంది బాలికలు, 20 మంది టీచర్లు, 125 మంది గైడ్ టీచర్లు, ఏఎంఓ, డీఎస్వోతో సహా మొత్తం 207 మంది రాష్ట్ర పర్యటనకు రూ.4.14 లక్షలు, రాష్ట్రేతర పర్యటనకు రూ.4.14 లక్షలు కేటాయించినట్లు తెలిపారు. -
చేపలు, మటన్కు క్యూ
భీమవరం(ప్రకాశం చౌక్): బర్డ్ ఫ్లూ వైరస్ ప్రభావంతో జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో చికెన్ దుకాణాలు మూతపడగా.. మిగిలిన ప్రాంతాల్లో చికెన్ కొనేవారు లేక కొనుగోళ్లు పడిపోయాయి. బర్డ్ఫ్లూ ఎఫెక్ట్తో చికెన్ అందుబాటులో లేకపోవడంతో చేపలు, మటన్ ధరలకు రెక్కలొచ్చాయి. మాంసాహారం తినేవారు చికెన్కు ప్రత్యామ్నాయంగా చేపలు, రొయ్యలు, మటన్ వినియోగంపై దృష్టిపెట్టారు. ఫంక్షన్లలో చికెన్కి బదులు చేపలు, మటన్, రొయ్య, పీతలు వాడుతున్నారు. ఈ నేపథ్యంలో వాటి ధరలు భారీగా పెరిగాయి. సాధారణ రోజుల్లో జిల్లా వ్యాప్తంగా 4 వేల నుంచి 5 వేల కిలోల చికెన్ అమ్మకాలు జరిగేవి. రెస్టారెంట్లలో అధికంగా చికెన్ వాడేవారు. ఆదివారం చికెన్ వినియోగం మరింత ఎక్కువ. ప్రస్తుతం బర్డ్ప్లూ కారణంగా రోజుకు కనీసం 500 నుంచి 1000 కిలోలు కూడా అమ్మకాలు జరగడం లేదు. చికెన్ అందుబాటులో లేకపోవడంతో చేపలు కొనుగోలుకు మొగ్గుచూపుతున్నారు. దీంతో చేపల ధరలు భారీగా పెరిగాయి. ఆయా రకం బట్టి కిలో రూ.150 నుంచి రూ.250 వరకు విక్రయిస్తున్నారు. రెండు నెలల ముందు చేపలు కిలో రూ.120 నుంచి రూ.140 వరకు పలికేవి. సముద్ర ఉత్పత్తులైన చేపలు, పీతల ధరలు కూడా పెరుగుతున్నాయి. రొయ్యలు కిలో రూ.500 నుంచి రూ.600 వరకు పెంచి విక్రయిస్తున్నారు. రెండు నెలల ముందు రొయ్యలు కిలో రూ.400 లోపు ఉండేవి. పీతలు నెల ముందు వరకు కిలో రూ.700 నుంచి రూ.750 వరకు ఉండగా, ప్రస్తుతం కిలో రూ.1000 ధర పలుకుతున్నాయి. మటన్ మరింత ప్రియం చికెన్ అమ్మకాలు లేకపోవడంతో మటన్ ధరలు దారుణంగా పెంచారు. బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్కు ముందువరకు కిలో మటన్ రూ.800 నుంచి రూ.900 వరకు విక్రయించేవారు. ఇప్పుడు ఏకంగా రూ.1000 నుంచి రూ.1100కి పెంచి అమ్మతున్నారు. బర్డ్ఫ్లూతో తగ్గిన చికెన్ అమ్మకాలు చేపలు కిలోకు రూ.50 నుంచి రూ.70 వరకు పెంపు మటన్ కిలోకు రూ.200 నుంచి రూ.300 వరకు పెంపు పశ్చిమ గోదావరి జిల్లాలో రెండు ప్రస్తుత ధర నెలల క్రితం (రూ.లలో) ధర(రూ.లలో) మటన్ 800 1,100 చేప 150 200 రొయ్య 150 – 190 220 – 260 చికెన్ (బాయిలర్) 240 180 చికెన్ (ఫారం కోడి) 180 50 ఏలూరు జిల్లాలో.. మటన్ రూ.800 మార్పు లేదు చికెన్ రూ.240 రూ.150మేకలకు, గొర్రెలకు డిమాండ్ చికెన్ అమ్మకాలు తగ్గిపోవడంతో మటన్ అమ్మకాలు పెరుగుతున్నాయి. దీంతో మేకలు, గొర్రెలకు డిమాండ్ పెరిగింది. మటన్ వ్యాపారులు, ఫంక్షన్ల కోసం తాడేపల్లిగూడెం మార్కెట్కు వెళ్లి మేకలు, గొర్రెలు కొనుగోలు చేస్తారు. ప్రస్తుతం అక్కడ మార్కెట్లో మేకలు, గొర్రెలకు మంచి డిమాండ్ ఉంది. – ఎస్కే హుస్సేన్, మటన్ వ్యాపారి -
ఆర్డీఓ కార్యాలయం తనిఖీ
తాడేపల్లిగూడెం: రెవెన్యూ సదస్సులు, రీ సర్వే గ్రామ సభల్లో స్వీకరించిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి ఆదేశించారు. పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయంలో రికార్డులను సోమవారం ఆయన పరిశీలించారు. అంతకు ముందు జేసీ మండలంలోని నవాబుపాలెంలో రీ సర్వే పనులను పరిశీలించారు. రైతుల సమక్షంలోనే రీ సర్వే పనులను నిర్వహించాలన్నారు. గ్రామంలో రికార్డుల ప్రకారం జరుగుతున్న రీ సర్వే గ్రౌండ్ ట్రూతినింగ్ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రీ సర్వేపై రైతులకు అవగాహన కల్పించారు. రైతుల సందేహాలు నివృత్తి చేశారు. రీ సర్వేకు సంబంధించి ముందుగా నోటీసులు అందిస్తున్నారా అని రైతులను అడిగారు. ఆర్డీఓ, జిల్లా రెవిన్యూ అఽధికారి తదితరులు పాల్గొన్నారు. -
వైరస్ కోళ్లు ఖననం
తాడేపల్లిగూడెం రూరల్ : బర్డ్ ఫ్లూ నేపథ్యంలో మండలంలోని పెదతాడేపల్లి పౌల్ట్రీ ఫారంలోని కోళ్లను సోమవారం వెటర్నరీ అధికారులు ఖననం చేశారు. వెటర్నరీ సిబ్బంది పీపీ కిట్లు ధరించి సుమారు 23 వేల కోళ్లను దశల వారీగా గోతుల్లో వేసి పూడ్చారు. వెటర్నరీ జేడీ మురళీకృష్ణ, డీడీ డాక్టర్ సుధాకర్, ఎంపీడీవో ఎం.విశ్వనాథ్, వెటర్నరీ ఏడీ డాక్టర్ అనిల్కుమార్, ఈవోపీఆర్డీ ఎం.వెంకటేష్, పంచాయతీ కార్యదర్శి టి.రవిచంద్ర, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఇళ్ల తొలగింపును నిరసిస్తూ ధర్నా భీమవరం: భీమవరంలోని కోర్టు పక్కన నివాసితుల ఇళ్లు తొలగించవద్దంటూ గణపతినగర్ పేదలు మున్సిపల్ కార్యాలయం వద్ద సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా నాయకుడు బి.వాసుదేవరావు మాట్లాడుతూ పట్టణంలో బడాబాబులు ఆక్రమించిన స్థలాలు, కాల్వలను వదిలి పేదల ఇళ్లను తొలగించడం దారుణమన్నారు. గణపతినగర్లో చంటిపిల్లలు, వృద్ధులతో ఉంటున్న పేదల ఇళ్లు తొలగించడంతో చెట్టు కింద ఉండాల్సిన దుస్థితి కల్పించారని విమర్శించారు. మున్సిపల్ కమిషనర్ను కలిసి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు డి.త్రిమూర్తులు, ఎం.ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. 19 నుంచి టెక్నికల్ పరీక్షలు భీమవరం: డ్రాయింగ్, టైలరింగ్, ఎంబ్రాయిడరీ లోయర్, హయ్యర్ గ్రేడ్ పరీక్షలు ఈ నెల 19 నుంచి నాలుగు రోజుల పాటు నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి ఇ.నారాయణ తెలిపారు. పరీక్షలకు హాల్ టికెట్లు వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయని పట్టణంలోని ఎస్సీహెచ్బీఆర్ హైస్కూల్లో నిర్వహిస్తామన్నారు. జిల్లా వ్యాప్తంగా 131 మంది అభ్యర్థులు హాజరు కానున్నారన్నారు. డ్రాయింగ్ లోయర్, హయ్యర్ పరీక్షలు 19 నుంచి 22 వరకు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి 4.30 వరకు జరుగుతాయని టైలరింగ్, ఎంబ్రాయిడరీ పరీక్షలు 19 నుంచి 20 వరకు నిర్వహిస్తామన్నారు. చట్ట పరిధిలో సమస్యలు పరిష్కరించాలి భీమవరం: వివిధ రకాల సమస్యలతో జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయానికి వచ్చేవారి సమస్యలను పూర్తిస్థాయిలో విచారణ చేసి పరిష్కరిస్తామని జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి అన్నారు. సోమవారం వినతులు స్వీకరించిన ఎస్పీ సంబంధిత పోలీసుస్టేషన్ల అధికారులతో మాట్లాడి సమస్యలను చట్ట ప్రకారం విచారణ చేసి పరిష్కరించాలని ఆదేశించారు. పోలీసు స్టేషన్లకు వచ్చే బాధితులతో గౌరవంగా మాట్లాడి సమస్యలను తెలుసుకోవాలని అనంతరం వాటిపై పూర్తిస్ధాయిలో విచారణ జరిపి చర్యలు తీసుకోవాలన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో ఆధార్ క్యాంపులు భీమవరం (ప్రకాశంచౌక్): జిల్లాలోని అంగన్వాడీ పిల్లల నమోదుకు ఏర్పాటుచేసిన ప్రత్యేక మొబైల్ ఆధార్ క్యాంపులను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. జిల్లాలోని అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో నమోదైన పిల్లలకు కొత్త ఆధార్ కార్డు నమోదుకు ప్రత్యేక మొబైల్ ఆధార్ క్యాంపులు ఏర్పాటు చేశామన్నారు. ఫిబ్రవరి 18 నుంచి 21, ఫిబ్రవరి 24 నుంచి 28 వరకు క్యాంపులు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మొత్తం 99 ఆధార్ కేంద్రాలలో క్యాంపులు ఏర్పాటు చేశామన్నారు. -
కొత్త ‘మోడల్’తో బడికి మూత
తణుకు రూరల్ మండపాక ఎస్సీ కాలనీలోని ఎంపీపీ పాఠశాల–3కు 95 ఏళ్ల చరిత్ర ఉంది. గ్రామానికి చెందిన ఎంతోమంది విద్యావేత్తలు, ఉద్యోగులు, ప్రముఖులు ఓనమాలు దిద్దింది ఇక్కడే. ప్రస్తుతం ఈ పాఠశాలలో 25 మంది విద్యార్థులు ఉండగా ఇద్దరు ఉపాధ్యాయులున్నారు. మోడల్ ప్రైమరీ స్కూల్స్ (ఎంపీఎస్) కోసం కూటమి ప్రభుత్వం చేస్తున్న కసరత్తులో ఈ పాఠశాలలోని 3, 4, 5 తరగతుల విద్యార్థులను సుమారు రెండు కి.మీ దూరంలోని పాఠశాలలో విలీనం చేసేందుకు ప్రతిపాదించినట్టు తెలుస్తోంది. అదే జరిగితే ఇక్కడ 1, 2 తరగతులకు చెందిన కొద్దిమంది విద్యార్థులు మాత్రమే మిగులుతారు. వారి కోసం ఈ పాఠశాలను కొనసాగిస్తారా? లేక.. విద్యార్థులు తక్కువగా ఉన్నారన్న కారణంతో భవిష్యత్తులో మూసివేస్తారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ●విద్యార్థులు ఇబ్బంది పడాల్సి వస్తుంది మండపాక ఎంపీపీ–3 పాఠశాలకు 95 ఏళ్ల చరిత్ర ఉంది. ఎంపీఎస్ పేరిట ఇక్కడి 3, 4, 5 తరగతులను రెండు కి.మీ దూరంలోని వేరే పాఠశాలలో విలీనం చేయడం సరికాదు. దీని వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బంది పడాల్సి వస్తుంది. – జంగం సురేష్ బాబు, ప్రైవేట్ టీచర్, మండపాక మూసేయాలని చూస్తే ఉపేక్షించం విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించే నిర్ణయాలను స్వాగతిస్తాం. మోడల్ ప్రైమరీ స్కూళ్ల ఏర్పాటు పేరిట కొన్ని పాఠశాలలను మూసేయాలని చూస్తే ఉపేక్షించేది లేదు. విద్యార్థులకు న్యాయం జరిగేలా వారి పక్షాన నిలబడి పోరాటం చేస్తాం. – ఎల్.సాయి శ్రీనివాస్, ఎస్టీయూ, రాష్ట్ర అధ్యక్షుడు, భీమవరం సాక్షి, భీమవరం: మోడల్ ప్రైమరీ స్కూళ్ల పేరిట బడుల సంఖ్యను తగ్గించే దిశగా కూటమి సర్కారు ఎత్తుగడలు వేస్తోంది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి నూతన విధానం అమలుకు కసరత్తు చేస్తోంది. జిల్లాలోని 409 పంచాయతీలు, పట్టణ ప్రాంతాల్లోని 143 వార్డుల పరిధిలో మొత్తం 1,436 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 1, 2 తరగతులు కలిగిన ఫౌండేషన్ స్కూళ్లు(ఎఫ్ఎస్) 96 ఉండగా, 1 నుంచి 5వ తరగతి వరకు ఫౌండేషన్ ప్రైమరీ స్కూళ్లు(ఎఫ్పీఎస్) 1025 ఉన్నాయి. 1 నుంచి 7, 8వ తరగతి వరకు ప్రైమరీ హైస్కూళ్లు (పీహెచ్ఎస్) 43 ఉండగా, 3 నుంచి 10వ తరగతి వరకు హైస్కూళ్లు (హెచ్ఎస్) 43, 6 నుంచి 10వ తరగతి వరకు హైస్కూళ్లు (హెచ్ఎస్)144 ఉన్నాయి. జూనియర్ ఇంటర్ కలిగిన హైస్కూళ్లు (హెచ్ఎస్ ఫ్లస్) 20, ఎయిడెడ్/సోషల్ వెల్ఫేర్ స్కూళ్లు 36 ఉన్నాయి. మోడల్ స్కూళ్లకు ప్రతిపాదనలు రానున్న విద్యాసంవత్సరం నుంచి గ్రామాల్లో కిలోమీటరు పరిధిలోని ఫౌండేషన్ ప్రైమరీ స్కూళ్ల పాఠశాలలను విలీనం చేసి ఎంపీఎస్ల ఏర్పాటుకు కసరత్తు జరుగుతోంది. మోడరన్ ప్రైమరీ స్కూల్ ఏర్పాటుకు 60 మంది విద్యార్థులు ఉండాలి. ప్రతిపాదనలు సిద్ధం చేసేందుకు గతంలోనే మార్గదర్శకాలిచ్చింది. విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్న పాఠశాలల్లో 3, 4, 5 తరగతుల విద్యార్థులను సమీప పాఠశాలల్లో చేర్పిస్తారు. ఈ మేరకు గత డిసెంబరు 31 తేదీ నాటికి విద్యార్థుల సంఖ్య ప్రామాణికంగా 25 మంది విద్యార్థుల కంటే తక్కువ ఉన్న పాఠశాలలను గుర్తిస్తున్నారు. విలీనమయ్యాక ఎఫ్పీఎస్లో విద్యార్థుల సంఖ్య తగ్గిపోవడంతో కేవలం 1, 2 విద్యార్థులకు సంబంధించిన ఫౌండేషన్ స్కూళ్లుగా అవి మారుతాయి. విద్యార్థుల సంఖ్య సరిపడనంత ఉన్న మిగిలిన పాఠశాలలను బేసిక్ ప్రైమరీ స్కూల్స్ (బీపీఎస్)గా గుర్తిస్తారు. జిల్లాలో 311 మోడల్ స్కూళ్లు ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు ఇప్పటికే జిల్లాలో విలీన ప్రతిపాదిత పాఠశాలలను గుర్తించి ప్రాథమిక నివేదికను సిద్ధం చేశారు. దీని ప్రకారం జిల్లాలో 12 పాఠశాలలను యూపీఎస్లుగా కొనసాగించనుండగా, 311 మోడల్ ప్రైమరీ స్కూళ్లు (1–5వ తరగతి) ఏర్పాటు కానున్నాయి. 424 బీపీఎస్లు(1–5వ తరగతి), 424 ఎఫ్ఎస్ (1–2వ తరగతి), 230 హెచ్ఎస్లు (6–10వ తరగతి)లు ఏర్పాటుకానుండగా సోషల్, బీసీ వెల్ఫేర్ పాఠశాలలు యథావిధిగా ఉంటాయి. తాజా నిర్ణయం వలన కొన్ని ఫౌండేషన్, బీపీఎస్ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. దీనిని సాకుగా చూపించి కూటమి ప్రభుత్వం ఆయా పాఠశాలలను ఎత్తివేసే ఆలోచన చేయవచ్చునన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విధానంలో ఉపాధ్యాయులు మిగలడం వల్ల డీఎస్సీ నోటిఫికేషన్లో ఖాళీ పోస్టులు తగ్గవచ్చన్న అభిప్రాయం ఉంది. ఇవి ప్రాథమిక అంచనా మాత్రమేనని తుది నివేదిక సిద్ధం కావాల్సి ఉందని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. మండపాకలోని ఎంపీపీ పాఠశాల ప్రభుత్వ బడులను తగ్గించే ఎత్తుగడ వచ్చే విద్యాసంవత్సరం నుంచి నూతన విధానం అమలుకు కసరత్తు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్న విద్యా శాఖ జిల్లాలో అనేక పాఠశాలలు మూతపడే అవకాశంనాడు.. నాడు–నేడుతో మహర్దశ పేదల విద్యకు పెద్దపీట వేసిన మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తన హయాంలో విప్లవాత్మకమైన సంస్కరణలు తెచ్చారు. మన బడి నాడు–నేడుతో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలకు కొత్త ఊపిరిలూదారు. రూ. 369.11 కోట్ల వ్యయంతో డిజిటల్ క్లాస్రూంలు, తాగునీటి వసతి, టాయిలెట్స్, కిచెన్ షెడ్లు, ప్రహరీగోడలు, అదనపు తరగతి గదుల నిర్మాణం, విద్యుద్దీకరణ, మేజర్, మైనర్ మరమ్మతులు తదితర అభివృద్ధి పనులు చేశారు. ఈ విద్యాసంవత్సరంలో తల్లికి వందనంకు కూటమి ప్రభుత్వం ఎగనామం పెట్టింది. ఇప్పుడు మోడల్ స్కూళ్ల పేరిట ప్రభుత్వం బడులను ఎత్తివేసే ఆలోచన చేస్తుందన్న వ్యతిరేకత వ్యక్తమవుతోంది. -
బలివే ఉత్సవాల్లో సౌకర్యాలకు ప్రాధాన్యం
బలివే(ముసునూరు) : భక్తుల సౌకర్యాలు, భద్రతకు ప్రాధాన్యతనిస్తూ, అందరి సహకారంతో బలివే మహా శివరాత్రి ఉత్సవాలను విజయవంతం చేయనున్నట్లు ఉత్సవాల ప్రత్యేకాధికారి, నూజివీడు సబ్ కలెక్టర్ స్మరణ్రాజ్ అన్నారు. బలివే శ్రీరామలింగేశ్వరస్వామి ఆలయం వద్ద ఉత్సవాల నోడల్ అధికారి, తహసీల్దార్ కె.రాజ్కుమార్ అధ్యక్షతన సోమవారం అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళా భక్తులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించామని, పంచాయతీరాజ్, పోలీస్శాఖల ఆధ్వర్యంలో భక్తుల స్నానాలు, దైవ దర్శనానికి ఆటంకం లేకుండా చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. నూజివీడు, ఏలూరు రహదారుల మరమ్మతులు తక్షణం పూర్తి చేయాలని ఆదేశించారు. ఉత్సవ ప్రాంగణ పరిసరాల్లో మద్యం విక్రయాలు లేకుండా ఆ శాఖలను అప్రమత్తం చేశామన్నారు. -
ఉరివేసుకుని మహిళ ఆత్మహత్య
భీమవరం అర్బన్: ఓ మహిళ ఇంట్లో ఊరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. భీమవరం రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గూట్లపాడు గ్రామానికి చెందిన ఆకుల శ్రీరామ్మూర్తికి, అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం నందిపువారిపాలెంకు చెందిన ఆకుల దేవి సాయి రామ నాగలక్ష్మి (29)కి 2018లో వివాహమైంది. అప్పట్లో పసుపు కుంకుమల కింద 50 సెంట్లు భూమి, రూ. 3 లక్షలు, ఆడపొడుచలు లాంఛనంగా రూ.లక్షా 50 వేలు, 5 కాసులు బంగారం ముట్టజెప్పారు. కొంతకాలం దాంపత్య జీవితం సాఫీగా సాగింది. వీరికి బాబు, పాప ఉన్నారు. గత కొంతకాలంగా రామ నాగలక్ష్మిని భర్త శ్రీరామ్మూర్తి, అత్త వరలక్ష్మి, మామ ఆదినారాయణమూర్తి, ఆడపొడుచులు ముత్యాల పష్పవతి, మేడ్చర్ల లక్ష్మి, సీహెచ్ సత్యవాణి వేధిస్తున్నారు. భీమవరంలో నివసిస్తున్న శ్రీరామ్మూర్తి తన కుటుంబంతో కలిసి ఈ నెల 15న సొంతూరు గూట్లపాడు గ్రామానికి వచ్చాడు. 16వ తేదీన బాబు పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. అయితే సోమవారం ఏమైందో తెలియదు కాని రామ నాగలక్ష్మి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కాగా భర్త, అత్తమామల వేధింపుల కారణంగానే తన అక్క మృతి చెందిందని దేవి సాయి రామ నాగలక్ష్మి సోదరుడు నందిపు వీర వెంకట సత్యనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రూరల్ ఎస్సై ఐ వీర్రాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భర్త, అత్తమామల వేధింపులే కారణమని సోదరుడి ఫిర్యాదు -
పెళ్లి బృందాలను తరలిస్తున్న బస్సుల సీజ్
భీమవరం(ప్రకాశం చౌక్) : పెళ్లి బృందాలను తీసుకెళ్తున్న మూడు స్కూల్ బస్సులను రవాణా శాఖ అధికారులు అడ్డుకుని సీజ్ చేసి, జరిమానా విఽధించారు. భీమవరం నుంచి గణపవరం వెళుతున్న రెండు బస్సులు, ఆకివీడు వెళుతున్న ఒక బస్సును సీజ్ చేసి మూడు బస్సులకు కలిపి రూ.1,85,540 జరిమానా విధించినట్టు జిల్లా రవాణా శాఖ అధికారి టి.ఉమామహేశ్వరరావు తెలిపారు. గురజాడ విద్యానికేతన్ (గణపవరం), ఇండియన్ డిజిటల్ స్కూలు(గణపవరం), భారతీయ ఎడ్యుకేషనల్ సొసైటీ(ఆకివీడు)కు చెందిన బస్సులు సీజ్ చేసినట్లు చెప్పారు. పెళ్లిళ్లకు, ఇతర కార్యక్రమాలకు స్కూల్ బస్సులను వినియోగించడం చట్ట విరుద్ధమని చెప్పారు. -
స్వాస్థ్య కార్యక్రమం సద్వినియోగం చేసుకోవాలి
భీమవరం: 18 ఏళ్లలోపు వయస్సు గల పిల్లలకు వచ్చే లోపాలు, వ్యాధులు గుర్తించడం, ఉచిత చికిత్స, అవసరమైన వారికి శస్త్రచికిత్సలు చేయడానికి రాష్ట్రీయ బాలల స్వాస్థ్య కార్యక్రమం(ఆర్బీఎస్కే) నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. భీమవరం ఎస్సీహెచ్బీఆర్ఎమ్ స్కూల్లో సోమవారం ఆర్బీఎస్కే వాహనాన్ని ప్రారంభి విద్యార్థులతో మాట్లాడారు. చికిత్స అవసరమైన పిల్లలకు కేంద్ర ప్రభుత్వం సమకూర్చిన ప్రత్యేక వాహనం ద్వారా తణుకు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటుచేసిన జిల్లా బాలల సత్వర చికిత్స కేంద్రం(డిఇఐసి)లో చికిత్సలు చేస్తారన్నారు. డీఇఐసీ కేంద్రంలో ప్రత్యేకంగా పిల్లల వైద్యులు, మెడికల్ అధికారి, డెంటల్ సర్జన్, ఫిజియోథెరపిస్ట్, సైకాలజిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్, ఆడియోలాజిస్ట్, స్పీచ్ థెరపిస్ట్, ఆప్తోమీటరిస్ట్, స్పెషల్ ఎడ్యుకేటర్, స్టాప్ నర్సులను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. జిల్లాలోని అంగన్వాడీ, ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లోని 1,98,895 పిల్లలకు పరీక్షలు నిర్వహించగా 1,043 మంది పిల్లల్లో సమస్యలు గుర్తించి తణుకులోని వైద్య సాయాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ భానునాయక్, ఆర్బీఎస్కే కోఆర్డినేటర్ డాక్టర్ బి.భావన, డీఈవో ఇ.నారాయణ, డీఎన్నార్ విద్యాసంస్థల సెక్రటరీ గాదిరాజు సత్యనారాయయణరాజు పాల్గొన్నారు. దోమల నివారణకు చర్యలు చేపట్టాలి భీమవరం (ప్రకాశంచౌక్): జిల్లాలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో దోమల నిర్మూలనకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి మున్సిపల్, పంచాయతీరాజ్ అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాలు నుంచి కలెక్టర్ మున్సిపల్ కమిషనర్లు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, మలేరియా అధికారులు, పంచాయతీ అధికారులతో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా దోమల నివారణ, పారిశుద్ధ్యం, వర్మీ కంపోస్ట్ తయారీ, ప్లాస్టిక్ నిషేధం తదితర అంశాలపై సమీక్షించారు. రాజమండ్రి నుంచి జూమ్ కాన్ఫరెనన్స్లో పాల్గొన్న మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఆర్డీ సీహెచ్.నాగ నరసింహం జిల్లాలో దోమల నిర్మూలనకు చేపట్టాల్సిన చర్యలపై మున్సిపల్, పంచాయతీరాజ్ అధికారులకు వివరించారు. కలెక్టర్ మాట్లాడుతూ రోజు, రోజుకు పెరిగిపోతున్న దోమలను నిర్మూలించేందుకు మున్సిపల్, పంచాయతీరాజ్ అధికారులు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలన్నారు. మున్సిపల్ ప్రాంతాల్లో కూడా వర్మీ కంపోస్ట్ తయారు చేయాలని సూచించారు. ప్లాస్టిక్ స్థానంలో ప్రత్యామ్నాయ బయో ఉత్పత్తులను అందుబాటులో ఉంచాలని సూచించారు. ప్రతి ఒక్కరు గుడ్డ సంచి, లేదా జ్యూట్ బ్యాగులను వెంట తీసుకెళ్లాలన్నారు. పారిశుద్ధ్యం పర్యవేక్షణకు ప్రతి వార్డుకు ఒక ప్రత్యేక అధికారిని, నోడల్ అధికారులను నియమించాలని కలెక్టర్ ఆదేశించారు. జూమ్ కాన్ఫరెన్స్లో భీమవరం మున్సిపల్ కమిషనర్ కె.రామచంద్రారెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి బి.అరుణ శ్రీ, మెప్మా అధికారి గ్రంధి పార్వతి, తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ నాగరాణి -
అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలి
భీమవరం: మాతా, శిశు సంక్షేమంపై పాలకులకు చిత్తశుద్ధి లేదని దీనికి కేంద్ర బడ్జెట్ నిదర్శనమని సీఐటీయు రాష్ట్ర కార్యదర్శి కె.ఉమామహేశ్వరరావు విమర్శించారు. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం ప్రాజెక్టు కార్యాలయం వద్ద నిర్వహించిన ధర్నానుద్దేశించి ఆయన మాట్లాడారు. వేతనాల పెంపు కోసం, రాజకీయ వేధింపులు ఆపాలని, పని ఒత్తిడి తగ్గించాలనే డిమాండ్తో అంగన్వాడీలు మరోసాఇ ఆందోళనకు సిద్ధం కాక తప్పదని పిలుపునిచ్చారు. పెరిగిన ధరలు, చాలీచాలని వేతనాలు, వివిధరకాల పేర్లతో ఆన్లైన్ సేవలప్పగించడం వంటి సమస్యలు అంగన్వాడీలను కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ తాత్సారం చేయకుండా చర్యలు తీసుకోవాలన్నారు. సీఐటీయు జిల్లా నాయకులు బి.వాసుదేవరావు, ఎం.ఆంజనేయులు, గొర్ల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రస్థాయి నెట్బాల్ విజేత ‘పశ్చిమ’
పాలకోడేరు: రాష్ట్రస్థాయి అండర్ 19 బాలబాలికల నెట్బాల్ పోటీల్లో జిల్లా బాలికల జట్టు విజేతగా నిలవగా జిల్లా బాలుర జట్టు తృతీయస్థానం సాధించిందని జిల్లా నెట్ బాల్ సంఘ కార్యదర్శి ఎన్.విజయలక్ష్మి తెలిపారు. ఈనెల 16 17 తేదీల్లో తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలోని డాన్ బాస్కో హైస్కూల్ క్రీడా ప్రాంగణంలో 10వ రాష్ట్రస్థాయి జూనియర్ అండర్ 19 బాల బాలికల నెట్ బాల్ పోటీలు జరిగాయన్నారు. విజేతలకు తూర్పుగోదావరి జిల్లా నెట్ బాల్ సంఘ అధ్యక్షుడు కె.అశోక్ రెడ్డి, డాన్ బాస్కో హైస్కూల్ ప్రిన్సిపాల్ ఫాదర్ ఐ.బల్కదర్ బహుమతులు అందజేశారు. ఈ పోటీల్లో ఎంపికై న క్రీడాకారులు ఈ నెలలో జరగనున్న జాతీయస్థాయి జూనియర్ నెట్ బాల్ పోటీల్లో ఆంధ్రప్రదేశ్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తారని కోచ్ పి.దావూద్ ఖాన్ తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా క్రీడాకారులను పలువురు అభినందించారు. -
వెలగలేరులో చోరీ
పెనుమంట్ర: వెలగలేరు శివాలయం సమీపంలో సోమవారం తెల్లవారుజామున తాళం వేసిన ఇంటిలో దొంగలు పడి బంగారు ఆభరణాలు, నగదును అపహరించారు. గ్రామానికి చెందిన పడాల సూర్యకుమారి వారం రోజుల క్రితం తన ఇంటికి తాళం వేసి వైజాగ్లోని కుమార్తె ఇంటికి వెళ్లింది. అయితే సోమవారం ఉదయం తలుపులు తెరచి ఉండటాన్ని గమనించిన స్థానిక బంధువులు సమాచారాన్ని ఆమెకు తెలియజేయడంతో వైజాగ్ నుంచి వచ్చిన ఆమె పెనుమంట్ర పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ చోరీలో ఇరవై మూడున్నర కాసుల బంగారం, రూ.1.80 లక్షల నగదును దొంగలు దోచుకుపోయినట్లు ఆమె బంధువులు తెలిపారు. పెనుమంట్ర పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
సూరీడు.. అప్పుడే సుర్రుమంటున్నాడు
నరసాపురం: ఈ ఏడాది వేసవి ఆరంభంలోనే ఎండలు అదరగొడుతున్నాయి. సూరీడు సుర్రుమంటూ రానున్న రోజుల్లో తన ప్రతాపం ఎలా ఉండబోతుందోననే హింట్ ఇస్తున్నట్టుగా ఉంది. ఉమ్మడి పశ్చిమ జిల్లాలో గత వారం రోజుల నుంచి 40 డిగ్రీల చేరువలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇంకా ఫిబ్రవరి మాసం ద్వితీయార్థంలో ఉన్నాము. సాధారణంగా మార్చి చివరివారం నుంచి క్రమేపీ ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. కానీ ఈ ఏడాది ఫిబ్రవరిలోనే వేసవి తాలూకూ ప్రభావం కనిపిస్తోంది. మొన్నటి వరకూ చలి తీవ్రత ఎక్కువగా ఉంది. ప్రస్తుతం కూడా జిల్లాల్లో మంచు ప్రభావం చాలా ప్రాంతాల్లో కనిపిస్తున్నప్పటికీ, ఉదయం పూట ఉష్ణోగ్రతలు మాత్రం పెరిగాయి. దీనిని బట్టి రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు ఎంత పెద్దస్థాయిలో ఉంటాయో? అని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు గాలిలో ఉండే తేమశాతంలో కూడా భారీ హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. దీంతో రాత్రిపూట కూడా ఉక్కబోత ప్రజలను కాస్త ఇబ్బంది పెడుతుంది. తగ్గుతున్న తేమశాతం.. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు సాధారణంగా పగటి పూటల్లో గాలిలో తేమశాతం 50 శాతం పైనే నమోదవుతుంది. తెల్లవారుజామున 95 శాతంగా ఉంటుంది. ప్రస్తుతం పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో గాలిలో తేమశాతం పడిపోతోంది. పగటిపూట 40 నుంచి 50 శాతం, తెల్లవారుజాము సమయంలో 85 నుంచి 90 శాతంగా గత 10 రోజులుగా నమోదవుతోంది. ఇక ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతున్నాయి. గత 10 రోజులుగా ఉమ్మడి పశ్చిమలో అత్యధికంగా 38 నుంచి 41 డిగ్రీలు, అత్యల్పంగా 32 నుంచి 37 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇప్పుడే ఇలా ఉంటే, ఈ సంవత్సరం వేసవి మొత్తం భానుడు తన ప్రతాపాన్ని గట్టిగానే చూపించే అవకాశాలు కనిపిస్తున్నాయని వాతావరణశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. జాగ్రత్తలు అవసరం అంటున్న వైద్యులు మొన్నటి వరకూ శీతాకాలం. ఇప్పుడు చలిగాలులు తగ్గి ఉష్ణోగ్రతలు పెరుగుతుండడంతో వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో వృద్ధులు, మధుమేహం, అధిక రక్తపోటు వంటి ధీర్ఘకాల రోగాలకు మందులు తీసుకుంటున్న వారు, చిన్నపిల్లలు ఇబ్బందులు పడుతుంటారని వైద్యులు చెబుతున్నారు. ఆరోగ్యం విషయంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. 10వ తరగతి, ఇంటర్ పరీక్షలకు సన్నద్ధమవుతున్న విద్యార్థులు వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. వేసవి ప్రారంభంలోనే హెచ్చరికలు జారీ చేస్తున్న ఎండలు ఉమ్మడి జిల్లాలో 40 డిగ్రీల చేరువలో నమోదవుతున్న ఉష్ణోగ్రతలు తేమశాతంలో భారీ హెచ్చుతగ్గులు ఉక్కబోతలు కూడా ప్రారంభం -
నేను చెప్పినట్టు నడుచుకోవాల్సిందే!
నూజివీడు: రాష్ట్రంలోని ట్రిపుల్ ఐటీల్లో ఎంతో కొంత మెరుగ్గా ఉన్న నూజివీడు ట్రిపుల్ ఐటీలో టీడీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి బోధనేతర ఉద్యోగి వ్యవహార శైలి తీవ్ర చర్చనీయాంశమవుతోంది. రానురాను అతని తీరు ట్రిపుల్ ఐటీ అధికారులను సైతం ఇబ్బంది పెట్టేలా పరిణమించడం గమనార్హం. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా తనకు చెప్పాలని, నేను చెప్పినట్లే అందరూ నడుచుకోవాలంటూ డైరెక్టర్, ఏవోలకు సైతం హుకుం జారీ చేస్తుండటంతో మిగిలిన ఉద్యోగులందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. ఇన్చార్జి బాధ్యతలు ఎవరికి ఇవ్వాలి, ఎవరిని తొలగించాలో కూడా తానే చెప్తానంటూ తన మాటే శాసనం అన్నట్లుగా వ్యవహరిస్తుండటంతో అధికారులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు సమాచారం. తనకు ప్రత్యేకంగా డిపార్ట్మెంట్ ఇవ్వాలని, సెంట్రల్ డీన్ హోదా ఇవ్వాలని, తన డిజిగ్నేషన్ మార్చాలని, జీతం పెంచాలని ఒత్తిడి తీసుకువస్తున్నట్లు చర్చించుకుంటున్నారు. అంతేగాకుండా తనకు లోకేష్ తెలుసని, లోకేష్ టీం తెలుసంటూ ట్రిపుల్ ఐటీలోని అధికారులను బెదిరిస్తూ కర్రపెత్తనం చేస్తుండటం, తనకు నచ్చని వారికి అదనపు బాధ్యతలు ఇస్తే వారిని ఆ బాధ్యతల నుంచి తొలగించాలంటూ ఒత్తిడి చేయడం నిత్యకృత్యంగా మారిందనే ప్రచారం జరుగుతోంది. విద్యార్థులపైనా వేధింపులు ఒకవైపు అధికారులపై కర్ర పెత్తనం చేస్తుండటంతో పాటు తమకు నచ్చని విద్యార్థులపైనా వేధింపులు చేస్తున్నారనే ప్రచారం చేస్తున్నారు. ఎవరైనా విద్యార్థులు తమకు నచ్చిన హీరో ఫొటోనో, నాయకుడి ఫొటోనో ఫోన్లస్టాటస్గా పెట్టుకుంటే ఆ విద్యార్థులపై చర్యలు తీసుకోవాలంటూ అధికారులపై ఒత్తిడి చేస్తుండటంపై ట్రిపుల్ ఐటీలో సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. ట్రిపుల్ ఐటీలను స్థాపించి 16 ఏళ్లు అవుతున్నప్పటికీ ఇంత దారుణమైన పరిస్థితి గతంలో ఎప్పుడూ లేదని పలువురు వాపోతున్నారు. ఈ ఉద్యోగితో పాటు కొందరు ప్రభుత్వ అనుకూల వర్గంగా ఏర్పడి తమకు అనుకూలంగా లేని ఉద్యోగులపై ఫిర్యాదులు సైతం చేస్తుండటం గమనార్హం. ఈ పరిస్థితుల్లో బయటి నుంచి కనబడే శత్రువు కంటే మనలోని కనబడని శత్రువు నుంచే ట్రిపుల్ ఐటీలో ఎక్కువ సమస్యలు వస్తున్నాయంటూ ఒక అధికారి పేర్కొన్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతోంది. ఇంతకీ ఆ బోధనేతర ఉద్యోగి కాంట్రాక్టు ఉద్యోగి కావడం కొసమెరుపు. కర్ర పెత్తనం చేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగి లోకేష్ టీం పేరుతో బెదిరింపులు ట్రిపుల్ ఐటీలో అధికారులపై ఒత్తిడి విద్యార్థులపై లేనిపోని ఫిర్యాదులు వివాదాస్పదంగా బోధనేతర ఉద్యోగి తీరు -
వర్గీకరణ చేస్తే ప్రాణత్యాగాలకు సిద్ధం
తాడేపల్లిగూడెం (టీఓసీ): ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ దేశ వ్యాప్తంగా చేయాలి తప్పా, తమ స్వార్థ ప్రయోజనాల కోసం తెలుగు రాష్ట్రాల పరిధిలో చేస్తే ప్రాణత్యాగాలు చేయడానికి కూడా సిద్ధమని మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు చీకటమిల్లి మంగరాజు పేర్కొన్నారు. సోమవారం పట్టణంలోని హౌసింగ్ బోర్డులో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం రావడానికి మాలలే ప్రముఖ పాత్ర వహించినట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీని గెలిపించేందుకు మాలలు కృషి చేస్తే అధికారంలోకి వచ్చిన ఆ పార్టీ, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మంద కృష్ణకు అనుకూలంగా ఎస్సీ వర్గీకరణ చేసేందుకు చూస్తున్నారని, ఇది సరికాదన్నారు. మందకృష్ణ మాత్రం మతతత్వ పార్టీ బీజేపీకి మద్దతు ఇస్తున్నారని, ఈ విషయాన్ని ఇతర పక్షాలు గుర్తించాలని వెల్లడించారు. రాబోయే ఎన్నికల్లో ఎస్సీ వర్గీకరణకు మద్దతు ఇచ్చిన రాజకీయ పార్టీలకు తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు మంత్రి నరసింహయ్య, ఏపీ రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ పుష్పాంజలి, మహానంది, శేషు పాల్గొన్నారు. గ్యాస్ లీకై వ్యక్తికి తీవ్ర గాయాలు బుట్టాయగూడెం: జీలుగుమిల్లి మండలం కనకాపురంలో సోమవారం సాయంత్రం గ్యాస్ సిలిండర్ పైప్ లీక్ అయ్యి మంటలు చెలరేగడంతో ఒక వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. గ్రామానికి చెందిన బంగారయ్య వంట కోసం గ్యాస్ స్టౌను వెలిగించే ప్రయత్నం చేశాడు. ఆ సమయంలో గ్యాస్ పైప్ లీక్ అవ్వడంతో మంటలు చెలరేగి అతనికి తీవ్ర గాయాలయ్యాయి. బంగారయ్యను చికిత్స నిమిత్తం జంగారెడ్డిగూడెం ఏరియా ఆస్పత్రికి తరలించారు. కాగా మంటలు ఆర్పేందుకు గ్రామస్తులు ప్రయత్నించినా గ్యాస్ సిలిండర్ కావడంతో పరుగులు తీశారు. సమాచారం అందుకున్న ఎమ్మెల్యే చిర్రి బాలరాజు, ఎస్సై నవీన్కుమార్ అక్కడికి చేరుకుని ఆ మంటలను ఆర్పించారు. లారీ ఢీకొని వ్యక్తి మృతి తాడేపల్లిగూడెం రూరల్: లారీ ఢీకొని మోటార్సైక్లిస్టు మృతి చెందాడు. రూరల్ ఎస్సై జేవీఎన్ ప్రసాద్ తెలిపిన వివరాలివి. ముత్యాలంబాపురం గ్రామానికి చెందిన పప్పు సంజీవరావు (64) సోమవారం తన మోటారు సైకిల్పై దేవరపల్లి మండలం కృష్ణంపాలెం వెళ్లి తిరిగి వస్తుండగా పెదతాడేపల్లి జాతీయ రహదారిపై ఏపీ 28 టిడి 5445 నెంబరు గల లారీ వేగంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రుడ్ని తాడేపల్లిగూడెం ఏరియా ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనపై సంజీవరావు కుమారుడు అశోక్ కుమార్ రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చెప్పారు. సారా తయారీదారుల అరెస్ట్ చాట్రాయి: సారా తయారీదారులను అరెస్ట్ చేసినట్లు నూజివీడు ఎకై ్సజ్ ఎస్సై మస్తానరావు తెలిపారు. మండలంలోని పోతనపల్లి తండాలో సారా నేరాలకు పాల్పడుతున్న హసావతు బాలరాజు, వడిత్యా బిక్షాలు, ధారావతు శ్రీరాములును అరెస్టు చేసి రిమాండ్ నిమిత్తం తిరువూరు కోర్టుకు తరలించినట్లు సోమవారం ఆయన చెప్పారు. -
23 నుంచి శివయ్య కల్యాణోత్సవాలు
ద్వారకాతిరుమల: శ్రీవారి ఆలయానికి ఉపాలయమై, క్షేత్రపాలకునిగా విరాజిల్లుతోన్న శ్రీ భ్రమరాంబ మల్లేశ్వర స్వామివారి ఆలయంలో శివయ్య కల్యాణ మహోత్సవాలు ఈనెల 23 నుంచి ప్రారంభం కానున్నాయి. వచ్చేనెల 1 వరకు ఈ ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని ఆలయ ఈఓ ఎన్వీ సత్యన్నారాయణ మూర్తి సోమవారం తెలిపారు. ఉత్సవాల్లో భాగంగా 23న ఉదయం 10 గంటలకు స్వామివారిని పెండ్లి కుమారునిగాను, అమ్మవార్లను పెండ్లికుమార్తెలుగా ముస్తాబు చేస్తారు. 26న మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని రాత్రి 10 గంటలకు లింగోధ్భవకాల అభిషేకం అనంతరం స్వామివారి కల్యాణోత్సవం, ఆ తర్వాత గ్రామోత్సవం జరుగుతుంది. వచ్చేనెల 1న ఆలయంలో జరిగే శ్రీపుష్ప యాగోత్సవంతో ఉత్సవాలు పరిసమాప్తం అవుతాయని ఈఓ తెలిపారు. భక్తులు పెద్ద ఎత్తున ఈ కల్యాణోత్సవాల్లో పాల్గొనాలని ఆయన కోరారు. 26న రాత్రి స్వామివారి కల్యాణం -
నకిలీ నగలతో ముత్తూట్లో రుణం
సంస్థలో పనిచేసే ఇద్దరిపై కేసు నమోదు ఏలూరు టౌన్: ప్రైవేట్ ఫైనాన్స్ దుకాణంలో పనిచేస్తున్న సిబ్బందే నకిలీ నగలు తాకట్టుపెట్టి భారీగా డబ్బులు కాజేశారు. ఈ మోసం బయటపడడంతో పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఏలూరు పవర్పేటలో ముత్తూట్ ఫైనాన్స్ పేరుతో బంగారు నగల తాకట్టు దుకాణం ఉంది. ఈ బ్రాంచ్లో ఏలూరుకు చెందిన ఇద్దరు వ్యక్తులు పనిచేస్తున్నారు. వీరు కొంతకాలం క్రితం ముత్తూట్ ఫైనాన్స్లో నకిలీ నగలను తాకట్టుపెట్టి రూ.12,31,600 రుణంగా తీసుకున్నారు. బ్రాంచ్లో పనిచేస్తున్న సిబ్బంది కావడంతో పూర్తిస్థాయిలో తనిఖీ చేయకుండానే రుణం మంజూరు చేశారు. రెండు రోజుల క్రితం మూత్తూట్ ఫైనాన్స్ రీజనల్ మేనేజర్ వేల్పూరి రాజేష్ ఏలూరులోని పవర్పేట బ్రాంచ్కు వచ్చారు. ఆయన బ్రాంచ్లో తాకట్టు పెట్టిన బంగారు నగలను తనికీ చేశారు. ఈ తనికీల్లో తాకట్టులోని నగలు నకిలీగా నిర్థారించారు. ఈ నగలను తాకట్టు పెట్టిన వ్యక్తుల వివరాలు ఆరా తీయగా బ్రాంచ్లో పనిచేస్తున్న సిబ్బందిగా గుర్తించారు. దీనిపై రీజనల్ మేనేజర్ రాజేష్ ఏలూరు టూటౌన్ పోలీసులకు సోమవారం ఫిర్యాదు చేశారు. టూటౌన్ సీఐ వైవీ రమణ ఆధ్వర్యంలో ఎస్ఐ నాగకళ్యాణి ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పిచ్చికుక్క దాడి.. 8 మందికి గాయాలు కొయ్యలగూడెం: కన్నాపురంలో పిచ్చికుక్క స్వైర విహారంతో 8 మంది గాయాలపాలయ్యారు. దీంతో గ్రామస్తులు ఆ పిచ్చికుక్కను వెంటాడి హతమార్చారు. పిచ్చికుక్క మరికొన్ని కుక్కలపై దాడి చేసిందని, ఈ నేపథ్యంలో మిగిలిన కుక్కల పరిస్థితి పట్ల అప్రమత్తతతో ఉండాలని గ్రామస్తులు సూచిస్తున్నారు. పంచాయతీ అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
ఇప్ప పువ్వు.. గిరిజనుల కల్పతరువు
బుట్టాయగూడెం: ఆదివాసీ గిరిపుత్రులకు అడవిలో లభించే ఉత్పత్తులే జీవనాధారం. అందులోనూ కాలానుగుణంగా లభించే ఇప్ప పవ్వు అతి ప్రధానమైనది. వేసవిలో మాత్రమే దొరికే వీటిని విక్రయించి గిరిజనులు ఉపాధి పొందుతుంటారు. తెల్లవారుజామునే అడవిలోకి వెళ్లి ఇప్పపువ్వును గిరిజనులు సేకరిస్తారు. చెట్లపై నుంచి కిందపడిన ఇప్ప పువ్వును మధ్యాహ్ననికి సేకరించి ఇంటికి తెచ్చి ఎండబెడతారు. మూడు నెలల పాటు ఉపాధి మన్య ప్రాంతంలో నివసిస్తున్న గిరిజనులకు ఇప్ప చెట్ల ద్వారా మూడు నెలల పాటు ఉపాధి దొరుకుతుంది. ఖరీఫ్, రబీ పనులు ముగిసే సమయానికి ఇప్ప చెట్లు విరగ పూస్తాయి. వీటి పువ్వులు గాలికి నేలరాలుతుంటాయి. ఈ పువ్వులను గిరిజనులు సేకరిస్తారు. వీటితోపాటు మొర్రి పండ్లు సేకరించి ఇంటికి తీసుకువస్తుంటారు. వీటిని సేకరించి మార్చి, ఏప్రిల్, మే నెలల్లో విక్రయించి ఉపాధి పొందుతుంటారు. ఔషధాల తయారీ గిరిజనులు సేకరించిన ఇప్ప పువ్వును జీసీసీల ద్వారా కొనుగోలు చేస్తుంటారు. ఇప్ప పువ్వును ఔషధాల తయారీకి విక్రయిస్తారు. ఈ పువ్వు నుంచి తీసిన తైలాన్ని పక్షవాతం వంటి వ్యాధులకు ఉపయోగిస్తారు. అలాగే దంతాలను శుభ్రం చేసుకోవడంతోపాటు దగ్గుకు, దంతాలకు సంబంధించిన వ్యాధులకు ఔషదంగా పనిచేస్తుంది. ప్రధానంగా స్వచ్ఛమైన ఇప్ప పువ్వుతో తయారు చేసిన సారాను సేవిస్తే వృద్ధాప్య లక్షణాలు త్వరగా రాకుండా ఉంటాయని గిరిజనులు అంటున్నారు. వైద్యశాస్త్రంలోనూ ఇప్ప పువ్వు ప్రాధాన్యతను సంపాదించుకుంది. ఆయుర్వేదంలోనూ మధుక వృక్షం అని పేరుపొందింది. గిరిజన ప్రాంతంలోని ప్రజలు ఈ ఇప్పచెట్లను మాతృమూర్తిగా భావిస్తారు. ఇప్ప పువ్వులో ఎన్నో పోషకాలు అడవిలో లభించే ఇప్ప పువ్వుల గింజల నుంచి తీసిన నూనెలో ఎన్నో పోషక విలువలున్నట్లు శాసీ్త్రయంగా నిరూపించబడింది. భారత శాసీ్త్రయ సాంకేతిక మంత్రిత్వ శాఖ సహాయంతో 1999లో నిర్వహించిన పరిశోధనలో ఎండిన ఇప్ప పువ్వుల నుంచి పంచదారను తయారు చేసి దీనితో జామ్, కేక్లు, చాక్లెట్లు తయారు చేసే విధానాన్ని కనిపెట్టారు. ఇప్పపువ్వు ఎక్కువకాలం నిల్వ ఉండడానికి మధ్యమధ్యలో ఎండిన వేప ఆకును వేస్తే ఎక్కువకాలం నిల్వ ఉంటుందని తెలుసుకున్నారు. కొందరు గిరిజనులు ఇప్పపువ్వును ఆహారంగా కూడా తీసుకుంటారు. ధరలేక ఇప్ప పువ్వు సేకరణపై తగ్గిన ఆసక్తి పశ్చిమ ఏజెన్సీ ప్రాంతంతో పాటు పాపికొండల అభయారణ్యంలో ఇప్ప చెట్లు దాదాపుగా 10 వేలకు పైగా ఉండవచ్చని అంచనా. ముఖ్యంగా బుట్టాయగూడెం మండలం, పోలవరం, కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో ఈ ఇప్ప చెట్లు ఆధికంగా ఉన్నాయి. అటవీ శాఖ ఆధ్వర్యంలో కూడా దాదాపుగా 5 వేల చెట్ల వరకూ అటవీ ప్రాంతాల్లోని ఖాళీ ప్రదేశాల్లో నాటి వాటిని పెంచుతున్నారు. గిరిజనులు సేకరించిన ఈ ఇప్ప పువ్వులను జీసీసీ అధికారులే కాదు బయటి నుంచి అనేక మంది వ్యాపారులు కూడా కొనుగోలు చేసి తీసుకువెళ్తుంటారు. ప్రస్తుతం కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో గుత్తుకోయలు, బుట్టాయగూడెం మండలంలో కొండరెడ్లు ఈ పువ్వులను సేకరిస్తూ జీవనోపాధి పొందుతున్నారు. అయితే సరైన ధర లభించకపోవడంతో కాలక్రమేపీ గిరిజనులు కూడా ఇప్ప పువ్వు సేకరణపై ఆసక్తి చూపడంలేదు. అలాగే పలుచోట్ల ఇప్ప పువ్వు చెట్లను కూడా నరికివేస్తున్నట్లు సమాచారం. పోషకాలు పుష్కలం.. వైద్య శాస్త్రంలోనూ ప్రాధాన్యత వేసవి నుంచి మూడు నెలల పాటు అడవి బిడ్డలకు ఉపాధి గిట్టుబాటు ధర లేక.. తగ్గుతున్న పువ్వుల సేకరణ జీసీసీ ద్వారా ఇప్ప పువ్వుకొనుగోలు చేయాలని డిమాండ్ సరైన ధర లేక.. సరైన ధర రాకపోవడంతో గిరిజనులు ఇప్ప పువ్వుల సేకరణకు ఆసక్తి చూపడంలేదు. రానురానూ చెట్లు కనుమరుగయ్యే పరిస్థితి ఉంది. అటవీశాఖ ఆధ్వర్యంలో చెట్లను పెంచడంతోపాటు జీసీసీ ద్వారా కొనుగోలు చేయాలి. – కారం రాఘవ, న్యూడెమోక్రసీ నాయకులు, అలివేరు జీసీసీ ద్వారా కొనుగోలు చేయాలి మా గ్రామ సమీపంలోని అడవుల్లో ఇప్ప పువ్వుతోపాటు పలు ఉత్పత్తులు లభిస్తున్నాయి. ప్రస్తుతం ఇప్ప పువ్వు సీజన్ ప్రారంభమవుతుంది. జీసీసీ ద్వారా ఇప్ప పువ్వు కొనుగోలు చేయాలి. – కెచ్చెల బాలిరెడ్డి, కొండరెడ్డి గిరిజనుడు, మోదేలు -
గోస్తనీ కాలువలో దూకి మహిళ గల్లంతు
తణుకు అర్బన్: గోస్తనీ కాలువలో దూకి మహిళ గల్లంతైన ఘటన తణుకు సజ్జాపురం ప్రాంతంలోని జాతీయరహదారి వంతెన ప్రాంతంలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం సజ్జాపురంలో నివసిస్తున్న గుమ్మళ్ల శాంతి (48) ఆదివారం రాత్రి 2.30 గంటల సమయంలో ఇంటి నుంచి బయటకు రావడం.. ఆపై కనిపించకపోవడంతో కుటుంబసభ్యులు, స్నేహితులు సోమవారం ఉదయం నుంచి వెతుకులాట చేపట్టారు. ఈ క్రమంలో ఆమె కాళ్లకు వేసుకునే బూట్లు గోస్తనీ కాలువ వంతెనపై భాగంలోని జాతీయరహదారిపై ఉండడంతో రాత్రి సమయంలో కాలువలోకి దూకి ఉంటారని కుటుంబసభ్యులు, పోలీసులు భావిస్తున్నారు. దీంతో అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సహకారంతో గజ ఈతగాళ్లు గోస్తనీ కాలువలో గాలింపు చర్యలు చేపట్టారు. మహిళ కాలువలో దూకారనే వార్త తెలిసిన సజ్జాపురవాసులతోపాటు జాతీయ రహదారిపై వెళ్తున్న ప్రయాణికులు వంతెన ప్రాంతంలో భారీగా చేరుకుని గుమిగూడారు. కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పట్టణ ఎస్సై శ్రీనివాస్ కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. వెల్నెస్ సెంటర్ కోచ్గా శాంతి సజ్జాపురం పార్కు ప్రాంతంలో తన ఇద్దరు కుమారులతో కలిసి శాంతి నివసిస్తోంది. భర్త లేకపోవడంతో తన నివాసంలోనే వెల్నెస్ సెంటర్ కోచ్గా ఆమె ఉపాధి పొందుతోంది. శాంతి అందరితో కలుపుగోలుగా ఉండే స్వభావమని, సామాజిక మాధ్యమాల్లో సైతం రీల్స్ చేస్తూ హుషారుగా ఉంటుందని స్నేహితులు చెబుతున్నారు. ఆమె ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. కుమారులిద్దరిలో ఒకరికి వివాహం కూడా అయినట్లు బంధువులు వివరిస్తున్నారు. శాంతి కాలువలో దూకినట్లుగా ఎవరూ చూడకపోవడంతో గోస్తనీ కాలువ వంతెనపై ఉన్న బూట్లు ఆధారంగా మాత్రమే కాలువలో దూకినట్లు అంచనా వేస్తున్నారు. వంతెనపై ఉన్న ఆమె బూట్ల ఆధారంగా గోస్తనీ కాలువలో గాలింపు -
హత్య చేసి.. కుడి చేయి తీసుకెళ్లినా హంతకులు
నిడమర్రు (పశ్చిమ గోదావరి): నిడమర్రు మండలం బావాయిపాలెం గ్రామంలో యువకుడి హత్య కలకలం రేపింది. గ్రామానికి చెందిన యువకుడు మజ్జి ఏసు(26)ను శనివారం రాత్రి అత్యంత దారుణంగా హత్య చేశారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఏసు తండ్రి ప్రసాద్ మరణించగా, తల్లి దుబాయ్లో ఉంది. ఏసు దుర్గా శ్రీవల్లిని 2023లో ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. ఉండి మండలం కలిగొట్ల గ్రామంలోని ఆక్వా చెరువుల కాపలాదారుడిగా పని చేస్తున్నాడు. భార్య 8వ నెల గర్భవతి కావడంతో తల్లిదండ్రుల వద్దకు వెళ్లింది. మృతుడితోపాటు అమ్మమ్మ మాత్రమే ఉంది. శనివారం అర్ధరాత్రి దాటాక బావాయిపాలెం శివారులో ఉన్న చినకాపవరం పంటకాల్వ వద్ద ఏసును చంపి, శవాన్ని కాలువ రేవు వద్ద పడేశారు. అతని కుడి చేయిని నరికి తీసుకెళ్లారు. ఆదివారం ఉదయం సమాచారం అందిన వెంటనే నిడమర్రు సీఐ ఎంవీ సుభాష్, ఎస్సై వీర ప్రసాద్ సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. భార్య శ్రీవల్లి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నారు. డీఎస్పీ శ్రావణ్ కుమార్ కూడా క్లూస్ టీమ్తో సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. హంతకులు ఒకరి కన్నా ఎక్కువ మంది ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. మృతుడి ఇంటి పరిసరాల్లోనే డాగ్ స్క్వాడ్ కలియ తిరిగింది. -
రాజకీయ ప్రకటనలకు అనుమతి తప్పనిసరి
ఏలూరు(మెట్రో): ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఎలక్ట్రానిక్ మీడియాలో రాజకీయ ప్రకటనలకు తప్పనిసరిగా మీడియా సర్టిఫికేషన్ మానటరింగ్ కమిటీ (ఎంసీఎంసీ) నుంచి ముందస్తు ఆమోదం పొందాలి. పెయిడ్ న్యూస్ రాజకీయ ప్రకటనలను పరిశీలించేందుకు రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ ఎంసీఎంసీ కమిటీని నియమించారు. ఎలక్ట్రానిక్ మీడియాలో రాజకీయ ప్రకటనలు ప్రసారం చేయదలచిన తేదీకి కనీసం మూడు రోజుల ముందు సంబంధిత అభ్యర్థులు ధరఖాస్తు చేసుకోవాలి. ఆ తర్వాత రెండు రోజుల్లో దానిపై కమిటీ నిర్ణయం తీసుకుంటుంది. ఎలక్ట్రానిక్ మీడియా రాజకీయ ప్రకటనలపై ఈసీ నిబంధనలను కచ్చితంగా పాటించాలి. ఎంసీఎంసీ సెల్ను ఏలూరు కలెక్టరేట్లో ఏర్పాటుచేశారు. -
వివాహిత ఆత్మహత్య
జంగారెడ్డిగూడెం: వివాహిత ఆత్మహత్య ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై షేక్ జబీర్ తెలిపారు. జంగారెడ్డిగూడెం మండలం మైసన్నగూడెంకు చెందిన మహాలక్ష్మికి గుండుగొలనుకు చెందిన బొంతు నారాయణతో గత ఏడాది ఏప్రిల్లో వివాహమైంది. మహాలక్ష్మికి ఇటీవల అబార్షన్ అయ్యింది. వారం రోజుల క్రితం మహాలక్ష్మి మైసన్నగూడెం పుట్టింటికి వచ్చింది. అప్పటి నుంచి మనస్తాపంతో ఉన్న ఆమె ఈ నెల 15న ఇంట్లో ఉరివేసుకుని మృతిచెందింది. కుటుంబసభ్యులు ఇంటికి వచ్చి చూసే సరికి చనిపోయి ఉందని, తల్లి నాగమణి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. మైనర్లపై పోక్సో కేసు నమోదు నూజివీడు: పట్టణంలోని అజరయ్యపేటకు చెందిన ఇద్దరు మైనర్లపై పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్సై జ్యోతిబసు తెలిపారు. అజరయ్యపేటకు చెందిన బాలిక ఈ నెల 15న కాలేజీ నుంచి ఇంటికి వస్తుండగా ఇద్దరు యువకులు బండిపై వచ్చి ఇంటి దగ్గర దించుతామని అడగగా బండి ఎక్కింది. వారిద్దరూ బాలికను ఇంటి వద్ద దించకుండా శ్మశానం వైపు తీసుకెళ్లారు. అక్కడ చేతులు వేయబోగా కేకలు వేసింది. దీంతో యువకులు బాలికను బండిపై ఇంటి వద్ద దించారు. బాలిక విషయాన్ని తల్లితో చెప్పగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. తల్లి ఫిర్యాదు మేరకు పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
రాజబాబు మరణం పార్టీకి తీరని లోటు
ద్వారకాతిరుమల: వైఎస్సార్సీపీ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెలికాని రాజమోహన్రావు (రాజబాబు) లేని లోటు పార్టీకి తీరనిదని ఆ పార్టీ ముఖ్య నేతలు అన్నారు. బ్రెయిన్ స్ట్రోక్తో చికిత్స పొందుతూ శనివారం రాత్రి ఆయన హైదరాబాద్లో కన్నుమూశా రు. ఆయన భౌతిక కాయాన్ని ఆదివారం ఉదయం మండలంలోని సీహెచ్ పోతేపల్లిలో స్వగృహానికి తీసుకువచ్చారు. వైఎస్సార్సీపీ, టీడీపీలకు చెందిన పలువురు నేతలు రాజబాబు పార్థీవ దేహం వద్ద నివాళులర్పించారు. మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ గోపాలపురం నియోజకవర్గ ఇన్చార్జి తానేటి వనిత, మాజీ మంత్రి, పార్టీ తూర్పుగోదావరి జిల్లా పార్టీ అధ్యక్షుడు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, పార్టీ రాష్ట్ర యువజన విభాగ అధ్యక్షుడు జక్కంపూడి రాజా, మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్, ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్, పార్టీ రాజమండ్రి పార్లమెంట్ ఇన్చార్జి గూడూరి శ్రీనివాస్, పార్టీ కొవ్వూరు ఇన్చార్జి తలారి వెంకట్రావు, చింతలపూడి ఇన్చార్జి కంభంపాటి విజయరాజు తదితరులు రాజబాబు పార్థీవదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబసభ్యులను పరామర్శించి, తమ ప్రగాఢ సానుభూ తిని తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైఎస్సార్సీపీ సీపీ ఆవిర్భావం నుంచి రాజబాబు పార్టీకి అందించిన సేవలు ఎనలేనివని అన్నారు. పార్టీ శ్రేణులకు ఎప్పుడూ వెన్నుదన్నుగా ఉంటూ, పార్టీ బలోపేతానికి రాజబాబు చేసిన కృషి మరువలేమన్నారు. రాష్ట్ర సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ పిల్లంగోళ్ల శ్రీలక్ష్మి, రాజమండ్రి జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు సాలి వేణు, జిల్లా బూత్ కమిటీల కన్వీనర్ గుర్రాల లక్ష్మణ్, జిల్లా ప్రచార కమిటీ అధ్యక్షుడు తోట రామకృష్ణ, నరహరిశెట్టి రాజా తదితరులు ఉన్నారు. రాజబాబుకు డీఎన్నార్ నివాళి ఏలూరు (టూటౌన్): వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెలికాని రాజబాబు పార్థీవదేహాన్ని పార్టీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు, ఏలూరు నియోజకవర్గ ఇన్చార్జి మామిళ్లపల్లి జయప్రకాష్ (జేపీ) సందర్శించి నివాళులర్పించారు. -
పక్షుల కేంద్రంలో పర్యాటకుల సందడి
కైకలూరు: పక్షి ప్రేమికుల స్వర్గధామంగా పిలిచే ఆటపాక పక్షుల విహార కేంద్రం పర్యాటకులతో ఆదివారం సందడిగా మారింది. శీతాకాలపు వలస పక్షుల కేరింతలను ఆస్వాదించడానికి ఏలూరు, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల నుంచి పెద్ద ఎత్తున యాత్రికులు విచ్చేశారు. బోటు షికారులో పెలికాన్, పెయింటెడ్ స్టోక్ పక్షుల అందాలను వీక్షించారు. అనంతరం ఈఈసీ కేంద్రంలో పక్షి నమూనా మ్యూజియంను సందర్శించారు. దీని సమీపంలోని చిల్డ్రన్స్ పార్కులో చిన్నారులు వివిధ ఆటలు ఆడుకున్నారు. కోడి పందేలపై దాడి ఉండి: మండలంలోని కలిసిపూడిలో నిర్వహిస్తున్న కోడి పందేలపై ఎస్సై ఎండీ నసీరుల్లా ఆధ్వర్యంలో పోలీసులు ఆదివారం దాడి చేశారు. ఈ దాడిలో ఐదుగురిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి రూ.1600 నగదు, ఒక కోడిని స్వాధీనం చేసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
పరీక్షల వేళ ఆహార నియమాలు
చింతలపూడి: త్వరలో పదో తరగతి, ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో పరీక్షల వేళ విద్యార్థులు చదువు మీద ధ్యాసతో సరైన ఆహారం తీసుకోవడం మర్చిపోతారు. గంపెడు సిలబస్ను వడపోసి ప్రశ్నా పత్రాల్లో వచ్చే ప్రశ్నలకు జవాబులు రాయాలంటే ముందుగా విద్యార్థికి కావాల్సింది ఆరోగ్యం. ఈ నేపథ్యంలో పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు నెల రోజుల ముందునుంచే తేలికపాటి ఆహారం అందించడం ఉత్తమమని యర్రగుంటపల్లి పీహెచ్సీ వైద్యాధికారి కొత్తపల్లి నరేష్ తెలిపారు. రోజూ ఇంట్లో వండే వంటల్లోనే చిన్న, చిన్న మార్పులతో తేలికపాటి ఆహారాన్ని వండి పెట్టాలని సూచిస్తున్నారు. ఏమేం తినాలి ● అధిక కారం, మసాలా, నూనెలతో తయారైన ఆహార పదార్థాలను తినకండి. వాటికి దూరంగా ఉండండి. రోజూ కనీసం 6 నుంచి 8 గంటలు నిద్ర పోవడం మంచిది. తేలికగా జీర్ణమయ్యే ఇడ్లీ, రసంతో భోజనం మంచిది. పెరుగు, మజ్జిగ పరిమితంగా తీసుకోవాలి. ● అందుబాటులో ఉండే తాజా పండ్లు తీసుకోవాలి. ద్రాక్ష, అరటి పండు, అనాస, దోస వంటి పండ్లు ఆరోగ్యానికి మంచిది. పరీక్షలు జరిగే రోజుల్లో మాంసాహారానికి దూరంగా ఉంటే మంచిది. మంచి ఆహారంతో పరీక్షల గండం గట్టెక్కినట్లే. టైం టేబుల్ ● మెదడు తాజాగా ఉండాలంటే పరీక్షల సమయంలో విద్యార్థులు ఉదయం 4.30 గంటలకు లేవడం రాత్రి 10.30 గంటలకు ముందుగా నిద్రపోవడం అలవాటు చేసుకోవాలి. ● మెదడు చురుగ్గా పని చేయడానికి ప్రొటీన్లు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవాలి. ముఖ్యంగా చిక్కుడు, కూరగాయలు, పండ్లు తినాలి. ఉదయం లేచిన వెంటనే కొద్దిసేపు వ్యాయామం చేస్తే మంచిది. తరువాత ఇడ్లీ, పాలు తీసుకోవడం ఉత్తమం. అనంతరం చదువు ప్రారంభించాలి. ● పరీక్ష రాసి ఇంటికి వచ్చాక పండ్లు, పండ్ల రసాలు తాగాలి. పెరుగుతో ఆహారం తీసుకోవడం కూడా మంచిదే. సాయంత్రం చదువు ప్రారంభించేటప్పుడు కప్పు టీ తాగాలి. చదువడం అయిపోయాక నిద్రకు ఉపక్రమించే గంట ముందు తేలికపాటి భోజనం తీసుకోవాలి. ● ఒత్తిళ్లకు గురికాకుండా నిద్ర పోవాలి. రోజులో ఎక్కువ సార్లు పాలు తాగండి. మెదడు చురుగ్గా పని చేస్తుంది. ఒకసారి రాస్తూ చదివితే పదిసార్లు చదివినట్లు అర్థం. డాక్టర్ కొత్తపల్లి నరేష్, యర్రగుంటపల్లి పీహెచ్సీ వైద్యాధికారి -
చోరీ చేసిన బైక్ల స్వాధీనం
ఏలూరు (టూటౌన్): బైక్ల దొంగతనం కేసును భీమడోలు పోలీసులు ఛేదించారు. డీఎస్పీ డి.శ్రావణ్ కుమార్ ఆదివారం వివరాలు వెల్లడించారు. చింతలపూడి మండలం బోయగూడెం గ్రామానికి చెందిన అక్కల రామచంద్ర రావు భీమడోలు మండలం సూరప్పగూడెం గ్రామంలో పొలం కౌలుకు చేస్తున్నాడు. పొలం షెడ్డులో ఉన్న అతని బైక్ చోరీకి గురైంది. దీనిపై భీమడోలు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. సీఐ యుజె.విల్సన్ పర్యవేక్షణలో ఎస్సై వై.సుధాకర్, సిబ్బంది ఈ కేసును దర్యాప్తు చేశారు. ఏలూరు వంగాయగూడెంకు చెందిన వాసే రాజు అలియాస్ సంసోను, భీమడోలుకు చెందిన యర్రంశెట్టి పవన్ కుమార్ను అరెస్టు చేశారు. ముద్దాయిలు ఈ నెల 6న ఏలూరు గంగానమ్మ గుడి సమీపంలో వృద్ధురాలి మెడలోని బంగారు తాడును తెంపుకుపోయారు. వాసే రాజుపై గతంలో పలు పోలీస్ స్టేషన్లలో కేసులున్నాయి. వారి నుంచి మూడు బైక్లు, బంగారు గొలుసును స్వాధీనం చేసుకున్నారు. -
గల్లీ నుంచి ఢిల్లీకి
బుట్టాయగూడెం: పశ్చిమ ఏజెన్సీ ప్రాంతంలోని కేఆర్పురం ఐటీడీఏ వద్ద గిరిజన మహిళలు తయారు చేస్తున్న చిరుధాన్యాల మిల్లెట్ బిస్కెట్లు ఢిల్లీలో ఆదిమహోత్సవ్ కార్యక్రమంలో స్టాల్స్ ఏర్పాటు చేసి విక్రయిస్తున్నారు. ఏజెన్సీలో తయారీ చేసిననీ బిస్కెట్లు ఢిల్లీలో విక్రయించే అవకాశం రావడం పట్ల మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్న కొందరు గిరిజన మహిళలు ఐటీడీఏ అధికారుల సహకారంతో చిరుధాన్యాలతో గిరి వనిత పేరుతో మిల్లెట్ బిస్కెట్లు తయారీ చేసి కేఆర్పురంలోనే విక్రయాలు ప్రారంభించారు. రాగులు, సజ్జలు, సోయా, పెసలు, అలసందలు, మినుములు, ఓట్స్, బెల్లంతో బిస్కెట్లు తయారు చేయడంతో అందరూ వీటిని తినేందుకు ఇష్టపడుతున్నారు. అనతి కాలంలోనే ఈ బిస్కెట్లకు గిరాకీ పెరగడంతో క్రమంగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా పలు షాపుల్లో ఈ బిస్కెట్లు విక్రయిస్తున్నారు. ఆన్లైన్లో కూడా బిస్కెట్లు విక్రయిస్తున్నారు. ఇటీవల టాటా గ్రూప్ కంపెనీ ముంబయిలో నిర్వహించిన సమావేశానికి వచ్చిన వారికి ఇచ్చిన గిఫ్ట్ ప్యాకెట్లో గిరిజన మహిళలు తయారు చేసిన మిల్లెట్ బిస్కెట్లు ఉన్నాయి. ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతున్న ఆదిమహోత్సవ్ (2025) కార్యక్రమంలో కూడా గిరిజన మహిళలు తయారు చేసిన మిల్లెట్ బిస్కెట్ల స్టాల్స్ ఏర్పాటు చేసి విక్రయిస్తున్నారు. ఈ కార్యక్రమంలో గిరిజనులు తయారు చేసిన వస్తువులు ప్రదర్శనగా ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ఆహ్వానంతో మిల్లెట్ బిస్కెట్ల తయారు చేసే పొట్టోడి బుల్లమ్మకు అక్కడ విక్రయించే అవకాశం లభించింది. జీలుగుమిల్లి మండలంలో ఉన్న నిర్వాసిత గ్రామం కొరుటూరు నుంచి మరో ఇద్దరు ఐటీడీఏ ద్వారా ఢిల్లీలో స్టాల్స్ను ఏర్పాటు చేసి వారు తయారు చేసిన వస్తువులను విక్రయిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని ఐటీడీఏల పరిధిలో ఎంపిక చేసిన వస్తువులు ఈ స్టాల్స్లో విక్రయిస్తున్నారు. ఆదిమహోత్సవ్లో కేఆర్ పురం ఐటీడీఏ మిల్లెట్ బిస్కెట్ల స్టాల్ -
సూర్యహంసినికి ఆర్చరీలో గోల్డ్ మెడల్
భీమవరం: ఎన్టీపీసీ జూనియర్ నేషనల్ ఆర్చరీ చాంయపియన్షిప్ పోటీల్లో భీమవరం భారతీయ విద్యా భవన్స్ విద్యార్థిని ఎం.సూర్యహంసిని ప్రతిభ చూపిందని కోచ్ కమల్ కిషోర్ తెలిపారు. బాలికల వ్యక్తిగత విభాగంలో హంసిని ఢిల్లీకి చెందిన కుమిత్ సనానిపై గెలిచి బంగారు పతకం సాధించిందన్నారు. హంసినిని స్టేట్ ఆర్చరీ అసోసియేషన్ సెక్రటరీ చెరుకూరి సత్యనారాయణ, జిల్లా ఆర్చరీ అసోసియేషన్ సెక్రటరీ జయరాజు అభినందించారు. శ్రీవారి పథకాలకు రూ.7.21 లక్షల విరాళం ద్వారకాతిరుమల: శ్రీవారి పథకాలకు ఒక భక్తుడు ఆదివారం రాత్రి రూ.7.21 లక్షలు విరాళంగా అందజేశారు. హైదరాబాద్లోని అంబర్పేటకు చెందిన బొప్పరపు వెంకట లోహిత్ ముందుగా కుటుంబసమేతంగా స్వామి, అమ్మవార్లను దర్శించారు. అనంతరం ఆలయ కార్యాలయంలో నిత్యాన్నదాన పథకానికి రూ.5 లక్షలు, గోసంరక్షణ పథకానికి రూ.2,21,000 వెరసి రూ.7,21,000 జమచేశారు. పెద్దింట్లమ్మా.. కోర్కెలు తీర్చమ్మా కై కలూరు: అమ్మా.. పెద్దింట్లమ్మా.. నీ భక్తుల కోర్కెలు తీర్చమ్మా.. అంటూ భక్తులు కొల్లేటికోట పెద్దింట్లమ్మను ఆర్తితో వేడుకున్నారు. ఆదివారం భక్తుల రద్దీ కనిపించింది. సుదూర ప్రాంతాల నుంచి భక్తులు అమ్మకు నైవేద్యాలు, పాలపొంగళ్లు సమర్పించారు. ఆలయ ఈవో కూచిపూడి శ్రీనివాస్ మాట్లాడుతూ ఆదివారం ఒక్కరోజు ప్రత్యేక, అంతరాలయ, కేశఖండన, పెద్ద, చిన్న తీర్థాలు, లడ్డూ ప్రసాదం, గదుల అద్దెలు, అమ్మవారి ఫొటోల అమ్మకం, భక్తుల విరాళాలు, వాహన పూజలు ఇలా అన్ని కలిపి రూ.52,396 ఆదాయం వచ్చిందని తెలిపారు. పంట కాల్వలో గుర్తుతెలియని మృతదేహం కైకలూరు: గుర్తుతెలియని మృతదేహం శ్యామలాంబపురం శ్మశాన వాటిక సమీప పంట కాల్వలో ఆదివారం కొట్టుకువచ్చింది. వీఆర్వో బి.సుబ్రహ్మణ్యేశ్వరరావు ఫిర్యాదు మేరకు కై కలూరు టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని కై కలూరు ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు మాట్లాడుతూ మృతుడి వయస్సు 35 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండొచ్చన్నారు. ఎత్తు 5.5 అడుగులు ఉంటుందని చెప్పారు. వివరాలు తెలిస్తే 9440796434, 9440796433 నంబర్లకు తెలియజేయాలన్నారు. -
క్లాప్నకు మంగళం
భీమవరం(ప్రకాశం చౌక్) : పట్టణాల పరిశుభ్రతే లక్ష్యంగా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం క్లీన్ ఆంధ్రప్రదేశ్ (క్లాప్) కార్యక్రమాన్ని అమలు చేసింది. ఇంటింటా చెత్త సేకరణకు ప్రత్యేక బ్యాటరీ వాహనాలను సమకూర్చింది. ఈ వాహనాలు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు వార్డుల్లో ఇంటింటా తిరుగుతూ తడి, పొత్త చెత్తలను వేర్వేరుగా సేకరించేవి. ఇలా జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలకు 149 వాహనాలను ప్రభుత్వం కేటాయించింది. వీటి ద్వారా రోజుకు 300 టన్నుల చెత్తను సేకరించేవారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత క్లాప్ కార్యక్రమాన్ని నిలిపివేసింది. దీంతో ఆయా మున్సిపాలిటీల్లో క్లాప్ ఆటోలు మూలకు చేరాయి. జిల్లాలోని పాలకొల్లు మున్సిపాలిటీలో మినహా మిగిలిన ప్రాంతాల్లో క్లాప్ అమలుకావడం లేదు. కూటమి చరమగీతం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత క్లాప్ కార్యక్రమానికి చరమగీతం పాడేశారు. దీంతో వాహనాలు నిరుపయోగంగా మారాయి. జిల్లాలోని భీమవరం, నరసాపురం, తాడేపల్లిగూడెం, తణుకు పట్టణాల్లో మూడు నెలలుగా క్లాప్ వాహనాల ద్వారా చెత్త సేకరణ నిలిపివేశారు. దీంతో ఆయా మున్సిపాలిటీల్లో చెత్త సేకరణకు వాహనాల కొరత ఏర్పడి ఎక్కడి చెత్త అక్కడే దర్శనమిస్తోంది. పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యమంటూ ఉపన్యాసాలు ఇచ్చే సీఎం చంద్రబాబు పట్టణాల్లో చెత్త సేకరణ వాహనాలపై దృష్టి పెట్టకపోవడం గమనార్హం. గత ప్రభుత్వంలో క్లాప్ కార్యక్రమం ద్వారా సత్ఫలితాలు వచ్చాయి. పట్టణ ప్రజల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. అయితే కూటమి ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని గాలికి వదిలేయడంతో రూ.5 లక్షల చొప్పున విలువ చేసే వాహనాలు దెబ్బతింటున్నాయి. క్యాబిన్లు తుప్పుపట్టడం, ఇంజన్లు పాడవటం వంటివి జరుగుతున్నాయి. కార్మికుల ఉపాధికి దెబ్బ జిల్లాలో మున్సిపాలిటీల వారీగా భీమవరంలో 41, తాడేపల్లిగూడెంలో 40, పాలకొల్లులో 23, నరసాపురంలో 17, తణుకులో 28 క్లాప్ వాహనాలు పనిచేసేవి. రోజుకు సుమారు ఒక్కో వాహనం 30 కిలోమీటర్ల మేర తిరుగుతూ రెండు నుంచి మూడు టన్నుల చెత్త సేకరించేవి. మొత్తంగా 149 వాహనాలకు 149 మంది డ్రైవర్లు, ఐదుగురు సూపర్వైజర్లు ఉపాధి పొందేవారు. డ్రైవర్కు రూ.11 వేలు, సూపర్వైజర్కు రూ.15 వేల చొప్పున గత ప్రభుత్వం ఏజెన్సీ ద్వారా వీరికి జీతాలు అందించింది. ప్రస్తుతం పాలకొల్లులోని 23 వాహనాల్లో 19 మాత్రమే నడుస్తున్నాయి. క్లాప్ నిలిపివేయడంతో జిల్లాలో సుమారు 134 మంది కార్మికులు ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. తమను విధుల్లో కొనసాగించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. ‘చెత్త’శుద్ధి కరువాయే! మూలకు చేరిన క్లాప్ ఆటోలు ఇంటింటా చెత్త సేకరణ నిలుపుదల గత ప్రభుత్వంలో జిల్లాకు 149 వాహనాల కేటాయింపు రోజుకు 300 టన్నుల చెత్త సేకరణ కూటమి పాలనలో ఎక్కడి చెత్త అక్కడే ఇదేనా ‘స్వచ్ఛ ఆంధ్ర’ ? కూటమి ప్రభుత్వం స్వచ్ఛ ఆంధ్ర..స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని తీసుకువచ్చింది. క్లాప్ ఆటోలు మూలకు చేరడం, మున్సిపాలిటీల్లో చెత్త సేకరణ వాహనాల కొరతతో చెత్త సేకరణ అధ్వానంగా మారింది. దీంతో పట్ట ణాల్లోని రోడ్డు మార్జిన్లు డంపింగ్ యార్డులుగా మారుతున్నాయి. జిల్లాలోని మున్సిపాలిటీల్లో చెత్త సేకరణ వాహనాలు భీమవరంలో 20కి 12, నరసాపురంలో 15కు 8, పాలకొల్లులో 10కి 6, తణుకులో 20కి 14, తాడేపల్లిగూడెంలో 20కి 14 మాత్రమే పనిచేస్తున్నాయి. పారిశుద్ధ్యం మెరుగులో కీలక పాత్ర పోషించిన క్లాప్ ఆటోలు లేకపోవడంతో ఇంటింటా చెత్త సేకరణ అంతంతమాత్రంగానే జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో స్వచ్ఛ ఆంధ్ర.. స్వచ్ఛ దివస్ ఎలా సాధ్యమవుతుందని పట్టణవాసులు ప్రశ్నిస్తున్నారు. -
కలుపు మందు తాగి యువకుడి ఆత్మహత్య
భీమడోలు: ప్రేమించిన యువతి బంధువులు చంపేస్తామని బెదిరించడంతో భయంతో ఓ యువకుడు కలుపుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పూళ్లకు చెందిన యువకుడు అడపా వీర రాఘవేంద్రకుమార్(19) గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం అర్థరాత్రి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కృష్ణకాలనీకి చెందిన ఆడపా రాఘవేంద్రకుమార్ అదే గ్రామానికి చెందిన ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. ఈ క్రమంలో గత నెల 20న రాత్రి సమయంలో యువతి బంధువులు వచ్చి అమ్మాయికి పెళ్లి నిశ్చిమైందని.. ఆమె జోలికి రావద్దని, వస్తే చంపేస్తామని బెదిరించారు. భయంతో అదే రోజు రాత్రి ఆ యువకుడు కలుపు మందు తాగి ఆత్మాహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అపస్మారక స్థితిలో ఉన్న యువకుడిని చికిత్స నిమిత్తం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. రాఘవేంద్రకుమార్ ఇచ్చిన మరణ వాంగ్మూలం మేరకు మృతికి కారణమైన సురేష్, సాయి, నాగులపై ఆదివారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వై.సుధాకర్ తెలిపారు. ప్రేమించిన యువతి బంధువుల బెదిరింపు -
స్పందన
కళేబరాల తొలగింపుఅత్తిలి : ‘పంట కాల్వల్లో వైరస్ కోళ్లు’ శీర్షికన ‘సాక్షి’ లో ఆదివారం ప్రచురించిన కథనానికి అధికారులు స్పందించారు. అత్తిలి కాలువపై ఉన్న పాలూరు డ్యాం వద్ద, పాలూరు గ్రామంలో స్లూయిజ్ వద్ద పేరుకుపోయిన చనిపోయిన కోళ్ల, జంతు కళేబరాలను పొక్లయిన్తో తొలగించారు. ఈ కార్య క్రమాన్ని ఈఓపీఆర్డీ ఎం.శ్రీనివాస్, అత్తిలి, పాలూరు సెక్రటరీలు జి.భాస్కర్. యు. ప్రసాదరావు పర్యవేక్షించారు. పరిశుభ్రతపై అవగాహన ఏలూరు(మెట్రో): గ్రీన్, క్లీన్ ఎనర్జీ ద్వారా పరిశుభ్రమైన పర్యావరణం అనే నినాదంతో ఆదివారం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో అవగాహన నడక ర్యాలీ నిర్వహించారు. స్థానిక ఇండోర్ స్టేడియం నుంచి ఫైర్స్టేషన్ మీదుగా జిల్లా ఆసుపత్రి వరకు ర్యాలీ సాగింది. ఎల్పీజీ సేల్స్ జనరల్ మేనేజర్ ఐఓసీఎల్ (విశాఖ) రవికుమార్ మాట్లాడుతూ ప్రతిఒక్కరూ పరిశుభ్రత పాటించాలని ఆయిల్ కంపెనీల ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. జిల్లా పౌర సరఫరాల అధికారి ఆర్ఎస్ఎస్ సత్యనారాయణ రాజు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిఒక్కరికీ గ్యాస్ను అందుబాటులో ఉంచిందన్నారు. ఎల్పీజీ సేల్స్ మేనేజర్ ఎంవీ రామ్ప్రసాద్, సహాయ పౌర సరఫరాల అధికారి వై.ప్రతాప్రెడ్డి, గ్యాస్ డీలర్లు తదితరులు పాల్గొన్నారు. రాట్నాలమ్మా.. నమోనమః పెదవేగి: రాట్నాలకుంటలోని రాట్నాలమ్మ ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. జిల్లాతో పాటు సమీప కృష్ణా జిల్లా నుంచి భక్తులు తరలివచ్చారు. ఆలయంలో విశేష పూజలు చేయించి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయానికి లడ్డూ ప్రసాదంపై రూ.16,935, పూజా టికెట్లపై రూ.30,500, ఫొటోల అమ్మకం ద్వారా రూ.1,500, విరాళాల రూపంలో రూ.5,500 ఆదాయం సమకూరిందని దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎన్.సతీష్కుమార్ తెలిపారు. -
చేపల దొంగలు !
● చెరువులు ఎండగడుతున్న పచ్చ నేతలు ● అక్రమంగా చేపలు పట్టివేత ● పట్టించుకోని అధికారులు సాక్షి, టాస్క్ఫోర్స్: మట్టి.. పుట్ట.. చెట్టు.. చేమ.. కాదేదీ దోపిడీకి అనర్హం అన్నట్టు పచ్చనేతలు చెలరేగిపోతున్నారు. బడానేతలు పట్టిసీమ, తమ్మిలేరు మ ట్టి దోచుకుంటుంటే.. చోటామోటా నాయకులు గ్రా మాల్లో చెరువులపై కన్నేశారు. ప్రజలకు తాగునీరు అందించే చెరువులను ఎండగట్టేస్తున్నారు. వేసవిలో తాగునీటి ఎద్దడి ఏర్పడే ప్రమాదం ఉన్నా అధికారు లు మిన్నుకుండిపోయారు. ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నా ప్రశ్నించలేకపోతున్నారు. పోణంగి చెరువుకు ఎసరు ఏలూరు నగర కార్పొరేషన్, 14 డివిజన్ పరిధి పో ణంగిలో ఐదు ఎకరాల తాగునీటి చెరువు ఉంది. అధికారులు ఈ చెరువు నీటిని శుద్ధి చేసి ప్రజలకు సరఫరా చేసేవారు. పశువులు దాహం తీర్చుకునేవి. రెండురోజుల క్రితం ఈ చెరువులో ఉన్న చేపలపై స్థానిక టీడీపీ నాయకుడి కన్ను పడింది. అధికారం అడ్డం పెట్టుకుని చెరువులో నీటిని తోడించేశాడు. ఆదివారం కూలీలతో చేపలు పట్టి అమ్ముకున్నాడు. ఇది చూసిన గ్రామ ప్రజలు ముక్కున వేలేసుకున్నా రు. రానున్నది వేసవికాలం కావడంతో చెరువు ఎండగడితే కనీసం పశువులు తాగేందుకు కూడా నీరు ఉండదని ఆవేదన చెందుతున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో గతేడాది ఏలూరు కార్పొరేషన్ అధికారులు చెరువులో చేపల వేలం పాట నిర్వహించి సొమ్మును ప్రభుత్వ ఖజానాకు జమ చేశారు. చాటపర్రులోనూ ఇదే తంతు ఏలూరు రూరల్ మండలం చాటపర్రులో సైతం ప చ్చనేతలు ఇదే తరహా దందా కొనసాగించారు. కొద్దిరోజుల క్రితం పంచాయతీకి చెందిన 40 ఎకరా ల తాగునీటి చెరువును ఎండగట్టారు. అక్రమంగా చేపలు పట్టి సొమ్ము చేసుకున్నారు. వారం పాటు సాగిన ఈ దందాపై అధికారులు కనీసం ప్రశ్నించలేదు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ పాలనలో ఈ చెరువులో చేపలను వేలం వేయగా సుమారు రూ.90 వేలు పంచాయతీ ఖజానాకు జమైంది. -
పాపాలను హరించే పాతాళ భోగేశ్వరుడు
కై కలూరు: పాతాళానికి పంచ బుగ్గల కోనేరు కలిగిన కలిదిండి పార్వతీ సమేత పాతాళ భోగేశ్వరస్వామి దివ్య కల్యాణ శివరాత్రి మహోత్సవాలు ఈ నెల 24 నుంచి 28 వరకు జరగనున్నాయి. 11వ శతాబ్దంలో వేంగిరాజు రాజరాజచోళుడి కాలంలో నిర్మించిన ఈ శివాలయానికి దక్షిణ కాశీగా పేరు. తెలుగులో ఆది కావ్యాఆనికి ఆంకురార్పణ జరిగిన పవిత్ర కోనేరు(పుష్కరిణీ)తో పాటు స్వామి పాదాల గుర్తులను ఇప్పటికీ భక్తులు తిలకిస్తున్నారు. ఏటా మాఘ బహుళ ఏకాదశి నుంచి అమావాస్య వరకూ పంచాహ్నిక కల్యాణ మహోత్సవాలు తిలకించడానికి కలిదిండికి తూర్పు ఆగ్నేయంలో 3 మైళ్ళ దూరంలో స్వామి దర్శనానికి లక్షల్లో భక్తులు విచ్చేస్తారు. భోగేశ్వరలంకలో రైతు పొలంలో నాగలితో దున్నుతుండగా, నాగలి కర్ర తగిలి రక్తం పారుతూ స్వయంభూలింగం బయటపడింది. నాగలి కర్ర తగిలి విరిగిన భాగాన్ని అతికించినట్లు చరిత్ర చెబుతోంది. ఈ భాగం ఒక పక్క విరిగినట్లుగా, అతికించినట్లుగా, ఆ భాగం నుంచి రక్తపు నీరు చమరిస్తున్నట్లుగా ఉంటుందని భక్తుల విశ్వాసం. ఈ లింగాన్ని కలిదిండి తీసుకొచ్చేందుకు రైతు విఫలయత్నం చేశాడు. ఆ రాత్రి స్వామి భక్తుల కలలో కనిపించి కోడికూత, రోకటి పోటు వినలేనంటూ ఏకాంతంగా ఉన్న ఈ చోటనే ఆలయ నిర్మించాలని కోరాడని ఇక్కడ స్థల పురాణం చెబుతోంది. స్వామి పాదాల గుర్తులు పూర్వం వర్షకాలంలో ఒక రోజున జోరున వర్షం కురుస్తుంటే స్వామి నిత్యార్చనకు ఆలస్యం జరిగిందట, దీంతో స్వామి వారు స్వయంగా ధ్వజస్తంభం ఎక్కి అర్చకుల రాకను గమనించి ధ్వజ స్తంభంపై నుంచి దూకడంతో కింద స్వామివారి పాదాల గుర్తులు ఏర్పడ్డాయని, వీటిని ఇప్పటికీ ప్రత్యక్షంగానే చూస్తున్నామని భక్తులు చెబుతారు. ఈ దేవాలయంలో నందీశ్వరుడికి విశేషంగా భక్తులు పూజలు చేస్తారు. పంచ బుగ్గల కోనేరు.. కోనేరు వద్ద భక్తితో ‘హరహరా’ అంటే ‘బుడబుడ’ మంటూ నీరు పైకిరావడం భక్తులను పారవశ్యంలో ముంచెత్తుతుంది. పూర్వం ఆంధ్ర దేశాన్ని ఏలిన రాజరాజనరేంద్రుడు, కవి నన్నయలు తణుకులో నిర్వహించిన యజ్ఞం పూర్తి చేసుకుని ఆశ్వాలపై కలిదిండికి వచ్చారు. దారిలో ఓ నలుగురు అశ్వాల కంటే ముందు పరిగెత్తుతూ కోనేరులో దిగి మాయమయ్యారు. రాజు, నన్నయకు సరస్వతి దేవీ ప్రతక్ష్యమై మీకు ఎదురు పడింది ‘భోగేంద్రులు – నాగేంద్రులు’ అని చెప్పి ఇక్కడ కోనేరు ద్వారా పాతాళానికి వెళ్తారని తెలిపింది. ఒడ్డున నిలిచి పాతాళ భోగేశ్వరా హరహర అని పిలిస్తే బుడబుడ మంటూ బుడగలు వస్తాయని అమ్మ చెప్పిందని పురాణం. రాజరాజ నరేంద్రుడు ఆ నాలుగు పద్యాల కావ్యంలో శోభించేలా కవి నన్నయ్యభట్టుచే తొలి తెలుగు కావ్యం ఇక్కడే రాయించారంటారు. కలిదిండిలో 24 నుంచి 28 వరకు కల్యాణ మహోత్సవాలు 11 శతాబ్దంలో నిర్మించిన అతి పురాతన శివాలయం తీర్థానికి అన్ని ఏర్పాట్లూ చేశాం పాతాళ భోగేశ్వరుడి కల్యాణం తిలకిస్తే పాపాలు హరిస్తాయని నమ్మకం. ఈ నెల 25 అర్థరాత్రి 1.25 గంటలకు స్వామి కల్యాణం జరుగుతుంది. శివరాత్రి తీర్థానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశాం. పవిత్ర కోనేరులో నీటిని నింపాం. సమీప ప్రాంతాల నుంచి లక్షల్లో భక్తులు వచ్చే అవకాశం ఉండటంతో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయి. – వీఎన్కే.శేఖర్, ఈవో, పాతాళ భోగేశ్వరస్వామి దేవస్థానం -
మూడు నెలలుగా జీతాల్లేవ్
ఆకివీడు: తమకు మూడు నెలలుగా జీతాలు లే వని పెదకాపవరం పంచాయతీ సిబ్బంది డీపీఓ అరుణశ్రీ వద్ద వాపోయారు. పెదకాపవరంలో పన్ను వసూళ్లపై డీపీఓ ఆదివారం సమీక్షించారు. గ్రామంలో ఆమె పర్యటించారు. గ్రామంలో రూ.20 లక్షలకు పైగా పన్ను బకాయిలు ఉండటంపై సిబ్బందిని నిలదీశారు. వసూళ్లను వేగిరపర్చాలని సూచించారు. ఇటీవల సుమారు రూ.8 లక్షలు వసూలు చేసినట్లు సర్పంచ్ ఊసల బేబీ స్నేతు డీపీఓకు వివరించారు. ముందుగా డీపీఓ గ్రామంలోని ఎస్సీ కాలనీ, ఇతర ప్రాంతాల్లో పర్యటించగా తాగునీటి సమస్యను స్థాని కులు ఆమె దృష్టికి తీసుకువెళ్లారు. 15 రోజుల్లో మంచినీటి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని డీపీఓ చెప్పారు. గ్రామంలో పారిశుద్ధ్య నిర్వహణపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేసి సోమవారం నుంచి ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్ చేపట్టాలని ఆదేశించారు. ఎస్సీ ప్రాంతాల్లో రోడ్లు అధ్వానంగా ఉన్నాయని మండిపడ్డారు. డీఎల్పీఓ బాలాజీ ఉన్నారు. -
63 వేల కోడి గుడ్లు పూడ్చివేత
ఉంగుటూరు: కోళ్లకు బర్డ్ఫ్లూ నిర్ధారణ కావడంతో బాదంపూడి వెంకట మణికంఠ ఫౌల్ట్రీ ఫారంలో మూడోరోజు ఆదివారం కోళ్ల ఖననం కార్యక్రమం కొనసాగింది. పశుసంర్ధకశాఖ డా క్టర్లు, సిబ్బంది 43 వేల కోళ్లను ఖననం చేశారు. దీంతో ఫారంలోని 1.13 లక్షల కోళ్ల ఖననం ప్రక్రియ పూర్తయ్యింది. అలాగే వ్యాధి సోకిన కోళ్లు పెట్టిన 63 వేల గుడ్లను గొయ్యి తవ్వి పూడ్చిపెట్టారు. పశుసంవర్ధకశాఖ జేడీ డి.గో విందరాజు పర్యవేక్షించారు. సోమవారం సమీ ప పెదతాడేపల్లిలోని ఫారంలో కోళ్ల ఖననం ప్రక్రియ చేపట్టనున్నారు. డ్రోన్తో హైపోక్లోరైడ్ పిచికారీ గ్రామంలో పారిశుద్ధ్య చర్యల్లో భాగంగా సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని రెండు డ్రోన్ల ద్వారా పిచికారీ చేయించారు. 300 లీటర్ల హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేయించినట్టు పంచాయతీ కార్యదర్శి గిరిధర్ తెలిపారు. గ్రామంలోని రెడ్జోన్లో ఉన్న కిలోమీటర్ పరిధిలో ఈ పనులు చేయించారు. నేడు పీజీఆర్ఎస్ రద్దు భీమవరం (ప్రకాశంచౌక్): ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో సోమవారం జిల్లా, డివిజన్, మండల కార్యాలయాల్లో నిర్వహించే ప్రజా సమ స్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)ను జిల్లావ్యాప్తంగా రద్దు చేస్తున్నట్టు కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. ఈ విషయాన్ని జిల్లా ప్రజలు గమనించి సహకరించాలని కోరారు. -
విద్యార్థుల్లో పోటీతత్వాన్ని అలవాటు చేయాలి
తణుకు అర్బన్: విద్యార్థుల్లో చిన్ననాటి నుంచే పోటీతత్వాన్ని అలవాటుచేయాలని తిరుమల విద్యాసంస్థల చైర్మన్ నున్న తిరుమలరావు అన్నారు. ఆదివారం తణుకు తిరుమల విద్యాసంస్థల ప్రాంగణంలో విద్యార్థులు, తల్లిదండ్రులకు నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. విద్యార్థులు ప్రణాళికా బద్ధంగా చిన్ననాటి నుంచే మంచి నడవడిక, పెద్దలతో గౌరవంగా మెలగడం, పోటీతత్వాన్ని అనుకరించేలా చేస్తే భవిష్యత్తులో ఎంతో ఎత్తుకు ఎదుగుతారని స్పష్టం చేశారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో దేశవ్యాప్తంగా ఇంజినీరింగ్ (జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్) నీట్ పరీక్షల్లో ఎంతో పోటీ ఉందని, ఆ ఒత్తిడిని తట్టుకుని మన పిల్లలు నిలవాలంటే తల్లిదండ్రుల ప్రోత్సాహం ఎంతో అవసరమని అన్నారు. పిల్లలు ఎక్కువ సమయం మొబైల్స్తో గడుపుతున్నారని అది ఎంతో నష్టమన్నారు. విద్యాసంస్థల డైరెక్టర్ నున్న సరోజినీదేవి మాట్లాడుతూ పిల్లల ఎదుగుదలలో తల్లిదండ్రులదే ప్రముఖ పాత్ర అని, తల్లిదండ్రులనురోల్ మోడల్గా తీసుకుని వారిని అనుకరిస్తారని చెప్పారు. సదస్సుల్లో అకడమిక్ డైరెక్టర్ సతీష్బాబు, ప్రిన్సిపాల్ వి.శ్రీహరి, తణుకు కాలేజ్ ప్రిన్సిపాల్ కె.దుర్గాప్రసాద్, తణుకు స్కూలు ఇన్చార్జ్ విజయలక్ష్మి పాల్గొన్నారు. -
మామిడి.. తడబడి
కొన్నేళ్లుగా గడ్డుకాలం కొన్నేళ్లుగా మామిడికి గడ్డుకాలం నెలకొంది. పూత వచ్చినా దిగుబడి ఆశించిన స్థాయిలో లేకపోవడం, దిగుబడి ఉన్నా మార్కెట్లో సరైన ధర లభించకపోవడం తదితర కారణాలతో రైతులు నష్టపోతున్నారు. తోటల దుక్కి, ఎరువులు, పురుగు మందులకు పెట్టిన పెట్టుబడులు కూడా రాని పరిస్థితి రైతులకు ఎదురవుతోంది. అలాగే ముదురు తోటలు కావడంతో ఎంత పెట్టుబడి పెట్టినా కాయకపోవడంతో రైతులు తీవ్ర నిరాశ, నిస్పృహలకు లోనవుతున్నారు. దీంతో భూములున్నా ఆదాయం లేక అప్పుల పాలవ్వాల్సిన పరిస్థితి నెలకొంది. ఏడాదికి 4 వేల ఎకరాలు కనుమరుగు ఏడాదికి నూజివీడు డివిజన్లో కనీసం 4 వేల ఎకరాలకు పైగా మామిడి తోటలను నరికివేస్తున్నారు. పేపర్ తయారీకి మామిడి కలపను వినియోగిస్తుండటంతో ఈ ప్రాంతంలోని ముదురు మామిడి తోటలకు గిరాకీ పెరిగింది. నరికిన తోటల్లో సగం తోటల వరకు మామిడి మొక్కలు వేస్తుండగా, మిగిలిన సగం మాత్రం ఆయిల్పామ్, ఇతర పంటలు సాగుచేస్తున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో మామిడి కనుమరుగయ్యే పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంది. నూజివీడు: మామిడి తోటలకు ప్రసిద్ధి చెందిన నూజివీడు డివిజన్లో ఏటేటా తోటల విస్తీర్ణం తగ్గిపోతోంది. పురుగులు, తెగుళ్లు బెడద ఎక్కువవ్వడం, గిట్టుబాటు ధర లభించకపోవడం, ప్రతికూల వాతావరణ పరిస్థితులు వెరసి మామిడి రైతులు ప్రతి ఏటా నష్టాల బాటలోనే పయనిస్తున్నాడు. మామిడి తోట ల ద్వారా ఆశించిన స్థాయిలో ఆదాయం రాకపోవడంతో వాటిని నరికివేస్తున్నారు. ఈ భూముల్లో ఆయిల్పామ్ మొక్కలు నాటుతున్నారు. మరికొందరు మొక్కజొన్న, పత్తి, మిరప,పొగాకు వంటి స్వల్పకాలిక పంటలను సాగు చేసి గ్యారంటీ ఆదాయం పొందుతున్నారు. ఆయిల్పామ్ మొక్క లు నాటినా ఐదేళ్ల వరకు అంతర పంటలుగా మొక్కజొన్న, కూరగాయలు, పుచ్చ, మిర్చి, పత్తి తదితర పంటలను సాగు చేస్తున్నారు. గత కొన్నేళ్లుగా మామిడిపై వచ్చే ఆదాయం క్రమేణా తగ్గుతోంది. ప్రతికూల వాతావరణం వల్ల పూతలు రాకపోవడం, వచ్చినా నిలవకపోవడం, వచ్చిన పూతలను రక్షించుకునేందుకు 12 నుంచి 15 సార్లు రసాయన మందులు పిచికారీ చేయడం, రెండేళ్లుగా నల్ల తామర పురుగుల ఉధృతి ఎక్కువ కావడం, పూర్తిగా మామిడి దిగుబడి పడిపోవడం తదితర కారణాలతో రైతులు ఆలోచనలో పడ్డారు. ఈ ప్రాంతంలో శతాబ్దాల తరబడి సాగులో ఉన్న మామిడి తోటలను తొలగించడానికి ఇష్టం లేకున్నా ఆదాయం రాకపోవడంతో చేసేదేమీ లేక తోటలను నరికి వేస్తున్నారు. ఇతర ప్రాంతాల్లో పెరిగిన విస్తీర్ణం ఒకప్పుడు మామిడి అంటే నూజివీడు ప్రాంతమే కేరాఫ్ అడ్రస్గా ఉండేది. ఇప్పుడు రాష్ట్రంలో ప్రకాశం, చిత్తూరు, కడప జిల్లాలతో పాటు పక్కనే ఉన్న తెలంగాణలో సైతం మామిడి తోటల విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. దీంతో వ్యాపారస్తులు, హైదరాబాద్, గుజరాత్, బరోడా వంటి ప్రాంతాలకు చెందిన మామిడి సేట్లు కాయలను కొనుగోలు చేసేందుకు నూజివీడుకు కాకుండా ఇతర ప్రాంతాలకు సైతం వెళ్తున్నారు. ఒకప్పుడు మామిడి మార్కెట్లలోని కమీషన్ వ్యాపారస్తులే మామిడి వ్యాపారస్తులకు పెట్టుబడులు ఇచ్చి తోటలను కొనుగోలు చేయించేవారు. వారి వద్ద నుంచి కమీషన్ వ్యాపారస్తులు కొనుగోలు చేసేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా పోయింది. మామిడి అనుబంధ పరిశ్రమలు ఏర్పాటైతేనే.. నూజివీడు ప్రాంతంలో బంగినపల్లి, తోతాపురి, చిన్నరసాలు, పెద్ద రసాలు వంటి రకాలను రైతులు సాగుచేస్తారు. వీటిలో అగ్రభాగం బంగినపల్లి రకం కాగా ఆ తర్వాత తోతాపురి ఉంటుంది. మామిడి తోటలు దాదాపు 40 వేల ఎకరాల్లో ఉన్నా మామిడి ఆధారిత పరిశ్రమలు ఇక్కడ లేవు. చిత్తూరు జిల్లాలో దాదాపు 60 వరకు జ్యూస్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. దీంతో ఆ జిల్లాలోని దిగుబడితో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి కూడా తోతాపురి రకం కా యలు అక్కడి జ్యూస్ ఫ్యాక్టరీలకు వ్యాపారస్తులు ఎగుమతి చేస్తారు. మామిడి రైతులకు ప్రభుత్వం నుంచి చేయూత కరువు కాగా ఒకప్పుడు మామిడికి పేరెన్నికగన్న నూజివీడు ప్రాంతం ప్రాధాన్యతను కోల్పోతోంది. చేయూత కరువై.. సాగు భారమై.. మామిడి తోటలను నరికివేస్తున్న రైతులు తగ్గుతోన్న తోటల విస్తీర్ణం ఆయిల్పామ్ సాగుపై ఆసక్తి తోట తొలగించి ఆయిల్పామ్ మొక్కలు వేశా.. మామిడి తోటలు కాపు కాసినా ధర లేక పెట్టుబడులు రాకపోవడం, గాలిదుమ్ములు వచ్చినప్పుడు కాయలు రాలిపోయి నష్టాలు రావడం, పూత వచ్చినా పురుగులు, తెగుళ్ల వల్ల పిందె ఏర్పడకపోవడం వంటి కారణాలతో నష్టాలు వచ్చాయి. దీంతో నాలుగెకరాల్లో మామిడి తోట నరికి వేయించి ఆయిల్పామ్ మొక్కలు వేశా. ఐదేళ్ల వరకూ అందులో అంతర పంటలను సాగు చేసుకోవచ్చు. – పల్లె రవీంద్రరెడ్డి, తూర్పు దిగవల్లి, నూజివీడు మండలం -
వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజబాబు మృతిపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
తాడేపల్లి: ద్వారకాతిరుమల మండలంలోని సీహెచ్ పోతేపల్లికి చెందిన వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెలికాని రాజమోహన్రావు(రాజబాబు) మృతిపై ఆ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు, సుధీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన నాయకుడిని కోల్పోవడం బాధాకరమన్నారు. రాజబాబు మరణం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ సందర్భంగా రాజబాబుతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధించారు.రాజబాబు శనివారం రాత్రి మృతి చెందారు. ఇటీవల బాత్రూమ్లో కాలుజారి పడిపోవడంతో ఆయన ఎడమ కాలికి తీవ్ర గాయమైంది. కొద్దిరోజుల పాటు లక్ష్మీపురంలోని విర్డ్ ఆస్పత్రిలో చికిత్స పొందిన ఆయన, శస్త్రచికిత్స నిమిత్తం హైదరాబాద్లోని సిటీ న్యూరో ఆస్పత్రిలో చేరారు. అక్కడ వైద్యులు వారం రోజుల క్రితం ఆయన కాలికి శస్త్రచికిత్స చేశారు.ఈ నెల 12న ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అవ్వాల్సి ఉండగా, అదే రోజు ఉదయం 11.30 గంటల సమయంలో ఆయనకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. అప్పటి నుంచి వైద్యులు ఆయనకు వెంటిలేటర్ సాయంతో వైద్యం చేస్తూ వచ్చారు. పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. రాజబాబు మృతి చెందడంతో మండలంలోని పార్టీ శ్రేణులు, ప్రజలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. -
యర్రగుంటపల్లిలో జీబీఎస్ కలకలం
చింతలపూడి: మండలంలోని యర్రగుంటపల్లి గ్రామంలో ఐదేళ్ల బాలికకు గులియన్ బారీ సిండ్రోమ్ (జీబీఎస్) వైరస్ లక్షణాలు ఉన్నట్టు భావిస్తున్న వైద్యారోగ్య శాఖ అప్రమత్తం అయ్యింది. బాలికను పరీక్షించిన స్థానిక వైద్యులు మెరుగైన చికిత్స కోసం విజయవాడ తరలించారు. ప్రస్తుతం బాలికకు అక్కడి జీజీహెచ్లో వైద్యుల పర్యవేక్షణలో ఆరోగ్య పరీక్షలు చేస్తున్నారు. బాలిక నుంచి సేకరించిన శాంపిల్స్ను బెంగళూరు పంపించినట్టు వైద్యులు చెప్పారు. ఈ వ్యాధి సోకిన రోగికి ఒళ్లంతా తిమ్మిరిగా మారి కండరాలు పట్టేయడంతో పాటు కండరాలు బలహీన పడతాయి అలాగే డయేరియా, పొత్తి కడుపులో నొప్పి, వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. జలుబు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడతారు. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో జీబీఎస్ లక్షణాలు బయటపడుతున్న నేపథ్యంలో గ్రామంలో వ్యాధి లక్షణాలు కనిపించడంతో కలకలం రేగింది. వ్యాధి నిర్ధారణ కాలేదు బాలిక పరిస్థితిపై పీహెచ్సీ వైద్యాధికారి కొత్తపల్లి నరేష్ వివరణ ఇస్తూ యర్రగుంటపల్లిలో బాలికకు జీబీఎస్ సోకినట్టు నిర్ధారణ కాలేదన్నారు. బాలికకు ఉన్న లక్షణాలను బట్టి శాంపిల్స్ సేకరించి నిర్ధారణ కోసం బెంగళూరు పంపారన్నారు. ప్రస్తుతం బాలిక ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పారు. ముందు జాగ్రత్త చర్యగా శనివారం బాలిక నివసించిన ప్రాంతంతో పాటు గ్రామంలో ఇంటింటా సర్వే చేపట్టామని, వైద్య శిబిరాలు ఏర్పాటు చేశామని వైద్యాధికారి నరేష్ చెప్పారు. జంగారెడ్డిగూడెంలో ఐసోలేషన్ కేంద్రం జంగారెడ్డిగూడెం: జీబీఎస్ వ్యాధిగ్రస్తుల కోసం జంగారెడ్డిగూడెం ఏరియా ఆస్పత్రిలో ప్రత్యేక ఐసోలేషన్ వార్డును ఏర్పాటు చేశారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ బేబీ కమల మాట్లాడుతూ రాష్ట్రంలో జీబీఎస్ అనుమానిత కేసుల నియంత్రణలో భాగంగా ఇక్కడ ప్రత్యేక ఐసోలేషన్ వార్డును సిద్ధం చేశామన్నారు. కండరాల బలహీనత, జ్వరం వంటి లక్షణాలున్న వ్యక్తులు ఏరియా ఆస్పత్రిలో సంప్రదించాలని, కాచి చల్లార్చిన నీటిని తాగాలని పరిసరాల శుభ్రతను, బయట ఆహార పదార్థాలను కొన్ని రోజులపాటు పూర్తిగా దూరం పెట్టాలని ఆమె సూచించారు. ఐదేళ్ల బాలికకు వైరస్ లక్షణాలు అప్రమత్తమైన వైద్యారోగ్యశాఖ -
ప్లాస్టిక్ భూతాన్ని పారదోలుదాం
కలెక్టర్ నాగరాణి భీమవరం(ప్రకాశం చౌక్): క్యాన్సర్కు ప్లాస్టిక్ కారణంగా ఉందని, ప్రజలు స్వచ్ఛందంగా ప్లాస్టిక్ నిర్మూలనకు ముందడుగు వేయాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. శనివారం భీమవరం కొత్త బస్టాండ్ ఎదురుగా హైస్కూల్ ఆవరణలో స్వచ్ఛ ఆంధ్ర.. స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. భీమవరం పరిసర గ్రామాల్లో ప్రతి రెండు, మూడు కుటుంబాల్లో ఒకరు క్యాన్సర్ పేషెంట్ కావడానికి ప్లాస్టిక్ కారణంగా ఉందని తెలిసి ఆశ్చర్యపోయామన్నారు. పాస్టిక్ నిర్మూలనకు ఉద్యమ రూపంలో ముందడుగు వేయాలన్నారు. స్వచ్ఛంద సంస్థలు పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలని కోరారు. వ్యాపారులు ఉత్తర్వులను కచ్చితంగా పాటించాలన్నారు. కలెక్టరేట్లో ప్లాస్టిక్ వస్తువుల స్థానంలో స్టీల్ వాటర్ బాటిల్స్, స్టీల్ ప్లేట్స్, స్టీల్ టీ కప్స్ వినియోగిస్తున్నట్టు చెప్పారు. జేసీ టి.రాహుల్కుమార్ రెడ్డి ప్లాస్టిక్ కవర్లను అందరూ తిరస్కరించాలని సూచించారు. అనంతరం కలెక్టర్ స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞను చేయించారు. కలెక్టర్ చేతులమీదుగా మహిళలకు గుడ్డ సంచులు, ప్లాస్టిక్ ప్రత్యామ్నాయ వస్తువులను వ్యాపారులకు అందజేశారు. మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డి, డీఆర్డీఏ పీడీ ఎంఎస్ఎస్ వేణుగోపాల్, శ్రీవిజ్ఞాన వేదిక కన్వీనర్ చెరుకువాడ రంగసాయి పాల్గొన్నారు. చిరు వ్యాపారులపై జరిమానాలు తగదు ప్లాస్టిక్ నిషేధం పేరుతో పట్టణంలో చిరు వ్యాపారులపై జరిమానాలు విధించడం కాదని, ఎక్కడ నుంచి ప్లాస్టిక్ ఉత్పత్తులు వస్తున్నాయో తెలుసుకుని ఆపాలంటూ మాజీ కౌన్సిలర్ మెంటే గోపి అన్నారు. వెంటనే కలెక్టర్ కలుగజేసుకుని వ్యాపారులు, ప్రజలకు అవగాహన కల్పించి ప్లాస్టిక్ నిషేధించాలని అవగాహన కల్పిస్తున్నామన్నారు. అవగాహన లేకుండా మాట్లాడవద్దని హితవుపలికారు. -
ఉద్యోగ భద్రత కల్పించాలి
ఏలూరు (ఆర్ఆర్పేట): రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించి ఆదుకోవాలని కాంట్రాక్టు అండ్ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు కె.సుమన్, సహాధ్యక్షుడు గంట సంపత్కుమార్ డిమాండ్ చేశారు. శనివారం ఏలూరులోని రెవెన్యూ భవన్లో నిర్వహించిన సంఘ జిల్లా కార్యవర్గ సమావేశంలో విలేకరులతో మాట్లాడారు. ఇటీవల మంత్రివర్గ సమావేశంలో ఆప్కాస్ రద్దుపై వస్తున్న ప్రకటనలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. గతంలో కంటే మెరుగైన విధానాన్ని తీసుకువచ్చి ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు న్యాయం చేయాలని కోరారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించి వారి కుటుంబాల్లో వెలుగులు నింపాలన్నారు. జిల్లా అధ్యక్షుడు కె.నాగభూషణం, మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి పి.సుశీల పాల్గొన్నారు. -
శానిటేషన్ లేకనే వైరస్ వ్యాప్తి
తణుకు అర్బన్: కోళ్ల ఫారాల్లో రైతులు పూర్తిస్థాయి శానిటైజేషన్ పాటించకపోవడంతోనే వైరస్లు వ్యాప్తిస్తున్నాయని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బి.రాజశేఖర్ అన్నారు. తణుకు మండలం వేల్పూరు రెడ్జోన్లోని కోళ్ల ఫారాలను కలెక్టర్ చదలవాడ నాగరాణితో కలిసి శనివారం ఆయన పరిశీలించారు. బాదంపూడి, వేల్పూరుల్లో కోళ్లకు వ్యాపించిన వైరస్ గతంలోనూ వచ్చిన దాఖలాలు ఉన్నాయన్నారు. ఆయా ప్రాంతాల్లో ఇప్పటికే కల్లింగ్ ప్రక్రియ పూర్తయిందని, శానిటైజేషన్ కార్యక్రమం జరుగుతోందని చెప్పారు. దీనివల్ల మానవాళికి ఎటువంటి ఇబ్బందులూ లేవని, అపోహలను నమ్మవద్దని తెలిపారు. కోళ్ల ఫారాల్లో తీసుకోవా ల్సిన జాగ్రత్తలు పూర్తిస్థాయిలో పాటించడం లేదని, ముఖ్యంగా ఫారాల్లో శానిటైజేషన్ సక్రమంగా లేకపోవడమే వైరస్లకు ప్రధాన కారణమని చెప్పా రు. రానున్న రోజుల్లో పూర్తిస్థాయి శానిటైజేషన్ చేసేలా కోళ్ల ఫారాల యాజమాన్యాలకు దిశానిర్దేశం చేస్తామన్నారు. కోళ్ల ఫారాల వద్ద పనులు పూర్తయిన తర్వాత మూడు నెలల పాటు ఫారాలను సీజ్ చేస్తామని చెప్పారు. ఈ సందర్భంగా ఒక ఫారం వద్ద ఏర్పాటుచేసిన ఫొటో ఎగ్జిబిషన్లో కోళ్ల మరణాలు, తీసుకున్న జాగ్రత్తలు వంటి ఫొటోలను ఆయన పరిశీలించారు. వైరస్ సోకిన కృష్ణానందం పౌల్ట్రీస్లో నిర్వహిస్తున్న శానిటైజేషన్ పనులను స్వయంగా పర్యవేక్షించారు. జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ మురళీకృష్ణ, తహసీల్దార్ దండు అశోక్వర్మ, మండల పశువైద్యాధికారి శంకర్ భావన్నారాయణ తదితరులు పాల్గొన్నారు. బాదంపూడిలో 30 వేల కోళ్ల ఖననం ఉంగుటూరు: బాదంపూడిలోని వెంకట మణికంఠ ఫారంలో బర్డ్ఫ్లూ సోకిన 30 వేల కోళ్లను శనివారం ఖననం చేశారు. ఈ ప్రక్రియను పశుసంవర్ధక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బి.రాజశేఖర్, రాష్ట్ర డైరెక్టర్ దామోదరనాయుడు పరిశీలించారు. జిల్లాకు చెందిన పశువైద్యులు, సహాయకులు సుమారు 100 మంది జేడీ టి.గోవిందరాజు పర్యవేక్షణలో కోళ్ల ఖననం చేశారు. ఈ ఫారం సమీపంలోని మరో ఫారంలోనూ కోళ్ల ఖననం ప్రక్రియ కొనసాగింది. మండలంలో చెక్పోస్టులు, మెడికల్ క్యాంపులు కొనసాగుతున్నాయి. గ్రామంలో శానిటేషన్ పనులు కొనసాగుతున్నాయి. తహసీల్దార్ ప్రసాద్, ఎంపీడీఓ రాజ్ మనోజ్ పర్యవేక్షిస్తున్నారు. ఊటాడలో 1,500 కోళ్లు మృతి యలమంచిలి: మండలంలోని ఊటాడ గ్రామంలో నెక్కంటి సతీష్కుమార్ అనే కోళ్ల రైతు ఫారంలో ఉదయం 1,500 బ్రాయిలర్ కోళ్లు మృతిచెందాయి. పశుసంవర్ధక శాఖ అధికారులు కోళ్ల నుంచి శాంపిల్స్ సేకరించి విజయవాడ, భోపాల్ పరీక్షా కేంద్రాలకు పంపించారు. అనంతరం పొక్లెయిన్తో కోళ్లను గొయ్యిలో ఖననం చేశారు. పశుసంవర్ధక శాఖ భీమవరం ప్రాంతీయ ఉప సంచాలకుడు జవార్ హుస్సేన్ మాట్లాడుతూ రెండు రోజుల క్రితమే మేడపాడులో కూడా ఇలానే 5,500 కోళ్లు చనిపోయాయని తెలిపారు. దీంతో ఈ రెండు గ్రామాల పరిధిలో కిలోమీటర్ వరకు రెడ్జోన్గా ప్రకటించామన్నారు. ల్యాబ్ నివేదిక వచ్చిన తర్వాత ఇతర చర్యలు తీసుకుంటామన్నారు. పాలకొల్లు ప్రాంతీయ సహాయ సంచాలకుడు డాక్టర్ గంజనబోయిన మల్లేశ్వరరావు, మండల పశు వైద్యాధికారి పోరెడ్డి చంద్రశేఖరరెడ్డి ఉన్నారు. పశుసంవర్ధక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాజశేఖర్ -
మహాశివరాత్రికి కట్టుదిట్టమైన ఏర్పాట్లు
డీఆర్వో వెంకటేశ్వర్లు భీమవరం(ప్రకాశం చౌక్): జిల్లాలో ఈనెల 26న జరిగే మహాశివరాత్రి ఉత్సవాలకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి ఎం.వెంకటేశ్వర్లు, జిల్లా ఏఎస్పీ వి.భీమారావు అన్నారు. కలెక్టరేట్లో శనివారం అధికారులతో సమీక్షించారు. డీఆర్వో మాట్లాడుతూ జిల్లా లోని పాలకొల్లు, భీమవరం, నత్తారామేశ్వరం, జుత్తిగ, ఆచంట, పెనుగొండ, లక్షణేశ్వరం, య నమదుర్రు, శివదేవునిచిక్కాల ఆలయాల్లో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలన్నారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పారిశుద్ధ్యం, విద్యుత్ దీపాలు, తాగునీరు, తాత్కాలిక మరుగుదొడ్లు తదితర ఏర్పాట్లపై సమీక్షించారు. జిల్లా ఏఎస్పీ వి.భీమారావు మాట్లాడుతూ భీమవరం మావుళ్లమ్మ ఉత్సవాల మాదిరిగా శివరాత్రి ఉత్సవాలను విజయవంతం చేయాలన్నారు. ఆధునిక టెక్నాలజీ సీసీ, సోలార్, డ్రోన్ కెమెరాలను వినియోగించాలన్నారు. బందోబస్తుకు సచివాలయాల్లోని మహిళా పోలీసులను వినియోగిస్తామన్నారు. అక్రమ మద్యం, మత్తు పదార్థాలు, జుదం జరగకుండా చూడాలన్నారు. జిల్లా ఎండోమెంట్ అధి కారి ఈవీ సుబ్బారావు, జిల్లా అగ్నిమాపకదళ అధికారి బి.శ్రీనివాసరావు, ఆర్బీఎస్ కేపీఓ సీహెచ్ భావన, కో–ఆర్డినేషన్ సెక్షన్ సూపరింటెండెంట్ ఎం.సన్యాసిరావు, డిప్యూటీ తహసీల్దార్ ఈ.నాగార్జున తదితరులు పాల్గొన్నారు. -
స్పా సెంటర్లను నిషేధించాలి
ఏలూరు (టూటౌన్): మార్గదర్శకాలను ఉల్లంఘిస్తూ, అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్న స్పా, మసాజ్ సెంటర్లను నిషేధించాలని ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య (ఎన్ఎఫ్ఐడబ్ల్యూ) ఏలూరు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వరక శ్యామల, మన్నవ యామిని శనివారం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్థానిక స్ఫూర్తిభవన్లో వారు మాట్లాడుతూ కొందరు ఈజీ మనీ కోసం అడ్డదారులు తొక్కుతున్నారని, మహిళలను బలవంతంగా వ్యభిచార కూపంలోకి లాగి డబ్బులు దండుకుంటున్నారని విమర్శించారు. మధ్యతరగతి, పేద మహిళలను టార్గెట్ చేసిఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి, స్పా సెంటర్లలో చేర్పిస్తున్నారన్నారు. అనంతరం మహిళలను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి దందా దేశంలోని పలు ప్రాంతాల్లో యథేచ్ఛగా సాగుతోందని ఆరోపించారు. పోలీసు శాఖ స్పా, మసాజ్ సెంటర్లపై దృష్టి సారించి నిర్వాహకులపై కఠిన చర్యలు చేపట్టాలని కోరారు. -
వైద్యసేవ.. అవినీతి తోవ
గతంలో ప్రతిష్టాత్మకంగా.. తణుకులోని ఆస్పత్రికి రూ.3.10 లక్షల జరిమానా ఉచిత వైద్య సేవ నిబంధనలు మీరి తమ నుంచి డబ్బులు వసూలు చేసినట్టు ముగ్గురు బాధితులు ఇచ్చిన ఫిర్యాదులపై తణుకులోని ఒక ప్రైవేట్ మల్టీస్పెషాలిటీ ఆస్పత్రికి రూ.3.02 లక్షల జరిమానాను ఉన్నతాధికారులు విధించారు. వీటిలో ఒక రోగి నుంచి రూ.10 వేలు వసూలు చేయగా అందుకు పది రెట్లు రూ.లక్ష, మరో రోగి నుంచి రూ.15,000 వసూలు చేసినందుకు గాను రూ.1.5 లక్షలు, మరో రోగి నుంచి రూ.5,200 వసూలు చేసినందుకు గాను రూ. 52,000 జరిమానాగా విధించారు. జిల్లాలోని భీమవరం, పాలకొల్లులోని మరో ఐదు ఆస్పత్రుల్లో రోగుల నుంచి అక్రమ వసూళ్లపై ఎన్టీఆర్ వైద్యసేవా ట్రస్టుకు ఫిర్యాదులు అందినట్టు తెలుస్తోంది. వీటిని మసిపూసి మారేడుకాయ చేసే పనిలో జిల్లాలోని సంబంధిత విభాగానికి చెందిన కొందరు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. ఆస్పత్రులపై జరిమానాల విషయమై జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి భానునాయక్ను సంప్రదించగా వాస్తవమేనని తెలిపారు. సాక్షి, భీమవరం: ఉచిత వైద్యసేవలో పలు నెట్వర్క్ ఆస్పత్రులు చేతివాటం ప్రదర్శిస్తున్నాయి. రోగుల నుంచి అందినంత పిండుకుంటున్నాయి. ఆస్పత్రుల తీరుపై కొందరు ఉన్నతస్థాయికి ఫిర్యాదులు చేయడంతో జిల్లాలోని ఒక ఆస్పత్రికి రూ.3.02 లక్షల జురిమానా విధించగా మరికొన్నింటిపై విచారణ జరుగుతున్నట్టు తెలిసింది. ఇటీవల చోటుచేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. జిల్లాలో 30 నెట్వర్క్ హాస్పిటల్స్ జిల్లాలో ఎన్టీఆర్ వైద్యసేవ (ఆరోగ్యశ్రీ) అందించే ప్రభుత్వ ఆస్పత్రులు 42 ఉండగా ప్రైవేట్ ఆస్పత్రులు 30 వరకు ఉన్నాయి. ప్రైవేట్ నెట్వర్క్ ఆస్పత్రుల్లో 22 మల్టీ స్పెషాలిటీ, ఎనిమిది డెంటల్ ఆస్పత్రులు ఉన్నాయి. ఆరోగ్యశ్రీ పేరును కూటమి ప్రభుత్వం ఎన్టీఆర్ వైద్యసేవగా మార్చింది. ఈ పథకం కింద ఉచిత వైద్యసేవ పొందే రోగికి ఉచిత అడ్మిషన్, అవసరమైన వైద్య పరీక్షలు, శస్త్రచికిత్సలతో పాటు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే వరకు మందులు, రూమ్ సదుపాయం, అల్పాహారం, రెండు పూటలా భోజనం, వైద్యసేవలు అందించాలి. డిశ్చార్జ్ సమ యంలో రోగికి సరిపడా మందులు ఇవ్వాలి. కొరవడిన అజమాయిషీ : ఎన్టీఆర్ వైద్యసేవ పథకం అమలులో సంబంధిత అధికారులు అజమాయిషి కొరవడటంతో ప్రైవేట్ ఆస్పత్రుల ఇష్టా రాజ్యంగా మారింది. మత్తు ఇచ్చేందుకనో, అప్రూవల్ రావడానికి ఆలస్యమవుతుందనో, బయట కొన్ని వైద్య పరీక్షలు చేయించాలనో పలు కారణాలు చెప్పి నిబంధనలకు విరుద్ధంగా ఆస్పత్రుల్లో రోగుల నుంచి డబ్బులు గుంజుతున్నారు. డెలివరీలకు సైతం సొమ్ములు చెల్లించాలంటున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. కొన్ని ఆస్పత్రుల్లో ఉచిత వైద్యసేవల రోగుల నుంచి వసూలు చేసిన సొమ్ములకు రశీదులు సైతం ఇస్తుండటం గమనార్హం. అధిక శాతం మంది రోగులు ఎందుకొచ్చిన గొడవలే అన్నట్టుగా అడిగినంత చెల్లిస్తుండగా, కొందరు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళుతున్నారు. ఆస్పత్రి యాజమాన్యాలతో తమకున్న పరిచయాలతో చాలా వరకు ఫిర్యాదులను జిల్లాస్థాయిలోని కొందరు అధికారులు బుట్టదాఖలు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. బాధితులు వెనక్కి తగ్గకుండా నిలబడిన కేసుల్లో మాత్రం ఉన్నతస్థాయి నుంచి సంబంధిత ఆస్పత్రులపై చర్యలు తప్పనిసరి అవుతున్నాయి.ప్రైవేట్ ఆస్పత్రుల ఇష్టారాజ్యం ఉచిత సేవల్లో చేతివాటం ఎన్టీఆర్ వైద్యసేవపై కొరవడిన అజమాయిషీ రోగుల నుంచి సొమ్ములు వసూలు చేస్తున్న నెట్వర్క్ హాస్పిటల్స్ ఉన్నతస్థాయికి బాధితుల ఫిర్యాదు జిల్లాలో పలు ఆస్పత్రులకు జరిమానాలు గత ప్రభుత్వం వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలుచేసింది. క్యాన్సర్ వంటి ఖరీదైన జబ్బుల చికిత్సకు పరిమితి లేకుండా అవసరమైన సాయం అందించారు. పథకం కింద అందించే 1,059 చికిత్సల సంఖ్య (ప్రొసీజర్ల)ను 3,257కి పెంచారు. శస్త్రచికిత్స అనంతరం రోగి కోలుకునే వరకు జీవనభృతి కోసం వైఎస్సార్ ఆరోగ్య ఆసరా కింద ఆర్థిక సాయం కూడా అందించేవారు. ఇంటికి వెళ్లిన పది రోజుల తర్వాత ఆస్పత్రికి వచ్చి ఉచితంగా వైద్య సేవలు పొందే వీలు కల్పించారు. అవసరమైన చికిత్సలకు ఏడాది పాటు డాక్టర్ సంప్రదింపులు, వైద్య పరీక్షలు, మందులు కూడా ఉచితంగా ఇచ్చేవారు. అక్రమాల నివారణకు 14400 నంబరుకు ఫోన్ చేసి ఫిర్యాదు చేసే వీలు కల్పించారు. అలాగే కుటుంబానికి రూ.5 లక్షలు ఉన్న వ్యయ పరిమితిని రూ.25 లక్షలకు పెంచడం ద్వారా పేదల ఆరోగ్యానికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరింత భరోసా కల్పించారు. కాగా కూటమి ప్రభుత్వం ఆరోగ్య ఆసరాకు ఎసరు పెట్టింది. ఆస్పత్రులకు బకాయిల విడుదలలో జాప్యంతో ఉచిత వైద్య సేవల కోసం రోగులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. -
ముగిసిన రోడ్డు భద్రత మాసోత్సవాలు
ఏలూరు (ఆర్ఆర్పేట): 18 ఏళ్లు నిండని వారికి మోటార్ వాహనాలు నడిపే హక్కు లేదని అడిషినల్ ఎస్పీ నక్కా సూర్యచంద్రరావు అన్నారు. స్థానిక ఉప రవాణా కమిషనర్ కార్యాలయంలో శనివారం 36వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రహదారి భద్రతా నియమాలు అందరూ పాటించాలన్నారు. హెల్మెట్, సీటు బెల్టు తప్పక ధరించాలన్నారు. మాసోత్సవాల్లో భాగంగా జిల్లాలో 50కు పైగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించామన్నారు. ఏలూరు, జంగారెడ్డిగూడెం ఆర్టీఓలు కృష్ణారావు, మదానీ మాట్లాడుతూ రహదారి భద్రత అందరి బాధ్యత అన్నారు. జిల్లాలో ఉత్తమ ఆర్టీసీ డ్రైవర్లు, విద్యాసంస్థల బస్సు డ్రైవర్లను సత్కరించారు. చిత్రలేఖనం, క్విజ్ పోటీల్లో విజేతలకు బహుమతులు అందించారు. ఆర్టీసీ డీఎం బి.వాణి, ఆర్అండ్బీ డీఈ సంఘమిత్ర, రవాణా శాఖ పరిపాలన అధికారులు ఎం.రాము, ఎం. ఆనంద్ కుమార్, వాహన తనిఖీ అధికారులు, ట్రాఫిక్ పోలీస్ రవాణా శాఖ సిబ్బంది పాల్గొన్నారు. -
జనన, మరణాల నమోదు తప్పనిసరి
ఏలూరు (టూటౌన్): జనన, మరణాలను తప్పనిసరిగా నమోదు చేయాలని అదనపు సీనియర్ సివిల్ జడ్జి కేకేవీ బుల్లికృష్ణ సూచించారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యా యమూర్తి (ఎఫ్ఏసీ) ఎం.సునీల్కుమార్ ఆధ్వర్యంలో శనివారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ భవనంలో జనన, మరణాల నమోదు, కుల, వివాహ ధ్రువీకరణ పత్రాల జారీ అంశాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ధ్రు వీకరణపత్రాల జారీకి సంబంధించి సూచనలు, నిబంధనలను ప్రతి కార్యాలయం వద్ద అధికారులు బహిర్గతం చేయాలన్నారు. పంచా యతీ, సచివాలయాల పరిధిలో ప్రజలకు అ వగాహన కల్పించాలన్నారు. జిల్లా రిజిస్ట్రార్ కె.శ్రీనివాసరావు, రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ అంబరీష్, మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాసరెడ్డి, తహసీల్దార్ శేషగిరి, లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ పీఎన్వీ మునేశ్వరరావు, ప్యానల్ లాయర్ కూనా కృష్ణారావు పాల్గొన్నారు. ఎన్నికల సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ ఏలూరు(మెట్రో): ఎమ్మెల్సీ ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి తపాలా బ్యాలెట్కు అవకాశం కల్పించినట్టు తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ కె.వెట్రిసెల్వి తెలిపారు. ఈనెల 27న పోలింగ్ జరుగనుందన్నారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఫాం–12ను ఈనెల 20న సాయంత్రం 5 గంటలోపు సమర్పించాలన్నారు. ఫాం–12ను ఏలూరు డాట్ ఏపీ డాట్ జీఓవీ డాట్ ఇన్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని కోరారు. ఫాం–12తో పాటు డ్యూటీ కేటాయింపు ఉత్తర్వులు జతచేయాలని కోరారు. సమన్వయంతో లక్ష్యాలు సాధించాలి భీమవరం(ప్రకాశం చౌక్): అధికారులు సమన్వయంతో లక్ష్యాలు సాధించాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి సూచించారు. శనివారం కలెక్టరేట్లో రెవెన్యూ సదస్సులు, రీ సర్వే గ్రామ సభలు, పీజీఆర్ఎస్ ఫిర్యాదులు, నిరుపేదల ఇళ్ల స్థలాల పరిశీలన, 22–ఏ కేసులు, ఏపీ సేవా సర్వీ సులు, కోర్టు కేసులు, పైలెట్ రీ సర్వే గ్రామాలు తదితర 13 అంశాలపై జేసీ టి.రాహుల్కుమార్రెడ్డితో కలిసి సమీక్షించారు. పెండింగులో ఉ న్న భూ సంబంధిత కోర్టు కేసులు, భూ సంబంధిత తగదాలు తదితర కేసులను త్వరితగతిన పరిష్కారమయ్యేలా చూడాలన్నారు. ఇంటర్ ప్రాక్టికల్స్కు 102 మంది గైర్హాజరు ఏలూరు (ఆర్ఆర్పేట): జిల్లాలో శనివారం జరిగిన ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలకు 3,097 మందికి 2,995 మంది హాజరుకాగా.. 102 మంది గైర్హాజరయ్యారు. జనరల్, ఒకేషనల్ విద్యార్థులకు 40 కేంద్రాల్లో పరీక్షలు జరిగాయి. ఉదయం షిఫ్టులో 1,641 మందికి 1,573 మంది, మధ్యాహ్నం షిఫ్టులో 1,456 మందికి 1,422 మంది హాజరయ్యారని ఇంటర్మీడియెట్ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి కె.యోహాన్ తెలిపారు. హెచ్ఎం సుబ్రహ్మణ్యంకు షోకాజ్ నోటీస్ జంగారెడ్డిగూడెం: లక్కవరం రెడ్డిపేట ఎంపీపీ స్కూల్ ప్రధానోపాధ్యాయుడు సుబ్రహ్మణ్యంకు జిల్లా విద్యాశాఖాధికారి వెంకట లక్ష్మమ్మ శనివారం షోకాజ్ నోటీసు జారీ చేశారు. పాఠశాలలో అన్యమత ప్రచారంపై తల్లితండ్రుల ఫిర్యాదు నేపథ్యంలో శుక్రవారం విచారణ నిర్వహించారు. విచారణలో తేలిన అంశాల ఆధారంగా డీఈఓ షోకాజ్ నోటీసు జారీ చేశారు. ఈ మేరకు విద్యాశాఖాధికారులు బి.రాముడు, జి.రాములు సుబ్రహ్మణ్యానికి షోకాజు నోటీసు అందజేశారు. డీసీసీబీ సీఈఓగా సింహాచలం ఏలూరు (ఆర్ఆర్పేట): జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ (డీసీసీబీ) ముఖ్య కార్యనిర్వహణాధికారిగా పి.సింహాచలం నియమితులయ్యారు. ఆయన గతంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో వివిధ హోదాల్లో పనిచేసి ఇటీవల పదవీ విరమణ చేశారు. కాగా ప్రస్తుతం ఈ స్థానంలో డిప్యూటేషన్పై పనిచేస్తున్న ఆప్కాబ్ అధికారి ఎంఎస్ఆర్కే తిలక్ను తిరిగి మాతృ సంస్థకు బదిలీ చేశారు. సింహాచలం సోమవారం బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది. -
మద్దిలో వసతి గదులకు రూ.10 లక్షల విరాళం
జంగారెడ్డిగూడెం : మండలంలోని గుర్వాయిగూడెం మద్ది ఆంజనేయస్వామి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ముఖమండపంపై స్వామివారి ఉత్సవమూర్తికి అర్చక స్వాములు శాస్త్రోక్తంగా పంచామృత అభిషేకం నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఆలయ సిబ్బంది భక్తులకు ప్రసాదాలు అందజేశారు. ఆలయం వద్ద నిర్మిస్తున్న వసతి గదుల కోసం హైదరాబాద్ కు చెందిన మహేందర్, లత దంపతులు రూ.10,00,000 విరాళంగా ఇచ్చారని ఈవో ఆర్వీ చందన తెలిపారు. దాతలను ఆలయ మర్యాదలతో సత్కరించారు. అథ్లెటిక్స్ పోటీలకు ఎంపిక తణుకు అర్బన్ : ఆల్ ఇండియా సివిల్ సర్వీస్ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ పోటీలకు తణుకు మండలం మండపాక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు సంకు సూర్యనారాయణ ఎంపికై నట్లు పాఠశాల హెచ్ఎం ఆర్.మోహన్బాబు తెలిపారు. గత నెలలో నాగార్జున యూనివర్సిటీలో జరిగిన పోటీల్లో సూర్య నారాయణ 1500 మీటర్ల రన్నింగ్ విభాగంలో ప్రథమ స్థానం సాధించారని చెప్పారు. ఈ నెల 19 నుంచి 21 వరకు చండీగఢ్లో నిర్వహించే అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికై నట్లు వివరించారు. కడుపు నొప్పి తాళలేక ఆత్మహత్య దెందులూరు: కడుపునొప్పి తాళలేక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడని దెందులూరు పోలీసులు తెలిపారు. ఎస్సై ఆర్.శివాజీ తెలిపిన వివరాలు ప్రకారం.. గ్రామానికి చెందిన శెనగల వెంకటేశ్వరరావు (32) కొంతకాలం నుంచి కడుపు నొప్పితో బాధపడుతున్నాడు. ఈ నెల 10న పురుగుమందు వాసన రావడంతో భార్యం ఏం జరిగిందని అడిగింది. కడుపునొప్పి తాళలేక పురుగుమందు తాగానని చెప్పడంతో వెంటనే అతన్ని చికిత్స నిమిత్తం ఏలూరు వైద్యశాలకు తరలించారు. వైద్యుల సూచన మేరకు ఏలూరు నుంచి విజయవాడ వైద్యశాలకు తీసుకెళ్లారు. విజయవాడలో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. -
వరకట్న వేధింపుల కేసు నమోదు
భీమవరం: అదనపు కట్నం కోసం భర్త, అత్తమామలు వేధిస్తున్నారంటూ భీమవరం పట్టణం గునుపూడికి చెందిన గోరుముచ్చు సిరివెన్నెల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు భీమవరం వన్టౌన్ హెడ్ కానిస్టేబుల్ జీజీఎస్ఎస్ చక్రవర్తి శనివారం చెప్పారు. కృష్ణాజిల్లా బంటుమిల్లి మండలం మల్లేశ్వరం గ్రామానికి చెందిన గోరుముచ్చు కల్యాణ్బాబుతో 2023 జూన్ 16న సిరివెన్నెలకు వివాహమైంది. పెళ్లి సమయంలో రూ.3 లక్షలు కట్నంగా ఇచ్చారు. ఇటీవల అదనపు కట్నం తీసుకురావాలంటూ వేధించడంతో సిరివెన్నెల ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చక్రవర్తి చెప్పారు. -
మెస్ నిర్వహణ సరిగా లేకపోతే జరిమానా
నూజివీడు: విద్యార్థులకు సరిపడా ఆహార పదార్థాలు అందుబాటులో ఉంచకపోయినా, ఆలస్యమైనా మెస్ నిర్వాహకులకు జరిమానా విధిస్తామని ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ ఆచార్య సండ్ర అమరేంద్రకుమార్ తెలిపారు. స్థానిక ట్రిపుల్ ఐటీలో మెస్ మానిటరింగ్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బర్డ్ఫ్లూ నేపథ్యంలో శుక్రవారం రాత్రి కోడిగుడ్డు కూరకు బదులుగా క్యాలీఫ్లవర్ కూరను తయారు చేశారని.. మూడు వేల మంది విద్యార్థులకు కూరను సిద్ధం చేసినప్పటికీ సరైన అంచనా లేక 500 మంది విద్యార్థులకు తగ్గడంతో నిర్వాహకులు వెంటనే తయారు చేసి సకాలంలోనే అందించారన్నారు. అనుకోకుండా ఇలాంటి పరిస్థితులు ఎదురైతే ఎలా అధిగమించాలనే దానిపై కూడా చర్చించారు. మెస్ మానిటరింగ్ కమిటీ, ఫుడ్ క్వాలిటీ ఇన్చార్జి, మెస్ ఫ్యాకల్టీ ఇన్చార్జిలు నిరంతరం మెస్లు పర్యవేక్షించాలన్నారు. నాణ్యత, పరిమాణంలో తేడా రాకుండా చూడాలన్నారు. సమావేశంలో ఏఓ బీ లక్ష్మణరావు, డీన్ అకడమిక్స్ చిరంజీవి, డీన్ స్టూడెంట్ వెల్ఫేర్ బ్రహ్మస్వాములు పాల్గొన్నారు. -
పేదల వ్యతిరేక బడ్జెట్
భీమవరం : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పేదల వ్యతిరేక, కార్పొరేట్ అనుకూల బడ్జెట్ను తక్షణం ఉపసంహరించుకోవాలని వామపక్ష పార్టీలు హెచ్చరించాయి. కేంద్ర బడ్జెట్ను నిరసిస్తూ శనివారం భీమవరం ప్రకాశం చౌక్ సెంటర్లో వామపక్ష పార్టీల అధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా, ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు బి.బలరామ్ మాట్లాడుతూ కేంద్ర బడ్జెట్ రైతులకు ఆత్మహత్యలను పురుకొల్పేలా ఉందని మండిపడ్డారు. సామాన్యులు, కౌలు రైతు, కార్మిక, రైతు కూలీలను మోసం చేసే బడ్జెట్పై రాష్ట్రపతి తక్షణం జోక్యం చేసుకుని పార్లమెంట్కు తిప్పి పంపాలని డిమాండ్ చేశారు. సీపీఐ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు మాట్లాడుతూ కేంద్ర బడ్జెట్ రైతు, కార్మిక, ప్రజా వ్యతిరేకమన్నారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తానన్న ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేయడమేగాక ఉద్యోగం, ఉపాధికి నిధులు కేటాయించలేదని కోనాల విమర్శించారు. ఫార్వర్డ్ బ్లాక్ జిల్లా కార్యదర్శి లంక కృష్ణమూర్తి, సీపీఎం జిల్లా కార్యదర్శి జెఎన్వీ గోపాలన్, సీపీఐ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు చెల్లబోయిన రంగారావు, ఎం.సీతారాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. భక్తులతో కిటకిటలాడిన శ్రీవారి క్షేత్రం ద్వారకాతిరుమల: శ్రీవారి క్షేత్రం శనివారం భక్తులతో కిటకిటలాడింది. స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో వేలాది మంది భక్తులు చినవెంకన్నను దర్శించారు. తెల్లవారుజామునుంచే భక్తుల రాక మొదలవడంతో ఆలయ పరిసరాలు కళకళలాడాయి. ఆలయ తూర్పురాజగోపుర ప్రాంతం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్, దర్శనం క్యూలైన్లతో పాటు, అనివేటి మండపం, ప్రసాదం, టికెట్ కౌంటర్లు, కల్యాణకట్ట ఇలా అన్ని విభాగాలు భక్తులతో పోటెత్తాయి. ఉచిత అన్నప్రసాదం కోసం అన్నదాన భవనం వద్ద భక్తులు బారులు తీరారు. అలాగే పార్కింగ్ ప్రదేశాలు వాహనాలతో నిండిపోయాయి. సాయంత్రం వరకు క్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగింది. కొట్లాట కేసు నమోదు భీమవరం: భీమవరం పట్టణం మెంటేవారితోటలో ఇరువర్గాలు ఘర్షణ పడగా కేసు నమోదు చేసినట్లు వన్టౌన్ ఎస్సై బీవై కిరణ్కుమార్ శనివారం చెప్పారు. శుక్రవారం సాయంత్రం మెంటేవారితోటకు చెందిన ముత్యాలపల్లి సాయివంశీ అదే ప్రాంతానికి చెందిన కేశవరపు శివరమేష్ వర్గాలు కొట్టుకున్నాయి. గాయపడిన వారిని చికిత్స కోసం ప్రభుత్వాసుపత్రిలో చేరగా.. అక్కడి నుంచి వచ్చిన సమాచారం మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై చెప్పారు. -
మామిడిలో తెగుళ్ల బెడద
నూజివీడు: డివిజన్లో విస్తరించి ఉన్న మామిడి తోటలకు ఈ ఏడాది నల్ల తామర, బూడిద తెగుళ్లు సోకడంతో మామిడి దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపే అవకాశముంది. నూజివీడు నియోజకవర్గంతో పాటు చింతలపూడి, లింగపాలెం మండలాల్లో మామిడి తోటలు విస్తరించి ఉన్నాయి. పూతలు 80 నుంచి 90 శాతం తోటల్లో వచ్చినప్పటికీ నల్లతామర, బూడిద తెగుళ్ల వల్ల ఆశించిన స్థాయిలో పిందె కట్టు కనిపించడం లేదు. వాటి వల్ల పూతంతా నల్లగా మాడిపోతుండటంతో రైతులు లబోదిబోమంటున్నారు. బంగినపల్లి, తోతాపురి రకం తోటల్లో నల్లతామర ఉధృతి ఎక్కువగా కనిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో నూజివీడు మామిడి పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త బొర్రా కనకమహాలక్ష్మి, శాస్త్రవేత్తలు కే రాధారాణి, శాలిరాజు నూజివీడు, ఆగిరిపల్లి, చాట్రాయి, ముసునూరు తదితర మండలాల్లో పర్యటించి ప్రస్తుత పరిస్థితులపై రైతులకు సలహాలు, సూచనలు అందజేస్తున్నారు. నల్లతామర నివారణకు.. నల్లతామర పురుగుల నివారణకు రైతులు థయోమిథాక్సమ్ 25 శాతం 0.3 గ్రాములు లీటరు నీటికి లేదా స్పైనోసాడ్ 45 ఎస్సీ 0.3 ఎంఎల్ లీటరు నీటికి లేదా ఫిప్రోనిల్ 40 శాతం, ఇమిడాక్లోప్రిడ్ 40 శాతం 0.2 గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. మామిడి తోటల్లో నల్ల తామర నివారణకు అక్కడక్కడ నీలిరంగు, పసుపురంగు జిగురు అట్టలు ఏర్పాటు చేసుకోవడం ద్వారా వాటి ఉధృతి తగ్గించవచ్చన్నారు. నీలి, పసుపు, తెలుపు రంగు చీరలను మడ్డి ఆయిల్లో తడిపి తోటల్లో కడితే నల్ల తామర పురుగుల ఉధృతిని సులువుగా నివారించుకోవచ్చు. తోటల్లో అధికంగా పిందె రాలితే ప్లానోఫిక్స్ 0.2 ఎంఎల్ లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. బూడిద తెగులు నివారణకు.. బూడిద తెగులు నివారణకు హక్సాకోనజోల్ లేదా ప్రొపికోనజోల్ 2 ఎంఎల్ లేదా టెబుకొనజోల్, ట్రైఫ్లాక్సీట్రోబిన్ 1 గ్రాము పొడి మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. బూడిద తెగులు అధికంగా ఉన్న తోటల్లో పూత నల్లగా మారడంతో పాటు పిందెలు అధికంగా రాలుతున్నట్లు గమనించినందున పిందెలు రాలకుండా తేలికపాటి నీటి తడులు ఇవ్వాలన్నారు. తోటలు శుభ్రంగా ఉంచుకున్న వాటిలో రసం పీల్చే పురుగులు, తెగుళ్ల ఉధృతి తక్కువగా ఉందన్నారు. మాడిపోతున్న పూత -
టెక్నాలజీని వినియోగించుకోవాలి
భీమవరం: ప్రపంచంలో కొన్ని దేశాలలో అపారమైన సహజ వనరులున్నప్పటికీ టెక్నాలజీ లేకపోవడంతో సహజ సంపద ఇతర దేశాలకు అందించి తిరిగి వారి వద్దే ఉత్పత్తులు కొనుగోలు చేసుకుంటున్నారని చైన్నెకి చెందిన ఇండియన్ పేటెంట్ డిప్యూటీ కంట్రోల్ ఆఫ్ పేటెంట్స్ అండ్ డిజైన్ ఎం.రాం జవహర్ అన్నారు. భీమవరం ఎస్ఆర్కెఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో 24 గంటల పాటు నిర్వీరామంగా నిర్వహించిన హ్యకథాన్ పోటీల్లో విజేతలకు శనివారం బహుమతులు అందజేశారు. మనకు లభ్యమవుతున్న సహజ సంపద పూర్తిస్థాయిలో వినియోగించుకుని దేశం ప్రగతి సాధించాలంటే టెక్నాలజీ ఎంతో అవసరమన్నారు. కళాశాల డైరెక్టర్ ఎం.జగపతిరాజు మాట్లాడుతూ విద్యార్థులు వినూత్న ఆలోచనలను ఆచరణలోకి తీసుకువచ్చేందుకు ఐడియా ల్యాబ్ టెక్నాలజీ సెంటర్లు తమ కళాశాలలో ఉన్నాయని వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కెనరా బ్యాంక్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ తోట రవిచంద్ర మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నతికి కెనరా బ్యాంక్ తమ వంతు సహకారం అందజేస్తుందన్నారు. ఈ పోటీల్లో అమరావతి వీఐటీ యూనివర్సిటీ కంప్యూటర్ సైనన్స్ ఇంజనీరింగ్ ఫైనలియర్ విద్యార్థులు ప్రథమ బహుమతి గెలుచుకోగా రూ. 12 వేలు నగదు బహుమతి అందజేశారు. ద్వితీయ స్థానం తాడేపల్లిగూడెం వాసవి ఇంజనీరింగ్ కళాశాలకు, తృతీయ స్థానం ఎస్ఆర్కెఆర్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు నిలిచారు. ఐటీ డిపార్ట్మెంట్ హెడ్ పి రవికిరణ్వర్మ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఓవర్సీస్ ఎడ్యుకేషన్ సెంటర్ డైరెక్టర్ కె.నాగఆదిత్యవర్మ, బ్రెయిన్ నో విజన్ టీం ఐటీ విభాగం ప్రొఫెసర్ ఐ.హేమలత, కె.కిషోర్రాజు తదితరులు పాల్గొన్నారు. -
పంట కాల్వల్లో వైరస్ కోళ్లు
అత్తిలి: వైరస్ సోకి చనిపోయిన కోళ్లకు అత్తిలి కాలువ నిలయంగా మారింది. బర్డ్ప్లూ వ్యాధితో చనిపోయిన కోళ్లను నిబంధనల ప్రకారం పూడ్చిపెట్టాల్సి ఉండగా కొంతమంది పౌల్ట్రీ రైతులు చనిపోయిన కోళ్లను మూటలు కట్టి పంట కాలువలో పడేస్తున్నారు. ఎగువ ప్రాంతం నుంచి కొట్టుకు వచ్చిన కోళ్ల మూటలు బ్రాంచ్ కాలువల స్లూయిజ్ల వద్ద అడ్డుపడి తీవ్ర దుర్గంధాన్ని వెదజల్లుతున్నాయి. వారం రోజుల క్రితం స్లూయిజ్ల వద్ద పేరుకుపోయిన కోళ్ల మూటలను ఆయా గ్రామాలలో స్థానిక నాయకులు కూలీలతో తొలగించినప్పటికీ, ఎగువ ప్రాంత నుంచి మూటలు కొట్టుకురావడంతో స్లూయిజ్ గేట్ల వద్ద గుట్టలుగా పేరుకుపోయాయి. చనిపోయిన కోళ్లతో పాటు జంతు కళేబరాలు కూడా కొట్టుకురావడంతో స్లూయిజ్ల వద్ద తాగునీరు కలుషితం అవుతోంది. అత్తిలి ప్రధాన కాలువ పరిధిలో రేలంగి చానల్, పాలి చానల్, పాలూరు చానల్, ఉరదాళ్లపాలెం చానల్, మంచిలి చానల్, ఈడూరు చానల్లో వైరస్ సోకి చనిపోయిన కోళ్ల మూటలు దర్శనమిస్తున్నాయి. మండల ప్రజల సాగు, తాగునీటి అవసరాలను తీర్చే అత్తిలి కాలువ కాలుష్య కోరల్లో చిక్కుకుంది. కలుషితమైన నీటిని తాగడం ద్వారా ప్రజలు అనేక రోగాలు బారిన పడే ప్రమాదం ఉంది. ఉన్నతాధికారులు చనిపోయిన కోళ్లను కాలువలో వేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు చేస్తున్నప్పటికీ పౌల్ట్రీ రైతులు పట్టించుకోవడం లేదు. రాత్రి సమయంలో కోళ్ల ఫారాల యజమానులు కాలువలో పడేస్తున్నారు. కాలువను కలుషితం చేస్తున్న వారిపై నిఘా ఉంచి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, అత్తిలి కాలువను కాలుష్యం బారి నుంచి కాపాడాలని ప్రజలు కోరుతున్నారు. అధికారుల హెచ్చరికలు ఖాతరు చేయని పౌల్ట్రీ యజమానులు -
‘చింతలపూడి’ ఎండమావేనా?
చింతలపూడి: ప్రభుత్వ తీరు చూస్తుంటే చింతలపూడి ఎత్తిపోతల పథకం ఇక ఎండమావే అనిపిస్తోంది. జిల్లాలో 2 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించే లక్ష్యంతో ప్రారంభించిన ఈ పథకం 16 ఏళ్ళు కావస్తున్నా కొలిక్కి రాలేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో నాబార్డు నుంచి పథకానికి రూ.1931 కోట్ల రుణం మంజూరైంది. కరోనా మహమ్మారి వల్ల పథకం పనులు ముందుకు సాగలేదు. మొదటి దశ పనులే పూర్తి కాని ఈ పథకానికి 2017లో టీడీపీ ప్రభుత్వ హయాంలో రెండో దశ మంజూరు చేసి భూసేకరణ చేపట్టడంతో అప్పట్లో రైతుల్లో తీవ్ర నిరసన వ్యక్తమైంది. రెండో దశలో కృష్ణా జిల్లాలో మరో 2.80 లక్షల ఎకరాలను చేర్చి ప్రాజెక్టు వ్యయాన్ని రూ.4,909.80 కోట్లకు పెంచారు. ఇందులో మొదటి దశ సామర్థ్యాన్ని పెంచడం వల్ల మరో రూ.808 కోట్లు అదనంగా ఖర్చవుతాయని అంచనా వేశారు. రెండో దశ పనులకు రూ.2,400 కోట్లు అంచనా కట్టారు. మొత్తం 4.80 లక్షల ఎకరాలకు సాగునీరు, తాగునీరు అందే అవకాశం ఉంది. ప్రధాన కాలువ ద్వారా తొలుత 2 వేల క్యూసెక్కుల నీరు పారడానికి వీలుగా 24 మీటర్ల వెడల్పు, 3.2 మీటర్ల లోతు ఉండేలా తవ్వకం పనులు చేపట్టారు. సామర్థ్యం పెరగడంతో మరో మూడు మీటర్ల మేర కాల్వ ఎత్తు పెంచడానికి నిర్ణయించారు. కాల్వ ఎత్తు పెంచితే కాల్వపై కట్టే వంతెనలు, తూములు నీటి ప్రవాహాన్ని తట్టుకునేలా డిజైన్లో మార్పులు చేయాల్సి ఉంటుంది. జల్లేరు వద్ద తొలుత 8 టీఎంసీల సామర్ధ్యం ఉన్న రిజర్వాయర్ను నిర్మించాలని భావించారు. అది 20 టీఎంసీల సామర్ాధ్యనికి పెంచారు. ఇప్పుడు ఈ రిజర్వాయర్ పనులను కూడ ప్రభుత్వం పక్కన పెట్టేసినట్లు సమాచారం. పశ్చిమ రైతుల పట్ల వివక్ష చింతలపూడి ఎత్తిపోతల పథకం భూసేకరణలో అప్పటి ప్రభుత్వం పశ్చిమ గోదావరి జిల్లా రైతుల పట్ల వివక్ష చూపింది. నష్ట పరిహారం పెంచాలని జిల్లాలోని రైతులు అనేక మార్లు ఆందోళనలు చేపట్టారు. వీరి అభ్యర్థనలను పెడచెవిన పెట్టిన ప్రభుత్వం కృష్ణా జిల్లా రైతులకు మాత్రం రెండో దశ పథకానికి ఎకరానికి 19 లక్షలు చెల్లించేలా జీఓ కూడా విడుదల చేయడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. భూసేకరణకు ససేమిరా జిల్లాలో చింతలపూడి ఎత్తిపోతల కాల్వ రైతులు నష్టపరిహారం విషయంలో సంతృప్తిగా లేరు. దీంతో రైతులు భూ సేకరణకు అడ్డు పడుతున్నారు. జిల్లాలోని పట్టిసీమ ప్రధాన కాల్వ కింద టీడీపీ ప్రభుత్వం రైతులకు ఎకరానికి రూ.30 లక్షలు చెల్లించి, చింతలపూడి మండలంలో ఎకరానికి 12.50 లక్షలు ప్రకటించడం, కృష్ణా జిల్లా చాట్రాయి మండలంలోని రైతులకు ఎకరానికి రూ.19 లక్షలు చెల్లిస్తామని ప్రకటించడంతో జిల్లా రైతులు వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలో అన్ని ప్రాంతాలకు ఒకే ప్యాకేజీ అమలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఈ పథకం వల్ల ఎక్కువ ప్రయోజనం కృష్ణా జిల్లాకు కలుగుతుందని ఇక్కడి రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లా అవసరాలు తీరాకే కృష్ణా జిల్లాకు నీరు ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. పట్టించుకోని కూటమి ప్రభుత్వం చింతలపూడి పథకం ప్రారంభించి దాదాపు 16 ఏళ్లు కావస్తుంది. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వచ్చి 8 నెలలు పూర్తి కావస్తోంది. పథకం మాత్రం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా తయారైంది. అధికారంలోకి వస్తే చింతలపూడికి నిధులు కేటాయించి పూర్తి చేస్తామని కూటమి నేతలు చెప్పారు. సప్రస్తుత పరిస్థితి చూస్తుంటే మరో పదేళ్లకై నా పథకం పూర్తవుతుందా అని రైతులు ఆందోళన చెందుతున్నారు. 16 ఏళ్లయినా పూర్తికాని ఎత్తిపోతల పథకం అధికారంలోకి వచ్చి 8 నెలలైనా ఊసే ఎత్తని కూటమి ప్రభుత్వం ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయాలి రైతుల నష్ట పరిహారం సమస్యలను పరిష్కరించి వెంటనే చింతలపూడి ఎత్తిపోతల పథకం పనులు ప్రారంభించాలి. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు గడువులోగా పథకాన్ని పూర్తి చేసి మెట్ట రైతులకు సాగు నీరు, జిల్లా ప్రజలకు తాగునీరు అందచేయాలి. – కంభం విజయరాజు– వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త -
వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజబాబు మృతి
ద్వారకాతిరుమల: మండలంలోని సీహెచ్ పోతేపల్లికి చెందిన వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెలికాని రాజమోహన్రావు(రాజబాబు) శనివారం రాత్రి మృతి చెందారు. ఇటీవల బాత్రూమ్లో కాలుజారి పడిపోవడంతో ఆయన ఎడమ కాలికి తీవ్ర గాయమైంది. కొద్దిరోజుల పాటు లక్ష్మీపురంలోని విర్డ్ ఆస్పత్రిలో చికిత్స పొందిన ఆయన, శస్త్రచికిత్స నిమిత్తం హైదరాబాద్లోని సిటీ న్యూరో ఆస్పత్రిలో చేరారు. అక్కడ వైద్యులు వారం రోజుల క్రితం ఆయన కాలికి శస్త్రచికిత్స చేశారు. ఈ నెల 12న ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అవ్వాల్సి ఉండగా, అదే రోజు ఉదయం 11.30 గంటల సమయంలో ఆయనకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. అప్పటి నుంచి వైద్యులు ఆయనకు వెంటిలేటర్ సాయంతో వైద్యం చేస్తూ వచ్చారు. పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. రాజబాబు మృతి చెందడంతో మండలంలోని పార్టీ శ్రేణులు, ప్రజలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. -
ఆర్థిక ఇబ్బందులు తాళలేక.. వరుస ఆత్మహత్యలు
ఏలూరు టౌన్ : కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల్లోనే జనం అష్టకష్టాలు పడుతున్నారు. ఆర్థిక సమస్యలతో అల్లాడుతున్నారు. ఒక్క ఏలూరు నగరంలో ఇటీవల ఆర్థిక సమస్యలతో పలువురు ఆత్మహత్యలకు పాల్పడడం ఆందో ళనకు గురిచేస్తోంది. ఒకవైపు ఉపాధి కరువై కుటుంబ జీవనం ఇబ్బందిగా మారటం... మరోవైపు చిరు వ్యాపారాలు నడవని దుస్థితిలో తీవ్ర మానసిక వేదనతో బలవంతంగా తనువు చాలించడం ఆందోళన కలిగిస్తోంది. ఆర్థిక ఇబ్బందులతో సతమతం : కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన అనంతరం జనం ఆర్థిక కష్టాలతో సతమతమవుతున్నారు. ఏలూరులో ఇటీవల కాల్మనీ కేసులు సైతం నమోదు కాగా... ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న జనం ఆత్మహత్యలకు పాల్పడుతూ కుటుంబాలను మరింత కష్టాల్లోకి నెట్టేస్తున్నారు. కనీసం ఉపాధి లేకపోవటం, ఉద్యోగాల కల్పన కానరాక, చిరు వ్యాపారాలు సైతం సాఫీగా సాగే పరిస్థితులు లేని దైన్యస్థితి.. గతంలో ఏలూరు నగరంలో సుమారు 78 వేల కుటుంబాలు ఉంటే ఏటా సంక్షేమ పథకాల పేరుతో గత ప్రభుత్వం ప్రజల జీవనానికి భరోసా కల్పించింది. కూటమి సర్కారు హయాంలో 9 నెలలు కావస్తున్నా కనీసం ఎన్నికల హామీలను అమలు చేయకపోవటం, సంక్షేమ పథకాలు రూపంలో ప్రజలకు అండగా ఉండాల్సి ప్రభుత్వం చేతులెత్తేయటంతో జనం తీవ్ర ఆర్థిక కష్టాల్లో కూరుకుపోతున్నారు. అమలుకాని హామీలు కూటమి పాలనలో అష్టకష్టాల్లో ప్రజలు కౌన్సెలింగ్ ఇవ్వాలి ఏదైనా సమస్యతో బాధపడుతున్న వ్యక్తికి ప్రత్యేకంగా కౌన్సెలింగ్ ఇవ్వాలి. కుటుంబ సభ్యులు వారి ప్రవర్తనను గమనిస్తూ వారిని మానసిక వైద్య నిపుణులు వద్దకు తీసుకువెళ్ళి కౌన్సెలింగ్ ఇవ్వడం లేదా వారితో ప్రేమగా మాట్లాడుతూ సమస్యను తెలుసుకునే ప్రయత్నం చేయాలి. భావోద్వేగాలను నియంత్రించుకునేలా వారి ఆలో చనల్లో మార్పు తెచ్చేందుకు ప్రయత్నించాలి. ఏలూరు జీజీహెచ్లో ప్రత్యేకంగా మానసిక వైద్య విభాగం ఉంది. కౌన్సెలింగ్ ఇస్తూ వారిలో మనోధైర్యాన్ని నింపేలా కుటుంబం సహకరించాలి. – డాక్టర్ సీహెచ్ వంశీకృష్ణ, మానసిక వైద్య విభాగం హెచ్వోడీ, ఏలూరు జీజీహెచ్ -
ఎన్నికల కోడ్ అమలు ఇంకెప్పుడు?
పాలకొల్లు అర్బన్: ఎన్నికల నియమావళిని అధికారులు పాటించడం లేదు. ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక ఈ నెల 27న జరగనుంది. దీనికి సంబంధించి కోడ్ అమలులో ఉంది. జిల్లా కలెక్టర్ అన్ని శాఖల అధికారులకు కోడ్ అమలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే పాలకొల్లు మండలంలో అధికార తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఫ్లెక్సీలకు తొలగించడానికి వేయడానికి అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. మొక్కుబడిగా కొన్నింటిని తొలగించి మిగిలిన వాటిని వదిలేశారు. పాలకొల్లు మండలం బల్లిపాడులో మంత్రి నిమ్మల రామానాయుడు ఫ్లెక్సీ, అలాగే దగ్గులూరులో గవరపేట వెళ్లేరోడ్డులో విద్యుత్ స్తంభానికి మంత్రి రామానాయుడు ఫ్లెక్సీకి ముసుగులు వేయలేదు. ప్రతిరోజూ అధికారులు అటు వైపుగా ప్రయాణిస్తున్నారు. అయితే వారికి ఈ ఫ్లెక్సీలు కనిపించకపోవడం విశేషం మంత్రి రామానాయుడు ఫ్లెక్సీలు తొలగించడానికి అధికారులు భయపడుతున్నారంటూ పలువురు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. -
నెట్బాల్ పోటీలకు జిల్లా జట్ల ఎంపిక
పాలకోడేరు: ఈ నెల 16 17 తేదీల్లో తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలోని డాన్బాస్కో హై స్కూల్ క్రీడా ప్రాంగణంలో జరగనున్న 10 వ జూనియర్ అండర్–19 బాల బాలికల రాష్ట్ర స్థాయి నెట్బాల్ పోటీలకు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా జట్టు పాల్గొననుందని నెట్బాల్ కార్యదర్శి ఎన్.విజయలక్ష్మీ తెలిపారు. క్రీడాకారులు బాగా రాణించి జిల్లాకు పేరు తేవాలని జిల్లా నెట్ బాల్ సంఘ సభ్యులు పి.దావూద్ ఖాన్, వి.వినీత్ జోసఫ్ కుమార్, జీఎన్వీఎస్ విజయ్ కుమార్, రామకృష్ణ, సుధీర్ ఆకాంక్షించారు. ● అండర్ 19 బాలుర జట్టు: ఎం.ఎర్నెస్ట్ (కెప్టెన్), డి.ఫణింద్ర కుమార్ (వైస్ కెప్టెన్), టి.దుర్గాప్రసాద్, పి.మిన్ను, కె.లోకేష్, బి.రమేష్, టి.కేశవ మణికంఠ, జి.త్రినాథ్, కే.దుర్గా గణేష్, ఎం.సంతోష్, టి.ఎలీషా, బి.యశ్వంత్ హరి వినయ్, స్టాండ్ బై జి.సురేష్ కోచ్ పూడి శ్రీనివాస్ అండర్ 19 బాలికల జట్టు: కె.అక్షయ (కెప్టెన్), కె.మానస (వైస్ కెప్టెన్), కె.గుణ వర్షిత, ఏ.పోషిత, డి.జోష్నా నాగసాయి, టి.ఉమ భవాని, కె.శ్రీదేవి, వి.రమ్యశ్రీ, ఐ.లావణ్య, ఎస్.మీనాక్షి, కే.భారతి, ఇ.లిఖిత, స్టాండ్ బై టి.మహా లక్ష్మి, కోచ్ డి నవ్య శ్రీ -
మహాశివరాత్రి ఏర్పాట్ల పరిశీలన
పోలవరం రూరల్: మహాశివరాత్రి ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని తహసీల్దార్ ఆర్ఎస్ రాజు సూచించారు. పోలవరం మండలం పట్టిసం రేవులో జరుగుతున్న ఉత్సవ ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. కాలినడకన వెళ్లే మార్గంలో పంట్లు, ర్యాంపులు ఏర్పాటు చేసే ప్రదేశాన్ని పరిశీలించి, ఫెర్రీ కాంట్రాక్టర్కు పలు సూచనలు చేశారు. ఇసుక తిన్నెలపై జరిగే ఏర్పాట్లను కూడా ఆయన పరిశీలించారు. దేవస్థానం వద్ద చేస్తున్న ఏర్పాట్లపై ఈవో చాగంటి సురేష్ నాయుడిని నుంచి తెలుసుకున్నారు. -
రైలు ప్రమాదంలో వ్యక్తి మృతి
ఏలూరు టౌన్: దెందులూరు ప్రాంతంలో ఒక వ్యక్తి రైలు ప్రమాదంలో మృతి చెందాడు. శనివారం దెందులూరు రైల్వేస్టేషన్ సమీపంలో గుర్తు తెలియని రైలు ఢీకొని ఒక వ్యక్తి మరణించాడు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు సంఘటనా స్ధలానికి వెళ్ళి పరిశీలించారు. మృతుడు గుంటూరు జిల్లా చేబ్రోలు గ్రామానికి చెందిన చల్లంచర్ల మారయ్య (42)గా గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు ఆసుపత్రి మార్చురీకి తరలించారు. బంధువులకు సమాచారం అందించామని రైల్వే ఎస్సై సైమన్ తెలిపారు. 11 మంది జూదరుల అరెస్ట్ ఏలూరు టౌన్: ఏలూరు త్రీటౌన్, రూరల్ పోలీస్స్టేషన్ పరిధిలో రెండు చోట్ల పోలీసులు పేకాట శిబిరాలపై దాడులు నిర్వహించి జూదరులను అరెస్టు చేశారు. దొండపాడు గ్రామంలో శుక్రవారం రాత్రి పేకాట నిర్వహిస్తున్నారని సమాచారంతో త్రీటౌన్ సీఐ కోటేశ్వరరావు ఆధ్వర్యంలో దాడులు చేసి 11 మందిని అరెస్టు చేశారు. వారి నుంచి రూ.65 వేల నగదు, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. శనివారం రాత్రి చాటపర్రు ప్రాంతంలో రూరల్ పోలీసులు పేకాట శిబిరంపై దాడి చేశారు. ఐదుగురు పేకాటరాయుళ్లను అరెస్టు చేసి వారి నుంచి రూ.2,350 నగదును స్వాధీనం చేసుకున్నారు. -
ఎమ్మెల్సీ ఎన్నికలను సమర్థంగా నిర్వహించాలి
ఏలూరు(మెట్రో): తూర్పు, పశ్చిమగోదావరి జిల్లా పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలను సమర్థవంతంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వ హించాలని ఎన్నికల రిటర్నింగ్ అధికారి, ఏలూరు కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో ఎన్నికల ఏర్పాట్లపై జేసీ పి.ధాత్రిరెడ్డి, సహాయ ఎన్నికల రిటర్నింగ్ అధికారి వి.విశ్వేశ్వరరావుతో కలిసి ఆమె సమీక్షించారు. ఈనెల 27న పోలింగ్ రోజు అనుసరించాల్సిన విధానం, వెబ్ కాస్టింగ్, బ్యాలెట్ బాక్సుల తరలింపు, రిసెప్షన్ సెంటర్లు, రూట్ అధికారులు, పోలీస్ బందోబస్తు, డిస్ట్రిబ్యూషన్ సెంటర్లు, బ్యాలెట్ పేపర్లు, ఎంసీసీ, ఎంసీఎంసీ, పోస్టల్ బ్యాలెట్లు వంటి అంశాలపై చర్చించారు. ఆరు జిల్లాల పరిధిలో జరిగే ఎన్నికల్లో 35 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారన్నారు. ఏలూరు జిల్లాలో 87 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశా మన్నారు. ఈనెల 26న ఉదయం నుంచి పోలింగ్ సామగ్రి సరఫరా ప్రారంభమవుతుందన్నారు. గుంటూరు, కృష్ణా జిల్లా పట్టభద్రులకు సంబంధించి నూజివీడు సబ్ కలెక్టర్ కార్యాలయం నుంచి పోలింగ్ సామాగ్రి డిస్ట్రిబ్యూషన్ చేపట్టాలన్నారు. రెండో విడత శిక్షణ కార్యక్రమాన్ని ఈనెల 22న నిర్వహించాలని ఆదేశించారు. మార్చి 3న జరిగే కౌంటింగ్ ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్షించారు.