breaking news
West Godavari
-
బాలికపై దాడికి యత్నించిన వీధి శునకాలు
ద్వారకాతిరుమల : వీధి కుక్కలు ప్రజలను హడలెత్తిస్తున్నాయి. చిన్న పిల్లలపై తరచూ ఎక్కడో ఒకచోట దాడులు చేస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో ద్వారకాతిరుమలలోని రాణీ చిన్నయమ్మారావు పేటలో గురువారం రెండు వీధి కుక్కలు ఒక బాలికపై దాడికి ప్రయత్నించాయి. అయితే వాటి బారి నుంచి తప్పించుకుని ఆ బాలిక ప్రమాదం నుంచి బయటపడింది. వివరాల ప్రకారం స్థానికంగా నివాసం ఉంటున్న భార్గవి తన పాప కాషికను ఉదయం పాఠశాలకని ఇంటి నుంచి పంపింది. కాషిక నడుచుకుంటూ కాస్త దూరం వెళ్లగానే రెండు వీధి కుక్కలు అరుచుకుంటూ కాషిక మీదకు వచ్చాయి. ప్రమాదాన్ని గమనించిన కాషిక పెద్దగా అరుస్తూ తన ఇంటి వైపునకు పరుగులు తీసింది. ఆ అరుపులు విన్న భార్గవి కంగారుగా రోడ్డు మీదకు వచ్చింది. వెంటనే కాషిక పరిగెట్టుకుంటూ వచ్చి తల్లిని పట్టుకుంది. వణికిపోతున్న పాపను దగ్గరకు తీసుకోగా, ఆ శునకాలు వెనక్కి వెళ్లిపోయాయి. ఇది చూసిన స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పాప శునకాలకు చిక్కితే పెనుప్రమాదం జరిగేదని, రోడ్డు మీదకు రావాలంటేనే భయమేస్తోందని స్థానికులు వాపోతున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి, వీధి కుక్కల బెడదను తొలగించాలని కోరుతున్నారు. -
బండివారిగూడెం వద్ద లారీ బోల్తా
టి.నరసాపురం: మండలంలోని బండివారిగూడెం సమీపంలో జామాయిల్ పుల్ల లోడు లారీ బోల్తాపడింది. వివరాల ప్రకారం చింతలపూడి మండలం యర్రగుంటపల్లికి చెందిన లారీ జామాయిల్ పుల్లల లోడుతో చింతలపూడి నుంచి రాజమండ్రి పేపర్ మిల్లుకు వెళుతోంది. బండివారిగూడెం సమీపంలో రోడ్డుపై ఉన్న గుంతలో పడి అదుపు తప్పి పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టి బోల్తాకొట్టింది. ఈ ప్రమాదం నుంచి లారీ డ్రైవర్, క్లీనర్లు సురక్షితంగా బయటపడ్డారు. అయితే లారీ బోల్తా పడటంతో ట్రాఫిక్కు అంతరాయం కలిగింది. తణుకు అర్బన్: రాష్ట్ర స్థాయిలో నిర్వహించనున్న అంతర్ జిల్లాల జూనియర్ కబడ్డీ పోటీల్లో పాల్గొనబోయే జిల్లా బాలురు, బాలికల కబడ్డీ జట్ల ఎంపిక ఈ నెల 14న నిర్వహించనున్నట్లు జిల్లా కబడ్డి అసోసియేషన్ సెక్రటరీ వై.శ్రీకాంత్ తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. పెద తాడేపల్లిలోని శ్రీవాసవి ఇంజనీరింగ్ కళాశాలలో మధ్యాహ్నం 2 గంటలకు ఎంపికలు ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. ఈ ఎంపిక పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు 2006 జనవరి 1వ తేదీ తరువాత జన్మించిన వారై ఉండాలని, 75 కేజీలు లోపు బాలురు, 65 కేజీలు లోపు బాలికలు బరువు కలిగి ఉండాలని స్పష్టం చేశారు. జిల్లా జట్టుకు ఎంపికై న క్రీడాకారులు సెప్టెంబర్ 22 నుంచి 24 వరకు విజయవాడ గొల్లపూడిలో నిర్వహించే అంతర్ జిల్లాల జూనియర్ కబడ్డీ పోటీలో పాల్గొంటారని వివరించారు. ఇతర వివరాలకు 94913 33906, 96424 96117 నంబర్లకు ఫోన్ చేయాలని కోరారు. -
2003 డీఎస్సీ ఉపాధ్యాయుల నిరసన
ఏలూరు (ఆర్ఆర్పేట): 2003–డీఎస్సీ ఉపాధ్యాయులకు కేంద్ర ప్రభుత్వ మెమో 57 ప్రకారం పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని 2003 డీఎస్సీ ఫోరమ్ నాయకులు డిమాండ్ చేశారు. ఫోరం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గురువారం స్థానిక ఏలూరు అర్బన్ తహసీల్దార్ కార్యాలయం వద్ద నల్లబ్యాడ్జీలతో నిరసన ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా ఫోరమ్ నాయకులు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీపీఎస్ విధానం అమలు 2004 సెప్టెంబన్ 1కు ముందు నోటిఫికేషన్ వెలువడినప్పటికీ, నియామకాలు తర్వాత జరిగిన కారణంగా సుమారు 11,000 మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు పాత పెన్షన్ నష్టపోయారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ మెమో 57 ప్రకారం వీరందరికీ పాత పింఛన్ను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం ఏలూరు తహసీల్దార్ గాయత్రికి వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో ఇప్పిలి శంకర్ రావు, నండూరి గణేష్, మరక బాలసుబ్రహ్మణ్యం, ఎం. శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
ఆక్వా సాగులో మెలకువలతో లాభాలు
కాళ్ల: ఆక్వా సాగులోని మెలకువులతో రైతులు లాభసాటిగా ముందుకు సాగాలని కేంద్ర సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాసవర్మ, రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) అన్నారు. పెదఅమిరంలోని ఆర్ కన్వెన్షన్ హాల్లో మూడురోజులపాటు నిర్వహించే ఆక్వా ఎక్స్ ఇండియాను గురువారం వారు ప్రారంభించారు. ఆక్వా ఎక్స్పోలను రొయ్య, చేపల రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. నిర్వాహకులు దంతులూరి వేణు మాట్లాడుతూ 9 ఏళ్లుగా అనేక చోట్ల ఆక్వా ఎక్స్ ఇండియా ఆధ్వర్యంలో ఆక్వా ఎక్స్పో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, 100 స్టాల్స్తో ప్రదర్శన జరుగుతుందన్నారు. మొదటి రోజు జరిగిన ఈ కార్యక్రమంలో దాదాపు 3000 మంది రైతులు పాల్గొని వివిధ ఆక్వా కంపెనీలు ఏర్పాటు చేసిన 80 స్టాల్స్ ను సందర్శించి వాళ్లకి కావాల్సిన సమాచారం, ప్రొడెక్షన్ గురించి తెలుసుకున్నారన్నా రు. అలాగే మిగిలిన రెండు రోజులలో జరిగే కార్యక్రమానికి దాదాపు 6000 మంది పైగా వివిధ కంపెనీ ల ప్రతినిధులు, రైతులు, ప్రజలు పాల్గొంటారని చెప్పారు. కార్యక్రమంలోఆక్వా ఎక్స్పో టైటిల్ పార్టనర్ నెక్సజెన్ కంపెనీ నుంచి అక్కిన శేషు, సీఓఓ టి. శ్రీనివాస్, సూర్యమిత్ర ఎగ్జిమ్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత యిర్రింకి సూర్యారావు, పొత్తూరి బాపిరాజు, రైతులు తదితరులు పాల్గొన్నారు. -
వరిని ఆశించే పురుగులతో ఇక్కట్లు
మండవల్లి: కాండం తొలుచు పురుగు, ఆకునల్లి తదితర రకాల పురుగుల వల్ల వరి రైతులు తీరని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాండం తొలుచు పురుగు వరి పంటలో కనిపించే అతి ముఖ్యమైన పురుగు. ఇది ఖరీఫ్ రబీల్లో కూడా కనిపిస్తూ ఎక్కువ నష్టాని కలుగజేస్తుంది. ఇది ఒకే పంటను ఆశించి ఎక్కువ నష్టాన్ని కలుగజేస్తాయి. ఈ పురుగులు లైంగిక గుడ్డు నుంచి వచ్చే చిన్న పురుగులు కొన్ని గంటల పాటు ఆకులపై తిరుగుతూ చద్విరూకత కలిగి ఉంటాయి. ఆడ పురుగులు, మగ పురుగులు కొన్ని గుర్తింపు చిహ్నాల ద్వారా లింగ భేదం చేయవచ్చు, ఆడ పురుగు మగ పురుగుకన్నా పెద్దగా లావుగా ఉండి , లేత పసుపు రంగులో ఉంటుంది. ఆడ పురుగు మొదటి జత రెక్కలపైన మధ్యలో ఒక నల్లటి చుక్క ఉంటుంది. మగ పురుగు ముందు రెక్కలపై నల్లటి మచ్చ ఉండదు. వరికాండానికి పెద్ద దెబ్బ ఈ పురుగులు గుడ్డు నుంచి వచ్చే చిన్న పురుగులు కొన్ని గంటల పాటు ఆకులపై తిరుగుతూ ఊలు దారంతో వేలాడుతాయి. ఇవి ఆకుల తొడిమి లోకి ప్రవేశించి కాండంను తింటూ లోపలకు చేరి లోపలి భాగాన్ని తింటాయి. ఈ పురుగు వరిపైరును పిలకలు వేసే దశ, చిరుపొట్ట దశల్లో ఆశించి నష్టాన్ని కలుగజేస్తాయి. ఈ పురుగులు పైరును వరి పంటను పిలకలు వేసే దశలో ఆశించి నష్టాన్ని కలుగజేస్తాయి. క్లోరో నియంతప్రోల్ మందు ఎకరానికి 60 మి.లీ, కార్ట్ ఆఫ్ హైడ్రోక్లోరైడ్ మందు 2 గ్రాములు ఒక లీటరు నీటికి అసెఫెట్ ఒక గ్రాము లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. కాండం తొలుచు పురుగు వరిపైరును పిలకలు వేసేదశ, చిరుపొట్ట దశల్లో ఆశించి నష్టాన్ని కలుగజేస్తాయి. వ్యవసాయాధికారుల సూచనలతో దీనిని నివారించుకోవచ్చు. – నల్లమోతు వేణుగోపాలరావు, మండవల్లి ఇవి ఆకుల తొడిమిలోకి ప్రవేశించి కాండంను తింటూ లోపలికి చేరి లోపలి భాగాన్ని తింటాయి. దీంతో వరిపైరుకు బాగా నష్టం ఏర్పడుతుంది. – పందిళ్ళ సూర్యనారాయణ, మండవల్లివరిని ఆశించే ఆడ, మగ కాండం తొలుచు పురుగులు -
చెరువు తయారీ నిర్వహణ ఇలా
● మట్టి, నీటి నాణ్యత సమతుల్యానికి చెరువు అడుగు భాగాన్ని ఎండబెట్టాలి. ● చెరువును ఎండబెట్టి దున్నడం వల్ల ఖనిజాలు స్థిరంగా ఉంటాయి. ● సున్నం చల్లడం వల్ల ఆమ్లత తటస్తంతో పాటు ఉపయోకర సూక్ష్మజీవుల పెరుగుదలకు సహాయపడుతుంది. ● అవాంఛిత చేపలను, జీవులను తొలగించడానికి సహజ చేపల నాశకాలైన సాయిల్ కేక్, టీ సీడ్ కేక్లు ఉపయోగించాలి. ● ఎరువులు, ప్లాంక్టాన్ పెరుగుదలను ప్రేరేపిస్తాయి. అధిక బ్లూమ్లను నివారించడానికి ఎరువులను జాగ్రత్తగా వాడాలి. ● ఆక్సిజన్ స్థాయిలను క్రమబద్ధీకరించడానికి, హానికరమైన పదార్థాలు పేరుకుపోకుండా ఉండటానికి బురద (స్లడ్జ్) తొలగింపు చాలా అవసరం. -
నీరు.. నేలతో ఆక్వా వహ్వా..!
● ఆక్వా సాగులో ఆ రెండే కీలకమంటున్న నిపుణులు ● కొల్లేరు నల్లరేగడి నేలలు సాగుకు అనుకూలం కై కలూరు: ఆక్వా సాగు అంటే రైతులకు సిరులు అందించే కల్పతరువుగా భావిస్తారు. ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఆక్వా సాగు ఎక్కువగా చేస్తారు. అయితే ఇటీవల ఆక్వా సాగులో రైతులు నష్టాలను చవిచూస్తున్నారు. సాగుపై సరైన అవగాహన లేకపోవడంతో ఆర్థికంగా నష్టపోతున్నారు. చేపలు, రొయ్యల పెంపకం నీరు, నేల యాజమాన్య పద్ధతులపై ఆధారపడి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. చెరువు అడుగున వీటి మధ్య పరస్పర చర్య జరుగుతుంది. నీటి నాణ్యత, ప్లాంక్టాన్ పెరుగుదల పంట దిగుబడిని నేరుగా ప్రభావితం చేస్తోంది. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో 2.90 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగు చేస్తున్నారు. ప్రధానంగా కొల్లేరు ప్రాంతంలో నల్లరేగడి నేలల్లో సాగు ఎక్కువుగా జరుగుతోంది. నేల స్వభావం దెబ్బతింటే స్థూల, సూక్ష్మ మూలకాలు పెరిగి పంట ఎదుగుదలపై ప్రభావం చూపుతాయి. నీటి నాణ్యత లోపం వల్ల బ్యాక్టీరియా వృద్ధి చెంది పేను, తాటాకు తెగులు, శంకు జలగ, జిగురు వ్యాధులు వ్యాప్తి చెందుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో నీరు, నేలపై ఆక్వా నిపుణులు తెలిపే సూచనలను ఓ సారి తెలుసుకుందాం. నీటి నాణ్యతపై శ్రద్ధ అవసరం మంచి నేల నిర్వహణ ఎంతో ముఖ్యమో సరైన నీటి నాణ్యత పర్యవేక్షణ కూడా అంతే ముఖ్యం. సాగు చేసే చెరువు నీటి ఉష్ణోగ్రతలు 28 డిగ్రీల నుంచి 32 డిగ్రీల సెంటీగ్రేట్ మధ్య ఉంటాయి. ఉష్ణోగ్రత 20 డిగ్రీల సెంటీగ్రేట్ కంటే తగ్గితే, పెరుగుదల బాగా తక్కువగా ఉంటుందని అర్థం. పారదర్శకత 25–40 సెంటీమీటర్లు ఉండాలి. చేపలు, రొయ్యల పెరుగుదలను నిర్ధారించడానికి కరిగిన ఆక్సిజన్ 5 పీపీఎం అంతకంటే ఎక్కువ ఉంచాలి. పగటిపూట అధిక హెచ్చుతగ్గులు లేకుండా నీటి పీహెచ్ 7.5–8.5 మధ్య ఉండాలి. రైతులు అమ్మోనియా, నైట్రేట్, హైడ్రోజన్ సల్ఫయిడ్ వంటి విష వాయువుల నుంచి కూడా జాగ్రత్త వహించాలి. ఆక్వాసాగులో నేల పాత్ర ఇలా చెరువు సాగులో ఒండ్రు, నల్లరేగడి నేలలు నీటి నిలుపుదల శక్తిని కలిగి ఉంటాయి. ఇవి సేంద్రియ పదార్థాల విచ్ఛిన్నతను నియంత్రిస్తాయి. పీహెచ్ (6.5–7.5) సమతుల్యంగా ఉంచితే మంచి నేలలుగా పరిగణించాలి. నేలలో కాల్షియం, కార్బోనేట్ 5 శాతం కంటే ఎక్కువుగా ఉంటే మంచి సామర్థ్యం కలిగిన నేలలుగా భావించాలి. అల్యూమినియం, మాంగనీస్ వంటి విషవారిత లోహాలు నీటిలో కరిగిపోకుండా నేలలు నిరోధిస్తుంది. సేంద్రియ పదార్థం 2 శాతం కంటే ఎక్కువ ఉన్న నేలలు నీటి లీకిజీని తగ్గించి, సూక్ష్మజీవుల అభివృద్ధికి మద్దతు ఇస్తాయి. చౌడు నేలలు సేంద్రియ పదార్థం విచ్ఛిన్నాన్ని తగ్గించి, ప్లాంక్టాన్ పెరుగుదలను పరిమితం చేస్తాయి. నేల, నీటి మధ్య రసాయనాల మార్పిడి చెరువు అడుగున, నేల, నీరు నిరంతరం ఒకదానితో ఒకటి పరస్పర చర్యలకు గురవుతాయి. ఆమ్ల నేలలు చెరువు పీహెచ్ని తగ్గిస్తాయి. క్షార నేలలు కార్బోనేట్ నిక్షేపాలను పెంచుతాయి. నేలలు నత్రజని, భాస్వరం గిడ్డంగులుగా పనిచేస్తాయి. ఫ్లాంక్టన్ పెరుగుదలకు తోడ్పడటానికి లవణాలను క్రమంగా విడుదల చేస్తాయి. వృథా అయిన మేత, జంతువుల వ్యర్థాలు పేరుకుపోయినప్పుడు, ఆక్సిజన్ స్థాయిలు తగ్గి, అమ్మోనియా స్థాయిలు పెరుగుతాయి. బాగా ఆక్సిజన్ నిండిన నేలలు ఆరోగ్యకరమైన విచ్ఛేదనాన్ని ప్రోత్సహిస్తాయి. ఆక్సిజన్ తక్కువగా ఉన్న నేలలు హైడ్రోజన్ సల్ఫైడ్, మీథేన్ వంటి విష వాయువులను విడుదల చేస్తాయి. రొయ్యల చెరువులో తిరుగుతున్న ఏరియేటర్లు(ఫైల్) చేపల పట్టుబడి చేస్తున్న కార్మికులునేల, నీరు కలిసి చెరువు పర్యావరణ సమతుల్యతను నిర్ధారిస్తాయి. ఆక్వాసాగులో ఈ రెండు వీడదీయరాని బంధంగా ఉంటాయి. చేపల, రొయ్యల రైతులు నేల, నీరు, మేతలు వంటి వాటిపై సరైన అవగాహనతో ఉండాలి. నీటి, మట్టి పరీక్షలను ఆక్వా ల్యాబ్లో పరీక్షలు చేయించుకోవాలి. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా సాగు పద్ధతులను పాటించాలి. సమస్య గుర్తిస్తే ఆక్వా నిపుణులను సంప్రదించాలి. – డాక్టర్ పి.రామమోహన్రావు, విశ్రాంత డిప్యూటి డైరెక్టర్ ఆఫ్ ఫిషరీస్, కాకినాడ -
ఉత్సాహంగా స్కూల్ గేమ్స్ ఎంపిక పోటీలు
భీమవరం : స్థానిక బ్రౌనింగ్ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో గురువారం ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా 69వ స్కూల్ గేమ్స్ అండర్ 19 బాల, బాలికల నెట్ బాల్, మాల్కంబ్ క్రీడల్లో ఎంపికలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అండర్–19 స్కూల్ గేమ్స్ సెక్రటరీ కె.జయరాజు మాట్లాడుతూ 100 మంది క్రీడాకారులు ఎంపికలో పాల్గొన్నారన్నారు. ఎంపికై న క్రీడాకారులు త్వరలో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీల్లో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా జట్లకు ప్రాతినిధ్యం వహిస్తారన్నారు. ఈ ఎంపిక కార్యక్రమానికి వీరవాసరం ప్రభుత్వ జూనియర్ కాలేజీ ఫిజికల్ డైరెక్టర్ నాగమణి, బ్రౌనింగ్ కళాశాల పీడీ దావుద్ ఖాన్, పీడీలు శ్రీనివాస్, జీపీసీ శేఖర్ రాజు తదితరులు సహకరించారు. అనంతరం ఎంపికై న క్రీడాకారులను బ్రౌనింగ్ కళాశాల చైర్మన్ మేడిది జాన్సన్, సెక్రటరీ మేడిది ఎస్తేరుప్రియాంక, అభినందించారు. భీమవరం: జిల్లా చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం భీమవరం పట్టణంలోని ఆర్యవైశ్య యువజన భవనంలో అనసూయ చెస్ అకాడమీ ఇన్విటేషన్ చెస్ పోటీలు నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు మాదాసు కిషోర్ తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. అండర్–7,9,11,13,13 విభాగాల్లో బాల, బాలికలకు నిర్వహించే పోటీల్లో మొదటి, రెండో స్థానంలో విజేతలకు రూ. 20 వేలు నగదు బహుమతులు అందజేయనున్నట్లు చెప్పారు. ఇతర వివరాల కోసం 90632 24466 నంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు. -
పెరిగిన వర్జీనియా పొగాకు ధర
కేజీకి రూ.395 రికార్డు ధరజంగారెడ్డిగూడెం: చాలా రోజులు స్థిరంగా కొనసాగిన వర్జీనియా పొగాకు ధర ఈ నెల ప్రారంభం నుంచి పెరుగుతూ వచ్చింది. ఇలా పెరుగుతూ వచ్చిన ధర గురువారం కేజీ ధర రూ. 395కు చేరుకుంది. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో జంగారెడ్డిగూడెం–1, –2, కొయ్యలగూడెం, గోపాలపురం, దేవరపల్లిలో వర్జీనియా పొగాకు వేలం కేంద్రాలు ఉన్నాయి. ఈ ఏడాది వర్జీనియా వేలం ప్రారంభం సమయంలో కేజీకి రూ.290 మాత్రమే లభించింది. గత ఏడాది అత్యధికంగా కేజీకి రూ.411 లభించగా, కేజీ సరాసరి ధర రూ.330 లభించింది. ఈ ఏడాది వర్జీనియా వేలం ప్రారంభం నాడు రూ.290 ధర రాగా, క్రమేపీ పెరుగుతూ జూలై నెల చివరి వరకు కేజీ ధర అత్యధికంగా రూ.390 లభించింది. కేజీ ధర అత్యల్పంగా రూ.200 లభించింది. ఆ తరువాత జూలై 26 నుంచి ఆగస్టు మొదటి వారం వరకు అత్యధిక ధర రూ.20 పడిపోయి రూ.370 లభించింది. అత్యల్ప ధర రూ.200 లభించింది. ఆ తరువాత ఆగస్టు 9 నుంచి సెప్టెంబర్ 2 వరకు ఈ ధర మరింత పడిపోయి అత్యధిక ధర కేజీ రూ.350, అత్యల్పధర రూ. 200 లభించింది. దీంతో రైతులు తీవ్ర నిరాశకు గురయ్యారు. కేజీ ధర రూ.390 నుంచి రూ. 350కు పడిపోవడంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. ఆయా కంపెనీలు సిండికేట్గా మారి పొగాకు ధరను తగ్గించి కొంటున్నారని రైతులు ఆరోపించారు. రూ.390 నుంచి రూ.350కు పడిపోయిన ధర సుమారు 25 రోజుల పాటు రూ.350 వద్ద స్థిరంగా కొనసాగింది. సెప్టెంబర్ 3న కొద్దిగా పెరిగి కేజీ ధర రూ.362, 4న రూ.375, 6 నుంచి 8 వరకు రూ.376 లభించింది. 9, 10వ తేదీన ఈ ధర మరింతగా పెరిగి రూ.390కు చేరుకుంది. గురువారం ధర రూ. కేజీ ఒక్కింటికి రూ.395 రాగా, అత్యల్పం రూ. 200 లభించింది. కాగా గురువారం నాటి వేలంలో జంగారెడ్డిగూడెం –1, 2 వేలం కేంద్రాలు, కొయ్యలగూడెం, గోపాలపురం వేలం కేంద్రాల్లో అత్యధిక ధర కేజీ ఒక్కింటికి రూ. 395 లభించగా, గోపాలపురం వేలం కేంద్రంలో రూ.394 లభించింది. అలాగే గురువారం నాటికి సరాసరి ధర రూ. 296.34 లభించింది. -
అమృత్ పై నీలినీడలు
భీమవరం(ప్రకాశం చౌక్): పశ్చిమగోదావరి జిల్లాలోని ఆరు పట్టణాలకు సురక్షిత తాగునీటిని పుష్కలంగా అందించే అమృత్ 2.0 (అటల్ మిషన్ ఫర్ రిజువెనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్) మంచినీటి సరఫరా ప్రాజెక్టు ముందుకు కదలడం లేదు. జిల్లాలోని భీమవరం, పాలకొల్లు, తణుకు, తాడేపల్లిగూడెం, నరసాపురం, ఆకివీడు మున్సిపాలిటీల్లో శివారు ప్రాంతాలకు సైతం రెండు పూటలా మంచినీటిని అందించి శాశ్వతంగా తాగునీటి సమస్య లేకుండా చేసే బృహత్తర ప్రాజెక్టు పనులు నత్తనడక కంటే దారుణంగా సాగుతున్నాయి. మొదట అమృత్ 2.0 ప్రాజెక్టుకు రూ.286.54 కోట్లు మంజూరు చేయగా 2025 నాటికి పూర్తి చేయాలని నిర్ధేశించారు. దీంతో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమృత్ 2.0 ప్రాజెక్టుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి ప్రాజెక్టుకు సంబంధించి డీపీఆర్లు సైతం పూర్తి చేసి టెండర్లు ప్రక్రియ వరకు తీసుకువెళ్లింది. అనంతరం సార్వత్రిక ఎన్నికలు రావడం, ప్రభుత్వం మారిపోవడంతో ప్రాజెక్టు పనులు నిలిచిపోయాయి. ఆ తరువాత కేంద్ర ప్రభుత్వం మళ్లీ ప్రాజెక్టు వ్యయం రూ.770.85 కోట్లతో భారీ ప్రాజెక్టుగా మార్చింది. 15 నెలలుగా ముందుకు కదలడం లేదు పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ద్వారా జరిగే ఈ ప్రాజెక్టుకు కూటమి ప్రభుత్వం నుంచి పూర్తి సహాయ సహకారం అందడం లేదని సృష్టంగా తెలుస్తోంది. గత 15 నెలలుగా ఒక పనికి కూడా టెండర్ వరకు అమృత్ 2.0 ముందుకు వెళ్లలేదు. ఆరు పట్టణాల్లో ఎక్కడ కూడా ఇప్పటివరకు ఒక పనికి కూడా టెండర్లు ఖరారు కాలేదు. పూర్తిగా డీపీఆర్లు కూడా తయారీ కాలేదు. జిల్లాలో ముఖ్యమైన పట్టణాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ అధ్వర్యంలో చేపట్టాల్సిన మంచినీటి ప్రాజెక్టు గురించి కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. దీంతో పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ శాఖ అధికారులు సైతం ప్రభుత్వ బాటలోనే పయనిస్తూ ప్రాజెక్టు పనులపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దృష్టి సారించని కేంద్ర మంత్రి జిల్లా కేంద్రమైన భీమవరంలో కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ ఉన్నా కేంద్ర ప్రాజెక్టు అమృత్ 2.0పై శ్రద్ధ వహించడం లేదు. ప్రజలకు తాగునీరు అందించే ప్రాజెక్టుపై శ్రద్ధ చూపడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఇప్పటివరకు జిల్లాలోని ఆరు పట్టణాలకు సంబంధించిన ఏ ఎమ్మెల్యే గానీ, రాష్ట్ర మంత్రి నిమ్మల రామనాయుడు గానీ అమృత్ 2.0 గురించి అధికారులను కనీసం ఆరా తీసిన దాఖలా లేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే ఆయా పట్టణాల్లో చివరి ప్రాంతాల ప్రజలు మంచినీళ్లు కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పట్టణాల్లో రోజురోజుకూ పెరుగుతున్న జనాభా, అలాగే కొన్ని మున్సిపాలిటిల్లో విలీన గ్రామాలు కూడా భవిష్యత్లో కలిసే అవకాశం ఉన్న నేపథ్యంలో పెరిగే జనాభా దృష్టిలో పెట్టుకుని ప్రాజెక్టు వేగవంతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అమృత్ 2.0 ప్రాజెక్ట్కు సంబంధించి మారిన షెడ్యూల్ రేట్ల ప్రకారం డీపీఆర్లు సిద్ధం చేసి టెండర్లకు చర్యలు తీసుకుంటున్నాం. – ఆర్.విజయ్ జిల్లా పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ శాఖ అధికారి అమృత్ 2.0 ప్రాజెక్టు నిధులు ఆరు పట్టణాలకు రూ. 770.85 కోట్లు కాగా అందులో ముఖ్యమైన పనుల్లో విజ్జేశ్వరం నుంచి ఆరు పట్టణాలకు వాటర్ గ్రిడ్ పైపులైన్, మొత్తం 12 ఓహెచ్ఆర్లు (వాటర్ ట్యాంకులు), ఎస్టీపీలు 2 (మురికినీళ్లు శుద్ధిచేసే ప్లాంట్లు), ఫిల్టరేషన్ ప్లాంట్లు 3, సమ్మర్ స్టోరేజీ ట్యాంకు, అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ పనులు ఉన్నాయి. భీమవరం రూ.167.72 కోట్లు విజ్జేశ్వరం నుంచి 54 కీలోమీటర్లు మేర వాటర్ గ్రిడ్ ద్వారా పైపులైన్ వేయడం, పట్టణంలో మంచినీటి సరఫరా కోసం పైపులైన్లు, ఇతర వాటర్ సరఫరా పనులు. తాడేల్లిగూడెం రూ.163.50 కోట్లు సమ్మర్ స్టోరేజి ట్యాంకు, ఓహెచ్ఆర్ 1, ఎస్టీపీలు 2, అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ, పైపులైను పనులు నరసాపురం రూ.125.92 కోట్లు ఓహెచ్ఆర్లు 3, ఫిల్టరేషన్ ప్లాంట్ 1, సంపులు, పైపులైన్ల పనులు పాలకొల్లు రూ.119.26 కోట్లు వాటర్ పైపులైన్లు, ఇతర వాటర్ సరఫరా పనులు తణుకు రూ 118.119 కోట్లు ఓహెచ్ఆర్లు 4, ఫిల్టరేషన్ ప్లాంట్ 1, పైపులైన్ల పనులు ఆకివీడు రూ.76.34 కోట్లు ఓహెచ్ఆర్లు 4, ఫిల్టరేషన్ ప్లాంట్ 1, పైపులైన్ల పనులు కూటమి అలసత్వం జిల్లాలో ఆరు పట్టణాలకు సంబంధించి మంచినీటి సరఫరా ప్రాజెక్టు డీపీఆర్లు సిద్ధం చేసిన గత ప్రభుత్వం టెండర్ల దశలో సార్వత్రిక ఎన్నికలు 15 నెలలుగా కూటమి హయాంలో పట్టాలు ఎక్కని ప్రాజెక్టు పనులు -
అటవీ అమరవీరులకు నివాళి
భీమవరం: అటవీ, వన్యప్రాణి సంరక్షణ కోసం అశువులు బాసిన అమరవీరులను స్ఫూర్తిగా తీసుకుని అటవీ సిబ్బంది నిబద్ధతతో పనిచేయాలని జిల్లా అటవీశాఖాధికారి డీఏ కిరణ్ అన్నారు. గురువారం జిల్లా అటవీ శాఖాధికారి కార్యాలయంలో జాతీయ అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవం నిర్వహించారు. గంధం చెక్కల స్మగ్లర్ వీరప్పన్ చేతిలో మృతి చెందిన రాజమహేంద్రవరానికి చెందిన ఫారెస్ట్ అధికారి పందిరిపల్లి శ్రీనివాసరావు చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. భీమవరం రేంజ్ అటవీ క్షేత్రాధికారి మురాల కరుణాకర్ మాట్లాడుతూ 1730 సెప్టెంబర్ 11న రాజస్థాన్ రాష్ట్రం జోదపూర్లో అటవీ సంరక్షణకు సుమారు 363 మంది బలిదానం కావడంతో మహారాజా అభయ్ సింగ్ పశ్చాత్తాపంతో అటవీ అమరవీరుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ జాతీయ అటవీ సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహించారని చెప్పారు. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ భారతి, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ సురేష్కుమార్, బీట్ ఆఫీసర్ రాంప్రసాద్, సీనియర్ అసిస్టెంట్ పోచమ్మ పాల్గొన్నారు. -
సమస్యలు పరిష్కరించకుంటే రాష్ట్రవ్యాప్త నిరసనలు
సచివాలయ ఉద్యోగుల హెచ్చరిక యలమంచిలి: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యలను 15 రోజుల్లో పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతామని ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ఐక్యవేదిక స్పష్టం చేసింది. రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు గురువారం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మున్సిపాలిటీలో, మండలంలో మున్సిపల్ కమిషనర్లకు, ఎంపీడీఓలకు సచివాలయ ఉద్యోగులు అధికారిక నోటీసులు అందజేశారు. ఈ మేరకు యలమంచిలి మండల ఉద్యోగులు ఈఓపీఆర్డీ జేడీవీ ప్రసాద్కు వినతిపత్రం ఇచ్చారు. ఇంటింటికీ తిరుగుతూ చేసే సర్వేల నుంచి సచివాలయ ఉద్యోగులకు విముక్తి కల్పించాలని, గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగులను వారి సంబంధిత మాతృశాఖలకే అనుసంధానం చేయాలని, సమయపాలన లేకుండా ఆదివారాలు, పండుగలు, సెలవులు, అర్ధ రాత్రుల్లో బలవంతపు విధులు చేయించడం నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ప్రొబేషన్ పీరియడ్ పూర్తయిన వారికి నోషనల్ ఇంక్రిమెంట్లు మంజూరు చేయాలని, ఆరేళ్లుగా ఒకే క్యాడర్లో కొనసాగుతున్న వారికి స్పెషల్ ఇంక్రిమెంట్ ఇవ్వాలని, ప్రస్తుత రికార్డ్ అసిస్టెంట్ క్యాడర్ను జూనియర్ అసిస్టెంట్ క్యాడర్గా మార్పు చేయాలని, జిల్లాల వారీగా సీనియారిటీ జాబితాలు విడుదల చేయాలని, స్టేషన్ సీనియారిటీ ఆధారంగా పారదర్శక బదిలీలకు ప్రత్యేక విధి విధానాలు రూపొందించాలని వారు అధికారిక నోటీసులో పేర్కొన్నారు. -
కర్నూలు ఉల్లి.. రైతులు తల్లడిల్లి
తాడేపల్లిగూడెం: ఆరుగాలం కష్టించి పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక కర్నూలు ఉల్లి రైతులు తల్లడిల్లుతున్నారు. రాష్ట్రంలోనే ప్రధానమైన తాడేపల్లిగూడెం మార్కెట్కు కర్నూలు ఉల్లి లారీలు వస్తున్నా తేమశాతం, నాణ్యత లేమితో వ్యాపారులు కొనుగోలు చేయకపోవడంతో ఏం చేయాలో పాలుపోక అల్లాడుతున్నారు. ప్రభుత్వ సాయం అందక, అధికారులు చేస్తున్న ప్రయత్నాలు ఫలించకపోవడంతో నెల రోజులుగా రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఉల్లి బస్తాలను రోడ్ల పక్కన వదిలేస్తూ నిట్టూరుస్తున్నారు. 70 ఏళ్లుగా ఇక్కడికే.. రాష్ట్రంలోని ఉల్లి అవసరాన్ని మహారాష్ట్ర ఉల్లి తర్వాత కర్నూలు, కడప ఉల్లి తీరుస్తుంది. ఖరీఫ్, రబీ సీజన్లలో వేలాది ఎకరాల్లో ఉల్లి పండించడంతో పాటు అధిక శాతం పంటను 70 ఏళ్లుగా ప్రధాన మార్కెట్గా ఉన్న తాడేపల్లిగూడేనికి రైతులు తీసుకొస్తున్నారు. ఇక్కడ బస్తా బస్తా గ్రేడింగ్ చేసి ధర నిర్ణయిస్తారు. బహిరంగ వేలంలో ఉల్లిని విక్రయిస్తారు. అదే రోజు రైతుల చేతికి సొమ్ములు అందుతాయి. కర్నూలు మార్కెట్ దీనికి భిన్నం కావడంతో ఈ రకం గూడెం మార్కెట్కే ఎక్కువగా వస్తుంది. ఇది చాలా కాలంగా వ్యాపార బంధంగా కొనసాగుతోంది. అక్కడి ఉల్లి రైతులకు కష్టం వచ్చినా కూడా ఆదుకొనేది తాడేపల్లిగూడెం వ్యాపారులే కావడం విశేషం. విస్తీర్ణం తగ్గినా.. ధర లేదు కర్నూలు జిల్లాలో ఉల్లి సాగు విస్తీర్ణం క్రమేపీ తగ్గుతోంది. 2019–20లో 33,829 ఎకరాల్లో సాగు చేయగా 7.78 లక్షల టన్నుల దిగుబడి వచ్చింది. అదే 2024–25లో 19,546 ఎకరాల్లో సాగు చేయగా 3.51 లక్షల టన్నులకు దిగుబడి అంచనా వేశారు. ఎకరాకు రైతుకు రూ.70 వేలు ఖర్చవుతుంది. కనీస దిగుబడి 50 క్వింటాళ్లు రావాలి. అలాగే ధర క్వింటాలు రూ.2 వేలు పలికితేనే రైతు గట్టెక్కుతారు. అయితే ఈ ఏడాది ధరలు దారుణంగా పడిపోయాయి. కిలోకు రూ.4 రావడం గగనంగా మారింది. నాణ్యత ఉంటే రూ.9 వరకు వస్తుంది. కిలో గరిష్ట ధరను రూ.11గా నిర్ణయించారు. దీంతో రైతులు ఉల్లిని మార్కెట్లకు తెస్తున్నారు. వాటిని మార్క్ఫెడ్ కొనుగోలు చేసి తర్వాత ప్రధాన మార్కెట్కు పంపిస్తోంది. నాలుగు రోజుల తర్వాత గూడెంకు.. మహారాష్ట్ర ఉల్లితో పోలిస్తే కర్నూలు ఉల్లిలో నాణ్యత తక్కువ. మార్క్ఫెడ్ కొనుగోలు చేసిన వెంటనే పంటను మార్కెట్లు తరలించాల్సి ఉండగా అలా జరగడం లేదు. ఉల్లిని కర్నూలు మార్కెట్ యార్డులో కొనుగోలు చేసి, నెట్టులు కట్టి నాలుగు రోజుల తర్వాత తాడేపల్లి గూడెం మార్కెట్కు పంపిస్తున్నాయి. వాస్తవానికి ఉల్లి లారీ 30 నుంచి 35 టన్నులు ఉంటుంది. నాసిరకం, కుళ్లిపోయే గుణం కర్నూలు ఉల్లిని పది టన్నులకు మించి పంపకూడదు. సామర్థ్యానికి మించి పంపితే ఆవిరి పెరిగి, పై బస్తాలు కింద బస్తాలను నొక్కడంతో ఉల్లిపాయలు మరింత రసం కారేలా తయారవుతున్నాయి. దీంతో ఈ రకం మార్కెట్కు వచ్చినా ఎవరూ కొనుగోలు చేయకపోవడంతో రోడ్లపై పడేసే పరిస్థితి వచ్చింది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ధరల స్థిరీకరణ పేరుతో ఏటా రూ.3 వేల కోట్లను బడ్జెట్లో కేటాయించి రైతులకు పంటల విషయంలో సమస్య వచ్చినప్పుడు కనీస ధర ఇచ్చి ఆదుకునేది. ప్రస్తుత కూటమి పాలనలో ఈ పరిస్థితి లేకపోవడంతో రైతులు అల్లాడుతున్నారు. తాడేపల్లిగూడెం మార్కెట్కు వచ్చే కర్నూలు ఉల్లిలో నాణ్యత లేకపోవడంతో వ్యాపారులు కొనడం లేదు. ఇంకా మహారాష్ట్ర ఉల్లిపాయలు వస్తున్నాయి. మహారాష్ట్రలో కూడా 60 శాతం పంట ఉంది. సాధారణంగా కర్నూలు ఉల్లి సీజన్లో రోజుకు 80కు పైగా లారీలు గూడెం మార్కెట్ వస్తుంటాయి. అయితే ప్రస్తుతం ఏడెనిమిది లారీలు మాత్రమే వస్తున్నాయి. కడప, మైదుకూరు ప్రాంతాల నుంచి వచ్చే రకంలో కాస్త నాణ్యత ఉంటుండగా.. కర్నూలు రకం ఇక్కడకు వచ్చేసరికి కుళ్లిపోతున్నాయి. దీంతో కిలో రూ. 2 కు కూడా కొనడం లేదు. వాటిని దుకాణాల్లో ఉంచుకోలేం. దీంతో వ్యాపారులు తాము తీసుకునే కమీషన్ సొమ్ములను రైతుల నుంచి తీసుకోవడం లేదు. ప్రభుత్వం ఆదేశాల మేరకు కర్నూలు ఉల్లి రైతులకు న్యాయం చేయడానికి మా వంతు కృషి చేస్తున్నాం. – ఎన్కే, ఉల్లి వ్యాపారి గిట్టుబాటు ధర లేని వైనం నాణ్యతలేమి, తేమ శాతంతో ఇబ్బందులు ఆదుకోని కూటమి సర్కారు నలిగిపోతున్న ఉల్లి రైతులు -
ధాన్యం కొనుగోలుకు పటిష్ట కార్యాచరణ
భీమవరం: ఖరీఫ్ సీజన్ ధాన్యం కొనుగోలుకు పటిష్ట కార్యాచరణ సిద్ధం చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని జాయింట్ కలెక్టర్ ఛాంబర్ నందు ఖరీఫ్ సీజన్లో ధాన్యం కొనుగోలు ఏర్పాట్లపై పౌర సరఫరాలు, వ్యవసాయ, సహకార, రవాణా శాఖలు, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ సభ్యులతో జేసీ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్టోబర్ మొదటి వారం నుంచి రైతుల ధాన్యం కొనుగోలుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మొదటి వారంలో తాడేపల్లిగూడెంలో ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు చేయాలన్నారు. పెనుగొండ: ములపర్రులో మద్యం ధరలను ఇష్టారాజ్యంగా వసూలు చేస్తుండడంపై మద్యం ప్రియులు గురువారం దుకాణం వద్ద నిరసన తెలిపారు. మద్యం ధరలు తగ్గించాలంటూ నినాదాలు చేశారు. సమయానుకూలంగా ధరలు మారుస్తున్నారంటూ విమర్శించారు. అధికంగా ఎందుకు తీసుకుంటున్నారని ప్రశ్నిస్తే ధర ఇంతేనంటూ వెటకారంగా సమాధానం ఇస్తున్నారని వాపోయారు. ధరలు తగ్గించకపోతే పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఏలూరు(మెట్రో): ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పంచాయతీరాజ్ పర్యవేక్షక ఇంజనీర్గా రమేష్ గరువారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం జిల్లా పరిషత్ క్యాంపు కార్యాలయంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఘంటా పద్మశ్రీని ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. పంచాయతీ రాజ్ విభాగం ద్వారా జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులపై సమగ్రంగా చర్చించారు. తాడేపల్లిగూడెం: రాష్ట్రంలో పండిన కర్నూలు ఉల్లిపాయలను వినియోగించి రైతులకు బాసటగా నిలవాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి పిలుపునిచ్చారు. గురువారం తాడేపల్లిగూడెంలో మార్కెట్లో ఉల్లిపాయల క్రయ విక్రయాలను ఆమె పరిశీలించారు. పరిస్థితిపై కలెక్టర్ రైతులను నేరుగా అడిగి తెలుసుకున్నారు. కర్నూలు ఉల్లిపాయలతో వంట చేయించి, వ్యాపారులు, రైతులతో కలిసి కలెక్టర్ అక్కడే భోజనం చేశారు. షోలాపూర్ ఉల్లి కన్నా, కర్నూలు ఉల్లి ఎంతో రుచికరం అని, జిల్లా ప్రజలు, విద్యాసంస్థలు కర్నూలు ఉల్లినే వినియోగించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉల్లి రైతులను ఆదుకొనేందుకు ఎప్పటికప్పుడు సమీక్షిస్తుందన్నారు. గురువారం వచ్చిన ఉల్లిపాయలకు కిలోకు రూ.6 వచ్చాయని రైతు తెలుపగా, కలెక్టర్ కోరిక మేరకు రూ.9 వంతున చెల్లించడానికి వ్యాపారులు అంగీకరించారు. విద్యాసంస్థల్లో, మార్టుల్లో కర్నూలు ఉల్లిపాయల విక్రయాలు చేపట్టడానికి చర్యలు తీసుకున్నట్టు ఆమె చెప్పారు. మార్కెటింగ్ రీజినల్ జేడీ.కె.శ్రీనివాసరావు, ఏడీ సునీల్కుమార్, తహసీల్దార్ సునీల్, కమిషనర్ ఎం. ఏసుబాబు, తదితరులు ఉన్నారు. టి.నరసాపురం: మండలంలో బుధవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో ఆయా మార్గాల్లో గురువారం వాహన రాకపోకలు నిలిచిపోయాయి. మండలంలోని మక్కినవారిగూడెం – టి.నరసాపురం మార్గంలో కనకదుర్గ గుడి వద్ద జలవాగు, బండివారిగూడెం – మక్కినవారిగూడెం గ్రామాల మద్య గల ముగ్గురాళ్ళ వాగు, అప్పలరాజుగూడెం – మధ్యాహ్నపువారిగూడెం గ్రామాల మధ్య ఎర్రకాలువ వాగులు భారీ వర్షం కారణంగా పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో ఆయా గ్రామాల మధ్య వాహన రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. -
ఉపాధ్యాయుల పోరుబాట
భీమవరం: తమ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ మొండివైఖరిని నిరసిస్తూ ఉపాధ్యాయులు పోరుబాట పట్టారు. జిల్లాలోని ఉపాధ్యాయులంతా గురువారం నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. పెండింగ్లో ఉన్న 4 డీఏలను తక్షణం విడుదల చేయాలని, 12వ పీఆర్సీ కమిషన్ నియమించి ఐఆర్ ప్రకటించాలని, అన్ని రకాల బకాయిలు చెల్లించాలని, ఈహెచ్ఎస్ పరిమితిని రూ.25 లక్షలకు పెంచాలని, యాప్లు, అసెస్మెంట్ బుక్లెట్ విధానాలను రద్దుచేయాలని డిమాండ్ చేశారు. వారం రోజుల పాటు నిరసన కార్యక్రమాలకు ప్రణాళిక రూపొందించినట్లు ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు జి.ప్రకాశం తెలిపారు. ఈనెల 12న మండల కేంద్రాల్లో నిరసన ప్రదర్శనలు, 13, 14 తేదీల్లో ప్రజాప్రతినిధులకు వినతిపత్రాలు అందించడం, 15న తాలూకా కేంద్రాల్లో, 16న జిల్లా కేంద్రాల్లో నిరసన ప్రదర్శనలు, 17న ముఖ్యమంత్రి, సీఎస్లకు వాట్సాప్, ఈ మెయిల్ ద్వారా వినతులు పంపించి నిరసనలు తెలుపుతామని, అప్పటికీ ప్రభుత్వం సమస్యలు పరిష్కరించకుంటే ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని చెప్పారు. -
ఆధిపత్యం కోసమే హత్య
ఏలూరు టౌన్: ఏలూరు రూరల్ కొమడవోలు ఇందిరమ్మ కాలనీలో ఇటీవల జరిగిన దారుణ హత్య కేసులో ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఏలూరు డీఎప్పీ డి.శ్రావణ్కుమార్ బుధవారం ఏలూరు పోలీస్ సబ్ డివిజన్ కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. కొమడవోలు ఇందిరమ్మ కాలనీకి చెందిన పూనూరు రాజేష్ కొందరు రాజకీయ నేతల అండతో గొడవలకు సెటిల్మెంట్లు చేస్తూ ఉంటాడు. ఇదే ప్రాంతానికి చెందిన బూరగ నాని అలియాస్ చిన్న నాని మృతుడితో సన్నిహితంగా మెలిగేవాడు. కానీ కొన్ని సందర్భాల్లో రాజేష్ కఠినంగా ప్రవర్తిస్తూ చిన్న నానిని మందలించటం... కొట్టటం చేసేవాడు. రాజేష్కు తెలిసిన ఒక మహిళతో నాని చనువుగా ఉండటాన్ని గమనించిన ఆమె బంధువులు గతంలో నానితో గొడవపడి కొట్టారు. దీనిలోనూ రాజేష్ కీలకపాత్ర పోషించాడని నాని మనసులో కక్ష పెంచుకున్నాడు. పైగా ఇందిరమ్మ కాలనీలో సెటిల్మెంట్లు చేస్తున్న రాజేష్ లేకుంటే... తానే పెద్దమనిషిగా చలామణి అవ్వచ్చు అనే ఆలోచనతో రాజేష్ను చంపేందుకు తన స్నేహితులతో కలిసి పక్కా స్కెచ్ వేశాడు. కత్తులతో దాడి చేసి.. ముందుగా వేసుకున్న పథకం ప్రకారం ఆగస్టు 31 తేదీ ఆదివారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఇందిరమ్మ కాలనీలో రాజేష్ తన ఇంట్లో ఉండగా బూరగ నాని అతని ఇంటికి వెళ్లి బయటకు రావాలని పిలిచాడు. చర్చి సమీపంలోకి తీసుకువెళ్లి నాని, మరో ఐదుగురు కత్తులతో దాడి చేసి కారులో పరారయ్యారు. ఈలోగా అరుపులు, కేకలకు రాజేష్ కుమార్తె, కుమారుడు, చెల్లి బయటకు వచ్చి చూడగా తీవ్ర గాయాలతో ఉన్నాడు. కుటుంబ సభ్యులు అతడ్ని ఏలూరు జీజీహెచ్కు తరలించగా వైద్యులు పరీక్షించి మృతిచెందినట్లు నిర్థారించారు. మృతుడి భార్య ఫిర్యాదుపై ఏలూరు రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. కేసును ఛేదించిన పోలీసులు ఈ కేసు విచారణకు సంబంధించి ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ ఆదేశాలతో ఏలూరు డీఎస్పీ శ్రావణ్కుమార్ పర్యవేక్షణలో ఏలూరు వన్టౌన్ సీఐ జీ.సత్యనారాయణ, ఏలూరు టూటౌన్ సీఐ కే.అశోక్కుమార్ ఆధ్వర్యంలో పోలీస్ బృందాలను ఏర్పాటు చేశారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈనెల 10న ఏలూరు జాతీయ రహదారిపై రత్నాస్ రెస్టారెంట్ వెనుక నిందితులు ఉన్నారనే సమాచారంతో ఏలూరు వన్టౌన్ సీఐ సత్యనారాయణ, రూరల్ ఇన్చార్జి ఎస్సై నాగబాబు, సిబ్బంది కలిసి ఆరుగురు నిందితులను పట్టుకున్నారు. వారి నుంచి స్కూటీ, కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు వీరే.. ఏలూరు రూరల్ ఇందిరమ్మ కాలనీకి చెందిన ప్రధాన నిందితుడు బూరగనాని అలియాస్ చిన్ననానితోపాటు, ఏలూరులోని వివిధ ప్రాంతాలకు చెందిన సామంతుల అజయ్సూర్య అలియాస్ బెస్సీ, లంకపల్లి బాలకృష్ణ అలియాస్ బాలు, సిగిరెడ్డి సుధాకర్ అలియాస్ సుధా, ఉగ్గిన షణ్ముక వేణుగోపాల్ అలియాస్ వేణు, కటారి పూర్ణచంద్ర శేఖర్ అనే ఆరుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వీరిలో ముగ్గురిపై ఏలూరు నగరంలో పాత కేసులు ఉన్నాయి. ఈ కేసును ఛేదించిన సీఐలు సత్యనారాయణ, అశోక్కుమార్, ఎస్సై నాగబాబు, ఏఎస్సై సురేష్, హెచ్సీ సత్యారావు, కానిస్టేబుళ్లు బీ.నాగార్జున, ఆర్.మోహన్, పీ.నాగరాజు, ఎండీ రుహుల్లా, ఎన్.శేషుకుమార్ను ఏలూరు డీఎస్పీ శ్రావణ్కుమార్ ప్రత్యేకంగా అభినందించారు. -
పశువుల్లో ‘లంపీ’తో అప్రమత్తం
● శ్రీవారి క్షేత్రంలో తాత్కాలికంగా గోదానం, గోదత్తత నిలుపుదల ● గోసంరక్షణ శాలలో పశువులకు టీకాలు ద్వారకాతిరుమల : పశువులకు ముద్దచర్మ (లంపీ స్కిన్) వ్యాధి వ్యాపిస్తుండటంతో శ్రీవారి దేవస్థానం అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే గోదానం, గోదత్తత పథకాలను తాత్కాలికంగా నిలుపుదల చేశారు. ప్రస్తుతం గోసంరక్షణశాలలో మొత్తం 326 పశువులు ఉన్నాయి. పశువైద్యాధికారులు ఇప్పటికే వాటన్నిటికి లంపీ స్కిన్ వ్యాధి నివారణా టీకాలు వేశారు. అయితే ఇటీవల ఓ భక్తుడు ఆవు, దూడను దానంగా ఇవ్వగా అందులో దూడకు లంపీ స్కిన్ వ్యాధి ఉన్నట్టు గుర్తించిన వైద్యులు, దానికి చికిత్స అందించారు. ప్రస్తుతం ఆ దూడ కోలుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో గోదానాన్ని స్వీకరిస్తే గోసంరక్షణశాలలోని అన్ని గోవులకు ఆ వ్యాధి సోకే ప్రమాదం ఉందని పశువైద్యులు దేవస్థానం అధికారులకు సూచించారు. దాంతో గోదానం, గోదత్తతను ఈనెల 6 నుంచి తాత్కాలికంగా నిలిపివేశారు. ప్రతిష్టాత్మకంగా గోసంరక్షణ గోదానం ఎంతో విశిష్టమైనదిగా ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. అందుకే భక్తులు శ్రీవారికి గోవులను దానంగా ఇస్తుంటారు. వాటిలో కొన్నింటిని దేవస్థానం రైతులకు వ్యవసాయ పనుల నిమిత్తం దత్తత ఇస్తోంది. ముందుగా దరఖాస్తు చేసుకున్న రైతులకు ప్రతినెలా రెండవ, నాల్గవ శనివారాల్లో ఆవులను దత్తత ఇస్తున్నారు. ఏడాదిలో ఒకసారి దేవస్థానం అధికారులు రైతుల వద్దకు వెళ్లి వారిచ్చిన గోవులను పరిశీలిస్తున్నారు. అలాగే గోసంరక్షణశాలలో ఉన్న గోవుల పోషణపట్ల అధికారులు, సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. తెల్ల పశువుల్లోనే వ్యాధి తీవ్రత తెల్ల పశువులు అయిన ఆవులు, ఎద్దుల్లోనే ఎక్కువగా ఈ వ్యాధి తీవ్రత కనిపిస్తుంది. లంపీ స్కిన్ అనే వైరస్ వల్ల కలిగే ఈ వ్యాధి పశువుల రక్తం పీల్చే దోమలు, ఈగలు, పిడుదుల ద్వారా ఒక పశువు నుంచి మరో పశువుకు సులభంగా వ్యాపిస్తుంది. అది కూడా అక్టోబర్ నుంచి జనవరి మధ్యలోనే ఈ వ్యాధి వ్యాప్తి చెందే అవకాశాలు ఉన్నాయి. అందుకే పశువైద్యాధికారులు, సిబ్బంది గోసంరక్షణశాలలోని గోవులకు సెప్టెంబర్లోనే టీకాలు వేశారు. జాగ్రత్తలు తప్పనిసరి పశువులకు లంపీ స్కిన్ వ్యాధి సోకకుండా ముందుగానే టీకాలు వేయించాలి. 104 నుంచి 106 డిగ్రీల జ్వరం వచ్చి, చర్మంపై బొబ్బలు, బుడిపెలు, పొక్కులు ఏర్పడి, నెమ్మదిగా అవి పగిలి పుండ్లుగా మారి, మేత సరిగ్గా తినకపోవడం, నోరు, ముక్కు నుంచి చొంగ కారడం, పాల దిగుబడి తగ్గడం, అలసటగా ఉండటం వంటి లక్షణాలు ఉంటే దాన్ని లంపీ స్కిన్ వ్యాధిగా గుర్తించాలి. వాటిని మంద నుంచి వేరు చేసి, చికిత్స అందించాలి. దోమ తెరలు, లేదా వేపాకు పొగ వేయాలి. గంజి వంటి ఆహార పదార్థాల్లో కాస్త ఉప్పు కలిపి తాగించాలి. జ్వరం తగ్గే వరకు ఓఆర్ఎస్ ద్రావణాన్ని ఇవ్వాలి. జ్వరం తగ్గడానికి మెలోక్సికామ్, ఆనాల్జిన్ మందులను వైద్యుల సూచనల మేరకు వాడాలి. సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉంటే యాంటీ బయాటిక్, న్యూమోనియా లక్షణాలు ఉంటే అవిల్, సీపీఎం వంటి మందులు వాడాలని పశువైద్యులు తెలిపారు. వ్యాధి పూర్తిగా తగ్గిన ఆవులనే దానంగా ఇవ్వాలి. గోసంరక్షణశాలలోని షెడ్డులో ఉన్న ఆవులు , గోసంరక్షణశాలలో లంపీ స్కిన్ వ్యాధి నుంచి కోలుకున్న ఆవుదూడ శ్రీవారి గోసంరక్షణశాల లోని ఆవులకు, గిత్తలకు, దూడలకు నెల క్రితమే లంపీ స్కిన్ వ్యాధి నివారణా టీకాలు వేశాం. బయట నుంచి కొత్తగా పశువులు లోపలికి వస్తే ప్రస్తుతం ఉన్న ఆవులకు వ్యాధి సోకే ప్రమాదం ఉంది. అందుకే కొత్త వాటిని రాకుండా చూడాలని ఆలయ అధికారులకు సూచించాం. వారు వెంటనే అప్రమత్తమై గోదానం, గోదత్తతను నిలిపివేశారు. – అంగర సురేష్, పశువైద్యాధికారి, ద్వారకాతిరుమలలంపీ స్కిన్ వ్యాధి విస్తరిస్తున్న నేపధ్యంలో పశువైద్యాధికారుల సూచనల మేరకు భక్తుల నుంచి గోవులను దానంగా తీసుకోవడం, అలాగే రైతులకు గోవులను దత్తత ఇవ్వడాన్ని తాత్కాలికంగా నిలుపుదల చేశాం. వ్యాధి తీవ్రత తగ్గిన తరువాత మళ్లీ వాటిని పునఃప్రారంభిస్తాం. ఆ సమాచారాన్ని ముందుగా మీడియా ద్వారా అందరికీ తెలియజేస్తాం. – ఎన్వీఎస్ఎన్ మూర్తి, శ్రీవారి దేవస్థానం ఈఓ -
15న కృష్ణాష్టమి వేడుకలు
ద్వారకాతిరుమల: శ్రీవారి దివ్య క్షేత్రంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఈనెల 15 న అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్టు ఆలయ ఈఓ ఎన్వీఎస్ఎన్ మూర్తి తెలిపారు. అందులో భాగంగా ఆరోజు ఆలయంలో స్వామివారికి నిత్యార్జిత కల్యాణాలు, ఆర్జిత సేవలను రద్దు చేస్తున్నట్టు చెప్పారు. అలాగే 16న సాయంత్రం క్షేత్రంలో ఉట్ల పండుగ, శ్రీవారి గ్రామోత్సవాన్ని నిర్వహిస్తామన్నారు. భక్తులు గమనించాలని ఆయన కోరారు. ఏలూరు(మెట్రో): జిల్లాలో ఎన్ఎంఆర్ కార్మికులకు 2025 –26 సంవత్సరానికి వేతనాల పెంపును ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కలెక్టర్ కె.వెట్రిసెల్వి అధ్యక్షతన జరిగిన జిల్లా కమిటీ సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఉప కార్మిక కమిషనర్ పి.శ్రీనివాస్ బుధవారం తెలిపారు. ఒక రోజుకి స్కిల్డ్ కార్మికునికి రూ.710 నుంచి రూ.730, సెమీ స్కిల్డ్ కార్మికునికి రూ.640 నుంచి రూ.665, అన్స్కిల్డ్ కార్మికునికి రూ.595 నుంచి రూ.615గా నిర్ణయించారని, ఈ వేతనాలు ఏప్రిల్ 01, 2025 నుంచి అమలులోకి వస్తాయన్నారు. -
కేవీకే హెడ్ సైంటిస్ట్కు అవార్డు
ఉండి: ఏరువాక ఉత్తమ శాస్త్రవేత్త అవార్డుకు ఎన్నార్పీ అగ్రహారం కృషీ విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ ఎన్.మల్లిఖార్జునరావు ఎంపికయ్యారు. ఏరువాక ఫౌండేషన్ ఏటా వ్యవసాయ అనుబంధ రంగాల్లోని వివిధ విభాగాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచే శాస్త్రవేత్తలను ఎంపిక చేసి అవార్డులు అందజేస్తుంది. దీనిలో భాగంగా 2023–24కి గాను ఉత్తమ విస్తరణ నిపుణుడు ఎంటొమోలోజీ విభాగంలో డాక్టర్ మల్లిఖార్జునను ఉత్తమ శాస్త్రవేత్తగా ఎంపిక చేశారు. ఈమేరకు ఫౌండేషన్ నుంచి తనకు సమాచారం అందినట్లు మల్లిఖార్జునరావు తెలిపారు. ఈ నెల 26, 27 తేదీల్లో గుంటూరు కేఎల్ యూనివర్సీటీలోని కాలేజ్ ఆఫ్ ఆగ్రికల్చర్ ఆర్అండ్డీ థియేటర్లో నిర్వహించే ప్రత్యేక కార్యక్రమంలో ఈ అవార్డు అందజేస్తారని ఆయన చెప్పారు. టి.నరసాపురం: బొర్రంపాలెం అన్నపూర్ణ ఫెర్టిలైజర్స్ అండ్ జనరల్ స్టోర్స్లో బుధవారం విజిలెన్స్ అధికారుల బృందం తనిఖీలు నిర్వహించారు. షాపులో ఆయా ఎరువులు ఉండాల్సిన దానికన్నా 3.245 టన్నులు తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. రూ.6,98,663 విలువ కలిగిన యూరియా, పొటాష్, 10–26, సూపర్ 39.585 టన్నులను సీజ్ చేశారు. షాప్ యజమాని అశోక్ కుమార్పై 6 ఏ కేసు నమోదు చేశారు. దాడుల్లో విజిలెన్స్ ఎస్సై రంజిత్ కుమార్, విజిలెన్స్ ఏవో మీరయ్య, మండల వ్యవసాయ అధికారిణి బి.ప్రియాంక తదితరులు పాల్గొన్నారు. ఉండి: ఈ నెల 17వ తేదీ నుంచి ఎన్నార్పీ అగ్రహారంలోని కృషీ విజ్ఞాన కేంద్రంలో మిద్దెతోటల పెంపకంపై శిక్షణ, అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ ఎన్ మల్లిఖార్జునరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. మిద్దెతోటల పెంపకంతో పాటు తేనెటీగలు, కోళ్లు, చేపల పెంపకం, బయోడీకంపోజర్స్ వినియోగం తయారీపై సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించడంపై శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి మిద్దెతోటల పెంపకం నిపుణుడు వేణుగోపాలరావు తదితర జిల్లా మండల అధికారులు హాజరువుతారని తెలిపారు. మిద్దెతోటలు తదితర వాటిపై అవగాహన, శిక్షణలో ఆసక్తి గల మహిళలు హాజరు కావాలని కోరారు. పెదవేగి : ఎస్జీఎఫ్ అండర్ 19 జిల్లా జట్ల ఎంపిక పోటీలు బుధవారం పెదవేగి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురుకులంలో ఉత్సాహంగా జరిగాయి. ఫెన్సింగ్ జూడో, బాక్సింగ్, బీచ్ వాలీబాల్, రగ్బీ, తైక్వాండో, గక్కా క్రీడాంశాలలో పోటీలు నిర్వహించి జిల్లా జట్లను ఎంపిక చేసినట్లు డీవైఈఓ టి శేఖర్బాబు, ఆర్గనైజింగ్ కార్యదర్శి కె జయరాజు తెలిపారు. ఈ పోటీల్లో కళాశాల ప్రిన్సిపాల్ ఏవీ శివప్రసాద్, ఇతర పీడీలు పాల్గొన్నారు. భీమవరం: భీమవరం ఒకటో పట్టణంలోని శ్రీనివాసా కూడలిలో ఇంట్లో ఉరివేసుకుని సునీల్ (39) అనే వ్యక్తి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. సునీల్ పట్టణంలోని ఓ దుకాణంలో మోటార్సైకిల్ మెకానిక్గా పనిచేస్తున్నాడు. బుధవారం రాత్రి ఆత్మహత్య సమాచారం అందడంతో ఎస్సై బీవై కిరణ్కుమార్ సంఘటనా స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు. -
క్వాంటం వ్యాలీ హేకథాన్ పోటీలు
భీమవరం: ఉభయగోదావరి జిల్లాలకు సంబంధించి భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన అమరావతి క్వాంటం వ్యాలీ హేకథాన్ 2025 సెమీఫైనల్స్లో విజేతలకు కలెక్టర్ చదలవాడ నాగరాణి చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు. విన్నర్స్గా భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజీ, శ్రీ విష్ణు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ భీమవరం, బీవీసీ ఇంజనీరింగ్ కాలేజ్, రాజమండ్రి, గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ రాజమండ్రి, ఆదిత్య కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ సూరంపాలెం, ప్రగతి ఇంజనీరింగ్ కాలేజీ సూరంపాలెం, ఆదిత్య డిగ్రీ అండ్ పీజీ కాలేజీ ఫర్ ఉమెన్ రాజమండ్రి, ఆదిత్య డిగ్రీ అండ్ పీజీ కాలేజీ కాకినాడ వారికి దక్కగా, ఒక్కొక్క టీంకి రూ.10 వేల చెక్కును కలెక్టర్ చదలవాడ నాగరాణి చేతుల మీదుగా అందించారు. రన్నర్స్గా నిలిచిన కళాశాలలకు ఒక్కొక్క టీంకు రూ.5 వేల చొప్పున అందించారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కేవీ మురళీకృష్ణంరాజు అధ్యక్షతన జరిగిన ఈ పోటీలకు ఉన్నత విద్యా మండల్ నుంచి ప్రత్యేక పరిశీలకులు డాక్టర్ పి అనిల్కుమార్ హాజరుకాగా రీజినల్ సెంటర్ కోఆర్డినేటర్ డాక్టర్ పి రవికిరణ్ వర్మ, కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ సాగి రామకృష్ణ నిషాంత వర్మ, ఉపాధ్యక్షుడు ఎస్వీ రంగరాజు, డైరెక్టర్ డాక్టర్ ఎం జగపతి రాజు, ప్రిన్సిపాల్ డాక్టర్ కేవీ మురళీకృష్ణంరాజు, చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సీహెచ్ దిలీప్ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు. -
మన్యంలో ప్రకృతి సేద్యం
● 10 వేల ఎకరాల్లో రసాయన రహిత సాగు ● స్వయంగా కషాయాలు తయారు చేస్తున్న గిరిజన రైతులు బుట్టాయగూడెం: రసాయన ఎరువులు, పురుగు మందుల వినియోగంతో వ్యవసాయం భారంగా మారుతోంది. మిత్ర పురుగుల నాశనంతో చీడపీడల బెడద పెరుగుతుంది. దీనితో అధికారుల ప్రోత్సాహంతో తక్కువ పెట్టుబడి కలిగిన ప్రకృతి వ్యవసాయంపై గిరిజన రైతులు ఆసక్తి కనబరుస్తున్నారు. మన్యంలో ప్రకృతి వ్యవసాయంపై గిరిజన రైతులకు ఐటీడీఏ, ప్రకృతి వ్యవసాయ రైతులు అవగాహన కలిగిస్తున్నారు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో సుమారు 1,596 మందికి పైగా సుమారు 10 వేల ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేపట్టినట్లు అధికారులు చెబుతున్నారు. ప్రకృతి సాగులో పంటలు కేఆర్పురం ఐటీడీఏ పరిధిలోని బుట్టాయగూడెం, జీలుగుమిల్లి, పోలవరం మండలాలతోపాటు జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం మండలాల్లో గిరిజనులు సుమారు 10 వేల ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేపట్టారు. వరి, మొక్కజొన్న, వేరుశనగ, మినుము పంటలతోపాటు జీడిమామిడి, అన్ని రకాల ఆకుకూరలు, కూరగాయల పంటలను ప్రకృతి వ్యవసాయంగా సాగు చేసి పండిస్తున్నారు. వీటిలో బుట్టాయగూడెం, జీలుగుమిల్లి, పోలవరం మండలాల పరిధిలో 4 వేల ఎకరాల్లో జీడిమామిడి, 2 వేల ఎకరాల్లో మొక్కజొన్న, 270 ఎకరాల్లో వరి, 200 ఎకరాల్లో మిర్చి, 250 ఎకరాల్లో మినుము, 280 ఎకరాల్లో కూరగాయలు, 3 వేల ఎకరాల్లో చిరుధాన్యాల పంటలు సాగు చేస్తున్నట్లు అధికారులు చెప్పారు. స్వయంగా కషాయాల తయారీ ప్రకృతి వ్యవసాయ పంటలకు కషాయాలను స్వయంగా గిరిజన రైతులు తయారు చేసుకుంటున్నారు. రసాయన ఎరువులు, పురుగు మందులకు బదులుగా పంటలకు జీవామృతం, ఘనామృతం, బీజామృతం, ద్రవ జీవామృతం, పంచగవ్య, అగ్నాస్త్రం, బ్రహ్మాస్త్రం వంటి రసాయనాలను గిరిజన రైతులు స్వయంగా తయారు చేసుకుని పంటలకు వినియోగించుకుంటున్నారు. -
సీసలిలో 144 సెక్షన్ అమలు
కాళ్ల: సీసలి గ్రామంలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా మంగళవారం నుంచి 15 రోజులపాటు గ్రామంలో 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు ఆకివీడు సీఐ జగదీశ్వరరావు, తహసీల్దార్ జి.సుందర్ సింగ్ తెలిపారు. సీసలిలో గ్రామదేవత పోలేరమ్మ గుడి పక్కన ఉన్న పోరంబోకు స్థలం విషయమై సోమవారం రాత్రి జరిగిన వివాదంలో పలువురికి గాయాలైన విషయం తెలిసిందే. దీనిపై మంగళవారం కాళ్ల తహసీల్దార్ కార్యాలయంలో ఇరువర్గాల పెద్దలతో పోలీసు, రెవెన్యూ, ఇరిగేషన్, పంచాయతీరాజ్ అధికారులు శాంతి సమావేశం నిర్వహించారు. సదరు వివాదాస్పద భూమిని ఇరిగేషన్ అధికారులు స్వాధీన పరుచుకోవాలని, ఇరిగేషన్ ఏఈ ఫణిశంకర్కు తహసీల్దార్ సూచించారు. గ్రామంలో 144 సెక్షన్ అమలు చేస్తున్నామని, ఎక్కడా గుంపులుగా గాని, ఐదుగురు కంటే ఎక్కువ వ్యక్తులు గాని ఉండరాదని స్పష్టం చేశారు. బయట నుంచి వచ్చి గ్రామంలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా, శాంతిభద్రతలకు విఘాతం కలిగించినా చట్టపరమైన క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
సచివాలయ ఉద్యోగుల నిరసన
యలమంచిలి: ప్రభుత్వం చేపట్టిన ఇంటింటికి వాట్సప్ గవర్నెన్స్ రిజిస్ట్రేషనన్, క్లస్టర్ మ్యాపింగ్ పనులను సచివాలయ ఉద్యోగులతో చేయించడాన్ని నిరసిస్తూ రాష్ట్ర గ్రామ, వార్డు సచివాలయం జేఏసీ పిలుపు మేరకు మంగళవారం సచివాలయ ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరై నిరసన తెలిపారు. వలంటీర్ వ్యవస్థను రద్దు చేసి ఆ పనులను సచివాలయ ఉద్యోగులతో చేయించడం సచివాలయ ఉద్యోగుల ఆత్మ గౌరవానికి భంగం కలిగించేదిగా ఉందని వారు పేర్కొన్నారు. ఈ మేరకు ఈఓపీఆర్డీ ప్రసాద్ను కలిసి వినతిపత్రం ఇచ్చారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు షేక్ ఉమర్ అలీషా, డియువి సత్యనారాయణ, గోనిపాటి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
థింక్ ఇండియా దక్షిణాపథ్ సమ్మిట్ పోస్టర్ ఆవిష్కరణ
తాడేపల్లిగూడెం (టీఓసీ): థింక్ ఇండియా ఆధ్వర్యంలో ఈ నెల 20, 21 తేదీల్లో తమిళనాడులోని ఐఐటీ మద్రాసు (ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్)లో నిర్వహించనున్న దక్షిణాపథ్ సమ్మిట్ పోస్టర్ను ఏపీ నిట్లో మంగళవారం నిట్ డీన్ రీసెర్చ్ అండ్ కన్సల్టెన్సీ డాక్టర్ జి.రవికిరణ్ శాస్త్రి ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ కృత్రిమ మేథ వంటి అధునాతన సాంకేతికతను ఉపయోగించి విద్యార్థులను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడం, యువత సృజనాత్మక ఆలోచనలు, ప్రతిభను సద్వినియోగం చేసుకుని దేశాన్ని ప్రపంచ దేశాలకు దీటుగా పురోగతివైపు నడిపించడం వంటి అంశాలపై నిపుణులు చర్చించనున్నారని చెప్పారు. పోస్టర్ ఆవిష్కరణలో రిజిస్ట్రార్ డాక్టర్ పి.దినేష్ శంకరరెడ్డి, అసోసియేట్ డీన్లు డాక్టర్ రాజేశ్వర్రెడ్డి, డాక్టర్ కార్తికేయ శర్మ తదితరులు పాల్గొన్నారు. -
నాసిరకం ఉల్లిపాయలు అమ్మలేం
తాడేపల్లిగూడెం: కర్నూలు నుంచి వచ్చే ఉల్లిపాయలను కొనుగోలు చేయడానికి వ్యాపారులు ఎవ్వరూ ముందుకు రాకపోవడంతో వాటిని అమ్మలేకపోతున్నామని బ్రహ్మానందరెడ్డి మార్కెట్లో వ్యాపారులు ఆర్డీఓ ఖతీబ్ కౌసర్ భానోకు తెలిపారు. మార్కెట్లో ఉల్లి లావాదేవీలను మంగళవారం ఆర్డీఓ పరిశీలించారు. వ్యాపారవర్గ ప్రతినిధి నంద్యాల కృష్ణమూర్తి ఆర్డీఓతో మాట్లాడుతూ వచ్చిన ఉల్లిపాయల్లో నాణ్యత లేనందున పాట పెట్టినా కొనేందుకు ఎవ్వరూ లేని కారణంగా వీటిని విక్రయించలేకపోతున్నామన్నారు. కామవరపుకోట:: ప్రోహిబిషన్, ఎకై ్సజ్, ఎన్ఫోర్స్మెంట్ అధికారుల ఆధ్వర్యంలో మంగళవారం సారా బట్టీలపై దాడులను నిర్వహించి పలువురిపై కేసు నమోదు చేసినట్లు చింతలపూడి ఎకై ్సజ్ సీఐ పి.అశోక్ తెలిపారు. చింతలపూడి మండలం తలార్లపల్లిలో 100 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేసి, 5 లీటర్ల సారాను స్వాధీనం చేసుకుని, నిందితుల పరారీపై కేసు నమోదు చేశామన్నారు. అలాగే కామవరపుకోట మండలం తాడిచెర్లలో పాత సారా కేసులో ఏ2 నిందితుడిగా పరారీలో ఉన్న వాక దేవాంజనేయులును అదుపులో తీసుకొని చింతలపూడి కోర్ట్ మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచగా రిమాండ్ విధించినట్లు చెప్పారు. ఏలూరు రూరల్: ఈ నెల 27, 28, 29 తేదీల్లో ఏలూరులో రాష్ట్రస్థాయి బాలబాలికల అథ్లెటిక్స్ పోటీలు చేపట్టనున్నట్లు ఏలూరు జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ కార్యదర్శి ప్రసాద్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ పోటీల్లో పాల్గొనే ఏలూరు జిల్లా జట్లు ఎంపిక పోటీలు ఈ నెల 15వ తేదీన నిర్వహించనున్నామని వెల్లడించారు. అండర్–14, 16, 18, 20 విభాగాల్లో పోటీలు జరుగుతాయని, ఆసక్తి గలవారు 15వ తేదీ ఉదయం 8 గంటలకు పుట్టినతేదీ, ఆధార్ ధ్రువీకరణ పత్రాలతో ఏలూరు అల్లూరి సీతారామరాజు స్టేడియంకు హాజరుకావాలన్నారు. వివరాలకు 86865 40555 నంబర్లలో సంప్రదించాలన్నారు. కాళ్ల: సీసలి గ్రామంలో దళితులపై దాడులను నిరసిస్తూ మంగళవారం గ్రామంలోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ విగ్రహం వద్ద మాలమహనాడు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు నల్లి రాజేష్ మాట్లాడుతూ గత కొంతకాలంగా సీసలి గ్రామంలో రెండు వర్గాల మధ్య ఏర్పడిన భూ వివాదాన్ని అధికారులు పరిష్కరించలేకపోయారన్నారు. దళిత యువకులు, మహిళలపై దాడి చేసిన వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుతోపాటు 307 కేసును పెట్టాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో దళిత ఐక్యవేదిక అధ్యక్షుడు గంటా సుందర్కుమార్, మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు గుండె నగేష్బాబు, రాష్ట్ర కార్యదర్శి కర్ని జోగయ్య, కోన జోసెఫ్ మీసాల జయరాజు, కాళ్ళ ఉండి అధ్యక్షుడు గుజ్జుల నిరీక్షణ రావు తదితరులు పాల్గొన్నారు. -
భీమవరంలో కలెక్టరేట్ కోసం దీక్ష
భీమవరం(ప్రకాశం చౌక్): స్థానిక మార్కెట్ యార్డ్లోనే కలెక్టరేట్ భవనం నిర్మించాలని భీమవరానికి చెందిన నాయ్యవాది జవ్వాది సత్యనారాయణ (సత్తిబాబు), రాట్నాల శ్రీనివాసరావు స్థానిక ప్రకాశం చౌక్ సెంటర్లో మంగళవారం రిలే నిరహార దీక్ష చేపట్టారు. గతంలో ఇచ్చిన జీవో ప్రకారం మార్కెట్యార్డ్లోనే కలెక్టరేట్ నిర్మాణం చేపట్టాలని, భీమవరం నుంచి కలెక్టరేట్ తరలింపు ప్రయత్నాలు మానుకొవాలని కోరారు. రిలే నిరాహార దీక్షలకు వైఎస్సార్సీపీ మద్దతు తెలిపింది. వైఎస్సార్ సీపీ నరసాపురం పార్లమెంట్ ఇన్చార్జి గూడూరి ఉమాబాల, భీమవరం నియోజకవర్గ ఇన్చార్జి చినిమిల్లి వెంకటరాయుడు దీక్షాదారులకు సంఘంభావం ప్రకటించారు. భీమవరంలోనే కలెక్టరేట్ ఉండాలని పోరాటం చేసే ప్రతి ఒక్కరికీ పార్టీ తరుఫున మద్దతు తెలియజేస్తామన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ పట్టణాధ్యక్షుడు గాదిరాజు రామరాజు, పాలవెల్లి మంగ, బొత్స ధర్మ తదితరులు పాల్గొన్నారు. దీక్షకు సీపీఐ పట్టణ కార్యదర్శి చెల్లబోయిన రంగారావు మద్దతు తెలిపారు. -
పాలనలో విఫలం.. సమస్యలతో సావాసం
● నూజివీడు ట్రిపుల్ ఐటీలో ఏడాదిగా ఇన్చార్జులే దిక్కు ● విద్యార్థులపై కొరవడిన పర్యవేక్షణ నూజివీడు: ఏలూరు జిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీలో ఏడాది కాలంగా ఇన్చార్జి అధికారుల పాలన కొనసాగుతుండటంతో రోజురోజుకూ పరిస్థితులు దిగజారుతున్నాయి. పాలనలో విఫలం కావడంతో నిరంతరం సమస్యలు చుట్టుముడుతున్నాయి. అకడమిక్ క్యాలెండర్ గాని, బీఓఎస్ సమావేశాలు గాని, ఇతర అకడమిక్ అంశాలపై సుదీర్ఘ అనుభవం కలిగిన నిష్ణాతులతో సంప్రదించకుండానే ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకుంటూ ట్రిపుల్ ఐటీని పురోగమనంలోకి కాకుండా తిరోగమనంలోకి నెడుతున్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై 15 నెలలు గడిచినా నేటికి రెగ్యులర్ చాన్సలర్ను గాని, వైస్ చాన్సలర్ను గాని, నాలుగు ట్రిపుల్ ఐటీలకు డైరెక్టర్లను గాని నియమించలేదు. ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో పనిచేస్తున్న ప్రొఫెసర్ సండ్ర అమరేంద్రకుమార్కు నూజివీడు ట్రిపుల్ ఐటీకి ఇన్చార్జి డైరెక్టర్గాను, అలాగే ఆర్జీయూకేటీకి ఇన్చార్జి రిజిస్ట్రార్గాను నియమించింది. ఒకే వ్యక్తికి రెండు కీలకమైన బాధ్యతలు అప్పగించడంతో తలకు మించిన భారంగా మారింది. నూజివీడు ట్రిపుల్ ఐటీలో నిరంతరం ఎదురయ్యే సమస్యలను పరిష్కరంచడానికే ఉన్న సమయం చాలక సతమతమవుతుంటే రిజిస్ట్రార్గా కూడా బాధ్యతలు ఉండటంతో మిగిలిన మూడు ట్రిపుల్ ఐటీలలో ఏ సమస్య ఉత్పన్నమైనా అక్కడికి ఉరుకులు, పరుగులు పెట్టాల్సి వస్తోంది. దీంతో దేనిపైనా శ్రద్ధ పెట్టలేక పాలన క్రమంగా బలహీనంగా మారి అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. అలాగే ఇక్కడ పనిచేస్తున్న ఏఓ సైతం ఇన్చార్జి బాధ్యతలు నిర్వర్తిస్తుండగా ఇటీవలే ఏడాది కాలపరిమితి పూర్తవ్వగా మరలా ఒక నెల ఇన్చార్జి బాధ్యతలను పొడిగించారు. ప్రొఫెసర్పై ఎంటెక్ విద్యార్థి కత్తులతో దాడికి దిగడం చూస్తుంటేనే ఇక్కడ పాలన ఎలా ఉందో అర్థమవుతోంది. టెండర్లు పిలవడంలో జాప్యం సెక్యూరిటీ, హౌస్ కీపింగ్ ఏజన్సీల కాలపరిమితి ముగిసిన నేపథ్యంలో మరలా ఏజెన్సీల ఎంపికకు టెండర్లు పిలవాల్సి ఉన్నా నెలలు గడుస్తున్నా ఇప్పటికీ టెండర్లు పిలవలేదు. ఇది ఎప్పటికీ పిలుస్తారో కూడా తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. అలాగే శ్రీకాకుళం, ఒంగోలు పీయూసీ ప్రథమ సంవత్సర విద్యార్థులకు నూజివీడు క్యాంపస్లోనే తరగతులు నిర్వహిస్తున్న నేపథ్యంలో పరిపాలన లోపం కారణంగానే తెలుగు సబ్జెక్టు బోధనకు సంబంధించి మెంటార్లకు, సర్ప్లస్లో ఉన్న కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లకు మధ్య వివాదం తలెత్తి కొద్దిరోజులు పాటు నడిచింది. ఈ వివాదాన్ని పరిష్కరించడానికి యాజమాన్యానికి తల బొప్పి కట్టింది. చివరకు మెంటార్లు వెనక్కు తగ్గడంతో ఎలాగోలా సమస్య సద్దుమణిగింది. క్యాంపస్లోకి మందు సీసాలు విద్యార్థులకు స్వేచ్ఛ ఎక్కువైపోవడంతో క్యాంపస్లోకి ఏకంగా మందుసీసాలే వచ్చేస్తున్నాయి. ఇటీవల పార్టీ చేసుకునేందుకు 10 మంది విద్యార్థులు మందు సీసాలను ఒక విద్యార్థితో తెప్పించుకోవడం తీవ్ర సంచలనంగా మారింది. ఆ విద్యార్థి గోడ దూకి వెళ్లి మద్యం సీసాలు తీసుకురావడం గమనార్హం. అలాగే క్యాంపస్లో బాలురకు, బాలికలకు వేరు వేరుగా ఫుడ్ కోర్టులున్నా బాలికలు కూడా బాలుర ఫుడ్కోర్టు వద్దకు వచ్చి బాలురతో దగ్గరగా కలిసి కూర్చొని తింటూ కాలక్షేపం చేస్తున్నారు. దీంతో ఫ్యాకల్టీ, సిబ్బంది ఫుడ్కోర్టు వైపు వెళ్లడమే మానివేశారు. సెమిస్టర్ పరీక్షలు ఎత్తేశారు దేశ వ్యాప్తంగా హైస్కూల్ స్థాయిలో విద్యార్థులకు ఉన్న వార్షిక పరీక్షలను ఎత్తేసి సెమిస్టర్ పరీక్షల విధానాన్ని తీసుకొస్తుండగా ట్రిపుల్ ఐటీలో మాత్రం పీయూసీ ప్రథమ, ద్వితీయ సంవత్సర విద్యార్థులకు ఈ ఏడాది నుంచి సెమిస్టర్ పరీక్షలను ఎత్తేసి వార్షిక పరీక్షలను నిర్వహించాలని నిర్ణయించారు. అధికార బాధ్యతలను చూస్తున్న వారికి అవగాహన లేకో, ఒకరిద్దరూ ఐఏఎస్ అధికారుల మెప్పు పొందడానికో గాని సెమిస్టర్ పరీక్షలను ఎత్తేసి వార్షిక పరీక్షలను ఏర్పాటుచేశారు. దీనికి గవర్నింగ్ కౌన్సిల్ అనుమతి గాని, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అనుమతులు గాని ఏమీ లేవని ట్రిపుల్ ఐటీలోని అధ్యాపక వర్గాలు పేర్కొంటున్నాయి. దీంతో పురోగమిస్తుందో, తిరోగమిస్తుందో అర్థం కావడం లేదని అధ్యాపకులు వాపోతున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి పటిష్టమైన చర్యలు చేపట్టాలని సర్వత్రా అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
యూరియా కోసం రోడ్డెక్కిన రైతులు
పోలవరం రూరల్: పోలవరం మండలం ప్రగఢపల్లి గ్రామంలో యూరియా కోసం రైతులు రోడ్డెక్కారు. మంగళవారం సొసైటీ గోడౌన్కు 270 బస్తాల యూరియా వచ్చింది. సమాచారం తెలుసుకున్న రైతులు యూరియా దొరకదేమోననే ఆందోళనతో ఒక్కసారిగా గోడౌన్ వద్దకు వచ్చి గుమిగూడారు. ఎల్ఎన్డీపేట, జిళ్లేళ్లగూడెం, వింజరం పంచాయతీ పరిధిలోని సుమారు 18 గ్రామాలకు చెందిన 500 మంది రైతులు యూరియా కోసం క్యూ కట్టారు. సరిపడా యూరియా లేదని అర్ధమైన రైతులు ఆగ్రహించి రోడ్డెక్కెరు. రైతులందరికీ యూరియా సరఫరా చేయాలని నినదించారు. సమాచారం తెలుసుకున్న పోలీసు వ్యవసాయ శాఖ అధికారులు అక్కడికి చేరుకుని రైతులకు నచ్చజెప్పారు. మరో లారీ యూరియా మంగళవారం రాత్రికే వచ్చేవిధంగా ఏర్పాట్లు చేస్తున్నామని, బుధవారం అందరికీ అందజేస్తామని వ్యవసాయ శాఖ అధికారులు హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. తీరని యూరియా కష్టాలు ఆగిరిపల్లి: రోజులు గడుస్తున్నా రైతులు యూరియా కోసం పడుతున్న కష్టాలు తీరడం లేదు. మంగళవారం ఆగిరిపల్లి సొసైటీలో యూరియా పంపిణీ చేస్తారని సమాచారం రావడంతో ఉదయం నుంచి రైతులు బారులు తీరారు. 250 బస్తాలు ఉండగా ఒకొక్కరికి ఒక్క బస్తా యూరియా ఇచ్చారు. గంటల కొద్ది నిలబడితే మాకు ఇవ్వకుండా టీడీపీ వారికి ఇవ్వడం ఎంత వరకు సమంజమని రైతులు ఆగ్రహం వ్యక్తంచేశారు. గురువారం ఆగిరిపల్లికి యూరియా వస్తుందని వ్యవసాయ అధికారి భవానీ తెలిపారు. -
కాంట్రాక్టర్పై చర్యలు
పాలకొల్లు సెంట్రల్: పాలకొల్లు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ద్విచక్ర వాహనంతో నేరుగా పేషెంట్ల వార్డులోకి వెళ్లి ఫుడ్ సప్లయి చేస్తున్న కాంట్రాక్టర్పై వైద్యాధికారులు చర్యలు చేపట్టారు. మంగళవారం సెలవులో ఉన్న ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మాధురి ఫోన్లో మాట్లాడుతూ పత్రికల్లో వచ్చిన వార్తపై నర్సింగ్ సిబ్బందికి మెమో ఇచ్చినట్లు తెలిపారు. మంగళవారం కాంట్రాక్టర్ ఫుడ్ ప్యాకెట్లు కాకుండా పాత్రల్లో ఫుడ్ తీసుకువచ్చారన్నారు. ఓ ట్రాలీలో డిష్లు ఏర్పాటుచేసి డెలివరీ చేసేలా చర్యలు చేపట్టామన్నారు. కాంట్రాక్టర్ నేడు వివరణ ఇస్తానని చెప్పినట్లు డాక్టర్ మాధురి తెలిపారు. -
మొగల్తూరు ముత్యాలమ్మ పూరిపాక దగ్ధం
నరసాపురం రూరల్: మొగల్తూరు గ్రామదేవత నడివీధి ముత్యాలమ్మ అమ్మవారి పూరిపాక సోమవారం అర్ధరాత్రి దగ్థమైంది. ఈ ఘటనతో భక్తులు, పరిసర గ్రామాల ప్రజలు ఆందోళనకు గురయ్యారు. ఆలయ ధర్మకర్త, కమిటీ నిర్వాహకులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో హుటాహుటీన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మత సామరస్యానికి ఇబ్బంది కలుగకుండా అధికార యంత్రాంగం అన్ని చర్యలు తీసుకుంది. అడిషనల్ ఎస్పీ వాసుపల్లి భీమారావు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ సమాచారం అందిన వెంటనే డీఎస్పీ శ్రీవేద, సీఐలు, ఎస్సైలు సంఘటనా స్థలంలోనే ఉన్నారన్నారు. ఇప్పటికే డాగ్స్స్క్వాడ్, వేలిముద్ర నిపుణులు వచ్చి సమాచార సేకరణలో నిమగ్నమయ్యారన్నారు. ఆలయ ధర్మకర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు భీమారావు తెలిపారు. -
మొబైల్ విప్లవంతో సాగు సమాచారం
పెనుమంట్ర: మొబైల్ విప్లవం ద్వారా వ్యవసాయ సమాచారాన్ని రైతులకు ఎప్పటికప్పుడు చేరువచేయాలనే ఉద్దేశ్యంతో కాబి ఇంటర్నేషనల్ సంస్థ ప్లాంట్వైజ్ప్లస్ అనే మొబైల్ అప్లికేషన్ని తీసుకువచ్చిందని మార్టేరు వరిపరిశోధనా స్థానం సహా పరిశోధనా సంచాలకులు టి.శ్రీనివాస్ తెలిపారు. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం, మార్టేరు, కాబి ఇంటర్నేషనల్ సంయుక్త ఆధ్వర్యంలో ప్లాంట్వైజ్ప్లస్ మొబైల్ అప్లికేషన్పై మంగళవారం శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డా.టి.శ్రీనివాస్ అధ్యక్షత వహించగా, కాబి సంస్థ నుంచి ముఖ్య అతిథిగా హాజరైన అగ్రి–డిజిటల్ కోఆర్డినేటర్ మధు మంజరి మాట్లాడారు. ఈ మొబైల్ సాధనం వ్యవసాయ నిపుణులకు తగిన సమాచారం అందిస్తుందని, తద్వారా వారు రైతులకు మెరుగైన సలహాలను అందించడానికి ఉపయోగపడుతుందని తెలిపారు. పంటపై పురుగుల నివారణకు సంబంధించిన పూర్తి సమాచారంతో పాటూ సిఫార్సుచేసిన పురుగు మందుల సమాచారం కూడా రైతులకు అందుబాటులో ఉంటుందని చెప్పారు. కార్యక్రమంలో మార్టేరు, నెల్లూరు, బాపట్ల వరి పరిశోధనా స్థానానికి చెందిన శాస్త్రవేత్తలు, విస్తరణ కేంద్రాల శాస్త్రవేత్తలు, వివిధ డివిజన్ల వ్యవసాయ సహాయ సంచాలకులు పాల్గొన్నారు. -
అన్నదాత పోరు
సీసలిలో 144 సెక్షన్ సీసలిలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా మంగళవారం నుంచి 15 రోజులపాటు గ్రామంలో 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 8లో uఆంక్షలు అధిగమించి.. సాగును నిర్వీర్యం చేస్తూ కూటమి దగాకోరు పాలనపై కర్షకులు కదం తొక్కారు. అన్నదాత పోరు విఫలయత్నానికి ఆంక్షల రూపంలో ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు కల్పించినా లెక్కచేయకుండా విజయవంతం చేశారు. రైతుల సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్సీపీ నాయకుల ఆధ్వర్యంలో భీమవరం, నరసాపురం, తాడేపల్లిగూడెంలోని ఆర్డీఓ కార్యాలయాల్లో వినతిపత్రాలు అందజేశారు. బుధవారం శ్రీ 10 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025తణుకు అర్బన్: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని మంగళవారం మాజీ మంత్రి, రీజనల్ కో–ఆర్డినేటర్ కారుమూరి వెంకట నాగేశ్వరరావు, రాష్ట్ర యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కారుమూరి సునీల్కుమార్లు మర్యాదపూర్వకంగా కలిశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో కలిసి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న అక్రమ పరిపాలనపై చర్చించినట్లు కారుమూరి తెలిపారు. పాలకొల్లు సెంట్రల్: వైఎస్సార్సీపీ బీసీ విభాగం సంయుక్త కార్యదర్శిగా యలమంచిలి మండలానికి చెందిన మామిడిశెట్టి చిట్టిబాబును నియమించారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల ప్రకారం పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఆదేశాలు అందాయి. భీమవరం: జిల్లాలో ఉపాధి హామీ వేతన బకాయిలు వెంటనే విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బాతిరెడ్డి జార్జి, జక్కంశెట్టి సత్యనారాయణ మాట్లాడుతూ పనిచేసిన 15 రోజుల్లో వేతనాలు ఇవ్వాలని చట్టంలో ఉన్నా మూడు నెలలుగా ఇవ్వకపోవడంతో కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇప్పటికై నా ఉపాధి కూలీల ఇబ్బందులను గుర్తించి వేతనాలు వెంటనే వేయాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టరేట్లోని జిల్లా డ్వామా పీడీ కెసీహెచ్ అప్పారావుకు వినతిపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో సంఘం జిల్లా సహాయ కార్యదర్శి బల్ల చిన వీరభద్రరావు, శేషపు అశ్రియ్య, జిల్లా ఉపాధ్యక్షురాలు జక్కంశెట్టి వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. భీమవరం: వెలుగు వీవోఏల సమస్యలను తక్షణం పరిష్కరించాలని లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా పీడీ ఆఫీసులు ముట్టడిస్తామని వెలుగు వీవోఏల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ధనలక్ష్మి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. భీమవరం మార్కెట్యార్డ్లో మంగళవారం వెలుగు వీవోఎల జిల్లా మహాసభ నాగిడి గోవిందమ్మ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ధనలక్ష్మి మాట్లాడుతూ తమతో ప్రభుత్వం వెట్టి చాకిరి చేయిస్తుందని, యాప్ల ద్వారా పని భారం పెంచుతుంది కానీ సెల్ఫోన్లు ఇవ్వడం లేదని విమర్శించారు. సెల్ఫోన్స్ ఇస్తామని హామీ ఇచ్చి ఏడాది గడిచినా నేటికీ అమలు చేయలేదని విమర్శించారు. జూమ్ మీటింగ్ పేరుతో వీవోఏలను రాత్రి, పగలు వేధిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఒకపక్క విపరీతంగా నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతుంటే మరోపక్క జీతాలు పెరగక తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్నారని ఆవేదనవ్యక్తం చేశారు. కనీస వేతనం రూ.26 వేలు అమలు చేయాలని, రూ.10 లక్షలు బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. సీఐటీయు ప్రధాన కార్యదర్శి కె.రాజా రామ్మోహన్రాయ్, జిల్లా ఉపాధ్యక్షుడు బి.వాసుదేవరావు తదితరులు పాల్గొన్నారు. ఏలూరు(మెట్రో): ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ స్థాయీ సంఘ సమావేశాలు ఈనెల 12 ఉదయం 10 గంటల నుంచి ఏలూరు జిల్లా పరిషత్ కార్యాలయంలో జరుగుతుందని జెడ్పీ సీఈఓ శ్రీహరి ఒక ప్రకటనలో తెలిపారు. సాక్షి, భీమవరం/నరసాపురం/తాడేపల్లిగూడెం: పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని, ఉచిత పంటల బీమా పథకాన్ని పునరుద్ధరించాలని, ఎరువుల బ్లాక్ మార్కెట్ను అరికట్టాలని, రైతులందరికీ పూర్తిస్థాయిలో అన్నదాత సుఖీభవ పథకం వర్తింపచేయాలని తదితర డిమాండ్లతో రైతుల పక్షాన మంగళవారం వైఎస్సార్సీపీ నేతృత్వంలో అన్నదాత పోరు జిల్లాలో విజయవంతమైంది. పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపునందుకుని పార్టీ శ్రేణులు, రైతు సంఘాల నేతలు, రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఉత్సాహంగా కార్యక్రమంలో పాల్గొన్నారు. సర్కారు విఫల యత్నం అన్నదాత పోరును అడ్డుకునేందుకు కూటమి ప్రభుత్వం విఫలయత్నం చేసింది. సెక్షన్ 30 అమల్లో ఉందని, ర్యాలీలకు అనుమతిలేదంటూ మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ పార్టీ కోఆర్డినేటర్ల నివాసాలు, పార్టీ కార్యాలయాల వద్ద పోలీసులను మోహరించి చెదరగొట్టే ప్రయత్నాలు చేసినా పార్టీ శ్రేణులు, రైతులు లెక్కచేయలేదు. నియోజకవర్గాల నుంచి ఆర్డీఓ కార్యాలయాలకు చేరుకుని ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నిరసనలు తెలిపారు. ఆర్డీఓ కార్యాలయాల వద్ద వినతిపత్రాలు అందజేసేందుకు పోలీసులు ఆంక్షలు పెట్టి పరిమిత సంఖ్యలో మాత్రమే అనుమతించారు. నరసాపురంలో.. నరసాపురంలోని రైల్వేస్టేషన్ రోడ్డులోని వైఎస్సార్సీపీ కార్యాలయం నుంచి పార్టీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు, మాజీ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, పాలకొల్లు కో–ఆర్డినేటర్ గుడాల శ్రీహరిగోపాలరావు, పార్టీ శ్రేణులు, రైతులు ర్యాలీగా సబ్ కలెక్టర్ కార్యాలయానికి వెళ్లారు. అడుగడుగునా పోలీసులు మోహరించి అడ్డంకులు కల్పించినా లెక్కచేయకుండా నిరసన ప్రదర్శన కొనసాగించారు. రైతులను ఆదుకోవాలని, కూటమి సర్కారు కళ్లు తెరవాలంటూ దారిపొడవునా నినాదాలు చేశారు. సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద పోలీసులు గేటు మూసివేసి కొంత మందిని మాత్రమే లోపలికి అనుమతించారు. దీంతో సబ్ కలెక్టర్ కార్యాలయ గేటు వద్ద స్వల్ప ఉద్రిక్తత ఏర్పడింది. అనంతరం ఆర్డీఓ దాసిరాజుకు వినతిపత్రం అందజేశారు. తాడేపల్లిగూడెంలో.. మాజీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ, నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గ అబ్జర్వర్ ముదునూరి మురళీకృష్ణంరాజు పార్టీ కార్యాలయం వద్ద నుంచి భారీ ర్యాలీగా, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు పెద్ద ఎత్తున తణుకు నియోజకవర్గ శ్రేణులతో కలిసి ఆర్డీఓ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ ఉన్న పోలీసులు పార్టీ శ్రేణులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. మాజీ మంత్రులు కొట్టు, కారుమూరి, అబ్జర్వర్ మురళీకృష్ణంరాజులు రైతు సమస్యలను ఆర్డీఓ ఖతీఫ్ కౌసర్ బానోకు వివరించి వినతిపత్రం అందజేశారు. భీమవరంలో.. రైతు విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వడ్డి రఘురాం, భీమవరం నియోజకవర్గ కోఆర్డినేటర్ చినమిల్లి వెంకటరాయుడు, ఉండి నియోజకవర్గ కో–ఆర్డినేటర్ పీవీఎల్ నరసింహరాజు, మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు గూడూరి ఉమాబాల, పార్టీ శ్రేణులు, రైతులు ప్రదర్శనగా భీమవరం మునిసిపల్ కార్యాలయ ప్రాంగణంలోని ఆర్డీఓ కార్యాలయానికి చేరుకుని వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రఘురాం మాట్లాడుతూ యూరియా కోసం అవస్థలు పడుతున్న రైతులను ఆదుకోవాలంటూ వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఆందోళన చేపడితే పోలీసులతో అడ్డుకోవాలని ప్రభుత్వం ప్రయత్నించడం దారుణమన్నారు. భీమవరం కో–ఆర్డినేటర్ వెంకటరాయుడు మాట్లాడుతూ యూరియా కూడా సరఫరా చేయలేని దుస్థితిలో కూటమి ప్రభుత్వం ఉందని విమర్శించారు. ఉండి కో–ఆర్డినేటర్ పీవీఎల్ మాట్లాడుతూ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రైతుల సంక్షేమం కోసం రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేస్తే కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేసిందన్నారు. మహిళ నేత ఉమాబాల మాట్లాడుతూ అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల కష్టాలు గుర్తించి వారి పక్షాన వైఎస్సార్సీపీ ఎప్పుడూ పోరాటం సాగిస్తుందన్నారు. తాడేపల్లిగూడెం: ఆర్డీఓ కార్యాలయంలోకి వెళుతున్న మాజీ మంత్రులు కొట్టు, కారుమూరి నరసాపురం: ఆర్డీఓ కార్యాలయం వద్ద పార్టీ శ్రేణులను అడ్డుకుంటున్న పోలీసులు భీమవరం: ఆర్డీఓ కార్యాలయంలో వినతిపత్రం అందిస్తున్న పార్టీ నాయకులు చినమిల్లి, పీవీఎల్, కవురు, రఘురామ్, ఉమాబాల ఏలూరు (టూటౌన్): విద్యుత్ స్మార్ట్ మీటర్లు బిగించవద్దని.. పెంచిన విద్యుత్ చార్జీలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో ఏలూరులో కొత్త బస్టాండ్ సమీపంలోని వంతెన వద్ద మంగళవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. అదానీ మీటర్లు వద్దు.. పెంచిన విద్యుత్ ఛార్జీలు రద్దు చేయాలంటూ నినాదాలు చేశారు.ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కె.శ్రీనివాస్, ఆర్.లింగరాజు, డీఎన్వీడీ ప్రసాద్ మాట్లాడారు. గత ఎన్నికల ముందు విద్యుత్ స్మార్ట్ మీటర్లు బిగిస్తే పగలగొట్టండని లోకేష్ పిలుపునిచ్చారని గుర్తు చేశారు. ఇప్పుడు ప్రజలపై భారంపడేలా స్మార్ట్ మీటర్లు ఏ విధంగా బిగిస్తున్నారని ప్రశ్నించారు. ఇప్పటికే వ్యాపార సంస్థలకు, షాపులకు స్మార్ట్ మీటర్లు బిగించారని ఈ స్మార్ట్ మీటర్లతో బిల్లుల భారం పెరిగిందన్నారు. ఇప్పుడు గృహ వినియోగదారులకు స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నారని, దొంగ చాటుగా ప్రజలు ఆమోదం లేకుండా మీటర్లు బిగించడం దుర్మార్గమన్నారు. బిగించిన స్మార్ట్ మీటర్లకు బిల్లు ఇవ్వడం లేదని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ ట్రూ ఆఫ్ చార్జీలు పేరుతో ప్రజలపై రూ.12 వేల కోట్లు భారం వేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. పెంచిన విద్యుత్ ఛార్జీలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు పి.మంగరాజు, ఎస్.మహంకాళి రావు, తామా ముత్యాలమ్మ, నగర కార్యదర్శి పంపన రవికుమార్, నగర కమిటీ సభ్యులు వైఎస్ కనకారావు తదితరులు పాల్గొన్నారు. భీమవరం (ప్రకాశంచౌక్): జిల్లాలో నిర్మాణం పూర్తయిన మల్టీ పర్పస్ గోడౌన్లను తక్షణమే వినియోగంలోకి తీసుకురావాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ సహకార శాఖలో చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాకు నాబార్డ్ మంజూరు చేసిన 500 మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన 24 మల్టీ పర్పస్ గోడౌన్స్లో 14 పూర్తి చేశామని, ఇంకా 10 నిర్మాణాలను పూర్తి చేయాల్సి ఉందన్నారు. పూర్తయిన 14 గోడౌన్లు రిజిస్ట్రేషన్లను కూడా పూర్తి చేసి, పీఎసీఎస్లకు అప్పగించామన్నారు. ఇప్పటికే పూర్తయిన వాటిని వినియోగంలో తీసుకురావాలని ఆదేశించారు. పోలవరం మండలం ప్రగఢపల్లిలో యూరియా కోసం రైతులు రోడ్డెక్కారు. మంగళవారం సొసైటీ గోడౌన్కు సరిపడా యూరియా రాకపోవడంతో రైతులు ఆగ్రహించారు. 8లో uముదునూరి ప్రసాదరాజు చంద్రబాబు పాలన మొత్తం ప్రజలను మోసం చేయడం, వంచించడమేనని మరోసారి రుజువైందని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు విమర్శించారు. నరసాపురంలో మాట్లాడుతూ రైతులకు ప్రభుత్వం నుంచి పెట్టుబడి సాయం అందడం లేదన్నారు. ఇన్పుట్ సబ్సిడీ, పంటకు బీమా వంటి సదుపాయాలు లేవన్నారు. పంటను అమ్ముకునే పరిస్థితిలేని దయనీయ స్థితిలో రైతులు కొట్టుమిట్టాడుతున్నారని వాపోయారు. నేడు యూరియా సక్రమంగా దొరక్క రైతులు అవస్థలు పడుతున్నారన్నారు. తమ గొంతునొక్కాలని చూసినా ప్రజల కోసం వైఎస్సార్సీపీ బలంగా నిలబడుతుందన్నారు. కొట్టు సత్యనారాయణ, మాజీ డిప్యూటీ సీఎం కూటమి ప్రభుత్వం రైతుల పట్ల దుర్మార్గంగా వ్యవహరిస్తోందని మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. జగన్ పాలనలో ఏర్పాటు చేసిన వ్యవస్ధలను మార్చేయాలని దుర్మార్గమైన ఆలోచనతో కూటమి ప్రభుత్వం ఉందన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రికి వ్యవసాయం అంటే అసహ్యం. పంటలకు యూరియా వేస్తే క్యాన్సర్ వస్తుందని సీఎం అంటున్నారని రైతులను, ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని అబద్ధాలు చెప్పడంలో సిద్ధహస్తుడు చంద్రబాబు అని విమర్శించారు. యూరియాను కూటమిలోని ఒక పార్టీ నాయకులు దారి మళ్లిస్తున్నారు. రూ.200 నుంచి రూ.300 కోట్లు చేతులు మారాయని విమర్శించారు. కారుమూరి నాగేశ్వరరావు, మాజీ మంత్రి యూరియాను నల్లబజార్లో కొనాల్సి వస్తోంది. రైతుల పక్షాన జగన్ నిలబడి నిరసన కార్యక్రమాలు చేపట్టాక కూటమి ప్రభుత్వం మేల్కొంటుంది. మామిడి, పొగాకు, పత్తి రైతులు ప్రభుత్వ తీరు వల్ల తీవ్రంగా నష్టపోయారు. ఉల్లి రైతుదీ అదే పరిస్థితి. కూటమి ప్రభుత్వంలో దళారీ వ్యవస్ధ పెరిగిపోయింది. వైఎస్ జగన్ వ్యవసాయం పండుగ అంటే, ప్రస్తుత సీఎం దండగ అంటున్నారు. రాష్ట్రంలో రైతులకు యూరియా కొరత లేకుండా అందించాలి. రైతుల పక్షాన వైఎస్సార్సీపీ పోరాటం కొనసాగిస్తుంది. శ్రీ రంగనాథరాజు, మాజీ మంత్రి ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని ఆచంట నియోజకవర్గ కన్వీనర్, మాజీ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు ఆవేదన వ్యక్తం చేశారు. గత వైఎస్సార్సీపీ 5 ఏళ్ల పాలనలో రైతులకు ఇలాంటి కష్టాలు లేవన్నారు. యూరియా కృత్రిమ కొరత సృష్టించి బ్లాక్మార్కెట్ను ప్రోత్సహిస్తూ రైతుల నడ్డివిరుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరిగేషన్ మంత్రి రామానాయుడు సొంత ఇలాకా పాలకొల్లులో అక్రమ ఇసుక దందా సాగుతుందని విమర్శించారు. గోదావరి గట్లను కూడా అక్రమంగా తవ్వడానికి సిద్దంగా ఉన్నారన్నారు. సీపీఎం ఆధ్వర్యంలో నిరసన వైఎస్సార్సీపీ అన్నదాత పోరు విఫలయత్నానికి కూటమి కుట్రలు అడుగడుగునా పోలీసులతో ఆంక్షలు వెనక్కి తగ్గకుండా రైతు పోరును విజయవంతం చేసిన పార్టీ శ్రేణులు, రైతులు ఆర్డీఓ కార్యాలయాల్లో వినతిపత్రాల సమర్పణ గుడాల గోపీ, కన్వీనర్ 14 నెలల పాలనలో కూటమి నేతల పాపాలు పండుతున్నాయని పాలకొల్లు నియోజకవర్గ కన్వీనర్ గుడాల గోపీ అన్నారు. యూరియా దొరక్క, పంట సాయం అందక రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని వాపోయారు. ముదునూరి మురళీకృష్ణంరాజు రైతుల పక్షాన పోరాడి ప్రభుత్వ మెడలు వంచుతాం. కష్టంలో రైతుల పక్షాన నిలబడాల్సిన కూటమి ప్రభుత్వం వారిని నిర్లక్ష్యం చేస్తోంది. ఇన్ఫుట్ సబ్సిడీ, బీమా గాలికొదిలేసింది. జగన్ ప్రభుత్వం రైతులు నష్టపోయిన సందర్భంలో అన్ని రకాలుగా ఆదుకుంది. -
ఉద్యోగాలకు ట్రిపుల్ ఐటీ విద్యార్థుల ఎంపిక
నూజివీడు: నూజివీడు ట్రిపుల్ ఐటీలో నాలుగో సంవత్సరం ఈసీఈ చదువుతున్న విద్యార్థులు ఇద్దరు ఉద్యోగాలకు ఎంపికయ్యారు. విద్యార్థి యుగంధర్ ఓమ్నీ డిజైన్స్ అనే కంపెనీకి ఇంటర్న్షిప్తో పాటు ఉద్యోగానికి ఎంపికయ్యాడు. ఇంటర్న్షిప్లో నెలకు రూ.50 వేలు ఏడాది పాటు ఇవ్వనున్నారు. అనంతరం ఏడాదికి రూ.18 లక్షల వార్షిక వేతనాన్ని కంపెనీ ఆఫర్ చేసింది. అలాగే మరో విద్యార్థిని కమలప్రియ ఎన్ఎక్స్పీ సెమీ కండక్టర్ కంపెనీకి ఎంపికై ంది. ఆరు నెలల పాటు ఇంటర్న్షిప్కు వెళ్లనుంది. ఇంటర్న్షిప్లో నెలకు రూ.40 వేల స్టైఫండ్ను కంపెనీ అందించనుంది. అనంతరం ఏడాదికి రూ.25 లక్షల వార్షిక వేతనంను అందించనుంది. విద్యార్థులను నూజివీడు ట్రిపుల్ఐటీ డైరెక్టర్ ఆచార్య సండ్ర అమరేంద్రకుమార్, ఏఓ బీ లక్ష్మణరావు అభినందించారు. -
కనకదుర్గ గోల్డ్ ఫైనాన్స్లో భారీ చోరీ
రూ.3 కోట్ల బంగారు ఆభరణాలతో ఆడిటర్ పరార్ చింతలపూడి: చింతలపూడి పట్టణంలోని కనకదుర్గ గోల్డ్ ఫైనాన్స్లో భారీ చోరీ జరిగింది. సుమారు రూ.3 కోట్ల విలువైన బంగారు ఆభరణాలతో అదే సంస్థలో పనిచేస్తున్న ఆడిటర్ వడ్లమూడి ఉమా మహేష్ పరారయ్యాడు. సంస్థ ఉద్యోగులు, ఖాతాదారులు తెలిపిన వివరాల ప్రకారం విజయవాడ ప్రధాన కార్యాలయం నుంచి ఆడిటర్ మహేష్ మంగళవారం ఉదయం 11 గంటలకు స్థానిక కనకదుర్గ ఫైనాన్స్ సంస్థకు చేరుకున్నాడు. మేనేజర్ యాదల ప్రవీణ్ కుమార్, క్యాషియర్ అమృతాల ఆషాలను బయటకు పంపించి 380 పాకెట్లలో ఉన్న గోల్డ్తో మహేష్ పరారయ్యాడు. సమాచారం అందుకున్న సీఐ క్రాంతికుమార్, ఎస్సై సతీష్ కుమార్ ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. సాయంత్రం 5 గంటల సమయంలో తనకు హెల్త్ బాలేదని, కొబ్బరి నీళ్లు తీసుకురమ్మని తమను బయటికి పంపించి మహేష్ గోల్డ్ బ్యాగ్తో పరార్ అయినట్లు సంస్థ ఉద్యోగులు తెలిపారు. అతడు బంగారం ఉన్న బ్యాగ్తో ఏలూరు వైపు వెళ్లినట్లు అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అన్నదాతకు అండగా..
నాలుగు ఎకరాలు సాగు చేస్తున్నాను. ఈ సీజన్లో యూరియా దొరకడం చాలా కష్టంగా ఉంది. సొసైటీలు, బయటి దుకాణాల్లో ఎక్కడా స్టాకు లేదంటున్నారు. గతంలో ఎప్పుడూ ఇంత ఇబ్బంది రాలేదు. ఈ తొలకరికే యూరియాకు కొరత వచ్చింది. – గణపాబత్తుల ఏసుబాబు, గుంపర్రు, యలమంచిలి మండలం యూరియా మొదటి కోటాకు ఇబ్బంది రాలేదు. ఇప్పుడు రెండో కోటా వేద్దామంటే ఎక్కడా దొరకడం లేదు. ఎరువుల దుకాణంలో ఖాతా ఉంది. అక్కడ లేకపోవడంతో డీలర్ సూచనపై పెనుమంట్ర డీసీఎంఎస్కు వస్తే ఇక్కడ స్టాకు లేదని చెప్పారు. – పి.రాము, రైతు, మాముడూరు, పెనుమంట్ర మండలం యలమంచిలి మండలంలో మొత్తం 9 సొసైటీలకు గాను కొంతేరు, యలమంచిలి, శిరగాలపల్లి, నారినమెరక, చించినాడ సొసైటీల్లో ఎరువుల విక్రయం చేస్తున్నారు. ఈ సీజన్లో యలమంచిలి సొసైటీకి 50 టన్నులు, కొంతేరుకు 36, శిరగాలపల్లికి 80, నారినమెరకకు 36, చించినాడకు 36 టన్నులు వచ్చింది. అరకొర నిల్వలతో స్టాకు వచ్చిన వెంటనే రైతులు ఎగరేసుకుపోతున్నారు. ఒక్కోసారి ఎకరాకు అర బస్తా (22.5 కిలోలు) మాత్రమే ఇస్తున్నట్టుగా రైతులు చెబుతున్నారు. కొంతేరు సొసైటీకి 12.5 టన్నుల వరకు రాగా సోమవారం రైతులు ఎగబడిమరీ తీసుకువెళ్లారు. పెనుమంట్రలోని డీసీఎంఎస్ గోడౌన్కు జూన్ 20న 25.200 టన్నులు, జూలై 23న 25.200 టన్నులు, జూలై 31న 6.300 టన్నుల యూరియా వచ్చింది. వచ్చిన రెండు మూడు రోజుల్లోనే ఈ స్టాకు అయిపోయింది. ఆగస్టు, సెప్టెంబరులో ఇప్పటి వరకు స్టాకు రాలేదని సిబ్బంది చెబుతున్నారు. ఈ–పోస్ యంత్రంలో స్టాకు ఉన్నట్టుగా చూపిస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం ప్రైవేట్ డీలర్ల వద్ద కూడా దొరకడం లేదని ఇక్కడి రైతులు అంటున్నారు. సాక్షి, భీమవరం: జిల్లాలో 2.15 లక్షల ఎకరాల్లో వరి, 25 వేల ఎకరాల్లో ఉద్యాన పంటలు సాగవుతున్నాయి. వ్యవసాయ శాఖ లెక్కల ప్రకారం ఖరీఫ్ సీజన్కు 21,270 మెట్రిక్ టన్నుల యూరియా అవసరమవుతుంది. ఇప్పటివరకు 20,310 మెట్రిక్ టన్నులు రాగా 18,329 మెట్రిక్ టన్నులు రైతులకు అందజేసినట్టు వ్యవసాయాధికారులు చెబుతున్నారు. ఎరువుల కొరత లేదని, సొసైటీల్లో అవసరమైన యూరియా నిల్వలు ఉన్నాయని.. అధికారులు చేస్తున్న ప్రకటనలకు, క్షేత్రస్థాయిలో పరిస్థితికి పొంతన ఉండటం లేదు. కొన్ని సొసైటీల్లో స్టాకు లేదని సిబ్బంది రైతులను వెనక్కి పంపిస్తున్నారు. వినియోగం తక్కువే రబీతో పోలిస్తే ఖరీఫ్లో యూరియా వినియోగం తక్కువగా ఉంటుంది. దాళ్వాలో మూడు నుంచి నాలుగు బస్తాలు (ఒక్కో బస్తా 45 కిలోలు) వినియోగిస్తే తొలకరిలో రెండు దఫాలుగా రెండు బస్తాల వరకు మాత్రమే వేస్తుంటారు. ముందుగా నాట్లు జరిగిన తాడేపల్లిగూడెం, తణుకు, ఉండి, భీమవరం నియోజకవర్గాల్లో దాదాపు రెండు కోటాలు పూర్తయ్యాయి. నీటి ఎద్దడి, వర్షాభావ పరిస్థితులతో సాగు ఆలస్యమైన ఆచంట, పాలకొల్లు, నరసాపురం నియోజకవర్గాల్లో చాలాచోట్ల మొదటి కోటా మాత్రమే వేశారు. కొన్ని సొసైటీల్లో యూరియా లభ్యత లేక రైతులు ఇబ్బంది పడుతున్న పరిస్థితులు ఉన్నాయి. యలమంచిలి మండలంలో కొన్నిచోట్ల అర బస్తా మాత్రమే ఇస్తుండగా, పెనుగొండ, ఆచంట మండలాల్లో యూరియాకు కాంప్లెక్స్ ఎరువుల లింక్ పెడుతున్నట్టు రైతులు చెబుతున్నారు. వైఎస్సార్సీపీ పిలుపుతో ఉలికిపాటు యూరియా కొరత, రైతుల సమస్యల పరిష్కారంలో అలసత్వంపై వైఎస్సార్సీపీ ఈ నెల తొమ్మిదో తేదీన అన్నదాత పోరుకు పిలుపునివ్వడం కూటమి ప్రభుత్వానికి మింగుడుపడటం లేదు. సాగుకు ముందే నిల్వలు పక్కదారి పట్టడం ప్రస్తుత దుస్థితికి కారణమని వైఎస్సార్సీపీ నేతలు విమర్శిస్తున్నారు. డెల్టా జిల్లాలో యూరియాకు కొరత రావడం ప్రభుత్వ చేతగానితనానికి నిదర్శనమంటూ మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ఎరువుల గోడౌన్లు, దుకాణాలపై విజిలెన్స్ తనిఖీలు, కేసుల నమోదు పేరిట ప్రభుత్వం హడావిడి చేస్తోంది. జిల్లాలో 13 (6ఏ) కేసులు నమోదు చేసి రూ.16.86 లక్షల విలువైన 76.65 మెట్రిక్ టన్నుల యూరియాను సీజ్ చేసినట్టు అధికారులు చెబుతున్నారు. రైతు సంక్షేమాన్ని గాలికొదిలేసిన కూటమి ప్రభుత్వ తీరును నిరసిస్తూ మంగళవారం రైతులతో కలిసి వైఎస్సార్సీపీ అన్నదాత పోరు నిర్వహించనుంది. రెవెన్యూ డివిజన్ పరిధిలోని పార్టీ శ్రేణులు, రైతులు ఆర్డీఓ కార్యాలయాలకు చేరుకుని వినతిపత్రాలు అందజేస్తారు. భీమవరం, ఉండి నియోజకవర్గాల నుంచి భీమవరం ఆర్డీఓ కార్యాలయం, తణుకు, తాడేపల్లిగూడెం నుంచి తాడేపల్లిగూడెంలోను, నరసాపురం, ఆచంట, పాలకొల్లు నుంచి నరసాపురంలోను రైతు సమస్యలపై వినతులు ఇస్తారు. ఎరువుల కొరత లేదంటున్న అధికారులు యూరియా దొరకడం లేదంటున్న రైతులు సొసైటీలు, డీలర్ల చుట్టూ ప్రదక్షిణలు రైతుల పక్షాన నేడు వైఎస్సార్సీపీ పోరు ఆర్డీఓ కార్యాలయాల వద్ద రైతులతో కలసి కార్యక్రమం -
దొడ్డిపట్ల గోదావరిలో పంటు ప్రారంభం
యలమంచిలి: మండలంలోని దొడ్డిపట్ల వద్ద వశిష్ట గోదావరి నదిలో పంటు ప్రయాణం పునః ప్రారంభమైంది. గత నెల 29న గోదావరిలో వరద నీరు పెరిగి కనకాయలంక కాజ్వే మునిగిపోవడంతో అధికారుల ఆదేశాల మేరకు దొడ్డిపట్ల రేవులో పంటు ప్రయాణాన్ని నిలిపివేశారు. 11 రోజుల తరువాత వరద తగ్గి కనకాయలంక కాజ్వే వరద నుంచి పూర్తిగా బయటపడడంతో సోమవారం నుంచి పంటు ప్రయాణం ప్రారంభించారు. దీంతో ఉభయ గోదావరి జిల్లాల్లోని డెల్టా, కోనసీమ ప్రజలకు ప్రయాణం సులభతరమైంది.అర్జీలకు శాశ్వత పరిష్కారం : ఎస్పీ భీమవరం: ప్రజా ఫిర్యాదులపై నిర్లక్ష్యం వహించకుండా నిర్ణీత గడువులోగా చట్ట పరిధిలో శాశ్వత పరిష్కారం చూపాలని ఎస్పీ అద్నాన్ నయీం అస్మి జిల్లా పోలీసు అధికారులను ఆదేశించారు. సోమవారం భీమవరం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఆయన అర్జీలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రాంతాలకు చెందిన 13 మంది బాధితులు అర్జీలు అందజేశారు. అర్జీలను స్వీకరించిన అనంతరం సంబంధిత పోలీస్స్టేషన్ల అధికారులతో ఆయన ఫోన్లో మాట్లాడారు. ప్రజా సమస్యలపై పూర్తిస్థాయి విచారణ జరిపి అర్జీలు తిరిగి పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కారం చూపాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్) వి.భీమారావు, జిల్లా స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ వి.పుల్లారావు, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ దేశంశెట్టి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.కలెక్టరేట్ కోసం 3 రోజుల నిరాహార దీక్ష భీమవరం (ప్రకాశం చౌక్) : భీమవరం మార్కెట్ యార్డులోనే కలెక్టరేట్ నిర్మించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల తొమ్మిదో తేదీ మంగళవారం నుంచి మూడు రోజులపాటు భీమవరం ప్రకాశం చౌక్ సెంటర్లో రిలే నిరాహార దీక్ష చేపట్టనున్నట్టు ప్రముఖ న్యాయవాది, బార్ అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ జవ్వాది సత్యనారాయణ (సత్తిబాబు) తెలిపారు. పార్టీలకు అతీతంగా భీమవరం పౌరులు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆయన కోరారు.కొనసాగుతున్న యూరియా కష్టాలుపోలవరం రూరల్: యూరియా కొరత లేదంటూ ప్రభుత్వం చెప్పే లెక్కలకు, క్షేత్రస్థాయిలో పరిస్థితులకు పొంతన లేని పరిస్థితి కనిపిస్తోంది. పోలవరం మండలంలోని కృష్ణారావుపేట, పట్టిసీమ, గూటాల, ప్రగడపల్లి సొసైటీల్లో 50.460 మెట్రిక్ టన్నుల యూరియా ఉన్నట్టు వ్యవసాయశాఖ అదికారులు చెబుతున్నారు. సోమవారం ఉదయం పట్టిసీమ, పోలవరం సొసైటీల వద్ద యూరియా కోసం రైతులు బారులు తీరారు. ఆధార్ కార్డులు పట్టుకుని క్యూ కట్టారు. రైతుకు రెండు బస్తాలు యూరియా వంతున పంపిణీ చేపట్టారు. కొన్ని గంటల్లోనే ఉన్న సరకు అయిపోయింది. దీనిపై రైతులు సిబ్బందిని నిలదీయగా, వాదోపవాదాలు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో పోలవరం ఎస్సై ఎస్ఎస్ పవన్కుమార్ అక్కడికి చేరుకొని రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. క్యూలో ఉన్నవారికి మాత్రమే బస్తాలు ఇవ్వడంతో ఆ తర్వాత వచ్చినవారు మిగిలిపోయారు. మిగిలిన రైతులు సుమారు 150 మంది వరకు ఉండటంతో వారికి వచ్చే కోటాలో యూరియా ఇస్తామని నచ్చజెప్పారు. వారికి స్లిప్పులు ఇచ్చి యూరియా వచ్చిన వెంటనే ముందుగా ఇచ్చేందుకు ఏర్పాటు చేయడంతో రైతులు శాంతించి వెనుదిరిగారు. యూరియా కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారనడానికి ఇదో తాజా ఉదాహరణ. -
మెడికల్ పింఛన్ అందడం లేదు..
కలెక్టర్కు విన్నవించిన దివ్యాంగుడి కుటుంబసభ్యులు కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ అర్జీల స్వీకరణ కార్యక్రమ ప్రాంగణం వద్ద వీల్చైర్లో మెలికలు తిరిగిపోతున్న దివ్యాంగుడిని చూసి కలెక్టర్ నాగరాణి చలించిపోయారు. అతని వద్దకు వచ్చి ఏమైందంటూ అతని తల్లిదండ్రులను ఆరా తీశారు. తమ కుమారుడి పేరు బొడ్డు రాఘవేంద్ర అని, చిన్ననాటి నుంచీ ఇదే పరిస్థితని ఈ సందర్భంగా వారు కలెక్టర్కు వివరించారు. వీల్చైర్లో కూడా నిలకడగా కూర్చోబెట్టలేని పరిస్థితని తెలిపారు. దివ్యాంగుల పింఛన్ ప్రస్తుతం రూ.6 వేలు అందుతోందని, సదరం సర్టిఫికెట్లో అంగవైకల్యం 45 శాతం మాత్రమే నమోదవడంతో మెడికల్ పింఛన్ అందుకోలేకపోతున్నామని వివరించారు. తమ కుమారుడిని చూసుకోవడం చాలా కష్టంగా ఉందని, ఎప్పుడూ ఇద్దరు వ్యక్తులు పనులు మానుకుని దగ్గరుండి చూసుకోవాల్సిన పరిస్థితని వారు వాపోయారు. దీంతో కలెక్టర్ స్పందిస్తూ డీసీహెచ్ఎస్ని పిలిచి కొత్తగా సదరం సర్టిఫికెట్ మంజూరుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీనిని ప్రత్యేక కేసుగా ప్రభుత్వానికి సిఫార్సు చేస్తూ పంపడానికి ప్రతిపాదన సిద్ధం చేయాలని చెప్పారు. అధైర్యపడొద్దని అతని తల్లిదండ్రులకు ధైర్యం చెప్పారు. -
గ్యాంబ్లింగ్ హబ్గా ‘గూడెం’
మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ ఆగ్రహం తాడేపల్లిగూడెం అర్బన్ : కూటమి ప్రభుత్వ హయాంలో తాడేపల్లిగూడెం నియోజకవర్గాన్ని గ్యాంబ్లింగ్ హబ్గా మార్చేశారని మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ విమర్శించారు. ఏ వీధిలో చూసినా బెల్టు దుకాణాలు, ఎక్కడ చూసినా జూదం, కోడి పందేలు, పేకాట.. ఇక గూడెంను ఏం చేద్దామనుకుంటున్నారు.. అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్థానిక ప్రజాప్రతినిధికి చెందినవారు వేసిన ఇసుక కొండల నుంచే అధిక ధరకు ఇసుక కొనుగోళ్లు చేయాలంటూ లారీ డ్రైవర్లపై బెదిరింపులకు పాల్పడతున్నారని విమర్శించారు. షాడోలు, షాడోల వారసుల ముసుగులో నియోజకవర్గంలో అక్రమ దందాలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ అనుమతులతో మట్టి తవ్వకాలు చేస్తున్నవారిని సైతం బెదిరించి.. ఇక్కడి నేతల అనుమతి తీసుకోవాల్సిందే అంటూ వసూళ్లకు పాల్పడుతున్నారని విమర్శించారు. రైతుల సమస్యలపై చిత్తశుద్ధి ఏదీ? డెల్టా ప్రాంతంలో అకాల వర్షాలకు పంటలు మునిగిపోతే ఆయా రైతుల గురించి పట్టించుకున్న పరిస్థితి లేదని కొట్టు సత్యనారాయణ విమర్శించారు. కాలువల్లో పూడుకుపోయిన తూడును తొలగించారా అని ప్రశ్నించారు. పంట మునిగిన రైతులకు కాకుండా ఎగువ ప్రాంత రైతులకు పరిహారం అందిస్తారా అంటూ నిలదీశారు. యూరియా కొరత వస్తుందని ముందే గమనించి.. స్థానిక కూటమి నేతలు భారీస్ధాయిలో గోదాముల్లో యూరియా నిల్వ చేశారని ఆయన విమర్శించారు. వాటిపై తనిఖీల కోసం విజిలెన్స్ సీఐ నేతృత్వంలో వచ్చిన బృందాన్ని తనిఖీలు చేయనివ్వకుండా ఎవరు ప్రభావితం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. పడమరవిప్పర్రు గ్రామంలో యూరియా బస్తా రూ.400కు మించి అమ్ముతుంటే వ్యవసాయాధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. మద్యం బాటిల్కు ఎంఆర్పీ కంటే అధికంగా పది రూపాయలు, డాబాలలో అదనంగా 40 రూపాయలు వసూలు చేస్తూ విక్రయాలు చేస్తుంటే ఎకై ్సజ్ అధికారులు ఏం చేస్తున్నారని నిలదీశారు. వేరే పార్టీల వారు అధికార పార్టీలో చేరితే విచ్చలవిడిగా జూదం ఆడించుకోవచ్చా అని ప్రశ్నించారు. పెద్ద ఎత్తున కోడి పందేలు జరుగుతుంటే అధికారులు ఏం చేస్తున్నారని నిలదీశారు. కాకినాడ బియ్యం అక్రమ రవాణాలో తాడేపల్లిగూడెం క్రియాశీలకంగా ఉందంటున్నారని, దీనికి సూత్రధారులు ఎవరని ప్రశ్నించారు. రాష్ట్ర మీడియాలో సైతం ఇక్కడి అక్రమాలను ప్రత్యేక కథనాలతో వెలికితీస్తోందని, వీటిపై జిల్లా పర్యవేక్షణాధికారిగా ఉన్న కలెక్టర్ పట్టించుకోకపోతే ఎలా అని ప్రశ్నించారు. తాము అఽధికారంలో ఉండగా, శాంతిభద్రతలను అదుపులో ఉంచి, మహిళలకు రక్షణ కల్పించలేదా అన్నారు. ట్రాఫిక్ పద్మవ్హూహ సమస్య పరిష్కారానికి రెండో ఫ్లెవోవర్ వంతెనను చేతిలో ఫైల్స్ పట్టుకొని సెక్రటేరియట్, మంత్రుల చుట్టూ తిరిగి నిర్మిస్తే, ఏదో బిల్డింగ్ కట్టుకున్నానని మాట్లాడుతున్నారు. ఇటీవల ఈ ప్రభుత్వం మూడు వంతెనలను 200కోట్లతో నిర్మిస్తున్నామంటున్నారు. వారు ఏం చేస్తారో. నెత్తిమీద పదిరూపాయలు పెడితే పది పైసలకు పలుకని నాయకులతో నకిలీ ప్రెస్మీట్లు పెడుతుంటారు. ఏంటి ఈ విధానం అన్నారు. కాకినాడ బియ్యం అక్రమ రవాణాలో గూడెం క్రియాశీలకంగా ఉందంటున్నారు. ఎవ్వరు దీనికి సూత్రధారులన్నారు. రాష్ట్ర మీడియా ఇక్కడి విషయాలపై ప్రత్యేక కధనాలను ప్రచురిస్తున్నాయి. జిల్లా పర్యవేక్షణాధికారిగా ఉన్న కలెక్టర్ ఇలాంటి విషయాలను పట్టించుకోవాలి కదా అన్నారు. నియోజకవర్గంలో రౌడీయిజం, నాన్ లేఅవుట్ల దందా పెరిగిపోయిందన్నారు. అధికారం చేతిలో ఉందని అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారని, ప్రజలు వాస్తవాలను గుర్తించి కూటమి నేతలను తిరస్కరించడానికి ఎంతో కాలం పట్టదన్న విషయాలను గమనించాలని హెచ్చరించారు. రైతులకు ఏ కష్టం వచ్చినా వారికి అండగా ఉండటానికి వైఎస్సార్సీపీ ముందు వరుసలో ఉంటుందన్నారు. రైతుల సమస్యల పరిష్కారం కోసం మంగళవారం చేపట్టిన కార్యక్రమం విజయవంతం చేయాలని, పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు, రైతులు పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. -
స్కూటీతో నేరుగా ఆస్పత్రి వార్డుల్లోకి..
● ఇష్టానుసారంగా కాంట్రాక్టర్ తీరు ● వైద్యాధికారులు చెప్పినా డోంట్ కేర్ పాలకొల్లు సెంట్రల్ : ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు అందించే ఆహారాన్ని కాంట్రాక్టర్ నేరుగా తన ద్విచక్ర వాహనంతో వార్డుల్లోకి తీసుకువెళ్లి అందించడంపై రోగులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అక్కడున్న ఒక వ్యక్తి ఫొటో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో ఈ విషయం బహిర్గతమైంది. ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు ఉదయం టిఫిన్, మధ్యాహ్న, రాత్రి వేళల్లో భోజనం కాంట్రాక్టర్ ద్వారా ఏర్పాటు చేస్తుంటారు. ఈ కాంట్రాక్టర్ గత కొంతకాలంగా ఆహారాన్ని నేరుగా వార్డుల్లోకి తన ద్విచక్ర వాహనంతో వెళ్లి సరఫరా చేస్తుండటం గమనార్హం. ఆస్పత్రి వైద్యాధికారులు ద్విచక్ర వాహనంతో లోపలికి రావద్దని వారించినా, తాను గత కొంతకాలంగా ఇలానే ఇస్తున్నానంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పినట్టు సమాచారం. సోషల్మీడియాలో ఈ విషయం వైరల్ కావడంతో ద్విచక్ర వాహనాన్ని వార్డు వద్ద పెట్టి.. లోపలికి పేషెంట్లను తీసుకెళ్లే వీల్ చైర్లో పెట్టుకుని తీసుకెళ్లడం గమనార్హం. మరి అత్యవసర సమయంలో వీల్ చైర్ అవసరమైతే ఏం చేస్తారని ఆసుపత్రికి వచ్చిన రోగుల బంధువులు ప్రశ్నిస్తున్నారు. దీనిపై వైధ్యాధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
ఎన్నికల హామీ అమలు చేయాలి
భీమవరం (ప్రకాశంచౌక్): ఇమామ్లకు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం రూ.10 వేలు, రూ.5 వేల గౌరవ వేతనం అమలు చేయాలని వైఎస్సార్సీపీ మైనారిటీ సెల్ ఆధ్వర్యంలో కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. సోమవారం భీమవరంలోని జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన పీజీఆర్ఎస్ అర్జీల స్వీకరణ కార్యక్రమంలో వారు కలెక్టర్ చదలవాడ నాగరాణిని కలిసి ఈ మేరకు అర్జీని అందించారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ మైనారిటీ సెల్ జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ జహంగీర్ మాట్లాడుతూ ఇమామ్లు, మౌజన్లకు పెండింగ్లో ఉన్న గౌరవ వేతనాలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆటో డ్రైవర్లకు న్యాయం చేయాలి కూటమి ప్రభుత్వం తీసుకున్న ఉచిత బస్సు నిర్ణయం వల్ల ఆటో డ్రైవర్ల కుటుంబాల ఆర్థిక పరిస్థితి దారుణంగా తయారైందంటూ ఆటో యూనియన్ జిల్లా అధ్యక్షుడు ఇంటి సత్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని జిల్లా కలెక్టర్కు అందజేశారు. ఆటో డ్రైవర్లకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా కోరారు. ప్రజల నుంచి 192 అర్జీలు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి కలెక్టర్తో పాటు అధికారులు ఫిర్యాదులను స్వీకరించారు. వివిధ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ప్రజల నుంచి 192 అర్జీలు అందాయి. కలెక్టర్తో పాటు జాయింట్ కలెక్టర్ టి.రాహుల్కుమార్రెడ్డి, డీఆర్వో బి.శివన్నారాయణరెడ్డి, డ్వామా పీడీ డాక్టర్ కేసీహెచ్ అప్పారావు, గ్రామ వార్డు సచివాలయ అధికారి వై.దోసిరెడ్డి తదితరులు వాటిని స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ఫిర్యాదుదారులతో స్వయంగా మాట్లాడి నిర్ణీత గడువులోపుగా వారి సమస్యలకు పరిష్కారం చూపాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో ఉత్పన్నమయ్యే సమస్యలకు అక్కడే మంచి పరిష్కార మార్గాలు చూపించాలని, అర్జీలు రీఓపెన్ ఆస్కారం లేకుండా చూడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, వయోవృద్ధుల సంక్షేమ ట్రిపునల్ సభ్యుడు దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. పీజీఆర్ఎస్లో కలెక్టర్కు వైఎస్సార్సీపీ మైనారిటీ సెల్ వినతి మైనర్ ఇరిగేషన్ ట్యాంకుల పునర్నిర్మాణానికి చర్యలు జిల్లాలోని మైనర్ ఇరిగేషన్ ట్యాంకుల పునర్నిర్మాణానికి వెంటనే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ చాంబర్లో ఆమె డ్వామా, ఇరిగేషన్, గ్రౌండ్ వాటర్, ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్ అధికారులతో మాట్లా డుతూ తాడేపల్లిగూడెం మెట్ట ప్రాంతంలో గుర్తించిన 54 మైనర్ ఇరిగేషన్ ట్యాంకుల పునర్నిర్మాణం చేసి భూగర్భ జలాల పెంపునకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఈ పనులను ఉపాధి హామీ పథకం నిధులతో చేపట్టేందుకు అంచనాలు సిద్ధం చేయాలన్నారు. వీటిలో డీసిల్టింగ్, గట్ల పటిష్టత, స్లూయిస్, ష్టటర్లు, జంగిల్ క్లియరెన్స్ తదితర పనులు చేపట్టేందుకు అంచనాలు సిద్ధం చేసి డ్వామా పీడీకీ అందించాలన్నారు. డ్వామా పీడీ డాక్టర్ కేసీహెచ్ అప్పా రావు, ఏపీడీ జీవీకే మల్లికార్జునరావు పాల్గొన్నారు. -
పశువుల్లో ప్రమాదకరంగా గాలికుంటు
భీమవరం: వ్యవసాయమే జీవనాధారమైన పశ్చిమగోదావరి జిల్లాలో వరిసాగు తరువాత రైతులు ఎక్కువగా పశువుల పెంపకంపై ఆధారపడతారు. వేణ్నీళ్లకు చన్నీళ్లు సాయం అనే నానుడితో వ్యవసాయంతో పాటు పాడిపశువులను పెంచుతున్నారు. ప్రస్తుతం వాతావరణ పరిస్థితులను బట్టి పశువులకు గాలికుంటు వ్యాధి (పుట్ అండ్ మౌత్ డీసీజెస్) సోకే అవకాశముంది. ఈ వ్యాధి కారణంగా పాల దిగుబడి తగ్గిపోవడం, పనిసామర్ధ్యం తగ్గిపోయే ప్రమాదముంది. వ్యాధి సోకిన పశువుల పాలు తాగిన లేగ దూడలు చనిపోయే అవకాశం ఉంది. గాలికుంటు వ్యాధి తీవ్రమైన అంటువ్యాధి. ఇది పశువులకు, పందులకు, మేకలకు, గొర్రెలు వంటి జంతువులకు సోకుతుంది. ఈ వ్యాధికి కారణం పిక్కోర్నావిరిడే అనే వైరస్.అధిక జ్వరం, నోట్లో పుండ్లు లక్షణాలుగాలికుంటు వ్యాధి సోకిన పశువులకు అధిక జ్వరం వస్తుంది. పశువుల నోటి లోపల, నాలుకపై, చిగుళ్ళ, పెదవులపైన నీటి పొక్కులు ఏర్పడతాయి. ఇవి పగిలి పుండ్లుగా మారతాయి. దీని కారణంగా పశువులు మేత తినడానికి ఇబ్బంది పడతాయి. పశువుల పాదాల మధ్య, గాలికుంటుపైన, కాళ్ళ పైన నీటి పొక్కులు ఏర్పడి అవి పగిలి పుండ్లుగా మారి పశువులు నడవడానికి ఇబ్బంది పడతాయి. దీనివల్ల పశువులు కుంటుతూ నడుస్తాయి. అందుకే ఈ వ్యాధిని గాలికుంటు వ్యాధి అంటారు. నోట్లో పుండ్ల కారణంగా పశువులు నోటి నుంచి ఎక్కువగా లాలాజలాన్ని స్రవిస్తాయి.పాలు ఉత్పత్తిపై ప్రభావంపశువులు మేత సరిగా తినకపోవడం వల్ల వాటి బరువు తగ్గిపోతుంది. దూడలలో ఈ వ్యాధి గుండె కండరాలను ప్రభావితం చేస్తుంది. అందువల్ల గుండె పోటు వచ్చి మరణాలు సంభవించే అవకాశం ఉంది.గాలికుంటు ఎలా వ్యాపిస్తుందివ్యాధి సోకిన పశువుల నుంచి ఆరోగ్యంగా ఉన్న పశువులకు నేరుగా వ్యాధి వ్యాపిస్తుంది. కలుషితమైన మేత, నీరు, పరికరాల ద్వారా వ్యాపిస్తుంది. అంతేకాకుండా గాలి ద్వారా కూడా ఈ వైరస్ కొంత దూరం వరకు వ్యాపిస్తుంది.వ్యాధి చికిత్స, నివారణ● ఈ వ్యాధి నివారణకు నిర్దిష్టమైన చికిత్స లేదు. సాధారణంగా వ్యాధి లక్షణాల ఆధారంగా చికిత్స చేయాలి.● పుండ్లలో ఇన్ఫెక్షన్ రాకుండా ఉండటానికి యాంటీబయోటిక్స్ ఉపయోగించవచ్చు. నోట్లోని పుండ్లను శుభ్రం చేయడానికి పొటాషియం పర్మాంగనేట్ వంటి ద్రావణాలను ఉపయోగించాలి. పాదాల పుండ్లకు అయోడిన్ లేదా ఇతర యాంటిసెప్టిక్ ద్రావణాలను ఉపయోగించవచ్చు. వ్యాధి నివారించడానికి టీకాలు వేయించడం చాలా ముఖ్యం. పశువులకు ప్రతి ఆరు నెలలకొకసారి టీకాలు వేయించాలి. పాడి పశువులు ఉండే స్థలాన్ని శుభ్రంగా ఉంచాలి. పశువులను ఒకదానికొకటి దూరంగా ఉంచాలి.15 నుంచి ఉచితంగా టీకాలుపశువుల్లో గాలికుంటు వ్యాధి నివారణకు ఈనెల 15 నుంచి జిల్లా వ్యాప్తంగా ఉచితంగా టీకాలు వేస్తున్నారు. సుమారు 45 రోజులపాటు పశుసంవర్ధకశాఖ ఆధ్వర్యంలో టీకాలు వేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. వ్యాధిని నిర్లక్ష్యం చేస్తే అనేక నష్టాలు ఏర్పడనున్నందున ఉచిత టీకాలను పాడి రైతులంతా సద్వినియోగం చేసుకోవాలి.పి.సుధీర్బాబు, ఏడీ, పశుసంవర్ధకశాఖ, భీమవరం -
దళిత కుటుంబాలకు పరామర్శ
కై కలూరు: దానిగూడెం దళితులపై దాడి నేపధ్యంలో కై కలూరు పట్టణంలో నాలుగు రోజులుగా పోలీసులను మెహరించారు. నిందితులను రిమాండ్కు తరలించినప్పటకీ ప్రధాన సూత్రదారుడిని అదుపులోకి తీసుకోవాలంటూ దళిత నాయకులు డిమాండ్ చేస్తున్నారు. సోమవారం నియోజకవర్గం, ఇతర ప్రాంతాల నుంచి దాదాపు 150 మంది దళిత యువకులు పోలీసుల వలయాన్ని చేధించుకుని దానిగూడెం చేరుకున్నారు. దానిగూడెం ప్రజలు వంటా, వార్పుతో మద్దతు తెలపడానికి వచ్చిన వారికి భోజనాలు అందించారు. డీఎస్పీ, పలువురు సీఐలు, ఎస్ఐలు కలిపి దాదాపు 200 మంది పోలీసులు విధులు నిర్వహించారు. రాష్ట్రంలో అభివృద్ధి లేదు.. సంక్షేమం లేదు.. రోజు రోజుకు దళితులు, బీసీలు, ఎస్టీలు, మైనార్టీ కులాలపై అత్యాచారాలు, హత్యలు, అరాచకాలు జరుగుతున్నాయని ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ రాష్ట్ర అధ్యక్షులు చింతపల్లి గురుప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. దానిగూడెంకు పోలీసులు వెళ్ళనీయకపోవడంతో అసహనం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో కీలక వ్యక్తులను అరెస్టు చేసి అందరిపై రౌడీషీట్లు ఓపెన్ చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు చర్యలు తీసుకోని పక్షంలో ఆందోళన చేస్తామని హెచ్చరించారు. దళితులపై దాడులు అరికట్టడంలో ప్రభుత్వం విఫలమవుతోందని రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర కన్వీనర్ ఉప్పులేటి దేవీ వరప్రసాద్ విమర్శించారు. ఇటీవల తెనాలి, తణుకు, ఇప్పుడు కై కలూరులో దళితులపై దాడులు జరిగాయన్నారు. రోడ్డుపై ఆందోళనలు చేశారంటూ దళితులపై పోలీసులు నమోదు చేసిన కేసులను ఉపసంహరించాలన్నారు. ప్రధాన నిందితుడు కొల్లి బాబీని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. మాలమహాడు రాష్ట్ర అధ్యక్షుడు నాగ జగన్ బాబూరావు, కృష్ణాజిల్లా మాలమహానాడు అధ్యక్షుడు దోవా గోవర్థన్, దళిత నాయకులు పాల్గొన్నారు. సున్నితమైన అంశంపై కావాలని ఘర్షణలకు పాల్పడితే సహించమని డీఎస్పీ డి.శ్రావణ్కుమార్ హెచ్చరించారు. 144 సెక్షన్ అమలులో ఉందన్నారు. దళితులపై దాడి కేసులో ఇప్పటికే అరెస్టులు చేసి రిమాండ్కు పంపామన్నారు. మరొకరిపై ఆరోపణలను నిర్ధారణ చేసుకుని చర్యలు తీసుకుంటామన్నారు. కై కలూరులో 144 సెక్షన్, భారీగా పోలీసుల మోహరింపు -
గుర్తు తెలియని మృతదేహం లభ్యం
ఇరగవరం: మండలంలోని అయినపర్రు పొలాల్లో సోమవారం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు ఇరగవరం హెడ్ కానిస్టేబుల్ ఐ.కృష్ణారావు తెలిపారు. నీలం రంగు జీన్స్, ఆరెంజ్ రంగు టీ షర్టు ధరించాడని, 30 నుంచి 40 ఏళ్ల వయస్సు ఉంటుందని.. ఎత్తు 5 అడుగుల 8 అంగుళాలు ఉంటుందని చెప్పారు. వీఆర్వో సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహన్ని పంచనామా నిమిత్తం తణుకు ఏరియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి ఆచూకీ తెలిసిన వారు 9440796681, 9440796639 నెంబర్లకు తెలియజేయాలని కోరారు. విశ్వసనీయ సమచారం ప్రకారం మృతుడి జేబులో నాలుగు సెల్ఫోన్లు ఉన్నాయని అతను ఫోన్లు దొంగిలించడానికి వచ్చిన దొంగగా భావిస్తున్నారు. పాలకొల్లు సెంట్రల్: పంచారామక్షేత్రం శ్రీ క్షీరారామలింగేశ్వరస్వామి ఆలయంలో చంద్రగ్రహణం విడుపుకాలం సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామిని దర్శించుకున్నారు. కొందరు భక్తులు దానాలు సమర్పించుకున్నారు. క్యూలైన్లు నిండిపోయాయి. సాయంత్రం ప్రదోషకాలంలో భక్తులు సప్త సోమవారం ప్రదక్షిణల్లో పాల్గొన్నారు. అనంతరం పంచహారతుల కార్యక్రమం నిర్వహించారు. -
10న క్వాంటం వ్యాలీ హ్యాకథాన్ సెమీస్
భీమవరం: భీమవరం పట్టణంలోని ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో అమరావతి క్వాంటం వ్యాలీ హ్యాకథాన్ సెమీఫైనల్స్ ఈ నెల 10న జరుగుతాయని కళాశాల డైరెక్టర్ ఎం.జగపతిరాజు సోమవారం తెలిపారు. ప్రిన్సిపల్ కేవీ మురళీకృష్ణంరాజు, టెక్నాలజీ సెంటర్ హెడ్ ఎన్.గోపాలకృష్ణమూర్తితో కలసి ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ విషయం వెల్లడించారు. ఈ పోటీలకు ఉభయ గోదావరి జిల్లాల్లోని 20 ఇంజనీరింగ్ కళాశాలల నుంచి 40 బృందాలకు సంబంధించి 240 మంది విద్యార్థులు హాజరవుతున్నట్టు చెప్పారు. బుధవారం ఉదయం 8:30 గంటలకు కళాశాల ఓపెన్ ఆడిటోరియంలో జరిగే ప్రారంభ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జేఎన్టీయూ కాకినాడ వైస్ చాన్స్లర్ సీఎస్ఆర్కె ప్రసాద్ హాజరవుతారని న్యాయ నిర్ణేతగా ఉన్నత విద్యా మండలి మాజీ వైస్ చైర్మన్, ఆంధ్ర యూనివర్సిటీ సీఎస్ఎస్ఈ విభాగం ప్రొఫెసర్ వి.వల్లికుమారి వ్యవహరిస్తున్నారన్నారు. -
ఉలిక్కిపడ్డ ట్రిపుల్ ఐటీ
● ప్రొఫెసర్పై దాడితో అప్రమత్తం ● ఆందోళనలో ఫ్యాకల్టీ, నాన్టీచింగ్ సిబ్బంది నూజివీడు: ట్రిపుల్ ఐటీలో పనిచేస్తున్న సీనియర్ ప్రొఫెసర్పై ఎంటెక్ విద్యార్థి కత్తితో దాడి చేయడంతో ట్రిపుల్ ఐటీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఇక్కడ పనిచేస్తున్న మెంటార్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ప్రొఫెసర్లు, గెస్ట్ ఫ్యాకల్టీ, నాన్ టీచింగ్ సిబ్బంది అందరూ దాడి సంఘటనతో ఆందోళనకు గురయ్యారు. ఆర్జీయూకేటీకి గతంలో రిజిస్ట్రార్గా, నూజివీడు ట్రిపుల్ ఐటీకి డైరెక్టర్గా, ఏఓగా, అడ్మిషన్ల కన్వీనర్గా పనిచేసిన సివిల్ ఇంజినీరింగ్ ప్రొఫెసర్ ఎస్ఎస్ఎస్వీ గోపాలరాజుపై ఎంటెక్ ప్రథమ సంవత్సరం విద్యార్థి వినయ్ పురుషోత్తం కత్తితో దాడి చేయడాన్ని ఫ్యాకల్టీ, నాన్ టీచింగ్ స్టాఫ్, మెంటార్ల యూనియన్లు ముక్తకంఠంతో తీవ్రంగా ఖండించాయి. ఒక విద్యార్థి జేబులో రెండు కత్తులు పెట్టుకొని తరగతి గదికి రావడంపై ఆందోళన వ్యక్తం చేశాయి. ఇలా అయితే తమకు రక్షణ ఏముంటుందని ఫ్యాకల్టీ ముక్తకంఠంతో ప్రశ్నిస్తోంది. 9,900 మంది విద్యార్థులున్న నూజివీడు ట్రిపుల్ ఐటీలో మున్ముందు తమ పరిస్థితి దారుణంగా ఉంటుందేమోననే ఆందోళన వ్యక్తం చేస్తోంది. దాడి జరిగింది తరగతి గదిలో కాబట్టి మిగిలిన విద్యార్థులందరూ వచ్చి నిలువరించారని, ఇదే సంఘటన ప్రొఫెసర్ కేబిన్లో జరిగి ఉంటే దాడి నుంచి ప్రొఫెసర్ను ఎవరు కాపాడేవారని ప్రశ్నిస్తున్నారు. ఇలంటి పరిస్థితుల్లో ఫ్యాకల్టీకి భద్రత డొల్లేనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తరగతులకు హాజరుకాకుంటే ఏం చేస్తున్నారు? ప్రొఫెసర్పై దాడికి పాల్పడిన ఎంటెక్ ప్రథమ సంవత్సరం విద్యార్థి వినయ్ పురుషోత్తం ప్రారంభం నుంచి తరగతులకు, ల్యాబ్లకు గానీ హాజరయ్యేవాడు కాదని ట్రిపుల్ ఐటీ వర్గాలు పేర్కొంటున్నాయి. రెసిడెన్షియల్ విధానంలో నిర్వహిస్తున్న ట్రిపుల్ ఐటీలో తరగతులకు రాకుండా హాస్టల్ గదిలోనే ఉంటున్నప్పుడు పరిపాలన చేసే అధికారులు ఏం చేస్తున్నారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. హెచ్ఓడీ, డీన్ అకడమిక్స్, డైరెక్టర్లు నిత్యం గైర్హాజరవుతున్న విద్యార్థులను గుర్తించి ఎందుకు గైర్హాజరవుతున్నారో తెలుసుకొని ఆ విద్యార్థి తల్లిదండ్రులకు తెలియజేయాల్సి ఉన్నప్పటికీ అలా చేసిన దాఖలాలు లేవు. ఈ విద్యార్థి తన రూమ్లో ఉండే మరికొందరు విద్యార్థులతో కూడా మాట్లాడకుండా ఉంటాడని పలువురు పేర్కొంటున్నారు. హాస్టల్లో ఉండే విద్యార్థులు సహజంగా పండ్లు కోసుకోవడానికి ఇంటి వద్ద నుంచే చాకులు తెచ్చుకుంటారు. అయితే ఇతను రెండు చాకులను జేబులో పెట్టుకొని తరగతి గదికి రావడాన్ని బట్టి చూస్తుంటే దాడి చేయాలనే లక్ష్యంతోనే ఉద్దేశపూర్వకంగా తెచ్చుకున్నట్లుగా ఉందని అధ్యాపకులు పేర్కొంటున్నారు. ఇప్పటికై నా యాజమాన్యం కఠినంగా వ్యవహరించాలనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. -
సీసలిలో ఉద్రిక్తత
కాళ్ల: కాళ్ల మండలం సీసలిలో రెండు వర్గాల మధ్య తలెత్తిన వివాదం ఘర్షణకు దారి తీసింది. గ్రామ దేవత గుడి పక్కన ఉన్న పోరంబోకు స్థలం విషయంలో వివాదం తలెత్తగా.. ఇరువర్గాల దాడిలో పలువురు గాయపడ్డారు. దీంతో పెద్ద సంఖ్యలో పోలీసులు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. సీసలి హరిజన పేటకు చేర్చి కాలువ ఒడ్డున తాడిచెట్టు ఉండగా, అక్కడ కొన్ని సంవత్సరాలుగా పోలేరమ్మకు పూజలు చేస్తున్నారు. జూన్లో అదే ప్రాంతంలో పోలేరమ్మ విగ్రహాన్ని ప్రతిష్టించారు. గుడికి పక్కనే కొంత స్థలం ఉంది. ఈ స్థలాన్ని స్థానిక దళితులు అంబేడ్కర్ జయంతి రోజున భోజనాలు వండేందుకు వాడుకునేవారు. ఈ స్థలంలోనే పోలేరమ్మ గుడికి సంబంధించిన ఉత్సవాలు జరిగినప్పుడు భోజనాలు పెట్టుకునేందుకు షెడ్డు కట్టాలనే ఆలోచనను స్థానిక దళితులు వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలో అక్కడ అంబేడ్కర్ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. ఈ విషయంలో ఇరువురి పెద్దలు మాట్లాడుకునే ప్రయత్నం చేశారు. కొందరు సోమవారం సాయంత్రం అక్కడికి వెళ్లి స్థలాన్ని శుభ్రం చేసే ప్రయత్నం చేశారు. ఫెన్సింగ్ తొలగించే క్రమంలో అంబేద్కర్ ఫ్లెక్సీ పాడయింది. విషయం తెలిసి దళితులు పెద్ద ఎత్తున చేరుకుని ఆందోళన చేశారు. ఈ క్రమంలో ఇరు వర్గాలు రాళ్లు విసురుకోవడంతో పలువురికి గాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం భీమవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. -
సచివాలయ ఉద్యోగుల పోరు బాట
● ఒకే మాతృ శాఖ కింద ఆత్మగౌరవంతో పనిచేయడానికి ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలి. ● అన్ని సర్వేలను సంబంధిత శాఖల ద్వారానే నిర్వహించి సచివాలయ సిబ్బందిపై భారం తొలగించాలి. ● పదోన్నతుల్లో జాప్యాన్ని నివారించి, జిల్లాల వారీగా, యూఎల్బీ వారీగా సీనియార్టీ లిస్టులు ప్రకటించి, ప్రక్రియను 2 నుంచి 3 నెలల్లో పూర్తి చేయాలి. ● ప్రతి యూఎల్బీ ఖాళీల్లో కనీసం 50 శాతం ఖాళీలను సచివాలయ సిబ్బందితో భర్తీ చేయాలి. ● 5 నుంచి 6 ఏళ్లు సర్వీస్ పూర్తిచేసిన ఉద్యోగులకు ఆటోమేటిక్ అడ్వాన్స్డ్ స్కీమ్ వర్తింపజేసి, రెండు అదనపు ఇంక్రిమెంట్లు ఇవ్వాలి. ● ప్రొబేషన్ పీరియడ్లో రావాల్సిన నోషనల్ ఇంక్రిమెంట్లకు స్పష్టమైన టైమ్ ఫ్రేమ్ నిర్ణయించాలి. కూటమి ప్రభుత్వం వలంటీర్ వ్యవస్థను రద్దు చేసి సచివాలయ ఉద్యోగులపై భారం వేసింది. గతంలో ఒక వలంటీర్ క్లస్టర్ (50 ఇళ్లు) చూసుకుంటే సచివాలయ ఉద్యోగికి ప్రస్తుతం మూడు నుంచి ఐదు క్లస్టర్ల బాధ్యతలు అప్పగించారు. దీంతో తీవ్ర పని ఒత్తిళ్లతో విధులు నిర్వహించాల్సి వస్తోంది. శాఖాపరమైన పనులతో పాటు బీఎల్ఓ, అదనపు పనులు, సర్వేల భారాన్ని మోపారు. సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం లేదు. ఇప్పటికైనా మా సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఆత్మ గౌరవ ఉద్యమం చేపట్టాం. – ఎ.శ్రీనివాస్, ఏపీ ఎంఎంఈఏ రాష్ట్ర ప్రచార కార్యదర్శి, వార్డు సెక్రటరీ, భీమవరంక్లస్టర్ మ్యాపింగ్ సిస్టమ్ సచి వాలయ సిబ్బందికి గుదిబండ వంటిది. గతంలో వలంటీర్లు ఉండటంతో సర్వేలు, పెన్షన్ల పంపిణీ సులభంగా జరిగేది. వలంటీర్లు లేకపో వడంతో సచివాలయ ఉద్యోగులపై భారం పెరిగింది. ఉదయం 8 గంటలలోపు, సాయంత్రం 5 గంటల తర్వాత కూడా సేవలందించాల్సి వస్తుంది. ఒక్కో ఉద్యోగి మూడు నుంచి ఐదు క్లస్టర్ల బాధ్యతలు చూసుకోవడం చాలా భారంగా ఉంది. ఒక్కో ఉద్యోగి 150 నుంచి 250 కుటుంబాల బాధ్యతలు నిర్వహించడం కష్టంగా ఉంది. ప్రభుత్వం కొన్ని సర్వేలను థర్డ్ పార్టీ వారితో చేయించాలి. సచి వాలయ ఉద్యోగుల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలి. –కె.శ్రీనివాస్, రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్, ఏపీ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంక్షేమ సంస్థ భీమవరం(ప్రకాశం చౌక్): కూటమి ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిరసనగా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ఆత్మగౌరవ ఉద్యమ బాట పట్టారు. పనిఒత్తిళ్లు, సర్వేల భారం, తమ ఆత్మగౌరవాన్ని దిగజార్చడంపై ఇప్పటికే పలుమార్లు వినతిపత్రాలు సమ ర్పించినా ప్రభుత్వం స్పందించకపోవడంతో ఏడు రోజులపాటు నిరసనలకు పిలుపునిచ్చారు. గ్రామ స్వరాజ్యమే లక్ష్యంగా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాలు, వలంటీర్ వ్యవస్థల ను తీసుకువచ్చింది. గత ప్రభుత్వంలో ఐదేళ్లపాటు పూర్తిస్థాయిలో ఈ వ్యవస్థల ద్వారా ముంగిళ్లలోకే ప్రజలకు పాలనను చేరువ చేశారు. అయితే కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు వలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని హామీ ఇచ్చి గద్దెనెక్కిన తర్వాత ని ర్దాక్షిణ్యంగా వలంటీర్ వ్యవస్థను రద్దు చేసింది. దీంతో రాష్ట్రంలో లక్షలాది మంది వలంటీర్లు ఉపాధి కో ల్పోయారు. ఈ క్రమంలో సచివాలయ ఉద్యోగులపై పనిభారం మరింత పెరిగింది. ఇంటింటా సర్వేలు, పింఛన్ల పంపిణీ, మల్టీ టాస్కింగ్ విధులతో సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు. రోజురోజుకూ ఉద్యో గుల ఆత్మగౌరవాన్ని దిగజార్చేలా ప్రభుత్వం వ్యవహరించడంపై రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు ఆత్మ గౌరవ ఉద్యమం పేరట నిరసనలు తెలుపుతున్నారు. దీనిలో భాగంగా జిల్లాలోని 380 గ్రామ, 155 వార్డు సచివాలయ ఉద్యోగులు మొత్తం 4,331 మంది నిరసనలు తెలుపుతున్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని గళమెత్తుతున్నారు. ఉద్యమ కార్యాచరణ సచివాలయ ఉద్యోగులు ఏడు రోజుల పాటు నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు. దీనిలో భాగంగా తొలిరోజు (శనివారం) ఉన్నతాధికారులకు వినతిపత్రాలు సమర్పించారు. 2, 3 రోజుల్లో (సోమ, మంగళవారాలు) నల్ల బ్యాడ్జీలతో విధులకు హా జరు, 4, 5 రోజుల్లో (బుధ, గురువారాలు) అధికారిక వాట్సాప్ గ్రూపుల నుంచి వైదొలగడం, 6,7 రో జుల్లో (శుక్ర, శనివారాలు) పెన్డౌన్ కార్యక్రమాల ద్వారా నిరసన తెలుపనున్నారు. ఆత్మగౌరవ ఉద్యమం సర్వేల భారంతో సతమతం ఒత్తిళ్లతో విధుల నిర్వహణ మహిళా, దివ్యాంగ సిబ్బందికి తప్పని ఇబ్బందులు ప్రభుత్వ వైఖరిపై మండిపాటు జిల్లాలో 4,331 మంది ఉద్యోగుల నిరసన గళం వలంటీర్ల వ్యవస్థను రద్దు చేయడంతో ఒక్కో ఉద్యోగి మూడు నుంచి ఐదు క్లస్టర్ల పరిధిలో సేవలందించాల్సి వస్తోంది. ఈ లెక్కన ఒక్కో ఉద్యోగి 150 నుంచి 250 కుటుంబాల బాధ్యతలను నిర్వహించడం కష్టంగా మారింది. సామాజిక, ఆర్థిక, విద్య, వైద్య, ఉపాధి తదితర సర్వేల భారాన్ని ప్రభుత్వం మోపడాన్ని వీరంతా వ్యతిరేకిస్తున్నారు. మల్టీటాస్కింగ్ పేరుతో మాతృశాఖ పనులతో పాటు ఇతర శాఖల పనులు కూడా చేయమని బలవంతం చేస్తున్నారు. డాష్ బోర్డులు, టార్గెట్ల పేరిటపై అధికారులు వేధిస్తున్నారు. సర్వేలకు వెళ్లినప్పుడు మహిళా సిబ్బంది సామాజిక వేధింపులకు గురవుతున్నారు. రక్షణపై ఆందోళన చెందుతున్నారు. సర్వే కోసం ఇంటింటా తిరగడం దివ్యాంగ సిబ్బందికి ఇబ్బందిగా ఉంది. సర్వే సమయంలో ఆధార్, బయోమెట్రిక్, ఓటీపీలు చెప్పేందుకు కొందరు సహకరించడం లేదు. సంక్షేమం, ఉద్యోగ ప్రయోజనాలు వంటి విషయాల్లో అధికారులు శ్రద్ధ చూపడం లేదు. సర్వేల విషయంలో ఒత్తిడి పెంచడం, సర్వే కాలేదనే కారణంతో సస్పెండ్ చేయడం ఉద్యోగులను ఆందోళన కలిగిస్తోంది. పని ఒత్తిళ్లతో కుటుంబ జీవనానికి దూరమవుతున్నామని ఉద్యోగులు వాపోతున్నారు. కొందరు ఆత్మహత్యలకు సైతం పాల్పడ్డారు. -
●చంద్ర గ్రహణం.. ఆలయాల మూసివేత
సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా ఆలయాల తలుపులకు మూతలు పడ్డాయి. ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయం, భీమవరం మావుళ్లమ్మవారు, భీమవరం పంచారామక్షేత్రం, జంగారెడ్డిగూడెం మండలం గుర్వాయిగూడెంలో మద్ది ఆంజనేయ తదితర ఆలయాలను ఆదివారం మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో మూసివేశారు. ప్రధాన ద్వారాలు, గోపుర ద్వారాలను మూసివేసి తాళాలు వేశారు. సోమవారం ఉదయం శుద్ధి, సంప్రోక్షణ, పుణ్యహవచనం అనంతరం భక్తులను అనుమతిస్తారు. – ద్వారకాతిరుమల/భీమవరం (ప్రకాశం చౌక్)/జంగారెడ్డిగూడెం గుర్వాయిగూడెంలో మద్ది అంజనేయస్వామి వారి ఆలయం వద్ద.. భీమవరంలో సోమేశ్వరస్వామి ఆలయగోపుర ద్వారం మూసివేసిన దృశ్యం -
కూటమి పాలనలో ఎరువుల కృత్రిమ కొరత
తాడేపల్లిగూడెం అర్బన్: కూటమి ప్రభుత్వం ఎరు వులు కృత్రిమ కొరత సృష్టించి రైతులను ఆర్థికంగా దోచుకుంటోందని మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక క్యాంపు కార్యాలయంలో ఆదివారం విలేకరుల సమావేశాన్ని వైఎస్సార్సీపీ పట్టణ అధ్యక్షుడు కొలుకులూరి ధర్మరాజు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కొట్టు మాట్లాడుతూ వ్యవసాయానికి అవసరమైన నీటి కాలువలు నిర్వహణ చేయడం లేదని, గుర్రపుడెక్కను నియంత్రించడంలో అధికారులు విఫలమయ్యారన్నారు. కూట మి ప్రభుత్వం ఏర్పడి 16 నెలలు గడస్తున్నా రైతులకు న్యాయం చేయలేపోయిందని ఎద్దేవా చేశారు. ఏడాదికి రూ.20 వేలు ఇస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం ఇప్పటికీ రూ.5 వేలు మాత్రమే ఇచ్చిందన్నారు. ఇటీవల ఎరువుల కొరత సృష్టించి వాటా లు, కోటాల పేరుతో యూరియా బస్తాలను అధిక ధరలకు విక్రయిస్తున్నారని ఆరోపించారు. ఎరువుల సరఫరాలో తాడేపల్లిగూడెం కేంద్రంగా ఇతర ప్రాంతాలకు తరలిస్తారన్నారు. మార్క్ఫెడ్, మార్కె ట్ వాటాలు ఎంతో తెలియజేయాలన్నారు. ఎరువులు ఎవరికి కోటా ఇచ్చారో ఇన్వాయిస్లను వెల్లడించాలని డిమాండ్ చేశారు. రైతుల ఇబ్బందులు సీఎం చంద్రబాబు, వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడికి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. రైతులను చులకన చేసి మాట్లాడటం తగదన్నారు. పడమర విప్పర్రులో ఎరువులు జనసేన, టీడీపీ వర్గీయులైన రైతులకు మాత్రమే ఇచ్చారని, కూటమి అనుయాయులకే ప్రాధాన్యమిచ్చి మిగిలిన వారిపై నిర్లక్ష్యం తగదన్నారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో షాడో ఎమ్మెల్యే ఎవరో తెలియజేయాలన్నారు. నియోజకవర్గంలో రైతుల కష్టాలు ప్రజాప్రతినిధులకు కానరావడం లేదన్నారు. 9న అన్నదాత పోరు రైతుల విషయంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న అక్రమాలు, అవినీతికి వ్యతిరేకంగా ఈనెల 9న వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో అన్నదాత పోరు కార్యక్రమాన్ని ఆర్డీఓ కార్యాలయాల వద్ద నిర్వహించనున్నామని మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. రైతులు, పార్టీ శ్రేణులు, అభిమానులు తరలిరావాలని పిలుపునిచ్చారు. అనంతరం అన్నదాత పోరు పోస్టర్లను ఆవిష్కరించారు. నాయకులు ముప్పడి సంపత్కుమార్, ఆరేపల్లి సుబ్బారావు, కర్రి భాస్కరరావు, వెలిశెట్టి నరేంద్రకుమార్, చెన్నా జనార్దన్, గార్లపాటి వీరకుమార్, సిర్రాపు శాంతకుమార్, మహ్మద్ రఫీ తదితరులు పాల్గొన్నారు. మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ -
రైతులను అప్పులపాలు చేసిన ప్రభుత్వం
తణుకు అర్బన్: కూటమి ప్రభుత్వం ఏర్పడిన రోజు నుంచి వ్యవసాయ రంగం అధోగతిపాలై రైతులు అప్పులపాలైపోయారని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు మండిపడ్డారు. వైఎస్సార్, జగన్ల హయాంలో వ్యవసాయాన్ని పండుగ చేసి చూపించారని, వ్యవసాయం దండగన్న చంద్రబాబు ఆ వ్యాఖ్యలను కొనసాగిస్తూ రైతుల ఉసురు తీస్తున్నారని విమర్శించారు. తణుకు వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులు తమ పంటలకు మంచి దిగుబడి రావాలనే ఉద్దేశంతో యూరియా కోసం పాకులాడుతున్నారని, క్యూ లైన్లలో మహిళలు కూడా నిల్చోవాల్సి వస్తుంటే చంద్రబాబు వెటకారంగా యూరియా వేస్తే క్యాన్సర్ వస్తుందని, పురుగు మందుల వాడకం తగ్గించాలని అనడం బాధాకరమన్నారు. ఏడాది పొడవునా వరి పంట పండుతూ ఉండే అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్ను ఎడారిగా మార్చి రైతులను కన్నీళ్లు పెట్టిస్తున్నాడని దుయ్యబట్టారు. పెట్టుబడి సాయం లేక, ఇన్పుట్ సబ్సిడీ, పంటల బీమా వంటివి అమలు చేయకపోవడంతో రైతులు పంట పండించేందుకు అప్పులపాలవ్వాల్సి వస్తోందని చెప్పా రు. రైతులను పట్టించుకోని కూటమి ప్రభుత్వం అమరావతికి కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తూ భ్రమరావతిని తయారు చేస్తోందని ఎద్దేవా చేశారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన పిలుపుమేరకు ఈనెల 9న తాడేపల్లిగూడెం ఆర్డీఓ కార్యాలయం వద్దకు ర్యాలీగా తరలివెళ్లి వినతిపత్రాన్ని ఇవ్వనున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వంలో ఎరువుల బ్లాక్ మార్కెట్పై ‘అన్నదాత పోరు’ పోస్టర్ను కారుమూరితో పాటు పార్టీ శ్రేణులు ఆవిష్కరించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన రోజు నుంచి తణుకులో గతంలో ఎన్నడూ లేనివిధంగా ఆర్కే ట్యాక్స్ గొడవ మార్కెట్లో తీవ్ర చర్చనీయాంశమైందని మాజీ మంత్రి కారుమూరి విమర్శించారు. టీడీఆర్ బాండ్లు, మట్టి, పేకాటలు, క్రికెట్ బుకింగ్లు, మద్యం దుకాణాలు, పంచాయతీల్లో కమీషన్లతో పాటు ఆవులు, గేదెల కోతకు సంబంధించి ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ మొత్తం రూ.1,200 కోట్లు దోపిడీ చేశారని ఆధారాలు సైతం బయటకు వచ్చాయని స్పష్టం చేశారు. ఆ పార్టీ వారి వద్ద కూడా ఆధారాలు ఉన్నాయని వారే చెబుతున్నారని విమర్శించారు. నియోజకవర్గంలో ఏ పనికి వెళ్లినా ఎమ్మెల్యే ట్యాక్స్ వేస్తున్నారని ప్రజలు, టీడీపీ వర్గాలవారే చెబుతున్నారని అన్నారు. తణుకు ప్రాంతంలో గతంలో ఎన్నడూ ఇటువంటి ట్యాక్స్లు ఏ ప్రభుత్వంలో కూడా తాము ఎప్పుడూ చూడలేదని టీడీపీ వర్గీయులే చెబుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు మారిశెట్టి శేషగిరి, ఎంపీపీ రుద్రా ధనరాజు, వైఎస్సార్సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు సత్తి వెంకటరెడ్డి, పబ్లిసిటీ వింగ్ జిల్లా అధ్యక్షుడు జల్లూరి జగదీష్, నియోజకవర్గ మహిళాధ్యక్షురాలు మెహర్ అన్సారీ, తణుకు మండల అధ్యక్షుడు పెనుమర్తి వెంకటరామన్న, పట్టణ మహిళాధ్యక్షురాలు నూకల కనకదుర్గ, తణుకు మండల మహిళాధ్యక్షురాలు ఉండవల్లి జానకి, డాక్టర్ దాట్ల సుందరరామరాజు, తేతలి మాజీ సర్పంచ్ కోట నాగేశ్వరరావు పాల్గొన్నారు. యూరియా కూడా అందించలేక చతికిలపడ్డ దుస్థితి మహిళా రైతులు సైతం క్యూలో ఉన్నా చోద్యం చూస్తున్న వైనం తణుకులో ఎమ్మెల్యే ఆరిమిల్లి అవినీతి రూ.1,200 కోట్లు విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి కారుమూరి విమర్శలు -
కూటమి పాలనలో రౌడీ సంస్కృతి
● వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు డీఎన్నార్ ధ్వజం ● దానిగూడెం దళితవాడలో బాధిత కుటుంబాలకు పరామర్శ కై కలూరు: కై కలూరు నియోజకవర్గంలో ఎన్నడూచూడని కత్తులు, కర్రలతో దాడులు చేసే సంస్కృతి కూటమి పాలనలోనే కనిపిస్తోందని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు (డీఎన్నార్) విమర్శించారు. వినాయక ఊ రేగింపు సందర్భంగా జనసేన కార్యకర్తల దాడిలో తీవ్రంగా గాయపడిన దానిగూడెం దళితవాడ బాధిత కుటుంబాలను ఆదివారం ఆయన పరామర్శించి చర్చిలో మాట్లాడారు. ఈ సందర్భంగా దళితులు మాట్లాడుతూ వినాయక ఊరేగింపులో డీజే సౌండ్ల వద్ద హారన్ కొట్టినందుకు జనసేన కార్యకర్తలు విచక్షణారహితంగా పయ్యేద్దు అజయ్, గొంతుపులి దినేష్బాబుపై బ్లేడు, కత్తులు, రాడ్లతో దా డి చేశారన్నారు. దీనిపై దళితులు ఆందోళన చేస్తే పోలీసులు తమపైనే లాఠీ చార్జీ చేశారని, తగిలిన దెబ్బలను డీఎన్నార్కు చూపించారు. గొడవలకు ప్రధాన సూత్రధారి, జనసేన నేత కొల్లి బాబీని కే సు నుంచి తప్పించడానికి ప్రయత్నిస్తున్నారని ఆ రోపించారు. తీవ్ర గాయాలైన అజయ్, దినేష్బా బు తండ్రులు శ్రీను, నానీలు కన్నీళ్లు పెట్టుకుని త మకు న్యాయం చేయాలని కోరారు. డీఎన్నార్ మాట్లాడుతూ కూటమి పాలనలో రౌడీలమంటూ అరాచక శక్తులు చెలరేగిపోతున్నాయన్నారు. పోలీసులు వారం ముందు అన్నసమారాధనలో జరిగిన ఘర్షణపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటే ఇటువంటి హత్యయత్నాలు జరిగేవి కావన్నారు. కేసు విషయమై ఏలూరు ఎస్పీతో మాట్లాడానన్నా రు. నిందితులకు శిక్ష పడేవరకూ పార్టీ పరంగా దళితులకు అండగా ఉంటామన్నారు. రోడ్డుపై చేసిన ఆందోళనపై దానిగూడెం దళితులపై కేసు నమోదు చేసినట్టు తెలిసిందని, తక్షణమే ఈ కేసును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దోషులను కఠినంగా శిక్షంచకపోతే పార్టీపరంగా ఆందోళన చేస్తామని హె చ్చరించారు. స్థానిక ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ ప క్కన కూర్చుని రౌడీయిజం చేస్తున్న సంఘ విద్రోహులను పక్కన పెట్టి ప్రశాంత వాతావరణం కల్పించాలని డీఎన్నార్ కోరారు. -
బ్రిటన్ మినిస్టర్ కావడమే లక్ష్యం
సాక్షి, భీమవరం: బ్రిటన్ మినిస్టర్ కావడమే తన లక్ష్యమని లండన్లోని రాయల్ బరో ఆఫ్ కెన్జింగ్టన్ అండ్ చెల్సియా డిప్యూటీ మేయర్ ఆర్యన్ ఉదయ్ ఆరేటి చెప్పారు. యూకే కాలేజీలో తెలుగు విద్యార్థుల పట్ల వివక్షకు వ్యతిరేకంగా పోరాడి స్టూడెంట్ ఎన్నికల్లో గెలవడమే తన రాజకీయ ప్రవేశానికి కారణమని తెలిపారు. అనంతరం కన్జర్వేటివ్ పార్టీలో చేరి రెండుసార్లు కౌన్సిలర్గా గెలిచినట్లు చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం సమీపంలోని తుందుర్రు గ్రామానికి చెందిన ఆర్యన్ ఉదయ్ శుక్రవారం.. భీమవరం వచ్చారు. తాను చదువుకున్న సెయింట్ మెరీస్ స్కూల్లో విద్యార్థులతో మమేకమయ్యారు. ఈ సందర్భంగా ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. తన బాల్యం, చదువు, బ్రిటన్ రాజకీయాల్లో ఎదుగుదల, తన లక్ష్యాల గురించి వివరించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. టెన్నిస్ కోసం లండన్కు మాది భీమవరం పక్కనే ఉన్న తుందుర్రు గ్రామం. ఆరేటి వీరాస్వామి, గొబ్బిలమ్మ తాత నాయనమ్మ. తండ్రి వెంకటసత్యనారాయణ కేజీఆర్ ప్రిన్సిపల్గా పనిచేశారు. తల్లి విజయలక్ష్మి, సోదరి ఇంద్రాణి. 7వ తరగతి వరకు భీమవరంలోని సెయింట్ మేరీస్ స్కూల్లో చదువుకున్నా. అప్పటికే ఏపీ తరఫున టెన్నిస్ ఆడుతున్న నేను ఆటపై ఆసక్తితో 8వ తరగతి హైదరాబాద్లో చేరాను. స్కూల్ నేషనల్స్, ఇంటర్ స్టేట్ కాంపిటీషన్స్కు ఏపీ కెపె్టన్గా వ్యవహరించాను. నా స్నేహితులు చాలామంది యూఎస్, యూకే వెళ్లేవారు. గ్రాడ్యుయేషన్ తరువాత టెన్నిస్ కోసం యూకే వెళ్లాను. 2006లో ఏయూ స్కాలర్షిప్ రావడంతో లండన్లో ఎంఎస్ చేశాను. రాజకీయాల్లోకి.. యూకే కాలేజీలో తెలుగు విద్యార్థుల పట్ల వివక్ష పూరిత సంఘటనలకు వ్యతిరేకంగా పోరాడేవాడిని. అప్పుడే స్టూడెంట్స్ ఎన్నికల్లో గెలవడం నాలో ఆత్మస్థైర్యం, నమ్మకం పెంచాయి. చదువు అనంతరం అక్కడే ఉండి బిజినెస్ చేసుకుంటూ కన్జర్వేటివ్ పార్టీ ఫాలోవర్గా ఉన్నాను. అక్కడి సిటిజన్షిప్ కూడా వచ్చింది. బ్రిగ్జిట్ టైంలో డేవిడ్ కేమరూన్ టీంలో చేరాను. నా అనాలసిస్, స్ట్రాటజీని చూసి కన్జర్వేటివ్ పార్టీ తరఫున పనిచేయాలని ప్రోత్సహించేవారు. 2014లో పార్టీలో సభ్యుడిగా చేరాను. రెండు, మూడు సంవత్సరాలు పార్టీ విధివిధానాలు, రాజకీయ పరిస్థితులను సైలెంట్గా అబ్జర్వ్ చేస్తూ వచ్చాను. ఇక్కడి మాదిరి అక్కడ కూడా రాజకీయ పారీ్టల్లో అంతర్గత విభేదాలు, వివక్ష కామనే. ఈ పరిస్థితులను బట్టి బ్రిటిష్ వాళ్లు మనల్ని రూల్ చేయలేదు. మన అంతర్గత కొట్లాటలతో మనమే పాలించబడ్డామని నా అభిప్రాయం. ఎవరినీ తక్కువ అంచనా వేయకూడదు యువత కులమతాలు, ప్రాంతీయ విభేదాలు విడిచిపెట్టి కలిసుండాలి. అనవసరమైన ఆర్భాటాలు, పబ్లిసిటీలకు దూరంగా ఉండాలి. ఎవరినీ తక్కువ అంచనా వేయకుండా లక్ష్యాన్ని చేరేందుకు ముందుకు సాగాలి. 2018, 2022ల్లో సెంట్రల్ కౌన్సిలర్గా ఎన్నిక నిజాం కాలేజీలో ఇంటర్ చదువుతున్న రోజుల్లో ఆర్ఎస్ఎస్కు ఆకర్షితుడినయ్యాను. లండన్లోను దేవాలయాలకు వెళ్లి దీపారాధన చేసేవాడిని. భారతీయులు, మన సంప్రదాయాలను ఎంతో గౌరవించే పార్టీ చైర్మన్, మాజీ మేయర్ జూలీమీల్స్ నన్ను ఎంతో ప్రోత్సహించేవారు. అందరితో కలుపుగోలుతనం నాకు కలిసొచ్చింది. ఇంటర్నల్ ఓటింగ్లో తెల్లవాళ్లకంటే అత్యధిక మెజార్టీ సాధించడంతో 2017లో నాకు సీట్ డిక్లేర్ అయ్యింది. 2018లో జరిగిన ఎన్నికల్లో మొదటిసారి సెంట్రల్ కౌన్సిలర్గా గెలిచాను. కౌన్సిలర్ అంటే ఇక్కడ ఎమ్మెల్యేతో సమానం.2022 ఎన్నికల్లోను వరుస విజయాన్ని అందుకున్నాను. లండన్లోని ముఖ్యమైన ప్రాంతానికి డిప్యూటీ మేయర్గా సుమారు రెండున్నర లక్షలమందికి ప్రాతినిధ్యం వహిస్తున్నాను. ప్లానింగ్, లైసెన్సింగ్, ఎని్వరాన్మెంట్ తదితర కీలక కమిటీల్లో సభ్యుడిగా ఉన్నాను. మేయర్ అందుబాటులో లేని సమయంలో ఆ బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంటుంది. భారత్, బ్రిటన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లో ఆక్వా, ఎన్విరాన్మెంట్కు సంబంధించి కొన్ని పాలసీలు చేయాలని అనుకున్నాం. కానీ సెంట్రల్ స్థాయిలో మా పార్టీ ఓడిపోవడంతో అది సాధ్యం కాలేదు. భవిష్యత్తులో ఆ దిశగా కృషిచేస్తాను. దేవుడి దయతో ఈ స్థాయికి వచ్చాను. వచ్చే ఎన్నికల్లో మేయర్ కావాలన్నదే నా లక్ష్యం. ఎంపీ కావడం, అనంతరం మినిస్టర్ అవడం తదుపరి లక్ష్యాలు. -
జీడిమామిడి కనుమరుగు
● సరైన ప్రోత్సాహం లేక తోటలు నరికివేత ● ఏజెన్సీ మండలాల్లో 6 వేల ఎకరాలకు పడిపోయిన విస్తీర్ణం బుట్టాయగూడెం: ఏజెన్సీ ప్రాంతంలోని గ్రామాల్లో పోడు వ్యవసాయం తర్వాత అత్యధికంగా గిరిజనులు జీడిమామిడి సాగు చేస్తున్నారు. ఐటీడీఏ ద్వారా ఈ ప్రాంతంలో సుమారు 20 వేల ఎకరాల వరకూ రైతులు జీడిమామిడి పంట వేశారు. ప్రస్తుతం జీడిమామిడి పంటల స్థానంలో రైతులు ప్రత్యామ్నాయ పంట వైపు దృష్టి సారించారు. దీంతో జీడిమామిడి తోటలను తొలగిస్తున్నారు. తోటల స్థానంలో పామాయిల్, మొక్కజొన్న, పొగాకు, అరటి వంటి వాణిజ్యపంటలను పండిస్తున్నారు. ప్రస్తుతం 5 వేల ఎకరాల వరకూ రైతులు జీడిమామిడి తోటలను తొలగించినట్లు సమాచారం. భవిష్యత్లో ఇంకా తగ్గే అవకాశం ఉంది. ప్రోత్సాహం కరువు ఐటీడీఏ పరిధిలో ఉన్న గిరిజన మండలాల్లో గిరిజన రైతులు జీడిమామిడి పంటల సాగుతో అధిక లాభాలను సాధిస్తున్నారు. అయితే గిట్టుబాటు ధరతోపాటు సరైన ప్రోత్సహం ఐటీడీఏ ద్వారా అందించకపోవడం వల్ల వాణిజ్యపంటలపై రైతులు దృష్టి సారిస్తున్నారు. ముఖ్యంగా కొండరెడ్డి గ్రామాల్లో పోడు వ్యవసాయం తర్వాత జీడిమామిడి పంటలే ప్రధానం. దీనిని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందంటున్నారు.జీడిమామిడి రైతులను ఐటీడిఏ అధికారులు ప్రోత్సహించాలి. జీసీసీ ద్వారా జీడిగింజలను కొనుగోలు చేసి గిరిజన రైతులు ఆదాయం పొందేలా చూడాలి. రానురానూ జీడిమామిడి పంటల విస్తీర్ణం తగ్గిపోతోంది. కారం రాఘవ, న్యూడెమోక్రసీ నేత, అలివేరు, బుట్టాయగూడెం మండలం గిరిజన ప్రాంతంలో ఎంతో మంది రైతులకు లాభాలు అందించిన జీడిమామిడి తోటలు నేడు నరికేస్తున్నారు. బుట్టాయగూడెం, జీలుగుమిల్లి మండలాల్లో అత్యధికంగా జీడిమామిడి పంటలను రైతులు తొలగిస్తున్నారు. చెట్లను నరికి కట్టెలుగా మార్చి బేరన్ పుల్లగా తరలిస్తున్నారు. కలపను తరలించి ఆ భూముల్లో ప్రత్యామ్నాయ పంటల కోసం భూములను సిద్ధం చేస్తున్నారు. -
పరిహారం లేదు.. పథకమూ అందదు
● కూటమి ప్రభుత్వ నిర్వాకం ● ఘొల్లుమంటున్న విలీన మండలాల రైతులు కుక్కునూరు: రాష్ట్రంకోసం.. పోలవరం ప్రాజెక్టు కోసం సర్వం త్యాగం చేసిన విలీన మండలాల రైతులపై కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. పోలవరం ముంపు పేరుతో అటు అభివృద్ధి పనులు చేయకుండా, ఇటు పరిహారం ఇవ్వకపోవడమే కాకుండా ప్రభుత్వ పథకాలు కూడా వారికి అందకపోవడంతో నిర్వాసితులు తామేం పాపం చేశామని వాపోతున్నారు. రైతుకు పెట్టుబడి సాయం కింద ఇస్తామన్న అన్నదాత సుఖీభవ రూ.7 వేలు ఆర్థిక సాయం గత ప్రభుత్వం పట్టాదారు లేకపోతే వారి వారసులకు అందించగా కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక నామినీలను అనర్హులుగా పేర్కొంది. ఆ తరువాత రైతుల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో మరలా వారంరోజులు సమయం ఇచ్చి ఆన్లైన్ చేయించుకునే అవకాశం కల్పించింది. దీంతో చాలా మంది రైతులు అన్నదాత సుఖీభవ పథకానికి దూరమయ్యారు. ఎల్టీ అగ్రికల్చర్ కలెక్షన్లు లేవు ప్రభుత్వం వ్యవసాయం కోసం అందించే ఎల్టీ అగ్రికల్చర్ కనెక్షన్ను తాజాగా రైతులకు దూరం చేసింది. గత జనవరి వరకు ప్రభుత్వం కొత్త అగ్రికల్చర్ కనెక్షన్లు మంజూరు చేయగా ప్రస్తుతం ఎల్టీ అగ్రికల్చర్ కనెక్షన్ కొరకు స్థానిక సబ్స్టేషన్కు రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు వెళ్లిన రైతులకు వెబ్ల్యాండ్ ఫ్రీజ్లో ఉండడంతో ఆధార్ కార్డ్ నెంబర్లు టైప్ చేస్తే ఆన్లైన్లో ఎటువంటి డేటా చూపించడంలేదని విద్యుత్ సిబ్బంది చెబుతున్నారు. దీంతో రైతులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. మండలంలో ముంపునకు గురవుతున్న భూములకు సంబంధించి పోలవరం భూసేకరణ పూర్తికాగా ఇంకా ముంపునకు గురికాని భూములు దాదాపు 50 శాతంకు పైగా ఉన్నాయి. ఇప్పుడు ఆ భూ యజమానులు మా భూములకు పరిహారం అయినా అందించండి లేకపోతే సాగు చేసుకునేందుకు విద్యుత్ కనెక్షన్ అయినా అందించాలని కోరుతున్నారు. అంతేకాక రాష్ట్రమంతా ఓ న్యాయం మాకో న్యాయమా అని బహిరంగంగానే కూటమి ప్రభుత్వ తీరును విమర్శిస్తున్నారు. బిందు సేద్యం దూరం ప్రభుత్వం ఉద్యాన రైతులకు అందించే బిందు సేద్యాన్ని కూడా విలీన రైతులు దరఖాస్తు చేసుకునే అవకాశం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బిందు సేద్యం చేస్తున్న గిరిజనేతర రైతులకు కేంద్ర ప్రభుత్వం 90 శాతం సబ్సిడీ ఇస్తుండగా, గిరిజన రైతులకు వందశాతం సబ్సిడీ ఇస్తుంది. ప్రస్తుతం బిందు సేద్యం కోసం దరఖాస్తు చేసుకునేందుకు వెబ్ల్యాండ్ ఫ్రీజింగ్ కారణంగా జియోట్యాగింగ్ చేసుకునేందుకు పలు గ్రామాల పేర్లు చూపించకపోవడంతో రైతులకు బిందు సేద్యానికి దరఖాస్తు చేసుకునే అవకాశం లేదని అధికారులు చెబుతున్నారు. నాకు కివ్వాక గ్రామంలో 2.5 ఎకరాల సాగు భూమి ఉంది. సదరు భూమి ముంపులో లేదు. ఆ భూమిలో సాగు చేసుకునేందుకు అగ్రికల్చర్ కనెక్షన్ కొరకు దరఖాస్తు చేసుకుందామంటే విద్యుత్ సిబ్బంది ఆన్లైన్ చేసేందుకు మీ గ్రామం సైట్లో చూపించడంలేదంటున్నారు. మా భూములకు పరిహారం అయినా ఇవ్వండి లేదంటే విద్యుత్ కనెక్షన్కు అవకాశం కల్పించండి. – పగిళ్ల ప్రసాద్, కివ్వాక, కుక్కునూరు మండలంవ్యవసాయ విద్యుత్ మోటార్ కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకునే రైతుల ఆధార్ వివరాలు కుక్కునూరు మండల వెబ్ ల్యాండ్ ఫ్రీజింగ్లో ఉండడంతో రిజిస్ట్రేషన్ చేసే సమయంలో ఆన్లైన్లో రైతుల వివరాలు చూపించడం లేదు. దీంతో రైతులకు కొత్త కనెక్షన్ పొందే అవకాశం లేకుండా పోయింది. ఈ సమస్యకు పరిష్కారం చూపాలి. – ఎంఎం పాపారావు, అసిస్టెంట్ ఇంజనీర్, కుక్కునూరుమా భూములకు సంబంధించి వెబ్ ల్యాండ్ ఫ్రీజింగ్లో ఉండడంతో మిర్చి తదితర పంటలకు డ్రిప్ వేసుకునేందుకు దరఖాస్తు చేసుకునే అవకాశం లేకుండా పోయింది. ముంపులో లేని భూములకు పథకాలు వర్తింపజేసేలా అధికారులు చర్యలు చేపట్టాలి. – మచ్చా రాజులు, ఇసుకపాడు, కుక్కునూరు మండలం -
నాటుసారా కేంద్రాలపై దాడి
కుక్కునూరు: నాటుసారా తయారీ కేంద్రాలపై ఆదివారం కుక్కునూరు పోలీసులు దాడి చేసి 600 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. కుక్కునూరు ఎస్సై రాజారెడ్డి వివరాల ప్రకారం, మండలంలోని సీతారామనగరం గ్రామ శివారులోని కిన్నెరసాని వాగు ఒడ్డున నాటుసారా తయారు చేస్తున్నారన్న సమాచారం మేరకు ఆదివారం దాడులు నిర్వహించినట్టు చెప్పారు. దాడులలో సారా తయారు చేసేందుకు సిద్ధంగా ఉంచిన 600 లీటర్ల బెల్లం ఊటను స్వాధీనం చేసుకోని ధ్వంసం చేసినట్టు తెలిపారు. 10 లీటర్ల నాటుసారాను ఓ వ్యక్తి నుంచి స్వాధీనం చేసుకుని అతనిపై కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. సారా నియంత్రణకు పోలీసులు తీసుకుంటున్న చర్యలకు ప్రజలు సహకరించాలని భవిష్యత్తులో ఇలాంటి దాడులు కొనసాగుతాయని తెలిపారు. -
బ్రిటన్ మంత్రి కావడమే లక్ష్యం
సాక్షి, భీమవరం: బ్రిటన్ మంత్రి కావడమే తన లక్ష్యమని లండన్లోని రాయల్ బరో ఆఫ్ కెన్సింగ్టన్ అండ్ చెల్సియా డిప్యూటీ మేయర్ ఆర్యన్ ఉదయ్ ఆరేటి చెప్పారు. యూకే కాలేజీలో తెలుగు విద్యార్థుల పట్ల వివక్షకు వ్యతిరేకంగా పోరాడి స్టూడెంట్ ఎన్నికల్లో గెలవడమే తన రాజకీయ ప్రవేశానికి కారణమని తెలిపారు. అనంతరం కన్జర్వేటివ్ పార్టీలో చేరి రెండుసార్లు కౌన్సిలర్గా గెలిచినట్లు చెప్పారు. భీమవరం సమీపంలోని తుందుర్రు గ్రామానికి చెందిన ఆర్యన్ ఉదయ్ ఇటీవల భీమవరం వచ్చారు. ఈ సందర్భంగా ఆయన శ్రీసాక్షిశ్రీతో మాట్లాడారు. తన బాల్యం, చదువు, బ్రిటన్ రాజకీయాల్లో ఎదుగుదల, తన లక్ష్యాల గురించి వివరించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. టెన్నిస్ కోసం లండన్కు మాది భీమవరం పక్కనే ఉన్న తుందుర్రు. తాత నాయనమ్మల పేర్లు ఆరేటి వీరాస్వామి, గొబ్బిలమ్మ. తండ్రి వెంకటసత్యనారాయణ కేజీఆర్ ప్రిన్సిపల్గా పనిచేశారు. తల్లి విజయలక్ష్మి, సోదరి ఇంద్రాణి. 7వ తరగతి వరకు భీమవరంలోని సెయింట్ మేరీస్ స్కూల్లో చదువుకున్నా. అప్పటికే ఏపీ తరఫున టెన్నిస్ ఆడుతున్న నేను ఆటపై ఆసక్తితో 8వ తరగతి హైదరాబాద్లో చేరాను. స్కూల్ నేషనల్స్, ఇంటర్ స్టేట్ కాంపిటీషన్స్కు ఏపీ కెప్టెన్గా వ్యవహరించాను. నా స్నేహితులు చాలామంది యూఎస్, యూకే వెళ్లేవారు. గ్రాడ్యుయేషన్ తరువాత టెన్నిస్ కోసం యూకే వెళ్లాను. 2006లో ఏయూ స్కాలర్షిప్ రావడంతో లండన్లో ఎంఎస్ చేశాను. రాజకీయాల్లోకి.. యూకే కాలేజీలో తెలుగు విద్యార్థుల పట్ల వివక్ష పూరిత సంఘటనలకు వ్యతిరేకంగా పోరాడేవాడిని. అప్పుడే స్టూడెంట్స్ ఎన్నికల్లో గెలవడం నాలో ఆత్మస్థైర్యం, నమ్మకం పెంచాయి. చదువు అనంతరం అక్కడే ఉండి బిజినెస్ చేసుకుంటూ కన్జర్వేటివ్ పార్టీ ఫాలోవర్గా ఉన్నాను. అక్కడి సిటిజన్షిప్ కూడా వచ్చింది. బ్రెగ్జిట్ టైంలో ప్రధాని డేవిడ్ కేమరూన్ టీంలో చేరాను. నా అనాలసిస్, స్ట్రాటజీని చూసి కన్జర్వేటివ్ పార్టీ తరఫున పనిచేయాలని ప్రోత్సహించేవారు. 2014లో పార్టీలో సభ్యుడిగా చేరాను. రెండు, మూడు సంవత్సరాలు పార్టీ విధివిధానాలు, రాజకీయ పరిస్థితులను సైలెంట్గా అబ్జర్వ్ చేస్తూ వచ్చాను. ఇక్కడి మాదిరి అక్కడ కూడా రాజకీయ పార్టీల్లో అంతర్గత విభేదాలు, వివక్ష కామన్. సెంట్రల్ కౌన్సిలర్గా ఎన్నిక నిజాం కాలేజీలో ఇంటర్ చదువుతున్న రోజుల్లో ఆర్ఎస్ఎస్కు ఆకర్షితుడినయ్యాను. లండన్లోను దేవాలయాలకు వెళ్లి దీపారాధన చేసేవాడిని. భారతీయులను, మన సంప్రదాయాలను ఎంతో గౌరవించే పార్టీ చైర్మన్, మాజీ మేయర్ జూలీమీల్స్ నన్ను ఎంతో ప్రోత్సహించేవారు. అందరితో కలుపుగోలుతనం నాకు కలిసొచ్చింది. ఇంటర్నల్ ఓటింగ్లో తెల్లవాళ్లకంటే అత్యధిక మెజార్టీ సాధించడంతో 2017లో నాకు సీట్ డిక్లేర్ అయ్యింది. 2018లో జరిగిన ఎన్నికల్లో మొదటిసారి సెంట్రల్ కౌన్సిలర్గా గెలిచాను. కౌన్సిలర్ అంటే ఇక్కడ ఎమ్మెల్యేతో సమానం. 2022 ఎన్నికల్లోను వరుస విజయాన్ని అందుకున్నాను. లండన్లోని ముఖ్యమైన ప్రాంతానికి డిప్యూటీ మేయర్గా సుమారు రెండున్నర లక్షలమందికి ప్రాతినిధ్యం వహిస్తున్నాను. ప్లానింగ్, లైసెన్సింగ్, ఎన్విరాన్మెంట్ తదితర కీలక కమిటీల్లో సభ్యుడిగా ఉన్నాను. మేయర్ అందుబాటులో లేని సమయంలో ఆ బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంటుంది. భారత్, బ్రిటన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లో ఆక్వా, ఎన్విరాన్మెంట్కు సంబంధించి కొన్ని పాలసీలు చేయాలని అనుకున్నాం. కానీ సెంట్రల్ స్థాయిలో మా పార్టీ ఓడిపోవడంతో అది సాధ్యం కాలేదు. భవిష్యత్తులో ఆ దిశగా కృషిచేస్తాను. దేవుడి దయతో ఈ స్థాయికి వచ్చాను. వచ్చే ఎన్నికల్లో మేయర్ కావాలన్నదే నా లక్ష్యం. ఎంపీ కావడం, అనంతరం మినిస్టర్ అవడం తదుపరి లక్ష్యాలు. ఎవరినీ తక్కువ అంచనా వేయకూడదు యువత కులమతాలు, ప్రాంతీయ విభేదాలు విడిచిపెట్టి అందరితో కలిసుండాలి. అనవసరమైన ఆర్భాటాలు, పబ్లిసిటీలకు దూరంగా ఉండాలి. ఎవరినీ తక్కువ అంచనా వేయకుండా లక్ష్యాన్ని చేరేందుకు ముందుకు సాగాలి యూకే స్టూడెంట్స్ ఎన్నికల్లో గెలుపే రాజకీయాల వైపు నడిపించింది రెండుసార్లు కౌన్సిలర్గా గెలుపొందా అందరితో కలుపుగోలుతనమే నా విజయ రహస్యం ‘సాక్షి’తో లండన్లోని కెన్సింగ్టన్ అండ్ చెల్సియా డిప్యూటీ మేయర్ ఆర్యన్ ఉదయ్ స్వస్థలం భీమవరంలో సహ విద్యార్థులతో మమేకం -
పెద్దింట్లమ్మ దేవస్థానంలో భక్తుల రద్దీ
కై కలూరు: కొల్లేటికోట పెద్దింట్లమ్మ దేవస్థానం భక్తులతో ఆదివారం కిటకిటలాడింది. సమీప జిల్లాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు విచ్చేశారు. దేవస్థాన సమీప పవిత్ర కోనేరులో స్నానాలు ఆచరించి అమ్మవారికి వేడి నైవేద్యాలను సమర్పించారు. ఆలయ ఉప ప్రధాన అర్చకుడు పేటేటి పరమేశ్వరశర్మ పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఆలయ ఈవో కూచిపూడి శ్రీనివాసు మాట్లాడుతూ రూ.19,185 ఆదాయం వచ్చిందని తెలిపారు. దెందులూరు: రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. పోలీసుల వివరాల ప్రకారం.. సీతంపేట సమీపంలోని రైల్వేస్టేషన్ వద్ద వ్యక్తి మృతదేహాన్ని గుర్తించారు. అతని ముఖం గుర్తించడానికి వీలు లేకుండా ఉంది. మృతుడు ఎరుపు రంగు చొక్కా ధరించాడు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉందని.. ఇతర వివరాలకు ఏలూరు రైల్వే పోలీసులను సంప్రదించాలన్నారు. -
పీ–సెట్ నోటిఫికేషన్ విడుదల
దెందులూరు: ఆంధ్రప్రదేశ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (పీ సెట్) నోటిఫికేషన్ నాగార్జున యూనివర్సిటీ విడుదల చేసిందని గోపన్నపాలెం ప్రభుత్వ వ్యాయామ విద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్.నతానియేలు అన్నారు. ఆదివారం వ్యాయామ కళాశాలలో ఆయన మాట్లాడుతూ బీపీఈడీ, డీపీఈడీ కోర్సులలో అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ నెల 13 వరకు దరఖాస్తు చేసుకోవటానికి గడువు ఉందన్నారు. ముసునూరు: మద్యం మత్తులో కింద పడడంతో తలకు తీవ్రగాయమై వ్యక్తి మృతి చెందిన సంఘటన మండలంలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. మండలంలోని రమణక్కపేటకు చెందిన తోట మురళీకృష్ణ(31) శనివారం సాయంత్రం మద్యం సేవించి ఇంటికి వచ్చాడు. అర్థరాత్రి మూత్ర విసర్జనకు బయటకు వస్తూ, తూలి గచ్చుపై పడ్డాడు. గచ్చు కోణం తలకు తగలడంతో తీవ్రంగా గాయపడి, అధిక రక్తస్రావమైంది. క్షతగాత్రుడిని బంధువులు నూజివీడు ఏరియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. ద్వారకాతిరుమల: మండల కేంద్రమైన ద్వారకాతిరుమలలో ఆదివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఉన్నట్టుండి ఒక్కసారిగా మొదలైన వర్షం అరగంట పాటు ఏకధాటిగా పడింది. దాంతో డ్రైనేజీలు పొంగి పొర్లడంతో మురుగు, చెత్తాచెదారం రోడ్లపైకి చేరింది. వర్షపు నీరు రోడ్లపై ప్రవహించడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొండపై నుంచి లింగయ్య చెరువులోకి భారీగా నీరు ప్రవహించింది. పెనుగొండ: పౌర్ణమి సందర్భంగా ఆదివారం గోదావరి మాతకు హిందూ ధర్మ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో హరతులనిచ్చారు. కలగభద్రుడు అర్చకత్వంలో ఏకముఖ, ద్విముఖ, చతుర్థ, పంచమ, కుంభ, నక్షత్ర, పూర్ణ, కుంభ, సర్ప హారతులనిచ్చారు. కార్యక్రమంలో హిందూ ధర్మ సమితి సభ్యులు పాల్గొన్నారు. -
భీమవరంలో రఘురామ పెత్తనమేంటి?
భీమవరం: భీమవరం మున్సిపాలిటీ మంచినీటిని విస్సాకోడేరు పంచాయతీలోని నాన్ లేఅవుట్కు తరలించడంపై ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు స్పందించకుండా ఉండి ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ కనుమూరు రఘురామకృష్ణరాజు మాట్లాడటం విడ్డూరంగా ఉందని వైఎస్సార్సీపీ నాయకులు దుయ్యబట్టారు. శనివారం రాయలంలో వైఎస్సార్సీపీ భీమవరం నియోజకవర్గ సమన్వయకర్త చినమిల్లి వెంకటరాయుడు నివాసంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పార్టీ జిల్లా అధికార ప్రతినిధి కామన నాగేశ్వరరావు మాట్లాడుతూ భీమవరంలోని శివారు ప్రాంతాలకు తాగునీరు అందక ప్రజలు ఇబ్బంది పడుతుంటే ఎమ్మెల్యే అంజిబాబు, మున్సిపల్ అఽధికారులు పట్టించుకోవడం లేదన్నారు. అయినా ఉండి నియోజవకర్గంలోని విస్సాకోడేరు పరిధిలోని నాన్ లే అవుట్కు ప్రత్యేకంగా పైప్లైన్ వేసి నీటిని సరఫరా చేయడాన్ని తాము ప్రశ్నిస్తే డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు తనపై వ్యక్తిగత దూషణలతో మాట్లాడటం బాధాకరమన్నారు. రఘురామకు రాజకీయాలు తెలియని రోజుల నుంచి తాను ప్రజాసమస్యలపై పోరాటం చేస్తున్నానని, విద్యార్థి సంఘ నాయకుడిగా, మున్సిపల్ వైస్ చైర్మన్గా సమస్యలపై పోరాడానన్నారు. వ్యక్తిగత దూషణ సరికాదు ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్ మాట్లాడుతూ వైఎస్సార్సీపీతో ఎదిగిన డిప్యూటీ స్పీకర్ ఆ పార్టీని కించపర్చేలా, బీసీ నాయకుడు నాగేశ్వరరావును వ్యక్తిగతంగా దూషించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చే శారు. వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు గూడూరి ఉమాబాల మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్రెడ్డికి ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి రూల్స్ ఒప్పుకోవని చెబుతున్న డిప్యూటీ స్పీకర్ మున్సిపాలిటీ తాగునీటిని గ్రామ పంచాయతీకి ఇవ్వడానికి రూల్స్ ఎలా ఒప్పుకుంటాయో చెప్పాలన్నారు. వెంకటరాయుడు మాట్లాడుతూ గతంలో రాయలం గ్రామానికి మున్సిపల్ నీరు ఇవ్వాలని కోరితే అభ్యంతరం చెప్పిన అధికారులు ఇప్పుడు విస్సాకోడేరు పంచాయతీకి పైప్లైన్ ఎలా వేశారని ప్రశ్నించారు. భీమవరం నియోజకవర్గంపై ఉండి ఎమ్మెల్యే పెత్తనం ఏంటని నిలదీశారు. పార్టీ నాయకులు ఏఎస్ రాజు, చవాకుల సత్యనారాయణ, గాదిరాజు రామరాజు, చిగురుపాటి సందీప్, పాలవెల్లి మంగ, మానుకొండ ప్రదీప్ పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ నాయకుల ధ్వజం -
శ్శశానంలో ట్రాన్స్ఫార్మర్తో ప్రాణాపాయం
ఉండి: పాములపర్రు దళితుల శ్శశాన వాటికలో అక్రమంగా ఏర్పాటుచేసిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ను తొలగించాలంటూ పాములపర్రు గ్రామానికి చెందిన దళిత మహిళలు ఉండి విద్యుత్ సబ్స్టేషన్ లోని ఏఈ కార్యాలయాన్ని ముట్టడించారు. గత నెల 22న విద్యుత్ సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదు చేయగా ట్రాన్స్ఫార్మర్ విద్యుత్ కనెక్షన్ తొలగించిన అధికారులు తిరిగి ఈనెల 4న విద్యుత్ కనెక్షన్ను పునరుద్ధరించడంపై శనివారం మండిపడ్డారు. సదరు రైతుకు నోటీసు పంపిస్తామని, ఇందుకు వారం రోజులు సమయం కావాలని ఏపీ పి.శ్రీనివాసరావు తెలపగా మహిళలు ససేమిరా అన్నారు. మహిళలు కార్యాలయం ఎదుటే బైఠాయించి, అక్కడే భోజనాలు చేసి నిరసన తెలిపారు. విషయం తెలిసిన ఎస్సై ఎండీ నసీరుల్లా ఆధ్వర్యంలో పోలీసులు ఇక్కడకు చేరకుని మహిళలను చెదరగొట్టేందుకు ప్రయత్నించారు. అయినా మహిళలు పట్టువీడలేదు. పోలీసులు, విద్యుత్ అధికారులు, మహిళలకు మధ్య జరిగిన చర్చలు ఫలించకపోవడంతో నిరసన కార్యక్రమం శనివారం రాత్రి వరకు కొనసాగింది. గతంలో తాము ఫిర్యాదు చేయగా విద్యుత్ సరఫరా కట్ చేశారని, మరలా కూటమి నాయకుల ఒత్తిళ్లతో కనెక్షన్ను పనరుద్ధరించారని దళితులు ఆవేదన వ్యక్తం చేశారు. దళితుల శ్శశాన వాటికలో ట్రాన్స్ఫార్మర్ ప్రమాదకరంగా ఉందన్నారు. దీనిపై ఏఈ పి.శ్రీనివాసరావును వివరణ కోరగా ట్రాన్స్ఫార్మర్ విషయమై సదరు రైతుకు నోటీసులు ఇస్తామని, పరిశీలన చేసి చర్యలు తీసుకుంటామన్నారు. దళిత మహిళలు దర్శి మెర్సీ, ఆండ్రు సునీత, బడుగు మరియమ్మ తదితరులు పాల్గొన్నారు. -
ట్రంప్ పెత్తనాన్ని తిప్పికొట్టాలి
భీమవరం: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారతదేశంపై చేస్తున్న పెత్తనాన్ని తిప్పికొట్టాలని, భారత్పై సుంకాల పేరుతో సాగిస్తున్న కక్ష సాధింపులను విరమించుకోవాలని సీపీఐ, సీపీఎం జిల్లా కార్యదర్శులు కోనాల భీమారావు, జేఎన్వీ గోపాలన్ డిమాండ్ చేశారు. భారత దిగుమతులపై ట్రంప్ భారీగా సుంకాలు విధించడాన్ని నిరసిస్తూ స్థానిక ప్రకాశం చౌక్ వద్ద వామపక్షాల ఆధ్వర్యంలో శనివారం ధర్నా చేశారు. సుంకాలను రద్దు చేసేలా కేంద్ర ప్రభుత్వం అమెరికాపై ఒత్తిడి తేవాలన్నారు. అమెరికా సుంకాలతో ఆక్వా, ఫార్మా, ఆటోమొబైల్ ఇలా పలు రంగాలు కుదేలయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించడానికి కూటమి ప్రభుత్వం కూడా ఏ మాత్రం నిరసన వ్యక్తం చేయకపోవడం దుర్మార్గమన్నారు. ఫార్వర్డ్ బ్లాక్ జిల్లా కార్యదర్శి లంక కృష్ణమూర్తి, ఎంసీపీయూ నాయకుడు జి.రాంబాబు, సీపీఐ, సీపీఎం నాయకులు పాల్గొన్నారు. వామపక్షాల ఆధ్వర్యంలో నిరసన -
మమ అనిపించారు
ఉండి: ఉండి బస్టాండ్లో రోడ్ల దుస్థితిపై ‘సాక్షి’లో ప్రచురించిన కథనానికి అధికారులు స్పందించా రు. శనివారం బస్టాండ్ ప్రాంగణంలో రోడ్లపై గోతులను కంకరతో పూడ్చించి నామమాత్రంగా పనులు చేయించారు. అయితే మెత్తటి కంకరతో రోడ్లు పూడ్చించడంతో ప్రయాణికులకు ఇబ్బందులు తప్పవని పలువురు అంటున్నారు. వర్షం వస్తే బస్టాండ్లోనికి వెళ్లేందుకు గతంలో కొద్దోగొప్పో అవకాశం ఉండేదని, ఇప్పుడు చా లా ఇబ్బంది పడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉండి: చెరుకువాడలో దళితులపై దాడి చేసి కులం పేరుతో దూషించిన వారిపై అట్రాసిటీ కేసులు నమోదు చేసి, దళితులకు రక్షణ కల్పించాలని దళిత ఐఖ్యవేదిక రాష్ట్రాధ్యక్షుడు గంటా సుందర్కుమార్ డిమాండ్ చేశారు. శనివారం చెరుకువాడలో దళితులు చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. భీమవరం (ప్రకాశంచౌక్)/తాడేపల్లిగూడెం (టీ ఓసీ): తాడేపల్లిగూడెం మండలం ఆరుగొలనులోని ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూ ల్స్ పీజీటీ భీమడోలు రాజారావును సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. పాఠశాలకు చెందిన బ్యాక్ పైపర్ బ్యాండ్ విద్యార్థుల బృందాన్ని అనుమతి లేకుండా నరసాపురంలోని ఓ ప్రైవేటు కళాశాల కార్యక్రమానికి పంపడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే జిల్లా కో–ఆర్డినేటర్ ఉమాకుమారికి షోకాజ్ నోటీసు ఇవ్వాల్సిందిగా ఆదేశించారు. -
మోసం చంద్రబాబు నైజం
పెంటపాడు: మోసపూరిత హామీలు ఇవ్వడం, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని దాటవేయడం చంద్రబాబు నైజమని మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ విమర్శించారు. శనివారం పడమరవిప్పర్రులో బాబు ష్యూరిటీ.. మోసం గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా ఇంటింటా ఆయన కూటమి ప్రభుత్వ వైఫల్యాలను వివరించారు. ఈ సందర్భంగా కొట్టు మాట్లాడుతూ మోసం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని, సూపర్సిక్స్ పేరుతో ప్రజలను వంచించారన్నారు. కూటమి నాయకులు ప్రజలకిచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ కూడా ఆలోచించాలన్నారు. చంద్రబాబు ఏం చెబితే దానికి తల ఊపడం సరికాదన్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలకు సీఎం చంద్రబాబు తూట్లు పొడిచారన్నారు. ప్రతి కార్యకర్త కూటమి వైఫల్యాలను ఇంటింటా వివరించాలని పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విచ్చలవిడి మద్యంతో ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. మద్యం మాఫియా సిండికేట్గా ధరలను ఇష్టారాజ్యంగా పెంచేస్తున్నారన్నా రు. ముందుగా పత్సా అంజిబాబు నివాసం వద్ద కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. పార్టీ అ ధ్యక్షులు జడ్డు హరిబాబు, వెలిచేటి నరేంద్ర, బండా రు నాగు, ములకాల రాంబాబు, పత్సా అంజిబా బు, ములకాల ప్రసాద్, ముప్పిడి సంపత్కుమార్, కర్రి భాస్కరరావు, కొలుకులూరి ధర్మరాజు తదితరులు పాల్గొన్నారు. మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ -
9న వైఎస్సార్సీపీ అన్నదాత పోరు
కాళ్ల: రాష్ట్రంలో వ్యవసాయం దండగ అన్న చంద్రబాబు పాలన నడుస్తోందని, రైతుల పక్షాన వైఎస్సార్సీపీ పోరుబాట పట్టిందని, ఈనెల 9న ఆర్డీఓ కార్యాలయాల వద్ద అన్నదాత పోరు కార్యక్రమం ద్వారా నిరసన తెలియజేయనున్నట్టు వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు తెలి పారు. పెదఅమిరంలోని పార్టీ కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రైతులపై కూటమి ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని, రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై అన్నదాతలతో కలిసి పోరాటం చేస్తామన్నారు. రైతుల సంక్షేమానికి దివంగత వైఎస్సార్, ఆయన తనయుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పెద్దపీట వేశారని, గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పెట్టుబడి సాయం, ఇన్పుట్ సబ్సిడీ, సున్నావడ్డీకే రుణాలు, సబ్సిడీపై పురుగు మందులు, ఎరువులు అందించామని గుర్తు చేశారు. ఉచిత బీమాతో రైతులను ఆదుకున్నామన్నారు. రాష్ట్రంలో 10,500 రైతు భరోసా కేంద్రాలు నిర్మిస్తే కూటమి ప్రభుత్వం వాటికి తాళాలు వేసిందని మండిపడ్డారు. బ్లాక్ మార్కెట్కు ఎరువులు ప్రస్తుత కూటమి పాలనలో విత్తనాలు, ఎరువులు బ్లాక్ మార్కెట్కు తరలిపోతున్నాయని ప్రసాద రాజు ఆరోపించారు. అయినా ముఖ్యమంత్రి, వ్య వసాయశాఖ మంత్రి స్పందించకపోగా రైతులను అవమానించేలా మాట్లాడుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో యూరియా బస్తా దొరకని పరిస్థితి నెలకొందని, ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమే అ న్నారు. రైతులు బ్లాక్లో రూ.200 నుంచి రూ.300 వరకు అదనంగా చెల్లించి కొనుగోలు చేయాల్సి వస్తుందని వాపోయారు. ఆక్వా రైతుల పరిస్థితి కూడా దయనీయంగా మారిందని, వరదల వల్ల పంట నష్టపోయిన రైతులకు ఇప్పటికీ పరిహారం అందలేదన్నారు. రైతుల పక్షాన ఈనెల 9న భీమవరం, నరసాపురం, తాడేపల్లిగూడెంలోని ఆర్డీఓ కా ర్యాలయాల వద్ద నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నామని, రైతులు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. అనంతరం అన్నదాత పోరు కరపత్రాలు ఆవిష్కరించారు. ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్, ఉండి, భీమవరం నియోజకవర్గాల ఇన్చార్జిలు పీవీఎల్ నరసింహరాజు, చినమిల్లి వెంకటరా యుడు, నరసాపురం పార్లమెంటరీ అధ్యక్షురాలు గూడూరి ఉమాబాల, కామన నాగేశ్వరరావు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. రైతులపై ప్రభుత్వానికి చిన్నచూపు యూరియా సరఫరాలో విఫలం రైతుల పక్షాన వైఎస్సార్సీపీ ఉద్యమం పార్టీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు -
ఎనీవేర్కు కేరాఫ్ ఉండి
దళితులపై దాడులు దారుణం కై కలూరు మండలం దానగూడెంలో దళితులపై జరిగిన దాడులను వివిధ సంఘాలు, పలు పార్టీల నాయకులు ఖండించారు. 8లో uమేం బానిసలం కాదు.. ప్రభుత్వ ఉద్యోగులమంటూ సచివాలయ ఉద్యోగులు పోరుబాట పట్టారు. నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. 8లో uఆదివారం శ్రీ 7 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025సాక్షి, భీమవరం/ ఉండి: పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలోని ఉండి, ఆకివీడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు లోపభూయిష్టంగా జ రుగుతున్నాయా? అమరావతి, చుట్టుపక్కల జి ల్లాల వారు రిజిస్ట్రేషన్ల కోసం ఇక్కడికి క్యూ కడుతున్నారా?.. అంటే అవుననే ఆరోపణలు వినిపిస్తు న్నాయి. ఇటీవల చోటుచేసుకున్న సంఘటనలు ఇందుకు బలం చేకూరుస్తున్నాయి. క్రయ, విక్రయదారులు ఇబ్బంది పడకుండా భూములు, స్థలాలను ఎక్కడైనా రిజిస్ట్రేషన్ చేసుకునే విధంగా ప్రభుత్వం ‘ఎనీవేర్ రిజిస్ట్రేషన్’ వీలు కల్పించింది. సాధారణంగా నిషేధిత జాబితాలోని భూములు, స్థలాలపై స్థానిక సబ్ రిజిస్ట్రార్లకు అవగాహన ఉంటుంది. ధ్రువీకరణ పత్రాలు, వ్యక్తులను క్షుణ్ణంగా పరిశీలించి అన్నీ సవ్యంగా ఉన్నాయనుకుంటేనే రిజిస్ట్రేషన్ చేస్తుంటారు. బయటి ప్రాంతాల్లోని వారికి ఈ భూములపై అవగాహన ఉండదు. బయటి ప్రాంతాల డా క్యుమెంట్లను క్షుణ్ణంగా పరిశీలించి, సంబంధిత ఏ రియాలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి అ న్నీ ధ్రువీకరించుకున్న తర్వాతనే రిజిస్ట్రేషన్లు చేయా లి. అయితే ఎనీవేర్ సాఫ్ట్వేర్ను దుర్వినియోగం చేస్తూ కొందరు అక్రమాలకు తెరలేపుతున్నారు. గతంలో మొగల్తూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో బయ టి ప్రాంతాలకు చెందిన నిషేధిత జాబితాలోని భూముల రిజిస్ట్రేషన్ చేశారన్న విషయంలో సబ్ రిజిస్ట్రార్పై చర్యలు తీసుకున్నారు. అయినా కొందరి తీరులో మార్పు రావడం లేదు. వందలాది ఎనీవేర్ రిజిస్ట్రేషన్లు ప్రస్తుతం ఉండి, ఆకివీడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనూ ఈ తరహా రిజిస్ట్రేషన్లు జరుగుతున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత మూడు నెలల్లో ఉండి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో 1,013 డాక్యుమెంట్లకు రిజిస్ట్రేషన్లు చేయగా వీటిలో 300 లకు పైగా ఇతర జిల్లాలకు చెందిన వారివే ఉన్నాయి. ఆకివీడులో వెయ్యికి పైనే రిజిస్ట్రేషన్లు జరగ్గా అక్కడ కూడా ఇదే పరిస్థితి ఉన్నట్టు సమాచారం. కృష్ణా జిల్లా బంటుమిల్లి, పెడన, మచిలీపట్నం, మండవల్లి, ఉయ్యూరు, ఏలూరు జిల్లా కై కలూరు, ప్రకాశం జిల్లా కనిగిరి, పల్నాడు జిల్లా గురజాల, గుంటూరు జిల్లా పెదకాకాని, జంగారెడ్డిగూడెం, భీమవరం తదితర ప్రాంతాలకు చెందిన వారి రిజిస్ట్రేషన్లు ఉన్నట్టు తెలుస్తోంది. ఎనివేర్ రిజిస్ట్రేషన్లకు సంబంధించి పూర్తి సమాచారం ఇచ్చేందుకు ఉన్నతాధికారుల అనుమతులు కావాలంటూ అధికారులు దాటవేత ధోరణి అవలంబిస్తున్నారు. మంగళ, శుక్రవారాలు, అమావాస్య రోజుల్లోనూ బయట జిల్లాల వారితో ఆయా కార్యాలయాలు కళకళలాడుతుంటాయని తెలిసింది. ఆయా కార్యాలయాల వద్ద లేఖర్లదే ఇష్టారాజ్యమంటున్నారు. ఎన్నో ఏళ్లుగా ఇక్కడ పాతుకుపోయిన కొందరు అన్నీ తామై వ్యవహరిస్తుంటారన్న ఆరోపణలు ఉన్నాయి. నా భూమిని నాకు స్వాధీనం చేయకపోవడంతో పాటు వేరే వారి పేరిట తప్పుడు రిజిస్ట్రేషన్ చేసిన అధికారులు, లేఖర్లపైనా చర్యలు తీసుకోవాలి. ఉన్నతాధికారులను అడుగుతుంటే సబ్ రిజిస్ట్రార్ సెలవులో ఉన్నారని చెబుతున్నారు. ఈ విషయమై పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేసినా నాకు న్యాయం జరగలేదు. సమస్యను పరిష్కరించినట్టుగా ఫేక్ ఫొటో అప్లోడ్ చేసి నా అర్జీని క్లోజ్ చేశారు. – కురెళ్ల రాజ్కుమార్, గణపవరం కాళ్ల మండలం కలవపూడిలో దాదాపు రూ.2.50 కోట్ల విలువైన 1.68 ఎకరాల గ్రామ కంఠం భూమిని జూన్ 30న ఒక సబ్ రిజిస్ట్రార్ తన భర్త పేరిట రిజిస్ట్రేషన్ చేసేశారు. ఈ విషయమై ఫిర్యాదు అందడంతో జూలై 15న రిజిస్ట్రేషన్ రద్దు చేస్తూ ఉన్నతాధికారులు ఆదేశాలిచ్చారు. ప్రస్తుతం ఈ విషయమై విచారణ కొనసాగుతున్నట్టు అధికారులు చెబుతున్నారు. కృష్ణా జిల్లా చినగొల్లపాలెంకు చెందిన ఏలూరి రంగబాబు కుటుంబానికి చినగొల్లపాలెంలో 32 ఎకరాల సాగు భూమి ఉంది. కొందరు ఉండి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఫేక్ రిజిస్ట్రేషన్ చేయించి ఈ భూమిని కాజేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు రంగబాబు ఆందోళనకు దిగారు. రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు అందుకు కొమ్ముకాస్తున్నారంటూ టెంట్ వేసి నిరసన తెలిపారు. గణపవరానికి చెందిన కురెళ్ల రాజ్కుమార్కు ఏలూరు జిల్లా కలిదిండి మండలం పటమటిపాలెంలోని 9 సెంట్ల భూమి ఉంది. ఏప్రిల్ 24న ఉండి సబ్ రిజిస్ట్రార్ ఈ భూమిని అదే గ్రామానికి చెందిన మరొకరి పేరిట రిజిస్ట్రేషన్ చేసేశారు. విషయం తెలుసుకున్న రాజ్కుమార్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో సవరణ పేరుతో తప్పుడు రిజిస్ట్రేషన్ చేసినట్టుగా విచారణలో నిర్ధారణ అయ్యింది. సబ్ రిజిస్ట్రార్ దాదాపు రెండు నెలలుగా సెలవులో ఉన్నారు. అక్రమ రిజిస్ట్రేషన్ రద్దు చేయాలని కోరుతూ బాధితుడు పీజీఆర్ఎస్ లో ఫిర్యాదు చేశారు. ఈ విషయమై ఇప్పటికీ అధికారులు చర్యలు తీసుకోలేదు. కాగా సమస్యను పరిష్కరించి ఉండి ఎస్సై చేతులమీదుగా రాజ్కుమార్కు ఎండార్స్మెంట్ ఇచ్చినట్టు నాలుగు రోజుల క్రితం పీజీఆర్ఎస్ సైట్లో అధికారులు ఫేక్ ఫొటోను అప్లోడ్ చేశారని బాధితుడు ఆరోపిస్తున్నారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అక్రమాలు దండి ఒకరి భూమి మరొకరి పేరుపై ఉండిలో రిజిస్ట్రేషన్ రెండు నెలలుగా సెలవులోనే సబ్ రిజిస్ట్రార్ గ్రామ కంఠం భూమిని రిజిస్టర్ చేసేసిన మరో సబ్ రిజిస్ట్రార్ రిజిస్ట్రేషన్ల కోసం పొరుగు జిల్లాల నుంచి జనం క్యూ చోద్యం చూస్తున్న ఉన్నతాధికారులు -
గంజాయి కేసులో ముగ్గురి అరెస్ట్
నరసాపురం రూరల్: గంజాయి కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేసి వారి నుంచి రూ.40 వేలు ఖరీదు చేసే 1.938 కిలోల (సుమారు రెండు కిలోలు) గంజాయి, మూడు సెల్ఫోన్లు, రూ.4 వేలు నగదును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. గంజాయి అక్రమ రవాణాపై నరసాపురం ఎస్సై సీహెచ్ జయలక్ష్మికి వచ్చిన సమాచారం మేరకు నరసాపురం– పాలకొల్లు రోడ్డులోని వీరభవాని ఆలయం వెనుక గల ఖాళీ స్థలంలో పోలీసులు నిఘా వేశారు. ఉండి ఎన్ఆర్పీ అగ్రహారంనకు చెందిన కాలుకురస ఏసురాజు నరసాపురం వీవర్స్ కాలనీకి చెందిన పృధ్వీసాయి శివకుమార్, పిచ్చుక ఉదయ్కిరణ్లకు విక్రయిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. నిందితులను అరెస్టు చేసి కోర్టుకు పంపగా రిమాండ్ విధించినట్లు చెప్పారు. ఏసురాజు ఏలూరుకు చెందిన మణికంఠ వద్ద గజాయిని కొని నరసాపురానికి చెందిన వ్యక్తులకు విక్రయిస్తున్నాడని, మణికంఠను అరెస్ట్ చేయాల్సి ఉందన్నారు. నరసాపురం డీఎస్పీ శ్రీవేద ఆదేశాల మేరకు టౌన్ సీఐ బి యాదగిరి ఆధ్వర్యంలో జరిపిన ఈ దాడుల్లో ఎస్సై ముత్యాలరావు, హెడ్ కానిస్టేబుళ్లు వేణుగోపాలరావు, ప్రకాష్ బాబు, కానిస్టేబుల్ చక్రవర్తి పాల్గొన్నారు. -
దళితులపై దాడులు దారుణం
ఏలూరు (టూటౌన్): కై కలూరు మండలంలో దానగూడెంలో దళితులపై జరిగిన దాడులను వివిధ సంఘాలు, పలు పార్టీల నాయకులు ఖండించారు. బాధితులను పరామర్శించి దోషులను వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక దళితులపై దాడులు పెరిగిపోయాయని ఆల్ ఇండియా అంబేడ్కర్ యువజన సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ మెండెం సంతోష్ కుమార్ విమర్శించారు. స్థానిక ఎన్ఆర్పేటలోని సంఘం రాష్ట్ర కార్యాలయంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దళితులపై ఆదిపత్య కులాల వారు దాడులకు తెగబడటం సరికాదన్నారు. తమకు న్యాయం జరగకపోతే రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు సిద్ధమని హెచ్చరించారు. సమావేశంలో గొల్ల కిరణ్, కనికెళ్ల రవి ప్రసాద్, పెరియార్ పాల్గొన్నారు. తక్షణమే అరెస్టు చేయాలి దళితులపై హత్యాయత్నం చేసిన దోషులను తక్షణమే అరెస్టు చేసి శిక్షించాలని దళిత బహుజన్ సీనియర్ నాయకులు నేతల రమేష్ బాబు డిమాండ్చేశారు. ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధిత యువకులను ఆయన పరామర్శించారు. దళితులపై హత్యాయత్నానికి పాల్పడిన జనసేన నాయకులను ఎస్సీ, ఎస్సీ అట్రాసిటీ యాక్టు కింద తక్షణమే అరెస్ట్ చేయాలన్నారు. కై కలూరులో జరిగిన దాడిని పోలీసులు ఇరువర్గాల ఘర్షణగా చిత్రీకరించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వమే బాధ్యత వహించాలి దళిత యువకులపై దాడి చేసి హత్యాయత్నానికి ఒడిగట్టిన బాధితులను శిక్షించాలని కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి ఏ.ఫ్రాన్సిస్ డిమాండ్చేశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధిత యువకులను ఆయన శనివారం పరామర్శించారు. గతంలో జనసేన సైనికులు పిఠాపురంలో దళితుల ఊరు మీద పడి దారుణంగా కొట్టారని, ఇప్పుడు కై కలూరులో అలాగే దాడులకు పాల్పడినా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏమీ మాట్లాడకపోవడం సిగ్గు చేటన్నారు. దీనికి ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలన్నారు. విచారణ జరిపించాలి కై కలూరు మండలం దానగూడెం దళితులపై జరిగిన దాడి ఘటనకు సంబంధించి పోలీసు ఉన్నతాధికారులతో విచారణ జరిపించాలని సీపీఎం ఏలూరు జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. దోషులపై అట్రాసిటీ చట్టం పెట్టి అరెస్టు చేయాలని సీపీఎం జిల్లాకార్యదర్శి ఏ.రవి డిమాండ్ చేశారు. తాము అధికారంలోకి వస్తే హత్యలు, అత్యాచారాలు, దాడులను అరికడతామని చెప్పిన కూటమి నాయకులు ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారంటూ ప్రశ్నించారు. బాధితులను పరామర్శించిన సంఘాలు, పార్టీల నాయకులు -
రూ.16.63 లక్షలకు లడ్డూ వేలం
నూజివీడు: మండలంలోని మిట్టగూడెం వినాయక చవితి నవరాత్రుల్లో విఘ్నేశ్వరుడికి ప్రసాదంగా ఏర్పాటుచేసిన 11 కేజీల లడ్డూకు శనివారం వేలం నిర్వహించగా రూ.16.63 లక్షలకు మాజీ ఎంపీటీసీ కొనకళ్ల మాధవరావు దక్కించుకున్నారు. గతేడాది సైతం లడ్డూను వేలంలో రూ.9.09 లక్షలకు మాధవరావు సొంతం చేసుకున్నారు. సర్పంచ్ కొనకాల నరసింహారావు, ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. బుట్టాయగూడెం: కలకత్తా నుంచి హైదరాబాద్కు వెళ్తున్న ఒక కంటైనర్ను జీలుగుమిల్లి పోలీసులు శనివారం తనిఖీ చేసి అందులో సుమారు 12,100 కేజీల గోమాంసాన్ని పట్టుకున్నారు. గ్రామశివారులోని హెచ్పీ గ్యాస్ గోడౌన్ సమీపంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా కంటైనర్లో ఏదో తరలిస్తున్నట్లు అనుమానంతో తనిఖీ చేయగా గోమాంసాన్ని గుర్తించారు. ఇద్దరిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. ఈ మాంసాన్ని నిర్జీవ ప్రదేశంలో ఖననం చేశారు. -
ఉపకార వేతన పరీక్షకు సిద్ధం
● డిసెంబర్ 7న పరీక్ష ● ఆన్లైన్ ద్వారా ఈ నెలాఖరులోగా దరఖాస్తుకు అవకాశంభీమవరం: ఆర్థిక ఇబ్బందులతో ప్రతిభావంతులైన పేద విద్యార్థులు చదువులో మధ్యలో నిలిపివేయకుండా సహకారం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం జాతీయస్థాయి నేషనల్ మీన్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ (ఎన్ఎంఎంఎస్) (ఉపకార వేతనం) అందిస్తుంది. ఎంపికై న విద్యార్థులకు నాలుగేళ్లపాటు అంటే 9వ తరగతి నుంచి ఇంటర్ వరకు ఏడాదికి రూ.12 వేల చొప్పున స్కాలర్షిప్ అందజేస్తారు. దేశవ్యాప్తంగా లక్షమంది విద్యార్థులకు ఎన్ఎంఎంఎస్ స్కాలర్షిప్ను అందిస్తారు. ఇందుకుగాను అర్హులైన విద్యార్థులను ఎంపిక చేసేందుకు ఏటా 8వ తరగతి విద్యార్థులకు పరీక్షను నిర్వహిస్తుంది. పరీక్ష విధానం ఇలా.. డిసెంబర్ 7వ తేదీన ఎన్ఎంఎంఎస్ పరీక్ష నిర్వహించనున్నారు. తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ, హిందీ భాషల్లో పరీక్ష ఉంటుంది. పరీక్ష ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్నల విధానంలో 180 మార్కులకు ఉంటుంది. మూడు గంటలు పరీక్షా సమయం. ఈ పరీక్ష పేపర్ రెండు విభాగాలుగా నిర్వహిస్తారు. మెంటల్ ఎబిలిటీలో 90 మార్కులు, స్కొలాస్టిక్ ఆప్టిట్యూడ్ టెస్ట్లో 90 మార్కులకు ప్రశ్నాప్రతం ఉంటుంది. అన్ని రెవెన్యూ డివిజనల్ ప్రధాన కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహిస్తారు. దరఖాస్తు విధానం ఈనెల 10వ తేదీ నుంచి పరీక్ష ఫీజు చెల్లింంపు ప్రారంభం. ఈనెల 30వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అక్టోబర్ 10వ తేదీలోపు పరీక్ష ఫీజు చెల్లించిన తరువాత విద్యార్థుల దరఖాస్తు, పరీక్ష ఫీజు చెల్లించిన రశీదు పత్రం, కుల, ఆదాయ ధ్రువీకరణ, 8వ తరగతి సర్టిఫికేట్, 7వ తరగతి మార్కుల జాబితా పత్రాలను జిల్లా విధ్యాశాఖాదికారి కార్యాలయంలో అక్టోబర్ 15వ తేదీలోపు అందజేయాలి. ఓసీ, బీసీ విద్యార్థులకు పరీక్ష ఫీజు రూ.100 కాగా ఎస్సీ, ఎస్టీ, వికలాంగ విద్యార్థులు రూ.50 ఆన్లైన్ ద్వారా చెల్లించాలి. అర్హులు ఎవరంటే.. ప్రస్తుతం 8వ తరగతి చదువుతూ 7వ తరగతిలో ఓసీ, బీసీ విద్యార్థులు 55 శాతం మార్కులు, ఎస్సీ, ఎస్టీ, వికలాంగ విద్యార్థులు 50 శాతం మార్కులను సాధించి ఉండాలి. అలాగే ప్రస్తుతం ప్రభుత్వ, జిల్లా పరిషత్, మునిసిపల్, ప్రభుత్వ ఎయిడెడ్, ఆదర్శ, మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలలోని 8వ తరగతి విద్యార్థులు మాత్రమే పరీక్ష రాయడానికి అర్హులు. విద్యార్థి తల్లిదండ్రుల ఆదాయం ఏడాదికి రూ.3.50 లక్షలలోపు ఉండాలి. ఎన్ఎంఎంఎస్ స్కాలర్షిస్ విద్యార్థులకు ఎంతో ఉపయోగకరం. పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తే 9వ తరగతి నుంచి ఇంటర్ వరకు ఏటా రూ.12 వేలు చొప్పున ఉపకారవేతం పొందవచ్చు. గత పరీక్ష పేపర్ల అధ్యయనం ద్వారా విద్యార్థులు తమ ప్రిపరేషన్ సాగించి మంచి మార్కులతో స్కాలర్షిప్ పొందవచ్చు. – వీరవల్లి వేంకటేశ్వరరావు, ఏపీసీపీఎస్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు, స్కూల్ అసిస్టెంట్, మత్స్యపురిపాలెం -
గణితం అంటే భయం పోగొట్టి..
రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఉస్మాన్ పాషాకు పురస్కారం లింగపాలెం: ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ధర్మాజిగూడెం హైస్కూల్ ప్లస్ అధ్యాపకుడు ఉస్మాన్ పాషా రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడి పురస్కారం అందుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేతులమీదుగా అవార్డు అందుకున్న ఆయన తన ఆనందాన్ని ‘సాక్షి’తో పంచుకున్నారు. 2008 డీఎస్సీలో ఎంపికై వట్లూరు జిల్లా పరిషత్ హైస్కూల్ నందు ఉపాధ్యాయ వృత్తిలో ప్రవేశించిన ఆయన 2023 నుంచి పీజీటీ (లెక్కలు) అధ్యాపకునిగా ధర్మాజీగూడెం హైస్కూల్ ప్లస్లో పనిచేస్తున్నట్లు చెప్పారు. వినూత్నమైన టీఎల్ఎం ఉపయోగించి ప్లేవే మెథడ్లో బోధించి మంచి ఫలితాలు సాధించానన్నారు. ఐసీటీ ద్వారా టెక్నాలజీని ఉపయోగించి పీపీటీఎస్ యానిమేటెడ్ వీడియోలు తయారు చేయడం, జియోజీబ్రా, రోబో కంపాస్ లాంటి యాప్స్ ఉపయోగించి బోధించడం ద్వారా విద్యార్థుల్లో గణితం పట్ల భయాన్ని పోగొట్టడంతో దాదాపు పది మంది విద్యార్థులు ఐఐటీలో సీట్లు, ప్రతిభ అవార్డులు సాధించారన్నారు. 2019లో సాంకేతిక శిక్షణ నేస్తం సీబీటీ పోటీ పరీక్షల్లో స్టేట్ రెండవ ర్యాంకు సాధించి ఏపీ ఎస్సీఈఆర్టీ టెక్ట్స్ బుక్స్ ఆథర్గా సెలెక్ట్ అయ్యి గణిత పుస్తక రచనలో సేవలు అందించినట్లు వివరించారు. -
బానిసలం కాదు.. ప్రభుత్వ ఉద్యోగులం
సాక్షి, భీమవరం: మేము బానిసలం కాదు.. ప్రభుత్వ ఉద్యోగులమంటూ సచివాలయ ఉద్యోగులు పోరుబాట పట్టారు. ఇంటింటి సర్వేలు నిషేధించాలంటూ శుక్రవారం నిర్వహించాల్సిన వాట్సప్ గవర్నెన్స్ ఇంటింట అవగాహన సర్వేను బహిష్కరించి నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 15,004 సచివాలయాలకు గాను కేవలం 12 సచివాలయాల్లో మాత్రమే సర్వే చేసినట్టుగా డాష్బోర్డులో అప్లోడ్ చేయగా.. జేఏసీ పిలుపు మేరకు మిగిలిన ఉద్యోగులు సర్వేను బహిష్కరించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనుల కోసం వ్యయప్రయాసలకోర్చి ప్రజలు మండల, జిల్లా కేంద్రాలకు తిరగాల్సిన పనిలేకుండా మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సచివాలయ వ్యవస్థకు శ్రీకారం చుట్టారు. రాజకీయ జోక్యం, అవినీతి, అక్రమాలకు తావులేకుండా పూర్తి పారదర్శకంగా సచివాలయ ఉద్యోగుల నియామకాలు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో రెండు వేలు, పట్టణ ప్రాంతాల్లో నాలుగు వేల జనాభా ప్రాతిపదికన జిల్లాలో 535 సచివాలయాల పరిధిలో ప్రస్తుతం 4,434 మంది ఉద్యోగులు సేవలందిస్తున్నారు. వీరిలో సచివాలయ సెక్రటరీ, ఇంజినీరింగ్, వెల్ఫేర్, ఎడ్యుకేషన్, అగ్రికల్చర్, హార్టీకల్చర్, వెటర్నరీ, డిజిటల్ అసిస్టెంట్లు, ఏఎన్ఎం, విలేజ్ సర్వేయర్ తదితర ఉద్యోగులు ఉన్నారు. సచివాలయానికి వెళితే చాలు అన్ని పనులు జరిగేలా 500కు పైగా సేవలను అందుబాటులోకి తెచ్చారు. ఆయా సేవలను బట్టి తక్షణ, కొన్ని 72 గంటలు, మరికొన్ని వారం నుంచి రెండు వారాల వ్యవధిలో పరిష్కరించేలా గడువు పెట్టారు. గత ప్రభుత్వంలో కేవలం దరఖాస్తు చేసుకున్న గంటలోనే రేషన్ కార్డులు, పింఛన్లు మంజూరుచేసిన సచివాలయాలు ఎన్నో ఉన్నాయి. కూటమి కుట్రలు గతంలో నవరత్న పథకాలు క్షేత్రస్థాయిలో అర్హులైన ప్రతి ఒక్కరి గడప చెంతకు చేరేలా వలంటీర్లను సమన్వయం చేసుకుంటూ సచివాలయ ఉద్యోగులు పనిచేసేవారు. కాగా సంక్షేమాన్ని అటకెక్కించిన కూటమి ప్రభుత్వం సచివాలయ ఉద్యోగులతో జాబ్చార్ట్లో లేని పనులు చేయిస్తూ వారిని తీవ్ర ఒత్తిడికి గురిచేస్తోంది. వలంటీర్ల పనులను వారితో చేయిస్తూ మొత్తం పనిభారం ఉద్యోగులపై మోపింది. హౌస్హోల్డ్, ఎంఎస్ఎం తదితర సర్వేల పేరిట ఇంటింటికి తిప్పుతూ వెట్టిచాకిరీ చేయిస్తోంది. కూటమి వచ్చాక కొందరు ప్రజాప్రతినిధులు, అధికారులు తమ సొంత సర్వేలకు సచివాలయ ఉద్యోగులను వినియోగించుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. హేతుబద్దీకరణ పేరిట 3,500 జనాభా పైబడిన సచివాలయాల్లో ఎనిమిది మంది, 2,500 నుంచి 3,500 జనాభా ఉన్న చోట ఏడుగురు, 2,500 లోపు జనాభా ఉన్నచోట ఆరుగురు ఉద్యోగులను కొనసాగించే అంశాన్ని కూటమి తెరపైకి తెచ్చింది. మరోపక్క ఉద్యోగుల బదిలీల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రుల సిఫార్సు లెటర్లకు ప్రాధాన్యమిస్తూ రాజకీయ జోక్యానికి తెరలేపింది. తాజాగా ప్రతి శుక్రవారం వాట్సప్ గవర్నెస్ అవగాహన సర్వేలు నిర్వహించాలంటూ గురువారం సచివాలయ ఉద్యోగులకు మౌఖిక ఆదేశాలందాయి. ఈ విషయమై సచివాలయ ఉద్యోగుల జేఏసీ స్పందించింది. ఉద్యోగుల ఆత్మగౌరవానికి భంగం కలిగించే వలంటీర్ విధులను బహిష్కరించి నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరుకావాలని జేఏసీ పిలుపునిచ్చింది. ఈ మేరకు శుక్రవారం భీమవరం, ఆకివీడు, జిల్లా వ్యాప్తంగా సచివాలయ ఉద్యోగులు వాట్సప్ సర్వీస్ రిజిస్ట్రేషన్లను ఉద్యోగులు బహిష్కరించి నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరయ్యారు. దీంతో జిల్లాలో 535 సచివాలయాల పరిధిలో ఒక్కచోట కూడా వాట్సప్ రిజిస్ట్రేషన్లు జరుగలేదు. సచివాలయ ఉద్యోగుల పోరుబాట సర్వే డాష్బోర్డు నింపకుండా నిరసన ఇంటింటి సర్వేలు నిషేధించాలని డిమాండ్ నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరు -
బీవీ రాజు కళాశాలకు జాతీయస్థాయి గుర్తింపు
భీమవరం : భీమవరంలోని బీవీరాజు కళాశాల ఆర్ట్స్ అండ్ సైన్స్ విభాగంలో జాతీయస్థాయి గుర్తింపు దక్కించుకుందని ప్రిన్సిపాల్ ఐఆర్ కృష్ణంరాజు తెలిపారు. కేంద్ర విద్యా శాఖ ఈ నెల 4న విడుదల చేసిన ర్యాంకింగ్స్లో ఈ ఘనత సాధించిందని చెప్పారు. శనివారం రాజమహేంద్రవరంలో ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయ ఉపకులపతి ఎస్.ప్రసన్నశ్రీ, రిజిస్ట్రార్ కేవీ స్వామి అభినందనలు తెలియజేస్తూ సర్టిఫికెట్ అందించారని వివరించారు. ఈ సందర్భంగా అధ్యాపకులు, సిబ్బందిని విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్ కేవీ విష్ణురాజు, వైస్ చైర్మన్ ఆర్.రవిచంద్రన్, సెక్రటరీ కె.ఆదిత్య విస్సం, జాయింట్ సెక్రటరీ కె.సాయి సుమంత్, డైరెక్టర్లు తదితరులు అభినందించారు. తాడేపల్లిగూడెం: డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయ ఇన్చార్జి వీసీ నియామకం కోసం ముగ్గురు సీనియర్ల పేర్లను రిజిస్ట్రార్ ప్రభుత్వానికి పంపించినట్టు తెలిసింది. ఇన్చార్జి వీసీ నియామకానికి అర్హులైన సీనియర్ల పేర్లను వెంటనే పంపాలని రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ, సహకార శాఖ ఎక్స్అఫీషియో స్పెషల్ చీఫ్ సెక్రటరీ టు గవర్నమెంటు తరపున ఈ నెల నాలుగున లేఖ పంపిన నేపథ్యంలో జాబితాను పంపినట్టు సమాచారం. మహానందిలోని ఉద్యాన పరిశోధనా స్థానం ప్లాంట్ పథాలజీ విభాగంలో పనిచేసే డాక్టర్ కె.సుబ్రహ్మణ్యం, సీడీహెచ్ ఉద్యాన విభాగం పార్వతీపురంలో పనిచేసే అసోసియేట్ డీన్ డాక్టర్ బి.ప్రసన్నకుమార్, కేవీకే పెరియవరంలో పనిచేసిన డాక్టర్ బి.గోవిందరాజులు పేర్లు ప్రభుత్వానికి చేరినట్టు తెలిసింది. మరోపక్క 65 ఏళ్ల వయస్సు వచ్చే వరకు యూజీసీ యాక్టును వర్సిటీల ప్రొఫెసర్లకు వర్తింపచేపిన విధంగా తనుక వర్తింప చేయాలని ప్రస్తుత వీసీగా ఉన్న కె.గోపాల్ హైకోర్టులో దాఖలు చేసిన రిట్ పిటిషన్పై వాదనలను ఈ నెల 11న జరుగనున్నాయి. తాత్కాలికంగా గోదానం, గో దత్తత నిలుపుదల ద్వారకాతిరుమల: రాష్ట్రంలో లంపి స్కిన్ వ్యాధి వేగంగా వ్యాపిస్తున్నందు వల్ల భక్తుల నుంచి గోదానాన్ని, అలాగే భక్తులకు ఇచ్చే గోదత్తతను శ్రీవారి దేవస్థానం తాత్కాలికంగా నిలుపుదల చేస్తున్నట్టు ఆలయ ఈఓ ఎన్వీ సత్యన్నారాయణ మూర్తి శనివారం ఒక ప్రకటన ద్వారా తెలిపారు. అంటు వ్యాధులు తగ్గిన తరువాత మళ్లీ వీటిని పునః ప్రారంభిస్తామన్నారు. ఇరగవరం: కె కుముదవల్లిలో రేషన్ బియ్యం అక్రమంగా నిల్వచేశారనే సమాచారం మేరకు వీఆర్వోతో కలిసి శుక్రవారం రాత్రి దాడులు చేసినట్లు సివిల్ సప్లయిస్ ఆర్ఐ కేవీవీ సత్యనారాయణ తెలిపారు. ఈ దాడుల్లో బందెల సాయి రామ్ అనే వ్యక్తి ఇంటి వద్ద 5 క్వింటాల్ రేషన్ బియ్యంను స్వాధీనం చేసుకుని అతడిపై 6ఏ కేసు నమోదు చేసినట్లు చెప్పారు. ఉత్తమ లఘు చిత్రం ‘చివరి శ్వాస’పాలకొల్లు సెంట్రల్: పాలకొల్లులో శనివారం నిర్వహించిన నాలుగో అంతర్జాతీయ లఘు చలన చిత్ర పోటీల్లో ‘చివరి శ్వాస’ ఉత్తమ చిత్రంగా నిలిచింది. జాతీయ తెలుగు సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీల్లో ప్రదర్శించిన లఘు చిత్రాలు అందరినీ ఆకట్టుకోవడంతో పాటు ఆలోచింపజేశాయి. 733, పదిలం.. లఘు చిత్రాలు ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి నిమ్మల రామానాయుడు.. ప్రముఖ సినీ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ, ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ వైజాగ్ సెక్రటరీ చెరుకూరి శ్రీనివాసరాజు, మాజీ మంత్రి చేగొండి హరిరామజోగయ్య, కాస్మో కల్చరల్ స్పోర్ట్స్ అధ్యక్షుడు గొట్టుముక్కల గాంధీభగవాన్రాజులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో తెలుగు సారస్వత పరిషత్ అధ్యక్షుడు ముత్యాల శ్రీనివాస్, సినీ దర్శకుడు రేలంగి నరసింహరావు తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం: నకిలీ కరెన్సీ ముఠాను జంగారెడ్డిగూడెం పోలీసులు శనివారం అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించి సీఐ ఎంవీ సుభాష్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నకిలీ కరెన్సీతో ప్రజలను మోసం చేస్తున్నారన్న సమాచారం మేరకు డీఎస్పీ యు.రవిచంద్ర ఆధ్వర్యంలో ఎస్సై షేక్ జబీర్, సిబ్బందితో కలిసి స్థానిక బాట గంగానమ్మ ఆలయ సమీపంలో తనిఖీ చేపట్టామన్నారు. ఈ తనిఖీల్లో ఏలేటి చంద్రశేఖర్ అలియాస్ ఇస్మార్ట్ శంకర్ అలియాస్ కిక్ (గోపాలపురం), లాగు శ్రీను (పేరంపేట), మోతరపు వంశీకుమార్ (నాగులగూడెం)లను అరెస్టు చేసి విచారించామన్నారు. వీరు నకిలీ రూ.500 నోట్లను నల్ల రంగులో ముద్రించి, ఈ నోట్లు ప్రత్యేక ద్రావణంలో ముంచితే అసలైన నోట్లుగా మారుతాయని ప్రజలను నమ్మించి మోసం చేస్తున్నారన్నారు. ఏలూరు టౌన్: ఏలూరు నగర శివారు జాతీయ రహదారిపై రామచంద్ర ఇంజనీరింగ్ కాలేజీ సమీపంలో వ్యాన్ బోల్తా పడి 15 మంది కూలీలు గాయాలపాలయ్యారు. తూర్పుగోదావరి జిల్లా తుని ప్రాంతానికి చెందిన వీరు చేపల వేటకు వైఎస్సార్ కడప జిల్లా బద్వేల్ ప్రాంతానికి వెళ్లి తిరుగు ప్రయాణమయ్యారు. ఏలూరు వచ్చే సరికి వాహనం టైర్ పంక్చర్ కావటంతో అదుపుతప్పి రోడ్డు డివైడర్పైకి బోల్తా కొట్టింది. క్షతగాత్రులను హైవే పెట్రోలింగ్ పోలీసులు 108 అంబులెన్స్ల్లో ఏలూరు సర్వజన ఆసుపత్రికి తరలించారు. 15 మందిలో నలుగురికి తీవ్ర గాయాలు కావటంతో అత్యవసర విభాగంలో చికిత్స అందిస్తున్నారు. -
సచివాలయ ఉద్యోగుల ఉద్యమ పిడికిలి
సాక్షి, అమరావతి/ భీమవరం (ప్రకాశం చౌక్): గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగులు పోరుబావుటా ఎగరవేశారు. ప్రజల గడప వద్దకే ప్రభుత్వ సేవలను అందించేందుకు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వలంటీర్ల వ్యవస్థను అధికారంలోకి రాగానే రద్దు చేసిన కూటమి ప్రభుత్వం... తాజాగా వలంటీర్ల బాధ్యతలను గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగులకు అంటగట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు అప్పట్లో ఉన్న వలంటీర్ల క్లస్టర్లను సచివాలయ ఉద్యోగులకు కేటాయించాలని జిల్లాలకు సమాచారమిచ్చింది. గతంలో 50 ఇళ్లకు ఓ వలంటీర్ను నియమించి క్లస్టర్లుగా విభజించగా, ఇప్పుడు నాలుగైదు క్లస్టర్లను ఓ సచివాలయ ఉద్యోగికి కేటాయించి సమాచార సేకరణ, ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని సూచించింది. ఇందుకు సంబంధించి గ్రామ, వార్డు సచివాలయ శాఖ అధికారిక వెబ్సైట్లో ప్రత్యేక ఆన్లైన్ లింకును ఏర్పాటు చేయడంతోపాటు వలంటీర్ల క్లస్టర్లను సచివాలయ ఉద్యోగులకు ఎలా మ్యాపింగ్ చేయాలో తెలిపే ఛార్ట్ ఫ్లోనూ శుక్రవారం సాయంత్రమే అన్ని సచివాలయాలకూ చేరవేసింది. దీనిపై సచివాలయ ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు. కూటమి సర్కారు తీరు తమ ఆత్మగౌరవం దెబ్బతీసేలా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఆందోళనే శరణ్యమని పోరుబావుటా ఎగరవేశారు. జూమ్ మీట్లో ఉద్యమానికి సిద్ధం సర్కారు తీరుపై శుక్రవారం రాత్రి అత్యవసరంగా జూమ్ యాప్లో వర్చువల్గా సమావేశమైన గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగ సంఘాల నేతలు జేఏసీగా ఏర్పడి ఉద్యమం ద్వారానే సమస్యలను పరిష్కరించుకోవాలని నిర్ణయించారు. వాట్సాప్ సేవలపై శనివారం ఇంటింటి ప్రచారం చేయాలని, ర్యాలీలు చేపట్టాలని ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను బహిష్కరించాలని తీర్మానించారు. ఉద్యోగ సంఘాల జేఏసీ పిలుపు మేరకు శనివారం ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని సచివాలయ ఉద్యోగులు బహిష్కరించారు. నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరై నిరసన తెలిపారు. పలుచోట్ల సమస్యలపై ఎంపీడీవోలకు, మున్సిపల్ కమిషనర్లకు వినతిపత్రాలు అందజేశారు. భీమవరంలో 40 వార్డుల సచివాలయ ఉద్యోగులు ప్రభుత్వ తీరును నిరసిస్తూ మున్సిపల్ కార్యాలయంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. -
‘ఈ ప్రభుత్వం రైతుల్ని చిన్నచూపు చూస్తుంది’
పశ్చిమగోదావరి జిల్లా : చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రైతుల్ని చిన్నచూపు చూస్తోందని జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు ముదునూరి ప్రసాద్రాజు ధ్వజమెత్తారు. గత ప్రభుత్వంతో రైతు భరోసా కేంద్రాలు నిర్మిస్తే, ఇప్పుడు వాటిన్నంటికీ తాళాలు వేశారని మండిపడ్డారు. రైతులకు విత్తనం మొదలు అమ్మేవరకూ పూర్తి భరోసా ప్రభుత్వానిదేనని, ఇప్పుడు యూరియా కోసం రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగం క్యూలైన్లో ఉండి ఇబ్బంది పడటం చూస్తున్నామన్నారు.ప్రభుత్వ తరుపున కట్టే ఇన్సురెన్స్ ఈ ప్రభుత్వం కట్టడం లేదన్నారు.రాష్ట్రంలో రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై 9వ తేదీన ఆర్డీవో కార్యాలయాలో రిప్రజెంటేషన్ ఇచ్చే కార్యక్రమం ఉంటుందన్నారు. జిల్లాలోని నర్సాపురం, తాడేపల్లిగూడెం, భీమవరం ఆర్డివో కార్యలయంలో ఈ కార్యక్రమం చేపడతామన్నారు.వైఎస్ఆర్సిపి పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి పిలుపుమేరకు ఈనెల తొమ్మిదో తారీఖున ప్రతి ఆర్డీవో కార్యాలయం వద్ద రైతులందరితో కలిపి రైతు సమస్యల పైన వినత పత్రాన్ని అందజస్తామన్నారు. గత వైఎస్ జగన్ ప్రభుత్వంలో రైతుల్ని అన్ని విధాలా ఆదుకుంటే, కూటమి ప్రభుత్వం మాత్రం రైతు సమస్యలపై మొద్దు నిద్ర వహిస్తుందన్నారు. -
ఉపాధి పనుల్లో అక్రమాలు
బుట్టాయగూడెం: ఉపాధి హామీ పథకం పనుల్లో భాగంగా గత ఏడాదిపాటు జరిగిన గ్రామీణ అభివృద్ధి పనులు, పంచాయతీరాజ్, ఐటీడీఏ సోషల్ ఫారెస్ట్, టెరిటోరియల్ ఫారెస్ట్, కూలీలకు కలిపి సుమారు రూ. 16.27 కోట్ల నిధులకు సంబంధించి పనులు చేశారు. ఈ పనులపై సామాజిక తనిఖీ బృందం అధికారులు ఆగస్టు 21 నుంచి ఒక్కొక్కటిగా పరిశీలించారు. పనుల వివరాలను మండల స్థాయిలో వెల్లడించేందుకు స్థానిక మండల పరిషత్ కార్యాలయం వద్ద సామాజిక తనిఖీ ప్రజావేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వేదికలో బుట్టాయగూడెం మండలంలోని 21 పంచాయతీల పరిధిలో జరిగిన పనుల్లో సుమారు రూ.1.73 కోట్ల అక్రమాలు జరిగినట్లు గుర్తించామని అధికారులు తెలిపారు. కొలతలు, మస్తర్లు, అంగన్వాడీ కేంద్రాల్లో చేపట్టిన పనులు, ఐటీడీఏ ద్వారా చేపట్టిన పనులు, తదితర పనుల్లో అక్రమాలు జరిగినట్లు గుర్తించామని చెప్పారు. వీటిలో రూ. 27.86 లక్షలను అధికారులు రికవరీకి ఆదేశించారు. మరో రూ.27 లక్షలకు సంబంధించి ఎంకై ్వరీకి ఆదేశించినట్లు తెలిపారు. రూ.86.86 లక్షలతో వివిధ పనులతోపాటు మొక్కలు వేయించేలా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఈ ప్రజావేదికలో రూ.66 లక్షలు తొలగించినట్లు చెప్పారు. అదేవిధంగా ఏపీఓ, ఈసీ, జేఏ, ఫీల్డ్ అసిస్టెంట్లకు సుమారు రూ. 2.81 లక్షల జరిమానా విధించినట్లు తెలిపారు. అదేవిధంగా ఎన్ఆర్పాలెంలో కాంపౌండ్ వాల్, రాజానగరం, లక్ష్ముడుగూడెంలో పాల కేంద్రం నిర్మాణాలు చేపట్టకుండానే సుమారు రూ.8 లక్షల వరకూ డబ్బులు చెల్లించినట్లు గుర్తించామన్నారు. ఆ సొమ్ము మొత్తం రికవరీ చేసినట్లు తెలిపారు. డ్వామా పీడీ వెంకటసుబ్బారావు ఆధ్వర్యంలో ప్రజావేదిక కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ కె.జ్యోతి, ఏపీఓ ఎం.స్వర్ణకుమారి, తదితరులు పాల్గొన్నారు. గురువారం ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9:30 వరకూ ఈ కార్యక్రమం జరిగింది. -
చాలీచాలని జీతాలతో పనిచేస్తున్నాం
ద్వారకాతిరుమల: శ్రీవారి ఆలయంలో ఏళ్ల తరబడి చాలీచాలని జీతాలతో పనిచేస్తున్నామని, తమను రెగ్యులర్ చేయాలని కోరుతూ దేవస్థానం ఎన్ఎంఆర్ ఉద్యోగులు గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు, తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్లకు శుక్రవారం వినతి పత్రాలను అందజేశారు. ముందుగా ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ను వారి క్యాంపు కార్యాలయాల్లో మర్యాద పూర్వకంగా కలసి, తమ సమస్యలను వివరించారు. ఆ తరువాత దుశ్శాలువాలు కప్పి, శ్రీవారి చిత్రపటాలను అందించి సత్కరించారు. ఈ సందర్భంగా ఉద్యోగులు తాము శ్రీవారి దేవస్థానంలో సుమారు 25 ఏళ్లుగా పనిచేస్తున్నామని తెలిపారు. చాలీచాలని జీతంతో పనిచేస్తూ, ఆలయానికి వచ్చే భక్తులకు మెరుగైన సేవలు అందిస్తున్నామని చెప్పారు. దేవస్థానం ఎస్టాబ్లీష్మెంట్ చార్జెస్ 30 శాతం లోపు ఉంటే ప్రభుత్వంపై ఎలాంటి భారం పడదని, తమ దేవస్థానం ఎస్టాబ్లీష్మెంట్ చార్జెస్ కేవలం 16 శాతం లోపే ఉందని పేర్కొన్నారు. దీన్ని బట్టి చూస్తే ప్రస్తుతం ఆలయంలో పనిచేస్తున్న ఎన్ఎంఆర్, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు అందరినీ రెగ్యులర్ చేయొచ్చన్నారు. అప్పుడు కూడా హుండీల ద్వారా వచ్చే ఆదాయంతోనే తమకు జీతభత్యాలు అందుతాయని, ప్రభుత్వంపై ఎటువంటి భారం పడదన్నారు. తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి రెగ్యులర్ అయ్యేలా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎంఆర్ ఉద్యోగులు చవలం శ్రీనివాసరావు, సర్నాల రంగారావు, విజ్జురోతి కుంకుళ్లు, గోపా బాలు, నాగేశ్వరరావు, మంగరాజు తదితరులున్నారు. శ్రీవారి దేవస్థానం ఎన్ఎంఆర్ ఉద్యోగుల ఆవేదన -
ప్రత్తిపాడు– బాదంపూడి రోడ్డెక్కితే టెర్రరే
సంక్రాంతికి రోడ్లు వేస్తామన్నారు. చివరకు అరకొర మరమ్మతులతో సరిపెట్టారు. తాడేపల్లిగూడెంలో ఒక్క ప్రధాన రహదారి నిర్మాణం పూర్తి చేయకుండానే మమా అనిపించారు. బాదంపూడి నుంచి ప్రత్తిపాడు వరకూ ఉన్న ప్రధాన రహదారి తాడేపల్లిగూడెం పట్టణానికే కాకుండా, తణుకు, రావులపాలెం వంటి ప్రాంతాలకు ఎంతో కీలకం. తాము అధికారంలోకి రాగానే ఈ రోడ్డు వేస్తామని జనసేన ఎమ్మెల్యే ఊదరగొట్టారు. ఇప్పుడు ఏడాదిన్నర దాటినా కనీసం దీనివైపు కన్నెత్తి చూడడం లేదు. చిన్నాచితకా రోడ్లకు చేసినా మరమ్మతులు కూడా చేయకపోవడంతో ఈ రోడ్డు నరకాన్ని తలపిస్తోంది. ఇటీవల పలువురు ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురై కాళు,్ల చేతులు విరగ్గొట్టుకున్నారు. గతంలో చిన్నపాటి గోతులపై రాజకీయం చేసిన కూటమి నేతలు ఇప్పుడు భారీ గుంతలతో రోడ్లు అధ్వానంగా తయారైనా పట్టించుకోవడం లేదు. –పెంటపాడు -
బైబిల్ విరుద్ధమైన బోధనలు అడ్డుకుంటాం
పాలకొల్లు సెంట్రల్: బైబిల్కు విరుద్ధమైన బోధనలు చేసే వారిని అడ్డుకుంటామని తెలుగు క్రైస్తవ సంఘాల పరిరక్షణ సమితి అధ్యక్షుడు ఎస్.ఎబినేజర్ అన్నారు. శుక్రవారం పట్టణ శివారు అడబాల గార్డెన్స్లో జరుగుతున్న క్రైస్తవ తెలాభిషేకం ఆరాధన కార్యక్రమాన్ని పాలకొల్లు తెలుగు క్రైస్తవ సంఘాల పరిరక్షణ సమితి సభ్యులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంగా గార్డెన్స్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పెద్ద ఎత్తున పోలీసులను మోహరించారు. కొంత కాలంగా ప్రార్థనా శక్తి నిర్వాహకుడు ఇస్సాక్ అడబాల గార్డెన్స్లో ప్రతి నెలా మొదటి శుక్రవారం తైలాభిషేకం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని నిలిపివేయాలంటూ స్థానిక తెలుగు క్రైస్తవ సంఘాల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో గురువారం రాత్రి నుంచి నిరసన చేపట్టారు. సంఘ అధ్యక్షుడు ఎబినేజర్ మాట్లాడుతూ అమాయక ప్రజలను, విశ్వాసులను మభ్యపెట్టి ప్రలోభాలకు గురిచేస్తున్నారన్నారు. ఆరాధన ఆదివారం మాత్రమే జరగాలని.. అలా కాకుండా ఏ రోజైనా చేస్తే వాక్యానికి విరుద్ధమన్నారు. తైలాభిషేకం బైబిల్లో ఎక్కడా లేదని, అందువల్ల ఈ బోధనను ఖండించేందుకు నిరసన చేపట్టామన్నారు. బోధకుడు ఇస్సాక్ అనుచరులు వచ్చి కోర్టు ఆర్డర్ ఉందని చెప్పారని.. అయితే కోర్టు నుంచి ఎలాంటి ఆర్డర్ రాలేదన్నారు. -
వరద ముంపులోనే కనకాయలంక ప్రజలు
యలమంచిలి: గోదావరిలో వరద స్థిరంగా ఉండిపోవడంతో కనకాయలంక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కనకాయలంక చుట్టూ వరద చుట్టుముట్టడంతో ప్రజలు తమ దైనందిన అవసరాల కోసం పడవల మీద ప్రయాణిస్తున్నారు. గత నెల 29న వరదముంపునకు గురయిన కాజ్వే మీద ఎనిమిది రోజులుగా వరద నీరు ప్రవహిస్తుంది. ముఖ్యంగా తాగునీటి కోసం లంక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గ్రామంలో తాగునీరు దొరకడం లేదు. దీంతో ప్రతి ఒక్కరూ చాకలిపాలెం వెళ్లి ఫౌండేషన్ నీరు తెచ్చుకుంటారు. మామూలు సమయంలో బైక్, సైకిల్ మీద తెచ్చుకుంటారు. వరద రావడంతో పడవపై తెచ్చుకోవాల్సి వస్తుంది. దీంతో ఒంటరి మహిళలు తాగునీరు తెచ్చుకోవడం కష్టమవుతుందని వాపోతున్నారు. ప్రభుత్వం కనీసం వాటర్టిన్స్ పంపిణీ చేయాలని కోరుతున్నారు. -
గురువుల పాత్ర కీలకం
తాడేపల్లిగూడెం: సమాజంలో గురువుల పాత్ర ఎంతో కీలకమని శుక్రవారం ఏపీ నిట్లో జరిగిన గురుపూజోత్సవం కార్యక్రమంలో నిట్ డీన్ స్టూడెంట్స్ వెల్ఫేర్ డాక్టర్ కె.హిమబిందు అన్నారు. ఆమె మాట్లాడుతూ ఉపాధ్యాయుల పాత్ర సమాజంలో ఎంతో అమూల్యమైందన్నారు. గురువే విద్యార్థుల జీవితానికి మార్గదర్శి అన్నారు. విద్యార్థులను అజ్ఞానం నుంచి విజ్ఞాన వెలుగుల దిశగా నడిపించేది ఉపాధ్యాయులే అన్నారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి నివాళులర్పించారు. అసోసియేట్ డీన్లు డాక్టర్ రాజేశ్వర్రెడ్డి ,శ్రీనివాసన్, ఆచార్యులు పి.శంకర్, కార్తికేయశర్మ, అమరేంద్రరెడ్డి, కిషోర్, ప్రత్యూష తదితరులు పాల్గొన్నారు. తణుకు అర్బన్: బెల్టు దుకాణాలు, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడంపై ఎకై ్సజ్ శాఖ దాడులు నిర్వహించినట్లు తణుకు ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ శాఖ సీఐ సత్తి మణికంఠరెడ్డి తెలిపారు. తణుకు ఎకై ్సజ్ స్టేషన్ పరిధిలో శుక్రవారం నిర్వహించిన దాడుల్లో దువ్వ గ్రామానికి చెందిన ఇందుకూరి నాగరాజు, తేతలి గ్రామానికి చెందిన పంది గోగులు నుంచి 6 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. బెల్టు దుకాణాలు నిర్వహించినా, మద్యం దుకాణాల్లోని పర్మిట్ రూంలలో కాకుండా బహిరంగంగా మద్యం సేవిస్తే కఠిన చర్యలు తప్పవని అన్నారు. పోలవరం రూరల్: గోదావరి వరద తగ్గుముఖం పట్టింది. ఎగువ ప్రాంతాల నుంచి నదిలోకి చేరుతున్న నీటితో వరద ప్రవాహం కొనసాగుతోంది. పోలవరం ప్రాజెక్టు స్పిల్వే వద్ద 32.250 మీటర్ల మేర నీటిమట్టం కొనసాగుతోంది. స్పిల్వే 48 గేట్ల నుంచి దిగువకు 9.10 లక్షల క్యూసెక్కుల నీరు చేరుతోంది. భద్రాచలం వద్ద 40.90 అడుగులకు నీటిమట్టం చేరుకుంది. వరద మరింత తగ్గే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. పాలకొల్లు సెంట్రల్: జాతీయ తెలుగు సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో నేడు లఘు చలన చిత్రాల పోటీలు నిర్వహించనున్నారు. శనివారం పట్టణంలోని బ్రాడీపేట బైపాస్ రోడ్డులో ఉన్న రామచంద్ర గార్డెన్స్లో ఈ పోటీలు ఉదయం 9 గంటల నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ ప్రదర్శనకు 30 లఘు చిత్రాలు రాగా వాటిలో 12 చిత్రాలను ఎంపిక చేసినట్లు తెలిపారు. ప్రత్యేక జ్యూరీ ప్రదర్శనకు మరో ఆరు చిత్రాలను ఎంపిక చేశారు. ఈ షార్ట్ ఫిలిం పెస్టివల్లో పాలకొల్లు పట్టణానికి చెందిన కళాకారుడు, సినీ నిర్మాత తుమ్మలపల్లి రామ సత్యనారాయణను సన్మానించనున్నారు. -
సంచార జాతులకు ఏం చేశారో చెప్పాలి?
కాళ్ల: సంచార జాతులకు బీజేపీ ప్రభుత్వం తరపున న్యాయం చేస్తామని విజయవాడలో నిర్వహించిన సంచార జాతుల దినోత్సవం సభలో బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ అన్నారని, గత 11 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం సంచార జాతులకు ఏం చేసిందో చెప్పాలని ఎంబీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పెండ్ర వీరన్న కౌంటర్ ఇచ్చారు. పెద అమీరంలోని జిల్లా పార్టీ క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ డీఎన్టీ, ఎన్టీ సర్టిఫికెట్లు ఇవ్వాలని, ఆ నెపం రాష్ట్ర ప్రభుత్వంపై నెట్టివేయడం సరికాదన్నారు. మతం పేరుతో ఓట్ల కోసం ఈ జాతులను వాడుకోవటం సరికాదని, సర్టిఫికెట్లు ఇవ్వాలంటే రాజ్యాంగ సవరణ చేసి భారత రాజ్యాంగంలోని 341, 342 ఆర్టికల్ పరిధిలోకి తీసుకొచ్చి న్యాయం చేయాలన్నారు. గతంలో అనేక కమిషన్లు కేంద్ర ప్రభుత్వానికి నివేదికలు ఇచ్చాయని ఇంతవరకు చర్చకు కూడా తీసుకురాకుండా ఈ వర్గాలకు న్యాయం చేస్తామని అబద్ధాలు చెప్పడం మాధవ్ మానుకోవాలని పెండ్ర వీరన్న అన్నారు. ఆగస్టు 31న ప్రధానమంత్రి మోదీ ఏం అద్భుతమైన సంక్షేమ పథకాలు ప్రకటించారో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. గత ప్రభుత్వం సంచార జాతులకు వివిధ సంక్షేమ పథకాల కింద రూ.1288.44 కోట్ల లబ్ధి చేకూర్చిందన్నారు. గుర్తింపు లేని సంచార జాతులను గుర్తించి కుల ధ్రువీకరణ పత్రాలు ఇప్పించే కార్యక్రమానికి గత ప్రభుత్వం స్వీకారం చుట్టిందని గుర్తు చేశారు. కార్యక్రమంలో సంచార జాతుల సంఘ జిల్లా అధ్యక్షుడు చుండూరి ముసలయ్య, ప్రధాన కార్యదర్శి చింత వీర్రాజు, కార్యదర్శి చుండూరి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. -
భవనం పైనుంచి దూకి వృద్ధుడి ఆత్మహత్య
తణుకు అర్బన్: గుర్తుతెలియని వృద్ధుడు భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన శుక్రవారం రాత్రి తణుకులో జరిగింది. తణుకు సూర్యాలయం వీధిలోని ప్రైవేటు ఆస్పత్రి భవనం పైనుంచి దూకగా.. మృతుడికి 65 ఏళ్లు ఉంటాయని భావిస్తున్నారు. ఆస్పత్రి వర్గాలు ఇచ్చిన సమాచారంతో ఘటనా ప్రాంతానికి వెళ్లిన ఎస్సై ప్రసాద్ సీసీ పుటేజీ పరిశీలించారు. వృద్ధుడు ఆస్పత్రిలోకి వచ్చి మెట్ల మార్గంలో మూడో అంతస్తులోకి వెళ్లి రెయిలింగ్పై నుంచి దూకినట్లుగా నిర్ధారించారు. పైనుంచి కిందపడిన వెంటనే తలకు తీవ్రగాయమై రక్తస్రావం కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి చొక్కా జేబులో బిస్కట్ ప్యాకెట్ తప్ప మరే వివరాలు లేకపోవడంతో ఆ వృద్ధుడు ఎవరనేది తెలియరాలేదు. దీంతో మృతదేహాన్ని తణుకు జిల్లా కేంద్ర ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు. మృతుడి ఫొటోతోపాటు వివరాలను పోలీసులు పలు వాట్సాప్ గ్రూపుల్లో పెట్టడంతో వివరాలు బయటపడ్డాయి. అత్తిలి మండలం బల్లిపాడులోని ఇందిరమ్మ కాలనీకి చెందిన కాకర్ల ఆదినారాయణ (65)గా పోలీసులు గుర్తించారు. ఉదయం 10 గంటలకు ఇంటినుంచి బయటకు వచ్చిన ఆదినారాయణ మళ్లీ రాలేదని కుటుంబసభ్యులు చెప్పారు. మృతుడికి భార్యతోపాటు కుమారుడు, కుమార్తె ఉన్నారని పోలీసులు చెబుతున్నారు. ఎస్సై ప్రసాద్ కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఉపాధ్యాయుల పాత్ర కీలకం
కలెక్టర్ నాగరాణి భీమవరం: దేశ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని కలెక్టర్ సీహెచ్ నాగరాణి, డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణరాజు అన్నారు. శుక్రవారం స్థానిక అల్లూరి సీతారామరాజు సాంస్కృతిక కేంద్రంలో నిర్వహించిన గురు పూజోత్సవ కార్యక్రమంలో వారు మాట్లాడారు. ముందుగా సర్వేపల్లి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ విద్యార్థులను ఆదర్శంగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల బాధ్యత ఎనలేనిదన్నారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ మహోన్నతమైన వ్యక్తి అని, అందరికీ ఆదర్శనీయులన్నారు. భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు(అంజిబాబు) మాట్లాడుతూ సంస్కృతి, సంప్రదాయాలను అలవర్చి ఉత్తమ విద్యార్థిగా తీర్చిదిద్దే గురువు పాత్ర అమోఘమైందన్నారు. ఎమ్మెల్సీ బొర్రా గోపిమూర్తి, రాష్ట్ర మహిళల సహకార ఆర్థిక కార్పొరేషన్ చైర్పర్సన్ పీతల సుజాత, జిల్లా విద్యాశాఖ అధికారి ఈ.నారాయణ మాట్లాడారు. అనంతరం జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికై న 56 మంది ఉపాధ్యాయులకు పూలమాల వేసి, శాలువా కప్పి, జ్ఞాపిక, ప్రశంసాపత్రాలతో సన్మానించారు. విద్యార్థుల నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. సహకార మార్కెటింగ్ సొసైటీ చైర్మన్ చాగంటి మురళీకృష్ణ, మత్స్యకార సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ కొల్లి పెద్దిరాజు, ఆర్యవైశ్య సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ పద్మనాభుని మురళీమోహన్, సమగ్ర శిక్ష ఏపీసీ పి.శ్యాంసుందర్, సహాయ సంచాలకుడు సత్యనారాయణ పాల్గొన్నారు. -
రేపు మధ్యాహ్నం ఆలయం మూసివేత
ద్వారకాతిరుమల: చంద్ర గ్రహణాన్ని పురస్కరించుకుని ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయాన్ని ఆదివారం మహానివేదన అనంతరం మధ్యాహ్నం 12.30 గంటలకు మూసివేస్తామ ని ఆలయ ఈఓ ఎన్వీ సత్యనారాయణమూర్తి తెలిపారు. సోమవారం (8వ తేదీన) పుణ్యహవాచనం అనంతరం ఉదయం 9.30 గంటల నుంచి భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తామని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే 7న సాయంత్రం జరగాల్సిన ఆర్జిత సేవలను, 8న వేకువజామున జరగాల్సిన సుప్రభాత సేవను రద్దు చేస్తున్నట్టు చెప్పారు. మిగిలిన అన్ని సేవలు యథావిధిగా జరుగుతాయన్నారు. భక్తులు గమనించాలని కోరారు. భీమవరం (ప్రకాశం చౌక్): పశ్చిమగోదావరి జిల్లాలో ప్రభుత్వ వైద్య సేవలను పేదలకు చేరువ చేయడంలో అధికారుల కృషికి నిదర్శనం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రకటించిన ఐవీఆర్ఎస్ ఫలితాలే సాక్ష్యం అని కలెక్టర్ సీహెచ్ నాగరాణి అన్నారు. శుక్రవారం ఆమె ఒక ప్రకటనలో వివరాలు వెల్లడిస్తూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యుల సేవలపై 79.6 శాతం మంది అవును అని సమాధానం ఇచ్చారని, ఇది రాష్ట్రంలో 26వ జిల్లాల్లో అత్యధిక సంతృప్తి స్థాయి అని పేర్కొన్నారు. అలాగే రక్తపరీక్షలకు సంబంధించి 64.7 శాతం మంది, మందుల పంపిణీ గురించి 73.4 శాతం మంది, వైద్య సిబ్బంది అందించే సేవలపై 75.1 శాతం మంది సంతృప్తి చెందారని తెలిపారు. మొత్తంగా ప్రభుత్వ ఆసుపత్రి సేవల్లో 73.4 శాతం నమోదు చేసుకుని మొదటి స్థానంలో పశ్చిమగోదావరి నిలిచిందని కలెక్టర్ తెలిపారు. అధికారులను సమన్వయం చేసుకుని జిల్లాలో మెరుగైన వైద్యసేవలు అందించేందుకు కృషిచేసిన కలెక్టర్ను పలువురు అభినందించారు. కొయ్యలగూడెం: ప్రభుత్వ హాస్టళ్ల తరలింపు నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని, వాటి బదిలీ ప్రక్రియను వెంటనే నిలిపివేయాలని మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక మెయిన్ సెంటర్లో ఏఐఎస్ఎఫ్ నాయకులు చేపట్టిన ఆందోళన శిబిరానికి బాలరాజు వెళ్లి సంఘీభావం తెలిపారు. కొయ్యలగూడెంలోని ప్రభుత్వ బీసీ హాస్టళ్లు రెండింటినీ వేరే మండలాలకు తరలించడాన్ని తప్పుపట్టారు. విద్యార్థులు అత్యధిక శాతం హాజరయ్యే కొయ్యలగూడెంలోని హా స్టళ్లను తరలించడం వెనుక రాజకీయ కుట్ర దాగి ఉందని ఆరోపించారు. కూటమిలోని నా యకులు రాజకీయాలు మాని ప్రజల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకోవాలన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో కొయ్యలగూడెం వల్లే పోలవరం అసెంబ్లీ స్థానాన్ని కూటమి గెలవగలిగింది అనేది జగమెరిగిన సత్యం అని, అయితే కొ య్యలగూడెంలో విద్యారంగాన్ని అణగదొక్కేలా కుట్రలు జరుగుతున్నాయన్నారు. కార్పొ రేట్ సంస్థలతో కలి ప్రభుత్వ విద్యారంగాన్ని అడ్డుకోవడం దారుణమన్నారు. వైఎస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధి దాసరి విష్ణు, ఏఐఎస్ఎఫ్ నాయకులు డి.శివకుమార్, ఎం.క్రాంతి కుమార్, తాడిగడప ఆంజనేయరాజు తది తరులు పాల్గొన్నారు. ఏలూరు(మెట్రో): ఎరువుల నిల్వలు తక్కువగా ఉన్న సొసైటీలకు యుద్ధప్రాతిపదికన సరఫరా చేయాలనీ కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఆదేశించారు. జిల్లాలో ఎరువుల లభ్యత, సరఫరాలపై శుక్రవారం కలెక్టరేట్ నుంచి టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. జిల్లాలో ఎరువుల పంపిణీపై వ్యవసాయాధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. ఎరువుల నిల్వలు తక్కువగా ఉన్న పెదపాడు, పెదవేగి, ఏలూరు, దెందులూరు, కలిదిండి, ముదినేపల్లి, బుట్టాయగూడెం, చింతలపూడి, ఆగిరిపల్లి, కుక్కునూరు, వేలేరుపా డు మండలాలకు 500 టన్నుల యూరియాను పంపామన్నారు. యూరియా పంపిణీ, రైతుల సందేహాల నివృత్తి కోసం ఏలూరు వ్యవసాయ శాఖ కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ రూ మ్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. 85004 21967, 89850 21117 నంబర్లలో సంప్రదించవచ్చన్నారు. -
కదం తొక్కిన ఆటో కార్మికులు
భీమడోలు: సీ్త్ర శక్తి పథకం (ఉచిత బస్సు) మా పా లిట శాపంగా మారిందంటూ ఆటోడ్రైవర్లు ఆందోళనకు దిగారు. ఒక్కో ఆటో కార్మికునికి రూ.25 వేల చొప్పున ఆర్థిక సాయం చేయాలంటూ శుక్రవారం భీమడోలు శ్రీవేంకటేశ్వర ఆటో యూనియన్ ఆధ్వర్యంలో భీమడోలు, పూళ్ల, గుండుగొలను ప్రాంతాలకు చెందిన 120 ఆటోలతో భారీ ర్యాలీ నిర్వహించారు. భీమడోలు జంక్షన్ వద్ద మానవహారం చేపట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమ సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని వారంతా భీమడోలు జంక్షన్లోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో అందించారు. ఈ సందర్భంగా జిల్లా సీఐటీయూ అధ్యక్షుడు ఆర్.లింగరాజు మా ట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాక ముందు ఏడాదికి రూ.15 వేల ఆర్థిక సాయం చే స్తామని హామీ ఇచ్చిందని, ఇప్పటికీ ఒక్క రూపాయి ఇవ్వలేదన్నారు. ఉచిత బస్సుతో ఆటో కార్మికుల ఆదాయం గణనీయంగా తగ్గిపోయిందని, వెంటనే కార్మికులకు ఆర్థిక సాయం చేయాలని డిమాండ్ చేశారు. అలాగే మోదీ ప్రభుత్వం తెచ్చిన మోటార్ వెహికల్ చట్ట సవరణలను ఉపసంహరించుకోవాలన్నారు. క్రూడాయిల్ తగ్గుతున్నా పె ట్రోలు, డీజిల్ ధరలు తగ్గించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఇకనైనా ప్రభుత్వం మేల్కొని ఆటో కార్మికులను ఆదుకోవాలని, లేకుంటే ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఆటో యూనియన్ల అధ్యక్షులు సీరా సాంబశివరావు, డి.పైడియ్య, నల్లమిల్లి నాగరాజు, ఉపాధ్యక్షుడు ముప్పిడి సతీష్, కార్యదర్శి రాచేటి యోహాన్, సిద్దాబత్తుల పండు, సంయుక్త కార్యదర్శి కూరపాటి సర్వేశ్వరరావు, కోశాధికారులు పాల్గొన్నారు. ప్రభుత్వ తీరుపై ఆందోళన -
రైతులను కన్నీళ్లు పెట్టిస్తున్న కూటమి ప్రభుత్వం
● యూరియా కూడా అందించలేని దుస్థితి ● మాజీ మంత్రి కారుమూరి ధ్వజం తణుకు అర్బన్: రైతులు కష్టాలు, కన్నీళ్లతో వ్యవసాయం చేస్తుంటే కూటమి ప్రభుత్వం చోద్యం చూస్తోందని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు మండిపడ్డారు. తణుకులోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రైతులకు యూరియా అందక అవస్థలు పడుతుంటే, యూరియా కొరతను అధిగమించలేక ఎరువులు, పురుగు మందులు తగ్గించి పండించా లంటూ చంద్రబాబు చెబుతున్నారని విమర్శించారు. ప్రభుత్వం తన చేతగానితనాన్ని రైతులకు ఆపాదించేలా మాట్లాడుతోందని ఎద్దేవా చేశారు. గతంలో వ్యవసాయం దండగన్న చంద్రబాబు నేడు కూడా అదే ధోరణి అవలంబిస్తున్నారని దుయ్యబట్టారు. గత పంట డబ్బులు ఇంకా చేతికి అందక, నేడు పంట చేలన్నీ నీట మునిగిపోయి రైతులు తీవ్ర ఇబ్బందుల్లో ఉంటే ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా పట్టించుకున్న దాఖలాలే లేవని చెప్పారు. అన్నదాత సుఖీభవ పేరుతో రైతుకు రూ.20 వేలు ఇస్తానన్న చంద్రబాబు నేడు కేంద్రం ఇచ్చిన మొత్తంతో కలిపి కేవలం రూ.7 వేలు మాత్రమే ఇచ్చారని మండిపడ్డారు. యూరియా కోసం రైతులు క్యూలో ఉండా ల్సి వస్తోందన్న విషయాన్ని ప్రస్తావిస్తూ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు రైతుల పట్ల వెటకారంగా మాట్లాడటం బాధాకరమన్నారు. రైతులకు ఇంకా ధాన్యం డబ్బులు రాలేదంటే మంత్రి నాదెండ్ల మనోహర్ ఏం చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు. మట్టి, ఇసుక, మద్యం వ్యవహారాల్లో ఎమ్మెల్యేలంతా దోపిడీ చేస్తున్నారని విమర్శించారు. కంటిచూపుతో చంపేస్తావా? కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ కంటిచూపుతో చంపేస్తానంటూ మర్డరిస్టులా బెదిరిస్తున్న తీరు చూస్తుంటే మంత్రి స్థానంలోనే ఉన్నారా అని మాజీ మంత్రి కారుమూరి ప్రశ్నించారు. ఆయన వ్యవహారశైలి ఇబ్బందికరంగా మారిందన్నారు. తణుకులో ఆవులు, గేదెలను వధిస్తుంటే ఏంచేస్తున్నారని నిలదీశారు. తణుకులో మీరు వెలగబెట్టిన వ్యవహారా లు అందరికీ తెలుసునని, ఆ బాధితులు కూడా బ యటకు వస్తున్నారని చెప్పారు. తణుకులో సొంత పార్టీవారే ఎమ్మెల్యేని నిందించే పరిస్థితి ఏర్పడిందంటే అతని పరిస్థితి ఏంటో అర్థమవుతోందన్నారు. యూరియా కొరతపై ఈనెల 9న తాడేపల్లిగూడెం ఆర్డీఓ కార్యాలయం వద్ద నిర్వహించే పార్టీ కార్యక్రమానికి తణుకు నుంచి పార్టీ శ్రేణులు భారీగా తరలి వెళ్లనున్నట్టు తెలిపారు. సమావేశంలో పట్టణ అధ్యక్షుడు మారిశెట్టి శేషగిరి, జిల్లా ఆర్గనైజేషన్ సెక్రటరీ యిండుగపల్లి బలరామకృష్ణ, పబ్లిసిటీ వింగ్ జిల్లా అధ్యక్షుడు జల్లూరి జగదీష్, పట్టణ మహిళాధ్యక్షురాలు నూకల కనకదుర్గ, ఏఎంసీ మాజీ చైర్పర్సన్ నత్తా కృష్ణవేణి పాల్గొన్నారు. -
కృత్రిమ కొరతతోనే యూరియా సంక్షోభం
కొయ్యలగూడెం: యూరియా సంక్షోభానికి కృత్రిమ కొరతే కారణమని మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు అన్నారు. శుక్రవారం కొయ్యలగూడెంలో వైఎస్సార్సీపీ యూత్ నేత నూకల రాము ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈనెల 9న చేపట్టనున్న ఆర్డీఓ కార్యాలయాల ముట్టడి, ఆందోళనలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కూటమి నాయకులు యూరియాను బ్లాక్ మార్కె ట్కి తరలించి కోట్లాది రూపాయల స్కామ్కి తెరదీశారని ఆరోపించారు. కొందరు ప్రజాప్రతినిధులు, నాయకుల చేతిలో కీలుబొమ్మగా మారిన కూటమి ప్రభుత్వం రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతోందన్నారు. చంద్రబాబు అంటేనే కరువు, కాటకాలకు దత్తపుత్రుడని ఎద్దేవా చేశారు. యూరియా కోసం రైతులు సొసైటీల చుట్టూ తిరగాల్సిన దుస్థితి నెలకొందన్నారు. కూటమి ప్రభుత్వం తమ పార్టీలకు చెందిన వారికి మాత్రమే సుపరిపాలన అందిస్తూ ప్రజలను నట్టేట ముంచేస్తోందన్నారు. పార్టీ మండల కన్వీనర్ తుమ్మలపల్లి గంగరాజు, ఎంపీపీ గంజిమాల రామారావు, మండల కో–కన్వీనర్ బిరుదుగట్ల ప్రేమ్ కుమార్ పాల్గొన్నారు. బొజ్జగణపయ్యా.. యూరియా అందించవయ్యా గణేష్ సెంటర్లో పునర్నిర్మించిన వినాయక ఆలయంలో బాలరాజు పూజలు చేశారు. యూరియా కోసం రైతులు పడుతున్న కష్టాలు తీర్చాలని కోరారు. -
నీళ్లునములుతున్న కమిషనర్
భీమవరం(ప్రకాశం చౌక్): పాలకోడేరు మండలం విస్సాకోడేరులోని పవన్ సుధ నాన్ లేఅవుట్కు భీమవరం మున్సిపాలిటీ నీటి సరఫరాను ము న్సిపల్ అధికారులు సమర్థించుకున్నారు. ‘సాక్షి’లో వచ్చిన ‘గొంతెండుతుంటే నాన్ లేఅవుట్కు నీళ్లా?’ శీర్షికన కథనానికి వివరణ ఇస్తూ తప్పు చేయలేదని పేర్కొన్నారు. అయితే ఆ వివరణలో నాన్ లేఅవుట్ లేక అప్రూవల్ లేఅవుట్ అనేది పంచాయతీకి సంబంధించిన విషయమని మున్సిపల్ కమిషనర్ తెలిపారు. అయితే నాన్ లేఅవుట్ లేక అప్రూవుల్ లేఅవుట్ అనే విషయం తెలియకుండా కౌన్సిల్ తీర్మానంలో ఎలా పెడతారు? లేఅవుట్ వివరాలు లేకుండా ప్రత్యేక అధికారిగా ఉన్న జాయింట్ కలెక్టర్ కౌ న్సిల్ తీర్మానంపై ఎలా సంతకం చేస్తారనే దానికి మాత్రం సమాధానం చెప్పలేదు. నిబంధనల ప్ర కారం నాన్ లేఅవుట్కు మున్సిపల్ నీళ్లు ఇవ్వచ్చని ఉంటే ఎందుకు కౌన్సిల్ తీర్మానంలో నిబంధనల కాపీ జత చేయలేదు? ఇలా నాన్ లేఅవుట్లకు మున్సిపల్ నీళ్లు ఇచ్చుకుంటూ భీమవరం ప్రజలకు నీళ్లు లేకుండా చేస్తారా? అని భీమవరం పట్టణ వాసులు ప్రశ్నిస్తున్నారు. నాన్ లేఅవుట్కు నీళ్లివ్వ డం కష్టమని విస్సాకోడేరు పంచాయతీ చేతులు ఎ త్తేస్తే భీమవరం మున్సిపాలిటీ ఫీజులు కట్టించుకుని నీళ్లివ్వడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇతర నాన్ లేఅవుట్లలోని వారు కూడా ఫీజులు చెల్లిస్తే నీళ్లిస్తారా.. అని ప్రశ్నిస్తున్నారు. విమర్శల వెల్లువ నాన్ లేఅవుట్కు మున్సిపాలిటీ నీటి సరఫరా చే స్తుంటే కలెక్టర్ పట్టించుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం నుంచి వచ్చిన ఉత్తర్వుల్లో నీటి సరఫరా చేయాలని ఉన్నా.. నాన్ లే అవుట్ అయినా ఫర్వాలేదు డబుల్ ఫీజులు కట్టించుకుని నీళ్లు సరఫరా చేయండి అని ఎక్కడా పేర్కొనలేదు. ఈ విషయాన్ని జిల్లా ఉన్నతాధికారులు గు ర్తించడం లేదు. మున్సిపల్ బైలా ప్రకారం నీళ్లు ఇ స్తున్నాం అని మాత్రమే వివరణలో ఉంది. అయితే నాన్ లేఅవుట్కు కూడా ఫీజులు కట్టించుకుని నీళ్లు ఇవ్వచ్చని మాత్రం చెప్పలేదు. మిగతా నాన్ లేఅవుట్లకు ఇస్తారా? పవన్ సుధా లేఅవుట్కు తీర్మానాలు చేసి ప్రభుత్వం నుంచి ఆర్డర్ పాస్ చేయించి మున్సిపాలిటీ నీళ్లు సరఫరా చేస్తున్నట్టుగా జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలకు సమీపంలో ఉన్న నాన్ లేఅవుట్లకూ మంచినీటి సరఫరా చేస్తారా అన్నదానిపై జిల్లా ఉన్నతాధికారులు సమాధానం చెప్పాల్సి ఉంది. ‘సాక్షి’లో వచ్చిన కథనంపై ఇచ్చిన వివరణ అక్రమ లేఅవుట్కు నీటి సరఫరా కరెక్టే అని సమర్థింపు వాస్తవాలు రాసిన ‘సాక్షి’కి వివరణ ఇచ్చిన వైనం కౌన్సిల్ తీర్మానంలో లేఅవుట్ వివరాలు ఎందుకు పెట్టలేదు ? నాన్ లేఅవుట్కు నీళ్లు ఎలా ఇస్తారని పట్టణవాసుల ప్రశ్న మిగిలిన నాన్ లేఅవుట్లకూనీళ్లు ఇస్తారా అని అంటున్న వైనం భీమవరంలో అనేక ప్రాంతాలకు పైప్లైన్ ఉన్నా మంచినీళ్లు అందడం లేదు. శివారు ప్రాంతాలకు పైపులైన్ వేసి నీళ్లు అందించాల్సిన మున్సిపాలిటీ పక్క నియోజకవర్గంలో నాన్ లేఅవుట్కు పైపులైన్ వేసి మరీ నీళ్లివ్వడం అనేది రాజకీయ ఒత్తిడా లేక అవినీతి చోటుచేసుకుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పట్టణంలో 39 వార్డుల్లోని అన్ని ప్రాంతాలకు పుష్కలంగా నీళ్లు అందించడంలో లేని ఆసక్తి నాన్ లేఅవుట్పై ఎందుకని పలువురు ప్రశ్నిస్తున్నారు. నాన్ లేఅవుట్కు దగ్గరలో ఉన్న మున్సిపల్ పైపు నుంచి పైప్లైన్ వేయాలని ఉండి ఎమ్మెల్యే సూచించారని తీర్మానంలో పేర్కొనడం గమనార్హం. -
కూటమికి కొమ్ముకాస్తున్న విద్యుత్ అధికారులు
ఉండి: కూటమి నాయకులకు విద్యుత్ అధికారులు కొమ్ముకాస్తున్నారంటూ పాములపర్రు దళిత శ్శశాన వాటిక వద్ద శుక్రవారం దళితులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దళిత శ్శశాన వాటికలో గ్రామానికి చెందిన ఆక్వారైతు అక్రమంగా విద్యుత్ ట్రాన్స్ఫార్మర్, మీటరు ఏర్పాటు చేయగా గతనెల 4న ఉండి విద్యుత్ ఏఈ కార్యాలయంలో ఫిర్యాదు చేశామన్నారు. అయినా పట్టించుకోకపోవడంతో తిరిగి గతనెల 22న ఎన్నార్పీ అగ్రహారంలో విద్యుత్ సమస్యలపై ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఫిర్యాదు చేశామని చెప్పారు. దీనిపై స్పందించిన విద్యుత్ అధికారులు 23న సదరు ట్రాన్స్ఫార్మర్ విద్యుత్ కనెక్షన్ను కట్ చేశారన్నారు. అయితే కూటమి నాయకుల ఒత్తిళ్లతో ఈనెల 4న ట్రాన్స్ఫార్మర్కు తిరిగి విద్యుత్ సరఫరా ఇచ్చారని ఆరోపించారు. ముందుగా దళితులకు న్యాయం చేసినట్టు నటించిన విద్యుత్ అధికారులు ఇప్పుడు కూటమి నాయకులకు ఒత్తాసు పలకడం దారుణమన్నారు. దళిత శ్మశాన వాటికలోని ట్రాన్స్ఫార్మర్కు ఎలా విద్యుత్ కనెక్షన్ ఇస్తారంటూ ప్రశ్నిస్తున్నారు. పాములపర్రులో దళితుల నిరసన -
వైఎస్సార్టీఏ ఆధ్వర్యంలో గురువులకు సన్మానం
ఏలూరు (ఆర్ఆర్పేట): వైఎస్సార్సీపీ ఉపాధ్యాయ విభాగం, వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర శాఖ ఆధ్వ ర్యంలో గురుపూజా దినోత్సవం సందర్భంగా శుక్రవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో గు రువులను సన్మానించారు. రాష్ట్రవ్యాప్తంగా 16 మంది ఉపాధ్యాయులను సన్మానించగా పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన బొడ్డు రాంబాబు, సున్నం శ్రీనివాసరావు ఉన్నారు. ఈ కార్యక్రమంలో వై ఎస్సార్సీపీ రాష్ట్ర కో–ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ కల్పలత రెడ్డి, చంద్రశేఖర్రెడ్డి, వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.అశోక్కుమార్ రెడ్డి, గడ్డం సుధీర్, రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు కె.జాల్ రెడ్డి పాల్గొన్నారు. -
కొనసాగుతున్న గోదావరి వరద
నరసాపురం: నరసాపురంలో వశిష్ట గోదావరికి వరద ఉధృతి కొనసాగుతోంది. రెండు రోజులతో పోలిస్తే గురువారం కాస్త తగ్గినా పరిస్థితి పూర్తిస్థాయిలో అదుపులోకి రాలేదు. వలంధర్రేవు, లలితాంబ ఘాట్, పడవల రేవు వద్ద గోదావరి ఉగ్రంగానే ప్రవహిస్తోంది. గణేష్ నిమజ్జనాలు యథావిధిగా సాగుతున్నాయి. మాధవాయిపాలెంలో పంటు రాకపోకలు పునరుద్ధరించలేదు. వారం రోజులుగా పంటు తిరగకపోవడంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. తాడేపల్లిగూడెం: ‘ఆప్కాస్ ఆపరేటర్ లైంగిక వేధింపులు’ శీర్షికన ఈనెల 1న ప్రచురించిన కథనానికి తాడేపల్లిగూడెం మున్సిపల్ కమిషనర్ ఎం.ఏసుబాబు స్పందించారు. ఆప్కాస్ ఆపరేటర్ బాలాను ప్రస్తుతానికి విధులకు దూరంగా ఉంచామని, లైంగిక వేఽధింపుల వ్యవహారంపై నిజాలను నిగ్గుతేల్చడానికి ఒక అధికారిని నియమిస్తున్నామన్నారు. సదరు అధి కారి నివేదిక వచ్చిన తర్వాత ఆపరేటర్ను కా ర్యాలయ విధుల నుంచి బయట విధులను నియమించే అవకాశం ఉందన్నారు. అప్పటికీ బాలా ప్రవర్తనలో మార్పు రాని పక్షంలో విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళతామని, నిబంధనల మేరకు జిల్లా ఉన్నతాధికారి నిర్ణయం తీసుకుంటారన్నారు. వీరవాసరం: రైతులు యూరియాను అవసరం మేరకు మాత్రమే వాడాలని జేసీ టి.రాహుల్కుమార్రెడ్డి అన్నారు. గత సార్వా పంటలో ఎంత యూరియా అవసరమైందో అంతే ప్రస్తుతం కూడా నిల్వలు ఉంచామని చెప్పారు. వీరవాసరంలో గురువారం ఎరువుల దుకాణాలు, పీఏసీఎస్ గోడౌన్లను తనిఖీ చేశారు. వ్యవసాయ అనుబంధ పంటలకు మాత్రమే యూరియా ఇవ్వాలని ఆదేశించారు. రైతు వ్యవసాయ విస్తీర్ణం బట్టి యూరియా ఇవ్వాలని సొసైటీలకు సూచించారు. జిల్లాలో ఎరువుల కొరత లేదని, రైతులు ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జెడ్.వెంకటేశ్వరరావు, తహసీల్దార్ రామాంజనేయులు, మండల వ్యవసాయ శాఖ అధికారి బిన్సీ బాబు ఉన్నారు. కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాసవర్మ -
గురుతర బాధ్యత.. సేవాతత్పరత
తణుకుకు చెందిన ప్రత్తిపాటి ఇస్సాకు, మార్తమ్మ దంపతుల ముగ్గురు కుమార్తెలు ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. పెద్ద కుమార్తె జ్ఞాన కాంతికుమారి తణుకు మండలం వేల్పూరు పాఠశాలలో, రెండో కుమార్తె కాంతి ప్రియ చింతలపూడి మండలం సీతానగరంలోని పాఠశాలలో, మూడో కుమార్తె మెర్సీ రాణి పాలకొల్లు మున్సిపల్ స్కూలులో విధులు నిర్వర్తిస్తున్నారు. కుమార్తెల భర్తలు ముగ్గురూ కూడా ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా ఉండటం విశేషం. ఇస్సాకు ఒక సామాన్య జీపు డ్రైవరుగా ఉపాధి పొందుతూ ముగ్గురు కుమార్తెలతోపాటు ఇద్దరు కుమారులను ఉన్నత చదువులు చదివించడమే కాకుండా కుమార్తెలు ముగ్గురినీ ఉపాధ్యాయులుగా తీర్చిదిద్దారు. పెనుగొండ: చిచ్చర పిడుగుల్లాంటి చిన్నారులకు వినూత్న రీతిలో బోధన చేస్తూ ఆకట్టుకుంటున్నారు పెనుగొండ మోడల్ ప్రైమరీ స్కూలు ఉపాధ్యాయురాలు ప్రసూనాంబ. విద్యార్ధులకు సులభంగా అర్థమయ్యేలా పాఠ్యాంశాలకు సంబంధించి టీఎల్ఎం చిత్రాలు ఏర్పాటు చేసి అవార్డులు అందు కున్నారు. 2003 నుంచి ఆమె అవార్డుల పరంపర సాగుతోంది. అలాగే సొంత ఖర్చులు, దాతల సహకారంతో పాఠశాలల అభివృద్ధికి కృషిచేస్తున్నారు. పెనుగొండ శివారం మల్లప్పదిబ్బలో 2003 మండల స్థాయిలో, 2014లో ఉత్తమ ఉపాధ్యాయురాలు, 2014లో దాతలు సహకారం, సొంత ఖర్చులతో పాఠశాలలను అభివృద్ధి చేసి మల్లప్ప దిబ్బలోని ఎంపీపీ పాఠశాలకు జిల్లాస్థాయి ఉత్త మ పాఠశాలగా ఎంపిక కావడానికి కృషి చేశారు. 2017లో సావిత్రీ బాయి పూలే అవార్డు అందుకున్నారు. ప్రస్తుతం ఆమె పెనుగొండలో శెట్టిబలిజపేట ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్నారు. అజ్ఞానాన్ని పారదోలి జీవితంలో విజ్ఞాన కాంతులు నింపేవారే గురువులు. పేరుకు మూడక్షరాలే అయినా తరాల తలరాతను మార్చే సత్తా వారి సొంతం. అందుకే మాతృదేవోభవ.. పితృదేవోభవ.. అన్న తర్వాత ఆచార్యదేవోభవ అంటూ తల్లిదండ్రుల తర్వాత గురువుకే ఆ స్థానం కల్పించారు. వినూత్నంగా విద్యాబోధన, సామాజిక సేవా కార్యక్రమాలతో ఆదర్శంగా నిలుస్తున్న ఉపాధ్యాయులు ఎంతోమంది ఉన్నారు. విద్యార్థులకు మెరుగైన విద్యనందిస్తూ వారి ఉన్నతికి బంగారు బాటలు వేస్తున్నారు. – సాక్షి, భీమవరంతణుకు రూరల్ తేతలి జెడ్పీ హైస్కూల్లో జీవశాస్త్ర ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న బాపతు మదనగోపాలరెడ్డి తన తండ్రి చెన్నారెడ్డి వర్ధంతిని పురస్కరించుకుని సెప్టెంబరు 3న ప్రభుత్వ పాఠశాలల్లోని పేద, మెరిట్ విద్యార్థులకు 13 సైకిళ్లు చొప్పున గత 13 ఏళ్లుగా అందిస్తున్నారు. విద్యార్థులకు సాంకేతిక విద్యా సౌకర్యాలను సమకూరుస్తున్నారు. రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్న ఆయన సైకాలజిస్ట్, మెజీషియన్ కాగా పరీక్షల సమయంలో పిల్లలకు ఏకాగ్రతపై మోటివేషన్, యోగ, ధ్యానం తదితర అంశాలపై శిక్షణ ఇస్తున్నారు. సైన్స్ ప్రదర్శనలకు గైడ్ టీచర్గా వ్యవహరించి విద్యార్థులను జాతీయ స్థాయికి తీసుకువెళ్లిన ఘనత సాధించారు. తణుకు మున్సిపల్ 4వ నంబరు పాఠశాలలో హెచ్ఎంగా పనిచేస్తున్న ఆయన సతీమణి రుద్రమదేవి సేవా కార్యక్రమాల్లో చేదోడుగా ఉంటూ ఈ జంట ఆదర్శంగా నిలుస్తున్నారు. మాస్టార్లు విద్యార్థులకు వినూత్నంగా బోధన సమాజ సేవలోనూ ముందంజ ఆదర్శంగా నిలుస్తున్న ఉపాధ్యాయులు నేడు ఉపాధ్యాయ దినోత్సవం విద్యార్థులకు ఆట, పాటలతో కూడిన బోధన కోసం తరగతి గదిని తీర్చిదిద్దడంలో నరసాపురం రూరల్ కొప్పర్రు ఎంపీపీ స్కూల్ టీచర్ ఉప్పుగంటి రాజశ్రీ అందెవేసిన చేయి. 27 ఏళ్ల ఉపాధ్యాయ వృత్తిలో పాఠ్యాంశాల బోధనకు అవసరమైన సామగ్రిని స్వయంగా తయారుచేసి తరగతి గదిని తీర్చిదిద్దడం ఆమెకు హాబీ. పాఠ్యాంశాలతో పాటు స్వాతంత్య్ర సమరయోధులు, దేశ నాయకులు గురించి విద్యార్థులకు వివరిస్తూ క్రమం తప్పకుండా వారి జయంతి, వర్ధంతులను నిర్వహిస్తూ పోటీలను పెడుతుంటారు. వినోద, విజ్ఞాన కార్యక్రమాలను నిర్వహిస్తుంటారు. తెలుగు భాషపై అవగాహన కల్పించేందుకు శతక పద్యాల పోటీలు, కథ చెప్పడం, కథ రాయడంపై చిన్న వయసులోనే పిల్లలకు నూరిపోస్తుంటారు. పండుగలు, సామాజిక, పర్యావరణ రక్షణకు అవగాహన కార్యక్రమాలు, పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందిస్తుంటారు. బోధనలోనే కాదు సామాజిక సేవల్లోను ముందుంటారు పాలకొల్లు జీవీఎస్వీఆర్ఎం మున్సిపల్ మోడల్ ప్రైమరీ స్కూల్ హెచ్ఎం రాయపూడి భవానీ శంకర ప్రసాద్. 2000 నుంచి మున్సిపల్ టీచర్గా సేవలందిస్తున్నారు. పని చేసే చోట తనతో పాటు దాతల సహకారం తీసుకుని పాఠశాలలను అభివృద్ధి చేయడ, విద్యార్థులకు కావాల్సిన వివిధ సామగ్రిని సమకూర్చడం చేస్తుంటారు. పాఠశాలకు సరిగా రాని విద్యార్థులు గురించి ఆరా తీయడం, అనారోగ్య సమస్యలు ఉంటే దాతల ద్వారా అవసరమైన సాయం చేస్తుంటారు. గతంలో పలువురు విద్యార్థులకు వైద్యానికి అండగా నిలిచారు. విద్యార్థుల్లో సామాజిక దృక్పథం పెంపొందేలా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. గతంలో జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యారు. సామాజిక సేవలకు గాను పలు అవార్డులను అందుకున్నారు. పాఠశాలే నా ఇల్లు. విద్యార్థులంతా నా కుటుంబ సభ్యులే అనే మనస్తత్వంతో ఉపాధ్యాయ వృత్తిలో ముందుకు సాగుతున్నారు ఆకివీడుకు చెందిన ఉపాధ్యాయుడు గోనెళ్ల శ్రీనివాసపురుషోత్తం. మాట, పాట, ఆటలతో విద్యార్థుల్లో సృజనాత్మక శక్తిని, పోటీతత్వాన్ని, ప్రశ్నించేతత్వాన్ని అలవరుస్తున్నారు. విద్యార్థి స్కూలుకు రాలేదంటే ఆరా తీసి, జ్వరమైతే ఇంటికి వెళ్లి మరీ పలకరించి ఆదుకోవడం ఆయన నైజం. ప్రైవేట్ స్కూళ్ల విద్యార్థుల్ని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చించి వారికి ఆంగ్లంతో పాటు లెక్కలు, తెలుగు పాఠ్యాంశాలు బోధిస్తున్నారు. అందరి చేత శభాష్ అనిపించుకుంటూ జిల్లాస్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడి ఎంపికయ్యారు. విద్యార్థులకు పోటీలు పెట్టి సొంత డబ్బులతో బహుమతులు అందజేస్తుంటారు. ఇలా విద్యార్థులకు చదువుపై ఆసక్తి పెంచేందుకు కృషిచేస్తున్నారు. -
రాయితీని తగ్గించుకునే ప్రయత్నం
ఏలూరు(ఆర్ఆర్పేట): కేంద్ర ప్రభుత్వం యూరియాపై సబ్సిడీ తగ్గించుకునేందుకు చేస్తున్న కుట్రలో భాగంగానే యూరియా దిగుమతి చేసుకోకుండా కొరత సృష్టిస్తోందని ఏపీ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె.శ్రీనివాస్ విమర్శించారు. ఏలూరులోని అన్నే భవనంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం యూరియాపై సబ్సిడీని కుదించి వేసిందన్నారు. రాష్ట్రానికి సరిపడా యూరియా అందించని కేంద్రంపై ఒత్తిడి చేయకుండా సీఎం చంద్రబాబు ప్రతిపక్షాలపై విమ ర్శలు చేయడం తగదన్నారు. యూరియా కోసం రైతులు సొసైటీలు, ఎరువుల షాపులు ముందు క్యూలు కట్టాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. అలాగే ఆధార్తో లింకు పెట్టి యూరియా ఇస్తామని చెప్పడం సరికాదన్నారు. రైతులకు నానో యూ రియా అంటగట్టడం తగదన్నారు. వర్షాల సీజన్లో ఎరువుల కొరత దారుణమన్నారు. అనంతపురం జిల్లాలో సోలార్ ఎనర్జీ కంపెనీలకు సేకరిస్తున్న భూములు పరిశీలనకు వెళ్లిన రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ప్రభాకర్ రెడ్డికి గుంతకల్లు ఎమ్మెల్యే జి.జయరాం ఫోన్ చేసి దూషించడాన్ని ఖండిస్తున్నామన్నారు. -
యూరియాపై వాస్తవాల వక్రీకరణ
ఏలూరు (ఆర్ఆర్పేట): యూరియాపై ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న ప్రకటన అవాస్తవమని, వా స్తవాలను వక్రీకరిస్తున్నారని ఏపీ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు డేగా ప్రభాకర్ గురువారం ప్రకటనలో విమర్శించారు. రాష్ట్రంలో యూరియా కొరత లేదని, రైతులకు పుష్కలంగా యూరియా సరఫరా చేస్తున్నామని ముఖ్యమంత్రి చేసిన ప్రకటన అవాస్తవం అన్నారు. వాస్తవాలు పరిశీలించకుండా మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. అవసరాలకు మించి యూరియా ఉందని అధికారులు చెబుతున్నారని, వాస్తవానికి క్షేత్రస్థాయిలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని పేర్కొన్నారు. బస్తా యూరియా కోసం రైతులు రోజుల తరబడి క్యూలో నిలవాల్సిన దారుణ పరిస్థితిని ఎందుకు తీసుకువచ్చారని ప్రశ్నించారు. యూరియా సమస్య ఎందుకు వచ్చింది అని ప్రశ్నించారు. అధికార పార్టీ నాయకులు యూరియాను దారి మళ్లించి అధిక ధరలకు అమ్ముకుంటున్నారని ఆరోపించారు. మరోవైపు ప్రైవేటు వ్యాపారులు యూరియాను బ్లాక్ మార్కెట్లకు తరలించి బస్తాకు రూ.100, డీఏపీ రూ.200లు అధికంగా విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారని విమర్శించారు. అక్రమ నిల్వలపై తనిఖీలు లేవని, అధికారులు బ్లాక్ మార్కెట్ల నుంచి వచ్చే కమీషన్లకు లొంగి సరైన చర్యలు చేపట్టడం లేదన్నారు. రైతులకు యూరియాను సరఫరా చేయలేనంత అధ్వానంగా ప్రభుత్వాన్ని నడుపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈనెల 8న రైతు సమస్యలపై జిల్లాలోని అన్ని తహసీల్దార్ కార్యాలయాల వద్ధ ధర్నా నిర్వహించనున్నామని, రైతులు తరలిరావాలని పిలుపునిచ్చారు. -
ఆక్వా వర్సిటీ నిర్మాణంపై నిర్లక్ష్యం
నరసాపురం రూరల్: ఆక్వా యూనివర్సిటీకి సొంత భవనాలు, క్యాంపస్ ఏర్పాటు చేయకపోవడం సిగ్గుచేటని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు కౌరు పెద్దిరాజు విమర్శించారు. గురువారం ఆ పార్టీ ఆధ్వర్యంలో ఆక్వా యూనివర్సిటీ విద్యార్థులకు ప్ర స్తుతం తరగతులు నిర్వహిస్తున్న లక్ష్మణేశ్వరం తు పాను రక్షిత భవనం వద్ద ధర్నా చేశారు. పెద్దిరాజు మాట్లాడుతూ రెండేళ్ల క్రితం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటుచేసిన ఆక్వావర్సిటీకి నిర్మాణ పనులు చురుగ్గా చేపట్టకుండా విద్యార్థులకు తుపాను షెల్టర్ భవనంలో తరగతులు నిర్వహించడం సరైంది కాదన్నారు. ఇరుకు గదుల్లో విద్యాబోధన, హాస్టల్ లేకపోవడం వల్ల విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. వర్సిటీ కోసం ప్రభుత్వం కేటాయించిన 50 ఎకరా ల స్థలంలో శాశ్వత భవనాలు ఎందుకు నిర్మించడం లేదని ప్రశ్నించారు. ఆక్వావర్సిటీ నిర్మాణంపై ప్రభు త్వం నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తోందని విమర్శించారు. యూనివర్సిటీ నిర్మాణానికి నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. మండల కార్యదర్శి జల్లి రామ్మోహన్రావు తదితరులు పాల్గొన్నారు. -
ఎరువులు అందించడంలో కూటమి విఫలం
పెనుగొండ: దేశానికి వెన్నెముకగా నిలుస్తున్న రైతులకు ఎరువులు అందించలేని స్థితిలో కూటమి ప్రభుత్వం ఉందని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యుడు చెరుకువాడ శ్రీరంగనాథరాజు విమర్శించారు. గురువారం తూర్పుపాలెంలోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. యూరియా కొరతపై తీవ్ర విమర్శలు చేశారు. యూరియా కొరతతో రైతులు అల్లాడుతుంటే ప్రశ్నించిన ప్రతిపక్షంపైనే సీఎం చంద్రబాబు, కూటమి నాయకులు బురద జల్లుతున్నారన్నారు. యూరియా కోసం రైతులు రోడ్డెక్కుతుంటే మభ్య పెట్టడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. సాగుకు ఆది నుంచి ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా లేకపోవడంతో రైతులు అష్టకష్టాలు పడుతున్నారన్నారు. మొదట్లో సాగు నీరు ఇవ్వలేకపోయారని.. ఇప్పుడు ఎరువులూ సరఫరా చేయలేకపోతున్నారని దుయ్యబట్టారు. మంత్రి ఇలాకాలో సాగునీటి కష్టాలు నీటిపారుదల శాఖ మంత్రి ఉన్న నియోజకవర్గంలోనే సాగుకు నీరు అందించలేకపోయారని శ్రీరంగనాథరాజు ఎద్దేవా చేశారు. భారీ వర్షాలతో ముంపునకు గురైన చేల రైతులను ఆదుకోలేదన్నారు. ఆచంట నియోజకవర్గంలో నక్కల డ్రెయిన్, గోస్తనీ డ్రెయిన్లతో ఆయా ప్రాంతాల్లో వరి చేలు ఊ డ్పులు కాగానే రెండు, మూడుసార్లు ముంపునకు గురయ్యాయన్నారు. దీంతో నాట్లు కుళ్లిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. వీరికి ఇప్పటికీ బీమా అందలేదన్నారు. వైఎస్సార్ సీపీ పాలనలో ఎప్పటి నష్టపరిహారం అప్పుడే అందజేశామని గుర్తు చేశారు. అలాగే కూటమి ప్రభుత్వంలో ఇప్పటివరకూ ఇన్పుట్ సబ్సిడీ విడుదల చేయలేదన్నారు. రైతులకు అన్ని సేవలూ ఒకే చోట అందించేలా రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేస్తే వాటిని కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేసిందన్నారు. ఎరువుల కోసం రైతులు క్యూలైన్లలో నిలబడితే తప్పేంటంటూ కించపరిచేలా మంత్రులు వ్యాఖ్యానించడం దారుణమన్నారు. ఇప్పటికై నా రైతులను ఆదుకోవడానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో ఈనెల 9న నిర్వహించబోయే ధర్నాల్లో రైతులు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కర్రి నారాయణరెడ్డి (వాసు), సర్పంచ్లు జక్కంశెట్టి శ్రీరాములు, సుంకర సీతారామ్, ఇళ్ల లక్ష్మీ చంద్రకళ, గుబ్బల ఉషారాణి వీరబ్రహ్మం, బుర్రా రవికుమార్, మండల కన్వీనర్లు గూడూరి దేవేంద్రుడు, నల్లి మిల్లి బాబిరెడ్డి, జక్కంశెట్టి చంటి, జిల్లా ప్రధాన కార్యదర్శి దంపనబోయిన బాబూరావు, నాయకులు కర్రి వేణుబాబు, కోట వెంకటేశ్వరావు, చింతపల్లి గురుప్రసాద్, పోతుమూడి రామచంద్రరావు, చిటికెన బాబీ తదితరులు పాల్గొన్నారు. రోడ్డెక్కి నిరసనలు తెలుపుతున్నా కనిపించడం లేదా? సాగుకు ఆది నుంచీ కష్టాలే.. ఈనెల 9న వైఎస్సార్సీపీ ధర్నా మాజీ మంత్రి శ్రీరంగనాథరాజు పీవీఎల్ నరసింహరాజు కాళ్ల: కూటమి ప్రభుత్వం రైతులను అన్ని విధాలా దగా చేస్తోందని వైఎస్సార్సీపీ ఉండి నియోజకవర్గ ఇన్చార్జి పీవీఎల్ నరసింహరాజు అన్నారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా రైతులు రోడ్డెక్కి నిరసనలు తెలుపుతున్నా కూటమి ప్రభుత్వానికి పట్టడం లేదన్నారు. చంద్రబాబు మాటలు నమ్మి ఓటేస్తే రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో రైతులకు ఇబ్బంది లేకుండా రైతు భరోసా కేంద్రం ద్వారా పూర్తిస్థాయిలో సేవలందించారని గుర్తు చేశారు. అయితే ప్రస్తుతం రైతులు యూరియా కోసం రోడ్లపైకి రావాల్సిన పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఇప్పటికే దీనిపై కలెక్టర్ను కలిసి వినతిపత్రం అందించామని, అయినా ప్రయోజనం లేదన్నారు. రానున్న రోజుల్లో రైతులు కూటమి ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతారన్నారు. యూరియా కోసం రైతులు రోడ్లు ఎక్కడం ప్రభుత్వానికి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ఈనెల 9న భీమవరం, ఉండి నియోజకవర్గాల పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఆర్డీఓకు వినతిపత్రం అందజేస్తామని చెప్పారు. -
గురువులపై కర్ర పెత్తనం
నిడమర్రు: కూటమి ప్రభుత్వంలో ప్రభుత్వ గురువులపై రోజు రోజుకూ నిఘా పెరుగుతూనే ఉంది. అందులో భాగంగా బడుల్లో నిర్వహిస్తున్న ప్రతి కార్యక్రమానికి పరిశీలకులు, సాక్షులు, నోడల్ పర్సన్స్ల పేరుతో ఇతర శాఖ అధికారులు, సిబ్బందితో ఉపాధ్యాయులపై పెత్తనం చేస్తున్నారంటూ వారు ఆరోపిస్తున్నారు. మరో పక్క రాష్ట్ర స్థాయి నుంచి మండల స్థాయి వరకూ విద్యాశాఖ అధికారుల తనిఖీలు మామూలే. తాజాగా ఒక పక్క డైట్ కళాశాల అధ్యాపకులతో తనఖీలు చేస్తుండంగా మరో పక్క మండల అకడమిక్ ఫోరంలు ఏర్పాటు చేసి ఉపాధ్యాయులపై పర్యవేక్షణ పెంచేలా విద్యాశాఖ సిద్ధమైంది. ఇప్పటికే మూల్యాంకన పుస్తకాలు దిద్దడం, హోలిస్టిక్ ప్రోగ్రస్ కార్డులు అందించడం, మార్కులు ఆన్లైన్ చేయడం, టీచర్ డైరీ నింపడం వంటి కార్యక్రమాలతో వారం రోజులుగా ఉపాధ్యాయులకు బోధనకు దూరంగా ఉన్న సమయంలో ఉన్నత అధికారులతో తనిఖీలు చేయడంపై ఉపాధ్యాయ వర్గం మండిపడుతోంది. నాలుగు మండలాలకు ఒక డైట్ లెక్చరర్ దూబచర్ల డైట్ కళాశాలల్లో ఉన్న 11 మంది అధ్యాపకులకు నాలుగు మండలాల చొప్పున ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల పనితీరుపై నివేదికలు అందించేలా ఉన్నత అధికారులు వారిని నియమించారు. వీరంతా వారికి కేటారయించిన మండలాల్లో ఎంపిక చేసుకున్న పాఠశాలల్లో ఉపాధ్యాయుల పనితీరు, విద్యార్థుల విద్యా సామర్థ్యాలు, భోజన పథకం వంటి అనేక అంశాలను పరిశీలించి జిల్లా అధికారులకు రోజువారీ నివేదిక అందించాల్సి ఉంది. మండల ఎకడమిక్ ఫోరంలు ప్రతి మండలాల్లో ఇప్పటికే మండల అకడమిక్ ఫోరంలు ఏర్పాటు చేశారు. ఈ ఫోరంలో ఎంఈవో 1, 2లు, నాలుగు క్లస్టర్ చైర్మన్లు, హైస్కూల్ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ టీచర్లు ఏడుగురు, ప్రైమరీ ఎక్సపర్ట్ టీచర్స్ 5గురుని నియమించారు. వీరంతా వారానికి రెండు సార్లు మండల ప్రాతిపదికగా పాఠశాలలు పరిశీలన చేయాల్సి ఉంది. ఈ ఫోరంలో ఎంఈవో1, ఎంఈవో2 రెండు వేర్వేరు బృందాలుగా ఆయా గ్రామాల్లో ప్రాథమిక పాఠశాలలను ఏకకాలంలో విజిట్ చేస్తారు. అలాగే విజిట్ జరుగుతున్న రోజు సంబంధిత స్కూళ్లలో ఏ టీచర్కు సెలవు మంజూరు చేయరు. అందరూ తప్పనిసరిగా హాజరయ్యేలా చర్యలు తీసుకుంటారు. బువ్వనపల్లి జెడ్పీస్కూల్లో ఉపాధ్యాయుల పనితీరును పరిశీలిస్తున్న డైట్ లెక్చరర్ లక్ష్మీనారాయణ (ఫైల్)అర్ధవరం జెడ్పీస్కూల్లో మూల్యాంకన పుస్తకాలు తనిఖీ చేస్తున్న డీఈవో నారాయణ (ఫైల్) రోజురోజుకీ పెరుగుతున్న నిఘా ఒక పక్క డైట్ లెక్చరర్లతో తనిఖీలు మరో వైపు మండల అకడమిక్ ఫోరంల ఏర్పాటు రోజువారీ హాజరుపైనా పర్యవేక్షణ ఉక్కిరిబిక్కిరవుతున్న ఉపాధ్యాయులు విద్యార్థి, ఉపాధ్యాయుల హాజరు సమయం, సిలబస్, టెక్ట్స్ బుక్, వర్క్ బుక్స్, నోట్ బుక్స్ పరిశీలన. ప్రతి శనివారం నిర్వహించే నోబ్యాగ్ డే కృత్యాల పుస్తకాలు, అభ్యసనా ఫలితాలు అంచనా వేయడం, మూల్యాంకన పుస్తకాలు, టీచర్ డైరీలు, స్కూల్ నమోదుపై జరుగుతున్న కృషి, మధ్యాహ్నా భోజన పథకం రికార్డులు, విద్యాప్రవేశ్ కార్యక్రమం నిర్వహణ వంటి అనేక అంశాలు పరిశీలిస్తారు. వీరందరూ అందించిన నివేదికలను సరి పోల్చుకుని ఆ పాఠశాల పనితీరుపై రాష్ట్రస్థాయిలో ఒక సమగ్ర నివేదిక అందించేలా జిల్లా విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకుంటారు. -
వదలని వరద గోదావరి
● జలదిగ్బంధంలో 25 గ్రామాలు ● నేటికీ బయట పడని రహదారులు ● పడవ ప్రయాణమే ఆ గ్రామాలకు దిక్కు వేలేరుపాడు: ఒక వైపు గ్రామాలను చుట్టుముట్టిన గోదావరి వరద.. మరో వైపు అడపా దడపా జోరున కురుస్తున్న వాన.. ముంపు మండలాల వాసులను మూడు నెలలలుగా కలవరపెడుతున్నాయి. భద్రాచలం వద్ద గోదావరి వరద నీటి మట్టం తగ్గుతూ.. పెరుగుతూ దోబూచులాడుతోంది. ఎగువన ఉన్న తుపాకులగూడెం సమ్మక్క, సారక్క పూర్తిగా గేట్లు ఎత్తివేశారు. దీంతో 8 లక్షల క్యూసెక్కుల నీరు కిందకు వదిలారు. దీనికి తోడు తాలిపేరు వరద తోడవ్వడంతో బుధవారం 43 అడుగులకు నీటిమట్టం పెరగడంతో మొదటి ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు. గురువారం రాత్రి 8.30కు గోదావరి నీటి మట్టం 42.60 అడుగులకు చేరడంతో ఉపసంహరించారు. వరద వల్ల జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో 18 రోజులుగా వేలేరుపాడు మండలంలో 25 గ్రామాలు జలదిగ్భంధనంలోనే ఉన్నాయి. వేలేరుపాడు నుంచి కొయిదా వెళ్లే రహదారిలో మేళ్ళవాగు, ఎద్దెలవాగు, టేకూరు, తదితర వాగుల వంతెనలు ముంపులోనే ఉన్నాయి. దిగువనున్న కొయిదా, కాచారం, పేరంటపల్లి, టేకుపల్లి, తాళ్ళగొంది, పూసుగొంది, టేకూరు, కట్కూరు, సిద్దారం, ఎడవల్లి, చిట్టంరెడ్డిపాలెం, ఎర్రతోగు, చిగురుమామిడి, బోళ్ళపల్లి, పాతనార్లవరం, తూర్పుమెట్ట, కొత్తూరు, తదితర గ్రామాలతోపాటు మరో ఎనిమిది గ్రామాలు జలదిగ్బంధనంలోనే ఉన్నాయి. వేలేరుపాడు నుంచి రేపాకగొమ్ము, వెళ్లే రహదారి నేటికీ మోకాల్లోతు నీరు పారుతోంది. దీంతో ఆయా గ్రామ ప్రజలు మోకాల్లోతు నీటిలో ప్రయాణిస్తున్నారు. రుద్రమకోట వెళ్లే రహదారులు ఇంకా నీటిలోనే మునిగి ఉండటంతో ఆయా గ్రామాల ప్రజలు లచ్చిగూడెం గ్రామం గుండా రాకపోకలు సాగిస్తున్నారు. పడవ ప్రయాణమే దిక్కు దిగువ ప్రాంతంలో ఉన్న 18 గిరిజన గ్రామాలకు గత మూడు నెలలుగా పడవ ప్రయాణమే దిక్కయింది. ఎద్దెలవాగు, టేకూరు, వాగుల వంతెనలు నీట మునగడంతో పడవల పైనే ప్రయాణం సాగిస్తున్నారు. ఏ అవసరమున్నా మండల కేంద్రమైన వేలేరుపాడుకు రావాలంటే పడవ దాటి రావాల్సిందే. పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులు కూడా పడవల పైనే పాఠశాలలకు వస్తున్నారు. గురువారం టేకూరు వాగు వద్ద స్థానిక పోలీసులు పడవ దాటించి పాఠశాలలకు పంపుతున్నారు. ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ ఆదేశాలతో లైఫ్ జాకెట్లతో బోట్లపై ప్రయాణిస్తున్నారు. పాతనార్లవరం గ్రామాన్ని పట్టించుకోని అధికారులు జలదిగ్బంధనంలో ఉన్న పాతనార్లవరం గ్రామాన్ని అధికారులు పట్టించుకోకుండా వదిలేశారు. ఇక్కడ 50 కుటుంబాలున్నాయి. ఈ గ్రామానికి వెళ్లే రహదారి నీటమునిగి జలదిగ్బంధనంలో ఉన్నప్పటికీ ఆ గ్రామానికి కనీసం పడవ కూడా ఏర్పాటు చేయకపోవడంతో గ్రామస్తులు నానా ఇబ్బందులు పడుతున్నారు. -
ఇసుక లారీల స్వాధీనం
చింతలపూడి: ఆంధ్రప్రదేశ్ నుంచి అక్రమంగా గోదావరి ఇసుకను హైదరాబాద్ తరలిస్తున్న లారీలను చింతలపూడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చింతలపూడి మండలం ఏపీ, తెలంగాణ సరిహద్దు ప్రాంతాలగుండా ఇసుకను తెలంగాణలో అధిక ధరలకు విక్రయిస్తూ అక్రమార్కులు అక్రమంగా ఆర్జిస్తున్నారు. గురువారం తెల్లవారుజామున పోలవరం, కొవ్వూరు ఇసుక రీచ్ల నుంచి తరలిస్తున్న 16 ఇసుక లారీలను స్థానికుల సమాచారం మేరకు అల్లిపల్లి సమీపంలో చింతలపూడి సీఐ క్రాంతికుమార్ ఆధ్వర్యంలో పోలీసులు పట్టుకున్నారు. పట్టుకున్న లారీలను రెవెన్యూ అధికారులకు బైండోవర్ చేశారు. కాగా ఇసుక లారీలు పట్టుబడిన వెంటనే అప్రమత్తమైన అక్రమార్కులు వాటిని విడిపించుకునేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేసినట్లు తెలిసింది. అయితే పోలీసులు ఎలాంటి వత్తిళ్ళకు తలొగ్గకుండా కేసులు నమోదు చేశారు. నిత్యం వందలాది లారీల్లో ఇసుక ఏపీ నుంచి తెలంగాణ రాష్ట్రం తరలి పోతుంటే ప్రభుత్వం ఏం చేస్తుందని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఏపీ, తెలంగాణ సరిహద్దుల్లో ప్రత్యేక నిఘా పెట్టి ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు. -
సందిగ్ధంలో వీసీ పీఠం
● వ్యాజ్యపరమైన అంశంతో ముడి ● 11న స్పష్టత వచ్చే అవకాశం తాడేపల్లిగూడెం: డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయ వైస్ చాన్సలర్ ఉద్యోగ కాల పొడిగింపు, లేదంటే కొత్త వారి నియామకం వ్యవహారం సందిగ్ధతకు ఇంకా తెరపడలేదు. వ్యవహారం వ్యాజ్యపరమైన వివాదంతో ముడిపడి ఉండటంతో ఇంకా కామాలతో వ్యవహారం సాగుతోంది. ప్రస్తుత వీసీ ఉద్యోగ కాలం ఆగస్టు 31తో ముగిసింది. యూజీసీ నిబంధనల ప్రకారం జీఓ నంబరు 39ను అనుసరించి తనకు 65 ఏళ్ల వయస్సు వచ్చే వరకు వీసీ పదవిలో కొనసాగించాలని వీసీ గోపాల్ హైకోర్టులో రిట్ పిటిషన్ వేశారు. దీనిపై స్పందించిన హైకోర్టు గత నెలలో ఈ నిబంధన వ్యవసాయశాఖ పరిధిలో ఉద్యోగులుగా ఉన్న వారికి వర్తించదని, దీనిపై మరోసారి అఫిడవిట్ సెప్టెంబరు 29న దాఖలు చేయాలని కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా వీసీ కొనసాగింపు, లేదా ఇన్చార్జిని నియమించడం వంటి ప్రక్రియను పూర్తి చేయలేదు. ఈలోగా అఫిడవిట్ దాఖలుకు ముందు నాయస్థానంలో జరిగిన వాదనల నేపథ్యంలో మరోమారు ఈ నెల 11న ఉద్యానవర్సిటీ వీసీ వ్యవహారంపై వాదనలు జరుగనున్నాయని తెలిసింది. దీంతో వీసీ కొనసాగింపు, లేదంటే కొత్త వారిని నియమించడం అనేది 11న తేలవచ్చని తెలుస్తోంది. తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు.. ఉద్యోగ నియామక పత్రాలను ఉద్యోగులకు ప్రభుత్వాలు ఇచ్చే సమయంలో అంటిల్ ఫర్దర్ ఆర్డర్ అనే పదాన్ని నియామకపు లేఖలో ఉటంకిస్తాయి. అంటే తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఇచ్చిన ఉద్యోగంలో కొనసాగవచ్చు అని అర్థం. అంటే ఉద్యోగకాలం ఉన్న వారికి మాత్రమే అంటిల్ ఫర్దర్ ఆర్డర్ అనే నిబంధన వర్తిస్తుంది. అంతే కాని ఉద్యోగ విరమణ చేసిన వారి విషయంలో వర్తించదు. ఉద్యానవర్సిటీ వీసీగా ఉన్న కె.గోపాల్ ఉద్యోగకాలం ఆగస్టు 31తో ముగిసింది. అంటిల్ ఫర్దర్ ఆర్డర్ మార్గదర్శకాలు ఆయనకు వర్తించదని అధికార వర్గాల సమాచారం. అయితే వీసీ తర్వాత పర్యవేక్షక బాధ్యతలు వహించాల్సిన వ్యక్తులు కూడా అంటిల్ ఫర్దర్ ఆర్డర్ను అడ్డుపెట్టుకొని తన పైఅధికారి విషయంలో మౌనంగా ఉన్నారని తెలుస్తోంది. గురువారం జరుగనున్న రాష్ట్ర క్యాబినెట్లో టేబుల్ అజెండాగా పెట్టే విషయంలో ఉద్యానవర్సిటీ వీసీ అంశంగా ఉండవచ్చనే ఊహాగానాలు ఉన్నాయి. -
పక్షులు వేటాడుతున్న ఏడుగురి అరెస్ట్
నరసాపురం: లక్ష్మణేశ్వరం చేపల మార్కెట్ వద్ద పక్షులను వేటాడి విక్రయిస్తున్న ఓ బృందంపై గురువారం భీమవరం ఫారెస్ట్ రేంజ్ అధికారులు దాడి చేశారు. ఏడుగురు వ్యక్తులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి మూడు నాటు తుపాకులు, కొంత గన్ పౌడర్, 13 మృత పక్షులను స్వాధీనం చేసుకున్నారు. వన్యప్రాణులను వేటాడటం, అక్రమ ఆయుధాలు కలిగి ఉన్న నేరంపై కేసు నమోదు చేసినట్టు భీమవరం ఫారెస్ట్ రేంజ్ మురాల కరుణాకర్ అధికారి చెప్పారు. వన్యప్రాణులను వేటాడటం, విక్రయించడం చట్టప్రకారం నేరమని హెచ్చరించారు. -
మద్యం మత్తులో హత్యాయత్నం
తణుకు అర్బన్: మద్యం మత్తులో ఉన్న యువకుడు కత్తితో భార్యభర్తలపై దాడికి పాల్పడిన ఘటన తణుకులో గురువారం రాత్రి చోటుచేసుకుంది. పట్టణ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తణుకు కొమ్మాయిచెర్వుగట్టు ప్రాంతంలో వినాయచవితి మహోత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న ఊరేగింపులో జరిగిన వాగ్వాదంలో చుక్కా సంజయ్ అనే యువకుడు స్థానికంగా నివసిస్తున్న కొలుసు శంకర్, నాగమణి దంపతులపై కత్తితో విచక్షణారహితంగా దాడిచేశాడు. గత పదేళ్లుగా తణుకులో కొబ్బరికాయల వ్యాపారం చేసుకుంటున్న శంకర్కు, సంజయ్ పాత గొడవలు ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఫూటుగా మద్యం సేవించి ఉన్న సంజయ్ బాఽధితుడి ఇంట్లోకి చొరబడి కత్తితో దాడిచేసినట్లుగా తెలుస్తోంది. తీవ్రంగా గాయపడ్డ భార్యాభర్తలిద్దరినీ స్థానికులు తణుకు జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించగా వైద్యసేవలందిస్తున్నారు. దాడికి పాల్పడిన యువకుడు పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. పట్టణ ఎస్సై శ్రీనివాస్ కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. నూజివీడు: విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి మోసం చేశారంటూ నూజివీడుకు చెందిన అరిగెల అమృతవల్లి చేసిన ఆరోపణలు అవాస్తవమని కే సంధ్య, ఆమె సోదరుడు కే శ్రీకాంత్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. మా తల్లి ఇంట్లో గతంలో కొన్ని నెలలు అమృతవల్లి పనిమనిషిగా పనిచేసిందని, ఆ సమయంలో తన ఆర్థిక ఇబ్బందులు చెప్పి విదేశాల్లో ఏమైనా అవకాశాలుంటే తనకు సాయం చేయాలని కోరిందన్నారు. దీంతో తమ స్నేహితుడు డాక్టర్ సమీర్ ఖతార్లో ఉంటే ఆయన ద్వారా సాయం చేయడమే కాకుండా శ్రీకాంత్ సైతం కొంత డబ్బును ఆమెకు చేబదులుగా ఇచ్చాడన్నారు. దీంతో ఖతార్ వెళ్లిన ఆమె రెండు నెలల పాటు అక్కడ పనిచేసి జీతం కూడా తీసుకుందన్నారు. అయితే వీసా మార్పిడి, వర్క్ పర్మిట్ వంటి అవసరమైన వాటిని అమృతవల్లి చేసుకోలేక తిరిగి ఇక్కడకు రావాల్సి వచ్చిందన్నారు. తిరుగు ప్రయాణం టిక్కెట్ కూడా సమీర్ కొని పంపించాడని, కానీ అమృతవల్లి మాత్రం నష్టపోయినట్లు నటిస్తూ, తప్పుడు ఆరోపణలతో బ్లాక్మెయిల్ చేస్తూ డబ్బు దండుకోవడానికి చూస్తోందన్నారు. ఆమె ఆరోపణలకు మా కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. తణుకు జిల్లా కేంద్ర ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శంకర్, నాగమణి -
గంజాయి కేసులో ఆరుగురి అరెస్ట్
ఏలూరు టౌన్: గంజాయి విక్రయిస్తున్న నలుగురిని అరెస్ట్ చేయగా, ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్నట్లు ఏలూరు త్రీటౌన్ సీఐ కోటేశ్వరరావు తెలిపారు. ఏలూరు త్రీటౌన్ పోలీస్స్టేషన్లో ఆయన ఎస్సై పీ రాంబాబుతో కలిసి వివరాలు వెల్లడించారు. ఈనెల 3వ తేదీన ఏలూరు మినీబైపాస్ రోడ్డులో గ్రాండ్ కృష్ణ ఫంక్షన్ హాల్ ప్రాంతంలో గంజాయి విక్రయిస్తున్నారని సమాచారం మేరకు ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ ఆదేశాలతో ఏలూరు డీఎస్పీ డీ.శ్రావణ్కుమార్ పర్యవేక్షణలో సిబ్బందితో దాడులు చేశామన్నారు. ఈ దాడుల్లో నిందితులు ఏలూరుకు చెందిన విష్ణుశెట్టి సత్యరూప్కుమార్ అలియాస్ సతీష్, కొమ్మిన మణికంఠ అలియాస్ సర్థార్పాండా, తమ్మిశెట్టి రామ్చరణ్, అల్లంపల్లి రాజేష్ తోపాటు మరో ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. వారివద్ద నుంచి సుమారు మూడున్నర కిలోల గంజాయి, రెండు మోటారు సైకిళ్లు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. నిందితులపై ఏలూరు మండలంలోని ఆయా పోలీస్స్టేషన్లలో ఇప్పటికే వివిధ కేసులు నమోదయ్యాయని చెప్పారు. -
మురళీకృష్ణంరాజును ఫోన్లో పరామర్శించిన వైఎస్ జగన్
సాక్షి, పశ్చిమగోదావరి: నర్సాపురం పార్లమెంట్ వైఎస్సార్సీపీ పరిశీలకులు మురళీకృష్ణంరాజును ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫోన్లో పరామర్శించారు. 86 ఏళ్ల వయసున్న మురళీకృష్ణంరాజు తండ్రి రామరాజుపై తప్పుడు కేసు పెట్టడం దారుణమని వైఎస్ జగన్ అన్నారు. అక్రమ కేసులపై భయపడొద్దని.. పార్టీ అండగా ఉంటుందని వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు.పింఛన్లు పంపిణీ సందర్భంగా ఈనెల 1వ తేదీన ధర్మవరంలో మురళీకృష్ణంరాజు నివాసానికి వెళ్ళిన సచివాలయం మహిళ సంరక్షణ కార్యదర్శి రాధిక.. జగన్నాధరాజు అనే పింఛన్ దారుని చిరునామా కోసం రామరాజును ఆమె వివరాలు అడిగారు. ఈ సమయంలో తనను 86 ఏళ్ల రామరాజు లైగింకంగా వేధించారని ఆరోపిస్తూ ప్రత్తిపాడు పీఎస్లో ఆమె ఫిర్యాదు చేశారు. రాధిక ఫిర్యాదు మేరకు ఆగమేఘాలపై పోలీసులు లైగింక వేధింపులు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. -
స్మార్ట్ పరేషన్
కూటమి ప్రభుత్వం కొత్తగా అందిస్తున్న స్మార్ట్ రేషన్కార్డులు ఇంకా ఇవ్వకపోవడంతో చాలా మంది లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. పాత రేషన్ కార్డుల స్థానంలో క్యూఆర్ కోడ్తో ఉన్న కొత్త రేషన్ కార్డుల పంపిణీ కొందరికే అందడంతో తమ కార్డు ఉందో లేదోనని లబ్ధిదారులు ఎదురుస్తున్నారు. ● మందకొడిగా స్మార్ట్ కార్డుల పంపిణీ.. ● గందరగోళంలో లబ్ధిదారులు ● కొందరికే అందడంతో ఆందోళన ● పంపిణీలో పర్యవేక్షణ లోపం గురువారం శ్రీ 4 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025తణుకు అర్బన్: రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు విడతల్లో స్మార్ట్ కార్డుల పంపిణీలో భాగంగా మొదటి దఫాలో గత నెల 25 నుంచి పశ్చిమ గోదావరి జిల్లాలో స్మార్ట్ కార్డుల పంపిణీని కూటమి నేతలు అట్టహాసంగా మొదలుపెట్టారు. మొదట ఎమ్మెల్యేలు, ఆ తరువాత వార్డు నాయకులు ఈ స్మార్ట్ కార్డుల పంపిణీలో భాగంగా లబ్ధిదారులతో ఫొటోలు తీసుకుని సోషల్ మీడియాలో విస్త్రతంగా ప్రచారం చేసుకున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా స్మార్ట్ కార్డులు పంపిణీ మాత్రం మందకొడిగా సాగుతుండడంతో తమ కార్డు ఉందో తెలియని స్థితిలో లబ్ధిదారులు ఉన్నారు. ఒక ఇంటికి స్మార్డ్ కార్డు ఇవ్వగా, పక్కనే ఉన్న మరో ఇంట్లో కార్డు అందకపోవడంతో లబ్ధిదారులు బెంబేలెత్తిపోతున్నారు. ప్రచారం చేసుకున్నంత వేగంగా కార్డులు పంపిణీ చేయకపోవడంతో ఏర్పడిన గందరగోళంలో లబ్ధిదారులు చౌక డిపోలు, గ్రామ, వార్డు సచివాలయాలు, తహసీల్దారు కార్యాలయాలు, మున్సిపల్ కార్యాలయాలకు పరుగులు పెడుతున్నారు. రేషన్ కార్డులో ఉన్న నంబరు ప్రకారం ఆయా రేషన్ డిపోల్లో ఇస్తారని అధికారులు చెబుతుండడంతో ఆ నంబరు రేషన్ డిపోల వద్దకు వెళ్లేందుకు లబ్ధిదారులు మల్లగుల్లాలు పడుతున్నారు. స్మార్ట్ కార్డుల గందరగోళం : స్మార్ట్ కార్డులు ఇంటి గుమ్మంలోకి ఇవ్వాలని మున్సిపల్ కమిషనర్లు ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఇంటి గుమ్మంలోకి కార్డులు రాకపోవడంతో లబ్ధిదారులు గందరగోళ పరిస్థితుల్లో ఉన్నారు. గతనెల 31 వరకు సచివాలయాల్లో కార్డులు ఉన్నప్పటికీ కార్డులు అందజేయడంలో సంబంధిత సిబ్బంది విఫలమయ్యారు. సచివాలయాలకు వస్తున్న లబ్ధిదారులకు కార్డులు రేషన్డిపోల వద్ద ఉన్నాయని సచివాలయ సెక్రటరీలు చెబుతున్నారు. ప్రభుత్వం వచ్చిన రోజు నుంచి ఏదోక రకంగా ఇబ్బందులు వస్తున్నాయని, ఇప్పటికే దివ్యాంగ పింఛన్లలో అధిక శాతం అనర్హులుగా చూపించారని ఈ కార్డులు కూడా ఏమవుతాయోనని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం అందించే ప్రతి పథకంలోను రేషన్ కార్డునే ప్రామాణికంగా తీసుకునే పరిస్థితుల్లో స్మార్ట్ కార్డులు అందకపోతే ఎలా అని తలపట్టుకుంటున్నారు. లబ్ధిదారులకు బయో మెట్రిక్ వేలిముద్ర, ఫేస్, ఐరిస్, ఆధార్ ఓటీపీ ఆప్షన్లలో ఒక దానిని ఎంచుకుని స్మార్ట్ కార్డు అందచేయాలి. తలపట్టుకుంటున్న రేషన్ డీలర్లు స్మార్ట్ రేషన్ కార్డులు రేషన్ డీలర్లు ఇవ్వాలని అధికారులు చెబుతున్నారని అయితే రేషన్ సరుకులే ఇవ్వాలా, కార్డులు వెతుక్కుని కార్డులే ఇవ్వాలా అని రేషన్ డీలర్లు తలపట్టుకుంటున్నారు. ఇప్పటికే రేషన్ కోసం లబ్దిదారులు క్యూలో ఉంటున్నారని, స్మార్ట్ కార్డులు కూడా ఇవ్వాలంటే చాలా ఇబ్బందిగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.గత ప్రభుత్వ హయాంలో సంక్షేమానికి సంబంధించిన అన్ని సేవలు ఇంటి గుమ్మంలోకే అందించేవారు. వలంటీర్లు ఇంటి గడపలోకి వెళ్లి దరఖాస్తులు సేకరించడంతోపాటు తిరిగి ధ్రువ పత్రాలను ఇంటికెళ్లి అందజేసేవారు. దీంతో ఎలాంటి జాప్యం లేకుండా గంటల వ్యవధిలోనే ప్రతి సేవ ఇంటికి చేరేది. స్మార్ట్ కార్డు పంపిణీకి సంబంధించి గతనెల 25న ప్రారంభించి పది రోజులు గడిచినా ఇంతవరకు జిల్లాలో 20 శాతం కూడా కార్డులు పంపిణీ చేయలేని దుస్థితి. ఇంటికెళ్లి కార్డులు పంపిణీ చేయాలని కొన్ని మున్సిపాలిటీల్లో కమిషనర్లు ఆదేశాలిస్తున్నా కొందరు సెక్రటరీలు ఆయా సచివాలయాలకు రావాల్సిందేనని చెబుతున్నారు. సచివాలయాలకు వెళ్లినా సదరు సీటులో సంబంధిత సెక్రటరీ ఉండకపోవడం, ఫీల్డుకు వెళ్లారనే సమాధానాలతో లబ్ధిదారులకు చిర్రెత్తుకొస్తుంది. ఒకవేళ వృద్ధులు వెళ్లలేని స్థితిలో ఉండి వారి తరఫున ఎవరైనా వెళ్లినా ఆధార్ ఓటీపీ ద్వారా ఇచ్చే అవకాశం ఉన్నప్పటికీ లబ్ధిదారులు రావాల్సిందేనని గుర్రుగా చెబుతున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇళ్లకే పరిమితమైన వృద్ధులు, వికలాంగులు సైతం స్మార్ట్ కార్డుల కోసం ఎక్కడికి వెళ్లాలో తెలియక కార్డు కోసం ఎదురుచూపులు చూస్తున్నారు.పశ్చిమగోదావరి జిల్లాలో గతనెల 25న కార్డుల పంపిణీ ప్రారంభించగా జిల్లాలో 5,61,408 రేషన్ కార్డులకు గాను 1,10,599 కార్డులు మాత్రమే బుధవారం సాయంత్రానికి పంపిణీ చేశారు. ఇంకా 4,50,809 కార్డులు పంపిణీ చేయాల్సి ఉంది. ఏలూరు జిల్లాలో గతనెల 30 నుంచి కార్డుల పంపిణీ ప్రారంభించగా 6,25,666 కార్డులకు 80,583 కార్డులు మాత్రమే పంపిణీ చేశారు. మిగిలిన 5,45,083 కార్డులు పంపిణీ చేయాల్సి ఉంది. స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ గందరగోళంగా ఉంది. కొంతమందికి ఇస్తుండగా, మరికొందరికి ఇవ్వకపోవడంతో గందరగోళంగా మారింది. సచివాలయాలు, రేషన్ డిపోల చుట్టూ తిరగలేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కార్డులు ఎక్కడ ఇస్తారనే సమాచారం కూడా అధికారులు ఇవ్వడంలేదు. – ఉండవల్లి సురేష్, మండపాక -
సర్వీస్ రోడ్ల కోసం రాస్తారోకో
టి.నరసాపురం: టి.నరసాపురం మండల పరిధిలో గ్రీన్ ఫీల్డ్ హైవే ఎక్కేందుకు దిగేందుకు సర్వీసు రోడ్లు ఏర్పాటు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం గ్రీన్ ఫీల్డ్ హైవేకు సర్వీస్ రోడ్లు ఇవ్వాల్సిందేనని భూ నిర్వాసిత రైతుల పోరాట కమిటీ, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో టి.నరసాపురం వద్ద రైతులు రాస్తారోకో నిర్వహించారు. నిర్వాసిత రైతుల సమస్యల పరిశీలనకు జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు తహసీల్దార్, హైవే అధికారులు, రోడ్డు నిర్మాణ సంస్థ ప్రతినిధులు పరిశీలనకు వచ్చారు. ఈ సందర్భంగా టి.నరసాపురం, గురువాయిగూడెం, ఏపుగుంట, మధ్యాహ్నపువారి గూడెం, వెంకటాపురం, బొర్రంపాలెం తదితర గ్రామాల వద్ద భూ నిర్వాసిత రైతులు తమ సమస్యలను ఏకరువు పెట్టారు. సమస్యలు రైతులు చెప్పడంతో నివేదికను కలెక్టర్కు పంపిస్తామని చెప్పారు. రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె. శ్రీనివాస్, రైతు పోరాట కమిటీ నాయకులు దేవరపల్లి సత్యనారాయణ, వెదుళ్ళ నాగేశ్వరరావు, లింగారెడ్డి శ్రీనివాస్, నిమ్మగడ్డ వెంకటేశ్వరరావు, బొంతు మురళి తదితరులు మాట్లాడుతూ సర్వీస్ రోడ్లు గ్రావెల్ రోడ్లుగా నిర్మించి ఇస్తామన్న హామీలు అమలు చేయకపోవడం వల్ల తమ పొలాలకు వెళ్లే మార్గాలు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. సర్వీస్ రోడ్డు మట్టి రోడ్డు కావడంతో దిగుబడిపోయి నానా తంటాలు పడాల్సి వస్తోందన్నారు. సర్వీస్ రోడ్ లో మొక్కలు వేయవద్దని డిమాండ్ చేశారు. టి.నరసాపురం 112వ అండర్ పాస్ వద్ద సర్వీస్ రోడ్ గుండా వెళ్లే అవకాశం లేకుండా పోయిందన్నారు. -
అక్రమ లేఅవుట్కు మున్సిపల్ పైప్లైన్
వైఎస్సార్సీపీ నాయకుల ధ్వజంభీమవరం: భీమవరం పట్టణ ప్రజలకు సక్రమంగా తాగునీరు అందించకుండా పక్క నియోజకవర్గంలోని అక్రమ లేఅవుట్లోని ఇళ్లకు మునిసిపాలిటీ నుంచి మంచినీటి సరఫరా చేయడం వెనుక అవినీతి భాగోతం ఉందని వైఎస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధి కామన నాగేశ్వరరావు ధ్వజమెత్తారు. విస్సాకోడేరు గ్రామంలో అక్రమంగా వేసిన పవన్ సుధ లేఅవుట్కు మునిసిపల్ వాటర్ సరఫరా చేయడాన్ని బుధవారం వైఎస్సార్సీపీ పట్టణ అధ్యక్షుడు గాదిరాజు రామరాజు నివాసంలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో తీవ్రంగా ఖండించారు. పట్టణంలో మంచినీటి సరఫరా జరగడం లేదని శివారు ప్రాంతాల ప్రజలు ఆందోళన చెందుతుంటే.. అక్రమ లేఅవుట్కు నీటి సరఫరాకు పది అంగుళాల పైప్లైన్ వేయడం అన్యాయమన్నారు. విస్సాకోడేరు పంచాయతీ నుంచి మంచినీటి పైప్లైన్కు దరఖాస్తు చేయగా అక్రమ లేఅవుట్ అంటూ నిరాకరించారని తెలిపారు. అయితే మునిసిపాల్టీ నుంచి ఎవరి ప్రయోజనాలకోసం ప్రత్యేక పైప్లైన్ వేశారని దీనికి వెనుక అవినీతి చోటుచేసుకుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని నాగేశ్వరరావు అన్నారు. విస్సాకోడేరు లేఅవుట్కు నీరు ఇవ్వడం వల్ల పట్టణంలోని మారుతీనగర్, కముజువారిపాలెం, బొక్కావారి పాలెం, నెహ్రుకాలనీ తదితర ప్రాంతాలకు మరింత మంటినీటి ఇబ్బందులు ఏర్పడే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ నాయకులు పేరిచర్ల సత్యనారాయణరాజు, గాదిరాజు రామరాజు, కోడే యుగంధర్, పాలవెల్లి మంగ, సుంకర బాబూరావు మాట్లాడుతూ గ్రామాల్లో రక్షిత మంచినీటి పథకాలుండగా మునిసిపాల్టీ నుంచి పైప్లైన్ ఇవ్వడానికి సమాధానం ఇవ్వాలన్నారు. మునిసిపల్ అధికారులు ఏ అధికారంతో పైప్లైన్ వేశారని నిలదీశారు.విస్సాకోడేరులో లేఅవుట్ ప్రాంతానికి ఇచ్చిన పైప్లైన్పై విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం పైప్లైన్ వేసిన ప్రాంతాన్ని సందర్శించి ఆందోళన నిర్వహించారు. -
మా గొంతెండుతుంటే నాన్ లేఅవుట్కు నీళ్లా?
● మున్సిపాలిటీ నీటి కోసం పంచాయతీ తీర్మానం చేయించిన డిప్యూటీ స్పీకర్ ● పట్టించుకోని ఎమ్మెల్యే అంజిబాబు ● జేసీని పక్కదోవ పట్టించిన అధికారులు భీమవరం(ప్రకాశం చౌక్): భీమవరం పట్టణ ప్రజలు మంచినీటి సమస్యతో సతమతం అవుతుంటే పక్కా నియోజకవర్గంలోని నాన్ లేవుట్కు మున్సిపాలిటీ నీళ్ల తరలింపు వివాదాస్పదంగా మారింది. ఉన్నత అధికారులను మున్సిపాలిటీ సిబ్బంది పక్కదోవ పట్టించి తీర్మానం చేయించి నీళ్లను ఉండి నియోజకవర్గంలోని విస్సాకోడేరులోని పవన్ సుధ నాన్ లేవుట్కు పైపులైన్ వేసి మరి సరఫరా చేస్తున్నారు. లేవుట్లో మొత్తం 50 కుటుంబాలు ఉండగా ఫీజు కట్టిన 32 మంది లబ్ధిదారులకు నీళ్ల సరఫరా జరుగుతోంది. నాన్ లేవుట్కు పైపులైన్ తీర్మానం సూచించిన రఘురామకృష్ణరాజు పవన్ సుధా నాన్ లేవుట్కు విస్సాకోడేరు పంచాయతీ నుంచి మంచినీటి పైపులైన్ వేయడం, నీటి సరఫరాకు రూ.20 లక్షలు ఖర్చవుతుందని, అది సాధ్యం కాదని పంచాయతీ తీర్మానంలో పేర్కొన్నారు. భీమవరం మున్సిపాలిటీ నుంచి నీళ్లు సరఫరా చేసే పైపులైన్ నుంచి పవన్ సుధా లేవుట్ ఆర్చి వరకు పైపులైన్ వేయాలని ఉండి ఎమ్మెల్యే సూచించనట్లు పంచాయతీ తీర్మానంలో పేర్కొని భీమవరం మున్సిపల్ కమిషనర్కు తీర్మానం కాపీ పంపించారు. ఈ తీర్మానంలోనే పంచాయతీ నాన్ లేవుట్ అని రాశారు. అలాంటి నాన్ లేవుట్కు ఉండి ఎమ్మెల్యే నీటి సౌకర్యం కల్పించమని ఎలా సిఫార్సు చేస్తారని ప్రశ్నిస్తున్నారు. ప్రిన్సిపాల్ సెక్రటరీ నుంచి అర్డర్ నాన్ లేవుట్కు మున్సిపాలిటి నీళ్లు సరఫరా చేయడానికి ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్ ఆదేశాలు జారీచేశారు. భీమవరం మున్సిపల్ కమిషనర్కు ఆర్డర్ జారీ చేయించడంలో ఉండి ఎమ్మెల్యే కీలక పాత్ర పోషించారని ఆరోపణలు ఉన్నాయి. అనుమతులు లేవు నాన్ లేవుట్కు నీటి సరఫరాకు మున్సిపల్ అధికారులు నిబంధనల ప్రకారం పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ నుంచి అనుమతులు తీసుకోలేదు. ఇదే విషయంపై పబ్లిక్ హెల్త్ ఇంజినీరింగ్ అధికారి విజయ్ను వివరణ కోరగా తమ డిపార్ట్మెంట్ నుంచి పవన్ సుధా ఎన్క్లేవ్కు ఎలాంటి అనుమతులు తీసుకోలేదని చెప్పారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నీటి సరఫరా చేస్తున్నామని మున్సిపల్ కమిషనర్, వాటర్ సరఫరా విభాగం అధికారులు చెబుతున్నారు. జేసీని తప్పుదోవ పట్టించారు మున్సిపాలిటీ నీటి సరఫరాపై కౌన్సిల్ తీర్మానం పంపించే క్రమంలో మున్సిపాలిటి ప్రత్యేక అధికారిగా జాయింట్ కలెక్టర్ను మున్సిపల్ అధికారులు తప్పుదోవ పట్టించారు. తీర్మానంలో ఎక్కడ కూడా నాన్ లేవుట్ అని పేర్కొకుండా లేవుట్ ఆర్చి వరకు పైపులైన్ను ఉండి ఎమ్మెల్యే పంచాయతీ తీర్మానంలో సూచించినట్లు పేర్కొన్నారు. ఎమ్మెల్యే ఎందుకు పట్టించుకోరు భీమవరం పట్టణంలో మంచినీటి సమస్య ఉంది. అలాంటిది పక్క నియోజవర్గంలోని ఒక నాన్లేవుట్కు మున్సిపాలిటీ నీటి సరఫరా చేస్తుంటే స్థానిక ఎమ్మెల్యే అంజిబాబు పట్టించుకోకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. చివరి ప్రాంతాలకు ట్యాంకర్లతో నీటి సరఫరా చేస్తున్న విషయం ఎమ్మెల్యే అంజిబాబుకు తెలుసు. వేసవిలో రెండు పూటల నీటి సరఫరా కష్టం అవుతుందని తెలిసి కూడా నాన్లేవుట్కు మున్సిపాలిటీ నీటి సరఫరాకు ఎందుకు అడ్డుకోలేదని ప్రశ్నిస్తున్నారు. మండిపడుతున్న పట్టణ వాసులు పక్క నియోజవర్గంలోని నాన్ లేవుట్కు సరఫరా చేయడంపై భీమవరం పట్టణ వాసులు మండిపడుతున్నారు. భీమవరంలో పైపులైన్ ఉన్న కొన్ని ప్రాంతాలకు నీళ్లు రావు. చివ రిప్రాంతాలకు నీళ్లు అందవు. అలాంటిది భీమవరం నీళ్లను అక్రమ లేవుట్లకు సరఫరా చేయడం దారుణం అంటున్నారు. -
జలజీవన్ మిషన్పై సమీక్ష
భీమవరం (ప్రకాశంచౌక్): జిల్లాలో జలజీవన్ మిషన్ పనులు వేగవంతం చేయడానికి అవసరమైన చర్యలు చేపట్టామని కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. స్వచ్ఛ భారత్ మిషన్–జల జీవన్ మిషన్ అమలు, నిర్వహణపై బుధవారం ఢిల్లీ నుంచి కేంద్ర సెక్రటరీ రాష్ట్రంలోని కలెక్టర్లతో వీడియో కాన్ఫరెనన్స్ నిర్వహించారు. కలెక్టరేట్ నుంచి కలెక్టర్తో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు. జల జీవన్ మిషన్, స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా జిల్లాలో జరుగుతున్న పనులకు సంబంధించి కలెక్టర్ వివరించారు. భీమవరం: జిల్లా కేంద్రం ఏర్పాటుపై కూటమి పార్టీల నాయకుల వైఖరి ఏంటని సీపీఎం జిల్లా కార్యదర్శి జెఎన్వీ గోపాలన్ బుధవారం ఒక ప్రకటనలో ప్రశ్నించారు. మూడేళ్ల క్రితం నాటి కలెక్టరేట్ వ్యవహారం అంశాన్ని అధికార పార్టీల నాయకులు ఎందుకు వివాదం చేస్తున్నారని గోపాలన్ ప్రశ్నించారు. ఒక్కొ పార్టీ నాయకుడు ఒక్కో చోట, ఒక్కో మాట చెప్పి ప్రజలను మభ్య పెట్టడం సరికాదన్నారు. ఎన్నికల్లో ఎన్నో వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన కూటమి పాలనలో ఇంకా అనేక వాగ్దానాలు అమలు చేయా ల్సి ఉండగా వాటి అమలు కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారని హామీల అమలుకోసం ఆందోళనలు చేయకుండా ప్రజల దృష్టి మళ్లించేందుకే ఇలాంటి వివాదాస్పద అంశాలను సృష్టిస్తున్నారనే అనుమానం వ్యక్తమవుతుందన్నారు. భీమవరం: పట్టణంలోని చింతలపాటి బాపిరాజు ఉన్నత పాఠశాల్లో పీఈటీగా పనిచేస్తున్న గొట్టు ముక్కల పూర్ణ చంద్ర శేఖరరాజు రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికయ్యారు. 27 ఏళ్లుగా ఆయన ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతున్నారు. 2008లో జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును అందుకున్నారు. 2011లో ఆంధ్రా యూనివర్సిటీ ఉత్తమ పీఈటీ అవార్డును అందించింది. వేండ్ర పాఠశాల ఉపాధ్యాయుడికి అవార్డు వీరవాసరం: వేండ్ర జెడ్పీ ఉన్నత పాఠశాల తెలుగు ఉపాధ్యాయుడు పంపన సాయిబాబు రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికయ్యారు. 1985లో ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడిగా తొలిసారి బాధ్యతలు స్వీకరించారు. తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్, ఆంధ్ర బుక్ ఆఫ్ రికార్డ్, భారత్ బుక్ ఆఫ్ రికార్డులో స్థానం పొందారు. ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణ బాధ్యత తీసుకోవాలంటూ కవితలు, గేయాలు రాసి ప్రజలను చైతన్యపర్చారు. భీమవరం (ప్రకాశంచౌక్): పట్టాదార్ పాస్ పుస్తకాలను పంపిణీకి సిద్ధం చేయాలని జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి అన్నారు. బుధవారం జాయింట్ కలెక్టర్ చాంబర్ నుంచి వివిధ రెవెన్యూ అంశాలపై జిల్లాలోని రెవెన్యూ డివిజన్ అధికారులు, తహసీల్దారులతో జాయింట్ కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గతంలో రీ సర్వే పూర్తయిన గ్రామాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి పట్టాదార్ పాస్ పుస్తకాలను తనిఖీ చేసి ఫోటోలు, తప్పులు ఉన్న పాస్ పుస్తకాలు సవరించి పంపిణీకి సిద్ధం చేయాలని తహసీల్దార్లను ఆదేశించారు. భీమవరం (ప్రకాశంచౌక్): జిల్లా రవాణా అధికారిగా కె.ఎస్.ఎం.వి.కృష్ణారావు పదవీ బాధ్యతలు చేపట్టారు. బుధవారం కలెక్టరేట్ చాంబర్లో కలెక్టర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. కృష్ణారావు ఏలూరు జిల్లా నుంచి బదిలీపై వచ్చారు. ఇంతకుముందు డీటీఓగా పనిచేసిన ఉమామహేశ్వరరావు గత నెల 31న పదవీ వివరణ చేశారు. భీమవరం: జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారిణిగా ఎన్.వి.అరుణ్ కుమారి నియమితులయ్యారు. ప్రకాశం జిల్లా కొండెపిలో సహాయ సాంఘిక సంక్షేమ అధికారిగా పనిచేస్తున్న ఆమె పదోన్నతిపై పశ్చిమగోదావరి జిల్లాకు వచ్చారు. -
చిచ్చుపెడతారా ?
ప్రశాంత వాతావరణంలో టీడీపీ శ్రేణులు చిచ్చు పెడతారా? కామిరెడ్డి నానిపై దాడి దుర్మార్గం. దాడులు, అక్రమ కేసులు పెట్టి ఏం చేయాలని సంకేతాలు ఇస్తున్నారు. ఎందుకు ఈ విధానాన్ని అవలంభిస్తున్నారు. గత ఐదేళ్లలో శిలాఫలకాలు, హోర్డింగులు మేం ధ్వంసం చేశామా? పోలీసులు చర్యలు తీసుకోవాలి. – కారుమూరి సునీల్ కుమార్ ఏలూరు పార్లమెంట్ ఇన్చార్జ్ ప్రజలు అధికారం ఇచ్చింది అభివృద్ధి, సంక్షేమం చేసి సమస్యలు పరిష్కరించాలని కానీ దాడులు, కొట్లాటలు చేయడానికి కాదు. ఇలాంటి చర్యలు సరికాదు. గతంలో ఎప్పుడు ఈ పరిస్థితులు లేవు. ఈ ఘటనపై పోలీసులు స్పందించాలి. బాధితులపై చర్యలు తీసుకోవాలి. – కొఠారు అబ్బయ్యచౌదరి, మాజీ ఎమ్మెల్యే -
ఎరువుల దుకాణాలపై విజిలెన్స్ దాడులు
తణుకు అర్బన్ : తణుకు మండలంలోని దువ్వ గ్రామంలోని ప్రైవేటు ఎరువుల దుకాణాలపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, వ్యవసాయ అధికారులు బుధవారం దాడులు నిర్వహించారు. తనిఖీల్లో దుకాణాల్లో ఎరువులకు సంబంధించి రిజిస్టరులో ఉన్న గణాంకాలకు గ్రౌండ్ బ్యాలెన్స్లో 17 బస్తాల యూరియా వ్యత్యాసం ఉండటంతో 1.395 మెట్రిక్ టన్నుల యూరియాను సీజ్చేసి దుకాణదారుడిపై 6ఏ కేసు నమోదు చేయాల్సిందిగా సూచించారు. కార్యక్రమంలో విజిలెన్స్ ఏవో జి. మీరయ్య, విజిలెన్స్ ఎస్సై సీహెచ్ రంజిత్ కుమార్, వ్యవసాయాధికారి కె.రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు. ఏలూరు(మెట్రో): జిల్లాలో యూరియా సరఫరా విషయంలో ఎలాంటి సమస్య లేదని, యూరియా సమృద్ధిగా ఉందని జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఘంటా పద్మశ్రీ ఓ ప్రకటనలో తెలిపారు. 2025–26లో ఇప్పటివరకు 28 వేల టన్నులు సరఫరా చేశామని, రాబోయే 3 నెలల్లో మిగిలిన 3 వేల మెట్రిక్ టన్నులు కూడా త్వరితగతిన అందుబాటులోకి వస్తాయన్నారు. ద్వారకాతిరుమల: కాణిపాకంలో జరుగుతున్న స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని చినవెంకన్న దేవస్థానం తరపున ఆలయ ఈఓ ఎన్వీ సత్యన్నారాయణ మూర్తి దంపతులు బుధవారం గణేషుడికి పట్టువస్త్రాలను సమర్పించారు. ముందుగా శ్రీవారి దేవస్థానం అర్చకులు, పండితులు, ఈఓ దంపతులు కాణిపాకం ఆలయానికి చేరుకున్నారు. అనంతరం అక్కడి దేవస్థానం ఈఓ కిషోర్ దంపతులతో కలసి, సత్యన్నారాయణ మూర్తి దంపతులు అర్చకులు, పండితుల వేద మంత్రోచ్ఛరణ నడుమ పూలు, పండ్లు, పట్టువస్త్రాలను శిరస్సుపై పెట్టుకుని తీసుకెళ్లి వరసిద్ధి వినాయకుడికి సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈఓ రమణరాజు, సూపరింటెండెంట్ హయగ్రీవాచార్యులు తదితరులున్నారు. -
మరోసారి న్యాయం గెలిచింది
● యాసిడ్ దాడి కేసులో ముగ్గురుముద్దాయిలకు కఠిన శిక్షలు ● రెండు జీవిత ఖైదులు, పదేళ్ల కఠిన కారాగారం, జరిమానా ఏలూరు టౌన్: రాష్ట్రంలోనే సంచలనం సృష్టించిన యాసిడ్ దాడి కేసులో మరోసారి ప్రత్యేక న్యాయస్థానం సంచలన తీర్పును వెలువరించింది. ముగ్గురు ముద్దాయిలకు రెండు జీవిత ఖైదులతోపాటు మరో పదేళ్ల కఠిన కారాగార శిక్ష, యాసిడ్ విక్రయించిన వ్యక్తికి జరిమానా విధించగా, మరో ఇద్దరిని నిర్ధోషులుగా ప్రకటిస్తూ ఆదేశాలు జారీ చేశారు. 2023లో ప్రత్యేక న్యాయస్థానంలో నిందితులకు శిక్షలు విధించగా, హైకోర్టును ఆశ్రయించి, తీర్పును సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆ తీర్పును రద్దు చేస్తూ మరోసారి ట్రయల్ నిర్వహించాలని ఆదేశించింది. రెండవ సారి క్షుణ్ణంగా సాక్షాధారాలను, సాక్షులను విచారించిన ప్రత్యేక న్యాయమూర్తి బుధవారం తీర్పు వెలువరించారు. ఈ నేపథ్యంలో ఏలూరు జిల్లా ఎస్పీ కేపీ శివకిషోర్ కేసు వివరాలను వెల్లడించారు. అసలేం జరిగిందంటే... ఏలూరు విద్యానగర్లో యడ్ల ఫ్రాన్సినా అనే మహిళ జూన్ 13 తేదీ 2023న రాత్రి 9గంటల సమయంలో డ్యూటీ ముగించుకుని ఇంటికి వస్తుండగా ముగ్గురు వ్యక్తులు ఆమైపె యాసిడ్ దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించగా పోలీస్ అధికారులు కృషితో నిందితులను 48 గంటల్లోపే పట్టుకున్నారు. ఏలూరు కొత్తగూడెంకు చెందిన బోడ నాగసతీష్, అతని స్నేహితులు ఏలూరు వైఎస్సార్ కాలనీకి చెందిన బెహర మోహన్, బూడిద ఉషాకిరణ్ను అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి నెట్టారు. యాసిడ్ కొనుగోలు చేసేందుకు సహకరించిన షేక్ కాజ్బాబు, యాసిడ్ విక్రయించిన కొల్లా త్రివిక్రమరావు, అతని వద్ద పనిచేస్తున్న వీడెలా సత్యనారాయణపైనా కేసు నమోదు చేశారు. ఐజీ జీవీజీ అఽశోక్కుమార్, అప్పటి జిల్లా ఎస్పీ దాసరి మేరీ ప్రశాంతి కేసును పరుగులు పెట్టించి నిందితులకు కేవలం మూడు నెలల వ్యవధిలోనే కఠిన శిక్ష విధించేలా చర్యలు చేపట్టారు. ప్రత్యేక న్యాయస్థానం కీలక తీర్పును వెలువరించింది. యాసిడ్ దాడికి పాల్పడిన ముగ్గురు వ్యక్తులకు రెండు జీవిత ఖైదులు విధించగా, ఏ5 నిందితుడికి జరిమానా విధించారు. తీర్పును సవాలు చేస్తూ హైకోర్టును ఆశ్రయించగా మరోసారి ట్రయల్ నిర్వహించారు. మరోసారి సంచలన తీర్పు రాష్ట్ర హైకోర్టు ఆదేశాలతో ట్రయల్ నిర్వహించిన ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి మరోసారి బుధవారం సంచలన తీర్పును వెలువరించారు. ఏ1 నుంచి ఏ3 వరకూ నిందితులైన బోడ నాగసతీష్, బెహర మోహన్, బూడిద ఉషాకిరణ్కు రెండు జీవిత ఖైదులతోపాటు, 10 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, జరిమానా విధించారు. ఏ5 నిందితుడు కొల్లా త్రివిక్రమరావుకు రూ.1500 జరిమానా, రూ.50 వేలు బాధితురాలి కుటుంబానికి పరిహారం చెల్లించాలని ఆదేశించారు. ఏ4, ఏ6 నిందితులు షేక్ కాజాబాబు, వీడెలా సత్యనారాయణపై నేరం రుజువు కాలేదని, నిర్ధోషులుగా ప్రకటించారు. మృతురాలికి న్యాయం చేసే లక్ష్యంతో... రాష్ట్ర హైకోర్టు ఆదేశాలతో స్పెషల్ జడ్జి ఫర్ ట్రయల్ ఆఫ్ కేసెస్ అండర్ ఎస్సీ, ఎస్టీ యాక్ట్, అదనపు జిల్లా సెషన్స్ జడ్జి పశ్చిమగోదావరి జిల్లా న్యాయమూర్తి మరోసారి ట్రయల్ నిర్వహించారు. సాక్షులను విచారించగా, పూర్తిస్థాయిలో సాక్షాధారాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఎస్పీ శివకిషోర్ కోర్టు మానిటరింగ్ సెల్కు సూచనలు చేయగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎన్.శారదమణి తనదైన శైలిలో వాదనలు వినిపించారు. మృతురాలికి న్యాయం చేసే లక్ష్యంతో పనిచేసిన పోలీసులందరినీ ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. -
ఉన్నత విద్యకు, ఉద్యోగాలకు గేట్ స్కోర్ కీలకం
నూజివీడు: నూజివీడు ట్రిపుల్ ఐటీలో ఇంజనీరింగ్ తృతీయ, ఆఖరి సంవత్సరం విద్యార్థులకు గేట్–2026 పరీక్షపై బుధవారం స్టూడెంట్ యాక్టివిటీ సెంటర్లో సెమినార్ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్ సెల్ ఆధ్వర్యంలో నిర్వహించగా, ప్రసిద్ధ కోచింగ్ సంస్థ ఏస్ ఇంజనీరింగ్ అకాడమీకి చెందిన సీనియర్ ఫ్యాకల్టీ ఎస్ మణిమోహన్ త్రినాథ్ వక్తగా పాల్గొని పలు విషయాలను విద్యార్థులకు వివరించారు. గేట్ పరీక్ష నిర్మాణం, సిలబస్, దానివల్ల కలిగే ప్రయోజనాలను తెలియజేశారు. ఐఐటీ, ఎన్ఐటీ వంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో ఉన్నత విద్యకు, అలాగే ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాలకు గేట్ స్కోర్ ఎంతో కీలకమని అవగాహన కల్పించారు. గేట్ పరీక్షకు సిద్ధమవుతున్న విద్యార్థుల కోసం ఆరో తేదీన బ్రాంచి వారీగా మాక్ పరీక్షను నిర్వహిస్తామన్నారు. దీని ద్వారా విద్యార్థులు తమ సన్నద్ధత స్థాయిని అంచనా వేసుకోవచ్చన్నారు. కార్యక్రమంలో సెంట్రల్ డీన్ అకడమిక్స్ దువ్వూరి శ్రావణి, ఈఐటీపీ డీన్ పీ శ్యామ్, డీన్ అకడమిక్స్ సాదు చిరంజీవి, సెంట్రల్ కోఆర్డినేటర్లు ఎం.రామకృష్ణ, వై ప్రియాంక పాల్గొన్నారు. -
హీల్ విద్యార్థులకు జాతీయస్థాయిలో పతకాలు
ఆగిరిపల్లి: జాతీయస్థాయిలో నిర్వహించిన పారా అథ్లెటిక్స్ పోటీల్లో మండలంలోని తోటపల్లికి చెందిన హీల్ పాఠశాల అంధ విద్యార్థులు పతకాలు సాధించారు. ఆగస్టు 29 నుంచి 31 వరకు మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో 14వ జాతీయ స్థాయి జూనియర్, సబ్ జూనియర్ పారా అథ్లెటిక్స్ పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో హీల్ పాఠశాలకు చెందిన అంధ విద్యార్థులు జూనియర్స్ విభాగంలో జాలా వరలక్ష్మి డిస్కస్ త్రోలో బంగారు పతాకం, లాంగ్ జంప్లో రజిత పతకం, చింతల ప్రవీణ్ పరుగు పందెం పోటీల్లో రజిత పతకం, సబ్ జూనియర్ విభాగంలో హరి లాంగ్ జంప్ , పరుగు పందెం పోటీల్లో రజిత పతకం, రోహిత్ జావాలిన్ త్రోలో రజిత పతకం సాధించారని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు యార్లగడ్డ లతా చౌదరి తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులను హీల్ సంస్థ సీఈఓ కూరపాటి అజయ్కుమార్ అభినందించారు. కార్యక్రమంలో పాఠశాల వైస్ ప్రిన్సిపాల్ మిక్కిలినేని హరీష్, అంధ పాఠశాల ఇన్చార్జి కే అబ్రహం, విద్యార్థులు పాల్గొన్నారు. -
మళ్లీ పెరుగుతున్న గోదావరి
కుక్కునూరు: గత రెండు రోజులుగా గోదావరి వరద ప్రవాహం తగ్గినట్టే తగ్గి మరలా పెరుగుతోంది. బుధవారం సాయంత్రం భద్రాచలం వద్ద 8 లక్షల క్యూసెక్కుల వరదతో 42.10 అడుగులకు చేరుకుంది. 43 అడుగులకు వరద ప్రవాహం చేరితే అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీచేయనున్నారు. అల్పపీడన ప్రభావంతో వర్షాలు కురుస్తుండడం వలన అటు గోదావరి, ఇటు శబరీ నదులతో విలీన మండలాల్లో వరద తీవ్రత పెరిగే అవకాశం ఉంటుందని విలీన మండలాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు పడతాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఈసారి వరద తీవ్రత ఎలా ఉంటుందోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. పోలవరంలో స్వల్పంగా తగ్గుతూ... పోలవరం రూరల్: గోదావరి వరద స్వల్పంగా తగ్గుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి కొండవాగుల నీరు నదిలోకి చేరుతుండటంతో వరద ప్రవాహం కొనసాగుతోంది. పోలవరం ప్రాజెక్టు స్పిల్వే వద్ద 32 మీటర్లకు నీటిమట్టం చేరుకుంది. స్పిల్వే 48 గేట్ల నుంచి దిగువకు 8.62 లక్షల క్యూసెక్కుల వరద నీరు చేరుతోంది. దిగువన వరద ఉధృతంగానే ప్రవహిస్తోంది. పట్టిసం శివక్షేత్రం చుట్టూ వరద నీరు తాకుతూ ప్రవహిస్తోంది. భద్రాచం వద్ద 48.80 అడుగులకు నీటిమట్టం చేరుకుంది. ఎగువ ప్రాంతాల నుంచి నదిలోకి నీరు చేరడంతో ప్రవాహం ఒకే విధంగా కొనసాగుతోంది. -
శ్రీవారి దర్శనం క్యూలైన్లలో పాము కలకలం
ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమల చిన వెంకన్న ఆలయంలో బుధవారం తాచు పాము కలకలం రేపింది. మధ్యాహ్నం 1 గంట సమయంలో స్వామివారి మహా నివేదన నిమిత్తం దర్శనాన్ని నిలుపుదల చేశారు. ఆ సమయంలో ఉత్తరం వైపు ఉన్న దర్శనం క్యూలైన్లలోకి ఒక పెద్ద తాచు పాము ప్రవేశించింది. దర్శనం నిలుపుదల కావడంతో క్యూలైన్లలో భక్తులెవరూ లేరు. దాంతో పెనుప్రమాదం తప్పింది. సెక్యూరిటీ సిబ్బంది ద్వారా సమాచారం అందుకున్న దేవస్థానం అధికారులు అక్కడికి చేరుకుని, గార్డెన్ సిబ్బందితో ఆ పామును చంపించారు. అనంతరం దాన్ని దూరంగా తీసుకెళ్లి పడేశారు. -
పోషకాహారం.. ఆరోగ్యానికి అనుసంధానం
కై కలూరు: పోషకాహారలోప నివారణ, ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రొత్సహించడానికి మహిళా అభివృద్ధి శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఈనెల 12 నుంచి అక్టోబరు 11 వరకు 8వ రాష్ట్రీయ పోషణ్ మాహ్ – 2025ను ప్రారంభించనున్నారు. పోషణ్ అభియాన్–మిషన్ పోషణ్ 2.0 పేరుతో నెల రోజుల పాటు అవగాహన కార్యక్రమాలను జిల్లాలో అమలు చేయనున్నారు. ఊబకాయం, చక్కెర, నూనె వినియోగం తగ్గించడం, బాల్య సంరక్షణ, తల్లి పేరు మీద ఒక చెట్టు, శిశువులు, చిన్న పిల్లలకు ఆహారం పెట్టడం, పోషకాహార సంరక్షణలో పురుషులు పాల్గొనడం వంటి 5 కార్యక్రమాలను అధికారులు అమలు చేయనున్నారు. ఏలూరు జిల్లాలో 10 ఐసీడీఎస్ ప్రాజెక్టులు ఉన్నాయి. వీటి పరిధిలో 2,225 అంగన్వాడీ కేంద్రాలు పనిచేస్తున్నాయి. గర్భిణులు 8,314 మంది ఉండగా వీరిలో 695 మందికి రక్తహీనత(ఎనిమియా) ఉన్నట్లు గుర్తించారు. అదే విధంగా జిల్లాలో 3–6 ఏళ్ల చిన్నారులు 49,048 ఉండగా, బాలామృతం తీసుకునే పిల్లలు 48,563 మంది ఉన్నారు. వీరిలో వయసుకు తగ్గ ఎత్తు లేని చిన్నారులు 14,281 మంది, ఎత్తుకు తగిన బరువు లేని పిల్లలు 4,141 మంది, వయసుకు తగిన బరువు లేని చిన్నారులు 6,705 మంది ఉన్నట్లు గుర్తించారు. ఇక బాలింతలు 5,758 ఉన్నారు. మహిళలు, పిల్లల్లో ఐరన్, అయోడిన్, విటమిన్ ‘ఏ’ లోపాలను సరిచేయడానికి మిషన్ పోషణ్ 2.0లో అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ప్రతి ఒక్కరికీ పోషకమైన ఆహారం ఆదాయం, సామాజిక స్థితికి సంబంధం లేకుండా అందరికీ ఆరోగ్యకర ఆహారం అందుబాటులో ఉంచాలని ప్రతి ఏటా సెప్టెంబరులో జాతీయ పోషకాహార వారోత్సవాలను 1982 నుంచి జరుపుతున్నారు. ప్రభుత్వం వీటిని నెల రోజుల పాటు నిర్వహిస్తుంది. ఏలూరు జిల్లాలో 16,37,418 మంది జనాభాలో 2,16,284 మందికి రక్తపోటు, 1,71,505 మందికి మధుమేహం ఉన్నట్లు గుర్తించారు. కోవిడ్–19 తదనంతర పరిస్థితుల్లో పోషకాహారం మరింతగా తీసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ పోషకాహార వినియోగంపై సూచనలు అందిస్తోంది. విటమిన్ ‘ఏ’ లేకపోవడం వల్ల మన దేశంలో ఏటా 30 వేల మంది కంటి చూపును కోల్పోతున్నారని అధ్యాయనాలు చెబుతున్నాయి. ఊబకాయం వల్ల టైప్ –2 డయాబెటీస్, ఫ్యాటీ లివర్ వ్యాధి, పిత్తాశయంలో రాళ్లు, కీళ్ల రుగ్మతలు, రక్తపోటు, కేన్సర్ వంటి వ్యాధులు వస్తున్నాయి. వీటి నివారణకు సరైన పోషకాహార వినియోగంపై అధికారులు అవగాహన కలిగించనున్నారు. షెడ్యూల్ ఇలా.. జిల్లా ఐసీడీఎస్ ఆధ్వర్యంలో నెల రోజులు జరిగే పోషకాహార కార్యక్రమాల్లో ఆరోగ్యం, విద్య, వ్యవసాయం, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీశాఖ పాలుపంచుకోనున్నాయి. షెడ్యూల్ విషయానికి వస్తే ఈనెల 12 నుంచి 25 వరకు ఊబకాయం, నూనె, చక్కరలు తగ్గించుకోవడం, ఈనెల 18 నుంచి 30 వరకు పోషణ్ బీ పధైబీ(పీబీపీబీ)పై అవగాహన, ఈనెల 12 నుంచి అక్టోబరు 11 వరకు ఒక చెట్టు పేరు, పర్యావరణం, ఈనెల 26 నుంచి అక్టోబరు 2 వరకు శిశువులు, చిన్న పిల్లలకు ఆహారం అందించడం, అక్టోబరు 3 నుంచి 11 వరకు పురుషులను భాగస్వాములను చేయడం వంటి కార్యక్రమాలు జరగనున్నాయి. అంగన్వాడీ కేంద్రాలు, పంచాయతీ భవనాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, పాఠశాలలు, కమ్యూనిటీ భవనాలలో వీటిని ఏర్పాటు చేయనున్నారు. పండ్లు, కూరగాయలు, తృణ ధాన్యాలు, ఫైబర్ కలిగినవి తీసుకోవాలి. రోజుకు 5 గ్రాముల కంటే తక్కువ ఉప్పు తీసుకోవడం వల్ల రక్తపోటు, గుండె జబ్బుల నుంచి రక్షణ పొందవచ్చు. పుట్టిన నాటి నుంచి 6 నెలల వయస్సు వరకు పిల్లలకు తల్లిపాలు మాత్రమే అందించాలి. 2 సంవత్సరాల పైనే తల్లి పాలు బిడ్డకు కొనసాగించవచ్చు. స్నాక్స్, చక్కెర, కొవ్వులు, ఉప్పు ఎక్కువగా ఉండే అహారం తీసుకోవద్దు. చేపలు, గుడ్లు, పాలు, మాంసం, కూరగాయలు, పండ్లు సమపాళ్లలో తీసుకోవాలి. కూరగాయలు, పండ్లను ఎక్కువగా ఉడికిస్తే విటమిన్లు కోల్పోతాయి. ప్రతి రోజూ వ్యాయామం, నడక, యోగసానాలు అలవర్చుకోవాలి. బలహీనంగా ఉన్న పిల్లలకు ప్రత్యేక పోషకాహారం అందించాలి. పోషణ్ అభియాన్ – మిషన్ పోషణ్ 2.0 ఈనెల 12 నుంచి అక్టోబరు 11 వరకు కార్యక్రమాలు 5 అంశాలపై రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన సమావేశాలు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఈనెల 12 నుంచి అక్టోబరు 11 వరకు పోషణ్ అభియాన్ – మిషన్ పోషణ్ 2.0 పై అవగాహన కలిగిస్తాం. ఇప్పటికే పోషకాహార లోపం కలిగిన వారిని గుర్తించాం. మహిళలు, చిన్నారులకు పోషకాహారంపై అంగన్వాడీ సిబ్బంది అవగాహన కలిగించాలి. వివిధ శాఖలతో సమన్వయంతో పనిచేయాలి. – పి.శారద, ఐసీడీఎస్, జిల్లా, పీడీ, ఏలూరు పోషకాహారం లోపాన్ని ప్రారంభంలోనే గుర్తించాలి. పిల్లలు ఎత్తుకు తగిన బరువు, బరువు తగిన ఎత్తు లేకపోతే వ్యాధి నిరోధక శక్తి వారిలో తుగ్గతుంది. ఏకాగ్రత లోపిస్తోంది. ఇటువంటి వారిని గుర్తించి అంగన్వాడీ సెంటర్లలో ప్రత్యేక ఆహారం అందిస్తున్నారు. పోషకాహార విలువల ఆహారాన్ని బిడ్డలకు అందించాలి. – డాక్టర్ కె.అన్నపూర్ణ, పీహెచ్సీ, శీతనపల్లి -
కామిరెడ్డి నానిని ఫోన్లో పరామర్శించిన వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: ఏలూరు జిల్లా వైఎస్సార్సీపీ యువజన విభాగ జిల్లా అధ్యక్షుడు, శ్రీరామవరం సర్పంచ్ కామిరెడ్డి నానిపై టీడీపీ గూండాల దాడి ఘటనను వైఎస్ జగన్ తీవ్రంగా ఖండించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నానితో ఆయన ఫోన్లో మాట్లాడి పరామర్శించారు. నాని ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేశారు.తనపై దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అనుచరులు, టీడీపీ గూండాలు ఎలా దాడిచేశారనేది కామిరెడ్డి నాని.. వైఎస్ జగన్కు వివరించారు. తనపై దాడి తర్వాత చికిత్స నిమిత్తం ఆసుపత్రికి వెళితే అక్కడకు కూడా వచ్చి దాడి చేశారని నాని చెప్పారు. ప్రశాంతమైన దెందులూరు నియోజకవర్గంలో ఈ తరహా దాడులు, దౌర్జన్యాలు, అక్రమ కేసులతో వైఎస్సార్సీపీ నేతలను దారుణంగా ఇబ్బందులు పెట్టడంపై వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.అధికారాన్ని అడ్డుపెట్టుకుని టీడీపీ నాయకులు చేస్తున్న దౌర్జన్యాలను బలంగా తిప్పికొడదామని వైఎస్ జగన్ సూచించారు. పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకుని అధికార దుర్వినియోగానికి పాల్పడడం దారుణమన్నారు. ప్రజల్లో వస్తున్న వ్యతిరేకత అర్థమై ఇలా కూటమి నేతలు భయోత్సాతం సృష్టిస్తున్నారని వైఎస్ జగన్ తీవ్రంగా మండిపడ్డారు.ఈ అనైతిక కార్యక్రమాలన్నీ ప్రజలు గమనిస్తున్నారని, టీడీపీకి తగిన బుద్ది చెబుతారన్నారు. వైఎస్సార్సీపీ నాయకులంతా ధైర్యంగా ఉండాలని, పార్టీ అందరికీ అండగా ఉంటుందని వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. నానికి అవసరమైన న్యాయ సహాయం అందించేందుకు వైఎస్సార్సీపీ లీగల్ సెల్ అందుబాటులో ఉంటుందని భరోసానిచ్చారు. -
దారి కాచి దాడులా?
పాలకొల్లు సెంట్రల్: వైఎస్సార్సీపీ కార్యకర్తపై దారి కాచి దాడి చేయడం చూస్తుంటే నియోజకవర్గంలో ఎన్నడూ లేని కొత్త సంస్కృతికి తెరలేపారని నియోజకవర్గ ఇంచార్జ్ గుడాల గోపి అన్నారు. వైఎస్సార్సీపీ కార్యకర్త రోణంకి శ్రీనివాస్పై దాడి విషయంలో నరసాపురం పార్లమెంటు ఇంచార్జ్ గూడూరి ఉమాబాల, యడ్ల తాతాజీతో కలిసి మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా విలేకర్లతో మాట్లాడుతూ శ్రీనివాస్ నరసాపురంలో పని ముగించుకుని రాత్రి ఒంటి గంట సమయంలో వస్తుండగా పాలకొల్లు వచ్చేసరికి 20 మంది దారి కాచి ఏంటిరా సోషల్ మీడియాలో పవన్పై పోస్టింగ్లు పెడుతున్నావని ప్రశ్నించడంతో పాటు నిన్ను ఏదైనా చేస్తే మీ జగన్ వస్తాడా? అంటూ శ్రీనివాస్పై దాడి చేశారన్నారు. మంత్రి ఇలాంటి సంఘటనలకు మద్దతు తెలపడం వల్లే ఈ దారుణాలు జరుగుతున్నాయని తప్పుపట్టారు. 2022లో జరిగిన సంఘటనపై కేసును రీ ఓపెన్ చేయించి కేసు కట్టించారని, ఈ కేసులో మాత్రం ఎస్సైను అడిగితే రెండు రోజులైంది కదా ఇప్పుడు వస్తే ఎలా అని అడుగుతున్నారన్నారు. సీసీ పుటేజి ఆధారంగా తగిన చర్యలు తీసుకుని న్యాయం చేయాలన్నారు. -
పేట్రేగిన టీడీపీ మూకలు
● వైఎస్సార్సీపీ యువజన విభాగ జిల్లా అధ్యక్షుడు నానిపై దాడి ● ఆస్పత్రికి వెళ్తే అక్కడికీ వెళ్లి దాడిచేసిన టీడీపీ మూకలు టాస్క్ఫోర్స్: కూటమి ప్రభుత్వంలో దాడులు, దౌర్జ న్యాలు, అక్రమ కేసుల పరంపర కొనసాగుతూనే ఉన్నాయి. వైఎస్సార్సీపీ యువజన విభాగ జిల్లా అధ్యక్షుడు, శ్రీరామవరం సర్పంచ్ కామిరెడ్డి నానిపై దాడులు పరంపర కొనసాగుతోంది. గతేడాది జూలై7న నాని ఇల్లు, తండ్రి కార్యాలయంపై దాడి చేసి ఫర్నీచర్ ధ్వంసం చేయడంతో పాటు, ద్విచక్రవాహనాలను దగ్ధం చేశారు. ఆస్పత్రిలో మరోసారి దాడి నానిపై మంగళవారం టీడీపీ రౌడీ మూకలు హత్యాయత్నానికి పాల్పడ్డాయి. ఈ మేరకు నాని పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. నాని ప్రయాణిస్తున్న కారుపై కత్తి, క్రికెట్ కర్రతో దాడి చేసి అద్దాలు పగలగొట్టారు. మంగళవారం వైఎస్సార్ వర్ధంతిని పురస్కరించుకుని శ్రీరామవరంలో వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి అనంతరం కారులో తిరిగివస్తుండగా శ్రీరామవరం మలుపు దాటిన తర్వాత టీడీపీ నాయకులు మోత్కూరు నాని, అక్కినేని రాజేంద్రప్రసాద్ తన కారుకు వాళ్ళ కారు అడ్డుపెట్టి క్రికెట్ కర్రలు, కత్తితో దాడి చేసి అద్దాలు పగలగొట్టారని చెప్పారు. తనను కారులో నుంచి కిందకు లాగి క్రికెట్ కర్రతో చంక కింద భుజం పైన కొట్టారన్నారు. తనపై టీడీపీ నాయకులు దాడి చేస్తుండగానే వారు ఫోన్ చేస్తే మరో 30 మంది వచ్చారన్నారు. తనపై జరిగిన హత్యాయత్నాన్ని ఎస్పీకి చెప్పి చూపించడానికి నాని ఎస్పీ కార్యాలయానికి వెళ్లారు. ఎస్పీ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. అనంతరం చికిత్స నిమిత్తం ఆసుపత్రికి వెళితే అక్కడ కూడా టీడీపీ శ్రేణులు వచ్చి దాడి చేయడంతో పాటు అక్కడ ఉన్న పార్టీ నాయకులు కే. పట్టాభిరామయ్య, కే. బాలు, సాయిలపై దాడి చేశారు. ఈ దాడిలో పట్టాభిరామయ్య తలకు గాయమైంది. ఈ దాడులను మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి ఖండించారు. -
నరసాపురంలో కలెక్టరేట్కు వ్యతిరేకం కాదు
భీమవరం: నరసాపురంలో కలెక్టరేట్ ఏర్పాటుకు తాను వ్యక్తిగతంగా వ్యతిరేకిని కాదని కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ అన్నారు. నరసాపురంలో కలెక్టరేట్ ఏర్పాటు చేయాలని ఆ నియోజకవర్గ అఖిలపక్ష నాయకులు ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్, మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు ఆధ్వర్యంలో మంగళవారం మంత్రి క్యాంపు కార్యాలయంలో వినతిపత్రం అందచేశారు. భీమవరంలో ఇంతవరకూ పనులు ప్రారంభం కాలేదని ఈ నేపథ్యంలో నరసాపురంలో ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కోరారు. కలెక్టర్కు వినతిపత్రం భీమవరం (ప్రకాశంచౌక్): నరసాపురంలో జిల్లా కేంద్రం ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అఖిల పక్ష నేతలు కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. జిల్లా నలుమూలల నుంచి ప్రధాన కార్యాలయాలకు వచ్చే ప్రజలు, ఉద్యోగులకు నర్సాపురం సౌకర్యంగా ఉంటుందన్నారు. పట్టణంలో 50 ఎకరాల ప్రభుత్వ భూములు అందుబాటులో ఉన్నాయని వినతిపత్రంలో పేర్కొన్నారు. -
క్షీరారామంలో శివ సహస్రనామ పూజలు
పాలకొల్లు సెంట్రల్: పంచారామక్షేత్రం శ్రీ క్షీరారామలింగేశ్వరస్వామి ఆలయంలో సప్త సోమవారముల ప్రదక్షిణలు పూర్తిచేసుకున్న భక్తులు మంగళవారం శివ సహస్రనామ పూజల్లో పాల్గొన్నారు. సుమారు 50 మంది ఈ కార్యక్రమాల్లో పాల్గొని పూజలు చేశారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి ముచ్చర్ల శ్రీనివాసరావు, సూపరింటెండెంట్ పసుపులేటి వాసు, ఆలయ అభిషేక పండితులు భమిడపాటి వెంకన్న, అర్చకులు వీరబాబు, పూర్ణయ్య, మద్దూరి సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం: డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయ ఉపకులపతి నియామకం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి ఉత్తర్వులు మంగళవారం సాయంత్రానికి కూడా రాలేదు. దీంతో ఈ కుర్చీ విషయంలో సందిగ్ధ స్థితి కొనసాగుతోంది. కొత్త ఉపకులపతి వస్తేనే కాని, లేదంటే ఎవ్వరినైనా ఇన్చార్జిగా నియమించి వారు ఇక్కడకు వచ్చి బాధ్యతలు స్వీకరించేవరకు ప్రస్తుతమున్న వీసీ కొనసాగుతారు. అయితే విధాన పరమైన కీలక నిర్ణయాలు తీసుకొనే వెసులుబాటు ఉండదు. మార్గదర్శకాలు, నిబంధనల ప్రకారం వర్సిటీ రిజిస్ట్రార్ పర్యవేక్షించే అవకాశం ఉంటుంది. -
వైద్యం వికటించి.. యువతి మృతి
ఏలూరు టౌన్: ఆర్ఎంపీ వైద్యుడి నిర్వాకంతో వైద్యం వికటించి ఒక యువతి మృతిచెందింది. దీంతో మృతురాలి బంధువులు ఆర్ఎంపీ వైద్యుడి క్లినిక్ వద్ద మంగళవారం ఆందోళనకు దిగారు. ఏలూరు వన్టౌన్ తూర్పువీధి మేకల కబేళా ప్రాంతానికి చెందిన కటారి భారతి (20) భర్తతో కలిసి జీవిస్తోంది. గత మూడు రోజులుగా తీవ్రమైన జ్వరంతో బాధపడుతుండడంతో ఆమెను మంగళవారం వంగాయగూడెం సెంటర్లోని ఆర్ఎంపీ వైద్యుడు నాని వద్దకు తీసుకువెళ్లారు. అతని క్లినిక్ పక్కనే ఉన్న మెడికల్ షాపులో రెండు ఇంజక్షన్లు తీసుకుని జ్వరంతో బాధపడుతున్న భారతికి నరంలోకి ఇంజెక్షన్ ఇచ్చారు. కొంతసేపు విశ్రాంతి తీసుకోవాలని బంధువులకు సూచించాడు. ఇంజక్షన్ చేసిన 15 నిమిషాల వ్యవధిలోనే ఆమె స్పృహ కోల్పోయింది. బంధువులంతా భయపడగా... ఏమీ కాదనీ కంగారుపడవద్దని ఆర్ఎంపీ వైద్యుడు నాని చెప్పాడు. కొంతసేపు గడచిన అనంతరం మెరుగైన వైద్యం కోసం వేరొక హాస్పిటల్కు తరలించాలని సూచించాడు. బంధువులు వేరొక హాస్పిటల్కు తరలించేందుకు ప్రయత్నిస్తూ ఉండగానే ఆమె మృతిచెందింది. కోపంతో బంధువులంతా ఆమె మృతదేహాంతో నాని క్లినిక్ వద్ద ఆందోళన చేపట్టారు. ఏలూరు వన్టౌన్ పోలీసులకు సమాచారం రావటంతో ఘటనా స్థలానికి వెళ్లి బాధితులతో మాట్లాడి సర్థిచెప్పారు. మృతదేహాన్ని ఏలూరు జీజీహెచ్ మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాపు చేస్తున్నారు. ఇదే తరహాలో ఆర్ఎంపీ వైద్యుడి నిర్వాకంతో గతంలోనూ ఇలాంటి ఘటనలే చోటుచేసుకున్నాయని ఆరోపిస్తున్నారు. అతనికి వైద్యం చేసే అర్హత కూడా లేదని పలువురు చెబుతున్నారు. ఆర్ఎంపీ క్లినిక్ వద్ద బంధువుల ఆందోళన -
ట్రాక్టర్ బోల్తా.. డ్రైవర్ మృతి
ఉంగుటూరు: ప్రమాదవశాత్తు ట్రాక్టర్ పంట బోదెలోకి బోల్తా పడడంతో డ్రైవర్ మృతి చెందిన ఘటన నారాయణపురంలో చోటుచేసుకుంది. చేబ్రోలు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నిడమర్రు మండలం బావాయిపాలెం గ్రామానికి చెందిన సింగులూరి రాంబాబు (59) భీమవరంలో ట్రాక్టరుపై డ్రైవర్గా పనిచేస్తుంటాడు. ఈ క్రమంలో ట్రాక్టర్పై చేపల మేతలోడు భీమవరం నుంచి భీమడోలు మండలం గుండుగొలను తీసుకువెళ్లి అక్కడ దించేసి ఖాళీ ట్రాక్టరుతో తిరిగి భీమవరం వస్తున్నాడు. చేబ్రోలు వంతెన మీదనుంచి నారాయణపురం పుంత రహదారిమీదుగా వెళుతుండగా ప్రమాదవశాత్తు ట్రాక్టర్ అదుపు తప్పి పక్కనే ఉన్న పంట బోదెలోకి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ రాంబాబు అక్కడికక్కడే మృతి చెందాడు. అతడికి భార్య వరలక్ష్మి ఇద్దరు కుమారులు ఉన్నారు. మంగళవారం మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పజెప్పగా అంత్యక్రియలు నిర్వహించారు. చేబ్రోలు ఎస్సై సూర్య భగవాన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఎరువుల దుకాణాలపై విజిలెన్స్ దాడులు
తాడేపల్లిగూడెం: జిల్లాలోని పలు ఎరువుల దుకాణాలపై మంగళవారం విజిలెన్స్, రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. తాడేపల్లిగూడెం మండలం పెదతాడేపల్లిలో విజయ ట్రేడర్స్, వెంకటేష్ మెన్యూర్ డిపో, చాట్రాయి మండలం చనుబండలో లక్ష్మీ వెంకటేశ్వర మెన్యూర్స్ అండ్ జనరల్ స్టోర్సు, డెక్కన్ ఆగ్రో కెమికల్స్పై దాడులు చేశారు. దుకాణాల్లో ఉన్న స్టాకునకు, వాస్తవ స్టాకునకు వ్యత్యాసాలు గుర్తించారు. సుమారు రూ.10 లక్షల 80 వేల 762 విలువ కలిగిన 53.565 టన్నుల ఎరువులు తేడా ఉన్నట్టు గమనించారు. ఈ మేరకు ఆ ఎరువులను సీజ్ చేసి, దుకాణ యజమానులపై నిత్యావసరాల చట్టం 1955 ప్రకారం 6ఏ కేసులు నమోదు చేశారు. దాడుల్లో రీజినల్ విజిలెన్స్ ఎన్పోర్సుమెంటు అధికారి పి.మహేష్, విజిలెన్స్ డీఎస్పీ సింగులూరి వెంకటేశ్వరరావు, విజిలెన్స్ ఇన్స్పెక్టర్ పి.శివరామకృష్ణ, ఏఓ జి.మీరయ్య, ఎస్సై సీహెచ్ రంజిత్కుమార్, కె.సీతారాము, చాట్రాయి, గూడెం వ్యవసాయాధికారులు పాల్గొన్నారు.కారులో ఆకస్మికంగా మంటలుఏలూరు టౌన్: ఏలూరు అమీనాపేటలో మంగళవారం రాత్రి ఒక కారులో ఆకస్మికంగా మంటలు చెలరేగాయి. చూస్తుండగానే కారు అగ్నికి ఆహుతి అయ్యింది. ఏలూరు మంచినీళ్ళతోట ప్రాంతానికి చెందిన కురెళ్ళ సుబ్బారావుకి చెందిన కారులో మంగళవారం రాత్రి 8.15 గంటలకు యజమాని కుమారుడు వివేక్ ప్రయాణిస్తున్నాడు. అశోక్నగర్ వైపు నుంచి కారులో వెళుతూ ఉండగా అమీనాపేట సోనోవిజన్ షోరూమ్ సమీపానికి వచ్చే సరికి కారు ఇంజన్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. స్థానికులు మంటలను అదుపుచేసే ప్రయత్నం చేశారు. ఏలూరు అగ్నిమాపక అధికారి రామకృష్ణ పర్యవేక్షణలో సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాలేదు. కారు ఇంజన్ భాగం పూర్తిగా దగ్ధమైంది.20 కాసుల బంగారం చోరీపాలకొల్లు సెంట్రల్: పెళ్లి ఇంట్లో బంగారు ఆభరణాల చోరీపై కేసు నమోదైంది. మండలంలోని ఉల్లంపర్రు గ్రామంలో పెన్మెత్స సుబ్బరాజు ఇంట్లో ఇటీవల వివాహం జరిగింది. వివాహ వేడుక అనంతరం చూసుకోగా హారం, నల్లపూసలు, గొలుసు, తెలుపు గులాబి రంగు రాళ్ల ముత్యాల నక్లీసు, బంగారు గాజులు, దుద్దులు మొత్తం దాదాపుగా 20 కాసుల వరకూ బంగారు ఆభరణాలు పోయినట్లు గుర్తించారు. వీటి విలువ సుమారు రూ.11 లక్షల వరకూ ఉంటుందని అంచనా. ఇంటిలో ఓ వ్యక్తిపై అనుమానం ఉన్నట్లు సుబ్బరాజు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని రూరల్ ఎస్సై బి. సురేంద్రకుమార్ తెలిపారు. -
రోడ్డెక్కిన గ్రీన్ఫీల్డ్ హైవే భూ నిర్వాసిత రైతులు
చింతలపూడి: గ్రీన్ ఫీల్డ్ హైవేకు సర్వీస్ రోడ్లు ప్రొవిజన్ కల్పించాలని, గ్రీన్ ఫీల్డ్ హైవే భూ నిర్వాసిత రైతుల సమస్యలు పరిష్కరించాలని రైతులు డిమాండ్ చేశారు. భూ నిర్వాసిత రైతుల పోరాట కమిటీ, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో మంగళవారం రేచర్ల గ్రామం వద్ద ఆందోళన చేపట్టారు. భూ నిర్వాసిత రైతుల సమస్యలు పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రీన్ ఫీల్డ్ హైవేకు సర్వీస్ రోడ్లు ప్రొవిజన్ కల్పించకపోవడం దారుణమని విమర్శించారు. రైతులు తమ పొలాలకు వెళ్లే మార్గాలు లేక, తమ పంటలు తెచ్చుకునే అవకాశం లేక అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అనేక చోట్ల అండర్ పాస్లు తగినంత ఎత్తు, వెడల్పుతో నిర్మాణం చేయకపోవడంతో గ్రామాల మధ్య రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయని చెప్పారు. గ్రీన్ఫీల్డ్ హైవే వలన ప్రతి గ్రామం పరిధిలో సమస్యలు ఉన్నాయని వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. అధికారులు క్షేత్ర స్థాయిలో గ్రామాల వారీగా రైతులతో మాట్లాడి సమస్యలు పరిష్కరించాలన్నారు. రేచర్ల ఎగ్జిట్ వద్ద రైతులు తమ పొలాలకు వెళ్లే మార్గం లేదన్నారు. సర్వీస్ రోడ్ ఏర్పాటు చేస్తామని, ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని అధికారులు ఇచ్చిన హామీలు అమలు కాలేదన్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు హైవే అథారిటీ, రెవెన్యూ అధికారులు, కేఎంవీఎల్ రోడ్డు నిర్మాణ సంస్థ మేనేజర్ తదితరులు గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణం వలన రైతులకు, ప్రజలకు వస్తున్న సమస్యలను పరిశీలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ రైతులతో మాట్లాడి సమస్యలు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. సర్వీస్ రోడ్లు నిర్మించాలని డిమాండ్ -
తప్పని పడవ ప్రయాణం
వేలేరుపాడు: భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమేపీ తగ్గుముఖం పడుతున్నా వేలేరుసాడు మండలాన్ని ముంపు వీడటం లేదు. మంగళవారం రాత్రి 8 గంటలకు భద్రాచలం వద్ద 41.40 అడుగులకు చేరింది. అయినప్పటికీ మండలంలో అనేక గ్రామాలు ఇంకా జలదిగ్బంధనంలోనే ఉన్నాయి. వేలేరుపాడు మండలంలో 25 గ్రామాలు ఐదో రోజూ కూడా జలదిగ్బంధనంలోనే ఉన్నాయి. వేలేరుపాడు నుంచి కొయిదా వెళ్లే రహదారిలో మేళ్ళవాగు, ఎద్దెలవాగు, టేకూరు, తదితర వాగుల వంతెనలు ముంపులోనే ఉన్నాయి. దిగువనున్న కొయిదా, కాచారం, పేరంటపల్లి, టేకుపల్లి, తాళ్ళగొంది, పూసుగొంది, టేకూరు, కట్కూరు, సిద్దారం, ఎడవల్లి, చిట్టంరెడ్డిపాలెం, ఎర్రతోగు, చిగురుమామిడి, బోళ్ళపల్లి, పాతనార్లవరం, తూర్పుమెట్ట, కొత్తూరు, తదితర గ్రామాలతోపాటు మరో ఎనిమిది గ్రామాలు జలదిగ్బంధనంలోనే ఉన్నాయి. వేలేరుపాడు నుంచి రేపాకగొమ్ము, వెళ్లే రహదారి మంగళవారం బయటపడింది. దీంతో ఆయా గ్రామ ప్రజలు మోకాల్లోతు నీటిలో ప్రయాణిస్తున్నారు. రుద్రమకోట వెళ్లే రహదారులు ఇంకా నీటిలోనే మునిగి ఉండటంతో ఆయా గ్రామాల ప్రజలు లచ్చిగూడెం గ్రామం గుండా రాకపోకలు సాగిస్తున్నారు. దిగువ గ్రామాల ప్రజలు పడవలపై ప్రయాణిస్తున్నారు. ఐదో రోజూ జలదిగ్బంధంలోనే 25 గ్రామాలు -
వైఎస్ చలవతో తమ్మిలేరు కష్టాలకు చెక్
● రక్షణ గోడ నిర్మాణానికి నాంది పలికిన వైఎస్సార్ ● రూ. 60 కోట్ల గోడతో ప్రజలకు ఊరట ఏలూరు టౌన్: ‘ఏలూరు దుఃఖదాయినిగా తమ్మిలేరును పిలుచుకునే పరిస్థితి.. తుపానులు, భారీ వర్షాలు కురిస్తే చాలు.. ఏలూరు నగరంలో తూర్పు, పడమరగా ప్రవహించే తమ్మిలేరు వరద ఉద్ధృతికి జనం బెంబేలెత్తేవారు. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యేవి. ప్రజలంతా నిరాశ్రయులై పిల్లాపాపలతో బతికితే చాలు అన్నట్లు.. ప్రభుత్వం ఏర్పాటు చేసే పునరావాస కేంద్రాల్లో తలదాచుకునే దుస్థితి ఉండేది. 2005లో ముఖ్యమంత్రిగా దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఏలూరు నగరంలో వరద పరిస్థితులను పరిశీలించేందుకు హుటాహుటిన బయలుదేరి వచ్చారు. నగరంలోని పలు ప్రాంతాల్లో వరద నీటిలోనే వరద బాధితులను పరామర్శించారు. ప్రజలను తీవ్రస్థాయిలో కష్టాల్లోకి నెడుతున్న తమ్మిలేరు వరద ముంపునకు శాశ్వత పరిష్కారానికి ఆయన నాంది పలికారు. తమ్మిలేరు గట్లకు రక్షణ గోడ నిర్మాణం చేపట్టాలని సంకల్పించారు. నిధులు సైతం విడుదల చేశారు. నేడు ప్రజలు భయం లేకుండా సురక్షితంగా ఉన్నారంటే... ‘మహానేత డాక్టర్ వైఎస్సార్ చలవే అంటారు’ తమ్మిలేరు వరదముప్పుకు శాశ్వత పరిష్కారం తమ్మిలేరు ఏలూరు నగరంలోకి ప్రవేశిస్తూనే తూర్పు, పడమరగా రెండు పాయలుగా ప్రవహిస్తుంది. తూర్పు వైపు అశోక్నగర్, కుమ్మరిరేవు, ఇజ్రాయేల్పేట, బీడీ కాలనీ, తంగెళ్ళమూడి సెంటర్ మీదుగా వెళుతుంది. పడమరవైపు అశోక్నగర్ బ్రిడ్జికి ముందుగా ప్రవహిస్తూ శనివారపుపేట కాజ్వే మీదుగా అమీనాటపేట ఏటిగట్టు, జన్మభూమి పార్క్, సీఆర్ఆర్ కాలేజీ ప్రాంతంలో నుంచి పడమర లాకుల వైపు వెళుతుంది. అనంతరం ఎన్టీఆర్ కాలనీ, కొత్తూరు కాజ్వే, పోణంగి, వైఎస్సార్ కాలనీల మీదుగా ప్రవహిస్తుంది. ఈ ప్రాంతాలన్నీ గతంలో తమ్మిలేరు వరదముంపు ప్రభావిత ప్రాంతాలే కావటం విశేషం. భారీ ఎత్తున వరదనీరు ఏలూరు నగరంలోకి ప్రవేశిస్తే చాలు ప్రజలు వరద భయంతో వణికిపోయేవారు. రూ.60 కోట్లతో రక్షణ గోడ ఏలూరు నగర ప్రజలకు తమ్మిలేరు ఏటిగట్టు వరద ముంపు నుంచి రక్షణ కల్పించేందుకు 2005లో దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి రూ.60 కోట్లతో రక్షణ గోడ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఏలూరు అశోక్నగర్ ప్రాంతంలో తూర్పు, పడమర వైపు ఏటిగట్టుకు రివిట్మెంట్ నిర్మాణం చేశారు. మరోవైపు అమీనాపేట ప్రాంతంలో తమ్మిలేరుకు రెండు వైపులా రక్షణ గోడ నిర్మాణం చేశారు. ఈ రివిట్మెంట్తో వరద ముంపు బారి నుంచి కొంతమేర ఊరట లభించింది. అనంతరం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం హయాంలో రూ.80 కోట్లతో మరికొన్ని ప్రాంతాల్లో తమ్మిలేరుకు రివిట్మెంట్ నిర్మాణం చేశారు. వైఎస్సార్ కాలనీ, పోణంగి ప్రాంతాలకు పూర్తిస్థాయిలో వరద భయం పోయింది. ఆనాడు మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఏలూరు నియోజకవర్గ ప్రజలు తమ్మిలేరు వరదముంపుతో కష్టాలు పడకూడదనే సంకల్పంతో రివిట్మెంట్ నిర్మాణానికి చర్యలు చేపట్టారు. యుద్ధప్రాతిపదికన నిధులు మంజూరు చేసి నిర్మాణం చేసేలా శ్రద్ధ చూపారు. దీంతో అమీనాపేట ఏటిగట్టు, ఇజ్రాయేల్ పేట, అశోక్నగర్ ప్రాంతాల్లోని ప్రజలు ప్రశాంతంగా నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. మిగిలిన ప్రాంతాల్లోనూ తమ్మిలేరుకు రివిట్మెంట్ నిర్మాణం చేయాలని ప్రజలు కోరుతున్నారు. – పల్లి శ్రీనివాసరావు, వైఎస్సార్టీయూసీ జిల్లా అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, మహానేత డాక్టర్ వైఎస్సార్ ఏలూరు నియోజకవర్గం ప్రజల పట్ల అభిమానంతో పనిచేశారు. తండ్రి, కొడుకులు ఇద్దరూ... ఏలూరుకు తమ్మిలేరు వరద నుంచి శాశ్వత పరిష్కారం లభించేలా కృషి చేశారు. పోణంగి, వైఎస్సార్ కాలనీల్లో ప్రజలు తమ్మిలేరుకు వరద వస్తే చాలు.. కట్టుబట్టలతో పరుగులు పెట్టే పరిస్థితి ఉండేది. కానీ మహానేత వైఎస్సార్ అనంతరం మాజీ సీఎం జగన్ అన్నతోనే ... మిగిలిన చోట్ల రివిట్మెంట్ నిర్మాణం సాధ్యం అవుతుంది. – గంటా రాజేంద్ర, ఏలూరు వన్టౌన్ -
అర్జీల పరిష్కారంలో చొరవ చూపాలి
భీమవరం(ప్రకాశం చౌక్): పీజీఆర్ అర్జీల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని కలెక్టర్ సి.నాగరాణి అన్నారు. సోమవారం జిల్లా కలెక్టరేట్లో పీజీఆర్ఎస్ కార్యక్రమంలో పాల్గొని జిల్లాలో పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలు సమర్పించిన అర్జీల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, క్షేత్రస్థాయిలో ఫిర్యాదుదారులతో స్వయంగా మాట్లాడి నాణ్యమైన పరిష్కారాన్ని చూపాలన్నారు. శాఖల వారీగా వచ్చిన అర్జీలను పరిశీలించి తక్షణమే పరిష్కార చర్యలు చేపట్టాలన్నారు. అర్జీల పరిష్కారంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, నిర్లక్ష్యానికి తావు లేకుండా సమష్టిగా పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ టి.రాహూల్కుమార్రెడ్డి, డీఆర్వో బి.శివన్నారాయణ రెడ్డి, డ్వామా పీడి డాక్టర్ కెసీసీహెచ్ అప్పారావు తదితరులు పాల్గొన్నారు. -
భవన నిర్మాణ కార్మికుల పోస్టుకార్డు ఉద్యమం
తాడేపల్లిగూడెం (టీఓసీ): భవన నిర్మాణ కార్మిక వెల్ఫేర్ బోర్డులో పెండింగ్లో ఉన్న క్లైయింలు వెంటనే పరిష్కరించాలని కోరుతూ జరుగుతున్న పోస్టు కార్డు ఉద్యమంలో పట్టణ పెయింటర్లు పాల్గొన్నారు. సోమవారం యాగర్లపల్లి వద్ద, గాయత్రి దేవి గుడి కల్యాణ మండపం వద్ద పెయింటర్ల నెలవారీ సమావేశాలు జరిగాయి. ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి పోలిరాతి ఆదినారాయణ మాట్లాడుతూ వెల్ఫేర్ బోర్డు కోసం పోరాడాల్సిన బాధ్యత కార్మికులపై ఉందన్నారు. పెండింగ్లో ఉన్న 46 వేల క్లైయిమ్లను వెంటనే పరిష్కరించాలని, వెల్ఫేర్ బోర్డులో నూతన సభ్యులను నమోదు చేసి కార్డులు ఇవ్వాలని కోరారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రికి పోస్టు కార్డులు రాసి పోస్టు చేశామని వివరించారు. నాయకులు నానిపల్లి రాంబాబు, బెవర నారాయణ, బసవ సామేలు, కర్రి గోవిందు తదితరులు పాల్గొన్నారు. ఉండిలో.. ఉండి: సంక్షేమ బోర్డును వెంటనే అమలులోకి తేవా లంటూ మండల భవన నిర్మాణ కార్మికులు డిమాండ్ చేశారు. ఉండి పార్క్లో నిర్వహించిన మండల భవన నిర్మాణ కార్మికులు సమావేశంలో పలు తీర్మానాలు చేశారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి తమ గళం వినిపించేలా పోస్టుకార్డు ఉద్యమాన్ని పారంభించారు. సంఘ అధ్యక్షుడు శేషాద్రి శ్రీను మాట్లాడుతూ బోర్డును పునఃప్రారంభిస్తామని చేసిన వాగ్దానాన్ని వెంటనే నెరవేర్చాలన్నారు. పెండింగ్లో ఉన్న క్లెయిమ్లను వెంటనే పరిష్కరించి కార్మికులకు చేయూత అందించాలన్నారు. కార్యక్రమంలో గుండుగొలను ఆదాము, ఆడపా గణేష్, ఏడిద సతీష్ తదితరులు పాల్గొన్నారు. -
సోషలిజమే ప్రత్యామ్నాయం
భీమవరం: అనేక దేశాల్లో పెట్టుబడిదారీ వ్యవస్థ విఫలమైందని దేశానికి సోషలిజమే ప్రత్యామ్నాయమని సీపీఎం పొలిట్బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు స్పష్టంచేశారు. సోమవారం భీమవరంలో సోషలిజం–విశిష్టత అనే అంశంపై జిల్లాస్థాయి సెమినార్లో ఆయన మాట్లాడారు. సోషలిజానికి అనేక దేశాల్లో ఆదరణ కూడాపెరుగుతుందన్నారు. ప్రతి మనిషికి సమాన హక్కులు ఇచ్చేది, తిండి, ఇల్లు, విద్య, వైద్యం హక్కుగా మార్చి, సమాన వేతనం, అన్ని రకాల అసమానతలను, అమానుషమైన కులవ్యవస్థ వంటి వాటిని రద్దు చేసి సమానత్వాన్ని చూపించేదే సోషలిజమన్నారు. దేశంలో కులవ్యవస్థ శ్రమదోపిడికి మరింత దోహదం చేస్తుందని రాఘవులు ఆందోళన వ్యక్తం చేశారు. ఏ దేశంలో సీ్త్ర, పురుష సమానత్వం ఉంటుందో అక్కడ ఉత్పత్తితో పాటు అభివృద్ధి కూడా పెరుగుతుందన్నారు. నేడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్మార్ట్ మీటర్లు పేరుతో ప్రజలను ఇబ్బందులు పెడుతున్నాయని అమెరికా సుంకాల ప్రభావం పశ్చిమ గోదావరి జిల్లాపై ఎక్కువగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై ఉద్యమ, పోరాటాలు మరింత పెంచాల్సిన అవసరం ఉందన్నారు. సెమినార్కు సీపీఎం జిల్లా కార్యదర్శి జేఎన్వీ గోపాలన్ అధ్యక్షత వహించగా రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బి.బలరామ్, కమిటీ సభ్యుడు మంతెన సీతారామ్ తదితరులు పాల్గొన్నారు. సీపీఎం పొలిట్బ్యూరో సభ్యుడు రాఘవులు -
నిమజ్జనంలో ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరం
ముదునూరి ప్రసాదరాజు, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు నరసాపురం: నరసాపురం మండలం తూర్పుతాళ్లు గ్రామంలో గణేశ్ నిమజ్జనంలో నలుగురు ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరమని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు విచారం వ్యక్తం చేశారు. సోమవారం విలేకరులతో మాట్లాడుతూ పండుగ సంబంరంలో ప్రమాదం జరిగి ప్రానాలు కోల్పోవడంపై ఆయన తీవ్ర ద్రిగ్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని కోరారు. తాడేపల్లిగూడెం: జిల్లా వాసులు కర్నూలు ఉల్లిపాయలను వినియోగిస్తూ కర్నూలు రైతులను ఆదుకోవాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి కోరారు. సోమవారం బ్రహ్మానందరెడ్డి మార్కె ట్ను సందర్శించారు. ఉల్లి అమ్మకం, కొనుగోళ్లను పరిశీలించారు. హాస్టల్స్, ప్రైవేటు కళాశాలల వంటల్లో ఈ రకం ఉల్లిపాయలను వినియోగించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆమె వెంట ఆర్డీఓ కౌసర్ భానో, మార్కెటింగ్ ఏడీ సునీల్కుమార్ తదితరులు ఉన్నారు. కర్నూలు ఉల్లిపాయలను రైతుల నుంచి ఇక్కడి గుత్త వ్యాపారులు కిలో రూ.12 కొనుగోలు చేయాలని సాయంత్రం పట్టణంలోని చాంబర్ ఆఫ్ కామర్సులో వ్యాపారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో కలెక్టర్ కోరారు. కొంతకాలం మహారాష్ట్ర ఉల్లి దిగుమతులు తగ్గించుకుని, కర్నూలు ఉల్లి వినియోగం పెంచడానికి వ్యాపారులు దోహదపడాలన్నారు. కలెక్టర్ ప్రతిపాదనకు వ్యాపారులు అంగీకరించారు. మెగా మార్టుల ద్వారా కర్నూలు ఉల్లి విక్రయించే ఏర్పాట్లు చేయాలని మున్సిపల్ కమిషనర్ను ఆదేశించారు. అనంతరం పట్టణంలోని సవితృపేటలో పింఛన్ల పంపిణీని కలెక్టర్ పరిశీలించారు. స్థానికంగా దాతల సహకారంతో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. భీమవరం: ప్రజా సమస్యలపై త్వరితగతిన స్పందించి నిర్ణీత గడువులోగా చట్ట పరిధిలో శాశ్వత పరిష్కారం చూపాలని ఎస్పీ అద్నాన్ నయీం అస్మి పోలీసు అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో అర్జీలను తీసుకున్న అనంతరం సంబంధిత పోలీసు స్టేషన్ల అధికారులతో ఫోన్లో మాట్లాడారు. ప్రజా ఫిర్యాదులు పరిష్కారానికి మొదటి ప్రాధాన్యతనిస్తూ అర్జీలు పునరావృతం గాకుండా నిర్ణీత గడువులోగా శాశ్వత పరిష్కారం చూపాలని ఆదేశించారు. 15 ఫిర్యాదులు అందాయని తెలిపారు. పెనుగొండ: పేదలకు ఉచితంగా అందించాల్సిన ఇసుకను ఆచంటలో టీడీపీ నాయకుడు గణపతినీడి రాంబాబు అక్రమంగా ర్యాంపుల ద్వారా తరలించి, వాటిని ప్రతి గ్రామంలో గుట్టలను నిల్వ చేసి అక్రమంగా తరలిస్తున్నారని, అధికారులకు ఫిర్యాదు చేసినా చూసీ చూడనట్లు వ్యవహిస్తున్నారని సీపీఎం పోలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులకు వైఎస్సార్సీపీ నాయకులు సుంకర సీతారామ్, కోట వెంకటేశ్వరరావు వినతి పత్రం అందించారు. అనంతరం వారు మాట్లాడుతూ గణపతినీడి రాంబాబు నియోజకవర్గంలోని ఇసుక ర్యాంపుల ద్వారా అక్రమంగా ఇసుక తరలించి, అధిక రేటుకు అమ్ముతున్నారని తెలిపారు. -
చెప్పుకోదగ్గ పథకం ఏదీ లేదు
మాజీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ తాడేపల్లిగూడెం రూరల్: రాజకీయాల్లో 40 ఏళ్ళ చరిత్ర ఉందని ఊకదంపుడు ప్రసంగాలిచ్చే చంద్రబాబు తన పాలనలో బెల్టు షాపు పథకం తప్ప చెప్పుకోవడానికి ఏ ఒక్క పథకం మిగలలేదని మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ ఎద్దేవా చేశారు. సోమవారం రాత్రి పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం కొమ్ముగూడెంలో శ్రీబాబు ష్యూరిటీ – మోసం గ్యారంటీశ్రీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ రైతు శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని తమ ప్రభుత్వంలో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేశామన్నారు. ప్రకృతి విపత్తుల సమయంలో రైతులను ఆదుకునేందుకు దాదాపు వెయ్యి కోట్లతో ప్రభుత్వమే పంటల బీమా చేయించిందని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వంలో ఆ భారమంతా ప్రజలపై వేసిందన్నారు. సూపర్ సిక్స్ పథకాల పేరిట మోసం చేయడం తప్ప చంద్రబాబు ప్రజలకు న్యాయం చేసిన దాఖలాలు లేవని దుయ్యబట్టారు. దీపం పథకానికి బడ్జెట్లో రూ.740 కోట్లు పెట్టి ఎగ్గొట్టారన్నారు. ఆయన వెంట జిల్లా అధికార ప్రతినిధి ముప్పిడి సంపత్కుమార్, వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు జడ్డు హరిబాబు ఉన్నారు. -
మద్దిలో పవిత్రోత్సవాలు ప్రారంభం
జంగారెడ్డిగూడెం : గుర్వాయిగూడెం మద్ది క్షేత్రంలో సోమవారం పవిత్రోత్సవాలు ప్రారంభమయ్యాయి. నాలుగు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాల్లో తొలి రోజు ఆంజనేయస్వామి వారికి విశ్వక్సేనపూజ, పుణ్యాహవచనము, మృత్సంగ్రహణ, అంకురార్పణ, దీక్షాధారణ, యాగశాల ప్రవేశం, అగ్నిప్రతిష్ట, అకల్మష హోమాలు, ఏతత్ ప్రధాన హోమాలు నిర్వహించినట్లు ఆలయ ఈవో ఆర్వీ చందన తెలిపారు. అలాగే రెండవ రోజు మంగళవారం నిత్యకై ంకర్యాలతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు ఈవో చెప్పారు. చింతలపూడి : సీపీఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని ఏపీ సీపీఎస్ ఈఏ రాష్ట్ర కౌన్సిలర్ కంచర్ల బుచ్చిబాబు డిమాండ్ చేశారు. ఈ మేరకు స్థానిక ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో సోమవారం చలో విజయవాడ కార్యక్రమం పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బుచ్చిబాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన మాట నిలబెట్టుకొని పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. చలో విజయవాడకు ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు సంపూర్ణ మద్దతు తెలిపాయి.కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘం నాయకులు పాల్గొన్నారు. ఏలూరు (టూటౌన్): బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ ఈ నెల మూడో తేదీన ఏలూరు రానున్నారని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు సీహెచ్ విక్రమ్ కిషోర్ సోమవారం విలేకరులకు తెలిపారు. బుధవారం ఉదయం 7.30 నుంచి సాయంత్రం వరకు ఏలూరులో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొని, అనంతరం నాలుగు గంటలకు మీడియాతో ముఖాముఖి నిర్వహిస్తారని చెప్పారు. కొయ్యలగూడెం: ద్విచక్ర వాహనంతో చెట్టును ఢీ కొని ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన కన్నాపురం గ్రామ శివారున సోమవారం చోటు చేసుకుంది. తూర్పుగోదావరి జిల్లా గౌరీపట్నం గ్రామానికి చెందిన అయినపుడి సత్యనారాయణ (60) ద్విచక్రవాహనంపై బుట్టాయిగూడెం మండలం కండ్రికగూడెంలో బంధువు రెడ్డి వెంకట్రావు ఇంటికి వెళ్లి తిరిగి వస్తూ కన్నాపురం శివారు వచ్చేసరికి చెట్టును ఢీకొన్నారు. దీంతో తలకు బలమైన గాయమైంది. స్థానికులు కొయ్యలగూడెం ప్రభుత్వాసుపత్రికి తీసుకువెళ్లగా అప్పటికే సత్యనారాయణ మృతిచెందాడని వైద్యులు నిర్ధారించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చంద్రశేఖర్ తెలిపారు. -
శోకసంద్రంగా తీరం
తూర్పుతాళ్లు ఈవనవారి మెరకలో విషాదఛాయలు నరసాపురం రూరల్: వినాయక నిమజ్జనంలో జరిగిన అపశ్రుతితో ఆ నాలుగు కుటుంబాల్లో తీరని శోకం మిగిల్చింది. భక్తిశ్రద్ధలతో గణపయ్యను మొక్కే ఆ కుటుంబాల్లో వినాయక చవితి పండుగ చీకటి రోజులను విడిచింది. తూర్పుతాళ్లు గ్రామపరిధిలోని ఈవనవారి మెరక రామలయం వద్ద ఆదివారం జరిగిన నిమజ్జన ఊరేగింపు ట్రాక్టర్ ప్రమాదంలో మృతి చెందిన నలుగురూ నాలుగు కుటుంబాలకు చెందిన వారు. చనిపోయిన నలుగురిలో ముగ్గురు ఆయా కుటుంబాలకు ముఖ్యజీవనాధారం. రెక్కాడితేగాని డొక్కాడని జీవితాలు వారివి. వారిని మృత్యువు కబళించేయడంతో ఆ కుటుంబాల పరిస్థితి అయోమయమైంది. గుమ్మం ఎదుటే మృత్యువాత ఈవన సూర్యనారాయణ (58) వ్యవసాయ కూలీగా జీవనం సాగిస్తుంటారు. ఆయనకు ముగ్గురు కుమారులు కాగా వారిలో ఇద్దరు పెయింటింగ్ పని చేస్తుంటారు. మూడో కుమారుడు ఉద్యోగం చేస్తున్నాడు. అతడికి వివాహం చేయాల్సి ఉంది. ఘటన జరిగే ముందే వ్యవసాయ పనులు ముగించుకుని స్నానం చేసి దేవుని ఊరేగింపులో పాల్గొనేందుకు వచ్చిన సూర్యనారాయణ ఇంటి ఎదుటే మృత్యువాత పడ్డాడు. భారం మోసేవాడే దూరమైతే.. గురుజు మురళి (38)కి వివాహమై మూడేళ్లయింది. భార్య కనకమహాలక్ష్మితో పాటు వృద్ధులైన తల్లిదండ్రులు, వ్యవసాయ కూలీగా జీవనం సాగించే తమ్ముడు ఉన్నారు. ఆర్థిక పరిస్థితి మెరుగు పరుచుకునేందుకు ఇటీవలే బట్టల వ్యాపారం కూడా ప్రారంభించాడు. కుటుంబ భారాన్ని మోసే కొడుకు దూరం అవడంతో ఆ కుటుంబం రోదనలు మిన్నంటాయి. జీవిత మాధుర్యాన్ని అనుభవించకుండానే.. తిరుమల నరసింహమూర్తి (35) పెయింటర్గా జీవనం సాగిస్తున్నాడు. అందరితో మంచిగా ఉంటూ ఆనందంగా ఉండే చురుకై న వ్యక్తి. ఇతనికి లేకలేక కలిగిన కవలలైన బాబు, పాపలతో ఇప్పుడిప్పుడే జీవిత మాధుర్యాన్ని చూస్తున్నాడు. ఇంతలోనే అతని మరణం కుటుంబంతో పాటు బంధుమిత్రులెవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. బాలుడిని కబళించిన మృత్యువు జై బోలో గణేష్ మహారాజ్కీ అంటూ చిందులేసిన తొమ్మిదేళ్ల కడియం దినేష్నాయుడు నరసాపురం పట్టణంలోని ఓ ప్రైవేటు స్కూల్లో ఐదవ తరగతి చదువుతున్నాడు. వినాయక నిమజ్జన ఊరేగింపు చూసేందుకు వ్యాన్ డ్రైవర్గా జీవనం సాగించే నాన్న, అన్నయ్యలతో పాటే వెళ్లాడు. ఒక్కసారిగా ట్రాక్టర్ మృత్యురూపంలో దూసుకు రావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కొడుకు లేడన్న విషయంతో ఆ తల్లిదండ్రుల రోదనలను ఆపడం ఎవరితరం కావడంలేదు. సోమవారం నరసాపురం ప్రభుత్వాసుపత్రినుంచి మృతదేహాలకు పంచనామా ముగించుకుని గ్రామానికి తీసుకురావడంతో కుటుంబసభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. గ్రామం అంతా శోకసంద్రంలో మునిగిపోయింది. ఒకే గ్రామంలో ఒకే ప్రాంతంలో నలుగురు మృతితో తీరప్రాంతం అంతా మూగబోయినట్లయ్యింది. గురుజు మురళి (ఫైల్) ఈవన సూర్యనారాయణ (ఫైల్) తిరుమల నరశింహమూర్తి (ఫైల్) కడియం దినేష్ నాయుడు (ఫైల్) -
మధ్యాహ్న భోజనం తిని విద్యార్థులకు అస్వస్థత
కుక్కునూరు: స్థానిక జెడ్పీ హైస్కూల్లో మధ్యాహ్న భోజనం తిని 8 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. 6వ తరగతికి చెందిన 8 మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం తిన్న తరువాత వాంతులు అవ్వడంతో వెంటనే ఉపాధ్యాయులు స్థానిక పీహెచ్సీకి తరలించి చికిత్స అందించారు. దీనిపై పీహెచ్సీ వైద్యురాలు డాక్టర్ సుప్రియను వివరణ కోరగా విద్యార్థుల ఆరోగ్యం బాగానే ఉందని, చికిత్స అందించిన వెంటనే పంపించివేశామని చెప్పారు. కాగా దీనిపై విద్యార్థుల తల్లితండ్రులు పాఠశాలకు చేరుకుని ఉపాధ్యాయులను నిలదీశారు. భోజనం తిన్న వెంటనే వాంతులు అయ్యాయని విద్యార్థులు చెబుతుంటే, బయట నుంచి తెచ్చుకున్న బిస్కెట్లు తినడం వలనే విద్యార్థులకు వాంతులు అయ్యాయని ఉపాధ్యాయులు పేర్కొన్నారు. ఎంపీపీ చేబ్రోలు గీతావాణి, సర్పంచ్ రావు మీనాతో కలిసి పాఠశాలకు వెళ్లి విద్యార్థులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఎంపీపీ ఉపాధ్యాయులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల భోజనంలో నాణ్యత పాటించాలని సూచించారు. -
నారాయణ స్కూల్లో దారుణం
● తరగతి గదిలో హార్పిక్ పౌడర్ తినేసిన ఎల్కేజీ చిన్నారి ● విజయవాడలో నాలుగు రోజులుగా అందిస్తున్న చికిత్స పాలకొల్లు సెంట్రల్: తరగతి గదిలో ఓ చిన్నారి హార్పిక్ యాసిడ్ పౌడర్ తినేయడంతో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన పాలకొల్లు శంభన్న అగ్రహారం ప్రాంతంలో చోటుచేసుకుంది. పట్టణంలోని స్థానిక బుధవారపు వీధి ప్రాంతానికి చెందిన మామిడిపల్లి సంయుక్త, అనుదీప్ వివరాలను విలేకరులకు వెల్లడించారు. తమ కుమార్తె నాలుగేళ్ల చిన్నారి హార్వి సహస్ర పట్టణంలోని నారాయణ స్కూల్లో ఎల్కేజీ చదువుతోందని తెలిపారు. గత గురువారం స్కూల్కు వెళుతుండగా పాప బ్యాగ్లో బిస్కెట్ ప్యాకెట్ వేసి పంపించామని చెప్పారు. మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో చిన్నారికి అస్వస్థతగా ఉందని ఆసుపత్రికి తీసుకు వెళుతున్నామని స్కూల్ నుంచి ఫోన్ రావడంతో వెళ్లినట్టు చెప్పారు. అక్కడ చిక్సిత చేసిన వైద్యులు ఇక్కడ కష్టమని, మెరుగైన వైద్యం కోసం విజయవాడకు తరలించాలని సూచించారన్నారు. వెంటనే విజయవాడలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నట్లు చెప్పారు. అసలు విషయంపై ఆరా తీయగా స్కూల్లో ఇచ్చిన స్నాక్స్ బ్రేక్లో చిన్నారి బిస్కెట్ ప్యాకెట్ అనుకొని హార్పిక్ యాసిడ్ పౌడర్ తినేసిందని, దీంతో నోటి నుంచి రక్తం వచ్చినట్లు తెలిసిందన్నారు. చిన్నారి నాలుక, పేగులు, గొంతు లోపల భాగంలో కాలిపోయాయని వైద్యులు చెప్పినట్టు బాలిక తల్లి సంయుక్త కన్నీరుమున్నీరవుతూ వివరించారు. ప్రస్తుతం శరీరంలోకి పైపు ద్వారా ఓఆర్ఎస్ ద్రావణం, కొబ్బరి నీళ్లు, మంచినీళ్లు ఐదేసి చుక్కలు చుక్కలుగా వేస్తున్నామని తెలిపారు. ఇప్పటివరకు సుమారు రూ.1.50 లక్షలు ఖర్చు అయ్యిందని ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడలో కేసు నమోదు చేయించినట్టు కుటుంబసభ్యులు తెలిపారు. తప్పించుకునే ప్రయత్నంలో బుకాయింపు ఈ ఘటనపై స్కూల్ యాజమాన్యాన్ని ప్రశ్నించగా మీ పాప ఆ ప్యాకెట్ తెచ్చుకుందని బుకాయిసున్నారని చిన్నారి తల్లిదండ్రులు వాపోయారు. సీసీ ఫుటేజీ తీయాలని అడుగుతుంటే కెమెరాలు పనిచేయడం లేదని చెబుతూ ఎదురు వాదనకు దిగారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై స్కూల్ ప్రిన్సిపాల్ వెంకటేష్ మాట్లాడుతూ స్నాక్స్ సమయంలో పాపకు ఇబ్బంది ఏర్పడినట్టు తెలియగానే నోరు కడిగి ఆస్పత్రికి తరలించామని, ఈ ప్యాకెట్ ఎక్కడిది అని పాపని అడిగితే ఇంటి నుంచి తెచ్చుకున్నానని చెప్పిందని సమాధానమిచ్చారు. సుమారు నెల రోజుల క్రితం ఇదే పాఠశాలలో ఓ చిన్నారిపై టీచర్ అగ్గిపుల్ల అంటించి వాత పెట్టిన ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. -
అయినవాళ్లే ఆదరించకపోతే..!
తణుకు అర్బన్: నడవలేని స్థితిలో ఉండడంతో భారమవుతాడనుకున్నారో ఏమో కానీ తండ్రి, తోడబుట్టిన సోదరులు ఇంట్లోకి రానివ్వడం లేదు. దీంతో తనను ఇంట్లోకి రానివ్వండి అంటూ ఆ యువకుడు వేడుకుంటూ రోదిస్తున్న తీరు ఆ ప్రాంతవాసులను కలచివేస్తోంది. మానవత్వాన్ని మంటకలిపే ఈ ఘటన తణుకు మండలం వేల్పూరు గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... గ్రామంలోని సాలిపేటకు చెందిన తాడిశెట్టి నాగ త్రినాఽథ్ గత ఏడేళ్లుగా సింగపూర్లోని షిప్యార్డులో రెస్క్యూ టీంలో ఉద్యోగిగా ఉపాధి పొంది కుటుంబంలో ఏర్పడ్డ సమస్యలతో గతేడాది జూలైలో ఇండియాకు వచ్చారు. అయితే ఇటీవల రోడ్డు ప్రమాదంలో నడుము భాగంలో తగిలిన గాయానికి కాలు కదపలేని స్థితిలో విశాఖపట్నం, విజయవాడ ఆస్పత్రుల్లో చికిత్స పొందారు. చేతిలో ఉన్న డబ్బు అయిపోగా సోమవారం ఆస్పత్రి నుంచి ఇంటికి రాగా ఇంట్లోకి రానీయకుండా తండ్రి, అన్నదమ్ములు ఇంటి తలుపులు మూసేశారు. దీంతో దిక్కుతోచక ఇంటి ముందు రోదిస్తూ ఉండిపోయారు. గతంలోనే తల్లి చనిపోగా తండ్రి తాడిశెట్టి నాగేశ్వరరావు, అన్న, తమ్ముడు ఇంట్లోకి రానీయడంలేదని చెబుతున్నారు. సింగపూర్లో ఉన్నంత కాలం సంపాదించిన సొమ్ము అంతా ఇంటికే పంపించానని, కానీ నేడు ఆరోగ్యం బాగోలేని సమయంలో సొంతవాళ్లే పట్టించుకోవడంలేదని త్రినాథ్ వాపోతున్నారు. నడవలేని స్థితిలో యూరిన్ బ్యాగ్తో వీల్చైర్లో ఉన్న త్రినాథ్ పడుతున్న ఆందోళన, ఆవేదన వర్ణనాతీతంగా మారింది. తన సమస్యను పరిష్కరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేష్లతోపాటు తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణలను సోషల్ మీడియా వేదికగా వేడుకుంటున్నారు. -
తండ్రికి తలకొరివి పెట్టిన తనయ
పాలకొల్లు సెంట్రల్: తండ్రికి కుమార్తె తలకొరివిపెట్టిన ఘటన పాలకొల్లులో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం పట్టణంలోని బ్రాడీపేట మూడవ వీధికి చెందిన సారిక సత్యనారాయణ (80) గత రెండేళ్లుగా అనారోగ్యంతో మంచానికే పరిమితం కాగా సోమవారం మృతి చెందారు. ఆయనకు భార్య, కుమార్తె ఉన్నారు. ఉండి నియోజకవర్గం కాళ్ల గ్రామంలో ఉంటున్న కుమార్తె తండ్రి సత్యనారాయణ అంతిమ సంస్కారాలు నిర్వహించింది. పెన్షన్తోనే జీవనం సాగించే సత్యనారాయణకు సచివాలయ సిబ్బంది ఉదయం సుమారు 8 గంటల సమయంలో పింఛన్ ఇవ్వడానికి వెళ్లగా అప్పటికే మృతి చెందాడు. సర్వర్ పనిచేయకపోవడంతో పింఛన్ పంపిణీ ఆలస్యమైందని చెబుతున్నారు. -
కుమ్మరిగట్టులో 9 డయేరియా కేసులు
బుట్టాయగూడెం: బుట్టాయగూడెం సమీపంలో ఉన్న కుమ్మరిగట్టు గ్రామంలో సుమారు 9 మంది వాంతులు, విరోచనాలతో బాధపడుతుండగా మరొక ఐదుగురు జ్వరాల బారిన పడ్డారు. దీంతో నందాపురం పీహెచ్సీకి సంబంధించిన వైద్యులు డాక్టర్ సల్మాన్ ఆధ్వర్యంలో వైద్య శిబిరం ఏర్పాటు చేసి బాధితులకు వైద్యసేవలు అందించారు. రోగుల్లో యండమూరి వెంకటలక్ష్మితో పాటు మీనాక్షి అనే చిన్నారిని చికిత్స నిమిత్తం జంగారెడ్డిగూడెం తరలించారు. ఈ వైద్యశిబిరాన్ని డీఎం అండ్ హెచ్ఓ డాక్టర్ అమృతం సందర్శించి గ్రామంలో డయేరియా కేసుల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ వైద్య శిబిరాన్ని మరో ఐదు రోజులపాటు కొనసాగించాలని వైద్యాధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీఎస్ఓ హరేంద్రకృష్ణ, డిప్యూటీ డీఎం అండ్ హెచ్ఓ జె. సురేష్, సర్పంచ్ ఎం.రామలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. గ్రామ ప్రజలు అస్వస్థతకు గురి కావడానికి కలుషిత నీరు కారణమా? లేక మరేదైనా ఉందా? అని గ్రామస్థులు భయాందోళన చెందుతున్నారు. -
వనితను పరామర్శించిన మాజీ ఎంపీ భరత్
పాలకొల్లు సెంట్రల్: రాష్ట్ర మాజీ హోం మంత్రి తానేటి వనితను వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ పరామర్శించారు. వనిత మామయ్య తానేటి బాబూరావు ఇటీవల మరణించిన విషయం తెలిసిందే. పాలకొల్లులోని బాబూరావు నివాసానికి వెళ్లి ఆయన చిత్రపటం వద్ద భరత్ పుష్పాంజలి ఘటించారు. బాబూరావు భార్య జ్యోతమ్మ, పెద్ద కుమారుడు డాక్టర్ శ్రీనివాస్, వనిత దంపతులకు, అలాగే ఇతర కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. జంగారెడ్డిగూడెం: లక్కవరం గవర్నమెంట్ హాస్పిటల్లో కోడె నాగును పట్టుకున్నారు. ఆసుపత్రిలో పామును స్టాఫ్నర్సు గమనించి స్నేక్ సేవియర్ సొసైటీకి సమాచారం ఇచ్చారు. సొసైటీకి చెందిన చదలవాడ క్రాంతి ఆసుపత్రికి చేరుకుని ఐదు అడుగులు పొడవు ఉన్న కోడె నాగును పట్టుకుని సమీపంలోని అటవీ ప్రాంతంలో విడచిపెట్టారు. -
సంప్రదాయ డ్రెస్ కోడ్ అమలు ఎప్పుడు?
ద్వారకాతిరుమల: సంస్కృతి, సంప్రదాయాలకు హిందూ ఆలయాలు పెట్టింది పేరు. భక్తులు ఒకప్పుడు ఆలయాలకు సంప్రదాయ దుస్తుల్లోనే వెళ్లేవారు. ప్రస్తుత ఆధునిక సమాజంలో రకరకాల మోడల్ దుస్తులు మార్కెట్లోకి వచ్చాయి. దాంతో కొందరు యువతి, యువకులు, మహిళలు, పురుషులు సంప్రదాయాలకు విరుద్ధమైన దుస్తుల్లో ఆలయాలకు వెళుతున్నారు. దీని కారణంగా దేవాలయాల పవిత్రతకు భంగం కలుగుతోంది. దీనిపై దృష్టి సారించిన రాష్ట్ర దేవదాయ శాఖ అధికారులు ఇటీవల విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో డ్రెస్ కోడ్ను ప్రవేశపెట్టారు. పంచె, కండువా ధరించిన పురుషులను, చీరలు, లంగా ఓణి, చుడీదార్ వంటి సంప్రదాయ దుస్తులు ధరించిన మహిళలను, యువతులను మాత్రమే ఆలయంలోకి అనుమతిస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంతో పాటు ఎన్నో ఆలయాల్లో ఈ డ్రెస్కోడ్ ఎప్పటి నుంచో అమలులో ఉంది. అయితే చిన్నతిరుపతిగా పేరొందిన ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయంలో మాత్రం నిత్యార్జిత కల్యాణంలో పాల్గొనే భక్తులకు మాత్రమే డ్రెస్ కోడ్ అమలులో ఉంది. స్వామివారి దర్శనార్ధం ఆలయంలోకి వెళ్లే భక్తులకు ఎటువంటి డ్రెస్ కోడ్ లేదు. దాంతో కొందరి భక్తుల వస్త్రధారణ ఆలయ పవిత్రత, సంప్రదాయాలకు భంగం కలిగిస్తున్నాయి. కొందరు యువతులు, మహిళలు జీన్స్ ప్యాంట్లు, గౌన్లు, స్లీవ్ లెస్ డ్రస్లు వేసుకొస్తున్నారు. కొందరు యువకులు చిరిగిన జీన్స్ ఫ్యాంట్లు, టీషర్ట్లు, ఇలా రకరకాల మోడల్స్ దుస్తుల్లో ఆలయానికి వస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు శ్రీవారి ఆలయంలో డ్రెస్ కోడ్ అమలు చేసి, ఆలయ పవిత్రతను కాపాడి, భక్తుల్లో ఆధ్యాత్మిక భావాలను మరింతగా పెంపొందించాలని పలువురు కోరుతున్నారు. -
విధి నిర్వహణలో హెడ్ కానిస్టేబుల్ మృతి
జంగారెడ్డిగూడెం: ఈ నెల 29 రాత్రి అదృశ్యమైన స్పెషల్ బ్రాంచ్ హెడ్ కానిస్టేబుల్ ఆచూకీ లభ్యమైంది. విధి నిర్వహణలో భాగంగా వెళ్తుండగా ప్రమాదవశాత్తు ఎర్రకాలువలో కొట్టుకుపోయి మృతిచెందారు. దీనికి సంబంధించి డీఎస్పీ యు.రవిచంద్ర వివరించారు. జంగారెడ్డిగూడెం పోలీస్ సబ్డివిజన్ పరిధిలోని కామవరపుకోట, టి.నరసాపురం మండలాల్లో బుడుపుల సుబ్బారావు పోలీసు శాఖ స్పెషల్ బ్రాంచ్లో హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నారు. ఆయన స్వగ్రామం బుట్టాయగూడెం. ఈ నెల 29 రాత్రి కామవరపుకోట, టి.నరసాపురం మండలాల్లోని వినాయక చవితి మండపాలను పరిశీలించేందుకు వెళ్లారు. ఆ సమయంలో టి.నరసాపురం మండలం అప్పలరాజుగూడెం సమీపంలోని ఎర్రకాలువ సప్టా దాటుతుండగా, అకస్మాత్తుగా నీటి ఉధృతితో ఆయన ద్విచక్ర వాహనంతో సహా కొట్టుకుపోయారు. శనివారం ఉదయం వరకూ సుబ్బారావు నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో కుటుంబసభ్యులు తడికలపూడి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో శనివారం నుంచి సుబ్బారావు ఆచూకీ కోసం పోలీసు యంత్రాంగం ప్రయత్నించింది. రాత్రి వరకు ఎటువంటి ఆచూకీ లభించలేదు. డీఎస్పీలు యు.రవిచంద్ర, ఎం.వెంకటేశ్వరరావు, చింతలపూడి, జీలుగుమిల్లి సీఐలు, ఎస్సైలు అప్పలరాజుగూడెం ఎర్రకాలువలో గాలింపు చర్యలు పర్యవేక్షించారు. మత్స్యకారుల సాయంతో కాలువలో గాలించారు. కాలువలో ఒక చోట సుబ్బారావు బైక్ లభించగా, జంగారెడ్డిగూడెం మండలం ఎ.పోలవరం పంచాయతీ చిన్నవారిగూడెం సమీపంలో ఎర్రకాలువలో బుడుపుల సుబ్బారావు (48) మృతదేహం లభించింది. మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రి తరలించారు. పోస్టుమార్టం అనంతరం సుబ్బారావు స్వగ్రామం బుట్టాయగూడెం తరలించారు. బుట్టాయగూడెంలో విషాద ఛాయలు బుట్టాయగూడెం: హెడ్ కానిస్టేబుల్ బుడుపుల సుబ్బారావు భౌతికకాయానికి బుట్టాయగూడెంలో ఆదివారం రాత్రి ఎస్పీ కె.ప్రతాప్ కిశోర్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సుబ్బారావు భార్య మాలినిని పరామర్శించి ధైర్యం చెప్పారు. అతని కుటుంబానికి అండగా ఉంటామని ప్రభుత్వ పరంగా అన్ని విధాలా ఆదుకుంటామని చెప్పారు. మృధుస్వభావి, విధి నిర్వహణలో అందరి మన్ననలు పొందిన సుబ్బారావు అకాల మృతితో ఒక్కసారిగా ఈ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి. గాలింపు చర్యలను పర్యవేక్షిస్తున్న డీఎస్పీలు యు.రవిచంద్ర, ఎం.వెంకటేశ్వరరావు చిన్నవారిగూడెం సమీపంలో ఎర్రకాలువలో లభించిన బుడుపుల సుబ్బారావు మృతదేహం ఎర్రకాలువ దాటుతుండగా గల్లంతు -
ఓపెన్ కేటగిరీలో ఎంపిక చేయాలి
భీమవరం అర్బన్: డీఎస్సీ ఉద్యోగాల్లో మెరిట్ ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులను ఓపెన్ కేటగిరి ద్వారానే నియమించాలని దళిత ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు గంటా సుందర్కుమార్ డిమాండ్ చేశారు. భీమవరం మండలంలోని తాడేరులో దళిత ఐక్య వేదిక భీమవరం మండల శాఖ ముఖ్య నాయకులు ఆదివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గంటా సుందర్ కుమార్ మాట్లాడుతూ జీవో నెం. 77 ప్రకారం డీఎస్సీ ఉద్యోగాలు భర్తీ చేయాలన్నారు. ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ డీఎస్సీ నోటిఫికేషన్లో ప్రకటించిన విధంగా పోస్టులు భర్తీ చేయడం లేదని ఆరోపించారు. దీని వల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ కేటగిరిలో రిజరేషన్ల ప్రకారం రావాల్సిన ఉద్యోగాలు అభర్థులకు రాకుండా తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. పారదర్శకంగా నిర్వహించవలసిన ఉద్యోగాల భర్తీని సీక్రెట్గా నిర్వహిస్తున్నారని విమర్శించారు. ఉన్నతాధికారులు ఈ పరిస్థితిని చక్కదిద్దాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో గొల్లా రాజ్కుమార్, జె. విజయకుమార్, కె. కళ్యాణ్, ఎ ఆనంద్కుమార్, తదితరులు పాల్గొన్నారు. -
నిమ్మ కేరాఫ్ అమ్మపాలెం
● గ్రామంలోని ప్రతి రైతుకూ నిమ్మతోటలు ● కుటుంబసభ్యులే సొంతంగా సేద్యం ● సిరులు కురిపిస్తున్న నిమ్మ పంట జంగారెడ్డిగూడెంః నష్టాల నుంచి బయట పడేందుకు నిమ్మ వైపు మొగ్గారు. వారి కష్టానికి తగ్గ ప్రతిఫలం దొరికింది. దీంతో ఆ గ్రామంలోని రైతులు అటుగా అడుగులు వేశారు. నేడు ప్రతి రైతుకు ఆ పంట సిరులు కురిపిస్తోంది. జంగారెడ్డిగూడెం మండలం అమ్మపాలెం నిమ్మ సిరులు కురిపిస్తోంది. జంగారెడ్డిగూడెం మండలం అమ్మపాలెంలో ప్రతి రైతు నిమ్మ పంటను పండిస్తున్నారు. గ్రామంలో సుమారు 100 ఇళ్లు ఉండగా, 150 కుటుంబాలు ఉన్నాయి. వీరిలో 100 మంది రైతులు ఉన్నారు. ప్రతి రైతుకు ఉన్న భూమిలో కొంత భూమిలో నిమ్మ పండిస్తున్నారు. మరో విశేషం ఏమిటంటే ప్రధానంగా నిమ్మపై ఆధారపడటమే కాక, కుటుంబసభ్యుల అంతా కలిసి వ్యవసాయం చేస్తారు. విద్యార్థులు కూడా ఖాళీ సమయాల్లో నిమ్మ తోటలకు వెళ్లి సొంతంగా కష్టపడుతారు. గ్రామ రెవెన్యూ పరిధిలో సుమారు 600 హెక్టార్లు ఉండగా, దీనిలో 300 ఎకరాల్లో రైతులు నిమ్మ పంట వేశారు. మిరప, పొగాకులో నష్టం రావడంతో.. సుమారు 20 ఏళ్ల క్రితం వరకు గ్రామ రైతులు మిరప, పొగాకు వేసేవారు. ఆ సమయంలో ఈ పంటలకు నష్టాలు రావడంతో ఒకరిద్దరు రైతులు ప్రయోగాత్మకంగా నిమ్మపంట వేశారు. అంతే నిమ్మ సిరులు కురిపించింది. దశలవారీగా రైతులంతా తమ పంట భూమిలో కొంత నిమ్మ పంట వేశారు. మెరక పొలాలు, వరి పొలాల్లో కూడా నిమ్మ పంట వేశారు. ఎకరానికి సుమారు రూ.లక్ష ఆదాయం రైతులకు లభిస్తోంది. దీంతో నిమ్మపంట అమ్మపాలెం గ్రామానికి బంగారం పంటగా మారిపోయింది. ఇప్పుడు ఊరంతా నిమ్మ పంటపైనే ఆధారపడ్డారు. మరొక విశేషం ఏమిటంటే రైతు ఇంటి పెరట్లో ఖాళీ జాగా ఉంటే కచ్చితంగా ఒకటి రెండు నిమ్మ చెట్లు సెంటిమెంట్గా పెంచుతున్నారు. ఊరంతా రైతు కుటుంబాలే. వీరంతా ఒకే మాటపై కట్టుబడి ఉంటారు. అందరూ ఒకే కట్టుబాటును పాటిస్తూ ఏకతాటిపై ఉంటారు. కుటుంబ సభ్యులంతా తోటల్లోకి వెళ్లి నిమ్మకాయలు కోసి సంచుల్లో నింపి ఊర్లో రోడ్డుపక్కన ఉంచుతారు. నిమ్మకాయల వ్యాపారులు మోటార్సైకిళ్లపై వచ్చి ఒకొక్క రైతు నుంచి వరుసగా కొనుగోలు చేసుకుని ట్రక్కు ఆటోలో ఏలూరు, జంగారెడ్డిగూడెం నిమ్మ మార్కెట్కు తరలిస్తారు. అమ్మపాలెంలో పండే నిమ్మ పంట మంచి నాణ్యత కలిగి ఉంటుంది. అమ్మపాలెం పంచాయతీ రైతులంతా నిమ్మ పంటపై ఆధారపడి ఉన్నాం. ఇది మా పంచాయతీకి బంగారు పంట. కుటుంబ సభ్యులంతా కష్టపడి సేద్యం చేస్తాం. మా పంచాయతీలో ప్రతి రైతుకు నిమ్మ పంట ఉంది. రైతులంతా కలిసి ఒకరికొకరు సహకరించుకుంటూ సేద్యం చేసుకుంటాం. – కనపర్తి వెంకట సత్యనారాయణ, నిమ్మరైతు మా గ్రామం నిమ్మ పంటకు ప్రసిద్ది. నిమ్మ పంటకు నేల బాగా అనుకూలంగా ఉంటుంది. దిగుబడి అధికంగా వస్తుంది. పండిన పంటను వ్యాపారులు వచ్చి కొనుగోలు చేసి ఏలూరు, జంగారెడ్డిగూడెం మార్కెట్కు తరలిస్తారు. మాకు ఈ పంట సిరులు కురిపిస్తోంది. – సూరవరపు రాంబాబు, నిమ్మరైతు, సర్పంచ్, అమ్మపాలెం -
అధిక యాంటీ బయోటిక్తో ముప్పు
కొయ్యలగూడెం: పశువులకు చేసే వైద్యంలో మోతాదుకు మించిన యాంటీ బయోటిక్స్ వాడకం ఎక్కువవుతుందని దీని వల్ల పశువుల ఆరోగ్యం క్షీణించడంతోపాటు పాల ఉత్పత్తి పడిపోతుందని యర్రంపేట వెటర్నరీ డాక్టర్ పి.అపురూప పేర్కొన్నారు. యాంటీ బయోటిక్స్ వాడకం, అవగాహనపై రైతులకు పలు సూచనలు చేశారు. యాంటీ బయోటిక్ నిరోధకత తీవ్రమైన ప్రపంచ సంక్షోభం. ఇది మానవ, జంతు ఆరోగ్యానికి ముప్పుగా మారుతోంది. పశువుల పెంపకంలో యాంటీ బయోటిక్స్ను విరివిగా, తరచూ ఉపయోగించడం వల్ల బ్యాక్టీరియాను తట్టుకునేలా పశువులలో ఇమ్యూనిటీ బలహీన పడుతుంది. ఫలితంగా సాధారణ ఇన్ఫెక్షన్లకు కూడా యాంటీబయాటిక్స్ పనిచేయదని, ఇది చికిత్సను సంక్లిష్టం చేస్తుందన్నారు. రోజు రోజుకు బాక్టీరియాలో పెరుగుతున్న నిరోధకతను సరైన అవగాహనతో అరికట్టడం ఎంతైనా అవసరమని పేర్కొన్నారు. బాక్టీరియాలో నిరోధతకు ప్రధాన కారణాలు యాంటీ బయోటిక్స్ సులభంగా, చౌకగా లభించడంతో వాడకందారులు ఎక్కువగా వాటిని ఉపయోగిస్తున్నారు. మోతాదు మించి వాడకంతో తగ్గుతున్న రోగ నిరోధకత యాంటీ బయోటిక్స్ దుర్వినియోగంపై ప్రజల్లో అవగాహనా లేకపోవడం పశువుల పాలిట యమపాశం అవుతుంది. పశువులకు ఇచ్చిన యాంటీబయాటిక్ల అవశేషాలు మాంసం, పాలు లేదా ఇతర ఉత్పత్తుల ద్వారా మనుషుల శరీరంలోకి ప్రవేశించి, వారిలో కూడా యాంటీబయాటిక్ అవశేషాలు వ్యాధి నిరోధకతను తగ్గిస్తాయి. సరైన మోతాదులో యాంటీ బయోటిక్లు ఇవ్వకపోవడం లేదా చికిత్సను మధ్యలో ఆపడం వల్ల, బలంగా ఉండే బ్యాక్టీరియా బతికి, నిరోధకతను అభివృద్ధి చేస్తుందిరు. నిరోధకత పెరగడం వల్ల, పశువులలో సాధారణ వ్యాధులను కూడా నయం చేయడం కష్టమవుతుంది. పశువులు అనారోగ్యానికి గురికావడం లేదా మరణించడం వల్ల రైతులకు భారీగా నష్టం కలుగుతుంది. బ్యాక్టీరియాను చంపడానికి యాంటీ బయోటిక్కు ప్రత్యామ్నాయలపై ఇటీవల పరిశోధనలు పెరిగాయి. నానో టెక్నాలజీ, మొక్కల నుంచి లభించు పదార్ధాలతో యాంటీ బయోటిక్ నిరోధకతను ఎదుర్కొనడం, ప్రో బయోటిక్స్ మొదలగు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా యాంటీ బయోటిక్ వినియోగాన్ని తగ్గించాలన్నారు. యాంటీ బయోటిక్స్ పశు వైద్యుడి సలహా మేరకు లేదా పశువైద్యుడి సంరక్షణలో మాత్రమే ఉపయోగించాలి., పశువులు వ్యాధి లక్షణాల నుంచి తేరుకునప్పటికి ముందుగా పశు వైద్యులు సూచించిన యాంటీ బయోటిక్స్ కోర్సు పూర్తిగ వాడాలి. యాంటీ బయోటిక్స్ నియంత్రణకు మార్గదర్శకాలు అవసరమన్నారు. ఇప్పటికే మార్గదర్శరకాలు రూపొందిస్తున్నారని, అది సఫలమైతే రైతులకు వరంగా మారుతుంది. పశువుల్లో జాగ్రత్తలు తీసుకోవాలంటున్న పశు వైద్యులు నవంబర్ నెలలో ప్రపంచ యాంటీబయాటిక్ అవేర్నెస్ వీక్ వంటి కార్యక్రమాల ద్వారా ప్రజలు, రైతులలో అవగాహన పెంచుబోతున్నాం. ఇందుకు మోడల్గా కొన్ని గ్రామాలను ఎంపిక చేసుకుని కార్యక్రమాలు ఏర్పాటు చేస్తాం. దీనిపై రిజల్ట్ అనుకూలంగా వస్తే శివారు గ్రామాలలో కూడా కార్యక్రమాలు విస్తరిస్తాం. పి.అపురూప, పశువైద్యధికారి, యర్రంపేట పశువైద్యశాల -
రాష్ట్ర స్థాయి ఫెన్సింగ్ పోటీలు
భీమవరం: రాష్ట్ర స్థాయి ఫెన్సింగ్ పోటీలు భీమవరంలో ఆదివారం నిర్వహించారు. ఈ పోటీల్లో క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ మాట్లాడుతూ యువత విద్యతో పాటు క్రీడల్లోనూ రాణించాలని సూచించారు. ఖేలో ఇండియాలో భాగంగా విద్యార్థిని ధృతి సమీక్షకు చెక్కు అందజేశారు. ఫెన్సింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా జాయింట్ సెక్రటరీ ఎన్.సుగుణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఏలూరు రూరల్: ఏలూరు కస్తూర్బా బాలికల పాఠశాల 10వ తరగతి విద్యార్థిని పి.నందిని జాతీయ బాస్కెట్బాల్ పోటీలకు ఎంపికై ందని పాఠశాల హెచ్ఎం కె.మాధవీలత ఒక ప్రకటనలో తెలిపారు. ఆగస్టు 14 నుంచి 17 వరకూ పిఠాపురంలో జరిగిన బాస్కెట్బాల్ పోటీల్లో నందిని జిల్లా జట్టుకు ప్రాతినిధ్యం వహించి ప్రతిభ చాటిందని గుర్తు చేశారు. ఈ నెల 2 నుంచి 9 వరకూ పంజాబ్ రాష్ట్రం లుథియానాలో జరిగే జాతీయ జూనియర్ బాస్కెట్బాల్ పోటీల్లో పాల్గొంటుందన్నారు. -
ఆప్కాస్ ఆపరేటర్ లైంగిక వేధింపులు
● కమిషనర్కు మహిళా ఉద్యోగి ఫిర్యాదు ● విచారణకు ఆదేశం తాడేపల్లిగూడెం: తాడేపల్లిగూడెం మున్సిపాలిటీలో ఆప్కాస్ ఆపరేటర్ బాలా మహిళా ఉద్యోగులపై లైంగిక వేధింపులకు పాల్పడటం కలకలం రేపింది. మున్సిపల్ కార్యాలయంలో ఓ సెక్షన్లో చిరుద్యోగం చేస్తున్న మహిళను తాజాగా వేధించడంతో ఆమె శనివారం మున్సిపల్ కమిషనర్కు ఫిర్యాదు చేయగా విషయం వెలుగులోకి వచ్చింది. ఇదిలా ఉండగా బాలా బాధిత మహిళా ఉద్యోగులు సోమ వారం మూకుమ్మడిగా కమిషనర్కు ఫిర్యాదు చేయనున్నట్టు సమాచారం. అధికారుల అండదండలతోనే..! మహిళా ఉద్యోగులు లక్ష్యంగా బాలా వేధింపులకు పాల్పడటం, ఇందుకు కొందరు అధికారులు వత్తాసు పలుకుతున్నట్టు తెలిసింది. మెసేజ్ల ద్వారా వేధించే పర్వం ఓ దశలో సహాయక మహిళా ఉన్నతాధికారిని కూడా ఇబ్బంది పెట్టే స్థాయికి వెళ్లిందని సమాచారం. దీర్ఘకాలంగా ఇక్కడే పనిచేస్తున్న బాలా అధికారులను లోబర్చుకుని వేధింపుల పర్వం కొనసాగిస్తున్నాడు. కోవిడ్ సమయంలో మున్సిపాలిటీ నుంచి ఆస్పత్రి వద్ద విధులకు, ఆ తర్వాత తాళ్లముదునూరుపాడులో హైస్కూల్కు బదిలీ అయ్యాడు. అతడి చీకటి వ్యవహారాలకు బాసటగా నిలిచే ఓ మహిళా ఉద్యోగి సహకారంతో తిరిగి మున్సిపల్ కార్యాలయంలోకి వచ్చినట్టు సమాచారం. సదరు మహిళా ఉద్యోగిని వేరే మున్సిపాలిటీకి బదిలీ కాగా బా లాను కోవర్టుగా వాడుకుంటున్నట్టు తెలిసింది. అలాగే మరికొందరు అధికారుల అండదండలు బా లాకు పుష్కలంగా ఉన్నాయి. దీర్ఘకాలంగా ఇక్కడే పనిచేయడంతో బాలా ఓ వర్గాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నాడు. మరో ఉద్యోగితో కలిసి మహిళా ఉద్యోగులను వేధింపులకు గురిచేస్తున్నాడు. ఈ క్రమంలో ఇటీవల బాలోత్సవం జరిగిన రోజు రాత్రి ఓ మహిళా చిరుద్యోగినికి వేధింపులకు గురిచేసేలా మెసేజ్ పంపడంతో విషయం వెలుగులోకి వచ్చింది. మున్సిపల్ కార్యాలయంలో ఆపరేటర్గా పనిచేస్తున్న బాలా అనే వ్యక్తి తనను మెసేజ్ల ద్వారా వేధిస్తున్నట్టు మహిళా ఉద్యోగి ఒకరు ఫిర్యాదు చేశారు. ఆమెను, బాలాను కార్యా లయ మేనేజర్ సమక్షంలో విచారణ చేశాం. సారీ.. ఆమె నాకు చెల్లి వంటిది, ఇలాంటి పొరపాట్లు మళ్లీ జరగవంటూ బాలా వివరణ ఇచ్చారు. ఈ విషయంపై లోతైన దర్యాప్తు చేసి చర్యలు తీసుకుంటాం. – ఎం.ఏసుబాబు, మున్సిపల్ కమిషనర్, తాడేపల్లిగూడెం -
వీసీ నియామకంలో పితలాటకం
తాడేపల్లిగూడెం: డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం కొత్త వీసీ నియామకంలో పితలాటకం మొదలైంది. ప్రస్తుత వీసీ డాక్టర్ కె.గోపాల్ ఉద్యోగ కాలం ఆదివారంతో ముగిసింది. వాస్తవానికి తదుపరి వీసీ ఎవరనేది ప్రభుత్వం శుక్రవారమే నిర్ణయం తీసుకోవాల్సి ఉండగా అది జరగలేదు. వీసీ గోపాల్ ఉద్యోగ కాలాన్ని అయినా పొడిగించాలి లేదా ఇన్చార్జి వీసీని నియమించాలి. అయితే ఇవి కూడా జరగలేదు. దీంతో తననే వీసీగా కొనసాగించాలని ప్రస్తుత వైస్ చానల్సర్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ విషయాన్ని ఈనెల 26కి వా యిదా వేస్తూ కోర్టు తీర్పునిచ్చింది. వీసీ వాదనేంటంటే.. వీసీగా వచ్చే వ్యక్తిని ఉన్నత విద్యాశాఖకు చెందిన వ్యక్తిగా పరిగణించాలని, వారికి మాదిరిగానే వయ సును 62 నుంచి 65 ఏళ్లకు పరిగణనలోకి తీసుకుని తనకు 65 ఏళ్లు వచ్చే వరకు కొనసాగించాలని వీసీ గోపాల్ హైకోర్టులో రిట్ పిటిషన్ వేశారు. గోపాల్ 1987లో అసిస్టెంట్ రీసెర్చ్ అధికారిగా అప్పటి వ్యవసాయ విశ్వవిద్యాలయంలో చేరారు. అనంతరం ప్లాంట్ పథాలజీ ప్రొఫెసర్గా ఉద్యోగోన్నతి పొందారు. 2007లో ఉద్యాన వర్సిటీలో ప్రవేశించి వీసీ స్థాయికి ఎదిగారు. ఈ నేపథ్యంలో ఆయన పదవీ కాలంలో ఆగస్టు 31తో ముగిసింది. ఉన్నత విద్యాశాఖ జీఓ 39 ప్రకారం విశ్వవిద్యాలయాల అధ్యాపకుల పదవీ విరమణ వయసు 62 నుంచి 65 ఏళ్లుగా పెంచినట్టుగా సూపర్ రెన్యూయేషన్ పద్ధతిన ప్రొఫెసర్గా ఉన్న తనకూ ఈ జీఓ వర్తింపజేయాలని కోరారు. వాస్తవానికి జీఓ 39 ఆంధ్రా విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్యాశాఖలో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) కింద పనిచేసే అధ్యాపకులకు మాత్రమే వర్తిస్తుంది. ఉద్యాన విశ్వవిద్యాలయంలో పనిచేసే ప్రొఫెసర్లకు వర్తించదు. ఉద్యాన వర్సిటీ ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ శాఖ పరిధిలోకి వస్తారు. వీరికి వేతనాలను ప్రభుత్వమే ఇస్తుంది. యూజీసీ వేతనాల పరిఽధిలోకి రారు కాబట్టి ఈ రిట్పై దఖలు చేసిన వ్యక్తి కౌంటర్ అఫిడవిట్ను ఈనెల 29న దాఖలు చేయాలని కోర్టు స్పష్టం చేసింది. దీంతో వీసీ గోపాల్కు ఊరట దొరకలేదు. మొత్తంగా ఉద్యాన వర్సిటీ వీసీ నియా మకంలో డైలమా కొనసాగుతోంది. ఆగస్టు 31తో ముగిసిన ఉద్యాన వర్సిటీ వీసీ పదవీ కాలం కొత్త వీసీని నియమించని ప్రభుత్వం తననే కొనసాగించాలని కోర్టును ఆశ్రయించిన ప్రస్తుత వీసీ గోపాల్ -
కూటమి పాలనలో పెచ్చుమీరిన దౌర్జన్యాలు
సాక్షి, టాస్క్ఫోర్స్: ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వల్ల తమకు ప్రాణహాని ఉందని పెదవేగి మండలం పినకడిమి సర్పంచ్ సునీత భర్త పలగాని శ్రీనివాసరావు ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం దెందు లూరు మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. శనివారం సాయంత్రం ఎమ్మెల్యే చింతమనేని, ఆయన గన్మన్, మరో వ్యక్తి రవి దౌ ర్జన్యంగా తన పొలంలోకి వచ్చి అన్యాయంగా దాడి చేయడంతో పాటు తమపైనే కేసు పెట్టడం ఎంతవరకు న్యాయమని కన్నీటిపర్యంతమయ్యారు. వైఎస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు మేక లక్ష్మణరావు మాట్లాడుతూ దెందులూరు నియోజకవర్గంలో బలమైన గౌడ సామాజిక వర్గానికి చెందిన సర్పంచ్ భర్తపై దాడి, దౌర్జన్యం చేయడమే కాకుండా వారు సాగు చేసుకుంటున్న పొలాన్ని ఆక్రమించాలని చూ డటం విచారకరమన్నారు. ఇలాంటి ఘటనలు జరగకుండా టీడీపీ అధిష్టానం చర్యలు తీసుకోవాలన్నారు. ఎప్పటినుంచో సాగు చేసుకుంటున్న సర్పంచ్ దంపతులకు చెందిన భూమిలోకి ఎమ్మెల్యేగానే వెళ్లాల్సిన అవసరం ఏమిటని, ఏకంగా మహిళా సర్పంచినే స్పృహ కోల్పోయేలా కొడితే గ్రా మస్తులకు, నియోజకవర్గ ప్రజలకు రక్షణ ఏముంటుందని ప్రశ్నించారు. పెదవేగి ఎంపీపీ తాత రమ్యశ్రీ మాట్లాడుతూ మహిళా సర్పంచ్పై, ఆమె భర్తపై జరిగిన దాడి, దౌర్జన్యం బాధాకరమన్నారు. దీనిని గౌడ సామాజిక వర్గ మహిళలపై జరిగిన దాడిగా తాము భావిస్తున్నామని స్పష్టం చేశారు. దెందులూరు నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షుడు మట్ట రమాశంకర్ గౌడ్ మాట్లాడుతూ ఎమ్మెల్యే గన్మన్, మరో వ్యక్తి చేసిన దాడి, దౌర్జన్యం, దు ర్భాషలు సభ్య సమాజానికి, ప్రజాస్వామ్యానికి సి గ్గుచేటన్నారు. ఇదే పరిస్థితి భవిష్యత్తులో మీకు వస్తే మీ పరిస్థితి ఏమిటని నిలదీశారు. పినకడిమి సర్పంచ్ భర్త శ్రీనివాసరావు