West Godavari
-
సొంతింటి కలకు చంద్ర గ్రహణం
చంద్రబాబు పాలనలో పేదల సొంతింటి కల సాకారానికి గ్రహణం పట్టింది. వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో జిల్లాలో లక్షలాది మందికి ఇళ్ల స్థలాలిచ్చి ఇళ్ల నిర్మాణాలు చేశారు. చాలా ఇళ్లు పూర్తయ్యి వందలాది కాలనీలు ఏర్పడగా కొన్ని చోట్ల పూర్తి కావాల్సి ఉంది. అయితే చంద్రబాబు రాకతో ఇళ్ల నిర్మాణం అటకెక్కింది. వాటిలో కొన్ని పూర్తి చేసి ఇప్పుడు అట్టహాసంగా వాటినే ప్రారంభిస్తున్నారు తప్ప.. బాబు పాలనలో పేదలకు సెంటు భూమి ఇవ్వలేదు. మంగళవారం శ్రీ 31 శ్రీ మార్చి శ్రీ 2026ఆకివీడు: పేదవాడి సొంత ఇంటి కల కలగానే మిగిలిపోతుండటంతో పలువురు నిరుపేదలు తీవ్ర నిరుత్సాహంలో ఉన్నారు. ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు తమ ఇల్లు పూర్తవు తుందని ఆశించినా, రెండేళ్లు కావస్తున్నా అమలు కాకపోవడంతో ఆ ఆనందం కాస్తా ఆవేదనగా మారుతుందని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఆర్భాటంగా గృహప్రవేశాలు చేస్తున్నా, క్షేత్రస్థాయిలో పూర్తయిన ఇళ్లు కొద్దిగా మాత్రమే ఉన్నాయని వారు విమర్శిస్తున్నారు. నియోజకవర్గానికి ఒక ఇంటిని ఎంపిక చేసి నామమాత్రంగా గృహప్రవేశాల వేడుకలు జరుపుతున్నారని మండిపడుతున్నారు. ప్రస్తుత పాలనలో జిల్లా వ్యాప్తంగా కేవలం 595 ఇళ్ల నిర్మాణం మాత్రమే పూర్తయింది. రూ.4.50 లక్షల కోసం ఎదురుచూపు పేదల ఇళ్ల నిర్మాణం కోసం రూ.4.50 లక్షల నిధులు సమకూరుస్తామని హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం, అధికారంలోకి వచ్చాక ఆ మొత్తాన్ని రూ.2.50 లక్షలకే పరిమితం చేసిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆ అరకొర నిధుల మంజూరుపై కూడా లబ్ధిదారులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం తన వంతు నిధులు మంజూరు చేసినప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వ వాటా విడుదల కాకపోవడంతో కొత్త రుణాలు మంజూరు కావడం లేదని లబ్ధిదారులు వాపోతున్నారు. ఎన్నికల హామీ ప్రకారం రూ.4.50 లక్షల ఆర్థిక సాయం అందించాలని వారు కోరుతున్నారు. ఆ స్థలాల్లో నిర్మాణం ఎండమావేనా? దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో పేదల కోసం కొనుగోలు చేసి సేకరించిన స్థలాల్లో నేటికీ ఇళ్లు నిర్మాణాలు ప్రారంభం కాలేదు. కొన్ని చోట్ల పట్టాలిచ్చినా లేఅవుట్లు వేసి విభజించకపోవడం, మరికొన్ని చోట్ల లే అవుట్ల విభజన జరగకపోవడంతో పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. లోతట్టు ప్రాంతాల్లో మట్టి పూడిక పనులకు నిధులు మంజూరు కాకపోవడంతో పనులు నిలిచిపోయాయి. గత ప్రభుత్వంలో మట్టి పూడిక పూర్తయిన చోట కూడా లబ్ధిదారులకు కేటాయింపులు జరగలేదు. దీంతో తమ సొంత ఇంటి కల నెరవేరుతుందా లేదా అని పేదలు నిరుత్సాహంతో ఉన్నారు. సొంత ఇంటి నిర్మాణం కోసం జిల్లాలోని లబ్ధిదారులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. గత ఏడాది కొత్త రుణాల కోసం సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించడంతో భారీ సంఖ్యలో దరఖాస్తు చేసుకున్నారు. ఆన్లైన్ ద్వారా వచ్చిన వేలాది దరఖాస్తులను హౌసింగ్, రెవెన్యూ అధికారులు పరిశీలించి, జిల్లా వ్యాప్తంగా 16,773 మందిని అర్హులుగా తేల్చి ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. ఈ కొత్త రుణాలను ప్రభుత్వం ఎప్పుడు మంజూరు చేస్తుందా? అని లబ్ధిదారులు ఎదురుచూస్తున్నారు. గతంలో నిర్మించిన జగనన్న కాలనీల్లో మౌలిక వసతుల కల్పనపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందనే ఆరోపణలు వస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో విద్యుత్, మంచినీరు, రోడ్ల నిర్మాణం కొంతమేర జరగగా.. ప్రభుత్వం మారిన తర్వాత మౌలిక సదుపాయాల కల్పనకు బ్రేక్ పడింది. రోడ్లు, డ్రైనేజీ సౌకర్యం లేక కాలనీవాసులు నరకం చూస్తున్నారు. వర్షాకాలంలో కాలనీలు లోతట్టుగా ఉండటంతో నీరు నిలిచి ఇబ్బందులు పడుతున్నామని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అరకొర వసతులు.. అందని నిధులు నాడు మొదలు పెట్టిన ఇళ్లకే ప్రారంభోత్సవాలు ఒక్క సెంటు భూమి ఇవ్వని చంద్రబాబు సర్కారు -
చెరువును పూడ్చి అమ్మేస్తున్నారు
కామవరపుకోట: స్థానిక వీరభద్ర స్వామి కోటగట్టును పక్కన ఉన్న ఆగర్తి చెరువును పూడ్చి సొమ్ము చేసుకుంటున్నారు కూటమి ప్రభుత్వ నాయకులు. గత కొన్ని రోజుల నుంచి అర్ధరాత్రి సమయంలో విచ్చలవిడిగా టిప్పర్లతో మట్టిని తీసుకొచ్చి చెరువును పూడుస్తున్నారు. సెంటున్నర స్థలాన్ని రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నా అధికారులు మాత్రం ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి సమగ్ర విచారణ జరిపి చెరువును పూడుస్తున్న వారిపై చర్య తీసుకోవాలని, లేకుంటే దీనిపై జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని స్థానికులు తెలిపారు. -
జగన్ అన్ని వర్గాలకూ న్యాయం చేశారు
తణుకు అర్బన్: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కులం, మతం, పార్టీ భేదాల్లేకుండా సంక్షేమ పాలనతో అందరికీ న్యాయం చేశారని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. తణుకు వైఎస్సార్సీపీ కార్యాలయంలో సోమవారం ఇరగవరం కాలనీకి చెందిన దళిత యువతితో నిర్వహించిన ముఖాముఖి సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వంలో కావాల్సిన వారికి మాత్రమే లబ్ధి చేకూరుస్తూ ప్రజలకు అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. అందరికీ మంచి చేయాలనే ఉద్దేశంతో జగన్మోహన్రెడ్డి ఐదేళ్లు పాలించారని, నేడు మా వాళ్లకే చేయాలనే ఉద్దేశం ఉండడం దురదృష్టకరమని స్పష్టం చేశారు. ఇరగవరం కాలనీలో ఉన్న శ్మశాన వాటిక వ్యవహారంలో కేసులు నమోదుచేశారని యువకులు ఆవేదన చెందుతున్నారని, అందరికీ అండగా ఉంటానని చెప్పారు. ఏ ఇబ్బంది వచ్చినా లీగల్ టీం ఉందని వారు చూసుకుంటారని అన్నారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ తణుకు పట్టణ అధ్యక్షుడు పెనుమాల రాజేష్ మాట్లాడుతూ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు గత ఐదేళ్ల వైఎస్సార్సీపీ పాలనలో ఇరగవరం కాలనీలో ఎంతో అభివృద్ధి చేశారని, అడగంగానే కమ్యూనిటీ హాలును నిర్మించారన్నారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు మారిశెట్టి శేషగిరి, వైఎస్సార్సీపీ రాష్ట్ర లీగల్ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి వెలగల సాయిబాబారెడ్డి, నియోజకవర్గ ప్రచార కమిటీ అధ్యక్షుడు గెల్లా జగన్, వల్లూరి బుజ్జిబాబు, పోతుల దొరబాబు, పడాల బాలు, నేలపాటి ఏసేపు, నేలపాటి సురేంద్ర, దిడ్ల సత్యానందం తదితరులు పాల్గొన్నారు. మాజీ మంత్రి కారుమూరి -
మత్స్యశాఖాధికారిగా బాధ్యతల స్వీకరణ
భీమవరం (ప్రకాశంచౌక్): జిల్లా మత్స్యశాఖాధికారిగా డి.శ్రీనివాస్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. శ్రీనివాస్ విజయవాడ కమిషనర్ ఆఫ్ ఫిషరీస్ ప్లానింగ్ సెక్షన్లో డిప్యూటీ డైరక్టర్గా పనిచేస్తూ బదిలీపై వచ్చారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ నాగరాణిని ఆయన మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందచేశారు. కలెక్టర్ నాగరాణి మాట్లాడుతూ అప్సడ రిజిస్ట్రేషన్లు పూర్తి చేయాలని, ఆక్వా రైతులకు నిరంతరం అందుబాటులో ఉంటూ సమస్యల పరిస్కారానికి కృషి చేయాలని సూచించారు. ఆకివీడు: స్థానిక పెదపేటలోని గొంతేనమ్మ గుడిని రామాలయంగా మార్చే ప్రయత్నానికి ప్రభుత్వం తక్షణమే అడ్డుకట్ట వేయాలని మానవ హక్కుల వేదిక(హెచ్ఆర్ఎఫ్) డిమాండ్ చేసింది. నిజనిర్ధారణ కమిటీ ఆదివారం ఆ ప్రాంతంలో పర్యటించి వివరాలు సేకరించినట్లు కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వై.రాజేష్, కార్యదర్శి జీ.రోహిత్, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం.శ్రీనివాసరావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. గొంతేనమ్మ సత్రం పడగొట్టి రామాలయం నిర్మిస్తామనడంపై స్థానిక దళితులు అభ్యంతరం తెలిపారన్నారు. ఏకపక్షంగా కేసులు నమోదు చేయడం, దళితులపై దాడి చేసిన వారిపై ఇంతవరకూ కేసులు నమోదు చేయకపోవడం చూస్తే స్థానిక ఎమ్మెల్యే కనుసన్నల్లోనే పోలీసు యంత్రాంగం పనిచేస్తున్నట్లు అర్థమవుతోందని వారు పేర్కొన్నారు. పోలీసుల మొహరింపు స్థానిక దళితుల్ని భయపెట్టడానికేనన్నారు. దళితులపై దాడిచేసిన వారిపైన, సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టినవారిపైన కేసులు నమోదు చేయాలని, దాడికి సంబంధం లేనివారిపై వెంటనే వ్యక్తిగత పూచిపై విడిచిపెట్టాలని డిమాండ్ చేశారు. భీమవరం (ప్రకాశంచౌక్): ప్రజా సమస్యలపై త్వరితగతిన స్పందించి, నిర్ణీత గడువులోగా చట్ట పరిధిలో శాశ్వత పరిష్కారం చూపాలని ఎస్పీ అద్నాన్ నయీం అస్మి జిల్లా పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి ఎస్పీ ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ఎంతో ఆశతో పోలీసు కార్యాలయాలను ఆశ్రయిస్తారని, బాధితులకు పోలీసు శాఖ భరోసా కల్పించాలని స్పష్టం చేశారు. ముఖ్యంగా ఫిర్యాదులు పునరావృతం కాకుండా లోతైన దర్యాప్తు జరిపి బాధితులకు న్యాయం చేకూరేలా చూడాలన్నారు. సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో 15 అర్జీలు స్వీకరించారు. కార్యక్రమంలో మహిళా పోలీసు స్టేషన్ డీఎస్పీ యు. రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు. నరసాపురం రూరల్: మండలంలోని లక్ష్మణేశ్వరం పరిధి గొల్లలవంతెన సమీపంలో సోమవారం పాత కక్షలతో స్కూటర్కు నిప్పు పెట్టారు. స్థానికుల వివరాల ప్రకారం.. లక్ష్మణేశ్వరం గ్రామానికి చెందిన దేశంశెట్టి వెంకటకృష్ణ ఆర్ఎంపీ వైద్యుడిగా పనిచేస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన కోలపర్తి పవన్ గొల్లల వంతెన సమీపంలో ఉంటున్న బంధువుల ఇంటికి వచ్చి వెళ్తున్న సమయంతో ఇద్దరికీ వివాదం మొదలైంది. గతంలో గొడవల నేపథ్యంలో పవన్, వెంకట రమణల మద్య మాటామాటా పెరిగింది. వెంకటరమణ తన వద్ద ఉన్న పెట్రోలను పవన్ స్కూటర్పై పోసి నిప్పు అంటించాడు. స్థానికులు మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. ఈ ఘర్షణలో గాయపడ్డ వెంకటకృష్ణ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. -
హుండీల లెక్కింపు.. కట్టుదిట్టంగా
ద్వారకాతిరుమల: ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమల చిన్నవెంకన్న ఆలయ హుండీల నగదు, కానుకల లెక్కింపు వేళ.. అధికారులు అలర్ట్ అయ్యారు. సోమవారం జరిగిన లెక్కింపులో అధికారులు పలు నిఘా ఏర్పాట్లు చేయడంతో పాటు, భద్రతా సిబ్బంది ప్రతి ఒక్కరిని మెటల్ డిటెక్టర్లతో తనిఖీలు చేశారు. వివరాల్లోకి వెళితే. ఈనెల 11న ప్రమోదా కల్యాణ మండపంలో జరిగిన హుండీల నగదు లెక్కింపులో పశ్చిమగోదావరి జిల్లా, ఇరగవరం మండలం, సూరంపూడి గ్రామానికి చెందిన బొల్లా సురేష్ అనే వ్యక్తి సేవకుడిగా పాల్గొని 59 గ్రాముల 700 మిల్లీ గ్రాముల బరువైన బంగారు చైన్, రెండు మంగళ సూత్రాలు, 4 డాలర్ నోట్లను చోరీ చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై అదే రోజు దేవస్థానం ఈఓ వై.భద్రాజీ స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, ఎస్సై టి.సుధీర్ కేసు నమోదు చేసి దర్యాప్తు జరిపారు. అందులో భాగంగా నిందితుడి బ్యాంక్ అకౌంట్ లోని రూ. 5.10 లక్షలను ఫ్రీజ్ చేశారు. విచారణ అనంతరం నిందితుడిని భీమడోలు కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి అతడికి బెయిల్ మంజూరు చేశారు. అయితే ఈ చోరీ ఘటన సంచలనంగా మారడంతో దేవస్థానం, పోలీస్ అధికారులు అప్రమత్తమయ్యారు. అందులో భాగంగా ఈసారి కౌంటింగ్ హాలు వద్ద ప్రత్యేకంగా పోలీస్ సిబ్బందిని నియమించారు. లెక్కింపు పూర్తయ్యే వరకు ఎస్సై టి.సుధీర్ తనిఖీలను పరిశీలించారు. రిజిస్టర్డ్ సేవా దళాలను మాత్రమే.. రిజిస్టర్డ్ సేవాదళాలను మాత్రమే లెక్కింపునకు అనుమతించారు. సేవలో పాల్గొన్న ప్రతి సభ్యుడి వివరాలను రిజిస్టర్లో నమోదు చేసి, వారి నుంచి సంతకాలు సేకరించారు. ఈ లెక్కింపులో పలు సేవా దళాలకు చెందిన 130 మంది పాల్గొనగా, దేవస్థానం అధికారులు, రెగ్యులర్ ఉద్యోగులు, అవుట్ సోర్సింగ్ సిబ్బంది, కల్యాణకట్టలోని నాయీ బ్రాహ్మణులు మొత్తం 150 మంది వరకు పాల్గొన్నారు. ఇక ముందు జరిగే లెక్కింపులో పాల్గొనే సేవాదళ సభ్యులు తప్పనిసరిగా ఐడెంటిటీ కార్డులు ధరించాల్సి ఉంటుంది. ప్రత్యేక నిఘా.. కౌంటింగ్ హాల్లోకి వెళ్లే వారిని, బయటకు వచ్చే వారిని డోర్ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్ (డీఎఫ్ఎండీ), హ్యాండ్ హెల్డ్ మెటల్ డిటెక్టర్ (హెచ్హెచ్ఎండీ) ద్వారా భద్రతా సిబ్బంది తనిఖీలు చేశారు. లోదుస్తులు (అండర్వేర్)ను తొలగించి, పంచి, కండువా ధరించిన వారిని మాత్రమే లెక్కింపునకు అనుమతించారు. అలాగే లెక్కింపు అందరికీ కనిపించేలా కౌంటింగ్ హాల్లో ఎల్ఈడీ మానిటర్ ఏర్పాటు చేసి, ఈఓ పర్యవేక్షించారు. ముడుపులు, విదేశీ, పెద్ద కరెన్సీ నోట్ల లెక్కింపును సూపరింటెండెంట్ల పర్యవేక్షణలో నిర్వహించారు. తనిఖీలకు మరింత అత్యాధునిక స్కానర్లను వినియోగించాల్సిన అవసరం ఉందని స్థానికులు, పలువురు భక్తులు అంటున్నారు. ముడుపుల వద్ద పర్యవేక్షిస్తున్న సూపరింటెండెంట్ పద్మావతి కౌంటింగ్ హాలు వద్ద భద్రతను పరిశీలిస్తున్న ఎస్సై సుధీర్బొల్లా సురేష్ చోరీ కేసులో షాకింగ్ అంశం బయటపడింది. శ్రీవారి దేవస్థానంలో జరిగే హుండీల నగదు, కానుకల లెక్కింపులో చోరీ చేయడం సులభమని అతడు పోలీసుల విచారణలో చెప్పినట్టు తెలిసింది. ఇతర దేవాలయాల్లో లోదుస్తులతో లెక్కింపునకు అనుమతించరని, ఇక్కడ ఆ నిబంధన లేకపోవడమే అందుకు కారణమని చెప్పినట్టు సమాచారం. అందుకే లోదుస్తులు లేకుండా లెక్కింపులో పాల్గొనే పద్ధతిని ఇక్కడా అమలు చేస్తున్నారు. శ్రీవారి హుండీల నగదు, కానుకల లెక్కింపులో.. పటిష్ట బందోబస్తు నిర్వహణ కౌంటింగ్ హాలు వద్ద మెటల్ డిటెక్టర్ల ఏర్పాటు ప్రతి ఒక్కరినీ క్షుణ్ణంగా తనిఖీలు చేసిన భద్రతా సిబ్బంది అత్యాధునిక స్కానర్లు ఏర్పాటు చేయాలంటున్న భక్తులు -
ఎల్ నినోతో వర్షాభావం.. రైతులూ జాగ్రత్త!
ఉండి: ఈ ఏడాది ఎల్నినో ప్రభావం వలన వర్షాలు తక్కువగా కురిసి నీటి కొరత ఏర్పడే ప్రమాదం ఉందని, ఆక్వారైతులు నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని మార్టేరు ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బీ సహదేవరెడ్డి సూచించారు. గత కొద్దిరోజులుగా ఎన్నార్పీ అగ్రహారం కృషీ విజ్ఞాన కేంద్రంలో రొయ్యల పెంపకంలో మెరుగైన యాజమాన్యాలపై నిర్వహిస్తున్న శిక్షణా కార్యక్రమం సోమవారంతో ముగిసింది. మత్స్యశాస్త్రవేత్త డాక్టర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సహదేవరెడ్డి మాట్లాడుతూ రైతులంతా నీటి వృథాను అరికట్టేలా జాగ్రత్తలు పాటించాలన్నారు. ఆక్వారైతులు తమ చెరువుగట్లపై మొక్కలను పెంచి చల్లని వాతావరణాన్ని ప్రేరేపించడం ద్వారా వాతావరణంలో వేడి తగ్గించి సుస్థిర ఉత్పత్తిని సాధించవచ్చునని అన్నారు. కేవీకే ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ ఎన్ మల్లిఖార్జునరావు మాట్లాడుతూ శిక్షణా కార్యక్రమంలో నేర్చుకున్న సాంకేతికతను చెరువుల యాజమాన్యంలో ఉపయోగించి ఖర్చు తగ్గించుకుని ఉత్పత్తిని పెంచుకోవాలని సూచించారు. ప్రోగ్రాం కన్వీనర్ శ్రీనివాస్ చివరిరోజు శిక్షణలో భాగంగా రొయ్యల్లో వ్యాధుల యాజమాన్యం, ఆర్ఏఎస్ పద్ధతి ద్వారా రొయ్యల పెంపకం, ఆక్వాఫోనీక్స్ విధానం, బయో ఫాలక్ పెంపకం తదితర విషయాలను వివరించారు. ఎంపెడా సాంకేతిక నిపుణుడు దుర్గారావు రొయ్యల ఎగుమతులు, దిగుమతులు, రొయ్యల చెరువుల రిజిస్ట్రేషన్ తదితర విషయాలపై రైతులకు అవగాహన కల్పించారు. అనంతరం శిక్షణ పొందిన వారికి సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. కార్యక్రమంలో కేవీకే శాస్త్రవేత్తలు ఏ శ్రీనివాస్, వినయలక్ష్మి, బిందు ప్రవీణ తదితరులు పాల్గొన్నారు. -
టిడ్కో లబ్ధిదారులకు తాళాలు అందజేత
పాలకొల్లు సెంట్రల్: పెంకుళ్లపాడు ఎల్అండ్టీ గృహాల సముదాయంలో టిడ్కో గృహాల లబ్ధిదారులకు కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖా మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ సోమవారం ఇంటి తాళాలు అందించారు. మంత్రి నిమ్మల రామానాయుడు, జిల్లా కలెక్టర్ సీహెచ్ నాగరాణి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ నేడు 2016 మంది నూతన గృహప్రవేశం చేయడం ఆనందంగా ఉందన్నారు. మిగిలిన 1500 ఇళ్లను జులై నాటికి పూర్తి చేసి అందిస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో లబ్ధిదారులందరికీ ఇంటి తాళాలు ఇస్తున్నట్లు సమాచారం ఇచ్చారు. అయితే కొన్ని ప్రాంతాల వారికే ఇళ్లు మంజూరు చేసినట్లు సమాచారం. టిడ్కోలోకి ఒకే గేటు ఉండడంతో జనం ఎండలో మాడిపోయారు. తాగడానికి నీళ్లు లేవని వాపోయారు. ఇంకా ఇళ్లు పూర్తికాకముందే ఈ హడావుడి ఎందుకని లబ్ధిదారులు నిలదీశారు. భీమవరంలో.. భీమవరం (ప్రకాశంచౌక్): భీమవరం మున్సిపాలిటీ పరిధిలో నిర్మించిన 1920 టిడ్కో గృహాలకు సోమవారం సామూహిక గృహప్రవేశ కార్యక్రమం నిర్వహించారు. భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ముఖ్య అతిథిగా హాజరై లబ్ధిదారులకు తాళాలు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, మున్సిపాలిటీ పరిధిలో నిర్మించిన 1,920 టిడ్కో గృహాల సామూహిక గృహప్రవేశాలు సంతోషకరమని పేర్కొన్నారు. మిగతా లబ్ధిదారులకు జూన్–జూలై నెలలలోపు గృహాలు అందజేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, ఆర్డీవో కె.ప్రవీణ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
2న వాటర్ స్పోర్ట్స్ జిల్లా జట్ల ఎంపిక
ఏలూరు రూరల్: రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో ఏప్రిల్ 11, 12 తేదీల్లో ఎన్టీఆర్ జిల్లాలో రాష్ట్రస్థాయి వాటర్ స్పోర్ట్స్ పోటీలు జరగనున్నాయని డీఎస్డీఓ ఎస్ఏ అజీజ్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ పోటీల్లో పాల్గొనే ఏలూరు జిల్లా అండర్–15 సబ్జూనియర్స్, అండర్–18 జూనియర్స్ బాలబాలికల జట్ల ఎంపిక పోటీలు ఏప్రిల్ 2వ తేదీన ఉదయం 9 గంటలకు జంగారెడ్డిగూడెం ఎర్రకాలువ వద్ద చేపట్టనున్నామని వివరించారు. కాయకింగ్, రోయింగ్, డ్రాగన్బోట్ విభాగాల్లో క్రీడాకారులు పాల్గొనాలని పేర్కొన్నారు. ఆసక్తి గల బాలబాలికలు ముందుగా శాప్ వెబ్సైట్లో పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. వివరాలకు పీవీవీఎస్ కృష్ణమూర్తి, 83318 73037 నంబరులో సంప్రదించాలన్నారు. ఏలూరు (టూటౌన్): ఏలూరు జిల్లా కలెక్టరేట్లోని గోదావరి సమావేశపు హాలులో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 289 వినతులు అందాయి. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ డా. ఎంజే అభిషేక్ గౌడ మాట్లాడుతూ ఫిర్యాదులను నిర్ధేశించిన సమయంలోగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఇన్చార్జి డీఆర్ఓ భాస్కర్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. పెదపాడు: జాతీయ రహదారిపై గంజాయి రవాణా చేస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. గుండుగొలను వైపు నుంచి విజయవాడ వైపు గంజాయి తరలిస్తున్నారనే సమాచారం మేరకు పెదపాడు ఎస్సై, ఎకై ్సజ్ సీఐ ధనరాజ్ కలపర్రు టోల్గేట్ వద్ద వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో ఆటోలో గంజాయి తరలిస్తుండగా పోలీసులు స్వాధీనం చేసుకుని నిందితులు పిల్లా మోహనరావు, తాతపూడి జితేంద్ర, సబ్బవరపు సాయిబాబులను అరెస్ట్ చేశారు. ఎస్సై ఆర్ శ్రీనివాస్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తనిఖీల్లో క్లూయిజ్ టీమ్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ఏలూరు (టూటౌన్): అపరిష్కృతంగా ఉన్న ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించాలని బీటీఏ రాష్ట్ర అధ్యక్షుడు భూపతి రామారావు డిమాండ్ చేశారు. బీటీఏ రాష్ట్ర శాఖ ఆదేశాను సారం దశలవారీ పోరాటాల్లో భాగంగా సోమవారం సాయంత్రం 4గంటలకు స్థానిక జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద బీటీఏ ఏలూరు జిల్లాశాఖ ఆధ్వర్యాన ఉద్యోగ, ఉపాధ్యాయుల అపరిష్కృత సమస్యలపై కొద్ది సేపు నిరసన తెలిపారు. అనంతరం కలెక్టర్కి సమస్యలతో కూడిన వినతి పత్రం అందజేశారు. దెందులూరు: అనుమానాస్పద స్థితిలో ఓ వివాహిత మృతి చెందింది. ఎస్సై ఆర్ శివాజీ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సోమవరప్పాడు గ్రామానికి చెందిన తంగేళ్ల అప్పారావుకు, లత (20)కు ఏడు నెలల క్రితం వివాహమైంది. తల్లిదండ్రులతో కలిసి నివసిస్తున్న అప్పారావు దంపతుల మధ్య గత కొన్నిరోజులుగా చిన్నపాటి గొడవలు జరుగుతున్నాయి. ఇంట్లో మనస్పర్థల కారణంగా మనస్తాపానికి గురైన లత, భర్త అప్పారావు పనికి వెళ్లిన తరువాత ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు ఈ ఘటనపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. లత మృతదేహాన్ని ఏలూరు ప్రభుత్వాసుపత్రికి మార్చురీకి తరలించారు. -
శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.02 కోట్లు
ద్వారకాతిరుమల : ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమల శ్రీవారి ఆలయ హుండీల నగదు లెక్కింపు సోమవారం స్థానిక ప్రమోద కల్యాణ మండపంలో, అన్నవరం దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్, ఏఈఓ ఎం.మంజులాదేవి పర్యవేక్షణలో నిర్వహించారు. ఈ లెక్కింపులో స్వామివారికి విశేష ఆదాయం సమకూరింది. గడచిన 20 రోజులకు గాను నగదు రూపేణా స్వామివారికి రూ. 2,02,77,293 ఆదాయం లభించినట్టు ఆలయ ఈఓ వై.భద్రాజీ తెలిపారు. అలాగే కానుకల రూపేణా భక్తులు సమర్పించిన 195 గ్రాముల బంగారం, 2.124 కేజీల వెండితో పాటు, అధికంగా విదేశీ కరెన్సీ లభించిందన్నారు. అదేవిధంగా లెక్కింపులోకి రాని రద్దయిన పాత రూ.1,000, రూ.500 నోట్లు ద్వారా రూ. 5 వేలు లభించినట్టు చెప్పారు. ఇదిలా ఉంటే హుండీల ఆదాయాన్ని పరిశీలిస్తే సగటున రోజుకి శ్రీవారికి రూ.10,13,865 ఆదాయం వచ్చినట్టు ఈఓ పేర్కొన్నారు. ఈ లెక్కింపులో శ్రీవారి దేవస్థానం అధికారులు, సిబ్బంది, సేవాదళం సభ్యులు పాల్గొన్నారు. చింతలపూడి: తిరుపతిలో సోమవారం ఘనంగా జరిగిన శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ 13వ స్నాతకోత్సవంలో చింతలపూడికి చెందిన విద్యార్థిని కారుమంచి రిషిత అద్భుత ప్రతిభ కనబరిచింది. తన విద్యా ప్రతిభతో ఏకంగా 9 బంగారు పతకాలు, ఒక వెండి పతకాన్ని సాధించి అందరి దృష్టిని ఆకర్షించింది. రాష్ట్ర గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా రిషిత ఈ పతకాలను అందుకుంది. చింతలపూడికి చెందిన ఉపాధ్యాయులు కారుమంచి ప్రకాష్ మాస్టారు కుమార్తె అయిన రిషిత, గన్నవరం వెటర్నరీ కళాశాలలో చదువుతోంది. స్నాతకోత్సవం అనంతరం రిషితను కళాశాల అధ్యాపకులు ప్రత్యేకంగా అభినందించారు. ఏలూరు (ఆర్ఆర్పేట): జిల్లాలో జరుగుతున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో భాగంగా సోమవారం నిర్వహించిన సాంఘిక శాస్త్ర పరీక్షకు 22751 మంది విద్యార్థులు హాజరయ్యారు. మొత్తం 23249 మంది విద్యార్థులకు గాను 498 మంది గైర్హాజరయ్యారు. విద్యార్థుల హాజరు 97.86 శాతంగా నమోదైంది. ఈ పరీక్షలో ఎటువంటి మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని, ప్రశాంతంగా జరిగాయని జిల్లా విద్యాశాఖాధికారి ఎం. వెంకటలక్ష్మమ్మ తెలిపారు. ముగిసిన దూర విద్య 10 పరీక్షలు ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో దూరవిద్యా విధానంలో నిర్వహిస్తున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో సోమవారం నిర్వహించిన గణితం పరీక్షకు 575 మంది విద్యార్థులు హాజరయ్యారు. 115 మంది గైర్హాజరయ్యారు. అలాగే భారతీయ సంస్కృతి, వారతస్వం పరీక్షకు ముగ్గురు విద్యార్థులకుగాను ఇద్దరు హాజరు కాగా ఒకరు గైర్హాజరయ్యారు. ఏలూరు (టూటౌన్): ఆకివీడు ఘటనపై సమగ్ర పరిశీలన చేసేందుకు సిట్టింగ్ జడ్జి లేదా రిటైర్డ్ జడ్జితో న్యాయ విచారణ జరపాలని కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అండ్ర మాల్యాద్రి, జాతీయ దళిత జేఏసీ చైర్మన్ పెరికె వరప్రసాద్ డిమాండ్ చేశారు. సంఘటనపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్కు సోమవారం వినతి పత్రం అందజేసారు. దీనికి సంబంధించిన వివరాలను ఏలూరులో పత్రికలకు విడుదల చేశారు. మత ఘర్షణలకు కారణమై దళితులపై అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేయిస్తున్న ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు శాసనసభ సభ్యత్వం రద్దు చేసి ఉభా సభాపతి నుంచి తొలగించాలని కోరారు. టి.నరసాపురం: పామాయిల్ గెలలు నరుకుతుండగా విద్యుదాఘాతంతో యువకుడు మృతిచెందాడు. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రాజుపోతేపల్లి గ్రామానికి చెందిన చెన్ని శివాజీ (23) పామాయిల్ గెలలు నరికే పనికి వెళుతూ కుటుంబానికి ఆసరాగా ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో ఎప్పటిలాగానే మరో ఇద్దరు కూలీలతో కలసి మండలంలోని గుడ్లపల్లికి చెందిన రైతు పామాయిల్ తోటలో గెలులు నరకడానికి వెళ్లాడు. పామాయిల్ గెలలు నరుకుతుండగా గెడ కత్తి విద్యుత్ తీగలకు తగిలి విద్యుదాఘాతానికి గురయ్యాడు. దీంతో తోటి కూలీలు 108కి ఫోన్ చేయగా సిబ్బంది వచ్చి అతడిని పరిశీలించి, అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చింతలపూడి తరలించారు. -
ఆర్థిక అసమానతలు తగ్గించడమే లక్ష్యం
భీమవరం (ప్రకాశంచౌక్): పీ–ఫోర్ కార్యక్రమం సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా వార్షికోత్సవ కార్యక్రమం సోమవారం భీమవరం త్యాగరాజ్ భవన్లో నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా ఇన్్చార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ పీ–ఫోర్ కార్యక్రమం రాష్ట్ర సామాజిక ముఖచిత్రాన్ని మార్చే చర్యగా అభివర్ణించారు. జిల్లాలో 49,118 బంగారు కుటుంబాలు గుర్తించగా, వాటిలో 22,762 కుటుంబాలను 2,331 మంది మార్గదర్శకులు దత్తత తీసుకున్నారని తెలిపారు. కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ, ప్రభుత్వంతో పాటు ప్రైవేట్ వ్యక్తుల భాగస్వామ్యంతోనే సమగ్ర అభివృద్ధి సాధ్యమని అన్నారు. కలెక్టర్ చదలవాడ నాగరాణి, ఎమ్మెల్యేలు పులపర్తి రామాంజనేయులు, పితాని సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
అసెంబ్లీ తీర్మానం రాజకీయ డ్రామా
ఏలూరు టౌన్: రాజధాని అమరావతి టీడీపీ నేతలకు, చంద్రబాబుకు ఏటీఎంలా మారిపోయిందని, చంద్రబాబుకు నిధులు కావాలంటే అప్పుడు బ్యాంకుల నుంచి అప్పులు తీసుకొస్తూ.. శాశ్వత భవనాలేమీ కట్టకుండానే నీళ్ళు తోడటానికి, పిచ్చి మొక్కలు పీకటానికి వేలకోట్లు నిధులు ఖర్చు చేస్తున్నారని వైఎస్సార్సీపీ ఏలూరు సమన్వయకర్త మామిళ్ళపల్లి జయప్రకాష్ విమర్శించారు. అమరావతి రాజధాని అంశంపై చంద్రబాబు తీరుపై ఏలూరులోని పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ధ్వజమెత్తారు. అమరావతిలో మూడు పంటలు పండే పొలాలను రైతుల నుంచి తీసుకున్నారని, ప్లాట్లు ఇస్తామంటూ నమ్మించి సుమారు 50 వేల ఎకరాల భూములు సేకరించారని.. ఒక్క శాశ్వత భవనమైనా నిర్మించారా అని ప్రశ్నించారు. డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే అసెంబ్లీలో తీర్మానం పేరిట డ్రామా చేస్తున్నారని, రైతులు రెండో విడత పూలింగ్ చేసేందుకు సహకరించడం లేదనే సాకుతో ఇప్పుడు అసెంబ్లీలో రైతులను మభ్యపెట్టేలా డైవర్షన్ చేయడం నిజం కాదా అని నిలదీశారు. 2028 లోపు అమరావతి నిర్మాణం పూర్తి చేస్తామని చెబుతున్న చంద్రబాబు.. అదే సమయంలో ఎవరైనా మార్చేస్తారంటూ ప్రచారం చేయటం వెనుక ఆంతర్యం ఏమిటో చెప్పాలని జేపీ ప్రశ్నించారు. ఈ భారమంతా ఎవరు భరిస్తారు? అమరావతి పేరిట భూములు ఇచ్చిన రైతుల పరిస్థితి నేడు దారుణంగా ఉందని, ప్లాట్లు డెవలప్మెంట్ లేదని, రోడ్లు వేయలేదని, కొన్ని ప్లాట్లు చెరువుల్లో ఉన్నాయని, చంద్రబాబును మరోసారి నమ్మేస్థితిలో రైతులు లేరని అన్నారు. మొదటి దశలో 50 వేల ఎకరాల భూసేకరణ చేశారని, ఒక్కో ఎకరా అభివృద్ధికి రూ.2 కోట్లు చొప్పున రూ.లక్ష కోట్లు అవసరం అన్నారని, మరోసారి సెల్ఫ్ ఫైనాన్స్ రాజధాని అన్నారని.. ఇప్పుడు రెండవ దశలో మరో 20 వేల ఎకరాల భూసేకరణ, అభివృద్ధికి మరో రూ.50 వేల కోట్లు.. ఈ భారమంతా రాష్ట్ర ప్రజలు భరించే స్థితిలో ఉన్నారా? అని ప్రశ్నించారు. అమరావతిలో కొత్త భవనాలు కట్టకుండా, డిజైన్ల పేరుతోనే సుమారు రూ.400 కోట్లు ఖర్చు చేస్తున్నారని, పాత టెండర్లను రద్దు చేసి కొత్త టెండర్లు పిలవడం అనుమానాలకు తావిస్తోందని విమర్శించారు. సెల్ఫ్ ఫైనాన్స్ రాజధాని అంటూ అసత్య ప్రచారాలు చేశారనీ, సెల్ఫ్ ఫైనాన్స్ అయితే రూ.47 వేల కోట్లు అప్పులు ఎందుకు చేశారో చెప్పాలని జయప్రకాష్ డిమాండ్ చేశారు. కౌన్సిల్లో పెడితే అవినీతి బయటపడుతుందనే భయం రెండో విడత పూలింగ్కు కొత్త నాటకం వైఎస్సార్సీపీ ఏలూరు సమన్వయకర్త మామిళ్ళపల్లి జయప్రకాష్ -
రూ.3.70 కోట్లకు ఫెర్రీ వేలం ఖరారు
నర్సాపురం రూరల్: మాధవాయిపాలెం ఫెర్రీ వేలం పాట పేరుతో సోమవారం అధికారులు వ్యవహరించిన తీరు, వేలం జరిగిన విధానంపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ ఖజానాకు భారీ గండి పడేలా ఈ పక్రియ సాగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. గతంలో రేవు వేలం ద్వారా ప్రభుత్వానికి రూ.4.18 కోట్ల ఆదాయం లభించగా ప్రస్తుతం ఆ మొత్తం భారీగా తగ్గిపోయింది. శ్రీ విఘ్నేశ్వర సాండ్ క్వారీ బోట్స్మెన్ లేబర్ కాంట్రాక్ట్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ రూ.3,70,01,000కు పాటను దక్కించుకుంది. రూ.3,59,06,322కి ప్రభుత్వం ప్రారంభ పాట నిర్ధేశించింది. అంబేడ్కర్ కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మండలం టేకుశెట్టిపాలెంకు చెందిన శ్రీ విఘ్నేశ్వర సాండ్ క్వారీ అండ్ బోట్స్ మేన్ లేబర్ కాంట్రాక్ట్ కోపరేటివ్ సొసైటీ లిమిటెడ్ రూ,3,60,09,999కు, నరసాపురం ప్రాథమిక మైరెన్ ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ రూ.3,60,06,333కు సీల్డ్ కవర్ వేశారు. బహిరంగ వేలంలో నర్సాపురం ప్రాథమిక మైరెన్ ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ రూ. 3,00,70,000కు పాడగా, శ్రీ విఘ్నేశ్వర లిమిటెడ్ రూ.3,70,01,000కు బహిరంగ వేలంలో పాడారు. కేవలం పాటలో పాల్గొనే వారికి మాత్రమే లోనికి వచ్చేందుకు అవకాశం కల్పించారు. ఇతరులు ఎవరు ఎంపీడీవో కార్యాలయంలోకి ప్రవేశించకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసుల పహారాలో వేలం నిర్వహించడంతో వేలం పాట నిర్వహణలో పారదర్శకత లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఎన్నడూ లేని విధంగా కొత్త నిబంధనలను చేర్చి ఆసక్తి కలిగిన పాటదారులను దూరం చేసే ప్రయత్నం చేశారని పలువురు ఆరోపిస్తున్నారు. సోమవారం జరిగిన ఈ వేలం పాటలో జేఏసీ సభ్యులుగా కొనసాగుతున్న నరసాపురం, సఖినేటిపల్లి ఎంపీపీలు మైలాబత్తుల సోనీ, వీరా మల్లికార్జున రావు, నరసాపురం, సఖినేటిపల్లి ఎంపీడీవోలు వీకె వీరభద్రరావు, పీఆర్సి రాజ్ కుమార్, తదితరులు వేలం ప్రక్రియను పరిశీలించారు. తగ్గిన ఆదాయం.. అధికారుల తీరుపై విమర్శలు -
క్షీణించిన వర్జీనియా ధర
● మరింత దిగజారిన కనిష్ట ధర ● సరాసరి కూడా పడిపోతుందని రైతుల ఆందోళన జంగారెడ్డిగూడెం: వర్జీనియా ధర మరింత క్షీణించింది. గరిష్ట ధర స్థిరంగా ఉన్నప్పటికీ కనిష్ట ధర గత ట్రేడింగ్ సెషన్తో పోల్చితే మరో ఐదు రూపాయలు దిగజారింది. వర్జీనియా వేలం ప్రక్రియ ప్రారంభమైన నాటి నుంచి రైతులు ధరపై ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. కేజీ ఒక్కింటికి రూ.350 పైబడి ధర వస్తేనే సగటు ధర మెరుగ్గా వచ్చి రైతులు నష్టాల రాకుండా గట్టెక్కగలరని పేర్కొంటున్నారు. సీజన్ ముగిసే నాటికి సరాసరి ధర రూ.330 నుంచి రూ. 350 మధ్య వస్తేనే రైతుకు గిట్టుబాటు అవుతుందని వర్జీనియా రైతు సంఘం నాయకులు పేర్కొంటున్నారు. అయితే ప్రారంభం రోజునే అంచనాలను తారుమారుచేస్తూ గత ఏడాది ప్రారంభ ధర కన్నా తక్కువగా రూ. 265 వద్ద వేలం ప్రారంభమైంది. తొలి రోజే పొగాకు బోర్డు చైర్మన్ యశ్వంత్కుమార్కు రైతులు తమ అసంతృప్తిని, ఆందోళనను తెలియజేశారు. అయినప్పటికీ పరిస్థితిలో మార్పు రాకపోగా ధర పతనమవుతోంది. గరిష్ట ధర స్థిరంగా ఉండి, కనిష్ట ధర పడిపోతూ ఉంటే, సరాసరి కూడా అదే రీతిలో తగ్గిపోతుందని, ఇదిలా కొనసాగితే చివరకు సగటున కేజీ ఒక్కింటికి రూ.100 నుంచి రూ. 120 వరకు నష్టం వచ్చే అవకాశం ఉంటుందని రైతులు వాపోతున్నారు. రోజు విడిచి రోజు వేలం ఎన్ఎల్ఎస్ పరిధిలోని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ఐదు వేలం కేంద్రాల్లో జంగారెడ్డిగూడెం–1, –2 వేలం కేంద్రాలు మినహాయించి, దేవరపల్లి, కొయ్యలగూడెం, గోపాలపురం వేలం కేంద్రాల్లో సోమవారం వేలం జరిగింది. వేలం నిర్వహణకు బయ్యర్లు, సిబ్బంది కొరత రావడం, కర్ణాటకలో వేలం ప్రక్రియ జరుగుతుండటంతో రోజు విడిచి రోజు వేలం నిర్వహించనున్నారు. వచ్చే నెల రోజుల పాటు ఇలానే కొనసాగుతుందని అధికారులు తెలుపుతున్నారు. దేవరపల్లి, కొయ్యలగూడెం, గోపాలపురంలలో ఒక రోజు, జంగారెడ్డిగూడెం–1, –2 వేలం కేంద్రాల్లో ఒక రోజు నిర్వహించేలా నిర్ణయించినట్లు చెప్పారు. దేవరపల్లి వేలం కేంద్రానికి 6 బేళ్లు తీసుకురాగా, వాటిలో 3 తిరస్కరణకు గురై 3 బేళ్లు అమ్ముడయ్యాయి. ఇక్కడ ధర స్థిరంగా రూ. 265 పలికింది. కొయ్యలగూడెం వేలం కేంద్రానికి 113 బేళ్లు రాగా, వాటిలో 54 బేళ్లు తిరస్కరించారు. 59 బేళ్లు కొనుగోలు జరగ్గా, ఇక్కడ గరిష్ట ధర రూ.265, కనిష్ట ధర రూ.250 నమోదైంది. అలాగే గోపాలపురం వేలం కేంద్రాలో 97కు గాను 79 బేళ్లు అమ్మకాలు జరగ్గా, ఇక్కడ కూడా గరిష్టం రూ. 265, కనిష్టం రూ.250 నమోదైంది. మొత్తంగా గరిష్ట ధర రూ.265, కనిష్ట ధర రూ.250 రాగా, సరాసరి ధర రూ. 257.85 లభించింది.వర్జీనియా పొగాకు బేళ్లు -
రోడ్డు ప్రమాదంలో డ్రైవర్ మృతి
పెంటపాడు: ముందున్న వాహనాన్ని లారీ ఢీకొని లారీ డ్రైవర్ మృతి చెందాడు. వివరాల ప్రకారం ప్రత్తిపాడు ఆటోనగర్ వద్ద హైవే మరమ్మతు పనులు జరగుతున్నాయి. ఏలూరు వైపు నుంచి తణుకు వైపు వెళుతున్న ధాన్యం లోడు లారీ ముందున్న రహదారి సేప్టీ వాహనాన్ని ప్రమాదవశాత్తూ ఢీకొంది. ఈ ప్రమాదంలో లారీ ముందు భాగం తీవ్రంగా దెబ్బతినగా, లారీ డ్రైవర్ మాచర్లకు చెందిన రాగిపిండి శ్రీనివాసరెడ్డి (48) లారీ క్యాబిన్లో ఇరుక్కొని మృతి చెందాడు. పెంటపాడు పోలీసులు ఇరుక్కొన్న మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి కేసు నమోదు చేశారు. ఎస్సై స్వామి ఆధ్వర్యంలో కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
●డ్రెయినేజీ ఆక్రమణలు తొలగించండి
ఏలూరులోని ప్రతి డ్రెయినేజీ ఆక్రమణకు గురైందని, ప్రతి పుట్పాత్ది ఇదే పరిస్థితి అని.. తక్షణం ఆక్రమణలను తొలగించాలని సామాజిక కార్యకర్త ఎన్.స్వర్ణలత డిమాండ్ చేశారు. ఏలూరు నగరంలోని సమస్యలపై అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా ఎండార్స్మెంట్లు ఇస్తున్నారే తప్ప చర్యలు మాత్రం ఉండటం లేదంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల తీరుపై నిరసన వ్యక్తం చేస్తూ సోమవారం ఆమె వినూత్నంగా నిరసన తెలిపారు. ముందుగా కలెక్టరేట్ వద్ద నిరసన వ్యక్తం చేసి.. అక్కడ నుంచి ఏలూరు కార్పొరేషన్ కార్యాలయానికి వెళ్లి అధికారులను నిలదీశారు. – ఏలూరు (టూటౌన్) -
చిగురుమామిడిలో అగ్నిప్రమాదం
● నాలుగు పూరిళ్లు దగ్ధం ● రూ.50 లక్షల ఆస్తినష్టం వేలేరుపాడు: వేలేరుపాడు మండల పరిధిలోని చిగురుమామిడి గ్రామంలో సోమవారం మధ్యాహ్నం జరిగిన అగ్ని ప్రమాదంలో నాలుగు పూరిళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. సుమారు రూ.50 లక్షల ఆస్తినష్టం సంభవించింది. వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన చండ్రుగొండ సత్తిబాబు, చిన్న నర్శింహులు, ఎక్కిళ్ళ శ్రీను, సింగ్బాబు మిర్చి రైతులు. సోమవారం మిర్చి కోతలు ఉండటంతో అంతా పొలాలకు వెళ్లారు. మధ్యాహ్న సమయంలో ముందుగా చిన్న నర్శింహులు ఇంట్లో విద్యుత్ షార్ట్సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. ఆ తర్వాత పక్కనున్న మూడు ఇండ్లకు మంటలు వ్యాపించాయి. అక్కడ నుంచి ఇతర ఇండ్లకు మంటలు వ్యాపించకుండా గ్రామస్తులు మంటలను అదుపుచేశారు. బాధితుల ఇళ్లల్లో గ్యాస్ సీలిండర్లు పేలడం, 33 కిలోమీటర్ల దూరంలోని కుక్కునూరు నుంచి ఫైర్ ఇంజన్ వచ్చేసరికే గృహోపకరణాలు, నగదు, బంగారు ఆభరణాలు దగ్ధమయ్యాయి. ప్రమాదంలో చండ్రుగొండ సత్యంకు చెందిన విద్యుత్ పిండి మిల్లు, డీజిల్ ఇంజన్, చిన్న నర్శింహులుకు చెందిన ఓ ద్విచక్రవాహనం, ఎక్కిళ్ళ శ్రీనుకు చెందిన కుట్టుమిషన్ కాలిపోయింది. చండ్రుగొండ సత్తిబాబుకు చెందిన రూ.2.20 లక్షలు, 10 కాసుల బంగారం, 5 కాసుల వెండి ఆభరణాలు, సింగ్బాబుకు చెందిన రూ.లక్ష నగదు, 8 కాసుల బంగారం, నాలుగు జతల వెండి పట్టీలు, ఎక్కిళ్ళ శ్రీనుకు చెందిన రూ.2 లక్షల నగదు, ఐదు కాసుల బంగారం, నాలుగు కాసుల వెండి ఆభరణాలు, చిన్న నర్శింహులుకు చెందిన 5 కాసుల బంగారం, లక్షా యాభైవేల నగదు, 6 కాసుల వెండి కాలిబూడిదయ్యాయి. బాధితులకు తక్షణ ప్రభుత్వ సాయం అందలేదు. బాధితులను వైఎస్సార్ సీపీ నేతలు పరామర్శించారు. కట్కూరు సర్పంచ్ లక్ష్మణ్, వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ కేసగాని శ్రీనివాసగౌడ్, కామినేని వెంకటేశ్వరావు, కౌలూరి సత్తిరాజు, చక్రి, అత్తిలి వెంకన్న బాధితులను పరామర్శించారు. -
ఆందోళనలో మొక్కజొన్న రైతులు
దెందులూరు: రాష్ట్రంలో తక్షణమే మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు తెరవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కె.శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఆదివారం దెందులూరులో ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 10 లక్షల ఎకరాలకు పైగా మొక్కజొన్నను పండించిన రైతులు తీవ్రమైన ఆందోళనలో ఉన్నారన్నారు. కష్టనష్టాలు, విపత్తులను తట్టుకుని మొక్కజొన్నను పండిస్తే మద్దతు ధర అందక, ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచే యక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే అదనుగా దళారులు క్వింటాకు రూ.700 నుంచి రూ.800 వరకు ధర తగ్గించి దోచుకుంటున్నారన్నారు. ఏలూరు జి ల్లాతో పాటు విజయనగరం, ఎన్టీఆర్, బాపట్ల, నంద్యాల, అనంతపురం తదితర జిల్లాల్లో రై తులు కొనుగోలు కేంద్రాల కోసం పలు రూ పాల్లో నిరసనలు తెలిపినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. వెంటనే కొనుగోలు కేంద్రాలను తెరవాలని, క్వింటాకు రూ.2,400 ధర చెల్లించాలని కోరారు. భీమవరం (ప్రకాశంచౌక్): ప్రతి వారం కలెక్టరేట్, గ్రామ, డివిజినల్ కేంద్రాల్లో నిర్వహించే పీజీఆర్ఎస్ కార్యాక్రమాన్ని సోమవారం రద్దు చేసినట్టు కలెక్టర్ తెలిపారు. ప్రజలు గమనించాలని కోరారు. అలాగే జిల్లాస్థాయిలో భీమవరం త్యాగరాజ భవనంలో సో మవారం మధ్యాహ్నం 2 గంటలకు పీ4 ప్ర థమ వార్షికోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు కలెక్టర్ తెలిపారు. క్యాంపు కా ర్యా లయం నుంచి అధికారులతో సమీక్షించారు. భీమవరం (ప్రకాశంచౌక్): విద్యాహక్కు చట్టం కింద 2026–27కు సంబంధించి ప్రైవేట్ పాఠశాలల్లో ఉచిత ప్రవేశాలకు జిల్లాలో 1,047 మంది విద్యార్థులు ఎంపికయ్యారని సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్ట్ కో–ఆర్డినేటర్ పి.శ్యామ్సుందర్ తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులు సంబంధిత ధ్రువీకరణ పత్రాలు, ఆన్లైన్ దరఖాస్తు ప్రింట్ను ఏప్రిల్ 7లోపు కేటాయించిన పాఠశా లలో సమర్పించి అడ్మిషన్ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. గడువులోపు ప్రక్రియ పూర్తికాకుంటే సీటు రద్దు చేస్తారన్నారు. ఎంఈఓలు తమ పరిధిలో జరిగిన ప్రవేశాల వివరాలను ధ్రువీకరించి, పూర్తి నివేదికను జిల్లా సమగ్ర శిక్ష కార్యాలయానికి సమర్పించాలని ఆదేశించారు. ఏలూరు (టూటౌన్): ఏలూరు జిల్లాలో సోమ వారం 1,160 ఇళ్లకు సామూహిక గృహ ప్రవేశాలు నిర్వహించనున్నట్టు కలెక్టర్ కె.వెట్రిసెల్వి తెలిపారు. నియోజకవర్గాల వారీగా చింతలపూడిలో 123, దెందులూరులో 89, ఏలూరు లో 502, గోపాలపురంలో 12, కై కలూరులో 172, నూజివీడులో 119, పోలవరంలో 91, ఉంగుటూరులో 52 ఇళ్లు పూర్తయ్యాయన్నారు. -
పైపులు..ఎటు చూసినా లీకులు
● తాడేపల్లిగూడెంలో తాగునీరు వృథా ● లీకేజీలతో నీరు కలుషితం తాడేపల్లిగూడెం (టీఓసీ): తాడేపల్లిగూడెం పట్టణంలో పలుచోట్ల పైప్లైన్ లీకేజీలతో తాగునీటికి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. నీరు వృథా కావడంతో పా టు కుళాయిలు నుంచి మురుగు నీరు, దుర్వాసన వస్తుందని ప్రజలు ఆందేన చెందుతున్నారు. ప్ర ధాన పైప్లైన్లతో పాటు ఇళ్లకు వెళ్లే పైప్లైన్లకు సైతం లీకేజీలు పడుతున్నాయి. కొన్నిచోట్ల డ్రెయిన్ల వద్ద పైప్లైన్లు ఉండటంతో తాగునీటి పైపుల ద్వా రా మురుగునీరు వస్తుందని పలువురు అంటున్నా రు. తక్షణమే సంబంధిత అధికారులు పైప్లైన్ల లీకేజీలపై దృష్టి పెట్టాలని కోరుతున్నారు. ఈతకోట మున్సిపల్ కాంప్లెక్స్ వద్ద.. స్థానిక పెద్ద మసీదు సెంటర్ నుంచి టీటీడీ కల్యాణ మండపం రహదారి మార్గంలో ఈతకోట తాతాజీ మున్సిపల్ కాంప్లెక్స్ వద్ద కాంప్లెక్స్కు సంబంధించిన పైప్లైన్కు సీసీ రోడ్డుకు దిగువన లీకేజీ పడింది. చాలా కాలంగా నీరు వృథా అవుతున్నా ఎవరూ పట్టించుకోలేదు. స్థానికులు మున్సిపల్ వాటర్ వర్క్స్ అధికారులకు తెలియజేయగా వారు వచ్చి పరిశీలించారు. రోడ్డుకు అవతల వైపు ప్రధాన పైపులైన్ వద్ద ఇతర పైప్లైన్లను సరిచేసేందుకు గొయ్యి తవ్వారు. ఎందుకు తవ్వారు తెలియరాలేదని స్థాని కులు అంటున్నారు. ఇప్పటికీ పైప్లైన్ లీకేజీని మాత్రం అరికట్టలేదు. ఇదిలా ఉండగా లీకేజీని అరికట్టేందుకు సీసీ రోడ్డును పగలగొట్టాల్సి ఉంటుందని సిబ్బంది చెబుతున్నారు. అంబేడ్కర్ భవనానికి ఎదురు సందులో.. మసీదు సెంటర్ అంబేడ్కర్ భవనానికి ఎదురుగా ఎంపీపీ పాఠశాల పక్క సందులో ఓ పైప్లైన్కు లీకేజీ పడింది. ఈ పైప్లైన్ డ్రెయినేజీ వద్ద ఉండటంతో లీకేజీ ద్వారా మురుగు నీరు పైప్లైన్లోకి వెళుతోందని స్థానికులు అంటున్నారు. ప్రభుత్వ పుస్తక విక్రయ కేంద్రం ఎదురుగా.. జిల్లా ప్రభుత్వ పాఠ్య పుస్తక విక్రయ కేంద్రం ఎదురుగా రోడ్డు పక్కగా డ్రెయినేజీకి సమీపంలో ఓ స్థలం వద్ద పైప్లైన్కు లీకేజీ ఏర్పడింది. నీరు వృథాగా పోతోంది. ఆయా సమస్యలపై అధికారులను వివరణ కోరగా లీకేజీలను పరిశీలించి సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. ఈతకోట మున్సిపల్ కాంప్లెక్స్ వద్ద.. మున్సిపల్ కాంప్లెక్స్ వద్ధతవ్వి వదిలేసిన గొయ్యి అంబేడ్కర్ భవనం ఎదురు సందులో.. -
నిబద్ధతతో పనిచేసిన ఉమేష్ చంద్ర
భీమవరం (ప్రకాశంచౌక్): దివంగత ఐపీఎస్ అధి కారి ఉమేష్ చంద్ర విధి నిర్వహణలో నిజాయతీ, నిబద్ధత, అంకిత భావంతో పనిచేసిన వ్యక్తి అని కలెక్టర్ సీహెచ్ నాగరాణి కొనియాడారు. ఆదివారం స్థానిక వీరమ్మ పార్కు సమీపంలోని ఉన్న ఎన్జీవో హోమ్ పట్టణ నిరాశ్రయుల వసతి గృహంలో ఉమేష్ చంద్ర 60వ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉమేష్ చంద్ర చిత్రపటం వద్ద కలెక్టర్, అధికారులు నివాళులర్పించారు. కుటుంబ సభ్యులతో కలిసి నాగరాణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజా శ్రేయస్సు దిశగా ఉమేష్ చంద్ర చేపట్టిన ప్రయోగాత్మక కార్యక్రమాలు ఆదర్శప్రాయమన్నారు. అనంతరం హోమ్లో వృద్ధులను ఆమె ఆప్యాయంగా పలకరించి భోజన ఏర్పాట్లు చేశారు. వృద్ధులకు అవసరమైన పలు వస్తువులు అందించారు. జేసీ టి.రాహుల్కుమార్రెడ్డి, ఆర్డీఓ కె.ప్రవీణ్కుమార్రెడ్డి, డ్వామా పీడీ సీహెచ్ అప్పారావు, జిల్లా దివ్యాంగుల సంక్షేమ శాఖ అధికారి రామ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
30 శాతం ఐఆర్ ప్రకటించాలి
ఏలూరు (ఆర్ఆర్పేట): రాష్ట్రంలో ఉపాధ్యాయులకు 30 శాతం ఐఆర్ను తక్షణమే ప్రకటించాలని జాక్టో చైర్మన్ పువ్వుల ఆంజనేయులు డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక ఆశోకవర్థన ప్రాథమికోన్నత పాఠశాలలో ఉపాధ్యాయ సంఘాల ఐక్య కార్యాచరణ సమితి (జాక్టో) జి ల్లా నూతన కార్యవర్గ ఎన్నిక నిర్వహించారు. జా క్టో జిల్లా చైర్మన్గా పువ్వుల ఆంజనేయులు, వైస్ చైర్మన్గా తలపంటి శ్రీనివాసరావు, సెక్రటరీ జనరల్గా భూక్యా రాము, కోశాధికారిగా ఎన్.ప్రవీణ్ కుమార్ ఎన్నికయ్యారు. వీరితో పాటు అదనపు సెక్రటరీ జనరల్గా కేఎస్వీకే రాజ్కుమార్, కో చైర్మన్లుగా కాటి వెంకటరమణ, బి.విద్యాసాగర్, పేరాబత్తుల సురేష్, మహిళా కో–చైర్మన్గా నందిగం శర్వాణి, డిప్యూటీ సెక్రటరీ జనరల్స్గా టీఎల్ఎస్ఎన్ మూర్తి, తోట ఎడ్వర్డ్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతనంగా ఎన్నికై న కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం చైర్మన్ ఆంజనేయులు మాట్లాడుతూ జిల్లాలో ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలపైనా జాక్టో రాజీలేని పోరాటం చేస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 12వ పీఆర్సీ కమిషన్ను వెంటనే నియమించాలని డిమాండ్ చేశారు. అలాగే పెండింగ్ డీఏలను విడుదల చేయాలని, సీపీఎస్ను రద్దు చేయాలని కోరారు. పీఆర్టీయూ, ఆపస్, ఎన్టీఏ, బీటీఏ (అమరావతి), టీఎన్యూఎస్, డీపీఆర్టీయూ, ఎంటీఎఫ్, ఏపీఎస్టీఏ, ఎంటీఎస్, ఏపీటీయూ తదితర ఉపాధ్యాయ సంఘాల జిల్లా ప్రతినిధులు పాల్గొన్నారు. -
ప్రజల చెవిలో పీ4 పూలు
నరసాపురం: ఉన్నది లేనట్టు.. లేనిది ఉన్నట్టు.. ఏ దో అద్భుతం జరిగిపోయిందంటూ హడావుడి చే యడంలో సిద్ధహస్తుడిగా పేరున్న సీఎం చంద్రబా బు రాష్ట్రంలో పేదలను ఉద్దారిస్తామంటూ పీ4 (పబ్లిక్–ప్రైవేట్–పీపుల్–పార్టనర్ఫిప్) కార్యక్రమా న్ని తీసుకువచ్చారు. ఎన్నికల హామీలను పూర్తిగా విస్మరించిన ముఖ్యమంత్రి పేదరిక నిర్మూలనకు పీ4 అంటూ హడావుడి చేశారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి ఏడాది గడిచినా ఏమాత్రం పురోగతి లేకపోగా.. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా పీ4 సర్వే ప్రథమ వార్షికోత్సవాలు నిర్వహించాలని కలెక్టర్లకు ఆదేశాలిచ్చారు. ఇప్పటికే పీ4 సర్వేలో ఎదురవుతున్న ఆటుపోట్లతో తలలు పట్టుకుంటున్న అధికారులు వార్షికోత్సవాన్ని ఏదో రకంగా నిర్వహించి చేతులు దులుపుకోవాలని చూస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాలతో జిల్లా అధికార యంత్రాంగం ఆదివారం సెలవు రోజైనా కార్యక్రమం నిర్వహణపై దృష్టి పెట్టింది. కలెక్టర్ నాగరాణి ఆర్డీఓలు, మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు, ఎంపీడీవోలతో గూగుల్ మీట్ ద్వారా సమావేశం నిర్వహించారు. జిల్లాస్థాయిలో భీమవరం త్యాగరాజ భవన్లో కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించారు. అలాగే ఏడు ని యోజకవర్గాల్లో కార్యక్రమం నిర్వహించాలని ఆదేశాలిచ్చారు. ఏమిటీ పీ4 సర్వే ఎన్నికల హామీలను అమలు చేయకపోవడంతో తీవ్ర వ్యతిరేకత రావడంతో ప్రజల దృష్టి మరల్చేందుకు చంద్రబాబు ప్రభుత్వం పీ4 సర్వే ప్రారంభించింది. జిల్లాల్లోని అన్ని ప్రాంతాల్లో ప్రతి కుటుంబా న్నీ సర్వే చేయాలని నిర్ణయించారు. ఆయా కుటుంబాల ఆర్థిక పరిస్థితి, వారి ఇళ్లలో విలాస వస్తువులు, ఆదాయ మార్గాలు ఇలా పలు అంశాల్లో పడపోత కా ర్యక్రమం నిర్వహించాలన్నది సర్వే లక్ష్యం. తద్వారా బంగారు కుటుంబాల పేరుతో సంపన్న వర్గాలను గుర్తించి వారిని మార్గదర్శకులుగా నియమించి కొన్ని పేద కుటుంబాలను దత్తత తీసుకునేలా చే యాలనేది కార్యక్రమం ఉద్దేశం. ఇలా సంపన్న వర్గా లు దత్తత తీసుకున్న కుటుంబాలకు ఆర్థికంగా చే యూత ఇవ్వడం, అవసరమైన నైపుణ్యాలు పెంచడానికి సహకరించడం చేయాలి. చెప్పడానికి ఇదంతా బాగున్నా.. సర్వే దశలోనే ఈ కార్యక్రమం అట్టర్ఫ్లాఫ్ అయ్యింది. టార్గెట్ ఘనం.. మార్గదర్శకులు దొరకని వైనం జిల్లాలో 4,92,292 కుటుంబాలను సర్వే చేసి ద త్తతకు అర్హమైన 64,940 కుటుంబాలను అధికారు లు తేల్చారు. అయితే ఆయా కుటుంబాలను దత్తత తీసుకోవడానికి సంపన్న వర్గాలైన మార్గదర్శకులు 15 వేల మంది కావాలి. అయితే ఏడాది కాలంలో మార్గదర్శకులు ఎంత మందిని గుర్తించారనే అంశంలో జిల్లా అధికార యంత్రాంగం వద్ద స్పష్టత లేదు. విశ్వసనీయ సమాచారం మేరకు కనీసం 3 వేల కు టుంబాలను కూడా గుర్తించలేదని తెలిసింది. మరి సర్వే లక్ష్యం ఏ మేరకు నెరవేరుతుందనేది ప్రశ్నార్థకమే. పబ్లిసిటీలో పీక్గా పేరున్న చంద్రబాబు పీ4 సర్వే విషయంలోనూ అదే తరహాలో ముందుకు సాగుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. హవ్వ.. ఇదెక్కడి విడ్డూరం ? పీ4 సర్వే పేరుతో సీఎం చంద్రబాబు హడావుడి నేడు ప్రథమ వార్షికోత్సవానికి సన్నాహాలు జిల్లాలో మార్గదర్శకులు దొరకని వైనం కార్యక్రమం విజయవంతానికి అధికారుల పాట్లు పీ4 సర్వేకు సంబంధించి ప్రభుత్వ వ్యవహార తీరుతో తొలి నుంచి అధికారులు తీవ్ర ఒత్తిడికి లోనయ్యారు. మార్గదర్శకులుగా చెప్పే బంగారు కుటుంబాలను గుర్తించాలని ప్రభుత్వం ఒత్తిడి తెస్తూనే ఉంది. కలెక్టర్ తరచూ ఇదే అంశంపై రివ్యూలు నిర్వహించడంతో అధికారులు విసిగిపోయారు. అయినా జిల్లాలో మార్గదర్శకులను రిజిస్టర్ చేయించడం అధికారుల వల్ల కాలేదు. దీంతో వ్యవహారం బెడిసికొట్టే ప్రమాదం ఉందని గుర్తించిన చంద్రబాబు సర్కారు ఓ దశలో ఈ బంగారు కుటుంబాల బాధ్యతను ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులకు అప్పగించాలని కూడా నిర్ణయించింది. ఒక్కో అధికారి, ఉద్యోగి జీతంలో నెలకు రూ.5 వేలు ఖర్చు చేయించేలా ప్రయత్నం జరిగింది. చివరకు సర్వే విఫలం విషయంలో ప్రభుత్వ ఉద్యోగులను బాధ్యులను చేసేలా సచివాలయ ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు ఇవ్వడం, ఒత్తిడి పెంచడం వంటివి కూడా చేశారు. అయితే ప్రభుత్వ చర్యలను మొదటిగా ఉపాధ్యాయ సంఘాలు వ్యతిరేకించాయి. తర్వాత మిగిలిన ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు సర్వే లక్ష్యం అమలు సాధ్యం కాదని ధిక్కార స్వరం పెంచారు. మొత్తంగా అటు ప్రజల నుంచే కాకుండా ఇటు అధికారులు, మేధా వుల నుంచి తీవ్ర వ్యతిరేకతతో అభాసుపాలైన పీ4 సర్వేకు వార్షికోత్సవం చేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. -
ఇంతి.. అధోగతి
ఏలూరు (టూటౌన్): రాష్ట్రంలో చంద్రబాబు పా లనలో మహిళలు ‘రుణమో రామచంద్రా’ అని అ భ్యర్థిస్తున్నారు.. పథకాలు అందక.. ఉపాధికి మా ర్గాలు లేక అల్లాడుతున్నారు. కూటమి ప్రభుత్వంలో మహిళా సంక్షేమానికి ఎలాంటి పథకాలు అమలు చేయకపోవడం, ఆర్థిక సాధికారత, స్వావలంబనకు ఊతమివ్వకపోవడంతో ఉసూరుమంటున్నా రు. దీంతో మహిళాభ్యున్నతి పూర్తిస్థాయిలో కుంటుపడింది. గత వైఎస్సార్సీపీ పాలనలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మహిళా సంక్షేమానికి పెద్దపీట వేశారు. మహిళలను ఆర్థికంగా శక్తిమంతులను చేసేందుకు కృషి చేశారు. డ్వా క్రా సంఘాలకు పెద్ద ఎత్తున బ్యాంకు లింకేజీ, సీ్త్ర నిధి రుణాలు అందించారు. ఆసరా, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, చేయూత, చేదోడు, జగనన్న తోడు వంటి పథకాలతో ఆర్థికంగా అండగా నిలిచారు. ప్ర భుత్వ అండతో చిరు వ్యాపారాలు, డెయిరీ యూ నిట్లు, గొర్రెలు, మేకలు, కోళ్ల పెంపకం, కుటీర పరిశ్రమల నిర్వహణ వంటివి మహిళలు చేపట్టారు. అయితే ఇదంతా గతం.. ప్రస్తుతం ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లావ్యాప్తంగా ఎక్కడా ఈ పరిస్థితి కానరావడం లేదు. ఈ నేపథ్యంలో పాత రోజులే బాగున్నాయని మహిళలు అంటున్నారు. చంద్రబాబు, కూటమి నేతల మాటలు నమ్మి మోసపోయామంటూ నిట్టూరుస్తున్నారు. వైఎస్సార్సీపీ పాలనలో స్వయం సమృద్ధి 2014–19 కాలంలో ఉమ్మడి జిల్లాలో డ్వాక్రా మ హిళలకు రూ.13,451.50 కోట్ల రుణాలు ఇచ్చారు. ఏలూరు జిల్లాలో 1,42,456 గ్రూపులకు రూ.7,682.40 కోట్లు, పశ్చిమగోదావరి జిల్లాలో 1,04,576 గ్రూపులకు రూ.5,753.10 కోట్లు రుణాలుగా అందించి స్వయం సమృద్ధికి దోహదపడ్డారు. అయితే ప్రస్తుత చంద్రబాబు పాలనలో ఈ స్థాయిలో బ్యాంకుల నుంచి రుణాలు అందడం లేదు. దీనిపై మహిళలు పెదవి విరుస్తున్నారు. వైఎస్సార్సీపీ పాలనలో ఏటా నిర్దేశిత లక్ష్యానికి మించి రుణాలు మంజూరు చేశారు. ఏలూరు జిల్లాలో సగటున ఏటా 164.89 శాతం, పశ్చిమగోదావరి జిల్లా లో 177.69 శాతం బ్యాంకు రుణాలు అందించారు. రుణమాఫీతో ఆదుకుని.. వైఎస్సార్సీపీ పాలనలో వైఎస్సార్ ఆసరా పథకంలో డ్వాక్రా మహిళలకు రూ.2,300 కోట్ల మేరకు లబ్ధి చేకూర్చారు. ఏలూరు జిల్లాలో 3.50 లక్షల మందికి పైగా మహిళలకు రూ.1377.16 కోట్ల రుణమాఫీ ప్రయోజనం చేకూరింది. పశ్చిమగోదావరి జి ల్లాలో సైతం మూడు లక్షల మందికి పైగా మ హిళలకు రూ.వెయ్యి కోట్ల మేరకు లబ్ధి కలిగింది. ‘కాపు’కాసిన నేస్తం వైఎస్సార్ కాపు నేస్తం పథకంలో ఒక్కో ఏడాది రూ.15 వేల చొప్పున నాలుగు విడతల్లో రూ.60 వేల చొప్పున ఆర్థిక సాయం అందించారు. ఉమ్మడి జిల్లాలో కాపు మహిళలకు రూ.220 కోట్ల మేరకు లబ్ధి చేకూరింది. ఏలూరు జిల్లాలో 66,488 మందికి రూ.100.45 కోట్లు, పశ్చిమలో లక్ష మందికి రూ.1,20 కోట్ల మేర సహకారం లభించింది. మెండైన చేయూత వైఎస్సార్ చేయూత పథకంలో ఉమ్మడి జిల్లాల పరిధిలోని మహిళలకు రూ.850 కోట్ల మేరకు లబ్ధి చే కూరింది. ఏలూరు జిల్లాలో 1,00,776 మందికి నా లుగు విడతల్లో కలిపి రూ.440 కోట్లు, పశ్చిమగోదావరి జిల్లా పరిధిలో 95 వేల మంది మహిళలకు రూ.410 కోట్ల మేరకు లబ్ధి చేకూర్చారు. అగ్రవర్ణ పేదలను అక్కున చేర్చుకుని.. గత వైఎస్సార్సీపీ పాలనలో అగ్రవర్ణ పేదలకు అండగా ఈబీసీ నేస్తం పథకాన్ని అమలు చేశారు. ఏడాదికి రూ.15 వేల చొప్పున మూడు విడతల్లో రూ.45 వేలు అందించారు. ఏలూరు జిల్లాలో 15,047 మందికి రూ.68.68 కోట్లు, పశ్చిమగోదావరి జిల్లాలో 14 వేల మందికి 63 కోట్ల మేర లబ్ధి చేకూర్చారు. అతివకు అన్యాయం చంద్రబాబు పాలనలో అందని భరోసా పథకాల్లేవ్.. ఉపాధికి బాటల్లేవ్ కుంటుపడిన మహిళా సాధికారత వైఎస్సార్సీపీ పాలనలో మహిళాభ్యున్నతికి పెద్దపీట నాటి రోజులే బాగున్నాయంటున్న సీ్త్రమూర్తులు చంద్రబాబు, కూటమి నాయకులు ఎన్నికల ముందు సూపర్ సిక్స్, పథకాల పేరుతో మహిళలను వంచించారు. అధికారం చేపట్టి రెండేళ్లు కావస్తున్నా మహిళా సంక్షేమానికి ఎలాంటి పథకాలను అ మలు చేయలేదు. దీంతో మహిళలు ఆర్థిక భరోసా కోల్పోయారు. ఎప్పటిలాగానే ప్రతి చిన్న అవసరానికీ ఇంట్లో వారిపై ఆధారపడాల్సిన దుస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఏదో పథకం ద్వారా మ హిళల చేతుల్లోకి డబ్బులు వచ్చే అవకాశం లేకపోవడంతో ఉసూరుమంటున్నారు. నాటి వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో వైఎస్ జగన్ పాలనే బాగుండేదని, ప్రస్తుతం తమకు ఎలాంటి పథకం అందకపో వడంతో వెంపర్లాడాల్సిన పరిస్థితి వచ్చిందని పలువురు మహిళలు ఆవేదన చెందుతున్నారు. -
మాజీ మంత్రి శ్రీరంగనాథరాజుకు పితృవియోగం
ఉండి: మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ రాష్ట్ర పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యుడు చెరుకువాడ శ్రీరంగనాథరాజుకు పితృవియోగం జరిగింది. ఆదివారం వేకువజామున ఉండి మండలం యండగండిలోని ఆయన నివాసంలో చెరుకువాడ వెంకట నర్సింహరాజు (96) తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య సూర్యకాంతమ్మ, ఇద్దరు కుమారులు శ్రీరంగనాథరాజు, బంగార్రాజు, కుమార్తె విజయ ఉన్నారు. నర్సింహరాజు భౌతికకాయాన్ని శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేన్రాజు, ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్, వైఎస్సార్సీపీ ఉండి నియోజకవర్గ ఇన్చార్జి పీవీఎల్ నర్సింహరాజు, పాలకొల్లు నియోజకవర్గ ఇన్చార్జి గుడాల గోపి, సీనియర్ నాయకులు కనుమూరు అబ్బాయిరాజు, ఆ కివీడు ఏఎంసీ మాజీ చై ర్మన్ వానపల్లి బాబూరా వు, కవిటం ఎంపీపీ వా సిరెడ్డి, పార్టీ నేత యడ్ల తాతాజీ, ఆచంట నియోజకవర్గ ప్రజాప్రతినిధులు తదితరులు సందర్శించి నివాళులర్పించారు. -
దళితులకు రక్షణ లేదా?
ఏలూరు టౌన్ : రాష్ట్రంలో కూటమి పాలనలో దళితులపై రోజురోజుకూ అక్రమ కేసులు, దాడులు, దౌర్జన్యాలు పెచ్చుమీరుతున్నాయని, ఆకివీడు పెదపేటలో శ్రీరామనవమి వేడుకల పేరుతో అక్కడకు వెళ్ళి రెచ్చగొట్టి దాడులకు ఉసిగొల్పి.. మత, కుల విద్వేషాలు రెచ్చగొట్టడం దారుణమని వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ ఏలూరు జిల్లా అధ్యక్షుడు తేరా ఆనంద్, ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నూకపెయ్యి సుధీర్బాబు అన్నారు. పార్టీ కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. పెదపేటలో రామాలయం కట్టాలని భావిస్తే గ్రామపెద్దలతో సామరస్యంగా చర్చించి ఇరు పక్షాలకూ ఇబ్బంది లేకుండా చేయాలని, కుట్రపూరితంగా గ్రామంలోకి రాజకీయ నేతలతో, పోలీస్ బలగాలతో వెళ్ళి దళితులను అణచివేయాలనే ప్రయత్నం సరైంది కాదన్నారు. ఉప సభాపతి స్థానంలో ఉంటూ కావాలనే మతపరమైన చిచ్చు రేపేందుకు గత కొంతకాలంగా అక్కడికి వెళుతూ దళితుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని విమర్శించారు. మందీ మార్బలంతో పెదపేటలోకి వెళ్ళి గొడవలు సృష్టించారు.. ఒక వర్గం నేతలు నినాదాలు చేస్తూ దళితులను రెచ్చగొట్టారు.. ఇది నిజం కాదా అంటూ వారు ప్రశ్నించారు. 57 మంది దళిత యువకులు, మైనర్లపై అక్రమ కేసులు బనాయించి వారి భవిష్యత్తో చెలగాటం ఆడాలని చూస్తే సహించేది లేదన్నారు. ఎస్సీ సెల్ అధికార ప్రతినిథి మున్నుల జాన్గురునాథ్, ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి నిట్టా గంగరాజు మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వంలో దళితులకు రాష్ట్రంలో ఎక్కడా రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ఉన్నత పదవుల్లో ఉన్న నేతలు సైతం దళితులను అణచివేసే ధోరణిలో మాట్లాడుతూ పెదపేట వివాదానికి మతం రంగు పులిమే ప్రయత్నం చేయటం సిగ్గుచేటన్నారు. సమావేశంలో వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ ఏలూరు నగర అధ్యక్షుడు ఇనపనూరి జగదీష్, ఏలూరు నగర మహిళ అధ్యక్షురాలు జిజ్జువరపు విజయనిర్మల, యువజన విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రత్తిపాటి విక్టర్ తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఆనంద్ ఆగ్రహం -
బస్సుషెల్టర్లు లేక అవస్థలు
తాడేపల్లిగూడెం(టీఓసీ): ఆర్టీసీ బస్సులు ఆగేందుకు తాడేపల్లిగూడెం పట్టణంలోని ప్రధాన కూడళ్లలో సరైన బస్సు షెల్టర్లు లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాడేపల్లిగూడెం బస్సు కాంప్లెక్స్ నుంచి ఏలూరు, భీమవరం, తణుకు, నల్లజర్ల వైపు వెళ్లే ప్రధాన మార్గాలు ఉన్నాయి. బస్సు కాంప్లెక్స్ నుంచి బయలుదేరిన తర్వాత తాలూకా ఆఫీస్ సెంటర్, శేషమహల్ రోడ్డు ప్రారంభంలోని ఎన్టీఆర్ జంక్షన్, ఫ్లై ఓవర్ మీదుగా తణుకు వెళ్లే స్టాప్, భీమవరం వెళ్లే స్టాప్, ఏలూరు వైపు వెళ్లే స్టాప్ల వద్ద ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా నల్లజర్ల వైపు గొల్లగూడెం సెంటర్, హౌసింగ్బోర్డు సెంటర్, మాగంటి కళ్యాణ మండపం సెంటర్లు కూడా రద్దీగా ఉంటాయి. తణుకు వైపు వెళ్లే ప్రయాణికుల కోసం షెల్టర్ నిర్మించినప్పటికీ, మిగిలిన చోట్ల పరిస్థితి దయనీయంగా ఉంది. హౌసింగ్బోర్డు సెంటర్ వద్ద దాతలు నిర్మించిన బస్సు షెల్టర్ ఉన్నా, అది బస్సులు ఆగే ప్రాంతానికి దూరంగా, ఒక మూలకు ఉండటంతో ప్రస్తుతం నిరుపయోగంగా మారింది. నేడు ఆ బస్సు షెల్టర్ను ఎవరూ ఉపయోగించడం లేదు. షెల్టర్లు లేక ప్రయాణికుల ఇబ్బందులు పట్టణంలోని ప్రధాన సెంటర్లయిన తాలూకా ఆఫీస్ సెంటర్, ఎన్టీఆర్ జంక్షన్, భీమవరం వైపు వెళ్లే ప్రభాత్ టాకీస్ సెంటర్, ఏలూరు వైపు వెళ్లే మోడ్రన్ కేఫ్ సెంటర్ల వద్ద బస్సులు నిలిపేందుకు షెల్టర్లు లేవు. దీంతో ఎండలు, వానలకు ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. ఈ వేసవిలో ఉష్ణోగ్రతలు పెరిగితే, షెల్టర్లు లేక ప్రయాణికులు ఎండలో నిలబడలేని పరిస్థితి ఏర్పడింది. వర్షం పడినప్పుడు సమీపంలోని దుకాణాల వద్ద తలదాచుకోవాల్సి వస్తోంది. మరోవైపు, షెల్టర్లు లేకపోవడంతో బస్సుల కోసం రోడ్లపైనే ఎదురుచూస్తున్నారు. సమీప షాపులు వద్ద నిలబడటం, లేదంటే రోడ్డుపైనే ఉంటున్నారు. ప్రయాణికులను ఎక్కించేందుకు బస్సు రోడ్డుపైన ఆపినప్పుడు బస్సు వెనుక నున్న వాహనాలు వారు ముందుకు వెళ్లేందుకు అవకాశం లేకపోవడంతో పలు చోట్ల ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలుగుతుంది. ముఖ్యంగా ఏలూరు, భీమవరం మార్గాల్లో ఈ సమస్య అధికంగా ఉంది. తాలూకా ఆఫీస్ సెంటర్, ఎన్టీఆర్ జంక్షన్, భీమవరం వైపు, ఏలూరు వైపు తక్షణమే షెల్టర్లు నిర్మించి, బస్సులు రోడ్డు పక్కన ఆగేలా ఏర్పాట్లు చేస్తే ట్రాఫిక్ సమస్య కూడా తగ్గుతుందంటున్నారు. తాడేపల్లిగూడెంలో ప్రయాణికుల ఇక్కట్లు రానున్నది వేసవి కాలం అందువల్ల అధికారులు మరియు ప్రజాప్రతినిధులు స్పందించి పట్టణంలోని ప్రధాన ప్రాంతాలలో బస్సు షెల్టర్లు నిర్మించాలి. ప్రయాణికులు బస్సుల కోసం రోడ్డు మీద పడిగాపులు పడకుండా చూడాలి. బస్సులు వచ్చే వరకు కూర్చునేందుకు, సేద తీరేందుకు అవకాశం ఉండాలి. ఆ దిశగా అధికారులు, ప్రజాప్రతినిధులు చొరవ తీసుకోవాలి. – తాడేపల్లి శ్యాంబాబు, మాలల జేఏసీ టౌన్ యువజన అధ్యక్షుడు -
గ్యాస్ అక్రమ వినియోగదారులపై కేసుల నమోదు
కై కలూరు : గృహ అవసరాలకు వినియోగించాల్సిన గ్యాస్ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు ఉపయోగిస్తున్న దుకాణాలు, హోటళ్లపై రెవెన్యూ అధికారులు శనివారం కై కలూరులో ఆకస్మిక దాడులు నిర్వహించారు. మండల పీడీఎస్ డీటీ కె.వెంకటరమణ ఆధ్వర్యంలో సిబ్బంది ఈ దాడులు చేసి మొత్తం 21 గ్యాస్ సిలిండర్లను సీజ్ చేశారు. అనంతరం తహసీల్దారు ఆర్.రామకృష్ణ మాట్లాడుతూ.. పట్టుబడిన వారికి 6ఏ నోటీసులు అందజేస్తామని, సీజ్ చేసిన సిలిండర్లను ఏలూరు జిల్లా కలెక్టర్ కార్యాలయానికి తరలిస్తామని తెలిపారు. నిబంధనలు అతిక్రమించి గ్యాస్ సిలిండర్లను వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తాడేపల్లిగూడెం : వ్యాపారంలో నైతిక విలువలు ఎంతో అవసరమని వరంగల్ నిట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ వెంకటకృష్ణ అన్నారు. ఏపీ నిట్లో శనివారం నిర్వహించిన ‘స్టార్టప్ లీగల్ ఎథికల్ స్టెప్స్’ అనే అంశంపై ఆయన ప్రసంగించారు. జీవితంలో ఏదైనా సాధించాలనే పట్టుదల, అంకితభావంతో పాటు వినియోగదారులను ఆకట్టుకునే నేర్పు ఉండాలన్నారు. సరైన వ్యాపారాన్ని ఎంచుకోవడం, కంపెనీ రిజిస్ట్రేషన్ విధానాలు, మేధోసంపత్తి హక్కుల ప్రాధాన్యత గురించి వివరించారు. వ్యాపారంలో పారదర్శకత, నమ్మకం, నైతిక విలువలు ఉండాలని, ప్రభుత్వ పథకాలు, రాయితీలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్తికేయశర్మ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో డీన్లు రవికిరణ్ శాస్త్రి, జి.బి.వీరేష్కుమార్, సంతోష్కుమార్ తదితరులు పాల్గొన్నారు. బుట్టాయగూడెం: మండలంలోని ఇప్పలపాడు సమీపంలో ఉన్న ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్లో 2026–27 విద్యా సంవత్సరానికి ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నట్లు ప్రిన్సిపాల్ ప్రవీణ్కుమార్ మిశ్రా శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 7వ తరగతిలో బాలురు–1, బాలికలు–4, 9వ తరగతిలో బాలురు–1, 11వ తరగతిలో బాలురు–15, బాలికలకు 15 సీట్లు ఖాళీగా ఉన్నా యని వివరించారు. అర్హత గల విద్యార్థులు ఏప్రిల్ 10వ తేదీలోపు పాఠశాలకు నేరుగా వచ్చి దరఖాస్తులు సమర్పించాలని కోరారు. ఐటీడీఏ పీఓ ఆధ్వర్యంలో నిర్వహించే ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన వారికే సీట్లు కేటాయిస్తామన్నారు. వివరాలకు 9412102600 నెంబరులో సంప్రదించవచ్చన్నారు. చాట్రాయి: విద్యుత్ షాక్ తగిలి రైతు మృతి చెందిన సంఘటన మండలంలోని చనుబండలో జరిగింది. గ్రామానికి చెందిన చిన్నం లక్ష్మీ నారాయణ (45) శుక్రవారం రాత్రి 7 గంటల సమయంలో మొక్కజొన్న పంటకు నీరు పెట్టడానికి వెళ్లి ఫీజు వేస్తుండగా షాక్ తగిలి అక్కడి అక్కడే మృతి చెందాడు. రాత్రి రెండు గంటల వరకూ ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పొలం దగ్గరకు వెళ్లి చూడగా మృతి చెంది ఉన్నాడు. మృతుడు తనకున్న భూమితో పాటు కొంత కౌలుకు తీసుకుని నిత్యం వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటూ ఇద్దరు కొడుకులను చదివించుకుంటన్నాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిర్వహించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై డి.రామకృష్ణ తెలిపారు. -
యువకుడి అదృశ్యం కేసు ఛేదించిన పోలీసులు
తణుకు అర్బన్: చనిపోతున్నానంటూ కుటుంబసభ్యులకు వాయిస్ మెసేజ్ పంపి అదృశ్యమైన యువకుడి కేసును తణుకు పోలీసులు ఛేదించారు. తణుకు పట్టణానికి చెందిన చిట్టూరి భీమరాజు ఈనెల 26 రాత్రి నుంచి అదృశ్యం కాగా శుక్రవారం రాత్రి తణుకు పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తులో భాగంగా యువకుడి సెల్ఫోన్ ఆధారంగా గంట వ్యవధిలోనే వివరాలు తెలుసుకుని తణుకు మండలం తేతలి వైజంక్షన్లో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం తల్లితండ్రులకు అప్పగించారు. భీమరావు తన ప్రేమ వ్యవహారంలో భాగంగా ఇటు కుటుంబసభ్యులను పోలీసులను సైతం పక్కదారి పట్టించే విధంగా ఆంధ్రా సుగర్స్ ప్రాంతంలోని కాలువ వంతెన సమీపంలో తన బైక్, చెప్పులు వదిలి అదృశ్యమైనట్లుగా నమ్మించాడు. ఆత్మహత్య చేసుకునే క్రమంలో కాలువలోకి దూకేశాడేమోనని భావించిన తల్లితండ్రులు కాలువ వెంట గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో సెల్ఫోన్ సిగ్నల్ ఆధారంగా పోలీసులు యువకుడి ఆచూకీ కనుగొన్నారు. యువకుడిని తణుకు పట్టణ పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చి తల్లితండ్రులకు అప్పగించారు. -
మట్టిరహిత నారు మొక్కలు అందిస్తాం
తాడేపల్లిగూడెం: మట్టిరహిత పద్ధతుల్లో ఉత్పత్తి చేసిన కూరగాయల నారును రైతులకు అందించడమే లక్ష్యంగా ఉద్యాన విశ్వవిద్యాలయంలో మొక్కలను తయారు చేస్తున్నామని వీసీ డాక్టర్ కె.ధనుంజయరావు తెలిపారు. శనివారం విశిష్ట రక్షిత సాగు కేంద్రంలో నామమాత్రపు ధరకే రైతులకు మొక్కలను అందజేశారు. ఈ పద్ధతిలో పెంచిన నారుకు తెగుళ్ల బెడద తక్కువగా ఉంటుందని, నారు దశలోనే వ్యాధులను నివారిస్తామని పేర్కొన్నారు. మొక్కలు కావాల్సిన రైతులు వీఆర్ గూడెం ఉద్యాన పరిశోధనా స్థానంలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. వర్సిటీలోని సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు అందుబాటులోకి తెస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పరిశోధనా సంచాలకులు జి.రామానందం, హెడ్ టి.సుశీల, శాస్త్రవేత్త ఎన్.వి.గౌతమ్ పాల్గొన్నారు. అంటుగట్టిన నారు కోసం 73826 33654 నెంబరులో సంప్రదించవచ్చన్నారు. పెనుగొండ: ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం పరిధిలోని మార్టేరు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో ఏప్రిల్ 8న కిసాన్ మేళా నిర్వహించనున్నట్లు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం గోదావరి మండలం పరిశోధన సహ సంచాలకుడు డాక్టర్ టి.శ్రీనివాస్ తెలిపారు. శనివారం విలేకర్లతో మాట్లాడుతూ మారుతున్న వాతావరణ, వాణిజ్య పరిస్థితులు–సుస్థిర వరి వ్యవసాయం అంశంపై మేళా జరుగుతుందన్నారు. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం, వ్యవసాయ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో మేళా జరుగుతుందని వివరించారు. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ, మంత్రి నిమ్మల రామానాయుడు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరవుతారన్నారు. 8వ తేదీన ఉదయం రైతుల నమోదుతో కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. అనంతరం క్షేత్ర సందర్శన, వ్యవసాయ ప్రదర్శన, రైతులతో శాస్త్రవేత్త చర్చా గోష్టి, వ్యవసాయ క్విజ్, రైతు సదస్సు, వ్యవసాయ ప్రచురణల విడుదల, రైతులతో భాగస్వామ్య సదస్సు నిర్వహిస్తున్నామన్నారు. ఆకివీడు: మండలంలోని కుప్పనపూడిలోని తాళ్లకోడు రోడ్డులో శనివారం రాత్రి రెండు బైక్లు ఢీకొనడంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. నంద్యాల రాంబాబును 108లో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. అదే గ్రామానికి చెందిన ఏలూరు మాధవ్కు తీవ్ర గాయాలయ్యాయి. మెరుగైన వైద్యం కోసం భీమవరంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. -
భానుడి భగభగలు
● నిర్మానుష్యంగా రహదారులు ● చలివేంద్రాలు ఏర్పాటు చేయాలంటున్న ప్రజలు తణుకు అర్బన్: ఎండల తీవ్రతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వేసవి ప్రారంభం నుంచే ఉష్ణోగ్రతలు పెరిగాయి. దీనికి తోడు ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. శనివారం అధిక వేడి కారణంగా, ఉక్కపోతతో తణుకు పట్టణంలో రహదారులన్నీ నిర్మానుష్యంగా మారాయి. ఎప్పుడూ రద్దీగా ఉండే తణుకులోని ప్రధాన రహదారులైన రాష్ట్రపతి రోడ్డు, రైల్వే ఓవర్ బ్రిడ్జి, వంగవీటి మోహన రంగా వీధి, రైల్వే స్టేషన్రోడ్డు, వేల్పూరు రోడ్డు, ఉండ్రాజవరం రోడ్డు ప్రాంతాలు జనసంచారం లేక నిర్మానుష్యంగా మారాయి. మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జనం సంచారం తగ్గింది. ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. ప్రయాణికులు ఎండతో ఇబ్బంది పడగా, చిరు వ్యాపారులు లేక డీలా పడ్డారు. చలివేంద్రాలు ఏర్పాటు చేయాలి వేసవి ఎండల తీవ్రత కారణంగా ప్రయాణికుల సౌకర్యార్ధం ప్రభుత్వం చలివేంద్రాలు ఏర్పాటుచేయాలని ప్రజలు కోరుతున్నారు. ఉక్కపోత వాతావరణానికి దాహంతో ప్రయాణాల్లో ఇబ్బందులు పడుతున్నారని ప్రధాన రహదారుల్లో చలివేంద్రాలు ఏర్పాటుచేస్తే ప్రయాణికులు దాహార్తిని తీర్చుకుంటారని పలువురు కోరుతున్నారు. -
అటవీ శాఖ మొద్దు నిద్ర
కుక్కునూరు: మండలంలో అటవీ శాఖ పనితీరుపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్ర అటవీ శాఖ పరిధిలోని బాంబూ చెట్లను తెలంగాణ అటవీశాఖ సిబ్బంది తమ ప్రాంతంలోదని పేర్కొంటూ అమరవరం రేంజ్ పరిధిలోని, కొత్తూరు బీట్ అటవీ ప్రాంతంలో సుమారుగా 20,000 కర్రలను నరికినట్టు తెలుస్తుంది. ఈ విషయం తెలిసి కూడా అమరవరం రేంజ్ సిబ్బంది అడ్డుకునే ప్రయత్నం చేయడం లేదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అటవీ శాఖలో అక్రమ వసూళ్లు కొయ్యలగూడెం: అటవీ శాఖలో అక్రమ వసూళ్లపై పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. కన్నాపురం అటవీ శాఖ రేంజ్ పరిధిలో పుల్ల ట్రాక్టర్ల నుంచి వసూళ్లు చేస్తున్నారని రైతులు ఆరోపణలు చేస్తున్నారు. మామిడి, జీడిమామిడి పుల్ల ట్రాక్టర్కు రూ. 4 వేల నుంచి రూ.6 వేలు, ఇతర మారుజాతి పుల్ల ట్రాక్టర్కు రూ.10 వేల వరకు వసూలు చేసుకున్నారని అంటున్నారు. బేరన్ క్యూరింగ్ కోసం మామిడి, జీడి మామిడి తోటలను పొలాలలో నుంచి తీసి వేస్తున్న రైతుల నుంచి పుల్లను కొనుగోలు చేసి తమ అవసరాల కోసం తరలిస్తుంటే అడ్డుపడి వసూళ్లు చేస్తున్నారంటున్నారు. దీనిపై కార్యాలయంలోని ఓ అధికారిని వివరణ కోరగా పుల్ల ట్రాక్టర్లకు పర్మిషన్లు తప్పనిసరి అన్నారు. రైతుల అభ్యర్థన మేరకు మామిడి,జీడి మామిడి పుల్ల రవాణాకు అడ్డు చెప్పడం లేదన్నారు. అవినీతి అధికారిపై చర్యలు తీసుకోవాలని ఏజెన్సీ మెట్ట రైతులు కోరుతున్నారు. -
మతిస్థిమితం లేని వ్యక్తి అదృశ్యం
తణుకు అర్బన్: తణుకు పట్టణానికి చెందిన ఒక వ్యక్తి అదృశ్యమైనట్లు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై కె.శ్రీనివాస్ తెలిపారు. అజ్జరం రోడ్డులోని ఇందిరమ్మ కాలనీకి చెందిన సంపు దుర్గాప్రసాద్ గత కొంతకాలంగా మతిస్థిమితం లేకుండా ఉంటున్నారు. మూడు నెలల క్రితం బ్రెయిన్ ఆపరేషన్ జరగడంతో ఇంట్లోనే ఉంటున్న ఆయన, ఈ నెల 25న మధ్యాహ్నం ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు చుట్టుపక్కల గాలించినా ఆచూకీ దొరకలేదు. సోదరుడు ఏసుబాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ముదినేపల్లి(కై కలూరు) : కడుపునొప్పి తాళలేక పురుగు మందు తాగి అత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన వ్యక్తి చికిత్స పొందుతూ శనివారం మరణించాడు. ముదినేపల్లి పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం చినకామనపూడికి చెందిన నున్న శ్రీనివాసరావుకు 4 ఏళ్ల క్రితం శ్రీనివాసరావుకు బ్రెయిన్ స్టోక్ వచ్చింది. అప్పటి నుంచి తీవ్ర కడుపునొప్పితో బాధపడుతున్నాడు. ఈ నెల 25న కడుపునొప్పి, చిన్ని కుమార్తెకు వివాహం కాలేదనే బాధతో పురుగుమందు తాగాడు. అతనిని ముదినేపల్లి అస్పత్రికి తీసుకువెళ్ళి, అక్కడ నుంచి గుడివాడ ఈవీఆర్ ఆస్పత్రికి మెరుగైన వైద్యం కోసం తరలించారు. చికిత్స పొందుతూ అతను మృతి చెందాడు. -
రేటు నాట్ 'గుడ్డు'
సాక్షి, భీమవరం: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని తణుకు, తాడేపల్లిగూడెం, అత్తిలి, ఇరగవరం, ఉంగుటూరు, జంగారెడ్డిగూడెం, దేవరపల్లి, ఉండ్రాజవరం తదితర మండలాల్లో సుమారు 250 పౌల్ట్రీలు విస్తరించి ఉన్నాయి. గుడ్లు పెట్టే కోళ్లు 1.3 కోట్ల వరకు ఉండగా రోజుకు 1.05 కోట్ల గుడ్లు ఉత్పత్తి అవుతున్నాయి. వీటిలో 70 శాతం గుడ్లు పశ్చిమబెంగాల్, ఒడిశా, బిహార్, తమిళనాడులోని నమ్మకల్ తదితర ప్రాంతాలకు ఎగుమతి అవుతుండగా మిగిలినవి స్థానికంగా వినియోగమవుతున్నాయి. చలి తీవ్రతతో ఉత్తరాది రాష్ట్రాల్లో చేపల లభ్యత తగ్గడం వలన గుడ్లు వినియోగం పెరుగుతుంది. జిల్లా నుంచి ఎగుమతులకు డిమాండ్ ఏర్పడి రైతు ధర ఆశాజనకంగా ఉంటుంది. డిసెంబరు చివరి వారంలో ఫాంగేట్ వద్ద రూ. 6.95లకు చేరి రికార్డు ధర నమోదు చేసుకుంది. రైతుల ఆశలపై నీళ్లు చల్లుతూ రికార్డు ధర మూన్నాళ్ల ముచ్చటయ్యింది. జనవరి నుంచి రూ.5.50 నుంచి రూ.4.50 మధ్య ఒడిదుడుకులకు లోనవుతూ వచ్చింది. వార్ ప్రభావం సాధారణంగానే ఎండలు ముదిరేకొద్ది గుడ్డు ధర తగ్గుతుంది. కాగా అమెరికా, ఇజ్రాయేల్– ఇరాన్ యుద్ధం దీనికి మరింత ఆజ్యం పోసింది. తమిళనాడులోని నమ్మకల్ నుంచి గల్ఫ్ దేశాలకు జరిగే గుడ్లు ఎగుమతులు నిలిచిపోయాయి. ఇప్పటికే జిల్లా నుంచి ఎగుమతులు జరుగుతున్న ఉత్తరాది రాష్ట్రాల్లో పౌల్ట్రీలు విస్తరించడం స్థానిక ఎగుమతులపై ప్రభావం చూపుతోంది. అక్కడి ట్రేడర్స్ నిర్ణయించిన ధరకు రైతులు అయినకాడికి అమ్ముకోవాల్సిన దుస్థితి ఎదురవుతోంది. పశ్చిమాసియా కల్లోలంతో గల్ఫ్ దేశాలకు ఎగుమతులు జరుగక పౌల్ట్రీల్లో గుడ్లు నిల్వలు పేరుకుపోయి ధర పతనమవుతోంది. రెండు వారాల క్రితం ఫాంగేట్ వద్ద రూ. 5.50లు వరకు ఉన్న గుడ్డు ధర గురువారం నాటికి రూ.3.95లకు తగ్గిపోయింది. ధర తగ్గడం వినియోగదారులకు ఊరటనిస్తున్నా రైతులను తీవ్ర నష్టాల్లోకి నెట్టేస్తోంది. పెరిగిన మేత, మందుల ధరలు, నిర్వహణ వ్యయంతో ఒక్కో గుడ్డు ఉత్పత్తి చేసేందుకు ఐదు రూపాయలకు పైనే వ్యయమవుతుందని కోళ్ల రైతులు అంటున్నారు. ప్రస్తుత ధరతో తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని ఆవేదనవ్యక్తం చేస్తున్నారు.మున్ముందు గడ్డు కాలమే ఎండలు ముదురుతుండటం కోళ్ల రైతులను మరింత ఆందోళనకు గురిచేస్తోంది. 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యేకొద్దీ కోళ్ల మరణాలు పెరుగుతుంటాయి. లక్ష కోళ్లు ఉన్న పౌల్ట్రీలో రోజుకు 25 నుంచి 30 వరకు కోళ్లు మృత్యువాత పడితే వేసవిలో వీటి సంఖ్య రెండు మూడు రెట్లు పెరుగుతుంది. ఆయా దశల కోళ్లను బట్టి ఒక కోడి చనిపోవడం వల్ల సగటున రూ. 200కు పైనే నష్టం వాటిల్లుతుందని పరిశ్రమ వర్గాలంటున్నాయి. మరోపక్క ఎండల తీవ్రతతో రోజువారీ గుడ్లు ఉత్పత్తి 10 శాతం నుంచి 15 శాతం వరకు తగ్గిపోతుంది. అధిక ఉష్ణోగ్రతల నుంచి కోళ్లను కాపాడుకునేందుకు ప్రత్యేక సంరక్షణ చర్యలతో నిర్వహణ భారం తడిసి మోపెడవుతోంది. వడదెబ్బకు గురికాకుండా కోళ్లకు ప్రత్యేక మందులు ఇవ్వడం, వేడిగాలులు తగలకుండా షెడ్లు చుట్టూ గోనె సంచులు కట్టి వాటికి వాటరింగ్ చేయడం, స్ప్రింక్లర్ల ఏర్పాటు తదితర సంరక్షణ చర్యలతో నిర్వహణ భారం పెరగనుండటం కోళ్ల రైతులను కలవరపరుస్తోంది. ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మంది ఆధారపడి జీవిస్తున్న పౌల్ట్రీ పరిశ్రమను సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోళ్ల రైతులు కోరుతున్నారు. కోళ్ల మేతలు సబ్సిడీపై అందించాలని, విద్యుత్, మందులు తదితర వాటిపై రాయితీలతో ఆదుకోవాలంటున్నారు. -
రఘురామ పర్యటనతో టెన్షన్!
సాక్షి, అమరావతి: పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడులోని పెదపేటలో ఉపసభాపతి రఘురామ కృష్ణరాజు పర్యటనతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.. డిప్యూటీ స్పీకర్ వెంట వచ్చిన కూటమి కార్యకర్తలు తమపై దాడిచేశారని స్థానిక దళితులు ఆందోళనచేశారు. ఈ గొడవ పేరుతో పలువురిని స్థానికులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని, పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లకుండా గుర్తు తెలియని ప్రాంతానికి తరలించారని వారు పేర్కొన్నారు. ఆకివీడులోని పెదపేటలో దళితుల నివాసాల మధ్య ఉన్న ఓ ఆలయంలో రఘురామకృష్ణరాజు పూజలు చేయడానికి శుక్రవారం వచ్చారు. ఆయన వెంట పెద్ద ఎత్తున కార్యకర్తలు రావడం, వారంతా ఏదో దాడికి వచ్చినట్లు హడావిడి చేయడం, ఆ ప్రాంతంలోని దళితులు నిరసన తెలిపేందుకు ప్రయత్నించడంతో ఘర్షణ వాతావరణం తలెత్తింది. డిప్యూటీ స్పీకర్ మందీమార్బలం హడావుడి..శుక్రవారం శ్రీరామ నవమి సందర్భంగా డిప్యూటీ స్పీకర్ మందీమార్బలాన్ని వేసుకుని హడావుడి చేయడం ఉద్రిక్తతకు దారితీసింది. ఉపసభాపతి కె.రఘురామకృష్ణరాజు వెంట పెద్ద ఎత్తున కార్యకర్తలు రావడంతో స్థానికులు నిరసన తెలిపారు. ఆ ప్రాంత దళిత మహిళలు, యువకులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. రఘురామ పర్యటన నేపథ్యంలో అక్కడ డీఎస్పీ రఘువీర్ విష్ణు ఆధ్వర్యంలో భారీ ఎత్తున పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. 57 మందిపై కేసులు నమోదు చేసిన పోలీసులురఘురామ వెంట వచ్చిన వారు దురుసుగా వ్యవహరించడంతోనే ఘర్షణ తలెత్తిందని స్థానికులు పేర్కొన్నారు. దాంతో తోపులాటకు దారితీసిందని, ఈ ఘటనలో పలువురు వ్యక్తులకు గాయాలయ్యాయని వారు పేర్కొన్నారు. పోలీసులు ఇరువర్గాల వారిని చెల్లాచెదురు చేశారు. గాయపడినవారిని స్థానిక ప్రభుత్వాస్పత్రిలో చేర్చారు. అనంతరం పెదపేటలో పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు సాయంత్రం వేళ తిరిగి ఆ ప్రాంతానికి చేరుకుని 57 మందిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. వారు స్థానిక పోలీస్ స్టేషన్లో లేకపోవడం, ఎక్కడికి తరలించారనే సమాచారం తెలియకపోవడంతో వారి కుటుంబసభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా, శుక్రవారం నుంచి 144 సెక్షన్ అమల్లో ఉంటుందని పోలీసులు తెలిపారు. -
ఆమెకు 35, అతనికి 25 .. భర్తను వదిలేసి!
ఏలూరు జిల్లా: సోషల్ మీడియా ద్వారా ఓ వివాహితకు, యువకుడికి మధ్య పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారి పెళ్లికి దారితీసింది. చివరికి ఇద్దరు ఆత్మహత్యకు పాల్పడడంతో రెండు కుటుంబాల్లో విషాదం మిగిలింది. ఉంగుటూరు మండలం యర్రమళ్ల గ్రామానికి చెందిన గుండుగొల్లు మావుళ్లు (25) చేపల ప్యాకింగ్కు వెళ్తూ జీవనం సాగిస్తున్నాడు. అతడికి ఇంకా వివాహం కాలేదు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఎర్రి రమ (35) అనే వివాహితతో మావుళ్లుకు ఇన్స్ట్రాగామ్ ద్వారా పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. అయితే అప్పటికే ఆమెకు వివాహం కాగా ఇటీవల మావుళ్లు ఆమెను ఇక్కడకు తీసుకువచ్చి వివాహం చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న రమ తరుఫు బందువులు వచ్చి ఆమెను తీసుకువెళ్లారు. అప్పటి నుంచి మావుళ్లు తాడేపల్లిగూడెం మండల కడియద్దలోని తన చెల్లెలు ఇంటివద్ద ఉంటున్నాడు. ఈ క్రమంలో తిరిగి రెండు రోజుల క్రితం రమ శ్రీకాకుళం నుంచి మావుళ్లు దగ్గరకు వచ్చేసింది. ఈ సమాజం వారిని బతకనీయదు అనుకున్నారో ఏమో ఇద్దరూ కలిసి మంగళవారం రాత్రి నాచుగుంట రేవు వద్దకు చేరారు. మావుళ్లు తన తమ్ముడు కి ఫోను చేసి విషయం చెప్పి నాచుగుంట వంతెన మీదనుంచి ఇద్దరు కాలువలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. మావుళ్లు తమ్ముడు వచ్చేసరికి వంతెన వద్ద సెల్ఫోను, ఇతర సామాన్లు కనిపించడంతో పోలీస్, ఫైర్ అధికారులకు సమాచారం అందించారు. భీమడోలు, తాడేపల్లిగూడెం ఫైర్ సిబ్బంది, చేబ్రోలు పోలీసులు గాలింపు చర్యలను చేపట్టారు. ఎస్సై సూర్యభగవాన్, తహసీల్దార్ పూర్ణచంద్రప్రసాద్, ఇతర అధికారులు గాలింపు చర్యలను ఎప్పుటికప్పుడు పర్యవేక్షించారు. బుధవారం రాత్రి 10,30 గంటలకు మావుళ్ల మృతదేహం ఉంగుటూరు టోలు ప్లాజా సమీపంలో లభ్యమైంది. అమరావతి నుంచి వచ్చిన ప్రత్యేక ఎస్టీఆర్ఎఫ్ బృందాలు గాలించగా రమ మృతదేహం చేబ్రోలు పోలీస్టేషన్ సమీపంలో గోదావరి కాలువలో గురువారం మధ్యాహ్నం 2 30 గంటలకు లభ్యమైంది. ఎస్సై సూర్యభగవాన్ ఆధ్వర్యంలో మావుళ్లు మృతదేహనికి తాడేపల్లిగూడెం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద పోస్టుమార్టం పూర్తి చేసి కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
ఇన్స్టా పరిచయం.. కడకు విషాదాంతం
ఉంగుటూరు: సోషల్ మీడియా ద్వారా ఓ వివాహితకు, యువకుడికి మధ్య పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారి పెళ్లికి దారితీసింది. చివరికి ఇద్దరు ఆత్మహత్యకు పాల్పడడంతో రెండు కుటుంబాల్లో విషాదం మిగిలింది. ఉంగుటూరు మండలం యర్రమళ్ల గ్రామానికి చెందిన గుండుగొల్లు మావుళ్లు (25) చేపల ప్యాకింగ్కు వెళ్తూ జీవనం సాగిస్తున్నాడు. అతడికి ఇంకా వివాహం కాలేదు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఎర్రి రమ (35) అనే వివాహితతో మావుళ్లుకు ఇన్స్ట్రాగామ్ ద్వారా పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. అయితే అప్పటికే ఆమెకు వివాహం కాగా ఇటీవల మావుళ్లు ఆమెను ఇక్కడకు తీసుకువచ్చి వివాహం చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న రమ తరుఫు బందువులు వచ్చి ఆమెను తీసుకువెళ్లారు. అప్పటి నుంచి మావుళ్లు తాడేపల్లిగూడెం మండల కడియద్దలోని తన చెల్లెలు ఇంటివద్ద ఉంటున్నాడు. ఈ క్రమంలో తిరిగి రెండు రోజుల క్రితం రమ శ్రీకాకుళం నుంచి మావుళ్లు దగ్గరకు వచ్చేసింది. ఈ సమాజం వారిని బతకనీయదు అనుకున్నారో ఏమో ఇద్దరూ కలిసి మంగళవారం రాత్రి నాచుగుంట రేవు వద్దకు చేరారు. మావుళ్లు తన తమ్ముడు కి ఫోను చేసి విషయం చెప్పి నాచుగుంట వంతెన మీదనుంచి ఇద్దరు కాలువలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. మావుళ్లు తమ్ముడు వచ్చేసరికి వంతెన వద్ద సెల్ఫోను, ఇతర సామాన్లు కనిపించడంతో పోలీస్, ఫైర్ అధికారులకు సమాచారం అందించారు. భీమడోలు, తాడేపల్లిగూడెం ఫైర్ సిబ్బంది, చేబ్రోలు పోలీసులు గాలింపు చర్యలను చేపట్టారు. ఎస్సై సూర్యభగవాన్, తహసీల్దార్ పూర్ణచంద్రప్రసాద్, ఇతర అధికారులు గాలింపు చర్యలను ఎప్పుటికప్పుడు పర్యవేక్షించారు. బుధవారం రాత్రి 10,30 గంటలకు మావుళ్ల మృతదేహం ఉంగుటూరు టోలు ప్లాజా సమీపంలో లభ్యమైంది. అమరావతి నుంచి వచ్చిన ప్రత్యేక ఎస్టీఆర్ఎఫ్ బృందాలు గాలించగా రమ మృతదేహం చేబ్రోలు పోలీస్టేషన్ సమీపంలో గోదావరి కాలువలో గురువారం మధ్యాహ్నం 2 30 గంటలకు లభ్యమైంది. ఎస్సై సూర్యభగవాన్ ఆధ్వర్యంలో మావుళ్లు మృతదేహనికి తాడేపల్లిగూడెం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద పోస్టుమార్టం పూర్తి చేసి కుటుంబ సభ్యులకు అప్పగించారు. గుండుగొల్లు మావుళ్లు మృతదేహం, చేబ్రోలు వద్ద లభ్యమైన ఎర్రి రమ మృతదేహం ఇన్ స్టాగ్రామ్ ద్వారా వివాహితతో యువకుడి పరిచయం ఆ పరిచయం ప్రేమగా మారి వారిద్దరూ పెళ్లిచేసుకున్న వైనం పెద్దలు ఒప్పుకోరని కాలువలో దూకి ఆత్మహత్య -
మద్ది హుండీ ఆదాయం రూ.63,26 లక్షలు
జంగారెడ్డిగూడెం: గుర్వాయిగూడెం శ్రీ మద్ది ఆంజనేయస్వామి ఆలయంలో గురువారం హుండీ ఆదాయాన్ని లెక్కించారు. జిల్లా దేవాదాయ శాఖ అధికారి కూచిపూడి శ్రీనివాస్ పర్యవేక్షణ, పోలీస్, రెవెన్యూ అధికారుల సమక్షంలో కేవీవీ బ్యాంక్ సిబ్బంది, ఆలయ సిబ్బంది హుండీలను తెరచి లెక్కింపు నిర్వహించారు. హుండీల ద్వారా 106 రోజులకు గాను రూ.62,34,432, అన్నదానం హుండీ ద్వారా రూ.92,023 మొత్తం రూ.63,26,455 ఆదాయం లభించినట్లు ఆలయ సహాయ కమిషనర్, కార్యనిర్వహణాధికారి ఆర్వీ చందన తెలిపారు. జంగారెడ్డిగూడెం: స్థానిక గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవస్థానం హుండీ లెక్కింపు కార్యక్రమం గురువారం నిర్వహించారు. 80 రోజులకుగాను మొత్తం రూ.11,36,434 లక్షలు ఆదాయం వచ్చినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి కలగర శ్రీనివాస్ తెలియజేశారు. జిల్లా దేవాదాయ ధర్మాదాయ శాఖ ఇన్స్పెక్టర్ వి.సురేష్కుమార్ ఆధ్వర్యంలో జరిగిన హుండీ లెక్కింపు కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తల, మండలి చైర్మన్ అల్లూరి రామకృష్ణ, కన్నా కృష్ణ, కొప్పుల నాగ సురేంద్ర, ముప్పుడి భాను, ప్రియాంక, దివ్య ప్రసన్న, ఆరేపల్లి నాన్ని, అభివృద్ధి కమిటీ సభ్యులు అబ్బిన దత్తాత్రేయ, దండు ధనరాజు, ఫణి, ఏలూరు విజయవాడ రిటైర్డ్ ఎంప్లాయీస్ యూనియన్, ఇండియన్ బ్యాంక్ సిబ్బంది, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. అత్తిలి : ఆరవల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్లస్లో బోటనీ అధ్యాపకురాలుగా పనిచేస్తున్న చల్లా హేమలత చండీఘర్లో నిర్వహించిన ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ యోగ చాంపియన్ షిప్ పోటీల్లో బంగారు, రజిత పతకాలను సాధించారు. 40 నుంచి 50 సంవత్సరాల కేటగిరీలో ఆర్టిస్టిక్ ఫెయిర్లో బంగారు పతకాన్ని, రిథమిక్ పెయిర్లో సిల్వర్ పతకాన్ని ఆమె సాధించారు. తిరుపతి సంస్కృత విద్యాపీఠంలో ఆమె యోగా విజ్ఞానం కోర్సును పూర్తి చేశారు. 2019 నుంచి యోగా పోటీల్లో పాల్గొంటూ జాతీయస్థాయిలో 8 ఈవెంట్లలో పాల్గొని పలు పతకాలను సాధించారు. జాతీయ స్థాయిలో రెండు పతకాలు సాధించిన హేమలతను ఈ సందర్భంగా పాఠశాల అధ్యాపకులు అభినందించారు. తన విజయానికి భర్త రామకృష్ణ ఎంతో సహకరించారని హేమలత తెలిపారు. ఏలూరు(టూటౌన్): దేశ ఆర్థిక ప్రగతికి ప్రజా సంక్షేమానికి జనాభా లెక్కలు దోహదం చేస్తాయని నగరపాలక సంస్థ కమిషనర్ ఎ.భానుప్రతాప్ అన్నారు. గురువారం కార్పొరేషన్ హాలులో ఇళ్ల జాబితా, జనగణనపై రెండు విడతలుగా శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. జనగణన కార్యక్రమంపై ఫీల్డ్ ట్రైనర్స్ 37 మందికి మొదటి బ్యాచ్లో ట్రైనింగ్ ఇచ్చామని కమిషనర్ తెలిపారు. మే నెలలో ఇళ్ల జాబితా కార్యక్రమం, జనగణన రెండు విడతలుగా నిర్వహిస్తామని చెప్పారు. సర్వే అంతా డిజిటల్ విధానంలో ఉంటుందని, ప్రతి కుటుంబానికీ ఉన్న వనరులు సదుపాయాలు విధిగా నమోదు చేయాలని తెలిపారు. కార్యక్రమంలో మాస్టర్ ట్రైనర్లు సబ్బితి నరసింహ మూర్తి, జనార్దనరావు, జిల్లా సెన్సస్ టెక్నికల్ ఇన్చార్జి సోనుయాదవ్ పాల్గొన్నారు. -
రొయ్యల పెంపకంపై శిక్షణ ప్రారంభం
ఉండి: రొయ్యల సాగులో నీటి నాణ్యత, మేతల యాజమాన్యం అత్యంత ప్రాముఖ్యమైనవని ఎన్నార్పీ అగ్రహారం కేవీకే ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ ఎన్ మల్లిఖార్జునరావు అన్నారు. కేవీకేలో రొయ్యల పెంపకంపై ఏర్పాటు చేసిన శిక్షణా కార్యక్రమం గురువారం ప్రారంభమైంది. ముఖ్య అతిథిగా ఎంపెడా అసిస్టెంట్ డైరెక్టర్ శ్యామ్ కే మెహతా పాల్గొని మాట్లాడారు. రొయ్యల ఎగుమతులు, విలువ ఆధారిత ఉత్పత్తులు, దేశీయ రొయ్యల మార్కెట్ అభివృద్ధి, సుస్థిర రొయ్యల పెంపకం వంటి వాటిపై రైతులకు అవగాహన ఉండాలన్నారు. కేవీకే హెడ్ మాట్లాడుతూ చెరువు తయారీలో పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కోర్సు ఇన్చార్జి, మత్స్య శాస్త్రవేత్త ఏ శ్రీనివాసరావు మాట్లాడుతూ రొయ్యల పెంపకంలో చెరువుల తయారీతో పాటు మట్టి పరీక్షలు జరగాలని అన్నారు. వానపాముల ఎరువు ఎకరాకు సుమారు 150 కి.వాడాలని సూచించారు. రొయ్యల పిల్ల చెరువులో వదిలే సమయంలో రెండు చిన్న ఆపాలు చెరువులో పెట్టుకుని వాటిలో ఒక్కొక్క దానిలో 100 పిల్లల చొప్పున వేసి రెండు రోజుల తరువాత లెక్కగట్టి బతుకుదల శాతం తెలుసుకొని యాజమాన్య పద్ధతులు పాటించాలని సూచించారు. కార్యక్రమంలో గాదిరాజు వెంకట సూర్యనారాయణరాజు, తాటిపట్టి భాను తదితర రైతులు పాల్గొని మాట్లాడారు. -
బంగారం చోరీ కేసులో మహిళ అరెస్టు
ఆగిరిపల్లి: బంగారం చోరీ కేసులో మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె నుంచి చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నారు. ఎస్సై శుభశేఖర్ కేసు వివరాలను వెల్లడించారు. నెక్కలం గొల్లగూడెం గ్రామానికి చెందిన ఉప్పలపాటి శోభనాద్రమ్మ ఇంట్లో గతేడాది అక్టోబర్లో గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లో చొరబడి 27 గ్రాముల బంగారం అపహరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఎస్సై శుభశేఖర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. పోలీసుల విచారణలో అదే గ్రామానికి చెందిన చదల వెంకటేశ్వరమ్మ ఈ చోరీకి పాల్పడినట్లు తేలింది. మంగళవారం పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి ఆమె నుంచి దొంగిలించిన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. కై కలూరు: చేపల చెరువు గట్టుపై గడ్డి కోయడానికి వెళ్లిన వృద్ధుడు విద్యుత్ వైర్లు తగిలి మృతి చెందిన ఘటన కై కలూరు మండలం గోనెపాడులో గురువారం జరిగింది. రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సింగాపురం గ్రామానికి చెందిన కొత్తపల్లి రామకృష్ణంరాజు (72) గోనెపాడులో పెద్దిరాజు చెరువు గట్టుపై గడ్డి కోస్తున్నాడు. గడ్డికోసే కొడవలి విద్యుత్ వైర్లకు తగలడంతో విద్యుదాఘాతానికి గురై మరణించాడు. భార్య వరలక్ష్మి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. -
పోస్టాఫీస్ పథకాలు అత్యంత విశ్వసనీయమైనవి
ద్వారకాతిరుమల: ప్రజలు తమ పొదుపులను సురక్షితంగా పెట్టుబడి పెట్టడానికి పోస్టాఫీస్ పథకాలు అత్యంత విశ్వసనీయమైనవని ఆంధ్రప్రదేశ్ సర్కిల్ చీఫ్ పోస్ట్మాస్టర్ జనరల్ బీపీ శ్రీదేవి అన్నారు. ఏలూరు పోస్టల్ డివిజన్లోని ద్వారకాతిరుమల మండలం ఎం.నాగులపల్లి బ్రాంచి పోస్టాఫీసును గురువారం ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా ఆ శాఖలో అందిస్తున్న తపాలా సేవలు, వినియోగదారులకు అందుతున్న సదుపాయాలు, పనితీరు అంశాలను సమగ్రంగా సమీక్షించారు. అలాగే భీమడోలు, పూళ్ల, ద్వారకాతిరుమల సబ్ పోస్టాఫీసుల పరిధిలో ఉన్న మొత్తం 15 బ్రాంచ్ పోస్ట్ ఆఫీసుల పనితీరుపై సమీక్ష నిర్వహించి, సేవల మెరుగుదలకు సంబంధించిన పలు సూచనలు చేశారు. అలాగే ఈసీఆర్, ఐసీఆర్ ప్రమాణాల బలోపేతం, సేవింగ్స్ బ్యాంక్ ఖాతాలు, పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్, బ్రాంచి ఆఫీసుల ఆర్థిక స్థిరత్వంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అలాగే బ్రాంచి పోస్టు మాస్టర్లు వ్యాపారాభివృద్ధి, ఆదాయవృద్ధి, వినియోగదారులకు చేరువయ్యే కార్యక్రమాల్లో చురుకై న పాత్ర పోషించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏలూరు పోస్టల్ సూపరింటెండెంట్ ఎస్.విజయ భాస్కర్, అసిస్టెంట్ పోస్టల్ సూపరింటెండెంట్ (హెచ్క్యూలు) డి.శ్రీనివాసరావు, కె.శ్రీనివాసరావు, అసిస్టెంట్ సూపరింటిండెంట్ జంగారెడ్డిగూడెం, పోస్టల్ ఇన్స్పెక్టర్లు డి.శ్రీకాంత్, యు.చంద్రశేఖర్, సిబ్బంది పాల్గొన్నారు. -
స్వర్ణాంధ్రలో ‘విజన్–ఎక్స్’ హ్యాకథాన్ సందడి
నర్సాపురం రూరల్ : స్వర్ణాంధ్ర ఇంజనీరింగ్ కళాశాలలో రెండు రోజులుగా నిర్వహించిన జాతీయ స్థాయి హ్యాకథాన్ ‘విజన్–ఎక్స్ 2026’ సాంకేతిక పోటీల్లో విద్యార్థులు తమ సత్తా చాటారు. ఈ పోటీల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి 64 టీంలు, ఇతర రాష్ట్రాల నుంచి 12 టీంలు పాల్గొనగా, ఆతిథ్య స్వర్ణాంధ్ర కళాశాల నుంచి 37 టీంలు పోటీపడ్డాయి. ముంగిపు కార్యక్రమానికి ఎన్సీసీ కాకినాడ గ్రూప్కు చెందిన గ్రూప్ కమాండర్ కల్నల్ రితిన్ మోహన్ అగర్వాల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎస్ఆర్కేఆర్ కళాశాల విద్యార్థులు మొదటి బహుమతిని, డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్పర్మేషన్ టెక్నాలజీ ద్వితీయ బహుమతి, ఎన్ఐటిఏపీ తృతీయ బహుమతిని సాధించగా బెస్ట్ ఉమెన్ టీంగా స్వర్ణాంధ్ర, బెస్ట్ ఇన్నోవేషన్ టీంగా లక్కిరెడ్డి బాల్రెడ్డి కళాశాల విద్యార్థులు బహుమతులు పొందారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫుడ్ స్టాల్స్ అతిథులను, విద్యార్థులను విశేషంగా ఆకట్టుకున్నాయి. కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సుమారు 30కి పైగా తినుబండారాల స్టాల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కళాశాల చైర్మన్ కొండవీటి వెంకట నారాయణ, కళాశాల కోశాధికారి కొండవీటి వెంకటేశ్వరస్వామి, డైరెక్టర్ అడ్డాల శ్రీహరి, డైరెక్టర్ ఎస్ కీర్తికుమార్, ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్ సురేష్కుమార్, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎ గోపిచంద్, ఇతర యాజమాన్య ప్రతినిధులు విద్యార్థులను అభినందించారు. -
పురుగు మందు తాగి దంపతుల ఆత్మహత్యాయత్నం
కలిదిండి (కై కలూరు): చెరువు తవ్వుకోవడానికి కొందరు వ్యక్తులు పెడుతున్న ఇబ్బందులు తాళలేక దంపతులు ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డారు. వివరాలు ఇలా ఉన్నాయి. కలిదిండి మండలం కొండంగి గ్రామానికి చెందిన తిరుమలశెట్టి వెంకట నరసయ్య, పద్మావతి దంపతులు చెరువు తవ్వుకోవడానికి నిర్ణయించుకున్నారు. అయితే వారు కొందరికి అప్పుగా కొంత నగదు చెల్లించాల్సి ఉండడంతో వారు చెరువు తవ్వకుండా పొక్లెయిన్ను అడ్డుకున్నారు. దీంతో మనస్థాపం చెందిన దంపతులు పురుగుమందు తాగారు. వీరిని ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న దంపతులను వైఎస్సార్సీపీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు(డీఎన్నార్) పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు. దంపతుల ఆత్మహత్య విషయమై కలిదిండి ఎస్సై వి.వెంకటేశ్వరరావును వివరణ కోరగా తమకు సమాచారం రాలేదని చెప్పారు. ఆస్పత్రిలో పరామర్శించిన డీఎన్నార్ -
శ్రీసీతారాముల కల్యాణం చూతము రారండి
● చిన భద్రాద్రిగా యర్రగుంటపల్లి రాముని గట్టు ● నవమి వేడుకలకు ఏర్పాట్లు పూర్తి ● రాష్ట్రం నలుమూలల నుంచి భక్తుల రాక చింతలపూడి : శ్రీరామ నవమి వేడుకలకు మండలంలోని యర్రగుంటపల్లి గ్రామ సమీపంలోని శ్రీ రామ రామలింగేశ్వర స్వామి ఆలయం ముస్తాబైంది. ఇక్కడ ఈనెల 27న సీతారాముల కల్యాణాన్ని అంగరంగవైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రతి ఏటా శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఇక్కడ నిర్వహించే సీతారాముల కల్యాణాన్ని తిలకించేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు తరలివస్తుంటారు. దీంతో భక్తుల సౌకర్యార్థం ఆలయ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. చిన భద్రాద్రిగా.. రాముడి గట్టుగా ప్రసిద్ధికెక్కిన శ్రీ సీతారామాంజనేయ ఆలయాన్ని ఈ ప్రాంత భక్తులు చిన్న భద్రాచలంగా పిలుచుకుంటారు. భద్రాద్రిలో వెలసిన విగ్రహాలను పోలి ఇక్కడి విగ్రహాలు ఉండటం విశేషం. అంతేగాకుండా భద్రాచలంలో సీతాదేవి రాముల వారి తొడపై ఆసీనురాలైనట్లు ఇక్కడ కూడా అదే విధంగా కూర్చుని ఉండటం జరిగింది. ఈ ఆలయాన్ని అతి ప్రాచీనమైనదిగా చెబుతుంటారు. వందల ఏళ్ల క్రితం శ్రీరామ చంద్రుడు సీతాలక్ష్మణ సహేతుడై శంఖు చక్రాలతో ఈ ప్రాంతంలో వెలిసినట్లు పూర్వీకులు చెబుతుంటారు. ఇక్కడ స్వామివారి కల్యాణం జరిపితే పెళ్లికాని అమ్మాయిలకు పెళ్లవుతుందని, సంతానం లేనివారికి సంతానం కలుగుతుందని భక్తుల విశ్వాసం. ఈ ఆలయాన్ని అభివృధ్ధి చేయడానికి శ్రీ రామ రామలింగేశ్వర స్వామి ఆలయ ట్రస్ట్ ఆధ్వర్యంలో కృషి చేస్తున్నారు. శివాలయంలో రాములోరి కల్యాణం సీతారామాంజనేయ ఆలయానికి చేరువలో కై లాసపతి పరమేశ్వరుడు నందీ సమేతంగా కొండ పైభాగంలో వేంచేసి ఉన్నాడు. పరమశివుణ్ని శ్రీరాముడు ముళ్ల గోరింట పూలతోను, బొంత పూలతోను పూజించినట్లు, వెలగ, నేరేడు పండ్లను నివేదించినట్లు చరిత్ర చెబుతోంది. ప్రతి ఏటా చైత్రశుద్ధ నవమికి ఇక్కడ స్వామివారి కల్యాణాన్ని వైభవంగా జరుపుతారు. చుట్టుపక్కల గ్రామాలనుంచి భక్తులు వేలాదిగా తరలివచ్చి స్వామివారి కల్యాణాన్ని వీక్షిస్తారు. ఆలయ కమిటీతో పాటు, ఆదినుంచి సత్యన్నారాయణ శాస్త్రి కుటుంబీకులు స్వామివారి కల్యాణ మహోత్సవాన్ని గ్రామస్తుల సహకారంతో జరుపుతున్నారు. యర్రగుంటపల్లి రాముని గట్టు(ఆలయాన్ని) మరింత అభివృధ్ధి చేయడానికి ట్రస్ట్ ఆధ్వర్యంలో కృషి చేస్తున్నాం. ప్రభుత్వం కూడా ఆలయ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాల్సిన అవసరం ఉంది. ఆలయానికి చెందిన భూములను ట్రస్ట్కు అప్పగించి ప్రభుత్వం రక్షణ కల్పించాలి. ఆలయం వద్దకు రోడ్డు సౌకర్యం ఏర్పాటు చేసి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలి. – వి సత్యనారాయణ శాస్త్రి, ఆలయ కమిటీ అధ్యక్షుడు, యర్రగుంటపల్లి -
కూటమిది అప్రజాస్వామిక పాలన
ద్వారకాతిరుమల : కూటమి ప్రభుత్వానిది అప్రజాస్వామిక పాలనని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమల చిన్నవెంకన్న ఆలయాన్ని బుధవారం ఉదయం మాజీ హోం మంత్రి తానేటి వనిత, తదితరులతో కలసి ఆయన సందర్శించారు. స్వామి, అమ్మవార్ల దర్శనానంతరం కాపు కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన అభినందన సభలో అంబటి రాంబాబు పాల్గొని మాట్లాడారు. తన ఇంటిపై జరిగిన దాడి ఒక అప్రజాస్వామిక, ఘోరమైన, రాష్ట్రంలో ఎన్నడూ జరుగని సంఘటన అని అన్నారు. ఏడు గంటల పాటు జరిగిన దాడిని పోలీసులు నిశ్చేష్టులై చూశారన్నారు. ఆ తరువాత దాడి చేసిన వారిని స్టేషన్ బెయిల్ ఇచ్చి విడిచిపెట్టారని, తనను మాత్రం అక్రమంగా అరెస్టు చేసి, 18 రోజులు జైల్లో పెట్టారన్నారు. భగవంతుడి దయ, తన కులం మద్దతు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతుతో ఇలాంటి ఘటనలు చరిత్రలో మళ్లీ జరగకుండా ఉండేలా పోలీసులకు, కూటమి ప్రభుత్వానికి, తనపై దాడి చేసిన వారికి బుద్ధి వచ్చేలా, శిక్షలు పడేవరకు తాను న్యాయపోరాటం చేస్తానన్నారు. కోర్టుల్లో న్యాయపోరాటం.. మీ సమక్షంలో ధర్మపోరాటం చేసి తీరుతానన్నారు. లేకపోతే తనకు జరిగిన అన్యాయం రేపు మరొకరికి జరుగుతుందన్నారు. తాను ఎవరికీ భయపడేదే లేదని, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సైతం తాను కాపుల్లో పులిలాంటి వాడని అన్నారని అన్నారు. అందరూ మద్దతు ఇవ్వాలి ఇంటిపై దాడి చేసినా, రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టినా భరించానని అంబటి రాంబాబు అన్నారు. భరించిన వాటన్నింటికీ న్యాయం పొందాలనే తాపత్రయం, కసి, పట్టుదలతో లాజికల్ పోరాటం చేస్తున్నానని, దానికి కులం మద్దతు, పార్టీ మద్దతు కోరుతున్నానని అన్నారు. ఈ దారుణాలను ఎదుర్కోవడం కోసం చిన్నవెంకన్న సన్నిధిలో ప్రతిజ్ఞ చేశానన్నారు. తనను భయపెట్టడం అంత ఆషామాషీ కాదని, తనకు 40 శాతం ఓటు బ్యాంక్ ఉన్న వైఎస్సార్ సీపీ అండగా ఉందన్నారు. కూటమి ప్రభుత్వ దారుణాలను ఎదుర్కోవడం కోసం ఇవాళ చిన్నవెంకన్న సన్నిధిలో ప్రతిజ్ఞ చేశానన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ పోసిన శ్రీలేఖ, రాష్ట్ర యువజన విభాగ సంయుక్త కార్యదర్శి పెద్దిరెడ్డి జ్యోతిశ్రీనివాస్, రాష్ట్ర సోషల్ మీడియా కార్యదర్శి వామిశెట్టి పరమేశ్వరరావు, ఏలూరు ఏఎంసీ చైర్మన్ నెరుసు చిరంజీవి, డిప్యూటీ మేయర్ నూకపేయి సుధీర్బాబు, పార్టీ ఏలూరు నగర అధ్యక్షుడు గుడిదేశి శ్రీనివాసరావు, కార్పొరేటర్ కిలారి దుర్గారావు, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి జాన్ గురునాధ్, బంట్రోతు సురేంద్ర తదితరులున్నారు. జరిగిన అన్యాయంపై కోర్టుల్లో న్యాయ పోరాటం.. మీ సమక్షంలో ధర్మపోరాటం చేస్తా పార్టీలకు అతీతంగా ప్రతి కాపు నాయకుడు అండగా నిలవాలి ఇలానే వదిలేస్తే నాకు జరిగిన అన్యాయం రేపు మరొకరికి జరుగుతుంది మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కూటమి ప్రభుత్వం ప్రజలను మభ్యపెడుతోంది. సీఎంగా ఉన్న వ్యక్తి తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో పంది కొవ్వు కలిసిందని ప్రచారం చేయడం దుర్మార్గం. అంబటి రాంబాబును టార్గెట్ చేసి ఆయన ఇంటిపై దాడి చేశారు. కాపు నేత వంగవీటిని చంపించిన పార్టీకి కాపులు మద్దతు ఇవ్వడం సరికాదు. – తానేటి వనిత, వైఎస్సార్ సీపీ గోపాలపురం నియోజకవర్గ సమన్వయకర్త కూటమి నేతలు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ అరాచకాలు సృష్టిస్తున్నారు. పరమ పవిత్రమైన శ్రీవారి లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని రాద్దాంతం చేశారు. అదంతా డైవర్షన్ పాలిటిక్స్లో భాగమే. ప్రజల్లో కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత పీక్ స్టేజ్లో ఉంది. ఈరోజు ఎన్నికలు జరిగితే వైఎస్సార్ సీపీకి 175 కి 175 రావడం ఖాయం. – పుప్పాల వాసుబాబు, వైఎస్సార్ సీపీ ఉంగుటూరు నియోజకవర్గ సమన్వయకర్త వంగవీటి మోహనరంగా తరువాత కాపుల కోసం పోరాడుతున్న వ్యక్తి అంబటి రాంబాబు. జైల్లో పెట్టినా ఎక్కడా ఆయన అధైర్య పడలేదు. కాపులంతా ఆయన వెంటే ఉంటాం. కూటమి ప్రభుత్వం నీచరాజకీయాలు చేస్తోంది. ఇప్పటికే తిరుమల శ్రీవారి ప్రతిష్ఠను దెబ్బతీశారు. లడ్డూ ప్రసాదంపై విషప్రచారం చేసి చివరకు భంగపడ్డారు. స్వామివారు వారికి తగిన బుద్ధి చెబుతారు. – వడ్డి రఘురామ్, వైఎస్సార్ సీపీ తాడేపల్లిగూడెం నియోజకవర్గ సమన్వయకర్త కాపుల అభ్యున్నతికి వంగవీటి మోహనరంగా ఎంతో కృషి చేశారు. ఆ క్రమంలోనే నిరాహార దీక్ష చేస్తున్న ఆయనను కర్కశంగా నరికి చంపారు. అప్పుడు ఏ ప్రభుత్వం అధికారంలో ఉంది, ఎవరు చేయించారనే విషయాలు అందరికీ తెలుసు. మాటకారితనం ఉన్న కాపులను అణగదొక్కుతున్నారు. ముద్రగడను కూడా తొక్కేస్తున్నారు. అంబటి రాంబాబు వెన్నెంటే మనమంతా ఉండకపోతే ఆయన్ను చంపేస్తారు. – చినమిల్లి వెంకటరాయుడు, వైఎస్సార్ సీపీ భీమవరం నియోజకవర్గ సమన్వయకర్త కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత అన్ని పార్టీల్లో ఉన్న కాపులపై దాడులు జరుగుతున్నాయి. కాపుల మద్దతుతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మన చిరకాల శత్రువులకు కాపు కాస్తూ అంబటి రాంబాబుపై దాడి చేయడం సరికాదు. ఆయన్ను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి కాపు సైనికుడిపై ఉంది. జగనన్నకు కాపుల మద్దతు పూర్తిగా ఉంటుంది. – తోట రామకృష్ణ, గోపాలపురం నియోజకవర్గ పరిశీలకుడుమాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై జరిగిన దాడి అమానుషం. ఇంట్లో ఉన్న వారిని హత్య చేయాలన్న ఉద్దేశంతోనే పెట్రోల్ బాంబులు వేశారు. అక్రమంగా రాంబాబును అరెస్టు చేసి, జైల్లో పెట్టినా ఆయన భయపడలేదు. ప్రతిపక్షంలో ఉంటూ ఆయన ప్రభుత్వానికి వినిపిస్తున్న స్వరం.. ఒక వరం. వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్రెడ్డిని సీఎం చేయడమే లక్ష్యంగా కాపులు పనిచేయాలి. – మామిళ్లపల్లి జయప్రకాష్ (జేపీ), వైఎస్సార్ సీపీ ఏలూరు నియోజకవర్గ సమన్వయకర్త -
పొగాకు రైతుల గుండెల‘ధర’
● వర్జీనియా ప్రారంభ ధర పతనం ● తొలి రోజు రూ.265 పలికిన ధర ● ఆందోళన వ్యక్తం చేసిన రైతులు ● గోపాలపురం కేంద్రంలో నిలిచిన వేలం జంగారెడ్డిగూడెం : వర్జీనియా ప్రారంభ ధరతో రైతులు తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. గతేడాది అత్యధిక ధర రావడంతో ఈ ఏడాది రైతులు ఉత్సాహంగా సాగు చేపట్టారు. వేలం ప్రారంభం కోసం ఎదురుచూశారు. అయితే ప్రారంభ రోజున ధర పతనమై రూ.265 లభించడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. తొలిరోజే ఆందోళన ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ఎన్ఎల్ఎస్ పరిధిలోని 5 వేలం కేంద్రాల్లో బుధవారం వర్జీనియా పొగాకు వేలం ప్రారంభించారు. వేలం ప్రారంభం ముందు పొగాకు బోర్డు ఛైర్మన్ సి.యశ్వంత్కుమార్, రీజనల్ మేనేజర్ జె.సురేంద్ర కుమార్, వేలం అధికారులు వై.ప్రశాంత్, గ్రేస్ మార్గరేట్, పొగాకు కంపెనీలు రైతులతో జంగారెడ్డిగూడెంలో చర్చలు జరిపారు. పొగాకు కంపెనీలు ప్రారంభ ధర రూ. 265 మాత్రమే ఇస్తామని చెప్పడంతో రైతులు ఆందోళనకు దిగారు. గతేడాది ప్రారంభ ధర కేజీకి రూ.290 ఇచ్చారని, అదే ధర ఇవ్వాలని అధికారులు, రైతు సంఘం నాయకులు డిమాండ్ చేశారు. కంపెనీ ప్రతినిధులు తమ యాజమాన్యాలతో మాట్లాడి ప్రారంభ ధర రూ.265కు మించి ఇవ్వలేమని తెగేసి చెప్పారు. రైతులు కొద్ది సేపు సమావేశమై బోర్డు అధికారులతో ప్రారంభ రోజు కాబట్టి వేలం జరుపుతామని, పొగాకు బేళ్లను వేలం కేంద్రంలో ఉంచుతామని స్పష్టం చేశారు. తొలుత అధికారులు, కంపెనీలు అంగీకరించినా అనంతరం పొగాకు కంపెనీలు బేళ్లను తరలించుకున్నారు. వేలం ఇలా.. జంగారెడ్డిగూడెం–1, కొయ్యలగూడెం వేలం కేంద్రాల్లో ప్రాంరభం రోజున 27 బేళ్లు చొప్పున, దేవరపల్లిలో 18 బేళ్లు, జంగారెడ్డిగూడెం–2 కేంద్రంలో 99 బేళ్లు చొప్పున రైతులు వేలానికి తీసుకువచ్చారు. ప్రారంభ ధర కేజీకి రూ.265 లభించింది. కాగా, గోపాలపురం వేలం కేంద్రంలో 27 బేళ్లు పెట్టగా రైతులు వేలాన్ని నిలిపివేశారు. ఆదిలోనే రైతుల కన్నెర్ర కొయ్యలగూడెం: కొయ్యలగూడెం వేలం కేంద్రంలో బుధవారం పొగాకు కొనుగోళ్లు ప్రారంభం కాగా ప్రారంభ ధర కేజీ రూ.265 లభించడంతో రైతులు తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేశారు. గతేడాది రూ.295 ప్రారంభ ధర ఉండగా ఈసారి రూ.30 తగ్గించి కొనుగోలు చేశారని, ఏటా పొగాకు సాగుకి రెండింతలు ఖర్చు అవుతుందని రైతు సంఘం నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. కర్ణాటకలో ప్రారంభ ధర రూ.320 ఉండగా ఎన్ఎల్ఎస్ పరిధిలోని వేలం కేంద్రాల్లో తక్కువ ధరకు కొనుగోలు చేయడం రైతుకు అన్యాయం చేయడమే అన్నారు. ఈ నేపథ్యంలో కొనుగోళ్లు అడ్డుకోవడంతో వేలం ప్రక్రియ నిలిచిపోయింది. విషయం తెలుసుకున్న బోర్డు చైర్మన్ ిసీహెచ్ యశ్వంత్ కుమార్ వేలం కేంద్రం వద్దకు చేరుకొని రైతు ప్రతినిధులతో చర్చలు నిర్వహించారు. మద్దతు ధర లభించే విధంగా కృషి చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. జంగారెడ్డిగూడెం: వర్జీనియా పొగాకు వేలం కేంద్రంలో వేలం జరుగుతున్న దృశ్యం కొయ్యలగూడెం: వర్జీనియా పొగాకు వేలం కేంద్రంలో ఆందోళన చేస్తున్న రైతులు -
ఏఐఎస్ఎఫ్ ఆందోళన
ఏలూరు (ఆర్ఆర్పేట): నిబంధనలకు విరుద్ధంగా తరగతులు నిర్వహిస్తున్న శ్రీ చైతన్య విద్యాసంస్థపై చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ ఏలూరు జిల్లా అధ్యక్షుడు డి.శివకుమార్ డిమాండ్ చేశారు. స్థానిక నరసింహరావు పేటలో ఉన్న శ్రీచైతన్య కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాలు రాకుండానే ద్వితీయ సంవత్సరం తరగతులు నిర్వహిస్తున్నారనే సమాచారం మేరకు ఏఐఎస్ఎఫ్ నాయకులు బుధవారం కళాశాలకు వెళ్లి విద్యార్థులను బయటకు పంపించారు. ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కిన కళాశాల యజమాన్యంపై చర్యలు తీసుకోకుంటే పెద్ద ఎత్తున ఆందోళనకు శ్రీకారం చుడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఉండి: రొయ్యల సాగులో మెరుగైన యాజమాన్య పద్ధతులపై మండలంలోని ఎన్నార్పీ అగ్రహారం కృషీ విజ్ఞాన కేంద్రంలో ఈనెల 26 నుంచి 30వ తేదీ వరకు శిక్షణా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కేవీకే హెడ్ డాక్టర్ ఎన్ మల్లిఖార్జునరావు పత్రికా ప్రకటనలో బుధవారం తెలిపారు. జాతీయ మత్స్య అబివృద్ధి మండలి హైదరాబాద్ సహకారంతో నిర్వహిస్తున్న శిక్షణలో రొయ్యల పెంపకంలో యాజమాన్య పద్ధతులు, చెరువు తయారీ, పిల్ల ఎంపిక, మేత, వ్యాధులు, నూతన యాజమాన్య పద్ధతులు గురించి వివరిస్తారన్నారు. సమాచారం కోసం కేవీకే మత్స్యశాస్త్రవేత్త డాక్టర్ శ్రీనివాసరావును సంప్రదించాలన్నారు. -
ద్విచక్ర వాహనాలు ఢీకొని ఐదుగురికి గాయాలు
క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి వైద్యసేవలు అందిస్తున్న దృశ్యంబుట్టాయగూడెం: ద్విచక్ర వాహనాలు ఢీకొని ఐదుగురు గాయపడ్డారు. ఈ ఘటన స్థానిక శివాలయం సమీపంలో బుధవారం రాత్రి జరిగింది. గుంటూరు జిల్లా రాజుపాలెం మండలం గణపవరంనకు చెందిన తాళ్లభోగి సురేష్, కుమార్తెలు ప్రియాంక, శ్రావణి, మనవడతో పొగాకు పనుల నిమిత్తం వచ్చి కంసాలిపాలెంలో నివాసముంటున్నారు. మనవడు చిన్నా పానీపూరీ అడగడంతో సురేష్ కుమార్తెలు ప్రియాంక, శ్రావణి, మనవడు చిన్నాతో కలిసి ద్విచక్రవాహనంపై బుట్టాయగూడెం వస్తున్నారు. అదే సమయంలో స్థానిక అరుంధతీ కాలనీకి చెందిన ఉండ్రాజవరపు కాంతారావు, మరొక యువకుడు ద్విచక్ర వాహనంపై బుట్టాయగూడెం నుంచి శివాలయం వైపు వెళ్తున్నారు. ఆ సమయంలో రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీ కొనడంతో ఐదుగురు తీవ్ర గాయాల పాలయ్యారు. క్షతగాత్రులను అంబులెన్స్లో స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ప్రియాంక, చిన్ని, శ్రావణిలకు స్వల్ప గాయాలు కావడంతో సామాజిక ఆరోగ్య కేంద్రంలోనే వైద్య సేవలు అందించారు. అనంతరం కాంతారావు, సురేష్లను జంగారెడ్డిగూడెం తరలించగా సురేష్ పరిస్థితి తీవ్రంగా ఉండడంతో రాజమండ్రి తరలించారు. ఏలూరు (ఆర్ఆర్పేట): శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలానికి ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీసులు నడుపుతున్నట్టు జిల్లా ప్రజా రవాణా అధికారి షేక్ షబ్నం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ బస్సులు 26వ తేదీ ఉదయం నుంచి రాత్రి వరకు భద్రాచలం వైపు, తిరిగి 27వ తేదీ శ్రీ సీతారాముల కల్యాణం అనంతరం భద్రాచలం నుంచి ఆయా డిపోలకు చేరుకుంటాయన్నారు. ఏలూరు, జంగారెడ్డిగూడెం, నూజివీడు నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్టు తెలిపారు. రద్దీని బట్టి బస్సుల సంఖ్య పెంచుతామని ఆమె స్పష్టం చేశారు. -
‘స్వర్ణాంధ్ర’లో ఆవిష్కరణల పండుగ
నరసాపురం రూరల్: సీతారామపురంలోని స్వర్ణాంధ్ర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ (అటానమస్) వేదికగా బుధవారం ‘విజన్–ఎక్స్ 2026’ పేరుతో రెండు రోజుల జాతీయ స్థాయి హ్యాకథాన్ వైభవంగా ప్రారంభమైంది. ఆక్వా టెక్ ఫౌండేషన్ సహకారంతో కళాశాలలోని కంప్యూటర్ సైన్స్, సైబర్ సెక్యూరిటీ విభాగాలు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. 36 గంటల పాటు జరిగే నాన్స్టాప్ ఇన్నోవేషన్ చాలెంజ్లో రాష్ట్రం నుంచి 54 బృందాలు, ఇతర రాష్ట్రాల నుంచి 12 బృందాలు మొత్తంగా 122 టీమ్లు పాల్గొంటున్నాయి. తొలుత కళాశాల చైర్మన్ కొండవీటి వెంకట సత్యనారాయణ, కోశాధికారి కొండవీటి వెంకటేశ్వర స్వామి (త్రినాథ్), డైరెక్టర్ అడ్డాల శ్రీహరి జ్యోతి ప్రజల్వనం చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీసి, సమస్యలకు సాంకేతిక పరిష్కారాలను కనుగొనడమే హ్యాకథాన్ ముఖ్య ఉద్దేశమన్నారు. విద్యార్థులు అగ్రిటెక్, హెల్త్టెక్, ఫిన్టెక్, సైబర్ సెక్యూరిటీ వంటి రంగాల్లో వినూత్న ప్రొటోటైప్లు తయారుచేస్తున్నారు. డైరెక్టర్ ఎస్.కీర్తి కుమార్, ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్.సురేష్కుమార్, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎ.గోపిచంద్, సీఎస్ఈ విభాగాధిపతులు డాక్టర్ పి.శ్రీనివాసులు, డాక్టర్ బి.మధు కుమార్, సైబర్ సెక్యూరిటీ విభాగాధిపతి డాక్టర్ టి.మురళీమోహన్ పర్యవేక్షించారు. గురువారం ముగింపు వేడుకల్లో విజేతలకు బహుమతులు అందిస్తామన్నారు. -
వ్యాపారులు, కేంద్రంతో చర్చిస్తాం
ఈ సీజన్లో ఎన్ఎల్ఎస్లో 48.75 మి.కిలోలు లక్ష్యం కాగా 80 మి.కిలోలు ఉత్పత్తి అయినట్లు అంచనా. బుధవారం ప్రారంభమైన వేలంలో ధరపై రైతులు అసంతృప్తి ప్రకటింంచి మద్దతు ధర లభించలేదని నిరసన తెలిపారు. దీనిపై వ్యాపారస్తులు, కేంద్రంతో చర్చించి, వారికి మద్దతు ధర ఇప్పించేందుకు ప్రయత్నిస్తాం. రైతుల పొగాకు పంట చివరి ఆకు వరకు అమ్మించేందుకు కృషి చేస్తా. – సి.యశ్వంత్కుమార్, చైర్మన్, పొగాకు బోర్డు గతేడాది ప్రారంభ ధర రూ. 290తో వేలం మొదలై, గరిష్టంగా రూ.456 వరకు తీసుకువెళ్లారు. ప్రస్తుతం తొలిరోజు వేలంలో ప్రారంభం ధర రూ. 265 ధర ఇవ్వడం రైతులను కంపెనీలు మోసం చేయడమే. ఇలాగే కొనసాగితే వచ్చే సంవత్సరం క్రాప్ హాలిడే తీసుకుని ఈ పంటను రెండు సంవత్సరాలు అమ్ముకుంటామని కంపెనీలకు తెలియజేస్తున్నాం. – వామిశెట్టి హరిబాబు, వర్జీనియా రైతు సంఘం నాయకుడు ప్రారంభ ధర రూ.350 వస్తుందని ఆశిస్తే రూ.265 ఇచ్చారు. పొగాకు బోర్డు అధికారులు, కేంద్ర ప్రభుత్వం కలిసి సరాసరి రూ.350 వచ్చేలా చర్యలు తీసుకోవాలి. కానీ ఎవరూ పట్టించుకోలేదు. ఇప్పటికై నా పొగాకు బోర్డు, కేంద్రం స్పందించి రైతుకు న్యాయం చేయాలి. మద్దతు ధర ఇవ్వలేనప్పుడు పొగాకును పూర్తిగా బ్యాన్ చేయండి. మేము వేరే పంటల వైపు వెళతాం. – పరిమి రాంబాబు, వర్జీనియా రైతు సంఘం నాయకుడు -
కొత్త సీట్లు.. ఆశావహుల్లో సందడి
సాక్షి ప్రతినిధి, ఏలూరు: మార్పులు, చేర్పులతో కొత్త నియోజకవర్గాల పునర్విభజనకు సర్వం సన్నద్ధమైంది. పార్లమెంట్ సమావేశాల్లో పునర్విభజన బిల్లును ఆమోదించి 2027 జనగణనకు అనుగుణంగా కొత్త నియోజకవర్గాలను ఖరారు చేయనున్నారు. ఈ పరిణామాల క్రమంలో ఉమ్మడి పశ్చిమ రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారనుంది. జిల్లాలో 4 నుంచి 5 అసెంబ్లీ స్థానాలు పెరిగే అవకాశం ఉండటంతో రాజకీయ పార్టీల్లో హడావుడికి తెరలేచింది. దాదాపు 5 స్థానాలు పెరిగే అవకాశం ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల రాజకీయ ముఖచిత్రం మారనుంది. నియోజకవర్గాల జనాభా, సీ్త్ర, పురుష ఓటర్లు, మండలాల విస్తీర్ణం అన్ని అంశాలను ప్రామాణికంగా తీసుకుని పునర్విభజన ప్రక్రియకు కేంద్రం శ్రీకారం చుట్టనుంది. పార్లమెంట్ సమావేశాల్లో బిల్లును ఆమోదించి 2027 మార్చి జనగణనతో పాటే పునర్విభజన ప్రక్రియ కూడా ముగించనుంది. దీంతో రెండు జిల్లాలో కలిపి 4 నుంచి 5 స్థానాలు పెరిగే అవకాశం ఉందని అంచనా. కొత్తగా జిల్లా కేంద్రాలకు అనుబంధంగా రూరల్ నియోజకవర్గాలు, అలాగే విస్తీర్ణం దృష్ట్యా, ఓటింగ్ దృష్ట్యా 2.50 లక్షలకుపైగా ఓటింగ్ ఉన్న స్థానాల్లో మండలాల మార్పులు, చేర్పులతో కొత్తవి ఏర్పాటయ్యే అవకాశం ఉంది. దీంతో ఈ అంశం ఇప్పుడు జిల్లా రాజకీయ వర్గాల్లో హాట్టాపిక్ మారింది. భవిష్యత్ రాజకీయాలకు అనుగుణంగా అధికార, ప్రతిపక్ష వైఎస్సార్సీపీ ఆశావహుల్లో హడావుడి ప్రారంభమైంది. మరోవైపు మహిళా రిజర్వేషన్ బిల్లు ఖరారైతే ఉమ్మడి జిల్లాలో మూడు స్ధానాలు మహిళలకు రిజర్వేషన్ ప్రాతిపదికన దక్కే అవకాశం ఉంది. రూరల్ నియోజకవర్గాల ఏర్పాటు? ఏలూరు జిల్లాలో కొత్తగా రెండు లేదా 3 నియోజకవర్గాలు పెరిగే అవకాశం ఉందనే చర్చ జోరుగా సాగుతోంది. ఏలూరు రూరల్ నియోజకవర్గం ఏర్పాటు చేయవచ్చనే ప్రచారం జరుగుతోంది. చింతలపూడి, పోలవరం నియోజకవర్గాల్లో కొంత భాగంతో జంగారెడ్డిగూడెం నియోజకవర్గం ఏర్పాటవుతుందని అంటున్నారు. అదే విధంగా ద్వారకాతిరుమల కేంద్రంగా కొత్త నియోజకవర్గం ఏలూరు జిల్లాలోకి వస్తుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. ముఖ్యంగా అధికార పార్టీ నేతలే పునర్విభజనపై రకరకాల ప్రచారాలు కొనసాగిస్తున్నారు. పశ్చిమగోదావరిలోనూ ఇదే తరహాలో భీమవరం రూరల్తో పాటు పాలకొల్లు రూరల్, పాత అత్తిలిని కొత్తగా నియోజకవర్గం చేస్తారనే చర్చ జోరుగా సాగుతోంది. మరోవైపు పునర్విభజనలో రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో మార్పులు, చేర్పులు అనివార్యంగా మారాయి. పోలవరం ఎస్టీ రిజర్వ్డ్ మినహా ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో మార్పులు జరుగుతాయని ఊహగానాలు తెరలేచాయి. మరోవైపు నర్సాపురం పార్లమెంట్లో ఒక్క ఎస్సీ రిజర్వ్డ్ అసెంబ్లీ నియోజకవర్గం కూడా లేదు. ఈ క్రమంలో నర్సాపురంలో ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం ఏర్పాటైతే రాజమండ్రిలో రిజర్వ్డ్ స్ధానాలు తగ్గే అవకాశం ఉంది. ఇక ఏలూరు జిల్లాలో రెండు జనరల్ స్థానాలు ఏర్పడే అవకాశం ఉందని చర్చ సాగుతోంది. మొత్తం మీద రాష్ట్రంలో 88 స్థానాలు పెరగనున్న నేపధ్యంలో ఉమ్మడి జిల్లాలో కొత్తగా ఐదుగురు ఆశాహహులకు అవకాశాలు దక్కనున్నాయి. నియోజకవర్గాల పునర్విభజన షురూ మారనున్న ఉమ్మడి పశ్చిమ రాజకీయ ముఖచిత్రం ఆశావహుల్లో మొదలైన హడావుడి ఉమ్మడి పశ్చిమలో 4 నుంచి 5 స్థానాలు పెరిగే అవకాశం -
అరుగు పైనే బడి
పట్టించుకోని అధికారులు, ప్రజాప్రతినిధులు నరసాపురం: ప్రభుత్వ విద్యావ్యవస్థ తీరుకు మొగల్తూరు మండలం కాళీపట్నం వెస్ట్ పంచాయతీలో ఉన్న మోడల్ ప్రైమరీ పాఠశాల దుస్థితి అద్దం పడుతోంది. ఈ పాఠశాలలో 1 నుంచి 5వ తరగతి వరకు మొత్తం 49 మంది విద్యార్థులు చదువుతున్నారు. పాఠశాలలో ఒకే ఒక్క గది మాత్రమే ఉండటంతో విద్యార్థులందరినీ ఒకే చోట కూర్చోబెట్టి ఉపాధ్యాయులు తరగతులు నిర్వహిస్తున్నారు. పాఠాలు చెప్పడానికి ఉన్న నలుగురు ఉపాధ్యాయులు కనీసం నిలబడటానికి స్థలం లేని పరిస్థితి. దీంతో కొంతమంది పిల్లలను స్కూల్ అరుగు మీద కూర్చోబెట్టి, బయట ఎండ తగలకుండా డేరా కట్టి చదువులు చెబుతున్నారు. పాఠశాల పక్కనే పాడుబడిన పాత భవనం ఉంది. సుమారు రూ.3 లక్షలు ఖర్చు చేసి దానికి మరమ్మతులు చేయిస్తే మరో తరగతి గది అందుబాటులోకి వస్తుందని పాఠశాల మేనేజ్మెంట్ కమిటీ సభ్యులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఎమ్మెల్యేకు, విద్యాశాఖ అధికారులకు ఎన్నోసార్లు మొరపెట్టుకున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి కనీస వసతులు లేక ఇబ్బందులు పడుతున్న కాళీపట్నం మోడల్ ప్రైమరీ పాఠశాల సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
ఉపాధ్యాయుల రణభేరి
● హామీలు అమలు చేయకపోతే తాడోపేడో ● ఒక్కరోజు నిరాహార దీక్షతో రంగంలోకి ఉండి: ఎన్నికల ముందు చెప్పిన వాగ్దానాలు నెరవేర్చాల్సిందేనని, లేదంటే రణభేరి మోగించడం ఖాయం అంటూ యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు, అనుబంధ సంఘాల నాయకులు మంగళవారం నిరాహార దీక్ష నిర్వహించారు. గత ఎన్నికల్లో ఉపాధ్యాయులు, ఉద్యోగులకు మోసపూరిత వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చాక చెప్పింది చేయకుండా మన పని అయిపోయిందని సంబరపడితే.. ఉద్యోగుల సత్తా చూపిస్తామని సవాల్ విసిరారు. ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలను తక్షణమే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఒక్కరోజు నిరాహార దీక్ష చేపట్టారు. ఆ హామీలన్నీ ఏమయ్యాయి? అధికారంలోకి వచ్చిన వెంటనే సీపీఎస్ రద్దు చేస్తామని, పీఆర్సీ అమలుకు కమిషన్ వేస్తామని చెప్పిన నేతలు రెండేళ్లవుతున్నా ఆ ఊసెత్తడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి నెలా 1వ తేదీన జీతాలు ఇస్తున్నాం కదా, ఇంకేం కావాలంటూ ఎదురు ప్రశ్నించడంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. భారీ ఉద్యమానికి సిద్ధమవుతున్నామని, దానిలో భాగంగానే రణభేరి మోగించామన్నారు. సీఎం చంద్రబాబు అధికారంలోకి రాగానే సీపీఎస్ రద్దు, పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు ముఖం చాటేశారని, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎన్నికల ముందు ఉద్యోగులపై ప్రేమ కురిపించి, అధికారంలోకి రాగానే జీతాలు పెంచుతామన్నారని, ఇప్పుడు సీపీఎస్ రద్దుపై కేవలం స్టడీ చేస్తున్నానంటూ సాగదీత ధోరణి అవలంబిస్తున్నారని మండిపడ్డారు. మంత్రి నారా లోకేష్ కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామని చెప్పి ఇప్పుడు కనీసం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఉద్యోగుల ప్రధాన డిమాండ్లు ఇవే.. పీఆర్సీ కమిషన్ చైర్మన్ను నియమించడంతో పాటు 29 శాతం ఐఆర్ ప్రకటించి, పెండింగ్ డీఏలు విడుదల చేయాలి. ఉద్యోగులు, పెన్షనర్ల బకాయిల చెల్లింపునకు రూట్మ్యాప్ ప్రకటించాలి. సీపీఎస్ రద్దు చేసి, 2004కు ముందు నియామక ప్రక్రియ పూర్తయిన వారికి పాత పెన్షన్ విధానం అమలు చేయాలి. హెల్త్ కార్డులు, మెడికల్ బిల్లుల సమస్యలు పరిష్కరించాలి. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో యూటీఎఫ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు జరిగాయి. -
ఇది న్యాయమా ?
గత ఎన్నికల సమయంలో మేమున్నామంటూ వాగ్దానం చేశారు. ఓట్లేసి గెలిపించినందుకు ఇప్పుడు అడుగుతుంటే ముఖం చాటేస్తున్నారు. ఇది న్యాయం కాదు. ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలి. – వీఎస్పీ శ్రీనివాస్, యూటీఎప్ మండల ప్రధాన కార్యదర్శి, ఉండి ఎన్నికలప్పుడు మేం ఉన్నాం.. అధికారంలోకి రాగానే మన ప్రభుత్వం చెప్పింది చెప్పినట్టు చేసేస్తుంది అని నమ్మించారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సుమారు రెండేళ్ళవుతుంది. చెప్పిన మాట ఒక్కటీ నెరవేర్చలేదు. ఉద్యోగులను చిన్నచూపు చూడొద్దు. – కే.వామనమూర్తి, యూటీఎఫ్ మండలాధ్యక్షుడు మాకు సహకరిస్తే మేం అధికారంలోకి వచ్చిన వెంటనే అన్ని సమస్యలు పరిష్కరిస్తామని వాగ్దానం చేశారు. ఇప్పుడెందుకు అమలు చేయరు. నమ్మినందుకు నట్టేట ముంచేస్తారా? రాష్ట్రంలో ఉద్యోగులంతా ఐక్యమవుతున్నారు. అమలుకు మహాపోరాటం జరగబోతుంది. – ఆర్వీఎస్ నారాయణ, ఆకివీడు యూటీఎఫ్ మండలాధ్యక్షుడు -
మావుళ్లమ్మను దర్శించుకున్న ఎమ్మెల్సీలు
భీమవరం (ప్రకాశంచౌక్): భీమవరం పట్టణంలో వేంచేసిన మావుళ్లమ్మను ఎమ్మెల్సీలు ఐజాక్ బాషా, కడప జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ ఎంవీ రామచంద్ర రెడ్డి, ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్ దర్శించుకున్నారు. వీరికి ఆలయ మర్యాదలతో దేవస్థానం అధికారులు, ధర్మకర్తలు స్వాగతం పలికారు. అర్చకులు ఆశీర్వచనాలు అందజేశారు. పెనుగొండ: నిధుల దుర్వినియోగం ఆరోపణలతో నడిపూడి సర్పంచ్ కడలి బేబీ అన్నపూర్ణ చెక్ పవర్ రద్దు చేశారు. ఈ మేరకు మంగళవారం జిల్లా పంచాయతీ అధికారి ఉత్తర్వులు జారీ చేశారు. ఏడాది కాలంగా వార్డు సభ్యులు, గ్రామస్తుల ఫిర్యాదుతో పలుమార్లు విచారణ నిర్వహించారు. ఇద్దరు కార్యదర్శులు, గ్రామ సర్పంచ్పైనా నిధుల దుర్వినియోగం ఆరోపణలు వెల్లువెత్తాయి. వీటిపై నోటీసులు జారీ చేసి, అనంతరం చెక్ పవర్ రద్దు చేసినట్లు జిల్లా పంచాయతీ అధికారి ఉత్తర్వులు జారీ చేశారని ఎంపీడీవో టి.సూర్యనారాయణ మూర్తి తెలిపారు. తణుకు అర్బన్: ప్రపంచ టీబీ డే సందర్భంగా తణుకు జిల్లా కేంద్ర ఆస్పత్రిలో టీబీ విభాగ సిబ్బందికి అవార్డులు దక్కాయి. జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్కుమార్రెడ్డి, డీఎంహెచ్వో డాక్టర్ గీతాబాయ్, జిల్లా టీబీ ఆఫీసర్ డాక్టర్ రవిబాబు చేతులమీదుగా జిల్లా బెస్ట్ ల్యాబ్ సూపర్వైజర్గా పంజా రవిబాబు, బెస్ట్ ల్యాబ్ టెక్నీషియన్గా పలివెల చినబాబు, బెస్ట్ ఫీల్డ్ కోఆర్డినేటర్గా రాచమళ్ల వెంకటకృష్ణ అవార్డులు అందుకున్నారు. భీమవరం (ప్రకాశంచౌక్): తల్లిదండ్రులు, వృద్ధుల ఆదరణ పట్ల నిర్లక్ష్యం వహిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని కలెక్టర్ చదలవాడ నాగరాణి హెచ్చరించారు. కలెక్టరేట్లో నిర్వహించిన జిల్లా స్థాయి శిక్షణ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ తమ తల్లిదండ్రులను, వృద్ధులను గౌరవించి ఆదరించడం ద్వారా సమాజంలో మంచి వ్యక్తులుగా నిలవాలని సూచించారు. తల్లిదండ్రుల ఆస్తులపై ఆశ పెట్టుకోకుండా స్వయంగా ఎదగాలని, ప్రేమ, వాత్సల్యంతో వారిని ఆదరించినప్పుడే ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని అన్నారు. జాయింట్ కలెక్టర్ పి.రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, వృద్ధుల ఫిర్యాదులను స్వీకరించినప్పుడు కుటుంబ సభ్యులతో చర్చించి సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. పీఎం సూర్య ఘర్ పథకాన్ని విజయవంతంగా అమలు చేయాల్సిన బాధ్యత విద్యుత్ శాఖ అధికారులపై ఉందని, కలెక్టర్ ఆదేశించారు. పథకం పురోగతిపై కలెక్టర్ మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. లక్ష్యాలకు అనుగుణంగా సోలార్ ప్యానల్స్ అమరిక జరగకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. గ్రామ స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. జంగారెడ్డిగూడెం: నేటి నుంచి వర్జీనియా పొగాకు వేలం ప్రారంభం కానుంది. ఎన్ఎల్ఎస్ పరిధిలోని ఐదు వేలం కేంద్రాల్లో వేలం ప్రారంభమవుతున్నట్లు రీజనల్ మేనేజర్ జె.సురేంద్రకుమార్ తెలిపారు. గత ఏడాది వేలం ప్రక్రియ రైతులు ఊహించిన దానికంటే రికార్డు స్థాయిని ధరను అందించింది. ఈ సారి పంట పెట్టుబడులు పెరిగాయి. ముఖ్యంగా కౌలు లీజులు పెరగడం, ఎరువులు, పురుగుమందులు తదితర ధరలు కూడా పెరగడంతో ఎక్కువ మొత్తంలో రైతులు వెచ్చించారు. కర్ణాటక మార్కెట్ అనుకూలంగా లేకపోవడం, ఉత్పత్తి ఖర్చులు పెరిగిపోవడం, అనుమతించిన 49 మి.కిలోల కంటే అధికంగా పడించడంతో కొంత ఒత్తిడి ఉంది. మొత్తంగా 80 మి.కిలోల పైబడి ఉత్పత్తి రావ చ్చనే అంచనాలు నడుమ ధరపై కూడా రైతులు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. గత ఏడాది కేజీ అత్యధిక ధర రూ.456 లభించగా, సరాసరి ధర రూ. 297.50 లభించింది. ప్రస్తుత పరిస్థితిలో ప్రారంభ ధర రూ.350 పైగా రావడంతో పాటు, రూ.320 నుంచి రూ.350 మధ్య వస్తేనే రైతులకు గిట్టుబాటు అవుతుందని వర్జీనియా రైతు సంఘ నాయకులు పేర్కొంటున్నారు. -
రియల్ దందా
అధికారం అండతో కూటమి నేతల ఆగడాలు పెచ్చుమీరాయి. ఉంగుటూరు మండలం కై కరంలో జాతీయరహదారిని ఆనుకుని 45 సెంట్ల భూమిని మెరక చేస్తున్నారు. 8లో uద్వారకాతిరుమల: ద్వారకాతిరుమల చిన్నవెంకన్న దేవస్థానంలో ఉద్యోగుల అంతర్గత బదిలీలు చేస్తు న్నారు. ఆలయంలో ఇటీవల జరిగిన రూ.200 నకిలీ టికెట్ల స్కాం నేపథ్యంలో నగదు లావాదేవీలు జరిగే ప్రదేశాల్లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను నియమించరాదని దేవదాయ శాఖ కమిషనర్ సర్క్యులర్ ఉన్నా.. అధికారులు బేఖాతరు చేస్తున్నారని ఈనెల 17న సాక్షి దినపత్రికలో శ్రీవారి సొమ్ము ‘అవుట్’ సోర్సింగ్ శీర్షికన కథనం ప్రచురితమైంది. దీనికి స్పందించిన దేవస్థానం ఛైర్మన్ ఎస్వీ సుధాకరరావు, ఆలయ అనువంశిక ధర్మకర్త ఎస్వీఎన్ఎన్ నివృతరావుల ఆదేశాల మేరకు ఆలయ ఈఓ వై.భద్రాజీ ఉద్యోగుల అంతర్గత బదిలీలకు చర్యలు చేపట్టారు. అందులో భాగంగా గత ఆదివారం కొదరు రెగ్యులర్, ఎన్ఎంఆర్ ఉద్యోగులను నగదు లావాదేవీలు జరిగే ప్రదేశాల్లో నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అవుట్ సోర్సింగ్ సిబ్బందిని బదిలీ చేయాల్సి ఉంది. -
వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్ మద్దతు
తణుకు అర్బన్: ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ యూటీఎఫ్ ఆధ్వర్యంలో తణుకులో మంగళవారం నిరాహార దీక్ష నిర్వహించారు. యూటీఎఫ్ నిరాహార దీక్షకు మద్దతు పలికిన వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు మురాల సుధాకర్ మాట్లాడుతూ పీఆర్సీ కమిషన్ను తక్షణమే నియమించాలని, ఐఆర్ వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు. పెండింగ్ బకాయిల విడుదలతోపాటు పెన్షనర్స్ సమస్యలు తీర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భవిష్యత్ పోరాటాల్లో వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్ కూడా పోరాటానికి దిగుతుందని అన్నారు. కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు పి.విజయరామరాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి పి.క్రాంతి కుమార్, అత్తిలి అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు జి.రమేష్, చిన వెంకట్రావు, ఇరగవరం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎంవీ రాఘవులు, కె.రాంబాబు తదితరులు పాల్గొన్నారు. -
ఎల్లో మీడియా అండతో చంద్రబాబు చిచ్చు
పీవీఎల్. నర్శింహరాజు, ఉండి వైఎస్సార్సీపీ ఇన్చార్జి ఆకివీడు: తన అసమర్ధ పాలనను కప్పిపుచ్చుకునేందుకు చంద్రబాబు కుటుంబ కలహాలను తెరపైకి తీసుకువస్తున్నారని, జగన్ కుటుంబంపై లేనిపోని ఆరోపణలు చేసి రాష్ట్రంలో సంచలనాలు సృష్టించాలని చూస్తున్నారని వైఎస్సార్సీపీ ఉండి నియోజకవర్గ ఇన్చార్జి పీవీఎల్ నర్సింహరాజు విమర్శించారు. ఎల్లో మీడియా అండదండలతో కుటుంబాల మధ్య కలహాలు పెడుతున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఏ వర్గం సంతోషంగా లేదన్నారు. సూపర్ సిక్స్ అట్టర్ప్లాప్ అయిందన్నారు. ఉచిత గ్యాస్ సిలిండర్లు అడ్రస్సులే కుండా పోయాయని ఆరోపించారు. కరోనాలో ప్రజలకు ఏ విధమైన ఇబ్బందులు తలెత్తకుండా అప్పటి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అన్ని వసతులూ కల్పించారన్నారు. ఎక్కడో యుద్ధం జరిగితే రాష్ట్రం అతలాకుతలమైపోతుందన్నారు. గ్యాస్ కొరతతో ప్రజలు పడుతున్న అవస్థలు వర్ణనాతీతమన్నారు. టీ స్టాల్స్, బిర్యానీ పాయింట్లు, ఇతర చిరు వ్యాపారాలు మూతపడ్డాయన్నారు. ఉండి నియోజకవర్గంలో రెడ్బుక్ పాలన సాగుతుందని ఎద్దేవా చేశారు. నియోజకవర్గ ప్రజాప్రతినిధికి ఎదురు చెప్పితే కేసులు, హెచ్చరికలు, దాడులు చేస్తున్నారన్నారు. ఎవరైనా ఎదురు చెబితే బొక్కలో వేస్తాం అన్నదే తమ సిద్ధాంతం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. -
పిల్లల విక్రయ కేసులో పురోగతి
కై కలూరు: రాష్ట్రంలో సంచలనం కలిగించిన ముదినేపల్లి పసిపిల్లల విక్రయాల కేసులో ఆరుగురిని కోర్టు ముందు హాజరుపర్చామని కై కలూరు రూరల్ సీఐ వి.రవికుమార్ తెలిపారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈనెల 13న కేసు కట్టి, విచారణలో 9 మందిపై కేసు నమోదు చేశామన్నారు. వీరిలో ఇప్పటివరకు అబ్బిశెట్టి వీరమ్మ, చిట్టూరి చిన్ని, రెడ్డమ్మ, వలవల గోపి, నర్సు మాధురి, ఖలిక్ను అరెస్టు చేసి కై కలూరు కోర్టుకు పంపించామన్నారు. విజయవాడకు చెందిన ఫరీనాపై ఇప్పటికే పలు స్టేషన్లలో ఐదు కేసులు ఉన్నాయని, ఆమె రాజమండ్రి జైలులో ఉందన్నారు. పీటీ వారెంట్తో ఆమె నుంచి మరింత సమాచారం రాబడతామన్నారు. ముదినేపల్లి మండలం అన్నవరంలో దూలం రాంప్రసాద్, సునీత దంపతులు అబ్బిశెట్టి వీరమ్మ, గోపి, చిన్ని, రెడ్డమ్మల సాయంతో ఫరీనా నుంచి పాపను రూ.3 లక్షలకు కొనుగోలు చేశారన్నారు. మండవల్లి మండలం కానుకొల్లులో ఒకరికి ఏలూరు జనన హాస్పటల్ నర్సు మాధురి ద్వారా రూ.80 వేలు చెల్లించి బాబును తీసుకున్నారన్నారు. ఇక్కడ కూడా వీరమ్మ ఉందన్నారు. వీరమ్మ 2012లో తామరకొల్లులో అనారోగ్యంతో ఉన్న ఒక పాపను, అలాగే వీరమ్మ బంధువుల్లో నలుగురు ఆడపిల్లలు ఉండగా వీరిలో ఇద్దరిని వారి బంధువులకు ఇప్పించిందన్నారు. ఫరీనా నుంచి అన్నవరం దంపతులు పొందిన పాప తల్లిదండ్రులు విషయాలు ఒక్కటే తెలియాల్సి ఉందన్నారు. ఈ కేసులో మరింత మందిని విచారిస్తామని సీఐ చెప్పారు. ముదినేపల్లి ఎస్సై వీరబధ్రరావు పాల్గొన్నారు. ఏలూరు (ఆర్ఆర్పేట): ఇంటర్ పరీక్షల జవాబుపత్రాల మూ ల్యాంకనం బుధవారం నుంచి ప్రారంభించనున్నట్టు ఇంటర్ బో ర్డు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి కె.యోహాన్ ఓ ప్రకటనలో తెలిపారు. ఏలూ కోటదిబ్బ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మూ ల్యాంకనం జరుగుతుందని, జిల్లాలోని బోటనీ, జువాలజీ, కా మర్స్, ఫిజిక్స్, సివిక్స్, కెమిస్ట్రీ ఎగ్జామినర్లను కళాశాలల ప్రిన్సిపా ల్ రిలీవ్ చేయాలని ఆదేశించారు. చీఫ్ ఎగ్జామినర్స్, ఎగ్జామినర్స్ అదేరోజు ఉదయం 10 గంటలకు, స్క్రూటినైజర్లు 26న ఉదయం 10 గంటలకు రిపోర్ట్ చేయాలని ఆదేశించామన్నారు. -
పేకాట స్థావరాలపై దాడులు
ఆకివీడు: పేకాట స్థావరాలపై సోమవారం పోలీసులు దాడులు చేశారు. ‘ఆకివీడులో యథేచ్ఛగా జూద క్రీడలు’ శీర్షికతో సాక్షిలో ప్రచురితమైన కథనానికి పోలీసులు స్పందించారు. పలు ప్రాంతాల్లో గాలింపు చేశారు. మండలంలోని దుంపగడప శివారు ప్రాంతంలో పేకాట స్థావరంపై దాడి చేసి ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.7,800 స్వాధీనం చేసుకోగా.. సిద్ధాపురం శివారు ప్రాంతంలో పేకాటస్థావరంపై దాడి చేసి నలుగురిని అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ.6,200 నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ హనుమంతు నాగరాజు చెప్పారు. -
కార్యకర్తలకు పెద్దపీట
సాక్షి, భీమవరం: ప్రజల పక్షాన కూటమి వంచనపై పోరుబాట, కూటమి స్థానిక నేతల అక్రమాలను ఎండగట్టడం, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్)పై అవగాహన, సంస్థాగతంగా క్షేత్రస్థాయి నుంచి వైఎస్సార్సీపీ బలోపేతం చేసే దిశగా వైఎస్సార్సీపీ జిల్లా సమన్వయ కమిటీ సమావేశం ఆద్యంతం ఉత్సాహభరితంగా సాగింది. పార్టీ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా రీజనల్ కో–ఆర్డినేటర్గా నియామకం అనంతరం తొలిసారి జిల్లాకు విచ్చేసిన మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్కు భీమవరంలో ఘన స్వాగతం లభించింది. రెట్టించిన ఉత్సాహంతో శ్రేణులు వైఎస్సార్సీపీ జిల్లా సమన్వయ కమిటీ సమావేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు అధ్యక్షతన సోమవారం పార్టీ జిల్లా క్యాంపు కార్యాలయంలో జరిగింది. అమర్నాథ్ ముఖ్య అతిథిగా హాజరైన సమావేశంలో పార్టీ జిల్లా పరిశీలకుడు ముదునూరి మురళీకృష్ణంరాజు, ఎమ్మెల్సీలు వంక రవీంద్ర, కవురు శ్రీనివాస్, మాజీ మంత్రులు కా రుమూరి నాగేశ్వరరావు, చెరుకువాడ శ్రీరంగనాథరాజు, నియోజకవర్గ కో–ఆర్డినేటర్లు చినమిల్లి వెంకటరాయుడు, గుడాల శ్రీహరిగోపాలరావు, పీవీఎల్ నరసింహరాజు తదితరులు పాల్గొన్నారు. జిల్లా అ ధ్యక్షుడు ప్రసాదరాజు మాట్లాడుతూ జిల్లాలో గ్రా మ, మండల, జిల్లాస్థాయి కమిటీల నియామకం దాదాపు పూర్తి కాగా డిజిటలైజేషన్ నెలాఖరుకు పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నట్టు వివరించారు. ప్రజల పక్షాన పార్టీ పిలుపు ఇచ్చిన ప్రతి కార్యక్రమాన్ని జిల్లాలో పార్టీ శ్రేణులు రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తూ విజయవంతంగా నిర్వహిస్తున్నామని వివరించారు. ఘనంగా పార్టీ క్యాంపు కార్యాలయం ప్రారంభం జిల్లా కేంద్రం భీమవరంలోని ఉండి రోడ్డులో మల్టీప్లెక్స్ పక్కన నూతనంగా ఏర్పాటుచేసిన వైఎస్సార్సీపీ జిల్లా క్యాంపు కార్యాలయాన్ని రీజనల్ కో–ఆర్డినేటర్ అమర్నాథ్ ప్రారంభించారు. ప్రతి నా యకుడు, కార్యకర్తకూ పార్టీ కార్యాలయం దేవాల యంతో సమానమని, రీజనల్ కో–ఆర్డినేటర్గా తొ లిసారి జిల్లాకు వస్తూనే జిల్లా క్యాంపు కార్యాలయం ప్రారంభించే అవకాశం కలగడం ఆనందంగా ఉందని ఆయన అన్నారు. అక్రమాలపై పోరాడండి జిల్లాలో త్వరితగతిన గ్రామ, మండల, జిల్లా కమి టీల నియామకం చేయడం పట్ల జిల్లా నాయకత్వం, నియోజకవర్గ సమన్వయకర్తలు, పార్టీ శ్రేణులను రీజనల్ కో–ఆర్డినేటర్ అమర్నాథ్ అభినందించారు. జగన్ 2.0 పాలనలో కార్యకర్తలకు పెద్దపీట వేయనున్నారని స్పష్టం చేశారు. పార్టీ అధ్యక్షుడు జగన్ ఆదేశాలకు అనుగుణంగా అందరూ సమన్వయంతో పనిచేయాలన్నారు. స్థానికంగా కూటమి నేతలు చేస్తున్న అన్యాయాలు, అక్రమాలపై పోరాడాలని పార్టీ శ్రేణులకు సూచించారు. ఓట్లు జాబితాలపై దేశవ్యాప్తంగా జరుగుతున్న ‘సర్’ కార్యక్రమంలో లక్షల ఓట్లు తొలగించారని, ఈ విషయంలో పార్టీ కేడర్ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఓట్లు తొలగింపులు, చేర్పులపై అవగాహన పెంచుకుని పరిశీలన చేస్తుండాలని అన్నారు. జిల్లాలో కమిటీల నియామకం పూర్తయిన నేపథ్యంలో వచ్చేనెల నుంచి నియోజకవర్గాల వారీగా పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేస్తామన్నారు. రీజనల్ కో–ఆర్డినేటర్గా తాను ఇక్కడ ఎవరి మీద పెత్తనం చేసేందుకు రాలేదని, అధినేతకు, పార్టీ కేడర్కు మధ్య మెసెంజర్ను మాత్రమేనన్నారు. పార్టీ కోసం కష్టపడిన వారికి తగిన గుర్తింపు ఇచ్చేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు. ఈ జిల్లాలో గెలిచిన పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావడం ఖాయమని, గత ఎన్నికల ఫలితాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయన్నారు. రానున్న మూడేళ్లు చాలా కీలకమని, వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని అమర్నాథ్ సూచించారు. పార్టీ మహిళ విభాగం అధ్యక్షురాలు జిల్లా కోడి విజయలక్ష్మి, ఎస్ఈసీ సభ్యులు పాతపాటి శ్రీనివాసరాజు, కొట్టు నాగేంద్ర, పార్లమెంట్ సెక్రటరీలు ఏఎస్ రాజు, మంతెన యోగేంద్రబాబు, వేండ్ర వెంకటస్వా మి, పట్టణ అధ్యక్షుడు గాదిరాజు రామరాజు, మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, పార్టీ నాయకులు బంధన పూర్ణచంద్రరావు, పుప్పల రామారావు తదితరులు పాల్గొన్నారు. టీడీపీ ప్రభుత్వానికి మాజీ మంత్రి అమర్నాథ్ హెచ్చరిక కూటమి ప్రభుత్వానికి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని వైఎస్సార్సీపీ రీజనల్ కో–ఆర్డినేటర్ గుడివాడ అమర్నాథ్ హెచ్చరించారు. విలేకరుల సమావేశంలో ఆ యన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంతో కాంగ్రెస్, ఇతర పార్టీలు కలిసి పనిచేస్తుండటంతో రాష్ట్రంలో ప్రజల గొంతుకగా పనిచేసిది ఒక్క వైఎస్సార్సీపీ మాత్రమే అన్నారు. డ్రగ్స్ ను అరికట్టాల్సిన పెద్దలే దానిని వాడుతూ సమాజానికి ఏ సందేశం ఇస్తున్నారో తెలియని పరిస్థితి ఉందంటూ ఏలూరు ఎంపీ పుట్టా మహేష్యాదవ్ వ్యవహారంపై స్పందించారు. భూ కబ్జాలు, డ్రగ్స్, అవినీతి వ్యవహరాలు చేసే పరిస్థితుల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు, కూట మి నేతలు ఉన్నారన్నారు. 20 నెలల్లో రూ.3.5 లక్షల కోట్లు అప్పులు తెచ్చిన చంద్రబాబు ప్రభుత్వం వాటిని వేటికి ఖర్చు చేసిందో తెలియని దుస్థితి ఉందన్నారు. రాష్ట్రంలోని రైతులు, కార్మికులు ఎక్కడా సంతోషంగా లేరన్నారు. రాష్ట్రంలో కోటి మందికి పైగా మహిళలకు న్యాయం చేసిన మాజీ సీఎం వైఎస్ జగన్ తన సొంత సోదరికి ఎందుకు అన్యాయం చే స్తారని ప్రశ్నించారు. ఎన్ని మాటలు అంటున్నా మౌనం వహిస్తున్న జగన్కు హ్యాట్సాఫ్ చెప్పాలన్నారు. జగన్ను ఎదుర్కోలేక 2014 ఎన్నికల్లో లక్ష కోట్లు అన్నారని, ఇప్పుడు చెల్లికి అన్యాయం అంటూ వ్యక్తిత్వ హననం చేస్తున్నా రని విమర్శించారు. కూటమి, కాంగ్రెస్ చేస్తున్న దుష్ప్రచారమే తప్ప ఇందులో వాస్తవం లేదని అమర్నాథ్ కొట్టిపడేశారు. కూటమి నేతల అక్రమాలను ఎండగట్టాలి వచ్చే నెల నుంచి నియోజకవర్గాల వారీగా సమీక్షలు ‘సర్’పై అవగాహన కలిగి ఉండాలి ఉత్సాహంగా వైఎస్సార్సీపీ జిల్లా సమన్వయ కమిటీ సమావేశం భవిష్యత్ కార్యాచరణపై రీజనల్ కో–ఆర్డినేటర్ అమర్నాథ్ దిశానిర్దేశం భీమవరంలో పార్టీ జిల్లా క్యాంపు కార్యాలయం ప్రారంభం ప్రజలకు మెరుగైన వైద్యం, రైతులకు అండగా మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మండలాల్లో ఆరోగ్య, రైతు భరోసా కేంద్రాల నిర్మాణం చేపట్టారని, కూటమి వచ్చాక కొన్నిచోట్ల ఆయా నిర్మాణాలను ఆపేసిందని, వాటిపై ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్ సూచించారు. విద్య, వైద్యం, వ్యవసాయం తదితర అన్ని రంగాల్లో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ఎన్నికల వాగ్దానాలను తుంగలోకి తొక్కి వంచనతో పాలన సాగిస్తున్నారని పార్టీ రాష్ట్ర కార్యదర్శులు ముప్పిడి సంపత్కుమార్, పేరిచర్ల విజయనరసింహరాజు, యడ్ల తాతాజీ, ఎస్ఈసీ సభ్యులు పెండ్ర వీరన్న, పీడీ రాజు, నాయకులు చిగురుపాటి సందీప్, కామన నాగేశ్వరరావు, మేడిద జాన్సన్, పాలవెల్లి మంగ తదితరులు వివరించారు. -
రాములోరి కల్యాణం చూతము రారండి
● 27న ఉదయం సీతారాముల కల్యాణం ● 28న పట్టాభిషేకం ● ఆకట్టుకుంటున్న ఆలయ శిల్ప సంపద ద్వారకాతిరుమల: శ్రీవారి ఆలయానికి దత్తత దేవాలయమై, చిన్న భద్రాద్రిగా వెలుగొందుతున్న ఈస్టు యడవల్లిలోని శ్రీ సీతారామ చంద్రస్వామి వారి ఆలయంలో ఈనెల 19 నుంచి వసంత నవరాత్రోత్సవ ప్రయుక్త శ్రీరామనవమి ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నట్టు దేవస్థానం ఈఓ వై.భద్రాజీ సోమవారం తెలిపారు. వేడుకల్లో భాగంగా ఆలయాన్ని శోభాయమానంగా అలంకరించినట్టు చెప్పారు. ఉత్సవాల్లో ముఖ్య ఘట్టమైన సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని ఈనెల 27 (శ్రీరామనవమి నాడు)న అంగరంగ వైభవంగా నిర్వహిస్తామన్నారు. 28 న శ్రీరామ పట్టాభిషేకను వేడుక కన్నులపండువగా జరుపుతామని, ఈ కార్యక్రమంతో ఉత్సవాలు పరిసమాప్తం అవుతాయన్నారు. శిల్ప కళావైభం.. ఎకరం విస్తీర్ణంలో అతి సుందర కళా వైభవంతో సుమారు రూ.కోటి వ్యయంతో నిర్మించిన ఈ ఆలయాన్ని శ్రీవారి దేవస్థానం 2003 జూన్ 19న దత్తత తీసుకుని, శ్రీ పాంచరాత్ర ఆగమానుసారం అర్చనాది కార్యక్రమాలు, ఉత్సవాలు, కల్యాణోత్సవాలను నిర్వహిస్తోంది. 52 అడుగుల రాజగోపురం శిల్పకళా వైభవంతో ఉట్టిపడుతోంది. ఇక్కడ 14 అడుగుల సింహ ద్వారాన్ని నిర్మించడం మరో విశేషం. ఆలయ ముఖ మండపంలో ఉన్న స్థంభాలపై గజరాజులు, నాగమోహిని తదితర శిల్పాలు భక్తులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. ఆలయ ముఖ మండపంలో మేషం నుంచి మీనం వరకు 12 రాశుల చిత్రీకరణ సజీవంగా ఉంది. అలాగే మండపం మధ్యలో చిన్నికృష్ణుడి శిల్పం ముద్దు గొలుపుతోంది. గర్భగుడిపై పరివార దేవతలకు సంబంధించిన 50 శిల్పాలు, గోదాదేవి దేవాలయంపై 28 శిల్పాలు, రాజ్యలక్ష్మీ దేవాలయంపై 28 శిల్పాలు అతి సుందరంగా ఉన్నాయి. ఆలయ ఆవరణలో శ్రీరాముడికి శబరి నేరేడు పళ్లు ఇస్తున్నట్టుగా ఉన్న శిల్పం చూపరులను ఆకట్టుకుంటోంది. ఈ క్షేత్రాన్ని అప్పటి రాష్ట్ర భారీ పరిశ్రమల శాఖా మంత్రి కోటగిరి విద్యాధరరావు దంపతుల కృషితో చినజీయర్ స్వామి విగ్రహ ప్రతిష్ఠ చేశారు. ఈ ఆలయంలో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. -
ఏలూరులో రెడ్బుక్ అంటూ పోస్టులు
ఏలూరు టౌన్: ఏలూరు నియోజకవర్గంలోనూ రెడ్బుక్ అమలు చేస్తామనీ, వైఎస్సార్సీపీ నేతలను బెదిరిస్తూ, అసభ్యకరమైన పదజాలంతో దూషిస్తూ సోషల్మీడియాలో టీడీపీ నేతలు పోస్టులు పెడుతూ రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారని, చర్య లు తీసుకోవాలని వైఎస్సార్సీపీ నేతలు సో మవారం జిల్లా అదనపు ఎస్పీ నక్కా సూర్యచంద్రరావుకు వినతిపత్రం సమర్పించారు. ఏలూరు సమన్వయకర్త మామిళ్లపల్లి జయప్రకాష్ ఆధ్వర్యంలో జిల్లా అధికార ప్రతినిధి మున్నుల జాన్ గురునాథ్, ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నూకపెయ్యి సుధీర్బాబు, నేతలు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయానికి వెళ్లారు. ఏలూరు నగర ప్రముఖులు అనే సోషల్ మీడియా వాట్సాప్ గ్రూపులో టీడీపీకి చెందిన ఓ వ్యక్తి అసభ్యంగా దూషించడంతో పాటు ఏలూరులో ప్రతి డివిజన్కు రెడ్బుక్ ఉందంటూ పోస్టులు పెడుతున్నారని వివరించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ రాగానే తామేంటో చూపిస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతున్నా రని తెలిపారు. రాజకీయ పార్టీల పేరుతో వైషమ్యా లు, గొడవలు సృష్టించేలా చూస్తున్న వారిపై చర్య లు తీసుకోవాలని కోరారు. ఏలూరు నగర మహిళ అధ్యక్షురాలు జిజ్జువరపు విజయనిర్మల, కార్పొరేటర్ కేదారేశ్వరి, ఎస్సీ సెల్ నగర అధ్యక్షుడు ఇనప నూరి జగదీష్, లీగల్ సెల్ నగర అధ్యక్షుడు ప్ర త్తిపాటి తంబి, న్యాయవాది డి.రామాంజనేయులు, జిల్లా మహిళ ఉపాధ్యక్షురాలు చిలకపాటి డింపుల్, పార్టీ ముఖ్యనేతలు రావి సునీత, రావి నాని, ఆర్టీఐ జిల్లా అధ్యక్షుడు స్టాన్లీబాబు, యువజన నాయకుడు ప్రత్తిపాటి విక్టర్, సోషల్మీడియా జిల్లా ఉపాధ్యక్షులు బండ్లమూడి సునీల్, గణేష్ ఉన్నారు. ఏఎస్పీకి వైఎస్సార్సీపీ నేతల ఫిర్యాదు -
మామిడి రైతు కుదేలు
చింతలపూడి: ఆరంభంలో ఆశలు రేపిన మామిడి తోటలు, తీరా కోత సమయానికి రైతులకు కన్నీరు మిగులుస్తున్నాయి. ఆశించిన స్థాయిలో పూత వచ్చినా.. తెగుళ్ల దాడి, అకాల వర్షాలు, మార్కెట్ ధరల పతనం వెరసి ఈ ఏడాది మామిడి సాగు గడ్డుకాలంగా మారుతోంది. చేతికొచ్చిన పంట ఎక్కడ నేలపాలవుతుందోనని అన్నదాతలు గుబులు చెందుతున్నారు. తేనె మంచు దెబ్బ ఈ ఏడాది సీజన్ ప్రారంభంలో తోటలు ఆశాజనకంగా పూత పూశాయి. అనూహ్యంగా తేనె మంచు తెగులు వల్ల పూత మాడిపోయి రాలిపోయింది. దీంతో కాయ సైజు తగ్గి, దిగుబడిపై ప్రభావం పడింది. దీనికి తోడు చాలా ప్రాంతాల్లో తోటలు ఆలస్యంగా పూతకు రావడంతో, ప్రస్తుతం కాయలు ఇంకా తగిన సైజుకు చేరుకోలేదు. ధరల పతనం మార్కెట్లో ధరల హెచ్చుతగ్గులు రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. బంగినపల్లి రకం ప్రస్తుతం టన్ను రూ.70,000 నుంచి రూ. 80,000 వరకు ధర పలుకుతోంది. తోతాపురి రకం సీజన్ ఆరంభంలో టన్ను రూ.లక్ష వరకు పలికిన ధర, వాతావరణ పరిస్థితుల వల్ల నాణ్యత తగ్గడంతో ఒక్కసారిగా రూ.25,000కు పడిపోయింది. ఇది రైతులను కోలుకోలేని దెబ్బ తీస్తోంది. అకాల వర్షాల భయం గత నాలుగైదు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలు, ఈదురు గాలులు రైతులను కలవరపెడుతున్నాయి. ఏలూరు జిల్లాలోని నూజివీడు సబ్ డివిజన్లో సుమారు 40,000 ఎకరాలు, చింతలపూడి సబ్ డివిజన్లోని చింతలపూడి, లింగపాలెం, కామవరపుకోట, టి.నరసాపురం, ద్వారకాతిరుమల, జంగారెడ్డిగూడెం మండలాల్లో సుమారు 12 వేల ఎకరాల్లో మామిడి సాగు విస్తరించి ఉంది. గాలి వానకు కాయలు రాలిపోతే పెట్టుబడులు కూడా దక్కవని రైతులు ఆందోళన చెందుతున్నారు. వెలవెలబోతున్న కమిషన్ దుకాణాలు సాధారణంగా ఈ పాటికి చింతలపూడి వంటి ప్రాంతాల్లో కమిషన్ దుకాణాలు కొనుగోళ్లతో కళకళలాడాలి. కాయలు ఇంకా పూర్తిస్థాయిలో తయారు కాకపోవడంతో వ్యాపారులు దుకాణాలు తెరవడానికి ఆసక్తి చూపడం లేదు. ప్రస్తుతం లభ్యమవుతున్న కొద్దిపాటి దిగుబడిని వ్యాపారులు నేరుగా గుజరాత్ వంటి రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు. ఏలూరు జిల్లా మామిడికి దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది. ఇక్కడి నుంచి ఏటా ఢిల్లీ, కోల్కతా, నాగపూర్, పుణె, అహ్మదాబాద్, హైదరాబాద్, తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు, మన రాష్ట్రంలో విజయవాడ, రాజమండ్రి, గుంటూరు, తెనాలి వంటి ప్రధాన వ్యాపార కేంద్రాలకు కాయలు ఎగుమతి చేస్తారు. ప్రకృతి వైపరీత్యాలు ఒకవైపు, మార్కెట్ మాయాజాలం మరోవైపు మామిడి రైతును ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ప్రభుత్వం స్పందించి గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు, నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ఉద్యానవన సాగుదారులు కోరుతున్నారు. తెగుళ్లు, ప్రకృతి వైపరీత్యాలతో నష్టంమార్కెట్లో ధర ఉన్నా తోటల్లో కాయ సైజు పెరగలేదు. తేనె మంచు పురుగు వల్ల మామిడి తోటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో మార్కెట్లో ధర తగ్గే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇక్కడి నుంచి హైదరాబాద్, మహారాష్ట్ర, గుజరాత్ మార్కెట్కు కాయలు తరలిస్తున్నాం. మామిడి రైతుల సౌకర్యార్థం మెట్టప్రాంతంలో మామిడి కోల్డ్ స్టోరేజ్ ప్లాంట్ను ఏర్పాటు చేస్తే రైతులకు ఉపయోగంగా ఉంటుంది. – సిహెచ్. సుధాకర్, శ్రీనివాస ఫ్రూట్ కంపెనీ, చింతలపూడి -
ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
నూజివీడు: పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలకు అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని ఇన్ఛార్జి ప్రిన్సిపాల్ మహమద్ ఫారూఖ్ సోమవారం తెలిపారు. ఎంప్లాయిస్ కాలనీలోని పాఠశాల తాత్కాలిక భవనాన్ని పరిశీలించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. 1 నుంచి 5వ తరగతి వరకు తరగతులు ఏప్రిల్ నెల నుంచి ప్రారంభమవుతాయని, ప్రతి తరగతికి 40 సీట్లు ఉంటాయని చెప్పారు. ఒకటో తరగతిలో చేరే పిల్లలకు మార్చి 31 నాటికి ఆరేళ్లు నిండి ఉండాలన్నారు. కేంద్రీయ విద్యాలయం వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలి. 2 నుంచి 5వ తరగతి వరకు చేరాలనుకునే వారు దరఖాస్తులను నేరుగా కార్యాలయంలో అందజేయాలని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకు ప్రథమ ప్రాధాన్యత, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకు ద్వితీయ ప్రాధాన్యత ఉంటుందని వివరించారు. -
రాజ్యసభ సభ్యుడు పాకాకు అవమానం
పాలకొల్లు సెంట్రల్: పంచారామక్షేత్రం శ్రీ క్షీరారామలింగేశ్వరస్వామి ఆలయం కల్యాణోత్సవ ఆహ్వాన పత్రికల్లో రాజ్యసభ సభ్యుడు పాకా సత్యనారాయణకు పేరు లేకపోవడంపై నిరసన వ్యక్తమవుతోంది. ఈ నెల 27 నుంచి పాలకొల్లు శ్రీ క్షీరారామలింగేశ్వరస్వామి ఆలయంలో కల్యాణోత్సవాలు జరగనున్నాయి. ఉత్సవాల ఆహ్వాన పత్రికల్లో స్థానిక మంత్రితో పాటు జిల్లాలో ఉన్న శాసనసభ సభాపతి, ఉప సభాపతి, ఎమ్మెల్సీలు, ఇన్చార్జి మినిస్టర్, జిల్లా పరిషత్ చైర్మన్ పేర్లు వేశారు. కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న రాజ్యసభ సభ్యుడు పాకా సత్యనారాయణ పేరు వేయలేదు. నిత్యం అధికార పార్టీ వెన్నంటి ఉండి ప్రతి కార్యక్రమంలో ముఖ్య భూమిక పోషిస్తున్న కొందరు బీజేపీ నాయకులు సైతం దీనిపై స్పందించకపోవడం గమనార్హం. ఈ విషయంపై పట్టణ గౌడ సంఘం నాయకులు స్పందించారు. కల్యాణోత్సవ ఆహ్వాన పత్రికల్లో పాకా సత్యనారాయణ పేరు వేయకుండా అవమానించారని తప్పుపట్టారు. ముద్రణ సమయంలో ఆలయ అధికారులు, పాలకమండలి సభ్యులు చూసుకోకుండానే ముద్రిస్తారా? అని అనుమానం వ్యక్తంచేశారు. ముందుగా ప్రింటింగ్ వేసిన ఆహ్వాన పత్రికలకు సుమారు రూ. 25 వేల వరకూ ఖర్చయ్యే అవకాశం ఉంటుందని అన్నారు. మళ్లీ కార్డులు ప్రింటింగ్ వేయిస్తున్నట్లు సమాచారం అందిందని అన్నారు. -
దొమ్మేటి.. గొప్ప సంఘ సంస్కర్త
ఏలూరు (టూటౌన్): దొమ్మేటి వెంకటరెడ్డి గొప్ప సంస్కర్త అని జిల్లా కలెక్టర్ కె.వెట్రి సెల్వి అన్నారు. సోమవారం స్థానిక కలెక్టరేట్ గోదావరి సమావేశపు హాలులో వెనుకబడిన తరగతుల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన దొమ్మేటి వెంకటరెడ్డి జయంతి వేడుకలను కలెక్టర్ జ్యోతిని వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ ప్రజలను విద్యావంతులను చేసేందుకు దొమ్మేటి ఎంతో కృషి చేశారని గుర్తుచేశారు. దొమ్మేటి జయంతిని అధికారిక కార్యక్రమంగా నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించిందని చెప్పరు. కార్యక్రమంలో జేసీ ఎంజె అభిషేక్ గౌడ, ఇన్చార్జి జిల్లా రెవెన్యూ అధికారి భాస్కర్, ఎస్సీ కార్పొరేషన్ ఇడీ ఎం ముక్కంటి, సర్వే శాఖ ఏడీ అన్సారీ, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమాధికారి ఆర్వీ. నాగరాణి పాల్గొన్నారు. దొమ్మెటికి నివాళి ఏలూరు టౌన్: ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో దొమ్మేటి వెంకటరెడ్డి జయంతి కార్యక్రమం నిర్వహించారు. శెట్టిబలిజ జాతిపిత దొమ్మేటి వెంకటరెడ్డి జయంతి సందర్భంగా అదనపు ఎస్పీ నక్కా సూర్యచంద్రరావు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో ఏఆర్ అదనపు ఎస్పీ జి.మునిరాజా, ఆర్ఐ పవన్కుమార్, కార్యాలయ సూపరింటెండెంట్ నాగేశ్వరరావు, ఆర్ఎస్ఐ వెంకటేష్, కార్యాలయ సిబ్బంది ఉన్నారు. దొమ్మేటి జీవితం స్ఫూర్తిదాయకం భీమవరం (ప్రకాశం చౌక్): శెట్టి బలిజల జాతిపిత, అట్టడుగు వర్గాల విద్య సామాజిక అభ్యున్నతికి కృషి చేసిన దొమ్మేటి వెంకటరెడ్డి జీవితం స్ఫూర్తిదాయకమని కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. దొమ్మేటి వెంకటరెడ్డి 173వ జయంతి వేడుకలను సోమవారం కలెక్టరేట్లో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ నాగరాణి దొమ్మేటి వెంకటరెడ్డి చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 19 వ శతాబ్దంలో అట్టడుగు వర్గాలకు విద్యా సామాజిక అభ్యున్నతికి దొమ్మేటి వెంకటరెడ్డి చేసిన కృషి భవిష్యత్తు తరాలకు మంచి ప్రేరణ కలిగిస్తాయని అన్నారు. డీఆర్ఓ బి.శివన్నారాయణ రెడ్డి, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి ఏవీ సూరిబాబు, వసతి గహాల సంక్షేమ శాఖ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ కె.వెట్రిసెల్వి -
అర్జీలను వేగంగా పరిష్కరించాలి
భీమవరం (ప్రకాశం చౌక్): పీజీఆర్ఎస్ అర్జీలను వేగంగా పరిష్కరించాలని కలెక్టర్ సీహెచ్ నాగరాణి అన్నారు. కలెక్టరేట్లో సోమవారం జిల్లాస్థాయి పీజీఆర్ఎస్లో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణీత గడువులోపు పరిష్కారం చూపాలని సూచించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో అనుమతులు లేకుండా, సీనరేజీ చెల్లించకుండా మట్టి అక్రమ రవాణా చేస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. మట్టి అక్రమ రవాణాను అరికట్టేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మట్టిని తరలించే లారీలు, ట్రాక్టర్లను తనిఖీ చేయాలన్నారు. జేసీ టి.రాహుల్కుమార్రెడ్డి, జిల్లా గ్రామ, వా ర్డు సచివాలయం అధికారి వై.దోసిరెడ్డి, డీపీఓ ఎం.రామనాథరెడ్డి, కలెక్టరేట్ పరిపాలన అధికారి ఎన్.వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. అర్జీల్లో కొన్ని.. ● ఇరగవరం మండలం గుబ్బలవారిపాలెంలో శ్శశాన వాటికకు వెళ్లే రోడ్డు అధ్వానంగా ఉందని, రోడ్డు సమస్య పరిష్కరించాలని గ్రామానికి చెందిన మహిళలు కలెక్టర్ను కోరారు. పైప్లైన్ ద్వారా మంచినీరు రాక ఇబ్బంది పడుతున్నామని చెప్పారు. ● ఆకివీడుకు చెందిన పి.సత్యనారాయణ తనకు 66 శాతం వైకల్యం ఉందని, దివ్యాంగ పింఛన్ మంజూరు చేయాలని కోరారు. ● మొగల్తూరు మండలం మోడీ, కొత్తకాల తిప్ప, పేరుపాలెం, ఏటిమొండి, మొలపర్రులో సు మారు 2 వేల ఎకరాలకు నీరందించే వీఆర్ చానల్ నిర్మాణ పనులు పూర్తిచేయాలని బీజేపీ జనతా వారధి జిల్లా కన్వీనర్ తోట గంగారాజు వినతిపత్రం అందజేశారు. ● పాలకోడేరు మండలానికి చెందిన పేరిచర్ల పల్లంరాజు తనకు తన తల్లి నుంచి 65 సెంట్ల భూమి సంక్రమించిందని ఇప్పటివరకు రైతు భరోసా సొమ్ము పడలేదని, చర్యలు తీసుకోవాలని కలెక్టర్ను కోరారు. -
స్వీపర్ల ఆకలి కేకలు
తాడేపల్లిగూడెం (టీఓసీ): స్వీపర్లకు పెండింగ్ జీతాలు ఇవ్వాలని ఐఎఫ్టీయూ నాయకులు మామిడి దాన వరప్రసాద్ డిమాండ్ చేశారు. ఐఎఫ్టీయూ అనుబంధ సంఘం ఆధ్వర్యంలో మున్సిపల్ స్కూల్స్ స్వీపర్లు, శానిటేషన్ వర్కర్లు సోమవారం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, ఆర్డీఓ డీటీ పోతురాజుకు వినతిపత్రాలు సమర్పించారు. తొలుత ఆర్డీఓ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. ట్రిబ్యునల్ తీర్పు, కౌన్సిల్ తీర్మానం మేరకు కనీస వేతనాలు అమలు చేయాలని, పెండింగ్లో ఉన్న 9 నెలలు జీతాలు వెంటనే ఇప్పించాలని డిమాండ్ చేశారు. భీమవరం(ప్రకాశం చౌక్): నిబంధనలకు విరుద్ధంగా గర్భస్థ శిశువుల లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించినా, సహకరించినా చర్యలు తప్పవని డీఎంహెచ్ఓ జి.గీతాభాయ్ హెచ్చరించారు. సోమవారం డీఎంహెచ్ఓ కార్యాలయంలో జిల్లాస్థాయి గర్భస్థ పిండ లింగ నిర్ధారణ కమిటీ సలహా సంఘ సమావేశం నిర్వహించారు. జి ల్లాలోని ఆస్పత్రులు, స్కానింగ్ కేంద్రాలను క్ర మం తప్పకుండా తనిఖీలు చేయాలని ఆదేశించారు. స్కానింగ్ కేంద్రాల్లో రిజిస్టర్లను పరిశీలించాలన్నారు. ఆడపిల్లల నిష్పత్తి తక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఏపీపీ ఎం.వెంకటేశ్వరరావు, డీఏఈఓ డాక్టర్ డి.సుధాలక్ష్మి, గైనకాలజిస్ట్ సుబ్బలక్ష్మి, డీపీఆర్ఓ టి.నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. భీమవరం(ప్రకాశం చౌక్): పోలీస్స్టేషన్లకు వ చ్చే సామాన్యుల సమస్యలపై అలసత్వం వద్దని, త్వరితగతిన న్యాయం చేయాలని జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మిం సూచించారు. సోమవారం గొల్లలకోడేరులోని జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో పోలీస్ పీజీఆర్ఎస్లో ఫిర్యాదులు స్వీకరించారు. 14 అర్జీలు రాగా కుటుంబ కలహాలు, అత్తింటి వేధింపు లు, ఆస్తి తగాదాలు వంటి సివిల్ వివాదాలు, సైబర్, ఆన్లైన్ మోసాలు, అధిక వడ్డీల వేధింపులు, ప్రేమ పేరుతో మోసం వంటి అంశాలపై అర్జీలు ఉన్నాయి. భీమవరం డీఎస్పీ రఘువీర్విష్ణు, మహిళా స్టేషన్ డీఎస్పీ యు.రవిచంద్ర, జిల్లా స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ కేవీవీఎన్ సత్యనారాయణ పాల్గొన్నారు. దొమ్మేటికి నివాళులు సామాజిక సంస్కర్త, శెట్టిబలిజ పితామహుడు దొమ్మేటి వెంకటరెడ్డి జయంతి వేడుకలను జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించారు. దొమ్మేటి చిత్రపటానికి ఎస్పీ పూలమాలలు వేసి నివాళులర్పించారు. -
ఎర్రకాలువ జలాశయంలో చేప పిల్లలు విడుదల
జంగారెడ్డిగూడెం: సోమవారం ఎర్రకాలవ జలాశయంలో 4.80 లక్షల చేప పిల్లలను విడుదల చేశారు. చక్రదేవరపల్లిలో 1.20 లక్షలు, దేవులపల్లి, తాడువాయి, మతన్నగూడెం రేవుల్లో చేపలు విడుదల చేశారు. ఈ సందర్భంగా అధికారులు, నాయకులు మాట్లాడుతూ మత్స్యకారుల ఆదాయ వృద్ధి, ప్రజలకు తాజా చేపల లభ్యత ద్వారా పోషక భద్రత కల్పిస్తున్నామన్నారు. నాణ్యమైన చేపలకు 40 శాతం సబ్సిడీతో విడుదల చేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో మండల అధ్యక్షులు కుక్కల మాధవరావు, జడ్పీటీసీ పొల్నాడు బాబ్జి, దాకారపు కృష్ణ పాల్గొన్నారు. అత్తిలి: అదనపు కట్నం వేధింపులు తాళలేక ఓ మహిళ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన సోమవారం అత్తిలి మండలం స్కిన్నెరపురంలో జరిగింది. ఎస్సై పి.ప్రేమరాజు తెలిపిన వివరాల ప్రకారం.. కాళ్ల మండలం జక్కరం గ్రామానికి చెందిన నాగలక్ష్మి(23)కి, అత్తిలి మండలం స్కిన్నెరపురం గ్రామానికి చెందిన కళ్యాణి దుర్గారావుతో 2018లో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భర్త రొయ్యల కంపెనీలో కారు డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఇటీవల కాలంలో అదనపు కట్నం తీసుకురావాలని, అలాగే అత్తవారి ఇంటి నుంచి రావాల్సిన స్థిరాస్తిని కూడా తన పేరిట రాయించాలని భర్త వేధించడంతో నాగలక్ష్మి మనస్థాపం చెందింది. ఈ క్రమంలో సోమవారం తెల్లవారుజామున ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి తండ్రి వెంకన్నబాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు భర్తపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. జంగారెడ్డిగూడెం: ప్రమాదవశాత్తు వృద్ధుడిపై చెట్టు విరిగిపడి మృతి చెందాడు. దీనికి సంబంధించి స్టేషన్ హెచ్సీ ఎన్.ఉమామహేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం.. జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురం గ్రామానికి చెందిన యడ్లపల్లి బొజ్జియ్య (62)తో పాటు కొంతమంది కూలీలు శ్రీనివాసపురం ప్రభుత్వ టింబర్ డిపోలో కూలీలుగా పనిచేస్తున్నారు. బొజ్జియ్య గత 30 ఏళ్ళుగా అదే టింబర్లో పనిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలో సోమవారం తెల్లవారుజామున 4 గంటలకు కొంత మంది కూలీలతో బయలుదేరి టింబర్ డిపోలో వెదురు కర్రల లోడు చేస్తున్నారు. ఉదయం 9 గంటల సమయంలో పక్కనే ఉన్న చెట్టు విరిగి బొజ్జియ్యపై పడింది. వెంటనే అతన్ని స్ధానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు. అప్పటికీ అతను మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. -
రొయ్య రైతులను దోచుకుంటున్న కంపెనీలు
వీరవాసరం: రొయ్యల రైతుల సమస్యల పరిష్కారం కోసం వీరవాసరంలో ఆదివారం ఆంధ్రప్రదేశ్ ఆక్వా రైతుల సదస్సు నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా వివి ధ జిల్లాల నుంచి రొయ్యల రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. పలు డిమాండ్లు ప్రకటించారు. వీరవా సరం రొయ్య రైతుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు మ ల్ల తులసీరామ్ (రాంబాబు) అధ్యక్షతన జరిగిన స మావేశంలో జై భారత్, క్షీరారామ రొయ్య రైతుల సంఘం అధ్యక్షుడు గొట్టుముక్కల గాంధీ భగవాన్రాజు మాట్లాడుతూ ఉత్పత్తులను సాధించడానికి రొయ్య రైతులు ప్రకృతి విపత్తులు, వైరస్లతో పోరాడుతుంటే ట్రంప్ సుంకాలు, యుద్ధం పేరుతో కంపెనీలు భా రాలు వేస్తున్నాయన్నారు. రాష్ట్ర ఆక్వాకల్చర్ అభివృద్ధి అథారిటీకి చెప్పకుండానే మేతల ధరలు పెంచారన్నారు. నాణ్యమైన సీడ్ లేక 80 శాతం పంటను రైతు లు కోల్పోతున్నారన్నారు. జిల్లా అసోసియేషన్ కార్య దర్శి గాదిరాజు సుబ్బరాజు మాట్లాడుతూ వచ్చిన దిగుబడిలో 90 శాతం పంటను రైతులు అయినకాడికి అమ్ముకుంటున్నారన్నారు. ఒక రొయ్యల మేతల కంపెనీ యజమాని ఎంతకాలం అడుక్కుంటారంటూ రైతులను చులకన చేసి మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేశారు. మల్ల తులసీరామ్ మాట్లాడుతూ పెంచిన ఫీడ్ రేట్లు తగ్గించి, తగ్గించిన రొయ్య రేట్లను వెంటనే ఆయా కంపెనీలు సరిచేయాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే ఆయా ఫీడ్, ప్రాసెసింగ్ ప్లాంట్లను పేర్లతో సహా వెల్లడించి బ్యాన్ చేస్తామన్నారు. పాలకొల్లు అసోసియేషన్ కార్యదర్శి బోనం వెంకట నరసయ్య (చిన్నబాబు) మాట్లాడు తూ మూడు నెలల పాటు క్రాప్ హాలిడేని ప్రకటిస్తే అ ప్పుడు ప్రభుత్వానికి, ఎగుమతిదారులకు రైతులు విలువ తెలుస్తుందన్నారు. అమలాపురానికి చెందిన నాగభూషణం, అప్సడా సభ్యుడు వేగేశ్న సత్యనారాయరాజు, ఐ.భీమవరం బోస్, వీరవల్లి చంద్రశేఖర్, బోగిరెడ్డి శ్రీనివాస్, సీహెచ్ నాగభూషణం, ఎన్.గజపతిరాజు, గాదిరాజు శ్రీనివాసరాజు, కలిగొట్ల యు వరాజు, సజ్జా బుజ్జి, రమేష్ రాజు తదితర నాయకులు పాల్గొన్నారు. సదస్సులో నినదించిన రైతులు -
ఎన్హెచ్–165 విస్తరణకు గ్రహణం
ఆకివీడు: జాతీయ రహదారి–165 విస్తరణ పనులు ముందుకు కదలడం లేదు. పాలకొల్లు–పామర్రు రోడ్డుగా ఉన్న దీనికి జాతీయ రహదారి హోదా ఇచ్చి నంబర్ కేటాయించిన తర్వాత విస్తరణ పనుల్లో పలు మార్పులు, చేర్పులు చోటుచేసుకున్నాయి. సుమారు దశాబ్ద కాలంగా రోడ్డు విస్తరణ, అభివృద్ధి అంగుళం కూడా కదల్లేదు. పీపీ రోడ్డును ఎన్హెచ్–165గా.. పాలకొల్లు–పామర్రు రోడ్డు (పీపీ రోడ్డు)ను పామర్రు–దిగమర్రు జాతీయ రహదారి నం.165గా గుర్తించిన తర్వాత రూ.1,200 కోట్లతో అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. పామర్రు నుంచి ఆకివీడు వరకు ఒక ప్రాజెక్టుగా, ఆకివీడు నుంచి దిగమర్రు వరకూ 46 కిలోమీటర్ల మేర రెండో ప్రాజెక్టుగా టెండర్లు పిలిచారు. వర్కు ఆర్డర్లు పొందిన తర్వాత పామర్రు నుంచి ఆకివీడు వరకు పనులు మొదలుపెట్టారు. ఏలూరు, కృష్ణా జిల్లాల్లో పనులు కొనసాగుతున్నాయి. మండవల్లి వరకు జాతీయ రహదారి విస్తరణ, అభివృద్ధి పనులు మొదటి ప్రాజెక్టులో పూర్తి చేశారు. అయితే ఆకివీడు వరకు పనులు నత్తనడకన సాగుతున్నాయి. కై కలూరు ప్రాంతంలో అక్కడక్కడా పనులు కొంత మేర జరిగాయి. బైపాస్ పనులు కొనసాగుతున్నాయి. ఆలపాడు వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేశారు. ఉప్పుటేరుపై వంతెనకు బ్రేక్ ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల సరిహద్దుగా ఉన్న ఉప్పుటేరుపై వంతెన నిర్మాణానికి బ్రేక్ పడింది. సంబంధిత కాంట్రాక్టర్ పనులు చేయడానికి వెనుకంజ వేస్తున్నట్టు తెలిసింది. దీంతో రెండేళ్లుగా వంతెన పనులు ఆగిపోయాయి. పనులు పిల్లర్ల దశలోనే ఉన్నాయి. ఉప్పుటేరు నుంచి అజ్జమూరు బైపాస్ ఓకే ఉప్పుటేరు వంతెన నుంచి బైపాస్ సౌకర్యం కల్పించారు. ఉప్పుటేరు, అయిభీమవరం, ఆకివీడు మీదు గా అజ్జమూరు గరువు వరకూ బైపాస్ రోడ్డుకు 37.50 ఎకరాల భూమి కొనుగోలు చేశారు. దీనికి సంబంధించి రూ.35 కోట్ల మేర నిధులు చెల్లించాల్సి ఉండగా ఇప్పటికే రూ.25 కోట్లు చెల్లించారు. మరో రూ.10 కోట్లు చెల్లించాల్సి ఉంది. అయిభీమవరం రోడ్డు వద్ద వెంకయ్య వయ్యేరు కాలువపై వంతెన నిర్మించాల్సి ఉంది. కాంట్రాక్టర్ పనులు ప్రారంభించడానికి ముందుకు రావడం లేదని ఎన్హెచ్ అధికారులు చెబుతున్నారు. ఈ ఏడాది వేసవిలో బైపాస్ రోడ్డుకు మట్టి పూడిక పనులు చేపట్టకపోతే వచ్చే ఏడాదిలోనే పనులు జరిగే అవకాశం ఉంది. ఉన్నతాధికారి పరిశీలన ఇటీవల రాష్ట్ర రహదారుల శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు ఆకివీడు మండలంలోని అజ్జమూరు గురువు నుంచి కలిసిపూడి, పెదమిరం మీదుగా జక్కరం వెళ్లే ప్రాంతంలో పరిశీలించారు. ఉండి ప్రాంతంలోని ప్రస్తుత జాతీయ రహదారి ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం కొత్త అలైన్మెంట్ మార్పుపై సూచనలు రావడం బైపాస్కు చుక్కెదురేనని స్థానికులు భావిస్తున్నారు. ఆకివీడు మండలం అజ్జమూరు నుంచి వీరవాసరం వరకు కొత్తగా రూపొందించిన బైపాస్ మార్గంపై జాతీయ రహదారుల శాఖ పునః పరిశీలన చేయాలని ప్రతిపాదనలు వెనక్కి పంపినట్టు తెలిసింది. అజ్జమూరు, పెదపుల్లేరు, సీసలి, జక్కరం మీదుగా చినమిరం, తాడేరు మీదుగా వీరవాసరం చేరుకుంటుంది. సుమారు 46 కిలోమీటర్ల రోడ్డు బైపాస్తో 40 కిలోమీటర్లకు తగ్గిపోయే అవకాశం ఉంది. అయితే ఈ ప్రాంతంలో అధికంగా చేపల చెరువులు, వంతెనలు, ఇతరత్రా కల్వర్టులు అధికంగా ఉండటంతో పాటు అధిక వ్యయం భూమి కొనుగోలుకు చెల్లించాల్సి ఉంటుంది. సుమారు రూ.3,200 కోట్లకు ప్రతిపాదనలు వెళ్లాయి. దీంతో ఆ శాఖ ఉన్నతాధికారులు పునఃపరిశీలనకు పంపారు. మరో మార్గం ద్వార తక్కువ భూమి కొనుగోలుకు, వ్యయం తగ్గించే మార్గాలుంటే చూడాలని జాతీయ రహదారుల శాఖ సూచించింది. దీంతో సంబంధిత కన్సల్టెంట్ ఆయా ప్రాంతాల్ని పరిశీలించేందుకు చర్యలు ప్రారంభిస్తున్నట్టు తెలిసింది. అలైన్మెంట్లో మార్పులు అజ్జమూరు–వీరవాసరం బైపాస్పై పునరాలోచన ఈ ఏడాది బడ్జెట్ కేటాయింపులు హుళక్కే నత్తనడక పనులతో కదలని నిర్మాణం -
గత ప్రభుత్వ అభివృద్ధి పనులు పూర్తి చేయండి
వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై అక్కసుతో అధికారు లు, పాలకులు ప్రజలను కష్టాల పాల్జేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రైతులకు, గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు వైఎస్సార్ ఆరోగ్యశ్రీ క్లినిక్లు, రైతు భరోసా భవనాలు నిర్మించారు. వీటిలో 90 శాతం భవనాలు అందుబాటులో వచ్చాయి. మరో 10 శాతం భవనాలకు విద్యుత్, తాగునీటి సౌ కర్యం కల్పిస్తే ఉపయోగంలోకి వస్తాయి. అయితే అధికారులు నేటికీ ఆయా భవనాలకు విద్యుత్, వాటర్ సప్లయ్ కనెక్షన్ ఇవ్వడం లేదు. దీనివల్ల పేదలు వైద్యం కోసం సుదూర ప్రాంతాలకు వెళుతున్నారు. రైతులు నానా అగచాట్లు పడుతున్నారు. దీనిపై శాసనమండలిలో సైతం ప్రశ్నించాను. అయినా ఫలితం కానరావడం లేదు. – వంక రవీంద్రనాథ్, ఎమ్మెల్సీ -
ప్రసాద్కు అవార్డు అభినందనీయం
భీమవరం (ప్రకాశంచౌక్) : ఎంత ఎదిగినా ఒది గి ఉండాలనే సౌమ్యులు పిప్పళ్ల ప్రసాద్ అని, నిర్దిష్ట జీవితాన్ని గడుపుతూ నాలుగు దశాబ్దాలుగా సంగీత విద్వాంసులుగా అందరి మన్ననలు పొందుతూ అవార్డు సాధించడం అభినందనీయమని శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేన్రాజు అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంస్కృతిక శాఖ ద్వారా ఉత్తమ సంగీత విద్వాంసుడిగా ఉగాది పురస్కారాన్ని అందుకున్న డాక్టర్ పిప్పళ్ల ప్రసాద్ను శ్రీవిజ్ఞానవేదిక ఆధ్వర్యంలో స్థానిక భీమేశ్వరస్వామి దేవస్థానంలో ఆదివారం సత్కరించారు. ముఖ్య అతిథిగా మోషేన్రాజు హాజరై మాట్లాడారు. ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు కొటికలపూడి గోవిందరావు, కృష్ణ బలిజ కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులు మాట్లాడారు. భట్టిప్రోలు శ్రీనివాసరావు, నందమూరి రాజేష్, పాలకోడేటి కార్తీక్ తదితరులు పాల్గొన్నారు. ఏలూరు (ఆర్ఆర్పేట) ప్రైవేట్ ఎలక్ట్రీషియన్లు సరైన సదుపాయాలు లేక వీధిన పడుతున్నారని, ప్రభుత్వం ఆదుకోవాలని ఏపీ ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొజ్జా రామకృష్ణ విజ్ఞప్తి చేశారు. ఆదివా రం రాష్ట్ర అధ్యక్షుడు లింగమల్లు శ్రీనివాసరావు అధ్యక్షతన రాష్ట్ర జనరల్ బాడీ సమావేశం ఏ లూరులో జరిగింది. ముఖ్య అతిథిగా రామకృష్ణ మాట్లాడుతూ కార్మిక శాఖ క్లయిమ్లు పరిష్కరించాలని, ప్రభుత్వమే టూల్కిట్లు ఇవ్వాలని, రుణాలు, ఈఎస్ఐ కల్పించాలని, ప్రమాద బీమా అమలు చేయాలని కోరారు. అనంతరం హేలాపురి ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ యూనియన్, ఇఫ్టూ అనుబంధ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. గౌరవ సలహాదారులుగా మై చర్ల శంకరరావు, అధ్యక్షుడిగా లింగమల్లు శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శిగా బత్తిన శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులుగా అనుపోజు ఉమా విజయ్ సాయి, కోడి రవి, సంయుక్త కార్యదర్శులుగా తోట మోహన్రావు. పోసిన జగదీష్, కోశాధికారిగా పిట్టా తరుణ్ సాయి కుమార్ను ఎన్నుకున్నారు. అలాగే కార్యవర్గ సభ్యులుగా వీరవరపు నాగేశ్వరావు, సిరిగిరి సత్యనారాయణను ఎన్నుకున్నారు. ద్వారకాతిరుమల: రోజురోజుకూ పెరుగుతున్న ఎండ వేడిమి నుంచి భక్తులకు ఉపశమనం కలిగించేందుకు చినవెంకన్న దేవస్థానం అధికారులు ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతున్నారు. దీనిలో భాగంగా ఆదివారం మరో కొత్త విధానానికి శ్రీకారం చుట్టారు. ప్రత్యేకంగా కొందరు సి బ్బంది భుజాలకు స్ప్రే పంప్ టిన్లను తగిలించుకుని, భక్తుల వద్దకు వెళ్లి మరీ మంచినీరు (శ్రీ వారి జలప్రసాదం) అందిస్తున్నారు. దీనిపై భ క్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అడిగి మరీ.. దాహం తీరుస్తున్నారని ప్రశంసిస్తున్నారు. -
సమస్యలపై నిలదీత
కోరం లేకుండా జెడ్పీ సమావేశమా?● తీర్మానాల ఆమోదంపై సభ్యుల ధ్వజం ● వైఎస్సార్సీపీ జెడ్పీటీసీల వాకౌట్ ● జెడ్పీ చైర్పర్సన్ తీరుపై మండిపాటు ఏలూరు రూరల్ : సభ్యులు హాజరు కాకుండా, కో రం లేకుండా జిల్లాపరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించడం, తీర్మానాలు ఆమోదించడం రా జ్యాంగ విరుద్ధమంటూ వైఎస్సార్సీపీ జెడ్పీటీసీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. జెడ్పీ చైర్పర్సన్ ఘంటా పద్మశ్రీ ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ సభ్యులను అవమానిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం ఏలూరులో జెడ్పీ సీఈఓ భీమేశ్వర్ పర్యవేక్షణలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాపరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. సమావేశం ప్రా రంభం కాగానే చైర్పర్సన్ పలు పనులపై అధికారులతో సమీక్ష చేపట్టారు. దీనిపై వైఎస్సార్సీపీ ఫ్లోర్లీడర్, పోడూరు జెడ్పీటీసీ గుంటూరి పెద్దిరా జు అభ్యంతరం వ్యక్తం చేశారు. మొదట ప్రజాసమస్యలపై చర్చించాలని డిమాండ్ చేశారు. దీనిపై చైర్పర్సన్ మాట్లాడుతూ రిజిస్టర్లో సంతకం చేస్తేనే సమావేశంలో మాట్లాడాలని, లేదంటే సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. వెంటనే జెడ్పీటీసీలు కోరిపల్లి జయలక్ష్మి (ఉంగుటూరు), తుమ్మగుంట భవాని (భీమడోలు), ముళ్లపూడి అన్నపూర్ణాదేవి (తణుకు), ఉప్పులూరి వరలక్ష్మి (పెంటపాడు) మాట్లాడుతూ గతంలో రిజిస్టర్లో సభ్యులు చేసిన సంతకాలను తప్పుడు తీర్మానాలకు ఆమోదం చేసినట్టుగా చూపి అక్రమాలకు పాల్పడ్డారని, అందుకే రిజిస్టర్లో సంతకం చేయమని అన్నారు. దీంతో చైర్పర్సన్ మాట్లాడుతూ సంతకాలు చేయని సభ్యులకు మాట్లాడే అవకాశం ఇవ్వమని అనడంతో ఏలూరు, దెందులూరు జెడ్పీటీసీలతో పాటు 11 మంది వాకౌట్ చేశారు. మరోపక్క వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్ ప్రజా సమస్యలపై గళమెత్తారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ది పనులను కొనసాగించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాడేపల్లిగూడెం పరిసర గ్రామాల్లో రోడ్ల పక్కన బెల్టుషాపులు పెరిగిపోయాయని, దీంతో పేదల జేబులు గుల్లకావడంతో పాటు ప్రమాదాలు జరుగుతున్నాయని జెడ్పీటీసీ ఆంజనేయులు అధికారులను నిలదీశారు. -
కోరం లేకుండా ఆమోదాలు ఎలా?
ఇప్పటికే మూడుసార్లు సమావేశం వాయిదా వేశారు. ఆదివారం ఆగమేఘాల మీద సమావేశం నిర్వహించారు. కోరంకు అవసరమైన సభ్యులు హాజరు కాలేదు. అయినా అధికారుల సమక్షంలోనే చైర్పర్సన్ సమావేశం నిర్వహించడం రాజ్యాంగ విరుద్ధం. దీనిని మేం ప్రశ్నించాం. అందుకే మమ్మల్ని సస్పెండ్ చేస్తామంటూ అవమానకరంగా హెచ్చరించారు. ప్రశ్నించే సభ్యులు లేకుండా చూసి పలు తీర్మానాలకు ఆమోదం చేసుకుంటున్నారు. – ఎం నీరజ, చింతలపూడి, జెడ్పీటీసీ కొంతకాలంగా సమావేశానికి హాజరైన సభ్యుల నుంచి ముందుగానే సంతకాలు సేకరించి అజెండాలో లేని పనులకు తీర్మానాలు చేసినట్టుగా చూపుతున్నారు. తీర్మానాల్లో చాలా అవకతవకలు జరిగాయి. వీటికి మేం బాధ్యులం కాకూడదనే సంతకాలు చేయలేదు. అజెండా అంశాలు చర్చించిన తర్వాతే రిజిస్టర్లో సంతకాలు చేస్తామన్నాం. దీనికి చైర్పర్సన్ ఒప్పుకోలేదు. పనుల వివరాలు అడిగినా ఇవ్వడం లేదు. – కర్రి గౌరీసుభాిషిణి, పెనుమంట్ర, జెడ్పీటీసీ కొంతకాలంగా జెడ్పీ నిధులు పక్కదారి పడుతున్నాయి. దీనిపై మేం ప్రశ్నిస్తున్నా సమాధానం చెప్పడం లేదు. గత సమావేశాల్లో సభ్యులు ఆమోదించిన తీర్మానాలు కాకుండా, తప్పుడు మార్గంలో తీర్మానాలు చేస్తున్నారు. ఈ తీర్మానాలు ద్వారా పనులు ఇష్టానుసారంగా చేపట్టి, నిధులు కాజేస్తున్నారు. దీనిపై ఉన్నతాధికారులకు సైతం ఫిర్యాదు చేసినా ఫలితం లేదు. అందుకే న్యాయపోరాటానికి సిద్ధపడుతున్నాం. – గుంటూరి పెద్దిరాజు, పోడూరు జెడ్పీటీసీ -
రథానికి మెరుగులు.. ఉన్నాయా అనుమతులు?
● క్షీరారామంలో ట్రస్ట్ ఏర్పాటు ● భక్తుల నుంచి విరాళాల సేకరణ పాలకొల్లు సెంట్రల్: పంచారామక్షేత్రం శ్రీ క్షీరారామలింగేశ్వరస్వామి ఆలయంలో స్వామివారి రథానికి బంగారు పూత పూయిస్తామని కొందరు భక్తులు ట్రస్టుగా ఏర్పడి రిజిస్ట్రేషన్ చేయించుకుని రంగంలోకి దిగారు. రథానికి రాగి తాపడం చేయించి దానిపై బంగారం పూత పూయిస్తామని ఆలయ ఈఓకు తెలియజేశారు. ఇందుకు ఈఓ అనుమతి ఇచ్చారా అంటే అధికారికంగా లేదనే చెప్పాలి. అయితే అనధికారికంగా మాత్రం సానుకూలంగా స్పందించినట్టు తెలిసింది. దీంతో ట్రస్టు సభ్యులు రంగంలోకి దిగారు. పట్టణంలోని పలువురిని కలిసి విరాళాలు సేకరిస్తున్నారు. అయితే దీనిని కొందరు భక్తులు, అధికార పార్టీ సభ్యులు, పాలకమండలి సభ్యులు వ్యతిరేకిస్తున్నారు. స్వామి పేరు చెప్పి నగదు ఎలా వసూలు చేస్తారని, గోల్డ్ కోటింగ్కు సంబంధించి ఖర్చుల లెక్కలు చూపిస్తారా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎంత బంగారం వినియోగిస్తారని ప్రశ్నిస్తున్నారు. ఆలయ ఈఓ ఏమన్నారంటే.. అభివృద్ధి పనులకు సంబంధించి ఆలయం నుంచి అనుమతులు రావాలంటే చాలా సమయం పడు తుందని ఈఓ అన్నారు. ఐదారుగురు వ్యక్తులు ట్రస్టు ఏర్పాటుచేసి రిజిస్ట్రేషన్ చేయించుకుని ఒక అకౌంట్ ఓపెన్ చేసుకుని దాని ప్రకారం చేస్తున్నారని, రథానికి బంగారం కోటింగ్ పూర్తి చేశాకా ఆలయానికి స్వాధీనం చేస్తారని చెప్పారు. అనధికారికంగా స్వామివారి పేరున వసూళ్లు చేస్తే చర్యలు తీ సుకుంటామని, విరాళాలకు రశీదులు ఇవ్వాలని అన్నారు. పూర్తి వివరాలు చెప్పాల్సిన బాధ్యత ట్రస్టు కు ఉంటుందని, దేవస్థానం పేరున చేస్తున్నారు కా బట్టి తాము అడుగుతామని చెప్పారు. రథం పనులు పూర్తయిన తర్వాత జమాఖర్చులు చెబుతామని ట్రస్టు సభ్యులు అన్నారని, అనుమానాలు ఉంటే ప్రశ్నించే హక్కు తమకు ఉందన్నారు. ఎవరికి వారే రిజిస్ట్రేషన్ చేయించుకుని వసూళ్లు చేస్తే ఏంచేస్తారు అని ఈఓను ప్రశ్నించగా.. ఎవరు వచ్చి వాళ్లు వసూళ్లు చేసి వ్యాపారం చేస్తానంటే ఎలా ఒప్పుకుంటామని ఈఓ ముగించారు. -
ట్రిపుల్ఐటీ విద్యార్థులు గ్రేట్
100లోపు 5, వెయ్యిలోపు 30 మందికి ర్యాంకులు నూజివీడు: గేట్–2026 ఫలితాల్లో నూజివీడు ట్రి పుల్ఐటీ విద్యార్థులు ప్రతిభ చూపారు. ఆలిండి యా స్థాయిలో 100లోపు ఐదుగురు విద్యార్థులు ర్యాంకులు సాధించారు. రవణం సురేష్ (ఈసీఈ) 37, మనోజ్ (సీఎస్ఈ) 43, తిలక్ 54, నాగరాజు 66, అజయ్ 69వ ర్యాంకు సాధించారు. అలాగే సుదర్శనరెడ్డి (ఈసీఈ)లో 117వ ర్యాంకు సాధించారు. మొత్తంగా వెయ్యి లోపు 30 మంది వి ద్యార్థులు ర్యాంకులు సాధించారు. ర్యాంకుల సాధనలో క్యాంపస్లో అమలు చేస్తున్న యూనివర్సిటీ సపోర్ట్ ప్రోగ్రామ్ కీలక పాత్ర పోషించింది. అత్యుత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులను ట్రిపుల్ ఐటీ నూజివీడు డైరెక్టర్ ఆచార్య ఎస్ఎస్ఎస్వీ గోపాలరాజు అభినందించారు. మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. విద్యార్థులను రిజిస్ట్రార్ అభినందించారు. -
పర్యాటకాభివృద్ధికి ప్రణాళికలు
భీమవరం (ప్రకాశంచౌక్): జిల్లాలో పర్యాటక రంగ అభివృద్ధికి సమగ్ర ప్ర ణాళికలు అమలు చేస్తున్నామని కలెక్టర్ సీహెచ్ నాగరాణి తెలిపారు. జిల్లాలోని తణుకులో 0.77 ఎకరాలు, తాడేపల్లిగూడెంలో 0.85 ఎకరాలు, ఉండి మండలంలో 0.81 ఎకరాల భూమిని టూరిజం అభివృద్ధికి వినియోగించేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. భారీ, మెగా, అల్ట్రా మెగా టూరిజం ప్రాజెక్టులకు భూ ములు దీర్ఘకాలిక లీజు పద్ధతిలో కేటాయిస్తారని, వీటి వివరాలు టూరిజం అథారిటీ వెబ్సైట్లో పొందుపరిచినట్టు చెప్పారు. జిల్లాకు చెందిన మూడు స్థలాలు ఉన్నాయని, ప్రాజెక్టులకు సంబంధించి పెట్టుబడిదారులకు సౌలభ్యం కల్పించేందుకు ఏపీ టూరిజం అథారిటీ పూర్తి సహకారం అందిస్తుందన్నారు. ప్రాజెక్టులకు సంబంధించి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారని, మరిన్ని వివరాలకు జిల్లా టూరిజం అధికారిని లేక అధికారిక వెబ్సైట్ను సందర్శించాలని ఆమె కోరారు. భీమవరం (ప్రకాశంచౌక్): జిల్లాలో గృహ గణన కార్యక్రమాన్ని సమర్థవంతంగా, సమయపాలనతో నిర్వహించేందు కు అధికారులు చర్యలు తీసుకోవాలని డీఆర్వో బి.శివన్నారాయణరెడ్డి ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి శుక్రవారం ఆయన తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లతో గూగుల్ మీట్ ద్వారా సమీక్షించారు. జిల్లాలోని ప్రతి మండలం, మున్సిపాలిటీలో ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లు, క్షేత్రస్థాయి సిబ్బందిని తక్షణమే ని యమించాలని ఆదేశించారు. ఈనెల 23, 24, 25 తేదీల్లో సిబ్బందికి శిక్షణా తరగతులు నిర్వహించాలన్నారు. సిబ్బంది పనితీరును పర్యవేక్షించాలని, గృహ గణన ప్రక్రియలో ఎలాంటి లోపాలు లేకుండా, కచ్చితమైన సమాచార సేకరణ జరిగేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అలాగే ప్రజలు కూడా సిబ్బందికి పూర్తిస్థాయిలో సహకరించి సరైన సమాచారాన్ని అందించాలని కోరారు. తాడేపల్లిగూడెం: అకాల వర్షాల వల్ల దెబ్బతిన్న ఉద్యాన పంటల రైతులకు అండగా ఉద్యాన వర్సిటీ శాస్త్రవేత్తలు ఉంటారని ఉద్యాన వర్సిటీ వీసీ డాక్టర్ కె.ధనుంజయరావు శుక్రవారం వి లేకరుల సమావేశంలో తెలిపారు. రాయలసీ మ జిల్లాల్లో, రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఉ ద్యాన పంటలు దెబ్బతినడం వల్ల రైతులు ఆందోళన చెందుతున్నారన్నారు. ఉద్యాన వర్సిటీ నుంచి ఆయా ప్రాంతాలకు శాస్త్రవేత్తల బృందాలు సందర్శించి, రైతులకు యాజమాన్య పద్ధతులు, సాంకేతిక పరిజ్ఞానం గురించి అవగాహన కల్పిస్తారన్నారు. అకాల వర్షాల వల్ల అరటి, మామిడి, బొప్పాయి, కర్బుజా, దాని మ్మ, కూరగాయల పంటలు, పూల మొక్కలు పాడైపోయే అవకాశాలు ఎక్కువన్నారు. ఉద్యా న పంటల సాగులో ఏఐ ప్రాధాన్యత, హార్టీ వి ద్య వల్ల కలిగే ప్రయోజనాల గురించి వివరించారు. రిజిస్ట్రార్ ఎం.మాధవి, బి.ప్రసన్నకుమార్, జి.రామానందం, సీహెచ్.రూత్ పాల్గొన్నారు. ద్వారకాతిరుమల: గోవును పూజించినా.. గోవుకు సేవించినా.. సకల శుభాలు కలుగుతాయని శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్ స్వామి ఉద్బోధించారు. ఒంగోలు, పుంగనూరు గోజాతి సంక్షేమ సంఘం, రాష్ట్ర పశుసంవర్ధక శాఖ–రాష్ట్ర పశుగణాభివృద్ధి సంస్థ, దాతల సౌజన్యంతో ద్వారకాతిరుమల మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన గోవుల అందాలు, పాల పోటీలను శుక్రవారం ఆయన ప్రారంభించారు. గో పోషకులతో మాట్లాడి, గో విశిష్టత ను తెలియజేశారు. అనంతరం అనుగ్రహ భా షణం చేశారు. గోవులో ముక్కోటి దేవతలు ఇమిడి ఉంటారని, ప్రతిఒక్కరూ గోవులను ఆ రాధించాలన్నారు. ఇక్కడ నిర్వహిస్తున్న గో అందాలు, పాల పోటీలు ఉన్నతమైనవన్నారు. సనాతన ధర్మాన్ని, సంస్కృతిని కాపాడుకోవడంలో గోసంరక్షణ ముఖ్యమైందన్నారు. గోశాలలను ప్రోత్సహించడం ద్వారా జీవన విధానంలో మార్పు, దైవత్వాన్ని ఆస్వాదించవచ్చన్నారు. ఇదిలా ఉంటే ఈ పోటీల్లో రాష్ట్ర నలుమూలల నుంచి ఇప్పటివరకు 91 పుంగనూరు, ఒంగోలు ఆవులు, గిత్తలు పాల్గొన్నాయి. -
కొబ్బరికి యుద్ధం సెగ
● ధరలు తగ్గడంతో రైతులు, వ్యాపారుల గగ్గోలు ● రూ.22 వేల నుంచి రూ.13 వేలకు పతనం భీమవరం: పశ్చిమాసియాలో యుద్ధం జిల్లాలోని రైతులు, ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. కొబ్బరి, రొయ్యల ధరలు పతనం కాగా నిత్యావసర సరుకుల ధరలు పెరుగుతూ గ్యాస్ కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉగాది, శ్రీరామనవమి పండుగలకు కొబ్బరి ధరలు ఆశాజనకంగా ఉంటాయని ఆశించిన రైతులు, వ్యాపారుల ఆశలు ఆవిరయ్యాయి. 25 వేల ఎకరాల్లో కొబ్బరి సాగు జిల్లాలో రైతులు ఎక్కువగా వరి తరువాత కొబ్బరి ఆదాయంపైనే ఆధారపడుతున్నారు. జిల్లాలో సు మారు 25 వేల ఎకరాల్లో కొబ్బరి సాగుచేస్తుండగా రైతులు చేలు, పుంత గట్లు, ఆర్అండ్బీ రోడ్డు వెంట, నివాస గృహాల పరిసరాల్లో కొబ్బరి పెంచడం పరిపాటి. కొబ్బరి ఆదాయం ద్వారా అనేక కుటుంబ అవసరాలు తీరుతున్నాయి. కొంతకాలంగా కొబ్బరి ధరలు తక్కువగా ఉండడం, కొబ్బరి దింపు, ఒలుపు ఖర్చులు పెరగడం రైతులకు భారంగా మారింది. ఈ నేపథ్యంలో గత ఏడాదిలో కొబ్బరికి మంచి గిట్టుబాటు ధరలు లభించడంతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు. ఆ సమయంలో గతంలో ఎన్నడూలేనంతగా వెయ్యికాయల ధర రూ.22 వేల వరకు పలకడంతో రైతుల ఆనందానికి అవధులు లేవు. మహాశివరాత్రి, సమ్మక్క, సారక్కల జాతర వంటి పండుగలకు కొబ్బరి పెద్ద ఎత్తున ఎగుమతులు కావడమేగాక మంచి ధర లభించడం రైతులకు ఊరటనిచ్చింది. యుద్ధం కారణంగా కొబ్బరి ఎగుమతులు తగ్గడంతో ధరలు కూడా పతనమయ్యాయి. గ తంలో రైతుల నుంచి వెయ్యి కాయలు రూ.18 వేలకు పైగా కొనుగోలు చేయగా ప్రస్తుతం రూ.13 వేలు మాత్రమే ఉంది. ప్రస్తుతం ఉగాది, శ్రీరామనవమి పండుగలతో ఆ మాత్రం ఎగుమతులు ఉన్నాయి. పండుగలు అయిపోతే ధరలు మరింత తగ్గే అవకాశముంది. – చివటపు నాగేశ్వరరావు, కొబ్బరికాయల వ్యాపారి -
అగ్గి రాజుకుంటే బుగ్గే
నడిరోడ్డుపై పడిగాపులు కాలం చెల్లిన బస్సులతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. ఆర్టీసీ బస్సులు ఎక్కడపడితే అక్కడ ఆగిపోవడంతో ఇక్కట్లు తప్పడం లేదు. 8లో uశనివారం శ్రీ 21 శ్రీ మార్చి శ్రీ 2026తణుకు అర్బన్: వేసవి ఎండలు తీవ్రమవుతుండటంతో అగ్నిప్రమాదాల భయం వెంటాడుతోంది. జిల్లాలో ఈ ఏడాదిలో 402 అగ్నిప్రమాదాలు జరగ్గా ఎన్నడూ లేనివిధంగా రూ.17.95 కోట్ల ఆస్తి నష్టం సంభవించడం ఆందోళన కలిగిస్తోంది. ఈ ఏడాదిలో ఎండలు తీవ్రంగా ఉంటాయనే అంచనాలతో ప్రజలు మరింత భయపడుతున్నారు. అధిక శాతం ప్రమాదాల్లో షార్ట్ సర్క్యూట్ కారణాలు ఉంటుండగా.. గ్యాస్ లీకేజీలు, గడ్డిమేట్లు, పొలాల్లోని గడ్డి దుబ్బులకు నిప్పు పెట్టడం, బహిరంగ ప్రదేశాల్లో మానవ తప్పిదాలతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. జిల్లాలో ఏడు అగ్నిమాపక కేంద్రాలు ఉన్నాయి. కొన్ని నియోజకవర్గాల్లో పట్టణం, గ్రామాల నిడివి ఎక్కువగా ఉండడం, అధిక ప్రాంతంగా విస్తరించడం వంటి కారణాలతో ఫైర్స్టేషన్లను పెంచడం లేదా కేంద్రానికి రెండో వాహనం మంజూరు చేయాలనే డిమాండ్ చాలా కాలంగా వినిపిస్తోంది. నిడివి ఎక్కువగా ఉన్న ప్రాంతానికి వాహనం చేరుకునే సమయానికే జరగాల్సిన నష్టం జరిగిపోతుందని బాధితులు వాపోతున్నారు. భయపెడుతున్న ప్రమాదాలు జిల్లాలో గతంలో లేనిమాదిరిగా ఈ ఏడాదిలో ఇప్పటివరకు 402 అగ్ని ప్రమాదాలకు సంబంధించి రూ. 17,95,45,500 మేర ఆస్తి నష్టం జరిగింది. అలాగే అగ్నిమాపక సిబ్బంది రూ.119,76,18,000 విలువ చేసే ఆస్తిని కాపాడగలిగారు. జిల్లావ్యాప్తంగా ఇప్పటికే అగ్నిమాపక శాఖ అధికారులు తమ పరిధిలోని పాఠశాలలు, కళాశాలలు, ఆస్పత్రులు, పరిశ్రమలకు వెళ్లి అగ్నిప్రమాదాలపై అవగాహన కలిగిస్తున్నారు. ప్రమాదాలు జరిగినప్పుడు ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ప్రమాదాల్లో చిక్కుకున్న వారిని ఎలా రక్షించాలనే విషయాలను వివరిస్తున్నారు. సమస్యల లోగిళ్లుగా.. అగ్నిమాపక కేంద్రాల్లో సిబ్బంది కొరత సమస్యాత్మకంగా ఉంది. సిబ్బంది పదోన్నతులు, ఉద్యోగ విరమణల తరువాత ఆయా పోస్టుల భర్తీలు లేకుండా పోయాయి. 2020 తర్వాత ఇప్పటివరకు అగ్నిమాపక శాఖలో పోస్టుల రిక్రూట్మెంట్లు లేని దుస్థితి. దీంతో విధుల్లో ఉన్న కొద్దిమంది సిబ్బందిపై విపరీతమైన పని ఒత్తిడి పడి ఇబ్బంది పడుతున్నారు. భీమవరం, నరసాపురం ఫైర్స్టేషన్లు శిధిలావస్థకు చేరడంతో ఈ రెండు ప్రాంతాల్లోనూ కొత్త భవనాల నిర్మాణాలు చేయాల్సి ఉంది. భయపెడుతున్న అగ్ని ప్రమాదాలు ఈ ఏడాది ఎండల తీవ్రత అధికమంటూ అంచనా ఆందోళనకరంగా భవన నిర్మాణాలు అగ్నిమాపక కేంద్రాలను వేధిస్తున్న సిబ్బంది కొరత వేట్లపాలెం ఘటనతో జిల్లా యంత్రాంగం అప్రమత్తం ప్రాంతం ఫోన్ నంబర్భీమవరం 08816–233299 పాలకొల్లు 08814–222299 తణుకు 08819–222101 తాడేపల్లిగూడెం 08818–221299 నరసాపురం 08814–275399 ఆకివీడు 08816–252099 అత్తిలి 08819–257977 వేట్లపాలెం ఘటనతో అప్రమత్తం తూర్పుగోదావరి జిల్లా వేట్లపాలెంలో బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు ఘటనలో 23 మంది మృత్యువాతపడటాన్ని అగ్నిమాపక విభాగం జీర్ణించుకోలేకపోయింది. ఈ ఘటనతో జిల్లా అగ్నిమాపక యంత్రాంగం వెంటనే బాణసంచా దుకాణాల తయారీ కేంద్రాలను పర్యవేక్షించి హెచ్చరించడంతోపాటు పరిశ్రమల యాజమాన్యాలకు కూడా ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలంటూ అవగాహన కల్పించింది. జిల్లాలో బహుళ అంతస్తుల భవనాలు, పెద్ద హాస్పిటల్స్ నిర్మాణాలు డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. 100 గజాల్లో కూడా ఐదు అంతస్తుల భవనాలు, ప్రహరీ నుంచి ప్రహరీకి ఆనుకుని నిర్మాణాలు జరిగిపోయి ప్రమాదాలకు నిలయాలుగా కనిపిస్తున్నాయి. ఏదైనా ప్రమాదం జరిగితే లోపలకు అగ్నిమాపక వాహనం కూడా వెళ్లలేని స్థితిలో భవనాల నిర్మాణాలు ఉంటున్నాయి. సిఫార్సులు, అధికారులను మేనేజ్ చేసుకుని జరుగుతున్న ఈ తరహా నిర్మాణాలు ప్రమాదాలకు సంకేతాలిస్తున్నాయి. -
● దేదీప్యం.. దివ్య తేజం
పెద్దింట్లమ్మ భక్తులకు పంగనామం సాక్షి టాస్క్ఫోర్స్: కొల్లేరు ఇలవేల్పు పెద్దింట్లమ్మవారి పేరుతో భక్తులను నిలువు దోపిడీకి కొందరు సిద్ధమయ్యారు. అక్రమ వాహన పార్కింగ్ పాట నిర్వహించి అవినీతికి అడ్డే లేదని నిరూపిస్తున్నారు. వాహన పార్కింగ్ వసూలుతో ఇటు దేవస్థానం, అటు పంచాయతీ చెడ్డ పేరు వస్తుందని మొత్తుకుంటున్నా ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. 11 నెలల కాలానికి రూ.7 లక్షల 7 వేలకు ధనరాజ్ అనే వ్యక్తి పార్కింగ్ పాటను శుక్రవారం దక్కించుకున్నాడు. దేవస్థానం అధికారులు స్థానిక రాజకీయం ముందు ఏమీ మాట్లాడలేక తమకేమీ సంబంధం లేదని చేతులు దులుపుకుంటున్నారు. అడ్డగోలు దోపిడీ అమ్మవారి జాతర సమయంలో నెల రోజులు దేవస్థానం వద్ద పార్కింగ్ పాట పందిరిపల్లిగూడెం పంచాయతీ నిర్వహిస్తుంది. ఈ ఏడాది రూ.2.60 లక్షలకు పాట వెళ్లింది. ఈ నిధులు పంచాయతీకి చెల్లించారు. గురువారంతో పంచాయతీ పాట ముగిసింది. జాతర సమయంలో కారుకు రూ.70, ఆటోకి రూ.50, ద్విచక్రవాహనానికి రూ.20 వసూలు చేశారు. మళ్లీ ఈ పాట ఏడాదిలో జాతర సమయంలో మాత్రమే జరుగుతోంది. అయితే 11 నెలలకు అక్రమ పార్కింగ్ పాటను ప్రైవేట్ వ్యక్తులు దే వస్థానం వద్దే నిర్వహించడం బరి తెగింపునకు నిదర్శనంగా మారింది. తండ్రీ కొడుకుల ముందు తలవంచాల్సిందే ! దేవస్థానం మొత్తం అక్కడ తిష్టవేసుకున్న తండ్రీకొడుకుల ముందు తలవంచాల్సిన పరిస్థితి దాపురించింది. ఎన్ని తప్పులు చేసిన వెనకేసుకొచ్చే రాజకీయ నాయకుల అండతో వీరు రెచ్చిపోతున్నారు. అప్పుడప్పుడూ రాజకీయ నేతలను తీసుకొచ్చి సన్మానాలు చేయడంతో వీరు ఎంత బరి తెగించినా అధికారులు సైతం నోరు మెదపడం లేదు. అలాగే ఆలయంలో పెత్తనం సైతం వీరి చేతుల్లో ఉంటోంది. ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ తమ మాట కాదనరని ప్రచారం చేయడం, నిత్యం ఆయన పక్కనే నీడలో ఉండటంతో కొల్లేరు పెద్దలు సైతం వీరు ముందు మాట్లాడడానికి జంకుతున్నారు. అక్రమ పార్కింగ్ పాటను నిర్వహించిన ఘనులు పాట నిధులతో దేవస్థానం గదులకు మరుగుదొడ్లు కట్టిస్తామని నమ్మబలుకుతున్నారు. రూ.లక్షల్లో దాతలు విరాళాలు ఇస్తున్నప్పుడు పార్కింగ్ పాట ఎందుకని పలువురు ప్రశ్నిస్తున్నారు. చట్టప్రకారం భక్తుల నుంచి పార్కింగ్ వసూలు చేయాలంటే దానికి టెండర్లు, రేట్లు నిర్ణయం ఇలా నిబంధనలు ఉంటాయి. ఇప్పటికే జాతర సమయంలో అధిక రేట్లు వసూలు చేస్తున్నారంటూ భక్తులు తిరగబడుతున్నారు. ఈ నేపథ్యంలో అక్రమ పార్కింగ్ విషయంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసే సాహసం ఎవరూ చేయడం లేదు. పందిరిపల్లిగూడెం పంచాయతీ కార్యదర్శి ప్రసాద్ తమకు చెప్పకుండా పాట నిర్వహించారని వివరణ ఇచ్చారు. నిబంధనలకు విరుద్ధంగా వాహన పార్కింగ్ పాట 11 నెలలకు రూ.7.07 లక్షలకు పాడుకున్న వైనం సంబంధం లేదంటున్న ఈఓ, పంచాయతీ కార్యదర్శి భక్తుల నుంచి అడ్డగోలు దోపిడీకి శ్రీకారం -
ధర పాలసీపై ప్రభుత్వం వెంటనే స్పందించాలి
ద్వారకాతిరుమల: కోకో గింజలకు ధర పాలసీపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని, రైతుల వద్ద ఉన్న కోకో గింజల కొనుగోలుకు చర్యలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.శ్రీనివాస్ డిమాండ్ చేశారు. మండలంలోని పంగిడిగూడెంలో కోకో తోటలను ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం నాయకులు గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా కోకో గింజల కొనుగోలు సమస్యలపై రైతులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ కోకో గింజలకు రాష్ట్ర ప్రభుత్వమే ధర ఫార్ములా ప్రకటించి ధర నిర్ణయించాలని డిమాండ్ చేశారు. అంతర్జాతీయ మార్కెట్ ధర తగ్గిందనే పేరుతో కోకో గింజలకు కంపెనీలు ధర తగ్గించేయడం దారుణమన్నారు. గత సంవత్సరం అంతర్జాతీయ మార్కెట్ ధర కిలో కోకో గింజలకు రూ. 900 లు ఉన్నప్పుడు, ఆ ధరను కంపెనీలు రైతులకు చెల్లించలేదని గుర్తు చేశారు. ప్రస్తుతం కిలో కోకో గింజలకు రూ. 300 లు కంపెనీలు ధర ప్రకటించినా, రైతుల నుంచి గింజలు కొనుగోలు చేయడం లేదన్నారు. ఈ ధరను మరింత తగ్గించి, మోసం చేసే విధంగా కంపెనీలు సిండికేట్గా మారి రైతులకు నష్టాన్ని కలిగిస్తున్నాయని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ధరల పాలసీపై మౌనంగా ఉండడం వల్ల కంపెనీలు రైతులను మరింతగా దోపిడీ చేస్తున్నాయని ధ్వజమెత్తారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కట్టా భాస్కరరావు, కోకో రైతుల సంఘం నాయకులు రుద్రరాజు సుబ్బరాజు, కనుమూరి బాపిరాజు, వీరవల్లి పండు, వీరవల్లి శివ నాగరాజు, వీరవల్లి మోహన్రావు తదితరులు పాల్గొన్నారు. -
ఉత్సాహంగా బాక్సింగ్ పోటీలు
భీమవరం : పట్టణంలోని ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో అండర్– 23 మెన్ అండ్ ఉమెన్ జాతీయ స్థాయి బాక్సింగ్ చాంపియన్షిప్ పోటీలు గురువారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్బంగా ఏపీ ఆమెచూర్ బాక్సింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు సాగి రామకృష్ణ నిషాంత్వర్మ మాట్లాడుతూ దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన 240 మంది క్రీడాకారులు పోటీల్లో పాల్గొంటున్నారన్నారు. సాగి రామకృష్ణంరాజు పేరిట నిర్వహిస్తున్న పోటీలు ఈ నెల 22 వరకూ ఉంటాయన్నారు. విజేతలు వీరే.. ఈ పోటీలలో 54 కేజీల కేటగిరిలో లడక్కు చెందిన శుభకర్మన్సింగ్, మిజోరామ్కు చెందిన అభిషేక్, 57 కేజీల విభాగంలో మణిపూర్కు చెందిన అర్మాన్, 48 కేజీల విభాగంలో హర్యానాకు చెందిన లక్షయ్, మధ్యప్రదేశ్కు చెందిన షేక్ హర్షద్, పంజాబ్కు చెందిన నిర్మల్, తెలంగాణకు చెందిన చౌహాన్, తమిళనాడుకు చెందిన ఉజ్వల్, ఢిల్లీకి చెందిన దేవేంద్ర సోలంకి, ఆంధ్రప్రదేశ్ నుంచి కె.శైన్కుమార్, చండీగర్ నుంచి తరుణ్ క్వాలిఫైయింగ్ రౌండ్స్లో విజయం సాఽధించారు. 51 కేజీల విభాగంలో ఢిల్లీకి చెందిన అశు, తెలంగాణకు చెందిన ఆయుష్, 54 కేజీల విభాగంలో పంజాబ్కు చెందిన సురేంద్ర పాల్సింగ్ విజయం సాధించారు. కార్యక్రమంలో అసోసియేషన్ కార్యదర్శి కె బంగార్రాజు, రింగ్ అఫీషియల్ చైర్మన్ రాకేష్ భరద్వాజ్, ఇండియన్ అమ్మేచూర్ బాక్సింగ్ ఫెడరేషన్ సెక్రటరీ జనరల్ రాకేష్ తక్కరన్, ఐబీఏ అబ్జర్వర్ సింగ్ రాజ్ కున్వర్ సింగ్, బాక్సింగ్ అసోసియేషన్ జాతీయ వైస్ ప్రెసిడెంట్ సంజీబ హనదీప్, ఐఏబిఎఫ్ వైస్ ప్రెసిడెంట్ మదన్ కోటి కౌటిల్, కళాశాల ప్రిన్సిపాల్ కేవీ మురళీకృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు. -
‘క్వారీ నిర్వాహకులు బెదిరిస్తున్నారు’
ఆగిరిపల్లి: మండలంలోని కనసానపల్లి లో గ్రావెల్ తవ్వకాలకు ప్రభుత్వం వద్ద నుంచి అనుమతులు తీసుకుని అనుమతికి మించి అధిక లోతు తవ్వేరని జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసినందుకు గ్రావెల్ క్వారీ నిర్వాహకులు తనను బెదిరిస్తున్నారని గ్రామానికి చెందిన ఆలూరు రామ్మోహన్ రావు అనే వ్యక్తి పోలీసులను ఆశ్రయించాడు. ఈ సందర్భంగా ఫిర్యాదుదారుడు రామ్మోహన్రావు గురువారం విలేకరులతో మాట్లాడుతూ కనసానపల్లి గ్రామంలో ఓ సంస్థ కు చెందినవారు సర్వేనెంబర్ 1606, 1608లో మూడు నెలల క్రితం రెండు ఎకరాలలో గ్రావెల్ తవ్వుకునేందుకు మైనింగ్ శాఖ అధికారుల నుంచి అనుమతులు తీసుకుని అనుమతులు కు మించి సుమారు 40అడుగుల లోతు తవ్వేయడంతో రామ్మోహన్రావు ఈ నెల 2న పీజీఆర్ఎస్లో జిల్లా కలెక్టర్కు, మైనింగ్ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదు మేరకు మైనింగ్ శాఖ అధికారులు వచ్చి తూతూ మంత్రంగా కొలతలు తీసుకుని వెళ్లిపోయారని ఆరోపించాడు. అయినా సరే గ్రావెల్ తవ్వకాలు ఆపకపోవడంతో గురువారం గ్రావెల్ తవ్వకాలు జరిగే ప్రదేశానికి వెళ్లి మీరు అనుమతులు లేకుండా అంత లోతు ఎందుకు తవ్వారని వారిని ప్రశ్నించగా, సిబ్బంది గ్రావెల్ నిర్వాహకులైన అబ్బాయికి ఫోన్ చేయగా నువ్వు రూ.10 లక్షలు డిమాండ్ చేస్తున్నావని పోలీసులకు, మంత్రికి ఫిర్యాదు చేసి జైల్లో పెట్టిస్తానని బెదిరించాడని రామ్మోహన్ రావు వాపోయాడు. గ్రావెల్ నిర్వాహకులు నుంచి తనకు రక్షణ కల్పించాలని ఫిర్యాదులో పేర్కొన్నాడు. -
మహిళల హక్కులు హరిస్తున్న పాలకులు
ఏలూరు (టూటౌన్): కేంద్రం, రాష్ట్రంలో పాలకులు మహిళల హక్కులను హరించి వేస్తున్నారని విశ్రాంత జడ్జి అడబాల లక్ష్మి పేర్కొన్నారు. గురువారం స్థానిక స్ఫూర్తి భవనంలో ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య (ఎన్ఎఫ్ఐడబ్ల్యూ) ఏలూరు జిల్లా సమితి ఆధ్వర్యంలో ఒక్కరు వద్దు–ముగ్గురు ముద్దు అనే పథకంపై రౌండ్ టేబుల్ సమావేశం ఎన్ఎఫ్ఐడబ్ల్యూ ఏలూరు జిల్లా ప్రధాన కార్యదర్శి మన్నవ యామిని అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మీ మాట్లాడుతూ పాలకులు మారినా విధానాలు మారలేదని, వ్యవస్థలను, చట్టాలను నిర్వీర్యం చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వం తన బాధ్యతల నుంచి తప్పుకునే ప్రయత్నంలో భాగంగా ఈ పథకాన్ని మహిళలపై బలవంతంగా రుద్దుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐద్వా జిల్లా కార్యదర్శి ఎ.రాణి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం మహిళలను పిల్లలు కనే యంత్రాలుగా మారుస్తుందని విమర్శించారు. సీ్త్ర విముక్తి రాష్ట్ర కమిటీ సభ్యులు కె.రమాదేవి సీపీఐ ఏలూరు జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
పంటల పాలిట శత్రువు.. వయ్యారిభామ
యలమంచిలి: రైతులు తెగుళ్ల కంటే అధికంగా భయపడేది వయ్యారిభామ (పార్థీనియం) కలుపు మొక్కకే. ఎక్కడైనా పెరగడం ఈ మొక్క లక్షణం. ఈ కలుపు మొక్క ప్రధాన పంటకు నష్టం కలిగిస్తుంది. మొలచిన నెల రోజుల్లోనే పూతకు వస్తుంది. ఒక్కో మొక్క 50 వేల విత్తనాలను ఉత్పత్తి చేయడంతో పాటు గాలి పాటుకు దూర ప్రాంతాలకు సైతం తేలికగా విస్తరిస్తుంది. ఈ కలుపు మొక్క గురించి మండల వ్యవసాయాధికారి దుంగా బాల త్రిపుర సుందరి తెలిపిన వివరాలు.. జీవరాశికి ప్రమాదమే.. వయ్యారిభామ వల్ల పంటలకే కాదు మనుషులు, పశువులకూ ముప్పే. మనుషులకు జ్వరం, ఉబ్బసం వంటి వ్యాధులతో పాటు చర్మ సంబంధిత అలర్జీ వస్తుంది. జలుబు, కళ్లు ఎరబ్రడడం, కనురెప్పల వాపు తదితర సమస్యలు వస్తాయి. ఈ మొక్కలను తింటే పశువులు అయితే హైపర్ టెన్షన్కు గురవుతాయి. ఇక పంటలకు నీరు, పోషకాలు అందకుండా వాటి కన్నా ముందుగా ఇవే శోషించుకుంటాయి. తద్వారా దిగుబడులు 40 శాతం వరకు తగ్గుతాయి. వంగ, మిరప, టమాట, మొక్కజొన్న పైర్లు పూత దశలో ఉన్నప్పుడు వాటిపై వయ్యారి భామ పుప్పొడి పడితే ఉత్పత్తి తగ్గుతుంది. పైర్లకు మొవ్వ, కాండం కుళ్లు తెగుళ్లు సోకే ప్రమాదముంది. ఈ మొక్కలు పశుగ్రాస పంటలకు కూడా నష్టం కలిగిస్తాయి. ఈ మొక్క ల్ని నిర్మూలించాలంటే రైతులు తప్పనిసరిగా సమగ్ర యాజమాన్య, సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. తొలగించడం ఇలా వయ్యారిభామ మొక్కలు తక్కువ సంఖ్యలో ఉంటే చేతితో పీకేయాలి. మొక్కలు పూతదశకు రాక ముందే పీకి తగలబెట్టాలి. లేకపోతే వాటి వ్యాప్తిని నివారించడం కష్టం. ఒకవేళ పూత దశకు చేరుకున్న తర్వాత మొక్కలను పీకినట్లయితే వాటిని వెంటనే కుప్పగా వేసి తగలబెట్టాలి. అలాగే మొక్కజొన్న, జొన్న, చిరుధాన్యాల పంటల్లో విత్తనాలు మొలక రాకముందు లీటరు నీటికి 4 గ్రాముల చొప్పున అట్రాజిన్ కలిపి పిచికారీ చేస్తే వయ్యారిభామ మొక్కల బెడద ఉండదు. విత్తనాలు మొలకెత్తిన 15–20 రోజులకు లీటరు నీటికి 2 ఎంఎల్ పేరాక్వాట్ మందును కలిపి పిచికారీ చేసుకోవచ్చు. పశుగ్రాసం వేసేవారు పైరు వేయకముందే లీటరు నీటికి 5 గ్రాముల చొప్పున అట్రాజిన్ కలిపి పిచికారీ చేయాలి. దుంగా బాల త్రిపుర సుందరి, యలమంచిలి మండల వ్యవసాయాధికారి -
హోరాహోరీగా టెన్నిస్ సెమీఫైనల్స్
టెన్నిస్ ఆడుతున్న క్రీడాకారులు భీమవరం : స్థానిక కాస్మోపాలిటన్ క్లబ్ ఆవరణలో ఆల్ ఇండియా సీనియర్ ర్యాంకింగ్ టెన్నిస్ ఛాంపియన్షిప్ పోటీల సెమీఫైనల్స్ హోరాహోరీగా సాగుతున్నాయి. గురువారం నిర్వహించిన పోటీల్లో పలువురు విజేతలుగా నిలిచారు. సింగిల్స్ విభాగంలో.. 70+ ఫైనల్స్లో కె.రాధాకృష్ణమూర్తిపై 6–4, 6–4 పాయింట్లతో ఎస్.సేతు విజేతగా నిలిచారు. 65+ విభాగంలో ఎస్.ఆనంద్ స్వరూప్పై వి.శ్రీనివాసరెడ్డి 6–3, 6–4 పాయింట్లతో విజయం సాధించారు. 55+ విభాగం సెమీఫైనల్స్లో సీహెచ్ శివపై 6–1, 6–0 పాయింట్ల తేడాతో కేవీఎన్ మూర్తి, బాబు రాజాపై 6–4, 6–3 పాయింట్ల తేడాతో డి.సుధాకర్రెడ్డి గెలుపొందారు. 45+ సెమీఫైనల్స్పై కె.సంపత్ కుమార్పై ఎంవీఎల్ఎన్ రాజు 6–3, 7–5 తేడాతో గెలుపొందారు. 35+ సెమీఫైనల్స్లో కె.అమిత్రెడ్డిపై 6–1, 6–2 తేడాతో ఈశ్వర్ సాయి, కొప్పుల సతీష్పై 6–1, 6–1 తేడాతో ఎన్.డి. విజయ్ ఆనంద్ విజయం సాధించారు. డబుల్స్ విభాగంలో 70+ విభాగంలో ఎం.సాయిరామ్బాబు, ఎస్.ఎ రాజాక్పై ఎ.రాంబాబు, ఎస్.సేతు 6–4, 7–5 విజయం సాధించారు. డీఎస్ఎన్ రాజు, టి.సుందర్ వడి వేలుపై ఎన్.అశోక్ రెడ్డి, కె.సీతా రామరాజు 6–3, 6–3 పాయింట్లతో విజయం సాధించారు. 65+ విభాగంలో జి.చంద్రశేఖర్, కె.కోటయ్యగౌడ్పై వి.శ్రీనివాసరెడ్డి, ఎస్.మన్మథరావు 6–2, 6–2 తేడాతో, పి.చంద్ర, సలీంపై ఎస్.ఆనంద్ స్వరూప్, టి.శ్రీనివాస్ 6–2, 6–2 పాయింట్ల తేడాతో గెలుపొందారు. 55+ విభాగంలో ఎ.వెంకటేశ్వర్లు, శంకర్రెడ్డిపై కె.వి.ఎన్ మూర్తి, హేమంత్ కుమార్ 6–1, 6–0 తేడాతో విజయం సాధించారు. -
రాష్ట్రస్థాయి చెస్ పోటీలకు క్రీడాకారుల ఎంపిక
భీమవరం : రాష్ట్రస్థాయి పోటీలకు చెస్ పోటీల కోసం క్రీడాకారుల ఎంపిక కార్యక్రమం గురువారం పట్టణంలో నిర్వహింరు. స్థానిక అనసూయ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో జిల్లా అండర్–19 ఓపెన్ ర్యాపిడ్ చెస్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో నాళం వరుణ్శ్రీతేజ(కాళ్ల), ఇ.వివేక్(తణుకు), అన్నెపు శాశాంక్(తాడేపల్లిగూడెం), పి.శ్రీశయసాకేత్(పాలకొల్లు), కంతేటి జీషిత్వర్మ(భీమవరం) ఎంపికయ్యారని చెస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు మాదాసు కిషోర్ చెప్పారు. విజేతలు ఈనెల 22 నిర్వహించే రాష్ట్రస్ధాయి అండర్–19 ఓపెన్ ర్యాపిడ్ చెస్ పోటీల్లో పాల్గొంటారని కిషోర్ తెలిపారు. నరసాపురం రూరల్ : మొగల్తూరు మండలం కేపీపాలెం సౌత్ పంచాయతీ పరిధిలోని కొండేటి వారి మెరకలో కొండేటి చినబాబుకు చెందిన మేకల మందపై వీధి కుక్కల గుంపు దాడి చేసింది. దీంతో 23 మేకలు మృత్యువాత పడ్డాయని, సుమారు రూ.3 లక్షలు నష్టం వాటిల్లిందని వాపోయాడు. ప్రభుత్వం తనను ఆదుకోవాలని చినబాబు కోరారు. జంగారెడ్డిగూడెం : బాలిక అదృశ్యంపై తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఎన్వీ ప్రసాద్ తెలిపారు. వివరాల ప్రకారం వేలేరుపాడు మండలానికి చెందిన 17 ఏళ్ల బాలిక జంగారెడ్డిగూడెం మండలంలో అమ్మమ్మ వద్ద ఉంటూ ఇంటర్ చదువుతోంది. ఈ నెల 10న పరీక్ష రాసేందుకు వెళ్లిన బాలిక తిరిగి ఇంటికి రాలేదు. బాలిక అమ్మమ్మ సాయంత్రం వరకు చూసి, బాలిక తల్లికి విషయాన్ని తెలియజేసింది. దీంతో బాలిక తల్లి పరిసర ప్రాంతాలు వెతికినా బాలిక ఆచూకీ లభించలేదు. దీంతో బాలిక తల్లి పోలీసులను ఆశ్రయించింది. పెనుగొండ: పెనుగొండ జయా నర్సింగ్ హోం పక్కన పిల్ల కాలువ గట్టున తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ జరిగినట్లు సత్తి నాగదేవి ఫిర్యాదు చేసినట్లు ఎస్సై కె.గంగాధర్ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం ఈ నెల 16న నాగదేవి తాడేపల్లిగూడెంలోని పుట్టింటికి వెళ్లారు. 18న మధ్యాహ్న సమయంలో పక్కింటి వారు ఇంటి తలుపులు తెరిచి ఉన్నట్లు నాగదేవి సమాచారం అందించారు. దీంతో ఆమె వచ్చి చూడగా బీరువాలో ఉన్న సుమారు 9 కాసుల బంగారం, వెండి వస్తువులు చోరీకి గురైనట్లు గుర్తించి పోలీసులను ఆశ్రయించింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు తెలిపారు. పెంటపాడు : వాతావరణ మార్పులకు అనుగుణంగా వరి కోతలను సరళం చేసేందుకు నూతన టెక్నాలజీతో సరసమైన ధరల్లో కోత మెషీన్లు అందిస్తున్నట్టు అద్విత ఆగ్రోస్ కంపెనీ ప్రతినిధి ఎన్.సాయి తెలిపారు. గురువారం ఉగాదిని పురస్కరించుకుని ప్రత్తిపాడులో జాతీయ రహదారిని ఆనుకుని వరికోత మెషీన్ల కంపెనీని ఆయన ప్రారంభించారు. నాణ్యమైన మెషీన్లు అందిస్తామని, తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తొలిరోజు 20 మెషీన్లను పలు ప్రాంతాలకు చెందిన రైతులకు విక్రయించారు. మెషీన్లు కొనేవారికి బ్యాంకులు రుణాలు ఇస్తాయన్నారు. మెషీన్ల వినియోగంపై తాము అవగాహన కల్పిస్తామన్నారు. స్పేర్ పార్టులు కూడా తమ వద్ద లభ్యమవుతాయన్నారు. చైనా దేశ ప్రతినిధులతో పాటు ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, బీజేపీ నాయకులు ఈతకోట తాతాజీ, తనుబుద్ది భోగేశ్వరరావు, రైసుమిల్లర్ కొలనువాడ పెదకృష్ణంరాజు, టీడీపీ నేత వలవల బాబ్జి పాల్గొన్నారు. -
సడి లేని గిజిగాడు
● గ్రామాల్లో కనుమరుగవుతున్న పిచ్చుకలు ● చిన్న పొట్టకు తిండి, గూడు కరువు ● నేడు పిచ్చుకల సంరక్షణ దినోత్సవం ద్వారకాతిరుమల : కిచ్ కిచ్..కిచ్ కిచ్ అనే శబ్దాలతో ఒకప్పుడు పల్లెలు, పట్టణాల్లో సందడి చేసే పిచ్చుకలు నేడు కనుమరుగయ్యాయి. చిన్నతనంలో పాఠ్యపుస్తకాల్లో గిజిగాడు పాఠ్యాంశం అందరికీ గుర్తు ఉండే ఉంటుంది. అలాంటి గిజిగాడికి ప్రస్తుత కాంక్రీట్ కీకారణ్యంలో గూడు కరువైంది. పట్టణాల్లో పచ్చదనం కరువై, నీడ కరువవడంతో పాటు, సెల్ టవర్ల రేడియేషన్ కూడా పిచ్చుకలు అంతరించిపోవడానికి కారణంగా చెబుతున్నారు. జీవ వైవిధ్యం కాపాడుకునే దిశలో పర్యావరణ ప్రేమికులు పిచ్చుకల సంరక్షణకు కృషి చేస్తున్నారు. ఒకప్పుడు మనిషికి పిచ్చుక కూడా నేస్తమే. పిచ్చుకతో మనిషికి ఉన్న సంబంధం కొన్ని శతాబ్దాల కాలం నాటిది. మానవుడు వ్యవసాయం ప్రారంభించిన తొలి రోజుల్లో తమకు ఉపకరించే వశు పక్ష్యాదులపై శ్రద్ధ వహించేవారు. ప్రధానంగా మన ఇంటి పిచ్చుకగా పిలిచే ఈ పక్షి తాటాకు ఇళ్ల చూరుల్లో గూళ్ళు పెట్టుకొని తమ సంతతిని వృద్ధి చేసుకునేవి. అదే సమయంలో వ్యవసాయం మీద ఆధారపడి జీవించే వారంతా తమ ఇళ్ల చూరుకు ధాన్యం కుంకుల గుత్తులు వేలాడదీసేవారు. దీంతో పిచ్చుకలు ఆహారం తీసుకొని ఆ ఇంటి చుట్టుపక్కల కిచుకిచుమంటూ తిరుగుతుండేవి. పిచ్చుకలు పంటలను ఆశించే క్రిమికీటకాలను తినడంలో ప్రముఖపాత్ర పోషిస్తాయి. నేడు పొలాల్లో చల్లే రసాయన క్రిమిసంహారక మందులు పిచ్చుకలకు తిండిని దూరం చేశాయి. సెల్ టవర్లే ప్రధాన కారణం ఆధునికీకరణలో భాగంగా పచ్చని రావి, మర్రి చెట్లను ఎక్కడికక్కడ నిర్ధాక్షణ్యంగా తొలగించేశారు. పోనీ మానవుడు నిర్మిస్తున్న పెద్దపెద్ద భవనాల్లో కాస్తంత చోటు కూడా పక్షులకు లేకుండా పోయింది. వాటి గూడుకు కనీసం చెట్లు కూడా లేవు. చిన్ని పొట్టకు ఇంత తిండి కూడా దొరకని పరిస్థితి ఉంది. వాస్తవానికి పిచ్చుకల్లో అనేక జాతులు ఉండేవి. పిచ్చుక జాతి అంతరించి పోవడానికి రేడియోధార్మికత విడుదల చేసే సెల్ఫోన్ టవర్లే ప్రధాన కారణంగా పర్యావరణవేత్తలు చెబుతున్నారు. దీని వల్ల పిచ్చుకలలో సంతానోత్పత్తి సామర్థ్యం దెబ్బతింటుంది. పిచ్చుకలు సాధారణంగా చెట్లు, పూరిపాకల పైకప్పు కింద గూళ్లు ఏర్పాటు చేసుకుంటాయి. ఇవి కనుమరుగు అయిపోవడంతో వీటికి ఆవాసం కరువైంది. ప్రముఖ పుణ్య క్షేత్రమైన ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయంలోను, అలాగే క్షేత్ర దేవత కుంకుళ్లమ్మ ఆలయంలో పిచ్చుకలకు ఆహారం అందించేందుకు వరి కుచ్చులను ఏర్పాటు చేశారు. కొందరు భక్తులు, రైతులు వీటిని స్వచ్ఛందంగా తీసుకొచ్చి చెట్లకు ఏర్పాటు చేస్తున్నారు. పిచ్చుకలు వచ్చి వీటిని తింటున్నాయి. అలాగే దేవస్థానం సిబ్బంది వాటికి మంచినీటిని అందిస్తున్నారు. పిచ్చుకల సంరక్షణకు దేవాలయాలు పెద్దపీట వేస్తున్నాయి. కొన్ని పక్షి జాతులు అంతరించిపోతే జీవ వైవిధ్యం సమతుల్యం దెబ్బతినే ప్రమాదం ఉంది. మానవుడి ఆధునిక జీవన శైలి వల్ల, సౌండ్, ఎయిర్ పొల్యూషన్, సెల్ టవర్స్ వల్ల పిచ్చుకలు కనుమరుగైపోయాయి. మానవ మనుగడకు పిచ్చుకల సంతతిని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకే మా ఇంటి వద్ద పిచ్చుక గూళ్లు, ధాన్యం కుచ్చులను ఏర్పాటు చేశాను. – పాకలపాటి త్యాగ భీమేశ్వరరావు, మాజీ సర్పంచ్, రామన్నగూడెం -
ఆ జిల్లాల్లో రానున్న మూడు రోజులు భారీ వర్షాలు..
సాక్షి, అమరావతి: ఏపీలో రానున్న మూడు రోజుల్లో కోనసీమ, పశ్చిమగోదావరి, ఎన్టీఆర్, కృష్ణా, బాపట్ల జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. అల్లూరి, కాకినాడ, ఏలూరు, గుంటూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. చెట్ల క్రింద నిలబడరాదని విపత్తుల నిర్వహణ సంస్థ ప్రఖర్ జైన్ తెలిపారు.కాగా కుండపోత వర్షంతో పిడుగుపాటుకు గురై రాష్ట్రవ్యాప్తంగా నిన్న(బుధవారం) నలుగురు మరణించారు. గుంటూరు జిల్లా తుళ్లూరులో పిడుగు పడి శ్రీనివాసరావు అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. చేబ్రోలు మండలం కొత్త రెడ్డిపాలెం గ్రామంలో పిడుగుపాటుకు పొలంలో పనిచేస్తున్న ఇరువురికి గాయాలయ్యాయి. ప్రకాశం జిల్లా కురిచేడు మండలం వీరపాలెంలో మిర్చి కోతలకు పొలానికి వెళ్లిన కాటూరి సుబ్బరత్నమ్మ పిడుగుపాటుకు గురై అక్కడికక్కడే మృతి చెందింది. బాపట్ల జిల్లాలో పిడుగుపాటుతో పెరవలి వనజ మృతి చెందింది. వైఎస్సార్ కడప జిల్లా చిన్నాయపల్లెకి చెందిన గుర్రాల నారాయణ రెడ్డి(55) పిడుగుపాటుకు గురై మృతి చెందాడు.బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో పలు జిల్లాల్లో బుధవారం గాలివాన బీభత్సం సృష్టించింది. ఈదురు గాలులతో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. గాలివాన ధాటికి పంటలు నేల వాలాయి. కల్లాల్లో ఆరబెట్టిన మిర్చి, మొక్కజొన్న తడిచి ముద్దయ్యాయి. ఎన్టీఆర్ జిల్లాలోని నందిగామ, జగ్గయ్యపేట, తిరువూరు, మైలవరం నియోజకవర్గాల్లో పంట నష్టం అధికంగా ఉంది. -
బాధిత కుటుంబాలకు చెక్కుల పంపిణీ
భీమవరం (ప్రకాశంచౌక్) : మస్కట్, ఒమన్ దేశంలో ఉపాధి నిమిత్తం వెళ్లి దురదృష్టవశాత్తు మరణించిన భారతీయుల కుటుంబాలకు మంజూరైన బీమా క్లెయిమ్, పరిహారానికి సంబంధించి ఇండియన్ ఎంబసీ ద్వారా అందిన చెక్కులను బుధవారం భీమవరం కలెక్టరేట్ చాంబర్లో కలెక్టర్ చదలవాడ నాగరాణి చేతుల మీదుగా బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. పెనుమంట్ర మండలం జుత్తిగకు చెందిన తాడి సూర్యనారాయణ రెడ్డి 2024 నవంబర్ 30న చనిపోగా వీరికి సంబంధించి కై ్లయిమ్ రూ.11,98,154 చెక్కును, భీమవరం మండలం సరిగుట్లపాడు గ్రామానికి చెందిన తిరుమాణి కృష్ణ 2023 అక్టోబర్ 28న చనిపోగా వారికి సంబంధించిన రూ.17,25,978 చెక్కును అందజేశారు. భీమవరం : జిల్లా వ్యాప్తంగా బుధవారం 132 పరీక్షా కేంద్రాల్లో నిర్వహించిన టెన్త్ పబ్లిక్ పరీక్షకు 98.46 శాతం విద్యార్థులు హాజరయ్యారని జిల్లా విద్యాశాఖాధికారి ఇ.నారాయణ తెలిపారు. హిందీ పరీక్షకు 22,858 మంది హాజరుకావాల్సివుండగా 353 మంది గైర్హాజరయ్యారన్నారు. ఎస్ఎస్సీ(ఏపీఓఎస్ఎస్) పబ్లిక్ పరీక్షకు 253 మందికి 215 మంది విద్యార్దులు హాజరయ్యారని 64 పరీక్షా కేంద్రాల్లో తనిఖీ నిర్వహించగా ఎక్కడా మాల్ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని నారాయణ తెలిపారు. భీమవరం: భీమవరం టీడీపీలో ఆధిపత్యపోరు మరోసారి బయటపడింది. భీమవరం కొత్త బస్టాండ్ ఆవరణలో బుధవారం జరిగిన దివ్యాంగ శక్తి ప్రారంభ సభ ఇందుకు వేదికగా మారింది. ఈ కార్యక్రమంలో వేదికపైకి ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులును పిలిచిన తర్వాత టీడీపీ రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథిని వేదికపైకి పిలిచారు. అనంతరం మాజీ ఎంపీ, భీమవరం నియోజకవర్గ ఇన్చార్జి తోట సీతారామలక్ష్మిని పిలవడం గొడవకు కారణమైంది. అధికారులకు ప్రొటోకాల్ తెలియదా అంటూ మండిపడి వేదికపైకి వెళ్లడానికి ఆమె నిరాకరించారు. దీంతో టీడీపీ నాయకులంతా ఆమె చుట్టూ చేరడం, రగడను కవర్ చేస్తున్న విలేకరులను పోలీసులు పక్కకు తోయడం గందరగోళంగా మారింది. జిల్లా అధికారులు సీతారామలక్ష్మికి నచ్చచెప్పి పొరపాటు జరిగిందంటూ వేడుకున్నా ఆమె ససేమిరా అనడంతో కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. చివరకు కలెక్టర్ సీహెచ్ నాగరాణి కలగజేసుకుని సీతారామలక్ష్మిని వేదికపైకి పిలవడమేగాక చేయిపట్టుకుని వేదిక ఎక్కించారు. టీడీపీలో ఇప్పటికే కొనసాగుతున్న ఆధిపత్యపోరు ఈ సంఘటనతో మరోసారి బయటపడింది. జిల్లాలో 220 బస్సుల్లో.. భీమవరం (ప్రకాశంచౌక్): జిల్లాలోని 220 బస్సు సర్వీసుల్లో దివ్యాంగ శక్తి పథకం అమలు చేస్తామని కలెక్టర్ సీహెచ్ నాగరాణి తెలిపారు. పల్లెవెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ సర్వీసుల్లో ఈ పథకాన్ని అందిస్తామని, దివ్యాంగులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఏలూరు (ఆర్ఆర్పేట): ఒంటిపూట బడులను పక్కాగా నిర్వహించాలని డీఈవో ఎం. వెంకట లక్ష్మమ్మ ఆదేశించారు. ఈ నెల 16వ తేదీ నుంచి 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు జరుగుతున్న నేపధ్యంలో పరీక్షా కేంద్రం లేని చోట ఉదయం 7.45 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకూ ఒంటిపూట బడులు నిర్వహించాలన్నారు. పరీక్షా కేంద్రం ఉన్న పాఠశాలలో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకూ నిర్వహించాలని సూచించారు. -
వైఎస్సార్సీపీ బలోపేతం దిశగా..
అన్ని స్థాయిల్లో 80 శాతం కమిటీల ఏర్పాటు పూర్తి నరసాపురం: వైఎస్సార్సీపీని సంస్థాగతంగా బలోపేతం చేసే కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా జరుగుతోందని పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి.విజయభ్కారరెడ్డి చెప్పారు. బుధవారం సాయంత్రం నరసాపురం వైఎస్సార్సీపీ కార్యాలయంలో జరిగిన పార్టీ జిల్లా ప్రతినిధుల సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో పారీ వార్డు, గ్రామ కమిటీల ఏర్పాటు దాదాపుగా 80 శాతం పూర్తయ్యిందన్నారు. పార్టీని సంస్థాగతంగా బలంగా తీర్చిదిద్దే ప్రయత్నం సాగుతుందని వివరించారు. వైఎస్సార్సీపీ ప్రజల గుండెల్లో ఉందన్నారు. వైఎస్సార్సీపీకి రానున్నవి మంచి రోజులని, పార్టీ నాయకులు అధైర్యపడకుండా ముందుకు వెళ్లాలని, కార్యకర్తలకు అండగా ఉండాలని సూచించారు. జిల్లాలో కమిటీల ఏర్పాటు దాదాపు పూర్తి వైఎస్సార్సీపీ గ్రామ, వార్డు కమిటీల ఏర్పాటు జిల్లాలో దాదాపుగా పూర్తయ్యిందని పార్టీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు చెప్పారు. వార్డులు, గ్రామాల వారీగా పార్టీ సమావేశాలు పెట్టి నాయకులు, కార్యకర్తల అభిప్రాయాలు తీసుకుని కమిటీల ఏర్పాటు చేశామన్నారు. రెండేళ్ల కూటమి పాలన వంచన, మోసంతో సాగిందని, ప్రజలు అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కూటమి దగాకోరు పాలనకు వ్యతిరేకంగా ప్రజలకు అండగా పోరాటాలు చేస్తామన్నారు. సదస్సులో పార్టీ స్టేట్ ఆర్గనైజేషన్ యాక్టివిటీ అండ్ కోఆర్డినేషన్ టీమ్ పవర్పాయింట్ ప్రజంటేషన్ ద్వారా రాష్ట్రంలో జరుగుతున్న పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని వివరించారు. ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్, నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడు ముదునూరి మురళీకృష్ణంరాజు, భీమవరం, పాలకొల్లు, ఉండి నియోజకవర్గాల పార్టీ సమన్వయకర్తలు చినమిల్లి వెంకటరాయుడు, గుడాల గోపీ, పీవీఎల్ నర్శింహరాజు, పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యులు పీడీ రాజు, పెండ్ర వీరన్న మాట్లాడారు. మాజీ మున్సిపల్ చైర్పర్సన్ బర్రి శ్రీవెంకటరమణ, పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు పప్పుల రామారావు, వైకేఎస్, చాగంటి సత్యనారాయణ, షేక్ బులిమస్తాన్, బర్రి శంకరం, పార్టీ పట్టణ అధ్యక్షుడు కామన బుజ్జి, మండల అధ్యక్షుడు ఉంగరాల రమేష్, తిరుమాని నాగరాజు తదితరులు పాల్గొన్నారు. సదస్సులో మాట్లాడుతున్న పార్టీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు, దిశానిర్దేశం చేస్తున్న విజయభాస్కరరెడ్డి -
పండుగ పూటా.. గ్యాస్ తంటా
జిల్లాలో మొత్తం 6,21,626 గ్యాస్ కనెక్షన్లకు గాను 4,02,335 జనరల్ కనెక్షన్లు కాగా, దీపం కనెక్షన్లు 1,83,183, ఉజ్వల కనెక్షన్లు 27,420, సీఎస్ఆర్ కనెక్షన్లు 8,528, ఐదు కేజీల కనెక్షన్లు 160 ఉన్నాయి. దీపం, ఉజ్వల కనెక్షన్లు చాలా వరకు గ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్కువ. ఒక్కో కుటుంబం సగటున ఏడాదికి ఏడు సిలెండర్లు వినియోగిస్తారని అంచనా. కాగా గ్రామీణ ప్రాంతాల్లో వంట వినియోగానికి కట్టెల వినియోగం ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి చిన్న కుటుంబాల్లో ఒక్కో సిలెండరు మూడు నుంచి నాలుగు నెలలు పైనే వస్తుంది. డెలివరీ బాయ్స్, ఏజెన్సీలు ఇలంఆటి వారికి కొంత మొత్తం చెల్లించి వీటిని బ్లాక్ మార్కెట్కు తరలిస్తున్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గ్యాస్ కష్టాలతో విద్యుత్తో పనిచేసే ఇండెక్షన్న్ స్టవ్, ఎలక్ట్రిక్ కుక్కర్లకు డిమాండ్ పెరిగింది. గ్యాస్ అయిపోతే వంట కష్టమేనని వినియోగదారులు హోల్సెల్, రిటైల్ దుకాణాలకు క్యూ కడుతున్నారు. కొద్దిరోజులుగా రూ.2000 నుంచి రూ.3000 మధ్యలో లభించే ఆయా గృహోపకరణాలకు డిమాండ్ పెరిగిందని హోమ్గూడ్స్ వ్యాపారులు చెబుతున్నారు. భీమవరంలోని ఒక గ్యాస్ ఏజెన్సీకి బుధవారం 1800 వరకు గ్యాస్ బుకింగ్స్ రాగా ఆయిల్ కంపెనీ నుంచి 318 వరకు మాత్రమే సిలిండర్లు వచ్చాయి. జిల్లాలో రోజుకు దాదాపు 50 వేల వరకు బుకింగ్స్ వస్తుంటే 12,000 సిలెండర్లు డెలివరీ చేస్తున్నారు. సాక్షి, భీమవరం : పశ్చిమాసియాలో యుద్ధ కల్లోలం గ్యాస్ సెగ పుట్టిస్తోంది. రోజువారీ సరఫరాకు అంతరాయం కలగడంతో హోటల్స్ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. అధిక ధరలు చెల్లించి బ్లాక్లో సిలిండర్లు కొనుగోలు చేయలేని పరిస్థితుల్లో చిరు వ్యాపారులు హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, బజ్జీ వ్యాపారాలు మూసివేస్తుండగా మరికొందరు టిఫిన్స్, మీల్స్ ధరలు పెంచి అమ్మకాలు చేస్తున్నారు. జిల్లాలో హెచ్పీసీఎల్కు చెందిన గ్యాస్ ఏజెన్సీలు 24, ఐఓసీఎల్ 20, బీపీసీఎల్ ఐదు ఏజెన్సీలు ఉన్నాయి. వీటి పరిధిలో సుమారు 6,21,626 గృహావసరాలు (డొమెస్టిక్) కనెక్షన్లు ఉన్నాయి. అమెరికా, ఇజ్రాయేల్ – ఇరాన్ యుద్ధంతో చమురు సంక్షోభం నెలకొంది. ఈ నేపథ్యంలో 14.20 కిలోల డొమెస్టిక్ సిలెండర్పై రూ.60, 19 కిలోల కమర్షియల్ సిలిండర్లపై రూ.110 చొప్పున వారం రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం అదనపు భారం మోపిన విషయం విదితమే. మూతపడుతున్న హోటళ్లు జిల్లాలో హోటళ్లు, రెస్టారెంట్లు, టిఫిన్ సెంటర్లు, స్వీట్ షాపులు, బేకరీలు, కర్రీ పాయింట్లు, బజ్జీల బళ్లు తదితర వ్యాపారాలు వేల సంఖ్యలో ఉన్నాయి. కొందరు వాణిజ్య సిలిండర్లు వినియోగిస్తుండగా అధిక శాతం మంది వ్యాపారులు డొమెస్టిక్ సిలిండర్లనే వాడుతున్నారు. పట్టణాల్లో 25 రోజులు, గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజుల మేరకు గ్యాస్ బుకింగ్ చేసుకోవాలి. గ్యాస్ కంపెనీలు సేల్స్ పెంచుకునే క్రమంలో ఇంతవరకు పరిమితి లేకుండా వినియోగదారులకు సిలిండర్లు డెలివరీ చేస్తూ వచ్చాయి. ఈ క్రమంలో డొమెస్టిక్వి దారి మళ్లించేందుకు వీలుండేది. తాజా పరిస్థితుల నేపథ్యంలో కేంద్రం నిబంధనలు కఠినతరం చేసింది. రెండు రోజుల క్రితం ఏడు వాణిజ్య సముదాయాల్లో అక్రమంగా వినియోగిస్తున్న 120 డొమెస్టిక్ సిలిండర్లను అధికారులు స్వాధీనం చేసుకుని 6ఏ కేసులు నమోదు చేశారు. కమర్షియల్ సిలిండర్ల సరఫరా తగ్గిపోవడం, మరొపక్క డొమెస్టిక్ దొరక్క ఆయా వ్యాపారాల నిర్వహణ కష్టతరమవుతోంది. బ్లాక్ మార్కెట్లో డొమెస్టిక్ రూ.3 వేల వరకు, కమర్షియల్ రూ.5 వేలు వరకు అమ్మకాలు చేస్తున్నట్టు సమాచారం. అధిక ధరలు చెల్లించి సిలిండర్లు కొనుగోలు చేయలేక గత్యంతరం లేని పరిస్థితుల్లో భీమవరం, నరసాపురం, తణుకు, తాడేపల్లిగూడెం, పాలకొల్లు తదితర చోట్ల ఆయా వ్యాపారాలు మూతపడుతున్నాయి. కొందరు వ్యాపారులు మీల్స్పై రూ.30 వరకు, టిఫిన్స్పై రూ.10 వరకు ధరలు పెంచి అమ్మకాలు చేస్తున్నారు. కట్టెలు, ఊకల వినియోగానికి ప్రాధాన్యమిస్తుండటంతో వీటి ధరలకు రెక్కలొస్తున్నాయి. నిన్నమొన్నటి వరకు రూ.80 వరకు ఉన్న ఊక బస్తా ఇప్పుడు రూ.150 నుంచి రూ.200 వరకు పలుకుతోందని వ్యాపారులు చెబుతున్నారు, పెళ్లిళ్లు, ఇతర వేడుకలకు గ్యాస్ సెగ తగులుతోంది. కేటరింగ్ నిర్వాహకులు ముందుగా బుక్ చేసిన ఫంక్షన్లకు మాత్రమే వంటలు చేసి పంపుతున్నారు. కొత్త ఆర్డర్లు తీసుకోవడానికి వెనుకాడుతున్నారు. జిల్లాలో గృహావసరాల కోసం వంట గ్యాస్కు కొరత లేదని అధికారులు చెబుతున్నారు. బుక్ చేసిన మూడు నాలుగు రోజుల్లోనే డెలివరీ అవుతున్నాయని తెలిపారు. జిల్లాలో ప్రతిరోజూ 12,000 డొమెస్టిక్ సిలిండర్లు డెలివరీ అవుతున్నాయని, అదనంగా మరో 35 వేల సిలిండర్ల కోసం ఆయిల్ కంపెనీలకు ఇండెంట్ పంపినట్టు అధికారులు తెలిపారు. సిలిం‘డర్’ జిల్లాను వేధిస్తున్న గ్యాస్ కొరత రోజువారీ బుకింగ్ 50 వేలు కాగా.. డెలివరీ 12 వేలు బ్లాక్లో డొమెస్టిక్ రూ.3,000, కమర్షియల్ రూ.5,000 వరకు .. గ్యాస్ కొరతతో మూతపడుతున్న హోటళ్లు, కర్రీ పాయింట్లు, వ్యాపారాలు కట్టెలు, ఊకకు పెరిగిన డిమాండ్ -
ఆలయ విశిష్టతకు ముప్పు!
క్షీరారామలింగేశ్వరస్వామి ఆలయంలో షెడ్ల నిర్మాణంపై నిరసన షెడ్ నిర్మించనున్న ప్రాంతం(ఫైల్) పాలకొల్లు సెంట్రల్: పాలకొల్లులోని ప్రముఖ పంచారామ క్షేత్రమైన శ్రీ క్షీరారామలింగేశ్వరస్వామి ఆలయంలో జరుగుతున్న పరిణామాలపై భక్తులు, పాలకమండలి సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆలయ నిబంధనలకు, పురావస్తు శాఖ నియమాలకు విరుద్ధంగా ధ్వజస్థంభం వద్ద షెడ్ల నిర్మాణం జరుగుతోంది. సాధారణంగా ఆలయంలో చిన్న మార్పు చేయాలన్నా అనేక అనుమతులు కావాలని చెప్పే అధికారులు.. దాతలు ముందుకు రాగానే ఎలాంటి అనుమతులు లేకుండానే పనులు ప్రారంభించేశారనే విమర్శలు వస్తున్నాయి. పాలకమండలిలో ఉన్న సభ్యులకు కనీస సమాచారం ఇవ్వకుండానే ఈ నిర్ణయాలు తీసుకుంటున్నారని సమాచారం. ఆగమేఘాల మీద నిర్మాణం ఎందుకు? క్షీరారామలింగేశ్వరస్వామి ఆలయంలో గాలిగోపురం, ధ్వజస్తంభం మధ్యలో ఖాళీ స్థలం ఉంది. గోపురం నుంచి లోపలకు వెళ్తుంటే రెండు వైపులా రెండు మండపాల మధ్యలో శివయ్య విగ్రహం, దాని ముందు నందీశ్వరుడు, వెనుక ధ్వజ స్తంభం ఉంటుంది. రెండు మండపాలకు ఇరువైపులా వర్షం వచ్చినా క్యూలైన్లో నిలబడడానికి మూడు అడుగుల వెడల్పుతో షెడ్లు ఏర్పాటు చేశారు. అంతవరకూ బాగానే ఉంది. ఇప్పుడు మద్యలో కూడా షెడ్ నిర్మాణానికి ఆలయ అధికారులు, పాలకమండలి సభ్యులు ఓకే చెప్పేసి కొబ్బరి కాయలు కొట్టినట్లు తెలిసింది. మంగళవారం రాత్రి అత్యవసరంగా పిలిపించి, కనీసం విషయం చెప్పకుండానే షెడ్ నిర్మాణానికి కొబ్బరికాయ కొట్టించారని కొందరు పాలక మండలి సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆలయ ఈవో, మరికొందరు సభ్యులు తమ ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకుంటున్నారని, ప్రశ్నిస్తే మంత్రి పేరు చెప్పి బెదిరిస్తున్నారని కూటమి నేతలు సైతం మండిపడుతున్నారు. ఆలయ విశిష్టతకు ముప్పు? ఈ కొత్త షెడ్డు నిర్మాణం వల్ల ఆలయ విశిష్టత దెబ్బతినే ప్రమాదం ఉందని భక్తులు భయపడుతున్నారు: ఆలయ ధ్వజ స్తంభం వద్ద షెడ్డు నిర్మాణం వల్ల ప్రధానంగా ఆలయం ముందు వెలుతురు ఉండదు. శ్రీశైలం మల్లికార్జునస్వామి ఆలయం తరువాత పాలకొల్లు క్షీరారామలింగేశ్వరస్వామి ఆలయంలో మాత్రమే మల్లన్న పాగా కడతారు. ఈ పాగా కనిపించేది ధ్వజ స్తంభం వద్ద మాత్రమే. ఇక్కడ షెడ్డు నిర్మాణం చేస్తే ఇక మల్లన్న పాగా ఎవరికి కనిపిస్తుంది. శ్రీరామనవమి సమయంలో గాలిగోపురం నుంచి సూర్య కిరణాలు నేరుగా శివలింగంపై పడతాయి. షెడ్ నిర్మాణం వల్ల ఇందుకు అవకాశం ఉండదు. మహాశివరాత్రి రోజున నందాదీపం వెలిగించినప్పుడు భక్తులు చేసే శిఖర దర్శనం సాధ్యం కాదు. పురావస్తు శాఖ అధికారులను షెడ్డు నిర్మాణంపై ప్రశ్నించగా.. తమకు ఎలాంటి సమాచారం లేదని, అనుమతులు ఇవ్వలేదని చెబుతున్నారు. ఫోన్ చేసి నిర్మానం చేయవద్దని ఈవోకు చెబుతానన్నారు. ఐదు నెలల క్రితం కూలిపోయిన ఆలయ ప్రాకార గోడను పట్టించుకోని అధికారులు, ఈ షెడ్డు నిర్మాణంపై చూపిస్తున్న ఆత్రం వెనుక కారణాలు ఏంటని భక్తులు ప్రశ్నిస్తున్నారు. ఆర్కియాలజీ డిపార్ట్మెంటు అనుమతులు కూడా లేవు. అయినా ఎందుకు వెళ్తున్నారో భక్తులకు అర్థం కావడం లేదు. ఆలయంలో ఏదైనా సమస్యపై ప్రశ్నిస్తుంటే మంత్రి వద్దకు వెళ్లి మన పార్టీ వాళ్లే ఏ పని చేయకుండా ప్రశ్నిస్తున్నారని, అడ్డుకుంటున్నారని కొందరు తెలుగు తమ్ముళ్లు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. మంత్రి ఈ విషయంలో జోక్యం చేసుకుని ఆలయ పవిత్రతను, చారిత్రక సంపదను కాపాడాలని భక్తులు కోరుతున్నారు. -
యథేచ్ఛగా కలప అక్రమ రవాణా
బుట్టాయగూడెం: గిరిజన ప్రాంతంలో కలప అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. ప్రస్తుతం వర్జీనియా పొగాకు క్యూరింగ్ పనులు ప్రారంభం కావడంతో పొగాకు బేరన్లకు అడవిలోని కలపను నరికి యథేచ్ఛగా తరలిస్తున్నారు. గత కొద్ది రోజులుగా బుట్టాయగూడెం మండలంలోని పాలకుంట, రెడ్డిగణపవరం గ్రామాల నుంచి పట్టపగలే ట్రాక్టర్లలో కలపను తరలిస్తున్నా అధికారులు పట్టించుకోవడంలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. భీమవరం: స్థానిక ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఈనెల 19వ తేదీ నుంచి మూడు రోజులపాటు జాతీయస్థాయిలో అండర్–23 మెన్ అండ్ ఉమెన్ ఓపెన్ బాక్సింగ్ చాంపియన్ షిప్ పోటీలు నిర్వహిస్తున్నట్లు ఏపీ అమెచ్యూర్ బాక్సింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు సాగి రామకృష్ణ నిశాంత్ వర్మ బుధవారం వెల్లడించారు. సాగి రామకృష్ణంరాజు ట్రోఫీ 2026 పేరిట నిర్వహిస్తున్న ఈ పోటీలను ఇండియన్ అమెచ్యూర్ బాక్సింగ్ ఫెడరేషన్, ఆంధ్రప్రదేశ్ ఆమెచుర్ బాక్సింగ్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నామన్నారు. 20 రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు పేర్లు నమోదు చేయించుకున్నారని తెలిపారు. నూజివీడు: ఆర్టీసీ బస్సును లారీ ఢీకొన్న ఘటన బుధవారం పట్టణంలోని విస్సన్నపేట రోడ్డులో పెట్రోలు బంకు సమీపంలో జరిగింది. అదృష్టవశాత్తూ ప్రయాణికులకు ఏమీ కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. తిరువూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు తిరువూరు నుంచి నూజివీడు వస్తుండగా మధ్యాహ్నం 3 గంటల సమయంలో పట్టణంలోని పెంకు ఫ్యాక్టరీ సమీపంలో ఎదురుగా వస్తున్న లారీ ఢీకొంది. బస్సును ఢీకొనగానే వచ్చిన శబ్దానికి ప్రయాణికులు భీతిల్లారు. ఒక మహిళకు స్వల్ప గాయం కాగా మిగతావారికి ఏమీ కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఏలూరు (ఆర్ఆర్పేట): ప్రభుత్వ పాఠశాలల్లో బ్రిడ్జి కోర్సు బోధించే ఉపాధ్యాయులను పదో తరగతి పరీక్షలకు ఇన్విజిలేటర్లుగా నియమించడం, డీఈఓ కార్యాలయంలో బాధ్యతలు అప్పగించడం వల్ల తరగతులు సక్రమంగా జరగక విద్యార్థులకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ ఉపాధ్యాయులను వెంటనే పాఠశాలలకు పంపించి విద్యార్థులకు బ్రిడ్జి కోర్సులు సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. ఏలూరు రూరల్: ఏలూరు అల్లూరి సీతారామరాజు స్టేడియం ఆవరణలో ఈ నెల 24వ తేదీన అథ్లెటిక్స్ జిల్లా జట్ల ఎంపిక చేపట్టనున్నట్లు డీఎస్డీఓ ఎస్ఏ అజీజ్ ఓ ప్రకటనలో తెలిపారు. 35, 45 ఏళ్ల వయస్సు పైబడిన విభాగంలో 100, 400, 800, 1500 మీటర్ల పరుగు పందెంతో పాటు లాంగ్జంప్, షాట్పుట్, హైజంప్, జావలిన్త్రో, 4 ఇన్టూ 100 రిలే పోటీలు జరగనున్నాయని పేర్కొన్నారు. ఇందులో ఎంపికై నవారు ఈనెల 30, 31 తేదీల్లో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఆవరణలో జరిగే రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొంటారని వివరించారు. ఆసక్తి గల ఏలూరు జిల్లా క్రీడాకారులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ క్రీడల స్పోర్ట్స్ వెబ్సైట్లో ఆధార్కార్డు ద్వారా నమోదు చేసుకోవాలని సూచించారు. వివరాలకు షేక్ ఖాసిం 9492701324 నంబర్లో సంప్రదించాలన్నారు. ఆగిరిపల్లి: ఆగిరిపల్లిలో పురుగుమందుల దుకాణాలపై బుధవారం జిల్లా వ్యవసాయ అధికారి హబీబ్ బాషా ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రెండు దుకాణాలను తనిఖీ చేసి పురుగు మందుల నమూనాలను సేకరించారు. ఆయన మాట్లాడుతూ దుకాణాల యజమానులు ప్రభుత్వ నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగానే పురుగు మందులను విక్రయించాలన్నారు. పురుగు మందులు కొనుగోలు చేసే ప్రతి రైతుకు తప్పనిసరిగా రసీదు ఇవ్వాలని ఆదేశించారు. అనంతరం అమ్మవారి గూడెంలో రైతన్న మీకోసం సర్వేను పరిశీలించి సిబ్బందికి పలు సూచన చేశారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి జె. భవాని, రైతు సేవ కేంద్రం సిబ్బంది అపర్ణ, సూర్య కౌషిక్, సాయి పాల్గొన్నారు. -
అంబులెన్స్కు ప్రమాదం
నరసాపురం రూరల్: పసికందును అత్యవసర చికిత్స నిమిత్తం తరలిస్తున్న అంబులెన్స్ ఆవును ఢీకొంది. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎవ్వరికీ ఏమీ కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. సయ్యద్ హమీద్ మౌలా ఖాదీ, సయ్యద్ మహబూబ్ సుల్తానా దంపతులకు జనవరి 30న ఒక బాబు జన్మించాడు. ఆ బాబుకు గుండె సంబంధిత సమస్య ఉండటంతో ఆపరేషన్ నిమిత్తం తిరుపతి పద్మావతి ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స అనంతరం, బాబు పరిస్థితి మెరుగుపడకపోవడంతో వైద్యుల సూచన మేరకు కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాలని నిర్ణయించారు. ఈ క్రమంలో బాబును అంబులెన్స్లో కాకినాడ తరలిస్తుండగా మార్గమధ్యలో బుధవారం వేకువజామున మొగల్తూరు మండలం కొత్తోట గ్రామానికి వచ్చేసరికి జాతీయ రహదారిపై అడ్డుగా ఉన్న ఆవును అంబులెన్స్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అంబులెన్స్ ముందుబాగం పూర్తిగా దెబ్బతిన్నప్పటికీ అంబులెన్స్లో ఉన్న వారంతా క్షేమంగా బయటపడ్డారు. బాబును 108 అంబులెన్స్లోకి మార్చి సురక్షితంగా కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాబు క్షేమంగా ఉన్నాడని, కాకినాడ ఆసుపత్రిలో తదుపరి వైద్యం అందుతోందని సమాచారం. -
గేదెలు అడ్డురావడంతో బైక్ అదుపు తప్పి..
కై కలూరు: గేదెలు అడ్డు రావడంతో బైక్ అదుపు తప్పి కిందపడి వ్యక్తి మృతి చెందిన ఘటన మంగళవారం రాత్రి పామర్రు–దిగమర్రు జాతీయ రహదారిపై సింగాపురం వద్ద చోటుచేసుకుంది. రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చటాకాయి గ్రామానికి చెందిన ఘంటసాల పెదరాముడు(49) కై కలూరు నుంచి గ్రామానికి ద్విచక్రవాహనంపై వస్తున్నాడు. సింగాపురం వచ్చేసరికి రోడ్డుపై గేదెలు కొట్టుకుంటూ రావడంతో బైక్ అదుపు తప్పి కింద పడిపోయాడు. స్థానికులు అతడ్ని కై కలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. పెదరాముడు కుమారుడు హరిశ్చంద్రరావు ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడిని పోలీసులకు అప్పగించిన స్థానికులు చింతలపూడి: ఆలయంలోని హుండీ పగలగొట్టి చోరీకి పాల్పడుతున్న దొంగను గ్రామస్తులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. చింతలపూడి మండలంలోని ఫాతిమాపురం గ్రామానికి చెందిన చార్లెస్ అనే యువకుడు బుధవారం తెల్లవారుజామున గ్రామంలోని చెక్పోస్ట్ వద్ద గల గుడిలోకి చొరబడ్డాడు. హుండీని పగలగొట్టి నగదు అపహరించేందుకు ప్రయత్నిస్తుండగా, గమనించిన స్థానికులు చాకచక్యంగా వ్యవహరించి అతడిని పట్టుకున్నారు. అనంతరం నిందితుడిని విద్యుత్ స్తంభానికి కట్టివేసి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని స్టేషన్న్కు తరలించి విచారిస్తున్నట్లు ఎస్సై కె సతీష్ కుమార్ తెలిపారు. -
గ్యాస్ను ఆదా చేయండిలా..
యలమంచిలి: అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్పై యద్ధం చేస్తుండడంతో ఆ ప్రభావం మన వంటింటిపై కూడా పడింది. యుద్ధ ప్రభావం వలన మన దేశంలో గ్యాస్ కొరత ఏర్పడే ప్రమాదముంది. ఈ నేపథ్యంలో చాలామందికి గ్యాస్ బుకింగ్ కాకపోవడంతో ప్రజల్లో ఆందోళన మొదలైంది. దీంతో బ్లాక్ మార్కెట్లో గ్యాస్ సిలిండర్ ధర భారీగా పెరిగింది. నేటికాలంలో ప్రతి ఇంట్లో వంట గ్యాస్ ఒక ప్రాథమిక అవసరంగా మారింది, కానీ ప్రస్తుతం గ్యాస్ కొరత ఏర్పడిందని వస్తున్న వార్తలు, ఇంట్లో ఉన్న సిలిండర్ అయిపోతే గ్యాస్ సిలిండర్లు దొరుకుతాయో లేదో అనే భయం చాలా మందిలో మొదలైంది. దీంతో కొందరు ఇంట్లో గ్యాస్ సిలిండర్ ఉన్నా సరే, మళ్లీ కొత్తగా బుక్ చేసుకుంటున్నారు. గ్యాస్ సిలిండర్ కోసం కిలోమీటర్ల మేర జనం క్యూ కడుతున్నారని వార్తలు వస్తున్న నేపథ్యంలో గ్యాస్ సిలిండర్ దొరుకుతుందా లేదా అని ఆలోచించేకంటే, ఇంట్లో ఉన్న గ్యాస్ను పొదుపుగా వాడుకోవడం చాలా మంచిది. అసలు బరువెంత చాలా మంది వినియోగదారులకు దేశీయ ఎల్పీజీ సిలిండర్ అసలు బరువు గురించి తెలియదు. సరిగ్గా నింపిన సిలిండర్ బరువు దాదాపు 29.7 కిలోలు ఉంటుంది. ఇందులో 14.2 కిలోల గ్యాస్ కాగా 15.5 కిలోల ఖాళీ సిలిండర్ బరువు ఉంటుంది. డెలివరీ సమయంలో సిలిండర్ బరువు దీని కంటే తక్కువగా ఉంటే సీలింగ్ చేసే ముందు తక్కువ గ్యాస్ నింపబడిన లేదా తీసివేయబడిన స్కామును ఇది సూచిస్తుంది. గ్యాస్ను సేవ్ చేసే చిట్కాలు ● వంటకు ఉపయోగించే వంట పాత్రల రకం కూడా గ్యాస్ వినియోగాన్ని ప్రభావితం చేస్తుంది. వంట చేసేటప్పుడు, ఎల్లప్పుడూ అడుగున చదునుగా ఉన్న పాత్రలను ఎంచుకోవాలి. ఈ పాత్రలు బర్నర్పై సరిగ్గా కూర్చుంటాయి, తద్వారా గ్యాస్ వేడి నేరుగా పాత్రను చేరుతుంది. పాత్ర అడుగు భాగం వంకరగా ఉంటే వేడి వ్యాపించడం వలన గ్యాస్ వినియోగం పెరుగుతుంది. ● అధిక వేడి మీద వంట చేయడం వల్ల ఆహారం త్వరగా ఉడుకుతుందని, గ్యాస్ వినియోగం తగ్గుతుందని అనుకుంటారు. అయితే, ఇది చాలా తప్పు. చాలా కూరగాయలు, పప్పులు, బియ్యం మీడియం లేదా తక్కువ వేడి మీద మరింత సులభంగా, సమర్థవంతంగా వండవచ్చు, దీనివల్ల గ్యాస్ ఆదా అవుతుంది. ● వంట చేయడానికి వీలైనంత వరకు ప్రెషర్ కుక్కర్ను ఉపయోగించడం మేలు. ప్రెషర్ కుక్కర్లో ఆహారం తక్కువ సమయంలోనే ఉడుకుతుంది. ఇది గ్యాస్ వినియోగాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. ● వంట చేసేటప్పుడు పాత్రల మీద మూత పెట్టడం కూడా మంచి అలవాటు. మూత లేకుండా వంట చేయడం వల్ల ఆవిరి బయటకు వెళ్లి వంట ఆలస్యం అవుతుంది. ● బర్నర్ శుభ్రతపై కూడా శ్రద్ధ వహించాలి. బర్నర్ రంధ్రాలు మూసుకుపోయినా లేదా ధూళి పేరుకుపోయినా, గ్యాస్ సరిగ్గా మండదు, ఫలితంగా గ్యాస్ వినియోగం పెరుగుతుంది. అందువల్ల వారానికి ఒకసారి బర్నర్ను శుభ్రం చేసుకోవడం మంచిది. -
మోటార్ల చోరీ గ్యాంగ్ అరెస్ట్
మండవల్లి: రొయ్యల చెరువుల వద్ద మోటార్లు చోరీ చేస్తున్న గ్యాంగ్ను పోలీసులు పట్టుకున్నారు. నిందితుల నుంచి 27 మోటార్లు, ఒక బ్యాటరీ, ఒక స్కూటీ స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఇటీవల కొందరి రొయ్యల చెరువుల వద్ద మోటార్ల దొంగతనాలపై పోలీసులకు ఫిర్యాదులు అందాయి. దీంతో ఎస్పీ కె ప్రతాప్శివకిషోర్, డీఎస్పీ డి శ్రావణ్కుమార్, సీఐ వి రవికుమార్ ఆదేశాల మేరకు పోలీసులు నిఘా ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో గున్ననపూడి శివారులో అనుమానాస్పదంగా సంచరిస్తున్న నలుగురిని ఎస్సై రామచంద్రరావు అదుపులోకి తీసుకుని విచారించారు. మోటార్ల చోరీలో నిందితులుగా కర్రె మెక్మిలన్, కర్రే వంశీ, పంతగాని సంజయ్కుమార్, నీలం ధర్మయ్యలను గుర్తించి అరెస్ట్ చేశారు. వారినుంచి చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నారు. -
ఉత్కంఠభరితంగా టెన్నిస్ పోటీలు
భీమవరం: ఆల్ ఇండియా సీనియర్ ర్యాంకింగ్ టెన్నిస్ చాంపియన్షిప్ పోటీలు భీమవరం కాస్మోపాలిటన్ క్లబ్ ఆవరణలో ఉత్కంఠభరితంగా జరుగుతున్నాయి. 35+ సింగిల్స్ విభాగంలో కేఎస్ఎన్రాజుపై కె.అమిత్రెడ్డి 6–4, 6–4 పాయింట్ల తేడాతో విజయం సాధించగా, టి.సంజీవ్పై ఈశ్వర సాయి 6–4, 6–1 తేడాతో, జానకిపై కె.సతీష్ 6–4, 6–3 పాయింట్ల తేడాతో, ఎ.చైతన్యపై ఎన్డీ విజయ్ ఆనంద్ 6–2, 6–0 పాయింట్ల తేడాతో విజయం సాధించారు. 45+ సింగిల్స్ విభాగంలో ఎం.శివకుమార్రాజుపై ఎంవీఎల్ఎన్ రాజు 6–4, 6–4 పాయింట్లతో, అశ్విన్కుమార్పై కె.సంపత్కుమార్ 6–2, 6–3 పాయింట్ల తేడాతో, రమేష్ బాలుపై రామకృష్ణయ్య 6–2, 6–1 తేడాతో, సీతారామరాజుపై ఎంఎస్.కిరణ్ 6–2, 6–4 పాయింట్ల తేడాతో గెలుపొందారు. అదేవిధంగా 55+ సింగిల్స్ విభాగంలో ఆదిశేషయ్యపై కేవీఎన్ మూర్తి 6–0, 6–1 పాయింట్ల తేడాతో, నగేష్పై సీహెచ్ శివ 6–4, 5–7, 10–5 పాయింట్ల తేడాతో, రాజాపై బాబు రాజా 6–1, 6–2 పాయింట్ల తేడాతో, సుధాకర్రెడ్డిపై బాబు రాజా 6–3, 6–4 పాయింట్ల తేడాతో విజయం సాధించారు. 65+ సింగిల్స్ సెమీఫైనల్స్లో ఎస్ఎస్.రథ్పై వి.శ్రీనివాసరెడ్డి 6–0, 6–2 పాయింట్ల తేడాతో, మన్మథరావుపై ఎస్.ఆనంద్ స్వరూప్ 6–2, 7–5 పాయింట్ల తేడాతో గెలుపొందారు. 70+ సింగిల్స్ సెమీఫైనల్స్లో వి.ధనుంజయులుపై ఎస్.సేతు 6–1, 7–6, 7–1 పాయింట్ల తేడాతో, అశోక్రెడ్డిపై కె.రాధాకృష్ణమూర్తి 6–0, 6–0 పాయింట్ల తేడాతో విజయం సాధించారు. -
కనీస వేతనాల చట్టాన్ని అమలు చేయాలి
ఏలూరు (టూటౌన్): కనీస వేతనాల చట్టాన్ని తప్పనిసరిగా అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి చైర్మన్ పి శ్రీనివాసులురెడ్డి ఆదేశించారు. బుధవారం ఏలూరులోని హోటల్ అతిథిలో సంయుక్త కార్మిక కమిషనరు ఎ.గణేషన్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కనీస వేతనాల పెంపుదలపై యజమానుల సంఘాల నుంచి, కార్మిక సంఘాల నుంచి సూచనలు, సలహాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం నిర్ణయించిన కనీస వేతనాల చట్టాన్ని అందరూ తప్పనిసరిగా అమలు చేయాలన్నారు. వర్తక వాణిజ్య సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ కనీస వేతనాల సలహా మండలిని ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఆహ్వానించ దగ్గ పరిణామమన్నారు. సలహా మండలి కూర్పు నందు జాతీయ కార్మిక సంఘాలకు బోర్డు సభ్యులుగా అవకాశం కల్పించాలని కోరారు. సమావేశంలో మండలి సభ్యులు ఆర్ శ్యామ్, డి.పుల్లయ్య, కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్, వర్తక, వాణిజ్య సంఘాల ప్రతినిధులు,కార్మిక నాయకులు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల ఉపకార్మిక కమిషనర్లు, సహాయ కార్మిక కమిషనర్లు, ఏలూరు సహాయ కార్మిక అధికారులు పాల్గొన్నారు. -
చేతబడి అనుమానంతో హత్యాయత్నం
● పాముకాటుతో బాలుడి మృతి ● చేతబడి చేశాడని వ్యాపారిపై అనుమానం ● మరునాడే గొంతు కోసిన బాలుడి తండ్రి వేలేరుపాడు: తన కొడుకు మరణానికి చేతబడి చేశాడనే అనుమానంతో వ్యాపారిపై హత్యాయత్నానికి పాల్పడ్డాడు ఓ తండ్రి. ఈ ఘటన వేలేరుపాడు మండలం జిన్నెలగూడెంలో చోటుచేసుకుంది. గ్రామంలోని గిరిజన బాలుడు మూడేళ్ల ధనుష్ మంగళవారం మధ్యాహ్నం నాగుపాము కాటుకు గురై మృతి చెందాడు. అయితే ఆ బాలుడు మరణానికి గ్రామంలో చిరు జామాయిల్ వ్యాపారి కరెడ్ల రాజబాబు చేతబడి చేశాడని, అందువల్లనే తన కుమారుడు మరణించాడని ధనుష్ తండ్రి రవి అనుమానించాడు. దీంతో బుధవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఇంట్లో నిద్రిస్తున్న రాజబాబుపై రవి దాడి చేసి కత్తితో గొంతును కోసి పరారయ్యాడు. అనంతరం గ్రామస్తులు గాయాలతో ఉన్న రాజబాబును వేలేరుపాడు ప్రభుత్వ ప్రాథమిక ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా హత్యాయత్నానికి పాల్పడిన నిందితుడు రవిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎస్సై నవీన్ కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రాజబాబు ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. -
గ్యాస్ లీకై వృద్ధురాలికి గాయాలు
తణుకు అర్బన్: గ్యాస్ లీకై వృద్ధురాలు గాయపడిన ఘటన బుధవారం మండపాక శివారు ఎర్రనీలికుంట గ్రామంలో చోటుచేసుకుంది. ఇందిరమ్మ కాలనీలో నివాసం ఉంటున్న గుబ్బల కస్తూరి తన నివాసంలో వంట చేసుకుంటుండగా ప్రమాదవశాత్తూ గ్యాస్ లీకై మంటలు వ్యాపించాయి. స్థానికుల సమాచారంతో తణుకు అగ్నిమాపక కేంద్ర అధికారి ఐ.అజయ్కుమార్ తమ సిబ్బందితో కలిసి హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ఘటనలో వృద్ధురాలి కాళ్లకు స్వల్పగాయాలుకాగా చికిత్స నిమిత్తం ఆమెను తణుకు ఆస్పత్రికి తరలించారు. ఇంట్లో సామాగ్రి కొంతమేర మంటల్లో కాలినట్లు అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. -
దళిత క్రైస్తవులను ఎస్సీలుగా పరిగణించాలి
ఏలూరు (టూటౌన్): దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలంటూ కలెక్టరేట్ వద్ద క్రిస్టియన్ కోఆర్డినేషన్ కౌన్సిల్ ఆధ్వర్యంలో బుధవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. అంతకు ముందు స్థానిక జిల్లా పరిషత్ సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకు శాంతి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా క్రిస్టియన్ కో–ఆర్డినేషన్ రాష్ట్ర నాయకులు ప్రొఫెసర్ ఎన్ఏడీ పాల్ మాట్లాడుతూ దళిత క్రైస్తవులను ఎస్సీ (షెడ్యూల్డ్ కాస్ట్)లుగా గుర్తించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. మతం మార్చుకున్న కారణంగా దళితులకు రాజ్యాంగ పరమైన హక్కులు దూరం కావడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. దళిత క్రైస్తవులు సామాజిక, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలుగానే ఉన్నప్పటికీ వారికి సరైన రక్షణ, సంక్షేమ పథకాలు అందడం లేదని తెలిపారు. అలాగే ప్రార్థనా మందిరాలపై, క్రైస్తవులపై దాడులు, బెదిరింపులు పెరుగుతున్నాయని, ఇలాంటి ఘటనలపై ప్రత్యేక దర్యాప్తు చేసి బాధ్యులపై కఠిన శిక్షలు విధించాలని విజ్ఞప్తి చేశారు. మత మార్పిడి నిరోధక చట్టాలు ప్రజాస్వామ్య హక్కులకు విరుద్ధమని పేర్కొంటూ వాటిని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టరేట్లో డీఆర్ఓ విశ్వేశ్వరరావుకి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఆల్ ఇండియా అంబేడ్కర్ యువజన సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి డా.మెండెం సంతోష్ కుమార్, క్రిస్టియన్ కో–ఆర్డినేషన్ కౌన్సిల్ సభ్యులు, వివిధ చర్చి ప్రతినిధులు, విశ్వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. -
నేటి నుంచి గూడెంలో ట్రాఫిక్ ఆంక్షలు
తాడేపల్లిగూడెం: పట్టణంలో గురువారం నుంచి ట్రాఫిక్ ఆంక్షలను విధించారు. గురువారం ఉగాది, బలుసులమ్మవారి జాతరలో భాగంగా నైవేద్యాల కార్యక్రమం ప్రారంభమవుతుండడంతో పట్టణంలో ట్రాఫిక్ ఆంక్షలను సీఐ బోణం ఆదిప్రసాద్, ఎస్సై నాగరాజు బుధవారం వెల్లడించారు. గురువారం ఉదయం ఐదు గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయన్నారు. భీమవరం నుంచి వచ్చే వాహనాలు యాగర్లపల్లి రెండోఫ్లైఓవర్ వంతెన మీదుగా బస్టాండ్కు చేరుకుంటాయి. ఒకటో వంతెన మీదుగా ఎలాంటి వాహనాలు అనుమతించరు. భక్తులను మాత్రమే అనుమతిస్తారు. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులు తాలూకా ఆఫీస్ సెంటర్ నుంచి కృష్ణా బాలాజీ ధియేటర్ వరకు వచ్చి, అక్కడ ఏర్పాటుచేసిన ప్రాంతంలో వాహనాలను పార్కింగ్ చేసుకోవాలి. ఉగాది రోజున 150 మంది సిబ్బంది. 25 మంది మహిళా పోలీసులను ఏర్పాటుచేశారు. నైవేద్యాల రోజున 400 మంది సిబ్బందిని వినియోగించనున్నట్టు సీఐ ఆదిప్రసాద్ చెప్పారు. భక్తులు ఈ మేరకు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో ఉత్సవ కమిటీ నిర్వాహకులు శ్రీరంగం అంజి పాల్గొన్నారు. -
అరుదైన వ్యాధి.. ఆదుకునేవారేరీ?
కై కలూరు: అరుదైన వ్యాధితో బాధపడుతోంది ముదినేపల్లి మండలం గురజకు చెందిన పదేళ్ల వయసు గల బాలిక భైరవపట్నపు సుప్రియ. తండ్రి ఏసుబాబు లారీ డ్రైవర్ కాగా తల్లి రాజేశ్వరీ హోటల్లో పనిచేస్తోంది. సుప్రియ చిన్ననాటి నుంచి వెన్నుపూస సమస్యతో బాధపడుతూ ఎడమ కాలు స్పర్శ కోల్పోయింది. అరికాలి కింద చిన్న రంధ్రం ఏర్పడటం అది పెద్దది కావడంతో కాలు నుంచి రక్తం, చీము కారడం పరిపాటిగా మారింది. ఇప్పటికే శరీరంలో ముక్కలను తీసి మూడు సార్లు కాలికి చికిత్స చేసినా ప్రయోజనం లేదు. పైగా ఇప్పుడు కుడికాలుకి సైతం స్పర్శ కోల్పోతుంది. గుంటూరు మెడికల్ కాలేజీ ఫాథాలజీ డిపార్డుమెంటు చికిత్స చేసినా నయం కాలేదు. కాలు తొలగించడం తప్పదని వైద్యులు చెబుతున్నారు. ఆర్థిక స్థోమత సహకరించకపోయినా ఇప్పటికే సుప్రియ తలిదండ్రులు అప్పులు చేసి రూ.12 లక్షలు ఖర్చు చేశారు. అలాగే ప్రతి నెలా మందుల నిమిత్తం రూ.8 వేలు ఖర్చు అవుతుందని చెబుతున్నారు. అరుదైన వ్యాధి కావడంతో పథకాలు వర్తించడం లేదు. సుప్రియకు 2023లో సదరం క్యాంపులో 63 శాతం శాశ్వత అంగవైకల్యంతో ధ్రువపత్రం అందించారు. అయినప్పటికీ చంద్రబాబు ప్రభుత్వం సుప్రియకు పింఛన్ మంజూరు చేయలేదు. దాతలు స్పందించి తమ కుమార్తె శస్త్రచికిత్సకు ఆర్థిక సహాయం అందించాలని, ప్రభుత్వం పింఛన్ మంజూరు చేయించాలని సుప్రియ తల్లిదండ్రులు కోరుతున్నారు. -
వైభవంగా బలుసులమ్మ జాతర
తాడేపల్లిగూడెం (టీఓసీ): పట్టణ ఇలవేల్పు బలుసులమ్మ అమ్మవారి మహాకుంభాభిషేక పూర్వక జాతర మహోత్సవాల్లో భాగంగా మంగళవారం అమ్మవారికి విశేష పుష్పార్చన ఘనంగా నిర్వహించారు. యాగశాల వద్ద ఉదయం నుంచి వేదపండితులు వైదిక కార్యక్రమాలను నిర్వహించారు. రాత్రి మధు ఈవెంట్స్ ఆర్డీఎక్స్ టీమ్ (వైజాగ్), మణిపూర్ స్టంట్స్, డాన్స్ బేబి డాన్స్ నిర్వహించారు. ప్రేక్షకులు, భక్తులు విశేషంగా హాజరైయారు. ఆలయ నిర్వాహకులు శ్రీరంగం అంజిబాబు పర్యవేక్షించారు. వేలేరుపాడు: మండల పరిధిలోని జిన్నెల గూడెం గ్రామానికి చెందిన తురసం ధనుష్ అనే మూడేళ్ల గిరిజన బాలుడు మంగళవారం మధ్యాహ్నం పాము కాటుకు గురై మృతి చెందాడు. తల్లిదండ్రులు రవి, లక్ష్మిలు తెలిపిన వివరాల ప్రకారం మంగళవారం మధ్యాహ్నం ఇంట్లో ధనుష్ ఆడుకుంటున్నాడు. ఈ సమయంలో నాగుపాము మోకాళ్ల దగ్గర కాటు వేసింది. దీన్ని గమనించిన తల్లిదండ్రులు నాగుపామును కొట్టి చంపారు. అనంతరం వేలేరుపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అప్పటికే పరిస్థితి విషమంగా మారడంతో ధనుష్ మృతి చెందాడు. రవి, లక్ష్మిలకు ముగ్గురు సంతానంలో కుమారుడు మృతి చెందడంతో వారు కన్నీరుమున్నీరయ్యారు. తాడేపల్లిగూడెం (టీఓసీ): ప్రముఖ వచన కవి పట్టణానికి చెందిన వేమూరి శ్రీనివాస్కు పరాభవనామ ఉగాది సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉగాది పురస్కారానికి ఎంపిక చేసింది. ఈ మేరకు మంగళవారం స్థానిక విలేకరులకు ఆయన వివరాలు వెల్లడించారు. వేమూరి వృత్తి గణిత శాస్త్ర బోధన కాగా ప్రవృత్తి కవితా రచన. తెలుగు భాషకు చేస్తున్న సేవలకు గాను ఉగాది పురస్కారం అందుకోనున్నారు. గణపవరం: పిప్పరలో ఉండిపంటకాలువలో ఈతకు దిగి మృతిచెందిన వారిలో ప్రమోద్వర్మ మృతదేహం మంగళవారం ఉదయం లభించింది. మూడు రోజులుగా రెస్క్యూ టీం సభ్యులు ఉండి పంటకాలువ పొడవునా కిలోమీటర్ల దూరం వరకూ మృతదేహం కోసం గాలించినా ఆచూకీ దొరక్కపోవడంతో గాలింపు చర్యలు కొనసాగించారు. ఎట్టకేలకు మంగళవారం ఉదయం ప్రమోద్వర్మ మృతదేహం లభించినట్లు గణపవరం ఎస్సై ఆకుల మణికుమార్ తెలిపారు. ఆదివారం సాయంత్రం పిప్పర గ్రామానికి చెందిన భూపతిరాజు సుశాంతవర్మ(10), ఇందుకూరి ప్రమోద్వర్మ(11) అనే ఇద్దరు స్నేహితులు సరదాగా ఈతకోసం కాలువలోకి దిగి గల్లంతైన విషయం తెలిసిందే. ప్రమోద్వర్మ మృతదేహాన్ని చూసిన తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. గణపవరం: ఏలూరు జిల్లా గణపవరం సెంటర్లో ఎస్సై ఆకుల మణికుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలలో మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న ముగ్గురిపై కేసులు నమోదు చేశారు. వారిని మంగళవారం తాడేపల్లిగూడెం ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులో హాజరుపర్చగా మెజిస్ట్రేట్ కె.లలితాదేవి ముగ్గురికీ ఒక్కొక్కరికీ పదివేల రూపాయల చొప్పున జరిమానా విధించినట్లు ఎస్సై తెలిపారు. నరసాపురం రూరల్: చేపల వేటకోసం వెళ్లిన ఓ యువకుడు విగతజీవిగా తేలడంతో స్థానికంగా విషాదం నెలకొంది. వివరాల్లోకి వెళితే మొగల్తూరు మండలం కోమటితిప్ప గ్రామానికి చెందిన తిరుమాని రాము (19) ఆదివారం ఉదయం వేటకోసం ఉప్పుటేరుకు వెళ్లాడు. అయితే సాయంత్రం దాటినా రాము ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు గాలించినా అతని ఆచూకీ లభ్యం కాలేదు. సోమవారం ఉదయం కాళీపట్నం ఈస్ట్ లోని లాంచీల రేవువద్ద రాము మృతదేహం లభ్యమైంది. ఈ ఘటనపై ఎస్సై వాసు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
గ్రావెల్ అక్రమ తవ్వకాలు దుర్మార్గం
నూజివీడు: ఆగిరిపల్లి మండలంలో అధికారపార్టీ నాయకులు అత్యంత దారుణంగా పేదలకు ఇచ్చిన అసైన్డ్ భూముల్లో వాటి యజమానులకు తెలియకుండానే మామిడి చెట్లు నరికివేసి గ్రావెల్ తవ్వకాలు జరిపి తరలించడం అత్యంత దుర్మార్గమని నూజివీడు మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి మేకా వెంకట ప్రతాప్ అప్పారావు ఆందోళన వ్యక్తం చేశారు. కలటూరుకు చెందిన గుద్దేటి వరదానానికి 30 ఏళ్ల క్రితం ప్రభ్వుత్వం 1.96ఎకరాలు అసైన్మెంట్ భూమి ఇవ్వగా, ఆమె మరణించిన తర్వాత దానిని ఆమె ముగ్గురు కుమారులు సాగు చేసుకుంటున్నారు. అందులో 50 మామిడి చెట్లు ఉన్నాయి. ఆమె కుమారుల్లో ఒకరైన గుద్దేటి రమేష్ తన భార్య అనారోగ్యానికి గురవ్వగా నాలుగు రోజుల పాటు విజయవాడలోని ఆసుపత్రిలో ఉండి చికిత్స చేయించి తీసుకొచ్చేసరికి 50 చెట్లు నరికివేయడంతో పాటు అందులోకి అక్రమంగా ప్రవేశించి గ్రావెల్ను తవ్వేశారు. దీనిపై బాధిత రమేష్ ప్రతాప్ అప్పారావును ఆశ్రయించగా మంగళవారం బాధితుడిని వెంటబెట్టుకుని సబ్కలెక్టర్ కార్యాలయంకు తీసుకెళ్లగా నక్కనబోయిన వేణు, దాసరి శేషగిరిరావు గ్రావెల్ అక్రమ తవ్వకాలకు పాల్పడ్డారని సబ్కలెక్టర్ బొల్లిపల్లి వినూత్నకు బాధితుడు ఫిర్యాదు చేశారు. తారాస్థాయికి అక్రమ తవ్వకాలు అనంతరం ప్రతాప్ అప్పారావు విలేకర్లతో మాట్లాడుతూ నియోజకవర్గంలోని ఆగిరిపల్లి, నూజివీడు మండలాల్లో మంత్రి అండదండలతో కొందరు నాయకులు గుట్టలు, చెరువులు కొల్లగొడుతున్నారన్నారు. ఆగిరిపల్లి మండలంలో అయితే కొల్లగొట్టడం తారాస్థాయికి చేరిందన్నారు. ప్రకృతి సంపదైన గుట్టలన్నీ కనుమరుగైపోయే పరిస్థితి నెలకొందన్నారు. దళితుడి భూమిలోని గ్రావెల్ను తవ్వి టిప్పర్లలో విజయవాడ, గుంటూరు తదితర ప్రాంతాలకు తరలించారన్నారు. గ్రావెల్ అక్రమ తవ్వకాలపై గ్రామస్థులు ఎన్నిసార్లు ఫోన్ చేసి ఫిర్యాదు చేస్తున్నా తహసీల్దార్లు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆగిరిపల్లి మండలంలో కనసానపల్లి, అమ్మవారిగూడెం, నర్సింగపాలెం తదితర గ్రామాల్లో ఇష్టారాజ్యంగా గ్రావెల్ అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయన్నారు. కనసానపల్లిలో అనుమతినిచ్చిన క్వారీ ఉండగా అందులో అనుమతి ఇచ్చిన విస్తీర్ణం కంటే రెండు రెట్లు ఎక్కువగా తవ్వేసి గ్రావెల్ను తరలించారని, దీనిని తనిఖీలు చేసి అదనంగా తవ్విన దానికి నిబంధనల ప్రకారం క్వారీ అనుమతి పొందిన వ్యక్తికి జరిమానా విధించాలని డిమాండ్ చేశారు. గతంలో ఎమ్మార్ అప్పారావు, కోటగిరి హనుమంతరావు, పాలడుగు వెంకట్రావు, తాను, చిన్నం రామకోటయ్యలు ఎమ్మెల్యేలుగా పనిచేశారని, ఏ ఒక్కరి హయాంలో కూడా ఇంత పెద్ద ఎత్తున అక్రమ గ్రావెల్ తవ్వకాలు జరగలేదని, వారు ఎన్నడూ ప్రోత్సహించలేదన్నారు. రాత్రి 10గంటల నుంచి తెల్లవారుజామున 5గంటల వరకు టిప్పర్లతో ఇష్టారాజ్యంగా గ్రావెల్ను తరలిస్తూ కొండలను, గుట్టలను, చెరువులను కొల్లగొడుతున్నారని, ఈ అక్రమ గ్రావెల్ దందాను కచ్ఛితంగా నిలువరించాలని అధికారులను డిమాండ్ చేశారు. ప్రతాప్ అప్పారావుతో పాటు వైఎస్సార్ సీపీ రైతు విభాగం అధ్యక్షుడు ఈలప్రోలు వెంకట సుబ్బయ్య, కలటూరు సర్పంచి సురేష్ తదితరులు ఉన్నారు. మేకా వెంకట ప్రతాప్ అప్పారావు -
వేప చెట్లకు ‘డై బ్యాక్’ముప్పు
● మెట్ట ప్రాంతంలో విస్తరిస్తున్న శిలీంధ్ర వ్యాధి ● నివారణకు శాస్త్రవేత్తల సూచనలుచింతలపూడి: గత కొద్ది రోజులుగా మెట్ట ప్రాంతంలోని వేప చెట్లు నిలువునా ఎండిపోతుండడం స్థానికంగా కలకలం రేపుతోంది. పచ్చగా ఉండాల్సిన చెట్లు అకస్మాత్తుగా కొమ్మల పైభాగం నుంచి ఎండిపోతూ వస్తుండటంతో సామాన్యులు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా ఉగాది పండుగ సమీపిస్తున్న తరుణంలో ఇలా జరగడం ఏదైనా అరిష్టమా అని కొందరు చర్చించుకుంటున్నారు. అయితే, ఈ ప్రచారంలో నిజం లేదని, ఇది కేవలం ‘డై బ్యాక్’ అనే శిలీంద్ర వ్యాధి మాత్రమేనని ఉద్యాన శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఏమిటీ డై బ్యాక్ వ్యాధి? ఇది ఫోమోప్సిస్ అజాడిరక్టే అనే ఫంగస్ (శిలీంధ్రం) వల్ల వస్తుంది. ఈ వ్యాధి సోకినప్పుడు చెట్టు కొమ్మలు పైనుండి కిందికి ఎండిపోతూ వస్తాయి. ఆకులు పసుపు రంగులోకి మారి రాలిపోవడం, పూత రాకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. వాతావరణంలో తేమ పెరగడం వల్ల ఈ శిలీంధ్రం వేగంగా విస్తరిస్తుంది. శాసీ్త్రయ నివారణ మార్గాలు మూఢనమ్మకాలతో చెట్లను వదిలేయకుండా, సరైన సమయంలో చికిత్స అందిస్తే వేప చెట్లను కాపాడుకోవచ్చని ఉద్యానాధికారిణి ఎండి షాఫియ సూచిస్తున్నారు. ఒక లీటరు నీటిలో 1 గ్రాము కార్బెండిజం లేదా 2 గ్రాముల మాంకోజెబ్ కలిపి చెట్టు మొత్తం తడిచేలా పిచికారీ చేయాలి. ఎండిపోయిన కొమ్మలను కత్తిరించి, ఆ భాగంలో బోర్డో పేస్ట్ను పూయడం వల్ల వ్యాధి మరింత వ్యాపించకుండా ఆపవచ్చు. చెట్టు మొదట్లో తగినంత నీరు పోస్తూ, పోషకాలు అందించినట్లయితే మళ్లీ కొత్త చిగుళ్లు వచ్చే అవకాశం ఉంది. వేప చెట్లు ఎండిపోవడం అనేది పూర్తిగా జీవశాస్త్ర పరమైన సమస్య. దీనికి గ్రహగతులకు లేదా అరిష్టాలకు ఎటువంటి సంబంధం లేదు. రైతులు, ప్రజలు ఆందోళన చెందకుండా ఉద్యాన అధికారుల సలహాల మేరకు నివారణ చర్యలు చేపట్టాలని ఉద్యాన శాఖ అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. -
తణుకులో వాహనాలతో మైనర్ల రచ్చ
తణుకు అర్బన్: ఇంటర్మీడియేట్ పరీక్షలు ముగిసిన నేపథ్యంలో మంగళవారం ఉదయం తణుకు రహదారుల్లో మైనర్లు తమ వాహనాలతో చేసిన సౌండ్ పొల్యూషన్ తాకిడికి ప్రయాణికులు బెంబేలెత్తిపోయారు. రకరకాల ద్విచక్ర వాహనాలపై మైనర్లు ముగ్గురేసి ఎక్కి వాహనాలు నడిపిన తీరు భయబ్రాంతులకు గురిచేసింది. వాహనాలకు ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన సైలెన్సర్ల నుంచి విపరీతమైన శబ్దాలు వచ్చే విధంగా నడిపిన తీరుతో పాదచారులు భయపడిపోయారు. బండి వెనుక బండితో మైనర్లు రేస్లు పెట్టుకున్నట్లుగా ప్రయాణించడంతో తణుకులో ప్రధాన రహదారులైన రాష్ట్రపతి రోడ్డు, సొసైటీ రోడ్డు, పెరవలి రోడ్డు, ఉండ్రాజవరం రోడ్డు, వేల్పూరు రోడ్డులో ప్రయాణికులు గగ్గోలెత్తిపోయారు. కళాశాలల వద్ద పరీక్షలు అయిన తరువాత మైనర్లు, ఆకతాయిలు ఆడపిల్లల వెనుక వాహనాలతో ప్రయాణించిన తీరుతో చూసేవారికి చమటలు పట్టించాయి. ఇటీవల కాలంలో ఈ తరహా వాహనాల జోరు అధికం కాగా పోలీసులు వాహనాలను ఆపి నిలువరించిన వెంటనే రాజకీయ సిఫార్సులు నిముషాల వ్యవధిలోనే వస్తుండడంతో కేవలం కౌన్సెలింగ్లతో సరిపెట్టాల్సిన దుస్థితి నెలకొంది. అంతేకాకుండా నేనెవరో తెలుసా అంటూ పోలీసులనే ప్రశ్నించే పరిస్థితుల్లో మైనర్లు ఉండడం శోచనీయం. మంగళవారం మధ్యాహ్నం తణుకు శివారు ఉండ్రాజవరం రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఉండ్రాజవరం మండల పరిషత్ కార్యాలయం సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న ధూళిపాల వీవీసీఎస్ శర్మ ఘటనా ప్రాంతంలోనే మృతిచెందారు. భోజన విరామ సమయంలో తణుకులోని నివాసానికి వస్తున్న శర్మను ద్విచక్ర వాహనంపై త్రిబుల్ రైడ్ చేస్తూ వేగంగా వస్తున్న యువకులు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందని స్థానికులు చెబుతున్నారు. కొరడా ఝళిపించిన పోలీసులు ఉదయం నుంచి మైనర్లు వాహనాలతో చేసిన రచ్చతో విసుగెత్తిన పోలీసు అధికారులు మంగళవారం సాయంత్రం తణుకు రాష్ట్రపతి రోడ్డులో యువకులు, మైనర్లు ప్రయాణించే వాహనాలను పదుల సంఖ్యలో నిలువరించి వాహనాల తాలూకా దస్త్రాలను తనిఖీలు నిర్వహించారు. రూరల్ సీఐ దేశంశెట్టి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఎస్సైలు డి.ఆదినారాయణ, కె.శ్రీనివాస్ సిబ్బందితో కలిసి వాహనాలను నిలువరించారు. మైనర్లకు బైక్లు ఇచ్చే తల్లిదండ్రులపై చర్యలు తీసుకుంటామని తణుకు ట్రాఫిక్ ఎస్సై డి.ఆదినారాయణ హెచ్చరించారు రాష్ట్రపతి రోడ్డులోని డిగ్రీ కళాశాల వద్ద మైనర్లు, విచిత్ర శబ్ధాలు చేస్తూ సైలెన్సర్లు లేకుండా నడుపుతున్న మోటారు సైకిళ్లను స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేశారు. ఉండ్రాజవరంలో వాహనం ఢీకొని ప్రభుత్వ ఉద్యోగి మృతి -
విద్యుత్ స్తంభాల క్రమబద్ధీకరణ
కొయ్యలగూడెం: మండలంలోని కన్నాపురం రోడ్డులో తంగళ్ళగూడెం వద్ద ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ స్తంభాలను అధికారులు క్రమబద్ధీకరించారు. సాక్షి పత్రికలో ఈ నెల 11న ప్రచురితమైన ప్రమాదకరంగా విద్యుత్ స్తంభాలు కథనానికి స్పందించి సిబ్బందితో వెళ్లి రెండు చోట్ల ఉన్న స్తంభాలను సరి చేశామని రామారావు తెలిపారు. మెయిన్ రోడ్ లో ఒకటి ఓ రైతు వ్యవసాయ క్షేత్రంలో మరొకటి రెండు రోజులపాటు శ్రమించి క్రమబద్ధీకరించామని తెలిపారు. ఈ సందర్భంగా రైతులు అదే విధంగా ప్రయాణికులు విద్యుత్ శాఖకు కృతజ్ఞతలు తెలిపారు. భీమవరం (ప్రకాశంచౌక్): జిల్లా డిఆర్ఓగా కే.పద్మలతను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లా డీఆర్ఓగా పనిచేస్తున్న పద్మలతను బదిలీపై పశ్చిమగోదావరి జిల్లాకు డీఆర్ఓగా నియమించారు. -
టిడ్కో ఇళ్లు.. సమస్యలు ఫుల్
● వేధిస్తున్న మంచినీటి కొరత ● చెత్త, డ్రెయినేజీ సమస్యతో తీవ్ర ఇబ్బందులు భీమవరం(ప్రకాశం చౌక్): పట్టణంలోని టిడ్కో ఇళ్ల సముదాయంలోని సమస్యలతో అక్కడ ఉండే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాగడానికి మంచినీళ్లు లేక రోగం వస్తే స్థానికంగా వైద్యం అందే సౌకర్యం లేక ఏడారిలో మాదిరిగా వారు బతుకుతున్నారు. పైపులైను, వాటర్ ట్యాంకు ఉన్న మంచినీళ్లు సక్రమంగా సరఫరా లేక దాహంతో అలమట్టిస్తున్నారు. ఊరికి దూరంగా ఉండే వాళ్ల గురించి మాకు ఎందుకులే అన్నట్లు మున్సిపల్ అధికారులు పట్టించుకోంవడం లేదు. దాంతో ప్రాణాలు నిలుపుకొవడానికి బయట నుంచి మంచినీళ్లు తెచ్చుకుని దాచుకుని తాగే పరిస్థితి అక్కడ ఉంది. అధ్వానంగా పారిశుద్ధ్యం టిడ్కో ఇళ్ల సముదాయం వద్ద గత ప్రభుత్వం రూ.15 కోట్లుతో ఎస్టీపీ ప్లాంట్ మంజూరు చేసింది. నిర్మాణం చేస్తున్న ఎస్టిపీ ప్లాంట్ సంవత్సరాల తరబడి నిర్మాణంలో ఉండడం అధికారులు వేగంగా నిర్మాణం పూర్తి చేయలేకపోవడంతో టిడ్కో లబ్ధిదారులకు శాపంగా మారింది. ప్లాట్లులోని టాయిలెట్స్లో వాడిన నీళ్లు బయటకు వెళ్లే మార్గం లేకపోవడంతో టాయిలెట్స్ నిండిపోయి పైకి రావడంతో దుర్వాసనను ప్లాట్లులో ఉండేవారు భరించలేకపోతున్నారు. సరైన డ్రెయినేజీ వ్యవస్ధ లేకపోవడంతో రోడ్లు వెంబడి,ప్లాట్ వద్ద మురికి నీళ్లు నిల్వ ఉండి పారిశుద్ధ్యం అధ్వానంగా మారిపోయింది. దానికి తోడు సకాలంలో తొలగించని చెత్తచెదారంతో అక్కడ వారు నరకం చూస్తున్నారు. వైద్య సేవలూ దూరం టిడ్కోలో సుమారు 1500 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. వారికి కనీస సౌకర్యాల్లో భాగంగా ఉండాల్సిన వైద్య సౌకర్యం లేదు. అక్కడ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోయింది. దాంతో రోగాలు వస్తే రెండు కీలోమీటర్లు దూరంలో ఉన్న భీమవరం పట్టణానికి రావాలసిన పరిస్థితి ఉంది. ఈ కుటుంబాల కోసం కనీసం సచివాలయం కూడా అక్కడ ఏర్పాటు చేయలేదు. ఏదైన పని ఉంటే మున్సిపాలిటికి వెళ్లాలసివస్తుంది. వేధిస్తున్న సమస్యలు టిడ్కో ఇళ్లుకు వెళ్లే ప్రధాన రహదారి గోతులతో అధ్వానంగా మారింది. ఈ రోడ్డును గత ప్రభుత్వంలో నిర్మించారు. ఈ రోడ్డు కాలువ గట్టుపై ఉండడంతో క్రమేపి దెబ్బతిన్ని గోతుల మయంగా మారింది. కనీసం ఈ రోడ్డు నిర్మాణం కూడా చేయలేదు. దాంతో టిడ్కో లభ్ధిదారులు రాకోపోకలు సాగించడానికి ఇబ్బందులు పడుతున్నారు. టిడ్కో లోపల వీధిలైట్లు వెలగడం లేదు. దాంతో చీకటిల్లో వారు ఇబ్బందులు పడుతున్నారు. టిడ్కోలో నిర్మానుషంగా ఉండే ప్రాంతంలో అసాంఘీక కార్యక్రమాలు జరుగుతుండడంతో అక్కడ వారు ఇబ్బందులు పడుతున్నారు. అలాగే భయపడుతున్నారు. వాటిపై నిఘా పెట్టి చర్యలు తీసుకునే అధికారులు లేరు. కలెక్టర్కు ఫిర్యాదు భీమవరంలో కేంద్ర మంత్రి, ఎమ్మెల్యే ఉన్నా కూడా టిడ్కో వైపు కన్నెత్తి చూసే వారు లేరు. ఓట్లు కోసం వారి వద్దకు వెళ్లిన ప్రజాప్రతినిధులు ఇప్పుడు అక్కడ వారు సమస్యలతో సమతమతం అవుతున్న పట్టించుకోవడం లేదు. అక్కడ కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నప్పటికి అటు ప్రజాప్రతినిధులు గాని ఇటు అధికారులు గాని పట్టించుకొవడం లేదు. అయితే సమస్యలు భరించలేక సోమవారం జిల్లా కలెక్టరేట్లో జరిగిన పీజీఆర్ఎస్కు పెద్ద సంఖ్యలో మహిళలు వెళ్లీ కలెక్టర్ నాగరాణికి మొరపెట్టకున్నారు. మంచినీళ్లు, టాయిలెట్స్ డ్రెయినేజి సమస్య, రోడ్డు, చెత్త, పారిశూద్ధ్యం సమస్యలతో తాము అక్కడ బతకలేకపోతున్నామని సమస్యలతో నిత్యం నరకం చూస్తుమని సమస్యల పరిష్కరించి రక్షించాలని కలెక్టర్ను వేడుకున్నారు. టిడ్కో ఇళ్ల సముదాయంలో గత 8 నెలలగా మంచినీటి సమస్యతో తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. పైపులైన్, మంచినీటి ట్యాంకు ఉన్నా కూడా మాకు మంచినీళ్లు సరఫరా అనేది సక్రమంగా జరగడం లేదు. దాంతో దహం తీర్చుకోవడానికి బయట నుంచి మంచినీళ్లు తెచ్చుకుంటున్నాం. – ఎస్. మురళీ, టిడ్కో నివాసి భీమవరం సరైన డ్రెయినేజీ వ్యవస్థ లేక టిడ్కో ప్లాట్లు ఉండే టాయిలెట్స్ నిండిపోయి భరించలేకపోతున్నాం. దుర్వాసనతో ఇబ్బందులు పడుతున్నాం. బయట చూస్తే చెత్తచెదారం, అధ్వానంగా డ్రెయినేజీ నీళ్లు, దోమలతో సమతమతం అవుతున్నాం. మా సమస్యలను ఇప్పటికై నా పరిష్కరించాలి. – కె.రామకుమారి, టిడ్కో నివాసి -
ఏఐపై ఎస్పీ శివకిషోర్ ప్రజెంటేషన్
ఏలూరు టౌన్: హైదరాబాద్ సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో ఏలూరు జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ (ఏఐ)పై ప్రత్యేకంగా ప్రజెంటేషన్ ఇచ్చారు. నేర పరిశోధన, పోలీసింగ్ వ్యవస్థలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అనుసంధానించే లక్ష్యంతో జాతీయ పోలీస్ అకాడమీలో చేపట్టిన ఉన్నతస్థాయి వర్క్షాప్లో ఆయన తనదైన శైలిలో కీలక ప్రసంగం చేశారు. పోలీస్ వ్యవస్థలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం జోడిస్తూ తన అపార అనుభవంతో ఏఐతో నేర పరిశోధనలో విప్లవాత్మక మార్పులను తెచ్చిన విధానాలపై జిల్లా ఎస్పీ శివకిషోర్ ప్రజెంటేషన్ ఇచ్చారు. డేటా విశ్లేషణతో నేరాలు జరగక ముందే పసిగట్టటం, అత్యాధునిక పరికరాలతో డిజిటల్ సాక్ష్యాధారాలను పగడ్భందీగా సేకరించటం వంటివాటిని వివరించారు. జిల్లాలో ఏఐను వినియోగిస్తున్న తీరును వివరించారు. -
ప్రమోద్వర్మ ఆచూకీ కోసం గాలింపు
గణపవరం: పిప్పరలో ఉండి పంట కాల్వలో ఈతకు దిగి గల్లంతైన ప్రమోద్వర్మ ఆచూకీ కోసం గాలింపు ముమ్మరంగా జరుగుతుంది. ఆదివారం సాయంత్రం పిప్పర గ్రామానికి చెందిన భూపతిరాజు సుశాంతవర్మ(10), ఇందుకూరి ప్రమోద్వర్మ(11) సరదాగా ఈతకోసం కాల్వలోకి దిగి గల్లంతైన విషయం తెలిసిందే. చీకటిపడినా ఇంటికి రాకపోవడంతో గ్రామంలో వెతికిన కుటుంబసభ్యులకు వీరు కాల్వలో ఈతకుదిగి మునిగిపోయిన విషయం తెలిసింది. వలలతో కాల్వలో గాలించగా సుశాంత్వర్మ మృతదేహం రాత్రి ప్రమాద ప్రదేశానికి కొద్దిదూరంలోనే లభించింది. ప్రమోద్వర్మ ఆచూకీ కోసం గాలించినా లభించలేదు. సోమవారం ఉదయం నుంచి గాలింపు కొనసాగిస్తున్నారు. గణపవరం ఎస్ఐ సంఘటనా స్థలంలో ఉండి గాలింపు చర్యలు పర్యవేక్షిస్తున్నారు. యండగండి లాకులను మూసివేశారు. పిప్పరనుంచి దాదాపు ఏడెనిమిది కిలోమీటర్ల దూరం వరకూ గాలింపు కొనసాగుతుంది. ఉండి పంటకాల్వలో ఈతకు దిగి మృతిచెందిన, గల్లంతైన బాలుర కుటుంబ సభ్యులను ఉంగుటూరు ఎమ్మెల్యే పి.ధర్మరాజు సోమవారం పరామర్శించారు. -
ఉత్తమ ప్రదర్శనగా అమ్మ చెక్కిన బొమ్మ
పాలకొల్లు సెంట్రల్: పాలకొల్లు కళాపరిషత్ ఆధ్వర్యంలో గత మూడు రోజులుగా జరిగిన జాతీయ స్థాయి నాటికల పోటీలు ఆదివారం రాత్రి ముగిశాయి. ఈ మూడు రోజులు ప్రదర్శనలో ఏడు నాటికలను ప్రదర్శించారు. వీటిలో గోవాడ క్రియేషన్స్ హైదరాబాద్ వారి అమ్మ చెక్కిన బొమ్మ ఉత్తమ ప్రదర్శనగా నిలిచింది. ద్వితీయ ఉత్తమ ప్రదర్శనగా చైతన్య కళాభారతి కరీంనగర్ ఖరీదైన జైళ్లు, తృతీయ ఉత్తమ ప్రదర్శనగా అభినయ ఆర్ట్స్ సహన, జ్యూరీ ప్రదర్శనగా ఉషోదయ కళానికేతన్ కట్రపాడు వారి మంచి మనసులు నాటికలు ఎంపికయ్యాయి. ఉత్తమ నటుడిగా గంగోత్రి సాయి, ఉత్తమ నటిగా బి.నాగరాణి, ప్రతి నాయకుడిగా అద్దేపల్లి లక్షణశాస్త్రి, ఉత్తమ హాస్యనటుడిగా టి.సుబ్బారావు ఎన్నికయ్యారు. న్యాయ నిర్ణేతలుగా లండ రుద్రమూర్తి బిలాయి, గెద్ద వరప్రసాద్ విజయనగరం, గుత్తు చిన్నారావు, శ్రీకాకుళం వ్యవహరించారు. కళాపరిషత్ అధ్యక్షులు కేవీ కృష్ణవర్మ, మానాపురం సత్యనారాయణ, మేడికొండ శ్రీనివాసరావు, విఠాకుల రమణ, జక్కంపూడి కుమార్, కొనిజేటి గుప్త, రెడ్డి వాసు పాల్గొన్నారు. -
ఉత్తమ హాస్య నాటికగా ఎంపిక
పాలకొల్లు సెంట్రల్: పాలకొల్లు) పట్టణానికి చెందిన విశ్రాంత డిప్యూటీ తహశీల్దార్, రచయిత వీరా పోతన రచించిన భలేటి నమూనా జూస్కో నాటిక ఆరవింద ఆర్ట్స్ సంస్థ ఎంపిక చేసిన 50 ఉత్తమ హాస్య, వ్యంగ్య నాటికల్లో ఒకటి ఎంపికై ంది. 50 నాటికల్లో తాను రచించిన వ్యంగ్య నాటిక ఎంపికవడం అదృష్టంగా భావిస్తున్నానని పోతన తెలిపారు. ఆదివారం రాత్రి హైదరాబాద్ తెలుగు యూనివర్సిటీలో పుస్తకాన్ని ప్రముఖ సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ చేతుల మీదుగా ఆవిష్కరించారన్నారు. పోతన నాటిక ఎంపిక పట్ల పట్టణంలో కళాకారులు, కళాభిమానులు, అభినందనలు తెలిపారు. దెందులూరు: అనుమానాస్పద స్థితిలో యువతి మృతి చెందింది. సానిగూడెం గ్రామానికి చెందిన వేముల తిరుపతమ్మ(19) ఇంటి వద్ద ఎవరూ లేరు సమయంలో సోమవారం ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. గమనించిన బంధువులు ఆమెను ఏలూరు సర్వజన ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు. భీమవరం: యూత్ హాస్టల్స్ అసోసియేషన్ అఫ్ ఇండియా(వైహెచ్ఏఐ) భీమవరం యూనిట్ వరుసగా మూడేళ్లుగా రాష్ట్ర స్థాయి అత్యుత్తమ సంఘంగా ఎంపికై ంది. ఈ సందర్బంగా ఆదివారం అరకు సమీపంలో గిరిజన గ్రామదర్శినిలో భీమవరం యూనిట్కు ఉత్తమ యూత్ హాస్టల్ పురస్కారం అందించినట్లు భీమవరం డిస్ట్రిక్ట్ యూనిట్ చైర్మన్ మట్లపూడి సత్యనారాయణ చెప్పారు. ఉండి: అసలే మండుటెండలు ఆపై మొరాయిస్తున్న ఆర్టీసీ బస్సులు... ఆదివారం ఒకటి, సోమవారం మరొకటి. సోమవారం ఉండి సెంటర్లో భీమవరం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు నిలిచిపోయింది. చేసేది లేక బస్సులోని ప్రయాణికులు బస్సును నెట్టడంతో కొంతసేపటికి నెమ్మదిగా స్టార్ట్ అయ్యింది. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని అధికారులు బస్సు కండీషన్ను పరిశీలించాలని బస్సులు ఆగిపోతే ప్రయాణికుల పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. పాలకోడేరు: ఇంటికి తాళాలు వేసి పెళ్లికి వెళ్లి వచ్చేసరికి బంగారం, వెండి అపహరించుకుపోయారు. బాధితుల కథనం ప్రకారం శృంగవృక్షంలోని సాయిబాబా గుడి పక్కన ఉంటున్న కచ్చెట్టి అలివేలు మంగతాయారు, భర్త, కూతురితో కలిసి ఈ నెల 10న బంధువుల ఇంటికి పెళ్లికి వెళ్ళారు. మళ్లీ 13న వచ్చేసరికి ఇంటి తాళాలు బద్ధలుకొట్టి, బంగారం, వెండి, నగదు అపహరించుకు పోయినట్లు గుర్తించారు. 7 కాసుల బంగారం వస్తువులు, 40 తులాల వెండి ఆభరణాలు, 17 వేల నగదు అపహరించుకు పోయారని వీటి విలువ రూ.10 లక్షలు ఉంటుందని బాధితులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. భీమవరం: అప్పుగా తీసుకున్న రూ.3 లక్షలు ఇవ్వమని అడిగితే కొట్టారని ఎన్.పద్మ ఫిర్యాదు చేశారని రెండో పట్టణ పోలీసులు తెలిపారు. చినఅమిరంలో ఉంటున్న పద్మ బి.సునీల్, నాగలక్ష్మికి రూ. 3 లక్షలు అప్పుగా ఇచ్చారు. డబ్బు ఇవ్వమని గత ఏడాది డిసెంబరు 12న అడగ్గా అసభ్య పదజాలంతో తిడుతూ, చంపేస్తామని బెదిరించారు. విషయాన్ని పెద్దల సమక్షంలో పరిష్కరించుకునేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. -
చికిత్స పొందుతూ వివాహిత మృతి
జంగారెడ్డిగూడెం: చికిత్స పొందుతూ వివాహిత మృతిచెందినట్లు ఎస్సై ఎన్వీ ప్రసాద్ తెలిపారు. పట్టణానికి చెందిన నాయుడు దుర్గారావు, మధుశ్రీ(26)లు స్థానిక ఎస్సీపేటలో ఉంటుంన్నారు. ఈ నెల 8వ తేదీన మధుశ్రీ పిల్లలు మట్టి తింటుండగా చూసిన అత్త పార్వతి మధుశ్రీని మందలించింది. దీంతో మనస్తాపానికి గురైన మధుశ్రీ ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆతహత్యాయత్నానికి పాల్పడింది. గమనించిన భర్త దుర్గారావు, కుటుంబసభ్యులు మధుశ్రీని స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మధుశ్రీని గుంటూరు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మధుశ్రీ మృతిచెందింది. భర్త ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
హ్యాండ్బాల్ పోటీలకు ఎంపిక
భీమవరం: సౌత్జోన్ హ్యాండ్బాల్ పోటీలకు భీమవరం విష్ణు ఇంజనీరింగ్ కళాశాల విద్యార్ధి షేక్ ఖాసిం ఎంపికై నట్లు కళాశాల ఫిజికల్ డైరెక్టర్ ఎం.శ్రీనివాసరావు చెప్పారు. కళాశాలలో సోమవారం విద్యార్థిని అభినందించారు. ఈనెల 15న జెఎన్టీయూకే హ్యాండ్బాల్ సెలక్షన్స్ నిర్వహించగా తమ విద్యార్ధి ఎంపికై నట్లు తెలిపారు. ఈ నెల 17 నుంచి వారం రోజుల పాటు తమిళనాడులో నిర్వహించే సౌత్జోన్ హ్యాండ్బాల్ పోటీల్లో పాల్గొంటాడన్నారు. పాలకోడేరు: మండలంలోని కొండేపూడి శివారు వరిపొలాల్లో పేకాట ఆడుతుండగా పోలీసులు దాడి చేసి 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం కొండేపూడి శివారులో పేకాట ఆడుతున్నారన్న సమాచారం మేరకు ఎస్సై తన సిబ్బందితో దాడి చేసి 8 మంది జూదరులను అదుపులోకి తీసుకొని వారి నుంచి రూ.4,200 నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై ఎం.రవివర్మ తెలిపారు. -
ఇలాగైతే నిత్యం ప్రమాదాలే..
ఉండి: ఒకవైపు జిల్లా ఉన్నతాధికారులు ఆక్వాచెరువుల తవ్వకానికి అనుమతులు లేవంటున్నా.. మండలంలో చెరువుల తవ్వకం మాత్రం ఆగడం లేదు. ఇదేంటని ఎవరైనా అడిగితే మాత్రం ఎప్పుడో చెరువు తవ్వుకునేందుకు అనుమతులు తీసేసుకున్నాం అంటున్నారు. ఉండి మండలం పెదపుల్లేరులో ఇటీవలే ఆక్వాచెరువు తవ్వారు. ఏకంగా ఆర్అండ్బీ రోడ్డు మార్జిన్ వరకు తవ్వకం చేశాడు. చెరువు రోడ్డు మార్జిన్ను ఆనుకుని ఉండటంతో వాహనదారులు ఆందోధోళన చెందుతున్నారు. రాత్రి సమయంలో చీకటిగా వుండటంతో ఆటోలు, ద్విచక్రవాహనాలు, కార్లు ప్రమాదానికి లోనయ్యే అవకాశాలు ఉన్నాయని వాపోతున్నారు. ఈ రహదారి పెదపుల్లేరు గ్రామం నుంచి ప్రారంభమై శివారు ప్రాంతం మేడవరం మీదుగా కాళ్ళ మండలం కోమటిగుంట, సీసలి గ్రామాలలో నుంచి జువ్వలపాలెం రాష్ట్ర రహదారికి చేరుకుంటుంది. కాళ్ళ మండలంలోని రెండు గ్రామాలతో పాటు ఉండి, భీమవరం తదితర ప్రాంతాలకు వెళ్ళే వాహనదారులు ఈ రోడ్డులో ప్రయాణాలు సాగిస్తుంటారు. దీనిపై సిబ్బందిని ఆరాతీయగా సదరు రైతుకు అనుమతి ఉందంటూ సమాధానమిచ్చారు. సదరు రైతు కూటమి పార్టీకి చెందినవారని సమాచారం. సాధారణ ప్రజలు రోడ్డు పక్కగా నివాసముంటేనే ఆక్రమణలు అంటూ తొలగించేస్తున్నారు.. మరి కూటమి నాయకులు రోడ్డుకు చేర్చి చెరువులు తవ్వేస్తే పట్టించుకోరా? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. దీనిపై మత్స్యశాఖ అధికారి ఎఫ్డీఓ సీహెచ్ రాంబాబును ఆరా తీయగా తాను ఎవరికీ అనుమతి ఇవ్వలేదని గతంలో అనుమతి తెచ్చుకుంటే మాత్రం ఐదేళ్ళ వరకు వ్యాలిడిటీ ఉంటుందని తెలిపారు. నిబంధనల మేరకు తవ్వకం చేయాలని లేకుంటే చర్యలు తీసుకుంటామని అన్నారు. పెదపుల్లేరు చెరువును పరిశీలిస్తానని అన్నారు. -
అధికారం అండతో పొట్టగొట్టారు
● దళిత రైతుపై దారుణం ● మామిడి తోట నరికేసి.. గ్రావెల్ తరలించుకుపోయిన వైనం ఆగిరిపల్లి (ఏలూరు): అధికారం ఉందనే అహంకారంతో, మంత్రి పార్థసారథి అండ చూసుకుని నిరుపేద దళిత రైతు రమేష్ మామిడి తోట నరికేయడంతోపాటు అందులోని గ్రావెల్ అక్రమంగా తవ్వేసి లారీల్లో తరలించుకుని సొమ్ము చేసుకోవడం దారుణమని వైఎస్సార్సీపీ నేత, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గుడిమళ్ల కృష్ణంరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. దళిత రైతుకు మద్దతుగా టీడీపీ నేతల దురాగతాన్ని తీవ్రంగా ఖండించారు. ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం చొప్పరమెట్ల రెవెన్యూ పరిధిలో వలస గట్టు దిగువన ఉన్న దళిత రైతు గుడ్డేటి రమేష్కు చెందిన ఎకరం 96 సెంట్ల మామిడి తోటను రైతు ఊరిలో లేని సమయంలో అధికార పార్టీ నాయకులు వారం రోజుల నుంచి నరికేసి... జేసీబీలతో గ్రావెల్ తవ్వి లారీల్లో తరలించి సొమ్ము చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ సమాచారం తెలుసుకున్న నూజివీడు నియోజకవర్గ వైఎస్సార్సీపీ నాయకులు సోమవారం రైతు భూమిని పరిశీలించారు. ఈ సందర్భంగా కృష్ణంరాజు మాట్లాడుతూ రైతు మామిడి తోటను నాశనం చేసిన అధికార పార్టీ నాయకులను వెంటనే అరెస్ట్ చేసి, బాధితుడికి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు పల్లగాని నరసింహారావు, రైతు సంఘం అధ్యక్షుడు ఈలప్రోలు సుబ్బయ్య మాట్లాడుతూ అధికార పార్టీ నాయకులు మంత్రి అండదండలు చూసుకుని మండలంలో విచ్చలవిడిగా గ్రావెల్ తరలిస్తున్నారని ఆరోపించారు. అక్రమ మైనింగ్తో లక్షలాది రూపాయలు సొమ్ము చేసుకుంటున్నా రెవెన్యూ, మైనింగ్, పోలీస్ అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. మామిడి తోట ఎందుకు నరికారని రైతు ప్రశ్నిస్తే.. ‘మామిడి తోట కొన్నాను.. ఇది నాది’ అంటూ తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు నక్కనబోయిన వేణు బాధిత రైతును బెదిరిస్తున్నాడని చెప్పారు. ‘ఒకవేళ వేణు కొంటే రైతు దగ్గర పట్టాదారు పాసుపుస్తకం ఎలా ఉంది’ అని వారు ప్రశ్నించారు. ఇప్పటికై నా కలెక్టర్ స్పందించి మామిడి తోటను ధ్వంసం చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులపై కేసు నమోదు చేయించి, నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ఘటనాస్థలిని సందర్శించినవారిలో వైఎస్సార్సీపీ నేతలు శీలం రాము, పావన జ్యోతి సుజన కుమారి, పోలిమెట్ల శివ, పిల్లా చరణ్, భాస్కర్ ప్రసాద్, గుర్రం శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
మట్టి మాఫియా ఆగడాలు
పెనుగొండ: అధికార పార్టీ మద్దతు, అధికార యంత్రాంగం చేతులు తడిపేశాం మనల్ని ఎవడు ఆపేది అంటూ మట్టి మాఫియా రేచ్చిపోతోంది. ఆచంట వేమవరంలో నక్కల డ్రెయిన్ లంక భూమి తవ్వకాలపై నిరసనలు వ్యక్తం చేస్తున్నా యథేచ్చగా తవ్వకాలు జరుపుతున్నారు. గత ఏడాది వేసవి కాలంలోనూ యలమంచిలి మండలంలో ఏటిగట్టు పనుల నెపంతో నక్కల డ్రెయిన్ గట్టును తవ్వేసారు. రైతులు, ప్రజల నుంచి తీవ్ర నిరసన వ్యక్తం కావడంతో తవ్వకాలు నిలిపివేశారు. అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారు. గత తవ్వకాల వల్ల వర్షాకాలంలో నక్కల డ్రెయిన్లో వరద నీటితో ఆచంట వేమవరంలోని పలు వరిచేలు ముంపుకు గురయ్యాయి. దీంతో రైతులు రెండు మూడు సార్లు వరి నాట్లు వేసుకోవలసిన పరిస్థితి. సర్పంచ్ జక్కంశెట్టి చంటి, స్థానిక రైతులు తవ్వకాల వద్ద నిరసన చేపట్టారు. పలువురు రైతులు మాజీ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు దృష్టికి సైతం తీసుకు వెళ్లడంతో, తవ్వకాల ప్రాంతానికి వచ్చి పరిశీలించారు. తవ్వకాలు జరిపి రైతులను ఇబ్బందులకు గురి చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరికలు చేశారు. రైతులు హెచ్చరికలు, నిరసనలు బేఖాతరు చేస్తూ మట్టి తవ్వకాలు కొనసాగిస్తున్నారు. వందలాది వాహనాల్లో జేసీబీలతో యథేచ్చగా మట్టి తవ్వకాలు సాగిస్తుండడంతో సోమవారం రైతులు మరోసారి నిరసన గళం విప్పారు. ఆచంట వేమవరం సర్పంచ్ జక్కంశెట్టి చంటి ఆధ్వర్యంలో పలువురు రైతులు అధికారులకు ఫోన్లో సమాచారం ఇచ్చి తవ్వకాలకు అనుమతులు ఇచ్చారా? అంటూ ప్రశ్నించారు. ఎలాంటి అనుమతులు లేవంటూ అధికారులు తేల్చి చెప్పారు. దీంతో చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. నీటి పారుదల శాఖ, డ్రెయిన్స్ శాఖ అధికారులు ఆ ప్రాంతానికి వచ్చి పరిశీలించారు. తవ్వకాలకు అనుమతులు లేకపోయినా తవ్వకాలు జరుగుతుండడంతో రెండు జేసీబీలను, ఆరు లారీలను అదుపులోకి తీసుకొన్నారు. -
రొయ్యల ధరలపై యుద్ధ ప్రభావం
భీమవరం: ఇజ్రాయిల్, అమెరికా, ఇరాన్ యుద్ధం కారణంగా ఆక్వా రంగానికి తీవ్ర నష్టం ఏర్పడిందని ఫీడ్ ధరలు పెంచేసి రొయ్యలు, చేపలు రేట్లు తగ్గించేశారని ఆంధ్రప్రదేశ్ రైతు కార్యాచరణ సమితి అధ్యక్షుడు పాతపాటి మురళీరామరాజు ఆవేదన వ్యక్తం చేశారు. భీమవరంలో సమితి గౌరవాధ్యక్షుడు కలిదిండి గోపాలకృష్ణంరాజు నివాసం వద్ద నిర్వహించిన రైతు కార్యాచరణ సమితి సమావేశంలో ఆయన మాట్లాడారు. రొయ్యలు, చేపల ఎగుమతులు నిలిచిపోవడాన్ని సాకుగా చూపి వ్యాపారులు ధరలు తగ్గించారన్నారు. మరో పక్క మేత ధరలు రోజు రోజుకు పెరిగిపోవడం పెట్టుబడులు పెరిగి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని మురళీరామరాజు ఆందోళన వ్యక్తం చేశారు. యుద్దం మరిన్ని రోజులు కొనసాగుతాయంటూ వ్యాపారులు ప్రచారం చేసి తక్కువ కౌంట్లోనే రొయ్యల పట్టుబడిపట్టే విధంగా ప్రోత్సహిస్తున్నారన్నారు. ఆక్వా రైతులందరికీ సబ్సిడీపై విద్యుత్ అందిస్తామని హామీ ఇచ్చినా ఎక్కడా సక్రమంగా అమలు కావడం లేదన్నారు. ఆక్వారంగాన్ని ఆదుకోవాలని మురళీరామరాజు కోరారు. ఈ సమావేశంలో పీఎ రామకృష్ణరాజు, సమితి ప్రధాన కార్యదర్శి తమ్మినీడి నాగేశ్వరరావు, కోశాధికారి గొట్టుముక్కల భీమరాజు తదితరులు పాల్గొన్నారు. -
నరసాపురంలో నయా దందా
నరసాపురం: నరసాపురం పాత అంబేశ్వరా థియేటర్ సమీపంలో కనకం సత్యవాణి తన ఇంటికి తాళం వేసి గుమ్మం ఎదుట మూడురోజులుగా కాపలా కాయడం చర్చనీయాంశమైంది. ఒంటరి మహిళలు టార్గెట్గా కొన్ని కబ్జా ముఠాలు తీరప్రాంతంలో ఎలా పేట్రేగిపోతున్నాయో దీంతో వెలుగులోకి వచ్చింది. బాధిత మహిళ పోలీసులు, అధికార పార్టీ నేతలను కలిసి తన బాధ వెళ్లబోసుకున్నా.. నీ ఇల్లు కబ్జా అయ్యింది, ఏదోరకంగా సెటిల్ చేసుకో అంటూ ఉచిత సలహాలు ఇస్తున్నారు. భర్త పోయి ఇద్దరు ఆడపిల్లలతో బతుకుతున్న తన ఇంటిని కాపాడాలని సత్యవాణి వేడుకుంటుంది. సత్యవాణి భర్త చనిపోవడంతో తన ఇల్లు 2023లో బేరం పెట్టింది. లిఖితపూడికి చెందిన యాదంరెడ్డి లక్ష్మి, ఆమె భర్త ఇల్లు కొనుగోలు చేస్తామని రూ.63 లక్షలకు బేరం కుదుర్చుకుని రూ.2 లక్షలు అడ్వాన్స్గా ఇచ్చినట్టు సత్యవాణి చెప్పారు. నెలరోజుల తరువాత రిజిస్ట్రేషన్ పెట్టుకుంటామని అప్పటివరకూ ఇంట్లో ఇద్దెకు ఉంటామని దిగి అప్పటి నుంచి ఇంటి ఇద్దె ఇవ్వకుండా, రిజిస్ట్రేషన్ చేయించుకోకుండా, ఇళ్లు ఖాళీ చేయకుండా ఏడిపిస్తున్నారు. తన ఇల్లు ఖాళీ చేయంచేందుకు సత్యవాణి అనేక ప్రయత్నాలు చేసింది. ఆర్డీవోకు ఫిర్యాదు చేయడంతో పాటు పోలీసులను ఆశ్రయించారు. అయినా ఫలితం లేకపోయింది. పైగా ఎదురు కేసులు పెట్టిస్తున్నారని సత్యవాణి చెబుతున్నారు. కొందరు స్థానిక టీడీపీ నాయకులను కలిస్తే.. నీ ఇల్లు కబ్జా అయ్యిందమ్మా.. సెటిల్ చేసుకోమని సలహాలు ఇస్తున్నారని వాపోయింది. తాజాగా మూడురోజుల క్రితం రూ 1.50 లక్షలు ఇస్తే ఇళ్లు ఖాళీ చేస్తామని చెప్పి డబ్బులు తీసుకుని కొన్ని సామాన్లు తీసుకుని మళ్లీ అడ్డం తిరిగి రూ.5 లక్షలు డిమాండ్ చేయడమే కాకుండా తనపై కేసు పెట్టారన్నారు. దీంతో ఇంటికి తాళం వేసి మూడురోజులుగా కాపలా కూర్చుంటానని వాపోయారు. తీరంలో ఒంటరి మహిళలను టార్గె చేసుకుని రాజకీయ అండదండలతో కొన్ని ముఠాలు ఇస్టానుసారం కబ్జాల పర్వం సాగిస్తున్నారు. ఇళ్లలో అద్దెకు దిగి కబ్జాలు చేయడంతో పాటు దూరప్రాంతాల్లో స్థిరపడిన వారి ఖాళీ స్థలాలు ఆక్రమించడం, వివాదాల్లో ఉన్న భూములను అన్యాక్రాంతం చేసుకోవడం చేస్తున్నారు. ఈ వ్యవహారం మరింత ముదరక ముందే అధికారులు చర్యలు చేపడతారా? ఒత్తిళ్లకు తలొగ్గి ఊరుకుంటారా? అనేది వేచి చూడాలి. ఒంటరి మహిళలే టార్గెట్గా ఇళ్లు కబ్జా -
ఓవరాల్ చాంపియన్గా వెంకట్రామన్నగూడెం
తాడేపల్లిగూడెం: మూడు రోజుల పాటు ఉద్యాన వర్సిటీ వెంకట్రామన్నగూడెంలో జరిగిన 12వ అంతర్ కళాశాలల పోటీల్లో వెంకట్రామన్నగూడెం జట్లు ఓవరాల్ చాంపియన్గా నిలిచాయి. రిలే పోటీలు, బాస్కెట్బాల్, కబడ్డీ, జావెలిన్ త్రో, డిస్కస్ త్రో వంటి అన్ని పోటీల్లో అత్యుత్తమ కనపర్చిన వీఆర్గూడెం ఉద్యాన కళాశాల జట్లు విజయకేతనం ఎగురవేశాయి. ఆదివారం రాత్రి ముగింపు సందర్బంగా ట్రోఫీలను ఉద్యానవర్సిటీ ఉపకులపతి డాక్టర్ కె.ధనుంజయరావు, రిజిస్ట్రార్ ఎం.మాధవి, డాక్టర్ చలపతిరావు తదితరులు అందజేశారు. -
పరీక్షకు ముందు రోజు కలిసిన అన్నదమ్ములు
పాలకొల్లు సెంట్రల్: ‘మా తమ్ముడిని.. నన్నూ కలపండి’ శీర్షిన ఈనెల 5న ‘సాక్షి’లో ప్రచురించిన కథనానికి అధికారులు స్పందించారు. పల్నాడు జిల్లా వినుకొండకు చెందిన బాలలు మర్రి కోటి శ్రీహర్ష, విశ్వాంత్ పాలకొల్లులో మేనమామ కొమిరిశెట్టి నరేష్ ఇంటి వద్ద ఉంటుండగా.. పిల్లల చిన్నాన్న రఘునాథ్ వారిని వినుకొండ తీసుకువెళ్లి నిర్బంధించగా నరేష్ కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. అధికారులు స్పందించి శ్రీహర్షను పాలకొల్లు పంపించేలా చర్య లు తీసుకున్నారు. అయితే విశ్వాంత్ను అక్కడే బంధించడంతో తమ్ముడిపై బెంగతో శ్రీహర్ష పరీక్షలకు సిద్ధం కాలేకపోయాడు. దీనిపై ‘సాక్షి’ కథనాన్ని ప్ర చురించగా చైల్డ్ వెల్ఫేర్ అధికారులు స్పందించారు. వినుకొండలో ఉన్న పిల్లల చిన్నాన్నను పిలిచి విచారించారు. విశ్వాంత్ను వెంటనే పాలకొల్లు పంపించాలని ఆదేశించారు. దీంతో మేనమామ నరేష్ ఆదివారం వినుకొండ వెళ్లి విశ్వాంత్ను ఇంటికి తీసుకువచ్చారు. పదో తరగతి పరీక్షలకు ఒక్కరోజు ముందు తమ్ముడు తన వద్దకు రావడంతో శ్రీహర్ష ఆనందంతో పొంగిపోయాడు. అధికారులకు, ‘సాక్షి’కి కృతజ్ఞతలు తెలిపాడు. -
కార్యదర్శులకు పన్నుపోటు
● పన్ను వసూళ్లకు ఒత్తిళ్లు ● సర్వేల భారం ● ఆందోళనలో కార్యదర్శులు యలమంచిలి: పంచాయతీ కార్యదర్శులు విధి నిర్వహణలో ఒత్తిళ్లకు గురవుతున్నారు. రోజువారీ విధులతో పాటు సర్వేలు భారంగా మారాయి. ఇదిలా ఉండగా పన్నుల వసూలు బాధ్యతలను అప్పగించడంతో సతమతమవుతున్నారు. ఉద్యోగుల కొరతతో ఒక్కో కార్యదర్శి రెండు నుంచి ఐదు గ్రామాల బాధ్యతలు చూసుకోవాల్సి వస్తోంది. చంద్రబాబు ప్రభుత్వంలో గ్రామ సచివాలయ వ్యవస్థను ఛిన్నాభిన్నం చేయడం, ఉద్యోగులను ఇతర శాఖలకు బదలాయించడంతో సర్వేల భారం కార్యదర్శులపై పడింది. అలాగే పన్ను వసూళ్లకు టార్గెట్ విధించడం, నెలాఖరులోపు నూరు శాతం వసూలు చేయాలని ఆదేశించడంతో కార్యదర్శులు ఆవేదన చెందుతున్నారు. ఇంటింటా తిరుగుతూ.. జిల్లాలోని 20 మండలాల్లో 3,35,182 పన్ను అసెస్మెంట్లు పూర్తిచేయాల్సి ఉండగా సోమవారం ఉదయం నాటికి 83.17 శాతం వసూలు చేసినట్టు గణాంకాలు చెబుతున్నాయి. మిగిలిన బకాయిలను నెలాఖరులోపు చెల్లించాలని ఒత్తిడి చేయడంతో ప్రజలకు అవస్థలు తప్పడం లేదు. ఆన్లైన్ విధానంతో సాంకేతిక సమస్యలు ఎదురవడం, సమయం తక్కువ ఉండటంతో కార్యదర్శులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. గ్రామాల్లో ఇంటింటా తిరుగుతూ పన్ను వసూలు చేస్తున్నారు. దీంతో పాటు ఫ్యామిలీ యూనిఫైడ్ సర్వే, బంగారు కుటుంబ సర్వే వంటి సర్వేలు చేస్తున్నారు. గత ప్రభుత్వంలో ఎంతో మేలు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా పాలన సాగించేవారు. సచివాలయాల్లోని ఉద్యోగులకు నిర్దిష్ట విధులను కేటాయించారు. దీంతో సర్వేలు, తదితర పనులను ఆయా ఉద్యోగులు నిర్వర్తించేవారు. అయితే చంద్రబాబు ప్రభుత్వం పంచాయతీ అధికారులపై కక్షపూరిత వాతావరణంలో సర్వేలు చేయించడం ఎంత వరకు సమంజసమో అర్థం కావడం లేదని పలువురు కార్యదర్శులు ఆవేదన చెందుతున్నారు. మండలాలు 20 అసెస్మెంట్లు 3,35,182 పాత బకాయిలు రూ.249.89 లక్షలు కరెంట్ డిమాండ్ రూ.3,935.55 లక్షలు మొత్తం డిమాండ్ రూ.4,185.44 లక్షలు ఇప్పటివరకూ వసూలు రూ.3,480.93 లక్షలు వసూలు శాతం 83.17 వసూలు చేయాల్సింది రూ.704.51 లక్షలు -
అర్జీలను వేగంగా పరిష్కరించాలి
భీమవరం(ప్రకాశం చౌక్): పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్ అర్జీలను వేగంగా పరిష్కరించాలని కలెక్టర్ సీహెచ్ నాగరాణి అన్నారు. కలెక్టరేట్లో సోమవారం జిల్లాస్థాయి పీజీఆర్ఎస్లో భాగంగా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. పీజీఆర్ఎస్లో 141, రెవెన్యూ క్లినిక్లో 26 అర్జీలు స్వీకరించారు. జేసీ టి.రాహూల్కుమార్రెడ్డి, అధికారులు పాల్గొన్నారు. అర్జీల్లో కొన్ని.. ● పెనుమంట్రలో గోస్తని నదిని ఆనుకుని ఉన్న శ్మశాన వాటిక వర్షాకాలంలో ముంపునకు గురవుతోందని, చర్యలు తీసుకోవాలని బీసీ–డీ కులస్తులు వినతిపత్రం అందించారు. ● తమ గ్రామంలో పొలాలకు నీరందించే పంచాయతీ చెరువును లీజుకు ఇచ్చేయడంతో సాగునీటి ఇబ్బందులు తలెత్తాయని, ఇప్పటికీ ఐదుసార్లు పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేసినా పరిష్కారం లభించలేదని మొగల్తూరు మండలం రామన్నపాలేనికి చెందిన దాసరి గోపాలకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. చొక్కాకు చంద్రబాబు హమీ, పీజీఆర్ఎస్కు సమస్య మళ్లీ రా కూడదని చంద్రబాబు చెప్పిన పేపర్ క్లిప్ంగ్తో ఆయన కలెక్టరేట్కు వచ్చారు. -
అమరజీవికి ఘన నివాళి
భీమవరం (ప్రకాశంచౌక్): అమరజీవి పొట్టి శ్రీరాములు తెలుగు ప్రజల గౌరవం, స్వాభిమానానికి ప్రతీకగా నిలిచిన మహనీయులని కలెక్టర్ సీహెచ్ నాగరాణి అన్నారు. కలెక్టరేట్లో సోమవారం పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అమరజీవి గొప్పత నాన్ని కలెక్టర్ గుర్తుచేశారు. అలాగే కలెక్టరేట్ ఆవరణలోని అమరజీవి విగ్రహానికి జేసీ టి.రాహుల్కుమార్రెడ్డి, డీఆర్వో బి.శివన్నారాయణరెడ్డి, జిల్లా అధికారులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రశాంతంగా టెన్త్ పరీక్షలు భీమవరం: జిల్లాలో పదో తరగతి పరీక్షలు సోమవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. స్థానిక పొట్టిశ్రీరాములు మున్సిపల్ బాలికల పాఠశాలలో కేంద్రాన్ని కేంద్రాన్ని కలెక్టర్ సీహెచ్ నాగరాణి ఆకస్మికంగా తనిఖీ చేసి పరీక్షల నిర్వహణను పరిశీలించారు. పరీక్షలకు పక్కా ఏర్పాట్లు చేసినట్టు ఆమె చెప్పారు. విద్యార్థులు ఎటువంటి ఆందోళనకు గురికాకుండా పరీక్షలు రాయాలన్నారు. డీఈఓ ఈ.నారాయణ ఉన్నారు. 132 కేంద్రాల్లో.. జిల్లాలోని 132 కేంద్రాల్లో తొలిరోజు తెలుగు పరీక్షకు 98.42 శాతం విద్యార్థులు హాజరయ్యారని డీఈఓ నారాయణ ప్రకటనలో తెలిపారు. 23,415 మందికి 23,044 మంది హాజరయ్యారన్నారు. అలాగే ఎస్ఎస్సీ (అసోస్) పరీక్షకు 240 మందికి 201 మంది హాజరయ్యారని, ఎక్కడా మాల్ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని తెలిపారు. తాడేపల్లిగూడెం (టీఓసీ): తాడేపల్లిగూడేనికి మూడో అదనపు సివిల్ జడ్జి జూనియర్ డివి జన్ కోర్టు మంజూరైనట్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు శిరిగినీడి విజయకృష్ణ తెలిపారు. కొత్తగా ఏర్పాటు చేసిన బార్ హాల్లో సోమ వారం న్యాయవాదుల సమావేశం నిర్వహించా రు. మాజీ జిల్లా జడ్జి గౌతమ్ ప్రసాద్ పంపిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ చరిత్ర గ్రంధాలను శిరిగినీడి ఆవిష్కరించారు. సీనియర్ మహిళా న్యాయవాది నిట్టల సూర్యమణి ఆమె తల్లి జ్ఞాపకార్థం అసోసియేషన్కు వీల్చైర్ అందజేశారు. జనరల్ సెక్రటరీ పెదగాడి భూపాల్ తదితరులు పాల్గొన్నారు. భీమవరం (ప్రకాశంచౌక్): జిల్లాలో గృహావసరాల కోసం వంట గ్యాస్ సరఫరా ఎటువంటి ఇబ్బంది లేకుండా కొనసాగుతోందని జేసీ టి.రాహుల్కుమార్రెడ్డి తెలిపారు. జిల్లాలోని 49 ఏజెన్సీల ద్వారా రోజుకు సుమారు 12 వేల సిలిండర్లు సరఫరా చేస్తున్నామన్నారు. గ్యాస్ సమస్యల పరిష్కారానికి కలెక్టరేట్లో 81216 76653 టోల్ ఫ్రీ నంబర్తో కంట్రోల్ రూమ్ ఏర్పాటుచేశామన్నారు. అలాగే ఆస్పత్రులు, ప్రభుత్వ హాస్టళ్లు, అంగన్వాడీ కేంద్రాలు, విద్యాసంస్థలకు గ్యాస్ సరఫరా నిరంతరంగా కొనసాగుతోందని జేసీ చెప్పారు. -
సమాజ ఉద్ధరణకు నాటక రంగం కీలకం
వీరవాసరం: సమాజ ఉద్ధరణకు నాటక రంగం కీలకమని ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్, వైఎస్సార్సీపీ భీమవరం ఇన్చార్జి చినమిల్లి వెంకటరాయుడు అన్నారు. వీరవాసరం కళాపరిషత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అఖిల భారత స్థాయి నాటక పోటీలు ముగింపు సభ సోమవారం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా వారు మాట్లా డుతూ సామాజిక రుగ్మతలను రూపుమాపడానికి నాటకాలు దోహదపడతాయని అన్నారు. నాటక రంగ అభివృద్ధికి ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని శాసనమండలిలో ప్రస్తావించినట్టు ఎమ్మెల్సీ రవీంద్రనాథ్ అన్నారు. నాటక సినీ నటి అమృత వర్షిణి, కరాటే క్రీడాకారిణి కవురు అభిలాషను సత్కరించారు. కళాపరిషత్ అధ్యక్షుడు గుండా రామకృష్ణ, మెంటే పార్థసారథి, చవాకుల సత్యనారాయణమూర్తి, గాదిరాజు రామరాజు తదితరులు పాల్గొన్నారు. సందేశాత్మకంగా పోటీలు చిలకమర్తి కళా ప్రాంగణంలో నాటక ప్రదర్శనలు సందేశాత్మకంగా సాగాయి. సాయి ఆర్ట్స్ కొలకలూరు వారి జనరల్ భోగీలు, మానవతా యడ్లపాడు వారి అందరూ మంచి వారే కాని, శ్రీరమణ కళానిలయం గుంటూరు వారి మా తృత్వం నాటికలు ఆకట్టుకున్నాయి. -
ఆచూకీ కోసం గాలింపు
గణపవరం మండలం పిప్పరలో పంట కాలువలో ఈతకు దిగి గల్లంతైన బాలుడు ప్రమోద్వర్మ ఆచూకీ కోసం గాలింపు ముమ్మరంగా జరుగుతోంది. IIలో uమంగళవారం శ్రీ 17 శ్రీ మార్చి శ్రీ 2026సాక్షి ప్రతినిధి, ఏలూరు: పరువు పోయింది.. కేడర్కు ఏం చెప్పుకోవాలో తెలియని పరిస్థితి.. ఎమ్మెల్యేలకు, ఓటు వేసి గెలిపించిన ప్రజలకు ఏం చెప్పాలో అర్థంకాని స్థితి.. ఇదంతా అబద్ధమని చెప్పడానికి ఒక్క ఎమ్మెల్యేగాని, కనీసం బాగా స్నేహం చేస్తున్న జిల్లా మంత్రులుగాని ముందుకు రాకపోవడంతో ఉమ్మడి పశ్చిమలో ఏలూరు ఎంపీ పుట్టా మహేష్కుమార్ పరువు పూర్తిగా పోయింది. జాతీయస్థాయిలో ఏలూరు పరువు తీశారంటూ కార్యకర్తలే సైటెర్లు వేస్తున్న పరిస్థితి. ఇక సోషల్ మీడియాలో అయితే ఎంపీ పుట్టాను తారాస్థాయిలో ఆడుకుంటున్నారు. రాష్ట్రస్థాయిలో హాట్ టాపిక్గా.. ఏలూరు తెలుగుదేశం పార్టీ ఎంపీ పుట్టా మహేష్ శనివారం మొయినాబాద్లో ఫామ్హౌస్లో డ్రగ్స్ తీసుకుంటూ పోలీసులకు రెడ్ హ్యాండెడ్గా చిక్కా రు. వైద్యపరీక్షల్లో డ్రగ్స్ తీసుకున్నట్లు తెలంగాణపోలీసులే అధికారికంగా ప్రకటించి అరెస్టు చేసి స్టేషన్ బెయిల్ ఇవ్వడం రాష్ట్రస్థాయిలోనే హాట్టాఫిక్గా మారింది. మరోవైపు జాతీయ స్థాయిలో డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడిన తొలి ఎంపీగా, అదేవిధంగా డ్రగ్స్ కేసులో స్టేషన్ బెయిల్ వచ్చిన మొదటి వ్యక్తిగా ఎంపీ పుట్టా ఖ్యాతి గడించారంటూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్గా మారాయి. ఇక ఎంపీగా గెలుపొందిన నాటి నుంచి జిల్లా రాజకీయాల్లో ఒక వర్గాన్ని ఏర్పాటు చేసుకుని కొద్దొగొప్పొ హవా సాగిస్తున్న ఎంపీ పరువు ఒక్క ఘటనతో పూర్తిగా పోయింది. జిల్లాలో లోకేష్ సొంత మనిషి అంటూ కేడర్లో ప్రత్యేక గుర్తింపు పొందిన పుట్టా మహేష్ తలెత్తుకోలేని పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి. ఈ క్రమంలో ఎంపీకి మద్దతుగా మంత్రి కొలుసు పార్థసారథి మొదలు బీజేపీ, జనసేన ఎమ్మెల్యేల వరకూ ఏ ఒక్కరూ కనీసం నోరు మెదపకపోగా పరువు తీశాడంటూ తీవ్రస్థాయిలో సైటెర్లు వేస్తుండటం గమనార్హం. జిల్లాకు ఏం మాత్రం పరిచయం లేకపోయినా తెలుగుదేశం పార్టీలో కీలక నేతల రాజకీయ వారుసుడు కావడంతో జిల్లాకు చెందిన మాగంటి బాబును పక్కన పెట్టి మరీ పుట్టా మహేష్కు రెడ్కార్పెట్ వేశారు. లోకేష్ సొంత మనిషి అంటూ హడావుడి చేశారు. పుట్టా మహేష్ తండ్రి సుధాకర్ ప్రస్తుతం మైదుకూరు ఎమ్మెల్యే, గతంలో టీటీడీ చైర్మన్గా పనిచేశారు. అలాగే టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు కు మార్తెను మహేష్యాదవ్ వివాహం చేసుకోవడం, దీంతో పాటు తెలంగాణలోని తలసాని శ్రీనివాస్ యాదవ్ కుటుంబంతో బంధుత్వం ఉండటంతో తెలుగుదేశం టికెట్ సునాయాసంగా వచ్చింది. అంతే సునాయాసంగా పార్లమెంట్ నియోజకవర్గంలో పుట్టా మహేష్ గెలుపొందిన పరిస్థితి. డ్రగ్స్ వద్దంటూ తన అఫీషియల్ ఖాతాలోపోస్టు పెట్టిన ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ ఎన్నికల ప్రచారంలో డ్రగ్స్ బారి నుంచి రాష్ట్రాన్ని కాపాడుకుందామంటూ నిత్యం సోషల్ మీడియాలో పోస్టులు, ప్రసంగాలతో హడావుడి చేశారు. గడిచిన ఐదేళ్లల్లో 2,107 మంది డ్రగ్స్బారిన పడి మృతి చెందారని, డ్రగ్స్ నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలంటూ విస్తృతంగా ప్రచారం చేశారు. కట్చేస్తే.. అదే డ్రగ్స్ తీసుకుంటూ పోలీసులకు పట్టుబడటంతో సోషల్ మీడియాలో ఎంపీని మీమర్స్ ఓ రేంజ్లో ఆడుకుంటున్నారు. ఘన కీర్తి ఉన్న ఏలూరు పార్లమెంట్ స్థానం నుంచి సూపర్స్టార్ కృష్ణ, కేంద్ర మంత్రులుగా పనిచేసిన బోళ్ల బుల్లిరామయ్య, కా వూరు సాంబశివరావు వంటి వ్యక్తులు పార్లమెంట్ ఖ్యాతిని పెంచితే ప్రస్తుత ఎంపీ పుట్టా చర్యలతో పరువు పోయిందంటూ సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతుండటం గమనార్హం. చెప్పేవి నీతులు.. చేసేవి డ్రగ్ల్బాజీ పనులు పరువు పోయిందిగా..! జాతీయ స్థాయిలో ఏలూరు పార్లమెంట్ పరువు గోవిందా నో డ్రగ్స్ అంటూనే డ్రగ్స్ తీసుకున్న ఎంపీ పుట్టా అడ్డంగా దొరికిపోవడంతో దిక్కుతోచని స్థితిలో ఎంపీ వర్గం ఎంపీ ఘటనపై నోరుమెదపని జిల్లా మంత్రి, టీడీపీ ఎమ్మెల్యేలు ఉమ్మడి పశ్చిమలో హాట్ టాపిక్గా పుట్టా డ్రగ్స్ వ్యవహారం జిల్లాలో తలెత్తుకోలేకపోతున్నామంటూ టీడీపీ నేతల అసహనం -
పోలీసుల కార్డన్ సెర్చ్
తణుకు అర్బన్: ఆపరేషన్ వజ్ర ప్రహార్లో భాగంగా తణుకు పట్టణంలోని ఇరగవరం కాలనీలో ఆదివారం పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. తణుకు రూరల్ సీఐ దేశంశెట్టి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ తనిఖీల్లో 60 మంది పోలీసులు పాల్గొన్నారు. పత్రాలు లేని 14 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అనుమానిత వ్యక్తులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. పెదవేగి: పెదవేగి మండలం రాట్నాలకుంటలో వేంచేసిన రాట్నాలమ్మను ఆదివారం జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజలు, వివిధ సేవల రూపేణా మొత్తం రూ.114,938, ఆదాయం లభించిందని దేవస్థాన ఉత్సవ కమిటీ చైర్మన్ చెప్పారు. -
మండుటెండలో తిప్పలు
ఉండి: భీమవరం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు జంగారెడ్డిగూడెం బయల్దేరగా.. ఉండి బస్టాండ్ దాటి సెంటర్కు రాగానే ఆగిపోయింది. స్టీరింగ్ పట్టేయడంతో పాటు లోపలి నుంచి ఆయిల్ కారిపోవడంతో స్టీరింగ్ బిగిసిపోయింది. దీంతో మిట్టమధ్యాహ్నం ఉండి సెంటర్లో బస్సు ఆగిపోయింది. ఆ సమయంలో రోడ్డుపై ఎలాంటి వాహనాలు రాకపోవడంతో ప్రయాణికులు పడిగాపులు కాశారు. బస్సు డ్రైవర్ చాలా సేపు కష్టపడి సమస్యను తాత్కాలికంగా పరిష్కరించడంతో ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు. చాలాసేపటి తరువాత ఉండి సెంటర్ నుండి ఆర్టీసి బస్సు బయల్దేరింది. అధికారులు బస్సుకు రిపేర్ చేయించకపోవడం.. బస్సు కండిషన్ చెక్ చేయకపోవడం వల్లే ఇలాంటివి జరుగుతున్నాయని ప్రయాణికులు వాపోతున్నారు. గృహ వినియోగ గ్యాస్ సిలెండర్లు స్వాధీనం ఏలూరు టౌన్: గృహాల్లో వినియోగించే సబ్సిడీ గ్యాస్ సిలిండర్లు వాణిజ్య అవసరాలకు వినియోగిస్తే చర్యలు తప్పవని రీజనల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి కే.నాగేశ్వరరావు హెచ్చరించారు. ఆయన ఆదేశాలతో ఏలూరు నగరంలో పలు ప్రాంతాల్లోని హోటల్స్లో విజిలెన్స్, రెవెన్యూ, పౌరసరఫరాల శాఖ అధికారులు సంయుక్తంగా తనిఖీలు చేపట్టారు. ఏలూరు నగరంలో కార్తికేయ సాయి హోటల్, డాల్ఫిన్ హోటల్, సాయిదుర్గ టిఫిన్స్, శ్రీలక్ష్మి గణపతి కేటరర్స్లో తనిఖీలు చేశారు. 18 గృహ అవసరాలకు వినియోగించే సిలెండర్లను గుర్తించారు. యజమానులపై నిత్యావసరాల చట్టం 1955 మేరకు కేసులు నమోదు చేశామని తెలిపారు. -
వైభవంగా నూకాలమ్మ జాతర
● 16 కేజీల వెండి చీరతో అమ్మవారి దర్శనం ● 1,008 మంది ముత్తైదువులచే శోభాయాత్ర జంగారెడ్డిగూడెం: జంగారెడ్డిగూడెం గ్రామ దేవత నూకాలమ్మ 62వ వార్షిక ఉగాది జాతర ఆదివారం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఆలయ కమిటీ చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ (పండు), వెంకట రామలక్ష్మి దంపతులు, ఆలయ చైర్మన్ రొంగల నాగేశ్వరరావుతో కూడిన ఆలయ కమిటీ సారథ్యంలో ఉదయం 6:45కు గరగలు తీయడంతో పాటు ప్రధానార్చకులు కాళ్ళకూరి శంకర మహేష్ శర్మ ఆధ్వర్యంలో పలువురు దంపతులతో కలశస్థాపన చేయించడంతో జాతర వేడుక ప్రారంభమైంది. గ్రామదేవత శ్రీ గంగానమ్మ అమ్మవారి దివ్యాలయం నుంచి శ్రీ గంగానమ్మ అమ్మవారు సింహవాహనంపై 1,008 మంది ముత్తైదువులతో శోభయాత్రగా మంగళవాయిద్యాలు, బాజాభజంత్రీలు, వేదమంత్రాల మధ్య సంప్రదాయ సారెను శోభాయాత్రగా నూకాలమ్మ అమ్మవారికి ఆలయానికి తీసుకువచ్చారు. బ్రహ్మశ్రీ కాళ్ళకూరి సూర్య సత్యశర్మ(సూరిపండు, ఆలమూరు) ముఖ్యఅతిథిగా పాల్గొని పూజలు నిర్వహించి శోభాయాత్రను ప్రారంభించారు. కార్యక్రమంలో శ్రీ గంగానమ్మ ఆలయ కమిటీ చైర్మన్ కలగర వీర్రాజు, చింతా నాగరాజు, కందుల సురేష్తో కూడిన ఆలయ కమిటీ సభ్యులతోపాటు వీరంపాలెం శ్రీ బాలా త్రిపుర సుందరి పీఠం ఆధ్యాత్మిక సేవాప్రతినిధి ఈమని శశికుమార్, కేఎల్ఎన్ ధనకుమార్తదితరులు పాల్గొన్నారు. సారెను వేదమంత్రాల నడుమ అందజేసి, అమ్మవార్లకు పూజ, హారతి సమర్పించారు. సుమారు 16 కేజీల వెండి చీర అలంకరణతో అమ్మవారు దర్శనమిచ్చారు. జెడ్పీ చైర్పర్సన్ దంపతులు, పూర్వపు మున్సిపల్ చైర్మన్ దంపతులు ఆలయ శాశ్వత చైర్మన్ దంపతులు అమ్మవారిని దర్శించారు. డాక్టర్ కొమ్మోజు వంశీ కృష్ణ దంపతులు ఈ రోజు అమ్మ వారి ఆలయానికి వచ్చిన భక్తులకు అన్న ప్రసాద వితరణ చేశారు. వస్త్రాలంకరణ, పుష్పాలంకరణకు యర్రా ప్రసాదరెడ్డి, నాగ స్వరాజ్య లక్ష్మీ దంపతులు, అంకనబోయిన రామచంద్ర వెంకట లక్ష్మి దంపతులు సహకరించారు. సాయంత్రం ఆరుగంటలకు నాలుగు మాడవీధుల్లో గ్రామోత్సవం జరిగింది. అభినయ కూచిపూడి నాట్య అకాడమీ వ్యవస్థాపకురాలు శీలా రూపాదేవి శిష్యబృందంచే కూచిపూడి, భరతనాట్య, జానపద, శాసీ్త్రయ నృత్యప్రదర్శన జరిగింది. -
ఉమ్మడి జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఎన్నిక
ఏలూరు రూరల్: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా క్రికెట్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం ఆదివారం నిర్వహించామని రిటైర్డ్ స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్, ఎన్నికల అధికారి టి.అప్పారావు ఓ ప్రకటనలో తెలిపారు. ఇందులో అధ్యక్షుడిగా గోకరాజు ఆదిత్య, ఉపాధ్యక్షుడిగా ఎం వీరభద్రరావు, కార్యదర్శిగా వీవీఎస్ఎం శ్రీనివాసరావు, సంయుక్త కార్యదర్శిగా కె.సంజీవరావు, కోశాధికారిగా ఎస్వీ సుబ్బారావు, కౌన్సిలర్గా కె బాలజ్శేఖర్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారని చెప్పారు. బుట్టాయగూడెం: బుట్టాయగూడెం మండలం కామవరం సమీపంలో అటవీ ప్రాంతంలో కొలువై ఉన్న గుబ్బల మంగమ్మ గుడికి ఆదివారం భక్తులు పోటెత్తారు. ద్విచక్ర వాహనాలు, ఆటోలు, ప్రత్యేక బస్సుల్లో తెల్లవారుజాము నుంచే భక్తులు అమ్మవారి సన్నిధికి చేరుకున్నారు. అనంతరం దూపదీప నైవేద్యాలతో అమ్మవారికి పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. దెందులూరు: లారీ డ్రైవర్కు కరెంట్ షాక్ కొట్టి మృతి చెందిన వైనమిది. ఈ సంఘటనకు సంబంధించి దెందులూరు ఎస్సై ఆర్.శివాజీ తెలిపిన వివరాల ప్రకారం.. నిడదవోలు గ్రామానికి చెందిన ఎం.అన్నవరం లారీ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. గాలాయిగూడెం మొక్కజొన్న ఫ్యాక్టరీకి లోడు లారీ తీసుకొచ్చాడు. శనివారం రాత్రి లారీ పైకెక్కి మోకు సర్దుతుండగా పైన ఉన్న విద్యుత్ వైర్లు తగిలి కరెంట్ షాక్ తగిలింది. తోటి లారీ డ్రైవర్ చికిత్స నిమిత్తం ఏలూరు వైద్యశాలకు తీసుకు వెళుతుండగా మధ్యలో లారీ డ్రైవర్ అన్నవరం మృతి చెందాడు. మృతుడికి, భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీరవాసరం: వీరవాసరం కళాపరిషత్ సేవా సంఘం ఆధ్వర్యంలో స్వర్గీయ శ్రీమతి గుండా లక్ష్మీ రత్నావతి కళావేదికపై చిలకమర్తి కళా ప్రాంగణంలో నిర్వహిస్తున్న అఖిల భారత స్థాయి నాటిక పోటీల ప్రదర్శనలు సందేశాత్మకంగా సాగుతున్నాయి. భార్యాభర్తల మధ్య ఉండాల్సిన అన్యోన్యత, ప్రేమ చిరస్థాయిగా నిలిచిపోతాయనే కథనంతో చైతన్య కళా స్రవంతి ఉక్కునగరం– విశాఖ వారి అగ్నిసాక్షి నాటక ప్రదర్శన సాగింది. రచన మాడభూషి దివాకర్ బాబు, దర్శకత్వం పి.బాలాజీ నాయక్ వహించారు. క్రాంతి ఆర్ట్స్ థియేటర్– నెల్లూరు వారి ఫోటో నాటిక ద్వితీయ ప్రదర్శనగా సాగింది. రచన తాళాబత్తుల వెంకటేశ్వరరావు, దర్శకత్వం తంబు సురేష్ బాబు వహించారు. ఎస్వీ రంగారావు కళా స్రవంతి వారి ఆచమనం నాటిక తృతీయ ప్రదర్శనగా సాగింది. తాడేపల్లిగూడెం: మూడు రోజులపాటు డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన వర్సిటీలో జరిగిన 12వ అంతర్ కళాశాల పోటీలు ఆదివారం ముగిశాయి. మహిళల త్రోబాల్లో అనంతరాజుపేట, వెంకట్రామన్నగూడెం జట్లు విజేతలుగా నిలిచాయి. బాస్కెట్బాల్ పురుషుల విభాగంలో వీఆర్ గూడెం, అనంతరాజు పేట రన్నరప్గా నిలిచింది. మహిళల విభాగంలో అనంతరాజుపేట, మార్కాపురం జట్టు జయకేతనం ఎగురవేశాయి. వాలీబాల్ పురుషుల విభాగంలో పులివెందుల, అనంతరాజు పేట జట్లు విజయం సాధించాయి. మహిళల విభాగంలో అనంతరాజు పేట, పార్వతీపురం జట్లు విజేతలుగా నిలిచాయి. రిలే పురుషుల విభాగంలో అనంతపురం. మార్కాపురం జట్లు ప్రతిభ కనపర్చాయి. మహిళల విభాగంలో వెంకట్రామన్నగూడెం ఉద్యాన కళాశాల జట్టు గెలుపొందింది. -
వేరుశెనగ కోతలో జాగ్రత్తలు
చింతలపూడి: భారతదేశంలో పండించే నూనె గింజల పంటల్లో వేరుశెనగ అతి ముఖ్యమైంది. వేరుశెనగ కోతలు పూర్తయ్యాక సరైన జాగ్రత్తలు పాటిస్తే విత్తనాలు రాబోయే కాలంలో పనికి వస్తాయి. లేదంటే పుచ్చుపట్టి పనికి రాకుండా పోతాయి. వేరుశెనగలో కోసిన పంటను తగిన తేమ (9 శాతం) వచ్చే వరకు మొక్క నుంచి కాయలను వేరు చేయడానికి ముందు ఎండ బెట్టాలి. మెట్ట ప్రాంతంలో ప్రస్తుతం వేరుశనగ పంటను భద్రపరుచుకునే పనిలో రైతులు ఉన్నారు. ఈ ఏడాది చింతలపూడి సబ్ డివిజన్లో 200 ఎకరాల్లో రైతులు పంటను వేశారు. విత్తనాలను భద్ర పరుచుకుని వచ్చే పంటకు ఉపయోగించుకోవడంలో తీసుకోవలసిన జాగ్రత్తలపై వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు వై.సుబ్బారావు సూచనలు చేస్తున్నారు. వేరుశెనగ ఎండబెట్టే విధానం ఇది రెండు రకాలుగా చేయొచ్చు. వేరుశెనగ కాయలు పై భాగానికి వచ్చేటట్లు చెట్లను చిన్న, చిన్న కుప్పలుగా వేయాలి. లేదా మొక్కలను కర్రలకు కట్టి కాయలను పక్కకు వచ్చేలా ఎండబెట్టుకోవచ్చు. తేమశాతం తగ్గించాలి కాయల్లో తేమ శాతం ఎక్కువగా ఉంటే ఎండలో ఆరబెట్టకుండా తేమను 7 నుంచి 8 శాతానికి తీసుకురావాలి. వేడి గాలులను వదిలే పరికరాలను ఇందుకు ఉపయోగించవచ్చు. వేరుశెనగ పంటను నిల్వ చేయడానికి ఒకసారి వాడిన సంచులను మళ్లీ వాడకూడదు. పాలిథీన్ పేపర్ ఉన్న గోనె సంచులు బాగా ఎండిన వేరుశనగ కాయలను నిల్వ చేయడానికి ఉపయోగం. ఎండలో ఆరబెట్టకూడదు రబీ కాలంలో పీకేటప్పుడు ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే ఎక్కువ ఉంటుంది. కాయలను నేరుగా ఎండలో ఆరబెట్టకూడదు. నీడలో ఆరబెట్టాలి. ఎండతీవ్రత ఉదయం 11 గంటల వరకు సాయంత్రం 4 గంటల తరువాత తక్కువగా ఉంటుంది. ఆయా సమయాల్లో ఆరబెట్టుకోవాలి. ఎండబెట్టే సమయంలో వేరే రకాల కాయలు కలవకుండ చూసుకోవాలి. నిల్వ చేసుకునే విధానం వేరుశెనగ విత్తనం కోసం బాగా ముదిరిన కాయలను నిల్వ చేసుకోవాలి. కాయలను కదిలిస్తే ఘల్లుమని శబ్దం రావాలి, అప్పుడే బాగా ఎండినట్లు అర్థం. కాయలను నిల్వ చేసుకోవడానికి శుభ్రమైన పాలిథీన్ లైనింగ్ ఉన్న గోనె సంచులను వాడాలి. గోనె సంచులను 0.5 శాాతం మలాథియాన్ ద్రావణంలో ముంచి బాగా ఆరబెట్టుకోవాలి. దీని వల్ల కాయల్లోని గింజలకు శిలీంధ్రాల బెడద ఉండదు. వై.సుబ్బారావు, సహాయ వ్యవసాయ సంచాలకుడు -
గ్రావెల్ మాఫియా ఆగడాలు
ఆగిరిపల్లి: మండలంలో గ్రావెల్ మాఫియా రెచ్చిపోతుంది. అధికారం మాది.. తవ్వేస్తాం.. అధికారులు మమ్మల్ని ఏమి చేయలేరు అన్న రీతిలో బరితెగిస్తున్నారు. కొన్ని రోజుల నుంచి పగలూ రాత్రి తేడా లేకుండా మండలంలోని పలు గ్రామాల్లో అధికార పార్టీ నాయకులు అనుమతులు లేకుండా కొండలను పిండి చేస్తున్నారు. లారీలలో వందలాది ట్రిప్పులను తరలించి జేబులు నింపుకుంటున్నారు. గత మూడు రోజులుగా మంత్రి అనుచరులు అని చెప్పి ఎలాంటి అనుమతులు లేకుండా కల్లుటూరు శివారులో ఉన్న అసైన్మెంట్ భూమిలో కొండను తవ్వి లారీల్లో గ్రావెల్ను బయట ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. మంత్రి పార్థసారథి ఫొటోతో కూడిన వాటర్ ట్యాంకర్ తవ్వకాలు జరుగుతున్న ప్రదేశంలో నీటిని చల్లుతున్న వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుండడంతో మండల ప్రజలు అవాక్కవుతున్నారు. ఆదివారం ఉదయం పత్రికా విలేకరులు గ్రావెల్ తవ్వకాలు జరుగుతున్న ప్రదేశానికి వెళ్లారని సమాచారంతో రెవెన్యూ అధికారులు హుటాహుటిన వెళ్లి సంఘటన స్థలంలో ఉన్న పొక్లెయిన్ స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అమ్మవారి గూడెంలో మాలగట్టును అక్రమార్కులు కొన్ని నెలల నుంచి ప్రతిరోజు రాత్రి తవ్వేయడంతో అక్కడ తాడిచెట్టు లోతులో గొయ్యి ఏర్పడింది. మైనింగ్ అధికారులు మాత్రం మాఫియాపై చర్యలు తీసుకోవడం లేదు. కొన్ని రోజుల క్రితం తవ్వకాలు జరుగుతున్నాయని సమాచారం రావడంతో మహిళా రెవెన్యూ అధికారి అక్కడికి వెళ్లగా.. తవ్వకాలు ఆపం, ఏం చేసుకుంటావో చేసుకో అని బెదిరించారు. పోతవరప్పాడుచెరువు, ఆగిరిపల్లిలోని అగ్గిరాయి చెరువులో ఇష్టానుసారంగా మట్టిని తవ్వేస్తున్నారు. సామాన్య ప్రజలు ఇంటి కోసం ట్రాక్టర్ మట్టిని తవ్వుకుంటే అధికారులు వచ్చి ట్రాక్టర్లు సీజ్ చేస్తారు. అధికార పార్టీకి చెందిన నాయకులు గ్రావెల్, మట్టిని అక్రమంగా తరలిస్తున్న పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. -
ఎండలతో జర భద్రం
● రోజు రోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ● ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలంటున్న డాక్టర్లు బుట్టాయగూడెం: వేసవి ప్రారంభంలోనే ఎండలు దంచి కొడుతున్నాయి. రానున్న రోజుల్లో ఎండలు మండిపోతాయని ఆందోళన చెందుతున్నారు. ఈ అయితే వేసవిలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా సున్నితంగా ఉండేవారు ఆరోగ్యం పట్ల మరింత జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ప్రస్తుతం ఎండల కారణంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో మనిషి శరీరంలోని అవయవాలు అలసటకు గురై క్షీణించే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. వేసవిలో తీసుకోవాల్సిన పండ్లు వేసవికాలంలో పుచ్చకాయ, ఖర్జూరం, దానిమ్మ, కమల, ద్రాక్షతో పాటు తాటిముంజులు కూడా తీసుకోవచ్చు. మసాలా లేని లేదా తక్కువ వేసిన వంటకాలు మాత్రమే తీసుకోవాలి ● సాధారణ రోజుల్లో మనిషి 2–3 లీటర్ల నీరు తాగితే సరిపోతుంది. వేసవిలో 4 నుంచి 5 లీటర్ల నీరు తాగాలి. క్లోరినేషన్ చేసిన నీటిని మాత్రమే తాగాలి. గుంటల్లో, చెరువుల్లో నీరు కలుషితంగా ఉంటుంది. గ్లాసుడు చల్లటి నీటిలో చిటికెడు ఉప్పు, పంచదార, నిమ్మరసం కలుపుకుని తాగాలి. మజ్జిగలో నిమ్మరసం, ఉప్పు తగిన మోతాదులో కలుపుకుని తాగాలి. గంజి, పెసర కడుగులో నిమ్మరసం, ఉప్పు కలుపుకుని తాగితే ఉష్ణ తాపాన్ని చల్లారుస్తుంది. ప్రస్తుతం ఎండల తీవ్రత అధికంగా ఉన్నందున ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. మధ్యాహ్నం సమయంలో ఎండ తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుంది. ప్రజలు ఆహార అలవాట్లు మార్చుకోవాలి. చల్లని పానీయాలు సేవిస్తూ ఉండాలి. అవసరమైతే తప్ప ఎండల సమయంలో బయటకు రాకపోవడం మంచిది. డాక్టర్ ఎస్. నందిని, దొరమామిడి పీహెచ్సీ, బుట్టాయగూడెం మండలం -
ఆపాత మధురాల కలబోత
తణుకు అర్బన్: తణుకులోని ఎస్ఎంవీఎం పాలిటెక్నిక్ కళాశాల ప్రాంగణం ఆదివారం ఆత్మీయ ఘట్టానికి వేదికై ంది. దాదాపు 49 సంవత్సరాల క్రితం (1977–80) సివిల్ ఇంజినీరింగ్ చదవిని స్నేహితులంతా మళ్లీ ఒకేచోట చేరి ఆనాటి జ్ఞాపకాల్ని పంచుకున్నారు. ఆరు పదుల వయసులో ఉన్న వీరంతా.. ఈ ఆత్మీయ సమ్మేళనంలో మళ్లీ పాత విద్యార్థులుగా మారిపోయారు. తమ చిన్ననాటి ఫొటోలను ఐడీ కార్డులుగా వేసుకుని పలకరించుకున్నారు. ఏరా గుప్తా.. ఏంటోయ్ రెడ్డి.. బాగానే ఉన్నావురా అంటూ ఆప్యాయతతో పలకరించుకుంటుంటే, అక్కడి వాతావరణం స్నేహ బంధానికున్న గొప్పదనాన్ని చాటిచెప్పింది. గుర్తుకొస్తున్నాయి అంటూ.. గురువుల చేతిలో తిన్న దెబ్బలు, క్లాసులు ఎగ్గొట్టి ఆడిన చూసిన సినిమాలు, చదువులో పోటీ... ఇలా జ్ఞాపకాల్ని నెమరువేసుకున్నారు. స్నేహమేరా జీవితం.. స్నేహమేరా శాశ్వతం అంటూ పాటల సందడి చేశారు. తమకు విద్యాబుద్ధులు నేర్పిన ఆనాటి గురువులు ఎ.కామేశ్వరరావుతో పాటు, కళాశాల మాజీ ప్రిన్సిపాల్ రాజేంద్రబాబు, ప్రస్తుత ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్.తులసిరాధ తదితరులను పూర్వ విద్యార్థులు సత్కరించారు. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనాలు స్నేహితులంతా కలిసి ఆరగించారు. చదువు తర్వాత ఉద్యోగ, వ్యాపారాల్లో దేశవిదేశాలకు స్థిరపడిన స్నేహితులంతా కుటుంబ సమేతంగా ఈ వేడుకకు విచ్చేశారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కృషి చేసిన వి.గోపాలరెడ్డి, ఎం.వెంకటేశ్వర గుప్త, వి.శ్రీనివాసరావు, ఎస్.వెంకటరాజు, డాక్టర్ పి.కృష్ణంరాజు, ఎస్.కామేశ్వరశర్మ, ఎం.వెంకటరావులను మిత్రులంతా ప్రత్యేకంగా అభినందించారు. 49 ఏళ్ల స్నేహ బంధం ఒక్కటైన వేళ 49 ఏళ్ల తరువాత బాల్య స్నేహితులంతా ఒకే చోటకు చేరి ఆత్మీయ సమ్మేళనం చేసుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. మా స్నేహ బంధం ఎంతో మధురమైంది. ఆనాటి తీపి జ్ఞాపకాలను అందరూ నెమరువేసుకున్నాం. మా గురువులు మాకు నేర్పించిన విద్యతో ఎంతో ఉన్నత స్థాయిలో నిలిచాం. చాలా దూర ప్రాంతాల నుంచి ఆత్మీయ సమ్మేళనానికి వచ్చారు. కొందరు స్నేహితులు గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. మా పాత రోజులు గుర్తుకు వచ్చాయి. – ఎం.వెంకటేశ్వరగుప్త, పూర్వ విద్యార్థి, రిటైర్డు ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు -
శ్రీవారి క్షేత్రంలో నకిలీ టికెట్ల విక్రయాలు
ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమలలోని చినవెంకన్న ఆలయంలో నకిలీ దర్శనం టికెట్ల వ్య వహారం ఆదివారం బయటపడింది. టికెట్ కౌంటర్లో రూ.200 నకిలీ టికెట్లను విక్రయించిన అవుట్సోర్సింగ్ ఉద్యోగి ఐఎస్జే రాజు (దేవస్థా నంలో కీలక అధికారి కుమారుడు) టికెట్ స్కా నర్, నిఘా నేత్రానికి చిక్కాడు. దీనిపై విచారణ చేపట్టిన దేవస్థానం అధికారులు సుమారు 61 నకిలీ టికెట్లను విక్రయించినట్టు గుర్తించారు. వి వరాలిలా ఉన్నాయి.. రూ.200 క్యూలైన్ వద్ద టి కెట్లు స్కాన్ చేస్తున్న సిబ్బంది మధ్యాహ్నం రెండు టికెట్లు స్కాన్ అవడం లేదని అధికారులకు చెప్పారు. రీసైక్లింగ్ టికెట్లు అయితే ‘టికెట్ ఆ ల్రెడీ స్కాన్డ్’ అని రావాలి. అయితే ‘నాట్ ఫౌండ్’ అని రావడంతో అధికారులకు అనుమానం వచ్చింది. ఈఓ యర్రంశెట్టి భద్రాజీ, ఎగ్జిక్యూ టివ్ ఇంజనీర్ డీవీ భాస్కర్, ఏఈఓ ఎం.దుర్గారావు, సూపరింటెండెంట్ ఐవీ రామారావు విచారణ చేపట్టి, రాత్రి వరకు టికెట్ కౌంటర్లలోని సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలించారు. అయితే ఆ కౌంటర్లో ఆ టికెట్లు విక్రయించిన సదరు ఉ ద్యోగి టికెట్ల విక్రయం నిమిత్తం దేవస్థానం వి నియోగిస్తున్న సాఫ్ట్వేర్కు సమాంతరంగా మరో సాంకేతికతను వినియోగించినట్టు గుర్తించారు. ఈ ఘటనపై ఈఓ భద్రాజీ స్థా నిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగి రాజును విధుల నుంచి తొల గించారు. టికెట్లు స్కాన్ కాకపోవడంతో బయటపడ్డ దందా -
పసిప్రాణం వెలవిల
సాక్షి టాస్క్ఫోర్స్: పసిపిల్లల విక్రయాల ఘటనలతో కై కలూరు నియోజకవర్గ పరువుపోతోంది. ముదినేపల్లి మండల కేంద్రంగా సాగుతున్న దందా గుట్టురట్టవడంతో జిల్లావ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ఈడేపల్లికి చెందిన ఓ మహిళ విక్రయాల్లో కీలకంగా వ్యహరించడంతో ఆమెను మొదటి ముద్దాయిగా చేర్చారు. లోతైన విచారణ కొనసాగుతోంది. ముదినేపల్లి మండలం శ్రీహరిపురంలో దాదాపు రెండు నెలల క్రితం ఆకేటి మోక్షిత్ అనే రెండున్నరేళ్ల బాబు మిస్సింగ్ కేసుగా నమోదయ్యింది. ప్రస్తుతం పిల్లల విక్రయాల ఘటన వెలుగులోకి రావడంతో మోక్షిత్ అంశం తెరపైకి వచ్చింది. ఐదుగురు పిల్లలు నియోజకవర్గంలో మొత్తం ఐదుగురు పిల్లల విక్రయాలు జరిగినట్టు గుర్తించారు. వీరిలో ముగ్గురు పిల్లల బంధువుల నుంచి దత్తత తీసుకున్నారు. ము దినేపల్లి మండలం అన్నవరం, మండవల్లి మండ లం కానుకొల్లులో ఇద్దరు పిల్లల తల్లిదండ్రుల వివరాలు తెలియాల్సి ఉంది. సంతానలేమితో బాధపడుతున్న మహిళలను గుర్తించి ఆడపిల్లకు రూ.4 లక్షలు, మగపిల్లాడికి రూ.5 లక్షలకు విక్రయిస్తున్నారని సమాచారం. దీంతో ఏలూరు బాలల సంరక్షణ యూనిట్ ఆఫీసర్ డాక్టర్ సీహెచ్ సూర్యచక్రవేణి విచారణ చేపట్టారు. అంగన్వాడీ కేంద్రాల్లో గర్భిణిగా రిజిస్టర్ కా కుండా పిల్లలను తీసుకొచ్చిన త ల్లుల వివరాలు సేకరించారు. డొంక కదిలింది ఇలా.. ముదినేపల్లి మండలం అన్నవరానికి చెందిన దూలం రాంప్రసాద్, సునీత దంపతులకు పిల్లలు లేరు. దీంతో దగ్గర బంధువు గోపి ద్వారా ఈ డేపల్లికి చెందిన అబ్బిశెట్టి వీరాకుమారి (వీరమ్మ), రెడ్డమ్మ, ఫరీనా వీరిని కలసి 8 నెలల వయసున్న యషనాశ్రీ అనే పాపను అందించారు. ఇందుకు గాను సునీత దంపతులు వీరమ్మ ద్వారా రూ.3 లక్షలు చెల్లించారు. పాపకు బొమ్మినంపాడు సచివాలయంలో 2024 డిసెంబరు 1న జన్మించినట్టు బర్త్ సర్టిఫికెట్ పొందారు. అలాగే వీరమ్మ ఏలూరు జనని హాస్పటల్లో 2024 సెప్టెంబరు 29న నర్సు మాధురి ద్వారా మగపిల్లాడిని తీసుకుంది. ఇందుకు గాను రూ.30 వేలు చెల్లించారు. ఆ సమయంలో వీరమ్మతో పాటు గోపి, పరసా రాము ఉన్నారు. బాబుకు పరసాత యశ్వంత్ శివరాము అనే పేరు కూడా పెట్టారు. రెండు విక్రయాల్లో కీలకంగా వ్యవహరించిన వీరమ్మ ముదినేపల్లి మండలంలో ఓ పార్టీ ద్వితీయ శ్రేణి నాయకుడి తల్లి కావడం చర్చనీయాంశమైంది. పిల్లల భవిష్యత్తుకు భరోసా ఎవరూ? పిల్లల మార్పిడితో సంతానం లేని దంపతులకు పెద్ద ఊరట కలగవచ్చు. సమాజంలో ఛీత్కారాలకు ఫుల్స్టాప్ పడవచ్చు. కానీ పసిపిల్లలుగా తీసుకొచ్చి పెంచుకుంటున్నా పిల్లలకు ఇప్పుడు ఆలోచన జ్ఞానం వచ్చింది. వీరు మీ అసలు తల్లిదండ్రులు కాదని బయట వ్యక్తుల ద్వారా తెలిస్తే వారి భవిష్యత్తు ఏంటని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారి లేత మనసు పొరల్లో పెంచిన ప్రేమ, కన్న ప్రేమ అనే ఆలోచనలు రేకెత్తుతాయి. పిల్లలను విక్రయించుకున్నారనే అపవాదు సైతం సమాజంలో జీవిస్తున్న వారి తల్లిదండ్రులపై పడుతోంది. చట్టప్రకారం దత్తత ద్వారా పిల్లలను పెంచుకోవడం ఉత్తమ మార్గమని నిపుణులు చెబుతున్నారు. ఇదేం ‘పాప’ం ముదినేపల్లి కేంద్రంగా పసిబిడ్డల విక్రయాలు 9 మందిపై కేసులు నమోదు చేసిన పోలీసులు అంగన్వాడీ కేంద్రాల వారీగా పిల్లల ఆరా రెండు నెలలుగా ఆచూకీ తెలియని మోక్షిత్ పిల్లల విక్రయాల ఘటనలో ఏ–1గా అబ్బిశెట్టి వీరమ్మ, అలాగే గోపి, రెడ్డమ్మ, ఫరీనా, పిల్లలను కొనుగోలు చేసిన తల్లిదండ్రులు, ఏలూరు జనని హాస్పటల్ నర్సు మాధురి వంటి 9 మందిపై బీఎన్ఎస్ సెక్షన్ 81, 87 జేజే యాక్టు ప్రకారం కేసును ముదినేపల్లి ఎస్సై వీరభద్రరావు నమోదు చేశారు. ఈ కేసులో ఏలూరు డీఎస్పీ డి.శ్రావణ్కుమార్ మాట్లాడుతూ హిందూ దత్తత యాక్డు, చైల్డ్ ప్రొటెక్షన్ యాక్డు ప్రకారం పిల్లలను దత్తత తీసుకున్నప్పుడు కచ్చితమైన నిబంధనలు పాటించాలన్నారు. కేసు నమోదు చేసి అనుమానితులను విచారిస్తున్నామన్నారు. -
అక్రమాలతో పంచుకుంటున్నారు
సోమవారం శ్రీ 16 శ్రీ మార్చి శ్రీ 2026సాక్షి టాస్క్ఫోర్స్: నరసాపురంలో అధికార జనసేన అవినీతి వ్యవహారాలు రోజురోజుకూ శృతి మించుతున్నాయి. ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ.. బినామీలకు దోచిపెడుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. చట్టంలోని లొసుగులను వాడుకుని సాంకేతిక ఇబ్బందులు తలెత్తకుండా పక్కా వ్యూహంతో ప్రజాధనం లూటీ చేస్తున్నారు. ఏటా రూ.4 కోట్లకు పైగా ఆదాయం తెచ్చిపెడుతున్న నరసాపురం పంటు రేవు ఇందుకు ఉదాహరణగా నిలుస్తుంది. వేలం పాటలో ఎక్కువ సంఖ్యలో టెండర్లు పడకుండా, తమ బినామీలకు పాట దక్కేలా నిబంధనలను అధికారులు మార్చడం ఇటీవల చర్చనీయాంశమైంది. అలాగే మున్సిపాలిటీ డైలీ మార్కెట్ పాట కూడా జనసేన నేతకు దక్కేలా మున్సిపల్ అధికారులు వ్యవహరించడం చర్చనీయాంశమైంది. ఇక్కడ జనసేన ఎమ్మెల్యేగా నాయకర్ ఉన్నా షాడో ఎమ్మెల్యేగా ఆయన సోదరుడు సునీల్ నాయకర్ కనుసన్నల్లోనే అవినీతి తంతు జరుగుతుందనే ప్రచారం ఉంది. వేలం పాట తగ్గించి.. బినామీలకు దోచిపెట్టి ఉభయగోదావరి జిల్లాల మధ్య రాకపోకలకు నరసాపురం వశిష్ట గోదావరిపై పంటు కీలకం. రికార్డు స్థాయిలో ప్రయాణాలు సాగుతుంటాయి. దీంతో నరసాపురం ఫెర్రీ వేలం పాటకు విపరీతమైన పోటీ ఉంది. గతేడాది పాట రూ.4,18,18,959కు వెళ్లగా జనసేన నేతల కన్ను దీనిపై పడింది. గతేడాది పాట తగ్గించే ప్రయత్నం చేసినా కుదరకపోవడంతో ఈ ఏడాది పక్కాగా స్కెచ్ వేసినట్టు సమాచారం. ఇటీవల రేవు వేలం ప్రారంభ ధర రూ 3,59,06,322గా నిర్ణయించి నోటిఫికేషన్ విడుదల చేశారు. అయితే అధికారులు సొంత పంటు ఉంటేనే వేలంలో పాల్గొనాలనే కొత్త నిబంధన తీసుకువచ్చారు. దీంతో వేలం సమయానికి కాంట్రాక్టర్లు రెండు షెడ్యూల్స్ మాత్రమే కొనుగోలు చేశారు. వీరిద్దరూ కూడా ఎమ్మెల్యే కార్యాలయానికి వీర విధేయులే. పాటలో వారిద్దరూ పాల్గొంటే తక్కువ అమౌంట్కు కోడ్ చేయొచ్చు, మూడుసార్లు నిబంధనల మేరకు పాట వాయిదా వేసి చివరకు వేలాన్ని తక్కువకు ఖరారు చేసుకునేలా పథకం రచించినట్టు ప్రచారం జరుగుతోంది. అయితే కొందరు పాటదారులు ఎంపీడీఓ కార్యాలయం వద్ద ధర్నా చేయడంతో గత్యంతరం లేక పాటను వాయిదా వేశారు. మార్కెట్ పాటలోనూ.. గతేడాది మున్సిపాలిటీ డైలీ మార్కెట్ పాటలో రూ.43 లక్షలు హాంఫట్ చేసిన బినామీలు ఈ ఏడాదీ అదే తరహాలో ముందుకు వెళుతున్నారు. 2024–25లో వైఎస్సార్సీపీ హయాంలో మార్కెట్ పాట రూ.80 లక్షలకు వెళ్లగా 2025–26లో కూటమి ప్రభుత్వంలో ఓ జనసేన నేత రూ.37 లక్షలకు పాట దక్కించుకున్నారు. అనంతరం మున్సిపల్ గెజిట్లో లేనివిధంగా వ్యాపారుల నుంచి అధిక మొత్తంలో పన్నులు వసూలు చేశారు. మార్కెట్ పాట మొత్తం తగ్గించి రూ.43 లక్షలకు పైగా మున్సిపల్ ఆదాయానికి గండి కొట్టారని మున్సిపల్ వర్గాలు చర్చించుకుంటున్నారు. ఇదిలా ఉండగా ప్రస్తుత 2026–27కి సంబంధించి ఈనెల 6న పాట నిర్వహించారు. పాటదారులు రింగ్ అయ్యి పాటకు ముందుకు రాలేదు. గతేడాది సీన్ను రిపీట్ చేయడంలో భాగంగానే కాంట్రాక్టర్ల రింగ్, బెదిరింపుల పర్వం కొనసాగుతుందనే ప్రచారం జరుగుతోంది.వేసవి ఎండల నుంచి రక్షణకు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఆహారపు అలవాట్లు మార్చుకోవాలని అంటున్నారు. సంక్రాంతి సమయంలో కోడిపందేలు, గుండాట బరుల్లో పర్సంటేజీలపై నియోజకవర్గ ప్రజలు ఇప్పటికీ చర్చించుకుంటున్నారు. అలాగే 120 ఏళ్లుగా జరుగుతున్న వనువులమ్మ సిరిమాను తీర్థంలోనూ జయింట్ వీల్స్ ఏర్పాటుచేసిన వారి నుంచి ఈ ఏడాది రూ.లక్ష చొప్పున మామూళ్లు వసూలు చేయడం చర్చనీయాంశమైంది. ఇక రెవెన్యూ, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల నుంచి నెలవారీ మామూళ్లు చెల్లించాలనే కొత్త నిబంధన పెట్టి మరీ సొమ్ములను ఎమ్మెల్యే కార్యాలయానికి చేరవేస్తున్నట్టు ప్రచారం ఉంది. ఎమ్మెల్యే పేరుతో ఆయన అనుయాయులు అతి చేస్తున్నారని ఎమ్మెల్యే సన్నిహితులే గుసగుసలాడుకుంటున్నారు. అలాగే పోలీస్స్టేషన్లకు వచ్చే ఆర్థికపరమైన తగాదాలకు సంబంధించి అధినాయకుడి బ్రదర్ ఓ గదికి పిలిపించుకుని సెటిల్మెంట్ల దందా సాగుతున్నారనే విమర్శలు ఉన్నాయి. ఈ మొత్తం వ్యవహారాలను పార్టీ అధినేత పవన్ కల్యాణ్కు చేరవేసినా ప్రయోజనం లేకపోవడంతో పార్టీలో ఉన్న అగ్రనాయకులు మిన్నకుండిపోతున్నారనే ప్రచారం సాగుతోంది. ప్రభుత్వ ఆదాయం లూటీ నరసాపురంలో శృతిమించిన జనసేన అవినీతి రూ.4 కోట్ల రేవు ఆదాయానికి గండి కొట్టే ప్రయత్నం మార్కెట్ పాటలోనూ గతేడాది తంతు రిపీట్ ఎమ్మెల్యే సోదరుడి కనుసన్నల్లోనే అక్రఓమాల దందాలు! -
కూటమిలో ఫ్లెక్సీల రగడ
తణుకు అర్బన్: తణుకు కూటమిలో టీడీపీ, బీజేపీల మధ్య వైరం రైల్వేస్టేషన్లో వేదికగా బహిర్గతమైంది. ప్రధాని ఫొటోలు ఉన్న ఫ్లెక్సీలను తొలగించడంపై బీజేపీ సోషల్ మీడియాలో తీవ్రంగా చర్చ జరుగుతోంది. కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ సాక్షిగా ఫ్లెక్సీల రగడ దుమారం రేపుతోంది. వివరాలిలా ఉన్నాయి.. ఆదివారం అమృత్ భారత్ రైలు ప్రారంభోత్సవానికి కేంద్రమంత్రితోపాటు బీ జేపీ నాయకులు, ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ తణుకు స్టేషన్కు వచ్చారు. ఇదే సమయంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ముళ్లపూడి రేణుక తరఫున బీజేపీ నాయకులు స్టేషన్ ప్రాంతంలో ఏర్పాటుచేసిన ఫ్లెక్సీల్లో ముఖ్యమంత్రి చంద్ర బాబు, డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్, తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ ఫొటోలు లేవని కూటమి నేతలు తొలగించిన తీరు చర్చనీయాంశంగా మా రింది. కూటమి నేతల ఫొటోలు లేవంటూ ప్రధాని మోదీతోపాటు జాతీయ నాయకుల ఫొటోలు ఉన్నా ఆ ఫ్లెక్సీలను తొలగించిన విధానం బీజేపీ వర్గాల్లో తీవ్ర అవమాన భారాన్ని రేకెత్తించింది. టీడీపీ నేతలు ఇష్టానుసారంగా ఫ్లెక్సీలను చింపేసి కిందపారేశారంటూ ధ్వజమెత్తారు. తణుకులో ఫ్లెక్సీల రచ్చ తణుకులో వైఎస్సార్ విగ్రహం వద్ద, అత్తిలి మండలం ఉరదాళ్లపాలెంలో ఏర్పాటుచేసిన కూటమి ఫ్లెక్సీల వివాదం సద్దుమణగక ముందే తాజాగా బీజేపీ ఫ్లెక్సీ వివాదం నెలకొంది. ఒక మహిళ అని, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అని, ముళ్లపూడి వంశీకురాలని కూడా చూడకుండా ఆమె ఉన్న ఫ్లెక్సీలు చించిపారేశారంటూ టీడీపీలో ఉన్న ముళ్లపూడి అభిమానులు, బీజేపీ పార్టీ నాయకులు సైతం గుర్రుగానే ఉన్నారు.రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉన్న ఆమె ఫొటోని ఏ ప్రభుత్వ కార్యక్రమంలో కానీ, పార్టీ కార్యక్రమాలకు సంబంధించిన ఫ్లెక్సీల్లో కానీ కూటమి నాయకులు వేశారేమో ఇప్పుడు ఉన్న ఫ్లెక్సీలను చూడాలనే కౌంటర్లు కూడా ఇస్తున్నారు. ఈ సమస్యపై బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ముళ్లపూడి రేణుకను వివరణ కోరేందుకు ‘సాక్షి’ ప్రయత్నించగా విజయవాడలో సమావేశంలో ఉన్నట్టు అనుచరవర్గం తెలిపారు. కేంద్ర మంత్రి సాక్షిగా కుమ్ములాటలు -
‘పది’ పరీక్షలకు సర్వం సిద్ధం
జిల్లాలో 140 కేంద్రాలు భీమవరం: జిల్లావ్యాప్తంగా సోమవారం ప్రారంభమయ్యే 10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు విద్యాశాఖ ఆధ్వర్యంలో పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తి చేశారు. ఏప్రిల్ 1 వరకూ జరిగే పరీక్షలకు జిల్లాలో 132 పరీక్షా కేంద్రాలను, అపోస్ పరీక్షలకు 8 సెంటర్లను ఏర్పాటు చేశారు. పరీక్షలకు 24,166 మంది రెగ్యులర్, ప్రైవేట్ విద్యార్థులు, 680 మంది అపోస్ పరీక్షలకు హాజరు కానున్నారు. ప్రభుత్వం 6 స్క్వాడ్లను నియమించగా చీఫ్ సూపరింటెండెంట్, 132 మంది డిపార్ట్మెంటల్ అధికారులు, ఐదుగురు అడిషనల్ డిపార్ట్మెంటల్ అధికారులు, కస్టోడియన్స్ 46 మంది, 1,426 మంది ఇన్విజిలేటర్లు విధులు నిర్వహించనున్నారు. రూట్ ఆఫీసర్లతో పరీక్షలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు పూర్తయ్యాయి. 25 మందితో సిట్టింగ్ స్క్వాడ్లు కేంద్రాలను తనిఖీ చేయనున్నాయి. కంట్రోల్ రూం ఏర్పాటు కేంద్రాల్లో టేబుల్స్, విద్యుత్, తాగునీటి సౌకర్యం కల్పించారు.ఉదయం 8.45 గంటల నుంచి 9.30 గంటల వరకూ విద్యార్థులను అనుమతిస్తారు. విద్యార్థులు హాల్టికెట్లను తప్పనిసరిగా తీసుకురావాలి. ప్రైవేటు స్కూల్స్ విద్యార్థులు స్కూల్ యూనిఫాంతో రావడాన్ని అనుమతించరు. కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుంది. -
ఏలూరు పరువు తీశారు
ఏలూరు టౌన్: రాష్ట్రంలో డ్రగ్స్ తీసుకుంటా రో... డ్రగ్స్ విక్ర యాలు చేస్తారో అ లాంటి వారి ఆస్తులు జప్తులు చేస్తామంటూ స్వయంగా సీఎం చంద్రబాబు చెప్పారు. టీడీపీ ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యా దవ్ డ్రగ్స్ పార్టీలో దొరికిపోయారు, ఎంపీ పుట్టా మహేష్ ఆస్తులు జప్తు చేస్తారా ? చంద్రబాబూ అంటూ వైఎస్సార్సీపీ ఏలూరు పార్లమెంట్ ఇన్చార్జి, యువజన విభాగం ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా జోన్ అధ్యక్షుడు కా రుమూరి సునీల్కుమార్ యాదవ్ తీవ్రస్థాయి లో ధ్వజమెత్తారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ ఏలూరు ప్రజలకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని, దేశ చరిత్రలో తొలిసారిగా డ్రగ్స్తో ఒక ఎంపీ దొరికిపోవటం బాధాకరమన్నారు. కూటమిలో టీడీపీ నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎలాంటి నీచమైన పనులు చేసినా సీఎం చంద్రబాబు నోరు మెదపటం లేదని, హోమంత్రి సైతం డ్రగ్స్ను నిరోధిస్తామని చెబుతున్నారని, అయితే ఎంపీ పుట్టా విషయంలో ఏమి చెబుతారో వేచి చూడాలన్నారు. ఎంపీ పుట్టా ఏలూ రు పరువు తీశారని, నైతికత ఉంటే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బుట్టాయగూడెం: డ్రగ్స్ పార్టీలో ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేష్యాదవ్ దొరకడం సిగ్గుచేటని మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు అన్నా రు. దుద్దుకూరులో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఢిల్లీలో పార్లమెంట్ సమావేశాలు జరుగుతుంటే ఎంపీ ఇక్కడ కొకై న్తో విందులు చేసుకుంటున్నారని ధ్వజమెత్తారు. రా జ్యాంగ బద్ధమైన పదవిలో ఉండి ఇదెక్కడి బా ధ్యతారాహిత్యం అని ప్రశ్నించారు. ఎంపీ సమాజానికి ఎటువంటి మెసేజ్ ఇవ్వాలని అనుకుంటున్నారో అర్థం కా వడం లేదన్నారు. ఎంపీ పదవి నుంచి మహేష్ ను తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ సంఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపి నిజానిజాలు బయట పెట్టాలని అన్నారు. ప్రజాప్రతినిధులు సమాజానికి ఆదర్శంగా నిలవాలని, ప్రజల నమ్మకానికి ద్రోహం చేసేలా ప్రవర్తించకూడదని అన్నారు. ఇటువంటి సంఘటనలు ప్రజల్లో రాజకీయ వ్యవస్థపై నమ్మకాన్ని దెబ్బతీస్తాయని భవిష్యత్లో ఇలాంటి సంఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. భీమవరం (ప్రకాశంచౌక్) : జిల్లాలో అక్షరాంధ్ర ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ అసెస్మెంట్ టెస్ట్ పరీక్ష ఆదివారం ప్రశాంతంగా జరిగినట్టు కలెక్టర్ సీహెచ్ నాగరాణి తెలిపారు. జిల్లాలో 60,865 మంది అభ్యర్థులు పరీక్షలకు నమోదు కాగా 60,829 మంది హాజరయ్యారని తెలిపారు. సుమారు 99.9 శాతం హాజరు నమోదైనట్టు వెల్లడించారు. పరీక్షల నిర్వహణలో గ్రామ స్థాయి సిబ్బంది, వలంటీర్లు, విద్యాశాఖ సిబ్బంది సమన్వయంతో పనిచేశారన్నారు. వయోజనులకు ప్రాథమిక చదువు, రాత, గణిత నైపుణ్యాలను అందించడమే అక్షరాంధ్ర ప్రధాన లక్ష్యమన్నారు. భీమవరం (ప్రకాశంచౌక్): జిల్లాలో 1.70 లక్షల పశువులకు గాలికుంటు నివారణ టీకాలు వేయించడం లక్ష్యమని కలెక్టర్ సీహెచ్ నాగరాణి తెలిపారు. ఆదివారం క్యాంపు కార్యాలయంలో ఆమె గాలికుంటు వ్యాధి నివారణ టీకా ప్రచార పోస్టర్లను ఆవిష్కరించారు. వచ్చేనెల 15 వరకు టీకాలను ఉచితంగా అందిస్తామన్నారు. కనీసం 90 శాతం పశువులకు టీకాలు వేయడం లక్ష్యంగా నిర్ణయించామన్నా రు. ఈ అవకాశాన్ని పశు రైతులు సద్వినియో గం చేసుకోవాలన్నారు. జిల్లా పశుసంవర్ధక శా ఖ అధికారి ఆర్.కోటిలింగరాజు, సహాయ సంచాలకుడు పి.జయకర్ జాన్సన్ పాల్గొన్నారు. భీమవరం (ప్రకాశంచౌక్): గొల్లలకోడేరులోని జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో సో మవారం పోలీస్ పీజీఆర్ఎస్ నిర్వహించనున్నట్టు పోలీసు అధికారులు తెలిపారు. రహ దారి నిర్మాణ పనులు పూర్తి కావడంతో ఇక్కడ పీజీఆర్ఎస్ నిర్వహిస్తామన్నారు. -
అదరగొట్టిన విద్యార్థులు
కబడ్డీలో తలపడుతున్న క్రీడాకారులు జావెలిన్త్రో విసురుతున్న దృశ్యంతాడేపల్లిగూడెం: వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం వెంకట్రామన్నగూడెంలో జరుగుతున్న 12వ అంతర్ కళాశాలల క్రీడల పోటీల్లో విద్యార్థులు తమ క్రీడా ప్రతిభతో అదరగొట్టారు. బ్యాడ్మింటన్ పోటీలు పురుషుల విభాగంలో ఉద్యానకళాశాల వెంకట్రామన్నగూడెం జట్టు విజేతగా నిలిచింది. అనంతరాజుపేట కళాశాల రన్నర్అప్ అయ్యింది. మహిళల విభాగంలో వెంకట్రామన్నగూడెం జట్టు విజేతగా నిలిచింది. అనంతరాజుపేట జట్టు ద్వితీయ జట్టుగా నిలిచింది. జావెలిన్ త్రోలో పార్వతీపురం ఉద్యాన కళాశాల విద్యార్థి నాని శ్రీహర్ష విజేతగా నిలువగా, పులివెందుల కళాశాల విద్యార్థి ప్రశాంత్ ద్వితీయ స్థానం, వీఆర్గూడెం కళాశాల విద్యార్థి రాహుల్ మూడో స్థానం పొందారు. మహిళల విభాగంలో పార్వతీపురం విద్యార్థి మౌనిక , వీఆర్గూడెం విద్యార్థి అంబిక రెండో స్థానం, పార్వతీపురం విద్యార్థి తృతీయ స్థానంలో నిలిచారు. 800 మీటర్ల పరుగు పందెంలో అనంతరాజుపేట, వీఆర్ గూడెం విద్యార్థులు తర్వాత రెండు స్థానాల్లో నిలిచారు. విద్యార్థుల్లో క్రీడా స్ఫూర్తిని పెంచడానికి క్రీడలు దోహదం చేశాయని అసోసియేట్ డీన్ డాక్టర్ చలపతిరావు అన్నారు. క్రీడలను ఉపకులపతి ధనుంజయరావు, తదితరులు ఆసక్తిగా తిలకించారు. -
గొర్రెల మందపైకి దూసుకెళ్లిన లారీ
ఏలూరు టౌన్ : స్థానిక పెద్ద రైల్వే స్టేషన్ ప్రాంతంలో శుక్రవారం అర్ధరాత్రి దాటాక సుమారు 2గంటల సమయంలో గొర్రెల మందపైకి ఒక డీసీఎం లారీ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో గొర్రెలమంద కాపరి తీవ్ర గాయాలపాలై విజయవాడ హాస్పిటల్లో చికిత్స పొందుతుండగా, ఐదు గొర్రెలు మృత్యువాత పడ్డాయి. వివరాల ప్రకారం కృష్ణాజిల్లా, ఏలూరు జిల్లా ఉంగుటూరు ప్రాంతానికి చెందిన గొర్రెల కాపరులు తమ గొర్రెల మందను మేపుకుంటూ ఏలూరు శివారు పాలగూడెం చేరుకున్నారు. అనంతరం వారంతా కృష్ణాజిల్లా గుడివాడ ప్రాంతానికి వెళ్లేందుకు ఏలూరు వైపు వస్తున్నారు. గొర్రెలతో ఏలూరు పెద్ద రైల్వే స్టేషన్ ప్రాంతానికి చేరుకునేసరికి రాజమండ్రి వైపు నుంచి ఏలూరు నగరంలోకి వస్తోన్న డీసీఎం లారీ అధిక వేగంతో వస్తూ గొర్రెల మీద నుంచి దూసుకువెళ్ళింది. ఈ ప్రమాదంలో గొర్రెలు కాచే బి.నరసింహకు తీవ్ర గాయలయ్యాయి. వెంటనే ఏలూరు జీజీహెచ్కు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అతడిని విజయవాడ తరలించారు. ప్రస్తుతం విజయవాడలోని హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. ఇక ఐదు గొర్రెల మృత్యువాతపడగా, మరో 10 గొర్రెలకు గాయాలయ్యాయి. ఈ మేరకు ఏలూరు టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 5 గొర్రెలు మృతి, కాపరికి తీవ్ర గాయాలు -
ఉత్సాహంగా నెట్బాల్ సెలెక్షన్లు
భీమవరం: నెట్బాల్ జూనియర్ బాల బాలికలు, సీనియర్ పురుషులు, మహిళల ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా క్రీడాకారుల ఎంపిక భీమవరంలో శనివారం సీఎస్ఎన్ కళాశాలలో నిర్వహించారు. జూనియర్ బాలికల జట్టుకు పి.మానస, పి.అజగవ, ఐ.కీర్తన, ఎ.సంజన, కె.సంజు, జి.లిఖిత, కె.మౌనిక, కె.రాము ఎంపికయ్యారు. మహిళల జట్టుకు కె.భారతి, పి.అక్షయ, జి.శ్రావణి, బాలురు జట్టుకు డి.ఫణింద్ర కుమార్, కె.బాలసాయి రామకృష్ణ, బి.రాజేష్, కె.హనుక్, టి.కేశవ మణికంఠ ఎంపికయ్యారు. పురుషులు జట్టుకు డి.బాల సత్య, జీఎన్వీఎస్ విజయ్ కుమార్ ఎంపికై నట్లు జిల్లా నెట్బాల్ సంఘ కార్యదర్శి పి.దావూద్ఖాన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఎస్ఎన్ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ఎండి సలీం ఖాన్, స్కూల్ ప్రిన్సిపాల్ నిర్మలాదేవి, నెట్బాల్ సంఘ సభ్యులు ఎన్.విజయలక్ష్మి, పి.శ్రీనివాస్, జీఎన్వీఎస్ విజయకుమార్ పాల్గొన్నారు. -
వర్క్ ఇన్స్పెక్టర్ల సస్పెన్షన్పై విచారణ
నూజివీడు : మండలంలోని సుంకొల్లులో గృహ నిర్మాణాలకు సంబంధించిన అవకతవకల విషయంలో మండలంలోని పని చేస్తున్న ఐదుగురు వర్కు ఇన్స్పెక్టర్లను సస్పెండ్ చేసిన విషయమై ఎస్సీ కమిషన్ సభ్యులు సుంకొల్లులో విచారణ నిర్వహించారు. సస్పెండ్కు గురైన వర్క్ ఇన్స్పెక్టర్లు అవకతవకల్లో తమ పాత్ర లేకపోయినా అన్యాయంగా తమను తొలగించారని, తమకు న్యాయం చేయాలని ఎస్సీ కమిషనర్కు అర్జీ పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో ఎస్సీ కమిషన్ సభ్యులు మేకల భిక్షం, ఆర్.సీతారామ్, పి.గౌతం సుంకొల్లు వచ్చి గృహనిర్మాణశాఖ అధికారులను విచారించారు. అయితే ఈ గ్రామంలో గతంలో పని చేసిన హౌసింగ్ అధికారులు, ఇంజినీరింగ్ అసిస్టెంట్లు కలిసి 42 పాత గృహాలకు బిల్లులు చేసి రూ.59 లక్షల వరకు దుర్వినియోగం చేసినట్లు గృహ నిర్మాణ శాఖ ఉన్నతాధికారులు చేసిన విచారణలోనే తేలింది. ఈ నేపథ్యంలో విచారణకు వచ్చిన ఎస్సీ కమిషన్ సభ్యులు హౌసింగ్ ఈఈ రామోజీ నాయక్, పీడీ సత్యన్నారాయణలపై ప్రశ్నల వర్షం కురిపించారు. స్టీలు, సిమెంట్, ఇసుక కూపన్లు, బిల్లులు జనరేట్ చేసే అధికారం ఎవరికి ఉందంటూ ప్రశ్నించారు. తప్పంతా అధికారులు చేసి వర్క్ ఇన్స్పెక్టర్లను బలిపశువులను చేయడంపై విస్మయం వ్యక్తం చేశారు. ఈ విచారణకు గతంలో సుంకొల్లులో పని చేసిన గ్రామ సచివాలయ ఇంజినీరింగ్ అసిస్టెంట్ గైర్హాజరవ్వడంపై కమిషన్ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
శ్రీవారి క్షేత్రంలో కియోస్క్ యంత్రాలు
ద్వారకాతిరుమల : ప్రముఖ దేవాలయాల్లో ఆన్లైన్ సేవలను విస్తృత పరిచేందుకు కియోస్క్ యంత్రాలను ఏర్పాటు చేస్తున్నారు. కరూర్ వైశ్యా బ్యాంక్ సహకారంతో ప్రభుత్వం 100 కియోస్క్లను భక్తులకు అందుబాటులోకి తెస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే ద్వారకాతిరుమల చిన్నవెంకన్న ఆలయంలోని పలు విభాగాల్లో ఏర్పాటు చేసిన ఈ కియోస్క్ యంత్రాలు అతి త్వరలో ప్రారంభం కానున్నాయి. వీటి ద్వారా డిజిటల్ చెల్లింపులు జరిపి సులువుగా దర్శనం, సేవ, ప్రసాదం, కేశఖండన, ఇ–హుండీ, వసతి టికెట్లతో పాటు, ఆలయ సమాచారాన్ని భక్తులు పొందొచ్చని ఆలయ ఈఓ యర్రంశెట్టి భద్రాజీ తెలిపారు. అదేవిధంగా గంటల తరబడి క్యూలైన్లలో నిలబడే అవసరం ఉండదన్నారు. ప్రస్తుతం ఈ కియోస్క్ యంత్రాలను కొండ కింద సమాచార కేంద్రం, కేశ ఖండనశాల, శ్రీ ధర్మ అప్పరాయ నిలయం, ప్రసాదాల కౌంటర్ల సముదాయం, అనివేటి మండపం, పీఆర్వో కార్యాలయం, నిత్య కల్యాణమండపం వద్ద వీటిని ఏర్పాటు చేశారు. భీమవరం: మద్యం మత్తులో భవనంపైనుంచి దూకుతానంటూ యువకుడు హల్చల్ చేశాడు. వివరాల ప్రకారం ఒడిస్సాకు చెందిన కపిలేంద్రనాయక్ శుక్రవారం తల్లి, సోదరితో కలసి రైలులో విజయవాడ బయలుదేరాడు. రాత్రి సమయంలో రైలు భీమవరం వచ్చేసరికి తల్లి, సోదరిని వదిలి దిగిపోయాడు. రాత్రి అంతా స్టేషన్ పరిసర ప్రాంతాల్లో గడిపిన కపిలేంద్రనాయక్ శనివారం ఉదయం పట్టణ పరిధిలోని బైపాస్ రోడ్డులోని ఒక భవనంపైకి ఎక్కి దూకుతానంటూ బెదిరించాడు. దీంతో స్థాని కులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అతనికి నచ్చచెప్పి కిందికి దించారు. కపిలేంద్రనాయక్ అతిగా మద్యం సేవించడమేగాక ఖైనీ వంటివి తినడంతో పాటు మతిస్థిమితం లేకపోవడంతో ఈ విధంగా ప్రవర్తించాడని చెబుతున్నారు. నూజివీడు : మండలంలోని రామన్నగూడెం సమీపంలోని పెట్రోలు బంకు వద్ద శనివారం బైక్లు ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. వివరాల ప్రకారం పట్టణంలోని బంగినపల్లితోట ప్రాంతానికి చెందిన ఖండవల్లి భానుబాబు(37), దాసరి సత్తిబాబు(50) కలిసి ఉదయం 11.30 గంటల సమయంలో నూజివీడు నుంచి రామన్నగూడెం వెళ్తున్నారు. పెట్రోలు బంకు సమీపంలోకి వెళ్లేసరికి ఎదురుగా వట్టిగుడిపాడుకు చెందిన నాగేశ్వరరావురావు నూజివీడు వెళ్తుండగా రెండు బైక్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ సంఘటనలో ఖండవల్లి భానుబాబు మృతిచెందగా దాసరి సత్తిబాబు, నాగేశ్వరరావులకు గాయాలయ్యాయి. మృతదేహాన్ని, క్షతగాత్రులను నూజివీడు ఏరియా ఆసుపత్రికి తరలించారు. రూరల్ ఎస్సై ఎన్.లక్ష్మణ్బాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
భక్తులతో శ్రీవారి క్షేత్రం కిటకిట
ద్వారకాతిరుమల: శ్రీవారికి ప్రీతికరమైన రోజు, అందులోనూ రెండో శనివారం కావడంతో చిన్నతిరుపతి క్షేత్రం భక్తులతో పోటెత్తింది. సుదూర ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు స్వామివారి దర్శనార్ధం ఆలయానికి తరలివచ్చారు. దాంతో క్షేత్ర పరిసరాలు భక్తులతో కిక్కిరిశాయి. ముఖ్యంగా దర్శనం క్యూలైన్లు, వైకుంఠం క్యూ కాంప్లెక్స్, ప్రసాదం, టికెట్ కౌంటర్లు, కల్యాణకట్ట తదితర విభాగాలు భక్తులతో రద్దీగా కనిపించాయి. 140 జంటలు శ్రీవారి నిత్యార్జిత కల్యాణంలో పాల్గొన్నారు. వేలాది మంది భక్తులు స్వామి వారి ఉచిత అన్నప్రసాదాన్ని స్వీకరించారు. అలాగే అనివేటి మండపంలో పలు భజన మండళ్ల సభ్యులు ప్రదర్శించిన కోలాట నృత్యాలు చూపరులను అలరించాయి. పాలకొల్లు సెంట్రల్: పెళ్లి వేడుకకు వెళ్లి ద్విచక్ర వాహనంపై వస్తున్న దంపతుల్లో భార్య మెడలో ఉన్న బొందును లాక్కెళ్లిన సంఘటన మండలంలోని దిగమర్రు గ్రామంలో బైపాస్ రోడ్డులో చోటు చేసుకుంది. రూరల్ పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం పాలకొల్లు మండలంలోని వరిదనం గ్రామానికి చెందిన గూడూరి భార్గవి, భర్త ప్రేమ్ సాయిలు శుక్రవారం రాత్రి నరసాపురం మండలంలోని ఎల్బీ చర్ల గ్రామంలో బంధువుల ఇంటికి పెళ్లికి వెళ్లారు. తిరిగి రాత్రి 10 గంటల సమయంలో తమ ఇంటికి వస్తుండగా దిగమర్రు బైపాస్ మారుతి సుజికి షోరూమ్ వద్దకు వచ్చే సరికి ఇద్దరు వ్యక్తులు వారి వెనుకే వస్తూ ద్విచక్ర వాహనంపై వెళ్లి భార్గవి మెడలో ఉన్న నాలుగు కాసులు తాళిబొట్టు, కాసు చైన్ లాక్కుని పారిపోయారు. గొలుసు లాగడంతో భార్యాభర్తలు వాహనంపై నుంచి పడిపోయారు. ప్రమాదంలో భార్యకు ఎడమ చేతిపై గాయమైంది. బాధితురాలు భార్గవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు రూరల్ పోలీసులు తెలిపారు. -
గ్యాస్ ఏజెన్సీలపై విజిలెన్స్ తనిఖీలు
ఏలూరు టౌన్ : జిల్లాలో గృహావసరాల గ్యాస్ సిలిండర్ల వినియోగంలో కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీ కే.నాగేశ్వరరావు గ్యాస్ ఏజెన్సీలకు హెచ్చరికలు జారీ చేశారు. ఆయన ఆదేశాలతో ఏలూరు, భీమడోలు గ్రామాల్లో విజిలెన్స్, పౌర సరఫరాలు, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా ఏకకాలంలో నాలుగు బృందాలుగా ఏర్పడి గ్యాస్ ఏజెన్సీలపై దాడులు చేశారు. గ్యాస్ ఏజెన్సీల్లో ఆకస్మిక తనిఖీలు చేయగా, నిల్వల్లో ఎలాంటి వ్యత్యాసాలు లేవని అధికారులు తెలిపారు. గృహ వినియోగదారులకు ఇబ్బందులు లేకుండా సకాలంలో గ్యాస్ సరఫరా చేయాలని ఆదేశించారు. అదేవిధంగా ఏలూరు నగరంలో మయూర్ హోటల్, వసంతమహాల్ సెంటర్, సితార హోటల్, మౌలాలి ఫాస్ట్ఫుడ్స్ వంటి పలు చోట్ల తనిఖీలు చేయగా... 13 గృహ అవసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్లు వినియోగిస్తున్నట్లు గుర్తించి కేసులు నమోదు చేశారు. ఈ తనిఖీల్లో విజిలెన్స్ డీఎస్పీ సింగులూరి వెంకటేశ్వరరావు, విజిలెన్స్ సీఐ ప్రసాద్కుమార్, తహసీల్దార్ బీ.కన్యాకుమారి, ఎస్సై సీహెచ్.రంజిత్కుమార్, కే.నాగరాజు, పౌర సరఫరాలు, రెవెన్యూ అధికారులు ఉన్నారు. ఏలూరులో హోటల్స్పై దాడులు


