breaking news
West Godavari
-
ఎకై ్సజ్ స్టేషన్ పరిశీలన
నూజివీడు: పట్టణంలోని ఎకై ్సజ్ స్టేషన్ను ఏలూరు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ బీ శ్రీలత, ఏలూరు జిల్లా అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ కేవీ నాగ ప్రభుకుమార్ సోమవారం సందర్శించి రికార్డులను పరిశీలించారు. గతంలో ఐడీ మద్యం కేసుల్లో నిందితులైన వారందరిపై సెక్షన్ 129 బీఎన్ఎస్ఎస్ కింద కేసులు నమోదు చేయాలని, పరారీలో ఉన్న నిందితులను అరెస్ట్ చేయాలని ఆదేశించారు. పునరావాస చర్యలతో పాటు వారి కార్యకలాపాలను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించే వ్యక్తులపై నిరంతర తనిఖీలు నిర్వహిస్తూ కేసులు నమోదు చేయాలన్నారు. ఎకై ్సజ్ సీఐ ఏ మస్తానయ్య పాల్గొన్నారు. భీమవరం: పట్టణంలోని గునుపూడిలో ప్రభుత్వ అనుమతులు లేకుండా తరగతులు నిర్వహిస్తున్న నారాయణ స్కూల్ను అధికారులు సోమవారం సీజ్ చేశారు. స్కూల్ భవన నిర్మాణం పనులు జరుగుతుండగానే విద్యార్థులకు తరగతులు నిర్వహించడంతోపాటు పుస్తకాలు, విద్యాసామాగ్రి అమ్మకాలు చేస్తుండడంపై ఎస్ఎఫ్ఐ నాయకులు గత వారం ఆందోళన చేపట్టగా డీవైఈవో రమేష్ స్కూల్ను సందర్శించి సీజ్ చేశారు. తిరిగి మళ్లీ తరగతులు నిర్వహిస్తుండడంపై ఎస్ఎఫ్ఐ నాయకులు అధికారులు దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో ఎంఈవో శ్రీనివాస్ నారాయణ స్కూల్ను సందర్శించి సీజ్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యహరిస్తే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ భీమవరం పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు పి.సాయికృష్ణ, ఎస్.లక్ష్మణ్, సభ్యులు బి సింధు, పి త్రినాథ్, జి కౌశిక్, జి అభి తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం: మండలంలోని తిరుమలాపురం పంచాయతీ వీరన్నగూడెం గ్రామానికి చెందిన రాజనాల దుర్గ (75) హత్యకు గురైనట్లు కేసు నమోదు చేశామని ఎస్సై ఎన్వీ ప్రసాద్ తెలిపారు. రాజనాల గౌరయ్య ఈ హత్యకు పాల్పడినట్లు హతురాలి కొడుకు రాజనాల దండియ్య సోమవారం ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశామన్నారు. రాజనాల గౌరయ్య ఒక హత్య కేసులో జైలు శిక్ష అనుభవించి, ఇటీవలే విడుదలై వచ్చినట్లు తెలిపారు. గ్రామంలో రాజనాల దుర్గ, కుటుంబసభ్యులతో సహా గౌరయ్య కూడా ఉపాధి పనులకు వెళుత్నుట్లు చెప్పారు. అయితే గౌరయ్య ప్రతి రోజు మద్యం చేవించి రావడంతో దుర్గ మందలించేదన్నారు. దీంతో కక్ష పెట్టుకున్న గౌరయ్య ఈ నెల 13వ తేదీ మధ్యాహ్న సమయంలో దుర్గ నిద్రిస్తుండగా, గొంతు నొక్కి హత్య చేసినట్లు తెలిపారు. అయితే వడదెబ్బ తగిలి దుర్గ మృతిచెందినట్లు భావించిన కుటుంబసభ్యులు, అదే రోజు ఆమె మృతదేహాన్ని దహనం చేసి అంత్యక్రియలు నిర్వహించారన్నారు. అయితే ఈ నెల 21న అనుమానంతో దుర్గ కొడుకు దండియ్య, కుటుంబసభ్యులు, గ్రామ పెద్దలు గౌరయ్యను నిలదీయగా, దుర్గ తనను తిడుతుందని కక్ష పెంచుకుని హత్య చేసినటు ఒప్పుకుని, అక్కడ నుంచి పరారైనట్లు తెలిపారు. కాగా, గౌరయ్య దండియ్యకు బాబాయ్ కొడుకు అవుతాడు. అలాగే హతురాలు దుర్గ పెద్దమ్మ అవుతుంది. -
విద్యార్థి మిత్ర ఎక్కడ..?
పాఠశాలలు పునఃప్రారంభమై పది రోజులు దాటినా విద్యార్థులకు టెస్ట్బుక్స్, నోటుపుస్తకాలు తప్ప విద్యార్థి మిత్రలో ఇప్పటివరకు ఏమి అందలేదు. గతేడాది ఇచ్చిన యూనిఫామ్, చినిగిన బ్యాగులతోనే పాఠశాలలకు వస్తున్నారు. కొందరు విద్యార్థులకై తే కాళ్లకు చెప్పులు లేకుండానే హాజరవుతున్నారు. ఎక్కువ మంది విద్యార్థులు మార్కెట్లో కొనుగోలు చేసిన బ్యాగులను తీసుకువస్తున్నారు. ప్రభుత్వం చెప్పే మాటలు గొప్పగా ఉన్నా.. ఆచరణలో మాత్రం శూన్యం అనడానికి ఈ చిత్రాలే ఉదాహరణ. దెందులూరు మండలం కొవ్వలి జడ్పీహైస్కూల్లో విద్యార్థుల ఇబ్బందులు ఇవి. –సాక్షి ఫొటోగ్రాఫర్/ ఏలూరు -
32 బ్యాంకులు.. 262 సొసైటీలు
ఉమ్మడి పశ్చిమలో 32 సహకార కేంద్ర బ్యాంకుల పరిధిలో 262 సహకార పరపతి సంఘాలు ఉన్నాయి. దాదాపుగా 90 శాతానికిపైగా సొసైటీల్లో కూటమి నేతలే చైర్మన్లుగా ఉన్నారు. అలాగే ప్రతి సొసైటీకి సీఈఓ సహకార శాఖ పరిధిలో పనిచేస్తుంటారు. రైతులకు రుణాలు ఇవ్వడం, ఎరువులు విక్రయించడం ప్రధాన విధిగా సంఘాలు పనిచేస్తుంటాయి. అలాగే సహకార శాఖ షేర్ క్యాపిటల్కు అనుగుణంగా, ఎరువుల విక్రయా ల్లోని లాభాలతో సొసైటీల పేరిట కొన్ని వ్యాపారాలు సైతం నిర్వహిస్తుంటారు. కొందరు ఉద్యోగులు వ్యక్తిగత అవసరాలకు కోట్లాది రూపా యలు వాడుకోవడం జిల్లాలో నిత్యకృత్యంగా మారింది. ఎరువుల విక్రయాలు, రుణాల మంజూరులో అవకతవకలు, రైతులు చెల్లించిన రు ణాలు బ్యాంకు ఖాతాల్లో చూపకపోవడం వంటి అక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. -
బావిలో పూడిక తీస్తూ దుర్మరణం
పోలవరం రూరల్: జీవనోపాధి కోసం పనికి వెళ్లిన ఇద్దరు కూలీలను కాలకూట విషవాయువు బలితీసుకున్న ఘోర విపత్తు ఏలూరు జిల్లా పోలవరం మండలం పోలవరం పంచాయతీ పరిధిలోని నూతనగూడెంలో చోటు చేసుకుంది. బావిలో పూడికతీసేందుకు దిగిన ఓ కూలీ ఊపిరాడక ఇబ్బంది పడుతుండగా, అతనిని కాపాడేందుకు దిగిన మరో సహచర కూలీ కూడా ప్రమాదవశాత్తు బావిలో పడి ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందడం స్థానికులను తీవ్రంగా కలచివేసింది. ఘటన వివరాలు ఇలా.. స్థానిక పోలీసులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. పోలవరం బీసీ కాలనీకి చెందిన కదల చిట్టబ్బాయి రెడ్డి అలియాస్ చిట్టిబాబు (35), బండి వీర వెంకట్రావు (56), గుడిసె రాజు అనే ముగ్గురు కూలీలు సోమవారం ఉదయం సుమారు 9 గంటల సమయంలో నూతనగూడెం కనకదుర్గమ్మ గుడి ఎదురుగా ఉన్న బండి మునేశ్వరరావు ఇంటి ఆవరణలోని బావిలో పూడిక తీసేందుకు పని కుదుర్చుకున్నారు. పని ప్రారంభించిన అనంతరం చిట్టబ్బాయి రెడ్డి (చిట్టిబాబు)(35) మొదటగా బావిలోకి దిగాడు. అయితే బావి లోపల తగినంత ఆక్సిజన్ లేకపోవడం లేదా లోపల పేరుకుపోయిన విషవాయువుల ప్రభావం వల్ల అతనికి ఒక్కసారిగా ఊపిరి ఆడలేదు. దీంతో శ్వాస తీసుకోవడానికి తీవ్రంగా ఇబ్బంది పడుతూ పైకి రాలేక బావిలోనే ఉండిపోయాడు. రక్షించబోయి.. రాలేకపోయి.. చిట్టిబాబు ప్రాణాపాయంలో ఉన్నాడని గమనించిన బండి వీర వెంకట్రావు (56) క్షణం కూడా ఆలోచించలేదు. ఎలాగైనా తన సహచరుడిని కాపాడుకోవాలనే తాపత్రయంతో స్థానికుల సహాయంతో నడుముకు తాడు కట్టుకుని బావిలోకి దిగాడు. లోపల స్పృహ తప్పుతున్న చిట్టిబాబును పట్టుకుని పైకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తుండగా, దురదృష్టవశాత్తు తాడుకు వేసిన ముడి ఊడిపోయింది. దీంతో ఇద్దరూ తిరిగి బావిలో పడిపోయారు. లోపల ఊపిరాడకపోవడం, అలాగే బావిలోని నీటిలో మునిగిపోవడంతో ఇద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు. మృతదేహాల వెలికితీత ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే పోలవరం సీఐ బి.కృష్ణకుమార్, ఎస్సై పి.అప్పారావు తన సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. తక్షణమే 108 అంబులెన్స్ సిబ్బందికి, కొవ్వూరు అగ్నిమాపక శాఖ రెస్క్యూ బృందానికి సమాచారం అందించారు. రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు స్థానికుల సహాయంతో శ్రమించి బావిలో నుంచి ఇద్దరి మృతదేహాలను బయటకు వెలికితీశారు. కళ్లెదుటే ఇద్దరు వ్యక్తులు శవాలుగా మారడంతో కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలతో ఆ ప్రాంతమంతా మిన్నంటింది. కాగా, మృతుడు కదల చిట్టబ్బాయి రెడ్డి భార్య ముత్యాలమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా పోలవరం పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఊపిరాడక ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు కూలీలు పోలవరం పంచాయతీ నూతనగూడెంలో విషాదం శోకసంద్రంలో కూలీల కుటుంబాలు -
అక్రమాల్లో సహకారం
నూజివీడు: రాజీవ్గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం స్నాతకోత్సవాన్ని ఈనెల 27న నిర్వహించనున్నట్టు వైస్ చాన్సలర్ ఆచార్య మద్దాలి లక్ష్మీనారాయణరావు తెలిపారు. నూజివీడు ట్రిపుల్ఐటీలో ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే స్నాతకోత్సవంలో ముఖ్య అతిథులుగా నీతి ఆయోగ్ సభ్యుడు ఆచార్య గోవర్ధన్దాస్, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ హాజరవుతారన్నారు. సాక్షి ప్రతినిధి, ఏలూరు: జిల్లా సహకార శాఖలో అవినీతి హద్దులు దాటుతోంది. సొసైటీ ఆదాయ వ్యయాలతో సంబంధం లేకుండా కోట్లాది రూపాయలు గోల్మాల్ చేయడం, పక్కదారి పట్టించడం వంటి వ్యవహారాలపై విచారణ జరిగినా చర్యలు మాత్రం ఏళ్ల తరబడి పెండింగ్లో ఉంటున్నాయి. పదుల సంఖ్యలో సొసైటీల్లో భారీగా అవకతవకలు గుర్తించి కోట్లాది రూపాయలను కొందరు అధికారులు వ్యక్తిగత అవసరాలకు వాడుకున్నా చర్యలు తీసుకోకపోవడం అవినీతికి పరాకాష్టగా నిలుస్తోంది. రంగాపురం, టి.నర్సాపురం సొసైటీల్లో అవకతవకలను గుర్తించి చర్యలకు సిఫార్సులు చేసినా నెలల తరబడి పెండింగ్లోనే ఉన్న పరిస్థితి. రూ.కోట్లు నొక్కేసినా.. లింగపాలెం మండలంలోని రంగాపురం సొసైటీలో రుణాలను రైతులు తిరిగి చెల్లించినా కార్యదర్శి వ్యక్తిగతంగా వినియోగించుకోవడంతో పాటు ఎరువుల లోన్లలోనూ అక్రమాలకు పాల్పడ్డారు. సొసైటీ కా ర్యదర్శి సీహెచ్ ప్రసాద్, పాలకవర్గ అధ్యక్షుడు రూ.2,06,16,302 దుర్వినియోగానికి పాల్పడినట్టు గుర్తించి విచారణ అధికారులు కార్యదర్శిని సస్పెండ్ చేశారు. ఇదే వ్యవహారంలో చింతలపూడి బ్రాంచ్ మేనేజర్లు టి.చంద్రశేఖర్, జి.మారేశ్వరరావు, అసిస్టెంట్ మేనేజర్ ఎస్వీ శ్రీనివాసరావు, ఇతర ఫీల్డ్సాఫ్ట్ ప్రమేయం ఉందని విచారణ అధికారి ఏడు నెలల క్రితం నివేదిక సమర్పించినా ఇప్పటికీ చర్యలు తీసుకోలేదు. అలాగే ఇక్కడ ఎరువుల విక్రయాల్లో రూ.41.85 లక్షలు, రుణాల్లో రూ.15.65 లక్షల అవకతవకలు జరగ్గా రూ.14.53 లక్షలు రికవరీ, చెల్లించిన రూ.59.94 లక్షల రుణాలను క్యాష్ రూపంలో చూపించకపోవడం, షేర్ క్యాపిటల్ కంటే క్యాష్ బ్యాలెన్స్ ఎక్కువగా చూపడం వంటివి చేశారు. ఈ కోణంలో విచారణ అధికారిగా ఉన్న డిప్యూటీ రిజిస్ట్రార్ డీసీఓకు నివేదిక ఇచ్చి క్రిమినల్ చర్యలకు సిఫార్సులు చేసినా జిల్లా సహకార శాఖ అధికారి ఫైల్ను పెండింగ్లో పెట్టేశారు. రుణాలు జమచేయరు.. డాక్యుమెంట్లు ఇవ్వరు అలాగే టి.నర్సాపురం సొసైటీలో అప్పటి మేనే జర్లు, కుటుంబసభ్యుల పేరుతో రుణాలు తీసుకున్నట్టు విచారణలో నిర్ధారించినా చర్యలు మాత్రం తీసుకోలేదు. ఈ వ్యవహారం కూడా సహకార శాఖ అధికారి వద్దే పెండింగ్లో ఉంది. ఇలా పలు రిపోర్టులు భారీ వ్యవహారాలతో పెండింగ్లో ఉంటా యనేది శాఖాపరమైన టాక్. తాజాగా జంగారెడ్డిగూడేనికి చెందిన ఓ రైతు సొసైటీలో చెల్లించిన రుణాన్ని కార్యదర్శి వ్యక్తిగతంగా వాడుకోవడంతో పాటు డాక్యుమెంట్లు ఇవ్వకుండా ఇబ్బందులు పె డుతున్నారు. దీంతో బాధిత రైతు కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేయగా జాయింట్ కలెక్టర్ను విచారణ అధికారిగా నియమించారు. సహకార శాఖ ఉన్నతాధికారుల ప్రమేయంతో రూ.లక్షల నగదు చేతులు మారిందనే ఆరోపణలతో విచారణ కొనసాగుతుంది. ఏఐ సృష్టించిన చిత్రం హద్దుల్లేని అవినీతి సొసైటీల్లో స్వాహాపర్వం రంగాపురం, టి.నర్సాపురం, జంగారెడ్డిగూడెంలో అవకతవకలు క్రిమినల్ చర్యలు, రికవరీలు శూన్యం జిల్లా అధికారి వద్దే పెండింగ్లో ఫైళ్లు రైతు ఫిర్యాదు మేరకు జేసీ విచారణ -
అర్జీలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి
భీమవరం (ప్రకాశంచౌక్): ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులు, వినతులను సకాలంలో పరిష్కరించి పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారంలో జాప్యానికి తావులేకుండా చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ టి.రాహుల్కుమార్రెడ్డి సూచించారు. భీమవరం కలెక్టరేట్లో సోమవారం జిల్లాస్థాయి అధికారులు, తహసీల్దార్లతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో పీజీఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కార ప్రగతి, ఐగాట్ కర్మయోగి కోర్సుల అమలుపై సమీక్షించారు. ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి, సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా చర్యలు చేపట్టాలన్నారు. ఏప్రిల్, మే నెలలకు సంబంధించిన పీజీఆర్ఎస్ దరఖాస్తులపై శాఖల వారీగా ఆడిట్ నివేదికలను సమర్పించాలని ఆదేశించారు. ఐగాట్ కర్మ యోగి కార్యక్రమంపై సమీక్షిస్తూ ప్రభుత్వ ఉద్యోగులంతా వంద శాతం నమోదు చేసుకోవాలని సూ చించారు. డీఆర్వో బి.శివన్నారాయణ రెడ్డి, పీజీఆర్ఎస్ నోడల్ అధికారి వై.దోసిరెడ్డి, డ్వామా పీడీ కేసీహెచ్ అప్పారావు, కలెక్టరేట్ పరిపాలనాధికారి ఎన్.వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. పారిశుధ్య నిర్వహణపై.. పట్టణ ప్రాంతాల్లో పర్యావరణ పరిరక్షణ, ప్రజారోగ్య సంరక్షణ, భూ గర్భ జలాల కాలుష్య నివారణకు సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్, ఫీకల్ స్లడ్జ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ ఏ ర్పాటుకు అవసరమైన స్థలాలను త్వరితగతిన సే కరించి పనులు ప్రారంభించాలని జేసీ ఆదేశించా రు. కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన అధికారులతో సమీక్షించారు. -
పెద్దింట్లమ్మను దర్శించి వస్తూ...
● చెట్టును ఢీకొన్న కారు ● ఒకరి మృతి.. ఐదుగురికి గాయాలుఉంగుటూరు: చేబ్రోలు పరిధిలో ఆదివారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల సమాచారం ప్రకారం.. గణపవరానికి చెందిన ఫణీంద్ర (26)తో పాటు నిడమర్రు గ్రామానికి చెందిన వేగిరెడ్డి షణ్ముఖ తేజ, వేగిరెడ్డి హేమంత్ ఫణిచంద్ర, కట్టుబోయిన వెంకన్న, ప్రవీణ్, మంగరాజు కారులో కై కలూరు మండలం కొల్లేటికోట పెద్దింట్లమ్మ అమ్మవారి దర్శనానికి వెళ్లారు. దర్శనం ముగించుకుని తిరిగి స్తుండగా, చేబ్రోలు ఆంజనేయస్వామి గుడి సమీపంలో కారు అదుపు తప్పి రహదారి పక్కనే ఉన్న చెట్టును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న ఫణీంద్ర తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. కారులో ఉన్న మిగిలిన ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే జాతీయ రహదారి అంబులెన్స్, 108 వాహనాల ద్వారా క్షతగాత్రులను తాడేపల్లిగూడెం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. చేబ్రోలు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపులో జాప్యం
నూజివీడు: కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపులో ప్రభుత్వం చేస్తున్న తీవ్ర జాప్యం కారణంగా కాంట్రాక్టర్లు తీవ్ర మానసిక వేదనకు గురై బలవన్మరణాలకు పాల్పడే ప్రమాదం కూడా పొంచి ఉందని నవ్యాంధ్ర కాంట్రాక్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర జనరల్ సెక్రెటరీ కోనేరు శ్రీనివాస ప్రసాద్ అన్నారు. నూజివీడులో గుండెపోటుతో మృతి చెందిన కాంట్రాక్టర్ చలసాని సురేష్కుమార్(నాని) కుటుంబ సభ్యులను సోమవారం అసోసియేషన్ నాయకులు పరామర్శించారు. అనంతరం వారు మాట్లాడుతూ గత రెండేళ్లుగా చేసిన పనులకు బిల్లులు చెల్లించకపోవడం వల్ల కాంట్రాక్టర్లందరూ తీవ్రమైన ఆర్థిక, మానసిక ఒత్తిడికి గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలోని అర్డబ్ల్యూఎస్ కాంట్రాక్టర్లు టైం బాంబుల్లా బతుకుతున్నారని, ప్రత్యక్షంగా 750 మంది కాంట్రాక్టర్లు, వారిపై ఆధారపడిన 15వేల మందికి చెందిన కుటుంబాలు తీవ్ర ఒత్తిడిలో ఉన్నాయన్నారు. గత రెండేళ్లుగా జలజీవన్ మిషన్ బిల్లులు చెల్లించకపోవడం వల్ల కాంట్రాక్టర్ల ఆత్మస్థైర్యం పూర్తిగా దెబ్బతిందని, వ్యవస్థపై దాదాపు నమ్మకాన్ని కూడా కోల్పోయామన్నారు. గతంలో ప్రభుత్వ కాంట్రాక్టర్ల పరిస్థితి చూస్తే ప్రభుత్వం నిధులు విడుదల చేసినప్పుడల్లా చెల్లింపులు జరుగుతాయనే భరోసా ఉండేదన్నారు. వ్యవస్థను కార్పొరేట్లకు అనుకూలంగా మార్చి కాంట్రాక్టర్ల వెన్ను విరిచేస్తున్నారన్నారు. రుణాల చెల్లింపుపై ఒత్తిడి పెరగడంతో కాంట్రాక్టర్లు బలవన్మరణాలకు పాల్పడే ప్రమాదం పొంచి ఉందన్నారు. మరోవైపు తీవ్ర ఒత్తిడికి గురై చలసాని సురేష్ గుండెపోటుతో ఆసుపత్రి కి తీసుకువెళ్లే సమయం కూడా లేకుండా మృతి చెందడం బాధాకరమన్నారు. ఈ నేపథ్యంలో మృతి చెందిన కాంట్రాక్టర్ కుటుంబానికి రావాలసిన బిల్లులను తక్షణం చెల్లించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని, తమ అసోసియేషన్ సైతం వారికి అండగా నిలుస్తుందన్నారు. ఈ సమావేశంలో సెక్రటరీ ఎన్వీఆర్కే రాజు, కోశాధికారి కే బాలకృష్ణ, సంయుక్త కార్యదర్శి ఏ నరసింహా, స్థానిక కాంట్రాక్టర్లు పాల్గొన్నారు. -
ఆదారం తెగుతోంది
అత్తిలి మండలం శివపురం చేనేతకు ప్రసిద్ధి. గ్రామంలో 200కు పైగా కుటుంబాలు ఉంటే అధికంగా చేనేత కుటుంబాలే. గ్రామంలో 140 వరకు కుటుంబాలు మగ్గం నేస్తుంటే గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అర్హత కలిగిన సుమారు 120 కుటుంబాలకు నేతన్న నేస్తం లబ్ధి చేకూరింది. అదనంగా అమ్మఒడి, చేయూత, పింఛన్ తదితర పథకాల ప్రయోజనం అందింది. కూటమి ప్రభుత్వ హయాంలో చేనేతకు తోడ్పాటు లేక, సంక్షేమం కానరాక నేత కార్మికులు ఇతర పనుల్లోకి వెళ్లిపోతుండటంతో మగ్గాలు మూలకు చేరుతున్నాయి. కలెక్టరేట్ వద్ద నేతన్నల నిరసన మంగళవారం శ్రీ 23 శ్రీ జూన్ శ్రీ 2026ప్రభుత్వ చేనేత వ్యతిరేక విధానాలతో పరిశ్రమ తీవ్ర సంక్షోభంలో ఉంది. కేంద్ర బడ్జెట్లో చేనేత కార్మికులకు ఉపాధి కల్పించడానికి రూ.25 వేల కోట్లు, రాష్ట్ర బడ్జెట్లో రూ.2 వేల కోట్లు కేటాయించాలి. ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు చేసి చేనేత రంగాన్ని ఆదుకోవాలి. –బళ్ల చినవీరభధ్రరావు, ఏపీ చేనేత కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ఏడాదికి రూ.25 వేలు, 50 ఏళ్లకే పింఛన్ తదితర ఎన్నికల హామీలను కూటమి ప్రభుత్వం అమలుచేయాలి. దివంగత వైఎస్ చేనేతను అన్ని విధాలా ఆదుకున్నారు. ఆయన తనయుడు మాజీ సీఎం జగన్ నేతన్న నేస్తం, ఇతర సంక్షేమ పథకాలతో నేత కార్మికులు అండగా ఉన్నారు. – వీరా మల్లికార్జునుడు, వైఎస్సార్సీపీ చేనేత విభాగం జిల్లా అధ్యక్షుడు సాక్షి, భీమవరం: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో పది వేలకు పైగా చేనేత కుటుంబాలు ఉన్నాయి. పాలకొల్లు, అత్తిలి, యలమంచిలి, పెంటపాడు, పోడూరు, ఆచంట మండలాల్లో నేత కార్మికులు అధికంగా ఉన్నారు. దివంగత సీఎం వైఎస్ హయాంలో చేనేత రంగం ఒక వెలుగు వెలిగింది. 50 ఏళ్లకే పింఛన్, రుణమాఫీ, ఆర్టిజన్ క్రెడిట్ కార్డుల ద్వారా పావలా వడ్డీ రుణాలు, చిలప నూలుపై పది శాతం సబ్సిడీ, ఉచిత వైద్య శిబిరాలు, ఇళ్ల నిర్మాణం తదితర ఎన్నో కార్యక్రమాల ద్వారా చేనేతను ఆదుకున్నారు. నేతన్నలకు అండగా మాజీ సీఎం జగన్ తండ్రిని మించిన తనయునిగా నేతన్నలకు అండగా నిలిచారు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి. సొంత మగ్గం ఉన్న వారికి వైఎస్సార్ నేతన్న నేస్తంగా ఏటా రూ.24 వేలు సాయం అందించారు. ఐదేళ్లలో ఉమ్మడి జిల్లాలో సరాసరి 1,063 కుటుంబాలకు రూ.12.76 కోట్ల లబ్ధి చేకూరింది. దీనికితోడు అమ్మఒడి, చేయూత, పింఛన్, వాహనమిత్ర, ఆరోగ్య శ్రీ వైద్యం తదితర పథకాల ద్వారా ఒక్కో కుటుంబానికి లక్షలాది రూపాయల ప్రభుత్వ సాయం అందింది. కూటమి పాలనలో హామీలు గాలికి.. చీర–ధోవతి పథకాన్ని పునరుద్ధరిస్తానని, చేనేత ఉత్పత్తులపై 30 శాతం రిబేటు ఇస్తానని 2014 ఎన్నికల్లో చెప్పిన చంద్రబాబు తర్వాత ఆ ఊసే ఎత్తలేదు. 2024 ఎన్నికల్లో కార్మికులకు ఏటా రూ.25 వేలు, 50 ఏళ్లకే పింఛనంటూ ఊదరగొట్టారు. రెండేళ్లుగా ప్రోత్సాహం కరువై చేనేత కుటుంబాలకు పూటగడవడం కష్టంగా మారింది. బతుకుదెరువు కోసం మగ్గాలకు స్వస్తి చెబుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. చాలామంది కార్మికులు నేత పని వీడి వేరే పనుల్లోకి వెళ్లిపోతున్నారు. నేత మగ్గాలకు 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, జీఎస్టీ మినహాయింపు వంటివి కంటితుడుపు చర్యలుగా కార్మికులు కొట్టిపారేస్తున్నారు. వినతిపత్రం ఇచ్చిన వైఎస్సార్టీయూసీ నాయకులు కొరుటూరు ప్రాంతానికి వెళుతున్న అటవీ శాఖ సిబ్బంది ఆదాయాన్ని లెక్కిస్తున్న దృశ్యం సంవత్సరం లబ్ధిదారులు ప్రభుత్వ సాయం (రూ.కోట్లలో)2019–20 996 2.39 2020–21 1,254 3.01 2021–22 899 2.16 2022–23 988 2.37 2023–24 1,027 2.83 చేనేతపై చిన్నచూపు రెండేళ్లయినా నేతన్నల వైపు కన్నెత్తి చూడని కూటమి సర్కారు ప్రోత్సాహం లేక మూలకు చేరుతున్న మగ్గాలు 50 ఏళ్లకే పింఛన్, నేతన్న నేస్తం హామీలు గాలికి.. హామీల అమలుకు నేత కార్మికుల డిమాండ్ కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్లో వినతి నేతన్నలకు అండగా నిలిచిన గత జగన్ సర్కారు ఉమ్మడి జిల్లాలోని 1,070 కుటుంబాలకు రూ.12.76 కోట్ల సాయం ఎన్నికల వాగ్దానాలు అమలుచేయాలని డిమాండ్ చేస్తూ ఏపీ చేనేత సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ పిలుపు మేరకు సోమవారం జిల్లాలోని చేనేత కార్మిక సంఘం నాయకులు భీమవరం కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపారు. ఏడాదికి రూ.25 వేల చొప్పున రెండేళ్లకు ఒక్కో కార్మికునికి రూ.50 వేల సాయం అందించాలని కోరారు. వైఎస్ హయాంలో 50 ఏళ్లకే పింఛన్ జీఓ తెచ్చారని, జగన్ ప్రభుత్వం జీఓను అమలుచేశారన్నారు. కూటమి ప్రభుత్వం ఈ జీఓను తుంగలోకి తొక్కడంతో 50 ఏళ్లు నిండిన కార్మికులు పింఛన్ అందక తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అర్హత కలిగిన కార్మికులకు ఏడాదికి పింఛన్ సాయం రూ.48 వేల చొప్పున రెండేళ్లకు రూ.96 వేలు అందజేయాలని డిమాండ్ చేశారు. అలాగే 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాన్ని ఉపవృత్తుల కార్మికులకు అందజేయాలని, చేనేత రుణాలు మాఫీ చేయాలని తదితర డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని పీజీఆర్ఎస్లో అధికారులకు అందజేశారు. -
అదుపు తప్పి చెట్టును ఢీకొన్న బస్సు
● డ్రైవర్కు తీవ్రగాయాలు ● నూజివీడు నుంచి శ్రీశైలం వెళ్తుండగా ఘటన ● ప్రయాణికులకు తప్పిన ప్రమాదం నూజివీడు: నూజివీడు డిపోకు చెందిన శ్రీశైలం వెళ్లే బస్సు ఆదివారం అర్ధరాత్రి దాటిన తరువాత 1.30 గంటల సమయంలో ప్రమాదానికి గురైంది. మార్కాపురం జిల్లా కుంట సమీపంలో బస్సు అదుపుతప్పి చెట్టును ఢీకొంది. ఈ ఘటనలో డ్రైవర్ రాంబాబుకి తీవ్ర గాయాలయ్యాయి. అదృష్టవశాత్తూ ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. తీవ్రంగా గాయపడిన డ్రైవర్ను మార్కాపురం ఆసుపత్రికి, అక్కడి నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం ఒంగోలు ఆసుపత్రికి తరలించారు. విశ్రాంతి లేకుండా డ్యూటీలు చేయించడమే కారణమా? శ్రీశైలం వెళ్లే బస్సు ప్రమాదానికి గురికావడం వెనుక యాజమాన్యం కార్మికులపై చేస్తున్న ఒత్తిడి, నిర్లక్ష్యమే అసలు కారణమనే విమర్శలు కార్మికుల్లో నుంచి వ్యక్తమవుతున్నాయి. దీనికి తోడు సరిపడా విశ్రాంతి లేకుండానే డ్యూటీలు వేయడం వల్లనే ఈ ప్రమాదం జరగడానికి బలమైన కారణమని పేర్కొంటున్నారు. తీవ్రంగా గాయపడిన డ్రైవర్ కే రామకృష్ణ ఆదివారం మధ్యాహ్నం 2గంటలకు నూజివీడు–యర్రగొండపాలెం సర్వీసు డ్యూటీ చేసి డ్యూటీ దిగాడు. అతనిని మరలా వెంటనే రాత్రి 8 గంటలకు సూపర్ లగ్జరీ సర్వీసుకు డ్యూటీ వేసి శ్రీశైలం సర్వీసుకు పంపించారు. దీంతో సరిపడా విశ్రాంతి లేక ప్రమాదం జరిగిందనే విషయం ప్రతి ఒక్కరికి అర్థమవుతోంది. ఇలా సరిపడా విశ్రాంతి లేకుండా డ్రైవర్లను డ్యూటీకి పంపడమంటే ప్రయాణికుల ప్రాణాలను సైతం రిస్క్లో పెట్టినట్లేనని ఆర్టీసీ కార్మికులు పేర్కొంటున్నారు. నూజివీడు డిపోలో డ్రైవర్లకు సరిపడా విశ్రాంతి ఇవ్వకుండా 16గంటల నుంచి 18గంటల వరకు డ్యూటీ చేయిస్తున్నారని కార్మికులు ఎప్పటి నుంచో ఆందోళనలు చేస్తున్నా యాజమాన్యం పట్టించుకోవడం లేదు. ఇటీవల కాలంలో నాలుగు యాక్సిడెంట్లు చోటుచేసుకోవడం గమనార్హం. ఆ డ్రైవర్ను దూరప్రాంతాలకు ఎలా పంపుతారు? ప్రమాదానికి గురైన బస్సు డ్రైవర్ కే రామకృష్ణ గతంలో భీమవరం డిపోలో పనిచేస్తూ అక్కడ ప్రమాదం చేసి పనిష్మెంట్పై నూజివీడు డిపోకు బదిలీ అయ్యారు. అలాంటి డ్రైవర్ను యాజమాన్యం కేవలం పల్లెవెలుగు సర్వీసులకు మాత్రమే పంపాల్సి ఉండగా ఇక్కడ మాత్రం హైదరాబాద్, శ్రీశైలం వంటి దూర ప్రాంత సర్వీసులకు పంపడం గమనార్హం. శ్రీశైలంకు కండక్టర్ సర్వీసులను ఏర్పాటు చేయమని కార్మికసంఘాల నాయకులు పదేపదే యాజమాన్యానికి చెబుతున్నా పట్టించుకోవడం లేదు. ఆర్టీసీ లాంటి ప్రజా రవాణా సంస్థల్లో ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు కేవలం డ్రైవర్ తప్పు అనడం కంటే, దాని వెనుక ఉన్న అసలు కారణాలను కూడా పరిశీలించాల్సిన అవసరం ఉంది. -
కారుమూరి సునీల్ అరెస్ట్ అన్యాయం
భీమవరం: అవినీతి మచ్చలేని మాజీ మంత్రి కారుమూరి వెంకటనాగేశ్వరరావు తనయుడు సునీల్ను అరెస్ట్ చేయడం అన్యాయమని యా దవ సంఘం జిల్లా అధ్యక్షుడు కందుల భానుప్రసాద్యాదవ్ అన్నారు. భీమవరంలో ఆదివారం యాదవ సంఘం ఆధ్వర్యంలో విలేక రుల సమావేశంలో మాట్లాడారు. యాదవులు స్వతహాగా సౌమ్యులు, నిజాయతీపరులన్నా రు. మంత్రిగా నాగేశ్వరరావు పేదలకు సేవలందించారని, సునీల్ ఎట్టి పరిస్థితుల్లోనూ అవినీతికి పాల్పడే అవకాశం లేదన్నారు. వ్యక్తిగత కక్షలతో వారి అభివృద్ధిని ఆపడం ద్వారా యాదవుల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయటానికి కుట్ర లు జరుగుతుంటే జిల్లా యాదవజాతి మొత్తం కారుమూరి కుటుంబానికి అండగా ఉంటుందన్నారు. సంఘ నాయకులు పేపేటి పెద్దిరాజు, గొరిపర్తి సత్యనారాయణ, పచ్చిగోళ్ల ఆంజనేయులు, కై లా పాండు, కోరశిక పెద్దిరాజు, కోరాశిక శ్రీనివాసరావు, కందుల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. భీమవరం (ప్రకాశంచౌక్): జిల్లాలోని 1,626 అంగన్వాడీ కేంద్రాలకు ఇండక్షన్ స్టౌవ్లు, వంట పాత్రల కిట్లను ఆదివారం కలెక్టరేట్లో కలెక్టర్ సీహెచ్ నాగరాణి అందజేశారు. కలెక్టర్ మాట్లాడుతూ గ్యాస్ సిలిండర్కు ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం ఇండక్షన్ స్టౌవ్లను అందజేసిందన్నారు. వీటి వినియోగంపై అంగన్వాడీ కార్యకర్తలకు శిక్షణ అందించాలని ఐసీడీఎస్ పీడీని ఆదేశించారు. చిన్నారులకు నాణ్యమైన ఆహారం అందించాలని అంగన్వాడీ కార్యకర్తలకు సూచించారు. ఐసీడీఎస్ పీడీ డి.శ్రీలక్ష్మి, సీడీపీఓలు లక్ష్మీకాంతం, వాణి విజయరత్నం, బ్లాక్ ప్రాజెక్ట్ కో–ఆర్డినేటర్ ప్రసాద్, సూపర్వైజర్లు పాల్గొన్నారు. భీమవరం (ప్రకాశంచౌక్) : ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమం సోమవారం జిల్లా కలెక్టరేట్తో పాటు డివిజన్, మండల కేంద్రాల్లో నిర్వహించనున్నట్టు కలెక్టర్ సీహెచ్ నాగరాణి తెలిపారు. అలాగే రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం రెవెన్యూ క్లినిక్ కార్యక్రమం కూడా నిర్వహిస్తామన్నారు. ప్రజ లు ఆన్లైన్లోనూ అర్జీలు నమోదు చేసుకోవ చ్చని, టోల్ఫ్రీ నంబర్ 1100ను సంప్రదించవచ్చని ఆమె సూచించారు. పెనుమంట్ర: స్థానిక మండల పరిషత్ కార్యాలయానికి (పోలీస్స్టేషన్) సమీపంలో బ్రాహ్మణచెర్వు ప్రధాన రహదారికి ఆనుకుని ఉన్న పంట బోదెలో గుర్తుతెలియని మృతదేహాన్ని ఆదివారం ఉదయం గుర్తించినట్టు పెనుమంట్ర పోలీసులు తెలిపారు. వీఆర్వో నాగబాబు ఫిర్యాదు మేరకు మృతదేహాన్ని తణుకు ప్రభుత్వాస్పత్రికి తరలించి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. మృతుని వివరాలు తెలిసిన వారు సెల్ 9440796682 నంబర్కు తెలియజే యాలని కోరారు. ఏలూరు (ఆర్ఆర్పేట) : రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల పోరాటాలకు ఏపీ జేఏసీ అండగా ఉంటుందని ఏపీ ఎన్జీఓస్ జిల్లా అధ్యక్షుడు చోడగిరి శ్రీనివాస్ హామీ ఇచ్చారు. ఆదివారం స్థానిక పంచాయతీరాజ్ మినిస్టీరియల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ హాల్లో ఏలూరు జిల్లా ఎస్జీపీఏ అడ్హక్ కమిటీ ఏర్పాటుకోసం నిర్వ హించిన ఆత్మీయ సమావేశంలో ఆయన మా ట్లాడారు. అడ్హక్ కమిటీ ఏర్పాటు కోసం సూ చనలను చేసి భవిష్యత్లో జరిగే ఉద్యమాల్లో పెన్షనర్లు కూడా పాల్గొని జేఏసీకి తోడ్పాటు అందించాలని కోరారు. పెన్షనర్లకు ఎలాంటి ఇబ్బందులొచ్చినా జేఏసీ, ఎన్జీఓస్ పరంగా అండగా ఉంటామన్నారు. ఏపీ ఎన్జీవోస్ అసో సియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు హరనాథ్ మా ట్లాడుతూ పెన్షనర్ల సంఘం ఏర్పాటుచేసి సమస్యలు పరిష్కరించుకోవాలని సూచించారు. -
ఎంటీఎస్ టీచర్ల వినతి
ఏలూరు (ఆర్ఆర్పేట): జిల్లావ్యాప్తంగా మిని మం టైమ్ స్కేల్ (ఎంటీఎస్) డీఎస్సీ 2008, 1998 ఉపాధ్యాయులకు సోమవారం తలపెట్టిన బదిలీల్లో జిల్లాలోని అన్ని ఖాళీలను ప్రదర్శించాలని ఎంటీఎ స్ ఉపాధ్యాయుల సంఘ నాయకులు డీఈఓ ఎం. వెంకటలక్ష్మమ్మను కోరారు. ఈ మేరకు డీఈఓకు వినతిపత్రం సమర్పిస్తూ ఎంటీఎస్ ఉపాధ్యాయు లు కొన్నేళ్లుగా సుదూర ప్రాంతాల్లో చాలీచా లని జీతాలతో ఇబ్బంది పడుతున్నారన్నారు. బదిలీల సందర్భంగా జిల్లాలోని అన్నిరకాల ఖాళీలను చూపడం ద్వారా కొందరికై నా న్యా యం జరుగుతుందన్నారు. ఎంటీఎస్ ఉపాధ్యాయులు తోట ఎడ్వర్డ్, సీహెచ్ ప్రవీణ్కుమార్, సయ్యద్ బాజీ పాల్గొన్నారు. -
‘నీట్’గా పరీక్ష రాశారు
భీమవరం : జిల్లాలో ఆదివారం నీట్ యూజీ ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.15 గంటల వరకు జరిగిన పరీక్షకు 91.39 శాతం హాజరు నమోదైంది. వివిధ ప్రాంతాల నుంచి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఉదయం 9 గంటలకే పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెంలో ఐదు పరీక్షా కేంద్రాలు ఏర్పాటుచేశారు. మొత్తం 2,475 మంది విద్యార్థులకు 2,262 మంది హాజరయ్యారు. భీమవరంలోని రెండు పరీక్షా కేంద్రాల్లో 1,186 మందికి 1,058 మంది హాజరయ్యారు. తణుకులోని రెండు కేంద్రాల్లో 662 మందికి 624 మంది హాజరయ్యారు. నిబంధనలు కఠినంగా అమలు పరీక్షా కేంద్రాల వద్ద అధికారులు నిబంధనలను కఠినంగా అమలు చేశారు. ప్రత్యేకమైన దుస్తులతో పాటు కాళ్లకు పట్టీలు, చెవులకు రింగులు, చేతికి తాళ్లు, మెడలో ఆభరణాలు వంటివి ఉండకూడదన్నారు. దీంతో తల్లిదండ్రుల సాయంతో వాటిని విద్యార్థినులు తొలగించారు. ప్రధానంగా జడ వేసుకోకూడదనే నిబంధనతో విద్యార్థినులు జడలు విప్పడం కనిపించింది. పటిష్ట బందోబస్తు భీమవరం, తణుకులోని కేంద్రాలను కలెక్టర్ సీ హెచ్ నాగరాణి తనిఖీ చేశారు. భీమవరంలోని కేంద్రాలను జాయింట్ కలెక్టర్ టి.రాహుల్కుమార్ రెడ్డి, ఆర్డీఓ ప్రసన్నకుమార్రెడ్డి, తహసీల్దార్ ఆర్.రాంబాబు పరిశీలించారు. అలాగే పటిష్ట బందోబస్తు ఏర్పాటుచేసి భీమవరంలోని రెండు కేంద్రాల గేట్ల వద్ద భీమవరం డీఎస్పీ రఘువీర్విష్ణు నేతృత్వంలో సీఐలు, ఎస్సైలు, పోలీసు సిబ్బంది పర్యవేక్షించారు. జిల్లాలో 91.39 శాతం హాజరు -
ఫీజులు భారం.. బీటెక్ దూరం!
భీమవరం : ఇంజనీరింగ్ చాలా మంది విద్యార్థుల కల. పేద విద్యార్థుల ఉన్నత చదువు లక్ష్యంగా దివంగత సీఎం వైఎస్సార్ ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టారు. దీంతో రాష్ట్రంలో లక్షలాది మంది ఇంజనీరింగ్ విద్యను అభ్యసించి ఉన్నత కొలువులు సాధించారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పూర్తిస్థాయిలో ఫీజు రీయింబర్స్మెంట్ను అందించి పేద విద్యార్థుల చదువులకు ఎంతో ఊతమిచ్చారు. అయితే రెండేళ్లుగా పరిస్థితి భిన్నంగా ఉంది. కూటమి ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు సకాలంలో విడుదల చేయకపోవడంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. విద్యార్థులు ఫీజులు చెల్లిస్తేనే సర్టిఫికెట్లు ఇస్తామంటూ కళాశాల యాజమాన్యాలు ఆంక్షలు విధించడంతో ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇంజనీరింగ్ విద్య అంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. 16 కాలేజీలు.. 8,400 సీట్లు పశ్చిమగోదావరి జిల్లాలో 9 కళాశాలల్లో 5,200 సీట్లు, ఏలూరు జిల్లాలో 7 కళాశాలల్లో 3,200 సీట్లు ఉన్నాయి. మొత్తంగా 16 ఇంజనీరింగ్ కాలేజీల్లో 8,400 సీట్లు ఉన్నాయి. ఇంజనీరింగ్, ఫార్మసీ, వ్యవసాయ కోర్సుల్లో ప్రవేశాల కోసం గత నెల 12 నుంచి 20 వరకు జరిగిన ఏపీఈఏపీసెట్ పరీక్షలకు సుమారు 20 వేల మంది విద్యార్థులు హాజరయ్యారు. సోమవారం ఫలితాలు విడుదలవుతాయనే వార్తలతో విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో ఉత్కంఠ నెలకొంది. మేనేజ్మెంట్ కోటాలో.. జిల్లాలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో సీఎస్ఈ, ఈసీఈలోని పలు బ్రాంచ్ల సీట్లకు డిమాండ్ ఎక్కువగా ఉంది. దీంతో మేనేజ్మెంట్ కోటాలో రూ.3 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు ఫీజులు ఉన్నాయి. కొందరు తల్లిదండ్రులు ఫలితాలు ఎలా ఉన్నా ముందుగానే పేరొందిన కళాశాలలో సీటు రిజర్వ్ చేసుకోవడంతో మేనేజ్మెంట్ కోటా సీట్ల ధరలకు రెక్కలొచ్చాయి. భీమవరం, ఏలూరు, నరసాపురం, తాడేపల్లిగూడెంలో ప్రముఖ కాలేజీలు ఉన్నాయి. కొన్ని కళాశాలల్లో బాలికలకు వసతి, కట్టుదిట్టమైన రక్షణ ఉండటంతో రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు చెందినవారు ఆసక్తి చూపుతున్నారు. సకాలంలో అందని ఫీజు రీయింబర్స్మెంట్ ఇంజనీరింగ్ చదువుకు వెనుకడుగు! ఉమ్మడి జిల్లాలో 16 కళాశాలలు.. 8,400 సీట్లు -
వామ్మో పిడుగులు.. తస్మాత్ జాగ్రత్త
బుట్టాయగూడెం: వర్షాకాలం వచ్చిందంటే చాలు, ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తుంటాయి. ఈ నేపథ్యంలో పిడుగులు పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పిడుగు ఎప్పుడు, ఎలా పడుతుందో తెలియని పరిస్థితిలో ప్రమాదాలు జరిగి ఒక్కోసారి ప్రాణనష్టం కూడా సంభవిస్తుంది. అలాగే, మెరుపుల ధాటికి గృహోపకరణాలు కూడా కాలిపోతుంటాయి. పిడుగులోని కాంతి ప్రభావంతో నష్టం భారీగానే ఉంటుంది. ఈ పరిస్థితుల్లో పిడుగుల నుంచి రక్షించుకునేందుకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తు నిర్వహణ శాఖ ఎప్పటికప్పుడు మెసేజ్ల రూపంలో హెచ్చరికలు జారీ చేస్తూనే ఉంది. జాగ్రత్తలు పాటించడం ద్వారానే ప్రమాదాలను నివారించవచ్చని అధికారులు చెబుతున్నారు. ఇటీవల ఏజెన్సీ ప్రాంతంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసిన సమయంలో పలు గ్రామాల్లో పిడుగులు పడ్డాయి. పిడుగు అంటే ఏమిటి? వాతావరణంలో చోటు చేసుకునే పరిణామాలతో ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై, మెరుపు వేగంతో విద్యుత్ కాంతి నేలకు చేరుకుంటుంది. మేఘాల మధ్య విద్యుదావేశం పెరిగి, వాతావరణంలోని తేమ, దుమ్ము కారణంగా స్థిర విద్యుత్ భూమివైపు ప్రవహిస్తుంది. ఒక మిల్లీసెకన్ కాలంలో మెరుపుతో కూడిన పిడుగు 20 వేల ఆంపియర్ల విద్యుత్ ప్రవాహాన్ని విడుదల చేస్తుంది. అప్పుడు ఏర్పడే విద్యుత్ క్షేత్ర తీవ్రత 2 లక్షల ఓల్టులతో సమానం. ఇది భూమి నుంచి 1 నుంచి 2 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. రెండు మేఘాల మధ్య అయితే 7 కిలోమీటర్ల నుంచి 140 కిలోమీటర్ల దూరంలో ఉంటాయి. మెరుపులు భూమి మీద పడినప్పుడు వస్తువులను బట్టి నష్ట తీవ్రత ఉంటుంది. కాపర్ ఎర్తింగ్తో ప్రమాదానికి చెక్ పిడుగుపాటు నుంచి తప్పించుకునేందుకు ఎత్తైన ప్రదేశాల్లో నేరుగా భూమిలోకి శ్రీకాపర్ ఎర్తింగ్శ్రీ (రాగి వైర్ను అనుసంధానం చేస్తూ భూమిలోకి పాతడం) ఏర్పాటు చేయడం ద్వారా, దాదాపు కిలోమీటరు దూరంలో పడిన పిడుగును కూడా ఇది ఆకర్షించుకుని నేరుగా భూమిలోకి పంపిస్తుంది. ఉప్పు, బొగ్గు, నీటి మిశ్రమంతో రాగి వైర్ కలిగిన రాడ్ను భూమిలోకి ఏర్పాటు చేయడం వల్ల ప్రమాదాలను నివారించే అవకాశం ఉంటుంది. ఎత్తైన టవర్లు నిర్మించేటప్పుడు తగిన జాగ్రత్తలు పాటించడం ద్వారా పిడుగుపాటు నుంచి రక్షణ పొందవచ్చు. పాటించాల్సిన జాగ్రత్తలు ● వర్షం వచ్చేటప్పుడు చెట్ల కింద ఉండకూడదు. ముఖ్యంగా ఎత్తైన చెట్ల కింద అస్సలు ఉండకూడదు. ● ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం వస్తే రైతులు పొలాల్లో, బహిరంగ ప్రదేశాల్లో ఉండకూడదు. ● లక్షల డిగ్రీల ఉష్ణోగ్రతతో విడుదలయ్యే వేడి ఒక్కసారిగా మనిషిపై పడితే గుండైపె తీవ్ర ప్రభావం చూపుతుంది. ● వర్ష సూచన ఉన్నప్పుడు గొడుగులపై ఇనుప బోల్టులు, కెమెరాలు, సెల్ఫోన్లు దగ్గర లేకుండా చూసుకోవాలి. లేదంటే రేడియేషన్ తరంగాలకు గురై ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ● మెరుపులు, పిడుగుల వల్ల విద్యుత్ ఉపకరణాలు కాలిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఆ సమయంలో టీవీలకు ఉన్న విద్యుత్, కేబుల్ కనెక్షన్లను తొలగించాలి. ● వర్షం పడుతున్న సమయంలో విద్యుత్ తీగల కింద, ట్రాన్స్ఫార్మర్ల సమీపంలో ఉండకూడదు. తడి ప్రదేశాలకు దూరంగా ఉండటం మంచిది. అప్రమత్తతతోనే ప్రమాదాల నివారణ -
దేవదాయ శాఖ పరిధిలోని చెట్ల నరికివేత
కొయ్యలగూడెం: దేవదాయ శాఖ పరిధిలోని అక్రమంగా చెట్లను నరికిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు ఆదివారం డిమాండ్ చేశారు. రాజవరం పంచాయతీ పరిధిలో ఆర్అండ్బీ, గూటాల లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం భూముల్లో ఉన్న కొబ్బరి చెట్లు నరికివేశారన్నారు. గుట్టుచప్పుడు కాకుండా నరికేసి అనంతరం చెట్టును కూడా తొలగించారన్నారు. దీనిపై ఆర్అండ్బీ అధికారులకు, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం అధికారులుకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. సదరు అధికారులు, చెట్లు నరికిన దుండగులు కుమ్మక్కు అయ్యారేమోనని ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై కొందరు గ్రామస్తులు సోమవారం జిల్లా కలెక్టర్కు పీజిఆర్ఎస్లో ఫిర్యాదు చేస్తామని అన్నారు. -
బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగడం నేరం
తాడేపల్లిగూడెం (టీఓసీ): బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం నేరమని, కఠిన చర్యలు తప్పవని ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ ఇన్స్పెక్టర్ ఈ.స్వరాజ్యలక్ష్మి అన్నారు. పట్టణ పరిధిలో ఆదివారం ఎకై ్సజ్ స్టేషన్ పరిధిలో దాడులు నిర్వహించి బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి, కేసులు నమోదు చేశారు. ఆమె మాట్లాడుతూ మద్యం దుకాణాల్లో అనుమతించిన పర్మిట్ రూమ్ల్లో మాత్రమే మద్యం సేవించేందుకు అనుమతి ఉందన్నారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే చట్టప్రకారం చర్యలు, కేసులు నమోదు ఉంటాయని, శిక్షలు అమలు అవుతాయని వివరించారు. దెందులూరు: గాలాయగూడెం వైపు సైకిల్పై వెళుతున్న మట్ట అంజయ్యను వెనుక నుంచి జంగారెడ్డిగూడెం నుంచి ఏలూరు వైపు వస్తున్న కారు శనివారం నాగులదేవునిపాడు శివారులో అతివేగంగా, నిర్లక్ష్యంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అంజయ్య తలకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన అంజయ్యను స్థానికులు, బంధువులు ఆటోలో ఏలూరు ఆంధ్ర వైద్యశాలకు తరలించారు. చికిత్స పొందుతూ అంజయ్య ఆదివారం అర్ధరాత్రి మృతి చెందాడని ఎస్ఐ వెంకట్కుమార్ తెలిపారు. మృతి చెందిన అంజయ్య స్వగ్రామం గాలాయగూడెం. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. -
వ్యాధులను ముందుగానే గుర్తించాలి
తాడేపల్లిగూడెం: చేపలు, రొయ్యల్లో వస్తున్న మార్పుల పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని, లక్షణాలు కనిపించిన వెంటనే తగు చర్యలు తీసుకోవాలని వెంకట్రామన్నగూడెం కేవీకేలో నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంటు బోర్డు సహకారంతో జరుగుతున్న శిక్షణా కార్యక్రమంలో ఆదివారం వక్తలు తెలిపారు. వ్యాధుల నిర్ధారణకు నమూనాల సేకరణ, కణజాల పరీక్షల ద్వారా వ్యాఽధి తీవ్రత, రోగనిరోధక సంబంధ పరీక్షలు, వ్యాధి కారకాలను గుర్తించడానికి ఆధునిక పద్ధతులను అవలంభించాలన్నారు. సూక్ష్మంగా వ్యాధులను గుర్తించడానికి ఆధునిక సాంకేతిక పరికరాల గురించి సమాచారం తెలిపారు. చేపల్లో పోషకాహార లోప వ్యాధులు, సరైన ఆహారం అందక చేపలు, రొయ్యల్లో ఎలాంటి వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయో విశదీకరించారు. మాలిక్యులర్ డయోగ్నోస్టిక్స్ టూల్స్ వినియోగం, పీసీఆర్, ఆర్టీపీసీఆర్, ల్యాంప్ ఎనాలిసిస్, వ్యాధి కారకాల డీఎన్ఏను గుర్తించే ప్రాధమిక పద్ధతి, ఆర్ఎన్ఏ వైరస్లను గుర్తించడానికి ఉపయోగించాల్సిన సాంకేతికత గురించి వివరించారు. కృషి విజ్ఞానకేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ దేవీవరప్రసాదరెడ్డి ఆధ్వర్యంలో సాగిన శిక్షణా కార్యక్రమంలో విషయాలను ఉండి ఫిషరీస్ రీసెర్చ్ స్టేషన్కు చెందిన శాస్త్రవేత్త డాక్టర్ శాస్త్రి, డాక్టర్ ధీరన్ వివరించారు. -
కల్తీ విత్తనాలపై అప్రమత్తం
బుట్టాయగూడెం: తొలకరి వర్షాలు ప్రారంభమయ్యాయి. రైతులు వ్యవసాయ పనులకు సిద్ధమవుతున్నారు. విత్తనాలు కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే, నాణ్యమైన విత్తనాల ఎంపికలో రైతులు అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు. కల్తీ విత్తనాల విషయంలో జాగ్రత్త వహించాలని, విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు విక్రయించే డీలర్లు ఎరువుల నియంత్రణ చట్టం–1985 ప్రకారం నిబంధనలను పాటించాలని హెచ్చరిస్తున్నారు. పాటించాల్సిన జాగ్రత్తలు ● వ్యవసాయ శాఖ నుంచి లైసెన్స్ పొందిన డీలర్ల వద్ద, గుర్తింపు పొందిన సంస్థల వద్ద మాత్రమే విత్తనాలు కొనుగోలు చేయాలి. ● సీలు వేసి, ధ్రువీకరణ పత్రం కలిగిన విత్తన బస్తాలనే ఎంచుకోవాలి. ● విత్తనాల సంచిపై ఉన్న రకం, ల్యాబ్ నంబర్, గడువు తేదీ వంటి వివరాలను తప్పనిసరిగా గమనించాలి. ● కొనుగోలు చేసిన తర్వాత డీలర్ సంతకం ఉన్న ఖచ్చితమైన బిల్లును తీసుకోవడం మర్చిపోకూడదు. ● హైబ్రీడ్ విత్తనాల విషయంలో వాటి రకం, స్వచ్ఛత, మొలకెత్తే సామర్థ్యం, జన్యు నాణ్యత వంటి వివరాలను పరిశీలించాలి. ● పంట మొలకెత్తే దశలో గానీ, పూత దశలో గానీ ఏదైనా లోపం కనిపిస్తే వెంటనే స్థానిక వ్యవసాయాధికారులను లేదా సిబ్బందిని సంప్రదించాలి. మొలక శాతం పరీక్షించే విధానం రైతులు విత్తనం కొనుగోలు చేసిన వెంటనే మొలక పరీక్ష చేసుకోవాలి. కొనుగోలు చేసిన విత్తన సంచి నుంచి 100 గింజలను తీసుకుని వాటిని 24 గంటలపాటు నీటిలో నానబెట్టాలి. అనంతరం ఆ గింజలను ఒక గుడ్డలో కట్టి, గాలి, వెలుతురు తగలని ప్రదేశంలో ఉంచాలి. మరో 24 గంటల తర్వాత చూస్తే, 100 గింజలకు కనీసం 75 గింజలు మొలకెత్తాలి. 75 శాతం కంటే ఎక్కువ మొలక శాతం ఉంటేనే ఆ విత్తనాలు నాణ్యమైనవని నిర్ధారించుకుని నారుమడి సిద్ధం చేసుకోవాలి. గడువు దాటితే కొనుగోలు చేయొద్దు కొనుగోలు చేసే విత్తన ప్యాకెట్, సీసా డబ్బాపై సీలు ఉందా? లేదా? అనేది నిర్థారించుకోవాలి. అరువు పద్ధతిలో విత్తనాలు కొనుగోలు చేసినప్పటికీ బిల్లు తప్పనిసరిగా తీసుకోవాలి. మొలకెత్తే దశ, పూత దశలో పంటలో లోపం కనిపిస్తే వెంటనే వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించాలి. రైతులకు వ్యవసాయాధికారుల సూచనలురైతులు సొంతంగా తయారు చేసిన విత్తనాలు నారు పోయడానికి శ్రేయస్కరం. ఒక వేళ కొనుగోలు చేస్తే మంచి విత్తనాలను మాత్రమే ఎంపిక చేసి కొనుగోలు చేయాలి. నారుపోసే ముందు వాటి మొలక శాతం గుర్తించి నారు పోయాలి. నకిలీ విత్తనాలను కొనుగోలు చేసి మోసపోవద్దు. విత్తనాల కొనుగోలులో ఎలాంటి సమస్యలు ఉన్నా వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించాలి. –పీజీ బుచ్చిబాబు, సహాయ వ్యవసాయ సంచాలకుడు, కేఆర్పురం, బుట్టాయగూడెం మండలం -
ఆన్లైన్ చేసిన ఓటర్ల జాబితా ప్రకటించాలి
దెందులూరు: భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జరుగుతున్న సర్ ప్రోగ్రాంలో ఆన్లైన్లో చేసిన ఓటర్ల జాబితా ప్రకటించాలని వైఎస్సార్సీపీ బీసీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముదుగురు సూర్యనారాయణ ఎలక్ట్రోరల్ అధికారులను డిమాండ్ చేశారు. ఆదివారం దెందులూరు మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి కార్యాలయంలో మాట్లాడుతూ బీఎల్ఓలు ఓటర్ల సమాచార సేకరణలో భారత ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగా పారదర్శకంగా వివరాలు సేకరించాలన్నారు. ఆన్లైన్ చేసిన ఓటర్ జాబితా పోలింగ్ బూత్ల వారీగా పది రోజులకు ఒకసారి ప్రకటించాలన్నారు. ఓటును ఆన్లైన్ చేసిన తర్వాత ఓటు పరిస్థితి తెలుసుకోవడానికి ఎలాంటి అసౌకర్యం లేకుండా అనుమానాలకు తావివ్వకుండా ఆన్లైన్ చేసిన ప్రతి ఓటును సంబంధిత పోలింగ్ బూత్ వద్ద పది రోజులకు ఒకసారి కచ్చితంగా వివరాలు ప్రకటించాలన్నారు. అక్కడక్కడ ఒక ఇంటి దగ్గర చేసి మిగిలిన కొన్ని ఇళ్ల వద్ద సమాచారం తీసుకోవటం లేదన్న సంఘటనలు తమ దృష్టికి వచ్చాయన్నారు. బీఎల్ఓలు చేస్తున్న ఈ ప్రక్రియను రెవెన్యూ శాఖలో ఎన్నికల విభాగం అన్ని స్థాయి అధికారులు సమీక్ష చేయాలన్నారు. -
బీసీలపై కూటమి ప్రభుత్వ కక్ష సాధింపు
ఏలూరు టౌన్ : టీడీపీ కూటమి ప్రభుత్వంలో బీసీ నేతలను రాజకీయంగా ఎదగకుండా అణచివేయాలనే కుట్రపూరిత చర్యల్లో భాగంగా వైఎస్సార్సీపీ యువజన విభాగం జోన్ కో–ఆర్డినేటర్, ఏలూరు పార్లమెంట్ ఇన్చార్జి కారుమూరి సునీల్కుమార్యాదవ్ను మద్యం కేసుల్లో ఇరికించారని వైఎస్సార్సీపీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు నెరుసు చిరంజీవి ధ్వజమెత్తారు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో ఏలూరు సమన్వయకర్త మామిళ్లపల్లి జయప్రకాష్ ఆధ్వర్యంలో ఏలూరు జ్యూట్మిల్లు బ్రిడ్జి జ్యోతిరావుపూలే విగ్రహం వద్ద ఆదివారం పార్టీ నేతలు నిరసన కార్యక్రమం తలపెట్టారు. సునీల్ అక్రమ అరెస్ట్కు నిరసనగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ వైఎస్సార్సీపీ హయాంలో పారదర్శకంగా మద్యం విక్రయాలు జరిగాయనీ, ప్రభుత్వమే మద్యం దుకాణాలను నిర్వహించిందని గుర్తుచేశారు. 2014–19 మధ్యకాలంలో (టీడీపీ హయాం) రాష్ట్రంలో 43 వేల బెల్టు షాపులు ఉండేవనీ, ప్రతి గ్రామంలో విచ్చలవిడిగా మద్యం విక్రయించారని గుర్తుచేశారు. గత వైఎస్సార్సీపీ పాలనలో ప్రభుత్వమే మద్యం విక్రయిస్తే అక్రమాలు జరిగాయని ఆరోపించటం వారి అవగాహనలోపాన్ని తేటతెల్లం చేస్తుందన్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో ప్రైవేటు వ్యక్తులకు మద్యం దుకాణాలు అప్పగించారనీ, రాత్రీపగలూ ఇష్టారాజ్యంగా మద్యం విక్రయాలు చేస్తున్నారనీ విమర్శించారు. మద్యం బాటిల్పై రూ.10 నుంచి రూ.20 వరకు అదనంగా వసూలు చేస్తున్నారని, ఈ సొ మ్ములు ఎవరి జేబుల్లోకి వెళుతున్నాయో చెప్పాలని నెరుసు చిరంజీవి డిమాండ్ చేశారు. ఇబ్బంది పెట్టాలనే లక్ష్యంతోనే.. వైఎస్సార్సీపీ నగర అధ్యక్షుడు గుడిదేశి శ్రీనివాసరావు మాట్లాడుతూ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలనే లక్ష్యంతో ఆయన కుమారుడు సునీల్కుమార్ను మద్యం కేసులో అక్రమంగా అరెస్ట్ చేశారని మండిపడ్డారు. చంద్రబాబుకు బీసీలంటే కేవలం ఓటు బ్యాంకు మాత్రమేననీ, రాజకీయంగా ఎదిగితే పోటీ వస్తారనే భయంతో అణచివేసే కుట్రలు చే స్తారని ఆరోపించారు. మద్యం రవాణాకు సంబంధించి కేవలం వాహనాలు సరఫరా చేసిన సునీల్ను అరెస్ట్ చేశారనీ, కానీ ఢిల్లీకి చెందిన సిగ్మా సొల్యూషన్స్ కంపెనీపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. ముందుగా జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. పార్టీ బీసీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు కిలారపు బుజ్జి, మోదుగుండు సూర్యనారాయణ, రాష్ట్ర ప్రచార విభాగం ప్రధాన కార్యదర్శి మోరు రామరాజు, వాణిజ్య విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంటా మోహనరావు, గ్రీవెన్స్ సెల్ రాష్ట్ర కార్యదర్శి కట్టా ఏసుబాబు, జిల్లా అధికార ప్రతినిధి మున్నుల జాన్గురునాథ్, వైఎస్సార్టీయూ జిల్లా అధ్యక్షుడు పల్లి శ్రీనివాస్, నగర బీసీసెల్ అధ్యక్షుడు కిలాడి దుర్గారావు, జిల్లా మహిళ ఉపాధ్యక్షురాలు చిలకపాటి డింపుల్, లీగల్ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డీవీ రామాంజనేయులు, నాయకులు తుమ్మగుంట రంగా, జిజ్జువరపు విజయనిర్మల, ఇనపనూరి జగదీష్, సాసుపల్లి యుగంధర్, గంటా సాయిప్రదీప్, పిట్టా ధనుంజయ్, కొల్లిపర భగవాన్, పచ్చిపులుసు సృజన్, అగ్గాల కృష్ణ, మేతర సురేష్, పిల్లంగోళ్ల సత్యదేవ్, కుమారి, బందెల కిరణ్రాజు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఉన్నారు. కారుమూరి సునీల్ అక్రమ అరెస్ట్పై నిరసన ఏలూరులో పూలే విగ్రహం వద్ద శాంతియుత ధర్నా వైఎస్సార్సీపీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు నెరుసు చిరంజీవి -
సత్య కేంద్రాన్ని ధ్వంసం చేసిన టీడీపీ నేతలు
ఆగిరిపల్లి: ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం కనసానపల్లిలో మాజీ గవర్నర్ కృష్ణకాంత్ చేతుల మీదుగా ప్రారంభించిన సత్య కేంద్రాన్ని గ్రామానికి చెందిన టీడీపీ నేతలు ధ్వంసం చేశారు. గ్రామంలో కుటుంబ తగాదాలు, గ్రామ సమస్యల పరిష్కారం కోసం 1993లో రాష్ట్రంలోనే మొదటిసారిగా కనసానపల్లిలో ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. దీనిపై గ్రామానికి చెందిన పచ్చ నేతల కన్ను పడింది. సత్య కేంద్రాన్ని పునర్నిర్మాణం చేస్తామంటూ గ్రామస్తులను సంప్రదించకుండానే ఆదివారం ఉదయం ధ్వంసం చేశారు. దీంతో గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
జంగారెడ్డిగూడెం: పుట్టినరోజు వేడుకల కోసం ఇంటికి వెళ్తున్న ఓ యువకుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషాద ఘటన జంగారెడ్డిగూడెం మండలంలో చోటుచేసుకుంది. చల్లవారిగూడెంకు చెందిన అబ్బ దాసరి వంశీ (30)ని శనివారం రాత్రి తాడువాయి గ్రామ శివారులో గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో మృతి చెందాడు. తాడువాయి గ్రామ శివారుకు చేరుకోగానే గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఎస్ఐ వీరప్రసాద్ సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఆదివారం పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఏడాది క్రితం మేనమామ కుమార్తెను వివాహం చేసుకున్న వంశీ భార్య ప్రస్తుతం ఆరు నెలల గర్భవతి. పుట్టబోయే బిడ్డ ముఖం చూడకముందే వంశీ మృతి చెందడం కుటుంబ సభ్యులను తీవ్ర విషాదంలో ముంచెత్తింది. తల్లిదండ్రులు, భార్య కావ్య కన్నీరుమున్నీరయ్యారు. కొయ్యలగూడెం: బయ్యన్నగూడెం గ్రామంలో ఓ వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఎస్ఐ వి.చంద్రశేఖర్ వివరాల ప్రకారం.. మంగిశెట్టిగూడెం గ్రామానికి చెందిన సింగంశెట్టి నాగరాజు (35) బయ్యన్నగూడెంకు చెందిన యువతిని వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమార్తెలున్నారు. దంపతుల మధ్య తరచూ కలహాలు జరుగుతుండటంతో, నాగరాజు భార్య గత మూడేళ్లుగా పుట్టింటిలోనే ఉంటోంది. ఆదివారం నాగరాజు తన భార్య, పిల్లలను కలిసేందుకు బయ్యన్నగూడెంలోని అత్తవారి ఇంటికి వెళ్లాడు. అనంతరం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు అతని భార్య సమాచారం ఇచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. పూర్తి కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
మాడవీధుల స్థలానికి రూ.5 లక్షల విరాళం
కాళ్ల: కాళ్ల మండలం కాళ్ళకూరు గ్రామంలో వెలసిన స్వయంభూ శ్రీ వెంకటేశ్వరస్వామి దేవస్థానంలో మాడవీధుల అభివృద్ధి పనులకు భక్తులు విరాళం అందించినట్లు దేవస్థానం చైర్మన్ అడ్డాల శివరామరాజు, ఈవో మోకా అరుణ్కుమార్ ఆదివారం తెలిపారు. జక్కరం గ్రామానికి చెందిన సాగిరాజు సుబ్బరాజు, వరలక్ష్మి దంపతుల కుమారుడు అప్పలరాజు (సింగపూర్ అప్పన్న), లక్ష్మీరూప దంపతులు, మనవళ్ళు దినేష్ వర్మ, అక్షిత్ రిషేంద్రవర్మ, సాగిరాజు శ్రీనివాసరాజు, రాధిక దంపతులు, మనవరాలు జాహ్నవి సమిహిత కలిసి రూ.5,01,116లు దేవాలయం చుట్టూ మాడవీధుల విస్తరణలో భాగంగా స్థలం కొనుగోలు నిమిత్తం విరాళంగా అందించినట్లు ఈవో తెలిపారు. ఈ సందర్భంగా దాతలకు ప్రత్యేక దర్శనం కల్పించి స్వామివారి ప్రతిమతో సత్కరించారు. బుట్టాయగూడెం: భక్తుల కోర్కెలు తీర్చే తల్లిగా, వరాలిచ్చే అమ్మగా, గిరిజనుల ఆరాధ్య దేవతగా బుట్టాయగూడెం మండలం కామవరం సమీపంలో అటవీ ప్రాంతంలో కొలువై ఉన్న గుబ్బల మంగమ్మ గుడికి ఆదివారం భక్తులు పోటెత్తారు. ద్విచక్ర వాహనాలు, ఆటోలు, ప్రత్యేక బస్సుల్లో తెల్లవారుజాము నుంచే భక్తులు అమ్మవారి సన్నిధికి చేరుకున్నారు. అనంతరం ధూపదీప నైవేద్యాలతో అమ్మవారికి పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఉదయం 7 గంటల సమయంలో ఆకాశంలో నల్లని మబ్బులు కమ్మడంతో వర్షం కురుస్తుందేమోనని భక్తులు ఆందోళన చెందారు. అయితే కొద్దిపాటి చినుకులు మాత్రమే పడి వర్షం ఆగిపోవడంతో పాటు వాతావరణం చల్లగా మారడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. వీరవాసరం: వీరవాసరం మండలం కొణితివాడ గవరపేట గ్రామంలో ఆదివారం కన్నతల్లికి కుమార్తెలు తలకొరివి పెట్టారు. మళ్ల కృష్ణవేణి– మళ్ల సాంబమూర్తి దంపతులకు ఇద్దరు కుమార్తెలు. 2015 అక్టోబర్ 20న తండ్రి సాంబమూర్తి మరణించగా ఆయనకు కుమార్తెలు తలకొరివి పెట్టి తండ్రి మీద ఉన్న ప్రేమ, అనురాగాలను చాటుకున్నారు. ఆదివారం తల్లి కృష్ణవేణి (70) మృతి చెందారు. ఆమెకు పెద్ద కుమార్తె అరుణ, చిన్న కుమార్తె విజయ తలకొరివి పెట్టి కొడుకులు లేని లోటును తీర్చారు. కొడుకులు లేరని ఏ రోజూ మా తల్లిదండ్రులు బాధపడకుండా చూసుకున్నాం అని కుమార్తెలు తెలిపారు. కొడుకులకు ఏ విధంగానూ తీసిపోమని నిరూపించుకున్నారని గ్రామస్తులు వారిని అభినందించారు. -
యోగాతో ఆరోగ్యం
భీమవరం (ప్రకాశంచౌక్): ప్రతిఒక్కరూ యోగాను అలవాటుగా చేసుకుని శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలని జాయింట్ కలెక్టర్ టి.రాహుల్కుమార్రెడ్డి అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆదివారం భీమవరం కలెక్టరేట్ పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై యోగాసనాలు వేశారు. జిల్లావ్యాప్తంగా రెండు వారాలుగా యోగా అభ్యాస కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించామన్నారు. భీమవరంలో సుమారు 1,500 మంది యోగా కార్యక్రమంలో పాల్గొన్నారన్నారు. యోగా పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు రాజ్యసభ మాజీ సభ్యురాలు తోట సీతారామలక్ష్మితో కలిసి జేసీ ప్రశంసాపత్రాలు అందజేశారు. అలాగే రాష్ట్రస్థాయిలో జిల్లాకు ద్వితీయ స్థానం సాధించడంలో విశేష కృషి చేసిన జిల్లా అధికారులను సత్కరించారు. యోగా శిక్షకు డు, పీడీ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో యోగాసనాలు, ప్రాణాయామం, ధాన్యంపై శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. డీఆర్వో బి.శివన్నారాయణ రెడ్డి, డీఈఓ ఈ.నారాయణ, ఆయుష్ పీడీ శ్రీరామ్, జిల్లా పర్యాటక శాఖ అధికారి ఏవీ అప్పారావు తదితరులు పాల్గొన్నారు. యోగాసనాలు వేస్తున్న జిల్లా అధికారులు -
ఆటకెక్కించారు!
ఏలూరు రూరల్ : ఏలూరు డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ (డీఎస్ఏ) తిరోగమిస్తోంది. అభివృద్ధి దేవుడెరుగు.. కనీసం క్రీడాకారులకు శిక్షణ ఇచ్చేందుకు కోచ్లను సైతం నియమించలేని దుస్థితిలో కొట్టుమిట్టాడు తోంది. ఆటస్థలాలు బాగు చేసేందుకు గ్రౌండ్స్మెన్స్ను కూడా ఏర్పాటు చేసుకోలేకపోతోంది. దీంతో జిల్లాలో క్రీడా వ్యవస్థ నిరీర్యమవుతోంది. బాలబాలికలకు ఆటలపై ఆసక్తి సన్నగిల్లుతోంది. పర్యవసానంగా రాష్ట్ర, జాతీయస్థాయిల్లో జిల్లాకు ప్రాతిని ధ్యం క్రమేపీ తగ్గుతోంది. ఒకప్పుడు క్రీడా నర్సరీగా పేర్గాంచిన ఏలూరు జిల్లా ప్రస్తుతం శిక్షణ, పోటీల నిర్వహణ, పతకాల సాధనలో అట్టడుగు స్థాయికి చేరిందని సీనియర్ క్రీడాకారులు, క్రీడాభిమానులు ఆవేదన చెందుతున్నారు. స్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (శాప్) నిర్వాకం వల్ల క్రీడా సంఘాలు సైతం నిర్వీర్యమైపోతున్నాయని అంటున్నారు. తక్షణమే శాప్ కోచ్లు, గ్రౌండ్స్మెన్ల నియామకం చేపట్టాని డిమాండ్ చేస్తున్నారు. గ్రౌండ్మెన్స్ లేరు ఏలూరు ఏఎస్ఆర్ స్టేడియంలో గ్రౌండ్స్మెన్ లేరు. రెండేళ్ల క్రితం ఇద్దరు గ్రౌండ్స్మెన్స్ పదవీ విరమణ చేయగా కనీసం తాత్కాలికంగా అయినా ఎవరినీ నియమించలేదు. ఫలితంగా స్టేడియంలో ఆటస్థలాలు ఎత్తు, పల్లాలుగా మారిపోయాయి. గోతులు, రాళ్లురప్పలు, దుమ్ము, దూళితో కనిపిస్తున్నాయి. మరోపక్క చిన్నపాటి వర్షం కురిసినా స్టేడియంలో రన్నింగ్ ట్రాక్పై నీరు నిలిచి చిత్తడిగా మారుతోంది. పశువుల సంచారంతో ట్రాక్ గోతులమయంగా కనిపిస్తోంది. దీంతో ఉన్న కొద్దిమంది సాధకులు సైతం గాయాలపాలవుతున్నారు. కొన్నిసార్లు క్రీడాకారులే స్వచ్ఛందంగా గ్రౌండ్స్ను బాగు చేసుకుంటున్నారు. క్రీ‘డల్’ జిల్లాలో క్రీడా వ్యవస్థ నిర్వీర్యం కోచ్ల కొరత.. గ్రౌండ్మెన్స్ లేరు పట్టించుకోని అధికారులు కోచ్లను నియమించాలని క్రీడాభిమానుల డిమాండ్ -
●చెక్ డ్యామ్లు శిథిలం.. షట్టర్లు ఘోరం
వేలాది ఎకరాల ఆయకట్టుకు సాగునీరందించే పంట కాలువలపై చెక్ డ్యామ్లు, షట్టర్లు శిథిలావస్థకు చేరాయి. దీంతో సాగునీరు వృథాగా పోతోంది. కాళ్ల మండలంలో 10 గ్రామాలకు నీరందించే బొండాడ పంట కాలువపై ఎల్ఎన్పురం వద్ద చెక్డ్యామ్కు ఉన్న షట్టర్లు పూర్తిగా పాడయ్యాయి. అలాగే మెండి వద్ద చెక్డ్యామ్ గోడలు కూలడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇరిగేషన్ అధికారులు చర్యలు తీసుకుని చెక్డ్యామ్లను పునరుద్ధరించడంతో పాటు కొత్త షట్టర్లు ఏర్పాటుచేయాలని కోరుతున్నారు. దీనిపై ఉండి డిస్ట్రిబ్యూటర్ కమిటీ చైర్మన్ తోట ఫణిబాబును వివరణ కోరగా బొండాడ పంట కాలువను రైతుల ప్రోత్సాహంతో ప్రక్షాళన చేశామన్నారు. శిథిలావస్థకు చేరిన డ్యామ్, షట్టర్ల పునరుద్ధరణకు ప్రతిపాదనలు చేశామని చెప్పారు. – కాళ్లఎల్ఎన్పురం వద్ద షట్టర్లు ఇలా.. -
దామాషా ప్రకారం రిజర్వేషన్లు పెంచాలి
ఏలూరు (టూటౌన్): పెరిగిన జనాభాకు అనుగుణంగా ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు పెంచాలని రిజర్వేషన్ పెంపు సాధన సమితి నాయకులు కోరారు. స్థానిక కలెక్టరేట్ వద్ద ప్రైవేట్ హాలులో ఆదివారం రిజర్వేషన్ పెంపు సాధన సమితి ముఖ్య నాయకుల సమావేశం డాక్టర్ మెండెం సంతోష్ కుమార్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చి ఇన్నాళ్లు గడిచినా ఎస్సీ, ఎస్టీ జనాభా ఇరవై శాతం పైగా పెరిగినా ఇప్పటికి అదే రిజర్వేషన్న్ అమలు చేయడం చాలా అన్యాయం అన్నారు. పెరిగిన జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్న్స్ పెంచాలని ప్రైవేటు సెక్టార్లలో కూడా అమలు పరిచేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమావేశంలో ఐఆర్ఎస్ చాగంటి సంజీవ్, గంజి మధు, నేతల రమేష్ బాబు, పల్లెం ప్రసాద్, దాసరి నాగేంద్ర కుమార్, సీహెచ్ సాయిరాజ్, పొట్ల సురేష్, ఎరికిపాటి విజయకుమార్, కలపాల రాజ్కుమార్, మతి చంద్రప్రసాద్, పాము రవీంద్ర, పెరియార్ పూలే అంబేడ్కర్, ఉప్పే రాజారావు, దాసి వెంకటేశ్వర్లు, పిట్టా నాగేశ్వరావు, అద్దంకి శ్రీమణి పాల్గొన్నారు. -
పొగాకు రైతులూ.. మోసపోవద్దు
జంగారెడ్డిగూడెం: పొగాకు కంపెనీల మాటలు విని మోసపోవద్దని పొగాకు బోర్డ్ చైర్మన్ యశ్వంత్ కుమార్ రైతులకు సూచించారు. శనివారం పట్టణంలోని రెండు పొగాకు వేలం కేంద్రాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా రైతుల పొగాకుకు కంపెనీల ప్రతినిధులు ఏ విధంగా ధర ఇస్తున్నారని స్వయంగా పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో పలువురు రైతులు వారి సమస్యలను విన్నవించారు. గిట్టుబాటు ధర లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, తమ బిడ్డలను చదివించుకోవడానికి, కుటుంబ ఖర్చుల నిమిత్తం కూడా ఇబ్బందులు పడుతున్నట్లు రైతులు వివరించారు. రైతు సంఘం నాయకులు సత్రం లక్ష్మణరావు, కరాటం రెడ్డి బాబు, పరిమి రాంబాబు, రైతులు తరఫున పలు విషయాలను చైర్మన్ దృష్టికి తీసుకువెళ్లారు. రానున్న అక్టోబర్ నెలలో పొగాకు నాట్లు వేయడానికి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు చెప్పారు. గత మూడు నెలలుగా జరుగుతున్న వేలంలో కనీస గిట్టుబాటు ధర లేదన్నారు. గిట్టుబాటు ధర ఇవ్వకుంటే కరెంట్ కట్ అనంతరం పొగాకు బోర్డ్ చైర్మన్ యశ్వంత్ కుమార్ మాట్లాడుతూ రైతుల పక్షాన పొగాకు బోర్డు పనిచేస్తుందన్నారు. ప్రస్తుతం ఉన్న రూ.255 ధరను రూ.300కు పెంచడానికి పొగాకు బోర్డు రైతులతో కలిసి కృషి చేస్తుందన్నారు. రానున్న సోమవారం నుంచి రైతులు తమ పొగాకును వేలం కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు. టాక్స్ల పేరుతో పొగాకు కంపెనీలు పొగాకు కొనడం లేదని నిజానికి వాటితో మాకు సంబంధం ఏంటి అని ప్రశ్నించారు. పొగాకు కంపెనీలు రైతులకు న్యాయమైన గిట్టుబాటు ధర ఇవ్వకపోతే వారి ఫ్యాక్టరీలలో కరెంటు కూడా కట్ చేస్తామన్నారు. పొగాకు బోర్డు రైతులు బాగోగులు పట్టించుకుంటుందని రైతులు పొగాకు బోర్డు కలిసి ప్రస్తుత ఒడిదుడుకులు ఎదుర్కోవాలని సూచించారు. దేశవ్యాప్తంగా 320 మిలియన్ వర్జినియా పొగాకులో 30 శాతమే సిగరెట్లు తయారీకి ఉపయోగిస్తున్నారని, మిగిలిన 70 శాతం ఇతర దేశాలకి ఎగుమతి చేస్తున్నారని అన్నారు. ఇక ఊరుకునేది లేదని తాడోపేడో తేల్చుకుందామన్నారు. కార్యక్రమంలో పొగాకు బోర్డు ఆర్ ఎం జై సురేంద్ర కుమార్, గ్రేస్ మార్గరెట్ రైతులు పాల్గొన్నారు. -
గాలివానతో బీభత్సం
కై కలూరు/ముదినేపల్లి: పగలు ఉష్ణోగ్రతలు పెరుగుదల, రాత్రి ఈదురుగాలుల బీభత్సంతో జిల్లాలో వింత వాతావరణ పరిస్థితి నెలకొంది. శుక్రవారం అర్థరాత్రి ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం పడింది. ఏలూరు జిల్లాలో అత్యధికంగా కై కలూరు నియోజకవర్గం మండవల్లి మండలంలో అత్యధిక వర్షపాతం 58.06 మిల్లీమీటర్లు నమోదైంది. ముదినేపల్లి మండలం 52.2, కై కలూరు మండలంలో 45.2 మీల్లీమీటర్ల వర్షపాతం కురిసింది. ఈదురు గాలులకు కై కలూరు మండలం వింజరం లాకుల వద్ద వందేళ్ల భారీ వృక్షం పంటకాల్వలో పడిపోయింది. అదే విధంగా ముదినేపల్లి మండలం విశ్వనాధ్రిపాలెం రహదారిలో ఏకంగా మూడు చెట్లు రహదారిపై విరిగి పడ్డాయి. ట్రాఫిక్ స్తంభించింది. ఆక్వారైతులు మారిన వాతావరణ పరిస్థితుల్లో అప్రమత్తంగా ఉండాలని మత్స్యశాఖ నిపుణులు చెబుతున్నారు. విరిగిన విద్యుత్ స్తంభాలు బుట్టాయగూడెం: మండలంలో శుక్రవారం రాత్రి రాత్రి 9:30 గంటల సమయంలో ఒక్కసారిగా మబ్బులు కమ్మి ఈదురు గాలులు వీచి వర్షం కురిసింది. ఈదురు గాలులకు పలుచోట్ల చెట్లు విద్యుత్లైన్లపై పడి విరిగిపోయాయి. అలాగే విద్యుత్ స్తంభాలు కూడా ధ్వంసమయ్యాయి. దీనితో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. రాత్రి 2 గంటల వరకూ విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అనంతరం విద్యుత్ సిబ్బంది యుద్ధ ప్రాతిపదికన విద్యుత్ సరఫరా పునరుద్ధరణ పనులు చేపట్టారు. -
బీసీలను అణగదొక్కడమే లక్ష్యం
● కారుమూరి సునీల్ కుమార్ అరెస్టుపై ఆగ్రహ జ్వాలలు కాళ్ల: ఓటు బ్యాంకుగా వాడుకుని బీసీలను అణగదొక్కడమే లక్ష్యంగా కూటమి పాలన సాగుతుందని ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కారుమూరి సునీల్ అరెస్టుకు నిరసనగా కాళ్ల మండలం పెద అమిరం పార్టీ కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వాలు ప్రజాస్వామ్యానికి అనుకూలంగా పాలన చేయనప్పుడు ప్రతిపక్షం గొంతు విప్పుతుందన్నారు. కూటమి ప్రభుత్వం రెండేళ్లలో ప్రజలకు ఇచ్చిన హామీలు పక్కనపెట్టి ఎన్ని దౌర్జన్యాలు, అరాచకాలు, అక్రమ అరెస్టులు చేస్తున్నారో రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారని చెప్పారు. ఇప్పటికే వైఎస్సార్సీపీ నాయకులు చాలామందిని అరెస్టు చేసి ఇబ్బంది పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు కారుమూరి సునీల్ కూడా అరెస్ట్ చేయడం చాలా దారుణం అని అన్నారు. బీసీలను ఓటు హక్కుగా భావించడం తప్ప చంద్రబాబు నాయుడు బీసీలకు చేసింది ఏమీ లేదని గుర్తు చేశారు. బీసీలంతా ఆలోచించాలని గత పాలనకు ప్రస్తుత పాలనకు తేడా గమనించాలని కోరారు. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి బీసీలకు పెద్దపీట వేశారని చేయూత పేరుతో బీసీ మహిళలకు ఎంతో సాయం చేశారని గుర్తు చేశారు. పార్టీ జిల్లా బీసీ సెల్ అధ్యక్షులు కొండేటి శివకుమార్, బీసీ నాయకులు గేదెల అప్పారావు, బడుగు బాలాజీ, జిల్లా పార్టీ ఉపాధ్యక్షుడు పెనుమత్స దుర్గాప్రసాద్ రాజు, ఆకివీడు మండల పార్టీ అధ్యక్షులు నంద్యాల సీతారామయ్య మాట్లాడుతూ ఏ తప్పు చేయకపోయినా కారుమూరి నాగేశ్వరరావు కుటుంబాన్ని టార్గెట్ చేసి ఆయన కుమారుడు సునీల్ను అక్రమ అరెస్టు చేయటం సరి కాదన్నారు. బీసీలను ఎంత అణగదొక్కాలని చూస్తే అంత వేగంగా బీసీలు అంత ఏకమై కూటమి ప్రభుత్వాన్ని కూల్చడానికి ఉద్యమం చేస్తామన్నారు. ఎలాంటి ఆధారాలు లేకపోయినప్పటికీ మద్యం కుంభకోణం జరిగిందని సాకు చూపుతూ బీసీలను అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారని వాపోయారు. కార్యక్రమంలో కాళ్ళ, ఉండి మండల పార్టీ అధ్యక్షులు గణేశ్న రాంబాబు, పెనుమత్స ఆంజనేయరాజు, గుండు నాగేశ్వరరావు, చేకూరి నరేంద్ర రాజు, బీసీ నాయకులు కట్ట వెంకటరావు, గోళ్ళ ప్రభాకర్, పార్టీ నాయకులు పాల్గొన్నారు. -
వ్యవసాయ అవసరాలకు వినియోగించాలి
ఉండి: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు అందించిన పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ ఆర్ధిక సహాయాన్ని రైతులు వ్యవసాయావసరాల కోసం వినియోగించుకోవాలని జాయింట్ కలెక్టర్ రాహూల్కుమార్ రెడ్డి అన్నారు. శనివారం మండలంలోని ఎన్నార్పీ అగ్రహారం కృషి విజ్ఞాన కేంద్రంలో పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ నిధుల విడుదల ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన, రైతులకు చెక్ అందజేత కార్యక్రమాలు నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 1,88,987 మంది రైతులకు రూ.68.93 కోట్లు అందజేసినట్లు తెలిపారు. 2026–27 ఆర్థిక సంవత్సరానికి మొత్తం రూ.7 వేలు రైతుల ఖాతాల్లో జమ చేశారన్నారు. ఎన్జీ రంగా యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ డాక్టర్ పీవీ సత్యనారాయణ మాట్లాడుతూ రైతులు రసాయన ఎరువులు, పురుగు మందుల వినియోగాన్ని తగ్గించి జీవ ఎరువులు, పచ్చిరొట్ట ఎరువుల వాడకాన్ని పెంచాలని సూచించారు. కార్యక్రమంలో వ్యవసాయాధికారి జెడ్ వెంకటేశ్వరరావు, ఎన్జీ రంగా వర్సిటీ డైరెక్టర్ డాక్టర్ జీ రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. -
సామాన్యులపై పోలీసు ప్రతాపం
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పోలీసు వ్యవస్థ గాడి తప్పుతుంది. పోలీస్ ట్రీట్మెంట్ పేరుతో కొందరు ఎస్సైలు, సీఐలు తరుచూ వివాదాలకు కేరాఫ్ అడ్రస్గా మారుతున్నారు. చిన్నపాటి కేసుల్లో ఇష్టానుసారంగా చితకబాదిన ఘటనలు జిల్లాలో అనేకం ఉన్నాయి. పొలిటికల్ అండతో పోస్టింగులు వేయించుకుని ఏకపక్షంగా వ్యవహరిస్తూ తరుచూ కొందరు విచారణలు ఎదుర్కొంటుండగా మరికొందరు వీఆర్లో ఉంటున్నారు. గత ఏడాది కాలంలో జిల్లాలో పోలీసుల వేధింపులతో ఇద్దరు యువకులు ఆత్మహత్య చేసుకోగా ఏలూరులో మైనర్ బాలుడిని పోలీసులే కొట్టి చంపారని అభియోగాలు ఎదుర్కొంటున్నారు. మొత్తంగా విజయవాడ కృష్ణలంక పోలీస్స్టేషన్ సంఘటనతో ఉమ్మడి జిల్లా పోలీసుల తీరు మరోసారి చర్చనీయాంశంగా మారింది. ప్రజా ప్రతినిధుల అండతో అత్యుత్సాహం మైనర్ బాలుడిపై దాడి, దొంగతనం కేసులో యువకుడిని స్టేషన్కు తీసుకురావడం, ఫిర్యాదుపై పూర్తి స్థాయిలో విచారించకుండా ఇష్టానుసారంగా కొట్టడంతో పశ్చిమ పోలీసుల వైఖరి వివాదాస్పదంగా మారింది. పూర్తిగా కూటమి ప్రజాప్రతినిధుల కనుసన్నల్లో పోస్టింగులు దక్కించుకుంటున్న ఎస్సైలు, సీఐలు ప్రజాప్రతినిధులు చెబితే అడ్డగోలుగా అత్యుత్సాహం చూపుతున్నారు. సమస్య వస్తే ప్రజాప్రతినిధే చూసుకుంటారనే రీతిలో వ్యవహరిస్తూ కొందరు సీఐలు వివాదాస్పదంగా మారుతున్నారు. గతేడాది మార్చిలో ఏలూరు చేపలతూము ప్రాంతానికి చెందిన బంగారు యశ్వంత్ బైక్ దొంగతనం చేశాడనే అభియోగంతో ఏలూరు సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తరువాత రెండు రోజులకు ఒంటిపై గాయాలతో మార్చురీలో శవమై తేలాడు. అధికార పార్టీ నేతలు రంగ ప్రవేశం చేసి హడావుడి చేయడంతో పోలీసుల తీరుపై తీవ్ర ఆరోపణలు వచ్చినా జిల్లా అధికారులందరికీ తెలిసే సంఘటన జరగడంతో వ్యవహారం పూర్తి స్థాయిలో వెలుగులోకి రాని పరిస్థితి. అలాగే కొద్ది నెలల క్రితం బుట్టాయగూడెం ఎస్సై దుర్గా ప్రసాద్ జంగారెడ్డిగూడెంకు చెందిన అఖిల్ అనే యువకుడిని రెడ్డిగణపవరంలో జరిగిన తిరునాళ్ళ వద్ద పోలీస్ ట్రీట్మెంట్ ఇచ్చారు. ఈ ఘటనలో అఖిల్ చేతులు విరగడంతో యువకుడి బంధువులు ఎస్పీకి ఫిర్యాదు చేయగా.. ఎస్సైను వీఆర్కు పంపి వ్యవహారాన్ని ముగించేశారు. ఉమ్మడి జిల్లాలో ఖాకీల పనితీరుపై వివాదం ఆకివీడు, నిడమర్రులో పోలీసుల వేధింపులకు యువకుల ఆత్మహత్య బుట్టాయగూడెంలో యువకుడి చేయి విరగ్గొట్టిన ఎస్సై జిల్లాలో తరచూ ఈ తరహా ఘటనలు గతేడాది ఏలూరులో బాలుడిని కొట్టి చంపారని అభియోగం -
పోలీస్ పిల్లల భవిష్యత్కు బాసట
ఏలూరు టౌన్: ఏలూరు జిల్లా పోలీస్ సిబ్బంది పిల్లల ఉన్నత భవితకు బాటలు వేస్తూ విద్యలో అత్యుత్తమ ప్రతిభ చూపిన విద్యార్థులకు ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ చేతులమీదుగా మెరిట్ స్కాలర్షిప్ అందజేశారు. 2025–26 విద్యాసంవత్సరానికి గానూ మినిస్టీరియల్ స్టాఫ్, పోలీస్ సిబ్బంది, హోంగార్డు పిల్లలు 61మంది విద్యార్థులకు రూ.5.31 లక్షల నగదు బహుమతులు అందజేశారు. పదవ తరగతి, ఇంటర్మీడియెట్, డిగ్రీ పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులను జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయానికి ప్రత్యేకంగా ఆహ్వానించి, నగదు బహుమతులు అందజేయటంతోపాటు అభినందించారు. పోలీస్ ప్రధాన కార్యాలయ సూపరింటెండెంట్ నాగేశ్వరరావు, ఏఆర్ డీఎస్పీ చంద్రశేఖర్, ఆర్ఐ పవన్కుమార్, ఆర్ఎస్ఐలు వెంకటేష్, అమరేశ్వరరావు, పోలీస్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు ఆర్.నాగేశ్వరరావు, పోలీస్ అధికారులు, సిబ్బంది, హోంగార్డులు, విద్యార్థులు వారి తల్లిదండ్రులు హాజరయ్యారు. ద్వారకాతిరుమల: చినవెంకన్న ఆలయం శనివారం భక్తులతో పోటెత్తింది. స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు క్షేత్రానికి తరలివచ్చారు. ఉదయం నుంచే ఆలయంలో దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. ఆలయ ప్రాంగణం, దర్శనం క్యూలైన్లు, ప్రసాదాలు విక్రయ కేంద్రాలు, అన్నదాన సదనం, కల్యాణకట్ట తదితర విభాగాలు భక్తులతో రద్దీగా మారాయి. అయితే గత వారంతో పోలిస్తే ఈ వారం భక్తుల రద్దీ కొంత మేర తగ్గింది. వేసవి సెలవులు ముగియడంతో ఇతర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల సంఖ్య తగ్గడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. అయినప్పటికీ శనివారం కావడంతో భక్తుల రాకపోకలు అధికంగానే కొనసాగాయి. దాంతో క్షేత్రం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. పెదపాడు: ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన పెదపాడు మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఏపూరు గ్రామానికి చెందిన పామర్తి శ్రీనివాసరావు ఇంటికి 19వ తేదీ సాయంత్రం 5 గంటల సమయంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. సరిచేసేందుకు లైన్మ్యాన్ కరంగుల నాగేశ్వరరావుతో కలిసి మనురాజు సూరిబాబు (48) వెళ్లాడు. విద్యుత్ మరమ్మతుల్లో భాగంగా నిచ్చెన సహాయంతో విద్యుత్ స్తంభం ఎక్కి మరమ్మతులు చేస్తుండగా సూరిబాబు నిచ్చెనపైనుంచి కింద పడి తలకు గాయం కావడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి అనంతరం మెరుగైన వైద్యపరీక్షల నిమిత్తం ఆంధ్రా ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో సూరిబాబు మృతి చెందాడు. అతడి భార్య ఫిర్యాదు మేరకు ఎస్సై ఆర్ శ్రీను కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఏలూరు (ఆర్ఆర్పేట): విద్యార్థులను తరలించే సమయంలో డ్రైవర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించేది లేదని మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్ ఎన్డీ విఠల్ అన్నారు. ఏలూరు డీటీసీ కార్యాలయంలో ఉప రవాణా కమిషనర్ షేక్ కరీమ్ ఆదేశాల మేరకు శనివారం నగరంలోని పాసింజర్ ఆటో యూనియన్ డ్రైవర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యంగా ఆటోల్లో విద్యార్థులను పరిమితికి మించి తరలించి, పిల్లల ప్రాణాలతో చెలగాటమాడటం చట్టవిరుద్ధమని, అటువంటి డ్రైవర్లపై కేసులు నమోదు చేయడంతో పాటుగా ఆటోను సీజ్ చేస్తామని విఠల్ హెచ్చరించారు. మరమ్మతులు ఉన్న ఆటోల్లో విద్యార్థులను తరలించవద్దని, డ్రైవర్ ఇరువైపులా ఎవరిని అనుమతించరాదని, మరీ ముఖ్యంగా డ్రైవర్లు మద్యం సేవించి వాహనం నడపరాదన్నారు. ప్రతి ఆటో ఫిట్నెస్ సర్టిఫికెట్ కలిగి ఉండాలని, డ్రైవింగ్ లైసెన్స్ లేకపోవడం, యూనిఫాం ధరించకపోవడం, రహదారి భద్రతా నియమాలను పాటించకపోవడం నేరమన్నారు. సమావేశంలో వాహన తనిఖీ అధికారులు, ఎన్.నెహ్రు, డీ.ప్రజ్ఞ, ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు. -
సునీల్ అరెస్టు బీసీలపై కక్ష సాధింపే
మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు పాలకొల్లు సెంట్రల్: కూటమి పాలన అరాచకాలను ప్రశ్నిస్తుందన్న అక్కసుతోనే కారుమూరి సునీల్ కుమార్ను అరెస్టు చేశారని మాజీ ఎమ్మెల్సీ శేషుబాబు మండిపడ్డారు. డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ఇలా కేసులు పెట్టి ప్రతిపక్షాల నోరు నొక్కాలని చూస్తుందన్నారు. ఎలాంటి కేసులు బనాయించినా ప్రభుత్వ తీరును ఎండగడతామని కేసులకు బెదిరేది లేదన్నారు. ప్రజాస్వామ్యంలో మాట్లాడే స్వేచ్ఛ లేదా అని ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ నాయకులను ఏదో ఒకరకంగా ఇరికించాలనే ఉద్దేశంతో మద్యం స్కాం అంటూ కట్టుకథలు అల్లుతూ బీసీ నాయకులను టార్గెట్ చేస్తున్నారన్నారు. లాకప్ డెత్లు, చిన్నారుల మిస్సింగ్ కేసులు చేధించలేని కూటమి నేతలు ప్రజల నుంచి తమ తప్పులను కాపాడుకోవడానికి ఇలాంటి కేసుల్లో ఇరికించి పైశాచికానందం పొందుతున్నారన్నారు. భీమవరం: కారుమూరి సునీల్కుమార్ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నట్లు దళిత ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు గంటా సుందరకుమార్ అన్నారు. శనివారం భీమవరం 31వ వార్డు దళిత ఐక్యవేదిక జిల్లా ముఖ్యనాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మాజీమంత్రి కారుమూరి నాగేశ్వరరావును టార్గెట్ చేయడంలో భాగంగానే సునీల్కుమార్ను అక్రమంగా అరెస్ట్ చేశారన్నారు. -
రొయ్యకు రెస్ట్
సాక్షి, భీమవరం: రేయింబవళ్లు చెరువుల్ని కంటికి రెప్పలా కాచుకుని సాగు చేస్తుంటే.. మేత ధరలు పెంచి, రొయ్య రేట్లు తగ్గించి ఫీడ్, ప్రాసెసింగ్, ఎక్స్పోర్టర్స్ సిండికేట్ మా కష్టాన్ని గద్దలా తన్నుకుపోతోంది. దోపిడీని అడ్డుకోవాలన్న మా గోడు చంద్రబాబు ప్రభుత్వం చెవికెక్కడం లేదు. నష్టాలతో సాగలేక సాగుకు సెలవు తప్పదంటున్నారు ఆక్వా రైతులు. స్వచ్ఛంద విరామం వైపు అడుగులు వేస్తున్నారు. జిల్లాలోని పలుచోట్ల రైతులు చెరువులను ఎండగట్టి పంట విరామం ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తున్నారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని 2.63 లక్షల ఎకరాల ఆక్వా చెరువులకు 60 శాతం విస్తీర్ణంలో రొయ్యలు సాగవుతున్నాయి. ఏటా దాదాపు మూడు లక్షల టన్నుల రొయ్యల ఉత్పత్తితో జిల్లా రాష్ట్రంలో మొదటిస్థానంలో ఉంది. దోపిడీతో విలవిల రెండేళ్లుగా ఆక్వా సిండికేట్ ఏకపక్షంగా మేత ధరలు పెంచి, రొయ్య రేట్లు తగ్గించి రైతుల కష్టాన్ని కాజేస్తున్నారు. సాధారణంగా వేసవి ఉష్ణోగ్రతలు వనామీ సాగుకు అనుకూలంగా ఉంటాయి. పట్టుబడులు మొదలై మార్కెట్లోకి రొయ్యలు వచ్చే సమయంలో కౌంట్ ధరలు తగ్గించేస్తున్నారు. నెల రోజుల క్రితం వరకు కిలోకు వంద కౌంట్ రూ.265 ఉన్న ధరను రూ.230కు తగ్గించేశారు. మిగిలిన అన్ని కౌంట్ల ధరలు కిలోకు రూ.30 నుంచి రూ.50 వరకు కోత పెట్టారు. రొయ్య ధరలు పెంచాలని డిమాండ్ చేస్తూ జిల్లా అంతటా రైతులు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలిపారు. రైతుల ఆందోళనలను లెక్కచేయక ఫీడ్ ప్లాంట్లు మేత రేట్లను టన్నుకు రూ.12 వేల నుంచి రూ.14 వేలు వరకు పెంచేశాయి. ఎకరాకు రెండున్నర టన్నుల మేత వినియోగిస్తే ధరల పెంపుతో రైతులపై రూ.35 వేలు వరకు అదనపు భారం పడుతోంది. టన్ను వంద కౌంట్ రొయ్యల ఉత్పత్తికి రూ.2.6 లక్షలు ఖర్చయితే రైతుకు చేతికందుతోంది. రూ.2.3 లక్షలు లోపే ఉంటోంది. ఈ మేరకు టన్ను రొయ్యల ఉత్పత్తికి రైతులు రూ.30 వేలు నష్టపోతున్నారు. రేయనక పగలనక, ఎండనక వాననక చెరువుల్ని కంటికి రెప్పల కాచుకుంటే చివరికి చేతి చమురు వదులుతోందని వారు వాపోతున్నారు. మూడు దశాబ్దాలుగా ఆక్వా కల్చర్లో ఉన్నాను. ఎప్పుడూ ఇంత దారుణమైన పరిస్థితి లేదు. ఇష్టానుసారం రొయ్య రేట్లు తగ్గించి మేత ధరలు పెంచేస్తున్నారు. గత ప్రభుత్వంలో ధరలు నియంత్రణలో ఉండేవి. ఇప్పుడు అడ్డగోలుగా రైతుల కష్టాన్ని దోచేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. సంఘాలతో సంబంధం లేకుండా స్వచ్ఛందంగా విరామం పాటిస్తున్నాం. వి.గోపాలకృష్ణరాజు, లంకలకోడేరు కౌంట్ రేట్లు దిగువకి.. మేత ధరలు ౖపైపెకి సంక్షోభంలో ఆక్వా సాగు సిండికేట్ దోపిడీని అడ్డుకోని చంద్రబాబు సర్కారు సాగు చేయలేక స్వచ్ఛంద విరామం వైపు అడుగులు పంట విరామంపై పాలకొల్లులో ఫ్లెక్సీలు ఏర్పాటు మేత ధరలు తగ్గించాలని తాము రోడ్లెక్కి ఆందోళనలు చేస్తుంటే, రైతు ప్రతినిధుల ముసుగులో టీడీపీకి చెందిన కొందరు ధరల పెంపునకు అంగీకారం తెలపడాన్ని రైతులు తప్పు పడుతున్నారు. రూపాయి పెంపును సహించేది లేదని స్పష్టం చేస్తున్నారు. ముడిసరుకు ధరలు పెరిగాయని మేత ధరలు పెంచినప్పుడు, ముడిసరుకులు ధరలు తగ్గినప్పుడు మేత ధరలు ఎందుకు తగ్గించడం లేదని ప్రశ్నిస్తున్నారు. సిండికేట్ మొత్తం టీడీపీ చెందిన వారే కావడంతో చంద్రబాబు ప్రభుత్వం కావాలనే తమ గోడు పట్టించుకోవడం లేదంటున్నారు. నష్టాల సాగు చేయడం కంటే కొంత కాలం విరామం మేలన్న ఆలోచనలో ఉన్నారు. ఇప్పటికే జిల్లాలోని పాలకొల్లు, నరసాపురం తదితర ప్రాంతాల్లో కొందరు రైతులు చెరువులను ఎండగట్టి పంట విరామం పాటిస్తున్నట్టు ఫ్లెక్సీలు ఏర్పాటుచేస్తున్నారు. ప్రస్తుతం సాగులో ఉన్న చెరువుల్లో పట్టుబడి పూర్తయ్యాక పంట విరామానికి వెళ్లాలని కొందరు, ప్రత్యామ్నాయంగా చేపలు సాగు చేయాలని మరికొందరు భావిస్తున్నారు. కిలో వంద కౌంట్ రొయ్యల ఉత్పత్తికి రూ.260 ఖర్చయితే రైతులకు వస్తుంది రూ.230 మాత్రమే. కిలోకు రూ.30 చొప్పున టన్నుకి రూ.30 వేలు నష్టపోతున్నాం. మేత ధరల పెంచేయ్యడంతో ఈ నష్టం మరింత పెరుగుతుంది. మేం కష్టాలకోర్చి సాగుచేసి సిండికేట్ను పెంచుతున్నట్టుంది. అందుకే పంట విరామం పాటించాలని నిర్ణయించుకున్నాను. సతీష్, ఆక్వా రైతు, మేడపాడు -
పర్యావరణ పరిరక్షణ చర్యలు భేష్
ద్వారకాతిరుమల: ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి (ఏపీపీసీబీ) చైర్మన్ డాక్టర్ పి.కృష్ణయ్య (రిటైర్డ్ ఐఏఎస్) శనివారం ఉదయం ద్వారకాతిరుమల క్షేత్రంలో పర్యటించారు. ముందుగా ఆయన సతీసమేతంగా స్వామి, అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు జరుపుకున్నారు. అనంతరం అర్చకులు, పండితుల నుంచి వేద ఆశీర్వచనాన్ని పొందారు. ఆ తరువాత కృష్ణయ్య కొండపైన దేవస్థానం గోసంరక్షణశాలను, ఆ ప్రాంతంలో ఏర్పాటు చేసిన గోబర్ధన్ 1.0 టీపీడీ సామర్థ్యం గల ప్లాంట్ను పరిశీలించారు. అలాగే కేశఖండనశాలలో వినియోగించిన వ్యర్థ జలాలను కొమ్ముగూడెంలోని దేవస్థానం తోటల్లో వినియోగిస్తున్న విధానాన్ని, అన్నదానానికి ఉపయోగించిన కూరగాయలు, ఆకుల వ్యర్థాలతో 500 కిలోల సామర్థ్యం గల స్మార్ట్ కంపోస్టింగ్ యంత్రం ద్వారా ఎరువు తయారీ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్నతిరుపతి క్షేత్రంలో పర్యావరణ పరిరక్షణ, మురుగునీటి నిర్వహణ, వ్యర్థాల నిర్వహణలో దేవస్థానం తీసుకుంటున్న చర్యలు ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. ఈ విధానాలను భవిష్యత్తులోనూ కొనసాగించాలని ఆలయ ఈఓ వేండ్ర త్రినాధరావు, ఈఈ డీవీ భాస్కర్లకు ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఆలయ డీఈఓ వై.భద్రాజీ, ఏఈఓ ఐ.రమణరాజు, ఎలక్ట్రికల్ డీఈ టి.సూర్యనారాయణ తదితరులున్నారు. -
పరిశోధనలు సమాజానికి ఉపయోగపడాలి
తాడేపల్లిగూడెం: విద్యార్థులు సమాజ అవసరాలకు ఉపయోగపడే పరిశోధనలు చేయాలని జాతీయ జలజీవన్ మిషన్ డైరెక్టర్ అశోక్బాబు కోరారు. ఏపీ నిట్లో శనివారం ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయన విద్యార్థులతో మాట్లాడారు. జలశక్తి మంత్రిత్వశాఖ అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాల గురించి విద్యార్థులకు తెలిపారు. జలవనరుల సంరక్షణ, సుస్థిర అభివృద్ధి , సాంకేతిక ఆవిష్కరణల ప్రాధాన్యంపై మాట్లాడారు. మల్టీచానల్ ట్యూబ్యులర్ సిరామిక్ మెంబ్రేన్ను ఆయన పరిశీలించారు. ఈ మెంబ్రేన్ను స్వదేశీ , తక్కువ వ్యయంతో లభించే ముడిపదార్థాలను ఉపయోగించి తయారుచేశామని కెమికల్ ఇంజనీరింగ్ అధిపతి వినోద్కుమార్రాజా తెలిపారు. దీంతో మురుగునీరు, పారిశ్రామిక వ్యర్థ జలాలను శుద్ధి చేయవచ్చన్నారు. నీటిశుద్ధి, నీటి పునర్వియోగం, జలవనరుల సంరక్షణకు ఈ సాంకేతికత ఉపయోగపడుతుందన్నారు. నిట్ డీన్లు రవికిరణ్శాస్త్రి, వి.సందీప్ తదితరులు అశోక్బాబును సత్కరించారు. భీమవరం: ప్రైవేట్, కార్పొరేట్, అన్ ఎయిడెడ్ విద్యాసంస్థల్లో ఫీజుల వివరాలు అందరిరికి కనిపించే విధంగా బోర్డులు పెట్టాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ అధ్యర్యంలో శనివారం జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి పి ప్రసాద్ మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటికే అనేక ప్రైవేట్ విద్యాసంస్థలు అత్యధిక ఫీజులు వసూలు చేస్తున్నాయన్నారు. ప్రభుత్వ నిబంధనలు అతిక్రమించి అధిక ఫీజులు వసూలు చేసే విద్యాసంస్థలపై విద్యాశాఖ చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వం నిర్ణయించిన ఫీజుల వివరాలను అన్ని ప్రైవేట్ విద్యాసంస్థల్లో నోటీస్ బోర్డులు ఏర్పాటుచేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. పుస్తకాలు, విద్యాసామాగ్రి అక్రమ వ్యాపారానికి అడ్డుకట్ట వేయాలని కోరుతూ విద్యాశాఖ ఏడీ ఎన్ సత్యనారాయణకు వినతిపత్రాన్ని అందచేశారు. -
యోగాతో ఆనందకర జీవనం
కై కలూరు: ప్రపంచ దేశాలకు భారతదేశం అందించిన అత్యంత అరుదైన కానుక యోగ. శారీరక, మానసిక, ఆధ్యాత్మిక, ఆనందకర జీవనం యోగాతో సిద్ధిస్తాయి. ఈ ఏడాది ‘ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా’ అనే నినాదంతో 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని 200 దేశాలు ఆదివారం నిర్వహిస్తున్నాయి. ఏలూరు జిల్లాలో కలెక్టర్ ఆదేశాలతో గ్రామ పంచాయతీలు, వార్డు సచివాలయాలు, పాఠశాలలు, పార్కులలో సామూహిక యోగ ప్రదర్శనలు నిర్వహించనున్నారు. మాస్టర్ ట్రైనర్లతో శిక్షణ పొందిన వాలంటీర్లు వేదికల వద్ద ఉమ్మడి యోగా ప్రొటోకాల్ ప్రకారం శిక్షణ ఇవ్వనున్నారు. సమాజంలో ప్రతి ఐదుగురు వ్యక్తులలో ఒకరు యోగాసనాలు అలవాటు చేసుకుంటున్నారని తాజా అధ్యాయనాల్లో తేలింది. ఆధునిక యుగంలో మానవుడు అనేక రకాల భావావేశాలు, ఒత్తిడులు, పనుల తొందర వల్ల టెన్షన్ భారిన పడుతున్నాడు. వివిధ రకాల మందుల వల్ల సైడ్ ఎఫెక్టులకు గురవుతున్నాడు. నేటి యాంత్రిక యుగంలో ఇది ఒక విషవలయంగా మారింది. ప్రాచీన కాలంలో పతంజిలి, కపిలుడు, చరకుడు, అధునిక యుగంలో రమణమహర్షి, అరవింద యోగి, రామకృష్ణ పరమహంస, శివానంద, యోగానంద, ఇటీవల కాలంలో బాబారామ్దేవ్, ఆర్ట్ ఆఫ్ లివింగ్ గురువు రవిశంకర్ యోగ అవశ్యకతను చాటిచెబుతున్నారు. యోగం అంటే.. యోగం అంటే కలయిక, కలుపుట అనే అర్థం. ఇది యుజ్ అనే సంస్తృత మూలధాతువు నుంచి ‘యోగా’ అనే పదం ఏర్పడింది. శరీరం, మనసు, ఆత్మలను కలపడం దీని ప్రత్యేకత. యోగంలో అష్టాంగ మార్గలైన యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహారం, ధారణ, ధ్యానం, సమాధి వంటి ఎనిమిది మార్గాలు ముఖ్యమైనవి. యోగ దృష్టిలో మానవ శరీరాన్ని 5 కోశాలుగా భావిస్తారు. వీటిలో అన్నమయకోశం, ప్రాణమయకోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయకోశం ఉన్నాయి. ఇక అందరూ ఖచ్చితంగా పాటించే సూర్య నమస్కారాల్లో ప్రణామాసనము, హస్త ఉత్థానాసనము, పాదహస్తాసనము, అశ్వసంచలనాసనము, పర్వతాసనము, భుజంగాసనము, సాష్టాంగాసనము ఎంతో ప్రాచూర్యం పొందాయి. మన యోగా చరిత్ర గొప్పది వయసు పెరిగే కొద్దీ వృద్ధులు శారీరకంగా చురుగ్గా, మానసికంగా ఉల్లాసంగా, స్వతంత్రంగా ఉండేందుకు యోగా ఎలా సహాయపడుతుందో వివరించడమే 2026 యెగా డే ముఖ్య ఉద్దేశం. 2014 సెప్టెంబరు 27న భారత ప్రధాని నరేంద్రమోదీ ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జూన్ 21న జరుపుకొనుట గురించి ప్రతిపాదన చేశారు. ఈ తీర్మానానికి 193 ఐరాస ప్రతినిధులలో 175 మంది మద్దతు ఇచ్చారు. డిసెంబర్ 2014లో తీర్మానాన్ని ఆమోదించారు. 2015 జూన్ 21 న, మొదటి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా జరుపుకున్నారు. జూన్ 21 అనేది ఉత్తరార్ధగోళంలో అత్యంత పొడవైన పగటి సమయం ఉన్న రోజు. అందుకే ఈ రోజును యోగా దినోత్సవంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపాదించగా, ఐక్యరాజ్యసమితి ఆమోదించింది. యోగ శాస్త్రంలో అత్యంత ముఖ్యమైనది ధ్యాన సాధన. ‘శ్వాస మీద ధ్యాస’ ద్యాన సాధన ద్వారా మనస్సు పూర్తిగా విశ్రాంతి పొంది ఎక్కువగా ప్రాణ శక్తి శరీరానికి అందుతుంది. మనస్సులో ఏర్పడే వ్యతిరేకమైన ఆలోచనలు భయాలు, ఆందోళనలు, ఒత్తిడిల నుంచి తేలికగా బయటపడవచ్చు. ఎన్నో దీర్ఘకాలిక రోగాలు తగ్గి ఆయుష్షు ప్రమాణం పెరుగుతుంది. –ఉండ్రమట్ల సాంబశివరావు, ధ్యానరత్న, యోగా గురువు, పతంజిలి యోగా ప్రచార పరిషత్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు నేడు 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం ఈ ఏడాది ‘ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా’ నినాదం జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు కలెక్టర్ ఆదేశాలతో యోగా వేదికలకు ఏర్పాట్లు పూర్తి -
పారామెడికల్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
భీమవరం (ప్రకాశంచౌక్): జిల్లా, ప్రాంతీయ, సామాజిక ఆసుపత్రులలో ఖాళీగా ఉన్న పారామెడికల్, సహాయక సిబ్బంది పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఆసుపత్రుల సేవల సమన్వయ అధికారి పి.సూర్యనారాయణ తెలిపారు. ల్యాబ్ టెక్నిషియన్, ఎలక్ట్రిషియన్, డార్క్ రూమ్ అసిస్టెంట్, థియేటర్ అసిస్టెంట్, ల్యాబ్ అటెండెంట్, జనరల్ డ్యూటీ అటెండెంట్, పోస్ట్మార్టం అసిస్టెంట్ పోస్టులకు కాంట్రాక్ట్/ అవుట్ సోర్సింగ్ పద్ధతిలో డిస్ట్రిక్ట్ సెలెక్టన్ కమిటీ ద్వారా భర్తీ చేయుటకుగాను దరఖాస్తులు కోరుతున్నామన్నారు. జిల్లా ఆసుపత్రి సేవల సమన్వయ అధికారి కార్యాలయం, కలెక్టర్ ఆఫీసు క్యాంపస్, భీమవరంలో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. కొయ్యలగూడెం: మితిమీరిన వేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్ నిండు ప్రాణాన్ని బలిగొంది. నరసన్నపాలెం వై జంక్షన్ బైనేరు కొత్తవంతెన మధ్య శనివారం మధ్యాహ్నం సంభవించిన ప్రమాదంలో అడప రమేష్ (45) ప్రాణాలు కోల్పోయాడు. ఎస్సై వి చంద్రశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం రామానుజపురం గ్రామానికి చెందిన రమేష్ బైక్ పై జంగారెడ్డిగూడెంకి వెళ్లి తిరిగి వస్తుండగా వ్యాన్ వేగంగా వచ్చి ఢీకొంది. దీంతో రమేష్ తలకి, ఛాతికి తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. రమేష్కి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్య వెంకటలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చెప్పారు. -
సాయికృష్ణ కుటుంబానికి పరామర్శ
భీమవరం : పోలీసుల వేధింపులతో మృతిచెందిన విజయవాడ కృష్ణలంకకు చెందిన కాపు యువకుడు గాదె సాయికృష్ణ కుటుంబసభ్యులను కాపు సంఘం జిల్లా అధ్యక్షుడు, వైఎస్సార్సీపీ భీమవరం నియోజకవర్గ సమన్వయకర్త చినమిల్లి వెంకటరాయుడు శనివారం పరామర్శించారు. కృష్ణలంకలోని సాయికృష్ణ నివాసానికి వెళ్లి మృతుడు తల్లి విజయలక్ష్మి, ఇతర కుటుంబసభ్యులను ఓదార్చారు. అనంతరం వెంకటరాయుడు మాట్లాడుతు కూటమి ప్రభుత్వ హయాంలో రెడ్బుక్ రాజ్యాంగం అమలవుతున్నందున అన్నివర్గాల ప్రజలకు రక్షణ కరువైందన్నారు. సాయికృష్ణ మృతిపై సీబీఐతో విచారణ చేసి నిదింతులను కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భీమవరం (ప్రకాశంచౌక్) : రెవెన్యూ శాఖ అధికారులు, సిబ్బంది రెవెన్యూ చట్టాలపై పూర్తి అవగాహన కలిగి ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలని జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి సూచించారు. రెవెన్యూ డే సందర్భంగా శనివారం కలెక్టరేట్ పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రెవెన్యూ సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేసిన జాయింట్ కలెక్టర్, రెవెన్యూ శాఖలో ప్రతి ఫైలు ఒక జీవితంతో ముడిపడి ఉంటుందని, అందువల్ల ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి జాగ్రత్తగా పరిష్కరించాలని అన్నారు. ఉద్యోగులందరూ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ఈ సందర్భంగా నరసాపురం కలెక్టర్ కార్యాలయంలో ఏవోగా పనిచేస్తున్న పెద్దిరాజు, కలెక్టరేట్లో ఎలక్షన్ డీటీగా పనిచేస్తున్న శ్రీనివాస్, ల్యాండ్ సూపరింటెండెంట్ భాను, ఆఫీస్ సబార్డినేట్ భారతిని జాయింట్ కలెక్టర్ దుశ్శాలువాలతో సత్కరించారు. భీమవరం (ప్రకాశంచౌక్) : భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) –2026 కార్యక్రమం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోందని కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని ఓటర్ల వివరాల సేకరణ, పరిశీలన, సవరణల కోసం ఈ నెల 15వ తేదీ నుంచి బీఎల్ఓలు ఇంటింటి సందర్శనలు నిర్వహిస్తున్నారని వెల్లడించారు. జిల్లాలో నియమితులైన బీఎల్ఓలందరికీ ప్రత్యేక శిక్షణ అందించి, ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దీంతో ఇప్పటివరకు 30.20 శాతం ఫారాల పంపిణీ పూర్తయిందని పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా ఓటర్ల వివరాల సేకరణ, ధ్రువీకరణ, సవరణ ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు చెప్పారు. -
గూడెంలో వందేభారత్కు హాల్ట్
తాడేపల్లిగూడెం: త్వరలో గూడెం రైల్వే స్టేషన్లో వందేభారత్ రైలుకు హాల్టు కల్పించనున్నామని కేంద్ర పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు. శనివారం ఆయన అమృత్ భారత్ నిధులతో జరుగుతున్న పనులను ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాసుతో కలిసి పరిశీలించారు. ఈ పనుల వల్ల గూడెం రైల్వే స్టేషన్కు మహర్దశ పడుతుందన్నారు. అమృత్ భారత్ పథకంలో గూడెం స్టేషన్కు రూ.46.22 కోట్లు, గతిశక్తి పథకం కింద ఇంటర్నల్ ఫుట్ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి రూ.10.22 కోట్లు కేటాయించామన్నారు. ఆయన వెంట ఎమ్మెల్యేలు బొలిశెట్టి శ్రీనివాసు, పత్సమట్ల ధర్మరాజు తదితరులు ఉన్నారు. భీమవరం: జిల్లా పరిధిలో ఈ నెల 21న నిర్వహించనున్న నేషనల్ ఎలిజిబిలిటీ కం ఎంట్రన్స్ టెస్ట్ నీట్ను అత్యంత పారదర్శకంగా, శాంతియుత వాతావరణంలో నిర్వహించేందుకు జిల్లా పోలీసు యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రతా చర్యలను చేపట్టిందని ఎస్పీ అద్నాన్ నయీం అస్మి పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా గుర్తించిన 5 పరీక్షా కేంద్రాల వద్ద నిరంతర నిఘా కొనసాగుతుందన్నారు. తాడేపల్లిగూడెంలో పరీక్షా కేంద్రాల వద్ద అదనపు ఎస్పీ డి.విశ్వనాథ్ ఆధ్వర్యంలో, భీమవరం పరిధిలో డీఎస్పీ రఘువీర్ విష్ణు పర్యవేక్షణలో, నర్సాపురం పరిధిలో డీఎస్పీ ఎం.సుధాకరరావు నేతృత్వంలో బందోబస్తు ఏర్పాట్లు చేశామని వెల్లడించారు. -
అరెస్ట్ కుట్రలో భాగమే
తణుకు అర్బన్: బీసీలను అణగదొక్కడమే లక్ష్యంగా చంద్రబాబు సర్కారు కుట్రలు చేస్తుందని వైఎస్సార్సీపీ బీసీసెల్ రాష్ట్ర కార్యదర్శి చింతపల్లి గురుప్రసాద్ అన్నారు. తణుకు పార్టీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏలూరు పార్లమెంట్ ఇన్చార్జ్ కారుమూరి సునీల్కుమార్ అక్రమ అరెస్టు బాధాకరమని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఎంతో పారదర్శకంగా అమలుచేసిన మద్యం పాలసీలో భాగంగా రవాణాకు సంబంధించి ఢిల్లీకి చెందిన సిగ్మా సంస్థ సుదర్శన్ కన్స్ట్రక్షన్స్ అనే కంపెనీకి ఇవ్వగా వారికి నిబంధనల ప్రకారం సునీల్కుమార్ కంపెనీ వాహనాలను మాత్రమే సరఫరా చేసినట్లు చెప్పారు. ఆయా సంస్థలను వదిలేసి సునీల్కుమార్పై కేసు నమోదుచేసి జైలుకు పంపించడం దుర్మార్గమని అన్నారు. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కూటమి ప్రభుత్వ అరాచకాలు ఎండగడుతున్నారనే ఆయన కుమారుడిని జైలుకు పంపించారని మండిపడ్డారు. బీసీలపై ఇదే పరిస్థితి కొనసాగితే రాబోయే రోజుల్లో ఆందోళన బాట పడతామని చెప్పారు. డ్రగ్స్ తీసుకుని పట్టుబడిన ఎంపీపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా కాలం గడిపేశారని, జనసేన అరవ శ్రీధర్ మహిళపై దాడిచేసినా, ఎమ్మెల్యే చింతమనేని తప్పతాగి న్యాయవాది ఇంటిపైకి దాడికి దిగినా కేసులు నమోదుచేయలేదని విమర్శించారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు మారిశెట్టి శేషగిరి, పట్టణ మహిళాధ్యక్షురాలు నూకల కనకదుర్గ, బీసీ నాయకులు బిరుదుకోట చింతన్న, కొప్పిశెట్టి దుర్గాప్రసాద్, యారబాటి రామకృష్ణ, గెద్దా శ్రీకాంత్, సాక్షి గోపాలరావు, కాకరపర్తి ఆంజనేయులు, నమ్మి ధనలక్ష్మి, పైడి సాయిసూర్య పాల్గొన్నారు. -
ఇద్దరు యువకులు ఆత్మహత్య
ఉండి మండలం పాందువ్వ గ్రామానికి చెందిన వీఽధి నవీన్కుమార్పై రౌడీషీట్ ఉంది. గత నెల ఆకివీడు సీఐ కాళీచరణ్ స్టేషన్కు పిలిపించి దారుణంగా కొట్టారని కుటుంబసభ్యులు ఆరోపించారు. పోలీస్ దెబ్బలు తట్టుకోలేక మే 11న పురుగుల మందు తాగి తన కుమారుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడని, ఒంటిపై తీవ్రంగా గాయాలున్నాయని నవీన్కుమార్ తల్లి వీధి బుజ్జి సీఐ కాళీచరణ్పై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. ఎస్సీ కమిషన్కు, డీఐజీకి ఫిర్యాదు చేయగా డీఐజీ విచారణ నిర్వహిస్తున్నారు. వాస్తవానికి పశ్చిమ ఎస్పీకి మృతుడి తల్లి గతనెలలో ఫిర్యాదుకు యత్నించగా స్థానిక పోలీసులు ఇబ్బందులు సృష్టించడంతో మే 18న డీఐజీకి ఫిర్యాదు చేశారు. నిడమర్రుకు చెందిన నండూరి శివ కార్తికేయ (33)తన మేనకోడలి గొలుసు అదే గ్రామానికి చెందిన వ్యక్తి అపహరించాడని ఫిర్యాదు చేయడంతో ఇరువర్గాలు ఘర్షణ పడ్డాయి. ఎస్సై రెండు కేసులు నమోదు చేశారు. అనంతరం చర్యలు ఎందుకు తీసుకోలేదని శివ కార్తికేయ విధుల్లో ఉన్న ఎస్సైను ప్రశ్నించారు. అదే సమయంలో అక్కడ జరిగిన తిరునాళ్ళల్లో ఓ యువకుడు కత్తి తిప్పి పరారయ్యాడు. ఇది శివ కార్తికేయ చేశాడని ఎస్ఐ విచారణ పేరుతో స్టేషన్ పిలిచి తీవ్రంగా కొట్టి అవమానించారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్టు చేసి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. శివ కార్తికేయను అదుపులోకి తీసుకుని స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపామని డీఎస్పీ శ్రావణ్ కుమార్ ప్రకటించడం విశేషం. -
టీడీపీ సంబరాలు.. ప్రజలకు అవస్థలు
నూజివీడు: కూటమి ప్రభుత్వం రెండేళ్ల విజయోత్సవ సంబరాలు, అన్నదాత సుఖీభవ కార్యక్రమం కలిపి పట్టణంలోని చిన్నగాంధీబొమ్మ సెంటర్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభతో పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. చిన్నగాంధీబొమ్మ సెంటర్లో కార్యక్రమం స్టేజీ నిమిత్తం ఉదయం 9గంటల నుంచే ఆయిల్పామ్ గెలలు తొలే ట్రాక్టర్ ట్రక్కును రోడ్డుపై ఉంచడంతో ట్రాఫిక్ ఇబ్బందులతో వాహనదారులు, ప్రజలు అష్టకష్టాలు పడ్డారు. ఉదయం నుంచి రాత్రి సభ కార్యక్రమం పూర్తయ్యే వరకు ప్రజలకు చుక్కలు కనిపించాయి. అసలే ఇరుకు రహదారులతో ఇబ్బందులు పడుతుంటే బహిరంగ సభ చిన్నగాంధీబొమ్మ సెంటర్లో ఏర్పాటు చేయడమేమిటనే ప్రశ్నలు ప్రజల నుంచి వినిపించాయి. మార్కెట్యార్డు ఆవరణలోనో, ఎంపీడీవో కార్యాలయం వద్దో, జంక్షన్ రోడ్డులోని ఎగ్జిబిషన్ గ్రౌండ్లోనో ఏర్పాటు చేసుకుంటే ఎవరికి ఇబ్బంది ఉండేది కాదనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమైంది. దీనికి తోడు రైతు బజారు రోడ్డుకు అడ్డంగా ట్రాక్టర్ ట్రక్కును ఏర్పాటు చేయడంతో కూరగాయల కోసం మహిళలు, వృద్ధులు చుట్టూ తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. బస్సుల మళ్లింపు విస్సన్నపేట నుంచి విజయవాడ వెళ్లే ఆర్టీసీ బస్సులను, మైలవరం, హనుమాన్ జంక్షన్ వైపు నుంచి వచ్చే గొల్లపల్లి, పోలసానపల్లి, వట్టిగుడిపాడు, రామన్నగూడెంల మీదుగా నూజివీడు బస్టాండుకు మళ్లించారు. బస్టాండులో దిగిన ప్రజలు తమ ఇళ్లకు చేరుకోవడానికి సైతం ఇబ్బందులు పడ్డారు. ఇలా మళ్లించడం వల్ల బస్సులు దాదాపు 20 కిలోమీటర్ల దూరం అదనంగా తిరిగి రావాల్సి వచ్చింది. పెట్రోలు, డీజిల్లను వృథా చేయొద్దు.. పొదుపు చేయాలని ప్రధాని మోడీ పిలుపునిస్తే దానికి విరుద్ధంగా 20 కిలోమీటర్ల దూరం తిరిగి రావడంతో పొదుపు చేయడమంటే ఇదేనా అనే విమర్శలు ప్రజల్లో వినిపించాయి. -
మామిడి.. తడబడి
● మామిడి రైతుకు మళ్లీ చేదే ● పతనమైన ధరలు ● పట్టించుకోని ప్రభుత్వంనూజివీడు: ప్రతి ఏటా మాదిరిగానే ఈ ఏడాది కూడా మామిడి సాగు రైతుకు చేదు అనుభవాన్నే మిగిల్చింది. ఈసారైనా లాభాలు వస్తాయేమోనని రైతులు పెట్టుకున్న ఆశలన్నీ అడియాశలయ్యాయి. ఏటికేడూ మామిడి పరిస్థితి దిగజారుతుండటంతో రైతులు నష్టాల ఊబిలో కూరుకుపోతున్నారు. పెట్టుబడులు కూడా రాని పరిస్థితుల్లో తోటలను నరికేసి, ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గుచూపే యోచనలో పలువురు ఉన్నారు. ఈ ఏడాది దిగుబడి తక్కువగా ఉన్నప్పటికీ, ఆశించిన స్థాయిలో ధరలు లేకపోవడంతో రైతులు తీవ్ర నిరాశలో కొట్టుమిట్టాడుతున్నారు. నల్లతామర దెబ్బతో తగ్గిన దిగుబడి ఏలూరు జిల్లాలో సుమారు 40 వేల ఎకరాల్లో మామిడి తోటలు విస్తరించి ఉండగా, అందులో ఒక్క నూజివీడు నియోజకవర్గంలోనే 35 వేల ఎకరాల్లో ఈ పంట సాగవుతోంది. ఇక్కడ బంగినపల్లి, తోతాపురి, చిన్న రసాలు, పెద్ద రసాలు వంటి రకాలను ఎక్కువగా పండిస్తారు. సాధారణంగా మామిడి పంట ఒక ఏడాది కాపు బాగా ఉంటే, మరుసటి ఏడాది తగ్గుతుంది. అయితే గత నాలుగైదేళ్లుగా ఈ సహజ లక్షణానికి భిన్నంగా ప్రతి ఏటా కాపు తక్కువగానే ఉంటోంది. పూత సమయంలో చెట్లు దట్టంగా కనిపిస్తున్నప్పటికీ, ఆ దశలో ఆశిస్తున్న శ్రీనల్లతామరశ్రీ తెగులు రైతులను కోలుకోలేని దెబ్బతీస్తోంది. దక్కని కోత ఖర్చులు ఈ ఏడాది కాపు కేవలం 20 నుంచి 30 శాతం లోపే ఉండటంతో సీజన్ ప్రారంభంలో ధరలు ఆశాజనకంగా కనిపించాయి. ముంబై మార్కెట్లో బంగినపల్లి రకం టన్ను రూ. లక్ష నుంచి రూ. 60 వేల వరకు పలికింది. కానీ, ఆ తర్వాత ధరలు వేగంగా పడిపోయి సీజన్ మధ్యలో టన్ను రూ. 25 వేల నుంచి రూ. 30 వేలకే పరిమితమైంది. దీంతో రవాణా ఖర్చులు పోను రైతులకు, కొనుగోలు చేసిన వ్యాపారులకు పెద్దగా ఏమీ మిగలలేదు. ఇక స్థానిక నూజివీడు, నున్న, విస్సన్నపేట, ఈదర తదితర ప్రాంతాల్లోని కమీషన్ దుకాణాల్లో బంగినపల్లి టన్ను ధర రూ. 10 వేల నుంచి రూ. 15 వేల లోపే పలికింది. తోతాపురి పరిస్థితి మరింత ఘోరంగా తయారైంది. ప్రారంభంలో టన్ను రూ. 12 వేలు పలికిన ఈ రకం, ఆ తర్వాత రూ. 3 వేలకు పడిపోయింది. దీనివల్ల రైతులకు కనీసం కోత ఖర్చులు కూడా రాని పరిస్థితి ఏర్పడింది. ఫలితంగా తీవ్ర నష్టాలు మిగలడంతో, ఖరీఫ్ సీజన్లో తోటల్లో దుక్కి దున్ని ఎరువులు వేసేందుకు కూడా రైతులు వెనుకాడుతున్నారు. ఈ ఏడాది కూడా గతేడాది మాదిరిగానే మామిడి చేదు అనుభవాన్ని మిగిల్చింది. బంగినపల్లి, తోతాపురి రకాలకు సరైన ధర లేకపోవడంతో రైతులకు పెట్టుబడులు రాలేదు. కాయలు కొన్న వ్యాపారులూ నష్టపోయారు. తోతాపురి ధర టన్ను రూ. 3 వేలకు పడిపోవడంతో కోత ఖర్చులు కూడా దక్కలేదు. ప్రభుత్వం తక్షణమే స్పందించి మామిడి రైతులను ఆదుకోవాలి. – శీలం రాము, మామిడి రైతు, నూజివీడు మామిడి ధరలు ఇంతలా పతనమవుతున్నా రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. నున్న మామిడి మార్కెట్కు కనీసం ఇతర రాష్ట్రాల వ్యాపారులను రప్పించి కొనుగోళ్లు జరిపించే ప్రయత్నం కూడా చేయలేదు. రైతులకు కనీస గిట్టుబాటు ధర దక్కేలా చూసేందుకు ఏ ఒక్క అధికారీ చొరవ తీసుకోకపోవడంతో, ఈ ఏడాది కూడా మామిడి సాగు రైతులకు నష్టాలనే మిగిల్చింది. -
పాత పద్ధతిలోనే చదువులు కొనసాగించాలి
బుట్టాయగూడెం: రాష్ట్రంలోని అన్ని గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో పాత పద్ధతిలోనే గిరిజన బిడ్డలు చదువులు సాగించేలా ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు అన్నారు. మండలంలోని మారుమూల గ్రామమైన పులిరామన్నగూడెంలో పాఠశాల కుదింపును నిరసిస్తూ గ్రామస్తులు చేస్తున్న నిరసన ఆందోళన కార్యక్రమానికి శుక్రవారం మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో పాటే నేలపై కూర్చుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం జీఓ నంబర్ 57ను తీసుకొచ్చి రేషనలైజేషన్ పేరుతో గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలను కుదిస్తే గిరిజన పిల్లలు చదువులకు దూరమయ్యే పరిస్థితి ఉందన్నారు. కొత్త విధానం వల్ల గిరిజన విద్యార్థులు బడులకు దూరమై మళ్లీ అడవిలోకి వెళ్లే పరిస్థితి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ అనాలోచిత చర్యల వల్ల గిరిజన విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారుతుందన్నారు. విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ తీసుకునే అనాలోచిత నిర్ణయాల వల్ల గిరిజన విద్యార్థులు చదువుకు దూరమవుతున్నా రన్నారు. ప్రభుత్వం పునరాలోచన చేసి పాత పద్ధతిని కొనసాగించాలని కోరారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ పాలనలో వైఎస్ జగన్మోహన్రెడ్డి గిరిజన ప్రాంతంలో మూత పడిన అనేక పాఠశాలలను తెరిపించి ప్రతి గిరిజన విద్యార్థికీ చదువు అందేలా కృషి చేశారన్నారు. కూటమి ప్రభుత్వం తీరు మార్చుకోకపోతే 2029లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మళ్లీ పాత పద్ధతిలోనే అన్ని పాఠశాలల్లో గిరిజన విద్యార్థులకు చదువులు అందేలా కృషి చేస్తామని తెల్లం బాలరాజు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యుడు మొడియం రామతులసి, వైస్ ఎంపీపీ గగ్గులోతు మోహన్రావు, వైఎస్సార్ సీపీ నాయకులు యోహాన్ నాయక్, షేక్ ముత్తూ సాహెబ్, న్యాయవాది ఏసుబాబు, సీపీఐ నాయకులు బేతి కిశోర్ తదితరులు పాల్గొన్నారు. -
ఆసుపత్రులపై ప్రజల్లో సంతృప్తి స్థాయి పెరగాలి
జంగారెడ్డిగూడెం: ప్రభుత్వ ఆసుపత్రులలో రోగులకు అందుతున్న వైద్యసేవలుపై ప్రజల్లో సంతృప్తి స్థాయి మరింత పెరగాలని, ఆసుపత్రి నిర్వహణపై రోగుల నుంచి ఏ ఒక్క ఫిర్యాదు వచ్చినా శాఖాపరమైన కఠిన చర్యలు తప్పవని రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ సోళ్ల బొజ్జిరెడ్డి స్పష్టం చేశారు. జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఆస్పత్రిని శుక్రవారం ఆయన కమిషన్ సభ్యులతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని బాలింతల వార్డు, అవుట్ అండ్ ఇన్ పేషెంట్ల వార్డులు, సమాచార కేంద్రం తదితర విభాగాలను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రికి గిరిజన ప్రాంతాల నుండి ఎక్కువ మంది వస్తుంటారని, వారికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎస్టీ కమిషన్ సభ్యులు కాకి లక్ష్మి, గొర్లె సునీత, ఐటీడీఏ పీఓ కె.రాములు నాయక్, డీసీహెచ్ఎస్ సీహెచ్. బేబీకమల తదితరులు పాల్గొన్నారు. భీమవరం: గత పన్నెండేళ్లలో కేంద్ర ప్రభుత్వం సాధించిన ప్రగతి, సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేయడంలో మీడియా పాత్ర అత్యంత కీలకమని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమలశాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అన్నారు. శుక్రవారం భీమవరం డీఎన్నార్ కళాశాల వద్ద ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) జర్నలిస్టుల కోసం ఏర్పాటు చేసిన వార్తాలాప్ వర్క్షాప్ను శ్రీనివాసవర్మ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ పాకా వెంకట సత్యనారాయణ, కలెక్టర్ చదలవాడ నాగరాణి, పీఏబీ డైరెక్టర్ సురేష్ కుమార్ పాల్గొన్నారు. తణుకు అర్బన్: ప్రమాదవశాత్తూ కాలువలో పడి వ్యక్తి మృతి చెందిన ఘటన తణుకు మండలం మండపాకలో శుక్రవారం చోటు చేసుకుంది. ఆచంట గ్రామానికి చెందిన కవ్వల నాగరాజు (51) గత మూడు రోజుల క్రితం పైడిపర్రులోని బంధువుల ఇంటికి వచ్చారు. గురువారం సాయంత్రం మండపాక కాలువలో స్నానం కోసం దిగి ప్రమాదవశాత్తూ గల్లంతయ్యాడు. గురువారం మండపాక వద్ద నాగరాజు మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు తణుకు రూరల్ పోలీసులకు సమాచారం అందించారు. మృతుడి కుమారుడు కవ్వల రాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రూరల్ హెడ్ కానిస్టేబుల్ నాగభూషణం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు నాగరాజు గంగిరెద్దులతో సంచార జీవనం గడుపుతున్నట్లుగా పోలీసులు తెలిపారు. కుక్కునూరు: రోడ్డు ప్రమాదంలో యువకుడు గాయాల పాలైన ఘటన శుక్రవారం మండలంలోని కమ్మరిగూడెం గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం కివ్వాక గ్రామానికి చెందిన యువకుడు బంజరగూడెం గ్రామం వైపు బైక్పై వెళ్తుండగా కమ్మరిగూడెం వద్ద ట్రాక్టర్ను ఓవర్ టెక్ చేసే క్రమంలో ట్రాక్టర్ను ఢీకొన్నాడు. దీంతో యువకుడి తలకు గాయమైంది. వెంటనే స్థానికులు యువకుడిని అమరవరం ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. బాలికపై బ్లేడుతో యువకుడి దాడి తణుకు అర్బన్: బాలికపై యువకుడు దాడికి పాల్పడిన ఘటన తణుకులో శుక్రవారం చోటు చేసుకుంది. వివరాల ప్రకారం తణుకు పాతవూరులో నివసిస్తున్న బాలిక ఇంట్లోకి ప్రవేశించిన యువకుడు జాషువా తన కూడా తెచ్చుకున్న మడత బ్లేడుతో దాడికి దిగాడు. బాలిక తణుకులోని ఒక కళాశాలలో ఇంటర్మీడియేట్ రెండో సంవత్సరం చదువుతుంది. అదే ప్రాంతంలో ఉంటున్న యువకుడు జాషువా గత కొన్ని నెలలుగా బాలిక వెంటపడుతున్నాడు. 6 నెలల క్రితం వేధింపులకు దిగిన సందర్భంలో పోలీసులకు ఫిర్యాదు చేయగా జాషువాను స్టేషన్కు రప్పించి హెచ్చరించారు. అయితే శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి దాడికి దిగినట్లుగా తెలుస్తోంది. ఈ దాడిలో బాలికకు స్వల్పగాయాలు కావడంతో బాధిత కుటుంబ సభ్యులు ఊపిరిపీల్చుకున్నారు. ప్రస్తుతం బాలిక తణుకు జిల్లా కేంద్ర ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. ఘటన జరిగిన వెంటనే పట్టణ సీఐ జె.వెంకటరమణ, పట్టణ ఎస్సై సత్యనారాయణ ఆస్పత్రికి వచ్చి బాధిత బాలికను విచారించి స్టేట్మెంట్ తీసుకున్నారు. -
మూడేళ్ల నిరీక్షణకు ‘టెక్నాలజీ’తో తెర
కుటుంబ సభ్యుల వద్దకు చేరిన తల్లి, కూతురు చింతలపూడి: క్షణికావేశంలో ఇల్లు వదిలి వెళ్లిన తల్లి, కూతురిని ఎఫ్ఆర్ఎస్ 360 సీసీ టీవీ సాంకేతికతతో పోలీసులు గుర్తించి, మూడేళ్ల తర్వాత వారి కుటుంబం చెంతకు చేర్చారు. చింతలపూడి మండలం ఎరగ్రుంటపల్లి గ్రామానికి చెందిన వీసం శైలజ, మూడేళ్ల క్రితం భర్తతో గొడవపడి తన కుమార్తె తనుశ్రీని తీసుకుని వెళ్లిపోయింది. అప్పట్లో కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేసినా ఆచూకీ లభించలేదు. ఇటీవల చింతలపూడి సీఐ క్రాంతి కుమార్ ఆధ్వర్యంలో ఎస్సై కె.సతీష్ కుమార్, హెచ్సీ రాంభద్రరావు బృందం ఆధునిక ఎఫ్ఆర్ఎస్ 360శ్రీ సీసీటీవీ టెక్నాలజీ సాయంతో శైలజ, ఆమె కుమార్తెను ఏలూరు పరిసర ప్రాంతాల్లో ఉన్నట్లు గుర్తించారు. శుక్రవారం వారిని సురక్షితంగా రక్షించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. మూడేళ్ల తర్వాత విడిపోయిన కుటుంబాన్ని కలిపిన పోలీసులను గ్రామస్తులు అభినందించారు. -
ప్రకృతి వ్యవసాయం వైపు రైతులను మళ్లించాలి
ద్వారకాతిరుమల: రసాయన వ్యవసాయం నుంచి ప్రకృతి వ్యవసాయం వైపు రైతులను మళ్లించేందుకు క్యాడర్ సభ్యులు కృషి చేయాలని ప్రకృతి వ్యవసాయం ఏలూరు జిల్లా ప్రాజెక్టు మేనేజర్ బి.వెంకటేష్ సూచించారు. మండలంలోని గుండుగోలనుకుంట గ్రామంలో శుక్రవారం ప్రకృతి వ్యవసాయం బయోరిసోర్స్ సెంటర్ల (బీఆర్సీ) బలోపేతంపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వెంకటేష్ మాట్లాడుతూ రైతులకు ఘన జీవామృతం, ద్రవ జీవామృతం, బీజామృతం, పీఎండీఎస్ విత్తన కిట్లు, వివిధ రకాల కషాయాలు వంటి ప్రకృతి వ్యవసాయ ఇన్పుట్లను అందుబాటులో ఉంచి, ప్రతి రైతుకు అవగాహన కల్పించాలని సూచించారు. రసాయన ఎరువులు, పురుగు మందుల దుకాణాలపై ఆధారపడకుండా రైతులు ప్రకృతి వ్యవసాయ బయోరిసోర్స్ సెంటర్లను వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా బీఆర్సీల నిర్వహణ, సేల్స్ రిజిస్టర్, బిల్ బుక్, స్టాక్ బుక్ నిర్వహణ విధానాలుపై శిక్షణ అందించడంతో పాటు, బీఆర్సీ ఈ–స్టాక్ వెబ్ యాప్ వినియోగం, స్టాకు నమోదు, అమ్మకాలు నమోదు, డిజిటల్ రికార్డుల నిర్వహణపై ప్రాయోగాత్మక శిక్షణ ఇచ్చారు. ఈ సమావేశంలో అదనపు డీపీఎంలు వాలి, ఒ.గోపాలకృష్ణ, నవీన్ తదితరులు పాల్గొన్నారు. -
శాసీ్త్రయ పద్ధతులతో వ్యాధుల నిర్ధారణ
తాడేపల్లిగూడెం: శాసీ్త్రయ పద్ధతులతో చేపలు, రొయ్యల్లో వచ్చే వ్యాధుల నివారణకు కృషి చేయవచ్చని డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్ కె.ధనుంజయరావు అన్నారు. నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంటు బోర్డు సహకారంతో చేపలు, రొయ్యల వ్యాధులపై ఐదు రోజుల శిక్షణా కార్యక్రమం శుక్రవారం వెంకట్రామన్నగూడెం కెవికెలో ప్రారంభమైంది. చేపలు, రొయ్యల వ్యాధుల నిర్ధారణ పరికరాలు, నిర్వహణ పద్ధతులు అనే అంశంపై శిక్షణా కార్యక్రమం ప్రారంభమైంది. ముఖ్య అతిఽథిగా పాల్గొన్న వీసీ మాట్లాడుతూ దేశంలో మత్స్య, ఆక్వా రంగం వేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు. చేపల రొయ్యల సాగులో వ్యాధులు పెరగడం వల్ల భారీ నష్టాలు రైతులకు వస్తున్నాయన్నారు. వ్యాధులను ముందుగానే గుర్తించి , శాసీ్త్రయ పద్ధతుల ద్వారా నివారించాలన్నారు. దీని వల్ల స్థిరమైన ఉత్పత్తి, అధిక ఆదాయం పొందవచ్చన్నారు. వర్సిటీ విస్తరణ సంచాలకుడు సీహెచ్ రూత్ మాట్లాడుతూ రైతులు, మత్స్య కారులకు శాసీ్త్రయ పరిజ్ఞానాన్ని చేరవేయడంలో కేవీకేలు కీలక పాత్ర పోషిస్తున్నాయన్నారు. ఆక్వా కల్చర్ రంగంలో ఎదురవుతున్న వ్యాధి సమస్యలను ఎదుర్కొనే సామర్థ్యం శిక్షణ ద్వారా లభిస్తుందన్నారు. గేదెల పరిశోధన స్థానం హెడ్ డాక్టర్ కె.ఆనందరావు వ్యవసాయ అనుబంధ పరిశ్రమల్లో మత్స్య పరిశ్రమ ప్రాధాన్యత, రొయ్యల్లో వైట్ సిండ్రోమ్ ,చేపలో బ్యాక్టీరియా వ్యాధుల గురించి వివరించారు. కోర్సు డైరెక్టర్ సీహెచ్.కిరణ్కుమార్, కో డైరెక్టర్ డాక్టర్ ఎ.దేవీవరప్రసాదరెడ్డి, కో ఆర్డినేటర్లు ఇ.రేఖ, కె.అర్చన తదితరులు పాల్గొన్నారు. -
జోరుగా మట్టి వ్యాపారం
చాట్రాయి: మండలంలో అక్రమ మట్టి వ్యాపారం జోరుగా సాగుతోంది. మట్టి తవ్వకాలకు ముందస్తు అనుమతులు తప్పనిసరని రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో ఆ మాటలు ఎక్కడా అమలు కావడం లేదు. చనుబండ గ్రామంలోని చిన్న చెరువు, పెద్ద చెరువుల నుండి ఇప్పటికే వేలాది ట్రాక్టర్ల మట్టిని అక్రమంగా తరలించారు. సాగునీటి చెరువుల్లో నిబంధనలకు విరుద్ధంగా అడ్డగోలుగా మట్టిని తోడేయడంతో ఆ ప్రాంతాలన్నీ లోతైన లోయలను తలపిస్తున్నాయి. ప్రమాదవశాత్తూ ఎవరైనా ఈ గోతుల్లో పడితే ప్రాణాలు దక్కే పరిస్థితి లేదు. కనీసం పశువులు దిగినా బయటకు రాలేనంత లోతుగా తవ్వకాలు జరిపారు. సాధారణంగా అనుమతులు ఉన్నవారైనా నిబంధనల మేరకే నిర్ణీత లోతులో మట్టిని సేకరించాల్సి ఉంటుంది. కానీ, ఇక్కడి అక్రమార్కులు ఎలాంటి నిబంధనలనూ లెక్కచేయకుండా యథేచ్ఛగా తవ్వకాలు సాగిస్తున్నారు. ప్రభుత్వ చెరువుల నుంచి తరలిస్తున్న ఈ మట్టిని ఇటుక బట్టీలకు, రియల్ ఎస్టేట్ వెంచర్లకు, భూముల చదునుకు విక్రయిస్తూ కొందరు భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. పగలు, రాత్రి అనే తేడా లేకుండా నిరంతరాయంగా మట్టి రవాణా సాగుతున్నా.. అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు. -
సేంద్రియ సారం.. పుడమికి జీవం
● సేంద్రియం వైపు రైతుల అడుగులు ● ఆవుపేడ, మూత్రంతో ఎరువుల తయారీ బుట్టాయగూడెం: వ్యవసాయ రంగంలో సాగు పద్ధతులు వేగంగా మారుతున్నాయి. ప్రస్తుత రోజుల్లో ఆరోగ్యంపై శ్రద్ధ పెరగడంతో రైతులు ప్రకృతి వ్యవసాయం వైపు మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా రసాయన ఎరువుల వినియోగం క్రమంగా తగ్గుతోంది. మార్కెట్లో ఎరువుల ధరలు పెరగడం, కొరత వంటి సమస్యలు వెంటాడుతుండటంతో.. పెట్టుబడి తగ్గించుకుని, నేలతల్లిని కాపాడుకోవాలనే లక్ష్యంతో సేంద్రియ సాగుపై రైతులు ఆసక్తి కనబరుస్తున్నారు. తక్కువ ఖర్చుతో కూడిన సేంద్రియ ఎరువులను వాడటం వల్ల నాణ్యమైన దిగుబడులు వస్తుండటంతో రైతుల దృష్టి ప్రకృతి సేద్యం వైపు మళ్లింది. కొందరు రైతులు సొంతంగా ఇళ్ల వద్దే ఎరువులను తయారు చేసుకుంటుండగా, మరికొందరు ప్రకృతి వ్యవసాయ అధికారుల సలహాలతో ముందుకు సాగుతున్నారు. అధికారుల పర్యవేక్షణలో ఘనామృతం, జీవామృతం, బీజామృతం వంటి ఎరువుల తయారీపై అవగాహన పెంచుకుంటూ రైతులు తమ పొలాల్లో విజయవంతంగా పంటలు పండిస్తున్నారు. బీజామృతంతో చీడపీడల నివారణ విత్తన శుద్ధికి బీజామృతాన్ని వాడటం వల్ల నారుమళ్లు చీడపీడల బారిన పడవని అధికారులు చెబుతున్నారు. కావాల్సిన పదార్థాలు: 20 లీటర్ల నీరు, 5 లీటర్ల ఆవు మూత్రం, 5 కిలోల ఆవు పేడ, 50 గ్రాముల పొడి సున్నం, గుప్పెడు పొలం గట్టు మట్టి. తయారీ విధానం: ఒక తొట్టెలో 20 లీటర్ల నీరు పోయాలి. ఆవు పేడను పల్చని గుడ్డలో మూట కట్టి 12 గంటల పాటు ఆ నీటిలో ఉంచాలి. వేరే పాత్రలో ఒక లీటరు నీటిని తీసుకుని 50 గ్రాముల సున్నం కలిపి రాత్రంతా నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం పేడ మూటను బాగా పిండి, ఆ సారాన్ని నీటిలో కలపాలి. అనంతరం తొట్టెలో పొలం గట్టు మట్టిని వేసి కర్రతో తిప్పాలి. చివరగా 5 లీటర్ల ఆవు మూత్రం, సున్నపు నీటిని కూడా అందులో పోసి బాగా కలిపితే ‘బీజామృతం’ సిద్ధమవుతుంది. భూసారాన్ని పెంచే ఘనామృతం ఘనామృతాన్ని దుక్కిలో వేసుకోవడంతో పాటు నిల్వ చేసుకుని, అవసరాన్ని బట్టి కొద్ది నెలల తర్వాత కూడా వాడుకోవచ్చు. ఖరీఫ్ పనులకు సిద్ధమవుతున్న ప్రకృతి వ్యవసాయదారులు ప్రస్తుతం ఘన జీవామృతాన్ని తయారు చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. కావాల్సిన పదార్థాలు: వారం రోజుల పాటు సేకరించిన దేశీ ఆవుపేడ 100 కిలోలు, ఆవు మూత్రం 5 లీటర్లు, శనగ, ఉలవ, పెసర లేదా మినుము పిండి (ఏదైనా ఒకటి) 2 కేజీలు, బెల్లం 2 కేజీలు (లేదా చెరకు రసం 3 లీటర్లు), తగినంత తాటిపండ్ల గుజ్జు, చిటికెడు పుట్టమట్టి. తయారీ విధానం: చెట్టు నీడన లేదా షెడ్లో ఈ పదార్థాలన్నింటినీ ఆవుపేడలో వేసి బాగా కలపాలి. ఆ మిశ్రమాన్ని 10 రోజుల పాటు ఆరబెడితే ‘ఘనామృతం’తయారవుతుంది. కోట్లాది సూక్ష్మజీవుల నిలయం.. జీవామృతం జీవామృతం చల్లిన భూమిలో వానపాములు చైతన్యవంతమై, పంటలకు అవసరమైన అన్ని రకాల పోషకాలను నిరంతరం అందిస్తాయి. భూసారాన్ని రక్షించుకోవడానికి ఇది ఎంతో దోహదపడుతుంది. ప్రకృతి వ్యవసాయంలో ఎలాంటి రసాయన ఎరువులు వాడాల్సిన అవసరం లేదు. ఆవుపేడ, మూత్రంతో తయారయ్యే జీవామృతంలో కోట్లాది సూక్ష్మజీవులు ఉంటాయి. ద్రవ, ఘన రూపాల్లో లభించే ఈ జీవామృతం పంటలకు అద్భుతమైన బలాన్ని ఇస్తుందని అధికారులు పేర్కొంటున్నారు. జిల్లాలో ప్రకృతి వ్యవసాయాన్ని మరింత విస్తరిస్తున్నాం. పెట్టుబడి తక్కువ, దిగుబడులు, లాభాలు ఎక్కువగా ఉండటంతో రైతులు ఈ సాగుపై మక్కువ చూపుతున్నారు. భూసారాన్ని రక్షించేలా, ప్రజలకు ఆరోగ్యకరమైన రసాయన రహిత పంటలు అందించేలా రైతులను చైతన్యపరుస్తున్నాం. సేంద్రియ ఎరువులను రైతులే స్వయంగా తయారు చేసుకునేలా శిక్షణ ఇస్తున్నాం. – బి.వెంకటేష్, ప్రకృతి వ్యవసాయ జిల్లా ప్రాజెక్టు మేనేజర్, ఏలూరు ప్రకృతి వ్యవసాయంపై రైతుల్లో స్పష్టమైన అవగాహన వచ్చింది. రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి సేంద్రియ పద్ధతులపై మొగ్గు చూపడం శుభపరిణామం. దీనివల్ల సాగు ఖర్చులు తగ్గడమే కాకుండా నాణ్యమైన, ఆరోగ్యకరమైన పంటలు చేతికి వస్తాయి. రైతులందరూ ప్రకృతి సాగు వైపు అడుగులు వేయాలి. – జతిన్ రాయ్, డీపీఎంయూ కమ్యూనికేషన్ అధికారి, ఏలూరు -
విత్తన శుద్ధి.. సాగు సమృద్ధి
● ఉమ్మడి పశ్చిమగోదావరిలో 5.40 లక్షల ఎకరాల్లో వరి సాగు ● విత్తన సేకరణ, శుద్ధి పట్ల అప్రమత్తత అవసరం భీమవరం : సార్వా వరి నారుమడి పనుల్లో రైతులు నిమగ్నమయ్యారు. గత సార్వా పంట సమయంలో మోంథా తుఫానుకు దెబ్బతిన్న రైతులకు ప్రభుత్వం నుంచి ఇంతవరకు ఎలాంటి సహాయం అందకపోయినా, వ్యవసాయమే జీవనాధారమైన రైతన్నలు ప్రస్తుత సార్వా సాగుకు సన్నద్ధమవుతున్నారు. కూటమి ప్రభుత్వం రైతులకు ఇస్తామన్న ‘అన్నదాత సుఖీభవ’ నిధులు నేటికీ జమకాకపోయినా... అప్పులు చేసి మరీ రైతులు విత్తనాలు కొనుగోలు చేస్తూ, దుక్కులు దున్నుతూ వరి నారుమళ్లు వేస్తున్నారు. వరిసాగులో విత్తన ఎంపిక, విత్తనశుద్ధి, సస్యరక్షణపై రైతులు దృష్టి పెట్టాలని వ్యవసాయశాఖాధికారులు చెబుతున్నారు. పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లో సుమారు 5.40 లక్షల ఎకరాల విస్తీర్ణంలో వరిసాగు చేయనున్నారు. దీనిలో పశ్చిమగోదావరి జిల్లాలో 2.35 లక్షల ఎకరాలు, ఏలూరు జిల్లాలో సుమారు 3 లక్షల ఎకరాలు ఉన్నాయి. వరి నారుమళ్లు వేయడానికి ఎకరాకు 30 కిలోల వరకు విత్తనాలు అవసరమవుతాయి. విత్తన సేకరణ ఇలా.. ● పురుగులు, తెగుళ్లు ఆశించని పొలం నుంచి విత్తనాన్ని సేకరించుకోవాలి. రైతులు తమ సొంత విత్తనాన్నే వాడుకుంటుంటే... పంట కోత కోసిన తరువాత విత్తనాలతో పాటు కలిసిపోయిన మట్టి, శిలీంధ్ర బీజాలు, పురుగు గుడ్లను (తుట్టెలను) తీసివేసి, శుభ్రం చేసి నిల్వ చేసుకోవాలి. బయట విత్తనాన్ని కొనుగోలు చేసే సమయంలో విత్తన శుద్ధి చేశారో లేదో నిర్ధారించుకోవాలి. కొనుగోలు చేసిన విత్తనానికి సంబంధించిన బిల్లును తప్పనిసరిగా తీసుకోవాలి. కొనుగోలు చేసిన విత్తనాల మొలక శాతాన్ని తప్పనిసరిగా పరీక్షించుకోవాలి. నాణ్యమైన విత్తనమే అయినా.. ● ఎక్కువ మంది రైతులు సొంతంగా విత్తనాలను పండించుకోవడం లేదా తోటి రైతుల నుంచి విత్తనాలను కొనుగోలు చేయడం చేస్తుంటారు. విత్తనాలతో పాటు కొన్ని తెగుళ్లను కలుగజేసే శిలీంధ్రాలు, బ్యాక్టీరియా, వైరస్ వంటివి పంటలను ఆశించి తీవ్రమైన నష్టాన్ని కలుగజేస్తుంటాయి. కొన్ని సందర్భాల్లో నాణ్యమైన విత్తనం అయినప్పటికీ భూమి నుంచి, వివిధ రకాల పురుగుల నుంచి తెగుళ్లు ఆశించి పంటను నష్టపరుస్తూ ఉంటాయి. ● అందువల్ల పంటను తొలిదశలోనే రక్షించుకోవడానికి సిఫారసు చేసిన శిలీంధ్ర నాశినులతో గాని, పురుగు మందులు లేదా జీవ శిలీంధ్ర నాశినులతో తప్పనిసరిగా విత్తన శుద్ధి చేసుకోవాలి. ఈ విత్తన శుద్ధి మందులు పొడి, ద్రవ రూపంలో, కాన్సంట్రేట్స్ రూపంలో మార్కెట్లో అందుబాటులో ఉంటాయి. విత్తన శుద్ధికి పద్ధతులు ● పొడి విత్తన శుద్ధి : డ్రమ్ములో మూడింట రెండొంతులు విత్తనాలు వేసి, సిఫార్సు చేసిన మోతాదులో మందు కలిపి బాగా తిప్పితే విత్తనానికి మందు పట్టుకుంటుంది. కొన్ని రకాల విత్తనాలకు జిగురు, బెల్లం ద్రావణం, చిక్కటి గంజి ద్రావణం వంటివి కలపడం వల్ల మందు బాగా పట్టుకుంటుంది. ఇది విత్తనానికి ఒక రక్షణ కవచంగా ఏర్పడి చీడపీడల నివారణకు తోడ్పడుతుంది. ● తడి విత్తన శుద్ధి : ముఖ్యంగా వరి విత్తన శుద్ధికి తగినంత నీటిని తీసుకుని, ఆ నీటిలో సిఫార్సు చేసిన మందులు కలుపుకొని విత్తనాలను నానబెట్టుకోవాలి. దీని ద్వారా చీడపీడల నుంచి పంటలను రక్షించుకోవచ్చు. ● జీవ శిలీంధ్ర నాశినులతో : కొన్ని రకాల జీవ శిలీంధ్ర నాశినులైన ట్రైకోడెర్మా విరిడి, ట్రైకోడెర్మా హార్జియానం, సూడోమోనాస్ వంటి వాటితో విత్తన శుద్ధి చేయడం చాలా మంచిది. ఇవి తమ సంతతిని భూమిలోనే అభివృద్ధి చేసుకుని, తెగుళ్లను కలుగజేసే హానికర శిలీంధ్రాలను నాశనం చేయడమే గాక పంట చివరి వరకు రక్షణ కల్పిస్తాయి. ఈ మందులు భూమిలోనే వృద్ధి చెంది, ఆ తర్వాత వేసే పంటలకు కూడా ఉపయోగపడతాయి. వీటి మోతాదు కిలో విత్తనానికి 8 నుంచి 30 గ్రాముల వరకు వాడుకోవాలి. వరిసాగులో విత్తనశుద్ధి ద్వారా పురుగుమందుల ఖర్చు తగ్గడమే కాకుండా పంటలో అధిక దిగుబడులు సాధించవచ్చు. సార్వా సాగుకు సిద్ధమవుతున్న రైతులు తప్పనిసరిగా విత్తనశుద్ధిపై దృష్టి పెట్టాలి. విత్తనశుద్ధికి అవసరమైన సమాచారం కోసం అందుబాటులో ఉన్న వ్యవసాయశాఖాధికారులను సంప్రదించాలి. – జె. వెంకటేశ్వరరావు, జిల్లా వ్యవసాయశాఖాధికారి -
భీమవరంలో థీమ్ ఆధారిత యోగా
భీమవరం : అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల ఆవరణలో శుక్రవారం రాష్ట్ర స్థాయి థీమ్ ఆధారిత యోగా ప్రదర్శన కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ చదలవాడ నాగరాణి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ యోగా భారతీయ సంస్కృతి ప్రపంచానికి అందించిన గొప్ప వరమన్నారు. ప్రతిరోజూ యోగ సాధన ద్వారా శరీరంలో అద్భుతమైన మార్పులు చోటుచేసుకుంటాయని ప్రస్తుతం మారుతున్న జీవనశైలిలో మానసిక ఒత్తిడి, ఆందోళనలు, అనారోగ్య సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో యోగ సాధన ప్రతి ఒక్కరికీ అవసరమన్నారు. యోగా అనంతరం కలెక్టర్ నాగరాణి, జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి విద్యార్థులతో కలిసి కబడ్డీ ఆడారు. కార్యక్రమంలో కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ సాగి రామకృష్ణ నిశాంత్ వర్మ, ప్రిన్సిపల్ మురళీకృష్ణంరాజు, జిల్లా క్రీడల అధికారి మోహన్దాస్ తదితరులు పాల్గొన్నారు. భీమవరం : భీమవరం పట్టణం గునుపూడి ప్రాంతంలో నూతనంగా ఏర్పాటుచేసిన నారాయణ స్కూల్ నిబంధనకు విరుద్ధంగా నిర్వహిస్తున్నారంటూ శుక్రవారం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్బంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి టి.ప్రసాద్ మాట్లాడుతూ నారాయణ స్కూల్కు ఎలాంటి అనుమతులు లేకపోవడంతో స్కూల్ నిర్వహించకూడదని విద్యా శాఖ నోటీసులు ఇచ్చినా వాటిని లెక్కచేయకుండా తరగతులు నిర్వహించడం దారుణమన్నారు. ఒక పక్క స్కూల్ బిల్డింగ్ నిర్మాణం పనులు, ఎలక్ట్రికల్ పనులు జరుగుతున్నా విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడుతూ తరగతులు నిర్వహిస్తున్నారన్నారు. అక్రమంగా పుస్తకాలు, విద్యాసామాగ్రి విక్రయిస్తున్నారన్నారు. రాష్ట్ర మంత్రి నారాయణ అండదండలతోనే అక్రమంగా విద్యావ్యాపారం చేస్తున్నారని మండిపడ్డారు. స్కూల్ను తక్షణం సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. విద్యాశాఖాధికారులకు ఫిర్యాదు చేయడంతో డీవైఈవో రమేష్ స్కూల్ వద్దకు వచ్చి పుస్తకాల గదిని సీజ్ చేశారు. భీమవరం: జిల్లాలో గత నెలలో నిర్వహించిన ఎస్ఎస్సీ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో 68.88 శాతం విద్యార్ధులు ఉత్తీర్ణత సాఽధించారని జిల్లా విద్యాశాఖాధికారి ఇ.నారాయణ శుక్రవారం చెప్పారు. జిల్లాలోని 20 మండలాల పరిధిలో నిర్వహించిన పరీక్షలకు 3,698 మంది హాజరుకాగా 2,547 మంది ఉత్తీర్ణత సాఽధించారన్నారు. వీరిలో 2,313 మంది బాలురకు 1,559, 1,385 మంది బాలికలకు 988 మంది ఉత్తీర్ణ సాధించారని చెప్పారు. భీమవరం: కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో అన్ని వర్గాల ప్రజల సంక్షేమం, అభ్యున్నతే ప్రధాన లక్ష్యంగా పనిచేసిందని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేస్తున్నాయని కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అన్నారు. కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలన విజయోత్సవాల్లో భాగంగా భీమవరంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. జిల్లా ఇన్చార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్, మంత్రి నిమ్మల రామానాయుడుతో కలిసి మహిళలకు సెర్ప్ ద్వారా అందించే రుణాల చెక్ను అందచేశారు. కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ కనుమూరు రఘురామకృష్ణరాజు, రాజ్యసభ సభ్యుడు పాకా వెంకటసత్యనారాయణ, కలెక్టర్ చదలవాడ నాగరాణి తదితరులు పాల్గొన్నారు. -
కక్ష సాధింపు మానుకోవాలి
బుట్టాయగూడెం: ఏలూరు పార్లమెంట్ వైఎస్సార్సీపీ ఇన్చార్జి కారుమూరి సునీల్కుమార్ అక్రమ అరెస్ట్ను పోలవరం మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు తీవ్రంగా ఖండించారు. శుక్రవారం బుట్టాయగూడెం పార్టీ కార్యాలయం వద్ద విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజల పక్షాన నిలబడి పోరాడుతున్న నాయకులను కూటమి ప్రభుత్వం అక్రమ అరెస్ట్లు చేస్తుందని విమర్శించారు. రాష్ట్రంలో ఏదైనా సమస్య తలెత్తినప్పుడు ఆ సమస్య నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి వైఎస్సార్సీపీ నాయకులను చంద్రబాబు నాయుడు అక్రమంగా అరెస్ట్ చేయిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయపు అరాచక పాలనను ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా.. వాటి కోసం పోరాడుతున్న వైఎస్సార్సీపీ నాయకులపై కేసులూ పెట్టి అరెస్ట్లు చేస్తున్నారని అన్నారు. అక్రమ అరెస్ట్లకు అదరం, బెదరం అని అన్నారు. బీసీల ప్రభుత్వం అని చెప్పుకునే కూటమి ప్రభుత్వం బీసీ నాయకులపై అక్రమ కేసులు పెట్టి అణగదొక్కాలని చూస్తుందన్నారు. బీసీలు తిరగబడి కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పడం ఖాయమని అన్నారు. -
పెండింగ్ బకాయిలు చెల్లించాలి
భీమవరం: జిల్లాలోని ఉపాధ్యాయులకు విద్యాశాఖ నుంచి రావాల్సిన పెండింగ్ బకాయిలు చెల్లించాలని ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు పీఆర్వీఎస్ సాయివర్మ కోరారు. ఈ మేరకు శుక్రవారం డీఈవో ఇ.నారాయణకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా సాయివర్మ మాట్లాడుతూ గత ఏడాది సెప్టెంబర్లో జరిగిన ఇండక్షన్ శిక్షణకు రిసోర్స్ పర్సనన్గా పనిచేసిన ఉపాధ్యాయులకు ఇంతవరకూ ఎలాంటి పారితోషికం ఇవ్వలేదని ఆందోళన వ్యక్తం చేశారు. స్పాట్ వాల్యుయేషన్ క్యాంపులో చేసిన ఉపాధ్యాయులకు పారితోషికం లభించలేదన్నారు. కార్యక్రమంలో ఎస్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కేవీ రామచంద్రరావు, కార్యదర్శి చుండూరు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం
ఏలూరు (ఆర్ఆర్పేట) : జిల్లాలో నూతన కొత్త సంవత్సరం ప్రారంభమైంది. విద్యార్థులు ఉత్సాహంగా బడులకు వెళుతున్నారు. ఒక పక్క ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నా తమ బిడ్డల భవిష్యత్ కోసం తల్లిదండ్రులు కష్టమైనా బడులకు పంపుతున్నారు. ఎక్కువ మంది విద్యార్థులు పాఠశాలల యాజమాన్యాలు నడుపుతున్న బస్సులపై వెళ్తున్నారు. బస్సులైతే భద్రంగా ఉంటుందనే నమ్మకంతో బస్సుల్లోనే తమ బిడ్డలను పంపుతున్నారు. పాఠశాలల యాజమాన్యాలు మాత్రం కేవలం వ్యాపార దృక్పథంతో వ్యవహరిస్తూ కనీసం ప్రమాణాలు లేకుండా బస్సులను నిర్వహిస్తున్నాయనే విమర్శలు వస్తున్నాయి. పూర్తికాని బస్సుల ఫిట్నెస్ ఏ వాహనమైనా రహదారిపై తిరగాలంటే రవాణా శాఖ ప్రమాణాలు పాటించాలి. రవాణా శాఖ నిబంధనలను అనుసరించాలి. సదరు బస్సులు రోడ్డుపై తిరడగానికి అనువుగా ఉందని ఏటా రవాణా అధికారుల అనుమతులు పొందాల్సి ఉంటుంది. ముఖ్యంగా విద్యా సంస్థల బస్సులు విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందుగానే ఇలాంటి అనుమతులన్నీ పొంది సిద్ధంగా ఉండాలి. విద్యా సంవత్సరం ప్రారంభమై వారం రోజులు గడుస్తున్నా ఇప్పటికీ కొన్ని బస్సులు సదరు అనుమతులు పొందలేదు. అయినప్పటికీ ఆయా విద్యా సంస్థలు బస్సులను తిప్పుతూ విద్యార్థులను పాఠశాలకు, వారి ఇళ్ళకు రవాణా చేస్తున్నాయి. దీనిపై ఇప్పటికే రవాణా అధికారులు విద్యా సంస్థల యాజమాన్యాలతో అవగాహన సమావేశాలు నిర్వహించి ఫిట్నెస్ సర్టిఫికెట్లు పొందాలని సూచించారు. జిల్లాలో 1,242 విద్యాసంస్థల బస్సులు జిల్లా వ్యాప్తంగా విద్యా సంస్థలకు చెందిన 1,242 బస్సులను విద్యార్థులను తిప్పడానికి వినియోగిస్తున్నారు. ఈ విద్యా సంవత్సరం వాటికి ఫిట్నెస్ అనుమతులు పొందాల్సి ఉండగా విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందు వాటిలో సగంలోపు బస్సులకు మాత్రమే ఫిట్నెస్ సర్టిఫికెట్లు పొందారు. ఈ మధ్య కాలంలో రవాణా శాఖ అధికారులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి ఫిట్నెస్ లేకుండా, ఇతర నిబంధనలు పాటించకుండా తిప్పుతున్న సుమారు 50కు పైగా బస్సులపై కేసులు నమోదు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా తిప్పే బస్సుల యాజమాన్యాలపై చర్యలు తీసుకుంటామని చేసిన హెచ్చరికల నేపథ్యంలో విద్యా సంస్థల యాజమాన్యాలు తప్పనిసరి పరిస్థితిలో అనుమతులు పొందడానికి చర్యలు చేపట్టారు. ఈ మేరకు ఇంత వరకూ 1171 బస్సులకు ఫిట్నెస్ సర్టిఫికెట్లు పొందారు. మరో 71 బస్సులకు ఫిట్నెస్ సర్టిఫికెట్లు పొందలేదు. దీనితో మిగిలిన వాటికి కూడా ఫిట్నెస్ సర్టిఫికెట్లు పొందాలని విద్యా సంస్థల యాజమాన్యాలకు నోటీసులు పంపారు. డ్యాష్ బోర్డు కెమెరాలు అమర్చాలని ఆదేశాలు ఇదిలా ఉండగా విద్యార్థులకు సురక్షితమైన ప్రయాణ సౌకర్యం కోసం, బస్సు డ్రైవర్ల అజాగ్రత్తలు గమనించడం కోసం, వేగ నియంత్రణను నిరంతరం పర్యవేక్షించడం కోసం ఈ ఏడాది కొత్తగా విద్యా సంస్థల బస్సులకు డాష్బోర్డు కెమెరాలు అమర్చాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. జిల్లా ఎస్పీ సూచనల మేరకు రవాణా శాఖ అధికారులు ఇప్పటికే విద్యా సంస్థల యాజమాన్య ప్రతినిధులతో సమావేశం నిర్వహించి డ్యాష్ బోర్డు కెమెరాల ఏర్పాటుపై అవగాహన కలిగించారు. ఈ డాష్ బోర్డు కెమెరాల ద్వారా రికార్డయ్యే వీడియోలను అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలించి చర్యలు తీసుకోవడానికి జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక బృందాన్ని డా ఏర్పాటు చేశారు. జిల్లాలోని పెద్ద విద్యా సంస్థలకు సుమారు 20 నుంచి 30 బస్సులు ఉండగా వాటన్నింటిలో డ్యాష్ బోర్డు కెమెరాలు అమర్చడం ఖర్చుతో కూడుకున్న అంశం కావడంతో ఈ ప్రక్రియ మందకొడిగా సాగుతోంది. ఇప్పటికీ పూర్తికాని విద్యాసంస్థల బస్సుల ఫిట్నెస్ పరీక్షలు జిల్లావ్యాప్తంగా 1,242 విద్యాసంస్థల బస్సులు బస్సులకు డ్యాష్ బోర్డు కెమెరాలు అమర్చాలని ఆదేశాలు -
ఎగుమతుల్లో ఇబ్బందులు తొలగించాలి
తణుకు అర్బన్: భారత్ ఎగుమతుల్లో ఇబ్బందులను తొలగించాలని శాసన మండలి సభ్యుడు వంక రవీంద్రనాథ్ అన్నారు. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో వరల్డ్ ఎక్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంటెక్స్ ఫెయిర్ ఈవెంట్ ప్రారంభ కార్యక్రమాన్ని పలువురు ప్రముఖులతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా బంగ్లాదేశ్ అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ భారత్ నుంచి ఎగుమతి అవుతున్న టెక్స్టైల్ రవాణాలో ఉంటున్న ఇబ్బందులను తొలగించాలని, చిట్టగాంగ్ పోర్ట్లో దిగుమతులు త్వరితగతిన చేపట్టాలని కోరారు. భారత్దేశం నుంచి కాటన్ యార్న్ అత్యధిక శాతం బంగ్లాదేశ్కు ఎగుమతి అవుతుందని, బంగ్లాదేశ్ కాటన్ వస్త్ర పరిశ్రమలో 85 శాతం భారత నూలు దిగుమతులపై ఆధారపడి ఉందని, పోర్ట్లలో కంటైనర్ విడుదలలో జాప్యం తగ్గితే వస్త్ర పరిశ్రమలు ఇబ్బందులు తొలగి త్వరితగతిన గార్మెంట్స్ ఎగుమతులకు మార్గం సుగమం అవుతుందని స్పష్టం చేశారు. -
అక్రమ అరెస్ట్లతో అడ్డుకోలేరు
భీమవరం: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటినుంచి వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలను వేధించడమే లక్ష్యంగా పనిచేస్తుందని వైఎస్సార్సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు చిగురుపాటి సందీప్ తీవ్రంగా విమర్శించారు. శుక్రవారం భీమవరంలో విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. కృష్ణలంకలో యువకుడి హత్యను పక్కదోవ పట్టించడానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కారుమూరి సునీల్ అక్రమ అరెస్ట్ను తెరపైకి తెచ్చారని ఆరోపించారు. ఎలాంటి అవినీతి మరకలు లేని సునీల్ను మద్యం కేసు బూచిగా చూపి అరెస్ట్ చేయడం దారుణమన్నారు. ఎంపీ పుట్టా మహేష్ డ్రగ్స్ కేసులో పట్టుబడితే ఎలాంటి చర్యలు తీసుకోని రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి ఆధారాలు లేని మద్యం కేసులో సునీల్ను అరెస్ట్ చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఇలాంటి చౌకబారు అక్రమ కేసులు, అరెస్ట్లతో వైఎస్సార్సీపీని అడ్డుకోలేరని చెప్పారు. -
కారుమూరి సునీల్ అరెస్ట్ దారుణం
నరసాపురం : వైఎస్సార్సీపీ ఏలూరు పార్లమెంట్ సమన్వయకర్త కారుమూరి సునీల్కుమార్ అక్రమ అరెస్ట్ దారుణమని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు ఖండించారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎలాంటి ఆధారాలు లేకుండా మద్యం కేసులో సునీల్కుమార్ను అరెస్ట్ చేశారన్నారు. పోలీసులను అడ్డుపెట్టుకుని అక్రమకేసులతో రాజ్యాంగ విలువను కాలరాసేలా అధికార పార్టీ వ్యవహరించడం ప్రజాస్వామ్యంలో తగదన్నారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదన్న విషయాన్ని కూటమి ప్రభుత్వం గుర్తించాలన్నారు. సూపర్సిక్స్ అంటూ ఎన్నికల సమయంలో ఊదరగొట్టి, ఇచ్చిన హామీలను గాలికొదిలేసి పాలన సాగిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం నిర్వాకాన్ని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార కూటమి పార్టీలకు పరాభవం తప్పదన్నారు. విజయవాడలో యువకుడి లాకప్డెత్, తునిలో రెండేళ్ల చిన్నారి అదృశ్యం లాంటి ఘటనలు రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎంతలా దిగజారాయో తెలియజేస్తున్నాయన్నారు. ఏలూరు టౌన్: టీడీపీ ప్రభుత్వం మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుటుంబాన్ని టార్గెట్ చేసిందని.. కారుమూరి సునీల్పై అక్రమ కేసు బనాయించి అరెస్ట్ చేయటం అన్యాయమని.. బీసీ సామాజికవర్గం పక్షాన అరెస్టును ఖండిస్తున్నామని వైఎస్సార్సీపీ బీసీ సెల్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నౌడు వెంకటరమణ అన్నారు. ఏలూరులో ఆయన మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ హయాంలో మద్యం సరఫరా, విక్రయాలు పారదర్శకంగా జరిగాయని తెలిపారు. వైఎస్సార్సీపీ ముఖ్య నేతలను అరెస్ట్లు చేయటం, వేధింపులకు గురిచేయటమే లక్ష్యంగా లేని మద్యం స్కామ్ను సృష్టించారని స్పష్టం చేశారు. గత టీడీపీ ప్రభుత్వం హయాంలో బార్లకు మేలు చేస్తూ ప్రివిలేజ్ ఫీజు రద్దు చేసి ప్రభుత్వ ఖజానాకు గండికొడితే ఈడీకి ఇవన్నీ కనిపించలేదా అని ప్రశ్నించారు. ఎంపిక చేసుకున్న డిస్టిలరీస్ నుంచి మద్యం కొనుగోలు చేసి అవినీతికి పాల్పడినా ఈడీ కళ్ళు మూసుకుందా అంటూ ధ్వజమెత్తారు. మా పార్టీ బీసీ యువ నాయకుడు కారుమూరి సునీల్కుమార్పై ఈడీ అన్యాయంగా కేసుపెట్టి అరెస్ట్ చేయటం రాజకీయ కక్షపూరిత చర్యల్లో భాగమే అన్నారు. -
ప్రభుత్వానికి రైతులంటే చులకన
తాడేపల్లిగూడెం: కూటమి ప్రభుత్వానికి రైతులంటే చులకనని అప్సడా మాజీ వైస్ చైర్మన్, తాడేపల్లిగూడెం నియోజకవర్గ వైఎస్సార్సీపీ కన్వీనర్ వడ్డి రఘురాం అన్నారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. రైతులు ఏ పంట పండించినా వారి పరిస్థితి దయనీయంగా మారిందన్నారు. మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి రైతులను పలుకరిస్తేనే ప్రభుత్వం స్పందిస్తుందని, లేదంటే వారిని గాలికొదిలేస్తుందన్నారు. ఆక్వా రంగ రైతుల పరిస్థితి ఎవరూ పట్టించుకోవడంలేదన్నారు. సీడ్, ఫీడ్ ధరలు వ్యత్యాసాలకు అనుగుణంగా రైతులకు సానుకూలంగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవడం లేదన్నారు. గతంలో ఆక్వా రంగంపై ట్యాక్స్ వేస్తే జే ట్యాక్స్ అని విమర్శలు చేసిన కూటమి నాయకులు ప్రస్తుతం వేస్తున్న ట్యాక్సులు సీబీఎన్ ట్యాక్స్, లోకేష్ ట్యాక్స్, పవన్ ట్యాక్సా అని ప్రశ్నించారు. ఆక్వా రైతులు, రైతు సంఘ నాయకులు జగన్ను కలిసి కూటమి ప్రభుత్వ హయాంలో ఇబ్బందులు చెప్పారన్నారు. ఫీడ్, సీడ్ ధరలు తగ్గించాలని లేకపోతే ఆక్వా రైతుల తరఫున రోడ్డు మీదకు వస్తామని, ఉద్యమం చేస్తామని ప్రకటించిన వెంటనే గురువారం చంద్రబాబు ఆక్వా అధికారులతో సమావేశమై ఫీడ్ ధరను తగ్గించారన్నారు. 0.92 నుంచి 0.95 వరకు పెట్టిన పవర్ ఫ్యాక్టర్ను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. వచ్చే నెల బిల్లులోనే ఇది జరగాలని, ఆక్వా రైతులను ఆదుకోవాలని కోరారు. అప్సడా మాజీ వైస్ చైర్మన్ వడ్డి రఘురాం -
నీట్ పరీక్షకు పటిష్ట ఏర్పాట్లు
భీమవరం: జిల్లాలో ఈనెల 21వ తేదీన నిర్వహించనున్న నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్–యూజీ)పరీక్షలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో పరీక్షల నిర్వహణపై జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 5 పరీక్షా కేంద్రాల్లో 2,475 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నట్లు తెలిపారు. భీమవరం డీఎన్నార్ పీజీ అటానమస్ కళాశాల, డీఎన్నార్ యూజీ అటానమస్ కళాశాల, తాడేపల్లిగూడెం ఎంఎంఎం అకాడమిక్ కాంప్లెక్స్, నిట్ కళాశాల, తణుకు పీఎంశ్రీ జడ్పీ బాలుర ఉన్నత పాఠశాల, జేఎస్ఎంఎల్ జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని పోలీసు శాఖ అధికారులను ఆదేశించారు. సమావేశంలో ఎస్పీ అద్నాన్ నయీం అస్మి, జాయింట్ కలెక్టర్ టి రాహుల్కుమార్ రెడ్డి, డీఆర్ఓ బి శివన్నారాయణ రెడ్డి, భీమవరం, తాడేపల్లిగూడెం ఆర్డీవోలు కె.ప్రవీణ్ కుమార్ రెడ్డి, ఎం సూర్యారావు తదితరులు పాల్గొన్నారు. -
జంగారెడ్డిగూడెంలో భారీ భూ కుంభకోణం
జంగారెడ్డిగూడెం: నకిలీ పత్రాలు, తప్పుడు రిజిస్ట్రేషన్లతో అమాయకులను మోసం చేస్తూ సాగుతున్న ఒక భారీ భూ కుంభకోణాన్ని జంగారెడ్డిగూడెం పోలీసులు అత్యంత చాకచక్యంగా ఛేదించారు. స్థానిక సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జంగారెడ్డిగూడెం ఏఎస్పీ సుస్మిత రామనాథన్ మాట్లాడుతూ ఈ కేసులో ఏడుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు వివరించారు. పట్టణంలోని రామచంద్రపురం ప్రాంతానికి చెందిన రాజనాల రమాదేవి అనే మహిళకు చెందిన 625 చదరపు గజాల విలువైన స్థలాన్ని అక్రమంగా కాజేయడానికి కుట్ర చేశారన్నారు. రమాదేవి తన ఆస్తిని ఉండి కృష్ణవేణి అనే మహిళకు వీలునామా రాసిచ్చినట్లు ఒక నకిలీ వీలునామాను, అలాగే రమాదేవి మరణించినట్లు ఒక నకిలీ మరణ ధ్రువీకరణ పత్రాన్ని సృష్టించారన్నారు. ఆ తర్వాత ఈ తప్పుడు పత్రాలను నిజమైనవిగా నమ్మించి సబ్–రిజిస్ట్రార్ కార్యాలయంలో అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారన్నారు. అనంతరం ఆ స్థలాన్ని భాగాలుగా విభజించి, ఇతర నిందితుల పేర్లపై మార్చి, చివరకు వేగవరం ప్రాంతానికి చెందిన కొనుగోలుదారులకు విక్రయించారన్నారు. ఈ విధంగా అసలు యజమానురాలిని మోసం చేసి సుమారు రూ.55 లక్షలు అక్రమంగా ఆర్జించినట్లు దర్యాప్తులో తేలిందన్నారు. నిందితులు వీరే ఈ కేసుపై లోతుగా దర్యాప్తు జరిపిన జంగారెడ్డిగూడెం ఎస్సై ఎన్వీ ప్రసాద్, సిబ్బంది గురువారం ఏడుగురు నిందితులను అరెస్ట్ చేశారన్నారు. ఈ కేసులో జంగారెడ్డిగూడేనికి చెందిన ఉండి కృష్ణవేణి, మత్స లోవరాజు, సింగంశెట్టి సత్యనారాయణ అలియాస్ సత్తిరాజు, సజ్జా రమేశ్ బాబు, జంగారెడ్డిగూడెం పట్టణ టీడీపీ మాజీ అధికార ప్రతినిధి గెడా సుబ్రహ్మణ్యం, నిడదవోలుకు చెందిన జెట్టి ఉమామహేశ్వరరావు అలియాస్ ఉమ, తాళ్లపూడి మండలం పెద్దేవం గ్రామానికి చెందిన దాసరి సురేశ్ అలియాస్ స్టాలిన్లను అరెస్టు చేసి వారి నుంచి నేరానికి ఉపయోగించిన ల్యాప్టాప్, ప్రింటర్, నకిలీ వీలునామా, నకిలీ మరణ ధ్రువీకరణ పత్రాలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఈ కేసుతో సంబంధం ఉన్న మరికొంత మందిని అరెస్టు చేయనున్నట్లు తెలిపారు. అరెస్టు చేసిన నిందితులను న్యాయస్థానం ముందు హాజరుపరుస్తామని ఏఎస్పీ తెలిపారు. స్థలాలు, ఇళ్లు వంటి స్థిరాస్తులను కొనుగోలు చేసేటప్పుడు ఆస్తి పత్రాలు, రిజిస్ట్రేషన్ వివరాలు, ఎన్కంబరెన్స్ సర్టిఫికెట్ (ఈసీ), రెవెన్యూ రికార్డులను అసలు యజమాని వివరాలతో సరిచూసుకోవాలని ఏఎస్పీ సుస్మిత రామనాథన్ తెలిపారు. మహిళతో సహా ఏడుగురు నిందితుల అరెస్ట్ -
నాడు–నేడు పనులకు మోక్షమెప్పుడో?
● చంద్రబాబు ప్రభుత్వం రాకతో నిలిచిన పనులు ● అసంపూర్తిగా పాఠశాలల భవన నిర్మాణాలు భీమవరం: గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం విద్యకు పెద్ద పీట వేసింది. కార్పొరేట్కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దేందుకు మనబడి, నాడు – నేడు పేరిట అభివృద్ధి పనులు చేపట్టింది. అనంతరం ఎన్నికల్లో చంద్రబాబు ప్రభుత్వం అధికారం చేపట్టడంతో పాఠశాలల అభివృద్ధి పనులకు బ్రేక్ పడింది. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి రెండేళ్లు పూర్తయినా నేటికీ ఆ పనులు పూర్తిచేయడం లేదు. దీంతో అంసపూర్తిగా నిలిచిన పాఠశాలల భవనాలతో విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జగన్ హయాంలో కార్పొరేట్కు దీటుగా.. జిల్లాలోని 20 మండలాల పరిధిలో దాదాపు 1,399 ప్రభుత్వ పాఠశాలల్లో సుమారు 90 వేలకు పైగా విద్యార్థులు విధ్యనభ్యసిస్తున్నారు. గతంలో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు సరిపడా తరగతి గదులు, మరుగుదొడ్లు వంటి సదుపాయాలు లేకపోవడంతో పేదలు సైతం ఆర్థిక స్థోమత లేకపోయినా తమ పిల్లలను ఉన్నతులుగా తీర్చిదిద్దడానికి ప్రైవేటు పాఠశాలల్లో చేర్పించక తప్పేదికాదు. 2019లో వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారం చేపట్టిన తరువాత ప్రభుత్వ పాఠశాలలపై దృష్టిపెట్టి మనబడి, నాడు–నేడు పథకంతో ప్రైవేట్ విద్యాసంస్థలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో సకల సౌకర్యాలు కల్పించడమేగాక ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టి విద్యార్థులకు ట్యాబ్లు, పాఠశాలల్లో డిజిటల్ బోధన అమలు చేశారు. దీంతో ఒక్కసారిగా ప్రభుత్వ పాఠశాలలపై ప్రజలకు మళ్లీ ఆసక్తి పెరిగింది. అనేక ప్రాంతాల్లో తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ స్కూళ్లలో చేర్పించారు. దీంతో కొన్ని ప్రాంతాల్లో ప్రభుత్వ స్కూళ్ల వద్ద నో వేకెన్సీ బోర్డులు దర్శనమిచ్చాయి. అమ్మ ఒడి, ఫీజు రీయింబర్స్మెంట్ వంటి పథకాలు విద్యార్థులకు ఎంతగానో దోహదపడడంతో పేద విద్యార్థులు సైతం ఉన్నత విద్యనభ్యసించి మంచి ఉద్యోగాలు సాధించారు. జిల్లాలోని 254 పాఠశాలల భవనాల మరమ్మతులు చేపడుతున్నాం. పెచ్చులూడిన శ్లాబ్ల మరమ్మతులు, గోడల నిర్మాణం వంటి పనులకు సుమారు రూ.9 కోట్లతో పనులు చేపడతాం. అలాగే 158 పాఠశాలల్లో అదనపు తరగతి గదుల నిర్మాణానికి రూ.2.5 కోట్లు వ్యయానికి సంబంధించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. ప్రభుత్వ అనుమతులు రాగానే పనులు పూర్తిచేయిస్తాం. – పి శ్యామ్సుందర్, జిల్లా సమగ్రశిక్షా అదనపు ప్రాజెక్టు కోఆర్డినేటర్, భీమవరం వైఎస్ జగన్ ప్రభుత్వంలో ప్రభుత్వ పాఠశాలలన్నీ అధునీకరిస్తున్న సమయంలో 2024లో ప్రభుత్వం మారింది. ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో నాడు–నేడు పనులకు బ్రేక్ పడింది. ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోవడంతో కొన్ని భవనాలు పునాదుల్లోనే నిలిచిపోగా మరికొన్ని భవనాలు గోడలు నిర్మాణం, ప్లాస్టింగ్ పనులు పూర్తికాక నిరుపయోగం ఉన్నాయి. దీంతో జిల్లాలో దాదాపు 400 స్కూళ్లు అభివృద్ధికి నోచుకోకుండా మిగిలిపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలోని 254 స్కూళ్ల మరమ్మతులు, మరో 158 స్కూళ్లలో అదనపు తరగతి గదులు నిర్మాణం జరగాల్సి ఉంది. వీటికిగాను దాదాపు రూ.13 కోట్లు నిధులు అవసరం ఉంటుంది. ప్రభుత్వ పాఠశాలలను త్వరితగతిని అభివృద్ధి చేసి వినియోగంలోకి తీసుకురావాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. -
ట్రిపుల్ఐటీ మెస్లలో పొరుగు రాష్ట్ర వర్కర్లు
● ఒడిసా వర్కర్ల నియామకంపై అభ్యంతరం ● స్థానిక మహిళల ఉపాధికి గండి ● విద్యార్థుల భద్రతా ప్రశ్నార్థకం? నూజివీడు: నూజివీడు ట్రిపుల్ఐటీలో పనిచేసేందుకు ఒడిసా నుంచి వర్కర్లను తీసుకురావడంపై అటు స్టాఫ్.. ఇటు విద్యార్థులతో పాటు ఇప్పటివరకూ పనిచేస్తున్న సిబ్బందిలో తీవ్ర ఆందోళన నెలకొంది. ఇతర రాష్ట్రాల నుంచి ఊరూపేరు తెలియకుండా దాదాపు 80 మంది వర్కర్లను తీసుకురావడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. నూజివీడు ట్రిపుల్ఐటీలోని మెస్లను హరేరామ హరే కృష్ణ ఫౌండేషన్కు టీడీపీ ప్రభుత్వం గతేడాది అక్టోబర్ నుంచి టెండర్లు ఏమీ లేకుండా ఏకపక్షంగా అప్పగించింది. అయితే ఈ మెస్లలో నూజివీడుతో పాటు చుట్టుపక్కల గ్రామాలకు చెందిన పేద మహిళలు పనిచేస్తూ ఉపాధి పొందుతున్నారు. వీరి ఉపాధికి గండికొట్టేలా మెస్లను నిర్వహిస్తున్న ఫౌండేషన్ ఒడిసా యువకులను తీసుకురావడం ట్రిపుల్ఐటీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. మెస్ నిర్వాహకులు తీసుకువచ్చిన 80 మంది ఒడిసా కూలీలు ట్రిపుల్ఐటీలోని మెస్లోనే గత వారం రోజులుగా ఉండటంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తమవుతోంది. ప్రభుత్వానికి చెందిన రెసిడెన్షియల్ విద్యాసంస్థ లోపల వాళ్లు ఎలా ఉంటారనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. యువకులతో వడ్డనా..? నూజివీడు ట్రిపుల్ఐటీలో మొత్తం విద్యార్థుల్లో 65 శాతం నుంచి 70 శాతం మంది విద్యార్థినులే ఉన్నారు. ఇప్పటివరకు మెస్లలో వడ్డన చేయడం, డైనింగ్ హాల్స్ శుభ్రం చేయడం, వంట పాత్రలు కడగడం, కుర్చీలు, టేబుల్స్ తుడవడం వంటి పనులన్నింటినీ స్థానికంగా ఉండే మహిళలే చేసేవారు. ఇప్పుడు వారిని తొలగించి ఈ పనులను చేయడానికి ఒడిసా యువకులను పెడుతుండటంపై విమర్శలు వస్తున్నాయి. మెస్లలో ఎక్కువగా ఆడపిల్లలు ఉంటారు కాబట్టి యువకులను ఎలా పెడతారని ప్రశ్నిస్తున్నారు. విద్యార్థినులకు సురక్షితమేనా? యువకులందరిది ఒడిసా కాగా.. వారు ఏ ఊరివారు, ఎక్కడి నుంచి వచ్చారు, వారి ప్రవర్తన, ఏమైనా నేర స్వభావం ఉందా.. గతంలో ఏమైనా నేరాలు చేశారా అనే వివరాలు ఏమీ తెలియకుండా ఇక్కడి మెస్లలో పెట్టడమేంటని విస్మయం వ్యక్తం చేస్తున్నారు. 8 వేల మంది విద్యార్థుల్లో 5 వేలకు పైగా బాలికలే ఉన్నారు. క్యాంపస్లోనే బోధనా సిబ్బంది అంతా క్వార్టర్స్లో నివాసముంటున్నారు. ఈ పరిస్థితుల్లో వేరే రాష్ట్రానికి చెందిన ముక్కూమొహం తెలియని వారిని తీసుకొచ్చి పెడితే ఎలాగనే ప్రశ్నలు సిబ్బంది నుంచి వ్యక్తమవుతున్నాయి. ట్రిపుల్ఐటీ పెట్టిన నాటి నుంచి నూజివీడుతో పాటు చుట్టుపక్కల ఉన్న సుంకొల్లు, యనమదల, రేగుంట, పోతురెడ్డిపల్లి గ్రామాలకు చెందిన పేద మహిళలు మెస్లలో పనిచేసేవారు. ఒడిసా యువకులతో వీరందరి ఉపాధి పోనుంది. దీంతో వీరు ఆందోళనకు దిగేందుకు సిద్ధమవుతున్నారు. దీనిపై ట్రిపుల్ఐటీ యాజమాన్యం స్పష్టమైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
నవ్విపోదురుగాక.. మాకేంటి!
భారీ భూ కుంభకోణం నకిలీ పత్రాలు, తప్పుడు రిజిస్ట్రేషన్లతో అమాయకులను మోసం చేస్తూ సాగుతున్న భారీ భూ కుంభకోణాన్ని జంగారెడ్డిగూడెం పోలీసులు ఛేదించారు. 8లో uనవ్విపోదురుగాక నాకేంటన్న చందాన ఉంది కూటమి పాలకుల తీరు. ఎన్నికల హామీలను గాలికొదిలేసి రెండేళ్ల పాలనపై విజయోత్సవ సంబరాలు చేసుకోవడం చూసి జనం ముక్కున వేలేసుకుంటున్నారు. మద్యాన్ని ఏరులై పారించడం, ఇసుక, మట్టి దోపిడీ తప్ప పేదల కోసం ఏం చేశారని ప్రజాధనం వృథా చేస్తూ వేడుకలు చేసుకుంటున్నారని ప్రశ్నిస్తున్నారు. జిల్లాలో కూటమి సంబరాలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.● హామీలు విస్మరించి.. వంచనతో పాలించి ● కూటమి రెండేళ్ల సంబరాలపై ముక్కున వేలేసుకుంటున్న జనం ● జిల్లాలో నేడు సంబరాలు శురకవారం శ్రీ 19 శ్రీ జూన్ శ్రీ 2026సాక్షి, భీమవరం ● వ్యవ‘సాయ’మేది? గత ప్రభుత్వం తెచ్చిన ఉచిత పంటల బీమాని ఎత్తేసి ప్రీమియం భారాన్ని రైతులపై మోపారు. పాత బకాయిలతో దాదాపు రూ. 21 కోట్లు నీటి తీరువాను వడ్డీతో సహా వసూలు చేస్తున్నారు. గత ఖరీఫ్లో మోంథా తుపానుతో 9,201 హెక్టార్లలో రూ.23 కోట్ల మేర పంట నష్టం వాటిల్లితే మళ్లీ ఖరీఫ్ మొదలైన పరిహారం ఇవ్వలేదు. జిల్లాలోని 80 వేల మంది కౌలు రైతులకు సాయంపై మాట్లాడటం లేదు. అగ్రిల్యాబ్లు, ఆర్బీకేలను అధోగతిపాల్జేశారు. ఆక్వా రైతులకు రూ.1.50 రాయితీ విద్యుత్ ఇస్తామని ఇప్పుడు పవర్ ఫ్యాక్టర్ పేరుతో ప్రస్తుతం ఇస్తున్న సబ్సిడీకి ఎగనామం పెట్టే పనిలో ఉన్నారు. రొయ్య రేట్లు తగ్గించి, మేత ధరలు పెంచేసి సిండికేటు చేస్తున్న దోపిడీకి కళ్లెం వేయలేకపోతున్నారు. ● అను‘గృహం’ ఎప్పుడు? ఇళ్లు లేని పేదలకు మూడు సెంట్లు స్థలం ఇస్తామని సెంటు కూడా ఇవ్వలేదు. ఇంటి నిర్మాణానికి రూ.నాలుగు లక్షలు సాయం అందిస్తామని చెప్పినా ఆ ఊసేలేదు. సొంతింటి కోసం ఎంతోమంది ఎదురు చూస్తుంటే గ్రామీణ ప్రాంతాల్లో ఒక్క ఇళ్లు మంజూరులేదు. పీఎం ఆవాస యోజనగా ఇటీవల పట్టణ ప్రాంతాల్లోని 595 ఇళ్లను మంజూరు చేశారు. ఆవాస్ ప్లస్లో 16,773 ఇళ్లను సర్వే చేసి 10,789 మంది అర్హులుగా గుర్తించగా వీరంతా మంజూరు కోసం చూస్తున్నారు. గతంలో ఇచ్చిన ఇళ్లను పూర్తిచేసేందుకు ప్రభుత్వం ఆపసోపాలు పడుతోంది. ● వైద్యానికి సుస్తీ ఆనారోగ్యం వస్తే ఆరోగ్య సురక్ష, ఫ్యామిలీ ఫిజీషియన్ వైద్యులు వస్తారన్న భరోసా. ఎంత పెద్ద రోగమైనా ఆరోగ్యశ్రీలో రూ.25 లక్షల వరకు ఉచితంగా వైద్యం అందుతుందన్న ధీమా. కోలుకునే వరకు జీవనోపాధికి ఆరోగ్య ఆసరా వస్తుందన్న నమ్మకాన్ని కూటమి దూరం చేసింది. గతంలో జిల్లాలోని ఆచంట, ఆకివీడు, భీమవరం, పాలకొల్లు, నరసాపురం సీహెచ్సీల్లో ఉచితంగా కంటి వైద్య సేవలు, కళ్లజోళ్ల పంపిణీకి మంగళం పాడింది. బకాయిల కోసం నెట్వర్క్ ఆస్పత్రులు పలుమార్లు ఆరోగ్యశ్రీ సేవలను బహిష్కరించిన దుస్థితి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మందుల కొరత, అరకొర సేవలతో పేదలు ఇబ్బంది పడుతున్నారు. ● ఏదీ ధీమా ఇంటి యజమాన్ని కోల్పోయి దిక్కుతోచని కుటుంబానికి ఆధారమైన బీమా పథకాన్ని నిర్వీర్యం చేశారు. ప్రమాదం, ఆనారోగ్యం కారణంగా రెండేళ్లలో ఇంటి పెద్ద మృతితో బీమా సాయం అందక జిల్లాలో రోడ్డున పడ్డ కుటుంబాలెన్నో. ● ఏమీలేదని‘పింఛెన్’ పేదలకు ఆర్థిక భరోసానిచ్చే పింఛన్ల మంజూరును విస్మరించింది. 2024 జూన్ నాటికి జిల్లాలో 2,32,885 మంది లబ్ధిదారులు ఉంటే ప్రస్తుతం వారి సంఖ్య 2,20,843 తగ్గింది. రెండేళ్లలో కొత్త పింఛన్ ఒక్కటి ఇవ్వక వృద్ధాప్య, వితంతు, దివ్యాంగ తదితర పింఛన్లు కోసం జిల్లాలో వేల మంది ఎదురుచూస్తున్నారు. 50 ఏళ్లకే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు వృద్ధాప్య పింఛన్ హామీ ఊసెత్తడంలేదు. జిల్లాలో 50 ఏళ్ల నుంచి 60 ఏళ్ల మధ్య పింఛన్కు అర్హత కలిగిన వారు 2 లక్షల మంది ఉంటారని అంచనా. ● మహిళకు వంచన సూపర్సిక్స్లో మొదటిదైన ఆడబిడ్డ నిధి అమలవ్వక రెండేళ్లలో జిల్లాలో అర్హత కలిగిన సుమారు 5,96,313 మంది మహిళలు రూ.2147 కోట్లు నష్టపోయారు. మహిళల కోసం గత ప్రభుత్వం తెచ్చిన చేయూత, కాపునేస్తం, ఈబీసీ నేస్తం, వడ్డీ రాయితీ పథకాలను తుంగలోకి తొక్కారు. డ్వాక్రా సంఘాలకు వడ్డీలేని రుణాలు రూ.10 లక్షల వరకు పెంపు, మహిళ ఉద్యోగులకు హాస్టల్ వసతి, అంగన్వాడీ కార్యకర్తలకు గ్రాట్యుటీ, ఆశా వర్కర్లకు కనీస వేతనం పెంపు హామీలను గాలికొదిలేశారు. జిల్లాలోని 3,486 మంది మహిళలకు కుట్టు శిక్షణ ఇచ్చి ఏడాదవుతున్నా మిషన్లు ఇవ్వలేదు. ‘‘బాబు ష్యూరిటీ.. భవిష్యత్తుకు గ్యారంటీ అంటూ చంద్రబాబు, పవన్కళ్యాణ్ ఫొటోలతో ఉన్న ఈ చిత్రాన్ని చూశారా? కూటమి వచ్చిన 2024 జూన్ నుంచే ఇచ్చే పథకాలు అమలు చేస్తామంటూ ఎన్నికల్లో ఇంటింటికీ పంచిన కరపత్రమిది. పాలకొల్లులోని ఒక కుటుంబంలో నలుగురు సభ్యుల్లో ఇద్దరు మహిళలకు ఆడబిడ్డ నిధిగా ఒక్కొక్కరికి రూ.1500 చొప్పున ఏడాదికి రూ.36 వేలు. ఇద్దరు యువకులకు నిరుద్యోగ భృతిగా నెలకు ఒక్కొక్కరికి రూ.3 వేలుచొప్పున ఏడాదికి రూ.72 వేలు. మొత్తం రూ.1.08 లక్షలు లబ్ధి చేకూరుతుందని స్పష్టంగా పేర్కొన్నారు. దీనినే బాండ్ పేపర్గా భావించమని సంతకాలు చేసిచ్చారు. రెండేళ్లలో ఆ కుటుంబానికి రూ.2.16 లక్షల సాయం అందాలి. నెలనెలా ఇస్తామన్న ఆడబిడ్డ నిధి, రూ.మూడు వేల నిరుద్యోగ భృతి కోసం పేదలు ఎదురుచూస్తున్నారు. ఎంత మేలు చేసింది పాలకులే చెప్పాలి’’ ప్రగతి.. అధోగతి జిల్లాకు తలమానికంగా నరసాపురం రూరల్ లిఖితపూడిలోని 40 ఎకరాల స్థలంలో రూ.వంద కోట్లతో చేపట్టిన ఆక్వా వర్సిటీ పనులను ప్రభుత్వం అర్ధాంతరంగా ఆపేసింది. అద్దె భవనంలో ఆక్వా కళాశాల నిర్వహిస్తోంది. రూ.475 కోట్లతో పాలకొల్లు రూరల్ దగ్గులూరులోని 60 ఎకరాల్లో నిర్మిస్తున్న మెడికల్ కళాశాల పనులకు ప్రైవేటీకరణ గ్రహణం పట్టింది. పేదల విద్యకు ఎసరు కార్పొరేట్కు కొమ్ముకాస్తూ సంస్కరణల పేరుతో ప్రభుత్వ పాఠశాలలను అధోగతి పాల్జేస్తున్నారు. నాడు–నేడు అభివృద్ధి పనులను, 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్ల పంపిణీని ఆపేశారు. గతంలో పాఠశాలలు తెరిచిన రోజునే బుక్స్, యూనిఫాం, బూట్లు తదితర వాటితో విద్యార్థులకు విద్యాకానుక కిట్లు పంపిణీ చేస్తే అరకొరగా నాసిరకం కిట్లను అందజేస్తూ వస్తున్నారు. -
లారీ ఢీకొని వ్యక్తి మృతి
తాడేపల్లిగూడెం రూరల్: మోపెడ్ సైకిల్పై వెళ్తున్న వ్యక్తిని వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొనడంతో మృతి చెందిన సంఘటన మండలంలోని నవాబుపాలెంలో గురువారం చోటు చేసుకుంది. వివరాల ప్రకారం గ్రామానికి చెందిన వేమగిరి రాజు (42) తాడేపల్లిగూడెంలోని ఒక బట్టల దుకాణంలో సేల్స్ ఎగ్జిక్యూటివ్గా పని చేస్తున్నాడు. గురువారం ఉదయం బట్టల దుకాణానికి వెళ్తున్న సమయంలో గ్రామంలోని కూడలికి కొంచెం దూరంలోనే టిప్పర్ లారీ ఢీకొనడంతో దాని చక్రాల కింద పడ్డాడు. దీంతో లారీ చక్రాలు రాజు నడుముపై నుంచి వెళ్లాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రుడిని తాడేపల్లిగూడెం ఏరియా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతుడికి భార్య మహాలక్ష్మి, నలుగురు కుమార్తెలు ఉన్నారు. బట్టల దుకాణానికి వెళ్తూ తన తండ్రి ఫొటో తీయించుకున్నట్లు మూడో కుమార్తె ప్రత్యూష విలపించడం చూపరులను కలచివేసింది. ఈ మేరకు రూరల్ ఎస్సై రవికుమార్ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. కాగా లారీ డ్రైవర్ పరారీలో ఉన్నట్లు సమాచారం. పాలకోడేరు: అదనపు కట్నం కోసం తనను వేధిస్తున్నారంటూ భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు గురువారం కేసు నమోదు చేసినట్లు పాలకోడేరు ఏఎస్సై నరసింహమూర్తి తెలిపారు. మోగల్లు గ్రామానికి చెందిన జోగి అనూషకు పెనుమంట్ర మండలం, బ్రాహ్మణచెరువుకు చెందిన సత్య హరిశ్చంద్ర ప్రసాద్ తో 2013లో వివాహమైంది. వారికి ఒక బాబు కూడా ఉన్నాడు. అయితే ఇటీవల అదనపు కట్నం కావాలంటూ భర్తతో సహా ఐదుగురు అత్తింటి వారు మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నారు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. -
వైఎస్సార్ సీపీ శ్రేణులపై క్రిమినల్ కేసు
దేవరపల్లి: తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి పోలీస్స్టేషన్ ముందు రోడ్డుపై నిలబడి నినాదాలు చేసిన వైఎస్సార్ సీపీ శ్రేణులపై క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు సీఐ బి.నాగేశ్వర్ నాయక్ తెలిపారు. గురువారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో పోలీస్స్టేషన్ ఎదురుగా ఉన్న పాత జీఎన్టీ రోడ్డుపై వైఎస్సార్ సీపీ నేత, మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, ఆయన ఇద్దరు కుమారులు, సుమారు 100 మంది కలిసి ఎటువంటి ముందస్తు అనుమతీ లేకుండా గుమిగూడారని, రోడ్డుపై నినాదాలు చేస్తూ సమావేశం నిర్వహించారని చెప్పారు. ఈ సంఘటనలో పాల్గొన్న అందరిపై కేసు నమోదు చేశామని తెలిపారు. ఈ కేసు విచారణ త్వరితగతిన చేపట్టి, ఫొటోలు, వీడియోలు, డ్రోన్ వీడియోల ద్వారా అందరినీ గుర్తించి చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పారు. వాహనాలను కూడా సీజ్ చేస్తామని సీఐ తెలిపారు. విచారణకు శేషుబాబు హాజరు దేవరపల్లి పోలీస్స్టేషన్లోని సర్కిల్ కార్యాలయంలో విచారణకు మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు హాజరయ్యారు. ఆయనను సీఐ నాయక్ సుమారు రెండు గంటల పాటు విచారించారు. అనంతరం 41 నోటీసు ఇచ్చి ఈ నెల 29న మళ్లీ విచారణకు హాజరు కావాలని పంపించారు. విచారణ సందర్భంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి పార్టీ శ్రేణులు, అభిమానులు, గౌడ సంఘాల నాయకులు శేషుబాబుకు మద్దతుగా పోలీస్స్టేషన్కు చేరుకున్నారు. విచారణ అనంతరం బయటకు వచ్చిన శేషుబాబు మీడియాతో మాట్లాడుతూ తన రాజకీయ ఎదుగుదలను చూడలేక కూటమి నాయకుల అండదండలతో తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన కంపెనీలకు సంబంధించిన వివాదం న్యాయస్థానం పరిధిలో ఉందన్నారు. అయి నా అక్రమంగా కేసులు పెట్టి, విచారణకు పిలిచి అవమానిస్తున్నారని మండిపడ్డారు. -
మెరుగైన సేవల్లో అద్వితీయం
● భక్తులకు మెరుగైన దర్శనం, సేవలు అందిస్తున్న దేవస్థానాల్లో శ్రీవారి దేవస్థానానికి రెండో ర్యాంక్ ● వాట్సాప్, ఐవీఆర్ఎస్ సర్వేల్లో వెల్లడి ద్వారకాతిరుమల: రాష్ట్రంలోని ఏడు ప్రధాన దేవాలయాలకు వచ్చే భక్తులకు ఆయా దేవస్థానాలు అందిస్తున్న సేవలపై ప్రభుత్వం తాజాగా నిర్వహించిన సర్వేలో ద్వారకాతిరుమల శ్రీవారి దేవస్థానానికి రెండో ర్యాంకు దక్కింది. ప్రతి నెలా వాట్సాప్, ఐవీఆర్ఎస్ ద్వారా దర్శనం సంతృప్తికరంగా జరిగిందా? దేవాలయాల్లో తాగునీటి వసతులు బాగున్నాయా? ప్రసాదం తాజాగా, రుచిగా ఉందా? పారిశుద్ధ్యం సంతృప్తికరంగా ఉందా? అనే ఈ నాలుగు అంశాలపై సర్వే నిర్వహిస్తున్నారు. అందులో గత నెల అన్ని అంశాల్లోనూ మొదటి ర్యాంక్ సాధించిన ద్వారకాతిరుమల దేవస్థానం, ఈనెల 16న వెలువడిన జూన్ నెలకు సంబంధించిన సర్వేలో ఓ మెట్టు దిగి, ద్వితీయ స్థానంలో నిలిచింది. ఇదిలా ఉంటే ఈసారి దర్శనం ఇతర అన్ని అంశాల్లో శ్రీకాళహస్తి దేవస్థానం మొదటి ర్యాంక్ సాధించగా, శ్రీశైలం దేవస్థానం ఆఖరి స్థానంలో నిలిచింది. దర్శనం ఇతర అంశాల్లో.. శ్రీకాళహస్తి 75.8 శాతంతో మొదటి ర్యాంక్ సాధించగా, ద్వారకాతిరుమల 74.2 శాతంతో రెండవ ర్యాంక్, అన్నవరం 73.0 శాతంతో మూడవ ర్యాంక్, సింహాచలం 72.6 శాతంతో నాల్గవ ర్యాంక్, కాణిపాకం 72.0 శాతంతో ఐదవ ర్యాంక్, విజయవాడ 71.2 శాతంతో ఆరవ ర్యాంక్ సాధించగా, శ్రీశైలం 68.8 శాతంతో ఆఖరి స్థానంలో నిలిచింది. సౌకర్యాల కల్పనలో.. శ్రీకాళహస్తి 75.75 శాతంతో మొదటి ర్యాంక్, ద్వారకాతిరుమల 74.21 శాతంతో రెండవ ర్యాంక్, అన్నవరం 73.0 శాతంతో మూడవ ర్యాంక్, సింహాచలం 72.61 శాతంతో నాల్గవ ర్యాంక్, కాణిపాకం 71.97 శాతంతో ఐదవ ర్యాంక్, విజయవాడ 71.16 శాతంతో ఆరవ ర్యాంక్, శ్రీశైలం 68.80 శాతంతో ఏడవ (ఆఖరి) ర్యాంక్ సాధించింది. -
కాళ్లకూరు వెంకన్న హుండీ ఆదాయం లెక్కింపు
కాళ్ల: మండలంలోని కాళ్లకూరులో స్వయంభూః శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో గురువారం హుండీ ఆదాయాన్ని లెక్కించారు. దేవదాయ ధర్మదాయ శాఖ ఆధ్వర్యంలో హుండీ ఆదాయాన్ని లెక్కించగా 83 రోజులుగాను రూ.21,25,181 ఆదాయం వచ్చినట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి ఎం.అరుణ్ కుమార్ తెలిపారు. ముసునూరు: గత కొన్ని రోజులుగా రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తూ మోటార్ల వైర్లను వరుసగా చోరీ చేసిన దొంగలను అరెస్టు చేసి గురువారం కోర్టులో హాజరుపర్చినట్లు ఎస్సై ఎం.చిరంజీవి తెలిపారు. ఈ చోరీలపై కొద్ది రోజుల నుంచి గస్తీ ముమ్మరం చేసి, విస్తృతంగా తనిఖీలు చేస్తుండగా బైక్పై మోటారు వైర్లు తరలిస్తున్న ముఠాను పట్టుకున్నట్లు చెప్పారు. కాగా దొంగల ముఠాలో పరివర్తన కోసం నూజివీడు ప్రధాన కూడలి నుంచి కోర్టు వరకు బహిరంగంగా నడిపించుకుంటూ తీసుకువెళ్లి కోర్టులో హాజరుపర్చినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐ ఐవీ నాగేంద్ర కుమార్, పోలీసులు పాల్గొన్నారు. భీమడోలు: మండలంలోని పూళ్లలో ఓ పాఠశాల విద్యార్థిని అదృశ్యమైన ఘటన గురువారం చోటు చేసుకుంది. వివరాల ప్రకారం పూళ్లకు చెందిన ఓ వ్యక్తికి ఇద్దరు పిల్లలు ఉండగా, కుమార్తె పూళ్ల జెడ్పీ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుకుంటుంది. ఈ క్రమంలో యథావిధిగా పాఠశాలకు వెళ్లిన విద్యార్థినీ మధ్యాహ్న భోజనం చేసి ఉపాధ్యాయులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా బయటకు వెళ్లిపోయింది. పాఠశాలలోని మధ్యాహ్నం తరగతులకు హాజరుకాకపోవడంతో హెచ్ఎం బాలిక తండ్రికి సమాచారం అందించారు. వెంటనే ఆయన కుటుంబ సభ్యుల సాయంతో ఆచూకీ కోసం బంధువులు, ఇతర పరిసరాలను గాలించారు. ఫలితం లేకపోవడంతో గురువారం రాత్రి భీమడోలు పోలీసులను ఆశ్రయించాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని భీమడోలు ఎస్సై మదీనా బాషా తెలిపారు. -
విగ్రహాల ఏర్పాటులో ‘పచ్చ’పాతం
సాక్షి, టాస్క్ఫోర్స్ : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంక్షేమానికి చిరునామాగా నిలిచి, పేదల గుండెల్లో కొలువైన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలు ముదినేపల్లి తహసీల్దారు కార్యాలయంలో ఓ మూలన పడి ఉన్నాయి. జాతీయ రహదారి విస్తరణ పనుల్లో భాగంగా ముదినేపల్లి ప్రధాన సెంటర్లో ఉన్న టీడీపీ వ్యవస్థాపకుడు, మాజీ సీఎం ఎన్టీఆర్ విగ్రహంతో పాటు బస్టాండ్, పోలీస్ స్టేషన్ల వద్ద ఉన్న వైఎస్సార్ విగ్రహాలను, భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని అధికారులు గతంలో తొలగించారు. అయితే అంబేడ్కర్ విగ్రహ ఏర్పాటు కోసం దళితులు పెద్ద ఎత్తున ధర్నా చేయడంతో జాతీయ రహదారి నిర్మాణదారులు సొంత నిధులతో కొంత దూరంలో దాన్ని తిరిగి ప్రతిష్ఠించారు. కానీ వైఎస్సార్ విగ్రహాల పునఃప్రతిష్ఠ విషయంలో మాత్రం అధికారులు, పాలకులు వివక్ష చూపుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కూటమి నాయకుల పక్షపాత ధోరణి కులాలు, మతాలు, రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలను అందించిన వైఎస్ రాజశేఖరరెడ్డి ఆకస్మిక మరణాన్ని తట్టుకోలేక రాష్ట్రంలో వందలాది మంది అభిమానులు గుండె ఆగి మృతి చెందారు. ఆయన చేసిన సేవలకు గుర్తుగా అభిమానులు, ప్రజలు గ్రామగ్రామాన విగ్రహాలను ఏర్పాటు చేసుకున్నారు. ఇందులో భాగంగానే ముదినేపల్లి ప్రధాన సెంటర్లోని పోలీస్ స్టేషన్, బస్టాండ్ సమీపంలో వైఎస్సార్ విగ్రహాలను నిర్మించారు. ఏటా వైఎస్సార్ జయంతి, వర్ధంతి కార్యక్రమాల్లో ఇక్కడ పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు, సంతాప సభలు నిర్వహిస్తుంటారు. జాతీయ రహదారి విస్తరణకు అడ్డుగా ఉన్నాయనే కారణంతో నాడు అధికారులు అన్ని పార్టీల నాయకుల విగ్రహాలను తొలగించారు. అయితే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వైఎస్సార్ విగ్రహాల పునఃనిర్మాణంలో కక్షపూరిత ధోరణి ప్రదర్శిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. వినతులు బుట్టదాఖలు ముదినేపల్లి బస్టాండ్, పోలీస్ స్టేషన్ల వద్ద తొలగించిన వైఎస్సార్ విగ్రహాలను వై–జంక్షన్, లేదా ఎంపీడీఓ కార్యాలయ ఆవరణ వెలుపల ఏర్పాటు చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని మే 24న వైఎస్సార్సీపీ మండలాధ్యక్షుడు బోయిన రామరాజు ఆధ్వర్యంలో తహసీల్దారు ఎస్కే. లతీఫ్పాషాకు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ ముదిరాజుల సంఘ విభాగం అధ్యక్షుడు కోమటి విష్ణువర్ధనరావు, ముదినేపల్లి ఎంపీపీ రామిశెట్టి సత్యనారాయణ, రాష్ట్ర మహిళా విభాగ కార్యదర్శి గంటా సంధ్య, జిల్లా అధికార ప్రతినిధి మోట్రూ ఏసుబాబు పాల్గొన్నారు. వినతిపత్రం ఇచ్చి రోజులు గడుస్తున్నా అధికారుల నుంచి ఇప్పటివరకు ఎలాంటి సమాధానం లేదు. అధికార పక్షానికి ఒక న్యాయం.. ప్రతిపక్షానికి మరో న్యాయం రహదారి విస్తరణలో భాగంగా తొలగించిన ఎన్టీఆర్ విగ్రహాన్ని ముదినేపల్లి శ్రీవైశ్రీ జంక్షన్లో పునఃప్రతిష్ఠించడానికి దిమ్మల నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అదేవిధంగా స్థానిక బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ ఆదేశాలతో భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహాన్ని కూడా దాని పక్కనే ఏర్పాటు చేస్తున్నారు. దీనికి సంబంధించిన శంకుస్థాపన కార్యక్రమాన్ని కూడా అట్టహాసంగా నిర్వహించారు. అక్కడ మరో విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు అనువైన స్థలం ఉండటంతో, దివంగత వైఎస్సార్ విగ్రహ ఏర్పాటుకు కూడా అవకాశం ఇవ్వాలని ప్రజాప్రతినిధులు, అభిమానులు అధికారులను కోరినా ఎలాంటి స్పందనా లేదు. కనీసం జాతీయ రహదారి, జిల్లా అధికారుల నుంచి ఎలాంటి రాతపూర్వక అనుమతులు లేకుండానే కూటమి నేతలు తమ విగ్రహాల నిర్మాణాలకు ఉపక్రమించడం గమనార్హం. వైఎస్సార్ విగ్రహాల ఏర్పాటుపై వైఎస్సార్సీపీ నాయకులు ఇచ్చిన వినతిపత్రం ఇచ్చిన రోజునే ఫైల్ను జిల్లా కలెక్టర్కు పంపించాం. అక్కడి నుంచి అనుమతులు రావాల్సి ఉంది. – ఎస్కే. లతీఫ్పాషా, ముదినేపల్లి తహసీల్దార్ అనుమతులు లేకుండా ఎన్టీఆర్ విగ్రహ పునఃప్రతిష్ఠ పనులు వైఎస్సార్ విగ్రహాలను ఏర్పాటు చేసుకుంటామని వినతి పత్రం ఇచ్చినా స్పందన నిల్ -
రఘురామకృష్ణరాజుపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు?
నరసాపురం: రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న రఘురామకృష్ణరాజు రాజ్యాంగ విలువలను కాలరాస్తూ..దళిత క్రైస్తవులపై దాడులకు దిగుతూ రెచ్చిపోతుంటే కూటమి ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడంలేదని హైకోర్టు న్యాయవాది జడ శ్రవణ్కుమార్ ప్రశ్నించారు. గురువారం సాయంత్రం స్థానిక అంబేడ్కర్ భవన్లో నిర్వహించిన దళిత క్రైస్తవ సమైక్య సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో 1.10 కోట్ల ఓట్లు ఉన్న దళిత క్రైస్తవుల ఓట్లు మాకు అక్కరలేదు అనే ధైర్యం రఘురామకృష్ణరాజుకు ఎక్కడి నుంచి వచ్చింది? అని ప్రశ్నించారు. 2029 ఎన్నికల్లో దళితుల ఆగ్రహానికి కూటమి ప్రభుత్వం అడ్రస్ గల్లంతు కావడం తథ్యమన్నారు. హక్కుల సాధన కోసం దళిత క్రైస్తవులు ఐక్యంగా పోరాడాలని సూచించారు. ఏలూరులో ఈనెల 28న లక్ష మందితో చేపట్టిన దళిత క్రైస్తవ సమరశంఖారావం బహిరంగసభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సభ కరపత్రాన్ని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఎంబీఎస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పెండ్ర వీరన్న, దళిత క్రైస్తవ సంఘాల నాయకులు ఇంజేటి జాన్కెనడీ, సోడదాసి శ్రీధర్, నల్లిమిల్లి జోసఫ్, గూటం జయరాజు, చదలవాడ జ్ఞానప్రకాష్, దొండపాటి స్వాములు, దీపాటి జానకీరాజు తదితరులు పాల్గొన్నారు. హైకోర్టు న్యాయవాది జడ శ్రవణ్కుమార్ -
జూలై 19న బ్రాహ్మణ ఆత్మీయ సమావేశం
భీమవరం (ప్రకాశంచౌక్): జూలై 19వ తేదీన రాజమండ్రిలోని మన్యం గార్డెన్స్లో రాష్ట్రస్థాయి బ్రాహ్మణ ఆత్మీయ సమావేశాన్ని నిర్వహిస్తున్న ట్లు ఆహ్వాన కమిటీ సభ్యులు భమిడిపల్లి వెంకట రమణమూర్తి (బాబు), రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ చెరుకుపల్లి సంతోష్ తెలిపారు. భీమవరం (ప్రకాశంచౌక్): అంతర్జాతీయ యోగా దినోత్సవం – 2026 పురస్కరించుకుని ప్రజల శారీరక–మానసిక ఆరోగ్యంపై అవగాహన పెంపొందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం యోగాంధ్ర–2026 కార్యక్రమాన్ని నిర్వహిస్తున్టన్లు కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. ఈ నేపథ్యంలో ఈనెల 19న స్థానిక ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ఉదయం 6.30 నుంచి 8 గంటల వరకు రాష్ట్ర స్థాయి థీమ్ ఆధారిత యోగా ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. దీనిలో భాగంగా గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో వివిధ అవగాహన కార్యక్రమాలు, యోగా శిక్షణ శిబిరాలు, ప్రదర్శనలు, సామూహిక యోగా కార్యక్రమాలు జరుగుతాయన్నారు. పాలకొల్లు సెంట్రల్: పశ్చిమగోదావరి జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడిగా తటవర్తి కృష్ణమూర్తి ఎంపికయ్యారు. ఏపీ ఆర్యవైశ్య మహాసభ సంఘం నుంచి కృష్ణమూర్తిని 2026– 28 సంవత్సర కాలానికి నియమిస్తూ వచ్చిన ఉత్తర్వులను రాష్ట్ర మాజీ కార్యదర్శి నాలం బాపిరాజు, మాటూరి నరసింహమూర్తి మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా నూతన జిల్లా అధ్యక్షుడు కృష్ణమూర్తి మాట్లాడుతూ ఆర్యవైశ్య సంఘం పటిష్టతకు, అభ్యున్నతికి కృషి చేస్తానని చెప్పారు. కార్యక్రమంలో పట్టణ సంఘ అధ్యక్షుడు రేపాక ప్రవీణ్భాను, సనిశెట్టి లీలాభవన్నారాయణ, బలభద్ర బాలరెడ్డియ్య, మామిడి వెంకటేశ్వరరావు, తటవర్తి సుధాకరరావు, కారుమూరి శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు. ఏలూరు (ఆర్ఆర్పేట): ఖాళీగా ఉన్న అంగన్వాడీ కార్యకర్తలు, అంగన్వాడీ సహాయకురాలు, మినీ అంగన్వాడీ కార్యకర్తల పోస్టుల భర్తీకి స్థానిక రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయంలో ఏలూరు ఆర్డీవో లక్ష్మీప్రసన్న ఆధ్వర్యంలో ఇంటర్వ్యూలు నిర్వహించినట్టు ప్రాజెక్ట్ డైరెక్టర్ శారద తెలిపారు. ఏలూరు, భీమడోలు, కైకలూరు, పెదపాడు ప్రాజెక్టుల్లో మొత్తం 8 మంది అంగన్వాడీ కార్యకర్తలు, 101 మంది అంగన్వాడీ సహాయకురాలు, 1 మినీ అంగన్వాడీ కార్యకర్త పోస్టుకు ఇంటర్వ్యూలు జరిగాయన్నారు. మొత్తం 270 మంది అభ్యర్థులు ఇంటర్వ్యూలకు హాజరైనట్లు చెప్పారు. కార్యక్రమంలో ఏలూరు ప్రాజెక్ట్ సీడీపీవో ఏ.పద్మావతి, భీమడోలు ప్రాజెక్ట్ సీడీపీవో రాజశేఖర్, కై కలూరు ప్రాజెక్ట్ సీడీపీవో దీప్తి, పెదపాడు ప్రాజెక్ట్ సీడీపీవో విజయకుమారి, రోహిత్ పాల్గొన్నారు. ఏలూరు (ఆర్ఆర్పేట): విద్యార్థుల భద్రత దృష్ట్యా అన్ని విద్యా సంస్థల బస్సుల్లో తప్పనిసరిగా డాష్బోర్డ్ కెమెరాలను అమర్చాలని, ప్రయాణ సమయంలో విద్యార్థులకు పూర్తి భద్రత కల్పించాలని ఉప రవాణా కమిషనర్ షేక్ కరీమ్ ఆదేశించారు. బుధవారం తన కార్యాలయంలో డీటీసీ విద్యా సంస్థల యాజమాన్య ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇటీవల తమ అధికారులు జరిపిన తనిఖీల్లో విద్యా సంస్థల బస్సుల్లో ఇంకా డాష్బోర్డ్ కెమెరాలను ఏర్పాటు చేయలేదని తేలిందన్నారు. దీనిని తీవ్రంగా పరిగణిస్తున్నామన్నారు. విద్యార్థుల భద్రత విషయంలో ఎలాంటి రాజీ పడేది లేదని, తప్పనిసరిగా డాష్బోర్డ్ కెమెరాలను అమర్చాలని ఆదేశించారు. ఈ సమావేశంలో రవాణా శాఖ ప్రాంతీయ రవాణా అధికారి శేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
ధరలు పెంచడం దారుణం
రైతుల విషయంలో ఉదారతతో వ్యవహారించాల్సింది పోయి ఇష్టారీతిన ఎరువుల ధరలు పెంచడం సరికాదు. పెట్టుబడులు భారీగా పెరిగి కౌలు రైతులు వ్యవసాయం మానేసే పరిస్థితులు ఎదురుకానున్నాయి. కాంప్లెక్సు, పొటాష్ ఎరువుల ధరలను తగ్గించాలి. – నిమ్మగడ్డ నరసింహ, కౌలు రైతు సంఘం నాయకుడు, గొల్లపల్లి ఇప్పటికే పంటలకు సరైన మద్దతు ధరలు లేక నష్టపోతున్నాం. ఇప్పుడు ఎరువుల ధరలను పెంచడంతో పెట్టుబడులు మరింత భారమవుతాయి. ప్రభుత్వాలు రైతులకు మేలు చేయాల్సిందిపోయి ఎరువుల ధరలను పెంచి భారాన్ని మోపడం సరికాదు. – నక్కనబోయిన వెంకేటేశ్వరరావు, రైతు, తూర్పు దిగవల్లి -
మరో పాఠశాల గేటుకు తాళం
లంకపాకలలో గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల గేటుకు బుధవారం గ్రామస్తులు తాళాలు వేశారు. పాఠశాలలను రేషనలైజేషన్ పేరుతో కుదించడాన్ని వ్యతిరేకించారు. 8లో u20 ఎకరాల్లో రొయ్యల సాగు చేస్తున్నా. సిండికేటు దోపిడీతో తీవ్రంగా నష్టపోతున్నాం. ఏడాదిన్నరగా ఎన్నో పోరా టాలు చేస్తున్నా ప్రభుత్వానికి పట్టడం లేదు. మేత ధరలు తగ్గించాలని రైతుల పక్షాన కూటమికి జగన్ అల్టిమేటం జారీచేయడం మాకు కొండంత ధైర్యాన్నిస్తోంది. – కె.దామోదరరావు, ఆక్వా రైతు, వీరవాసరం ఆక్వా రైతుల సమస్యల పట్ల ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. గత ప్రభుత్వంలో అప్సడాతో సిండికేట్ దోపిడీకి అడ్డుకట్ట వేశారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. సాగుపై ఆశలు వదులుకుంటున్న తరుణంలో జగన్ భరోసాతో మా సమస్య పరిష్కారం అవుతుందన్న నమ్మకం వచ్చింది. – దాసరి మాణిక్యాలరావు, రొయ్యల రైతు, చింతల కోటి గరువు -
కూటమి సభలో నాయకుల రగడ
భీమవరం : భీమవరం నియోజకవర్గంలోని కూటమి పార్టీ నాయకుల్లో విభేదాల కుంపటి ఆరడం లేదు. ఏ కార్యక్రమం నిర్వహించినా ప్రోటోకాల్ రగడ జరుగుతోంది. బుధవారం భీమవరం బ్యాంక్ కాలనీలోని శ్రీకృష్ణదేవరాయ కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన శ్రీరెండేళ్ల నమ్మకం.. అభివృద్ధి, సంక్షేమంశ్రీ పేరుతో కార్యక్రమంలో టీడీపీ నాయకులు ప్రోటోకాల్ పాటించలేదంటూ రగడ సృష్టించారు. నియోజకవర్గంలో జనసేన ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) అధికారంలో ఉన్నప్పటికీ తెలుగుదేశం పార్టీ హవానే కొనసాగుతుందని జనసేనకు కనీసం గుర్తింపు లభించడంలేదనే ఆందోళన జనసేన నాయకులు వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ నుంచి జనసేనలో చేరి ఎమ్మెల్యేగా గెలిచిన అంజిబాబు పాత స్నేహితులు, సన్నిహితులైన టీడీపీ నాయకులకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని జనసేన క్యాడర్ గుర్రుగా ఉన్నారు. భీమవరం పట్టణంతోపాటు, భీమవరం, వీరవాసరం మండలాల్లోని టీడీపీ, జనసేన, బీజేపీ నాయకుల మధ్య సమన్వయలోపం కొట్టొచ్చినట్లు కనబడుతోంది. రెండేళ్ల నమ్మకం కార్యక్రమానికి మూడు పార్టీల నుంచి 8 మంది చొప్పున నాయకులను వేదికపైకి పిలవాలని వారిలో ఒక్కో పార్టీ నుంచి నలుగురు చొప్పున మాట్లాడే విధంగా నిర్ణయించారు. అయితే వేదిక పైకి పిలిచే సమయంలో టీడీపీకి తగిన ప్రాధాన్యత ఇవ్వలేదని కొంతమంది అలజడి సృష్టించడంతో సమావేశంలో గందరగోళం ఏర్పడింది. దీంతో రాజ్యసభ మాజీ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి కలుగుచేసుకుని కార్యకర్తలు సమన్వయం పాటించాలని సర్ది చెప్పడానికి ప్రయత్నం చేశారు. ‘జనసేనలో కార్యకర్తలకు గుర్తింపు లేదు’ జనసేన పార్టీలో కష్టపడి పని చేస్తున్న కార్యకర్తలకు గుర్తింపు లేకుండా పోయిందని జనసేన నాయకుడు, వీరవాసరం జెడ్పీటీసీ సభ్యుడు గుండా జయప్రకాష్నాయుడు విమర్శించారు. తరచూ పెద్ద నాయకుల చుట్టూ ప్రదక్షణలు చేసేవారికి పదవులు ఇస్తున్నారని, ఇలా అయితే పార్టీ మనుగడ కష్టమేనని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో వేదికపై ఉన్న కొంతమంది నాయకులు కలుగుచేసుకుని ఇది పార్టీ కార్యక్రమం కాదని అభివృద్ధి గురించి మాత్రమే మాట్లాడాలి అని అనడంతో నేను కార్యకర్తల గురించే మాట్లాడతానని కార్యకర్తలు లేకుంటే పార్టీ ఎక్కడదని స్పష్టం చేశారు. మొత్తం మీద రెండేళ్లలో నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి చెప్పుకునే కంటే కూటమి నాయకుల్లో విభేదాలే బయటపడడం విశేషం. -
ఆరు పదుల వయస్సులో.. తొమ్మిదో ర్యాంకు
నరసాపురం రూరల్ : చదవాలనే తపన, పట్టుదల ఉంటే వయస్సు ఏమాత్రం అడ్డురాదని నరసాపురం పట్టణం కోవెల వీధికి చెందిన రిటైర్డ్ ఉద్యోగి బొప్పన నాగమల్లేశ్వరరావు నిరూపించారు. ఇటీవల ఎల్ఐసీలో బ్రాంచ్ మేనేజర్గా ఉద్యోగ విరమణ పొందిన ఆయన మొదటి నుంచి తనకు ఎంతో ఆసక్తి ఉన్న న్యాయవాద వృత్తిని చేపట్టాలని బలమైన కాంక్షతో ముందడుగు వేశారు. గతంలో ఉద్యోగ బాధ్యతల నేపథ్యంలో ప్రైవేటుగా న్యాయ విద్యను అభ్యసించే అవకాశం లేకపోవడంతో, పదవీ విరమణ తర్వాత తన సుదీర్ఘకాలపు కోరికను నెరవేర్చుకోవాలని 2026–27 విద్యాసంవత్సరానికి గాను మూడేళ్ల ఎల్ఎల్బీ కోర్సులో ప్రవేశానికి నిర్వహించిన ఏపీ లాసెట్ పరీక్షలు రాశారు. సోమవారం విడుదలైన ఫలితాల్లో ఆయన వందకు వంద మార్కులు సాధించి, రాష్ట్రస్థాయిలోనే అత్యుత్తమంగా 9వ ర్యాంకు కై వసం చేసుకున్నారు. రాష్ట్రస్థాయిలో 9వ ర్యాంకు సాధించిన విషయం తెలుసుకున్న పలువురు ఎల్ఐసీ ఏజెంట్లు, మిత్రులు బుధవారం నరసాపురంలోని నాగమల్లేశ్వరరావు నివాసానికి వచ్చి, ఆయనను కలిసి పుష్పగుచ్ఛాలు అందజేసి, శాలువాలతో ఘనంగా సత్కరించారు. -
మోంథా పరిహారం కోసం ఎదురుచూపులు
భీమవరం: వ్యవసాయమే జీనవాధారమైన జిల్లా రైతులకు చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఎప్పుడూ చేదు అనుభవాలే. రైతులను చిన్నచూపు చూస్తూ వ్యవసాయం దండగంటూ తీవ్ర నిరాశపర్చిన చంద్రబాబు గత ఏడాది సార్వా సీజన్లో మోంథా తుపాను కారణంగా నష్టపోయిన రైతులకు నేటికీ పెట్టుబడి రాయితీ అందించలేదు. జిల్లాలో దాదాపు 2.35 లక్షల ఎకరాల్లో ప్రతి ఏటా వరిసాగు చేస్తున్నారు. ఏటా రెండు పంటలు పండిస్తూ రాష్ట్రానికే అన్నపూర్ణగా పేరుగాంచిన జిల్లాలో నేడు వరి, ఆక్వా సాగు చేస్తున్న రైతుల కష్టాలను పట్టించుకునే నాథుడు కన్పించడం లేదు. 22 వేల ఎకరాల్లో పంట నష్టం గత ఏడాది సార్వా సీజన్లో రైతన్నలు ఎన్నో ఆశలతో దాదాపు 2.35 లక్షల ఎకరాల్లో వరిసాగు చేశారు. వ్యయప్రయాసలకోర్చి పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టి వరి పైరు పండించారు. ఒక్కొక్క ఎకరానికి దాదాపు రూ.35 వేల వరకు పెట్టుబడులు పెట్టారు. పైరు ఏపుగా పెరిగి మంచి దిగుబడులు వస్తాయని ఆశగా ఎదురుచూస్తున్న రైతులకు 2025 అక్టోబర్లో మోంథా తుపాను రూపంలో దెబ్బ తగిలింది. తుపాను కారణంగా పైరు సుడులు తిరిగి పంట నేలనంటింది. చేలలో నీరు నిలిచిపోవడంతో గింజలు మొలకులు వచ్చాయి. కొందరు రైతులు చేలలోని నీటిని మోటర్లు, ఆయిల్ ఇంజిన్ల సాయంతో బయటకుతోడి పంటను దక్కించుకోడానికి ప్రయత్నం చేయగా, మరికొందరు రైతులు సుడులు తిరిగి నేలనంటిని పైరును కట్టలు కట్టి నిలబెట్టుకునే ప్రయత్నం చేశారు. కష్టపడి పండించిన పంటను దక్కించుకోడానికి అనేక ప్రయత్నాలు చేసినా జిల్లాలో సుమారు 22,400 ఎకరాల్లో పంట పూర్తిగా దెబ్బతిన్నట్లు వ్యవసాయశాఖ అంచనా వేసింది. దాదాపు 20 వేల మంది రైతులు నష్టపోయారని వారికి సుమారు రూ.22.39 కోట్లు నష్టపరిహారం ఇవ్వాలని ప్రభుత్వానికి నివేదికలు పంపించారు. ఏడాది గడిచినా జాడ లేదు మోంథా తుపాను కారణంగా నష్టపోయిన రైతులకు ఏడాది గడిచినా ప్రభుత్వం నేటికి పరిహారం అందించ లేదు. దీనిపై రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దెబ్బతిన్న సార్వా పంట నిమిత్తం పరిహారం వస్తుందని అప్పులు చేసి దాళ్వా పండించామని.. నేటికీ అప్పులు తీర్చలేక, వడ్డీలు కట్టలేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం రైతులకు పంట నష్టపరిహారం ఇవ్వాలని కోరుతున్నారు. జంగారెడ్డిగూడెం: బ్యాంక్ ఆఫ్ బరోడా జంగారెడ్డిగూడెం బ్రాంచ్లో బంగారపు రుణాల వ్యవహారంలో జరిగిన అవకతవకలపై ప్రతి ఖాతాదారుడికి పూర్తి న్యాయం చేస్తామని, ఎవ్వరూ ఆందోళన చెందవద్దని ఆ బ్యాంక్ విజయవాడ ప్రాంతీయ మేనేజర్ ఎస్కే కిరణ్ రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సాధారణ అంతర్గత తనిఖీల్లో అవకతవకలు బయటపడిన వెంటనే, కస్టమర్ల ప్రయోజనాల కోసం తామే స్వయంగా త్వరితగతిన చర్యలు ప్రారంభించామన్నారు. బ్రాంచ్లోని అన్ని బంగారు రుణ ఖాతాలను, బంగారం మూటలను తక్షణమే మళ్లీ సమగ్రంగా రీ–అప్రైజల్ (పునఃమూల్యాంకనం) చేయిస్తున్నామని తెలిపారు. పూర్తి పారదర్శకత కోసం, ఎవరికీ ఎలాంటి అనుమానాలు లేకుండా సంబంధిత ఖాతాదారుల సమక్షంలోనే వారి బంగారు ప్యాకెట్లను సరిచూస్తున్నామని వివరించారు. జంగారెడ్డిగూడెం బ్రాంచ్ సిబ్బందికి తోడుగా, ఈ పనుల కోసమే ప్రత్యేకంగా అదనపు అధికారులను, సిబ్బందిని కూడా కేటాయించినట్లు వెల్లడించారు. బ్యాంకింగ్ నిబంధనల ప్రకారం వచ్చే ప్రతి ఫిర్యాదును చాలా సీరియస్గా తీసుకుని, తగిన రీతిలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. బాధితులెవరూ ఎలాంటి ఆందోళనకు గురికావద్దని, ఖాతాదారుల బంగారానికి, నమ్మకానికి బ్యాంక్ పూర్తి బాధ్యత వహిస్తుందని భరోసా ఇచ్చారు. ఈ ప్రక్రియ అంతా నిబంధనల ప్రకారం సజావుగా సాగుతుందని, ఖాతాదారులు బ్యాంకుకు సహకరించాలని రీజినల్ మేనేజర్ ఎస్కే కిరణ్ రెడ్డి కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు రైతులంటే ఎప్పుడూ చిన్నచూపే. ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు మద్దతు ధర లభించదు. సకాలంలో విత్తనాలు, ఎరువులు అందించన దాఖలాలు లేవు. మోంథా తుపాను వల్ల నష్టపోయిన రైతులకు ఏడాది కావస్తున్నా పరిహారం ఇవ్వకపోవడం దారుణం. – గాదిరాజు రామరాజు, వైఎస్సార్సీపీ పట్టణ అధ్యక్షుడు భీమవరం గతంలో వ్యవసాయం దండగన్న చంద్రబాబు నేడు రైతుల గురించి పట్టించుకుంటారని అనుకోవడం భ్రమే. ఏడాదిగా పంట నష్టపరిహారం అందక వరి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తుంటే ఆక్వా ఫీడ్ ధరలు పెంపు, రొయ్యల ధరలు తగ్గిపోయి నష్టపోతున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. – పాలవెల్లి మంగ, వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా కార్యదర్శి, భీమవరం గతేడాది మోంథా తుపానుకు జిల్లాలో 22 వేల ఎకరాల్లో పంట నష్టం సుమారు రూ.22 కోట్లపంట నష్టం అంచనా ఇప్పటివరకు రైతులకు అందని పరిహారం -
హైస్కూల్ ప్లస్.. నిర్వీర్యం
● ముసునూరులో అడ్మిషన్లు నిల్ ● ప్రచారంలో ఉపాధ్యాయుల వైఫల్యం ● బడి తెరిచిన రెండు రోజులకే టీచర్ల డిప్యుటేషన్? నూజివీడు: ప్రభుత్వ నిర్లక్ష్యం, ఉపాధ్యాయుల అశ్రద్ధ వెరసి గ్రామీణ విద్యార్థినుల కోసం ఏర్పాటు చేసిన ‘హైస్కూల్ ప్లస్’ పాఠశాలలు నిర్వీర్యమవుతున్నాయి. మండల కేంద్రమైన ముసునూరులోని జెడ్పీ హైస్కూల్ ప్లస్లో ఈ విద్యాసంవత్సరానికి సంబంధించి ఇప్పటివరకు ఒక్క అడ్మిషన్ కూడా నమోదు కాలేదు. కనీసం అదే పాఠశాలలో పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థినుల తల్లిదండ్రులను కలిసి, ఇంటర్లో చేర్పించేలా ఉపాధ్యాయులు చైతన్యపరచకపోవడం గమనార్హం. బాల్య వివాహాల నివారణే లక్ష్యంగా.. గ్రామీణ ప్రాంతాల్లోని పేద, మధ్యతరగతి వర్గాలకు చెందిన బాలికలకు ఉచితంగా ఇంటర్ విద్యను అందించాలనే సదాశయంతో గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం మండలానికి ఒక జెడ్పీ హైస్కూల్ను శ్రీహైస్కూల్ ప్లస్శ్రీగా అప్గ్రేడ్ చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నత విద్యాసంస్థలు అందుబాటులో లేకపోవడం వల్ల పదో తరగతి పూర్తి కాగానే ఆడపిల్లలను దూర ప్రాంతాలకు పంపలేక చాలామంది తల్లిదండ్రులు బాల్య వివాహాలు చేసేస్తున్నారు. ఇలాంటి పరిస్థితులను మార్చి, బాలికలు తమ కాళ్లపై తాము నిలబడేలా చేయాలనే లక్ష్యంతో ఈ పాఠశాలలను ప్రభుత్వం అప్గ్రేడ్ చేసింది. విద్యార్థులు లేకున్నా అదనపు ఇంక్రిమెంట్ స్కూల్ అసిస్టెంట్ క్యాడర్తో ఇక్కడ పీజీటీలుగా పని చేస్తున్న వారికి ప్రభుత్వం బేసిక్ జీతంతో పాటు అదనంగా ఒక ఇంక్రిమెంట్ (నెలకు సుమారు రూ.4 వేలు) చెల్లిస్తోంది. గతేడాది విద్యార్థులు లేకపోయినా ఈ నలుగురు ఉపాధ్యాయులు అదనపు ఇంక్రిమెంట్తో కూడిన జీతాన్ని డ్రా చేశారు. విద్యార్థులకు బోధించకుండానే ప్రభుత్వ సొమ్మును జీతంగా పొందిన వీరి నుంచి ఆ మొత్తాన్ని రికవరీ చేయాల్సిన బాధ్యత విద్యాశాఖ అధికారులపై లేదా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. రెండు రోజులకే పని సర్దుబాటా? ఈ నెల 12న పాఠశాలలు పునఃప్రారంభం కాగా.. 13, 14 తేదీల్లో సెలవులు వచ్చాయి. కేవలం 15వ తేదీ ఒక్కరోజే స్కూల్ నడిచింది. అయితే, విద్యార్థినులు లేరనే సాకుతో ముసునూరు హైస్కూల్లో పనిచేస్తున్న నలుగురు పీజీటీలను నూజివీడులోని బాలికల హైస్కూల్ ప్లస్కు పని సర్దుబాటు (డెప్యుటేషన్) కింద పంపుతూ డీవైఈఓ ఉత్తర్వులు జారీ చేయడం ఉపాధ్యాయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. బడి తెరిచిన కేవలం రెండు రోజులకే విద్యార్థులు లేరని తేల్చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. కనీసం నెల రోజుల పాటు అడ్మిషన్ల కోసం ప్రయత్నించి, అప్పటికీ పిల్లలు చేరకపోతే వేరే చోటుకు పంపాలి గానీ.. ఇంత త్వరగా డెప్యుటేషన్ ఆర్డర్స్ ఇవ్వడం వెనుక ఉన్న ఆంతర్యమేమిటనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముసునూరులోని జెడ్పీ హైస్కూల్ ప్లస్ పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థినులనైనా ఇంటర్లో చేర్చుకోవాలని స్థానిక ప్రధానోపాధ్యాయుడికి సూచించాం. ఒకవేళ విద్యార్థినులు చేరితే ప్రస్తుతం పని సర్దుబాటు కింద వేరే పాఠశాలకు పంపిన ఉపాధ్యాయులను మళ్లీ ముసునూరు హైస్కూల్ ప్లస్కే రప్పిస్తాం. – పీఎస్ సుధాకర్, డీవైఈఓ, నూజివీడు ముసునూరు మండల పరిధిలోని ముసునూరు, రమణక్కపేట, గుడిపాడు, వేల్పుచర్ల, గోపవరం, చెక్కపల్లి, కాట్రేనిపాడు, గురుకుల పాఠశాలల్లో కలిపి ఈ ఏడాది 200 మందికి పైగా విద్యార్థినులు పదో తరగతి ఉత్తీర్ణులయ్యారు. కేవలం ముసునూరు హైస్కూల్లోనే 34 మంది బాలికలు పాసయ్యారు. వీరిలో కనీసం 15 మందిని కూడా ఇంటర్లో చేర్పించలేకపోవడంపై ఉపాధ్యాయుల పనితీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతేడాది కేవలం ఒక్క విద్యార్థిని మాత్రమే చేరగా.. ఆ విద్యార్థిని కూడా పరీక్షల్లో ఫెయిలైంది. నలుగురు పీజీటీ (పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్)లు ఉన్నప్పటికీ, ఉన్న ఒక్క విద్యార్థినిని కూడా పాస్ చేయించలేకపోవడం ఇక్కడి విద్యా ప్రమాణాలకు అద్దం పడుతోంది. -
మహిళలు అప్రమత్తంగా ఉండాలి
కై కలూరు: సమాజంలో మహిళలు అప్రమత్తతతో వ్యవహరించాలని వైఎస్సార్ సీపీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు (డీఎన్నార్) సూచించారు. కై కలూరు 8వ వార్డులో ఇటీవల వరుస హత్యలకు గురైన మార్పిన వరలక్ష్మీ (50), సోము ఆదిలక్ష్మీ (80) కుటుంబ సభ్యులను బుధవారం పరామర్శింంచారు. ఇదే వార్డులో తుపాకుల ద్రువంత్ (24) అనే వ్యక్తి చెడు వ్యవసనాలకు బానిసై ఇద్దరి మెడలో ఆభరణాలు దొంగిలించి హత్య చేశాడు. దీంతో వార్డుకు వెళ్లిన డీఎన్నార్తో మహిళలు తమ గోడును వెళ్ళబోసుకున్నారు. భయం భయంగా బతుకుతున్నామని వాపోయారు. అతను పట్టుబడకపోతే మరికొందరి ప్రాణాలు తీసేవాడని కన్నీరు పెట్టుకున్నారు. దీంతో డీఎన్నార్ మాట్లాడుతూ మద్యం, జూదం, గంజాయి వంటి వ్యసనాలకు బానిసలైన యువకులు ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారన్నారు. పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారన్నారు. మహిళలు భయపడవద్దని సూచించారు. కార్యక్రమంలో తోట మహేష్, శంకర్, నానీ తదితరులు పాల్గొన్నారు. -
దడ పుట్టిస్తున్న ఎరువుల ధరలు
● బస్తాపై రూ.300 నుంచి రూ.700 వరకు పెంపు ● ఆందోళనలో అన్నదాత నూజివీడు: ఖరీఫ్ సాగుకు సన్నద్ధమవుతున్న రైతులకు ఎరువుల ధరలు దడ పుట్టిస్తున్నాయి. ప్రాథమికంగా వినియోగించే యూరియా, డీఏపీ ధరల్లో ఎలాంటి మార్పు లేకపోయినా.. పంట ఎదుగుదలకు, దిగుబడికి అత్యంత కీలకమైన ‘కాంప్లెక్స్ ఎరువుల’ ధరలు భారీగా పెరిగాయి. దీంతో తమపై అదనపు భారం పడటమే కాకుండా పెట్టుబడి వ్యయం కూడా పెరుగుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. వాతావరణం సహకరించక.. ఆరుగాలం శ్రమించి సాగుచేసిన పంటలకు మద్దతు ధర లేక.. పెరిగిన సాగు ఖర్చులు సైతం చేతికందక రైతన్నలు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు ఎరువుల ధరలు పెంచడంతో మూలిగేనక్కపై తాటికాయ పడిన చందంగా రైతన్న పరిస్థితి తయారైంది. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మార్కెట్లో ఎరువులు సరిగా లభించడం లేదు. బ్లాక్ మార్కెట్లో అధిక డబ్బులు వెచ్చించి కొనుగోలు చేయాల్సిన దుస్థితి. యూరియా కోసమైతే క్యూలో నిలబడాల్సిన దుస్థితి రైతన్నలకు ఎదురైంది. ఇప్పుడు ఎరువుల ధరలు పెంచడంతో పంటల సాగులో పెట్టుబడులు మరింత పెరుగుతాయని వాపోతున్నారు. పెట్టుబడులు పెరిగిన మేర గిట్టుబాటు ధర పెరుగుతుందో లేదోనని ఆందోళన చెందుతున్నారు. యూరియా, డీఏపీ పాత ధరలే ఉన్నప్పటికీ కాంప్లెక్స్ ఎరువులు బస్తాకి రూ.300 నుంచి రూ.700 వరకు పెరిగాయి. కాంప్లెక్స్ ఎరువులే కీలకం పంటల దిగుబడిలో కాంప్లెక్స్ ఎరువులే కీలకమని రైతులు పేర్కొంటున్నారు. వరి, మొక్కజొన్న, మినుము తదితర పంటలు ఈ ప్రాంతంలో సాగవుతాయి. యూరియా కేవలం పంట ఏపుగా పెరిగేందుకేనని, దిగుబడులు రావాలంటే నత్రజని, భాస్వరం, పొటాష్ మిళితమై ఉండే కాంప్లెక్స్ ఎరువులనే వాడతారు. వాటి ధరలను భారీగా పెంచేయడంపై రైతుల్లో తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ఎరువుల ధరలు ఇలా పెంచితే వ్యవసాయం చేయాలా, మానేసి కూర్చోవాలా అని ప్రశ్నిస్తున్నారు. ఎరువుల ధరల పెంపు వల్ల రైతులపై కోట్లలో భారం పడనుంది. కౌలు రైతుల పరిస్థితి మరింత దయనీయంగా మారనుంది. ఎరువుల ధరలు భారీగా పెంచడం వల్ల కౌలు రైతులు పెట్టుబడులు పెట్టలేక వ్యవసాయం చేయడం మానేసే ప్రమాదం నెలకొంది. బస్తాకు రూ.700 వరకు పెరుగుదల ఎరువుల ధరలు బస్తాకు రూ.300 నుంచి రూ.700 వరకు పెరిగాయి. బస్తాపై వందల్లో పెరగడంతో సాగు ఖర్చు తడిసిమోపెడవుతోందని రైతులు చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం కేవలం డీఏపీ, యూరియా ధరలను నియంత్రిస్తూ, రాయితీని భర్తిస్తోంది. భాస్వరం, పొటాష్, కాంప్లెక్స్ ధరల నిర్ణయాన్ని తయారీ కంపెనీలకు వదిలేయడం సరి కాదన్నది రైతుల వాదన. ధరలు ఎప్పుడు ఎంత పెరుగుతున్నాయో సమాచారం ఇచ్చే వ్యవస్థ లేకపోవడం దారుణమని రైతు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఎరువు రకం పాత ధర పెరిగిన ధర పెంపు (రూ.ల్లో) (రూ.ల్లో) (రూ.ల్లో)12–32–16 1900 2450 550 14–35–14 1900 2350 450 24–24–0 2000 2450 450 10–26–26 1950 2450 500 20–20–0–13 1550 2250 700 16–16–16 1675 2050 325 15–15–15–09 1650 1950 300 16–20–0–13 1400 2000 600 ఎంఓపీ 1850 1975 125 ఎస్ఎస్పీ 615 1000 385 -
ఆక్రమణ చెరలో ఎర్ర కాలువ గట్టు
తాడేపల్లిగూడెం రూరల్: మండలంలోని మారంపల్లి వద్ద ఎర్ర కాలువ గట్టును తవ్వి సరిహద్దు చేలలో కలిపేసుకుంటున్న సంఘటన స్థానిక రైతుల ద్వారా వెలుగులోకి వచ్చింది. ఈ సందర్భంగా రైతులు సారిక సత్యనారాయణ, శ్రీనివాసరావు, నిడదవోలు రమేష్బాబు మాట్లాడుతూ ఎర్ర కాలువకు సంబంధించిన గట్టును గత కొంతకాలంగా తవ్వేశారని ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామానికి చెందిన రైతు వెంపల్లి రాంబాబు 95 సెంట్లు భూమి ఉందని, ఎర్ర కాలువ గట్టును తవ్వి దానిని మూడెకరాలకు విస్తరించినట్లు తెలిపారు. దీంతో గట్టు బలహీనంగా మారే అవకాశం ఉందని, మారంపల్లి, పరిసర గ్రామాల్లోని వేలాది ఎకరాలు వరద సమయంలో ముంపు బారిన పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. వెంపల్ల రాంబాబు, అతని సోదరుడు ఈ ఆక్రమణలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఎర్ర కాలువ గట్టు, మురుగునీటి డ్రెయిన్ ఆక్రమణలను తొలగించి, ముంపును అరికట్టాలని అధికారులను కోరారు. లేకుంటే సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని హెచ్చరించారు. గట్టు తవ్వి కలిపేసుకుంటున్న రైతులు -
కారు బోల్తా
బుట్టాయగూడెం : మండలంలోని కండ్రికగూడెం సమీపంలో బుధవారం ఒక కారు బోల్తా పడింది. మండలంలోని కంసాలికుంటకు చెందిన తెల్లం రాకేష్, తన పిన్ని సుజాత, ఒక బాబు ముగ్గురూ నల్లజర్ల వెళ్ళి తిరిగి ఇంటికి వస్తున్న సమయంలో చిన్నపాటి కునుకురావడంతో గోతులోకి వెళ్లి తిరగబడిపోయింది. అయితే ఈ సంఘటనలో ఎవరికీ ఏమీ కాకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. బోల్తాపడిన కారును సమీపంలోని కొందరు బయటకు తీశారు. బుట్టాయగూడెం : గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలను రేషనలైజేషన్ పేరుతో కుదించడాన్ని వ్యతిరేకిస్తూ మండలంలోని మారుమూల గ్రామమైన లంకపాకలలో గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల గేటుకు బుధవారం గ్రామస్తులు, విద్యార్థుల తల్లిదండ్రులు తాళాలు వేశారు. ఈ సందర్భంగా గేటు బయట బైటాయించి యథాతథంగా పాఠశాలలను కొనసాగించాలని నినాదాలు చేశారు. రేషనలైజేషన్ విధానాన్ని వ్యతిరేకిస్తూ ఇప్పటికే పులిరామన్నగూడెం, రెడ్డికోపల్లి గ్రామాల్లో కూడా గ్రామస్థులు గత ఐదు రోజులుగా నిరసనలు వ్యక్తం చేస్తూ తరగతులు జరగకుండా అడ్డుకున్నారు. తాజాగా లంకపాకల పాఠశాలల కూడా తెరవకుండా తాళాలు వేయడంతో బుట్టాయగూడెం మండలంలోని మొత్తం 3 పాఠశాలల్లో విద్యాబోధన, అడ్మిషన్లు పూర్తిగా నిలిచిపోయాయి. పాత పద్ధతిలోనే పాఠశాలలను కొనసాగించే వరకూ తెరవబోమని గ్రామస్తులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కారం లక్ష్మి, పీడీఎస్యూ నాయకులు బన్నే వినోద్, ఎంపీటీసీ సభ్యుడు కొవ్వాసి గోవిందరాజు తదితరులు పాల్గొన్నారు. ఏలూరు (ఆర్ఆర్పేట): భీమడోలు మండలం గుండుగొలను గ్రామంలోని వేంకటేశ్వర స్వామి దేవస్థాన అర్చకుడు ఎంఆర్ మంగపతి ఆచార్యులపై వచ్చిన ఆరోపణలపై ఈ నెల 22న విచారణ నిర్వహించనున్నట్టు దేవాదాయ శాఖ ఏలూరు డివిజన్ ఇన్స్పెక్టర్ వి.సురేష్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. అర్చకుడి ప్రవర్తనపై అదే గ్రామానికి చెందిన వగ్వాల వెంకట భాస్కర్ అనే వ్యక్తి చేసిన లిఖితపూర్వక ఫిర్యాదుపై దేవాదాయ శాఖ జిల్లా అధికారి కె.శ్రీనివాస్ ఆదేశాల మేరకు ఈ నెల 22న ఉదయం 11 గంటలకు గుండుగొలను ఆలయ ప్రాంగణంలోనే విచారణ చేపట్టనున్నట్టు పేర్కొన్నారు. ఈ విచారణకు ఫిర్యాదీ వెంకట భాస్కర్తో పాటు అర్చకుడు మంగపతి ఆచార్యులు తప్పనిసరిగా హాజరు కావాలని ఆయన సూచించారు. దెందులూరు: ఏలూరు రూరల్ మండలం మాదేపల్లిలో కలకలం సృష్టించిన నకిలీ ఎంజాయ్మెంట్ సర్టిఫికెట్ల వ్యవహారంలో.. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఏలూరు ఆర్డీఓను విచారణ అధికారిగా నియమించారు. నిబంధనలకు విరుద్ధంగా, జాయింట్ కలెక్టర్ సంతకం లేకుండా మాన్యువల్గా ఈ సర్టిఫికెట్లు జారీ చేశారంటూ పీజీఆర్ఎస్ ద్వారా అందిన లిఖితపూర్వక ఫిర్యాదుపై కలెక్టర్ చర్యలు తీసుకున్నారు. దీనిపై ఇప్పటికే విచారణ పూర్తి చేశామని, ఆ నివేదికను కలెక్టరుకు అందజేస్తామని రూరల్ తహసీల్దార్ విజయ్కుమార్ రాజు తెలిపారు. కాగా, తదుపరి విచారణ నిమిత్తం ఈ నెల 26న తమ కార్యాలయానికి హాజరుకావాలని రూరల్ మండలం రీ–సర్వే డిప్యూటీ తహసీల్దార్ను ఆర్డీఓ ఆదేశించారు. ద్వారకాతిరుమల: శ్రీవారి నిత్యాన్నదాన పథకానికి ఇద్దరు భక్తులు వేరువేరుగా బుధవారం రూ.2,01,116 లను విరాళంగా అందజేశారు. అందులో భాగంగా హైదరాబాద్కు చెందిన నిడుముక్కల గంగాధరరావు రూ.1,00,000 సమర్పించగా, ఏలూరుకు చెందిన పెద్ది శ్రీప్రియ రూ.1,01,116లను విరాళంగా అందించారు. ఈ సందర్భంగా దాతలకు ఆలయ ఈఓ వేండ్ర త్రినాథరావు, ఏఈఓ మెట్టపల్లి దుర్గారావు విరాళం బాండ్ను అందజేశారు. ఈ సందర్భంగా త్రినాథరావు మాట్లాడుతూ నిత్యాన్నదాన పథకానికి భక్తులు అందిస్తున్న విరాళాలు అన్నదాన కార్యక్రమాల నిర్వహణకు ఎంతో తోడ్పడుతున్నాయన్నారు. -
ఎకై ్సజ్ అధికారుల దాడులు
చింతలపూడి : చింతలపూడి ఎకై ్సజ్ స్టేషన్ పరిధిలో అధికారులు, సిబ్బంది బుధవారం విస్తృతంగా దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో రాఘవాపురం గ్రామానికి చెందిన పర్స నరసింహారావు అనే వ్యక్తి వద్ద నుంచి 7 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎకై ్సజ్ సీఐ పి.అశోక్ తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. అలాగే కామవరపుకోట మండలంలోని పలు మద్యం దుకాణాల్లో ఎకై ్సజ్ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. శ్రీసురక్షశ్రీ యాప్ ద్వారానే మద్యం అమ్మకాలు జరపాలని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ దాడుల్లో చింతలపూడి ఎకై ్సజ్ స్టేషన్ ఎస్సైలు అబ్దుల్ ఖలీల్, జె.జగ్గారావు తదితరులు పాల్గొన్నారు. పోలవరంలో.. పోలవరం రూరల్: మండలంలోని ఎల్ఎన్డీ పేట పరిసర ప్రాంతాల్లోని నాటుసారాయి నిందితుల ఇళ్లలో ఎకై ్సజ్, పోలీస్, ఈఎస్టీఎఫ్ బృందాలు బుధవారం సంయుక్తంగా తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల సందర్భంగా నాటుసారాయి తయారీ, విక్రయదారులకు అధికారులు ప్రత్యేకంగా కౌన్సిలింగ్ నిర్వహించి అవగాహన కల్పించారు. ఈ దాడుల్లో పోలవరం ఎకై ్సజ్ ఇన్స్పెక్టర్ కె.వీరబ్రహ్మం, పోలీస్ ఇన్స్పెక్టర్ పి.అప్పారావు, ఈఎస్టీఎఫ్ ఇన్స్పెక్టర్ ఆర్.సత్యవతి, ఎన్ఫోర్స్మెంట్ ఇన్స్పెక్టర్ వై.వి.ఎన్.ఎస్.ఫణి కుమార్ పాల్గొన్నారు. -
రోడ్డున పడ్డ రొయ్య రైతు
‘హైస్కూల్ ప్లస్’.. నిర్వీర్యం ప్రభుత్వ నిర్లక్ష్యం, ఉపాధ్యాయుల అశ్రద్ధ వెరసి గ్రామీణ విద్యార్థినుల కోసం ఏర్పాటు చేసిన ‘హైస్కూల్ ప్లస్’ పాఠశాలలు నిర్వీర్యమవుతున్నాయి. 8లో uగురువారం శ్రీ 18 శ్రీ జూన్ శ్రీ 2026సాక్షి, భీమవరం: విదేశీ మారకద్రవ్యంతో దేశానికి ఆదాయం తెస్తున్న ఆక్వా రైతులు రోడ్డున పడుతున్నారు. రొయ్య ధరలు గిట్టుబాటవ్వక సాగు భారమై దిక్కుతోచక కొట్టుమిట్టాడుతున్నారు. సిండికేటు దోపిడీని అడ్డుకోవాలని ఏడాదిన్నర కాలంగా రైతులు ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వానికి పట్టడం లేదు. ఈ తరుణంలో మేత ధరలు తగ్గించకుంటే రైతుల పక్షాన ఆందోళనకు సిద్ధమంటూ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కూటమి ప్రభుత్వానికి అల్టిమేటం జారీచేయడం ఆక్వా రైతులకు కొండంత ధైర్యాన్నిస్తోంది. 2.63 లక్షల ఎకరాల సాగు విస్తీర్ణం, ఏటా దాదాపు మూడు లక్షల టన్నుల దిగుబడితో రొయ్యల ఉత్పత్తిలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా రాష్ట్రంలో మొదటిస్థానంలో ఉంది. కిలోకు 30 నుంచి 40 కౌంట్లోపు రొయ్యలు అమెరికాకు, 50 నుంచి 100 కౌంట్ వరకు రొయ్యలు చైనా, యురోపియన్ దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. ఏటా ఆక్వా ఎగుమతులతో ప్రభుత్వానికి కోట్లాది రూపాయల విదేశీ మారకద్రవ్యం సమకూరుతోంది. రైతులు విలవిల జోన్తో నిమిత్తం లేకుండా ఆక్వా రైతులందరికీ రూ.1.50 రాయితీ విద్యుత్ ఇస్తానని, కోల్డ్ స్టోరేజిలు కట్టిస్తానని, ఏరియేటర్స్పై సబ్సిడీ ఇస్తానని ఎన్నికల్లో చంద్రబాబు హామీ ఇచ్చారు. అవేమీ చేయకపోగా ప్రస్తుతం ఇస్తున్న రాయితీ విద్యుత్కు పవర్ ఫ్యాక్టర్ పేరిట ఎగనామం పెట్టే పనిలో ఉన్నారు. సీడ్, ఫీడ్, ప్రాసెసింగ్, ఎక్స్పోర్టర్స్ సిండికేటు టీడీపీకి చెందిన వారే కావడంతో కూటమి పాలనలో దోపిడీకి తెరలేచింది. ఏకపక్షంగా మేత ధరలు పెంచి, రొయ్య రేట్లు తగ్గించి రైతుల కష్టాన్ని కాజేస్తున్నారు. గత ఏడాది అమెరికా పన్నుల పెంపు ప్రకటనను సాకుగా చూపించి కౌంట్కు రూ.30 నుంచి రూ.70 వరకు తగ్గించేశారు. పన్నుల పెంపులేదని అమెరికా చెప్పినా తగ్గించిన రొయ్య రేట్లు పెంచలేదు. సిండికేట్ దోపిడీ, కూటమి సర్కారు నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ అప్పట్లో జిల్లా అంతటా రైతులు రోడ్లెక్కి ఆందోళనలు చేశారు. నరసాపురం, పాలకొల్లు, ఆచంటలో చెరువులను ఎండగట్టి పంట విరామానికి సిద్ధమయ్యారు. ఈ పరిణామాలతో ఉలిక్కిపడ్డ ప్రభుత్వం ఉండిలో ఆక్వా సదస్సు, విజయవాడలో ప్రాన్ కో–ఆర్డినేషన్ కమిటీ మీటింగ్ పేరిట కంటితుడుపు చర్యలతో సరిపెట్టింది. తాజాగా నెలరోజుల క్రితం మేత ధరలు పెంచుతున్నట్టు ఫీడ్ కంపెనీల ప్రకటనతో రైతులు మళ్లీ రోడ్డెక్కి మేత బస్తాలను తగలబెట్టారు. తాము చెప్పే వరకు ధరలు పెంచవద్దని కంపెనీలకు సూచించినట్టు ప్రభుత్వం చెప్పింది. అయితే టన్నుకు రూ.12 వేల నుంచి రూ.14 వేల వరకు ఫీడ్ కంపెనీలు ధరలు పెంచేయడం గమనార్హం. మరోపక్క రొయ్య ధరలు కౌంట్కు రూ.30 నుంచి రూ.50 వరకు తగ్గించేశారు. ఇప్పటికే పాలకొల్లు, వీరవాసరం, ఉండి, భీమవరంలలో రైతులు రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నారు. మేత ధరల పెంపుతో ఎకరాకు రూ.35 వేలు వరకు అధనపు భారం పడుతుండగా, రొయ్య ధరల పతనంతో రూ. లక్ష వరకు నష్టపోతున్నామని రైతులు వాపోతున్నారు. రొయ్య ధరలు తగ్గించి.. మేత ధరలు పెంచి సిండికేటు దోపిడీ పట్టించుకోని కూటమి ప్రభుత్వం రెండేళ్లుగా నష్టాల్లో ఆక్వా సాగు దిక్కుతోచక రోడ్డెక్కుతున్న రైతులు ధర్నాలు, ఉరితాళ్లతో నిరసనలు ఆక్వాకు నాడు అండగా.. నేడు భరోసాగా వైఎస్సార్ సీపీ సర్కారుకు జగన్ అల్టిమేటం పట్ల రైతుల హర్షం ఆక్వా రంగానికి అడుగడుగునా అండగా నిలిచారు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి. వైఎస్సార్ సీపీ హయాంలో ప్రపంచంలోనే రెండవదిగా ఏపీ స్టేట్ ఆక్వా డెవలప్మెంట్ ఆథారిటీ (అప్సడా)ని ఏర్పాటుచేశారు. యూనిట్ విద్యుత్ రూ.1.50తో పాటు ఇతర రాయితీలు అందించారు. ఆక్వా కంపెనీలను రైతులకు జవాబుదారీ చేసి మేత, రొయ్య ధరల స్థిరీకరణ, నాణ్యమైన సీడ్, ఫీడ్ సరఫరాకు కృషిచేశారు. కరోనా సమయంలో సైతం సిండికేట్ దోపిడీకి కళ్లెంవేసి 100 కౌంట్ రూ.180 ఎంఎస్పీగా నిర్ణయించి అమలుచేశారు. రొయ్యల ఉత్పత్తి, ఎగుమతుల్లో రాష్ట్రాన్ని నెంబర్ వన్గా నిలిపారు. కూటమి పాలనలో సిండికేట్ దోపిడీతో కుదేలవుతున్న ఆక్వా రైతులకు నేడు భరోసాగా నిలుస్తున్నారు వైఎస్ జగన్. ఎప్పటికప్పుడు రైతుల ఆందోళనలకు వైఎస్సార్సీపీ సంపూర్ణ మద్దతు తెలుపుతూ వారి పక్షాన పోరాడుతోంది. పెంచిన మేత ధరలు తగ్గించకుంటే జూలై 1 లేదా 2 తేదీల్లో రైతులతో కలిసి ఆందోళన చేపడతానని జగన్ కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించడం తమకు కొండంత భరోసానిస్తోందని ఆక్వా రైతులు ఆనందం వ్యక్తంచేస్తున్నారు. -
ఒంటరి, వృద్ధ మహిళలే టార్గెట్
● హత్య చేసి బంగారం, డబ్బు చోరీ ● వివరాలు వెల్లడించిన ఎస్పీ శివకిషోర్ ఏలూరు టౌన్: ఏలూరు జిల్లా కై కలూరు టౌన్ ప్రాంతంలో ఒంటరి, వృద్ధ మహిళలను లక్ష్యంగా చేసుకుని అర్ధరాత్రి వేళల్లో హత్యలు చేస్తూ, ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలు, ఇంట్లోని విలువైన వస్తువులు, నగదు దోపిడీ చేస్తున్న వ్యక్తిని కై కలూరు టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. జూన్ 13న కై కలూరు పాములవీధికి చెందిన మార్పిన వరలక్ష్మి అనే మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందగా, ఆమె ఒంటిపై ఆభరణాలు, నగదు మాయమయ్యాయి. దర్యాప్తు చేపట్టిన పోలీసులకు, అదే వీధికి చెందిన కోమటి మామ అలియాస్ సోము అనే వృద్ధురాలిని కూడా జూన్ 3న ఇదే తరహాలో హత్య చేసినట్లు ఆధారాలు లభించాయి. ప్రేమ వివాహం చేసుకుని, జూదానికి, మద్యానికి బానిసై అప్పులపాలైన ధ్రువంత్ ఈ ఘాతుకాలకు పాల్పడినట్లు ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ వెల్లడించారు. నిందితుడి నుంచి చోరీ సొత్తు, బైక్, సెల్ఫోన్లను స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు. ఈ కేసును వేగంగా ఛేదించిన పోలీసు సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. ఈ కేసు దర్యాప్తులో ప్రతిభ కనబరిచిన హెచ్సీలు ఎన్. వెంకటేశ్వరరావు, బి. భూషరావు, కానిస్టేబుళ్లు శ్రీకాంత్, నాగార్జున, వంశీకృష్ణ, హోంగార్డులు రాము, ఫణిలను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. గంజాయి ముఠా అరెస్టు మరో కేసులో, ఏలూరు త్రీటౌన్ పోలీసులు, ఈగల్ టీమ్ సంయుక్తంగా జాతీయ రహదారిపై సీతాపురం వద్ద వాహన తనిఖీలు నిర్వహించి భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఒడిశా నుంచి రాజమహేంద్రవరం మీదుగా శ్రీకాళహస్తికి కారు, బైక్పై తరలిస్తున్న 32 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. రవాణాకు పాల్పడుతున్న బోనంగి నానాజీ, బోనంగి సత్యనారాయణ, మర్లపూడి దుర్గాప్రసాద్, మురుకుట్టి ఈశ్వరసాయి సతీష్లను అరెస్ట్ చేశారు. వీరిలో ఇద్దరిపై గతంలోనే పలు పోలీస్ స్టేషన్లలో పాత కేసులు ఉన్నట్లు ఎస్పీ తెలిపారు. గంజాయి రవాణాకు ఉపయోగించిన బాలెనో కారు, మోటారు సైకిల్ను సీజ్ చేసి, ఈ నెట్వర్క్తో సంబంధమున్న ఇతర వ్యక్తుల ప్రమేయంపై దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు స్పష్టం చేశారు. -
‘వీబీ జీరామ్జీ’ని నిరసిస్తూ ఆందోళనలు
భీమవరం: వీబీ జీరామ్జీ నూతన మార్గదర్శకాలను నిరసిస్తూ జిల్లావ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి జక్కం శెట్టి సత్యనారాయణ పిలుపునిచ్చారు. మంగళవారం భీమవరంలో బళ్ల చిన వీరభద్రరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం ఉసురు తీసి కేంద్ర ప్రభుత్వం వీబీ జీరాంజీ పథకాన్ని తెచ్చి కూలీల హక్కులను కాలరాసిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఒకపక్క 125 రోజులు పని దినాలు పెంచామని చెప్పి 60 రోజుల నిషేధం విధించడం కూలీలను మోసగించడమేనన్నారు. జిల్లా ఉపాధ్యక్షుడు కవురు పెద్దిరాజు, ఎ.రవి మాట్లాడుతు గ్రామీణ పేదలపై కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఫొటో విధానాన్ని రద్దు చేసి మాన్యువల్ మస్తర్ వేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో సంఘం జిల్లా సహాయ కార్యదర్శి శేషపు అశ్రియ్య. ఎడ్ల చిట్టిబాబు, షేక్ పాదుషా, జె వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. భీమవరం: భీమవరం మండల న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో జూలై 11వ తేదీన జాతీయ లోక్అదాలత్ నిర్వహిస్తున్నట్లు భీమవరం 3వ జిల్లా అదనపు న్యాయమూర్తి, మండల న్యాయ సేవా సంస్థ చైర్మన్ బి లక్ష్మీనారాయణ తెలిపారు. జాతీయ లోక్అదాలత్లో అన్ని సివిల్ కేసులు, రాజీకాదగ్గ క్రిమినల్ కేసులు, ప్రామిసరీ నోటు బాకీ కేసులు, మోటారు యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కేసులు, భార్యాభర్తల తగాదా, మనోవర్తి, గృహ హింస కేసులు, చెక్కు బౌన్స్, ఎకై ్సజ్ కేసులు రాజీ చేసుకోవచ్చన్నారు. రాజీ విశిష్టతను కక్షిదారులకు తెలియజేసి జాతీయ లోక్అదాలత్లో ఎక్కువ కేసుల రాజీకి ప్రయత్నం చేయాలని న్యాయవాదులు, పోలీసు అధికారులకు జడ్జి లక్ష్మీనారాయణ సూచించారు. పోలవరం రూరల్: పోలవరం ప్రాజెక్టును ట్రైనీ ఐఏఎస్ అధికారుల బృందం మంగళవారం సందర్శించింది. ‘ఏపీ దర్శన్’ కార్యక్రమంలో భాగంగా 2025 బ్యాచ్కు చెందిన ట్రైనీ ఐఏఎస్ అధికారులు పోలవరం ప్రాజెక్ట్, జలవిద్యుత్ కేంద్రంతో పాటు పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని సందర్శించారు. ఈ బృందంలో సీహెచ్ శ్రావణ్ కుమార్ రెడ్డి, హరి ఓం పాండియా, క్షితిజ్ ఆదిత్య శర్మ, నమ్రత్ అగర్వాల్, పవన్ తేజా ఏఆర్, ప్రియా, సుయాష్ కుమార్, వెంకటేష్ బన్నా ఉన్నారు. ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్టు ఎస్ఈ రెడ్డి రామచంద్రరావు, ఈఈ బాలకృష్ణ, డీఈ శ్రీనివాస్, ఎంఈఐఎల్ ప్రాజెక్టు జీఎం ఎ.గంగాధర్, డీజీఎం మురళి పమ్మి అధికారులకు ప్రాజెక్టు గురించి సమగ్రంగా వివరించారు. ప్రాజెక్టు లక్ష్యాలు, రూపకల్పన, నిర్మాణ పురోగతి, సాంకేతిక సవాళ్లు, పూర్తయిన తర్వాత కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పించారు. కై కలూరు: సుప్రీంకోర్టు నియమించిన సెంట్రల్ ఎంఫవర్డ్ కమిటీ(సీఈసీ) నిర్ణయం మేరకు కొల్లేరు పరివాహక ప్రాంతాల్లో సరిహద్దుల నిర్ణయానికి కలెక్టర్ వెట్రిసెల్వి ఆదేశాలతో మండల తహసీల్దారు రామకృష్ణ 10 కొల్లేటిలంక గ్రామాల్లో గ్రామసభలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా పల్లెవాడ, భుజబలపట్నం, గోనెపాడు, ఆటపాక, కై కలూరులో రెండో రోజు మంగళవారం సభలు నిర్వహించారు. అభయారణ్యం సరిహద్దుల పునః సర్వే, నీటి ప్రవాహాలు, పక్షుల సంరక్షణ ప్రాంతం, కాలుష్యం కలవడం, కొల్లేరు పరివాహక ప్రాంతంలో జీ రాయితీ, సొసైటీ భూముల వివరాలు, ఆక్రమణలను తొలగించుట వంటి అంశాలపై అవగాహన, ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు. జంగారెడ్డిగూడెం: గురవాయిగూడెంలో మద్ది ఆంజనేయస్వామివారికి మంగళవారం విశేష పూజలు నిర్వహించారు. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. వివిధ సేవల రూపేణా ఆలయానికి రూ.3,33,961 ఆదాయం సమకూరినట్లు ఆలయ సహాయ కమిషనర్, ఈవో ఆర్వీ చందన, ధర్మకర్తల మండలి అధ్యక్షుడు రాజాన సత్యనారాయణ తెలిపారు. -
ఫీడ్ ధరలను ప్రభుత్వమే నియంత్రించాలి
కనుమరుగవుతున్న తాటిచెట్లు జిల్లాలో తాటిచెట్లను నరికి ఇటుకల బట్టీల్లో ఇటుకలను కాల్చడానికి వాడుతున్నారు. దీంతో జీవ వైవిధ్యం తగ్గే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. 8లో uభీమవరం (ప్రకాశంచౌక్): రొయ్య ఫీడు ధరల పెరుగుదల, మార్కెట్ ధరల నియంత్రణలో కూటమి ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతూ మంగళవారం జిల్లా రొయ్యల రైతుల వెల్ఫేర్ ఫెడరేషన్ నాయకులు, ఆక్వా రైతులు కలెక్టరేట్లో డీఆర్వో శివన్నారాయాణరెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ఆక్వా రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందన్నారు. ముడి సరుకు ధరలు పెరిగాయనే సాకుతో ఫీడు ధరలు భారీగా పెంచారని, కానీ అంతర్జాతీయ మార్కెట్లో ముడి సరుకు ధరలు తగ్గినపుడు మాత్రం ఫీడు ధరలు తగ్గించడం లేదని, దీంతో వ్యయం భారీగా పెరిగిందని వాపోయారు. పెట్టుబడికి అనుగుణంగా గిట్టుబాటు ధర అందించాలని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణం కమిటీ వేసి ఆక్వా రైతుల సమస్యలు పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు గొట్టుముక్కల గాంధీభగవాన్ రాజు, మళ్ల తులసీ రాంబాబు, గాదిరాజు సుబ్బరాజు, వీరవల్లి చంద్రశేఖర్, ముత్యాల బుజ్జి, తోట విజయ్కుమార్, అంగర ప్రసాదు, గంధం కేసుబాబు, భోగిరెడ్డి శ్రీనివాస్, ఎం.శ్రీనివాసరావు, దాసరి మాణిక్యాలరావు, కావలి దాము తదితరులు పాల్గొన్నారు. -
బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ ‘గోల్డ్’మాల్
● 4.4 కేజీల బంగారం మాయమైనట్లు గుర్తింపు ● ముగిసిన తనిఖీలు జంగారెడ్డిగూడెం: స్థానిక బ్యాంక్ ఆఫ్ బరోడా శాఖలో జరిగిన భారీ బంగారం కుంభకోణం (గోల్డ్మాల్) తనిఖీలు మంగళవారంతో ముగిశాయి. ఈ నెల 6వ తేదీ నుంచి (7వ తేదీ మినహా) వరుసగా 10 రోజుల పాటు పోలీసుల సమక్షంలో అధికారులు ఈ తనిఖీలు చేపట్టారు. మొత్తం 2,756 బంగారు రుణ ఖాతాలను పరిశీలించగా, అందులో 139 ఖాతాలకు సంబంధించిన 4.4 కేజీల (4,399.70 గ్రాములు) బంగారం మాయమైనట్లు అధికారికంగా నిర్ధారించారు. బ్యాంకుకు రాని ఖాతాదారులు ఎప్పుడు వచ్చినా వారి సమక్షంలోనే వారి బంగారు వస్తువుల ప్యాకెట్లను పరిశీలిస్తామని అధికారులు తెలిపారు. ఈ నెల 6న ముగ్గురు ఖాతాదారులు తమ బంగారాన్ని పరిశీలించగా 30 కాసులు (240 గ్రాములు) మాయమైనట్లు తేలింది. ఈ విషయం బయటకు పొక్కడంతో వందలాది మంది ఖాతాదారులు బ్యాంకు వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. రంగంలోకి దిగిన పోలీసులు, బ్యాంకు ఉన్నతాధికారులు టోకెన్లు ఇచ్చి వరుసగా తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో కొన్ని బంగారం ప్యాకెట్లలో అసలు బంగారానికి బదులుగా రోల్డ్గోల్డ్, ఇత్తడి, చాక్పీసులు, స్టాప్లర్ పిన్ల బాక్సులు ఉంచినట్లు గుర్తించడంతో అధికారులు అవాక్కయ్యారు. మొత్తం తనిఖీలు పూర్తయ్యేసరికి మాయమైన బంగారం విలువ రికార్డు స్థాయిలో 4.4 కేజీలకు చేరింది. ఎక్కువ బంగారం పెట్టి తక్కువ రుణం తీసుకున్న ఖాతాలు, అలాగే రెన్యువల్ చేసిన ఖాతాల నుంచే ఎక్కువ శాతం బంగారం మాయమైనట్లు గుర్తించారు. ఖాతాదారుల పత్రాలపై ఎక్కువ బంగారం చూపి, బ్యాంకు రికార్డుల్లో తక్కువ చూపించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లాకర్లలోని బంగారం మాయం కావడం వెనుక కేవలం అప్రయిజర్ రాజు పాత్రే కాకుండా, బ్యాంకు సిబ్బంది, కస్టోడియన్ల హస్తం కూడా ఉండి ఉంటుందని బాధితులు ఆరోపిస్తున్నారు. -
సిండికేట్ వ్యవస్థ నశించాలి
ఆక్వా ఫీడ్ తయారీదారులు, సీడ్ అమ్మకందారులు, రొయ్యల కొనుగోలుదారులు వీరంతా సిండికేట్గా తయారై ఆక్వారైతుల జీవితాలను నాశనం చేస్తున్నారు. పెరుగుతున్న ధరలను అరికట్టాలని ఆక్వారైతులు నిరసన తెలుపుతున్నా కూటమి ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదో అర్థమవుతోంది. నేతల తీరును ఆక్వారైతులు గమనిస్తూనే ఉన్నారు. – పీవీఆర్కే ఆంజనేయరాజు, ఆక్వారైతు, వైఎస్సార్సీపీ మండలాధ్యక్షుడు, వాండ్రం, ఉండి మండలం ఆక్వారైతుల అండదండలతో గత ఎన్నికల్లో గెలిచిన మనం వారికి తగిన న్యాయం చేయాలి. ఇప్పటికే ఆక్వారైతులు చాలాకాలంగా రోడ్డెక్కి నిరసనలు తెలుపుతున్నారు. ఆక్వారైతుల వల్ల కోట్లాది రూపాయల ఆదాయం పొందుతున్న ప్రభుత్వం, ఇప్పుడు వారినే నిర్లక్ష్యం చేస్తే రైతులంతా మద్దతు ఉపసంహరించుకునే అవకాశం ఉంది. – రుద్దరాజు యువరాజు, టీడీపీ ఎంపీటీసీ, ఆక్వారైతు రాష్ట్ర నాయకుడు, కలిగొట్ల, ఉండి మండలం గత ఎన్నికల్లో ఆక్వారైతులు ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లో కూటమికి క్లీన్ స్వీప్ విజయాన్ని అందించి 34 మంది ఎమ్మెల్యేలను గెలిపించారు. కానీ ఇప్పుడు ఆక్వా రైతులకు జరుగుతున్న అన్యాయంపై వారంతా మండిపడుతున్నారు. ఆక్వా రైతులు తమ మద్దతును వెనక్కి తీసుకుంటే కూటమికి తగిన బుద్ధి వస్తుంది. – యడవల్లి వెంకటేశ్వరరావు, జనసేన మండలాధ్యక్షుడు, ఆక్వారైతు, పాములపర్రు, ఉండి మండలం నేను టీడీపీ కార్యకర్తను. గత ఎన్నికల్లో టీడీపీ గెలుపునకు ఎంతో కృషి చేశాను. కానీ ఇప్పుడు అదే ఆక్వారైతుల పాలిట శాపంగా, బాధాకరంగా మారుతుందని ఊహించలేదు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆక్వారైతు రోడ్డెక్కాడు. ఆక్వారైతులు ఏం పాపం చేశారని కూటమి ప్రభుత్వం ఇంత దారుణంగా వ్యవహరిస్తోంది? – పూసపాటి వెంకటరాజు, ఆక్వారైతు రాష్ట్ర నాయకుడు, టీడీపీ కార్యకర్త, ఉండి -
ఆక్వా రైతుల నిరసన ర్యాలీ
ఉండి: ‘నమ్మి కట్టుకున్న పసుపుతాడు ఈరోజు ఆక్వారైతులకు ఉరితాడుగా మారింది’ అంటూ కూటమి ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఆక్వారైతులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మంగళవారం పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గ కేంద్రంలో వైఎస్సార్సీపీ, టీడీపీ, జనసేన, బీజేపీ, సీపీఎం, సీపీఐ తదితర పార్టీలకు చెందిన ఆక్వారైతులు, నాయకులు పెద్ద ఎత్తున నిరసన చేపట్టేందుకు చేయి చేయి కలిపి తరలివచ్చారు. ముందుగా ఆక్వారైతులు తమ డిమాండ్లతో కూడిన బ్యానర్లు, జెండాలు పట్టుకుని ఉండి సెంటర్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. అక్కడ మెడకు పసుపురంగు ఉరితాళ్లు వేసుకుని వినూత్నంగా నిరసన తెలిపారు. కూటమి ప్రభుత్వంలో ఆక్వారైతులకు లభించిన బహుమానం ఇదేనంటూ కన్నీటి పర్యంతమయ్యారు. అనంతరం అక్కడ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ కొనసాగించి, కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. అనంతరం కార్యాలయ సిబ్బందికి తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మేతల ధరలు తగ్గించాలని, రొయ్యల ధరలు పెంచాలని గత కొద్ది నెలలుగా ఆక్వారైతులు నిరసనలు చేస్తున్నా కూటమి ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని అన్నారు. అంతర్జాతీయంగా డాలర్ ధర పెరుగుతుంటే ఇక్కడ రొయ్యల ధరలు తగ్గిస్తున్నారని, మేతల ధరలను టన్నుకు రూ.10 వేల నుంచి రూ.12 వేల వరకు పెంచేశారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం తమను పట్టించుకోని పక్షంలో తామంతా ఒకటి రెండు రోజుల్లో ‘ఛలో అమరావతి’ లేదా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ‘ఛలో ఢిల్లీ’ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని హెచ్చరించారు. కొత్త పార్టీ పెట్టే యోచనలో ఆక్వారైతులు ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కూటమి తరుఫున మొత్తం 34 మంది ఎమ్మెల్యేలు ఆక్వారైతుల చలవ వల్లే గెలిచారనే విషయాన్ని గుర్తుంచుకోవాలని, తామంతా ఎంతో కష్టపడి వారిని గెలిపించుకున్నా మని రైతులు అన్నారు. కానీ ఎన్నికలకు ముందు చెప్పింది ఒకటి, ఎన్నికల తర్వాత కూటమి ప్రభుత్వ వైఖరి మరొకటిగా మారిపోవడం దారుణమన్నారు. తూర్పుగోదావరిలో 19, పశ్చిమగోదావరిలో 15 మంది ఎమ్మెల్యేల విజయానికి ఆక్వారైతుల అండదండలే కారణమని, ఇప్పుడు తమకు కూటమి ప్రభుత్వం న్యాయం చేయకపోతే వచ్చే ఎన్నికల్లో తమ తడాఖా చూపిస్తామని హెచ్చరించారు. అవసరమైతే ఉభయగోదావరి జిల్లాల్లో ఆక్వారైతులంతా చేయి చేయి కలిపి ‘ఆక్వా (ష్రింప్) జనతా పార్టీ’ పెట్టేందుకు కూడా వెనుకాడబోమని స్పష్టం చేశారు. తగిన న్యాయం జరగకపోతే ఆక్వా సాగుకు ‘క్రాప్ హాలిడే’ ప్రకటించేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఆక్వారైతులను నట్టేట ముంచుతుండటంతోనే అన్ని పార్టీల్లోని ముఖ్య నాయకులంతా రాజకీయాలకు అతీతంగా చేయి చేయి కలిపినట్లు వివరించారు. మెడకు ఉరితాళ్లు తగిలించుకుని ఉండి సెంటర్లో రైతుల నిరసన న్యాయం చేయకపోతే కూటమి ప్రభుత్వానికి షాక్ తప్పదని హెచ్చరిక మద్దతు తెలిపిన వివిధ పార్టీల నేతలు -
బాధితులపై కేసులా?
దెందులూరు: కూటమి ప్రభుత్వంలో ఏ ఒక్కరికీ రక్షణ లేకుండా పోయిందని, చింతమనేని ప్రభాకర్ న్యాయవాది ఇంటిపై దాడి చేస్తే అతనిపై, అతని అనుచరులపై ఎందుకు కేసు నమోదు చేయలేదని వైఎస్సార్సీపీ సమన్వయకర్తలు కొఠారు అబ్బయ్యచౌదరి, మామిళ్ళపల్లి జయప్రకాష్, కంభం విజయరాజు ప్రశ్నించారు. దౌర్జన్యం చేసిన వారిని వదిలిపెట్టి బాధితులపై కేసులు పెట్టడం ఆశ్చర్యకరమన్నారు. బుధవారం ఏలూరులో న్యాయవాది శ్రీనివాస్ నివాసంలో ఆయన్ను, ఆయన కుటుంబ సభ్యులను అబ్బయ్య చౌదరి, జేపి, విజయరాజు పరామర్శించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏ ఒక్కరికీ భద్రత లేకుండా పోయిందన్నారు. జేసీబీ తీసుకొచ్చి ఇల్లు కూల్చడానికి ప్రయత్నించి.. బూతులు తిడుతూ దౌర్జన్యం చేస్తే జిల్లా యంత్రాంగం ఏమీ తెలియనట్టు మౌనంగా ఉండటం ఆశ్చర్యంగా ఉందన్నారు. న్యాయవాది ఇంటిపై దౌర్జన్యం చేస్తే చంద్రబాబు ఎందుకు మౌనంగా ఉన్నారని విమర్శించారు. లా అండ్ ఆర్డర్ కంట్రోల్ ఉందని పదేపదే చెబుతున్న హోం మంత్రి ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. అధికారం శాశ్వతం కాదని గుర్తుపెట్టుకోవాలన్నారు. పరామర్శించిన వారిలో వడ్డీల కార్పొరేషన్ మాజీ చైర్మన్ ముంగర సంజీవ్ కుమార్, జడ్పీ వైస్ చైర్మన్ పెనుమాల విజయ్బాబు, జడ్పీటీసీ నిట్టా లీలా నవకాంతం, పెదపాడు ఎంపీపీ బత్తుల రత్నకుమారి, దెందులూరు వైస్ ఎంపీపీ వేమూరి జితేంద్ర, పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు మేకా లక్ష్మణరావు, యువజన భాగం అధ్యక్షుడు కామిరెడ్డి నాని, రాష్ట్ర కార్యదర్శి నిట్టా గంగరాజు, కట్ట ఏసుబాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఆళ్ల సతీష్ చౌదరి, ఏఎంసీ మాజీ చైర్మన్ నెరుసు చిరంజీవి, లీగల్ సెల్ అధ్యక్షుడు ప్రత్తిపాటి తంబి పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ సమన్వయకర్తలు అబ్బయ్యచౌదరి, జేపీ, విజయరాజు -
చోరీ కేసులో ఇద్దరి యువకుల అరెస్ట్
కాళ్ల: ఆకివీడు జవహర్ పేటలో ఈ నెల 9న జరిగిన చోరీ కేసును ఛేదించినట్లు ఆకివీడు సీఐ కాళీ చరణ్ తెలిపారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ పెద్దింటి శ్రీను కుటుంబ సభ్యులు పెళ్లి బట్టలు కొనుగోలు నిమిత్తం హైదరాబాద్ వెళ్లిన సమయంలో తాళాలు పగలగొట్టి దొంగతనానికి పాల్పడినట్లు తెలిపారు. ఈ కేసును ప్రత్యేక కేసుగా పరిగణించి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి విచారించామని పేర్కొన్నారు. ఈ కేసులో ఆకివీడు గంగానమ్మకోడు ప్రాంతానికి చెందిన మేకల తేజ, సాయి నగర్ ప్రాంతానికి చెందిన షేక్ ఫరూక్లను గుర్తించి అరెస్టు చేశామన్నారు. వారి నుంచి రూ.17 లక్షలు విలువైన 14.5 కాసుల బంగారు నగలు, మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. గతంలో కూడా వీరు రెండు కేసుల్లో నిందితులుగా ఉన్నట్లు ఆయన చెప్పారు. నిందితులపై సస్పెక్ట్ షీట్లు తెరుస్తున్నట్లు ఆయన చెప్పారు. అనంతరం ఎస్సై హనుమంత నాగరాజు, కానిస్టేబుల్ శివ, విజయ్, వాసు, నాగేశ్వరరావు తదితరులను ఆయన అభినందించారు. -
● కూటమి సభ కోసం.. స్కేటింగ్ ట్రాక్ ధ్వంసం
కూటమి సభ కోసం చిన్నారులు శిక్షణ తీసుకునే స్కేటింగ్ ట్రాక్ ధ్వంసం చేశారు. ‘కూటమి పాలనకు రెండేళ్లు’ పేరుతో మంగళవారం ఏలూరు ఇండోర్ స్టేడియం ప్రాంగణంలో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. వచ్చిన వారికి భోజనాలు వంట చేయడానికి ప్రాంగణంలో ఉన్న స్కేటింగ్ ట్రాక్ను ఉపయోగించారు. స్కేటింగ్ ట్రాక్ మధ్యలో పెద్ద పెద్ద గోతులు తవ్వడం, ట్రాక్పై వంట పాత్రలు, నీళ్ల డ్రమ్ములతో అధ్వానంగా తయారు చేశారు. దీంతో స్కేటింగ్ ట్రాక్పై ప్రతిరోజూ సుమారు 100 మందికిపైగా శిక్షణ తీసుకునే పిల్లలకు రెండు రోజుల నుంచి శిక్షణ లేదు. వీటిని ఎప్పుడు తీస్తారో.. తవ్విన గోతులు పూడుస్తారు? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. – ఫొటోలు: సాక్షి ఫొటోగ్రాఫర్/ఏలూరు -
ఆగని అక్రమ గట్ల పర్వం
● కొల్లేరు అభయారణ్యంలో వింత పరిస్థితి ● ప్రజాప్రతినిధుల అండతో రెచ్చిపోతున్న వైనంకై కలూరు: కొల్లేరు అభయారణ్యంలో అక్రమ చెరువుల గట్ల నిర్మాణం యథేచ్ఛగా సాగుతోంది. ఒకవైపు కొల్లేరు ప్రజలకు అన్యాయం జరుగుతోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నా, నాయకులు మాత్రం ఓట్ల రాజకీయం కోసమే ప్రాధాన్యమిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రజాప్రతినిధులు నాటకీయంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణల నడుమ, అక్రమార్కులు చీకటి చాటున చెరువు గట్లను నిర్మిస్తున్నారు. కై కలూరు మండలం వడ్లకూటితిప్ప వద్ద రహదారికి సమీపంలో, గతంలో ‘కొల్లేరు ఆపరేషన్’ సమయంలో ధ్వంసం చేసిన చెరువు గట్లను ఇప్పుడు పగటిపూటే పూడ్చేస్తున్నారు. ప్రజాప్రతినిధుల అండదండలు ఉన్నాయంటూ అక్రమార్కులు బహిరంగంగానే సవాళ్లు విసురుతుండటం గమనార్హం. నిబంధనలు బేఖాతరు కై కలూరు మండలం పెంచికలమర్రు శివారు మంచినీటి చెరువు సమీపంలో, దాదాపు 20 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న మూడు చెరువులను అదే గ్రామానికి చెందిన ఓ ప్రముఖ అక్రమార్కుడు సాగు చేస్తున్నాడు. కొల్లేరు ఆపరేషన్ సమయంలో ఈ చెరువులను పూర్తిగా ధ్వంసం చేసినప్పటికీ, అక్కడ కూల్చకుండా వదిలేసిన ఒక షెడ్డును కేంద్రంగా చేసుకుని ఇతడు కార్యకలాపాలు సాగిస్తున్నాడు. జీవో నెంబర్ 120 ప్రకారం కొల్లేరు అభయారణ్యంలోకి కనీసం అగ్గిపెట్టె తీసుకెళ్లడం కూడా నేరమే. అలాంటిది అటవీ శాఖ నిబంధనలను ఏమాత్రం లెక్కచేయకుండా ఇక్కడ గట్ల నిర్మాణం సాగుతోంది. రాజకీయ నేతలను ప్రసన్నం చేసుకుంటూ అక్రమ సాగులో ఆరితేరిన సదరు వ్యక్తి, కూటమి ప్రభుత్వ పాలనలో మరింత రెచ్చిపోతున్నాడనే విమర్శలు వస్తున్నాయి. కూలీలతో వ్యూహాత్మకంగా.. రాజకీయ ఎత్తుగడలు తెలిసిన సదరు అక్రమార్కుడు, పొక్లెయిన్లతో గట్లు వేస్తే అధికారులకు అనుమానం వస్తుందని భావించి.. నిఘా నుంచి తప్పించుకునేందుకు రోజువారీ కూలీలను రంగంలోకి దించాడు. గత కొన్నేళ్లుగా ఇతడు ఇదే పద్ధతిని అనుసరిస్తున్నాడు. స్థానిక నేతలు, ప్రజాప్రతినిధుల మద్దతు ఉండటంతో అటవీ శాఖ అధికారులను సైతం ఖాతరు చేయడం లేదు. గతంలో ఇక్కడ పనిచేసిన డీఎఫ్ఓ విజయ సదరు అక్రమ సాగుపై కొరడా ఝుళిపించారు. అయితే, ఆమె బదిలీ కావడం అక్రమార్కులకు కలిసివచ్చింది. రానున్న వర్షాకాలంలో గట్లు కొట్టుకుపోకుండా ఉండేందుకు కూలీలతో ముందుగానే వాటిని పటిష్ఠం చేయిస్తున్నాడు. గతంలో అటవీ శాఖ ఇతనిపై అనేక కేసులు నమోదు చేసినా వైఖరి మారలేదు. సదరు వ్యక్తి తమకు పెద్ద తలనొప్పిగా మారాడని అటవీ అధికారులు సైతం తలలు పట్టుకుంటున్నారు.కొల్లేరు అభయారణ్య పరిధిలోని వడ్లకూటితిప్ప వద్ద కూలీలతో అక్రమంగా గట్టు వేయిస్తున్న ఉదంతం మా దృష్టికి వచ్చింది. వెంటనే స్థానిక డీఆర్వో, ఎఫ్బీవోలను అక్కడికి పంపించి పనులను నిలిపివేయించాం. అభయారణ్యంలో గట్లు ఏర్పాటు చేయడం చట్టరీత్యా నేరం. మరోసారి ఇలాంటి చర్యలకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటాం. – కె.రామలింగాచార్యులు, అటవీ శాఖ రేంజర్, కై కలూరు -
కనుమరుగవుతున్న తాటిచెట్లు
● ఉపాధి కోల్పోతున్న గీత కార్మికులు ● పర్యావరణానికి ముప్పు అంటున్న నిపుణులు భీమవరం: మొక్కలు నాటండి.. పర్యావరణాన్ని కాపాడండి.. అంటూ ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తున్నా.. జిల్లాలో తాటిచెట్లను విచ్చలవిడిగా నరికి ఇటుకల బట్టీల్లో ఇటుకలను కాల్చడానికి వాడుతున్నారు. దీనితో వాతావరణంలో కాలుష్య నివారణకు, లక్షలాదిమంది కల్లుగీత కార్మికుల జీవనోపాధికి ఉపయోగపడుతున్న తాటిచెట్లు కనుమరవుతున్నాయి. ఒకప్పుడు కాలువగట్లు, ఖాళీస్థలాల్లో విఫరీతంగా పెంచిన తాటిచెట్లను ప్రస్తుతం విచ్చలవిడిగా నరికివేస్తున్నా పట్టించుకునే నాథుడు కన్పించడం లేదు. గ్రామాల్లో భవనాలు తక్కువగా ఉన్న రోజుల్లో ఎక్కువ మంది ప్రజలు తాటి చెట్టతో నిర్మించిన తాటిఆకులను పైకప్పుగా వేసుకునే ఇళ్లల్లోనే జీవనం సాగించేవారు. చల్లదనానికి ఎంతో అనువైన తాటి ఆకుల పందిళ్లు ఇళ్లముందు దర్శనమిచ్చేవి. తాటిచెట్ల నుంచి కల్లుతీసి కల్లు విక్రయాలే గాకుండా తాటిబెల్లం తయారీ వంటివాటికి ఉపయోగించి అనేకమంది జీవనోపాధి పొందేవారు. తాటిచెట్టుకు సంబంధించిన ఆకులతో చాపలు, వివిధ రకాల బుట్టలు వినియోగించేవారు. అయితే నేడు తాటిచెట్లు కనబడడం అరుదుగా మారింది. రియల్ ఎస్టేట్ వ్యాపారం పుంజుకోవడంతో ఇటుకలకు గిరాకీ పెరగడంతో జిల్లాలోని అనేక ప్రాంతాల్లో ఇటుకల బట్టీలు వెలవడంతో తాటిచెట్లను నరికి ఇటుకలను కాల్చడానికి వినియోగిస్తున్నారు. దీనితో ఎక్కడా తాటిచెట్టు కన్పించే పరిస్థితి కానరావడం లేదు. వేసవి సమయంలో చేల గట్లు, కాలువ గట్లు, ఇతర ఖాళీ ప్రదేశాల్లో ఉండే తాటిచెట్లను నరికి ఇటుకల బట్టీల వద్ద గుట్టలుగా నిల్వచేసుకుంటున్నారు. తాటిచెట్ల ఉపయోగాలు తాటిచెట్టు ఆక్సిజన్ను విడుదల చేసి కార్బన్డైఆకై ్సడ్ను తీసుకుంటుంది. గాలిలోని దూళి కణాలను ఒడిసిపట్టి గాలిని శుద్ధి చేస్తుంది. తాటిచెట్ల వేర్లు మట్టిని బలంగా పట్టుకుని నేలక్షయాన్ని నివారిస్తుంది. వర్షపునీటిని భూమిలోనికి చొప్పించి నీటి నిల్వకు సహాయపడుతుంది. తాటిఆకులు సూర్యకిరణాలను అడ్డగించడంతో వాతావరణాన్ని చల్లగా ఉంచడం వంటి అనేక విధాలుగా ఉపయోగపడుతుంది. తాటిచెట్లను విచ్చలవిడిగా తొలగించడం వలన ప్రకృతిలో జీవ వైవిధ్యం తగ్గే ప్రమాదం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి తాటిచెట్ల తొలగింపును అడ్డుకోవాలని ప్రజలు కోరుతున్నారు.బొరాసిస్ఫ్లా బెల్లీఫెర్ అనే శాసీ్త్రయనామం కలిగిన తాటిచెట్ట మట్టజాతికి చెందినది. కాలువలు, బోదెలకు ఇరువైపులా తాటిచెట్లను పెంచడం వల్ల మట్టి క్షయాన్ని తగ్గించి గట్లు ధృఢంగా ఉండేందుకు దోహదపడతాయి. తాటిచెట్లు తగ్గడం వల్ల ప్రకృతిలో జీవ వైవిధ్యం తగ్గే ప్రమాదముంది. – డాక్టర్ కె మల్లిఖార్జున, వృక్షశాస్త్ర అధ్యాపకుడు, డీఎన్నార్ కళాశాల, భీమవరం తాటిచెట్లను ఇటీవల విచ్చల విడిగా నరికివేయడం వల్ల కల్లుగీత కార్మికులు ఉపాధినికోల్పోతున్నారు. గీతకార్మికులు ఇప్పటికీ మద్యం బెల్ట్షాపులు కారణంగా కల్లు అమ్మకాలు తగ్గి ఇబ్బందులు పడుతుంటే తాటిచెట్లు తగ్గిపోవడం వల్ల కల్లుతీసే అవకాశాన్ని కోల్పోతున్నారు. – జుత్తిగ నర్సింహమూర్తి, కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి -
వృద్ధుడి అదృశ్యం
భీమడోలు: మండలంలోని పూళ్లకు చెందిన వృద్ధుడు కొత్తపల్లి జార్జి (60) అదృశ్యమైనట్లు కుటుంబ సభ్యులు మంగళవారం పోలీసులను ఆశ్రయించారు. వారు తెలిపిన వివరాల ప్రకారం పూళ్లకు చెందిన కొత్తపల్లి జార్జి అనే వృద్ధుడు ఉపాధి హామీ పథకం సొమ్మును ఏలూరులోని బ్యాంక్ ఆఫ్ బరోడాకు వెళ్లి తెచ్చుకుంటానని చెప్పి ఇంటి నుంచి వెళ్లాడు. అయితే రెండు రోజులుగా అతను కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆచూకీ కోసం చేసిన ప్రయత్నాలు చేశారు. అయితే ఎలాంటి ఫలితం లేకపోవడంతో వృద్ధుడు కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేశామని ఎస్సై మదీనా బాషా తెలిపారు. కుక్కునూరు: మండలంలోని బోనగిరి గ్రామం వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఛత్తీస్గడ్ రాష్ట్రానికి చెందిన పోడియం మోటు (35) అనే వ్యక్తి మృతి చెందాడు. కుక్కునూరు ఎస్సై రాజారెడ్డి చెప్పిన వివరాలు ప్రకారం మృతుడు జామాయిల్ మొక్కలు తీసుకెళ్లే వాహనంపై పని చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో మొక్కలు తీసుకువెళుతున్న వాహనంపై మోటు కూర్చుని ఉండగా భద్రాచలం నుంచి అశ్వారావుపేట వెళ్తున్న ఆటో మొక్కల వాహనాన్ని ఢీకొంది. దీంతో వాహనంపై నుంచి పడిపోయిన మోటుకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో స్థానికులు చికిత్స నిమిత్తం భద్రాచలం ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మోటు మృతి చెందినట్లు చెప్పారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వివరించారు. వేలేరుపాడు: మండలంలోని జిన్నెలగూడెం గ్రామంలో మంగళవారం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనుల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రైతు రవ్వ గణేష్ పొలంలో ఉపాధి పనులు చేస్తుండగా, తురసం జోగారావు (62) అనే కూలీ అకస్మాత్తుగా అస్వస్థతకు గురై కుప్పకూలిపోయాడు. వెంటనే తోటి కూలీలు ఆయనను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, పరీక్షించిన వైద్యులు అప్పటికే జోగారావు మృతి చెందినట్లు ధ్రువీకరించారని వేలేరుపాడు ఎంపీడీవో తెలిపారు. బుట్టాయగూడెం: గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో ప్రభుత్వం చేపట్టిన రేషనలైజేషన్ను వ్యతిరేకిస్తూ బుట్టాయగూడెం మండలం మారుమూల గ్రామాలైన పులిరామన్నగూడెం, రెడ్డికోపల్లి గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో చేపట్టిన నిరసన కార్యక్రమం కొనసాగుతూనే ఉంది. పాఠశాల పునఃప్రారంభం నుంచి మంగళవారం వరకూ పాఠశాలలు తెరవకుండా గేట్లకు తాళం వేసి నిరసన కార్యక్రమాన్ని గ్రామస్తులు చేపట్టారు. వంటావార్పు కార్యక్రమం కొనసాగిస్తున్నారు. పాఠశాల ప్రారంభమై నాలుగు రోజులు గడుస్తున్నా ఆయా పాఠశాలల్లో అడ్మిషన్లు నిలిచిపోయాయి. విద్యార్థులకు విద్యాబోధన నిలిచిపోయింది. గ్రామస్తులు పాఠశాల గేట్లకు తాళాలు వేయడంతో పాఠశాలలకు వస్తున్న 20 మంది ఉపాధ్యాయులు ఆ పరిసర ప్రాంతాల్లో చెట్ల కింద, బల్లలపైన కుర్చునే పరిస్థితి నెలకొంది. తమకు అధికారులు పాత పద్ధతిలోనే నిర్వహిస్తామని రాతపూర్వకంగా రాసి ఇచ్చే వరకూ తాము చేపట్టిన నిరసన కార్యక్రమం నిలుపుదల చెయ్యమంటూ గ్రామస్థులు తెగేసి చెప్తున్నారు. పులిరామన్నగూడెం, రెడ్డికోపల్లి పాఠశాలల్లో గ్రామస్తులు చేస్తున్న నిరసన కార్యక్రమానికి అటు పీడీఎస్యూ విద్యార్థి సంఘం, గిరిజన సంఘాలు మద్దతు తెలిపాయి. అలాగే మంగళవారం వైఎస్సార్సీపీ ఎంపీపీ, ఎంపీటీసీ సభ్యులు కూడా మద్దతు తెలిపారు. పులిరామన్నగూడెం చేరుకుని అక్కడ గ్రామస్తులతో కలిసి పాఠశాల వద్ద నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ తెల్లమ రమణ, వైస్ ఎంపీపీ గగ్గులోతు మోహన్రావు, ఎంపీటీసీ సభ్యులు గాలి దుర్గారావు, మొడియం వెంకమ్మ, మడకం వెంకటలక్ష్మి, ఉయికే రత్నకుమారి తదితరులు పాల్గొన్నారు. ఏలూరు (ఆర్ఆర్పేట): నిబంధనలను ఉల్లఘించిన 32 ప్రైవేటు విద్యాసంస్థల బస్సులపై కేసులు నమోదు చేశామని ఉప రవాణా కమిషనరు షేక్ కరీమ్ మంగళవారం తెలిపారు. విద్యాసంస్థలు పునఃప్రారంభమైన నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా సోమ, మంగళవారాల్లో వివిధ ప్రైవేటు విద్యాసంస్థల బస్సులను తనిఖీలు చేశామన్నారు. భద్రతా నియమాలు, నిబంధనలకు అనుగుణంగా ఉన్న బస్సుల్లో మాత్రమే విద్యార్థులను తరలించాలని యాజమాన్యాలకు సూచించారు. ఈ తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని ఆయన తెలిపారు. -
ఆర్జీయూకేటీలో పుస్తకావిష్కరణ
నూజివీడు: నేటి సమాజంలో ఒత్తిడి, నిరాశ, అపజయాలు, ఒంటరితనం వంటి సమస్యలతో అనేక మంది మానసికంగా కుంగిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో జీవితంపై ఆశ కోల్పోయే వారికి ధైర్యం, ప్రేరణ కలిగించాలనే ఉద్దేశంతో రచించిన ‘ఏం ఇంత బాధ ప్రాణం తీసుకునేంత?’ అనే పుస్తకాన్ని ఆర్జీయూకేటీ వైస్చాన్సలర్ ప్రొఫెసర్ మద్దాలి లక్ష్మీనారాయణ రావు మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలోని ప్రతి ఒక్కరికీ మానసిక ఆరోగ్యం ఎంతో ముఖ్యమని, ఎలాంటి సమస్య వచ్చినా ‘ప్రాణం కంటే గొప్పది మరొకటి లేదు’ అనే సందేశాన్ని ఈ పుస్తకం చాటుతుందని పేర్కొన్నారు. ఈ పుస్తక రచయిత గుమ్మడిదల జయకృష్ణ మాట్లాడుతూ ఏ సమస్యా జీవితానికంటే పెద్దది కాదనే సందేశాన్ని అందించాలనే సాధారణ ఉద్దేశంతోనే ఈ పుస్తకాన్ని రచించినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ప్రొఫెసర్ సండ్ర అమరేంద్ర కుమార్, ఆర్జీయూకేటీ నూజివీడు డైరెక్టర్ ప్రొఫెసర్ ఎస్ఎస్ఎస్వీ గోపాలరాజు, డీన్ అకడమిక్స్ దువ్వూరు శ్రావణి, ఫైనాన్స్ ఆఫీసర్ డాక్టర్ డీవీ నాగార్జునదేవి, నూజివీడు ఏఓ బి.లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. -
ఏలూరులో ‘ధార్ గ్యాంగ్’ కదలికలు
ఏలూరు టౌన్: ఏలూరు జిల్లాలో శ్రీధార్ గ్యాంగ్శ్రీ కదలికలను పోలీస్ నిఘా వర్గాలు గుర్తించాయి. అత్యంత ప్రమాదకరమైన మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఈ దోపిడీ ముఠాను పట్టుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. ధార్ గ్యాంగ్లో ముగ్గురు సభ్యుల ముఠా కదలికలు ఇటీవల ఏలూరు పెద్దరైల్వే స్టేషన్లో గుర్తించారు. వెంటనే అప్రమత్తమైన ఏలూరు జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ నిఘా మరింత పెంచేలా ఆదేశాలు జారీ చేశారు. ఎవరైనా అనుమానితులను గుర్తిస్తే తక్షణమే 112కు గానీ, 8332959174 నంబర్కు గానీ ఫోన్ చేయాలని సూచిస్తున్నారు. విశాఖపట్నం వయా రాజమండ్రి, ఏలూరు మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ధార్ జిల్లా మారుమూల ప్రాంతాలకు చెందిన అత్యంత ప్రమాదకరమైన అంతరాష్ట్ర దొంగల ముఠానే ‘ధార్ గ్యాంగ్’గా పోలీస్ వర్గాలు గుర్తించాయి. ఈ దోపిడీ ముఠా మహారాష్ట్ర, ఏపీ, తెలంగాణ, తమిళనాడు వంటి పలు రాష్ట్రాల్లోనూ దోపిడీలకు పాల్పడుతుంటారు. ఈ ధార్ ముఠా ఈనెల 13న విశాఖపట్నంలోని కంచరపాలెం పరిధిలో సంచరించినట్లు పోలీసులు గుర్తించారు. ధార్ గ్యాంగ్లోని ముగ్గురు సభ్యులు 15తేదీ సాయంత్రం తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రైల్వేస్టేషన్, ఏలూరు పెద్ద రైల్వేస్టేషన్ వెనుకవైపు గేటు నుంచి లోనికి వెళ్లినట్లు పోలీస్ నిఘాలో గుర్తించారు. -
AP: ఆక్వా రైతుల ఆగ్రహ జ్వాలలు
విజయవాడ: పెంచిన ఆక్వా ఫీడ్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రంలోని రైతులు ఆందోళన బాటపట్టారు. దొడ్డిదారిన పెంచిన ఆక్వా ఫీడ్ను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమాలు చేపట్టారు. దీనిలో భాగంగా తహసీల్దార్లకు వినతి పత్రాలు అందజేస్తున్నారు.ఆక్వా రైతుల నిరసన కార్యక్రమంలో భాగంగా పశ్చిమగోదావరి జిల్లా ఉండి మెయిన్ సెంటర్లో ధర్నా చేశారు. తమకు ఉరితాళ్లే శరణ్యం అంటూ ఉరితాళ్ళు మెడకు బిగించుకుని ఉండి మెయిన్ సెంటర్లో నిరసన తెలిపారు. సిండికేట్ వ్యవస్థను అరికట్టాలని, ఆక్వారైతులకు సరైన ధర కల్పించి అప్సడ చట్టాన్ని అమలు చేయాలని నినాదాలు చేశారు. ఉండి మండల తాసిల్దార్కు వినతి పత్రం అందజేశారు ఆక్వా రైతులు. దీనికి వైఎస్సార్సీపీ, సీపీఎం, సీపీఐ నేతలు సంఘీభావం తెలిపారు. వనామీ రకం మేత పై కేజికి 10 రూపాయి పెంపు, టైగర్ ప్రాన్ మేత ధరలు 12 రూపాయల పెంపును వ్యతిరేకిస్తూ ఆక్వా రైతులు ధర్నా చేపట్టారు. టన్ను వనామీ ఫీడ్కు రూ. 10 వేలు, టైగర్ ప్రాన్ ఫీడ్కు రూ. 12 వేలు పెంచి ఆక్వా రైతుల నడ్డివిరిచే యత్నం చేస్తున్నారని వారు మండిపడుతున్నారు. ఈ పెంపును ఏ మాత్రం అంగీకకరించబోమని రైతులు పదే పదే చెప్పినప్పటికీ ఏకపక్షంగా టీడీపీకి చెందిన కంపెనీలు ధరలు పెంచేశాయని ధ్వజమెత్తారు. అప్పడాతో సంబంధం లేకుండా మొండిగా నిర్ణయం తీసుకోవడాన్ని రైతులు తప్పుబడుతున్నారు. ఇప్పటికే రొయ్య రేటు పతనం కావడం ఒకటైతే పెంచిన ధరలతో పెట్టుబడులు మరింత పెరిగే అవకాశం ఉంది. కేజీ రొయ్య ఉత్పత్తికి 280/- వరకు ఖర్చు.. ప్రస్తుతం కేజీ వనామి రొయ్య మార్కెట్ ధర 240 ఉండటంతో తాము సాగు ఎలా చేసేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెండు రోజుల్లో ప్రభుత్వం దిగిరాకుంటే.. చలో అమరావతికి పిలుపునిస్తామని ఆక్వా రైతుల హెచ్చరిస్తున్నారు.ఏలూరు జిల్లాలోని భీమడోలు మండలం గుండుగొలనులో ఆక్వా రైతుల సమావేశమయ్యారు. ఆక్వా రైతుల సమస్యల పరిష్కారంపై చర్చిస్తున్నారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు పాల్గొన్నారు. ఆక్వా రంగం తీవ్ర సంక్షోభంలో ఉందన వ్యాఖ్యానించారు. కూటమి ప్రభుత్వం ఆక్వా రైతులను మోసం చేస్తోందని విమర్శించారు. ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయలేదని ఆరోపించారు. ఆక్వా రైతుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. -
బాధితుల పట్ల అలసత్వం వద్దు
భీమవరం: సమస్యల పరిష్కారం కోసం పోలీస్స్టేషన్కు వచ్చే బాధితుల పట్ల అలసత్వం వద్దని, వారికి త్వరితగతిన న్యాయం జరిగేలా చూడాలని ఎస్పీ అద్నాన్ నయీం అస్మి పోలీసు అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఎస్పీ స్వయంగా ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. అనంతరం సంబంధిత పోలీసుస్టేషన్స్ అధికారులతో ఫోన్లో మాట్లాడుతూ ప్రజలు ఎంతో నమ్మకంతో పోలీస్ శాఖను ఆశ్రయిస్తారని వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. ఫిర్యాదులను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని ఆదేశించారు. -
సీఆర్జెడ్లో అక్రమ తవ్వకాలపై ఆగ్రహం
పెనుగొండ: హైకోర్టు ఉత్తర్వులను ధిక్కరిస్తూ సీఆర్జెడ్ పరిధిలోని నడిపూడి, రావిలంకల్లో అక్రమ ఇసుక తవ్వకాలు జరుపుతున్నా అధికారులు నిర్లక్ష్యం వహించడం దారుణమని వైఎస్సార్సీపీ అడ్వయిజరీ కమిటీ సభ్యుడు, మాజీ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. నడిపూడిలో అక్రమ తవ్వకాలు జరుపుతున్న ప్రాంతంలో సోమవారం సాయంత్రం వైఎస్సార్సీపీ శ్రేణులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. టీడీపీ నాయకుల అండదండలతో ఇసుక మాఫియా రెచ్చిపోతుందన్నారు. వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులకు ఆశ చూపడానికి ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ఎవరూ ఆశపడే రకం కాదన్నారు. గోదావరిని స్థానిక ప్రజా ప్రతినిధులు గుత్తగా అమ్మేస్తున్నారని ఆరోపించారు. అక్రమ తవ్వకాలు జరిపితే సహించేది లేదని హెచ్చరించారు. ఇసుక మాఫియాకు అధికార పార్టీ స్థానిక నేతలు కొమ్ము కాస్తున్నారని ఆరోపించారు. అధికారులు అక్రమాలకు అండగా ఉంటున్నారన్నారు. అక్రమ ఇసుక తరలింపుపై పోరాటం చేస్తే అక్రమ కేసులు పెట్టి వేధింపులకు గురిచేస్తున్నారని దుయ్యబట్టారు. ఎన్ని కేసులు పెట్టినా వెనుకడుగు వేసేది లేదని పోరాటం చేస్తామని హెచ్చరించారు. -
రక్షణ లేకపోతే ఎలా ?
దాడులు, దౌర్జన్యం సమస్యలకు పరిష్కారం కాదు. రోజులన్నీ ఒకేలా ఉండవు. న్యాయ పరిరక్షణ కోసం కృషి చేస్తున్న న్యాయవాదులకు, వారి కుటుంబాలకు రక్షణ లేకపోవడం బాధాకరం. న్యాయవాదులపై దాడులు విచారకరం. న్యాయవాదికి అందరూ బాసటగా ఉంటాం. న్యాయం జరిగే వరకు పోరాడతాం. –ముదుగురు సూర్యనారాయణ, వైఎస్సార్సీపీ బీసీ విభాగం ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్పై దాడి దౌర్జన్యం అనాగరిక చర్య. సమాజంలో భిన్నాభిప్రాయాలు సహజం. ప్రజాస్వామ్య పద్ధతిలో చట్టపరంగా ఎదుర్కోవాలి తప్ప కుటుంబ సభ్యులపై దాడి చేయడం హేయమైన చర్య. ముమ్మాటికీ శాంతిభద్రతలను విచ్ఛిన్నం చేసే ప్రయత్నం. దాడుల ద్వారా గొంతు నొక్కలేరు. శ్రీనివాస్కు అండగా ఉంటాం. – కామిరెడ్డి నాని, వైఎస్సార్సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు -
న్యాయవాది శ్రీనివాసబాబుపై కేసు
ఏలూరు టౌన్: న్యాయవాది ఈడ్పుగంటి శ్రీనివాసబాబును ఏలూరు జిల్లా న్యాయస్థానం నియమించిన అడ్వకేట్ కమిషనర్ సురేష్రెడ్డి సమక్షంలో కోర్టులో హాజరుపరిచేందుకు తీసుకువెళ్ళారు. న్యాయవాది శ్రీనివాసబాబుపై నమోదు చేసిన కేసుల్లో స్టేషన్ బెయిల్కు అవకాశం ఉండటంతో ఆయన్ను ఏలూరు జిల్లా కోర్టుకు తరలించారు. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని అమీనాపేటలోని న్యాయవాది శ్రీనివాసబాబు ఇంటివద్దకు వెళ్ళి హంగామా చేశారు. మద్యం సేవించి ఇష్టారాజ్యంగా వ్యవహరించడంతో టూటౌన్ పోలీస్స్టేషన్లో బైండోవర్ కేసు నమోదు చేశారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా చింతమనేనిని హౌస్ అరెస్ట్ చేశారు. న్యాయవాది శ్రీనివాసబాబుపై దెందులూరు నియోజకవర్గానికి చెందిన నలుగురు పార్టీ నాయకులు ఏలూరు త్రీటౌన్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ నెల 7న శ్రీనివాసబాబు ప్రెస్మీట్ పెట్టి ఎమ్మెల్యే చింతమనేని, కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేశారని, మహిళల మనోభావాలు దెబ్బతీనేలా మాట్లాడుతూ కించపరిచారనీ అతనిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
ఆక్వా సంక్షోభానికి ప్రభుత్వానిదే బాధ్యత
మేత ధరలు, విద్యుత్ భారం తగ్గించాలి నరసాపురం రూరల్: ఆక్వా సంక్షోభానికి అధికారంలో ఉన్న ప్రభుత్వమే బాధ్యత వహించాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు, అప్సడా మాజీ చైర్మన్ వడ్డి రఘురామ్ డిమాండ్ చేశారు. ఎన్నడూ లేని విధంగా రొయ్య రైతుల కన్నీళ్లు ఈ ప్రభుత్వంలోనే చూస్తున్నామని, ధరలు అమాంతం పడిపోయి రైతులు తీవ్ర నష్టాలు ఎదుర్కొంటున్నారన్నారు. ఆక్వా రైతులకు అండగా వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్నామని వారు పేర్కొన్నారు. సోమవారం మొగల్తూరులోని లక్ష్మీ వెంకటేశ్వర కళ్యాణ మండపంలో నిర్వహించిన ఆక్వా రైతుల సదస్సులో ప్రసాదరాజు, వడ్డి రఘురాంలు పలువురు రైతులతో మాట్లాడి రైతుల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ రొయ్యల మేత ధరలు పదేపదే పెరిగిపోవడంతో రైతులు తీవ్ర నష్టాలను చవిచూస్తున్నారన్నారు. మరోపక్క రొయ్యలకు గిట్టుబాటు ధర లేదని, ఆందోళన వ్యక్తం చేశారు. మాజీ జెడ్పీటీసీ, ఆక్వా వ్యాపారవేత్త చాగంటి సత్యనారాయణ, వైఎస్సార్సీపీ కేంద్ర పాలకమండలి సభ్యులు పీడీ రాజు, ఎంబీసీ కార్పోరేషన్ మాజీ చైర్మన్ పెండ్ర వీరన్న తదితరులు మాట్లాడుతూ ఆక్వాకు సబ్సిడీ విద్యుత్ ఎగ్గొట్టడమే లక్ష్యంగా చంద్రబాబు ప్రభుత్వం కొత్త ఎత్తుగడలు వేస్తుందన్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న విధానాలు ఏవీ రైతులకు ఉపయోగపడే విధంగా లేవన్నారు. ఆక్వా జోన్, నాన్ ఆక్వా జోన్కు రూ 1.50 విద్యుత్ సబ్సిడీ ఇస్తామని హామీ ఇచ్చారని, కాలయాపన చేస్తూనే ఉన్నారని విమర్శించారు. నూతన సంఘాన్ని ఏర్పాటు చేస్తున్నాం ఆక్వా సాగు నష్టాలతో ఉండటంతో ప్రభుత్వ ప్రోత్సాహం కోసం రైతు సమస్యల పరిష్కారం కోసం తీర ప్రాంత రైతులకు మేలు చేకూర్చేందుకు రాష్ట్ర స్థాయి నూతన సంఘాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రతినిధులు తెలిపారు. తమ సమస్యల సాధనకోసం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిని కలిసి సమస్యలను శాసనసభలో ప్రస్తావించేందుకు వినతిపత్రం అందించనున్నట్టు రైతు సంఘ నాయకులు తెలిపారు. వైఎస్సార్సీపీ అగ్నికుల క్షత్రియ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు తిరుమాని నాగరాజు, జిల్లా మత్స్యకార సొసైటీల సంఘం మాజీ అధ్యక్షుడు అండ్రాజు చల్లారావు, నరసాపురం, మొగల్తూరు, పోడూరు, ఆకివీడు జెడ్పీటీసీలు బొక్కా రాధాకృష్ణ, తిరుమాని బాపూజీ, గుంటూరి పెద్దిరాజు, వేగేశ్న వెంకటరాజు, గుబ్బల నారాయణమూర్తి, చిలుకూరి దత్తాత్రేయవర్మ, దొంగ సత్యనారాయణ, రామచంద్రరాజు, రేవు నారాయణమూర్తి, ఉంగరాల రమేష్నాయుడు, గుంటూరి సత్యనారాయణ, కాండ్రేగుల నర్శింహరావు, కంకటాల పెద్దిరాజు, పాలా రాంబాబు, ముక్తేశ్వరరావు, బంధన పూర్ణచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. -
చింతమనేనిపై చర్యలేవి?
మాడవీధుల స్థలానికి విరాళం కాళ్ల: కాళ్లకూరు వేంకటేశ్వరస్వామి ఆలయ మాడవీధుల స్థలం కోసం కొమ్మూరి వెంకటనరసింహారావు జ్ఞాపకార్థం కుటుంబసభ్యులు రూ.1,01,116 విరాళంగా అందించారు. మంగళవారం శ్రీ 16 శ్రీ జూన్ శ్రీ 2026ఏలూరు టౌన్: దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ఏలూరులో రెచ్చిపోయారు.. ఫూటుగా మద్యం సేవించి టీడీపీకి చెందిన ప్రముఖ న్యాయవాది ఈడ్పుగంటి శ్రీనివాసబాబు ఇంటిపైకి వెళ్ళి దౌర్జన్యానికి పాల్పడ్డారు. ఇదంతా ఏలూరు డీఎస్పీ శ్రావణ్కుమార్, సీఐలు, ఎస్ఐల సమక్షంలోనే జరగటం విశేషం. పోలీసులను ఏంట్రా అంటూ సంబోధించినా.. గుండెలపై చేతులు వేస్తూ గెంటేసినా.. పోలీసులు నోరెత్తలేదు. ఇదిలా ఉండగా న్యాయవాది శ్రీనివాసబాబును పోలీసులు అదుపులోకి తీసుకుని ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయ సమీపంలోని మహిళా పోలీస్స్టేషన్కు తరలించటం విమర్శలకు తావిచ్చింది. దాడి చేసేందుకు వెళ్ళిన ఎమ్మెల్యే చింతమనేనిని క్షేమంగా ఇంటి వద్ద దించిన పోలీసు అధికారులు... బాధితుడు శ్రీనివాసబాబుకు 151 నోటీస్ జారీ చేసి అతని కుమారుడితో సహా స్టేషన్లో ఉంచారు. ఏలూరులో హైడ్రామా న్యాయవాది ఈడ్పుగంటి శ్రీనివాసబాబు పోలీస్స్టేషన్లో అక్రమ నిర్బంధంపై తీవ్ర నిరసన వ్యక్తమైంది. ఏలూరు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కోనే సీతారాం, ప్రధాన కార్యదర్శి నిమ్మల జ్యోతికుమార్, ఉపాధ్యక్షుడు ఎన్.కృష్ణారావు, మాజీ ప్రధాన కార్యదర్శి కే.సురేష్రెడ్డి ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో న్యాయవాదులు పోలీస్స్టేషన్కు చేరుకున్నారు. బాధితుడు శ్రీనివాసబాబుకు మద్దతుగా ఏలూరు బార్ సభ్యులు చేరుకున్నారు. పోలీస్స్టేషన్లోకి వెళ్ళేందుకు ప్రయత్నించగా లోనికి వెళ్ళేందుకు అనుమతి లేదని పోలీసులు అడ్డుకున్నారు. దీనిపై కొంతసేపు గందరగోళ పరిస్థితి నెలకొంది. కనీసం సహచర న్యాయవాదిని కలిసేందుకు పోలీసులు అడ్డుచెప్పటంపై ఏలూరు బార్ అసోసియేషన్ నాయకులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. రోడ్డు వద్దనే నిలబడి తమ నిరసన వ్యక్తం చేశారు. అనంతరం పోలీస్ అధికారులతో ఫోన్లో మాట్లాడగా.. ఐదుగురు నాయకులను మాత్రం లోనికి వెళ్ళేందుకు అనుమతించారు. న్యాయవాది శ్రీనివాసబాబు ఆరోగ్య పరిస్థితిని, పోలీస్ అధికారుల తీరును అడిగి తెలుసుకున్నారు. దాడికి పాల్పడిన ఎమ్మెల్యేపై ఎలాంటి చర్యలు లేకపోగా... బాధితుడిని పోలీస్స్టేషన్లో ఉంచటంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లా కోర్టులో సెర్చ్ వారెంట్కు పిటిషన్ ఏలూరు బార్ సభ్యులు ఈడ్పుగంటి శ్రీనివాసబాబును సాయంత్రంలోగా విడిచిపెడతామని చెప్పిన పోలీస్ అధికారులు ఏవిధమైన చర్యలు తీసుకోలేదు. అక్రమ కేసులు బనాయించేందుకు ప్రయత్నిస్తున్నారనే సందేహాల నేపథ్యంలో ఏలూరు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 2వ అదనపు జ్యూడిషియల్ ఫస్ట్క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో సెర్చ్ వారెంట్ పిటిషన్ను దాఖలు చేశారు. ఏలూరు నగరానికి చెందిన ప్రముఖ హైకోర్టు న్యాయవాది గొట్టుముక్కల రోనాల్డ్ రాస్, పీపీ నర్సింహమూర్తి, బార్ అసోసియేషన్ అధ్యక్షులు కోనే సీతారాం సెర్చ్ వారెంట్ పిటిషన్ వేశారు. రౌడీషీట్ ఉన్న ఎమ్మెల్యే రాత్రివేళ దాడులు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని, అతనిపై ఎలాంటి చర్యలు లేకపోగా.. న్యాయవాది ఈడ్పుగంటి శ్రీనివాసబాబు, అతని కుమారుడిని అక్రమంగా నిర్బంధించారని, సెర్చ్ వారెంట్ ఇవ్వాలని, అడ్వకేట్ కమిషనర్ను ఏర్పాటు చేయటంతోపాటు కోర్టు సిబ్బంది సమక్షంలో వారెంట్ అమలుకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. కోర్టు సెర్చ్ వారెంట్ జారీ చేయటంతోపాటు అడ్వకేట్ కమిషనర్గా న్యాయవాది సురేష్రెడ్డిని నియమించారు. మంగళవారం ఏలూరు జిల్లా కోర్టుల్లో విధులను బాయ్కాట్ చేస్తున్నట్లు బార్ అసోసియేషన్ ప్రకటించింది. చింతమనేని ప్రభాకర్ తీరుపై న్యాయవాదులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సీనియర్ న్యాయవాది ఈడ్పుగంటి శ్రీనివాసబాబు ఇంటిని జేసీబీతో కూల్చివేస్తామంటూ.. ఆయన కుటుంబ సభ్యులను తీవ్ర భయాందోళనకు గురిచేయటంపై నిరసన తెలుపుతూ బాయ్కాట్ చేస్తున్నామని ఏలూరు బార్ అసోసియేషన్ అధ్యక్షులు కోనే సీతారామారావు ఒక ప్రకటన విడుదల చేశారు. చింతమనేనిపై ఎలాంటి కేసు నమోదు చేయకపోగా... బాధితుడిని పోలీస్స్టేషన్లో నిర్బంధించటంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పోలీస్స్టేషన్లో బాధితుడు శ్రీనివాస్ నిర్బంధం దాడికి పాల్పడ్డ చింతమనేనికి రక్షణగా పోలీసులు ఇదెక్కడి న్యాయం: బార్ అసోసియేషన్ ప్రతినిధులు -
‘వెన్నుపోటుకు రెండేళ్లు’ సూపర్హిట్
● జగన్ ఇచ్చిన పథకాలు రద్దుచేశారు ● సూపర్ సిక్స్ నెరవేర్చలేదు ● విలేకరుల సమావేశంలో కారుమూరి మండిపాటు తణుకు అర్బన్: చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమం సూపర్ హిట్ అయ్యిందని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. పార్టీ శ్రేణులతోపాటు ప్రజలు కూడా స్వచ్ఛందంగా పాల్గొన్నారని చెప్పారు. తణుకు పార్టీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాపు నేస్తం, చేదోడు, వాహనమిత్ర వంటటి పథకాలతోపాటు 17 మెడికల్ కళాశాలలను ఏంచేశారని ప్రశ్నించారు. గత జగన్ ప్రభుత్వ హయాంలో నాడు నేడు పేరుతో ప్రభుత్వ పాఠశాలలను సుందరంగా తీర్చిదిద్దామని చంద్రబాబు పాలనలో పాఠశాలలు నేడు అధోగతి పాలయ్యాయని, విద్యాసంవత్సరం ప్రారంభించినా ఇంతవరకు పుస్తకాలు పూర్తిస్థాయిలో ఇవ్వలేకపోయారని నిలదీశారు. ఈ రెండేళ్ల కాలంలో జగన్ ఇచ్చిన పథకాలను రద్దుచేయడమే కాకుండా ఇస్తానన్న సూపర్సిక్స్ పథకాలు ఇవ్వకపోవడంతోనే రోడ్డెక్కాల్సి వచ్చిందని అన్నారు. రెండేళ్లలో ఒక్క కొత్త పింఛను ఇచ్చారా అని మండిపడ్డారు. తణుకు నియోజకవర్గంలో మద్యం, పశువధ, పేకాట వంటి అంశాలను ఆదాయ వనరుగా మార్చుకుని రాబందులా రాధాకృష్ణ పీక్కుతింటున్నారని కారుమూరి ఆరోపించారు. వైజాగ్లో దొరికిన ఆవు మాంసం మూలాలు తణుకు మండలం తేతలి కర్మాగారానికి చెందినవని తేలినప్పటికీ నిరోధించకపోగా సదరు పశువధ కర్మాగారానికి పన్ను మినహాయింపులు ఇవ్వడం వెనుక ఎమ్మెల్యేకు ఉన్న పావలా వాటా నిదర్శనమన్నారు. మా ప్రభుత్వ హయాంలో తణుకులో రూ. 800 కోట్లు టీడీఆర్లో కారుమూరి స్కాం చేశారని ప్రచారం చేశారని, నేడు వారి ప్రభుత్వ హయాంలో గతంలో ఎలాంటి తప్పు జరగలేదని అధికారులే నివేదికలు ఇచ్చారని వివరించారు. నేడు తణుకులో టీడీఆర్లకు తెరతీశారని, పూర్తయిన రోడ్లకు కూడా టీడీఆర్లు పెడుతున్నారని, లేఅవుట్లలో సైతం డబుల్ రోడ్లు వేసేసి బిల్డర్ల నుంచి భారీగా దోచేస్తున్నారని విమర్శించారు. ఎమ్మెల్యే సొంత గ్రామం వేల్పూరులో ప్రజలకు సెంటు భూమి కొనలేకపోగా టాయిలెట్స్ పడగొట్టి వారి ఇంట్లో పనివార్లకు ఇచ్చారని విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో వేల్పూరులో హాస్పిటల్ నిరా్మాణానికి నిధులు తెస్తే కోర్టుకు వెళ్లారని, వివిధ వర్గాలకు కమ్యూనిటీ హాల్సు నిర్మాణాలు చేయిస్తే కోర్టులకెళ్లి అడ్డుకున్నారని మండిపడ్డారు. మద్యంపై రోజుకు రూ.20 ఎమ్మెల్యేకి ఇస్తున్నానని బాహాటంగానే చెబుతుండడం సిగ్గుచేటన్నారు. సమావేశంలో పట్టణ అధ్యక్షుడు మారిశెట్టి శేషగిరి, లీగల్సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి వెలగల సాయిబాబారెడ్డి, పంచాయితీరాజ్ రాష్ట్ర కార్యదర్శి వడ్లూరి సీతారాం, పార్టీ మేధావుల ఫోరం రాష్ట్ర కార్యదర్శి చోడే గోపి, నియోజకవర్గ మహిళాధ్యక్షురాలు మెహర్ అన్సారీ, పట్టణ మహిళాధ్యక్షురాలు నూకల కనకదుర్గ, ఇరగరం మండల అధ్యక్షుడు కొప్పిశెట్టి దుర్గాప్రసాద్, నియోజకవర్గ ప్రచార కమిటీ అధ్యక్షుడు గెల్లా జగన్, సప్పా బలరామకృష్ణ పాల్గొన్నారు. -
ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోరా?
టీడీపీ లీగల్ సెల్ వైస్ ప్రెసిడెంట్పై దాడి చేస్తే చర్యలు ఉండవా.. దెందులూరు ఎమ్మెల్యే తో పాటు 100 మంది అనుచరులు దాడి చేసి దౌర్జన్యం చేస్తే ఎందుకు చర్యలు తీసుకోలేదు. మీకొక న్యాయం.. ఎదుట వాళ్లకు మరో న్యాయమా? రెడ్బుక్ అంటూ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు, లోకేష్ వ్యవస్థలను విచ్ఛిన్నం చేశారు. దెందులూరు నియోజకవర్గంలో మద్యం, మట్టి మాఫియా అరాచకం కొనసాగుతోంది. నియోజకవర్గంలో భయానక పరిస్థితులు ఉన్నాయని చెబుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. –కొఠారు అబ్బయ్యచౌదరి, మాజీ ఎమ్మెల్యే -
విద్యార్థులకు సాంకేతికత అవసరం
తాడేపల్లిగూడెం: విద్యార్థులు ఆధునిక సాంకేతిక విషయాలను నిరంతరం తెలుసుకోవాలని డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్ కె.ధనుంజయరావు కోరారు. సోమ వారం వెంకట్రామన్నగూడెం ఉద్యాన కళాశాలలో జరిగిన మానవవనరుల అభివృద్ధి శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ ఉద్యాన పంటల పర్యవేక్షణ, భూభాగ పటాల తయారీ, పరిశోధన కార్యకలాపాలు, పంట నిర్వహణ తదితర రంగాల్లో డ్రోన్ సాంకేతికతకు విశేష ప్రాధాన్యముందన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని, భవిష్యత్లో వచ్చే అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. డీన్ ప్రసన్నకుమార్ మాట్లా డుతూ డ్రోన్ సాంకేతికతను అందించేందుకు ఇలాంటి శిక్షణా కార్యక్రమాలు ఏర్పాటుచేస్తున్నామన్నారు. కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ ఎన్బీవీ.చలపతిరావు, ప్రాజెక్టు ప్రధాన పరిశోధకులు బీఎం.చెన్నకేశవులు, సహ పరిశోధకులు ఎన్.ఇమ్మాన్యుయేల్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రైవేటీకరణ విరమించాలి
భీమవరం: మున్సిపాలిటీల్లోని 14 కీలక రంగాలను ప్రైవేటీకరణ చేస్తూ కూటమి ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 975 తక్షణం రద్దు చేయాలని సోమవారం ఏపీ మున్సిపల్ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో భీమవరం మున్సిపల్ కార్యాలయం వద్ద్ద నిరసన ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి బి.వాసుదేవరావు మాట్లాడుతూ మునిసిపాలిటీల్లో ప్రజా సేవలు ప్రభుత్వం కొనసాగించాలని డిమాండ్ చేశారు. వెంటనే కార్మికుల సంఖ్య పెంచాలని, పదవీ విరమణ చేసిన కార్మికుల స్థానంలో కొత్తగా కార్మికులను నియమించాలని కోరారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరిగినందున కార్మికులు తక్కువ జీతాలతో తీవ్ర ఇబ్బందులు పడుతు న్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రం అసిస్టెంట్ కమిషనర్కు అందజేశారు. భీమవరం (ప్రకాశంచౌక్): క్రీడల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులను కలెక్టర్ సీహెచ్ నాగరాణి అభినందించారు. శాప్ లీగ్స్ –2026 బాక్సింగ్ పోటీల్లో జిల్లా నుంచి కే.శరణ్య(పెనుమంట్ర జెడ్పీ హై స్కూల్) 44 నుంచి 46 కేజీల కేటగిరీలో గోల్డ్ మెడల్ సాధించింది. కె.గిరి వెంకటస్వామి(వీరవాసరం జెడ్పీ స్కూల్) బాలుర విభాగంలో 49 నుంచి 52 కేజీల కేటగిరిలో రజత పతకం సాధించారు. సబ్ జూనియర్ బాక్సింగ్ పోటీల్లో 67 నుంచి 70 కేజీల విభాగంలో కె. రామ అంజలి బాలికల విభాగంలో బంగారు పతకం సాధించింది. వీరిని కలెక్టర్ ప్రశంసించారు. జీఎస్టీ వసూళ్లలో చొరవ చూపాలి కలెక్టర్ అధ్యక్షతన వాణిజ్య పన్నుల వసూళ్లలో చేపట్టాల్సిన చర్యలపై సోమవారం వాణిజ్య పన్నుల శాఖతో పాటు వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. జీఎస్టీ వసూళ్లు పెంచడం, పన్ను చెల్లింపుల పర్యవేక్షణ కట్టుదిట్టం చేయడం వంటి అంశాలపై సవివరంగా చర్చించారు. భీమవరం(ప్రకాశం చౌక్): పీజీఆర్ఎస్లో వచ్చిన ప్రతి అర్జీకి శాశ్వత పరిష్కారం చూపాలని కలెక్టర్ సి.నాగరాణి అన్నారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలలో పాల్గొని అర్జీలు స్వీకరించారు. సంబంధిత శాఖల అధికారులతో చర్చించి సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజల నుంచి స్వీకరించిన ప్రతి అర్జీని అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి నాణ్యమైన, శాశ్వత పరిష్కారం చూపాలని ఆదేశించారు. ప్రజల సమస్యల పరిష్కారంలో అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. ప్రతి అర్జీని నిర్ణీత గడువులోగా పరిష్కరించి, ఫిర్యాదుదారులు సంతృప్తి చెందేలా చర్యలు చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్రెడ్డి, డీఆర్వో బి,శివనారాయణ రెడ్డి, డ్వామా పీడీ కెసిహెచ్ అప్పారావు, జిల్లా పంచాయతీ అధికారి దోసిరెడ్డి పాల్గొన్నారు. ఫిర్యాదుల్లో కొన్ని ● పోలీసు కానిస్టేబుల్ సోమేశ్వరరావు వల్ల తనకు తన కుటుంబానికి ప్రాణ హాని ఉందని పెనుమంట్ర మండలం పొలమూరు గ్రామానికి చెందిన పార్సి ప్రభాకరరావు పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేశారు. ● తన భార్యపై దాడి జరిగిందని కేసు పెట్టడానికి వెళ్తే నర్సాపురం సీఐ తమ కేసు తీసుకొలేదని నర్సాపురం 4 వార్డుకు చెందిన సంగాని ఆనంద్కుమార్ సోమవారం ఫిర్యాదు చేశాడు. ఏలూరు (ఆర్ఆర్పేట): ఎయిడెడ్ పాఠ శాలలుగా పనిచేసి ప్రస్తుతం మండల పరిషత్ యాజమాన్యంలో విలీనం చేసిన ప్రాథమిక పాఠశాలలు, మోడల్ ప్రైమరీ పాఠశాలల నిర్వహణ నిధులు తక్షణమే మంజూరు చేసి విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ –1938 ఏలూరు జిల్లా నాయకులు సమగ్ర శిక్ష ప్రాజెక్టు కోఆర్డినేటర్ కే పంకజ్ కుమార్ను కోరారు. నాయకులు సోమవారం ఆయన్ను కలిశారు. -
కై కలూరులో సీరియల్ కిల్లర్
● ఒంటరి వృద్ధ మహిళలే లక్ష్యం ● ఆభరణాలు లాక్కొని హత్యలు ● పోలీసుల అదుపులో ప్రధాన నిందితుడు ● వ్యసనాలకు బానిసై ఘాతుకాలు కై కలూరు: వరుస హత్యలతో కై కలూరు ప్రజలకు కంటి మీద కునుకు కరువైంది. వ్యసనాలకు బాని సైన ఓ యువకుడు అతడి ఇంటి సమీపంలో వృద్ధులను లక్ష్యంగా చేసుకుని ఆభరణాలు కాజేయడంతోపాటు వారి ప్రాణాలను తీసేశాడు. హతమా ర్చిన తర్వాత ఏమీ ఎరుగనట్టు ప్రజల్లో కలిసిపోయి అయ్యో పాపం అంటూ ముసలి కన్నీరు కార్చాడు. చివరికి అతడి పాపం పండింది. పట్టపగలు ఓ వృద్ధురాలిని చంపేసి ఆభరణాలు తీసుకెళ్లిన సమయంలో ఓ వ్యక్తి చూడటంతో బండారం బయటపడింది. అలాగే కొద్దిరోజుల క్రితం మరణించిన ఓ వృద్ధురాలినీ ఇతడే చంపేశాడని ప్రాథమికంగా నిర్ధారణ అయ్యింది. వివరాల్లోకి వెళితే.. కై కలూరు పంచాయతీ 8వ వార్డు పాముల వీధిలో మార్పిన వెంకటలక్ష్మి (50) శనివారం సాయంత్రం విగతజీవిగా పడి ఉంది. చెవులు, ముక్కు నుంచి రక్తం కారి ఉంది. మూడు సవర్ల మంగళసూత్రం, చెవిదిద్దులు, రూ.10 వేలు వెరసి మొత్తం రూ.3.10 లక్షలు విలువైన సొత్తు చోరీ జరిగింది. ఇదే వార్డులో ఈనెల 3న ఒంటరిగా జీవిస్తున్న సోము ఆదిలక్ష్మి (80) శరీరం కుళ్లిన రీతిలో మంచంపై మరణించింది. గుండెపో టుతో మరణించిందని బంధువులు దహన సంస్కా రాలు చేశారు. ఆమె ముక్కు, చెవుల నుంచి కూడా రక్తం కారి ఉంది. మృతురాలి ఒంటిపై బంగారు ది ద్దులు, మూడు తులాల ఆంజనేయస్వామి లాకెట్ మాయమయ్యాయి. ఆమె ఇంట్లో ఎక్కడో పెట్టి ఉంటుందని భావించి బంధువులు వెతికి ఊరుకున్నారు. కిల్లర్ దొరికాడిలా.. కై కలూరు 8వ వార్డుకు చెందిన తుపాకుల ధ్రువంత్ (24) చెడు వ్యసనాలకు బానిసయ్యాడు. తాపీ పనులు, కేటరింగ్కు వెళ్లేవాడు. సంత మార్కెట్ సమీపంలో ఓ యువతిని ప్రేమించి పెళ్లిచేసుకున్నా డు. అతడికి ఇద్దరు సంతానం. భార్యతో గొడవపడి తండ్రి ఇంటి వద్ద ఉంటున్నాడు. శనివారం హత్యచేసిన వెంకటలక్ష్మి కుమారుడికి ఇతడు స్నేహితుడు. వెంకటలక్ష్మి కుమారుడు హైదరాబాద్లో ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. ఆ పరిచయంతో ఆమె ఇంటికి వెళ్లి హత్య చేసి ఆభరణాలతో ఉడాయించాడు. వీటిని కైకలూరులో విక్రయించి ఏలూరు రోడ్డు తాలింపు హోటల్లో మద్యం సేవించినట్టు తెలిసింది. వెంకటలక్ష్మి ఇంటి నుంచి ధ్రువంత్ బయటకు రావడం సమీప వ్యక్తి చూడటంతో అసలు విషయం బయటపడింది. ఇదిలా ఉంటే ఈనెల 3న మరణించిన వృద్ధురాలు ఆదిలక్ష్మిని మరొకరితో కలిసి హత్య చేసినట్టు పోలీసుల ఎదుట నిందితుడు నేరం అంగీకరించినట్టు సమాచారం. అలాగే ధ్రువంత్ పలు చోరీలకు పాల్పడినట్టు విచారణలో బయటపడింది. కై కలూరు స్టేషన్లో ఏలూరు డీఎస్పీ శ్రవణ్కుమార్, సీఐ ఏవీఎస్ రామకృష్ణ కేసును దర్యాప్తు చేస్తున్నారు. కిల్లర్ ధ్రువంత్ చిన్ననాటి నుంచి వ్యసనాలకు బానిస కావడంతో పాటు ఘర్షణలకు పాల్పడేవాడు. విలాసవంతమైన జీవితానికి అలవాటు పడ్డాడు. పనికి వెళ్లేవాడు కాదు. ఈజీ మనీ కోసం పన్నాగాలు వేసేవాడు. ఈనెల 3న వృద్ధురాలు ఆదిలక్ష్మి హత్యలో అతడితో పాటు కై కలూరు సిటీకేబుల్లో పనిచేసిన ఓ వ్యక్తి పాత్ర కూడా ఉందని భావిస్తున్నారు. కై కలూరు ప్రాంతంలో ఇటీవల కాలంలో పలువురు వృద్ధుల మరణాలు సంభవించాయి. ఈ కోణంలో ధ్రు వంత్ పాత్రపై అనుమానాలు బలపడుతోన్నా యి. అతడి సెల్ఫోన్ డేటాను సైతం పోలీసులు పరిశీలిస్తున్నారు. -
3.212 కేజీల బంగారం మాయం
జంగారెడ్డిగూడెం: జంగారెడ్డిగూడెం బ్యాంక్ ఆఫ్ బరోడా శాఖలో ఆదివారం కూడా బ్యాంకు అధికారులు ఖాతాలను పరిశీలించారు. శని, ఆదివారాలు సెలవు అయినప్పటికీ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బ్యాంకును తెరిచి ఖాతాదారులు కుదువ పెట్టిన బంగారం పరిశీలించారు. ఆదివారం పరిశీలనలో 47 ఖాతాదాలను పరిశీలించగా, ఒక ఖాతా మాత్రం తేడా వచ్చింది. ఆ ఖాతాలో 12 గ్రాముల బంగారం మాయమైనట్లు తేలింది. దీంతో ఇంతవరకు 3.212 కేజీల బంగారం మాయమైంది. బ్యాంకులో ఖాతాదారులు కుదువ పెట్టిన బంగారం ఖాతాలు 2756 ఉన్నట్లు తెలిసింది. ఇంతవరకు 1961 ఖాతాలను పరిశీలించారు. దీనిలో 1873 ఖాతాలకు సంబంధించి బంగారం సరిపోగా, 88 ఖాతాలకు మాత్రం మొత్తంగా 3.212 కేజీల బంగారం మాయమైంది. అసలు ఏం జరిగిందంటే...? బ్యాంకులో ఖాతాదారులు కుదువ పెట్టిన బంగారానికి సంబంధించి బంగారం మాయమైనట్లు చూచాయిగా బయటకు లీకై ంది. దీంతో ఈ నెల 2న అప్రైజర్ కలపాక రాజును బ్యాంకు అధికారులు పిలిపించి మాట్లాడారు. 2వ తేదీ పగలు బ్యాంకుకు వెళ్లిన రాజును మాయమైన బంగారంపై బ్యాంకు అధికారులు నిలదీసినట్లు తెలిసింది. దీంతో రాజు బ్యాంకు ఖాతాల్లో తాను తీసి వాడుకున్న బంగారానికి సంబంధించి ఎంతైతే వాడుకున్నాడో అంతా ఇచ్చేసినట్లు సమాచారం. అయితే బ్యాంకు అధికారులు 2వ తేదీ అర్ధరాత్రి వరకు రాజును కూర్చోబెట్టి అతనితో మిగిలిన బంగారానికి కూడా రాజే బాధ్యుడని రాయించుకుని పంపినట్లు తెలిసింది. దీంతో కంగారుపడిన రాజు 3వ తేదీ ఉదయం రాజు, అతని తల్లిదండ్రులతో జంగారెడ్డిగూడెం వదిలి వెళ్లిపోయినట్లు తెలిసింది. భార్య, పిల్లలు పుట్టింటికి వెళ్లినట్లు తెలిసింది. సోదరుడి కుటుంబం జంగారెడ్డిగూడెంలో ఉన్నట్లు సమాచారం. కుటుంబసభ్యులను కూడా తాను ఫలానా చోట ఉన్నాను రమ్మని రప్పించుకున్నట్లు తెలిసింది. వారు వెళ్ళిన తరువాత వారితో కొద్దిసేపు మాట్లాడి తిరిగి వెళ్ళిపోయినట్లు తెలిసింది. అప్పటి నుంచి రాజు కనిపించడం లేదు. రాజు తన కుటుంబసభ్యులతో తాను వాడుకున్న బంగారం బ్యాంకులో జమ చేశానని, మిగిలిన బంగారం గురించి తనకు తెలియదని చెప్పినట్లు సమాచారం. అప్పటి నుంచి రాజు సెల్ఫోన్ పనిచేయకపోగా, ఇంతవరకు ఆచూకీ లభించలేదు. ఈ నెల 6న ముగ్గురు ఖాతాదారులు తమ ఖాతాలను పరిశీలించేందుకు రాగా, అదే రోజున 240 గ్రాములు మాయమైనట్లు గుర్తించారు. అసలు బంగారం అంతా ఏమైంది...? బ్యాంకు ఆఫ్ బరోడాలో ఆదివారం వరకు మాయమైన 3.212 కేజీల బంగారం అసలు ఏమైంది. బంగారం బయటకు వెళ్ళడంలో రాజుతో పాటు మిగిలిన అధికారులు, కస్టోడియన్ల పాత్ర ఎంత అనేది తేలాల్సి ఉంది. లాకర్లో భద్రపరిచిన బంగారం బయటకు రావాలంటే ఒక్క అప్రయిజర్ వల్ల సాధ్యమేనా అనే ప్రశ్న తలెత్తుతోంది. పెద్ద వస్తువులైన వడ్డాణం, హారాలు, బిస్కెట్లు కూడా మాయమయ్యాయి. కుదువ పెట్టినా, లేక కరిగించి అమ్మివేసి ఉన్నా లేక ఆభరణాలు కింద అమ్మేసినా రికవరీ అయ్యే అవకాశం ఉంది. ఆదివారం కూడా కొనసాగిన ఖాతాల పరిశీలన -
పరిశ్రమల్లో ప్రమాదాలు అరికట్టాలి
ఏలూరు (టూటౌన్): పారిశ్రామిక రంగాల్లో ప్ర మాదాలను అరికట్టాలని, భద్రతా తనిఖీల విధానాన్ని కఠినంగా కొనసాగించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఐఎఫ్టీయు (ఇఫ్టూ) జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. ఇఫ్టూ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా కమిటీ సమావేశాన్ని ఆదివారం ఏలూరులో నిర్వహించారు. ఉమ్మడి జి ల్లా అధ్యక్షుడు కేవీ రమణ, జిల్లా ప్రధాన కార్యదర్శి బద్దా వెంకట్రావు మాట్లాడుతూ నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని, అత్యున్నత న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పుల ప్రకారం ఔ ట్సోర్సింగ్, కాంట్రాక్ట్ కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రమాదాలను అరికట్టేలా పరిశ్రమల్లో రెగ్యులర్ సేఫ్టీ చెకప్ విధానాన్ని కఠినంగా అమలు చేయాలని, భద్రతా నిబంధనలు పాటించని యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భవన ఇతర నిర్మాణ కార్మిక సంఘం సంక్షేమ బోర్డు ద్వారా పథకాలు అందించాలని కోరారు. ఇఫ్టూ జిల్లా ఆఫీస్ బేరర్స్ బి.సో మయ్య, ఎర్ర శ్రీనివాసరావు, ఈమని గ్రేష్మకుమార్, దానవరప్రసాద్, ఎం.నాగరాజు తదితరులు పాల్గొన్నారు. దెందులూరు: పెదవేగి మండలం రాట్నాలకుంటలో రాట్నాలమ్మవారి ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. ఆలయంలో ఉన్న చెట్టుకు ఆరోగ్యం, విద్య, ఉద్యోగం, వ్యాపారం, వివాహం, ఐశ్వర్యం కోసం ము డుపులు కట్టారు. అమ్మవారిని దర్శించి పూ జలు చేయించారు. ఆలయానికి పలు రూ పాల్లో రూ. 98,707 ఆదాయం వచ్చినట్టు ఆలయ కమిటీ చైర్మన్ మన్నే శ్రీనివాసరావు, ఈఓ ఎం.సతీష్కుమార్, జూనియర్ అసిస్టెంట్ విడుదల సత్యనారాయణ తెలిపారు. భీమవరం (ప్రకాశంచౌక్): ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమం సో మవారం జిల్లా కలెక్టరేట్తో పాటు డివిజన్, మండల కేంద్రాల్లో నిర్వహించనున్నట్టు కలెక్టర్ సీహెచ్ నాగరాణి తెలిపారు. అలాగే రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం రెవెన్యూ క్లినిక్ కార్యక్రమం కూడా నిర్వహిస్తామన్నారు. ప్రజ లు ఆన్లైన్లోనూ అర్జీలు నమోదు చేసుకోవచ్చని, టోల్ఫ్రీ నంబర్ 1100ను సంప్రదించవచ్చని ఆమె సూచించారు. ఏలూరు టౌన్: ఏలూరు జిల్లా ఏఆర్ హెచ్సీగా పనిచేస్తూ ప్రమాదవశాత్తూ మృతిచెందిన ఎ. భాస్కరరావు కుటుంబానికి పోలీస్ శాఖ అండగా నిలిచింది. ఏలూరు ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ ఆదేశాలతో ఏలూరు జిల్లా పోలీస్ అధికారుల సంఘం బాధిత కుటుంబానికి భరోసా కల్పించింది. డిసీజ్డ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఫండ్ నుంచి రూ.లక్ష చెక్కును పోలీస్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు ఆర్.నాగేశ్వరరావు, నాయకులు ఏఆర్ ఎస్సై ఎం.వెంకటేశ్వరరావు కమిటీ నేతలు మృతుడు భాస్కరరావు భార్య ఝాన్సీ లక్ష్మీకి అందజేశారు. ఏఆర్ ఎస్సై శ్రీనివాసరావు, ఏఆర్ హెచ్సీ రమేష్కుమార్, ఏఆర్ కానిస్టేబుల్ నాగేశ్వరరావు, రిటైర్డ్ ఆర్ఎస్ఐ ఎం.సత్యనారాయణ, ఏఆర్ ఎస్సై సుగుణరావు, హెచ్సీ రామకృష్ణ ఉన్నారు. ఏలూరు (ఆర్ఆర్పేట): ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం (ఓపెన్ స్కూల్) ఆధ్వర్యంలో 10వ తరగతి, ఇంటర్మీడియెట్ కోర్సుల్లో ప్రవే శాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు డీఈఓ ఎం.వెంకటలక్ష్మమ్మ తెలిపారు. 2026–27 వి ద్యా సంవత్సరంలో 10వ తరగతి ప్రవేశాలకు ఆగస్టు 31 నాటికి 14 ఏళ్లు, ఇంటర్లో ప్రవేశాలకు 10వ తరగతి ఉత్తీర్ణులై, ఆగస్టు 31లోపు 15 ఏళ్లు నిండి ఉన్నవారు అర్హులన్నారు. ఆయా కోర్సుల్లో ప్రవేశాలకు ఆన్లైన్ ద్వారా జూలై 30 వరకూ దరఖాస్తు చేసుకోవచ్చని, అదే నెల 31 వరకూ ఫీజులు చెల్లించవచ్చన్నారు. గడువు లోపు ఫీజులు చెల్లించలేని వారు రూ.200 అపరాధ రుసుంతో ఆగస్టు 1 నుంచి 15 లోపు ఫీజులు చెల్లించవచ్చని పేర్కొన్నారు. -
నేవీ డిపో రద్దుతో పూజలు
కొయ్యలగూడెం: నేవీ ఆయుధ డిపో నిర్మాణ ప్రతిపాదన రద్దు కావడంతో పోలవరం, గోపాలపురం నియోజకవర్గాల్లోని పలు గ్రామాల ప్రజలు ఆదివారం పూజలు నిర్వహించారు. గ్రామ దేవతల ఆలయాలలో నైవేద్యాలు సమర్పించారు. వేలాది మంది రైతుల గోడు తమ గ్రామ దేవతలు విని ఆయుధ డిపో రద్దయ్యేలా అనుగ్రహించారని మహిళలు సంతోషం వ్యక్తం చేశారు. ఊట్లగూడెం సమీపంలోని కొవ్వాడమ్మ ఆలయం వద్ద అదే విధంగా బోడిగూడెం, మంగపతిదేవిపేట, బర్కెట్ నగర్, రేగులగుంట తదితర గ్రామాలలో గ్రామస్తులు పూజలు చేపట్టడంతో ఆధ్యాత్మిక శోభ నెలకొంది. ద్వారకాతిరుమల: శ్రీవారి ఆలయానికి దత్తత దేవాలయమైన ఐఎస్ జగన్నాథపురంలోని సుందరగిరిపై కొలువైన శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో ఆదివారం విశేష పూజలు జరిగాయి. చతుర్ధశి తిధిని పురస్కరించుకుని అర్చకులు ఆలయ గర్భాలయంలోని స్వామివారి మూలవిరాట్్కు విశేష అభిషేకాలు, పూజలు నిర్వహించారు. అలాగే హోమాది కార్యక్రమాలు జరిపారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్ఛరణల నడుమ నారసింహునికి మహా నివేదనను సమర్పించారు. అధిక సంఖ్యలో భక్తులు స్వామి, అమ్మవార్లను దర్శించి, తీర్ధప్రసాదాలను స్వీకరించారు. బుట్టాయగూడెం: బుట్టాయగూడెం మండలం కామవరం సమీపంలో అటవీ ప్రాంతంలో కొలువై ఉన్న గుబ్బల మంగమ్మ గుడికి ఆదివారం భక్తులు పోటెత్తారు. ద్విచక్ర వాహనాలు, ఆటోలు, ప్రత్యేక బస్సుల్లో తెల్లవారుజాము నుంచే భక్తులు అమ్మవారి సన్నిధికి చేరుకున్నారు. అనంతరం ధూప దీప నైవేద్యాలతో అమ్మవారికి పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయ కమిటీ వారితోపాటు పోలీసులు కూడా బందోబస్తు నిర్వహించారు. పెనుగొండ: ఆర్యవైశ్యులకు కూటమి ప్రభుత్వంలో అన్యాయం జరిగిందని ఆర్యవైశ్యుల ఆత్మీయ సమావేశంలో పలువురు ప్రస్తావించారని వైఎస్సార్ సీపీ వాణిజ్య విభాగం నియోజకవర్గ కన్వీనరు నంబూరి రాజేంద్ర ప్రసాద్(రాజా) తెలిపారు. ఆదివారం వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో తాడేపల్లిలో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఆర్యవైశ్యుల ఆత్మీయ సమావేశంలో మాజీ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు సూచనతో పాల్గొన్నట్లు తెలిపారు. ఆర్యవైశ్యులు ఎదుర్కొంటున్న సమస్యలు, ట్రస్ట్ బోర్డుల నియామకాల్లో ఆర్యవైశ్యులకు జరిగిన అన్యాయంపై చర్చ జరిగిందని వివరించారు. ద్వారకాతిరుమల: శ్రీవారి విమానగోపుర స్వర్ణమయ పథకానికి ఓ భక్తుడు రూ.1,00,000 విరాళంగా అందజేశారు. సామర్లకోటకు చెందిన దాత జె.రామలక్ష్మణులు ముందుగా కుటుంబ సమేతంగా స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. అనంతరం ఈ విరాళాన్ని ఆలయ కార్యాలయంలో జమ చేశారు. -
● తూడు.. రైతులతో చెడుగుడు
కాళ్ల మండలంలో మురుగు కాలువలు తూడు, గుర్రపుడెక్క, కిక్కసతో నిండిపోయాయి. వేసవిలో ప్రక్షాళన పనులు చేపట్టకపోవడంతో వేలాది ఎకరాల పొలాలకు ముంపు పొంచి ఉంది. భారీ వర్షాల కురిస్తే చేలల్లోని ముంపు నీరు బయటకు వెళ్లేందుకు ఇబ్బందులు తప్పవని రైతులు ఆందోళన చెందుతున్నారు. మురుగు కాలువల్లో తూడుతో నీటి ప్రవాహం మందగించి పొలాలు ముంపు నుంచే బయటపడటం కష్టమని అంటున్నారు. మండలంలో ప్రధానంగా సీసలి వద్ద మొగదిండి మురుగు కాలువ కింద భాగంలో బాగు చేసినా ప్రారంభంలో ప్రక్షాళన పనులు చేయకపోవడంతో గుర్రపుడెక్క మేట వేసింది. అలాగే ప్రధానమైన రుద్రయ్యకోడు మురుగు కాలువ అభివృద్ధి పనులు ప్రారంభంలో చేసినా దొడ్డనపూడి గ్రామం నుంచి చేపట్టకపోవడంతో కిక్కిస, తూడు పేరుకుపోయి శివారు ప్రాంతంలో కాలువ అడవిని తలపిస్తుంది. ఇదిలా ఉండగా పూర్తిస్థాయిలో కాలువ పనులకు ప్రతిపాదనలు చేశామని, నిధులు మంజూరైతే ప్రారంభిస్తామని అధికారులు అంటున్నారు. –కాళ్ల -
విత్తన ఎంపికే కీలకం
దాళ్వా సాగులో బిజీగా రైతులుగణపవరం: సార్వా సాగుకు రైతులు సమాయత్తమవుతున్నారు. దాళ్వా సాగు కలిసిరావడంతో ఆనందంగా సార్వా సాగుకు రెడీ అవుతున్నారు. గణపవరం, నిడమర్రు మండలాలలో పంట కాల్వలకు దగ్గరగా ఉన్న భూములలో ఇప్పటికే నారుమడులు వేయగా, ఉంగుటూరు, భీమడోలు మండలాల్లోని మెట్ట ప్రాంతంలో బోర్ల కింద సాగయ్యే భూములలో నారుమడులు పూర్తి చేశారు. మిగిలిన భూములలో ఇప్పుడిప్పుడే నారుమడుల తయారీ, విత్తనాలు చల్లుకోవడం వంటి పనుల్లో రైతులు నిమగ్నమయ్యారు. విత్తన నాణ్యతే కీలకం వరి సాగులో నాణ్యమైన అధిక దిగుబడులు సాధించాలంటే మంచి విత్తనాలను ఎంపిక చేసుకోవాలి. సాగులో నారుమడి దశ చాలా కీలకం. ఈ సమయంలో సరైన విత్తనాలను ఎంపిక చేసుకుంటే చక్కని ఫలితాలు సాధించే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో ఆయా ప్రాంతాల వాతావరణ పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవాలి. పండించే పంటను బట్టి సమీప వ్యవసాయ పరిశోధనా కేంద్రం, కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలను సంప్రదించాలి. ఆ అవకాశం లేకుంటే డివిజన్, మండల కేంద్రాల్లోని స్థానిక వ్యవసాయ అధికారులను సంప్రదించి విత్తనాల కొనుగోలుపై వారి సలహాలు తీసుకోవాలి. రైతులే స్వయంగా విత్తనాలను తయారు చేసుకుంటే వాటి మొలక శాతాన్ని పరీక్షించాలి. పంటల సాగులో సరైన విత్తనాలను వినియోగించకపోతే మొలకల శాతం తగ్గి, దిగుబడులు పడిపోయే ప్రమాదం ఉంటుంది. అంతేకాక ఒక్కోసారి తెగుళ్లు, చీడపీడలు ఎక్కువగా ఆశించి రైతులు నష్టపోయే పరిస్థితులు ఉంటాయి. ఈ నేపథ్యంలో రైతులు వ్యవసాయ నిపుణులు సూచించిన విత్తనాలను మాత్రమే ఉపయోగించాలి. విత్తన రకాలు బ్రీడర్ సీడ్ : పంటలో అన్ని రకాల విత్తనాలకు మూలంగా బ్రీడర్ సీడ్ను పరిగణిస్తారు. వరి విత్తనోత్పత్తి పరిశోధనా కేంద్రాలలో శాస్త్రవేత్తల పర్యవేక్షణలో వీటిని ఉత్పత్తి చేస్తారు. ఈ విత్తనాలలో జన్యు స్వచ్ఛత 100 శాతం ఉంటుంది. ఈ విత్తనాల ప్యాకెట్లకు పసుపు రంగు ట్యాగులు ఉంటాయి. సీడ్ : బ్రీడర్ సీడ్ నుంచి ఫౌండేషన్ విత్తనాలను ఉత్పత్తి చేస్తారు. రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో వ్యవసాయ శాస్త్రవేత్తల పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ విత్తనాలు కూడా 100 శాతం జన్యు స్వచ్ఛత కలిగి ఉంటాయి. ఈ విత్తనాల సంచులకు తెలుపు రంగు ట్యాగులు ఉంటాయి. çÜÇ-t-OòœyŠæ-ಸರ-್-ಟ-ಿ-ಫೈ-ಡ್ ïÜyŠæ: వ్యవసాయ శాఖ అధికారుల స్వీయ పర్యవేక్షణలో ఫౌండేషన్ విత్తనాల నుంచి రైతులే సొంతంగా తమ పొలాలలో ఈ విత్తనాలను తయారు చేసుకుంటారు. వీటిని వ్యవసాయ శాఖ ప్రయోగశాలల్లో పరీక్షించిన తర్వాత, నిర్దేశించిన ప్రమాణాలు కలిగి ఉంటే వ్యవసాయ శాఖ సీడ్ సర్టిఫికేషన్ ధ్రువీకరణ పత్రం మంజూరు చేస్తుంది. ఈ విత్తనాల సంచులకు నీలి రంగు ట్యాగులు వేస్తారు. రైతుల విత్తనాలు: ఇవేమీ లేకుండా ఎక్కువగా రైతులే తాము స్వయంగా పండించిన విత్తనాలను ఇతర రైతులకు మార్కెట్లో విత్తనాల ధర కన్నా తక్కువ ధరలకే విక్రయిస్తుంటారు. అధిక శాతం రైతులు వీటిపైనే ఆధారపడుతుంటారు. ఈ విత్తనాల నాణ్యతపై అధికారిక భరోసా అంటూ ఏమీ ఉండదు. కానీ, ఈ రైతుల స్థాయిలో పండించిన విత్తనాల వల్ల రైతులు నష్టపోయిన సందర్భాలు అతి తక్కువనే చెప్పవచ్చు. మొలక శాతం పరీక్ష కీలకం: రైతులు విత్తనాలను విత్తుకునే ముందు విత్తనాల నాణ్యత తెలుసుకోవడానికి తప్పనిసరిగా విత్తనాల మొలక శాతాన్ని పరీక్షించుకోవాలి. వినియోగించే విత్తనాలలో కొన్నింటిని గ్లాసులో వేసి నీరు పోసి, 24 గంటల తర్వాత గుడ్డలో మూటకట్టాలి. వీటిలో 80 శాతం మొలకలు వస్తేనే ఆ విత్తనాలను నారుమడిలో చల్లుకోవాలి. శుద్ధి తప్పనిసరి: మొలక శాతం సంతృప్తికరంగా ఉంటే విత్తనాలను చల్లుకునే ముందు విత్తన శుద్ధి చేసుకోవాలి. దీని కోసం ఒక కిలో విత్తనాలకు 3 గ్రాముల కార్బండిజం కలిపి రెండు రోజులు ఒక సంచిలో నిల్వ ఉంచాలి. అనంతరం ఆ విత్తనాలను వదులుగా ఉండేలా ఒక సంచిలో వేసి, ఒక రోజు నీటిలో నానబెట్టాలి. ఆ తర్వాత బయటకు తీసి మరో రోజు గాలి తగలని (వెచ్చని) ప్రదేశంలో ఉంచాలి. యాజమాన్యం: ముందుగా సిద్దం చేసుకున్న నారుమడిలో ఒక సెంటు నారుమడిలో 5 కిలోల చొప్పున శుద్దిచేసిన విత్తనాలను సమానంగా చల్లుకోవాలి. నారుమడిలో నత్రజని వేసిన 12 నుంచి 16 రోజుల మధ్య పొటాషియం, భాస్వరం ఎరువులు చల్లుకోవాలి. నారుమడి వేసిన 25 రోజుల తర్వాత పొలంలో నాటుకోవాలి. మొలకలు రాకుంటే నష్టపరిహారం: నారుమడి వేసిన పదిరోజుల వ్యవధిలో విత్తనాలనుంచి మొలకలు రాకపోతే సత్వరమే వ్యవసాయ శాఖకు ఫిర్యాదు చేయాలి. డివిజన్ వ్యవసాయశాఖ సహాయ సంచాలకుల ద్వారా జిల్లా విత్తన కమిటీకి ఫిర్యాదు అందేలా చూడాలి. ఒకవేళ విత్తనాలలో లోపాలు ఉండి నారుమడి దెబ్బతింటే సంబంధిత అధీకృత డీలరు, కంపెనీ నుంచి నష్టపరిహారం పొందే వీలు ఉంటుంది. ఇందుకు సంబంధించిన బిల్లులు, విత్తనాల సంచి, ట్యాగ్ తదితర ఆధారాలను రైతులు తమవద్ద ఉంచుకోవాలి విత్తనాల కొనుగోలులో తీసుకోవాల్సిన జాగ్రత్తల్ని గణపవరం ఏవో ఆర్ఎస్ ప్రసాద్ వివరించారు. ● రైతులు ప్రభుత్వ గుర్తింపు ఉన్న విత్తన అధీకృత డీలర్ల వద్దనే విత్తనాలు కొనుగోలు చేయాలి. విత్తనాల బరువును నిర్ధారించుకోవాలి. ● విత్తనాలు కొన్న డీలర్వద్ద రసీదు తీసుకోవాలి. పంట నష్టం జరిగితే బిల్లు సమర్పించి పరిహారం పొందే అవకాశం ఉంటుంది. ● విత్తనాలను ఇంటికి తీసుకెళ్లాక మొలక శాతాన్ని పరీక్షించి, సంతృప్తిగా ఉంటేనే విత్తనాలు చల్లుకోవాలి. ● విత్తనాల రసీదును పంటకాలం పూర్తయ్యే వరకూ భద్రపర్చుకోవాలి. ● సీల్ తీసిన సంచులు, మూతలు తీసిన డబ్బాలు, పగిలిన ప్యాకెట్లలో విత్తనాలు తీసుకోవద్దు. -
పెద్దింట్లమ్మా.. దీవెనలు అందించమ్మా
కై కలూరు: కొల్లేటికోట పెద్దింట్లమ్మ నీ ఆశీస్సులు మాకు అందించమ్మా.. అంటూ భక్తులు ఆర్తితో వేడుకున్నారు భక్తులతో కొల్లేటికోట పెద్దింట్లమ్మ దేవస్థానం ఆదివారం కిటకిటలాడింది. సమీప జిల్లాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో కూచిపూడి శ్రీనివాసు మాట్లాడుతూ ఒక్క ఆదివారం మాత్రమే ప్రత్యేక, అంతరాలయ దర్శనాలు, కేశఖండన, పెద్ద, చిన్న తీర్ధాలు, లడ్డూ ప్రసాదం, గదుల అద్దెలు, అమ్మవారి చిత్రపటాలు విక్రయం, వాహన పూజలు, విరాళాల ద్వారా రూ.1,05,567 ఆదాయం వచ్చిందని చెప్పారు. భక్తులకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. వేలేరుపాడు: మండలంలోని రుద్రంకోట సమీపంలో ఆదివారం విషాద సంఘటన చోటుచేసుకుంది. గోదావరిలో స్నానానికి దిగిన కంతిరెడ్డి రాంబాబు (25) ప్రమాదవశాత్తు గల్లంతయ్యాడు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న వేలేరుపాడు పోలీసులు రంగంలోకి దిగారు. అధికారులు స్థానికుల సహకారంతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, నదిలో గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. రాంబాబు గల్లంతుంతో గ్రామంలో ఒక్కసారిగా విషాదచాయలు అలముకున్నాయి. రాంబాబు వైఎస్సార్సీపీ కార్యకర్త. ఈ ప్రమాద వార్త తెలియడంతో పార్టీ శ్రేణులు దిగ్భ్రాంతికి లోనయ్యాయి. రాంబాబు ఉదంతంపై వేలేరుపాడు మండల వైఎస్సార్సీపీ కన్వీనర్ కేశగాని శ్రీనివాస్ గౌడ్, నియోజకవర్గ రైతు విభాగం అధ్యక్షుడు కామినేని వెంకటేశ్వరరావు, మండల ఉపాధ్యక్షుడు గుద్దేటి భాస్కర్లు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. -
రక్తదానంపై అవగాహన పెరగాలి
ఏలూరు (ఆర్ఆర్పేట): ప్రజల్లో రక్తదానంపై మరింత అవగాహన పెరగాలని, ఆరోగ్యవంతులైన 18 నుంచి 65 ఏళ్ల వయసున్న ప్రతిఒక్కరూ క్రమం తప్పకుండా స్వచ్ఛందంగా రక్తదానం చేయాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి సౌరభ్గౌర్ పిలుపునిచ్చారు. ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రశాఖ ఆధ్వర్యంలో ఆదివారం ఏలూరులోని సీఆర్ రెడ్డి డిగ్రీ కళాశాల కళ్యాణ చక్రవర్తి ఆడిటోరియంలో రాష్ట్రస్థాయి అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన సౌరభ్ గౌర్ మా ట్లాడుతూ... రక్తాన్ని కృత్రిమంగా తయారు చేయలేమని, దానికి ప్రత్యామ్నాయం లేదని అన్నారు. సకాలంలో రక్తం అందడం వల్లే ఎందరో ప్రాణాలు రక్షించబడుతున్నాయని, ముఖ్యంగా యువత పెద్ద సంఖ్యలో రక్తదాన కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరారు. సురక్షిత రక్తసరఫరా వ్యవస్థను బలోపేతం చేయడంలో రెడ్క్రాస్ సొసైటీ పాత్ర అభినందనీయమన్నారు. రక్తదానంతో పాటు అవయవదానంపై కూడా ప్రజలు అవగాహన కలిగి ఉండాలని సూచించారు. గౌరవ అతిథిగా పాల్గొన్న జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ మాట్లాడుతూ.. ఏలూరు జిల్లా రెడ్క్రాస్ సేవలను కొనియాడారు. కార్యక్రమానికి అ ధ్యక్షత వహించిన రెడ్క్రాస్ రాష్ట్ర శాఖ చైర్మన్ వైడీ రామారావు, ప్రధాన కార్యదర్శి ఏకే పరిడా మాట్లాడారు. ఈ సందర్భంగా ఉత్తమ రక్త కేంద్రాలు, అత్యధికంగా శిబిరాలు నిర్వహించిన సంస్థలు, విశిష్ట సేవలు అందించిన దాతలు, విద్యాసంస్థలకు రాష్ట్రస్థాయి అవార్డులు ప్రదానం చేసి సత్కరించారు. రెడ్క్రాస్ ప్రతినిధులు పాల్గొన్నారు. -
పాపికొండల విహారానికి ఆటుబోట్లు
బుట్టాయగూడెం: గోదావరి అందాలు, పాపికొండల ప్రకృతి సోయగాలను ఆస్వాదించేందుకు ప్రతి వారాంతరంలో అధిక సంఖ్యలో పర్యాటకులు దేవీపట్నం, రాజమండ్రి పరిసర ప్రాంతాలకు తరలి వస్తుంటారు. దేవీపట్నం, గండిపోచమ్మ అమ్మవారి గుడి వద్ద ఏర్పాటు చేసిన రోడ్డు పాయింట్ నుంచి పాపికొండల విహారయాత్రకు బయల్దేరి వెళ్తుంటారు. అయితే ఈసారి పాపికొండల విహారయాత్రకు వెళ్లాలని భావిస్తున్న వారందరికీ అధికారులు కీలక హెచ్చరికలు జారీ చేశారు. దీంతో పాపికొండల పర్యాటక బోటు ప్రయాణాలు ఆదివారం తా త్కాలికంగా నిలిచిపోయాయి. శుక్రవారం గండిపోచమ్మ బోటు పాయింట్ నుంచి రెండు బోట్లలో పర్యాటకులు పాపికొండల అందాలను వీక్షించేందుకు 89 మంది ప్రయాణికులతో బయలుదేరగా.. బోటు దేవీపట్నం పాత పోలీస్స్టేషన్ సమీపానికి వెళ్లే సరికి సాంకేతికలోపం తలెత్తడంతో గోదావరి నడి మధ్యలోనే నిలిచిపోయింది. ఆ సమయంలో ప్రయాణికులు కేకలు పెట్టారు. అప్రమత్తమైన డ్రైవర్ వెంటనే కంట్రోల్రూమ్ అధికారులకు, బోటు యజమానులకు సమాచారం అందించారు. దీంతో నిర్వాహకులు మరో బోటును ఏర్పాటు చేసి ప్రయాణిలను సురక్షితంగా పంపించారు. అయితే ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటనపై పర్యాటకశాఖ అధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫిట్నెస్ ఉంటేనే.. పాపికొండల పర్యాటక బోట్ల నిర్వహణ, భద్రతపై ఆరోపణలు రావడంతో బోటు ప్రయాణాన్ని నిలిపివేసిన అధికారులు తనిఖీలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారుల ఆదేశాలతో ఒక ఏపీ టూరిజం, 15 ప్రైవేటు బోట్లు నిలిచిపోయాయి. బోట్ల నిర్వహణ, భద్రతను పరిశీలించిన తర్వాత ఫిట్నెస్గా ఉన్నట్టు ధ్రువీకరణ పత్రాలు జారీ చేస్తారు. అనంతరమే పాపికొండల పర్యాటకానికి అనుమతులు ఇస్తామని అధికారులు చెబుతున్నారు. అయితే బోట్ల తనిఖీలు, భద్రతా ఏర్పాట్లు పూర్తయ్యాకే బోటు ప్రయాణాలు ప్రారంభమవుతాయని, అప్పటివరకూ పర్యాటకులు తమ ప్రయా ణాలను వాయిదా వేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. గోదావరిపై బోటు ప్రయాణానికి తాత్కాలిక బ్రేక్ పర్యాటక బోట్ల నిర్వహణ, భద్రతపై తనిఖీలు 15 ప్రైవేట్, ఒక టూరిజం శాఖ బోట్ల నిలిపివేత -
హాస్టళ్ల నిర్వహణపై శ్రద్ధ పెట్టాలి
పెనుగొండ: ప్రభుత్వ హాస్టళ్ల నిర్వహణలో మౌలిక వసతులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని జాయింట్ కలెక్టర్ టి.రాహుల్కుమార్రెడ్డి ఆదేశించారు. ఆదివారం పెనుగొండలోని బీసీ బాలికల వసతి గృహా న్ని ఆయన తనిఖీ చేసి విద్యార్థుల హాజరు, వంటశాల, వంట సామగ్రి, తాగునీరు, పారిశుద్ధ్య నిర్వహణ, భవన మరమ్మతులపై ఆరా తీశారు. వసతి గృహాల్లో నూరు శాతం అడ్మిషన్లు జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎరువులు అందుబాటులో ఉంచాలి రైతులకు ఎరువులు ఎప్పటికప్పుడు అందుబాటు లో ఉంచాలని జేసీ ఆదేశించారు. దేవ సొసైటీలో ఆ న్లైన్ ఆధారిత ఎరువుల విక్రయాలను పరిశీలించా రు. ఆన్లైన్ అమలులో ఎదురవుతున్న సాంకేతిక స మస్యలను అడిగి తెలుసుకున్నారు. యూరియాను వ్యవసాయేతర అవసరాల విక్రయాల నుంచి నివారించడం, పారదర్శకమైన ఎరువుల విక్రయ వి ధానం కోసం ఆన్లైన్ ఏర్పాటు చేసినట్టు చెప్పారు. రైతులు కొత్త విధానాన్ని అలవాటు చేసుకోవాలన్నా రు. ఆర్డీఓ దాసి రాజు, జిల్లా బీసీ సంక్షేమశాఖ అ ధికారి ఏవీ సూరిబాబు, తహసీల్దార్ జి.అనితకుమారి, వ్యవసాయాధికారి జెడ్.వెంకటేశ్వరరావు, వ్యవసాయ సంచాలకుడు రాఘవేంద్రరావు, దేవ సొసైటీ అధ్యక్షుడు జుత్తిగ ఆంజనేయులు ఉన్నారు. -
ఇంటర్ చదువుకొనేదెలా!
సోమవారం శ్రీ 15 శ్రీ జూన్ శ్రీ 2026భీమవరం: విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన మొదలైంది. కళాశాల ఫీజులు, యూనిఫాం, పుస్తకాలు, బస్ ఫీజులు వంటివి తడిసిమోపెడవడంతో ఎలా చదివించాలని తలలు పట్టుకుంటున్నారు. విద్య వ్యాపారంగా మారడంతో ఏటా నూతన విద్యాసంస్థలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. భవన నిర్మాణాలు, ప్రభుత్వ అనుమతులు లేకుండానే రూ.లక్షల ఫీజులు వసూలు చేస్తూ అడ్మిషన్స్ నిర్వహించడం గమనార్హం. పశ్చిమగోదావరి జిల్లాలో 15 ప్రభుత్వ, రెండు ఎయిడెడ్, రెండు సోషల్ వె ల్ఫేర్, సుమారు 85 ప్రైవేట్ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. ప్రస్తుత విద్యాసంవత్సరం మరిన్ని వి ద్యాసంస్థలు పుట్టుకొచ్చాయి. ప్రైవేట్ కాలేజీల్లో త గిన వసతులు, ఆటస్థలాలు లేకపోయినా భారీ మొ త్తంలో మాత్రం ఫీజులు వసూలు చేస్తున్నా రు. ఫీజుల మోత.. తల్లిదండ్రుల వెత : జిల్లాలోని ప్రైవేట్ కళాశాలల్లో ఫీజులు పలు రకాలుగా ఉన్నాయి. కళా శాలకు ఉన్న పేరును బట్టి ఫీజులు వసూలు చేస్తున్నారు. భీమవరం, పాలకొల్లు, నరసాపురం, తణు కు, తాడేపల్లిగూడెం వంటి పట్టణాల్లో పేరున్న కళా శాలలు ఏడాదికి ఫీజు రూపంలో రూ.90 వేల నుంచి రూ.1.50 లక్షల వరకు వసూలు చేస్తున్నాయి. అలాగే హాస్టల్కు రూ.లక్ష, బస్ చార్జీలు దూరాన్ని బట్టి రూ.30 వేలు, బుక్స్కు రూ.18 వేలు, యూనిఫామ్ రెండు జతలకు రూ.5 వేలు తీసుకుంటున్నారు. గ్రా మీణ ప్రాంతాల్లోని కళాశాలల్లో ఫీజు రూ.60 వేలు, బస్ ఫీజు రూ.18 వేలు, యూనిఫామ్ రూ.2,500, బుక్స్కు రూ.12 వేల వరకు వసూళ్లు చేస్తున్నారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు పిల్లలను చదివించేందుకు అప్పులు చేయాల్సి వస్తోంది. ఫీజుల దోపిడీతో పాటు సెలవు రోజుల్లో సైతం తరగతులు నిర్వహించడం, గైర్హాజరైతే ఫైన్లు, వారానికి ఒక్క రోజు కూడా క్రీడలకు అనుమతించకపోవడం ప్రై వేట్ కాలేజీల్లో ప్రత్యేకం. విద్యాసంవత్సరం ప్రారంభమైనందును ప్రైవేట్ విద్యాసంస్థలు ప్రభుత్వ నిబంధలను పాటించకపోతే చర్యలు తప్పవు. అధిక ఫీజు లు వసూళ్లు చేసినా, సెలవు దినాల్లో తరగతు లు నిర్వహించినా చర్యలుంటాయి. తమ పిల్లలను చేర్చే విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ప్రైవేట్ కళాశాలల గురించి పూర్తిగా తెలుసుకోవాలి. ప్రభుత్వ కళాశాలల్లో అన్ని సౌకర్యాలు కల్పించడానికి కృషి చేస్తాం. – జి.ప్రభాకరరావు, ఇంటర్మీడియెట్ జిల్లా విద్యాశాఖాధికారి, భీమవరంవామ్మో.. ఫీజులు ప్రైవేట్ కాలేజీల్లో దోపిడీ ఫీజులు, యూనిఫాం, రవాణా భారం ఏడాదికి రూ.90 వేల నుంచి రూ.3.50 లక్షల వరకు ఖర్చు జిల్లాలోని 85 కళాశాలల్లో ఇష్టారాజ్యం ఏఐ సృష్టించిన చిత్రంజిల్లాలోని 15 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో సరైన సదుపాయాలు, ల్యాబ్స్, లెక్చరర్లు లేరు. అరకొర వసతులు, అన్ని సబ్జెక్ట్స్ బోధించే అధ్యాపకులు లేకపోవడం వల్ల తమ పిల్లలను చేర్పించేందుకు తల్లిదండ్రులు వెనుకడుగు వేస్తున్నారు. తప్పనిసరై ప్రైవేట్ కాలేజీల్లో చేర్పిస్తున్నారు. ఇదే అదునుగా జిల్లాలోని ప్రధాన పట్టణాలతోపాటు గ్రామాల్లో సైతం ప్రైవేట్ కళాశాలలు వెలుస్తున్నాయి. రూ.లక్షల్లో ఫీజులతో పాటు బస్ ఫీజులు, హాస్టల్ ఫీజులతోపాటు జేఈఈ అడ్వాన్స్డ్, జేఈఈ మె యిన్స్, ఎంసెట్, నీట్ ప్రవేశ పరీక్షలకు శిక్షణ అంటూ అదనంగా దోపిడీ చే స్తున్నారు. ఇలా ఏడాదికి ఒక్కో విద్యార్థి నుంచి రూ.90 వేల నుంచి రూ.3.50 లక్షల వరకు గుంజుతున్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో మనబడి నాడు–నేడు పధకంలో ప్రభుత్వ పాఠశాలలతోపాటు ప్రభుత్వ జూనియర్ కళాశాలలను అభివృద్ధి చేశారు. అయితే కూటమి ప్రభుత్వ పాలనలో సర్కారీ కళాశాలలను పట్టించుకోవడం లేదు. సౌకర్యాల కల్పనపై దృష్టి సారించడం లేదు. జిల్లాలో ఇంటర్మీడియెట్ విద్యాశాఖాఽధికారి కార్యాలయానికే అనువైన భవనం లేదంటే కళాశాలల పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. -
పశువ్యాధులపై అప్రమత్తం
● సీజనల్ వ్యాధులు సోకే ప్రమాదం ● ముందుగానే టీకాలు వేయడం ఉత్తమమంటున్న పశు వైద్యులు ● చిన్నపాటి జాగ్రత్తలతో వ్యాధులు దూరం బుట్టాయగూడెం: వర్షాకాలంలో పశువులు, గొర్రెలు ఇతర జీవాలకు వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువని, రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని పశు సంవర్ధక శాఖ అధికారులు సూచిస్తున్నారు. జీవాలకు వచ్చే వ్యాధులను సకాలంలో గుర్తించి సరైన చికిత్స చేయించాలని సూచిస్తున్నారు. ముందస్తు జాగ్రత్తలు పాటిస్తే వ్యాధులు రాకుండా కాపాడుకోవచ్చని సూచిస్తున్నారు. పశువులకు వచ్చే వ్యాధుల్లో కొన్ని.. బ్లూటంగ్– ఫుట్రాట్ లక్షణాలు గొర్రెలు, మేకల్లో బ్లూటంగ్ వ్యాధులు సోకితే ఎక్కువగా జ్వరం, మూతి వావు, పెదవులు దద్దరించడం, నోటి లోపల పుండ్లు, ముక్కులో చీమిడి, కాళ్లు కుంటడం, ఒంట్లో నీరు చేరడం, పారుకోవడం, మేత మేయకపోవడం, ఈసుకుపోవడం జరుగుతుంది. 30 శాతం వరకూ మరణాలు సంభవించవచ్చు. వీటి నివారణకు సాయంత్రం సమయంలో గొర్రెల మందలో వేపాకు పొగ పెట్టుకుంటూ అప్పుడప్పుడూ బ్లూటాక్స్/టిక్కిల్ మందులు పిచికారీ చేస్తూ పోడు ప్రాంతాల్లో మేతకు తీసుకెళ్లాలి. కాళ్ల పుండ్ల వ్యాధి సోకితే జీవాలకు కాళ్ల పుండ్లు వ్యాధి సోకితే కాలి గిట్టల మధ్య చీము చేరి చెడువాసన వస్తుంది. గొర్రెలు కుంటుతూ నడుస్తాయి. ఈ లక్షణాలు కనిపించిన్నప్పుడు జీవాలను బురద ప్రాంతంలో మేపకూడదు. పొడి ప్రాంతంలోనే మేత వేసేలా చూడాలి. గొంతువాపు వ్యాధి పశువులకు సోకే వ్యాధుల్లో గొంతువాపు వ్యాధి ప్రమాదకరమైంది. ఈ వ్యాధిని గురక వ్యాధి అని కూడా పిలుస్తారు. వర్షాకాలంలో పశువులకు సూక్ష్మజీవుల వల్ల సంక్రమిస్తుంది. తొలకరి వర్షాలు పడిన సమయంలో కలుషితమైన నీరు, మేత ద్వారా పశువుల రోగ నిరోధక శక్తి తగ్గడం వల్ల ఈ వ్యాధుల బారిన పడతాయి. గొంతువాపు వ్యాధి బారిన పడిన పశువులను మిగిలిన పశువులతో కలిపి ఉంచితే ఈ వ్యాధి మిగిలిన వాటికి కూడా వ్యాప్తి చెందుతుంది. వర్షాకాలంలో పశువులు తడవకుండా చూడాలి. నివారణ చర్యలు జూన్, జులై, ఆగస్టు నెలలో వ్యాధి నిరోధక టీకాలు వేయించాలి. పౌష్టికాహారం అందించాలి. వ్యాధి సోకిన పశువులను మిగిలినవాటి నుంచి వేరు చేయాలి. వాటి స్థావరాలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉండేలా చూడాలి. చిటిక వ్యాధి ఇది గొర్రెల్లో ఎక్కువగా వస్తుంది. తొలకరి వర్షాలు కురిసే సమయంలో సోకుతుంది. ఏడాది వయసు గల గొర్రెల్లో ఈ వ్యాధి వస్తుంది. ఈ వ్యాధి సోకిన గొర్రె తక్కువ సమయానికే మరణిస్తుంది. వ్యాధి లక్షణాలు ఉదయం, మధ్యాహ్నం వేళ గొర్రెల్లో కనిపిస్తాయి. ఈ వ్యాధి నివారణకు వర్షాలకు ముందే గొర్రెలకు వ్యాధి రాకుండా టీకాలు వేయించాలి. వ్యాధి సోకిన గొర్రెలను మంద నుంచి వేరుచేయాలి. వర్షాకాలంలో పశువులకు వచ్చే వ్యాధులపై రైతులు జాగ్రత్తలు తీసుకోవాలి. సీజనల్ వ్యాధులు సోకే ప్రమాదం ఉన్నందున ముందుగానే టీకాలు వేయించుకోవడం ఉత్తమం. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకు ముప్పు. పశువులకు సోకే వ్యాధులను గుర్తిస్తే దగ్గరలో ఉన్న పశువుల ఆస్పత్రిలో వైద్యులను సంప్రదించాలి. మల్లంపల్లి సాయిబుచ్చారావు, సహాయ సంచాలకులు, ప్రాంతీయ పశు సంవర్ధక శాఖ -
యోగాతో ఆరోగ్యం
పెనుగొండ: మానసిక ఒత్తిళ్లు, ఆందోళనలు, ఆరోగ్య సమస్యలకు యోగా సమర్థవంతమైన పరిష్కారమని కలెక్టర్ సీహెచ్ నాగరాణి అన్నారు. పర్యాటకాభివృద్ధిని ప్రోత్సహిస్తూ ప్రజల్లో ఆరోగ్య చైతన్యం పెంపు లక్ష్యంగా పెనుగొండ నగరేశ్వర మహిషాసురమర్ధనీ వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయ ప్రాంగణంలో జరిగిన టెంపుల్ యోగాలో ఆదివారం ఆమె పాల్గొన్నారు. యోగా గురువు, నేషనల్ అథ్లెటిక్స్ యోగా టీచర్ బడుగు చంద్రశేఖర్ ఆధ్వర్యంలో యోగాసనాలు వేశారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం యోగాతో సాధ్యమన్నారు. యోగా కేవలం వ్యాయామ విధానం మాత్రమే కాదని, సంపూర్ణ జీవన విధానమన్నారు. ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ మాట్లాడుతూ ప్రజల ఆరోగ్య పరిరక్షణలో యోగా కీలక పాత్ర పోషిస్తుందన్నారు. అధికారులు, ఉద్యోగులు, విద్యార్థులు, ప్రజలు యోగా కార్యక్రమంలో భాగస్వామ్యులు కావడం అభినందనీయమన్నారు. జేసీ టి.రాహుల్కుమార్రెడ్డి, ఆర్డీఓ దాసి రాజు, జిల్లా ఆయుష్ అధికారి ఎ.శ్రీరామ్, తహసీల్దార్ జి.అనితకుమారి, ఆయుష్ వైద్యులు శాస్త్రి ఆకేళ్ల, ఎన్.గిరీష్, ఎన్.మల్లేశ్వరి, సీహెచ్ సులక్షణ, రామచంద్ర, కిషోర్, జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు. -
రక్తదానంతో ప్రాణాలు కాపాడుదాం
భీమవరం (ప్రకాశంచౌక్): సమాజం పట్ల బాధ్యతతో, సేవా దృక్పథంతో నిర్వహించే ప్రజోపయోగ కార్యక్రమాలకు జిల్లా యంత్రాంగం నుంచి ఎల్లప్పుడూ పూర్తి సహకారం అందుతుందని కలెక్టర్ చదలవాడ నాగరాణి పేర్కొన్నారు. ప్రపంచంలో డబ్బుతో కొనలేని విలువైనది రక్తం మాత్రమేనని, స్వచ్ఛంద రక్తదానం ద్వారా మరొకరి ప్రాణాన్ని కాపాడే అవకాశం లభిస్తుందని అన్నారు. ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం భీమవరం ఆనంద ఫంక్షన్ హాలులో ఆర్.ఆర్.ఫ్రెండ్స్ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, అన్ని దానాల్లోకెల్లా రక్తదానం అత్యంత గొప్పదని, రక్తదానం నిజమైన ప్రాణదానమని పేర్కొన్నారు. కలెక్టర్ తనయుడు చదలవాడ భరత్ చంద్ర మాట్లాడుతూ, రక్తదానం వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తవని, ఆరోగ్యవంతులైన ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని సూచించారు. ఆయన స్వయంగా రక్తదానం చేశారు. భీమవరం రెండో పట్టణ సర్కిల్ ఇనన్స్పెక్టర్ మురళీకష్ణ, పోలీస్ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు మోజెస్, సంఘ సేవకులు అల్లు శ్రీనివాసులు, ఆర్.ఆర్.ఫ్రెండ్స్ సేవా సమితి గౌరవ అధ్యక్షుడు ఆనంద రఘువర్మ, అధ్యక్షుడు గెడ్డం రామారావు తదితరులు పాల్గొన్నారు. -
మేత ధరల పెంపు అన్యాయం
యలమంచిలి: ప్రభుత్వానికి, అప్సడాకు కనీస స మాచారం ఇవ్వకుండా రొయ్య మేత కంపెనీలు ఆక్వా ఫీడ్ ధరలను పెంచడాన్ని ఆక్వా రైతు సంఘం రాష్ట్ర నాయకులు తీవ్రంగా ఖండించారు. పా లకొల్లులో శనివారం ఆక్వా రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గొట్టుముక్కల గాంధీ భగవాన్రాజు అధ్యక్షతన రాష్ట్రస్థాయి సమావేశం నిర్వహించారు. గాంధీ భగవాన్రాజు మాట్లాడుతూ మేత కంపెనీలు ఏకపక్షంగా ధరలు పెంచడం అన్యాయమన్నారు. అప్సడా యాక్ట్కు విరుద్ధంగా ధరలు పెంచడాన్ని సహించబోమన్నారు. ధరల పెంపు విషయంలో నాలుగు రోజుల క్రితం ఆక్వా రైతులకు, రొయ్య మేతల కంపెనీ ప్రతినిధులకు కమిషనర్ జూమ్ కాల్ ఏర్పాటు చేశారన్నారు. కంపెనీ ప్రతినిధులు ధరలు పెంచుతామంటే తాము ఒప్పుకోలేదన్నా రు. ఓ పక్క చర్చలు జరుగుతుండగానే ధరల పెంపు ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. మేత కంపెనీలు మెడిసన్ రేటు 30 శాతం, మేత కిలోకు రూ.12 పెంచాయని ఆ మేరకు రొయ్య ధరలు మాత్రం పెంచడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు రోజుల సమయం ఇస్తున్నామని, అప్పటికీ ధరలు తగ్గించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ప్రతి జిల్లాలో మంగళవారం నిరసనలు చేపడతామని చెప్పారు. అవసరమైతే చలో అమరావతి పిలుపునిచ్చి ముఖ్యమంత్రితో మాట్లాడతామన్నారు. -
కేసుల ఛేదనలో ఏఐ కీలకం
ఐజీ అశోక్కుమార్ ఏలూరు టౌన్: పోలీస్ వ్యవస్థలో నిందితులకు శిక్షలు విధించడంలో అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత సాధనాలు కీలకమని ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్కుమార్ అన్నారు. ఏలూరు జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ అధ్యక్షతన పోలీస్ శాఖ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగంపై కెపాసిటీ బిల్డింగ్ వర్క్షాప్ను శనివారం ఏలూరులో నిర్వహించా రు. ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లా, తూర్పుగోదావరి, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాల పోలీస్ అధికారులు హాజరయ్యారు. ఐజీ అశోక్కుమార్ మాట్లాడుతూ పోలీస్ విధుల్లో ద ర్యాప్తు, కోర్టు విచారణల రిపోర్టుల తయారీలో ఏఐ ఉపయోగపడుతుందన్నారు. ఏలూరు జిల్లాలో ఎస్పీ శివకిషోర్ ఆధ్వర్యంలో ఏఐని వినియోగిస్తూ మెరుగైన ఫలితాలు సాధించటం అభినందనీయమని, ఇదే తరహాలో అన్ని జిల్లాల్లో ఏఐ టూల్స్ను వినియోగించాలన్నారు. ఏలూరు జిల్లా ఎస్పీ శివకిషోర్ మాట్లాడుతూ ధర్మా (డిజిటల్ హాలీస్టిక్ ఏఐ డ్రైవెన్ రెస్పాన్స్ మేనేజ్మెంట్ అసిస్టెంట్) యా ప్ను రూపొందించటంలో స్మార్ట్ పోలీసింగ్కు కృషి చేశామన్నారు. ధర్మా యాప్ పోలీస్ విధి నిర్వహణలో ఏఐ ఆధారిత సహాయక వేదికగా పనిచేస్తోందన్నారు. గతంతో పోలిస్తే కేసుల పరిష్కారం 20 శాతం పెరిగిందన్నారు. -
నిరసన ర్యాలీపై కేసుల నమోదు
తణుకు అర్బన్: చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు నిరసన ర్యాలీపై పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు తణుకులో మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఆధ్వర్యంలో శుక్రవారం భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. అయితే ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు హడావుడి చేయగా.. ముందుగానే సమాచారం ఇచ్చామని, ఇప్పుడు అనుమతి లేదంటే కుదరదని, రాష్ట్రంలో ఎక్కడా లేని నిబంధనలు తణుకులో ఏంటని కారు మూరి నిలదీశారు. దీంతో అడ్డుకుని తీరుతామన్న పోలీసు అధికారులు వేలల్లో తరలివచ్చిన జనాన్ని చూసి చేసేదిలేక వదిలేశారు. ఈ నేపథ్యంలో ర్యాలీ లో పాల్గొన్న మాజీ మంత్రి కారుమూరితోపాటు 38 మందిపై శనివారం ఉదయం ఎఫ్ఐఆర్ వేశారు. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కేసులు ఇవి.. సెక్షన్ 189 (2) (చట్టవిరుద్ధమైన గుంపు సభ్యులు), సెక్షన్ 190 (చట్టవిరుద్ధమైన గుంపులతో ఉమ్మడి లక్ష్యంతో నేరం), 120 (ఏ) (అక్రమ నిరోధం), 292 (పబ్లిక్ న్యూసెన్స్), 285 (ప్రజా మార్గాలకు అడ్డంకి ఏర్పరచడం), 32 (పోలీసుల ఆదేశాలను ధిక్కరించడం) జరిమానాలతో కూడిన సెక్షన్లతో కేసులు నమోదుచేశారు. ఐదుగురు సీఐలు, 10 మంది ఎస్సైలతో.. నిరసన ర్యాలీని భగ్నం చేయాలనే ఉద్దేశంతో తణుకు పట్టణ, రూరల్ సీఐలతోపాటు మరో మగ్గురు సీఐలు, 10 మంది ఎస్సైలు సిబ్బందితో హడావుడి చే శారు. ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారమే అంటూ మాజీ మంత్రి కారుమూరితో సైతం వాగ్వాదానికి ప్రయత్నించారు. అయినా కారుమూరితోపాటు పా ర్టీ శ్రేణులు సంయమనం పాటించి, శాంతియుతంగా ర్యాలీ చేపట్టారు. ర్యాలీ సక్సెస్ను జీర్ణించుకోలేక రాజకీయ ఆదేశాలతో కేసులు నమోదుచేశారంటూ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. మాజీ మంత్రి కారుమూరి, పార్టీ శ్రేణులు సైతం ఎన్ని కేసులు పె ట్టినా భయపడేది లేదని అన్నింటికీ సిద్ధంగానే ఉ న్నామంటూ బహిరంగంగానే చెబుతున్నారు. మాజీ మంత్రి కారుమూరితో సహా 38 మందిపై కేసులు -
ఆక్వా రైతులను ఫీడ్యించుకు తినేలా..!
కై కలూరు: ఉమ్మడి జిల్లాలో చేపల సాగు 1.80 లక్షల ఎకరాలు, రొయ్యల సాగు 1.10 లక్షల ఎకరాలు వె రసి 2.90 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగవుతోంది. వా ర్షిక ఉత్పత్తి 4 లక్షల టన్నులు. సాధారణంగా వ నామీ రొయ్యల ఉత్పత్తికి టన్నుకు టన్నున్నర మేత, టైగర్ రొయ్యలకు టన్నుకు రెండున్నర టన్నుల మేతను రైతులు వినియోగిస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో టన్నుకు రూ.4 వేల చొప్పున ధరలను మేతల కంపెనీలు పెంచేశాయి. తిరిగి ముడిసరుకుల ధరలు పెరిగాయనే సాకుతో టన్నుకు కనీసం వనామీ ఫీడ్పై రూ.12 వేలు, టైగర్ ఫీడ్పై రూ.14 వేలు పెంచేందుకు అవకాశం ఇవ్వాలని రొయ్య మే త తయారీదారులు కోరారు. తర్వాత ఒక్కసారిగా ధరలు పెంచామని ప్రకటించడంతో రొయ్యల రైతు లు ఆందోళన బాట పట్టారు. ధరలు తగ్గినా రేట్లు తగ్గించలేదు ఫీడ్ తయారీ కంపెనీలు పూర్వం ఫిష్మీల్, సోయాబిన్ వంటి ముడిసరుకుల ధరలు తగినా మేత ధరలను తగ్గించలేదని రైతు సంఘ నాయకులు వాపోతున్నారు. గత నెల 11న వనామీ ఫీడ్పై రూ.8,420, టైగర్ ఫీడ్పై రూ.10,520 చొప్పున పెంచుతూ కంపెనీలు ప్రకటనలు చేశాయి. అప్సడా చట్టం ప్రకారం ఆక్వా రైతులు, సంఘాల నేతలతో చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉండగా అందుకు విరుద్ధంగా నిర్ణయాలు జరిగాయి. దీంతో రొయ్యల రైతులు రోడ్లపై నిరసనలతో పాటు పలు పట్టణాల్లో అవగాహన సదస్సులు నిర్వహించారు. మంత్రి అచ్చెన్నాయుడు పరిస్థితిని చక్కదిద్దుతానని చెప్పి నా ఫలితం లేదు. ఇంత జరిగినా శుక్రవారం రొ య్యల మేతల ధరలు పెంచుతూ అధికారిక అనుమతులు కంపెనీలకు చేరాయి. విద్యుత్ సబ్సిడీలోనూ మెలికలే.. ఆక్వా జోన్స్తో సంబంధం లేకుండా కూటమి ప్రభు త్వం రాగానే విద్యుత్ యూనిట్ను రూ.1.50కే సరఫరా, జిల్లాల్లో 5 వేల టన్నుల నిల్వ సామర్థ్యం కలిగిన కోల్ట్ స్టోరేజీలు, తగ్గింపు ధరలకు ట్రాన్స్ఫార్మర్లు, సబ్సిడీపై ఏరియేటర్లు అందిస్తామని ఎన్నికల సమయంలో నేతలు వాగ్దానాలు చేశారు. రెండేళ్ల తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడటంతో మెలికలు పెట్టి యూనిట్ రూ.1.50కి అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఏలూరు జిల్లా లో మొత్తం 13,007 ఆక్వా విద్యుత్ కనెక్షన్లు ఉన్నా యి. వీటిలో వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో 9,555 కనెక్షన్లకు విద్యుత్ సబ్సిడీ అందించారు. చంద్ర బాబు ప్రభుత్వంలో ప్రస్తుతం 3,452 మంది రైతులకు సబ్సిడీ వర్తింపజేయాలి. ఇదిలా ఉంటే పవర్ ఫ్యాక్టర్ (విద్యుత్ వినియోగ నాణ్యత) 0.90 నుంచి 0.95 శాతం మధ్య ఉండాలని ప్రభుత్వం షరతు పె డుతూ 169 జీఓను విడుదల చేసింది. దీనిపై ఆక్వారైతుల్లో అధిక శాతం మందికి అవగాహన లేదు. లబ్ధిదారులను తగ్గించే ఎత్తుగడగా పలువురు భావిస్తున్నారు. ఏఐ సృష్టించిన చిత్రం ఏఐ సృష్టించిన చిత్రం మాజీ సీఎం వైఎస్ జగన్ ఎటువంటి షరతులు లేకుండా ఆక్వాలో విద్యుత్ సబ్సిడీ అమలు చేశారు. చంద్రబాబు ప్రభుత్వం పవర్ ఫ్యాక్టర్ అంశాన్ని తెరపైకి తెచ్చింది. రొయ్యల రైతులు రూ.వేలల్లో చెల్లించి అద్దె జనరేటర్లను ఏర్పాటు చేసుకుంటున్నారు. మేత తయారీదారుల పక్షానే ప్రభుత్వం నిలవడం శోచనీయం. – రామిశెట్టి సత్యనారాయణ, వైఎస్సార్సీపీ రాష్ట్ర వాణిజ్య విభాగ సెక్రటరీ, ముదినేపల్లి రాష్ట్రానికి అత్యధిక ఆదాయం అందిస్తున్న ఆక్వారంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి. ఇప్పటికే సరైన నీటి వనరులు లేక సాగులో వ్యాధులు ప్రబలుతున్నాయి. రొయ్యల రైతులు అప్పులు చేసి సాగు చేస్తున్నారు. పెంచిన మేతల ధరలను తగ్గించాలి. షరతులు లేకుండా అందరికీ ఆక్వా సబ్సిడీ వర్తింపజేయాలి. – చేబోయిన వీరరాజు, వైఎస్సార్సీపీ, ఏలూరు జిల్లా ఉపాధ్యక్షుడు, మండవల్లి -
19న ఏజెన్సీలో రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ పర్యటన
బుట్టాయగూడెం: ఈ నెల 19వ తేదీన రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ సోళ్ల బొజ్జిరెడ్డి ఏజెన్సీలో పర్యటించనున్నారు. ఆరోజు ఉదయం 7 గంటలకు రంపచోడవరం నుంచి బయలుదేరి 8:30కు బుట్టాయగూడెం మండలం కేఆర్పురం ఐటీడీఏ అతిథి గృహానికి చేరుకుంటారని అధికారులు తెలిపారు. అనంతరం 9 గంటలకు అక్కడి నుంచి గుబ్బల మంగమ్మ గుడికి చేరుకుని అమ్మవారిని దర్శించుకుంటారని చెప్పారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 12:30కు జంగారెడ్డిగూడెం ఏరియా ఆస్పత్రికి వెళ్లి రోగులకు అందుతున్న వైద్యసేవలను, సౌకర్యాలను పరిశీలిస్తారన్నారు. అనంతరం ఉప్పలమెట్టలో ఉన్న గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల సందర్శన, మధ్యాహ్నం 3.30కు బుట్టాయగూడెం మండలం వెలుతురువారిగూడెం చేరుకుని అక్కడి గిరిజనులను కలిసి సమస్యలను అడిగి తెలుసుకుంటారని తెలిపారు. సాయంత్రం 5:15కు కేఆర్పురం ఐటీడీఏ సమావేశ మందిరంలో గిరిజనులు, గిరిజన ఉద్యోగులు, గిరిజన సంఘాల ప్రతినిధులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకుంటారని తెలిపారు. రాత్రి 8:30కు ఏలూరు చేరుకుని అక్కడ బస చేస్తారని చెప్పారు. భీమడోలు: జాతీయ రహదారి పూళ్ల, భీమడోలు రైల్వే స్టేషన్ల మధ్య గల అండర్ పాస్ సమీపాన శనివారం ఓ గుర్తు తెలియని వృద్ధుడి మృతదేహాన్ని రైల్వే పోలీసులు కనుగొన్నారు. మృతుని శరీర భాగాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. సమాచారం అందుకున్న తాడేపల్లిగూడెం రైల్వే ఎస్సై పి.అప్పారావు తన సిబ్బందితో కలిసి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. గుర్తు తెలియని రైలు ఢీకొనడం లేదా రైలు నుంచి జారిపడడంతో మృతదేహాం నుజ్జునుజ్జుగా మారిందని రైల్వే పోలీసులు తెలిపారు. వృద్ధుని వయస్సు 60 నుంచి 70 ఏళ్ల మధ్య ఉంటుందని, ఎత్తు 5.5 అడుగులు, ఛామనఛాయ, నలుపురంగు ఫ్యాంటు ధరించి ఉన్నాడని పేర్కొన్నారు. వృద్ధుడి మృతదేహాన్ని పోస్ట్మార్టమ్ నిమిత్తం తాడేపల్లిగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై గూడెం స్టేషన్ మాస్టార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఏలూరు (ఆర్ఆర్పేట): ఆప్కాస్ ఉద్యోగులందరినీ వెంటనే రెగ్యులర్ చేయాలని, ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు 12వ పీఆర్సీ ప్రకటించాలని, ఆప్కాస్ ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు 62 సంవత్సరాలకు పెంచాలని ఆప్కాస్ ఉద్యోగుల జిల్లా సదస్సు డిమాండ్ చేసింది. శనివారం ఆప్కాస్ ఉద్యోగుల జిల్లా సదస్సు ఆర్ఆర్ పేటలోని శ్రీ కాశీ విశ్వేశ్వర కళ్యాణ మండపంలో జరిగింది. తణుకు అర్బన్: వైద్యుల నిర్లక్ష్యం కారణంగా మహిళ మృతి చెందిందని కుటుంబ సభ్యులు తణుకులో ఒక ప్రైవేటు ఆస్పత్రి వద్ద ఆందోళన నిర్వహించారు. శనివారం రాత్రి తణుకు పాతవూరుకు చెందిన సూరవరపు వరలక్ష్మి (58) ఛాతీ నొప్పితో బాధపడుతుండగా ఆమె కుటుంబసభ్యులు ప్రైవేటు ఆస్పత్రికి తీసుకువచ్చారు. ఆస్పత్రి వైద్యులు ప్రాథమిక చికిత్స అనంతరం ఈసీజీ తదితర పరీక్షలు నిర్వహించి ఇంజక్షన్ చేశారు. అనంతరం వరలక్ష్మి బంధువులు ఆమెను రాజమండ్రికి తీసుకువెళ్తామంటూ బయటకు తీసుకురాగా ఒక్కసారిగా అపస్మారక స్థితిలోకి వెళ్లారు. పరీక్షిక్షించిన వైద్యులు ప్రాణంలేదని నిర్ధారించగా, ఇంజక్షన్ కారణంగానే మృతిచెందార ంటూ మృతురాలి బంధువులు ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. దీంతో పట్టణ సీఐ జె.వెంకటరమణ, ఎస్సైలు ఆస్పత్రి వద్దకు చేరుకుని బాధితులకు నచ్చజెప్పి ఆందోళనను విరమింపజేశారు. మరో 11 ఖాతాల్లో 412 గ్రాముల బంగారం మాయం జంగారెడ్డిగూడెం: స్థానిక బ్యాంక్ ఆఫ్ బరోడా శాఖలో బంగారం మాయమైన ఘటనలో అధికారుల తనిఖీలు కొనసాగుతుండగా, రోజురోజుకూ గోల్డ్మాల్ లెక్కలు భారీగా పెరుగుతున్నాయి. శనివారం నిర్వహించిన బంగారం ప్యాకెట్ల తనిఖీల్లో మరో పెద్ద లీల వెలుగుచూసింది. ఈ రోజు జరిపిన పరిశీలనలో 11 ఖాతాలకు సంబంధించిన సుమారు 412 గ్రాముల బంగారం మాయమైనట్లు అధికారులు గుర్తించారు. శనివారం నాటి లెక్కింపుతో కలిపి ఇప్పటివరకు మొత్తంగా 3 కిలోల 200 గ్రాములకు చేరుకోవడం బ్యాంకు వర్గాల్లో కలకలం రేపుతోంది. బ్యాంకు అధికారులు వరుసగా ఏడో రోజు కూడా గట్టి నిఘా నడుమ బంగారం ప్యాకెట్లను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. విషయం తెలుసుకున్న ఖాతాదారులు పెద్ద సంఖ్యలో బ్యాంకు వద్దకు చేరుకుని, తమ తాకట్టు బంగారం సురక్షితంగా ఉందో లేదోనని అధికారులను ఆరా తీస్తూ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
అమ్మకాలు అరికట్టాలి
ప్రైవేట్ విద్యాసంస్థల్లో అక్రమంగా విద్యా సామగ్రి విక్రయిస్తున్నా కఠిన చర్యలు తీసుకోవడం లేదు. తమ వద్దనే పుస్తకాలు, యూనిఫాం కొనుగోలు చేయాలనే నిబంధనతో అఽధిక ధరలకు విక్రయిస్తున్నారు. కార్పొరేట్ విద్యాసంస్థలు ప్రభుత్వ పెద్దలకు చెందినవి కావడంతో చర్యలు అంతంతమాత్రమే. – పి.సాయికృష్ణ, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ప్రైవేట్ విద్యాసంస్థల్లో విద్యా సామగ్రిని సీజ్ చేస్తున్న అధికారులు వాటిని పేద విద్యార్థులకు పంపిణీ చేయాలి. సీజ్ చేసిన కొన్నిరోజుల తర్వాత తిరిగి ఆయా సంస్థలకు అప్పగించడంతో మళ్లీ విక్రయాలు చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు తప్ప అక్రమ వ్యాపారానికి అడ్డుకట్ట పడటం లేదు. – బి.సింధు, ఎస్ఎఫ్ఐ గరల్స్ జిల్లా కన్వీనర్ ప్రైవేటు విద్యాసంస్థల్లో నిబంధనలకు విరుద్ధంగా విద్యా సామగ్రి విక్రయాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. ఎక్కడైనా పుస్తకాలు, యూనిఫాం వంటివి విక్రయిస్తే మా దృష్టికి తీసుకురావాలి. అన్ని విద్యాసంస్థలు ప్రభుత్వ నియమ, నిబంధనలు తప్పక పాటించాలి. – ఈ.నారాయణ, డీఈఓ, భీమవరం -
రక్తదానంతో ప్రాణదానం
భీమవరం (ప్రకాశం చౌక్): రక్తదానం చేయడం అంటే ఆపదలో ఉన్న వారికి ప్రాణదానం చేయడమే. ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడిన వారికి, అత్యవసర శస్త్రచికిత్సలు అవసరమైన వారికి రక్తాన్ని అందించి ఆదుకునే రక్తదాతలు నిజమైన ప్రాణబంధువులు. పశ్చిమగోదావరి జిల్లాలోని యువత, ఉద్యోగులు సోషల్ మీడియా ద్వారా రక్తం అవసరాన్ని తెలుసుకొని పెద్దఎత్తున స్పందిస్తున్నారు. రక్తదానంలో జిల్లాను ఉత్తమంగా నిలిపి, రాష్ట్రపతి నుంచి రెడ్క్రాస్ ప్రశంసా పత్రాలు అందుకుంటున్న ప్రభుత్వ ఉద్యోగులే దీనికి నిదర్శనం. జూన్ 14న ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా బ్లడ్ బ్యాంకులు, స్వచ్ఛంద సంస్థలు ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేసి రక్తదానంపై అవగాహన కల్పిస్తున్నాయి. జిల్లాలోని భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం, పాలకొల్లు, నరసాపురం ప్రాంతాల్లో రాజకీయ నాయకులు, సినీ హీరోల పుట్టినరోజుల సందర్భంగా అభిమానులు, యువత స్వచ్ఛందంగా రక్తదాన శిబిరాలు నిర్వహించి రక్తదానం చేయడంలో ముందుంటుండడం విశేషం. జిల్లాలో రెడ్క్రాస్ సేవలు 2022లో అప్పటి కలెక్టర్ పి.ప్రశాంతి చొరవతో భీమవరం రాయలంలో రూ.1.50 కోట్లతో జిల్లా స్థాయి రెడ్క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఏర్పాటైంది. తణుకు, తాడేపల్లిగూడెంలోనూ ఇవి ఉన్నాయి. ఏడాదికి 21 వేల యూనిట్ల రక్తం లక్ష్యం కాగా 18,500 యూనిట్లు రక్తం సేకరణ అవుతుంది. అందులో రెడ్క్రాస్ ద్వారా 3,200 యూనిట్లు సరఫరా అవుతుంది. ప్రభుత్వం ద్వారా 2 బ్లడ్ బ్యాంకులు, 7 ప్రైవేట్ బ్లడ్ బ్యాంకులు ఉన్నాయి. అన్ని కలుపుకుని ఏడాదికి 18,500 యూనిట్లు రక్త సేకరణ చేస్తున్నారు. జిల్లాలో తలసేమియా బాధితులు 45 మందికి రెడ్క్రాస్ ద్వారా బ్లడ్ డోనేషన్ చేస్తున్నారు. రక్తదానంపై అపోహలు వద్దు మన శరీరంలో 5 లీటర్ల రక్తం ఉంటే, రక్తదానంలో కేవలం 350 మిలీ లీటర్లు మాత్రమే తీసుకుంటారు. దీనివల్ల ఇన్ఫెక్షన్లు వస్తాయని, హిమోగ్లోబిన్ తగ్గుతుందని అనుకోవడం కేవలం అపోహ మాత్రమే. ఎటువంటి అపోహలు పెట్టుకొకుండా రక్తదానం చేసి అపదలో ఉన్న వారి ప్రాణాలు రక్షించాలని వైద్యులు చెబుతున్నారు. రక్తదానానికి అర్హతలు ● వయసు 18 నుంచి 60 ఏళ్ల లోపు ఉండాలి. బరువు కనీసం 45 కేజీల పైబడి ఉండాలి. ● రక్తంలో హిమోగ్లోబిన్ కనీసం 12.5 గ్రాములు ఉండాలి. ప్రతి 3 నెలల (పురుషులు), 4 నెలల (సీ్త్రలు) వ్యవధితో ఇవ్వవచ్చు. ● రక్తదానానికి 12 గంటల ముందు, తర్వాత ఆల్కహాల్ తీసుకోకూడదు. రక్తదానం ఎవరు చేయకూడదంటే.. శ్వాసకోశ వ్యాధులు, కేన్సర్, గుండెజబ్బులు, మధుమేహం, ఆస్తమా, ఫిట్స్, కాలేయ వ్యాధులు, ఎయిడ్స్ లక్షణాలు ఉన్నవారు రక్తదానం చేయకూడదు. మలేరియా, టైఫాయిడ్ వంటి జ్వరాలు ఉన్నప్పుడు ఇవ్వరాదు. సీ్త్రలు రుతుక్రమ సమయంలో, గర్భం దాల్చినప్పటి నుంచి పాలిచ్చేంత వరకు రక్తదానం చేయరాదు. రక్తాన్ని సేకరించాక అన్ని రకాల పరీక్షలు చేసి, సురక్షితమని తేలాకే ఇతరులకు ఇస్తారు. ఒక మైక్రో లీటరు రక్తంలో 4.5–5.5 మిలియన్ల ఎర్ర రక్తకణాలు (ఆక్సిజన్ సరఫరాకు), 4–11 వేల తెల్ల రక్తకణాలు (రోగనిరోధక శక్తికి), రక్తం గడ్డకట్టడానికి తోడ్పడే 1.5–4.5 లక్షల ప్లేట్లెట్స్ ఉంటాయి. రక్తదానంలో ఆదర్శంగా జిల్లా యువత, ఉద్యోగులు నేడు ప్రపంచ రక్తదాన దినోత్సవం -
సెలవు రోజుల్లో తరగతులు
భీమవరం: పట్టణంలోని పలు ప్రైవేట్ పాఠశా లల్లో సెలవు రోజు రెండో శనివారం తరగతులు నిర్వహిస్తుండగా ఎస్ఎఫ్ఐ నాయకులు అడ్డుకున్నారు. సిగ్ని, సంస్కార్, పూర్ణోదయ, బార్దోలి, భాష్యం తదితర పాఠశాల్లో తరగతులను వారు అడ్డుకుని విద్యార్థులను ఇళ్లకు పంపించారు. ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు పి.సాయికృష్ణ మాట్లాడుతూ సెలవు రోజుల్లో తరగతులు నిర్వహించడం నిబంధనలకు విరుద్ధమన్నారు. ఆయా విద్యాసంస్థలపై అధికారులు చర్యలు తీసుకోవా లని కోరారు. ఎస్ఎఫ్ఐ నాయకులు పి.త్రినాథ్, జి.కౌశిక్, జి.అభి తదితరులు పాల్గొన్నారు. కొయ్యలగూడెం: వైఎస్సార్సీపీ భీమవరం అసెంబ్లీ నియోజకవర్గ పరిశీలకుడిగా తాను నియమితులైనట్టు మంతెన సోమరాజు తెలిపారు. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పార్టీ కేంద్ర కార్యాలయం ద్వారా నియామక పత్రం జారీ చేశారన్నారు. రీజనల్ కో–ఆర్డినేటర్లు, పార్టీ జిల్లా అధ్యక్షులు, పార్లమెంటు ని యోజకవర్గ పరిశీలకులకు సహాయకారిగా కూ డా తనను నియమించారని తెలిపారు. కాగా మంతెన ఇప్పటికే పార్లమెంట్ కార్యదర్శిగా, ఏలూరు జిల్లా ఉపాధ్యక్షుడిగా వ్యవహరిస్తు న్నారు. వైఎస్సార్సీపీ శ్రేణులు ఆయన్ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. భీమవరం(ప్రకాశంచౌక్): జిల్లాలో అంతర్జాతీయ యోగా దినోత్సవానికి విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్ సీహెచ్ నాగరాణి తెలిపారు. ఆదివారం ఉదయం 6 గంటల నుంచి పెనుగొండ వాసవీ క్షేత్రంలో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. 21న జిల్లావ్యాప్తంగా యోగా సంగమ్ కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు చెప్పారు. ఏలూరు (ఆర్ఆర్పేట): ప్రభుత్వ ఉపాధ్యాయులు, ఉద్యోగులకు ఐఆర్ ప్రకటించడానికి ఇంకెంత సమయం కావాలని ఏపీటీఎఫ్ ఏలూరు జిల్లా అఽ ద్యక్షుడు టి.నారాయణదాసు ప్రశ్నించారు. శనివారం స్థానిక ఏఆర్డీజీకే నగరపాలక ఉన్నత పాఠశాలలో జిల్లా సమావేశాన్ని నిర్వహించా రు. నారాయణదాసు మాట్లాడుతూ ఇన్సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ రద్దు చేయాలని, లేకుంటే కేవలం వారి బోధన సబ్జెక్టుకు సంబంధించి మాత్రమే ప్రత్యేక టెట్ నిర్వహించాలని కోరారు. జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్లూరి రామారావు మాట్లాడుతూ వెంటనే ఐఆర్ ప్రకటించాలని, పెండింగ్లో ఉన్న నాలుగు డీఏలను విడుదల చేయాలని, పీఆర్సీ కమిషన్ను నియమించాలని కోరారు. -
మొగల్తూరు మామిడికి వర్షం దెబ్బ
నరసాపురం రూరల్: నరసాపురం, మొగల్తూరు ప్రాంతాల్లో ఏటా మామిడి సీజన్ చివరిలో ప్రారంభమవుతుంది. ఈ ఏడాది వాతావరణ పరిస్థితులు అనుకూలించడంతో మామిడి పంట బాగా కాపుకాసింది. అయితే, ఇటీవల ఎండలు తీవ్రంగా ఉండటం, వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా శనివారం వేకువజామున భారీ వర్షం కురిసింది. దీంతో పక్వానికి వచ్చిన మామిడి కాయలు పెద్దఎత్తున రాలిపోయాయి. ఫలితంగా కనీసం పెట్టుబడులు కూడా దక్కడం గగనమని రైతులు వాపోతున్నారు. దేశ, విదేశాలకు ఎగుమతి అయ్యే నరసాపురం ప్రాంత బంగినపల్లి మామిడికి మంచి డిమాండ్ ఉన్న సమయంలో.. ఈ అకాల వర్షాలు కురవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. మరోపక్క ఈ ప్రాంతంలో మామిడి సీజన్ ముగిసే సమయం దగ్గరపడుతుండటంతో, లక్షలు పెట్టి తోటలను కొనుగోలు చేసిన వ్యాపారులు, రైతులు తాము తీవ్రంగా నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శనివారం ఒక్కసారిగా మార్కెట్లోకి పెద్దఎత్తున మామిడికాయలు రావడంతో ధరలు అమాంతం పడిపోయాయని, దీనివల్ల భారీగా నష్టాలు చవిచూడాల్సి వస్తోందని రైతులు ఆందోళన చెందుతున్నారు. -
సహకారం భేష్
జిల్లాలో రెడ్క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఏర్పాటైన నాటి నుంచి ప్రభుత్వ ఉద్యోగులు, యువత సహకారం చాలా గొప్పగా ఉంది. వివిధ శాఖల ఉద్యోగులు క్యాంపుల ద్వారా రక్తాన్ని అందిస్తూ సకాలంలో ప్రాణాలు రక్షించడంలో భాగస్వాములవుతున్నారు. – డాక్టర్ రామభద్రరాజు (రెడ్క్రాస్ జిల్లా చైర్మన్, భీమవరం) వైఎస్సార్ జయంతి, వైఎస్ జగన్ పుట్టినరోజుల సందర్భంగా ఏడాదికి రెండు సార్లు బ్లడ్ క్యాంపులు నిర్వహిస్తున్నాం. కార్యకర్తలు, యువత స్వచ్ఛందంగా రక్తదానం చేస్తున్నారు. ఆపదలో ఉన్న వారికి సోషల్ మీడియా ద్వారా దాతలను సమకూరుస్తున్నాం. – చిగురుపాటి సందీప్, వైసీపీ జిల్లా యువజన అధ్యక్షుడు -
విద్యా వ్యాపారం.. ఇష్టారాజ్యం
● యథేచ్ఛగా విద్యా సామగ్రి విక్రయాలు ● పుస్తకాలు, యూనిఫాం అమ్మకాలు ● నామమాత్రపు దాడులతో సరి భీమవరం: జిల్లాలో ప్రైవేట్, కార్పొరేట్ సంస్థల విద్యా వ్యాపారం యథేచ్ఛగా జరుగుతోంది. పెద్ద మొత్తంతో ఫీజుల వసూళ్లతో పాటు విద్యా సామగ్రి విక్రయాలు సాగుతున్నా అధికారులు నామమాత్రపు దాడులతో సరిపెడుతున్నారు. జిల్లాలోని 20 మండలాల పరిధిలో సుమారు 1,300 ప్రభుత్వ, 563 ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలు ఉన్నాయి. చంద్రబాబు పాలనలో ప్రభుత్వ విద్యారంగంపై నిర్లక్ష్యంతో విద్యార్థుల తల్లిదండ్రులు ప్రైవేట్ స్కూళ్ల బాటపడుతున్నారు. ఇదే అదునుగా పుస్తకాలు, యూనిఫాం, విద్యా సామగ్రిని అధిక ధరలకు ఇష్టారాజ్యంగా విక్రయిస్తున్నారు. విద్యా సామగ్రి తప్పనిసరిగా తమ వద్దే కొనుగోలు చేయాలని కొన్ని సంస్థలు నిబంధనలు పెడుతున్నాయి. ఉల్లంఘనలపై అరకొర దాడులు నిబంధనలకు విరుద్ధంగా విద్యా సామగ్రి విక్రయాలు చేస్తున్నా విద్యాశాఖ అధికారులు అరకొర దాడులతో సరిపెడుతున్నారనే విమర్శలు ఉన్నాయి. ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, ఏబీవీపీ వంటి విద్యార్థి సంఘాలు సమాచారం ఇచ్చిన కొన్ని సందర్భంగా మొక్కుబడి గా ఆయా స్కూళ్లలో దాడులు చేసి విద్యాసామగ్రి ఉ న్న గదులను సీజ్ చేస్తున్నారు. అయితే విద్యా సంస్థల యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోకపో వడంతో వీరి అక్రమ వ్యాపారం యథేచ్ఛగా సాగుతోంది. సీజ్ చేసిన విద్యా సామగ్రిని కొన్నిరోజుల తర్వాత ఆయా విద్యాసంస్థలకు అప్పగించడంతో దర్జాగా తిరిగి అమ్మకాలు చేస్తున్నారు. -
ఫీడ్ రేట్ల భారం
ఆలయ అభివృద్ధికి విరాళం కాళ్ల: కాళ్లకూరులో వేంకటేశ్వరస్వామి ఆలయ మాడవీధుల అభివృద్ధికి పచ్చిగోళ్ల అన్నపూర్ణమ్మ జ్ఞాపకార్థం ఆమె కుటుంబసభ్యులు రూ.1,01,116 విరాళంగా అందజేశారు. ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్ వీరవాసరం: ఆక్వా రైతు నెత్తిపై ఫీడ్ రేట్ల పెంపు మరో పిడుగుపాటు చర్య అని శా సనమండలి సభ్యుడు, వైఎస్సార్సీపీ శెట్టిబలిజ విభాగ రాష్ట్ర అధ్యక్షుడు కవురు శ్రీనివాస్ శనివారం ఆవేదన వ్యక్తం చేశారు. రొయ్యల ఫీడ్ ధరను కిలోకు రూ.10 నుంచి రూ.12 పెంచారన్నారు. ఇప్పటికే ఆక్వా సాగు నష్టాల్లో సాగుతోందని, ఈ సమయంలో మేత ధరలను పెంచడం దారుణమన్నారు. చంద్రబాబు సానుభూతిపరులైన కొందరు ఫీడ్ తయారీ కంపెనీల యజమానులు సిండికేట్గా మారి రైతులను జలగల్లా పీల్చిపిప్పి చేస్తున్నారని విమర్శించారు. గత ప్రభుత్వంలో వైఎస్ జగన్ హయాంలో రొయ్య రైతులకు ఏ చిన్న సమస్య వచ్చినా అప్సడా ద్వారా ప్రత్యేక చర్యలు తీసుకుని మేలు చేశారని గుర్తుచేశారు. ఇప్పుడు రొయ్యల మేత ఫ్యాక్టరీలు, రొయ్యల సీడ్ హ్యాచరీ యజమానులు, రొయ్యల ప్లాంట్ యజమానులు, రొయ్యల మందులు యజమానులు ఒక్కరే ఉంటూ రేట్లు పెంచుతున్నారని మండిపడ్డారు. అలాగే రొయ్యల ధరలను ఇష్టానుసారం తగ్గించివేయడంతో రైతులు అయినకాడికి అమ్ము కోవాల్సి వస్తుందన్నారు. చంద్రబాబు ప్రభుత్వ కనుసన్నల్లోనే సిండికేట్ వ్యవస్థ నడుస్తుందని ఎమ్మె ల్సీ కవురు ఆరోపించారు. పెంచిన ఫీడ్ ధ రలు వెంటనే తగ్గించకుంటే వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో రై తులకు మద్దతుగా రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. -
పాపికొండలు: గోదావరి మధ్యలో నిలిచిపోయిన బోటు
సాక్షి, పోలవరం: పాపికొండల పర్యటనలో గోదావరి మధ్యలో శ్రీలక్ష్మి బోటు నిలిచిపోయింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనతో పాపికొండల బోట్లు నిర్వహణలో డొల్లతనం బయటపడింది. గండి పోచమ్మ దేవస్థానం ప్రాంగణం నుండి పాపికొండలు విహారయాత్రకు 89 మంది పర్యాటకులతో బోటు బయలుదేరింది. దేవీపట్నం పాత పోలీస్ స్టేషన్ ప్రాంతానికి వెళ్ళే సరికి సాంకేతిక లోపం తలెత్తడంతో బోటును సరంగు నిలిపివేశారు.మరో బోటులో పర్యాటకులను బోటు యజమానులు తీసుకెళ్లారు. శ్రీలక్ష్మి బోటు ఆగిపోవడంతో జలశ్రీ బోటులో పర్యాటకులను వెళ్లారని నిర్వాహకులు చెబుతున్నారు. బోట్ నిలిచిపోవడంతో పాపికొండల బోట్లు ఫిట్నెస్పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బోట్లో వద్ద తనిఖీలు నిర్వహించిన అధికారులు.. తాత్కాలికంగా పాపికొండలు టూరిజం బోట్లను నిలిపివేశారు. -
షరతుల మెలిక.. ఆక్వా సబ్సిడీకి పొగ!
అంగన్వాడీ పిలుస్తోంది ఏలూరు (టూటౌన్): ఏలూరులోని యాదవ్నగర్–2, వెంకట్రావుపేట ముస్లిం బజార్–1 కేంద్రాల్లో సూపర్వైజర్ మంగ ఆధ్వర్యంలో అంగన్వాడీ పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు. శురకవారం శ్రీ 12 శ్రీ జూన్ శ్రీ 2026సాక్షి, భీమవరం: జోన్తో నిమిత్తం లేకుండా ఆక్వా సాగు అంతటికీ రాయితీ విద్యుత్ ఇస్తామంటూ ఎన్నికల్లో ఊదరగొట్టిన కూటమి ప్రభుత్వం రెండేళ్లుగా హామీని గాలికొదిలేసింది. తాజాగా కొత్త కనెక్షన్లకు సబ్సిడీ ఇస్తామంటూనే పవర్ ఫ్యాక్టర్ 0.90 నుంచి 0.95 మధ్య ఉండాలంటూ మెలిక పెట్టింది. రూ.1.50 సబ్సిడీ విద్యుత్కు ఎగనామం పెట్టే ఎత్తుగడలో భాగమే షరతులంటూ ఆక్వా రైతుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వంలో 14,242 కనెక్షన్లకు.. గతంలో జిల్లాలో ఆక్వా సాగు విస్తీర్ణం 1.24 లక్షల ఎకరాల వరకు ఉండేది. సిండికేట్ దోపిడీ కుదేలైన ఆక్వా రంగానికి అడుగడుగునా అండగా ఉంటూ గత జగన్ సర్కారు కొత్త ఊపిరిలూదింది. ప్రపంచంలోనే రెండోదిగా ఏపీ స్టేట్ ఆక్వా డెవలప్మెంట్ అథారిటీ (అప్సడా)ని ఏర్పాటుచేసింది. టీడీపీ హయాంలో ఆక్వాజోన్లో దాదాపు 30 వేలలోపు ఎకరాలు మాత్రమే ఉంటే ఈ–ఫిష్ సర్వేతో 1.17 లక్షల ఎకరాలకు పెంచారు. సబ్సిడీపై యూనిట్ రూ.1.50లతో పాటు ఇతర రాయితీలు అందించారు. మేత, రొయ్య ధరల స్థిరీకరణ, నాణ్యమైన సీడ్, ఫీడ్ సరఫరా, ఫిష్ ఆంధ్రా ద్వారా ఆక్వా రైతులకు అండయ్యారు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి. కోవిడ్ కష్టకాలంలో సైతం సిండికేట్ దోపిడీకి అడ్డుకట్ట వేసి 100 కౌంట్ రూ.180 ఎంఎస్పీగా నిర్ణయించి అమలుచేశారు. సాగు లాభసాటిగా మారి జిల్లాలో ఆక్వా విస్తీర్ణం గణనీయంగా దాదాపు 1.34 లక్షల ఎకరాలకు పెరిగింది. గత ప్రభుత్వ కృషితో ప్రస్తుతం జిల్లాలో 14,242 విద్యుత్ కనెక్షన్లకు నెలకు దాదాపు రూ.23 కోట్ల సబ్సిడీ అందుతోంది. కూటమి వంచన : జోన్, సాగు విస్తీర్ణంతో సంబంధం లేకుండా ఆక్వా రైతులు అందరికి యూనిట్ విద్యుత్ రూ.1.50కే ఇస్తానని, 500 టన్నుల కెపాసిటీ కలిగిన కోల్డ్ స్టోరేజీలు కట్టిస్తామని, ఏరియేటర్స్పై సబ్సిడీ ఇస్తామని ఎన్నికల్లో చంద్రబాబు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా వాటిని అమలు చేయకుండా రైతులను వంచించారు. కూటమి పాలనలో సిండికేట్ ఇష్టారాజ్యంగా మారింది. దోపిడీని అడ్డుకుని ఆక్వారంగాన్ని ఆదుకోవాలని ఏడాదిన్నర కాలంగా రైతులు రోడ్డెక్కి నిరసనలు తెలుపుతున్నా ప్రభుత్వానికి పట్టడం లేదు. జిల్లాలో సుమారు 2 వేల కనెక్షన్లకు రాయితీ విద్యుత్ కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. ట్రాన్స్ఫార్మర్ ఖర్చు మూడింతలై.. గతంలో 100 కేవీఏ ట్రాన్స్ఫార్మర్తో కనెక్షన్ కోసం రూ.4.50 లక్షలు ఖర్చయితే ప్రస్తుతం రూ.13 లక్షలకు పైనే వ్యయమవుతోందని, కనెక్షన్, నిర్వహణ ఖర్చులు, పెరుగుతున్న విద్యుత్ బిల్లులతో ఇప్పటికే ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్న తరుణంలో 169 జీఓ తమపై మరింత భారం మోపుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ షరతు ఆక్వా రైతులకు ఇస్తున్న సబ్సిడీ ఎగ్గొట్టే ఎత్తుగడని విమర్శిస్తున్నారు. షరతులు ఎత్తివేయడంతో పాటు పీఎఫ్ ప్రాముఖ్యత, కెపాసిటర్లు, ఆటోమేటిక్ పీఎఫ్ కంట్రోల్పై విద్యుత్, మత్య్సశాఖ సంయుక్త ఆధ్వర్యంలో శిక్షణ, అవసరమైన పరికరాలకు సబ్సిడీ అందించి ఆక్వా రంగాన్ని ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.ఏఐ సృష్టించిన చిత్రంపవర్ ఫ్యాక్టర్పై అవగాహనలేమి తాజాగా రాష్ట్రంలోని 12 వేల కనెక్షన్లకు రాయితీ విద్యుత్ను అందిచనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. అయితే పవర్ ఫ్యాక్టర్ (విద్యుత్ వినియోగ నాణ్యత) 0.90 నుంచి 0.95 శాతం మధ్య ఉండాలని షరతు పెట్టి 169 జీఓను విడుదల చేసింది. సాధారణంగా పవర్ ఫ్యాక్టర్ (పీఎఫ్) ఒక శాతంగా ఉంటే సమర్థవంతంగా వినియోగిస్తున్నట్టు, 0.95 ఉంటే మంచి స్థాయిలో ఉన్నట్టు, 0.90 ఉంటే ఆమోదయోగ్యంగా, అంతకంటే త క్కువగా ఉంటే విద్యుత్ వృథా అవుతున్నట్టుగా భావిస్తారు. అయితే ఒక్కో ఆక్వా చెరువు రెండు నుంచి పది ఎకరాలకు పైబడి విస్తరించి ఏరియేటర్లు నడిపేందుకు గట్లు వెంబడి కిలోమీటర్లు పొడవునా కేబుల్స్ ఉంటాయి. వాటికి జాయింట్లు, విద్యుత్ సరఫరాలో హెచ్చుతగ్గులు తదితర కారణాలతో పీఎఫ్ చాలావరకు 0.90 శాతంలోపు ఉంటుందని నిపుణులు అంటున్నారు. అధిక శాతం మంది రైతులకు పీఎఫ్ అంటే ఏమిటి?, ఎలా లెక్కిస్తారు, ఎందుకు తగ్గుతుంది, ఎలా మె రుగుపర్చుకోవాలనే విషయాలపై అవగాహన ఉండదు. గతంలో విద్యుత్ బిల్లుల్లో పీఎఫ్ విలువలు స్పష్టంగా ఉండేవని, ఇప్పుడు ఆ వివరాలు కూ డా కనిపించక రైతులు అర్హత కోల్పోతున్న విషయాన్ని కూడా తెలుసుకోలేకపోతున్నారు. కూటమి ‘షాక్’ విద్యుత్ సబ్సిడీకి షరతులు రూ.1.50 విద్యుత్కు పవర్ ఫ్యాక్టర్ మెలిక విద్యుత్ నాణ్యత 0.90 నుంచి 0.95 మధ్య ఉంటేనే రాయితీ 169 జీఓ విడుదల చేసిన ప్రభుత్వం రాయితీకి ఎగనామం పెట్టేందుకేనని ఆక్వా రైతుల ఆవేదన జిల్లాలోని 1.34 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగు రాయితీ విద్యుత్ కనెక్షన్లు 16,332 విద్యుత్ సబ్సిడీ ఇవ్వాలి షరతులు కొత్త కనెక్షన్కు విద్యుత్ సబ్సిడీ పవర్ ఫ్యాక్టర్ 0.90 నుంచి 0.95 మధ్య ఉండాలి -
రెండేళ్లు.. అతీగతీ లేని హామీలు
సాక్షి ప్రతినిధి,ఏలూరు: ఆడబిడ్డ నిధి అడ్రస్ లేదు.. అర్హులందరికీ తల్లికి వందనం అందలేదు.. జిల్లా దశదిశ మార్చే అభివృద్ధి పథకాల హామీల అమలు అతీగతీ లేదు.. మామిడి నుంచి వరి వరకూ అన్నదాతలకు నిత్య సంక్షోభమే.. లెక్కకు మించి హామీలిచ్చి గద్దెనెక్కిన తర్వాత అన్నింటినీ విస్మరించిన కూటమి ప్రభుత్వ పాలనకు రెండేళ్లు నిండాయి. అక్రమ కేసులు, వేధింపుల పర్వం, ప్రతిఘటిస్తే వ్యక్తిగత ఆస్తుల ధ్వంసరచన.. ఇంతకుమించి జిల్లాలో జరిగిందేమీ లేదు. పచ్చనేతల దందా.. ఊరూరా బెల్టుషాపులతో యథేచ్ఛగా మద్యం విక్రయాలకు తెరదీశారు. చంద్రబాబు ప్రభుత్వ రెండేళ్ల పాలనకు వ్యతిరేకంగా శుక్రవారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వైఎస్సార్సీపీ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసన ర్యాలీలు నిర్వహించనున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా.. కూటమి మోసపూరిత హామీలతో జిల్లా ప్రజలు నష్టపోయిన వైనాన్ని వైఎస్సార్సీపీ శ్రేణులు నిరసనలు, సదస్సులు, రౌండ్టేబుల్ సమావేశాల ద్వారా ప్రజలకు వివరించారు. దీనిలో భాగంగా ఏలూరు ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లోని 14 నియోజకవర్గాల్లో పార్టీ సమస్వయకర్తల నేతృత్వంలో భారీ నిరసన ర్యాలీలు నిర్వహించనున్నారు. ఈ రెండేళ్లలో ఉమ్మడి జిల్లాలో కనీసం రూ.100 కోట్ల అభివృద్ధి పనులు కూడా జరగకపోవడం గమనార్హం. ఆడబిడ్డ నిధి అందలేదు నిరుద్యోగ భృతి ఊసు లేదు జాడలేని అభివృద్ధి కూటమి ప్రభుత్వరెండేళ్ల పాలనలో దౌర్జన్యకాండ నేడు వైఎస్సార్సీపీ భారీ నిరసనలు -
తణుకు స్టార్ హాస్పిటల్ సీజ్
తణుకు అర్బన్: తణుకు పరిధిలోని పైడిపర్రులో అక్రమంగా నిర్వహిస్తున్న స్టార్ ఆస్పత్రిని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులు సీజ్ చేశారు. ఎటువంటి అనుమతులు లేకుండానే సిజేరియన్లు చేస్తుండటంతోపాటు ఇటీవల బా లింత మృతి ఘటనతో డీఎంహెచ్ఓ జి.గీతా బాయ్ ఆధ్వర్యంలో రూరల్ పోలీసుల సమక్షంలో గురువారం ఆస్పత్రిని సీజ్ చేశారు. గత నెల 16న ఓ గర్భిణీకి గర్భధారణ సమయం పూర్తికాకపోయినా రహస్యంగా సిజేరియన్ చేసి ఆమె మృతికి కారకుడైన ఆస్పత్రి వైద్యుడు సుంకవల్లి పాండురంగారావుకు ఇటీవల నోటీసు లు అందజేసినా సరైన వివరణ ఇవ్వకపోవడంతోనే చర్యలు తీసుకున్నట్టు డీఎంహెచ్ఓ గీతాబాయ్ తెలిపారు. పోలీస్ విచారణ కొనసాగుతుందని ఆమె చెప్పారు. డిప్యూటీ తహసీల్దార్ శ్రీదేవి పాల్గొన్నారు. భీమవరం: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు జిల్లాకు చెందిన పలువురిని పార్టీ అనుబంధ విభాగాల్లో నియ మిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. తిరుమల విజయరామ్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు. జిల్లా అగ్నికుల క్షత్రియ విభాగం అ ధ్యక్షుడిగా తిరుమాని బాలచంద్రం, స్టూడెంట్ వింగ్ ఉపాధ్యక్షుడిగా షేక్ షఫీక్, వైఎస్సార్టీయూసీ ఉపాధ్యక్షుడిగా గంటా విజయ్కుమార్ రాజు, జనరల్ సెక్రటరీగా మల్లుల సత్యనారాయణ, సెక్రటరీలుగా తనుకుల వెంకటేశ్వరరా వు, మైలా అర్జునరావు, ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా దేవగుప్త జగదీష్ నియమితులయ్యారు. భీమవరం (ప్రకాశంచౌక్): స్థానిక ప్రభుత్వ ఐటీఐ కాలేజీలో ఈనెల 17న క్యాంప్ ప్లేస్మెంట్ డ్రైవ్ నిర్వహించనున్నట్టు కలెక్టర్ తెలిపారు. ఐటీఐ పూర్తిచేసినవారు అర్హులన్నారు. డ్రైవ్ పోస్టర్ను ఆమె ఆవిష్కరించారు. వివరాలకు సెల్ 96406 30969, 9492885556, 9618382542 నంబర్లలో సంప్రదించాలని కోరారు. జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి పి.లోకమాన్, ఐటీఐ ప్రిన్సిపాల్ ఎం.వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. తణుకు అర్బన్: గంజాయి కేసులో పరారీలో ఉన్న నిందితుడిని తణుకు ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అధికారులు అరెస్టు చేశారు. గతేడాది అక్టోబర్లో తణుకు ఉండ్రాజవరం రోడ్డులో శ్శశాన వాటిక ప్రాంతంలో ఐదు కిలోల గంజా యి రవాణా చేస్తూ పట్టుబడిన కేసులో ప్రధాన నిందితుడు తణుకు మండలం మండపాకకి చెందిన పోలవరపు కుమార శివను బుధవారం అరెస్టు చేసినట్లు ఎకై ్సజ్ సీఐ సత్తి మణికంఠరెడ్డి తెలిపారు. ఒడిసాలోని మల్కాన్గిరి నుంచి గంజాయిని తీసుకువచ్చి తణుకు ప్రాంతంలో విక్రయిస్తున్నట్టు తమ విచారణలో తేలిందన్నారు. ఇటీవల ద్విచక్ర వాహనాల చోరీలకు అలవాటుపడి కృష్ణలంక, రాజమండ్రి, ఉంగుటూరు, మారేడుమిల్లి తదితర ప్రాంతాల్లో వాహనాలు చోరీ చేశాడని చెప్పారు. గంజాయి విక్రయాలపై సమాచారం తెలిస్తే 9490874538 తమకు తెలియజేయాలని ప్రజలను కోరారు. ఎకై ్సజ్ శాఖ ఎస్సైలు బి.లక్ష్మి, ఆర్.మధుబాబు పాల్గొన్నారు. భీమవరం: జిల్లాలో ఎక్కడ మత్తుపదార్థాల ఎగుమతి, వినియోగం జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని కలెక్టర్ సీహెచ్ నాగరాణి ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్లో ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్పై జిల్లా ఎస్పీ అద్నాన్ నయీమ్ అస్మితో కలిసి సమావేశం నిర్వహించారు. డ్రగ్స్ వద్దు బ్రో అనేది స్లోగన్ కాదని జీవితాన్ని కాపాడుకునే మార్గదర్శక సూత్రం అన్నారు. ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో పటిష్ట నిఘా పెట్టామన్నారు. యోగాంధ్ర రిజిస్ట్రేషన్లపై..భీమవరం (ప్రకాశంచౌక్): జిల్లాలో యోగాంధ్ర– 2026 కార్యక్రమానికి విస్తృతస్థాయిలో రిజిస్ట్రేషన్లు చేపట్టాలని కలెక్టర్ సీహెచ్ నాగరాణి ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆమె అధికారులతో సమీక్షించారు. జిల్లాలో 4.5 లక్షల మంది పౌరులతో యోగా రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయడమే లక్ష్యమన్నారు. -
బీసీ కమిషన్కు వినతుల వెల్లువ
ఏలూరు (టూటౌన్): రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై అధ్యయనం కోసం సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం రాష్ట్ర ప్రభు త్వం ఏర్పాటుచేసిన ఏకసభ్య డెడికేటెడ్ కమిషన్ గురువారం జిల్లాలో పర్యటించింది. వి శ్రాంత ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలోని కమిషన్ సభ్యులు కలెక్టర్ కె.వెట్రిసెల్వితో కలిసి ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన స్థానిక సంస్థల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఏకీకృత కుటుంబ సర్వే సమగ్రంగా నిర్వహించి కచ్చిత సమా చారం సేకరించాలని చైర్మన్ సూచించారు. ముందుగా ఆయన జిల్లా బీసీ సంక్షేమ వర్గాల నాయకులు, ప్రతినిధుల నుంచి అర్జీలు స్వీకరించారు. జెడ్పీ చైర్పర్సన్ ఘంటా పద్మశ్రీ, రాజ్యసభ సభ్యుడు పాకా సత్యనారాయణ, రాష్ట్ర వడ్డీల సంఘ చైర్పర్సన్ ఘంటసాల వెంకటలక్ష్మి తదితరుల నుంచి అభిప్రాయాలు తెలుసుకున్నారు. కలెక్టర్ కె.వెట్రిసెల్వి, కమిషన్ కార్యదర్శి చంద్రశేఖర రాజు పాల్గొన్నారు. వినతుల్లో కొన్ని.. ● జనాభా దామాషా ప్రకారం బీసీలకు కూడా 50 రిజర్వేషన్ అన్ని రంగాల్లో కల్పించాలని ఏపీ బీసీ కులాల జేఏసీ ప్రతినిధులు కోరారు. ● బీసీ గ్రూపులోని గౌడ కులానికి స్థానిక సంస్థల్లో సబ్ కొత్తగా కల్పించాలని, లేదా బీసీ–బీ లోపల జనాభా ప్రాతిపదికన రొటేషన్ స్పష్టంగా అమలు చేయాలని ఏలూరు నగర గౌడ సంక్షేమ సంఘం ప్రతినిధులు కోరారు. ● ట్రిపుల్ టెస్ట్ ప్రక్రియ కేవలం విధాన పరమైన ప్రక్రియగా కాకుండా, బీసీల సామాజిక న్యాయం, రాజకీయ సాధికారతను బలోపేతం చేసేదిగా ఉండాలని జెడ్పీ చైర్పర్సన్ పద్మశ్రీ అభిప్రాయపడ్డారు. ● పోటీ చేయడానికి అవకాశం లేని చోట మండలపరిషత్, జెడ్పీ, మున్సిపాలిటీల్లో కో–ఆప్షన్ సభ్యులుగా విశ్వ బ్రాహ్మణులకు అవకాశం కల్పించాలని, విశ్వబ్రాహ్మణులను బీసీ–బీ నుంచి బీసీ–ఏకి మార్చాలని విశ్వబ్రాహ్మణ సంఘాల ప్రతినిధులు కోరారు. ● విద్యా, ఉద్యోగ రంగాల్లో మాదిరిగా స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ బీసీ వర్గీకరణ బీసీ–ఏ నుంచి బీసీ–ఈ వరకు అమలు చేయాలని ఏపీ నాయీ బ్రాహ్మణ వెల్ఫేర్, డెవలప్మెంట్ కా ర్పొరేషన్ డైరెక్టర్ లంకా రత్నారావు కోరారు. ● బీసీ జనాభా ప్రాతిపదికన రాజకీయ రిజర్వే షన్లు, బీసీ మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఏపీ బీసీ సంక్షేమ సంఘం ప్రతినిధులు అభ్యర్థించారు. -
సమన్వయంతో పనిచేయాలి
భీమవరం: జిల్లాలో ఖరీఫ్ సాగుకు పుష్కలంగా నీరందించేందుకు నీటిపారుదల శాఖ అధికారులు పటిష్ట చర్యలు చేపట్టాలని, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సీహెచ్ నాగరాణి తెలిపారు. భీమవరం కలెక్టరేట్లో గురువారం జిల్లా నీటిపారుదల సలహా మండలి సమావేశాన్ని నిర్వహించారు. సాగునీటి సరఫరాలో ఇబ్బందులు తొలగించాలని, మున్సిపల్ డ్రైనేజీ నీరు, ఇతర వ్యర్థాలు పంట కాలువల్లో కలవకుండా చూడాలన్నారు. సమావేశంలో భీమవరం ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా డెల్టా ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ కె.మురళీకృష్ణరాజు, వైస్ చైర్మన్ గుబ్బల మార్రాజు, డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్లు, సాగునీటి సంఘాల అధ్యక్షులు, ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు. -
ధ్వంసమైన క్యూలైన్ల పైకప్పు
ద్వారకాతిరుమల: శ్రీవారి క్షేత్రం నూతన అనివెట్టి మండపం పక్కన క్యూలైన్లలోని పైకప్పు ఈదురుగాలులకు ధ్వంసమైంది. గురువారం మరమ్మతులు చేపట్టారు. ఆక్వా రైతుకు ఇచ్చే విద్యుత్ సబ్సిడీలో కొరివి పెట్టకుండా, ఆంక్షలు లేకుండా ప్రతి రైతుకూ న్యాయం చేయాలి. గతంలో కూడా ఇలానే ఆక్వా రైతులకు హామీలు ఇచ్చినా రెండేళ్లలో అమలు చేయలేదు. ఇప్పుడు ఇదేదో ఆక్వా మేతలు పెంచుకునేందుకే డైవర్షన్ పాలిటిక్స్ లాగా ఉంది తప్ప ఆక్వా రైతుకు మేలు జరిగేలా లేదు. –పెనుమత్స దుర్గాప్రసాద్రాజు, ఆక్వా రైతు ఆక్వా రైతులకు ఎటువంటి షరతుల లేకుండా విద్యుత్ సబ్సిడీ అందించాలి. అసలే ఫీడు, సీడు ధరలు పెరిగి నష్టాల బారిన పడుతున్నాం. ఆక్వా రైతులను ఆదుకోవాల్సిన తరుణంలో ప్రభుత్వ పవర్ ఫ్యాక్టర్ అంటూ ఏదో చెబుతున్నారు. ఆక్వా రైతులను నిష్పక్షపాతంగా ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. రూ.1.50కే సబ్సిడీ విద్యుత్ను అందించాలి. – కర్రి వెంకటేశ్వరరెడ్డి, ఆక్వా రైతు -
ప్రయాణ ఇక్కట్లు ఇంకెనాళ్లు?
ఉండి: ఉండి కాలువలో జాతీయ రహదారి రక్షణ కోసం చేపట్టిన రివిట్మెంట్ వాల్ (రక్షణ గోడ) నిర్మాణ పనుల వల్ల ప్రయాణికులు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత నెల ద్వితీయార్ధంలో ప్రారంభమైన ఈ పనుల కోసం జాతీయ రహదారిని, పంట కాలువను అధికారులు మూసివేశారు. పనులు పూర్తిస్థాయిలో ముగిసి, రాకపోకలు యథావిధిగా సాగడానికి మరో నెల రోజులకు పైగా సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు వెల్లడిస్తున్నారు. ఉండి మండల శివారు, చెరుకువాడ సరిహద్దుల నుంచి ఆకివీడు మండలం అజ్జమూరు పరిధి వరకు ఈ రక్షణ గోడ నిర్మాణం జరుగుతోంది. ప్రస్తుతం ఈ పనులు ప్రాథమిక దశ దాటి కొంత ముందుకు సాగినప్పటికీ, క్షేత్రస్థాయి సమస్యల వల్ల పనుల్లో తీవ్ర ఆలస్యం జరుగుతుంది. మట్టి ఊటతో పనులకు ఆటంకం ఒకవైపు పంట కాలువ, మరోవైపు ఆక్వా చెరువులు ఉండటంతో కాలువ తవ్విన ప్రాంతంలో చెరువుల నుంచి నీరు ఊరుతోంది. దీనికి తోడు కాలువ గట్టే చెరువు గట్టుగా ఉండటం, అధికారులు దీనిపై ముందస్తు శ్రద్ధ తీసుకోకపోవడంతో గట్టు జారి మట్టి తిరిగి కాలువలోకి వచ్చేస్తోంది. ఈ మట్టిని పదే పదే తొలగించాల్సి రావడం వల్లే రక్షణ గోడ పనులు మందగించాయని తెలుస్తోంది. ప్రయాణికుల నరకయాతన.. అదనపు భారం గతంలో ఉండిలో ఆర్ఓబీ నిర్మాణ సమయంలో రైల్వేగేటు కొన్ని రోజులు మూసివేస్తేనే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు ఏకంగా జాతీయ రహదారినే మూసివేయడంతో ప్రయాణికుల అవస్థలు వర్ణనాతీతంగా మారాయి.పనులు అనుకున్నట్లు జరిగితే ఈ నెల 20వ తేదీ నాటికి రహదారిని కొద్దిగా తెరుస్తామని అధికారులు చెబతున్నా అది సాధ్యమేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం కేవలం ద్విచక్ర వాహనదారులు మాత్రమే మట్టి దిబ్బలు ఎక్కుతూ ప్రమాదకరంగా ప్రయాణిస్తున్నారు. సాధారణ ప్రయాణికులు, ఆటోలు కూడా వెళ్లే పరిస్థితి లేదు. ఉండి, ఆకివీడు వైపుల నుంచి వచ్చేవారు పనులు జరిగే ప్రాంతం వరకు వచ్చి, కాలినడకన ఆ ప్రాంతాన్ని దాటి అవతలి వైపు మరో ఆటో ఎక్కాల్సి వస్తోంది. దీంతో ఆటో డ్రైవర్లు ఇష్టారాజ్యంగా చార్జీలు వసూలు చేస్తున్నారు. 10 కిలోమీటర్ల మేర అదనపు ప్రయాణం భీమవరం నుంచి ఆకివీడు మీదుగా కై కలూరు, ఏలూరు తదితర ప్రాంతాలకు వెళ్లే కార్లు, ఇతర భారీ వాహనాలు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాల్సి వస్తోంది. భీమవరం నుంచి జువ్వలపాలెం రోడ్డు మీదుగా వెళ్లి, అక్కడ ఏలూరుపాడు వంతెన నుంచి ఐ.భీమవరం మీదుగా ఆకివీడు చేరుకుంటున్నారు. దీనివల్ల సాధారణ మార్గం కంటే సుమారు 10 కిలోమీటర్ల మేర అదనంగా ప్రయాణించాల్సి వస్తోందని, సమయంతో పాటు ఇంధనం వృథా అవుతోందని వాహనదారులు వాపోతున్నారు. సాగు, తాగునీటికీ ముప్పు కాలువలకు నీరు విడుదల చేసి వారం రోజులు గడుస్తున్నా.. చెరుకువాడ, దాని శివారు గ్రామాలకు పూర్తిస్థాయిలో సాగు, తాగునీరు అందడం లేదు. సాధారణంగా ఇక్కడి నుంచి ప్రవహించే నీరు అజ్జమూరు మురుగు కాలువలోకి వెళ్లాలి. కానీ, పనులు జరుగుతున్న ప్రాంతంలో అడ్డుకట్ట వేయడం వల్ల, ఉండి అక్విడెక్టు వద్ద పంట కాలువ నీటిని బొండాడ మేజర్ డ్రెయిన్లోకి విడిచిపెడుతున్నారు. ఫలితంగా కలిసిపూడి, చెరుకువాడ ప్రాంతాలకు నీటిమట్టం తగ్గి, పొలాలకు నీరందడం లేదు. నాణ్యతపై అనుమానాలు.. ప్రభుత్వం, అధికారులు ముందుచూపుతో వ్యవహరించి కాలువలు మూసి ఉంచిన సమయంలోనే ఈ పనులు ప్రారంభించి ఉంటే.. నీటి విడుదలకు ముందే పనులు పూర్తయ్యేవి. ఒకవైపు రక్షణ గోడ కడుతుండగానే జాతీయ రహదారి కుంగిపోవడం, మరోవైపు ఆక్వా చెరువుల వల్ల గట్లు జారిపోతుండటంతో భవిష్యత్తులో ఈ కట్టడం సురక్షితమేనా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నీరు ప్రవహిస్తున్న సమయంలోనే పనులు చేస్తుండటంతో రక్షణ గోడ నాణ్యతపై కూడా స్థానికులు పెదవి విరుస్తున్నారు. ఉండి కాలువ రివిట్మెంట్ వాల్ నిర్మాణంలో తీవ్ర జాప్యం మట్టి కొట్టుకుపోతుండటంతో మందగించిన పనులు 10 కిలోమీటర్లు అదనంగా ప్రయాణంరక్షణ గోడ నిర్మాణానికి సంబంధించి మే మొదటి వారంలోనే మట్టి పరీక్షలు ప్రారంభించాం. కాంట్రాక్ట్ అగ్రిమెంట్ పూర్తయిన తర్వాతే పనులను వేగవంతం చేశాం. పనులు పూర్తిస్థాయిలో ముగియడానికి మరో నెల రోజులు పట్టవచ్చు. అయితే, ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ నెల 20 నాటికి జాతీయ రహదారిపై రాకపోకలను తాత్కాలికంగా పునరుద్ధరిస్తాం. పనులన్నీ త్వరితగతిన, నాణ్యతతో పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటున్నాం. – సబీరా సుల్తానా, ఎన్హెచ్ ఏఈ -
1.2 కిలోల బంగారం మాయం
కొనసాగుతున్న గోల్డ్ ఖాతాల పరిశీలన జంగారెడ్డిగూడెం: జంగారెడ్డిగూడెం బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రాంచ్లో ఖాతాదారుల కుదవ పెట్టిన బంగారం ఇంతవరకూ 1210 గ్రాములు(1.21 కిలోలు) స్వాహా అయినట్లు గుర్తించారు. మంగళవారం రాత్రి వరకూ ఖాతాలను పోలీసుల సమక్షంలో బ్యాంకు అధికారులు పరిశీలించారు. మరోవైపు ఖాతాదారులు మంగళవారం రాత్రి రాష్ట్ర ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. బంగారు వస్తువుల ఖాతాల పరిశీలనలో తీవ్ర జాప్యం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో సీఐ ఎంవీ సుభాష్, ఎస్సై ఎన్వీ ప్రసాద్ ఖాతాదారులకు సర్ధిచెప్పారు. రాత్రి పొద్దుపోయే వరకు ఖాతాల పరిశీలన జరుగుతూనే ఉంది. పెద్ద ఎత్తున బంగారం మాయం కావడంతో ఖాతాదారులంతా తీవ్ర ఆందోళనలో ఉన్నారు. సుమారు 2,800 ప్యాకెట్లు అధికారులు పరిశీలించాల్సి ఉందని తెలుస్తోంది. ఈ నెల 6న బ్యాంక్ ఆఫ్ బరోడాలో ముగ్గురు ఖాతాదారులకు సంబంధించి 30 కాసుల(240 గ్రాముల) బంగారం మాయమైంది. దీంతో ముగ్గురు ఖాతాదారులు బ్యాంకు అధికారులకు ఫిర్యాదు చేశారు. అదే రోజు రాత్రి వరకు విషయం తెలుసుకున్న ఖాతాదారులు ఆందోళనకు దిగారు. సోమవారం ఉదయం వరుసగా టోకెన్లు ఇచ్చి ఖాతాదారులు బ్యాంకులో కుదువ పెట్టిన బంగారాన్ని పోలీసుల సమక్షంలో చూపించారు. ఖాతాదారులకు సంబంధించి 118 ప్యాకెట్లలోని బంగారు వస్తువులలో 8 ప్యాకెట్లకు సంబంధించి సుమారు 350 గ్రాముల బంగారం మాయం అయినట్లు గుర్తించారు. లాకర్లో ఉన్న బంగారం మాయం అవడంపై బ్యాంకు సిబ్బంది పాత్రపై కూడా ఖాతాదారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బంగారం మాయం ఘటనలో బ్యాంకులో పనిచేసే అప్రయిజర్ పాత్ర కీలకం కాగా, గత కొద్ది రోజులుగా అప్రయిజర్ బ్యాంకుకు రావడం లేదు. ఖాతాదారులు ఎక్కువ బంగారం పెట్టి తక్కువ రుణం పొందిన ఖాతాల నుంచే ఎక్కువ శాతం బంగారం మాయమైంది. రెన్యువల్ చేసిన ఖాతాల నుంచి కూడా బంగారం మాయమైంది. ఖాతాదారులకు తాము పెట్టిన బంగారం మొత్తం పత్రాలపై చూపించి, బ్యాంకులో ఉండే పత్రాలపై మాత్రం తక్కువ బంగారం చూపించడం అనుమానాలకు తావిస్తోంది. -
కొల్లేరు సమస్యలను శాశ్వతంగా పరిష్కరిస్తాం
కై కలూరు: కొల్లేరు ప్రాంత సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతానని కై కలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ అన్నారు. తొలి అడుగు పేరుతో కొల్లేరు నాయకుడు బలే ఏసురాజు ఆధ్యరంలో కై కలూరు సీతారామఫంక్షన్ హాలులో ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల కొల్లేరు గ్రామ పెద్దలతో మంగళవారం సమావేశం నిర్వహ/ంచారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కామినేని మాట్లాడుతూ త్వరలో సుప్రీంకోర్టు నుంచి శుభవార్త వస్తుందని భావిస్తోన్నామన్నారు. ఫోన్లో ఎంపీ పుట్టా మహేష్ యాదవ్తో మాట్లాడించారు. ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ మాట్లాడుతూ పవన్ కల్యాణ్ త్వరలో కొల్లేరుపై చర్చిస్తారని తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర వడ్డీ కార్పొరేషన్ చైర్పర్సన్ ఘంటసాల వెంకటలక్ష్మీ, మాజీ ఎమ్మెల్సీ కమ్మిలి విఠల్రావు, జిల్లా అటవీశాఖ అధికారి త్రిమూర్తులురెడ్డి, ఆర్డీఓ లక్ష్మీప్రసన్న తదితరుల పాల్గొన్నారు. తణుకు అర్బన్: పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ, వామపక్షాల రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా మంగళవారం తణుకు నరేంద్ర సెంటర్లో సీపీఐ, సీపీఎం ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు మాట్లాడుతూ పెట్రల్, డీజిల్ ధరల పెంపుతో సరుకు రవాణా ఛార్జీలు పెరిగి అన్ని నిత్యావసర వస్తువులు ధరలు ఆకాశాన్నంటి ప్రజల జీవనం దుర్భంరంగా మారుతుందన్నారు. దేశంలోని ప్రస్తుత దుస్థితికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాలనా వైఫల్యమే కారణమని విమర్శించారు. కార్యక్రమంలో సీపీఐ తణుకు పట్టణ కార్యదర్శి బొద్దాని నాగరాజు, గార రంగారావు, జి.గోపి, బండి సత్యనారాయణ, నాగరత్నం తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం: బ్యాంక్ ఆఫ్ బరోడాలో బంగారం మాయం కావడంతో ఆందోళనలో ఉన్న ఖాతాదారులకు వైఎస్సార్సీపీ అండగా నిలిచింది. జంగారెడ్డిగూడెంలో మంగళవారం బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంకు వద్ద ఖాతాదారులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ పార్లమెంట్ పరిశీలకులు, రాష్ట్ర కార్యదర్శి జెట్టి గురునాథరావు బ్యాంకు వద్దకు చేరుకుని బాధితులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాధితుల తెలిపిన వివరాలు ప్రకారం ఇప్పటికే రూ.కోటి విలువైన బంగారం మాయమైనట్లు తెలుస్తోందన్నారు. దీనిపై బ్యాంకు అధికారులు సమగ్ర విచారణ చేసి ఖాతాదారులకు న్యాయం చేయాలన్నారు. దీనిపై బ్యాంక్ ఆఫ్ బరోడా ఆర్ఎం, పోలీస్ అధికారులతో మాట్లాడానని జెట్టి తెలిపారు. ఆర్ఎం స్పందిస్తూ ప్రస్తుతం బ్యాంకులో బంగారం రుణాలపై విచారణ జరుగుతోందని, ప్రతి ఖాతాదారుడికి న్యాయం చేస్తామని, ఇది పూర్తిగా బ్యాంకు బాధ్యత అని తెలిపారన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పిటిసి సభ్యులు ముప్పిడి శ్రీనివాసరావు, వీరవల్లి సోమేశ్వరరావు, ఉడా నాగేంద్ర కుమార్, గగ్గల కిరణ్ కుమార్, జుత్తిగ ప్రసాద్, పిల్లి రామకృష్ణ, కడిమి కిరణ్ పాల్గొన్నారు. మద్యం మత్తులో ఉన్న వ్యక్తి నుంచి బంగారం చోరీ ఏలూరు టౌన్: మద్యం మత్తులో ఉన్న వ్యక్తి నుంచి బంగారం, సెల్ఫోన్ చేరీ చేసిన ఘటన మంగళవారం ఏలూరులో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం ఏలూరు అశోక్నగర్ ప్రాంతానికి చెందిన పర్వతనేని సాయినవీన్ బీటెక్ పూర్తి చేసి ఖాళీగా ఉంటున్నాడు. నవీన్ తన స్నేహితుడితో కలిసి దేవి బార్ అండ్ రెస్టారెంట్కు మద్యం తాగేందుకు వెళ్లాడు. మద్యం తాగుతున్న సమయంలోనే నవీన్కు అతడి స్నేహితునికి మద్య చిన్న వివాదం ఏర్పడటంతో బార్ నుంచి అతను వెళ్లిపోయాడు. నవీన్ ఒక్కడే బార్ నుంచి బయటకు వచ్చాడు... ఇదే సమయంలో మోటారు సైకిల్పై వేచి ఉన్న ఇద్దరు వ్యక్తులు అతడిని అశోక్ నగర్లో దించుతామని చెప్పి ఎక్కించుకున్నారు. అయితే వారు చొదిమెళ్ల వైపు తీసుకువెళ్తూ గట్టిగా అరవకుండా నోరు మూసేశారు. అతడి వద్ద నుంచి బంగారు ఆభరణాలు, సెల్ఫోన్ తీసుకుని ఉడాయించారు. ఇద్దరు వ్యక్తులు పారిపోతూ వంగూరు వెళదామని చెప్పుకోవటం తాను విన్నానని నవీన్ ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ మేరకు ఏలూరు టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. భీమవరం (ప్రకాశంచౌక్): యోగాంధ్ర–2026 కార్యక్రమాన్ని జిల్లాలో విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి సూచించారు. మంగళవారం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి జిల్లాలోని ఆర్డీఓలు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, నియోజకవర్గ ప్రత్యేక అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, వివిధ శాఖల జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా యోగాంధ్ర–2026 కార్యక్రమంపై సమీక్షించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 4.5 లక్షల మంది పౌరులతో యోగ రిజిస్ట్రేషన్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయడం లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. జూన్ 13న నరసాపురం వలందర్ రేవు వద్ద 1000 మందితో, జూన్ 14న వాసవి పెనుగొండలో 2500 మందితో, జూన్ 19న స్పోర్ట్స్ అథ్లెటిక్స్ మైదానంలో 1500 మందితో ప్రత్యేక యోగా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అంతేకాకుండా జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లాస్థాయిలో 1500 మందితో మెగా యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. తాడేపల్లిగూడెం రూరల్: మండలంలో మద్యం సేవిస్తూ ఇతరులకు ఇబ్బందులు కలిగిస్తున్న పది మందిని అదుపులోకి తీసుకున్నట్లు రూరల్ ఎస్సై రవికుమార్ మంగళవారం విలేకరులకు ప్రజాప్రదేశాల్లో మద్యం సేవించడం, గొడవలు చేయడం, అసభ్యంగా ప్రవర్తించడం, ప్రజాశాంతి భద్రతలకు భంగం కలిగించడం వంటివి చట్టరీత్యా శిక్షార్హమని హెచ్చరించారు. -
పంట బోదెలో గుర్తు తెలియని మృతదేహం లభ్యం
కాళ్ల: ఆకివీడు శివారు ఐ.భీమవరం రోడ్డులో ఉన్న దుంపగడప పంట బోదెలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కనుగొన్నట్లు ఆకివీడు ఎస్సై హనుమంతు నాగరాజు మంగళవారం విలేకరులకు తెలిపారు. ఆయన తెలిపిన వివరాలు ప్రకారం పంట బోదెలో 35 సంవత్సరాల వయసు ఉన్న పురుషుని మృతదేహం బోర్లా పడి ఉండడాన్నీ కనుగొన్నామన్నారు. నీలిరంగు ఫ్యాంటు, గోధుమ రంగు చారలు షర్టు కలిగి ఉన్నారని ఆయన వివరించారు. వెంకయ్య–వయ్యేరు కాలువలో నీటి ప్రవాహంలో కొట్టుకుని వచ్చి పంట బోదెలోకి వచ్చి ఉంటుందని భావిస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఆయన వివరించారు. కామవరపుకోట: మండలంలో అంకాలంపాడు, కామవరపుకోట కోత్తూరు పరిసర ప్రాంతాల్లో సోమవారం రాత్రి పొలాల్లో బోరు మోటర్ కేబుల్ వైర్లు గుర్తుతెలియని వ్యక్తులు దొంగలించి వెళ్లినట్లు రైతులు తెలిపారు. దీనిపై మంగళవారం పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు తెలిపారు. ఈ వైర్లు సుమారు రూ.2 లక్షల రూపాయలు పైగా ఉంటుందని రైతులు తెలిపారు. గతంలో కూడా ఇలాగే ట్రాన్స్ఫార్మర్ వైర్లు, మోటర్ వైర్లు దొంగతనానికి గురైనట్లు రైతులు పేర్కొన్నారు. -
వెన్నుపోటుకు కేరాఫ్ చంద్రబాబు
టిప్పర్ లారీ బోల్తా ఉంగుటూరు మండలంలోని రాచూరు వద్ద టిప్పరు లారీ తిరగపడి వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. మోటారు సైక్లిస్టును తప్పించబోయి టిప్పర్ తిరగబడింది. 8లో uముసునూరు మండలంలోని వలసపల్లి గ్రామంలో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని అధికారులు సీజ్ చేసి కేసులు నమోదు చేశారు. 8లో uబుధవారం శ్రీ 10 శ్రీ జూన్ శ్రీ 2026సాక్షి, భీమవరం: సూపర్ సిక్స్ అన్నారు.. అధికారమే పరమావధిగా చంద్రబాబు, పవన్న్ కల్యాణ్లు అలవికాని హామీలెన్నో ఇచ్చారు. సంక్షేమ పథకాలకు తూట్లు పొడిచి వృద్ధులు, ఆడ బిడ్డలు, నిరుద్యోగులు, కర్షకులు, కార్మికులు.. అన్ని వర్గాల వారిని నిలువునా వంచించారు. విద్య, వైద్య రంగాలను నిర్వీర్యం చేసి పేదలపై భారం మోపారు. చంద్రబాబు రెండేళ్ల పాలన వైఫల్యాలపై ప్రజల్లో నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన రౌండ్ టేబుల్ సమావేశాలకు అపూర్వ స్పందన వచ్చింది. వివిధ వర్గాల ప్రజలు పాల్గొని కూటమి తీరును ఎండగట్టారు. ● నరసాపురంలో.. పార్టీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు ఆధ్వర్యంలో నరసాపురంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు రౌండ్ టేబుల్ సమావేశానికి అధిక సంఖ్యలో పార్టీ శ్రేణులు, వివిధ వర్గాల ప్రజలు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలు, రెండేళ్లలో సాగించిన అరాచకాలు, దౌర్జన్యాలపై సమావేశంలో చర్చించారు. ప్రసాదరాజు మాట్లాడుతూ జగన్ కంటే ఎక్కువ మేలు చేస్తామని ఎన్నికల్లో అబద్ధపు హామీలు ఇచ్చి గద్దెనెక్కిన చంద్రబాబు అభివృద్ధి సంక్షేమాన్ని పూర్తిగా గాలికి వదిలేశారన్నారు. పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు పీడీ రాజు, ఎంబీసీ కార్పోరేషన్ మాజీ చైర్మన్ పెండ్ర వీరన్న, సోషల్ మీడియా వింగ్ జిల్లా అధ్యక్షుడు బందన పూర్ణచంద్రరావు, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ బర్రె శ్రీవెంకటరమణ పాల్గొన్నారు. ● పాలకొల్లులో.. నియోజకవర్గ ఇన్చార్జి గుడాల శ్రీహరిగోపాలరావు ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశానికి పార్లమెంట్ పరిశీలకుడు ముదునూరి మురళీకృష్ణంరాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కూటమి రెండేళ్లలో రాష్ట్ర ప్రజలకు చేసిన వంచనపై సమావేశంలో చర్చించారు. మురళీకృష్ణంరాజు మాట్లాడుతూ అన్ని వర్గాల వారికి శఠగోపం పెట్టిన కూటమి పాలనకు రోజులు దగ్గర పడ్డాయని ఎన్నికలు ఎప్పుడు వచ్చినా, ఎన్నిక ఏదైనా గట్టిగా గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. గోపి మాట్లాడుతూ ప్రచార ఆర్భాటానికే స్థానిక మంత్రి నిమ్మల రామానాయుడుకు సమయం సరిపోవడం లేదని ఇక ప్రజా సమస్యల పరిష్కారానికి టైం ఎక్కడ ఉంటుందని విమర్శించారు. నియోజకవర్గ పరిశీలకుడు పేరిచర్ల వెంకట నరసింహరాజు, పార్టీ ముఖ్య నేతలు గుణ్ణం నాగబాబు, మేకా శేషుబాబు, చెల్లెం ఆనందప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు. ● భీమవరంలో.. నియోజకవర్గ సమన్వయకర్త చినమిల్లి వెంకటరాయుడు ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశానికి పార్లమెంట్ సమన్వయకర్త గూడూరి ఉమాబాల, అధిక సంఖ్యలో పార్టీ శ్రేణులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉమాబాల మాట్లాడుతూ సంపద సృష్టించి పేదలకు పంచుతానని ఎన్నికల్లో చెప్పుకొచ్చిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ప్రజాధనాన్ని తన సిండికేటుకు దోచిపెడుతున్నారన్నారు. వెంకటరాయుడు మాట్లాడుతూ మహిళలు, నిరుద్యోగులు, రైతులు అన్ని వర్గాల వారిని కూటమి వంచించి పాలన సాగిస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర కార్యదర్శులు ఏఎస్ రాజు, మేడిది జాన్సన్, యూత్ విభాగం జిల్లా అధ్యక్షుడు చిగురుపాటి సందీప్, రాష్ట్ర మహిళా కార్యదర్శి పాలవెల్లి మంగ తదితరులు పాల్గొన్నారు. ● తాడేపల్లిగూడెంలో.. నియోజకవర్గ ఇన్చార్జి వడ్డి రఘురామ్నాయుడు ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెంలోని గమిని ఫంక్షన్హాల్లో ఏర్పాటుచేసిన రౌండ్ టేబుల్ సమావేశానికి అపూర్వ స్పందన వచ్చింది. కూటమి ప్రభుత్వం చేసిన మోసాలు, అరాచకాలు, ఆర్ధిక దుర్వినియోగంపై ఫోటో ఎగ్జిబిషనన్ ఏర్పాటుచేశారు. కూటమి పాలనను నిరసిస్తూ రఘురామ్ నాయుడు పార్టీ శ్రేణులతో కలిసి నల్లబెలూన్లు ఎగురవేసి నిరసన తెలిపారు. వివిధ వర్గాల ప్రజలు పాల్గొని కూటమి పాలన వైఫల్యాలను ఎండగట్టారు. ఈ సందర్భంగా రఘురామ్ మాట్లాడుతూ సంపద సృష్టించి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేస్తానన్న 40 ఇయర్స్ ఇండస్ట్రీ, రెండేళ్లలోనే రూ. 3.47 లక్షల కోట్లు అప్పులు తెచ్చినా ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ● ఉండిలో.. పెదఅమిరంలోని పార్టీ కార్యాలయంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు. కూటమి పాలనలో అఘాయిత్యాలు, దౌర్జన్యాలకు సంబంధించిన పోస్టర్స్ను ప్రదర్శించారు. జిల్లా ఉపాధ్యక్షుడు పెన్మెత్స ప్రసాదరాజు మాట్లాడుతూ నమ్మిన వారిని వెన్నుపోటు పొడవడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్యని, ఎన్నో ఏళ్లుగా ఆయన ప్రజలను మోసం చేస్తూనే ఉన్నారన్నారు. సూపర్ వంచనగా కూటమి రెండేళ్ల పాలన హామీలు తుంగలోకితొక్కి పేదల్ని నట్టేట ముంచారని మండిపాటు నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీ రౌండ్టేబుల్ సమావేశాలు ప్రజావ్యతిరేక పాలనపై గళం విప్పిన జనం -
ఉపాధ్యాయులకు టెట్ గండం
సుప్రీంకోర్టు తాజా తీర్పు ప్రస్తుతం పనిచేస్తున్న ఉపాధ్యాయుల పాలిట గొడ్డలి పెట్టు లాంటిది. టెట్ నిబంధనను అధిగమించడానికి పార్లమెంట్లో చట్టసవరణ చేస్తేనే మేలు జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం నూతన విద్యా విధానంలోని నిబంధనలను సవరించడం ద్వారా ఉపాధ్యాయులకు ఉపశమనం కలిగించవచ్చు. ఉపాధ్యాయుల బోధనా నైపుణ్యాలను కేవలం టెట్ పరీక్షలతో కొలవలేము. – గెడ్డం సుధీర్, వైఎస్ఆర్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధికార ప్రతినిధి. ఇన్ సర్వీస్ టీచర్లు టెట్ అర్హత సాధించాలనడం ఎంతమాత్రం సహేతుకం కాదు. దాదాపు 20 సంవత్సరాల పాటు ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతున్న వారు ఇప్పటికిప్పుడు తమను తాము నిరూపించుకోవాల్సిన అవసరం ఏముంది? కొన్ని అర్హతా ప్రమాణాల మేరకు అప్పట్లోనే ఉద్యోగాలు పొందిన వారికి, దశాబ్దాల తర్వాత మరోసారి అర్హత పరీక్షలు నిర్వహించి తీరాలనడం ప్రపంచంలో ఎక్కడా లేదు. – పువ్వుల ఆంజనేయులు, పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు. ఏలూరు (ఆర్ఆర్పేట): ఉపాధ్యాయులకు ప్రస్తుతం విషమ పరీక్ష ఎదురైంది. 2010వ సంవత్సరానికి ముందు ఉపాధ్యాయ వృత్తిలో ప్రవేశించిన వారు కూడా ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) సాధించాల్సిందేనని సుప్రీంకోర్టు తీర్పునివ్వడం ఉపాధ్యాయులను కలవరపెడుతోంది. దాదాపు 16 నుండి 25 సంవత్సరాల పాటు ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతూ, ఎందరో విద్యార్థులను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దిన వారే ప్రస్తుతం పరీక్షలను ఎదుర్కోవాల్సి రావడం గమనార్హం. అప్పటి కాలమాన పరిస్థితులకు అనుగుణంగా నిర్వహించిన అన్ని అర్హత పరీక్షల్లో నెగ్గి ఉద్యోగం సాధించిన తాము, ఇప్పుడు తిరిగి తమను తాము నిరూపించుకోవాలని నిబంధన విధించడాన్ని ఉపాధ్యాయ వర్గాలు జీర్ణించుకోలేకపోతున్నాయి. పరీక్షల విధానంలో వచ్చిన మార్పులు, కంప్యూటర్ ఆధారిత పరీక్షల నిర్వహణపై తమలో కొందరికి అసలు అవగాహనే లేదని, ఈ పరిస్థితుల్లో పరీక్షలు ఎలా రాయగలమని వారు ప్రశ్నిస్తున్నారు. ఎంతోకాలంగా పాఠాలు బోధిస్తున్న తమకు ఇప్పుడు ‘టెట్’ నిర్వహించడం ఏమిటంటూ ఉపాధ్యాయులు, సంఘ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టెట్ అర్హత సాధించాల్సిందే.. అసలే విద్యారంగంలో సంస్కరణల పేరుతో ప్రభుత్వం తీసుకొస్తున్న మార్పులు ఉపాధ్యాయులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఏ రాష్ట్రంలో లేని విధంగా 1 నుండి 10వ తరగతి వరకు 9 రకాల పాఠశాలల విధానాన్ని తీసుకువచ్చారు. ఇప్పటికే పలు రకాల యాప్ల వినియోగంతో టీచర్లు మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. ఇది చాలదన్నట్లు, ఇప్పుడు 2010కి ముందు ఉద్యోగంలో చేరిన ఉపాధ్యాయులు కూడా ‘టెట్’ పాస్ కావాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఏదో ఒక సబ్జెక్టులో నైపుణ్యం సాధించి, ఆ సబ్జెక్టుపై విద్యార్థులకు పాఠాలు బోధించే తాము.. ప్రస్తుతం అన్ని సబ్జెక్టులు కలిపి నిర్వహించే ‘టెట్’ పరీక్షలో ఉత్తీర్ణులు కావాలనడం దారుణమని వారు వాపోతున్నారు. ప్రత్యేక టెట్ నిర్వహించాలని డిమాండ్ టెట్ పరీక్షను 150 మార్కులకు నిర్వహించనున్నారు. ఇందులో అర్హత సాధించాలంటే: ఓసీ కేటగిరీవారు 60 శాతం మార్కులు, బీసీ కేటగిరీ 50 శాతం మార్కులు, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్సీ, ఎక్స్–సర్వీస్మెన్ కేటగిరీ 40 శాతం మార్కులు సాధించాలి. టెట్ పాస్ కావాలంటే తెలుగు, ఇంగ్లీష్, గణితం, చైల్డ్ డెవలప్మెంట్, పర్యావరణ శాస్త్రం వంటి అంశాలన్నీ చదవాల్సి ఉంటుంది. బయలాజికల్ సైన్స్ ఉపాధ్యాయులకు గణితం, తెలుగు పండితులకు సోషల్ స్టడీస్ వంటి సంబంధం లేని సబ్జెక్టులను టెట్లో పెట్టడం వల్ల పాస్ కావడం ఎలా అని టీచర్లు ప్రశ్నిస్తున్నారు. అందుకోసమే ప్రస్తుతం పనిచేస్తున్న ఇన్–సర్వీస్ ఉపాధ్యాయుల కోసం ‘ప్రత్యేక టెట్’ నిర్వహించాలని ఉపాధ్యాయ సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. అలాగే అన్ని కేటగిరీల ఉపాధ్యాయులకూ ఉత్తీర్ణత మార్కులను 35 శాతానికి తగ్గించాలని కోరుతున్నారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో, ఐదేళ్లకు పైబడి సర్వీసు ఉన్న ఉపాధ్యాయులు రెండేళ్లలోపు టెట్ రాసి ఉత్తీర్ణత సాధించాలి. లేనిపక్షంలో ఉద్యోగం వదులుకోవాల్సిన పరిస్థితి వస్తుందేమోననే ఆందోళన గురువులను వెంటాడుతోంది. దీనికి తోడు టెట్ పాస్ కాని వారికి పదోన్నతులతో (ప్రమోషన్లు) పాటు నియామకాలు కూడా ఉండవని కోర్టు తీర్పులో పేర్కొంది. ఐదేళ్లలోపు సర్వీస్ మిగిలి ఉన్న ఉపాధ్యాయులకు టెట్ నుండి మినహాయింపు ఇచ్చినప్పటికీ, వారికి పదోన్నతులు కావాలంటే టెట్ ఉత్తీర్ణత తప్పనిసరి చేశారు. ఈ నిబంధన కారణంగా జిల్లాలో 2010వ సంవత్సరానికి ముందు ఉద్యోగాల్లో ప్రవేశించిన సుమారు 6 వేల మంది ఉపాధ్యాయులు ఇప్పుడు టెట్ రాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ టెట్ నిబంధనను ఉపసంహరించాలని గత ఏడాది కాలంగా దేశవ్యాప్తంగా ఉపాధ్యాయులు ఆందోళనలు నిర్వహించడంతో పాటు, సుప్రీంకోర్టు ఈ నిబంధనను పునఃపరిశీలించాలని కోరుతూ రివ్యూ పిటిషన్లు కూడా దాఖలు చేశారు. దీనిపై మరోసారి విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. గత మే నెల 29వ తేదీన తుది తీర్పు ఇస్తూ ఉపాధ్యాయులు తప్పనిసరిగా టెట్ అర్హత సాధించాల్సిందేనని నొక్కి చెప్పింది. అయితే, గతంలో ఇచ్చిన గడువును మరో ఏడాది పెంచుతూ, అంటే 2028 ఆగస్టు 31వ తేదీలోగా పూర్తి చేయాలని కొద్దిగా సడలింపు ఇవ్వడం ఒక్కటే ఉపాధ్యాయులకు స్వల్ప ఉపశమనం కలిగించే అంశం. సుప్రీంకోర్టు తీర్పుతో గురువుల్లో మళ్లీ మొదలైన టెన్షన్ జిల్లాలో సుమారు 6 వేల మంది టెట్ అర్హత సాధించాల్సిన గురువులు ఉపాధ్యాయుల కోసం ప్రత్యేక టెట్ నిర్వహించాలని డిమాండ్


