breaking news
Jogulamba
-
చెత్త నిర్వహణ అస్తవ్యస్తం
● అలంపూర్ చౌరస్తా,సర్వీస్రోడ్లు దుర్గంధమయం ● భారీ చెట్లతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు అలంపూర్: నిత్యం వేలాది వాహనాల రాకపోకలతో రద్దీగా ఉండే అలంపూర్ చౌరస్తా, సర్వీస్రోడ్లలో చెత్త నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. ఆయా శాఖల మధ్య సమన్వయ లోపం కాస్తా వాహనదారులు, ప్రజలను ఇబ్బందుల్లో పడేస్తుంది. అలంపూర్ చౌరస్తాలోని నాలుగు రోడ్ల కూడలి, సర్వీస్ రోడ్ల పక్కనే చెత్తను వేస్తుండటంతో పందులకు అవాసాలుగా మారాయి. ఫ్లైఓవర్ పక్కన ముళ్ల పొదలు, పచ్చదనం కోసం వేసిన చెట్ల కొమ్మలు ఏపుగా పెరిగి రోడ్లను కమ్మేస్తున్నా.. వాహనదారులకు ఇబ్బందులు కలుగుతున్నా పట్టించుకునేవారే కరువయ్యారు. మరికొన్ని చోట్ల చెట్లు ఏపుగా పెరిగి విద్యుత్ తీగలను తాకుతున్నాయి. ఫ్లైఓవర్ కూడలి, సర్వీస్ రోడ్ల నిర్వహణను నేషనల్ అథారిటీ సిబ్బంది.. మిగిలిన ప్రాంతాలు పంచాయతీ సిబ్బంది చేపడుతున్నారు. అయితే, నాలుగు రోడ్ల కూడలిలోని ఫ్లైఓవర్ పక్కన విశాలమైన మైదానం ఉంటుంది. గతంలో నేషనల్ ఆథారిటీ అధికారులు పచ్చదనం పెంపొందించడానికి మొక్కలను నాటారు. కానీ అది కార్యరూపం దాల్చలేదు. దీంతో ఆ ప్రాంతం అపరిశుభ్రంగా మారి పందులకు అవాసంగా మారింది. ఈ మార్గంలో రాకపోకలు సాగించే వారు, ప్రయాణికులు ఆ ప్రాంతంలో ఒంటికి, రెంటికీ వినియోగిస్తుండడంతో దుర్వాసన వెదజల్లుతోంది. అధికారులు ఇప్పటికై న నాలుగు రోడ్ల కూడలిపై దృష్టి సారించాలని, చెత్త నిర్వహణ విధిగా చేపట్టేలా చూడాలని, సర్వీస్ రోడ్లపై వాహనదారులకు ఇబ్బందిగా మారిన చెట్ల కొమ్మలు కత్తిరించాలని స్థానికులు కోరుతున్నారు. -
తాగునీటి సమస్య తీర్చండి
అయిజ: గ్రామాల్లో తాగునీటి సమస్య తీవ్రమవుతోందని, అధికారులు తాగునీటి సమస్యను పరిష్కరించాలని బీజేపీ మండల ప్రసిడెంట్ గోపల కృష్ణ అన్నారు. ఆదివారం మండలంలోని ఉప్పలలో గ్రామంలో బీజేపీ నాయకులు పర్యటించారు. ఈసందర్భంగా బీజేపీ నాయకులకు గ్రామ ప్రజలు తాగునీటి సమస్య గురించి తెలిపారు. అదేవిధంగా ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. ఈసందర్భంగాబీజేపీ నాయకులు మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామాల్లో ఎలాంటి మౌళిక వసతులు కల్పించడంలేదని, కనీసం రోడ్లు, డ్రైనేజీలు నిర్మించడంలేదని మండిపడ్డారు. ప్రజలకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఏవీ పూర్తిస్థాయిలో అమలు కావడంలేదని, స్థానిక ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెబుతారని బీజేపీ నాయకులు అన్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు లక్ష్మణ్ గౌడ్, నరసింహులు, రవి, శంకరన్న, గ్రామస్తులు పాల్గొన్నారు. -
త్వరలో మద్యం టెండర్లు!
నవంబర్తో ముగియనున్న పాత లైసెన్స్ గడువు ● పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ముందస్తు టెండర్లు నిర్వహించే అవకాశం ● దరఖాస్తు ఫీజు రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షలకు పెంపు ● జిల్లాలో 36 మద్యం దుకాణాలు దరఖాస్తులు ఎక్కువే... జిల్లాలో గతంలో నిర్వహించిన మద్యం దుకాణాల టెండర్లలో దరఖాస్తులు వెల్లువలా వచ్చాయి. ఈసారి కూడా మద్యం షాపులకు పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చే అవకాశం ఉంది. టెండర్లలో పాల్గొనేందుకు రెండు రాష్ట్రాలకు చెందిన వ్యాపారులు బృందాలుగా ఏర్పడి పోటీ పడ్డారు. 10 నుంచి 20 షాపులకు టెండర్లు వేశారు. అయితే లక్కీ డిప్లో షాపులు దక్కని వారు డిప్లో వచ్చిన వారి నుంచి గుడ్విల్తో చేజిక్కించుకున్నారు. 2023లో జిల్లాలోని 36 మద్యం దుకాణాల కోసం వ్యాపారులు 1,171 టెండర్లు దాఖలు చేశారు. ఈ దరఖాస్తుల రూపంలో ప్రభుత్వానికి రూ.23.42 కోట్లు సమకూరింది. డిపాజిట్ ధర పెంపు..? గతంలో టెండర్లో పాల్గొనాలంటే దరఖాస్తుకు రూ.2 లక్షలు డీడీ చెల్లించాలనే నిబంధనతో పాటు లక్కీ డీప్ ద్వారా దుకాణం కేటాయిస్తారు. డీడీల రూపంలో వ్యాపారులు చెల్లించిన డబ్బులు తిరిగి రాదు ప్రభుత్వానికే చెందుతుంది. అయితే తాజాగా దరఖాస్తుల ధరను మరింతగా పెంచి ప్రభుత్వం అదనపు ఆదాయం సమకూర్చుకునే పనిలో పడింది. దరఖాస్తు ఫారం ధరను రూ.2 లక్షల నుంచి రూ. 3లక్షలకు పెంచే అవకాశం ఉంది. గద్వాల క్రైం: త్వరలోనే మద్యం దుకాణాల టెండర్లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చే యోచనలో ఉంది. దరఖాస్తు ఫీజులను సైతం పెంచనుంది. జిల్లాలో గద్వాల – అలంపూర్ సెగ్మెంట్లలో 36 మద్యం దుకాణాల గడవు మరో నాలుగు నెలల్లో ముగుస్తుంది. దీనికి తోడు పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ సెప్టెంబర్ నెలాఖరు నాటికి పూర్తి చేయాల్సిన నేపథ్యంలో మద్యం షాపులకు టెండర్ల ప్రక్రియను ముందస్తుగా చేపట్టే అవకాశం ఉంది. 2023లో ఆగస్టు 21న టెండర్లు పిలిచి డ్రా తీశారు. డిసెంబర్ 1 నుంచి కొత్త మద్యం దుకాణాల నిర్వాహకులు క్రయవిక్రయాలు ప్రారంభించారు. ప్రస్తుతం జిల్లాలోని 36 మద్యం దుకాణాల లైసెన్స్ గడువు నవంబర్ 30వ తేదీన ముగియనుంది. ఈ నేపథ్యంలో మళ్లీ టెండర్లు పిలిచేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. -
ఆదేశాలు వస్తే దరఖాస్తులు స్వీకరిస్తాం
మద్యం దుకాణాల పాత లైసెన్స్ గడువు నాలుగు నెలలు ఉంది. అయితే స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ కోసం ప్రభుత్వం కసరత్తు చేపట్టింది. అందులో భాగంగా కోడ్ వస్తే ఎలాంటి టెండర్ల నిర్వహణ ఉండదని భావించి మద్యం దుకాణాల కోసం ముందస్తు టెండర్ల చేపట్టే అవకాశం ఉంది. జిల్లాలోని దుకాణాలు, అన్ని అంశాలపై నివేదికలను ప్రభుత్వానికి అందజేశాం. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వస్తే దరఖాస్తుల స్వీకరణ చేపడ్తాం. – గణపతిరెడ్డి, ఎకై ్సజ్ సీఐ, గద్వాల ● -
రక్తదానం.. మరొకరికి ప్రాణదానం
గద్వాలటౌన్: రక్తదానం చేస్తే ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తికి పునర్జన్మను ఇచ్చినట్లేనని సీఐ శ్రీనివాస్ పేర్కొన్నారు. బ్రహ్మకుమారి దాది ప్రకాష్మణి వర్ధంతిని పురస్కరించుకుని విశ్వబంధుత్వ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదివారం స్థానిక రాజయోగ సేవ కేంద్రంలో ఆవరణలో బ్రహ్మకుమారీస్ ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రక్తదానం అన్ని దానాల కన్నా మిన్న అని, ఆపత్కాకాలంలో అవసరమైన రక్తాన్ని అందించి ప్రాణాన్ని రక్షించవచ్చవన్నారు. ప్రమాదంలో గాయపడిన వారికి సకాలంలో రక్తం లభించక మృతి చెందిన సంఘటనలు నిత్యం చోటు చేసుకుంటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. బ్రహ్మకుమారీ ప్రతినిధి బీకే మంజుల మాట్లాడుతూ సమాజ హిత కార్యక్రమాల్లో బ్రహ్మకుమారీల భాగస్వామ్యం పెరిగిందని చెప్పారు. అవకాశం లభించినప్పుడల్లా ప్రతి ఒక్కరూ సామాజిక సేవా కార్యక్రమాలపై దృష్టి సారించాలన్నారు. కార్యక్రమంలో రెడ్క్రాస్ సోసైటీ ప్రతినిధులు రమేష్, అయ్యప్పురెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఇంకా పునరుద్ధరించలే!
సాక్షి, నాగర్కర్నూల్: శ్రీశైలం ఎడమగట్టు భూగర్భజల విద్యుత్ కేంద్రంలో జరిగిన ఘోర ప్రమాద ఆనవాళ్లు నేటికీ చెదిరిపోవడం లేదు. 2020 ఆగస్టు 20న రాత్రి నాలుగో యూనిట్లో చోటుచేసుకున్న షార్ట్సర్క్యూట్ కారణంగా.. రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ వెలుగులు ప్రసరింపజేసే భూగర్భ కేంద్రంలో చీకట్లు కమ్ముకున్నాయి. ప్రమాదం కారణంగా చెలరేగిన మంటలు, పొగలతో ఉక్కిరిబిక్కిరికి గురై డ్యూటీలో ఉన్న తొమ్మిది మంది ఉద్యోగులు మరణించారు. తెలంగాణ రాష్ట్రానికి విద్యుత్ అందిస్తున్న శ్రీశైలం ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రంలోని నాలుగో యూనిట్ ప్యానెల్ బోర్డులో షార్ట్సర్క్యూట్తో మంటలు చెలరేగడం, చుట్టూ మంటలు, పొగలో చిక్కుకుని ఏడుగురు జెన్కో ఉద్యోగులు, ఇద్దరు అమరాన్ బ్యాటరీ కంపెనీకి చెందిన ఉద్యోగులతో సహా మొత్తం తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా.. ప్రమాదం సంభవించిన నాలుగో యూనిట్ను నేటికీ పునరుద్ధరించకపోవడం కొసమెరుపు. ఇదే తొలి ప్రమాదం.. శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ జలవిద్యుత్ కేంద్రంలో 2001 ఫిబ్రవరిలో ఒక యూనిట్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించారు. ఈ కేంద్రంలో మొత్తం 6 యూనిట్లకు గానూ ఒక్కో యూనిట్ 150 మెగావాట్ల చొప్పున మొత్తం 900 మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యం ఉంది. 2020 వరకూ ఈ కేంద్రంలో పూర్తిస్థాయిలో విద్యుదుత్పత్తి కొనసాగింది. 24 గంటల వ్యవధిలో 6 యూనిట్ల ద్వారా 21 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి చేసేవారు. అయితే ఐదేళ్ల క్రితం జరిగిన ప్రమాదంలో నాలుగో యూనిట్ పూర్తిగా ధ్వంసం కాగా.. ఇప్పటి వరకు ఈ యూనిట్ పునరుద్ధరణ పూర్తికాలేదు. అయితే భూగర్భ కేంద్రం చరిత్రలోనే ఇదే తొలి ప్రమాదం కావడం గమనార్హం. ఐదేళ్లుగా సా..గదీత ప్రమాదం జరిగినప్పటి నుంచి నాలుగో యూనిట్ పునరుద్ధరణ పనులను చేపట్టినా ఇప్పటి వరకు అధికారులు అందుబాటులోకి తీసుకురాలేకపోయారు. పూర్తిగా ధ్వంసమైన నాలుగో యూనిట్ను పునరుద్ధరణ పనులు రెండేళ్ల కిందట పూర్తిచేసినా, సాంకేతిక సమస్యలతో విద్యుదుత్పత్తి చేపట్టడం లేదు. గతేడాది డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఈ కేంద్రాన్ని సందర్శించి నాలుగో యూనిట్ పునరుద్ధరణ పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. కేంద్రం పూర్తి విద్యుదుత్పత్తి సామర్థ్యం 900 మెగావాట్లు కాగా.. ప్రస్తుతం ఐదు యూనిట్ల ద్వారా 750 మెగావాట్ల సామర్థ్యంతోనే విద్యుదుత్పత్తి కొనసాగుతుంది. నాలుగో యూనిట్ను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెస్తేనే గరిష్ట స్థాయిలో విద్యుదుత్పత్తి చేసే అవకాశం ఉంది. ఈ విషయమై శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రం సీఈ సత్యనారాయణను సంప్రదించగా నాలుగో యూనిట్ పునరుద్ధరణ పనులు 24 గంటల పాటు కొనసాగుతున్నాయని, మరో నెల రోజుల్లో విద్యుదుత్పత్తి చేపట్టేలా కృషిచేస్తామన్నారు. శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ జల విద్యుత్ కేంద్రంలో సిద్ధంకాని నాలుగో యూనిట్ 2020 ఆగస్టు 20 నాటి దుర్ఘటనలో 9 మంది ఉద్యోగుల మృతి ఏళ్లతరబడిగా సాగుతున్న మరమ్మతు ప్రక్రియ ప్రస్తుతానికి ఐదు యూనిట్లతోనే విద్యుదుత్పత్తి -
ప్రజల దీవెనతో ప్రజాపాలన
అమ్రాబాద్/వెల్దండ: ప్రజా పాలనలో ప్రజల ప్రభుత్వం పనిచేస్తుందని, ప్రజల దీవెనలతో అన్నివర్గాల ప్రజలు, అన్నిరంగాల అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్తోందని రాష్ట్ర పంచాయతీ రాజ్, సీ్త్ర శిశు సంక్షేమ, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అన్నారు. ఆదివారం నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జంగంరెడ్డిపల్లిలో ప్రజలనుద్దేశించి మాట్లాడారు. గ్రామాలు బాగుండాలని ప్రభుత్వం పనుల జాతర కార్యక్రమంలో భాగంగా మొత్తం 1,500 పనులకు గాను రూ.20,200 కోట్లు మంజూరు చేసిందన్నారు. ఈ నిధులతో గ్రామ పంచాయతీ, అంగన్వాడీ భవనాలు తదితర అభివృద్ధి పనులు చేపట్టవచ్చన్నారు. ముఖ్యంగా మహిళా సంఘాల అభివృద్ధి కోసం ఇప్పటికే ప్రభుత్వం క్యాంటీన్లు, పెట్రోల్ బంకులు ఏర్పాటు చేసి మహిళలు ఆర్థిక స్వావలంభన సాధించే దిశగా ప్రోత్సహిస్తుందని చెప్పారు. గత ప్రభుత్వం మహిళలకు పావలా వడ్డీ రుణాలను పూర్తిస్థాయిలో అమలు చేయలేదని, కానీ, తమ ప్రజల ప్రభుత్వం మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇస్తుందని పేర్కొన్నారు. గతంలో 60 ఏళ్లు దాటిన మహిళలను తొలగించారని, ఇప్పుడు వారిని కూడా చేర్చుకోవాలని తాము చెబుతున్నామన్నారు. చదువుతోనే పేదరిక నిర్మూలన సాధ్యమని మంత్రి సీతక్క అన్నారు. మహిళలు స్వయం ఉపాధి రంగాలను ఎంచుకోని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని, తమ పిల్లలను ఉన్నత చదువులను చదివించాలని సూచింజుచారు. ఆయా కార్యక్రమంల్లో అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ, అదనపు కలెక్టర్ దేవసహాయం, డీఆర్డీఓ ఓబులేష్, గ్రంథాలయ చైర్మన్ రాజేందర్, తదితరులు పాల్గొన్నారు. -
సీపీఎస్ రద్దు చేసే వరకు పోరాటం
గద్వాలటౌన్: ఉద్యోగ, ఉపాధ్యాయుల పాలిట శాపంగా మారిన జీఓ 28ని తక్షణమే రద్దు చేయాలని జేఏసీ చైర్మన్ నాగర్జునగౌడ్ డిమాండ్ చేశారు. జీఓ 28ని వ్యతిరేకిస్తూ బాధిత ఉద్యోగ, ఉపాధ్యాయులంతా తమకు న్యాయం చేయాలని, తమ ఉద్యోగ జీవితాలకు భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ శనివారం నిరసన కార్యక్రమాలు చేపట్టారు. మధ్యాహ్న భోజన విరామ సమయంలో ఆయా శాఖల కార్యాలయాల వద్ద ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి, ఫ్లకార్డులు చేతపట్టి నిరసన వ్యక్తం చేశారు. జాక్టో, జేఏసీ వేరువేరుగా పెన్షన్ విద్రోహ దినం, బ్లాక్ డే కార్యక్రమాలు చేపట్టారు. జీఓ ప్రతులను దహనం చేసి నిరసన తెలిపారు. సీపీఎస్ వద్దు – ఓపీఎస్ ముద్దు అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సీపీఎస్ విధానాన్ని రద్దు చేయకుంటే ప్రభుత్వంపై సమరం సాగిస్తామని జేఏసీ నేతలు హెచ్చరించారు. సంఘటితంగా ఉద్యమించాలి సీపీఎస్ రద్దు కోసం శాంతియుతంగా ఉద్యమాలు చేసి సాధించుకోవాలని, ఇందుకు ప్రతి ఒక్కరూ చొరవ తీసుకొని సంఘటితంగా పోరాడాలని జేఏసీ చైర్మన్ నాగర్జునగౌడ్, టీఎన్జీఓ రాష్ట్ర నాయకుడు భీమన్న పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని సీపీఎస్ అధ్యక్షుడు నాగరాజు, విష్ణు డిమాండ్ చేశారు. -
‘ఇందిరమ్మ ఇళ్ల’ ఇసుక టిప్పర్ల నిలిపివేత
రాజోళి: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల కోసం ఇసుకను తరలిస్తున్న టిప్పర్లను మండలంలో పలు చోట్ల నిలిపేశారు.జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం రాజోళి మండలంలోని తుమ్మిళ్ల గ్రామంలో ఇసుక రీచ్ను ఏర్పాటు చేశారు. కాగా ఆన్లైన్లో ఇసుకను బుక్ చేసుకున్న వారి కోసం అక్కడి నుంచి ఇసుకను పడమటి గార్లపాడు,రాజోళి మీదుగా తరలిస్తున్న క్రమంలో పడమటి గార్లపాడు,కొత్త రాజోళిలో శుక్రవారం, శనివారం నిలిపేశారు. తమ గ్రామాల మీదుగా టిప్పర్లు వెళితే రోడ్లు దెబ్బతింటాయని, దెబ్బతిన్న రోడ్లకు బాధ్యులెవరని అంటూ వాహనాలను నిలిపేశారు. 20 టన్నుల బరువుతో టిప్పర్లు వెళితే రోడ్లు పూర్తిగా దెబ్బతింటాయని తమ గ్రామాల మీదుగా తిరగనివ్వమని వాపోయారు. ఇతర గ్రామాల గుండా వెళ్లమని చెప్పామని, అయినా ఇదే మార్గంలో బుకింగ్ ఉందని టిప్పర్లు తిరగడంతో వాటిని నిలిపేశామని ఆయా గ్రామాల వాసులు తెలిపారు. -
సురవరానికి ఘన నివాళి..
గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో శనివారం మాజీ సర్పంచ్ శేషన్గౌడ్, గ్రామస్తులు సూరిగౌడు, లక్ష్మన్న, రాంరెడ్డి, మణికుమార్, సుధాకర్రెడ్డి, ఎంఈఓ రామకృష్ణ, ప్రధానోపాధ్యాయురాలు శ్యామల, ఉపాధ్యాయులు గరీబ్, గజరాజు విద్యార్థులతో కలిసి సురవరం సుధాకర్రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన ఆత్మకూ శాంతి చేకూరాలని రెండు నిమిషాలు మౌనం పాటించారు. అదేవిధంగా సురవరం వెంకట్రామిరెడ్డి విజ్ఞాన కేంద్రం వద్ద ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించగా నాయకులు వీరాంజనేయులు, బాబు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన మరణం స్థానికంగానేగాక ఎమ్మెల్యేగా పోటీచేసిన కొల్లాపూర్లోనూ తీవ్ర విషాదం నింపింది. పాఠశాలలో నివాళులర్పిస్తున్న ఉపాధ్యాయులు, విద్యార్థులు -
ఉత్సాహంగా ఎంపిక పోటీలు
గద్వాలటౌన్: రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల కోసం జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి ఎంపిక పోటీలు ఉత్సాహంగా సాగాయి. శనివారం స్థానిక మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియంలో అండర్ –14, 16, 18, 20 విభాగాలలో బాలురు, బాలికలకు వేర్వేరుగా జిల్లాస్థాయి ఎంపిక పోటీలు నిర్వహించారు. 100 మీటర్లు, 600 మీటర్లు, 800 మీటర్లు,1500 మీటర్లు, 3000 మీటర్లు పరుగు పందెంతో పాటు లాంగ్జంప్, హైజంప్, షాట్ఫుట్, డిస్క్త్రో, జావలిన్ త్రో విభాగాలలో క్రీడాకారులు పోటీపడ్డారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 750 మంది విద్యార్థులు పోటీలలో పాల్గొన్నారు. జిల్లాస్థాయి అథ్లెటిక్స్ ఎంపిక పోటీలను డీవైఎస్ఓ జితేందర్, ఎస్జీఎఫ్ జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు జెండా ఊపి పోటీలను ప్రారంభించి మాట్లాడారు. పట్టుదల, శ్రద్ధ అనేది క్రీడల వల్ల అలవడతాయని, జిల్లాస్థాయిలో ప్రతిభ చాటిన 30 మంది క్రీడాకారులను రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేశారు. ఎంపికై న వారందరూ ఈ నెల 30, 31వ తేదీలలో పాలమూరు యూనివర్సిటీ సేడియంలో జరిగే రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీలలో పాల్గొంటారని జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు బీసన్న, సతీష్కుమార్ తెలిపారు. నగేష్బాబు, వెంకట్రాములు, బషీర్, జగదీష్, నర్సింహరాజు, మోహనమురళీ, ఆనంద్, రఘు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. -
ఉద్యమ నేతకు జోహార్లు
● స్వగ్రామం కంచుపాడులో సురవరం సుధాకర్రెడ్డికి ఘనంగా నివాళి ● నాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్న గ్రామస్తులు సాగులో మెళకువలు చెప్పేవారు.. సురవరం పొలాలను మేమే సాగు చేస్తాం. గ్రామానికి వచ్చినప్పుడు పంటలను తప్పక పరిశీలించేవారు. దిగుబడి, చీడపీడల గురించి అడిగి తెలుసుకొని కొత్త పంటల గురించి వివరించేవారు. అందరికి సహకరిస్తూ సాయంగా ఉండేవారు. – చిన్న కర్రెన్న, కంచుపాడు అన్యోన్యంగా ఉండేవారు.. సురవరం సుధాకర్రెడ్డి గ్రామానికి వచ్చిన సమయాల్లో రాజకీయాల గురించి అడిగి తెలుసుకునే అలవాటు. అలాగే ప్రతి సంక్రాంతికి యువతను ప్రోత్సహించడానికి క్రీడాపోటీలు నిర్వహించేవారు. తనతోపాటు కూర్చున్న యువకులకు క్రీడలు, జీవితంలో రాణించడం తదితర అనేక అంశాలపై అవగాహన కల్పించేవారు. అందరితో ఎంతో అనోన్యంగా ఉండేవారు. – వీరేష్, మండల అధ్యక్షుడు, ఏఐవైఎఫ్ అలంపూర్/ఉండవెల్లి: సీపీఐ అగ్రనేత సురవరం సుధాకర్రెడ్డి (83) మృతితో ఆయన స్వగ్రామం జోగుళాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం కంచుపాడులో విషాదఛాయలు అలుముకున్నాయి. గ్రామస్తులు ఆయన జ్ఞాపకాలను నెమరు వేసుకొని బాధాతప్త హృదయాలతో కన్నీటి పర్యంతమై శ్రద్ధాంజలి ఘటించారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శుక్రవారం తుది శ్వాస విడిచారు. మారుముల గ్రామం నుంచి జాతీయ నేతగా ఎదిగిన ఆయన ప్రస్థానం గురించి చర్చించారు. పేద, బడుగు బలహీనవర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన కృషిని స్మరించుకున్నారు. సొంతూరిపై మమకారం.. జాతీయ రాజకీయాలను శాసించిన సురవరానికి సొంతూరిపై మమకారం ఎక్కువ. సీపీఐ అగ్రనేతగా ఉన్న సమయంలోనూ తరుచూ వచ్చి వెళ్లేవారు. తండ్రి సురవరం వెంకట్రామిరెడ్డి పేరు మీద విజ్ఞాన కేంద్రం నెలకొల్పి యువతులు, మహిళలకు కుట్టు శిక్షణ, యువకులకు కంప్యూటర్ శిక్షణ ఇప్పించారు. అలాగే ఏటా సంక్రాంతికి ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో క్రీడాపోటీలు నిర్వహించి యువతను ప్రోత్సహించారు. కరోనా సమయంలో ఐసోలేషన్ కిట్స్, నిత్యావసర సరుకులు అందించి ఆసరాగా నిలిచారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉపయోగపడే పుస్తకాలు అందించారు. సీపీఐ మహాసభలు, యువజన ఉత్సవాలు సురవరం విజ్ఞాన కేంద్రంలోనే నిర్వహించి సొంతూరిపై అభిమానాన్ని చాటుకున్నారు. క్రీడాకారులకు క్రీడాసామగ్రిని పంపిణీ చేశారు. పర్యావరణ పరిరక్షణపై గ్రామీణులకు అవగాహన కల్పిస్తూనే సొంత ఇంటి ఆవరణలో రకరకాల మొక్కలు పెంచి ఆదర్శంగా నిలిచారు. గ్రామంలో తాగునీటి సమస్య పరిష్కారానికి ట్యాంకును నిర్మించారు. ఆర్థికంగా వెనుకబడిన పేద విద్యార్థులను ప్రోత్సహించి విశ్వవిద్యాలయాల్లో ఉన్నత విద్య అభ్యసించే అవకాశాలు కల్పించారు. నిరాడంబర జీవనం ఆయన ప్రత్యేకత.. సురవరం జీవనం నిరాడంబరంగా సాగింది. పార్టీలో జాతీయస్థాయి పదవితో పాటు ఎంపీగా రెండు పర్యాయలు సేవలందించారు. కానీ సొంతూరికి వచ్చిన సమయాల్లో ఆయన చాలా నిరాడంబరంగా ఉండేవారు. ఇంటి వద్ద బయట కూర్చొని వచ్చిపోయే వారితో మాట్లాడి వారి యోగక్షేమాలు తెలుసుకునేవారు. గ్రామ వీధుల్లో సైతం సాదాసీదాగా తిరుగుతూ అందరిని పలుకరించేవారు. -
పండుగలు ప్రశాంతంగా జరుపుకోవాలి
గద్వాల: ప్రశాంత వాతావరణంలో వినాయక చవితి, మిలాద్–ఉన్–నబీ వేడుకలు నిర్వహించేలా అధికారులు అన్ని రకాల ముందస్తు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ బీఎం సంతోష్ ఆదేశించారు. శనివారం ఐడీవోసీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్హాలులో ఎస్పీ శ్రీనివాస్రావుతో కలిసి అధికారులతో సమీక్షించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉత్సవాల నిర్వహణకు జిల్లా అధికార యంత్రాంగం సంసిద్ధంగా ఉండి అన్ని రకాల ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టాలన్నారు. అదేవిధంగా దెబ్బతిన్న రోడ్లకు వెంటనే తాత్కాలిక మరమ్మత్తులు చేపట్టాలన్నారు. ఈవేడుకలు ప్రతి ఎడాది మాదిరిగానే సహృద్భావ వాతావరణంలో జరిగేలా అందరూ స్ఫూర్తిని కొనసాగించాలన్నారు. ఈసారి కూడా వినాయక నిమజ్జనం, మిలాద్–ఉన్–నబీ వేడుక ఒకేసారి వస్తున్నందున ఎక్కడా కూడా చిన్నపాటి అవాంఛనీయ ఘనటలకు తావులేకుండా పోలీసుశాఖ అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. హైరిస్క్ కేసులపై ప్రత్యేక దృష్టి సారించండి గర్భిణులలో హైరిస్క్ కేసులను ముందస్తుగానే గుర్తించి ప్రత్యేక దృష్టి సారించాలని, మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులను ఆదేశించారు. శనివారం జిల్లా కేంద్రంలోని ఒంటెలపేటలోని అర్బన్హెల్త్సెంటర్ను ఆకస్మికంగా సందర్శించారు. సిబ్బంది హాజరు, ఓపి వివరాలు వ్యాక్సినేషన్, మందుల పంపిణీ వంటి అంశాలను పరిశీలించారు. ప్రభుత్వ ఆసుపత్రులలోనే ప్రసవాలు జరిగేలా అవగాహన కల్పించాలని, రక్తహీనతతో బాధపడుతున్న ప్రతిఒక్కరికి పౌష్టికాహారం అందించాలన్నారు. అవసరమైన వారికి ప్రభుత్వ ఆసుపత్రులలోనే వైద్యసేవలు అందించాలన్నారు. ఇమ్యునైజేషన్ నిరంతరం కొనసాగించాలన్నారు. మలేరియా, డెంగీ, చికెన్గున్యా వంటి సీజనల్ వ్యాధుల నియంత్రణకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్వో డాక్టర్ సిద్ధప్ప, డాక్టర్ మాధుర్య, వైద్యసిబ్బంది పాల్గొన్నారు. ప్రమాదాలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు ఏకధాటిగా వర్షాలు కురుస్తున్నందున ప్రమాదాలు చోటుచేసుకోకుండా వినాయక మండపాల ఏర్పాటులో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని, నిమజ్జన కార్యక్రమంలో గుర్తించిన బీచుపల్లి, నదీఅగ్రహారం, జమ్మిచేడు, జూరాల ప్రాంతాల్లో పోలీసు, రెవెన్యూ శాఖలు అప్రమత్తంగా ఉండి అన్ని రకాల చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచాలన్నారు. క్రేన్, లైటింగ్వ్యవస్థ, వైద్యశిబిరాలు, బారికేడ్లు, ట్రాఫిక్క్రమబద్దీకరణ, పారిశుద్ధ్యం వంటి చర్యలు చేపట్టాలన్నారు. అనంతరం పొల్యూషన్ శాఖ ఆధ్వర్యంలో ముద్రించిన పర్యావరణ పరిరక్షించేలా మట్టివిగ్రహాలు వినియోగించేలా అవగాహన కల్పించాలన్నారు. ఇందుకు సంబంధించి మట్టివిగ్రహం పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం ఎస్పీ శ్రీనివాస్రావు మాట్లాడుతూ జిల్లాలో భారీవర్షాల కారణంగా చెరువులు, కుంటలు పూర్తిస్థాయి నీటితో నిండుగా ఉన్నాయని నిమజ్జనం సమయంలో ఎలాంటి ప్రమాదాలు సంభవించకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా కట్టుదిట్టమైన భద్రతాఏర్పాట్లు చేపట్టనున్నట్లు తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు వి.లక్ష్మీనారాయణ, నర్సింగ్రావు, డీఎంహెచ్వో డాక్టర్ సిద్దప్ప, విద్యుత్తు శాఖ డీఈ తిరుపతిరావు, డీఎస్పీ మొగులయ్య, ఇరిగేషన్వాఖ అఽధికారి శ్రీనివాస్రావు, మత్య్సశాఖ అధికారి షకీలాభాను, తహసీల్దార్లు పాల్గొన్నారు. -
నోటీసులిచ్చిన తదుపరి చర్యలు..
పలు బీఈడీ కళాశాలల్లో ఆకస్మికంగా గతంలో తనిఖీలు నిర్వహించి.. వసతులు, నిబంధనలు పాటించని మొత్తం 7 కళాశాలలకు నోటీసులు ఇచ్చాం. వారు సమాధానం ఇస్తే పరిశీలించి తదుపరి చర్యలు తీసుకుంటాం. అంతేకాకుండా డిగ్రీ కళాశాలలపై కూడా ర్యాటిఫికేషన్, అప్లియేషన్ తనిఖీలు నిర్వహిస్తాం. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు పూర్తిస్థాయిలో కృషి చేస్తున్నాం. సెయింట్ మేరీస్ కళాశాలపై చర్యల్లో భాగంగా 50 శాతం సీట్లను కుదించాం. – శ్రీనివాస్, వీసీ, పీయూ తనిఖీలు చేపట్టాం.. గతంలో మొదటిసారి తనిఖీలు నిర్వహించిన క్రమంలో కళాశాలల్లో లేని వసతులపై రిమార్కులు కళాశాలల వారికి చూపించాం. మార్పులు లేనందుకు మరోసారి వీసీ నేరుగా తనిఖీలు చేసి.. వసతులు లేని 7 కళాశాలలకు నోటీసులు ఇ చ్చారు. గతంతో పోల్చితే తనిఖీలు మెరుగుప డ్డాయి. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు పూర్తిస్థాయిలో కృషి చేస్తున్నాం. – చంద్రకిరణ్, అకాడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ● -
పారదర్శక పాలనకే సమాచార హక్కుచట్టం
గద్వాల/అలంపూర్: పారదర్శకమైన పాలన కోసమే 2005లో అప్పటి కేంద్ర ప్రభుత్వం సమాచార హక్కుచట్టం తీసుకురావడం జరిగిందని కలెక్టర్ బీఎం సంతోష్, సమాచారహక్కు చట్టం కమిషనర్లు పీవీ శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం వారు గద్వాలకు వచ్చిన నేపథ్యంలో ఐడీవోసీ కార్యాలయంలో వివిధ శాఖలకు చెందిన అధికారులతో సమాచారం హక్కు చట్టంపై సమీక్షించారు. ఈసందర్బంగా ముందుగా పీవీ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో సిటిజన్ చార్ట్ను తప్పనిసరిగా ప్రదర్శించాలన్నారు. పౌరులకు పారదర్శక, బాధ్యతాయుత పాలన అందించడలంలో సమాచార హక్కుచట్టం కీలకపాత్ర పోషిస్తుందన్నారు. ఆర్టీఐ దరఖాస్తులు ఫిర్యాదులు తక్కువ అందిన జిల్లాలో జోగుళాంబగద్వాల జిల్లా ఒకటన్నారు. పీఐవో అధికారులు ప్రజలకు సమయానికి పూర్తి సమాచారాన్ని అందించాలని సూచించారు. ఆర్టీఐ దరఖాస్తుల పరిష్కారం ఆలస్యం కాకుండా చట్టంలో ఉన్న సమయపాలనతో కూడిన సమాచారం ఇవ్వాలన్నారు. గత మడు సంవత్సరాల నుంచి 17వేల ఆర్టీఐ కేసులు పెండింగులో ఉన్నాయని వీటిని త్వరితగతిన పరిష్కరించేందుకు జిల్లాల పర్యటన కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. అనంతరం కలెక్టర్ బీఎం సంతోష్ మాట్లాడుతూ.. సమాచార హక్కు చట్టంపై ప్రతిఒక్క అధికారి అవగాహన పెంచుకోవాలని, ఆర్టీఐ అప్పీల్ కేసులను పరిష్కరించటానికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. ఆర్టీఐ కింద అడిగిన సమాచారాన్ని తప్పకుండా నిర్ణీత గడువులోలప ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో సమాచార హక్కు చట్టం కమిషన్ కమిషనర్లు దేశాల భూపాల్, వైష్ణవి, అదనపు కలెక్టర్ వి.లక్ష్మీనారాయణ, ఆర్డీవో అలివేలు, వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. జోగుళాంబ ఆలయంలో ప్రత్యేక పూజలు అలంపూర్ జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను సమాచార హక్కు చట్టం కమిషనర్లు పీవీ శ్రీనివాస్ రావు, వైష్ణవి మెర్ల, బోరెడ్డి అయోధ్య రెడ్డి, దేశాల భూపాల్రావు శుక్రవారం దర్శించుకున్నారు. ఆలయ అధికారులు, అర్చకులు వారికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం క్షేత్రంలోని ఆలయాల్లో అర్చనలు, అభిషేక పూజలు నిర్వహించారు. దేశంలోనే ఐదో శక్తిపీఠంగా ప్రసిద్ధి చెందిన జోగుళాంబ అమ్మవారిని దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నామని వారు తెలిపారు. -
అభివృద్ధికి పెద్దపీట
గద్వాల: రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధికి పెద్దపీట వేసిందని ఇందులో భాగంగానే ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పనుల జాతర–2025 చేపట్టినట్లు కలెక్టర్ బీఎం సంతోష్, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి అన్నారు. శుక్రవారం వారు గద్వాల మండలం జిల్లెడబండతండాలో నూతన గ్రామ పంచాయతీ భవననిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జాతీయ ఉపాధిహామీ పథకం కింద గత సంవత్సరం రూ.13 కోట్లతో గద్వాల నియోజకవర్గంలో వివిధ రకాల అభివృద్ధి పనులు చేపట్టి పూర్తి చేయడం జరుగుతుందన్నారు. ఈ సంవత్సరం కూడా వంద రోజుల పనిదినాలు కల్పించి కొత్త పనులు చేపట్టనున్నట్లు తెలియజేశారు. గ్రామీణ ప్రాంత ప్రజలు ఉపాధి కోసం వలసలు వెళ్లకుండా ఉపాధి హామీ పథకం కింద పని కల్పించనున్నట్లు తెలిపారు. గ్రామంలో 900 మంది ఉన్నారని గ్రామానికి అవసరమైన సీసీ రోడ్లు, మరుగుదొడ్లు, గ్రామపంచాయతీ భవనాలు, అంగన్వాడీ భవనాలు, గ్రామాలలో మౌళికవసతుల కల్పన వంటి ముఖ్యమైన అభివృద్ధిపనులు చేయనున్నట్లు తెలిపారు. రూ.20 లక్షలతో గ్రామంలో కొత్తగా గ్రామ పంచాయతీ భవనాలు శంకుస్థాన చేసుకోవడం జరిగిందన్నారు. చేపట్టిన పనులు వచ్చేడాది మార్చి వరకు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా గ్రామాల్లో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పారిశుద్ధ్య పనులు చేపట్టాలన్నారు. అనంతరం ఉత్తమ సేవలు అందించిన పారిశుద్ధ్య కార్మికులకు సన్మానించారు. గ్రామంలో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకున్న లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. గ్రామ పంచాయతీ కార్యాలయ ప్రాంగణంలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నర్సింగ్రావు, ఎంపీడీవో ఉపాదేవి, పీఆర్ డీఈ కబీర్దాస్, ఏఈ బషీర్, పీఎస్ కార్యదర్శి కవిత, మహిళా సంఘం అధ్యక్షురాలు జ్యోతి, నాయకులు పాల్గొన్నారు. -
స్వగ్రామం కంచుపాడు..
సురవరం సుధాకర్రెడ్డి జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలోని ఉండవెల్లి మండలంలోని కంచుపాడు గ్రామంలో మార్చి 25, 1942 సంవత్సరంలో జన్మించారు. సురవరం వెంకట్రామిరెడ్డి, ఈశ్వరమ్మ దంపతులకు సుధాకర్రెడ్డి, రవీందర్రెడ్డి, ప్రభాకర్రెడ్డి, పుష్పలత నలుగురు సంతానం. కాగా అందరిలో పెద్దవాడైన సుధాకర్రెడ్డి విద్యాభ్యాసం కర్నూలు మున్సిపల్ పాఠశాలలో ఎస్ఎస్ఎల్సీ, ఉస్మానియా కళాశాలలో డిగ్రీ, ఉస్మానియా యూనివర్సిటీలో లా చదివారు. 1974 ఫిబ్రవరి 14న వివాహం కాగా.. ఆయనకు ఇద్దరు కుమారులు ఉన్నారు. -
యూరియా కోసం బారులు..
గట్టు:యూరియా కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు. శుక్రవారం పోలీస్ పహారా మధ్య గట్టు పీఏసీఎస్లో యూరియా పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. వ్యవసాయ అధికారుల సమక్షంలో ప్రతి రైతుకు 2 బస్తాల చొప్పున అందించారు. యూరియా వచ్చిందని తెలుసుకున్న రైతులు ముందుగానే పీఏసీఎస్ దగ్గరకు చేరుకొని వరుసలో కవర్ల ద్వారా పాసు పుస్తకం, ఆధార్ జిరాక్స్లను పెట్టారు. వంతు వచ్చిన రైతులు వేలి ముద్ర వేసుకుని యూరియాను తీసుకెళ్లారు. ఒక్క రోజే 420 బస్తాలను రైతులకు అందజేసినట్లు పీఏసీఎస్ అధికారులు తెలిపారు. -
ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలి
● వైద్యులు, వైద్యసిబ్బంది తప్పక బయోమెట్రిక్ ద్వారా హాజరు వేయాలి ● ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచాలి ● కలెక్టర్ బీఎం సంతోష్ గద్వాల: జిల్లాలో వైద్యులు, వైద్యసిబ్బంది.. ప్రజలకు అందుబాటులో ఉండి మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్ బీఎం సంతోష్ ఆదేశించారు. గురువారం ఐడీవోసీ కార్యాలయంలో కాన్ఫరెన్స్ హాలులో అధికారులతో సమీక్షించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని ప్రభుత్వ ఆసుపత్రులలో అన్ని రకాల వైద్యసదుపాయాలు కల్పించి ప్రజలకు మరింత మెరుగైన వైద్యం అందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు. అదేవిధంగా వైద్యులు, వైద్యసిబ్బంది తప్పక బయోమెట్రిక్ ద్వారా హాజరు నమోదు చేయాలన్నారు. ఈ నెలాఖరుకు అన్ని రిజిస్ట్రేషన్ ఎన్రోల్చేసి సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ప్రతిఒక్కరు బయోమెట్రిక్ అమలు చేయాలన్నారు. ప్రోగ్రాం ఆఫీసర్లు ప్రతి రెండుసార్లు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను క్షేత్రస్థాయిలో సందర్శించాలన్నారు. క్షేత్రస్థాయి పర్యటన సమయంలో ప్రోగ్రాం అధికారులు హైరిస్క్ రోగులను గుర్తించి వారికి అవసరమైన మెరుగైన వైద్యసేవలు అందించాలన్నారు. అన్ని ఆసుపత్రులలో డెలివరీల సంఖ్య పెంచాలన్నారు. సమావేశంలో డీఎంహెచ్వో డాక్టర్ సిద్దప్ప, ప్రోగ్రాం అధికారి డాక్టర్ సంధ్యారాణి, మెడికల్ ఆఫీసర్లు, హెల్త్సూపర్వైజర్లు పాల్గొన్నారు. చేనేత రుణమాఫీకి ప్రతిపాదనలు జిల్లాలో చేనేత కార్మికులకు రూ.11.51 కోట్ల వ్యతిగత రుణమాఫీకి సంబంధించిన ప్రతిపాదనలు రారష్ట్ర స్థాయి కమిటీకి పంపుతున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈమేరకు అధికారులతో మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా 1496మంది చేనేత కార్మికుల పెండింగ్ రుణాలు రూ.9,94,83,283 ఉన్నాయన్నారు. 265మంది కార్మికులకు రూ.1,81,10,500 కలిపి మొత్తం రూ.11.751కోట్లు మాఫీ చేయాలని జిల్లా స్థాయి కమిటీ ఆమోదించిందన్నారు. ఈ సిఫారసులను తదుపరి చర్యల కోసం రాష్ట్ర స్థాయికమిటీకి పంపుతున్నట్లు తెలిపారు. అన్ని జాతీయ బ్యాంకులు, జిల్లా సహకార బ్యాంకులు చేనేత కార్మికులపై బ్రోకెన్ పీరియడ్ వడ్డీతో సహా మొత్తం రూ.68,58,334 వడ్డీని మాఫీ చేయాలని కమిటీ నిర్ణయించినట్లు తెలిపారు. చేనేత కార్మికుల సంక్షేమార్థం ప్రభుత్వం తీసుకున్న చారిత్రాత్మక రుణమాఫీ నిర్ణయం వందలాది కుటుంబాలకు ఆర్థిక భారం నుంచి ఉపశమనం కలిగిస్తుందన్నారు. బ్యాంకులు సంపూర్ణ సహకారం అందించి వారి భవిష్యత్తు భద్రతకు తోడ్పాడాలన్నారు. సమావేశంలో ప్రాంతీయ డిప్యూటీ డైరెక్టర్ పద్మ, ఏడీ గోవిందయ్య, లీడ్బ్యాంక్ మేనేజర్ శ్రీనివాసరావు, జీఎం రామలింగేశ్వర్గౌడ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
బిగుస్తున్న ఉచ్చు..
నందిన్నె రైస్మిల్లులో విజిలెన్స్ సోదాలు రెండు రోజులపాటు విజిలెన్స్ సోదాలు.. నందిన్నె రైస్మిల్లుకు 2022 రబీలో (1425.520 మెట్రిక్ టన్నుల ధాన్యం), 2024 ఖరీఫ్లో (5948.560 మె.ట) 2024–25 రబీలో (10,294.680 మె.ట) సీజన్లలో సదరు రైస్మిల్లుకు సుమారు రూ.45 కోట్ల విలువ గల (40కేజీల సామర్థ్యం ఉన్న 4 లక్షల ధాన్యం బస్తాలు) సివిల్సప్లై శాఖ అధికారులు కేటాయించారు. ఇందులో ఇప్పటి వరకు 2024 ఖరీఫ్, రబీకి సంబంధించి కేవలం రూ.10 కోట్ల విలువ గల సీఎమ్మార్ బియ్యం మాత్రమే అందించారు. 2022 రబీకి నిర్వహించిన టెండర్ సరుకు ఇంకా అందించలేదు. ఇలా మొత్తంగా కలుపుకొని ప్రభుత్వానికి ఇంకా రూ.40కోట్ల విలువ గల బియ్యాన్ని ప్రభుత్వానికి అందించాల్సి ఉంది. ఇదిలాఉండగా, సదరు రైస్మిల్లులో ఈనెల 11, 12వ తేదీలలో విజిలెన్స్ అధికారులు సోదాలు నిర్వహించారు. ప్రభుత్వం వద్ద తీసుకున్న ధాన్యం లెక్కలతో రైస్మిల్లులో ఉన్న ధాన్యం లెక్కలు సరిచూశారు. రెండు రోజుల పాటు సాగిన సోదాల వివరాలను సదరు విజిలెన్స్ అధికారులు వెల్లడించలేదు. ప్రభుత్వం వద్ద తీసుకున్న ధాన్యం బస్తాల లెక్కకు మిల్లులో ఉన్న ధాన్యం బస్తాల లెక్కలో భారీగా వ్యత్యాసం ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. దాదాపు లక్ష ధాన్యం బస్తాలు తేడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈనేపథ్యంలో మరోమారు మిల్లులో సోదాలు నిర్వహించేందుకు రానున్నట్లు సమాచారం. గద్వాల: జిల్లాలో నందిన్నె రైస్మిల్లుకు ప్రభుత్వం నుంచి మూడు సీజన్లలో సుమారు రూ.50 కోట్ల విలువైన ధాన్యాన్ని మర ఆడించేందుకు ఇవ్వగా.. సదరు మిల్లు యజమాని ఎంచక్కా దొంగ మార్గంలో బ్లాక్మార్కెట్కు తరలించి రూ.కోట్లు వెనకేసుకున్నాడు. దీంతో జిల్లాలోనే సదరు రైస్మిల్లు పేరు అక్రమాలకు కేరాఫ్ అడ్రస్గా నిలిచింది. గత నెల ధాన్యంలోడు లారీని అక్రమంగా కర్ణాటకకు తరలిస్తుండగా గ్రామస్తులు పట్టుకుని అధికారులకు అప్పగిస్తే.. సదరు రైస్మిల్లు ఓనర్పై విచారణ చేపట్టిన అధికారులు కేసు నమోదు చేశారు. తాజాగా విజిలెన్స్ అధికారులు రెండు రోజులపాటు సోదాలు చేయగా.. మరిన్ని వివరాలు బయటకు వస్తున్నాయని సమాచారం. తుది నివేదిక ఆధారంగా చర్యలు గత నెల 15వ తేదీన ఽఅర్ధరాత్రి ప్రభుత్వ ధాన్యాన్ని లారీలో తరలిస్తున్న సంఘటనపై విచారణ జరిపి కేసు నమోదు చేశాం. సదరు రైస్మిల్లు ఓనర్కు షోకాజ్ నోటీసు ఇచ్చాం. ప్రస్తుతం విజిలెన్స్ విచారణ జరుగుతుంది. తుదినివేదిక ఆధారంగా మిల్లు, ఓనర్పై చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా ఈనెల 11వ తేదీన బోల్తాపడిన లారీలో ధాన్యం ఉన్నట్లు గుర్తించాం. దీనిని కూడా విజిలెన్స్ విచారణకు పంపించాం. రైస్మిల్లర్ సహకారం అందిస్తున్న ప్రభుత్వ అధికారులపై సైతం విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం. – వి.లక్ష్మీనారాయణ, అదనపు కలెక్టర్ యథేచ్ఛగా ధాన్యం పక్కదారి.. ● నందిన్నె రైస్ మిల్లు యజమానిపై ఆది నుంచి ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ● 2023 మే 27వ తేదీన నందిన్నె రైస్మిల్లులో ధాన్యం పక్కదారి పట్టిందనే ఆరోపణలతో విజిలెన్స్ అధికారులు సోదాలు చేశారు. దీంతో ధాన్యం అక్రమంగా తరలించినట్లు తేల్చారు. – గత నెల జూలై 15వ తేదీన నందిన్నె రైస్ మిల్లు నుంచి అర్ధరాత్రి వేళ అక్రమంగా ధాన్యం లారీ లోడు కర్నాటకకు తరలిస్తుండగా గ్రామస్తులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. దీనిపై కేసు నమోదు చేసిన అధికారులు మరింత లోతైన విచారణకు విజిలెన్స్కు అప్పగించారు. ● ఈనెల 14వ తేదీన గంగన్పల్లి గోదాం నుంచి అక్రమంగా ధాన్యం బస్తాల లోడు లారీని అక్రమంగా కర్ణాటకకు తరలిస్తుంటే వెంకటాపురం–ఇర్కిచేడు మధ్య మెట్టుబండ వద్ద రోడ్డుపక్కన బోల్తా పడింది. గమనించినన గ్రామస్తులు వివరాలను ఫొటోతో సహా సదరు మండల అధికారులకు సమాచారం అందించారు. అయితే బియ్యం తవుడును తీసుకెళ్తున్నామంటూ అధికారులను బోల్తా కొట్టించి బోల్తాపడిన లారీని కర్ణాటకకు తరలించి దర్జాగా చేతులు దులిపేసుకున్నారు. ఈవ్యవహారంపై అధికారులు ఆరా తీస్తున్నారు. గత నెల అర్ధరాత్రి ధాన్యం లారీ తరలింపులో మిల్లు యజమానిపై కేసు సోదాల్లో లక్ష వరకు ధాన్యం బస్తాలు మాయం? మూడు సీజన్లలో మిల్లుకు రూ.50 కోట్ల ధాన్యం కేటాయింపు గంగన్పల్లి గోదాం నుంచి కర్ణాటకకు అక్రమమార్గంలో తరలింపు ఇటీవల ధాన్యం లారీ బోల్తా.. ఆరా తీస్తున్న అధికారులు ప్రభుత్వ పెద్దల సాయం.. ప్రభుత్వ ధాన్యం పక్కదారి పట్టిస్తున్న సదరు రైస్మిల్లు యజమాని అక్రమాల నుంచి తప్పించుకునేందుకు ఏకంగా ప్రభుత్వంలోనే పెద్దల సాయం తీసుకున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. పైగా ఆమ్యామ్యాలకు అలవాటుపడిన ఓ జిల్లా స్థాయి అధికారి రైస్మిల్లర్కు కొమ్ము కాస్తున్నట్లు బహిరంగంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
ప్రారంభానికి ‘ట్రిపుల్ఐటీ’ సిద్ధం
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: ప్రభుత్వం ప్రతిష్టాత్మక బాసర ఐఐఐటీ కళాశాలను జిల్లాకేంద్రంలో ఏర్పాటు చేయనుంది. దీంతో పాలమూరు చరిత్రలో నూతన అధ్యాయం ప్రారంభం కానునుంది. కళాశాల ఏర్పాటుకు అధికారులు దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ మేరకు జిల్లాకేంద్రంలోని బండమీదిపల్లి వద్ద ఉన్న రెడ్డి హాస్టల్ భవనంలో తాత్కాలికంగా కళాశాల ఏర్పాటు చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. అక్కడ విద్యార్థులకు, ప్రత్యేక తరగతి గదులతోపాటు అడ్మిషన్ పొందిన ప్రతి ఒక్కరికీ హాస్టల్ గదులు, డైనింగ్ హాల్ వంటివి సదుపాయాలు కల్పించనున్నారు. ఇప్పటికే తరగతులు ప్రారంభం కావాల్సి ఉండగా.. వర్షాల కారణంగా ఆలస్యమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే వచ్చే వారం కళాశాలను ప్రారంభించి.. అక్కడే విద్యార్థులు, తల్లిదండ్రులకు ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహిస్తామని అధికారులు పేర్కొంటున్నారు. కాగా.. రెగ్యులర్ కళాశాల భవనం కోసం జిల్లాకేంద్రం సమీపంలోని దివిటిపల్లి వద్ద 40 ఎకరాల భూమిని ప్రభుత్వం సిద్ధం చేసినట్లు తెలుస్తుంది. వీటిలో త్వరలో పూర్తిస్థాయి నిర్మాణాలు చేపట్టనున్నారు. అవకాశాలతో మేలు.. సాధారణంగా ఇంజినీరింగ్ చేసే విద్యార్థులకు ఇంటర్మీడియట్ తర్వాత ఎఫ్ సెట్ వంటి పోటీ పరీక్షలు రాస్తే సీటు లభించే అవకాశం ఉంది. కానీ ప్రస్తుతం ఐఐఐటీలో ఎస్సెస్సీ పూర్తయిన తర్వాత నేరుగా మొదటి సంవత్సరంలో అడ్మిషన్ను పొందవచ్చు. ఇది ఇంటిగ్రేటెడ్ కోర్సులు కావడంతో 2 ప్లస్ 4 విధానంలో విద్యాబోధన జరుగుతుంది. మొదటి రెండేళ్లు అందరికీ కామన్ సిలబస్ ఉండగా.. తర్వాత మరో నాలుగేళ్లు వివిధ డిపార్ట్మెంట్లు విడిగా తరగతులు బోధించాల్సి ఉంటుంది. ఇందులోనే ఇంటర్తోపాటు ఇంజినీరింగ్ విద్య కూడా పూర్తి అవుతుంది. ఒక విద్యార్థి ఎస్సెస్సీ తర్వాత అడ్మిషన్ పొందితే నేరుగా ఇంజినీరింగ్ సర్టిఫికెట్తో బయటికి వచ్చి.. ఉద్యోగం పొందేందుకు సంసిద్ధంగా ఉంటారు. వచ్చేవారం ఓరియంటేషన్ కార్యక్రమాల నిర్వహణ ఇప్పటికే ఎస్సెస్సీ మెరిట్ ఆధారంగా 208 మందికి అడ్మిషన్లు ఇంటర్మీడియట్తోపాటు ఇంజినీరింగ్చదివేందుకు వెసులుబాటు బండమీదిపల్లి వద్ద ఉన్న రెడ్డి హాస్టల్భవనంలో తాత్కాలికంగా ఏర్పాటు టీచింగ్, నాన్టీచింగ్ సిబ్బంది నియామకాలు చేపడుతున్న బాసర అధికారులు ఆన్లైన్ విధానంలోనే.. ఐఐఐటీ కళాశాల ఏర్పాటు మొదటి సంవత్సరం కావడంతో అడ్మిషన్ల ప్రక్రియ అంతా కూడా యూనివర్సిటీ నుంచి నేరుగా ఆన్లైన్ విధానంలో జరిగింది. ఈ మేరకు ఎస్సెస్సీలో అత్యధిక మార్కులు సాధించిన 208 మంది విద్యార్థులకు రిజర్వేషన్ల ఆధారంగా ప్రస్తుతం 144 మంది బాలికలు, 64 మంది బాలురకు అవకాశం కల్పించారు. ఇక స్టాఫ్ నియామకాల ప్రక్రియను సైతం అధికారులు పూర్తిచేశారు. గత నెల టీచింగ్ సిబ్బంది నియామకానికి ప్రకటన ఇవ్వగా.. 31 మంది దరఖాస్తు చేసుకుంటే 9 మందిని వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించి అధ్యాపకులను భర్తీ చేశారు. మరో 6 మంది నాన్ టీచింగ్ సిబ్బందిని సైతం నియమించినట్లు తెలుస్తోంది. ఇందులో వార్డెన్లు, అటెండర్లు, స్వీపర్ ఇతర సిబ్బంది ఉన్నారు. -
కేసుల విచారణ వేగవంతం
గద్వాల క్రైం: శాంతిభద్రతల విషయంలో అప్రమత్తంగా ఉంటూ అనుమానాస్పద కేసులపై వేగవంతంగా విచారణ చేపట్టాలని ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. గురువారం ఎస్పీ కార్యాలయంలో నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమస్యలపై వచ్చే బాధితులకు న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. గణేష్ మండపాల కోసం నిర్వాహకులు పోలీసుశాఖ అనుమతి తీసుకోవాలని, ఉత్సవాలు పూర్తి అయ్యేవరకు నిత్యం నిఘా ఉంచాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రత్యేక విచారణ చేపట్టాలన్నారు. అనుమతి లేకుండా ఇసుక, మట్టి, రేషన్ బియ్యం, నిషేధిత మత్తు పదార్థాల వంటి వాటిని కట్టడి చేయాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకానికి ఇసుక తరలింపు విషయంలో ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కేసుల విషయంలో నిర్లక్ష్యం లేకుండా వీలైనంత త్వరగా కోర్టులో చార్జ్షీట్ దాఖలు చేసి నిందితులకు శిక్ష పడేలా వ్యవహరించాలన్నారు. అనంతరం ఆయా స్టేషన్లలో నమోదైన కేసులపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. డ్రగ్ రహిత సమాజ స్థాపనలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాల్సిందిగా పిలుపునిచ్చారు. సమావేశంలో డీఎస్పీ మొగిలయ్య, సీఐ టాటాబాబు, శ్రీను, రవిబాబు, ఎస్ఐలు, కళ్యాణ్కుమార్, శ్రీకాంత్, వేంకటేష్, శ్రీనివాసులు, మల్లేష్, శ్రీహరి, నందికర్ పాల్గొన్నారు. -
ఎరువుల కొరత ఉండొద్దు : కలెక్టర్
గద్వాల: రైతులకు అవసరమైన ఎరువులు అందుబాటులో ఉండాలని.. ఎట్టి పరిస్థితుల్లోనూ కొరత ఉండొద్దని కలెక్టర్ బీఎం సంతోష్ ఆదేశించారు. బుధవారం ఐడీఓసీలోని కాన్ఫరెన్స్ హాల్లో సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం జిల్లాలో 543 మెట్రిక్ టన్నుల యూరియాను అవసరమున్న రైతులకు మాత్రమే పంపిణీ చేయాలన్నారు. యూరియా పంపిణీలో అవకతవకలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లాకు వచ్చే యూరియాను పూర్తిగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారానే రైతులకు అందజేయాలని.. ఇతర ఆగ్రో షాపులకు కేటాయించరాదన్నారు. గతేడాది కంటే ఈ సారి 600 మెట్రిక్ టన్నుల యారియాను ఎక్కువగా విక్రయించడం జరిగిందని, అయినప్పటికీ యూరియా కొరతకు గల కారణాలపై సమగ్ర విచారణ జరపాలని కలెక్టర్ ఆదేశించారు. ఎరువులు పక్కదారి పట్టకుండా పర్యవేక్షణ చేయాలన్నారు. అదే విధంగా రైతులు కూడా తమకు అవసరమైనంత మేరకే ఎరువులు వినియోగించుకునేలా అవగాహన కల్పించాలని సూచించారు. ఒకసారి తీసుకున్న రైతులకు మళ్లీ ఇవ్వకుండా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో డీఏఓ సక్రియా నాయక్, ఏడీఏ సంగీతలక్ష్మి తదితరులు ఉన్నారు. కలెక్టర్ బీఎం సంతోష్ -
అత్యవసర సమయాల్లో అవస్థలు
ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో పది రోజుల నుంచి హనుమాన్పురాలోని ఆర్యూబీ ద్వారా రాకపోకలు బంద్ అయ్యాయి. రైల్వే ట్రాక్ అవతల 2.5 కి.మీ. దూరంలో మా తండా ఉంటుంది. ప్రతి రోజూ బైక్ను ఇవతల ఉంచి న్యూటౌన్లో నేను పనిచేసే ప్రైవేట్ ఆస్పత్రికి వస్తున్నాను. తిరిగి రాత్రి రైల్వే ట్రాక్ వద్ద నిలిపి అవతలికి కాలినడకన వెళ్లి ఆ తర్వాత ఏదైనా ఆటో అందుబాటులో ఉంటే తండాకు చేరుకుంటున్నాను. అత్యవసర సమయాల్లో ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పాత గేటును వెంటనే తెరిస్తే సమస్య కొంత వరకు పరిష్కారమవుతుంది. – పి.మహేష్, ప్రైవేట్ ఉద్యోగి, గొల్లబండతండా -
‘యమ’డేంజర్..!
ప్రమాదకరంగా ఆర్యూబీలు ● ప్రతి ఏటా ఇదే తంతు.. తాత్కాలిక చర్యలతోనే సరి ● భారీ వర్షాలతో అండర్ పాస్లకు పోటెత్తుతున్న వరద ● పలు గ్రామాలు, కాలనీలకు నిలిచిపోయిన రాకపోకలు ● ప్రత్యేక పైపులైన్ల ఏర్పాటును పట్టించుకోని రైల్వే శాఖ ● డ్రెయినేజీల విస్తరణ, అనుసంధానంపై నిర్లక్ష్యం2022 జూలై 08: ఇది మహబూబ్నగర్ రూరల్ మండలం సూగురుగడ్డ రైల్వే అండర్ బ్రిడ్జిలో భారీగా చేరిన వరద నీటి లో చిక్కుకున్న ఓ స్కూల్ బస్సు. ఆ సమయంలో 30 మంది విద్యార్థులు బస్సులో ఉండగా.. యువకుల సమయస్ఫూర్తితో ప్రాణాపాయం తప్పింది. 2025 ఆగస్ట్ 14: ఇది మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి బండమీదపల్లి (పాలిటెక్నిక్ కళాశాలకు వెళ్లే దారి)లోని రైల్వే అండర్ బ్రిడ్జి. భారీ వర్షంతో వరద పోటెత్తగా చెరువును తలపిస్తోంది. ఐదు రోజులుగా అటు ఇటుగా రాకపోకలు నిలిచిపోయాయి. -
యూరియా కోసం రోడ్డెక్కిన రైతులు
గద్వాలన్యూటౌన్: జిల్లాలో యూరియా సమస్య తీరడం లేదు. వారం రోజులుగా యూరియా కోసం రైతులు నానా అవస్థలు పడుతున్నారు. పీఏసీఎస్ల వద్ద గంటల తరబడి క్యూ కడుతున్నారు. అయినప్పటికీ యూరియా లభించకపోవడంతో రోడ్డెక్కి ఆందోళనకు దిగుతున్నారు. మంగళవారం అయిజ, గట్టు, కేటీదొడ్డి మండలాల్లో రైతులు ఆందోళనకు దిగగా.. తాజాగా జిల్లా కేంద్రంలో రైతులు రోడ్డెక్కారు. బుధవారం స్థానిక పీఏసీఎస్ కార్యాలయానికి రైతులు యూరియా కోసం వచ్చారు. అయితే స్టాక్ లేదని అధికారులు చెప్పడంతో ఆగ్రహించిన అన్నదాతలు.. అంబేడ్కర్ చౌరస్తా వద్ద రాస్తారోకో చేపట్టారు. యూరియా కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని.. రోజల తరబడి ఎదురుచూడాల్సి వస్తోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. యూరియా చల్లకపోవడం వల్ల మొక్కల పెరుగుదల మందగించి.. దిగుబడులు తగ్గే ప్రమాదం ఉందని వాపోయారు. రైతులకు బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి బాసు హనుమంతు నాయుడు, ఇతర నాయకులు సంఘీభావం తెలిపారు. గంట పాటు రైతులు చేపట్టిన ఆందోళనతో వాహనాల రాకపోకలు స్తంభించాయి. విషయం తెలుసుకున్న డీఎస్పీ మొగిలయ్య పోలీసులతో అక్కడికి చేరుకొని రైతులను శాంతింపజేశారు. 22 మెట్రిక్ టన్నుల యూరియా పంపిణీ.. రైతుల ఆందోళన విషయం తెలుసుకున్న పీఏసీఎస్ చైర్మన్ సుభాన్ అక్కడికి చేరుకొని విషయాన్ని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఎమ్మెల్యే కలెక్టర్తో మాట్లాడి రైతుల సమస్యను వివరించడంతో 22 మెట్రిక్ టన్నుల యూరియాను గోదాముకు పంపించారు. దీంతో పీఏసీఎస్ అధికారులు రైతులకు టోకెన్లు అందించి.. యూరియా పంపిణీ చేశారు. ● పీఏసీఎస్ కార్యాలయాన్ని ఎస్పీ శ్రీనివాసరావు సందర్శించి రైతులకు టోకెన్ల పంపిణీ విధానాన్ని పరిశీలించారు. నిల్వ ఉన్న యూరియాను నిబంధనలకు అనుగుణంగా పంపిణీ చేయాలని అధికారులకు సూచించారు. ఎరువుల కృత్రిమ కొరత తలెత్తకుండా జాగ్రత్త వహించాలన్నారు. ఎస్పీ వెంట డీఎస్పీ మొగిలయ్య, పట్టణ ఎస్ఐ కళ్యాణ్కుమార్, వ్యవసాయశాఖ అధికారులు ఉన్నారు. జిల్లా కేంద్రంలో గంట పాటు ఆందోళన ఎమ్మెల్యే చొరవతో 22 మెట్రిక్ టన్నుల యూరియా పంపిణీ -
‘ఆత్మీయ భరోసా’ అమలులో విఫలం
అలంపూర్: ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అమలులో ప్రభుత్వం విఫలమైందని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జి.రాజు విమర్శించారు. అలంపూర్లోని కేవీపీఎస్ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జీఓ 42 ప్రకారం ఉపాధి హామీ పథకం కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం ద్వారా ఆర్థిక చేయూత అందించాల్సి ఉండగా.. పథకం అమలులో తీవ్ర జాప్యం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో 5లక్షల మంది లబ్ధిదారులను ఎంపికచేసి.. కేవలం 83వేల మందికి రూ. 50.33కోట్లు చెల్లించారని తెలిపారు. మిగిలిన 4,13,658 మందికి రూ. 250కోట్లు చెల్లించాల్సి ఉండగా.. ప్రస్తుతం మరో 2లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారన్నారు. ప్రభుత్వం మాత్రం లబ్ధిదారుల ఖాతాల్లో నిధులు జమ చేయడం లేదన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం లబ్ధిదారులకు ఆత్మీయ భరోసా అందించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఆ సంఘం జిల్లా ఉ పాధ్యక్షుడు రాఘవేంద్ర యాదవ్, నర్సింహ ఉన్నారు. -
వర్షాలతో ఇబ్బంది
సీడ్ క్రాసింగ్ పనుల కోసం ప్రతి ఏటా జూలై ఈ ప్రాంతానికి వస్తాం. రైతులు మాతో ముందస్తుగా మాట్లాడుకుంటారు. నెలకు రూ.20వేల నుంచి రూ.22వేలు చెల్లిస్తారు. రైతు వీలును బట్టి 30 నుంచి 60 రోజుల వరకు క్రాసింగ్ పనులు చేపడతాం. ఈ ఏడాది ఎడతెరిపి లేని వర్షాలతో కొంత ఇబ్బంది నెలకొంది. క్రాసింగ్ చేసినవి కాయలుగా మారకుండా రాలిపోతాయనే భయం వెంటాడుతోంది. – యాకోబు, వలస కూలి, గుడేకల్లు గ్రామం, ఎమిగనూర్ మండలం, కర్నూలు జిల్లా -
సం‘పత్తి’ కలిగేనా..!?
నడిగడ్డలో అత్యధికంగా సీడ్ పత్తి సాగు గట్టు: పేరెన్నిక కల్గిన పత్తి విత్తనాలను అందించడంలో నడిగడ్డ ప్రాంతం రాష్ట్రంలోనే పేరుగాంచింది. అయితే, ఈ ఏడాది సీడ్ పత్తి రైతును ఎడతెరిపి లేని వర్షాలు.. మధ్యవర్తుల కొత్త నిబంధనలు కలవరపాటుకు గురిచేస్తున్నాయి. భారీ వర్షాలతో క్రాసింగ్ చేసినవి కాయలుగా మారకుండా రాలిపోతాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికితోడు ఎకరాకు కేవలం 150 నుంచి 200 ప్యాకెట్ల విత్తనాలు మాత్రమే కొంటామని.. అంతకుమించి సాగుచేస్తే కొనమని మధ్యవర్తులు చెబుతుండడం కలవరపెడుతోంది. విధిలేని పరిస్థితుల్లో కొంతమంది రైతులు మధ్యలోనే పంట వదిలేస్తుండగా.. మరికొందరు యథావిధిగా సాగు చేస్తున్నారు. మొత్తంగా ఈ ఏడాది పత్తి సాగు చేసిన రైతుల శ్రమకు తగిన ప్రతిఫలం దక్కుతుందా.. లేదా అన్న అనుమానం నెలకొంది. జిల్లా వ్యాప్తంగా పత్తివిత్తనోత్పత్తి సాగు 22,783 ఎకరాల్లో, కమర్షియల్ పత్తి 1,05,101 ఎకరాల్లో సాగు అవుతోంది. ఎడతెరిపి లేని వర్షాలతో ముప్పు.. ఎకరా సీడ్పత్తిని సాగు చేస్తే పెట్టుబడిగా రూ.లక్ష నుంచి 1.5 లక్షల వరకు పెట్టుబడి పెడతారు. జూన్న్ ప్రారంభంలో పత్తివిత్తనోత్పత్తిని సాగు చేస్తుండగా, జూలై చివరి వారం నుంచి క్రాసింగ్ పనులు (మగ పువ్వు పుప్పొడిని ఆడ పువ్వుతో క్రాసింగ్) ప్రారంభిస్తారు. ఇలా 30 నుంచి 60 రోజుల పాటు క్రాసింగ్ పనులను చేపడతారు. ఇలా ఆరుమాసాల్లో పంటకాలం పూర్తి చేస్తారు. ఈ క్రాసింగ్ పనులకు ఎకరాకు 5 నుంచి 7 మంది కూలీల దాకా అవసరం అవుతారు. వీరికి నెలకు రూ.18వేల నుంచి రూ.21 వేల వరకు కూలీ చెల్లిస్తారు. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు, ఎమ్మిగనూర్ ప్రాంతాలతో పాటుగా కర్ణాటకలోని రాయచూర్ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి కూలీలను రప్పిస్తుంటారు. అయితే, భారీ వర్షాలతో క్రాసింగ్ చేసినవి కాయలుగా మారకుండా రాలిపోతాయన్న భయం రైతులను వెంటాడుతోంది. జిల్లాలో పత్తి విత్తనోత్పత్తి సాగు ఇలా.. (ఎకరాల్లో) ఇటీవల రైతును కలవరపెడుతున్న ఎడతెరిపి లేని వర్షాలు మధ్యవర్తుల కొత్త నిబంధనలతోపరేషాన్ జిల్లాలో 22,783 ఎకరాల్లో సీడ్ పత్తి.. 1.05 లక్షల ఎకరాల్లో కమర్షియల్ పత్తి సాగు -
ముందస్తు ఒప్పందంతో ఆందోళన
పత్తివిత్తనోత్పత్తి సాగులో ముందుస్తు ఒప్పందం మేరకు జూన్ మొదటి వారంలోనే రైతులకు విత్తనాలతో పాటుగా పెట్టుబడి కోసం మధ్యవర్తులు కొంత డబ్బులను అందజేస్తారు. అయితే, 45 రోజుల తర్వాత ఎకరాకు కేవలం తాము 150 నుంచి 200 ప్యాకెట్లు మాత్రమే కొంటామని, అంతకన్నా ఎక్కువ పండిస్తే తాము కొనలేమని చెబుతుండడంతో పత్తి రైతులు పరేషాన్ అవుతున్నారు. ముఖ్యంగా పూత రాసే (జీఎంఎస్, స్టేరల్స్) వైరెటీ సీడ్ పత్తి పంటను సాగు చేసిన రైతులు ఆందోళనలో ఉన్నారు. ఎకరాకు 4 నుంచి 8 క్వింటాళ్ల దిగుబడి వస్తుండగా.. క్వింటన్నర, రెండు క్వింటాళ్లు మాత్రమే కొంటామని చెబుతుండడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది రైతులు పత్తి మొక్కలను తొలగించుకుని వేరే పంటలను సాగు చేసుకోగా, మరికొంత మంది అలాగే కొనసాగిస్తున్నారు. రైతులకు పంటల సాగుకయ్యే పెట్టుబడి డబ్బులను మధ్యవర్తులు నిలిపి వేయడంతో రైతులు మరింత ఆందోళన చెందుతున్నారు. -
సరిహద్దు చెక్పోస్టు వద్ద పటిష్ట నిఘా
అయిజ: జిల్లా సరిహద్దు నుంచి ఇతర రాష్ట్రాలకు యూరియా, ఇతర వస్తువులు అక్రమంగా రవాణా చేయకుండా పోలీస్ అధికారులు పహారా కాయాలని ఎస్పీ శ్రీనివాసరావు ఆదేశించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దులో ఉన్న నాగల్దిన్నె బ్రిడ్జి దగ్గర ఏర్పాటు చేసిన పోలీస్ చెక్పోస్ట్ను మంగళవారం రాత్రి ఎస్పీ సందర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీపై అందిస్తున్న యూరియాను సరిహద్దు రాష్ట్రాలకు అక్రమంగా తరలించకుండా చెక్పోస్ట్ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 24 గంటలు నిఘా ఉంచి ప్రతి వాహనాన్ని తనిఖీ చేయాలన్నారు. ఎస్పీ వెంట శాంతినగర్ సీఐ టాటాబాబు, అయిజ ఎస్సై శ్రీనివాసరావు, పోలీస్ సిబ్బంది ఉన్నారు. -
విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చూడాలి
ఎర్రవల్లి: వసతిగృహ విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని, అవసరమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ సంతోష్ ఆదేశించారు. మంగళవారం మండలంలోని ధర్మవరం బాలుర వసతి గృహం, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కలెక్టర్ పరిశీలించారు. హాస్టల్ పైకప్పు పెచ్చులూడుతున్న నేపథ్యంలో విద్యార్థులకు ప్రమాదం పొంచి ఉందని, వర్షాల నేపథ్యంలో మరమ్మతులు చేపట్టాలని, అప్పటి వరకు విద్యార్థులను పాఠశాలలోనే వసతి కల్పించాలన్నారు. మరమ్మతు అంచనా నివేదికను వెంటనే సమర్పించాలని ఇంజినీరింగ్ శాఖ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ అధికారిని నిశిత, పాఠశాల ప్రిన్సిపల్ లక్ష్మిరెడ్డి, వార్డెన్ జయరాములు, తదితరులు పాల్గొన్నారు. మోటార్లతో వర్షపు నీటిని ఎత్తిపోయాలి మానవపాడు: భారీ వర్షాల కారణంగా అండర్ రైల్వే బ్రిడ్జిలలో నీరు నిలిచిపోతుందని, ఎప్పటికప్పుడు మోటార్లతో నీరు తొలగించాలని, ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులను ఆదేశించారు. మంగళవారం మండలంలోని నారాయణపురం గ్రామం అండర్ రైల్వే బ్రిడ్జిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నీటి మట్టం మరింత పెరిగిన సందర్భంలో, ప్రజలు సురక్షితంగా గ్రామానికి చేరుకునేందుకు డైవర్షన్ రోడ్డు ఏర్పాటు చేయాలని, ఇతర మార్గాల ద్వారా రాకపోకలకు కొనసాగేలా చూడాలన్నారు. అండర్పాస్లను రెవెన్యూ సిబ్బంది, పోలీసులు నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. త్వరలోనే సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామన్నారు. తహసీల్ధార్ జోషి శ్రీనివాస్శర్మ, ఎస్ఐ చంద్రకాంత్, సిబ్బంది పాల్గొన్నారు. జోగుళాంబ ఆలయంలో ప్రత్యేక పూజలు అలంపూర్: అలంపూర్ జోగుళాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను కలెక్టర్ సంతోష్ దర్శించుకున్నారు. ఆలయ అధికారులు, అర్చకులు ఘన స్వాగతం పలికారు. జోగుళాంబ అమ్మవారు, బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాల్లో కలెక్టర్ ప్రత్యేక పూజలు చేశారు. -
దరఖాస్తుల ఆహ్వానం
గద్వాల: ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం ద్వారా స్వయం ఉపాధి అవకాశాలను వినియోగించుకోవాలనుకునే యువత, మహిళలు, గ్రామీణ పారిశ్రామికవేత్తలు ఆన్లైన్ దరఖాస్తులు చేసుకోవాలని పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ రామలిగేశ్వర్గౌడ్ తెలిపారు. ఈపథకం ద్వారా బ్యాంకు రుణాలతో పాటు కేంద్ర నిధుల నుంచి సబ్సిడీ అందుతుందని తెలిపారు. ఏప్రిల్ నుంచి సాంకేతిక సమస్యల కారణంగా ఆన్లైన్ పోర్టల్ సేవలు నిలిచిపోయాయని, ప్రస్తుతం పునరుద్ధరించబడినందున ఆసక్తి గల అభ్యర్థులు httpr.www.kviconi ne.gov.in.pmefpŠobèltal ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని, ఈపథకం ద్వారా జిల్లాలో మరిన్ని ఉపాధి అవకాశాలు సృష్టించబడతాయని పేర్కొన్నారు. మెరుగైన వైద్యసేవలు అందించాలి అలంపూర్ రూరల్: ప్రజలకు అందుబాటులో ఉండి మెరుగైన వైద్యసేవలు అందించాలని ఇన్చార్జ్ డీఎంహెచ్ఓ సిద్దప్ప అన్నారు. మండలంలోని క్యాతూర్ పీహెచ్సీని సందర్శించి ఫార్మసి గది, షేషెంట్స్ గది, రికార్డులను పరిశీలించారు. వైద్య పరీక్షల కోసం వచ్చే గర్భిణులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. కార్యక్రమంలో ప్రోగ్రాం ఆఫీసర్ ప్రసన్న రాణి, వరలక్ష్మీ, భరత్, తిరుమల్ రెడ్డి, రామంజనేయులు పాల్గొన్నారు. నాణ్యమైన విద్యుత్ సరఫరాకు కృషి అయిజ: వినియోగదారులకు నిరంతరం నాణ్యమైన విద్యుత్ను సరఫరా చేస్తామని ట్రాన్స్ కో ఎస్ఈ శ్రీనివాసరెడ్డి అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని సబ్స్టేషన్ను డీఈ తిరుపతిరావుతో కలిసి ఆయన పరిశీలించారు. మండల కేంద్రంలోని 132 /33 కేవీ సబ్స్టేషన్లో 31.5 ఎంవీఏ శక్తిని 50 ఎంవీఏకు పెంచనున్నట్లు తెలిపారు. పట్టణాల్లో, గ్రామాల్లో విద్యుత్ స్తంభాలకు ఏర్పాటు చేసిన టీవీ చానెల్ కేబుల్ వైర్లను డిష్ నిర్వాహకులు స్వచ్ఛందంగా తొలగించాలని ఆదేశించారు. విద్యుత్ స్తంభాలను, విద్యుత్ తీగలను తాకుతున్న చెట్ల కొమ్మలను తొలగించకుంటే ప్రాణ నష్టం జరుగుతుందని, వీటి వల్ల విద్యుత్ సరఫరాకు తరుచూ అంతరాయం కలుగుతుందని అన్నారు. కార్యక్రమంలో గోవిందు, ఏఈ నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. గద్వాల యువతికి నాయక్, రస్తోగి అవార్డు గద్వాల న్యూటౌన్: ఇంజినీరింగ్, టెక్నాలజీ రంగానికి సంబధించి పరిశోధనలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన వారికి ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ముంబాయి (ఐఐటీ ముంబాయి) వారు నాయక్, రస్తోగి అవార్డును 2012 నుంచి అందిస్తున్నారు. ఈ ఏడాది ఈ అవార్డును గద్వాలకు చెందిన కొంకతి ప్రీతి పొందారు. ఆసియాలోనే ప్రతిష్టత్మకమైన అవార్డులలో ఇది ఒకటి. యువతికి ఈ అవార్డు లభించడంపై వారి కుటుంబ సభ్యులు, పలువురు విద్యావేత్తలు హర్షం వ్యక్తం చేశారు. -
తరలింపే తరువాయి..
సాక్షి, నాగర్కర్నూల్: నల్లమల అటవీప్రాంతంలోని అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలో కోర్ ఏరియాలో ఉన్న ఐదు చెంచుపెంటల రీలొకేషన్కు కేంద్ర పర్యావరణ శాఖ సలహాకమిటీ ఆమోదం తెలిపింది. రెండు విడతల్లో ఐదు చెంచుపెంటల్లోని స్థానికులను అడవి నుంచి బయటకు తరలించి అక్కడ పునరావాసం కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనకు కేంద్ర పర్యావరణ శాఖ సలహా కమిటీ సూత్రప్రాయంగా ఆమోదించడంతో గ్రామాల రీలొకేషన్ ప్రక్రియ మొదలుకానుంది. మొదటి విడతలో కుడిచింతల్బైల్, కొల్లంపెంట, తాటిగుండాల పెంటల్లోని 417 కుటుంబాలతో పాటు రెండోవిడతలో వటవర్లపల్లి, సార్లపల్లి గ్రామాల్లోని 836 కుటుంబాలను అడవి నుంచి బయటకు తరలించి ప్రభుత్వం పునరావాసం కల్పించనుంది. వన్యప్రాణులు– మనుషులకు మధ్య ఘర్షణ నివారించేందుకు.. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్లోని కోర్ ఏరియాలోని చెంచుపెంటల్లో నివసిస్తున్న స్థానిక చెంచులను ఇక్కడి నుంచి తరలించి నాగర్కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం బాచారం సమీపంలో పునరావాసం కల్పించనున్నారు. టైగర్ రిజర్వ్ పరిధిలోని పులులు, వన్యప్రాణుల సంరక్షణ, వాటి ఆవాసాలకు ఆటంకాలను నిర్మూలించడం, మనుషులకు – వన్యప్రాణులకు మధ్య ఘర్షణలను నివారించేందుకు, పర్యావరణ సంరక్షణలో భాగంగా జాతీయ పులుల సంరక్షణ అథారిటీ(ఎన్టీసీఏ) నిర్వాసితులకు ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ అందిస్తోంది. స్వచ్ఛందంగా అడవి నుంచి బయట నివసించాలనుకునే వారికి ఒక్కో కుటుంబానికి రూ.15 లక్షల ఆర్థిక సహాయం లేదా ఇల్లు, ఐదెకరాల వ్యవసాయ భూమిని అందిస్తోంది. ఇందుకోసం ఇప్పటికే రీలొకేషన్ సర్వే, గ్రామసభలు నిర్వహించిన అటవీశాఖ అధికారులు గ్రామస్తుల నుంచి అంగీకారపత్రాలను తీసుకున్నారు. సార్లపల్లి గ్రామంలోని 30 కుటుంబాలు మినహా, కొల్లంపెంట, కుడిచింతల్ బైల్, తాటిగుండాల, వటవర్లపల్లి గ్రామాల్లోని స్థానికులు రీలొకేషన్కు అంగీకారం తెలిపారు. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్లోని చెంచుపెంటల తరలింపునకు కేంద్రం ఆమోదం నల్లమల అడవి నుంచి రెండు దశల్లో 5 గ్రామాల రీలొకేషన్ నిర్వాసితుల నుంచి ఎంఓయూ ఒప్పందం అనంతరంప్రారంభంకానున్న తరలింపు ప్రక్రియ ప్రభుత్వం పూర్తిస్థాయిలో పునరావాసం కల్పించాకే తమను తరలించాలంటున్న చెంచులు పెద్దకొత్తపల్లి మండలం బాచారం వద్ద పునరావాసం ఎంఓయూ అనంతరం ప్రారంభంకానున్న ప్రక్రియ.. గ్రామసభలు, జిల్లాస్థాయి కమిటీ, రాష్ట్రస్థాయి కమిటీ, జాతీయ పులుల సంరక్షణ అథారిటీ(ఎన్టీసీఏ) కమిటీల ఆమోదం మంగళవారం కేంద్రం పర్యావరణశాఖ సలహా కమిటీ సైతం ఆమోదం తెలిపింది. దీంతో నిర్వాసితుల నుంచి మెమొరెండమ్ ఆఫ్ అండర్ స్టాడింగ్(ఎంఓయూ) పత్రాలపై సంతకాలను తీసుకున్న తర్వాత గ్రామాల రీలొకేషన్ ప్రక్రియ ప్రారంభంకానుంది. మరో రెండునెలల్లోనే ఈ ప్రక్రియ మొదలవుతుందని అధికారులు చెబుతున్నారు. రీలొకేషన్ ప్రక్రియ పూర్తిగా స్వచ్ఛందంగా ఉంటుందని అటవీశాఖ అధికారులు అంటున్నారు. -
యూరియా కోసం రైతుల ఆందోళన
గద్వాల/గట్టు/అయిజ: విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పంటలకు సంబంధించి సరిపడా యూరియా అందుబాటులో లేక ఇబ్బందులు పడుతున్నామంటూ రైతులు ఆందోళన బాట పట్టారు. మంగళవారం అయిజ మండల కేంద్రంలోని సింగిల్ విండో కార్యాలయాన్ని రైతులు దిగ్బంధించగా.. గట్టు పీఏసీఎస్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. పూర్తి వివరాలిలా.. మూడు రోజుల వరుస సెలవుల నేపథ్యంలో అయిజ సింగిల్విండో కార్యాలయానికి యూరియా సరఫరా నిలిచిపోయింది. మార్క్ఫెడ్ నుంచి వచ్చిన 300 బస్తాల యూరియా కోసం రైతులు ఒకేసారి గుమికూడడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఈసందర్భంగా సింగిల్విండో అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రస్తుతం మార్కెట్లో యూరియా సరిపడినంతగా సరఫరా కాకపోవడం, బహిరంగ మార్కెట్లో ఎక్కువ ధరలకు విక్రయిస్తుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. రైతులంతా ఒకేసారి సింగిల్విండో కార్యాలయానికి చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడుతున్నా యని అన్నారు. సరిపడా యూరియాను సరఫరా చేయాలని కలెక్టర్ను కోరినట్లు తెలిపారు. ఉదయం నుంచి రాత్రి వరకు బారులు.. గట్టు పీఎసీఎస్ ఎదుట మంగళవారం యూరియా కోసం పెద్ద ఎత్తున రైతులు బారులుతీరారు. ఉదయం 6–30 గంటల నుంచే రాత్రి వరకు క్యూలైన్లో నిలబడ్డారు. రైతుల రద్దీని గమనించి పోలీసుల పీఏసీఎస్ దగ్గరకు చేరుకుని పరిస్థితిని అదుపు చేయాల్సి వచ్చింది. ప్రస్తుతం వర్షాలు జోరందుకున్న తరుణంలో రైతులు తాము సాగు చేసిన పంటలకు యూరియా అవసరం కాగా, అది బయట మార్కెట్లో లభించకపోవడంతో లబోదిబోమంటున్నారు. రైతులు వ్యవసాయ పనులు వదిలి ఎరువులు సరఫరా చేసే పీఏసీఎస్ దగ్గర పడిగాపులు పడాల్సి వస్తోంది. ఇలాంటి పరిస్థితి ఎన్నడూ చూడలేదని, పంటలను పండించుకునేందుకు యూరియా దొరకకపోవడం దారుణమని రైతులు వాపోయారు. గట్టు పీఏసీఎస్లో గత నెల 24న యూరియా పంపిణీని ప్రారంభించగా ఇప్పటి దాకా (ప్రస్తుతం పంపిణి చేస్తున్నవి కలుపుకొని) 3024 యూరియా బస్తాను రైతులకు అందించినట్లు పీఏసీఎస్ అధికారులు తెలిపారు. యూరియా కొరత లేకుండా చూడాలి : మాజీ మంత్రి జిల్లాలో యూరియా లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని యూరియా కొరత లేకుండా అవసమైన చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. ఈమేరకు మంగళవారం ఆయన గద్వాలకు వచ్చి కలెక్టర్ బీఎం సంతోష్తో ప్రత్యేక భేటీ అయ్యారు. జిల్లాలో నెలకొన్న పలు సమస్యలపై చర్చించారు. ప్రధానంగా యూరియా కొరతతో పాటు, జూరాల ప్రాజెక్టు గేట్ల మరమ్మతులు, నెట్టెంపాడు ప్రాజెక్టు పరిధిలో సంగాల, తాటికుంట రిజర్వాయర్లను పూర్తిస్థాయి నీటితో నింపి ఆయకట్టుకు సాగునీటిని అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా 99,100 ప్యాకేజీల పరిధిలో అసంపూర్తిగా ఉన్న పనులు పూర్తి చేయాలన్నారు. అనంతరం పలుసమస్యలతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టర్కు అందజేశారు. ఈకార్యక్రమంలో విష్ణువర్ధన్రెడ్డి, బాసుహనుమంతు, కుర్వపల్లయ్య, రాజు, మోనేష్, శ్రీనివాస్రెడ్డి పాల్గొన్నారు. అయిజ సింగిల్విండో కార్యాలయం దిగ్బంధం గట్టు పీఏసీఎస్ వద్ద రాత్రి వరకు ఎదురుచూపులు -
ప్రజావాణికి 40 ఫిర్యాదులు
గద్వాల: వివిధ సమస్యలపై వచ్చే ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో సమావేశం హాలులో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా జిల్లాలోని వివిధ గ్రామాలకు చెందిన ప్రజలు మొత్తం 40 ఫిర్యాదులను కలెక్టర్కు నేరుగా అందజేశారు. అనంతరం వాటిని ఆయా శాఖలకు చెందిన అధికారులకు పంపించడం జరిగిందని, వెంటనే పరిష్కరించాలని, పరిష్కారం కానిపక్షంలో అందుకు గల కారణాలు వివరిస్తూ సంబంధిత ఫిర్యాదుదారుడికి అక్నాలెడ్డ్మెంట్ ద్వారా తెలియజేయాలని సూచించినట్లు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు వి.లక్ష్మీనారాయణ, నర్సింగ్రావు కలెక్టరేట్ సిబ్బంది, వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. పోలీస్ గ్రీవెన్స్కు 10 అర్జీలు గద్వాల క్రైం: భూ వివాదం, ఆస్తి తగదాలు, అప్పుగా తీసుకున్న వ్యక్తులు డబ్బులు చెల్లించడం లేదంటూ మొత్తం 10 ఫిర్యాదులను ఎస్పీ శ్రీనివాస్రావుకు అందజేశారు. సోమవారం ఎస్పీ కార్యాలయంలో పోలీస్ గ్రీవెన్స్ నిర్వహించారు. -
ఎడతెరిపి లేని వానలు
గద్వాల: జిల్లాలో రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. రాత్రనక.. పగలనకా ముసురు వర్షంతో ప్రజలు చిత్తడవుతున్నారు. ఇక వాగులు, వంకలు పొంగి పొర్లుతుండగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. శనివారం రాత్రి నుంచి సోమవారం రాత్రి వరకు జిల్లా వ్యాప్తంగా 3.8సెం.మీ. వర్షం కురిస్తే ఇందులో గరిష్టంగా రాజోలిలో 52.1 మి.మీటర్లు, ఇటిక్యాల, మల్దకల్, గట్టు, అయిజ మండలాల్లో 40 మి.మీ. పైగా వర్షపాతం నమోదైంది. కలెక్టర్, ఎస్పీ పర్యవేక్షణ జిల్లా వ్యాప్తంగా నాలుగురోజులుగా భారీ వర్షాలు కురుస్తుండడంతో కలెక్టర్ బీఎం సంతోష్, ఎస్పీ శ్రీనివాసరావు అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ క్షేత్రస్థాయిలో పర్యటించి అప్రమత్తం చేస్తున్నారు. ప్రధానంగా ఎర్రవల్లి, మానవపాడు మండలా పరిధిలోని వాగులు ఉగ్రరూపం దాల్చుతుండడంతో పోలీసు, రెవెన్యూ సిబ్బందిని పహారపెట్టి రాకపోకలను నియంత్రిస్తున్నారు. మరో రెండు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండి అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. రాకపోకలకు అంతరాయం భారీ వర్షాలతో ప్రధానంగా అలంపూర్ మండలం కాశపురం వద్దనున్న వాగు పొంగి పొర్లడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అదేవిధంగా మానవపాడు మండలంలోని మానవపాడు– అమరవాయి మధ్యనున్న పెద్దవాగు ఉగ్రరూపం దాల్చడంతో ఆ రహదారిలో వెళ్లే వాహనాలకు ప్రమాదం పొంచి ఉందని, దాంతోపాటు పైభాగాన కురిసిన భారీ వర్షాలకు వర్షపు నీరు చేరి వాగు ఉధృతంగా పొంగే ప్రమాదం ఉందంటూ స్థానికులు హెచ్చరికలు చేస్తూ వాహనాల రాకపోకలను నిలిపివేశారు. మెన్నిపాడు వాగు ఉగ్రరూపం దాల్చడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. గద్వాల, ధరూరు, ఇటిక్యాల, మానవపాడు, కేటి.దొడ్డి, గట్టు, మల్దకల్, ఎర్రవల్లి, రాజోలి, అలంపూరు, వడ్డేపల్లి తదితర మండలాల పరిఽధిలో వాగులు, కుంటలు వర్షంనీటితో పొంగిపొర్లుతున్నాయి. పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు రాజోళిలో గరిష్టంగా 52.1 మి.మీ వర్షపాతం నమోదు కలెక్టర్, ఎస్పీల నిరంతర పర్యవేక్షణ -
సమయపాలన తప్పనిసరి
మల్దకల్: ఉదయం 9నుంచి సాయంత్రం 4.30గంటల వరకు తప్పనిసరిగా విధులు నిర్వహించాలని, సమయపాలన పాటించని వైద్య సిబ్బందిపై కఠినచర్యలు తప్పవని డీఎంహెచ్ఓ డాక్టర్ సిద్దప్ప హెచ్చరించారు. సోమవారం మండలంలోని పాల్వాయిలో ఉన్న ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాలని, మెరుగైన వైద్యసేవలు అందించాలన్నారు. కొంతమంది వైద్య సిబ్బంది సమయపాలన పాటించడం లేదనే ఫిర్యాదులు అందుతున్నాయని, అలాంటి వారు తమ పద్దతిని మార్చుకోవాలని హెచ్చరించారు. ప్రతి శుక్రవారం డ్రై డే నిర్వహించడంతో పాటు గ్రామంలో బీపీ, షుగర్ పరీక్షలు నిర్వహించాలని, ప్రభుత్వ ఆస్పత్రులలో ప్రసవాల సంఖ్యను మరింత పెంచాలన్నారు. ననీన్కుమార్, డీపీహెచ్ఎన్ఓ వరలక్ష్మీ, డీఎస్ఓ తిరుమలేష్ రెడ్డి, హెల్త్ సూపర్వైజర్ శ్రీధర్, ఏఎన్ఎం మనోహరమ్మ, ఆశాలు ఉన్నారు. -
సాహస వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న
గద్వాలటౌన్: బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం అహర్నిశలు పోరాడిన మహావీరుడు సర్దార్ సర్వాయి పాపన్న అని కలెక్టర్ సంతోష్ కొనియాడారు. సోమవారం కలెక్టరేట్లో సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకలను అధికారికంగా ఘనంగా నిర్వహించారు. కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన సర్దార్ సర్వాయి పాపన్న చిత్రపటానికి ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి కలిసి కలెక్టర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అడిషనల్ కలెక్టర్లు లక్ష్మినారాయణ, నర్సింగరావు,బీసీ సంక్షేమ శాఖ అధికారిణి నుశిత, గౌడ్ సంఘం జిల్లా నాయకుడు శ్రీధర్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. వివిధ పార్టీల ఆధ్వర్యంలో... సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకలను వివిధ పార్టీల నాయకులు, వివిధ సంఘాల నాయకులు వేరువేరుగా ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆ పార్టీ ఇన్చార్జి సరిత ఘనంగా నివాళి అర్పించి, ఆయన సేవలను కొనియాడారు. బీఆర్ఎస్ నాయకుడు హనుమంతు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామంజనేయులు, ప్రజా సంఘాల నాయకడు ప్రభాకర్, నడిగడ్డ గౌడ్ సంఘం నాయకులు వేరువేరుగా నివాళులర్పించి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. -
అనధికార మందులు విక్రయిస్తే చర్యలు
ఎర్రవల్లి: ప్రభుత్వ నిబంధనలు ఉల్లగించి అనధికార మందులు విక్రయిస్తే చర్యలు తప్పవని జిల్లా డ్రగ్ ఇన్స్పెక్టర్ వినయ్ అన్నారు. సోమవారం ఇటిక్యాల మండలంలోని ఉదండాపురంలో మసూద్ అహ్మద్ నిర్వహిస్తున్న ప్రథమ చికిత్స కేంద్రాన్ని నాగర్కర్నూల్ జిల్లా డ్రగ్స్ ఇన్స్పెక్టర్ విశ్వనాథ్రెడ్డి, మహబూబ్నగర్ రీజియన్ అసిస్టెంట్ డైరెక్టర్ దినేష్కుమార్తో కలిసి ఆయన తనిఖీ చేశారు. ఈమేరకు రూ.40వేల విలువైన 67 రకాల అలోపతి ఔషదాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వీటిని చికిత్స చేయడం, విక్రయించడం కోసం నిల్వ చేసినందుకుగాను సెక్షన్ 18 (సి) ఉల్లంఘన కింద ప్రథమ చికిత్స కేంద్రం నిర్వాహకుడిపై కేసు నమోదు చేసి ఔషధాలను సీజ్ చేసినట్లు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆర్ఎంపీలు రోగులకు కేవలం ప్రథమ చికిత్సను మాత్రమే అందించాలన్నారు. -
మాంద్యం నివారణలో కేంద్రం విఫలం
గద్వాల: దేశంలో పెరిగిపోతున్న ఆర్థికమాంద్యాన్ని నివారించి యువతకు ఉపాధి కల్పించడంలో బీజేపీ పూర్తిగా విఫలమైందని, నిత్యావసర వస్తువుల ధరలు అధికమై ద్రవ్యోల్బణం పెరిగిందని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు ఆర్.శ్రీరామ్నాయక్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని సీపీఎం పార్టీ కార్యాలయంలో పార్టీ కమిటీ సమావేశం నిర్వహించగా ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రజల ఆదాయం తగ్గి కేంద్రీకృతమవుతున్న ఆర్థిక అసమానతలు పెరిగాయని, ప్రజల దృష్టిని మళ్లించటానికి బీహార్లో ప్రజలు ప్రజాస్వామిక ఓటుహక్కును నిరాకరిస్తున్నారన్నారు. చట్టబద్ధ, రాజ్యాంగ పదవులలో ఉన్నవారు చేస్తున్న బాధ్యతారాహిత్య వ్యాఖ్యలు ప్రజల మధ్య విద్వేషాలు సృష్టిస్తున్నాయన్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికలోటు పేరుతో ప్రజలకు అందించే సంక్షేమ పథకాలకు కోతవిధించడం దారుమన్నారు. రైతులకు సంబంధించి పెట్టుబడి సాయం, బోనస్, రాజీవ్ యువవికాస్ అమలు, విద్యార్థులకు ఉపకార వేతనాలు అందజేయడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. వర్షాల వల్ల పంటనష్టం, ఇళ్లు కూలిపోయి నష్టం, మూగజీవాల మృత్యువాత వంటివాటిపై అధికారులతో ప్రత్యేక సర్వే చేయించి పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా కార్యదర్శి వెంకటస్వామి మాట్లాడుతూ సీడ్పత్తి రైతులకు కలెక్టర్ ఇచ్చిన హామీని అమలు చేయాలని, కొంతమంది సీడ్ఆర్గనైజర్లు ఇప్పటికీ రెండుక్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేస్తామని చెబు తూ బెదిరిస్తున్నారన్నారు. సమావేశంలో రేపల్లె దేవ దాసు, రాజు, పరంజ్యోతి, నర్సింహా, మద్దిలేటి, నర్మద, ఈదన్న, రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
బీసీ రిజర్వేషన్ల అమలుకు ఉద్యమం
గద్వాల: 42శాతం బీసీ రిజర్వేషన్ అమలు కోసం నడిగడ్డలో మరో ఉద్యమం చేపడతామని అఖిలపక్ష కమిటీ, ప్రజా సంఘాలు, కుల, ఉప్యాధాయ, రైతు సంఘాల నాయకులు అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని బీసీ టీచర్స్ యూనియన్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ 42 శాతం బీసీ రిజర్వేషన్ల కోసం కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో చట్టం చేసి అమలు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. తొమ్మిదో షెడ్యూల్లో చేర్చాలన్నారు. ప్రధానమంత్రిగా ఉన్న వ్యక్తి బీసీగా ఉన్నారని, కానీ బీసీలను మోసం చేస్తూ 42శాతం రిజర్వేషన్ల చట్టం పార్లమెంటులో ఆమోదం తెలపకుండా దానికి మతం రంగు పులమడం దారుణమని విమర్శించారు. రిజర్వేషన్లు ఇచ్చేది మత ప్రాతిపదికన కాదని వెనకబడిన వర్గాలకు ఆర్థిక, రాజకీయ, సామాజిక సమాన అవకాశాలు కల్పన కోసం అన్న విషయాన్ని బీజేపీకి తెలియకపోవడం శోచనీయమన్నారు. విద్యా, ఉద్యోగ, ఉపాధి అవకాశాలలో సమానత్వాన్ని నిరాకరిస్తుందని, అందుకే బీసీ రిజర్వేషన్లను పక్కన పెట్టాలని భావిస్తున్నట్లు చెప్పారు. బీజేపీ నాయకులు సైతం బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతూ మతవిద్వేషాలు రెచ్చగొట్టడం మంచిది కాదని హితవు పలికారు. నాయకులు వాల్మీకి, మధుసుదన్బాబు, వెంకట్రాములు, శంకరప్రభాకర్ మోహన్, గోపాల్రెడ్డి, టవర్మక్బుల్, బుచ్చన్న, లక్ష్మీనారాయణ, దామోదర్, రామకృష్ణ, సాదతుల్లా పాల్గొన్నారు. -
పల్లెగడ్డను వదులుకోం
మరికల్: తమ పూర్వీకులు వ్యవసాయమే జీవనాధారంగా బతుకుతూ తమకు కానుకగా ఇచ్చిన ‘పల్లెగడ్డ’ను వదులుకోమని గ్రామస్తులు ముక్తకంఠంతో తేల్చిచెబుతున్నారు. తమ గోడును ప్రభుత్వం పట్టించుకోకపోయినా కోర్టులో న్యాయ పోరాటం చేసి.. తమ గ్రామాన్ని కాపాడుకుంటామని శపథం చేస్తున్నారు. నిజాం నిరంకుశ పాలన నాటి నుంచి తరతరాలుగా తమ పూర్వీకులు ఊరిని కాపాడుకుంటూ వస్తున్నారని.. 2018లో ఓ అజ్ఞాత వ్యక్తి సమాచార హక్కు చట్టం ద్వారా చిన్నరాజమూరు ఆంజనేయస్వామి దేవాలయ భూమిలో పల్లెగడ్డ గ్రామం ఉందని ఫిర్యాదు చేయడంతో తమకు సమస్యలు మొదలయ్యాయని వాపోతున్నారు. అప్పటి నుంచి ఎండోమెంట్ అధికారులు తమకు దశల వారీగా కోర్టు నుంచి నోటీసులు జారీచేస్తూ భయాందోళనకు గురిచేస్తున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిధులతో అభివృద్ధి పనులు.. చిన్నరాజమూరు ఆంజనేయస్వామి ఆలయ భూమిలో నిర్మితమైన పల్లెగడ్డ గ్రామం మొదట్లో అభివృద్ధికి ఆమడదూరంలో ఉండేది. మరికల్ పంచాయతీ పరిధిలో ఉండటంతో కనీస వసతులకు నోచుకోక గ్రామస్తులు ఇబ్బందులు పడేవారు. కాలక్రమేణా గ్రామ జనాభా పెరగడంతో 1980లో అప్పటి ప్రభుత్వం 15 ఇళ్లను పేదలకు నిర్మించి ఇచ్చింది. అప్పట్లోనే ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ కేంద్రం ఏర్పాటుచేశారు. గ్రామంలో అంతర్గత రహదారులకు ఇరువైపులా డ్రెయినేజీలు, పబ్లిక్ కొళాయిలు ఏర్పాటు చేశారు. ఇలా ప్రభుత్వ నిధులతో ప్రజా సమస్యలు తీరుస్తూ వచ్చారు. తెలంగాణ రాష్ట్ర వచ్చాక గత ప్రభుత్వం నూతన పంచాయతీల ఏర్పాటుకు శ్రీకారం చూట్టింది. అప్పటి ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి చొరవతో మరికల్ గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న పల్లెగడ్డను కొత్త పంచాయతీగా ఏర్పాటు చేయించారు. ఆ తర్వాత ఉపాధి హామీ పథకం నిధులతో సీసీరోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రెయినేజీలు నిర్మించారు. మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ నల్లా కనెక్షన్ ఇచ్చి తాగునీరు అందిస్తున్నారు. నూతన గ్రామ పంచాయతీ భవనం, సెగ్రిగేషన్ షెడ్, పల్లెప్రకృతి వనం, శ్మశానవాటిక, డంపింగ్యార్డు వంటివి నిర్మించారు. ప్రస్తుత ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకానికి పల్లెగడ్డ గ్రామాన్ని పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపికచేసి.. మొదటి విడతలో 66 ఇళ్లు మంజూరుచేయగా.. లబ్ధిదారులు పనులు సైతం ప్రారంభించారు. ఇలా ప్రభుత్వ నిధులతో గ్రామంలో అనేక అభివృద్ధి పనులు చేపడుతూ వస్తున్నారు. అయితే పల్లెగడ్డ గ్రామస్తుల సమస్యపై ప్రజాప్రతినిధులు పట్టనట్టుగా ఉండటం గమనార్హం. ప్రజాప్రతినిధులు స్పందించాలి.. గ్రామంలో ప్రభుత్వ పాఠశాల, అంగన్వాడీ కేంద్రం, రేషన్షాపు, సీసీరోడ్లు, డ్రెయినేజీలు, మిషన్ భగీరథ నీటి సరఫరా తదితర అభివృద్ధి పనులు ఎన్నో జరిగాయి. కొత్త పంచాయతీగానూ ఏర్పాటు చేశారు. 200 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న పల్లెగడ్డ గ్రామాన్ని ఖాళీ చేయాలని 2018 నుంచి కోర్టు చుట్టూ తిప్పడం సరికాదు. ప్రజాప్రతినిధులు స్పందించి గ్రామానికి న్యాయం చేయాలి. – కుర్మయ్య, పల్లెగడ్డ ఇందిరమ్మ ఇళ్లు కూడా.. ఇందిరమ్మ ఇళ్ల పథకానికి పల్లెగడ్డ గ్రామం పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక కావడంతో మొదటి విడతగా 66 ఇళ్లు మంజూరయ్యాయి. 1980లో కూడా అప్పటి ప్రభుత్వం 15 ఇళ్లను పేదలకు మంజూరు చేసింది. ఇన్నాళ్లుగా ప్రభుత్వ నిధులతో గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి ఎండోమెంట్ అధికారులకు కనిపించడం లేదా.. కోర్టులో న్యాయ పోరాటం చేసి గ్రామాన్ని కాపాడుకుంటాం. – విజయ్, పల్లెగడ్డ మరిన్ని నోటీసులు.. పల్లెగడ్డ గ్రామం విషయం దేవాదాయ ట్రిబ్యునల్ కోర్టు పరిధిలో ఉంది. త్వరలోనే మరికొంత మందికి కోర్టు నుంచి నోటీసులు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం 25 మందికి నోటీసులు జారీ అయ్యాయి. వారి వద్ద ఏమైనా ఆధారాలు ఉంటే దేవాదాయశాఖ ట్రిబ్యునల్ కోర్టులో సమర్పించాలి. – కవిత, దేవాదాయశాఖ ఈఓ, మహబూబ్నగర్ ముక్తకంఠంతో నినదిస్తున్న గ్రామస్తులు నేడు దేవాదాయశాఖ ట్రిబ్యునల్ కోర్టు ఎదుట హాజరుకానున్న 25మంది పుట్టిన ఊరి కోసం తమ వాదన వినిపిస్తామని వెల్లడి ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరిని విడిచివెళ్లమని శపథం స్పందించని ప్రజాప్రతినిధులు 1,624 మందికిపైగా జనాభా.. నాలుగు కుటుంబాలతో మొదలైన పల్లెగడ్డ గ్రామంలో 250కి పైగా ఇళ్ల నిర్మాణాలు జరిగాయి. 20 ఎకరాల గ్రామకంఠం ఉంది. మొత్తం 1,624 జనాభా ఉండగా.. 745 మంది ఓటర్లు ఉన్నారు. 254 రేషన్కార్డులు ఉన్నాయి. ప్రాథమిక పాఠశాలలో 40 మంది, అంగన్వాడీ కేంద్రంలో 25మంది చదువుకుంటున్నారు. 250 ఇళ్లకు పైగా విద్యుత్ మీటర్లు ఉండగా.. ఇంటి పన్ను, నల్లా పన్నులు చెల్లిస్తున్నారు. అంతేకాకుండా గ్రామంలో ఆంజనేయస్వా మి, శివాలయాలు, నలుదిక్కులా గ్రామదేవతల విగ్రహాలను ప్రతిష్ఠించి పూజిస్తున్నారు. 2 వేల ఎకరాలకు పైగా వ్యవసాయ భూములు ఉన్నాయి. -
సీపీఎస్ రద్దే లక్ష్యం
వనపర్తిటౌన్: ఉపాధ్యాయ, ఉద్యోగులకు అశనిపాతంగా మారిన కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్) రూపుమాపేందుకు పీఆర్టీయూ టీఎస్ పూనుకుందని, అదే లక్ష్యంతో పని చేస్తోందని సంఘం ఉమ్మడి రాష్ట్ర మాజీ అధ్యక్షుడు పేరి వెంకట్రెడ్డి అన్నారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని సంఘం కార్యాలయంలో నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. సెప్టెంబర్ 1న హైదరాబాద్లోని ఇందిరాపార్క్లో ఉన్న ధర్నాచౌక్ వద్ద సంఘం ఆధ్వర్యంలో చేపట్టే మహాధర్నాకు ఉద్యోగ, ఉపాధ్యాయులు అధికసంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అంతకుముందు మహాధర్నా వాల్పోస్టర్లను విడుదల చేశారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు బౌద్ధారెడ్డి, ప్రధానకార్యదర్శి సూర చంద్రశేఖర్, టీఈజేఏసీ జిల్లా కన్వీనర్ సూగూరు వరప్రసాద్రావు, టీఎస్సీపీఎస్ఈయూ జిల్లా అధ్యక్షుడు మద్దిలేటి, ప్రధానకార్యదర్శి రాజేంద్రప్రసాద్, కోశాధికారి మోహన్బాబు, సంఘం మండల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు. -
యూరియా.. నో స్టాక్
గద్వాల వ్యవసాయం: జిల్లాలో యూరియా కొరత రైతులను వేధిస్తోంది. అన్ని రకాల పంటల్లో యూరియాను వినియోగిస్తారు. గడిచిన కొద్ది రోజులుగా డిమాండ్ మేరకు జిల్లాలో లభించడం లేదు. దీంతో సరిపడా దొరకక అన్నదాతలు అవస్థలు పడుతున్నారు. అన్ని ఎరువుల కన్నా ప్రభుత్వం ఎక్కువ సబ్సిడీపై యూరియాను అందిస్తోంది. దాదాపు అన్ని రకాల పంటల్లో యూరియాను ఎరువుగా వినియోగిస్తారు. ఇది ప్రధానంగా పంటలకు నత్రజని అందిస్తుంది. మొక్కల పెరుగుదలకు, ఆకుల అభివృద్ధికి, దిగుబడిని పెంచడానికి దోహదం చేస్తుంది. దీనివల్ల వరి, వేరుశనగ, పత్తి, ఆముదం, కంది, మిరప, ఇతర ఉద్యాన పంటల్లో ఇలా అన్ని పంటల్లో యూరియాను వాడతారు. 3.67 లక్షల ఎకరాలు.. 15 వేల మెట్రిక్ టన్నులు ఈ ఏడాది వానాకాలం సీజన్లో 3,67,211 ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు అవుతాయని వ్యవసాయశాఖ అంచనా వేసింది. ఇందుకోసం 15వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం అవుతుందని లెక్కలు వేశారు. 15వేల మెట్రిక్ టన్నుల యూరియాను జూన్ నుంచి సెప్టెంబర్ వరకు ఆయా నెలలకు సరిపడా వినియోగించేలా లెక్కలు వేసి ఉంచుతారు. వరి మినహాయిస్తే మిగిలిన పంటలకు ఎకరాకు కనీసంగా రెండు బస్తాల యూరియాను వేస్తారు. అయితే గత పదిరోజుల నుంచి సరిపడా యూరియా రైతులకు లభ్యం కావడం లేదు. ఇందుకు పలు కారణాలు కన్పిస్తున్నాయి. ప్రధానంగా ఒక్క జూలై నెలలోనే 11500 మెట్రిక్ టన్నుల యూరియా రైతులు కొనుగోలు చేశారు. వర్షాలతో ఊపందుకున్న సాగు జిల్లాలో మే నెలలో వర్షాలు కురిశాయి. సీజన్ అంతా బాగుంటుందని ఆశించారు రైతులు. అయితే జూన్, జులైలో ఆశించిన మేర వర్షాలు కురవకపోవడం, బోర్లు, బావులు రీచార్జి కాకపోవడం వల్ల సగమే సాగు అయ్యింది. అయితే జూన్లో ఎగువన కురిసిన వర్షాలకు జూరాల నుంచి నీటి విడుదల జరగడంతో నారుమళ్లు పోసుకున్నారు. కాగా జూలై మూడో వారం నుంచి వర్షాలు బాగా కురిసాయి. గత కొద్ది రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో సాగుజోరు అందుకుంది. ప్రధానంగా వరిపంటను ఎక్కువగా వేస్తున్నారు. అనుమానాలెన్నో.. ఇదిలాఉండగా, యూరియా అధిక మొత్తంలో కొనుగోలు చేసింది ఈప్రాంతానికి చెందిన రైతులేనా..లేక ఇతర ప్రాంతాల రైతులు కొనుగోలు చేశారా అనే దానిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే కర్ణాటకలో యూరియా కొరత ఉంది. గద్వాల ప్రాంతానికి కర్ణాటక రాష్ట్రం కేవలం 50కీ.మీ. దూరం ఉంది. గట్టు, అయిజ మండలాల్లోని పలు గ్రామాలు రాయచూర్కు దగరలో ఉన్నాయి. అక్కడి రైతులు కొనుగోలు చేయడం వల్లే జూలైలో డిమాండ్కు మించి యూరియా కొనుగోలు అయినట్లు తెలుస్తోంది. దీంతో పాటు యూరియా కొరత ఉంది అని ఆనోటా ఈనోటా ఎక్కువగా ఉండటంతో ఇక్కడి రైతులు కూడా కొంతమంది ముందు ముందుగానే కొని నిల్వ పెట్టుకున్నారని అంటున్నారు. ఏదిఏమైనా జూలై చివరివారం నుంచి ఆగస్టు నెలలో విస్తారంగా కురుస్తున్న నేపథ్యంలో వరి, ఇతర పంటలు వేసిన రైతులు యూరియా అవసరం మేరకు లభ్యం కాక నానా అవస్థలు పడుతున్నారు. సింగిల్ విండో గోదాములకు యూరియా వచ్చిందంటే చాలు రైతులు బారులు తీరుతున్నారు. జిల్లాలో ఎక్కువగా గట్టు, కేటీదొడ్డి, అయిజ, ఉండవల్లి, మల్దకల్ మండలాల్లో యూరియా కొరత స్పష్టంగా కన్పిస్తోంది. ఆగస్టులో 6వేల, సెప్టెంబర్లో 5వేల మెట్రిక్ టన్నుల యూరియా జిల్లాకు అవసరం ఉంటుంది. దొరకట్లేదు.. రెండు ఎకరాల్లో వరి సాగు చేశాను. యూరియా కోసం సింగిల్విండో గోదాంకు ఈవారంలో రెండు సార్లు వెళ్లగా అక్కడ స్టాక్ లేక వట్టి చేతులతో తిరిగి వచ్చాను. కనీసం నాకు నాలుగు బస్తాలు కావాలి. సకాలంలో యూరియా వేస్తేనే పంట బాగా వస్తుంది. – వెంకట్రాములు, రైతు, గట్టు అధికారులు దృష్టి సారించాలి నాకున్న పది ఎకరాల్లో వరి,పత్తి, మిరప పంటలు వేశాను. ఆయా పంటలకు ఇప్పుడు యూరియా వేయాలి. కాని సరిపడా యూరియా దొరకడం లేదు. టైం ప్రకారం యూరియా వేయకుంటే పంట బాగా రాదు. ఇప్పటికై నా యూరియా కొరతపై అధికారులు దృష్టి పెట్టాలి. – గోధ జయన్న, రైతు, ఉండవల్లి నిల్వలు ఉన్నాయి జూలైలో యూరియా వినియోగం ఎక్కువ కావడం వల్ల అక్కడక్కడ యూరియా డిమాండ్ మేరకు లభించడం లేదు. అయితే జిల్లాలో ప్రస్తుతం మార్క్ఫెడ్ వద్ద 200 మెట్రిక్ టన్నులు, ప్రైవేట్ డీలర్ల వద్ద 2500 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు ఉన్నాయి. జిల్లాలో యూరియా కొరత రాకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. – సక్రియానాయక్, డీఏఓ నెల యూరియా వినియోగం (మెట్రిక్ టన్నుల్లో) మే 55.15 జూన్ 891 జులై 11,500 ఆగస్టు(ఇప్పటివరకు) 3200 జిల్లా వివరాలిలా.. సరిపడా లభ్యంకాక రైతుల అవస్థలు వానాకాలం మొత్తానికి 15వేల మె.టన్నులు సిద్ధం చేసిన అధికారులు జూలైలో రికార్డుస్థాయిలో 11,500 మె.టన్నుల యూరియా వినియోగంపై అనుమానాలెన్నో.. ఇటీవల వర్షాలతో జోరందుకున్న వరి సాగు -
కనులపండువగా కృష్ణస్వామి రథోత్సవం
మల్దకల్: కృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా ఆదివారం స్వామి వారి రథోత్సవాన్ని కనులపండువగా నిర్వహించారు. వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య స్వామి వారి ఉత్సవమూర్తులను భాజాభజంత్రీలతో ఆలయం చుట్టూ ఊరేగించారు. అనంతరం రథోత్సవంపై స్వామి వారి ఉత్సవమూర్తులను ఏర్పాటు చేసి దశమికట్ట వరకు లాగారు. ఈ రథోత్సవ కార్యక్రమానికి వివిధ పార్టీలకు చెందిన నాయకులు హాజరయ్యారు. రథోత్సవ కార్యక్రమాన్ని తిలకించేందుకు మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన భక్తులతో పాటు గట్టు, అయిజ, గద్వాల మండలాలకు చెందిన భక్తులు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. అలాగే ఎల్కూర్లో కృష్ణాష్టమి వేడుకలను గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు. సద్దలోనిపల్లి ఆలయ అవరణలో చిన్నారుల కోలాటం భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది. -
మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
గద్వాల: మున్సిపల్ కార్మికులకు ఉద్యోగ భద్రతలేదని, దాంతో పాటు కనీసం ప్రమాద బీమా కూడ లేదని సీఐటీయూ రాష్ట్ర ప్రధానకార్యదర్శి జె.రాజమల్లు అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని స్థానిక బృందావన్గార్డెన్ ఫంక్షన్ హాలులో జరిగిన మూడో జిల్లా మహాసభలకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులకు ప్రమాద బీమా కల్పించి వారి కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. జీవితాంతం ప్రజలకు సేవలు అందించే కార్మికులకు ఉద్యోగ భద్రత లేకపోగా కనీసం ప్రమాద బీమాను కూడా కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయన్నారు. రాజీలేని పోరాటాల ద్వారానే ప్రభుత్వాల మెడలు వంచి హక్కులు సాధించుకోగలమన్నారు. ఈఎస్ఐ సౌకర్యం లేకపోవడంతో వైద్యం కోసం సొంత డబ్బులనే వెచ్చిస్తున్నారన్నారు. దీనికోసం అప్పులు సైతం చేస్తూ ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో వెంకటస్వామి, వివి నర్సింహా, ఉప్పేర్ నర్సింహా, శివ, రవి, మహేష్, దేవి, లలితమ్మ, సత్యమ్మ, నరేష్, ప్రభుదాసు, సంజీవరాజు తదితరులు పాల్గొన్నారు. -
నయా దందా..!
–8లో uరాజోళి: డబ్బు వెనకేసుకోవడమే లక్ష్యంగా జిల్లాలో కొందరు ప్రైవేట్ బ్యాంకు సిబ్బంది కొత్త దందాకు తెరలేపారు. మీ పేర్లపై ఆస్తులు లేకపోయినా.. తాతలు, అమ్మనాన్నల పేర్లపై ఉంటే చాలు.. మిగతాదంతా మేమే చూసుకుంటామంటూ నమ్మబలుకుతారు. మా బ్యాంకు ద్వారా రుణం అందిస్తాం.. నువ్వు చేయాల్సిందంతా రుణం మంజూరు కాగానే పర్సంటేజీ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రూ.వేల నుంచి రూ.లక్షలు వెనకేసుకుంటున్నారు. ఇదే అదునుగా స్థానికంగా ఉన్న పైరవీకారులు వారితో కుమ్మకై ్క అమాయకులైన పల్లె ప్రజలను రుణాల పేరుతో మోసం చేస్తున్నారు. నకిలీ పత్రాలు సృష్టించి.. రుణం పొందేందుకు సరైన పత్రాలు లేకున్నా.. దానిపై మీకు ఎలాంటి హక్కులు ఉన్నాయి, మీ దగ్గర ఉన్న ఏదైనా ఒక కాగితం చూపించండని బ్యాంకు సిబ్బంది వారిని ప్రేరేపిస్తున్నారు. ఉన్న ఒక్క దాన్ని ఆసరాగా చేసుకుని, ఆస్తికి సంబంధించిన అన్ని నకిలీ పత్రాలను వారే తయారు చేస్తున్నారు. ఇవేవి తెలుసుకోకుండా.. అక్రమార్కులకు రూ.లక్షలు కమీషన్ల రూపంలో ఇచ్చి.. అనంతరం రుణ బకాయిలు చెల్లించలేక ఆత్మహత్య చేసుకుంటున్నారు. అలాంటి వారిలో అలంపూర్ మండలం క్యాతూరు గ్రామానికి చెందిన ఒకరు, రాజోళి మండలం మాన్దొడ్డి గ్రామానికి చెందిన మరొకరు ఉన్నారు. మాన్దొడ్డి గ్రామానికి చెందిన ఒక ప్రైవేట్ బ్యాంకు ఉద్యోగి కారణంగా అదే గ్రామంతో పాటు, సమీపంలో ఉన్న పచ్చర్ల గ్రామంలోను అగ్గి రాజేసుకుంది. పచ్చర్లలో నేటికి అన్నదమ్ములు, తండ్రి కొడుకుల మధ్య తగాదాలు జరిగి, పంటను నాశనం చేసుకుని, కేసులు పెట్టుకునే స్థాయికి చేరుకుంది. ప్రస్తుతం అదే కుటుంబం రెండు వర్గాలుగా ఏర్పడి స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారు. సదరు వ్యక్తి కారణంగానే మాన్దొడ్డిలో రుణం తీసుకుని కమీషన్ ఎక్కువ కావాలని డిమాండ్ చేయడంతో గ్రామ పెద్దలు పంచాయితీ చేసి మందలించినట్లు సమాచారం. కానీ ఆయన తీరు మార్చుకోలేక అయిజలోకి మకాం మార్చి, తన కార్యకలాపాలను యథేచ్ఛగా కొనసాగిస్తున్నట్లు సమాచారం. ఇదే వ్యక్తి గట్టు మండలంలో 3, రాజోళి మండలంలో 2, అయిజలో 5, వడ్డేపల్లిలో ఒకటి ఇలా రుణాలు ఇప్పించినట్లు తెలుస్తుంది. ఇవికాక మరికొందరి దగ్గర రుణాల కోసం వేల రూపాయల్లో ముందుగానే డబ్బులు తీసుకున్నట్లు తెలుస్తుంది. నకిలీ సర్టిఫికెట్లు తయారుచేయడం, సంతకాలు ఫోర్జరీ చేయడం నేరం. రుణాల కోసం ఇలాంటి చర్యలకు ఎవరు పాల్పడినా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. ప్రజలు ఎవరూ కూడా ఇలాంటి వాటిని ప్రోత్సహించొద్దు. – మొగిలయ్య, డీఎస్పీ ప్రైవేట్ బ్యాంకు సిబ్బంది నిర్వాకం రూ.వేల నుంచి రూ.లక్షల్లో దండుకుంటున్న కమీషన్లు అయిజ, గద్వాల, మాన్దొడ్డి కేంద్రాలుగా లావాదేవీలు జిల్లాలో ప్రైవేట్ బ్యాంకులు, ఫైనాన్స్ కంపెనీలు పుట్ట గొడుగుల్లా పుట్టుకొచ్చాయి. ఈ నేపథ్యంలో బ్యాంకులు కూడా తమ సిబ్బందికి రుణాలు మంజూరు, రీకవరీ పేరిట లక్ష్యాలను నిర్దేశించింది. దీంతో తాము లక్ష్యాలను చేరుకోకుంటే జీతం రాదని తలచిన కొందరు ప్రైవేట్ బ్యాంకు సిబ్బంది.. గ్రామాల్లో డబ్బు అవసరమున్న అమాయకులను లక్ష్యం చేస్తున్నారు. వారికి ఉన్న ఆస్తుల వివరాలను తెలసుకుని, అందులో ఉన్న లోటు పాట్లను తెలసుకుని వారే ముందు ఉండి అమాయకులను లోన్ ట్రాప్లో దింపుతున్నారు. జిల్లాలో ఇంత జరుగుతున్నా.. దానికి కారణమైన ప్రైవేట్ బ్యాంక్ సిబ్బంది వివరాలు తెలిసినా అధికారులు ఎందుకు చర్యలు చేపట్టడం లేదనేది చర్చనీయాంశంగా మారింది. వీరు చేసే దందాలో అధికారులకు ఏమైనా పాత్ర ఉందా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. గట్టు, రాజోళి మండలాలకు సంబంధించిన ఫోర్జరీ సంతకాలు, ఫేక్ సర్టిఫికెట్లు బయటపడినా సంబంధిత అధికారులు వాటిపై ఎందుకు మౌనంగా ఉన్నారు. ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని జిల్లా ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి దందాలను మొదట్లోనే అడ్డుకోకుంటే.. గతంలో జరిగిన నకిలీ పాసు బుక్కుల కుంభకోణం తరహాలో రూ.కోట్ల రూపాయల్లో ఆస్తులకు ఎసరు పెడతారని, జిల్లా అధికారులు వారిపై కఠినమైన చర్యలు చేపట్టాలని బాధితులు కోరుతున్నారు. -
క్షయ నివారణ చర్యలపై జిల్లా బృందానికి అవార్డు
గద్వాల క్రైం: క్షయ నివారణ నిమిత్తం 2023లో గద్వాల క్షయ నివారణ బృందం పటిష్ట చర్యలు తీసుకొని 16వేల మంది అనుమానిత వ్యాధిగ్రస్తులకు పరీక్షలు చేపట్టిన నేపథ్యంలో ఉత్తమ అవార్డు వరించింది. శనివారం గవర్నర్ జిష్ణుదేవ్వర్మ, ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్ చేతుల మీదుగా జిల్లా క్షయ నివారణ ప్రోగ్రాం అధికారి డాక్టర్ రాజు అవార్డు ఫర్ ది ఇయర్ అవార్డు అందుకున్నారు. దాదాపు 1500 మందిలో వ్యాధి లక్షణాలు గుర్తించి సకాలంలో వైద్య సేవలు అందించడం, క్షయ రహిత జిల్లాగా మార్చాలనే లక్ష్యంతో వైద్య శాఖ చర్యలు అభినందనీయమని జిల్లా ఇన్చార్జ్ వైద్యాధికారి సిద్ధప్ప, ఇతర వైద్య సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు. -
ఆదివాసుల హక్కుల కోసం ఉద్యమిద్దాం
గద్వాల: ఆదివాసుల హక్కుల కోసం ఉద్యమించి కగార్ హత్యాకాండ–కాల్పుల విరమణపై నిర్వహించనున్న సభను విజయవంతం చేయాలని ఆదివాసి హక్కుల పోరాట సంఘీభావ వేదిక నాయకులు అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలో ఆదివాసుల హక్కుల పోరాట సంఘీభావ వేదిక నాయకులు సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ మధ్య భారతంలో ఏడు నెలలుగా మావోయిస్టుల ఏరివేతలో భాగంగా అమాయకులైన ఆదివాసులను ఎన్కౌంటర్ల పేరిట హత్యలు చేసి వారిని మావోయిస్టుల ముద్రవేయడం వల్ల వారికి జీవించే హక్కుకు భంగం కలుగుతుందన్నారు. గడ్చిరోలి ప్రాంతంలోరూ.7లక్షల కోట్ల విలువ చేసే ఖనిజ సంపద ఉందని దానిని కార్పోరేట్లకు దోచిపెట్టేందుకే కేంద్రం ఆపరేషన్ కగార్ పేరిట దమణకాండను సృష్టిస్తుందని ఆరోపించారు. దేశంలో మొత్తం 461 ఆదివాసి తెగలు ఉండగా, అందులో 92 తెగలు అడవిపైనే ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారని, వారి జీవన హక్కులను కేంద్రం ధ్వంసం చేస్తుందన్నారు. తక్షణమే కేంద్రం ఆపరేషన్ కగార్ నిలిపివేసి శాంతిచర్చలు జరిపి అడవులను ఆదివాసుల జీవించే హక్కులను కాపాడుతూ పర్యావరణాన్ని కాపాడాలని డిమాండ్ చేశారు. ఇదే డిమాండ్తో ఈనెల 24వ తేదీన వరంగల్లోని అంబేడ్కర్ భవన్లో సభను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.కార్యక్రమంలో గోపాల్, జ్యోతి, వెంకటమ్మ, శంకరప్రభాకర్, నాగరాజు, సుభాన్, ప్రకాష్గౌడ్, ఆంజనేయులు, ఇక్బాల్ తదితరులు పాల్గొన్నారు. -
ముకుందా.. ముకుందా
గద్వాల న్యూటౌన్/మల్దకల్: జిల్లా వ్యాప్తంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు శనివారం అంగరంగ వైభవంగా జరిగాయి. హరేకృష్ణా నామస్మరణలతో జిల్లా కేంద్రం గాంధీచౌక్ సమీపంలోని కృష్ణమందిరం, చెన్నకేశవస్వామి ఆలయం, వేదనగర్లోని పాండురంగస్వామి ఆలయం, రాఘవేంద్రకాలనీలోని సత్యనారాయణ స్వామి ఆలయం, మండల పరిధిలోని రేపల్లె, వీరాపురంలలోని శ్రీకృష్ణ స్వామి ఆలయాలు మార్మోగాయి. ఆలయాలు కొత్తశోభను సంతరించుకున్నాయి. భక్తులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. పలుచోట్ల నామకరణ, ఉట్టి కొట్టే కార్యక్రమాలు నిర్వహించారు. చిన్నారులను చిన్ని కృష్ణుడు, గోపిక వేషధారణలతో అలంకరించారు. సద్దలోనిపల్లిలో.. మల్దకల్ మండలంలోని సద్దలోనిపల్లిలో కృష్ణాష్టమి వేడుకలను శనివారం భక్తులు కనులపండువగా జరుపుకొన్నారు. పెద్దసంఖ్యలో భక్తులు ఆలయానికి కొత్తకుండల్లో దాసంగాలు సిద్ధం చేసి మొక్కులు చెల్లించారు. ఆలయ ప్రాంగణం మొత్తం భక్తులతో కిక్కిరిసిపోయింది. ఆలయ అధికారులు భక్తుల కోసం ప్రత్యేక క్యూలైన్లను ఏర్పాటు చేశారు. స్వామి వారి పల్లకీసేవ దశమికట్ట వరకు భాజాభజంత్రీలతో వెళ్లగా గ్రామస్తులు స్వామి వారికి పూజలు నిర్వహించారు. రాత్రి స్వామి వారి జననం, అనంతరం ఉత్సవమూర్తులతో పల్లకీసేవ నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదానం నిర్వహించారు. కృష్ణస్వామి మూలవిరాట్ జిల్లాలో కనులపండువగా కృష్ణాష్టమి వేడుకలు సద్దలోనిపల్లిలో అంబరాన్నంటిన వైనం -
వర్షాలతో అప్రమత్తం
రానున్న 72 గంటలలో భారీ నుంచి అతి భారీ వర్ష సూచన ● అవసరం ఉంటేనే ఇళ్ల నుంచి బయటకు రావాలి ● లోతట్టు ప్రాంతాలు, నదీపరివాహక ప్రాంతాల ప్రజలను అలర్ట్ చేయండి ● కలెక్టర్ సంతోష్, ఎస్పీ శ్రీనివాసరావు ● బీచుపల్లి పుష్కరఘాట్, పలు లోతట్టు ప్రాంతాల పరిశీలన ఉండవెల్లి: మండలంలో ఐదురోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలతో పొంగిపొర్లాయి. మారమునగాల–1, 2, మెన్నిపాడు గ్రామాల మధ్య వాగులు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఈక్రమంలో బుధవారం ఉపాధ్యాయులు ప్రమాదమని తెలిసినా మారుమునగాల–2, మెన్నిపాడు వాగులులను దాటి పాఠశాలకు చేరుకున్నారు. గ్రామస్తులది ఇదే పరిస్థితి. అదేవిధంగా, మారమునగాల – ప్రాగటూరు, బొంకూరు – మెన్నిపాడు మధ్యలో వాగు ఉధృతంగా ప్రవహించడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఇక తక్కశీలలోని పంట పొలాలకు వెళ్లేందుకు వీలు లేక వాగు ప్రవహిస్తండడంతో బ్రిడ్జి నిర్మించాలని రైతులు, గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. గద్వాల/ఎర్రవల్లి/మానవపాడు: భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అందరూ అప్రమత్తంగా ఉండి, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని, రానున్న 72గంటలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిందని కలెక్టర్ బీఎం సంతోష్ సూచించారు. బుధవారం ఎర్రవల్లి మండలంలోని బీచుపల్లి పుష్కర్ ఘాట్ వద్ద కృష్ణానది ఉధృతిని కలెక్టర్, ఎస్పీ శ్రీనివాసరావు వేర్వేరుగా పరిశీలించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎలాంటి అత్యవసర పరిస్థితులు తలెత్తినా సమర్థవంతంగా ఎదుర్కొనేలా అధికారులందరూ సంసిద్ధంగా ఉండాలని, అదేవిధంగా ప్రాణ, ఆస్తినష్టం జరగకుండా మూగజీవాలు ప్రాణాలు కోల్పోకుండా ముందస్తుగానే జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అత్యవసర పరిస్థితుల నేపథ్యంలో ఉద్యోగులందరూ సెలవులు రద్దు చేసుకుని అందుబాటులో ఉండాలన్నారు. రానున్న 72గంటల పాటు అవసరం ఉంటేనే ఇళ్లనుండి బయటకు రావాలని సూచించారు. సీజనల్ వ్యాధులు ప్రభలే అవకాశాలు ఉన్నందున వైద్యారోగ్యశాఖ అధికారులు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, అన్ని పీహెచ్సీలు, ఆసుపత్రులలో సరిపడా మందులను అందుబాటులో ఉంచుకోవాలని, వైద్యులు, సిబ్బంది నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి అవసరమైన వైద్యసేవలు అందించాలన్నారు. ● అలాగే, ఎర్రవల్లి మండలంలోని యాక్తాపురంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లన పనులను కలెక్టర్ పరిశీలించి పనులు వేగవంతంగా చేపట్టాలన్నారు. అవసరమైన ఇసుక, మట్టిని లబ్ధిదారులకు అందజేయాలని, నిర్మాణ పనులు త్వరగా పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు. బి.కే.ఎస్ ట్రేడర్స్, ఫర్టిలైజర్స్ ఎరువుల గోదాములను తనిఖీ చేశారు. లోతట్టు ప్రాంతాల్లో జర భద్రం : ఎస్పీ లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వాగులు, వంకలు దాటకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్పీ టి. శ్రీనివాసరావు పోలీసులను ఆదేశించారు. బుధవారం ఎస్పీ బీచుపల్లి పుష్కరఘాట్, అమరవాయి పెద్దవాగు, మానవపాడు పోలీస్స్టేషన్ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారీ వర్షాల నేపథ్యంలో పొలీసు యంత్రాంగాన్ని సంసిద్దం చేయడం జరిగిందని, వర్షాల సమయంలో విద్యుత్ తీగలు తెగిపోవడం, చెట్లు కూలడం, రహదారులు దెబ్బతినే అవకాశాలు ఉన్నందున ప్రజలకు ఎలాంటి సమస్య తలెత్తిన డయల్ 100, పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో రెస్క్యూ టీమ్లను అవసరమైన పరికరాలను సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. స్థానిక ప్రజలకు నిరంతరం ప్రజలకు మైక్అనౌన్స్మెంట్, సోషల్మీడియా ద్వారా విపత్తు నిర్వహణ విభాగంతో సమన్వయం చేస్తూ ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మానవపాడు పోలీస్స్టేషన్లో పలురికార్డులను పరిశీలించి, సిబ్బంది విధులను పరిశీలించారు. శాంతినగర్ సీఐ టాటాబాబు, అలంపూర్ సీఐ రవిబాబు, ఇటిక్యాల ఎస్ఐ రవి పాల్గొన్నారు. మానవపాడులో నీట మునిగిన పంటలు ఫైనాన్స్లో రూ.5 లక్షలను జమచేయగా.. నిర్వాహకులు తొలుత నెలకు రూ.2 చొప్పున వడ్డీ చెల్లించారు. ఆ తర్వాత ఇవ్వకపోవడంతో హరిబాబు నాగర్కర్నూల్లోని ఫైనాన్స్ కార్యాలయం, నిర్వాహకుల ఇళ్లకు నిత్యం తిరిగేవాడు. ఈ నేపథ్యంలో మనోవేదనకు గురై.. క్రమక్రమంగా ఆయన ఆరోగ్యం దెబ్బతింది. సుమారు 8 నెలలు హైదరాబాద్లోని వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందాడు. చేతిలో డబ్బులు లేకపోవడంతో పునరావాసం కింద వచ్చిన ప్లాటును అమ్మి వైద్య చికిత్స చేయించారు. ఈ క్రమంలో 11 నెలల క్రితం చికిత్స పొందుతూ మృతి చెందడంతో ఆయన కుటుంబం దిక్కులేనిదైంది. హరిబాబుకు ఆస్పత్రి ఖర్చులు రూ.10 లక్షలకు పైగా అయ్యాయని.. అయినా బతికించుకోలేకపోయామని.. ప్రస్తుతం అప్పుల కుప్ప అయిందని ఆయన కుటుంబసభ్యులు వాపోతున్నారు. ప్రస్తుతం ఆ కుటుంబానికి గూడు లేకపోవడంతో ముంపులోని పాత బండరాయిపాకులలో తమ చేను వద్ద కవర్తో కప్పిన చిన్న గుడిసెలో ఉంటున్నారు. పుష్కరఘాట్ల దగ్గర ప్రజలు ఎవరు కూడా నీటి లోనికి దిగరాదని, పరివాహక ప్రాంతాల్లో నివసించే మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని, పాడుబడ్డ ఇళ్లలో ఉన్నవారు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ఎస్పీ సూచించారు. అలంపూర్: అలంపూర్ నియోజకవర్గంలో బుధవారం తెల్లవారుజాము నుంచి ఎడతేరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఐదు రోజులుగా వర్షలు కురుస్తుండటంతో వాగులు, వంకల్లో భారీగా వరద నీరు చేరాయి. తెల్లవారుజామున కురిసిన వర్షాలతో మరోసారి వాగులు ఉప్పొంగి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మానవపాడు మండలంలో 36 మి.మీ వర్షం కురిసింది. ఉండవెల్లి మండలంలో 27.2 మి.మీ, ఇటిక్యాలలో 25.3 మి.మీ, రాజోలిలో 24.3 మి.మీ, వడ్డేపల్లిలో 21.5 మి.మీ, అయిజలో 16.8 మి.మీ, అలంపూర్లో 15.6 మి.మీ వర్షపాతం నమోదైంది. అలంపూర్ మండలంలోని పల్లా వాగు భారీ వర్షంతో ఉధృతంగా ప్రవహించింది. గ్రామానికి చెందిన మహేష్ అనే వ్యక్తి తన బైక్తో వాగు దాటే ప్రయత్నం చేశాడు. వరద ఉధృతికి బైక్ వాగు మధ్యలోనే నిలిచింది. అక్కడే ఉన్న పంచాయతీ సిబ్బంది, గ్రామస్తులు వాగులోకి వెళ్లి అతడి కాపాడి బైక్తో సహ వాగుదాటించారు. వాగు ఉధృతి పెరుగుతుండటంతో వాహనాల రాకపోకలు కొనసాగించకుండా ముళ్ల కంచె ఏర్పాటు చేశారు. వాగును ఎస్ఐ వెంకటస్వామి సిబ్బందితో కలిసి పరిశీలించారు. -
మత్తు పదార్థాల విక్రయాలపై ఉక్కుపాదం
గద్వాల: జిల్లాలో మత్తుపదార్థాల వినియోగం, సరఫరా చేస్తే ఉక్కుపాదంతో అణచివేస్తామని అదనపు కలెక్టర్ వి.లక్ష్మీనారాయణ అన్నారు. బుధవారం ఐడీవోసీ కార్యాలయంలోని సమావేశం హాలులో మిషన్ పరివర్తన–మత్తుపదార్థాల వినియోగ నిర్మూలన కోసం సామూహిక ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. మత్తు పదార్థాల వినియోగం వల్ల వ్యక్తిగత ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింటుందన్నారు. అదేవిధంగా ఆలోచనశక్తి సామర్థ్యం నశిస్తుందన్నారు. మత్తుపదార్థాల క్రయవిక్రయాలు గుర్తిస్తే వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. క్రయవిక్రయాలు జరిపేవారిపై చట్టపరంగా కఠిన తీసుకుంటామన్నారు. గతంలో పట్టణాలకే పరిమితమైన డ్రగ్స్ వినియోగం ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాలకు సైతం వ్యాప్తిచెందడం ఆందోళన కలిగించే పరిణామం అన్నారు. యువకులు డ్రగ్స్కు బానిసలు కాకుండా వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు నిరంతరం పిల్లలపై నిఘా ఉంచి గమనించాలన్నారు. అదేవిధంగా అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ప్రాముఖ్యతను వివరిస్తూ యువతకు ఆధునిక సాంకేతిక విద్య, నైపుణ్యశిక్షణ అందించడంలో ఏటీసీ కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తాయన్నారు. సీఎన్ఎస్ మెషిన్ టెక్నీషియన్, మెకానిక్ ఎలక్ట్రిక్ వాహనం, ఇండస్ట్రియల్ రోబోటిక్స్, డిజిటల్ మానుఫ్యాక్చరింగ్, ఇంజినీరింగ్ డిజైన్, ఆటోమిషన్ వంటి దీర్ఘకాలిక స్వల్పకాలిక కోర్సులు పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా శిక్షణను అందిస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది గద్వాలలో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ఏర్పాటు చేయబడుతుందని యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు అందుతాయన్నారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి సునంద, ఉపాధికల్పన అధికారి ప్రియాంక, ఎల్డీఎం శ్రీనివాసరావు, డీపీఆర్వో ఆరీఫుద్దీన్, సివిల్సప్లై డీఎం విమల తదితరులు పాల్గొన్నారు. డ్రగ్ రహిత సమాజమే లక్ష్యం గద్వాల క్రైం: డ్రగ్ రహిత సమాజమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటామని ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. బుధవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ.. డ్రగ్స్ వాడకం వల్ల కలిగే అనర్థాలపై విస్తృత అవగాహన కల్పించే ఉద్ధేశంతో దేశవ్యాప్తంగా నషా ముక్త్ భారత్ అభియాన్ను అమలు చేస్తోందని అన్నారు. మాదక ద్రవ్యాల వాడకం, సరఫరాపై పోలీస్ యంత్రాంగం పూర్తి నిఘా ఉంచిందని అన్నారు. గంజాయి అక్రమ రవాణా చేస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. -
మహిళల ఆర్థిక ప్రగతే లక్ష్యం
గద్వాల: మహిళల ఆర్థిక ప్రగతే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని.. ఈమేరకు ప్రతి మహిళను స్వయం సహాయక సంఘాలలో సభ్యులుగా చేర్చాలని అదనపు కలెక్టర్ నర్సింగ్రావు అధికారులను ఆదేశించారు. బుధవారం ఐడీవోసీ కార్యాలయంలోని సమావేశపు హాలులో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో నూతన స్వయం సహాయక సంఘాల ఏర్పాటు కోసం నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ.. మహిళలు ఆర్థికంగా ఎదిగితే కుటుంబం, సమాజం అభివృద్ధి చెందుతుందన్నారు. కిశోర, బాలికలు, దివ్యాంగులు, వృద్ధులను మహిళా సంఘాల్లో చేర్చే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. అర్హత కలిగిన ప్రతి మహిళను సంఘాల్లో చేర్చే బాధ్యత ఏపీఎంలు, సీసీలపై ఉందని ప్రతి అర్హురాళ్లను సభ్యురాలిగా చేర్చేలా సమన్వయంతో కృషి చేయాలని ఆదేశించారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మహిళా సంఘాలు భద్రత సామాజిక గుర్తింపుతో పాటు ఆర్థిక స్థిరత్వాన్ని అందిస్తున్నాయని వివరించారు. గ్రామస్థాయిలో ఇటుకల తయారీ సెంటరింగ్ వర్క్స్ వంటి గ్రౌండ్ యూనిట్లను ఏర్పాటు చేసి కుటుంబ ఆదాయాన్ని పెంచుకునే అవకాశాన్ని కల్పిస్తామన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఇళ్ల పట్టాలు మహిళల పేరిటనే మంజూరీ చేస్తున్నట్లు తెలిపారు. నిర్మాణానికి అవసరమైన నిధుల కొరత వుంటే మహిళా సంఘాల ద్వారా రుణాలు తీసుకుని ఇళ్లు పూర్తి చేసుకోవచ్చన్నారు. బ్యాంకర్లు రుణసదుపాయాల కల్పనలో పూర్తి సహకారం అందిస్తామన్నారు. కార్యక్రమంలో ఎల్డీఎం శ్రీనివాసరావు, సమాఖ్య అధ్యక్షురాలు ప్రభావతి, జిల్లా సంక్షేమ అధికారి సునంద, ఇండస్ట్రీస్ జీఎం రామలింగేశ్వర్గౌడ్, ఏడీఆర్డీవో శ్రీనివాసులు, ఏపీఎంలు, సీసీలు పాల్గొన్నారు. -
కష్టాల కడలిలో గంగమ్మ
నా భర్త ఉన్నప్పుడు ఎప్పుడూ సంతోషంగా ఉండేవాళ్లం. ఇప్పుడు గతిలేని పరిస్థితి మాది. వానొస్తే మొత్తం కురుస్తుంది. వరద ఎప్పుడొస్తుందో తెలియదు. రేషన్ బియ్యమే మాకు దిక్కు. అదీ కొత్త బండరాయిపాకులకు వెళ్లి తెచ్చుకోవాలి. పిల్లలను పోషించలేక వనపర్తిలోని గురుకుల పాఠశాలల్లో చేర్పించా. అక్కడైనా బువ్వ దొరుకుతుందని. ఫైనాన్సోళ్ల నుంచి మా డబ్బులు మాకు ఇప్పించి న్యాయం చేయాలి. – గంగ, మృతుడు హరిబాబు భార్య ఈ మధ్య బ్యాంకోళ్లు వచ్చారు. రూ.2లక్షల అప్పు ఉందని.. ఇప్పుడు రూ.5 లక్షలు అయిందని చెబుతున్నారు. కోర్టు కేసు పెడతామని.. జైలుకు వెళ్లాల్సి వస్తుందని చెప్పారు. రూపాయి అప్పు పుడుత లేదు. పిల్ల తీర్చ లేదు. పిలగాడు లేకపాయె. పెడితే అందరినీ జైల్లో పెట్టండి. ఎక్కడికై నా వస్తాం. అక్కడ బువ్వ అయినా దొరుకుద్ది. నా కొడుకు పిల్లలకు కనీసం బుక్కులు, పెన్నులైనా కొనియ్యండి. – మల్లమ్మ, హరిబాబు తల్లి సాఫీగా సాగుతున్న జీవితంలో.. మిద్దె మల్లమ్మ, పెద్ద లక్ష్మయ్యకు నలుగురు కొడుకులు. అందరికీ పెళ్లిళ్లు కాగా.. మొదటి ముగ్గురు గతంలోనే బతుకుదెరువు కోసం హైదరాబాద్కు వలసవెళ్లారు. చిన్నకుమారుడు హరిబాబు కాగా.. పెద్దకొత్తపల్లికి చెందిన గంగతో 14 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ముగ్గురు ఆడపిల్లలు. ప్రస్తుతం పెద్ద కుమార్తె శ్రుతి ఇంటర్, శాన్వి ఏడు, సమీర నాలుగో తరగతి చదువుతున్నారు. హరిబాబు ఆటో, ట్రాక్టర్ నడుపుతూ వీరిని పోషించేవాడు. తల్లిదండ్రులు కూడా వీరితోనే ఉండేవారు. ఉన్నంతలో సంతోషంగా జీవనం సాగిస్తున్న క్రమంలో పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్ట్లో ఆ కుటుంబం పొలం, ఇల్లును కోల్పోవాల్సి వచ్చింది. వచ్చిన పరిహారంలో హరిబాబు తనకు వచ్చిన వాటాలో నెలనెలా వడ్డీ వస్తుందనే ఆశతో 2021లో ఓం శ్రీసాయిరాం ఫైనాన్స్లో పెట్టాడు. ఇదే వారి కుటుంబానికి శాపంగా మారింది. మనోవేదనతో కిడ్నీలు దెబ్బతిని భర్త హరిబాబు మృతి ఆస్పత్రుల్లో చికిత్సకు రూ.10 లక్షలు దాటిన ఖర్చు ముగ్గురు ఆడపిల్లలు, ముసలి అత్తామామలతో పోషణ భారం -
చిగురిస్తున్న ఆశలు..
అయిజలో కొత్త మార్కెట్ యార్డు ఏర్పాటుకు ప్రతిపాదనలు అలంపూర్: జిల్లాలో మరో మార్కెట్యార్డు ఏర్పాటుకు అడుగులు పడుతున్నాయి. అయిజ సబ్యార్డును పూర్తి స్థాయి మార్కెట్ యార్డుగా మార్చాలని రైతులు, నాయకులు ఏళ్లుగా కోరుతున్నారు. గతేడాది వ్యవసాయ శాఖ మంత్రి ప్రకటనతో ఈ ప్రతిపాదనలకు బీజం పడింది. అందుకు తగ్గట్టుగా అధికార పార్టీకి చెందిన నేతలు సంబంధిత శాఖ రాష్ట్ర నాయకులను కలుస్తు వినతులు అందిస్తున్నారు. మరోసారి తెరపైకి.. జిల్లాలోని అలంపూర్ నియోజకవర్గంలోని అయిజలో కొత్త మార్కెట్ యార్డు ఏర్పాటుకు బీజం పడింది. 2024 సెప్టెంబర్ 13న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు అలంపూర్ రాగా.. మాజీ ఎమ్మెల్యే, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ అయిజలోని సబ్ మార్కెట్ యార్డును పూర్తి స్థాయి మార్కెట్ యార్డుగా చేయాలని వినతి పత్రం అందజేశారు. అందుకు తగ్గట్టుగానే మంత్రి అయిజలో కొత్త మార్కెట్ యార్డు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కలెక్టర్ ప్రతిపాదనలు చేస్తే తప్పక పూర్తి స్థాయి యార్డుగా ఆధునీకరిస్తామని భరోసా ఇచ్చారు. గత నెలలో మాజీ ఎమ్మెల్యే, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ స్థానిక నాయకులతో కలిసి రాష్ట్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ కార్పొరేషన్ చైర్మన్ కోదండారెడ్డిని కలిసి వినతి పత్రం అందించారు. దీంతో కొత్త మార్కెట్ యార్డు ప్రస్తావన మరోసారి తెరపైకి వచ్చింది. రూ.లక్షల్లో నుంచి రూ.కోట్లలో ఆదాయం అయిజ వ్యవసాయ మార్కెట్ సబ్యార్డు ఆదా యం ఏటేటా పెరుగుతూ వస్తోంది. మూడేళ్లలో ఆదాయం రెట్టింపునకు చేరింది. మార్కెట్ యార్డు ఆరంభంలో రూ.లక్షల్లో ఉన్న ఆదాయం కోట్లకు చేరింది. 2022–23 వార్షిక ఆదాయం రూ. 2.13 కోట్లు వచ్చింది. 2023–24 రూ. 3.07 కోట్లు, 2024–25లో రూ. 4.7 కోట్లు వచ్చింది. అలంపూర్ చౌరస్తా మార్కెట్ యార్డు పరిధిలో పుల్లూరు, అయిజ, ఎర్రవల్లిలోని మూడు చెక్పోస్టుల ద్వారా రూ.1.76 కోట్లు, వ్యాపార సముదాయాలు, వ్యాపారుల ద్వారా రూ.1.39 కోట్లు, అయిజ సంత మార్కెట్ యార్డు ద్వారా రూ.21.60 లక్షలు, గోదాంల ద్వారా రూ.69 లక్షలు మొత్తం రూ.4.07 కోట్ల ఆదాయం వచ్చింది. 2025–26 వార్శిక సంవత్సరంలో ఏప్రెల్ 1 నుంచి జూలై వరకు రూ.2.61 కోట్ల ఆదాయం వచ్చింది. కొత్త మార్కెట్తో లబ్ధి పెరిగిన జనాభా, మారిన పరిస్థితులకు అనువుగా కొత్త మార్కెట్ యార్డు ఏర్పాటు జరిగితే అన్ని విధాలుగా లబ్ది జరిగే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం నియోజకవర్గంలో 8 మండలాలుగా విభజించారు. జనాభా గణయంగా పెరిగింది. అయిజలో ఇప్పటికే సబ్ మార్కెట్ యార్డుతోపాటు అనువైన వసతులు అందుబాటులో ఉండటంతో స్థానికంగా కొత్త మార్కెట్ యార్డు కావాలని విజ్ఞప్తులు వస్తున్నాయి. కొత్త మార్కెట్ యార్డు వస్తే జిల్లాలో మొత్తం సంఖ్య మూడుకు చేరుతుంది. అంతర్ రాష్ట్రాలకు సరిహద్దుగా ఉండటంతో ఆదాయం పెరగడంతోపాటు రాజకీయంగా అనేక మందికి లబ్ధి చేకూరే అవకాశం ఉంటుంది. ఈ ప్రాంతం నుంచి కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ వంటి ప్రాంతాలకు రైతులు పండించిన ధాన్యాలు తరలించకుండగా ఇక్కడే విక్రయించుకునే వెసలుబాటు ఉంటుంది. దీంతో రైతులకు ప్రయాణ భారం తగ్గడంతోపాటు ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది. 2024లో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి హామీ.. ప్రస్తుత సబ్ యార్డు ఆదాయం రూ.4 కోట్లు మార్కెట్యార్డు వస్తే మరింత పెరిగే అవకాశం.. పెరగనున్న నామినేటెడ్ పోస్టులు అయిజ మున్సిపాలిటీలో కొత్త మార్కెట్ యార్డు ఏర్పాటుకు ఎన్నో అనుకూలతలు ఉన్నాయి. ఇప్పటికే సబ్ మార్కెట్ యార్డు కొనసాగుతుంది. అలంపూర్ చౌరస్తాలో అలంపూర్, మానవపాడు, ఇటిక్యాల, వడ్డేపల్లి, రాజోలి, ఉండవెల్లి, ఎర్రవల్లి మండలాల రైతులకు అనువుగా అలంపూర్ చౌరస్తాలో 1978లో వ్యవసాయ మార్కెట్ యార్డు నిర్మాణానికి శ్రీకారం చూట్టారు. దాదాపు 26.34 ఎకరాల విస్తీర్ణంలో దీన్ని నిర్మించడం జరిగింది. ప్రస్తుతం ఈ మార్కెట్లోని 5 ఎకరాలు 100 పడకల ఆస్పత్రికి అప్పగించారు. అయిజ పెద్ద మండలంగా ఉండటంతోపాటు పట్టణం విశాలంగా విస్తరించింది. రైతుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో ఉత్పత్తులు పెరిగాయి. దీంతో దీన్ని దృష్టిలో ఉంచుకొని 1992లో సబ్ మార్కెట్ యార్డును ఏర్పాటు చేశారు. ఇక్కడ దాదాపు 16 ఎకరాల విస్తీర్ణంలో సబ్ మార్కెట్ యార్డు కొనసాగుతుంది. యార్డులలో ధాన్యం నిల్వ చేసే భారీ గోదాంలు, ఓపెన్ షెడ్స్, దుకాణ సముదాయాలు విశాలమైన మైదానాలు అందుబాటులో ఉన్నాయి. -
కానరాని పురోగతి!
సాగునీటి ప్రాజెక్టుల పెండింగ్ పనులపై కాలయాపన రిపేర్లపై నిర్లక్ష్యం.. నెట్టెంపాడు ఎత్తిపోతల పథకానికి ర్యాలంపాడు జలాశయం గుండెకాయలాంటిది. అయితే రాక్టోల్, తూములు, ఆనకట్ట బండ్లో లీకేజీలు ఏర్పడటంతో నాలుగేళ్లుగా 2 టీఎంసీలు మాత్రమే నిల్వచేస్తూ వస్తున్నారు. కేవలం వానాకాలంలో మాత్రమే సాగునీటిని అందిస్తూ వస్తున్నారు. గతేడాది పుణెకు చెందిన ఇంజినీరింగ్ నిపుణుల బృందం ర్యాలంపాడు రిజర్వాయర్ను సందర్శించి.. మరమ్మతుకు రూ.185కోట్లు వ్యయం అవుతుందని నివేదించారు. దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి చలనం లేదు. కోయిల్సాగర్ది అదే తీరు.. మరికల్, ధన్వాడ, చిన్నచింతకుంట, దేవరకద్ర మండలాల పరిధిలో 50 వేల ఎకరాలకు సాగునీటిని అందించాలనే లక్ష్యంతో కోయిల్సాగర్ ఎత్తిపోతల పథకం నిర్మాణం చేపట్టారు. గత పాలకులు కోయిల్సాగర్ పనులను పూర్తిచేయకపోవడంతో నేటికీ పెండింగ్లోనే ఉంది. మరోవైపు జూరాల ప్రాజెక్టుకు భారీ వరద కొనసాగుతున్న క్రమంలో మోటారు పంపులలో తరచుగా సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. ఇక్కడ కూడా నిర్వహణ లోపమే ప్రధాన కారణం. గద్వాల: పదేళ్ల క్రితమే పూర్తికావాల్సిన ఉమ్మడి పాలమూరు జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల పనులు పాలకుల నిర్లక్ష్యం కారణంగా ఇంకా అసంపూర్తిగానే ఉన్నాయి. ఏళ్ల తరబడి పెండింగ్లోనే కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెండింగ్ పనులను వచ్చే ఏడాది నాటికి పూర్తిచేసి.. ఉమ్మడి జిల్లాను సస్యశ్యామలం చేస్తామని చెబుతున్న ఆమాత్యుల హామీలు కేవలం సమీక్షలు, క్షేత్రస్థాయి పర్యటనల్లో ప్రకటనలకే పరిమితమయ్యాయి. ఈ నేపథ్యంలో బుధవారం హైదరాబాద్లో ఇరిగేషన్శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అధ్యక్షతన జరిగే ఉమ్మడి పాలమూరు జిల్లా పెండింగ్ ప్రాజెక్టుల పనుల సమీక్షకు ప్రాధాన్యత సంతరించుకుంది. నెరవేరని లక్ష్యం బీడు భూముల్లో సాగునీటిని పారించి వలసల పాలమూరు రూపురేఖలు మార్చాలని అప్పటి ముఖ్యమంత్రి దివంగత డా.వైఎస్ రాజశేఖరరెడ్డి జలయజ్ఞం కింద కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిల్సాగర్ ప్రాజెక్టుల నిర్మాణాలు చేపట్టారు. ఆ ప్రాజెక్టుల ద్వారా 10లక్షల ఎకరాలకు సాగునీటిని అందించాలని సంకల్పించారు. అయితే వైఎస్సార్ అకాల మరణాంతరం పాలకుల నిర్లక్ష్యం కారణంగా ప్రాజెక్టుల పనులను పూర్తిచేయకుండా వదిలేయడంతో పెండింగ్లోనే కొనసాగుతున్నాయి. ఫలితంగా 10 లక్షల ఎకరాలకు నీరందించాల్సిన ప్రాజెక్టుల కింద 6 లక్షల ఎకరాల్లో మాత్రమే సాగునీరు పారుతోంది. నెట్టెంపాడుకు భూ సేకరణే అడ్డంకి.. నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం పనులు పదేళ్ల క్రితమే 90 శాతం పూర్తయ్యాయి. అయితే 99, 100 ప్యాకేజీల్లో భూసేకరణ సమస్య నెలకొనడతో కలెక్టర్ సంతోష్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. మొత్తం 2 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించాల్సి ఉండగా.. గూడ్డెందొడ్డి, ర్యాలంపాడు జలాశయాల కింద 1.45 ఎకరాలకు సాగునీరు అందుతోంది. మోటార్ల నిర్వహణ కొరవడటంతో తరచుగా సాంకేతిక సమస్యలు తలెత్తి నీటి పంపింగ్కు ఆటంకాలు ఏర్పడటం పరిపాటిగా మారింది. కలెక్టర్లకు బాధ్యతలు అప్పగించినా.. గతేడాది సెప్టెంబర్లో జిల్లా పర్యటనకు వచ్చిన మంత్రులకు జడ్చర్ల వద్ద పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం భూ నిర్వాసితుల నుంచి పెద్దఎత్తున నిరసన సెగలు తగిలాయి. పెండింగ్ పనులు పూర్తి చేయాలంటే భూసేకరణ సమస్యను పరిష్కరించాలని గ్రహించిన మంత్రులు.. భూసేకరణ ప్రక్రియతో పాటు పెండింగ్ పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించి వేగం పెంచాలని కలెక్టర్లకే బాధ్యతలు కట్టబెట్టారు. అయితే 10 నెలల కాలంలో ప్రాజెక్టుల పనుల్లో ఆశించిన పురోగతి కనిపించడం లేదు. వచ్చే ఏడాది నాటికి పూర్తిస్థాయి ఆయకట్టుకు సాగునీరు అందడం గగనమే ఊసేలేని ర్యాలంపాడు రిజర్వాయర్ మరమ్మతు ఆమాత్యుల సమీక్షలు, క్షేత్రస్థాయిపర్యటనల్లో ప్రకటనలకే పరిమితం నేడు రాష్ట్ర సచివాలయంలో ఉమ్మడి పాలమూరు జిల్లా సాగునీటి ప్రాజెక్టులపై సమీక్ష -
నాన్న దూరమయ్యాడు.. కుటుంబం రోడ్డున పడింది..
మా నాన్న రాంచంద్రయ్య ఓం శ్రీ సాయిరాం చిట్ఫండ్లో రూ.13 లక్షలు పెట్టాడు. ఆ తర్వాత ఆయనకు ఆరోగ్యం బాగాలేకపోతే ఆస్పత్రికి తీసుకెళ్లాం. ఫైనాన్సోళ్లను ఎన్నిసార్లు అడిగినా డబ్బులు ఇవ్వకపోయేసరికి మనోవేదనతో మంచానపడ్డాడు. దీంతో వైద్య ఖర్చులకు ఆయనపై ఉన్న ప్లాటు అమ్మాల్సి వచ్చింది. ఈ క్రమంలో మా నాన్న గుండెపోటు వచ్చి మరణించాడు. ఇప్పుడు మాకు ఇల్లులేదు. డబ్బుల కోసం నా భార్యకు నాకు గొడవ జరిగింది. వీళ్లతో డబ్బులు పెట్టడం వల్ల మా నాన్న నాకు దూరమాయ్యాడు. నా కుటుంబం రోడ్డున పడింది. ప్రస్తుతం ఉండేందుకు ఇంటి స్థలం కూడా లేదు. – కుర్మయ్య, బాధితుడు -
అతికష్టం మీద బతుకుతున్నాం..
నా పేరు, నా భర్త మీద రూ.6 లక్షలను 2021లో ఓం శ్రీసాయిరాం ఫైనాన్స్ కంపెనీలో పెట్టాం. మాకు నలుగురు కొడుకులు ఉండగా.. ముగ్గురు మరణించారు. ఒక్క కొడుకు మాత్రమే ఉన్నాడు. మాతో డబ్బులు లేకపోయేసరికి మమ్మల్ని ఎవరూ చూసుకోవడం లేదు. ఉన్న కొడుకు కూడా విడిగా ఉంటున్నాడు. నాకు పక్షవాతం వచ్చింది. ఒక కన్ను సరిగా కనిపించడం లేదు. అతికష్టం మీద బతుకుతున్నాం. డబ్బులు అనవసరంగా ఎవరికో ఇచ్చి ఇలా చేశారని కొడుకు, కోడలు నిత్యం తిడుతూనే ఉన్నారు. మాకు డబ్బులు ఇప్పించి న్యాయం చేయాలి. – మిద్దె నాగమ్మ, బాధితురాలు ● -
కిరాయి ఇంట్లో ఉంటున్నాం..
తెలిసిన వాళ్లు మిత్తి వస్తుందని చెబితే.. మాకు పునరావాసం కోసం వచ్చిన డబ్బులు మొత్తం రూ.24 లక్షలను ఓం శ్రీ సాయిరాం చిట్ఫండ్లో నాలుగేళ్ల క్రితం పెట్టాం. ఇప్పటివరకు మాకు చిల్లిగవ్వ ఇవ్వలేదు. డబ్బులు లేక మేము ఇల్లు కట్టుకోలేదు. కిరాయికి వేరొకరి ఇంట్లో ఉంటున్నాం. నేనూ మా ఆయన ఇద్దరం కూలీ చేసుకుని బతుకుతున్నాం. మా పరిస్థితి ఇలా ఉంటే.. దుడ్డు మల్లయ్య అనే వాళ్లతో రూ.2.60 లక్షలు కట్టించాను. ఇప్పుడు వాళ్లు డబ్బులు ఇవ్వాలని నన్ను టార్చర్ పెడుతున్నారు. ప్రభుత్వం స్పందించి న్యాయం చేయాలి. – గోపాల పార్వతమ్మ, బాధితురాలు ● -
కదిలిస్తే కన్నీరే..
వీరందరూ వనపర్తి జిల్లా రేవల్లి మండలంలో ముంపు గ్రామమైన బండరాయిపాకులకు చెందిన సామాన్య, మధ్య తరగతికి చెందిన ప్రజలు. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా చేపట్టిన ఏదుల ప్రాజెక్ట్ నిర్మాణంలో వ్యవసాయ భూములు, ఇళ్లు కోల్పోయిన నిర్వాసితులు. ప్రభుత్వం ఇచ్చిన అరకొర పరిహారాన్ని ఓం శ్రీ సాయిరాం ఫైనాన్స్ కంపెనీ నిర్వాహకులు గద్దలా తన్నుకుపోవడంతో గుండెలు బాదుకుంటున్నారు. నెలనెలా వడ్డీ వస్తుందనే ఆశ నిండా ముంచడంతో దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. తాము చెల్లించిన డబ్బులను ఇవ్వాలని ఐదేళ్లుగా ఆందోళన చేస్తున్నా.. ఫలితం లేకపోవడంతో వారిలో ఆగ్రహావేశాలు పెల్లుబికుతున్నాయి. ..ఇలా మోసపోయింది ఈ ఒక్క గ్రామస్తులే కాదు. వనపర్తి, నాగర్కర్నూల్ జిల్లాల పరిధిలో దాదాపు 50 గ్రామాలకు చెందిన పీఆర్ఎల్ఐ నిర్వాసితులు 2,500 మంది ఉన్నట్లు అంచనా. డబ్బులు వస్తలేవనే మనోవేదనతో ఇప్పటికే పలువురు బలవన్మరణాలకు పాల్పడగా.. కొందరు గుండెనొప్పితో తనువు చాలించారు. ఈ నేపథ్యంలో బాధిత నిర్వాసితులను ‘సాక్షి’ పలకరించగా.. కన్నీళ్లే మిగిలాయి. అనారోగ్య కారణాలతో మంచమెక్కిన వారు.. వైద్య చికిత్సలకు డబ్బులు లేక విలవిల్లాడుతున్నారు. ఇళ్లు కట్టుకోలేక, సంతానాన్ని పోషించలేక, చదివించలేక నరకయాతన అనుభవిస్తున్నారు. బాధితులు ఒక్కొక్కరిదీ ఒక్కో దీనగాధ కాగా.. వారి ఆవేదన వారి మాటల్లోనే.. – సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్ -
ఉపాధ్యాయుడిగా మారిన కలెక్టర్
● రాష్ట్రవ్యాప్తంగా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. హైదరాబాద్ నుంచి మంత్రులు, ఉన్నతాధికారులతో కలిసి ఆయన కలెక్టర్లతో వీసీ నిర్వహించారు. జిల్లా నుంచి కలెక్టర్ బీఎం సంతోష్, ఎస్పీ శ్రీనివాసరావు, అదనపు కలెక్టర్ వి.లక్ష్మీనారాయణ, ఇరిగేషన్శాఖ ఎస్ఈ రహీముద్దీన్, విద్యుత్శాఖ డీఈ తిరుపతిరావు, డీఎంహెచ్ఓ సిద్దప్ప, డీఏఓ సక్రియానాయక్ ఉన్నారు. గద్వాల/గద్వాలటౌన్: పిల్లలూ ఎలా చదువుతున్నారు.. ఇంగ్లిష్ చదవడం వచ్చా.. అంటూ విద్యార్థులను పలకరించారు కలెక్టర్ సంతోష్. ఆయన అడిగిన ప్రశ్నకు వచ్చు సార్ అంటూ విద్యార్థులు బదులిచ్చారు. మంగళవారం గద్వాల మండలం పూడూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఓ తరగతి గదిలోకి కలెక్టర్ వెళ్లి విద్యార్థులతో ముచ్చటించారు. విద్యార్థులచే పాఠాలు చదివించారు. టీచర్లు బాగా చెబుతున్నారా అని అడిగి సమాధానాలు రాబట్టారు. పదో తరగతి విద్యార్థులు చాలా మంది ఇంగ్లిష్లో చదివిన దానికి అర్థం చెప్పకపోవడంతో అసంతృప్తి వ్యక్తంచేశారు. చదువులో వెనకబడిన వారిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఉపాధ్యాయులకు సూచించారు. పదో తరగతి ఫలితాల్లో మెరుగైన ఫలితాలు సాధించాలన్నారు. అంతకుముందు ఉపా ధ్యాయుల హాజరు పట్టిక, విద్యార్థుల ఫెషియల్ రికగ్నిషన్, వంటగది, తాగునీరు, భోజనం నాణ్యత, స్టోర్రూంలోని సరుకులను కలెక్టర్ పరిశీలించారు. యూడైస్ ఎంట్రీలను ఎప్పటికప్పుడు అప్డేట్ చే యాలని హెచ్ఎంకు సూచించారు. ఆహార పదార్థా లు, కూరగాయలు నాణ్యతగా ఉండేలా చూడాలన్నారు. విద్యార్థుల ఆరోగ్యం, విద్య విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ పోస్టర్లను కలెక్టర్ ఆవిష్కరించారు. కార్మికశాఖ కమిషనర్ మహేశ్, జిల్లా ఎంప్లాయిమెంట్ అధికారి ప్రియాంక, హెచ్ఎం వెంకటేశ్వర్లు ఉన్నారు. వర్షాకాలంలో అప్రమత్తంగా ఉండాలి.. భారీ వర్షాలు కురుస్తున్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. కలెక్టరేట్ వీసీ హాల్ నుంచి ఎస్పీ శ్రీనివాసరావుతో కలిసి ఆయన అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ఇప్పటి వరకు ప్రమాదకర పరిస్థితులు తలెత్తనప్పటికీ.. రాబోయే రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ముందుజాగ్రత్త చర్యలు చేపట్టాలన్నారు. వరదలతో పొంగిపొర్లే వాగులు, వంకల వద్ద ప్రమాదాలు సంభవించకుండా చూడాలన్నారు. ప్రమాదాల నివారణ కోసం మండలస్థాయి బృందాలను ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రజలకు అధికారులు అందుబాటులో ఉండాలన్నారు. అదే విధంగా సీజనల్ వ్యాధుల నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ వి.లక్ష్మీనారాయణ, ఇరిగేషన్ ఎస్ఈ రహీముద్దీన్, డీపీఓ నాగేంద్రం, డీఎంహెచ్ఓ డా.సిద్దప్ప, డీఏఓ సక్రియా నాయక్ ఉన్నారు. -
కేన్సర్ పేషంట్ను.. గోలీలకూ డబ్బుల్లేవు..
పాత బండరాయిపాకులలో మాకు ఐదెకరాల భూమి ఉండేది. పాలమూరు ప్రాజెక్ట్తో ఉన్నది పోయింది. ప్రభుత్వం నుంచి డబ్బులు వచ్చాక సాయిరాం ఫైనాన్స్ వాళ్లు నా కొడుకును కలిసిండ్రు. మిత్తి ఎక్కువగా వస్తుందని మాయమాటలు చెప్పి బాగా నమ్మించిండ్రు. దీంతో నా కొడుకు రాములు పేరిట రూ.10 లక్షలు, నా కోడలు గోపాల శివశీల పేరిట రూ.5 లక్షలు, నేను దాచుకున్న రూ.1.50 లక్షలు.. మొత్తం రూ.16.50 లక్షలను 2021లో ఫైనాన్స్ కంపెనీలో డిపాజిట్ చేశాం. ఒకసారి రూ.60 వేలు, మరోసారి రూ.30 వేలు వడ్డీ కింద ఇచ్చారు. ఆ తర్వాత ఆరోగ్యం బాలేదని డబ్బులు అడిగితే ఇవ్వడం లేదు. కొన్ని రోజుల క్రితం హైదరాబాద్ ఆస్పత్రికి వెళ్తే కేన్సర్ వచ్చిందని చెప్పారు. మళ్లీ ఆస్పత్రికి వెళ్లేందుకు, గోలీలకు డబ్బుల్లేవ్. ఫికరుతో ఎప్పుడు సచ్చిపోతనో నాకే తెలుస్తలేదు. – గోపాల బొజ్జమ్మ, బండరాయిపాకుల, రేవల్లి, వనపర్తి ● -
ముగిసిన రాఘవేంద్రస్వామి ఆరాధనోత్సవాలు
గద్వాలటౌన్: జిల్లా కేంద్రంలో మంత్రాలయ రాఘవేంద్రస్వామి ఆరాధన మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. చివరి రోజైన మంగళవారం ఉత్తరారాధన ఉత్సవాలను వైభవంగా నిర్వహించారు. ఈ సందర్బంగా రాఘవేంద్రస్వామి బృందావనానికి పంచామృత అభిషేకం చేశారు. వివిధ రకాల పూలతో బృందావనాన్ని సుందరంగా అలంకరించారు. అదే విధంగా భీంనగర్లోని రాఘవేంద్రస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ● ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయులు రథంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవాల సందర్భంగా అలంకరించిన స్వామివారి ఉత్సవమూర్తిని పూల పల్లకీలో తీసుకెళ్లి రథంపై కొలువుదీర్చారు. షేరెల్లి వీధిలోని రాఘవేంద్రస్వామి మఠం నుంచి శేషదాస భజన మండలి సభ్యులు, భక్తుల పాటలు, భజనల మధ్య స్వామివారి ఊరేగింపు సాగింది. స్థానిక కోటలోని చెన్నకేశవస్వామి ఆలయం చుట్టూ రథోత్సవం నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ విచారణకర్త ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. దేశంలో బీజేపీకే అత్యధిక సభ్యత్వాలు అయిజ: దేశంలో అత్యధిక సభ్యత్వాలు గల పార్టీ బీజేపీ అని జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు అన్నారు. మంగళవారం అయిజలో బీజేపీ నాయకులు హర్ ఘర్ తిరంగా బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఏర్పాటుచేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్యకర్తలు సమష్టిగా ఉంటూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నాయకులు గోపాలకృష్ణ, అక్కల రమాదేవి, వెంకటేశ్,, ఆంజనేయులు, లక్ష్మణ్గౌడ్, నర్సన్న, అంజి, రాజేశ్గౌడ్, శశికుమార్, పరశురాముడు, మహేశ్, రాజశేఖర్, గోపాల్, సుంకన్న పాల్గొన్నారు. లైసెన్స్డ్ సర్వేయర్లకు రెండో విడత శిక్షణ గద్వాల: జిల్లాలోని లైసెన్స్డ్ సర్వేయర్లకు రెండో విడత శిక్షణ ఈ నెల 18నుంచి నిర్వహించనున్నట్లు భూ కొలతలు, సర్వేశాఖ ఏడీ రాంచందర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో 285 లైసెన్స్డ్ సర్వేయర్లు ఉండగా.. ఇప్పటికే మొదటి విడత శిక్షణ పూర్తిచేయడం జరిగిందన్నారు. రెండో విడత 50 రోజుల పాటు శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. -
వసతిగృహాల్లో సమస్యల పరిష్కారానికి కృషి
అలంపూర్: ప్రభుత్వ వసతిగృహాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే విజయుడు అన్నారు. మంగళవారం కర్నూలులోని తన క్యాంపు కార్యాలయంలో ఎస్సీ, బీసీ వసతిగృహాల వార్డెన్లతో ఆయ సమీక్షించారు. ఈ సందర్భంగా హాస్టళ్ల వారీగా నెలకొన్న సమస్యలను ఎమ్మెల్యే తెలుసుకున్నారు. విద్యార్థులకు కల్పిస్తున్న వసతులపై ఆరా తీశారు. హాస్టళ్లలో ఉంటూ చదువుకుంటున్న విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. అనంతరం అయిజ మండలం టీటీదొడ్డికి చెందిన ఉరుకుందమ్మకు శస్త్రచికిత్స నిమిత్తం సీఎం సహాయనిధి మంజూరైన రూ. 5లక్షల ఎల్ఓసీ, అదే గ్రామానికి చెందిన ఎద్దుల రాముడు శస్త్రచికిత్స నిమిత్తం రూ. 2.20లక్షల ఎల్ఓసీని ఎమ్మెల్యే అందజేశారు. -
వంద పడకల ఆస్పత్రి భవనానికి లీకేజీలు
అలంపూర్: కొత్తగా నిర్మించిన ఆస్పత్రి భవనంలో లీకేజీలు స్థానికులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందుబాటులోకి రాకముందే భారీ వర్షాలకు లీకేజీల రూపంలో నీరు దిగువకు రావడంతో స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అలంపూర్ చౌరస్తాలోని వంద పడకల ఆస్పత్రిలో సోమవారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షాలకు లీకేజీలు కనిపించాయి. లీకేజీలతో వర్షపు నీరు లోపల పడుతుండటంతో సిబ్బంది బకెట్లతో నీటిని తోడేశారు. ఇటీవల వంద పడకల ఆస్పత్రిలో వైద్య సేవలు అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఇక్కడ ఓపీ సేవలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అయితే మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు లీకేజీల ద్వార వర్షపు నీరు లోపలికి చేరుతుంది. దశల వారీగా రెండు భవనాల స్లాబ్లు వేర్వేరుగా వేయగా.. రెండు స్లాబులు కలిసిన చోట కాంట్రాక్టర్ కేవలం ఒక ఇనుప రేకుతో కప్పి వదిలేశాడు. దీంతో లీకేజీ అవుతున్నట్లు అనుమానిస్తున్నారు. శాశ్వత పరిష్కారం చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. -
గుండె పగిలిపోయి..
ఒక్కొక్కరుగా ‘పాలమూరు–రంగారెడ్డి’ నిర్వాసితుల మృత్యువాత చనిపోయిన తన భర్త పస్పుల శేఖర్ ఫొటోను చూపిస్తున్న మహిళ పేరు పార్వతమ్మ. వనపర్తి జిల్లా రేవల్లి మండలం బండరాయిపాకుల గ్రామానికి చెందిన ఆ దంపతులకు ముగ్గురు సంతానం. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్ట్లో భాగమైన ఏదుల రిజర్వాయర్ నిర్మాణంలో వీరికి ఉన్న ఎకరం భూమి ముంపునకు గురైంది. ఎకరాకు రూ.3.50 లక్షల చొప్పున ప్రభుత్వం పరిహారం అందించింది. రూ.2 చొప్పున వడ్డీ ఇస్తామని నమ్మబలకడంతో శేఖర్ రూ.2 లక్షలను ఓం శ్రీసాయిరాం ఫైనాన్స్ కంపెనీలో జమచేశాడు. ఆరునెలల్లో డబ్బులు తిరిగిస్తామని పత్రం రాసివ్వగా, మూడేళ్లు గడిచినా డబ్బులు ఇవ్వలేదు. పైసలు రావడం లేదన్న బెంగతో 2023 ఆగస్టు 26న పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పునరావాసం కింద నిర్మించుకుంటున్న ఇల్లు సైతం డబ్బులు లేక అసంపూర్తిగానే ఉండగా.. పిల్లలను ఎలా పోషించాలో తెలియడం లేదని భార్య పార్వతమ్మ వాపోతోంది. -
‘ప్రజావాణి’ ఫిర్యాదులు త్వరగా పరిష్కరించాలి
గద్వాల: ప్రజావాణి కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదులను త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ బీఎం సంతోష్ ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించగా.. వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ జిల్లాలోని వివిధ గ్రామాలకు చెందిన ప్రజలు నేరుగా కలెక్టర్కు 43 ఫిర్యాదులు అందించారు. వాటిని ఆయా శాఖలకు చెందిన అధికారులకు పంపించి వెంటనే పరిష్కరించాలని, పరిష్కారం కానిపక్షంలో అందుకు గల కారణాలు వివరిస్తూ సంబంధిత ఫిర్యాదుదారుడికి అక్నాలెడ్డ్మెంట్ ద్వారా తెలియజేయాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు వి.లక్ష్మీనారాయణ, నర్సింగ్రావు కలెక్టరేట్ సిబ్బంది, వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. పోలీస్ గ్రీవెన్స్కు 12 అర్జీలు గద్వాల క్రైం: ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పోలీస్ గ్రీవెన్స్కు మొత్తం 12 అర్జీలు వచ్చాయి. ఎస్పీ శ్రీనివాసరావు ఫిర్యాదుదారుల నుంచి నేరుగా అర్జీలు స్వీకరించారు. ఫిర్యాదుల్లో ప్రధానంగా భూ వివాదం, ఆస్తి తగదాలు, అప్పుగా తీసుకున్న వ్యక్తులు డబ్బులు చెల్లించడం లేదని ఇలా 12 మంది ఫిర్యాదులు చేశారు. వీలైనంత త్వరగా సమస్యలు పరిష్కరిస్తామని, సివిల్ సమస్యలపై కోర్టు ద్వారా పరిష్కారం చేసుకోవాలని ఎస్పీ సూచించారు. వేరుశనగ క్వింటా రూ.6,389 గద్వాల వ్యవసాయం: గద్వాల మార్కెట్ యార్డుకు సోమవారం 366 క్వింటాళ్ల వేరుశనగ వచ్చింది. గరిష్టం రూ.6389, కనిష్టం రూ. 3066, సరాసరి రూ.4431 ధరలు లభించాయి. పాఠశాలను సందర్శించిన యూనిసెఫ్ బృందం ధరూరు: మండలంలోని ఉప్పేర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సోమవారం యూనిసెఫ్ బృందం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయుల హాజరు పట్టికను పరిశీలించడంతోపాటు మరుగుదొడ్లు, మూత్రశాలలు ఎలా ఉన్నాయని బాలికలను అడిగి తెలుసుకున్నారు. మద్యాహ్న భోజనం సమయంలో విద్యార్ధులు చేతులు శుభ్రంగా కడుక్కోవాలని సూచించారు. ఆర్ఓ ప్లాంట్ను పరిశీలించారు. కార్యక్రమంలో హెచ్ఎం గౌరిశంకర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. వచ్చేనెల 3న సీఎం రేవంత్రెడ్డి రాక అడ్డాకుల: వచ్చే నెల 3న మూసాపేటకు సీఎం రేవంత్రెడ్డి రానున్నారు. మూసాపేటలో నిర్మాణాలు పూర్తయిన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలకు హాజరు కానున్నారు. ఇందులో భాగంగా సోమవారం దేవరకద్రలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డి మూసాపేట గ్రామస్తులతో సమావేశమయ్యారు. మూసాపేటలో చివరి దశలో ఉన్న ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని లబ్ధిదారులకు సూచించారు. వచ్చేనెల ప్రారంభం నాటికి ఇళ్ల పనులను పూర్తి చేస్తే గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డితో కలిసి సీఎం రేవంత్రెడ్డి ప్రారంభిస్తారని ఎమ్మెల్యే తెలిపారు. -
ఆందోళన చేపడతాం..
పరిహారం డబ్బుల కోసం ఎదురుచూస్తూ ఇప్పటికే దాదాపు 150 మంది చనిపోయారు. ఆర్అండ్ఆర్ కమిటీ చైర్మన్గా ఉన్న నాగం బుచ్చిరెడ్డి అలియాస్ సురేందర్రెడ్డి ప్రోద్బలంతోనే అందరూ ఓం శ్రీసాయిరాం ఫైనాన్స్లో డబ్బులు పెట్టారు. ఫైనాన్స్ నిర్వాహకుడు సాయిబాబుతో కలిసి పక్కా ప్లాన్తో బోర్డు తిప్పేశాడు. ఫైనాన్స్ కంపెనీ వాళ్లు గ్రామాల వారీగా బాధిత రైతుల పేరు మీద రిజిస్ట్రేషన్ చేయాలి. మాకు పరిహారం చెల్లించకుంటే.. ఆందోళన చేపడతాం. ఆయా నిందితుల ఇంటి వద్ద వాంటావార్పు వంటి కార్యక్రమాలు చేపడతాం. మా బాధను అర్ధం చేసుకోవాలి. – బంగారయ్య, బాధితుడు, బండరాయిపాకుల● -
ఆయిల్పాం సాగుతో అధిక లాభాలు
అయిజ: రైతులు ఆయిల్పాం తోటలు సాగుచేస్తే ఇతర పండ్ల తోటలకన్నా అధిక లాభాలు గడించవచ్చని, జిల్లా వ్యాప్తంగా ఆయిల్పాం పంటల సాగుకు రైతులు ఆసక్తి చూపుతున్నారని ఆయిల్ఫెడ్ జనరల్ మేనేజర్ సుధాకర్రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని కురవపల్లి గ్రామానికి చెందిన రైతుల పొలంలో జిల్లా ఇన్చార్జ్ శివ నాగిరెడ్డితో కలిసి మెగా ఆయిల్పామ్ కార్యక్రమంలో మొక్కలు నాటారు. ఈసందర్భంగా ఆయిల్పాం పంటలో వచ్చే దిగుబడుల గురించి తెలియజేశారు. ఇదివరకే వేసిన ఆయిల్పాం తోటల నుంచి దిగుబడి వస్తున్న గెలలను సేకరించేందుకు వెంకటాపురం సమీపంలో ఏర్పాటు చేస్తున్న కలెక్షన్ సెంటర్ భవనాన్ని పరిశీలించారు. రైతులకు ప్రయోజనకరంగా ఉండేందుకు పూర్తి స్థాయిలో కలెక్షన్ సెంటర్లో అన్ని వసతులు త్వరలో ఏర్పాటు చేయిస్తామని అన్నారు. వేయింగ్ మిషన్ కూడా ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ఆయిల్పామ్ తోటలకు అవసరమైన పరికరాలు సబ్సిడీ ధరలకు అందజేస్తామని అన్నారు. ఫర్టిలైజర్స్ను కూడా సబ్సిడీ ధరలకు ఇవ్వాలని ప్రభుత్వం ప్రపోజల్ చేసిందని అన్నారు. ఆయిల్పామ్ పంటలు సాగు చేయాలనుకుంటున్న రైతులు ఆయిల్ఫెడ్ అధికారులకు, ఉద్యానవన శాఖ అధికారులకు సమాచారం ఇచ్చి మొక్కలను తీసుకోవాలని సూచించారు. ఆయిల్ఫెడ్ మండల ఏరియా ఆఫీసర్ యుగేందర్, వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాబాలు.. గద్వాల వ్యవసాయం: ఆయిల్పాం సాగుతో అధిక లాభాలు గడించవచ్చని జిల్లా ఉద్యానశాఖాధికారి ఎం.ఏ. అక్బర్ అన్నారు. సోమవారం మండలంలోని జిల్లెడబండలో రైతు ప్రభాకార్రావ్ 13 ఎకరాల్లో మెగా ఆయిల్పాం ప్లాంటేషన్ నిర్వహించారు. ఆయన మొక్కలు నాటారు. ఈసందర్భంగా మాట్లాడుతూ ఆయిల్పాం సాగుకు ప్రభుత్వం పలు ప్రోత్సాహకాలు అందిస్తోందని చెప్పారు. తక్కువ పెట్టుడితో ఎక్కువ లాభాలు పొందవచ్చునని తెలిపారు. ఆయిల్పాం సాగులో అంతర్ పంటలు వేసుకోవడానికి అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. -
ఆయిల్పాం సాగుతో అధిక లాభాలు
అయిజ: రైతులు ఆయిల్పాం తోటలు సాగుచేస్తే ఇతర పండ్ల తోటలకన్నా అధిక లాభాలు గడించవచ్చని, జిల్లా వ్యాప్తంగా ఆయిల్పాం పంటల సాగుకు రైతులు ఆసక్తి చూపుతున్నారని ఆయిల్ఫెడ్ జనరల్ మేనేజర్ సుధాకర్రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని కురవపల్లి గ్రామానికి చెందిన రైతుల పొలంలో జిల్లా ఇన్చార్జ్ శివ నాగిరెడ్డితో కలిసి మెగా ఆయిల్పామ్ కార్యక్రమంలో మొక్కలు నాటారు. ఈసందర్భంగా ఆయిల్పాం పంటలో వచ్చే దిగుబడుల గురించి తెలియజేశారు. ఇదివరకే వేసిన ఆయిల్పాం తోటల నుంచి దిగుబడి వస్తున్న గెలలను సేకరించేందుకు వెంకటాపురం సమీపంలో ఏర్పాటు చేస్తున్న కలెక్షన్ సెంటర్ భవనాన్ని పరిశీలించారు. రైతులకు ప్రయోజనకరంగా ఉండేందుకు పూర్తి స్థాయిలో కలెక్షన్ సెంటర్లో అన్ని వసతులు త్వరలో ఏర్పాటు చేయిస్తామని అన్నారు. వేయింగ్ మిషన్ కూడా ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ఆయిల్పామ్ తోటలకు అవసరమైన పరికరాలు సబ్సిడీ ధరలకు అందజేస్తామని అన్నారు. ఫర్టిలైజర్స్ను కూడా సబ్సిడీ ధరలకు ఇవ్వాలని ప్రభుత్వం ప్రపోజల్ చేసిందని అన్నారు. ఆయిల్పామ్ పంటలు సాగు చేయాలనుకుంటున్న రైతులు ఆయిల్ఫెడ్ అధికారులకు, ఉద్యానవన శాఖ అధికారులకు సమాచారం ఇచ్చి మొక్కలను తీసుకోవాలని సూచించారు. ఆయిల్ఫెడ్ మండల ఏరియా ఆఫీసర్ యుగేందర్, వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాబాలు.. గద్వాల వ్యవసాయం: ఆయిల్పాం సాగుతో అధిక లాభాలు గడించవచ్చని జిల్లా ఉద్యానశాఖాధికారి ఎం.ఏ. అక్బర్ అన్నారు. సోమవారం మండలంలోని జిల్లెడబండలో రైతు ప్రభాకార్రావ్ 13 ఎకరాల్లో మెగా ఆయిల్పాం ప్లాంటేషన్ నిర్వహించారు. ఆయన మొక్కలు నాటారు. ఈసందర్భంగా మాట్లాడుతూ ఆయిల్పాం సాగుకు ప్రభుత్వం పలు ప్రోత్సాహకాలు అందిస్తోందని చెప్పారు. తక్కువ పెట్టుడితో ఎక్కువ లాభాలు పొందవచ్చునని తెలిపారు. ఆయిల్పాం సాగులో అంతర్ పంటలు వేసుకోవడానికి అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. -
కుండపోత వర్షం..
గ్రామాల్లో ఉప్పొంగిన వాగులు, వంకలు ● ఉండవెల్లి మండలంలో 64.5 మి. మీ వర్షం కురిసింది. దీంతో వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహించాయి. రోడ్డుపై నుంచి వరద నీరు పారడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మానవపాడు మండలంలో 11.3 మి.మీ, వడ్డేపల్లిలో 40.5 మి.మీ, రాజోలిలో 30.5 మి. మీ అయిజలో 19.3 మి.మీ వర్షపాతం నమోదు అయ్యాయి. దీంతో ఆయా మండలాల్లోని కొన్ని గ్రామాలు గంటల పాటు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. అలంపూర్: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జనజీవనం స్తంభించిపోయింది. గత మూడు రోజులుగా ఇదే పరిస్థితి ఉండటంతో తోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అలంపూర్ నియోజకవర్గంలో సోమవారం తెల్లవారుజామున దాదాపు నాలుగు గంటలకుపైగా కుండపోత వర్షం కురిసింది. అలంపూర్ మున్సిపాలిటీలోని అక్బర్పేట కాలనీలో వర్షపు నీరు రోడ్డును ముంచెత్తాయి. సీసీ రోడ్డు నిర్మాణ సమయంలో డ్రైనేజీలు నిర్మించకపోవడంతో ఈ పరిస్థితులను ఎదుర్కొవాల్సి వస్తోందని కాలనీ వాసులు అందోళన వ్యక్తం చేశారు. లోతట్టు ప్రాంతాల్లోని నివాస గృహాల వద్దకు నీళ్లు చేరడంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడపాల్సి వచ్చింది. రోడ్డుపై దాదాపు 3 అడుగులకుపై నీళ్లు నిలవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. వాగులు ఉగ్రరూపం అలంపూర్ మున్సిపాలిటీకి అతి సమీపంలోని జోగుళాంబ వాగు ఉధృతంగా ప్రవహించింది. మండలంలోని కాశీపురం వాగు ఉగ్రరూపం దాల్చింది. కల్వర్టులు రోడ్డు కంటే తక్కువగా ఉండటంతో పై నుంచి నీళ్లు పరవళ్లు తొక్కాయి. దీంతో ఈ మార్గంలో దాదాపు ఐదు గంటలపాటు రాకపోకలు స్తంభించాయి. గ్రామస్తులు ప్రమాదకరంగా ప్రవహిస్తున్న వాగు ద్వారానే దాటే ప్రయత్నాలు చేశారు. కోనేరు గ్రామ సమీపంలోని వాగు సైతం ప్రమాదకర స్థితితో ప్రవహించడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. మండలంలో 71.9 మి.మీ వర్షం కురిసినట్లు అధికారులు తెలిపారు. ఉధృతంగా ప్రవహించిన వాగులను ఎస్ఐ వెంకటస్వామి, ఎంపీడీఓ పద్మావతి ప్రరిశీలించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అలంపూర్ మున్సిపాలిటీలో లోతట్టు కాలనీలు జలమయం గంటల తరబడి నిలిచిన వాహనాల రాకపోకలు స్తంభించిన జన జీవనం వాగులను పరిశీలించిన అధికారులు -
నులిపురుగుల నివారణతో ఆరోగ్యం
గద్వాల: పిల్లల్లో నులిపురుగులు నివారించి వారి ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఆల్బెండజోల్ మాత్రలు ఎంతో ఉపయోగపడతాయని కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవంలో భాగంగా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆయన పాల్గొని విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ నులిపురుగుల కారణంగా పిల్లల ఎదుగుదలలో ఎన్నో సమస్యలు తలెత్తుతాయన్నారు. వీటి నివారణ కోసం ప్రతిఏటా ప్రభుత్వం జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నేటి పౌరులే దేశానికి రేపటి వెలుగులని.. అలాంటి పౌరుల ఆరోగ్యం కాపాడటం ప్రతిఒక్కరి బాధ్యత అన్నారు. ప్రతిశుక్రవారం డ్రైడే కార్యక్రమం నిర్వహించి ఆరోగ్య జాగ్రత్తలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. దీంతోపాటు సీజనల్లో వచ్చే డెంగీ, మలేరియా, టైఫాయిడ్ వంటి వ్యాధుల నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా విద్యార్థులందరూ ఆరోగ్య జాగ్రత్తలు పాటిస్తూనే విద్యపై కూడ శ్రద్ధ వహించాలన్నారు. గతంలో పదో తరగతిలో జిల్లాలో ఉత్తీర్ణత శాతం తక్కువగా ఉండేదని అయితే గతేడాది 10.36శాతం వృద్ధిరేటు సాధించి 91.74శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. ఈ ఏడాది కూడా మెరుగైన ఫలితాలు సాధించాలన్నారు. పదో తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు సన్మానం చేయనున్నట్లు తెలిపారు. కార్యమంలో డీఎంహెచ్వో డాక్టర్ సిద్దప్ప, డీడీఎంహెచ్వో డాక్టర్ సంధ్య, వైద్యులు కిర్మయి, రిజ్వాన, పాఠశాల అధ్యపకులు జహీరుద్దీన్, విద్యార్థులు పాల్గొన్నారు. రాఖీకట్టిన బాలసదనం విద్యార్థులు రాఖీపండుగను పురస్కరించుకుని బాలసదనం విద్యార్థులు కలెక్టర్ బీఎం సంతో్ష్కు రాఖీకట్టి శుభాకాంక్షలు తెలియజేశారు. బాగా చదువుకుని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలన్నారు. విద్యార్థుల అభిరుచులను ప్రోత్సహించాలి గద్వాలటౌన్: ఘల్లుఘల్లుమనే గజ్జల సవ్వడితో చిన్నారులు ప్రదర్శించిన నాట్యాంశాలు ప్రేక్షకులను రంజింపజేశాయి. సోమవారం స్థానిక గద్వాల బాలభవన్లో ప్రజా నాట్య మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన ‘దేశభక్తిని చాటుదాం’ పేరుతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కలెక్టకర్ సంతోష్, ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. విద్యార్థుల నాట్యాంశాలను తిలకించారు. ప్రతిభ చాటిన విద్యార్థుళకు ప్రశంసా పత్రాలను అందజేశారు. అనంతరం కలెక్టర్ సంతోష్ మాట్లాడుతూ చిన్నారులలో అంతర్గతంగా దాగిఉన్న ప్రతిభను ప్రోత్సహించాలని, అప్పుడే వారు అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారన్నారు. ప్రతి విద్యార్థి చదువుతో పాటు క్రీడలు, సాంస్కృతిక రంగాల్లో రాణించాలని సూచించారు. సమాజాన్ని చైతన్య పర్చేలా సాంస్కృతిక కార్యక్రమాలను రూపొందించాలన్నారు. ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు చెడు వ్యసానాల బారినపడ కుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. విద్యార్థి దశ నుంచే దేశభక్తి, క్రమశిక్షణ కలిగి ఉండాలన్నారు. త్వరలోనే అన్ని హంగులతో కూడిన ఆడిటోరియాన్ని ప్రజలకు అందుబాటులోకి తెస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డీఐఈఓ హృదయరాజు, ఎంఈఓ శ్రీనివాస్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఆల్బెండజోల్ మాత్రల పంపిణీలో కలెక్టర్ బీఎం సంతోష్ -
చికిత్సకు డబ్బులు లేక అమ్మ చనిపోయింది..
మా తల్లిదండ్రుల పేరిట ఉన్న 8 ఎకరాలు మొత్తం ప్రాజెక్ట్లోనే పోయింది. పరిహారం కింద వచ్చిన డబ్బులను మా తల్లిదండ్రుల పేరిట రూ.10 లక్షలు, నా పేరిట మరో రూ.2 లక్షలు ఫైనాన్స్ కంపెనీలో జమచేశాం. 2019లో డబ్బులు జమచేస్తే నాలుగేళ్లయినా తిరిగి ఇవ్వలేదు. మా అమ్మ లక్ష్మమ్మకు పక్షవాతం వస్తే, చికిత్స చేయించేందుకు కూడా డబ్బులు లేకపోవడంతో ఏడాది కిందట చనిపోయింది. జీవనాధారమైన భూములు కోల్పోయి, డబ్బులు పోగొట్టుకుని అరిగోస పడుతున్నాం. – అలివేలు, బండరాయిపాకుల, రేవల్లి, వనపర్తి ● -
కుండపోత వర్షం..
గ్రామాల్లో ఉప్పొంగిన వాగులు, వంకలు ● అలంపూర్ మున్సిపాలిటీలో లోతట్టు కాలనీలు జలమయం ● గంటల తరబడి నిలిచిన వాహనాల రాకపోకలు ● స్తంభించిన జన జీవనం ● వాగులను పరిశీలించిన అధికారులు అలంపూర్: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జనజీవనం స్తంభించిపోయింది. గత మూడు రోజులుగా ఇదే పరిస్థితి ఉండటంతో తోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అలంపూర్ నియోజకవర్గంలో సోమవారం తెల్లవారుజామున దాదాపు నాలుగు గంటలకుపైగా కుండపోత వర్షం కురిసింది. అలంపూర్ మున్సిపాలిటీలోని అక్బర్పేట కాలనీలో వర్షపు నీరు రోడ్డును ముంచెత్తాయి. సీసీ రోడ్డు నిర్మాణ సమయంలో డ్రైనేజీలు నిర్మించకపోవడంతో ఈ పరిస్థితులను ఎదుర్కొవాల్సి వస్తోందని కాలనీ వాసులు అందోళన వ్యక్తం చేశారు. లోతట్టు ప్రాంతాల్లోని నివాస గృహాల వద్దకు నీళ్లు చేరడంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడపాల్సి వచ్చింది. రోడ్డుపై దాదాపు 3 అడుగులకుపై నీళ్లు నిలవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. వాగులు ఉగ్రరూపం అలంపూర్ మున్సిపాలిటీకి అతి సమీపంలోని జోగుళాంబ వాగు ఉధృతంగా ప్రవహించింది. మండలంలోని కాశీపురం వాగు ఉగ్రరూపం దాల్చింది. కల్వర్టులు రోడ్డు కంటే తక్కువగా ఉండటంతో పై నుంచి నీళ్లు పరవళ్లు తొక్కాయి. దీంతో ఈ మార్గంలో దాదాపు ఐదు గంటలపాటు రాకపోకలు స్తంభించాయి. గ్రామస్తులు ప్రమాదకరంగా ప్రవహిస్తున్న వాగు ద్వారానే దాటే ప్రయత్నాలు చేశారు. కోనేరు గ్రామ సమీపంలోని వాగు సైతం ప్రమాదకర స్థితితో ప్రవహించడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. మండలంలో 71.9 మి.మీ వర్షం కురిసినట్లు అధికారులు తెలిపారు. ఉధృతంగా ప్రవహించిన వాగులను ఎస్ఐ వెంకటస్వామి, ఎంపీడీఓ పద్మావతి ప్రరిశీలించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఉండవెల్లి మండలంలో 64.5 మి. మీ వర్షం కురిసింది. దీంతో వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహించాయి. రోడ్డుపై నుంచి వరద నీరు పారడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మానవపాడు మండలంలో 11.3 మి.మీ, వడ్డేపల్లిలో 40.5 మి.మీ, రాజోలిలో 30.5 మి. మీ అయిజలో 19.3 మి.మీ వర్షపాతం నమోదు అయ్యాయి. దీంతో ఆయా మండలాల్లోని కొన్ని గ్రామాలు గంటల పాటు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. -
ఎట్టకేలకు..!
జూరాలలో 3వ యూనిట్ వినియోగంలోకి అమరచింత: ప్రియదర్శిని జూరాల జలాశయం ఎగువ విద్యుదుత్పత్తి కేంద్రంలో రెండేళ్ల కిందట మరమ్మతుకు గురైన 3వ యూనిట్ను జెన్కో అధికారులు బాగు చేయించారు. ఆదివారం తెల్లవారుజామున ప్రారంభించే సమయంలో వాటికి సంబంధించిన బ్లాక్ పూడుకుపోవడంతో క్రేన్లను రప్పించి వాటి సాయంతో బ్లాక్ను పైకెత్తడంతో ప్రాజెక్టు రహదారిపై వాహనాల రాకపోకలు మూడు గంటల పాటు నిలిచిపోయాయి. దీంతో జూరాల క్రస్ట్ గేట్లకు సంబంధించిన రోప్లు మొరాయించడంతో క్రేన్ల సాయంతో పైకెత్తుతున్నారన్న సమాచారం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టింది. జూరాలకు మళ్లీ సమస్య తలెత్తిందా.. ప్రాజెక్టు భద్రమేనా అనే విషయాలను పరిసర గ్రామాల ప్రజలు చర్చించుకోవడం కనిపించింది. సమస్య క్రస్ట్ గేట్లదు కాదని.. జెనన్కో సమస్య అంటూ ప్రాజెక్టు అధికారులు తెలిపారు. ● జూరాల ఎగువ జల విద్యుదుత్పత్తి కేంద్రంలోని ఆరు యూనిట్లకు 12 గేట్ల ద్వారా నీటిని సరఫరా చేస్తారు. వరద నిలిచిపోతే గేట్లు మూసివేస్తారు. వీటి కి సంబంధించిన గేట్ల రోప్లు అప్పుడప్పుడు మొ రాయించడం సాధారమేనని, వీటితో ఎలాంటి ప్ర మాదం ఉండదని జెన్కో సిబ్బంది వెల్లడిస్తున్నారు. రెండేళ్ల కిందట.. జూరాల ఎగువ జల విద్యుదుత్పత్తి కేంద్రంలో ఆరు యూనిట్లకుగాను మూడో యూనిట్కు సంబంధించిన టర్బైన్ రెండేళ్ల కిందట కాలిపోయింది. మరమ్మతుకుగాను జెన్కో అధికారులు టెండర్లు ఆహ్వానించగా పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ అలస్యంగా చేపట్టారు. ప్రస్తుతం మరమ్మతులు పూర్తవడంతో అధికారులు విద్యుదుత్పత్తి చేపట్టేందుకు సిద్ధమయ్యారు. 3వ యూనిట్కు నీటిని సరఫరా చేసే బ్లాక్ బురదలో ఇరుక్కొని పైకెత్తేందుకు మొరాయించడంతో అధికారులు కర్ణాటక నుంచి అధునాతన క్రేన్లను రప్పించి వాటి సాయంతో పనులు పూర్తి చేశారు. భారీగా నిలిచిన వాహనాలు జూరాల హైడల్ పవర్ ప్రాజెక్టు 3వ యూనిట్ బ్లాక్ను పైకెత్తే సమయంలో జెన్కో అధికారులు ఆనకట్టపై వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిపివేశారు. దీంతో తెల్లవారుజామున 5 నుంచి ఉదయం 8 వరకు మరమ్మతులు భారీ క్రేన్ల సాయంతో చేపట్టడంతో ట్రాఫిక్ సమస్య తలెత్తి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రాజెక్టుపై తాగేందుకు కనీసం నీరు సైతం లభించలేదు. ఎలాంటి సమాచారం లేకుండా రాకపోకలు నిలిపివేయడం ఏమిటని అధికారులను ప్రశ్నించినా సమస్యను వినేవారే కరువయ్యారు. జూరాల జలాశయం క్రస్ట్గేట్ల రోప్లు మొరాయిస్తున్నాయంటూ సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టిన వార్త అవాస్తవం. విద్యుదుత్పత్తి కోసం ఆరు బ్లాక్లకు నీటిని వదులుతున్నాం. వాటికి సంబంధించిన వ్యవహారం జెన్కో అధికారులే పర్యవేక్షిస్తారు. ప్రాజెక్టు 64 క్రస్ట్గేట్ల రోప్లు బాగానే ఉన్నాయి. ఎలాంటి ముప్పులేదు. – ఖాజా జుబేర్ అహ్మద్, ప్రాజెక్టు ఈఈ, గద్వాల రెండేళ్ల కిందట మరమ్మతుకు గురైన 3వ యూనిట్ టర్బైన్ను మరమ్మతుల తర్వాత ఆదివారం ప్రారంభించేందుకు చర్యలు తీసుకున్నాం. ఇందుకు సంబంధించిన బ్లాక్ బురదలో పూడుకుపోవడంతో రోప్ ద్వారా సాధ్యం కాకపోవడంతో క్రేన్ల సాయంతో పైకెత్తాం. అంతేగాని రోప్లు తెగిపోయాయనే మాట ల్లో వాస్తవం లేదు. – పవన్కుమార్, డీఈ, జెన్కో జూరాల జలాశయంపై వాహనాల రద్దీ -
ఆటల్లేవ్.. పోటీల్లేవ్ !
ఇక్కడ చిత్రంలో పెద్ద పెద్ద అక్షరాలతో ‘క్రీడా ప్రాంగణం’ అని కనిపిస్తుంది కదా ఇది రాయాపురం గ్రామంలోనిది. కానీ, అక్కడ బోర్డు తప్పా మైదానం లేదు. పైగా బోర్డు నుంచి నాలుగు అడుగులు ముందుకు వేస్తే నూతన పశువైద్యశాల భవనం కనిపిస్తుంది. అక్కడ పశువైద్య శాలనే కొనసాగుతోంది. గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాల పక్కనే అప్పట్లో క్రీడా ప్రాంగణాన్ని ఏర్పాటు చేశారు. పాఠశాల గేటు ముందు కేవలం క్రీడా ప్రాంగణం బోర్డును మాత్రమే పెట్టి వదిలేశారు. ఆటలు ఆడుకునేందుకుకు ఖాళీగా ఉన్న స్థలం చుట్టూ ఎలాంటి హద్దురాళ్లను ఏర్పాటు చేయలేదు. కేవలం క్రీడా ప్రాంగణం బోర్డును మాత్రమే పెట్టి వదిలేశారు. ఆ స్థలం పక్కనే కొత్తగా పశువైద్యశాల భవనం నిర్మించారు. ముందు చూస్తే క్రీడాప్రాంగణం బోర్డు.. లోపల పశువైద్యశాల భవనమా అంటూ చూసే వారు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇది కొత్తగా చూసే వారికి కాస్త వింతగా అన్పించినా.. జిల్లాలో చాలామటుకు క్రీడా ప్రాంగణాల పరిస్థితి ఇలాగే నిరుపయోగంగా మారాయి. గట్టు: మట్టిలో మాణిక్యాల్లాంటి గ్రామీణ క్రీడాకారులకు గుర్తింపు తీసుకువచ్చేందుకు గత ప్రభుత్వం జిల్లా వ్యాప్తంగా ప్రతి గ్రామంలో క్రీడా మైదానాలను ఏర్పాటు చేసింది. అయితే వీటి నిర్వహణ మాత్రం అధ్వాన్నంగా తయారైంది. ఈ క్రీడా ప్రాంగణాలు కేవలం గ్రామాల్లో అలంకారప్రాయంగా మారాయి. కేవలం వీటికి బోర్డులు ఏర్పాటు చేసి చేతులు దులుపుకొన్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. క్రీడా ప్రాంగణాల్లో కనీస సౌకర్యాలను కూడా కల్పించకుండా వదిలేశారు. కొన్ని చోట్ల కనీసం ఆటలు ఆడుకునేందుకు భూమిని కూడా చదును చేయకుండా వదిలేశారు. వీటిలో ఇప్పటికి ఆటలు ఆడుకునేందుకు అనువుగా పరిస్థితులు లేకపోవడం గమనార్హం. పేరుకే ఇవి క్రీడా ప్రాంగణాలు. ఏ ఒక్క రోజు కూడా వీటిలో క్రీడలను నిర్వహించిన దాఖలాలు లేవు. జిల్లా వ్యాప్తంగా ప్రతి గ్రామంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేసింది. జిల్లా వ్యాప్తంగా 280 క్రీడా ప్రాంగణాలు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉన్నట్లుగా అధికారుల లెక్కల ద్వారా తెలుస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో క్రీడా పోటీలను నిర్వహించుకునేందుకు అనువుగా వీటిని ఏర్పాటు చేశారు. ఉపయోగంలోకి తేవాలి గత ప్రభుత్వం గ్రామాల్లో నిర్మించిన క్రీడాప్రాంగణాల్లో మౌలిక వసతులను కల్పించి, ఆటలు అడుకునేందుకు వీలుగా సిద్ధం చేయాలి. ప్రభుత్వం ప్రతి ఏటా గ్రామీణ, మండల స్థాయిల్లో క్రీడలను నిర్వహించి ప్రతిభావంతులను గుర్తించి, వారికి సరైన ప్రోత్సాహాలను అందించే విధంగా చర్యలు తీసుకోవాలి. క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వాలి. పల్లెల్లో కొత్తగా నిర్మించిన క్రీడా ప్రాంగణాలను ఉపయోగంలోకి తీసుకురావాలి. – రామకృష్ణ, ఆలూరు సౌకర్యాలు కల్పించాలి గ్రామాల్లో నిర్మించిన క్రీడా ప్రాంగణాల్లో సౌకర్యాలు కల్పించాలి. విద్యార్థులు, యువకులు ఈ క్రీడాప్రాంగణాల్లో క్రీడలు ఆడుకునే విధంగా అధికార యాంత్రాంగం చర్యలు తీసుకోవాలి. చదువుతోపాటు క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వాలి. క్రీడా ప్రాంగణాల్లో క్రీడలను నిర్వహించడం ద్వారా ప్రతిభ కల్గిన గ్రామీణ క్రీడాకారులను గుర్తించవచ్చు. ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలి. – సాయి, గట్టు ఊరికి దూరంగా.. క్రీడల పట్ల ఆసక్తిని కల్గించి, ప్రతిభ ఉన్న గ్రామీణ క్రీడాకారులను గుర్తించేందుకు వీలుగా ప్రతి గ్రామంలో ఏర్పాటు చేసిన క్రీడాప్రాంగణాలు ప్రస్తుతం నిరూపయోగంగా మారాయి. గ్రామాల్లో అందుబాటులో ఉన్న ప్రభుత్వ స్థలాలను అధికారులు గుర్తించి, క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేశారు. అయితే ఈ క్రీడా ప్రాంగణాలు కొన్ని గ్రామాలకు దూరంగా ఉండడంతో పాటుగా క్రీడా ప్రాంగణాల్లో సరైన వసతులు లేక ఆటలు ఆడుకోవడం లేదు. యువత కూడా ఈ మైదానాల్లో ఆడుకునేందుకు ఇష్టపడడం లేదు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా జిల్లా వ్యాప్తంగా 296 క్రీడాప్రాంగణాలను మంజూరు చేయగా.. అందులో 280 పూర్తి చేసుకున్నట్లు అధికారుల రికార్డులు చెబుతున్నాయి. మరో 16 చోట్ల అడ్డంకులు ఏర్పడ్డాయి. అయితే క్రీడాప్రాంగణాలు ఏర్పాటు చేసిన చోట ప్రవేశ ద్వారాల దగ్గర పెద్ద సైజులో బోర్డులను కూడా ఏర్పాటు చేశారు. కానీ, ఇక్కడ ఇప్పటి దాకా ఏ క్రీడా పోటీలను నిర్వహించిన దాఖలాలు లేవు. కనీసం ఆటలు ఆడుకునేందుకు అనుకూలంగా క్రీడామైదానాలను కూడా సిద్దం చేయకుండా అసంపూర్తిగా వదిలేశారు. ప్రభుత్వం రూ.లక్షలు వెచ్చించి నిర్మించిన క్రీడాప్రాంగణాలు ఎందుకు పనికి రాకుండా పోయాయి. ఇప్పటికై నా అధికార యంత్రాంగం నిరుపయోగంగా ఉన్న క్రీడా ప్రాంగణాలను ఉపయోగంలోకి తీసుకురావాలని క్రీడాభిమానులు కోరుతున్నారు. జిల్లావ్యాప్తంగా నిరుపయోగంగా క్రీడా ప్రాంగణాలు ఆటలకు అనువుగా లేనిక్రీడా మైదానాలు.. నిర్వహణ కరువు జిల్లా వ్యాప్తంగా 296కుగాను 280 క్రీడా మైదానాల ఏర్పాటు -
అయ్యో.. తల్లీ
● ఆటో నుంచి జారిపడి మహిళ మృతి ● కూతురితో కుమారుడికి రాఖీ కట్టించి వస్తుండగా ఘటన ఎర్రవల్లి: రాఖీ పండుగ నేపథ్యంలో హాస్టల్లో ఉంటున్న కూతురి వద్దకు కుమారుడిని తీసుకెళ్లి రాఖీ కట్టించింది ఆ తల్లి. తిరిగి కుమారుడితో కలిసి స్వగ్రామానికి వస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు ఆటోలో నుంచి జారిపడి మృతిచెందింది. ఈ విషాదకర సంఘటన జాతీయ రహదారిపై వేముల స్టేజీ సమీపంలో ఆదివారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలంలోని పల్లెపాడు గ్రామానికి చెందిన వడ్డె సుజాత(35) తన కుమారుడు వెంకటేష్తో కలిసి ఎర్రవల్లిలోని కేజీబీవీ పాఠశాలలో చదువుతున్న తన కుమార్తె వద్దకు వెళ్లి కుమారుడికి రాఖీ కట్టించింది. అనంతరం కుమారుడితో కలిసి ఆటోలో స్వగ్రామానికి బయలుదేరింది. ఈ క్రమంలో జాతీయ రహదారిపై వేముల స్టేజీ సమీపంలోకి వచ్చే సరికి వారి బ్యాగ్ కింద పడుతుండటంతో దానిని పట్టుకునేందుకు ప్రయత్నించిన సుజాత ఆటో నుంచి జారి రోడ్డుపై పడింది. దీంతో తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందింది. ఇదిలా ఉండగా.. ప్రమాద సమయంలో ఆటోలో ఉన్న ప్రయాణికులంతా ఒక పక్కకు ఒరగడంతో ఆటో కూడా రోడ్డుపై బోల్తా పడింది. సుజాత కుమారుడితోపాటు ఆటోలోని వారంతా గాయాలతో బయటపడ్డారు. కాగా.. సుజాత ఆదివారం ఉదయమే తన పుట్టినింటికి సైతం వెళ్లి సోదరుడికి రాఖీ కట్టినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఉదయం ఎంతో ఆనందంగా ఇంటికి వచ్చిన సోదరి అంతలోనే విగతజీవిగా మారడంతో ఆ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. -
‘నులి’పేద్దాం..
గద్వాల క్రైం: ఆటపాటలతో ఉల్లాసంగా గడపాల్సిన చిన్నారుల పాలిట శాపంగా మారుతున్నాయి నులిపురుగులు. పిల్లల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. తరచూ అనారోగ్యం, అలసటతో బాధపడుతున్నారు. దీంతో నులిపురుగుల నివారణే లక్ష్యంగా వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లాలో 1 –19 సంవత్సరాలలోపు ఉన్న బాల బాలికలకు ఆల్బెండజోల్ మాత్రల పంపిణీని సోమవారం ప్రారంభించనున్నారు. ఈమేరకు జిల్లాలో 1,71,354 మందిని గుర్తించారు. ప్రతి ఆంగన్వాడీ, పాఠశాల, కళాశాల విద్యార్థులకు ఈ మాత్రల పంపిణీ చేయనున్నారు. కలుషిత ఆహారమే కారణం.. నులిపురుగులతో బాధపడేవారు ప్రధానంగా ఎనిమియా (రక్తహీనత) వ్యాధి బారినపడతారు. శరీరంలో పదేపదే నీరసం వస్తూ నీరసించిపోతారు. శారీరక, మానసిక ఎదుగుదలపై ప్రభావం చూపుతుంది. ఆకలి మందగించి జీర్ణ సంబంధ సమస్యలు తలెత్తుతాయి. పిల్లలు మందబుద్ధిగా తయారవుతారు. మలవిసర్జన ప్రదేశంలో, చర్మంపై దురదలు వస్తుంటాయి. కొందరు పిల్లల్లో దీర్ఘకాలంపాటు ఇవి ఉన్నప్పటికి వ్యాధి లక్షణాలు కనిపించకపోవచ్చు. కానీ, ఈ సమస్య వారి ఆరోగ్యం, విద్య ఇలా అన్ని రకాల ఎదుగుదలపై ప్రభావితం చూపుతాయి. నులిపురుగుల ఎక్కువగా ఉంటే ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది. మల విసర్జన, బహిర్భూమికి వెళ్లివచ్చాక కాళ్లు, చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. పాదాలకు బూట్లు తప్పనిసరిగా ధరించాలి. దీంతోపాటు ఆహార పదార్థాలను శుభ్రంగా కడగాలి. ఇంటి పరిసరాలను శుభ్రం చేసుకోవాలి. వ్యక్తిగత పరిశుభ్రతను పాటించడం వల్ల నులిపురుగులు రాకుండా నియంత్రించవచ్చని వైద్యులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో పిల్లలకు, యువకులకు తప్పనిసరిగా ఆల్బెండజోల్ మాత్రలు వేయించాలని వైద్యాధికారులు చెబుతున్నారు. దీంతో సంక్రమణాన్ని నియంత్రించడంతోపాటు శారీరక, మానసిక అభివృద్ధికి దోహదపడుతుందని సూచిస్తున్నారు. నులి పురుగుల నిర్మూలన కోసం ప్రత్యేక డ్రైవ్ చేపట్టాం. చిన్నారుల ఆరోగ్య సంరక్షణ దిశగా ఆల్బెండజోల్ మాత్రలను పంపిణీ చేస్తున్నాం. పలు జాగ్రత్తలు తీసుకుంటే నులిపురుగుల బారిన పడకుండా పిల్లలను కాపాడుకోవచ్చు. మల విసర్జన తర్వాత, భోజనానికి ముందు చేతులను పరిశుభ్రంగా కడుక్కోవాలి. గోళ్లను ఎప్పటికప్పుడు కత్తిరించుకోవాలి. పరిశుభ్రమైన నీటిని తాగాలి. ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. వ్యక్తిగత శుభ్రత పిల్లలకు వివరించాలి. – సిద్దప్ప, జిల్లా ఇన్చార్జ్ వైద్యాధికారి మాత్రల డోస్ ఇలా.. ● ఏడాది నుంచి రెండేళ్లలోపు చిన్నారులకు సగం మాత్రను పొడి చేసి పాల ద్వారా, నీళ్ల ద్వారా వేయాలి. ● 2 నుంచి 3 ఏళ్లలోపు పిల్లలకు ఒక మాత్రను పొడి చేసి నీళ్ల ద్వారా మింగించాలి. ● 3 నుంచి 19 ఏళ్లలోపు వారు మధ్యాహ్న భోజనం తర్వాత మాత్రను నమిలి మింగించాలి. ● ఇది నేరుగా మింగే మాత్ర కాదు. నోట్లో వేసుకుని చప్పరించిన లేదా నులిమి మింగినా సరిపోతుంది. 19 ఏళ్లలోపు వారికి ఆల్బెండజోల్ మాత్రల పంపిణీకి ఏర్పాట్లు జిల్లాలో 1.71 లక్షల మంది బాలల గుర్తింపు ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక డ్రైవ్ నేడు జాతీయ నులి పురుగుల నిర్మూలన దినోత్సవం -
కేఎల్ఐ.. రికార్డు బ్రేక్!
ఈ ఏడాది ఇప్పటికే 4 టీఎంసీలు పంపింగ్ ● గత సీజన్లో 50 టీఎంసీల నీటి ఎత్తిపోతలు ● మూడు మోటార్లతోనే కొనసాగుతున్న లిఫ్టింగ్ ● భారం పడుతున్నా.. తప్పడం లేదంటున్న అధికారులు కొల్లాపూర్: జిల్లా వరప్రదాయిని కేఎల్ఐ ప్రాజెక్టు నీటి ఎత్తిపోతల్లో రికార్డు సృష్టిస్తోంది. కృష్ణానదికి వరద ప్రారంభమైన కొన్ని రోజుల్లోనే 4 టీఎంసీల నీటిని ఎత్తిపోసి గత రికార్డుకు బ్రేక్ వేసింది. 2011లో కేఎల్ఐ ద్వారా ఎత్తిపోతలు ప్రారంభం కాగా.. నాటి నుంచి అవిశ్రాంతంగా మోటార్లు పనిచేస్తున్నాయి. కొన్నేళ్ల క్రితం ప్రాజెక్టు మొదటి పంపుహౌజ్లో రెండు మోటార్లు పాడయ్యాయి. మిగిలిన మూడు మోటార్లతోనే నీటిని ఎత్తిపోస్తూ ప్రాజెక్టు అధికారులు రికార్డు సృష్టిస్తున్నారు. పనితీరు ఇలా.. కేఎల్ఐ పరిధిలో ఎల్లూరు, జొన్నల బొగుడ, గుడిపల్లి గట్టు పంప్హౌజ్లు ఉన్నాయి. ఒక్కో పంపుహౌజ్లో 5 మోటార్ల చొప్పున ఏర్పాటుచేశారు. వీటిలో 4 మోటార్లు రెగ్యులర్ పంపింగ్ కోసం, ఒక మోటార్ స్పేర్లో ఉంచేందుకు నిర్ణయించారు. 30 మెగావాట్ల సామర్థ్యం గల ఒక్కో మోటార్ ద్వారా రోజూ 800 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తారు. కేఎల్ఐ ద్వారా కొల్లాపూర్, నాగర్కర్నూల్, వనపర్తి, అచ్చంపేట, కల్వకుర్తి నియోజకవర్గాల్లోని ఆయకట్టు భూములకు సాగునీరు అందుతోంది. మోటార్లపై భారం.. ఎల్లూరు పంప్హౌజ్లో ఐదు మోటార్లకు గాను ప్రస్తుతం మూడు మోటార్లు మాత్రమే పనిచేస్తున్నాయి. 2011లో కేఎల్ఐ ద్వారా నీటి ఎత్తిపోతలు ప్రారంమైన సమయంలో ఐదు మోటార్ల ద్వారా 0.0086 టీఎంసీ నీటిని మాత్రమే ఎత్తిపోశారు. 2015 వరకు ప్రతి సంవత్సరం 2.5 టీఎంసీల లోపు మాత్రమే ఎత్తిపోతలు జరిగాయి.మూడు మోటార్ల తోనే రికార్డుస్థాయిలో పంపింగ్ జరుగుతోంది. సాగు, తాగునీటికి కేఎల్ఐ ప్రాజెక్టే దిక్కవడంతో మోటార్లపై పంపింగ్ భారం పెరుగుతోంది. నీటి పంపింగ్ రికార్డుస్థాయిలో జరుగుతోందని ఓవైపు ఆనందపడుతున్న అధికారులు.. మరో వైపు మోటార్లపై భారం పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మిషన్ భగీరథకు సైతం.. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాతో పాటు రంగారెడ్డి జిల్లాలోని పలు మండలాలకు తాగునీరు అందించేందుకు ఏర్పాటుచేసిన మిషన్ భగీరథ పథకానికి కూడా కేఎల్ఐ ద్వారానే నీటి ఎత్తిపోతలు సాగుతున్నాయి. ఎల్లూరు సమీపంలోనే మిషన్ భగీరథ స్కీం ఏర్పాటుచేశారు. ఇక్కడి నుంచే అన్ని ప్రాంతాలకు తాగునీరు సరఫరా అవుతోంది. ప్రతి సంవత్సరం మిషన్ భగీరథ కోసం 7 టీఎంసీల నీటిని వినియోగిస్తున్నారు. రెగ్యులర్గా పంపింగ్.. వర్షాకాలంలో మినహాయిస్తే మిగతా రోజుల్లో ఎల్లూరు పంప్హౌజ్ లోని మూడు మోటార్ల ద్వారా రెగ్యులర్గా నీటిని పంపింగ్ చేస్తు న్నాం. సాగునీటితో పాటు, మిషన్ భగీరథకు కూడా నీటిని ఎత్తిపోస్తున్నాం. దీంతో మోటార్లపై భారం పడుతోంది. అయినా తప్పడం లేదు. పాలమూరు ప్రాజెక్టు ద్వారా ఎత్తిపో తలు ప్రారంభమైతే కేఎల్ఐపై భారం తగ్గు తుంది. ఈ ఏడాది జూన్ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు 4 టీఎంసీల నీటిని ఎత్తిపోశాం. గతేడాది 50 టీఎంసీల నీటిని ఎత్తిపోశాం. – లోకిలాల్ నాయక్, డీఈ, పంపుహౌజ్ నిర్వహణ విభాగం -
ఇంటింటా వెల్లివిరిసిన ఆత్మీయ బంధం
● ఘనంగా రాఖీ వేడుకలు గద్వాలటౌన్: అన్నా చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలచిన రాఖీ పౌర్ణమిని శనివారం జిల్లా వ్యాప్తంగా ప్రజలు ఘనంగా జరుపుకొన్నారు. సోదరీమణులు తమ సోదరులకు నుదుట కుంకుమ పెట్టి రాఖీలు కట్టి స్వీట్లు తినిపించారు. దూర ప్రాంతాల నుంచి సైతం వచ్చి మహిళలు తమ సోదరులకు రాఖీలు కట్టారు. కొందరు మహిళలు కొరియర్, పోస్టల్ ద్వారా తమ సోదరులకు రాఖీలు పంపారు. ఏబీవీపీ, ఎస్ఎఫ్ఐ, పీడీఎస్యూ, ఏఐఎస్ఎఫ్ నాయకులు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. నేను నీకు రక్షా.. నీవు నాకు రక్షా.. మనిద్దరం దేశానికి రక్షా అంటూ రాఖీ వేడుకలు చేపట్టారు. ప్రజాపిత బ్రహ్మకుమారీలు పలువురు రాజకీయ నాయకుల ఇళ్లకు వెళ్లి రాఖీలు కట్టారు. జిల్లాలో వివిధ పార్టీల నాయకులు రాఖీ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డికి పలువురు మహిళలు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. శనేశ్వరుడికి తైలాభిషేకాలు బిజినేపల్లి: నందివడ్డెమాన్ జైష్ఠ్యాదేవి సమేత శనేశ్వరుడికి శనివారం ప్రత్యేక పూజలు చేశారు. వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు శనేశ్వరాలయాన్ని సందర్శించి తమ ఏలినాటి శనిదోష నివారణ కోసం స్వామివారికి తిల తైలాభిషేకాలు నిర్వహించారు. అనంతరం బ్రహ్మసూత్ర పరమశివుడిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయ చైర్మన్ గోపాల్రావు, ప్రధాన అర్చకుడు గవ్వమఠం విశ్వనాథశాస్త్రి, కమిటీ సభ్యులు రాజేశ్, ప్రభాకరాచారి, పుల్లయ్య, వీరశేఖర్, అర్చకులు శాంతికుమార్, ఉమ్మయ్య పాల్గొన్నారు. ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించండి కందనూలు: అపరిష్కృతంగా ఉన్న ఉపాధ్యాయ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు పర్వత్రెడ్డి, ప్రధాన కార్యదర్శి సదానందంగౌడ్ డిమాండ్ చేశారు. శనివారం జిల్లా కేంద్రంలోని ఎస్టీయూ భవనంలో జిల్లా అధ్యక్షుడు మురళి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. ఉపాధ్యాయుల పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలన్నారు. పదోన్నతులతో పాటు బదిలీల ప్రక్రియను పారదర్శకంగా చేపట్టాలని కోరారు. 317 జీఓ బాధితుల సమస్యలను పరిష్కరించడంతో పాటు అక్రమ డిప్యూటేషన్లు రద్దు చేయాలన్నారు. హెల్త్ కార్డులు అన్ని కార్పొరేట్ ఆస్పత్రుల్లో అమలయ్యే విధంగా ప్రభుత్వం చొరవ చూపాలన్నారు. మధ్యాహ్న భోజన బిల్లులు ప్రతినెలా క్రమం తప్పకుండా విడుదల చేయాలని కోరారు. సమావేశంలో ఎస్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీధర్రావు, రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి ఈశ్వర్, కార్యదర్శి రమేశ్, ఉపాధ్యక్షుడు లక్ష్మణరావు, జిల్లా మాజీ అధ్యక్షుడు సుదర్శన్ ఉన్నారు. -
ఔత్సాహికులకు వరం.. వాలీబాల్ అకాడమీ
మహబూబ్నగర్ క్రీడలు: ఔత్సాహిక వాలీబాల్ క్రీడాకారులను ప్రోత్సహించడానికి 2004లో రాష్ట్ర క్రీడాపాధికారిక సంస్థ జిల్లాకు వాలీబాల్ అకాడమీ మంజూరు చేసింది. అకాడమీ నడిచిన నాలుగేళ్లలో జిల్లా క్రీడాకారులు ఎంతో ప్రతిభ కనబరిచేవారు. అప్పట్లో ఈ వాలీబాల్ అకాడమీ రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు సంతరించుకుంది. వాలీబాల్ అకాడమీలో శిక్షణ పొందిన జిల్లాకు చెందిన పలువురు క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయి వాలీబాల్ క్రీడాకారులుగా ఎదిగారు. అయితే నిధుల నిర్వహణ భారంతో 2008 సంవత్సరంలో వాలీబాల్ అకాడమీని మూసివేశారు. అయితే స్థానిక ప్రజాప్రతినిధుల కృషి, అధికారుల చొరవతో మరోసారి వాలీబాల్ అకాడమీ ఏర్పాటై.. పూర్వవైభవం సంతరించుకునే దిశగా ముందుకు సాగుతోంది. అధునాతన సౌకర్యాలతో.. మహబూబ్నగర్లోని మెయిన్ స్టేడియంలో నూతన వాలీబాల్ అకాడమీ రూ.19.70 లక్షల నిధులతో ఏర్పాటు చేశారు. స్టేడియంలోని రెండు పాత వాలీబాల్ కోర్టులను ఆధునీకరించి వాటి స్థానంలో నూతన కోర్టులు నిర్మించారు. కోర్టుల చుట్టూ నాలుగు ఫ్లడ్లైట్లు, ప్రత్యేక షెడ్లు, గ్యాలరీ ఏర్పాటు చేశారు. ఈ ఏడాది జూన్ 12న వాలీబాల్లో అకాడమీలో ప్రవేశాల కోసం సెలక్షన్స్ నిర్వహించగా.. రాష్ట్రంలోని ఆయా జిల్లాల నుంచి బాల, బాలికలు హాజరయ్యారు. అకాడమీలో 32 మంది బాలురు, బాలికలు ప్రవేశాలు పొందారు. స్విమ్మింగ్పూల్ అంతస్తులో బాలురకు, ఇండోర్ స్టేడియంలో బాలికలకు వసతి ఏర్పాటు చేశారు. అదేవిధంగా భోజన వసతి కల్పించారు. క్రీడాకారులకు మెరుగైన శిక్షణ వాలీబాల్ అకాడమీలో ప్రవేశాలు పొందిన బాల, బాలికలకు మెరుగైన శిక్షణ ఇస్తున్నారు. ప్రస్తుతం ఒక కోచ్ ఉండగా త్వరలో మరో కోచ్ రానున్నారు. కోచ్ పర్వేజ్పాషా క్రీడాకారులకు ఉదయం 6 నుంచి 9 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 7 గంటల వరకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. ఉదయం వేళలో రిక్రియేషన్ గేమ్, స్టెచ్చింగ్ ఫ్లెక్సిబిలిటీ, గ్రౌండ్ మూమెంట్, బాల్ డ్రిల్స్, సా యంత్రం బ్లాకింగ్, అటాకింగ్ డ్రిల్స్, బాల్ ప్రాక్టిస్పై శిక్షణ ఇవ్వడంతోపాటు ప్రతి శుక్రవారం ఐదు సెట్ల మ్యాచ్ ఆడిపిస్తున్నారు. మహబూబ్నగర్లో నూతన వాలీబాల్ స్టేడియం ఏర్పాటు శిక్షణ పొందుతున్న వివిధ జిల్లాల క్రీడాకారులు బాల, బాలికలకు మెరుగైన వసతి సౌకర్యాలు ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రత్యేక శిక్షణ అంతర్జాతీయ స్థాయిలో రాణించడమే లక్ష్యంగా ముందుకు.. -
కనులపండువగా కల్యాణోత్సవం
మల్దకల్ : ఆదిశిలా క్షేత్రమైన స్వయంభూ లక్ష్మీవెంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం స్వామి వారి కల్యాణోత్సవం కనులపండువగా జరిగింది. ఆలయంలో రాఖీ పౌర్ణమి సందర్భంగా వేదపండితులు రమేషాచారి, మధుసూదనాచారి, రవిచారి వేదమంత్రోచ్ఛరణల మధ్య స్వామి వారి ఉత్సవమూర్తులకు కల్యాణం నిర్వహించారు. ఆలయ ప్రాంగణం మొత్తం భక్తులతో కిక్కిరిసిపోయింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. స్వామి వారి రథోత్సవం ప్రతి ఏటా రాఖీపౌర్ణమి రోజున స్వామి వారి ఆలయంలో రథోత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీ. అందులో భాగంగానే రథోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వహకులు అరవిందరావు, బాబురావు, చంద్రశేఖర్రావు, అర్చకులు రమేషాచారి, మధుసూదనాచారి, రవిచారి, దామరామక్రిష్ణ, దామ భీమరాయుడు, దామగోవిందప్ప, దామమురళీఽ, దామ లక్ష్మీనారాయణ, భక్తులు, వాల్మీకి పూజారులు తిరుమల్, గోవిందు, దాతలు దామ శంకరయ్య పార్వతమ్మ పాల్గొన్నారు. -
దంచికొట్టిన వాన
జిల్లాలోని పలు మండలాల్లో శుక్ర, శనివారం వాన దంచికొట్టింది. వర్షాకాలం ప్రారంభమైన తర్వాత జిల్లాలో ఇంతటి భారీ వర్షం కురవడం ఇదే తొలిసారి. వానాకాలం ప్రారంభమై రెండు నెలలు గడిచినా పెద్దగా వానలు లేక రైతులు ఇబ్బంది పడుతూ వచ్చారు. జిల్లాలో ఇప్పటికే దాదాపు 1.2 లక్షల ఎకరాల్లో పంటలు వేసినా.. వరుణుడి జాడ మాత్రం కరువైంది. చేసేది లేక వర్షాల కోసం పలు గ్రామాల్లో పూజలు సైతం చేశారు. ఎట్టకేలకు వరుణుడు కరుణించడంతో ఎండుదశకు చేరిన పంటలకు ఊపిరిపోసినట్లయ్యింది. ఇదిలాఉండగా, శనివారం ప్రధానంగా అలంపూర్ నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో భారీ వర్షం కురవడంతో పంట పొలాలు నీటమునిగాయి. అలంపూర్, అయిజ, శాంతినగర్, ఉండవెల్లి, గట్టు, ఇతర మండలాల్లో వాగులు వంకలు పొంగి పొర్లాయి. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. – సాక్షి నెట్వర్క్ -
భక్తిశ్రద్ధలతో నూలు పౌర్ణమి వేడుకలు
గద్వాలటౌన్: పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో శనివారం జిల్లా కేంద్రంలోని భక్త మార్కండేయస్వామి ఆలయంలో రాఖీ పౌర్ణమి, నూలు పౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఉదయం 7గంటల నుంచి పలు పూజా కార్యక్రమాలు చేపట్టారు. గణపతి హోమం, యజ్ఞోపహితధారణ కార్యక్రమాలను వైభవంగా నిర్వహించారు. అనంతరం వేడుకలకు హాజరైన ప్రతి ఒక్కరికీ రాఖీలు కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. పద్మశాలీలు జంద్యం ధరించారు. అనంతరం రథోత్సవ కార్యక్రమాన్ని వైభవంగా చేపట్టారు. ఈ సందర్భంగా పద్మశాలి సంఘం నాయకులు అఖండ భజన కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు పులిపాటి వెంకటేష్, నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
వైద్య సేవలపై ఆరా..
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో రాష్ట్ర బృందం విస్తృత తనిఖీ ●గద్వాల క్రైం: ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులల్లో రోగులకు అందుతున్న వైద్య సేవలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నిఘా ఉంచింది. రోగులతో వైద్య సిబ్భంది అనుసరిస్తున్న విధానం, వారికి అందిస్తున్న చికిత్స, మందులు పూర్తి వివరాలను తెలుసుకునే పనిలో పడింది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటిస్తున్నారా.. మెరుగైన వైద్యం అందిస్తున్నారా.. ఏమేం మార్పులు చేస్తే బాగుంటుంది మొత్తంగా వైద్యశాఖలో సమూల మార్పులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అలాగే, ప్రైవేట్ ఆస్పత్రులు అనుమతులు పొందారా.. అర్హులైన వైద్యులు, టెక్నీషియన్లు ఉన్నారా.. ఫీజులు ఎంత వసూలు చేస్తున్నారు పూర్తి వివరాలతో నివేదికలు కోరారు. తాజాగా ఈ నెల 2వ తేదీన రాష్ట్ర మానిటరింగ్ అధికారి ఐఏఎస్ ఫణీందర్రెడ్డి బృందం జిల్లా ఆసుపత్రి, పీహెచ్సీలు, ప్రైవేటు ఆస్పత్రులను సందర్శించింది. రోగులకు అందుతున్న సేవలు, రికార్డులు, మందుల వివరాలు, అనుమతులపై వాకబు చేశారు. పీహెచ్సీలో సేవలపై.. జిల్లా ఆసుపత్రి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు రోగులకు అందించిన సేవలు, వివరాలపై బృందం సభ్యులు నివేదికలు కోరారు. గర్భిణులకు అందుతున్న సేవలు, సాధారణ డెలివరీలు, శస్త్ర చికిత్సలు, మెరుగైన చికిత్సల కోసం వైద్యులు సిఫార్సు వివరాలను అడిగి తెలుసుకున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సేవలు అందిస్తున్న వైద్యుల జాబితా, విధులకు హాజరు మేరకు రిజిస్టర్లు, మందుల సరఫరా అంశాలపై వాకబు చేశారు. ప్రభుత్వం అభివృద్ధి పనుల నిమిత్తం మంజూరు చేసిన నిధులు, వినియోగించిన వివరాలు, టెండర్ ప్రక్రియ, కాంట్రాక్టర్ల వివరాలు, ఇప్పటి వరకు మౌలిక సౌకర్యాల కోసం వినియోగించిన నిధులు, మందుల సరఫరా అంశాలపై ఆరా తీశారు. ఇటీవల రూ.3 కోట్లతో జిల్లా ఆస్పత్రిలో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటుపై నివేదికలు కోరారు. మరోవైపు మెడికల్ కళాశాల బోధన విషయాలు, ప్రొఫెసర్లు, అవసరమయ్యే సిబ్బంది వివరాలపై బృందం సభ్యులు వాకబు చేశారు. ల్యాబ్లో ఉండాల్సిన పరికారాలు, రోగుల కోసం ఆధునిక పరికరాలు, వాటి పనితీరు, టెక్నిషన్లు, డయాలిస్ రోగులకు అందుతున్న సేవలు, సమస్యలను తెలుసుకున్నారు. అత్యవసర సేవల విషయంలో మెడికల్ కళాశాల ప్రొఫెసర్ల సహాయంతో మెరుగైన వైద్య సేవలు అందించల్సిందిగా రాష్ట్ర మానిటరింగ్ అధికారి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. నివేదికలు కోరారు.. రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం. ఈఏమరకు జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో రోగులకు అందుతున్న సేవలపై రాష్ట్ర మానిటరింగ్ బృందం ఆకస్మిక తనిఖీలు చేపట్టింది. ఎక్కువగా ఏ జబ్బుతో బాధపడుతున్నారు, వారికి అందిస్తున్న వైద్య సేవలు, వైద్యులు సూచించిన మందుల వినియోగం తదితర విషయాలపై నివేదికలు కోరారు. జిల్లా ఆసుపత్రిలో వైద్యుల కొరత ఉందని తెలియజేశాం. అవసరమయ్యే మౌలిక వసతులు, సౌకర్యాలపై వివరించాం. 300 పడకల ఆసుపత్రిని 550 పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేయాల్సిందిగా కోరాం. – సిద్దప్ప, జిల్లా ఇన్చార్జ్ వైద్యాధికారి ప్రైవేట్ ఆస్పత్రుల్లో సౌకర్యాలు, ఫీజులపై వాకబు మెరుగైన వైద్యసేవలు అందడమే లక్ష్యం.. -
యూరియాపై ఆందోళన వద్దు
గద్వాల వ్యవసాయం: జిల్లాలో అవసరమైన మేరకు యూరియా నిల్వలు ఉన్నాయని డీఏఓ సక్రియానాయక్ అన్నారు. శనివారం స్థానిక పీఏసీఎస్ గోదాము వద్ద రైతులకు 20.25 మెట్రిక్ టన్నుల యూరియాను ఏఓ, ఏఈఓల పర్యవేక్షణలో పంపిణీ చేయగా ఆయన పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ యూరియా కొరత రాకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. పీఏసీఎస్లలోనే కాకుండా ప్రైవేట్ ఎరువుల దుకాణాల్లో 150 మెట్రిక్ టన్నుల యూరియా స్టాక్ ఉందని, రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. డీఏఓ వెంట ఏఓ ప్రతాప్కుమార్ ఉన్నారు. ఈ–పాస్ ద్వారానే ఎరువులు విక్రయించాలి కేటీదొడ్డి: ఎరువుల డీలర్లు ఈ–పాస్ మిషన్ ద్వారానే రైతులకు ఎరువులు విక్రయించాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సక్రియానాయక్ అన్నారు. శుక్రవారం మండలంలోని నందిన్నె, కుచినెర్ల, చింతలకుంట గ్రామాలలో ఎరువుల దుకాణాలను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎమ్మార్పీ ధరలకే ఫర్టిలైజర్, మందులకు విక్రయించాలని, ఎరువుల దుకాణాల్లో ఎక్కడ కూడా యూరియా కొరత లేదని ఈ –పాసు మిషన్లతో అమ్మకాలు జరపాలన్నారు. అధిక ధరలకు విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. రైతులకు తప్పనిసరిగా రశీదులు అందజేయాలని, ఎరువుల ధరలు, స్టాక్ వివరాలను సూచిక బోర్డుపై ప్రదర్శించాలని పేర్కొన్నారు. వారి వెంట ఏఓ రాజవర్ధన్ రెడ్డి, ఏఈఓ కిరణ్కుమార్, తదితరులు ఉన్నారు. ప్రాణత్యాగం చేసిన వారిని స్మరించుకుందాం గద్వాలటౌన్: బీజేపీ ఆధ్వర్యంలో హర్ఘర్ తిరంగా అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామంజనేయులు తెలిపారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యశాలలో ఆయన మాట్లాడారు. అన్ని మండలాలలో 9,10వ తేదీల నాటికి హర్ఘర్ తిరంగాపై కార్యశాల సన్నహాక సమావేశాలను పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో భాగంగా ఈ నెల 11 నుంచి 14 వరకు అన్ని మండలాలలో తిరంగా యాత్ర నిర్వహించాలన్నారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వారిని స్మరించుకుంటూ, వారి విగ్రహాల దగ్గర నివాళులర్పించాలన్నారు. పార్టీ కార్యకర్తలు ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకాన్ని ఎగరవేయాలన్నారు. విభజన గాయాల స్మారక దినాన్ని నిర్వహిస్తున్నామని వివరించారు. 15న ప్రతి ఒక్కరూ జెండా కార్యక్రమంలో పాల్గొనాలని సూచించారు. ఈ సమావేశంలో బీజేపీ నాయకులు రామచంద్రారెడ్డి, రవికుమార్, కేకేరెడ్డి, అక్కల రమాదేవి, జయశ్రీ, శివారెడ్డి, శ్యామ్రావు, నాగేశ్వర్రెడ్డి, సమతగౌడ్, వెంకటేశ్వర్రెడ్డి, దేవదాసు తదితరులు పాల్గొన్నారు. వేరుశనగ క్వింటా రూ.5,303 గద్వాల వ్యవసాయం: గద్వాల మార్కెట్ యార్డుకు శుక్రవారం 287 క్వింటాళ్ల వేరుశనగ వచ్చింది. గరిష్టం రూ.5303, కనిష్టం రూ.2940, సరాసరి రూ.2940 ధరలు లభించాయి. -
ఆల్బెండజోల్ మాత్రలు తప్పక వేయించాలి
గద్వాల న్యూటౌన్: నులిపురుగుల నిర్మూలన కోసం ఏడాది నుంచి 19 ఏళ్లలోపు వారందరికి ఈనెల 11న ఆల్బెండజోల్ మాత్రలు తప్పక వేయించాలని అడిషనల్ కలెక్టర్ నర్సింగ్రావు సూచించారు. శుక్రవారం కలెక్టరేట్లో ఈనెల 11న నిర్వహించనున్న జాతీయ నులిపురుగుల దినోత్సవంపై జిల్లా టాస్క్ఫోర్స్ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్య, ఆరోగ్యశాఖతో పాటు సంబందిత ప్రభుత్వ విభాగాలు, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల యాజజమాన్యాలు సమన్వయంతో వ్యవహరిస్తూ ఏడాది నుంచి 19 ఏళ్ల వయస్సు ఉన్న వారందరికి అల్బెండజోల్ మాత్రలు వేయించాలని ఆదేశించారు. నులిపురుగులు ఉండటం వల్ల పిల్లలలో రక్తహీనత, ఆకలి మందగించడం వంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని చెప్పారు. వీటివల్ల చదువులో ఏకాగ్రత కోల్పోతారని పేర్కొన్నారు. గత కొన్నేళ్లుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుండటం వల్ల మెరుగుదల కన్పించిందన్నారు. అన్ని హస్టల్లు, అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలల్లో మాత్రలు ఇస్తారని, బడిబయటి పిల్లలకు కూడా ఈకేంద్రాల్లోనే మాత్రలు తప్పక ఇప్పించాలని సూచించారు. ప్రతి అంగన్వాడీ కేంద్రం, పాఠశాల, కళాశాలకు ఒక అంగన్వాడీ కార్యకర్త, ఆశా కార్యకర్త, ఏఎన్ఎంలను అనుసంధానం చేయాలన్నారు. జిల్లాలో 1.71 లక్షల మంది జిల్లాలో ఏడాది నుంచి 19 ఏళ్లలోపు వారు 1,71,354 మంది ఉన్నారని తెలిపారు. మాత్రల వలన ఎలాంటి అన్నారోగ్య సమస్యలు రావని వివరించారు. ఏడాది నుంచి రెండేళ్ల వయస్సు పిల్లలకు సగం మాత్రం పొడి చేసి ఇవ్వాలన్నారు. ఆపై వయస్సు ఉన్నవారికి ఒక మాత్ర నమిలిమింగించాలని సూచించారు. ఆర్ఎస్కే బృందాలు, పోగ్రాం అధికారులు పర్యవేక్షిస్తారని చెప్పారు. సమావేశంలో జిల్లా వైద్యాధికారి సిద్దప్ప, పంచాయతీ అధికా రి నాగేంద్రం, సంక్షేమఅధికారి సునంద, ఇంటర్మీడియేట్ అధికారి హృదయరాజ్, మున్సిపల్ కమీషనర్ దశరథ్, ఎస్సీ కార్పోరేషన్ ఈడీ నుషిత, పోగ్రాం అధికారులు పాల్గొన్నారు. -
పైసలిస్తేనే.. ఫైల్ కదిలేది!
కొన్ని ప్రభుత్వ శాఖల్లో రాజ్యమేలుతున్న అవినీతి రెవెన్యూ, సబ్ రిజిస్ట్రార్లపై దృష్టి సారించాలి జిల్లాలోని తహసీల్దార్, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలపై అవినీతి ఆరోపణలు బాహాటంగానే వెల్లువెతున్నాయి. మధ్యవర్తులను ఏర్పాటు చేసుకుని పెద్ద మొత్తంలో డబ్బులు దండుకుంటున్నారు. రియల్ భూం ఉన్న మండలాల్లో తహసీల్దార్లకు కాసుల వర్షం కురుస్తుంది. ప్రధానంగా గద్వాల సబ్రిజిస్ట్రార్ కార్యాలయంలో నిబంధనలు ఉల్లంఘించి రిజిస్ట్రేషన్లు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారులకు లాభం చేకూర్చుతూ... తమ జేబులను నింపుకుంటున్నారనే ఆరోపణలు లేకపోలేదు. గద్వాల జిల్లాలోని ఈ కార్యాలయాలపై ఏసీబీ అఽధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు. -
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి
గద్వాలటౌన్/గద్వాలన్యూటౌన్: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణపు పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని ఐడీఓసీలో ఇందిరమ్మ ఇళ్ల పురోగతిపై మున్సిపల్ కమీషనర్లు, ఎంపీడీఓలు, సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈసందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఇళ్ల నిర్మాణాల్లో స్పష్టమైన పురోగతి సాధించేందుకు క్షేత్రస్థాయిలో పనిచేయాలని, నిర్లక్ష్యం వహించిన వారిపైకఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాకు 7వేల ఇళ్లు మంజూరు కాగా ఇప్పటివరకు 1,078 మేస్మెంట్ దశకు, 3850 మార్క్అవుట్ దశకు చేరుకున్నాయని చెప్పారు. గతంతో పోల్చితే ఈసారి మంచి పురోగతి ఉందని, ఇదే వేగాన్ని పెంచి మరింత మెరుగైన ఫలితాలు సాధించాల్సి ఉందన్నారు. అన్ని మున్సిపల్, పంచాయతీల్లో లభ్దిదారుల వివరాలను ప్రదానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ పోర్టల్లో నమోదు చేయాలని ఆదేశించారు. ఎంపీడీఓలకు ఇసుక బుకింగ్ కోసం లాగిన్ ఐడీలు అందజేస్తామని, అబ్ధిదారులకు ఉచిత ఇసుక అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూ చించారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్లు లక్ష్మీనారాయణ, నర్సింగరావ్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శ్రీనివాసరావ్, హౌసింగ్ డీఈ కాశీనాథ్, ఎంపీడీఓలు,మున్సిపల్ కమిషనర్లు, అధికారులు పాల్గొన్నారు. ఇళ్ల పరిశీలన గద్వాల శివారులో చేపట్టిన డబుల్ బెడ్రూం ఇళ్ల పనులను కలెక్టర్, ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డితో కలిసి పరిశీలించారు. పెండింగ్ పనులను త్వరిరతగతిన పూర్తి చేయాలన్నారు. ముళ్ల పొదలను తొలగించి, పరిసరాలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలన్నారు. విద్యుత్తు, తాగునీటి సరఫరాలో లోపాలు లేకుండా చూడాలని ఆదేశించారు. డ్రైనేజీ వ్యవస్థను చక్కదిద్దాలన్నారు. ఈ కార్యక్రమంలో అడిషినల్ కలెక్టర్లు లక్ష్మినారాయణ, నర్సింగరావు, ఎస్డీసీ శ్రీనివాసరావు, విద్యుత్శాఖ ఎస్ఈ శ్రీనివాస్రెడ్డి, పీఆర్ డీఈ లక్ష్మన్న, మున్సిపల్ కమిషనర్ దశరథ్, ఇరిగేషన్ శాఖ ఈఈ శ్రీధర్రెడ్డి పాల్గొన్నారు. డే కేర్ సెంటర్ ఆదర్శవంతంగా నిలవాలి జిల్లాలో వయోవృద్ధుల డే కేర్ సెంటర్ ఆదర్శవంతంగా నిలవాలని కలెక్టర్ ఆకాంక్షించారు. ‘అటల్ వయో అభివృద్ధి యోజన’ పథకం కింద జిల్లాకు మంజూరైన డే కేర్ సెంటర్ను ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ నిర్వహించేందుకు అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదిరింది. శుక్రవారం కలెక్టరేట్లో కలెక్టర్ సమక్షంలో జిల్లా మహిళా, శిశు, దివ్యాంగుల సంక్షేమ అధికారిని సునంద, రెడ్క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ రమేష్ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. వృద్ధులకు నాణ్యమైన, పౌష్టికాహరం అందించడంతో పాటు, శారీరక, మనసికోల్లాసం కల్గించే కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఎరువు దుకాణాల తనిఖీ జిల్లా కేంద్రంలోని మహంతి ఫర్టిలైజర్, శివశంకర్ ఆగ్రో ట్రేడర్స్ను కలెక్టర్ తనిఖీ చేశారు. ఆయా దుకాణాల్లో యూరియా, ఇతర ఎరువుల అమ్మకం, స్టాక్ వివరాలను.. ఈపాస్ యంత్రాలు, గ్రౌండ్ నిల్వలతో పోల్చి వివరాలు తెలుసుకున్నారు. రైతు ఆధార్కార్డు, పట్టాదారు పాసు పుస్తకం ఆధారంగా ఈ–పాస్ ద్వారానే ఎరువులను విక్రయించాలని ఆదేశించారు. ఎరువుల అమ్మకాల్లో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. -
భక్తిశ్రద్ధలతో వరలక్ష్మి వ్రతాలు
గద్వాలటౌన్/ఎర్రవల్లి: శ్రావణమాసం మూడో శుక్రవారం సందర్భంగా జిల్లా వ్యాప్తంగా మహిళలు అత్యంత భక్తిశ్రద్ధలతో వరలక్ష్మి వ్రతాన్ని నిర్వహించారు. పలు ఆలయాల్లో మహిళలు సామూహిక వ్రతాలు నిర్వహించగా, ఇళ్లలో కూడా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారిని అందంగా అలంకరించి భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు. శ్రావణ పౌర్ణమికి ముందురోజు వచ్చిన శుక్రవారాన్ని పురస్కరించుకొని స్థానిక సరస్వతీ శిశు మందిరంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలను నిర్వహించారు. ప్రత్యేకంగా అలంకరించిన అమ్మవారికి ఇష్టమైన తీర్థ ప్రసాదాలను నైవేద్యంగా సమర్పించారు. జిల్లా కేంద్రంలోని వాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయం, మార్కెండేయస్వామి ఆలయం, కాళికాదేవి ఆలయం, అయ్యప్పస్వామి ఆలయం, కోటలోని చెన్నకేశవస్వామి ఆలయం, నల్లకుంటలోని శివాలయం, రాఘవేంద్ర కాలనీలోని సత్యనారాయణస్వామి ఆలయాల్లో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని సామూహిక కుంకుమార్చనను నిర్వహించారు. కన్యకాపరమేశ్వరి ఆలయంలో అమ్మవారు వరలక్ష్మీదేవిగా దర్శనమిచ్చారు. కరెన్సీ నాణేలతో అందంగా తీర్చిదిద్దారు. ఈ సందర్భంగా అమ్మవారి ముందు గాజులు, పూలు, పండ్లు ఉంచారు. సుఖ శాంతులతో, సౌభాగ్యంగా ఉండాలని అమ్మవారికి మొక్కులు చెల్లించారు. ఈ సందర్భంగా ఆయా ఆలయాల నిర్వాహకులు భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ● బీచుపల్లి కోదండరామస్వామి ఆలయంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలను నిర్వహించారు. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. -
పాలమూరుకు ఆటుపోట్లు
ఇప్పట్లో నీటి ఎత్తిపోతలకు కనిపించని అవకాశాలు ● ఇళ్లు ఖాళీ చేయని నార్లాపూర్ రిజర్వాయర్ ముంపు బాధితులు ● జలాశయంలో ఇప్పటికే నాలుగు టీఎంసీల నీటి నిల్వ ● ప్రాజెక్టు ద్వారా నీటిని ఎత్తిపోస్తే ఇళ్లు మునిగిపోయే ప్రమాదం ● ఒకవేళ నింపినా.. ఏదులకు తరలించేందుకు అడ్డంకులు కొల్లాపూర్: పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా నీటి ఎత్తిపోతలు ఇప్పట్లో చేపట్టేలా కనిపించడం లేదు. ఇందుకు ప్రధానంగా పలు రకాల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రాజెక్టు పంప్హౌజ్ పనులు ముమ్మరంగా సాగుతున్నప్పటికీ నీటి ఎత్తిపోతలు మాత్రం రెండేళ్లుగా వాయిదా పడుతూ వస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్లో కచ్చితంగా నీటి ఎత్తిపోతలు చేపట్టాలని అధికారులు భావించినా.. ఆచరణకు నోచుకోలేదు. ఈ క్రమంలో ప్రస్తుత పరిస్థితులను చూస్తే ఈ ఏడాది ఆఖరి వరకు ఎత్తిపోతల కోసం ఎదురుచూడక తప్పేలా లేదు. పరిహారం చెల్లించాకే.. నార్లాపూర్ రిజర్వాయర్లో అంజనగిరి, వడ్డెగుడిసెలు, సున్నపుతండా గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. వీరిలో కొంతమందికి సరైన పరిహారం అందలేదు. ఆర్అండ్ఆర్ ప్యాకేజీ ప్రకారం తమకు పరిహారం చెల్లించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ సమస్యను ఇటీవలే స్థానిక ఎమ్మెల్యే, మంత్రి జూపల్లి కృష్ణారావు సీఎం దృష్టికి తీసుకువెళ్లారు. వారికి పరిహారం ఇప్పించేందుకు చర్యలు చేపట్టారు. అయితే తమకు పూర్తిస్థాయి పరిహారం అందిన తర్వాతే ఖాళీ చేస్తామని నిర్వాసితులు చెబుతున్నారు. దీంతో పాలమూరు ప్రాజెక్టు అధికారులు కొత్తగా నీటి ఎత్తిపోతలు చేపట్టే ఆలోచనను విరమించుకున్నారు. ఒకవేళ నీటిని ఎత్తిపోస్తే సున్నపుతండాలో ఇళ్లు మునిగిపోయే ప్రమాదం ఉండటంతో అధికారులు వాయిదా వేస్తున్నారు. నాలుగు మోటార్ల బిగింపు.. ప్రాజెక్టులోని మొదటి లిఫ్టు ఎల్లూరు పంపుహౌజ్లో ఇప్పటి వరకు నాలుగు మోటార్లు బిగించారు. మూడు మోటార్ల పనులన్నీ పూర్తి కాగా.. మరో మోటార్కు ఫ్రీ ట్రయల్స్ నిర్వహించాల్సి ఉంది. లిఫ్టులో ఇంకో నాలుగు మోటార్ల బిగింపు పనులు కొనసాగుతున్నాయి. డెలివరీ మెయిన్స్ పనులు దాదాపు తుది దశకు చేరుకున్నాయి. ప్రాజెక్టు వద్ద 400/11 కేవీ విద్యుత్ సబ్స్లేషన్ను ఏర్పాటు చేస్తున్నారు. నార్లాపూర్లో నీటి నిల్వ ఇలా.. నార్లాపూర్ రిజర్వాయర్ నీటినిల్వ సామర్థ్యం 6.4 టీఎంసీలు. ప్రస్తుతం పూర్తయిన పనుల ప్రకారం మూడు మోటార్ల ద్వారా నీటిని ఎత్తిపోసేందుకు అవకాశం ఉంది. దీంతో నార్లాపూర్ రిజర్వాయర్లోకి 4 టీఎంసీల నీటిని తాగునీటి అవసరాల కోసం ఈ ఏడాది తరలింపునకు కేఆర్ఎంబీ అనుమతులు సైతం ఉన్నాయి. అయితే గతంలో నార్లాపూర్ రిజర్వాయర్లో 2 టీఎంసీల నీటిని నిల్వ చేశారు. ఇటీవల కాాలంలో కేఎల్ఐ ద్వారా ఎత్తిపోసిన నీటిని నార్లాపూర్ రిజర్వాయర్లోకి మళ్లించడంతో నీటి నిల్వ 4 టీఎంసీలకు పెరిగింది. రిజర్వాయర్లోకి కొత్తగా నీటిని ఎత్తిపోస్తే పలు సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వం దృష్టిలో ఉంది.. నార్లాపూర్ రిజర్వాయర్లో ఇప్పటికే 4 టీఎంసీల నీళ్లు నిల్వ ఉన్నాయి. ఈ రిజర్వాయర్లోకి మరిన్ని నీళ్లు ఎత్తిపోస్తే నిర్వాసితుల ఇళ్లు మునిగిపోతాయి. కానీ, నిర్వాసితులకు పరిహారం చెల్లింపులు పూర్తయితేనే ఇళ్లు ఖాళీ చేస్తామంటున్నారు. ఈ సమస్య ప్రభుత్వం దృష్టిలో ఉంది. త్వరలోనే అన్ని సమస్యలను అధిగమించి ఈ సీజన్ ముగింపులోగా ఎత్తిపోతలు చేపడుతాం. – శ్రీనివాసరెడ్డి, ఈఈ, నీటిపారుదల శాఖ -
ఏసీబీకి చిక్కిన ఇరిగేషన్ డీఈ
అలంపూర్: కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటూ ఇరిగేషన్ డీఈ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఈ ఘటనకు సంబంధించి ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణ కథనం ప్రకారం.. జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్లోని రక్షణ గోడ మరమ్మతు, ఇతర పనులను కాంట్రాక్టర్కు రూ.4 లక్షలకు అప్పగించారు. అయితే రెండురోజుల క్రితం కాంట్రాక్టర్ పనులకు సంబంధించిన ఎంబీ బుక్ మెజర్మైంట్ చేయడానికి ఇరిగేషన్ డీఈ శ్రీకాంత్నాయుడును కలిశారు. ఈ క్రమంలో డీఈ రూ.12 వేలు లంచం అడగగా.. పనుల్లో నష్టం వచ్చిందని అన్ని డబ్బులు ఇవ్వలేనని చెప్పడంతో రూ.11 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో కాంట్రాక్టర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించగా.. వారి సూచన మేరకు గురువారం కాంట్రాక్టర్ ఇరిగేషన్ కార్యాలయంలో డీఈకి డబ్బులు ఇస్తుండగా.. అప్పటికే అక్కడ ఉన్న ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. అనంతరం నిందితుడిని హైదరాబాద్లోని నాంపల్లి ఏసీబీ కోర్టులో ప్రత్యేక న్యాయమూర్తి ఎదుట హాజరుపరుస్తామన్నారు. ఎవరైనా అధికారులు లంచం డిమాండ్ చేస్తే ఏసీబీ టోల్ఫ్రీ నం.1064, వాట్సప్ నం.94404 46106కు సమాచారం ఇవ్వాలని ఏసీబీ డీఎస్పీ సూచించారు. రూ.11 వేలు తీసుకుంటూ పట్టుబడిన అధికారి -
జోగుళాంబ ఆలయంలో ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే పూజలు
అలంపూర్: దక్షిణ కాశీ అలంపూర్ క్షేత్ర ఆలయాలను ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్యే విజయుడు గురువారం దర్శించుకున్నారు. ఆలయ అధికారులు, అర్చకులు వారికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే బాలబ్రహ్మేశ్వర స్వామి జోగుళాంబ అమ్మవారి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అధికారులు శేషవస్త్రాలతో సత్కరించారు. వీరితోపాటు చల్లా ఆదిత్యరెడ్డి, జిల్లా మత్స్యసహకార సంఘం అధ్యక్షుడు గోపాల్, నాయకులు రఘు రెడ్డి, సదానందమూర్తి, నాగేశ్వర్ రావు తదితరులు ఉన్నారు. ● ఆంధ్రప్రదేశ్–తెలంగాణ సీజీఎం, అంబుడ్స్మెన్ డాక్టర్ సింగాల సుబ్బయ్య, పృథ్వీఫాల్గుణి, కిరణ్ జార్జ్లతో కలిసి గురువారం దర్శించుకున్నట్లు ఈఓ పురేందర్ కుమార్ తెలిపారు. ఆలయ అధికారులు అర్చకులతో కలిసి స్వాతం పలికారు. ఈ సందర్భంగా వారు శ్రీ జోగుళాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి వారి ఆలయాల్లో పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు వారిని శేషవస్త్రాలతో సత్కరించారు. 108 సేవలను సద్వినియోగించుకోవాలి గట్టు: ఆపద సమయంలో ఆదుకునేందుకు 108 సేవలు 24 గంటలు అందుబాటులో ఉంటాయని, వీటి సేవలను ప్రజలు ఉపయోగించుకోవాలని 108 జిల్లా అధికారి రత్నమయ్య తెలిపారు. గురువారం గట్టులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 108 వాహనాన్ని, రికార్డులను ఆయన తనిఖీ చేశారు. ఆక్సిజన్, వైద్య పరికరాలు, మందులు తదితర వాటిని పరిశీలించారు. అత్యవసర సమయంలో 108కు కాల్ చేస్తే క్షణాల వ్యవధిలో సంఘటనా స్థలానికి చేరుకుంటుందని, ప్రజలు వీటి సేవలను ఉపయోగించుకోవాలని సూచించారు. వాహనం పూర్తిగా సిద్ధంగా ఉండే విధంగా డ్రైవర్తో పాటుగా సిబ్బంది చూసుకోవాలని ఆదేశించారు. క్షయ నిర్మూలనకు ప్రత్యేక చర్యలు గద్వాల క్రైం: క్షయ వ్యాధి నిర్మూలనకు వైద్యశాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని జిల్లా ఇంచార్జ్ వైద్యాధికారి సిద్దప్ప అన్నారు. గురువారం క్షయ అనుమానితులకు టీబీ ముక్త్ భారత్ అభియాన్ ద్వారా ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. క్షయరహిత జిల్లాగా మార్చుకునేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలన్నారు. అనంతరం పోస్టర్ను విడుదల చేశారు. -
రొయ్యల సాగు ప్రశ్నార్థకం
●సమాచారం లేదు జిల్లాలోని జలాశయాలు రొయ్యల ఉత్పత్తికి అనుకూలంగా ఉన్నాయి. అయితే 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబధించి రొయ్యల సీడ్ కోసం టెండర్ల నిర్వహణకు సంబంధించిన సమాచారం మాతో లేదు. – షకీలా బానో, జిల్లా మత్స్యశాఖ అధికారి గద్వాల శివారులోని జములమ్మ రిజర్వాయర్ గద్వాల వ్యవసాయం: జిల్లాలో గడిచిన ఏడాది రొయ్యల సీడ్ను వదలలేదు. ఈ ఏడాది అయినా రొయ్యల సీడ్ను వదలుతారా.. అని మత్స్యకారులు ఎదురుచూస్తున్నారు. జిల్లాలో 93 మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల్లో 7162 మంది మత్స్యకారులు ఉన్నారు. ఈ కుటుంబాలకు చేపలు, రొయ్యల పెంపకం, విక్రయించడమే జీవనాధారం. జిల్లాలో కృష్ణా, తుంగభద్ర నదులు, జూరాల ప్రాజెక్ట్, శ్రీశైలం బ్యాక్ వాటర్, ఆరు రిజర్వాయర్లు, 38 నోటిఫైడ్ చెరువులతో పాటు చిన్న చెరువులు, కుంటలు ఉన్నాయి. వీటిలో ఏటా మత్స్యశాఖ అందించే చేపల, రొయ్యల సీడ్ను వదిలి పెంచుతున్నారు. పైలెట్ ప్రాజెక్ట్గా.. ఏడేళ్ల క్రితం రొయ్యల పెంపకంపై మత్స్యశాఖ దృష్టి పెట్టింది. జిల్లాలోని వాతావరణం, జలాశయాల్లోని నీటి సాంద్రత, అందులో ఉండే లవణాలు తదితర అంశాలపై కొంత సమాచారం తీసుకున్నారు. పైలెట్ ప్రాజెక్ట్గా 2019–20లో జూరాల జలాశయంలో 6లక్షల రొయ్యల సీడ్ను వదలగా.. బాగా పెరిగాయి. దీంతో మత్యశాఖ అధికారులు ఏటా రొయ్యల సీడ్ను వదిలే సంఖ్యను పెంచుతూ వచ్చారు. ఈసారైనా వదలుతారా.. రొయ్యలసాగు, ఉత్పత్తిలో భాగంగా రొయ్య సీడ్ కోసం ప్రభుత్వం మత్స్యశాఖకు బడ్జెట్ కేటాయిస్తుంది. ఈబడ్జెట్తో రొయ్యల సీడ్కు సంబంధించి మత్స్యశాఖ రాష్ట్ర స్థాయిలో టెండర్లు ఆహ్వానిస్తుంది. టెండర్లు దక్కించుకునే కాంట్రాక్టర్ ఆయా జిల్లాలకు నిర్ధేశించిన సీడ్ సంఖ్య ప్రకారం సప్లై చేస్తాడు. ఒక రొయ్య సీడ్ రూ.2 నుంచి రూ. 2.50పైసల వరకు గడిచిన 2023–24 వరకు ఉండింది. అయితే 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రొయ్యల సీడ్కై ప్రభుత్వం బడ్జెట్ కేటాయించలేదు. దీనివల్ల గడిచిన ఏడాది రొయ్యలను వదలలేదు. ఈఏడాది సైతం అదే పరిస్థితి కనిపిస్తోంది. ఇంతవరకు రొయ్యల సీడ్కు అవసరమైన బడ్జెట్ను ప్రభుత్వం కేటాయించలేదు. ఫలితంగా ఈఏడాది సైతం రొయ్యల సీడ్ వదిలే విషయం పశ్నార్థకంగా మారింది. సీడ్ కోసం బడ్జెట్ కేటాయించని ప్రభుత్వం ఎదురుచూస్తున్న మత్స్యకారులు గతేడాది ఆర్థికంగా నష్టపోయిన వైనం మత్స్యకారులకు నష్టం రొయ్యలు బొన్లెస్గా ఉంటాయి. దీంతో వీటికి మార్కెట్లో డిమాండ్ ఉంటుంది. గద్వాల ప్రాంతంలో కేజీ రూ.300 నుంచి రూ.400 వరకు ధరలున్నాయి. అయితే రొయ్యల సీడ్ వదిలిన ఆరు, ఏడు నెలల తర్వాత రిజర్వాయర్ పరిధిలోని మత్స్యపారిశ్రామిక సంఘాల్లోని మత్స్యకారులు వలల ద్వార పట్టుకొని విక్రయిస్తారు. చేపలు, రొయ్యల పెంపకం, విక్రయం ద్వార ఆధారపడి ఇక్కడి మత్స్యకారలు జీవనం సాగిస్తున్నారు. మధ్యరాత్రి రిజర్వాయర్లలోకి వెళ్లి వలలు కట్టి, తిరిగి తెల్లవారుజామున వలలో పడ్డ రొయ్యలను తీసి, మార్కెట్లో విక్రయించి వచ్చిన డబ్బుతో కుటుంబాన్ని పోషిస్తారు. కాగా రొయ్య సీడ్ను వదలకపోవడం వల్ల మత్స్యకారులు గడిచిన ఏడాది ఆర్థికంగా నష్టపోయారు. ఐదేళ్ల రొయ్యల ఉత్పత్తిని బట్టి గడిచిన ఏడాది 286 టన్నుల ఉత్పత్తి నష్టపోయారు. ఈ ఏడాది సైతం వదలకపోతే మరోసారి మత్స్యకారులు ఆర్థికంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడనుంది. -
వైభవంగా పవిత్రోత్సవాలు
ఎర్రవల్లి: బీచుపల్లి పుణ్యక్షేత్రంలోని కోదండరామస్వామి ఆలయంలో పవిత్రోత్సవాలు వైభవంగా కొనసాగాయి. ఉత్సవాలలో భాగంగా రెండో రోజైన గురువారం సుదర్శన్ నారాయణన్ ఆధ్వర్యంలో ఉదయం సుప్రభాతసేవ, విశేష తిరువారాదన, సన్నాయి వాయిద్యాల నడుమ పవిత్రమాలలతో గ్రామోత్సవం, యాగశాల ద్వారా తోరణ, ధ్వజకుంభారాదనలు, మహాకుంభ ఆరాదనలు, పవిత్ర ప్రతిష్ట, మూలమంత్ర హోమాలు, పవిత్ర ఆదివాస హోమాలు, లఘు పూర్ణాహుతి, మహా నైవేద్య నీరాజనములు, తీర్థ ప్రసాదగోష్టి వంటి పూజలు చేశారు. సాయంకాలం దివ్యప్రబంధ పారాయణం, యాగశాల ఆరాదనలు, నిత్యహోమం, శ్రీరామ మూలమంత్ర గాయత్రీ హోమం, లఘు పూర్ణాహుతి వంటి పూజా కార్యక్రమాలను వేద మంత్రాల నడుమ అర్చకులు అంగరంగ వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ మేనేజర్ సురేందర్ రాజు, పాలక మండలి సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. నేడు సామూహిక వరలక్ష్మి వ్రతం బీచుపల్లి కోదండరామస్వామి ఆలయంలో శుక్రవారం ఉదయం 10.30 గంటలకు సామూహిక వరలక్ష్మి వ్రతం నిర్వహించనున్నట్లు ఆలయ మేనేజర్ సురేందర్ రాజు తెలిపారు. ఆసక్తి గల భక్తులు కార్యాలయంలో రూ.1516 చెల్లించి తమ పేరు నమోదు చేసుకోవాలని, అప్పుడే పూజకు అవసరమైన సామగ్రిని ఇవ్వనున్నట్లు తెలిపారు. -
చేనేత కార్మికుల సంక్షేమానికి కృషి
గద్వాల టౌన్: చేనేత రంగంలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని, ఎక్కడా లేని విధంగా ఈ రంగంలోని ప్రతి ఒక్కరి సంక్షేమానికి ప్రభుత్వం చిత్తశుద్దితో కృషిచేస్తోందని కలెక్టర్ సంతోష్ అన్నారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం స్థానిక ప్రైవేటు ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. చేనేత పరిశ్రమను అభివృద్ధి చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలను అమలు చేస్తున్నాయని చెప్పారు. గద్వాల జరీ చీరలు ఖండాంతర ఖ్యాతిని పొందడం గర్వకారణమని పేర్కొన్నారు. చేనేత అందాలు మన సంస్కృతికి చిహ్నాలన్నారు. వారసత్వంగా వచ్చిన చేనేతను కాపాడుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలను ధరించేలా ప్రోత్సహించాలన్నారు. అమెజాన్, ఫ్లిప్కార్డు, మిత్రా తదితర కంపెనీల ఆన్లైన్ మార్కెటింగ్ ద్వారా గద్వాల చేనేత విశ్వవ్యాప్తం అయిందని, దీన్ని మరింత విస్తృతం చేయడానికి కృషిచేస్తామన్నారు. జిల్లాలో 2,950 మగ్గాలకు జియోట్యాగ్ ఉందని చెప్పారు. నేతన్నకు చేయూతలో ఆరు వేల మంది కార్మికులు ఎంపికయ్యారన్నారు. చేనేత రుణమాఫీలో 1,761 మంది కార్మికులకు రూ. 12 కోట్లు మంజూరయ్యాని వివరించారు. కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో దేశ వ్యాప్తంగా తెలంగాణ, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు మాత్రమే ఎంపికయ్యాయని, అందులో గద్వాల చీరలకు ప్రాధాన్యత లభించడం హర్షించదగిన విషయమన్నారు. చేనేత వస్త్రాలను ఆదరించాలి ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రలను ధరించి చేనేత రంగాన్ని ప్రోత్సహించాలన్నారు. జిల్లాలోని నేతన్నలకు అన్ని రకాలుగా ప్రోత్సాహం అందిస్తామన్నారు. చేనేత జౌళిశాఖ అధికారి గోవిందయ్య చేనేత అభివృద్ధిలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చేనేత కార్మికులకు అందుబాటులో ఉండటం లేదని, ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు, రాయితీలను అందకుండా చేస్తున్నారని మండిపడ్డారు. ఇదిలాఉండగా, అంతకుముందు చేనేత, జౌళీశాఖ అధ్వర్యంలో పట్టణంలో ర్యాలీని ఎమ్మెల్యేతో కలిసి కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. స్థానిక పాతబస్టాండ్ నుంచి ప్రధాన రహదారుల గుండా చేనేత కార్మిక సంఘం ప్రతినిధుల ర్యాలీ కొనసాగింది. అనంతరం చేనేత ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా చేనేత రంగంలో వృత్తి నైపుణ్యాలు కనబర్చిన పలువురు చేనేత కార్మికులకు ప్రశంసా పత్రం అందజేశారు. వ్యాసరచన, ఉపన్యాస పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. చేనేత వస్త్రాలతో విద్యార్థులు నిర్వహించిన ఫ్యాషన్షో ఆకట్టుకుంది. కార్యక్రమంలో చేనేత శాఖ సహాయ సంచాలకులు గోవిందయ్య, చేనేత క్లస్టర్ చైర్మన్ రామలింగేశ్వర కాంమ్లే తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ అవసరం గద్వాలటౌన్: విద్యార్థులపై ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్ సంతోష్ సూచించారు. గురువారం జమ్మిచేడ ప్రభుత్వ పాఠశాలను కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. విద్యార్థుల చేత ఇంగ్లీష్ పాఠాలు చదివించారు. టీచర్లు బాగా చెబుతున్నారా అని ఆరా తీశారు. బాగా చదువుకోవాలని విద్యార్థినీలకు సూచించారు. ఆకట్టుకున్న విద్యార్థినుల సాంస్కృతిక ప్రదర్శన చేనేత ఫ్యాషన్ షో–8లో u కలెక్టర్ సంతోష్ ఘనంగా జాతీయ చేనేత దినోత్సవం స్ట్రాంగ్రూం వద్ద పటిష్ట భద్రత గద్వాల న్యూటౌన్: ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు (ఈవీఎంలు) భద్రపరిచిన స్ట్రాంగ్రూమ్ల వద్ద పటిష్ట భద్రత ఉంచాలని కలెక్టర్ బీ.ఎం. సంతోష్ అన్నారు. గురువారం కలెక్టరేట్ ఆవరణలో ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్రూమ్ను కలెక్టర్ సంబందిత అధికారులు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి తనిఖీ చేశారు. అక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పనితీరును చూశారు. -
ఆదాయ శాఖకు..అద్దె భవనాలే దిక్కా?
ఇబ్బందులు లేకుండా చూస్తాం.. నేను ఇటీవలే బాధ్యతలు చేపట్టాను. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల నూతన భవన ప్రతిపాదనలపై నాకు ఎలాంటి సమాచారం లేదు. అయితే కార్యాలయాలకు వచ్చే క్రయ విక్రయదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగు చర్యలు తీసుకుంటున్నాం. – ఫణీందర్, జిల్లా స్టాంపులు, రిజిస్ట్రేషన్లు అధికారి మెట్టుగడ్డ: ఉమ్మడి జిల్లాలోని స్టాంపులు, రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు సొంత భవనాలు కరువయ్యాయి. ప్రభుత్వానికి రూ.కోట్లలో ఆదాయం సమకూర్చే ఈ కార్యాలయాలు ఏళ్ల తరబడి అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. ఎంత ఆదాయం ఆర్జించినా.. కార్యాలయానికి సొంత భవనాలు సమకూర్చుకోలేని దుస్థితిలో ఈ శాఖ ఉంది. సరైన వసతులు లేకపోవడంతో అక్కడ పనిచేసే ఉద్యోగులు, సిబ్బందితోపాటు రిజిస్ట్రేషన్ల కోసం వచ్చే క్రయవిక్రయదారులు సైతం ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంది. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల మాట అలా ఉంటే.. ఉమ్మడి జిల్లాలోని రిజిస్ట్రేషన్ కార్యాలయాల వ్యవహారాలు పర్యవేక్షించే జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయం కూడా అద్దె భవనంలోనే కొనసాగుతుండటం మరో విశేషం. ఆడిట్, చిట్ రిజిస్ట్రార్ కార్యాలయాలు సైతం ఇందులోనే ఉన్నాయి. వివిధ పనుల నిమిత్తం కార్యాలయాలకు వచ్చే ప్రజలు, ఉద్యోగులకు సైతం వాహనాలు నిలిపేందుకు పార్కింగ్ స్థలం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రెండు చోట్లే పక్కా భవనాలు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 12 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉండగా.. ఇందులో కేవలం కల్వకుర్తి, ఆత్మకూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు మాత్రమే పక్కా భవనాలు కలిగి ఉన్నాయి. మిగతా పది కార్యాలయాలు అద్దె భవనాల నుంచే రిజిస్ట్రేషన్ సేవలు అందిస్తున్నాయి. వీటికి గాను రూ.వేలల్లో ప్రతినెలా అద్దె చెల్లిస్తున్నారు. ఏళ్లతరబడిగా ఇలా చెల్లిస్తున్న అద్దెలతోనే పక్కా భవనాలు నిర్మించవచ్చని ప్రజలు విమర్శిస్తున్నారు. అయితే మక్తల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని ఇటీవల నూతన భవనంలోకి మార్చినా.. అద్దె నిర్ణయించలేదని అధికారులు చెబుతున్నారు. వసతులు లేక అవస్థలు.. జిల్లాలోని 10 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు అద్దె భవనాల్లో కొనసాగుతుండగా.. ఎక్కడా సరైన వసతులు లేవు. ఒక్కో కార్యాలయానికి సగటున ప్రతిరోజు వందమంది వరకు వస్తుండటంతో మూత్రశాలలు, మరుగుదొడ్లు, పార్కింగ్, తాగునీరు వంటివి లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నారాయణ పేటలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం చిన్నగా ఉండటంతో పార్కింగ్ లేక అవస్థలు పడుతున్నారు. అచ్చంపేటలో చిన్నపాటి రోడ్డులో ఉండటంతో వాహనాలు కూడా వెళ్లలేని దుస్థితి నెలకొంది. ప్రైవేట్ ఇళ్లలో కొనసాగుతున్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఆదాయం ఎక్కువ.. వసతులు తక్కువ వాహనాల పార్కింగ్కూ స్థలం కరువు అవస్థలు పడుతున్న క్రయవిక్రయదారులు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఇదే పరిస్థితి -
భూ సమస్యలు సత్వరం పరిష్కరించండి
గద్వాల: రాష్ట్ర ప్రభ్వుం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న భూభారతిలో వచ్చిన అర్జీలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ బీఎం సంతోష్ తహసీల్దార్లను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్హాలులో తహసీల్దార్లతో సమీక్షించారు. భూసమస్యలపై వచ్చిన దరఖాస్తులలో ఆయా మాడ్యుల్స్లో ఎన్ని అర్జీలు పరిష్కరించారు, ఎన్ని పెండింగులో ఉన్నాయని, పరిష్కారం కాని వాటికి సంబంధించి ఎంతమందికి నోటీసులు జారీ చేశారు క్షేత్రస్థాయిలో పరిశీలన ప్రక్రియ పూర్తి చేశారా..వంటి అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా దరఖాస్తుల పరిష్కారంలో జరుగుతున్న జాప్యానికి గల కారణాలను ఆరా తీశారు. సక్సేషన్, పెండింగ్ ముటేషన్, పీవోపీ, డీఎస్ వంటి అన్ని పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా అసైన్మెంట్ భూములు పూర్తిగా పరిశీలించేందుకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి నివేదికను సమర్పించాలన్నారు. వచ్చే వారం నిర్వహించే సమీక్షలో పరిష్కారం చూపేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అదేవిధంగా మీసేవ ద్వారా 2024 వరకు దరఖాస్తు చేసిన వివిధ సర్టిఫికెట్లు పెండింగ్లో లేకుండా వారంరోజుల వ్యవధిలో పరిష్కరించాలన్నారు. రేషన్కార్డు దరఖాస్తులలో చాలా వరకు పరిష్కరించగా పెండింగులో ఉన్నవాటిని త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ వి.లక్ష్మీనారాయణ, ఆర్డీవో అలివేలు, తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు. మందులు అందుబాటులో ఉంచాలి గద్వాల క్రైం: సీజనల్ వ్యాధులు ప్రబలే నేపథ్యంలో ప్రజలకు ఆహార అలవాట్లు, శుభత్ర, వ్యాధుల నివారణ, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై తెలియజేయాలని, అలాగే ఆస్పత్రుల్లో అవసరమైయ్యే మందులను అందుబాటులో ఉంచుకోవాలని కలెక్టర్ బీఎం సంతోష్ ఆదేశించారు. బుధవారం గద్వాలలోని గాంధీచౌక్ బస్తీ దవాఖానాను ఆయన ఆకస్మికంగా సందర్శించి రోగులకు అందుతున్న సేవలను అక్కడి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ప్రసవాలు, శస్త్ర చికిత్సల రికార్డులను పరిశీలించారు. గర్భిణుల విషయంలో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. రోగులను మెరుగైన చికిత్సల పేరుతో మరో ఆసుపత్రికి రెఫర్ చేసిన క్రమంలో వాటికి సంబంధించిన పూర్తి నివేదికలను ఉన్నతధికారులకు సిబ్బంది అందజేయలన్నారు. కలెక్టర్ వెంట జిల్లా ఇంచార్జ్ వైద్యాధికారి సిద్దప్ప తదితరులు ఉన్నారు. -
బీసీ రిజర్వేషన్లపై కేంద్రం చర్చించాలి
గద్వాల: బీసీ రిజర్వేషన్లపై కేంద్ర ప్రభుత్వం ప్రస్తుత పార్లమెంట్ సమావేశంలో చర్చించాలని, బీసీ రిజర్వేషన్లకు తాను సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి అన్నారు. బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రప్రభుత్వం బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించాలని అసెంబ్లీలో తీర్మానం చేసిన సందర్భంలో తాను కూడా సంపూర్ణ మద్దతు తెలిపినట్లు చెప్పారు. ఢిల్లీలో బీసీలకు 42శాతం రిజర్వేషన్ కల్పించాలని చేపట్టిన ధర్నాకు సంపూ ర్ణమద్దతు తెలుపుతున్నట్లు చెప్పారు. బీసీ రిజర్వేషన్ బిల్లుపై కేంద్రం ఆమోదించి మద్దతు పలకాలన్నారు. అదేవిధంగా ఎంతో కాలంగా నూతన రేషన్కార్డుల కోసం ఎదురుచూస్తున్న ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం మంజూరీ చేయడంతో వారి ఇబ్బందులు తొలిగాయన్నారు. పేదల సొంతింటి కల సాకారం చేసేలా రాష్ట్ర ప్రభుత్వం గద్వాల నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసిందని, పనులు వేగవంతంగా జరుగుతున్నాయన్నారు. నియోజకవర్గ పరిధిలో 7విద్యుత్తు సబ్స్టేషన్లకు రూ.18.70కోట్లు మంజూరీ అయ్యాయని, వీటి నిర్మాణానికి అవసరమైన 40.20ఎకరాల భూమిని కేటాయించినట్లు పనులు కూడా త్వరలోనే ప్రారంభమవుతాయన్నారు. అలాగే, విద్యుత్ గోదాం, విద్యుత్ పరికరాల స్టోర్, 10వేల మెట్రిక్ టన్నుల కెపాసిటీతో రెండు గిడ్డంగుల నిర్మాణాల కోసం రూ.20.50 కోట్లు మంజూరయ్యాయన్నారు. మల్దకల్లో పీఏసీఎస్ నూతన భవనం, వరికొనుగోలు కేంద్రం, బీసీ స్టడీసర్కిల్ నూతన భవనం(రూ.3కోట్లు), మహిళా సమాఖ్య భవననిర్మాణం(రూ.5కోట్లు), గ్రామీణ స్వయం ఉపాధిశిక్షణ సంస్థ భవనం(రూ.2కోట్లు), వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రి కోసం 33/11కేవీ విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణం కోసం రూ.4.50 కోట్లు మంజూరీ అయినట్లు తెలిపారు. గద్వాల నియోజకవర్గం అభివృద్ధికై సంపూర్ణ సహకారం అందిస్తున్న సీఎం, డీప్యూటీ సీఎం, ఉమ్మడి జిల్లా మంత్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు బాబర్, మురళి, విజయ్,శ్రీకాంత్రెడ్డి, రఘు, తిమ్మప్ప, ప్రభాకర్గౌడ్, కురుమన్న తదితరులు పాల్గొన్నారు. -
ఏసీబీకి చిక్కిన ఇరిగేషన్ ఏఈఈ
మహబూబ్నగర్ క్రైం: మరో అవినీతి చేప ఏసీబీకి చిక్కింది. రూ.3 వేలు లంచం తీసుకుంటూ ఓ ఏఈఈ రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. వివరాల్లోకి వెళితే.. ఏసీబీ డీఎస్పీ సీహెచ్ బాలకృష్ణ కథనం ప్రకారం.. మహబూబ్నగర్ ఇరిగేషన్ సబ్ డివిజన్–1లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఏఈఈ)గా పనిచేస్తున్న మహ్మద్ ఫయాజ్.. ఓ వ్యక్తి తన 150 గజాల ప్లాట్కు సంబంధించి ఎల్ఆర్ఎస్, ఎన్ఓసీలను ఆన్లైన్లో అప్లోడ్ చేసేందుకు రూ.5 వేలు డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు రూ.3 వేలు లంచం ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. అనంతరం ఈ విషయాన్ని బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. కాగా.. బుధవారం ఉదయం జిల్లాకేంద్రంలోని వన్టౌన్ చౌరస్తాలో ఉన్న ఓ బేకరి దగ్గరకు రావాలని ఏఈఈ ఫోన్ చేయడంతో బాధితుడు అక్కడికి వెళ్లి తన దగ్గర ఉన్న రూ.3 వేల నగదు ఇచ్చాడు. ఆ డబ్బులు తీసుకున్న ఏఈఈ జేబు లో పెట్టుకున్న కా సేపటికే అక్కడికి వచ్చిన ఏసీబీ బృందం రెడ్హ్యాండెడ్గా పట్టుకుంది. అనంతరం ఏఈఈని నేరుగా కార్యాలయానికి తీసుకెళ్లి.. ఆయన చాంబర్తో పాటు వన్టౌన్ ఏరియా లో ఆయన అద్దె ఇంట్లో సైతం సోదాలు నిర్వహించా రు. తనిఖీల్లో ఎలాంటి ఆస్తులు, నగదు లభ్యం కాలేద ని డీఎస్పీ వెల్లడించారు. మహ్మద్ ఫయాజ్ను గురువారం ఏసీబీ కోర్టు నాంపల్లిలో హాజరుపరుస్తామని తెలిపారు. రూ.3 వేలు లంచం తీసుకుంటూ చిక్కిన వైనం -
పొలాలకు ముప్పు..!
ఆరు వరుసల హైవేతో నీట మునుగుతున్న పంట పొలాలు ●అయిజ: భారత్మాల (ఆరు వరుసల హైవే రోడ్డు) కొందరు రైతుల పాలిట శాపంగా మారింది. ఇదివరకు పంటపొలాలకు ఏర్పాటు చేసుకున్న రోడ్లు మూతపడ్డాయని అసహనం వ్యక్తం చేయగా.. తాజాగా మరో చిక్కు వచ్చి పడింది. వర్షం కురిసిన ప్రతిసారి దాదాపు 55 నుంచి 60 ఎకరాల్లో వర్షం నీరు నిలిచిపోతుంది. దీంతో పంటలు మునిగిపోవడం, తేమ ఆరకుండా మొక్కలు ఎండిపోవడం, గిడసబారి పంటకు నష్టం వాటిల్లుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ముంబై, చైన్నె కారిడార్లో భాగంగా మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మీదుగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన భారతమాల రోడ్డు నిర్మాణంతో పంట పొలాలకు వెళ్లేందుకు రైతులు ఏర్పాటు చేసుకున్న ఎండ్ల బండ్ల రస్తాలు (దారులు) సైతం రోడ్డు నిర్మాణంలో మూతపడుతున్నాయి. దానికి తోడు మొన్న కురుసిన వర్షాలకు భారతమాల రోడ్డు అంచుకు ఉన్న పంటపొలాల్లో నీరు నిలుస్తుంది. రోడ్డు నిర్మాణం పనులు శరవేగంగా సాగుతుండడంతో రైతుల మనసుల్లో దిగులు మొదలైంది. ఆరు మండలాలు.. 53 కి.మీ.రోడ్డు నిర్మాణం భారతమాల రోడ్డు జిల్లాలో మొత్తం 53 కి.మీ. మేర నిర్మాణం చేపట్టారు. దీనికోసం రైతుల నుంచి ప్రభుత్వం 775 ఎకరాల భూమి స్వాధీనం చేసుకున్నారు. ఆరు మండలాల్లో నిర్మాణం పనులు శరవేగంగా నడుస్తున్నాయి. గద్వాల, అయిజ, మల్దకల్, కేటీ దొడ్డి, గట్టు, రాజోళి మండలాల మీదుగా హైవే నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. అందులో సుమారు 35 ఎకరాల ప్రభుత్వ భూమి కూడా ఉంది. తూంకుంట శివారులో భారత్మాల రోడ్డు పక్కన నీట మునిగిన వ్యవసాయ పొలం నీరు నిలుస్తుంది భారత్మాల రోడ్డు నిర్మాణం చేపట్టడంతో రైతుల పంట పొలాల్లో వర్షం నీరు నిలుస్తోంది. దీంతో కొంత మంది రైతుల పంట పొలాలు మునిగిపోతున్నాయి. వర్షంనీరు ఇంకిపోయిన అనంతరం భూమిలో తేమ ఆరిపోకుండా ఉండడంతో పంటకు నష్టం చేకూరుతుంది. దిగుబడి ఘననీయంగా పడిపోతుంది. ప్రజా ప్రతినిధులు, అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలి. – దావుద్, రైతు, అయిజ సమస్యలు పరిష్కరిస్తాం భారత్మాల రోడ్డు నిర్మాణంలో భాగంగా డీపీఆర్లో రూపొందించిన విధంగానే పనులు చేస్తున్నారు. అయితే పంట పొలాలకు వెళ్లే రోడ్లు మూతపడ్డాయని, పంట పొలాల్లో వర్షంనీరు నిలిచిపోతుందని రైతులు వాపోతున్నారు. రైతులు వారి సమస్యలను సంబంధిత అధికారులకు తెలియజేయాలి. రైతులకు నష్టం జరుగుతుందని మా దృష్టికి వస్తే నేషనల్ హైవే అథారిటీతో మాట్లాడి సమస్యలను పరిష్కరించేందుకు కృషిచేస్తాం. – లక్ష్మి నారాయణ, అదనపు కలెక్టర్ వర్షం కురిసిన ప్రతి సారి ఇక్కట్లు పంట నష్టం జరుగుతుందంటూ రైతుల ఆందోళన -
ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాలను కొనసాగిద్దాం
గద్వాల/గద్వాల క్రైం/ఎర్రవల్లి: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన జీవితాన్నే అంకితం చేసి త్యాగం చేసిన గొప్ప వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ అని పలువురు ప్రముఖులు కొనియాడారు. ప్రొఫెసర్ జయశంకర్ జయంతిని జిల్లా వ్యాప్తంగా నిర్వహించి నివాళులర్పించారు. ముందుగా కలెక్టరేట్లో బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు నిర్వహించగా.. కలెక్టర్ బీఎం సంతోష్ పూలమాల వేసి నివాళులర్పించారు. తెలంగాణ ప్రత్యేక సాధననే శ్వాసగా ఆశయంగా కొట్లాడిన వ్యక్తి గొప్పయోధుడు ప్రొఫెసర్ జయశంకర్ అన్నారు. ఆయన రచనలు, ఉపన్యాసాలు, పరిశోధనలు తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కీలక పాత్రపోషించాయన్నారు. తెలంగాణ రాష్ట్రం నిర్మాణం వె నక ఉన్న శక్తి ప్రొఫెసర్ జయశంకర్ విద్యారంగంలో చేసిన కృషి, సమానత్వం, ప్రాంతీయ న్యాయం వంటి అంశాలపై చేసిన అధ్యాయనాలు ఈతరం విద్యార్థులకు ఆదర్శంగా నిలుస్తాయన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వి.లక్ష్మీనారాయణ, బీసీ సంక్షేమశాఖ అధికారి నుషిత, వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. ● తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రొఫెసర్ జయశంకర్ నిరంతం కృషి చేశారని ఏఆర్ డీఎస్పీ నరేందర్ రావు అన్నారు. ఎస్పీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి మాట్లాడారు.తెలంగాణ ఉద్యమంలో సకల జనులను భాగస్వామ్యం చేయడానికి ప్రొఫెసర్ జయశంకర్ ఎంతో కృషి చేశారని గుర్తుచేశారు. ● తెలంగాణ రాష్ట సిద్దాంత కర్త, రాష్ట్ర సాధన కోసం నిరంతరం శ్రమించినటువంటి ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఆశయాలను ప్రతి ఒక్కరూ కొనసాగించాలని బీచుపల్లి పదో బెటాలియన్ ఇన్చార్జ్ కమాండెంట్ జయరాజు అన్నారు. ఎర్రవల్లి మండలంలోని బీచుపల్లి పదో బెటాలియన్లో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేశారు. ఎలాంటి పదవులు ఆశించకుండా కేవలం ప్రత్యేక తెలంగాణ లక్ష్యంగా పోరాడిన గొప్ప వ్యక్తి జయశంకర్ సార్ అని, ప్రజల్లో ఉద్యమ భావాజాలాన్ని వ్యాప్తి చేస్తూ రాష్ట్ర సాదన కోసం తన జీవితాన్ని అంకితం చేశారన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ తప్పకుండా ఆయన ఆడుగుజాడల్లో నడవాలని ఆయన సూచించారు. -
ఉత్తీర్ణత శాతం పెంచాలి
ధరూరు: ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తీర్ణతా శాతాన్ని పెంచేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని అదనపు కలెక్టర్ నర్సింగరావు అన్నారు. బుధవారం ఆయన మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించి పరిసరాలతో పాటు కంప్యూటర్ గదిని, లైబ్రరీ, వంట గదితో పాటు తరగతి గదులను, వాటర్ ఫిల్టర్ కేంద్రాన్ని పరిశీలించారు. విద్యార్థులనుద్దేశించి మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠాలల్లో నిష్ణాతులైన ఉపాధ్యాయులు ఉంటారని, ప్రతి ఒక్కరు ప్రభుత్వ పాఠశాలల్లోనే చదవాలన్నారు. విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాలు, యూనిఫాం, మధ్యాహ్న భోజనం అందిస్తుందని, సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మెనూ ప్రకారం భోజనం అందించాలన్నారు. పస్తుత సమాజంలో ప్రతీది ఆన్లైన్, కంప్యూటర్తో ముడిపడి ఉందని విద్యార్థులు కంప్యూటర్ పరిజ్ఞానాన్ని పెంచుకోవాలన్నారు. ఈ సందర్భంగా హెల్పింగ్ హ్యాండ్స్ ట్రస్టు ఆద్వర్యంలో 10వ తరగతి విద్యార్థులకు కొరకు తెచ్చిన స్టడీ మెటీరియల్ను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంఈఓ రవీంద్రబాబు, ఎంపీడీఓ మంజూల, జీహెచ్ఎం ప్రతాప్రెడ్డి, ట్రస్టు చైర్మన్ రత్నసింహారెడ్డి, శ్రీనివాస్రెడ్డి, నర్సింహులు పాల్గొన్నారు. మెడికల్ ఏజెన్సీలో తనిఖీలు గద్వాల క్రైం: జిల్లా కేంద్రంలో వెలసిన మెడికల్ ఏజెన్సీలో జిల్లా ఇన్చార్జ్ ఔషధ నియంత్రణ అధికారి వినయ్ బుధవారం తనిఖీలు నిర్వహించారు. తనిఖీలో మందుల క్రయ విక్రయాలు, సరఫరాల రికార్డులను పరిశీలించారు. ఈ క్రమంలో సుంకులమ్మ మెట్ సమీపంలోని ఓ ఏజెన్సీ నిర్వాహకులు మల్దకల్, కర్నూల్ జిల్లా ఎమ్మిగనూర్ మండలం తదితర ప్రాంతాల్లోని ఆర్ఎంపీలుగా ఉన్న వ్యక్తులకు మందులు సరఫరా చేసేందుకు వారితో ఒప్పందం చేసుకుంటున్నట్లు తెలిసిందని, అలాగే, జిల్లా కేంద్రంలోని వివిధ మెడికల్ దుకాణాలకు మందులు పంపిణీ చేసినట్లు రికార్డులలో నమోదు చేసినట్లు వివరించారు. కంపెనీల నుంచి కొనుగోలు చేసిన మందుల బిల్లులు, ఇప్పటి వరకు విక్రయాలు చేసిన వివరాలపై విచారణ చేపడుతున్నట్లు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించి ఆర్ఎంపీలకు మందులు సరఫరా చేయడం తనిఖీల్లో వెల్లడైందన్నారు. దీంతో మెడికల్ ఏజెన్సీ లైసెన్స్ను 15 రోజుల పాటు సస్పెండ్ చేశామన్నారు. మందుల క్రయ విక్రయాలపై నిర్వాహకుల నుంచి రికార్డులను సీజ్ చేశామని, తదుపరి చర్యలపై త్వరలో తెలియజేస్తామని వినయ్ పేర్కొన్నారు. సీపీఐ సభలు వాయిదా గద్వాల: సీపీఐ జిల్లా మహాసభలు ఈ నెల 14వ తేదీకి వాయిదా పడినట్లు ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ఆంజనేయులు తెలిపారు. 7వ తేదీన జరగాల్సిన సభలు అనివార్య కారణాల వల్ల వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. చదువుతోనే గుర్తింపు గద్వాలటౌన్: జీవితంలో మనిషిని ఉన్నత స్థితికి చేరేందుకు దోహదపడేది చదువేనని, విద్య నేర్చుకున్నప్పుడే సమాజావృద్ధి జరుగుతుందని ప్రభుత్వ పీజీ కళాశాల ప్రిన్సిపాల్ చవ్వా వెంకట్రెడ్డి పేర్కొన్నారు. బుధవారం స్థానిక ప్రభుత్వ కళాశాలలో పీజీ రెండో సంవత్సర విద్యార్థులకు వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ సాంకేతికను అందిపుచ్చుకోవాలన్నారు. అనంతరం విద్యా ర్థులు ఆట పాటలతో ఆకట్టుకున్నారు. ప్రొఫెసర్లు అరవిందు, మంగళగిరి శ్రీనివాసులు, గణేష్, గోపినాథ్, రాథోడ్, మహేందర్, రవిషెరీన్, రఫీ, గట్టయ్య పాల్గొన్నారు. -
సాక్ష్యాధారాల సేకరణ వేగవంతం : ఎస్పీ
గద్వాల క్రైం: నేరం జరిగిన ప్రాంతాల్లో సమర్థవంతంగా, వేగవంతంగా సాక్ష్యాధారాలు సేకరించేందుకు వీలుగా ప్రభుత్వం జిల్లాకు మొబైల్ ఫోరెన్సిక్ వాహనం కేటాయించిందని ఎస్పీ శ్రీనివాసరావు చెప్పారు. మంగళవారం మొబైల్ ఫోరెన్సిక్ వ్యాన్ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. నేరం జరిగిన ప్రదేశంలో వేలి, కాలిముద్రలు, నార్కొటిక్, పేలుడు పదార్థాలు ఇతర అన్నిరకాల ఆధారాలను విచారణ అధికారులు మరింత వేగంగా, అత్యాధునిక పద్ధతుల్లో సేకరించేందుకు మొబైల్ ఫోరెన్సిక్ వాహనం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఈ వాహనంలో ప్రత్యేకంగా శిక్షణ పొందిన సిబ్బంది విధుల్లో ఉంటారన్నారు. ఘటనా స్థలాల్లో లభించే ఆధారాలను ఎప్పటికప్పుడు అనాలసిస్ చేయడానికి దోహ ద పడుతుందన్నారు. వాహనానికి ప్రత్యేక కెమెరా, ఫ్రిడ్జ్, మోడ్రన్ లైట్లు, డిజిటల్ పరికరాలు తదితర సాంకేతిక పరమైన టూల్స్ అందుబాటులో ఉన్నా యని తెలిపారు. విపత్కర కేసుల ఛేదనలో మొబైల్ ఫోరెన్సిక్ వాహనం కీలకంగా ఉంటుందన్నారు. కా ర్యక్రమంలో డీఎస్పీ మొగిలయ్య పాల్గొన్నారు. -
ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి
గద్వాలన్యూటౌన్: ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యూఎస్పీసీ), వివిధ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. యూఎస్పీసీ ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా కేంద్రంలోని పాతబస్టాండ్ ప్రాంతంలో ధర్నా చేపట్టగా.. పలు సంఘాలు, పార్టీల నాయకులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా టీఎస్యూటీఎఫ్ జిల్లా అద్యక్షుడు రమేశ్ మాట్లాడుతూ.. పెండింగ్లో ఉన్న ఐదు డీఏలను విడుదల చేయడంతో పాటు సీపీఎస్ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పీఆర్సీ నివేదికను వెంటనే తెప్పించుకొని అమలు చేయాలన్నారు. కేజీబీవీలో పనిచేస్తున్న వారిని రెగ్యులరైజ్ చేయాలని.. గురుకులాల్లో పనిచేస్తున్న వారికి 010 పద్దు కింద వేతనాలు చెల్లించాలన్నారు. అనంతరం డీటీఎఫ్ జిల్లా ప్రధానకార్యదర్శి ఉదయ్కిరణ్, సీపీఎం కార్యదర్శి వెంకటస్వామి, సీఐటీయూ కార్యదర్శి నర్సింహ, రిటైర్డ్ ఉద్యోగ, పెన్షనర్ల సంఘాల నాయకులు ఆర్.మోహన్, స్వామి, అబ్దుల్బాబు మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్య, వైద్య రంగాలను నిర్వీర్యం చేయడానికి ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. జీపీఎస్ బిల్లులు చెల్లించాలని, రిటైర్డ్ అయిన రోజే అన్నిరకాల బెనిఫిట్స్ అందించాలని డిమాండ్ చేశారు. అనంతరం అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణకు వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు రామన్గౌడ్, ఇక్బాల్, రవికుమార్, నాగర్దొడ్డి వెంకట్రాములు, అతికూర్ రహ్మన్, గోపాల్, కురువ పల్లయ్య, ప్రభాకర్, వినోద్ పాల్గొన్నారు. -
మహిళల ఆర్థికాభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం
గద్వాల: మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని కలెక్టర్ బీఎం సంతోష్, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్హాల్లో మంగళవారం గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇందిరా మహిళాశక్తి సంబురాల్లో వారు ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు. ఇందిరా మహిళాశక్తి పథకంతో రాష్ట్రంలో కోటిమంది మహిళలకు కోటీశ్వరులను చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. అందులో భాగంగా సోలార్ విద్యుత్ ప్లాంట్లు, పెట్రోల్బంకులు, మహిళాశక్తి క్యాంటీన్లు, ఆర్టీసీ బస్సులకు యజమానులుగా చేసి.. ప్రతినెలా రూ.లక్ష ఆదాయం పొందే విధంగా చర్యలు చేపట్టిందన్నారు. పెట్రోల్బంకు, సోలార్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు నాలుగు ఎకరాల చొప్పున కేటాయిస్తున్నట్లు చెప్పారు. గద్వాల నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లను మహిళల పేరుపై మంజూరు చేయడం జరిగిందన్నారు. గద్వాల మండలంలో 1,587 కుటుంబాలకు కొత్త రేషన్కార్డులు ఇవ్వడంతో పాటు 4,877 మంది పేర్లను కొత్తగా రేషన్కార్డుల్లో చేర్చినట్లు తెలిపారు. అంతే కాకుండా మహిళా సంఘాలకు రూ. 50.61లక్షల వడ్డీలేని రుణాలతో పాటు 53 సంఘాలకు రూ. 7.87కోట్ల బ్యాంకు లింకేజీ రుణాలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. అనంతరం మహిళా సంఘాల సభ్యులకు రుణ చెక్కులతో పాటు లబ్ధిదారులకు కొత్త రేషన్కార్డులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వి.లక్ష్మీనారాయణ, మార్కెట్ కమిటీ చైర్మన్ హనుమంతు పాల్గొన్నారు. -
వరిధాన్యం కొనుగోలుకు ముందస్తు ఏర్పాట్లు
గద్వాల: వానాకాలంలో పండించే వరిధాన్యం కొనుగోలుకు ముందస్తు ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ వి.లక్ష్మీనారాయణ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన పరికరాలను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. అదే విధంగా ధాన్యంపై క్వింటాల్కు పెరిగిన మద్దతు ధరపై రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. ప్రస్తుతం ఉన్న పరికరాలను వెంటనే మార్కెట్ కమిటీలకు అప్పగించాలని తెలిపారు. సమావేశంలో జిల్లా మార్కెటింగ్శాఖ అధికారి పుష్పమ్మ, డీఎస్ఓ స్వామికుమార్, డీఎం విమల, జిల్లా కోఆపరేటివ్ అధికారి శ్రీనివాసరావు, ఏఓ సిద్ధయ్య తదితరులు ఉన్నారు.విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దాలిఅలంపూర్/మల్దకల్/మానవపాడు: ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దాలని ఇంటర్ బోర్డు డిప్యూటీ సెక్రటరీ, ఉమ్మడి జిల్లా ప్రత్యేకాధికారి విశ్వేశ్వర్ అధ్యాపకులకు సూచించారు. మంగళవారం అలంపూర్, మల్దకల్, మానవపాడు జూనియర్ కళాశాలల్లో ఆయన ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పలు రికార్డులను పరిశీలించడంతో పాటు అధ్యాపకుల పనితీరుపై ఆరా తీశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ప్రతి జూనియర్ కళాశాలలో పూర్తిస్థాయిలో అధ్యాపకులు ఉన్నారన్నారు. పదో తరగతి ఉత్తీర్ణత సాధించిన ప్రతి విద్యార్థి ప్రభుత్వ కళాశాలలో చేరే విధంగా చొరవ చూపాలన్నారు. రాష్ట్ర కమిషనర్, కార్యదర్శి ఆదేశాల మేరకు అడ్మిషన్ల సంఖ్య పెంచాలని సూచించారు. అలంపూర్, మానవపాడు కళాశాలల్లో మౌలిక వసతుల కల్పనకు నిధులు కేటాయించినట్లు చెప్పారు. కళాశాల ల్యాబ్కు సంబంధించిన ఇన్ఫ్రా కోసం ప్రతిపాదనలు పంపాలన్నారు. ప్రతి శనివారం విద్యార్థులతో క్రీడలు ఆడించాలన్నారు. ఎంసెట్, నీట్, జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్డ్ సీఏ వంటి పోటీ పరీక్షలకు విద్యార్థులను సన్నద్ధం చేసేందుకు ప్రత్యేకంగా సమయ పట్టిక రూపొందించాలని సూచించారు. విద్యార్థుల ఆపార్ నమోదు త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఇంటర్మీడియట్ జిల్లా నోడల్ అధికారి హృదయరాజు, ప్రిన్సిపాల్స్ పద్మావతి, కృష్ణ, పద్మావతి పాల్గొన్నారు.రేపు జాతీయ చేనేత దినోత్సవంగద్వాల: జిల్లా కేంద్రంలో ఈ నెల 7న జాతీయ చేనేత దినోత్సవం నిర్వహించనున్నట్లు చేనేత, జౌళిశాఖ ఏడీ గోవిందయ్య మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని పాతబస్టాండ్ నుంచి అనంత ఫంక్షన్హాల్ వరకు నిర్వహించే ర్యాలీలో కలెక్టర్ బీఎం సంతోష్, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహరెడ్డి పాల్గొంటారని పేర్కొన్నారు. అనంతరం ఫ్యాషన్ షో ఉంటుందన్నారు. అదే విధంగా విద్యార్థులకు వ్యాసరచన, ఉపన్యాస పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు.పాఠశాల పరిశీలనధరూరు: మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను మంగళవారం యునెస్కో ప్రతినిధి సైదులు పరిశీలించారు. ప్రధానంగా పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేకంగా సర్వే నిర్వహించారు. మరుగుదొడ్ల నిర్వహణ, వాటి శుభ్రత, తాగునీరు, తడి, పొడి చెత్త నిర్వహణ, తరగతి గదుల శుభ్రత తదితర వాటిపై వివరాలు నమోదు చేసుకున్నారు. పాఠశాలలో నూతనంగా నిర్మిస్తున్న అదనపు గదులు, కంప్యూటర్ ల్యాబ్ను పరిశీలించారు. ఆయన వెంట జీహెచ్ఎం ప్రతాప్రెడ్డి ఉన్నారు. -
రైతులపై ఆర్థిక భారం..
2024 వానాకాలం నుంచి రాయితీపై కూరగాయల, ఎండుమిర్చి విత్తనాలను అందిస్తామని ప్రస్తుత సర్కార్ పేర్కొంది. అయితే గతేడాదితో పాటు ఈసారి కూడా రాయితీపై విత్తనాలు ఇవ్వలేదు. సర్కార్ మాట నిలబెట్టుకోలేకపోవడంతో ఉద్యాన రైతులపై ఆర్థిక భారం పడుతోంది. ప్రధానంగా కూరగాయలు సాగుచేసేది సన్న, చిన్నకారు రైతులే. ఏటా విత్తనాలకే రూ. 6వేల నుంచి రూ. 8వేల వరకు వెచ్చిస్తున్నారు. రాయితీ ఉన్నప్పుడు రూ. 3వేల నుంచి రూ. 4వేలు మాత్రమే ఖర్చయ్యేదని రైతులు అంటున్నారు. రాయితీపై విత్తనాలు అందిస్తేనే ప్రయోజనం చేకూరుతుందని పేర్కొంటున్నారు. ఇక ఎండుమిర్చి రైతుల పరిస్థితి ఏమాత్రం బాగా లేదు. ఏటా ధరలు రాక నష్టపోతున్నారు. ఇక కంపెనీలు, రకాలను బట్టి విత్తనాలకే వేలాది రూపాయలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. గుంటూరు మిర్చి రకాలు కేజీ రూ. 600 నుంచి రూ. 900 వరకు ఉంది. ఎకరాకు కనీసంగా 3కిలోలు కావాల్సి ఉంటుంది. కొన్ని రకాలను కంపెనీలు పాకెట్ల రూపంలో ఇస్తారు. ఒక పాకెట్ ధర రూ.700 నుంచి రూ.900 వరకు ఉంది. ఎకరాకు 12 పాకెట్లు కావాల్సి ఉంటుంది. ఇలా ఉద్యాన రైతులు విత్తనాలకు కోసం అధికంగా వ్యయం చేస్తున్నారు. ప్రభుత్వం ఉద్యాన రైతులకు రాయితీ అవకాశం కల్పిస్తేనే ప్రయోజనం చేకూరుతుంది. -
రాయితీ.. ఉత్తిమాటే!
కూరగాయలు, మిరప రైతులకు అందని ప్రభుత్వ ప్రోత్సాహం ●గద్వాల వ్యవసాయం: ఉద్యాన పంటల విత్తనాలను 50శాతం రాయితీపై ఇస్తామన్న సర్కార్ హామీ నీటిమూటగానే మారింది. ఏడేళ్ల క్రితం వరకు ఆర్కేవీవై (రాష్ట్రీయ కృషి విజ్ఞాన్ యోజన) పథకం కింద కూరగాయల విత్తనాలను రాయితీపై అందించే వారు. ప్రస్తుతం ఈ పథకం తీగజాతి కూరగాయల సాగుకు ఏర్పాటుచేసే పందిళ్లకే పరిమితమైంది. కూరగాయలు, మిర్చి పండించే రైతుల ఆశలు అడియాశలుగానే మారాయి. జిల్లాలో విస్తారంగా సాగు.. జిల్లాలో ఉద్యాన పంటలకు నేలలు అనుకూలంగా ఉన్నాయి. ఇక్కడ సాధారణ పంటలతో పాటు కూరగాయలను ఏటా రెండు సీజన్లలో విస్తారంగా పండిస్తారు. గద్వాల మండలంలో వంకాయ, బెండ, పచ్చిమిర్చి, చిక్కుడు, క్యాలిఫ్లవర్, క్యాబేజీ, ధరూర్ మండలంలో బెండ, టమాట మల్దకల్ మండలంలో చిక్కుడు, టమాటా, బీర, సోరకాయ, బెండ, కాకర, అయిజలో బెండ, చిక్కుడు, వడ్డేపల్లిలో వంకాయ, బెండ, కాకర, క్యాబేజీ, క్యాలిఫ్లవర్, ఉల్లి, అలంపూర్లో ఉల్లి, రాజోళిలో పచ్చిమిర్చి, ఉల్లి, టమాటా పండిస్తారు. ఇక ఎండుమిర్చి సాగుపై ఈ ప్రాంత రైతులు ఎక్కువగా మక్కువ చూపుతున్నారు. మానవపాడు, అలంపూర్, ఇటిక్యాల, ఉండవెల్లి, రాజోళి, అయిజ, కేటీదొడ్డి, గట్టు మండలాల్లో ఏటా దాదాపు 30వేల ఎకరాలకు పైగా ఎండుమిర్చి సాగు అవుతోంది. సబ్సిడీపై విత్తనాలు అందించాలి.. నాకున్న మూడెకరాల్లో ఏటా రెండు సీజన్లలో కూరగాయలు పండిస్తాను. ఏడేళ్ల క్రితం వరకు కూరగాయల విత్తనాలు, మార్కెట్కు తరలించడానికి ట్రేలు సబ్సిడీపై ఇచ్చే వారు. దీనివల్ల పెట్టుబడి భారం కొంత తగ్గేది. ఇప్పుడు సబ్సిడీ లేకపోవడంతో పెట్టుబడులు పెరుగుతున్నాయి. ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం సబ్సిడీపై విత్తనాలు అందించాలి. – సుదర్శన్రెడ్డి, కూరగాయల రైతు, గద్వాల పెట్టుబడులు పెరుగుతున్నాయి.. నాకున్న ఆరెకరాలతో పాటు మరో నాలుగు ఎకరాలు కౌలుకు తీసుకొని గతేడాది వరకు ఎండుమిర్చి సాగు చేశాను. ఏటా పెట్టుబడులు పెరుగుతున్నాయి. ధరలు రావడం లేదు. విత్తనాలకే వేలకు వేలు అవుతున్నాయి. అందుకే ఈఏడాది మూడెకరాల్లో మాత్రమే వేశాను. ప్రభుత్వం సబ్సిడీపై విత్తనాలు అందిస్తే కొంత పెట్టుబడి సాయం అవుతుంది. – వెంకటేశ్వర్లు, మిర్చిరైతు, చిన్నిపాడు, మానవపాడు మండలం పందిళ్లకు మాత్రమే..ఆర్కేవీవై పథకం కింద తీగజాతి కూరగాయలు పండించేందుకు అవసరమైన పందిళ్లను 50 శాతం రాయితీపై అందిస్తాం. ఇక కూరగాయల, ఎండుమిర్చి విత్తనాలను రాయితీపై అందించడం లేదు. – ఎంఏ అక్బర్, జిల్లా ఉద్యానశాఖ అధికారి భారంగా మారిన విత్తనాల కొనుగోలు ఆర్కేవీవై పథకంతో లబ్ధి చేకూరని వైనం నీటిమూటగానే మారిన సర్కారు హామీ పందిళ్లకే పరిమితం.. ఉద్యాన పంటలను ప్రోత్సహించడంలో భాగంగా కూరగాయల రైతులకు ప్రయోజనం చేకూర్చేలా అప్పట్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఆర్కేవీవై పథకానికి శ్రీకారం చుట్టాయి. ఈ పథకం ద్వారా రాయితీపై కూరగాయల విత్తనాలతో పాటు, ట్రేలు, తీగజాతి కూరగాయలకు అవసరమయ్యే పందిళ్లకు 50శాతం రాయితీ అందించే వారు. దీంతో చాలా మంది రైతులు ప్రభుత్వ రాయితీని సద్వినియోగం చేసుకునే వారు. పండించిన కూరగాయలను మార్కెట్కు తరలించడానికి వినియోగించే ట్రేళ్లను కూడా రాయితీపై తీసుకునేవారు. అయితే ఆర్కేవీవై పథకం కింద ఇవన్నీ 2015–16 వరకు అందించారు. ఆ తర్వాత ఏడాది నుంచి ఈ పథకం కేవలం పందిళ్ల ఏర్పాటుకే పరిమితమైంది. -
రాములు దారెటో..?
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్/సాక్షి, నాగర్కర్నూల్: బీఆర్ఎస్ను వీడుతూ బీజేపీలో చేరనున్న మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఉదంతం ఉమ్మడి పాలమూరు జిల్లావ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. రెండు దశాబ్దాలుగా పైగా గులాబీ పార్టీలో క్రియాశీలకంగా పనిచేసిన గువ్వల అనూహ్యంగా పార్టీ మారడం పట్ల బీఆర్ఎస్ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది. ఆయనతో పాటు మరికొందరు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు సైతం పార్టీని వీడుతారన్న ప్రచారం నేపథ్యంలో వారంతా అయోమయంలో ఉన్నారు. అయితే పార్టీ మార్పుపై వదంతుల వ్యాప్తి ఉధృతంగా మారిన క్రమంలో పలువురు మాజీ ఎమ్మెల్యేలు స్పందిస్తూ తాము పార్టీ వీడేది లేదని తెగేసి చెబుతున్నారు. గువ్వల బీజేపీలో చేరుతుండటంతో బీఆర్ఎస్తో పాటు బీజేపీలోని నేతలను సైతం కలవరపెడుతుండటం గమనార్హం.గువ్వల వెంట వెళ్లేందుకు కేడర్ విముఖత..మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బీఆర్ఎస్ను వీడి బీజేపీలో చేరుతున్నట్టు తన ముఖ్య అనుచరులు, కేడర్గా ముందుగానే చెప్పారు. వారి నుంచి సహకారం కావాలని, తనతో పాటుగా బీజేపీకి రావాలని ఆహ్వానిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్లో బీజేపీతో కలిసే అవకాశం ఉన్న నేపథ్యంలో వారి కన్నా ముందే తాము బీజేపీలో చేరితే గౌరవం నిలబడుతుందని కేడర్తో చెబుతున్నారు. తద్వారా జాతీయ రాజకీయాల్లోనూ క్రియాశీలకంగా పనిచేయవచ్చని అంటున్నారు. అంబేద్కర్ ఆశయాలు, జాతీయవాదాన్ని ఆచరించే పార్టీతో పని చేస్తానని చెప్పారు. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం ఆయనతో వెళ్లేందుకు బీఆర్ఎస్ కేడర్ విముఖంగా ఉందని తెలుస్తోంది. అచ్చంపేట నియోజకవర్గంలోని బీఆర్ఎస్ మాజీ ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతలు, అనుచరులు గువ్వల పాటు బీజేపీకి వెళ్లేందుకు నిరాసక్తతను కనబరుస్తున్నారు. ఇప్పటికే గువ్వల పార్టీ మారుతున్న ప్రచారం మొదలైన క్రమంలోనే సోమవారం సీఎం రేవంత్ సమక్షంలో పదర మండల మాజీ జెడ్పీటీసీ సభ్యుడు, గువ్వల ముఖ్య అనుచరుడు రాంబాబునాయక్ కాంగ్రెస్లో చేరారు. ప్రధానంగా అచ్చంపేట నియోజకవర్గంలో బీజేపీ ప్రభావం తక్కువగా ఉండటం, బీజేపీ కన్నా బీఆర్ఎస్ కేడర్ బలంగా ఉందన్న భావన నేపథ్యంలో ఎక్కువ మంది అనుచరులు బీజేపీలో చేరడానికి విముఖంగా ఉన్నట్టు తెలుస్తోంది. -
గట్టులో యూనిసెఫ్ బృందం పర్యటన
గద్వాల/గట్టు: గ్రామీణ ప్రాంతంలోని చిన్నారులు, గర్భిణులు, బాలింతల్లో పోషక లోపాన్ని నివారించేందుకు చేపడుతున్న చర్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకునేందుకు గాను మంగళవారం యూనిసెఫ్ బృందం గట్టులో పర్యటించింది. యూనిసెఫ్ ఇండి యా న్యూట్రీషన్ చీఫ్ మారీక్లాడ్, స్పెషలిస్టు సమీర్ మాణిక్రావు పవార్, హైదరాబాద్ ఫీల్డ్, న్యూట్రీషన్ స్పెషలిస్టు ఖ్యాతి తివారీ, ఎస్బీసీ సీమాకురమార్, న్యూట్రీషన్ ఆఫీసర్ రేషా దేశాయ్, కన్సల్టెంట్ నర్సింగరావు, డీడబ్ల్యూఓ సునంద తదితరులతో కూడిన బృందం గట్టు సంతబజారు అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించారు. అంగన్వాడీ కేంద్రం పరిధిలో పోషణలోపం, అతి తీవ్ర పోషణలోపం పిల్లల గుర్తింపు.. తల్లిదండ్రులు తీసుకుంటున్న జాగ్రత్తలపై ఆరా తీశారు. గర్భిణులు, బాలింతలకు అంగన్వాడీ ద్వారా అందిస్తున్న సేవలతో పాటు రోజు వారీగా తీసుకునే ఆహారం తదితర వివరాలను తెలుసుకున్నారు. మహిళా సంఘాలు నిర్వహిస్తున్న వ్యాపారాలు, ఆర్థిక లావాదేవీలను పరిశీలించారు. అనంతరం నేతాజీ చౌక్లో ఆరోగ్య ఉపకేంద్రాన్ని పరిశీలించారు. వారి వెంట ఎస్బీసీసీ కోఆర్డినేటర్ శృతి అప్పింగికర్, ఏఐఐఎస్ ప్రాజెక్టు శాస్త్రవేత్త శిరీష, సురేశ్, హరినీలేష్, జశ్వంత్నాయుడు, ఎంపీడీఓ చెన్నయ్య ఉన్నారు. ● చిన్నారుల సంక్షేమంపై యూనిసెఫ్ బృందం సూచనలు పాటిస్తామని కలెక్టర్ బీఎం సంతోష్ అ న్నారు. ఐడీఓసీ వీడియో కాన్ఫరెన్స్హాల్లో యూనిసెఫ్ బృందంతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా యూనిసెఫ్ బృందం పలు సూచనలు చేసింది. సమావేశంలో అదనపు కలెక్టర్ నర్సింగ్రావు, డీఎంహెచ్ఓ డా.సిద్ధప్ప, జిల్లా సంక్షేమశాఖ అధికారిణి సునంద, డీపీఓ నాగేంద్రం ఉన్నారు. -
మెనూ ప్రకారం భోజనం అందించాలి
గద్వాల: ప్రభుత్వం సూచించిన మేరకు విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించకపోతే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ బీఎం సంతోష్ హెచ్చరించారు. సోమవారం సాయంత్రం గద్వాల పట్టణంలోని చింతలపేటలో ఎస్సీ సంక్షేమ వసతిగృహాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా వసతిగృహంలోని స్టోర్రూం, వంటగది, కాంపౌండ్లోని పరిసర ప్రాంతాల్లో కలియతిరిగారు. ఈసందర్భంగా ఆయన విద్యార్థులతో మాట్లాడారు. పాఠ్యపుస్తకంలోని ప్రశ్నలు అడిగారు. దూరప్రాంతాల నుంచి విద్య కోసం ఇంత దూరం వచ్చారని, ఏమాత్రం నిర్లక్ష్యం వహించకుండా క్రమశిక్షణతో ముందుకెళ్లాలని విద్యార్థులకు సూచించారు. స్వయంగా విద్యార్థుల హాజరును పరిశీలించి విద్యార్థుల హాజరు వందశాతం లేని యెడల సక్రమంగా హాజరు కాని వారిపేర్లు తొలగించి వారి స్థానంలో కొత్తవారిని చేర్చుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఎస్సీ సంక్షేమశాఖ జిల్లా అధికారి నుషితా, వార్డెన్లు శ్రీను, ఽమధు, రామకృష్ణ పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పరిశీలన అనంతరం పట్టణంలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించారు. పనుల నాణ్యతపై ఏమాత్రం రాజీపడకుండా ప్రతిదశలో పనులు వేగంగా చేయాలన్నారు. ప్రతిఇంటిని అనుమతించిన 600 చదరపు అడుగుల లోపే నిర్మించేలా లబ్ధిదారులకు తెలియజేయాలని, అవసమరైన ఇసుక, మట్టిని అందజేయాలని, ఏఏ పనులు పూర్తయితే వాటి వివరాలు దశలవారిగా ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. లబ్ధిదారులకు విధిగా డబ్బులు జమచేయాలన్నారు.కార్యక్రమంలో మున్సిపల్ కమీషనర్ దశరథ్, హౌసింగ్పీడీ కాశీనాథ్ తదితరులు పాల్గొన్నారు. -
వరుణుడిపైనే ఆశలు..!
జిల్లాలో జూన్, జూలైలో సాధారణం కంటే కనిష్ట వర్షపాతం నమోదు ●గద్వాల: వానాకాలానికి ముందుగానే మే నెలలో ముందస్తుగా వర్షాలు కురవడంతో రైతులు ఎంతో సంతోషించారు. దుక్కులు దున్ని పంటలు సాగుచేసుకునేందుకు సిద్ధం చేసుకున్నారు. ఖరీఫ్లో మెట్టపంటలైన పత్తి, వేరుశనగ, మొక్కజొన్న, పొగాకు, ఆముదాలు, కందులు, కూరగాయలు వంటి పంటలు 1,73,211 ఎకరాల్లో సాగుచేశారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ, జూన్, జూలైలో సాధారణ వర్షపాతం కంటే కూడా తక్కువ వర్షపాతం నమోదు కావడంతో సాగుచేసిన పంటలు ఎండుముఖం పడుతూ రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. దీంతోపాటు వానాకాలంలో సమృద్ధిగా కురవాల్సిన వర్షాలు.. కురవకపోవడంతో భూగర్భజలాలపై కూడా ప్రభావం చూపుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో ఆశలతో రైతులు పంటలు సాగు చేయగా.. వరుణుడు కురవాల్సిన సమయంలో మాత్రం ముఖం చాటేశాడు. ప్రధానంగా జూన్, జూలై మాసాల్లో సాధారణం కంటే కూడా కనిష్ట వర్షపాతం నమోదైంది. వాస్తవానికి జూన్లో 84.4మిల్లీ మీటర్ల మేర వర్షం నమోదు కావాల్సి ఉండగా.. అందుకు భిన్నంగా 72.4మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. కేవలం 5 రోజులు మాత్రమే వర్షం కురవగా మిగిలిన 25రోజుల పాటు వర్షమే కురవలేదు. అంటే సాధారణం కంటే 13.5 శాతం వర్షపాతం కనిష్టంగా కురిసింది. అదేవిధంగా జూలైలో సాధారణ వర్షం 112.1 మి.మీటర్లు కురవాల్సి ఉండగా, అందుకు భిన్నంగా కనిష్టంగా 96.9 మి.మీటర్ల వర్షం కురిసింది. కేవలం 9 రోజులు మాత్రమే వర్షం కురిసింది. 22రోజుల పాటు వర్షం జాడేలేదు. అంటే 13.6శాతం వర్షపాతం కనిష్టంగా కురిసింది. కనిష్ట వర్షపాతం నమోదు పత్తి పంట ఎండుతుంది.. గతేడాది పత్తిపంట దిగుబడి బాగా వచ్చింది. ఈసారి ముందస్తు వర్షాలు కురవడంతో 11 ఎకరాల్లో పత్తి పంట సాగుచేశాను. కానీ, జూన్, జూలై రెండు నెలల్లో సరైన వర్షాలు కురవనేలేదు. బాగా కాపుకాసి చెట్టు పెరిగే దశలో నీరు అందకుండా పోయింది. మొక్క పెరుగుదల అనుకున్నంతగా పెరగలేదు. ఇప్పటికే ఎకరాకు రూ.70వేల చొప్పున మొత్తం రూ.7లక్షల వరకు పెట్టుబడి పెట్టాను. మరో వారం రోజుల్లో సరైన వర్షాలు కురవకపోతే పంట మొత్తం ఎండిపోతుంది. – నాయుడు, బోరెల్లి, మానవపాడు దిగుబడిపై ప్రభావం జూన్, జూలై నెలలో సాధారణ వర్షపాతం కంటే కూడా తక్కువ వర్షాలు కురిశాయి. దీంతో వర్షాధార పంటలకు ఇబ్బందులు తలెత్తాయి. మరో వారం, పది రోజుల్లో ఇలాగే వర్షాలు కురవకపోతే పంటల దిగుబడిపై తీవ్ర ప్రభావం పడుతుంది. – సక్రియానాయక్, డీఏఓ ఇప్పటికే 1.70 లక్షల ఎకరాల్లో మెట్టపంటలు సాగు ఎండుముఖం పడుతున్న పత్తి, మిరప, వేరుశనగ పంటలు రూ.వేల పెట్టుబడులు పెట్టామంటూ ఆందోళనలో రైతులు -
సీఎం సార్.. మా సమస్యలు పట్టించుకోండి
గట్టు : గట్టులోని ఉన్నత పాఠశాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని విద్యార్థులు సీఎం రేవంత్రెడ్డికి పోస్టుకార్డుల ద్వారా విన్నవించారు. హై స్కూల్లో నెలకొన్న సమస్యలపై విద్యాశాఖ అధికారులకు పలు మార్లు విన్నవించినా సమస్యను పరిష్కరించకపోవడంతో విద్యార్థులు సోమవారం నేరుగా సీఎం రేవంత్రెడ్డికు సమస్యలను పోస్టుకార్డు ద్వారా తెలియజేయాలనే ఉద్దేశంతో పోస్టు కార్డులను పంపారు. పాఠశాల విద్యార్థులు సమస్యలతో సతమతమవుతున్నారని, వారి సమస్యలను పరిష్కరించాలని పీడీఎస్యూ జిల్లా అధ్యక్షుడు హలీంపాష డిమాండ్ చేశారు. పీడీ పోస్టు ఖాళీగా ఉందని, ఉపాధ్యాయుల కొరత, గదుల కొరత చాలా ఉందని తెలిపారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి గట్టు హైస్కూల్ సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలని డిమాంఢ చేశారు. -
‘నౌరోజ్ కళా బృందానికి’ రాష్ట్రస్థాయి గుర్తింపు
అయిజ: లలిత కళా సమాఖ్య సేవా సామాజిక సంస్కృతి ఆధ్వర్యంలో హైదరాబాద్లో ఆదివారం నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ 31వ సువర్ణ కంకరణ అవార్డు సంబరాల్లో అయిజ మండలం నౌరోజ్ క్యాంప్ కళా బృందం ఉత్తమ ప్రతిభ కనబర్చి మొదటి బహుమతి గెలుపొందింది. ఈ గెలుపులో అయిజ మండలం దేవబండ గ్రామానికి చెందిన మాస్టర్ శివకుమార్ ప్రత్యేక పాత్ర పోషించారు. వీరి కుటుంబం మూడు తరాల నుంచి కోలాటం నేర్పిస్తూ.. ఇంటిపేరే కోలంట్లగా మారింది. ఇదిలాఉండగా, హైదరాబాద్లోని కోలాట ప్రదర్శనలో మొత్తం 9 రాష్ట్రాల బృందాలు పాల్గొనగా.. రాష్ట్రం తరపు నుంచి మాస్టర్ శివకుమార్ ఆధ్వర్యంలో అయిజ మండలానికి చెందిన నౌరోజ్ క్యాంప్ కళా బృందం పాల్గొనింది. ఈమేరకు ఉత్తమ ప్రతిభ కనబర్చగా ఈ బృందానికి ప్రథమ, ఏపీ బృందానికి ద్వితీయ, కేరళ బృందానికి తృతీయ బహుమతి లభించింది. ఈమేరకు నిర్వాహకులు మాస్టర్కు బంగారు కంకణం, మెడల్, బృందం సభ్యులకు ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ రుద్రరాజు పద్మరాజు, ఎమ్మెల్యే కోమటిరెడ్డి, సినీ నటులు జార్జారావు, శివాజీ రాజు పలువురు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా సోమవారం పలువురు ప్రముఖులు కోలాటం శివకుమార్ను, నౌరోజ్ క్యాంప్ కళా బృందాన్ని అభినందించారు. -
1.73 లక్షల ఎకరాల్లో పంటలు సాగు
మే నెలలో వర్షాలు కురవడంతో మెట్ట పంటలు సాగుచేసుకునేందుకు రైతులు భూములు దుక్కులు దున్నుకుని సిద్ధం చేసుకున్నారు. మృగశిరకార్తిలో పత్తి, వేరుశనగ, ఆముదం, మొక్కజొన్న, కందులు వంటి వివిధ రకాల పంటలు సాగుచేశారు. ఈ ఏడాది ఖరీఫ్లో మొత్తం 1,73,211 ఎకరాల్లో పంటలు సాగుచేయగా ఇందులో 1.50 లక్షల ఎకరాల్లో మెట్టపంటలు సాగుచేశారు. ఈ పంటలన్ని కూడా పూర్తిగా వర్షాధారంగానే పండుతాయి. ఇదిలాఉండగా, సాధారణంగా జూన్ చివర, జూలై మాసంలో సమృద్ధిగా వర్షాలు మొదలవుతాయి. అయితే ఈ సారి మే నెలలోనే వర్షాలు కురిశాయి. మే నెలలో జిల్లా వ్యాప్తంగా 117.3మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. వాస్తవానికి మే నెలలో సాధారణ వర్షపాతం 25.8 మి.మీటర్లు కురవాల్సి ఉండగా.. అధికంగా కురిసింది. -
రేపటి నుంచి బీచుపల్లిలో పవిత్రోత్సవాలు
ఎర్రవల్లి: బీచుపల్లి పుణ్యక్షేత్రంలోని కోదండరామస్వామి ఆలయంలో 6వ తేదీ నుంచి 9వ వరకు పవిత్రోత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ మేనేజర్ సురేందర్ రాజు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో భాగంగా 6న విశ్వకేశ ఆరాధన, పుణ్యహం, రక్షాబంధనం, 7న మంగళవాయిద్యాల నడుమ పవిత్ర గ్రామ ప్రదక్షణం, వేద ప్రబంధ పారాయణం, 8న మూల మూర్తి హోమాలు, పూర్ణాహుతి, అనంతరం సామూహిక వరలక్ష్మి వ్రతాలు, 9న లక్ష్మీ హయగ్రీవ స్వామి వారి తిరుకళ్యాణ మహోత్సవం, ఉత్సవ పరిసమాప్తి, వేద ఆశీర్వచనం వంటి కార్యక్రమాలతో ఉత్సవాలు ముగియనున్నట్లు తెలిపారు. శివాలయంలో ప్రత్యేక పూజలు బీచుపల్లి పుణ్యక్షేత్రంలోని శివాలయంలో సోమవారం భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. శ్రావణమాసం అందులోనూ రెండో సోమవారం కావడంతో ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. ఉదయాన్నే అధిక సంఖ్యలో ప్రజలు బీచుపల్లికి చేరుకొని కృష్ణానదిలో స్నానాలు ఆచరించి శివుడిని దర్శించుకొన్నారు. -
రాజకీయ కలకలం
అబ్రహం దారెటు? అలంపూర్ మాజీ ఎమ్మెల్యే అబ్రహం బీజేపీలో చేరే అవకాశాలు ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రచారంపై ఆయన స్పందించలేదు. పార్టీ మార్పును ఇప్పటివరకు ధ్రువీకరించలేదు. అలంపూర్ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి సీటు దక్కలేదు. దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే కాంగ్రెస్లోనూ వర్గపోరు కొనసాగుతోంది. ఈ క్రమంలో ఆయన బీజేపీ వైపు అడుగులు వేస్తున్నారన్న ప్రచారం సాగుతోంది. ఇప్పటికే చర్చలు జరిగినట్టు చెబుతున్నా పార్టీ మార్పుపై ఎలాంటి నిర్ణయం వెలువడలేదు. అయితే స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే సమయానికి పార్టీ మార్పుపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఆయన ముఖ్య అనుచరులు చెబుతున్నారు. ● కారు పార్టీకి గుడ్బై చెప్పిన మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ● ఈ నెల 9న బీజేపీలో చేరే అవకాశం? ● ప్రచారంలో మరికొందరు మాజీ ఎమ్మెల్యేల పేర్లు సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్/ సాక్షి, నాగర్కర్నూల్: బీఆర్ఎస్ పార్టీ నాగర్కర్నూల్ జిల్లా అధ్యక్షుడు, అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పార్టీకి రాజీనామా చేయడం బీఆర్ఎస్లో ప్రకంపనలు సృష్టించింది. ఆయనతో పాటు మరికొందరు మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారన్న ప్రచారం నేపథ్యంలో ఉమ్మడి పాలమూరు జిల్లావ్యాప్తంగా తీవ్రంగా చర్చ సాగుతోంది. రెండు దశాబ్దాలుగా గులాబీ పార్టీలో క్రియాశీలకంగా పనిచేసిన గువ్వల పార్టీ వీడుతుండటంతో ఏం జరుగుతోందన్న ఆందోళన పార్టీ కేడర్లో నెలకొంది. ఈనెల 9న ఆయన బీజేపీలో చేరే అవకాశం ఉందని, ఆయనతో పాటు మరికొందరు మాజీ ఎమ్మెల్యేలు సైతం బీజేపీ గూటికి చేరుతారన్న ప్రచారం జరుగుతోంది. ప్రాధాన్యత లేదని.. బీఆర్ఎస్ పార్టీలో 2007లో చేరిన గువ్వల బాలరాజు మొదటి నుంచి క్రియాశీలకంగా ఉన్నారు. 2009లో మొదటిసారిగా నాగర్కర్నూల్ పార్లమెంట్ స్థానం నుంచి బీఆర్ఎస్, టీడీపీ కూటమి అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. తర్వాత 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో అచ్చంపేట ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచాక ప్రభుత్వ విప్గా వ్యవహరించారు. ప్రస్తుతం బీఆర్ఎస్ నాగర్కర్నూల్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో నాగర్కర్నూల్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా సీటు ఆశించినా భంగపాటు ఎదురైంది. ఈ సీటును ఆర్ఎస్ ప్రవీణ్కుమార్కు కేటాయించడంతో అసంతృప్తికి గురయ్యారు. పార్టీలో తనకు ప్రాధాన్యతను తగ్గిస్తున్నారని, పార్టీ అధినేత కేసీఆర్ తనను పట్టించుకోవడం లేదని అనుచరులతో చెబుతున్నారు. భవిష్యత్లో బీఆర్ఎస్, బీజేపీ పొత్తు పెట్టుకుంటారని, వారి కన్నా ముందే తానే బీజేపీలో చేరుతున్నట్లు ముఖ్య అనుచరులతో స్పష్టం చేశారు. అయోమయంలో పార్టీశ్రేణులు.. గువ్వల బాలరాజు పార్టీకి రాజీనామా చేయడం, ఆయనతో పాటు మరికొందరు మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు బీజేపీలో చేరనున్నారన్న ప్రచారం నేపథ్యంలో గులాబీ పార్టీ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది. అకస్మాత్తుగా గువ్వల రాజీనామా, పార్టీ మార్పు ప్రకటనతో పార్టీలో ఏం జరుగుతోందన్న అయోమయంలో పార్టీ శ్రేణులు ఉన్నారు. గువ్వల రాజీనామా క్రమంలో మిగతా నేతలు కూడా అదే బాటలో పడుతున్నారన్న ప్రచారం, వదంతుల నేపథ్యంలో పలువురు నేతలు స్పందించి పార్టీ మార్పు ప్రచారాన్ని ఖండిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీలో ప్రకంపనలు ఎప్పటికీ పార్టీ లైన్లోనే ఉంటా: జైపాల్యాదవ్ చివరి శ్వాస వరకు బీఆర్ఎస్తోనే: మర్రి తాను చివరి శ్వాస వరకు బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటానని, పార్టీ మారే ఆలోచన తనకు లేదని నాగర్కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి స్పష్టం చేశారు. తాను పార్టీ మారుతున్నట్టు సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారాన్ని ఖండించారు. పార్టీ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మార్గ దర్శకాలతో పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తానని చెప్పారు. తాను ఎప్పటికీ బీఆర్ఎస్ పార్టీ లైన్లోనే ఉంటానని కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. గువ్వల నిర్ణయంతో తమకు సంబంధం లేదని చెప్పారు. తాను నిత్యం పార్టీ కార్యకర్తల నడుమ ఉంటున్నానని, బీఆర్ఎస్ పార్టీ కోసమే నిరంతరం పని చేస్తానని స్పష్టం చేశారు. -
ఫిర్యాదుల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి
గద్వాల: వివిధ సమస్యలపై ప్రజావాణికి వచ్చే ఫిర్యాదుల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో సమావేశం హాలులో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా జిల్లాలోని వివిధ గ్రామాలకు చెందిన ప్రజలు మొత్తం 43 ఫిర్యాదులను నేరుగా కలెక్టర్కు అందించారు. వాటిని ఆయా శాఖలకు చెందిన అధికారులకు పంపించారు. వీటిని వెంటనే పరిష్కరించాలని, పరిష్కారం కానిపక్షంలో అందుకు గల కారణాలు వివరిస్తూ సంబంధిత ఫిర్యాదుదారుడికి అక్నాలెడ్డ్మెంట్ ద్వారా తెలియజేయాలని సూచించినట్లు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు వి.లక్ష్మీనారాయణ, నర్సింగ్రావు కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు. పోలీస్ గ్రీవెన్స్కు 21 వినతులు గద్వాల క్రైం: జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పోలీస్ గ్రీవెన్స్ కార్యక్రమానికి మొత్తం 21 ఫిర్యాదులు అందాయి. ఎస్పీ శ్రీనివాసరావు ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులు స్వీకరించారు. ప్రధానంగా భూ వివాదం, ఆస్తి తగదాలు, అప్పుగా తీసుకున్న వ్యక్తులు డబ్బులు చెల్లించడం లేదని ఫిర్యాదులు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. వీలైనంత త్వరగా సమస్యలను పరిష్కరిస్తామని, బాధితులకు న్యాయం చేస్తామని వివరించారు. సివిల్ సమస్యలపై కోర్టు ద్వారా పరిష్కారం చేసుకోవాలన్నారు. కలెక్టర్కు సన్మానం గద్వాల: వెనుకబడిన జిల్లాల అభివృద్ధి కోసం నీతిఅయోగ్ ద్వారా చేపట్టిన సంపూర్ణత అభియాన్ కార్యక్రమంలో భాగంగా గట్టు మండలం ఆరుకీలక సూచికలలో ఉత్తమ ప్రగతి సాధించింది. దీంతో దేశంలోనే గట్టుకు ఉత్తమ ర్యాంకు రావడంతో గవర్నర్ విష్ణుదేవ్వర్మ చేతుల మీదుగా రాజ్భవన్లో కలెక్టర్ బీఎం సంతోష్ ఈ నెల 2వ తేదీన అవార్డు అందుకున్నారు. ఈనేపథ్యంలో అవార్డు పొందిన కలెక్టర్ను జిల్లా అధికారులు సోమవారం ఘనంగా సన్మానించారు. రేపు జాబ్ మేళా కందనూలు: జిల్లాకేంద్రంలోని నేషనల్ ఐటీఐ కళాశాలలో బుధవారం జాబ్మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి, శిక్షణ శాఖాధికారి రాఘవేంద్రసింగ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. అపోలో ఫార్మసీ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో వివిధ కేటగిరీల్లో వంద ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. జిల్లాలోని యువతీ, యువకులు 10వ తరగతి, డిగ్రీ, ఫార్మసీ, పాసై 18–35 ఏళ్లలోపు నిరుద్యోగులు హాజరుకావాలని సూచించారు. పూర్తి వివరాలకు సెల్ నం.97012 00819 సంప్రదించాలని కోరారు. పాలిటెక్నిక్ కళాశాలలో స్పాట్ అడ్మిషన్లు కోస్గి రూరల్: కోస్గి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో మిగిలిన సీట్ల భర్తీకి స్పాట్ అడ్మిషన్లు చేపట్టామని కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాసులు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ కోర్సులలో సీట్లు ఉన్నా యని తెలిపారు. ఈ నెల 5వ తేదీ నుంచి 11వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకోవాలని అన్నారు. విద్యార్థులు తమ ఒరిజినల్, జిరాక్స్ సర్టిఫికెట్లతో కళాశాలలో సంప్రదించాలని కోరారు. కాల్వలో జమ్ము తొలగింపునకు చర్యలు అమరచింత: భూత్పూర్ రిజర్వాయర్ నుంచి ప్రదాన ఎడమ కాల్వ నుంచి అమరచింత పెద్ద చెరువుకు సాగునీరు అందడంలో ఆలస్యం అవుతుండటంతో కాల్వలో ఉన్న జమ్మును తొలగించేందుకు ఇరిగేషన్ అధికారులు ముందుకు వచ్చారు. అమరచింత,పాంరెడ్డిపల్లి, పిన్నంచర్ల గ్రామాలకు చెందిన పలువురు రైతులు తమ చెరువులకు సాగునీరు అందడం లేదని విషయాన్ని ఇరిగేషన్ అధికారులకు విన్నవించాలని మాజీ అడ్వకేట్ జనరల్ దేశాయి ప్రకాష్రెడ్డికి ఆదివారం కలిసి విన్నవించారు. తమ సొంత డబ్బులను వెచ్చించి జమ్ము తొలగిస్తామని అధికారులకు తెలపడంతో సోమవారం ఇరిగేషన్ అధికారులు కాల్వ వెంట ఎన్ని మీటర్ల పొడవున జమ్ము, ముళ్ళ పొదలు వ్యాపించి ఉన్నాయనే విషయాలను కాల్వ వెంట తిరుగుతూ పరిశీలించారు. త్వరగా జమ్ము తొలగించే కార్యక్రమం చేపడతామని ఇరిగేషన్ అధికారులు తెలిపారు. -
పర్యావరణహిత విద్యుత్ ఉత్పత్తి చేద్దాం
కొల్లాపూర్: పెరుగుతున్న డిమాండ్, భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని పర్యావరణ హితమైన విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు ప్రణాళిక రూపొందించాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఆదివారం ఉదయం ఆయన నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలంలోని సోమశిలలో జెన్కో, ట్రాన్స్కో అధికారులతో విద్యుదుత్పత్తి, వినియోగం, ఉత్పాదక సామర్థ్యం తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. హైడల్ పవర్తోపాటు పంప్డ్ స్టోరేజీతో పెద్దఎత్తున విద్యుదుత్పత్తి చేసి వినియోగంలోకి తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 23 పాయింట్స్ గుర్తించి, వాటిమీద సమగ్ర నివేదిక ఇవ్వాలని సూచించారు. కృష్ణానదిపై ఉన్న జూరాల నుంచి పులిచింతల వరకు గల హైడల్ ప్రాజెక్టులను సమీక్షించాలని అధికారులను ఆదేశించారు. ఇందుకోసం అవసరమైతే అంతర్జాతీయంగా పేరుగాంచిన కన్సల్టెంట్ల సహకారం తీసుకోవాలని చెప్పారు. సోలార్ ద్వారా పగటిపూట ఉత్పత్తి చేసే విద్యుత్ను స్టోరేజీ చేసి రాత్రివేళల్లో వినియోగించుకునేందుకు అవసరమైన సాంకేతిక, స్టోరేజీ వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఆధునిక సాంకేతిక వినియోగానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు. 1978లోనే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం తోషిబా, మిస్టుబుషి వంటి సంస్థల సాంకేతికతను వినియోగించుకున్న విషయాలను ఆయన గుర్తుచేశారు. సాంకేతికత వినియోగం కోసం కిందిస్థాయి అధికారులకు శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు. విద్యుత్ శాఖ అధికారులతో సమీక్ష అనంతరం స్థానిక లంబాడీ గిరిజనులతో డిప్యూటీ సీఎం మాట్లాడారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క -
చేనేత కార్మికులకు కేంద్రమంత్రి సన్మానం
గద్వాల: నేషనల్ డెవ్లప్మెంట్ హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్ ఆధ్వర్యంలో వీవర్ సర్వీసింగ్ సెంటర్ ద్వారా ఎలక్ట్రానిక్ జాకార్డ్స్ సబ్సిడీపై లబ్ధిపొందిన గద్వాలకు చెందిన ఎనిమిది మంది చేనేత కార్మికులను కేంద్ర మంత్రి జి.కిషన్రెడ్డి సన్మానం చేశారు. ఆదివారం ఎన్హెచ్డీసీ వారు హైదరాబాద్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చేనేత కార్మికులు శ్రీహరి, శివశంకర్, శ్రీను, సరిత, హిమబిందు, మల్లిఖార్జున్, వెంకటేష్, రాధను కేంద్రమంత్రి మంత్రి సన్మానించారు. కార్యక్రమంలో నిఫ్ట్ డైరెక్టర్ మాలిని, అక్కల శాంతారాం, హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. దేశభక్తి చాటుదాం గద్వాల: విజ్ఞానం, వినోదం, వికాసం, ఆటపాటలు వ్యాయమం వంటి శారీరక శ్రమ తగ్గిపోతున్న తరుణంలో విద్యార్థి దశలోనే ప్రతిభ పోటీలు నిర్వహించి వారిలో మనోవికాసాన్ని పెంపొందించేందుకు దోహదపడుతాయని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి అన్నారు. ఆదివారం ప్రజానాట్యమండలి ఆధ్వర్యంలో నిర్వహించే ప్రతిభపోటీలకు సంబంధించిన కరపత్రాన్ని తన క్యాంపు కార్యాలయంలో విడుదల చేశారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశభక్తిని చాటుదాం అనే నినాదంతో ప్రజానాట్యమండలి వాళ్లు చేపడుతున్న ఈ ప్రతిభపోటీలు మంచి కార్యక్రమం అన్నారు. కార్యక్రమంలో శ్రీనివాస్రెడ్డి, ఆశన్న, నాయకులు విజయ్, రాజశేఖర్, ఖలీల్ పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ దైవభక్తిని పెంపొందించుకోవాలి మల్దకల్ : మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రతి ఒక్కరూ భక్తి మార్గంలో నడుచుకుంటూ దైవ భక్తిని పెంపొందించుకోవాలని త్రిదండి దేవనాథ జీయర్ స్వామి భక్తులకు సూచించారు. ఆదివారం మండలంలోని అమరవాయిలో ఏర్పాటు చేసిన వెంకట్రామిరెడ్డి పరమావధి కార్యక్రమానికి త్రిదండి దేవనాథ జీయర్స్వామి హాజరై భక్తులకు వేదర్వశీచనాలు అందజేసి ప్రవచనాలు వినిపించారు. ప్రజలు చెడు వ్యసనాలకు దూరంగా ఉండి భక్తి మార్గంలో నడుచుకోవాలన్నారు. భగవద్గీత ద్వారా సమాజంలో ఉన్న కులమతాలను రూపుమాపడానికి ప్రజల మధ్య ఉన్న అసమానతలను తొలగించడానికి సర్వమతాలకు దేవుడు ఒక్కడేనని, ప్రజలలో దైవ భక్తిని పెంపొందించడానికి ఎంతో దోహదపడుతుందన్నారు. భక్తులు ఆధ్యాత్మికతను అలవరచుకోవడం వలన జీవితంలో రాణించి ఉన్నత స్థానాలను చేరుకునే వీలుంటుందన్నారు. భగవంతుని చేరడానికి నాలుగు మార్గాలు ఉన్నాయని తెలిపారు. కార్యక్రమంలో కరుణాకర్రెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, కృష్ణారెడ్డి, నారాయణరెడ్డి, భక్తులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలి గద్వాల: సీపీఎస్ రద్దు– ఓపీఎస్ అమలు కోసం పీఆర్టీయూ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 1వ తేదీన హైదరాబాద్లోని ఇందిరాపార్కులో మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆ సంఘం నాయకులు తిమ్మారెడ్డి తెలిపారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని పీఆర్టీయూ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం తన మేనిఫెస్టోలో పెట్టిన సీపీఎస్ రద్దును వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల హక్కుల పరిరక్షణలో భాగంగా సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ ని వెంటనే అమలు చేయాలని కోరారు. ఈ డిమాండ్ను కోరుతూ పీఆర్టీయూ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 1వ తేదీన హైదరాబాదులోని ఇందిరాపార్కు వద్ద మహాధర్నా చేపడుతున్నట్లు, కార్యక్రమంలో ఉపాధ్యాయులందరూ అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో యూనియన్ నాయకులు వేణుగోపాల్, నర్సింహారెడ్డి, పరమేశ్వర్రెడ్డి, వెంకట్నాయుడు, జాహేద్, రవిప్రకాష్రెడ్డి, ఎల్లస్వామి, గోవిందు తదితరులు పాల్గొన్నారు. -
అభివృద్ధిని ఇంటింటా వివరించండి
రాజోళి: బీజేపి హయాంలోనే గ్రామాల్లో నూతన శకం మొదలైందని.. బీజేపీ హయాంలో గ్రామాల్లో చేసిన అభివృద్ధిని ఇంటింటా వివరించాలని నాగర్కర్నూల్ మాజీ ఎంపీ పోతుగంటి రాములు అన్నారు. గృహ మహా సంపర్క్ అభియాన్లో భాగంగా ఆదివారం మండల కేంద్రం రాజోళిలో మండల అధ్యక్షుడు శశి కుమార్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరుగుతూ..బీజేపి ప్రభుత్వం, నరేంద్ర మోదీ ప్రధానిగా గ్రామాలకు అందించిన సేవలను వివరించారు. నేడు గ్రామాల్లో కనిపిస్తున్న అభివృద్ధి ప్రధాని మోదీ ద్వారానే సాధ్యమైందని అన్నారు. సీసీ రోడ్లు, ఉచిత బియ్యం, ముద్ర రుణాలు, విశ్వకర్మ రుణాలను అందించి సాధారణ, మద్య తరగతి ప్రజలకు మేలు చేసిందన్నారు. దేశ భద్రతలో భాగంగా ఆర్టికల్ 370 రద్దు, మైనార్టీ మహిళల కోసం త్రిపుల్ తలాక్ రద్దు, ఆపరేషన్ సిందూర్ చేపట్టి ఉగ్రమూకలను తోక ముడుచుకునేలా చేసిన ఘనత మోదీకే దక్కుతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరిత హామీలను ఇచ్చి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి, హామీలను తుంగలో తొక్కిందని అన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని అబద్దపు హామీలను, రిజర్వేషన్ల పేరుతో ఓట్లు కాజేసేందుకు మళ్లీ ప్రజల్లోకి వస్తుందని, వారిని ఎవరూ నమ్మే పరిస్థితి లేదన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంపై, బీజేపీ పాలనపై ప్రజలకు అపారమైన నమ్మకం ఉందని, రానున్న అన్ని ఎన్నికల్లో బీజేపి విజయఢంకా మోగిస్తుందని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల జిల్లా కన్వీనర్ రామచంద్రారెడ్డి మాట్లాడుతూ...ఈ నెల 4,5 తేదీలల్లో మండల నాయకులు, బూత్ అధ్యక్షులు, రాష్ట్ర నాయకులు 100 ఇళ్లకు తిరిగి బీజేపి ప్రభుత్వం చేసిన అభివృద్ది పనులను ప్రజలకు తెలియజేయాలన్నారు. కార్యక్రమంలో రాజగోపాల్,సంజీవ రెడ్డి,రాజశేఖర్,నాగేశ్వర్ రెడ్డి, నాగరాజు, గోవిందు రాజులు, గోపాల కృష్ణ, భగత్ రెడ్డి బీమన్న తదిదరులు పాల్గొన్నారు. -
అయ్యో దేవుడా!
ముంపునకు గురైన ‘ఆలూరు’ నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంలో భాగంగా ర్యాలంపాడు రిజర్వాయర్ నిర్మాణంలో ఆలూరు గ్రామం ముంపునకు గురైంది. 2016లో ర్యాలంపాడు రిజర్వాయర్ను పూర్తి స్థాయి 4 టీఎంసీల నీటిని నింపడంతో ఆలూరు గ్రామస్తులు గ్రామాన్ని ఖాళీ చేసి, పునరావాస కేంద్రంలోకి మకాం మారారు. ముంపు గ్రామస్తులకు అప్పట్లో బింగిదొడ్డి తండా సమీపంలో ప్రభుత్వం 130 ఎకరాల్లో పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేసి, 1,452 మందికి ప్లాట్లను కేటాయించింది. ఆలూరు ముంపు గ్రామస్తులతో పాటుగా ఆలయాలకు ప్రభుత్వం పరిహారాన్ని అందజేసింది. ఇక్కడి గ్రామస్తుల ప్రధాన దైవం ఆంజనేయస్వామి, శివాలయం. ఆలయాలకు ప్రభుత్వం సుమారుగా రూ.28 లక్షల పరిహారం అందజేస్తే.. బ్యాంకులో దాచుకున్న ఆ డబ్బులు ఇప్పుడు రెట్టింపయ్యాయి. ఈ నిధులు రూ. 50 లక్షలకు చేరాయి. రెండున్నర నెలల క్రితమే ఆలూరు పునరావాస కేంద్రంలో ఆంజనేయస్వామి, శివాలయాల నిర్మాణానికి ప్రభుత్వం టెండర్లను పిలిచి పనులు అప్పగించింది. పనులు ఇప్పటికి ప్రారంభం కాలేదు. ఆలూరు గ్రామంలోని ప్రధాన రహదారి పక్కనే ఉన్న 10 శాతం ఖాళీ స్థలంలో ఆంజనేయస్వామి, శివాలయంలో పాటుగా వాల్మీకి, కనకదాసుల విగ్రహాలు రేకుల మధ్య గుడిసెల్లో పూజలందుకుంటున్నారు. ఇక్కడి ఆంజనేయస్వామి జాతరను ప్రతి ఏటా జనవరిలో గ్రామస్తులు నిర్వహిస్తుంటారు. అయితే ఇక్కడ ఆలయ నిర్మాణం కోసం 6 పాట్లను కేటాయించారు. మిగతా దాంట్లో కొందరికి ప్లాట్లను కేటాయించిన నేపథ్యంలో వివాదం నెలకొంది. ఈ స్థలం మొత్తంలో ఆలయ నిర్మాణంతోపాటుగా జాతర, వివాహాది శుభకార్యాయాలు జరుపుకొనేందుకు అనువుగా ఆలయంతో పాటుగా ఖాళీ స్థలం ఉండాలని కొందరు పట్టుబట్టారు. ఈ పురనరావాస కేంద్రంలో రెండు చోట్ల పబ్లిక్ పర్పస్ కోసం బస్టాండ్ దగ్గర 3 ఎకరాలు, గ్రామం మధ్యలో 3 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. ఇందులో కొంత మేరకు అన్యాక్రాంతం అయినట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. బస్టాండ్ పక్కనే ఉన్న మొత్తం ఖాళీ స్థలం మొత్తం దేవాలయాలు, గ్రామంలో నిర్వహించే శుభకార్యాలు, ఉత్సవాల కోసం అలానే ఉంచాలని మరికొందరు గ్రామస్తులు పట్టుపడుతుడుతున్నారు. ఆలయానికి కావాల్సిన 6 ప్లాట్లు సరిపోతాయని, మిగిలినవి లోతట్టు ప్రాంతంలో కట్టడాలకు పనికి రాని చోట కేటాయించిన వారికి ప్లాట్లను ఇవ్వాలని మరి కొందరంటున్నారు. ఆలయ నిర్మాణంపై గ్రామస్తుల్లో ఏకాభిప్రాయం లేని కారణంగా ఆలయాల నిర్మాణంపై ప్రభావం పడింది. రూ.లక్షలు ఉన్నా పూరి గుడిసెల్లోనే పూజలందుకుంటున్న దేవుళ్లు గట్టు: ఏ ఊరిలో అయినా పెళ్లి లేదా.. పండుగ.. ఇలా ఏ శుభకార్యమైనా మొదట ఆలయానికి వెళ్లి అంతా మంచి జరగాలంటూ దేవుడికి మొక్కులు చెల్లించుకుంటుంటారు. కానీ, ఆ ఊరిలో మాత్రం ఏళ్లుగా ఆలయాల నిర్మాణానికి నోచుకోక దేవుళ్లు పూరి గుడిసెలోనే ఉండిపోవడంతో గ్రామస్తులు పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలయాలను పక్క గ్రామాలకు వెళ్లి చేయించుకునే పరిస్థితి నెలకొంది. చివరికి ఏటా ఘనంగా జరుపుకొనే జాతర సైతం కల తప్పినట్లయ్యింది. గట్టు మండలం ఆలూరు పునరావాస కేంద్రంలో నెలకొన్న విచిత్ర పరిస్థితి ఇదీ. ఆలూరులోని దేవుళ్ల పేరిట బ్యాంకుల్లో రూ.లక్షలు ఉన్నా ఆలయ నిర్మాణానికి మాత్రం నోచుకోవడేంలేదు. రెండున్నర ఏళ్ల క్రితం టెండర్లు పిలిచి పనులు అప్పగించినా.. నేటికీ ఆలయ నిర్మాణ పనులు ప్రారంభం కాలేదు. అటు ఆలయాల నిర్మాణాలు చేపట్టక.. రేకుల గుడిసెలో దేవుడు తలదాచుకుంటూ పూజలందుకునే పరిస్థితి నెలకొంది. ఆలూరు గ్రామంలో ఆలయాలు లేకపోవడంతో గ్రామస్తులు ఇబ్బంది పడుతున్నారు. శుభకార్యాయాలు, పెళ్లిళ్లు జరుపుకోవాలన్నా ఆరు బయటే జరుపుకోవాల్సిందే. దేవుడి దీవెనల కోసం పూరి గుడిసెలో ఉన్న స్వామి వారిని దర్శించుకునే పరిస్థితి గ్రామంలో ఇప్పటికి కొనసాగుతోంది. గ్రామంలో ఆలయాల నిర్మాణం ప్రారంభం కాకపోవడంతో ఇప్పటికి పండుగలు, వివాహాది శుభకార్యాయాలు నిర్వహించుకునే సందర్భంలో గ్రామస్తులు ఇబ్బంది పడుతున్నారు. గ్రామానికి కొత్తగా వచ్చిన వారు గ్రామంలో ఆలయాలు లేకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. పట్టువిడుపులు మాని ఆలయ నిర్మాణానికి అధికారులు, ప్రజా ప్రతి నిధులు కృషి చేయాలని ఆలూరు గ్రామస్తులు కొరుతున్నారు. ఆలూరులో వివాదాస్పదంగా మారిన ఖాళీ స్థలం ఇదే.. త్వరలో నిర్మాణాలు చేపడతాం పునరావాస కేంద్రంలో ఆలయ నిర్మాణానికి చర్యలు తీసుకుంటాం. ఆలయంతో పాటుగా వివిధ నిర్మాణాలకు మరిన్ని నిధులు రావాల్సి ఉంది. వీటిపై సమీక్షించి, ఏడాదిలోపు నిర్మాణాలను ప్రారంభించే విధంగా చర్యలు తీసుకుంటాం. – లక్ష్మీనారాయణ, అడిషనల్ కలెక్టర్ ఆలయం నిర్మించాలి ఆలూరు పునరావాస కేంద్రంలో నూతన ఆలయాల నిర్మాణం చేపట్టని కారణంగా ఇబ్బంది పడుతున్నాం. పెళ్లిళ్లను ఊరిలో కాకుండా ఇతర ప్రాంతాల్లో చేసుకునే పరిస్థితి నెలకొంది. దేవుళ్లను గుడిసెల్లోనే పూజించుకుంటున్నాం. బస్టాండ్ పక్కనే ఉన్న 10 శాతం ఖాళీ స్థలం ఆలయాలు, ఫంక్షన్ హాల్, పబ్లిక్ పార్కు కోసం కేటాయించాలి. అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి పునరావాస కేంద్రంలో నూతన ఆలయాలను నిర్మించాలి. – మహేష్గౌడ్, ఆలూరు ●ప్లాట్ల కేటాయింపు వివాదం ఆలూరు పునరావాస కేంద్రంలో ఆలయాల నిర్మాణాలకు గ్రహణం ఆలయాల పేరిట బ్యాంకులో మూలుగుతున్న రూ.50 లక్షలు రెండున్నరేళ్ల క్రితమే నిర్మాణానికి టెండర్లు ఎటూ తేలని 10 శాతం స్థలంలో ప్లాట్ల పంచాయితీ -
పాలమూరుపై బీఆర్ఎస్ నిర్లక్ష్యం
కొల్లాపూర్: ‘పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తిచేయడంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది.. ప్రాజెక్టు పనులు పూర్తిచేసి ఉంటే రిజర్వాయర్లలో కృష్ణానీటిని నింపుకొనేవాళ్లం.. పాలమూరు ప్రాజెక్టుతోపాటు జిల్లాలోని జూరాల, కోయిల్సాగర్, నెట్టెంపాడు, కేఎల్ఐ ప్రాజెక్టుల్లోని పెండింగ్ పనులన్నీ పూర్తిచేస్తాం.. ఇందుకు అవసరమైన నిధులు కేటాయిస్తామని’ రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. శనివారం ఆయన కొల్లాపూర్ నియోజకవర్గంలో పర్యటించి.. పలు విద్యుత్ సబ్స్టేషన్ల నిర్మాణాలకు శిలాఫలకాలను ఆవిష్కరించారు. అనంతరం రాజాబంగ్లా ఎదుట ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పలువురు లబ్ధిదా రులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు, కల్యాణలక్ష్మి చెక్కులు, రేషన్కార్డులు, రైతులకు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ.. కొల్లాపూర్తో తనకు ప్రత్యేక అనుబంధం ఉందన్నారు. 1980లో మల్లు అనంతరాములు నాగర్కర్నూల్ ఎంపీగా పోటీ చేశారని, తాను అప్పుడు కొల్లాపూర్ నియోజకవర్గానికి ఇన్చార్జిగా వ్యవహరించానని పేర్కొన్నారు. మధిర ప్రజలతో ఉన్న అనుబంధమే కొల్లాపూర్ ప్రజలతో నూ ఉందన్నారు. పాలమూరు బిడ్డ సీఎం రేవంత్రెడ్డి, కొల్లాపూర్తో అను బంధం ఉన్న తాను ఈ ప్రాంత అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని పునరుద్ఘాటించారు. మంత్రి జూపల్లి కృష్ణారావు విజ్ఞప్తి మేరకు కొల్లాపూర్లో అడ్వాన్స్ టెక్నాలజీతో ఐటీఐ ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు. గతంలో తొలగించిన బ్యాంకులన్నింటినీ తిరిగి గ్రామాల్లో ఏర్పాటు చేసేందుకు అధికారులతో మాట్లాడతామన్నారు. శ్రీశైలం నిర్వాసితుల అంశం ఆర్థిక పరమైనది కాబట్టి దీనిపై పరిశీలన చేసి చెబుతానన్నారు. ముంపు బాధితుల కోసం జూపల్లి కోరిన 3 వేల అదనపు ఇళ్ల గురించి కలెక్టర్లతో మాట్లాడి సమాచారం తెలుసుకొని తగిన న్యాయం చేస్తానన్నారు. అభివృద్ధికి సహకరించండి: మంత్రి జూపల్లి కొల్లాపూర్ నియోజకవర్గ అభివృద్దికి సహకరించా లని మంత్రి జూపల్లి కృష్ణారావు డిప్యూటీ సీఎంను కోరారు. ఇక్కడ ఐటీఐ, పాలిటెక్నిక్, ఇంజినీరింగ్ కళాశాలలు మంజూరు చేయాలని, శ్రీశైలం నిర్వాసితులకు పంచాయతీ కార్యదర్శి, లష్కర్ పోస్టులు ఇవ్వాలని, లేనిచో ఒక్కో కుటుంబానికి రూ.25 లక్ష ల చొప్పున అదనపు పరిహారం చెల్లించాలని, నిర్వాసితుల కోసం నియోజకవర్గానికి అదనంగా 3 వేల ఇళ్లు మంజూరు చేయాలని విన్నవించారు. డిజిటల్ బుక్స్ ఆవిష్కరణ.. ఐఐఎఫ్సీఎల్ ఆధ్వర్యంలో ఎస్ఎస్సీ విద్యార్థుల కోసం రూపొందించిన డిజిటల్ బుక్స్ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆవిష్కరించారు. వీటికి స హకరించిన ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డిని ఆయ న అభినందించారు. ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, మేఘారెడ్డి, రాజేష్రెడ్డి, నారాయణరెడ్డి, శ్రీనివాసరెడ్డి, డీసీ సీబీ చైర్మన్ విష్ణువర్ధన్రెడ్డి, నాయకులు జగదీశ్వర్రావు, ఒబేదుల్లా కొత్వాల్, సరిత పాల్గొన్నారు. ప్రభుత్వాన్ని విమర్శిస్తే బుద్ధి చెప్పండి: ఎంపీ మల్లురవి ముగ్గురు, నలుగురు సీఎంలు మారినా పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నించి.. కల్వకుర్తి నుంచి నంద్యాల వరకు జాతీయ రహదారి, సోమశిల– సిద్దేశ్వరం బ్రిడ్జిని మంత్రి జూపల్లి కృష్ణారావు సాధించారని ఎంపీ మల్లురవి అన్నారు. సీఎంను, డిప్యూటీ సీఎంను, మంత్రులను, ప్రభుత్వాన్ని ఎవరైనా అనవసరంగా విమర్శిస్తే వారికి కుక్కకాటుకు చెప్పుదెబ్బ తరహాలో బుద్ధిచెప్పాలని పార్టీ శ్రేణులకు సూచించారు. జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టుల పూర్తికి రూ.899 కోట్లు కేటాయించాలని, పాలమూరు ప్రాజెక్టు పనులకు రూ.5 వేలు లేదా రూ.10 వేల కోట్లు విడుదల చేయాలని డిప్యూటీ సీఎంను కోరారు. నాగర్కర్నూల్ పార్లమెంట్ పరిధిలో కొత్తగా 50 గ్రామీణ లైబ్రరీలను సీఎస్ఆర్ ఫండ్స్ ద్వారా ఏర్పాటు చేయబోతున్నామని, అందులో 8 లైబ్రరీలు కొల్లాపూర్ ప్రాంతంలోనే ఉంటాయన్నారు. అప్పుడే పూర్తి చేసి ఉంటే రిజర్వాయర్లలో కృష్ణానీళ్లు నింపుకొనేవాళ్లం జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల అసంపూర్తి పనులకు నిధులు కేటాయిస్తాం అడ్వాన్స్ టెక్నాలజీతో ఐటీఐ ఏర్పాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క -
పర్యవరణాన్ని పరిరక్షించుకుందాం
అలంపూర్: పర్యవరణాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని జిల్లా జడ్జి ప్రేమలత అన్నారు. వనమహోత్సవంలో భాగంగా శనివారం అలంపూర్ కోర్టు ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి మాట్లాడుతూ.. మొక్కల పెంపకంతోనే మానవ మనుగడ ఆధారపడి ఉందన్నారు. భవిష్యత్ తరాలను దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి సంరక్షించాలని సూచించారు. అనంతరం జిల్లా జడ్జితో పాటు స్థానిక జూనియర్ సివిల్కోర్టు జడ్జి మిథున్ తేజను న్యాయవాదులు శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గవ్వల శ్రీనివాసులు, ఏపీపీ కార్తిక్ రాజ్, ఏజీపీ మధుసూదన్, ఎంఈఓ అశోక్కుమార్, న్యాయవాదులు, పోలీసు అధికారులు పాల్గొన్నారు. దరఖాస్తుల ఆహ్వానం గద్వాల: బేగంపేట, రామనంతాపూర్లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో 2025–26 విద్యా సంవత్సరం ఒకటో తరగతిలో డేస్కాలర్గా ప్రవేశాల నిమిత్తం జిల్లాలోని గిరిజన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు గిరిజన సంక్షేమశాఖ అధికారి పవన్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 2018 జూన్ 1నుంచి 2019 మే 31వ తేదీ మధ్య జన్మించిన విద్యార్థులు అర్హులని పేర్కొన్నారు. దరఖాస్తు ఫారాలను జిల్లా గిరిజన సంక్షేమశాఖ కార్యాలయంలో పొందవచ్చన్నారు. దరఖాస్తుతో పాటు నివాస, కులం, ఆదాయం, జనన ధ్రువపత్రాల జిరాక్స్తో ఈ నెల 8వ తేదీలోగా జిల్లా గిరిజన సంక్షేమశాఖ కార్యాలయంలో సమర్పించాలని సూచించారు. 12న లక్కీ డిప్ ద్వారా విద్యార్థుల ఎంపిక ఉంటుందని తెలిపారు. 7న సీపీఐ జిల్లా మహాసభలు గద్వాల: జిల్లా కేంద్రంలోని వాల్మీకి భవన్లో ఈ నెల 7న సీపీఐ జిల్లా 3వ మహాసభలు నిర్వహించనున్నట్లు ఆ పార్టీ జిల్లా కార్యదర్శి బి.ఆంజనేయులు అన్నారు. ఈ మేరకు శనివారం జిల్లా పార్టీ కార్యాలయంలో మహాసభలకు సంబంధించిన పోస్టర్లను విడుదల చేశారు. అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తూ దేశ సంపదను దోచిపెడుతోందని ఆరోపించారు. దేశ ఐక్యత, లౌకిక ప్రజాస్వామ్య వ్యవస్థకు తీరని హాని తలపెడుతున్నారన్నారు. రాజ్యాంగ మూలాలను నాశనం చేయాలనే ఉద్దేశంతోనే దళితులపై దాడులకు తెగబడుతున్నారని అన్నారు. డీజిల్, పెట్రోల్, గ్యాస్ వంటి నిత్యావసర ధరలు పెంచి సామాన్యులపై భారం మోపుతున్నారన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందన్నారు. సీపీఐ ఆధ్వర్యంలో భవిష్యత్ పోరాటాలకు నాంది పలికేందుకు జిల్లా మహాసభల్లో పలు నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాసంఘాలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో రంగన్న, ఖాసీం, ఉప్పేరు కృష్ణ, ప్రవీణ్, రవి, రామాంజనేయులు, తిమ్మప్ప, గోకారి పాల్గొన్నారు. ఇద్దరు పంచాయతీ కార్యదర్శుల సస్పెన్షన్ గద్వాల: ఫేక్ డీఎస్ఆర్ అటెండెన్స్ నమోదు చేసిన ఇద్దరు పంచాయతీ కార్యదర్శులపై సస్పెన్షన్ వేటు పడింది. మల్దకల్ మండలం విఠలాపురం, గట్టు మండలం బోయలగూడెం పంచాయతీ కార్యదర్శులు తిరుమలేశ్, శ్రీనివాసులును సస్పెన్షన్ చేసినట్లు కలెక్టర్ బీఎం సంతోష్ తెలిపారు. లైవ్ డీఎస్ఆర్ అటెండెన్స్ నమోదు చేయకుండా ఫేక్ డీఎస్ఆర్ నమోదు చేస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. వేరుశనగ క్వింటాల్ రూ.6,100 గద్వాల వ్యవసాయం: జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్యార్డుకు శనివారం 482 క్వింటాళ్ల వేరుశనగ విక్రయానికి వచ్చింది. క్వింటాల్కు గరిష్టంగా రూ. 6,100, కనిష్టంగా రూ. 3,499, సరాసరి రూ. 5,090 ధరలు లభించాయి. -
రుణ లక్ష్యం ఖరారు
రూ. 2998.57కోట్ల పంట రుణాలు ఇవ్వాలని నిర్దేశం రుణ లక్ష్యం నెరవేరేలా చర్యలు. పంట పెట్టుబడుల్లో బాగంగా పంట రుణాలకై ధరఖాస్తు చేసుకునే అర్హులైన రైతులందరికి రుణాలు అందిస్తాం. 2025–26 ఆర్థిక సంవత్సరంలో రుణ లక్ష్యం మేరకు రుణాలు అందించేందుకు చర్యలు తీసుకుంటాము. ఇందులో బాగంగా ఆయా బ్యాంకులకు లక్ష్యాలను నిర్దేశించాము. – శ్రీనివాసరావు, ఎల్డీఎం గద్వాలన్యూటౌన్: జిల్లాలో పంట రుణ లక్ష్యం ఖరారైంది. 2025–26 ఆర్థిక సంవత్సరానికి గాను వానాకాలం, యాసంగి రెండు సీజన్లలో 1,47,258 మంది రైతులకు రూ. 2998.57 కోట్ల రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా నిర్దేశించారు. నడిగడ్డ రైతాంగం బ్యాంకులు అందించే రుణాలపైనే ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారు. ఇదీ పరిస్థితి.. జిల్లాలో వ్యవసాయమే ప్రధాన జీవనాధారం. జూరాల, ఆర్డీఎస్ ప్రాజెక్టులతో పాటు నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం కింద ఏడు రిజర్వాయర్లు, వందకు పైగా చెరువులు, కుంటలు ఉన్నాయి. ఏటా రెండు సీజన్లలో దాదాపు 5లక్షల ఎకరాల వరకు వివిధ రకాల పంటలను సాగు చేస్తుంటారు. పండ్లతోటలు, కూరగాయలు కూడా పండిస్తున్నారు. అయితే జిల్లాలో సన్న, చిన్నకారు రైతులు వేల సంఖ్యలో ఉన్నారు. రైతుభరోసా, పీఎం కిసాన్ సమ్మాన్ యోజన వంటి పంట పెట్టుబడుల పథకాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలుచేస్తున్నా.. వాటితో రైతలు అవసరాలు పూర్తిగా తీరడం లేదు. దీంతో వీరంతా బ్యాంకులు అందించే పంట రుణాలపైనే ఆధారపడి సేద్యం చేస్తున్నారు. బ్యాంకర్లు సకాలంలో రుణాలు ఇవ్వకపోతే అధిక వడ్డీలకు ప్రైవేటులో అప్పులుచేసి ఆర్థికంగా నష్టపోతున్నారు. బ్యాంకర్లు సకాలంలో రుణాలు అందిస్తేనే రైతులకు ప్రయోజనం చేకూరుతుంది. ● ఆర్థిక సంవత్సరం నిర్దేశించిన పంట రుణ పరిమితి మేరకు బ్యాంకులు రైతులకు రుణాలు అందిస్తాయి. అందులో బాగంగా 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆయా బ్యాంకుల వారీగా రెండు సీజన్లకు రుణ లక్ష్యాన్ని లీడ్ బ్యాంక్ అధికారులు రూపొందించారు. వానాకాలంలో 88,356 మంది రైతులకు రూ. 1798 కోట్లు, యాసంగిలో 58,902 మంది రైతులకు రూ. 1200.58 కోట్లు లక్ష్యంగా నిర్దేశించారు. దీన్ని కొన్నిరోజల క్రితం కలెక్టర్ అధ్యక్షతన జరిగిన డీఎల్ఆర్సీ సమావేశంలో ఆమోదించారు. బ్యాంకుల వారీగా రుణ లక్ష్యం ఇలా (రూ.కోట్లలో) వానాకాలంలో 88,356మంది, యాసంగిలో 58,902మందిరైతులకు ఆర్థిక తోడ్పాటు లక్ష్యం నెరవేరితేనే ప్రయోజనం -
వైద్యసేవలు అందించడంలో నిర్లక్ష్యాన్ని సహించం
గద్వాల క్రైం: ప్రజలకు వైద్యసేవలు అందించడంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని రాష్ట్ర వైద్యరోగ్యశాఖ మానిటరింగ్ అధికారి ఫణిందర్రెడ్డి హెచ్చరించారు. శనివారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఆయన ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ముందుగా జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిని సందర్శించి.. రోగులకు అందుతున్న సేవలు, మందుల నిల్వలు, వైద్యుల పనితీరు, స్కానింగ్ పరికరాల వినియోగం, మౌలిక వసతులు తదితర వివరాలను సూపరింటెండెంట్ ఇందిరతో తెలుసుకున్నారు. ప్ర సవాల కోసం వచ్చే గర్భిణులకు సాధ్యమైనంత వర కు సాధారణ ప్రసవం చేయాలని వైద్యులకు సూచించారు. అత్యవసరమైతేనే సిజేరియన్ చేయాలన్నారు. ప్రస్తుతం సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున అన్నిరకాల మందులను అందుబాటు లో ఉంచుకోవాలని సూచించారు. అనంతరం రోగులతో మాట్లాడి వైద్యసేవలపై ఆరా తీశారు. సెంట్రల్ మెడిసిన్ స్టోర్లో మందుల నిల్వ వివరాలను ఫార్మసిస్ట్తో తెలుసుకున్నారు. ప్రమాదకర వ్యాధులు, శస్త్ర చికిత్సల కోసం అందజేసిన మందులు, రోగుల వివరాలకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. అందుబాటులో లేని మందుల కోసం సమర్పించిన నివేదికలపై ఆరా తీశారు. కాగా, టెక్నిషియన్ పోస్టు ల భర్తీ కోసం ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేశామని సూపరింటెండెంట్ తెలిపారు. అనంతరం జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిని ఆయన తనిఖీ చేశా రు. మానిటరింగ్ అధికారి వెంట సిబ్బంది కౌటిల్య, వేణుగోపాల్, శ్రీనివాసులు, అభినేష్, రాజు, మధుసూదన్రెడ్డి, వినోద్ తదితరులు ఉన్నారు. -
హాస్టళ్ల నిర్వహణలో నిర్లక్ష్యం వద్దు
● అధికారులు సమన్వయంతో పనిచేయాలి.. ● నిర్లక్ష్యం వహిస్తే వేటుతప్పదు ● కలెక్టర్ బీఎం సంతోష్ గద్వాల: గురుకులాలు, సంక్షేమ శాఖల వసతిగృహాల నిర్వహణలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటానని కలెక్టర్ బీఎం సంతోష్ హెచ్చరించారు. శుక్రవారం ఐడీవోసీ కార్యాలయంలో ఎస్పీ శ్రీనివాస్రావుతో కలిసి సమీక్షించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖపై ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. పాఠశాలలు, హాస్టళ్లల్లో నిర్వాహణలో ఎలాంటి నిర్లక్ష్యం వహించినా తగిన వేటుతప్పదన్నారు. ఇటీవల ఓ పాఠశాలలో జరిగిన ఘటనపై సంబంధిత డిప్యూటీ వార్డెన్, సూపర్వైజర్లను సస్పెండ్ చేసిన విషయాన్ని గుర్తుచేశారు. నిర్లక్ష్యం వహించిన ఇతర సంబంధిత అధికారులకు కూడా మొమోలు జారీ చేసినట్లు తెలిపారు. పాఠశాలలో విద్యార్థుల సంక్షేమం కోసం మండల స్థాయి అధికారులు పరస్పరం సమన్వయంతో పనిచేయాలన్నారు. అన్ని మండలాలకు జిల్లా స్థాయి స్పెషల్ అధికారులను నియమించడం జరిగిందన్నారు. ప్రతినెలా కనీసం రెండుసార్లు పాఠశాలలు సందర్శించి అక్కడి విద్య, భద్రతా, మౌళిక వసతులైన తాగునీరు, మరుగుదొడ్లు ఇతర అవసరాలను సమీక్షించాలన్నారు. విద్యార్థులకు ప్రతిరోజు మెను ప్రకారం నాణ్యమైన పోషకాహారంతో కూడిన భోజనం తప్పనిసరిగా అందించాలన్నారు. ఏదైనా సమస్యలు తలెత్తితే వెంటనే తహసీల్దార్, ఎంపీడీవో పోలీసు అధికారులకు తెలియపర్చాలని తహసీల్దార్ మండల స్థాయి మెజిస్ట్రేట్ వెంటనే స్పందించాలన్నారు. బాధ్యతాయుతంగా వ్యవహరించాలి అనంతరం ఎస్పీ శ్రీనివాస్రావు మాట్లాడుతూ.. జిల్లాల్లో ఎలాంటి సంఘటన జరిగిన వెంటనే పోలీసుశాఖ అన్ని సమయాల్లో అందుబాటులో ఉంటుందని, వసతిగృహాల ప్రతివిషయం అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. వ్యక్తులు ఎవరైనా విద్యార్థులను రోడ్డుపైకి వచ్చేలా చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. వసతి గృహాల్లోకి బయటి వారిని అనుమతించకూడదని వసతిగృహాల విద్యార్థుల హక్కులకు భంగం కలిగించే వారిపై కేసులు నమోదు చేస్తామన్నారు. విద్యాలయాల ఆవరణలో ఎవరైనా మద్యం సేవిస్తే కేసులు నమోదు చేస్తామన్నారు. మండల స్థాయిలో అధికారులు, పోలీసువిభాగం పరస్పరం సమన్వయంతో పనిచేయాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు వి.లక్ష్మీనారాయణ, నర్సింగ్రావు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శ్రీనివాసరావు, ఆర్డీవో అలివేలు, అధికారులు పాల్గొన్నారు. సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా చర్యలు వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు వ్యాప్తిచెందకుండా అవసరమైన ముందస్తు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని బీస్తీదవాఖానాను ఆకస్మింకగా తనిఖీ చేశారు. దగ్గు, జలుబు, జ్వరం నివారణకు సంబధించి మెరుగైన వైద్యం అందించాలని, దోమల నివారణకు ఆయిల్బాల్స్, బ్లీచింగ్ వంటి నివారణ కారకాలను ఉపయోగించాలన్నారు. ఎరువుల కొరత సృష్టించొద్దు రైతులకు అవసరమైన ఎరువులు అందుబాటులో ఉంచాలని, వాటి కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటానని కలెక్టర్ అన్నారు. రైతు నుంచి ఆధార్ వివరాలు సేకరించిన అనంతరమే యూరియా విక్రయాలు చేయాలని, ఈ–పాస్ ద్వారా అమ్మకాలు జరగాలన్నారు. జిల్లాలో ఎరువుల నిల్వలు, వినియోగంపై సమగ్ర నివేదికను ఇవ్వాలని డీఏవో సక్రియానాయక్ను ఆదేశించారు. -
కేంద్రియ విద్యాలయ ఏర్పాటుకు స్థల పరిశీలన
మల్దకల్ : మండల కేంద్రమైన మల్దకల్, కుర్తిరావుల చెర్వు గ్రామ పరిసరాల్లోని ప్రభుత్వ భూమిని శుక్రవారం కేంద్రియ విద్యాలయ అధికారులు కృష్ణవేణి, హరిప్రసాద్, డీఈఓ అబ్దుల్ ఘని పరిశీలించారు. మల్దకల్ తహసీల్దార్ ఝాన్సీరాణి, ఎంఈఓ సురేష్ల ఆధ్వర్యంలో మల్దకల్ టూరిజం శాఖ నిర్మించిన అతిథిగృహాన్ని తాత్కాలిక కేంద్రంగా ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని వారు పేర్కొన్నారు. ప్రభుత్వ స్థలాన్ని గుర్తించి నిర్మాణాలు చేపట్టే వరకు ప్రస్తుతం వాటిలో పాఠశాలను ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కేంద్రియ విద్యాలయ ఏర్పాటుతో గ్రామీణ విద్యార్థులకు మెరుగైన విద్యాబోధన అందనుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సెక్టోరియల్ అధికారి శాంతిరాజు, సూపరిండెంట్ వీరశేఖర్, సర్వేయర్ హరికృష్ణ, ఆర్ఐ మద్దిలేటి తదితరులు ఉన్నారు. -
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఇసుక ఉచితం
గద్వాల: జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు అవసరమైన ఇసుకను ఉచితంగా కేటాయించేందుకు చర్యలు తీసుకుంటున్నామని అదనపు కలెక్టర్ వి.లక్ష్మీనారాయణ అన్నారు. శుక్రవారం ఐడీవోసీ కార్యాలయంలోని వీనియోకాన్ఫరెన్స్ హాలులో ఇసుక బుకింగ్ విధానంపై రారష్ట్ర స్థాయి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈకార్యక్రమంలో అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ పాల్గొని మాట్లాడారు. జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల పథకానికి అవసరమైన ఇసుక సరఫరా కోసం తుమ్మిళ్ల ప్రాంతంలో ఒక ఇసుక రీచ్ను గుర్తించామని, రేట్చార్జ్ను సిద్ధం చేసి లబ్ధిదారుల జాబితాను త్వరగా ఇస్తే వారికి ఉచిత ఇసుకను వెంటనే పంపిణీ చేసేలా ప్రఽణాళిక చేశామన్నారు. ఒక్కో ఇంటి నిర్మాణానికి 25క్యూబిక్ మీటర్ ఇసుకను అందించనున్నట్లు తెలిపారు. ఇసుక రవాణాకు ట్రాక్టర్ యజమానులు రిజిస్ట్రేషన్ చేసుకున్న ట్రాక్టర్లు, సొంత ట్రాక్టర్ల ద్వారా రవాణా చేసుకోవాలని సూచించారు. ఇసుక పక్కదారి పట్టకుండా అవసరమైన చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు సమావేశంలో అదనపు కలెక్టర్ నర్సింగ్రావు, ఎస్డీసీ శ్రీనివాస్రావు, హౌసింగ్పీడీ కాశీనాథ్, అన్ని మండలాల తహసీల్దార్లు, ఎంపీడీవోలతోపాటు మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు. -
టీచర్లకు తీపికబురు
ఉమ్మడి జిల్లా పరిధిలో ఇలా.. నిలిచిన డిప్యూటేషన్లు.. ఉమ్మడి జిల్లాలోని వివిధ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఉపాధ్యాయులను సర్దుబాటు చేసేందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు అన్ని జిల్లాల్లో ఎంఈఓల నుంచి డిప్యూటేషన్ ఇవ్వాల్సిన ఉపాధ్యాయుల వివరాలను డీఈఓలు సేకరించారు. వీటికి కలెక్టర్ అనుమతితో ఆర్డర్ ఇవ్వాల్సి ఉంది. ఉమ్మడి జిల్లాలో సుమారు 680 మందికి డిప్యూటేషన్లు ఇవ్వాల్సి ఉండగా ఒక్క మహబూబ్నగర్లోనే 330 మంది బదిలీ కావాలి. కానీ, ప్రస్తుతం ప్రభుత్వం పదోన్నతుల ప్రక్రియను చేపట్టనున్న నేపథ్యంలో డిప్యూటేషన్లు నిలిచిపోయాయి. పదోన్నతుల అనంతరం అక్కడ ఏర్పడిన ఖాళీల ఆధారంగా డిప్యూటేషన్లు చేపట్టనున్నట్లు విద్యాశాఖ అధికారులు పేర్కొంటున్నారు. పదోన్నతుల ప్రక్రియ ఈ నెల 11లోగా పూర్తయితే 15లోగా డిప్యూటేషన్లు కూడా పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నట్లు సమాచారం. నేటినుంచి ఉపాధ్యాయుల పదోన్నతుల ప్రక్రియ ప్రారంభం ● ఎస్జీటీలకు ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం, ఎస్ఏలుగా అవకాశం ● స్కూల్ అసిస్టెంట్లకు గెజిటెడ్ హెచ్ఎంలుగా ప్రమోషన్ ● ఉమ్మడి జిల్లాలో 650 నుంచి 750 మందికి మేలు ● ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేసిన ప్రభుత్వం మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: విద్యాశాఖలో ఖాళీగా ఉన్న వివిధ పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా అర్హులైన సీనియర్ ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించనుంది. గత మూడేళ్ల క్రితమే ప్రమోషన్లు ఇచ్చిన తాజాగా ప్రభుత్వం మరోసారి ప్రక్రియ చేపట్టాలని పేర్కొంటూ ఉత్తర్వులు సైతం జారీ చేసింది. దీంతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 2,991 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా.. 14,221 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. ప్రభుత్వం ప్రస్తుతం చేపడుతున్న పదోన్నతులతో సుమారు 650 నుంచి 750 మంది ఉపాధ్యాయులు అర్హత పొందే అవకాశం ఉందని విద్యాధికారులు పేర్కొంటున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం ఎస్జీటీలుగా విధులు నిర్వహిస్తున్న వారికి ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం, స్కూల్ అసిస్టెంట్లుగా అవకాశం కల్పించనున్నారు. ఇక స్కూల్ అసిస్టెంట్లకు గెజిటెడ్ హెచ్ఎంలుగా, ఎంఈఓలుగా పదోతున్నతులు ఇచ్చే అవకాశం ఉంది. ఈ నెల 11 వరకు.. ఉపాధ్యాయులకు పదోన్నతుల ప్రక్రియ శనివారం నుంచే ప్రారంభం కానుంది. ఈ క్రమంలో ఆయా జిల్లాల వారీగా డీఈఓ వెబ్సైట్లలో గ్రేడ్–2 హెడ్మాస్టర్, స్కూల్ అసిస్టెంట్ సమానమైన క్యాడర్ ఖాళీల వివరాలను ఆన్లైన్లో పొందుపర్చాల్సి ఉంది. వీటితోపాటు గెజిటెడ్ హెచ్ఎంలుగా పదోన్నతులు పొందాల్సిన ఎస్జీటీ ఉపాధ్యాయులు సీనియార్టీ ప్రొవిజనల్ లిస్టు, స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులు పొందనున్న ఎస్జీటీల ప్రొవిజనల్ సీనియార్టీ లిస్టును ఆన్లైన్లో అందుబాటులో ఉంచాలి. ఈ మేరకు సీనియార్టీ జాబితాలపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే చెప్పుకొనేందుకు ఈ నెల 3న అవకాశం ఉంటుంది. అలాగే 4, 5 తేదీల్లో సీనియార్టీ జాబితాపై వచ్చిన అభ్యంతరాలను పరిష్కరించి తుది జాబితా విడుదల చేస్తారు. 6న పదోన్నతులకు అర్హులైన వారు వెబ్ఆప్షన్లు పెట్టుకునేందుకు అవకాశం ఉంది. 7న సంబంధిత ఆర్జేడీ, డీఈఓల నుంచి ప్రమోషన్ ఆర్డర్ వెలువడనున్నాయి. ఇలా మొదట హెచ్ఎంలు, స్కూల్ అసిస్టెంట్లు, ఎస్జీటీల ప్రక్రియను ఈ నెల 11 వరకు పూర్తి చేసేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. జిల్లా పాఠశాలలు విద్యార్థులు ఉపాధ్యాయులు మహబూబ్నగర్ 791 62,724 4,650 నాగర్కర్నూల్ 808 54,152 3,513 వనపర్తి 495 38,147 2,097 జోగుళాంబ గద్వాల 448 55,289 2,064 నారాయణపేట 458 52,314 1,879 షెడ్యూల్ ప్రకారమే.. ప్రభుత్వం ప్రమోషన్లకు సంబంధించి షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నెల 11లోగా ప్రక్రియను పూర్తి చేసే విధంగా ఆదేశించింది. అందులో భాగంగా ఆదివారం సీనియార్టీ లిస్టులను ప్రదర్శిస్తాం. జిల్లా పరిధిలో 1:3 ప్రకారం 450 మందిని ఎంపిక చేసి 150 మందికి ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది. ఇక డిప్యూటేషన్లు ఆగిపోయే అవకాశం లేదు. కలెక్టర్ ఆదేశాల ప్రకారం ఫైల్ ప్రాసెస్ చేసి డిప్యూటేషన్లు ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. ఎక్కడ కూడా తప్పిదాలకు తావులేకుండా ప్రక్రియ నిర్వహిస్తాం. – ప్రవీణ్కుమార్, డీఈఓ, మహబూబ్నగర్ -
లక్ష్యం దిశగా ముందుకు
నీతి ఆయోగ్ సంపూర్ణ అభియాన్లో గట్టుకు కాంస్య పతకం గట్టు: దేశ వ్యాప్తంగా వెనుకబడిన మండలాలను గుర్తించి, వాటిని అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్ సంపూర్ణ అభియాన్ ద్వారా మండలాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే దేశ వ్యాప్తంగా 500 మండలాలను ఎంపిక చేయగా, అందులో గట్టు మండలం కూడా ఉంది. ఈమేరకు కలెక్టర్ బీఎం సంతోష్ ఆధ్వర్యంలో మండల స్థాయి అధికారులు అన్ని శాఖల సమన్వయంతో అభివృద్ధికి అహర్నిశలు శ్రమించారు. అధికారుల శ్రమకు తగిన ఫలితం లభించింది. 6 అంశాలను పరిగణలోకి తీసుకుని కేంద్ర ప్రభుత్వం వాటికి ర్యాంకులు ఇవ్వగా.. గట్టు మండలానికి 5వ ర్యాంకు లభించిన విషయం తెలిసిందే. దీంతోపాటుగా దక్షణాది రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలను జోన్ –3గా గుర్తించగా ఈ జోన్–3 లో గట్టు మండలం అభివృద్ధి సూచికలో 2వ ర్యాంకును సాధించింది. నేడు రాజ్ భవన్లో అవార్డు అందుకోనున్న కలెక్టర్ బీఎం సంతోష్ 6 అంశాలకు 3 అంశాల్లో వంద శాతం లక్ష్య సాధన సంపూర్ణ అభియాన్లో అధికారుల సమష్టి కృషికి గుర్తింపు -
మహిళా హక్కుల రక్షణకు ఉద్యమిద్దాం
గద్వాలటౌన్: దేశంలో మహిళా హక్కుల పరిరక్షణ కోసం ఐక్యంగా ఉద్యమించాలని ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు అరుణజ్యోతి పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక సీఐటీయూ కార్యాలయంలో జరిగిన ఐద్వా జిల్లా రాజకీయ శిక్షణ తరగతుల కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దేశంలో సీ్త్ర, పురుషులకు అనేక హక్కులను ప్రకటించినప్పటికి సమస్యలు వెంటాడుతున్నాయన్నారు. సీ్త్ర, పురుషుల మధ్య సమానత్వం లేదని.. విద్యా, వైద్యం, ఉపాధి రంగాలలో సీ్త్రలు ఇప్పటికి వెనుకబడే ఉన్నారని చెప్పారు. చట్టరీత్యా హక్కులున్నా అవేవీ సీ్త్రలకు అందుబాటులో లేవన్నారు. వీటికి తోడు హత్యాచారాలు, వరకట్నపు మరణాలు, కుటుంబంలో హింస, బలవంతపు పెళ్లిలు, బాల్యవివాహాలు, బహు భార్యత్వం వంటి అనేక సమస్యలు సీ్త్రలను వేధిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు వీటిని అరికట్టేందుకు సమగ్రమైన ప్రతిపాదిత చట్టాలు చేయాలని కోరారు. ప్రజాస్వామ్యం, సమానత్వం, సీ్త్ర విముక్తి అనే నినాదంతో ఐద్వా పనిచేస్తుందని వివరించారు. ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా కార్యదర్శి నర్మద, కమిటీ సభ్యులు పద్మ, రత్నమ్మ, రాణి, సుధా, పద్మ, భాగ్యమ్మ, అమ్ములు, రాధా, కై యూమ్ తదితరులు పాల్గొన్నారు. -
వైద్య పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
గద్వాల: అలంపూర్ ఏరియా ఆసుపత్రిలో కాంట్రాక్టు విధానంలో వైద్యాధికారుల నియామకాలు చేపడుతున్నట్లు అర్హుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రమేష్చంద్ర శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. అలంపూర్ ఏరియా ఆసుపత్రిలో గైనకాలజిస్ట్–2, జనరల్ సర్జన్–2, జనరల్ మెడిసిన్–2, అనస్తిటిస్ట్–2, ఈఎన్టీ–1, ఆర్థోపెడిక్–1, పాథాలజిస్ట్–1, సైక్రియార్టిస్ట్–1, డెర్మటాలజిస్ట్–1 పోస్టు ఖాళీగా ఉన్నాయని, అదేవిధంగా అలంపూర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో జనరల్ మెడిసిన్–1, పిడియాట్రీషియన్–1, జీడీఎంవో(ఎంబీబీఎస్)–2 కాంట్రాక్టు పోస్టులకు దరరఖాస్తులు చేసుకోవాలని కోరారు. దరఖాస్తుదారులు ఈనెల 7వ తేదీన అలంపూర్ ఏరియా ఆసుపత్రి, అలంపూర్ క్రాస్రోడ్డులో వాక్–ఇన్ ఇంటర్వ్యూకు హాజరుకావాలని తెలిపారు. ఆపరేషన్ ముస్కాన్లో 75 మంది బాలలకు విముక్తి గద్వాల క్రైం: జిల్లా వ్యాప్తంగా చేపట్టిన ఆపరేషన్ ముస్కాన్ –11 విజయవంతమైందని, మొత్తం 75 మంది బాలకార్మికులను గుర్తించి విముక్తి కల్పించినట్లు ఎస్పీ శ్రీనివాసరావు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. గద్వాల – అలంపూర్ సెగ్మెంట్లో జులై 1 నుంచి 31వ తేదీ వరకు పోలీసు, కార్మిక, విద్య, స్వచ్ఛంద సంస్థలు సమష్టిగా కృషి చేశాయని, పలు ప్రాంతాల్లో బాలకార్మికులుగా పని చేస్తున్న 75 మంది చిన్నారులను గుర్తించి వారిని వెట్టి నుంచి విముక్తి కల్పించామని తెలిపారు. అనంతరం చిన్నారులను పాఠశాలలో చేర్పించామని, వారిని పనిలో పెట్టుకున్న యజమానులపై 18 కేసులు నమోదు చేశామని పేర్కొన్నారు. జిల్లాలో ఎవరైన చిన్నారులను పనిలో పెట్టుకుంటే డయల్ 100 లేదా 1098కు సమాచారం అందించాలని, ఆపరేషన్ ముస్కాన్లో విధులు నిర్వహించిన సిబ్బంది కృషి మరువలేనిదని తెలిపారు. కేంద్రం నిధులిస్తే.. కాంగ్రెస్ ప్రారంభోత్సవాలా ? అలంపూర్: కేంద్ర ప్రభుత్వం నిధులిచ్చి నిర్మిస్తే కాంగ్రెస్ మంత్రులు ప్రారంభోత్సవాలు చేయడం హాస్యాస్పదంగా ఉందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు అన్నారు. అలంపూర్లోని ప్రసాద్ స్కీం భవనంలో బాలబ్రహ్మేశ్వర నిత్య అన్నదాన సత్రాన్ని, ఏర్పాట్లను ఆయనతోపాటు బీజేపీ నాయకులతో కలిసి శుక్రవారం సందర్శించారు. అనంతరం మాట్లాడుతూ.. కేంద్రం ప్రసాద్ స్కీం పథకం ద్వారా జోగుళాంబ ఆలయానికి 2021లో రూ.80 కోట్లు పలు భవనాలు, అభివృద్ధి పనుల కోసం కేటాయించారన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కేవలం రూ.36.72 కోట్లు మాత్రమే వినియోగించుకున్నట్లు తెలిపారు. నిర్మించిన వసతి గృహాలను సైతం వినియోగంలోకి తేవడానికి సరైన చర్యలు చేపట్టడం లేదన్నారు. ఈ భవనంలో భక్తుల సౌకర్యార్థం కళ్యాణమండపం, ఆడిటోరియం వంటివి అందుబాటులోకి రావాల్సి ఉందన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల ప్రసాద్ స్కీంలోని సౌకర్యాలతోపాటు నిత్య అన్నదాన సత్రం తెలిసే విధంగా సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు.కార్యక్రమంలో బీజేవైఎం ఉపాధ్యాక్షుడు రాజశేఖర్ శర్మ, బీజేపీ నాయకులు రాజగోపాల్, నాగేశ్వర్ రెడ్డి, శరత్, ఈశ్వర్, మురళికృష్ణ, రామకృష్ణ, నాగమల్లయ్య ఉన్నారు. జీవన ప్రమాణాలు మెరుగుపడాలి: వీసీ మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: జీవన ప్రమాణాలు మెరుగుపడాలంటే ఆర్థిక క్రమశిక్షణ అవసరం అని పాలమూరుయూనివర్సిటీ వీసీ శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ మేరకు పీయూలో ఎంబీఏ విభాగం ఆధ్వర్యంలో ఆర్థిక విద్య, జీవన నైపుణ్యాలు అనే అంశంపై ఒకరోజు జాతీయ వెబినార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆన్లైన్లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. జాతీయ విద్యా విధానం–2020 ప్రకారం నైపుణ్య ఆధారిత పరిజ్ఞానం అవసరం అన్నారు. విద్యార్థి దశలోనే ఆర్థిక అవగాన పెంచుకుని, దేశ స్థూల జాతీయోత్పత్తిలో మీ వంతు పాత్ర పోషించాలన్నారు. కీనోట్ స్పీకర్, సీనియర్ కన్సల్టెంట్ బ్రహ్మ, రిజిస్ట్రార్ రమేష్బాబు, మధుసూదన్రెడ్డి, అర్జున్కుమార్ పాల్గొన్నారు. వేరుశనగ క్వింటా రూ.6,570 గద్వాల వ్యవసాయం: గద్వాల మార్కెట్ యార్డుకు శుక్రవారం 622 క్వింటాళ్ల వేరుశనగ రాగా గరిష్టం రూ. 6570, కనిష్టం రూ. 2276, సరాసరి రూ. 5370 ధరలు లభించాయి. -
మామిడి కొమ్మల కత్తిరింపుతో అధిక దిగుబడులు
కొల్లాపూర్ రూరల్: మండలంలోని అంకిరావుపల్లి గ్రామ శివారులో ఉమ్మడి జిల్లాలోని మామిడి రైతులకు ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ ఆధ్వర్యంలో క్లస్టర్ డెవలప్మెంట్ కార్యక్రమంలో భాగంగా గురువారం రైతులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్యాన శాఖ జాయింట్ డైరెక్టర్ బాబు మాట్లాడుతూ మామిడి కొమ్మల కత్తిరింపు, పునరుద్ధరణపై రైతులకు శిక్షణతోపాటు మామిడి కొమ్మలను కత్తిరింపు చూపించడం జరిగిందన్నారు. మామిడి కొమ్మలను కత్తిరించడం వల్ల దిగుబడి బాగా వస్తుందన్నారు. ప్రతి ఏటా ఆగస్టులోగా ఈ పద్ధతి పాటించాలని రైతులకు సూచించారు. మామిడి దిగుబడి రావాలంటే కొమ్మ కత్తిరింపు అనంతరం మొక్కకు కావాల్సిన సేంద్రియ, రసాయనిక ఎరువులను చెట్టు వయస్సు బట్టి వేసుకోవాలని చెప్పారు. కొమ్మల కత్తిరింపుతో గాలి, తేమ, సూర్యరష్మి తగిలి దిగుబడి ఎక్కువ వస్తుందన్నారు. అలాగే చీడపీడల బెడదను సమర్థవంతంగా నివారిచవచ్చున్నారు. కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా ఉ ద్యాన అధికారి వేణుగోపాల్, వనపర్తి, గద్వాల, నా గర్కర్నూల్ జిల్లాల అధికారులు విజయభాస్కర్రె డ్డి, అక్బర్, వెంకటేశం, హార్టికల్చర్ యూనివర్సిటీ ఉద్యాన శాస్త్రవేత్త హరికాంత్, పాలెం శాస్త్రవేత్తలు ఆదిశంకర్, శైల, ప్రసాద్, సీడ్ రిస్క్ మేనేజర్ భూపేష్కుమార్, ఇండియా గ్యాప్ సర్టిఫికేషన్ శ్రీహరి, ఉమ్మడి జిల్లా రైతులు పాల్గొన్నారు. -
కార్మికులకు కనీస వేతనం ఇవ్వాలి
గద్వాలటౌన్: కాంట్రాక్టు వర్కర్ల క్రమబద్ధీకరణ, కనీస వేతనాలు, పెన్షన్ తదితర డిమాండ్ల సాధన కోసం కార్మికులు కదం తొక్కారు. గురువారం టీయూసీఐ ఆధ్వర్యంలో స్థానిక పాత బస్టాండ్ నుంచి నిరసన ర్యాలీ నిర్వహించి.. కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా టీయూసీఐ జిల్లా అధ్యక్షుడు హనుమంతు మాట్లాడుతూ.. రాష్ట్రంలో కనీస వేతనాల జీఓ అమలు కాకపోవడంతో కాంట్రాక్టు సిబ్బంది చాలీచాలని జీతాలతో కాలం గడుపుతున్నారన్నారు. కాంట్రాక్టు సిబ్బందిని వెంటనే క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టరేట్లో వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో టీయూసీఐ నాయకులు కృష్ణ, చెన్నరాములు, శంకరన్న, మహేశ్వరమ్మ, రంగన్న, నాగరాజు, వెంకటరామిరెడ్డి, భీమన్న, బీచుపల్లి, నల్లాస్వామి, సలీం, రాజు తదితరులు పాల్గొన్నారు. -
ఎర్రమట్టి గుట్టలను పరిశీలించిన విజిలెన్స్
అలంపూర్: మండలంలో ఎర్రమట్టి గుట్టలను కొల్లగొడుతున్న వైనంపై జూలై 27న ‘సాక్షి’లో ప్రచురితమైన ‘ఆగని మట్టి దందా’ కథనానికి రాష్ట్ర విజిలెన్స్ అధికారులు స్పందించారు. గురువారం విజిలెన్స్ డీఎస్పీ శ్రీనివాస్, ఏడీఎంజీ కేఎల్ఎన్ రావు, ఆర్ఐ సత్యనారాయణ తదితరుల ఆధ్వర్యంలో మూడు బృందాలుగా ఏర్పడి సుల్తానాపురం, రేలంపాడు శివారుల్లో ఉన్న గుట్టలను పరిశీలించారు. గుట్టల్లో మట్టి తవ్వకాలతో పాటు ఇసుక అక్రమ రవాణాపై ఆరా తీసినట్లు తెలిసింది. మట్టి తవ్వకాలు ఎంత మేర జరిగాయనే దానిపై నివేదిక ఇవ్వాలని స్థానిక అధికారులకు సూచించినట్లు సమాచారం. అయితే విజిలెన్స్ అధికారులకు తగిన సమాచారం ఇవ్వడంలో స్థానిక అధికారులు దోబూచులాడటంపై విమర్శలు వ్యక్తవుతున్నాయి. ప్రకృతి సంపదను అక్రమార్కులు కొల్లగొడుతున్నా.. కనీస సమాచారాన్ని రహస్యంగా ఉంచడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా, ఈ విషయమై మైనింగ్ అధికారులను ఫోన్లో సంప్రదించగా.. అందుబాటులోకి రాలేదు. విజిలెన్స్ అధికారుల వెంట ఆర్ఐ దుర్గాసింగ్ ఉన్నారు. -
గూడు.. తీరొక్క గోడు!
‘ఇందిరమ్మ ఇళ్ల’లో కొర్రీలు ●● అర్హుల జాబితాలో చేర్చి.. ఆపై తీసేయడంతో ఆందోళన ● 600 ఎస్ఎఫ్టీలలోపే అనుమతితో పలువురు దూరం ● పక్కా ఇళ్లలో అద్దెకున్న వారికి వర్తించని పథకం ● అడ్డంకిగా మారిన పలు నిబంధనలు కేటీదొడ్డి మండలం ఇర్కిచేడుకు చెందిన పద్మమ్మ తన భర్త, ముగ్గురు పిల్లలతో కలిసి గుడిసెలో నివాసం ఉంటోంది. ఆమె ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఇల్లు మంజూరు కాలేదు. నివాసముంటున్న గుడిసె కూడా పూర్తిగా దెబ్బతింది. ఎప్పుడు కూలుతుందో తెలియని పరిస్థితి. వర్షం వస్తే పూర్తిగా కురుస్తుంది. కప్పుపై కవర్ కప్పుకొని కాలం వెల్లదీస్తున్నారు. అన్ని అర్హతలు ఉన్న తమకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి ఆదుకోవాలని కోరుతుంది. అద్దె ఇంట్లో ఉంటున్నాం.. మా ఇల్లు పాడుపడటంతో ఖాళీ చేసి.. అద్దె ఇంట్లో ఉంటున్నాం. నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రతినెలా రూ. 5వేల ఇంటి అద్దె చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నా. సెంటు భూమి లేని మాకు కుటుంబం గడవడమే కష్టంగా ఉంది. ఇందిరమ్మ ఇంటి కోసం అధికారులను అడిగితే మీకు ఇల్లు రాలేదని అంటున్నారు. ఏం చేయాలో తోచడం లేదు. ఏళ్ల తరబడిగా ఎదురుచూస్తున్న సొంతింటి కల కలగానే మిగిలింది. – శ్రీధర్, ధరూరు సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: పేద, మధ్య తరగతి కుటుంబాలకు గూడు కల్పించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకంలో నిబంధనల కొర్రీలు లబ్ధిదారుల ఆశలపై నీళ్లు చల్లుతున్నాయి. ప్రధానంగా 600 చదరపు అడుగుల (ఎస్ఎఫ్టీ) కంటే ఎక్కువ విస్తీర్ణంలో ఇల్లు నిర్మిస్తే ఇందిరమ్మ పథకం వర్తించదని అధికారులు తేల్చిచెబుతుండడంతో ఎటూ తేల్చుకోలేని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ క్రమంలో ఎక్కువ మొత్తంలో లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణం చేపట్టకుండా వేచి చూస్తున్నారు. మరో వైపు అర్హుల జాబితాలో చేర్చి, ఆపై తీసేయడం.. పక్కా ఇళ్లలో అద్దెకుంటున్న వారికీ మొండిచేయి చూపడంతో పలువురు ఆందోళనలో కొట్టుమిట్టాడుతున్నారు. ప్రతిబంధకాలుగా మారిన నిబంధనలతో ఉమ్మడి పాలమూరు జిల్లావ్యాప్తంగా ఇబ్బందిపడుతున్న లబ్ధిదారులు, ఆశావహుల తీరొక్క గోడుపై ‘సాక్షి’ గ్రౌండ్ రిపోర్ట్.. జిల్లాల వారీగా ఇందిరమ్మ ఇళ్ల వివరాలు.. -
రోడ్డు భద్రతా నియమాలు తప్పనిసరి
అయిజ: ప్రైవేటు స్కూల్ బస్సులను నిబంధనల మేరకు నడుపుకోవాలని.. రోడ్డు భద్రతా నియమాలను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని డీటీఓ వెంకటేశ్వరరావు హెచ్చరించారు. గురువారం అయిజలో ప్రైవేటు స్కూల్ బస్సులను మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ రాములు, అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ వెంకటరమణారెడ్డిలతో కలిసి ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అనుమతి పత్రాలను పరిశీలించారు. బస్సు సీటింగ్ కెపాసిటీ మేరకు విద్యార్థులను తరలించాలని సూచించారు. దరఖాస్తుల ఆహ్వానం గద్వాల: హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ప్రవేశాలకు సంబంధించి ఎస్సీ విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ బీఎం సంతోష్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఒకటో తరగతిలో జిల్లాకు ఒక సీటు కేటాయించినట్లు పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 2018 జూన్ 1నుంచి 2019 మే 31వ తేదీ మధ్య జన్మించి ఉండాలని.. గ్రామీణ ప్రాంతాల వారి వార్షిక ఆదాయం రూ. 1.50లక్షలు, పట్టణ ప్రాంతానికి చెందిన వారి వార్షికాదాయం రూ. 2లక్షలు మించరాదన్నారు. దరఖాస్తు ఫారాలు ఎస్సీ సంక్షేమాభివృద్ధిశాఖ కార్యాలయంలో పొందవచ్చన్నారు. ఆసక్తి, అర్హత గల విద్యార్థులు 8వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని.. 10న కలెక్టరేట్లో లక్కీ డిప్ ద్వారా ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. మెరుగైన వైద్యం అందించాలి ఇటిక్యాల: ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డా.సిద్దప్ప అన్నారు. గురువారం ఇటిక్యాల పీహెచ్సీలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పలు రికార్డులను పరిశీలించడంతో పాటు వైద్యసేవలపై ఆరా తీశారు. వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటిస్తూ.. ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆయన సూచించారు. ముఖ్యంగా ప్రసవాల సంఖ్య పెంచాలన్నారు. సీజనల్ వ్యాధుల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. డీఎంహెచ్ఓ వెంట ఎంసీహెచ్ పోగ్రాం అధికారి డా.ప్రసూనారాణి, డీపీఎన్ఎం వరలక్ష్మి, మండల వైద్యాధికారి రాధిక తదితరులు ఉన్నారు. వేరుశనగ @రూ. 6,189 గద్వాల వ్యవసాయం: జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్యార్డుకు గురువారం 725 క్వింటాళ్ల వేరుశనగ విక్రయానికి వచ్చింది. క్వింటాల్కు గరిష్టంగా రూ. 6,189, కనిష్టంగా రూ. 3,352, సరాసరి రూ. 4050 ధరలు లభించాయి. -
మహిళల ఆర్థికాభివృద్ధే లక్ష్యం
అలంపూర్: మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించాలనే సంకల్పంతో ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర మత్స్య, పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. అలంపూర్ చౌరస్తాలోని ఓ ఫంక్షన్ హాల్లో గురువారం నిర్వహించిన ఇందిరా మహిళాశక్తి సంబురాలు, రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి మంత్రితో పాటు ఎమ్మెల్యే విజయుడు, కలెక్టర్ బీఎం సంతోష్, అదనపు కలెక్టర్లు లక్ష్మీనారాయణ, నర్సింగ్రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం మహిళా అభ్యున్నతికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందన్నారు. కోటిమంది మహిళలను కోటీశ్వరులను చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. అందులో భాగంగానే 2,600 మహిళా సంఘాలకు రూ. 3.15కోట్ల వడ్డీ లేని రుణాలు అందించినట్లు చెప్పారు. పలు పెట్రోల్ బంకులు, 1000 ఆర్టీసీ బస్సులకు మహిళా సమాఖ్యలను యజమానులుగా చేసిందన్నారు. మహిళల పేరుపైనే సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామన్నారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేందుకు సీఎం రేవంత్రెడ్డి కృషి చేస్తున్నారని అన్నారు. పేదల సొంతింటి కలను నెరవేర్చడానికి ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసినట్లు తెలిపారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి బడుగు బలహీన వర్గాల కోసం అనేక సంక్షేమ పథకాలు అందించారని.. అదే తరహాలో రేవంత్రెడ్డి ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. తెలంగాణ వచ్చాక పేదలకు రేషన్కార్డులు అందించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు. కలెక్టర్ సంతోష్ మాట్లాడుతూ.. అలంపూర్ నియోజకవర్గంలో 2,041 మహిళా సంఘాల సభ్యులు ఉండగా.. బ్యాంకు లింకేజీ రుణాలు రూ. 30.58 కోట్లు, 2,600 సంఘాలకు రూ. 3.15 కోట్ల వడ్డీ లేని రుణాలు అందిస్తున్నట్లు తెలిపారు. 23మందికి రూ. 13.89లక్షల బీమా చెక్కులు అందజేసినట్లు వివరించారు. కొత్తగా 3వేల రేషన్ కార్డులు మంజూరు కాగా.. 19వేల మంది పేర్లను కొత్తగా నమోదు చేసినట్లు తెలిపారు. అనంతరం గొర్రెలకు నీలినాలుక వ్యాధి నిరోధక టీకాల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి వాకిటి శ్రీహరి ప్రారంభించారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తాం రాష్ట్ర మత్స్య, పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి -
రహదారులకు మహర్దశ
ఉమ్మడి జిల్లాలో రోడ్ల విస్తరణకు నిధులు కేటాయించిన ప్రభుత్వం సాక్షి, నాగర్కర్నూల్: ఉమ్మడి జిల్లావ్యాప్తంగా కీలకమైన రహదారులకు మహర్దశ పట్టనుంది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం వీటి విస్తరణ కోసం పెద్దఎత్తున నిధులు విడుదల చేసింది. మహబూబ్నగర్, వనపర్తి సర్కిళ్ల వారిగా ఉమ్మడి జిల్లాలోని మొత్తం 41 రోడ్ల విస్తరణ, బలోపేతం చేసేందుకు రోడ్డు, భవనాల శాఖ నిధులు కేటాయించింది. ప్రధానంగా జిల్లాలను అనుసంధానం చేస్తూ కొనసాగుతున్న రహదారులతోపాటు మండలాలు, గ్రామాలకు కనెక్టింగ్ రోడ్లను విస్తరించనున్నారు. మహబూబ్నగర్ ఆర్అండ్బీ సర్కిల్లో మహబూబ్నగర్, జోగుళాంబ గద్వాల, నారాయణపేట జిల్లాలు ఉండగా.. వీటి పరిధిలోని 26 రోడ్ల నిర్మాణానికి సంబంధించి మొత్తం 380.85 కి.మీ., మేర రోడ్లను విస్తరించనున్నారు. ఇందుకు గానూ ప్రభుత్వం రూ.434.19 కోట్లు కేటాయించింది. అలాగే వనపర్తి సర్కిల్లో వనపర్తి, నాగర్కర్నూల్ జిల్లాలు ఉండగా.. వీటి పరిధిలో 15 రోడ్లను ప్రభుత్వం డబుల్ రోడ్లుగా విస్తరించనుంది. మొత్తం 279.16 కి.మీ., మేర రహదారులను విస్తరించాల్సి ఉండగా ఇందుకోసం రూ.399.34 కోట్లు మంజూరు చేసింది. పెండింగ్లో ఉన్నవాటికి మోక్షం.. ఉమ్మడి జిల్లాలో గత కొన్నేళ్లుగా ప్రధాన రహదారుల విస్తరణ, మరమ్మతు పనులు దాదాపుగా నిలిచిపోయాయి. రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ చేపట్టిన జాతీయ రహదారుల నిర్మాణాలు మాత్రమే ముమ్మరంగా కొనసాగుతున్నాయి. జిల్లాలను ఒక దానితో మరొకటి అనుసంధానిస్తూ ఉన్న ఆర్అండ్బీ రోడ్లు, మండల కేంద్రాలను అనుసంధానం చేస్తూ ఉన్న రోడ్ల విస్తరణతోపాటు మరమ్మతుకు సైతం నోచుకోవడం లేదు. సుమారు ఐదేళ్లకుపైగా ఆర్అండ్బీ రోడ్లకు మరమ్మతు లేకపోవడంతో రోడ్లు పూర్తిగా దెబ్బతిని అధ్వానంగా మారాయి. మండల కేంద్రాల నుంచి గ్రామాలకు వెళ్లే కనెక్టింగ్ రోడ్లు వర్షాలకు దెబ్బతిని, కంకర తేలి దర్శనమిస్తున్నాయి. తాజాగా ప్రభుత్వం ఆర్అండ్బీ రోడ్ల విస్తరణ, మరమ్మతుకు నిధులను మంజూరు చేయడంతో ఈ రోడ్ల రూపురేఖలు మారిపోనున్నాయి. హెచ్ఏఎం విధానంలో.. ఈసారి రహదారుల నిర్మాణ ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం హైబ్రిడ్ యాన్యూటీ మోడ్ (హెచ్ఏఎం) విధానంలో చేపడుతోంది. పూర్తిస్థాయిలో నిధులను ప్రభుత్వమే ఖర్చు చేయకుండా ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో రహదారులను నిర్మించాలని నిర్ణయించింది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం జాతీయ రహదారుల నిర్మాణాలను ఈ విధానంలోనే చేపడుతుండగా.. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం హెచ్ఏఎం విధానంలో రోడ్ల విస్తరణ చేపట్టనుంది. ఈ విధానంలో రోడ్ల నిర్మాణానికి అవసరమైన నిధుల్లో 40 శాతం నిధులను ప్రభుత్వం సమకూర్చితే మిగతా 60 శాతం నిధులను ఆయా రోడ్డు నిర్మాణ కాంట్రాక్టు సంస్థలే భర్తీ చేయాల్సి ఉంటుంది. తర్వాత 15 ఏళ్లపాటు రోడ్డు నిర్వహణ బాధ్యతలతోపాటు టోల్ రుసుం సంబంధిత సంస్థలే నిర్వహిస్తాయి. రోడ్ల విస్తరణకు నిధుల కొరత లేకుండా, నిర్ణీత గడువులోగా వేగంగా పనులు పూర్తిచేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వనపర్తి సర్కిల్ పరిధిలో.. వనపర్తి– జడ్చర్ల వయా వట్టెం, తిమ్మాజిపేట రోడ్డు, బల్మూరు– నాగర్కర్నూల్ వయా గోదల్, తుమ్మన్పేట్, అచ్చంపేట– రాకొండ వయా ఉప్పునుంతల రోడ్డు, పెంట్లవెల్లి– వనపర్తి వయా శ్రీరంగాపూర్, అమ్రాబాద్– ఇప్పలపల్లి రోడ్డు, వనపర్తి– ఆత్మకూర్, ఆత్మకూర్– మరికల్ రోడ్డు, వనపర్తి– బుద్దారం రోడ్డు, చిన్నంబావి– చెల్లెపాడు రోడ్ల నిర్మాణాలను ప్రభుత్వం చేపట్టనుంది. అలాగే బల్మూర్– నాగర్కర్నూల్ వయా గోదల్, తుమ్మన్పేట్ రోడ్డు, అచ్చంపేట– రాకొండ, పెంట్లవెల్లి– వనపర్తి రోడ్లను డబుల్గా విస్తరించనున్నారు. మహబూబ్నగర్ సర్కిల్ పరిధిలో జోగుళాంబ గద్వాలలోని ఎర్రిగెర– అయిజ– అలంపూర్ రోడ్డు (బల్గెర, మిట్టిదొడ్డి, తుమ్మపల్లి, శాంతినగర్, కౌకుంట్ల, శ్రీనగర్, కొరివిపాడు, బొంకూర్)ను విస్తరించారు. అలాగే గద్వాల– రంగాపూర్ రోడ్డు, తుంగభద్ర బ్రిడ్జి అప్రోచ్ రోడ్డు, గద్వాల– అయిజ రోడ్డు (బింగిదొడ్డి, అయిజ) రోడ్లను మెరుగుపరచనున్నారు. మహబూబ్నగర్ జిల్లాలోని వనపర్తి– జడ్చర్ల వయా బిజినేపల్లి రోడ్డు, మహబూబ్నగర్– మంగనూర్ రోడ్డు, మహబూబ్నగర్– నవాబుపేట రోడ్డు, వేపూర్ జెడ్పీ రోడ్డు నుంచి కొమ్మిరెడ్డిపల్లి వయా షేక్పల్లి, కురుమూర్తిరాయ టెంపుల్ రోడ్డు, గుడిబండ– తిరుమలాపూర్– అప్పంపల్లి రోడ్డు, కోడూరు– కోయిల్కొండ రోడ్డు వయా మల్కాపూర్, మణికొండ రోడ్డు, జడ్చర్ల రైల్వేస్టేషన్– కొత్తమొల్గర రోడ్డు, రాజాపూర్– తిరుమలాపూర్, మరికల్– మిన్సాపూర్ రోడ్డు, మక్తల్– నారాయణపేట వయా లింగంపల్లి రోడ్లను పునరుద్ధరించనున్నారు. మహబూబ్నగర్ సర్కిల్ పరిధిలో 380.85 కి.మీ మేర రోడ్ల నిర్మాణానికి రూ.434 కోట్లు వనపర్తి సర్కిల్లో 15 రోడ్ల నిర్మాణానికి రూ.399.34 కోట్లు మంజూరు హైబ్రిడ్ యాన్యూటీ విధానంలో పనులు చేపట్టేందుకు చర్యలు జిల్లాలు, మండలాలు, గ్రామాల కనెక్టింగ్ రోడ్లకు ప్రాధాన్యం -
మెరుగైన వైద్య సేవలు అందించాలి
గద్వాల క్రైం: జిల్లా ప్రభుత్వాసుపత్రిలో రోగులకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని కలెక్టర్ సంతోష్ అన్నారు. బుధవారం జిల్లా ఆసుపత్రిలో రూ.3 కోట్లతో చేసిన అభివృద్ధి పనులను కలెక్టర్తోపాటు ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్రెడ్డి, విజయుడులు ముఖ్యఅతిథులుగా హాజరై ప్రారంచారు. కలెక్టర్ మాట్లాడుతూ.. అత్యవసర సమయాల్లో రోగులకు ఆక్సిజన్ అందక మృతి చెందిన సంఘటనలు ఎన్నో ఉన్నాయని, ఇక నుంచి ఆక్సిజన్ కొరత లేకుండా ప్లాంట్ ఏర్పాటుకు రూ.2.65 కోట్లు వెచ్చించి ఏర్పాటు చేశామన్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులకు తక్షణ సహాయం అందించడం జరుగుతుందన్నారు. రేడియాలజీ సేవల కోసం వచ్చే గర్భిణులు వేచి ఉండేందుకు సిటీ స్కాన్ బ్లాక్ వద్ద నూతనంగా రూ. 8.90లక్షలతో వెయింటింగ్ హాల్ నిర్మించామన్నారు. ఆస్పత్రి ఆవరణలో సీసీ రోడ్లు, తదితర పనులు చేపట్టినట్లు తెలిపారు. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి మాట్లాడుతూ.. 300 పడకల ఆసుపత్రిగా ఉన్నప్పటికి 550 పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేసేందుకు ప్రభుత్వానికి నివేదిక అందజేశామన్నారు. ఆధునిక వైద్య పరికరాలు, మౌలిక వసతులు అందుబాటులోకి తీసుకురావడం జరిగిందన్నారు. ఎమ్మెల్యే విజయుడు మాట్లాడుతూ.. జిల్లాలోని ఆయా ప్రాంతాల్లోంచి వచ్చే రోగులకు ఎలాంటి సమస్యలు లేకుండా వైద్యులు చూడాలని, సిబ్బంది, వైద్యులు తప్పనిసరిగా సమయపాలన పాటించాలని అన్నారు. ఎల్లప్పుడు అందుబాటులో ఉండాలన్నారు. కార్యక్రమంలో ఆస్పత్రి సూపరింటెండెంట్ ఇందిర, అభినేష్, సిబ్బంది, నాయకులు పాల్గొన్నారు. కలెక్టర్ బీఎం సంతోష్ జిల్లా ఆస్పత్రిలో రూ.3 కోట్లతో అభివృద్ధి పనులు -
నిబంధనలు పట్టవా?
ప్రిస్కిప్షన్ లేకుండానే ఔషధాల విక్రయాలు ●లైసెన్స్ రద్దు చేస్తాం అనుమతి లేకుండా మెడికల్ దుకాణాలు, ఏజెన్సీలు ఏర్పాటు చేసినా.. వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు విక్రయిస్తే సదరు దుకాణాల లైసెన్స్ రద్దు చేస్తాం. గర్భవిచ్ఛిత్తి మాత్రలు, అబార్షన్ కిట్ విక్రయాలు, వాటికి సంబంధించిన రికార్డులపై తనిఖీలు నిర్వహించాం. మూడు మెడికల్ దుకాణాల నిర్వాహకులు సరైన రికార్డులు చూయించకపోవడంతో షోకాజ్ నోటీసులు జారీ చేశాం. ప్రజలు సైతం ఇష్టారీతిలో మందులు కొనుగోలు చేసి ప్రాణాల మీదికి తెచ్చుకోవద్దు. – వినయ్, జిల్లా ఇన్చార్జి ఔషధ నియంత్రణ అధికారి గద్వాల క్రైం: జిల్లాలో కొందరు మెడికల్ షాపు యజమానులు.. వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండానే పలు మందులు విక్రయిస్తూ నిబంధనలు తుంగలో తొక్కుతున్నారు. ఔషధ నియంత్రణ అధికారులు గత వారం రోజులుగా గద్వాల – అలంపూర్ సెగ్మెంట్లలో తనిఖీలు నిర్వహించిన క్రమంలో బహిర్గతం అయ్యింది. నిబంధనలు ఉల్లంఘించిన 21 మెడికల్ దుకాణాలకు నోటీసులు జారీ చేసి అయిదు రోజుల పాటు సస్పెనషన్ వేటు వేశారు. మరో వైపు గర్భవిచ్చిత్తి మాత్రలు, అబార్షన్ కిట్ అమ్మకాలపై ఈ నెల 16వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా డ్రగ్ కంట్రోల్ అధికారులు మెడికల్ దుకాణాలలో తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో జిల్లాలోని ప్రైవేటు ఆసుపత్రులకు అనుసంధానంగా ఉన్న మూడు ఫార్మసీలలో తనిఖీలు చేయగా గర్భవిచ్ఛిత్తి మాత్రలు, అబార్షన్ కిట్ రికార్డులు లేకపోవడంతో ముగ్గురికి షోకాజ్ నోటీసులను జిల్లా ఇంచార్జ్ డ్రగ్ ఇన్స్పెక్టర్ వినయ్ ఇచ్చారు. మొత్తంగా జిల్లాలో నిబంధనలు ఉల్లంఘించి మందుల విక్రయాలు జరుగుతున్నాయని తనిఖీల్లో బహిర్గతం అయ్యింది. తనిఖీలు ముమ్మరం గద్వాల, అయిజ, అలంపూర్, ధరూర్, గట్టు, ఇటిక్యాల, శాంతినగర్ తదితర మండలంలోని మెడికల్ దుకాణాలపై ఔషధ నియంత్రణ అధికారులు ముమ్మరంగా తనిఖీలు చేయడంతో వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు విక్రయాలు చేస్తున్నట్లు గుర్తించారు. ఈ క్రమంలో పలువురికి షోకజ్ నోటీసులు జారీ చేసి శాఖ పరమైన చర్యలు తీసుకున్నారు. మరో వైపు గ్రామీణ ప్రాంతాల్లో ఎలాంటి అనుమతి లేకుండా మందులు, ఇంజక్షన్లు ఆర్ఎంపీలు సైతం విక్రయాలు చేయడం వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు గుర్తించి సీజ్ చేసిన సంఘటనలు ఉన్నాయి. పూర్తి స్థాయిలో తనిఖీలు చేపడితే నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకునేందుకు దోహద పడుతుంది. మెడికల్ షాపు యజమానుల ఇష్టారాజ్యం మత్తు ఇంజెక్షన్లు, గర్భస్త్రావం మాత్రలు యథేచ్ఛగా విక్రయాలు రికార్డుల నిర్వహణలోనూ నిర్లక్ష్యం అధికారుల తనిఖీల్లో పలు విషయాలు వెలుగులోకి.. -
నేడు అలంపూర్కు మంత్రుల రాక
అలంపూర్: జోగుళాంబ శక్తిపీఠాన్ని దర్శించుకోవడంతోపాటు అలంపూర్లోని పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఈ నెల 31వ తేదీన గురువారం మంత్రులు పట్టణానికి రానున్నుట్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక ప్రకటనలో తెలిపారు. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జిల్లెల చిన్నారెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే సంపత్కుమార్ ఆలయంలో ఉదయం 10 గంటలకు నిర్వహించే జోగుళాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి కల్యాణ మహోత్సవంలో పాల్గొంటారని, అనంతరం అలంపూర్ చౌరస్తాలో మహిళా సాధికారత, మహిళలకు వడ్డీలేని రుణాలు, రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండండి అయిజ: సీజనల్ వ్యాధుల భారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని, ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని ఇంచార్జ్ డీఎంహెచ్ఓ సిద్దప్ప అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. డెలివరీ రూం, ఏఎంసీలను, ల్యాబ్ను, ఫార్మసీ గదిని పరిశీలించారు. మెడికల్ ఆఫీసర్లు విష్ణు, కిరణ్తో వైద్య సేవలు, అందుబాటులో ఉన్న మందుల గురించి ఆరా తీశారు. సాధారణ కాన్పుల సంఖ్యను పెంచాలని, కుక్క, పాము కాటుకు మందులను సిద్ధంగా ఉంచుకోవాలని అన్నారు. పీహెచ్సీకి నలుగురు డాక్టర్లను ఏర్పాటు చేశామని, ఇన్ పేషంట్లకు మెరుగైన వైద్యసేవలు అందించాలన్నారు. ప్రజలు సీజనల్ వ్యాధుల బారినపడకుండా ఉండేందుకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని పలు సలహాలు చేశారు. దండం పెడతా.. విద్యార్థుల జీవితాలతో ఆటలొద్దు ఉండవెల్లి: విద్యార్థుల జీవితాలతో ఆటలొద్దని.. వారికి నాణ్యమైన భోజనం అందించాలంటూ ఎమ్మెల్యే విజయుడు వంట సిబ్బందికి సూచించారు. మండలంలోని అలంపూర్ చౌరస్తాలోని గురుకుల పాఠశాలను ఎమ్మెల్యేతోపాటు బీఆర్ఎస్వి జిల్లా కోఆర్డినేటర్ పల్లయ్య, పీఎసీఎస్ చైర్మన్ గజేందర్రెడ్డి పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పురుగుల అన్నం, ఉప్పు నీటితో చారు చేసి ఇస్తున్నారని ఉపాధ్యాయులపై, రాష్ట్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారని, అనేక సమస్యలున్నా నిధులు విడుదల చేయక ఇబ్బందులు పెడుతున్నారని, అందుకే విద్యార్థులు రోడెక్కుతున్నారని అన్నారు. వంట గదికి వెళ్లి విద్యార్థులకు నాణ్యమైన భోజనం మెనూ ప్రకారం అందించాలని దండం పెట్టి వేడుకున్నారు. అనంతరం ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాద్యక్షుడు దామర కిరణ్ సైతం పాఠశాలకు చేరుకొని భోజనాన్ని పరిశీలించారు.ప్రభుత్వం నిధులు విడుదల చేయాలని, సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈదన్న, సింగరాజు మద్దిలేటి, శేషన్ గౌడు, తదితరులు పాల్గ్గొన్నారు. -
టీచర్గా మారిన కలెక్టర్..
గద్వాలటౌన్: పిల్లలూ... ఎలా చదువుతున్నారు, ఇంగ్లీష్ చదవడం వచ్చా.. అంటూ విద్యార్థినులను పలకరించారు కలెక్టర్ సంతోష్. కలెక్టర్ అడిగిన ప్రశ్నకు ఆ.. వచ్చు సార్ అంటూ పిల్లలు బదులిచ్చారు. బుధవారం గద్వాల మండలం గోనుపాడులో ఉన్న కేజీబీవీ పాఠశాలను కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఓ తరగతి గదిలోకి వెళ్లి విద్యార్థులతో ముచ్చటించారు. విద్యార్థుల చేత పాఠాలు చదివించారు. టీచర్లు బాగా చెబుతున్నారా అని అడిగి సమాధానాలు రాబట్టారు. బాగా చదువుకోవాలని విద్యార్థినులకు సూచించారు. ఉపాధ్యాయుల హాజరు పట్టిని, విద్యార్థుల ఫెషియల్ రికగ్నిషన్ను పరిశీలించారు. యూడైస్ ఎంట్రీలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలన్నారు.ఇదిలాఉండగా, మధ్యాహ్న భోజన తనిఖీలో లోపాలు కనిపించడం, మెనూ పాటించకపోవడంపై కలెక్టర్ సంతోష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మెనూ ప్రకారం భోజనం అందించకపోవడంతో ఎస్ఓకు మెమో జారీ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆకస్మిక తనిఖీలో భాగంగా కలెక్టర్ పాఠశాలలోని వంటగది, తగునీరు, భోజనం నాణ్యత, స్టోర్ రూంలోని సరుకులు, పరిసరాలను పరిశీలించారు. విద్యార్థులు ఆరోగ్యంగా ఉండేందుకు మెనూ ప్రకారం ప్రతిరోజు పౌష్టికాహారం ఇవ్వాలన్నారు. -
ఈ–పాస్ ద్వారానే ఎరువుల విక్రయాలు
ఎర్రవల్లి: ఎరువుల డీలర్లు రైతులకు ఈ –పాస్ మిషన్ ద్వారానే ఎరువులు విక్రయించాలని జిల్లా వ్యవసాయశాఖ అధికారి సక్రియా నాయక్ అన్నారు. బుధవారం మండలంలోని కోదండాపురం, పుటాన్దొడ్డి గ్రామాలను సందర్శించి రైతులు వానాకాలంలో సాగు చేసిన వివిధ పంటలను ఏఓ రవికుమార్తో కలిసి పరిశీలించారు. అలాగే కోదండాపురం స్టేజీలోని రైతు సేవా కేంద్రం ఎరువుల దుకాణాన్ని, ఎరువుల నిల్వలు, రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా డీఏఓ మాట్లాడుతూ.. ఎరువుల కోసం వచ్చే ప్రతి రైతు నుంచి ఆదార్ కార్డు తీసుకొని ఈ పాస్లో నమోదు చేసిన తర్వాతే ఎరువులను విక్రయించాలన్నారు. ప్రభుత్వం ముద్రించిన ధరల కంటే అధికంగా విక్రయించరాదని ఆదేశించారు. రైతులు తమకు కావాల్సిన మోతాదు మేరకు మాత్రమే యూరియాను పంటలకు వాడుకోవాలన్నారు. ఎక్కువ మొత్తంలో యూరియాను వాడటం వల్ల పంటలకు లాభం కంటే నష్టం అధికంగా జరుగుతందన్నారు. రెండవ సారి యూరియాను వాడాలనుకునే రైతులు వంద శాతం నీటిలో కలిగే సూక్ష్మ రూపంలో దొరికే నానో డీఏపీ, నానో యూరియాను ఒక ఎకరానికి 500 మిల్లీ లీటర్లు 200 లీటర్ల నీటిలో కలిపి స్ప్రే చేస్తే మొక్కలకు ఎక్కువ ప్రయోజనం ఉంటుందని సూచించారు. కార్యక్రమంలో ఏఓ రవికుమార్, డీలర్ రవి, రైతులు రామిరెడ్డి, మల్లికార్జున్ ఉన్నారు. -
తేళ్లు కుట్టని పంచమి
అరచేతిలో తేలు.. ఆనందంలో యువతి తేళ్లను చూస్తేనే ఒళ్లు జలదరిస్తుంది. ఎక్కడ కుట్టి చంపేస్తుందేమోననే భయంతో ఆమడదూరం పారిపోతాం. కానీ, తేలు కుట్టని రోజంటూ ఒకటుందని మీకు తెలుసా.. అదే తేళ్ల పంచమి. ఈ రోజు తేలును పట్టుకున్నా.. ఒంటిపై, చెంపపై, చేతిపై వేసుకున్నా.. ఏకంగా నోట్లో నాలుకపై పెట్టుకున్నా ఏమీ చేయని అరుదైన దృశ్యాలను రాష్ట్ర సరిహద్దులోని కర్ణాటక రాష్ట్రం యాద్గీర్ జిల్లా కందుకూరులో చూడవచ్చు. నాగుల పంచమి పర్వదినమైన మంగళవారం నాడు తేళ్ల పంచమిని పురస్కరించుకొని స్థానికంగా కొండమవ్వగుట్టపైకి వందలాది మంది తరలివెళ్లి తేళ్ల విగ్రహాలకు ప్రత్యేక పూజలు చేశారు. గుట్టపై రాళ్ల కింద, చెట్ల పొదల్లో ఉన్న తేళ్లను చిన్నా, పెద్ద తేడా లేకుండా పట్టుకొని సందడి చేశారు. మరికొందరు తమ ఇంటికి తేళ్లను తీసుకెళ్లి పూజించారు. తేళ్ల పంచమి జరుపుకోవడం ద్వారా తమను తాము తేళ్ల బారి నుంచి రక్షించుకోవచ్చని నమ్ముతారు.ఈ జాతరకు వేలాదిగా రాగా గుర్మిట్కల్ పోలీసులు బందోబస్తు నిర్వహించారు. – నారాయణపేట -
ఎరువులు అధిక ధరకు విక్రయిస్తే చర్యలు
మల్దకల్: ఎరువులను అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తప్పవని డీఏఓ సక్రియానాయక్ ఫర్టిలైజర్ షాపు నిర్వాహకులను హెచ్చరించారు. మంగళవారం పాల్వాయి గ్రామంలోని ఫర్టిలైజర్ షాపును ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు ఎరువులను విక్రయించిన వెంటనే రశీదులను ఇవ్వాలని, విత్తనాలు కొనుగోలు చేసే రైతులు తప్పనిసరిగా షాపు యజమానులతో రశీదులు పొందాలన్నారు. ఫర్టిలైజర్ షాపులలో ఈ – పాస్మెషిన్ ద్వారానే మందులు పంపిణీ చేపట్టాలని, స్టాక్ వివరాలను రికార్డులలో పొందుపరచాలన్నారు. అనుమతులు లేని ఎరువులు, విత్తనాలు విక్రయిస్తే లైసెన్సులను రద్దు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయఽ అధికారి రాజశేఖర్, ఫర్టిలైజర్ షాపు నిర్వాహకులు పాల్గొన్నారు. -
అక్రమ నిర్మాణాలపై చర్యలు చేపట్టండి
ఎక్కడా లేని విధంగా నాలలు, కందకాలు కబ్జాకు గురయ్యాయి. అధికారులు, పాలకుల ఊదాసీనత వల్లే అక్రమ నిర్మాణాలు, ఆక్రమణలు పెరిగాయి. ఇప్పటికై నా అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి అక్రమ నిర్మాణాలు, కబ్జాలపై చేపట్టాల్సిన చర్యలపై సమీక్షించాలి. తద్వారా రానున్న రోజుల్లో ఎదుర్కొనే సమస్యల పరిష్కారంపై స్పష్టత వస్తుంది. ఇప్పటికై నా మేల్కొనపోతే భవిష్యత్లో త్రీవ ఇబ్బందులు పడాల్సి వస్తుంది. – శ్రీధర్, గద్వాల దారులు అధ్వానం పట్టణంలోని ప్రధాన రహదారులతో పాటు కాలనీ అంతర్గత రోడ్లు అధ్వానంగా తయారయ్యాయి. ఎక్కడపడితే అక్కడ గుంతలు ఏర్పాడ్డాయి. నిత్యం గుంతల రోడ్లపై ప్రయాణం అంటే సాహసం చేయాల్సి వస్తోంది. ప్రమాదాలు చోటుచేసుకుంటున్న అధికారుల పట్టనట్లుగా ఉన్నారు. మరమ్మతులు సైతం మొక్కుబడిగా చేపట్టి చేతులు దులుపుకొంటున్నారు. ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి రహదారులను మెరుగుపర్చాలి. – గోపాల్, గద్వాల