breaking news
West Godavari
-
ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా మాణిక్యరావు
ఏలూరు (ఆర్ఆర్పేట): ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ రాష్ట్ర ఉపాధ్యక్షునిగా ఏలూరుకు చెందిన సీనియర్ జర్నలిస్ట్, ఎంటీవీ యూ ట్యూబ్ ఛానల్ చైర్మన్ కాగిత మాణిక్యరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శుక్రవారం ఒంగోలులో నిర్వహించిన సంఘ 36వ రాష్ట్ర మహాసభల్లో ఈ ఎన్నిక నిర్వహించారు. ఈ సందర్భంగా మాణిక్యరావును ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ జాతీయ అధ్యక్షుడు కే.శ్రీనివాసరెడ్డి, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు ఐవీ సుబ్బారావు, ప్రధాన కార్యదర్శి కంచర్ల జయరాజు, ఐజేయూ జాతీయ కార్యదర్శి దూసనపూడి సోమ సుందర్, అభినందంచారు. అలాగే మాణిక్యరావు ఎన్నికపట్ల ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు కేపీకే కిషోర్ శుభాకాంక్షలు తెలిపారు. గూడ్స్ రైలు ఢీకొని వ్యక్తి మృతి మండవల్లి: గూడ్స్ రైలు ఢీకొని ఒక వ్యక్తి మృతి చెందాడు. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కైకలూరు–మండవల్లి రైల్వే స్టేషన్ల మధ్య 68–17 కిలో మీటరు నెంబర్ వద్ద ఒక వ్యక్తి అజాగ్రత్తగా రైల్వే ట్రాక్ను దాటుతుండగా కై కలూరు వైపు నుంచి వస్తున్న గూడ్స్ రైలు ఢీకొని ప్రమాదవశాత్తు మృతి చెందాడు. మృతుడి వయస్సు 25 నుంచి 30 సంవత్సరాల మధ్య వయసు ఉంటుందన్నారు. మృతుడి వివరాలు తెలిస్తే గుడివాడ రైల్వే ఎస్సై ఫోన్ 94406 27570 లేదా 98662 21412 నంబర్లలో తెలియజేయాలని రైల్వే పోలీసులు కోరారు.యువతి అదృశ్యంపై కేసు నమోదు ఆకివీడు : యువతి అదృశ్యంపై స్థానిక పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఎస్సై హెచ్ నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం కలిదిండి మండలం కాళ్లపాలెంకు చెందిన యువతి (19) స్థానిక ఎస్ టర్నింగ్ ప్రాంతంలో నివసిస్తున్న తాత ఇంటి వద్దకు ఇటీవల వచ్చింది. ఈనెల 24వ తేదీ ఉదయం ఇంటి వద్ద నుంచి బయటకు వెళ్లిన యువతి తిరిగి రాలేదని, బంధువుల ఇళ్ల వద్ద వెతికినా ఆచూకీ లభించక పోవడంతో యువతి తాత పోలీసులకు ఫిర్యాదు చేశాడు. -
సర్కారు నిర్ణయం.. డీలర్లకు భారం
భీమడోలు: కూటమి సర్కారు నిర్ణయం రేషన్ డీలర్లకు భారంగా మారింది. ప్రభుత్వం ఎండీయూ వాహనాలను తొలగించి ఇంటింటికీ రేషన్ రద్దు చేయడంతో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. దీంతో ఒక అడుగు వెనక్కు వేసి 65 ఏళ్లు నిండిన వృద్ధులు, మహిళలు, దివ్యాంగుల ఇంటికే రేషన్ సరఫరా చేయాలని రేషన్ డీలర్లను ఆదేశించింది. జూలై నెల రేషన్ను ఈనెల 26వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ముందుగానే ఇంటింటికీ వెళ్లి డీలర్లు పంపిణీ చేయాలని పౌరసరఫరాల విభాగం అధికారులను ఆదేశించింది. అయితే క్షేత్రస్థాయిలో డీలర్ల ఇబ్బందులను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోకపోవడంతో వారి పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. డీలర్లకు కష్టాలు రేషన్ డీలర్లలో ఎక్కువ మంది వృద్ధులు, మహిళలు, వితంతువులు, వికలాంగులుండడం.. కిలోమీటర్ల దూరంలో ఉన్న వృద్ధుల ఇంటింటికీ వెళ్లి రేషన్ సరఫరా చేయాల్సి రావడం వారికి తలకు మించిన భారంగా మారింది. వృద్ధుల ఇంటికి వెళ్లి రేషన్ పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందే గానీ బియ్యం, సరుకుల పంపిణీకి వాహనాన్ని కేటాయించలేదని, ఒక్క సంచి కూడా ఇవ్వలేదని, కమీషన్ సైతం పెంచలేదని డీలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండల పరిధిలో 20 వేల రేషన్ కార్డులుండగా... 65 ఏళ్లు నిండిన వృద్ధుల రేషన్ కార్డులు 2406 ఉన్నాయి. వారందరికీ ఇళ్లకు వెళ్లి రేషన్ పంపిణీ చేయాలంటే తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని వాపోతున్నారు. ప్రభుత్వం తమ సమస్యలను గుర్తించి రేషన్ పంపిణీకి మండలానికి కొన్ని వాహనాలు కేటాయించాలని, దూరాభారాన్ని ఎదుర్కొంటున్న డీలర్లకు పారితోషికాన్ని పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా భీమడోలు సీఎస్ డీటీ భరత్కుమార్ మాట్లాడుతూ వయోభారంతో ఉన్న డీలర్లు ప్రత్నామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. -
ఏఐపై మరిన్ని పరిశోధనలు జరగాలి
తాడేపల్లిగూడెం (టీఓసీ): విశ్వ విద్యాలయ పరిధిలోని పరిశోధన, బోధన, విస్తరణ రంగాల పురోగతిని బలోపేతం చేసేందుకు డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వ విద్యాలయం, యూఎస్ఏ కాన్సాస్ స్టేట్ యూనివర్సిటీలు పరస్పర ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. విశ్వ విద్యాలయం ఉప కులపతి డాక్టర్ కే.గోపాల్, డాక్టర్ పీవీ వర ప్రసాద్, యూనివర్సిటీ ప్రొఫెసర్ ఆర్ఓ కృస్, ఎండోడ్ ప్రొఫెసర్, డైరక్టర్ సెంటర్ ఫర్ క్రాప్స్, క్లైమేట్ అండ్ కమ్యూనిటీస్, కాలేజీ ఆఫ్ అగ్రికల్చర్, యూఎస్ఏ కాన్సాస్ స్టేట్ యూనివర్సిటీ సభ్యులు గురువారం ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. గోపాల్ మాట్లాడుతూ రానున్న రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటిల్జెన్సీ, మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ వంటి ఉద్యాన సంబంధిత పరిశోధనలు మరిన్ని జరగాలన్నారు. డాక్టర్ వర ప్రసాద్ మాట్లాడుతూ విశ్వ విద్యాలయంలోని ఫ్యాకల్టీ, విద్యార్థులకు ఉపయోగపడేలా అనుబంధ పరిశోధన, అధ్యాపక అవకాశాలు కల్పిస్తారన్నారు. డాక్టర్ కే.ధనుంజయ్ రావు, అధికారులు ఎం.మాధవి, బి.శ్రీనివాసులు, ప్రసన్నకుమార్, ఎస్శ్రీ విజయపద్మ, జి.రామానందం అసోసియేషన్ డీన్లు, విద్యార్థినీ, విద్యార్థులు సిబ్బంది పాల్గొన్నారు. వివాహితపై హత్యాయత్నం కేసులో నిందితుడి అరెస్ట్ భీమవరం (ప్రకాశం చౌక్): బ్లేడుతో వివాహితపై హత్యాయత్నం జరిపిన కేసులో నిందితుడిని పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. భీమవరం డీఎస్పీ జయసూర్య స్థానిక వన్టౌన్ పోలీస్ స్టేషన్లో వివరాలు వెల్లడించారు. తనను వివాహం చేసుకోవాలని పట్టణానికి చెందిన పొలిశెట్టి హేమంత్ వివాహిత మామిడి నాగసూర్యమణిపై ఒత్తిడి చేశాడు. ఆమె నిరాకరించడంతో బుధవారం హేమంత్ బ్లేడుతో నాగమణిపై హత్యాయత్నానికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఎస్పీ, డీఎస్పీ పర్యవేక్షణలో వన్టౌన్ సీఐ ఆధ్వర్యంలో నాలుగు టీమ్లు ఏర్పాటు చేసి నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నిందితుడు హేమంత్ భీమవరం బైపాస్ రోడ్డులో ఉన్నట్లు గుర్తించి గురువారం ఉదయం 11 గంటలకు అతడిని అరెస్ట్ చేసి పోలీసు స్టేషన్కు తరలించారు. విచారణలో నాగమణి పెళ్లికి తిరస్కరించడంతో కోపంతోనే ఆమైపె హత్యాయత్నానికి పాల్పడినట్లు నిందితుడు హేమంత్ నేరం అంగీకరించాడని పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా సీఐ నాగరాజు, ఎస్సైలు కిరణకుమార్, కృష్ణాజీలను డీఎస్పీ అభినందించారు. -
లారీ రూపంలో కబళించిన మృత్యువు
భీమడోలు, మండవల్లి: మోటార్సైకిల్ను లారీ ఢీకొన్న ఘటనలో భార్య మృతి చెందగా భర్తకు గాయాలయ్యాయి. పూళ్ల పంచాయతీ కార్యాలయం వద్ద గురువారం ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల ప్రకారం మండవల్లి మండలం కొవ్వాడలంక గ్రామానికి చెందిన ఘంటసాల రామృష్ణ, సీతామహాలక్ష్మి పూళ్ల పంచాయతీ పరిధిలోని ఎంఎంపురం గ్రామంలో నివాసముంటున్నారు. కుమార్తె మోరు లక్ష్మీతిరుపతమ్మ ఆనారోగ్యం కారణంగా ఏలూరు ఆశ్రం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఆస్పత్రిలో ఉన్న కుమార్తెకు భోజనం తీసుకువెళ్లేందుకు రామకృష్ణ, సీతామహాలక్ష్మి మోటార్సైకిల్పై ఏలూరుకు బయలుదేరారు. మార్గమధ్యమైన పూళ్ల పంచాయతీ వద్దకు వచ్చేసరికి ఎదురుగా వస్తున్న టిప్పర్ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సీతామహాలక్ష్మి (61) అక్కడిక్కడే మృతి చెందింది. భర్త రామకృష్ణకు స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న భీమడోలు ఎస్సై వై.సుధాకర్ ఘటనా స్థలానికి చేరకుని పరిశీలించారు. రామకృష్ణ ఫిర్యాదు మేరకు ఎస్సై సుధాకర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సీతామహాలక్ష్మి మృతితో ఎంఎంపురం గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. మోటార్సైకిల్ను ఢీకొన్న లారీ భార్య మృతి, భర్తకు గాయాలు -
కర్తవ్య నిర్వహణలో విగతజీవులై..
ఆలమూరు : కర్తవ్య నిర్వహణలో ఉన్న పోలీసు సిబ్బంది రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందడం ఆ కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. మాదక ద్రవ్యాలు (గంజాయి) రవాణా చేస్తున్న నిందితుడిని పట్టుకోవడానికి వెళుతూ అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నియంత్రణ దినోత్సవం రోజునే ఆ ఇద్దరు అధికారులు అశువులు బాసారు. వివరాల్లోకి వెళితే.. ఆలమూరు మండల పరిధిలోని 216 ఏ జాతీయ రహదారిలో గతంలో గంజాయి అక్రమ రవాణా కేసు నమోదైంది. ఆ కేసులో నిందితుల్లో ఒకరు హైదరాబాద్లో ఉన్నాడన్న సమాచారంతో అతడ్ని పట్టకునేందుకు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బుధవారం రాత్రి ఆలమూరు ఎస్సై అశోక్, ఆత్రేయపురం కానిస్టేబుల్ ఎస్.బ్లెసన్ జీవన్, రావులపాలెం సీఐ కార్యాలయం ఐడీ పార్టీ హెడ్ కానిస్టేబుల్ దొంగ స్వామి, డ్రైవర్ జి.రమేష్ కారులో హైదరాబాద్ బయలు దేరారు. కోదాడ సమీపంలోని దుర్గాపురం వద్దకు వచ్చేసరికి వారు ఓ లారీని వెనుక నుంచి ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ఎస్సై అశోక్ (45) కానిస్టేబుల్ బ్లెసన్ (32) అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. డ్రైవర్ రమేష్, హెడ్ కానిస్టేబుల్ స్వామికి తీవ్ర గాయాలయ్యాయి. పదోన్నతి వస్తుందనుకునే లోపే.. అశోక్ ఎస్సైగా బాధ్యతలు చేపట్టిన అనతి కాలంలోనే ఉన్నతాధికారుల సాయంతో అనేక కేసులను ఛేదించి పలు అవార్డులు, రివార్డులను సొంతం చేసుకున్నారు.ఈ ఏడాది సర్కిల్ ఇన్స్పెక్టర్గా పదోన్నతి వస్తుందని కుటుంబ సభ్యులు భావిస్తున్న నేపథ్యంలో ఇంతటి ఘోరం జరగడం వారిని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. అశోక్ స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలోని రుస్తుంబాదా కాగా ప్రస్తుతం రాజమహేంద్రవరంలోని ఏవీ అప్పారావు రోడ్డులో కుటుంబ సభ్యులతో కలిసి నివసిస్తున్నారు. ఆయనకు భార్య శ్రీవల్లి, ఇద్దరు సోదరులు, ఒక సోదరి, ఇద్దరు కుమారులు ఉన్నారు. బ్లెసన్ మృతిపై విలపించిన సోదరులు విధి నిర్వహణలో ఎస్సై అశోక్కు తోడుగా వెళ్లి మృత్యు ఒడిలోకి వెళ్లిన కానిస్టేబుల్ బ్లెసన్ స్వస్థలం ఆలమూరు. ఆయన తన తల్లి హెప్సీబా, సోదరులు ప్రిన్స్ ఆదిత్య, అలెక్స్ కలసి ఉంటున్నారు. కష్టపడి చదివి ఉద్యోగం సాధించిన బ్లెసన్ తమ కుటుంబానికి అండగా ఉంటాడనుకుంటే హఠాత్తుగా మృతి చెందడంపై కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. వచ్చే ఏడాది కొత్త ఇల్లు నిర్మించుకుని పెళ్లి చేసుకుందామనుకుంటున్న తన సోదరుడు బ్లెసన్ ఆ ముచ్చట తీరకుండానే కానరాని లోకాలు వెళ్లిపోయాడని సోదరులు రోదిస్తున్న తీరు చూపరులను కంటతడి పెట్టించింది. రోడ్డు ప్రమాదంలో ఎస్సై, కానిస్టేబుల్ మృతి మరో ఇద్దరికి తీవ్ర గాయాలు గంజాయి రవాణా నిందితుడి అన్వేషణలో దుర్ఘటన నరసాపురంలో అంత్యక్రియలు నరసాపురంలో విషాదఛాయలు నరసాపురం: ఆలమూరు ఎస్సై ముద్దాల అశోక్ మృతిపై నరసాపురంలో విషాదచాయలు అలుముకున్నాయి. ఆయన మృతేహాన్ని గురువారం సాయంత్రం స్వస్థలమైన నరసాపురం తీసుకొచ్చారు. కోనసీమ జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు, ఇతర పోలీసు అధికారులు, ప్రజాప్రతినిధులు అశోక్కుమార్ భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. అనంతరం వశిష్ట గోదావరి గట్టున ఉన్న మహాప్రస్థానం శ్మశానవాటిక వద్ద పోలీసు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. అశోక్ తండ్రి నర్శింహమూర్తి సాధారణ రైతు. తల్లి గృహిణి. వారు గతంలోనే మృతి చెందారు. అశోక్ వారంరోజుల క్రితం ఇంటికి వచ్చి స్నేహితులను, బంధువును కలిసివెళ్లినట్టుగా చెబుతున్నారు. ఇక్కడున్న రెండు రోజులుచాలా సరదాగా గడిపినట్టు గుర్తు చేసుకున్నారు. -
కనులపండువగా శివ కల్యాణం
ద్వారకాతిరుమల : క్షేత్రపాలకునిగా విరాజిల్లుతోన్న శ్రీ భ్రమరాంబ మల్లేశ్వర స్వామివారి ఆలయంలో శివదేవుని కల్యాణ మహోత్సవం గురువారం కన్నులపండువగా జరిగింది. ఆరుద్రా నక్షత్రాన్ని పురస్కరించుకుని అట్టహాసంగా నిర్వహించిన ఈ వేడుక భక్తులకు కనువిందు చేసింది. మండపంలో ఏర్పాటు చేసిన వేదికపై స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను ఉంచి, అర్చకులు విశేష పుష్పాలంకారాలు చేశారు. ఆ తరువాత కల్యాణ తంతును ప్రారంభించి, సుముహూర్త సమయంలో నూతన వధువరుల శిరస్సులపై జీలకర్ర, బెల్లం ధరింపజేశారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, అర్చకులు, పండితుల వేద మంత్రోచ్ఛరణలు, భక్తుల శివనామస్మరణల నడుమ మాంగల్యధారణ, తలంబ్రాల వేడుకలను కనులపండువగా జరిపి, కల్యాణ మూర్తులకు హారతులిచ్చారు. ఈ వేడుకలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని, స్వామివారి తీర్థప్రసాదాలను స్వీకరించారు. -
జగన్నాథ ఉత్సవాలకు సర్వం సిద్ధం
ద్వారకాతిరుమల: శ్రీవారి ఆలయానికి దత్తత దేవాలయమైన లక్ష్మీపురంలోని జగన్నాథని ఆలయం రథయాత్ర ఉత్సవాలకు సర్వం సిద్ధమైంది. ప్రతి ఏటా పూరీలో వలె ఈ ఉత్సవాలు ఇక్కడ వైభవంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈనెల 27 నుంచి వచ్చేనెల 6 వరకు నిర్వహించనున్న ఉత్సవాలను పురస్కరించుకుని ఆలయాన్ని విశేషంగా అలంకరించారు. ఉత్సవాల తొలిరోజు సాయంత్రం 6 గంటల నుంచి జగన్నాథ రధయాత్ర ఆలయం నుంచి ద్వారకాతిరుమల క్షేత్రం వరకు జరుగనుంది. ఇదిలా ఉంటే ఈ సారి స్వామివారి దశావతారాలు ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నాయి. దేవస్థానం అధికారులు లక్షలాది రూపాయలు వెచ్చించి ఇత్తడితో దశావతారాల రూపాలను తయారు చేయించారు. ఉత్సవాల ప్రారంభాన్ని పురస్కరించుకుని జగన్నాథుడు శుక్రవారం ఆలయ యాగశాలలో మత్స్యావతార అలంకారంలో దర్శనమిస్తారని, భక్తులు దర్శించి తరించాలని ఆలయ ఈఓ ఎన్వీ సత్యన్నారాయణ మూర్తి కోరారు. -
చేదు మిగిల్చిన మామిడి
నూజివీడు : ఏ ఏటికాయేడు లాభాలను పంచుతుందేమోనని ఆశగా ఎదురుచూస్తున్న రైతుకు మామిడి చేదునే రుచిచూపిస్తోంది. ఈ ఏడాది మామిడి దిగుబడి తక్కువగా ఉండటం, ధర లేకపోవడంతో రైతులు కు ఆదాయం లేక నిరాశలో కొట్టుమిట్టాడుతున్నారు. పండ్లలో రారాజుగా మామిడికి పేరున్నప్పటికీ అదే మామిడిని సాగుచేస్తున్న రైతులు మాత్రం తీవ్రమైన నష్టాల ఊబిలో కూరుకుపోయారు. ఈ ఏడాదైనా పరిస్థితి బాగుంటుందనే ఆశాభావంతో మామిడి రైతు ముందుకు సాగుతున్నప్పటికీ పరిస్థితుల్లో మార్పు రాకపోగా ఏడాదికేడాదికి మరింత సంక్షోభంలో కూరుకుపోతున్నాడు. ఈ ఏడాది మామిడి దిగుబడి తక్కువగా ఉండటంతో మంచి ధర లభిస్తుందని రైతులు పెట్టుకున్న ఆశలు అడియాశలయ్యాయి. దీంతో జిల్లా వ్యాప్తంగా ఉన్న మామిడి రైతులు తీవ్ర నిరాశ నిస్పృహలో కొట్టుమిట్టాడుతున్నారు. జిల్లాలో 40 వేల ఎకరాల్లో మామిడి తోటలు విస్తరించి ఉన్నాయి. దీనిలో నూజివీడు నియోజకవర్గంలోనే 35 వేల ఎకరాల్లో మామిడి పంట సాగులో ఉంది. బంగినపల్లి, తోతాపురి, చిన్నరసాలు, పెద్ద రసాలు వంటి రకాలు ఇక్కడ ఎక్కువగా ఉన్నాయి. మామిడి పంట లక్షణం ఒక ఏడాది కాపు బాగా ఉంటే మరో ఏడాది దిగుబడి ఉండదు. అయితే గత కొన్నేళ్లుగా ఈ సహజ లక్షణానికి భిన్నంగా మామిడి దిగుబడి ఉంటోంది. గత నాలుగైదేళ్లుగా ప్రతిఏటా కాపు తక్కువగానే ఉంటోంది. పూత సమయంలో ఎక్కడ చూసినా దట్టంగా కనిపిస్తున్నప్పటికీ పిందెగా మారే శాతం మాత్రం చాలా తక్కువగా ఉంటోంది. పూత దశలో ఆశిస్తున్న నల్లతామర రైతులను కోలుకోలేని దెబ్బ కొడుతోంది. పతనమైన ధరలు రైతులు ఎక్కుగా బంగినపల్లి, తోతాపురి(కలెక్టర్), రసాల తోటలను సాగుచేస్తుండగా ఈ ఏడాది అన్ని రకాల దిగుబడి చాలా తక్కువగా ఉంది. కాపు పది నుంచి 20శాతం లోపు మాత్రమే ఉండటంతో మామిడికి సీజన్ ప్రారంభంలో మంచి ధర లభించింది. బంగినపల్లి రకం కాయలకు టన్నుకు ముంబాయి మార్కెట్లో రూ.50 వేల నుంచి రూ.60 వేల వరకు ధర లభించింది. అయితే రానురాను కొంతమేరకు ధర తగ్గుముఖం పట్టినప్పటికీ టన్ను రూ.25 వేల నుంచి రూ.30 వేల మధ్య ధర నిలబడింది. నూజివీడు, నున్న, విస్సన్నపేట తదితర ప్రాంతాల్లోని కమీషన్ షాపుల్లో టన్ను రూ.10 వేల నుంచి రూ.15 వేల లోపు మాత్రమే ఉంది. తోతాపురి పరిస్థితి కూడా అలాగే ఉంది. దీనికి ప్రారంభంలో టన్ను 12 వేల ధర లభించినప్పటికీ రానురాను పతనమవుతూ టన్ను రూ.3 వేలకు పడిపోయింది. అంతేగాకుండా మే నెల అంతా వర్షాలు కురవడం వల్ల కాయల్లో నాణ్యత సైతం తగ్గిపోయింది. దీంతో రైతులకు కోతఖర్చులు కూడా రాని పరిస్థితి నెలకొంది. నష్టాలు మిగలడంతో ఖరీఫ్ సీజన్లో మామిడి తోటల్లో దుక్కిదున్ని ఎరువులు వేసే పరిస్థితి లేదు. పట్టించుకోని ప్రభుత్వం మామిడి ధరలు పతనమైనా రైతులను ఆదుకునే ఆలోచన ప్రభుత్వం చేయలేదు. కనీసం ధరలు పతనమవ్వకుండా చర్యలు తీసుకోలేదు. నున్న మామిడి మార్కెట్లో మామిడి కాయలను కొనుగోలు చేసి దేశంలోని పలు ప్రాంతాలకు ఎగుమతి చేసే సేట్లతో సమావేశం ఏర్పాటు చేసి రైతులకు కనీస గిట్టుబాటు ధర ఇవ్వాలని చెప్పే అధికారి కూడా ఎవరూ లేకపోవడంతో మామిడి ధర పతనమై రైతులకు ఈ ఏడాది చేదును పంచింది. రూ.15 లక్షల నష్టం వాటిల్లింది ఈ ఏడాది ఎన్నడూ లేని విధంగా మామిడి ధరలు పతనమయ్యాయి. తోతాపురి టన్ను రూ.3 వేలకు పడిపోవడంతో కోత ఖర్చులు రాకపోవడంతో కాయలను కోయకుండా వదిలేశా. బంగినపల్లి ధర సైతం టన్ను రూ.10 వేలకు పడిపోయింది. 40 ఎకరాల్లో మామిడి కాపును కొంటే ధర లేక రూ.15 లక్షల నష్టం వాటిల్లింది. ఇంత దారుణమైన పరిస్థితిని గతంలో ఎన్నడూ చూడలేదు. ప్రభుత్వం మామిడి రైతులను, వ్యాపారులను ఆదుకోవాలి. – బాణావతు రాజు, లైన్తండా, నూజివీడు మండలం ధర లేక నిరాశలో రైతులు కోత ఖర్చులు కూడా రాని పరిస్థితి ఏటా నష్టాల్లో కూరుకుపోతున్నామని ఆవేదన -
అధినేతతో భేటీ
సాక్షి, భీమవరం: వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని మాజీ మంత్రి, తాడేపల్లిగూడెం నియోజకవర్గ వైఎస్సార్సీపీ కో–ఆర్డినేటర్ కొట్టు సత్యనారాయణ బుధవారం తాడేపల్లిలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో అధికార కూటమి సాగిస్తున్న అరాచకాలపై అధినేతతో చర్చించారు. ప్రజలకు అండగా ఉండాలని జగన్ సూచించినట్లు కొట్టు తెలిపారు.వైఎస్సార్సీపీ అనుబంధ కమిటీల్లో నియామకాలుఆకివీడు: వైఎస్సార్సీపీ రాష్ట్ర విభాగం అనుబంధ సంస్థ ఆర్టీఐ విభాగం కార్యదర్శిగా ఉండికి చెందిన బడుగు బాలాజీ, పార్టీ ఐటీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పడాల కిషోర్ రెడ్డిని నియమించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి బుధవారం ఉత్తర్వులు అందాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీని మరింత పటిష్టం చేయడానికి కృషి చేస్తామని చెప్పారు.మున్సిపల్ ఇంజినీరింగ్ కార్మికుల ర్యాలీభీమవరం(ప్రకాశం చౌక్): మున్సిపల్ ఇంజినీరింగ్ కార్మికుల సమ్మెలో భాగంగా 3 రోజు బుధవారం మున్సిపల్ ఆఫీస్ నుంచి అంబేడ్కర్ చౌక్ వరకు ర్యాలీ నిర్వహించారు. వారి సమస్యలపై అంబేద్కర్ విగ్రహానికి పూలమాల అలంకరించి వినతిపత్రం అందజేశారు. అనంతరం ర్యాలీగా తిరిగి వెళ్లి మున్సిపల్ కార్యాలయం వద్ద సమ్మె కొనసాగించారు. కార్యక్రమంలో భీమవరం మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. -
కలల వారధి కల్లేనా?
నరసాపురం: వశిష్ట గోదావరిపై నరసాపురంలో నిర్మించాలనుకున్న వంతెన నిర్మాణం సందిగ్ధంలో పడింది. జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ రూ 591.71 కోట్ల నిధులతో వంతెన నిర్మించడానికి గత వైస్సార్సీపీ హయాంలో టెండర్లు పిలిచారు. ఎన్నికలు రావడం, కోర్టు అడ్డంకులతో కూటమి నేతల కుట్రలతో పనులు ముందుకు సాగలేదు. ఈ నెల 11న టెండర్లు తెరవాల్సి ఉండగా, సాంకేతిక కారణాలతో టెండర్లు రద్దు చేస్తున్నట్టు ఢిల్లీలోని జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ కేంద్ర కార్యాలయం పేర్కొంది. ఇప్పటికే టెండర్లు తెరిచే ప్రక్రియను రికార్డు స్థాయిలో 13 సార్లు వాయిదావేసి, చివరిగా టెండర్లు రద్దు చేయడం మరో విశేషం. వంతెన నిర్మాణం జరగకుండా అడ్డుకునే క్రమంలో కూటమి నేతలు కోర్టుల ద్వారా చేస్తున్న కుట్రలు కొనసాగుతున్నాయి. సుప్రీంకోర్టులో కేసు విచారణ ఆగస్టుకు వాయిదా పడింది. దీంతో వశిష్ట వంతెన కల నెరవేరే అవకాశాలు ఇప్పట్లో లేనట్టే. ఉభయ గోదావరి జిల్లాలను కలుపుతూ వశిష్ట గోదావరిపై నరసాపురంలో వంతెన నిర్మించాలనేది దశాబ్దాల డిమాండ్. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా వంతెన నిర్మాణం ప్రారంభమవుతుందన్న తరుణంలో ఆయన అకాల మృతితో ఆ ప్రయత్నం ఆగిసోయింది. మళ్లీ ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక వంతెన నిర్మాణంపై దృష్టిపెట్టి పనిచేయడం, అప్పటి ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు చొరవతో వంతెన నిర్మాణం ముందుకు కదిలింది. రూ 591.71 కోట్ల అంచనాతో నరసాపురం మండలం రాజుల్లంక వద్ద వంతెన నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో వైఎస్సార్సీపీ ప్రభుత్వం పూనుకుంది. కోనసీమ జిల్లా చించినాడ మీదుగా నరసాపురం నుంచి ఒంగోలు వరకూ నిర్మించిన 216 జాతీయ రహదారికి బైపాస్ నిర్మించడం ద్వారా వంతెన నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. కోనసీమ జిల్లా శివకోడు నుంచి టేకిశెట్టిపాలెం మీదుగా ఉన్న స్టేట్హైవేను జాతీయ రహదారిగా మార్చి రామేశ్వరం మీదుగా ఇటు పశ్చిమగోదావరి జిల్లాలోని రాజుల్లంక, వైఎస్ పాలెం, సీతారామపురం మీదుగా జాతీయ రహదారికి బైపాస్ హైవే రోడ్డు నిర్మించాలని ప్రతిపాదనలు తయారు చేసి టెండర్లు పిలిచారు. మధ్యలో కోనసీమ జిల్లా రామేశ్వరం, నరసాపురం మండలం రాజుల్లంక వద్ద వశిష్ట గోదావరిపై వంతెన నిర్మించడం ద్వారా వంతెన కలను నిజం చేయడానికి జగన్ ప్రభుత్వం పూనుకుంది. మొత్తం 380 మీటర్ల మేర వంతెన నిర్మాణానికి అంచనాలు తయారు చేశారు. స్థల సేకరణకు ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన రూ.60 కోట్లు మంజూరు చేసింది. స్థల సేకరణ సొమ్ముతో కలసి మొత్తం రూ 651.71 కోట్లు వంతెన నిర్మాణానికి ఖర్చుచేయడానికి జగన్ సర్కార్ పూనుకుంది. మొదటి నుంచీ కూటమి నేతల కుట్రలు అప్పటి వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి మంచి పేరు ఎక్కడ వస్తుందోనని కూటమి నేతలు కొందరు కుట్రలు మొదలుపెట్టారు. కావాలని అడ్డంకులు సృష్టించడానికి స్థల సేకరణ అంశంలో కోర్టుకు వెళ్లి స్టే తీసుకొచ్చారు. అప్పటి ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు గట్టి ప్రయత్నం చేసి స్టేను వెకేట్ చేయించారు. కూటమి కుట్రలు కొనసాగడంతో.. వివాదం సుప్రీంకోర్టు వరకూ వెళ్లింది. అక్కడ కేసు క్లియర్ అయిన తరువాత గానీ మళ్లీ రీటెండర్లు పిలిచే అవకాశం లేదని జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ వివరణ ఇచ్చింది. వశిష్ట గోదావరి వంతెనకు మళ్లీ అడ్డంకులు వంతెన టెండర్లు రద్దు చేసిన జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ వంతెనకు టెండర్లు పిలిచిన గత వైస్సార్సీపీ ప్రభుత్వం రూ 591.71 కోట్లతో వంతెన నిర్మాణానికి చర్యలు రూ.60 కోట్లతో స్థల సేకరణ పూర్తి కూటమి నేతల కుట్రలతో వంతెన పనులకు బ్రేక్ ఇప్పటికే పనులు మొదలవ్వాలి వశిష్ట వంతెన గోదావరి జిల్లాల ప్రజల చిరకాల కోరిక. మా హయాంలో స్థల సేకరరణ కూడా పూర్తయ్యింది. భూమి తీసుకున్న రైతులకు చెల్లింపులు జరిగిపోయాయి. అప్పుడు వెంతెన నిర్మించడానికి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించడంలో వైస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. మా ప్రభుత్వ హయాంలో టెండర్లు పిలిచాం. ఇప్పుడు టెండర్లు తెరిచి వంతెన పనులు మొదలు పెట్టడంలో ఈ ప్రభుత్వానికి ఇబ్బంది ఏంటో అర్ధం కావడంలేదు. – ముదునూరి ప్రసాదరాజు, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు -
దివ్యాంగులకు జాబ్ మేళా
భీమవరం: రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో వికలాంగ యువతకు నిర్వహించిన మెగా జాబ్ మేళాలో ఎంపికై న వారు ఉద్యోగాలలో స్థిరపడి మంచిగా జీవనం కొనసాగించాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. భీమవరం ఆర్ఆర్డీఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆంధ్రప్రదేశ్ నైపుణ్య అభివృద్ధి సంస్థ (ఏపీఎస్ఎస్డీసీ) నేషనల్ కెరియర్ సర్వీస్ (ఎన్సీఎస్) ఆధ్వర్యంలో బుధవారం దివ్యాంగులకు నిర్వహించిన మెగా ఉద్యోగ మేళా కార్యక్రమానికి కలెక్టర్ చదలవాడ నాగరాణి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ మేళాలో 14 కంపెనీలు పాల్గొని ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. మేళాకు 65 మంది హాజరు కాగా.. 45 మంది వివిధ కంపెనీల్లో ఉద్యోగాలకు ఎంపికయ్యారని జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారి డాక్టర్ పి.లోకమాన్ వివరించారు. డీఎస్సీ పరీక్షకు 81.89 శాతం హాజరు భీమవరం: జిల్లాలోని అయిదు పరీక్షా కేంద్రాల్లో బుధవారం నిర్వహించిన డీఎస్సీ పరీక్షకు 81.89 శాతం అభ్యర్థులు హాజరయ్యారని జిల్లా విద్యాశాఖాధికారి ఇ.నారాయణ చెప్పారు. సెషన్ 1లో 580 మందికి 495 మంది హాజరుకాగా, సెషన్–2లో 276 మందికి 206 మంది హాజరయ్యారని ఎక్కడా మాల్ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని నారాయణ తెలిపారు. -
జయహో జగన్నాథా
ద్వారకాతిరుమల: పూరి క్షేత్రంలో వలే జగన్నాథ రధోత్సవాలను శ్రీవారి క్షేత్ర దత్తత దేవాలయమైన లక్ష్మీపురంలోని జగన్నాథుని ఆలయంలో ఈనెల 27 నుంచి వచ్చేనెల 6 వరకు వైభవంగా నిర్వహించేందుకు దేవస్థానం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఉత్సవాల్లో భాగంగా జగన్నాథ స్వామివారు ఆలయ యాగశాలలో రోజుకో అలంకారంలో భక్తులకు దర్వనమివ్వనున్నారు. దీన్ని పురస్కరించుకుని యాగశాల ప్రాంతాన్ని ముస్తాబు చేస్తున్నారు. అలాగే స్వామివారి రథయాత్రలకు వినియోగించే రథ వాహనాన్ని సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే ఆలయం ముందు చలువ పందిరిని నిర్మించారు. అదేవిధంగా ఆలయాన్ని, పరిసరాలను విద్యుద్దీప తోరణాలతో అలంకరించారు. ఉత్సవాల ప్రారంభం రోజు శుక్రవారం సాయంత్రం సుభద్ర, బలభద్ర సమేత జగన్నాథుడు రథ వాహనంలో కొలువుదీరి ద్వారకాతిరుమల క్షేత్రానికి వెళ్లనున్నారు. అలాగే వచ్చేనెల 6 న ఆలయం నుంచి సమీప గ్రామమైన తిమ్మాపురం వైపు రథయాత్ర సాగనుంది. ఉత్సవాలు జరిగే పదిరోజులు జగన్నాథుని దశావతారాలు భక్తులను అలరించనున్నాయి. ఈ ఉత్సవాల్లో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని తరించాలని ఆలయ ఈఓ ఎన్వీ సత్యన్నారాయణ మూర్తి కోరారు. ఉత్సవాల్లో భాగంగా రోజుకో ప్రత్యేక అలంకారంలో స్వామివారు దర్శనమివ్వనున్నారు. ఆలయ విశిష్టత ఈ ఆలయాన్ని ఒరిస్సా రాష్ట్రానికి చెందిన పూరీ వాస్తవ్యులు, మఠాధిపతులైన మంత్రరత్నం అమ్మాజీ అనే లక్ష్మీ అమ్మవారు 130 ఏళ్ల క్రితం నిర్మించారు. అందులో జగన్నాథునితో పాటు, వేంకటేశ్వర స్వామివారిని ప్రతిష్ఠించారు. అప్పటి నుంచి కల్యాణోత్సవ, పవిత్రోత్సవాలతో కై ంకర్యాలను వైభవంగా నిర్వహిస్తున్నారు. శ్రీవారి దేవస్థానం ఈ ఆలయాన్ని దత్తత తీసుకున్న తరువాత జీర్ణోద్ధరణ గావించి మరింత అభివృద్ధి చేసింది. ఈ ఆలయంలో వేంకటేశ్వర స్వామి, అమ్మవార్లతో పాటు జగన్నాథ స్వామి, బలరామస్వామి, సుభద్రాదేవుల సన్నిధి, ఆళ్వారుల సన్నిధి, శ్రీ సంతాన వేణుగోపాల స్వామి సన్నిధి ఉన్నాయి. రేపటి నుంచి లక్ష్మీపురం ఆలయంలో జగన్నాథ రథోత్సవాలు -
● మావుళ్లమ్మకు ఉయ్యాల సేవ
భీమవరం మావుళ్లమ్మ అమ్మవారి జ్యేష్ఠమాస జాతర మహోత్సవాల్లో భాగంగా ఆఖరి రోజు బుధవారం అమ్మవారికి ఉయ్యాల సేవ నిర్వహించారు. పుట్టింటి, అత్తింటి వారు అల్లూరి, మెంటే వంశస్తులచే ఆలయ ప్రధానార్చకులు బ్రహ్మ శ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ ఈ కార్యక్రమాన్ని జరిపారు. అలాగే అమావాస్య సందర్భంగా మావుళ్లమ్మ దేవస్థానంలో చండీహోమం నిర్వహించారు. ఈ హోమంలో 60 మంది దంపతులు పాల్గొన్నారు. కార్యక్రమాల్లో ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మీ నగేష్, ఆలయ అధికారులు, భక్తులు పాల్గొన్నారు. – భీమవరం (ప్రకాశం చౌక్) -
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
భీమడోలు: సూరప్పగూడెంలోని పాత సుగర్ ఫ్యాక్టరీలో సెక్యూరిటీ గార్డు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన సూరాబత్తుల సాయిబాబు(30) పాత షుగర్స్ ఫ్యాక్టరీలో సెక్యూరిటీ గార్డ్గా పని చేస్తున్నాడు. ఈనెల 24న ఫ్యాక్టరీలో మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 10 గంటల షిఫ్ట్లో పని చేసేందుకు వెళ్లాడు. రాత్రి 10 గంటలకు షిఫ్ట్ దిగాల్సి ఉండగా రిలీవర్కు ఆతను కనిపించలేదు. ఫ్యాక్టరీలో ఉన్న చెరువు పక్కన అతని దుస్తులు కనిపించడంతో చెర్వులో వెతకగా బుధవారం అతడి మృతదేహం లభ్యమైంది. మృతుడి తండ్రి చిరంజీవి ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు ఎస్సై వై.సుధాకర్ తెలిపారు. కాగా సాయిబాబుతో మనస్పర్థల కారణంగా అతడి భార్య పుట్టింటికి వెళ్లిపోవడంతో మనస్తాపం చెందిన సాయిబాబు ఆత్మహత్యకు పాల్పడినట్లు చెబుతున్నారు. -
ఇంకా వెలగని ‘దీపం’
దెందులూరు: ఎంతో అట్టహాసంగా ప్రారంభించిన దీపం పథకం ఫలితం నీరుగారుతోంది. సుమారు రెండు నెలలైనా దీపం–2 రెండో విడత నగదు లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ కాలేదు. తొలి విడతలో ఈ పథకం ద్వారా అరకొరగా నగదు విడుదల చేశారు. రెండో విడత పూర్తిగా విస్మరించారు. 2024 నవంబర్లో దీపం–2 పథకాన్ని ప్రారంభించిన ప్రభుత్వం 2025 మార్చి 31 వరకు స్కీంను అమలు చేసింది. మొదటి విడత కొంతవరకు నగదును బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. రెండో విడత 2025 ఏప్రిల్ నుంచి ప్రారంభమైంది. రెండు నెలలు గడుస్తున్నా లబ్ధిదారుల ఖాతాల్లో పైసా కూడా జమ కాలేదు. జిల్లాలో అన్ని గ్యాస్ కంపెనీలకు సంబంధించి 55 ఏజెన్సీలు ఉన్నాయి. వీటిలో సింగిల్, డబుల్ సిలిండర్ల కనెక్షన్లు కలిపి 6,92,825 ఉన్నాయి. మొదటి విడత జిల్లా వ్యాప్తంగా 4,40,278 మంది లబ్ధిదారులు గ్యాస్ బుక్ చేసుకున్నారు. 4,35,035 కనెక్షన్లకు మాత్రమే నగదు బ్యాంకు ఖాతాల్లో జమైంది. రూ.49,78,950 బకాయిలు బ్యాంకు ఖాతాల్లో జమ కాలేదు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూలై నెలాఖరుకు వరకు రెండో విడత గడువు నిర్ణయించారు. దీనికి సంబంధించిన నిధులు ఇంతవరకూ అందలేదు. రెండో విడతకు సంబంధించి రెండు నెలలుగా ఏప్రిల్, మే నెలల్లో జిల్లాలో సుమారుగా 1,77,040 మంది గ్యాస్ బుక్ చేసుకున్నారు. వారు ఇప్పటికే గ్యాస్ ఏజెన్సీలకు డబ్బులు చెల్లించారు. ఫిర్యాదులు బుట్టదాఖలు దీపం పథకం సిలిండర్ నగదు అందలేదని చాలా మంది లబ్ధిదారులు పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేస్తున్నారు. అయితే వారి నగదుకి సంబంధించిన సమాచారం లేకపోవడం, గ్యాస్ కంపెనీలు తమ వద్ద ప్రభుత్వ నగదు లేదని స్పష్టం చేయడంతో ఫిర్యాదులను బుట్టదాఖలు చేస్తున్నారు. రెండు నెలలైనా అందని గ్యాస్ సబ్సిడీ రెండో విడత సుమారు రూ.19.81 కోట్ల బకాయిలు -
బీజీబీఎస్ మహిళా కళాశాల వ్యవహారంపై విచారణ
నరసాపురం: పట్టణంలో పద్మశ్రీ అద్దేపల్లి సర్విశెట్టి స్థాపించిన బీజీబీఎస్ మహిళా కళాశాల పాలకవర్గంపై ఇటీవల వస్తున్న ఆరోపణలపై బుధవారం ఉన్నత విద్యామండలి ఆర్జేడీ (రాజమండ్రి) పీవీ కృష్ణారావుతో కూడిన అధికార బృందం కళాశాలలో విచారణ నిర్వహించింది. కళాశాల అధ్యక్షుడు, కార్యదర్శి, ట్రెజరర్ కలిపి కళాశాల ఆస్తులు ఇస్టానుసారం అమ్మేస్తున్నారని, కళాశాలలో అవకతవకలు జరుగుతున్నాయనే అంశాన్ని ఇటీవల ‘అమ్మకానికి మహాశయుడి ఆస్తులు’ శీర్షికన సాక్షి దినపత్రిక వెలుగులోకి తీసుకురావడంతో డొంక కదిలింది. కళాశాలలో పనిచేస్తున్న మహిళా అధ్యాపకురాలు ఒకరు బయటకు వచ్చి కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ నూలి శ్రీనివాస్ తమను లైంగికంగా వేధిస్తున్నాడంటూ మీడియాకు వివరించడం చర్చనీయాంశమైంది. కళాశాల వ్యవహరాలపై చర్యలు తీసుకోవాలని కావలి నాని అనే వ్యక్తి ఫిర్యాదు చేయడంతో అధికారులు విచారణ చేపట్టారు. లోపల విచారణ.. బయట ఆందోళన కళాశాలలో అధికారులు విచారణ జరుపుతుండగా, బయట కాంట్రాక్ట్ అధ్యాపకులు, సిబ్బందితో కలసి బీసీ సంఘ నేత చింతపల్లి గురుప్రసాద్ నాయకత్వంలో ఆందోళన నిర్వహించారు. కరస్పాండెంట్ నూలి శ్రీనివాస్ కబంధహస్తాల నుంచి కళాశాలను కాపాడాలని, పాలకవర్గంపై క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో టౌన్ ఎస్సై ముత్యాలరావు సిబ్బందితో వచ్చి బందోబస్తు నిర్వహించారు. విచారణ అధికారి కృష్ణారావు విద్యార్థులు, అధ్యాపకులను విచారించి వివరాలు రికార్డు చేసుకున్నారు. ఈ వ్యవహారానికి కేంద్ర బింధువైన నూలి శ్రీనివాస్ విచారణకు హాజరుకాకపోవడం విశేషం. అనంతరం కృష్ణారావు విలేకరులతో మాట్లాడుతూ నివేదికను ఉన్నతాధికారులకు అందిస్తామన్నారు. ఆందోళనలో బిళ్లు బ్రదర్స్, కోట్ల రామకృష్ణారావు, కోట్ల రాజా, స్వర్ణాంధ్ర త్రినాథ్ పాల్గొన్నారు. -
‘ఎస్’ వెనుక ఎవరు?
సాక్షి టాస్క్ఫోర్స్: నూజివీడు నియోజకవర్గంలోని మద్యం బెల్టుషాపులకు మద్యం సిండికేట్ సరఫరా చేస్తున్న మద్యం సీసాలపై ‘ఎస్’ స్టిక్కర్ ఉండటంతో నియోజకవర్గ వ్యాప్తంగా సర్వత్రా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఊరూరా పదుల సంఖ్యలో బెల్టుషాపులు, మద్యం దుకాణాల వద్ద బార్లను తలపించేలా అనధికార సిట్టింగ్లతో మద్యం వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలు అన్న చందంగా సాగుతోంది. ఇష్టారాజ్యంగా సిట్టింగ్లతో మద్యం వ్యాపారం జోరుగా సాగుతున్నప్పటికీ అనధికార సిట్టింగ్ల వైపు ఎకై ్సజ్ అధికారులు కన్నెత్తి కూడా చూడటం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మద్యం సిండికేట్ బెల్టుషాపులకు ‘ఎస్’ స్టిక్కర్తో మద్యం సీసాలను సరఫరా చేస్తుండటం తీవ్ర సంచలనంగా మారింది. ఈ స్టిక్కర్ అర్థం ఏమిటి, దీని వెనుక ఉన్నదెవరనే ప్రశ్నలు రాజకీయవర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. మద్యం షాపుల నుంచి బెల్టుషాపులకు మద్యం సీసాలు రవాణా అవుతుంటే స్టిక్కర్ వేయాల్సిన అవసరమేముందనే సందేహం ప్రతి ఒక్కరిలో వస్తోంది. అలా కాకుండా ఇంకేదైనా మద్యంను సరఫరా చేస్తున్నారా అనే అనుమానాలు ప్రబలడానికి ఆస్కారం ఏర్పడింది. బెల్టుషాపుల్లో ఎమ్మార్పీ కంటే రూ.40 అధికం ఏ గ్రామంలోనైనా బెల్టుషాపు పెట్టాలంటే రూ.25 వేలు చెల్లించాల్సిందే. బెల్టుషాపులకు అనుమతి లేదని, ఎమ్మార్పీ ధరలకే మద్యాన్ని విక్రయించాలని ప్రభుత్వం ప్రకటనలు ఇస్తుంటే ఇక్కడ మాత్రం ఒక్కో సీసాపై రూ.20 నుంచి రూ.40 అధిక ధరలకు విక్రయిస్తున్నారు. మద్యం సిండికేట్ బెల్టుషాపులకు ఏ మద్యం బ్రాండ్ అయినా సరే ఒక్కో సీసాపై ఎమ్మార్పీపై అదనంగా రూ.20కు విక్రయిస్తుండగా బెల్టుషాపుల నిర్వాహకులు మరో రూ.20 వేసుకొని మందుబాబులకు అమ్ముతున్నారు. దీంతో ఒక్కో సీసాకు ఎమ్మార్పీ కంటే రూ.40 అదనంగా చెల్లించి మందుబాబులు మద్యంను సేవించాల్సి వస్తోంది. పెద్ద ఎత్తున అధిక ధరలకు విక్రయిస్తూ ఇంత దారుణంగా దోపిడీ చేస్తుంటే పట్టించుకోవాల్సిన ఎకై ్సజ్ అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. అప్పుడప్పుడు దాడులు చేస్తూ బెల్టుషాపుల నిర్వహణకు అనుమతి లేదంటూ ప్రకటనలు ఇచ్చి మిన్నకుండిపోతున్నారు. మద్యం సీసాలపై ‘ఎస్’ స్టిక్కర్పై సర్వత్రా చర్చ -
ఏం సమాధానం చెబుతారు
మహిళలందరికీ ముఖ్యమంత్రి చంద్రబాబు, పవన్ కల్యాణ్, బీజేపీ పెద్దలు ఏం సమాధానం చెబుతారు. ఎన్నికల ముందు నాది హామీ అంటూ అన్ని ప్రచార సభల్లో హామీలిచ్చారు. ఇప్పుడు వంట గ్యాస్ విషయంలో కూడా మోసం చేస్తే ఎలా? – నిట్టా లీలా నవకాంతం, జెడ్పీటీసీ దెందులూరు సూపర్ సిక్స్ అమలు చేస్తారా? కూటమి ప్రభుత్వానికి సూపర్ సిక్స్ హామీలు అమలు చేసే ఉద్దేశం ఉందా లేదా? అన్ని వర్గాల ప్రజలు సూపర్ సిక్స్ హామీలు అమలు చేస్తారని ఎదురుచూస్తున్నారు. సంవత్సరం పూర్తయింది. గ్యాస్ కాకుండా ఉచిత బస్సు.. ఆడబిడ్డ నిధి ఎప్పుడు అమలు చేస్తారు. – అప్పన పద్మావతి, వైస్ ఎంపీపీ, పెదపాడు ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఎన్నికల ముందు అన్ని ప్రచార సభల్లో సూపర్ సిక్స్ పేరిట హామీలిచ్చారు. సంవత్సరం గడిచినా సూపర్ సిక్స్ హామీలు అమలు చేయడం లేదు. ఉచిత గ్యాస్, ఉచిత బస్సు, ఆడబిడ్డ నిధి మహిళలకు ఎంతో ఉపయోగపడే పథకాలు. అమలు చేయనప్పుడు హామీలు ఎందుకు ఇచ్చారు? – పర్వతనేని శ్రావణి, సర్పంచ్, రామారావుగూడెం సబ్సిడీ జమ చేస్తున్నాం 3.30 లక్షల మంది లబ్ధిదారులు గ్యాస్ సబ్సిడీ కోసం ఆన్లైన్ చేశారు. సబ్సిడీ జమ కార్యక్రమం జరుగుతుంది. లబ్ధిదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. లబ్ధిదారుల ఖాతాల్లో సబ్సిడీ సొమ్ము త్వరలోనే జమ అవుతుంది. – విలియమ్స్, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి, ఏలూరు -
9 కిలోల గంజాయి పట్టివేత
నలుగురు గంజాయి విక్రేతల అరెస్ట్ ఏలూరు టౌన్: గంజాయి విక్రయిస్తున్న నలుగురిని పోలీసులు అరెస్ట్ చేసి నిందితుల నుంచి 9 కిలోల గంజాయి, రెండు మోటారు సైకిళ్లు, రూ.4,100 నగదు, 4 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఏలూరు త్రీటౌన్ పోలీస్ స్టేషన్లో బుధవారం రాత్రి సీఐ వి.కోటేశ్వరరావు వివరాలు వెల్లడించారు. పెదవేగి మండలం దుగ్గిరాల గ్రామ పరిధిలోని ఏలూరు జాతీయ రహదారి–16 సర్వీస్ రోడ్డులో గంజాయి విక్రయిస్తున్నారని తెలియటంతో ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ ఆదేశాల మేరకు ఏలూరు డీఎస్పీ డీ.శ్రావణ్కుమార్ పర్యవేక్షణలో త్రీటౌన్ ఎస్సై రాంబాబు, సిబ్బంది చాకచక్యంగా దాడి చేసి నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని మధ్యవర్తుల సమక్షంలో అరెస్ట్ చేసినట్లు చెప్పారు. వీరిపై ఎన్డీపీఎస్ యాక్ట్–1985 మేరకు కేసు నమోదు చేశామన్నారు. విలాసాలు, సులువుగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశ్యంతో నిందితులు గంజాయి విక్రయిస్తున్నారని ఆయన తెలిపారు. నిందితులు బాపట్ల జిల్లా అద్దంకి మండలం ప్రాంతానికి చెందిన సైడ వేణు, ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం పాదర్తికి చెందిన సింబత్తుల సాయి, అదే గ్రామానికి చెందిన అలుగుల నాగవర్థన్గా గుర్తించామని, వీరితోపాటు ఒక మైనర్ బాలుడు కూడా ఉన్నట్లు సీఐ చెప్పారు. -
ఈవీఎం గోడౌన్ తనిఖీ
భీమవరం (ప్రకాశం చౌక్): భీమవరం పీపీ రోడ్డులోని ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ గోడౌన్లో భద్రపరిచిన ఈవీఎం యంత్రాలను కలెక్టర్ చదలవాడ నాగరాణి బుధవారం తనిఖీ చేశారు. గోడౌన్న్కు వేసిన సీళ్లను ఈవీఎంల రక్షణ, భద్రతకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం పర్యవేక్షణ రిజిస్టర్లో కలెక్టర్ సంతకం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ప్రతి మూడు నెలలకు ఒకసారి ఈవీఎంలు భద్రపరిచిన గోడౌన్ క్షుణ్ణంగా తనిఖీ చేసి సమగ్ర నివేదికను పంపడం జరుగుతుందని తెలిపారు. మా పాఠశాలను విలీనం చేయొద్దు సార్ భీమవరం అర్బన్: మా పాఠశాలను విలీనం చేయొద్దని దెయ్యాలతిప్పలోని ఎస్సీ పేటకు చెందిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కలక్టరేట్లోని డీఆర్వో మొగలి వెంకటేశ్వర్లుకు వినతిపత్రం అందజేశారు. ఇటీవల కూటమి ప్రభుత్వం విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్న పాఠశాలలను విలీనం చేసే ప్రక్రియలో భాగంగా ఎస్సీ పేటలో ఉన్న పాఠశాలను బీసీ పేటలో ఉన్న ప్రాథమిక పాఠశాలలో విలీనం చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అధికారులకు మొర పెట్టుకున్నారు. గతంలో బీసీ పేటలోని వ్యక్తులకు తమ పేటలోని వ్యక్తులకు గొడవలు అయ్యాయని, ఇప్పుడు విలీనం చేయడం వల్ల మళ్లీ గొడవలు జరిగే ప్రమాదం ఉందని వినతిపత్రంలో ఎస్సీ పేట వాసులు తెలిపారు. సమస్యను పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామని డీఆర్వో హామీ ఇచ్చారు. గ్యాస్ నొప్పితో మహిళ మృతి చాట్రాయి: గ్యాస్ నొప్పితో ఓ మహిళ మృతి చెందింది. వివరాల ప్రకారం మండలంలోని పోతనపల్లి గ్రామానికి చెందిన వడిత్యా కామాక్షి (35) బధవారం గ్యాస్ నొప్పిగా ఉందని భర్తతో కలిసి చాట్రాయి ఆర్ఎంపీ వైద్యులను ఆశ్రయించారు. టిఫిన్ చేసి రావాలని ఆర్ఎంపీ వైద్యుడు సూచించారు. అనంతరం టిఫిన్ చేసి వచ్చిన తరువాత బీపీ చూస్తుండగా ఆమె అకస్మాతుగా వాంతులు చేసుకుని అక్కడే సృహ తప్పి పడిపోయింది. వెంటనే పీహెచ్సీకి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు పీహెచ్సీ వైద్యురాలు విజయలక్ష్మి చెప్పారు. మృతురాలికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఆమె మృతితో భర్త, పిల్లలు కన్నీరుమున్నీరుగా విలపించారు. విజయలక్ష్మి భౌతికకాయాన్ని ఏపీ కో ఆపరేటివ్ యూనియన్ రాష్ట్ర మాజీ చైర్మన్ దేశిరెడ్డి రాఘవరెడ్డి, వైఎస్సార్ సీపీ నేత కారంగుల వాసు తదితరులు సందర్శించి నివాళులర్పించారు. -
బడ్జెట్లో దళితులకు తగ్గిన కేటాయింపులు
ఏలూరు (ఆర్ఆర్పేట): ముఖ్యమంత్రి చంద్రబాబు గతంలో 2018–19 సంవత్సరంలో ఎస్సీ కార్పొరేషన్కు రూ.2,450 కోట్లు కేటాయించగా ప్రస్తుత బడ్జెట్లో కేవలం రూ.341 కోట్లు మాత్రమే కేటాయించి దళితులను మోసం చేశారని నవ్యాంధ్ర ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షుడు సొంగ మధు అన్నారు. ఎస్సీలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఎం. ముక్కంటికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర బడ్జెట్లో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ప్రకటించిన పథకాలు దళితుల జీవన విధానాలకు, ఉపాధికి ఎటువంటి సబంధంలేనివని అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా గతంలో ఇచ్చిన పథకాలు – భూమి కొనుగోలు పథకం, వ్యవసాయ పనిముట్లు, రూ.50 లక్షల వరకు బ్యాంక్ లింకుడ్ స్కీమ్స్, నాన్ బ్యాంక్ స్కీమ్స్, వనరబుల్ లోన్స్, చర్మకారులకు రుణాలు, పూర్తి సబ్సిడీ రుణాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంలో ఇచ్చే రుణాలు ఉన్నాయన్నారు. వీటితో పాటు కార్లు, గూడ్స్ వెహికల్స్, క్రేన్లు, పొక్లెయినర్లు, లారీలు, ట్రాక్టర్లు ఆటోలు, పారిశుద్ధ్య వాహనాలు, ఎస్సీల సాంప్రదాయ వ్యాపారాలు, పనులకు సంబంధించిన పథకాలు ఉండేవన్నారు. అయితే ప్రస్తుత ఎస్సీ కార్పొరేషన్లో ఆయా పథకాలు లేకపోవడం, అదే సమయంలో వీరికి ఎటువంటి సంబంధంలేని వ్యాపార పథకాలు ఇవ్వడం అంటే ఎన్నికల హామీ తప్పటమే అవుతుందన్నారు. ఈ మేరకు తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం రూ. 5 వేల కోట్లు ఎస్సీ కార్పొరేషన్కు విడుదల చేయాలని, ప్రస్తుతం కార్పొరేషన్ ప్రకటించిన స్థానంలోనే గతంలో అమలు పరచిన 27 పథకాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే మాదిగ చర్మకారులకు గతంలో రూ. 60 కోట్లు ప్రకటించిన మాదిరిగానే ప్రస్తుతం రూ.100 కోట్లు ప్రత్యేకంగా కేటాయించి చర్మకారులకు చెప్పుల షాపులు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. వినతిపత్రం సమర్పించిన వారిలో ఎస్సీ నాయకుడు మాముడూరి మహంకాళి ఉన్నారు. చంద్రబాబు మోసం చేశారని, న్యాయం చేయాలని డిమాండ్ ఎస్సీ కార్పొరేషన్ ఈడీకి నవ్యాంధ్ర ఎంఆర్పీఎస్ వినతి -
సేంద్రియ సాగుపై దృష్టి సారించండి
ఉండి: రైతులు అన్ని రకాల పంటలకు రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి సేంద్రియ ఎరువులపై దృష్టి సారించాలని మార్టేరు అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ డాక్టర్ టీ శ్రీనివాస్ అన్నారు. ఖరీఫ్లో వరి, ఉద్యాన పంటల సంసిద్ధతపై మంగళవారం ఎన్నార్పీ అగ్రహారం కేవీకేలో నిర్వహించిన అవగాహనా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పచ్చిరొట్ట, పంట మార్పిడి, జీవ ఎరువులతో పాటు సేంద్రియ ఎరువులపైనా రైతులు అవగాహన కలిగి ఉండాలన్నారు. కేవీకే ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ ఎన్ మల్లిఖార్జునరావు మాట్లాడుతూ సేంద్రియ వ్యవసాయ పద్ధతులపై కేవీకే ద్వారా రైతులకు అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. వాటిని అవలంభించి రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి దిగుబడులు పెంచుకోవాలని సూచించారు. రసాయన రువులు వాడకాన్ని తగ్గించే రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం మరింత ప్రోత్సాహకాన్ని అందిస్తుందని తెలిపారు. జిల్లా ఉద్యాన శాఖాధికారి ప్రభాకర్ మాట్లాడుతూ జిల్లాలో ఆయిల్పాం, కోకో పంటను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. ఆహార నాణ్యతకు ప్రథమస్థానం ఇచ్చి పంటలు పండించాలని కోరారు. కార్యక్రమంలో మద్రాస్ ఫెర్టిలైజర్స్ మేనేజర్ బెనర్జీ, ఎన్జీ రంగా యూనివర్సిటీ పరిశోధనా, విస్తరణ మండలి సభ్యుడు ఎం రమేష్ తదితరులు పాల్గొన్నారు. తండ్రిపై దాడికి కుమారుడి యత్నం పెదవేగి : ఓ కుటుంబంలో ఏర్పడిన చిన్నపాటి వివాదం చివరికి తండ్రిపై కుమారుడు దాడికి యత్నం చేసేంత వరకు వెళ్లింది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పెదవేగి మండలం రామసింగవరం గ్రామానికి చెందిన రాటాలు, చంటి తండ్రి కొడుకులు. వీరి మధ్య చిన్నపాటి వివాదం తలెత్తగా చంటి తన తండ్రి రాటాలుపై చెట్లని నరికే యంత్రంతో దాడికి యత్నించాడు. అదే సమయంలో చంటి అన్న రాజేష్ అడ్డు వెళ్లడంతో అతని చేతిపై తీవ్ర గాయమైంది. స్థానికులు రాజేష్ను హుటాహుటిన ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పీజీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా అమలు చేయాలి భీమవరం(ప్రకాశంచౌక్): ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారానికి చిత్తశుద్ధితో పనిచేయని అధికారులపై చర్యలు తప్పవని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన 1100 కాల్ సెంటర్కు అందిన అర్జీల నివేదికపై మంగళవారం కలెక్టరేట్లోని జాయింట్ కలెక్టర్ చాంబర్ నందు మున్సిపల్ సర్వే, పంచాయతీ, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్, ఆర్ అండ్బీ, విద్యుత్, ఇరిగేషన్, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంపులు, సివిల్ సప్లయ్ శాఖల అధికారులతో జాయింట్ కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ పీజీఆర్ఎస్ ఫిర్యాదుల పరిష్కారంపై నిర్లక్ష్యం వహించే వారిపై చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. -
ఆక్వా రైతులను ఆదుకోవాలి
గణపవరం: తమను ప్రభుత్వం ఆదుకోవాలని పలువురు ఆక్వా రైతులు అధికారులకు తమ గోడు వెళ్లబోసుకున్నారు. మంగళవారం గణపవరం, పిప్పర, కేశవరం, సరిపల్లె, కొత్తపల్లి, ముప్పర్తిపాడు, జల్లి కాకినాడ, తదితర గ్రామాల్లో ఆక్వా రైతులకు గ్రామ సభలు నిర్వహించారు. ఈ సదస్సులో పాల్గొన్న రైతులు గిట్టుబాటు ధర, విద్యుత్ సబ్సిడీ, ఆక్వా జోన్ వర్తింపు తదితర సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. నాన్ ఆక్వా జోన్లో ఉన్న రైతులు ఆక్వా జోన్లోకి మారడానికి దరఖాస్తు చేసుకోవాలన్నారు. రైతులు సాగులో అనుసరించాల్సిన పద్ధతులను వివరించారు. గణపవరం పంచాయతీ కార్యాలయం వద్ద నిర్వహించిన సదస్సులో సర్పంచ్ మూర అలంకారం, ఎఫ్డీవో శివ రామకృష్ణ, సహాయకురాలు షర్మిల తదితరులు పాల్గొన్నారు. -
నకిలీ మద్యం తయారీ గుట్టు రట్టు
పాలకొల్లు సెంట్రల్: ఎకై ్సజ్ పోలీసులు పట్టణంలో నకిలీ మద్యం తయారీ ముఠా గట్టును రట్టు చేశారు. శంభునిపేటలో నివాసం ఉంటున్న పులి శీతల్ అనే వ్యక్తి ఇంటిలో నకిలీ మద్యం తయారవుతుందని వచ్చిన సమాచారంపై ఎకై ్సజ్ పోలీసులు మంగళవారం తెల్లవారుజామున దాడులు నిర్వహించారు. ఈ దాడిలో శీతల్ ఇంటిలో 130 లీటర్ల స్పిరిట్తోపాటు ప్రమాదకర ఎసెన్స్, నకిలీ మద్యం తయారీ యూనిట్, మద్యం సీసాలకు మూతలు బిగించే మిషన్, ఖాళీ మద్యం సీసాలు, మూతలు స్వాధీనం చేసుకున్నారు. ఈ యూనిట్ నడుపుతున్న పులి శీతల్ని అరెస్ట్ చేశారు. పాలకొల్లు ఎకై ్సజ్ స్టేషన్లో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో జిల్లా ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ బి శ్రీలత, అసిస్టెంట్ కమిషనర్ ప్రభుకుమార్ మాట్లాడుతూ నిందితుడికి స్పిరిట్, ఎసెన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయో దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. శీతల్పై గుట్కా కేసు కూడా ఉందన్నారు. అమలాపురంలో ఈ ముఠాకు చెందిన నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు ఆమె చెప్పారు. అసిస్టెంట్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్లు అజయ్ సింగ్, ప్రసాదరెడ్డి ఆధ్వర్యంలో పాలకొల్లు ఎకై ్సజ్ సీఐ మద్దాల శ్రీనివాస్, భీమవరం స్క్వాడ్ సీఐ కల్యాణ చక్రవర్తి ఎస్సైలు రఘు, మహేష్, రమాదేవి ఈ దాడుల్లో పాల్గొన్నారు. -
ఖైదీల సౌకర్యాలపై ప్రతి నెలా తనిఖీలు
ఏలూరు టౌన్: ఏలూరు జిల్లా జైలును ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్.శ్రీదేవి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కే.రత్నప్రసాద్ మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీదేవి మాట్లాడుతూ జిల్లాలోని ప్రతి కారాగారాన్ని జిల్లా న్యాయసేవాధికార సంస్థ తనిఖీలు నిర్వహించాల్సి ఉందన్నారు. ప్రతి నెలా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఆధ్వర్యంలో తనిఖీలు ఉంటాయని, మూడు నెలలకు ఒకసారి జిల్లా చైర్మన్ తనిఖీలు చేస్తారని స్పష్టం చేశారు. జిల్లా జైలులోని ఖైదీల వివరాలు తెలుసుకుని, ఉచిత న్యాయ సహాయం ఏర్పాటు చేస్తామన్నారు. ఖైదీల కుటుంబ సభ్యులకు ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను పొందడంలో సమస్యలు ఏర్పడితే జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఉచితంగా అందిస్తుందన్నారు. కార్యక్రమంలో జిల్లా జైలు సూపరింటెండెంట్ సీహెచ్ఆర్వీ స్వామి, జైలర్ కే.శ్రీనివాసరావు, చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిలర్ పీవీఎన్. మునీశ్వరరావు తదితరులు ఉన్నారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్పర్సన్, ప్రధాన న్యాయమూర్తి శ్రీదేవి -
● మద్ది క్షేత్రానికి పోటెత్తిన భక్తులు
జంగారెడ్డిగూడెం: గురవాయిగూడెం శ్రీ మద్ది ఆంజనేయస్వామి ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు స్వామివారికి ప్రభాతసేవ, నిత్యార్చన పూజలు జరిపారు. అనంతరం స్వామివారు ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనం ఇచ్చారు. స్వామివారికి ప్రీతికరమైన మంగళవారం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో బారులుదీరి స్వామిని దర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. మధ్యాహ్నం వరకు దేవస్థానానికి వివిధ సేవలు, విరాళాల ద్వారా రూ.2,15,016 సమకూరినట్లు ఈవో ఆర్వీ చందన తెలిపారు. సుమారు 1200 మంది భక్తులకు స్వామివారి నిత్యాన్నదాన సత్రం నందు అన్నప్రసాదం స్వీకరించారని ఈవో తెలియజేశారు. -
దుగ్గిరాలలో వైఎస్సార్ విగ్రహం ధ్వంసం
పెదవేగి : ఏలూరు జిల్లా పెదవేగి మండలం దుగ్గిరాల గ్రామంలో దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని గుర్తుతెలియని వ్యక్తులు మంగళవారం ధ్వంసం చేశారు. ఈ ఘటనపై వైఎస్సార్సీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కక్షపూరిత చర్యలు, వికృత చేష్టలతో హద్దులు దాటి విచక్షణ కోల్పోయి ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారంటూ మండిపడ్డారు. గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో దుగ్గిరాల ప్రధాన కూడలిలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాల ఏర్పాటును స్థానిక కూటమి నాయకులు వ్యతిరేకించారని గుర్తుచేశారు. ప్రస్తుతం వారు అధికారంలోకి వచ్చిన తరువాత మహానేత వైఎస్సార్ విగ్రహం చెయ్యి విరగ్గొట్టి, తల వెనుక భాగంలో కర్ర పుల్ల గుచ్చి అవమానించడం నీచ సంస్కృతికి నిదర్శనమన్నారు. దీనిపై జిల్లా పోలీస్ అధికారులకు, కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామని, వారు స్పందించి నిందితులపై చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున నిరసనలు, ధర్నాలు చేపడతామని నాయకులు స్పష్టం చేశారు. విగ్రహ ధ్వంసం సరైంది కాదు దుగ్గిరాలలో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహ ధ్వంసం ఘటనను దెందులూరు మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి ఖండించారు. ప్రభుత్వాలు మారినంత మాత్రాన ఇలా విగ్రహాలు ధ్వంసం చేసే విధానం సరైంది కాదన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డిని ప్రజలు దైవంగా భావిస్తారని, అటుంవంటి మహనీయుని విగ్రహం ధ్వంసం చేయడం హేయమైన చర్య అని అన్నారు. ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వైఎస్సార్ సీపీ శ్రేణులు అధికారులు స్పందించకపోతే ఉద్యమిస్తామని వెల్లడి -
కూటమి ప్రభుత్వానివి ఓటు బ్యాంకు రాజకీయాలు
ఏలూరు (ఆర్ఆర్పేట): పుట్టపర్తి సత్య సాయిబాబా జయంతిని కూటమి ప్రభుత్వం అధికారిక కార్యక్రమంగా జరపాలను కోవడం ఓటు బ్యాంకు రాజకీయాల్లో భాగమేనని ఆంధ్రప్రదేశ్ హేతువాద సంఘం జిల్లా అధ్యక్షుడు కడలి రామాంజనేయులు విమర్శించారు. మంగళవారం స్థానిక ఆర్ఆర్ పేట స్ఫూర్తి భవనంలో హేతువాద సంఘం నాయకుడు కోడూరి సత్యనారాయణ అధ్యక్షతన నిర్వహించిన జిల్లా సమావేశంలో ఆయన మాట్లాడారు. సైంటిఫిక్ టెంపర్ను ప్రోత్సహించాల్సిన ప్రభుత్వం మహిమల పేరుతో ప్రసిద్ధుడైన సత్య సాయిబాబా జయంతిని అధికారికంగా జరపాలను కోవడం సిగ్గుచేటన్నారు. ప్రభుత్వాలు బాబాల పట్ల చూపిన గౌరవం, మహాకవి శ్రీ శ్రీ, గురజాడ అప్పారావు, కందుకూరి వీరేశలింగం, గుర్రం జాషువాల పట్ల చూపకపోవడం విచారకరమన్నారు. సమావేశంలో ముందుగా ఇటీవల మరణించిన హేతువాది, నటుడు అల్లం గోపాలరావు, అవయవ దాన ఉద్యమ నాయకురాలు పేరేచర్ల లక్ష్మీకాంతంలకు ఘనంగా నివాళులు అర్పించారు. సీపీఐ నాయకుడు బండి వెంకటేశ్వరరావు, ఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు రెడ్డి శ్రీనివాస్ డాంగే, హేతువాద సంఘ నాయకులు పాల్గొన్నారు. -
రాష్ట్రంలో డైవర్షన్ రాజకీయాలు
కర్మాగారం ప్రైవేటీకరిస్తే ఊరుకోం పెదవేగి ఆయిల్ ఫెడ్ కర్మాగారం ప్రైవేటీకరణ చేస్తే చూస్తూ ఊరుకోబోమని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, సీఐటీయు జిల్లా నాయకులు హెచ్చరించారు. 8లో uమూలనపడిన ఆక్వా ల్యాబ్ మత్స్యశాఖ ఆధ్వర్యంలో ఆక్వా మొబైల్ ల్యాబ్ సేవలు నిలిచిపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. కొంతకాలంగా సేవలు నిలిచిపోయాయి. 8లో uమంగళవారం శ్రీ 24 శ్రీ జూన్ శ్రీ 2025అంగన్వాడీల నిరసన గళం భీమవరం(ప్రకాశం చౌక్): అంగన్వాడీలకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని, ఎఫ్ఆర్ ఎస్ యాప్ రద్దు చేయాలని తదితర డిమాండ్ల సాధన కోసం సోమవారం భీమవరం కలెక్టరేట్ వద్ద అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో అంగన్వాడి కార్యకర్తలు సోమవారం ధర్నా చేశారు. జిల్లావ్యాప్తంగా అంగన్వాడీలు తరలివచ్చి నిరసన గళం వినిపించారు. అనంతరం జేసీ రాహుల్కుమార్రెడ్డికి వినతిపత్రం సమర్పించారు. అనంతరం సంఘ జిల్లా అధ్యక్షురాలు కె.ఝాన్సీలక్ష్మి, కా ర్యదర్శి డి.కల్యాణి, భీమవరం ప్రాజెక్టు లీడర్ సీహెచ్ మహాలక్ష్మి మాట్లాడుతూ సాధారణ ఉద్యోగులుగా ఉన్న తమకు జీఓ ప్రకారం సంక్షేమ పథకాలు అమలు చేయాలన్నారు. పనికి తగిన వేతనం చెల్లించాలన్నారు. సీఐటీయూ నాయకులు వారికి మద్దతు తెలిపారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు రాజారామోహన్రాయ్, జిల్లా కార్యదర్శి వాసుదేవరావు తదితరులు పాల్గొన్నారు. డీఎస్సీ పరీక్షలకు 81 శాతం హాజరు భీమవరం: జిల్లాలోని ఐదు కేంద్రాల్లో సోమ వారం నిర్వహించిన మెగా డీఎస్సీ పరీక్షలకు 81 శాతం అభ్యర్థులు హాజరయ్యారని జిల్లా విద్యాశాఖాధికారి ఈ.నారాయణ తెలిపారు. ఉదయం సెషన్లో 101 మందికి 92 మంది, మధ్యాహ్నం సెషన్లో 573 మందికి 460 మంది హాజరయ్యారన్నారు. ఎక్కడా మాల్ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని నారాయణ తెలిపారు. మున్సిపల్ కార్మికుల సమ్మె భీమవరం(ప్రకాశం చౌక్): భీమవరం మున్సిపాలిటీలో ఇంజనీరింగ్ కార్మికులు భీమవరం మున్సిపల్ కార్యాలయం వద్ద సోమవారం సమ్మెకు దిగారు. రాష్ట్ర జేఏసీ కన్వీనర్ పిట్టా రాజేష్కుమార్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు సమస్యల పరిష్కరం కోసం 34 రోజులుగా పోరాటం చేస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. దీంతో సమ్మెకు దిగినట్టు చెప్పారు. ప్రభుత్వం వెంటనే సమస్యలను పరిష్కరించాలని కోరారు. సంఘ జిల్లా వైస్ ప్రెసిడెంట్ పి. మోహన్రావు, జాయింట్ సెక్రటరీ డి.జయరాజు, కార్మికులు పాల్గొన్నారు. పనిదినాల పెంపు తగదు ఆకివీడు: కార్మికుల పనిదినాల్ని పెంచుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని సీఐటీయూ మండల అధ్యక్షుడు పెంకి అప్పారావు డిమాండ్ చేశారు. స్థానిక వైఎస్సార్ సెంటర్లో సోమ వారం కార్మికులతో కలిసి ధర్నా చేశారు. 12 గంటల పనిదినాల వల్ల కార్మికులు శక్తిని కోల్పోతారన్నారు. త్వరగా వృద్ధాప్యానికి గురవుతారని వాపోయారు. ఎన్డీఏ ప్రభుత్వంలో కార్మికులకు రక్షణ లేకుండా పోయిందన్నారు. నిరసనకు బి.రాంబాబు అధ్యక్షత వహించారు. అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం సహించం భీమవరం(ప్రకాశం చౌక్): పీజిఆర్ఎస్కు వచ్చే అర్జీల పరిష్కారం నాణ్యతతో ఉండాలని, నిర్ల క్ష్యంగా ఉంటే చర్యలు తప్పని జేసీ టి.రాహుల్కుమార్రెడ్డి అన్నారు. సోమవారం కలెక్టరేట్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్ఎస్)లో భాగంగా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అర్జీలను సంబంధిత శాఖల అధికారు లు ఆన్లైన్ చేయడంతో పాటు తప్పనిసరిగా డైరీలో రాసుకోవాలన్నారు. అర్జీల్లో కొన్ని.. ● భీమవరం నరసయ్య అగ్రహారంలోని పార్క్ సమీపవాసులు డ్రైనేజీ వ్యవస్థ, రోడ్లు లేకపోవడంతో వర్షం నీరు నిలిచి అవస్థలు పడుతున్నామని అర్జీ అందించారు. ● అత్తిలి మండలం ఈడూరుకి చెందిన ఘంట సాయిబాబు వృద్ధాప్య పింఛన్ కోసం వినతిపత్రం సమర్పించారు. ● గణపవరం మండలం చిలకంపాడు చెందిన బొడ్డుపల్లి దుర్గాభవాని తన భర్త మరణించారని, తనని, తన కుమారుడిని భర్త కు టుంబసభ్యులు ఇంటి నుంచి గెంటేశారని న్యాయం చేయాలని కోరారు. ● ఉండి మండలం ఉణుదుర్రుకు చెందిన న్యా యవాది సుందరకుమార్ గ్రామంలోని ఎ స్సీ పేటలోని పంచాయతీ చెరువు కలుషితంపై చర్యలు తీసుకోవాలని కోరారు. సాక్షి ప్రతినిధి, ఏలూరు/ఏలూరు టౌన్: ప్రజలను ఏమార్చడంలో చంద్రబాబు నిపుణుడని, రాష్ట్రంలో డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని వైఎస్సార్సీపీ యువజన విభాగ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి ధ్వజమెత్తారు. రాష్ట్రంలో బెదిరింపులు, భయపెట్టడం, అక్రమ కేసులు, నెలల తరబడి జైళ్లలో ఉంచేలా చేస్తూ రివేంజ్ రాజకీయాలు చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. సోమ వారం ఏలూరులో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో జరిగిన యువత పోరులో యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజాతో కలిసి ఆయన పాల్గొన్నారు. స్థానిక ఫైర్స్టేషన్ సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్ వద్ద రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిద్ధార్థరెడ్డి మాట్లాడుతూ సీఎం చంద్రబాబు సూపర్ సిక్స్లోని ఆరు హామీలు పూర్తి చేశా నని చెప్పడంతో ప్రజలు అవాక్కయ్యారన్నారు. జగన్ ఐదేళ్ల ముఖ్యమంత్రి అయినా, చంద్రబాబు 20 ఏళ్లు ముఖ్యమంత్రి అయినా ఒకటేనని, కేవలం ఐదేళ్లలోనే జగన్మోహన్రెడ్డి రూ.3 లక్షల కోట్ల మొత్తాన్ని సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు పంచితే చంద్రబాబు మాత్రం ఒక ఏడాదికే 1.30 లక్షల కోట్లు అప్పు చేశారని విమర్శించారు. చంద్రబాబు గతంలో హామీలు అమలు చేయాల్సిన సమయంలోనూ హ్యాపీ సండే, దోమలపై దండయాత్ర అని డైవర్షన్ రాజకీయాలు చేశారని, ఇప్పుడేమో పథకాలడిగితే యోగాంధ్ర, ఊపిరి బాగా తీసుకోవాలంటూ హడావుడి చేస్తున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు పోలవరం నిర్మాణానికి ఖర్చు పెట్టిన దాని కంటే పోలవరం ప్రాజెక్టును అందరికీ చూపించడానికి రూ.100 కోట్లు ఖర్చు చేశారని, పని కంటే పబ్లిసిటీ ఎక్కువని విమర్శించారు. పవన్ కల్యాణ్ ప్రతి నియోజకవర్గంలో వంద మంది యువతకు రూ.10 లక్షల చొప్పున ఇస్తానని ఎన్నికల సమయంలో ప్రకటించారని, దానిని ఆయన మరచిపోయారన్నారు. కనీసం మీడియా, ప్రజలైనా దీనిపై ప్రశ్నించాలని సిద్ధార్థరెడ్డి కోరారు. నిరుద్యోగ భృతి రూ.57 వేల కోట్ల బకాయి రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా మాట్లాడుతూ చంద్రబాబు అధికారంలోకి వస్తే ఆయన కొడుకుకు మాత్రం ప్రతిసారీ ఉద్యోగం ఇస్తున్నాడు గానీ నిరు ద్యోగ యువతను పట్టించుకోవడం లేదని విమర్శించారు. తద్వారా లక్షలాది మంది నిరుద్యోగులను వంచించారని ధ్వజమెత్తారు. నిరుద్యోగ భృతి ఈ ఏడాదికి సంబంధించి రాష్ట్రంలోని నిరుద్యోగ యు వతకు రూ.57 వేల కోట్లు చెల్లించాలని, లేదంటే వైఎస్సార్సీపీ యువత పోరును నిరంతరం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో 2.50లక్షల మంది వలంటీర్లను తొలగించారని, ఎండీయూలో పనిచేస్తున్న 15 వేల మందికి ఉపాధి తీశారని జక్కంపూడి రాజా మండిపడ్డారు. ఫీజు బకాయిలు ఎప్పుడిస్తారు? గత ప్రభుత్వంలో మాజీ సీఎం జగన్ విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారని, నేడు కూటమి పాలనలో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బం దులు పడుతున్నారని వైఎస్సార్సీపీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు అన్నారు. కూటమి ప్రభుత్వం ఇలానే ఉంటే రాబోయే రోజుల్లో మరింత ఉధృతంగా విద్యార్థులు, నిరుద్యోగుల పక్షాన ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరించారు. బాబు పాలనలో ప్రజలకు కష్టాలే.. సీఎం చంద్రబాబు పాలనలో రాష్ట్రంలోని ప్రజలంతా అష్టకష్టాలు పడుతున్నారనీ, రైతులు, విద్యార్థులు, నిరుద్యోగ యువత, చివరకు వ్యాపారులు సైతం నష్టాల్లో ఉన్నారని పార్టీ ఏలూరు పార్లమెంట్ సమన్వయకర్త కారుమూరి సునీల్కుమార్ అన్నా రు. కార్పొరేట్ విద్యాసంస్థలకు మేలు చేసేందుకు ఇంజనీరింగ్ ఫీజులు సైతం పెంచేశారని ఆరోపించారు. తల్లికి వందనం పథకంలో 87 లక్షల మంది తల్లులు అర్హులు కాగా 57 లక్షల మందికి మాత్రమే లబ్ధి చేకూర్చడం కూటమి ప్రభుత్వ చేతకానితనానికి నిదర్శనమన్నారు. రైతులకు పెట్టుబడి సాయం కూడా అందించలేదన్నారు. కదం తొక్కి.. నిరసన తెలిపి.. వైఎస్సార్సీపీ యువత పోరుకు భారీ ఎత్తున యువత, వైఎస్సార్సీపీ శ్రేణులు పోటెత్తారు. వేలాదిగా తరలిరావడంతో ఏలూరు ఫైర్స్టేషన్ సెంటర్ స్తంభించింది. ఉదయం 9.30 గంటలకే జిల్లాలోని ఆయా నియోజకవర్గాల నుంచి శ్రేణులు తరలివచ్చారు. పార్టీ జెండాలు, ప్లకార్డులు, ప్లెక్సీలతో యు వత కేరింతలు కొడుతూ భారీ మోటార్ సైకిళ్ల ర్యాలీ నిర్వహించారు. ఫైర్స్టేషన్ సెంటర్లో పార్టీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు ఆధ్వర్యంలో యు వజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా, వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్థార్థ రెడ్డి, ఏలూరు పా ర్లమెంట్ ఇన్చార్జి కారుమూరి సునీల్కుమార్, సమన్వయకర్తలు మామిళ్లపల్లి జయప్రకాష్ (ఏలూరు), కంభం విజయరాజు (చింతలపూడి), పుప్పాల వా సుబాబు (ఉంగుటూరు), తెల్లం బాలరాజు (పోలవరం) దివంగత సీఎం వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం భారీ ర్యాలీగా ఎన్ఆర్పేట, జెడ్పీ కార్యాలయం రోడ్డులో నుంచి కలెక్టరేట్కు చేరుకున్నారు. కలెక్టరేట్ వద్ద ౖబైఠాయించి కొద్దిసేపు ధర్నా చేశారు. కలెక్టరేట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించటంతో పోలీసు లు, కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. అనంతరం పార్టీ నేతలు ఏలూరు కలెక్టర్ వెట్రిసెల్వికి వినతిపత్రం అందజేశారు. ఏలూరు జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు కామిరెడ్డి నాని, బీసీ సెల్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నౌడు వెంకటరమణ, వడ్డీల కార్పొరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ముంగర సంజయ్, యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి గాదిరాజు మణికంఠ కిషోర్, కోటగిరి సందీప్, బసవ వినయ్, దాలి వెంకటేష్, ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి నూకపెయ్యి సుధీర్బాబు, వాణిజ్య విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంటా మోహనరావు, జెడ్పీ వైఎస్ చైర్మన్ పెనుమాల విజయ్బాబు, జెడ్పీ వైస్ చైర్మన్ జి.కృష్ణంరాజు, జెడ్పీటీసీలు నిట్టా లీలా నవకాంతం (దెందులూరు), భవానీ (భీమడోలు), కోడే వెంకట కాశీ విశ్వనాథ్ (నిడమర్రు), జయలక్ష్మి (ఉంగుటూరు), హేమ కుమారి (పోలవరం), కడిమి రమేష్ (కామవరపుకోట), పోల్నాటి బాబ్జీ (జంగారెడ్డిగూడెం), జిల్లా మహిళా అధ్యక్షురాలు కేసరి సరితా రెడ్డి, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు తేరా ఆనంద్, క్రిస్టియన్ సెల్ అధ్యక్షుడు పిల్లా చరణ్, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు పి.రాజేష్, వైఎస్సార్టీయూసీ జిల్లా అధ్యక్షుడు పల్లి శ్రీనివాసరావు, అంగన్వాడీ అధ్యక్షురాలు శైల స్వాతీ యాదవ్, లీగల్సెల్ అధ్యక్షుడు అల్తి శ్రీనివాసరావు, సోషల్ మీడియా అధ్యక్షుడు చిక్కాల దుర్గాప్రసాద్, బూత్ కమిటీ అధ్యక్షుడు చింత అనిల్కుమార్, ప్రచార కమిటీ అధ్యక్షుడు చిలుకూరి జ్ఞానరెడ్డి, ఆర్టీఐ అధ్యక్షుడు స్టాలిన్బాబు, జిల్లా అధికార ప్రతినిధి మున్నుల జాన్గురునాథ్, పోలవరం నియోజకవర్గ అధ్యక్షుడు జైబాబు, దెందులూరు యువజన అధ్యక్షుడు పెద్దిరాజు, కై కలూరు యువజన అధ్యక్షుడు చార్లెస్, జిల్లా ఉపాధ్యక్షురాలు జగ్గవరపు జానకీ రెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్ అప్పనవీడు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. న్యూస్రీల్ బెదిరింపులు, అక్రమ కేసులు, జైళ్లతోనే పాలన కూటమి పాలనలో తలలు నరికితే తప్పు లేదా? వైఎస్సార్సీపీ యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి ఏలూరులో యువత పోరుకు కదం తొక్కిన నిరుద్యోగులు భారీ ర్యాలీ, కలెక్టరేట్ వద్ద ధర్నా -
యువత జీవితాలతో కూటమి ఆటలు
భీమవరం: యువతను నిండా మోసం చేసిన కూట మి ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని వైఎస్సార్సీపీ యువజన విభాగం పశ్చి మగోదావరి జిల్లా అధ్యక్షుడు చిగురుపాటి సందీప్ హెచ్చరించారు. భీమవరంలో చేపట్టిన యువత పో రు నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కూటమి అధికారం చేపట్టి ఏడాది గడిచినా ప్రజలకిచ్చిన ఏ ఒక్క హామీని అమలుచేయలేదని, అయినా లక్షల కోట్లు అప్పులు చేస్తూ ప్రజా సంక్షేమాన్ని విస్మరించి ఆర్బాటాలు చేస్తున్నారని విమర్శించారు. నిరుద్యోగ భృతి, ఇంటికో ఉద్యోగం అంటూ ప్ర చారం చేసిన సీఎం చంద్రబాబు ఒక్క హామీ కూ డా అమలుచేయకుండా యువత జీవితాలను ఆటలా డుకుంటున్నారని దుయ్యబట్టారు. 20 లక్షల ఉ ద్యోగాలు, నిరుద్యోగులకు నెలకు రూ.3 వేల భృతి, పె ద్ద ఎత్తున పరిశ్రమలు స్థాపించి ఉపాధి అవకా శా లు కల్పిస్తామన్న హామీలు ఏమయ్యాయని ప్ర శ్నించారు. ఏడాదిలో జిల్లాలో యువతకు నిరుద్యోగ భృతి బకాయిలు రూ.7,200 కోట్లు ఎగ్గొట్టారన్నారు. వలంటీర్ల వ్యవస్థకు మంగళం వైఎస్సార్సీపీ ఎంబీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పెండ్ర వీరన్న మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం నిరుద్యోగ భృతికి ఎగనామం పెట్టడంతో పాటు వలంటీర్ల వ్యవస్థకు మంగళం పాడిందని విమర్శించారు. యువతకు ఉద్యోగాలంటూ మోసం చేసి గొప్పల కోసం డబ్బును వృథా చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజా సమస్యలను పట్టించుకోకపోవడంతో పాటు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలుచేసిన సంక్షేమ పథకాలను కూడా గాలికి వదిలేశారని దుయ్యబట్టారు. తల్లికి వందనం పథకంలో కొర్రీలు, వసతి దీవెన, విద్యాదీవెన పథకాల ఊసేలేదన్నారు. విస్సాకోడేరు వంతెన వద్ద నుంచి ర్యాలీగా.. జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో వైఎస్సా ర్ సీపీ యువత విభాగం నాయకులు, కార్యకర్తలు భీమవరంలో విస్సాకోడేరు వంతెన వద్ద నుంచి ర్యా లీగా కలెక్టరేట్కు చేరుకున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వినతిపత్రం ఇవ్వడానికి ఐదుగురికి మాత్రమే అనుమతి ఇవ్వడంతో సందీప్, వీరన్న, బంధం పూర్ణచంద్రరావు తదితరులు కలెక్టరేట్లోకి వెళ్లి జాయింట్ కలెక్టర్ టి.రాహుల్కుమార్రెడ్డికి వినతిపత్రం అందజేశారు. పార్టీ భీమవ రం పట్టణ అధ్యక్షుడు గాదిరాజు రామరాజు, మాజీ అధ్యక్షుడు కోడే యుగంధర్, రాష్ట్ర యూత్ జనరల్ సెక్రటరీ మంతెన సునీల్వర్మ, జాయింట్ సెక్రటరీ సత్తి రాజశేఖరరెడ్డి, కార్యదర్శి బలం శ్రీను, మానుకొండ ప్రదీప్, జిల్లా వైస్ ప్రెసిడెంట్ తమనంపూడి సూర్యారెడ్డి, స్టూడెంట్ వింగ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రాహుల్, అరిగెల అభి షేక్, బేతల సంతోష్, జోగాడ ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. అడుగడుగునా ఆంక్షలువైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన యువత పోరు, సంక్షేమ పథకాలు అమలు చేయాలంటూ అంగన్వాడీలు, తమ ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేయాలని సెకండ్ ఏఎన్ఎంలు చేపట్టిన నిరసన కార్యక్రమాలకు పోలీసులు ఆంక్షలతో ఇబ్బంది పెట్టారు. కలెక్టరేట్లో వినతిపత్రం ఇవ్వడం కోసం వైఎస్సార్సీపీ యువత విభాగం నాయకులు పట్టణంలోని విస్సాకోడేరు వంతెన వద్దకు చేరుకున్నారు. అదే సమయంలో వర్షం ప్రారంభం కావడంతో షామియానా వేసి కూర్చునేందుకు ఏర్పాట్లు చేస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. 50 మందికి మించి వెళ్లడానికి వీల్లేదంటూ కలెక్టరేట్కు కిలోమీటరు దూరంలోనే అడ్డుకోవడానికి ప్రయత్నించారు. అలాగే అంగన్వాడీలను విస్సాకోడేరు వంతెన వద్ద పోలీసులు నిలువరించారు. కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెబుతామంటూ అంగన్వాడీల కార్యకర్తలు హెచ్చరించారు. వైఎస్సార్సీపీ యువజన విభాగం ‘పశ్చిమ’ జిల్లా అధ్యక్షుడు సందీప్ భీమవరంలో ర్యాలీ, ధర్నా -
పేకాట స్థావరంపై పోలీసుల దాడి
తాడేపల్లిగూడెం రూరల్: మండలంలోని కుంచనపల్లి ఎంవీఆర్ టౌన్షిప్ సమీపం ఒక భవనంలో పేకాట ఆడుతున్నారన్న సమాచారం మేరకు రూరల్ సీఐ రమేష్, ఎస్సై జేవీఎన్.ప్రసాద్ తమ సిబ్బందితో దాడి చేశారు. ఈ సందర్భంగా ఎనిమిది మందిని అదుపులోకి తీసుకొని, ఆరు మోటారు సైకిళ్లు, ఒక కారు, తొమ్మిది సెల్ఫోన్లు, రూ.1.63 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్టు రూరల్ పోలీసులు తెలిపారు.ప్రతిభావంతులకు ల్యాప్టాప్లుఏలూరు(మెట్రో): ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, పోస్టు గ్రాడ్యుయేషన్ చదువుతున్న 13 మంది విభిన్న ప్రతిభావంతులకు కలెక్టర్ కె. వెట్రిసెల్వి సోమవారం స్థానిక కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో విభిన్న ప్రతిభావంతుల శాఖ ఆధ్వర్యంలో రూ.4.68 లక్షల విలువైన ల్యాప్టాప్లను జేసీ పి.ధాత్రిరెడ్డితో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వెట్రిసెల్వి మాట్లాడుతూ దృష్టి లోపం, బధిరులు, చలన వైకల్యం గల విద్యార్థినీ విద్యార్థులకు ల్యాప్టాప్లను అందిస్తున్నట్టు చెప్పారు. -
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
నూజివీడు: మండలంలోని ముక్కొల్లుపాడులో అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతిచెందిన సంఘటన సోమవారం చోటు చేసుకుంది. వ్యక్తి మృతిపై మృతుడి తల్లి బండారు దుర్గమ్మ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన బండారు కోటేశ్వరరావు(44) పొక్లైయిన్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. అతనికి నూజివీడు రామాయమ్మరావుపేటకు చెందిన ప్రమీలతో 20 ఏళ్ల క్రితం వివాహమైంది. ప్రమీలకు అదే గ్రామానికి చెందిన ఇర్ల మహేష్తో వివాహేతర సంబంధం ఉంది. దీనిపై ప్రమీలకు ఆమె భర్త కోటేశ్వరరావుకు మధ్య గొడవలు జరుగుతున్నాయి. సోమవారం ఉదయం 7 గంటల సమయంలో తల్లి దుర్గమ్మ కొడుకును నిద్ర లేపగా ఎంతకీ లేవకపోయే సరికి పరీక్షించగా.. మృతిచెంది ఉన్నాడు. ఆదివారం సాయంత్రం ఇర్ల మహేష్ తల్లి జమలమ్మ, మహేష్ తమ్ముడు భార్య హైమావతి కలిసి కోటేశ్వరరావుతో గొడవ పడ్డారు. కోటేశ్వరరావు ఇంటికి వెళ్లి భోజనం పెట్టమని అడగగా భార్య పెట్టకపోవడంతో తన అన్న ఇంటికి వెళ్లి భోజనం చేశాడు. భోజనం చేసిన కొద్దిసేపటికే కోటేశ్వరరావు వాంతులు చేసుకున్నాడు. ఆ తరువాత ఇంటికి వెళ్లి పడుకున్నాడు. తన కుమారుడి మృతి విషయంలో కోడలు ప్రమీల, ఇర్ల మహేష్పై అనుమానం ఉన్నట్లు ఫిర్యాదులో పేర్కొంది. ఎస్ఐ జ్యోతిబసు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మూలనపడిన ఆక్వా మొబైల్ ల్యాబ్
30 వేల ఎకరాల చెరువులకు పరీక్షలు ప్రశ్నార్థకం దెందులూరు: మత్స్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆక్వా మొబైల్ ల్యాబ్ సేవలు నిలిచిపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. పదేళ్ల క్రితం మత్స్యశాఖ ఆధ్వర్యంలో దెందులూరు, ఏలూరు రూరల్, పెదపాడు మండలాలకు సంబంధించి ఆక్వా రైతుల పొలాల మేత, ఇతర పరీక్షల కోసం మొబైల్ ల్యాబ్ ఏర్పాటు చేశారు. రైతులు ఏలూరులోని ల్యాబ్కు రానవసరంలేకుండా గ్రామ సచివాలయ సిబ్బంది గ్రామాలకు వెళ్లి రైతులకు అవగాహన సమావేశంలో సదస్సులు నిర్వహించి మేత, నీరు ఇతర శాంపిల్స్ తీసుకుంటారు. మొబైల్ వ్యాన్ సిబ్బంది రైతుల వద్దకు వెళ్లి మొబైల్ ల్యాబ్లో ఉన్న టెస్టులు చేస్తారు. మిగిలిన టెస్టులకు శాంపిల్స్ తీసుకొని ఏలూరు మత్స్య శాఖ కార్యాలయానికి వచ్చి పరీక్షలు నిర్వహించి నిర్ధారణ చేసి రిపోర్టులను రైతులకు పంపుతారు. కొంతకాలంగా ఈ సేవలు నిలిచిపోయాయి. దీంతో దెందులూరు ఏలూరు రూరల్, పెదపాడు మండలాల్లోని 30 వేల ఆక్వా రైతుల చెరువుల్లో పరీక్షలు ప్రశ్నార్థకంగా మారాయి. నామమాత్రంగా ల్యాబ్ సేవలు ఆక్వా మొబైల్ ల్యాబ్ సేవలు బాటలోనే ఏలూరు మత్స్యశాఖ జిల్లా కార్యాలయంలో ఉన్న ఆక్వా ల్యాబ్ లో కూడా పరీక్షలు తూతూ మంత్రంగా ఉన్నాయి. ఆక్వాకు సంబంధించి మేత పరీక్ష ప్రాధాన్యమైంది. మేతకు సంబంధించి నాలుగు పరీక్షలు ఈ ల్యాబ్లో జరగాల్సి ఉండగా ఒక పరీక్ష మాత్రమే చేస్తున్నారు. మిషన్లు పనిచేయని కారణంగా పరీక్షలు జరగటం లేదని చెబుతున్నారు. కూటమి ప్రభుత్వం ఆక్వా రైతుల అభివృద్ధి సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో ఇవి జరగటం లేదు. పరీక్షలు జరగకపోతే ఎలా? ఆక్వాలో నీరు, మేత, ఇతర పరీక్షలు చాలా ముఖ్యమైనవి. ఇవే లేకపోతే ఆక్వా సాగు లేనట్టే. ప్రభుత్వం ఆక్వా సాగుకు మద్దతు, ప్రోత్సాహం, నిధులు కేటాయింపు ఇస్తామని ఊదరగొడుతోంది. క్షేత్రస్థాయిలో ఇబ్బందులు తెలుసుకునే ప్రయత్నం కూడా చేయకపోవడం బాధాకరం. – డీబీఆర్కే చౌదరి, వైఎస్సార్సీపీ జిల్లా కార్యదర్శి ఆక్వా రైతుల గోడు పట్టదా? మొబైల్ ల్యాబ్ పనిచేయకపోయినా ప్రభుత్వం పట్టించుకోకపోతే ఏమనాలి. జిల్లా కార్యాలయంలో ఉన్న ల్యాబ్లో టెస్టులు సైతం అరకొరగా జరుగుతున్నాయి. వెంటనే మొబైల్ ల్యాబ్ రిపేరుకు చర్యలు తీసుకోవాలి. జిల్లా కార్యాలయంలో ఉన్న ల్యాబ్లో అన్ని పరీక్షలు జరిగేలా చూడాలి. – నిట్టా లీలా నవకాంతం, దెందులూరు జడ్పీటీసీ -
డ్రైవర్ తొందరపాటు వల్లే ప్రమాదం
ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమల క్షేత్రంలో ఆదివారం సాయంత్రం జరిగిన ఆర్టీసీ బస్సు ప్రమాదానికి డ్రైవర్ కంగారు, తొందరపాటే కారణమని తణుకు ఆర్టీసీ డిపో మేనేజర్ సప్పా గిరిధర్ కుమార్ సోమవారం ఒక ప్రకటన ద్వారా తెలిపారు. స్థానిక గుడిసెంటర్ నుంచి సుమారు 70 మంది యాత్రికులతో తణుకుకు బయల్దేరిన ఏపీ16జెడ్ 215 నెంబర్ ఆర్టీసీ బస్సు డీసీసీబీ బ్రాంచి ఎదురుగా ఉన్న దేవస్థానం స్ట్రీట్లైట్ స్తంభాన్ని, ఆ తరువాత షాపింగ్ కాంప్లెక్స్ భవనాన్ని ఢీకొట్టిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదం బస్సు బ్రేక్లు విఫలం కావడం వల్లే జరిగిందని డ్రైవర్ శ్రీనివాస్ తెలిపారు. బస్సును నిశితంగా పరీక్షించిన తణుకు డిపో మెకానికల్ సిబ్బంది బస్సుకు ఏ విధమైన కంప్లైంట్లు లేవని, బ్రేక్లు బాగానే ఉన్నట్టు తేల్చారని డిపో మేనేజర్ తెలిపారు. గుడి సెంటర్ నుంచి కిందకు దిగుతున్న సమయంలో డ్రైవర్ కొద్దిపాటి కంగారు, తొందరపాటు వల్లే బస్సు డ్రైనేజీలోకి జారి ఈ ప్రమాదం జరిగిందన్నారు. గత పది రోజులుగా ఈ బస్సుకి ఏ విధమైన కంప్లైంట్లు లేవని తెలిపారు. విచారణ అనంతరం ప్రమాదానికి కారణమైన సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని గిరిధర్ కుమార్ పేర్కొన్నారు. -
దళితవాడల్లోని స్కూళ్ల విలీనంపై ఆగ్రహం
పెనుమంట్ర : మోడల్ స్కూళ్ల పేరుతో దళితవాడల్లో ఎంతోకాలంగా ఉన్న ప్రాథమిక పాఠశాలలను, యూపీ పాఠశాలలను డౌన్ గ్రేడ్ చేసి వేరే పాఠశాలల్లో విలీనం చేయడం ద్వారా ఆ పాఠశాలల రద్దు దిశగా ప్రభుత్వ ప్రయత్నిస్తోందని, పెనుమంట్ర మండలంలోని పలువురు దళితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల పెనుమంట్ర మండలంలోని అనేక పాఠశాలలను దూర ప్రాంతాలలో ఉన్న పాఠశాలల్లో విలీనం చేశారు. పెనుమంట్రలోని దళితవాడలో ఎల్ఈ పాఠశాలను డౌన్ గ్రేడ్ చేసి 3, 4, 5 తరగతులను పెనుమంట్రలో దళితవాడకు దూరంగా ఉన్న పెనుమంట్ర (ఆర్) పాఠశాలలో విలీనం చేయడం పట్ల ఆ గ్రామ దళితులు నాలుగు రోజులుగా ఆందోళన చేస్తున్నారు. ఓడూరు పాఠశాల ఉన్న విద్యార్ధులను మూడు కిలోమీటర్లు దూరంలో ఉన్న నెలమూరు గ్రామంలో యూపీ పాఠశాలను హైస్కూల్గా అప్గ్రేడ్ చేసి ఆ పాఠశాలలో విలీనం చేయడంతో ఓడూరు గ్రామస్తులు కూడా ఆందోళన చేపట్టారు. నెలమూరుకు కేవలం అరకిలో మీటరు దూరంలో కొమ్ముచిక్కాల జడ్పీ ఉన్నత పాఠశాల ఉండగా నెలమూరు యూపీ పాఠశాలను అప్గ్రేడ్ చేయడంలో రాజకీయాలు చోటు చేసుకున్నాయని ఇది దళితులను విద్యకు దూరం చేయడం కోసం జరుగుతున్న కుట్రలో భాగమేనని దళితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఓడూరు పాఠశాలను హైస్కూల్గా అప్గ్రేడ్ చేయాల్సి ఉండగా నెలమూరు పాఠశాలను అప్గ్రేడ్ చేయడం పట్ల ఆందోళన చేపడుతున్నారు. సోమవారం రెండు గ్రామాలకు చెందిన దళితులు పాఠశాలల వద్ద ఆందోళన చేయడమే కాకుండా పెనుమంట్ర తహసీల్దార్ కార్యాలయంలో వినతిపత్రాన్ని అందజేశారు. తమ పిల్లలను వేరొక పాఠశాలకు పంపించేదిలేదని పేర్కొన్నారు. ఇంతవరకు పెనుమంట్ర మండలంలో జుత్తిగ, పొలమూరు, మాముడూరు, ఆలమూరు, మార్టేరులోని బాసంతిదేవి జెడ్పీ ఉన్నత పాఠశాలల్లో 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు తరగతులు నిర్వహించారు. ఈ పాఠశాలలో 3 నుంచి 5 తరగతులు ఉన్న విద్యార్థులను వేరొక పాఠశాలల్లో విలీనం చేయగా ఎస్.ఇల్లిందలపర్రు గ్రామంలోని యూపీ పాఠశాలను హైస్కూల్గా అప్గ్రేడ్ చేశారు. మండలంలోని ఎస్.ఇల్లిందలపర్రు గ్రామం మినహా అన్ని గ్రామాలలో చేసిన విలీనాల విషయంలో అధికారులు అడ్డుగోలుగా వ్యవహరించారని విమర్శిస్తున్నారు. ఈ విషయమై ఎంఈవో యు నాగేశ్వరరావును వివరణ కోరగా ఆయా పాఠశాలల విద్యార్ధుల సంఖ్య ఆధారంగా ప్రభుత్వ నిబంధనలు అనుసరించి విలీనం చేయడం అప్గ్రేడ్లు చేయడం జరిగిందన్నారు. తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కొన్ని గ్రామాలలో తరగతి గదుల కొరత ఉండటం వల్ల సమీప పాఠశాలల్లో ఉన్న సౌకర్యాలను బట్టి ఆ పాఠశాలల్లో విలీనం చేశామన్నారు. -
‘సూర్య ఘర్’ పథకంపై అవగాహన
ఏలూరు (ఆర్ఆర్పేట): సోలార్ విద్యుత్ మధ్యతరగతి ప్రజలకు ఎంతో లాభదాయకమని, ఒక్కసారి ఖర్చుపెడితే ఇరవై ఏళ్ల పాటు విద్యుత్ బిల్లులు చెల్లించే పని ఉండదని ఈపీడీసీఎల్ ఏలూరు సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ పీ సాల్మన్రాజు తెలిపారు. సోమవారం స్థానిక విద్యుత్ భవన్ సమావేశ మందిరంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రధాన మంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకంలో భాగంగా గృహ విద్యుత్ వినియోగదారులకు సబ్సిడీ కల్పిస్తూ సోలార్ సిస్టం ఏర్పాటు చేసుకునే అవకాశం కల్పిస్తున్నారన్నారు. ప్రతిఒక్కరూ తమ ఇంటిపై సోలార్ ప్యానళ్లను సబ్సిడీపై ఏర్పాటు చేసుకోవాలని, దీనికి అన్ని జాతీయ బ్యాంకులు తక్కువ వడ్డీకే సులభ వాయిదాలలో చెల్లించేలా రుణాలు అందిస్తున్నాయన్నారు. గృహ విద్యుత్ వినియోగదారులకు విద్యుత్ బిల్లుల భారం లేకుండా ఉండాలంటే సోలార్ విద్యుత్ను వినియోగించుకోవాలన్నారు. సోలార్ విద్యుత్ పానళ్ల ఏర్పాటుకు కిలోవాట్కు రూ.30 వేలు, రెండు కిలోవాట్లకు రూ.60 వేలు, మూడు కిలోవాట్లకు రూ.78 వేలు సబ్సిడీగా ఇస్తుందన్నారు. సోలార్ ప్యానళ్ల ద్వారా ఉత్పత్తి చేసుకునే విద్యుత్లో వినియోగదారులు తాము వినియోగించుకోగా మిగిలిన విద్యుత్ను యూనిట్ రూ.2.09కు విద్యుత్ సంస్థలు కొనుగోలు చేస్తాయని, దాని ద్వారా అసలు బిల్లు చెల్లించకుండా ఆదాయం కూడా వస్తుందన్నారు. ఈ సందర్భంగా సూర్యఘర్ పథకానికి సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. సమావేశంలో విద్యుత్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ టెక్నికల్ పీ.రాధాకృష్ణ, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కమర్షియల్ అండ్ టెక్నికల్ ఏ.రమాదేవి తదితరులు పాల్గొన్నారు. -
ఫ్రైడ్ ఆఫ్ ఇండియాలో ప్రతిభ
ఏలూరు(మెట్రో): జూన్ 16న బ్రిటన్ నుంచి ఫ్రాన్స్ వరకు 34 కి.మీ. ఇంగ్లిష్ చానల్ను ఆరుగురి బృందంతో కూడిన ఫ్రైడ్ ఆఫ్ ఇండియా ఎ టీమ్ స్విమ్మింగ్ చేస్తూ 13 గంటల 37 నిమిషాలు వ్యవధిలో విజయవంతంగా ముగించారు. ఏలూరుకు చెందిన బలగ గణేష్ కూడా ఆ బృందంలో సభ్యుడిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో బలగ గణేష్ను కలెక్టర్ కె.వెట్రిసెల్వి అభినందించారు. గణేష్ ఏప్రిల్ 18న శ్రీలంక నుంచి ఇండియా వరకు 28 కి.మీ దూరం పాక్ జలసంధిని 10 గంటల 30 నిమిషాల వ్యవధిలో పూర్తి చేసి తెలుగు రాష్ట్రాల్లోనే మొట్ట మొదటి పారా స్మిమ్మర్గా రికార్డు నెలకొల్పడం అభినందనీయమన్నారు. గణేష్ను అభినందించిన వారిలో జాయింట్ కలెక్టర్ పి.ధాత్రిరెడ్డి, డీఆర్ఓ వి.విశ్వేశ్వరరావు, డీఎస్డీవో బి.శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు.తాడిచెట్టు కూలి ఇల్లు ధ్వంసందెందులూరు : గాలాయగూడెంలో ఆదివారం రాత్రి భారీ ఈదురు గాలులకు పెండ్లి ఇస్సాకు ఇంటిపై తాడిచెట్టు పడింది. తాడిచెట్టు పడే సమయంలో కుటుంబ సభ్యులు ఇంట్లోనే నిద్రిస్తున్నారు. అదృష్టవశాత్తు ఇంట్లో ఉన్న ఏ ఒక్కరికి ఏమీ కాకపోవడంతో గ్రామస్తులంతా ఊపిరి పీల్చుకున్నారు.కూలిన భారీ వృక్షంభీమడోలు: ఆదివారం రాత్రి వీచిన గాలి వానకు పలు గ్రామాల్లో చెట్లు నేలమట్టమయ్యాయి. మండల వ్యాప్తంగా చెట్ల కొమ్మలు సైతం విరిగి పడ్డాయి. విద్యుత్ తీగలపై పడడంతో పలు చోట్ల కరెంట్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. గుండుగొలను సంతమార్కెట్ వద్ద భారీ వృక్షం నేలకొరిగింది. దీంతో విద్యుత్ వైర్లు తెగి గ్రామంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం నెలకొంది. తీగలు తెగడంతో విద్యుత్ శాఖ అప్రమత్తమై ఎలాంటి ప్రమాదం జరగకుండా తగు చర్యలు చేపట్టింది. పంచాయతీ, విద్యుత్ శాఖ అధికారులు చెట్టును తొలగించి విద్యుత్ సరఫరాకు చర్యలు తీసుకున్నారు. -
పెదవేగి కర్మాగారం ప్రైవేటీకరిస్తే ఊరుకోం
పెదవేగి: ఆయిల్పామ్ రైతుల ప్రయోజనాలకు నష్టం కలిగించేలా పెదవేగి ఆయిల్ ఫెడ్ కర్మాగారం ప్రైవేటీకరణ చేస్తే చూస్తూ ఊరుకోమని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, సీఐటీయు జిల్లా నాయకులు హెచ్చరించారు. సోమవారం సాయంత్రం పెదవేగిలోని ఆయిల్ ఫెడ్ కర్మాగారాన్ని పరిశీలించి కార్మికులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఫ్యాక్టరీ ముందు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్, సీఐటీయు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆర్.లింగరాజు, డీఎన్వీడీ ప్రసాద్ మాట్లాడుతూ పెదవేగి ఆయిల్ ఫెడ్ కర్మాగారం ప్రైవేటీకరించి రైతులు, కార్మికుల ప్రయోజనాలను దెబ్బతీసేలా ప్రభుత్వం ఆలోచన చేయడం తగదన్నారు. ఫ్యాక్టరీ జోన్ పరిధిని, ఫ్యాక్టరీని ప్రైవేటు వారికి అప్పగించాలనే ప్రయత్నాలు వెంటనే విరమించుకోవాలని కోరారు. దేశంలోనే అత్యధిక ఆయిల్పామ్ విస్తీర్ణం ఏలూరు జిల్లాలోనే ఉందన్నారు. ఆయిల్ పామ్ గెలల ధర ఆయిల్ ఫెడ్ కర్మాగారంలో వచ్చే ఆయిల్ రికవరీ శాతం( ఓ ఇ ఆర్ ) ప్రామాణికంగా ఉందని చెప్పారు. ఈ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణతో భవిష్యత్తులో రైతులు తీవ్రంగా నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆయిల్ ఫెడ్ కర్మాగారం ప్రైవేటీకరణ చర్యలు ఆపి కొత్త ఫ్యాక్టరీ నిర్మాణానికి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఆయిల్పామ్ రైతులు సంఘటితంగా పోరాడి ఆయిల్ ఫెడ్ కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిలబడాలని విజ్ఞప్తి చేశారు. -
బెల్టుషాపులపై దాడి
నూజివీడు: స్థానిక ఎకై ్సజ్ స్టేషన్ పరిధిలోని పలు మండలాల్లో సిబ్బంది సోమవారం దాడులు చేసి 30 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నట్లు ఎకై ్సజ్ సీఐ ఏ మస్తానయ్య తెలిపారు. ఆగిరిపల్లి మండలం సీతారామపురానికి చెందిన మల్లెల శివనాగరాజు వద్ద 10 మద్యం సీసాలు, ముసునూరు మండలం చింతలవల్లికి చెందిన పలగాని విమల వద్ద 10 మద్యం సీసాలు, చెక్కపల్లికి చెందిన చెంగల వెంకటేశ్వరరావు వద్ద 10 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బెల్టుషాపులకు మద్యంను సరఫరా చేస్తే సంబంధిత షాపుపై కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. నిబంధనల ప్రకారం వ్యాపారం చేసుకోవాలన్నారు. అలాగే బెల్టుషాపుల నిర్వహణకు అనుమతులు లేవని, బెల్టుషాపులు నిర్వహించేవారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. ఫిర్యాదులు సకాలంలో పరిష్కరించాలి భీమవరం: ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి మొదటి ప్రాధాన్యత ఇస్తూ మళ్లీ అర్జీలు పునరావృతం కాకుండా నిర్ణీత గడువులోగా చట్ట పరిధిలో శాశ్వత పరిష్కారం చూపాలని అదనపు ఎస్పీ వి.భీమారావు పోలీస్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని అదనపు ఎస్పీ నిర్వహించారు. వివిధ రకాల సమస్యలతో వచ్చిన ప్రజల నుంచి ఫిర్యాదులను అదనపు ఎస్పీ స్వయంగా స్వీకరించి వారి సమస్యలను విని, పూర్తిస్థాయి విచారణ జరిపి శాశ్వత పరిష్కారం అందిస్తామని భరోసా ఇచ్చారు. సంబంధిత పోలీసు అధికారులతో ఫోన్లో మాట్లాడి అర్జీదారుల సమస్యలను చట్ట పరిధిలో విచారించి నిర్ణిత గడువులోగా పరిష్కారం చూపాలన్నారు. వివిధ సమస్యలతో పోలీస్ కార్యాలయాలకు వచ్చే బాధితులకు భరోసాగా పోలీస్ శాఖ ఉండాలన్నారు. పలు సమస్యలపై మొత్తం 17 అర్జీలను అదనపు ఎస్పీ స్వీకరించారు. గర్భిణిఅనుమానాస్పద మృతి ఏలూరు టౌన్: ఏలూరు నగరంలో గర్భిణీ అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. ఏలూరు శ్రీరామ్నగర్ 9వ రోడ్డులోని ఒక అపార్ట్మెంట్లో వాచ్మెన్గా పనిచేస్తోన్న కాళిదాసు దేవి(30) భర్తతో కలిసి జీవిస్తోంది. సోమవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికులు సమాచారంతో ఏలూరు త్రీటౌన్ సీఐ కోటేశ్వరరావు ఆదేశాలతో సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. గర్భిణీ ఆత్మహత్యపై సందేహాలు వ్యక్తం కావటంతో త్రీటౌన్ పోలీసులు విచారణ చేపట్టారు. మృతదేహాన్ని ఏలూరు జీజీహెచ్లోని మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని త్రీటౌన్ పోలీసులు తెలిపారు. ఉపాధి కూలీలకు బెదిరింపులపై ఫిర్యాదు ఏలూరు (టూటౌన్): ఉపాధి హామీ కూలీలను బెదిరించి, ఇబ్బంది పెట్టిన బీజేపీ నాయకులు, జిల్లా అధికారులపై చర్యలు తీసుకోవాలని సీపీఎం ఏలూరు జిల్లా కమిటీ తరఫున ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ఎ.రవి సోమవారం కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. కొయ్యలగూడెంలో రోటరీ క్లబ్లో బీజేపీ నిర్వహించిన సమావేశం సందర్భంగా బెదిరించి ఉపాధి హామీ కూలీలు సుమారు 200 మందిని బీజేపీ సమావేశానికి తీసుకెళ్లారన్నారు. ఆ సమావేశంలో బీజేపీ కరపత్రాలు పంపిణీ చేసి, ఆ పార్టీ కండువాలు ఇష్టం లేకపోయినా బలవంతంగా మెడలో వేసిన బీజేపీ నాయకులపై, బెదిరింపు చర్యలకు పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. -
Dangeti Jahnavi : అంతరిక్షంలోకి ఆంధ్రా అమ్మాయి.. ఎప్పుడంటే?
సాక్షి,అమరావతి: ఆంధ్ర అమ్మాయి దంగేటి జాహ్నవి అరుదైన ఘనతను సాధించారు. 2029లో అంతరిక్షంలోకి వెళ్లే వ్యోమగామిగా ఎంపికయ్యారు. ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన దంగేటి జాహ్నవి 2029లో అంతరిక్ష యాత్రకు సిద్ధమవుతున్నారు. జాహ్నవి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్లో డిగ్రీ పూర్తి చేసి నాసా నిర్వహించే అంతర్జాతీయ ఎయిర్ అండ్ స్పేస్ ప్రోగ్రామ్ను విజయవంతంగా పూర్తి చేసిన తొలి భారతీయురాలిగా గుర్తింపు పొందారు.జాహ్నవి అమెరికాలోని టైటాన్స్ ఆర్బిటల్ పోర్ట్ స్పేస్ స్టేషన్కు ఎంపికై నాలుగేళ్లలో ప్రారంభం కానున్న ఈ ప్రాజెక్టులో భాగంగా అంతరిక్షంలోకి అడుగు పెట్టనున్నారు. పంజాబ్లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో బీఎటెక్ పూర్తిచేసిన జాహ్నవి ఇంటర్మీడియట్ వరకు తన స్వగ్రామమైన పాల కొల్లులోనే చదువుకున్నారు. ఆమె తల్లిదండ్రులు శ్రీనివాస్, పద్మశ్రీ.. ఉద్యోగ రిత్యా వాళ్లిద్దరూ కువైట్లో ఉంటున్నారు. అంతరిక్ష పట్ల అపారమైన ఆసక్తి ఉన్న జాహ్నవి, విద్యార్థులకు సైన్సు, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మాథమేటిక్స్ (STEM) విద్యపై చైతన్యాన్ని కలిగించే కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. మన దేశంలో ప్రముఖ ఎన్ఐటీల్లో ప్రసంగాలు ఇచ్చారు. అంతేకాకుండా, అనాలోగ్ మిషన్లు, డీప్ సీ డైవింగ్, దీర్ఘకాలిక అంతరిక్ష ప్రయాణాల స్థిరతపై ప్రపంచ సదస్సుల్లోనూ పాల్గొంటూ వచ్చారు.International Astronomical Search Collaboration లో ఆమె కృషి ద్వారా, పాన్-స్టార్స్ టెలిస్కోప్ డేటా ఆధారంగా ఓ ఆస్ట్రాయిడ్ను తాత్కాలికంగా గుర్తించారు. తద్వారా స్పేస్ ఐస్లాండ్లో జరిపే జియాలజీ శిక్షణ కోసం ఎంపికైన తొలి భారతీయురాలిగా పేరు సంపాదించారు. నాసా స్పేస్ అప్స్ చాలెంజ్లో పీపుల్స్ చాయిస్ అవార్డు, ఇస్రో అందజేసే వరల్డ్ స్పేస్ వీక్ యంగ్ అచీవర్ అవార్డుతో పాటు ఇతర ప్రతిష్టాతకమైన అవార్డులను ఆమె సొంతం చేసుకున్నారు. -
‘దారితప్పుతున్న కూటమి’ బుక్లెట్ విడుదల
భీమవరం : కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో 143 హామీలిచ్చి కేవలం 20 హామీలలోపే అమలు చేశారని జిల్లా కార్యదర్శి జేఎన్వీ గోపాలనన్ విమవర్శించారు. దారితప్పుతున్న టీడీపీ కూటమి ఏడాది పాలన బుక్లెట్ని ఆదివారం భీమవరంలో విడుదల చేశారు. ఈ ఏడాది కాలం కూటమి ప్రభుత్వం పనిని సమీక్షించి సీపీఎం పార్టీ ఈ బుక్లెట్ని ముద్రించి విడుదల చేసిందన్నారు. ముఖ్యమంత్రి తన ఇచ్చిన హామీలలో 20లోపే అమలు చేశారన్నారు. అత్యధిక హామీలు అమలు చేయకుండా కాలయాపన చేస్తున్నారన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిన దానికి రేటింగ్, గ్రేడింగ్ ఇవ్వాల్సి వస్తే ఈ సంవత్సర కాలంలో చాలా తక్కువ మార్కులే వచ్చాయన్నారు. 10కిగాను 1.75 మార్కులు వచ్చాయన్నారు. ఇప్పటికై నా రాష్ట్ర కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా అమలు చేయాలని కోరారు. జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బాబూరావు, బి.వాసుదేవరావు, కమిటీ సభ్యులు జె.సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. జీతాలు సకాలంలో చెల్లించాలి తణుకు అర్బన్ : తాజాగా బదిలీ అయిన ఉపాధ్యాయులకు సకాలంలో జూన్ నెల వేతనాలు అందేలా రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ (ఏపీటీఎఫ్) పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షులు జి.ప్రకాశం కోరారు. సీఎఫ్ఎంఎస్కు అనుసంధానం చేసి పొజిషన్ ఐడీలను కేటాయించి ట్రెజరీ అధికారులకు తగు సూచనలు ఇవ్వాలని కోరారు. ఏపీటీఎఫ్ పశ్చిమగోదావరి జిల్లా సబ్ కమిటీ సమావేశం ఆదివారం స్థానిక మునిసిపల్ ప్రాథమికోన్నత పాఠశాలలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలకు వేలాది కోట్ల రూపాయలు బకాయిలు ఉందని వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. తొమ్మిది రకాల పాఠశాల విద్యా విధానాన్ని రద్దు చేయాలని కోరారు . జిల్లా ప్రధాన కార్యదర్శి బీవీ నారాయణ, జిల్లా కార్యదర్శి కే.రాంబాబు, వి.రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో సరాసరి వర్షపాతం 22.5 మి.మీ భీమవరం: జిల్లాలో ఆదివారం 22.5 మి.మీ సరాసరి వర్షపాతం నమోదైంది. మండలాల వారీగా తాడేపల్లిగూడెం 55.2 మి.మీ, పెంటపాడు 39.2, తణుకు 18.6, అత్తిలి 18, గణపవరం 52.2, ఆకివీడు 12.4, ఉండి 9.4, పాలకోడేరు 21, పెనుమంట్ర 15.8, ఇరగవరం 65.2, పెనుగొండ 32.2, ఆచంట 20, పోడూరు 10.4, వీరవాసరం 13.2, భీమవరం 23.2, కాళ్ల 12.6, మొగల్తూరు 7.4, నరసాపురం 7.2, పాలకొల్లు 13చ యలమంచిలి 4.2 మి.మీ వర్షపాతం నమోదైంది. ప్రశాంతంగా డీఎస్సీ పరీక్ష భీమవరం: జిల్లావ్యాప్తంగా ఆదివారం నిర్వహించిన మెగా డీఎస్సీ–2025 పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలోని 3 పరీక్షా కేంద్రాల్లో ఉదయం షిఫ్ట్కు 310 మందికి 296 మంది, మధ్యాహ్నం షిప్ట్లో 310 మందికి 238 మంది హాజరయ్యారని జిల్లా విద్యాశాఖాధికారి ఇ.నారాయణ తెలిపారు. స్పెషల్ స్క్వాడ్ టీం పరీక్షా కేంద్రాలను తనిఖీ చేయగా ఎలాంటి మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదన్నారు. అడిషినల్ డీఎంహెచ్వో బదిలీ భీమవరం(ప్రకాశం చౌక్) జిల్లా వైద్యా ఆరోగ్యశాఖలో అడిషనల్ డీఎంహెచ్వోగా పనిచేసిన బి.భానునాయక్ ఎన్టీఆర్ జిల్లాకు బదిలీ అయ్యా రు. ఆయన ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో 5 ఏళ్ల సర్వీసు పూర్తికావడంతో బదిలీ చేశారు. నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక భీమవరం (ప్రకాశంచౌక్): సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కలెక్టర్ కార్యాలయం, డివిజన్, మున్సిపల్, మండల స్థాయిలో నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఫిర్యాదులను సమీపంలోని మండల కార్యాలయాలు, డివిజనల్ కార్యాలయాలు లేదా మున్సిపల్ కార్యాలయాలలో అందించవచ్చన్నారు. -
రోజువారీ సేవలు బంద్
●పర్మినెంట్ చేయాలి ఆప్కాస్ విధానాన్ని ఉంచాలి. తీసేయాల్సివస్తే పర్మినెంట్ చేయాలనేది ప్రధాన డిమాండ్. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అమలుచేయాలి. వేతన సవరణ చేసి పెరుగుతున్న మార్కెట్ ధరలకు అనుగుణంగా మాకు కనీస వేతనాలు అందచేయాలి. – ఉండ్రాజవరపు శ్రీను, ఏకార్మిక సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ తణుకు శాఖ అధ్యక్షుడు ఉద్యోగ భద్రత కల్పించాలి పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెరగకపోవడంతో చాలా కష్టంగా ఉంది. కూటమి నేతలు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. విధుల్లోకి వచ్చినప్పటి నుంచి ఒళ్లు దాచుకోకుండా పనిచేస్తున్న తమకు వేతనాలు పెంచి ఉద్యోగ భద్రత కల్పించాలి. – గెల్లా విజయకుమార్, కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ జేఏసీ కార్యదర్శి తణుకు అర్బన్ : గత సమ్మె కాలంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలంటూ మున్సిపల్ ఇంజినీరింగ్ అవుట్సోర్సింగ్ కార్మికుల ఆందోళలనలు ఊపందుకున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయినా ఎలాంటి న్యాయం జరగలేదని నిరాహారదీక్షలు చేపట్టారు. కూటమి ప్రభుత్వం స్పందించకపోవడంతో సోమవారం నుంచి పూర్తిస్థాయి సమ్మెలోకి వెళ్లేందుకు కార్యాచరణ సిద్ధం చేశారు. అన్ని మున్సిపాలిటీల అధికారులు, స్థానిక శాసనసభ్యులకు సమ్మె నోటీసులు అందచేశారు. ఈ నెల 20 నుంచి మునిసిపల్ కార్యాలయాల వద్ద రిలే నిరాహారదీక్షలు చేస్తున్నారు. అయినప్పటికీ ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడం, చర్చలకు పిలవకపోవడంతో పూర్తిస్థాయి సమ్మెలోకి దిగుతున్నారు. దీంతో ఇంజనీరింగ్ విభాగంలోని ఎలక్ట్రికల్, ప్లంబింగ్, వాటర్ వర్క్స్, వర్క్ ఇన్స్పెక్టర్లు, పార్కు మజ్దూర్స్, కంప్యూటర్ ఆపరేటర్స్, సెక్యూరిటీ, అటెండర్స్ సేవలు నిలవనున్నాయి. 2023 డిసెంబర్ నెలలో జరిగిన 17 రోజుల సమ్మె కాలపు ఒప్పందాలు అమలు చేయాలని కోరుతున్నారు. ఎక్స్గ్రేషియా ఏడు లక్షలకు పెంపు, రిటైర్మెంట్ బెనిఫిట్ రూ.75,000, దహన సంస్కారాల ఖర్చులు 20,000, రిటైర్మెంట్ వయసు 62 సంవత్సరాలకు పెంచడం వంటి అంశాలు పెండింగ్ లోనే ఉన్నాయని, వాటిని తక్షణమే అమలు చేయాలని మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు కోరుతున్నారు. నిలిచిపోనున్న సేవలు వాటర్వర్క్స్, ఎలక్ట్రికల్ విభాగాల్లో కార్మికులు అందుబాటులో లేకపోతే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఆయా విభాగాల్లో ఏ సమస్య వచ్చినా ఫిర్యాదుచేసిన వెంటనే కార్మికులు ఆ సమస్యలను పరిష్కరిస్తున్నారు. సమ్మె కారణంగా ఇకపై ఎలాంటి ఇబ్బందులు తలెత్తుతాయోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో 310 మంది కార్మికులు భీమవరంతో పాటు తణుకు, తాడేపల్లిగూడెం, నరసాపురం, పాలకొల్లు మున్సిపల్ కార్యాలయాల్లో నగర పంచాయతీగా ఉన్న ఆకివీడులో మున్సిపల్ ఇంజినీరింగ్ విభాగంలో 310 మంది కార్మికులు విధులు నిర్వర్తిస్తున్నారు. వీరికి రూ.15 వేలు వేతనం కాగా కేవలం రూ.13,080లు మాత్రమే చేతికి అందుతుంది. ఆందోళన బాటలో మున్సిపల్ ఇంజినీరింగ్ కార్మికులు నేటి నుంచి పూర్తి స్థాయి సమ్మెలోకి కార్మికులు సమ్మె ఒప్పందాల్ని అమలు చేయాలని డిమాండ్ పశ్చిమలో 310 మంది ఇంజినీరింగ్ కార్మికులు ప్రభుత్వం పట్టించుకోవడం లేదు ఇంజినీరింగ్ సెక్షన్లో 25 ఏళ్లుగా పనిచేస్తున్నాను. ఉద్యోగం పర్మినెంట్ అవుతుంది కదా అనే ఆశతో చాలీచాలని జీతంతో నెట్టుకొస్తున్నాం. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్న అంశాన్ని కూడా పట్టించుకోవడంలేదు. మా సమస్యలు ప్రభుత్వం పట్టిచుకోవడంలేదనే ఉద్దేశ్యంతో తప్పనిసరి పరిస్థితుల్లో సమ్మెకు దిగాల్సివచ్చింది. – కొపనాతి వెంకటకృష్ణ, నరసాపురంకార్మికుల ప్రధాన డిమాండ్లు టెక్నికల్ రూ.29,200, నాన్ టెక్నికల్ రూ.24,500 జీతం అమలుచేయాలి. షరతులు లేకుండా సంక్షేమ పథకాలు అమలు చేయాలి రిటైర్మెంట్, చనిపోయినా, అనారోగ్యం పాలైన వారి స్థానంలో వారి పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలి ఆప్కాస్ రద్దు చేస్తే ఉద్యోగాలు పర్మినెంట్ చేయాలి సుప్రీంకోర్టు తీర్పు మేరకు సమాన పనికి సమాన వేతనం, గ్రాట్యుటీ అమలు చేయాలి. చట్టబద్ధమైన సెలవులు అమలు చేయాలి. ఇతర ఉద్యోగుల మాదిరిగా గ్రాట్యుటీతో పాటు కనీస పింఛన్ రూ.10 వేలు ఇవ్వాలి. విధి నిర్వహణలో చనిపోయిన కార్మికులకు రూ.10 లక్షలు, అంగవైకల్యం పొందిన వారికి రూ.5 లక్షలు ఇస్తూ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలి. -
పెద్దింట్లమ్మ దేవస్థానంలో భక్తుల రద్దీ
కై కలూరు: పెద్దింట్లమ్మ నామస్మరణతో కొల్లేటికోట దేవస్థానం ఆదివారం మార్మోగింది. సమీప జిల్లాల నుంచి వేలాదిగా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. పవిత్ర కోనేరులో స్నానాలు ఆచరించి అమ్మవారికి వేడి నైవేద్యాలు సమర్పించారు. ఆలయ ప్రధాన అర్చకులు పేటేటి పరమేశ్వరశర్మ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ ఈవో కూచిపూడి శ్రీనివాసు మాట్లాడుతూ ఒక్క ఆదివారం ప్రత్యేక, అంతరాలయ దర్శనాలు, పెద్ద, చిన్న తీర్థాలు, కేశఖండన, లడ్డూ ప్రసాదం, అద్దెలు, అమ్మవారి చిత్రపటాలు, వాహన పూజలు, విరాళాల ద్వారా రూ.79,710 ఆదాయం వచ్చిందని చెప్పారు. -
ఆయిల్పామ్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ వద్దు
ఏలూరు (టూటౌన్) : పెదవేగి ఆయిల్ ఫెడ్ కర్మాగారం ప్రైవేటీకరణ చేయవద్దని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఆదివారం ఏలూరు అన్నే భవనంలో పెదవేగి ఆయిల్ ఫెడ్ కర్మాగారం ప్రైవేటీకరణ అంశంపై రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కట్టా భాస్కరరావు అధ్యక్షతన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో రోజురోజుకీ ఆయిల్పామ్ విస్తీర్ణం పెరుగుతోందని, దేశంలోనే అత్యధికంగా ఏలూరు జిల్లాలో ఆయిల్ పామ్ సాగు ఉందన్నారు. సహకార రంగంలో ఉన్న ఆయిల్ ఫెడ్ కర్మాగారాన్ని అభివృద్ధి చేయకుండా ప్రైవేటీకరించాలనే ప్రభుత్వ యోచన విరమించుకోవాలని కోరారు. పెదవేగి ఆయిల్ ఫెడ్ కర్మాగారంలో వస్తున్న రికవరీ శాతం ఆధారంగానే ధర నిర్ణయం జరుగుతుందని చెప్పారు. కర్మగారాన్ని ప్రైవేటీకరిస్తే ఊరుకునేది లేదని, రైతులను సమీకరించి ఉద్యమం చేపడతామని శ్రీనివాస్ హెచ్చరించారు. -
ముగిసిన బదిలీల కౌన్సెలింగ్
కౌన్సెలింగ్కు హాజరైన ఎంటీఎస్ టీచర్లు ఏలూరు (ఆర్ఆర్పేట): డీఎస్సీ 1998, 2008 ఉపాధ్యాయులకు నిర్వహించిన కౌన్సెలింగ్ ప్రశాంతంగా కొనసాగింది. 2008 డీఎస్సీకి సంబంధించిన 191 మంది ఎంటీఎస్ టీచర్లు, 1998 డీఎస్సీకి సంబంధించిన 199 మంది టీచర్లు పాల్గొన్నారు. వీరికి విద్యాశాఖ అధికారులు ఉమ్మడి జిల్లాలోని 700 ఖాళీలను చూపారు. సీనియారిటీ ప్రాతిపదికన తొలుత 2008, అనంతరం 1998 ఎంటీఎస్లకు కౌన్సిలింగ్ నిర్వహించారు. కౌన్సిలింగ్ను సెంటర్కు దగ్గరగా ఉండే జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించకుండా సెంటర్కు దూరంగా ఉన్న జీఎంసీ బాలయోగి సైన్స్పార్కులో ఏర్పాటు చేయడంతో ఎంటీఎస్ టీచర్లు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు అసంతృప్తి వ్యక్తం చేశారు. కౌన్సెలింగ్కు హాజరయ్యే వారి కోసం కేంద్రంలో ఎలాంటి టెంట్లు వేయకపోవడంతో ఎక్కువ మంది తలోదిక్కున, చెట్ల నీడల్లో ఉండాల్సి రావడంపై అసంతృప్తి వ్యక్తమయింది. -
పోటెత్తిన భక్తులు
బుట్టాయగూడెం: మారుమూల గ్రామమైన కామవరం సమీపంలోని అటవీ ప్రాంతంలో కొలువై ఉన్న గుబ్బల మంగమ్మ గుడికి ఆదివారం భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు విజయవాడ, మచిలీపట్నం, తెలంగాణ రాష్ట్రంలోని భద్రాచలం, పాల్వంచ, కొత్తగూడెం, సత్తుపల్లి, అశ్వారావుపేట ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు వాహనాలలో తరలివచ్చి అమ్మవారికి దూపదీప నైవేద్యాలతో ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. సిల్వర్ సెట్లో ప్రతిభ భీమడోలు: ఉమ్మడి రాష్ట్రాల్లో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సిల్వర్ సెట్ ఫలితాల్లో బీఎస్సీ లెక్కల విభాగంలో పయ్యావుల చిరు హాసిని మొదటి ర్యాంకు సాధించి సత్తా చాటింది. ఉమ్మడి రాష్ట్రాల్లో సిల్వర్ జూబ్లీ కళాశాలల్లో డిగ్రీ ప్రవేశాలకు ప్రతి ఏటా సిల్వర్ సెట్ను నిర్వహిస్తుంది. శనివారం ఫలితాలు విడుదల కాగా.. చిరు హాసిని ప్రతిభ చాటింది. ఇందులో సీట్ సాధిస్తే మూడేళ్ల పాటు రెసిడెన్షియల్ కళాశాలలో ప్రవేశం ఉంటుంది. చదువుతో పాటు భోజన వసతి సౌకర్యాలు కల్పిస్తారు. నేడు తణుకులో ఉమ్మడి జిల్లా ఫెన్సింగ్ జట్ల ఎంపిక తణుకు అర్బన్: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ఫెన్సింగ్ టీం సెలక్షన్లు ఈనెల 23వ తేదీన తణుకు విద్యా వ్యాలీ స్కూల్లో నిర్వహిస్తున్నట్లు ఫెన్సింగ్ అసోసియేషన్ ఆఫ్ ఏపీ రాష్ట్ర కార్యదర్శి జీఎస్వీ కృష్ణమోహన్ తెలిపారు. సోమవారం ఉదయం 9 గంటలకు మినీ (అండర్ 12) విభాగంలో 2014 నుంచి 2015లోపు పుట్టిన ఫెన్సర్లు, చైల్డ్ (అండర్ 10) విభాగంలో 2016 నుంచి 2018 మధ్యలో పుట్టిన ఫెన్సర్లు హాజరుకావాల్సిందిగా కోరారు. ఎంపికై న జట్లు ఈ నెల 28, 29 తేదీల్లో కాకినాడ జిల్లా పరిషత్ కళ్యాణ మండపంలో నిర్వహించే ఏపీ స్టేట్ ఇంటర్ డిస్ట్రిక్ట్ 11వ చైల్డ్, మినీ ఫెన్సింగ్ చాంపియన్షిప్లో పాల్గొంటారన్నారు. వివరాలకు 96802 34566 నంబరులో సంప్రదించాలని కోరారు. రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి పెనుమంట్ర: నవుడూరు– పొలమూరు గ్రామాల మధ్య ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో పాలమూరు గ్రామానికి చెందిన కడలి నాగార్జున (33) మృతి చెందాడు. మోటార్ సైకిల్పై భీమవరం వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. గుర్తుతెలియని వాహనం ఢీకొనడం వల్ల ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చునని స్థానికులు చెబుతున్నారు. రోడ్డుపై తీవ్ర గాయాలతో పడి ఉన్న నాగార్జునను స్థానికుల సమాచారంతో 108 వాహనంలో తణుకు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్లు పైలట్ బాలకృష్ణ తెలిపారు. పెయింటర్గా పనిచేస్తున్న నాగార్జున ఇటీవల దుబాయ్ నుంచి వచ్చాడని, అతనికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారని, అతని బంధువులు తెలిపారు. -
● నిర్లక్ష్యానికి నిదర్శనం
అధికారుల నిర్లక్ష్యంతో వైద్య సామాగ్రి, రోగులకు అవసరమైన మంచాలు నిరుపయోగంగా మారాయి. ఆకివీడు సీహెచ్సీకి గత ప్రభుత్వం రోగుల కోసం మంచాలు సరఫరా చేసింది. అయితే అధికారులు వాటిలో కొన్ని వినియోగించగా మిగిలిన వాటిని ఆసుపత్రి ఆవరణలోనే నిర్లక్ష్యంగానే వదిలేశారు. దీంతో మంచాలు ఎండకు ఎండి, వర్షానికి తడిచి నిరుపయోగంగా మారాయి. అలాగే గతంలో సీహెచ్సీకి మూడు ఫొటో థెరపీ యూనిట్లు దాతలు సమకూర్చగా వాటిలో ఒకటి పనికిరాకుండా పోవడంతో దానిని కూడా ఆసుపత్రి ఆవరణలోనే వదిలేశారు. దీంతో జిల్లా సామాజిక ఆరోగ్య కేంద్రం అధికారి సూచనల మేరకు వాటిని వేలం వేసేందుకు నిర్ణయించారు. పాత పరికరాలు, యూనిట్లు పాడైపోతే తీసివేయడం సహజమే. వాటిని సకాలంలో వినియోగించుకున్నప్పుడే ప్రజలకు ఉపయోగకరంగా ఉంటాయని పలువురు భావిస్తున్నారు. – ఆకివీడు -
ద్వారకాతిరుమలలో ఆర్టీసీ బస్సుకు బ్రేక్లు విఫలం
ద్వారకాతిరుమల: ఆర్టీసీ బస్సు డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. బస్సు బ్రేకులు విఫలం కావడంతో రోడ్డు పక్కనున్న స్ట్రీట్ లైట్ స్తంభాన్ని, ఆ తరువాత షాపింగ్ కాంప్లెక్స్ భవనాన్ని ఢీకొట్టి నిలిచిపోయింది. ద్వారకాతిరుమల క్షేత్రంలో డీసీసీ బ్రాంచి ఎదురుగా షాపింగ్ కాంప్లెక్స్ వద్ద ఆదివారం సాయంత్రం జరిగిన ఈ ప్రమాదంలో ఒక వృద్ధురాలు తీవ్ర గాయాలుపాలు కాగా, డ్రైవర్ స్వల్పంగా గాయపడ్డాడు. స్థానికుల కథనం ప్రకారం. తణుకు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు క్షేత్రంలోని గుడి సెంటర్ నుంచి సుమారు 70 మంది యాత్రికులతో తణుకుకు బయల్దేరింది. ప్రారంభంలోనే బస్సు బ్రేక్లు విఫలమయ్యాయి. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ ఘటనా స్థలం వద్దకు వచ్చేసరికి బస్సును పక్కకు తిప్పాడు. దాంతో బస్సు దేవస్థానం స్ట్రీట్ లైట్ స్తంభాన్ని, ఆ తరువాత షాపింగ్ కాంప్లెక్స్ భవనాన్ని ఢీకొట్టి నిలిచిపోయింది. బస్సులో ఉన్న యాత్రికులు ఒక్కసారిగా భయాందోళనతో కేకలు పెట్టారు. ఈ ప్రమాదంలో అత్తిలి గ్రామానికి చెందిన వృద్ధురాలు ప్రభావతి తీవ్రంగా, డ్రైవర్ శ్రీనివాస్ స్వల్పంగా గాయపడ్డారు. అలాగే షాపింగ్ కాంప్లెక్స్ ఎలివేషన్ కొంత భాగం, బస్సు ముందు భాగాలు దెబ్బతిన్నాయి. ప్రభావతికి స్థానిక పీహెచ్సీ వైద్యుడు ప్రవీణ్కుమార్ ప్రథమ చికిత్స చేశారు. కాగా స్థానికులు, భక్తులతో రద్దీగా, పల్లంగా ఉన్న ఆ ప్రాంతంలో ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. యాత్రికులంతా వేరువేరు బస్సుల్లో స్వగ్రామాలకు తరలివెళ్లారు. స్ట్రీట్ లైట్ స్తంభాన్ని, షాపింగ్ కాంప్లెక్స్ భవనాన్ని ఢీకొట్టిన బస్సు వృద్ధురాలికి తీవ్ర, డ్రైవర్కు స్వల్ప గాయాలు డ్రైవర్ చాకచక్యంతో తప్పిన పెను ప్రమాదం -
ఎల్ఐసీ ఏజెంట్ల సంక్షేమానికి కృషి
ఏలూరు (టూటౌన్): భారత జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ)లో పనిచేస్తున్న ఏజెంట్ల సంక్షేమానికి కృషి చేయడంలో ఎల్ఐసీ ఏఓఐ సంఘం ఎప్పుడూ ముందుంటుందని ఆ సంఘ సౌత్ సెంట్రల్ జోనల్ (ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలు) ప్రధాన కార్యదర్శి పీఎల్ నరసింహారావు అన్నారు. ఆ సంఘ మహాసభ ఆదివారం ఏలూరులో పవర్ పేట ఉద్దరాజు రామం భవనంలో జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న నరసింహారావు మాట్లాడుతూ ఎల్ఐసీ ఏజెంట్ల కమీషన్లు తగ్గించటపై సంఘం ఉద్ధృతంగా పోరాడుతోందన్నారు. అనేక పోరాటాల ఫలితంగానే కొన్ని హక్కులను సాధించుకున్నామని తెలిపారు. ఈ కార్యక్రమానికి ఆహ్వాన సంఘం అధ్యక్షుడు తాళం సురేష్, స్టీరింగ్ కమిటీ చైర్మన్ కోడే రాంబాబు, మెంబర్ వైఎస్ కనకారావు, సీనియర్ బ్రాంచ్ మేనేజర్ ఎస్.శ్రీనివాసరావు, భీమడోలు బ్రాంచ్ మేనేజర్ ఎన్.భువన దీప, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి డీఎన్వీడీ ప్రసాద్, ఎల్ఐసీ ఏవోఐ రాష్ట్ర అధ్యక్షుడు టి.కోటేశ్వరరావు, జనరల్ సెక్రటరీ జి రవి కిషోర్ పాల్గొన్నారు. -
వానా కాలం.. వ్యాధుల కాలం
భీమవరం(ప్రకాశం చౌక్): వర్షాకాలం వచ్చిందంటే వ్యాధుల సోకే ప్రమాదం పొంచి ఉంటుంది. డ్రెయినేజీల పారుదల సక్రమంగా లేక రోజుల తరబడి మురుగు నీరు నిలిచిపోవడం, పారిశుద్ధ్యం మెరుగ్గా లేని ప్రాంతాల్లో దోమలు, సూక్ష్మక్రిములు వృద్ధి చెంది వ్యాధులకు కారకాలుగా మారతాయి. దీంతో జ్వరం, ఇతర అనారోగ్య సమస్యల బారిన పడే ప్రమాదముందని, తగు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా వైద్యా ఆరోగ్య శాఖ అధికారి జీ,గీతాభాయి సూచిస్తున్నారు. ప్రతి ఏడాది జ్వరాల వల్ల చనిపోతున్న వారి సంఖ్య పెరుగుతుందని ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని చెబుతున్నారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పాటించడంతోపాటు జ్వరం, ఇతర అనారోగ్య సమస్యలు వస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను ఆశ్రయించాలని అంటున్నారు. వర్షాకాలంలో వచ్చే వ్యాధులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఆమె వివరించారు. సాధారణ జ్వరం, జలుబు సీజన్ మార్పుతో పెరిగే సూక్ష్మక్రిముల వల్ల వైరల్ జ్వరాలు వ్యాప్తిచెందుతాయి. గాలి, నీటి ద్వారా మానవ శరీరంలోకి సూక్ష్మజీవులు ప్రవేశిస్తాయి. వైరస్ రకాన్ని బట్టి జ్వరం ఉంటుంది. జ్వరం మాత్రమే కాకుండా కొందరికి దగ్గు, కీళ్ల నొప్పులు ఉంటాయి. వైరల్ జ్వరం 3 నుంచి 7 రోజుల వరకు ఉంటుంది. చికెన్ గున్యా తీవ్రమైన జ్వరం, కీళ్ల నొప్పులు చికెన్ గున్యా లక్షణాలు. ఈ జ్వరం దోమ కాటు వల్ల వస్తుంది. చికెన్ గున్యా సోకితే మొదటి రెండు, మూడు రోజులు జ్వరం ఎక్కువగా ఉంటుంది. మలేరియా తీవ్రమైన తలనొప్పి, వణుకుతో కూడిన అధిక జ్వరం మలేరియా లక్షణం. జ్వరం తగ్గి మళ్లీ వస్తుంది. మలేరియా ఆడ అనాఫిలిస్ దోమ కాటుతో వ్యాప్తి చెందుతుంది. దోమ కాటు వల్ల దాని లోపల ఉన్న మలేరియా జెరమ్స్ శరీరం లోపలికి వెళ్తాయి. 14 రోజుల తర్వాత అధిక జ్వరం వస్తుంది. ఈ దోమలు నిల్వ ఉన్న వర్షపు నీటిలో వృద్ధి చెందుతాయి. డెంగీ ఈడిస్ ఈజిప్టు అనే దోమ కాటుతో డెంగీ వ్యాప్తి చెందుతుంది. ఈ దోమ పగటి పూట కుడుతుంది. దోమ కుట్టినప్పుడు ఒళ్లుంతా దద్దుర్లు కనిపిస్తాయి. వైరల్ జ్వరం మాదిరి అకస్మాత్తుగా జ్వరం వస్తుంది. తల నొప్పి, ఒళ్లు నొప్పులు, కీళ్ల నొప్పులతో ఎముకలు విరిగేటంత నొప్పి కలిగిస్తుంది. ఒక్కోసారి శరీరం లోపలి భాగాల్లో రక్తస్రావం జరుగుతుంది. దాని వల్ల కాళ్లు, చేతులు, ముఖం, వీపు భాగాల చర్మంపై ఎరగ్రా కందినట్లుగా చినచిన మొటిములు కనిపిస్తాయి. ఒక్కోసారి ప్లేట్లెట్స్ తగ్గిపోయి రోగి పరిస్థితి విషమంగా ఉంటుంది. హెపటైటిస్ ఎ వర్షాకాలంలో హెపటైటిస్ ఎ ( కామెర్లు) వ్యాధి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఇది కాలేయకణాల్లో సంక్రమణ వల్ల కలుగుతుంది. ఈ వ్యాధి సూక్ష్మక్రిములు కలుషితమైన ఆహార పదార్థాల నుంచి, తాగునీటి నుంచి శరీరంలోకి ప్రవేశిస్తాయి. కాలేయ వ్యాధి కారణంగా రక్తంలో బిలిరుబిన్ పరిమాణం పెరుగుతుంది. శరీర భాగాలు పసుపు రంగులో కనిపిస్తాయి. టైఫాయిడ్ వర్షాకాలంలో టైఫాయిడ్ కేసులు పెరిగే అవకాశం ఉంది. ఇది సాల్మొనెల్లా టైఫి బాక్టీరియా వల్ల వస్తుంది. మురుగునీరు తాగడం, కలుషితమైన ఆహారం తినడం వల్ల ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది. దోమల నివారణకు చర్యలు శూన్యం జిల్లాలోని పట్టణాల్లో గాని పల్లెల్లో గాని దోమల నివారణ చర్యలు అధికార యంత్రాంగం చేపట్టకపోవడంపై ప్రజలు మండిపడుతున్నారు. పట్టణాల్లో పారిశుద్ధ్యం అధ్వానంగా ఉంటుందని, పల్లెల్లో కచ్ఛా డ్రెయిన్లు తవ్వడం, డ్రెయినేజీల పూడిక పనులు నిర్వహించడం లేదని అంటున్నారు. దోమల నివారణకు ఫాంగింగ్ చేయడం లేదని, ఎక్కడా కనీసం బ్లీచింగ్ పౌడర్ జల్లడం కూడా చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి దోమల నివారణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. సీజనల్ వ్యాధుల పట్ల జాగ్రత్త వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. వ్యక్తిగత శుభ్రత, పరిసరాల పరిశుభ్రత పాటించడంతోపాటు కలుషిత ఆహారం, కలుషిత నీరు తాగకుండా ఉండడం ద్వారా వ్యాధులు సోకకుండా రక్షణ పోందవచ్చు. జ్వరం, ఇతర అనారోగ్య సమస్యలు వస్తే వెంటనే వైద్యులను ఆశ్రయించాలి. ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు, అన్ని రకాల మందులు అందుబాటులో ఉన్నాయి. – జీ,గీతాభాయి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి దోమల విజృంభణతో డెంగీ, మలేరియా సోకే ప్రమాదం పరిసరాల, వ్యక్తిగత శుభ్రతే ప్రధానమని వైద్యుల సూచనతీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇంటి పరిసర ప్రాంతాల్లో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలి. పెంటకుప్పులు, చెత్తాచెదారం ఇంటికి దూరంగా వేయాలి. ఇంటి పరిసరాల్లో కొబ్బరి బొండాలు, పాత టైర్లు, ఖాళీ డబ్బాల్లో నీరు నిల్వ ఉండకుండా చూడాలి. ఇంటిలో అన్ని గదుల్లో దోమలు రాకుండా చూసుకోవాలి. దోమ తెరలు వాడడం శ్రేయస్కరం. శరీరం మొత్తం కప్పేలా ఉన్న దుస్తులు ధరించాలి. వారంలో ఒక రోజు డ్రైడే పాటించాలి. నీళ్ల ట్యాంకులపై సరైన మూతలను అమర్చాలి. వర్షంలో తడవరాదు. తడిచిన బట్టలలో ఎక్కువ సేపు ఉండకూడదు. భోజనం చేసే ముందు తప్పనిసరిగా చేతులు శుభ్రం చేసుకోవాలి. కాచి చల్లార్చిన నీటిని తాగాలి. బయట ఆహారం తినకూడదు. నిల్వ పదార్థాలు తినరాదు. వేడి ఆహార పదార్థాలు తినడం మంచిది. తాజా పండ్లు, పండ్ల రసాలు, కొబ్బరి నీళ్లు తీసుకోవాలి. వ్యక్తిగత మరుగుదొడ్లు వినియోగించాలి. -
ఏలూరు శాయ్లో కీచకుడు.. క్రీడాకారిణులపై కోచ్ లైంగిక వేధింపులు
సాక్షి, ఏలూరు జిల్లా: ఏలూరు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(శాయ్)లో లైంగిక వేధింపుల ఘటన కలకలం రేపుతోంది. క్రీడాకారిణిల జీవితాలతో అథ్లెటిక్ కోచ్ వినాయక ప్రసాద్ ఆడుకుంటున్నారు. వెయిట్ లిఫ్టింగ్లో శిక్షణను అడ్డం పెట్టుకుని యువ క్రీడాకారిణిలతో అసభ్యంగా ప్రవర్తిసున్నాడు. ఏలూరు శాయ్లో వెయిట్ లిఫ్టింగ్లో శిక్షణ పొందుతున్న క్రీడాకారిణిలను కోచ్ నిత్యం లైంగికంగా వేధిస్తున్నాడు.ఏలూరు శాయ్లో వెయిట్ లిఫ్టింగ్లో మొత్తం 45 మంది అండర్ 15, 16, 17, 18 విభాగాల క్రీడాకారులు శిక్షణ పొందుతున్నారు. గత కొంత కాలంగా క్రీడాకారిణిలను వినాయక ప్రసాద్ వేధింపులకు గురిచేస్తున్నాడు. ఇటీవల స్పోర్ట్స్ అథారిటీ సెంటర్లో వెయిట్ లిఫ్టింగ్లో శిక్షణ పొందుతోన్న ఓ బాలిక పట్ల కోచ్ అసభ్యంగా ప్రవర్తించాడు. వార్షిక తనిఖీల్లో భాగంగా బెంగుళూరు నుంచి వచ్చిన స్పోర్ట్స్ అథారిటీ అధికారులకు ఆ బాలిక ఫిర్యాదు చేసింది.కోచ్ అకృత్యాలపై రహస్యంగా విచారణ జరిపిన బెంగుళూరు బృందం.. ఆరోపణలు నిజమని తేలడంతో ఏలూరు టూ టౌన్ పోలీసులకు అధికారులు ఫిర్యాదు చేశారు. కోచ్ వినాయక ప్రసాద్పై ఫోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. శాయ్లో లైంగిక వేధింపుల వ్యవహారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. -
మోకాలి లోతు నీటిలో వెళ్లాలి
మాది రాజమండ్రి ప్రస్తుతం కుక్కునూరు మండలంలో 4వ కేటగిరీ ప్రాంతమైన ఉప్పరమద్దిగట్లలో పని చేస్తున్నాను. అక్కడికి వెళ్ళడానికి 12 కిలోమీటర్లు వాహనాలు వెళ్లవు. పైగా రోజూ మోకాలి లోతు నీటిలో దిగి వెళ్ళాలి. వాగు పొంగితే ప్రాణాలు పణంగా పెట్టి వాగు దాటాల్సివస్తోంది. ఈ సారి కౌన్సిలింగ్లో మా సొంత మండలానికి బదిలీ చేయాలి. – కే.శ్రీలత ఎంటీఎస్ టీచర్ 200 కిలోమీటర్లు ప్రయాణించాలి మాది భీమవరం. కుక్కునూరు మండలం పెదరావిగూడెంలో రెండేళ్లుగా పని చేస్తున్నాను. మా ఊరి నుంచి పాఠశాలకు వెళ్ళాలంటే 200 కిలోమీటర్లు ప్రయాణించాలి. నాకు ఆరోగ్యం సరిలేదు. అక్కడి వాతావరణం పడడంలేదు. చాలా అనారోగ్యానికి గురయ్యాను. ఈ సారి కౌన్సెలింగ్లో స్పౌజ్ సరౌండింగ్ ఏరియాకు బదిలీ చేయాలి. – వై.మెర్సీ, ఎంటీఎస్ టీచర్ అత్తమామల బాధ్యత నాపైనే నేను కుక్కునూరు మండలం వెంకటాపురం ఎస్సీ కాలనీలో సింగిల్ టీచర్ హెచ్ఎంగా విధులు నిర్వహిస్తున్నాను. మా స్వగ్రామం నుంచి అక్కడికి 200 కిలోమీటర్లు ప్రయాణించాలి. అనారోగ్యంతో ఉన్న అత్తమామల బాధ్యత నాపైనే ఉంది. పని భారం ఎక్కువ, జీతం తక్కువ. 4వ కేటగిరీ ఏరియాలో విధులు నిర్వహించడం భారంగా ఉంటోంది. – ఎం.భాగ్యలక్ష్మి, ఎంటీఎస్ టీచర్ సహకరించని ఆరోగ్యం మాది తాళ్ళపూడి మండలం. ప్రస్తుతం 140 కిలోమీటర్ల దూరంలోని ఎర్రబోరు పాఠశాలలో పని చేస్తున్నారు. నాకు 58 ఏళ్ల వయసు. మరో రెండేళ్లలో పదవీ విరమణ చేస్తాను. వయోభారంతో ఆరోగ్యం సహకరించడం లేదు. నేను పని చేస్తున్న ప్రాంతానికి బస్సు సౌకర్యం కూడా లేదు. కనీస వైద్య సదుపాయం కూడా లేని ప్రాంతం. – బట్టు సత్తెమ్మ, ఎంటీఎస్ టీచర్ ● -
ఏలూరు శాయ్లో లైంగిక వేధింపులు
ఏలూరు టౌన్: ఏలూరులోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(శాయ్)లో మహిళా క్రీడాకారిణులపై లైంగిక వేధింపుల ఆరోపణలు సంచలనంగా మారింది. తమను తీర్చిదిద్దాల్సిన గురువులే కీచకులుగా మారితే... తమ కష్టాలు ఎవరికి చెప్పుకోవాలంటూ వారంతా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేధింపులు భరించలేక స్పోర్ట్స్ అఽథారిటీ ఆఫ్ ఇండియాకు మహిళా క్రీడాకారిణులు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన అధికారులు లైంగిక వేధింపులు నిజమేనని నిర్ధారించారు. అల్లూరి సీతారామరాజు స్టేడియం పక్కనే ఏర్పాటు చేసిన శాయ్ కేంద్రంలో మహిళా క్రీడాకారిణులపై లైంగిక వేధింపులు ఎక్కువ అవడంతో వారంతా కేంద్ర కార్యాలయానికి ఫిర్యాదు చేశారు. ఏకంగా 10 మంది మహిళా క్రీడాకారిణులు శాయ్ నిర్వాహకులు, వెయింట్ లిఫ్టింగ్ కోచ్పై ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. శాయ్ ఇన్చార్జ్తో పాటు వెయిట్ లిఫ్టింగ్ జూనియర్ కోచ్ వారి పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ వేధింపులకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. శాయ్లో అథ్లెటిక్స్లో బాలురు, బాలికలు తర్ఫీదు పొందుతూ ఉండగా, వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో బాలికలు అధికంగా ఉన్నారు. బాలికలకు శాయ్ హాస్టల్లోనే వసతి సౌకర్యాలు కల్పిస్తారని సమాచారం. బాలురకు అల్లూరి సీతారామరాజు స్టేడియంలోని గదుల్లో వసతి కల్పిస్తారు. ఈ నేపథ్యంలో బాలికలను లైంగిక వేధింపులకు గురిచేయటంపై వారంతా శాయ్ కేంద్ర కార్యాలయాన్ని ఆశ్రయించారు. బెంగుళూరు బృందం విచారణ క్రీడాకారిణుల ఫిర్యాదుపై కేంద్రం శాయ్లోని ఇద్దరు సభ్యుల బృందం గత కొద్దిరోజులుగా రహస్య విచారణ చేపట్టి ఆరోపణలు వాస్తవమేని నిర్ధారించినట్లు తెలుస్తోంది. దీంతో విచారణ అధికారులు టూటౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును స్వీకరించి దానిపై ప్రాథమిక దర్యాప్తు చేపడుతున్నట్లు టూటౌన్ సీఐ అశోక్కుమార్ స్పష్టం చేశారు. శాయ్ ఇన్చార్జ్, వెయిట్ లిఫ్టింగ్ జూనియర్ కోచ్పై కేసు నమోదు విషయంలో రాజకీయ ఒత్తిడులు ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. బెంగుళూరు శాయ్ బృందం దర్యాప్తులో వెల్లడి 10 మంది మహిళా క్రీడాకారిణుల ఫిర్యాదు -
చిన్న వెంకన్న క్షేత్రంలో భక్తుల రద్దీ
ద్వారకాతిరుమల: శ్రీవారి ఆలయం శనివారం భక్తులతో పోటెత్తింది. స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో వేలాది మంది భక్తులు స్వామి వారినికి దర్శించకున్నారు. పెద్ద సంఖ్యలో వచ్చిన భక్తులతో క్షేత్ర పరిసరాలు భక్తులతో కళకళలాడాయి. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. అలాగే ఆలయ తూర్పురాజగోపుర ప్రాంతం, అనివెట్టి మండపం, దర్శనం క్యూలైన్లు, ప్రసాదం, టికెట్ కౌంటర్లు, కల్యాణకట్ట, నిత్యాన్నదాన విభాగాలు భక్తులతో పోటెత్తాయి. అలాగే ఆలయ అనివేటి మండపంలో పలు భజన మండలి సభ్యులు ప్రదర్శించిన కోలాట నృత్యాలు భక్తులను ఆకట్టుకున్నాయి. సాయంత్రం వరకు క్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగింది. -
తమ్మిలేరులో యువకుడి గల్లంతు
చింతలపూడి: చేపల వేటకు వెళ్లిన యువకుడు గల్లంతైన సంఘటన చింతలపూడి మండలం నాగిరెడ్డిగూడెం సమీపంలోని తమ్మిలేరు జలాశయంలో శనివారం చోటు చేసుకుంది. స్థానికుల తెలిపిన వివరాల ప్రకారం చింతలపూడి నగర పంచాయతీ ఛార్లెస్నగర్కు చెందిన గడ్డం శాంతకుమార్(29) స్నేహితులతో కలిసి నాగిరెడ్డిగూడెం సమీపంలోని తమ్మిలేరు ప్రాజెక్టుకు చేపల వేటకు వెళ్లాడు. చేపలు పట్టడానికి జలాశయం లోనికి దిగిన శాంతకుమార్ ప్రమాదవశాత్తూ జలాశయంలో మునిగిపోయాడు. మిగిలిన స్నేహితులు ఇద్దరు క్షేమంగా బయటపడ్డారు. అక్కడే ఉన్న మత్స్యకారులు, గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించి గాలింపు చర్యలు చేపట్టారు. అగ్నిమాపక శాఖ సిబ్బంది కూడా ప్రాజెక్టు వద్దకు చేరుకుని మృతదేహం కోసం గాలిస్తున్నారు. స్థానిక ఎస్సై కె.సతీష్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు ప్రాజెక్టు వద్దకు చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. టీటీడీకి 12 టన్నుల కూరగాయల వితరణ నూజివీడు: తిరుమల తిరుపతి దేవస్థానం అన్నదాన ప్రసాదం ట్రస్టుకు నూజివీడు నుంచి శనివారం 12 టన్నుల కూరగాయలను భక్తులు పంపారు. మండలంలోని దేవరగుంటకు చెందిన నక్కా సత్యనారాయణ ఆధ్వర్యంలో వేంకటేశ్వరస్వామి భక్తులు కూరగాయలను సేకరించి టీటీడీ ప్రత్యేక వాహనంలో తిరుమలకు పంపించారు. అలాగే ద్వారకాతిరుమల ఆలయంలో అన్నదానం నిమిత్తం నాలుగు టన్నుల కూరగాయలను పంపారు. చిత్రలేఖనంలో విద్యార్థుల ప్రతిభ యలమంచిలి: మేడపాడు హైస్కూల్ విద్యార్థులు యోగాంధ్ర చిత్రలేఖనం పోటీల్లో జిల్లా స్థాయిలో విజేతలుగా నిలిచినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎంవీ సత్యనారాయణ తెలిపారు. శనివారం యనా విలేకరులతో మాట్లాడుతూ ఇటీవల భీమవరంలో జరిగిన పోటీల్లో మేడపాడు హైస్కూల్ విద్యార్థులు డి.కోటేశ్వరి ప్రథమ, ఎ.శివార్షిణి ద్వితీయ స్థానం సాధించినట్లు ఆయన వివరించారు. వారిద్దరికీ కలెక్టర్ నాగరాణి, డీఈఓ బహుమతులు అందజేశారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా శనివారం పాఠశాలలో విద్యార్థులను, వారికి శిక్షణ ఇచ్చిన పాఠశాల చిత్రలేఖన ఉపాధ్యాయుడు అడ్డాల శివరామకృష్ణంరాజును అభినందించారు. -
ఎంటీఎస్ టీచర్ల ఆక్రందన
ఏలూరు (ఆర్ఆర్పేట): గత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 1998 డీఎస్సీ, 2008 డీఎస్సీ అర్హులకు ఉపాధ్యాయులుగా మినిమం టైం స్కేల్ ప్రాతిపదికన ఉద్యోగాలు కల్పించి ఆదుకుంది. జగన్ తీసుకున్న కీలక నిర్ణయంతో డీఎస్సీల్లో అర్హులైన మొత్తం 390 మందికి ఉపాధ్యాయ ఉద్యోగాలు వచ్చాయి. కలగా మిగిలిపోతుందనుకున్న ఉద్యోగం రావడంతో వారు వివిధ పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్నారు. అనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో పని సర్దుబాటు ప్రక్రియలో ఎంటీఎస్ టీచర్లను బదిలీ చేశారు. ఈ బదిలీల్లో వీరిని సొంత మండలాల పరిధిలోనే చేయాల్సి ఉండగా సుమారు 140 నుంచి 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాఠశాలలకు మార్చారు. వీరిలో కొంతమందికి ఏడాది, మరికొంత మంది రెండేళ్లలో పదవీ విరమణ చేయనున్నారు. 2008 డీఎస్సీ అర్హుల్లో సైతం కొంతమంది మరో 5 ఏళ్ల నుంచి 10 ఏళ్లలోపులో పదవీ విరమణ చేయాల్సి ఉంది. పని సర్దుబాటు ప్రక్రియలో వీరిని చాలా దూరానికి బదిలీ చేయడంతో ఒక పక్క పిల్లల చదువులు, మరో పక్క వృద్ధులైన తల్లిదండ్రుల బాధ్యత నెరవేర్చలేక మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. 2008 డీఎస్సీ అభ్యర్థులకు ప్రాధాన్యం ఆయా బాధ్యతలు నెరవేర్చలేక మానసికంగా కుంగిపోతున్న వారికి అన్నిటికీ మించి దీర్ఘకాలిక అనారోగ్యాలు వెంటాడుతున్నాయని వాపోతున్నారు. దీంతో పాటు తమకు అలవాటులేని వాతావరణంలో పని చేయాల్సి రావడంతో అనారోగ్యం పాలవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది కూటమి ప్రభుత్వం ఉపాధ్యాయుల బదిలీలు చేపట్టింది. వాస్తవానికి ఈ నెల 20న ఎంటీఎస్ టీచర్ల బదిలీ జరగాల్సి ఉండగా సాంకేతిక కారణాలతో బదిలీలు వాయిదా వేశారు. కౌన్సిలింగ్ ఆదివారం చేపట్టనున్నట్టు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా విద్యాశాఖాధికారి ఎం.వెంకట లక్ష్మమ్మ ప్రకటించారు. ఈ బదిలీల్లో ముందుగా వృత్తిలో చేరిన 2008 డీఎస్సీ అర్హులను సీనియారిటీ జాబితాలో పైకి చేర్చి అనంతరం వృత్తిలో చేరిన 1998 డీఎస్సీ అర్హులను తరువాత వరుస క్రమంలో చేర్చారు. ఈ కారణంగా ఈ సారి బదిలీల్లో కూడా తమకు అన్యాయం జరుగుతుందని 1998 అర్హులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమను కనికరించాలని వేడుకోలు మరో ఏడాది, రెండేళ్లలో పదవీ విరమణ చేసే తమను మళ్లీ 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాఠశాలలకు బదిలీలు చేస్తే తమకు తీవ్ర అన్యాయం చేసినట్టేనని 1998 డీఎస్సీ అర్హులు వాపోతున్నారు. ఈ బదిలీల్లో సీనియారిటీ కంటే వయసు సీనియారిటీని ప్రాతిపదికగా తీసుకుని వయసు రీత్యా 60 ఏళ్లకు దగ్గరలో ఉన్న తమకు బదిలీల్లో సీనియారిటీ జాబితాలో ప్రాధాన్యత కల్పించి కోరుకున్న ప్రాంతాల్లో పని చేసేలా చూడాలంటున్నారు. 2008 డీఎస్సీ అభ్యర్థులు తమ కంటే చిన్న వారు కాబట్టి పదవీ విరమణ వయస్సుకు దగ్గరగా ఉన్న తమకు సీనియారిటీ జాబితాలో ప్రాధాన్యం ఇవ్వాలని కోరుతున్నారు. సొంత ఊళ్లకు 200 కిలోమీటర్ల దూరంలో ఉద్యోగం ఈ సారి దగ్గర మండలాలకు బదిలీ చేయాలని వేడుకోలు -
వేతన బకాయిలు చెల్లించాలని ధర్నా
తణుకు అర్బన్: స్థానిక జిల్లా కేంద్ర ఆస్పత్రిలో పని చేస్తున్న కాంట్రాక్టు పారిశుద్ధ్య కార్మికుల నాలుగు నెలల వేతన బకాయిలు, 36 నెలల పీఎఫ్ బకాయిలు తక్షణమే చెల్లించాలని ఏపీ మెడికల్ కాంటాక్టు ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ తణుకు శాఖ అధ్యక్షుడు, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు కోనాల భీమారావు డిమాండ్ చేశారు. శనివారం యూనియన్ ఆధ్వర్యంలో ఆస్పత్రి ఆవరణలో ధర్నా నిర్వహించి డిమాండ్స్తో కూడిన వినతిపత్రాన్ని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వెలగల అరుణకు అందజేశారు. ఈ సందర్బంగా భీమారావు మాట్లాడుతూ హాస్పిటల్ పారిశుద్ధ్య కార్మికలకు ఇస్తున్న వేతనాలే తక్కువని వాటిని కూడా నెలా నెలా సక్రమంగా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జీతాలు సక్రమంగా రాకపోవడంతో కార్మికులు పస్తులతో విధులు నిర్వహిస్తున్నారన్నారు. అలాగే తణుకు జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రి 150 పడకల స్థాయికి అనుగుణంగా కనీసం 60 మందికి తగ్గకుండా పారిశుద్ధ్య కార్మికులను నియమించి కార్మికుల పనిభారాన్ని తప్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ధర్మాని పుష్పలత, డి.ప్రసన్న కుమారి, మెండి శ్రీను, పి.లక్ష్మి, పి.రేణుక, ఎం.బేబి, ఇ.హైమావతి తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెంలో.. జంగారెడ్డిగూడెం: స్థానిక ఏరియా హాస్పిటల్ శానిటరీ వర్కర్స్ సమస్యలు పరిష్కరించాలని, పెండింగ్ వేతనాలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఏపీ మెడికల్ కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఏడో రోజు ఆస్పత్రి ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా గౌరవాద్యక్షుడు జంపన వెంకటరమణ రాజు, ఏఐటీయూసీ మండల కార్యదర్శి కుంచె వసంతరావు మాట్లా డుతూ ఏరియా హాస్పిటల్ సానిటరీ వర్కర్స్కి గత మూడు నెలలుగా వేతనాలు ఇవ్వలేదని మండిపడ్డారు. పెండింగ్ వేతనాలతో చెల్లించడంతో పాటు ఇతర సమస్యలు పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు వేముల రాజు, సంజీవ్, మేరీ, చంద్రకళ, దయామని, జె.దుర్గారావు, పి.శ్రీను తదితరులు పాల్గొన్నారు. -
మార్టేరు పరిశోధన స్థానంలో పదోన్నతులు
పెనుమంట్ర: మార్టేరు ప్రాంతీయ పరిశోధన స్థానంలో వివిధ విభాగాల్లో శాస్త్రవేత్తలుగా పనిచేస్తున్న ఎనిమిది మంది శాస్త్రవేత్తలకు ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్గా పదోన్నతులు లభించాయి. ఈ సందర్భంగా పరిశోధన స్థానంలో శుక్రవారం సాయంత్రం జరిగిన ఆత్మీయ సమావేశంలో బంగారు పతకం అందుకున్న డాక్టర్ టి.శ్రీనివాస్ తో పాటు డాక్టర్ బి.సహదేవరెడ్డి ( పంటల యాజమాన్య విభాగం), డాక్టర్ ఎస్.దయాకర్, డాక్టర్ పి.రాధిక (కీటక శాస్త్ర విభాగం) సీనియర్ ప్రొఫెసర్లుగా పదోన్నతి పొందగా.. డాక్టర్ ఎం.గిరిజా రాణి, డాక్టర్ వై సునీత(మొక్కల ప్రజనన విభాగం) ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్గా పదోన్నతి పొందారు. డాక్టర్ పీవీ రమేష్ బాబు(పంటల యాజమాన్య విభాగం). డాక్టర్ వీ రోజా (మొక్కల ప్రజనన విభాగం) అసిస్టెంట్ ప్రొఫెసర్గా పదోన్నతి పొందారు. -
ఆక్వాకు వాతావరణ గండం
గణపవరం : పూటకో రకంగా మారుతున్న వాతావరణం ఆక్వా సాగుకు గుదిబండలా తయారైంది. ఈ వాతావరణం రొయ్య సాగుకు పూర్తి ప్రతికూలం కావడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఇటీవల దారుణంగా పడిపోయిన రొయ్యల ధరలు కొద్దిగా పెరిగి ఆక్వా సాగు కుదుట పడుతున్న సమయంలో గత రెండు వారాలుగా మళ్లీ రొయ్య ధర తగ్గిపోయి రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ పరిస్థితిలో గత పది రోజులుగా నిలకడలేని వాతావరణం రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. పగలు ఉక్కబోత, విపరీతమైన ఎండలు ఓ పక్క, సాయంత్రానికి మబ్బులు కమ్మి, వర్షపు జల్లులు మరో పక్క ఆక్వా సాగును కుదేలు చేస్తున్నాయి. ఈ సమస్యలకు తోడు ఎడాపెడా విధిస్తున్న విద్యుత్ కోతలు ఆక్వా రైతులను ముప్పు తిప్పలు పెడుతున్నాయి. విద్యుత్ కోతల కారణంగా ఏరియేటర్లు తిరగడానికి ఆయిల్ ఇంజిన్లు సిద్ధం చేసుకుంటున్నారు. ఆయిల్ ఇంజిన్ల వినియోగానికి రోజూ వేల రూపాయల డీజిల్ కొనాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మే నెలలో వర్షాలతో చల్లబడిపోగా, జూన్ విపరీతమైన ఎండలు, అధిక ఉష్ణోగ్రతలతో మొదలైంది. ఉక్కబోత కారణంగా రొయ్యల చెరువుల్లో డీవో సమస్య ఏర్పడి సరిపడా ఆక్సిజన్ అందక నీటి ఉపరితలంపై తేలియాడుతున్నాయి. ఈ సమస్య మరీ తీవ్రమైతే రొయ్యలు చనిపోతున్నాయి. దీంతో రైతులు ఆఘమేఘాల మీద రొయ్యల పట్టుబడి చేసి, నష్టాల పాలవుతున్నారు. ఉమ్మడి జిల్లాలో సుమారు 2.50 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగు చేస్తుండగా 50 శాతం చెరువుల్లో అంటే 1.25 లక్షల ఎకరాల్లో రొయ్య సాగు చేస్తున్నారు. ఉంగుటూరు నియోజకవర్గంలో వాతావరణం ప్రతికూలంగా మారడంతో జూన్లో దాదాపు నాలుగు వేల ఎకరాల్లో రొయ్యలు అర్ధాంతరంగా పట్టుబడి చేసినట్లు అంచనా. ప్రతికూల వాతావరణాన్ని తట్టుకోవాలంటే.. రొయ్య సీడ్ నాణ్యత కలిగి ఉండాలి. నీటి పీహెచ్ స్థాయి సరైన మోతాదులో ఉండాలి. నిరంతరం ఆక్సిజన్ స్థాయిని సరి చూసుకుంటూ ఉండాలి. నీటి క్షార స్వభావం, నీటి కాఠిన్యం సరైన స్థాయిలో ఉండేలా చూడాలి. చెరువులో ప్రమాదకరమైన విష వాయువులు అమ్మోనియా నైట్రేట్, హైడ్రోజన్ సల్ఫైడ్ వంటివి తయారవకుండా చర్యలు తీసుకోవాలి. చెరువుల్లో రొయ్య పిల్ల సాంద్రతను బట్టి పాక్షిక పట్టుబడి చేసుకుంటే మిగిలిన రొయ్యలు ఒత్తిడికి గురి కాకుండా స్వేచ్చగా పెరగడానికి అవకాశం ఉంటుంది. మత్స్యశాఖ అధికారుల సూచనలు చెరువుల్లో ఉష్ణోగ్రతలు తగ్గకుండా నిరంతరం ఏరియేటర్లు తిప్పుతూ నీటిని రీ సైక్లింగ్ చేయాలి. ఆక్సిజన్ లోపం నివారణకు పొటాషియం పర్మాంగనేట్ సిద్ధంగా ఉంచుకుని, అవసరం మేరకు చెరువుల్లో చల్లుతుండాలి. ఆక్సిజన్ సరిపడా అందకపోవడంతో చేపలు, రొయ్యలు మేతలు సరిగా తినని కారణంగా పరిమితంగా మేతలు వేస్తుండాలి. ఆక్సిజన్ సమస్య ఉన్న సమయంలో చెరువుల్లో మేత, సేంద్రియ ఎరువులను వేయడం పూర్తిగా మానేయాలి. చెరువుల్లో మినరల్స్ ఎక్కువగా వినియోగించకూడదు. నీటి పరీక్షలు చేయించి చెరువులలో అమ్మోనియా స్థాయిని నిర్ధారించుకోవాలి. పగలంతా ఎండ, సాయంత్రం భారీ వర్షాలతో అనర్థం విద్యుత్ కోతలతో ఆయిల్ ఇంజిన్లు వాడుతున్న రైతులు -
యోగాసనం.. ఆరోగ్య రహస్యం
కై కలూరు/పాలకొల్లు సెంట్రల్: శారీరక దృఢత్వానికి, మానసిక ప్రశాంతతకు యోగా ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా మార్మోగిపోతోంది. భారతదేశంలో వేల ఏళ్ల నుంచి యోగాకు ప్రాచుర్యం ఉంది. 2014 డిసెంబరు 11న జరిగిన ఐక్యరాజ్య సమితి 69వ జనరల్ అసెంబ్లీలో అంతర్జాతీయ యోగా దినోత్సవంగా తీర్మానించారు. ఏటా జూన్ 21 నుంచి అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈ ఏడాది శ్రీయోగా ఒక భూమి, ఒక ఆరోగ్యంశ్రీ అనే నినాదంతో ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుంటున్నారు. యోగా ప్రపంచానికి ఆదర్శంగా నిలిచింది. ఇది మనసును నియంత్రించడంతో పాటు మెదడును ఉత్తేజ పరుస్తోంది. పూర్వకాలంలో చరక, సుశ్రుత, ధన్వంతరి, పతంజలి, కపిలుడు వంటి రుషుల నుంచి, ఆధునిక యుగంలో రమణ మహర్షి, అరవింద యోగి, రామకృష్ణ పరమహంస, శివానంద, యోగానంద, బాబా రామ్దేవ్, ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవిశంకర్ వంటి ఎందరో యోగా విశిష్టతను చాటి చెప్పారు. ఈ ఏడాది ప్రత్యేకంగా 10 కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. యోగా పేరుతో సంగం, బంధన్, పార్క్, సమావేశ్, ప్రభావ, కనెక్ట్, హరిత్, అన్ప్లగ్డ్, మహాకుంభ్, సంయోగ పేరుతో వీటిని రూపొందించారు. ప్రధానంగా మహాసంగం పేరుతో 1,00,000 ప్రాంతాల్లో యోగా ప్రదర్శనలు ఇస్తున్నారు. అష్టాంగ మార్గం.. అనుసరణీయం యోగాలో యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహారం, ధారణ, ధ్యానం, సమాధి అని 8 అంశాలు ఉంటాయి. నేటి సమాజంలో సూర్య నమస్కార ఆసనాలు ప్రాధాన్యత పొందాయి. వీటిలో ప్రణమాసనం, హస్త ఉత్థానాసనం, పాద హస్తాసనం, ఆశ్వ సంచాలనాసనం, పర్వతాసనం, భుజంగాసనం, సాష్టాంగాసనం ముఖ్యమైనవి. ఇక స్థూలకాయ నివారణకు త్రికోణ, హలన శలభ, నిద్రలేమికి హలాసనం, శీర్షాసనం, శీతలి, ప్రాణాయామం, మలబద్దకానికి తాడ, చక్ర, మయూర, మత్య్సాసనాలు, నెలసరి ఇబ్బందులకు హల, గోముఖ, భద్ర, చంద్ర నమస్కారాలు వంటి ఉపయోగపడుతున్నాయి. నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు యోగాతో లాభాలు ధ్యాన సాధన క్రమంగా చేస్తే ఏకాగ్రత పెరుగుతుంది. చదువు, ఉద్యోగ జీవితంలో మెరుగైన ఫలితాలు సాధించవచ్చు. దృష్టి ఏకాగ్రత పెరుగుతుంది. మానసిక ప్రశాంత కలుగుతోంది. ఆందోళన, అలసట వంటి సమస్యలు తగ్గుతాయి. ప్రాణాయామం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. దీర్ఘకాలిక రోగాల నుంచి ఉపశమనం కలుగుతోంది. యోగాసనాలకు 45 నిమిషాల నుంచి గంటన్నర సమయం కేటాయించాలి. -
ఎఫెక్ట్
తల్లికి వందనంపై స్పందించిన అధికారులు కామవరపుకోట: కరెంట్ బిల్లు సాకుతో ‘తల్లికి వందనం ఎగనామం’ పేరిట సాక్షి దినపత్రికలో గురువారం ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. స్థానిక కొత్తూరు యానాదుల కాలనీకి చెందిన చౌటూరి కోటమ్మ ఇద్దరు పిల్లలు తల్లికి వందనం పథకానికి అర్హులయినప్పటికీ ఆమెకు 300 యూనిట్లకు పైగా విద్యుత్ బిల్లు వచ్చినట్లు చూపించి అనర్హులుగా చూపించారు. దీంతో సాక్షిలో ప్రచురితమైన కథనానికి కెఆర్పురం ఐటీడీఏ అధికారులు స్పందిస్తూ చౌటూరి కోటమ్మను అర్హురాలుగా ప్రకటించారు. కూతురే కొడుకై .. జంగారెడ్డిగూడెం: కూతురే కొడుకై తండ్రికి అంత్యక్రియలు నిర్వహించింది. ఈ ఘటన జంగారెడ్డిగూడెం పట్టణం బాటగంగానమ్మ లేఅవుట్ కాలనీలో జరిగింది. ఆదిమూలపు వెంకటేశ్వరరావు (55) అనారోగ్యంతో శుక్రవారం మృతిచెందాడు. వెంకటేశ్వరరావుకు కొడుకులు లేరు. దీంతో కుమార్తె ముప్పన జ్యోతి అంత్యక్రియలు నిర్వహించింది. ఈ దృశ్యం చూపరులను కంటతడి పెట్టించింది. -
నాటుసారాపై దాడులు
ఏలూరు టౌన్: నాటుసారా తయారీ, రవాణా, విక్రయాలపై కఠిన చర్యలు చేపడతామని ఎకై ్సజ్ అసిస్టెంట్ కమిషనర్ కేవీఎన్ నాగప్రభుకుమార్ హెచ్చరించారు. అసిస్టెంట్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్ సీహెచ్ అజయ్కుమార్ సింగ్ ఆధ్వర్యంలో ఎన్ఫోర్స్మెంట్ సీఐ భోగేశ్వరరావు, తన సిబ్బందితో నాటుసారా తయారీపై దాడులు చేశారు. శుక్రవారం లింగపాలెం మండలం మఠంగూడెం పరిధిలో నాటుసారా తరలిస్తున్నారనే సమాచారంతో దాడి చేసి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 40 లీటర్ల నాటుసారా, రవాణాకు వినియోగించిన కారును సీజ్ చేశారు. తలార్లపల్లి గ్రామానికి చెందిన దేశవతు వేణు నాటుసారా తయారు చేస్తూ చుట్టుపక్కల గ్రామాలకు సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. మఠంగూడెం గ్రామానికి చెందిన జెర్రిపోతుల మారేశు, తొచలక రాయుడుపాలెం గ్రామానికి చెందిన పెనమలూరి చంటమ్మను ఎకై ్సజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. వేణు సమాచారం మేరకు అతని ఇంటి సమీపంలో, పొలంలో తనిఖీలు చేయగా 200 లీటర్ల పులిసిన బెల్లపు ఊటను స్వాధీనం చేసుకున్నామని ఎకై ్సజ్ సీఐ భోగేశ్వరరావు తెలిపారు. ప్రగడవరం అడ్డరోడ్డులో కిరాణాషాపు నిర్వహిస్తున్న అద్దంకి విశ్వేశ్వరరావు బెల్లం విక్రయించినట్లు అంగీకరించటంతో 5 కిలోల బెల్లం స్వాధీనం చేసుకుని, అతనిపైనా కేసు నమోదు చేసి అరెస్ట్ చేశామన్నారు. -
112 బస్సులపై కేసులు
ఏలూరు (ఆర్ఆర్పేట): రవాణా కమిషనరు ఆదేశాల మేరకు గురువారం రాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజాము వరకు కలపర్రు టోల్గేట్ వద్ద తనిఖీలు నిర్వహించి.. 112 కాంట్రాక్టు క్యారేజ్ బస్సులు, వాణిజ్య, వాణిజ్యేతర వాహనాలపై కేసులు నమోదు చేసి రూ.3.67 లక్షల అపరాధ రుసుం విధించినట్లు ఇన్చార్జ్ ఉప రవాణా కమిషనరు కేఎస్ఎంవీ కృష్ణారావు తెలిపారు. విశాఖపట్నం నుంచి విజయవాడ, విజయవాడ నుంచి విశాఖపట్నం మధ్య తిరిగే కాంట్రాక్టు బస్సులను తనిఖీ నిర్వహించి పర్మిట్ నిబంధనలను ఉల్లంఘించిన బస్సులపై కేసులు నమోదు చేశామన్నారు. వాణిజ్య వాహనాలపై పన్ను చెల్లించకుండా, పర్మిట్, ఫిట్నెస్, డ్రైవింగ్ లైసెనన్స్ వంటి లేకుండా నడుపుతున్న వారిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ప్రత్యేక తనిఖీల్లో జంగారెడ్డిగూడెం ఇన్చార్జ్ ఆర్టీవో ఎస్.రంగనాయకులు, వాహన తనిఖీ అధికారులు జీ ప్రసాదరావు, జీ స్వామి, వై సురేష్ బాబు, కళ్యాణి, కృష్ణవేణి, అన్నపూర్ణ, డీ ప్రజ్ఞ పాల్గొన్నారు. -
కాలినడక భక్తులకు సౌకర్యాల కల్పన
ద్వారకాతిరుమల : ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల శ్రీవారి క్షేత్రంలో కాలినడక భక్తులకు దేవస్థానం పెద్దపీట వేసింది. వృద్ధ, దివ్యాంగ భక్తుల సౌకర్యార్థం కొండపైన డార్మెటరీలో సుమారు 50 మంచాలను ఏర్పాటు చేసింది. చిన వెంకన్న దివ్య క్షేత్రానికి ప్రతి శుక్రవారం వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు కాలినడకన వస్తున్నారు. వారంతా శనివారం ఉదయం స్వామి, అమ్మవార్లను దర్శిస్తున్నారు. కాలినడక భక్తులకు సౌకర్యాలు కల్పించాలని నిర్ణయించిన దేవస్థానం డార్మిటరీల ద్వారా వసతి సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఈ క్రమంలోనే వృద్ధ, దివ్యాంగ భక్తులకు డార్మెటరీలో మంచాలు ఏర్పాటు చేసింది. ఒక్కో భక్తుడి నుంచి రూ.20 నామమాత్రపు రుసుం వసూలు చేస్తోంది. వస్తువులను భద్రపరచుకునేందుకు లాకర్ సదుపాయం కల్పించారు. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
యలమంచిలి: పాలకొల్లు యడ్లబజారు సెంటర్లోని ఫైర్స్టేషన్ వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో యలమంచిలి మండలం కాజ పడమర గ్రామానికి చెందిన సత్తినీడి వీరన్న(69) మరణించారు. ఆయన కాజ పడమర నుంచి తన బైక్పై పాలకొల్లు వెళ్తుండగా యడ్లబజారు సెంటర్లో ఫైర్ స్టేషన్ వద్దకు వచ్చాక వెనుకగా లారీ బైక్ను బలంగా ఢీ కొట్టింది. ప్రమాదంలో అతని బైక్ లారీ ముందు భాగంలోకి దూసుకుపోయింది. లారీ బైక్తోపాటు వీరన్నను కొద్ది దూరం ఈడ్చుకుపోయింది. దీంతో ఆయన ప్రమాద స్థలంలోనే మరణించారు. స్థానికులు 108 వాహనానికి ఫోన్ చేయడంతో వాహన సిబ్బంది వచ్చి వీరన్నను పరీక్షించి చనిపోయినట్లు ధ్రువీకరించారు. మృతుడి కుమార్తె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాలకొల్లు పట్టణ ఏఎస్సై శలా మార్లింగం కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పాలకొల్లు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
నేడు భీమవరానికి బొత్స రాక
భీమవరం: భీమవరంలో శనివారం నిర్వహించనున్న వైఎస్సార్సీపీ నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశానికి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. పట్టణంలోని కుముదవల్లి రోడ్డులోని నర్సయ్య అగ్రహారం వద్ద గల ఏఎస్ రాజు కల్యాణ మండపంలో ఉద యం 10 గంటలకు ప్రారంభం కానున్న సమావేశానికి పార్టీ రీజనల్ కో–ఆర్డినేటర్ బొత్స సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. గత కొన్ని నెలలుగా పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త లేకపోవడం, ఇటీవల భీమవరం మండలం రాయ లం గ్రామానికి చెందిన పార్టీ సీనియర్ నాయకుడు చినమిల్లి వెంకట్రాయుడును సమన్వయకర్తగా నియమించడంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలేస్తోంది. ఈ క్రమంలో జరిగే సమావేశానికి భీమవరం పట్టణం, వీరవాసరం, భీమవరం మండలాల నుంచి పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కా ర్యకర్తలు తరలివచ్చి పార్టీ సత్తా చూపించడానికి సమాయత్తమవుతున్నారు. సమావేశానికి జిల్లా పార్టీ అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజుతోపాటు ఆరు నియోజకవర్గాల సమన్వయకర్తలు, పార్టీ నా యకులు, కార్యకర్తలు భారీగా హాజరుకానుండటంతో ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు. వైఎస్సార్సీపీ విస్తృతస్థాయి సమావేశానికి హాజరు -
సార్వాకు సన్నద్ధం
భీమవరం: జిల్లాలో రైతులు సార్వా వరి సాగుకు సమాయత్తమవుతున్నారు. వర్షాలు కురుస్తుండటంతో కొన్నిచోట్ల నారుమడుల పనులు చేస్తుండగా.. మరికొందరు విత్తనాల సేకరణ, దుక్కుల్లో నిమగ్నమయ్యారు. జిల్లాలో సార్వా సీజన్లో 2.08 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయనుండగా, ఈ మేరకు 10,400 ఎకరాల్లో నారుమడులు వేయాల్సి ఉంది. ఇప్పటివరకు దాదాపు 1,500 ఎకరాల్లో నా రుమడులు పూర్తిచేసినట్టు వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. గత దాళ్వా సాగు చేపట్టిన రైతులు ధాన్యం అమ్మకాల సమయంలో మిల్లర్లు, ధాన్యం కమీషన్ ఏజంట్లు పంటకు తక్కువ ధర చెల్లించడంతో తీవ్రంగా నష్టపోయారు. నేటికీ కోట్లాది రూపాయలు ధాన్యం డబ్బులు చెల్లించాల్సి ఉండటంతో ప్రస్తుత సార్వా సాగు పెట్టుబడుల కోసం వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. 52 వేల క్వింటాళ్ల విత్తనాల అవసరం జిల్లాలో వరి సాగుకు 52,500 క్వింటాళ్ల విత్తనాలు అవసరం కాగా దాదాపు 41,600 క్వింటాళ్లు రైతుల వద్దనే ఉంటాయనే అంచనా. 225 క్వింటాళ్ల విత్తనాలను వ్యవసాయ శాఖ సబ్సిడీపై రైతులకు అందించనుంది. 4,600 క్వింటాళ్ల విత్తనాలు ప్రైవేట్ డీలర్ల వద్ద విక్రయానికి సిద్ధంగా ఉన్నాయి. సన్న రకాలను ప్రోత్సహించేందుకు ఎంటీయూ 1262 రకం వరి విత్తనాలను అన్ని మండలాల్లో దాదాపు 175 ఎకరాల్లో విత్తన పంటగా వేయించడానికి అధికారులు కృషి చేస్తున్నారు. 58,900 టన్నుల ఎరువులు జిల్లాలో 2.08 లక్షల ఎకరాల్లో సాగుకు 58,905 టన్నుల ఎరువులు అవసరముంటుంది. దీనిలో యూరియా 20,990 టన్నులు, కాంప్లెక్స్ 35,059 టన్నులు, డీఏపీ 2,700 టన్నులు అందుబాటులో ఉన్నాయి. వరిపైరుపై నానో యూరియా వాడకాన్ని ప్రోత్సహించడానికి జిల్లావ్యాప్తంగా 2 లక్షల ఎకరాలకు అవసరమైన నానో యూరియా, డీఏపీ ప్రైవేట్ మార్కెట్లో అందుబాటులో ఉంచారు. భూసారాన్ని బట్టి ఎరువులు వాడాలి అధికంగా ఎరువులు వాడకాన్ని తగ్గించడానికి రైతులకు భూసార పరీక్షల కార్డులు అందిస్తున్నారు. ఫలితాల ఆధారంగా ఎరువులు వినియోగించడం ద్వారా అధిక దిగుబడులకు అవకాశం ఉంటుంది. దీనిలో భాగంగా ఈ ఏడాది 16,150 మట్టి నమూనాలు సేకరించి భూసార పరీక్షలకు తాడేపల్లిగూ డెం ల్యాబ్కు పంపించారు. వ్యవసాయ భూముల్లో నత్రజని, కర్బన శాతం, జింకు తక్కువగా గుర్తించారు. ఈ మేరకు రైతులకు భూసార పరీక్షల కార్డులు అందించి వాటి ఆధారంగా ఎరువులు వాడకంపై అవగాహన కల్పించనున్నారు. జిల్లాలో 2.08 లక్షల ఎకరాల్లో వరి సాగు 10,400 ఎకరాల్లో నారుమడులకు 1,500 ఎకరాల్లో పూర్తి అందుబాటులో విత్తనాలు, ఎరువులు ముందస్తు నాట్లతో మేలు సార్వా పంటకు ముందస్తు నాట్లు వేయడం వల్ల మంచి దిగుబడులు సా ధించవచ్చు. ఇప్పటికే కా లువల్లో సంవృద్ధిగా నీరు ఉంది. వాతావరణం కూడా అనుకూలంగా ఉన్నందున రైతుల త్వరితగతిన నారుమడులు వేసుకోవాలి. దాదాపు 1,500 ఎకరాల్లో నారుమడులు పూర్తయ్యాయి. విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉన్నాయి. – జెడ్.వెంకటేశ్వరరావు, జిల్లా వ్యవసాయశాఖ అధికారి, భీమవరం -
23న వైఎస్సార్సీపీ యువత పోరు
భీమవరం: కూటమి నాయకులు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా యువతను మోసం చేశారని, ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ ఈనెల 23న వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో యువత పోరు పేరుతో నిరసన కార్యక్రమం నిర్వహించనున్నట్టు పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు చిగురుపాటి సందీప్ తెలిపారు. శుక్రవారం భీమవరంలో యువత పోరు పోస్టర్ ఆవిష్కరణ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని, ప్రతి నెలా నిరుద్యోగ భృతి చెల్లిస్తామంటూ గొప్పగా ప్రచారం చేసిన టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు అధికారం చేపట్టి ఏడాది పూర్తయినా యువతకు ఇచ్చిన ఒక్క వాగ్దానం అమలు చేయలేదన్నారు. ప్రభుత్వం కళ్లు తెరిపించి యువతకు ఇచ్చిన హామీల అమలుకు తాము నిరసన బాటపట్టనున్నట్లు చెప్పారు. సోమవారం ఉదయం 10 గంటలకు భీమవరం పట్టణ శివారు విస్సాకోడేరు వంతెన వద్ద నుంచి ప్రదర్శనగా కలెక్టరేట్కు వెళ్లి వినతిపత్రం అందిస్తామన్నారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుంచి వైఎస్సార్సీపీ యువజన విభాగం నాయకులు, కార్యకర్తలు, నిరుద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని సందీప్ కోరారు. ఈ కార్యక్రమంలో యువజన విభాగం జనరల్ సెక్రటరీ పాము యోహాన, మండల ప్రధాన కార్యదర్శి బొడ్డుపల్లి రాజు, సన్నీ, చందు, జానీ, రాహుల్, ప్రవీణ్, చింటూ తదితరులు పాల్గొన్నారు. -
బస్సులు లేక.. ప్రయాణం సాగక
శనివారం శ్రీ 21 శ్రీ జూన్ శ్రీ 2025సాక్షి ప్రతినిధి, ఏలూరు: లక్షలాది మంది ప్రజల రాకపోకలతో బస్టాండ్లు కిటకిటలాడుతుంటాయి. వేలాది మంది విద్యార్థులు, ప్రజలు చుట్టుపక్కల గ్రామాల నుంచి పట్టణాలకు రావడానికి కీలక వారధిగా ఉండే ప్రజా రవాణా వ్యవస్థ శుక్రవారం స్తంభించింది. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లావ్యాప్తంగా 60 శాతానికిపైగా బస్సులు విశాఖ జిల్లాకు తరలించడంతో బస్టాండ్లలో బస్సుల కోసం ప్రయాణికులు గంటల తరబడి పడిగాపులు కాస్తున్న పరిస్థితి. మరోవైపు చుట్టుపక్కల గ్రామాలకు ఆటోలే దిక్కు అయ్యాయి. శనివారం ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని విశాఖలో ప్రభుత్వం నిర్వహిస్తున్న యోగా డేకు జిల్లాలోని బస్సులు తరలించడంతో ప్రజా రవాణా నిలిచిపోయింది. 7 డిపోలు.. 355 బస్సులు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని 7 డిపోల నుంచి 355 బస్సులను విశాఖ సభకు ప్రభుత్వం కేటాయిం చింది. అన్ని డిపో మేనేజర్లకు ఉత్తర్వులు రావడంతో గురువారం సాయంత్రం నుంచే విడతల వారీగా బస్సులను పంపారు. మొత్తంగా ఏలూరు జిల్లాలోని ఏలూరు, జంగారెడ్డిగూడెం, నూజివీడు డిపోల్లో కలిపి 305 సర్వీసులు, అలాగే పశ్చిమగోదావరి జిల్లాలో 305 సర్వీసులు ఉన్నాయి. శుక్రవారం అన్ని బస్టాండల్లో ప్రయాణికుల రద్దీతో పాటు గంటలతరబడి పడిగాపులు అనివార్యంగా కొనసాగాయి. 80 శాతం ఆక్యూపెన్సీతో ఉమ్మడి జిల్లాలో ఆర్టీసీ బస్సులు నడుస్తున్నాయి. ప్రధానంగా ఏలూరు, జంగారెడ్డిగూడెం, చింతలపూడి, తాడేపల్లిగూడెం, భీమవరం, పాలకొల్లు, తణుకు ఇలా అన్ని ప్రధాన ప్రాంతాలకు చుట్టుపక్కల వందల గ్రామాల నుంచి రోజూ సగటున 60 వేల మందికిపైగా రాకపోకలు సాగిస్తుంటారు. దీనిలో ఆర్టీసీలోనే సుమారు 25 వేల మందికిపైగా రాకపోకలుంటాయి. అలాగే కళాశాల విద్యార్థులు కూడా అత్యధికంగా ప్రజా రవాణానే వినియోగిస్తుంటారు. ఈ పరిణామాల క్రమంలో బస్సులన్నీ విశాఖకు తరలించడంతో అన్ని ప్రాంతాల్లో రాకపోకలు కొంతమేర స్తంభించాయి. ప్రయాణికులకు చుక్కలే.. ఏలూరు బస్టాండ్ నుంచి విజయవాడకు రోజూ 72 ట్రిప్పులు నాన్స్టాప్ సర్వీసులు నడుపుతున్నారు. అలాగే దూరప్రాంతాల నుంచి వచ్చే బస్సులు అన్నీ కలుపుకుని ఏలూరు నుంచి 150 వరకు సర్వీసులు ఉన్నాయి. శుక్రవారం దాదాపు 70 శాతం సర్వీసులకు బస్సులు లేకపోవడంతో నామమాత్రంగా సర్వీసులను నడిపారు. అలాగే ఏలూరు నుంచి రాజమండ్రి, రావులపాలెంకు 6 సర్వీసులుండగా వాటిని రెండింటికి పరిమితం చేశారు. రోజూ ఒక్క ఏలూరు డిపో నుంచి 19 నుంచి 20 వేల మంది రాకపోకలు సాగిస్తుంటారు. ఇక జంగారెడ్డిగూడెం, చింతలపూడి, ఏలూరు చుట్టుపక్కల గ్రామాల నుంచి వేలాది మంది విద్యార్థులకు ఆటోలే దిక్కయ్యాయి. అలాగే విజయవాడకు ప్రైవేట్ ట్రా వెల్స్ వాహనాలే అనివార్యమయ్యాయి. ఏలూరు జిల్లాలో ని ఏలూరు డిపో నుంచి 80 బస్సులు, జంగారెడ్డిగూడెం డిపో నుంచి 52 బస్సులు, నూజివీడు డిపో నుంచి 38 బస్సులు విశాఖకు పంపారు. అవసరమైతే మరో 50 బస్సులు పంపడానికి అధికారులు ముందస్తు ఏర్పాట్లు కూడా చేశారు. న్యూస్రీల్‘పశ్చిమ’లోనూ ఇదే పరిస్థితి పశ్చిమగోదావరి జిల్లాలో 305 బస్సులకుగాను 185 బస్సులను విశాఖకు తరలించారు. భీమవరం డిపో నుంచి 51, నరసాపురం డిపో నుంచి 41, తాడేపల్లిగూడెం డిపో నుంచి 41, తణుకు డిపో నుంచి 52 బస్సులు శుక్రవారం విశాఖకు పంపారు. ప్రధానంగా భీమవరం నుంచి విజయవాడ, ఏలూరుకు 40 బస్సులు, భీమవరం నుంచి తణుకు, తాడేపల్లిగూడెంకు మరో 40 బస్సులు 90 శాతం ఆక్యూపెన్సీతో రాకపోకలు సాగిస్తుంటారు. పూర్తి గ్రామీణ ప్రాంతాలు కావడంతో పల్లె వెలుగు సర్వీసులపైనే ఎక్కువగా ఆధారపడే పరిస్థితి. ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో సగటున రూ.35 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు రోజువారీ ఆదాయం సమకూరుతుంది. ఈ క్రమంలో శుక్రవారం నుంచి ఆదివారం ఉదయం వరకు బస్సులు అందుబాటులో ఉండకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా భీమవరం–పాలకొల్లు, భీమవరం–నరసాపురం, తాడేపల్లిగూడెం–తణుకు మధ్య తప్పని పరిస్థితుల్లో రెండు రోజులపాటు ఆటో ప్రయాణాలే ప్రజలకు దిక్కయ్యాయి. రవాణా కష్టాలు బస్సులన్నీ విశాఖకు తరలింపు ఉమ్మడి పశ్చిమ నుంచి 355 బస్సులు బస్టాండ్లలో ప్రయాణికుల అవస్థలు గంటల తరబడి ఎదురుచూపులు కళాశాల విద్యార్థులకు ఆటోలే దిక్కు జిల్లాలో 40 శాతమే నడిచిన సర్వీసులు -
పని గంటల పెంపుపై మండిపాటు
భీమవరం: రాష్ట్రాభివృద్ధికి ప్రత్యేక విధానం లేకుండా కేంద్ర ప్రభుత్వ విధానాలకు మద్దతు ఇవ్వడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు జేఎన్వీ గోపా లన్ మండిపడ్డారు. రాష్ట్ర కేబినేట్ పని గంటల పెంపు, మహిళలు రాత్రి సమయాల్లో పనులు చేయడానికి అంగీకరిస్తూ తీసుకున్న నిర్ణయాలు కార్మికులకు ఇబ్బందులు కలిగించేలా ఉన్నాయంటూ శుక్రవారం స్థానిక ప్రకాశం చౌక్ సెంటర్లో నిరసన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వ లేబర్ కోడ్లపై దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నా.. రాష్ట్ర ప్రభుత్వం కనీసం పరిశీలించకుండా అంగీకరించడం దారు ణమన్నారు. కార్మికుల ఆరోగ్యం, కనీస వేతనాల అమలును పట్టించుకోలేదన్నారు. అలాగే మద్యం, మత్తుపదార్థాల అనర్థాలు, మహిళలపై దాడులను అరికట్టడంతో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. ఏఐటీయూసీ నాయకుడు చెల్లబోయిన రంగారావు, టీయూసీసీ నాయకులు దండు శ్రీనివాసరాజు, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు బి.వాసుదేవరావు, కలిపిండి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. యోగా డేకు పటిష్ట ఏర్పాట్లు భీమవరం (ప్రకాశంచౌక్): జిల్లావ్యాప్తంగా శనివారం నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రతిఒక్కరూ పాల్గొనేలా చూడాలని కలెక్టర్ సీహెచ్ నాగరాణి అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ నుంచి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. జిల్లాలో నమోదైన 8.80 లక్షల మంది యోగా కార్యక్రమాల్లో పాల్గొనేలా చూడాలన్నారు. అలాగే భీమవరం కలెక్టరేట్ వద్ద 5 వేల మందితో నిర్వహించే యోగా కార్యక్రమం ఏర్పాట్లపైనా కలెక్టర్ సమీక్షించారు. కలెక్టరేట్ పరేడ్ గ్రౌండ్లో చేపట్టిన ఏ ర్పాట్లను రాత్రి కలెక్టర్ నాగరాణి జేసీ టి.రాహు ల్కుమార్రెడ్డి, డీఆర్వో మొగలి వెంకటేశ్వర్లు, అధికారులు పరిశీలించారు. మున్సిపల్ కార్మికుల దీక్షలు తణుకు అర్బన్: మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని ఏపీ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ (జేఏసీ) జిల్లా కార్యదర్శి గెల్లా విజయకుమార్ ప్రభు త్వాన్ని డిమాండ్ చేశారు. తణుకు మున్సిపల్ కార్యాలయం ఎదుట శుక్రవారం కార్మికులు నిరాహార దీక్షలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏళ్ల తరబడి అవుట్ సోర్సింగ్లో పనిచేస్తున్నా తమకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం లేదన్నారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. జేఏసీ గౌరవ అధ్యక్షుడు మీసాల పాపారావు, అధ్యక్షుడు ఉండ్రాజవరపు శ్రీను, ఉపాధ్యక్షుడు పీతల శ్రీదేవి, ఉప కార్యదర్శి పడాల దానం జైసిల్రాజు, పిండి పెద్దిరాజు, జి.నాగబాబు పాల్గొన్నారు. ధాన్యం బకాయిలు చెల్లించాలి భీమవరం: రైతులు తోలిన ధాన్యానికి ప్రభుత్వం సొమ్ములు చెల్లించకపోవడం దారుణమని, తక్షణం ధాన్యం బకాయిలు చెల్లించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి జేఎన్వీ గోపాలన్ డిమాండ్ చేశారు. శుక్రవారం భీమవరంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ధాన్యం డబ్బులు చెల్లించకుండా జాప్యం చేయడంతో రైతులు అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. సార్వా సీజన్ ప్రారంభం కావడంతో వ్యవసాయ పనులకు చేతుల్లో డబ్బులు లేక రైతులు అవస్థలు పడుతున్నారన్నారు. జిల్లాలో రైతులకు రూ.293 కోట్ల మేర బకాయిలు ఉన్నా నాయకులు నోరుమెదపకపోవడం సరికాదన్నారు. సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు బి.వాసుదేవరావు పాల్గొన్నారు. ప్రత్యేక సబ్ డివిజన్ డ్రైవ్ భీమవరం(ప్రకాశంచౌక్): జిల్లాలో రీ సర్వే పూర్త యిన గ్రామాల్లో జాయింట్ ఎల్పీఎంల కారణంగా పథకాలు పొందడంలో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని జేసీ టి.రాహుల్కుమార్రెడ్డి శుక్రవారం ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు ప్రత్యేక సబ్ డివిజన్ డ్రైవ్ చేపట్టిందన్నారు. రెవెన్యూ శాఖ సబ్ డివిజన్ సేవ కోసం రూ.50 రుసుం చెల్లిస్తే జాయింట్ పట్టాదారుల భూములకు ఉచితంగా సబ్ డివిజన్ చేస్తామన్నారు. ఈ అవకాశం నెలాఖరులోపు దరఖాస్తు చేసుకున్న వారికే వర్తిస్తుందన్నారు. ఈ మేరకు రైతులు సబ్ డివిజన్ పొందేందుకు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. -
రెవెన్యూ చట్టాలపై అవగాహన అవసరం
భీమవరం (ప్రకాశంచౌక్): రెవెన్యూ చట్టాలపై పూర్తి అవగాహన కలిగి, ప్రజలకు మంచి సర్వీసులను అందించడానికి రెవెన్యూ ఉద్యోగులు కృషి చేయా లని కలెక్టర్ సీహెచ్ నాగరాణి అన్నారు. శుక్రవారం రెవెన్యూ దినోత్సవాన్ని కలెక్టరేట్లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రెవెన్యూ శాఖలో పనిచేస్తున్నందుకు గర్వపడాలని, ప్రజలతో మర్యాదగా వ్యవహరించాలన్నారు. జేసీ టి.రాహుల్కుమార్రెడ్డి మాట్లాడుతూ రెవెన్యూ ఉద్యోగులు రూల్స్ను అనుసరిస్తూ పనిచేయాలని, పనితోనే గుర్తింపు లభిస్తుందన్నారు. రెవెన్యూ శాఖలో పని చేసి రిటైర్ అయిన తహసీల్దార్లు లక్కు నరసింహారావు, పాంచజన్యమూర్తి, డిప్యూటీ తహసీల్దార్ బాబాజీ, వీఆర్వో బి.వెంకట సుబ్బారావు, ఆఫీస్ సబార్డినేట్ మణికంఠలను సత్కరించి జ్ఞాపికలు అందించారు. డీఆర్వో మొగిలి వెంకటేశ్వర్లు, కేఆర్సీసీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ బి.శివన్నారాయణ రెడ్డి, భీమవరం ఆర్డీఓ కె.ప్రవీణ్కుమార్రెడ్డి, ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ జిల్లా ప్రెసిడెంట్ ఎస్.శివశంకర్ పాల్గొన్నారు. -
అధిక ఫీజులను ఉపేక్షించం
భీమవరం: ప్రైవేట్ పాఠశాలల్లో అధిక ఫీజుల వసూలు, విద్యా సామగ్రి అమ్మకాలను ఉపేక్షించబోమని కలెక్టర్ సీహెచ్ నాగరాణి హెచ్చరించారు. గురువారం స్థానిక విష్ణు కళాశాలలో విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రైవేట్, ఆన్ ఎయిడెడ్ పాఠశాలల యజమానులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలు వారి పిల్లలు భవిష్యత్తును గొప్పగా ఊహించుకుని ఫీజులు భారమైన ప్రైవేట్ స్కూల్స్ వైపు మొగ్గుచూపి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారన్నారు. దీనికి తోడు పుస్తకాలు, విద్యా సామగ్రి, కల్చరల్ యాక్టివిటీస్ వంటి వాటి పేరుతో యాజమాన్యాలు వసూలు చేస్తున్నాయన్నారు. కొన్ని పాఠశాలలు సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ సిలబస్ అని చెప్పుకుంటున్నాయని, ఏ సిలబస్ అయినా ప్రభు త్వ నిబంధనల ప్రకారం నడపాల్సిందేనని స్పష్టం చేశారు. అధిక ఫీజులు వసూలుపై ఎంఈఓలు, డిప్యూటీ డీఈఓలు, డీఈఓ ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. ప్రైవేట్ పాఠశాలల్లో క్వాలిఫైడ్ టీచర్లను మాత్రమే నియమించాలని, పాఠశాల వేళలను ప్రభుత్వం సూచించిన మేరకు కచ్చితంగా పాటించాలన్నారు. ఆర్జేడీ జి.నాగమణి, డీఈఓ ఈ.నారాయణ, ఎస్ఎస్ఏ పీఓ పి.శ్యామ్సుందర్, డిప్యూటీ డీఈఓలు పాల్గొన్నారు. 4,835 చోట్ల యోగా కార్యక్రమాలు భీమవరం(ప్రకాశంచౌక్): అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈనెల 21న జిల్లాలో 4,835 చోట్ల యోగా కార్యక్రమాల నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ నాగరాణి ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో సమీక్షించారు. -
సచివాలయాల్లో కూటమి బదిలీలలు
భర్తకు దేహశుద్ధి కొయ్యలగూడెంలోని ఓ ప్రైవేట్ బ్యాంక్లో మేనేజర్గా పనిచేస్తున్న వ్యక్తికి ఆయన భార్య దేహశుద్ధి చేసింది. తనకు న్యాయం చేయాలని ఆందోళనకు దిగింది. IIలో uస్వశక్తితో ఉద్యోగాలు సాధించి గ్రామ, వార్డుస్థాయిలో సేవలందిస్తున్న సచివాలయ ఉద్యోగులను కూటమి నేతల చెప్పుచేతల్లో పెట్టే ప్రయత్నాలు మొదలయ్యాయి. ఉద్యోగుల బదిలీలపై స్పష్టత లేని జీఓ ఇచ్చిన కూటమి ప్రభుత్వం.. ఎన్నడూ లేనివిధంగా బదిలీల్లో రాజకీయ జోక్యానికి తెరలేపింది. ఈ మేరకు వీఐపీ (మంత్రి/ఎమ్మెల్యే/ఎంపీ) పేరిట సిఫార్సు లేఖల కోసం ప్రొఫార్మాలో ప్రత్యేక కాలమ్ ఏర్పాటుచేసింది. ఈ సమ్మర్ కూల్ గురూ.. వేసవి ఆరంభంలోనే ఎండలు అదరగొట్టాయి. అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అందరూ భావించగా అందుకు భిన్నంగా మే నెలలో వాతావరణం చల్లబడింది. IIలో uశురకవారం శ్రీ 20 శ్రీ జూన్ శ్రీ 2025సాక్షి, భీమవరం: నెలాఖరు నాటికి సచివాలయ ఉద్యోగుల బదిలీలను పూర్తిచేసేందుకు మూడు రోజుల క్రితం ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. మే నెలాఖరవు నాటికి ఒకే చోట ఐదేళ్ల కాలం పూర్తిచేసుకున్న వారి బదిలీ తప్పనిసరి. అలాగే ఐదేళ్లు పూర్తికాకున్నా రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్ కోరుకునే వారికి అవకాశం ఇచ్చారు. అభ్యర్థన బదిలీ కావాలనుకునే వారు ఈనెల 22 నుంచి 24వ తేదీలోపు రిక్వెస్ట్ ట్రాన్సఫర్ మాడ్యూల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. గతంలోని సొంత మండలాల్లో పనిచేసే వెసులుబాటును తొలగించింది. ఒకే చోట ఐదేళ్లుగా పనిచేస్తున్న వారి వివరాలను ఇప్పటికే ఎంపీడీఓ, మున్సిపల్ కమిషనర్లు సిద్ధం చేశారు. 25 నుంచి 29లోపు ప్రాధాన్యతను అనుసరించి బదిలీలు పూర్తిచేయనున్నట్టు ప్రభుత్వం తెలిపింది. ఉద్యోగి పనిచేసే విభాగాన్ని బట్టి సంబంధిత శాఖల పర్యవేక్షణలో బదిలీలు జరుగుతాయి. సచివాలయ ఉద్యోగులపై కక్ష అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కూటమి ప్రభుత్వం సచివాలయ ఉద్యోగుల పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తోందన్న విమర్శలున్నాయి. సర్వేల పేరిట తిప్పడం, గతంలో వలంటీర్లు చేసిన పనులను వీరికి అప్పగించడం ద్వారా పనిభారం పెంచేసింది. క్లస్టర్ల పేరిట ఉద్యోగులను క్రమబద్ధీకరించి మిగిలిన వారిని ఇతర శాఖల్లో భర్తీ చేసే యోచన చేస్తోంది. కేవలం రూ.29 వేల నుంచి రూ.31 వేల జీతంపై పనిచేస్తున్న సచివాలయ ఉద్యోగులు సొంత మండలాల్లో పనిచేయకూడదన్న కూటమి ఆదేశాలు ఇవ్వడం, బదిలీలపై స్పష్టత ఇవ్వకపోవడం వారిని మరింత ఇబ్బంది పెట్టేందుకేనని పలువురు విమర్శిస్తున్నారు. గత ప్రభుత్వంలో పారదర్శకంగా.. ప్రభుత్వ సేవలను ప్రజలకు చేరువ చేస్తూ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సచివాలయ వ్యవస్థను తెచ్చారు. రాజకీయ జోక్యం, అవినీతి, అక్రమాలకు తావులేకుండా పూర్తి పారదర్శకంగా సచివాలయ ఉద్యోగుల నియామకాలు చేశారు. గ్రామాల్లో రెండు వేలు, పట్టణాల్లో నాలుగు వేల జనాభా ప్రాతిపధికన సచివాలయాలను ఏర్పాటుచేశారు. గ్రేడ్ 4 పంచాయతీ కార్యదర్శి, ఇంజినీరింగ్ అసిస్టెంట్, ఏఎన్ఎం, వెల్ఫేర్ అసిస్టెంట్, ఎడ్యుకేషన్ అసిస్టెంట్, విలేజ్ సర్వేయర్, అగ్రికల్చర్ అసిస్టెంట్, పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్, ఉద్యాన అసిస్టెంట్, డిజిటల్ అసిస్టెంట్ తదితర పోస్టులను నియమించించారు. తద్వారా జిల్లాలో వేలాది మంది నిరుద్యోగ యువతకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించారు. 35 శాఖలకు చెందిన 500లకు పైగా సేవలను అందుబాటులోకి తెచ్చారు. కూటమి ప్రభుత్వం వచ్చాక సచివాలయాలను నిర్వీర్యం చేస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురికావాల్సి వస్తోంది.న్యూస్రీల్సిఫార్సుల పర్వం ఉద్యోగులను కూటమి నేతల చెప్పుచేతల్లో పెట్టే ఎత్తుగడ బదిలీల నిర్వహణపై స్పష్టత లేని జీఓ మెరిట్ను పక్కనపెట్టి సిఫార్సు లేఖలున్న వారికే ప్రాధాన్యం ఈ మేరకు ప్రొఫార్మాలో వీఐపీ కాలమ్ సిఫార్సు లేఖల కోసం నేతల వద్దకు ఉద్యోగుల ప్రదక్షిణలు చెప్పినట్టు పనిచేసే వారికే ఎమ్మెల్యేల లేఖలు జిల్లాలో 4,434 మంది సచివాలయ ఉద్యోగులు సచివాలయాల్లో పారదర్శకతకు పెద్దపీట వేసిన గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాజకీయ జోక్యానికి ఆస్కారం లేకుండా ఉద్యోగుల నియామకాలు, బదిలీలు ఉద్యోగుల్లో గందరగోళం సాధారణంగా వెబ్, ఆన్లైన్ కౌన్సెలింగ్, మెరిట్, ర్యాకింగ్, మ్యూచవల్ విధానంలో బదిలీలు జరుగుతుంటాయి. గత ప్రభుత్వంలో రాజకీయ జోక్యానికి తావివ్వకుండా కౌన్సెలింగ్ నిర్వహించి ర్యాంకింగ్ మేరకు పోస్టింగ్లు ఇచ్చేవారు. తాజా బదిలీల్లో అందుకు భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఏ విధానాన్ని అనుసరించేది కూటమి ప్రభుత్వం స్పష్టం చేయకపోవడం ఉద్యోగులను గందరగోళానికి గురిచేస్తోంది. సర్వేయర్లు బదిలీలకు సంబంధించిన ప్రొఫార్మాలో వీఐపీ రికమెండేషన్స్ (మంత్రి/ ఎమ్మెల్యే/ ఎంపీ) పేరుతో ప్రత్యేక కాలమ్ను ఏర్పాటుచేయడం సిఫార్సు లేఖల ప్రాధాన్యతను స్పష్టం చేస్తోంది. ఎమ్మెల్యేల వద్దకు బారులు జిల్లాలో 393 గ్రామ, 142 వార్డు సచివాలయ పరిధిలో 4,434 మంది సచివాలయ ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరిలో దాదాపు 70 శాతం మంది బదిలీ అవుతారని అంచనా. స్థానిక నేతలను ప్రసన్నం చేసుకోవడం ద్వారా సిఫార్సు లేఖల కోసం సచివాలయ ఉద్యోగులు కూటమి ఎమ్మెల్యేల ఇళ్లకు క్యూ కడుతున్నారు. తమ చెప్పుచేతల్లో పనిచేసే వారి పేర్లను ఎమ్మెల్యేలకు సూచించి కావాల్సిన వారికి కవరింగ్ లెటర్లు ఇప్పించే పనిలో నాయకులు ఉన్నారు. ప్రస్తుతం జిల్లాలోని ఎమ్మెల్యేల నివాసాలు సిఫార్సు లేఖల కోసం వస్తున్న సచివాలయ ఉద్యోగులతో కిటకిటలాడుతున్నాయి. -
పోలీస్ గస్తీకి కొత్త వాహనాలు
భీమవరం: జిల్లాలో ట్రాఫిక్ నియంత్రణ, శక్తి బృందాల గస్తీకి కేటాయించిన 16 నూతన మోటార్ సైకిళ్లను గురువారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయం వద్ద ఎస్పీ అద్నాన్ నయీం అస్మి జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వాహనాల ద్వారా ప్రజలకు మరింత సమర్థవంతమైన పోలీసు సేవలు అందించడానికి కృషి చేయాలన్నారు. జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, ట్రాఫిక్ నియంత్రణ, మహిళలు, బాలికల భద్రతకు దోహదపడే శక్తి బృందాల గస్తీని మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు ఈ వాహనాలు ఉపయోగపడతాయన్నారు. అడిషినల్ ఎస్పీ వి.భీమారావు, జిల్లా ఆర్మ్డ్ రిజర్వ్ డీఎస్పీ ఎంవీవీ సత్యనారాయణ, డీఎస్పీలు ఆర్జీ జయసూర్య, జి.శ్రీవేద, జిల్లా స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ వి.పుల్లారావు తదితరులు పాల్గొన్నారు. డీఎస్సీ పరీక్షలకు 97 శాతం హాజరు భీమవరం: జిల్లాలోని ఐదు కేంద్రాల్లో గురువారం నిర్వహించిన మెగా డీఎస్సీ పరీక్షలకు 97 శాతం అభ్యర్థులు హాజరయ్యారని డీఈఓ ఈ.నారాయణ తెలిపారు. ఉదయం 623 మందికి 599 మంది, మధ్యాహ్నం 580 మందికి 568 మంది హాజరయ్యారన్నారు. ఏలూరులో 1,030 మంది హాజరు ఏలూరు (ఆర్ఆర్పేట): ఏలూరులో గురువారం నిర్వహించిన డీఎస్సీ పరీక్షలకు 1,030 మంది అభ్యర్థులు హాజరయ్యారు. నగరంలోని సిద్ధార్థ క్వెస్ట్ కేంద్రంలో ఉదయం 174 మందికి 171 మంది, మధ్యాహ్నం 189 మందికి 180 మంది, ఏలూరు ఇంజనీరింగ్ కళాశాలలో ఉదయం 150 మందికి 141 మంది, మధ్యాహ్నం 140 మందికి 138 మంది హాజరయ్యారు. సీఆర్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఉదయం 197 మందికి 193 మంది, మధ్యాహ్నం 215 మందికి 207 మంది హాజరయ్యారని డీఈఓ ఎం. వెంకట లక్ష్మమ్మ తెలిపారు. సమ్మెలోకి మున్సిపల్ అవుట్ సోర్సింగ్ కార్మికులు తాడేపల్లిగూడెం (టీఓసీ): మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగంలోని అవుట్ సోర్సింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, లేకుంటే ఈనెల 22 నుంచి పూర్తిస్థాయిలో విధులు బహిష్కరించి సమ్మెలోకి వెళుతున్నట్టు ఏపీ మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగపు కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ నాయకులు హెచ్చరించారు. స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద గురువారం కార్మికులు కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలిపారు. నాయకులు మర్రిపూడి సతీష్ కుమార్, అవిడి కుమార్, నూకపల్లి శేఖర్, య ర్రంశెట్టి నాగేశ్వరరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, వేతనాలు పెంచాలని, కార్మికులను మానవ వనరుల విధానంలోకి తీసుకురావాలని, అన్నిరకాల బెనిఫిట్స్ అందజేయాలని కోరారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ యేసుబాబు, మున్సిపల్ ఇంజనీర్ వెంకట రమణ, అధికారులకు సమ్మె నోటీసులు అందించారు. ఐటీఐల్లో ప్రవేశాలు ఉండి: జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐల్లో ప్రవేశాలకు వచ్చేనెల 15న సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులకు గడువు ఉందని ఐటీఐ జిల్లా కన్వీనర్ వి.శ్రీనివాసరాజు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. పదో తరగతి పాస్ లేదా ఫెయిలైన విద్యార్థులు ఐటీఐ డాట్ ఏపీ డాట్ జీఓవీ డాట్ ఇన్ అనే ఆన్లైన్ పోర్టల్లో నమోదు చేసుకుని, సమీపంలోని ప్రభు త్వ ఐటీఐలో సర్టిఫికేషన్ వెరిఫికేషన్ చేయించుకోవాలన్నారు. వివరాలకు 08816 297093, 9676099988లో సంప్రదించాలని సూచించారు. సాగుదారుల చట్టంపై ప్రచారోద్యమం ఏలూరు (టూటౌన్): దళిత బహుజన రిసోర్స్ సెంటర్ ఆధ్వర్యంలో జిల్లా వ్యవసాయ జా యింట్ డైరెక్టర్ షేక్ హబీబ్ బాషా చేతులమీదుగా పంట సాగుదారులు చట్టంపై ప్రచారోద్యమం కరపత్రాలను గురువారం విడుదల చేశారు. హబీబ్ బాషా మాట్లాడుతూ జిల్లాలో డీబీఆర్సీ 2025– 26కి గాను భూమి ఉన్న రైతులు, కౌలుదారులకు అవగాహనా కార్యక్ర మం నిర్వహించడం శుభపరిణామమన్నారు. -
యోగా భారత ప్రాచీన సంపద
భీమవరం: యోగా దేశ ప్రాచీన సంపద అని, ప్రపంచానికి యోగాను పరిచయం చేసింది భారతదేశం అని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమ శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అన్నారు. స్థానిక డీఎన్నార్ కళాశాలలోని మైదానంలో గురువారం ప్రత్యేక థీమ్ అథ్లెటిక్స్, స్పోర్ట్స్, యూత్ గ్రూప్స్తో నిర్వహించిన మెగా యోగా ప్రదర్శన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యోగా సాధనతో శారీరక దృఢత్వంతో పాటు మానసిక ప్రశాంతత కలుగుతుందన్నారు. డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే కనుమూరు రఘురామకృష్ణరాజు, పీఏసీ చైర్మన్, భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు మాట్లాడుతూ యోగా సాధనతో సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుందన్నారు. కలెక్టర్ సీహెచ్ నాగరాణి, ఎస్పీ అద్నాన్ నయీమ్ అస్మి, ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ, కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు, జేసీ టి.రాహుల్కుమార్రెడ్డి, అడిషనల్ ఎస్పీ వి.భీమారావు, డీఆర్వో మొగిలి వెంకటేశ్వర్లు, ఆర్డీఓలు, అధికారులు, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. -
● ప్రాణాలతో సదరంగం
కూటమి ప్రభుత్వంలో దివ్యాంగులకు అవస్థలు తప్పడం లేదు. సామాజిక పింఛన్ల ఏరివేతలో భాగంగా దివ్యాంగులు మళ్లీ సదరం సర్టిఫికెట్ తీసుకోవాలంటూ అధికారులు కొర్రీలు పెట్టి ఆస్పత్రుల చుట్టూ తిప్పుతున్నారు. దీంతో దివ్యాంగులు, మానసిక వికలాంగులు నానా ప్రయాసలు పడుతూ ఏలూరు జీజీహెచ్లో సదరం క్యాంపునకు హాజరవుతున్నారు. మండుటెండల్లో దూర ప్రాంతాల నుంచి సహాయకులను తీసుకుని ఆందోళనతో వస్తున్నారు. బుధవారం ఇలానే ఓ వృద్ధుడు జీజీహెచ్కు వచ్చి గుండె ఆగి ప్రాణాలు విడిచాడు. అయినా అధికారుల్లో చలనం లేదు. సదరం కేంద్రాలు నియోజకవర్గానికి ఒకటి చొప్పున ఏర్పాటుచేయాలని పింఛన్దారులు కోరుతున్నారు. గురువారం ఏలూరు జీజీహెచ్ వద్ద కనిపించిన దృశ్యాలివి. – సాక్షి ఫొటోగ్రాఫర్/ ఏలూరు వృద్ధుడికి తప్పని తిప్పలు -
సెల్ సిగ్నల్స్తో సేఫ్
ఆకివీడు: కేసుల పరిష్కారంలో సెల్ఫోన్ సిగ్నల్స్ పోలీసులకు ఎంతగానో ఉపకరిస్తున్నాయి. తాజాగా జరిగిన ఘటనలే ఇందుకు తార్కాణం. బుధవారం ఉదయం హైదరాబాద్లోని గోషామహల్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్న రాథోడ్ సురేష్ భార్య సంధ్య విశాఖ ఎక్స్ప్రెస్లో విజయనగరం బయలుదేరారు. ఆమెను వెంబడిస్తున్న అగంతకుడు ఆకివీడు ప్రాంతం వచ్చేసరికి ఆమె హ్యాండ్ బ్యాగ్ను కాజేసి, పారిపోయే అవకాశం లేకపోవడంతో ఆకివీడు–చెరుకువాడ మధ్య రైలు నుంచి బ్యాగ్ బయటకు విసిరివేశాడు. ఈ విషయాన్ని సంధ్య ఆమె భర్తకు ఫోన్ ద్వారా తెలియజేశారు. వెంటనే రాథోడ్ స్పదించి సెల్ సిగ్నల్ ద్వారా బ్యాగ్ ఏప్రాంతంలో పడిపోయిందో గుర్తించారు. వెంటనే ఆకివీడు ఎస్సై హనుమంతు నాగరాజుకు ఫోన్ ద్వారా విషయం తెలియజేసి, సిగ్నల్ ప్రాంతంను తెలియజేశారు. ఎస్సై నాగరాజు హూటాహుటీన తన సిబ్బంది శివ, విజయ్లతో వెదకగా చెరుకువాడ దగ్గర బ్యాగ్ను గుర్తించి, దానిలోని ఆభరణాలు, సెల్ఫోన్ను మరో సెల్ఫోన్ ద్వారా వీడియో తీశారు. విషయాన్ని కానిష్టేబుల్ రాథోడ్కు తెలియజేశారు. బాధితురాలు సంధ్యకు హ్యాండ్ బ్యాగ్ అందజేశారు. అగంతకుడి కోసం విచారణ చేపట్టారు. ప్రమాదవశాత్తూ జారిపడిన బాధితుడి గుర్తింపు ఇటీవల మండలంలోని కమతవానిగూడెంకు చెందిన వలస కార్మికుడు తిరుపతి నుంచి రైలులో ఆకివీడు వస్తుండగా మార్గమధ్యలో జారిపడిపోయాడు. రైలులో ఉన్న అతని బంధువులు వెంటనే ఆకివీడు పోలీసులకు తెలియజేశారు. బాధితుడి వద్ద ఉన్న సెల్ఫోన్ ఆధారంగా కావలి ప్రాంతంలో పడిపోయి ఉన్నాడని గుర్తించి ఆకివీడు ఎస్సై నాగరాజు వెంటనే సమీపంలోని పోలీసులకు తెలియజేడంతో అక్కడి పోలీసులు వెళ్లి గాయాలతో పడి ఉన్న అతడ్ని రక్షించి, వైద్యం అందజేశారు. ప్రస్తుతం ఆసుపత్రిలో వైద్యం పొందుతున్నాడు. హ్యాండ్ బ్యాగ్ చోరీ కేసును కూడా ఛేదించడంతో ఆకివీడు ఎస్సై నాగరాజుకు, పోలీస్ సిబ్బందికి పలువురు అభినందనలు తెలిపారు. ఏడాది చివరికి ఎలక్ట్రిక్ బస్సులు నూజివీడు: రాష్ట్రానికి ఈ ఏడాది చివరి నాటికి 750 ఎలక్ట్రిక్ బస్సులు రానున్న నేపథ్యంలో వాటిలో జోన్–2 పరిధిలోని విజయవాడకు 100 బస్సులు, కాకినాడకు 50, రాజమండ్రికి 50 బస్సులు చొప్పున కేటాయించనున్నట్లు ఆర్టీసీ జోన్–2 ఈడీ జీ విజయరత్నం పేర్కొన్నారు. నూజివీడులోని ఆర్టీసీ బస్సు డిపోను గురువారం ఆయన సందర్శించి అన్ని విభాగాల పనితీరును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా పనిచేసి డిపోను లాభాల్లో నడపాలన్నారు. బస్సులు సైతం సమయపాలనతో నడిచేలా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని పేర్కొన్నారు. ఎలక్ట్రిక్ బస్సులు రావడం వల్ల కాలుష్యం తగ్గడంతో పాటు ఆర్టీసీపై డీజిల్ భారం సైతం తగ్గుతుందన్నారు. ప్రయాణికుల ఆక్యుపెన్సీ రేషియో బాగుంటే నూజివీడు డిపో నుంచి దూర ప్రాంతాలకు కచ్ఛితంగా బస్సు సర్వీసులను నడుపుతామన్నారు. బెంగళూరు, శ్రీశైలం వంటి దూర ప్రాంతాలకు ఇప్పటికే సర్వీసులు నడుపుతున్నామన్నారు. నాన్స్టాప్ బస్సు సర్వీసులను పెంచాల్సిన అవసరం ఉందని, పెంచేలా చర్యలు తీసుకుంటామన్నారు. హైదరాబాద్ తిరిగే సర్వీసులు కచ్ఛితంగా సమయానికి బయలుదేరి వెళ్లాల్సిందేనన్నారు. బస్టాండ్లో ఉండే కంట్రోలర్లు బస్సులు సమయానికి వెళ్తున్నాయా, లేదా అనే విషయాన్ని పర్యవేక్షించాలన్నారు. కార్మికుల సమస్యలను పరిష్కరించడానికి అధిక ప్రాధాన్యతనిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ సీహెచ్ సూర్యపవన్ కుమార్, ట్రాఫిక్ సీఐ జీ రాంబాబు, పలు యూనియన్లకు చెందిన నాయకులు పాల్గొన్నారు. సెల్ఫోన్ సిగ్నల్స్తో కేసుల పరిష్కారం లొకేషన్లు గుర్తించి కేసులను ఛేదిస్తున్న పోలీసులు -
యథేచ్ఛగా కంకర అక్రమ తవ్వకాలు
సాక్షి, టాస్క్ఫోర్స్ : కూటమి పాలనలో మట్టి దందా దోచుకున్నోళ్లకు దోచుకున్నంత అన్న చందంగా తయారైంది. కోర్టు నుంచి స్టే ఉన్నా వారు లెక్క చేయని పరిస్థితి. ఉంగుటూరు మండలం నల్లమాడులో కంకర అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. మూడు తరాల నుంచి ఒక పేద కుటుంబం హక్కు భుక్తంలో ఉన్న మెరసుకుంటను ఆనుకొని ఉన్న సుమారు ఒకటిన్నర ఎకరం కంకర బీడులో 15 రోజులుగా ఇష్టారాజ్యంగా తవ్వకాలు సాగిస్తున్నారు. పెద్ద ఎత్తున కంకరను జేసీబీలు, పొక్లయినర్ల సాయంతో తవ్వి లారీలు, ట్రాక్టర్ల ద్వారా తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ముసనబోయిన అంజమ్మకు చెందిన ఈ భూమి విషయంలో హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నా కూటమి నాయకలు లెక్కచేయడం లేదు. పంచాయతీ, ఇరిగేషన్ అధికారుల అనుమతితో తవ్వకాలు చేస్తున్నట్లు ఆ నాయకులు ప్రచారం చేస్తున్నారు. ఈ విషయంలో గ్రామ, మండల స్థాయి అధికారుల జేబులు నింపుతున్నారని వినికిడి. కంకర తవ్వకాలపై గ్రామ రెవెన్యూ అధికారి నాగరాజుని వివరణ కోరగా కంకర తవ్వకాలకు అనుమతులు ఉన్నట్లు చెబుతున్నారు. -
భర్తకు దేహశుద్ధి చేసిన భార్య
కొయ్యలగూడెం: భర్తకు భార్య దేహశుద్ధి చేసిన ఘటన గురువారం కొయ్యలగూడెంలో చోటుచేసుకుంది. బాధితురాలు పూజిత తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కొయ్యలగూడెంలో ప్రైవేట్ బ్యాంకులో మేనేజర్గా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాసరావుకు చిట్యాల గ్రామానికి చెందిన పూజితకు 11 ఏళ్ల క్రితం వివాహమైంది. వారికి ఇద్దరు ఆడపిల్లలు సంతానం. అయితే మగపిల్లాడు కావాలని పూజితను అత్తమామలు, భర్త వేధింపులకు గురి చేస్తున్నారు. ఆమె నుంచి విడాకులు కావాలని భర్త కోర్టును ఆశ్రయించగా కోర్టు పూజితకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. దీంతో బంధువులు, మహిళ మండలి సంఘాల మద్దతుతో గురువారం పూజిత శ్రీనివాసరావు ఇంటికి వెళ్లగా అదే సమయంలో భర్త మరో మహిళతో విహహేతర సంబంధం పెట్టుకొని సహజీవనం చేస్తున్నాడని తెలియడంతో అవాక్కయింది. పైగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న మహిళకు ఆరు నెలల పాప ఉందని తెలియడంతో ఆమెను కూడా తీసుకొని బ్యాంకు వద్దకు వెళ్లి నిరసన తెలిపింది. దీంతో శ్రీనివాసరావు, పూజితల మధ్య వాగ్వాదం చోటుచేసుకోగా మహిళా సంఘాలు బంధువులు కలిసి శ్రీనివాసరావుకు దేహశుద్ధి చేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని శ్రీనివాసరావును, పూజితను స్టేషన్కు తీసుకుని వెళ్లారు. కోర్టు తనకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని, తనకు న్యాయం చేయాలని బాధితురాలు పూజిత కోరుతోంది. కాగా దీనిపై పూర్తిస్థాయి విచారణ చేయాల్సి ఉందని పోలీసులు తెలిపారు. వివాహేతర సంబంధం కొనసాగిస్తుండడంపై ఆవేదన -
ఈ సమ్మర్ చాలా కూల్ గురూ..
నరసాపురం: ఈ ఏడాది వేసవి ఆరంభంలోనే ఎండలు అదరగొట్టాయి. ఉమ్మడి పశ్చిమలో ఫిబ్రవరి నెలలోనే 40 డిగ్రీలకు చేరువలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మార్చి, ఏప్రిల్ నెలల్లో కూడా భానుడు ప్రతాపం చూపించాడు. దీంతో ఈఏడాది వేసవిలో ఎండల ప్రతాపం దారుణంగా ఉంటుందని అంచనా వేశారు. వేసవిలో గరిష్టస్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతాయని జనవరి నెలలోనే విశాఖ వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేసినా అందుకు భిన్నంగా అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మే నెలలో అయితే ఉమ్మడి పశ్చిమలో ఎక్కడా కూడా 40 డిగ్రీలు దాటి ఉష్ణోగ్రతలు నమోదు కాలేదు. జూన్ మొదటి వారంలో అత్యధికంగా 41 డిగ్రీలు, అత్యల్పంగా 39 డిగ్రీలు నమోదయ్యాయి. దీనికి తోడు ఈ ఏడాది రుతుపవనాల రాక కూడా దాదాపు 20 రోజులు ముందుగానే రావడంతో వాతావరణం పూర్తిగా చల్లబడింది. ప్రస్తుతం రుతుపవనాలు పూర్తిగా విస్తరించడంతో వర్షాలు పడుతున్నాయి. ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లో 2005 తరువాత వేసవిలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు కావడం ఇదే ప్రథమం. దీంతో గోదావరి జిల్లాల వాసులు ఈ ఏడాది వేసవి తాపం తెలియకుండానే వర్షాకాలంలోకి ప్రవేశించారు. రోహిణీ కార్తె ప్రభావం కూడా కనిపించలేదు ఈ ఏడాది మే 24 వతేదీ నుంచి రోహిణీ కార్తె ప్రారంభమైంది. రోహిణి కార్తెలో ఎండలకు రోళ్లు పగులుతాయని నానుడి ఉంది. రికార్డు స్థాయిలో ఉండే రోహిణి కార్తె ఎండలకు జనం బెంబేలెత్తుతూ ఉంటారు. అయితే ఈ ఏడాది రోహిణి కార్తె కూడా సాధారణ ఉష్ణోగ్రతలో కూల్గా గడిచిపోవడంతో జనం ఊపిరి పీల్చుకున్నారు. మొత్తానికి ఈ ఏడాది వేసవి పెద్దగా ఇబ్బంది పెట్టకుండా కూల్గా గడిచిపోవడం విశేషం. అప్పుడు కరోనా కారణంగా ఇళ్లలో ఉండి.. కరోనా కారణంగా వేసవిలో వరుసగా రెండేళ్లపాటు జనం ఇళ్లకే పరితమై వేసవి ప్రభావం పడకుండా తప్పించుకున్నారు. 2020 సంవత్సరంలో కరోనా విలయతాండవం, లాక్డౌన్ కారణంగా ఏప్రిల్, మే నెలలు మొత్తం జనం ఇళ్లకే పరిమితమయ్యారు. ఇక 2021లో కూడా మార్చి నెలలోనే కరోనా సెకండ్వేవ్ ప్రభావం ప్రారంభమైంది. ఏప్రిల్, మే నెలల్లో కల్లోలంగా మారడంతో దీంతో జనం పెద్దగా రోడ్కెక్కలేదు. ఆ రకంగా రెండేళ్లు అధిక మొత్తంలో జనం ఇళ్లపట్టునే ఉండి భానుడి ప్రతాపాన్ని చాలా వరకూ తప్పించుకున్నారు. నిజానికి ఈ రెండేళ్లు కూడా జిల్లాలో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిల్లోనే నమోదయ్యాయి. అయితే ఈ సంవత్సరం మాత్రం రికార్డుస్థాయి ఉష్ణోగ్రతలు నమోదు కాకపోవడంతో జనం కూల్ కూల్గా ఖుషీ అయ్యారు. వేసవిలో గోదావరి జిల్లాల్లో నమోదైన అత్యల్ప ఉష్ణోగ్రతలు రోహిణి కార్తెలో కూడా ఎండలు ప్రభావం చూపని వైనం రుతుపవనాలు విస్తరించడంతో చల్లబడ్డ వాతావరణం మే మొత్తం కూల్.. జూన్లో కొంత ప్రభావం ఈ ఏడాది మే నెల మొత్తం ఉమ్మడి పశ్చిమలో ఎండల ప్రభావం అంతగా కనిపించలేదు. అంతేకాకుండా మే 16, 17 తేదీల్లో వర్షాలు పడ్డాయి. గత ఏడాది కూడా మే నెలలో ఇదే సమయంలో వర్షాలు పడ్డాయి. అయితే తరువాత వడగాగాలలు దుమ్మురేపాయి. గత ఏడాది పడగాలులకు ఉమ్మడి జిల్లాలో 16 మంది మృత్యువాత పడ్డారు. అయితే ఈ ఏడాది వడగాలుల మరణాలు నమోదు కాకపోవడం విశేషం. ఇక మేనెల ఎండంటే తెలియకుండా గడిపేసిన జిల్లా వాసులకు జూన్ మొదటి వారంలో కొంత ప్రభావం కనిపించింది. జూన్ 2, 3 తేదీల్లో కొన్ని ప్రాంతాల్లో 41 డిగ్రీలు దాటి ఉఫ్ణోగ్రతలు నమోదయ్యాయి. మళ్లీ తరువాత అంతకు మించి ఉఫ్ణోగ్రతలు నమోదు కాలేదు. -
యోగా మంత్రం.. ఒత్తిడిలో యంత్రాంగం
పాలకోడేరు: కూటమి ప్రభుత్వం కొన్ని రోజలుగా నిరంతరం యోగా మంత్రం జపిస్తుండడంతో ప్రభుత్వ యంత్రాంగం ఒత్తిడిలో కొట్టుమిట్టాడుతోంది. యోగాంధ్ర కార్యక్రమానికి మే 21 నుంచి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విశాఖ కేంద్రంగా లక్షల మందితో నిర్వహించాలని నిర్ణయించారు. ప్రధాని మోదీ కూడా హాజరవుతుండడంతో ఎలాగైనా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కుస్తీలు పడుతోంది. దీంతో అధికారులు, ఉద్యోగులకు క్షణం తీరిక లేకుండా పోయింది. యోగాంధ్ర ఎన్రోల్మెంట్, మాస్టర్ ట్రైనీ, రిజిస్ట్రేషన్, యోగ ప్రొటోకాల్ ఆసనాలు పూర్తి చేసినప్పటికీ జిల్లాస్థాయి యోగాసనాల పోటీల నిర్వహణ మాత్రం తమ వల్ల కాదని చేతులెత్తేస్తున్నారు. ఎందుకంటే సాధ్యం కానీ అలవాటు లేని ఆసనాలతో పోటీలు నిర్వహించాలని అధికారులు మార్గదర్శకాలు పేర్కొనడంతో కొత్తగా యోగా నేర్చుకున్న తాము ఈ ఆసనాలను ఎలా వేయగలమంటూ పోటీల్లో పాల్గొనడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. ఇవేం పోటీలు? జిల్లా స్థాయిలో యోగా పోటీలకు సంబంధించి 10 నుంచి 18 సంవత్సరాలు, 19 నుంచి 35 సంవత్సరాలు, 35 పైబడి అంటూ మూడు భాగాల్లో పోటీలు నిర్వహిస్తున్నారు. వాస్తవానికి 50 ఏళ్లు పైబడిన కేటగిరీ ఇవ్వకపోవడంతో యోగాలో అనుభవం, ఆసక్తి ఉన్న ఆ వయస్సు వారితో పోటీ పడే పరిస్థితి ఏర్పడింది. వారంతా పోటీలో పాల్గొనడానికి ఆసక్తి కనపరచడం లేదు. ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్న వారిని సైతం పోటీల్లో అభ్యర్థులుగా చేర్చడంతో క్లిష్టతరమైన ఆసనాలు వేయలేమని తమ పేర్లను తొలగించాలని వారు కోరుతున్నారు. చిన్న పిల్లలకు ఆకర్ణ ధనురాసనం, బకాసనం, 19 నుంచి 35 సంవత్సరాల విభాగంలో మత్స్యేంద్రాసనం, జిల్లా స్థాయిలో విభక్త పశ్చిమోత్తాసనం తదితర ఆసనాలు వేయాలని సూచించారు. రాష్ట్ర స్థాయిలో పూర్ణమత్స్యేంద్రాసనం, ఓంకారాసనం, కర్ణ పీడనాసనం ఇచ్చారు. మండల స్థాయి పోటీలను ఏదోలా మమ అనిపించినప్పటికీ జిల్లా స్థాయి పోటీలకు వెళ్లేవారిని పంపించడం కష్టతరమేనని అధికారులు తలలు పట్టుకుంటున్నారు. సమయం వృథా అంటూ ఆవేదన యోగాంధ్ర కార్యక్రమం కోసం ప్రతిరోజు కలెక్టర్ నుంచి ఆయుష్ విభాగం అధికారులు పలు శాఖల జిల్లా స్థాయి అధికారులు గూగుల్ మీట్, వెబ్క్స్ నిర్వహిస్తుండడంతో గంటల కొద్ది సమయం వృథా అవుతుందని అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని మూడు రోజులపాటు ఎటువంటి శ్రమ లేకుండా చేపట్టామని అధికారులు చెబుతుండడం గమనార్హం. అప్పటి ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించింది. కానీ ఇప్పుడు యోగాంధ్ర కోసం నెలరోజుల పాటు నరకయాతన పడుతున్నామని అధికారులు తమ అంతర్గత సంభాషణలో తలలు పట్టుకుంటున్నారు. ఈ కార్యక్రమంతో పని ఒత్తిడి భరించలేక సచివాలయం నుంచి మండల స్థాయి ఉద్యోగులు అంతా నరకం చూస్తున్నారు. యోగాంధ్ర విజయవంతానికి ప్రభుత్వం కుస్తీలు ఉద్యోగులు, సిబ్బందిపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి -
యానాం మద్యం విక్రేతకు రూ.లక్ష జరిమానా
తణుకు అర్బన్: యానాం మద్యం విక్రయాలు చేస్తున్న వ్యక్తికి ఇరగవరం మండల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్, తహసీల్దార్ ఎం.సుందరరాజు రూ.లక్ష జరిమానా విధించినట్లు తణుకు ఎకై ్సజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖ సీఐ సత్తి మణికంఠరెడ్డి తెలిపారు. ఇరగవరం మండలం కంతేరు గ్రామానికి చెందిన కొవ్వూరి శ్రీనివాసరెడ్డి ఇటీవల రెండు పర్యాయాలు యానాం మద్యంతో దొరికిన నేపథ్యంలో ఈ భారీ జరిమానా విధించినట్లు స్పష్టం చేశారు. ఈ ఏడాది మార్చి 7న కంతేరు గ్రామంలో కారులో 43.1 లీటర్ల యానం మద్యం తరలిస్తూ తణుకు ఎకై ్సజ్ శాఖ దాడుల్లో పట్టుబడ్డాడని, దీంతో అతడిని ఇరగవరం మండల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ వద్ద రూ.లక్ష పూచీకత్తుతో ఏడాది కాలానికి బైండోవర్ చేయడం జరిగిందన్నారు. సత్ప్రవర్తన బాండ్ను ఉల్లంఘించి తిరిగి మే 26న యానాం నుంచి మద్యాన్ని కారులో రవాణా చేస్తూ తణుకు ఎక్సైజ్ శాఖకు మరోసారి పట్టుబడ్డాడని చెప్పారు. దీంతో ఈనెల 11న ఇరగవరం తహసీల్దార్ వద్ద హాజరపరచగా దీనిపై విచారణ అనంతరం విధించిన జరిమానాను ముద్దాయి గురువారం చెల్లింపు చేసినట్లు వివరించారు. యువకుడి అదృశ్యంపై కేసు నమోదు ముదినేపల్లి రూరల్ : యువకుడి అదృశ్యంపై స్థానిక పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. వివరాల ప్రకారం మండలంలోని పెదగొన్నూరు శివారు కర్షకమాలపల్లికి చెందిన మద్దాల మరియమ్మ కుమారుడు కిరణ్బాబు ముదినేపల్లి, బంటుమిల్లి, సింగరాయపాలెం గ్రామాల్లోని స్వీటుషాపుల్లో పనిచేసేవాడు. ప్రతిరోజు వచ్చే ఆదాయంతో మద్యం సేవించి తల్లిని దుర్భాషలాడుతూ బాధపెట్టేవాడు. ఈ ఏడాది మార్చి 30న మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వమని తల్లి మరియమ్మను ఒత్తిడి చేశాడు. అందుకు నిరాకరించడంతో తల్లిని తూలనాడి ఇంటినుంచి వెళ్లిపోయాడు. నాటి నుంచి కిరణ్బాబు ఆచూకీ తెలియకపోవడంతో తల్లి మరియమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎస్సై వీరభద్రరావు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. కామ్రేడ్ సుధాకర్ సేవలు ఎనలేనివి పెదపాడు: మండలంలోని సత్యవోలులో కామ్రేడ్ తెంటు సుధాకర్ సంస్మరణ సభ గురువారం నిర్వహించారు. సీపీఐఎంల్ సానుభూతిపరులు, విరసం నాయకులు, కళాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థిగా, డాక్టర్గా, కామ్రేడ్గా సుధాకర్ ఎనలేని సేవలందించారని కొనియాడారు. పేద, బడుగు, పీడిత ప్రజల కోసమే సుధాకర్ తన జీవితాన్ని త్యాగం చేశారని, ఆయన ఆశయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో కొండారెడ్డి, కృష్ణ లావేటి శ్రీనివాసరావు, తూర్పు కాపు కార్పొరేషన్ డైరక్టరు లావేటి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. మద్ది హుండీల ఆదాయం రూ.54.71 లక్షలు జంగారెడ్డిగూడెం: మండలంలోని గుర్వాయిగూడెం మద్ది క్షేత్రంలో హుండీ ఆదాయన్ని గురువారం లెక్కించినట్టు మద్ది ఈఓ ఆర్వీ చందన తెలిపారు. 85 రోజులకు హుండీల ద్వారా రూ.49,67,182, చిల్ల రూపేణా రూ.4,22,927, అన్నదానం హుండీ ద్వారా రూ.81,370 మొత్తం ఆదాయం రూ.54,71,479 వచ్చినట్టు చెప్పారు. ఏలూరు దేవదాయ శాఖ ఆధ్వర్యంలో గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ ఈఓ కలగర శ్రీనివాస్ పర్యవేక్షణలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కేవీబీ బ్యాంకు సిబ్బంది, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. -
వైఎస్ జగన్తో చినమిల్లి భేటీ
భీమవరం: తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని భీమవరం నియోజకవర్గ సమన్వయకర్త చినమిల్లి వెంకట్రాయుడు మర్యాదపూర్వకంగా కలిశారు. తనను సమన్వయకర్తగా నియమించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. తనపై నమ్మకంతో ఇచ్చిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించి భీమవరం నియోజకవర్గంలో వైఎస్సార్సీపీని మరింత బలోపేతం చేయడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఆయన వెంట పార్టీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు, నరసాపురం పార్లమెంట్ ఇన్చార్జ్ గూడూరి ఉమాబాల, పార్టీ మహిళా జిల్లా అధ్యక్షురాలు కోడే విజయలక్ష్మి, ఎంపీపీ పేరిచర్ల విజయనర్సింహరాజు, పార్టీ నాయకులు మేడిద జాన్సన్, ఏఎస్ రాజు, కామన నాగేశ్వరరావు, గాదిరాజు రామరాజు, చవాకుల సత్యనారాయణ, కోడె యుగంధర్, జల్లా కొండయ్య తదితరులున్నారు. చెవిరెడ్డి అరెస్టు అన్యాయం భీమవరం: వైఎస్సార్సీపీ నేత చెవిరెడ్డి భాస్కరరెడ్డి అరెస్టు అక్రమమని వైఎస్సార్సీపీ బీసీ సెల్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నౌడు వెంకటరమణ అన్నారు. ఈ మేరకు బుధవారం ప్రకటన విడుదల చేశారు. భాస్కరరెడ్డి రాజకీయాల పట్ల నిబద్ధత, నిజాయితీ గల నాయకుడని,, కూటమి ప్రభుత్వం జైలుకు పంపాలనే దుర్బుద్ధితో మద్యం అక్రమ కేసులో ఇరికించి వేధింపులకు పాల్పడేందుకు అరెస్టు చేశారన్నారు. భాస్కరరెడ్డి కుమారుడు మోహిత్రెడ్డితో పాటు మరో నలుగురుపై కేసు నమోదు చేయడం దురదృష్టకరమన్నారు. వ్యవసాయంలో సాంకేతికత వినియోగించాలి భీమవరం: వ్యవసాయంలో సాంకేతికతను వినియోగించి అధిక లాభాలు పొందాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి రైతులకు సూచించారు. బుధవారం కలెక్టరేట్లో వ్యవసాయ శాఖ ఏర్పాటు చేసిన యంత్ర పరికరాలు, రాయితీ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ఆహార కొరత స్థాయి నుంచి రైతులు విప్లవాత్మకమైన సాగు ద్వారా ధాన్యం విదేశాలకు ఎగుమతి చేసే స్థాయికి చేరుకున్నారన్నారు. జిల్లాకు కిసాన్ డ్రోన్ గ్రూపులకు 80 శాతం సబ్సిడీతో 41 డ్రోన్లను కేటాయించినట్లు చెప్పారు. సన్న, చిన్నకారు రైతులకు రూ.8.99 కోట్ల విలువైన వ్యక్తిగత యంత్ర పరికరాలకు రూ.3.84 కోట్లు రాయితీపై పంపిణీ చేశామన్నారు. డీఎస్సీకి 1,161 మంది హాజరు భీమవరం: జిల్లా వ్యాప్తంగా అయిదు పరీక్షా కేంద్రాల్లో బుధవారం నిర్వహించిన మెగా డీఎస్సీ పరీక్షకు 1,161 మంది హాజరైనట్లు జిల్లా విద్యాశాఖాధికారి ఇ.నారాయణ చెప్పారు. ఉదయం పరీక్షకు 580 మందికి 567 మంది హాజరుకాగా.. మధ్యాహ్నం పరీక్షకు 601 మందికి 594 మంది హాజరయ్యారన్నారు. సమగ్రశిక్ష సిబ్బంది బదిలీలకు అవకాశం భీమవరం: జిల్లాలోని సమగ్ర శిక్ష ప్రాజెక్టులోని కాంట్రాక్ట్ సిబ్బంది బదిలీలకు ఈనెల 21లోగా దరఖాస్తు చేసుకోవాలని సమగ్రశిక్ష అడిషినల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ పి.శ్యామ్సుందర్ తెలిపారు. సమగ్రశిక్ష ప్రాజెక్టులో కాంట్రాక్ట్ సిబ్బందిగా పనిచేస్తున్న ఐఇఆర్పీ, పీటీఐ, సీఆర్ఎంటీ, మండల స్థాయి అకౌంటెంట్, సైట్ ఇంజనీర్స్, ఎంఐఎస్ కోఆర్డినేటర్స్, డేటా ఎంట్రీ ఆపరేటర్స్, మేసెంజర్స్, ఆఫీసు సబార్టినేట్స్ తదితర సిబ్బంది రిక్వెస్ట్, సరస్పర ప్రతిపాదనల దరఖాస్తులను ఈనెల 19 నుంచి 21 లోగా సమగ్రశిక్ష ప్రాజెక్ట్ కార్యాలయంలో అందజేయాలని శ్యామ్సుందర్ తెలిపారు. మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి భీమవరం (ప్రకాశంచౌక్): యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండేలా పెద్ద ఎత్తున ప్రచారం కల్పించాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరంలో విభిన్న ప్రతిభావంతుల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ‘నషా ముక్త్ భారత్ అభియాన్’ క్యాంపెయిన్ కార్యకలాపాలపై కలెక్టర్ సంబంధిత కమిటీ సభ్యులతో సమీక్షించారు. -
విత్తన ఎంపికే కీలకం
భీమవరం: వ్యవసాయమే జీవనాధారమైన ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో సార్వా వరి సాగుకు రైతన్నలు సన్నద్ధమవుతున్నారు. ఏడాది కాలంగా రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి సాయం అందించకపోవడం, గత దాళ్వా సీజన్ ధాన్యం సొమ్ములు ఇంకా చెల్లించపోవడంతో వరిసాగుకు రైతులు మీనవేషాలు లెక్కించాల్సిన పరిస్థితి.. ధాన్యం విక్రయించిన 24 గంటల లోపు సొమ్ములు రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమచేస్తున్నామని గొప్పగా ప్రచారం చేసుకున్న ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు ఒక్క పశ్చిమగోదావరి జిల్లాలోనే దాదాపు రూ.290 కోట్లు బకాయిపడినా నోరుమెదపపోవడం పట్ల రైతన్నలు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ సాయం అందకున్నా, సకాలంలో ధాన్యం డబ్బులు చెల్లించపోయినా వరిసాగు తప్పనిసరికావడంతో సార్వా సాగుకు విత్తనాల సేకరణ, భూములు దుక్కులు వంటి పనుల్లో నిమగ్నమయ్యారు. సార్వా పంటకు అనువైన విత్తనాలు వేసుకోవడం ద్వారా మంచి దిగుబడులు సాధించవచ్చునని వ్యవసాయశాఖాధికారులు చెబుతున్నారు. ఉమ్మడి జిల్లాలో దాదాపు 5.60 లక్షల ఎకరాల్లో వరిసాగు చేస్తున్నందున విత్తన ఎంపిక కీలకం.. సార్వా వరి సాగు ప్రారంభం ఉమ్మడి పశ్చిమగోదావరిలో 5.60 లక్షల ఎకరాల్లో సాగు చీడ పీడలు తట్టుకునే రకాలు ఎంచుకోవాలి వరిసాగులో రైతులు విత్తన ఎంపికలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వాతావరణం, భూసార పరిస్థితులకు అనువైన విత్తనాలను ఎంపిక చేసుకోవడం ద్వారా మంచి దిగుబడులు సాధించవచ్చు. చీడ, పీడలను తట్టుకునే వరిరకాలను ఎంపిక చేసుకోవడం ద్వారా పెట్టుబడులు తగ్గించుకోవచ్చు. – ఎంవీ కృష్ణాజీ, ప్రధానశాస్త్రవేత్త, వ్యవసాయ పరిశోధనాస్థానం, మార్టేరు -
మహిళలకు రక్షణ కరువు
వైఎస్సార్ సీపీ జిల్లా మహిళ అధ్యక్షురాలు విజయలక్ష్మి భీమవరం: రాష్ట్రం కూటమి ప్రభుత్వ పాలనలో మహిళలకు రక్షణ లేదని, మహిళలపై దాడులు పెచ్చుమీరిపోయాయని వైఎస్సార్సీపీ మహిళ జిల్లా అధ్యక్షురాలు కోడే విజయలక్ష్మి ఆవేదన వ్యక్తంచేశారు. బుధవారం భీమవరంలో విలేకర్ల సమావేశంలో కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు. వృద్ధులు, చిన్నారులని చూడకూండా మానవ మృగాలు ప్రభుత్వ అండతో రెచ్చిపోతున్నారని వారిని అదుపుచేయడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తలు మహిళను చెట్టుకు కట్టి చిత్రహింసలకు గురి చేశారన్నారు. రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో విద్యకు అఽత్యధిక ప్రాధాన్యత ఇచ్చి అమ్మ ఒడి పథకాన్ని ఎంతో పటిష్టంగా అమలుచేస్తే నేటి కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పేరుతో అనర్హులంటూ లక్షలాది మందికి మొండిచేయి చూపిందని, తండ్రికి మాత్రం విచ్చల విడిగా మద్యం అమ్మకాలు చేయిస్తున్నారని చెప్పారు. హామీలు అమలుచేయలేక అంకెల గారడీతో ప్రజల మఽభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ప్రజలు తగిన సమయంలో గట్టిగా బుద్దిచెబుతారని విజయలక్ష్మి హెచ్చరించారు. -
తల్లికి వందనం వర్తింపజేయాలి
వీరవాసరం: తల్లికి వందనం పథకాన్ని అంగన్వాడీలకు వర్తింపజేయాలని అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ వీరవాసరం మండల కమిటీ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. సీఐటీయు జిల్లా నాయకుడు ఎం.ఆంజనేయులు మాట్లాడుతూ.. రూ.10,000 వేతనం దాటిందని, గవర్నమెంట్ ఉద్యోగి అని అంగన్వాడీలకు పథకాన్ని తిరస్కరించడం దారుణమని అన్నారు. గత ప్రభుత్వంలో అమ్మఒడి అంగన్వాడీలకు వర్తించిందని అన్నారు. అత్యధికమంది కేవలం వేతనం మీద ఆధారపడి జీవిస్తున్నారని అన్నారు. స్కీం వర్కర్లుగా, గౌరవ వేతనంతో బతికే అంగన్వాడీలకు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని అన్నారు. ఇంతవరకు అంగన్వాడీల సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదన్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే మరోసారి అంగన్వాడీలు రోడ్డు మీదకు రావడం తప్పదని అన్నారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు. -
బాబు మోసాన్ని ప్రజలు గమనిస్తున్నారు
తాడేపల్లిగూడెం అర్బన్: హామీలను నెరవేర్చిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డిపై ప్రజలు నమ్మకంతో ఉన్నారని, 143 హామీలిచ్చి ఒక్కటి కూడా నూరుశాతం అమలు చేయలేని చంద్రబాబు మోసాన్ని ప్రజలు గమనిస్తున్నారని మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. స్థానిక క్యాంపు కార్యాలయంలో జగన్ అంటే నమ్మకం, చంద్రబాబు అంటే మోసం పుస్తకావిష్కరణ కార్యక్రమంలో బుధవారం మాజీ మంత్రి కొట్టు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే చేసిన అప్పు రూ.1.50 లక్షల కోట్లని, ఏం చేశాడో లెక్కలు లేవన్నారు. అన్యాయం జరిగితే ప్రశ్నిస్తానన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఎక్కడా నోరు మెదపడంలేదన్నారు. ప్రజలు ప్రశ్నిస్తారనే భయంతో కూటమి ప్రభుత్వం రోజుకో డైవర్షన్ పాలిటిక్స్తో ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందని అన్నారు. పచ్చమీడియా బాబు మాదిరి ప్రజలను మోసం చేస్తోందని వ్యాఖ్యానించారు. సూపర్ సిక్స్ హామీల్లో సీ్త్ర శక్తి, ఉచిత బస్సు, నిరుద్యోగ భృతి, కొత్త పింఛన్లు ఇంతవరకూ అమలు చేయకపోవడం చంద్రబాబు చేతకాని పాలనకు నిదర్శమన్నారు. నారా లోకేష్ రెడ్ బుక్ పాలన పేరుతో రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ను నిద్రావస్థలోకి పంపించాడన్నారు. మహిళలపై అఘాయిత్యాలు జరుగుతుంటే సాక్షాత్తు మహిళా హోం మంత్రి మాట్లాడకపోవడం దారుణమన్నారు. అనధికార బార్లు, దాబాలు, కోడి పందేలు, మహిళలపై లైంగిక దాడులతో నియోజకవర్గం రాష్ట్రంతో పోటీపడుతుందన్నారు. స్థానిక ఎమ్మెల్యే తప్పులు చేసిన వారికే వత్తాసు పలుకుతూ బాధితులకు వ్యతిరేకంగా పోలీస్ స్టేషన్కు సిఫార్సులు చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో కొలుకులూరి ధర్మరాజు, కర్రి భాస్కరరావు, కై గాల శ్రీనివాసు, గుండుమోగుల సాంబయ్య, వీరయ్య, కంటమని సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.68 కోట్లు
ద్వారకాతిరుమల: ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయ హుండీల నగదు లెక్కింపు స్థానిక ప్రమోద కల్యాణ మండపంలో బుధవారం అత్యంత కట్టుదిట్టమైన భద్రతల నడుమ జరిగింది. ఈ లెక్కింపులో శ్రీవారికి భారీగా ఆదాయం సమకూరింది. గత 28 రోజులకు నగదు రూపేణా స్వామివాకి రూ. 3,68,88,156 ఆదాయం లభించినట్టు ఆలయ ఈఓ ఎన్వీ సత్యనారాయణ మూర్తి తెలిపారు. కానుకల రూపేణా భక్తులు సమర్పించిన 317 గ్రాముల బంగారం, 7.877 కేజీల వెండితో పాటు, అధికంగా విదేశీ కరెన్సీ లభించిందన్నారు. అదేవిధంగా లెక్కింపులోకి రాని రద్దయిన పాత రూ.2000, రూ.1,000, రూ.500 నోట్ల ద్వారా రూ. 49 వేలు లభించినట్టు చెప్పారు. -
కొల్లేరు సమస్యలపై మొర
పిడుగులు.. తస్మాత్ జాగ్రత్త వర్షాకాలం పిడుగులు పడే అవకాశాలు ఎక్కువ. తగు జాగ్రత్తలు తీసుకుంటే పిడుగు ప్రమాదాన్ని నివారించవచ్చని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. 10లో uగురువారం శ్రీ 19 శ్రీ జూన్ శ్రీ 2025ఏలూరు(మెట్రో): సుప్రీంకోర్టు ఆదేశాలతో కొల్లేరుపై కేంద్రం నియమించిన సాధికారత కమిటీ బుధవారం కొల్లేరు వాసులు, నేతల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. కొల్లేరు ప్రాంతంలోని ప్రజల జీవన స్థితిగతులు, వారి సమస్యలను ఆ ప్రాంతానికి చెందిన మహిళలు, మత్స్యకారులు, రైతులు, ప్రజాప్రతినిధులు ఏలూరు కలెక్టరేట్లోని గోదావరి సమావేశపు హాలుకు బుధవారం తరలివచ్చి తమ గోడును వెల్లబోసుకున్నారు. కేంద్ర సాధికారత కమిటీ గౌరవ సభ్యుడు చంద్రశేఖర్ గోయల్, సభ్య కార్యదర్శులు జె.ఆర్.భట్, జి.భానుమతి, కమిటీ సభ్యులు సునీల్ లిమాయే, ప్రకాష్ చంద్ర భట్లకు విన్నవించుకున్నారు. జి రాయితీ, డీ–ఫాం భూములు మినహాయించాలి పర్యావరణాన్ని పరిరక్షించడంతో పాటు స్థానికులకు జీవనోపాధితో పాటు భూములపై హక్కులు ఉండేలా చూడాలని వినతి పత్రాలు అందజేశారు. అభయారణ్యంలోని జిరాయితీ డీ–ఫామ్ భూములు మినహాయించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఫిష్ ఫార్మర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నంబూరి వెంకటరామరాజు మాట్లాడుతూ.. కొల్లేరులో పర్యావరణ, పక్షులను కాపాడేది రైతులేనని, కొల్లేరు అభయారణ్యం నోటిఫికేషన్ విడుదల చట్టంగా రూపొందించే సమయంలో పరిణామాలపై ఆ ప్రాంత ప్రజలకు ఎలాంటి అవగాహన కలిగించలేదన్నారు. అందుకే ఈ పరిస్థితి వచ్చిందన్నారు. కొల్లేరు ప్రాంతంలోని కాలువలు, డ్రెయిన్లలో చెత్తను తొలగించని కారణంగా, సరైన నిర్వహణ పనులు చేపట్టక ఏటా వరదల సమయంలో కొల్లేరు ప్రాంతం ముంపునకు గురవుతుందన్నారు. కొల్లేరు ప్రాంతంలో లక్షలాది మంది ప్రజలు జీవిస్తున్నారని, ప్రజల పౌర హక్కులకు, జీవన విధానాలకు ఎలాంటి భంగం కలగకుండా మానవీయ కోణంతో చూడాలన్నారు. శివాజీ మాట్లాడుతూ కొల్లేరు ప్రాంతంలో 122 గ్రామాలున్నాయని, అధికశాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాలకు చెందిన ప్రజలున్నారన్నారు. కొల్లేరు అభయారణ్యం చట్టం చేసినప్పుడు ఆ ప్రాంత ప్రజలకు కనీస అవగాహన కలిగించలేదన్నారు. ఆ సమయంలో ఒకే ఒక వ్యక్తి స్పందించారని, దీనినిబట్టి కొల్లేరు చట్టంపై ఏ విధమైన అవగాహన కలిగించారన్నది స్పష్టం అవుతుందన్నారు. కొల్లేరు అభివృద్ధి బోర్డు ఏర్పాటు చేయాలి కై కలూరు శాసనసభ్యులు కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ కొల్లేరు ప్రాంతంలో నివసిస్తున్న ప్రజల సమస్యలను సానుకూల దృక్పథంతో పరిశీలించి వారికి న్యాయం జరిగేలా చూడాలని కమిటీని కోరారు. కొల్లేరు అభివృద్ధి బోర్డు ఏర్పాటుచేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ కొల్లేరు అభయారణ్య పరిధిలోని 14 వేల ఎకరాల జిరాయితీ భూమిదారులు, 20 వేల ఎకరాల డీ–ఫారం పట్టాదారుల హక్కులను కాపాడాలన్నారు. కాంటూర్ పరిధిని తగ్గిస్తామని హామీ ఇచ్చారని, కానీ అది అమలు జరగలేదన్నారు. ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు, జెడ్పీ చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ, అటవీ శాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనంతరాము, అటవీ ప్రిన్సిపాల్ చీఫ్ కన్ఝర్వేటర్ అజయ్ కుమార్ నాయక్, మత్యశాఖ కమిషనర్ రమాశంకర్ నాయక్, కలెక్టర్ కె.వెట్రిసెల్వి, ఎస్పీ కె.ప్రతాప్ శివ కిషోర్, డీఎఫ్ఓలు శుభం, విజయ తదితరులు పాల్గొన్నారు. అదుపు తప్పిన కారు ద్వారకా తిరుమల వెళ్తున్న కారు అదుపుతప్పి రోడ్డు మార్జిన్లోకి దూసుకెళ్లి, టైల్స్ షాపును ఢీకొట్టింది. ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా, ఒకరు స్వల్పంగా గాయపడ్డారు. 10లో uఅధికారులతో సమీక్ష కేంద్ర సాధికారత కమిటీ సభ్యులు బుధవారం కలెక్టరేట్లో అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ గోయల్ మాట్లాడుతూ ఉప్పుటేరులోకి కలిసే ఇరిగేషన్ డ్రెయిన్లు, డ్రెయిన్ల ద్వారా కొల్లేరులోకి వచ్చే కాలుష్యం నివారణకు తీసుకుంటున్న చర్యలు, డ్రెయిన్ల డీసిల్టింగ్పై నివేదిక సమర్పించాలని ఇరిగేషన్ శాఖ ఎస్ఈ నాగార్జునరావును ఆదేశించారు. కొల్లేరు వన్యప్రాణి అభ్యయారణ్యంగా ప్రకటించక ముందు కొల్లేరు గ్రామాల్లోని అంతర్గత రోడ్లు, గ్రామాలను కలిపే లింక్ రోడ్లు, ప్రస్తుతం వాటి నిర్వహణ, కొత్తగా నిర్మించిన, నిర్మించే రోడ్లపై, కొల్లేరు అభయారణ్య పరిధిలో రోడ్ల నిర్మాణం, రోడ్ల నిర్వహణలపై ఉన్న సమస్యలపై నివేదిక అందించాలని పంచాయతీరాజ్ ఎస్ఈ రమణమూర్తిని కమిటీ సభ్యులు ఆదేశించారు. అనంతరం ఏలూరులో పారిశుద్ధ్య వ్యర్థాలు, వ్యర్థాల శుద్ధీకరణ సామర్థ్యం, కొల్లేరులో కలిసే ఏలూరు నగరంలోని పారిశుద్ధ్య వ్యర్థాలు వివరాలపై నివేదిక సమర్పించాలని నగరపాలక సంస్థ కమిషనర్ను ఆదేశించారు. కొల్లేరు పరిధిలో పర్యావరణం, కాలుష్య పరిస్థితులు, చేపల పెంపకానికి వినియోగించే నీరు, తాగునీటి కాలుష్యం, పరిశ్రమల ద్వారా కొల్లేరులోకి వెళ్లే వ్యర్థాల కారణంగా కాలుష్యం తదితర వివరాలపై సవివరమైన నివేదిక సమర్పించాలని కాలుష్య నియంత్రణ మండలి ఈఈ వెంకటేశ్వరరావును ఆదేశించారు. కొల్లేరులో చేపల పెంపకం, కాలుష్య నీటిలో ఉత్పత్తియ్యే చేపల వినియోగం కారణంగా అనారోగ్య సమస్యలు, చేపల పెంపకానికి వినియోగించే రసాయనిక ఎరువులు, పురుగుమందుల వివరాలు, వాటి కారణంగా కొల్లేరులో కలిగే కాలుష్యం తదితర విషయాలపై నివేదిక సమర్పించాలని మత్స్యశాఖ అధికారులను సూచించారు. న్యూస్రీల్ సీఈసీ బృందానికి వినతుల వెల్లువ ఏలూరు కలెక్టరేట్కు పెద్ద ఎత్తున కొల్లేరు వాసులు భూములపై హక్కులుండేలా చూడాలని విజ్ఞప్తి -
కరెంటు బిల్లు సాకుతో తల్లికి ఎగనామం
కామవరపుకోట కొత్తూరు యానాదుల కాలనీకి చెందిన చౌటూరి కోటమ్మ , భర్త సురేష్ గ్రామంలో కూలి పనులు చేసుకుని కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. తమ పిల్లలు దుర్గాప్రసాద్ ఏడవ తరగతి, దీప్తి 3వ తరగతి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. వీరికి తల్లికి వందనం సొమ్ములు జమకాలేదు. దీంతో స్థానిక సచివాలయానికి వెళ్లి అడిగితే 300 యూనిట్లు పైబడి కరెంటు వాడారని.. అందుకే తల్లికి వందనం డబ్బులు పడలేదని సిబ్బంది తేల్చిచెప్పారు. దీంతో ఆ తల్లి లబోదిబోమంది. మాది రెండు గదులు గల చిన్న ఇల్లని, ఇంటా బయట ఎల్ఈడీ బల్బులు రెండు వాడతామని దానికి 300 యూనిట్ల బిల్లు ఎలా వస్తుందని ఆమె వాపోయింది. అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని వేడుకుంటుంది. – కామవరపుకోట -
వాహన తనిఖీలపై స్పెషల్ డ్రైవ్
భీమవరం (ప్రకాశంచౌక్) : కలెక్టర్, జిల్లా రోడ్ సేఫ్టీ కమిటీ చైర్పర్సన్ ఆదేశాల మేరకు రోడ్ సేఫ్టీ డ్రైవ్లో భాగంగా బుధవారం జిల్లా వ్యాప్తంగా వాహన తనిఖీలు నిర్వహించారు. హెల్మెట్లు ధరించని వారిపై 32 కేసులు, సెల్ఫోన్ డ్రైవింగ్ 30 కేసులు, సీట్బెల్ట్ లేదని 28, ట్రిపుల్ రైడింగ్ 8, మోటార్ కార్కి ఫిలిం కలిగిన వాహనంపై 1 కేసు, నంబర్ ప్లేట్ లేదని 2, ఇన్సూరెన్సు లేనివి 3 కేసులు, డ్రైవింగ్ లైసెన్స్లు లేని వారిపై 11 కేసులు నమోదు చేసి రూ.2,46,800 అపరాధ రుసుము విధించారు. వాహన తనిఖీల్లో జిల్లా వ్యాప్తంగా 10 మంది అధికారులు పాల్గొన్నారు. డిజిటల్ అసిస్టెంట్ సస్పెన్షన్ పాలకోడేరు: పాలకోడేరు సచివాలయం –1 కి చెందిన డిజిటల్ అసిస్టెంట్ రవి నవనీత్కుమార్ను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. పంచాయతీకి సంబంధించిన రూ.75,994 ప్రభుత్వ ఖజానాకు జమ చేయకుండా నవనీత్కుమార్ తన అవసరానికి వాడుకున్నట్లు నిరూపణ కావడంతో కలెక్టర్ చదలవాడ నాగరాణి ఉల్లంఘన చట్టం అండర్ ఏపీసీఎస్ (సీసీ అండ్ ఎ) రూల్స్ 1991 ప్రకారం సస్పెన్షన్ ఆర్డర్ ఇచ్చినట్లు ఎంపీడీవో వి.రెడ్డియ్య తెలిపారు. తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు సంబంధిత ఉద్యోగి సస్పెన్షన్లోనే ఉంటాడని ఒక ప్రకటనలో తెలియజేశారు. పెళ్లి వేడుకలో ఘర్షణ.. వ్యక్తి మృతి నరసాపురం రూరల్: పెళ్లి వేడుకల్లో ఏర్పడిన ఘర్షణలో ఒక వ్యక్తి మృతి చెందాడు. నరసాపురం రూరల్ పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఈ నెల 16వ తేదీ రాత్రి మండలంలోని కొత్తనవరసపురం గ్రామంలో జరిగిన ఈద వారి వివాహ వేడుక జరిగింది. ఈ వేడుకకు వచ్చిన బంధువుల్లో మద్యం మత్తులో జవదాల విజయశేఖర్ (46)తో అదే గ్రామానికి చెందిన ఈద సునీల్ ఆనంద్, అతని తండ్రి మోహనరావు (పండు) మరికొంత మంది గొడవ పడ్డారు. దీంతో పెద్దలు వారికి సర్దిచెప్పి పంపించారు. కాసేపటికే మళ్లీ సునీల్ ఆనంద్, మరికొందరు వచ్చి విజయశేఖర్ను పొడిచి, తలపై బలంగా కొట్టడంతో అతను కోమాలోకి వెళ్లిపోయాడు. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా మంగళవారం అర్ధరాత్రి విజయశేఖర్ మృతి చెందాడు. మృతుని భార్య జవదాల గీత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ పోలీసులు తెలిపారు. -
గుండెపోటుతో కూలీ మృతి
ఆకివీడు: గుండెపోటుతో ఓ కూలీ మృతి చెందాడు. ఈ ఘటన ఆకివీడు రైల్వేస్టేషన్ వద్ద బుధవారం చోటుచేసుకుంది. స్థానిక రైల్వే స్టేషన్ వద్ద బియ్యం బస్తాల వ్యాగన్లలో కూలీలు బియ్యం లోడు చేస్తున్నారు. వారికి మంచినీళ్లు అందిస్తున్న కూలీ దుంపగడకు చెందిన నిమ్మల రాంబాబు (54) అకస్మాత్తుగా సొమ్ముసిల్లి పడిపోయాడు. తోటి కార్మికులు గమనించి అతడిని ఆసుపత్రికి తరలించేలోపు గుండెపోటుతో మృతి చెందాడు. రాంబాబుకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. విధి నిర్వహణలో మృతి చెందిన రాంబాబు కుటుంబానికి ఎఫ్సీఐ గోడౌన్ యజమాన్యం ఆర్థిక సహాయం అందజేసే విధంగా సర్పంచ్ ముద్దే విశ్వేశ్వరరావు, మాజీ ఉపసర్పంచ్ కొట్టు ఆంజనేయులు తదితరులు బాధిత కుటుంబానికి బాసటగా నిలిచారు. 21 నుంచి పాలిసెట్ సర్టిఫికెట్ల పరిశీలన తణుకు అర్బన్: డైరెక్టర్ అండ్ కన్వీనర్ పాలిసెట్ 2025 ఆదేశాల మేరకు పాలిసెట్కు అర్హత పొందిన విద్యార్థులకు తణుకు శ్రీ ముళ్లపూడి వెంకటరాయ మెమోరియల్ పాలిటెక్నిక్ కళాశాలలో హెల్ప్లైన్ సెంటర్ ఏర్పాటుచేసినట్లు ప్రిన్సిపాల్ ఎన్.తులసిరాధ తెలిపారు. కౌన్సెలింగ్ ప్రక్రియ ఈనెల 21 నుంచి 28వ తేదీ వరకు కళాశాల ప్రాంగణంలో ధ్రువపత్రాల పరిశీలన, 25 నుంచి 30వ తేదీ వరకు ఐచ్ఛికాల ఎంపిక ప్రక్రియ జరుగుతుందని జూలై 3వ తేదీన సీట్ల కేటాయింపు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. జిల్లాలోని ఎస్టీ విద్యార్థులకు ధ్రువపత్రాల పరిశీలన తణుకు హెల్ప్లైన్ సెంటర్లో మాత్రమే నిర్వహించబడుతుందని వివరించారు. కౌన్సెలింగ్ షెడ్యూలు ప్రకారం 21న 1 నుంచి 15వేలు ర్యాంకు, 22న 15,001 నుంచి 32వేలు, 23న 32,001 నుంచి 50 వేలు, 24న 50,001 నుంచి 68 వేలు, 25న 68,001 నుంచి 86 వేలు, 26న 86,001 నుంచి 1,04,000, 27న 1,04,001 నుంచి 1,20,000, 28న 1,20,001 నుంచి చివరి ర్యాంకు వరకు ధ్రువపత్రాల పరిశీలన జరుగుతుందన్నారు. వెబ్ ఆప్సన్స్ కోసం 25, 26 తేదీల్లో 1 నుంచి 50 వేలు, 27, 28 తేదీల్లో 50,001 నుంచి 90వేలు, 29, 30 తేదీల్లో 90,001 నుంచి చివరి ర్యాంకు వరకు నిర్వహిస్తామని చెప్పారు. వివరాలకు 99123 42012, 94900 32025 నంబర్లలో సంప్రదించాలని కోరారు. రివర్స్ చేస్తుండగా లారీ కింద పడి.. ఉంగుటూరు: రివర్స్ చేస్తుండగా లారీ కింద పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. వివరాల ప్రకారం చేబ్రోలు గ్రామ పంచాయతీ పరిధిలో తల్లాపురం రోడ్డును ఆనుకుని కొత్తగా వెంచర్ వేస్తున్నారు. ఆ వెంచర్లో మెరక పనులు చేస్తున్న నేపథ్యంలో లారీ రివర్స్ చేస్తుండగా లారీ కింద పడి అక్కడ పనిచేస్తున్న గాది గంటయ్య (55) అక్కడికక్కడే మృతి చెందాడు. గంటయ్యకు భార్య, వివాహం అయిన ఇద్దరు అమ్మాయిలు, అబ్బాయి ఉన్నారు. చేబ్రోలు ఎస్సై సూర్య భగవాన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
కోకో గింజల దొంగలు దొరికారు
ఏలూరు టౌన్ : కోకో గింజల చోరీ కేసులో నలుగురు దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 430 కిలోల కోకో గింజలను స్వాధీనం చేసుకున్నారు. బుధవారం ఏలూరు పోలీస్ సబ్ డివిజన్ కార్యాలయంలో ఏలూరు డీఎస్పీ డీ.శ్రావణ్కుమార్ వివరాలు వెల్లడించారు. ద్వారకాతిరుమల మండలం వేంపాడు గ్రామంలో ఆలపాటి జగదీష్కుమార్ పొలంలో ఉన్న షెడ్డులోని 160 కిలోల కోకో గింజలను ఈనెల 15వ తేదీ రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు ద్వారకాతిరుమల పోలీస్స్టేషన్లో కేసు నమోదు చేసి భీమడోలు సీఐ విల్సన్ ఆధ్వర్యంలో ఎస్సై సుఽధీర్ దర్యాప్తు చేపట్టారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో ఈనెల 17న సాయంత్రం అంగిడిగూడెం సంతమార్కెట్ సమీపంలో నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులు కామవరపుకోట మండలం తడికలపూడి గ్రామానికి చెందిన కొత్లపల్లి హర్ష, ద్వారకాతిరుమల మండలం వేంపాడు గ్రామానికి చెందిన గెద్దల నాగరాజు, ముదునూరి శివశంకర్, తడికలపూడి గ్రామానికి చెందిన జొన్నకూటి రాజేష్గా గుర్తించి వారిపై కేసు నమోదు చేశారు. నిందితులు జల్సాలు, వ్యసనాలకు బానిసలై డబ్బు సంపాదించేందుకు రాత్రివేళల్లో పొలాల్లోకి వెళ్లి కోకో గింజలను చోరీ చేస్తున్నట్లు విచారణలో అంగీకరించారు. వీరిపై దెందులూరు, తడికలపూడి, ద్వారకాతిరుమల పోలీస్స్టేషన్లలో పలు కేసులు నమోదయ్యాయి. నిందితుల నుంచి 430 కోకో గింజలను స్వాధీనం చేసుకోగా వాటి విలువ సుమారు రూ.2.15 లక్షలు ఉంటుందని పోలీసుల అంచనా. నేరానికి వినియోగించిన రెండు మోటారు సైకిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చోరీ చేసిన కోకో గింజలను పెదవేగి మండలం చక్రాయగూడెం గ్రామానికి చెందిన సిరిబత్తుల ఉదయ్కుమార్ కొనుగోలు చేయడంతో అతడ్ని కూడా నిందితుడిగా పోలీసులు గుర్తించారు. ఈ కేసును ఛేదించడంలో ప్రతిభ చూపిన సీఐ విల్సన్, ఎస్సై సుధీర్, హెచ్సీ ఎస్.శ్రీనివాస్, పీసీ ఎం.వెంకటేశ్వరరావు, సీహెచ్ లక్ష్మీనారాయణ, హెచ్జీ వీజే ప్రకాష్బాబును ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ అభినందించారు. చోరీ సొత్తు 430 కిలోల కోకో గింజల స్వాధీనం -
ద్వారకాతిరుమలలో అదుపు తప్పిన కారు
ద్వారకాతిరుమల : శ్రీవారి దర్శనార్థం క్షేత్రానికి నలుగురు యువకులతో వెళుతున్న కారు అతివేగం, నిర్లక్ష్యం కారణంగా అదుపుతప్పి రోడ్డు మార్జిన్లోని చెట్లలోకి దూసుకెళ్లి, పక్కనే ఉన్న టైల్స్ షాపును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా, ఒకరు స్వల్పంగా గాయపడ్డారు. ఈ ఘటన ద్వారకాతిరుమలలోని కుంకుళ్లమ్మ అమ్మవారి ఆలయం దాటిన తరువాత మలుపులో మంగళవారం అర్ధరాత్రి జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. భీమవరంనకు చెందిన కె.విష్ణు తన అన్న కారును తీసుకుని, అదే పట్టణానికి చెందిన తన స్నేహితుడు మనోజ్తో కలసి ద్వారకాతిరుమల క్షేత్రానికి ధైవదర్శనార్థం పయనమయ్యాడు. మార్గ మద్యలో గణపవరం మండలం పిప్పరలో మరో ఇద్దరు స్నేహితులు బండారపు మోహన వెంకట సాయి, వడ్డీల ప్రభాకర్ను కారులో ఎక్కించుకున్నాడు. అతి వేగంగా వెళుతున్న కారు ఘటనా స్థలం వద్ద మలుపులోకి వచ్చేసరికి అదుపుతప్పి, రోడ్డు మార్జిన్లోని చెట్లలోకి దూసుకెళ్లి, పక్కనే ఉన్న టైల్స్ షాపుని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో విష్ణు, మోహన్ వెంకట సాయి, ప్రభాకర్లకు తీవ్ర గాయాలు కాగా మనోజ్ మాత్రం స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. స్థానికులు హుటాహుటీన క్షతగాత్రులను 108 ఆంబులెన్స్లో ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలాన్ని ఎస్సై టి.సుధీర్ పరిశీలించారు. ముగ్గురికి తీవ్ర, ఒకరికి స్వల్ప గాయాలు -
బాలిక ఆత్మహత్యపై కేసు నమోదు
భీమడోలు : గుండుగొలనులో బాలిక ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. దీనిపై బుధవారం పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల ప్రకారం గుండుగొలనుకు చెందిన చిట్టిబొమ్మల మోక్షశ్రీ 16) స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఇటీవల పదో తరగతి పూర్తిచేసింది. 350 మార్కులతో ద్వితీయశ్రేణిలో ఉత్తీర్ణత సాధించింది. సెలవులకు అమ్మమ్మ ఇంటికి వెళ్లి వచ్చిన మోక్షశ్రీతో మంగళవారం తండ్రి పోతురాజు పాఠశాలకు వెళ్లాడు. అక్కడ నుంచి వచ్చిన తర్వాత కుమార్తె మోక్షశ్రీను మందలించాడు. టెన్త్లో సక్రమంగా చదువుకుంటే మంచి మార్కులు వచ్చేవని, ఇలాగే ఇంటర్లో కూడా చదివితే ఇబ్బందులు పడతావంటూ మందలించి బయటకు వెళ్లాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన మోక్షశ్రీ సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో వంట గదిలో ఫ్యాన్కు చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. బాలిక మృతితో కుటుంబ సభ్యులు రోదనలు మిన్నంటాయి. సమాచారం అందుకున్న భీమడోలు సీఐ యూజే విల్సన్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై చలపతిరావు తెలిపారు. -
పనికి వెళ్లినా.. నమోదు కాని హాజరు
ముసునూరు: ఫీల్డ్ అసిస్టెంట్, అతని అనుయాయులతో బెదిరింపులకు పాల్పడడంతో ఓ ఉపాధి కూలీ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. బాధితురాలు పేర్కొన్న వివరాల ప్రకారం ముసునూరుకు చెందిన చలపాటి రాణి, ఆమె భర్త తంబి ప్రతి రోజూ ఉపాధి హామీ పనులకు వెళుతున్నారు. కాని స్థానిక ఫీల్డ్ అసిస్టెంట్ దేవరపల్లి రవితేజ గ్రామస్థాయి రాజకీయాల నేపథ్యంలో గత రెండు వారాలుగా వీరికి హాజరు వేయడం లేదు. దీంతో వారు ఫీల్డ్ అసిస్టెంట్ను హాజరు విషయంపై ప్రశ్నించారు. రెచ్చిపోయిన ఫీల్డ్ అసిస్టెంట్ రోజూ పనికి వచ్చినా మీకు హాజరు వేయనని తెగేసి చెప్పాడు. నిర్ఘాంత పోయిన బాధితులు ఈ విషయంపై న్యాయం కోరుతూ జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. భయపడిన ఫీల్డ్ అసిస్టెంట్ గ్రామంలోని తన అనుయాయులు, పనిలో పాల్గొనకుండా హాజరు పొందుతున్న మరికొందరిని బాధితుల ఇంటి మీదకు ఉసిగొల్పాడు. దుక్కిపాటి విజయకుమార్, కొడవలి ఆంద్రెయ, రాజేష్, సర్వేశ్వరరావు తదితరులు తంబి ఇంటి వద్ద లేని సమయంలో బాధితుల ఇంటికి వెళ్లి దుర్భాషలాడుతూ బెదిరింపులకు దిగారు. అంతటితో ఆగకుండా నీ భర్తను చంపేస్తామంటూ రాణిని బెదిరించారు. భయభ్రాంతురాలైన ఆమె తీవ్ర మనస్తాపానికి లోనై మంగళవారం నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. స్థానికులు ఆమెను నూజివీడులోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతోంది. తమను బెదిరిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్, అతని అనుయాయుల నుంచి ప్రాణరక్షణ కల్పించాలని బాధిత కుటుంబ సభ్యులు మొరపెట్టుకుంటున్నారు. దీనిపై తమకు సమాచారం అందలేదని ఎస్సై ఎం.చిరంజీవి చెప్పారు. ఫీల్ట్ అసిస్టెంటును నిలదీసిన ఉపాధి కూలీలు తన అనుయాయులతో బెదిరింపులకు దిగిన ఫీల్డ్ అసిస్టెంట్ భయభ్రాంతులతో మహిళ ఆత్మహత్యాయత్నం -
పాటించాల్సిన జాగ్రత్తలు
● వర్షం వచ్చేటప్పుడు చెట్ల కింద ఉండరాదు. ముఖ్యంగా ఎత్తయిన చెట్టు కింద అస్సలు ఉండకూడదు. ● ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం వస్తే రైతులు పొలాల వద్ద బహిరంగ ప్రదేశాల్లో ఉండకూడదు. ● లక్షల డిగ్రీల ఉష్ణోగ్రతతో విడుదలయ్యే వేడి ఒక్కసారిగా మనిషిని చేరగానే గుండైపె ప్రభావం చూపుతుంది. ● వర్షపు సూచన ఉన్నప్పుడు గొడుగులపై ఇనుప బోల్టులు, కెమేరాలు, సెల్ఫోన్లు దగ్గర లేకుండా చూసుకోవాలి. లేకుంటే రేడియేషన్ తరంగాలకు గురై ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ● మెరుపులు, పిడుగుల వల్ల విద్యుత్ ఉపకరణాలు కాలిపోయే అవకాశం ఉంది. ఆ సమయంలో టీవీలకు ఉన్న విద్యుత్ కేబుల్ కనెక్షన్ తొలగించాలి. ● వర్షం పడుతున్న సమయంలో విద్యుత్ తీగల కింద ట్రాన్స్ఫార్మర్ సమీపంలో ఉండకూడదు. తడి ప్రదేశాల్లో ఉండకపోవడం చాలా మంచిది. -
ప్రశ్నిస్తానన్న పవన్.. ఏమైపోయావ్?: కొట్టు సత్యనారాయణ
సాక్షి, పశ్చిమగోదావరి: కూటమి ప్రభుత్వ ఏడాది పాలనలో ప్రజలు మోసపోయారని.. రాష్ట్రంలో ఎక్కడ అన్యాయం జరిగిన ప్రశ్నిస్తానన్న పవన్ కళ్యాణ్ ఏమైపోయారంటూ మాజీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ నిలదీశారు. బుధవారం ఆయన ‘‘జగన్ అంటే నమ్మకం-చంద్రబాబు అంటే మోసం’’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ.. ఏపీలో అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి లోకేష్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారంటూ మండిపడ్డారు.‘‘చంద్రబాబు 1 లక్ష 50 కోట్ల రూపాయలు అప్పు తెచ్చి తమ యంత్రాంగానికి దోచిపెడుతున్నారు. యువగళం పాదయాత్రలో జాబ్ క్యాలెండర్ ఇస్తానన్న లోకేష్ ఆ హామీ మరిచిపోయారా?. తల్లికి వందనం పథకంపై కూటమి నాయకులు డబ్బులు కోరుకుంటున్నారు. ఏడాది కూటమి పాలనలో స్త్రీ శక్తి పథకం డబ్బులు ఎవరికీ వేశారు?. రాష్ట్ర మహిళలు ఉచిత బస్సులో ప్రయాణిస్తున్నారా?. ఏ ఆగస్ట్లో ఈ ఉచిత బస్సు అమలు చేస్తారు?’’ అంటూ కొట్టు సత్యనారాయణ ప్రశ్నించారు.‘‘కూటమి పాలనలో వ్యవసాయ రంగంలో పూర్తిగా దెబ్బతింది. ప్రజలు ప్రభుత్వన్ని నిలదీస్తారని రాష్ట్రంలో డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారు. వైఎస్ జగన్ హయాంలో డీబీటీ ద్వారా నేరుగా ప్రజల అకౌంట్లో డబ్బులు జమ చేసేవాళ్లం. పోలవరం ప్రాజెక్టు సృష్టికర్త వైఎస్సార్పై కూడా విమర్శలు చేస్తున్నారు. 1 లక్ష 50 వేల కోట్లలో పోలవరానికి ఎంత కేటాయించారు?. మైనింగ్ కార్పొరేషన్లో గనులకు వచ్చే లక్షల కోట్ల రూపాయల మధ్యవర్తుల జేబుల్లోకి వెళ్తున్నాయి’’ అని కొట్టు సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘పిఠాపురంలో జనసేన కార్యకర్త అన్యాయన్నీ ప్రశ్నించాడని ఊరు నుంచి వెలివేస్తే పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించలేదు. సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో మహిళను చెట్టుకు కట్టేస్తే వీడియో కాల్లో పరామర్శిస్తారా?’’ అంటూ కొట్టు సత్యనారాయణ మండిపడ్డారు. -
కనెక్షనే లేదు.. బిల్లు ఎక్కువ వచ్చిందంటా
రెండవ తరగతి చదువుతున్న మా పాపకు ‘తల్లికి వందనం’ డబ్బులు వేయలేదు. సచివాలయానికి వెళ్లి అడిగితే కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందని చెబుతున్నారు. ఆక్వా పట్టుబడులకు రోజువారీ కూలీ పనులకు వెళ్లే మేము ఇటీవలే ఇంటి నిర్మాణం చేపట్టాం. ఇంకా కరెంటు కనెక్షన్ కూడా ఇవ్వలేదు. – సంగాని కనకదుర్గ, బియ్యపుతిప్ప నేనుండేది అద్దె ఇంట్లో.. నాకు 8 మీటర్లా? ఈ ప్రభుత్వం మాలాంటి పేదలకు అన్యాయం చేయడం దుర్మార్గం. అద్దె ఇంటిలో ఉంటున్న నాకు 8 విద్యుత్ కనెక్షన్లు చూపిస్తున్నాయని చెబుతున్నారు. తల్లికి వందనం ఇవ్వకుండా కుంటి సాకులు చూపడం అన్యాయం. సమస్య పరిష్కారం కోసం నరసాపురం విద్యుత్ సబ్ స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేశాను. – ఇందుకూరి సోమేశ్వరరావు. నరసాపురం కరెంట్ బిల్లు రూ.వంద లోపే ఎన్నికల ముందు పిల్లలందరికీ తల్లికి వందనం వేస్తామన్నారు. మొదటి ఏడాది ఎలాగూ వేయలేదు. నాకు పాప, బాబు ఉంటే ఇప్పుడూ ఒక్కరికీ కూడా వేయలేదు. మాకు కరెంటు బిల్లు వంద రూపాయల లోపే వస్తుంది. అయినా 300 యూనిట్లకంటే ఎక్కువ వినియోగిస్తున్నారనే సాకుతో పథకాన్ని నిలిపివేశారు. – మత్తి జాన్శామ్యూల్, నరసాపురం, క్రిస్టియన్పేట ఒక్కరికీ ఇవ్వలేదు నాకు రెండవ తరగతి చదివే మనుమడు, మూడవ తరగతి చదివే మునుమరాలు ఉన్నారు. ఒక్కరికీ తల్లికి వందనం డబ్బులు వేయలేదు. మాకు కరెంటు బిల్లు రూ.150 మాత్రమే వస్తుంటే.. కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందంటున్నారు. మాలాంటి వాళ్లను ఇబ్బందులకు గురిచేయడం సరికాదు. – పిల్లి సుగుణమ్మ, మల్లవరం -
విద్యుత్ సబ్స్టేషన్ వద్ద పడిగాపులు
యలమంచిలి: అధిక విద్యుత్ వినియోగం సాకుతో ప్రభుత్వం చాలామందికి శ్రీతల్లికి వందనంశ్రీ సొమ్ములు జమ చేయలేదు. దీంతో తల్లులు లబోదిబోమంటున్నారు. సోమవారం లబ్ధిదారులంతా సచివాలయానికి వెళ్లి అడిగితే రూ.300 యూనిట్ల లోపే విద్యుత్ వినియోగం ఉంటే కరెంట్ ఆఫీస్ నుంచి సర్టిఫికెట్ తెచ్చుకుంటే గ్రీవెన్స్లో పెడతామని చెప్పారు. దీంతో మండల వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో లబ్థిదారులు మంగళవారం ఉదయం నుంచి విద్యుత్ సబ్స్టేషన్ వద్ద పడిగాపులు పడ్డారు. విద్యుత్ శాఖ సిబ్బంది ప్రతి ఒక్కరీ విద్యుత్ బిల్లు, సెల్, ఆధార్ నెంబర్లతో ఆన్లైన్లో తనిఖీ చేసి అంత వాడకం లేని వారందరికీ సర్టిఫికెట్లు అందజేశారు. అయితే ఒక్కసారిగా వందల సంఖ్యలో లబ్థిదారులు విద్యుత్ సబ్ స్టేషన్కు తరలిరావడంతో బిల్లులు తనిఖీ చేయడానికి సిబ్బంది నానాయాతన పడుతున్నారు. -
వినతులు.. వేడుకోళ్లు..
కై కలూరు: అయ్యా.. మా జీవనోపాధికి గండికొట్టారు. నష్టపరిహారం చెల్లించకుండా కొల్లేరు ఆపరేషన్లో జిరాయితీ, ఢీపాం భూములలో చెరువులను ధ్వంసం చేశారు. కొల్లేరు గ్రామాల్లో చచ్చిన శవాలను పూడ్చాలన్నా.. అటవీశాఖ నిబంధనలు అడ్డువస్తున్నాయి. మా భూములు తిరిగి ఇచ్చేయండి అంటూ కొల్లేరు ప్రజలు సుప్రీంకోర్టు పంపించిన కేంద్ర సాధికార కమిటీ(సీఈసీ) ముందు గోడు వెళ్లబోసుకున్నారు. సాధికారిత కమిటీ ఏలూరు నుంచి మధ్యాహ్నం 3 గంటలకు కై కలూరు నియోజకవర్గం మణుగునూరులంక వద్దకు వచ్చారు. సమీప కొల్లేరు గ్రామాల ప్రజలు రోడ్లుపై నిలుచున్నారు. ముందుగా పెదఎడ్లగాడి నుంచి కొల్లేరు నీటి ప్రవాహాన్ని పరిశీలించారు. ప్రజలందరూ అక్కడికి వచ్చి సీఈసీ కమిటీనికి వినతిపత్రాలు అందించారు. అక్కడ నుంచి మార్గమధ్యలో కొల్లేరు ప్రాంతాలను చూస్తూ సీఈసీ కమిటీ ముందుగా సాగింది. కలెక్టర్, ఎస్పీ, ఎమ్మెల్యేలు కామినేని, ధర్మరాజులతో కలసి వచ్చిన సీఈసీ వాహనాలు వీరికి తెలియకుండా కలకర్రులో కొల్లేరును పరిశీలించారు. పెద ఎడ్లగాడి వద్ద దాదాపు 30 నిమషాలు కలెక్టర్, ఎస్పీ సీఈసీ కోసం వేచి ఉన్నారు. ప్రజాప్రతినిధులు అధికారులకు సంబంధించి 40 కార్లు ఉండటంతో ట్రాఫిక్నకు అంతరాయం కలిగింది. ఆటపాక పక్షుల కేంద్రంలో సమావేశం ఆటపాక పక్షుల కేంద్రం పక్షి నమూనా మ్యూజియాన్ని సీఈసీ బృందం పరిశీలించింది. అక్కడ కొంత సమయం అటవీ అధికారులు, ప్రజాప్రతినిధులతో సమావేశమయ్యారు. పక్షుల కేంద్రంలో నీరు లేకపోవడం, వివిధ రకాల పక్షుల గురించి అటవీశాఖ అధికారులు వివరించారు. పక్షుల కేంద్రం సమీపంలోని దెందులూరు నియోజకవర్గం కోమటిలంక ప్రజలు ఎమ్మెల్యే చింతమనేనితో కలసి సీఈసీ సభ్యులకు వినతపత్రం అందించారు. గ్రామానికి అవసరమైన రహదారిని నిర్మించాలని కోరారు. వంతన లేకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. వేలాదిగా ప్రజలు కేంద్ర సాధికారిత కమిటీకి అర్థమయ్యే విధంగా ఇంగ్లీషులో ప్లకార్డులను కొల్లేరు ప్రజలు ప్రదర్శించారు. సీఈసీ రాక నేపథ్యంలో కై కలూరు, ఉండి నియోజకవర్గాల పరధిలోని కొల్లేరు గ్రామాల్లో పెద్దలు, మహిళలు, పిల్లలు వేలాదిగా తరలివచ్చారు. సేవ్ పూర్ పీపుల్ ఎడ్యుకేషన్, ప్లీజ్ సేవ్ అజ్, వుయ్ సేవ్ బర్ట్స్.. యూ సేవ్ ఫిషర్మెన్స్ వంటి నినాదాల కార్డులను ప్రదర్శించారు. ఎమ్మెల్యే కామినేని తెలుగును ఇంగ్లీషులో అనువదించి సీఈసీకి వివరించారు. సీఈసీ నుంచి వచ్చిన నలుగురు సభ్యుల్లో జి.భానుమతికి తెలుగు భాష వచ్చినప్పటికీ ఆమె ప్రసంగించలేదు. ఎంపీపీ అడవి కృష్ణ, రాష్ట్ర చేపల రైతు సంఘ అధ్యక్షుడు తాడినాడ బాబు, కొల్లేరు కమిటీ సభ్యుడు నంబూరి శివాజీరాజు, కొల్లి బాబీ, పూల రాజీ, బీకేఎం.నానీ త్రినాథరాజు, సీపీఎం నాయకులు బలరాం, రవి తదితరులు పాల్గొన్నారు. ఆశల పల్లకీలో కొల్లేరు ప్రజలు సీఈసీ కమిటీకి అర్జీలు జనసంద్రమైన పందిరపల్లిగూడెం -
కొందరికే తల్లికి వందనం
నరసాపురం రూరల్: కూటమి సర్కార్ అట్టహాసంగా అమలు చేసిన శ్రీతల్లికి వందనంశ్రీ నిరుపేద తల్లులకు అందకుండా పోయింది. పథకం అమలుకు సవాలక్ష నిబంధనలు విధించిన కూటమి సర్కార్ అంతిమంగా అర్హులకు మొండిచేయి చూపింది. ఇంట్లో ఎంతమంది విద్యార్థులుంటే అందరికీ ఏటా రూ.15 వేల చొప్పున క్రమం తప్పకుండా ఇస్తామని ఎన్నిక వేళ హామీ ఇచ్చిన చంద్రబాబు అధికారంలోకి వచ్చి ఏడాది గడిచాక రూ.13 వేలే అంటూ మాటమార్చారు. అది కూడా అందరికీ ఇవ్వకుండా మోసం చేశారు. దీంతో చంద్రబాబు మాటలు నమ్మి తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలల్లో చదివిస్తున్న నిరుపేద కుటుంబాల వారు శాపనార్థాలు పెడుతున్నారు. నిబంధనలతో కొర్రీలు తల్లికి వందనం కింద ఎంత మంది విద్యార్థులుంటే అందరికీ రూ.15 వేలు చొప్పున ఇస్తామన్న చంద్రబాబు.. పథకం అమల్లోకి వచ్చేసరికి సవాలక్ష నిబంధనలు విధించారు. యూడైస్ ప్రకారం జాబితాలు సేకరించామని చెబుతున్నప్పటికీ చదువుతున్న విద్యార్థుల సంఖ్యకు ప్రభుత్వం సేకరించిన గణాంకాలకు తేడా ఉన్నట్లు తెలుస్తోంది. కూటమి సర్కార్ (2024–25 విద్యా సంవత్సరం) లో తల్లికి వందనం పథకం కింద విద్యార్థులకు ఇవ్వాల్సిన మొత్తం ఎగవేసి ఈ సంవత్సరం ఇస్తామన్న మొత్తంలో కూడా భారీగా కోతలు విధించి అర్హత ఉన్నప్పటికీ చాలా మందికి శ్రీతల్లికి వందనంశ్రీ ఆర్థిక సాయం మొత్తం ఖాతాల్లో జమ కాలేదు. దీంతో లబ్ధిదారులు సచివాలయాలు, బ్యాంకులు, కరెంటు ఆఫీసుల వద్దకు పరుగులు తీస్తున్నారు. బ్యాంకు ఖాతాల్లో తల్లికి వందనం డబ్బు జమకానట్లు తెలియడంతో చాలామంది ఉసూరు మంటూ వెనుదిరిగి వెళుతున్నారు. నరసాపురం మండలం, పట్టణంలలో ఎక్కువమందికి విద్యుత్ వినియోగం ఎక్కువ అనే కారణంతో పథకం సొమ్ములు జమకాలేదని తెలియడంతో నరసాపురం పట్టణంలోని విద్యుత్సబ్ స్టేషన్ వద్ద గత రెండు రోజులుగా పథకం లబ్ధిదారులు క్యూకడుతున్నారు. జగన్ హయాంలో విప్లవాత్మక మార్పులు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో విద్యార్థుల భవితకు బాటలు వేశారు. అమ్మ ఒడి పథకాన్ని ప్రారంభించి ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేశారు. అంతేకాకుండా శ్రీనాడు– నేడుశ్రీ పనులతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చేశారు. విదేశీ విద్యా దీవెన, గోరుముద్ద తదితర పథకాలతో విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చిన విషయాన్ని విద్యార్థులు వారి తల్లిదండ్రులు జ్ఞప్తికి తెచ్చుకుంటున్నారు. నిబంధనల పేరుతో చాలామందికి ఎగనామం మండలానికి వెయ్యి మందికి పైగా కోత కరెంట్ బిల్లులను సాకుగా చూపి అర్హులకూ మొండిచేయి మాట తప్పిన చంద్రబాబుపై మండిపడుతున్న జనం -
రొయ్యకు సిండి‘కాటు’
సాక్షి, భీమవరం: వారం వ్యవధిలో వనామీ రొయ్యల ధరలు అమాంతం పడిపోయాయి. నిన్నమొన్నటి వరకు కిలో రూ.240 ఉన్న 100 కౌంట్ ధర రూ.200 నుంచి రూ.180కి తగ్గించేయడం ఆక్వా రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. ప్రాసెసింగ్ ప్లాంట్ల యజమానులు, ఎగుమతిదారులు సిండికేట్గా మారి ధరలు తగ్గించేస్తున్నారని రైతులు వాపోతున్నారు. కూటమి ప్రభుత్వం సిండికేటుకు కొమ్ముకాస్తోందని విమర్శిస్తున్నారు. అమెరికా పన్నుల పేరిట దోపిడీ వేసవి ఉష్ణోగ్రతలు అనుకూలించి మార్కెట్లోకి రొయ్యలు రావడం పెరగడంతో ఎగుమతిదారులు, ప్రాసెసింగ్ ప్లాంట్ల యజమానులు, వ్యాపారులు ఏకమై ధరలు తగ్గిస్తూ వచ్చారు. ఏప్రిల్ 3న అమెరికా ప్రతీకార సుంకాల ప్రకటన వెలువడే నాటికి 30 కౌంట్ ధర రూ.460, 40 కౌంట్ ధర రూ.370, 100 కౌంట్ ధర రూ.230కి తగ్గించేశారు. అమెరికా పన్నులను సాకుగా చూపించి కౌంట్కు కేజీకి రూ.30 నుంచి రూ.70 వరకు కోత పెట్టారు. ఇప్పట్లో పన్నులు లేవని తర్వాత అమెరికా ప్రకటించినా సిండికేట్ వర్గాలు ధరలను పెంచకపోవడం గమనార్హం. కంటితుడుపు చర్యలతో సరి ఫీడ్ ప్లాంట్ల యజమానులు మేత ధరలు పెంచేయడం.. ప్రాసెసింగ్ ప్లాంట్ల యజమానులు, ఎగుమతిదారులు ఏకమై తమ కష్టాన్ని దోచుకుంటుంటే కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఏప్రిల్లో రైతులు రోడ్డెక్కి నిరసనలు తెలిపారు. పాలకొల్లు, నరసాపురం, ఆచంట నియోజకవర్గాల్లోని జై భారత్ క్షీరారామ ఆక్వా రైతు సంఘం ఆధ్వర్యంలో పంట విరామం సైతం ప్రకటించారు. ఈ పరిణామాలతో ఉలిక్కిపడిన ప్రభుత్వం ఉండిలో ఆక్వా సదస్సు, విజయవాడలో ప్రాన్స్ కో–ఆర్డినేషన్ కమిటీ సమావేశాల్లో మేత ధరలను కేవలం టన్నుకు రూ.4 వేలు మాత్రమే తగ్గించడం, 100 కౌంట్ ధరను స్వల్పంగా పెంచడం తదితర కంటితుడుపు చర్యలతో సరిపెట్టింది. మళ్లీ ధరలు పతనం వారం క్రితం 100 కౌంట్ ధర దాదాపుగా రూ.240 ఉండగా, 30 కౌంట్ ధర రూ.385, 40 కౌంట్ ధర రూ.325, 50 కౌంట్ ధర రూ.295, 60 కౌంట్ ధర రూ.265 వరకు ఉన్నాయి. రానున్న సీజన్కు గాను మరలా చెరువులను సిద్ధం చేసుకునేందుకు రైతులు పట్టుబడులు ముమ్మరం చేయడంతో మార్కెట్లోకి రొయ్యలు రావడం ముమ్మరమైంది. ఇదే అదునుగా తిరిగి సిండికేట్లు ధరలను తగ్గించేస్తున్నాయి. పెద్ద రైతులైతే ఎక్కువ టన్నుల్లో పట్టుబడులు జరిగి 100 కౌంట్కు రూ.210 వరకు ధర చెల్లిస్తుంటే.. చిన్న రైతులు మూడు టన్నుల లోపు పట్టుబడులు చేయడం వల్ల పట్టుబడి పరిమాణం బట్టి 100 కౌంట్ రొయ్యలను రూ.200 నుంచి రూ.180కు కొనుగోలు చేస్తున్నట్టు రైతులు చెబుతున్నారు. మిగిలిన కౌంట్ల ధరలు సైతం తగ్గించేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతికూల వాతావరణం, నాణ్యత లేని సీడ్, ఫీడ్తో ఇబ్బందులు పడుతుంటే ధరల పతనం తమను మరింత నష్టాల్లోకి నెట్టేస్తోందని వాపోతున్నారు. నాడు అప్సడాతో అండ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం 2020లో ఏపీ స్టేట్ ఆక్వా డెవలప్మెంట్ అథారిటీ (అప్సడా)ని ఏర్పాటు చేసి హేచరీలు, ఫీడ్, ప్రాసెసింగ్ ప్లాంట్ల ఆగడాలకు చెక్ పెట్టింది. ప్రతి 10 రోజులకు ఒకసారి సమావేశమై ధరల స్థిరీకరణకు చర్యలు తీసుకుంది. రైతులకు లాభసాటి ధర అందేలా పనిచేసింది. ఆక్వా రంగం కుదేలు ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షలాది మంది కుటుంబాలకు ఉపాధి కల్పిస్తున్న ఆక్వా రంగం సిండికేటు దోపిడీతో సంక్షోభంలో కూరుకుపోతోంది. సీడ్, ఫీడ్, లీజు, మెడిసిన్ ధరలు 100 శాతం పెరగ్గా.. రొయ్యల ధర మాత్రం పతనమవుతోంది. ఇదే పరిస్థితి కొనసాగితే సాగు చేయడం చాలా కష్టం. ఇప్పటికే ఎకరాకు రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు నష్టపోతున్నాం. – పొత్తూరి శ్రీనివాసరాజు, ఆక్వా రైతు, కలగంపూడి గత ప్రభుత్వంలో ఇలా లేదు ఎగుమతిదారులు, ప్రాసెసింగ్ ప్లాంట్ల యజమానులు సిండికేట్ అయి ఇష్టానుసారం ధరలు తగ్గించేస్తున్నారు. టన్నులను బట్టి 100 కౌంట్ రూ.210 నుంచి రూ.180కి కొంటున్నారు. గత ప్రభుత్వంలో ఈ పరిస్థితి ఉండేది కాదు. ధరలు స్థిరంగా ఉండేవి. ఇప్పుడు రోజుకు ఎలా మారతాయో తెలియడం లేదు. ఆక్వా రైతులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. – పెనుమాల నరసింహస్వామి, ఆక్వా రైతు, గొల్లవానితిప్ప -
తాడేపల్లిగూడేనికి ఎయిర్పోర్టు
తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టు నిర్మించే దిశగా అడుగులు పడుతున్నాయి. కేంద్రం నుంచి భూసేకరణకు ఉత్తర్వులు అందాయి. 8లో uకొల్లేరును 3వ కాంటూరుకు కుదించాలి కేంద్ర కమిటీకి సీపీఎం వినతిఏలూరు (ఆర్ఆర్పేట): కొల్లేరును 3వ కాంటూరుకు కుదించి, వారి ఉపాధిని కాపాడి, అక్కడి ప్రజలను ఆదుకోవాలని కొల్లేరులో మంగళవారం పర్యటించిన సీఈసీకి సీపీఎం ఏలూరు జిల్లా కమిటీ వినతి పత్రం సమర్పించింది. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కమిటీ నాయకులు మాట్లాడుతూ కొల్లేరును 5 నుండి 3వ కాంటూరుకు కుదిస్తామన్న పాలకుల హామీలు అమలు కాలేదని, కొల్లేరులో 46 బెడ్ గ్రామాలు, 74 బెల్ట్ గ్రామాలలో మూడు లక్షల మంది మత్స్యకారులు, దళితులు ఉన్నారన్నారు. 1975–76 సంవత్సరాలలో అప్పటి వెంగళరావు ప్రభుత్వం 146 సొసైటీలు ఏర్పాటు చేసి 7100 ఎకరాలలో చేపల చెరువులు తవ్వించారని అన్నారు. కొల్లేరు ఆపరేషన్ సందర్భంగా వేలాది ఎకరాల్లో చేపల చెరువులను ధ్వంసం చేశారని, అయితే ఆ సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని, కొల్లేరు ప్రజలకు జీవనోపాధి కల్పించాలని కోరారు. కొల్లేరు ప్రజల సమస్య శాశ్వత పరిష్కారానికి చర్యలు చేపట్టాలని, ప్రస్తుత అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి, సుప్రీంకోర్టుకు నివేదించాలని కోరారు. కొల్లేరులో ఉన్న వేలాది ఎకరాల ప్రభుత్వ భూములు పేదలకు పంచాలని, అటవీ అధికారుల వేధింపులు, అవినీతి అరికట్టాలని కోరారు. కమిటీని కలిసిన వారిలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బీ బలరాం, జిల్లా కార్యదర్శి ఏ రవి తదితరులున్నారు. -
గూడెంలో మద్యం పరవళ్లు
వాణిజ్య కేంద్రంగా పేరొందిన తాడేపల్లిగూడెం ఇప్పుడు లిక్కర్ సిండికేట్కు అడ్డాగా మారింది. అడ్డూ అదుపూ లేకుండా నిరంతరం మద్యం అమ్మకాలు సాగిపోతున్నాయి. దాబాల్లో సైతం లిక్కర్ సులువుగా దొరుకుతోంది. ఈ సిండికేట్ను నడిపించేది కూటమి నేతలే కావడంతో ఎకై ్సజ్, పోలీస్ అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. సాక్షి, భీమవరం: జిల్లాకు ముఖ్య వాణిజ్య కేంద్రమైన తాడేపల్లిగూడెం ఉల్లి, బెల్లం, మామిడి, పప్పు దినుసుల వ్యాపారానికి ప్రఖ్యాతి. చుట్టుపక్కల ప్రాంతాల వారితో పాటు ఇతర జిల్లాల నుంచి హోల్సేల్, రిటైల్ వ్యాపారులు, వినియోగదారులు, సరుకుల రవాణ వాహనాలతో రోజూ పట్టణానికి భారీగా వచ్చి వెళ్తుంటారు. ఇంత ప్రాముఖ్యమున్న పట్టణంలో మద్యం పరవళ్లు తోక్కుతోంది. గత ప్రభుత్వంలో చాలా వరకు ఊరికి దూరంగా ఉన్న మద్యం షాపులను కూటమి ప్రభుత్వం తెచ్చిన ప్రైవేట్ మద్యం పాలసీతో సిండికేట్లు ఇప్పుడు పట్టణంలోని జనావాసాలు, ప్రధాన కూడళ్లు, రద్దీ ప్రాంతాల్లోకి తెచ్చేశాయి. ఎకై ్సజ్ పాలసీకి విరుద్ధంగా షాపుల వద్దనే కూర్చుని తాగేందుకు టేబుళ్లు, కుర్చీలతో సిట్టింగ్ ఏర్పాట్లు చేశారు. మందులోకి మంచింగ్, ఫాస్ట్ఫుడ్స్ అందిస్తున్నారు. ఉదయం పది గంటల నుంచి రాత్రి పది గంటల వరకు మాత్రమే అమ్మకాలు చేయాల్సి ఉండగా వేళాపాలా లేకుండా ఇష్టానుసారంగా షాపులు నిర్వహిస్తున్నారు. నిర్ణీత సమయం దాటాక బాటిల్పై అధనంగా రూ. 10 నుంచి రూ. 20 వరకు పెంచి అమ్మకాలు చేస్తున్నట్టు మందుబాబులు చెబుతున్నారు. తాడేపల్లిగూడెం సర్కిల్ పరిధిలోని తాడేపల్లిగూడెం అర్బన్, రూరల్, పెంటపాడు మండలాల్లో 38 మద్యం దుకాణాలు ఉన్నాయి. వీటిలో పట్టణ పరిధిలో 12 షాపులు, నాలుగు బార్ అండ్ రెస్టారెంట్లు ఉన్నాయి. నియోజకవర్గంలోని ఒక్కో షాపు పరిధిలో రెండు నుంచి ఐదు వరకు బెల్టులు తెరిచి బాటిల్పై రూ.30 నుంచి రూ.40 వరకూ అదనంగా అమ్ముతున్నారు. కొందరు మొబైల్ బెల్టులు నిర్వహిస్తూ నేరుగా మందుబాబుల వద్దకే వెళ్లి మద్యం అందిస్తున్నారు. సిండికేట్ కనుసన్నల్లోనే వీటి నిర్వహణ జరుగుతోంది. సరసమైన ధరలకే సరసమైన ధరలకే మద్యం దొరుకుతుందంటూ కొన్ని దుకాణాల వద్ద గతంలో బోర్డులు సైతం వెలిశాయి. ఇటీవల వెన్నుపోటు దినం కార్యక్రమంలో ఈ బోర్డులు, విచ్చలవిడిగా సాగుతున్న మద్యం అమ్మకాలు గురించి మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ విమర్శలు చేయడంతో సంబంధిత అధికారులు ఆగమేఘాలపై షాపుల వద్ద బోర్డులను తొలగించారు. గతంలో నిబంధనలు అమలు బెల్ట్ షాపులపై దాడులు నామమాత్రమే తాడేపల్లిగూడెం సర్కిల్ పరిధిలో బెల్టు అమ్మకాలుపై ఇప్పటి వరకు 85 కేసులు నమోదుచేసిన ఎకై ్సజ్ పోలీసులు 85 మందిని అరెస్టు చేసి వారి నుంచి 160 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అయినా ఎక్కడా తగ్గకుండా బెల్టుల నిర్వహణ యథేచ్ఛగా సాగుతోంది. నిబంధనలు తుంగలోకి తొక్కడంతో నియోజకవర్గంలో మద్యం అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. ప్రైవేట్ షాపులు ప్రారంభించిన గత ఏడాది అక్టోబరు 16 నుంచి ఈ ఏడాది మార్చి నెలాఖరు నాటికి సర్కిల్ పరిధిలో 1,93,792 కేసుల లిక్కర్, 73,019 కేసుల బీర్లు విక్రయాలు జరగగా వీటిలో అధిక శాతం తాడేపల్లిగూడెంలోనే జరిగినట్టు సమాచారం. గత మూడు నెలల్లో ఈ అమ్మకాలు మరింత పెరిగాయి. గత ప్రభుత్వ మద్యం దుకాణాలతో పోలిస్తే లిక్కర్ సేల్స్ భారీగా పెరిగినట్టు గణాంకాలు చెబుతున్నాయి. తాడేపల్లిగూడెంలో విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు బార్లను తలదన్నేలా షాపుల వద్ద సిట్టింగ్ ఏర్పాట్లు దాబాల్లోనూ మద్యం లభ్యం గత ఐదున్నర నెలల్లో 1,93,792 కేసుల లిక్కర్, 73,019 కేసుల బీర్లు విక్రయాలు దాబాల్లో విచ్చలవిడిగా మద్యం పట్టణంలో పది వరకు దాబాలు ఉండగా పలుచోట్ల ఫుడ్తో పాటు మద్యం కూడా అందిస్తున్నారు. ఎమ్మార్పీ ధరపై క్వార్టర్ బాటిల్కు అదనంగా రూ. 30, బీర్లకు రూ. 40 వరకు పెంచి సరఫరా చేస్తున్నారు. బార్లను తలపించేలా మందుబాబుల కోసం రాత్రి వేళల్లో ఆరుబయట మంచాలు ఏర్పాటుచేసి మరీ దాబాలను నిర్వహిస్తున్నట్టు స్థానికులు చెబుతున్నారు. పట్టణ శివార్లు, హైవేకు సమీప దాబాల్లో ఈ తరహా అమ్మకాలు ఎక్కవగా జరుగుతున్నాయి.. వైఎస్సార్సీపీ హయాంలో నిబంధనల మేరకు మద్యం అమ్మకాలు సాగేవి. బెల్టుషాపులు అరికట్టడంతో పాటు నిర్ణీత వేళల్లో మాత్రమే అమ్మకాలు చేసేవారు. షాపుల వద్ద కొనుగోలు చేసి తీసుకువెళ్లిపోవడమే తప్ప తాగేందుకు వీలు లేకుండా చేశారు. షాపుల నిర్వహణ ప్రభుత్వ అధీనంలో ఉండటంతో మద్యం ఆదాయం పూర్తిగా ప్రభుత్వ ఖజానాకు చేరేది. కాగా కూటమి ప్రభుత్వం మద్యాన్ని మరలా ప్రైవేట్ పరం చేయడంతో సిండికేట్లు ఇష్టారాజ్యంగా మారింది. -
వైఎస్ జగన్ను కలిసిన మురళీకృష్ణంరాజు
సాక్షి, భీమవరం: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని మంగళవారం తాడేపల్లిలో పార్టీ నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడు ముదునూరి మురళీకృష్ణంరాజు మర్యాదపూర్వకంగా కలిశారు. పార్లమెంట్ పరిధిలో పార్టీ కార్యక్రమాల నిర్వహణ, కూటమి ప్రభుత్వ వైఫల్యాలు, సూపర్ సిక్స్ హామీలను గాలికొదిలేసి ప్రజలను మోసగిస్తున్న తీరు తదితర అంశాలపై అధినేతతో చర్చించినట్టు మురళీకృష్ణంరాజు తెలిపారు. కొల్లేరు వాసుల నుంచి వినతిపత్రాల స్వీకరణ ఏలూరు(మెట్రో): కేంద్ర సాధికారిత కమిటీ కొల్లేరు ప్రాంతంలో క్షేత్రస్థాయి పర్యటన అనంతరం మంగళవారం రాత్రి ఏలూరు కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో దెందులూరు, ఏలూరు, ఉంగుటూరు మండలాలకు చెందిన పలువురు రైతులు, కొల్లేరు వాసులు, పర్యావరణవేత్తలు అందజేసిన వినతిపత్రాలను స్వీకరించింది. కార్యక్రమంలో కమిటీ మెంబరు కార్యదర్శులు డా.జె.ఆర్.భట్, జి.భానుమతి, కమిటీ సభ్యులు సునీల్ లిమాయే, ప్రకాష్ చంద్రభట్లతో పాటు ఎమ్మెల్యేలు కామినేని శ్రీనివాస్, పత్సమట్ల ధర్మరాజు, చింతమనేని ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. మహిళలకు రక్షణ కరువు ఏలూరు టౌన్: రాష్ట్రంలో మహిళలకు, యువతులకు రక్షణ లేకుండా పోయిందని, ఏకంగా సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గంలోనే మహిళలపై దౌర్జన్యాలు, దాడులు జరుగు తున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారని ఏలూరు జిల్లా వైఎస్సార్సీపీ మహిళా అధ్యక్షురాలు కేసరి సరితారెడ్డి తెలిపారు. ఒక మహిళ హోమంత్రిగా ఉంటున్నా మహిళలకు రక్షణ లేకపోవటం సిగ్గుచేటని, ఒక మహిళను పట్టపగలు నడిరోడ్డుపై ఈడ్చుకుంటూ తీసుకువెళ్ళి చెట్టుకు కట్టేసి కొట్టడం దారుణమన్నారు. ఇలాంటి దాడులు, దౌర్జన్యాలపై ప్రభుత్వం స్పందించలేదని, కనీసం దోషులను అరెస్ట్ చేయలేదని, ఈ సంఘటనకు బాధ్యులైన వారిపై కేసులు నమోదు చేసి బాధిత మహిళకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మహిళల కోసం శక్తి యాప్ పెట్టాం, ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామని చెప్పుకునే కూటమి ప్రభుత్వం మహిళపై దాడికి పాల్పడినా ఏ విధమైన చర్యలు తీసుకోకపోవటం బాధాకరమని తెలిపారు. వైఎస్సార్సీపీ అనుబంధ విభాగాల్లో నియామకాలు భీమవరం: జిల్లాకు చెందిన పలువురిని రాష్ట్ర అనుబంధ విభాగ కమిటీల్లో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు నియమించినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం మంగళవారం తెలిపింది. రాష్ట్ర ఎస్టీ సెల్ వైస్ ప్రెసిడెంట్గా సాలా నరసయ్య (పాలకొల్లు), ఎస్టీ సెల్ జనరల్ సెక్రటరీగా బి.విజయరాం(నరసాపురం), ఎస్టీ సెల్ సెక్రటరీగా మేకల ఏడుకొండలు(తాడేపల్లిగూడెం), రాష్ట్ర రైతు విభాగం జాయింట్ సెక్రటరీగా పరిమి వెంకటేశ్వరరావు (తాడేపల్లిగూడెం), రాష్ట్ర ఇంటలెక్చువల్ ఫోరం సెక్రటరీగా ఎస్ఎస్ ప్రసాద్(తాడేపల్లిగూడెం), రాష్ట్ర అంగన్వాడీ వింగ్ వైస్ ప్రెసిడెంట్గా మద్దా చంద్రకళ(పాలకొల్లు), రాష్ట్ర గ్రీవెన్స్ సెల్ సెక్రటరీగా మారిశెట్టి శేషగిరిరావు(తణుకు), రాష్ట్ర కల్చరల్ వింగ్ వైస్ ప్రెసిడెంట్గా ఆకుల పాండుస్వామి(తణుకు), రాష్ట్ర వీవర్స్ వింగ్ జనరల్ సెక్రటరీగా ఎస్.మల్లిఖార్జునరావు (పాలకొల్లు) నియమితులయ్యారు. డీఎస్సీ పరీక్షకు 94 శాతం హాజరు భీమవరం: జిల్లాలోని 5 పరీక్షా కేంద్రాల్లో మంగళవారం నిర్వహించిన మెగా డీఎస్సీ పరీక్షకు 94.66 శాతం అభ్యర్థులు హాజరయ్యారని జిల్లా విద్యాశాఖాధికారి ఇ.నారాయణ చెప్పారు. ఉదయం నిర్వహించిన పరీక్షకు 636 మందికి 615 మంది హాజరుకాగా మధ్యాహ్నం పరీక్షకు 581 మందికి 537 మంది హాజరయ్యారు. ఎక్కడా మాల్ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని నారాయణ తెలిపారు. -
కొల్లేరు సమస్యలను సుప్రీంకు నివేదిస్తాం
సీఈసీ సభ్యుడు చంద్రశేఖర్ గోయల్ ఏలూరు(మెట్రో): కొల్లేరు ప్రాంత సమస్యలపై రెండు రోజులు అధ్యయనం అనంతరం నిర్ధేశించిన కాలపరిమితిలోపు నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పిస్తామని సీఈసీ సభ్యుడు చంద్రశేఖర గోయల్ వెల్లడించారు. ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో విస్తరించిన కొల్లేరు సరస్సు ప్రాంత ప్రజల సమస్యలపై సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అధ్యయనం చేసేందుకు గోయల్ నేతృత్వంలో బృందం మంగళవారం జిల్లాకు చేరుకుంది. ఏలూరులో రాత్రి మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. 1999లో కొల్లేరు పరిరక్షణ అంశం నోటిఫై చేశారన్నారు. కొల్లేరు విషయంలో రీమార్కేషన్, సంబంధిత విషయాల్లో కొన్ని సమస్యలు ఉన్నాయని, ఈ విషయం సుప్రీంకోర్టు దృష్టికి వెళ్లిందన్నారు. ఈ విషయంలో కొన్ని నిర్ణయాలు తీసుకున్నప్పటికీ.. ఇంకా పరిష్కారం కాని అంశాలు ఉన్నాయని గోయల్ చెప్పారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు దృష్టికి వచ్చిన అంశాలపై నివేదిక ఇవ్వాలని తమ కమిటీని నియమించారని, ఆ దిశగా తొలిరోజు ఏలూరు జిల్లా పరిధిలోని కొల్లేరు గ్రామాల్లో పర్యటించామన్నారు. అక్కడ వాస్తవ పరిస్థితి, ప్రజలతో ముఖాముఖి, తమకు ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం పరిశీలించామని వివరించారు. తొలిరోజు పర్యటన తమ పరిశీలనలో ముందడుగు అన్నారు. స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, కేంద్ర మంత్రితో భేటీ అయ్యామని చెప్పారు. బుధవారం ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లా అధికారులుతో మరో సమావేశం నిర్వహిస్తామన్నారు. ఈ రెండు రోజుల పర్యటన అనంతరం గుర్తించిన అంశాలను నివేదిక రూపంలో సుప్రీంకోర్టుకు సమర్పిస్తామని వెల్లడించారు. ఈ ప్రక్రియ పూర్తి చేసి నివేదిక ఇచ్చేందుకు సుప్రీంకోర్టు తమకు 12 వారాల గడువు ఇచ్చిందని చెప్పారు. సమావేశంలో కమిటీ మెంబరు కార్యదర్శులు డా.జె.ఆర్.భట్, జి.భానుమతి, కమిటీ సభ్యులు సునీల్ లిమాయే, ప్రకాష్ చంద్రభట్లతో పాటు అటవీశాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ అజేయ్ కుమార్ నాయక్, మత్స్యశాఖ కమిషనరు రమాశంకర్ నాయక్, కలెక్టర్ కె.వెట్రిసెల్వి, ఎస్పీ కె.పి.ఎస్.కిషోర్, తదితరులు పాల్గొన్నారు. మంగళవారం ఏలూరు చేరుకున్న కేంద్ర సాధికార కమిటీ సభ్యులకు కలెక్టర్ ఘనంగా స్వాగతం పలికారు. -
మున్సిపల్ కార్మికులకు ‘తల్లికి వందనం’ వర్తింపజేయాలి
భీమవరం: భీమవరం మున్సిపల్ కార్మికులందరికీ తల్లికి వందనం పథకం వర్తింప చేయాలని, ఇంజినీరింగ్ కార్మికుల కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మంగళవారం మున్సిపల్ కార్యాలయం వద్ద సీఐటీయు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఉపాధ్యక్షుడు బి.వాసుదేవరావు మాట్లాడుతూ మున్సిపాలిటీని నమ్ముకుని ఎన్నో ఏళ్లుగా పని చేస్తున్న కార్మికులకు ప్రభుత్వ పథకాలు అమలు చేయకపోవడం దారుణమన్నారు. తల్లికి వందనం పథకం పారిశుధ్య కార్మికుల కుటుంబాలకు వర్తింప చేయకపోవడం దారుణమన్నారు. అరకొర జీతాలతో పనిచేస్తున్న స్కీం కార్మికులందరిని తల్లికి వందనం పథకానికి దూరం చేశారని, 300 యూనిట్లు విద్యుత్ వినియోగం, రూ.20 వేల జీతం సాకుతో పథకాన్ని నిలుపుదల చేయడం దారుణమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, ఆందోళన చేపడతారని హెచ్చరించారు. అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రం మున్సిపల్ మేనేజర్కు అందచేశారు. ధర్నాలో యూనియన్ నాయకులు నీలాపు రాజు, ఎస్కే నాగూర్, బంగారు వరలక్ష్మి, చిన్న పెద్దిరాజు, మామిడి శివ, పళ్ల రాజు తదితరులు పాల్గొన్నారు. -
ధాన్యం.. రైతు దైన్యం
సాక్షి, భీమవరం : జిల్లాలోని 2.2 లక్షల ఎకరాల్లో దాళ్వా సాగు చేయగా 9.25 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని వ్యవసాయశాఖ అంచనా వేసింది. ఓపెన్ మార్కెట్లో విక్రయాలు, నిల్వ నిమిత్తం 1.50 లక్షల టన్నులు మినహాయించగా, 7.75 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలుకు సిఫార్సు చేసింది. కాగా ఆరు లక్షల టన్నుల సేకరణకు మాత్రమే తొలుత కూటమి ప్రభుత్వం సివిల్ సప్లయీస్ అధికారులకు ఆదేశాలిచ్చింది. ప్రభుత్వ తీరుపై రైతుల నుంచి నిరసనలు వ్యక్తం కావడంతో తర్వాత మరో 1.5 లక్షల టన్నులు సేకరించేందుకు అనుమతినిచ్చింది. రూ.290 కోట్ల బకాయిలు ధాన్యం అమ్మిన 24 గంటల్లోనే చెల్లింపులు చేస్తున్నట్టు కూటమి ప్రభుత్వం చెబుతుండగా క్షేత్రస్థాయిలో అందుకు భిన్నమైన పరిస్థితులు ఉన్నాయి. రబీ సీజన్లో జిల్లాలో దాదాపు 77 వేల మంది రైతుల నుంచి రూ.1,650 కోట్లు విలువైన 7.17 లక్షల టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది. వీటిలో రూ.1,360 కోట్లు రైతుల ఖాతాలకు జమచేసింది. 18 వేల మందికి పైగా రైతులకు సంబంధించి రూ.290 కోట్ల మేర బకాయిలు ఉన్నాయి. దాదాపు నెల రోజులుగా ప్రభుత్వం ధాన్యం సొమ్ముల చెల్లింపులను నిలిపివేసినట్టు తెలుస్తోంది. సాగు చివరిలో ప్రతికూల వాతావరణం ఇబ్బంది పెట్టినా వ్యయప్రయాసలకోర్చి ధాన్యాన్ని ప్రభుత్వానికి విక్రయిస్తే సొమ్ములివ్వకుండా ఇబ్బంది పెడుతోందని రైతులు వాపోతున్నారు. గత నెలలో జిల్లాలో పర్యటించిన రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, రాష్ట్ర పర్యాటక, గృహనిర్మాణశాఖల ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అజయ్జైన్లు మాట్లాడుతూ ధాన్యం విక్రయించిన 24 గంటల్లోనే రైతుల ఖాతాలకు నగదు జమచేస్తున్నట్టు తెలపగా అప్పటికే రూ.కోట్లల్లో ధాన్యం బకాయిలు ఉన్నట్టు సమాచారం. రైతులకు చెల్లించాల్సిన సొమ్ములను ప్రభుత్వం వేరే అవసరాల నిమిత్తం దారి మళ్లించడమే బకాయిలు పేరుకుపోవడానికి కారణంగా తెలుస్తోంది. ఖరీఫ్ సాగుపై ప్రభావం కాలువలకు నీరు విడుదల కావడం, రుతుపవనాల ప్రభావంతో వర్షాలు మొదలవ్వడంతో జిల్లాలోని 2.05 లక్షల ఎకరాల్లో తొలకరి సాగుకు రైతులు సిద్ధమవుతున్నారు. నారుమడులు సిద్ధం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. పెట్టుబడుల నిమిత్తం ధాన్యం సొమ్ముల కోసం ఎదురు చూస్తున్నారు. సకాలంలో ప్రభుత్వం నుంచి డబ్బులు పడకపోతే బయట అధిక వడ్డీలకు అప్పులు చేసి పెట్టుబడులు పెట్టాల్సి వస్తుందని వాపోతున్నారు. ధాన్యం బకాయిల విడుదలకు ప్రభుత్వం సత్వర చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. ఈ విషయమై ఉన్నతాధికారులకు నివేదించామని, ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కావాల్సి ఉందని సంబంధిత అధికారులు తెలిపారు. 24 గంటల్లోనే ధాన్యం సొమ్ములంటూ కూటమి ప్రగల్భాలు నెలరోజులైనా అందక రైతుల ఎదురుచూపులు జిల్లాలో దాదాపు 18 వేల మంది రైతులకు రూ.290 కోట్ల మేర బకాయిలు సొమ్ములు చెల్లించాలని కూటమి నేతలే సోషల్ మీడియాలో పోస్టులు ఖరీఫ్ పెట్టుబడులకు సొమ్ముల్లేక రైతుల ఇక్కట్లు అయ్యా.. ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు, నారా లోకేష్కి విన్నపం.. ఆరు నెలలు రైతు కష్టపడి పండించిన పంట మన ప్రభుత్వం కొని నెల రోజులు గడిచినా రైతులకు డబ్బులు ఇవ్వలేదు. ఎక్కడో లోపం ఉంది. ఒక రైతు దగ్గర ధాన్యం మే 2న ప్రభుత్వం కొన్నది. ఇప్పటివరకూ డబ్బులు ఖాతాల్లో పడలేదు. మన ప్రభుత్వం ధాన్యం ఎగుమతి చేసిన 24 గంటల్లో అమౌంట్ పడిపోతుందని చెప్పింది.. అది జరగడం లేదు. సోషల్ మీడియాలో తణుకు ప్రాంతానికి చెందిన ఓ టీడీపీ నేత పెట్టినట్టుగా భావిస్తున్న ఈ పోస్టు జిల్లాలో రైతులకు ధాన్యం నగదు చెల్లింపులో జరుగుతున్న తీవ్ర జాప్యానికి అద్దం పడుతోంది. అప్పులు చేయాల్సిన దుస్థితి నాలుగు ఎకరాలు కౌలుకు వ్యవసాయం చేస్తున్నాను. ధాన్యం మే నెల 11న మిల్లుకు వెళ్లింది. సుమారు 150 బస్తాలకు రూ.2.50 లక్షలు రావాలి. ఇప్పటికీ ఒక్క రూపాయి ఇవ్వలేదు. ఇప్పుడు సార్వా నారుమడులు వేయాలంటే అప్పు చేయాల్సిన దుస్థితి. రెండు రోజుల్లో ధాన్యం డబ్బులు వేస్తామని చెప్పి ఇలా మోసం చేయడం తగదు. – రుద్రరాజు శివరామరాజు, నారినమెరకవెంటనే డబ్బులు చెల్లించాలి ధాన్యం తోలి నెల రోజులు కావస్తున్నా డబ్బులు బ్యాంకుకు జమ కాలేదు. నాలుగు ఎకరాలు వరి సాగు చేస్తున్నాను. నాతో పాటు ఇతర రైతులకు కలిపి సుమారు రూ.3 లక్షల వరకు ప్రభుత్వం నుంచి రావాల్సి ఉంది. ప్రభుత్వం వెంటనే ధాన్యం డబ్బులు చెల్లించాలి. లేకుంటే చాలా ఇబ్బందులు పడతాం. – కర్రి వెంకటేశ్వర రెడ్డి, రాయకుదురు -
డీపీఓగా రామ్నాథ్రెడ్డి
భీమవరం (ప్రకాశంచౌక్): పశ్చిమగోదావరి జిల్లా పంచాయతీ అధికారి (డీపీఓ)గా ఎన్.రామ్నాథ్రెడ్డి, భీమవరం అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్గా ఎ.రాంబాబు సోమవారం పదవీ బాధ్యతలు చేపట్టారు. వీరు సోమవారం కలెక్టరేట్లో కలెక్టర్ సీహెచ్ నాగరాణిని కలిసి పూలమొక్కలు అందించారు. జిల్లాను పరిశుభ్రంగా ఉంచేందుకు, ప్లాస్టిక్ నిషేధాన్ని అమలు చేసేందుకు కృషి చేయాలని కలెక్టర్ సూచించారు. జేసీ టి.రాహుల్కుమార్రెడ్డి ఉన్నారు. వృద్ధుల ఆస్తులకు రక్షణ కల్పించాలి భీమవరం: తల్లిదండ్రుల సంరక్షణ, పోషణ చట్టాన్ని పటిష్టంగా అమలుచేయాలని, ట్రిబ్యునల్ తీర్పును కచ్చితంగా అమలు జరిగేలా చూడాలని జిల్లా వృద్ధుల సంక్షేమ సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అడ్డాల సత్యనారాయణ, కొటికలపూడి చిట్టి వెంకయ్య డిమాండ్ చేశారు. సోమవారం ప్రపంచ వయోవృద్ధుల వేధింపుల నివారణ, అవగాహన దినోత్సవం సందర్భంగా భీమవరం కలెక్టరేట్ వద్ద ధర్నా చేశారు. వృద్ధుల సంక్షేమానికి ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని, వృద్ధుల ప్రాణాలు, ఆస్తులకు రక్షణ కల్పించాలని, మండలానికి కనీసం ఒక వృద్ధాశ్రమాన్ని ప్రభుత్వమే ఏర్పాటు చేసి నిర్వహించాలన్నారు. డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టర్ నాగరాణికి అందజేశారు. అప్పిలేట్ ట్రిబ్యునల్ మెంబర్ మేళం దుర్గాప్రసాద్, మట్లపూడి సత్యనారాయణ, నల్లం వెంకట కృష్ణ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కూటమిలో సోషల్ మీడియా చిచ్చు పెనుగొండ: సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీ కార్యకర్త పెట్టిన పోస్టులు ఆచంట నియోజకవర్గంలో చిచ్చురేపాయి. జనసేన పార్టీపై ఆక్రోశం వెళ్లగక్కుతూ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్పై పోస్టులు పెట్టి అవహేళన చేస్తుండటంతో జనసేన కార్యకర్తలు రగిపోతున్నారు. అనుచిత పోస్టులపై పోడూరు, ఆచంట, పెనుమంట్ర, పెనుగొండ పోలీస్స్టేషన్లలో సోమవారం ఫిర్యాదు చేశారు. అలాగే పెనుగొండ సర్పంచ్ భర్త నక్కా వేదవ్యాస శాస్త్రి, అతడి సోదరుడు శర్మలపై ఆరోపణలు చేస్తూ పోస్టింగ్ పెట్టడం వివాదంగా మారింది. దీనిపై మాలమహానాడు నాయకులు పోలీసులను ఆశ్రయించారు. ఎస్పీ వరకూ ఫిర్యాదులు చేశారు. ఫిర్యా దులు వెల్లువెత్తడంతో ఆ గ్రూపు అడ్మిన్ను ఆచంట పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసి, అరెస్ట్ చేయాలంటూ జనసేన నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఆ గ్రూపులో సదరు వ్యక్తి మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ అడ్వయిజరీ కమిటీ సభ్యుడు చెరుకువాడ శ్రీరంగనాథరాజు, హై కోర్టు అడ్వకేట్ ఇండుగపల్లి రామానుజం, జనసేన నాయకుడు కంబాల బాబులుపైనా అనుచిత వ్యాఖ్యలు చేస్తూ పోస్టులు పెట్టారు. మున్సిపల్ కార్మికుల నిరసన తాడేపల్లిగూడెం (టీఓసీ): మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగంలోని ఔట్ సోర్సింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, లేకుంటే సమ్మె తప్పదని ఏపీ మున్సిపల్ ఇంజనీరింగ్ విభా గపు కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ పట్టణ నాయకులు హెచ్చరించారు. స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద సోమవారం వారు నిరసన తెలిపారు. నాయకులు నూకపల్లి శేఖర్, యర్రంశెట్టి నాగేశ్వరరావు మాట్లాడుతూ చాలాకాలంగా తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నా ప్రభుత్వం పట్టించుకోవ డం లేదన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హా మీలు నెరవేర్చాలని, వేతనాలు పెంచాలని, బెనిఫిట్స్ అందజేయాలని కోరారు. హెడ్వాట ర్ వర్క్స్, అవుట్ డోర్ వాటర్ సప్లయ్, ఆ ఫీస్ ఎలక్ట్రీిషియన్స్, కంప్యూటర్ ఆపరేటర్లు, ఆఫీస్, ఇంజనీరింగ్ సెక్షన్ సిబ్బంది పాల్గొన్నారు. -
జగన్ అంటే నమ్మకం.. చంద్రబాబు అంటే మోసం
కాళ్ల : వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అంటే నమ్మకం.. టీడీపీ అధినేత చంద్రబాబు అంటే మోసం, ద్రోహం అని ప్రజలకు కూటమి ఏడాది పాలనలో తెలిసిందని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు అన్నారు. మండలంలోని పెద అమిరంలోని పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్, నరసాపురం పార్లమెంట్ పరిశీలకులు ముదునూరి మురళీకృష్ణరాజు కలిసి సోమవారం జగన్ అంటే నమ్మకం.. చంద్రబాబు అంటే మోసం ప్రజాకోర్టు చార్జ్షీట్ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ముదునూరి మాట్లాడుతూ జగన్ ఐదేళ్ల పాలన, కూటమి ఏడాది పాలనపై ప్రజలకు అవగాహన కల్పించేలా పుస్తకాన్ని రూపొందించినట్టు చెప్పా రు. రాష్ట్ర ప్రజలు జగన్, చంద్రబాబు పాలనను బేరీజు వేసుకుంటున్నారన్నారు. 2024 ఎన్నికల్లో సూపర్సిక్స్ హామీలిచ్చి ఐదు కోట్ల ప్రజల్ని వెన్ను పోటు పొడిచారని ఎద్దేవా చేశారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంలా భావించి అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే హామీలను అమలుచేశారని గుర్తుచేశారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రశ్నించే గొంతులను నొక్కే ప్రయ త్నం చేస్తోందని ఆరోపించారు. కూటమి పాలనలో మోసపోయినట్టు ప్రజలు గ్రహిస్తున్నారన్నారు. వైఎస్సార్సీపీ ఎల్లవేళలా ప్రజల పక్షాన ఉంటుంద న్నారు. కూటమి ప్రభుత్వం హామీలు అమలుచేసే వరకూ ఒత్తిడి తెస్తామని ముదునూరి తెలిపారు. 30 లక్షల మంది తల్లులకు ద్రోహం నరసాపురం పార్లమెంట్ పరిశీలకుడు ముదునూరి మురళీకృష్ణరాజు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో రైతులకు అన్నదాత సుఖీభవ సాయం, మహిళలకు ఆడబిడ్డ నిధి (నెలకు రూ.1,500), నిరుద్యోగ భృతి వంటి పథకాలు అమలు చేయలేదని ఎద్దేవా చేశారు. తల్లికి వందనం పేరుతో 30 లక్షల మంది పిల్లలకు ద్రోహం చేశారన్నారు. అందరికీ తల్లికి వందనం ఇచ్చి అప్పుడు సంబరాలు చేసుకుంటే ప్రజలు కూడా హర్షిస్తారన్నారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని అన్నారు. జగన్ పాలనను గుర్తుచేసుకుంటూ.. ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్ మాట్లాడుతూ గత ప్రభు త్వంలో మాజీ సీఎం జగన్ రాష్ట్రంలో మూడు పో ర్టులు తీసుకువస్తే కూటమి ప్రభుత్వం పక్కన పడేసిందన్నారు. అలాగే 17 మెడికల్ కాలేజీలను పూర్తిచేయగా వాటినీ పక్కన పెట్టేశారన్నారు. అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. మాట మీద నిలబడ్డ జగన్ను ప్ర జలు గుర్తు చేసుకుంటున్నారన్నారు. నియోజకవర్గ ఇన్చార్జులు చినమిల్లి వెంకట్రాయుడు (భీమవరం), గుడాల గోపి (పాలకొల్లు), రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి కర్ర జయసరిత, పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు కోడె విజయలక్ష్మి, పెండ్ర వీరన్న, చిగురుపాటి సందీప్, కోడె యుగంధర్, గాదిరాజు రామరాజు, పేరిచర్ల విజయరామరాజు, మంతెన సునీల్వర్మ, పెనుమత్స ఆంజనేయరాజు, చేకూరి నరేంద్ర వర్మ, అంబటి రమేష్, కొండేటి శివకుమార్, నాయకులు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు -
●మీకో దండం.. తల్లికి వందనం ఇప్పించండి
ఫిర్యాదులపై సత్వర చర్యలు భీమవరం: ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్ఎస్)లో వచ్చిన ఫిర్యాదులపై సమగ్రమైన విచారణ జరిపి సత్వర పరిష్కారం చూపాలని ఎస్పీ అద్నాన్ నయీం అస్మి అన్నారు. సోమవారం భీమవరంలోని జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో పీజీఆర్ఎస్ కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి ఫిర్యాదుల స్వీకరించారు. పలు ప్రాంతాల నుంచి 15 ఫిర్యాదులు అందగా సంబంధిత స్టేషన్ల అధికారులతో ఎస్పీ ఫోన్లో మాట్లాడారు. జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్) వి.భీమారావు, జిల్లా స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ వి.పుల్లారావు, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ దే శంశెట్టి వెంకటేశ్వరరావు, మహిళా పోలీస్స్టేషన్ ఇన్స్పెక్టర్ అహ్మదున్నీషా పాల్గొన్నారు. -
యోగా జీవితంలో భాగం కావాలి
నరసాపురం: యోగా దైనందిన జీవితంలో భాగం కావాలని కలెక్టర్ సీహెచ్ నాగరాణి సూచించారు. యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా సోమవారం జిల్లా రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో మొగల్తూరు మండలం కేపీపాలెం బీచ్లో యోగాసనాలు వేశారు. జిల్లాలో గ్రామ, మండల, డివిజన్ స్థాయిల్లో 4,635 ప్రాంతాల్లో యోగా అభ్యసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. యోగాతో సంపూర్ణ ఆరోగ్యం సొంతమవుతుందన్నారు. ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్, జిల్లా ఎస్పీ నయీం అస్మి, జేసీ టి.రాహూల్కుమార్రెడ్డి, డీఆర్వో ఎం.వెంకటేశ్వరరావు, ఆర్డీఓ దాసి రాజు, డీఎస్పీ డి.శ్రీవేద, యోగా టీచర్ టి.శిరీష తదదితరులు పాల్గొన్నారు. 19న విష్ణు కళాశాలలో.. భీమవరం: యోగాంధ్రలో భాగంగా ఈనెల 19న భీమవరం విష్ణు కాలేజీ ఆవరణలో సుమారు 5 వేల మంది అథ్లెట్లు, క్రీడాకారులు, యువతతో యోగా ప్రదర్శన నిర్వహించనున్నట్టు కలెక్టర్ తెలిపారు. సోమవారం కళాశాలలో ఏర్పాట్లను ఆమె పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. -
కొల్లేరు దస్త్రాలతో సిద్ధం కండి
కై కలూరు: కొల్లేరులో క్షేత్రస్థాయి పరిశీలనకు కేంద్ర సాధికారత కమిటీ (సీఈసీ) మంగళ, బుధవారాల్లో పర్యటించనున్న నేపథ్యంలో అటవీశాఖ అధికారులు అన్ని దస్త్రాలను సిద్ధం చేసుకోవాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఆదేశించారు. రూట్మ్యాప్ పరిశీలన నిమిత్తం నిడమర్రు మండలం తోకలపల్లి, మండవల్లి మండలం మణుగునూరు, పులపర్రు, కై కలూరు మండలం ఆటపాక, ఆలపాడు, కొల్లేటికోట ప్రాంతాల్లో ఎమ్మెల్యేలు కామినేని శ్రీనివాస్, పత్సమట్ల ధర్మరాజుతో కలిసి సోమవారం ఆమె పర్యటించారు. కొల్లేరులో నివాసిత ప్రాంతాలు, జిరాయితీ, డీఫాం భూములు, 2006 సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఎలా అమలు చేశారనే విషయాలను కమిటీ పరిశీలిస్తుందని కలెక్టర్ తెలిపారు. ఎమ్మెల్యే కామినేని మా ట్లాడుతూ కొల్లేరులో వాస్తవ పరిస్థితులను పరిశీలించి మూడు నెలల్లో నివేదిక సుప్రీంకోర్టుకు అందిస్తారన్నారు. ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు మాట్లాడుతూ కొల్లేరు పరిరక్షణ, ప్రజల ఇబ్బందులను కమిటీ దృష్టికి తీసుకువెళతామన్నారు. జిల్లా అటవీ శాఖ అధికారి బి.విజయ, ఎంపీపీ అడవి కృష్ణ, వైస్ ఎంపీపీ మంగినేని రామకృష్ణ, రాష్ట్ర చేపల రైతు సంఘ అధ్యక్షుడు నంబూరి వెంకటరామరాజు (తాడినాడ బాబు) తదితరులు ఉన్నారు. సీఈసీ పర్యటన ఇలా.. ఏలూరు(మెట్రో): కేంద్ర సాధికార కమిటీ (సీఈసీ) మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంటకు ఏలూరు చేరుకుంటుంది. మధ్యాహ్నం 1.30 గంటల నుంచి 4 గంటల మధ్య కలకుర్రు, మణుగునూరు, ఆటపాక, కొల్లేటికోటను సందర్శిస్తారు. సాయంత్రం 4 గంటలకు కొల్లేటికోటలో రైతులు, కొల్లేరువాసులతో సమావేశమవుతారు. 5 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి ఏలూరు చేరుకుంటారు. సా యంత్రం 6 గంటలకు ఏలూరు కలెక్టరేట్లో దెందులూరు, ఏలూరు, ఉంగుటూరు మండలాల రైతు లు, కొల్లేరువాసులు, అధికారులతో సమావేశమవుతారు. 18న ఉదయం 8 గంటల నుంచి 12.30 గంటల మధ్య నిడమర్రులో జిరాయితీ భూములను, కొల్లేరు వన్యప్రాణి అభయారణ్యం ప్రాంతాలను పరిశీలిస్తారు. ఉంగుటూరులో కలెక్టర్ పర్యటన ఉంగుటూరు: నియోజకవర్గంలోని కొల్లేరు పరీవాహక ప్రాంతాలను కలెక్టర్ వెట్రిసెల్వి, ఎమ్మెల్యే ధర్మరాజు పరిశీలించారు. తోకలపల్లి, వెంకటకృష్ణాపురం, రామన్నగూడెం, నిడమర్రు, ఉంగుటూరు మండలాల్లో పర్యటించి రైతులతో మాట్లాడారు. -
శ్రీవారి సేవలో న్యాయమూర్తులు
ద్వారకాతిరుమల: ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయాన్ని సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ (సీఏటీ) న్యాయమూర్తులు సోమవారం సందర్శించారు. ఆలయానికి విచ్చేసిన న్యాయమూర్తులు డాక్టర్ లతా బస్వరాజ్ పాట్నే, షాలిని మిశ్రా (రిటైర్డ్ ఐఏఎస్), రిజిస్ట్రార్ జి.నవీన్ కుమార్, సీఏటీ సిబ్బందికి ముందుగా దేవస్థానం అధికారులు మర్యాద పూర్వకంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు స్వామి, అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ముఖ మండపంలో అర్చకులు, పండితులు వారికి స్వామివారి శ్రీవారి శేష వస్త్రాన్ని కప్పి, వేద ఆశీర్వచనాన్ని పలుకగా, ఆలయ ఏఈఓ రమణరాజు, సూపరింటెండెంట్ హయగ్రీవాచార్యులు చిన వెంకన్న చిత్రపటాలను, ప్రసాదాలను వారికి అందజేశారు. పోక్సో కేసులో యావజ్జీవశిక్ష వీరవాసరం: బాలికను మోసపూరిత మాటలతో మభ్యపెట్టి, బెదిరించి, గర్భవతిని చేసిన కేసులో నిందితుడికి జీవిత కాల కఠిన కారాగార శిక్షతో పాటు లక్ష రూపాయలు జరిమానా విధిస్తూ పోక్సో కోర్టు న్యాయమూర్తి బి.లక్ష్మీనారాయణ సోమవారం తీర్పు చెప్పారు. జరిమానాలో రూ.80 వేలు బాధితురాలికి నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని కొణితివాడకు చెందిన కండెల్లి రమేష్ స్థానిక బాలిక (16)ను మోసపూరిత మాటలతో మభ్యపెట్టి, బెదిరించి గర్భవతిని చేశాడంటూ ఆమె తండ్రి 2020 జూలై 13న పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిపై నేరం రుజువవడంతో జడ్జి తీర్పు చెప్పారు. -
వంతెనకు రంధ్రం.. అవస్థల్లో జనం
ఉంగుటూరు: మండలంలోని నారాయణపురం వద్ద జాతీయరహదారికి అనుసంధానంగా ఉన్న వంతెనకు భారీ రంధ్రం పడటంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. భీమవరం నుంచి గణపవరం మీదుగా నారాయణపురం వద్ద జాతీయరహదారికి చేరుకునేందుకు కీలకంగా ఉన్న ఈ వంతెనకు ఆదివారం రంధ్రం పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలీసులు ఈ మార్గంలో వాహనాల రాకపోకలను నిలిపివేశారు. ద్విచక్ర వాహనాలు మినహా మరే ఇతర వాహనాలూ వెళ్లకుండా బారికేడ్లు, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. వంతెనపై పెద్ద వాహనాల రాకపోకలకు అవకాశం లేకుండా మట్టిని, రాళ్ల గుట్టలను అడ్డుగా వేశారు. ద్విచక్ర వాహనదారులు వాటి మధ్యే ఇబ్బందులు పడుతూ రాకపోకలు సాగిస్తున్నారు. కార్లు తదితర వాహనాలు నారాయణపురం శివారులో ఉన్న మట్టి రోడ్డు ద్వారా ఉంగుటూరుకు, మరికొన్ని తల్లాపురం రోడ్డు మీదుగా చేబ్రోలు వంతెనకు చేరుతున్నాయి. మరికొందరు వాహనదారులు చేబ్రోలు పోలీస్స్టేషన్ నుంచి కాలువ గట్టు మీదుగా రాకపోకలు సాగిస్తున్నారు. ఈ మార్గాలు అంత అనుకూలంగా లేకపోవడంతో తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఎట్టకేలకు ఆర్అండ్బీ అధికారుల రాక వంతెనకు ఆదివారం రంధ్రం పడగా, ఆర్అండ్బీ అధికారులు రెండోరోజైన సోమవారం ఆ ప్రాంతాన్ని పరిశీలించేందుకు రావడం గమనార్హం. ఆర్అండ్బీ ఈఈ కిషోర్ బాలాజీ, డీఈ గోవింద మోహన్, ఏఈ ప్రభాకరరావు వంతెన వద్ద రంధ్రం పడిన ప్రాంతాన్ని పరిశీలించి స్థానిక అధికారులు పలు సూచనలు చేశారు. నూతన వంతెన నిర్మాణానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపనున్నట్టు తెలుస్తోంది. బ్రిటీష్ కాలం నాటి వంతెనలు బ్రిటీష్ వారి కాలంలో కట్టిన ఈ వంతెనలకు కాలం చెల్లింది. 1935లో నిర్మించిన ఈ వంతెనలు దశాబ్ద కాలం నుంచి పట్టు కోల్పోయి బలహీనపడ్డాయి. వేలాది వాహనాలు వీటిపై రాకపోకలు సాగిస్తుండటంతో వీటి సామర్థ్యం తగ్గిపోయిందని, ఆయా వంతెనల స్థానంలో కొత్తవి నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు. ఆరేళ్ల క్రితం ఉంగుటూరు బ్రిడ్జి కూడా ఇలాగే ధ్వంసం కాగా, దాని స్థానంలో కొత్త వంతెన నిర్మించకుండా రూ.35 లక్షలు వెచ్చించి మరమ్మతులతో సరిపెట్టారు. ఇక నారాయణపురంలో కొత్త వంతెన నిర్మాణంపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది వేచి చూడాలి. -
రొయ్యకు సిండి‘కాటు’
సాక్షి, భీమవరం: వారం వ్యవధిలో వనామీ రొయ్యల ధరలు అమాంతం పడిపోయాయి. నిన్నమొన్నటి వరకు కిలో రూ.240 ఉన్న 100 కౌంట్ ధర రూ.200 నుంచి రూ.180కి తగ్గించేయడం ఆక్వా రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. ప్రాసెసింగ్ ప్లాంట్ల యజమానులు, ఎగుమతిదారులు సిండికేట్గా మారి ధరలు తగ్గించేస్తున్నారని రైతులు వాపోతున్నారు. కూటమి ప్రభుత్వం సిండికేటుకు కొమ్ముకాస్తోందని విమర్శిస్తున్నారు. అమెరికా పన్నుల పేరిట దోపిడీ వేసవి ఉష్ణోగ్రతలు అనుకూలించి మార్కెట్లోకి రొయ్యలు రావడం పెరగడంతో ఎగుమతిదారులు, ప్రాసెసింగ్ ప్లాంట్ల యజమానులు, వ్యాపారులు ఏకమై ధరలు తగ్గిస్తూ వచ్చారు. ఏప్రిల్ 3న అమెరికా ప్రతీకార సుంకాల ప్రకటన వెలువడే నాటికి 30 కౌంట్ ధర రూ.460, 40 కౌంట్ ధర రూ.370, 100 కౌంట్ ధర రూ.230కి తగ్గించేశారు. అమెరికా పన్నులను సాకుగా చూపించి కౌంట్కు కేజీకి రూ.30 నుంచి రూ.70 వరకు కోత పెట్టారు. ఇప్పట్లో పన్నులు లేవని తర్వాత అమెరికా ప్రకటించినా సిండికేట్ వర్గాలు ధరలను పెంచకపోవడం గమనార్హం. కంటితుడుపు చర్యలతో సరి ఫీడ్ ప్లాంట్ల యజమానులు మేత ధరలు పెంచేసినా.. ప్రాసెసింగ్ ప్లాంట్ల యజమానులు, ఎగుమతిదారులు ఏకమై తమ కష్టాన్ని దోచుకుంటున్నా.. కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఏప్రిల్లో రైతులు రోడ్డెక్కి నిరసనలు తెలిపారు. పాలకొల్లు, నరసాపురం, ఆచంట నియోజకవర్గాల్లోని జై భారత్ క్షీరారామ ఆక్వా రైతు సంఘం ఆధ్వర్యంలో పంట విరామం సైతం ప్రకటించారు. ఈ పరిణామాలతో ఉలిక్కిపడిన ప్రభుత్వం ఉండిలో ఆక్వా సదస్సు, విజయవాడలో ప్రాన్స్ కో–ఆర్డినేషన్ కమిటీ సమావేశాల్లో మేత ధరలను కేవలం టన్నుకు రూ.4 వేలు మాత్రమే తగ్గించడం, 100 కౌంట్ ధరను స్వల్పంగా పెంచడం తదితర కంటితుడుపు చర్యలతో సరిపెట్టింది. మళ్లీ ధరలు పతనం వారం క్రితం 100 కౌంట్ ధర దాదాపుగా రూ.240 ఉండగా, 30 కౌంట్ ధర రూ.385, 40 కౌంట్ ధర రూ.325, 50 కౌంట్ ధర రూ.295, 60 కౌంట్ ధర రూ.265 వరకు ఉన్నాయి. రానున్న సీజన్కు గాను మరలా చెరువులను సిద్ధం చేసుకునేందుకు రైతులు పట్టుబడులు ముమ్మరం చేయడంతో మార్కెట్లోకి రొయ్యలు రావడం ముమ్మరమైంది. ఇదే అదునుగా తిరిగి సిండికేట్లు ధరలను తగ్గించేస్తున్నాయి. పెద్ద రైతులైతే ఎక్కువ టన్నుల్లో పట్టుబడులు జరిగి 100 కౌంట్కు రూ.210 వరకు ధర చెల్లిస్తుంటే.. చిన్న రైతులు మూడు టన్నుల లోపు పట్టుబడులు చేయడం వల్ల పట్టుబడి పరిమాణాన్ని బట్టి 100 కౌంట్ రొయ్యలను కేజీ రూ.200 నుంచి రూ.180కు కొనుగోలు చేస్తున్నట్టు రైతులు చెబుతున్నారు. మిగిలిన కౌంట్ల ధరలు సైతం తగ్గించేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతికూల వాతావరణం, నాణ్యత లేని సీడ్, ఫీడ్తో ఇబ్బందులు పడుతుంటే ధరల పతనం తమను మరింత నష్టాల్లోకి నెట్టేస్తోందని వాపోతున్నారు. నాడు అప్సడాతో అండ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం 2020లో ఏపీ స్టేట్ ఆక్వా డెవలప్మెంట్ అథారిటీ (అప్సడా)ని ఏర్పాటు చేసి హేచరీలు, ఫీడ్, ప్రాసెసింగ్ ప్లాంట్ల ఆగడాలకు చెక్ పెట్టింది. ధరలను పూటకో రకంగా మారుస్తూ రైతుల కష్టాన్ని దోచుకునే పరిస్థితికి చెక్ పెట్టడంతో పాటు 10 రోజులకోసారి సమావేశమై ధరల స్థిరీకరణకు చర్యలు తీసుకుంది. అంతర్జాతీయ మార్కెట్లను విశ్లేషిస్తూ రైతుకు లాభసాటి ధర అందేలా పనిచేసింది. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో ఆ దిశగా చర్యలు లేకపోవడంతో తాము ఇబ్బందులు పడాల్సి వస్తోందని రైతులు అంటున్నారు. వనామీ ధరలు పతనం 100 కౌంట్ ధర రూ.240 నుంచి రూ.200కు తగ్గింపు 2 టన్నులలోపు అయితే రూ.180 ఆందోళనలో ఆక్వా రైతులు సిండికేట్గా మారి ధరలు తగ్గించేస్తున్నారని ఆవేదన అప్సడాతో సిండికేట్ ఆగడాలకు చెక్ పెట్టిన జగన్ ప్రభుత్వం ఆక్వా రంగం కుదేలు ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షలాది మంది కుటుంబాలకు ఉపాధి కల్పిస్తున్న ఆక్వా రంగం సిండికేటు దోపిడీతో సంక్షోభంలో కూరుకుపోతోంది. సీడ్, ఫీడ్, లీజు, మెడిసిన్ ధరలు 100 శాతం పెరగ్గా.. రొయ్యల ధర మాత్రం పతనమవుతోంది. ఇదే పరిస్థితి కొనసాగితే సాగు చేయడం చాలా కష్టం. ఇప్పటికే ఎకరాకు రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు నష్టపోతున్నాం. – పొత్తూరి శ్రీనివాసరాజు, ఆక్వా రైతు, కలగంపూడి గత ప్రభుత్వంలో ఇలా లేదు ఎగుమతిదారులు, ప్రాసెసింగ్ ప్లాంట్ల యజమానులు సిండికేట్ అయి ఇష్టానుసారం ధరలు తగ్గించేస్తున్నారు. టన్నులను బట్టి 100 కౌంట్ను కేజీ రూ.210 నుంచి రూ.180కి కొంటున్నారు. గత ప్రభుత్వంలో ఈ పరిస్థితి ఉండేది కాదు. ధరలు స్థిరంగా ఉండేవి. ఇప్పుడు ఏ రోజు ఎలా మారతాయో తెలియడం లేదు. ఆక్వా రైతులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. – పెనుమాల నరసింహస్వామి, ఆక్వా రైతు, గొల్లవానితిప్ప -
డ్రోన్లతో ఏజెన్సీని జల్లెడ పడుతున్నాం
జంగారెడ్డిగూడెం: ఛత్తీస్గఢ్లో జరుగుతున్న మావోయిస్టుల ఎన్కౌంటర్ల నేపథ్యంలో జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్తంగా ఉందని, జిల్లా ఏజెన్సీ ప్రాంతాన్ని డ్రోన్లతో జల్లెడ పడుతున్నామని ఎస్పీ కేపీఎస్ కిషోర్ తెలిపారు. జంగారెడ్డిగూడెం డీఎస్పీ కార్యాలయ ప్రాంగణంలో సోమవారం పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని నిర్వహించిన ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. ఇటీవల కాలంలో ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మావోయిస్టుల జాడ కోసం కూంబింగ్లు జరిగాయని, ఈ నేపథ్యంలో జరిగిన ఎదురుకాల్పుల్లో కొంతమంది మరణించారని చెప్పారు. కూంబింగ్, ఎన్కౌంటర్ల నేపథ్యంలో మావోయిస్టులకు తీవ్ర నష్టం కలిగిందన్నారు. ఈ నేపథ్యంలో వారు షెల్టర్ కోసం జిల్లాలోకి ప్రవేశించే అవకాశం ఉందన్నారు. గతంలో వారు ఈ ప్రాంతాన్ని షెల్టర్ జోన్గా వినియోగించుకున్న సంఘటనలు ఉన్నాయని, ఎటువంటి ప్రమాదాలూ జరగకుండా ముందుగానే జిల్లాలో నక్సల్ వింగ్కు సంబంధించి ఒక విధానం రూపొందించనున్నామని చెప్పారు. దీనిలో భాగంగానే తరచుగా పోలీస్స్టేషన్ల తనిఖీలు, పోలవరం ప్రాజెక్టు భద్రత పరిశీలన చేస్తున్నట్టు తెలిపారు. ఏఎన్ఎస్ పార్టీలు జిల్లా ఏజెన్సీలో కూంబింగ్ చేస్తున్నాయన్నారు. ఈ ప్రాంత ప్రజలు పోలీసులకు పూర్తిగా సహకరిస్తున్నారని, సంఘ విద్రోహులకు సహాయం చేసే అవకాశాలు లేవని చెప్పారు. ప్రజాప్రతినిధులు, ప్రముఖులు జాగ్రత్తగా ఉండాలని ఈ సందర్భంగా ఎస్పీ సూచించారు. సీసీ కెమెరాలు ప్రారంభం జంగారెడ్డిగూడెంలో పోలీసింగ్ మరింత పటిష్టం చేసే దిశగా పట్టణం మొత్తం సీసీ కెమెరా వ్యవస్థ ఏర్పాటు చేసినట్టు ఎస్పీ కేపీఎస్ కిషోర్ తెలిపారు. పోలీసింగ్ను ప్రజలకు మరింత నమ్మకంగా మార్చే ఉద్దేశంతో దాత నవభారత్ యాజమాన్యం సహకారంతో డీఎస్పీ యు.రవిచంద్ర, సీఐ వి.కృష్ణబాబు, ఎస్సై షేక్ జబీర్లు పట్టణంలో సీసీ టీవీ వ్యవస్థను ఏర్పాటు చేశారని చెప్పారు. అంతర్ రాష్ట్ర సరిహద్దు కలిగి ఉండటం, జంగారెడ్డిగూడెం పట్టణం అభివృద్ధి చెందడంతో నేరాలు జరిగే అవకాశం ఉందని, సీసీ కెమెరాల వ్యవస్థ ఉండటం వల్ల వీటిని అరికట్టే వీలుంటుందని తెలిపారు. ఒకవేళ ఘటనలు చోటుచేసుకున్నా త్వరగా వాటిని ఛేదించవచ్చని చెప్పారు. ఇటీవల కాలంలో జాబ్ ఇస్తానని మోసం చేశారంటూ కేసులు నమోదువుతున్నాయని, ఇలాంటి వారి విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇటీవల ద్వారకాతిరుమలలో ఇలాంటి ఘటన చోటుచేసుకుందని, నిందితుడిని అరెస్ట్ చేశామని చెప్పారు. ఏలూరుతో పాటు జంగారెడ్డిగూడెంలో కూడా పోలీస్ గ్రీవెన్స్ ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్టు ఎస్పీ వెల్లడించారు. పోలవరం డీఎస్పీ ఎం.వెంకటేశ్వరరావు, పోలవరం సబ్డివిజన్ పరిదిలోని సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు. మావోయిస్టుల ఎన్కౌంటర్ల నేపథ్యంలో అప్రమత్తంగా ఉన్నాం షెల్టర్ కోసం జిల్లాలోకొచ్చే అవకాశం ప్రజాప్రతినిధులు, ప్రముఖులు జాగ్రత్తగా ఉండాలి ఎస్పీ కేపీఎస్ కిషోర్ వెల్లడి -
ప్రత్యేక కేటగిరీ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన
నూజివీడు: నూజివీడు ట్రిపుల్ ఐటీలో సోమవారం ప్రత్యేక కేటగిరీ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన చేపట్టారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల 2 నుంచి 10వ తేదీ వరకు ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాల కొరకు ఆర్జీయూకేటీ దరఖాస్తులను స్వీకరించింది. దీంతో 1340 దరఖాస్తులు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఎన్సీసీ, సైనికోద్యోగుల పిల్లలు, క్రీడా, దివ్యాంగులు, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ కేటగిరీలకు చెందిన అభ్యర్థుల సర్టిఫికెట్లను పరిశీలించారు. క్రీడా విభాగంలో 62 మంది, ఎన్సీసీ విభాగంలో 85 మంది, సైనికోద్యోగుల పిల్లల విభాగంలో 12 మంది, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ విభాగానికి సంబంధించి 15 మంది కలిపి మొత్తం 174 మంది అభ్యర్థులు సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు వచ్చినట్టు అడ్మిషన్ల కన్వీనర్ ఆచార్య సండ్ర అమరేంద్రకుమార్ తెలిపారు. స్కీముల పేరిట మోసగిస్తున్న ముఠా అరెస్ట్ తాడేపల్లిగూడెం అర్బన్ : ఇచ్చిన సొమ్ముకు రెట్టింపు సొమ్ము ఇస్తామంటూ స్కీముల పేరిట అమాయక ప్రజలను మోసగిస్తున్న ముఠాను అరెస్ట్ చేసినట్టు తాడేపల్లిగూడెం డీఎస్పీ డి.విశ్వనాథ్ తెలిపారు. స్థానిక పట్టణ పోలీస్స్టేషన్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా టేకుల నాయక తండాకు చెందిన సదాసూత సాయికిరణ్, మోహనరావు స్నేహితులు. భీమడోలుకు చెందిన ఆర్కే రెడ్డి అనే ఆనంద్కు సింహాద్రి మోహనరావు స్నేహితుడు. వీరిద్దరికీ సన్నిహితం ఉండటం కారణంగా కోడూరు మండలం చిన్నూరుకు చెందిన నక్క సత్తిబాబు పరిచయమయ్యాడు. ఈ పరిచయంలో భాగంగా సత్తిబాబు తమ వద్ద ఒక స్కీమ్ ఉందని, సొమ్ములు ఇచ్చిన వారికి రెట్టింపు సొమ్ములు ఇస్తామని మోహనరావుతో చెప్పాడు. దీంతో ఆశపడిన సాయికిరణ్, మోహనరావు కొంత సొమ్మును ఈ నెల 13న తాడేపల్లిగూడెం బస్టాండ్ సెంటర్ వద్దకు తీసుకొచ్చారు. వీరు డబ్బు తెచ్చిన విషయం గమనించిన సత్తిబాబు, అతని స్నేహితుడు ఏలూరు ఆనంద్లు వీరిని పిలిచి.. తమ కారులోకి ఎక్కించుకున్నారు. ఈలోగా తాడేపల్లిగూడేనికి చెందిన షేక్ సుబాని, జంగారెడ్డిగూడేనికి చెందిన పిల్లిబోయిన గణేష్ వీరి కారులోకి చొరబడి కత్తిని చూపించి బెదిరించి నగదు బ్యాగ్ను లాక్కున్నారు. అనంతరం కారు నుంచి దించేసి వారంతా పరారయ్యారు. తాము మోసపోయమని గ్రహించిన బాధితులు ఈ నెల 15న పోలీసులకు ఫిర్యాదు చేశారు. జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి ఆదేశాల మేరకు డీఎస్పీ డి.విశ్వనాథ్ పర్యవేక్షణలో సీఐ బోణం ఆదిప్రసాద్, ఎస్సైలు బాదం శ్రీనివాస్, పి.నాగరాజు సిబ్బందితో కలిసి బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేసి నక్క సత్తిబాబు, ఆనంద్, పిల్లిబోయిన గణేష్, షేక్ సుబానిలను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.4,20,000 నగదును, రెండు అరల సూట్కేస్, బ్యాగులు, బ్లేడు కత్తి స్వాధీనం చేసుకున్నారు. -
ఏజెన్సీలో విజృంభిస్తున్న జ్వరాలు
బుట్టాయగూడెం: ఏజెన్సీ ప్రాంతంలోని గ్రామాల్లో జ్వరాలు విజృంభిస్తున్నాయి. వాతావరణంలో చోటుచేసుకున్న మార్పులు, వర్షాలు కూడా కురుస్తూండడంతో మన్యంలో రోజురోజుకూ టైఫాయిడ్, మలేరియా కేసులు అధికంగా నమోదవుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఎన్నడూ లేని విధంగా మలేరియా కేసులు అధికంగా నమోదవుతున్నట్లు అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే మలేరియా బారిన పడిన జ్వర పీడితులు ఆస్పత్రుల్లో వైద్యం పొందుతున్నారు. అధికారికంగా జనవరి నుంచి ఇప్పటివరకూ 148 మలేరియా కేసులు నమోదైనప్పటికీ అనధికారికంగా ఆ కేసులు రెట్టింపు ఉండొచ్చని పలువురు చెబుతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రులు, ప్రైవేటు ఆస్పత్రులు కూడా జ్వరపీడితులతో కిటకిటలాడుతున్నాయి. అధికంగా మలేరియా కేసులు ఇటీవలి వర్షాలతో మలేరియా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఏజెన్సీ ప్రాంతంలోని బుట్టాయగూడెం, జీలుగుమిల్లి, పోలవరం, వేలేరుపాడు, కుక్కునూరు మండలాలతో పాటు జిల్లాలోని ఏలూరు, ద్వారకాతిరుమల, లక్కవరం తదితర గ్రామాల్లో కూడా మలేరియా కేసులు నమోదైనట్టు చెప్తున్నారు. జనవరి నుంచి జూన్ మొదటివారం వరకు బుట్టాయగూడెం మండల పరిధిలోని కేఆర్పురం పీహెచ్సీలో 12 కేసులు, పీఆర్గూడెం పీహెచ్సీ పరిధిలో 23, నందాపురం పరిధిలో 6, దొరమామిడి పరిధిలో 16, అంతర్వేదిగూడెం పరిధిలో 8, వేలేరుపాడు మండలం కొయిదా పీహెచ్సీ పరిధిలో 28, వేలేరుపాడు 4, పోలవరం మండలం కోండ్రుకోట పీహెచ్సీ పరిధిలో 6, ద్వారకాతిరుమల 1, లక్కవరం 1, ఏలూరు 1, కొయ్యలగూడెం 1, రాచన్నగూడెం 6, కామయ్యపాలెం 3తో పాటు పలు గ్రామాల్లో మొత్తం 148 కేసులు జనవరి నుంచి ఇప్పటివరకు నమోదైనట్లు మలేరియా అధికారులు తెలిపారు. వెంటాడుతున్న మందుల కొరత జిల్లాలో మలేరియా కేసులు అధికంగా నమోదవుతున్నాయి. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలోని మండలాల్లో ప్రతి గ్రామంలోనూ టైఫాయిడ్, మలేరియా కేసులతో బాధపడుతున్నవారు ఉన్నారు. మలేరియా నివారణకు సంబంధించిన క్లోరోక్విన్ మాత్రలు ఆస్పత్రుల్లో అందుబాటులో లేవని సమాచారం. గతంలో ఈ మందులనే మలేరియా నివారణకు అధికంగా ఇచ్చేవారు. ఈ మందుల సరఫరా లేకపోవడం వల్ల కిందిస్థాయి సిబ్బందిని బయట కొనుగోలు చేసి ఇవ్వాలని చెప్పినట్టు సమాచారం. గతంతో పోల్చుకుంటే ఇటీవల కాలంలో మలేరియా కేసులు ఎక్కువగా నమోదవుతున్న క్రమంలో వీటి నివారణపై ప్రత్యేక చర్యలు చేపట్టాలని జిల్లా వాసులు కోరుతున్నారు. రోజురోజుకూ పెరుగుతున్న మలేరియా, టైఫాయిడ్ కేసులు నామమాత్రంగానే ఉన్న మలేరియా మందులు జ్వరపీడితులతో కిటకిటలాడుతున్న ప్రభుత్వాస్పత్రులుమలేరియా నివారణకు చర్యలు తీసుకుంటున్నాం జనవరి నుంచి ఇప్పటివరకు జిల్లాలో 148 కేసులు నమోదయ్యాయి. వాటి నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. ఏసీటీ మందులు అందుబాటులో ఉన్నాయి. క్లోరోక్విన్ మాత్రలకు ప్రతిపాదనలు పంపించాం. మలేరియా కేసులు నమోదైన ప్రదేశాల్లో స్ప్రేయింగ్ పనులు చేయించడంతో పాటు అన్ని రకాల చర్యలూ తీసుకుంటున్నాం. – ఎన్ఎస్ఎస్ ప్రసాద్, జిల్లా మలేరియా అధికారి, కేఆర్పురం, బుట్టాయగూడెం మండలం -
24 గంటల్లో బాలికల ఆచూకీ లభ్యం
తాడేపల్లిగూడెం రూరల్ : బాలికల మిస్సింగ్ కేసు ను పోలీసులు చాకచక్యంగా ఛేదించారు. కేసు నమోదైన 24 గంటల్లోనే బాలికల ఆచూకీ గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించిన సంఘటన తాడేపల్లిగూడెంలో చోటుచేసుకుంది. ఆదివారం స్థానిక రూరల్ సర్కిల్ కార్యాలయంలో రూరల్ సీఐ రమేష్ విలేకరులకు వివరాలు వెల్లడించారు. మండలంలోని ఎల్.అగ్రహారం టిడ్కో గృహ సముదాయానికి చెందిన ఓ మహిళ ఈనెల 12న రాత్రి నుంచి తన కుమార్తె, ఇంటి ఎదురుగా ఉన్న మరో బాలిక కనిపించడం లేదంటూ రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై 13న రూరల్ ఎస్సై జేవీఎన్ ప్రసాద్ కేసు నమోదు చేశారు. జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి, డీఎస్పీ డి.విశ్వనాథ్ పర్యవేక్షణలో రూరల్ సీఐ రమేష్, టౌన్ సీఐ ఆదిప్రసాద్, రూరల్ ఎస్సై ప్రసాద్, పెంటపాడు ఎస్సై స్వామిలతో కూడిన ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. సీసీ కెమెరా పుటేజ్, బాలికల ఫోన్ కాల్ డేటా, వారి స్నేహితుల కాల్ రికార్డులు క్షుణ్ణంగా పరిశీలించగా బాలికలు చైన్నెలో ఉన్నట్టు గుర్తించారు. ప్రత్యేక బృందాల సాయంతో వారిని తాడేపల్లిగూడెం క్షేమంగా తీసుకువచ్చారు. ప్రాథమిక దర్యాప్తులో బాలికలు స్నాప్చాట్ ద్వారా యువకులతో సంభాషించేవారని, చైన్నె వెళ్లి పనిచేసుకుంటూ పెళ్లి చేసుకోవాలని వీరు భావించినట్టు తెలిసిందన్నారు. బాధితుల వాంగ్మూలం ఆధారంగా కేసు దర్యాప్తు కొనసాగుతుందని సీఐ రమేష్ తెలిపారు. పిల్లలను సెల్ఫోన్లు వీలైనంత దూరంగా ఉంచాలని, లేదంటే తల్లిదండ్రులే బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు. కేసును 24 గంటల్లోనే ఛేదించిన రూరల్ సీఐ రమేష్, టౌన్ సీఐ ఆదిప్రసాద్, ఎస్సైలు జేవీఎన్ ప్రసాద్, స్వామి, సిబ్బందిని జిల్లా ఎస్పీ నయీమ్ అస్మి అభినందించారు. సమావేశంలో టౌన్ సీఐ ఆదిప్రసాద్, ఎస్సైలు జేవీఎన్ ప్రసాద్, కేసీహెచ్ స్వామి పాల్గొన్నారు. -
సాగుకు సిద్ధం.. సాయం శూన్యం
ఏలూరు (మెట్రో): ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనా రైతులకు కూటమి ప్రభుత్వం ఎలాంటి సాయం అందించడం లేదు. అరక చేతబట్టి పొలం బాట పట్టిన రైతులు దిగాలుతో వ్యవసాయ పనులు చేపడుతున్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాది పూర్తయినా రైతులకు ఎలాంటి పెట్టుబడి సాయం అందించకుండా వ్యవసాయం దండగ అనే రీతిలోనే వ్యవహరిస్తోందని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. చేతిలో చిల్లిగవ్వ లేక అప్పులు చేసి వ్యవసాయ పనులు మొదలు పెడుతున్నామని వాపోతున్నారు. గత ప్రభుత్వంలో రైతే రాజుగా.. రాష్ట్రంలో రైతే రాజుగా భావించిన గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అన్నదాతల సంక్షేమానికి మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పెద్దపీట వేశారు. వైఎస్సార్ రైతు భరోసా పథకం ద్వారా ఏటా సీజన్ ప్రారంభంలోనే ఆర్థిక సాయం అందించారు. ఇలా ఏలూరు జిల్లాలో రైతులకు 2019 నుంచి 2023 వరకు రూ.1,339.45 కోట్ల సాయం అందించారు. అయితే ప్రస్తుత కూటమి సర్కారు ఎన్నికల హామీ ల్లో భాగంగా రైతులకు అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రూ.20 వేల చొప్పున అందించాల్సి ఉండగా.. ఏడాది గడిచినా పట్టించుకోవడం లేదు. తా జాగా ఈనెల 20 నుంచి అన్నదాత సుఖీభవ పథకం ప్రారంభిస్తామని కూటమి నాయకులు ప్రక టించారు. అయితే ఇప్పటికే ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో ఎప్పుడు పథకాన్ని అమలు చేసి సాయం అందిస్తారని రైతులు నిట్టూరుస్తున్నారు. 13,027 మందికి ఈకేవైసీ జిల్లావ్యాప్తంగా 1,62,085 మంది రైతులు అన్నదాత సుఖీభవ పథకానికి అర్హులుగా జిల్లా వ్యవసాయశాఖ అధికారులు లెక్కలు తేల్చారు. రైతులకు సంబంధించి ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. అయితే ఇప్పటివరకు కేవలం 13,027 మంది రైతుల ఖాతాల ఈకేవైసీ మాత్రమే పూర్తిచేశారు. రైతుల ఇక్కట్లు గత ఏడాది కాలంగా రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం సాయం చేయకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పంట పెట్టుబడుల కోసం వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తూ నష్టపోతున్నారు. రైతులు సీజన్ ఆరంభంలో పెట్టుబడి కోసం వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తే పంట చేతికొచ్చాక కూడా ఆ అప్పు తీర్చే పరిస్థితి ఉండటం లేదు. ప్రస్తుతం ఖరీఫ్ పనులు చేపడుతున్న రైతులు చేతిలో డబ్బులు లేక మరోమారు అప్పుల కోసం తిప్పలు పడుతున్నారు. సార్వా సాగేనా..? ఖరీఫ్ పనులు ప్రారంభం రైతులను పట్టించుకోని ప్రభుత్వం అన్నదాత సుఖీభవ సాయం ఎప్పటికో? జిల్లాలో 99,512 హెక్టార్లలో సాగు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో సీజన్ ఆరంభంలోనే సాయం గత ప్రభుత్వంలో రైతు భరోసా సాయం సంవత్సరం రైతులు లబ్ధి (రూ.కోట్లలో) 2019 2,24,016 302.42 2020 2,13,950 288.83 2021 1,90,729 257.48 2022 1,87,950 253.73 2023 1,98,179 236.99 -
మున్సిపల్ కార్మికులకు అన్యాయం
ఏలూరు (ఆర్ఆర్పేట): మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులకు జీతాల చెల్లింపులో జరుగుతున్న అన్యాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సరిచేయాలని ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, ప్రజా సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం డిమాండ్ చేసింది. ఆదివారం ఏలూరులో ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ నగర కమిటీ ఆధ్వర్యంలో సీఐటీయూ కార్యాలయంలో ఇంజనీరింగ్ కార్మికుల సమ్మెకు మద్దతుగా రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి డీఎన్వీడీ ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రంలోని సుమారు 12 వేల మంది మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు జీతాల వ్యత్యాసాల వల్ల వందల కోట్ల రూపాయలు నష్టపోతున్నారన్నారు. మున్సిప ల్ కార్మికుల రాష్ట్రవ్యాప్త సమ్మెకు సీఐటీయూ అనుబంధ సంఘాలన్నీ మద్దతుగా పాల్గొంటున్నాయన్నారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రాజనాల రామ్మోహన్రావు, మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు అప్పలరాజు, మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.సోమయ్య మాట్లాడుతూ జీతాల్లో వ్యత్యాసం వల్ల ఒక్కో కార్మికుడు ఆరేళ్లలో రూ.4.50 లక్షలకు పైగా నష్టపోయారన్నారు. పలు సంఘాల నాయకులు వైఎస్ కనకారావు, జె.గోపి, అంగుళూరు జానుబాబు, వినుకొండ రమేష్ తదితరులు పాల్గొన్నారు. నేడు పీజీఆర్ఎస్ రద్దు భీమవరం (ప్రకాశంచౌక్): జిల్లా యంత్రాంగం అత్యవసర పరిపాలన సంబంధమైన పనులకు హాజరు కావాల్సి ఉన్నందున సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్ఎస్)ను రద్దు చేస్తున్నట్టు కలెక్టర్ సీహెచ్ నాగరాణి తెలిపారు. జిల్లా, డివిజన్, మండల స్థాయిల్లో కార్యక్రమాన్ని రద్దు చేశామని ప్రజలు గమనించాలని కోరారు. నేడు ఏలూరులో పీజీఆర్ఎస్ ఏలూరు(మెట్రో): ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్ఎస్) కార్యక్రమాన్ని జిల్లాస్థాయిలో సోమవారం ఏలూరు కలెక్టరేట్లో నిర్వహించనున్నట్టు డీఆర్వో వి.విశ్వేశ్వరరావు తెలిపారు. కొల్లేరుకు సంబంధించి కేంద్ర సాధికారత కమిటీ పర్యటన దృష్ట్యా కలెక్టర్ సంబంధిత ప్రాంతాల్లో పర్యటిస్తారని, పీజీఆర్ఎస్కు జాయింట్ కలెక్టర్ హాజరవుతారని పేర్కొన్నారు. అలాగే సమస్యలపై ఆన్లైన్లో ఫిర్యా దు చేయవచ్చని, 1100 టోల్ఫ్రీ నంబర్కు కాల్ చేయవచ్చని తెలిపారు. కొల్లేరు ప్రజల జీవనాన్ని కాపాడాలి ఏలూరు (ఆర్ఆర్పేట): కొల్లేరుకు శాశ్వత పరిష్కారం చూపాలని, కొల్లేరులో పక్షులు, పర్యావరణాన్ని మాత్రమే కాకుండా అక్కడి ప్రజల జీవితాలను, జీవనాన్ని కాపాడాలని ఈనెల 17,18 తేదీల్లో పర్యటించే కేంద్ర సాధికారత కమిటీని సీపీఎం ఏలూరు జిల్లా కమిటీ కోరింది. ఈ మేరకు ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ఎ.రవి ఆదివారం ప్రకటన విడుదల చేశారు. కొల్లేరును నమ్ముకుని వందలాది ఏళ్లుగా బతుకుతున్న సుమారు మూడు లక్షల మంది ప్రజల జీవనం ప్రశ్నార్థకంగా మారిందన్నారు. కొల్లేరును 3వ కాంటూరుకు కుదించడం, ఎకో సెన్సిటివ్ జోన్ నుంచి మినహాయించడం, వా రికి ఉపాధి అవకాశాలను కల్పించడం ద్వారా మాత్రమే ప్రజల జీవితాలను నిలబెట్టగలమని తెలిపారు. అందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని కోరారు. జిరాయితీ డీ పట్టాల భూములను రైతులకు కేటాయించాలన్నారు. అటవీ నిబంధనలు సడలించి తాగునీరు, రోడ్లు, శ్శశా న వాటికలు, మౌలిక వసతుల అభివృద్ధికి విజ్ఞ ప్తి చేశారు. ఈ మేరకు కమిటీ క్షేత్రస్థాయిలో పరిశీలించాలని కోరారు. ఉత్కర్ష అభియాన్తో గిరిజనుల అభివృద్ధి ఏలూరు(మెట్రో): దార్తీ అభ జనజాతీయ గ్రామ్ ఉత్కర్ష అభియాన్ పథకం జిల్లాలో గిరిజనుల అభివృద్ధికి దోహదపడుతుందని కలెక్టర్ కె.వెట్రిసెల్వి అన్నారు. ఆదివారం స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా పథకం అమలుపై అధికారులతో సమీక్షించారు. గిరిజన పథకాలను అర్హు లు వినియోగించుకునేలా చూడాలన్నారు. పథకాలు, గిరిజనుల హక్కులపై అవగాహన కలిగించేందుకు ఈనెల 16 నుంచి 30 వరకు గిరిజన గ్రామాల్లో కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. జిల్లాలోని 132 గిరిజన గ్రామాల్లో గిరిజనుల సామాజిక, ఆర్థిక అభివృద్ధికి తహసీల్దార్లు, ఎంపీడీఓలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. ఐటీడీఏ పీఓ రాములు నాయక్, గిరిజన సంక్షేమ శాఖ అధికారులు పాల్గొన్నారు. -
కొల్లేరులోసీఈసీఅధ్యయనం
నేడు కొల్లేరు గ్రామాల్లో కలెక్టర్ పర్యటన కైకలూరు : కొల్లేరు అభయారణ్య ఆక్రమణలు, పర్యావరణానికి విఘాతం, ప్రజల ఇబ్బందులు, జిరాయితీ, డీఫాం భూముల అంశాలపై సుప్రీంకోర్టులో పిటీషన్ల నేపథ్యంలో ఈనెల 17, 18 తేదీల్లో కేంద్ర సాధికారత కమిటీ (సీఈసీ) పర్యటించనుంది. సీఈసీ కమిటీ సభ్యులు జి.భానుమతి, చంద్ర ప్రకాష్ గోయల్, సునీల్ లిమాయే, డాక్టర్ జైవర్థన్ రమన్లాల్ భట్లు కొల్లేరు ప్రాంతాల్లో అధ్యయనం చేయడానికి విచ్చేస్తున్నారు. సోమ వారం ఢిల్లీ నుంచి రానున్న బృందం ముందుగా విజయవాడలో సీఎం చంద్రబాబుతో భేటీ కానున్నారు. సీఈసీ పర్యటన నేపథ్యంలో అటవీ శాఖ అ ధికారులు అన్ని దస్త్రాలను సిద్ధం చేస్తున్నారు. కలెక్టర్ ఆదేశాలతో అప్రమత్తమయ్యారు. ర్యూట్ మ్యాప్ నిమిత్తం సమావేశం సీఈసీ పర్యటన నేపథ్యంలో కలెక్టర్ వెట్రిసెల్వి సోమవారం కొల్లేరు ప్రాంతాలను పరిశీలించనున్నారు. సీఈసీకి అందించే నివేదికలపై అటవీ శాఖ అధికారులను అప్రమత్తం చేశారు. కైకలూరు రెవెన్యూ కార్యాలయంలో రూట్ మ్యాప్ నిమిత్తం సమావేశం నిర్వహించనున్నారు. ఈనెల 17న మండవల్లి మండలం, 18న కై కలూరు మండలంలో సీఈసీ సభ్యులు క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు. కొల్లేరు నాయకులు కై కలూరు మండలం పందిరిపల్లిగూడెం వద్ద బహిరంగ సభ, అలాగే నిడమర్రు మండలం తోకలపల్లి, భైనేపల్లి, ఆకివీడు మండలం సిద్దాపురం ప్రాంతాల్లో కొల్లేరును పరిశీలించాలని అధికారుల ద్వారా సీఈసీకి తెలియజేయడానికి సిద్ధమయ్యారు. వినతులు సిద్ధం కొల్లేరులో 122 పరీవాహక గ్రామాలు ఉండగా.. మౌలిక వసతులు, శ్శశానాలకు భూములు, తాగునీటి చెరువులు, మట్టి పూడికలు వంటి అంశాలను సీఈసీకి వినతుల రూపంలో అందించేందుకు ప్రజలు సిద్ధమయ్యారు. కొల్లేరు అభయారణ్యం 77,135 ఎకరాల్లో జిరాయితీ, డీఫాం పట్టా భూములు దాదాపు 20 వేల ఎకరాలు మినహాయించాలనే ప్రధాన డిమాండ్ను సీఈసీ ముందు ఉంచనున్నారు. అటవీ నిబంధనలు కఠినంగా ఉన్నాయని, వాటిని సవరించి ప్రజల అవసరాలకు అనుగుణంగా మార్పు చేయాలని కోరనున్నారు. కమిటీ సభ్యులు వీరే.. జి.భానుమతి సీఈసీకి సభ్య సెక్రటరీగా జి.భానుమతి వ్యవహరించనున్నారు. ఆమె త్రిపుర కేడర్కు చెందిన 2009 బ్యాచ్కు చెందిన ఐఎఫ్ఎస్ అధికారి. ప్రస్తుతం న్యూఢిల్లీలో నేషనల్ టైగర్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అథారిటీ అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫారెస్ట్గా పనిచేస్తున్నారు. రమన్లాల్ భట్ డాక్టర్ జైవర్థన్ రమన్లాల్ భట్ అంతర్జాతీయ పర్యావరణ నిపుణులు. 35 ఏళ్లుగా పర్యావరణ శాసీ్త్రయ సాంకేతిక సేవలు అందిస్తున్నారు. పలు సంస్థలకు సలహాదారులుగా ఉన్నారు. పర్యావరణంపై 20 పుస్తకాలు రాశారు. 10 అంతర్జాతీయ సమావేశాలకు సంధానకర్తగా వ్యవహరించారు. సునీల్ లిమాయే మహారాష్ట్ర కేడర్కు చెందిన సునీల్ లిమాయే ఇండియన్ ఫారెస్టు సర్వీస్ ఆఫీసర్. చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్టుగా పనిచేశారు. ఏకో టూరిజం మేనేజింగ్ డైరెక్టర్, మహారాష్ట్ర సంజయ్ గాంధీ నేషనల్ పార్కు డైరెక్టర్గా ఉన్నారు. చిరుత పులుల సంరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు.చంద్రప్రకాష్ గోయల్చంద్రప్రకాష్ గోయల్ ఐటీ అధికారి. 1986లో ఐఎఫ్ఎస్లో చేరారు. ఉత్తరప్రదేశ్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్టుగా పనిచేశారు. కేంద్ర అటవీ, వాతావరణ మార్పుల శాఖ స్పెషల్ సెక్రటరీగా విధులు నిర్వహించారు. పర్యావరణ అంశాలపై కేంద్ర ప్రభుత్వానికి సలహాదారుగా ఉన్నారు. -
వృద్ధులకు బాసటగా నిలవాలి
ఏలూరు (ఆర్ఆర్పేట): వృద్ధులకు ప్రతిఒక్కరూ బాసటగా నిలవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.రత్నప్రసాద్ సూచించారు. ఆదివారం ప్రపంచ వయోవృద్ధుల వేధింపుల అవగాహన దినోత్సవం సందర్భంగా స్థానిక ప్రేమాలయం వృద్ధుల ఆశ్రమంలో వృద్ధుల హక్కులు, చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఆయన మాట్లాడుతూ వృద్ధులపై వేధింపులు, నిర్లక్ష్యం, దుర్వినియోగం వంటి సమస్యలు తెలుసుకుని పరిష్కార మార్గాలను సూచించడానికి ఈ దినోత్సవం వేదికన్నారు. పిల్లలు వారి తల్లిదండ్రులకు రక్షణ, పోషణ, వైద్య సదుపాయాలు ఏర్పాటు చేయాలని సూచించారు. వృద్ధుల సమస్యలను పరిష్కారానికి ప్రతి రెవెన్యూ డివిజనల్ కార్యాలయంలో ప్రత్యేక ట్రిబ్యునల్ ఉందన్నారు. అవసరమైన పక్షంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థను నేరుగా గాని లేదా 15100 లేదా 08812 224555 ద్వారా సంప్రదించి సాయం పొందవచ్చన్నారు. న్యాయవాది రత్నప్రసాద్, ప్రేమాలయం నిర్వాహకులు మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
నారాయణపురం వంతెనకు భారీ రంధ్రం
ఉంగుటూరు: ప్రజలు అనుకున్నదంతా జరిగింది. కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యంతో వంతెన శ్లాబ్ ఊడి పెద్ద రంధ్రం పడింది. ఆదివారం వేకువజామున మండలంలోని నారాయణపురం బ్రిడ్జిపై మీటరున్నర పొడవు, మీటరు వెడల్పున శ్లాబ్ ఊడి పెద్ద రంధ్రం పడింది. ఆ సమయంలో వాహన రాకపోకలు లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. బ్రిడ్జిపై ద్విచక్రవాహనాలు మినహా మరి ఏ ఇతర వాహనాలు తిరగకుండా పోలీసులు, ఆర్అండ్బీ సిబ్బంది ఆంక్షలు విధించి పహారా కాస్తున్నారు. గణపవరం సీఐ సు భాష్, చేబ్రోలు, నిడమర్రు ఎస్సైలు సూర్యభగవాన్, ప్రసాద్ ఈ ప్రాంతాన్ని పరిశీలించారు. ఆర్అండ్బీ ఏఈ భాస్కరరావు ఈ ప్రదేశాన్ని పరిశీలించి ఉన్నతాధికారులకు నివేదించారు. ఉన్నతాధికారులు ఎవరూ ఇప్పటివరకూ ఇక్కడకు రాలేదు. భారీ వాహనాల రాకపోకలతోనే.. 1932లో నారాయణపురం బ్రిడ్జిని నిర్మించగా దాదాపు 12 ఏళ్ల నుంచి శిథిలావస్థకు చేరుకుంది. ఇటుగా 30 టన్నుల వరకు భారీ వాహనాలు ఎక్కువగా తిరగడమే బ్రిడ్జికి రంధ్రం పడటానికి కారణంగా కనిపిస్తుంది. నిత్యం వందలాదిగా చేపలు, రొయ్యలు, కంకర లారీలు ఇటుగా తిరుగుతు న్నాయి. కొన్నేళ్లుగా బ్రిడ్జి కింద భాగం పెచ్చులూడటంతో వంతెన పునర్నిర్మించాలని స్థానికులు ప్రజాప్రతినిధులకు విన్నవించారు. తప్పని దూరాభారం పశ్చిమ డెల్టాతో పాటు కోనసీమ జిల్లా నుంచి విజయవాడ, హైదరాబాద్కు ఇటుగా దగ్గర మార్గం కావడంతో నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. అలాగే ఆక్వా ఉత్పత్తుల లోడు లారీలు ఇటుగా కోల్కతా, ఈశాన్య రాష్ట్రాలకు వెళుతుంటాయి. ఇప్పుడు ఇటుగా రాకపోకలు నిలిపివేయడంతో కొన్ని వాహనాలు చేబ్రోలు బ్రిడ్జి నుంచి పుంత దారి మీదుగా గణపవరం చేరుకుంటున్నాయి. ఎక్కువ వాహనాలు తాడేపల్లిగూడెం మీదుగా సుమారు 50 మీటర్లు ఎక్కువ దూరం ప్రయాణించి వెళుతున్నాయి. గత ప్రభుత్వంలో బ్రిడ్జి మంజూరు తాము అధికారంలో ఉండగా అప్పటి సీఎం జగన్కు చెప్పి ఉంగుటూరు నియోజకవర్గంలో మూడు బ్రిడ్జిలు మంజూ రు చేయించాను. అందులో నారాయణపురం బ్రిడ్జి ప్రధానమైంది. రూ.8.50 కోట్ల నిధులు మంజూరు చేయించగా ప్రభుత్వ అధికారుల తాత్సారం, టెండర్ల దశలో ఉండగా ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో బ్రిడ్జి నిర్మాణ పనులు నిలిచిపోయాయి. ప్రభు త్వం మారడంతో ఆ పని పెండింగ్లో పడింది. బ్రిడ్జికి రంధ్రం పడటం దురదృష్టకరం. వంతెన పనులు యుద్ధప్రాతిపదికన చేపట్టాలి. – పుప్పాల వాసుబాబు, మాజీ ఎమ్మెల్యే, ఉంగుటూరు శ్లాబ్ ఊడి పడిన వైనం స్తంభించిన రాకపోకలు గత ప్రభుత్వంలో బ్రిడ్జి నిర్మాణానికి నిధులు కూటమి పాలనలో పట్టించుకోని వైనం గత ప్రభుత్వంలో రూ.8.50 కోట్ల మంజూరు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో 2022లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గణపవరం పర్యటనకు వచ్చిన సందర్భంగా అప్పటి ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు నియోజకవర్గ సమస్యలను విన్నవించారు. దీంతో 2023లో గుండుగొలను, నారాయణపురం, గణపవరంలో వంతెనల నిర్మాణాలకు మాజీ సీఎం జగన్ నిధులు మంజూరు చేశారు. నారాయణపురం బ్రిడ్జికి రూ.8.50 కోట్లు, గుండుగొలను బ్రిడ్జికి రూ.9 కోట్లు, గణపవరం బ్రిడ్జికి రూ.8.45 కోట్ల నిధులు మంజూరు చేశారు. గుండుగొలనులో వంతెన నిర్మాణ పనులు ప్రారంభించారు. అయితే నారాయణపురం బ్రిడ్జి పనులు టెండర్ల ప్రక్రియ దశకు చేరే సరికి సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో పనులు నిలిచిపోయాయి. గతేడాది రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఈ పనులను పట్టించుకోలేదు. దీంతో బ్రిడ్జి నిర్మాణం ప్రశ్నార్థకమైంది. -
చిన్నతిరుపతి క్షేత్రంలో పోటెత్తిన భక్తులు
ద్వారకాతిరుమల: చిన్నతిరుపతి క్షేత్రంలో ఆదివారం భక్తులు పోటెత్తారు. వేసవి సెలవులు ఈనెల 11తో ముగిశాయి. అయితే మంచి తిధులు లేకపోవడంతో విద్యార్థులను తమ తల్లిదండ్రులు సోమవారం నుంచి పాఠశాలలకు పంపేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో ఆఖరి సెలవురోజును పురస్కరించుకుని పెద్ద ఎత్తున భక్తులు క్షేత్రానికి తరలివచ్చారు. దాంతో ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడాయి. ఆలయ తూర్పు రాజగోపుర ప్రాంతం, అనివేటి మండపం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్, దర్శనం క్యూలైన్లు, కల్యాణకట్ట ఇతర విభాగాలు భక్తులతో కిక్కిరిసాయి. సాయంత్రం వరకు క్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగింది. ఆలయ అనివేటి మండపంలో పలు భజన మండలి సభ్యులు ప్రదర్శించిన కోలాట నృత్యాలు చూపరులను అలరించాయి. -
కలల వారధి ఇంకెన్నాళ్లు?
భీమడోలు: గోదావరి కాల్వపై నిర్మిస్తున్న వంతెన నిర్మాణం ఎప్పటికి పూర్తి అవుతుందో తెలియక నియోజకవర్గ వాసులు ఆందోళన చెందుతున్నారు. నిర్మాణం చేపట్టి రెండేళ్లు గడిచింది. వైఎస్సార్సీపీ హయాంలో పనులు పరుగు పెట్టగా.. కూటమి పాలనలో పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఇటీవల వంతెన శ్లాబ్ వేసినా నేటికి మిగిలిన పనులు జరగకపోవడంతో ప్రజలు కూటమి పాలనపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రెండున్నరేళ్ల క్రితం జాతీయ రహదారికి అనుసంధానంగా గుండుగొలను వద్ద గోదావరి కాల్వపై నిర్మించిన బ్రిటిష్ కాలం నాటి వంతెన కూలిపోయింది. దీంతో భీమడోలు, దెందులూరు, ఏలూరు రూరల్, కై కలూరు ప్రాంతాలకు చెందిన వేలాది మంది ప్రజల రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. వేరే ప్రాంతాలకు వెళ్లేందుకు రాకపోకలు స్తంభించాయి. దీంతో ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని అప్పటి ఉంగుటూరు ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు సీఎం హోదాలో గణపవరం వచ్చిన వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. తక్షణం స్పందించిన జగనన్న గుండుగొలను, నారాయణపురం వద్ద కొత్త వంతెనల మంజూరుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. శాశ్వత వంతెన నిర్మాణానికి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రూ.3 కోట్లు మంజూరు చేశారు. ప్రజలు, విద్యార్థులు, ఉద్యోగుల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యామ్నయంగా గుండుగొలను వద్ద కాల్వపై బెయిలీ బ్రిడ్డిని నిర్మించేందుకు రూ.40 లక్షలు మంజూరు చేయించారు. వంతెన నిర్మాణం నేపథ్యంలో కేంద్ర జలరవాణాశాఖ నుంచి ఎలాంటి అభ్యంతరాలు రాకుండా, వంతెన నిర్మాణంలో తన వంతు కృషి చేశారు. దీంతో 60శాతానికి పైగా పనులు పూర్తి చేశారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం సౖరైన విధానాలను పాటించకపోవడం, వారి మధ్య సమన్వయం కరువవడంతో నిర్మాణం చిక్కుముడిలా మారింది. జల రవాణ శాఖ అభ్యంతరం 11 మీటర్ల ఎత్తులో వంతెన నిర్మించాల్సి ఉన్నా 5 మీటర్ల ఎత్తు ఉండడంతో కేంద్ర జల రవాణా శాఖ అభ్యంతరం వ్యక్తం చేసింది. భవిష్యత్తులో కాల్వలో జల రవాణ జరిగే అవకాశం ఉందని, స్టీమర్లు, పడవలు, ఓడల రవాణాకు ఈ వంతెన అడ్డంకిగా మారుతుందని పేర్కొంది. తక్షణం నిలిపివేయాలని ఆ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఏలూరు ఎంపీ, ఎమ్మెల్యేలు ఈ సమస్యను పరిష్కరించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదిస్తున్నారు. సమస్య కొలిక్కి రాకపోవడం ఆందోళనకు గురి చేస్తుంది. బెయిలీ వంతెనపై భయం భయంగా గుండుగొలను వద్ద శాశ్వత వంతెన నిర్మాణాన్ని ఆరు నెలల్లో పూర్తి చేయాల్సి ఉంది. ఆ వంతెన నిర్మాణం పూర్తి అయ్యేంత వరకు గోదావరి కాల్వపై బెయిలీ వంతెనను నిర్మించి ప్రజల రాకపోకల కష్టాలకు చెక్ పెట్టారు. ఈ వంతెన వ్యవధి రెండేళ్లని ఆర్ అండ్ బీ అధికారులు ప్రారంభోత్సవం సమయంలో తెలిపారు. ఈ ఏడాది నవంబర్కు గడువు ముగుస్తుంది. ఈ వంతెనపై భారీ వాహనాలు రాకపోకలు సాగించడంతో బిక్కు బిక్కుమంటూ ప్రయాణం చేయాల్సి ఉంది. దీంతో వంతెన ప్రమాదంగా మారింది. గుండుగొలను వంతెన పనుల్లో జాప్యంపై అసంతృప్తి కూటమి పాలనలో ముందుకు సాగని నిర్మాణం వంతెన తక్షణం నిర్మించాలి గుండుగొలను వంతెన నిర్మాణం చేపట్టి రెండేళ్లు గడుస్తుంది. నేటికీ పూర్తి కాలేదు. నిర్మాణానికి రూ.3 కోట్లు, బెయిలీ వంతెన నిర్మాణానికి రూ.40 లక్షలు మంజూరు చేయించాం. దీంతో పనులు సాగుతున్నాయి. కూటమి పాలనలో వంతెన నిర్మాణానికి అవసరమైన అన్ని అనుమతులు తీసుకు రావాల్సిన బాధ్యత అధికారులు, పాలకులపై ఉంది. పాలకులు, అధికారుల మధ్య సమన్వయం కొరవడంతో ఈ వంతెన నిర్మాణ పనులు జాప్యమవుతున్నాయి. దీంతో కొల్లేరు వాసులు అష్టకష్టాలు పడుతున్నారు. ఇప్పటికే పూర్తి కావాల్సిన వంతెన అవాంతరాల మధ్య జరుగుతుంది. నారాయణపురం వంతెన కూలిపోతుంది. అప్పట్లో నారాయణపురం వంతెన నిర్మాణానికి నిధులు మంజూరు చేయించాను. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పాలకులు పట్టించుకుంటే ఈ వంతెన నిర్మాణం పూర్తయ్యేది. పుప్పాల వాసుబాబు, మాజీ ఎమ్మెల్యే, ఉంగుటూరు -
సుబ్బారాయుడిని దర్శించుకున్న భక్తులు
ముదినేపల్లి రూరల్: ప్రసిద్ధి చెందిన సింగరాయపాలెం–చేవూరుపాలెం సెంటర్లోని శ్రీసుబ్రహ్మణ్యేశ్వరస్వామిని భక్తులు ఆదివారం అధిక సంఖ్యలో దర్శించుకున్నారు. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి ఉదయానికే ఆలయానికి చేరుకుకోవడంతో ఆలయ ప్రాంగణమంతా కిటకిటలాడింది. పుట్టలో పాలు పోసేందుకు, పాల పొంగళ్ల శాల వద్ద మహిళలు నైవేద్యాలు తయారుచేసేందుకు అధిక సమయం వేచి ఉండాల్సి వచ్చింది. స్వామిని దర్శించుకున్న అనంతరం నాగబంధాల వద్ద పూజలు చేశారు. అదేవిధంగా గోకులంలోని గోవులకు మహిళలు పసుపు కుంకుమలతో పూజలు చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ సహాయ కమిషనర్ శ్రీదేవి, సిబ్బంది పర్యవేక్షణ చేశారు. ఈ సందర్భంగా సహాయ కమిషనర్ మాట్లాడుతూ ఆలయ ఆవరణలో వాహనాల పార్కింగ్ రుసుము వసూలు చేసుకునేందుకు లైసెన్సు హక్కు ఒక సంవత్సర కాలానికి కల్పించేందుకు ఈనెల 17న టెండర్ కం బహిరంగ వేలం జరుగుతుందని తెలిపారు. ఆటో చోరీపై ఫిర్యాదు భీమవరం: భీమవరం రెండో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధి రాయలంలోని ఇంటి ముందు నిలుపుదల చేసిన ఆటోను గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేశారని సీఐ జి. కాళీచరణ్ తెలిపారు. ఈ నెల 11న నిలుపుదల చేసిన ఆటోను యజమాని వై.తాతారావు 12న ఉదయం చూసే సరికి లేకపోవడంతో చుట్టుపక్కల వెతికాడు. కనిపించకపోవడంతో ఆదివారం ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. వైభవంగా శ్రీనివాసుడి కల్యాణం జంగారెడ్డిగూడెం: స్థానిక గోకుల తిరుమల పారిజాతగిరిలో శ్రవణా నక్షత్రాన్ని పురస్కరించుకుని ఆదివారం శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుడి కల్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకుడు నల్లూరు రవికుమార్ ఆచార్యులు కల్యాణ తంతును జరిపించారు. భక్తులు విశేష సంఖ్యలో స్వామివారిని దర్శించుకుని స్వామివారి కల్యాణ మహోత్సవాన్ని వీక్షించి తరించారు. ఏర్పాట్లను ఈవో మాణికల రాంబాబు, ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు పర్యవేక్షించారు. -
మృతదేహంతో రెండో రోజూ ఆందోళన
యలమంచిలి: కొంతేరులో ఆత్మహత్య చేసుకున్న చింతా లక్ష్మీ నర్సమాంబ మృతదేహంతో రెండో రోజు కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళన చేశారు. ప్రేమలో విఫలమై కొడుకు చనిపోవడం, ప్రియురాలి తండ్రి కోర్టులో కేసు వేయడంతో మనస్తాపానికి గురై నర్సమాంబ శనివారం ఉరి వేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో కుటుంబ సభ్యులు, బంధువులు ఆమె మృతదేహంతో ప్రియురాలి ఇంటి ముందు ఆందోళన చేశారు. శనివారం రాత్రి పోలీసులు వచ్చి కుటుంబ సభ్యులు, బంధువులకు నచ్చచెప్పి మృతదేహాన్ని పాలకొల్లు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో ఆదివారం పోస్టుమార్టం పూర్తి చేసి తిరిగి కొంతేరు తీసుకొచ్చి కుటుంబ సభ్యులు, బంధువులకు అప్పగించారు. మరోసారి మృతదేహంతో ఆందోళన దిగారు. ఆందోళన పెరిగి ఉద్రిక్తతలకు దారితీసే ప్రమాదం కనిపించడంతో గ్రామ పెద్దలు, పోలీసులు స్పందించారు. ప్రియురాలి తండ్రిపై కేసు నమోదు చేసి, చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పడంతో ఆందోళన విరమించి, మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. -
గుబ్బల మంగమ్మ గుడికి పోటెత్తిన భక్తులు
బుట్టాయగూడెం: గుబ్బల మంగమ్మ గుడికి ఆదివారం భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు విజయవాడ, మచిలీపట్నం, తెలంగాణ రాష్ట్రంలోని భద్రాచలం, పాల్వంచ, కొత్తగూడెం, సత్తుపల్లి, అశ్వారావుపేట ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు వాహనాలతో తరలివచ్చి అమ్మవారికి దూపదీప నైవేద్యాలతో ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. గుబ్బల మంగమ్మ గుడి వద్ద ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిషేదిస్తున్నట్లు ఆలయ కమిటీ ప్రతినిధి, సర్పంచ్ కోర్సా గంగరాజు తెలిపారు. గుబ్బల మంగమ్మ గుడి పరిసర ప్రాంతాల్లో పర్యావరణ పరిరక్షణలో భాగంగా పూర్తి ప్లాస్టిక్ రహిత ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. భక్తులు తప్పనిసరిగా పేపర్ బ్యాగ్లను తెచ్చుకోవాలని ఆలయ కమిటీ వారు కోరారు. -
అందని ద్రాక్షగా హజ్ యాత్ర
ఆకివీడు: హజ్ యాత్రను కూటమి ప్రభుత్వం అందని ద్రాక్షగా మార్చివేసిందని వైఎస్సార్సీపీ ముస్లిం విభాగం నాయకులు ఎండీ. జక్కీ ఆరోపించారు. ఆదివారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ హజ్ యాత్రకు రూ.లక్ష ఇస్తామని ఎన్నికల్లో వాగ్దానం చేసిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మోసగించిందన్నారు. రాష్ట్రంలోని ముస్లింలందరూ హజ్ యత్రకు వెళ్లవచ్చని ఆశపడ్డారని వారి ఆశల్ని నిరాశ చేశారని ఆరోపించారు. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో సాధించిన విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ను కూడా కూటమి ప్రభుత్వం రద్దు చేయించిందన్నారు. -
డ్వాక్రా గ్రూపుల్లో అవినీతి
వీరవాసరం: వీరవాసరం మండలం నందమూరి గరువులో డ్వాక్రా గ్రూపుల్లో భారీ అవినీతి చోటుచేసుకుంది. సుమారుగా రూ.కోటి మేరకు డ్వాక్రా సభ్యుల సొమ్ము పక్కదారి పట్టింది. నందమూరు గరువులో 68 స్వయం సహాయక సంఘాలు ఉన్నాయి. నందమూరి గరువు గ్రామ సంఘం వీవోఏగా ముక్కు సత్యవాణి అలియాస్ బోడపాటి సత్యవాణి 2021లో, ఆదర్శ నందమూరి గరువు సంఘం వీవోఏగా పోతుల నాగ స్వాతి 2022లో చేఆరు. గత మూడు సంవత్సరాలుగా డ్వాక్రా గ్రూపు సభ్యుల అనుమతి లేకుండా పొదుపు ఖాతాల నుంచి డబ్బులు గ్రామ సంఘం అకౌంట్కు బదిలీ చేస్తున్నారు. గ్రామ సంఘం ఖాతా నుంచి సీ్త్ర నిధి ద్వారా డ్వాక్రా సంఘ సభ్యులకు సంబంధం లేని వ్యక్తులు ఖాతాల్లోకి నిధులను తరలించారు. సత్యవాణి సుమారు రూ.39,14,700 పక్కదారి పట్టించగా.. పోతుల నాగస్వాతి రూ.43.63 లక్షలు పక్కదారి పట్టించింది. ఇది గమనించి ప్రభ గ్రూపు సభ్యులు ఏపీఎం జ్యోతి రాణి దృష్టికి, గ్రామంలోని నాయకుల దృష్టికి తీసుకెళ్లారు. ఏపిఎం అప్రమత్తమై రికార్డులను పరిశీలించడంతో సుమారు రూ.85 లక్షల మేర అవినీతి చోటుచేసుకుందని గుర్తించారు. ఇదే విషయాన్ని జిల్లా స్థాయి అధికారులకు నివేదించారు. 68 స్వయం సహాయ క సంఘాల్లోని రికార్డులను పూర్తిస్థాయిలో విచారణ చేస్తున్నారు. సత్యవాణి సుమారు రూ.18 లక్షల నగదును తిరిగి ఆయా డ్వాక్రా సంఘ గ్రూపు నిధులకు జమ చేయించారు. గత మూడేళ్ల నుంచి ఇంత పెద్ద ఎత్తున అవినీతి చోటు చేసుకుంటే కనీసం పట్టించుకోలేదని సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకు సిబ్బంది ఏం చేస్తున్నారంటూ డ్వాక్రా మహిళలు నిలదీస్తున్నారు. దీనిపై ఏపీఎం జ్యోతిరాణి స్పందిస్తూ.. ఇద్దరు వీవోఏల పరిధిలో సుమారు రూ.85 లక్షల మేర అవినీతి చోటు జరిగిందని.. సత్యవాణి నుంచి రూ.18 లక్షల మేర నగదును తిరిగి జమ చేయించామని చెప్పారు. పరారీలో పోతుల నాగస్వాతిపై వీరవాసరం పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. సొమ్మును రికవరీ చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. -
విద్యార్థులకు ఉచిత బస్ పాస్లు
భీమవరం(ప్రకాశం చౌక్): స్కూలు, కళాశాలకు విద్యార్థులు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించేందుకు ఆర్టీసీ ఏటా ఉచితంగా బస్సు పాసులిస్తోంది. ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించేలా ఈ పాసులు మంజూరు చేస్తోంది. 12 ఏళ్ల లోపు బాలురు, 18 ఏళ్ల లోపు బాలికలకు వీటిని ఇస్తారు. విద్యా సంవత్సరం మొదలు కావడంతో ఈ నెల 13 నుంచి ఉచిత బస్పాస్లు పశ్చిమ ఆర్టీసీ జారీ చేస్తోంది. భీమవరం, తణుకు, నర్సాపురం, తాడేపల్లిగూడెం, పాలకొల్లు ఆర్టీసీ బస్టాండ్ల్లో పాస్ల జారీ చేయడానికి ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు. ఉచిత బస్పాస్లతో పాటు రాయితీ, దివ్యాంగుల(పీహెచ్) పాస్లు కూడా జారీ చేస్తున్నారు. విద్యార్థులు విద్యార్థి ఫొటో, స్కూల్ యాజమాన్యం నుంచి (బోనఫైడ్ సర్టిఫికెట్) ధ్రువీకరణ పత్రం సమర్పించి బస్పాస్ పొందవచ్చును. ఆర్టీసీ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకుని కౌంటర్ దగ్గరకు వెళ్తే వెంటనే ఉచిత పాస్ పొందవచ్చు. పాస్ పొందిన విద్యార్థులు తమ ఇంటి నుంచి 20 కిలోమీటర్ల దూరం వరకు ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించవచ్చు. 2024–25 ఏడాదికి జిల్లాలో నాలుగు డిపోల పరిధిలో మొత్తం 13,190 ఉచిత బస్ పాస్లు అందిస్తున్నారు. రాయితీ పాస్లు ఇలా రాయితీ బస్ పాస్ పొందేవారికి పాస్ ధరతో నెలవారీ గుర్తింపు కార్డు రూ.50, సర్వీస్ చార్జీ రూ.40 అదనంగా చెల్లించాలి. రాయితీతోపాటు సంవత్సరం గుర్తింపు కార్డు కోసం రూ.100 చెల్లించాలి. పాస్లు నెల, మూడు నెలలు, ఏడాది కాలపరిమితితో మంజూరు చేస్తారు. గడువు ముగిశాక రెన్యువల్ కోసం ప్రిన్సిపాల్ సంతకం చేయించుకుని తిరిగి పొందాలి. సాధారణ విద్యార్థులకు జూన్ నుంచి ఏప్రిల్ వరకూ, ఐటీఐ, పారా మెడికల్ వంటి కోర్సులు చదివే వారికి మే నెల వరకు పాసులు మంజూరుచేస్తారు. దివ్యాంగులకు ఉచిత పాసులు ఆర్టీసీ దివ్యాంగులకు ఉచిత పాసులు అందిస్తుంది. పాస్ పొందడానికి సర్టిఫికెట్, ఆధార్ కార్డు, అన్ ఎంప్లాయిమెంట్ సర్టిఫికెట్ సమర్పించాలి. మూడేళ్ల కాల వ్యవధితో ఈ పాస్లు జారీ చేస్తారు. అన్ని బస్టాండ్లలో ప్రత్యేక కౌంటర్లు కళాశాలలు, స్కూళ్లు ప్రారంభమైన నేపథ్యంలో కొత్త బస్ పాస్ల జారీకి చర్యలు తీసుకున్నాం. ఈనెల 13 నుంచి పాస్లు మంజూరు చేస్తున్నాం. కొత్తవి మంజూరు, పాత పాస్లు రెన్యువల్ చేసి విద్యార్థులకు వేగంగా అందించడానికి జిల్లాలోని ఐదు బస్టాండ్ల్లో కౌంటర్లు ఏర్పాటు చేశాం. రద్ధీ బట్టి అదనపు కౌంటర్లు ఏర్పాటు చేస్తాం. ఎన్వీఆర్ వరప్రసాదరావు జిల్లా ప్రజా రవాణా అధికారి ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసిన ఆర్టీసీ 12 ఏళ్లలోపు బాలురు, 18 ఏళ్ల బాలికలకు ఉచిత పాసులు 2024–2025 ఏడాది జిల్లాలో 1390 ఉచిత పాసుల జారీ గత రెండేళ్లుగా బస్ పాస్ల జారీ ఇలా.. ఏడాది డిపో ఉచిత పాస్లు రాయితీ పాస్లు పీహెచ్సీ పాస్లు 2023–24 భీమవరం 6,056 10,966 319 నర్సాపురం 2,239 6,367 513 తణుకు 1,266 4,705 347 తాడేపల్లిగూడెం 2,142 6,122 506 2024–25 భీమవరం 5,010 4,924 410 నర్సాపురం 2,512 4,518 358 తణుకు 2,108 3,661 363 తాడేపల్లిగూడెం 3,560 3,839 376 -
పెద్దింట్లమ్మ దేవస్థానంలో భక్తుల రద్దీ
కై కలూరు: అమ్మా.. పెద్దింట్లమ్మ నీ చల్లని దీవెనలు అందించమ్మా అంటూ భక్తులు అమ్మవారిని ఆర్తితో వేడుకున్నారు. కొల్లేటికోట పెద్దింట్లమ్మను సమీప జిల్లాల ప్రజలు ఆదివారం దర్శించుకున్నారు. పవిత్ర కోనేరులో స్నానాలాచరించి అమ్మవారికి వేడి నైవేద్యాలను సమర్పించారు. మహిళలు పొంగళ్లను అమ్మకు అందించారు. ఆలయ ఈవో కూచిపూడి శ్రీనివాసు మాట్లాడుతూ ఆదివారం ఒక్కరోజు ప్రత్యేక, అంతరాలయ దర్శనాలు, కేశఖండన, పెద్ద, చిన్న తీర్థాలు, లడ్డూ ప్రసాదం, గదుల అద్దెలు, అమ్మవారి చిత్రపటాల అమ్మకం, వాహన పూజల ద్వారా రూ.73,090 ఆదాయం వచ్చిందని తెలిపారు. -
‘ఉచిత పంటల బీమాకు కూటమి సర్కార్ ఎగనామం’
తణుకు: రైతులకు మేలు చేయాలనే లక్ష్యంతో వైఎస్ జగన్ ఉచిత పంటల బీమా పథకాన్ని తీసుకువస్తే, కూటమి ప్రభుత్వం దానిని పూర్తిగా నిర్వీర్యం చేసిందని మాజీ మంత్రి, వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ కారుమూరి నాగేశ్వరరావు మండిపడ్డారు. తణుకు పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. రైతుల తరుఫున ప్రీమియం కింద రూ.700 కోట్లు చెల్లించడాన్ని భారంగా చూపుతూ కూటమి ప్రభుత్వం ఈ పథకాన్నే పూర్తిగా ఎత్తేసేందుకు సిద్దపడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రకృతి వైఫరీత్యాల సమయంలో రైతులకు అండగా నిలిచే ఈ పథకాన్ని తీసేయడానికి వ్యవసాయం అంటే చంద్రబాబుకు ఉన్న చిన్నచూపే కారణమని ధ్వజమెత్తారు. తక్షణం ప్రభుత్వం దిగివచ్చి ఉచిత పంటల బీమాకు ప్రీమియంను భరించాలని డిమాండ్ చేశారు. ఇంకా ఆయనేమన్నారంటే..రైతులకు మేలు చేయాలని వైఎస్ జగన్ గత ప్రభుత్వంలో ఉచిత బీమా పథకాన్ని అమలు చేశారు. దీనిని పూర్తిగా వక్రీకరిస్తూ ఎల్లోమీడియా ఈనాడు పత్రికలో వైకాపా హయాంలో ఈ పథకాన్ని నిర్వీర్యం చేసిందంటూ తప్పుడు కథనాన్ని ప్రచురించారు. కూటమి ప్రభుత్వమే ప్రీమియంగా దాదాపు రూ.700 కోట్లు చెల్లించాల్సి వస్తోందని ఉచిత బీమా పథకాన్ని అటకెక్కించిన మాట వాస్తవం కాదా? ఆనాడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రైతులపై ఒక్క పైసా భారం పడకుండా ఈ పథకాన్ని అమలు చేసింది. అయిదేళ్ళ పాటు ఈ ఉచిత బీమా వల్ల రైతులకు లబ్ది చేకూరింది. కూటమి ప్రభుత్వం రైతుల పట్ల నిర్లక్ష్యంతో బీమా ప్రీమియం చెల్లించకపోవడం వల్ల గత ఏడాది ప్రకృతి వైఫరీత్యాల వల్ల నష్టపోయిన రైతులకు దాదాపు రూ.1300 కోట్ల మేర పరిహారం దక్కలేదు. రాష్ట్ర ప్రభుత్వం తన వంతు ప్రీమియం కడితేనే దానికి కేంద్రం వాటా విడుదల అవుతుంది. కూటమి ప్రభుత్వంలో ఇది జరగలేదు. వైఎస్ఆర్సీపీ హయాంలో అయిదేళ్ళలో సుమారు 5.52 కోట్ల ఎకరాలకు ఉచిత పంటల బీమా కవరేజీ కల్పించాం. 2014-19 చంద్రబాబు హయాంలో ఉచిత పంటల బీమా కింద రైతులకు ఇచ్చింది కేవలం రూ.3,400 కోట్లు మాత్రమే. వైఎస్ఆర్సీపీ హయాంలో పంట బీమా కింద ఇచ్చింది రూ.7800 కోట్లు. ఇదీ రైతులంటే వైఎస్ జగన్ కు ఉన్న ప్రేమ.గత ఏడాది పంటల బీమాకు ఎగనామంకూటమి ప్రభుత్వం గత ఏడాది ఉచిత పంటల బీమా పథకాన్నికి ఎగనామం పెట్టింది. ఏడాది కాలంగా రైతుల గోడు ప్రభుత్వానికి పట్టడం లేదు. రైతులకు ఈక్రాప్ వల్ల ఉచిత పంటల బీమాను పకడ్బందీగా అమలు చేశాం. దేశంలోనే తొలిసారిగా ఆర్బీకేను ఏర్పాటు చేసి విత్తు నుంచి విక్రయం వరకు రైతులకు బాసటగా నిలిచాం. వైఎస్ఆర్ రైతుభరోసా కింద అయిదేళ్ళలో రూ.34,200 కోట్లను రైతుల ఖాతాలకు నేరుగా జమ చేయడం జరిగింది. కూటమి ప్రభుత్వం ఏడాదికి రూ.20 వేలు ఇస్తామని చెప్పి, నేటికీ దానిని అమలు చేయలేదు. ధాన్యం కొనుగోళ్ళకు సంబంధించి నెలలు గడుస్తున్నా వారికి చెల్లించాల్సిన డబ్బులను కూడా జమ చేయలేదు. మంత్రులు నాదెండ్ల మనోహర్ను రైతులు నేరుగా నిలదీస్తున్నా వారిలో చలనం కలగడం లేదు.ఒకవైపు ప్రభుత్వం నుంచి ధాన్యం కొనుగోళ్లు అరకొరగా చేస్తున్నారు, మరోవైపు మధ్యదళారీలు తక్కువ రేట్లకే రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. ధాన్యం అమ్మి రైతులు డబ్బు కోసం ఎదురుచూస్తుంటే ఈనాడుకు కనిపించడం లేదా? పొదిలిలో పొగాకు రైతులకు అండగా నిలబడేందుకు వైఎస్ జగన్ వెడితే దాదాపు లక్ష మంది రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమ గోడును ఆయన దృష్టికి తీసుకువచ్చేందుకు ప్రయత్నించారు. ైయస్ జగన్ పర్యటన కాగానే వెంటనే ప్రభుత్వం హడావుడిగా పొగాకు కొనుగోళ్ళకు ప్రయత్నిస్తోంది. ఉచిత పంటల బీమాను ఎత్తివేయడం ద్వారా రైతులకు తీవ్రమైన అన్యాయం చేస్తోంది. రైతుల తరుఫున ప్రీమియను ప్రభుత్వమే చెల్లించి, రైతులను ఆదుకోవాలి. రైతు అమ్ముకునే సందర్బంలో గిట్టుబాటు ధర లేక అన్యాయమై పోతున్నాడు. ప్రజలు మాత్రం అధిక రేట్లకు కందిపప్పు కొనుగోలు చేస్తున్నారు. మధ్యలో దళారీలు దోచుకుంటున్నారు. వీరిపై కూటమి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి. కంది రైతుకు గిట్టుబాటు ధర కల్పించాలి, మార్కెట్లో కందిపప్పు రేట్లను నియంత్రించాలి. మామిడి పరిస్థితి కూడా ఇలాగే ఉంది. అన్ని పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలి’ అని డిమాండ్ చేశారు. -
పోషకాల మేతతోమంచి దిగుబడి
చింతలపూడి: పాడి పశువులకు పుష్టికరమైన మేత అందించడం వల్ల అనేక ప్రయోజనాలున్నాయి. నాణ్యమైన మేత అందించడం కారణంగా పశువుల్లో పునరుత్పత్తి సామర్థ్యం పెరుగుతుంది. పాల ఉత్పత్తి కూడ గణనీయంగా పెరుగుతుందని పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ కె.లింగయ్య తెలిపారు. సాధారణంగా పాడి పశువుల్లో విటమిన్ ఎ, కాల్షియం, ఫాస్పరస్ వంటి పోషక పదార్థాల లోపం వల్ల పునరుత్పత్తి సామర్థ్యం తగ్గుతుంది. చాలామంది రైతులు వర్షాకాలం, చలికాలంలో పచ్చిమేతలు, ఎండాకాలంలో ఎండు గడ్డిని దాణాగా అందిస్తారు. ఇది సరైన పద్ధతి కాదు. పచ్చిమేత ఎక్కువగా దొరికే కాలంలో దానికి పాతర వేసి నిల్వ చేసుకోవాలని.. అన్ని కాలాల్లో పచ్చిమేత అందుబాటులో ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు. ఎంత మేత అవసరం.. రోజూ ఒక్కో పశువుకు 8 కిలోల వరిగడ్డి, లేదా ఎండు చొప్ప(మొక్కజొన్న, జొన్న) 8 కిలోల లెగ్యూమ్ జాతి పచ్చిమేత(పిల్లిపెసర, అలసంద, గోరు చిక్కుడు) 16 కిలోల గింజ జాతి పచ్చి మేతలు ఇస్తే.. పశువులకు అన్ని రకాల పోషకాలు అందుతాయి. పాల దిగుబడిని బట్టి పశువులకు దాణా అందించాలి. పోషకాలతో కూడిన గడ్డిని ఇస్తే సకాలంలో ఎదకు వస్తాయి. పాల ఉత్పత్తి కూడా అధికంగా ఉంటుంది. గొడ్డుమోతు సమస్య ఉంటే.. పశువుల్లో గొడ్డుమోతు సమస్యకు సకాలంలో ఎదకు రాకపోవడం, గర్భకోశ వ్యాధులు, అండంలో లోపాల వల్ల ఈ సమస్య అధికంగా ఉంటుంది. పశువులు ఈనిన తరువాత పశువులు 60 నుంచి 90 రోజుల్లో ఎదకు వచ్చి చూలు కట్టాలి. ఎదకు రాని పశువులను సకాలంలో పశు వైద్యుడి దగ్గరకు తీసుకువెళ్ళి పరీక్ష చేయించాలి. ప్రతీ రోజు ఎద లక్షణాలను పరిశీలించి కృత్రిమ గర్భధారణ చేయించాలి. దూడలకు చూడి కట్టించడం సరికాదు యుక్త వయసు రాని దూడల్ని కత్రిమంగా చూడి కట్టించే పనిని రైతులు మానుకోవాలి. తగిన వయసు, బరువు లేని పశువుల్ని చూడి కట్టించడం వల్ల పశువుల్లో వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువ. ఆవులకు 18 నెలలు, గేదెలకు 24 నెలల వయసు వచ్చిన తరువాత మాత్రమే చూడి కట్టించాలి. ఆవులు 200 కిలోలు, గేదెలు 250–300 కిలోలు బరువు ఉన్నప్పుడు మాత్రమే చూడికట్టించాలి. శారీరకంగా పూర్తిగా ఎదగని పశువులను చూడి కట్టించడం వల్ల కటి వలయం సరైన రీతిలో నిర్మాణం కాక ఈనిక కష్టమవుతోంది. ఒక్కోసారి తల్లి లేదా దూడ లేదా రెండూ మరణించే ప్రమాదం ఉంది. అందు వల్ల రైతులు అశాసీ్త్రయమైన పద్ధతులకు స్వస్తి పలికితే పాడి పశువులు ఆరోగ్యంగా ఉంటాయని పశు వైద్యాధికారి సూచించారు. పాడి – పంట -
రూ.15 కోట్ల బిల్లులు పెండింగ్
నూజివీడు: రాష్ట్రంలోని ఆర్జీయూకేటీ పరిధిలోని నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీల్లో విద్యార్థులకు భోజనాన్ని అందిస్తున్న మెస్ నిర్వాహకులకు రూ.కోట్ల మెస్ బిల్లులు చెల్లించకుండా జాప్యం చేస్తుండంతో వారంతా గగ్గోలు పెడుతున్నారు. నెలల తరబడి మెస్ బిల్లులు చెల్లించకుండా జాప్యం చేయడంతో.. అప్పుల పాలవుతున్నామని లబోదిబోమంటున్నారు. నాలుగు ట్రిపుల్ ఐటీల్లోని మెస్ నిర్వాహకులకు దాదాపు రూ.15 కోట్ల వరకు బిల్లులు చెల్లించాల్సి ఉంది. దీనిపై నిర్వాహకులు పలుమార్లు ఆర్జీయూకేటీ అధికారులను కలిసి బిల్లులు విడుదల చేయాలని విన్నవించుకున్నా రూపాయి కూడా విడుదల చేయడం లేదు. దీంతో జూలై 1 నుంచి వేసవి సెలవుల అనంతరం ట్రిపుల్ ఐటీల్లో తరగతులు పునఃప్రారంభమవుతున్న నేపథ్యంలో మెస్ల నిర్వహణ ఎలా అని తలలు పట్టుకుంటున్నారు. నాలుగు ట్రిపుల్ ఐటీల్లో ఉన్న 26,400 మంది విద్యార్థులకు 11 మంది మెస్ నిర్వాహకులు భోజనాన్ని తయారు చేసి అందజేస్తున్నారు. ఈ మెస్లలో కొన్నింటికి గతేడాది సెప్టెంబరు నుంచి మరికొన్నింటికి నవంబరు నుంచి, ఇంకొన్నిటికి జనవరి నుంచి ట్రిపుల్ ఐటీలకు వేసవి సెలవులు ఇచ్చే నాటి వరకు మెస్ బిల్లులు చెల్లించాల్సి ఉంది. ప్రతి రోజూ ఒక్కొక్క మెస్ కనిష్టంగా 2 వేల మంది నుంచి 6 వేల మందికి ఉదయం టిఫిన్, మధ్యాహ్నం, రాత్రి భోజనం, సాయంకాలం స్నాక్స్ అందిస్తోంది. ఇంత భారీ మొత్తంలో మెస్లు నిర్వహిస్తున్న వీరికి పెట్టుబడి సైతం ఎక్కువగానే ఉంటుంది. నెలల తరబడి బిల్లులు చెల్లించకపోవడంతో అప్పులు చేసి సరుకులు తెచ్చి విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వండి పెడుతున్నారు. అయినప్పటికీ ఆర్జీయూకేటీ అధికారులు మెస్ నిర్వాహకులకు బిల్లులు సకాలంలో చెల్లించకుండా తీవ్ర జాప్యం చేస్తున్నారు. ట్రిపుల్ ఐటీల మెస్ నిర్వాహకుల గగ్గోలు బిల్లుల అప్లోడ్లో తీవ్ర జాప్యం నెల గడవగానే ఆ నెలకు సంబంధించిన బిల్లులను సీఎంఎఫ్ఎస్లో అప్లోడ్ చేయడంలో ట్రిపుల్ ఐటీల సిబ్బంది తీవ్ర జాప్యం చేస్తున్నారని మెస్ నిర్వాహకులు వాపోతున్నారు. ఉన్నతాధికారులు ఈ బిల్లుల అప్లోడ్ బాధ్యతలను అవుట్ సోర్సింగ్ స్టాఫ్కు అప్పగించడంతో వారు బాధ్యతా రహితంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఆరు నెలలు, ఎనిమిది నెలల పాటు బిల్లులు చెల్లించకపోవడంతో మెస్ నిర్వాహకులు కోట్లాది రూపాయల అప్పుల్లో మునిగిపోయారు. నూజివీడు ట్రిపుల్ఐటీలో కేఎంకే సంస్థకు దాదాపు రూ.2.50 కోట్లు బిల్లులు చెల్లించాల్సి ఉంది. ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో రూ.1.75 కోట్లు, ఎస్ఎస్ క్యాటరర్స్కు రూ.2.10 కోట్లు, ఒంగోలు ట్రిపుల్ ఐటీలో ఫుడ్సూత్ర హాస్పటాలిటీకి రూ.2.10కోట్లు, శ్రీదేవి క్యాటరర్స్కు రూ.1.40కోట్లు, శ్రీకాకుళం ట్రిపుల్ఐటీలో సరోజ క్యాటరర్స్కు రూ.1.50 కోట్లు, ప్రిజం హాస్పటాలిటీకి రూ.1.30 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఇంకా పలువురు నిర్వాహకులకు మెస్ బిల్లులు చెల్లించాల్సి ఉన్నప్పటికీ ఎప్పుడు చెల్లిస్తారో అంతుబట్టడం లేదని వాపోతున్నారు. ఇప్పటికై నా మెస్ బిల్లులు చెల్లించాలని నిర్వాహకులు కోరుతున్నారు. -
రెడ్క్రాస్ బ్లడ్ బ్యాంక్కు అవార్డు
భీమవరం (ప్రకాశంచౌక్): రెడ్క్రాస్ సొసైటీ జిల్లా శాఖ రాష్ట్రంలో అత్యధిక రక్త యూనిట్లు సేకరించిన సంస్థగా రెండో స్థానం సాధించింది. ఈ సందర్భంగా గుంటూరులోని భారతీయ విద్యాభవనన్లో జరిగిన ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. తణుకు రెడ్క్రాస్ బ్లడ్సెంటర్కు పురస్కారం లభించడం అభినందనీయమని జిల్లా శాఖాధ్యక్షుడు రామ భద్రిరాజు అన్నారు. బస్సు ఢీకొని మహిళకు తీవ్ర గాయాలు ఉండి: ఆసుపత్రికి వెళ్తున్న వృద్ధ దంపతులను ఆర్టీసీ బస్సు ఢీ కొట్టడంతో మహిళ తీవ్రంగా గాయపడింది. శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంపై స్థానికులు, బాధితురాలి భర్త తెలిపిన వివరాల ప్రకారం గణవరానికి చెందిన రిటైర్డ్ టీచర్ గొట్టుముక్కల గోపాలకృష్ణంరాజు తన భార్య సావిత్రితో కలసి బైక్పై భీమవరంలో ఆసుపత్రికి వెళ్తున్నాడు. ఎన్నార్పీ అగ్రహారంలోని ప్రభుత్వ పెట్రోల్ బంక్ వద్దకు రాగానే నర్సాపురం డిపోకు చెందిన బస్సు లారీని ఓవర్ టేక్ చేయబోయి బైక్ను ఢీకొట్టింది. వెనుక కూర్చున్న మహిళ పట్టుతప్పి ఆర్టీసీ బస్సు వెనక చక్రం కింద పడిపోయింది. ఇంతలో డ్రైవర్ సడన్ బ్రేక్ వేశారు. తలకు తీవ్ర గాయం కావడంతో 108లో ఆమెను ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాదస్థలికి వచ్చి వివరాలు సేకరించారు. వివాహిత ఆత్మహత్య ఆగిరిపల్లి: వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని వట్టిగుడిపాడులో శుక్రవారం రాత్రి జరిగింది. ఎస్సై శుభశేఖర్ వివరాల ప్రకారం వట్టిగుడిపాడుకు చెందిన రాంబాబు, నాగ తేజస్వినికి( 21) మూడేళ్ల క్రితం వివాహమైంది. ఆ సమయంలో 50 సెంట్లు కట్నంగా ఇచ్చారు. సంవత్సరం క్రితం తండ్రి కూతురి భూమి పట్టాలను బ్యాంకులో తనఖా పెట్టాడు. శుక్రవారం కూతురు తేజస్విని తండ్రి తనఖా పెట్టిన భూమిని విడిపించి ఇవ్వాలని అడగ్గా తండ్రి కొంత సమయం కావాలనడంతో తేజస్విని మనస్తాపంతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
చికిత్స పొందుతూ మహిళ మృతి
పాలకొల్లు సెంట్రల్: పెళ్లికి హైదరాబాద్ వెళ్లి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో భర్త అక్కడికక్కడే మృతి చెందగా.. గాయపడి చికిత్స పొందుతున్న భార్య కుంపట్ల రీతు (41) శనివారం మృతి చెందింది. బంధధువులు తెలిపిన వివరాలు ప్రకారం కృష్ణాజిల్లా కృత్తివెన్ను మండలం సంగమూడి సమీపంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కుంపట్ల రాంగోపాల్ (పెద్దరాజా) అక్కడికక్కడే మృతి చెందాడు. భార్య రీతు, పాప ప్రణవి, కుమారుడు రాములను భీమవరం ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం రీతును శుక్రవారం హైదరాబాద్ తరలించగా శనివారం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. భార్యాభర్తల మృతితో బంధువులు, స్నేహితులు కన్నీటి పర్యంతమయ్యారు. రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి భీమవరం అర్బన్: భీమవరం రూరల్ పోలీస్స్టేషన్ పరిధిలో శనివారం రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కొత్తపూసలమర్రు గ్రామానికి చెందిన పెమ్మాడి దయామణి (38) గల్ఫ్ నుంచి 20 రోజుల క్రితం సొంతూరు వచ్చింది. శనివారం మొగల్తూరు మండలంలోని కొత్తాటలోని బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి సొంతూరు కొత్తపూసలమర్రుకు బంధువు ద్విచక్రవాహనంపై వస్తుండగా లోసరి పంచాయతీ గరవళ్ల దిబ్బ వద్ద వెనుకనుంచి లారీ ఢీకొనడంతో దయామణి మృతిచెందింది. ఆమె భర్త గతంలో మృతి చెందాడు. ఇద్దరు ఆడపిల్లలున్నారు. కోడి వ్యర్థాల వాహనం సీజ్ దెందులూరు: జాతీయ రహదారి మీదుగా చేపల చెరువులకు చికెన్ వ్యర్థాలు తరలిస్తున్న రవాణా వాహనాలను సీజ్ చేసి వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. శనివారం ఉదయం తనిఖీల్లో భాగంగా చికెన్ వ్యర్థాలతో వెళుతున్న వ్యాన్ను పట్టుకున్నారు.హైదరాబాద్ నుంచి గుండుగోలను వైపు వెళ్తున్న వ్యానును దెందులూరు ఎస్సై శివాజీ తనిఖీ చేయగా.. తనిఖీ చేయగా కోళ్ల వ్యర్థాలు బయటపడ్డాయి. ఇద్దరిపై కేసు నమోదు చేశారు. -
కల్తీ విత్తనాలతో జాగ్రత్త!
బుట్టాయగూడెం : తొలకరి వర్షాలు ప్రారంభం కావడంతో రైతులు వ్యవసాయ పనులకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో విత్తనాలు కొనేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. నాణ్యమైన విత్తనాల ఎంపికలో జాగ్రత్తలు అవసరమని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు. కల్తీ విత్తనాల విషయంలో అప్రమత్తంగా ఉండాలంటున్నారు. విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు విక్రయించే డీలర్లు ఎరువుల నియంత్రణ చట్టం– 1985 ప్రకారం నిబంధలు పాటించాలని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు. విత్తనాల కొనుగోలులో.. వ్యవసాయ శాఖ లైసెన్స్ పొందిన డీలర్ల వద్ద, గుర్తింపు పొందిన సంస్థల వద్ద మాత్రమే రైతులు విత్తనాలు కొనుగోలు చేయాలి. సీల్ వేసిన ధృవీకరణ పత్రం ఉన్న విత్తన బస్తాలనే కొనుగోలు చేయాలి. విత్తనాల సంచిపై విత్తనాల రకం, ల్యాబ్ నెంబర్, గడువు తేదీ, తదితర విషయాలను గమనించాలి. కొనుగోలు చేసిన బిల్లుపై డీలర్ సంతకం తప్పనిసరిగా ఉండాలి. రైతులు విత్తనాలు కొనుగోలు చేసిన తర్వాత రసీదు తప్పనిసరిగా తీసుకోవాలి. హైబ్రిడ్ విత్తనాల కొనుగోలుకు విత్తన రకం, స్వచ్ఛత, మొలకెత్తే స్వభావం, జన్యు నాణ్యత వంటి వివరాలు పరిశీలించాలి. మొలకెత్తిన దశ, పూత దశలో లోపం కనిపిస్తే స్థానిక వ్యవసాయ అధికారులను, సిబ్బందిని సంప్రదించాలి. మొలకలను పరీక్షించే విధానం రైతులు విత్తుకోవడానికి ఒకరోజు ముందు విత్తనాలను కొనుగోలు చేయడం వల్ల మొలక పరీక్షలు చేయించుకోవడం లేదు. విత్తనం కొనుగోలు చేసిన తర్వాత తప్పనిసరిగా మొలకలను పరీక్ష చేయించుకోవాలి. రైతు కొనుగోలు చేసిన విత్తనాల సంచి నుంచి 100 గింజలను 24 గంటలపాటు నీటిలో నానబెట్టి అనంతరం ఒక గుడ్డలో గాలి, వెలుతురు తగలని ప్రదేశంలో ఉంచాలి. 24 గంటల తర్వాత తీసి చూస్తే 100 గింజలకు 75 గింజలపైనే మొలక వస్తే మంచి విత్తనంగా నిర్ధారించుకుని నారుమడులు సిద్ధం చేసుకోవాలి. మొలక శాతం కనీసం 75 శాతం వరకూ ఉంటే విత్తనాలు నాణ్యమైనవని భావించి పంటలు విత్తుకోవాలి. గడువు దాటితే కొనుగోలు చేయొద్దు కొనుగోలు చేసే విత్తన ప్యాకెట్, సీసా డబ్బాపై సీలు ఉందా? లేదా? అనేది నిర్ధారించుకోవాలి. అరువు పద్ధతిలో విత్తనాలు కొనుగోలు చేసినప్పటికీ బిల్లు తప్పనిసరిగా తీసుకోవాలి. మొలకెత్తే దశ, పూత దశలో పంటలో లోపం కనిపిస్తే వెంటనే వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించాలి. మంచి విత్తనాలతోనే నారు కట్టాలి సొంతంగా తయారు చేసిన విత్తనాలు నారుకు శ్రేయస్కరం. కొనుగోలు చేస్తే మంచి విత్తనాలను ఎంపిక చేయాలి. నారుపోసే ముందు మొలక శాతం గుర్తించి నారు పోయాలి. ఎలాంటి సమస్యలు ఉన్నా వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించాలి. – పీజీ బుచ్చిబాబు, సహాయ వ్యవసాయ సంచాలకుడు, కేఆర్పురంరైతులకు వ్యవసాయాధికారుల సూచన -
నటుడు అల్లం గోపాలరావు మృతి
భీమడోలు : సినీ, టీవీ ఆర్టిస్ట్ అల్లం గోపాలరావు(75) శనివారం హైదరాబాద్లో కన్నుమూశారు. భీమడోలు మండలం గుండుగొలను గ్రామానికి చెందిన ఆయన మృతితో గ్రామంలో విషాద చాయలు అలముకున్నాయి. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. గోపాలరావుకు ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం స్నేహితుడు. ఆయన సహకారంతో రెండు దశాబ్దాల క్రితం హైదరాబాద్ వెళ్లి టీవీ, సినిమాల్లో నటించి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేశారు. గోపాలరావు భీమడోలులోని సుగర్ ఫ్యాక్టరీలో ఉద్యోగిగా పని చేసేవారు. గ్రామంలోని గురజాడ కళావేదిక వద్ద క్రీడా పోటీలు నిర్వహించేశారు. అభ్యుదయ వాదిగా అనేక చైతన్య కార్యక్రమాలు, సామాజిక కార్యక్రమాలు చేశారు. ప్రజానాట్యమండలి ఆధ్వర్యంలో నాటికలు, ప్రదర్శనలు ఇచ్చారు. గోపాలరావు మృతికి నివాళి ఏలూరు (ఆర్ఆర్పేట): గోపాలరావు మృతికి సీపీఐ, ప్రజా నాట్యమండలి, బీకేఎంయూ జిల్లా సమితులు ఓ ప్రకటనలో సంతాపం తెలిపాయి. సీపీఐ జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య, బీకేఎంయూ జిల్లా కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు, ప్రజానాట్యమండలి ఏలూరు ఏరియా కార్యదర్శి తమ్మా విశ్వేశ్వరరావు మాట్లాడుతూ గోపాలరావు తొలినాళ్లలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ప్రజానాట్యమండలిలో ప్రముఖ పాత్ర నిర్వహించారన్నారు. సమాజంలో మార్పునకు కృషి చేశారన్నారు. అభ్యదయ భావాలు కలిగిన గోపాలరావు మృతి కళా రంగానికి తీరని లోటన్నారు. -
కొంతేరులో మహిళ ఆత్మహత్య
యలమంచిలి: కొడుకు ప్రేమలో విఫలమై ఆత్మహత్య చేసుకోగా.. కొడుకు ప్రియురాలి కుటుంబ సభ్యులు కోర్టు కేసులు వేసి తనను వేధిస్తున్నారని.. కడుపు కోతను, కోర్టు కేసులను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ సూసైడ్ నోట్ రాసి మహిళ శనివారం కొంతేరు గ్రామంలో ఆత్మహత్య చేసుకుంది. దీంతో ఆమె మృతదేహాన్ని ప్రియురాలి ఇంటి ముందు ఉంచి కుటుంబసభ్యులు, బంధువులు ఆందోళన చేపట్టారు. మృతురాలి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. భీమవరం గ్రామానికి చెందిన చింతా లక్ష్మీ నర్సమాంబ భర్త చనిపోవడంతో పుట్టిల్లు కొంతేరు వచ్చి స్థిరపడింది. ఇద్దరు కుమారులను కష్టపడి ఇంజినీరింగ్ చదువించింది. వారిలో లికిల్ సాయి సమీపంలో ఉంటున్న అమ్మాయిని ప్రేమించాడు. వారిద్దరికి గొడవ జరగడంతో వీడియో కాల్లో ఆ అమ్మాయితో మాట్లాడుతూనే ఉరి వేసుకుని గత డిసెంబరులో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయంలో తన కుమార్తెను అల్లరిపాలు చేస్తున్నారంటూ ఆ అమ్మాయి తండ్రి వారిపై పోక్సో కేసు నమోదు చేయాలని హైకోర్టులో రిట్ పిటిషన్ వేశాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఒకవైపు కొడుకు మరణం, మరోవైపు కోర్టు కేసులతో నర్సమాంబ మనస్తాపం చెంది శనివారం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తన ఆత్మహత్యకు అడ్డాల నాగేశ్వరరావు కుటుంబమే కారణమని ఆరోపిస్తూ నర్సమాంబ సూసైడ్ నోట్ రాసింది. ఈ సంఘటనపై ఎవరూ పిర్యాదు చేయకపోవడంతో కేసు నమోదు చేయలేదని పోలీసులు తెలిపారు. కుమారుడి ప్రియురాలి ఇంటిముందు మృతదేహంతో ఆందోళన -
కిటకిటలాడిన శ్రీవారి క్షేత్రం
ద్వారకాతిరుమల: శ్రీవారి క్షేత్రం శనివారం భక్తులతో కిటకిటలాడింది. వేసవి సెలవులు ముగియడంతో వేలాది మంది భక్తులు ఆలయానికి తరలివచ్చారు. దాంతో ఆలయ పరిసరాలు భక్తులతో సందడిగా మారాయి. ఆలయ తూర్పురాజగోపుర ప్రాంతం, వైకుంఠం క్యూకాంప్లెక్స్, అనివెట్టి మండపం, దర్శనం క్యూలైన్లు, ప్రసాదం, టికెట్ కౌంటర్లు, కేశఖండనశాల, నిత్యాన్నదాన విభాగాలు భక్తులతో పోటెత్తాయి. దేవస్థానం సిబ్బంది భక్తులకు క్యూ కాంప్లెక్స్లో నిరంతరాయంగా మజ్జిగ, మంచి నీటిని అందించారు. ఆలయ అనివేటి మండపంలో పలు భజన మండలి సభ్యులు ప్రదర్శించిన కోలాట నృత్యాలు చూపరులను అలరించాయి. కొండపైన ఘాట్ రోడ్లు భక్తుల వాహనాలతో నిండిపోయాయి. సాయంత్రం వరకు క్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగింది. -
ట్రిపుల్ ఐటీ డీన్ స్టూడెంట్ వేల్ఫేర్ అధికారిగా ఎల్.రాజేష్
నూజివీడు : స్థానిక ట్రిపుల్ ఐటీ డీన్ స్టూడెంట్ వెల్ఫేర్ (బాలురు) అధికారిగా ఇంగ్లిష్ కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్గా పని చేస్తున్న ఎల్.రాజేష్ శుక్రవారం అదనపు బాధ్యతలు స్వీకరించారు. ఏడాది పాటు ఈ పదవిని ఆయన నిర్వర్తించనున్నారు. అలాగే చీఫ్ వార్డెన్ (బాలురు)గా బి.సురేష్బాబు నియమితులయ్యారు. ఈయన పీయూసీలో బయాలజీ మెంటార్గా పనిచేస్తున్నారు. ఈ సందర్భంగా ఇన్చార్జి డైరెక్టర్ ఆచార్య సండ్ర అమరేంద్ర కుమార్ మాట్లాడుతూ విద్యార్థుల సమస్యల పరిష్కారంలో తగిన చొరవ చూపాలని రాజేష్కు సూచించారు. కార్యక్రమంలో సెంట్రల్ డీన్ దువ్వూరి శ్రావణి, సెంట్రల్ ఏఓ బండి ప్రసాద్, ఏఓ బి లక్ష్మణరావు, డీన్ సాధు చిరంజీవి, చీఫ్ వార్డెన్ బి సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. మద్యం మత్తులో రాయిపై పడి వ్యక్తి మృతి కాళ్ల: మద్యం మత్తులో రోడ్డు పక్కన ఉన్న రాయిపై పడిపోవడంతో తీవ్ర గాయమై ఓ వ్యక్తి మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పెద అమిరంలోని లిబర్టీ ఫ్యాక్టరీ సమీపంలో గురువారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. భీమవరం మండలం రాయలం గ్రామానికి చెందిన ఎన్.లక్ష్మీకాంత్ (34) భీమవరం పట్టణంలోని బాలాజీ మెడికల్ షాపులో పనిచేస్తున్నాడు. అతనికి వివాహమై ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మద్యానికి బానిసైన లక్ష్మీకాంత్ గురువారం రాత్రి మద్యం సేవించి వస్తూ రోడ్డు పక్కన రాయిపై పడిపోవడంతో కనుబొమ్మ వద్ద గాయమై ప్రాణాలు కోల్పోయాడు. శుక్రవారం ఉదయం స్థానికులు ఇచ్చిన సమాచారంతో భీమవరం డీఎస్పీ జయసూర్య, ఆకివీడు సీఐ జగదీశ్వరరావు, ఎస్సైలు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భీమవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుని తండ్రి మదనాచారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్సై శ్రీనివాసరావు తెలిపారు. నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ ఏలూరు (ఆర్ఆర్పేట): జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలకు చెందిన నిరుద్యోగ యువతకు యూనియన్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ద్వారా వివిధ కోర్సుల్లో ఉచిత శిక్షణ అందించడానికి ఏర్పాటు చేసినట్టు ఆ సంస్థ డైరెక్టర్ ఎం.ఫణి కిషోర్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఎలక్ట్రికల్ హౌస్ వైరింగ్ కోర్సులో 30 రోజులు, సీసీ కెమెరాల బిగింపుపై 13 రోజుల శిక్షణ ఉంటుందని వివరించారు. ఎలక్ట్రికల్ హౌస్ వైరింగ్ కోర్సుకు 10వ తరగతి ఆపై, సీసీ కెమెరాల బిగింపు కోర్సుకు 5వ తరగతి ఆపై విద్యార్హత కలిగి ఉండాలని పేర్కొన్నారు. ఈ కోర్సుల్లో చేరడానికి గ్రామీణ ప్రాంతాలకు చెందిన 19 నుంచి 45 సంవత్సరాల మధ్య వయసు కలిగిన నిరుద్యోగులు అర్హులని తెలిపారు. శిక్షణ తరగతులు ఈ నెల 16 నుంచి ప్రారంభమవుతాయని వివరించారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు మరిన్ని వివరాలకు 99485 65256, 90140 40780 నంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు. -
మోటార్సైకిళ్ల దొంగ అరెస్ట్
రూ.13 లక్షల విలువైన మోటారు సైకిళ్లు స్వాధీనం తాడేపల్లిగూడెం అర్బన్ : పట్టణంలో రాత్రి సమయంలో మోటారుసైకిళ్లను దొంగలిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం పట్టణ ఎస్సై నాగ రాజు తెలిపిన వివరాల ప్రకారం ఏలూరు పట్టణానికి చెందిన పూతి ప్రసాద్ అలియాస్ పెరుమాళ్ల దాలయ్య పలు పట్టణాల్లో రాత్రి సమయాల్లో సంచరిస్తూ ఇళ్ల ముందు ఉన్న కొత్త మోటారుసైకిళ్లను దొంగలిస్తున్నాడు. దీంతో ప్రత్యేక బృందాలుగా ఏర్పడి పూత్తి ప్రసాద్ను అదుపులోకి తీసుకొని అతని వద్ద నుంచి రూ.13 లక్షలు విలువైన 9 మోటారు సైకిళ్లు స్వాధీనం చేసుకున్నారు. తాడేపల్లిగూడెం పరిధిలో నాలుగు, తణుకు టౌన్లో 1, రావులపాలెంలో రెండు, గుడివాడ టౌన్లో ఒకమోటారుసైకిల్ దొంగలించాడు. ఈ మేరకు ప్రసాద్పై కేసు నమోదు కోర్టుకు హాజరుపర్చనున్నారు. పూతి ప్రసాద్ గతంలో వివిధ జిల్లాల్లో సుమారు వంద నేరాలు చేసి జైలుశిక్ష అనుభవించాడు. ఆరుతడి పద్ధతితో అధిక దిగుబడి ఏలూరు(మెట్రో): వరిలో ఆరుతడి పద్ధతి సాగుతో అధిక దిగుబడిని సాధించవచ్చని డీఏఓ షేక్ హబీబ్ బాషా, జిల్లా ప్రకృతి వ్యవసాయ ప్రాజెక్టు మేనేజర్ బి.వెంకటేష్ తెలిపారు. ఏలూరులోని జిల్లా కళ్యాణి అపార్ట్మెంట్లో శుక్రవారం కమ్యూ నిటీ రిసోర్స్పర్సన్స్కు అంతర్జాతీయ పరిశోధన కోర్ ప్రాజెక్ట్ గురించి డీఏఓ షేక్ హబీబ్ బాషా వివరంచారు. వరిలో ఆరుతడి పద్ధతి, హరిత గృహవాయువు వాటి ప్రాముఖ్యత గురించి వివరించారు. అలాగే కోర్ ప్రాజెక్టు సిబ్బంది ఈ శిక్షణలో వరిలో ఆరుతడి పద్ధతి ఏ విధంగా పాటించాలి? అలాగే తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి తెలియజేశారు. ఆరుతడి పద్ధతి సాగు వల్ల 30 శాతం వరకు సాగు నీరు ఆదా అవుతుందన్నారు. అలాగే మెరుగైన పంట ఎదుగుదల ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో డీపీఎంయూ స్టాఫ్ శాసీ్త్రయ శాస్త్రవేత్తలు అంకిత పాల్, పవన్ యెగ్గిన్ తదితరులు పాల్గొన్నారు. -
జగన్నాథుని రథోత్సవాలకు ముమ్మరంగా ఏర్పాట్లు
27 నుంచి రథోత్సవాల నిర్వహణ ద్వారకాతిరుమల: శ్రీవారి ఆలయానికి దత్తత దేవాలయమైన లక్ష్మీపురంలోని జగన్నాథస్వామి వారి ఆలయంలో ఈ నెల 27 నుంచి వచ్చే నెల 6 వరకు జగన్నాథుని రథోత్సవాలను వైభవంగా నిర్వహించనున్నట్టు ఆలయ అధికారులు తెలిపారు. ప్రతి ఏటా ఈ ఉత్సవాలను పూరీ క్షేత్రంలో నిర్వహించే విధంగా చిన వెంకన్న దేవస్థానం ఇక్కడ వైభవంగా నిర్వహిస్తోంది. అందులో భాగంగా ఈ నెల 27న రథంపై స్వామి వారు లక్ష్మీపురం ఆలయం నుంచి ద్వారకాతిరుమల క్షేత్రానికి ఊరేగింపుగా వెళ్తారు. అలాగే ఉత్సవాల ముగింపు రోజు జులై 6న ఆలయం నుంచి సమీప గ్రామమైన తిమ్మాపురానికి రథయాత్రగా వెళ్లనున్నారు. రథోత్సవాలను పురస్కరించుకుని ఆలయ ఆవరణలోని కల్యాణ మండపంలో జగన్నాథస్వామి వారు రోజుకో ప్రత్యేక అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారని తెలిపారు. భక్తులు స్వామి వారిని దర్శించి, తీర్థ ప్రసాదాలను స్వీకరించాలని ఆయన కోరారు. దశావతారాలు ఇలా.. 27న మత్స్యావతారం, 28న కూర్మావతారం, 29న వరాహావతారం, 30న నరసింహావతారం, జులై 1న వామనావతారం, 2న పరశురామావతారం, 3న రామావతారం, 4న కృష్ణావతారం, 5న కల్కిఅవతారం, 6న శ్రీవేంకటేశ్వర స్వామి అవతారం -
రక్తదాత.. జీవన ప్రదాత
రాయలంలో అత్యాధునిక బ్లడ్ బ్యాంక్ నూతన జిల్లా ఏర్పడ్డాక 2022లో అప్పటి కలెక్టర్ పి. ప్రశాంతి నేషనల్ రెడ్ క్రాస్ ద్వారా రూ. కోటి 50 లక్షలతో అత్యాధునిక పరికరాలను మంజూరు చేయించారు. అలాగే మండలంలోని రాయలం పంచాయతీ కార్యాలయం పక్కనే ఉన్న ప్రభుత్వ భవనాన్ని బ్లడ్ బ్యాంకు కోసం కేటాయించారు. ఉద్యోగులు, ప్రజల నుంచి జిల్లా శాఖ కోటి రూపాయల మేర విరాళాలు సేకరించి భవనంలో వైద్య పరికరాలు మార్పులు చేయించి వసతులు కల్పించారు. గతేడాది నవంబర్ 18న జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ ప్రెసిడెంట్, ప్రస్తుత కలెక్టర్ సీహెచ్ నాగరాణి బ్లడ్ బ్యాంకును ప్రారంభించారు. అయితే తణుకు, నరసాపురంలోని రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంకులు హోల్ బ్లడ్ను మాత్రమే అందిస్తాయి. రాయంలోని ఏర్పాటు చేసి రెడ్క్రాస్ బ్లడ్ బ్యాంకులో అత్యాధునిక పరికరాలు ద్వారా రక్తాన్ని ప్రాసెసింగ్ చేసి హోల్ బ్లడ్తో పాటు ఎర్రరక్తకణాలు, ప్లాస్మా, ప్లేట్లెట్స్ అందించే విధంగా ఆధునిక వసతులు కల్పించారు. 8 వేల యూనిట్లు రక్తం నిల్వ ఉండే విధంగా చర్యలు తీసుకున్నారు. భీమవరం అర్బన్: ప్రమాద సమయాల్లో ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లిన వారికి రక్తం చాలా అవసరం. ఇలా ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి రెడ్క్రాస్ చొరవతో రక్తం అందుతుంది. రోడ్డు ప్రమాదాల్లో క్షతగాత్రులైన వారికే కాకుండా తలసేమియా రోగులకు, ఇతర శస్త్రచికిత్సల్లో రక్తం అవసరమయ్యే వారికి రెడ్క్రాస్ రక్తనిధి దన్నుగా నిలుస్తుంది. నోబుల్ బహుమతి గ్రహీతైన ఆస్ట్రేలియాకు చెందిన కార్ల ల్యాండ్ స్టైనర్ జయంతి, జూన్ 14న ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం. దాతల అవసరం లేకుండానే ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు బ్లడ్ బ్యాంకులు రక్తాన్ని అమ్మకూడదు. దాత నుంచి సేకరించాక మరొకరి శరీరంలోకి ఎక్కించేందుకు సురక్షితమో? కాదో నిర్ధారించే పరీక్షలు, భద్రపరిచేందుకు అవసమైన ప్రాసెసింగ్ చార్జీలు మాత్రమే తీసుకోవాలి. ప్రైవేటు బ్లడ్ బ్యాంకుల్లో దాతలు రక్తాన్ని ఇచ్చిన తరువాత రోగికి కావాల్సిన బ్లడ్ గ్రూపుల రక్తాన్ని విక్రయిస్తారు. రెడ్క్రాస్ సొసైటీలో దాత అవసరం లేకుండా రోగికి కావాల్సిన బ్లడ్ను ప్రభుత్వం నిర్ణయించిన ప్రాసెసింగ్ చార్జీలతో అందజేస్తారు. ముందుకు వచ్చిన ఉద్యోగులు ప్రతి నెలా మొదటి, మూడో శుక్రవారాల్లో మండలంలోని రాయలంలో ఏర్పాటు రెడ్క్రాస్ సొసైటీలో జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖల సిబ్బందితో రక్తదాన శిబిరాలను నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు 12 శిబిరాల ద్వారా 645 యూనిట్లు రక్తాన్ని సేకరించినట్లు జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ డాక్టర్ బద్రిరాజు తెలిపారు. రక్తదానం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు గురించి వివరించారు. రక్తదానంతో ప్రాణాలకు రక్షణ ఒక వ్యక్తి చేసే రక్తదానం 4 ప్రాణాలు కాపాడుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. రక్తం ఇవ్వగానే దానిని వివిధ భాగాలుగా విభజిస్తారు. దాత నుంచి సేకరించే రక్తాన్ని హోల్ బ్లడ్ అంటారు. ఆ రక్తంలో ప్లాస్మా, ప్లేట్లెట్స్, తెల్ల రక్తకణాలు, ఎర్ర రక్తకణాలు ఉంటాయి. వీటిని విడదీసి నలుగురికి ఈ రక్తాన్ని ఎక్కించవచ్చు. ఒక వ్యక్తి ప్రతి 3 నెలలకు ఒకసారి సాధారణ రక్తదానం చేయవచ్చు. ప్రతి 15 రోజులకు ఒకసారి ప్లేట్లెట్స్ కానీ, ప్లాస్మాను గానీ దానం చేయవచ్చు. రక్తదానం చేయడానికి ముందు రక్తదాత హెల్త్ ప్రొఫైల్ తెలుసుకోవచ్చు. రక్తదానం చేయడం వల్ల పెద్దపేగు, ఊపిరితిత్తులు, కాలేయం, గొంతు, క్యాన్సర్లు వంటి రాకపోవడమే కాకుండా గుండె సంబంధిత వ్యాధులు తగ్గుతాయి. రక్తదానం ఎవరు చేయాలంటే? 18–60 సంవత్సరాల మధ్య వయస్సు ఉండి బరువు 45 కిలోల పైన ఉండాలి. బీపీ అదుపులో ఉండాలి. తీవ్రమైన వ్యాధులు, మూర్చ, మూత్రపిండ వ్యాధులు, అలర్జీ, అసాధారణ రక్తస్రావ లక్షణాలు, హృదయ సంబంధమైన వ్యాధులు ఉండకూడని వారు రక్తదానం చేయవచ్చు. అలాగూ హిమోగ్లోబిన్ 100 మిల్లీ లీటర్లు రక్తంలో 12.5 గ్రాముల కంటే ఎక్కువగా ఉండాలి. రక్తదానం ఎవరు చేయకూడదంటే? గర్భిణులు, ప్రసవానంతరం 6 నెలల వరకు బిడ్డకు పాలిచ్చినంత కాలం, బహిష్టు సమయంలో అధికంగా రక్తస్రావం జరిగే పరిస్థితుల్లో సీ్త్రలు రక్తం ఇవ్వకూడదు. అలాగే టీకాలు వేసుకున్న రెండు వారాల లోపు ఇవ్వకూడదు. జంతువుల కాట్లకు గురైన ఏడాది లోపు ఇవ్వకూడదు. టిటానస్ (ధనుర్వాతం), డిప్తీరియా (కంఠవాపు), గ్యాస్ గ్యాంగ్రీన్ కోసం మందులు వాడినవారు పచ్చకామెర్లు వ్యాధి గ్రస్తులు కూడా రక్తం ఇవ్వకూడదు. నేడు ప్రపంచ రక్తదాతల దినోత్సవం రెడ్క్రాస్ ఆధ్వర్యంలో ప్రతి నెలా ప్రభుత్వ ఉద్యోగుల రక్తదానం ప్రభుత్వ ఉద్యోగుల చొరవ అభినందనీయం రక్తదాన శిబిరాలకు ప్రభుత్వ ఉద్యోగుల ప్రత్యేక చొరవ చూపడం అభినందనీయం. వారు రక్తదానం చేయడంతోనే 645 యూనిట్ల రక్తాన్ని సేకరించగలిగాం. ప్రాణాపాయస్థితిలో ఉన్న వారిని ఎంతోమందిని రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా కాపాడగలిగాం. రక్తం కొరతను తీర్చడం, అత్యవసర పరిస్థితులు, శస్త్ర చికత్సల సమయంలో ప్రాణాలను రక్షించే సహాయాన్ని అందించడం లక్ష్యంగా ఈ కేంద్రం పనిచేస్తుంది. డాక్టర్ బద్రిరాజు, రెడ్క్రాస్ జిల్లా చైర్మన్, భీమవరం -
యథేచ్ఛగా మట్టి అక్రమ తవ్వకాలు
నూజివీడు: నియోజకవర్గవ్యాప్తంగా మట్టిదందా యథేచ్ఛగా కొనసాగుతోంది. మట్టిదోపిడీ కోసమే కూటమి ప్రభుత్వం ఏర్పడిందన్న చందంగా అధికార పార్టీకి చెందిన నాయకులు పగలు, రాత్రి లేకుండా చెరువుల్లోని మట్టిని కొల్లగొడుతున్నారు. అధికారుల పర్యవేక్షణలోపంతో ధనార్జనే ధ్యేయంగా సహజ సంపదైన మట్టిని కొల్లగొడుతూ లక్షలాది రూపాయల ప్రజా ధనాన్ని దోచుకుంటున్నారు. నూజివీడు డివిజన్కు సబ్కలెక్టర్గా ఐఏఎస్ అధికారి ఉన్నప్పటికీ పట్టించుకోకపోవడంతో మట్టి దందా ఊపందుకుంది. మండలంలోని బోర్వంచ శివారు కొన్నంగుంట గోరింత చెరువు నుంచి మట్టి అక్రమ అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. ఈ చెరువులో గ్రావెల్ పెద్ద ఎత్తున ఉండడంతో గ్రామంలోని పొలాల్లోకి సారవంతమైన పూడిక మట్టిని తోలుకునేందుకు అనుమతులు పొంది గ్రావెల్ను తవ్వి నూజివీడు పట్టణంలోనికి ట్రాక్టర్లలో యథేచ్ఛగా తరలిస్తూ మట్టిని విక్రయిస్తున్నారు. ట్రక్కు వెయ్యి రూపాయల నుంచి రూ.1200లకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఈ చెరువులో 2014–19 సమయంలో తవ్విన అడ్డగోలు తవ్వకాలతో తూము కంటే పది అడుగుల లోతుకు చేరినా ఇరిగేషన్ అధికారులు మాత్రం మట్టి తవ్వకాలకు అనుమతులు ఇవ్వడంపై గ్రామానికి చెందిన పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. వృద్ధురాలు మృతి చెందినా ఆగని రవాణా ముసునూరు: మండలంలోని గోపవరం, రమణక్కపేట, కొర్లగుంట,లోపూడి తదితర గ్రామాల్లో జేసీబీలు పెట్టి, రేయింబవళ్లు తేడా లేకుండా వందలాది ట్రాక్టర్లతో విలువైన చెరువు మట్టి తరలిస్తున్నారు.గోపవరంలో టీడీపి నేతలే ట్రాక్టర్ ట్రక్కు మట్టికి రూ.650 నుంచి రూ.700 గా నిర్ణయించి, మట్టిని యథేచ్ఛగా అమ్ముకుంటున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఇటీవల గోపవరంలో మట్టి ట్రాక్టర్ ఢీకొట్టి వృద్ధురాలు మృతి చెందినా ఆగకుండా అక్రమ మట్టి రవాణా కొనసాగిస్తున్నారు. నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్న సమాచార, గృహనిర్మాణ శాఖా మంత్రి పేరుతో అక్రమాలకు పాల్పడుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. అయితే అక్రమ మట్టి రవాణాపై తహసీల్దార్ కేవీ రమణను వివరణ కోరగా తక్షణమే సిబ్బందిని పంపి చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే నీటిపారుదల శాఖ నూజివీడు డీఈఈ అర్జునరావును సంప్రదించగా అన్ని గ్రామాల్లో తోలకాలకు అనుమతులు ఇవ్వలేదని, అనుమతి లేకుండా మట్టి రవాణా చేసేవారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
ఎన్నికల శిక్షణకు జిల్లా అధికారులు
భీమవరం (ప్రకాశం చౌక్): భారత ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహించిన శిక్షణలో జిల్లా అధికారులు పాల్గొన్నార. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలోని నియోజకవర్గాల వారీగా ఎంపిక చేసిన బూత్ లెవల్ అధికారులు, బూత్ లెవెల్ సూపర్వైజర్లు, ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు, జిల్లా ఎన్నికల అధికారులకు 12, 13 తేదీల్లో శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాల తరఫున నరసాపురం ఆర్డీఓ దాసి రాజు, జిల్లా నుంచి ఐదు మంది బీఎల్ఓలు, ఇద్దరు బీఎల్ఓ సూపర్వైజర్లు హాజరయ్యారు. అలాగే శిక్షణ కార్యక్రమంలో కొన్ని అంశాలను బోధించడానికి కేఆర్ఆర్సీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ బి.శివన్నారాయణ రెడ్డి కూడా వెళ్లారు. శిక్షణ కార్యక్రమంలో ఎన్నికల అధికారులు విధులు, విధానాలు, ఓటర్ల జాబితా స్వచ్ఛీకరణ, యువ ఓటర్ల నమోదు, విధుల్లో ఎదురయ్యే సమస్యల పరిష్కారం తదితర అంశాలపై శిక్షణ ఇచ్చారు. దైవ దర్శనానికి వెళ్లి వచ్చేసరికి చోరీ ఏలూరు టౌన్: ఏలూరు వన్టౌన్ ప్రాంతంలోని ఒక కుటుంబం దైవ దర్శనానికి వెళ్లి మొక్కు తీర్చుకుని వచ్చేసరికి దొంగలు ఇంటిని కొల్లగొట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఏలూరు వన్టౌన్ దక్షిణపువీధి ప్రాంతానికి చెందిన ఇన్నమూరి భాస్కరరావు ఇంటివద్దే కిరాణా షాపు నిర్వహిస్తున్నారు. ఆయన తన కుటుంబంతో తిరుమల తిరుపతి దర్శనానికి ఆదివారం వెళ్లి శుక్రవారం ఇంటికి వచ్చారు. అయితే ఇంటి తలుపు తాళాలు పగలగొట్టి ఇంట్లోని బంగారు ఆభరణాలు, నగదు అపహరించుకుపోయినట్లు గుర్తించారు. చోరీ సమాచారం అందుకున్న ఏలూరు వన్టౌన్ సీఐ సత్యనారాయణ, క్లూస్ టీమ్ ఘటన స్థలంలో ఆధారాలు సేకరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.