breaking news
West Godavari
-
అన్నదాతకు వెన్నుపోటు
భీమవరం: రైతులకు అన్నివిధాలుగా అండగా ఉంటామని ప్రగల్భాలు పలికి తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నదాతల సంక్షేమాన్ని విస్మరించింది కూటమి ప్రభుత్వం. రైతుల నుంచి కొను గోలు చేసి ధాన్యానికి సకాలంలో సొమ్ములు చెల్లించక తీవ్ర ఇక్కట్లు కలిగించిన సర్కారు.. తాజాగా అన్నదాత సుఖీభవ పథకంలో రైతుల సంఖ్యను గణనీయంగా తగ్గించింది. తాము అధికారంలోకి వస్తే రైతులకు ఏడాదికి రూ.20 వేల ఆర్థిక సాయం చేస్తామని మేనిఫెస్టోలో ప్రకటించిన కూటమి నాయకులు తొలి ఏడాది (2024–25) సాయానికి ఎగనామం పెట్టారు. ఏడాది కాలంలో రైతులకు ఎలాంటి సాయం అందించని ప్రభుత్వం శనివారం అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రారంభిస్తున్నట్టు ప్రకటించింది. అయితే జిల్లాలో గతంలో సాయం పొందిన రైతుల్లో 21 వేల మందిని అర్హుల జాబితా నుంచి కుదించింది. గత ప్రభుత్వంలో పక్కాగా.. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఏటా వ్యవసాయ సీజన్ ప్రారంభంలో వైఎస్సార్ రైతు భరోసా కింద సాయం అందించారు. 2023–24లో జిల్లాలో 1,24,645 మంది రైతులకు సాయం అందగా.. తాజాగా అన్నదాత సుఖీభవ పథకం కింద సుమా రు 1.03 లక్షల మంది అర్హులుగా కూటమి ప్ర భుత్వం నిర్ధారించింది. ఈ లెక్కన జిల్లాలో సు మారు 21 మందికి సాయం అందకుండా పోనుంది. జిల్లాలో 20 మండలాల్లో సుమారు 2.20 లక్షల ఎకరాల్లో రైతులు వరి సాగు చేస్తున్నారు. రైతుల అప్పులబాట గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో సార్వా, దాళ్వా సీజన్ల ప్రారంభంలో పెట్టుబడి సాయం కింద నగదు అందించేవారు. దీంతో రైతులు ఆనందంగా సాగు ప్రారంభించేవారు. అయితే కూటమి ప్రభుత్వంలో ఇప్పటివరకూ సాయం అందించికపోవడంతో రైతులు అప్పులబాట పడుతున్నారు. దళారులు, వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తూ నష్టపోతున్నారు. దీనికి తోడు దాళ్వా సీజన్లో రైతుల నుంచి ప్రభు త్వం కొనుగోలు చేసిన ధాన్యానికి నెలల తరబడి సొమ్ములు చెల్లించకపోవడంతో రోడ్డెక్కి ఆందోళన లు చేశారు. ఓ పక్క సాయం అందించకపోగా.. సేకరించిన ధాన్యానికి సకాలంలో సొమ్ములు చెల్లించలేదంటూ రైతులు మండిపడుతున్నారు. సార్వా నాట్ల ముగింపు దశలో.. జిల్లాలో రైతులు అవస్థల నడుమ ప్రస్తుత సార్వా సీ జన్లో నాట్లు పూర్తిచేస్తున్న తరుణంలో కేంద్ర ప్ర భుత్వం పీఎం కిసాన్ రూ.2 వేలు, రాష్ట్ర ప్రభుత్వం రూ.5 వేలు కలిపి అన్నదాత సుఖీభవ పథకంలో జమచేస్తామని ప్రకటించింది. నారుమడులు, నాట్ల కోసం ఇప్పటికే అప్పులు చేశామని, సొమ్ములు అవ సరమైన సమయంలో ఇవ్వకుండా జాప్యం చేయడంపై రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీనికితోడు జాబితా నుంచి సుమారు 21 వేల మందిని కుదించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కౌలు రైతులకు అమలు చేయాలి అన్నదాత సుఖీభవ పథకంలో రైతుల సంఖ్య తగ్గించడం దారుణం. కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చి ఏడాది గడిచిన తర్వాత ఎన్నికల్లో ఇచ్చిన హామీ అమలుకు శ్రీకారం చుట్టడం రైతులకు అన్యాయం చేయడమే. అన్నదాత సుఖీభవ పథకాన్ని కౌలు రైతులకూ అమలు చేసి వారిని ఆదుకోవాలి. – ఎం.రామాంజనేయులు, ఏపీ కౌలు రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శికోతల కూటమి అన్నదాత సుఖీభవ పథకంలో 21 వేల మంది రైతులకు కోత గతేడాది లబ్ధికి ఎగనామం రైతులందరికీ రూ.20 వేలు ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇప్పుడు కేంద్రం ఇచ్చే రూ.6 వేలతో కలిపి రూ.20 వేలని మెలిక కౌలు రైతులకు పథకాన్ని వర్తింపజేయాలని డిమాండ్ సాయంలో మెలిక టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికలకు ముందు ఉమ్మడి మేనిఫెస్టోలో సూపర్సిక్స్లో భాగంగా అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రతి రైతుకూ ఏడాదికి రూ.20 వేలు చొప్పున ఇస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రూ.6 వేలతో కలిపి రూ.20 వేలు ఇస్తామంటూ మెలిక పెట్టారు. దీనిపై రైతులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. -
జైళ్ల శాఖ పెట్రోల్ బంక్ ప్రారంభం
భీమవరం : పట్టణంలోని వన్టౌన్ పోలీసుస్టేషన్ సమీపంలో ఆధునికీకరించిన సబ్ జైలు, జైళ్ల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన పెట్రోల్ బంక్లను శుక్రవారం జైళ్ల శాఖ డీజీపీ అంజన్కుమార్ ప్రారంభించారు. అనంతరం సబ్ జైల్ లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన వెంట ఎస్పీ అద్నాన్నయీం అస్మి, ఏఎస్పీ వి.భీమారావు, డీఎస్పీ ఆర్జీ జయసూర్య, వన్టౌన్ సీఐ ఎం.నాగరాజు ఉన్నారు. సర్పంచ్ వేధిస్తున్నారంటూ ఫిర్యాదు ఉండి: గ్రామ సర్పంచ్ తనను వేధిస్తున్నారంటూ ఉప్పులూరు గ్రామంలో ఓ మహిళ శుక్రవారం డిప్యూటీ స్పీకర్ కనుమూరు రఘురామకృష్ణరాజు వద్ద మొరపెట్టుకుంది. పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి వచ్చిన ఆయన వద్ద తన బాధ చెప్పుకుంది. గ్రామ సర్పంచ్, జనసేన నేత యర్రా దుర్గారావు చాలాకాలం నుంచి తనను బాధలు పెడుతున్నారని, న్యాయం చేయాలని ఆమె వేడుకుంది. దీంతో స్పందించిన డిప్యూటీ స్పీకర్ ఎస్సై ఎండీ నసీరుల్లాను పిలిచి ఆమెకు న్యాయం చేయాలని ఆదేశించారు. దీనిపై సర్పంచ్ దుర్గారావును వివరణ కోరగా ఆమె చెప్పేవన్నీ అబద్ధాలని, ఆమె ఆ రోపణల్లో నిజం లేదన్నారు. పోలీసుల విచారణలో నిజాలు తెలుస్తాయన్నారు. పక్కాగా భూ సర్వే భీమవరం(ప్రకాశంచౌక్): ప్రభుత్వ భూములకు సంబంధించి ఒక్క సెంటు కూడా తగ్గకుండా సర్వే నిర్వహించాలని ఇన్చార్జ్ కలెక్టర్ టి.రాహుల్కుమార్రెడ్డి ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో ప్రభుత్వ భూముల రీ సర్వేపై అధికారులతో సమీక్షించారు. జిల్లాలోని 293 గ్రామాలకు సంబంధించి 194 గ్రామాల్లో రీ సర్వే పనులను నెలాఖరుకు పూర్తిచేయాలన్నారు. మిగిలిన 72 గ్రామాల్లో ప్రభుత్వ భూములను సర్వే చేసి నిర్ధారణ చేయాలన్నారు. ఆ గ్రామాల్లో 24,474 ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయన్నారు. డీఆ ర్వో ఎం.వెంకటేశ్వర్లు, జిల్లా సర్వే అధికారి కె.జాషువా తదితరులు పాల్గొన్నారు. ఉపాధ్యాయ అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం ఏలూరు (ఆర్ఆర్పేట): ఉపాధ్యాయుల నుంచి రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు దరఖాస్తు లు ఆహ్వానిస్తున్నట్టు ఏలూరు డీఈఓ ఎం.వెంకట లక్ష్మమ్మ ప్రకటనలో తెలిపారు. సెప్టెంబర్ 5న సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా అవార్డుల వేడుక నిర్వహించనున్నారని, ఈనెల 8వ తేదీ వరకు దరఖాస్తులు సమర్పించాలని తెలిపారు. పింఛన్ల పంపిణీలో వివాదం కొట్టుకున్న ‘తెలుగు’ తమ్ముళ్లు నూజివీడు: పింఛన్ల పంపిణీలో జరిగిన వాగ్వి వాదం ఘర్షణకు దారితీసింది. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీకి చెందిన ఇరువర్గాల వారు కొట్టుకున్నారు. అనంతరం పోలీసులకు ఫిర్యా దు చేశారు. దీనికి సంబంధించి వివరాలిలా ఉన్నాయి. నూజివీడు మండలం యనమదల శివారు రేగుంటలోని ఇద్దరికి స్పౌజ్ పింఛన్లు మంజూరయ్యాయి. దీంతో వాటిని లబ్ధిదారులకు అందించేందుకు శుక్రవారం టీడీపీ గ్రామ అధ్యక్షుడు బొల్లిగొర్ల నాగరాజు, గ్రామ సచివాలయ వెల్ఫేర్ సెక్రటరీ షహీన, గ్రామంలోని పలువురు టీడీపీ నాయకులు వచ్చారు. అయితే.. అదే గ్రామానికి చెందిన టీడీపీ నా యకుడు సూదిలకుంట సుబ్రహ్మణ్యం అభ్యంతరం వ్యక్తం చేశాడు. గ్రామానికి చెందిన టీడీ పీ నాయకుడు జోషి లేకుండా పింఛన్లు ఎలా ఇస్తారని నిలదీశాడు. మంజూరైన రెండు పింఛన్లను దరఖాస్తు చేయించింది జోషినే కాబట్టి ఆయన అందుబాటులో లేనందున సాయంత్రం ఆయనొచ్చాక ఇవ్వాలని స్పష్టం చేశాడు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య గొడవ జరిగి బాహాబాహీకి దిగారు. ఈ ఘర్షణలో గాయపడిన సుబ్రహ్మణ్యం స్థానిక ఏరియా ఆస్పత్రిలో చేరి.. కోమవరపు దేవదాసు, కోమవరపు సు రేంద్ర, కోమవరపు మనోజ్ తనపై దాడి చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మరోపక్క కోమవరపు దేవదాసు కూడా ఆస్పత్రిలో చేరి పింఛన్లను పంపిణీ చేస్తుంటే సూదిలకుంట సుబ్రహ్మణ్యం, ఆయన కుమారులు అజయ్బాబు, వరుణ్బాబు తనపై దాడి చేసి కొ ట్టారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘ టన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. -
మైన్స్ అధికారులంటూ వసూళ్లు
సాక్షి, భీమవరం : మైన్స్ అధికారులుగా చెప్పుకుంటూ జిల్లాలో వసూళ్లకు పాల్పడుతున్న ఇద్దరి వ్యక్తులపై గురువారం లారీ యూనియన్ నేతలు ఉన్నతా ధికారులకు ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రావూరి రాజా తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మైన్స్ అధికారుల ముసుగులో ఇద్ద రు వ్యక్తులు రెండు రోజులుగా సిద్ధాంతం, పెరవలి, తణుకు, జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో కారులో సంచరిస్తున్నారు. లారీలను ఆపి రికార్డులు చూపించమని, కేసులు పెడతామని బెదిరిస్తున్నారు. పెనాల్టీల పేరిట వసూళ్లు చేసిన సొమ్ములకు రసీదులు కూడా ఇవ్వడం లేదు. గురువారం సిద్ధాంతం సమీపంలో లారీలను ఆపి డబ్బులు డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని ఏలూరులోని గనులు, భూగర్భశాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లినట్టు రాజా చెప్పారు. మైన్స్ శాఖకు చెందిన ఇద్దరు ఉద్యోగులు రెండు రోజులుగా అందుబాటులో లేకుండా తిరుగుతున్నారని, వారు అయి ఉండవచ్చునని అధికారులు అభిప్రాయపడినట్టు రాజా తెలిపారు. ఈ విషయమై మైన్స్ పశ్చిమగోదావరి జిల్లా ఇన్చార్జి ఏడీని ఫోన్లో సంప్రదించగా ఈ విషయం తమ దృష్టికి వచ్చిందని, పరిశీలించి చర్యలు తీసుకుంటామని చెప్పారు. భీమవరంలో అలంకారప్రాయంగా ఆఫీస్ భీమవరంలో గనులు, భూగర్భశాఖ జిల్లా కార్యా లయం అలంకారప్రాయంగా మిగిలింది. కార్యాలయ సూపరింటెండెంట్ లాంగ్ లీవ్పై వెళ్లిపోగా, సర్వేయర్ డిప్యూటేషన్పై ఏలూరులో పనిచేస్తు న్నారు. ఒక అసిస్టెంట్ జియాలజిస్ట్ (ఏజీ), ఒక రా యల్టీ ఇన్స్పెక్టర్ (ఆర్ఐ), ఇద్దరు టెక్నికల్ అసిస్టెంట్ (టీఏ)లు, డేటా ఎంట్రీ ఆపరేటర్ (డీఏఓ), రెండు ఆఫీస్ సబార్డినేట్, చైన్మెన్, డ్రైవర్, స్వీపర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. జిల్లాలోని ఇసుక ర్యాంపులు సీఆర్జెడ్ పరిధిలోకి వెళ్లి మైనింగ్ నిలిచిపోవడంతో ఖాళీలను భర్తీ చేయడం లేదు. ఇన్చార్జి బాధ్యతలు నిర్వర్తిస్తున్న అధికారులు ఏలూరు నుంచి అప్పుడప్పుడూ వచ్చి వెళుతున్నారు. పర్యవేక్షణ కరువు జిల్లాలో మైనింగ్ లీజులు లేనప్పటికీ పట్టించుకునే వారు లేక ఆచంట, యలమంచిలి, పెనుగొండ మండలాల్లోని గోదావరి తీరంలో బొండు, ఇసుక, అలాగే నరసాపురం, మొగల్తూరు మండలాల్లో సముద్ర తీరం వెంబడి ఇసుక, తాడేపల్లిగూడెం రూరల్లోని ఆరుగొలనులో గ్రావెల్ అక్రమ తవ్వకాలు సాగిపోతున్నాయి. వీటిపై ఫిర్యాదులు చేస్తే వెళ్లి పరిశీలించే పరిస్థితి ఉండటం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. లారీలు ఆపి వసూళ్లకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులు ఉన్నతాధికారులకు లారీ యూనియన్ నేతల ఫిర్యాదు -
నిలదీద్దాం.. నిలబడదాం
వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి పాలకొల్లు సెంట్రల్: ఎన్నికల సమయంలో హామీలిచ్చి అధికారం చేపట్టిన తర్వాత ప్రజలను మోసం చేసిన ఘనత సీఎం చంద్రబాబుకే దక్కుతుందని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు అన్నారు. శుక్రవారం స్థానిక లయన్స్ క మ్యూనిటీ హాలులో వైఎస్సార్సీపీ మండల కన్వీన ర్ పెన్మెత్స ఏసురాజు అధ్యక్షతన బాబు ష్యూరిటీ–మోసం గ్యారంటీపై పాలకొల్లు మండల విస్తృత స్థా యి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జి ల్లా అధ్యక్షుడు ప్రసాదరాజు మాట్లాడుతూ అధికారంలో ఉంటే కేసులతో భయపెట్టి పోలీసులతో పాలన చేయడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అన్నారు. అక్రమ కేసులు బనాయించి జైలు లో పెట్టినా ప్రజాపక్షాన పోరాటం చేసి విజయం సాధించిన గుండె వైఎస్ జగన్మోహన్రెడ్డిది అని అన్నారు. వైఎస్సార్సీపీ అంటే జగనన్న సైన్యం అని, కేసులకు భయపడే ప్రసక్తే లేదన్నారు. పార్టీలో కష్టపడే కార్యకర్తలకు అగ్రపీఠం ఉంటుందని, ఇది జగన్ పంపించిన సందేశం అన్నారు. వంచనపై పోరాడుదాం కూటమి నాయకుల మోసపూరిత హామీలపై ఇంటింటా నిలదీయాలని ముదునూరి పిలుపునిచ్చా రు. కూటమి నేతలు సూపర్ సిక్స్ అని చెప్పి సూ పర్ ప్లాప్ చేశారన్నారు. రైతులకు రూ.20 వేలు, ఆడబిడ్డ నిధి, ఉచిత బస్సు, నిరుద్యోగ భృతి, 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇప్పుడు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో రాష్ట్రంలో 68.50 లక్షల మందికి సామాజిక పింఛన్లు ఇస్తే నేడు కూటమి ప్ర భుత్వంలో 60.50 లక్షల మందికే ఇస్తున్నారన్నారు. ఇంటింటికీ వచ్చే చౌక డిపోను దూరం చేశారని మండిపడ్డారు. ఏడాది కాలంలో ప్రజలపై రూ. 18,500 కోట్ల విద్యుత్ భారం మోపారన్నారు. ఆ రోగ్యశ్రీ అడ్రస్ లేకుండా పోయిందన్నారు. రైతుల కు రూ.6,500 కోట్ల బకాయిలు పడ్డారన్నారు. సు మారు 2.80 లక్షల మంది వలంటీర్లను తొలగించారని, వీటన్నింటిపై సీఎం చంద్రబాబుతో పాటు నియోజకవర్గంలోని మంత్రి సమాధానం చెప్పాల ని డిమాండ్ చేశారు. ఇప్పుడు కూటమి నేతలు తొలిఅడుగు అంటూ సిగ్గులేకుండా ప్రజల ముందుకు వస్తున్నారన్నారు. తల్లికి వందనం ప్రచారం హోరెత్తిపోతుందని కానీ ఈ పథకం అందని ప్రజల ఫొటోలు కూడా వేస్తే వారి నిబద్ధత ఏపాటిదో అర్థమవుతుందని ముదునూరి అన్నారు. ఎమ్మెల్సీ కవు రు శ్రీనివాస్, ఇన్చార్జి గుడాల శ్రీహరిగోపాలరావు, నాయకులు గుణ్ణం నాగబాబు, చెల్లెం ఆనందప్రకాష్, కుమారదత్తాత్రేయ వర్మ, జెడ్పీటీసీ నడపన గోవిందరాజులు నాయుడు తదితరులు పాల్గొన్నారు. -
ఆలస్యమైతే వెదజల్లే పద్ధతే మేలు
చింతలపూడి: ఇటీవల వరి సాగులో ఖర్చులు బాగా పెరిగాయి. వాతావరణంలో వస్తున్న మార్పుల కారణంగా ఏటా సకాలంలో వరినాట్లు పడటం లేదు. పోసిన నారు ముదిరిపోవడం, లేదా నారు దెబ్బతినడంతో దిగుబడులు తగ్గుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో సాగు ఖర్చును తగ్గించుకుని, కూలీల సమస్యను అధిగమించేందుకు దమ్ము చేసిన పొలంలో నేరుగా వరి విత్తే పద్ధతిని ఆచరించడం మేలని చింతలపూడి సహాయ వ్యవసాయ సంచాలకుడు వై సుబ్బారావు సూచిస్తున్నారు. చింతలపూడి నియోజకవర్గ పరిధిలో 18,384 హెక్టార్లల్లో వరి సాగు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో చింతలపూడి మండలంలో అత్యధికంగా 7,603 హెక్టార్లు, లింగపాలెం మండలంలో 3,072 హెక్టార్లు, కామవరపుకోట మండలంలో 2,457 హెక్టార్లు, జంగారెడ్డిగూడెం మండలంలో 5,252 హెక్టారుల్లో వరి పంటను సాగు చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు సుమారు 50 శాతం నాట్లు మాత్రమే పూర్తయ్యాయి. రైతుకు లాభం దమ్ము చేసిన పొలంలో నేరుగా వరి విత్తడం వల్ల నారు పోయడం, నారు తీత, నాట్లు వేసే పని ఉండదు. ఈ విధానం వల్ల ఎకరాకు రైతులకు సుమారు రూ.3,500 రూపాయల ఖర్చు తగ్గుతుంది. ఎకరాకు 15–20 కిలోల విత్తనం ఆదా అవుతుంది. మొక్కల మధ్య సాంద్రత ఉండటంతో ఎకరాకు 15 శాతం దిగుబడి పెరుగుతుంది. ఎక్కువ విస్తీర్ణంలో నాటుకోవడం మాత్రమేకాక , వారం పది రోజుల ముందుగానే పంట కోతకు వస్తుంది. సాగులో మెలకువలు సాధారణంగా అన్ని రకాల నేలల్లో దమ్ము చేసి వరివిత్తే పద్ధతిని అవలంభించవచ్చు. చౌడు, ఆమ్ల, క్షార నేలలు మాత్రం ఈ విధానానికి అనుకూలం కావు. రకాన్ని బట్టి ఎకరాకు 10 నుండి 15 కిలోల విత్తనం అవసరం అవుతుంది. వరిసాగు ఆలస్యమయ్యే పరిస్ధితుల్లో స్వల్పకాలిక వరి విత్తనాలను ఎంచుకోవడం మేలు. విత్తనాలను 24 గంటలు నానబెట్టి, మరో 24 గంటలు మండెకట్టి దమ్ము చేసిన పొలంలో వెదజల్లడం కాని, డ్రమ్ము సీడర్తో కాని విత్తుకోవాలి. డ్రమ్ సీడర్తో డ్రమ్ సీడర్తో లాగితే ఒకేసారి 8 వరుసల్లో విత్తనాలు పడతాయి. సాళ్ళ మధ్య 20 సెం.మీ, మొక్కల మధ్య 5–8 సెం.మీ ఎడంగా గింజలు పడతాయి. ప్రతి 16 వరసలకు ఒక అడుగు కాలిబాట వదలాలి. ఇద్దరు కూలీలు రెండు గంటల్లో ఎకరా విత్తనాలను విత్తవచ్చు. ఎరువుల వాడకం సాధారణ వరికి సిఫార్సు చేసిన విధంగానే దీనికి కూడ ఎరువుల వాడకం చేపట్టాలి. దమ్ములో మాత్రం నత్రజని ఎరువులు వేయకూడదు. వేస్తే కలుపు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఎక్కువ. భాస్వరం, అర వంతు పొటాష్ను దమ్ములో వేసుకోవాలి. నత్రజని ఎరువులను 3 భాగాలుగా చేసుకుని విత్తిన 15–20, 40–45, 60–65 రోజులకు వేయాలి. మిగిలిన సగభాగం పొటాష్ 60–65 రోజులకు నత్రజనితో పాటు వేసుకోవచ్చు. నీటి వాడకం విత్తిన దగ్గర నుండి పొట్ట దశ వచ్చే వరకు బురదగా ఉంచి పొట్టదశ నుంచి పంట కోత పది రోజుల ముందు వరకు పొలంలో 2 సెంమీ నీరు నిల్వ ఉండేలా చూసుకోవాలి. దీనివల్ల వేరు వ్యవస్ధ బాగా బలపడి పిలకలు బాగా వస్తాయి. కలుపు నివారణ కలుపు నివారణకు ఎకరాకు 35 గ్రాముల ఆక్సా డయార్జిల్ లేదా 400 మిల్లీ.లీ ప్రిటిక్లాక్లోర్ లేదా 100 గ్రా పైరజో సల్ఫ్యూరాన్ మందును 20 కిలోల పొడి ఇసుకతో కలిపి విత్తిన 3–5 రోజుల మధ్య పొలంలో పలుచగా నీరుంచి చల్లాలి. విత్తిన 20 రోజుల తర్వాత కలుపు సమస్య అధికంగా ఉంటే ఎకరాకు 80–100 మి.లీ బిస్ఫైరిబాక్ సోడియం, ఊద ఎక్కువగా ఉంటే 300–400 మి.లీ సైహలోఫాప్ బ్యూలైట్ను, వెడల్పాటి ఆకు ఎక్కువగా ఉంటే 4డి సోడియం లవణాన్ని 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. వై.సుబ్బారావు, చింతలపూడి సహాయ వ్యవసాయ సంచాలకులు -
పెట్రోల్లో నీరు కలిసిందంటూ..
తణుకు అర్బన్ : ద్విచక్ర వాహనంలో పెట్రోలు పో యించుకుంటే ట్యాంకు నుంచి నీళ్లు బయటపడ్డా యంటూ బాఽధితులు పెట్రోలు బంక్ వద్ద ధర్నా చే శారు. తణుకుకు చెందిన ఫణి, శంకర్ అనే యు వకులు శుక్రవారం స్థానిక హెచ్పీసీఎల్కు చెందిన తుమ్మలపల్లి పాపారావు బంకు వద్ద తమ వాహనంలో రూ.60లు పెట్రోలు పోయించుకున్నారు. కొద్ది దూరం వెళ్లగానే వాహనం మోరాయించడంతో తిరి గి బంకులోకి వచ్చి యజమానితో మాట్లాడి వా హనం ట్యాంకులోని పెట్రోల్ను బయటకు తీయించగా పెట్రోల్తోపాటు నీరు బయటపడటంతో అ వాక్కయ్యారు. దీంతో పాతవూరుకు చెందిన యువకులు భారీ సంఖ్యలో బంకు వద్దకు చేరి నిరసన తెలిపారు. పట్టణ ఎస్సై శ్రీనివాస్ వెళ్లి పరిస్థితిని చక్కదిద్దారు. వాహనంలోని పెట్రోల్ ట్యాంకు నుంచి పెట్రోల్ బయటకు తీయిస్తే సగానికి పైగా నీరు వచ్చిందని, దీనిపై అడిగితే బంకు యజమాని నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారని బాధితులు అన్నారు. దీంతో ఆందోళనకు దిగినట్టు యువకులు చెప్పారు. విషయం తెలిసి డిప్యూటీ తహసీల్దార్ శ్రీదేవి బంకు వద్దకు వచ్చి పరీక్షలు జరిపారు. బంకులో నిల్వ ఉన్న పెట్రోల్లో ఎలాంటి నీటి ఆనవాళ్లు లేవని, డెన్సిటీ పరీక్షలతో పాటు సాంకేతిక పరీక్షల్లో ఈ విషయం తేలిందన్నారు. -
ఎస్సీ వర్గీకరణపై మండిపాటు
భీమవరం: ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును నిరసిస్తూ భీమవరం అంబేడ్కర్ సెంటర్లో శుక్రవారం మాల సంఘాల జేఏసీ అధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు నల్లి రాజేష్ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణతో మాల సామాజిక వర్గానికి తీవ్ర అన్యాయం జరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. మాలలు అన్ని రంగాల్లో అవకాశాలు కోల్పోతున్నారని చెప్పారు. జాతీయ కన్వీనర్ చీకటిమిల్లి మంగరాజు మాట్లాడుతూ మాలలకు వ్యతిరేకంగా పనిచేసే రాజకీయ పార్టీలకు తగిన గుణపాఠం చెబుతామన్నారు. మాల సంఘాల జేఏసీ కన్వీనర్ గంటా సుందరకుమార్ మాట్లాడుతూ అక్టోబర్ 3న కుప్పం నుంచి మాల సంఘాల ఆధ్వర్యంలో రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర నిర్వహిస్తున్నామని, దీనిని మాల సంఘాల నాయకులు, సభ్యులు విజయవంతం చేయాలని కో రారు. మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు గుండె నగేష్, సోడదాసి జయపాల్, కొండేటి లాజర్, వర్ధనపు మోషే, పెట్టెం శుభాకర్, కర్ని జోగయ్య, ఉన్నమట్ల శామ్యూల్రాజ్, పరువు వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. -
గ్రంథాలయ ఉద్యోగుల జీతాలు చెల్లించాలి
ఏలూరు (ఆర్ఆర్పేట): రాష్ట్రంలో గ్రంథాలయ సంస్థల్లో పని చేస్తున్న ఉద్యోగులకు 010 పద్దు ద్వారా జీతాలు చెల్లించేలా ఏర్పాటు చేయడానికి కృషి చేస్తామని ఏపీ జేఏసీ జిల్లా చైర్మన్ చోడగిరి శ్రీనివాస్ స్పష్టం చేశారు. శుక్రవారం స్థానిక జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రంథాలయ సంస్థ ఉద్యోగుల సంఘం ఎన్నిక నిర్వహించారు. సంఘ అధ్యక్షుడిగా జీ. రాంబాబు, అసోసియేట్ అధ్యక్షుడిగా పీ రంగారావు, ఉపాధ్యక్షులుగా ఎస్.వెంకటేశ్వరరావు, ఎస్డీ.లతీఫ్, ప్రధాన కార్యదర్శిగా ఎండీ జుల్ఫికర్ అలీ, సహాయ కార్యదర్శిగా కొండే వెంకటేశులు, జిల్లా కోశాధికారి ఎన్సీహెచ్ రామకృష్ణ, కార్యవర్గ సభ్యులుగా ఎం.శోభ, జీ అనిత, బంగారు పాప ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ముఖ్య అతిథులుగా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి ఎం.శేఖర్ బాబు, జేఏసీ రాష్ట్ర డిప్యూటీ సెక్రటరీ జనరల్ ఆర్ఎస్.హరనాథ్, ఏపీ ఎన్జీఓ ఏలూరు తాలూకా అధ్యక్షుడు జీ శ్రీధర్ రాజు తదితరులు పాల్గొన్నారు. -
వర్షాకాలంలో పాముకాటుతో జాగ్రత్త
బుట్టాయగూడెం: వర్షాకాలంలో గ్రామాల్లో ఎక్కువగా ఖాళీ స్థలాలు, బీడు భూముల్లో పచ్చని గడ్డి ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి సమయంలో పాముల బెడద ఎక్కువగా ఉంటుంది. పశువులు బీడు భూములు, ఇంటి వద్ద ఖాళీ స్థలాల్లో మేతకు వెళ్ళినప్పుడు పశువుల పాక చుట్టూ ఉన్న ఖాళీ స్థలాల్లో గడ్డి ఎక్కువగా పెరుగుతుంది. ఈ సమయంలో వర్షాల కారణంగా పచ్చని గడ్డిలో విషసర్పాలు ఉండి పశువులను కాటు వేసే ప్రమాదం ఉంది. పాడి రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని జీలుగుమిల్లి పశు సంవర్ధకశాఖ సహాయ సంచాలకుడు డాక్టర్ మల్లంపల్లి సాయిబుచ్చారావు సూచించారు. రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల పాముకాటు నుంచి పశువులను కాపాడుకోవచ్చన్నారు. రక్తపింజర పశవులను రక్తపింజర కాటువేస్తే హీమోటాక్సిన్ విడుదలై రక్త ప్రసరణపై ప్రభావం చూపుతుంది. దీంతో పశువు నోరు, ముక్కు నుంచి రక్తం కారుతుంది. పాము కాటు వేసినచోట వాపు వచ్చి చర్మం రంగు మారుతుంది. మూత్రం ఎరుపురంగులోకి వస్తుంది. సరైన సమయంలో చికిత్స అందకపోతే 10 గంటలలోపు పశువులు మృత్యువాత పడతాయి. తాచు, కట్ల పాములు తాచు, కట్లపాములు పశువులను కాటు వేసినప్పుడు న్యూరోటాక్సిన్ వాటి శరీరంలోకి వెళ్ళి నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. దీనితో శ్వాస వ్యవస్థ స్థంభిస్తుంది. నోటి నుంచి నురగ వచ్చి అపస్మారక స్థితిలోకి వెళ్తాయి. సరైన సమయంలో చికిత్స అందించకపోతే పశువు మృతి చెందుతుంది. విషరహిత పాముల్లో కాటు లక్షణాలు విషరహిత పాములు కాటు వేసినప్పుడు రెండు వరుస పళ్లు ముద్రలు ఉంటాయి. గాయాలు చిన్నగా ఉంటాయి. ఎక్కువగా పలుచని రేఖల వంటి ముద్రలుగా ఉంటాయి. కొద్దిగా రక్తం కారవచ్చు. కానీ ఇది ప్రమాదమైన స్థాయిలో ఉండదు. విషపూరిత పాము లక్షణాలు విషపూరిత జాతి పాములు కాటు వేసిన చోట ఉబ్బినట్టు, గాయంలా కనిపిస్తుంది. పశువు తినకుండా నీరసంగా ఉంటుంది. అదుపు తప్పడం(పిచ్చెక్కినట్టుగా అటూ ఇటూ తిరగడం), నోట్లో నురగరావడం, వేగంగా గుండె చప్పుడు, శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది, పొట్ట ఉబ్బడం, కింద పడి కాళ్లు కొట్టుకోవడం వంటివి చేస్తాయి. కొన్ని సందర్భాల్లో 3 నుంచి 5 గంటల్లోపు కాటుకు గురైన పశువులు మృతి చెందుతాయి. వైద్యుల సూచనలు ● పాముకాటుకు గురైన పశువులను బయటకు పంపించవద్దు. ఎక్కువగా నడిపించకూడదు. కదలకుండా ఉండాలి. ● కాటు వేసిన ప్రాంతానికి పై భాగంలో గట్టిగా కట్టుకట్టాలి. ఇది పాము విషాన్ని నరాల ద్వారా వ్యాప్తి చెందకుండా ఉపయోగపడుతుంది. 15 నిముషాలకు ఒకసారి నిమిషం పాటు విరమించాలి. లేదంటే నరాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. ● కాటు వేసిన చోట కడగవద్దు. కట్టు తియ్యొద్దు. ఇలా చేస్తే విషం వ్యాప్తి పెరుగుతుంది. ● పశువులను బాగా గాలి తగిలేటట్టు నీడలో ఉంచాలి. ● వెంటనే పశు వైద్యుడిని సంప్రదించి చికిత్స అందిస్తే ప్రాణాపాయ స్థితి నుంచి పశువులను కాపాడుకోవచ్చు. సకాలంలో చికిత్స అందించాలి పశువులను మేతకు తీసుకువెళ్ళినప్పుడు తరచూ గమనించాలి. పాము కాటు వేస్తే కరిచిన చోట గుడ్డతో గట్టిగా కట్టాలి. బ్లేడుతో కోసి రక్తం పిండాలి. 15 నిముషాలకు ఒకసారి కట్టును వదులు చేస్తూ ఉండాలి. స్నేక్ యాంటీ వీనమ్ ఇంజెక్షన్, ఆట్రోసిన్ సల్ఫేట్, ఏవిల్ ఇంజక్షన్ను పశువు రక్తంలోకి ఎక్కించాలి. నొప్పి నివారణకు స్టైరాయిడ్, యాంటీ బయోటిక్స్, అవసరాన్ని బట్టి ఇతర మందులను ఇవ్వాలి. డాక్టర్ మల్లంపల్లి సాయి బుచ్చారావు, పశు సంవర్ధక శాఖ సహాయ సంచాలకులు, జీలుగుమిల్లి -
వైఎస్సార్సీపీ అనుబంధ విభాగాల్లో నియామకాలు
ఆకివీడు: వైఎస్సార్సీపీ రాష్ట్ర సోషల్ మీడియా జాయింట్ సెక్రటరీగా కమతం మహేష్ను నియమిస్తూ పార్టీ అధిష్టానం ఉత్తర్వులు జారీ చేసింది. నియోజకవర్గ ఇన్చార్జి పీవీఎల్ నర్సింహరాజు సూచనల మేరకు నియామకం జరిగినట్లు మహేష్ తెలిపారు. ● ఉంగుటూరు: వైఎస్సార్సీపీ బీసీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎ.గోకవరానికి చెందిన మిద్దే వెంకటేశ్వరరావును నియమించారు. పార్టీ అధినేత జగన్, మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. ● చింతలపూడి: బీసీ విభాగం ఏలూరు జిల్లా కార్యదర్శిగా చింతలపూడి మండలం, రేచర్ల గ్రామానికి చెందిన పెరుగొండ్ర శివరామకృష్ణను నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ● పెనుగొండ: వైఎస్సార్సీపీ ప్రచార విభాగం రాష్ట్ర కార్యదర్శిగా ఆచంట నియోజకవర్గం మార్టేరుకు చెందిన మండ విశ్వనాథ నారాయణ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. ● దెందులూరు: వైఎస్సార్సీపీ సోషల్ మీడియా రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా దెందులూరు నియోజవర్గం నుంచి చల్లారి హేమంత్ నియమితులయ్యారు. ఈ మేరకు శుక్రవారం నియామక ఆదేశాలు జారీ చేశారు. ● బుట్టాయగూడెం: వైఎస్సార్సీపీ అనుబంధ విభాగం రాష్ట్ర కమిటీ ప్రచార వింగ్ కార్యదర్శిగా పోలవరం నియోజకవర్గం నుంచి కొయ్యలగూడెంకు చెందిన తమిర్చి బ్రహ్మయ్యను నియమిస్తూ శుక్రవారం ఆ పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. ● చింతలపూడి: చింతలపూడి మండలం వెంకటాద్రిగూడెంకు చెందిన త్సల్లాబత్తుల శ్రీనివాసరావును వైఎస్సార్సీపీ జిల్లా ప్రచార విభాగం అధ్యక్షుడిగా నియమిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. -
గ్రావెల్ అక్రమ తవ్వకాలు ఆగేనా?
ద్వారకాతిరుమల: మండలంలోని పంగిడిగూడెం వద్ద పోలవరం కుడి కాలువ గట్టుపై అక్రమ గ్రావెల్ తవ్వకాలకు అడ్డుకట్ట వేసేందుకు కాలువ ఇరిగేషన్ అధికారులు చర్యలు చేపట్టారు. అందులో భాగంగా శుక్రవారం కాలువ గట్టుపై నుంచి గ్రామంలోకి వెళ్లే పలు మార్గాల్లో ట్రంచ్ (రోడ్డుకు అడ్డంగా) తవ్వకాలు జరిపారు. వివరాల్లోకి వెళితే. కొందరు టీడీపీ నాయకులు కాలువ గట్టును ఆదాయ మార్గంగా ఎంచుకున్నారు. రాత్రి వేళల్లో దొంగతనంగా గ్రావెల్ తవ్వకాలను జరిపి, అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు. ఒక్కో నాయకుడు ఈ మట్టిని అమ్ముకోవడం ద్వారా నెలకు రూ. 3 లక్షల వరకు కూడబెడుతున్నట్టు సమాచారం. అయితే ఈ పచ్చ ముఠా గట్టుపై ఉన్న మట్టిని కాకుండా, ఏకంగా భూమిని తవ్వి గ్రావెల్ను అమ్మేస్తున్నారు. దాంతో కాలువ గట్టుపై పెద్దపెద్ద గోతులు ఏర్పడి, అగాధాలను తలపిస్తున్నాయి. అవి ప్రమాద ఘంటికలను మోగిస్తున్నాయి. ఈ అక్రమ తవ్వకాలను అడ్డుకోవడం సంబంధిత శాఖల అధికారులకు ప్రహసనంగా మారింది. దొంగ దారుల్లో ట్రంచ్లు.. మట్టి దొంగలు అధికార పార్టీకి చెందినవారు కావడంతో కొందరు అధికారులు చూసిచూడనట్టు వదిలేస్తున్నారు. దాంతో వారి మట్టి దందాకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. రాత్రి అయితే చాలు.. జేసీబీలతో కాలువ గట్టుపైకి చేరి, తవ్వకాలు జరిపేస్తున్నారు. వీరి తవ్వకాలు ప్రమాదకర స్థాయికి చేరడంతో కాలువ ఇరిగేషన్ అధికారులు అక్రమ గ్రావెల్ తవ్వకాలకు అడ్డుకట్ట వేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలో రవాణా చేస్తున్న ట్రాక్టర్లు, టిప్పర్లను పట్టుకునేందుకు కాలువ గట్టు చివరన కాపలా కాస్తున్నారు. అయితే తెలివిమీరిన మట్టి దొంగలు పలు దొంగ మార్గాల గుండా మట్టిని తరలించేస్తున్నారు. దాంతో కాపలా కాసినా ప్రయోజనం లేదని భావించిన అధికారులు ట్రంచ్ తవ్వకాలను చేపట్టారు. గట్టుపై నుంచి గ్రామంలోకి అక్రమ మట్టి రవాణా జరుగుతున్న పలు మార్గాలను గుర్తించి, పీఐపీఆర్ఎంసీ జేఈ దూర్జటి పర్యవేక్షణలో ట్రంచ్ లను తవ్వారు. ఫలితం ఉంటుందా? ట్రంచ్లు తవ్వడం వల్ల ఫలితం ఉంటుందా అంటే.. గ్రామస్తులు కొందరు ఉండదనే అంటున్నారు. మట్టినే ఆదాయ వనరుగా ఎంచుకున్న ముఠాకు ట్రంచ్లు ఒక లెక్క కాదని చెబుతున్నారు. ట్రంచ్లను పూడ్చి, అక్రమ రవాణాను సాగించినా ఆశ్చర్యపోనవసరం లేదని అంటున్నారు. అయితే అధికారుల ప్రయత్నం ఏమేరకు ఫలితాలనిస్తుందో వేచి చూడాల్సి ఉంది. అడ్డుకట్ట వేసేందుకు ప్రయత్నిస్తున్న ఇరిగేషన్ అధికారులు పలు మార్గాల్లో ట్రంచ్ల తవ్వకాలు -
మావుళ్లమ్మను దర్శించుకున్న క్రికెటర్ నితీష్ కుమార్
భీమవరం (ప్రకాశంచౌక్): ప్రముఖ ఇలవేల్పు మావుళ్ళమ్మ వారిని ఇండియన్ క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి శుక్రవారం దర్శించుకున్నారు. ఆలయ ప్రధానార్చకుడు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వచనం అందించారు. ఈ నెల 8 నుంచి జరగనున్న ఆంధ్రా ప్రీమియం లీగ్ టీం లో భీమవరం బుల్స్ టీంకు నితీష్ కెప్టెన్గా వ్యవహరిస్తున్నారు. ఈ పోటీల్లో విజయం సాధించాలని శ్రీ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రేపు జిల్లా అథ్లెటిక్స్ జట్ల ఎంపికలు తణుకు అర్బన్: జిల్లా అథ్లెటిక్స్ జట్ల ఎంపికలు ఈనెల 3న తణుకు శ్రీ చిట్టూరి ఇంద్రయ్య ప్రభుత్వ డిగ్రీ కళాశాల క్రీడా ప్రాంగణంలో నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ కార్యదర్శి సంకు సూర్యనారాయణ తెలిపారు. అండర్ 14, 16, 18, 20 బాలుర, బాలికల విభాగాల్లో నిర్వహించనున్నామని, ఎంపికై న క్రీడాకారులు ఈనెల 9 నుంచి 11 వరకు బాపట్ల జిల్లా చీరాలలో జరిగే రాష్ట్ర స్థాయి జూనియర్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్లో పాల్గొంటారని వివరించారు. ఎంపికకు హాజరయ్యే క్రీడాకారులు తమ పుట్టిన తేదీ ధ్రువపత్రం, ఆధార్ కార్డుతో ఉదయం 8 గంటలకు తణుకు క్రీడా ప్రాంగణంలో రిపోర్ట్ చేయాలని, ఇతర వివరాలకు 9989363978 నంబరులో సంప్రదించాలని కోరారు. చెరువులో పడి వ్యక్తి మృతి మండవల్లి: ప్రమాదవశాత్తు చెరువులో పడి ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయిన ఘటన మండలంలోని భైరవపట్నంలో జరిగింది. గ్రామానికి చెందిన పండు జోజి పెద్ద కుమారుడు తరుణ్ అలియాస్ చందు (23) 31న ఒంటి గంట సమయంలో బయటకు వెళ్ళి తిరిగి రాలేదు. శుక్రవారం ఇంటి పక్కనే ఉన్న చేపల చెరువులో జారిపడి మృతిచెందాడు. పోలీసు సిబ్బంది కేసు నమోదు చేశారు. రోడ్ల ఆక్రమణలపై చర్యలు కొయ్యలగూడెం: పరింపూడి పంచాయతీ అంతర్గత రోడ్ల ఆక్రమణలపై చర్యలు తీసుకోనున్నట్లు కార్యదర్శి కే.సురేష్ పేర్కొన్నారు. శుక్రవారం పంచాయితీ కార్యాలయంలో గ్రామసభ నిర్వహించారు. జూలై 29 సాక్షిలో ప్రచురితమైన అంతర్గత రోడ్ల ఆక్రమణ విషయంపై ప్రజలతో మాట్లాడుతూ స్వమిత్వ కార్యక్రమంలో ప్రజలు ఫిర్యాదు చేసుకోవచ్చనని సూచించారు. సాక్షిలో వచ్చిన కథనంపై విచారణ చేసి ఆక్రమణలను గుర్తించామని వారికి నోటీసులు జారీ చేశామన్నారు. ఈ సందర్భంగా స్వమిత్వ ద్వారా ప్రజలు ఇచ్చిన దరఖాస్తులను ఆయన పరిశీలించారు. -
రుణాలు అందక ఇబ్బందులు
భీమవరం: రైతులకు ఎంతగానో ఉపయోగపడే వ్యవసాయ సహకార పరపతి సంఘాలకు(సొసైటీ) పూర్తిస్థాయిలో త్రిసభ్య కమిటీలు, ప్రత్యేక అధికారులు లేకపోవడంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. జిల్లాలోని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నాయకుల మధ్య సమన్వయం లేకపోవడంతో పూర్తి స్థాయిలో త్రిసభ్య కమిటీలను నియమించకపోగా ప్రత్యేక అధికారుల పాలన గడువు ముగిసిన సంఘాలకు అధికారులను నియమించకపోవడంతో సొసైటీలో రైతులు రుణం పొందే అవకాశాన్ని కోల్పోతున్నారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 122 సొసైటీలున్నాయి. రైతులు ఎక్కువ శాతం సొసైటీల్లో రుణాలు తీసుకుని పంటలకు పెట్టుబడులు పెడతారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జీరో వడ్డీకే రైతులకు పంట రుణాలు ఇవ్వడంతో సొసైటీల ప్రాచుర్యం బాగా పెరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సొసైటీలకు నియమించిన త్రిసభ్య కమిటీలను రద్దు చేసి ప్రత్యేక అధికారులను నియమించారు. కూటమి నాయకుల మధ్య సమన్వయం లేకపోవడంతో ఇటీవల కేవలం 50 సొసైటీలకు మాత్రమే త్రిసభ్య కమిటీలు నియమించారు. కూటమిలో పదవులు పందేరంలో తమకు ఎక్కువ శాతం పదవులు కావాలంటూ టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పంతాలకు పోవడంతోపాటు ఆయా సొంత పార్టీ నాయకుల మధ్యనే విభేదాలు తలెత్తంతో నామినేటెడ్ పదవుల భర్తీ సందిగ్ధంగా మారింది. ముగిసిన ప్రత్యేక అధికారుల పాలన జిల్లాలో కేవలం 50 సొసైటీలకే త్రిసభ్య కమిటీల నియామకం, మిగిలిన సొసైటీల ప్రత్యేక అధికారుల పాలన జూలై 31తో ముగియడంతో పాలకవర్గాలు లేని దాదాపు 70 సొసైటీల్లోని రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. సొసైటీల్లో రుణాలు ఇవ్వాలంటే రుణం పొందే రైతుల జాబితాపై సంఘం చైర్మన్గాని ప్రత్యేక అధికారి సంతకం తప్పనిసరి. ప్రత్యేక అధికారుల పాలన గడువు ముగిసినా ప్రభుత్వం పొడిగించకపోవడంతో రైతులు రుణాలు ఎలా పొందాలో తెలియక ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే సార్వా సీజన్ ప్రారంభం కావడంతో రైతులకు రుణాలు ఎంతో అవసరం. ఇలాంటి సమయంలో సొసైటీలకు పూర్తి స్థాయిలో కమిటీలను నియమించకపోవడం రైతులు పూర్తి స్థాయిలో రుణాలు పొందే అవకాశం లేకపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సొసైటీల్లో పూర్తి స్థాయిలో లేని త్రిసభ్య కమిటీలు ఇంత వరకు 50 సొసైటీలకే త్రిసభ్య కమిటీల నియామకం -
చింతమనేని వర్గం హల్చల్.. అబ్బయ్య చౌదరి హెచ్చరిక
సాక్షి, పశ్చిమ గోదావరి: దెందులూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే చింతమనేని భయానక వాతావరణ సృష్టించారని అన్నారు వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి. చింతమనేని ప్రభాకర్ బెదిరింపులకు భయపడేవాడెవారు ఎవరూ లేరు.. తప్పుడు కేసులు పెడితే కోర్టులో మొట్టికాయలు వేసినా వీరికి బుద్ధి రావడం లేదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.అయితే, దెందులూరు నియోజకవర్గంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది. మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి టార్గెట్గా చింతమనేని రాక్షస క్రీడకు తెరలేపారు. అబ్బయ్య చౌదరికి చెందిన పంట పొలాలను పచ్చ మూకలు ధ్వంసం చేసి.. వక్క చెట్లను నరుక్కు పోయారు. అంతటితో ఆగకుండా.. అబ్బయ్య చౌదరి ఇంటి ముందు టీడీపీ శ్రేణులు వంటావార్పుకి పిలుపునిచ్చారు. దీంతో, దెందులూరు నియోజకవర్గం కొండలరావు పాలెంలో పోలీసులు భారీగా మోహరించారు. ఈ నేపథ్యంలో అబ్బయ్యచౌదరి నివాసానికి వైఎస్సార్సీపీ శ్రేణులు చేరుకున్నారు. ఈ క్రమంలో దెందులూరు మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘దెందులూరు నియోజకవర్గంలోకి అబ్బయ్య చౌదరి వచ్చాడంటే చాలు ఉలిక్కిపడుతున్నారు. టీడీపీ నేతలకు అధికారం ఇచ్చింది దేనికి?. ప్రజలకు మంచి చేయడానికా లేక అబ్బయ్య చౌదరిని టార్గెట్ చేయడానికా?. దెందులూరులో వైఎస్సార్సీపీ నేతల ఆస్తులను టార్గెట్ చేస్తున్నారు. చింతమనేని మేము చేసిన అభివృద్ధిలో సంక్షేమంతో పోటీ పడండి.. అంతేకానీ కక్షపూరిత రాజకీయాలు కాదు.దెందులూరు నియోజకవర్గంలో చింతమనేని భయానక వాతావరణ సృష్టించారు. చింతమనేని బెదిరింపులకు భయపడేవారు ఎవరూ లేరు. తప్పుడు కేసులు పెడితే కోర్టులో మొట్టికాయలు వేసినా వీరికి బుద్ధి రావడం లేదు. ఏదో ఒక వంక పెట్టుకుని వచ్చి భయపెట్టాలని చూస్తున్నారు. మాజీ శాసనసభ్యుడి ఇంటి ముందు ఇలా చేయడం ఏంటి?. మేము ఎక్కడికి పారిపోవటం లేదు ఇక్కడే ఉన్నాం.. ఏం చేస్తారో చేయండి?. దుర్మార్గమైన నీచమైన సంస్కృతికి తెర లేపారు. మా తోటలో వక్క చెట్లు నరుక్కుని పోయే బ్యాచులు తయారయ్యారు. అధికారం ఎప్పుడూ శాశ్వతం కాదు అంటూ వ్యాఖ్యలు చేశారు. -
విద్యుత్ సంస్థలో పదోన్నతులు
ఏలూరు (ఆర్ఆర్పేట): ఏపీఈపీడీసీఎల్ ఏలూరు ఆపరేషన్ సర్కిల్ పరిధిలోని పలువురు సీనియర్ అసిస్టెంట్లకు జూనియర్ అక్కౌంట్స్ అధికారులుగా పదోన్నతులు కల్పిస్తూ ఎస్ఈ పి.సాల్మన్ రాజు ఉత్తర్వులు జారీ చేశారు. పాలకొల్లు ఈఆర్ఓలోని ఎల్బీవీ సాంబశివరావును భీమవరానికి పదోన్నతిపై బదిలీ చేశారు. ఏలూరు సర్కిల్ కార్యాలయంలోని వై.శ్రీనివాసరావును ఏలూరు సర్కిల్ కార్యాలయంలో ఎల్టీ విభాగానికి బదిలీ చేశారు. భీమవరం ఈఆర్ఓలోని పీఆర్కేవీ ప్రసాద్ను నరసాపురం డివిజన్ అక్కౌంట్స్ కార్యాలయానికి బదిలీ చేశారు. ఏలూరు కనస్ట్రక్షన్స్ విభాగంలోని వి.రాజశేఖర్ను ఏలూరు సర్కిల్ కార్యాలయంలోని సీఏఎస్ విభాగానికి బదిలీ చేశారు. తణుకు డీ1లోని కె.రవీంద్రనాథ్ను తాడేపల్లిగూడెం అక్కౌంట్స్ డివిజన్ కార్యాలయానికి, భీమవరం డివిజన్ కార్యాలయంలోని జి.రామకృష్ణ రాజును భీమవరం సర్కిల్ కార్యాలయానికి బదిలీ చేశారు. ఏలూరు సర్కిల్ కార్యాలయంలోని కేవీఆర్జీ కృష్ణమూర్తిని అదే కార్యాలయానికి, నరసాపురం డివిజన్ కార్యాలయంలోని ఎస్డీ ఆశీర్వాదంను అదే కార్యాలయంలో ఏడీఎం విభాగానికి, ఏలూరు ఈఆర్ఓలోని ఎస్.వెంకటేశ్వరరావును ఏలూరు డివిజన్ కార్యాలయానికి, పెరవలి సెక్షన్ కార్యాలయంలోని ఎ.శ్రీనివాసరావును జంగారెడ్డిగూడెం అక్కౌంట్స్ కార్యాలయానికి బదిలీ చేశారు. నిడదవోలు ఈఆర్ఓలోని ఎండీ అబ్దుల్ అలీంను నిడదవోలు డివిజన్ కార్యాలయానికి, ఉండ్రాజవరం సెక్షన్ కార్యాలయంలోని కేవీపీ విజయకుమార్ను జంగారెడ్డిగూడెం ఈఆర్ఓకు, తంగెళ్లమూడి ఈఆర్ఓలోని కె.పద్మజను అదే కార్యాలయానికి జూనియర్ అక్కౌంట్స్ అధికారిగా పదోన్నతి కల్పించారు. అలాగే తణుకు ఈఆర్ఓలోని కె.బాలకృష్ణకు జూనియర్ అక్కౌంట్స్ అధికారిగా పదోన్నతి కల్పిస్తూ తాడేపల్లిగూడెం డివిజన్ కార్యాలయంలో పోస్టింగ్ ఇచ్చారు. అయితే పరిపాలనా సౌలభ్యం కోసం ఆయన్ను భీమవరం ఈఆర్ఓకు బదిలీ చేశారు. -
మద్యం మత్తులో ఏటీఎం ధ్వంసం
ఆకివీడు: స్థానిక గుమ్ములూరు సెంటర్లో పోలీస్స్టేషన్కు కూతవేటు దూరంలోని ఎస్ బీఐ ఏటీఎంను మద్యం మత్తులో ఓ వ్యక్తి ధ్వంసం చేశాడు. బుధవారం మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో తాగిన మైకంలో ఏటీఎం గది అద్దాలను గుద్దుకుంటూ లోనికి వెళ్లాడు. గురువారం ఉదయం ఏటీఎం నగదు డ్రా చేసే కింది భాగంలో డోర్ తెరిచి ఉంది. దీంతో రూరల్ సీఐ జగదీశ్వరరావు సంఘటనా స్థలాన్ని, సీసీ పుటేజ్లను పరిశీలించారు. ఏటీఎంలో డబ్బు భద్రంగా ఉందని తెలిపారు.క్లోరినేషన్ చేసి నీరు సరఫరాఆకివీడు: మండలంలోని అప్పారావుపేట గ్రామంలో క్లోరినేషన్ చేసి తాగునీటిని కుళాయిల ద్వారా సరఫరా చేస్తున్నామని గ్రా మ కార్యదర్శి బి.సతీష్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ‘సమస్యల వలయంలో అప్పారావుపేట’ శీర్షికన ‘సాక్షి’లో ప్రచురించిన కథనానికి ఆయన స్పందించారు. ప్రతినెలా రక్షిత మంచినీటి పథకాన్ని శుభ్రం చేయిస్తున్నామన్నారు. అప్పారావుపేట–గుమ్ములూరు రోడ్డు కు నాబార్డు (ఆర్ఐడీఎఫ్) నిధులు మంజూరు అయ్యాయని పనులు జరగాల్సి ఉందన్నారు. 2.50 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణానికి రూ.1.60 కోట్లు విడుదలయ్యాయని చెప్పారు. ఉపాధి హామీ నిధులతో డ్రెయిన్ల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపామని తెలిపారు.జూనియర్ కాలేజీల్లో ప్రవేశాల గడువు పెంపుభీమవరం: ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాలకు ఈనెల 11 వరకు గడువు పొడిగించినట్టు జిల్లా ఇంటర్మీడియెట్ విద్యాశాఖ అధికారి జి.ప్రభాకరరావు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల్లో గతేడాది 1,410 మంది చేరగా ఈ ఏడాదిలో 1,618 మంది ప్రవేశాలు పొందారన్నారు. ప్రభుత్వం ఇంటర్మీడియె ట్ విద్యార్థులకు తల్లికి వందనం, టెస్ట్, నోట్బు క్స్, మధ్యాహ్నం భోజన పథకంతోపాటు విద్యార్థులకు పోషకాహారం కోసం చిక్కీలు, రాగి జావ అందిస్తున్నట్టు చెప్పారు.ఉపాధ్యాయులకు అన్యాయంఏలూరు (ఆర్ఆర్పేట): విద్యారంగంలో ప్రభు త్వం తీసుకుంటున్న అసంబద్ధ నిర్ణయాలతో జిల్లా పరిషత్, మండల పరిషత్ ఉపాధ్యాయులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఏపీటీఎఫ్ 1938 రాష్ట్ర అకడమిక్ కమిటీ కన్వీనర్ గుగులోతు కృష్ణ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చేరిన ఉపాధ్యాయులకు మాత్రమే ఎంఈఓ, డీవైఈఓలుగా బాధ్యతలు అప్పగిస్తామని అధికారులు ఎలా నిర్ధారిస్తారని ప్రశ్నించారు. జిల్లా పరిషత్, మండల పరిషత్, మున్సిపల్ యాజమాన్యాల్లో పనిచేసే ఉపాధ్యాయులపై ప్రభుత్వ ఉపాధ్యాయుల పెత్త నం ఏంటని ప్రశ్నించారు. ఉమ్మడి సర్వీసు రూల్స్కు సంబంధించి 72, 73, 74 జీఓల అమలులో పక్షపాత వైఖరి సరికాదన్నారు. వెంటనే ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను ఉపసంహరించుకుని ఉమ్మడి సీనియార్టీ ద్వారా మాత్రమే ఎంఈఓ–1 పోస్టులను భర్తీ చేయా లని డిమాండ్ చేశారు.రిజిస్ట్రేషన్ ఆదాయంలో ఫస్ట్నూజివీడు: ఏలూరు జిల్లాలోని 12 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల ద్వారా రూ.548.80 కోట్ల రెవెన్యూతో రాష్ట్రంలోనే అత్యధిక ఆదాయాన్ని సాధించినట్టు ఏలూరు జిల్లా రిజిస్ట్రార్ కొమ్మి నేని శ్రీనివాసరావు తెలిపారు. గురువారం నూ జివీడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని ఆయన తనిఖీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే నూజివీడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం 80 శాతం వృద్ధి సాధించిందన్నారు. రిజిస్ట్రేషన్ విధానంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన సంస్కరణల్లో భాగంగా కార్డ్ ప్రైమ్ 2.0 విధానంలో రిజిస్ట్రేషన్ జరిగిన రోజే డాక్యుమెంట్ను యజమానికి అందిస్తున్నామన్నారు. ఆగస్టు 1 నుంచి రిజిస్టర్ డాక్యుమెంట్ కాపీని యజమానికి వా ట్సాప్ ద్వారా అందిస్తామన్నారు. ఏలూరు కా ర్పొరేషన్ పరిధిలో కార్డ్ ప్రైమ్ 2.0ను మున్సి పల్ పరిపాలన విభాగంతో అనుసంధానం చే సి, అర్బన్ పరిధిలో ఉన్న ఆస్తులను మ్యూటేష న్ చేసి యజమాని మార్పిడి జరుగుతుంద న్నారు. ఏలూరు, వట్లూరు సబ్ రిజిస్ట్రార్ కా ర్యాలయాల్లో ప్రారంభిస్తామన్నారు. -
గీత రాత మారేనా?
గత ప్రభుత్వంలో ఆపన్న హస్తం గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం గీత కార్మికులకు ఆపన్న హస్తం అందించింది. నాటి సీఎం వైఎస్ జగన్ నూతన ఎకై ్సజ్ పాలసీ తీసుకువచ్చారు. గీత పన్ను రద్దు చేశారు. కల్లు గీత కార్మిక సొసైటీలు, గీత గీచే వారికి చెట్టు పథకం అమలు చేశారు. కల్లు తీస్తూ ప్రమాదానికి గురై శాశ్వత వైకల్యం పొందితే నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా శిక్షణ ఇప్పించి ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలను చూపించారు. వైఎస్సార్ బీమా పథకం ద్వారా నష్టపరిహారం చెల్లించారు. ప్రమాదాల్లో మరణిస్తే ఇచ్చే పరిహారాన్ని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచారు. ఎన్ఈఆర్జీఎస్, షెల్టర్ బెడ్ అభివృద్ధి పథకాల ద్వారా తాటి, ఈత వంటి చెట్లు పెంచేలా చర్యలు తీసుకున్నారు. ప్రధానంగా కాలువ గట్లు, నదీ, సాగర తీరాలను పటిష్టం చేస్తూ కల్లు గీతకు కావాల్సిన తాటి, ఈత చెట్లు సమృద్ధిగా పెరిగేలా చర్యలు తీసుకున్నారని గీత కార్మికులు గుర్తుచేసుకుంటున్నారు. ఏలూరు (టూటౌన్): ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో కల్లు గీత కార్మికులు తమ రాత మారేనా.. కష్టాలు తీరేనా అని ఎదురుచూస్తున్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం తమ జీవితాల్లో వెలుగులు నింపితే ప్రస్తుత కూటమి ప్రభుత్వం వేదనను మిగిలుస్తోందని ఆందోళన చెందుతున్నారు. ఊరూవాడా బెల్టు షాపులు, విచ్చలవిడిగా మద్యం అమ్మకాలతో గీత వృత్తి మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని అంటున్నారు. ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో సుమారు 9 వేల బెల్టుషాపులు ఉన్నాయని గీత కార్మిక సంఘాల నాయకులు చెబుతున్నారు. గత ఎన్నికల సమయంలో హామీలు గుప్పించిన కూటమి నాయకులు గద్దెనెక్కిన తర్వాత తమను పట్టించుకోవడం లేదని అంటున్నారు. కల్లుగీత వృత్తిపై ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సుమారు 25 వేల మంది కార్మికులు ఆధారపడి ఉన్నారంటున్నారు. 9 వేలకు పైగా బెల్టు షాపులు ఏలూరు జిల్లావ్యాప్తంగా సుమారు 5 వేలు, పశ్చిమగోదావరి జిల్లావ్యాప్తంగా సుమారు 4 వేలు బెల్టుషాపులు ఉన్నాయి. కూటమి నాయకులు, వారి అనుచరులే బెల్టుషాపులను నిర్వహిస్తున్నారని, దీంతో గీత వృత్తి కనుమరుగయ్యే ప్రమాదం ఉందని గీత కార్మికులు ఆవేదన చెందుతున్నారు. బెల్టు షాపులపై కొరడా ఝుళిపిస్తామని ముఖ్యమంత్రి, ఎకై ్సజ్ మంత్రి ప్రకటనలు చేయడం తప్ప ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో తమ సమస్యల పరిష్కారం కోసం గీత కార్మికులు ఆందోళన బాట పట్టారు. ఇప్పటికే సర్కిల్ వారీగా సభలు, సమావేశాలు నిర్వహించిన కార్మికులు ఆందోళనను ఉధృతం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ఈనెల 18న ఏలూరు కలెక్టరేట్ వద్ద భారీ ఆందోళనకు సిద్ధమవుతున్నారు. కల్తీ మద్యం హల్చల్! ఉమ్మడి జిల్లాలో కల్తీ మద్యం హల్చల్ చేస్తున్నట్లు గీత కార్మిక సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. గోవా, యానాం నుంచి అక్రమ మద్యం తీసుకు వస్తున్నారని చెబుతున్నారు. అనకాపల్లి, పరవాడ కేంద్రంగా కబళిస్తున్న కల్తీ మద్యం రాకెట్ పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లును స్థావరంగా చేసుకుందని అంటున్నారు. పాలకొల్లులో కల్తీ మద్యం తయారుచేసి తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కాకినాడ జిల్లాలకు సరఫరా చేస్తున్నట్టు వార్తలు వస్తున్నా అధికారులు స్పందించడం లేదని ఆరోపిస్తున్నారు. బెల్టు షాపుల్లో అధికంగా కల్తీ మద్యం విక్రయిస్తున్నారని, హైదరాబాద్ నుంచి స్పిరిట్ను తీసుకువచ్చి రంగు నీళ్లు కలిపి మద్యంగా తయారు చేసి బ్రాండెడ్ కంపెనీల బాటిల్స్లో నింపి ప్రముఖ బ్రాండ్ల లేబుల్ అతికించి షాపుల్లో విక్రయిస్తున్నారని అంటున్నారు. తెలుగుదేశం పార్టీ ముఖ్య నేత అనుచరుడే కల్తీ మద్యం దందా నడుపుతున్నట్టు విస్తృత ప్రచారం జరుగుతోందని గీత కార్మికుల నాయకులు ఆరోపిస్తున్నారు. కూటమి మొండిచేయి గీత కార్మికులకు ఇచ్చిన హామీల అమలెప్పుడు? ఏడాది దాటినా పట్టించుకోని కూటమి సర్కారు వాడవాడలా బెల్టు షాపులు ఉమ్మడి జిల్లాలో కల్లుగీత ఛిన్నాభిన్నం సుమారు 25 వేల మంది కార్మికులకు కష్టం బెల్టు షాపులు తొలగించాలి గీత వృత్తిని దెబ్బ తీస్తున్న మద్యం బెల్టు షాపులను తక్షణం తొలగించాలి. ఊరూ వాడా తేడా లేకుండా ఎక్కడపడితే అక్కడ బెల్టు షాపులు వెలియడంతో కల్లు గీత వృత్తి మరుగున పడే ప్రమాదం ఉంది. గీత వృత్తిని కాపాడేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. –బెజవాడ వెంకటేశ్వరరావు, గీత కార్మికుడు, చొదిమెళ్ల, ఏలూరు మండలం పట్టించుకోని అధికారులు ఉమ్మడి జిల్లాలో అక్రమ మద్యం ఏరులై పారుతున్నా ఎకై ్సజ్ అధికారులు కన్నెత్తి చూడటం లేదు. నాటు సారా పేరుతో గీత కార్మికులపై దాడులు చేస్తూ వేధిస్తున్నారు. ఓపక్క కల్లు వ్యాపారం లేక ఉపాధి కోల్పోతున్న గీత కార్మికులు అధికారుల వేఽధింపులతో వృత్తికి దూరమవుతున్నారు. – జుత్తిగ నరసింహమూర్తి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కల్లుగీత కార్మిక సంఘం, భీమవరం -
అంగన్వాడీ.. సమస్యల ఒడి
సాక్షి, భీమవరం: ఆటపాటలతో చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పే అంగన్వాడీ కేంద్రాలు కూటమి సర్కారు నిర్లక్ష్యం నీడలో కొట్టుమిట్టాడుతున్నాయి. ఆట పరికరాల సరఫరా లేక పిల్లలు పాడైపోయిన బొమ్మలతోనే ఆడుకోవాల్సిన దుస్థితి. సన్నబియ్యం రాక ముతక బియ్యాన్ని పంపిణీ చేయాల్సి వస్తోందని అంగన్వాడీ వర్కర్లు చెబుతున్నారు. 1,556 కేంద్రాలు.. 70 మినీ కేంద్రాలు జిల్లాలో సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మొత్తం 1,626 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో ఆయాలతో నడిచే మినీ కేంద్రాలు 70 ఉండగా, వర్కర్, ఆయాలతో నిర్వహించే కేంద్రాలు 1,556 ఉన్నాయి. వీటి పరిధిలో 7,936 మంది గర్భిణులు, 5,686 మంది బాలింతలు, ఏడు నెలల వయసు నుంచి మూడేళ్ల లోపు చిన్నారులు 40,706 మంది, మూడేళ్ల నుంచి ఐదేళ్లలోపు బాలలు 17,687 మంది ఉన్నారు. ముతక బియ్యమే సరఫరా గర్భిణులు, బాలింతలకు నెలకు మూడు కిలోల చొప్పున బియ్యం, కిలో కందిపప్పు, అర లీటరు ఆయిల్ ప్యాకెట్, ఐదు లీటర్ల పాలు, 25 గుడ్లు, కిలో అటుకులు, రెండు కిలో రాగి పిండి, పావు కిలో డ్రైఫ్రూట్స్ తదితర వాటిని అందజేయాలి. గర్భిణులు, బాలింతలకు పోర్టిఫైడ్ బియ్యం సరఫరాను గత వైఎస్సార్సీపీప్రభుత్వంలోనే ప్రారంభించారు. అలాగే చిన్నారులకు సోమవారం నుంచి శనివారం వరకు రోజూ అంగన్వాడీ కేంద్రాల వద్దనే ఆహారాన్ని అందించాలి. మెనూ ప్రకారం సోమ, బుధ, గురు, శుక్రవారాల్లో అన్నం, కూరలతో భోజనం, మంగళవారం పులిహోరా, శనివారం వెజిటబుల్ రైస్ వడ్డించాలి. హాస్టళ్లు, పాఠశాలల్లో మ ధ్యాహ్న భోజనానికి సన్నబియ్యం పంపిణీ ప్రారంభించినట్టు చెబుతున్న కూటమి ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలకు మాత్రం రేషన్ డిపోల్లో అందజేసే బియ్యాన్నే సరఫరా చేస్తుండటం గమనార్హం. అంగన్వాడీ కేంద్రాలకు సన్నబియ్యం సరఫరా చేస్తున్నట్టు సివిల్ సప్లయీస్ అధికారులు చెబుతుండగా తమకు రేషన్ బియ్యమే వస్తున్నాయని వర్కర్లు చెబుతున్నారు. చిన్నారులకు ఆటపరికరాలతో పాటు సన్నబియ్యం సరఫరాకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో.. అంగన్వాడీ కేంద్రాల అభివృద్ధికి గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం పెద్దపీట వేసింది. నాడు–నేడు కార్యక్రమంలో భాగంగా కేంద్రాల్లో వసతుల కల్పన, నూ తన భవనాల నిర్మాణం, ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్లు తదితర వసతులు కల్పించింది. గర్భిణులు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్య పరిరక్షణకు అధిక ప్రా ధాన్యమిస్తూ పౌష్టికాహారం మెనూలోనూ మార్పులు చేసింది. చిన్నారుల వికాసానికి క్రమం తప్పకుండా ఆటపరికరాలు సరఫరా చేస్తూ వచ్చింది. పాడైపోయిన బొమ్మలే దిక్కు చిన్నారుల శారీరక, మానసిక, సామాజిక వికాసానికి, చదువుపై ఆసక్తి పెంపొందించేందుకు ఆటపరికరాలు దోహదపడతాయి. వారు ఆరోగ్యంగా ఎదగేందుకు సాయపడతాయి. పిల్లల ఊహాశక్తిని, సృజనాత్మకతను పెంచే బొమ్మలు, ఆట వస్తువులు, రంగురంగుల బ్లాక్లు, పజిల్స్, లెక్కలు నేర్చుకునేందుకు సంబంధించిన వస్తువులు, పిల్లలు కలిసి ఆడుకోవడానికి, ఒకరితో ఒకరు కలిసిమెలిసి ఉండటానికి ఉపయోగపడే ఆట వస్తువులు తదితర వాటితో కూడిన ఆట పరికరాల కిట్లను ప్రభుత్వం సరఫరా చేసేది. గతంలో రెగ్యులర్గా వచ్చేవని రెండేళ్లుగా ఆట పరికరాల కిట్లు సరఫరా నిలిచిపోయినట్టు అంగన్వాడీ వర్కర్లు చెబుతున్నారు. కొత్తవి రాకపోవడంతో గత ప్రభుత్వంలో అందజేసిన ప్లాస్టిక్ బొమ్మలు, పరికరాలతోనే ప్రస్తుతం చిన్నారులు ఆడుకుంటున్నారు. వీటిలో చాలా వరకు పాడైపోయి విరిగిపోయాయి. కొన్ని సెంటర్లలో ఈ బొమ్మలు సైతం లేని పరిస్థితి ఉంది. కాగా ఆట పరికరాల కోసం ప్రతిపాదనలు పంపామని, కిట్లు రావాల్సి ఉందని ఐసీడీఎస్ అధికారులు చెబుతున్నారు. ఆట బొమ్మలకూ దిక్కులేదు అంగన్వాడీ కేంద్రాలకు ఆట పరికరాలు సరఫరా చేయని కూటమి సర్కారు పాడైపోయిన వాటితోనే పిల్లలకు ఆటలు సన్నబియ్యం రాక చౌక బియ్యమే పంపిణీ జిల్లాలో 1,626 అంగన్వాడీ కేంద్రాలు ఐదేళ్లలోపు చిన్నారులు 58,393 గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అంగన్వాడీలకు పెద్దపీట -
కూటమి మోసాలను ఎండగడదాం
భీమవరం అర్బన్: ఎన్నికల సమయంలో ఎడాపెడా హామీలిచ్చి తీరా గద్దెనెక్కిన తర్వాత మొహం చాటేస్తున్న చంద్రబాబు వంచన పాలనను తిప్పికొడదామని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు పిలుపునిచ్చారు. గురువారం మండలంలోని కొత్తపూసలమర్రులో పార్టీ మండల అధ్యక్షుడు జల్లా కొండయ్య అధ్యక్షతన బాబు ష్యూరిటీ–మోసం గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా మండల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ప్రసాదరాజు మాట్లాడుతూ చంద్రబాబుకు ఓటేసిన ప్రతిసారీ ప్రజలు శిక్ష అనుభవిస్తున్నారని, సూపర్సిక్స్ అంటూ మ రోసారి బాబు మోసం చేశాడని మండిపడ్డారు. సంపద సృష్టిస్తానని చెప్పి ఏడాది పాలనలో రూ.1.60 లక్షల కోట్లు అప్పులు చేశారని విమర్శించారు. అలాగే రాష్ట్రంలో వలంటీర్లు, ఎండీఎం డ్రైవర్లు, మద్యం షాపుల్లో సిబ్బంది ఇలా సుమారు 3 లక్షల మంది ఉద్యోగాలు పీకేశారన్నారు. నిరుద్యోగ భృతి నెలకు రూ.3 వేలు ఇస్తామని మోసం చేశారన్నారు. అలాగే కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత 8.58 లక్షల పింఛన్లను రద్దు చేసిందని ధ్వజమెత్తారు. ఉచిత బస్సు, ఆడబిడ్డ నిధి, రైతులకు అన్నదాత సుఖీభవ పథకాలు అమలు చేయలేదన్నారు. పేదలకు ఆరోగ్యశ్రీ అందకుండా రూ.4,500 కోట్ల బకాయిలు పెట్టారన్నారు. ఇంటింటా నిలదీత నరసాపురం పార్లమెంటరీ పరిశీలకులు ముదునూరి మురళీకృష్ణంరాజు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో చంద్రబాబు, పవన్లు సంతకాలు పెట్టి బాండ్ పేపర్లు ఇచ్చారని, వీటిపై కూటమి నాయకులను ప్రజలు ప్రశ్నిస్తున్నారన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా పార్టీ శ్రేణులంతా సిద్ధంగా ఉండాలని, జగన్ను మరోసారి ముఖ్యమంత్రి చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. కూటమి ప్రభుత్వంలో వందల కోట్లు వృథా ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్ మాట్లాడుతూ రైతులకు ధాన్యం సొమ్ములు జమచేయకుండా చంద్రబాబు ప్రభుత్వం ఇబ్బంది పెట్టిందన్నారు. యోగాంధ్ర, పేరెంట్స్ కమిటీ సమావేశాల పేరుతో వందల కోట్లు ఖర్చు పెట్టారని దుయ్యబట్టారు. భీమవరం నియోజకవర్గ సమన్వయకర్త చినమిల్లి వెంకట్రాయుడు మాట్లాడుతూ గ్రామస్థాయి వరకూ పార్టీని పటిష్టం చేస్తున్నారని, పార్టీలో కష్టపడే వారికి సముచిత స్థానం లభిస్తుందన్నారు. చంద్రబాబు మోసపూరిత పాలనను ఇంటింటా వివరించాలన్నారు. మాజీ సీఎం జగన్ పర్యటనలతో కూటమి నాయకులు ఉలిక్కి పడుతున్నారని, అడుగడుగునా ఆంక్షలు విధిస్తున్నారన్నారు. ఎంపీపీ పేరిచర్ల విజయ నరసింహరాజు, జెడ్పీటీసీ కాండ్రేగుల నరసింహరావు, జిల్లా సోషల్ మీడియా విభాగ అధ్యక్షుడు బందన పూర్ణచంద్రరావు, జిల్లా మహిళా విభాగ అధ్యక్షురాలు కోడే విజయలక్ష్మి, జిల్లా యూత్ విభాగ అధ్యక్షుడు చిగరుపాటి సందీప్, నాయకులు మేడిది జాన్సన్, ఏఎస్ రాజు, కామన నాగేశ్వరరావు, పట్టణ కన్వీనర్ గాదిరాజు రామరాజు, ఎంపీటీసీ తిరుమాని తులసీరావు, వైస్ ఎంపీపీ తిరుమాని ధనంజయరాజు తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి -
2న ఉపాధ్యాయుల ధర్నా
భీమవరం: ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం శనివారం భీమవరంలో కలెక్టరేట్ వద్ద ఫ్యాప్టో ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నాను జయప్రదం చేయాలని ఫ్యాప్టో చైర్మన్ పెన్మెత్స విజయరామరాజు, జనరల్ సెక్రటరీ జి.ప్రకాశం పిలుపునిచ్చారు. గురువారం స్థానిక యూటీఎఫ్ కార్యాలయంలో నిర్వహించిన ధర్నా సన్నాహక సమావేశంలో మాట్లాడారు. 12వ పీఆర్సీ, మధ్యంతర భృతి, కారుణ్య నియామకాలు, సీపీఎస్ రద్దు, యాప్స్ భారం తగ్గించాలని, ఉపాధ్యాయులను బోధనకే పరిమితం చేయాలని, పెండింగ్ బకాయిలతోపాటు పలు సమస్యలను పరిష్కరించాలనిఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య జిల్లా యూనిట్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నట్లు చెప్పారు. ధర్నాలో జిల్లాలోని ఉపాధ్యాయులంతా పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఫ్యాప్టో కో–చైర్మన్ పెన్మెత్స ఆర్వీఎస్ సాయివర్మ, డిప్యూటీ జనరల్ సెక్రటరీ రమణారావు, కో–చైర్మన్ శ్రీనివాస్, వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. పీ4పై సమీక్ష భీమవరం (ప్రకాశంచౌక్) : పీ4 కార్యక్రమంలో మార్గదర్శకులు స్వచ్ఛందంగా పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ కలెక్టర్లకు సూచించారు. గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన సమీక్షించగా భీమవరం కలెక్టరేట్ నుంచి ఇన్చార్జి కలెక్టర్ టి.రాహుల్కుమార్రెడ్డి, జిల్లా అధికారులు హాజరయ్యారు. -
సేంద్రియ సాగుతో ఖర్చు ఆదా
చింతలపూడి: రైతులు సేంద్రియ ఎరువులను వాడాలని చింతలపూడి వ్యవసాయ సబ్ డివిజన్ సహాయ సంచాలకులు వై సుబ్బారావు సూచిస్తున్నారు. ప్రస్తుత తరుణంలో రసాయన ఎరువులు అధికంగా ఉపయోగించడం వల్ల సాగు ఖర్చులు పెరిగి రైతులు నష్టాల్లో కూరుకు పోతున్నారని, సేంద్రియ సాగుతో ఖర్చులు తగ్గి లాభాలు చేకూరుతాయని తెలిపారు. సేంద్రియ ఎరువులు అంటే సేంద్రియ ఎరువుల్లో పశువుల ఎరువు, వానపాముల ఎరువు, గొర్రెలు, కోళ్ల ఎరువులు, పచ్చి రొట్ట ఎరువులు ముఖ్యమైనవి. వీటి వాడకం వల్ల భూమి సహజ స్థితిని పొందడమే కాక, పంటకు ప్రధాన పోషకాలు, సూక్ష్మ పోషకాలు లభిస్తాయి. నాణ్యమైన, విష రహితమైన పంటలను పండించవచ్చు. వీటితో పాటు వేరుశనగ, వేప, పొద్దు తిరుగుడు, ఆముదం చెక్కలను వాడడం వలన మొక్కలకు పోషక పదార్థాలు ఎక్కువగా లభిస్తాయి. పచ్చిరొట్ట ఎరువులు: సమగ్ర పోషక యాజమాన్యంలో పచ్చిరొట్ట ఎరువులు ప్రధానమైనవి. పచ్చి రొట్టతో వివిధ పంటల్లో దిగుబడి గణనీయంగా పెరుగుతుంది. పచ్చిరొట్టలో జీలుగ, జనుము, పిల్లి పెసర, అలసంద, పెసర, మినుము ముఖ్యమైనవి. జీవ ఎరువులు: పంటల పెరుగుదలకు కావలసిన పోషకాలను అందించే సూక్ష్మ జీవకణాల సముదాయాలను జీవన ఎరువులు అంటారు. వీటిలో నత్రజనిని స్థిరీకరించేవి రైజోబియం, నీలి ఆకుపచ్చ ఆకు, అజిటో బ్యాక్టీరియ, అజో స్పైరిల్లం, అజొల్లా ఒక రకం కాగా, భాస్వరంను భూమిలో లభ్యమయ్యేలా చేసే ఫాస్ఫో బ్యాక్టీరియ రెండోది. నీలి ఆకుపచ్చ నాచు: ఎకరాకు 4 కిలోల నాచు పొడిని ఇసుకతో కలిపి మడి అంతా సమానంగా పడేటట్లు వేయాలి. 7–10 రోజుల మధ్య మడిలో నీరు పెట్టాలి. నాచు గాలిలోని నత్రజనిని తీసుకుని స్థిరీకరిస్తుంది. దీనివలన ఎకరాకు 8–12 కిలోల నత్రజని పంటకు అంది దిగుబడి పెరుగుతుంది. అజటో బ్యాక్టర్: ఒక ఎకరానికి సరిపడే విత్తనానికి 200–400 గ్రాముల కల్చరును పట్టించాలి. లేదా కిలో కల్చరును 20 కిలోల పశువుల ఎరువుతో కలిపి ఎకరం నేలపై చల్లాలి. వరి, చెరకు, జొన్న, పత్తి, సజ్జ, మిరప పంటల్లో వేసుకుంటే మంచిది. దీని వల్ల ఎకరానికి 8–16 కిలోల నత్రజని పైరుకు అందుతుంది. అజొల్లా: దమ్ములో ఎకరానికి 50 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ను వేసి పలుచగా నీరు పెట్టి 100–150 కిలోల అజొల్లా వేసి 2–3 వారాల తరువాత నేలలో కలియ దున్నాలి. ఎకరానికి 3 టన్నుల పచ్చిరొట్టతో 12 కిలోల నత్రజని అందుతుంది. భాస్వరపు జీవన ఎరువు: ఫాస్ఫో బ్యాక్టీరియ భూమిలో లభ్యంకాని స్థితిలోని భాస్వరాన్ని లభ్యమయ్యేలా చేస్తుంది. ఎకరాకు సరిపడే విత్తనంలో 200–400 గ్రాముల కల్చర్ను పట్టించాలి. లేదా ఒక కిలో కల్చరును 20 కిలోల పశువుల ఎరువుతో కలిపి ఎకరం నేలలో వేయాలి. ఇక రైతులు రసాయనిక ఎరువులను సిఫార్సు చేసిన మోతాదులోనే వాడాలని, అధిక మోతాదులో వాడితే పురుగులు, తెగుళ్లు అధికమై పంట దెబ్బతినే ప్రమాదం ఉందని సుబ్బారావు తెలిపారు. వై సుబ్బారావు, వ్యవసాయ సహాయ సంచాలకులు -
వాహనాన్ని డెలివరీ చేసేందుకు వెళ్లి..
పాలకొల్లు సెంట్రల్: ద్విచక్ర వాహనాన్ని డెలివరీ చేసేందుకు వెళ్లిన వ్యక్తి లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన పాలకొల్లు నరసాపురం రహదారిలో టిడ్కో గృహాల సముదాయం సమీపంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తెన్నేటి ప్రసాద్ (38) నరసాపురంలోని ఓ ద్విచక్ర వాహనాల షోరూమ్లో పనిచేస్తున్నాడు. గురువారం నరసాపురం నుంచి మార్టేరు షోరూమ్కు వాహనాన్ని డెలివరీ చేయడానికి వెళుతున్నాడు. పాలకొల్లు దగ్గర్లో టిడ్కో గృహాల సముదాయం వద్దకు వచ్చేసరికి వెనుక నుంచి వస్తున్న కంటైనర్ లారీ ఓవర్టేక్ చేసే క్రమంలో ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. దీంతో ప్రసాద్ లారీ వెనుక టైర్ కింద పడడంతో తల నుజ్జయి అక్కడిక్కడే మృతి చెందాడు. ప్రసాద్కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారు తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటలో నివాసం ఉంటున్నారు. ప్రసాద్ ఉద్యోగం నిమిత్తం నరసాపురంలోనే రూము తీసుకుని ఉంటున్నాడు. అతడి మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పృధ్వీ తెలిపారు. -
ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన వ్యాన్
ద్వారకాతిరుమల: ఆగి ఉన్న ట్రాలీ లారీని వెనుక నుంచి వ్యాన్ ఢీకొన్న ప్రమాదంలో వ్యాన్ క్లీనర్ అక్కడికక్కడే మృతి చెందగా, డ్రైవర్ తీవ్ర గాయాల పాలయ్యాడు. ఈ ఘటన మండలంలోని ఎం.నాగులపల్లి జాతీయ రహదారిపై బుధవారం రాత్రి జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. తూర్పు గోదావరి జిల్లా, జగ్గంపేట మండలం, కాట్రావులపల్లి గ్రామానికి చెందిన వ్యాన్ క్లీనర్ యెరిట సూర్యనారాయణ (21), డ్రైవర్ జి.సురేష్ గతనెల 29న మొక్కజొన్న పొత్తులు లోడింగ్ నిమిత్తం వినుకొండ వెళ్లారు. తిరిగి లోడుతో స్వగ్రామానికి వెళుతున్న క్రమంలో ఘటనా స్థలం వద్దకు వచ్చేసరికి ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో వ్యాన్ క్లీనర్ సూర్యనారాయణ అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్ర గాయాలపాలైన డ్రైవర్ సురేష్ను స్థానికులు హుటాహుటీన ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ద్వారకాతిరుమల ఎస్సై టి.సుధీర్ ఘటనా స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. క్లీనర్ మృతి, డ్రైవర్కు తీవ్ర గాయాలు -
కొడుకుపై కన్నతల్లి దాడి
కొయ్యలగూడెం: మానసిక, శారీరక వికలాంగుడైన కుమారుడిపై ఓ తల్లి విచక్షణ కోల్పోయి దాడి చేసింది. దీంతో అతను తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితికి వెళ్లిన ఘటన గురువారం జరిగింది. వివరాల ఇలా ఉన్నాయి. ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలం రామానుజపురం గ్రామానికి చెందిన తొంట కుమారి భర్త గతంలోనే మృతిచెందాడు. వీరికి కుమార్తె, మానసిక, శారీరక వికలాంగుడైన కుమారుడు ఉన్నారు. కుమార్తెను ఆమె భర్త విడిచిపెట్టడంతో తల్లి దగ్గరే ఉంటోంది. గురువారం తల్లికి, కుమారుడికి మధ్య ఏర్పడిన వివాదంలో తీవ్ర ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో విచక్షణ కోల్పోయిన తల్లి కుమారుడిని తలపై కర్రతో కొట్టడంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. స్థానికులు అతన్ని 108 అంబులెన్సులో చికిత్స నిమిత్తం జంగారెడ్డిగూడెం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. తీవ్ర గాయాలపాలైన కుమారుడు -
యూనియన్ బ్యాంకు పరిహారం చెల్లించాల్సిందే
చిలకలపూడి (మచిలీపట్నం): ఖాతాదారునికి యూనియన్ బ్యాంక్ పరిహారం చెల్లించాలని వినియోగదారుల కమిషన్ అధ్యక్షుడు నందిపాటి పద్మారెడ్డి, సభ్యురాలు శ్రీలక్ష్మీరాయల గురువారం తీర్పుచెప్పారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మండలం తుందుర్రు గ్రామానికి చెందిన తోట గంగరాజుకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తుందుర్రు బ్రాంచ్లో సేవింగ్ అకౌంట్ ఉంది. 2023 సెప్టెంబరు 26వ తేదీన గంగరాజు డెబిట్కార్డు వివరాలు, ఓటీపీ చెప్పమని ఒక కాల్ వచ్చింది. వెంటనే బ్యాంకుకు వెళ్లి వివరాలు తెలియజేసి అకౌంట్స్, డెబిట్ కార్డు బ్లాక్ చేయించారు. వారం రోజుల తరువాత గంగరాజు కొత్త డెబిట్కార్డు తీసుకున్నారు. 2023 అక్టోబరు 5వ తేదీన రూ.1,39,200 గంగరాజు అకౌంట్ నుంచి మూడు విడతలుగా నగదు కట్ అయింది. దీంతో ఆయన యూనియన్ బ్యాంక్ వారిని కలిసి ఏ విధమైన లావాదేవీలు జరగకుండానే నగదు కట్ అయిందని ఫిర్యాదు చేశారు. అపరిచిత వ్యక్తుల వల్ల నగదు కట్ అయిందని, దానికి బ్యాంకు వారే బాధ్యులని అంటూ ఆయన వినియోగదారుల కమిషన్ను ఆశ్రయించారు. కమిషన్ సభ్యులు పూర్వాపరాలను విచారించి తోట గంగరాజు ఖాతా నుంచి కట్ అయిన నగదు రూ.1,39,200 యూనియన్ బ్యాంకు వారు 9 శాతం వడ్డీతో కట్ అయిన తేదీ నుంచి చెల్లించాలని, మానసిక వేదన కలిగించినందుకు రూ.25 వేలు, ఖర్చుల నిమిత్తం రూ.5 వేలు తీర్పు వెలువడిన 30 రోజుల్లోగా చెల్లించాలని ఆదేశించారు.రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతికుక్కునూరు: రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. కుక్కునూరు మండలం సీతారామపురం గ్రామానికి చెందిన చనుబల్లి సుబ్బారావు (48) గురువారం తన బైక్పై తెలంగాణ రాష్ట్రం అశ్వారా వుపేట నుంచి కుక్కునూరు వస్తూ వినాయకపురం సమీపంలో అదుపు తప్పి బైక్పైనుంచి కిందకు పడిపోయాడు. తీవ్రగాయాలు కావడంతో సుబ్బారావుని చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. -
ప్రైవేటు ఆక్వా దుకాణాలకు రెక్కలు
కై కలూరు: రాష్ట్ర తలసరి ఆదాయంలో ఏలూరు జిల్లాలో కలిదిండి, కై కలూరు రెండు మండలాలు ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలుస్తున్నాయి. ఇందుకు ప్రధాన కారణం ఆక్వా రంగం. ఆక్వా ఉత్పత్తుల రవాణాలోనూ కొల్లేరు ప్రాంతాలు సింహభాగం ఆక్రమించాయి. ఆక్వా ప్రాధాన్యతను గుర్తించి రాష్ట్ర మంచినీటి సంవర్థక రిఫరల్ ల్యాబోరేటరీను కై కలూరు మత్స్యశాఖ కార్యాలయంలో ఏర్పాటు చేశారు. కాకినాడ తర్వాత కై కలూరు ల్యాబ్ మాత్రమే రాష్ట్ర స్థాయిలో రిఫరల్ ల్యాబ్ కావడం విశేషం. కూటమి ప్రభుత్వంలో ఈ ల్యాబ్ పాడుపడ్డా కొంపలా మారింది. కేవలం ఒకే ఒక్క సిబ్బంది పరీక్షలు నిర్వహించడం గమనార్హం. ప్రభుత్వ ఆక్వా ల్యాబ్లో సేవలు సక్రమంగా అందకపోవడంతో రైతులు ప్రైవేట్ ఆక్వా దుకాణాలను ఆశ్రయిస్తున్నారు. పరికరాలున్నా.. ప్రయోజనం శూన్యం కై కలూరులో మత్స్యశాఖ కార్యాలయంతో పాటు లాబోరేటరీని 2003లో నిర్మించారు. ఫీడ్ అనాలసీస్, మైక్రోబయోలజీ ల్యాబ్ను దివంగత వైఎస్.రాజశేఖరరెడ్డి పాలనలో అప్పటి మంత్రి ఎండీ.ఫరీదుద్దిన్ 2005లో ప్రారంభించారు. ల్యాబ్లో మైక్రోబయోలజీ, హిస్టోపాథాలజీ, నీటి, మట్టి, మేత పరీక్షలు, పీసీఆర్ టెస్టులు అందుబాటులో ఉన్నాయి. ల్యాబ్లో రూ.20లక్షల విలువ చేసే ఎలిషా పరికరం, అదే విధంగా రూ.13లక్షలు విలువ చేసే పీసీఆర్ మిషన్తో పాటు మేత పరీక్షలకు రూ.లక్షల్లో విలువ చేసే పరికరాలు అందుబాటులో ఉన్నాయి. ప్రైవేటు ల్యాబ్లతో పోల్చితే తక్కువ ధరకు పరీక్షలు చేస్తున్నా ఆక్వా రైతులు ఫిషరీస్ ల్యాబ్కు రావడం లేదు. లైసెన్సులు లేనివి ఎన్నో.. ఆక్వా దుకాణాలు ఏర్పాటు చేయాలంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆక్వా డెవలప్మెంట్ అథారిటీ(అప్సడా) నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి. కోస్టల్ అథారిటీ అనుమతులు ఉండాలి. వీటితో పాటు డ్రగ్ లైసెన్స్, జీఎస్టీ, ఐటీ రిటర్న్, ఆథరైజ్డ్ డీలర్షిప్ లెటర్స్తో దరఖాస్తు చేసుకున్న తర్వాత జాయింట్ కలెక్టర్ అనుమతులు పొందాలి. క్షేత్ర స్థాయిలో తహసీల్దార్, ఫిషరీస్, డ్రగ్ ఇన్స్పెక్టర్ పొల్యూషన్ ఇలా పలు శాఖలు నిరభ్యంతర ధ్రువపత్రం ఇవ్వాలి. ఇంత తతంగం ఉన్నప్పుటికీ కై కలూరు నియోజకవర్గంలో ఏకంగా 130 ఆక్వా దుకాణాలు ఉన్నాయి. వీటిలో కేవలం 39 దుకాణాలకు మాత్రమే లైసెన్సులు ఉన్నాయి. కూటమి ప్రభుత్వంలో రెక్కలు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత లైసెన్సులు రాకపోయినా రాజకీయ నేతల అండతో ఆక్వా దుకాణాలు తెరుస్తున్నారు. కొన్ని ప్రైవేటు ల్యాబ్లలో సరైన నిబంధనలు పాటించడం లేదు. ఇక పరీక్ష ధరల విషయానికి వస్తే ప్రభుత్వ ల్యాబ్లో నీటి పరీక్ష రూ.100 ఉంటే ప్రైవేటు ల్యాబ్లో రూ.200, మట్టి పరీక్ష రూ.210 ఉంటే ప్రైవేటులో రూ.300, మేతలో అన్ని పరీక్షుల కలిపి ప్రభుత్వ ల్యాబ్లో రూ.680 ఉంటే ప్రైవేటులో రూ.1200, పీసీఆర్ టెస్టు ప్రభుత్వ ల్యాబ్లో రూ.800 ఉండగా ప్రైవేటు ల్యాబ్లలో రూ.2,500 తీసుకుంటున్నారు. ఇక కొన్ని ఆక్వా దుకాణాల్లో మందులు కొనుగోలు చేసి చెరువులో చల్లడం వల్ల సాగు రైతులకు రూ.లక్షల్లో చేప పిల్లలు చనిపోతున్నాయి. నాసిరకం మందులపై ప్రశ్నిస్తే రాజకీయ నేతల అండతో బక్క రైతులపై దుకాణదారులు జులం ప్రదర్శిస్తున్నారు. వైఎస్సార్ సీపీ పాలనలో రూ.18.60 లక్షలు నిధుల కేటాయింపు వైఎస్సార్ సీపీ పాలనలో ల్యాబ్ ఆధునికీకరణకు రూ.18.60 లక్షలు కేటాయించారు. పరికరాలు కొనుగోలుతో పాటు ఎంజైమ్ లింక్ట్ ఇమ్యునోసోర్జెంట్ ఆస్సే(ఎలిషా) టెస్టు గదిని నిర్మించారు. అయితే ఇప్పటి వరకు ప్రభుత్వం సిబ్బందిని నియమించకపోవడంతో మూతపడింది. ల్యాబ్లో మొత్తం 6గురు సిబ్బందికి గాను కేవలం అశోక్ అనే ఎంపీఈవో సిబ్బంది ఒక్కరే పరీక్షలు చేస్తున్నాడు. ఇక్కడ ల్యాబ్ ఏడీ రాజ్కుమార్ను ఏలూరు ఏడీగా వేయడంతో అయన అక్కడ సేవలకే పరిమితమయ్యారు. గత పాలనలో సచివాలయ ఉద్యోగాల్లో భాగంగా ఇక్కడ మత్స్య సహాయకులను పరీక్షలకు నియమించారు. ఇప్పుడు వీఎఫ్ఏలు సచివాలయాలకు మాత్రమే పరిమితమవుతున్నారు. కూటమి హయాంలో ప్రభుత్వ ల్యాబ్ నిర్వీర్యం పరికరాలు ఉన్నా.. సేవలు శూన్యం సచివాలయాలకే పరిమితమవుతున్న వీఎఫ్ఏలు పెచ్చులూడటం వాస్తవమే కై కలూరు ఆక్వా లేబోరేటరీ బయట శ్లాబ్ పెచ్చులూడడం వాస్తవమే. ఇంజనీరింగ్ అధికారులకు తెలిపాం. ఎలిషా టెస్టుకు కాకినాడలో శిక్షణ పొందిన సిబ్బంది అవసరం. ఆక్వా దుకాణాలకు దరఖాస్తు చేసుకున్నప్పటికీ క్షేత స్థాయిలో అధికారుల లాగిన్లో నిలిచాయి. దుకాణాల్లో, లేబ్లలో ప్రభుత్వ నిబంధనలు పాటించకపోతే చర్యలు తీసుకుంటాం. – బి.రాజ్కుమార్, మత్స్యశాఖ ల్యాడ్, ఏడీ, కై కలూరు పూర్తి స్థాయి సిబ్బందిని నియమించాలి ఫిషరీస్ ల్యాబ్ను రైతులకు అందుబాటులో ఉంచండి. సిబ్బంది లేకపోవడంతో ప్రైవేటు ల్యాబ్లను ఆశ్రయిస్తున్నాం. రాష్ట్ర స్థాయిలో ల్యాబ్ ఉన్నప్పటికీ ఆక్వా రైతుల నమ్మకాన్ని పొందలేకపోతుంది. ప్రభుత్వం ల్యాబ్కు మరమ్మతులతో పాటు పూర్తి స్థాయి సిబ్బందిని నియమించాలి. – సమయం రామాంజనేయులు, ఆక్వా రైతు, కై కలూరు -
ఆటో, వ్యాన్ ఢీకొని కూలీ మృతి
నలుగురికి గాయాలు దెందులూరు: ఆటోను వ్యాన్ ఢీకొట్టిన ఘటనలో ఒక కూలీ మృతి చెందగా ఇద్దరికీ తీవ్ర, మరో ఇద్దరికీ స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటన ఏలూరు రూరల్ మండలంలోని శ్రీపర్రులో గురువారం తెల్లవారుజామున 5.30 గంటలకు చోటుచేసుకుంది. వివరాల ప్రకారం రావులపాలెం నుంచి మండవల్లి రొయ్యల చెరువు పట్టుబడికి కూలీలు ఆటోలో వస్తున్నారు. ఏలూరు రూరల్ మండలం శ్రీపర్రు పెట్రోల్ బంక్ సమీపానికి వచ్చేసరికి ఆటో, భీమవరం నుంచి వస్తున్న వ్యాన్ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆటో నుజ్జయింది. ఆటోలో ఉన్న ఒరిస్సా రాష్ట్రం దేవిరీపల్లికి చెందిన సందీప్ కుమార్ (19) అక్కడికక్కడే మృతి చెందాడు. మిగితావారిలో ఒరిస్సాకు చెందిన రాత్కు, సూరజ్కు తీవ్రగాయాలు కాగా రాంబాబు, లక్ష్మణ్లకు స్వల్ప గాయాలయ్యాయి. ఏలూరు రూరల్ తహసీల్దార్ బి విజయకుమార్రాజు, శ్రీపర్రు వీఆర్ఓ సుబ్రహ్మణ్యం, రెవెన్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఏలూరు జీజీహెచ్కు తరలించారు. ఏలూరు రూరల్ ఎస్సై దుర్గాప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రైలు నుంచి జారిపడిన వ్యక్తి మృతి
భీమవరం: రైలు నుంచి జారిపడిన వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందినట్లు రైల్వే ఎస్సై ఎం.సుబ్రహ్మణ్యం చెప్పారు. ఈనెల 16వ తేదీన ఆకివీడు – ఉండి రైల్వే స్టేషన్ మధ్య 55 ఏళ్ల గుర్తు తెలియని వ్యక్తి రైలు నుంచి జారిపడి గాయపడడంతో చికిత్స నిమిత్తం 108 వాహనం ద్వారా భీమవరం ప్రభుత్వాసుపత్రికి అనంతరం మెరుగైన వైద్యం కోసం ఏలూరు జిల్లా ఆసుపత్రికి తరలించామన్నారు. అక్కడ ఆ వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడని చెప్పారు. మృతుని ఆచూకీ తెలిసిన వారు సెల్ 99084 48729 నంబర్లో సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు. అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి దెందులూరు: అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఏలూరు రూరల్ ఎస్సై దుర్గా ప్రసాద్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఏలూరు రూరల్ మండలంలోని జాలిపూడి గ్రామంలో కంచర్ల తంబి (40) చేపల చెరువులపై గుమస్తాగా పనిచేస్తున్నాడు. గురువారం ఇంటి వద్దనే మద్యంలో పురుగుల మందు కలుపుకుని తాగాడు. గమనించిన బంధువులు వెంటనే అతడ్ని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చెప్పారు. ఎరువుల పట్టివేత లింగపాలెం: మండలంలోని యడవల్లి గ్రామ సమీపంలో 7 టన్నుల కాంప్లెక్స్ ఎరువులను వ్యాన్లో అక్రమంగా తరలిస్తుండగా వ్యవసాయశాఖ డీఏఓ ఎస్కే అబీబ్ బాషా, ఏడీఏ వై సుబ్బారావు, ఏవో వి ప్రదీప్ కుమార్ పరిశీలించి సీజ్ చేశారు. వీటి విలువ రూ.2 లక్షల 6 వేలు అని తెలిపారు. కృష్ణా జిల్లా మైలవరం నుంచి ఈ ఎరువులను తరలిస్తున్నట్లు చెప్పారు. స్వాధీనం చేసుకున్న ఎరువులను మఠంగూడెం సొసైటీలో భద్రపర్చి, వ్యాన్ను పోలీస్ స్టేషన్కు అప్పగించినట్లు ఏవో ప్రదీప్ కుమార్ విలేకర్లకు తెలిపారు. గురుకుల ఉపాధ్యాయుడికి పురస్కారం నరసాపురం రూరల్: ఎల్బీచర్ల డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల గణిత ఉపాధ్యాయుడు బేతపూడి విజయ్కిరణ్ కేంద్ర మంత్రిత్వ శాఖ కార్యదర్శి రాహుల్ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. భారత సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జాతీయ సంస్కృతుల ప్రోత్సాహంపై ఈ నెల 9 నుంచి 29 వరకూ హైదరాబాద్లో శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో విజయ్కిరణ్ ‘ఆంధ్రప్రదేశ్లో చేతి వృత్తుల కళాకారుల జీవన స్థితిగతులు’ అనే అంశంపై ప్రాజెక్టు సమర్పించారు. ఈ ప్రాజెక్టుకుగాను కేంద్ర మంత్రిత్వ శాఖ నుంచి ఆయనకు ప్రశంసలు లభించాయి. ఈ సందర్భంగా గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ ఎన్.శ్యాంప్రసాద్, వైస్ ప్రిన్సిపాల్ పి.మార్క్, నల్లి సాయిబాబు, రాజా, పాఠశాల సిబ్బంది ఉపాధ్యాయుడు విజయ్కిరణ్ను అభినందించారు. -
తేనెటీగల పెంపకంతో ఆర్థిక వృద్ధి
తాడేపల్లిగూడెం: తేనె టీగల పెంపకంతో ఆర్థిక స్వయం సమృద్ధి సాధించవచ్చని సీనియర్ సైంటిస్టు డాక్టర్ విజయలక్ష్మి అన్నారు. వెంకట్రామన్నగూడెంలోని కేవీకేలో గురువారం ప్రారంభమైన తేనెటీగల పెంపకం శిక్షణా కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. తేనెను శాసీ్త్రయంగా ఎలా ప్రోసెస్ చేయాలి, నాణ్యమైన తేనెను మిషనరీ ద్వారా కలుషితం లేకుండా బాట్లింగ్ వరకు ఎలా తీసుకురావాలనే విషయాలను విశదీకరిరంచారు. రూ.20 వేలతో ఒక ఎకరానికి నాలుగు బాక్సులు, రూ.5 వేలతో కావాల్సిన పరికరాలు కొనుగోలు చేసి ఉద్యాన పంటల మధ్య ఖాళీ స్థలంలో బాక్సులు ఎలా అమర్చాలనే విషయాల గురించి చెప్పారు. తేనె ఉప ఉత్పత్తులుగా మైనం, పుప్పొడి, జెల్లీ, విషం తయారు చేసి ఎకరాకు రూ.లక్ష ఆదాయం పొందవచ్చన్నారు. గాఢమైన పురుగుమందులు కొట్టే తోటల పక్కన కాని, రైల్వే ట్రాకుల పక్కన, విద్యుత్ స్తంభాల పక్కన తేనెటీగల పెంపకం కోసం బాక్సులు ఏర్పాటు చేయకూడదన్నారు. మూడు రోజుల పాటు శిక్షణలో తేనెటీగల పెంపకం, యాజమాన్య పద్ధతులు, తెగుళ్లు, నివారణ చర్యలు గురించి వివరిస్తామన్నారు. కార్యక్రమంలో డాక్టర్ దీప్తి, దేవీవరప్రసాదరెడ్డి తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ స్తంభాన్ని ఢీకొని వ్యక్తి మృతితాడేపల్లిగూడెం రూరల్: విద్యుత్ స్తంభాన్ని మోటారు సైకిల్ ఢీకొన్న ఘటనలో ఓ యువకుడు మృతి చెందాడు. వివరాల ప్రకారం మండలంలోని జగన్నాథపురం గ్రామానికి చెందిన దండే శ్రీను (21) గురువారం బాదంపూడి నుంచి స్వగ్రామం మోటారు సైకిల్పై వస్తుండగా, నవాబుపాలెం వద్దకు వచ్చే సరికి కుక్కను తప్పించబోయి పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో అతను అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. శ్రీను సోదరుడు చందు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రూరల్ ఎస్సై జేవీఎన్.ప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
న్యాయం చేయకపోతే పోరు ఉధృతం
జంగారెడ్డిగూడెం: గ్రీన్ ఫీల్డ్ హైవే భూ నిర్వాసిత రైతులకు న్యాయం చేయకపోతే పోరాటాన్ని ఉధృతం చేస్తామని, ఆగస్టు 4న గ్రీన్ఫీల్డ్ హైవే భూ నిర్వాసిత రైతుల చలో కలెక్టరేట్ నిర్వహిస్తామని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కె.శ్రీనివాస్ హెచ్చరించారు. మంగళవారం జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెంలోని మానవతా కల్యాణ మండపంలో నిర్వాసిత రైతుల సదస్సు నిర్వహించారు. సదస్సుకు వామిశెట్టి హరిబాబు అధ్యక్షత వహించారు. రైతుల సమస్యలు చర్చించి పలు తీర్మానాలు ఆమోదించారు. ఆగస్టు చలో కలెక్టరేట్ కార్యక్రమం చేపట్టాలని, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, జిల్లా కలెక్టర్, ఇతర అధికారులకు వినతి పత్రాలు అందజేయాలని సదస్సులో ఏకగ్రీవంగా తీర్మానించారు. కె.శ్రీనివాస్ మాట్లాడుతూ నిర్వాసిత రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేరలేదని, రైతులను మోసగించారని తీవ్రంగా విమర్శించారు. సర్వీస్ రోడ్ల నిర్మాణం చేయకపోవడం వల్ల పొలాలకు వెళ్లే మార్గాలు లేక అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఆర్బిట్రేషన్ పిటిషన్ల ద్వారా పరిహారం పెంచి ఇస్తామని హామీ ఇచ్చి కొద్దిమందికి కొద్ది పరిహారం పెంచి మిగిలిన రైతులకు అన్యాయం చేయడం తగదన్నారు. చింతలపూడి, టి.నర్సాపురం, జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం, గోపాలపురం, దేవరపల్లి తదితర మండలాల్లో గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణం వల్ల తలెత్తిని సమస్యలు పరిష్కారం చేయాలన్నారు. సదస్సులో రైతుల పోరాట కమిటీ నాయకులు వామిశెట్టి హరిబాబు, అల్లూరి రామకృష్ణ, దేవరపల్లి సత్యనారాయణ, శీలం రామచంద్రరావు, ఎలికే తాతారావు, వందనపు సాయిబాబా, కె.నాగేశ్వరావు, కె.రంగారావు, జి.నర్సిరెడ్డి, బొడ్డు రాంబాబు, పి.శ్రీహరి తదితరులు మాట్లాడుతూ సర్వీస్ రోడ్లు లేకపోవడం వల్ల గ్రామాల రైతులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోకపోవడం అన్యాయమన్నారు. 2013 భూ సేకరణ చట్ట ప్రకారం పరిహారంతో పాటు ఇతర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సదస్సుకు ముందుగా గురవాయిగూడెంలో రైతులు ధర్నా చేపట్టారు. గ్రీన్ఫీల్డ్ హైవే భూ నిర్వాసిత రైతుల తీర్మానం -
ఉచితం పరిమితం
కౌలు రైతులందరికీ రుణాలివ్వాలి బుధవారం శ్రీ 30 శ్రీ జూలై శ్రీ 2025కండిషన్ అంతంత మాత్రమే పల్లె వెలుగు హైర్ సర్వీసులతో పోలిస్తే మిగిలిన వాటి కండిషన్ అంతంత మాత్రంగానే ఉన్నాయి. వాటిలో ప్రయాణిస్తున్నప్పుడు కుదుపులు, కిటికీల తలుపుల నుంచి వచ్చే శబ్దాలకు తీవ్ర అసౌకర్యానికి గురికావాల్సి వస్తుందని ప్రయాణికులు అంటున్నారు. సిబ్బంది కొరత అధికంగా ఉంది. అవుట్ సోర్సింగ్ ద్వారా డ్రైవర్లను భర్తీచేసే యోచనలో అధికారులు ఉన్నారు. పనిభారం పెరిగినప్పుడు కండక్టర్లను డబుల్ డ్యూటీ చేయించాలని భావిస్తున్నారు. ఈ రూట్లలో మాటేంటి ? ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేయడం ద్వారా జిల్లాలోని ఆర్టీసీ రోజుకు రూ.40 లక్షల ఆదాయాన్ని ఆర్జిస్తోంది. భీమవరం–రాజమహేంద్రవరం, భీమవరం–తాడేపల్లిగూడెం, భీమవరం– తణుకు, భీమవరం–నరసాపురం, భీమవరం–ఏలూరు రూట్లు ఆర్టీసీకి ఆదాయాన్ని తెస్తున్నాయి. భీమవరం డిపోలోని గణపవరం రూట్, నరసాపురంలోని దొడ్డిపట్ల, కందరపల్లి, చినగొల్లపాలెం రూటు, తణుకులోని వరిగేడు, పసలపూడి రూటు, తాడేపల్లిగూడెంలోని అప్పారావుపేట, సింగరాజుపాలెం, పోల వరం రూట్లు ఆదాయం లేని రూట్లుగా ఉండటంతో వీటికి సర్వీసులు అంతంతమాత్రంగానే నడుస్తున్నాయి. ఆదాయం లేని రూట్లలో మహిళల ఉచిత ప్రయాణానికి అదనపు బస్సులు ఏర్పాటు చేస్తారో లేదో వేచిచూడాలి. సాక్షి, భీమవరం: ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు రాష్ట్రమంతా ఉచితం ప్రయాణమని ఎన్నికల్లో ఊదరగొట్టిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు ప్లేటు ఫిరాయించింది. ఉచిత బస్సు హామీకి ఏడాది ఎగనామం పెట్టిన చంద్రబాబు సర్కారు రానున్న ఆగస్టు 15 నుంచి అమలు చేస్తామంటోంది. ఉచిత ప్రయాణం జిల్లా వరకే పరిమితమంటూ చేతులెత్తేసింది. కూటమి సూపర్సిక్స్ హామీల్లో మహిళలకు ఉచిత బస్సు సదుపాయం ఒకటి. ఎన్నికల ప్రచారంలో భాగంగా జిల్లాలోని భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం, పాలకొల్లు, నరసాపురం తదితర సభల్లో చంద్రబాబు, పవన్ కల్యాణ్లు మాట్లాడుతూ రాష్ట్రమంతటికీ వర్తింపచేస్తామంటూ హామీ ఇచ్చిన విషయం విదితమే. రానున్న ఆగస్టు 15 నుంచి ఈ హామీని అమల్లోకి తేనున్నట్టు సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఉన్నతస్థాయి నుంచి వచ్చిన ఆదేశాల మేరకు జిల్లా పరిధిలోనే ఉచిత బస్సు సర్వీసులు నడిపే దిశగా ఆర్టీసీ యంత్రాంగం కసరత్తు చేస్తోంది. ఆంక్షల నడుమ పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు సర్వీసుల్లో మాత్రమే మహిళలకు ఉచిత ప్రయాణానికి అనుమతించనున్నట్టు తెలుస్తోంది. జిల్లాలోని మొత్తం బస్సులు రోజుకు లక్ష కిలోమీటర్లు దూరం ప్రయాణిస్తుండగా, 90 వేల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. వీరిలో జిల్లా పరిధిలో ప్రయాణిస్తున్న వారు దాదాపు 70 శాతం మంది ఉంటారు. మహిళలకు ఉచిత బస్సు నేపథ్యంలో ఈ ఆక్యుఫెన్సీ మరో 15 నుంచి 20 శాతం పెరుగుతుందని ఆర్టీసీ అధికారులు అంచనా వేస్తున్నారు. సాధారణంగా ఉదయం, సాయంత్రం వేళల్లో విద్యార్థులు, ఉద్యోగులతో రద్దీ అధికంగా ఉంటుంది. ఉచిత బస్సు ప్రయాణంతో ఈ రద్దీ మరింత పెరగనుంది. అలాగే పట్టణ ప్రాంతాల్లో లోకల్ సర్వీస్ పెరుగుతుంది. ప్రస్తుతం ఉన్న 23 స్పేర్ బస్సులు, 22 బడి బస్సుల్లో దాదాపు 30 బస్సులను వినియోగంలోకి తీసుకురావడం ద్వారా రద్దీని అధిగమించే యోచనలో ఆర్టీసీ అధికారులు ఉన్నారు. జిల్లాలో బస్సులు ఇలా.. జిల్లాలోని భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం, నరసాపురం డిపోల పరిధిలో మొత్తం 295 బస్సులు ఉన్నాయి. వీటిలో దూరప్రాంతాలకు వెళ్లే వెన్నెల, స్టార్ లైనర్లు నాలుగు, ఇంద్ర బస్సులు 11, సూపర్ లగ్జరీ బస్సులు 33, అల్ట్రా డీలక్స్లు 26, ఎక్స్ప్రెస్లు 20 వరకు ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల మధ్య సేవలందిస్తున్న అల్ట్రా పల్లె వెలుగులు 19, పల్లె వెలుగు బస్సులు 158 ఉండగా, స్పేర్ బస్సులు 23 ఉన్నాయి. జిల్లాలోని మొత్తం బస్సుల్లో వెన్నెల సర్వీస్తో పాటు ఒక అల్ట్రా డీలక్స్, తొమ్మిది ఎక్స్ప్రెస్ బస్సులు, 17 అల్ట్రా పల్లె వెలుగు, 47 పల్లె వెలుగు బస్సులను అద్దె ప్రాతిపదికన నడుపుతున్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లాలో మహిళల జనాభా 9.23 లక్షలు. ప్రస్తుతం వీరి సంఖ్య మరింత పెరిగింది. జిల్లాలో 409 పంచాయతీలకు దాదాపు 300 గ్రామాలకు మాత్రమే ఆర్టీసీ బస్సు సదుపాయం ఉంది. ఉమ్మడి జిల్లా పరిధిలో ప్రయాణించాలంటే ఎక్స్ప్రెస్, సూపర్లగ్జరీ సర్వీసులు ఎక్కువగా ఉంటాయి. వీటికి అనుమతి ఇవ్వకుండా కేవలం పల్లె వెలుగు బస్సులకు మాత్రమే అనుమతించడం సరికాదని మహిళలు మండిపడుతున్నారు. అదనపు బస్సులు లేకుండా ఉన్న వాటినే సర్దుబాటు చేయడం తూతూమంత్రంగా ఎన్నికల హామీని అమలుచేయడమేనని విమర్శిస్తున్నారు.సిద్ధంగా ఉన్నాం మహిళలు ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఇంకా మార్గదర్శకాలు రానప్పటికి సిద్ధంగా ఉన్నాం. బస్సులను పూర్తి కండీషన్లోకి తెచ్చాం. ప్రస్తుతం స్పేర్లో ఉన్న వాటిని, బడి బస్సులను వినియోగంలోకి తీసుకువచ్చి అవసరాన్ని బట్టి అదనపు బస్సుల కోసం ప్రతిపాదనలు పంపాలని భావిస్తున్నాం. సిబ్బంది కొరతను అధిగమించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశాం. – ఎన్వీఆర్ వరప్రసాద్, జిల్లా ప్రజా రవాణ అధికారి, భీమవరం న్యూస్రీల్ రాష్ట్రమంతా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యమంటూ హామీ ఇప్పుడు పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగులకే పరిమితం? జిల్లాలో 9.23 లక్షల మహిళలకు ఉన్న బస్సులు కేవలం 184 ఆర్టీసీ బస్సులు వెళ్లని గ్రామాలు 100 పైనే -
ఆత్మీయ కలయిక
భీమవరం: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఆ పార్టీ నరసాపురం పార్లమెంట్ సమన్వయకర్త ముదు నూరి మురళీకృష్ణంరాజు సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. తాడేపల్లిలో నిర్వహించిన పార్టీ పీఏసీ సమావేశానికి హాజరైన సందర్భంగా ఆయన పార్టీ అధినేతను కలిశారు. పీ4లో భాగస్వాములవ్వాలి భీమవరం (ప్రకాశంచౌక్): పీ4లో భాగంగా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరంలో జిల్లాలోని సంపన్న రైతులు, ఎరువులు, పురుగు మందుల షాపుల యజమానులు, డీలర్లు, వ్యవసాయ శాఖ అధికారులతో ఏర్పాటుచేసిన అవగాహన కార్యక్రమానికి జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలోని పేద వర్గాలను ఆర్థికంగా, సామాజికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం పీ4 కార్యక్రమాన్ని ప్రారంభించిందని, కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలన్నారు. బంగారు కుటుంబాలను దత్తత తీసుకొని వారికి చేయూతనిస్తే వారు ఆర్థికంగా ఎదుగుతారన్నారు. దోపిడీ కోసమే స్మార్ట్ మీటర్లు ఏలూరు (టూటౌన్): దోపిడీ కోసమే స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నారని కార్మిక సంఘాల ఐక్య కార్యచరణ నాయకులు విమర్శించారు. కార్మిక సంఘాల ఐక్యకార్యాచరణ ఆధ్వర్యంలో మంగళవారం వన్ టౌన్ బిర్లాభవన్ సెంటర్ నుంచి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఐఎఫ్టియు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి బద్దా వెంకట్రావు, సీఐటీయూ ఏలూరు జిల్లా ప్రధాన కార్యదర్శి డీఎన్వీడి ప్రసాదు, రైతు సంఘం రాష్ట కార్యదర్శి డేగ ప్రభాకర్ మాట్లా డుతూ కుటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను పక్కనపెట్టి అదానీ కంపెనీకి సేవకులుగా పని చేస్తున్నారని విమర్శించారు. ప్రజల డబ్బులను ఏ విధంగా దోచుకోవాలో, ఆ డబ్బులు కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టేలా బాబు సర్కార్ వేగంగా పనిచేస్తుందని ఎద్దేవా చేశారు. పోలవరం నుంచి భారీగా నీటి విడుదల ఏలూరు (ఆర్ఆర్పేట): పోలవవరానికి వరద ప్రవాహం కొనసాగుతూనే ఉంది. తెలంగాణ, మహారాష్ట్రల్లో కురిసిన వర్షాలకు గోదావరి, శబరి నదులు ఉధృతంగా ప్రవహించడంతో గోదావరిలో వరద పోటెత్తుతోంది. గత నాలుగు రోజుల నుంచి రోజుకు సగటున 5 లక్షల క్యూసెక్కుల నీరు పోలవరం నుంచి దిగువకు విడుదల చేస్తున్నారు. మంగళవారం సాయంత్రం 6 గంటల సమయానికి పోలవరం ప్రాజెక్టు స్పిల్ వే నీటిమట్టం 31.050 మీటర్లుండగా దిగువకు 6,70,335 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. స్వర్ణకార సంఘ కార్యవర్గం ఎన్నిక ఆకివీడు: ఉమ్మడి పశ్చి మగోదావరి జిల్లా స్వర్ణకార సంఘం నూతన కమిటీని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు కమిటీ చైర్మన్ పట్నాల శేషగిరిరావు మంగళవారం చెప్పారు. ఆరోసారి తమను ఎన్నుకోవడంతో డబుల్ హ్యాట్రిక్ సాధించామన్నారు. 25 ఏళ్లపాటు ఒక సంఘం ఏకగ్రీవంగా ఎన్నికవడం ఇదే ప్రథమమన్నారు. స్వర్ణకారులకు, విశ్వబ్రాహ్మణ సంఘ సభ్యులకు సంఘం తరుఫున చేసిన సేవల్ని గుర్తించి ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు చెప్పారు. అధ్యక్షుడిగా తనతో పాటు ప్రధాన కార్యదర్శిగా నల్లగొండ వెంకట రామకృష్ణ, కోశాధికారిగా కొమ్మోజు రామకృష్ణ, కార్యవర్గ సభ్యులు కొనసాగుతారని చెప్పారు. -
భవన నిర్మాణ కార్మికుల పోరుబాట
భీమవరం: పనులు లేక అవస్థలు పడుతున్న భవన నిర్మాణ కార్మికులు రాష్ట్ర ప్రభుత్వం వెల్ఫేర్ బోర్డును ఏర్పాటు చేయాలంటూ పోరుబాట పట్టారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాది గడిచినా కార్మికులకు చేతినిండా పనులు దొరకని దుర్భర పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే కార్మిక, ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తున్నాయి. వీరికి తోడు భవన నిర్మాణ కార్మికులు తమ సమస్యలు పరిష్కరించాలని ఉద్యమబాట పట్టారు. దీనిలో భాగంగా ఇప్పటికే భవన నిర్మాణ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయాల వద్ద ఆందోళనలు నిర్వహించి వినతిపత్రాలు అందచేశారు. నమోదు సులభతరం చేయాలి భవన నిర్మాణ కార్మికులకు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం హయాంలో ఏర్పాటు చేసిన భవన నిర్మాణ కార్మికుల వెల్ఫేర్ బోర్డును పునరుద్ధరించి బోర్డులో కార్మికుల నమోదు ప్రక్రియను సులభతరం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. గతంలో ఏర్పాటు చేసిన వెల్పేర్ బోర్డు ద్వారా నిర్మాణదారుల నుంచి ఒక శాతం సెస్ వసూలు చేసి భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి వినియోగించగా నేటి ప్రభుత్వం సెస్ నిధులను దారి మళ్లించి కార్మికులకు మొండిచేయి చూపుతోందనే ఆందోళన వ్యక్తమవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 25 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులుండగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో గతంలో సుమారు 1.70 లక్షల మంది కార్మికులు వెల్పేర్ బోర్డులో నమోదు చేసుకున్నారు. హామీని ఎప్పుడు అమలు చేస్తారు? ఎన్నికల సమయంలో భవన నిర్మాణ కార్మికుల వెల్ఫేర్ బోర్డును అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చిన కూటమి నాయకులు అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా భవన నిర్మాణ కార్మికులను పట్టించుకోకపోవడం పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కార్మికుల నమోదు వంటి ప్రక్రియను సులభతరం చేసి వార్డు, గ్రామ సచివాలయాల్లో నమోదు చేసుకునే అవకాశాన్ని కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. భవన నిర్మాణ కార్మికులకు ఐదురోజులు ఆసుపత్రిలో ఉండాలనే నిబంధనను, తొలగించాలని ప్రమాదం కారణంగా విశాంత్రి తీసుకుంటున్న కాార్మికులకు ఇచ్చే రూ.100 భృతిని రూ.500 పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రమాదాలు, ఆనారోగ్యం కారణంగా మంచాన పడిన కార్మికులకు వెల్ఫేర్ బోర్డు ద్వారా ఈఎస్ఐ తరహాలో ఉచిత వైద్య సాయం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించకుంటే పోరుబాట తప్పదని హెచ్చరిస్తున్నారు. వెల్ఫేర్ బోర్డును పునరుద్ధరించాలని ఆందోళనలు ప్రభుత్వం స్పందించకుంటే ఉధృతం చేస్తామని హెచ్చరిక -
సమస్యలు పరిష్కరించాలి
భవన నిర్మాణ కార్మికులకు ప్రభుత్వం అందించాల్సిన సంక్షేమ పథకాలు నిలిచిపోవడంతో కార్మిక కుటుంబాలు తీవ్ర ఇబ్బంది పడుతున్నాయి. గతంలో ప్రభుత్వం వెల్పేర్ బోర్డు ద్వారా అమలు చేసిన సంక్షేమ పథకాలు భవన నిర్మాణ కార్మికులకు అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. – బండి శ్రీనివాసరావు, భవన నిర్మాణ కార్మిక సంఘం మండల అధ్యక్షుడు, వీరవాసరం పోరుబాట తప్పదు భవన నిర్మాణ కార్మికుల కోసం ఏర్పాటు చేసిన వెల్పేర్ బోర్డును పునరుద్దరించకుంటే పోరుబాట తప్పదు. చేతినిండా పనులు లేక అనేక ఇబ్బందులు పడుతున్న భవన నిర్మాణ కార్మికులకు ప్రభుత్వ ప్రోత్సహం కూడా కరువైతే పరిస్థితి మరింత దుర్బరంగా మారుతుంది. – మండ సూరిబాబు, భవన నిర్మాణ కార్మిక సంఘం కార్యదర్శి ఆందోళనలు ఉధృతం చేస్తాం వెల్పేర్ బోర్డును పునరుద్ధరించి సంక్షేమ పథకాలు అమలు చేయకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తాం. ఇప్పటికే తహసీల్దార్ కార్యాలయాల వద్ద ఆందోళన చేసి అధికారులకు సమస్యలు పరిష్కరించాలని వినతిపత్రాలు అందచేశాం. – నారపల్లి రమణరావు, భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ● -
డ్రెయిన్లోకి దూసుకెళ్లిన కారు
విశ్రాంత సైంటిస్ట్ మృతి ముదినేపల్లి రూరల్: పోల్రాజ్ డ్రెయిన్లో కారు దూసుకుపోయిన ఘటనలో విశ్రాంత సైంటిస్టు మరణించిన ఘటన ముదినేపల్లి వద్ద మంగళవారం రాత్రి జరిగింది. మండవల్లి మండలం లింగాలకు చెందిన చందు వెంకటేశ్వరరావు(63) నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ(ఎన్ఆర్ఎస్ఏ)లో శాస్త్రవేత్తగా పనిచేస్తూ ఇటీవలే ఉద్యోగ విరమణ చేసి హైదరాబాదులో ఉంటున్నారు. లింగాల గ్రామంలోని బంధువుల ఇంట జరిగే వివాహం నిమిత్తం హైదరాబాదు నుంచి భార్య రాణితో కలసి వస్తున్నారు. పోల్రాజ్ వంతెన వద్ద డైవర్షన్ రోడ్డులో ప్రయాణించాల్సి ఉండగా, డైవర్షన్ గమనించకపోవడంతో పోల్రాజ్ డ్రెయిన్లోకి కారు దూసుకుపోయింది. ప్రమాద సమయంలో పక్కనే చెరువులపై పనిచేసే కూలీలు ప్రమాదాన్ని గమనించి కాల్వలోకి దూకి రాణిని కాపాడారు. అప్పటికే వెంకటేశ్వరరావు మృతిచెందారు. ప్రమాదవార్త తెలిసిన వెంటనే కై కలూరు సీఐ వి.రవికుమార్, స్థానిక ఎస్ఐ వీరభద్రరావు సంఘటన స్థలానికి చేరుకుని వెంకటేశ్వరరావు మృతదేహాన్ని బయటకు తీసి, గుడివాడ ఏరియా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాంట్రాక్టర్ డైవర్షన్ బోర్డులు పెట్టకపోవడంతోనే ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. మృతుడు వెంకటేశ్వరరావుకు ముగ్గరు కుమార్తెలు కాగా.. వారంతా అమెరికాలో స్థిరపడ్డారు. -
కలెక్టర్ చదలవాడ నాగరాణి
భీమవరం (ప్రకాశంచౌక్): ప్రభుత్వ పథకాల లబ్ధిదారులకు బ్యాంకర్లు విరివిగా రుణాలు అందించాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్లో బ్యాంకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పథకాల లక్ష్యసాధనకు బ్యాంకర్లు తమవంతు సహకారం అందిచాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని ఎస్హెచ్జీలకు రుణాల మంజూరు లక్ష్యంలో చాలా లోటు కనిపిస్తుందని, మైక్రో క్రెడిట్ ప్లాన్ అందిన వెంటనే రుణాలు మంజూరు చేయాలని ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో రూ.977.74 కోట్ల రుణాల మంజూరు లక్ష్యంగా కాగా.. కేవలం రూ.144.85 కోట్లు మాత్రమే మంజూరు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఆర్డీఎ ద్వారా పంపిన 9,633 ఎంసీపీలకు వెంటనే రుణాలు మంజూరు చేయాలని ఆదేశించారు. చేనేత కార్మికులకు ముద్ర లోన్ మంజూరులో తీవ్ర జాప్యం ఎందుకని ప్రశ్నించారు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ హెడ్ ఎల్.వి.వి.ఆర్.కె.ఎం.ఎస్ మన్యం మాట్లాడుతూ పీఎం సూర్యఘర్ పథకం అమలు లక్ష్యానికి కృషి చేయాలని సూచించారు. నాబార్డ్ ప్రతినిధి నిష్యంత్ చంద్ర, లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ ఎ.నాగేంద్ర ప్రసాద్, ఆర్బీఐ ప్రతినిధి రామకృష్ణ పాల్గొన్నారు. అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలి భీమవరం అర్భన్: సమాజం అభివృద్ధి చెందాలంటే ప్రతి ఒక్కరు అక్షర జ్ఞానం కలిగి ఉండాలని, జిల్లాలోని నిరక్షరాస్యలను అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు సంబంధిత అధికారులు కృషి చేయాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. మంగళవారం వయోజన విద్యా శాఖ ఆధ్వర్యంలో ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన జిల్లా స్థాయి ‘అక్షర ఆంధ్ర’ అక్షరాస్యత 2025–26పై శిక్షణా తరగతుల ప్రారంభ సభలో కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. 2029 నాటికి నిరక్షరాస్యులు లేని జిల్లాగా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉంచేందుకు అధికారులు నిరంతరాయంగా కృషి చేయాలన్నారు. -
ఐకమత్యంతో సాగాలి
చోరీ కేసుల్లో నిందితుల అరెస్ట్ ఏలూరులో రాత్రివేళ ఇళ్లల్లో చోరీలకు పాల్పడుతున్న కేసులో ఇద్దరు నిందితులను, బైక్ల చోరీలకు పాల్పడుతున్న మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. 8లో uఏలూరు (ఆర్ఆర్పేట): అందరూ ఐకమత్యంతో ముందుకు సాగాలని తద్వారా సమస్యకు పరిష్కారం లభిస్తుందని రాష్ట్ర మాజీ హోం శాఖ మంత్రి తానేటి వనిత సూచించారు. మంగళవారం స్థానిక డీసీఎంఎస్ ఫంక్షన్ హాల్లో ఆల్ ఇండియా పాస్టర్స్ ఫెడరేషన్ ప్రారంభోత్సవ సమావేశం జాతీయ అధ్యక్షుడు రెబ్బ ఇమ్మానుయేల్, జాతీయ కార్యదర్శి జీవన్ కుమార్ అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న తానేటి వనిత మాట్లాడుతూ ప్రతి ఒక్కరు దేవుడి మనస్తత్వాన్ని కలిగి ఉండాలన్నారు. ప్రేమ, క్షమించడం, ఆదరణ లక్ష్యాలుగా జీవిస్తేనే మోక్షమార్గం లభిస్తుందన్నారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి విజయకుమార్ మాట్లాడుతూ ఐకమత్యంతో ప్రతి ఒక్కరు జీవించాలన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను పూర్తిస్థాయిలో పేద బడుగు బలహీన వర్గాలకు అందేలా స్వచ్ఛంద సంస్థల నాయకులు కృషి చేయాలన్నారు. ఆర్సీఎం ఏలూరు పీఠాధిపతి డాక్టర్ పొలిమేర జయరావు మాట్లాడుతూ ఆధ్యాత్మిక అభివృద్ధి ఐక్యత, సేవ, ప్రేమ గుణాలతో ప్రతి ఒక్కరు జీవించాలన్నారు. ఆలిండియా పాస్టర్స్ ఫెడరేషన్ జాతీయ కార్యదర్శి పాస్టర్ జీవన్ కుమార్ మాట్లాడుతూ దేశంలోని 28 రాష్ట్రాల పరిధిలో పాస్టర్లు అంతా కలిసి ఆలిండియా పాస్టర్స్ ఫెడరేషన్గా ఏర్పడినట్లు తెలిపారు. జాతీయ అధ్యక్షుడు బిషప్ ఇమ్మానియేల్ మాట్లాడుతూ క్రైస్తవులపై దాడుల నివారణ, పేదలకు సేవ లక్ష్యంగా ఫెడరేషన్ ఏర్పడిందన్నారు. ఈ సందర్భంగా పాస్టర్లు జాతీయ జెండాలు ప్రదర్శించారు. -
విద్యుదాఘాతంతో యువకుడి మృతి
టి.నరసాపురం: ఆయిల్పామ్ గెలలు కోస్తుండగా విద్యుదాఘాతానికి గురై ఓ యువకుడు మృతి చెందాడు. టి.నరసాపురంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కె.జగ్గవరం గ్రామానికి చెందిన కొమ్ము రవింద్ర (22) ఆయిల్పామ్ గెలలు నరికే పని చేస్తుంటాడు. మంగళవారం మరో వ్యక్తితో కలిసి టి.నరసాపురంలో ఆయిల్పామ్ గెలలు నరికే పనికి వెళ్లాడు. గెలలు కోస్తుండగా గెలలు కోసే గెడకు విద్యుత్ షాక్ తగిలి రవీంద్ర కిందకు పడిపోయాడు. స్థానికులు రవీంద్రను చింతలపూడి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. రూ.10 లక్షలు పరిహారం ఇవ్వాలని ధర్నా చింతలపూడి ఏరియా హాస్పిటల్లో ఉన్న రవింద్ర మృతదేహాన్ని ఆయిల్పామ్ గెలలు నరికే కార్మికులు, సీఐటీయూ నాయకులు సందర్శించారు. అనంతరం ఫైర్ స్టేషన్ సెంటర్లో మృతుని కుటుంబీకులతో కలసి ధర్నా నిర్వహించారు. రవీంద్ర కుటుంబానికి రూ.10 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పోలీసులు ఆందోళనకారులతో చర్చించి ఆందోళన విరమింపజేశారు. -
జీఐపై ఉద్యాన వర్సిటీ ఎంఓయూ
తాడేపల్లిగూడెం: భౌగోళిక గుర్తింపు సూచికల ఆవశ్యకత నానాటికి పెరుగుతుందని, ఈ మొక్క మనదే, ఈ వస్తువు భారతదేశానిదే అనే విషయాలు అధికారికంగా గుర్తింపు పొందాలంటే జీఐ సూచికల ప్రాధాన్యత అవసరం ఉందని హైదరాబాద్కు చెందిన రిసల్యూట్ 4ఐపీ గ్రూపు వ్యవస్థాపకుడు సుభజిత్సాహ అన్నారు. డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయంలో మంగళవారం జీఐ అంశంపై నిర్వహించిన అంతర్జాతీయ సదస్సులో ఆయన మాట్లాడారు. 2030 నాటికి 10వేల జీఐల నమోదు చేయాలని భారత ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో జీఐలు పొందటంలో విశ్వవిద్యాలయాల పాత్ర పెరిగిందన్నారు. ఉపకులపతి డాక్టర్ కె.గోపాల్ మాట్లాడుతూ జీఐలు పొందడంలో విశ్వవిద్యాలయాలకు ఆచరణలో ప్రతిబంధకాలు ఉన్నాయని, ఇలాంటి విషయాలపై ఆకళింపు కలిగిన రిసల్యూట్ గ్రూపు అవసరం ఉందన్నారు. ఈ నేపథ్యంలో ఈ సంస్థతో ఉద్యానవర్సిటీ ఎంఓయూ కుదుర్చుకుందన్నారు. దీని వల్ల యూనివర్సిటీ తయారు చేసిన వంగడాలు వంటి వాటికి జీఐ సులభతరంగా వచ్చే అవకాశం ఉందన్నారు. రీసల్యూట్ సంస్థతో ఒప్పంద పత్రాలను వీసీ గోపాల్, సుభజిత్ సాహ మార్చుకున్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ ఆఫ్ ఇండస్ట్రీయల్ అండ్ ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్స్ డాక్టర్ కె.ధనుంజయ్ రావు పర్యవేక్షించారు. విశ్వవిద్యాలయ అధికారులు ఎం.మాధవి, బి.శ్రీనివాసులు, బి.ప్రసన్నకుమార్, ఎస్.సూర్యకుమారి, తదితరులు పాల్గొన్నారు. -
పెదతాడేపల్లి గురుకులం జాతికి అంకితం
తాడేపల్లిగూడెం రూరల్: మండలంలోని పెదతాడేపల్లి డాక్టర్ బీఆర్.అంబేడ్కర్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను మంగళవారం వీడియో సమావేశం ద్వారా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ జాతికి అంకితం చేసినట్లు ప్రిన్సిపాల్ బి.రాజారావు తెలిపారు. ఆయనతో పాటు సహాయ మంత్రులు సుకాంత్ మజుందార్, జయంత్ చౌదరి, కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖమంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారన్నారు. పాఠశాలలో నాణ్యమైన విద్య, మౌలిక సదుపాయాల కల్పనే ధ్యేయంగా పీఎంశ్రీ పథకాన్ని భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు. జిల్లాలోని 26 పీఎంశ్రీలలో ఉత్తమ పాఠశాలగా పెదతాడేపల్లి గురుకులాన్ని ఎంపిక చేసినట్లు తెలిపారు. డీఈవో నారాయణ, సమగ్ర శిక్ష ఏపీసీ శ్యామ్ సుందర్, ఏఎంవో సుబ్రహ్మణ్యం, మండల విద్యాశాఖ అధికారి వి.హనుమ, పేరెంట్స్ కమిటి వైస్ చైర్పర్సన్ ఇందిర పాల్గొన్నారు. -
మానవ హక్కుల ఫోరం సభ్యుడిగా మంగరాజు
తాడేపల్లిగూడెం (టీఓసీ): జాతీయ మానవ హక్కుల పరిరక్షణ సంస్థ (ఎన్హెచ్ఆర్పీ ఫోరం) ఎస్సీ, ఎస్టీ వింగ్కు జాతీయ సభ్యునిగా మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చీకటిమిల్లి మంగరాజు నియమితులయ్యారు. సంస్థ జాతీయ చైర్మన్ జేఎస్ఆర్ నాయుడు ఈమేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. మంగరాజు జిల్లా ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ అండ్ మోనిటరింగ్ కమిటీ సభ్యునిగా రెండు సార్లు పనిచేశారు. ఫోరం సభ్యునిగా నియమితులైన మంగరాజును మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు బేతాల శరత్ బాబు, నాయకులు నల్లి రాజేష్, తిరగటి శివ, గంటా సుందర్కుమార్ అభినందించారు. -
చోరీ కేసుల్లో నిందితుల అరెస్ట్
ఏలూరు టౌన్: ఏలూరులో రాత్రివేళ ఇళ్లల్లో చోరీలకు పాల్పడుతున్న కేసులో ఇద్దరు నిందితులను, బైక్ల చోరీలకు పాల్పడుతున్న మరో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ.11.50 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, 17 మోటార్సైకిళ్లు స్వాధీనం చేసుకున్నారు. ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం వద్ద మంగళవారం విలేకరుల సమావేశంలో ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ వివరాలు వెల్లడించారు. కై కలూరు మినీబైపాస్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరు వ్యక్తులను ఏలూరు వన్టౌన్ సీఐ సత్యనారాయణ బృందం అదుపులోకి తీసుకుని విచారించగా పలు ఇంటి చోరీల్లో బంగారు ఆభరణాలు అపహరించినట్లు నిర్ధారించారు. వారివద్ద నుంచి రూ.11.50 లక్షల విలువైన హారం, చంద్రహారం, మురుగులు, ఉంగరాలు, చెవిమాటీలు, నవరత్నాల దిద్దులు, బేబీ రింగులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుల్లో నిందితులైన గుంటూరు జిల్లా తెనాలికి చెందిన పిల్లి సురేష్ అలియాస్ శివ, పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన నాగళ్ళ ముత్తయ్య గుప్తాలను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిద్దరిపై చోరీ, కొట్లాట, మోసం కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసును ఛేదించిన సీఐ సత్యనారాయణ, వన్టౌన్ ఎస్సై ఎస్కే మదీనా బాషా, ఎస్సై నాగబాబు, వన్టౌన్ ఏఎస్సై అహ్మద్, హెచ్సీ రమేష్, కానిస్టేబుళ్లు మోహన్, నాగార్జున, నాగరాజు, శేషుకుమార్, రుహుల్లా, సీసీఎస్ ఏఎస్సై గోపి, హెచ్సీ రమణ, పీసీ రజని ఉన్నారు. వీరిని ఎస్పీ అభినందించారు. మోటార్సైకిళ్లు స్వాధీనం ఏలూరు త్రీటౌన్ సీఐ వీ.కోటేశ్వరరావు, భీమడోలు సీఐ యూజే విల్సన్ వారి పోలీస్స్టేషన్ల పరిధిలో ప్రత్యేక నిఘా, తనిఖీలు చేపట్టి భారీగా చోరీకి గురైన మోటారు సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఏలూరు త్రీటౌన్ సీఐ కోటేశ్వరరావు, ఎస్సై రాంబాబు, సిబ్బందితో నిఘా ఉంచి ఇద్దరు దొంగలను అరెస్ట్ చేశారు. వారిద్దరి నుంచీ 14 మోటారు సైకిళ్లు స్వాధీనం చేసుకోగా, వాటి విలువ సుమారు రూ.6.68 లక్షలుగా ఉంటుందని అంచనా. ఇక భీమడోలు సీఐ విల్సన్ ఆధ్వర్యంలో ద్వారకాతిరుమల ఎస్సై సుధీర్ తమ సిబ్బందితో తనిఖీలు చేసి 3 మోటారు సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.1.40 లక్షలు ఉంటుందని అంచనా. కృష్ణాజిల్లా గుడివాడకు చెందిన సయ్యద్ రజాక్, సయ్యద్ కరీముల్లాను అదుపులోకి తీసుకుని విచారించగా మోటారు సైకిళ్ల చోరీ కేసులు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో ప్రతిభ చూపిన పోలీస్ అధికారులు, సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. ఇళ్ల దొంగతనాల్లో ఇద్దరు, బైక్ చోరీల్లో మరో ఇద్దరి అరెస్ట్ రూ.11.50 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, 17 మోటార్సైకిళ్లు స్వాధీనం -
కొబ్బరి ధరహాసం
● రికార్డు స్థాయిలో నీటి కొబ్బరి, కురిడీ ధరలు ● తమిళనాడు, కేరళలో పంట తగ్గడమే కారణం ● వరుస పండుగలతో పెరిగిన కొబ్బరి ధరలు ● కొబ్బరి వ్యాపారులు, రైతుల్లో హర్షం ●అవగాహన అవసరం ప్రస్తుతం మార్కెట్ ధర అత్యధికంగా ఉంది. రైతులు బాగా తయారైన కాయలను దింపు తీయించడం ద్వారా మంచి ధరను పొందవచ్చు. ప్రభుత్వం కోకోనట్ పరిశోధన కేంద్రాలను ఏర్పాటుచేసి మన ప్రాంతంలో కొబ్బరి రైతులకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలి. – మైగాపుల రాంబాబు, కోకోనట్ సంఘ మాజీ అధ్యక్షుడు, పాలకొల్లు ప్రభుత్వం శ్రద్ధ వహించాలి ప్రస్తుతం ధరను బట్టి రైతుల్లోనూ కొబ్బరి పంటపై ఆసక్తి పెరుగుతుంది. ధరలు లేవని సరైన అవగాహన లేక కొందరు కొబ్బరి చెట్లను నిర్లక్ష్యం చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వమే ప్రత్యేక శ్రద్ధ వహించి రైతుల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. – కఠారి నాగేంద్రకుమార్, పాలకొల్లు కోకోనట్ మర్చంట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్, పాలకొల్లు పాలకొల్లు సెంట్రల్: గత రెండు నెలలుగా రికార్డు స్థాయిలో కొబ్బరి ధరలు పలుకుతుండడంతో రైతుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో పశ్చిమగోదావరి జిల్లాలో పచ్చి కొబ్బరి, కురుడి, కొత్త కొబ్బరి కాయ దొరకడమే గగనంగా మారింది. ప్రస్తుతం శ్రావణమాసం ప్రారంభం కావడంతో మార్కెట్లో కొబ్బరికి డిమాండ్ మరింత పెరగడంతో ఇక్కడ కూడా పంటకు కొరత ఏర్పడింది. ధర ఉన్నా సరుకు అందుబాటులో లేకపోవడంతో ధర మరింత పెరిగే అవకాశం ఉంటుందని రైతులు ఎదురు చూస్తున్నారు. జిల్లాలో దాదాపుగా 80 వేల ఎకరాల్లో కొబ్బరి సాగు జరుగుతుంది. ఉమ్మడి పశ్చిమ జిల్లాలో ఏలూరు, నిడదవోలు, జంగారెడ్డిగూడెం, రెడ్డిసీమ, కోరుమామిడి, చింతలపూడి, ద్వారకాతిరుమల, దేవరపల్లి, పెదవేగి, కొవ్వూరు, నల్లజర్ల, గోపాలపురం, ఉంగుటూరు, తాడేపల్లిగూడెం, భీమవరం, తణుకు, పాలకొల్లు, మొగల్తూరు, పేరుపాలెం వంటి ప్రాంతాల్లో కొబ్బరి పంట అధికంగా కొనసాగుతుంది. జోరుగా కొబ్బరి మార్కెట్ శ్రావణమాసానికి ముందుగానే జిల్లాలో కొబ్బరి మార్కెట్ జోరందుకుంది. కురుడి కొబ్బరికై తే ధర రికార్డు స్థాయిలో ఉండడం గమనార్హం. ప్రస్తుతం మార్కెట్లో పాత కాయల్లో పెద్ద సైజు గిలక కాయలు వెయ్యి కాయల ధర రూ.24,500, చిన్న సైజు కాయలు రూ.20 వేలు వరకూ మార్కెట్ జరిగింది. అలాగే కొత్త రకం కాయల్లో పెద్ద (అరవైబత్తి) సైజు రూ. 22,500, చిన్న సైజు కాయలు రూ.18 వేలు వరకూ ఉంది. నెంబర్ కాయ (అతి చిన్న సైజు) కొబ్బరి రూ.15 నుంచి 18 వేలు పలుకుతుంది. కురుడీ కాయలో పెద్ద సైజు ధర రూ.30 వేల గటగట సైజు రూ.27 వేల వరకూ పలుకుతోంది. పండుగల ప్రభావం మన రాష్ట్రం నుంచి గుజరాత్, మహారాష్ట్ర, చత్తీస్ఘడ్, ఉత్తర ప్రదేశ్, డిల్లీ, పంజాబ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఒరిస్సా, హర్యానా వంటి అనేక రాష్ట్రాలకు ఇక్కడ నుంచి ఎక్కువగా ఎగుమతులు అవుతుంటాయి. శ్రావణమాసంలో దాదాపుగా ఈ ఒక్క నెలలోనే శ్రావణ శుక్రవారాలు, మంగళవారాలు, శుక్ల ఏకాదశి, బహుళ ఏకాదశి, దూర్వాగణపతి హోమం, వరలక్ష్మీ వ్రతం, సంకట హర చతుర్థి, శ్రీకృష్ణాష్టమి, మాసశివరాత్రి రాఖీ పౌర్ణమి, పోలాల అమావాస్య, నాగ పంచమి, ఆగస్టు నెలలో వినాయకచవితి రావడంతో ఆయా రాష్ట్రాల్లో పండుగ వాతావరణం అంతా ఈ నెలలోనే ఉండడంతో కొబ్బరి మార్కెట్ నిలకడగా ఉండడానికి కూడా ఒక కారణంగా చెబుతున్నారు. కాయల్లో నాణ్యత ఉండాలి రైతులు దింపు తీసేటప్పుడు నాణ్యమైన నిక్కర్చి కాయలను మాత్రమే దింపు తీయాలి. బరువైన కాయలు దింపు తీయడం వల్ల అవి ఎక్కువ రోజులు నిల్వ ఉండే అవకాశం లేక కాయలు కుళ్లిపోతుంటాయి. నిక్కర్చి కాయలు బరువు తక్కువ ఉండే బాగా తయారైన కాయలు దింపు తీయడం వల్ల మార్కెట్ ధర కూడా ఎక్కువగా ఉంటుందని వ్యాపారస్తులు చెబుతున్నారు. దింపు తీసే కార్మికులు అందుబాటులో లేకపోవడంతో రైతులు కొంత ఇబ్బందులు పడుతున్నారు. కొబ్బరి విజ్ఞాన కేంద్రాలు ఉమ్మడి పశ్చిమలో పెదవేగిలో తూర్పు గోదావరిలో అంబాజీపేటలోనే ఉన్నాయి. కొబ్బరి పంటపై రైతుల్లో అవగాహన కల్పించేలా ప్రభుత్వం అవగాహనా సదస్సులు ఏర్పాటుచేయాలి. తమిళనాడు, కేరళలో దిగుబడులు లేకపోవడమే ప్రస్తుతం మార్కెట్లో కొబ్బరి ధరకు ఇంత జోష్ రావడానికి ప్రధాన కారణం తమిళనాడు, కేరళలో కొబ్బరి దిగుబడి తగ్గడమే. ఇటీవల వేసవిలో ఈ రెండు రాష్ట్రాల నుంచి కొబ్బరి బొండాల వ్యాపారం జోరుగా కొనసాగడంతో నేడు పంట దిగుబడి తగ్గి మన రాష్ట్రంలో కొబ్బరికి డిమాండ్ పెరిగింది. అందువల్ల గుజరాత్, ఉత్తర ప్రదేశ్, బీహార్, చత్తీస్ఘడ్, మహారాష్ట్ర వంటి ప్రాంతాలకు మన ప్రాంతం నుంచే కొనుగోలు చేయాల్సి రావడంతో ధరలు ఆకాశాన్నంటాయని వ్యాపారస్తులు చెబుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో సీజన్లో రోజుకు సుమారు 80 నుంచి 100 లారీల వరకూ ఎగుమతులు జరుగుతుంటాయి. అన్ సీజన్లో అయితే జిల్లాలో రోజుకు సుమారు 30 నుంచి 40 లారీల వరకూ ఎగుమతులు జరుగుతుంటాయని వ్యాపారస్తులు చెబుతున్నారు. ప్రస్తుతం సీజన్ అయి ఉండి ధర కూడా అధికంగా ఉన్నా సరుకు లేకపోవడం వల్ల రోజుకు సుమారు 60 నుంచి 80 లారీలు వరకూ ఎగుమతులు అవుతున్నాయని అంటున్నారు. -
అదృశ్యమైన యువకుడు శవమై తేలాడు
ద్వారకాతిరుమల: ఇంటి నుంచి బయటకు వెళ్లి అదృశ్యమైన యువకుడు పంగిడిగూడెం వద్ద పోలవరం కుడి కాలువలో శవమై కనిపించాడు. వివరాల్లోకి వెళితే. మండలంలోని కొమ్మర గ్రామానికి చెందిన పొద్దుటూరి శ్యామ్(21) గత రెండేళ్లుగా ద్వారకాతిరుమలలోని ఈకామ్ ఎక్స్ప్రెస్ కొరియర్లో సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు. గత ఆదివారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఇంటి నుంచి బైక్పై వెళ్లిన శ్యామ్ తిరిగి ఇంటికి రాలేదు. చుట్టుపక్కల, బంధువుల ఇళ్ల వద్ద వెదికినా ఫలితం లేదు. దాంతో శ్యామ్ తల్లి సంకురమ్మ సోమవారం స్థానిక పోలీస్టేషన్లో ఫిర్యాదు చేయగా, హెడ్ కానిస్టేబుల్ దుర్గారావు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. కాగా మంగళవారం పంగిడిగూడెం వద్ద పోలవరం కుడి కాలువలో మృతదేహం లభించగా అది శ్యామ్గా గుర్తించారు. భీమడోలు సీఐ యుజే విల్సన్, ద్వారకాతిరుమల ఎస్సై టి.సుధీర్, సిబ్బంది శ్యామ్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మిస్సింగ్ కేసును అనుమానాస్పద మృతిగా మార్పుచేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు. శ్యామ్ మృతికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. అతడికి తల్లి, ఒక అన్నయ్య ఉన్నారు. పంగిడిగూడెం వద్ద పోలవరం కుడి కాలువలో యువకుడి మృతదేహం లభ్యం -
ఫసల్ బీమా.. రైతులకు ధీమా
చింతలపూడి, దెందులూరు : కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధాన మంత్రి ఫసల్ భీమా యోజన (పీఎంఎఫ్బీవై) రైతులకు వెన్నుదన్నుగా నిలుస్తోంది. ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికందే వరకు అన్నదాతలకు ఆందోళన తప్పడం లేదు. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో రైతన్నలకు అండగా నిలిచేందుకు కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన రైతులకు ధీమానిస్తుంది. ప్రకృతి వైపరీత్యాలు, చీడపీడలతో పంటలకు నష్టం వాటిల్లితే కర్షకులకు ఇబ్బంది లేకుండా బీమా వర్తించేలా ఈ పథకాన్ని రూపొందించినట్లు సహాయ సంచాలకులు వై సుబ్బారావు, దెందులూరు మండల వ్యవసాయ అధికారి శ్రీనివాసరాజు తెలిపారు. బీమా ప్రీమియం చెల్లించేందుకు వరి పంటకు ఆగస్టు 15 వరకు సమయం ఉండగా మినుముల పంటకు మాత్రం ఈనెల 31 వరకు మాత్రమే గడువు ఉందని, రైతులు త్వరపడాలని సూచించారు. రైతులకు కలిగే ప్రయోజనాలు ఖరీఫ్లో ఆహార ధాన్యాలు, చిరు ధాన్యాలు, నూనె గింజలు పండించే రైతులు ఎకరానికి రూ.840 చెల్లించాలి. వరి పంటకు నష్టం సంభవింస్తే ఎకరానికి రూ.42 వేల వరకు బీమా పొందే అవకాశం ఉంటుంది. మినుముల పంటకు రూ.300 చెల్లించాల్సి ఉండగా రూ.20 వేల వరకు బీమా పొందవచ్చు. రుణాలు తీసుకోని రైతులు, కౌలు రైతులు కూడా బీమా కట్టుకోవచ్చు. బీమా వర్తింపు ఇలా.. ముంపు, చీడపీడలు, తుపాన్లు, అగ్ని ప్రమాదాలు, వడగళ్లు, పెను గాలుల ధాటికి పంట నష్టపోయినప్పుడు ఫసల్ బీమా వర్తిస్తుంది. అదేవిధంగా పంట కోసి పనలపై ఉన్నప్పుడు అకాల వర్షాలు, తుపాన్లు కారణంగా పంట దెబ్బతిన్న ఘటనల్లో కూడా బీమా వర్తింపచేశారు. ఒకవేళ తుపాన్లు, వరదలు సంభవించినప్పుడు పంట ముంపుకు గురైతే 48 గంటల్లోగా సంబంధిత బ్యాంక్ వారికి, బీమా కంపెనీకి, వ్యవసాయశాఖ అధికారులకు సమాచారం అందించాలి. గ్రామం యూనిట్గా.. గ్రామంలో పండే ప్రధాన పంటను గ్రామం యూనిట్గా పరిగణిస్తారు. ఏలూరు జిల్లాలో వరి పంటను గ్రామం యూనిట్గా గుర్తించారు. పంట ముంపుకు గురైనప్పుడు, వడగళ్ల వానలకు దెబ్బ తిన్నప్పుడు బీమా వర్తిస్తుంది. 50 శాతానికి పైగా పంట దిగుబడి నష్టం జరిగితే నిబంధనల మేరకు నష్టాన్ని అంచనా వేసి 25 శాతం బీమా సొమ్మును వెంటనే చెల్లిస్తారు. రైతులు కూడా అధిక వర్షాలు, లేదా అనావృష్టి పరిస్థితులు సంభవించినప్పుడు 7 రోజుల్లోగా ప్రభుత్వ అధికారులకు సమాచారం అందించాల్సి ఉంటుంది. ఇదికాక వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం కూడా అమల్లో ఉంది. రైతులు ఈ బీమా పథకాలను సద్వినియోగం చేసుకోవాలని వ్యవసాయ అధికారులు విజ్ఞప్తి చేశారు. -
10న జిల్లా స్థాయి యోగాసన పోటీలు
ఏలూరు (ఆర్ఆర్పేట): యోగాసనా భారత్ సంస్థ ఆధ్వర్యంలో ఆగస్టు 10వ తేదీన ఏలూరు జిల్లా స్థాయి యోగాసన పోటీలు నిర్వహించనున్నట్టు ఆ సంస్థ గౌరవాధ్యక్షుడు వెంకటేష్ గురూజీ తెలిపారు. మంగళవారం స్థానిక గుప్తవిద్య, దివ్యజ్ఞాన సమాజం మందిరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. స్థానిక తూర్పువీధి మాదేపల్లి రోడ్డులోని ప్రేమాలయంలో యోగాసన పోటీలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేశామన్నారు. ఈ పోటీల్లో 10 నుంచి 55 ఏళ్ల వయసు గల సీ్త్ర, పురుషులు పాల్గొనవచ్చునన్నారు. యోగాసన భారత్ అధ్యక్షుడు ఆలపాటి నాగేశ్వర రావు మాట్లాడుతూ పోటీదారులు వయసు ధ్రువీకరణ పత్రాలతో హాజరుకావాలని, అలాగే పోటీలో పాల్గొనే ఒక్కో విభాగానికి రూ. 100 రుసుము చెల్లించాలన్నారు. వివరాలకు ఏలూరు జిల్లా యోగాసనా భారత్ కార్యదర్శి మోటమర్రి మల్లికార్జున రావు 98486 11744, కోశాధికారి సాంబశివరావు 94907 34033 నంబర్లలో సంప్రదించవచ్చన్నారు. 3న అథ్లెటిక్స్ జిల్లా జట్టు ఎంపిక ఏలూరు రూరల్: ఆగస్టు 9, 10, 11 తేదీల్లో బాపట్లలో రాష్ట్రస్థాయిలో అంతర జిల్లాల జూనియర్ అథ్లెటిక్స్ పోటీలు జరగనున్నాయని ఏలూరు జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ కార్యదర్శి దేవరపల్లి ప్రసాద్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ పోటీల్లో పాల్గొనే ఏలూరు జిల్లా బాలబాలికల జట్లను ఆగస్టు 3వ తేదీన ఎంపిక చేస్తామని వెల్లడించారు. ఏలూరు అల్లూరి సీతారామరాజు స్టేడియంలో ఆదివారం ఉదయం 8 గంటల నుంచి జట్టు ఎంపిక చేపడతామన్నారు. అండర్ 14,, 16, 18, 20 విభాగాల్లో ఈ పోటీలు ఉంటాయన్నారు. ఆసక్తి గలవారు పుట్టినతేదీ, ఆధార్, ఎస్ఎస్సీ మార్క్లిస్ట్తో హాజరై రూ.200 ఎంట్రీ ఫీజు చెల్లించి పోటీల్లో పాల్గొనాలని పేర్కొన్నారు. వివరాలకు 62814 31202 నంబర్లో సంప్రదించాలని సూచించారు. డిప్లమో హార్టీకల్చర్లో చేరికకు నెలాఖరు వరకే అవకాశంతాడేపల్లిగూడెం: డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం పరిఽధిలోని కళాశాలలు, అనుబంధ కళాశాలల్లో డిప్లమో హార్టీకల్చర్లో చేరడానికి ఈనెల 31వ తేదీ ఆఖరు అని రిజిస్ట్ట్రార్ బి.శ్రీనివాసులు మంగళవారం తెలిపారు. విశ్వవిద్యాలయ పరిధిలో నాలుగు, వర్సిటీ గుర్తింపు పొందిన మూడు పాలిటెక్నికల్ కళాశాలలో డిప్లమో హార్టీకల్చర్ , ల్యాండ్స్కేపింగ్, నర్సరీ మేనేజ్మెంట్ కోర్సుల్లో చేరడానికి మాన్యువల్ కౌన్సిలింగ్కు హాజరు కావాలన్నారు. ఇంతకు మునుపు నమోదు చేసుకున్న అభ్యర్థులతో పాటు , కొత్తగా నమోదు చేసుకున్న దరఖాస్తు దారులు ఈనెల 31వ తేదీ ఉదయం 9.30 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు తుది విడత కౌన్సిలింగ్ వెంకట్రామన్నగూడెంలో జరుగనుందన్నారు. విద్యార్థులు స్వయంగా తగిన ధ్రువపత్రాలతో వచ్చి కౌన్సిలింగ్కు హాజరు కావాలన్నారు. ఇతర వివరాలు, సీట్ల ఖాళీల సమాచారం కోసం వర్సిటీ వెబ్సైట్ను సందర్శించాలన్నారు. మొరాయించిన ఆర్టీసీ బస్సు ఉండి: భీమవరం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు జాతీయ రహదారిపై మహదేవపట్నం సత్రం వద్ద మంగళవారం మొరాయించింది. భీమవరం నుంచి గణపవరం మీదుగా తాడేపల్లిగూడెం వెళ్లే ఈ బస్సు బయలుదేరి సరిగ్గా ఐదు కిలోమీటర్లు కూడా ప్రయాణించకుండానే ఆగిపోయింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బస్సులో మహిళా ప్రయాణికులు, విద్యార్థులు ఉండడంతో గమ్యం చేరేందుకు వారు చాలా ఇబ్బందిపడ్డారు. బస్సులను పరిశీలించకుండానే డిపోనుంచి సర్వీసులకు అధికారులు పంపించేస్తున్నారంటూ ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేశారు. -
మనస్తాపంతో యువకుడి ఆత్మహత్య
పాలకొల్లు సెంట్రల్: మనస్తాపంతో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పాలకొల్లు మండలంలో చోటుచేసుకుంది. రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జొన్నల గరువు గ్రామానికి చెందిన కట్టా నవీన్ కుమార్ (19) ఆగర్తిపాలెం గ్రామానికి చెందిన ఓ యువతిని ప్రేమిస్తున్నానంటూ వేధిస్తున్నాడు. దీనిపై యువతి తల్లిదండ్రులకు విషయం చెప్పగా ఆ యువకుడిని మందలించారు. దీంతో మనస్తాపానికి గురైన నవీన్ కుమార్ ఆదివారం రాత్రి ఇంటిలో ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తండ్రి కట్టా శ్రీను ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై బి సురేంద్ర కుమార్ తెలిపారు.చికిత్స పొందుతూ వ్యక్తి మృతిఉండి: రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఉండి మండలం పాములపర్రు శివారు రామాపురంలో ఆదివారం ఉదయం వ్యాన్ ఢీకొనడంతో సప్పా సుబ్రహ్మణ్యం (44) తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. -
ఆలయాల్లో ట్రస్టు బోర్డుల ఏర్పాటుకు కసరత్తు
ద్వారకాతిరుమల: దేవాలయాల్లో కొత్త ట్రస్టు బోర్డుల ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ నెలాఖరు నాటికి లేదా వచ్చే నెల మొదటి వారంలో ఇది ఒక కొలిక్కి వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే కూటమి నేతలు ట్రస్టు బోర్డుల్లో సభ్యులుగా స్థానం దక్కించుకునేందుకు ఎవరి ప్రయత్నాలు వారు చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలను ప్రసన్నం చేసుకున్నారు. దీంతో వారు 25 మంది పేర్లతో ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపారు. ఇప్పటికీ కొందరు ఆశావహులు ఇంకా పైరవీలు సాగిస్తూనే ఉన్నారు. ధర్మకర్తల మండలి చైర్మన్తో పాటు మరో 17 మంది సభ్యులతో ట్రస్టు బోర్డుల ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. అందులో 13 పదవులు టీడీపీకి ఇచ్చి, బీజేపీ, జనసేనలకు చెరో రెండు పదవులు ఇచ్చి సరిపెట్టేందుకు యోచిస్తున్నట్టు సమాచారం. తాజాగా ప్రభుత్వం రాష్ట్రంలో వంశపారంపర్య ధర్మకర్తలున్న ఆలయాలకు ట్రస్టు బోర్డుల ఏర్పాటులో మినహాయింపు ఇచ్చేందుకు యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఇదే గనుక జరిగితే రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాల్లో ఒకటైన ద్వారకాతిరుమల, అన్నవరం, సింహాచలం దేవస్థానాలకు ట్రస్టు బోర్డులు లేనట్టే. ఇక్కడ పదవులు ఆశిస్తున్న నేతలకు చుక్కెదురైనట్టే. ప్రభుత్వం దీనిపై ఏ విధమైన నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సి ఉంది. ట్రస్టు బోర్డులున్నా.. సభ్యులు డమ్మీలే వంశపారంపర్య ధర్మకర్తలు ఉన్న ఆలయాలకు ట్రస్టు బోర్డు సభ్యులు కేవలం డమ్మీలుగా మాత్రమే వ్యవహరిస్తారన్నది జగమెరిగిన సత్యం. బోర్డు సభ్యులంతా కలసి ధర్మకర్తను మార్చడానికి వీలుపడదు. కేవలం వారు ట్రస్టు బోర్డు సభ్యులమని చెప్పుకోవడానికి, ఆ పేరుతో ఉచితంగా తమకు, తమ వారికి దర్శనాలు చేయించుకోవడానికి, ప్రసాదాలు అందుకోవడానికి మాత్రమే ఉపయోగపడతారు. ఇది దేవస్థానానికీ అదనపు భారమే. ప్రభుత్వం ఇవే అంశాలను పరిగణనలోకి తీసుకుని వంశపారంపర్య ధర్మకర్తలున్న ఆలయాలకు ట్రస్టు బోర్డుల ఏర్పాటులో మినహాయింపు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. వచ్చేనెల మొదటి వారంలోగా కొలిక్కివచ్చే అవకాశం సభ్యులుగా స్థానం కోసం ఆశావహుల పైరవీలు -
పరదాలు, కాపలా అక్కరలేదంటూనే..
ఆకివీడు: హోం శాఖమంత్రి వంగలపూడి అనిత సోమవారం ఆకివీడు పర్యటన సందర్భంగా సామాన్యులు, ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. పోలీసులు ప్రధాన రహదారిపై వాహనాలను అడ్డుకోవడం, ఆర్టీసీ బస్సులను దారి మళ్లించడంతో ప్రజానీకానికి ఇబ్బందులు తప్పలేదు. కానీ స్థానిక వెలంపేట రామాలయం వద్ద జరిగిన సభలో హోం మంత్రి వనిత మాట్లాడుతూ తమ పర్యటనలో పరదాలు అక్కరలేదు, చెట్లు కొట్టక్కరలేదు, షాపులు మూయ్యక్కరలేదు, పైన పోలీసులు కాపలా కాయక్కరలేదు అంటూ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిపై వ్యంగ్యంగా మాట్లాడడం గమనార్హం. తమ ప్రభుత్వంలో బయటకు వస్తే ప్రశాంతంగా బతకవచ్చని హోం మంత్రి అనిత చెబుతున్నా ఆమె పర్యటన కారణంగా ప్రయాణికులు, స్థానికులకు ఇబ్బందులు తప్పలేదు. రోపులు, వైరు తాడులు ఉపయోగించి నాయకులను, స్థానికుల్ని అడ్డుకోవడం కొసమెరుపు. ఉదయం 10 గంటలకు వస్తారని పోలీసులు హడావిడి చేసినా మధ్యాహ్నం 12.30 గంటలకు ఆమె రావడంతో సభా వేదిక వద్ద ఉన్న డ్వాక్రా మహిళలు నీరసించి, విసుగుచెందారు. హోం మంత్రి పర్యటనలో హంగామా ఆర్టీసీ బస్సుల దారి మళ్లింపు -
గృహ నిర్బంధాలు దారుణం
పెనుగొండ: పేదలపై జరిగిన దాడులను ఎదరించి నిలబడితే, గృహ నిర్బంధాలు చేయడం దారుణమని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు నన్నేటి పుష్పరాజ్ అన్నారు. ఉండి నియోజకవర్గం ఆకివీడు మండలం ధర్మపురి అగ్రహారం దళితుల ఇళ్ల కూల్చివేత తగదంటూ పోరాటం చేయడానికి వెళుతుంటే ఆచంట వేమవరంలో పుష్పరాజును గృహ నిర్బంధం చేశారు. దీనిపై ఆయన తీవ్ర నిరసన వ్యక్తం చేశారు, హోం మంత్రి అనిత పర్యటన సందర్భంగా తనను హౌస్ అరెస్ట్ చేసినట్లు పుష్పరాజ్ తెలిపారు. ఉద్యమాలను అణచి వేయలేరన్నారు. పేదల ఇళ్లు తొలగించడం దారుణమని, వారికి పక్కా స్థలాలు చూపించి, ఇళ్ల నిర్మాణం చేపట్టే వరకూ పోరాటం చేస్తామని హెచ్చరించారు. సంగీత దర్శకుడు గణేష్కు జాతీయ అవార్డు దెందులూరు: తిరుపతిలో జరిగిన జాతీయ స్థాయి నాటక పోటీల్లో దెందులూరుకు చెందిన సాయి గణేష్ చారికి ఉత్తమ సంగీత దర్శకుడిగా హనుమాన్ అవార్డు లభించింది. అభినయ అరూట్స్ ఈనెల 19 నుంచి 27వ తేదీ వరకు తిరుపతి మహతి కళాక్షేత్రంలో ఈ పోటీలు నిర్వహించింది. పోటీల్లో హేలపురి కల్చర్ల అసోసియేషన్ ప్రదర్శించిన సారీ రాంగ్ నెంబర్ అనే సాంఘిక నాటికకు సాయి గణేష్ చారి సంగీతం అందించి ఉత్తమ సంగీత దర్శకుడిగా హనుమాన్ అవార్డును కై వసం చేసుకున్నారు. అభినయ ఆరూట్స్ కార్యదర్శి బి.ఎన్.రెడ్డి ఇతర ప్రజాప్రతినిధులు అవార్డులు అందజేశారు. -
పీ4 ఒత్తిడి తగ్గించకుంటే పోరుబాటే
భీమవరం: ఉపాధ్యాయులు పీ4 పేరుతో కొన్ని కుటుంబాలను దత్తత తీసుకోవాలని దాని కోసం వెంటనే రిజిస్టర్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలిస్తూ ఒత్తిడి చేయడాన్ని యూటీఎఫ్ జిల్లా శాఖ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పీఎస్ విజయరామరాజు, ఎకేవీ రామభద్రం తీవ్రంగా ఖండించారు. సోమవారం భీమవరంలో మాట్లాడుతూ ఉపాధ్యాయులను ఇప్పటికే బోధనేతర పనులతో బోధనకు దూరం చేయడం వల్ల విద్యార్థుల్లో అభ్యసనం మందగిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. బదిలీలు, ప్రమోషన్లు తరువాత ఎక్కువ శాతం ఉపాధ్యాయులకు జీతాలు అందక ఆందోళనకు గురవుతున్నారన్నారు. సమాజంలో పేదరిక నిర్మూలనకు స్వచ్ఛంద సంస్థలు, ఎన్నారైల ఆసరా కోసం ప్రత్యేకంగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటే బాగుంటుందన్నారు. విద్యాశాఖాధికారులు ఉపాధ్యాయులపై ఒత్తిడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. ఉపాధ్యాయులపై భారాన్ని తగ్గించాలని, లేకుంటే ఆందోళన బాట పట్టాల్సివస్తుందని హెచ్చరించారు. ఉద్యోగులపై పీ4 భారం దారుణం ఉద్యోగులపై పీ4 భారాన్ని నెట్టే ఆలోచనను ప్రభుత్వం తక్షణం విరమించుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి జెఎన్వీ గోపాలన్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. పీ4 పథకానికి కార్పొరేట్లు, సంపన్నుల నుంచి ఆశించిన స్పందన రాకపోవడంతో ఆ భారాన్ని ఉద్యోగులపై నెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు. ఉపాధ్యాయులంతా ఐదుగురిని దత్తత తీసుకోవాలని విద్యాశాఖాధికారుల ద్వారా ప్రభుత్వం ఆదేశాలు జారీచేయడం, మరోవైపు ప్రతి సచివాలయ కార్యదర్శి తప్పనిసరిగా ఇద్దరిని దత్తత తీసుకోవాలని ఆదేశాలు ఇవ్వడం హాస్యాస్పదమన్నారు. కార్మికులకు, ఉద్యోగులకు జీతభత్యాలు ఇవ్వకుండా వారి హక్కులను హరిస్తూ భారాలు మోపుతూ పీ4 భారాన్ని నెట్టడం దుర్మార్గమని విమర్శించారు. కార్పొరేట్ కంపెనీలు ఎగ్గొట్టిన పన్నులు, బ్యాంకు రుణాలను ప్రభుత్వం వసూలు చేస్తే 20 లక్షల మంది పేదలకు అవసరమైన అన్ని సౌకర్యాలు సులభంగా ఏర్పాటు చేయవచ్చని చెప్పారు. -
బడికి మూత
మంగళవారం శ్రీ 29 శ్రీ జూలై శ్రీ 2025సాక్షి, భీమవరం: విద్యావ్యవస్థలో కూటమి ఎంపీఎస్ (మోడల్ ప్రైమరీ స్కూల్) విధానం ప్రభుత్వ పాఠశాలలకు ముప్పుగా తయారైంది. ఎంతో చరిత్ర కలిగిన పాఠశాలలు విద్యార్థులు లేక మూతపడే ప్రమాదం పొంచి ఉంది. గత విద్యాసంవత్సరంలో జిల్లావ్యాప్తంగా 1,400 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 1, 2 తరగతులు కలిగిన ఫౌండేషన్ స్కూళ్లు (ఎఫ్ఎస్) 96 ఉండగా, 1 నుంచి 5 వరకు ఫౌండేషన్ ప్రైమరీ స్కూళ్లు (ఎఫ్పీఎస్) 1025, 1 నుంచి 7/8వ తరగతి వరకు ప్రైమరీ హైస్కూళ్లు (పీహెచ్ఎస్) 43, 3 నుంచి 10 వరకు హైస్కూళ్లు(హెచ్ఎస్) 43, 6 నుంచి 10వ తరగతి వరకు హైస్కూళ్లు (హెచ్ఎస్)144, జూనియర్ ఇంటర్ కలిగిన హైస్కూళ్లు (హెచ్ఎస్ ఫ్లస్) 20 ఉన్నాయి. తగ్గిన విద్యార్థుల సంఖ్య ఎంపీఎస్ విధానంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గింది. గత విద్యాసంవత్సరంలో 1,04,654 మంది ఉండగా, ఈ విద్యాసంవత్సరంలో 87,861 మంది ఉన్నారు. ఇంకా అడ్మిషన్లు జరుగుతున్నాయని వీరి సంఖ్య పెరగవచ్చునని విద్యాశాఖ వర్గాలంటున్నాయి. పాఠశాలల విలీనం నేపథ్యంలో భవిష్యత్తులో తక్కువ విద్యార్థులు ఉన్న వాటిని ప్రభుత్వం ఎత్తివేస్తుందన్న అనుమానంతో తల్లిదండ్రులు తమ పిల్లల్ని ప్రైవేట్ పాఠశాలల్లో చేర్పించడం తగ్గుదలకు కారణంగా తెలుస్తోంది. నాడు.. నాడు–నేడుతో మహార్దశ పేదల విద్యకు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పెద్దపీట వేశారు. ప్రపంచంతో పేదల పిల్లలు పోటీపడేలా ప్రభుత్వ విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చారు. మనబడి నాడు–నేడుతో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలకు కొత్త ఊపిరిలూదారు. రూ. 369.11 కోట్ల వ్యయంతో డిజిటల్ క్లాస్రూంలు, తాగునీటి వసతి, టాయిలెట్లు, కిచెన్ షెడ్లు, ప్రహరీ గోడలు, అదనపు తరగతి గదుల నిర్మాణం, విద్యుదీకరణ, మేజర్, మైనర్ మరమ్మత్తులు తదితర అభివృద్ధి పనులు చేశారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం కార్పొరేట్కు కొమ్ముకాస్తూ ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేసే ఎత్తుగడలు వేస్తోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. న్యూస్రీల్ఎంపీఎస్తో పొంచి ఉన్న ముప్పు ఈ విద్యా సంవత్సరం నుంచి ఎంపీఎస్ విధానాన్ని ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. ఈ మోడల్ ప్రైమరీ స్కూల్లో 60 మంది విద్యార్థులు ఉండాలి. విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్న చోట సమీప ఎఫ్పీఎస్ పాఠశాలల్లోని 3, 4, 5 తరగతులను వీటిలో విలీనం చేశారు. మిగిలిన 1, 2 తరగతులతో ఎఫ్పీఎస్ పాఠశాలలు కాస్తా ఫౌండేషన్ స్కూళ్లుగా మారిపోయాయి. ఈ మేరకు ప్రస్తుతం జిల్లాలో 186 ఫౌండేషన్ స్కూళ్లు ఉండగా బేసిక్ ప్రైమరీ 730, మోడల్ ప్రైమరీ స్కూళ్లు 244, యూపీ 35, హైస్కూళ్లు 197 ఉన్నాయి. ఫౌండేషన్ స్కూళ్లు ఏకోపాధ్యాయ, బేసిక్ ప్రైమరీలో ఇద్దరు ఉపాధ్యాయులు ఉంటున్నారు. గతంలో 96 మాత్రమే ఉన్న ఏకోపాధ్యాయ పాఠశాలలు ప్రస్తుతం 186కు పెరిగాయి. వ్యక్తిగత, అత్యవసర పనిపై వీటిలోని ఉపాధ్యాయులు సెలవు పెట్టాల్సి వస్తే కొన్నిచోట్ల డిప్యుటేషన్ మరొకరిని నియమిస్తున్నారు. అందుబాటులో లేని చోట ఆ రోజుకు ఆ ఫౌండేషన్ స్కూల్ను మూసివేసి అక్కడి విద్యార్థులను సమీప పాఠశాలకు తరలిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సర్కారు స్కూళ్లకు ‘మోడల్’ కష్టాలు జిల్లాలో ఫౌండేషన్ పాఠశాలలు 186 ఒక్కో పాఠశాలలో ఒకరి నుంచి ఐదుగురు మాత్రమే విద్యార్థులు ఉపాధ్యాయుడు సెలవు పెడితే ఆరోజు పాఠశాల మూతే కూటమి విధానాలతో ప్రభుత్వ పాఠశాలల్లో తగ్గిన విద్యార్థుల సంఖ్య పెనుమంట్ర మండలం వెలగలవారిపాలెంలోని ఈ ఎంపీపీ స్కూల్కు ఎనిమిది దశాబ్దాల చరిత్ర ఉంది. గ్రామానికి చెందిన ఎంతోమంది విద్యావేత్తలు, ఉద్యోగులు, ప్రముఖులు ఓనమాలు దిద్దింది ఇక్కడే. తాజాగా కూటమి ప్రభుత్వం తెచ్చిన మోడల్ ప్రైమరీ స్కూల్స్ (ఎంపీఎస్) విధానంలో ఇక్కడి 3, 4, 5 తరగతులను ఇందిరమ్మ కాలనీలోని ఎంపీపీ పాఠశాలలో విలీనం చేశారు. ఈ పాఠశాలను 1–2 తరగతులతో ఫౌండేషన్ స్కూల్గా మార్చారు. ప్రస్తుతం ఈ ఏకోపాధ్యాయ పాఠశాలలో ముగ్గురు విద్యార్థులు మాత్రమే ఉన్నారు. సోమవారం స్కూల్ ఉపాధ్యాయుడు సెలవు పెట్టడంతో ఇక్కడి విద్యార్థులను ఇందిరమ్మ కాలనీలోని స్కూల్కు తరలించారు. దీంతో ఇదిగో.. ఎంతో చరిత్ర ఉన్న ఈ పాఠశాలలోని కుర్చీలు ఇలా ఖాళీగా కనిపించాయి. ప్రభుత్వ తీరు సరికాదు కూటమి ప్రభుత్వ విధానాలు కార్పొరేట్ విద్యారంగానికి కొమ్ము కాసేలా ఉన్నాయి. ఉపాధ్యాయుల సంఖ్యను తగ్గించుకునే దిశగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలి. – బొంతు ఆనందరాజు, రిటైర్డ్ హెచ్ఎం, లక్ష్మణేశ్వరం -
సుప్రీం ఆదేశాలూ లెక్కచేయక..
హైకోర్టు ఉత్తర్వులున్నా బేఖాతరు ఇదే విధంగా గతంలో నిడమర్రుకు చెందిన వైఎస్సార్కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్త బేతు సతీష్పై భీమడోలు పోలీసులు కేసు నమోదు చేసి హడావుడిగా అరెస్టు చేసి జడ్జి ఎదుట హాజరుపరిచారు. ఈ కేసులోనూ న్యాయమూర్తి ఆదేశాలతో పోలీసులు స్టేషన్ బెయిల్ ఇచ్చారు. పెదపాడులో పోలీసుల అరాచకం తారాస్ధాయిలో ఉంది. ప్రైవేటు వ్యవహారాలు, హైకోర్టు ఉత్తర్వులున్న సివిల్ వ్యవహారాల్లో సైతం తలదూర్చడంతో పాటు అధికార పార్టీకి అనుకూలంగా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. పెదపాడు మండలం గుడిపాడులో 6 ఎకరాల ప్రైవేటు భూమిలో భూ యజమాని చేపలు, రొయ్యల చెరువులు సాగుచేస్తున్నారు. స్ధానిక టీడీపీ నేతలతో భూ యజమానికి రాజకీయంగా విభేదాలున్నాయి. చెరువు యజమాని వైఎస్సార్సీపీ పార్టీకి చెందినవాడు కావడంతో పట్టుబడుల సమయంలో అడ్డగించడం, రహదారులను ధ్వంసం చేసి వాహనం బయటకు వెళ్లనీయకుండా చేయడంతో పాటు ఎస్సై శారదా సతీష్ రమ్మంటున్నారని స్టేషన్కు పిలిపించి చేస్తూ తీవ్రంగా వేధింపులకు గురి చేశారు. సదరు చెరువు యజమాని చేపలు పట్టుకోవడానికి తహసీల్దార్, ఎస్సై తగిన ఏర్పాట్లు చేయాలని హైకోర్టు ఆదేశాలిచ్చినా వాటిని అమలు చేయకుండా టీడీపీ నేతల అడుగులకు మడుగులొత్తడం వివాదాస్పదంగా మారింది. సాక్షి ప్రతినిధి, ఏలూరు: అధికార పార్టీ నాయకుడు చెబితే అడ్డగోలుగా రెచ్చిపోతున్నారు. కనీసం ఫిర్యాదు ఉందా.. దానిపై విచారణ చేశామా.. చేస్తుంది న్యాయమా, అన్యాయమా ఇలాంటి సహజ న్యాయసూత్రాలను విస్మరించి అధికార పార్టీ నేతలు చెబితే అడ్డగోలుగా అక్రమ నిర్భంధాలు, రకరకాల కేసుల పేరుతో వేధింపులకు జిల్లా పోలీస్ యంత్రాంగం తెరతీసింది. జిల్లా పరిధిలో కొన్ని పోలీస్ స్టేషన్లలో ఈ తరహా రెడ్బుక్ రాజ్యాంగాన్ని కొందరు ఎస్సైలు ప్రజాప్రతినిధుల మెప్పుకోసం అమలు చేస్తూ తలనొప్పులు తెచ్చుకుంటున్నారు. తాజాగా అక్రమ నిర్బంధం కేసుపై పెదవేగి ఎస్సై న్యాయమూర్తి మెమో జారీ చేశారు. గతంలోనూ భీమడోలు పోలీసుల అత్యుత్సాహంపై న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తూ ప్రాథమిక హక్కులకు భంగం కలిగేలా వ్యవహరిస్తున్నారు. పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పుతూ వేధింపులు జిల్లాలో అధికార పార్టీ వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయి. రెడ్బుక్ పేరుతో దెందులూరు, యలమంచిలి, భీమడోలు ఇలా కొన్ని ప్రధాన పోలీస్స్టేషన్లల్లో పోలీసుల మితీమిరిన అత్యుత్సాహం సమస్యాత్మకంగా మారింది. కేవలం టీడీపీ నేతలు చెప్పా రని ఫిర్యాదు లేకుండా రోజులు తరబడి వైఎస్సార్సీపీ శ్రేణులను పోలీస్స్టేషన్ల చుట్టూ తిప్పుతున్న ఘటనలు అనేకం ఉన్నాయి. తాజాగా గత వారం వైఎస్సార్సీపీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు కామిరెడ్డి నాని, మాజీ ఎమ్మెల్యే అబ్బయ్యచౌదరి సోదరులు చల్లగోళ్ళ తేజ, ప్రదీప్లను అరెస్టు చేశారు. అరెస్టు సమయంలో ముందస్తుగా సమాచారం ఇవ్వడం పోలీసుల ప్రాథమిక విధి. 2024 జనవరిలో జరిగిన ఘర్షణపై అదే సంవత్సరం మేలో కేసు నమోదు చేయడం, ఆ కేసులో 2025 జూలైలో అరెస్టులు చూపడం కేవలం రాజకీయ కక్షతోనే జరిగింది. ఈ క్రమంలో కోర్టులో కూడా తెల్లవారుజాము వరకు వాదనలు జరిగాయి. పాత కేసుల్లో ఇప్పుడు అరెస్టు చేయడంపై జడ్జి ఆగ్రహం వ్యక్తం చేసి పెదవేగి ఎస్సై రామకృష్ణకు మెమో జారీ చేశారు. రెడ్బుక్ వేధింపుల్లో పోలీసులదే కీలకపాత్ర సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం ధిక్కరిస్తున్న వైనం పెదవేగి ఎస్సైకు మెమో జారీ చేసిన న్యాయమూర్తి గతంలో భీమడోలు పోలీసులు కూడా ఇదే తరహా అత్యుత్సాహం జిల్లాలో పెరుగుతున్న రెడ్బుక్ వేధింపులు యలమంచిలిలో మరీ అత్యుత్సాహం యలమంచిలిలో ఈ ఏడాది మే 19న జరిగిన ఎంపీపీ ఎన్నికల్లో పోలీసుల తీవ్ర అత్యుత్సాహం రాష్ట్ర స్ధాయిలో చర్చనీయాంశంగా మారింది. అధికార టీడీపీకి ఎలాంటి బలం లేనప్పటికీ మంత్రి నిమ్మల రామానాయుడు డైరెక్షన్లో పోలీసులు హడావుడి చేసి ఓటింగ్నే అడ్డుకోవాలని ప్రయత్నించారు. అది కూడా కోర్టు ఆదేశాలతో జరుగుతున్న ఎన్నికలను సజావుగా నిర్వహించాల్సిన పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించడం చర్చగా మారింది. ఎంపీటీసీ కంభాల సత్యశ్రీ కనిపించడం లేదని తన కుమార్తె ఫిర్యాదు చేసిందనే సాకుతో ఓటింగ్కు వచ్చిన ఆమెను స్టేషన్కు తీసుకువెళ్లడానికి బలంగా ప్రయత్నించిన క్రమంలో వైఎస్సార్సీపీ శ్రేణులు అడ్డుకున్నాయి. అయినప్పటికీ ఆమెను పోలీసులు స్టేషన్కు తీసుకువెళ్లారు. కేవలం ఎన్నికలు వాయిదా వేయించడానికి ఈ తరహా ఎత్తుగడ రాజకీయంలో మహిళా ప్రజాప్రతినిధిని ఇబ్బంది పెట్టారు. -
మానవ అక్రమ రవాణా నిరోధానికి పటిష్ట చర్యలు
భీమవరం (ప్రకాశంచౌక్): జిల్లాలో మానవ అక్రమ రవాణా నిరోధానికి పటిష్ట చర్యలు చేపట్టాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. జులై 30న ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమ వారం పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో కలెక్టర్, జాయింట్ కలెక్టర్ సంయుక్తంగా ప్రచార గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 15 నుంచి 30 వరకు పిల్లల అక్రమ రవాణాకు వ్యతిరేకంగా జిల్లాలో పక్షోత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. విద్యా శాఖ ఆధ్వర్యంలో పాఠశాలల్లో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. తల్లిదండ్రులు పిల్లల చదువు పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వారి నడవడికపై పర్యవేక్షణ చేపట్టాలన్నారు. మానవ అక్రమ రవాణా నిరోధానికి అత్యవసర సమయాల్లో 1098, 1800 1027 222 నెంబర్లకు సమాచారం అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్ఓ మొగిలి వెంకటేశ్వర్లు, డీపీఓ ఎ.రామనాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు. లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే చర్యలు భీమవరం(ప్రకాశం చౌక్): లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే చర్యలు తప్పవని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జి.గీతాబాయి హెచ్చరించారు. కలెక్టరేట్ డీఎం అండ్ హెచ్ఓ కార్యాలయంలో సోమవారం లింగ నిర్ధారణ పరీక్షల నిషేధ చట్టం అమలు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడుతూ జిల్లాలో ఈ చట్టాన్ని కట్టుదిట్టంగా అమలు చేసేందుకు సంబంధిత అధికారులు, సిబ్బంది కృషి చేయాలన్నారు. జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ప్రజల ఫిర్యాదులపై నిర్లక్ష్యం వద్దు భీమవరం: ప్రజల పిర్యాదులపై నిర్లక్ష్యం వహించకుండా నిర్ణీత గడువులోగా చట్ట పరిధిలో శాశ్వత పరిష్కారం చూపాలని ఎస్పీ అద్నాన్ నయీం అస్మి పోలీసు అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదులు స్వీకరించిన అనంతరం జిల్లాలోని వివిధ పోలీసు స్టేషన్ల అధికారులతో మాట్లాడారు. ఫిర్యాదులకు పరిష్కరించాలని ఆయన ఆదేశించారు. 14 ఫిర్యాదులు అందగా బాధితుల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ(అడ్మిన్) వి.భీమారావు, జిల్లా స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ వి.పుల్లారావు తదితరులు పాల్గొన్నారు. క్షీరారామలింగేశ్వరస్వామి ఆలయంలో ఆర్జేసీ విచారణ పాలకొల్లు సెంట్రల్: క్షీరారామలింగేశ్వరస్వామి ఆలయంలో సమస్యలపై ఫిర్యాదుల నేపథ్యంలో దేవదాయ శాఖ రీజనల్ జాయింట్ కమిషనర్ వేండ్ర త్రినాథరావు సోమవారం విచారణ నిర్వహించారు. మూలవిరాట్కు దాతల సహకారంతో చేయించిన వెండి మండపంపై మరో దాత ఇచ్చిన ఆరు గ్రాముల బంగారు పతకం ఎలా పెడతారని ఈ సందర్భంగా ఫిర్యాదుదారులు ప్రశ్నించారు. ఆలయ ప్రధానార్చకులు ముగ్గురూ ప్రతి ఉపాలయం వద్ద సొంతంగా కొందరు బ్రాహ్మణులను పెట్టుకుని పళ్లాలను ఏర్పాటు చేసుకుంటున్నారని తెలిపారు. ఆలయంలో పళ్లాల సంస్కృతి తొలగించాలని సూచించారు. స్వామివారి కల్యాణం లోపల మండపంలో కాకుండా బయట ఏర్పాటుచేయడం వల్ల భక్తులు తిలకించడానికి వీలుగా ఉంటుందని ఆ విషయంపై ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. -
పారదర్శకంగా అర్జీలు పరిష్కరించాలి
భీమవరం(ప్రకాశం చౌక్): పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారం పారదర్శకత, నాణ్యతతో ఉండాలని కలెక్టర్ సి.నాగరాణి అన్నారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన పీజీఆర్ఎస్లో కలెక్టర్ పాల్గొని జిల్లా అధికారులతో కలిసి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అర్జీలు తమ పరిధిలోకి రాకపోతే వెంటనే సంబంధిత శాఖకు ఎండార్స్ చేసి పంపాలని ఆదేశించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి, డీఆర్వో ఎం.వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. పీజీఆర్ఎస్లో వచ్చిన అర్జీలు తల్లికి వందనం ఆర్థిక సాయం అందలేదని అత్తిలికి చెందిన వమ్మి వీర సంధ్య, అల్తి విజయదుర్గ మహేశ్వరి ఫిర్యాదుచేశారు. కంటి చూపు దెబ్బతిందని, పెన్షన్ ఇప్పించాలని కాళ్ల మండలం కోళ్లపర్రు గ్రామానికి చెందిన గండి వెంకన్న అర్జీ పెట్టుకున్నాడు. 22(ఎ) నుంచి తన భూమి తొలగించాలని తాడేపల్లిగూడెం మండలం పడాల గ్రామానికి చెందిన సీహెచ్.సుబ్బలక్ష్మీ, సీహెచ్.బాబురావు, బి.నీరజ కలెక్టర్కు అర్జీ సమర్పించారు. గొల్లలకోడేరులో పంచాయతీ భూములను అమ్మేస్తున్నారని, సర్పంచ్, ఉప సర్పంచ్ పంచాయతీకి చెందిన స్థలాలను ఆక్రమించుకుని అమ్ముకుంటారని పాలకోడేరు జెడ్పీటీసీ పెద్దిశెట్టి లక్ష్మీతులసి దంపతులు ఫిర్యాదు చేశారు. – పింఛన్ మంజూరు చేయాలంటూ పోడూరు మండలం పెమ్మరాజు పోలవరానికి చెందిన టి.బసవమ్మ అర్జీ అందజేసింది. -
ఆందోళనతో వెనక్కి తగ్గిన డీఈవో
ఏలూరు (ఆర్ఆర్పేట): జిల్లాలో ప్రతి మండలంలో 190 మంది ప్రధానోపాధ్యాయులు/స్కూల్ అసిస్టెంట్లను పీ–4 మార్గదర్శకులుగా తప్పనిసరిగా రిజిస్టర్ చేయాలని జిల్లా విద్యాశాఖాధికారి ఈ నెల 25న ఉత్తర్వులు జారీ చేశారు. ఉత్తర్వులు ఇచ్చిన మరుసటి రోజు సాయంత్రం 5 గంటల లోపు ప్రతి మండలంలో రిజిస్ట్రేషన్లు పూర్తి చేయాలని ఆ ఉత్తర్వుల్లో ఉప విద్యాశాఖాధికారులు, మండల విద్యాశాఖాధికారులను ఆదేశించారు. ఈ ఉత్తర్వులపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఉపాధ్యాయ సంఘాల జేఏసీ నాయకులు ఆందోళనకు పిలుపునిచ్చారు. ఈ విషయంపై జిల్లా వ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తం కావడంతో డీఈఓ తన ఉత్తర్వులపై యూ టర్న్ తీసుకున్నారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేస్తూ ఉపాధ్యాయులెవరినీ కూడా పీ4లో గుర్తించిన బంగారు కుటుంబాలను దత్తత తీసుకోవాలని ఎలాంటి ఒత్తిడి చేయలేదని తెలిపారు. మార్గదర్శిగా నమోదు స్వచ్చంద కార్యక్రమమని ఆ ప్రకటనలో తెలిపారు. ఉపాధ్యాయులకు బోధనేతర విధులను అప్పగించే విషయంలో జిల్లా కలెక్టర్ కూడా వ్యతిరేకమన్నారు. డీఈఓ యూటర్న్ తీసుకోవడంతో ఉపాధ్యాయ సంఘాల జేఏసీ తలపెట్టిన ఆందోళన కార్యక్రమాన్ని తాత్కాలికంగా విరమించుకున్నారు. -
గురువులపై ‘బోధనేతర’ భారం
ఉపాధ్యాయుల డిమాండ్లు ● యాప్ల భారం, పని భారం తగ్గించాలి. ● కేడర్ స్ట్రెంత్ సమస్య పరిష్కరించాలి. ● రెండు నెలల పెండింగ్ జీతాలు విడుదల చేయాలి. ● శిక్షణలో చనిపోతున్న ఉపాధ్యాయులకు ఎక్స్గ్రేసియా ఇవ్వాలి. ● డీఏ, ఐఆర్ వంటి హామీలను నెరవేర్చాలి. ● ఆప్షనల్, లోకల్ సెలవుల్లో ఆంక్షలు తొలగించాలి. ● పుస్తకాలు, డైరీల రాత తగ్గించాలి. భీమవరం(ప్రకాశం చౌక్): ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యా యులు బోధనేతర విధులతో సతమతమవుతున్నారు. ప్రభుత్వం యోగాంధ్ర, పేరెంట్ మీటింగ్స్, యాప్లు, శిక్షణ, ఫొటోలు అప్లోడ్ వంటి పనులు అప్పగించడంతో వీరంతా విసుగు చెందుతున్నారు. పూర్తిస్థాయిలో బోధన సమయం తగ్గిపోయి మొక్కుబడిగా పాఠాలు చెప్పే పరిస్థితి వస్తోందని, దీంతో విద్యార్థుల విద్యా ప్రమాణాలు తగ్గిపోతాయని అంటున్నారు. బోధనేతర విధులతో పని భారం పెరగడంతో పాటు ఒత్తిళ్లతో ఇబ్బంది పడుతున్నట్టు ఆవేదన చెందుతున్నారు. ఆయా సమస్యల పరిష్కారం కోసం నిరసనలు, దీక్షలు చేస్తున్నారు. ఒత్తిళ్లతో ప్రాణాలు కోల్పోయి.. కూటమి ప్రభుత్వం దూరప్రాంతాల్లో నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమాలతో ఉపాధ్యాయులు ఒత్తిళ్లకు గురవుతున్నారు. ఇలా జిల్లాలో ఇద్దరు ఉపాధ్యాయులు శిక్షణకు వెళ్లి ప్రాణాలు కూడా కోల్పోయారు. పాలకొల్లు మండలం అరట్లకట్ల హైస్కూల్ హెచ్ఎం మూర్తిరాజు, ఉండి మండలం ఉణుదుర్రులో ఇన్చార్జి హెచ్ఎం టీవీ రత్నకుమార్ శిక్షణ కార్యక్రమాలకు వెళ్లి మృతి చెందిన ఘటనలతో ఉపాధ్యాయులు భయాందోళన చెందుతున్నారు. రెండు నెలలుగా జీతాల్లేవ్ పాఠశాలల రేషనలైజేషన్లో భాగంగా రీ అపోర్షన్ చేసి బదిలీ చేసిన 300 మంది ఉపాధ్యాయులకు రెండు నెలలుగా జీతాలు చెల్లించలేదు. దీంతో వీరంతా ఇబ్బంది పడుతున్నారు. హామీలు బుట్టదాఖలు గత ఎన్నికలకు ముందు కూటమి నాయకులు ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన తర్వాత మర్చిపోయారు. ఐఆర్, పీఆర్సీ, డీఏలు అమలు చేస్తామన్న హామీలు 14 నెలలు గడుస్తున్నా అమలు కాలేదు. కలెక్టరేట్ వద్ద నిరసన తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఉపాధ్యాయులు భీమవరం కలెక్టరేట్ వద్ద నిరసన తెలి పారు. డీఈఓకు వినతిపత్రం సమర్పించారు. ఉపాధ్యాయులతో ఇతర పనుల చేయిస్తున్న ప్రభుత్వం పని భారం, ఒత్తిళ్లతో సతమతం బదిలీ ఉపాధ్యాయులకు రెండు నెలలుగా జీతాల్లేవు సమస్యల పరిష్కరానికి నిరసనల బాట పట్టించుకోని కూటమి సర్కారు -
ఈ విధానం సరికాదు
పూర్వం సంపన్న వర్గాలు సాయం, అప్పు రూపంలో డబ్బులిచ్చి అందుకు తగ్గట్టుగా పనిచేయించుకునే వారు. 1976లో కేంద్ర ప్రభుత్వం ఈ వెట్టిచాకిరీని రద్దుచేస్తూ చట్టం చేసింది. ప్రస్తుత పీ–4 గతాన్ని గుర్తుచేస్తోంది. పేదలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. అందుకు నేరుగా అవసరమైన సాయం అందించాలే తప్ప ఈ విధానం సరికాదు. – కామన బాల సత్యనారాయణ, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు, నరసాపురం బాధ్యత గాలికొదిలేయడమే ధనికులే బాధ్యత తీసుకుని పేదల్ని ఉద్ధరించింది ప్ర పంచంలో ఎక్కడా జరగలేదు. ప్రభుత్వం పేదల సంక్షేమం–బాధ్యత నుంచి వైదొలగాలనుకోవడం దారుణం. మరోవైపు పేదల సంక్షేమం బాధ్యత ధనవంతుల దయాదాక్షిణ్యాలపై ఆధారపడాలనడం సరికాదు. ప్రజలపై పన్నుల ద్వారా ఆదాయం సమకూర్చుకుంటున్న ప్రభుత్వాలు ప్రజల సంక్షేమ బాధ్యతను గాలికొదిలేయడం అన్యాయం. – బి.బలరాం, సీపీఎం రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యుడు పారదర్శకంగా అందించాలి అర్హులైన పేద, దిగువ మధ్యతరగతి వర్గాల వారందరికీ ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకు పారదర్శకంగా సంక్షేమాన్ని అందజేయాలి. అంతేకానీ పీ4 విధానంలో వ్యక్తిగత లబ్ధి అందిస్తానని అనడం కరెక్ట్ కాదు. ఇలాంటి విధానాలతో వ్యక్తిగత హక్కులకు భంగం వాటిల్లే అవకాశం ఉంది. – ఎస్వీ జాకబ్ బాబు, ఎస్టీఎఫ్ పూర్వ జిల్లా కార్యదర్శి ● -
దివ్యాంగుల ఇంటికి చేరని రేషన్
ఆకివీడు : దివ్యాంగులకు రేషన్ సరుకులు ఇంటి వద్దకే తీసుకువెళ్లి ఇవ్వాలనే ఆదేశాలను రేషన్ డీలర్లు అమలుచేయడం లేదని వికలాంగుల సంక్షేమ సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు అల్లాడి నటరాజు ఆరోపించారు. ఆకివీడులో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ చాలాచోట్ల దివ్యాంగులకు రేషన్ సరుకులు ఇంటి వద్దకు వచ్చి ఇవ్వడం లేదని, వేలిముద్ర తీసుకుని వెళ్లి షాపు వద్దకు వచ్చి సరుకులు తీసుకోవాలని డీలర్లు చెబుతున్నారన్నారు. డీలర్ల వద్ద ఉన్న జాబితాలో తమ పేర్లు లేకపోతే రేషన్ ఇవ్వడం లేదని దివ్యాంగులు వాపోతున్నారని తమ దృష్టికి వచ్చిందన్నారు. దివ్యాంగుడి పేరు ఉంటే ఆ కుటుంబానికి రేషన్ను డీలర్ ఇంటి వద్దకు తీసుకువెళ్లి ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రేషన్ డిపోలను దివ్యాంగులకు కేటాయించాలని కోరారు. అంత్యోదయ అన్న యోజన కింద 35 కేజీల బియ్యం దివ్యాంగులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఒంటరి దివ్యాంగులకు ఒంటరి రేషన్ కార్డు ఇవ్వాలని నటరాజు కోరారు. ధర్మస్థల దోషులను శిక్షించాలి ఏలూరు (టూటౌన్): ధర్మస్థల మారణకాండలో దోషులను కఠినంగా శిక్షించాలని ఏపీ మహిళా సమాఖ్య ఏలూరు నగర కమిటీ డిమాండ్ చేసింది. ఏలూరు నగర సమితి ఆధ్వర్యంలో ఆదివారం నగరంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. కమిటీ నాయకులు అడ్డగర్ల లక్ష్మీ ఇందిరా, కొండేటి బేబీ, కొల్లూరి సుధారాణి మాట్లాడుతూ కర్ణాటకలోని మంజునాథ ఆలయంలోని ధర్మస్థలలో మహిళల మానప్రాణాలను హరిస్తూ సుమారు 500 మందిని చంపి పూడ్చి పెట్టడం తీవ్ర ఆందోళన కలిగిస్తోందన్నారు. తక్షణమే ఇందుకు కారకులపై చర్యలు తీసుకోవాలన్నారు. దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలపై దాడులు, అత్యాచారాలు పెరిగిపోయాయన్నారు. నగర సహాయ కార్యదర్శి కొల్లూరి సుధారాణి, ఉపాధ్యక్షురాలు గొర్లి స్వాతి తదితరులు పాల్గొన్నారు. ఆకతాయిల వీరంగం జంగారెడ్డిగూడెం: స్థానిక డాంగేనగర్లో ఆకతాయిలు వీరంగం సృష్టించారు. డాంగేనగర్ 10వ సచివాలయం సమీపంలో ఆదివారం ఆకతాయిలు మద్యం మత్తులో రోడ్డును అడ్డగించారు. రోడ్డుపై వెళుతున్న మహిళల రాకపోకలకు ఇబ్బంది కలిగించారు. స్థానికులు అడ్డుకోవడంతో పరిస్థితి సర్దుమణిగింది. మహిళలు మాట్లాడుతూ ఈ ప్రాంతంలో బహిరంగ మద్యపానం ఎక్కువగా జరుగుతోందని, మందుబాబుల వల్ల రోడ్డుపై వెళ్లేందుకు ఇబ్బంది పడుతున్నామని అన్నారు. పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరారు. స్మార్ట్ మీటర్లతో ప్రజలపై భారాలు ఏలూరు (టూటౌన్): స్మార్ట్ మీటర్ల బిగింపు, విద్యుత్ భారాలకు వ్యతిరేకంగా ప్రజలంతా ఉద్యమించాలని వామపక్ష పార్టీల నాయకులు పిలుపునిచ్చారు. సీపీఎం జిల్లా కార్యదర్శి ఎ.రవి అధ్యక్షతన స్థానిక సీపీఐ జిల్లా కార్యాలయంలో ఆదివారం ప్రజావేదిక సమావేశం నిర్వహించారు. సీపీఐ జిల్లా కార్యదర్శి ఎం.కృష్ణ చైతన్య, సీపీఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ జిల్లా నాయకుడు వెంకటేశ్వరరావు, సీపీఎం జిల్లా కార్యదర్శి ఎం.రవి మాట్లాడారు. స్మార్ట్ మీటర్లు, ట్రూఅప్ చార్జీలకు వ్యతిరేకంగా సోమవారం నుంచి ఇంటింటా ప్రచారం, సంతకాల సేకరణ చేపట్టాలన్నారు. ఆగస్టు 5న జిల్లావ్యాప్తంగా విద్యుత్ కా ర్యాలయాలు, మండల కేంద్రాల వద్ద ధర్నాలు చేయాలని పిలుపునిచ్చారు. -
షాపు అద్దెల మాయాజాలం
రూ.45 వేల అద్దెను రూ.18 వేలకు కుదించి.. ఏలూరు చందనా బ్రదర్స్ సెంటర్లోని కస్తూరిబా మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్లోని నెం.2 షాపు కేటాయింపు కూటమి నేతల అక్రమాలకు నిదర్శనంగా నిలుస్తోంది. ఈ షాపు 15 ఏళ్లుగా టీడీపీ నేత మామిళ్లపల్లి పార్థసారథి పేరున నెలకు రూ.45 వేల అద్దైపె ఉంది. పార్థసారథి కీలక నేత కావడంతో కొత్త అంశానికి తెరతీశారు. గుట్టుచప్పుడు కాకుండా ఈ షాపును ఖాళీ చేసి మరలా వేలం వేసేలా పావులు కదిపారు. ఈనెల 17న బహిరంగ వేలంలో ముగ్గురు టెండర్లు వేశారు. అయితే వీరంతా సదరు నేత కుమారుడు, అనుయాయులు కావడం విశేషం. హెచ్చు మొత్తం నెలకు రూ.18 వేల అద్దెకు టెండర్ వేసిన మామిళ్లపల్లి నందగోపాల్కు షాపును కేటాయించారు. ఇలా షాపును తండ్రి పేరు నుంచి కుమారుడికి బదలాయించారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం నెలకు రూ.49,065 అద్దె నిర్ణయించగా రూ.18 వేల కే ఖరారు చేయడం ద్వారా కార్పొరేషన్ ఆదాయానికి నెలకు రూ.31,065 గండి పడింది. మున్సిపల్ చ ట్టం ప్రకారం ఉన్న అద్దె కన్నా ఎక్కువకే టెండర్ ఖరారు చేయాల్సి ఉన్నా పట్టించుకోలేదు. ఏలూరు (టూటౌన్): ఏలూరు నగరపాలక సంస్థ పరిధిలోని మున్సిపల్ కాంప్లెక్స్ల్లోని దుకాణాల్లో అద్దెల మాయాజాలం నడుస్తోంది. డిమాండ్ ఉన్న షాపులను కూటమి నాయకులు, వారి అనుచరులు అయినకాడికి అందుకుంటున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. షాపుల అద్దె పెరిగిన సందర్భాల్లో గుట్టుచప్పుడు కాకుండా వాటిని ఖాళీ చేయించి, మరలా బహిరంగ వేలం నిర్వహిస్తున్నారు. ఇలా వేలం నిర్వహించిన సందర్భాల్లో తమ కుటుంబ సభ్యులు, బంధువులు, బినామీల పేర్లతో షాపులను దక్కించుకుంటున్నారు. దీంతో ఏలూరు కార్పొరేషన్ ఆదాయానికి భారీగా గండి పడుతోంది. ‘వడ్డించే వాడు మనవాడైతే’ అన్న చందంగా షాపుల కేటాయింపులు జరుగుతున్నాయి. 746 షాపులు.. రూ.4.80 కోట్లు కార్పొరేషన్ పరిఽధిలో 746 షాపులు ఉండగా ప్రస్తుతం 125 ఖాళీగా ఉన్నాయి. మిగిలిన 621 షాపులు అద్దెకు నడుస్తున్నాయి. ఏటా షాపు అద్దెల రూపంలో కార్పొరేషన్కు రూ.4.80 కోట్ల ఆదాయం సమకూరుతుంది. మూడేళ్లకోసారి 33 శాతం పెంచేలా.. మున్సిపల్ కాంప్లెక్స్లోని షాపులకు ప్రతి మూడేళ్లకోసారి 33 శాతం అద్దె పెంచాలి. దీనికి 18 శాతం జీఎస్టీ అదనం. అలాగే షాపు పాడుకున్న వ్యక్తి రెన్యూవల్ చేయించుకోవాలి. షాపు సర్వే నంబర్లను బట్టి కంప్యూటర్లో ఆటోమేటిక్గా అద్దెల పెంపుదల జరుగుతుంది. అయితే ఇక్కడ కార్పొరేషన్ సిబ్బంది మాయాజాలం కారణంగా కంప్యూటర్లను కూడా మేనేజ్ చేసేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. షాపుల కేటాయింపులో కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, వికలాంగులు, ఓసీ కేటగిరీల వారీగా అద్దెలు నిర్ణయిస్తారు. షాపుల అద్దెలు సైతం సర్వే నంబర్ల ఆధారంగా వేర్వేరుగా ఉంటాయి. బిర్లా భవన్ సెంటర్లోని మూడు వైపులా ఉన్న మున్సిపల్ షాపుల్లో మూడు రకాలుగా అద్దెలు ఉండటమే దీనికి ఉదాహరణగా చెప్పవచ్చు. ప్రజాప్రతినిధి అనుచరుడికి రెండు షాపులు ఇటీవల ఓ మున్సిపల్ కాంప్లెక్స్లో బేకరీ, హోటల్ షాపులు ఖాళీ అయ్యాయి. వీటిని ప్రజాప్రతినిధి అనుచరుడికి కేటాయించినట్టు తెలిసింది. సదరు వ్యక్తి ఆ రెండు షాపులను సబ్ లీజుకు ఇచ్చేశారు. ఇదే ప్రజాప్రతినిధి మరో అనుచరుడు ఒకరు ఏకంగా మున్సిపల్ ఆఫీస్ గోడను పగులగొట్టి బిర్యానీ పాయింట్ రూమ్ను లోపలకు విస్తరించారు. అయినా కార్పొరేషన్ అధికారులు ఏ ఒక్కరూ నోరు మెదపకపోవడం విశేషం. మద్యం షాపు ఏర్పాటుపై విమర్శలు బిర్లాభవన్ సెంటర్ నుంచి కల్పనా థియేటర్కు వెళ్లే మార్గంలోని మున్సిపల్ కాంప్లెక్స్లోని రెండు షాపుల్లో మద్యం దుకాణం ఏర్పాటుచేయడం విమర్శలకు తావిస్తోంది. దీనిపై మున్సిపల్ ఉన్నతాధికారులకు సైతం ఫిర్యాదులు వెళ్లాయి. వేరే వారి పేరుతో ఉన్న ఆ రెండు షాపులను వైన్స్ షాపుదారుడికి సబ్ లీజుకి ఇచ్చినట్టు తెలిసింది. మున్సిపల్ కాంప్లెక్స్లలో మద్యం షాపులను ఏర్పాటు చే యకూడదనే నిబంధనలు ఉన్నా భేఖాతరు చేశారు. ధనార్జనే కూటమి లక్ష్యం కార్పొరేషన్ షాపుల అద్దెలు సగానికి కుదింపు కూటమి నేతల అనుయాయులకే దుకాణాల కేటాయింపు ఏలూరు నగరపాలక సంస్థ షాపులపై కన్ను మున్సిపల్ నిబంధనలు పాటించని వైనం ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి మద్యం షాపు విడ్డూరం మున్సిపల్ కాంప్లెక్స్లో ఏకంగా మద్యం షాపు ను ఏర్పాటు చేయడం విడ్డూరంగా ఉంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎటువంటి చట్టవ్యతిరేక, అసాంఘిక కార్యక్రమాలకు షాపులను అద్దెకు ఇవ్వకూడదనే నిబంధనలు ఉన్నా వాటిని భేఖాతరు చేస్తూ షాపులను కేటాయించడం బాధాకరం. దీనిపై మున్సిపల్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తాం. – బి.సోమయ్య, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు, ఏలూరు -
నాలుగు ఆలయాల్లో చోరీ
నిడమర్రు: మండలంలోని నాలుగు ఆలయాల్లో డిబ్బీల్లో నగదు చోరీకి గురైంది. నిడమర్రు ఎస్సై వీర ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం శనివారం అర్ధరాత్రి పత్తేపురంలో మూడు దేవాలయాల్లో, పెదనిండ్రకొలను గ్రామంలోని ఒక దేవాలయంలోని డిబ్బీలు పగలు గొట్టి నగదు దోచుకున్నట్లు తెలిపారు. ఈ నాలుగు దేవాలయాలను స్థానిక ఆలయ కమిటీల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. పత్తేపురంలో పత్తేపురం– పెదనిండ్రకొలను ఆర్అండ్బీ రోడ్డు మార్గంలోని శ్రీకృష్ణుడి ఆలయం, గ్రామ ప్రధాన మంచినీటి చెరువు వద్ద నిర్మించిన శ్రీ అంజనేయ విగ్రహ ఆలయం, వినాయక స్వామి ఆలయం, పెదనిండ్రకొలను గ్రామంలోని తూర్పుపేట వినాయకుడి గుడి వద్ద ఉన్న డిబ్బీల్లోని నగదు చోరీకి గురైంది. కమిటీల ఫిర్యాదు మేరకు సంఘటన స్థలాలకు వెళ్లి పరిశీలించి కేసు నమోదు కేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వీర ప్రసాద్ తెలిపారు. అందుబాటులో ఉన్న సీసీ పుటేజ్ పరిశీలనలో శనివారం అర్ధరాత్రి దాటాక 25 నుంచి 30 సంవత్సరాలన్న ముగ్గురు యువకులు పల్సర్ బైక్ పై వచ్చి ఈ చోరీలకు పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. -
కువైట్లో నా భార్యను నిర్బంధించారు..
కొయ్యలగూడెం: కువైట్లో చిక్కుకుపోయిన తన భార్యను రక్షించాలని బయ్యనగూడెం గ్రామానికి చెందిన మర్రిపూడి వెంకటరమణ కోరుతున్నాడు. వెంకటరమణ భార్య సుమ ఉపాధి నిమిత్తం మూడు నెలల క్రితం కువైట్ వెళ్ళింది. వెంకటరమణ వెన్నెముక దెబ్బ తినడంతో కుటుంబ పోషణ నిమిత్తం సుమ కువైట్లోని క్లీనింగ్ పనులకు చేరింది. రెండు నెలల నుంచి తీవ్ర అనారోగ్యంతో ఆమె బాధపడుతోంది. దీంతో సుమను కువైట్కి పంపిన భీమవరంలోని ఏజెంట్ను సంప్రదించగా రూ.1.50 లక్షలు కడితే సుమను ఇండియాకి తీసుకువస్తానని చెప్పాడు. తన భార్య వద్ద ఫోన్ను తీసుకుని మానసిక వేధింపులకు గురి చేస్తున్నారని, వేరొకరి ఫోన్ నుంచి సమాచారం అందజేసిందన్నారు. ప్రభుత్వం తన భార్యను క్షేమంగా ఇండియాకు తీసుకువచ్చేందుకు కృషి చేయాలని రమణ కోరుతున్నాడు. పంచాయతీలకు నిధులు విడుదల చేయాలి కాళ్ల: రాష్ట్రంలో గ్రామ పంచాయతీల ఆర్థిక పరిస్థితి దయనీయంగా ఉందని రాష్ట్ర సర్పంచుల సంఘ ఉపాధ్యక్షుడు కొలుకులూరి ధర్మరాజు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడారు. గత 8 నెలల కాలంగా కేంద్ర ప్రభుత్వం పంచాయతీలకు విడుదల చేసిన రూ.1,120 కోట్ల నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టాంపు డ్యూటీలో పంచాయతీల వాటాను గతంలో 3 నెలలకోసారి విడుదల చేసేవారని గుర్తు చేశారు. గత ఏడాదిగా ప్రభుత్వం ఆ సొమ్మును సొంత అవసరాలకు వాడుకోవడం చాలా దారుణమన్నారు. పంచాయతీలను ఉద్ధరిస్తానని వాగ్దానం చేసిన పంచాయతీ రాజ్ మంత్రి పవన్ కళ్యాణ్ సినిమాల బిజీలో పడి మమ్మల్ని మరిచారని ఆవేదన వ్యక్తం చేశారు. -
రాట్నాలమ్మకు రూ.1,16,385 ఆదాయం
పెదవేగి: ఆదివారం ప్రీతికరమైన రోజు కావడంతో జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు పెదవేగి మండలం రాట్నాలకుంట గ్రామంలోని రాట్నాలమ్మను దర్శించుకునేందుకు తరలివచ్చారు. ఈ సందర్భంగా భక్తులు చిన్నారులకు అక్షరాభ్యాసాలు, అన్నప్రాసనలు, నూతన వస్త్ర బహూకరణలు, నామకరణలు చేశారు. ఈ వారం అమ్మవారికి పూజా రుసుం వలన రూ 71,400, విరాళాలుగా రూ10,245, లడ్డూ ప్రసాదంతో రూ30,390, పులిహోర అమ్మకంతో రూ.1035, ఫొటోల అమ్మకంతో రూ.3,315, మొత్తం రూ.1,16,385 ఆదాయం లభించిందని దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎన్.సతీష్కుమార్ చెప్పారు. విద్యుత్ దీపాలకు రూ.4.23 లక్షల అందజేత భీమవరం (ప్రకాశంచౌక్): ద్వారకా తిరుమల వెంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు కాలినడక వెళ్లే భక్తుల కోసం జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ తరఫున రూ.4.23 లక్షలు విద్యుత్ దీపాల ఏర్పాటుకు అసోసియేషన్ అధ్యక్షుడు సామంతపూడి శ్రీరామరాజు అందించారు. ఇటీవల ఒక భక్తుడు పాము కాటుకు గురయ్యాడని తెలవడంతో మిల్లర్స్ అసోసియేషన్ సామాజిక సేవా సంస్థ నుంచి ఈ మొత్తం అందించారు. -
విశ్వబ్రాహ్మణ సంఘానికి ఎమ్మెల్సీ కేటాయించాలి
ఆకివీడు: రాష్ట్రంలో స్వర్ణకార వృత్తి అగమ్యగోచరంగా ఉందని, వృత్తిదారులు పనులు లేక రోధిస్తున్నారని స్వర్ణకార సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ దార్ల పాపాయాచార్యులు ఆవేదన వ్యక్తంచేశారు. స్థానిక రైస్మిల్లర్స్ భవనంలో ఆదివారం ఉమ్మడి జిల్లా స్వర్ణకార సంఘం విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం జరిగింది. ముఖ్యఅతిధిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ స్వర్ణకారులు రాజకీయంగా ఎదగాలన్నారు. విశ్వబ్రాహ్మణులకు ఎమ్మెల్సీ పదవిని కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. విశ్వబ్రాహ్మణ, స్వర్ణకార కార్పొరేషన్లు ఏర్పాటు చేసి రూ.100 కోట్లు నిధులు కేటాయించాలని కోరారు. బ్యాంకుల్లో అప్రైజర్లుగా అనుభవం కలిగిన స్వర్ణకారుల్నే నియమించాలని డిమాండ్చేశారు. తిరుమల తిరుపతి, ఇతర దేవస్థానాల్లో ట్రస్టుబోర్డు సభ్యులుగా విశ్వబ్రాహ్మణులకు ప్రాధాన్యత కల్పించాలని కోరారు. అన్ని రంగాల్లో స్వర్ణకారులు ముందుండాలని, వృత్తి నైపుణ్యత సాధించాలన్నారు. ప్రభుత్వం వృత్తిదారులకు పనిముట్లు అందజేసేకన్నా, పని కల్పించడంలో ప్రాధాన్యతనివ్వాలని విజ్ఞప్తి చేశారు. బీసీ కార్పొరేషన్ ద్వారా ఇచ్చే రుణాల ప్రాధాన్యతను పెంచాలన్నారు. మట్టి, మాంగళ్యం వంటివి స్వర్ణకారుల ద్వారానే తయారుచేయించాలన్నారు. ఉమ్మడి జిల్లా స్వర్ణకార సంఘ అధ్యక్షుడు పట్నాల శేషగిరిరావు మాట్లాడుతూ స్వర్ణకారుల్ని ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. కార్పొరేట్ సంస్థల రంగప్రవేశంతో స్వర్ణకారులకు పనులు లేకుండా పోయాయని వాపోయారు. రెడీమేడ్ ఆభరణాలు రాజ్యమేలడంతో స్వర్ణకారులు చితికిపోతున్నారన్నారు. బంగారం ధరలు రోజు రోజుకూ ఆకాశాన అంటుతుంటే వృత్తిదారులు మాత్రం పాతాళానికి వెళ్తున్నారని వాపోయారు. సమావేశంలో సీనియర్ స్వర్ణకారుల్ని, విశ్వబ్రాహ్మణుల్ని సత్కరించారు. కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షుడు కీర్తి శివప్రసాద్, ప్రధాన కార్యదర్శి నల్లగొండ వెంకట రామకృష్ణ, లక్కోజు వెంకట దుర్గా నాగేశ్వరరావు, దేవు వెంకటేశ్వర ప్రసాద్, పట్నాల సత్యనారాయణ, లక్కోజు రాజగోపాలాచార్యులు, పోడుగు రామాచార్యులు, గొల్తి వరప్రసాద్, కోరుమిల్లి సుబ్బారావు, నక్కా చైతన్య శ్రీణివాస్, తుపాకుల సోమాచార్యులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం సీనియర్లను, జిల్లా కమిటీని సత్కరించారు. ఉమ్మడి జిల్లా స్వర్ణకార సంఘం డిమాండ్ -
వివాహిత ఆత్మహత్య
కొయ్యలగూడెం: క్షణికావేశంలో ఉరివేసుకుని వివాహిత ఆదివారం ఆత్మహత్యకు పాల్పడింది. సర్పంచ్ కడకట్ల గడ్డియ్య తెలిపిన వివరాల ప్రకారం.. కొయ్యలగూడెం మండలం బోడిగూడెం గ్రామానికి చెందిన ఆవూరి అంజలి(18)కి అదే గ్రామానికి చెందిన ఆవూరి వెంకట కల్యాణ్తో ఆరు నెలల క్రితం ప్రేమ వివాహం జరిగింది. అంజలికి తల్లిదండ్రులు లేకపోవడంతో పెద్దమ్మ దగ్గర ఉంటూ చదువుకునేది. అదే గ్రామానికి చెందిన కల్యాణ్ అంజలిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇటీవల అంజలికి, కల్యాణ్కు మనస్పర్ధలు రావడంతో పెద్దల సమక్షంలో పరిష్కరించారు. ఆషాఢ మాసం కావడంతో అంజలి పెద్దమ్మ ఇంటికి వచ్చింది. ఆషాఢం పూర్తయిన సందర్భంగా భార్యను తీసుకు వెళ్ళమని కళ్యాణ్కు అంజలి పుట్టింటి వారు కబురు పంపగా మీరే తీసుకువచ్చి దింపాలన్నాడు. దీంతో మనస్థాపానికి గురైన అంజలి ఇంటి వద్ద ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు ఉరి వేసుకుని మృతి చెందిందని తెలిపారు. పోలవరం సీఐ బాల సురేష్బాబు, ఎస్సై చంద్రశేఖర్ కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మనస్తాపంతో మహిళ ఆత్మహత్య మండవల్లి: కుటుంబ సభ్యులతో మాట మాట పెరిగి మనస్తాపంతో మహిళ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన అయ్యవారిరుద్రవరంలో ఆదివారం జరిగింది. మండలంలోని అయ్యవారిరుద్రవరానికి చెందిన రంగమ్మ(45) భర్త పిల్లలతో కలిసి జీవిస్తుంది. కుటుంబ సభ్యులు ఆమెను కూలి పనులకు వెళ్ళవద్దని ఇంటివద్దనే ఉండమని చెప్పారు. దీంతో రంగమ్మ మనస్తాపంతె పందికొక్కుల టాబ్లెట్లు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కంప్యూటర్ సైన్స్కే మొగ్గు
ఏలూరు (ఆర్ఆర్పేట): ఇంజినీరింగ్లో కంప్యూటర్స్కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. చదువుతుండగానే ఉద్యోగాలు పొందే అవకాశాలు కేవలం కంప్యూటర్ కోర్సుల ద్వారా మాత్రమే రావడంతో ఆ కోర్సులు కౌన్సెలింగ్లో హాట్ కేకుల్లా అయిపోతున్నాయి. సీఎస్ఈలో సీటు రాదని తెలిస్తేనే విద్యార్థులు మరో బ్రాంచ్ వైపు దృష్టి సారిస్తున్నారు. ఇటీవల జరిగిన ఇంజినీరింగ్ కౌన్సెలింగ్లో ఇప్పటికే యాజమాన్య కోటా సీట్లు మొత్తం భర్తీకాగా తొలి విడత కన్వీనర్ కోటా కౌన్సెలింగ్లో జిల్లాలో ఉన్న 6 ఇంజనీరింగ్ కళాశాలల్లోనూ సీఎస్ఈ బ్రాంచ్ సీట్లు పూర్తిగా భర్తీ అయిపోయాయి. విద్యార్థుల్లోని నైపుణ్యాన్ని గుర్తిస్తున్న ఆయా సంస్థలు విద్యార్థులు మూడో సంవత్సరం పూర్తి చేయగానే క్యాంపస్ సెలక్షన్లు, లేదా ఆన్లైన్ టెస్ట్లు నిర్వహించి వారిని తమ ఉద్యోగాలకు ఎంపిక చేసుకుంటున్నాయి. ఆయా సంస్థల ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా జాబ్ మార్కెట్ ట్రెండ్కు అనువుగా కంప్యుటర్ సైన్స్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్న్స్(ఏఐ), ఇంటర్ నెట్ ఆఫ్ థింగ్స్(ఐవోటీ), బ్లాక్ చైన్ టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీ, మెషీన్ లెర్నింగ్, డైటా సైన్స్ వంటి కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. వీటికి దేశ విదేశాల్లో అపార ఉద్యోగ అవకాశాలు ఉండడంతో విద్యార్థులు ఈ కోర్సులపై ఆసక్తి చూపుతున్నారు. భవిష్యత్లో సీఎస్ఈ అనుబంధ కోర్సులైన ఏఐ, ఐఓటీ, డీఎస్, ఎంఎల్ వంటి ప్రత్యేక కోర్సులు చేసిన వారికే ఎక్కువ అవకాశాలు అందివచ్చే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. కంప్యూటర్ కోర్సులకు లక్షల్లో ప్యాకేజీలు కంప్యూటర్ ఆధారిత కోర్సులు పూర్తి చేసిన వారికి వివిధ బహుళ జాతి సంస్థలు లక్షల్లో జీతాలు ఆఫర్ చేస్తున్నాయి. సీఎస్ఈ విభాగంలో బీటెక్ పూర్తిచేసిన వారికి ప్రారంభ ప్యాకేజీ రూ.4 లక్షలుగా ఉంటోంది. టీసీఎస్, విప్రో, హెచ్సీఎల్, మెక్రోసాఫ్ట్, టెక్ మహీంద్ర, ఐబీఎం వంటి కంపెనీలు విద్యార్థుల కోసం క్యూ కట్టడంతో డిమాండ్ పెరిగిపోయింది. నగరంలోని సీఆర్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో 2021–25 విద్యా సంవత్సరంలో ఏఐడీఎస్ పూర్తి చేసిన విద్యార్థినికి అమెజాన్ రూ. 46.3 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం ఆఫర్ చేయడం విశేషం. ఏలూరు జిల్లాకు చెందిన వివిధ కళాశాలల విద్యార్థులు సైతం రూ.10 లక్షలకు పైగా ప్యాకేజీతో ఉద్యోగాలు సంపాదించారు. 30 వరకూ రెండో దశ కౌన్సెలింగ్ మొదటి దశలో సీటు పొందిన విద్యార్థులకు ఇప్పటికే సీట్ల కేటాయింపులు జరిగిపోవడంతో వారిలో 95 శాతానికి పైగా సీటు పొందిన కళాశాలల్లో రిపోర్ట్ చేశారు. మొదటి విడత కౌన్సిలింగ్లో తమకు ఆశించిన కళాశాలల్లో సీటు రాని మిగిలిన 5 శాతం మంది రెండో దశ కౌన్సెలింగ్కు వెళ్ళడానికి సిద్ధపడుతున్నారు. మొదటి దశలో సీటు పొందిన కళాశాలలో సదరు విద్యార్థి రిపోర్టు చేయకుంటే ఆ సీటు రద్దయ్యి, రెండో విడత కౌన్సిలింగ్లో ఏ కళాశాలలో సీటు కేటాయిస్తే ఆ కళాశాలలోనే తప్పనిసరిగా చేరాల్సిన పరిస్థితి. రెండవ దశ కౌన్సెలింగుకు ఈ నెల 27 నుంచి షెడ్యూల్ విడుదల చేశారు. 27 నుంచి 30 వరకూ రిజిస్ట్రేషన్ 28 నుంచి 30 వరకూ సర్టిఫికెట్ల అప్లోడ్ 28 నుంచి 31 వరకూ వెబ్ ఆప్షన్లు ఆగస్టు 1న వెబ్ ఆప్షన్ల మార్పు ఆగస్టు 4న సీట్ల కేటాయింపు ఆగస్టు 8న రిపోర్ట్ చేయడానికి తుది గడువు సీఎస్ఈ, అనుబంధ బ్రాంచుల్లో సీటు రాకపోతేనే మిగతా కోర్సుల వైపు చూపు ఈ నెల 30 వరకూ రెండో విడత కౌన్సెలింగ్ కంప్యూటర్ సైన్స్కు పెరుగుతున్న ఆదరణ ఈ ఏడాది సీటు పంపిణీ వివరాలను పరిశీలిస్తే, కంప్యూటర్ సైన్న్స్ అండ్ ఇంజనీరింగ్, దాని అనుబంధ విభాగాలకు విద్యార్థుల నుంచి మంచి ఆదరణ కనిపిస్తోంది. ఇతర ప్రధాన ఇంజినీరింగ్ శాఖలు కూడా గత సంవత్సరంతో పోల్చితే మెరుగైన స్థాయిలో భర్తీ కావడం సానుకూల పరిణామంగా చెప్పవచ్చు. సమాజంలో వేగంగా మారుతున్న సాంకేతిక పరిణామాల దృష్ట్యా అన్ని ఇంజినీరింగ్ కళాశాలలు విద్య నాణ్యతను మెరుగుపరచుకోవాలి. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్న్స్, డేటా సైన్న్స్, సైబర్ సెక్యూరిటీ వంటి తాజా సాంకేతిక రంగాల్లో నవీకరణలు తీసుకురావాలి. ఇంజినీరింగ్లో అడ్మిషన్ పొందిన విద్యార్థులు తమ రెగ్యులర్ సబ్జెక్టులతో పాటు తాజా సాంకేతికతలపై సర్టిఫికేషన్ కోర్సులు కూడా చేయడం అత్యంత అవసరం. –డాక్టర్ మర్లపల్లి కృష్ణ, సీఎస్ఈ ప్రొఫెసర్, సీఆర్ఆర్ ఇంజినీరింగ్ కళాశాల -
గుబ్బల మంగమ్మ గుడికి పోటెత్తిన భక్తులు
బుట్టాయగూడెం: మండలంలోని మారుమూల గ్రామమైన కాపవరం సమీపంలోని అటవీప్రాంతంలో కొలువై ఉన్న గుబ్బల మంగమ్మ గుడికి ఆదివారం భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు విజయవాడ, మచిలీపట్నం, తెలంగాణ రాష్ట్రంలోని భద్రాచలం, పాల్వంచ, కొత్తగూడెం, సత్తుపల్లి, అశ్వారావుపేట ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు వాహనాలతో తరలివచ్చి అమ్మవారికి దూపదీప నైవేద్యాలతో ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు అధికంగా మంగమ్మతల్లి దర్శనానికి రావడంతో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ఆలయ కమిటీ వారు, పోలీసులు ప్రత్యేక చర్యలు చేట్టారు. పెద్దింట్లమ్మకు ప్రత్యేక పూజలు కై కలూరు: కొల్లేటి పెద్దింట్లమ్మా.. నీ చల్లని దీవెనలు మా కుటుంబాలకు అందించమ్మా.. అంటూ భక్తులు అమ్మవారిని ఆర్తితో వేడుకున్నారు. కొల్లేటికోట పెద్దింట్లమ్మను సమీప జిల్లాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు ఆదివారం దర్శించుకున్నారు. పవిత్ర కోనేరులో స్నానాలు ఆచరించి అమ్మకు పొంగళ్లు, వేడి నైవేద్యాలను సమర్పించారు. ఆలయ ప్రధాన అర్చకులు పేటేటి పరమేశ్వరశర్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలను సమర్పించారు. ఆలయ ఈవో కూచిపూడి శ్రీనివాసు మాట్లాడుతూ ఒక్క ఆదివారం రోజున ప్రత్యేక, అంతరాలయ దర్శనాలు, పెద్ద, చిన్న తీర్థాలు, కేశఖండన, గదుల అద్దెలు, లడ్డూ ప్రసాద విక్రయాలు, అమ్మవారి చిత్రపటాలు విక్రయాలతో కలిపి మొత్తంరూ. 62,073 ఆదాయం వచ్చిందని తెలిపారు. నేడు మిగులు భూముల సమస్యపై పోరు ఏలూరు (టూటౌన్): ఎర క్రాలువ మిగుల భూముల సమస్యపై టి.నర్సాపురం, జంగారెడ్డిగూడెం మండలాల పరిధిలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు నాయకత్వంలో సోమవారం జరిగే పర్యటన జయప్రదం చేయాలని సీపీఎం ఏలూరు జిల్లా కమిటీ తరపున పార్టీ జిల్లా కార్యదర్శి ఎ.రవి ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. మిగులు భూములను ఇంకా ఇప్పటికీ అక్రమంగా భూస్వాములే అనుభవిస్తున్నారని విమర్శించారు. ఆ ప్రాంతాల్లో పామాయిల్, జామాయిల్, మొక్కజొన్న, కొబ్బరి పంటలు వేసి వచ్చిన ఫలసాయాన్ని నేటికి అనుభవిస్తున్నారని ఆరోపించారు. ఒకసారి ప్రభుత్వానికి భూములు అమ్మి నష్టపరిహారం తీసుకున్న తర్వాత ఎట్టి పరిస్థితులలో భూములపై హక్కు ఉండదని, అలాంటి భూములను సాగు చేసి ఫలసాయం పొందడం చట్ట విరుద్ధమని అన్నారు. రిజర్వాయర్ మిగులు భూములు దాదాపుగా 3500 ఎకరాలు ఉన్నాయని, ఆ భూములను ప్రభుత్వ స్వాధీనం చేసుకొని భూమిలేని దళితులు, గిరిజనులు, పేదలకు పట్టాలు ఇచ్చి ఆదుకోవాలన్నారు. ఈ సమస్యపై సీపీఎం గత 10 సంవత్సరాల నుంచి పోరాటం సాగిస్తుందని తెలిపారు. స్థానిక దళితులు, గిరిజనులు, పేదలకు అండగా నిలబడేందుకు, హైకోర్టుతీర్పు ఆధారంగా సాగుచేసుకోమని చెప్పడానికి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు నాయకత్వంలో రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బి.బలరాం, ఇతర జిల్లా నాయకులు సోమవారం టి.నర్సాపురం, జంగారెడ్డిగూడెం ప్రాంతాల్లోని ఎరక్రాలువ మిగులు భూముల్లో పర్యటన జరిపి, దున్ని, సాగుచేసే కార్యక్రమాన్ని చేపడతారన్నారు. -
పరీక్షా కేంద్రం మార్పుతో గందరగోళం
పెనుగొండ: ఎయిడెడ్ పోస్టులపై ఆశలు పెట్టుకున్న అభ్యర్థుల భవిష్యత్తుతో విద్యా శాఖ ఆడుకుంటోంది. ఆదివారం నిర్వహించిన అర్హత పరీక్షలో గందరగోళం నెలకొంది. పెనుగొండ సెంటర్కు వచ్చిన తరువాత సెంటరు మార్పు చేయడంతో పెనుగొండ కళాశాల గేటు వద్ద అభ్యర్థులు నిరసన వ్యక్తం చేశారు. సమన్వయ లోపంతో సుమారు 50 మంది అఽభ్యర్థులు పరీక్షకు దూరమయ్యారు. పెనుగొండలోని ఎస్వీ కేపీ అండ్ కోట్ల వెంకట్రామయ్య బాలికోన్నత పాఠశాలలో మూడు సంవత్సరాల కాంట్రాక్టు ఉపాధ్యాయులకు నోటిపికేషన్ విడుదల చేశారు. మొత్తం 7 పోస్టులకు 1400 మంది దరఖాస్తు చేసుకొన్నారు. వీరిలో 912 మందిని అర్హులుగా గుర్తించారు. వారికి టెస్ట్ నిర్వహించడానికి ఈ నెల 15న జిల్లా విద్యాశాఖాధికారి పెనుగొండలోని ఎస్వీకేపీ అండ్ డాక్టర్ కేఎస్ రాజు కళాశాలలో పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు. దీనికి అనుగుణంగా పాఠశాల నుంచి అర్హులైన వారికి హాల్ టికెట్లు జారీ చేశారు. అకస్మాత్తుగా పరీక్షా కేంద్రాలను మార్చుతూ నిర్ణయం తీసుకున్నారు. భీమవరంలోని ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల, డీఎన్ఆర్ కళాశాలలో రెండు సెంటర్లు, తాడేపల్లిగూడెంలోని వాసవీ ఇంజనీరింగ్ కళాశాలలో, శశి ఇంజనీరింగ్ కళాశాలకు మార్పు చేశారు. ఈ సమాచారం కొంతమందికి మాత్రమే అందింది. ఎంప్లాయిమెంట్ ఎక్స్ఛేంజ్ ద్వారా దరఖాస్తు చేసుకొన్న వారికి ఎలాంటి సమాచారం లేకుండా పోయింది. పెనుగొండలోని ఎయిడెడ్ పాఠశాలకు ఎలాంటి సమాచారం లేదు. అభ్యర్థులలో కొందరు మూడు పోస్టులకు దరఖాస్తు చేసుకోవడంతో మూడు స్లాట్లలో పరీక్షలు ఏర్పాటు చేశారు. అయితే, పరీక్షా సమయం కావస్తున్నా విద్యాశాఖాధికారులు రాకపోవడంతో అనుమానం వచ్చి సంప్రదిస్తే పరీక్షా కేంద్రం మార్పు చేశారని చెప్పారు. అప్పటికే కేంద్రానికి 50 మందికి పైగా అభ్యర్ధులు చేరుకున్నారు. ఎలాంటి సమాచారం అందించకుండా మార్పు ఎలా చేశారంటూ నిరశన వ్యక్తం చేశారు. విద్యాశాఖాధికారులు పోస్టులను బేరం పెట్టారని, అందుకే పరీక్ష నిర్వహణలో గందరగోళం సృష్టించారని ఆరోపించారు. -
అభివృద్ధి ముసుగులో మట్టి దందా
ద్వారకాతిరుమల: కొందరు పచ్చనేతలు మట్టినే వ్యాపారంగా ఎంచుకున్నారు. చెరువులు, కాలువ గట్లకు తూట్లు పొడుస్తూ యథేచ్ఛగా మట్టి దందాను సాగిస్తున్నారు. ట్రాక్టర్కు, టిప్పర్కు ఇంత రేటని ఫిక్స్చేసి, అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ద్వారకాతిరుమల మండలం తక్కెళ్లపాడులోని లక్ష్మీపురం చెరువులో గత నెల రోజులుగా ఈ మట్టి వ్యాపారం యథేచ్ఛగా సాగుతోంది. లక్ష్మీపురం చెరువు సుమారు 57 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. పి.కన్నాపురంలోని ఓ ప్రైవేటు పరిశ్రమ ఈ చెరువును అభివృద్ధి చేసేందుకు ముందుకొచ్చింది. గత నెలరోజుల క్రితం నుంచి రెండు పొక్లెయిన్లతో మట్టి తవ్వకాలను జోరుగా సాగిస్తోంది. వర్షాల కారణంగా మూడు రోజులపాటు నిలిచిపోయిన ఈ పనులు తిరిగి ఆదివారం ప్రారంభమయ్యాయి. వాస్తవానికి తవ్విన మట్టితో చెరువుకు గట్లు వేయాల్సి ఉంది. కొందరు టీడీపీ నేతలు ఆ మట్టిని అమ్ముకుని, వచ్చిన సొమ్ములతో జేబులు నింపుకుంటున్నారు. వీరిని చూస్తున్న ప్రజలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఇందుకా.. అని ముక్కున వేలేసుకుంటున్నారు. లోకల్కు ఓ రేటు.. నాన్ లోకల్కు ఓ రేటు తక్కెళ్లపాడు పంచాయతీకి చెందిన ట్రాక్టర్కు రూ. 200కు, పక్క పంచాయితీలకు చెందిన ట్రాక్టర్కు రూ.1,000కు మట్టిని విక్రయిస్తున్నారు. టిప్పర్కు రూ. 3,500కు మట్టిని అమ్ముతున్నారు. చెరువులోకి వచ్చే ట్రాక్టర్, టిప్పర్ల యజమానుల నుంచి ఈ సొమ్ములను టీడీపీ నేతలు వసూలు చేసి, జేబులో వేసుకుంటున్నారు. ట్రాక్టర్, టిప్పర్ల యజమానులు ఆ మట్టిని తీసుకెళ్లి తమకు నచ్చిన రేటుకు అమ్ముకుంటున్నారు. బహిరంగంగా ఇంత జరుగుతుంటే అధికారులు తమకేమీ తెలియనట్టు నిద్ర నటిస్తున్నారు. కాసులు అందుకుని నిమ్మకుండిపోయారో.. లేక నేతల బెదిరింపులకు లొంగిపోయారో తెలియడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి పక్కదారి పడుతున్న ప్రజాధనాన్ని ప్రభుత్వానికి జమ చేయాలని పలువురు కోరుతున్నారు. తక్కెళ్లపాడులోని లక్ష్మీపురం చెరువులో మట్టి తవ్వకాలు జోరుగా సాగుతున్న పచ్చనేతల మట్టి వ్యాపారం -
జిల్లా జూనియర్ బాస్కెట్బాల్ జట్టు ఎంపిక
పెంటపాడు: ప్రత్తిపాడు సరస్వతి విద్యాలయ ఇంగ్లీషు మీడియం స్కూల్లో శనివారం అంతర్ జిల్లాల జూనియర్ బాస్కెట్బాల్ ఎంపిక పోటీలను నిర్వహించారు. ఈ పోటీలకు జిల్లా నలుమూలల నుంచి 50 మంది క్రీడాకారులు పాల్గొనగా 12 మందిని ఎంపిక చేశారు. ఎంపికై న క్రీడాకారులు ఆగస్టు 14 నుంచి 17 వరకు పిఠాపురంలో జరిగే రాష్ట్రస్థాయి అంతర్ జిల్లాల జూనియర్ బాస్కెట్బాల్ పోటీల్లో పాల్గొంటారని బాస్కెట్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు కె.కృష్ణారెడ్డి, కార్యదర్శి జి. శ్రీనివాసరావు తెలిపారు. అసోసియేషన్ కోశాధికారి కె.మురళీకృష్ణ, సరస్వతి విద్యాలయ డైరెక్టర్ కొలనువాడ వెంకట హనుమ సత్యనారాయణరాజు (వెంకట్), స్కూలు పీడీ సత్యకిరణ్, సభ్యులు పాల్గొన్నారు. -
వర్జీనియా ధర పతనం
రూ.390 నుంచి రూ.370కి పడిపోయిన ధర కొయ్యలగూడెం: వర్జీనియా పొగాకు వేలం ధరలు అమాంతంగా పడిపోవడంతో రైతులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. శనివారం కొయ్యలగూడెం పొగాకు వేలం కేంద్రంలో నిర్వహించిన కొనుగోళ్లలో నాణ్యమైన పొగాకు ధర కేజీకి రూ. 390 నుంచి ఒక్కసారిగా రూ.370కు పడిపోవడంతో రైతులు నిరుత్సాహానికి గురయ్యారు. పొగాకును కొనుగోలు చేసే ప్రధాన కంపెనీకి చెందిన అలయన్ కంపెనీ కొనుగోళ్ల నుంచి తప్పుకోవడం ధరల పతనానికి కారణంగా తెలిసింది. దీంతో మిగిలిన కొనుగోలుదారులు ఇదే అదునుగా భావించి పొగాకు ధరను తగ్గించి కొనుగోలు చేయడానికి సిండికేట్గా మారారని రైతులు ఆరోపించారు. మార్చి నెలలో రూ. 290తో ప్రారంభమైన వర్జీనియా పొగాకు కొనుగోలు సుమారు 4 నెలలకు గాని రూ.390కు చేరుకోలేకపోయిందన్నారు. కాగా ధర మరింత పతనం అయ్యే అవకాశం ఉందని, ఇందుకు కంపెనీలు సిద్ధం అవుతున్నాయని ప్రధాన కంపెనీలోని ప్రైవేటు ఉద్యోగి ఒకరు పేర్కొన్నారు. విదేశీ ఆర్డర్లు లేవంటూ సాకు చూపిస్తున్నారని క్లూ ఇచ్చారు. ఇచ్చిన అనుమతుల కంటే పరిమితికి మించి పంటను ఉత్పత్తి చేయడం వలన ఏర్పడిన సంక్షోభం ఇది అని బోర్డు అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. -
ఉలిక్కిపడిన వరహాపట్నం
కై కలూరు: భూమి నుంచి వచ్చిన భారీ శబ్ధం.. మందుపాతర మాదిరిగా పేలడంతో శనివారం వరహాపట్నం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. బాంబులంటూ ప్రజలు భయాందోళన చెందారు. వివరాల ప్రకారం వరహాపట్నం నుంచి కలిదిండి వెళ్లే రహదారిలో కూడలి వద్ద సేద తీరే సిమెంటు బెంచీపై ఉదయం ముగ్గురు యువకులు కూర్చుని కబుర్లాడుకుంటున్నారు. ఇంతలో సమీప భూమి నుంచి రెండు లారీ టైర్లు ఒక్కసారిగా పేలిన శద్ధం వచ్చింది. ఆ ప్రాంతమంతా దుమ్ముతో నిండిపోయింది. బెంచీపై కూర్చున్నా కోనాల నానీ, పడమటి శివగణేష్, సోమగాని కార్తీక్లకు స్వల్పంగా రాళ్ల గాయాలయ్యాయి. గ్రామస్తులు రూరల్ ఏఎస్సై వెంకటేశ్వరరావుకు సమాచారం అందించారు. ఆయన సిబ్బందితో వచ్చి గాయపడిన యువకుల నుంచి వివరాలు సేకరించారు. అనంతరం ఏలూరు నుంచి బాంబు, డాగ్ స్క్వాడ్లు వచ్చాయి. పొక్లెయిన్తో పేలుడు సంభవించిన ప్రాంతాన్ని తవ్వి బాంబుకు సంబంధించి ఎటువంటి అనవాళ్లు లేవని నిర్థారించారు. ఇదిలా ఉంటే రెండు రోజుల క్రితం వర్షపు నీరు వెళ్లడానికి పేలుడు సంభవించిన కొంత దూరంలో డ్రెయిన్ను తవ్వారు. పేలుడు జరిగిన చోట గతంలో మెకానిక్ షెడ్, ఎలక్రిక్టల్ రిపేరు షాపు ఉండేదని గ్రామస్తులు చెప్పారు. భూమిలో బ్యాటరీ కాని, భూమి అడుగున కూల్ డ్రింక్ సీసాలలో గ్యాస్ వల్ల పేలుడు సంభవించి ఉండవచ్చని భావిస్తున్నారు. హఠాత్తుగా జరిగిన పరిణామంతో గ్రామస్తులు ఉలిక్కిపడ్డారు. ప్రజలు భయపడవద్దని పోలీసులు చెప్పారు. భూమి నుంచి భారీ పేలుడు బాంబులంటూ భయపడిన ప్రజలు ముగ్గురికి స్వల్ప రాళ్ల గాయాలు బాంబ్, డాగ్ స్క్వాడ్ల పరిశీలన -
నేరాల నియంత్రణకు ప్రత్యేక ప్రణాళిక
ఏలూరు టౌన్: నేరాల నియంత్రణకు ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్లాలని ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్కుమార్ చెప్పారు. ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో శనివారం ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ అధ్యక్షతన ఏలూరు జిల్లా అర్ధసంవత్సర నేరసమీక్ష, కోఆర్డినేషన్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఏలూరు రేంజ్ ఐజీ మాట్లాడుతూ జిల్లాలోని పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసులు, పురోగతి, నిందితుల అరెస్ట్లు, కోర్టుల్లో చార్జిషీటు దాఖలు వంటి అంశాలపై పోలీస్ అధికారులు, సిబ్బంది ప్రత్యేక దృష్టి సారించాలని, బాధితులకు న్యాయం అందించేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. వీక్లీ ప్రోగ్రెస్ రిపోర్ట్ తయారు చేసుకుంటే దర్యాప్తు వేగంగా పూర్తి అవుతుందన్నారు. పోక్సో కేసులు, బాలికల మిస్సింగ్ కేసుల్లో 90 శాతం దర్యాప్తు పూర్తి చేయాలని ఆదేశించారు. పోక్సో కేసుల్లో 60 రోజుల్లో కేసులు దర్యాప్తు పూర్తిచేసి చార్జిషీట్ను కోర్టులో దాఖలు చేయాలని, నిందితులకు శిక్షలు పడేలా చూడాలన్నారు. ప్రాసిక్యూషన్స్ డిప్యూటీ డైరెక్టర్ ఎం.శారదామణి మాట్లాడుతూ జిల్లాలో కోర్టు మోనిటరింగ్ సెల్ను ఏర్పాటు చేసి ఎస్పీ శివకిషోర్ ఎప్పటికప్పుడు దిశా నిర్ధేశం చేయడంతో కేసుల్లో నిందితులకు శిక్షలు పడుతున్నాయని స్పష్టం చేశారు. దర్యాప్తులో పోలీస్ అధికారులు శ్రద్ధ చూపించటంతో ఇటీవల పోక్సో కేసుల్లో కఠిన శిక్షలు పడుతున్నాయని తెలిపారు. రవాణాశాఖ అధికారి కృష్ణారావు మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామన్నారు. ఎస్పీ కేపీ శివకిషోర్ మాట్లాడుతూ జిల్లాలో నేరాల నియంత్రణకు పటిష్టమైన చర్యలు చేపట్టామని, నేరాలకు పాల్పడితే ఎవరినీ ఉపేక్షించేదిలేదని హెచ్చరించారు. పోలీస్ అధికారులు బాధితులకు న్యాయం అందించేలా మరింత నిబద్ధతతో పనిచేయాలని సూచించారు. సమీక్ష సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీ నక్కా సూర్యచంద్రరావు, ఏలూరు జీజీహెచ్ అధికారి జాగీ, ఎక్పైజ్ జిల్లా అధికారి ఆవులయ్య, డీఎస్పీలు, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్కుమార్ అర్ధ సంవత్సర నేర సమీక్ష, కోఆర్డినేషన్ సమావేశం -
ప్రభుత్వ భవనాలకే రక్షణ లేదు..!
కాళ్ల: లక్షలాది రూపాయలతో నిర్మించిన ప్రభుత్వ భవనాలు సైతం ప్రైవేటు వ్యక్తులు కూల్చివేస్తున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. పట్టపగలు అందరూ చూస్తుండగా ఇలాంటి దౌర్జన్యంకు పాల్పడుతున్నా అధికారులు సైతం మిన్నకుండిపోవడం గమనార్హం. కాళ్ల మండలం బొండాడ గ్రామంలో సామూహిక మరుగుదొడ్ల భవనం (కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్) కూల్చివేత ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే... గత ప్రభుత్వ హయాంలో బొండాడ గ్రామంలో నూతన సచివాలయ భవనం నిర్మించారు. దానిని ఆనుకుని సుమారు రూ.3 లక్షలతో ఇ ఇ బిల్డింగ్ (కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్) పురుషులు, స్ట్రీలకు విడివిడిగా రెండు బాత్రూమ్లు నిర్మించి పంచాయతీకి అప్పగించారు. అయితే సమీపంలోని ప్రైవేటు వ్యక్తి అవి మా స్థలంలో ఉన్నాయంటూ ఇటీవల వాటిని నిర్లక్ష్యంగా కూల్చివేసి అసలు అక్కడ వాటి ఆనవాళ్లు లేకుండా చేశాడు. సదరు వ్యక్తి ఇంత దారుణానికి ఒడిగట్టిన విషయం అందరికీ తెలిసినా అధికారులు మాత్రం తమకేమీ సంబంధం లేదన్నట్లు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరించడం ఏమిటని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. సాధారణంగా ఒక ప్రభుత్వ భవనాన్ని కూల్చాలంటే స్పష్టమైన అనుమతులతో అధికారుల సమక్షంలో పనులు చేపట్టాలి. కనీసం సచివాలయ భవనం ప్రారంభం కాకుండానే ఇలా లక్షలాది రూపాయల ప్రభుత్వ నిధులతో నిర్మించిన కట్టడం కూల్చివేయడం వెనుక అంతర్యం ఏంటో అర్థం కావడం లేదని ప్రజల నుంచి విమర్శలు వస్తున్నాయి. ఇటీవల దీనిపై గ్రామ ఉపసర్పంచ్ పీజీఆర్ఎస్లో కలెక్టర్కి ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయింది. లోపాయికారి ఒప్పందాలే ఇందుకు కారణమని, అందుకే ఎవరూ పట్టించుకోవడంలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. దీనిపై కాళ్ల డిప్యూటీ ఎంపీడీవో భాస్కరరావును వివరణ కోరగా సదరు భవనం విషయం తన దృష్టికి వచ్చిందని, క్షేత్రస్థాయిలో పరిశీలించి శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. బొండాడలో సామూహిక మరుగుదొడ్ల భవనం కూల్చివేత పీజీఆర్ఎస్లో కలెక్టర్కి ఫిర్యాదు చేసినా పట్టించుకోని అధికారులు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు ప్రభుత్వ భవనాన్ని కూల్చివేస్తున్నారని నేనే స్వయంగా వెళ్లి పంచాయతీలో ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదు. దీంతో గత నెల 23వ తేదీన కలెక్టర్ దగ్గరికి వెళ్లి పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేశా. దానిపై ఇటీవల డిప్యూటీ ఎంపీడీవో భాస్కరరావు వచ్చి ఎండార్స్మెంట్ ఇవ్వాలి అని సంతకం తీసుకున్నారు. మరుసటి రోజు ఉదయం సమస్య పరిష్కారమైందంటూ నా మొబైల్కి మెసేజ్ వచ్చింది. ప్రభుత్వ ఆస్తులను కాపాడాల్సిన అధికారులు ఈ విధంగా నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఎంతవరకు సబబు. ఈ విషయంపై మరలా కలెక్టర్కు ఫిర్యాదు చేసి న్యాయపోరాటం చేస్తా. – గునుపూడి ప్రసన్నకుమార్, ఉప సర్పంచ్, బొండాడ -
ధర పతనంతో ఆందోళన
ఎన్ఎల్ఎస్ పరిధిలోని ఐదు వేలం కేంద్రాల్లో ఇదే పరిస్థితి ఎదురైంది. గతంలో కంటే కూడా నాణ్యమైన పొగాకును ఉత్పత్తి చేశాం. బోర్డు అధికారుల సూచనలు పాటిస్తూ అన్య పదార్థాలు లేకుండా గ్రేడ్ వన్ పొగాకు ఉత్పత్తి చేసి మద్దతు ధర ఆశించాం, కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ధర పతనం చూస్తుంటే ఆందోళన కలుగుతుంది. – కాకర్ల వివేకానంద, వర్జీనియా పొగాకు వేలం కేంద్రం రైతు సంఘం అధ్యక్షుడు, కొయ్యలగూడెం సగం కూడా కొనుగోలు చేయలేదు ఎన్ఎల్ఎస్ పరిధిలోని ఐదు పొగాకు వేలం కేంద్రాల్లో సుమారు 82 మిలియన్ల కేజీల పొగాకు విక్రయించాల్సి ఉంది. కానీ ఇప్పటివరకు అందులో సగం కూడా కొనుగోలు చేయకపోవడంతో రైతుల వద్ద మిగిలి ఉన్న పొగాకు నాణ్యత తగ్గే ప్రమాదం ఉంది. లోగ్రేడ్ ధర రూ.250కు దిగజారకుండా ఉండగలిగితే రైతుకు కొంతైనా ప్రయోజనం చేకూరుతుంది. – పరిమి రాంబాబు, వర్జీనియా పొగాకు రైతు సంఘం అధ్యక్షుడు, జంగారెడ్డిగూడెం ● -
మార్టేరు వరి పరిశోధనా స్థానం శాస్త్రవేత్తకు పురస్కారం
పెనుమంట్ర : మార్టేరు వ్యవసాయ పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ వై సునీతను ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం 57వ స్నాతకోత్సవంలో ఉత్తమ అవార్డుతో సత్కరించారు. ఈ నెల 24వ తేదీన కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఆత్కూర్ స్వర్ణభారత్ ట్రస్ట్ ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు. ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం, మార్టేరులో సస్య ప్రజనన విభాగంలో సీనియర్ శాస్త్రవేత్తగా పనిచేస్తున్న డా. వై. సునీత 2011 నుంచి చేసిన విశిష్ట సేవలకు గాను ‘మెరిటోరియస్ రీసెర్చ్ సైంటిస్ట్ అవార్డు’ అందుకున్నారు. ఆమె మార్టేరు (18 రకాలు), బాపట్ల (5 రకాలు) వరి పరిశోధనా స్థానాల నుంచి మొత్తం 23 వరి రకాల అభివృద్ధి, విడుదలలో భాగస్వామిగా ఉన్నారు. అదనంగా 1 జన్యు స్టాక్ అభివృద్ధి చేశారు. ఈ సందర్భంగా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం, మార్టేరు డీడీఆర్. డా. టి. శ్రీనివాస్, ఇతర శాస్త్రవేత్తలు, సిబ్బంది అవార్డు గ్రహీతకు అభినందనలు తెలిపారు. -
పారిజాతగిరిలో మార్మోగిన గోవింద నామస్మరణ
జంగారెడ్డిగూడెం: భక్తుల గోవింద నామ స్మరణలతో గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వేంకటేశ్వరస్వామి క్షేత్రం పులకించింది. దేవస్థానంలో పారిజాత గిరి కొండ చుట్టూ నిర్మించిన ప్రదక్షిణ మార్గాన్ని శ్రీశ్రీశ్రీ త్రిదండి అహోబిల రామానుజ జీయర్ స్వామి విశేష భక్త జన సందోహం మధ్య శనివారం ప్రారంభించారు. భక్తులు పెద్ద ఎత్తున గిరి ప్రదక్షిణలో పాల్గొని స్వామివారిని దర్శించారు. ప్రధానార్చకులు నల్లూరి రవికుమారాచార్యులు ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఏర్పాట్లను అభివృద్ధి కమిటీ సహకారంతో ఆలయ ఈవో కలగర శ్రీనివాస్ పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్, గిరి ప్రదక్షణ మార్గానికి ఆర్థిక సహకారం అందజేసిన మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు, పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు తదితర ప్రముఖులు పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి, మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు జెట్టి గురునాథరావు, పార్టీ మండల, పట్టణ నాయకులు, కార్యకర్తలు గిరిప్రదక్షిణ చేశారు. ఆలయ గిరి ప్రదక్షిణ మార్గం ప్రారంభం -
కనిపిస్తే సమాచారం ఇవ్వండి
పశ్చిమ ఏజెన్సీ ప్రాంతంలో గిరినాగులు కనిపిస్తే మాకు సమాచారం ఇవ్వండి. ప్రాణభయంతో పాములను చంపవద్దు. మాకు సమాచారం ఇస్తే వాటిని పట్టుకుని అటవీ ప్రాంతంలో వదిలేస్తాం. ఈ పాములు అరుదైనవి. అభయారణ్యంలో వణ్యప్రాణులను సంరక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉంది. – ఎస్కే వల్లీ, రేంజ్ అధికారి, పోలవరం 20 అడుగుల పొడవు గిరినాగు పాము చాలా ప్రమాదమైంది. 20 అడుగుల పైగా పొడవు ఉంటుంది. బాగా ముదిరిన పాము చాలా డేంజర్. నేను చాలాసార్లు వాటిని చూశాను. అటవీ ప్రాంతంలో పర్యటించినప్పుడు అవి కనిపిస్తే పరుగులు తీసేవాళ్లం. – ఎస్.ప్రసాద్, బుట్టాయగూడెం అత్యంత ప్రమాదకరం గిరినాగులు అత్యంత ప్రమాదకరం. వీటిని పట్టుకోవడం అంత సులువు కాదు. పాపికొండలు, బుట్టాయగూడెం, జీలుగుమిల్లి ప్రాంతాల్లో ఇవి కనిపిస్తున్నట్టు ఫోన్లు వస్తున్నాయి. గిరినాగు కనిపిస్తే ఎవరూ చంపవద్దు. 8099855153 నంబర్కు ఫోన్ చేస్తే నేను వచ్చి పట్టుకుని వాటిని అడవిలో వదిలేస్తా. – చదలవాడ క్రాంతి, స్నేక్ సేవియర్స్ సొసైటీ వ్యవస్థాపకుడు, జంగారెడ్డిగూడెం మనుషులపై దాడి చేయవు గిరినాగులు సాధారణంగా మనుషులపై దాడి చేయవు. అయితే వాటిని భయపెట్టడం లేదా రెచ్చగొట్టడం చేస్తే కాటు వేస్తాయి. ఇది చాలా విషపూరితమైన పాము. కాటు వేస్తే మరణమే తప్ప జీవించే అవకాశం ఉండదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. – గంధం విక్టర్, బుట్టాయగూడెం ● -
నరసాపురంలో ఉగ్ర గోదావరి
నరసాపురం: నరసాపురంలో వశిష్ట గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. ఐదు రోజులుగా ఎగువ ప్రాంతం నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. వలంధర్ రేవులో పిండ ప్ర ధానాలు చేసే షెడ్డుపైకి నీరు చేరింది. గో దావరి మాత విగ్రహం వద్ద నీటిమట్టం పె రిగింది. వలంధర్ రేవు వద్ద నిషేధాజ్ఞలు విధించారు. సముద్ర పోటు సమయంలో నీటిమట్టం మరింత పెరుగుతోంది. పట్టణ పరిధిలో ఐదు చోట్ల అవుట్ఫాల్ స్లూయిజ్ల నుంచి గోదావరి నీరు ఎగదన్నుతోంది. గోదావరి బండ్ను ఆనుకుని ఉన్న ప్రాంతాలు వరద తాకిడి గురయ్యే ప్రమాదం ఉంది. మళ్లీ పెరిగిన గోదావరి వేలేరుపాడు: ఎడతెరపి లేని వర్షాలకు వాగు లు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. భద్రాచ లం వద్ద గోదావరి నీటిమట్టం క్రమేపీ పెరుగు తోంది. గోదావరి, శబరి నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. భద్రాచలం వద్ద శనివారం రాత్రి 35.40 అడుగులకు నీటిమట్టం చేరింది. వేలేరుపాడు నుంచి కొయిదా వెళ్లే దారిలోని ఎద్దెలవాగు వంతెన ఉదయమే నీటమునిగింది. దీంతో దిగువన ఉన్న 18 గిరిజన గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. కొయిదా, కట్కూరు, కాచారం, తాళ్ల గొంది, పూసుగొంది, చిట్టంరెడ్డిపాలెం, ఎడవల్లి, బుర్రెడ్డిగుడెం, టేకూరు, సిద్దారం, కుంకుడు కొయ్యలపాకలు మరో ఏడు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వేలేరుపాడు తహసీల్దార్ సత్యనారాయణ ఎద్దెలవాగు వద్ద నాటు పడవను ఏర్పాటుచేశారు. 5.53 లక్షల క్యూసెక్కులు దిగువకు.. పోలవరం రూరల్: పోలవరం వద్ద గోదావరి వరద క్రమేపీ పెరుగుతోంది. ప్రాజెక్టు దిగువన స్పిల్వే వద్ద 30.400 మీటర్లకు నీటిమట్టం చేరుకుంది. స్పిల్వే 48 గేట్ల నుంచి 5.53 లక్షల క్యూసెక్కుల వరద నీరు దిగువకు వదులుతున్నారు. దీంతో దిగువన వరద ప్రవాహం పెరుగుతోంది. భారీ వర్షాలతో మరో రెండు రోజుల పాటు వరద పెరిగే అవకాశం ఉందని జలవనరుల శాఖ అధికారులు చెబుతున్నారు. గళమెత్తిన ఉపాధ్యాయులు భీమవరం (ప్రకాశంచౌక్): విద్యా సంవత్సరం ప్రారంభమైన నాటి నుంచి ఉపాధ్యాయులు బోధన కంటే బోధనేతర పనులకే ఎక్కువ సమయం కేటాయించాల్సి వస్తుందని యూటీఎఫ్ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధ్యాయ సమస్యలపై యూటీఎఫ్ ఆధ్వర్యంలో భీమవరం కలెక్టరేట్ వద్ద శనివారం నిరసన వ్యక్తం చేశారు. యాప్ల భారం తగ్గిస్తామని చెబుతూనే ఒకే యాప్లో అనేక సమాచారాలు పెట్టమంటూ పనిభారం పెంచుతున్నారన్నా రు. ఏ మాత్రం సంబంధం లేని పీ4 వంటి విషయాలను ఉపాధ్యాయులపై మోపడం సమంజసం కాదన్నారు. బదిలీలు అయిన వారికి రిలీవ్ ఉత్తర్వులు అందజేయాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులకు పెండింగ్లో ఉన్న జీతాల సమస్యను పరిష్కరించాలని కోరారు. లేకుంటే ఆందోళన తీవ్రతరం చేస్తామని ఉపాధ్యాయులు హెచ్చరించారు. నేడు ఎయిడెడ్ టీచర్ నియామక పరీక్ష భీమవరం (ప్రకాశంచౌక్): పెనుగొండ వాసవి కన్యకా పరమేశ్వరి, కోట్ల వెంకట రామయ్య బాలికోన్నత పాఠశాలలో ఖాళీగా ఉన్న 7 ఎయిడెడ్ టీచర్ పోస్టులకు ఆదివారం ఆన్లైన్ పరీక్ష నిర్వహించనున్నారు. రెండు సెషన్లలో పరీక్ష జరుగనుంది. భీమవరం డీఎన్నార్ కాలేజీ అ టానమస్, డీఎన్నార్ కాలేజీ అఫ్ ఇంజనీరింగ్, భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్, తా డేపల్లిగూడెం వాసవి ఇంజనీరింగ్, తాడేపల్లిగూడెం శశి ఇంజనీరింగ్ కళాశాలల్లో కేంద్రాలు ఏర్పాటుచేశారు. హాల్టికెట్ కోసం 99892 71919 నంబర్లో సంప్రదించాలని అధికారులు సూచించారు. -
వసతి.. అధోగతి
జిల్లాలోని సంక్షేమ వసతి గృహాలను సర్కారు నిర్లక్ష్యం పట్టిపీడిస్తోంది. పరిసరాల్లో పారిశుద్ధ్య లేమి.. సరిగాలేని టాయిలెట్స్.. తాగునీటి సమస్యలు.. దోమల బెడద.. నాణ్యత లేని ఆహారం.. విరిగిన బల్లలు.. మంచాలు లేక కటిక నేలపై నిద్ర.. వంటి సమస్యలతో విద్యార్థులు సతమతమవుతున్నారు. మౌలిక వసతుల లేమితో ఇబ్బందులు పడుతున్నారు. ఆదివారం శ్రీ 27 శ్రీ జూలై శ్రీ 2025సాక్షి, భీమవరం: జిల్లాలో బీసీ సంక్షేమ శాఖ పరిధిలో 16 బాయ్స్, 13 గరల్స్ హాస్టళ్లు ఉండగా, సాంఘిక సంక్షేమశాఖ పరిధిలో 15 బాయ్స్, 20 గరల్స్ హాస్టళ్లు ఉన్నాయి. మొత్తం 64 హాస్టళ్లకు గాను 32 హాస్టళ్లకు సొంత భవనాలు ఉండగా మిగిలినవి అద్దె భవ నాల్లో నిర్వహిస్తున్నారు. తాడేపల్లిగూడెం రూరల్ ఆరుగొలను, నరసాపురం రూరల్ ఎల్బీచర్లలో గు రుకుల కళాశాలలు, పెనుగొండలో గురుకుల బాలికల పాఠశాల, తాడేపల్లిగూడెం రూరల్ పెదతాడేపల్లిలో గురుకుల బాలుర పాఠశాల ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా ఆయా వసతి గృహాల్లో 5,329 మంది విద్యార్థులు విద్యాభ్యాసం సాగిస్తున్నారు. హాస్టల్స్లోని పరిస్థితులపై జిల్లావ్యాప్తంగా ‘సాక్షి’ జరిపిన పరిశీలనలో విద్యార్థులు పడుతున్న ఇబ్బందులు వెలుగుచూశాయి. సమస్యలు కోకోల్లలు ● పెనుమంట్ర మండలం పొలమూరులోని ఎస్సీ బాలుర హాస్టల్లో 25 మంది విద్యార్థులు ఉన్నారు. రూ.14 లక్షలతో చేపట్టిన హాస్టల్ భవనం, టాయిలెట్స్ మరమ్మతు పనులు ఆరు నెలలుగా నత్తనడకన సాగుతుండటంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. మంచాలు లేక నేల మీదే పడుకుంటున్నారు. జనరేటర్ గాని, ఇన్వెర్టర్ గాని లేక రాత్రి సమయంలో కరెంట్ పోతే ఇబ్బంది పడాల్సి వస్తోందని, రక్షిత నీటిని అందించే ఆర్ఓ ప్లాంట్ లేదని విద్యార్థులు చెబుతున్నారు. ట్యూటర్ లేక సాయంత్రం స్టడీ అవర్స్ సక్రమంగా జరగట్లేదు. ● భీమవరంలో ఒక ఎస్సీ, ఒక బీసీ బాలికల హాస్టల్, మూడు బీసీ బాయ్స్ హాస్టల్స్ ఉన్నా యి. పీపీ రోడ్డులోని బీసీ బాయ్స్ హాస్టల్లో విద్యార్థులకు కనీసం పరుపులు లేవు. టాయిలెట్స్ నిర్వహణ సరిగా లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. మెంటేవారితోటలోని బీసీ బాయ్స్ హాస్టల్లో విద్యుత్ బోరు ప్రమాదకరంగా ఉంది. ఫ్యాన్లు మరమ్మతులకు గురై పనిచేయడం లేదు. టాయిలెట్స్ సరిగా లేవు. తాగునీటి సమస్య ఉంది. సన్న బియ్యం మూడు రోజులు మాత్రమే పెట్టారని, కోడిగుడ్లు సక్రమంగా ఇవ్వడం లేదని విద్యార్థులు చెబుతున్నారు. ● నరసాపురంలోని రూరల్ పోలీస్స్టేషన్ వద్ద గల బీసీ బాయ్స్ హాస్టల్లో గుమ్మాలు చెదలు పట్టేసి కన్నాలు పడిపోవడంతో క్రిమికీటకాల బెడద ఉంది. బల్లలు లేక నేలమీద చదువుకోవడం, భోజనాలు చేయడం, నిద్రించాల్సి వస్తోందని, గోదావరి గట్టున ఉన్న హాస్టల్లో టాయిలెట్స్ శిధిలావస్థకు చేరి దుర్గంధం వెదజల్లుతున్నాయని, ఎల్బీ చర్ల గురుకుల పాఠశాలలో బల్లలు విరిగిపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు అంటున్నారు. ● తాడేపల్లిగూడెం రూరల్ పెంటపాడులోని ఎస్సీ హాస్టల్ నుంచి స్కూల్కు వెళ్లే దారి అధ్వానంగా ఉంది. దోమల బెడద ఎక్కువగా ఉండటంతో రాత్రిళ్లు నిద్ర ఉండటం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎస్సీ గరల్స్ హాస్టల్కు సొంత భవనం లేకపోవడంతో పాఠశాలలోని అరకొర గదుల్లోనే నిర్వహిస్తున్నారు. ● ఆకివీడులోని బీసీ హాస్టల్ వెనుక భాగంలో కిక్కిస దట్టంగా పెరిగిపోగా, ముందు భాగంలో డ్రెయిన్ పూడుకుపోయి మురుగునీరు హాస్టల్ ఆవరణలోకి వచ్చేస్తోంది. పరిసరాల్లో పారిశుద్ధ్య లేమితో దోమల సమస్య ఎక్కువగా ఉంది. విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ● తాడేపల్లిగూడెం రూరల్లోని మహాత్మా జ్యోతిబా పూలే బీసీ బాయ్స్ గురుకుల పాఠశాలలో 208 మంది విద్యార్థులకు ఏడుగురు ఉపాధ్యాయులు ఉన్నారు. సబ్జెక్టు టీచర్లు లేరు. టాయిలెట్స్ నిర్వహణ సరిగా లేదు. బెడ్స్ సదుపాయం లేక విద్యార్థులు నేలపైనే పడుకుంటున్నారు. ● పాలకొల్లులోని ఎస్సీ గరల్స్ హాస్టల్లో బెడ్స్ లేక నేలపై పరుపులు వేసుకుని పడుకోవాల్సి వస్తుందని విద్యార్థినులు అంటున్నారు. వీరవాసరంలో జరిగిన బాబూ ష్యూరిటీ–మోసం గ్యారెంటీ కార్యక్రమంలో మాట్లాడుతున్న ప్రసాదరాజు వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి న్యూస్రీల్వాగులే ఆవాసం.. పాములే ఆహారంజిల్లాలో వసతి గృహాలు కేటగిరీ సంఖ్య విద్యార్థులు బీసీ హాస్టళ్లు 29 1,585 ఎస్సీ హాస్టళ్లు 35 1,624 గురుకుల పాఠశాలలు 2 కళాశాలలు 2 2,120 సంక్షోభంలో సంక్షేమం ప్రభుత్వ వసతి గృహాలను వెంటాడుతున్న సమస్యలు తాగునీరు, పారిశుద్ధ్య లేమి.. అధ్వానంగా మరుగుదొడ్లు చీకటి పడితే దోమల బెడద అవస్థలు పడుతూ సాగుతున్న విద్యార్థుల చదువులు జిల్లాలో 68 హాస్టళ్లు.. 5,329 మంది విద్యార్థులు }శుభ్రం చేయించాలి ఆకివీడులోని బీసీ బాయ్స్ హాస్టల్ ఆవరణలోకి మురుగునీరు చేరి దుర్గంధం వస్తుండటంతో ఇబ్బంది పడుతున్నాం. హాస్టల్ వెనుక భాగంలో మొక్కలు దట్టంగా పెరిగి పాములు వస్తున్నాయి. హాస్టల్ ఆవరణను శుభ్రం చేయించాలి. – దండే ప్రేమ్కుమార్, 8వ తరగతి విద్యార్థి, ఆకివీడు దోమలతో నిద్ర కరువు రెండేళ్లుగా హాస్టల్లో ఉంటున్నాను. హాస్టల్ రూమ్లో డోర్లు పాడైపోయి చిల్లులు పడటంతో రాత్రిళ్లు దోమల సమస్యతో నిద్ర ఉండటం లేదు. తలుపులకు మరమ్మతులు చేయించాలి. – పి.హరి, 8వ తరగతి, బీసీ బాయ్స్ హాస్టల్ విద్యార్థి, నరసాపురం జీతాలు ఇప్పించండి గురుకుల హాస్టల్లో హెల్పర్ని. ఏడు నెలలుగా జీతాలు లేవు. అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేదు. ఇక్కడ హాస్టల్లో చూస్తే పని ఎక్కువగా ఉంటుంది. – గుంపుల రాంబాబు, హెల్పర్, గురుకుల పాఠశాల, ఎల్బీ చర్ల -
గిరినాగు (కింగ్ కోబ్రా) అత్యంత ప్రమాదకరమైన సర్పం. దట్టమైన అటవీ ప్రాంతాల్లో సంచరిస్తుంటాయి. అరుదైన సర్పజాతికి చెందిన గిరినాగులకు ఇతర పాములే ఆహారం. వర్షాకాలంలో పాములను తినేందుకు ఇవి బయటకు వస్తుంటాయి. పాపికొండల అభయారణ్యంలోని జలతారు వాగు సమీపంలో వీటి జాడ ఎక్
● అత్యంత ప్రమాదకరం గిరినాగులు ● పాపికొండల అభయారణ్యంలో సంచారం బుట్టాయగూడెం : ఏలూరు, అల్లూరు సీతారామరాజు జిల్లాల మధ్య 1,01,200 హెక్టార్ల పరిఽధిలో పాపికొండల జాతీయ వన్య మృగ అభయారణ్యం విస్తరించి ఉంది. అరుదైన జంతు జాలానికి నిలయంగా ఉన్న ఈ అభయారణ్యంలో గిరి నాగుల సంచారం ఎక్కువగా ఉంది. దట్టమైన అటవీ ప్రాంతాలకు పరిమితమయ్యే ఈ సర్పాలు అత్యంత విషపూరితం. అలాగే ఇవి అరుదుగా కనిపిస్తాయి. అయితే ఇటీవల ఇవి జనావాసాల్లోకి వస్తున్నాయి. బుట్టాయగూడెం, జీలుగుమిల్లి, పోలవరం మండలాల్లో గిరినాగులు కనిపించినట్టు రైతులు చెబుతున్నారు. ముఖ్యంగా పాపికొండల అభయారణ్యంలోని జలతారు వాగు పరిసర ప్రాంతాలు వీటికి అడ్డాగా మారా యని వైల్డ్ లైఫ్ అధికారులు అంటున్నారు. ఆహారం కోసం బయటకు.. మార్చి నుంచి జూలై వరకు గిరినాగులు ఎక్కువగా సంచరిస్తుంటాయి. అటవీ ప్రాంతంలో జల వనరులు తగ్గినప్పుడు నీటి చెమ్మను వెతుక్కుంటూ బయటకు వస్తుంటాయి. రబీ సీజన్ అనంతరం ఇతర పాములు పొలాల్లో ఉండటంతో ఆహారం కోసం వాటిని వెతుక్కుంటూ గిరినాగులు వస్తుంటాయి. గతేడాది వర్షాకాలంలో బుట్టాయగూడెం మండలం కేఆర్పురం సమీపంలో, ఇనుమూరు, జీలుగుమిల్లి మండలం కామయ్యపాలెం అటవీ ప్రాంతంలో, ఇటీవల గడ్డపల్లి, ముంజులూరు, తంగేడికొండ, దారావాడ, కోండ్రుకోట అటవీ ప్రాంతాల్లో గిరినాగులు కనిపించినట్టు ఆ ప్రాంత వాసులు చెబుతున్నారు. పాపికొండల అభయారణ్యంలో గిరినాగులతో పాటు పది అడుగుల తాచుపాములు, రక్తపింజర వంటి ప్రమాదకరమైన పాములు కూడా ఉన్నాయి. పట్టుకుని అడవిలో వదిలేస్తూ.. ఇటీవల కాలంలో వర్షాకాలంలోనూ గిరిజనులు పొ లాల్లో సంచరిస్తున్నాయి. వీటి సమాచారం అందిస్తే ఫారెస్ట్ అధికారులు వాటిని పట్టుకుని మళ్లీ అటవీ ప్రాంతంలో వదిలేస్తున్నారు. ఇవి అరుదైన పా ములు కావడంతో వాటి సంరక్షణకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. గిరినాగులు 14 నుంచి 20 అడుగుల పొడవు ఉంటాయి. మగ గిరినాగులను ఆకర్షించేందుకు ఆడ గిరినాగులు ఫెర్మోన్స్ అనే రసాయన పదార్థాన్ని వెదజల్లుతాయి. ఆ వాసన బట్టి మగ గిరినాగులు వాటిని అనుసరిస్తాయి. గిరినాగులు కాటు వేస్తే 10 నిమిషాల్లో ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. గిరినాగులు రక్తపొడ, తాచుపాము, కట్లపాము, జెర్రిగొడ్డు వంటి పాములను ఆహారంగా స్వీకరిస్తాయి. గిరినాగులు గుడ్లు పెట్టి 18 రోజులపాటు పొదుగుతాయి. 21వ రోజున పిల్లలు బయటకు వస్తాయి. పాపికొండల అభయారణ్యంలోని జలతారు వాగు ప్రాంతంలో వీటి సంచారం ఎక్కువగా ఉంది. -
ట్రైతలాన్ పోటీల్లో విద్యార్థుల ప్రతిభ
తణుకు అర్బన్ : జిల్లా ట్రైతలాన్ (రన్నింగ్, స్విమ్మింగ్, షూటింగ్) పోటీల్లో మండలంలోని మండపాక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు అత్యుత్తమ ప్రదర్శన చూపించి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై నట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కె.ఫణిశ్రీ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం విద్యార్థులను పాఠశాలలో అభినందించారు. ఈనెల 24వ తేదీన తేతలిలోని స్టెప్పింగ్ స్టోన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ క్రీడా ప్రాంగణంలో నిర్వహించిన అండర్ 17 విభాగంలో ఎస్.గణేష్, అండర్ 15 విభాగంలో కె.కిరణ్, ఎస్.రోహిత్, జి.రమేష్, అండర్ 13 విభాగంలో జి.ఆనంద్ శ్రీనివాస్ ప్రతిభ చూపారని వివరించారు. వీరు ఈ నెల 26, 27 తేదీల్లో విజయవాడలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి ట్రైతలాన్ పోటీల్లో పాల్గొంటారని వివరించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు శిక్షణ ఇచ్చిన పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ సంకు సూర్యనారాయణను పలువురు అభినందించారు. -
నగదు చోరీ కేసులో నిందితుల అరెస్ట్
భీమవరం (ప్రకాశంచౌక్): స్కూటర్ డిక్కిలో రూ.3 లక్షల నగదు చోరి చేసిన కేసులో నిందితుల అరెస్ట్ చేశామని డీఎస్పీ ఆర్జీ జయసూర్య శుక్రవారం విలేకరుల సమావేశంలో తెలిపారు. జూలై 4న అమలాపురం నుంచి వచ్చిన బాధితుడు ఎం.రమేష్ బాబు నగదును వేరొకరికి ఇద్దామనుకున్నారు. కళాభవన్ వీధిలో ద్విచక్ర వాహనాన్ని నిలిపి ఇంట్లోకి వెళ్లి వచ్చేలోపు డిక్కీ తెరిచి నగదు ఎత్తుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. సీసీ కెమెరా ఫుటేజీ పరిశీలించగా విజయనగరం జిల్లాకు చెందిన మేకల బాలరాజు, ఒడిశాకు చెందిన దాసు రబి (రవి) నగదు చోరీ చేశారని గుర్తించారు. ఈ మేరకు నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రూ.3 లక్షల సొమ్మును రికవరీ చేశారు. -
మూడు గంటల్లోనే మిస్సింగ్ కేసు ఛేదన
తాడేపల్లిగూడెం : అదృశ్యమైన బాలుడిని పెంటపాడు పోలీసులు మూడు గంటల్లో సురక్షితంగా వారి తల్లిదండ్రులకు అప్పగించారు. తాడేపల్లిగూడెం రూరల్ ఇన్చార్జి సీఐ బోణం ఆదిప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం పెంటపాడు మండలం రాచర్ల గ్రామానికి చెందిన ఈదరాడ కామేశ్వరరావు అనే వ్యక్తి తన చెల్లెలు కనిపించడం లేదని ఫిర్యాదు చేయడానికి గురువారం అర్ధరాత్రి 2.30 సమయంలో ఆయన తల్లి, ఇద్దరు మేనళ్లులతో కలిసి పెంటపాడు పోలీసు స్టేషన్కు వచ్చారు. పోలీసు స్టేషన్ పక్కనే ఉన్న రోడ్డులో కారు పార్కు చేసి, అందులో నాలుగు సంవత్సరాల మేనల్లుడిని నిద్రపుచ్చి కారును లాక్ చేసి, మిగిలిన వారు ఫిర్యాదు చేయడానికి వెళ్లారు. ఫిర్యాదు అనంతరం తిరిగి కారు వద్దకు రాగా, కారులో బాలుడు కనిపించలేదు. వెంటనే వారు తిరిగి స్టేషన్కు వెళ్లి మళ్లీ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పెంటపాడు పోలీసులు కేసు నమోదు చేశారు. తాడేపల్లిగూడెం రూరల్ సర్కిల్ ఇన్చార్జి సీఐ బోణం ఆదిప్రసాద్ ఆధ్వర్యంలో పెంటపాడు ఎస్సై కేసీహెచ్ స్వామి తన సిబ్బందితో ప్రత్యేక టీమ్గా ఏర్పడ్డారు. సీసీ కెమెరాల పుటేజ్ ఆధారంగా గాలింపులు జరిపారు. మూడు గంటల వ్యవధిలో బాలుడిని గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించారు. -
ఆకట్టుకున్న నిమ్మకాయల అలంకరణ
9న ఏపీ నిట్ స్నాతకోత్సవం తాడేపల్లిగూడెం: నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(నిట్) ఏడో స్నాతకోత్సవం ఆగస్టు 9న నిర్వహించనున్నారు. ఈ మేరకు నిట్ అధికారవర్గాలు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశాయి. కార్యక్రమంలో ముఖ్యఅతిఽథిగా టీసీఎస్ లిమిటెడ్, టెక్నాలజీ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ప్రెసిడెంట్ వి.రాజన్న ముఖ్యఅతిథిగా పాల్గొని విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇస్తారని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. విద్యుత్ మోటార్ దొంగలించిన వ్యక్తికి ఆరు నెలల జైలు భీమవరం అర్బన్: భీమవరం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గతంలో అనాకోడేరు గ్రామానికి చెందిన యర్రంశెట్టి విజయ రామరాజు తన చెరువు వద్ద విద్యుత్ మోటార్ దొంగిలించినట్లు ఫిర్యాదు చేయడంతో రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. విద్యుత్ మోటార్ దొంగిలించిన నేపాల సూర్యనారాయణను శుక్రవారం కోర్టులో హాజరుపర్చగా నేరం రుజువు కావడంతో సీనియర్ సివిల్ జడ్జి సురేష్ సూర్యనారాయణకు నిందితుడికి 6 నెలలు జైలు శిక్ష విధించినట్లు రూరల్ ఎస్సై ఐ.వీర్రాజు తెలిపారు. -
మావుళ్లమ్మకు శ్రావణమాస ఉత్సవాలు ప్రారంభం
భీమవరం (ప్రకాశంచౌక్): స్థానిక శ్రీ మావుళ్ళమ్మ వారి దేవస్థానంలో శ్రావణమాసం ఉత్సవాలు శుక్రవారంతో నుంచి ప్రారంభమాయ్యాయి. దేవస్థానం ప్రధాన అర్చకులు మద్దిరాల మల్లికార్జున శర్మ ఆధ్వర్యంలో ఉదయం నుంచే అమ్మవారికి వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు దర్శనానికి తరలివచ్చారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా దేవస్థానం సహాయ కమిషనర్ బుద్ద మహాలక్ష్మి నగేష్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. మున్సిపల్ కార్యాలయంలో అగ్నిప్రమాదం జంగారెడ్డిగూడెం : స్థానిక మున్సిపల్ కార్యాలయంలో శుక్రవారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. కమిషనర్ చాంబర్లో విద్యుత్ షార్ట్సర్క్యూట్ కారణంగా కంప్యూటర్ లాప్టాప్, ఫర్నీచర్, ఏసీ, విద్యుత్ ఉపకరణాలు దగ్ధమయ్యాయి. ఘటనాస్థలాన్ని మున్సిపల్ ఛైర్పర్సన్ బత్తినలక్ష్మి పరిశీలించారు. అగ్ని ప్రమాద విషయాన్ని ఉన్నతాధికారులతో పాటు, విద్యుత్ శాఖ, పోలీసు శాఖకు సమాచారం ఇచ్చామన్నారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియజేయాలని కమిషనర్ కేవీ రమణను ఛైర్పర్సన్ ఆదేశించారు. వైస్ చైర్మన్ ముప్పిడి ఆంజనేయులు, కౌన్సిలర్లు చిటికెల అచ్యుతరామయ్య, పీపీఎన్ చంద్రరావు, లోకారపు వెంకటేశ్వరరావు అగ్నిప్రమాద ప్రాంతాన్ని పరిశీలించారు. 7 నుంచి శ్రీవారి పవిత్రోత్సవాలు ద్వారకాతిరుమల: ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయంలో ఆగస్టు 7 నుంచి పదో తేదీ వరకు స్వామివారి దివ్య పవిత్రోత్సవాలను నిర్వహించనున్నట్టు ఆలయ ఈఓ ఎన్వీ సత్యన్నారాయణ మూర్తి తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. 7న అంకురార్పణతో ఈ ఉత్సవాలకు శ్రీకారం చుడతారని తెలిపారు. అలాగే 8న పవిత్రాదివాసం, 9న పవిత్రావరోహణ, ఉత్సవాల్లో ఆఖరి రోజైన 10న ఆలయ యాగశాలలో మహా పూర్ణాహుతి వేడుకలు కన్నులపండువగా జరుగుతాయని పేర్కొన్నారు. ఈ ఉత్సవాలు జరిగే నాలుగు రోజులు ఆలయంలో స్వామివారికి నిత్యార్జిత కల్యాణాలు, ఆర్జిత సేవలను రద్దు చేస్తున్నట్టు ఈఓ తెలిపారు. ధర్మవరం, తిరుపతి రైళ్ల రద్దు పాలకొల్లు సెంట్రల్: రైల్వే మరమ్మతులు, ట్రాక్ పనుల్లో భాగంగా నరసాపురం నుంచి ధర్మవరం, తిరుపతి రైళ్లు రద్దు చేస్తున్నట్లు రైల్వే డీఆర్యుసిసి సభ్యులు జక్కంపూడి కుమార్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఓ ప్రకనట విడుదల చేవారు. నరసాపురం నుంచి ధర్మవరం వెళ్లే 17247 రైలు ఆగస్టు 11 నుంచి 19 వరకూ, ధర్మవరం నుంచి నరసాపురం వచ్చే 17248 రైలు ఆగస్టు 12 నుంచి 20 వరకు రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే తిరుపతి నుండి నరసాపురం వచ్చే 07131 రైలు ఆగస్టు 17న, నరసాపురం నుంచి తిరుపతి వెళ్లే 07132 రైలు ఆగస్టు 18న రద్దు చేస్తున్నట్లు వివరించారు. -
చెట్ల నరికివేతపై వాల్టా యాక్ట్ అమలు
తాడేపల్లిగూడెం రూరల్: మండలంలోని కొండ్రుప్రోలు కేఎస్ఎన్ కాలనీలో ఏళ్ల నాటి చెట్లను నరికివేయడంపై ‘మాయమవుతున్న వన సంపద’అనే శీర్షికతో శుక్రవారం సాక్షి దినపత్రికలో కథనం ప్రచురితమైంది. దీంతో అటవీ శాఖ అధికారులు స్పందించారు. భీమవరం రేంజ్ అధికారి మురాల కరుణాకర్, ఫారెస్ట్ సెక్షన్ అధికారి ఎస్.సురేష్కుమార్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ బృందం కొండ్రుప్రోలులో పర్యటించింది. ఈ సందర్భంగా రేంజ్ అధికారి కరుణాకర్ మాట్లాడుతూ మామిడి, వేప, రావిచెట్టు, తాటి చెట్లు, గుల్మోహర్ చెట్ల కలపను గ్రామ పంచాయతీ తీర్మానం మేరకు సంబంధిత శాఖ అధికారుల అనుమతితో బహిరంగ వేలం వేయాలని ఆదేశించామని తెలిపారు. అయినప్పటికీ పంచాయతీ కార్యదర్శి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని వెల్లడించారు. ఏపీ వాల్టా చట్టం ప్రకారం విచారణ చేపడతామని తెలిపారు. తదుపరి వివరాలు త్వరలో వెల్లడిస్తామని తెలిపారు. స్పందన -
ఉపాధి బకాయిలు చెల్లించాలి
తాడేపల్లిగూడెం రూరల్: ఉపాధి హామీ పథకం కూలీలకు బకాయిపడ్డ వేతనాలను వెంటనే చెల్లించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కండెల్లి సోమరాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం మండలంలోని నవాబుపాలెం సచివాలయం వద్ద వేతన బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ శ్రామికులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సోమరాజు మాట్లాడుతూ 10 నుంచి 12 వారాలు పనిచేస్తే కేవలం రెండు వారాల సొమ్ములు మాత్రమే జమ చేసి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి కండెల్లి రమేష్బాబు, కండెల్లి విజయ, నూతంగి సూర్యారావు, బైపో ప్రసాద్, దిద్దే అబ్బులు, కొల్లి మేరీ, ఉండ్రాజవరపు భాను పాల్గొన్నారు. -
పొలసానిపల్లి గురుకులం పరిశీలన
భీమడోలు: మండంలోని పొలసానిపల్లిలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాల భవనాలను తక్షణమే నిర్మించాలని, తాత్కాలిక షెడ్లను నిర్మించి బాలికలకు తరగతులను నిర్వహించాలని సీపీఎం ప్రతినిధుల బృందం డిమాండ్ చేసింది. పోలసానిపల్లిలో రెండు శ్లాబ్లు కూలడం, ఓ విద్యార్థీనీ ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో శుక్రవారం సీపీఎం ప్రతినిధుల బృందం సందర్శించింది. గురుకుల కళాశాలలోని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు ఆర్.లింగరాజు మాట్లాడుతూ దళితుల విద్యపై ప్రభుత్వం అసలు శ్రద్ధ తీసుకోవడం లేదని విమర్శించారు. కార్యక్రమంలో భీమడోలు, ద్వారకాతిరుమల మండలాల నిర్వహకులు కట్టా భాస్కరరావు, మండల నాయకులు పోలుకొండ నాగరాజు, మానుకొండ వీర్రాజు తదితరులు పాల్గొన్నారు. -
సీతారామస్వామి ఆలయ భూమి స్వాధీనం
జంగారెడ్డిగూడెం: ఎన్నో ఏళ్లుగా కోర్టు వివాదంలో ఉండి ఆక్రమణలో ఉన్న దేవదాయ శాఖ భూమిని శుక్రవారం ఆ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వివరాల ప్రకారం స్థానిక బుట్టాయగూడెం రోడ్డులోని సీతారామస్వామి ఆలయానికి పట్టణంలోని సుబ్బంపేటలో121/3 సర్వే నెంబర్లో 33.65 ఎకరాల భూమి ఉంది. ఈ భూమిలో పామాయిల్ తోట ఉంది. అయితే ఈ తోటను చాలా ఏళ్ల క్రితం కొందరు వ్యక్తులు లీజుకు తీసుకుని సేద్యం చేసేవారు. ఆ తరువాత 2002లో ఈ భూమికి లీజుదారులకు రెవెన్యూ శాఖ పట్టాదారుపాస్ పుస్తకం జారీ చేసింది. దీంతో వివాదం మొదలైంది. అప్పటి నుంచి దేవాదాయ శాఖ కోర్టులో పోరాటం చేస్తూ వచ్చింది. ఈ నేపథ్యంలో ఇటీవల కోర్టు దేవదాయ శాఖకు అనుకూలంగా తీర్పునిచ్చింది. దీంతో దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కూచిపూడి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆలయ ఈఓ కలగర శ్రీనివాస్, దేవాదాయ శాఖ అధికారులు సుబ్బంపేటలోని భూమిని స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ పామాయిల్ తోట ముదురు తోట అని, ఇక కాపు కాయదని ఉద్యానశాఖ లేఖ ఇవ్వడంతో పామాయిల్ మొక్కలను తొలగించే కార్యక్రమాన్ని చేపట్టారు. సుమారు 5 జేసీబీలను పెట్టి పామాయిల్ మొక్కలను తొలగించారు. ఈ భూమిని చదును చేసి లీజుకు వేలం నిర్వహిస్తామని అధికారులు ప్రకటించారు. -
●మన్యంలో జలపాతాల సోయగం
గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఏజెన్సీ ప్రాంతంలోని జలపాతాలు కనువిందు చేస్తున్నాయి. బుట్టాయగూడెం మండలం అటవీప్రాంతంలో ఉన్న ఉప్పరిల్ల జలపాతం, ముంజులూరు సమీపంలో ఉన్న ఏనుగుతోగు జలపాతం, పాపికొండల అభయారణ్యంలో ఉన్న జలతరు వాగు జలపాతం వర్షాలకు విస్తృతంగా పొంగిపొర్లుతున్నాయి. సమీపంలో ఉన్న అనేక మంది పొంగే జలపాతాలను చూసేందుకు వస్తున్నారు. అయితే ప్రస్తుతం విస్తారంగా వర్షాలు ఉన్నందున జలపాతాలను చూసేందుకు వెళ్లే పర్యాటకులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. – బుట్టాయగూడెం -
అక్రమ ఇసుక గుట్టలను సీజ్ చేయాలి
పెనుగొండ: ఆచంట నియోజకవర్గంలో అక్రమ ఇసుక గుట్టలను సీజ్ చేయాలని, మాఫియా ఇసుకను తోడేసి విక్రయిస్తుందంటూ సర్పంచ్లు గళమెత్తారు. నిబంధనలకు విరుద్ధంగా ఇసుకను తవ్వుతూ గుట్టలుగా నిల్వ చేస్తున్నారని, చర్యలు తీసుకోవాలంటూ ఆచంట డిప్యూటీ తహాసీల్దార్ సోమేశ్వరరావుకు గురువారం వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సర్పంచ్లు సుంకర సీతారామ్, ఇళ్ల లక్ష్మీ చంద్రిక, జక్కంశెట్టి శ్రీరామ్, కోట సరోజినీ వెంకటశ్వరరావు, గణేషుల శేషవేణి సుబ్బారావు, గుబ్బల ఉషారాణి వీర బ్రహ్మంలు మాట్లాడుతూ టీడీపీ నాయకుడు గణపతినీడి రాంబాబు మాఫియా డాన్లా వ్యవహరిస్తూ అక్రమంగా ఇసుక నిల్వ చేస్తున్నారన్నారు. గ్రీన్ ట్రిబ్యునల్ పరిధిలో 50 కిలోమీటర్లు వరకు ఇసుక తీసుకూడదనే నిబంధనలను పట్టించుకోవడం లేదన్నారు. కోడేరు, భీమలాపురం, కరుగోరుమిల్లి, సిద్ధాంతం, నడిపూడిల్లో ర్యాంపుల్లో ఇసుక తవ్వకాలకు అనుమతులు లేకున్నా వందలాది యంత్రాలతో కోట్లాది రూపాయల ఇసుకను తవ్వేస్తున్నారని ఆరోపించారు. నియోజకవర్గాల్లో ఖాళీ ప్రదేశాలు ఇసుక గుట్టలుగా మారాయన్నారు. రాంబాబుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి డిమాండ్ చేశారు. అలాగే ఇసుకను అక్రమంగా తవ్వి కొడమంచిలి, సిద్ధాంతంలోని ప్రభు త్వ ఇసుక స్టాక్ పాయింట్లలోనూ నిల్వ చేశారన్నా రు. గెద్దాడ ఏకలవ్య, మెడిచర్ల పండు, గొట్టుముక్కల సునీల్ తదితరులు పాల్గొన్నారు. -
జనసేన చేష్టలు బాధాకరం
ఏలూరు (టూటౌన్): మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కాన్వాయ్పై జనసేన మూకల వికృత చేష్టలు బాధాకరమని వైఎస్సార్సీపీ చింతలపూడి నియోజకవర్గ ఇన్చార్జి కంభం విజయరాజు అన్నారు. నగరంలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు. వైఎస్సార్సీపీ ఏపీ స్టేట్ క్రిస్టియన్ మైనార్టీ సెల్ అధ్యక్షుడు బొల్లవరపు జాన్ వేస్లితో కలిసి మాట్లాడుతూ జిల్లాలో క్రిస్టియన్ల సమస్యలపై వైఎస్సార్సీపీ కార్యాచరణ సిద్ధం చేసి భరోసా కల్పించనుందన్నారు. తణుకులో కారుమూరి కాన్వాయ్పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని, ఇది ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ అని అన్నారు. -
ఏబీపై వైఎస్సార్సీపీ నేత ధ్వజం
నూజివీడు: వైఎస్సార్సీపీ గూండాలు ఇక్కడ ఎవరూ లేరని, ఏమి అరాచకం చే శారో చెప్పాలని, ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడటం మీ స్థాయికి తగదని వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు, మాజీ సర్పంచ్ కలగర వెంకటేశ్వరరావు రిటైర్డ్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావుపై మండిపడ్డారు. నూజివీడు మండలం ముక్కొల్లుపాడులో గురువారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ 2014–19 కాలంలో టీడీపీ ప్రభుత్వంలో ఏబీ వెంకటేశ్వరరావు తమ గ్రామాన్ని దత్తత తీసుకున్నారని, దీంతో గ్రామం బాగుపడుతుందనుకుంటే కేవలం రెండు సిమెంట్ రోడ్లు వేయించారని చెప్పారు. వ్యక్తిగత మరుగుదొడ్ల నిధులను మాత్రం ఆయన అనుచరులు అధికారులను బెదిరించి బిల్లులు చేయించుకుని మెక్కేశారన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో గ్రామాన్ని బాగుచేయడానికి కృషి చేశామే గానీ ఎవరినీ ఇబ్బంది పెట్టలేదని స్పష్టం చేశారు. వైఎస్సార్సీపీ వాళ్లను గూండాలంటావా.. దమ్ముంటే పంచాయతీ ఎన్నికల్లో నిలబడు.. నీపై నేనే నిలబడతా.. గెలిచి చూపించు.. అని కలగర వెంకటేశ్వరరావు సవాల్ విసిరారు. గత ఏడాది కాలంగా గ్రామానికి వస్తే చాలు కేసులు కట్టమంటూ పోలీసు అధికారులపై ఒత్తిడి చేస్తున్నది ఎవరో ప్రజలకు తెలుసునన్నారు. రాష్ట్రస్థాయి అధికారిగా పనిచేసిన ఆయన ఇలా ఎందుకు మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదన్నారు. 56 ఏళ్లుగా తాను రాజకీయాల్లో ఉన్నానని, అప్పటి నుంచి పంచాయతీని గెలిపించుకుంటూనే ఉన్నానని, ఏనాడూ తాను ఎవరిపైనా దౌర్జన్యం చేయలేదని, గ్రామానికి వచ్చి విచారణ చేసుకోవాలని సూచించారు. గ్రామంలో ఒకరిద్దరు చెప్పే మాటలు నమ్మి తప్పుడు మాటలు మాట్లాడటం మంచిది కాదన్నారు. అయినా రాజకీయాల్లో ఎవరిష్టం వచ్చినట్టు వారు ఒకసారి కాకపోతే పదిసార్లు పార్టీలు మారతారని, దీనికి మీకొచ్చే నష్టమేమిటని కలగర ప్రశ్నించారు. -
శ్రావణం.. శుభప్రదం
ఏలూరు(ఆర్ఆర్పేట)/బుట్టాయగూడెం/ ద్వారకా తిరుమల: హిందువులకు అత్యంత శుభప్రదమైన మాసం శ్రావణం. ప్రత్యేక వ్రతాలు, నోములతో పాటు ఆలయాల్లో విశేష పూజలు చేస్తారు. ఆషాఢం తర్వాత శుభ ముహూర్తాలు మొదలుకానుండటంతో అంతటా శుభకార్యాల సందడి కనిపిస్తుంది. ప్రత్యేకంగా శుక్రవారాల్లో లక్ష్మీదేవికి వ్రతాలు, మంగళవారాల్లో మంగళ గౌరీ వ్రతాలు ఆచరిస్తారు. ఈ మాసంలో ప్రతిరోజూ ఒక్కో దేవతామూర్తికి విశేషమైనదిగా స్కాంద పురాణంలో చెప్పినట్టు పండితులు తెలుపుతున్నారు. శుక్రవారం నుంచి శ్రావణమాసం ప్రారంభం కానుంది. పర్వదినాలు.. ప్రత్యేక పూజలు ● ఆగస్టు 8న వరలక్ష్మి వ్రతం.. శ్రావణ మాసంలో రెండో శుక్రవారం మహిళలు వరలక్ష్మి వ్రతాలు ఆచరిస్తారు. ● 9న రాఖీ పౌర్ణమి.. అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల అనుబంధానికి ప్రతీకగా శ్రావణ పౌర్ణమిని రాఖీ పౌర్ణమిగా జరుపుకుంటారు. దీనినే జంధ్యాల పౌర్ణమి అని పిలుస్తారు. ● 12న సంకష్ట హర చతుర్థి వ్రతం: శ్రావణ బహుళ చవితి నాడు ప్రధాన సంకష్ట హర చతుర్థి వ్ర తాలు జరుపుకుంటారు. గణపతి ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తారు. ● 16న శ్రీకృష్ణ జన్మాష్టమి.. శ్రావణ బహుళ అష్టమి నాడు శ్రీ కృష్ణ జన్మాష్టమి పర్వదినాన్ని జరుపుకుంటారు. ● 23న పోలాల అమావాస్య: ఈ రోజుతో శ్రావణ మాసం ముగియనుంది. ఈ సందర్భంగా పోలాల అమావాస్య జరుపుకుంటారు. వ్యాపారుల్లో నూతనోత్సాహం శ్రావణ మాసం అంటే వ్యాపారుల్లో నూతనోత్సాహం వెల్లివిరుస్తుంది. వస్త్ర, స్వర్ణ, పూజా సామగ్రి, పూలు, పండ్లు, నిత్యావసర వస్తువుల వ్యాపారాలు జోరందుకుంటాయి. వస్త్ర, బంగారు ఆభరణాల వ్యాపారులు ఆఫర్లతో మహిళలను ఆకర్షిస్తుంటారు. పండుగలు, ప్రత్యేక దినాలకు నెలవు ఆలయాల్లో ప్రత్యేక పూజలు విశిష్ట మాసం శ్రావణ మాసానికి ఎంతో విశిష్టత ఉందని పురాణేతిహాసాలు చెబుతున్నాయి. ఈ నెలలో ఆలయాల్లోని అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు ఆచరించడం అత్యంత పుణ్యప్రదం. తమ కుటుంబాలు పదికాలాల పాటు చల్లగా ఉండాలని మహిళలు వరలక్ష్మీ వ్రతా లు, మంగళగౌరీ వ్రతాలు ఆచరించుస్తుంటా రు. గృహప్రవేశాలకు, శంకుస్థాపనలకు, చా తుర్మాస్య దీక్షలకు ఈ మాసం విశిష్టమైంది. – గుడిమెట్ల బాలకృష్ణ కిషోర్ శర్మ అవధాని, జ్యోతిష పండితుడు -
అందని సాయం.. అన్నదాత ఆక్రోశం
శురకవారం శ్రీ 25 శ్రీ జూలై శ్రీ 2025గత ప్రభుత్వంలో సాగు ఆరంభంలోనే.. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో సాగు ప్రారంభంలోనే వైఎస్సార్ రైతు భరోసా సాయం విడుదల చేశారు. పీఎం కిసాన్ రూ.6,000లకు, రాష్ట్ర ప్రభుత్వం రూ.7,500లు జతచేసి ఏటా రూ. 13,500లు మొత్తాన్ని మూడు విడతలుగా అందించేవారు. తొలి విడతగా మే నెలలోనే రూ. 7,500, తొలకరి చివరిలో రూ.4,000, రబీలో రూ.2,000 చొప్పున అందించారు. ఇలా ఐదేళ్లలో జిల్లాలోని 1,17,999 మందికి రూ.796.49 కోట్ల లబ్ధి చేకూరింది. గత ప్రభుత్వ సాయాన్ని గుర్తుచేసుకుంటూ ప్రస్తుతం తొలకరి పనులు జోరందుకోవడంతో చేతిలో సొమ్ముల్లేక ఇబ్బంది పడాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు. సాక్షి, భీమవరం: సాగునీటి ఎద్దడి, ఎండలకు నత్తనడకన సాగిన ఖరీఫ్ సాగు అల్పపీడనంతో జోరందుకుంది. జిల్లా అంతటా విస్తారంగా వర్షాలు పడుతుండటంతో రైతులు పనులు ముమ్మరం చేస్తున్నారు. ఈ తరుణంలో పంట పెట్టుబడుల కోసం ఇబ్బందులు పడుతున్నారు. గతేడాది అన్నదాత సుఖీభవ సాయానికి ఎసరు పెట్టిన చంద్రబాబు సర్కారు ఈ సీజన్లో ఎప్పుడు ఇచ్చేది స్పష్టం చేయడం లేదు. జిల్లాలో 2.08 లక్షల ఎకరాల్లో.. జిల్లాలోని 2.08 లక్షల ఎకరాల్లో ఖరీఫ్ సాగు జరుగనుంది. జూన్ రెండో వారంలో కాలువలకు నీరు విడుదల చేసినా క్లోజర్ పనుల్లో తీవ్ర జాప్యం, సాగునీటి ఎద్దడి, వర్షాభావ పరిస్థితులతో పనులు ఆలస్యమయ్యాయి. పలుచోట్ల సాగునీరందక నారుమడులు ఎండిపోయి రైతులు ఇబ్బందులు పడ్డారు. నాలుగు రోజుల క్రితం నాటికి 40 వేల ఎకరాల్లో మాత్రమే నాట్లు పడ్డాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో రెండు రోజులుగా జిల్లా అంతటా వర్షాలు పడుతుండటం తొలకరి పనులకు ఊతమిచ్చినట్టయ్యింది. రైతులపై రూ.26.18 కోట్ల అదనపు భారం రైతులకు ఊరటనిస్తూ గత వైఎస్సార్సీపీ ప్రభు త్వం పక్కన పెట్టిన నీటి తీరువాను కూటమి తెరపైకి తెచ్చింది. పంట పొలాలకు ఎకరానికి ఏడాదికి రూ.350, ఆక్వా చెరువులకు రూ.500 చొప్పున గత మూడేళ్లకు జిల్లాలోని 3,31,169 మంది రైతుల ఖాతాల నుంచి వసూలుకు ఆదేశాలిచ్చింది. ఈ మేరకు పాత బకాయిలు రూ.5.62 కోట్లు, వడ్డీ రూ.33.77 లక్షలు, ప్రస్తుత డిమాండ్ రూ.15.84 కోట్ల కలిపి రూ. 21.81 కోట్లు వసూలు చేసే పనిలో అధికారులు ఉన్నారు. మరోపక్క మాజీ సీఎం వైఎస్ జగన్ తెచ్చిన ఉచిత పంటల బీమా పథకాన్ని కూటమి ఎత్తివేసి ప్రీమియం భారాన్ని రైతులపై మోపింది. ఎకరానికి రూ.210లు చొప్పున తొల కరిలో 2.08 లక్షల ఎకరాలకు రూ.4.37 కోట్లు ప్రీ మియాన్ని ఆగస్టు 15లోపు రైతులు చెల్లించాల్సి ఉంది. సీజన్ ప్రారంభంలోనే నీటితీరువా, బీమా ప్రీ మియం రూపంలో ఖరీఫ్ రైతులపై రూ.26.18 కో ట్ల భారం పడింది. గడిచిన రబీ సీజన్లోని ధాన్యం బకాయిలు దాదాపు రూ.290 కోట్లను రెండు నెలలుగా ప్రభుత్వం చెల్లించక రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సాయంపై స్పష్టత ఏదీ ? అన్నదాత సుఖీభవ పేరిట ఏటా రైతులకు పెట్టుబడి సాయంగా రూ.20 వేలు చొప్పున ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన చంద్రబాబు, పవన్కళ్యాణ్లు మొదటి ఏడాది సా యానికి ఎగనామం పెట్టారు. ఇలా జిల్లాలోని రైతు లు దాదాపు రూ.210 కోట్లు సాయాన్ని కోల్పో యారు. ఇప్పటికే ఖరీఫ్ ప్రారంభమై నెలన్నర కావస్తున్నాయి. సాయం విడుదల పేరిట జిల్లాలోని 1.05 లక్షల మంది రైతులకు ఈకేవైసీ పూర్తిచేశారు. కాగా ఎప్పుడు విడుదల చేసేది ప్రకటించకుండా ప్రభుత్వం తాత్సారం చేస్తుండటంపై రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పంట పెట్టుబడులకు ఇబ్బందులు పడాల్సి వస్తోందని వాపోతున్నారు. న్యూస్రీల్అన్నదాత దుఃఖీభవ వర్షాలతో ఊపందుకున్న తొలకరి పనులు పెట్టుబడుల కోసం రైతుల ఇక్కట్లు నీటితీరువా, బీమా ప్రీమియం భారం మోపిన కూటమి సర్కారు జూలై గడిచిపోతున్నా అన్నదాత సుఖీభవ ఊసెత్తని వైనం గత ప్రభుత్వంలో పక్కాగా సాయం విడుదల రైతులంటే చిత్తశుద్ధి లేదు కూటమి ప్రభుత్వానికి రైతులంటే ఏమాత్రం చిత్తశుద్ధి లేదు. అన్నదాత సుఖీభవ సాయం ఇవ్వకపోగా ఉచిత పంటల బీమా పథకాన్ని ఎత్తివేసింది. మూడేళ్లుగా లేని నీటి తీరువాను పాత బకాయిలతో వసూలు చేస్తోంది. ధాన్యం సొమ్ములకు చాలా ఇబ్బంది పెట్టింది. మూడు నెలల పాటు ధాన్యం డబ్బులు పడక సన్న, చిన్నకారు రైతులు చాలా ఇబ్బంది పడ్డారు. – చిన్నం రామారెడ్డి, వైఎస్సార్సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు, పెనుగొండ -
అనుమతి లేని వైద్యం
కామవరపుకోట: రోగులకు ప్రథమ చికిత్స చేయాల్సిన రిజిస్టర్ మెడికల్ ప్రాక్టీషనర్స్ (ఆర్ఎంపీ) వచ్చీరాని వైద్యం చేస్తూ రోగి ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. జిల్లాలో కొందరు ఆర్ఎంపీలు నిబంధనలకు విరుద్ధంగా వైద్యం చేస్తుండగా, మరి కొందరు అనుమతులు లేకుండా క్లినిక్లు నిర్వహిస్తూ రోగులను అడ్డంగా దోచుకుంటున్నారు. జిల్లాలో సుమారు 4 వేల మందికి పైగా ఆర్ఎంపీలు గ్రామాల్లో డాక్టర్లుగా చలామణి అవుతున్నారు. క్లినిక్ బోర్డులు పెట్టి విచ్చలవిడిగా వైద్యం చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పేద లు పెద్దాస్పత్రులకు వెళ్లలేని పరిస్థితుల్లో వీరి వద్దే వైద్యం చేయించుకుంటున్నారు. ఇదే అదునుగా ఆర్ఎంపీలు డబ్బులకు కక్కుర్తి పడి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఆర్ఎంపీలు చేయాల్సినవి.. చిన్న గాయమైతే కట్టు కట్టడం, జ్వరం వస్తే పా రాసిటమాల్ వంటి మందులు ఇవ్వడం వరకే ఆర్ఎంపీలు పరిమితం కావాలి. కేవలం ప్రథమ చికిత్స మాత్రమే చేయాలనే ప్రభుత్వ నిబంధనలు ఉన్నా యి. రోగి సమస్య పెద్దదైతే అందుబాటులో ఉన్న పెద్ద ఆస్పత్రికి రిఫర్ చేయాలి. ఆర్ఎంపీలు చేస్తున్నవి.. ఆర్ఎంపీలు నిబంధనలు మీరి ఎంబీబీఎస్ డాక్టర్ మాదిరిగా ప్రిస్కిప్షన్ ప్యాడ్ ముందు పెట్టుకుని, స్టెతస్కోప్ మెడలో వేసుకుని రోగుల్ని పరీక్షిస్తూ మందులు, ల్యాబ్ టెస్ట్, స్కానింగ్లు రాస్తున్నారు. ఒక్కోసారి సర్జరీలు చేసి రోగులకు ప్రాణాలు మీదకు తెచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంతటితో ఆగకుండా క్లినిక్లు ఏర్పాటుచేసి బెడ్స్ వేసి రోగులకు ఫ్లూయిడ్స్ ఎక్కించడం, ఎక్కువ మోతాదులో యాంటీ బయోటిక్ ఇంజక్షన్లు ఇవ్వడం వంటివి చేస్తున్నారు. అప్పటికీ రోగం తగ్గకపోతే సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రికి రిఫర్ చేస్తున్నారు. అక్కడ ఆస్పత్రిలో చికిత్స, టెస్టులు, రూమ్ అద్దెలు, మందులు వాటిలో కమీషన్లు దండుకుంటున్నారు. అలాగే వారి క్లినిక్లలో బిల్లులు లేని నాసిరకం మందులతో దర్జాగా వైద్యం చేస్తున్నారు. మచ్చుకు కొన్ని.. కామవరపుకోట మండలంలోని కళ్లచెరువులో ఓ ఆర్ఎంపీ వచ్చీరాని వైద్యం చేసి రోగి ప్రాణం మీదకు తెచ్చాడు. ఇదే ఆర్ఎంపీ రెండేళ్ల క్రితం సాగిపాడులో ఓ వ్యక్తికి వైద్యం చేయగా అతడు ప్రాణాలు పోయినట్టు స్థానికులు చెబుతున్నారు. కామవరపుకోట మండల కేంద్రంలో ఆర్ఎంపీలు పరిమితికి మించి వైద్యం చేసి ప్రా ణాలు తీయగా మృతుడి కుటుంబంతో రాజీ కుదుర్చుకున్న సందర్భాలు ఉన్నాయి. కామవరపుకోట మండలంలోని వీరిశెట్టిగూడెంలో ఓ యువకుడు న్యుమోనియాతో బాధపడుతూ తడికలపూడిలో ఓ ఆర్ఎంపీ వద్దకు వెళ్లగా వైద్యం వికటించింది. యువకుడిని ఏలూరు ఆస్పత్రికి తీసుకువెళుతుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు. అలాగే కొందరు ఆర్ఎంపీలు సొంతంగా మందులు షాపులు నిర్వహిస్తూ, అక్కడే వైద్యం చేస్తు డబ్బులు దండుకుంటున్నారు. ప్రాణాలతో చెలగాటం వచ్చీరాని వైద్యం చేస్తున్న ఆర్ఎంపీలు నిబంధనలు మీరి క్లినిక్ల నిర్వహణ ధనార్జనే ధ్యేయంగా విధులు గ్రామాల్లో ఇష్టారాజ్యంగా వైద్యసేవలు -
కారుమూరి కాన్వాయ్పై దాడి అమానుషం
మావుళ్లమ్మ సన్నిధిలో కలెక్టర్ భీమవరం(ప్రకాశంచౌక్): మావుళ్లమ్మవారిని గురువారం కలెక్టర్ సీహెచ్ నాగరాణి మాతృమూర్తితో కలిసి దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేయించారు.ఏలూరు (టూటౌన్): ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టు అక్రమని, తణుకులో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కాన్వాయ్ను అడ్డగించి మరీ జనసేన నాయకులు చేసిన వికృత చేష్టలు అమానుషమని వైఎస్సార్సీపీ ఏలూరు ఇన్చార్జి మామిళ్లపల్లి జయప్రకాష్ (జేపీ) ఖండించారు. స్థానిక జిల్లా పార్టీ కార్యాలయంలో గురువారం విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన 13 నెలల వ్యవధిలో నిత్యం వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలను వేధిస్తున్నారని, అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నారన్నారు. సీఎం చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ప్రజల దృష్టిని మరల్చేందుకు ప్రతిపక్షాలను టార్గెట్గా చేసుకోవడం సిగ్గుచేటన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న మద్యం డిస్టిలరీలన్నీ గతంలో టీడీపీ హ యాంలో ఏర్పాటుచేసినవే అని, అలాంటప్పుడు వైఎస్సార్సీపీ హయాంలో అవినీతి ఎలా జరు గుతుందని ప్రశ్నించారు. తణుకులో మాజీ మంత్రి కారుమూరి కాన్వాయ్ను అడ్డగించి ప్రచార రథం ఎక్కిన జనసేన నాయకులు దివంగత వైఎస్సార్, మాజీ సీఎం జగన్ ఫొటోలను కాళ్లతో తొక్కడం హేయమన్నారు. సినిమాల పేరుతో రోడ్లను బ్లాక్ చేయడం, ట్రాఫిక్కు, సాధారణ జనజీవనానికి అంతరాయం కలిగించడం ఏమిటంటూ నిలదీశారు. జిల్లా అధికార ప్రతినిధి మున్నుల జాన్ గుర్నాథ్, రాష్ట్ర ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి నూకపెయ్యి సుధీర్ బాబు, జిల్లా బీసీ సెల్ ప్రెసిడెంట్ నేరుసు చిరంజీవి, ఏలూరు నగర మహిళా విభాగం అధ్యక్షురాలు జుజ్జువరపు విజయనిర్మల, తంగేళ్లమూడి సురేష్, బసవ పాల్గొన్నారు. -
బ్యాగుల నాణ్యతలో డొల్లతనం
ఆగిరిపల్లి: కూటమి ప్రభుత్వం విద్యార్థులకు పంపిణీ చేసిన బ్యాగుల నాణ్యతలో డొల్లతనం బయటపడుతోంది. పట్టుమని పది రోజులు కూడా కాకుండానే బ్యాగులు చిగిరిపోతున్నాయి. ఆగిరిపల్లి జెడ్పీ హైస్కూల్లో ఏడో తరగతి చదువుతున్న విద్యార్థి గురువారం పాఠశాలకు వెళుతుండగా బ్యాగ్ హ్యాండిల్ తెగిపోయింది. దీంతో ఇలా బ్యాగును చేతికి తగిలించుకుని తంటాలు పడుతూ బడికి వెళ్లాడు. మండలంలోని పలు పాఠశాలల్లో విద్యార్థులకు ఇచ్చిన బ్యాగులు జిప్పులు ఊడిపోవడం, చిగిరిపోవడం వంటివి జరుగుతున్నాయని, నాణ్యత లేని బ్యాగులు ఇవ్వడం ఏంటని విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పొగాకు బోర్డులో నమోదు తప్పనిసరి జంగారెడ్డిగూడెం: నారుమడులకు సిద్ధమయ్యే పొగాకు రైతులు పొగాకు బోర్డులో రిజిస్ట్రేషన్ చేయించుకుని రశీదు పొందాలని వేలం కేంద్రం నిర్వాహక అధికారి బి.శ్రీహరి గురువారం ప్రకటనలో తెలిపారు. పంట నియంత్రణలో భాగంగా నర్సరీ నుంచి నిబంధనలు కఠినతరం చేస్తున్నామని పేర్కొన్నారు. సీటీఆర్ఐ, ఐటీసీ సంస్థలు విత్తనాలు సరఫరా చేస్తాయని, వాణిజ్య రైతులు నారుమడులు 2 హెక్టార్ల వరకు విస్తీర్ణంలో రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చని తెలిపారు. హెక్టారుకు రూ.500 రుసుం చెల్లించాలని సూచించారు. బోర్డులో రిజిస్ట్రేషన్ లేకుండా నర్సరీలు వేసే వారిపై చర్యలు తీసుకుంటామని, నమోదు చేయించుకున్న వారి జాబితాను బోర్డు వద్ద ప్రదర్శిస్తామని తెలిపారు. రిజిస్ట్రేషన్ లేని నర్సరీల నుంచి నారు కొనుగోలు చేసి పొగాకు సాగు చేస్తే బేరన్, రిజిస్ట్రేషన్ నిలుపుదల చేస్తామని తెలిపారు. ఆర్టీసీ స్థలాలను కాపాడుకుందాం ఏలూరు (ఆర్ఆర్పేట): విలువైన ఆర్టీసీ స్థలాలను, ప్రజల, ప్రయాణికుల అవసరాలకు కా కుండా ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టే చర్యలను స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ వ్యతిరేకిస్తోందని యూనియన్ రాష్ట్ర ప్రచార కార్యదర్శి టీపీఆర్ దొర అన్నారు. గురువారం ఏలూరు డిపో వద్ద ఆర్టీసీ కార్మికులు నిరసన చేపట్టారు. డిపో కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ధర్నాలో ము ఖ్య అతిథిగా దొర మాట్లాడుతూ విజయవాడ గవర్నర్ పేట–2 డిపో, విజయవాడ పాత బ స్టాండు స్థలాలను బహుళ జాతి సంస్థ ‘లూ లూ’ షాపింగ్ మాల్కు ఇచ్చే ప్రతిపాదనలు విరమించుకోవాలన్నారు. ప్రయాణికులు భవిష్యత్తు రవాణా అవసరాలకు ఉపయోగపడే ఆర్టీసీ స్థలాలు అన్యాక్రాంతం కాకుండా కాపాడాల్సిన ప్రభుత్వమే ఇలాంటి చర్యకు పూనుకోడాన్ని ప్రజలందరూ నిరసించాలని కోరారు. లూలూ షాపింగ్ మాల్ కోసం ఆర్టీసీ డిపోను మరో చోటకు తరలించాలని నిర్ణయించడం వి చారకరమన్నారు. ఆర్టీసీని కాపాడుకోవడం కోసం ప్రజలు, ప్రయాణికులు, ప్రజా సంఘా లు ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. డిపో కార్యదర్శి టీకే రావు, జిల్లా కార్యదర్శి ఎన్.సురేష్, జీవీ శాస్త్రి, సీహెచ్ నారాయణ, ఎ.రమేష్ ప్రసాద్, జీవీ రావు, పి.శ్యామల, బి.సూర్య కళ, వి.సూరన్న, జి.ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. రుణాల మంజూరు వేగిరపర్చాలి ఏలూరు(మెట్రో): జిల్లాలో స్వయం సహాయక సంఘాలకు నిర్దేశించిన మేర రుణ లక్ష్యాలను సాధించాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఆదేశించారు. స్వయం సహాయక సంఘాలకు రుణా ల మంజూరు, ఉపాధి యూనిట్ల గ్రౌండింగ్, తదితర అంశాలపై ఏలూరు కలెక్టరేట్ నుండి డీఆర్డీఏ ఏపీఎంలు, కమ్యూనిటీ కో–ఆర్డినేటర్లతో గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. జిల్లాలో 15,353 సంఘాలకు రూ.1,145.20 కోట్ల రుణాల మంజూరుకు మైక్రో క్రెడిట్ ప్లాన్లను బ్యాంకులకు అందించామన్నారు. ఇప్పటివరకూ 2,888 సంఘాలకు రూ.237 కోట్ల రుణాలను బ్యాంకులు ఆమోదించాయని, మిగిలిన రుణాలను కూడా ఆమోదించేలా డీఆర్డీఏ అధికారులు బ్యాంకర్లతో సమన్వయం చేసుకోవాలన్నారు. -
గుర్రపు డెక్కతో ముంపు ముప్పు
కై కలూరు: కొల్లేరు ప్రాంతానికి ప్రతిఏటా గుర్రపుడెక్క పెద్ద గుదిబండగా మారుతోంది. కొల్లేరుకు చేరే వరద నీటిని సముద్రానికి పంపే పెదఎడ్లగాడి వంతెన వద్ద గుర్రపుడెక్క పేరుకుపోవడంతో లంక గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతోన్నారు. మొత్తం 56 ఖానాలకు గానూ సగం ఖానాలపైనే గుర్రపుడెక్క ఆక్రమించింది. ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాలో 12 మండలాలు పరిధిలో 2,22,300 ఎకరాలు విస్తీర్ణంలో కొల్లేరు సరస్సు విస్తరించి ఉంది. కొల్లేరు పరివాహక ప్రాంతాల్లో మొత్తం 122 గ్రామాలు ఉన్నాయి. డెక్క కారణంగా ప్రతి ఏడాదీ నీటి ప్రవాహం వెనక్కి మళ్లి కొల్లేరు గ్రామాలు ముంపులో చిక్కుకుంటున్నాయి. 67 డ్రెయిన్ల ద్వారా నీరు వరదల సమయంలో ఉమ్మడి కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల నుంచి 67 డ్రెయిన్ల ద్వారా 1.10 లక్షల క్యూసెక్కుల నీరు కొల్లేరుకు చేరుతుంది. నీరంతా కైకలూరు నియోజకవర్గం మండవల్లి మండలం పెదఎడ్లగాడి, చిన్న ఎడ్లగాడి, పోలరాజ్ కాలువల ద్వారా ఉప్పుటేరు మీదుగా సముద్రంలో కలుస్తుంది. వాస్తవానికి కొల్లేరుకు చేరుతున్న 1.10 క్యూసెక్కుల నీటిలో 12 వేల క్యూసెక్కుల నీరు మాత్రమే దిగువకు వస్తుంది. పెదఎడ్లగాడి నుంచి ఉప్పుటేరు వరకు ఛానలైజేషన్ చేయాలని 1895లో ఇరిగేషన్ ఎస్ఈ హుస్సేన్, 1964లో మిత్ర కమిటీ, 1986లో శ్రీరామకృష్ణయ్య కమిటీలు సూచనలు చేశాయి. అయితే ఇవేమి అమలు కాలేదు. దీనికి తోడు ప్రవాహానికి గుర్రపుడెక్క అడ్డు రావడంతో నీరు వెనక్కి మళ్లి లంక గ్రామాలు మునుగుతున్నాయి. కొత్త రైల్వే బ్రిడ్జితో చిక్కులు పెదఎడ్లగాడి వంతెన నుంచి వచ్చే వరద నీరు ఆలపాడు–ఆకివీడు గ్రామాల మధ్య ఉప్పుటేరు నుంచి సముద్రంలోకి చేరాలి. ఉప్పుటేరుపై పాత బ్రిడ్జీ ఉంది. కొన్ని సంవత్సరాల క్రితం డబుల్ లైన్ నిమిత్తం మరో కొత్త బ్రిడ్జిని నిర్మించారు. వాస్తవానికి పాత బ్రిడ్జి ఖానా నుంచి ఖానా మధ్య 30 గజాల దూరం ఉంది. అదే కొత్త బ్రిడ్జి ఖానా నుంచి ఖాన మధ్య కేవలం 10 గజాల దూరం మాత్రమే ఉండడంతో గుర్రపుడెక్క మేటలు వేస్తున్నాయి. ఇప్పటికై నా అధికారులు, నాయకులు స్పందించి గుర్రపు డెక్క సమస్యకు పరిష్కారం చూపాలని కొల్లేరు ప్రాంతవాసులు కోరుతున్నారు. రూ.20 లక్షలతో ప్రతిపాదనలు పెదఎడ్లగాడి వంతెన వద్ద పేరుకుపోయిన గుర్రపుడెక్కను తొలగించడానికి రూ.20 లక్షలతో ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపించాం. ఈ మేరకు నిధులు మంజూరు కావాల్సి ఉంది. కొల్లేరుకు చేరే నీటిని కిందకు పంపడానికి పెదఎడ్లగాడి వంతెన ఎంతో కీలకం. ఎగువ నుంచి వచ్చిన డెక్క ఖానాల మధ్య అడ్డుగా ఉంది. ఎప్పటికప్పుడు నీటి ప్రవాహాన్ని అంచనా వేస్తున్నాం. – ఎం.రామకృష్ణ, డ్రెయినేజీ డీఈఈ, కై కలూరు పెదఎడ్లగాడి వద్ద పేరుకుపోయిన గుర్రపు డెక్క ఆందోళన చెందుతున్న కొల్లేరు ప్రాంతవాసులు -
బహుళ పంటలతో అధిక లాభాలు
కామవరపుకోట: కొబ్బరి, ఆయిల్పామ్ వంటి పంటలో బహుళ పంటలు సాగు చేయటం వల్ల రైతులు అధిక లాభాలు పొందవచ్చునని ఉద్యానవనశాఖ డైరెక్టర్ కె.శ్రీనివాసులు అన్నారు. మండలంలో తడికలపూడి రత్నగిరినగర్, కళ్లచెరువు గ్రామాల్లో ఆయన పర్యటించి అంతర పంటలను పరిశీలించారు తడికలపూడి గ్రామాల్లో కొబ్బరి, ఆయిల్పామ్ పంటలు మల్టీ క్రాఫింగ్ బహుళ పంట సాగు చేస్తున్న రైతుల తోటల్లోని కలెక్షన్ సెంటర్ సోలార్ కోల్డ్ రూమ్ డ్రైవర్ యూనిట్ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు బహుళ పంట సాగు పద్ధతిని అవలంబించాలని అవలంభించడం వల్ల ఆదాయం పెరుగుతుందని తెలిపారు. రత్నగిరినగర్లో కొబ్బరి పంటలో కోకో, మిరియాలు సాగుతో పాటు వివిధ రకాల కొత్త సుగంధ ద్రవ్యాలు పంటలు కూడా పండించే విధానాలను రైతులందరూ అలవాటు చేసుకోవాలని సూచించారు. ఎంత పెట్టుబడి పెడితే ఎంత లాభం వస్తుంది? ఏ పంట వేస్తే ఎకరానికి తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం ఎలా పొందవచ్చు? అనే విషయాలు రైతులకు అవగాహన కల్పించాలన్నారు. ఆయన వెంట మండల ఉద్యానవన శాఖ అధికారి రత్నమాల ఉన్నారు. -
మియావాకి విధానంలో చిట్టడవుల పెంపకం
ద్వారకాతిరుమల: ప్రస్తుత రోజుల్లో నానాటికీ వాతావరణ కాలుష్యం పెరిగిపోతోంది. ఆ కాలుష్యాన్ని తగ్గించాలంటే మొక్కల పెంపకం ఒక్కటే మార్గం. మొక్కల పెంపకంపై ప్రభుత్వాలు ఎన్ని ప్రచారాలు చేస్తున్నా అడవుల శాతం మాత్రం పెరగడం లేదు. ప్రస్తుత పరిస్థితులను పరిశీలిస్తే భవిష్యత్లో ఆక్సిజన్ శాతం భారీగా తగ్గుతుందని స్పష్టమవుతోంది. ఈ తరుణంలో జపాన్ వృక్ష శాస్త్రవేత్త అకీరామియావాకి అనుసరించిన మియావాకి (చిట్టి అడవులు) పద్ధతిలో జనాభా ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో మొక్కలు పెంపకం చేపట్టాలని రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి సూచిస్తోంది. ఈ నేపథ్యంలో ద్వారకాతిరుమల శ్రీవారి క్షేత్రంలో 10 వేల మొక్కలను ఈ మియావాకి పద్ధతిలో నాటుతున్నారు. లక్ష్యంతో ముందుకు.. విశాఖపట్టణానికి చెందిన మైత్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్, మైనింగ్ ఇండియా లిమిటెడ్ చైర్మన్ శ్రీనివాసరావు ఇటీవల 5 వేల నేరేడు, మామిడి, వేప, రావి, మద్ది, కొండ తంగేడి తదితర జాతుల మొక్కలను అందించారు. వీటిని శ్రీవారి కొండపైన టోల్గేట్ పక్కనున్న రెండు ఎకరాల ఖాళీ స్థలంలో మియావాకి పద్ధతిలో నాటుతున్నారు. అలాగే పూళ్లకు చెందిన దాత పీవీ రామాంజనేయులు సహకారంతో శివాలయం కొండ దిగువన రెండు ఎకరాల ఖాళీ స్థలంలో ఫ్రూట్ బియరింగ్, శివుడికి ప్రీతికరమైన మారేడు, నాగమల్లి మొక్కలను నాటుతున్నారు. అదేవిధంగా లక్ష్మీపురం ఆర్చిగేటు వద్ద నుంచి గరుడాళ్వార్ విగ్రహం వరకు ఉన్న రోడ్డు మధ్యలోని డివైడర్లో పాక్ స్టైల్ మొక్కలు, కొత్త బస్టాండ్ వద్ద నుంచి పాత సినిమాహాలు వరకు డివైడర్లో టెర్మిలియన్ మెంటీలియన్ మొక్కలు నాటుతున్నారు. సోము మొక్కలు ప్రత్యేకం కొండపై నాటుతున్న మొక్కల్లో సోము జాతి మొక్క లు ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. ఆలయాల్లో ధ్వజస్తంభాలకు ఈ చెట్లను వినియోగిస్తారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఆలయ అధికారు లు 100 మొక్కలను నాటించారు. ప్రస్తుతం ఈ పనులు ఆలయ ఈఓ ఎన్వీ సత్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో ఈఈ డీవీ భాస్కర్, ఎలక్ట్రికల్ డీఈ టి.సూర్యనారాయణ పర్యవేక్షణలో శరవేగంగా జరుగుతున్నాయి. ద్వారకాతిరుమల శ్రీవారి కొండపై వినూత్న ప్రయోగం 30 శాతం ఆక్సిజన్ పెరుగుతుందంటున్న నిపుణులు మియావాకి విధానమే మేలు మియావాకి విధానంలో మొక్కలు నాటడమే మేలు. పచ్చని ఆహ్లాదకర వాతావరణంతో పాటు స్వచ్ఛమైన గాలి, ఆక్సిజన్ను అందిస్తాయి. క్షేత్రంలో నానాటికి భక్తుల రద్దీ పెరుగుతోంది. ఇలాంటి సమయంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటడం శుభపరిణామం. భవిష్యత్ తరాలకు ఈ చెట్లు ఎంతగానో ఉపయోగపడతాయి. ఈ నెలాఖరు నాటికి 10 వేల మొక్కలు నాటే లక్ష్యాన్ని పూర్తి చేస్తాం. – ఎన్వీ సత్యన్నారాయణ మూర్తి, ఈఓ, ద్వారకాతిరుమల దేవస్థానం -
మియావాకి పద్ధతిలో మొక్కలు నాటే విధానం
● మొక్కలు నాటాలనుకునే భూమిని ఎక్కువ లోతు తవ్వాలి. ● మొక్కల ఎదుగుదలకు అవసరమైన నాణ్యమైన కంపోస్ట్ ఎరువును సారవంతమైన మట్టితో కలిపి గొయ్యిని పూడ్చాలి. ● స్థానిక పరిస్థితులకు అనుగుణంగా వృక్ష జాతులను ఎంపిక చేయాలి. ● ఎక్కువ రకాలు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ● మొక్కకు, మొక్కకు ధ్య దూరం లేకుండా దట్టంగా మొక్కలు నాటాలి. ● పక్కనున్న మొక్కల ఎదుగుదలపై ప్రభావం పడకుండా చిన్న, పెద్ద, మధ్యస్త (ఎత్తు) మొక్కలు ఒకే దగ్గర ఉండేలా రకరకాల వృక్ష జాతులను ఎంపిక చేయాలి. ● ప్రతిరోజూ క్రమం తప్పకుండా డ్రిప్ వంటి పైప్ల ద్వారా నీటిని అందించాలి. మియావాకి పద్ధతితో ప్రయోజనాలివే. ● ఒక్కో ఎకరానికి 4 వేలకు పైగా మొక్కలు నాటవచ్చు. ● చిట్టడవులను తలపించేలా దట్టంగా పెరుగుతాయి. ● జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో స్వచ్ఛమైన గాలి లభిస్తుంది. ● ఈ విధానంతో 30 శాతం ఆక్సిజన్ అందుతుంది. ● 30 రెట్లు త్వరగా మొక్కలు వృద్ధి చెందుతాయి. ● మూడు నుంచి నాలుగేళ్లలోనే 10 రెట్లు పచ్చదనం ఎక్కువగా అభివృద్ధి చెందుతుంది. ● నిర్వహణా వ్యయం చాలా తక్కువ. అలాగే పక్షులు గూళ్లు పెట్టుకోవడానికి వీలుంటుంది -
అభిమానమా?.. ఉన్మాదమా..?: కారుమూరి
సాక్షి, పశ్చిమ గోదావరి: రాష్ట్రంలో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం నియంత పాలనను సాగిస్తోందని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ రీజనల్ కో-ఆర్డినేటర్ కారుమూరి నాగేశ్వరరావు మండిపడ్డారు. తణుకు క్యాంప్ కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఒక మాజీ మంత్రిగా పనిచేసిన తనపైన జనసేన సైకోలు దారుణంగా దాడికి తెగబడ్డారంటే, ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, పోలీస్ వ్యవస్థను దారుణంగా నిర్వీర్యం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా ఆయనేమన్నారంటే..కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో నియంతృత్వంతో కూడిన రాచరిక పాలన నడుస్తోంది. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపుతప్పాయి. మాజీ మంత్రిగా ఉన్న నాకే సరైన రక్షణ లేదు. ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. నిన్న'బాబు ష్యూరిటీ- మోసం గ్యారెంటీ' కార్యక్రమానికి వెళ్తుండగా తణుకు టౌన్ బాయ్స్ హైస్కూల్ వద్ద జనసేనకి చెందిన కొంతమంది రౌడీ మూకలు నా కాన్వాయ్ వాహనం పైకి ఎక్కి దాడి చేసి వాహనాన్ని ధ్వంసం చేశారు. వాహనంపైన ఉన్న మా పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ ఫొటోలపైన నిలబడి హరి హర వీరమల్లు సినిమా జెండాలతో, జనసేన పార్టీ జెండాలతో వీరంగం సృష్టించారు. దాదాపు 15 నిమిషాలకు పైగా రణరంగం సృష్టించారు.గతంలో ఎన్నో సినిమాలు రిలీజైనప్పటికీ ఏ హీరో అభిమానులు కూడా ఇలాంటి సైకో దుందుడుకు చర్యలకు దిగడం తణుకు చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. జనసేన అల్లరి మూకలు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చేసిన ఈ చర్యలకు సామాన్య ప్రజలు సైతం భయభ్రాంతులకు గురయ్యారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి చర్యలు మంచిది కాదు. జనసేన కార్యకర్తల తల్లిదండ్రులు కూడా ఒకసారి ఆలోచించుకోవాలి.ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత పోలీసులదే. ఇప్పటికే ఈ ఘటనపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. రౌడీ మూకలను గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. గతంలోనూ ఎంపీపీ ఎన్నిక సందర్భంగా కూటమి పార్టీలకు చెందిన నాయకులంతా కలిసి అత్తిలిలో నా ఇంటిపైన దాడిచేసి వీరంగం సృష్టించారు.ఒకపక్క పవన్ కళ్యాణ్ ని ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు అభిమానులు అంతగా ప్రేమిస్తుంటే.. ఆయన మాత్రం టీడీపీ నాయకులు అన్యాయం చేస్తున్నారని ప్రశ్నించిన సొంత పార్టీ వారిని సంజాయిషీ కూడా అడగకుండానే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నారు. చంద్రబాబే 15 ఏళ్ళు సీఎంగా ఉంటారని పవన్ పదే పదే చెప్పడాన్ని ఆ పార్టీ కార్యకర్తలు ఓర్చుకోలేకపోతున్నారు. మొన్న తాడేపల్లిగూడెం జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఇదే విషయాన్ని ఆవేదనపూరితంగా చెబితే, పవన్ మాత్రం చాలా క్యాజువల్గా పార్టీ నుంచి వెళ్లిపోవచ్చని సూచించారంటే ఆ పార్టీ వారికి ఆయనిచ్చే గౌరవం అలాంటిది. ఆయన సొంత జనసేన కార్యకర్తల కంటే టీడీపీ నాయకత్వాన్నే ఎక్కువగా ప్రేమిస్తున్నారు. -
రాష్ట్రంలో అసురుల పాలన
యలమంచిలి: రాష్ట్రంలో అసురుల పాలన నడుస్తోందని, వారి పాలనలో మంచి వాళ్లకు కష్టాలు తప్పవని నరసాపురం మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు అన్నారు. స్థానిక తమ్మినీడి ఉమా నరసింహ కల్యాణ మండపంలో బుధవారం జరిగిన వైఎస్సార్సీపీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రపంచంలో మోసపూరిత హామీలకు పేటెంట్ ఉన్న ఏకై క నాయకుడు చంద్రబాబు అన్నారు. చంద్రబాబు ఏనాడు ఒంటరిగా పోటీచేసి గెలిచింది లేదన్నారు. పాలకొల్లులో గత మూడు పర్యాయాలుగా ఓడిపోతున్నా మొక్కవోని విశ్వాసంతో పని చేస్తున్న కార్యకర్తలంతా వజ్రాలేనన్నారు. 2029లో మన పార్టీ అధికారంలోకి వచ్చాక కార్యకర్తల సంక్షేమానికి ప్రాధాన్యత ఉంటుందన్నారు. రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు నూతన కమిటీలు వేస్తున్నామన్నారు. ఈ సారి సభ్యత్వంతోపాటు బీమా కూడా ఉంటుందని ప్రసాదరాజు చెప్పారు. ఒక్క హామీ పూర్తిగా నెరవేర్చలేదు: గుడాల గోపి పాలకొల్లు నియోజకవర్గ ఇన్చార్జి గుడాల శ్రీహరి గోపాలరావు (గోపి) మాట్లాడుతూ సూపర్ సిక్స్ హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఏడాది కాలంలో ఒక్క హామీ కూడా పూర్తిగా అమలు చేయలేదని విమర్శించారు. జగన్ అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లో నవరత్నాలు అమలు చేశారన్నారు. ఏడాది కాలంలో ఒక కొత్త పింఛన్ కూడా ఇవ్వలేదన్నారు. తల్లికి వందనం పథకంలో కోత విధించడంతోపాటు 20 శాతం తల్లులకు అసలు డబ్బులు వేయలేదన్నారు. ఉచిత బస్సు, అన్నదాత సుఖీభవ, నిరుద్యోగ భృతి అసలు అమలుకే నోచుకోలేదన్నారు. మోసానికి ప్రతిరూపం కూటమి ప్రభుత్వం: కవురు ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో ప్రజలు ఇప్పటికే అనేక విధాలుగా నష్టపోయారన్నారు. అవినీతి, లంచాలకు తావులేని ప్రభుత్వం జగనన్నదైతే మోసానికి ప్రతిరూపం కూటమి ప్రభుత్వానిదన్నారు. నరసాపురం పార్లమెంటు ఇన్చార్జి ముదునూరి మురళీ కృష్ణంరాజు మాట్లాడుతూ అన్ని వర్గాలు, కులాలు ప్రజలను మోసం చేసిన ఈ ప్రభుత్వానికి మనమంతా సినిమా చూపిద్దామన్నారు. సూపర్సిక్స్ పథకాలు అమలు చేసే వరకు ప్రజల తరఫున మనమే పోరాటం చేయాలన్నారు. పార్టీ సీనియర్ నాయకుడు గుణ్ణం నాగబాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయలేక, అడిగిన వారిపై కేసులు పెడుతూ పబ్బం గడుపు కుంటుందని విమర్శించారు. డీసీఎంఎస్ మాజీ చైర్మన్ యడ్ల తాతాజీ మాట్లాడుతూ మూడు పర్యాయాలుగా నిమ్మల రామానాయుడు నెగ్గితే నియోజకవర్గంలో అభివృద్ధి 30 ఏళ్లు వెనక్కి వెళ్లిందన్నారు. మంత్రి నిమ్మలది ప్రచారార్భాటమే కానీ ప్రజల సంక్షేమానికి చేసిందేమీ లేదని విమర్శించారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి చిలువూరి కుమార దత్తాత్రేయవర్మ, ఎంపీపీ వినుకొండ ధనలక్ష్మీ రవికుమార్, వైస్ ఎంపీపీలు గొల్లపల్లి శ్రీనివాసరావు, కొప్పాడి శ్రీనుబాబు, సర్పంచ్ల చాంబర్ అధ్యక్షుడు కవురు గోపి, పాలకొల్లు, పోడూరు జెడ్పీటీసీ సభ్యులు నడపన గోవిందరాజులునాయుడు, గుంటూరి పెద్దిరాజు నాయకులు పొత్తూరి బుచ్చిరాజు, ఓదూరి భాస్కరరావు, ఇలపకుర్తి నరసింహారావు, చల్లా విశ్వేశ్వరరావు, నిమ్మకాయల రామకృష్ణ, పెచ్చెట్టి కృష్ణాజీ, బొంతు వెంకట కర్ణారెడ్డి, రావూరి వెంకటరమణ బుజ్జి, మేడిది విజయ జ్ఞానమణి, మద్దా చంద్రకళ, పాలంకి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు యలమంచిలిలో పాలకొల్లు నియోజకవర్గ కార్యకర్తల సమావేశం -
ఆడబిడ్డకు అన్యాయం
రైతులకు నాణ్యమైన నారు వైఎస్సార్ ఉద్యాన వర్సిటీలోని పరిశోధన శిక్షణా కేంద్రంలో తయారుచేసిన నారును రైతులకు అందిస్తున్నామని వర్సిటీ వీసీ కె.గోపాల్ తెలిపారు. 8లో uఆడ్డబిడ్డ నిధిపై నీలినీడలు గురువారం శ్రీ 24 శ్రీ జూలై శ్రీ 2025సాక్షి, భీమవరం: ఆడబిడ్డ నిధి కోసం ఎదురుచూస్తున్న పేద మహిళల ఆశలపై టీడీపీ ముఖ్య నేత, కీలక మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు వ్యాఖ్యలు నీళ్లు చల్లాయి. ఈ పథకాన్ని అమలు చేస్తే ఆంధ్రాను అమ్మాలన్న సంచలన వ్యాఖ్యలతో ఆడబిడ్డ నిధి అమలు లేనట్టేనని స్పష్టం చేశారు. ఎంత ఖర్చవుతుందో ఎన్నికలప్పుడు తెలియదా అని కూటమి తీరుపై మహిళలు మండిపడుతున్నారు. అధికారంలోకి రావడమే ఆలస్యం 2024 జూన్ నెల నుంచే 19 ఏళ్ల నుంచి 59 ఏళ్ల వరకు పేద మహిళలకు నెలకు రూ. 1500 చొప్పున ఏడాదికి రూ. 18000 ఆర్థిక సాయం అందిస్తామని కూటమి హామీ ఇచ్చింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు, పవన్ కల్యాణ్లు జిల్లాలో ఎక్కడకు వచ్చినా ఇదే విషయాన్ని ఊదరగొట్టారు. బాబు ష్యూరిటీ–భవిష్యత్తు గ్యారంటీ పేరిట ప్రజలకు పంచిన బాండ్లలో సైతం ఈ పథకం కింద కుటుంబానికి ఎంత లబ్ధి చేకూరుతుందో పేర్కొన్నారు. సీఎంగా చంద్రబాబు, డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్లు పాలన చేపట్టి ఏడాది పూర్తయినా ఈ పథకంపై నోరుమెదపడం లేదు. తొలి ఏడాది రూ.1073 కోట్ల నష్టం సార్వత్రిక ఎన్నికల నాటికి జిల్లాలో 7,51,313 మంది మహిళ ఓటర్లు ఉన్నారు. వృద్ధాప్య పింఛన్ అందుకుంటున్న లబ్ధిదారులు 1,26,061 మంది ఉండగా వారిలో మహిళలు 60 శాతం ఉంటారని అంచనా. ఈ మేరకు ఓఏపీ లబ్ధిదారులు 75,636 మంది ఉండగా, వితంతు 49,564, సింగిల్ ఉమెన్ 6,926, అభయహస్తం 8,908, దివ్యాంగులు సుమారు 14000 మంది కలిపి మహిళ లబ్ధిదారులు 1,55,034 మంది ఉన్నారు. వీరిని మినహాయించి కూటమి మేనిఫెస్టో మేరకు జిల్లాలో ఆడబిడ్డ నిధి పథకానికి 5,96,279 మంది అర్హులు ఉంటారని అంచనా. ఈ మేరకు నెలకు రూ. 89.44 కోట్లు చొప్పున గత ఏడాది కాలానికి రూ.1073 కోట్లు మేర ప్రభుత్వ సాయాన్ని ఆడబిడ్డలు నష్టపోయారు. భార్యను చంపిన భర్త అరెస్టు చేపల చెరువు అమ్మకానికి భార్య అడ్డుపడుతోందని కక్ష పెంచుకుని హత్య చేసిన భర్తను కలిదిండి పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. 8లో uమహిళలకు మేలు చేసిన జగన్ సర్కారు వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో వైఎస్సార్ ఆసరా, చేయూత, కాపునేస్తం, ఈబీసీ నేస్తం తదితర పథకాల ద్వారా పేద మహిళలకు జగన్ సర్కారు అండగా నిలిచింది. ఆసరా కింద జిల్లాలోని 2,70,380 మంది డ్వాక్రా మహిళల రూ.1,107 కోట్ల రుణాలను మాఫీ చేశారు. 45 నుంచి 60 ఏళ్ల లోపు బీసీ మహిళలకు ఏడాదికి రూ. 18,750 చొప్పున జిల్లాలోని సగటున 61,750 మంది మహిళలకు నాలుగేళ్లలో రూ.4 63.41 కోట్ల సాయాన్ని అందించారు. కాపు నేస్తంగా కాపు, బలిజ, ఒంటరి, తెలగ సామాజిక వర్గాలోని సుమారు 28,004 మంది మహిళలకు నాలుగేళ్లలో రూ.168.02 కోట్లు, ఈబీసీ నేస్తంగా క్షత్రియ, రెడ్డి, కమ్మ, బ్రాహ్మణ, వైశ్య తదితర ఓసీ సామాజికవర్గాల్లోని 12,827 మంది పేద మహిళలకు గత నాలుగేళ్లలో రూ. 57.71 కోట్ల సాయం అందజేశారు. న్యూస్రీల్ 19 నుంచి 59 ఏళ్ల మధ్య మహిళలకు నెలకు రూ.1500 ఇస్తామని హామీ జిల్లాలో 5.96 లక్షల మందికి అర్హత గతేడాది రూ.1,073 కోట్లు ఎగ్గొట్టిన చంద్రబాబు సర్కారు మంత్రి అచ్చెన్న వ్యాఖ్యలతో మహిళల్లో ఆందోళన ఇప్పటికే తల్లికి వందనం కొర్రీలతో నష్టపోయిన మహిళలు సూపర్ సిక్స్లోని హామీని అమలు చేయకుండా చంద్రబాబు సర్కారు అన్యాయం చేసింది. ఈ హామీని అటకెక్కించే ప్రయత్నాలు చేస్తున్నట్టు కనిపిస్తోంది. ఈ పథకం అమలుచేయాలంటే ఆంధ్రాను అమ్మాలంటూ.. మంగళవారం మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు ఇందుకు బలం చేకూరుస్తున్నాయి. ఇప్పటికే తల్లికి వందనం అర్హులకు కూటమి ఎగనామం పెట్టింది. జిల్లాలో అర్హులైన విద్యార్థులు 2,29,106 మంది ఉండగా ఇప్పటివరకు 1,87,990 మందికి మాత్రమే సాయం జమచేసింది. ఒక్కో విద్యార్థికి రూ.13 వేలకు గాను కొందరికి రాష్ట్ర వాటాగా రూ. 8500 నుంచి రూ.9000 మాత్రమే ఇచ్చింది. కేంద్రం వాటా త్వరలో జమవుతుందని మెసేజ్లు పంపి చేతులు దులుపుకుంది. ఆడబిడ్డ నిధి పట్టాలెక్కించుకుండానే పక్కనపెట్టే వ్యాఖ్యలపై మహిళలు భగ్గుమంటున్నారు. ఎంత ఖర్చవుతుంది? పథకం అమలుకు ఆదాయ వనరులు ఏమిటి? అనే విషయం ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టే ముందు తెలియదా? అని ప్రశ్నిస్తున్నారు. -
బీసీ మహిళపై కూటమి నేతల వేధింపులు
పెనుగొండ: కూటమి నేతలు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ బీసీ మహిళా సర్పంచ్ చెక్ పవర్ను రద్దు చేయడం అన్యాయమని వైఎస్సార్ సీపీ ప్రజా ప్రతినిధులు మండిపడ్డారు. పోడూరు మండలం పండిత విల్లూరు సర్పంచ్ ఇళ్ల లక్ష్మీ చంద్రిక చెక్ పవర్ పునరుద్ధరించాలంటూ బుధవారం ఎంపీడీవో కార్యాలయం వద్ద వైఎస్సార్ సీపీ నేతలు ఆందోళన నిర్వహించారు. అనంతరం ఎంపీడీవోకు వినతిపత్రం సమర్పించారు. వైఎస్సార్ సీపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచ్లు, ఇతర ప్రజాప్రతినిధులకు విలువ నివ్వకుండా గ్రామాల్లో కూటమి నాయకులు పెత్తనం చెలాయిస్తున్నారని ఆరోపించారు. 15వ ఆర్థిక సంఘ నిధులు సైతం కనీసం సర్పంచ్కు తెలియనివ్వకుండా ఖర్చు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వీరికి స్థానిక ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ మద్దతు పలుకుతున్నారని ఆరోపించారు. కన్నీరు పెట్టుకొన్న బీసీ మహిళా సర్పంచ్ కక్ష సాధింపులో భాగంగానే తనపై లేనిపోని ఆరోపణలు చేస్తూ చెక్ పవర్ రద్దు చేశారని పండిత విల్లూరు సర్పంచ్ ఇళ్ల లక్ష్మీ చంద్రిక కన్నీరు పెట్టుకొన్నారు. పండిత విల్లూరు కనీసం పంచాయతీ సభ్యుడు కాని గణపతినీడి రాంబాబు తనను కించపరుస్తూ సర్పంచ్ కుర్చీలో కూర్చోని పెత్తంన చెలాయిస్తున్నారన్నారు. అహంకారంతో శ్రీప్రభుత్వం మాది.. మా మాటే వేదవాక్కుశ్రీ అంటూ అధికారులపై పెత్తనం చెలాయిస్తున్నారన్నారు. ప్రశ్నించినందుకు ఆరోపణలు చేసి, అధికారులపై ఒత్తిడి తెచ్చి తన చెక్పవర్ రద్దు చేయించారన్నారు. బీసీ మహిళా సర్పంచ్ అని చూడకుండా స్థానిక ఎమ్మెల్యే పితాని దీనికి వత్తాసు పలికారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించకపోతే పోరాటం తప్పదని వైఎస్సార్ సీపీ నాయకులు హెచ్చరించారు. నిరసనలో జెడ్పీటీసీలు గుంటూరి పెద్దిరాజు, కర్రి గౌరీ సుభాషిణి, ఆచంట, పోడూరు మండల సర్పంచ్ల చాంబర్ అధ్యక్షులు సుంకర సీతారామ్, గుబ్బల ఉషారాణి వీరబ్రహ్మం, సర్పంచ్లు మట్టాకుమారి, బుర్రా రవికుమార్, చుట్టగుళ్ల పూర్ణిమ, గొట్టుముక్కల సోనీయా, నామన వీర్రాజు, తమనంపూడి వీర్రేడ్డి, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి దంపనబోయిన బాబూరావు, మండల కన్వీనర్లు పిల్లి నాగన్న, నల్లిమిల్లి వేణుబాబు, కర్రి వేణుబాబు, చింతపల్లి గురుప్రసాద్, గెద్దాడ ఏకలవ్య, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు. కక్ష సాధింపులతో సర్పంచ్ చెక్ పవర్ రద్దు వైఎస్సార్ సీపీ నేతల ఆందోళన -
ప్రజల దృష్టిని మరల్చేందుకే అరకమ కేసులు
యలమంచిలి: ఎన్నికల హామీలను అమలు చేయడంలో విఫలమైన కూటమి ప్రభుత్వం ప్రజల దృష్టిని మరల్చేందుకు ప్రతిపక్ష నాయకులపై అక్రమ కేసులు బనాయించి, అరెస్ట్లు చేస్తున్నారని వైఎస్సార్ సీపీ పాలకొల్లు నియోజకవర్గ ఇన్చార్జి గుడాల శ్రీహరి గోపాలరావు (గోపి) విమర్శించారు. ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డి అక్రమ అరెస్ట్ను నిరసిస్తూ వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ ఉచ్చుల స్టాలిన్బాబు నాయకత్వంలో యలమంచిలి సెంటర్లో బుధవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. సెంటర్లోని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి అనంతరం మిథున్రెడ్డి అక్రమ అరెస్ట్ను నిరసిస్తూ నినాదాలు చేశారు. పార్టీ నాయకులు ఎంపీపీ వినుకొండ ధనలక్ష్మీ రవికుమార్, చిలువూరి కుమార దత్తాత్రేయవర్మ, చల్లా విశ్వేశ్వరరావు, గుడాల సురేష్, మల్లుల కొండ, వీరా ఉమా శంకర్, నల్లి సంధ్యారాణి, తోట సుబ్బారావు, మోకా నరసింహారావు, పులి వెంకట సుబ్రహ్మణ్యం, మల్లుల బుజ్జి, విప్పర్తి సత్యనారాయణ, కాకుమళ్ల ఆంజనేయులు, దిడ్ల రాజబాబు, వినుకొండ చిన్న, మానుకొండ సోమరాజు, రామేశ్వరపు రఘు, శీలం రామారావు, గాడి దుర్గాప్రసాద్, గుబ్బల వాసు, బుంగా జయరాజు పాల్గొన్నారు. -
మహిళలను మోసం చేయడం తగదు
ఆడబిడ్డ నిధి కింద మహిళలకు నెలకు రూ.1500 ఇస్తామని ఎన్నికల్లో కూటమి నేతలు హామీ ఇచ్చారు. ఇప్పుడు మంత్రి అచ్చెన్నాయుడు మాటలు వింటుంటే పఽథకం అమలు చేయరని అర్ధమైపోయింది. ఎన్నికల్లో మహిళలకు హామీలు ఇచ్చి అమలు చేయకుండా మోసం చేయడం ప్రభుత్వానికి తగదు. – కావలి రామసీత, కౌన్సిలర్, నరసాపురం మోసం చేయడం టీడీపీకి అలవాటే హామీలు ఇచ్చి మోసం చేయడం టీడీపీకి, చంద్రబాబునాయుడికి అలవాటే. ఆడవారికి పథకాలు ఇవ్వాలంటే చేతులు రావడం లేదు. ఆడబిడ్డ నిధి రూ.1500 ప్రకటించి 13 నెలలుగా అమలు ఊసేలేదు. ఇప్పుడు ఇస్తారో లేదో వారికే తెలియడం లేదు. – పోతంశెట్టి లక్ష్మి, పెంటపాడు ఏ హామీనీ అమలు చేయడం లేదు ఎన్నికల సమయంలో కూటమి పార్టీలు ఇచ్చిన ఏ ఒక్క హామీని సక్రమంగా అమలు చేయడం లేదు. 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1500 ఇస్తానని చెప్పారు. అధికారం చేపట్టి 14 నెలలు కావొస్తున్నా ఇచ్చిన హామీని అమలు చేయలేదు. – బుడితి శ్రీలత, అత్తిలి హామీలు అమలు చేయకపోతే దిగిపోవాలి మాటపై నిలబడి తత్వం కూటమి ప్రభుత్వానికి లేదు. హామీలకు కరపత్రాలు, గ్యారంటీ బాండ్లు పంపిణీ చేశారు. మహిళలను మోసం చేయడానికే రూ.1500 ఆడబిడ్డ నిధి అంటూ ఎన్నికల్లో ఊదరగొట్టారు.ఇచ్చిన హామీల అమలు చేతకాకపోతే దిగిపోవాలి. – రావూరి వెంకటరమణ, మాజీ ఎంపీపీ, యలమంచిలి ● -
విద్యుత్ మీటరు బిగింపుతో సమస్య పరిష్కారం
యలమంచిలి: కనకాయలంక పంచాయతీ డొల్లవారిపేటకి చెందిన డొల్ల విజయలక్ష్మి ఇంటికి బుధవారం విద్యుత్ శాఖ అధికారులు విద్యుత్ మీటర్ బిగించారు. గ్రామానికి చెందిన టీడీపీ నాయకుల ఒత్తిడితో పంచాయతీ, విద్యుత్ శాఖ అధికారులు నాలుగు రోజుల క్రితం ఆ మీటరు తొలగించారు. దీంతో గ్రామానికి చెందిన వైఎస్సార్ సీపీ, జనసేన నాయకులు ఆందోళన చేశారు. ఈ క్రమంలో మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు నన్నేటి పుష్పరాజ్ బుధవారం కనకాయలంక వెళ్లి పంచాయతీ కార్యదర్శి అనుమతితో విద్యుత్ మీటర్ ఏర్పాటు చేసినా కనీసం నోటీస్ ఇవ్వకుండా ఎలా తొలగిస్తారని ప్రశ్నించారు. ప్రభుత్వ అధికారులు వైఖరి మార్చుకొని ఎక్కడైతే మీటర్ తొలగించారో అదే స్థానంలో మీటర్ ఏర్పాటు చేయకపోతే ఆందోళన చేస్తామని హెచ్చరించారు. దీంతో విద్యుత్ శాఖ లైన్ ఇన్స్పెక్టర్ వెంకటరమణ వెంటనే మీటరు బిగించడంతో సమస్య పరిష్కారమైంది. కార్యక్రమంలో ఉద్యోగ సంఘాల జిల్లా అధ్యక్షుడు నేతల సాల్మన్ రాజు, గ్రామస్తులు పినిపే పెద్దిరాజు, గూటం వెంకటేశ్వరరావు, నాగేశ్వరరావు, సరేళ్ళ రాజు, గుడిసె శ్రీను, పైడి వెంకటేష్, సరేళ్ళ తేజ, పినిపే ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. -
ఆస్తి కోసం భార్యను చంపిన భర్త అరెస్టు
కై కలూరు, ఏలూరు టౌన్ : చేపల చెరువు అమ్మకానికి భార్య అడ్డుపడుతోందని కక్ష పెంచుకుని కత్తితో అతి కిరాతకంగా హత్య చేసిన భర్తను కలిదిండి పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. ఈ కేసు వివరాలను కలిదిండి పోలీసు స్టేషన్లో ఏలూరు డీఎస్పీ డి.శ్రావణ్కుమార్, సీఐ వి.రవికుమార్ వెల్లడించారు. కలిదిండి మండలం ఎస్ఆర్పీ అగ్రహారం శివారు కట్టావానిపాలెంకు చెందిన కట్టా పెద్దిరాజు(48), జయలక్ష్మి (44) భార్యభర్తలు. వీరికి ఇరువురు మగ సంతానం. గ్రామంలో 33 సెంట్లు చేపల చెరువును విక్రయించి వివాహం జరిగిన పెద్ద కుమారుడికి నగదు ఇవ్వాలని భార్య జయలక్ష్మి భావించింది. ఈ విషయమై ఇద్దరి మద్య గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కొన్నిరోజుల క్రితం పెద్దిరాజు భీమవరంలో వైద్యం చేయించుకుని వస్తూ కాళ్ల మండలం, దొడ్డనపూడి గ్రామంలో కత్తిని కొనుగోలు చేసి ఇంటిలో దాచాడు. చెరువు విక్రయం విషయంలో ఈ నెల 9న రాత్రి భోజనం చేసిన తర్వాత భార్యభర్తలు గొడవపడ్డారు. ముందుగా తెచ్చుకున్న కత్తితో 10వ తేదీ తెల్లవారుజామున భార్యను విచక్షణ రహితంగా నరికి చంపాడు. తనపై దాడి జరుగుతుందని భావించి పురుగుమందు తాగి, చాకుతో పీకపై కోసుకుని ఆపై ఉరివేసుకుని ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. అతడిని 108 వాహనంలో ఏలూరు ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. కుమారుడు రాము ఫిర్యాదుపై కోలుకొని వచ్చిన తర్వాత పెద్దిరాజును అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. కార్యక్రమంలో కలిదిండి ఎస్సై వి.వెంకటేశ్వరరావు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
రైతులకు నాణ్యమైన నారు
తాడేపల్లిగూడెం: డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన వర్సిటీలోని విశిష్ట రక్షిత సాగు పరిశోధన శిక్షణా కేంద్రంలో తయారుచేసిన నారును రైతులకు అందిస్తున్నామని, సద్వినియోగం చేసుకోవాలని ఉద్యాన వర్సిటీ ఉపకులపతి డాక్టర్ కె.గోపాల్ తెలిపారు. ఈ కేంద్రం ద్వారా అందిస్తున్న నారు తదితర విషయాల గురించి బుధవారం వివరించారు. కూరగాయల ఉత్పత్తి నేలలో వ్యాధుల వల్ల దిగుబడి తగ్గుతుందన్నారు. ఇది రైతుల జీవనోపాధిని ప్రభావితం చేస్తుందన్నారు. కూరగాయల పెంపకంలో కొత్త పద్ధతి గ్రాఫ్టెడ్ ఖ్యాతి పొందిందన్నారు. అంటుకట్టిన కూరగాయల నారు ద్వారా నేల ద్వారా సంక్రమించే వ్యాధులు ఉండవన్నారు. వంగ, టమాటా, మిరప పంటలకు కావాల్సిన నారును వర్సిటీలోని విశిష్ట రక్షిత సాగు కేంద్రంలో పెంచుతున్నామని వీసీ చెప్పారు. అంటుకట్టిన నారును రైతుల అవసరాల మేర అందిస్తున్నామన్నారు. తెగుళ్ల నిరోధక శక్తి కలిగి, అంటు కట్టిన కూరగాయల నారు కావాలంటే 30 రోజులు ముందుగా ఈ కేంద్రంలో రైతులు తమ వివరాలు నమోదు చేసుకోవాల్సి ఉందన్నారు. సంప్రదాయ టమాట, మిరప వంగడాల కంటే గ్రాఫ్టెడ్ వంగడాల వాడకం వల్ల దిగుబడులు 30 నుంచి 50 శాతం పెరిగాయన్నారు. వంగలో రెండింతల దిగుబడి పెరిగిందన్నారు. రైతులకు అంటు కట్టిన కూరగాయల మొక్కలు రూ.10కు ఇస్తామన్నారు. నారు కావాల్సిన వారు ఉద్యాన వన విభాగం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి.రమేష్బాబు 94921 85716 నంబరులో సంప్రదించాలన్నారు. ఉద్యాన వర్సిటీ వీసీ కె.గోపాల్ -
క్షీరారామంలో రుద్రహోమం
పాలకొల్లు సెంట్రల్: స్థానిక శ్రీ క్షీరారామలింగేశ్వరస్వామి ఆలయంలో మాసశివరాత్రి సందర్భంగా బుధవారం రుద్రహోమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 12 మంది దంపతులు పాల్గొని స్వామివారికి అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. ఆలయ అభిషేక పండిట్ భమిడపాటి వెంకన్న బ్రహ్మత్వంలో పూజా కార్యక్రమాలు జరిపారు. హోమం అనంతరం భక్తులను స్వామివారి శేషవస్త్రంతో సత్కరించి ప్రసాదాలు అందజేశారు. ఆలయ సూపరింటెండెంట్ పి వాసు, అర్చకులు వీరబాబు తదితరులు పాల్గొన్నారు. శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యం పోలవరం రూరల్: పోలవరంలో నూతనంగా నిర్మించిన పోలీస్ స్టేషన్ భవనాన్ని బుధవారం హోం మంత్రి వంగలపూడి అనిత బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అభివృద్ధి వేగంగా సాగాలంటే శాంతిభద్రతల పర్యవేక్షణ అత్యంత ముఖ్యమైనదన్నారు. పోలీసు వ్యవస్థ బలోపేతానికి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడమే ఈ భవనాల నిర్మాణ లక్ష్యమన్నారు. పోలీస్స్టేషన్ ఆవరణ మొత్తం ఆమె పరిశీలించి వివరాలను డీఎస్పీ ఎం.వెంకటేశ్వరరావు నుంచి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే చిర్రి బాలరాజు, ట్రైకార్ ఛైర్మన్ బొరగం శ్రీనివాసులు, ఏలూరు రేంజ్ ఐజీ అశోక్కుమార్, ఎస్పీ కేపీఎస్ కిషోర్, సీఐ బాల సురేష్, ఎస్సై ఎస్ఎస్ పవన్కుమార్ పాల్గొన్నారు. ‘ఓ రోజు శాస్త్రవేత్త అవుతారా’లో ఏలూరు విద్యార్థి ఏలూరు (ఆర్ఆర్పేట): కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా దేశవ్యాప్తంగా 37 ప్రయోగశాలలో నిర్వహిస్తున్న ‘ఓ రోజు శాస్త్రవేత్త అవుతారా’ కార్యక్రమానికి ఏలూరు వెన్నవల్లి వారిపేటలోని సెయింట్ జోన్స్ హైస్కూల్ ఎనిమిదో తరగతి విద్యార్థి తంజంగారి భార్గవ్ సాయి హనుమ సీఎస్ఐఆర్ చైన్నె కేంద్రానికి ఎంపికయ్యాడు. బుధవారం చైన్నె అడయార్లోని సీఎస్ఐఆర్ కేంద్రంలో దక్షిణ భారత వ్యాప్తంగా విచ్చేసిన 75 మంది విద్యార్థులతో శాస్త్రవేత్తలతో పలు అంశాలకు సంబంధించిన విషయాలు తెలుసుకొని, వారిలో కలిగే ప్రశ్నలకు జవాబులు, సైన్స్ ల్యాబ్లో జరిగే ఎన్నో పరిశోధనలను పరిశీలించే కార్యక్రమంలో పాల్గొన్నాడు. విద్యార్థులకు నిర్వాహకులు సర్టిఫికెట్లు అందించారు. -
‘రాజు గాని సవాల్’ చిత్ర బృందం సందడి
ఏలూరు (ఆర్ఆర్పేట): రాజు గాని సవాల్ చిత్రబృందం బుధవారం ఏలూరులో సందడి చేసింది. స్థానిక సత్యనారాయణ థియేటర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కథానాయకుడు లెలిజాల రవీందర్ మాట్లాడారు. తన జీవితంలో జరిగిన కొన్ని ఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించామన్నారు. ఆగస్టు 8న విడుదల కానుందని తెలిపారు. హీరోయిన్ రితిక చక్రవర్తి మాట్లాడుతూ తాను ఇప్పటివరకు తమిళ చిత్రాల్లో నటించగా తెలుగులో తనకి ఇది మూడో చిత్రమన్నారు. డిస్ట్రిబ్యూటర్ బాపిరాజు పాల్గొన్నారు. యువకుడిపై పోక్సో కేసు భీమవరం (ప్రకాశంచౌక్): భీమవరం వన్టౌన్ పోలీస్స్టేషన్ పరిధిలో బాలికపై లైంగిక దాడికి యత్నించిన భానుతేజ అనే యువకుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు వన్ టౌన్ సీఐ నాగరాజు తెలిపారు. బుధవారం తెల్లవారుజామున భీమవరం బేతనిపేటకు చెందిన బాలిక గదిలోకి భానుతేజ చొరబడి ఆమైపె లైంగిక దాడికి యత్నించగా బాలిక కేకలు వేయడంతో పారిపోయాడు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ చెప్పారు.బావ, బావమరిదులకు తీవ్ర గాయాలు భీమడోలు: జాతీయ రహదారి సూరప్పగూడెం ఫ్లై ఓవర్ వంతెన వద్ద బుధవారం ఓ లారీ బైక్ను ఢీకొట్టిన ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ద్వారకాతిరుమల మండలం తిరుమలంపాలెంకు చెందిన ముదరబోయిన కొండయ్య, తాడిశెట్టి రామకృష్ణ బావ, బావమరుదులు. వీరు బుధవారం కుటుంబ పనుల నిమిత్తం బైక్పై విజయవాడ వెళ్తున్నారు. సూరప్పగూడెం ఫ్లైఓవర్ వంతెనపై వెళ్తూ రాంగ్ రూట్లో డివైడర్ దాటుతుండగా ఏలూరు నుంచి రాజమండ్రి వైపు వస్తున్న లారీ ఆ బైక్ను వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బావమరుదులూ తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారిలో కొండయ్య పరిస్థితి విషమంగా ఉంది. భీమడోలు ఎస్సై వై.సుధాకర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అనుమానాస్పద స్థితిలో విద్యార్థి మృతి
ముసునూరు: గత రెండు రోజులుగా అదృశ్యమైన ఇంటర్ విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ముసునూరు ఎస్సై ఎ చిరంజీవి కథనం మేరకు మండలంలోని లోపూడి గ్రామానికి చెందిన బిలుగుది గోపాలరావు కుమారుడు చందూ(17) పదో తరగతి పాస్ అయ్యాడు. ఇటీవల ధర్మాజీగూడెంలోని ఓ ప్రైవేటు కాలేజీలో చేరగా కొద్ది రోజుల క్రితం అతని స్నేహితులు ఏలూరులో చదువుతున్నట్లు తెలుసుకుని అక్కడ కాలేజీలో చేర్చారు. అనంతరం తమ సమీప బంధువుల కుమార్తె ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేటలో చదువుతున్న విషయం తెలుసుకుని అక్కడ కాలేజీలో చేర్చారు. ఈ నేపథ్యంలో శుక్రవారం కళాశాలలో ఇంటికి వెళ్తున్నట్లు చెప్పి కొండపర్వలోని తన బంధువుల ఇంటికి వెళ్లి ఆదివారం వరకు అక్కడే ఉన్నాడు. సోమవారం కాలేజీకి బయలుదేరాడు. కాని అటు వెళ్లకుండా అమ్మమ్మ వాళ్ల గ్రామం రమణక్కపేట చేరుకున్నాడు. అక్కడ నుంచి సాయంత్రం వరకు చెక్కపల్లి, ధర్మాజీగూడెం గ్రామాల్లో సంచరించి రాత్రి 7 గంటలకు లోపూడి చేరుకుని అదృశ్యమయ్యాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు బంధువుల గ్రామాల్లో గాలించినా చందూ ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో సామవారం సాయంత్రం ముసునూరు పోలీసులను ఆశ్రయించారు. కాగా బుధవారం తమ ఇంటి సమీపంలో ఉన్న ఖాళీ ఇంటిలోని టాయిలెట్లో విద్యార్థి ఉరి వేసుకుని మృతి చెంది ఉండడాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చెప్పారు. -
కుళాయి కనెక్షన్లకు కూటమి వసూళ్లు
భీమవరం అర్బన్: మండలంలోని తాడేరు గ్రామంలో కూటమి నాయకులు గ్రామస్తులపై ప్రత్యేక పన్నులు వేసి డబ్బులు వసూలు చేస్తున్నారన్న విమర్శలు సర్వత్రా వెల్లువెత్తుతున్నాయి. తాడేరు గ్రామంలో మొత్తం జనాభా 3,600 పైగా నివసిస్తున్నారు. వీరికి తాగునీటిని సరఫరా చేసేందుకు వెయ్యి కుళాయి కనెక్షన్లు ఉన్నాయి. గ్రామస్తులకు అవసరమయ్యే తాగునీటిని పంచాయతీ అధికారులు సరిపెట్టలేకపోతున్నారని పలువురు విమర్శిస్తున్నారు. గ్రామంలో ఎవరైనా కుళాయి కనెక్షన్ల కోసం పంచాయతీ ద్వారా అన్ని అనుమతులు పొందితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం గ్రామ పంచాయతీకి రూ.4,100 చెల్లించాలి. గతంలో కొత్తగా కుళాయి కనెక్షన్లు పొందాలంటే మైక్రో ఫిల్టర్లు ఏర్పాటు చేస్తేనే కాని అనుమతులు ఇవ్వమని పంచాయతీ అధికారులు గ్రామస్తులకు తెలియజేశారు. అయితే ఇప్పటికే గ్రామంలో తాగునీరు సరిపోక తీవ్ర ఇబ్బందులు పడుతుంటే మైక్రో ఫిల్టర్లు ఏర్పాటు చేయకుండానే కొత్తగా 40 కుళాయి కనెక్షన్లు పంచాయతీ అధికారులు మంజూరు చేయడంపై గ్రామంలో తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. గ్రామాభివృద్ధి కమిటీ పేరుతో అదనపు వసూళ్లు నూతనంగా కుళాయి కనెక్షన్ తీసుకోవాలంటే అన్ని అనుమతులు ఉంటే రూ.4,100 చెల్లిస్తే సరిపోతుంది. అయితే జనసేన నాయకులు గ్రామాభివృద్ధి కమిటీ పేరుతో మరో రూ.5,900 కలిపి మొత్తం రూ.11 వేలు కడితేనే నూతన కుళాయి కనెక్షన్ ఇస్తున్నారని గ్రామస్తులు చెబుతున్నారు. ప్రత్యేకంగా గ్రామాభివృద్ధి కమిటీ పేరుతో ఒక రసీదు బుక్కు తయారుచేయించి నాన్ లేఅవుట్లలో కుళాయి కనెక్షన్ పొందాలనుకునే వారి నుంచి రూ.11 వేలు, అన్ని అనుమతులు ఉండి కుళాయి కనెక్షన్ పొందాలనుకుంటే రూ.6 వేలు చొప్పున వసూలు చేసి జనసేన నాయకులు రసీదులు ఇస్తున్నారని చెబుతున్నారు. ఈ విధానం పూర్తిగా ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకమని, అధికార పార్టీ నాయకులు వసూళ్లు చేసి దోపిడీ చేస్తున్నారన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. అంతేకాకుండా అక్రమ వసూళ్లను గ్రామంలోని వివిధ పార్టీల నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వసూళ్లు చేసిన నగదును ఏ అభివృద్ధికి వినియోగిస్తారో.. ఎవరికి లెక్కలు చెబుతారో కూడా తెలియని పరిస్థితి. గ్రామ కార్యదర్శి వివరణ గ్రామాభివృద్ధి కమిటీ పేరుతో వసూళ్ల విషయమై గ్రామ కార్యదర్శి పార్వతిని వివరణ కోరగా ఆ కమిటీకి, పంచాయతీకి ఎలాంటి సంబంధం లేదని, కుళాయి కనెక్షన్కు అన్ని అనుమతులు ఉంటే రూ.4,100 చెల్లిస్తే మంజూరు చేస్తామని చెప్పారు. గ్రామ అభివృద్ధి కమిటీ పేరుతో దందా రూ.11 వేల చొప్పున వసూలు గ్రామస్తుల మండిపాటు -
పీడీ అసభ్య ప్రవర్తనపై విచారణ
కలిదిండి (కై కలూరు): స్థానిక ప్రభుత్వ జెడ్పీ ఉన్నత పాఠశాల పీడీ కోటి రత్నదాస్పై బాలికలు, హెచ్ఎం చేసిన ఆరోపణలపై జిల్లా విద్యాశాఖాధికారిణి వెంకటలక్ష్మమ్మ ఆదేశాలతో డీవైఈవో నిమ్మగడ్డ రవీంద్రభారతీ పాఠశాలలో బుధవారం విచారణ చేశారు. విద్యార్థినుల పట్ల పీడీ అసభ్యకర ప్రవర్తనపై మంగళవారం మీడియా ద్వారా వెలుగు చూసింది. హెచ్ఎం బి.స్వర్ణకుమారి, మరో 19 మంది ఉపాధ్యాయుల నుంచి ముందుగా రూపొందిచిన ప్రశ్నావళిని డీవైఈవో పూర్తి చేయించారు. బాలికల నుంచి పూర్తి వివరాలను తెలుసుకున్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న పీడీ రత్నదాసు నుంచి వివరణ తీసుకున్నారు. విచారణ నిమిత్తం పది రోజుల పాటు అతనితో ప్రేరేపిత సెలవు పెట్టించారు. విచారణ అధికారి రవీంద్రభారతీ మాట్లాడుతూ హెచ్ఎం, సహచర ఉపాధ్యాయులు, బాలికల నుంచి వివరాలు సేకరించామని, నివేదికను జిల్లా అధికారికి సమర్పిస్తామని చెప్పారు. కార్యక్రమంలో కలిదిండి మండల ఎంఈవోలు రవిప్రకాష్, శ్రీనివాసరావు, ఐసీడీఎస్ కై కలూరు సెక్టార్ సీడీపీవో డాక్టర్ ఎన్.దీప్తి, ఏలూరు ఐసీడీఎస్ సాంస్థగతేతర సంరక్షణ అధికారి(పీవోఎన్ఐసీ) జయలక్ష్మి, పాఠశాల హెచ్ఎం బి.స్వర్ణకుమారి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
తణుకులో జనసేన రౌడీ మూకల వీరంగం
సాక్షి, పశ్చిమ గోదావరి: తణుకులో జనసేన రౌడీ మూకలు వీరంగం సృష్టించారు. మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు కాన్వాయ్లోని ప్రచార రథంపై దాడి చేశారు. హరిహర వీరమల్లు రిలీజ్ సందర్భంగా తణుకులో జనసేన కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. అదే మార్గంలో ‘బాబు షూరిటీ-మోసం గ్యారంటీ’ కార్యక్రమానికి వెళుతున్న కారుమూరి కాన్వాయిని జనసేన కార్యకర్తలు చుట్టుముట్టారు.ప్రచార రథంపై ఎక్కి.. జనసేన జెండాలు ఊపుతూ.. ప్రచార రథాన్ని ధ్వంసం చేశారు. ప్రచార రథం వెనుక.. కారులో కారుమూరి ఉన్నారు. జనసేన రౌడీ మూకలపై వైఎస్సార్సీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. -
మహిళల భద్రత ప్రశ్నార్థకం
బుధవారం శ్రీ 23 శ్రీ జూలై శ్రీ 2025సాక్షి ప్రతినిధి, ఏలూరు : చిన్నారులకు రక్షణ లేదు. గుడ్ టచ్.. బ్యాడ్ టచ్ గురించి పూర్తిగా తెలియకుండానే అత్యాచారాలకు గురవుతున్నారు. గంజాయి మత్తులో మానవ మృగాలు వావీవరుసలు చూడకుండా అత్యాచారాలకు తెగబడుతున్నారు. ప్రశాంతతకు మారుపేరైన ఉమ్మడి పశ్చిమలో ఓ వైపు గంజాయి గుప్పుమంటుంటే.. మరోవైపు అత్యాచార ఘటనలు వ్యవస్థకే సవాలుగా మారుతున్నాయి. అత్యాచారం జరిగాక.. అది కూడా బాధితులు పోలీస్స్టేషన్కు వెళ్ళి ఫిర్యాదు చేస్తే సాధారణ కేసుల్లాగా ఫోక్సో కేసులు నమోదు చేసి చేతులు దులుపుకోవడం మినహా పోలీస్ వ్యవస్థ మరేమి చేయకపోవడంతో మహిళా భద్రత ప్రశ్నార్ధకంగా మారింది. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో చిన్నారులు మొదలుకొని అనేక మందిపై లైంగిక దాడులు, అత్యాచారాల ఘటనలు తరుచూ జరుగుతున్నాయి. ప్రధానంగా గంజాయి మత్తులో ఎక్కువ నేరాలు ఘటనలు జరుగుతున్నట్లు గుర్తించినా కట్టడి చేస్తున్న దాఖలాలు అంతగా లేదు. ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల పోలీసులు గంజాయిపై ఉక్కుపాదం మోపుతున్నాం.. పెద్ద సంఖ్యలో కేసులు నమోదు చేస్తున్నామని ప్రత్యేక సదస్సులు, సెమినార్లు నిర్వహిస్తున్నారే తప్పా మూలాల్లోకి వెళ్ళి కట్టడికి ప్రయత్నించని పరిస్ధితి. ఏలూరు జిల్లాలో ఇంతవరకు 20 గంజాయి కేసులు నమోదు చేసి 700 కేజీల గంజాయిని సీజ్ చేసి 40 మందిని అరెస్టు చేశారు. పశ్చిమగోదావరి జిల్లాలో 64 కేసులు నమోదు చేసి 641 కేజీల గంజాయిని సీజ్ చేశారు. అంతే తప్ప ఒడిశా నుంచి ఎలా వస్తుంది.. స్థానిక విక్రేతలు ఎవరు.. గతంలో సస్పెట్ షీట్లు నమోదైన వారు, గతంలో కేసుల్లో అరెస్టు అయినవారు ఏం చేస్తున్నారు.. జిల్లాలో పరిస్ధితి ఏంటనే దానిపై పూర్తి స్థాయిలో సమీక్షించకపోవడంతో ఉమ్మడి జిల్లాలో ప్రతి రోజూ గంజాయి మత్తులో ఏదోచోట దాడులు, దౌర్జన్యాలు సాగుతూనే ఉన్నాయి. దీంతో పాటు అత్యాచార కేసులు కూడా ఎక్కువగా నమోదు కావడం కలవరపరుస్తుంది.న్యూస్రీల్ పశ్చిమలో పేట్రేగిపోతున్న హింసా ప్రవృత్తి గంజాయి మత్తులో యువత లైంగిక దాడికి బలవుతున్న చిన్నారులు, యువతులు పోక్సో కేసులతో సరిపెడుతున్న పోలీసులు ఉమ్మడి జిల్లాలో వారానికో ఘటన జరిగినా స్పందన శూన్యం -
తాగునీటి కోసం బిందెలతో నిరసన
పెనుగొండ: దళిత వాడలో తాగునీటి పట్ల వివక్ష చూపుతున్నారంటూ ఆచంట వేమవరం శివారు పడమటి పాలెంలో మహిళలు బిందెలతో నిరసన తెలిపారు. మంగళవారం ఉదయం కుళాయి వద్ద బిందెలతో ఆందోళన చేశారు. వీరికి మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు నన్నేటి పుష్పరాజ్ మద్దతు పలికారు. దళిత వాడపై వివక్ష చూపుతున్నారని ఆరోపించారు. ఇతర ప్రాంతాల్లో తాగునీటిని అందిస్తూ దళిత వాడకు అందించడం లేదన్నారు. సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చినా గ్రామ కార్యదర్శి ఇంతవరకూ పరిష్కరించలేదన్నారు. డ్రెయినేజీలు ఏర్పాటు చేయడంలేదన్నారు. సమస్యలు పరిష్కరించకపోతే మాల మహానాడు ఆధ్వర్యంలో ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో పిల్లి స్వరూప రాణీ, తరపట్ల గంగారత్నం, సాక జ్యోతి తదితరులు పాల్గొన్నారు. -
ఎంపీ మిథున్రెడ్డి అరెస్టు అన్యాయం
కై కలూరు: రాజకీయ కక్షతోనే ఎంపీ మిథున్రెడ్డిని అక్రమంగా అరెస్టు చేశారని వైఎస్సార్సీపీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వర రావు (డీఎన్నార్) మండిపడ్డారు. కై కలూరు సీతారామ ఫంక్షన్ హాలులో నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశంలో మిథున్రెడ్డి అక్రమ అరెస్టును వ్యతిరేకిస్తూ మంగళవారం పోస్టర్లను అవిష్కరించారు. కూటమి పాలనలో జరుగుతున్న అన్యాయాలపై రెండు ఎల్ఈడీ భారీ స్క్రీన్లపై ప్రదర్శన ఆకట్టుకుంది. డీఎన్నార్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ అక్రమ అరెస్టులను ఖండిచాలన్నారు. రేషన్ షాపుల తనిఖీ ఆకివీడు: రాష్ట్రంలో ఆకివీడులోని సచివాలయం–1 పరిఽధిలోని మూడు రేషన్ షాపులు అధ్వానంగా పనిచేస్తున్నాయని, ప్రజా వ్యతిరేకతలో ప్రథమ స్థానంలో ఉన్నాయని జాయింట్ కలెక్టర్ రాహూల్ కుమార్ రెడ్డి అన్నారు. మంగళవారం మూడు రేషన్ షాపుల్ని తనిఖీ చేశారు. బియ్యం అమ్మకాలు, నిల్వల రికార్డు, బియ్యం పరిశీలించారు. అనంతరం డీలర్లతో మాట్లాడుతూ వినియోగదారులతో దురుసుగా ప్రవర్తిస్తున్నారని, సమయానికి షాపు తెరవడం లేదని, వృద్ధులకు, ఇతరులకు వేలిముద్రలు వేయించుకుని సరుకులు ఇవ్వడంలేదనే ఆరోపణలు ప్రభుత్వ విచారణలో తేలాయని చెప్పారు. ఈ విధంగా ప్రవర్తిస్తే చర్యలు తప్పవన్నారు. వీఆర్వోలు ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాలన్నారు. ప్రతీ వంద మంది వినియోగదారుల వద్దకు వెళ్లి డీలర్ల వల్ల అసౌకర్యం జరుగుతుందా, సరుకులు బాగా ఇస్తున్నారా లేదా అనేది విచారణ చేసి నివేదికలు ఇవ్వాలని ఆదేశించారు. సురక్షితంగా తల్లి చెంతకు ఏలూరు టౌన్: ఏలూరు పాతబస్టాండ్ సమీపంలో రూరల్ ఎస్ఐ సీహెచ్ దుర్గాప్రసాద్ తన సిబ్బందితో సోమవారం రాత్రి వాహన తనిఖీలు చేపట్టారు. అనుమానాస్పదంగా కనిపించిన ఆటోను తనికీ చేశారు. ఆటోలో పాఠశాల యూనిఫాంతో బాలికను గుర్తించి ఆరా తీశారు. తల్లి మందలించటంతో ఇల్లు వదిలి విజయవాడ వెళ్ళాలనే ఉద్దేశంతో ఏలూరు వచ్చిందని తెలిసింది. వెంటనే అప్రమత్తమైన ఎస్సై పూర్తి వివరాలు సేకరించి బాలిక తల్లిదండ్రులకు సమాచారం అందించారు. బాలికను సురక్షితంగా తల్లికి అప్పగించారు. దాడి ఘటనలో 12 మందిపై కేసు పెదవేగి: ఓ వ్యక్తిపై దాడి చేసి అతని పామాయిల్ గెలలు అపహరించుపోయారన్న ఫిర్యాదుపై పెదవేగి పోలీసులు 12 మందిపై కేసు నమోదు చేశారు. పెదవేగి ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. దెందులూరు మండలం సోమవరప్పాడుకు చెందిన వేమూరి బసవ పున్నయ్య పెదవేగి మండలం కొప్పులవారిగూడెంలో పామాయిల్ సాగు చేస్తున్నాడు. ఈ నెల 21న తోటలోని గెలలను కోసి పెదవేగి పామాయిల్ ఫ్యాక్టరీకి తరలిస్తుండగా, మధ్యలో సుమారు 25 బైక్లపై కొంతమంది దౌర్జన్యంగా బసవపున్నయ్య, ట్రాక్టర్ డ్రైవర్పై దాడి చేసి, కంట్లో కారం కొట్టి, బలవంతంగా పామాయిల్ గెలల లోడుతో ఉన్న ట్రాక్టర్ను రామశింగవరం కలెక్షన్ పాయింట్కు తరలించి, అక్కడ అన్లోడ్ చేశారు. ఈ ఘటనలో వేంపల నాగరాజు, వెంపల తంబి, కల్లెం చినదాసు, ఉప్పె రంగరావు, దానం శ్రీను, చిమ్మె సురేష్, వలుకుల వినోద్, వలుకుల తాతబాబు, వలుకుల సుబ్రహ్మణ్యం, బొమ్మగంటి చిన్న సురేష్, బొమ్మగంటి పెద్ద సురేష్, పరుచూరి వరుణ్ చౌదరిలపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. -
ఎఫ్ఆర్ఎస్ను తక్షణం రద్దు చేయాలి
అంగన్వాఢీలకు భారంగా మారిన ఎఫ్ఆర్ఎస్ (ముఖ కవళికల గుర్తింపు) విధానాన్ని తక్షణం రద్దుచేయాలి. నాణ్యమైన సెల్ ఫోన్లు, నెట్ కనెక్షన్లు అందించాలి.ఇతర కారణాల వల్ల రిజిష్టర్ కాని అంగన్వాఢీ లబ్దిదారులకు మాన్యూవల్గా రేషన్ అందించేందుకు అవకాశం కల్పించాలి. – పి.సుజాత, అధ్యక్షురాలు, అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలనే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అంగన్వాడీ కార్యకర్తలకు నెలకు రూ.26 వేలు కనీస వేతనం అందించాలి. పీఎఫ్, ఉద్యోగ భద్రత, గ్రాట్యుటీ అందించాలి. అంగన్వాడీలపై రాజకీయ వేధింపులను తక్షణం నిలుపుదల చేయాలి. అంగన్వాడీల పోరాటానికి సీఐటీయూ మద్దతు ఇస్తుంది. – డీఎన్వీడీ ప్రసాద్, జిల్లా ప్రధాన కార్యదర్శి, సీఐటీయూ హామీలను నెరవేర్చాలి ముఖ్యమంత్రి చంద్రబాబు అంగన్వాడీల సమస్యల పరిష్కారానికి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను తక్షణం అమలు చేయాలి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాది దాటినా చిరు ఉద్యోగులమైన అంగన్వాడీల సమస్యల పట్ల నిర్లక్ష్యం వహించడం తగదు. అవసరమైతే కేంద్రంతో మాట్లాడి ఎఫ్ఆర్ఎస్ విధానాన్ని రద్దుచేసేలా చూడాలి. – పి.భారతి, ప్రధాన కార్యదర్శి, అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ సంక్షేమ పథకాలను అమలు చేయాలి అంగన్వాఢీ వర్కర్స్, హెల్పర్స్కు ప్రభుత్వ సంక్షేమ పధకాలు అన్నింటినీ అమలు చేయాలి. తల్లికి వందనం పథకంను అంగన్వాఢీలకు ఇవ్వక పోవడం సరికాదు. మినీ సెంటర్లను మెయిన్సెంటర్లుగా మార్చాలి. సెంటర్ మెయింటినెన్స్ ఛార్జీలు చెల్లించాలి. అపరిష్కృతంగా ఉన్న అంగన్వాఢీల సమస్యలపరిష్కారానికి చర్యలు తీసుకోవాలి. – టి.మాణిక్యం, కోశాధికారి, అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ ● -
పోరుబాటకు అంగన్వాడీలు సిద్ధం
అంగన్వాడీల ప్రధాన డిమాండ్లు ● టేక్ హోం రేషన్, ఇతర సేవల కొరకు ఎఫ్ఆర్ఎస్ ధ్రువీకరణ తప్పనిసరి చేసే నిబంధన అమలును వెంటనే ఆపాలి. ● అంగన్వాడీ రిపోర్టింగ్ విధానం డిజిటలైజేషన్ అమలుకు ముందే ఆయా కేంద్రాలన్నింటికీ కంప్యూటర్/లాప్టాప్/టాబ్లు అందించాలి. ● అంగన్వాడీ కేంద్రాల్లో ఫ్రీ వైఫై కనెక్షన్ అందించాలి. లేదా డేటాకు సరిపడా నగదు చెల్లించాలి. ● సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం ఆధార్ ధ్రువీకరణ, ముఖ గుర్తింపు వంటివేమీ లేకుండానే లబ్ధిదారులందరికీ నాణ్యమైన అనుబంధ పోషకాహారాన్ని అందించాలి. ● పోషణ్ ట్రాకర్ యాప్కు సంబంధించిన సమస్యలు చర్చించటానికి అంగన్వాడీ ఫెడరేషన్స్ అన్నింటితో కలిపి మూడు పక్షాలతో కూడిన సమావేశం వెంటనే నిర్వహించాలి. ● నెలకు రూ.26 వేల కనీస వేతనం, పెన్షన్, సామాజిక భద్రతా సదుపాయాలు ,గ్రాట్యుటీ వంటివి అమలు చేయాలి.ఏలూరు (టూటౌన్): ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అంగన్వాడీలు పోరు బాటకు సిద్దమవుతున్నారు. అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఇప్పటికే ఏలూరు కలెక్టరేట్, ఐసీడీఎస్ కార్యాలయాల వద్ద ధర్నాలు చేపట్టారు. కూటమి ప్రభుత్వం మాత్రం సమస్యల పరిష్కారానికి ముందుకు రాకపోవడంతో అంగన్వాడీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎంతో కాలంగా కోరుతున్న సమస్యల పరిష్కారం కోసం రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్త ఉద్యమాన్ని చేపట్టేందుకు వెనుకాడేది లేదని హెచ్చరిస్తున్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చి సంవత్సరం గడిచినా ఎన్నికల ముందు చెప్పిన వాటి ఊసే ఎత్తడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అమ్మకు వందనం అంగన్వాడీలకు ఎందుకు వేయలేదని ప్రశ్నిస్తున్నారు. చాలీచాలని వేతనాలతో పనిచేస్తున్న అంగన్వాడీకు అమ్మకు వందనం, సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మినీ వర్కర్లు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ సెంటర్లు నిర్వహిస్తున్నారని వారిని వెంటనే మెయిన్ వర్కర్లుగా గుర్తించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ముఖ గుర్తింపు విధానం రద్దు చేయాలి ముఖ గుర్తింపు విధానాన్ని తక్షణం రద్దు చేయాలని కోరుతున్నారు. 2022 లో ఇచ్చిన మొబైల్ ఫోన్లో యాప్లు పని చేయడం లేదని, యాప్లో అప్లోడ్ చేయకపోతే సరుకులు ఇవ్వమని చెప్పడం సమంజసం కాదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మారుమూల ప్రాంతాలలో నేటికీ సిగ్నల్స్ రాక అనేక ఇబ్బందులు పడుతుంటే అధికారులు ఏమీ పట్టనట్లు వ్యవహారిస్తున్నారని విమర్శిస్తున్నారు. తక్షణమే గర్భిణులు, బాలింతలు, చిన్న పిల్లలకు పేస్ యాప్ రద్దు చేయాలని కోరుతున్నారు. సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలని వినతి కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలి -
బెల్ట్ షాపులు తొలగించాలి
దిగొచ్చిన అధికారులు రైతుల ఆందోళనకు అధికారులు దిగొచ్చారు. ఉంగుటూరు మండలం తోకలపల్లి మురుగుకోడు రావులపర్రు రెగ్యులేటర్ షట్టర్లను మంగళవారం ఎత్తారు. 8లో uఏలూరు (టూటౌన్): సందుకో బెల్ట్ షాపుతో కల్లుగీత వృత్తి చిన్నాభిన్నం అయిపోయిందని కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జుత్తిగ నరసింహమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక కొత్త బస్టాండ్ సమీపంలోని సీఐటీయూ జిల్లా కార్యాలయంలో ఏలూరు సర్కిల్ కల్లుగీత కార్మికుల సమావేశం మంగళవారం బెజవాడ వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిధిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ జిల్లాలో బెల్ట్ షాపులు ఐదు వేల వరకు ఉన్నాయని ఆరోపించారు. రాష్ట్రంలో కల్తీ మద్యం హల్ చల్ చేస్తున్నా ఎకై ్సజ్ అధికారులు కన్నెత్తి చూడటం లేదని విమర్శించారు. బెల్టు షాపులు పెడితే బెల్టు తీస్తామని సీఎం ఆదేశాల ప్రకారం తక్షణం బెల్ట్ షాపులు తొలగించి కల్లుగీత కుటుంబాలకు ఉపాధి కాపాడాలని విజ్ఞప్తి చేశారు. కల్లుగీత కుటుంబాలను తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కన్నీరు పెట్టిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. అనకాపల్లి పరవాడ కేంద్రంగా కల్తీ మద్యం రాకెట్ పాలకొల్లును స్థావరంగా చేసుకొందన్నారు. పాలకొల్లులో కల్తీ మద్యం తయారుచేసి తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కాకినాడ జిల్లాలకు పారిస్తున్నట్లు పత్రికలలో వస్తున్నా అధికారులు స్పందించకపోవడం అన్యాయం అన్నారు. హైదరాబాద్ నుంచి స్పిరిట్ తీసుకొచ్చి రంగు నీళ్లు కలిపి బ్రాండెడ్ కంపెనీల బాటిల్స్లో నింపి విక్రయిస్తున్నారని. తెలుగుదేశం పార్టీ ముఖ్య నేత అనుచరుడే కల్తీ దందా నడుపుతున్నట్లు విస్తృతంగా ప్రచారం జరుగుతోందన్నారు. ఆగస్టు 18న గీత కార్మికులందరూ మన గోడు ఏలూరు కలెక్టర్ గారికి చెప్పుకుందాం కార్యక్రమానికి తరలిరావాలని విజ్ఞప్తి చేశారు. -
అక్కడ ఏడాదంతా పందేల జాతరే
సాక్షి, టాస్క్ ఫోర్సు: ఆ ఆసామి తాలూకా వ్యవసాయ క్షేత్రం ప్రయోగాలకు కేంద్రంగానే కాకుండా, జూద క్రీడా ప్రాంగణంగా మారడం చర్చనీయాంశంగా మారింది. ఈ తోటకు తాడేపల్లిగూడెం వ్యాపార కేంద్రంలో మంచి పేరుంది. ఒకప్పుడు పేకాటకు కేరాఫ్గా ఉండే ఈ ప్రాంతం నూతన ప్రభుత్వ హయాంలో కోడి పందేల అడ్డాగా మారింది. రాత్రయితే జాతరే జాతర. తొమ్మిదైతే చాలు తోటకు నలువైపులా ఉన్న దారులు తెరుచుకుంటాయి. క్వారీ ల్యాండ్, లారీ స్టాండ్లు దాటి వచ్చిన వాహనాలు ఈ తోట వైపునకే దారి తీస్తాయి. ప్రైవేటు సైన్యం పహరాలో , నిఘాలో ఉన్న ఈ క్షేత్రానికి ఉన్న రెండు ద్వారాలు ఐడెంటిఫికేషన్ పరేడ్ ముగిసిన తర్వాత వాహనాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తారు. ఇక ఆ తర్వాత ఫ్లడ్లైట్ల కాంతిలో కొక్కొరొకో శబ్దాలు, కాయ్రాజా కాయ్ అంటూ పందెగాళ్లు నోట్ల కట్టలతో జూద క్రీడా విన్యాసంతో వీర విహారం చేస్తారు. రాత్రంతా కోడి పందేలు నిర్వహిస్తున్నా, పోలీసులు తమకేం తెలియదన్నట్టు అటువైపు వెళ్లడానికి సాహసించరు. అధికారానికి సలాం అంటూ మాకెందుకులే అనుకుంటారు. దీంతో ఈ జూద క్రీడకు అడ్డూఅదుపు లేకుండా పోయిందని ప్రజలు విమర్శిస్తున్నారు. ఎంత నిఘా ఉన్నా ఉన్నతాధికారులు ఎందుకు కఠిన చర్యలు తీసుకోవడం లేదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పోలీసు డివిజన్ కార్యాలయం జూద క్రీడా ప్రాంగణంగా చెబుతున్న ప్రాంతానికి కొద్ది దూరంలోనే ఉన్నా, అధికారులు చర్యలు ఎందుకు తీసుకోవడం లేదో తెలియదంటున్నారు. కొన్ని రోజులు జూదాలకు అడ్డుకట్ట పడినట్టుగా కనిపించినా ప్రస్తుతం వారం రోజులుగా కోడి పందేలు ఆ తోటలో యథేచ్ఛగా సాగుతున్నాయని అంటున్నారు. టార్పాలిన్ పందిరి, చుట్టూ ఫెన్సింగ్, కుర్చీలు, తినేందుకు అన్ని వసతులు ఆ తోటలో సమకూర్చడంతో రాష్ట్రంలోని పందెంగాళ్లు ఇక్కడకు డబ్బుల కట్లతో వాలిపోతున్నారు. అధికారం అండతోనే.. జూద నిర్వాహకులు కూటమికి చెందిన పార్టీ నేతగా చెబుతున్నారు. పందేల నిర్వాహణలో పీహెచ్డీ చేసిన ఆ వ్యక్తి నేతృత్వంలో జూద దందా మూడు పందేలు.. ఆరు నోట్ల కట్టలుగా సాగుతుందని చెబుతున్నారు. అధికార నేతల అండదండలతో అసాంఘిక కార్యక్రమాలు సాగుతున్నా, ఎవరూ పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఇప్పటికై నా పందేలను అడ్డుకోవాలని స్థానికులు కోరుతున్నారు. పోలీసులు అసలు పట్టించుకోరు నిఘా కూడా అంతే... అధికార పార్టీ ఆశీస్సులు, అండాదండాతోనే యథేచ్ఛగా -
టిడ్కో ఇళ్ల సమస్య పరిష్కరించాలి
పాలకొల్లు సెంట్రల్: టిడ్కో ఇళ్లను పూర్తి చేసి సౌకర్యాలు కల్పించి అర్హులైన వారికి అందించాలని కోరుతూ మంగళవారం సీపీఎం నాయకులు ఎర్ర వంతెన వద్ద ధర్నా చేశారు. ఆ పార్టీ జిల్లా కార్యదర్శి గోపాలన్ మాట్లాడుతూ పాలకొల్లులో ఇళ్ల స్థలాలు కొనుగోలు చేసి 18 ఏళ్లు గడిచినా నేటికీ ఇళ్ల నిర్మాణం పూర్తి కాలేదని విమర్శించారు. ఇళ్లు పొందిన అర్హులు ఇప్పటికే కొంతమంది చనిపోయారన్నారు. ఈ ప్రభుత్వానికి పేదవాడి ఇంటి సమస్య పట్టడం లేదన్నారు. టిడ్కో ఇళ్ల ప్రాంతాల్లో విష సర్పాల సంచారంతో ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారని, పొదలు తొలగించి పారిశుధ్య సమస్య మెరుగుపరచాలన్నారు. ప్రజలకు నివాసయోగ్యంగా ఉండేటట్లు ఇళ్ళు నిర్మించి వెంటనే అందించాలని ఆయన డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు ఇళ్ల స్థలాలుగా ఇస్తామన్న కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది గడచినా ఇంతవరకు ఒక సెంటు భూమి కూడా పేదలకు ఇవ్వలేదన్నారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు పాల్గొన్నారు మోటార్బోర్ల వైర్ల చోరీ కేసులో ముగ్గురి అరెస్ట్ జంగారెడ్డిగూడెం: మోటార్ బోరు కేబుల్ వైర్ల చోరీకి సంబంధించి ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు ఎస్సై షేక్ జబీర్ తెలిపారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. వేగవరం గ్రామానికి చెందిన దార విశ్వేశ్వర శ్రీనివాస్కు చెందిన పొలంలో ఈ నెల7వ తేదీ రాత్రి రూ.1.60 లక్షలు విలువైన 650 మీటర్ల బోరు కేబుల్ వైరు చోరీకి గురైంది. అదే రోజు రాత్రి మరో 8 మంది రైతుల పొలాల్లో బోర్లకు సంబంధించి కరెంటు వైర్లు కట్ చేసి గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేశారు. అలాగే ఈ నెల 9వ తేదీ రాత్రి అదే గ్రామానికి చెందిన మోటేపల్లి సుబ్రహ్మణ్యంకు చెందిన రూ.2 లక్షలు విలువైన 810 మీటర్ల మోటార్ కేబుల్వైరు, సమీపంలోని మరో 8 మందికి చెందిన మోటార్ల కేబుల్ వైర్లు చోరీకి గురయ్యాయి. దీనిపై రైతులు పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేయగా, అక్కడ నుంచి వచ్చిన సమాచారం మేరకు సోమవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు ఎస్సై తెలిపారు. డీఎస్పీ యు.రవిచంద్ర ఆదేశాల మేరకు సీఐ ఎంవీ సుభాష్ పర్యవేక్షణలో ఎస్సై జబీర్, ఏఎస్సై ఎన్వీ సంపత్కుమార్, పీసీ ఎన్.రమేష్ నిందితుల కోసం గాలించారు. ఈ క్రమంలో మంగళవారం మధ్యాహ్నం వేగవరం ఇందిరా కాలనీ వద్ద అదే గ్రామానికి చెందిన నిందితులు తాళరి రామకృష్ణ, చెల్లూరి నాగరాజు, పసలపూడి రాజులను అరెస్టు చేసినట్లు ఎస్సై తెలిపారు. వీరి వద్ద నుంచి రూ. 3.60 లక్షల 19 రోల్స్ కేబుల్ వైర్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితులను కోర్టులో హాజరుపరచగా, 15 రోజులు రిమాండ్ విధించినట్లు చెప్పారు. -
అమెరికాలో కేవీఎస్కు సన్మానం
ఏలూరు (ఆర్ఆర్పేట): కళా రంగానికి, నాట్య రంగానికి చేస్తున్న సేవలకు అభినందిస్తూ తనను అమెరికా తెలుగు సంఘం (ఆటా) ప్రతినిధులు ఈ నెల 21వ తేదీన డల్లాస్ నగరంలో ఘనంగా సత్కరిచినట్టు కూచిపూడి నాట్య గురువు, కళారత్న కేవీ సత్యనారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. ఆటాతో పాటు ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం, తానా సభ్యులు ఈ సన్మాన కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. ప్రముఖ సాహితి వేత్త, సంయుక్త కార్యదర్శి శారద సింగిరెడ్డి నిర్వహణలో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో ఆటా ప్రెసిడెంట్ ఎలెక్ట్ సతీష్ రెడ్డి, తానా పూర్వ అధ్యక్షుడు తోటకూర ప్రసాద్ కేవీ సత్యనారాయణ సేవలను కొనియాడారు. ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం వారు ఈ నెల 19న నిర్వహించిన నెల నెలా వెన్నెల సాహిత్య సభ వార్షికోత్సవంలో కేవీ సత్యనారాయణ ప్రదర్శించిన కాలార్చన గూర్చి ప్రశంసిస్తూ అభినందిచారు. ఏషియన్ చాంపియన్షిప్ పోటీలకు జెస్సీ దెందులూరు: సౌత్కొరియాలో ఈనెల 23 నుంచి జరిగే ఏషియన్ చాంపియన్షిప్ పోటీల్లో పాల్గొనేందుకు ఇంటర్నేషనల్ స్కేటర్ ఎం.జెస్సీ మంగళవారం వెళ్లారు. కోచ్తో పాటు వెళుతున్న 9 మందిలో ఏలూరు జిల్లా దెందులూరు మండలం జోగన్నపాలెం గ్రామానికి చెందిన మాత్రపు జెస్సీ ఒకరు. ప్రతి రెండేళ్లకు ఒకసారి ఏషియన్ చాంపియన్షిప్ పోటీలు జరుగుతాయి. ఈ పోటీల్లో విజయం సాధించాలని కుటుంబ సభ్యులు, బంధువులు, క్రీడాభిమానులు ఆకాంక్షించారు. పోక్సో కేసులో మూడేళ్ల జైలు నూజివీడు: పోక్సో కేసులో ఓ ముద్దాయికి మచిలీపట్నంలోని పోక్సో కోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. వివరాల ప్రకారం.. నిందితుడు రెడ్డి త్రిమూర్తులు 2019 మార్చి 26న రాత్రి 9 గంటల సమయంలో బాలికను పట్టణంలోని పెద్ద చెరువు ప్రాంతానికి తీసుకెళ్లి లైంగిక దాడికి యత్నించాడు. బాలిక అరవడంతో చుట్టుపక్కల వారు రాగా నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు. దీనిపై బాలిక తండ్రి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో అప్పటి ఎస్సై సీహెచ్ రంజిత్కుమార్ కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో సాక్షులను విచారించిన అనంతరం నేరం రుజువు కావడంతో మచిలీపట్నంలోని పోక్సో కోర్టు సెషన్స్ జడ్జి గాజుల వెంకటేశ్వర్లు ముద్దాయి రెడ్డి త్రిమూర్తులుకు మూడేళ్ల జైలు శిక్ష, రూ.వెయ్యి జరిమానా విధిస్తూ మంగళవారం తీర్పు వెలువరించారు. జరిమానా చెల్లించకపోతే మరో నెల జైలుశిక్షను అదనంగా అనుభవించాలని, బాధితురాలికి నష్టపరిహారం కింద రూ.50 వేలను చెల్లించాలని జడ్జి ఆదేశాలు జారీచేశారు. -
విద్యాభ్యాసం.. మురుగునీటితో సహవాసం
పోలవరం రూరల్: పోలవరం మండలం ఎల్ఎన్డీపేట గ్రామంలోని మురుగునీరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలోకి చేరుతోంది. నీరు బయటకు వెళ్లే మార్గంలేక, డ్రెయిన్ సౌకర్యం లేక రోజుల తరబడి నిలిచిపోతోంది. దీంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనికితోడు వర్షం కురిస్తే ఇక అంతే సంగతులు. పాఠశాల ఆవరణ చెరువును తలపిస్తూ ఉంటుంది. మధ్యాహ్న భోజన పథకంలో ద్యార్థులు భోజనం అనంతరం చేతులు శుభ్రం చేసుకునేందుకు ఆ మురుగు నీటిలోనే చేతిపంపు వద్దకు వచ్చి చేతులు శుభ్రం చేసుకోవాల్సిన దుస్థితి. దీంతో విద్యార్థులు అనారోగ్యాల బారిన పడే ప్రమాదం ఉందని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. కచ్చా డ్రెయిన్ తవ్వి నీరు బయటకు పోయేలా చర్యలు తీసుకోవాలని విద్యార్థులు కోరుతున్నారు. -
కోటిపల్లి రైల్వేలైన్ నిర్మాణంలో కదలిక
నరసాపురం: నరసాపురం–కోటిపల్లి రైల్వేలైన్ నిర్మాణంలో మళ్లీ కాస్త కదిలిక వచ్చింది. ఈ భారీ ప్రాజెక్ట్ నిర్మాణానికి సంబందించి ఎంతోకాలంగా పెండింగ్లో ఉన్న స్థల సేకరణ విషయంలో రైల్వేశాఖ ముందడుగు వేస్తోంది. ప్రాజెక్ట్ నిర్మాణంలో భాగంగా రెండవ విడత స్థల సేకరణ చేయాలని నిర్ణయించి, రెవెన్యూ శాఖకు ప్రతిపాదనలు పంపాలని నిర్ణయించింది. ఈ ప్రాజెక్ట్కు సంబంధించి నిధులు పూర్తిస్థాయిలో లేకపోవడంతో స్థల సేకరణ కూడా పెండింగ్లోనే ఉంది. మొత్తం 54 కిలోమీటర్లు పొడవులో నిర్మించే ఈ రైల్వేలైన్ కోసం దాదాపు 200 ఎకరాల భూమి సేకరించాలి. తొలి దశ కింద 158.55 ఎకరాలు సేకరించారు. తూర్పుగోదావరి జిల్లాలో భట్లపాలెం, కామనగరువు ప్రాంతాలు అమలాపురం మండలంలో భట్నవిల్లి, రోళ్లపాలెం, భట్లపాలెం, పేరూరు పరిధిలో ప్రాంతాల్లో 60 శాతం స్థలసేకరణ జరిగింది. ఈ ప్రాంతాల్లో మిగిలిన 40 శాతంతో పాటు పశ్చిమగోదావరి జిల్లాలోని యలమంచిలి, నరసాపురం ప్రాంతాల్లో భూసేకరణ రెండవ విడతలో చేపట్టనున్నారు. అయితే ఇప్పటి వరకూ సేకరించిన భూమిలో బాధితులకు పూర్తిస్థాయిలో ఇంకా నష్టపరిహారం చెల్లించనేలేదు. కూటమి హయాంలో తొలి బడ్జెట్లోనే మొండిచేయి 2001లో ఈ రైల్వేలైన్ నిర్మాణం ఆలోచన ఊపందుకున్న తరువాత 2019 నుంచి ప్రతి బబ్జెట్లోను ఈ ప్రాజెక్ట్కు నిధులు కేటాయించారు. 2019–24 మధ్య వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లపాటు కూడా అప్పటి వైఎస్సార్సీపీ ఎంపీల కృషితో కేంద్రం ప్రతి బడ్జెట్లో నిధులు కేటాయించింది. విచిత్రం ఏమిటంటే కేంద్రంలోని బీజేపీతో జతకట్టి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ప్రవేశపెట్టిన 2025–26 తొలి రైల్వే బడ్జెట్లో నరసాపురం–కోటిపల్లి రైల్వేలైన్కు నిధుల కేటాయింపులో మొండిచేయి దక్కడం చెప్పుకోవాలి. రూ 2,800 కోట్ల అంచనా వ్యయంగల ఈ భారీ ప్రాజెక్ట్కు సంబంధించి గోదావరిపై మూడు పాయల వద్ద వంతెన నిర్మాణం చేయాలి. వంతెన నిర్మాణాలకు రూ.700 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసి టెండర్లు పిలిచి రెండేళ్ల క్రితం ప్రారంభించారు. అయితే అరకొర కేటాయింపులతో పనులు మందకొడిగా సాగుతున్నాయి. మరి రెండవ విడత స్థలసేకరణ పూర్తయిన తరువాత పనులు పరిగెడతాయో లేదో చూడాలి. ప్రాజెక్ట్ నిర్మాణం ఆలస్యం అవుతుండటంతో ప్రతి ఏటా నిర్మాణ అంచనా వ్యయం కూడా పెరుగుతూ వస్తోంది. 2001లో రూ.800 కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్ అంచనా వ్యయం ప్రస్తుతం రూ.2,800 కోట్లకు చేరింది. ఎప్పటి నుంచో డిమాండ్ మచిలీపట్నం–గుడివాడ–భీమవరం వరకూ ఉన్న రైల్వే లైన్ను 1925లో నరసాపురం వరకూ పొడిగించారు. అప్పటి నుంచి నరసాపురం టు కోనసీమకు రైల్వేలైన్ అనుసంధానం కావాలనే డిమాండ్ ఉంది. దీనివల్ల రవాణా మార్గం సులభమవుతుందని, వ్యాపార వ్యవహారాలతో మొత్తంగా గోదావరి జిల్లాలు అభివృద్ధి బాట పట్టే అవకాశం ఉందని భావించారు. ఇక అప్పటి నుంచీ కోటిపల్లి నుంచి నరసాపురం వరకూ రైల్వేలైన్ను పొడిగించాలనే డిమాండ్ ఉంది. దివంగత లోక్సభ స్పీకర్ బాలయోగి చొరవతో ఈ ప్రాజెక్ట్కు బీజం పడింది. 2001–02 బడ్జెట్లో తొలిసారిగా రూ.100 కోట్లు కేటాయించారు. కానీ నిధులు మాత్రం విడుదల కాలేదు. తరువాత 2016–17 బడ్జెట్లో రూ. 200 కోట్లు కేటాయించారు. సర్వేకే ఈ నిధులు చాలని పరిస్థితి. 2019 నుంచి గత ఏడాది వరకూ వరుసగా నిధులు కేటాయించారు. ఇప్పటికి సుమారుగా రూ.1900 కోట్లు నిధుల కేటాయింపు జరిగింది. వంతెనలకే ఖర్చు ఎక్కువ ఈ ప్రాజెక్ట్ 25 శాతం రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో నిర్మాణమవుతోంది. ఈ ప్రాజెక్ట్ విషయంలో ఇచ్చిన సొమ్ము వంతెనల నిర్మాణాలకే అధిక మొత్తం ఖర్చువుతోంది. ఉమ్మడి తూర్పు, పశ్చిమగోదావవరి జిల్లాల్లోని గోదావరి పాయలుగా ఉన్న వైనతేయి, గౌతమి, వశిష్ట నదులపై వంతెనలు నిర్మించాలి. రూ.700 కోట్లతో ఈ మూడు వంతెనల పనులు నత్తనడకన సాగుతున్నాయి. రెండవ విడత స్థల సేకరణకు గ్రీన్ సిగ్నల్ 2019–24 మధ్య నుంచి ప్రతి బడ్జెట్లో నిధులు కూటమి హయాంలో తొలి బడ్జెట్లోనే మొండిచేయి ఏటా పెరుగుతున్న అంచనా వ్యయం ఇప్పటికై నా ప్రాజెక్ట్ పరుగులు పెట్టేనా? -
కొత్త రెస్టారెంట్లో కుళ్లిన మాంసం
ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలో వెల్లడి తాడేపల్లిగూడెం : పట్టణంలోని స్కై గార్డెన్ రెస్టారెంట్లో మంగళవారం జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ట్రేడ్ లైసెన్స్ లేకుండానే రెస్టారెంట్ నడుపుతున్నట్లు తనిఖీలో వెల్లడైంది. కుళ్లిన మాంసం, కూరగాయలు, నిఽషేధించిన ప్లాస్టిక్ వస్తువులు వాడుతున్నట్టు ఈ సందర్భంగా గుర్తించారు. చికెన్ లాలీపాప్లు నిల్వ ఉన్నట్లు కనుగొన్నారు. నిషేధిత ప్లాస్టిక్ వస్తువులను వాడుతుండటంతో వాటిని స్వాధీనం చేసుకుని రూ.5 వేల జరిమానా విధించారు. చికెన్ తండూరి, చికెన్ లాలీపాప్లను శాంపిల్స్ తీసి నాచారంలోని స్టేట్ ఫుడ్ లాబరేటరీకి పంపించారు. రెస్టారెంట్లో గుర్తించిన లోపాలపై అధికారులు యాజమాన్యానికి నోటీసులు జారీ చేసి కేసు నమోదు చేశారు. నాణ్యతా ప్రమాణాలు పాటించకుంటే లైసెన్సు రద్దు చేస్తామని హెచ్చరించారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ కే.వెంకటరత్నం, జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ ఏ.సుందరరామిరెడ్డి, మున్సిపల్ కమిషనర్ ఎం.ఏసుబాబు ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. విద్యుదాఘాతంతో వ్యక్తి దుర్మరణం పెదవేగి: విద్యుదాఘాతానికి గురై ఓ వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం పెదవేగి మండలం బాపిరాజుగూడెం గ్రామానికి చెందిన చొదిమెల్ల యాకోబు (45) గ్రామంలో నూతనంగా ఒక ఇంటిని నిర్మించుకుంటున్నాడు. ఈ మేరకు మంగళవారం ఆ ఇంట్లో పనిచేస్తుండగా ఒక్కసారిగా విద్యుదాఘాతానికి గురై స్పృహ కోల్పోయాడు. హుటాహుటిన కుటుంబ సభ్యులు స్థానికుల సాయంతో ఏలూరు సర్వజన ఆసుపత్రికి తరలించగా అప్పటికే అతడు మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. -
అత్యాచారం కేసులో పదేళ్ల జైలు శిక్ష
ఏలూరు (టూటౌన్)/పెనుగొండ: అత్యాచారం కేసులో నిందితుడికి కోర్టు పదేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ కేసుకు సంబంధించిన వివరాలను జిల్లా కోర్టు అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ డీవీ రామాంజనేయులు వెల్లడించారు. పెనుగొండ మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన బాధిత యువతి వ్యవసాయ కూలీగా జీవనం సాగించేది. సుమారు ఏడేళ్ల క్రితం అదే గ్రామానికి చెందిన నిందితుడు అంజూరి ప్రసన్న కుమార్ ప్రేమ పేరుతో ఆమెకు సన్నిహితమయ్యాడు. వివాహం చేసుకుంటానని మోసం చేసి, ఆమెను బలవంతంగా శారీరక సంబంధానికి గురిచేశాడు. అనంతరం నిందితుడు విదేశానికి (గల్ఫ్) పరారయ్యాడు. తన తల్లిదండ్రుల సహకారంతో ఆమెను పెళ్లి చేసుకోవడానికి నిరాకరించాడు. దీనిపై బాధిత యువతి పెనుగొండ పోలీస్స్టేషన్న్లో ఫిర్యాదు చేయగా, అప్పటి ఎస్సై బి.మోహన్రావు కేసు నమోదు చేశారు. అనంతరం సీఐ జీవీవీ నాగేశ్వరరావు పూర్తిస్థాయిలో దర్యాప్తు నిర్వహించి కోర్టులో చార్జ్షీట్ దాఖలు చేశారు. ఈ కేసులో నేరం రుజువు కావడంతో ముద్దాయి అంజూరి ప్రసన్న కుమార్కు పదేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటుగా రూ.5 వేలు జరిమానా విధిస్తూ మహిళా కోర్టు ఐదవ అదనపు జిల్లా జడ్జి ఆర్వీవీఎస్ మురళీకృష్ణ మంగళవారం తీర్పు వెలువరించారు. అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ డీవీ రామాంజనేయులు వాదనలు వినిపించగా కోర్టు కానిస్టేబుల్ తిమ్మరాజు నాగబాబు, లైజనింగ్ ఆఫీసర్ ఏఎస్సై ఎస్.ప్రదీప్ కుమార్ విచారణకు సహకరించారు. ఎస్ఆర్కేఆర్లో మెగా టెక్నికల్ మేళా భీమవరం (ప్రకాశంచౌక్): భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఆగస్టు 4 నుంచి 14వ తేదీ వరకు శ్రీవేదిక్ విజన్ 2కే 25్ఙ పేరిట స్పోర్ట్స్ అండ్ హెల్త్ అంశంపై మెగా టెక్నికల్ మేళా నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కేవీ మురళీకృష్ణంరాజు చెప్పారు. దీనికి సంబంధించిన పోస్టర్ను కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎం జగపతి రాజు మంగళవారం కళాశాలలో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో విడుదల చేశారు. ప్రోగ్రాం కోఆర్డినేటర్ ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ పి సత్యనారాయణ రాజు మాట్లాడుతూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఫుల్ జావా స్టాక్ నైపుణ్యాలను ఉపయోగించి ఆరోగ్య యోగ, క్రీడా రంగాల్లో నూతన పరిష్కారాలను అభివృద్ధి చేసే విధంగా పది రోజుల పాటు జరిగే బూట్ క్యాంపులో విద్యార్థులకు శిక్షణ అందించడం జరుగుతుందన్నారు. సౌత్ జోన్ రోల్బాల్ పోటీలకు ఎంపిక తణుకు అర్బన్: ఆంధ్రప్రదేశ్ రోల్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 19, 20 తేదీల్లో కాకినాడలో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో అండర్ 17, 17 ఏళ్లు పైబడిన విభాగాల్లో పశ్చిమగోదావరి జిల్లా క్రీడాకారులు ద్వితీయస్థానంలో నిలిచినట్లు రోల్బాల్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి వానపల్లి లావణ్య తెలిపారు. వీరిలో ఉత్తమ ప్రతిభ కనబరచిన క్రీడాకారులు ఆగస్టులో నిర్వహించనున్న సౌత్ జోన్ రోల్బాల్ పోటీల్లో పాల్గొంటారని వివరించారు. ఇటీవల తణుకులో నిర్వహించిన స్కేటింగ్ రోల్బాల్ పోటీల్లో పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి అండర్ 11, 14, 17, 17 ఏళ్లు పైబడిన వారికి నిర్వహించిన పోటీల్లో అర్హత సాధించిన 20 మంది క్రీడాకారులు కాకినాడలో రోల్బాల్ పోటీల్లో పాలొన్నారని చెప్పారు. బైక్ చోరీ కేసులో జైలు ముదినేపల్లి రూరల్: మోటార్బైక్ల దొంగతనం కేసులో ఓ వ్యక్తికి 164 రోజుల శిక్ష విధించినట్లు ఎస్సై వీరభద్రరావు తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా అత్తిలి మండలం ఉరదాపాలెంకు చెందిన జొన్నల వెంకటేష్ ముదినేపల్లి మండలంలో బైక్ దొంగతనం చేస్తూ పట్టుబడినట్లు తెలిపారు. అతడ్ని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా రిమాండ్కు పంపిన అనంతరం విచారణ జరిపిన కై కలూరు మేజిస్ట్రేట్ ముద్దాయికి 164 రోజులు జైలుశిక్ష విధిస్తూ మంగళవారం తీర్పు వెలువడించినట్లు ఎస్సై తెలిపారు. వివాహిత అనుమానాస్పద మృతి భీమవరం (ప్రకాశంచౌక్): భీమవరం రాయలంలో లావణ్య (28) అనే వివాహిత మంగళవారం ఉదయం ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు భీమవరం టూటౌన్ సీఐ కాళీ చరణ్ తెలిపారు. ఆమె మృతికి గల కారణాలు తెలియాల్సి ఉందన్నారు. -
● రండి బాబు... రండి
ప్రభుత్వ పాఠశాలలు పునఃప్రారంభించి నెల రోజులు దాటినా ఇంకా అడ్మిషన్లు జరుగుతున్నాయంటూ ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి. గత ప్రభుత్వంలో పాఠశాలలు ప్రారంభమైన వారం రోజులకే క్లాస్రూమ్లు నిండిపోయి విద్యార్థులకు అడ్మిషన్లు ఇచ్చే పరిస్ధితి ఉండేది కాదు. ఎందుకంటే పాఠశాల ప్రారంభం రోజే పుస్తకాలు, బ్యాగులు, యూనిఫామ్తో పాటు సమయానికి అమ్మ ఒడి ఇచ్చేవారు. కానీ కూటమి ప్రభుత్వంలో సగం మంది తల్లులకు తల్లికి వందనం రాక.. నాణ్యమైన బ్యాగులు ఇవ్వక, సరిగ్గా పుస్తకాలు అందకపోవడంతో ప్రభుత్వ పాఠశాలలో చేరేందుకు పిల్లలు ఆసక్తి చూపడం లేదు. దీంతో ఇలా ఇంకా అడ్మిషన్లు జరుగుతున్నాయంటూ ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి. ఏలూరు లక్ష్మివారపుపేటలోని ఎలిమెంటరీ స్కూల్లో దర్శనమిచ్చిన ఫ్లెక్సీ ఇది. – సాక్షి ఫొటోగ్రాఫర్/ ఏలూరు -
● ‘బ్యాక్ బెంచ్’కి చెక్
బ్యాక్ బెంచ్ విద్యార్థులు చదువులో వెనుకబడకుండా ఉండేందుకు కలెక్టర్ వెట్రి సెల్వి విన్నూత్న ప్రయోగం చేపట్టారు. కేరళ తరహాలో యూ ఆకారంలో కూర్చునే విధంగా బెంచీలు వేయాలని ఆదేశించారు. దీనిని లింగపాలెం జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలను మంగళవారం తనిఖీ చేసేందుకు వచ్చిన జిల్లా సమగ్ర శిక్ష ఏపీసీ పంకజ్ కుమార్ అమలు చేశారు. యూ ఆకారంలో బెంచీలు అమర్చడం వలన విద్యార్థులంతా ఉపాధ్యాయునికి కనబడతారని, దీంతో ఆయన చెప్పే పాఠాలు బాగా అర్థమవుతాయన్నారు. పాఠశాలలోని విద్యార్థులు ఆన్లైన్ ప్రకారం ఉన్నారా లేరా డ్రాప్ బాక్స్ విద్యార్థులు ఎంతమంది ఉన్నారు అని రికార్డులు పరిశీలన చేశారు. – లింగపాలెం -
ఫేస్ యాప్పై అంగన్వాడీల గళం
పెంటపాడు: అంగన్వాడీ పథకంలో టీచర్లకు, లబ్ధిదారులకు ఆటకంగా ఉన్న ఫేస్ రికగ్నైజ్డ్ సిస్టం (ఎఫ్ఆర్ఎస్)ను కూటమి ప్రభుత్వం తక్షణం రద్దుచేయాలని కోరుతూ అంగన్వాడీలు, గర్భిణులు, బాలింతలు చిన్నారులలో కలిసి సోమ వారం నిరసన చేపట్టారు. ప్రత్తిపాడులో ధర్నాకు ది గారు. ఐసీడీఎస్ సంఘ అధ్యక్ష, ఉపాధ్యక్షులు జె.శ్యామల, జి.దీనాలు మాట్లాడుతూ పోషణ కిట్ల పంపిణీకి ఓటీపీ ద్వారా కేవైసీ నిబంధన సరికాదన్నారు. కొన్నిచోట్ల సిగ్నల్ సమస్యతో సరుకుల పంపిణీలో ఇబ్బంది పడుతున్నామన్నారు. రాబో యే రోజుల్లో అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులు గ్గిపోయే ప్రమాదముందని, యాప్లను తొలగించాలని డిమాండ్ చేశారు. పెనుమంట్రలో.. పెనుమంట్ర: గర్భిణులు, బాలింతలు, చిన్నారులు అంగన్వాడీ సరుకులు పొందడానికి ఆంటకాలా అంటూ పెనుమంట్ర ప్రాజెక్ట్ కార్యాలయం వద్ద అంగన్వాడీలు ధర్నా చేసి వినతిపత్రం అందించారు. ఫేస్ యాప్ను రద్దు చేయాలని, అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని, ఆన్లైన్ పద్ధతిని రద్దు చేయాలని, తేలికగా లబ్ధిదారులు సరుకులు పొందడానికి అవకాశం కల్పించాలని నినాదాలు చేశారు. సీఐటీయూ మండల నాయకుడు కోడి శ్రీనివాసప్రసాద్ మద్దతు తెలిపారు. జిల్లా నాయకురాలు కానూరు తులసి తదితరులు పాల్గొన్నారు. -
చట్ట పరిధిలో పరిష్కారం
భీమవరం (ప్రకాశంచౌక్): ప్రజాసమస్యలపై త్వరితగతిన స్పందించి, నిర్ణీత గడువులోపు చట్ట పరిధిలో పరిష్కారం చూపాలని జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి ఆదేశించారు. స్థానిక జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)లో భాగంగా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఫిర్యాదులపై పూర్తిస్థాయిలో విచారణ జరపాలన్నారు. కుటుంబ కలహాలు, సైబర్ మోసాలు, భర్త, అత్తింటి వేధింపులు, భూ ఆస్తి వివాదాలు, నకిలీ పత్రాలు, అధిక వడ్డీలు, ఆన్లైన్ మోసం, ప్రేమ పేరుతో మోసం, ఆస్తి తగాదాలు వంటి సమస్యలపై 10 అర్జీలు స్వీకరించారు. జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్) వి.భీమారావు, జిల్లా స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ వి.పుల్లారావు, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ దేశంశెట్టి వెంకటేశ్వరరావు, అధికారులు పాల్గొన్నారు. స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలి పాలకొల్లు సెంట్రల్: విద్యుత్ స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి జేవీఎన్ గోపాలన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్థానిక కొబ్బరి వర్తకుల భవనంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ స్మార్ట్ మీటర్లు అదానీ మెప్పు కోసం రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తెచ్చిందన్నారు. వీటి వల్ల బిల్లులు 2, 3 రెట్లు పెరగడమే కాకుండా, టైం ఆఫ్ స్కేల్ ద్వారా ప్రజలపై భారం పడుతుంద న్నారు. ముందస్తుగా బిల్లు కట్టి కరెంట్ కొనుక్కోవడం వల్ల ప్రజలు ఆర్థిక కష్టాలు అనుభవించాల్సి వస్తుందన్నారు. ఎన్నికలకు ముందు స్మార్ట్ మీటర్లు పగలు కొట్టండని పిలుపునిచ్చిన లోకేష్ అధికారం చేపట్టిన తర్వాత బిగించడని చెప్పడం ఏరు దాటిన తరువాత తెప్ప తగలెయడమేనని విమర్శించారు. ఎకరాకు 56 కిలోల ఎరువులు అవసరం తాడేపల్లిగూడెం: ఉభయగోదావరి జిల్లాల్లో వ్యవసాయంలో అధికంగా ఎరువులు వినియోగిస్తుంటారని, సేంద్రియ వ్యవసాయ పద్ధతుల వైపు వెళితే ఇంత పెద్ద మొత్తంలో ఎరువులు వాడక్కరలేదని వెంకట్రామన్నగూడెంలోని కేవీకేలో సోమవారం జరిగిన అవగాహన కార్యక్రమంలో కేవీకే సమన్వయకర్త డాక్టర్ విజయ లక్ష్మి అన్నారు. వరిలో అత్యఽధికంగా రసాయన ఎరువులు వినియోగించే జిల్లాలు ఉభయగోదావరి జిల్లాలే అన్నారు. గోదావరి జిల్లాల్లో 164 కిలోలు వాడుతున్నారని, అయితే ఎకరాకు కావాల్సింది కేవలం 56 కిలోల ఎరువులు మాత్రమే అన్నారు. సేంద్రియ పద్ధతిలో వరికి అవసరమైన వాటిని వాడాలన్నారు. డ్రోన్ ద్వారా జీవామృతం పిచికారీపై వివరించారు. ప్రకాశరావుపాలెం, చోడవరం రైతులకు అవగాహన కల్పించారు. టీడీపీ కార్యకర్తల దాడి సాక్షి, టాస్క్ఫోర్స్: దెందులూరు వైస్ ఎంపీపీ వేమూరి జితేంద్ర తండ్రి బసవ పున్నయ్యపై తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దాడి చేసి పా మాయిల్ గెలలను అపహరించడం ఘర్షణకు దారి తీసింది. సోమవారం కొప్పులవారిగూడెంలో తన పొలంలో పామాయిల్ గెలలను కో సుకుని ఫ్యాక్టరికి తీసుకువెళుతుండగా టీడీపీ కార్యకర్తలు అడ్డగించి కళ్లల్లో కారం కొట్టి ఐదు టన్నుల లోడుతో ఉన్న ట్రాక్టర్ను తీసుకువెళ్లారని బాధితుడు బసవ పున్నయ్య ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వ పాలనలో తమ కుటుంబాన్ని అన్నిరకాలుగా నష్టపరుస్తున్నారని, ఇది మంచి పద్ధతి కాదని వాపోయారు. దాడిని మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి, దెందులూరు మండల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు కామిరెడ్డి నాని, వైఎస్సార్సీపీ శ్రేణులు తీవ్రంగా ఖండించారు. బసవ పున్నయ్య కుటుంబానికి అండగా ఉంటామన్నారు. జరిగిన సంఘటనపై మాజీ ఎమ్మెల్యే అబ్బయ్యచౌదరి జిల్లా ఎస్పీ ప్రతాప శివకిషోర్, అడిషనల్ ఎస్పీ సూర్యచంద్రరావులతో ఫోన్ లో మాట్లాడారు. మున్సిపల్ కార్మికుల సమ్మె కొనసాగింపు ఏలూరు (టూటౌన్): రాష్ట్ర ప్రభుత్వం ము న్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులకు ఇచ్చిన హా మీలను అమలు చేయడంలో దాటవేత ధోరణి అవలంబించడంపై ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, జిల్లా గౌరవ అధ్యక్షుడు బి.సోమయ్య తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. జీ తాలు మొక్కుబడిగా పెంచడం గర్హనీయమని విమర్శించారు. కార్మికుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని భవిష్యత్ కార్యాచరణను రూపొందించడం కోసం మంగళవారం కూడా సమ్మెను కొనసాగించాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ నిర్ణయించిందన్నారు. -
అరకమ కేసులతో భయపెట్టలేరు
వీరవాసరం: ఎంపీ మిథున్రెడ్డి కడిగిన ముత్యంలా కేసు నుంచి బయటకు వస్తారని వైఎస్సార్సీపీ భీమవరం ఇన్చార్జి చినమిల్లి వెంకటరాయుడు అన్నారు. భీమవరంలో సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సూపర్ సిక్స్ హామీలతో అధికారంలోకి వచ్చి గద్దెనెక్కిన తర్వాత వాటిని తుంగలో తొక్కి కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తుందని విమర్శించారు. గత చంద్రబాబు ప్రభుత్వంలో జరిగిన లిక్కర్ స్కామ్లో ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు బెయిల్పై ఉన్నారనే విషయాన్ని ప్రజలు మర్చిపోలేదన్నారు. అక్రమ కేసులు పెట్టి వైఎస్సార్సీపీ నాయకులను హింసించాలి, భయపెట్టాలి అనే ప్రభుత్వ ఆలోచన ప్రజలంతా గమనిస్తున్నారన్నారు. నరసాపురం పార్లమెంట్ ఇన్చార్జి గూడూరి ఉమాబాల మాట్లాడుతూ పూర్తి పారదర్శకతతో నిర్వహించిన వైఎస్సార్సీపీ ప్రభుత్వ లిక్కర్ పాలసీని అపహాస్యం చేసేలా ప్రస్తుత ప్రభుత్వం నడుచుకుంటుందన్నారు. ఎటువంటి అవినీతి, అక్రమాలకు చోటులేకుండా గతంలో లిక్కర్ పాలసీ అమలు చేశారన్నారు. కావాలనే వైఎస్సార్సీపీ నాయకులను టార్గెట్ చేసి మరీ రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఎవరు ఎన్ని అక్రమ కేసులు బనాయించినా ప్రజలంతా వైఎస్సార్సీపీ వైపే ఉన్నారన్నారు. నాయకులు ఏఎస్ రాజు, జి.రామరాజు, చవాకుల సత్యనారాయణమూర్తి, జల్లా కొండయ్య, మానుకొండ ప్రదీప్ కుమార్, పెనుమాల నరసింహస్వామి, వీరవల్లి శ్రీనివాస్, ఎరక రాజు ఉమాశంకర్ రాజు తదితరులు పాల్గొన్నారు. -
వృద్ధుల సంరక్షణ పిల్లల బాధ్యత
కలెక్టర్ నాగరాణి భీమవరం (ప్రకాశంచౌక్): వృద్ధులైన తల్లిదండ్రులను ఇబ్బంది పెడితే చర్యలు తీవ్రంగా ఉంటాయని కలెక్టర్ సీహెచ్ నాగరాణి హెచ్చరించారు. సోమవారం కలెక్టరేట్లో పీజీఆర్ఎస్లో భాగంగా అధికారులతో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. మొత్తంగా 260 అర్జీలు స్వీకరించారు. వృద్ధురాలికి భరోసా : నరసాపురం ఎన్టీఆర్ కాలనీకి చెందిన వృద్ధురాలు బండి వెంకట నరసమ్మ (90) తనకు ముగ్గురు కుమారులని, ఒక కుమారుడు తన స్థలంలో ఇల్లు నిర్మించుకుని, తనను చూడటం లేదంటూ కలెక్టర్ను ఫిర్యాదు చేసేందుకు వచ్చారు. ఎవరి సాయం లేకుండా వచ్చిన నరసనమ్మ వద్దకు కలెక్టర్ వెళ్లి ఆమె సమస్య తెలుసుకుని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆస్తులు రాయించుకుని వృద్ధులను బయ టికి పంపిస్తే, రాసిన ఆస్తులు చెల్లవని వృద్ధులు వాటిని తిరిగే పొందే హక్కు ఉందన్నారు. తల్లిదండ్రులను వృద్ధాప్యంలో చూడాల్సిన బాధ్యత పిల్లల దే అన్నారు. జేసీ టి.రాహుల్కుమార్రెడ్డి, డీఆర్వో మొగిలి వెంకటేశ్వర్లు, కేఆర్ఆర్సీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ బి.శివన్నారాయణరెడ్డి, డ్వామా పీడీ కేసీహెచ్ అప్పారావు పాల్గొన్నారు. ఎస్సీ పేటలో పాఠశాలను కొనసాగించాలి పెనుమంట్రలో గత ప్రభుత్వంలో నాడు–నేడులో అభివృద్ధి చేసిన ఎస్సీ పేటలోని ప్రాథమిక పాఠశాలను అనుసంధానం పేరుతో పాడైన మరో స్కూల్లోకి మార్చేందుకు దొంగచాటుగా తీర్మానం చేశారంటూ పెనుమంట్ర సర్పంచ్ తాడిపర్లి ప్రియాంక, ఓ విద్యార్థి తల్లి బొడ్డుపల్లి సత్యవతి కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. పాఠశాలలో 35 మంది పిల్లలు ఉన్నారని, వీరంతా మరోచోట ఏర్పాటుచేసిన స్కూల్కు వెళ్లకుండా ఎస్సీ పేటలోని పాఠశాలలో ఉన్నారని, వీరికి మ ధ్యాహ్న భోజనం ఏర్పాట్లు, ఉపాధ్యాయులు రా వడం లేదన్నారు. స్కూల్ను యథాతథంగా ఉంచాలని ధర్నాలు, దీక్షలు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదని కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. -
కొందరికే వందనం
కొందరికి అరకొరగానే.. ఒక్కో విద్యార్థికి రూ.13 వేలకు గాను కొంతమంది తల్లులకు రూ.8,500 నుంచి రూ.9,000 మాత్రమే జమయ్యాయి. తల్లికి వందనం పథకంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ వాటా మీ అకౌంట్కు జమచేయడం జరిగిందని, కేంద్ర ప్రభుత్వ వాటా త్వరలో జమచేయబడుతుందంటూ తక్కువ మొత్తం జమైన లబ్ధిదారుల సెల్ఫోన్లకు మెసేజ్లు రావడం గమనార్హం. దాదాపు నెలరోజులు కావస్తున్నా కేంద్రం వాటా రాకపోవడంతో వస్తుందో? లేదోనని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. గత ప్రభుత్వంలో ఎప్పుడు ఇటువంటి పరిస్థితి లేదని, అందరికీ ఒకేసారి ఇచ్చేవారని చెబుతున్నారు. సెంటు భూమి లేకున్నా 46 ఎకరాలు చూపిస్తూ.. ‘తల్లికి వందనం ఇవ్వకపోయినా పర్వాలేదు సార్. నా పేరిట ప్రభుత్వ రికార్డుల్లో చూపిస్తున్న 46 ఎకరాల భూమిలో పై ఆరు ఎకరాలు తమకు అప్పగిస్తే చాలు’ అంటున్నాడు వీరవాసరం మండలం రాయకుదురుకు చెందిన తోట పెద్దిరాజు. తాను వ్యవసాయ పనులు చేస్తుంటానని, తమ ఇద్దరు కుమార్తెలు రాయకుదురు జెడ్పీ హైస్కూల్లో చదువుకుంటున్నారన్నారు. సెంటు భూమి కూడా లేని తనకు రాయకుదురు, కొణితివాడ గ్రామాల్లో ఏకంగా 46 ఎకరాల భూమి ఉన్నట్టు రికార్డులో ఉండటంతో మొదటి విడతలో తల్లికి వందనం సాయం అందలేదన్నారు. సచివాలయ సిబ్బంది సూచన మేరకు రెండు గ్రామాల్లోనూ తన పేరిట భూమి ఏమీ లేదని వీఆర్వోల స్టేట్మెంట్ తీసుకుని గ్రీవెన్స్లో దరఖాస్తు చేసుకున్నట్టు తెలిపాడు. అయినా ఒక్క రూపాయి సాయం కూడా రాలేదని చెబుతున్నాడు. తనదిగా చూపిస్తున్న 46 ఎకరాల భూమిలో 40 ఎకరాలు తీసేసుకుని ఆరు ఎకరాలు స్వాధీనం చేస్తే ఎంతో సంతోషిస్తానంటూ ప్రభుత్వంపై తనదైన శైలిలో అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఆయన ఒక్కరే కాదు అర్హత ఉన్నా తల్లికి వందనం అందని ఎంతో మంది ఆవేదన ఇది. సాక్షి, భీమవరం: తల్లికి వందనం పథకం అమలులో కూటమి ప్రభుత్వం పిల్లి మొగ్గలు వేస్తోంది. అర్హులైన వారందరికీ పథకాన్ని వర్తింపజేస్తామని చెప్పి వివిధ సాకులు పేరిట కొందరికి ఎగనామం పెడుతోంది. అర్హులుగా గుర్తించిన వారికి సైతం ఇప్పటివరకు పూర్తిస్థాయిలో లబ్ధి చేకూర్చకపోవడం గమనార్హం. 1,920 పాఠశాలలు.. 2.79 లక్షల మంది విద్యార్థులు జిల్లాలో 1,920 ప్రభుత్వ, ప్రైవేట్ పాఠఠశాల్లోని విద్యార్థులు 2,79,204 మంది వరకు ఉండగా, 121 ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కళాశాలల్లోని విద్యార్థులు 37,124 మంది ఉన్నారు. 1వ తరగతి నుంచి ఇంటర్ చదువుతున్న విద్యార్థులు మొత్తం 3,16,328 మంది ఉన్నారు. వీరిలో 2,29,106 మంది విద్యార్థులు తల్లికి వందనం పథకానికి అర్హులుగా ప్రభుత్వం గుర్తించింది. మండలాలతో పోలిస్తే విద్యాసంస్థలు ఎక్కువగా ఉన్న పట్టణ ప్రాంతాల్లో విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వారి ఒక్కో విద్యార్థికి రూ.15,000 చొప్పున రూ. 343.81 కోట్లను వారి తల్లుల ఖాతాలకు జమచేయాల్సి ఉంది. పాఠశాలల నిర్వహణ పేరిట రూ. 2,000 తగ్గించి గత నెల 12న మొదటి విడతగా జిల్లాలోని 1,76,574 మంది విద్యార్థులకు సంబంధించి వారి తల్లుల ఖాతాలకు రూ.229.55 కోట్లను జమచేసింది. గ్రీవెన్స్లో ఫిర్యాదు చేయాలంటూ.. 10వ తరగతి పూర్తయి ఇంటర్లో చేరిన విద్యార్థులకు తర్వాత అందజేస్తామని, సాంకేతిక పరమైన అవరోధాలతో ఆగిన వారు గ్రీవెన్స్లో ఫిర్యాదు చేసుకోవా లని అధికారులు సూచించారు. ఈ మేరకు 20,139 మంది నుంచి వినతులు వచ్చాయి. ఇటీవల వీటిలోని 11,416 మందికి తల్లికి వందన సాయాన్ని, 1,137 మందికి సాయం అందించాల్సి ఉందని, 4262 మంది దరఖాస్తులు ఇంకా పరిశీలనలో ఉన్నట్టుగా అధికారులు చెబుతున్నారు. కాగా ఫోర్ వీలర్, స్థలం, ఇన్కంటాక్స్, ప్రభుత్వ ఉద్యోగి, విద్యుత్ బిల్లులు తదితర వాటిని సాకుగా చూపించి 4,693 మంది దరఖాస్తులను పక్కన పెట్టేసినట్టు తెలుస్తోంది. మొత్తంగా ఇప్పటివరకు దాదాపు 1,87,990 మందికి సాయం అందించగా మిగిలిన వారి పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. తమకు సొంత ఇళ్లు కూడా లేకపోయినా తమ పేరిట స్థలాలు ఉన్నాయని, విద్యుత్ బిల్లులు ఎక్కువగా వస్తున్నాయని తదితర రకరకాల సాకులతో సాయం విడుదల చేయకుండా తాత్సారం చేస్తున్నారని అర్హులైన వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా ఇప్పటివరకు ఎంతమందికి సాయం అందిందనే విషయంపై తమ వద్ద స్పష్టమైన సమాచారం లేదని ఉద్యోగ వర్గాలంటున్నాయి. మండలాల వారీగా అర్హులు మండలం అర్హులు ఆచంట 5,354 ఆకివీడు 9,610 అత్తిలి 6,196 భీమవరం 33,928 యలమంచిలి 5,286 గణపవరం 7,406 ఇరగవరం 4,211 కాళ్ల 6,780 మొగల్తూరు 7,657 నరసాపురం 20,193 పాలకొల్లు 21,267 పాలకోడేరు 5,410 పెంటపాడు 7,302 పెనుగొండ 11,039 పెనుమంట్ర 5,697 పోడూరు 5,242 తాడేపల్లిగూడెం 25,881 తణుకు 27,775 ఉండి 6,413 వీరవాసరం 6,459 తల్లులకు ఎగనామం పూర్తిస్థాయిలో అర్హులకు అందని తల్లికి వందనం లబ్ధి ప్రభుత్వ లెక్కల ప్రకారం జిల్లాలో అర్హులైన విద్యార్థులు 2,29,106 మంది మొదటి విడతలో 1,76,574 మంది, గ్రీవెన్స్లో 11,416 మందికి జమ మిగిలిన వారి పరిస్థితి అగమ్యగోచరం విద్యుత్ బిల్లులు, ఫోర్ వీలర్ల పేరిట తాత్సారం -
ఉద్యోగులు లేరు.. పని చేసేదెవరు?
ఏలూరు (మెట్రో): ‘అధికారంలోకి వచ్చిన తరువా త ఏటా ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేసి ఖాళీ పోస్టుల భర్తీ ప్రక్రియ చేపట్టి నిరుద్యోగ వ్యవస్థను రూపుమాపుతాం’ ఇవీ గతేడాది ఎన్నికల ప్రచారంలో కూటమి నేతలు పలికిన ప్రగల్భాలు. అయితే ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న ఉద్యోగాలను ఊడగొట్టే పనిలో నిమగ్నమైంది. అధికారంలోకి వచ్చి ఏడాది దాటుతున్నా ఒక్క కొత్త ఉద్యోగాన్ని కూడా భర్తీ చేయలేదు. జిల్లాలో ప్రజలకు సుపరిపాలన అందాలన్నా.. సంక్షేమ ఫలాలు పూర్తిస్థాయిలో చేరువ కా వాలన్నా జిల్లా పరిషత్ వ్యవస్థ ఎంతో కీలకం. అటు రాజకీయంగా, ఇటు పరిపాలన పరంగా పెనవే సుకుని ఉన్న ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పరిషత్లో కీలకమైన ఉద్యోగాలన్నీ ఇన్చార్జిలతోనే కొనసాగుతున్నాయి. జిల్లా పరిషత్లోకి జిల్లా పరిషత్ ఉ న్నత పాఠశాలలు, ఎంపీపీ కార్యాలయాలు, ఎంపీడీఓ కార్యాలయాలు, ఇంజనీరింగ్ సెక్షన్లు ప్రజలకు సేవలు అందించడంలో కీలక పాత్ర పోషిస్తుంటాయి. అయినప్పటికీ జిల్లా పరిషత్లో వందలాది ఉద్యోగాలు భర్తీకి నోచుకోవడం లేదు. ఏళ్ల తరబడి ఖాళీగానే ఉంటున్నాయి. జిల్లా పరిషత్ వ్యవస్థలో ఏలూరులోని జెడ్పీ కార్యాలయంతో పాటు 15 విభాగాల్లో ఉద్యోగాలను భర్తీ చేయాల్సి ఉంది. దీనిలో జిల్లా పరిషత్ కార్యాలయంలోని సీఈఓ, డిప్యూటీ ిసీఈఓ ఉద్యోగాలు మినహా మిగిలిన అన్ని విభాగాల్లోనూ కీలకమైన పోస్టులను ఇన్చార్జిలతోనే నెట్టుకొస్తున్నారు. అకౌంట్స్ అధికారి కీలకం ఉమ్మడి జిల్లాకు కీలకమైన అకౌంట్స్ అధికారి పోస్టు ఒక్కటే ఉంది. అయితే అదీ ఖాళీగా ఉంది. జిల్లా పరిషత్లోని అన్ని విభాగాలకు ఈ అధికారి ద్వారా నే నిధులు బదిలీ అవుతాయి. ప్రతి రూపాయి విడుదల, ఖర్చుకు అకౌంట్స్ అధికారి కీలకంగా వ్యవహరిస్తారు. అయితే ఈ పోస్టు ఖాళీగా ఉండటంతో నిధుల ఖర్చు ఇష్టారాజ్యంగా సాగుతోంది. ఈ పోస్టు భర్తీపై పాలకులు దృష్టి సారించడం లేదు. 35 మంది ఎంపీడీఓలే.. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో 48 మండలాల్లో అభివృద్ధి పనులకు ఎంపీడీఓలు కీలకం. అయితే 35 మండలాల్లోనే పూరిస్థాయిలో ఎంపీడీఓలు ఉండగా.. 13 మండలాల్లో లేరు. దీంతో 13 మండలాల్లో ఇన్చార్జుల పాలనలో నెట్టుకొస్తున్నారు. 1,600 పోస్టులు.. 662 ఖాళీలు పశ్చిమగోదావరి జిల్లాపరిషత్లో మొత్తం 1,600 పోస్టులకు గాను 938 పోస్టుల్లో మాత్రమే ఉద్యో గులు విధులు నిర్వహిస్తున్నారు. మిగిలిన 662 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇన్ని పోస్టులు ఖాళీగా ఉంటే ప్రజలకు ఎంతవరకూ సేవలందుతాయనే విషయాన్ని పాలకులు గుర్తించాలి. త్వరితగతిన పోస్టుల భర్తీ చేయాలనే డిమాండ్ సర్వత్రా వినిపిస్తోంది. జిల్లా పరిషత్లో 662 పోస్టుల ఖాళీ ఉమ్మడి జిల్లావ్యాప్తంగా కుంటుపడిన పాలన కీలకమైన అకౌంట్స్ అధికారి పోస్టుదీ అదే పరిస్థితి 13 మండలాల్లో ఇన్చార్జి ఎంపీడీఓలే.. పట్టించుకోని కూటమి సర్కారు ఉద్యోగుల ఖాళీలు భారీగానే.. సీనియర్ అసిస్టెంట్లు, జూనియర్ అసిస్టెంట్ల పరిస్థితి కూడా అలానే ఉంది. రికార్డు అసిస్టెంట్లు 18 పోస్టులు, లైబ్రరీ అసిస్టెంట్లు 20 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆఫీస్ సబార్డినేట్లు 484 పోస్టులకు 65 మంది మాత్రమే పనిచేస్తుండగా 418 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇక క్లాస్–4 ఉద్యోగులు 185 పోస్టులకు 8 మంది మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. క్లాస్–4 ఉద్యోగుల పోస్టులు 177 ఖాళీగా ఉన్నాయి. త్వరలో సమీక్షిస్తా.. జిల్లా పరిషత్లో ఖాళీల భర్తీపై త్వరలో సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేసి చర్యలు తీసుకుంటాం. నూతనంగా నేను బాధ్యతలు తీసుకున్నాను. పరిపాలనకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తాం. సమీక్షా సమావేశం ద్వారా తగు నిర్ణయం తీసుకుంటాం. – ఎం.శ్రీహరి, జెడ్పీ సీఈఓ -
విచారణకు రావాలని జైలు అధికారులకు ఏసీబీ కోర్టు ఆదేశం
సాక్షి,విజయవాడ: ఎంపీ మిథున్రెడ్డికి జైలులో వసతులు కల్పించాలనే ఉత్తర్వులను పరిగణలోకి తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యహరించారనే ఫిర్యాదుపై రాజమండ్రి జైలు అధికారులకు ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. రేపు(మంగళవారం, జూలై 22) కోర్టులో హాజరు కావాలని న్యాయమూర్తి ఆదేశించారు. రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరిటెండెంట్పై ఏసీబీ కోర్టు న్యాయమూర్తికి వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి తరపు న్యాయవాదులు నాగార్జున రెడ్డి, విష్ణు వర్ధన్లు ఫిర్యాదు చేశారు. మిథున్ రెడ్డికి వసతులు కల్పించాలన్న ఉత్తర్వులను పరిగణలోకి తీసుకోకుండా జైలు అధికారులు ఇబ్బందులు పెడుతున్నారని పిర్యాదులో పేర్కొన్నారు. ఎంపీగా ఉన్న వ్యక్తి పట్ల అమానవీయంగా వ్యవహరించారని న్యాయమూర్తికి చేసిన ఫిర్యాదులో తెలిపారు. దీంతో జైలు అధికారులతో ఏసీబీ కోర్టు ఏవో మాట్లాడారు. అనంతరం, రాజమండ్రి జైలు అధికారులు రేపు ఏసీబీ కోర్టుకు హాజరు కావాలని ఆదేశించారు. కోర్టు ఆదేశాల మేరకు రాజమండ్రి జైలు అధికారులు మంగళవారం ఏసీబీ కోర్టు ఎదుట విచారణకు హాజరు కానున్నారు. -
భర్త బర్త్ డే విషెస్ చెప్పలేదని టీచర్..!!
ఏలూరు: అనుమానాస్పద స్ధితిలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలు మందాడ దేవిక (38) తన అపార్ట్మెంట్లో ఆత్మహత్యకు పాల్పడడం కలకలం సృష్టించింది. నూజివీడు సమీపంలో బత్తులవారిగూడెం గ్రామానికి చెందిన రిటైర్డ్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ మందాడ లక్ష్మయ్య, ప్రభావతి కుమార్తె దేవికను పెదపాడు మండలం నాయుడుగూడెం గ్రామానికి చెందిన చిన్ని సురేంద్రకిచ్చి 20 ఏళ్ల క్రితం వివాహం చేశారు. వారికి పవన్ తేజ, గౌతమ్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. దేవిక ఉంగుటూరు మండలం నల్లమాడు ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. సురేంద్ర ఉంగుటూరు మండలం రాచూరు పాఠశాలలో హెచ్ఎంగా ఉన్నారు. చొదిమెళ్ళ శ్రీవల్లి అపార్ట్మెంట్స్లో ఐదేళ్ల కిందట అపార్ట్మెంట్ కొన్నారు. ఉద్యోగాల నిమిత్తం ఉంగుటూరు మండలం గొల్లగూడెంలో ఉంటున్నారు. శని, ఆదివారాలు ఏలూరు అపార్ట్మెంట్కు వెళ్తుంటారు. శనివారం సాయంత్రం 5 గంటలకు సురేంద్ర వచ్చేసరికి ఉరి వేసుకుని భార్య దేవిక మృతి చెంది ఉంది. మనస్తాపంతో కాళ్లు, చేతులపై అతను తీవ్రంగా కోసుకున్నాడు. దేవిక పుట్టిన రోజు సందర్భంగా కుమారులు శుభాకాంక్షలు చెప్పేందుకు తల్లిదండ్రులకు ఫోన్ చేశారు. వారు లిఫ్ట్ చేయకపోవడంతో ఏలూరులోనే ఉంటున్న పెదనాన్నకు చెప్పడంతో అతను అపార్ట్మెంట్కు వెళ్లి చూడగా రక్తమడుగులో ఉన్న తమ్ముడు కనిపించాడు. వెంటనే పోలీసులకు, సురేంద్ర మామ లక్ష్మయ్యకు విషయం తెలియచేసి ఏలూరు ప్రభుత్వాసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. అనంతరం సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని అపార్ట్మెంట్ను పరిశీలించారు. మృతిపై అనుమానాలు: మృతురాలి తండ్రి తన కూతురు దేవిక మృతిపై అనుమానాలు ఉన్నాయని మృతురాలు తండ్రి లక్ష్మయ్య తెలిపారు. పూర్తిస్థాయి విచారణ నిర్వహించాలని కోరారు. టీచర్ మృతి చెందిన అపార్ట్మెంట్లో సీసీ కెమెరాలు పనిచేయటం లేదని సిబ్బంది తెలిపారు. ఈ నేపథ్యంలో ఇద్దరి సెల్ఫోన్ డేటా కీలకం కానుంది. పుట్టినరోజు నాడే తన కుమార్తె దేవిక మృతి చెందటం తట్టుకోలేకపోతున్నానని తండ్రి లక్ష్మయ్య కన్నీటి పర్యంతమయ్యారు. చిన్న కూతురుగా గారాబంగా పెంచమని ఇలా జరుగుతుందని ఊహించలేదని అన్నారు. -
పెద్దింట్లమ్మకు పూజలు
కై కలూరు: అమ్మా.. పెద్దింట్లమ్మా.. నీ ఆశీస్సులు మాకు అందించమ్మా అంటూ భక్తులు అమ్మను ఆర్తితో వేడుకున్నారు. సమీప జిల్లాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు పెద్దింట్లమ్మకు మొక్కులు తీర్చుకున్నారు. పవిత్ర కోనేరులో స్నానాలు ఆచరించి అమ్మకు వేడి నైవేద్యాలను సమర్పించారు. ఆలయ ఈవో కూచిపూడి శ్రీనివాసు మాట్లాడుతూ ప్రత్యేక, అంతరాలయ దర్శనాలు, కేశఖండన, పెద్ద, చిన్న తీర్ధాలు, లడ్డూ ప్రసాదం, గదుల అద్దెలు, అమ్మ ఫొటోల అమ్మకాలు, వాహన పూజలు, విరాళాల ద్వారా రూ.1,17,660 ఆదాయం వచ్చినట్లు తెలిపారు. రైలు ఢీకొని యువకుడి మృతి భీమడోలు: భీమడోలు రైల్వే స్టేషన్ సమీపంలోని రైల్వే గేటు వద్ద ఆదివారం గుర్తు తెలియని రైలు ఢీకొని ద్వారకాతిరుమల మండలం సత్తెనగూడెం గ్రామానికి చెందిన కొత్తపల్లి అశోక్ (30) మృతి చెందాడు. ఏలూరు రైల్వే పోలీసులు పోస్ట్మార్టం నిమిత్తం మృతదేహాన్ని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రైల్వే ఎస్సై సైమన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
టైం టేబుల్పై ట్రిపుల్ ఐటీలో రగడ
నూజివీడు: ఆరేళ్ల సమీకృత ఇంజినీరింగ్ విద్యను అందిస్తున్న నూజివీడు ట్రిపుల్ఐటీలో అనుభవం ఉన్న అధికారులు లేక నిరంతరం సమస్యలకు వేదికగా మారుతోంది. మెంటార్లకు సంబంధించిన టైం టేబుల్ నుంచి ప్రతి విషయంలోనూ అనుభవ లేమి స్పష్టంగా కనిపిస్తోంది. తాజాగా పీయూసీకి బోధన చేసే తెలుగు మెంటార్లకు సంబంధించి పీరియడ్ల కేటాయింపు వివాదాస్పదంగా తయారైంది. తెలుగు డిపార్ట్మెంట్ హెచ్ఓడీ నిబంధనల ప్రకారం వర్క్ లోడ్ ఉండేలా మెంటార్లకు టైం టేబుల్ను రూపొందించగా, దానిని డీన్ అకడమిక్స్ తన ఇష్టారాజ్యంగా మార్చేయడం ట్రిపుల్ ఐటీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నూజివీడు ట్రిపుల్ ఐటీలో పీయూసీ రెండు సంవత్సరాలకు బోధించేందుకు సరిపడా మెంటార్లు ఉండగా వారిని కాదని డీన్ అకడమిక్స్ సాధు చిరంజీవి హెచ్ఓడీ వేసిన టైం టేబుల్ను పక్కన పెట్టి తెలుగు కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లకు పీయూసీకి టైం టేబుల్ వేయడంపై మెంటార్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. గొడవకు కారణం ఇదే.. నూజివీడు ట్రిపుల్ ఐటీలోని పీయూసీ రెండు సంవత్సరాల విద్యార్థులకు తెలుగు బోధించేందుకు ఆరుగురు మెంటార్లు ఉన్నారు. వీరికి వారానికి 18 గంటల వర్క్లోడు ఉండేలా టైం టేబుల్ రూపొందించారు. ఈ విద్యా సంవత్సరం నుంచి ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలకు సంబంధించిన పీయూసీ ప్రథమ సంవత్సర విద్యార్థులకు నూజివీడు ట్రిపుల్ ఐటీలోనే తరగతులు నిర్వహిస్తున్నారు. దీనికి ఒంగోలు ట్రిపుల్ ఐటీ నుంచి ముగ్గురు తెలుగు ఫ్యాకల్టీని పంపగా శ్రీకాకుళం నుంచి ముగ్గురు రావాల్సి ఉండగా ఒక్కరు మాత్రమే వచ్చారు. మిగిలిన ఇద్దరు తాము మంత్రి మనుషులమంటూ ట్రిపుల్ ఐటీ అధికారులపై ఒత్తిడి తెచ్చి ఇక్కడకు రాకుండా అక్కడే ఉండిపోయారు. దీంతో శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు తెలుగు బోధించేందుకు ఫ్యాకల్టీ కొరత ఏర్పడింది. ఇక్కడే అసలు సమస్య ప్రారంభమైంది. గతంలో ఇంజినీరింగ్లో తెలుగు బోధించేందుకు ముగ్గురు కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లను నియమించారు. ఆ తరువాత ఇంజినీరింగ్లో తెలుగు తొలగించడంతో వీరిని పీయూసీకి బోధించమని పీయూసీకి పంపుతుంటే తమకు వర్క్లోడ్ సరిపోతుందంటూ పీయూసీ మెంటార్లు అభ్యంతరం చెబుతున్నారు. ప్రస్తుతం శ్రీకాకుళం ట్రిపుల్ఐటీ విద్యార్థులకు తెలుగు బోధించడానికి ఒక్క ఫ్యాకల్టీనే ఉండటం వల్ల ఖాళీగా ఉంటున్న ముగ్గురు కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లతో పాఠాలు చెప్పిస్తే ఎలాంటి సమస్య ఉత్పన్నమయ్యేది కాదు. అలా కాకుండా ఈ ముగ్గురికి నూజివీడు ట్రిపుల్ ఐటీలో పీయూసీకి నియమించి, ఇక్కడి మెంటార్లను శ్రీకాకుళం పీయూసీకి చెప్పేందుకు నియమించారు. దీంతో ఇలా ఎలా చేస్తారంటూ మెంటార్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మాకు ఇక్కడ సరిపోయే స్టాఫ్ ఉన్నామని, మిగులు స్టాఫ్ ఉంటే వారితో ఎక్కడ అవసరముంటే అక్కడ చెప్పించాలే గాని ఇలా చేయడమేంటని ప్రశ్నిస్తున్నారు. సమస్య చిన్నదైనా యాజమాన్యం మాత్రం సరిగా డీల్ చేయలేక సమస్యలను పెద్దది చేసుకుంటున్నారనే విమర్శలు ట్రిపుల్ ఐటీ వర్గాల్లోనే వినిపిస్తున్నాయి. డీన్తో మాట్లాడతా తెలుగు సబ్జెక్టు బోధించే విషయమై వచ్చిన సమస్యపై డీన్తో మాట్లాడతా. ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ నుంచి మరో ఇద్దరు తెలుగు మెంటార్లు ఇక్కడకు వస్తున్నారు. వాళ్లు వస్తే తెలుగు బోధించడానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. బీ లక్ష్మణరావు, ఇన్ఛార్జి ఏఓ, నూజివీడు. -
మద్యం పాలసీకి చంద్రబాబే సూత్రధారి
పెంటపాడు: రాష్ట్రంలో మద్యం పాలసీకి సూ త్రధారి సీఎం చంద్రబాబేనని మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ విమర్శించారు. పెంటపాడులోని ఆర్యవైశ్య సేవా సంఘ భవనంలో ఆదివారం బాబు ష్యూరిటీ–మోసం గ్యారెంటీ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ వైఎస్సార్సీపీ నాయకుల అరెస్టులను ఖండించారు. వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్రెడ్డి అరెస్టు దారుణమని అన్నారు. అరెస్టులతో వైఎస్సార్ సీపీ నాయకులను కట్టడి చేయగలరా అని కూటమి నాయకులను ప్రశ్నించారు. రా ష్ట్రంలో మద్య నిషేధానికి గత వైఎస్సార్సీపీ ప్రభు త్వం ప్రయత్నించగా.. ప్రస్తుత కూటమి పాలనలో విచ్చలవిడిగా మద్యం దుకాణాల ఏర్పాటుతో ప్ర జల ఆర్యోగంతో ఆడుకుంటున్నారన్నారు. విచ్చలవిడి మద్యంతో ప్రజలు ఒళ్లు గుల్లచేసుకుని ఆస్పత్రుల పాలవుతున్నారన్నారు. అయినా ఎకై ్సజ్ సి బ్బంది పట్టించుకోవడం లేదన్నారు. అప్పులు చేసి తాగడం వల్ల కుటుంబాల్లో కలహాలు రేగుతున్నాయన్నారు. రాష్ట్రంలో ఆటవిక పాలన సాగుతుందని, రౌడీమూకలు రాజ్యమేలుతున్నాయని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డి పర్యటనలకు భారీ ప్రజాదరణ లభిస్తుండటం చూసి ఓర్వలేక ఆయనకు భద్రత విషయంలో కూ టమి ప్రభుత్వం ఆంక్షలు విధించడం సరికాదని కొట్టు విమర్శించారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై జగన్ నిత్యం పోరాటం చేస్తూనే ఉంటారన్నారు. జగన్తో అనుబంధం ఉన్నవారందరినీ భయపెట్టి, కేసులు పెట్టి జైలులో పెట్టడం చంద్రబాబుకు, లోకేష్కు పరిపాటిగా మారిందన్నారు. అలాగే సంక్షేమం కోసం ప్రతిపక్షం ప్రశ్నిస్తుందని బాబుకు, పవన్కు భయం పట్టుకుందన్నారు. ప్రజలంతా కూటమి ప్రభుత్వ తీరుపై ఆగ్రహంతో ఉన్నారని, కూటమి ప్రభుత్వానికి పతనం తప్పదని కొట్టు అన్నారు. మాజీ మంత్రి కొట్టు సత్యనారయణ -
కొనసాగిన ఇళ్ల తొలగింపు
ఆకివీడు: స్థానిక ధర్మాపుర అగ్రహారంలోని మంచినీటి చెరువు చుట్టూ ఉన్న ఇళ్ల తొలగింపు ప్రక్రియ రెండో రోజు ఆదివారం కూడా కొనసాగింది. బాధితులు తమ ఇళ్లను ఖాళీ చేయడంతో పొక్లెయిన్లతో కూల్చివేశారు. బాఽధితులు ఎవరూ అడ్డుపడకపోవడంతో కూల్చివేత కార్యక్రమం సాఫీగా సాగిపోయింది. ఆదివారం రాత్రి వరకూ తొలగింపు పనులు సాగాయి. స్థానిక ఆనాల చెరువు, దొరగారిచెరువు గట్లపై ఆక్రమణలతో పాటు జాతీయరహదారి ప్రధాన సెంటర్లో ఆక్రమణలు, విస్తరణ కార్యక్రమాలు చేపడతామని అధికారులు చెబుతున్నారు. ఇటీవల నగర పంచాయతీ పరిధిలోని మంచినీటి చెరువుల్ని పరిశీలించిన కలెక్టర్ నాగరాణి చెరువు గట్లపై ఆక్రమణలు తొలగించాలని ఆదేశించారు. -
ఎంపీ మిథున్రెడ్డి అరెస్ట్ దారుణం
పెనుగొండ: రాజంపేట ఎంపీ మిథున్రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేయడం దారుణమని వైఎస్సార్సీపీ సీనియర్ నేతలు సుంకర సీతారామ్, కోట వెంకటేశ్వరరావు అన్నారు. మిథున్రెడ్డి అక్రమ అరెస్ట్ను ఖండిస్తూ ఆచంటలో అంబేడ్కర్ విగ్రహం వద్ద ఆదివారం వైఎస్సార్సీపీ శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం సీతారామ్, వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రాజకీయ ప్రతీకారంతోనే మిథున్ రెడ్డిని కూటమి ప్రభుత్వం అరెస్ట్ చేసిందని మండిపడ్డారు. మద్యం కేసులో ఎలాంటి ఆధారాలు లేకపో యినా మిథున్రెడ్డిని అరెస్ట్ చేయాలనుకోవడం చంద్రబాబు కక్షపూరిత పాలనకు నిదర్శనం అన్నారు. కూటమి నాయకులు హామీలు నెరవేర్చకపోవడంతో ప్రజల్లో తిరుగుబాటు మొదలైందని, దీంతో ప్రజల దృష్టి మళ్లించడానికి ఇలాంటి అక్రమ కేసులు నమోదు చేసి అరెస్ట్లు చేస్తున్నారని దుయ్యబట్టారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను ఎవరూ ప్రశ్నించకూడదనే ఉద్దేశంతోనే వైఎస్సార్సీపీ నాయకులను భయభ్రాంతులకు గురిచేస్తున్నా రని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో పాలనను గాలికొదిలేసి రెడ్బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని ఎద్దేవాచేశారు. సర్పంచ్లు జక్కంశెట్టి చంటి, జక్కంశెట్టి శ్రీరామ్, పార్టీ రాష్ట్ర యూత్ జాయింట్ సెక్రటరీ కొవ్వూరి వేణుమాధవరెడ్డి, పిల్లి రుద్రప్రసాద్, మన్నె సుబ్బారావు, పెచ్చెట్టి సత్యనారాయణ, యల్లమెల్లి రాజేష్, బొరుసు రాంబాబు, దొమ్మెటి రాంబాబు, కేతా తాతారావు, గుబ్బల రామకృష్ణ, దొంగ దుర్గ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
చెత్తశుద్ధి కరువు
●దోమలు విజృంభిస్తున్నాయి భీమవరంలో రోడ్లు, డ్రెయిన్ల వెంబడి చెత్తాచెదారంతో పారిశుద్ధ్యం అధ్వానంగా మారింది. 1,2 వార్డుల మీదుగా ప్రవహించే మిరియమియా కోడు (మురుగు డ్రెయిన్)లో చెత్తను డంప్ చేస్తున్నారు. దీంతో డ్రెయిన్ మరింత దారుణంగా మారి దోమలు విజృంభిస్తున్నాయి. అధికారులు పట్టించుకోవడం లేదు. – పాలవెల్లి మంగ, 1వ వార్డు, భీమవరం నిర్వహణ లేక నిరుపయోగం మా గ్రామంలో చెత్త నుంచి సంపద సృష్టించే కేంద్రం నిర్వహణ లేక నిరుపయోగంగా మారింది. ఈ కేంద్రంలో పొడి, తడి చెత్త, ప్లాస్టిక్ వ్యర్థా లు వేరు చేసే విభాగాలు ధ్వంసమయ్యాయి. దీంతో చెత్తను కేంద్రం ఆవరణలో డంప్ చేస్తున్నారు. కేంద్రాన్ని వినియోగంలోకి తీసుకువచ్చి వర్మీకంపోస్టు తయారీకి చర్యలు తీసుకోవాలి. –బి.రాంబాబు కొండేపూడి భీమవరం(ప్రకాశం చౌక్): జిల్లాలోని రోడ్డు మార్జిన్లు చెత్తాచెదారాలతో కంపు కొడుతున్నాయి. డ్రెయిన్లు వ్యర్థాలతో అధ్వానంగా మారాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంతో ఆర్భాటంగా స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభించిన జిల్లాలో పారిశుద్ధ్య నిర్వహణ పరిస్థితి ఇది. తణుకులో పర్యటించిన సీఎం చంద్రబాబు ‘పారిశుద్ధ్య పనులు చేయకపోతే అధికారులు, ప్రజాప్రతినిధులదే బాధ్యత’, ‘ఎక్కడా చెత్త కనిపించవద్దు.. ఎప్పుడైనా వచ్చి తనిఖీ చేస్తా’ అని హెచ్చరించినా అధికారులు మాత్రం నిర్లక్ష్యం వీడటం లేదు. జిల్లాలోని పట్టణాల నుంచి పల్లెల వరకూ రోడ్ల మార్జిన్లు చెత్తాచెదారం, ప్రమాదకర వస్తువులతో డంపింగ్ యా ర్డులు ఉన్నాయి. అలాగే మురుగు కాలువలు, డ్రెయిన్లు చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలతో నిండి పోయాయి. 20 మండలాలు.. 409 పంచాయతీలు జిల్లాలో 20 మండలాలు, 6 మున్సిపాలిటీలు, 409 పంచాయతీలు ఉన్నాయి. దాదాపు అన్ని చోట్లా పారిశుద్ధ్య నిర్వహణ అధ్వానంగానే ఉంది. కొన్నిచోట్ల డ్రెయిన్లలోకి కొందరు టాయిలెట్స్ పైపులను పెట్టడం, డ్రెయిన్లను ఆక్రమించుకుని నిర్మాణాలు చేపట్టడంతో పూర్తిస్థాయిలో మురుగు పారడం లేదు. దీంతో పర్యావరణ కాలుష్యం పెరుగుతోంది. సంపద సృష్టి అంతంతమాత్రమే.. జిల్లాలో దాదాపు అన్ని పంచాయతీల్లో చెత్త నుంచి సంపద సృష్టించే కేంద్రాలు ఉన్నాయి. అయితే వీటి నిర్వహణ అధ్వానంగా ఉంది. ఒకటి, రెండు పంచాయతీలు మినహా మిగిలిన కేంద్రాల నిర్వహణను పంచాయతీ అధికారులు గాలికి వదిలివేశారు. దీంతో సంపద సృష్టించే కేంద్రాలు నిరుపయోగంగా మారాయి. గ్రామాల్లో సేకరించిన చెత్తను కేంద్రాలకు తరలించడం లేదు. కొన్నిచోట్ల కేంద్రాల ఆవరణల్లో, మరికొన్ని చోట్ల ఊరి శివార్లలో రోడ్ల వెంబడి డంప్ చేస్తున్నారు. సీజనల్ వ్యాధుల వ్యాప్తి చెత్తను ఎక్కడిపడితే అక్కడ డంప్ చేయడంతో సీజనల్ వ్యాధుల భయం వెంటాడుతోంది. దోమలు విజృంభించి డెంగ్యూ, మలేరియా వ్యాపించే అవకాశం ఉంది. అలాగే పలుచోట్ల జ్వరాలు ప్రబలుతున్నాయి. అధికారుల అలసత్వం జిల్లాలో రోడ్లు, డ్రెయిన్లు, మురుగు కాలువలు చెత్తతో నిండిపోతున్నా కూటమి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ప్రజల ఆరోగ్యం దెబ్బతింటున్నా పట్టడం లేదు. ఊళ్లన్నీ చెత్తతో నిండిపోతున్నా, చెత్త నుంచి సంపద సృష్టించే కేంద్రాల నిర్వహణ తీరు సరిగా లేకున్నా కలెక్టర్ పట్టించుకునే పరిస్థితి లేదు. అలాగే జిల్లాలోని మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రతిపక్ష పార్టీ నాయకులపై విమర్శలు చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు తప్ప ఆయా నియోజకవర్గాల్లో పారిశుద్ధ్య నిర్వహణపై దృష్టి సారించడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదేనా స్వచ్ఛాంధ్ర? డంపింగ్ యార్డులుగా రోడ్లు, డ్రెయిన్లు ఆచరణలో కానరాని స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర నిరుపయోగంగా సంపద సృష్టి కేంద్రాలు క్షీణించిన పారిశుద్ధ్యంతో సీజనల్ వ్యాధుల భయం పట్టించుకోని అధికార యంత్రాంగం -
సుముహూర్తాల శ్రావణం
ముహూర్తాలు ఇలా.. శ్రావణమాసం మొదలైన మరుసటి రోజు నుంచి సుముహూర్తాలు మొదలు కానున్నా యి. జూలై 26, 30, 31, ఆగస్టు 1, 3, 5, 6, 7, 8, 9, 10, 12, 13, 14, 17, సెప్టెంబర్ 23, 24, 26, 27, 28, అక్టోబర్ 1, 2, 3, 4, 7, 8, 10, 11, 12, 16, 17, 22, 23, 24, 26, 28, 29, 30, 31, నవంబర్ 1, 2, 4, 7, 12, 13, 14, 15, 22, 23, 25, 26, 27 తేదీల్లో సుమూహూర్తాలు ఉన్నాయి. ద్వారకాతిరుమల: శ్రావణమాసం వచ్చేస్తోంది. పెళ్లికళ తెచ్చేస్తోంది. ఈనెల 25 నుంచి శ్రావణమాసం ప్రారంభం కానుండగా, 26 నుంచి వివాహాది శుభకార్యాలు మొదలుకానున్నాయి. ఈ ఏడాది గురు మూఢమి, ఆషాఢ మాసం కావడంతో జూన్ 10 నుంచి 48 రోజుల పాటు శుభకార్యాలకు బ్రేక్ పడింది. దాంతో పెళ్లిబాజాలు మోగక కల్యాణ మండపాలు కళ తప్పాయి. శుభకార్యాలపై ఆధారపడ్డ వ్యాపార దుకాణాలు వెలవెలబోయాయి. అయితే ఈనెల 26 నుంచి సుముహూర్తాలు ప్రారంభం కానుండటంతో వ్యాపారులు మళ్లీ బిజీ కాను న్నారు. ఇప్పటికే పెళ్లిళ్లు కుదుర్చుకున్న వారు తమ పిల్లల వివాహాలను ఈ ముహూర్తాల్లోనే అట్టహాసంగా జరిపించాలని భావిస్తున్నారు. శ్రీవారి క్షేత్రంలో ఆల్ ఫుల్ గురు మూఢమి, ఆషాఢ మాసం కావడంతో వివా హాలు, శంకుస్థాపనలు, గృహ ప్రవేశాలు, నూతన వ్యాపారాల ప్రారంభం, రిజిస్ట్రేషన్లు, నామకరణలు ఇతర శుభకార్యాలన్నింటికీ బ్రేక్ పడింది. శ్రావణమాసంలో ఆయా శుభకార్యాలకు పలువురు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. దీంతో ద్వారకాతిరుమల శ్రీవారి క్షేత్రంలో భారీగా వివాహాలు జరుగనున్నాయి. ప్రధానంగా ఆగస్టు 9, 13, 14 తేదీల్లో ఎక్కువ వివాహాలు జరుగనున్నాయని పండితులు చెబుతున్నారు. దీంతో ఇప్పటికే క్షేత్రంలో కల్యాణ మండపాలు, సత్రాల్లోని గదులు, కాటేజీలు అన్నీ బుక్ అయిపోయాయి. వ్యాపారులకు ఊరట 48 రోజుల పాటు వివాహ ముహూర్తాలు లేకపోవడంతో ప్రధానంగా పెళ్లిళ్లపై ఆధారపడి వ్యాపారాలు సాగిస్తున్న వస్త్ర, నగల దుకాణాలు, కల్యాణ మండపాలు వెలవెలబోయాయి. పెళ్లి తంతు సాగించే పురోహితులు ఖాళీగా ఉన్నారు. అలాగే కేటరింగ్, భోజనాల తయారీ వారు, డెకరేషన్, వీడియో, ఫొటోగ్రాఫర్లు డీలా పడ్డారు. శ్రావణమాసం రానుండటం వీరికి ఊరట కలిగిస్తోంది. పెళ్లి కళ వచ్చేసిందే బాలా ఈనెల 25 నుంచి శ్రావణమాసం 26 నుంచి సుముహూర్తాలు ద్వారకాతిరుమల క్షేత్రంలో ఆల్ ఫుల్ 48 రోజులుగా ఖాళీగా.. వివాహ ముహూర్తాలు లేక కేటరింగ్ వ్యాపారులు 48 రోజులుగా ఖాళీగా ఉన్నారు. అలాగే కల్యాణ మండపాల యజమానులు, పచ్చిపూల మండపాలు వేసేవారు, పురోహితులు అంతా ఇబ్బంది పడ్డారు. ఈనెల 26 నుంచి నవంబర్ 27 వరకు సుముహూర్తాలు ఉన్నాయి. వ్యాపారాలు బాగా జరుగుతాయని ఆశిస్తున్నాం. –ఇమ్మడి నాగు, కేటరింగ్ వ్యాపారి, ద్వారకాతిరుమల భారీగా వివాహాలు శ్రావణమాసంలో పెళ్లిళ్లు భారీగా జరుగనున్నాయి. నవంబర్ 27 వరకు ఉన్న సుముహూర్తాల్లో వివాహాది శుభకార్యాలు జరుపుకునేందుకు అంతా సిద్ధమవుతున్నారు. ద్వారకాతిరుమల క్షేత్రంలో వేలాదిగా వివాహాలు జరుగనున్నాయి. పెళ్లివారు ముందుగా ఏర్పాట్లు చేసుకోకుంటే ఇబ్బంది పడతారు. – గోవిందవఝుల వెంకటరమణమూర్తి శర్మ, పురోహితులు, ద్వారకాతిరుమల -
దళిత వితంతువుపై టీడీపీ నేతల వేధింపులు
యలమంచిలి: తమ ఇళ్లకు దారి ఇవ్వడం లేదనే అక్కసుతో కనకాయలంక గ్రామంలో తెలుగుదేశం నాయకులు ఓ దళిత వితంతువుపై కక్ష సాధింపులకు పూనుకున్నారు. దీనిని నిరసిస్తూ ఆదివారం మిగిలిన పార్టీల నాయకులు నిరసన తెలిపి అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం ఇచ్చారు. వివరాలిలా ఉన్నాయి.. కనకాయలంకకి చెందిన దళిత వితంతువు డొల్లా విజయలక్ష్మి గ్రామంలో రేకుల షెడ్డు వేసుకుని జీవిస్తోంది. ఆమెకున్న స్థలంలో నుంచి దారి కావాలని చాలాకాలంగా స్థానిక తెలుగుదేశం నాయకులు పట్టుబడుతున్నారు. రెవెన్యూ అధికారులు కూడా స్థలాన్ని పరిశీలించి ఆమె అంగీకరిస్తే రోడ్డు వేసుకోమని చెప్పారు. అయితే ఆ స్థలంలో తాను ఇల్లు కట్టుకుంటానని, అంతవరకూ తిరగడానికి అభ్యంతరం లేదని, కానీ సిమెంట్ రోడ్డు నిర్మాణానికి స్థలం ఇవ్వనని విజయలక్ష్మి చెప్పింది. ఇదిలా ఉండగా నెల రోజుల క్రితం ఆమె తను రేకుల షెడ్డుకు విద్యుత్ సర్వీసును ఏర్పాటు చేసుకుంది. అయితే తెలుగుదేశం నాయకులు అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చి ఆమె ఇంటి విద్యుత్ మీటర్ను తొలగింపజేశారు. దీనిపై గ్రామంలోని మిగిలిన పార్టీల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసనకు దిగారు. రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలుచేస్తున్న తెలుగుదేశం నాయకుల తీరును నిరసిస్తూ అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మద్దా శ్రీనివాసరావు, వైఎస్సార్ సీపీ, జనసేన నాయకులు పులి వెంకట సుబ్రహ్మణ్యం, వలవల ప్రసాద్, లంక కిషోర్, వలవల శ్రీనివాస్, చింద్రపు గణపతి, నెల్లి ఆనందరావు, యన్నాబత్తుల సుధీర్, వలవల నరసింహమూర్తి, కారుపల్లి శ్రీను, చిల్లే రవి, చిల్లే నాని, యాతం నాగపండు, యాతం సీతారాముడు , యాతం రెడ్డినాయుడు, యాతం వెంకటేశ్వరరావు (చిన్నబ్బు) తదితరులు పాల్గొన్నారు. -
మావుళ్లమ్మకు సారె సమర్పణ
భీమవరం (ప్రకాశంచౌక్): మావుళ్ళమ్మకు ఆదివారం భక్తులు వెయ్యి కిలోల ఆషాఢ సారె సమర్పించారు. క్వీన్ కిట్టి మహిళలు 51 రకాలతో 250 కిలోల సారె, విజయవాడ, ఆకివీడు, వీరవాసరం, భీమవరానికి చెందిన భక్తులు 200, 108 కేజీల చొప్పున సారె సమర్పించినట్లు ఆలయ సహాయ కమిషనర్ తెలిపారు. ప్రధాన అర్చకుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. సారె అందించిన భక్తులకు ఆశీర్వచనాలు అందించారు. రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి నరసాపురం రూరల్: నరసాపురం మండలం సీతారామపురం సౌత్ గ్రామంలో రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఆదివారం సాయంత్రం సీతారామపురంలోని జాతీయ రహదారిపై ఎదురెదురుగా వస్తున్న రెండు బైక్లు ఢీకొన్నాయి. ప్రమాదంలో మండలంలోని రుస్తుంబాద యడ్లపల్లి వారి తోట గ్రామానికి చెందిన పరసా సాయిచందు (26) అక్కడికక్కడే మృతి చెందాడు. మరో బైక్పై ఉన్న ఆనంద్, పి.రాజ్కు తీవ్రగాయాలు కావడంతో నరసాపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు.