Jogulamba
-
మోగిన బడిగంట..!
గద్వాలటౌన్: వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు పునఃప్రారంభం అయ్యాయి. ఇన్ని రోజులు ఆటపాటలతో గడిపిన విద్యార్థులు గురువారం బడి గంట కొట్టగానే పాఠశాలలకు చేరుకున్నారు. పాఠశాలన్నీ పండగ వాతావరణంలో ప్రారంభించారు. కొన్ని పాఠశాలలకు మామిడి తోరణాలను కట్టి అలంకరించారు. హెచ్ఎం, ఉపాధ్యాయులు విద్యార్థులకు స్వాగతం పలికారు. హాజరైన విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, దుస్తులు అందజేశారు. తొలిరోజు.. తడ‘బడి’ ఎంతో ఉత్సాహంగా ప్రారంభం కావాల్సిన కొత్త విద్యా సంవత్సరం తడబడుతూ మొదలైంది. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు 2025–26 విద్యా సంవత్సరానికి ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు గురువారం బడిబాట పట్టారు. అయితే చాలా పాఠశాలలు ఉపాధ్యాయుల హజరుకే పరిమితం అయ్యాయి. మరికొన్ని చోట్ల విద్యార్థుల హాజరు నామమాత్రంగా ఉండటం గమనార్హం. పట్టణాలతో పోల్చితే గ్రామీణ ప్రాంతాలలోని ప్రభుత్వ పాఠశాలలో మొదటి రోజు విద్యార్థుల హాజరు శాతం చాలా తక్కువగానే ఉంది. ● మానవపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఐదుగురు ఉపాధ్యాయులు, 12 మంది విద్యార్థులు మాత్రమే హాజరయ్యారు. ● గోకులపాడు పాఠశాలలో ఒకే ఒక్క ఉపాధ్యాయుడు హాజరయ్యాడు. విద్యార్థులు ఒక్కరూ కూడా పాఠశాలకు రాలేదు. అలాగే, కేజీబీవీకి ఆరుగురు ఉపాధ్యాయులు హాజరుకాగా.. విద్యార్థులు ఎవరూ ప్రార్థన సమయం నాటికి హాజరుకాలేదు. ఏరువాక పౌర్ణమి పండగ కావడంతో కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలను బడికి పంపేందుకు అంతగా ఆసక్తి చూపలేదు. దీంతో తొలిరోజు విద్యా సంస్థలు వెలవెలబోయాయి. వచ్చిన కొద్దిమంది విద్యార్థులకు అసౌకర్యాలు దర్శమిచ్చాయి. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా బడికి పంపే విషయంలో మరో రెండు రోజులపాటు వేచిచూద్దామన్న ధోరణిలో మరికొంత మంది తల్లిదండ్రులు ఉన్నారు. వచ్చిన విద్యార్థులకు మాత్రం ఉపాధ్యాయులు.. మధ్యాహ్న భోజనం పెట్టించి తరువాత పంపించారు. దూరప్రాంత విద్యార్థులు పాఠశాలలకు రావడానికి ఇబ్బందులు పడ్డారు. బస్సు సౌకర్యాలు ఎక్కడ కనిపించలేదు. ముఖ్యంగా వసతి గృహాలు మూసివేత ప్రభావం పాఠశాలల హాజరు శాతంపై స్పష్టంగా కనిపించింది. కొన్ని తరగతులలో మాత్రం ఒకరి, ఇద్దరూ మాత్రమే హాజరుకావడం కనిపించింది. తెరిచిన కొన్ని ప్రైవేటు విద్యా సంస్థలలో సైతం పలుచుగానే హాజరు నమోదైంది. నెలన్నర పాటు వేసవి సెలవుల్లో సరదాగా గడిపిన చిన్నారులు మొదటిరోజు పాఠశాలకు వెళ్లడానికి మారాం చేశారు. ఆసక్తి చూపని వైనం మొదటి రోజు హాజరు అంతంతే -
రైతు ‘భరోసా’ ఏది ?
పెట్టుబడి సాయం కోసం రైతుల ఎదురుచూపులు ●మానవపాడు: రైతులకు చేయూత ఇచ్చేందుకు గత ప్రభుత్వం రైతుబంధు పథకం అమలుచేసి ఏటా వానాకాలం, యాసంగి పంటల పెట్టుబడి కోసం ఎకరాకు రూ.5వేల చొప్పున ఆర్థిక సాయం రైతుల ఖాతాల్లో జమ చేసింది. దీంతో సాగు సమయంలో విత్తనాలు, ఎరువులు కొనుగోలుకు ఆర్థిక ఇబ్బందులు తప్పుతాయి. 2023 డిసెంబర్లో ఏర్పడిన రైతు బంధు పథకం పేరును రైతుభరోసాగా మార్చింది. ఈ పథకంలో ఎకరాకు రూ.7500 ప్రతి పంటకు అందిస్తామని మాట ఇచ్చింది. ఇదిలాఉండగా, ఈ ఏడాది వానాకాలం సీజన్ ముందుగానే ప్రారంభం కావడం, వర్షాలు మే నెలలో విస్తారంగా కురవడంతో రైతుభరోసా సాయం కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. గత వార్షకాలం సీజన్ రైతు భరోసా పెట్టుబడి సాయం అందక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ సీజన్లో అయినా సాగుకు ముందుసాయం అందించాలని కోరుతున్నారు. గత 15 రోజులుగా అకాల వర్షాలు, నైరుతి రుతుపవనాల రాకతో జిల్లా వ్యాప్తంగా వాతావరణం చల్లబడింది. దీంతో రైతులు పొలం బాట పట్టారు. గత ఖరీప్, రబీ పంటల మొదళ్లు, వేర్లు తొలగిస్తూ చెత్తాచెదరం కాల్చివేస్తున్నారు. ఇప్పటికే వేసవి దుక్కులు దున్నిన రైతులు దౌర కొడుతూ చేను సారవంతం చేసి విత్తనాలు వేసేందుకు సిద్ధమయ్యారు. ఈ వర్షాకాలంలో జిల్లావ్యాప్తంగా వేల ఎకరాల్లో వివిధ రకాల పంటల సాగు చేయనున్నట్లు వ్యవసాయ అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రధానంగా పత్తి, వరి, మిరప, కందులు, పొగాకు సాగు చేయనున్నారు. యేటా తొలకరి వర్షాలు ఆలస్యంగా కురవడంతో జూన్ నెలాఖరులో పత్తి విత్తనాలు వేయడం, వరి నారు పోయడం చేస్తుంటారు. ఈ సారి ముందుగానే వర్షాలు రావడంతో రైతులు విత్తుకునేందుకు సిద్ధమయ్యారు. జిల్లా వివరాలిలా.. త్వరగా అందించాలి గత వానాకాలం ఎవరికి రైతుభరోసా ఇవ్వలేదు. యాసంగిలో ఐదు ఎకరాలలోపు రైతులకు డబ్బులు పడ్డాయి. వర్షాలు ముందు కురుస్తుడటంతో పంట పొలాలను సాగుకు సిద్ధం చేశాం. త్వరగా రైతుల ఖాతాల్లో రైతుభరోసా నగదు జమ చేస్తే ఎంతో మేలు చేసినట్లవుతుంది. – గోపాల్, రైతు, గోకులపాడు అప్పులు తప్పుతాయి.. ఈ ఏడాది వానాకాలం ముందే వచ్చింది. ప్రతి యేడాది విత్తనాలు నాటేందుకు ఆలస్యమయ్యేది. పత్తి వేసుకునేందుకు దుక్కిదున్ని సిద్ధం చేసుకున్నా. ప్రభుత్వం రైతుభరోసా సాయం అందిస్తే విత్తనాలు, ఎరువులు కొనుగోలుకు ఇబ్బంది ఉండదు. లేదంటే అప్పులు చేసి మరీ కొనుగోలు చేయాల్సి వస్తుంది. – శ్రీకాంత్రెడ్డి, రైతు, మానవపాడు ముందస్తు వర్షాలతో పొలం బాట దుక్కులు సిద్ధం చేస్తున్న రైతులు విత్తనాలు, ఎరువులకు ఏర్పాట్లు జిల్లాలో 1,65,763 మంది రైతులు విడతల వారీగా... గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుబంధు పథకం కింద పెట్టుబడి సాయం ఎకరానికి రూ.5వేలు చొప్పున అందించగా.. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా పథకం పేరుతో ఎకరానికి రూ.6వేలు చొప్పున గత యాసంగి నుంచి అందిస్తోంది. జనవరి నుంచి మార్చి వరకు ఎకరాలోపు, ఆ తర్వాత రెండు, మూడు, నాలుగు ఐదు ఎకరాల్లో భూమి ఉన్న రైతుల ఖాతాల్లో విడతల వారీగా నగదు జమ చేసింది. యాసంగి పంటలు దిగుబడి వచ్చే సమయం వరకు నగదు జమ చేస్తూ వచ్చింది. ఈ ఖరీఫ్ సీజన్లోనైనా సాగు సమయానికి నగదు అందితే ఎంతో మేలు చేకూరుతుందని రైతులు బావిస్తున్నారు. -
573 బస్సులకు నో ఫిట్నెస్
● ఉమ్మడి జిల్లాలో పునఃప్రారంభమైన పాఠశాలలు ● స్కూల్ బస్సులపై ఆర్టీఏ ప్రత్యేక డ్రైవ్ ప్రారంభం ● ఫిట్నెస్ లేకుండా నడిపితేకేసులు నమోదు పాలమూరు: ఉమ్మడి జిల్లాలో గురువారం నుంచి విద్యాసంస్థలు పునఃప్రారంభమయ్యాయి. అయితే జిల్లాలో ప్రైవేట్ పాఠశాలలకు సంబంధించి బస్సులు ఫిట్నెస్ పరీక్షలు పూర్తి చేసుకోలేదు. చాలా బస్సులు ఫిట్గా లేకుండానే విద్యార్థులను తరలించడానికి సిద్ధమయ్యాయి. ఉమ్మడి జిల్లాలో 1,336 స్కూల్ బస్సులు ఉండగా.. ఇందులో బుధవారం సాయంత్రం వరకు 763 బస్సులకు ఫిట్నెస్ పరీక్షలు పూర్తిచేయగా.. మరో 573 బస్సులు ఫిట్నెస్ పరీక్షలు చేసుకోలేదు. డీటీఓలకు ఆదేశాలు.. ఉమ్మడి జిల్లాలోని ప్రైవేట్ స్కూళ్లు, కళాశాలల బస్సులకు ఫిట్నెస్ పరీక్షలు చేసుకోవడానికి ఇచ్చిన గడువు బుధవారంతో ముగియడంతో జిల్లా ఆర్టీఏ అధికారులు గురువారం నుంచి ప్రత్యేక డ్రైవ్లు చేపట్టామని డీటీసీ కిషన్ వెల్లడించారు. మొదట జిల్లాకేంద్రాలతో పాటు పాఠశాలలు అధికంగా నిర్వహించే పట్టణాల్లో ఆర్టీఏ బృందాలతో ప్రత్యేక డ్రైవ్ చేపట్టి ఫిట్నెస్, పర్మిట్ ఇతర పత్రాలు పరిశీలిస్తామన్నారు. అన్ని స్కూల్ బస్సులు ఫిట్నెస్ సర్టిఫికెట్ లేకుండా రోడ్లపై తిరిగితే చర్యలు తీసుకోవడంతోపాటు కేసులు నమోదు చేస్తామన్నారు. దీంతోపాటు 15 ఏళ్లు దాటిన వాహనాలపై కూడా ప్రత్యేక దృష్టిసారించి తనిఖీ చేపడుతామన్నారు. జిల్లావ్యాప్తంగా తనిఖీలు చేయడానికి అధికారులు ప్రత్యేక టీంలు ఏర్పాటు చేసి ఇప్పటికే ఆయా జిల్లాల డీటీఓలకు ఆదేశాలు ఇచ్చినట్లు డీటీసీ పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలో ఇలా.. -
బాధిత మహిళలకు అండగా నిలవాలి
గద్వాల క్రైం: జిల్లా కేంద్రంలోని భరోసా, సఖీ, షీటీం సెంటర్లను గురువారం ఆకస్మికంగా ఎస్పీ శ్రీనివాసరావు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ సిబ్బందిని పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో లైంగిక దాడులకు గురైన మైనర్ బాలికల కేసులు, నిందితులకు శిక్షపడే విధంగా తీసకున్న చర్యలపై ప్రత్యేకంగా ఆరా తీశారు. వేధింపులకు గురైన క్రమంలో వారిలో ఆత్మస్థైర్యం, నమ్మకం, చట్టాలపై కల్పిస్తున్న విషయాలను ఆరా తీశారు. భరోసా సెంటర్ ఏర్పాటు నుంచి ఇప్పటి వరకు నమోదైన కేసుల వివరాలను, రికార్డులను పరిశీలించారు. సిబ్బంది బాధ్యతతో విధులు నిర్వహించి మనోధైర్యం కోల్పోయిన బాధితులకు అండగా ఉండాలన్నారు. నిపుణులైన వైద్యులు, డాక్టర్లు, లాయర్లు, కౌన్సెలింగ్ సిబ్బంది ద్వారా ప్రభుత్వం బాధింపబడ్డ బాధితులకు భరోసా ఇవ్వాలనే ధృఢసకల్పంతో ఈ సెంటర్లను అందుబాటులోకి తీసుకురావడం జరిగిందన్నారు. అనంతరం సెంటర్లోని వివిధ విషయాలపై అక్కడి సిబ్బందిని అడిగి తెలసుకున్నారు. కార్యక్రమంలో సీఐ శ్రీను, తదితరులు ఉన్నారు. -
నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
అయిజ: మెడికల్ దుకాణాల నిర్వాహకులు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఔషధ నియంత్రణ అధికారి వినయ్ కుమార్ హెచ్చరించారు. గురువారం మండల కేంద్రంలోని వివిధ మెడికల్ షాపులను, మెడికల్ ఏజెన్సీలను తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మెడికల్ దుకాణాల్లో కాలం చెల్లిన మందులు విక్రమిస్తే చట్టరిత్యా చర్యలు తీసుకుంటామని అన్నారు. ముఖ్యంగా మెడికల్ షాపుల్లో ఫార్మసిస్ట్ ఉండాలని, ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు విక్రయించరాదని, ఎమ్మార్పీ ధరలకు మించి కొనుగోలుదారుల నుంచి డబ్బు తీసుకోరాదని అన్నారు. మందుల కొనుగోలు విక్రయానికి సంబంధించిన రికార్డులు పక్కాగా నిర్వహించాలని అన్నారు. రాజోళి ఎస్ఐ వీఆర్కు అటాచ్ గద్వాల క్రైం: బాధితుల ఫిర్యాదులను నిర్లక్ష్యం చేసిన క్రమంలో రాజోళి ఎస్ఐను గురువారం వీఆర్కు అటాచ్ చేస్తూ ఎస్పీ శ్రీనివాసరావు ఉత్తర్వులు జారీ చేశారు. రాజోళి మండలం పెద్ద ధన్వాడకి చెందిన ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన బాధితులు తమ వ్యవసాయ పొలం, మరొకరి మధ్య ఉన్న భూ వివాదంపై రాజోళి ఎస్ఐ జగదీష్కు ఫిర్యాదు చేసినా.. నిర్లక్ష్యం కనబర్చినట్లు ఈ నెల 10వ తేదీన ఎస్సీ ఎస్టీ కమిషన్కు ఫిర్యాదు చేశారు. విచారణలో భాగంగా ఎస్ఐని జిల్లా కార్యాలయానికి అటాచ్ చేస్తున్నట్లు ఎస్పీ పేర్కొన్నారు. అయితే ఇటీవల పెద్దధన్వాడలో ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటు విషయంలో జరిగిన పలు తప్పిదాలు సైతం ఉండడంతో ఎస్ఐపై శాఖాపరమైన చర్యలు చేపట్టినట్లు పలు సామాజిక మాద్యమాల్లో పోస్టులు వైరల్ అయ్యాయి. నేడు రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి రాక గద్వాల: రాష్ట్ర రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ ఎం.కోదండరెడ్డి ఈనెల 13వ తేదీ శుక్రవారం జిల్లాలో పర్యటించనున్నట్లు కలెక్టర్ బీఎం సంతోష్ ప్రకటనలో తెలిపారు. ఉదయం 9:30గంటలకు గద్వాల మండలంలోని పుటాన్పల్లిలో సాగుచేసిన పత్తి విత్తన పంటలపై క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారన్నారు. అక్కడే రైతులతో ముఖాముఖి అనంతరం 11:30గంటలకు కలెక్టరేట్లో పత్తి విత్తన పంటకు సంబంధించి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై సమీక్షించనున్నట్లు తెలిపారు. విమాన ప్రమాదం దురదృష్టకరం గద్వాల: గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్లో జరిగిన ఘోర విమాన ప్రమాద ఘటన అత్యంత దురదృష్టకరమని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో మాజీ సీఎం విజయ్రూపానితో పాటు దేశప్రజలు, విదేశీయులు, చిన్నారులు, మహిళలు మృతిచెందడం బాధాకరమని తెలిపారు. మృతులకు నివాళి అర్పించడంతోపాటు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కేంద్రం అవసరమైన చర్యలు చేపట్టాలని కోరారు. ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీఫలితాలు విడుదల మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీ పరిధిలో ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ సెమిస్టర్– 1, 3 సంబంధించి ఫలితాలను పీయూ వీసీ శ్రీనివాస్ గురువారం విడుదల చేశారు. ఈ మేరకు సెమిస్టర్–1లో 37.74 శాతం, సెమిస్టర్–3లో 42.11 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు పీయూ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రవీణ తెలిపారు. ఫలితాలను పీయూ అధికార వెబ్సైట్లో చూసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఆడిట్ సెల్ డైరెక్టర్ చంద్రకిరణ్, అడిషనల్ కంట్రోలర్ అనురాధ తదితరులు పాల్గొన్నారు. -
పెండింగ్ కేసుల పరిష్కారానికి ప్రత్యేక డ్రైవ్
గద్వాల క్రైం: జిల్లాలోని పెండింగ్ కేసులు, రాజీకాదగా కేసుల పరిష్కారానికి ప్రత్యేక డ్రైవ్ చేపట్టామని, ఈ నెల 14వ తేదీన జాతీయ లోక్అదాలత్ నిర్వహిస్తున్నామని జిల్లా జడ్జి ఎన్ ప్రేమలత వెల్లడించారు. గురువారం జిల్లా కోర్టు ఆవరణలో విలేకర్ల సమావేశం నిర్వహించి మాట్లాడారు. గతంతో పొలిస్తే నేటికి చాలా అంశాలను పరిగణలోకి తీసుకొని కేసుల సత్వర పరిష్కారానికి జాతీయలోక్ అదాలత్ నిర్వహించడం జరిగిందన్నారు. పోలీసు, ఎకై ్సజ్, రెవెన్యూ, రోడ్డు ప్రమాద, బ్యాంకు రుణాలు, స్టేషన్లలో నమోదైన కేసుల వివరాలను ఇప్పటికే ఆ శాఖ సిబ్బందితో మాట్లాడి విపత్కర కేసుల అంశాలను అడిగి తెలుసుకున్నట్లు వివరించారు. నేటి లోక్ అదాలత్ కార్యక్రమంలో 4వేల కేసులు పరిష్కారం అయ్యేలా చర్యలు చేపట్టామన్నారు. సమావేశంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రెటరీ వి శ్రీనివాస్, శోభ తదితరులు ఉన్నారు. -
బాల కార్మిక వ్యవస్థను నిర్మూలిద్దాం
గద్వాల: బాల కార్మిక వ్యవస్ధను పూర్తిగా నిర్మూలించి జిల్లాను బాల కార్మిక రహిత ప్రాంతంగా మార్చే దిశగా పని చేయాలని అడిషనల్ కలెక్టర్ లక్ష్మీనారాయణ అన్నారు. గురువారం ఐడీఓసీ కార్యాలయంలోని ప్రపంచ బాల కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకొని బాల కారికార్మిక నిర్మూలన జిల్లా కార్మిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలలకు ఉజ్వల భవిష్యత్ కల్పించడం మన అందరి బాధ్యత అని తెలిపారు. కుటుంబ ఆర్ధిక పరిస్థితుల దృష్ట్యా బాలలు కార్మికులుగా మారుతున్నారని, అటువంటి వారిని గుర్తించి పాఠశాలలో చేర్పించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. బాలలను పనుల్లో పెట్టుకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి సునంద, డీసీపీఓ నర్సింహులు, తదితరులు ఉన్నారు. భూ సమస్యల పరిష్కారానికి సదస్సులు ధరూరు: భూ సమస్యల పరిష్కారం కొరకే రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు అడిషనల్ కలెక్టర్ లక్ష్మీనారాయణ అన్నారు. గురువారం మండలంలోని చింతరేవులలో జరిగిన రెవెన్యూ సదస్సుకు ఆయన హాజరై మాట్లాడారు. భూ సమస్యలను పరిష్కరించి రైతులకు వారి భూములపై పూర్తి హక్కులు కల్పించేందుకు ప్రభుత్వం భూ భారతి చట్టాన్ని తీసుకువచ్చినట్లు తెలిపారు. భూ రికార్డులలో తప్పులు, విస్తీర్ణం హెచ్చు తగ్గులు, వారసత్వ భూములు, భూ స్వభావం తప్పులు, నిషేదిత జాబితాలో ఉన్న భూ సమస్యలు, సర్వే నంబర్ మిస్సింగ్, పట్టా పాస్ బుక్కులు లేకపోవడం ప్రభుత్వ భూములను నవీకరించడం, సాదాబైనామా కేసులు, హద్దులు నిర్ధారణ, పార్ట్ బీలో చేర్చిన భూముల సమస్యలు, భూ సేకరణ కేసులపై దరఖాస్తులు స్వీకరించి క్షేత్ర స్థాయిలో విచారణ జరిపి పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. క్షేత్ర స్థాయిలో రైతుల సందేహాలను నివృత్తి చేయడంతో పాటు సమస్యలను పరిష్కరించడంలో భాగంగానే ఈ సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆగస్టు 14వ తేదీ లోపు భూ భారతి కింద వచ్చిన అన్ని దరఖాస్తులను పరిష్కరిస్తామన్నారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ నరేందర్, రెవన్యూ సిబ్బంది, రైతులు తదితరులు పాల్గొన్నారు. -
ఏరువాకా సాగారో..
ఎర్రవల్లి మండలం జింకలపల్లిలో ఊరేగింపుగా వెళ్తున్న ప్రజలు నాగరికత ఎంతగా ముందుకు సాగినా.. నాగలి లేనిదే పని జరగదు.. రైతు లేనిదే పూట గడవదు. అలాంటి వ్యవసాయానికి.. ప్రధానంగా ప్రతి రైతుకు సంబంధించి అతిపెద్ద పండుగ ఏరువాక పున్నమి. జిల్లావ్యాప్తంగా రైతులు బుధవారం ఈ పండుగను ఉత్సాహంగా జరుపుకొన్నారు. ఉదయాన్నే సేద్యానికి అవసరమైన పరికరాలకు.. ఎడ్లకు ప్రత్యేక పూజలు చేశారు. గజ్జెలు, గంటలు, పూల దండలతో ఎడ్లను అలంకరించి ఊరేగింపుగా పొలాలకు వెళ్లారు. వర్షాలు సమృద్ధిగా కురవాలని.. పంటలు బాగా పండాలని భూతల్లికి పూజలు చేసి పొలం దున్నడం ప్రారంభించారు. సాయంత్రం గ్రామాల్లో ఏరువాక తోరణాలు పశువులను ఈ ఏరువాక తోరణం కిందుగా రైతులు ఆనందోత్సాహాలతో పరుగులు పెట్టించారు. – సాక్షి నెట్వర్క్ షేకుపల్లిలో బోనం ఎత్తిన చిన్నారులు గట్టులో ఎడ్ల బండ్ల ఊరేగింపు -
బుడి బడి అడుగులు!
గద్వాల టౌన్: బడి.. భవితను తీర్చిదిద్దే చదువులమ్మ ఒడి. జీవిత గమ్యాన్ని నిర్దేశించే దిక్సూచి. నూతన విద్యా సంవత్సరం గురువారం నుంచి ప్రారంభం కానుంది. నెలన్నరగా మూతబడిన పాఠశాలలు తెరుచుకోనున్నాయి. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. తరగతి గదులను శుభ్రం చేసి.. పాఠశాల అందంగా అలకరించే పనిలో హెచ్ఎంలు నిమగ్నమయ్యారు. ఇదిలాఉండగా, ప్రభుత్వ పాఠశాలల్లో చదివి ఉన్నత స్థాయికి చేరుకున్న ప్రముఖులు, జిల్లా ఉన్నతాఽధికారులు ఎందరో ఉన్నారు. వారు తమ పాఠశాల మధుర స్మృతులను పాఠశాలల పునఃప్రారంభం నేపథ్యంలో ‘సాక్షి’తో పంచుకున్నారు. ఆ అభిప్రాయాలు వారి మాటల్లోనే... జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే కాకుండా పాఠశాలలో అన్ని రకాల మౌళిక సదుపాయాలు కల్పించాం. తాగునీరు, టాయిలెట్స్, తరగతి గదుల్లో బెంచీలు వంటి వసతులతో పాటు అన్ని పాఠశాలలోనే మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తున్నాం. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందిస్తున్నాం. పాఠశాలలు మొదటిరోజునే విద్యార్థులందరికి యూనిఫామ్లు, నోట్బుక్కులు, పాఠ్యపుస్తకాలు అందించేలా ఇప్పటికే అన్ని రకాలుగా సిద్ధం చేశాం. బడిబాట కార్యక్రమం ద్వారా డ్రాపవుట్స్ విద్యార్థులను గుర్తించి వారిని తిరిగి పాఠశాలలో చేర్పించే కార్యక్రమం చేపడుతున్నాం. ఈ కార్యక్రమం ఈనెల 19వ తేదీ వరకు కొనసాగుతుంది. ప్రస్తుతం పోటీపరీక్షలకు అనుగుణంగా విద్యార్థులకు బోధించే విధానంలో నూతన మార్పులు తీసుకొచ్చాం. ఇందుకు సంబంధించి ఉపాధ్యాయులకు ఐదురోజుల పాటు ప్రత్యేక శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించాం. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో సైతం విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలోనే చేరేలా ఇప్పటికే కార్యక్రమాన్ని చేపట్టాం. జిల్లాలో అక్షరాస్యత శాతాన్ని పెంచేందుకు ప్రత్యేకంగా కృషి చేస్తున్నాం. ఈ సారిప పదో తరగతి ఫలితాల్లో గతంతో కంటే పదిశాతం ఉత్తీర్ణత శాతం పెంచగలిగాం. ఇదే ఒరవడితో ముందుకు వెళ్లి మరింత మెరుగైన ఫలితాలు సాధించేందుకు ఇప్పటి నుంచే ఉపాధ్యాయులకు శిక్షణా ఇవ్వడం జరిగింది. – బీఎం సంతోష్, కలెక్టర్ ఇంట్లో కంటే బడిలో ఉండటమే ఇష్టం ఫస్ట్ డే స్కూల్ అంటే సంబరంగా వెళ్లేవాళ్లం. వేసవి సెలవుల్లో రెండు నెలల పాటు ఇంటి వద్ద ఉండటంతో స్నేహితులను మిస్ అయ్యేది. వారిని ఎప్పుడెప్పుడు కలుస్తామా అంటూ ఫస్ట్ డే కోసం ఎదురుచూసే వాడ్ని. ఇంటి కంటే బడిలోనే ఎక్కువగా ఉండటానికి ఇష్టంగా ఉండేది. నా పాఠశాల విద్యాభ్యాసం అంతా గద్వాలలోనే సాగింది. అప్పట్లో పాఠశాలల్లో సౌకర్యాలు అరకొరగా ఉన్నా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు విద్య ప్రాధాన్యతను వివరించేవాళ్లు. పాఠశాల విద్య మొత్తం హుషారుగానే గడిచిపోయింది. బీహార్లో ఐఏఎస్ అధికారిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సమయంలో అప్పుడుప్పుడు గద్వాల పాఠశాల రోజులు గుర్తొస్తాయి. బడీడు పిల్లలందరు బడిలోనే ఉండాలి. ప్రతి ఒక్కరు చదువుకోవాలి. – రామచంద్రుడు, సీనియర్ ఐఏఎస్ అధికారి, బీహార్ నేటినుంచి తెరుచుకోనున్న పాఠశాలలు ప్రభుత్వ బడుల్లో చదివి ఉన్నత స్థాయికి చేరిన వారెందరో.. బడిబాట పట్టిన జ్ఞాపకాన్ని నెమరవేసుకున్న ప్రముఖులు -
సర్కారు బడులు.. ప్రగతికి సోపానాలు
మాది వ్యవసాయ మధ్యతరగతి కుటుంబం. నా విద్యాభ్యాసం మొత్తం ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీలలోనే సాగింది. 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు ఖిల్లాగణపురం మండలం మామిడిమాడలో, 8వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఖిల్లాగణపురం హైస్కూల్లో.. ఇంటర్, డిగ్రీ వనపర్తి ప్రభుత్వ కాలేజీ.. పీజీ ఉస్మానియా యూనివర్సిటీలో పూర్తి చేశాను. ప్రభుత్వ పాఠశాలలో క్వాలిఫైడ్ ఉపాధ్యాయులుంటారు. చదువుతో పాటు మానసిక ఉల్లాసం, సామాజిక స్పృహ, క్రీడలు వంటివి నేర్పిస్తారు. దీనివల్ల జీవితంలో ఎప్పుడైనా ఒడిదుడుకులు ఎదురైతే వాటిని ధైర్యంగా ఎదుర్కొని ముందుకెళ్లేందుకు ఉపయోగపడుతుంది. తరగతి గదుల్లోని పాఠ్యపుస్తకాలిని మాత్రమే కాకుండా సామాజంలో అన్ని విషయాలు తెలుసుకోవచ్చు. గతంతో పోల్చితే ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలలో కూడా ఇంగ్లిష్ మీడియంలో బోధిస్తున్నారు. ఉచితంగా పుస్తకాలు, నోట్బుక్కులు, మధ్యాహ్న భోజనం వంటి వసతులు కల్పిస్తున్నారు. విద్యావ్యవస్థపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధచూపుతూ అనేక సంస్కరణలు తీసుకొస్తుంది. వాటిని ప్రతిఒక్కరు సద్వినియోగం చేసుకోవాలి. ముఖ్యంగా విద్యార్థుల తల్లిదండ్రులు ప్రైవేటు వైపు మొగ్గు చూపకుండా ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి వారి పిల్లల ఉజ్వల భవిష్యత్కు బాటలు వేయాలి. – వి.లక్ష్మీనారాయణ, అదనపు కలెక్టర్, గద్వాల -
జోగుళాంబ క్షేత్ర అభివృద్ధికి మాస్టర్ప్లాన్
● ఆలయ నిర్మాణాల పరిరక్షణ, పునరుద్ధరణకు చర్యలు ● 2028 కృష్ణా పుష్కరాల నాటికి అభివృద్ధి పనులు పూర్తిచేయడమే లక్ష్యం ● దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ ● ఆయా శాఖల అధికారులతో సమీక్షా సమావేశం ● రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, కలెక్టర్ సంతోష్ హాజరు అలంపూర్: జోగుళాంబ క్షేత్రం, ఆలయాల ప్రాముఖ్యతను ప్రతిబింబించేలా.. ఆధ్యాత్మికతతోపాటు చారిత్రాత్మకంగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని.. ఇందుకోసం సమగ్ర మాస్టర్ప్లాన్ రూపొందిస్తున్నట్లు.. 2028 కృష్ణా పుష్కరాల నాటికి ఈ అభివృద్ధి పనులు పూర్తి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ అన్నారు. బుధవారం అలంపూర్లో కలెక్టర్ బీఎం సంతోష్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జి.చిన్నారెడ్డి, ఎమ్మెల్యే విజయుడు, హైలెవల్ అభివృద్ధి కమిటీ సభ్యులు, అన్ని శాఖల అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా దేవాదాయ శాఖ ప్రధాన కార్యదర్శి శైలజ రామయ్యర్ మాట్లాడుతూ... ఈ పవిత్ర క్షేత్రాన్ని మరింత అభివృద్ధి చేయడం అత్యవసరమని ప్రభుత్వం భావిస్తుందని, ఈ ప్రణాళిక అమలుకు కలెక్టర్ మూడు సార్లు సమీక్షలు నిర్వహించారన్నారు. ఈ మాస్టర్ ప్లాన్ను ప్రభుత్వానికి, సీఎం రేవంత్రెడ్డికి సమర్పించి తగు చర్యలు తీసుకుంటామన్నారు. 2028లో జరగనున్న కృష్ణా పుష్కరాల నాటికి పూర్తి స్థాయిలో అమలులోకి తీసుకురావలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఆలయాల నిర్మాణాల పరిరక్షణ, పునరుద్ధరణకు ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా పూర్తి సహకారం అందించనుందని తెలిపారు. మ్యూజియాన్ని ఆధునీకరిండానికి తగిన చర్యలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. అభివృద్ధి పనులకు ప్రభుత్వానికి నిధుల కొరత లేదని, పనులు వేగవంతం చేయవచ్చన్నారు. మాస్టర్ ప్లాన్న్లోని పనులకు దాతలు ముందుకు వస్తారన్నారు. అన్నదాన సత్రంను వారం లోపల ప్రారంభించాలని ఈఓ పురేందర్ను అదేశించారు. పనులు వేగవంతం చేయాలి రాబోయే పుష్కరాల నాటికి ఈ క్షేత్రంలో అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉండాలని, ఈమేరకు అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని ఎమ్మెల్యే అజయుడు అన్నారు. కలెక్టర్ బీఎం సంతోష్ మాట్లాడుతూ...క్షేత్ర అభివృద్ధి పనులపై ఆయా శాఖల అధికారులతో కలిసి పాపినాశి, సంగమేశ్వర ఆలయాలను పరిశీలించినట్లు తెలిపారు. హైలెవల్ కమిటీతో కలిసి సమగ్ర అభివృద్ధి ప్రణాళికలు రూపొందించడం జరిగిందన్నారు. ప్రణాళికల వివరాలను పీపీటీ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు లక్ష్మినారాయణ, నర్సింగ్ రావు, రాష్ట్ర టూరిజం శాఖ ఎస్ఈ సరిత, ఆర్డీఓ అలివేలు, దేవాదాయ శాఖ అడిషనల్ కలెక్టర్ కృష్ణవేణి, ఆర్కిటెక్ట్ సూర్య నారాయణ మూర్తి, టెంపుల్ డిజైనర్ గోవింద హరి, స్థపతి వాలినాయగం, ఈఓ పురేందర్, ఆలయ కమిటీ చైర్మన్ నాగేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సమీక్ష అనంతరం వారు జోగుళాంబ క్షేత్రాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. గద్వాల – అలంపూర్ రోడ్డులో సుందరీకరణ పనులు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జి. చిన్నారెడ్డి మాట్లాడుతూ... జోగుళాంబ ఆలయం జాతీయ రహదారి పరిధిలో ఉండటంతో గద్వాల నుంచి అలంపూర్ వరకు రోడ్సైడ్లో ఆర్చీలు, అవెన్యూ ప్లాంటేషన్, సైన్న్ బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. ఆలయం వద్ద శుభ్రమైన వాతావరణం, బస్ స్టాండ్, సౌకర్యవంతమైన గదులు, శుద్ధమైన ఆహారం, పార్కింగ్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. అలంపూర్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ మంచి సూచనగా భావిస్తున్నట్టు తెలిపారు. రెండు మూడు నెలల్లో పనులు పూర్తి చేసేవిధంగా ప్రణాళికలు సిద్దమవ్వాలన్నారు. -
కనులపండువగా ఆదిశిలావాసుడి కల్యాణం
మల్దకల్ ఆదిశిలా క్షేత్రంలోని స్వయంభూ లక్ష్మీవెంకటేశ్వరస్వామి వారి కల్యాణోత్సవం బుధవారం వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య కనులపండువగా నిర్వహించారు. వేదపండితులు రమేషాచారి, మధుసూదనాచారి, రవిచారి స్వామి వారి ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే మహాహోమం, స్వామి వారి ఉత్సవమూర్తులకు కల్యాణం జరిపించారు. భక్తులు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. ఆలయచైర్మన్ ప్రహ్లదరావు, చంద్రశేఖర్రావు, దీరేంద్రదాసు, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.బీచుపల్లి ఆలయంలో ప్రత్యేక పూజలుఎర్రవల్లి: బీచుపల్లి పుణ్యక్షేత్రంలోని అభయాంజనేయస్వామి ఆలయంలో ఏరువాక పౌర్ణమిని పురస్కరించుకొని బుధవారం భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వికాస తరంగిణి, విశ్వ హిందూపరిషత్, ధర్మప్రసార సమితి ఆధ్వర్యంలో చిన జీయర్ స్వామి శిష్య బృందం సభ్యులు ఆలయంలో 41 పర్యాయాలు హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. అనంతరం హనుమంతుని గొప్పతనం, ధైర్య సాహసాలను గురించి భక్తులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, పాలక మండలి సభ్యులు, అర్చకులు, హిందూ సంఘాల సభ్యులు, భక్తులు, తదితరులు పాల్గొన్నారు.విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలుమల్దకల్: అంగన్వాడీ టీచర్లు తమ విధుల్లో అలసత్వం ప్రదర్శిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని జిల్లా సంక్షేమ అధికారిణి సునంద హెచ్చరించారు. బుధవారం మండలంలోని తాటికుంటలో బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించగా..ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. గ్రామంలో బడిబయట ఉన్న పిల్లలందరి గుర్తించి బడిలో చేర్పించాలన్నారు. బాల్యవివాహాలు చేయడం వలన కలిగే అనర్థాలతో పాటు బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు తీసుకోవాల్సిన చర్యలను తల్లిదండ్రులకు వివరించారు. అంగన్వాడీ కేంద్రాలను పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు పౌష్టికాహారంలో పంపిణీలో నిర్లక్ష్యం వహించరాదని ఆమె పేర్కొన్నారు. ప్రభుత్వ ఆస్పత్రిలో నెలనెలా గర్భిణీ, బాలింతలు వైద్యపరీక్షలు చేయించుకునేలా అవగాహన కల్పించాలన్నారు. అనంతరం గ్రామంలోని మూడు అంగన్వాడీ కేంద్రాలను ఆమె పరిశీలించారు. నాగరాణి, మంజుల, లక్ష్మినారాయణమ్మ, అనంతమ్మ, తల్లిదండ్రులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. -
ఉత్సాహంగానే బడికి
చిన్నప్పుడు పాఠశాలలు పునఃప్రారంభమైన సమయంలో బడికి వెళ్లి స్నేహితులతో ఆడుకోవచ్చని అనుకునే వాడ్ని. కొత్త స్నేహితులు ఎవరెవరూ వస్తారనే ఆసక్తి ఉండేది. ప్రాథమిక విద్య మా స్వగ్రామం బిజ్వారంలో సాగింది. హైస్కూల్ చదువుల కోసం గద్వాలకు వచ్చాం. అప్పుడు ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో పరీక్ష పెట్టి పాఠశాలలో చేర్పించుకున్నారు. ఏ ఒక్క రోజు కూడా బడికి వెళ్లేందుకు మారం చేయలేదు. అప్పటి గురువుల ప్రోత్సాహం మరువలేనిది. వారి మార్గదర్శనంతోనే నేడు పేద ప్రజలకు వైద్య సేవలు అందించగలుగుతున్నాం. – డాక్టర్ రఘునాథ్రెడ్డి, గద్వాల -
పశుసంవర్ధక శాఖ మంత్రిగా వాకిటి
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: రాష్ట్రంలో రెండో దఫా చేపట్టిన మంత్రివర్గ విస్తరణలో ఉమ్మడి పాలమూరులోని మక్తల్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి చోటు దక్కిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆయన ఈ నెల 8న మరో ఇద్దరు మంత్రులతో కలిసి రాజ్భవన్లో ప్రమాణస్వీకారం చేశారు. అయితే రెండు రోజులుగా ఆయనకు ఏ శాఖలు కేటాయిస్తారనే అంశంపై ఉమ్మడి జిల్లాలో నెలకొన్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. బుధవారం రాత్రి శాఖల కేటాయింపు ప్రక్రియ పూర్తి కాగా.. వాకిటి శ్రీహరికి రాష్ట్ర పశుసంవర్ధకశాఖ, పాడి అభివృద్ధి, మత్స్యశాఖ, క్రీడలు, యువజన సర్వీసుల శాఖలు దక్కాయి. దీంతో ఉమ్మడి పాలమూరు జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, అభిమానుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. మక్తల్ నుంచి మూడో వ్యక్తి.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సీఎం కాసు బ్రహ్మానందరెడ్డి హయాంలో తొలిసారిగా నారాయణపేటకు చెందిన రాంచందర్ కల్యాణి మార్కెటింగ్శాఖ మంత్రిగా పనిచేశారు. 1994లో టీడీపీ నుంచి మక్తల్ ఎమ్మెల్యేగా ఎల్లారెడ్డి గెలుపొందగా.. ఆయనకు 1997లో మార్కెటింగ్ శాఖ మంత్రి పదవి దక్కింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం మూడో పర్యాయం 2023లో జరిగిన ఎన్నికల్లో మక్తల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున గెలుపొందిన ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన వాకిటి శ్రీహరికి ఈ నెల 8న మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఈ లెక్కన మక్తల్ నుంచి ముగ్గురికి మంత్రి పదవులు దక్కినట్లయింది. పాడి అభివృద్ధి, మత్స్య, క్రీడలు, యువజన సర్వీసుల శాఖలు కూడా.. మక్తల్కు మూడుసార్లు దక్కిన అమాత్యగిరి -
కేసులు ఎత్తివేసే దాక పండుగలు చేసుకోం
పెద్ద ధన్వాడ రైతుల తీర్మానం అలంపూర్/శాంతినగర్: ‘ఇథనాల్ ఫ్యాక్టరీని రద్దు చేయడమే మాకు పెద్ద పండుగ.. రైతులపై పెట్టిన కేసులను ఎత్తివేసే వరకు ఏ పండుగనూ జరుపుకోం’ అని రాజోళి మండలం పెద్ద ధన్వాడ గ్రామ రైతులు తీర్మానించారు. ఈ నెల 11న రైతుల పండుగ ఏరువాక పౌర్ణమి నేపథ్యంలో మంగళవారం గ్రామస్తులు రైతువేదిక వద్ద సమావేశమయ్యారు. ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటును నిరసిస్తూ ఇటీవల ఆందోళన కార్యక్రమం చేపట్టగా.. అనుకోకుండా జరిగిన ఘర్షణలో 12 మంది రైతులను పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించిన విషయం విదితమే. అయితే తోటి రైతులు జైలులో ఉంటే తాము ఎలా పండుగ చేసుకుంటామని రైతులు వాపోతున్నారు. తోటి రైతులు లేకుండా.. ఇథనాల్ ఫ్యాక్టరీ రద్దు కాకుండా పండుగ నిర్వహించుకునే ప్రసక్తే లేదని ముక్త కంఠంతో తీర్మానించారు. రైతులు తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి గ్రామంలోని కూలీలు, ఇతరులు కూడా ఏరువాక పండుగను జరుపుకోవద్దని నిర్ణయించుకున్నారు. కాగా, పెద్ద ధన్వాడ గ్రామస్తులు సమావేశమై పండుగ జరుపుకోరాదని తీర్మానం చేసిన విషయం తెలుసుకున్న చిన్న ధన్వాడ రైతులు సైతం వారికి సంఘీబావంగా తమ గ్రామంలో కూడా ఏరువాక పౌర్ణమిని బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. రైతులు తీసుకున్న నిర్ణయానికి సమీప గ్రామాల రైతులు సైతం మద్దతు ప్రకటిస్తున్నారు. అక్రమ కేసులు ఎత్తివేయాలి.. ఇథనాల్ కంపెనీ కాలుష్యంతో పంటలు పండవని, మనుషులు రోగాల బారిన పడతారని శాంతియుతంగా నిరసన తెలిపితే పట్టించుకోలేదు. ఇథనాల్ కంపెనీని రద్దు చేసేందుకు కృషిచేస్తామని నాయకులు చెబితే నిరసనలు విరమించుకున్నాం. అకస్మాత్తుగా ఫ్యాక్టరీ పనులు ప్రారంభించేందుకు ప్రైవేటు సైన్యంతో వచ్చారు. 12 గ్రామాల ప్రజలకు తీవ్ర నష్టం వాటిల్లే కంపెనీని రద్దు చేయాలని ఆందోళన చేపడితే రైతులపై అక్రమ కేసులు పెట్టడం ఏంటి. న్యాయం కావాలని ఆందోళన చేపడితే అన్నదాతలను అరెస్ట్ చేయడమేంటి. రైతులపై పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలి. – శ్యాంప్రసాద్, పెద్ద ధన్వాడ పండుగలు జరుపుకోం. ఇథనాల్ కంపెనీ ఏర్పాటుచేస్తే మా గ్రామానికి, రైతులకు నష్టం వాటిల్లుతుందని ఆందోళన చేపట్టిన రైతులు జైలులో ఉన్నారు. వారి కుటుంబ సభ్యులు బాధపడుతుంటే తోటి రైతులం మేము ఎలా పండుగ జరుపుకుంటాం. జైలులో ఉన్న రైతులు గ్రామానికి వచ్చే దాక ఏ పండుగనూ జరుపుకోము. ఇథనాల్ ఫ్యాక్టరీని రద్దు చేయాలి. అప్పుడే మాకు పెద్ద పండుగ. అందుకే రైతుల పండుగ ఏరువాక పౌర్ణమిని జరుపుకోకూడదని నిర్ణయించుకున్నాం. – వీరన్న, రైతు, పెద్ద ధన్వాడ ● -
ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడొద్దు
గద్వాల: రాజోళి మండలం పెద్ద ధన్వాడలో ప్రాణాంతకమైన ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటుచేసి.. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడొద్దని వివిధ రాజకీయ పార్టీల నాయకులు అన్నారు. మంగళవారం సీపీఎం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ఆ పార్టీ కార్యాలయంలో అఖిలపక్ష నాయకులతో రౌండ్టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ.. సాగు భూములను బలవంతంగా లాక్కొని రైతులను రోడ్డుపాలు చేయడమే కాకుండా, భవిష్యత్ తరాలను సైతం ప్రమాదంలో నెట్టేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. నదులు, సాగుభూములను నాశనం చేసే పరిశ్రమ ఏర్పాటుపై ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తూ ముందుకెళ్లడం దారుణమని మండిపడ్డారు. ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటును ప్రజలు, రైతులు మొదటి నుంచి వ్యతిరేకిస్తూ వస్తున్నారని.. తమను తాము కాపాడుకునే క్రమంలో జరిగిన ఆందోళనలో అమాయకులపై పోలీసు కేసులు పెట్టి భయబ్రాంతులకు గురిచేయడం సరికాదని అన్నారు. దీనిపై ప్రభుత్వం పట్టుదలకు వెళ్లకుండా ప్రజల కోరికను పరిగణనలోకి తీసుకుని పరిశ్రమ ఏర్పాటును విరమించుకోవాలని డిమాండ్ చేశారు. అదే విధంగా బాధిత గ్రామస్తులను పరామర్శించే ప్రయత్నం చేస్తున్న నాయకులను ప్రభుత్వం పోలీసులతో అడ్డుకోవాలని చూడటం సరికాదన్నారు. ప్రభుత్వ తీరు మారకపోతే చలో పెద్ద ధన్వాడ కార్యక్రమానికి పిలుపునివ్వాల్సి ఉంటుందన్నారు. సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి వెంకటస్వామి, సీపీఐ జిల్లా కార్యదర్శి ఆంజనేయులు, ఇక్బాల్పాషా, సుభాన్, రంగన్న, రాజ్కుమార్, మోషన్న ఉన్నారు. -
నీలినీడలు
మత్స్యకారులకు ఉచితంగా చేప విత్తనాలు ఆర్థిక భరోసా అందించాలని ప్రభుత్వం సంకల్పించింది. ఇందుకోసం ఏటా రూ.కోట్లు వెచ్చించి.. చేప విత్తనాలు అందిస్తోంది. అయితే క్షేత్రస్థాయిలో ఇది పెద్దగా సత్ఫలితాలు సాధించలేకపోతోంది. దీనికోసం ఉమ్మడి పాలమూరులో ఇప్పటికే అందుబాటులో ఉన్న చేప విత్తనాల ఉత్పత్తి కేంద్రాలకు కొద్దిపాటి నిధులు వెచ్చించి.. వాటిని వినియోగంలోకి తెస్తే ప్రభుత్వం ఆశించిన నీలి విప్లవం సృష్టించవచ్చు. వీటిని సద్వినియోగం చేసుకోవడంలో అధికారులు ‘మీన’మేషాలు లెక్కిస్తున్నారు. మహబూబ్నగర్ న్యూటౌన్: ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో నీటి వనరులు పుష్కలంగా ఉన్నాయి. ప్రతిఏటా జిల్లాల వారీగా కోట్లలో చేప విత్తనాలు అవసరమవుతాయి. జిల్లాల వారీగా చేప పిల్లల ఉత్పత్తి జరిగితే వాటిని మత్స్యకారులకు పంపిణీ చేసి పారదర్శకంగా మత్స్య పారిశ్రామిక రంగం వృద్ధి సాధించే అవకాశం ఉంటుంది. అయితే గత ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన ఉచిత చేపపిల్లల పంపిణీకి ఉత్పత్తి లేకపోవడంతో మత్స్యకారులకు తీవ్రనష్టం వాటిల్లుతోంది. మత్స్య సంపద పెంపునకు ప్రాధాన్యత ఇస్తున్న ప్రభుత్వం క్షేత్రస్థాయి సమస్యలపై దృష్టి పెట్టడం లేదు. దీంతో ప్రతి సంవత్సరం టెండర్లు నిర్వహించి ఆంధ్రప్రదేశ్, ఇతర రాష్ట్రాల నుంచి చేప విత్తనాలను తెస్తే నాణ్యత లేకపోవడంతో మత్స్యకారులు తీవ్ర నష్టాలకు గురవుతున్నారు. ఉమ్మడి జిల్లాలో నదులు, జలాశయాలు, చెరువులు, కుంటలు మత్స్యకారులకు జీవనోపాధి కల్పిస్తున్నాయి. ఉమ్మడి పాలమూరులో 4,624 చెరువులు, కుంటలు, జలాశయాల్లో ప్రతి ఏడాది 11.07 కోట్ల చేపపిల్లల పెంపకం లక్ష్యంగా ఉంది. చేపపిల్లల పంపిణీ కోసం ఏటా రూ.9 కోట్లు వెచ్చిస్తున్నారు. చేపపిల్లల ఉత్పత్తి కేంద్రాలను అందుబాటులోకి తీసుకొస్తే ప్రభుత్వానికి ఆర్థిక భారం తగ్గడంతో పాటు మత్స్యకారులకు నాణ్యమైన చేప విత్తనాలు లభించడంతోపాటు అక్రమాలకు ఆస్కారం ఉండదు. ‘మీన’మేషాలు -
పెండింగ్ రైల్వే పనులు పూర్తి చేయాలని ఎంపీ వినతి
పాలమూరు: మహబూబ్నగర్ పార్లమెంట్ పరిధిలో పెండింగ్లో ఉన్న రైల్వే పనులపై మంగళవారం కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్కు ఢిల్లీలో ఎంపీ డీకే అరుణ వినతి పత్రం అందించారు. కృష్ణా–వికారాబాద్ రైల్వే లైన్ ప్రాజెక్ట్ పనులు త్వరగా ప్రారంభించాలని కోరారు. ఈ ప్రాజెక్ట్ను త్వరగా పూర్తి చేయాలని కోరారు. ఈ ప్రాజెక్టు వల్ల హుబ్లీతో పాటు ఇతర ప్రాంతాలకు కనెక్టివిటీ మరింత సులభతరం అవుతుందన్నారు. దీంతో పాటు పెండింగ్లో ఉన్న అండర్ రైల్వే బ్రిడ్జిలు, రైల్వే ఓవర్ బ్రిడ్జిలు నిర్మాణ పనులపై గతంలో ఇచ్చిన ప్రతిపాదనలు పరిగణలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించి పెండింగ్ పనులు త్వరగా పూర్తి చేయడానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. -
ఎస్సీ, ఎస్టీ కేసులు పరిష్కరించండి
● అసమానత్వం, అట్రాసిటీ లేని రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యం ● ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య ● ఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. 2023 సెప్టెంబర్ నుంచి ఇప్పటి వరకు జిల్లావ్యాప్తంగా 62 ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదు కాగా.. 19 కేసులు విచారణలో ఉన్నాయన్నారు. మిగతా కేసులకు చార్జీషీట్ వేసినట్లు తెలిపారు. అదే విధంగా ఒక కేసులో నిందితులకు శిక్ష పడినట్లు ఎస్పీ వెల్లడించారు. 32 కేసులకు సంబంధించి రూ. 38.75లక్షల నష్టపరిహారం చెల్లించినట్లు వివరించారు. ఈ సందర్బంగా ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్కు పలు సమస్యలపై బాధితులు వినతిపత్రాలను అందజేశారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు వి.లక్ష్మీనారాయణ, నర్సింగ్రావు, కమిటీ సభ్యులు కొంకటి లక్ష్మీనారాయణ, నీలాదేవి, రాంబాబునాయక్, ప్రవీణ్, ఆర్డీఓ అలివేలు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రమేశ్బాబు, డీఎస్పీ మొగులయ్య తదితరులు ఉన్నారు. గద్వాల: జిల్లాలో ఎస్సీ, ఎస్టీ కేసుల పరిష్కారానికి సత్వర చర్యలు చేపట్టాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. మంగళవారం ఐడీఓసీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశానికి కలెక్టర్ బీఎం సంతోష్, ఎస్పీ శ్రీనివాసరావులతో కలిసి ఆయన హాజరై మాట్లాడారు. దళితుల అణచివేత, అసమానత్వం, అట్రాసిటీ లేని రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో కమిషన్ పనిచేస్తోందన్నారు. పెండింగ్లో ఉన్న ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసులను త్వరగా పరిష్కరించేందుకు చొరవ చూపాలని అధికారులకు సూచించారు. కొన్ని ప్రాంతాల్లో నేటికీ రెండు గ్లాసుల విధానం, కులవివక్ష వంటివి కొనసాగడం విచారకరమన్నారు. ప్రతినెలా చివరి శనివారం పౌరహక్కుల దినోత్సవం నిర్వహించేందుకు తహసీల్దార్లు, ఎస్ఐలు కార్యాచరణ రూపొందించుకోవాలని సూచించారు. ప్రత్యేకంగా రాయపురం గ్రామంలో అత్యధికంగా ఫిర్యాదులు వచ్చాయని.. ఆర్డీఓ, డీఎస్పీలు ప్రత్యేక చొరవ తీసుకోవాలని తెలిపారు. అదే విధంగా ప్రభుత్వం అమలుచేస్తున్న ఇందిరమ్మ ఇళ్లు, రాజీవ్ యువవికాసం పథకాల్లో ఎస్సీ, ఎస్టీ కోటా తప్పనిసరిగా అమలు చేయాలన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ నిధులు సైతం వారికే కేటాయించాలన్నారు. నిధుల దుర్వినియోగం జరిగితే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇథనాల్ ఫ్యాక్టరీ ఘటనపై నివేదికను కమిషన్కు సమర్పించాలని ఆదేశించారు. రైతులకు అన్యాయం జరగకూడదన్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు కులాంతర వివాహాలు, అంబేడ్కర్ విద్య తదితర పథకాలపై గ్రామ స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. జిల్లాలో విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు. ప్రభుత్వానికి శక్తి సామర్థ్యాలు కలగాలి.. అలంపూర్: శ్రీజోగుళాంబ అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్ర ప్రభుత్వానికి శక్తి సామర్థ్యాలు కలగాలని రాష్ట్ర ఎస్పీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య ఆకాంక్షించారు. అలంపూర్ ఆలయాలను చైర్మన్తో పాటు సభ్యులు కుశ్రం నీలాదేవి, కొంకటి లక్ష్మీనారాయణ, రాంబాబు నాయక్, రెణికుంట్ల ప్రవీణ్ సందర్శించగా.. ఆర్డీఓ అలివేలు, డీఎస్పీ మొగులయ్య, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రమేశ్బాబు పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. అనంతరం ఆలయాలకు చేరుకున్న వారికి అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం జోగుళాంబ బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయాల్లో వారు ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు వారిని శేషవస్త్రాలతో సత్కరించి.. తీర్థప్రసాదాలను అందజేశారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ పురేందర్ కుమార్, తహసీల్దార్ మంజుల, జిల్లా ఎస్సీ సంక్షేమశాఖ అధికారిణి సుజాత, సీఐ రవిబాబు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ బీఎం సంతోష్ మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల పరిష్కారం, నష్టపరిహారం చెల్లింపులు, రెసిడెన్షియల్ పాఠశాలల వివరాలను వివరించారు. కులాంతర వివాహాల కింద 59 దరఖాస్తులు వచ్చాయని.. ఆరు జంటలకు రూ. 15లక్షల చొప్పున ప్రోత్సాహాకాన్ని అందించినట్లు తెలిపారు. మిగతా వారికి నిధులు వచ్చిన వెంటనే ఇస్తామన్నారు. ఇందిరమ్మ ఇళ్లు, రాజీవ్ యువవికాసం పథకాల్లో ఎస్సీ, ఎస్టీ కోటా ప్రకారమే లబ్ధిదారుల ఎంపిక చేపడుతున్నట్లు వివరించారు. -
విత్తన దుకాణాల్లో తనిఖీలు
అయిజ: మండల కేంద్రంలోని విత్తన దుకాణాల్లో సోమవారం విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్, వ్యవసాయ అధికారులు తనిఖీ చేశారు. ఇందులో భాగంగా సాయిరాం హైబ్రీడ్ సీడ్స్, శింతి సీడ్స్, సాయిరాం సీడ్స్ దుకాణాల్లో స్టాక్ రిజిస్టర్, నిలువలు, బిల్లు బుక్కులు, ఇన్వాయిసులు, సోర్స్ సర్టిఫికెట్లు పరిశీలించారు. నిబంధనల మేరకు విత్తనాలు విక్రయించాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి జనార్ధన్, విజిలెన్స్ అధికారులు సీఐ గణేష్, ఏసీటీఓ సురేష్. ఎస్సై శ్రీరాము పాల్గొన్నారు. బీచుపల్లి శివాలయంలో ప్రత్యేక పూజలు ఎర్రవల్లి: బీచుపల్లి పుణ్యక్షేత్రంలోని శివాలయంలో సోమవారం భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు శివుడికి ప్రత్యేక అభిషేకాలు చేశారు. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు బీచుపల్లికి చేరుకొని శివుడిని దర్శించుకున్నారు. ధ్వజస్తంభం ఎదుట కొబ్బరికాయలు కొట్టి శివుడికి పంచామృత అభిషేకాలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. పేదల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం కృషి గద్వాల: పేదల సంక్షేమానికి ప్రధాని మోదీ ఎంతో కృషి చేస్తున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు అన్నారు. సోమవారం గద్వాల పట్టణంలోని రాజవీదిలో పట్టణ అధ్యక్షురాలు రజకశ్రీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన హాజరై రేషన్ బియ్యం పంపిణీ చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దూరదృష్టితో పేదలకు ఒకేసారి మూడు నెలల రేషన్ బియ్యాన్ని పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు రవి, ఎక్బోటా, వెంకటరాములు తదితరులు ఉన్నారు. ‘గట్టు’లో ముగిసిన ధాన్యం కొనుగోళ్లు గట్టు: యాసంగి సిజన్లో రైతులు పండించిన ధాన్యం కొనుగోలు ప్రక్రియను సోమవారం నుంచి నిలిపివేస్తున్నట్లు పీఏసీఎస్ చైర్మన్ వెంకటేశ్ తెలిపారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ద్వారా గట్టు,మాచర్ల, ఆలూరు, పెంచికలపాడు గ్రామాల్లో కొనుగోలు కేంద్రాల ద్వారా మొత్తం 1,13,617 సంచుల ద్వారా 52.617 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేసినట్లు వెంకటేశ్ తెలిపారు. గట్టు కొనుగోలు కేంద్రం ద్వారా 369 మంది రైతులకు సంబందించి 49,739 బస్తాలు, మాచర్లలో 320 మంది నుంచి 39,503 బస్తాలు, ఆలూరులో 164 మంది నుంచి 18,868 బస్తాలు, పెంచికలపాడులో 202 మంది నుంచి 23,507 బస్తాలను కొనుగోలు చేసినట్లు తెలిపారు. రైతులు పండించిన ధాన్యానికి ప్రభుత్వం ఏ–గ్రేడ్ రకానికి 2330 మద్దతు ధరను చెల్లించి కొనుగోలు చేసింది. దీనికి అదనంగా క్వింటాల్కు ప్రభుత్వం 500 బోనస్ను చెల్లించనున్నది. దీంతో రైతులు యాసంగిలో పండించిన వడ్లను ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో విక్రయించారు. -
నయా వెట్టి..!
కృష్ణాతీరంలో చేపల వేట కోసం కూలీల అక్రమ రవాణా వ్యాపారులకే లబ్ధి.. నిర్బంధ కార్మికులకు విముక్తి కల్పించామని అధికారులు చెబుతున్నప్పటికీ.. పరోక్షంగా వారు చేపల వ్యాపారులకు లబ్ధి చేకూరుస్తున్నారు. నిర్బంధ కార్మికులు, స్వచ్ఛంద సంస్థలు ఫిర్యాదులు చేస్తున్నప్పటికీ ఎక్కడా వ్యాపారులపై కేసులు నమోదు కావడం లేదు. నెలల తరబడి పనులు చేసిన కార్మికులకు వ్యాపారుల నుంచి జీతాలు ఇప్పించడం లేదు. కేవలం రవాణా చార్జీలు ఇచ్చేసి కార్మికులను తమ స్వగ్రామాలకు పంపిస్తున్నారు. అధికారుల ఉదాసీనత కారణంగా ఒక్కో కార్మికుడిపై రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు వ్యాపారికి మిగులుతున్నాయి. ఇదే బాగుందని కొందరు వ్యాపారులు ఉద్దేశపూర్వకంగానే అధికారులకు స్వయంగా ఫోన్లు చేసి కార్మికులను అప్పగిస్తున్నారు. ఇదో రకమైన నయా మోసమని కార్మికులు వాపోతున్నారు. ●చిన్నంబావి మండలంలోని కృష్ణా నదీ తీరం నుంచి శ్రీశైలం డ్యాం వరకు పదుల సంఖ్యలో అలివి గుడారాలు ఉంటాయి. ఒక్కొక్క గుడారంలో 20 నుంచి 30 మంది వరకు నిర్బంధ కార్మికులు పనిచేస్తుంటారు. ఈ గుడారాలన్నీ నదీతీరంలో అందరికీ కనిపించే దూరంలోనే ఉంటాయి. కానీ అధికారులు మాత్రం అక్కడికి వెళ్లరు. ఎప్పుడైనా తనిఖీలు చేయాల్సి వస్తే.. ముందుగానే వ్యాపారులకు సమాచారం అందుతుంది. అధికారులు వచ్చేలోపు వ్యాపారులు తమ స్థావరాలను మరో చోటికి మార్చడం పరిపాటిగా మారింది. ఫిర్యాదులు అందినా.. అలివి వలలతో చేపల వేట నిషేధం. కానీ, కృష్ణానదిలో అలివి వేట విచ్చలవిడిగా సాగుతోంది. చేపల వేట కోసం వేర్వేరు ప్రాంతాల నుంచి కార్మికులను తీసుకొస్తారు. వారి సమాచారం ఎక్కడా నమోదు కాదు. కార్మికులు నదిలో పడి చనిపోయినా వారి వివరాలను గోప్యంగా ఉంచుతున్నారు. కృష్ణాతీరంలోని మల్లేశ్వరం, సోమశిల తదితర ప్రాంతాల్లో చోటు చేసుకుంటున్న బాండెడ్ లేబర్ దందాపై ఫిర్యాదులు చేసినా సంబంధిత అధికారులు చూసీ చూడనట్టుగా వ్యవహరించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కార్మికులకు విముక్తి ఇలా.. ఏపీలోని భీమవరం ప్రాంతానికి చెందిన గణేశ్ను నాలుగు నెలల క్రితం ఓ బ్రోకర్ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి మల్లేశ్వరం తీసుకొచ్చాడు. అక్కడ ఓ చేపల వ్యాపారికి అతడిని అప్పగించాడు. అతడి ఫోన్ లాగేసుకున్నారు. గణేశ్ ఎక్కడికి వెళ్లాడో తెలియకపోవడంతో అతడి భార్య భీమవరంలో పోలీసులకు ఫిర్యాదు చేసింది. నేషనల్ ఆదివాసీ సాలిడారిటీ సెంటర్(ఎన్ఏఎస్సీ) సభ్యులను కూడా కలిసింది. వారు నాగర్కర్నూల్ జిల్లాలోని తమ సంస్థ సభ్యులకు సమాచారం ఇచ్చారు. వారు వెళ్లి నదీతీరంలో వెతకగా.. అక్కడ గణేశ్ కనిపించాడు. అతడితోపాటు మరో 39 మంది నిర్బంధ కార్మికులను స్థానిక పోలీసుల సహకారంతో పెంట్లవెల్లి మండల రెవెన్యూ అధికారులకు అప్పగించారు. ఇందులో చైన్నె, ఒడిశా, నెల్లూరు, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, జార్ఖండ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నారు. వీరంతా మల్లేశ్వరం, సంగమేశ్వరం, బోనాసి, మంచాలకట్ట, అమరగరి ప్రాంతాల్లో నిర్బంధంలో ఉన్న కార్మికులు. నాలుగు నెలల క్రితం 28 మంది కార్మికులను కూడా ఇదే తరహాలో అధికారులకు అప్పగించారు. ఇటీవలి కాలంలో మొత్తం 80 మందికి పైగా కార్మికులకు నిర్బంధం నుంచి విముక్తి లభించింది. హైదరాబాద్ నుంచి తీసుకొచ్చారు.. ఉపాధి కోసం హైదరాబాద్కు వచ్చా. పనులు దొరక్కపోవడంతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఉండేవాడిని. ఓ వ్యక్తి పరిచయమై చేపల కంపెనీలో పనిచేసేందుకు పిలిచాడు. అడ్రస్ చెప్పలేదు. అతడి వెంట వచ్చా. మల్లేశ్వరంలో ఓ వ్యక్తికి అప్పగించాడు. 5 నెలలుగా కృష్ణానదిలో చేపల వలలు లాగే పనులు చేశా. రోజు అన్నంతోపాటు కారంపొడి పెట్టేవారు. లేదంటే చేపలు వండుకొని తినాలి. రాత్రి, పగలు పనిచేయాలి. పని చేయలేమంటే కొట్టేవారు. మూత్రానికి వెళ్లినా ఒకరిద్దరు మాకు కాపలా ఉంటారు. పనిచేసినందుకు జీతాలు మాత్రం ఇవ్వలేదు. అధికారులు జీతాలు ఇప్పించకుండానే మా ఊళ్లకు పంపించారు. – రాహుల్, బెంగుళూరు పోలీసులకు ఫిర్యాదు.. కార్మికుల నిర్భందం గురించి రెవన్యూ పరంగా పోలీసులకు ఫిర్యాదులు చేస్తున్నాం. ఇటీవల చాలామంది కార్మికులకు నిర్బంధం నుంచి విముక్తి కల్పించాం. కార్మికులకు రవాణా చార్జీలు ఇచ్చి వారి స్వగ్రామాలకు పంపిస్తున్నాం. వారి వెంట రెవెన్యూ అధికారులు కూడా వెళ్తున్నారు. కేసుల నమోదు అంశం పోలీసు శాఖ పరిధిలోనిది. దీన్ని కూడా పర్యవేక్షిస్తాం. – భన్సీలాల్, ఆర్డీఓ, కొల్లాపూర్ చేపల కంపెనీలో ప్యాకింగ్ ఉద్యోగాలని నమ్మిస్తున్న దళారులు నదీతీరంలో వ్యాపారులకు అప్పగిస్తున్న వైనం 18 గంటల పాటు పనులు.. జీతాలు ఇవ్వకుండా వేధింపులు ఇటీవల 80 మంది నిర్బంధ కార్మికులకు విముక్తి -
‘ప్రజావాణి’ ఫిర్యాదులు త్వరగా పరిష్కరించాలి
గద్వాల: వివిధ సమస్యలపై ప్రజావాణికి వచ్చే ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా వివిధ సమస్యలకు పరిష్కారం కోరుతూ ప్రజలు నేరుగా కలెక్టర్కు వినతులు అందించారు. మొత్తం 52 ఫిర్యాదులు రాగా.. ఆయా శాఖలకు చెందిన అధికారులకు పంపించారు. ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని, పరిష్కారం కానిపక్షంలో అందుకు గల కారణాలు వివరిస్తూ సంబంధిత ఫిర్యాదుదారుడికి అక్నాలెడ్డ్మెంట్ ద్వారా తెలియజేయాలని సూచించినట్లు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు లక్ష్మీనారాయణ, కలెక్టరేట్ సిబ్బంది, వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. -
అలరించిన చిన్నారుల నృత్య ప్రదర్శన
గద్వాలటౌన్: జిల్లా కేంద్రంలోని బాలభవనంలో జానపద, భరత నాట్యం, కూచిపూడి శాసీ్త్రయ నృత్యాలతో చిన్నారులు ఆకట్టుకున్నారు. సోమవారం సాయంత్రం బాలభవన్లో నాట్యమయూరి దివ్య నృత్యాలయం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శిక్షణా శిబిరం ముగింపు వేడుకలు నిర్వహించారు. ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. చిన్నారులలో అంతర్గతంగా దాగిఉన్న ప్రతిభను ప్రోత్సహించాలని, అప్పుడే వారు అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారన్నారు. పాశ్చాత్య సంస్కృతి నుంచి ఉపశమనం పొందేందుకు సాంప్రదాయ కళలు, నృత్యాలు పరిపూర్ణంగా దోహద పడతాయన్నారు. సమాజాన్ని చైతన్య పర్చేలా సాంస్కృతిక కార్యక్రమాలను రూపొందించాలన్నారు. విజయ్, మాదవి, వెంకటేశ్వర్లు, అమరేష్, మున్సిపల్ మాజీ చైర్మన్ వేణుగోపాల్ పాల్గొన్నారు. -
మురిపించి.. ముఖం చాటేసి
●4 ఎకరాల్లో విత్తనాలు వేశాం గత నెలలో వర్షాలు కురవడంతో ముందస్తుగా నాలుగు ఎకరాల్లో పత్తి విత్తనాలు వేశాను. ఏదో రకంగా పక్క పొలాల్లో నుండి అడపాదడపా నీరు అందిస్తున్నాం. కానీ వర్షం కురిస్తేనే పొలాలకు నీరు పుష్కలంగా అందుతుంది. దాని వల్ల వేసిన విత్తనం నుండి వచ్చిన మొలక ఎండిపోకుండా, ఆరిపోకుండా ఉంటుంది. ఈ వారంలో వర్షం కురవకపోతే వేల ఎకరాల్లో నష్టం తప్పదు. – శ్రీకాంత్ రైతు, మాన్దొడ్డి 14 ఎకరాలు కౌలుకు తీసుకున్నా 14 ఎకరాలు కౌలుకు తీసుకుని పత్తి విత్తనాలు వేశాను. అప్పటి వర్షాలకు మొలకలు వచ్చాయి. నీటి సౌకర్యం తక్కువగా ఉండటంతో చాలా చోట్ల రైతులకు నీరు అందడం లేదు. వర్షం కురిస్తేనే మొలకలకు జీవం లభిస్తుంది. చాలా చోట్ల విత్తనాలు వేశారు. ముందస్తుగా వేస్తే తర్వాతి పంటకు అనుకూలంగా ఉంటుందనుకుంటే ఆదిలోనే ఇబ్బందులు తప్పడం లేదు. – వీరస్వామి, రైతు మాన్దొడ్డి ఎన్నో ఆశలతో వేల ఎకరాల్లో పత్తి విత్తనాలు నాటిన రైతులు రాజోళి: రైతును ప్రకృతి ఏదో రూపంలో దెబ్బతీస్తూనే ఉంది. ముందస్తుగా వర్షాలు కురవడంతో నాలుగు గింజలు ఎక్కువ పండించుకుందామని ఆశపడితే రైతులకు ఆదిలోనే భంగపాటు తప్పలేదు. ఈ ఏడాది ఆరంభంలోనే విత్తనాలు వేసుకున్న రైతులకు ప్రకృతి సహకారం కనిపించడం లేదు. దీంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. వర్షం కురిస్తే తప్పా ప్రస్తుతం ఉన్న తమ పంట బ్రతకదని ఆవేదన చెందుతున్నారు. 15 రోజుల నుంచే విత్తనాలు గత నెలలో కురిసిన వర్షం, తుఫాను ద్వారా జల్లులకు రైతుల్లో ఆశలు చిగురించి విత్తనాలు వేయడం మొదలుపెట్టారు. 15 రోజుల కిందట మొదలైన విత్తన ప్రక్రియ ఇప్పటికీ కొనసాగుతుంది. ఇప్పటికే వేల ఎకరాల్లో విత్తనాలు నాటిన రైతులు వర్షం కోసం రోజూ ఎదురుచూస్తున్నారు. కాని వరణుడు కరుణించకపోవడంతో నిరాశ చెందుతున్నారు. ఇప్పటికే విత్తనాలు కొనేందుకు, సేద్యం పనులకు ఇతర కూలీలకు ఎకరాకు రూ.10 వేల చొప్పున పెట్టుబడి పెట్టిన రైతులు చివరిదాకా ఈ పంట ఉంటుందా, ఉండదా అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. విత్తనమైతే వేశాము కాని, వాటిని కాపాడుకోవడం ఎలా అనే సందిగ్ధంలో పడ్డారు. బోర్లు, బావులు ఉన్న చోట విత్తనాలకు నీరు అందిస్తున్నప్పటికీ, ఆ సౌకర్యం లేని దగ్గర రైతులు వర్షం కోసం పడిగాపులు కాస్తున్నారు. ముందుగానే విత్తనం వేసుకుంటే, అనంతరం వేసే పంటకు సమయం అనుకూలంగా, ప్రకృతి కూడా సహకరిస్తుందని భావించిన రైతులకు ఈ 15 రోజులుగా నిరాశే ఎదురవుతుంది. అయితే ఈ వారంలో వర్షం పడకపోతే పెట్టుబడి మొత్తం గాలిలో కలిసిపోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సొంత భూముల్లో విత్తనాలు వేసిన రైతుల పరిస్థితి ఒకలా ఉంటే, కౌలు రైతుల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ముందుగానే కౌలు డబ్బులు చెల్లించి, సాగు మొదలు పెట్టాల్సి ఉంటుంది. ఇటు కౌలు డబ్బులు చెల్లించి, అటు పెట్టుబడికి ఖర్చు చేసి రెండు రకాలుగా నష్టపోవాల్సి వస్తుందని రైతులు అంటున్నారు. 15 రోజుల నుంచి కరుణించని వరుణుడు గాలి, ఎండ తీవ్రతతో వాడుతున్న మొలకలు దిక్కుతోచని స్థితిలో అన్నదాత -
ఒక్క వాన కోసం
అలంపూర్ నియోజకవర్గంలోని వడ్డేపల్లి, రాజోళి, ఉండవెళ్లి, మానవపాడు, అలంపూర్, ఇటిక్యాల మండలాల్లో రైతులు విత్తనాలు వేశారు. కానీ నేటి వరకు సరైన వర్షాలు లేని కారణంగా మొలకెత్తిన విత్తనాలు పండుతాయా, ఎండుతాయా అని రైతులు గందరగోళానికి గురవుతున్నారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఒక్క వాన కురిస్తే వేలాది ఎకరాలకు జీవం వస్తుందని రైతులు అంటున్నారు. ఎండలు ఎక్కువగా ఉండటం, గాలి తీవ్రత ఎక్కువగా ఉండటంతో మొలకలు ఎండకు వాడిపోతున్నాయని రైతులు అంటున్నారు. మొత్తానికి అన్ని చోట్ల ఇదే పరిస్థితి ఉండటతో రైతుల్లో ఆశలు సన్నగిల్లుతున్నాయి. ఒక వేళ ఈ విత్తనాలు మొలకెత్తకపోతే మొత్తం దున్నేసి మళ్లీ విత్తనాలు వేయాలంటే రెట్టింపు ఖర్చు అవుతుందని రైతులు దిగాలు చెందుతున్నారు. ఒక్క వాన కురిస్తే వేల ఎకరాలకు జీవం వస్తుందని ఈ వారంలో వాన కురుస్తుందని రైతులు ఆశా భావం వ్యక్తం చేస్తున్నారు. -
జోగుళాంబ క్షేత్రంలో భక్తుల సందడి
అలంపూర్: అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన అలంపూర్ జోగుళాంబ అమ్మవారి ఆలయానికి ఆదివారం భక్తుల పోటెత్తారు. సెలవు దినం కావడంతో వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. క్షేత్రానికి వచ్చిన భక్తులు జోగుళాంబ అమ్మవారి ఆలయాల్లో కుంకుమార్చన పూజలు, బాలబ్రహ్మేశ్వర స్వామి వారి ఆలయాల్లో అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. పాఠశాలలు, కళాశాలల వేసవి సెలవులు ముగియనుండటంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. దీనికి తోడు మృగశిరకార్తె కావడంతో రైతులు, వ్యవసాయ సంబంధిత వ్యాపారులు సైతం తెల్లవారుజాము నుంచే రావడం జరిగింది. దీంతో పట్టణ పురవీధులు వాహనాలతో రద్దీగా మారాయి. దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్థానిక పుష్కర ఘాట్లో స్నానాలు అచరించి స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. అర్చకులు భక్తులకు తీర్ధ ప్రసాదాలు అందజేసి వేద ఆశీర్వచనం పలికారు. జోగుళాంబ రైల్వే హాల్ట్ వద్ద గేట్ పడిన ప్రతి సారి ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఆలయ అధికారులు భక్తులకు తగు సౌకర్యాలు కల్పించారు. స్థానిక అన్నదాన సత్రంలో భక్తులకు అన్నప్రసాద వసతి కల్పించారు. -
ఇసుక రీచ్లో.. ఓవర్లోడ్ దందా
●గద్వాల క్రైం: రాజోళి మండలంలోని తుమ్మిళ్ల ఇసుక రీచ్ను అడ్డాగా చేసుకొని కొందరు ఓవర్లోడ్ దందాకు తెరలేపారు. ఒక టిప్పుర్లో 20 టన్నుల ఇసుక తరలించాల్సి ఉండగా.. 27 టన్నుల చొప్పున తరలిస్తూ ఒక్కో అదనపు టన్నుకు రూ.వెయ్యి చొప్పున వసూలు చేస్తూ జేబులు నింపుకొంటున్నారు. ఈ దందాకు కొందరు అధికారులు సైతం తోడయ్యారు. ఇలా రోజుకు 30 – 40 టిప్పర్ల ఇసుకను అనుమతుల పేరుతో తరలిస్తూ రూ.లక్షలు వెనకేసుకుంటున్నారు. గడిచిన మూడు రోజుల వ్యవధిలో విజిలెన్స్ అధికారులు జిల్లా వ్యాప్తంగా తనిఖీలు నిర్వహించి 20 టిప్పర్లు ఓవర్లోడ్తో వెళ్తుండడాన్ని గుర్తించడంతో విషయం బయటికి వచ్చింది. కేసులు నమోదు చేసి రూ.1.45 లక్షలు జారిమానా వసూలు చేశారు. నిబంధనలు తుంగలో తొక్కి దందా.. నడిగడ్డలోని గద్వాల–అలంపూర్ సెగ్మెంట్లలోని ఇసుక కొరత కారణంగా గృహ నిర్మాణ పనులు నిలిచిపోయాయి. ఈక్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం టీజీఎండీసీ ద్వారా తుమ్మిళ్ల ఇసుక రీచ్ నుంచి ఇసుకను ఆన్లైన్లో బుకింగ్ చేసుకునేందుకు అనుమతి ఇచ్చింది. అయితే, జిల్లాలోని ఓ మాజీ ఎమ్యెల్యే అంతా తానై ఇసుక దందాకు తెరలేపారనే ఆరోపణలు వినవస్తున్నాయి. సదరు మాజీ ఎమ్మెల్యే.. ఓ మాజీ ప్రజాప్రతినిధికి ఈ ఇసుక రీచ్ టెండర్ను దక్కించేలా ముఖ్యపాత్ర పోషించాడనే ఆరోపణలు ఉన్నాయి. అనంతరం తన అనుచరవర్గంలోని కొందరిని రీచ్ వద్ద ఉంచి ప్రతి టిప్పర్ (ట్రిప్పు)లో 7 టన్నుల ఇసుకను ఎక్కువగా తరలించే ప్రక్రియను చేపట్టారు. ఒక్కో అదనపు టన్ను ఇసుకకు రూ.వెయ్యి చొప్పున వసూలు చేస్తున్నారు. వాస్తవంగా టిప్పర్కు 20 టన్నులు ఇసుక తరలింపునకు అనుమతి ఉంటుంది. అయితే అదనంగా 7 టన్నుల ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. రోజుకు సగటున రూ.2.10 లక్షల అక్రమ ఆదాయం వైట్ కాలర్ నాయకులకు చేరుతుంది. తుమ్మిళ్ల ఇసుక రీచ్ అడ్డాగా అక్రమాలు మా దృష్టికి రాలేదు.. తుమ్మిళ్ల ఇసుక రీచ్ నుంచి ప్రభుత్వం టీజీ ఎండీసీ ద్వారా ఇసుక తరలింపునకు అనుమతి ఇచ్చింది. ప్రాజెక్ట్ అధికారి పర్యవేక్షణలో ఇసుక తరలింపు కొనసాగుతుంది. టిప్పర్కు 20 టన్నుల ఇసుక తరలించేందుకు అనుమతి ఉంది. సామర్థ్యానికి మించి ఇసుకను తీసుకెళ్తున్నట్లు మా దృష్టికి రాలేదు. ఒకవేళ తరలిస్తే శాఖ పరమైన చర్యలు ఉంటాయి. తుమ్మిళ్ల రీచ్ విషయంపై సంబంధిత అధికారితో మాట్లాడి పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తాం. – వెంకటరమణ, జిల్లా మైనింగ్ అధికారి కేసులు నమోదు చేస్తాం ఇటీవల జిల్లాలోని పలు చోట్ల తనిఖీలు చేయగా.. సామర్థ్యానికి మించి టిప్పర్ల ద్వారా ఇసుకను తరలిస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలో మైనింగ్, రవాణాశాఖకు వాహనాలు అప్పగించి జారిమానాలు విధించాం. ప్రభుత్వ అనుమతులు లేకున్నా, వాహనాల్లో ఓవర్లోడ్గా ఇసుకను తరలించినా క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం. ఇప్పటికే రాష్ట్ర విజిలెన్స్ బృందం సైతం తనిఖీలు చేపట్టింది. ఎవరినీ ఉపేక్షించేది లేదు. – మొగిలయ్య డీఎస్పీ, గద్వాల ఒక్కో టిప్పర్లో ఏడు టన్నులు అధికంగా లోడ్ చేస్తున్న వైనం ట్రిప్పుకు రూ.15 వేల నుంచి రూ.20 వేలు వెనకేసుకుంటున్న ఇసుకాసురులు విజిలెన్స్, పోలీసుల తనిఖీలో బహిర్గతం మూడు రోజుల వ్యవధిలో 20 టిప్పర్ల పట్టివేత.. కేసులు నమోదు అంతా తామై.. వెనకుండి నడిపిస్తున్న కొందరు జిల్లా నాయకులు ఇసుక టిప్పర్ల పట్టివేత గద్వాల క్రైం: సామర్థ్యానికి మించి ఇసుక తరలిస్తున్న టిప్పర్లను గద్వాల పట్టణ, రూరల్ ఎస్ఐలు కళ్యాణ్కుమార్, శ్రీకాంత్ ఆదివారం పట్టుకున్నారు. వివరాలిలా.. రాజోలి మండలం తుమ్మిళ్ల ఇసుక రీచ్ నుంచి గద్వాల మీదుగా ఇసుకను టిప్పర్లలో తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఇసుక అనుమతి వివరాలపై ఆరా తీశారు. మొత్తం ఏడు టిప్పర్లను తనిఖీ చేయగా.. అందులో సామర్థ్యానికి మించి ఐదు టిప్పర్లలో ఇసుక తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. సదరు టిప్పర్లను మైనింగ్ లేదా రవాణాశాఖ అధికారులకు అప్పగించనున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
సర్పంచ్ టు మంత్రి..
అంచెలంచెలుగా ఎదిగిన ముదిరాజ్ బిడ్డ వాకిటి శ్రీహరి సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణలో మరో పాలమూరు వాసికి చోటు దక్కింది. వ్యవసాయ కుటుంబం నుంచి రాజకీయాల్లోకి వచ్చి.. అంచెలంచెలుగా ఎదిగిన మక్తల్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరిని అమాత్య పదవి వరించింది. ఈ మేరకు హైదరాబాద్ రాజ్భవన్లో ఆదివారం ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన ఆయనకు మంత్రి పదవి రావడంతో బీసీ సంఘాలతో పాటు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. కాగా, ఉమ్మడి మహబూబ్నగర్ పరిధిలోని కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న రేవంత్రెడ్డి ముఖ్యమంత్రిగా, కొల్లాపూర్ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు పర్యాటక, ఎకై ్సజ్ శాఖ మంత్రిగా ఉన్నారు. తాజాగా వాకిటి శ్రీహరికి మంత్రి పదవి దక్కడం పాలమూరుకు వరమని ఆ పార్టీ నాయకులు అభిప్రాయపడుతున్నారు. రాజకీయ నేపథ్యం.. ● వాకిటి శ్రీహరి 1990 నుంచి 1993 వరకు ఎన్ఎస్యూఐ మక్తల్ మండల ప్రెసిడెంట్గా.. 1993–1996 వరకు యూత్ కాంగ్రెస్ మక్తల్ మండల అధ్యక్షుడిగా.. 1996 నుంచి 2001 వరకు మక్తల్ మండల కాంగ్రెస్ కార్యదర్శిగా పనిచేశారు. ● 2001–2006 వరకు మక్తల్ మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్గా బాధ్యతలు నిర్వర్తించారు. ఎన్నికల్లో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో అత్యధిక మెజార్టీ సాధించి రికార్డుల్లోకెక్కారు. ● 2001–2006 ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్గా పనిచేశారు. ● 2006 నుంచి 2011 వరకు వాకిటీ శ్రీహరి సతీమణి వాకిటి లలిత దాసర్పల్లి ఎంపీటీసీ సభ్యురాలిగా ఉన్నారు. 2006 నుంచి 2011 వరకు ఆమె కాంగ్రెస్ మక్తల్ మండల అధ్యక్షురాలిగా పనిచేశారు. ● 2006 నుంచి 2012 వరకు వాకిటి శ్రీహరి సోదరుడు వాకిటి శేషగిరి మక్తల్ మేజర్ గ్రామపంచాయతీ ఉపసర్పంచ్గా.. 2006 నుంచి 2014 వరకు యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. ● 2014 నుంచి 2018 వరకు వాకిటి శ్రీహరి మక్తల్ జెడ్పీటీసీ సభ్యుడిగా సేవలందించారు. జెడ్పీటీసీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలోనే రెండో మెజార్టీ స్థానంలో నిలిచారు. 2014 నుంచి 2018 వరకు కాంగ్రెస్ జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్గా.. 2014 నుంచి 2018 వరకు మహబూబ్నగర్ జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ● 2018 నుంచి వాకిటి శ్రీహరి కృష్ణా జలాల పరిరక్షణ సమితి సభ్యుడిగా ఉన్నారు. పరిగి ఎమ్మెల్యే రాంమోహన్రెడ్డి, మాజీ మంత్రి నాగం జనార్దన్రెడ్డితో కలిసి పనిచేశారు. ● 2019లో వాకిటి శ్రీహరి సోదరుడి భార్య రాధిక మక్తల్ మున్సిపాలిటీ కౌన్సిలర్గా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్గా పనిచేశారు. ● 2022 సెప్టెంబర్ 03 నుంచి 2024 ఫిబ్రవరి వరకు నారాయణపేట జిల్లా డీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. ● 2023 సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి మక్తల్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా పోటీ చేసి.. సమీప బీఆర్ఎస్ అభ్యర్థి చిట్టెం రామ్మోహన్రెడ్డిపై 17,525 ఓట్లతో గెలుపొందారు. తాజాగా రెండో దఫాలో జరిగిన రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో కేబినెట్లో చోటుదక్కించుకున్నారు. వాకిటి శ్రీహరి విద్యార్థి దశలో యూత్ కాంగ్రెస్లో చేరినప్పటి నుంచి ఆ పార్టీలోనే కొనసాగారు. సుదీర్ఘకాలంగా పార్టీకి విధేయుడిగా ముద్రపడిన ఆయనకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో మంచి సాన్నిహిత్యం ఉంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రను మక్తల్ నియోజకవర్గంలో విజయవంతం చేసి ప్రశంసలు పొందారు. దీంతో పాటు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన క్రమంలో మంత్రివర్గంలో బీసీలకు, అందులోనూ ముదిరాజ్ సామాజికవర్గానికి చెందిన వారికి చోటు కల్పించాలన్న డిమాండ్ పెరిగింది. లోక్సభ ఎన్నికల సమయంలో సీఎం రేవంత్ సైతం ముదిరాజ్కు మంత్రి పదవి ఇవ్వనున్నట్లు హామీ ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా గెలిచిన ఎమ్మెల్యేలలో ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యే శ్రీహరి ఒక్కరే కాగా.. విధేయత, సామాజిక సమీకరణాలు ఆయనకు కలిసి వచ్చాయని.. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారని కాంగ్రెస్ శ్రేణులు చర్చించుకుంటున్నాయి. వ్యవసాయ కుటుంబం నుంచి.. మక్తల్ పట్టణం నేతాజీ నగర్కు చెందిన వాకిటి శ్రీహరిది తొలుత వ్యవసాయ కుటుంబం కాగా.. కాంగ్రెస్లో చేరి క్రమక్రమంగా రాజకీయాల్లోకి వచ్చారు. కాంగ్రెస్, గాంధీ కుటుంబానికి విధేయుడిగా ఉంటూ ఎన్ఎస్యూఐ, యూత్ కాంగ్రెస్తో పాటు పార్టీలో మండల, ఉమ్మడి జిల్లా, విభజన అనంతరం నారాయణపేట జిల్లాలో వివిధ హోదాల్లో సేవలందించారు. వాకిటి శ్రీహరి తల్లి రాములమ్మ స్టాఫ్ నర్స్గా పనిచేసి ఉద్యోగ విరమణ పొందారు. స్థానికంగా వేలాది మంది నిరుపేద మహిళలకు ఉచితంగా కాన్పులు చేసి రాములమ్మ సిస్టర్గా పేరు సాధించారు. తండ్రి వాకిటి నరసింహులు వ్యవసాయంతో పాటు చిన్నపాటి కాంట్రాక్టర్గా పనిచేశారు. వీరికి మొత్తం ఆరుగురు సంతానం కాగా.. నాలుగో కాన్పులో శ్రీహరి జన్మించారు. విద్యార్థి దశలోనే నాయకత్వ లక్షణాలు పెంపొందించుకున్న ఆయన డిగ్రీ (బీఏ) దాకా విద్యాభ్యాసం కొనసాగించారు. 1996లో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఆయన మక్తల్ సర్పంచ్గా, జెడ్పీటీసీ సభ్యుడిగా, ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తాజాగా సామాజిక సమీకరణాల్లో భాగంగా బీసీ సామాజిక వర్గానికి చెందిన ఆయనను కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రి వర్గంలోకి తీసుకుంది. మంత్రి వాకిటి శ్రీహరి అమ్మమ్మ ఇంట్లో సంబరాలు నారాయణపేట: మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి మంత్రి వర్గంలో చోటు కల్పించడం, ఆదివారం ఆయన మంత్రిగా ప్రమాణస్వీకారం చేయడంతో జిల్లా కేంద్రంలోని మంత్రి అమ్మమ్మ పోషల్ శివమ్మ ఇంటా సంబరాలు అంబరాన్నంటాయి. శివమ్మ కుటుంబ సభ్యులు గొడుగుగేరిలోని అంజనేయస్వామి దేవాలయం దగ్గర టపాకులు పేల్చి మిఠాయిలు పంచిపెట్టారు. చిన్నారులు నృత్యాలు చేస్తూ ఆనందంగా డప్పు వాయిస్తూ కేరింతలు కొట్టారు. సత్యనారాయణ చౌరస్తాలో సైతం కుటుంబ సభ్యులందరూ మిఠాయిలను పంపిణీ చేశారు. విధేయత.. సామాజిక సమీకరణాలు.. తొలిసారి ఎమ్మెల్యే.. తొలిసారే మంత్రి.. వ్యవసాయ కుటుంబం నుంచి రాజకీయాల్లోకి.. కుటుంబంలో అందరూ విద్యావంతులే.. తొలిసారి ఎమ్మెల్యే.. తొలిసారే అమాత్యగిరి గతంలో ఎల్లారెడ్డి, పి.చంద్రశేఖర్, పులి వీరన్న, చిత్తరంజన్దాస్, శ్రీనివాసరావుకు అవకాశం బీసీ వర్గాలతో పాటు ఉమ్మడి పాలమూరు కాంగ్రెస్ శ్రేణుల్లో హర్షాతిరేకాలు 2023 ఎన్నికల్లో మక్తల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వాకిటి శ్రీహరి కాంగ్రెస్ అభ్యర్థిగా తొలిసారి పోటీచేసి గెలుపొందారు. తొలిసారి ఎమ్మెల్యే అయిన ఆయన.. వెంటనే మంత్రి పదవి చేపట్టి ఘనత సాధించారు. గతంలో ఉమ్మడి మహబూబ్నగర్ నుంచి ఎల్కోటి ఎల్లారెడ్డి (మక్తల్), పి.చంద్రశేఖర్ (మహబూబ్నగర్), చిత్తరంజన్దాస్ (కల్వకుర్తి), శ్రీనివాసరావు (నాగర్కర్నూల్), పులి వీరన్న (మహబూబ్నగర్)కు ఈ అవకాశం దక్కగా.. శ్రీహరి వారి సరసన చేరడం విశేషం. కాగా, వాకిటి శ్రీహరితో పాటు ఆయన కుటుంబసభ్యులందరూ విద్యావంతులే. శ్రీహరితో పాటు ఆయన భార్య, ఆయన తమ్ముడు, మరదలు ప్రజాప్రతినిధులుగా ఎన్నికై ప్రజాసేవలోనే ఉన్నారు. -
మంత్రివర్గంలో చోటు హర్షణీయం
కొత్తకోట రూరల్: బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలుచేసిన తర్వాతే గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం మండలంలోని వడ్డెవాటలో సంఘం జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షుడు భీమన్ననాయుడు ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని బీఆర్ఎస్, కాంగ్రెస్పార్టీలు బీసీలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా, జనాభా దామాషా ప్రకారం రాజకీయ ప్రాతినిథ్యం ఇవ్వకుండా ముందుకు సాగుతున్నాయని ఆరోపించారు. రాష్ట్ర మంత్రివర్గంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు చోటు కల్పించడాన్ని స్వాగతిస్తున్నామని.. అనేక పోరాటాల ఫలితంగానే కరుడుగట్టిన కాంగ్రెస్పార్టీ సామాజిక న్యాయం వైపు అడుగులేస్తోందని వివరించారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మొదటిసారి ఇద్దరు, రెండోసారి ఒక బీసీకి మంత్రివర్గంలో అవకాశమిచ్చారన్నారు. బీసీల పోరాటం ఎక్కడా వృథా కాలేదని.. ఇటీవల ఐదు ఎమ్మెల్సీ స్థానాలను కాంగ్రెస్పార్టీ చరిత్రలో లేనివిధంగా అగ్రకుల సామాజిక వర్గానికి లేకుండా మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కేటాయించారని తెలిపారు. ఎవరి వాటా వారికి దక్కాలని రాహుల్గాంధీ చెప్పారని.. అందుకు అనుగుణంగా అటు ఇటుగా బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఎమ్మెల్సీగా, మంత్రులుగా అవకాశం దక్కడం హర్షిస్తున్నామన్నారు. ఇదే పద్ధతిన నామినేటెడ్ పోస్టులు, యూనివర్సిటీ వైస్ చాన్స్లర్, సమాచార కమిషన్లో బీసీల వాటా బీసీలకు కేటాయించాలని కోరారు. 42 శాతం రిజర్వేషన్ బిల్లును అసెంబ్లీలో పాస్ చేసి ఢిల్లీకి పంపించి రెండు నెలలవుతుందని.. రాష్ట్రపతి వెంటనే ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు. ప్రధాని మోదీ దేశవ్యాప్తంగా జాతి జనగణనలో బీసీ కులగణన చేపడతామని చెప్పారని.. బీజేపీని నమ్మాలంటే బీసీ బిల్లును వెంటనే అమలు చేయాలన్నారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు రామన్నగౌడ్, జిల్లా అధ్యక్షుడు బాలరాజుగౌడ్, బీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్, బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు దోమ వెంకట్ ముదిరాజ్, బీసీ నేతలు జనార్దన్గౌడ్, బస్వరాజ్, రంగస్వామి, వెంకటన్నగౌడ్, శ్రీనివాస్గౌడ్, తిరుపతయ్య, రాందాస్, ఉద్యోగ సంఘం నేతలు వెంకటేష్, మహేష్ మేరు, దోమ వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. -
త్యాగానికి ప్రతీక బక్రీద్
గద్వాలటౌన్: త్యాగానికి ప్రతీక అయిన బక్రీద్ పండగను జిల్లా వ్యాప్తంగా ముస్లింలు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. శనివారం ముస్లింలు జిల్లా కేంద్రంలోని ఈద్గాకు తరలివెళ్లారు. ఉదయం 9 గంటల నుంచి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మతపెద్దలు నమాజ్ చేయించారు. చుట్టుపక్కల గ్రామాల ముస్లింలు సైతం గద్వాల ఈద్గాకు వచ్చి ప్రార్థనలు చేశారు. ప్రార్థనలకు వచ్చే సమయంలో ఈద్గా దగ్గర ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా డీఎస్పీ మొగలయ్య ఆధ్వర్యంలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్రంతో పాటు అయిజ, అలంపూర్, శాంతినగర్, మానవపాడు తదితర మండలాల్లోని ఈద్గాల దగ్గర ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మండల కేంద్రాలతో పాటు పలు గ్రామాల్లో ఉన్న ఈద్గాల దగ్గర ముస్లింలు బక్రీద్ ప్రార్థనలు చేశారు. ముఖ్యంగా గద్వాల పట్టణంలోని గాంధీచౌక్ నుంచి ఈద్గా వరకు ముస్లిం మైనార్టీల సందడితో బక్రీద్ కళ కనిపించింది. ప్రార్థనల అనంతరం ఈద్గా ప్రక్కన ఉన్న పూర్వీకుల సమాధుల వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి ప్రార్థనలు చేశారు. జిల్లావ్యాప్తంగా ముస్లింల ప్రత్యేక ప్రార్థనలు పండుగ శుభాకాంక్షలు తెలిపిన ప్రజాప్రతినిధులు -
ఆదిశిలా క్షేత్రంలో ప్రత్యేక పూజలు
మల్దకల్: ఆదిశిలా క్షేత్రమైన స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈసందర్భంగా ఆలయ అర్చకులు మధుసూదనాచారి, రమేషాచారి, రవిచారి స్వామి వారికి అభిషేకాలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు. అలాగే సద్దలోనిపల్లి కృష్ణస్వామి, కుర్తిరావులచెర్వు గట్టు తిమ్మప్ప స్వామి ఆలయాలతో పాటు వివిధ గ్రామాల్లోని ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆదిశిలా క్షేత్రంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఓపెన్ స్కూల్ ఫలితాలు విడుదల మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: ఉమ్మడి జిల్లావ్యాప్తంగా గత నెల మొదటి వారంలో జరిగిన ఓపెన్ ఎస్సెస్సీ, ఇంటర్ పరీక్షలకు సంబంధించిన ఫలితాలను ప్రభుత్వం శనివారం విడుదల చేసింది. ఈ మేరకు మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి 559 మంది విద్యార్థులు పరీక్ష రాయగా.. 374 మంది (67.09 శాతం) ఉత్తీర్ణులయ్యారు. అలాగే జోగుళాంబ గద్వాల జిల్లా పరిధిలో 455 మంది పరీక్ష రాయగా.. 255 మంది (52.43 శాతం), వనపర్తి జిల్లా పరిధిలో 346 మందికి గాను 289 (88.59 శాతం), నాగర్కర్నూల్ జిల్లాలో 353 మందికి గాను 235 (67.10 శాతం), నారాయణపేటలో 503 మంది పరీక్ష రాయగా.. 424 మంది (84.48 శాతం) ఉత్తీర్ణత నమోదు చేశారు. ● ఇంటర్మీడియట్కు సంబంధించి మహబూబ్నగర్ జిల్లాలో 841 మంది పరీక్ష రాయగా.. 490 మంది (60.21 శాతం) ఉత్తీర్ణత సాధించారు. జోగుళాంబ గద్వాల జిల్లాలో 652 మందికి గాను 412 (63.12 శాతం), వనపర్తి పరిధిలో 510 మందికి గాను 370 మంది (72.84 శాతం), నాగర్కర్నూల్లో 746 మందికి గాను 546 మంది (73.30 శాతం), నారాయణపేట జిల్లాలో 897 మందికి గాను 528 మంది (59.62 శాతం) నమోదు చేసినట్లు డీఈఓ ప్రవీణ్కుమార్, ఉమ్మడి జిల్లా ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ శివయ్య పేర్కొన్నారు. రైతులపై కేసులు ఎత్తివేయాలి రాజోళి: ఇథనాల్ ఫ్యాక్టరీ విషయంలో అమాయక రైతులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని బీజేపి జిల్లా అధ్యక్షుడు టి.రామాంజనేయులు డిమాండ్ చేశారు. శనివారం రాజోళిలోని బీజేపి కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఫ్యాక్టరీ వద్దని ప్రజలు విన్నవిస్తున్నా కూడా.. ఎందుకు బలవంతంగా ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. ఇప్పటికే 40 మందిపై కేసులు నమోదు చేశారని, 12 మందిని రిమాండ్ కు తరలించారని, తమ గొంతుకను వినిపిస్తే కూడా అక్రమ కేసులు బనాయిస్తారా అని ఆయన ప్రశ్నించారు. రైతుల వెంటనే ఉంటూ, వారికి మద్దతుగా బీజేపి పార్టీ నిలుస్తుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు మదుసూదన్ గౌడ్. మండల అధ్యక్షుడు శికుమార్,నాగరాజు, రాఘవేంద్ర, వెంకటేష్, సహదేవుడు పాల్గొన్నారు. బీచుపల్లి అంజన్న సన్నిధిలో దాసంగాలు ఎర్రవల్లి: బీచుపల్లి పుణ్యక్షేత్రంలోని అభయాంజనేయస్వామి సన్నిధిలో శనివారం భక్తులు ప్రత్యేక దాసంగాలను సమర్పించారు. నెల రోజుల పాటు జరిగే జాతరలో చివరి వారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దీంతో పుణ్యక్షేత్రం పరిసరాలు ఆంజనేయస్వామి నామస్మరణతో మార్మోగాయి. ఆలయ అర్చకులు ఆంజనేయస్వామికి పంచామృత అభిషేకం, ఆకుపూజ, మహా మంగళహారతి నిర్వహించారు. ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచి భక్తులు బీచుపల్లికి చేరుకొని స్వామివారిని దర్శించుకొన్నారు. మట్టి కుండలలో ప్రత్యేక నైవేద్యం, కుడుములు వండి ఆంజనేయస్వామికి సమర్పించారు. -
‘పాలమూరు’కు మరో అమాత్యగిరి
ఖర్గేతో సాన్నిహిత్యం.. రాహుల్తో ప్రశంసలు.. కర్ణాటక సరిహద్దులో ఉన్న మక్తల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీహరికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గేతో మంచి సాన్నిహిత్యం ఉంది. మొదటి నుంచీ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేస్తారనే పేరు శ్రీహరికి ఉంది. సర్పంచ్గా, ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యుడిగా పనిచేసిన అనుభవం ఉండగా.. నారాయణపేట జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా సైతం బాధ్యతలు చేపట్టారు. ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తలపెట్టిన భారత్ జోడో యాత్రను మక్తల్ నియోజకవర్గంలో విజయవంతం చేసి ప్రశంసలు పొందారు. రాష్ట్రంలో బీసీ జనాభాలో అత్యధికంగా ఉన్న ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన వాకిటికి మంత్రి పదవి.. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్కు మేలు చేస్తుందని పార్టీ పెద్దలు భావిస్తున్నారు. ఇవన్నీ శ్రీహరికి కలిసి రాగా.. ఆయన పేరు ఖరారైనట్లు గాంధీ భవన్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఎలాంటి అవరోధాలు లేకుంటే ఎమ్మెల్యేగా గెలిచిన తొలిసారే మంత్రి అయిన ఘనత శ్రీహరికి దక్కనుంది. సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: ఉమ్మడి పాలమూరుకు మరో అమాత్యగిరి దక్కనుంది. నారాయణపేట జిల్లా మక్తల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న వాకిటి శ్రీహరిని మంత్రి పదవి వరించనుంది. కాంగ్రెస్ అధిష్టానం ఫైనల్ చేసిన జాబితాలో ఆయన పేరున్నట్లు గాంధీభవన్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. బీసీ కోటాలో వాకిటితో పాటు రాష్ట్రంలో పలు సామాజిక వర్గాలకు చెందిన మరో ముగ్గురు లేదా నలుగురికి సీఎం రేవంత్రెడ్డి కేబినెట్లో చోటు దక్కనున్నట్లు తెలుస్తోంది. అంతా అనుకున్నట్లు జరిగితే నేడు లేదంటే ఈనెల పదో తేదీ లోపు అధికారికంగా వెల్లడించే అవకాశం ఉన్నట్లు కాంగ్రెస్లోని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. కాంగ్రెస్లో ఒకే ఒక్క ముదిరాజ్ ఎమ్మెల్యే.. రాష్ట్రంలో బీసీ సామాజిక వర్గంలో అత్యధిక జనాభా ఉన్న ముదిరాజ్లకు మొదటి విడతలో మంత్రి పదవి లభించలేదు. దీంతో ముదిరాజ్ల నుంచి విమర్శలు వెల్లువెత్తగా.. రెండో విడతలో చేపట్టే మంత్రి వర్గ విస్తరణలో ఆ సామాజిక వర్గానికి మంత్రి పదవి ఖాయమని కాంగ్రెస్ పెద్దలు సంకేతాలు ఇచ్చారు. గత ఏడాది లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా పలుమార్లు ఉమ్మడి జిల్లాలో పర్యటించిన సీఎం రేవంత్రెడ్డి.. ముదిరాజ్ల విజ్ఞ ప్తి మేరకు వారిని బీసీ–డీ నుంచి బీసీ–ఏ కేటగిరికి మార్చేలా ముందుకు సాగుతామని.. దీంతో పాటు ఈసారి మంత్రి వర్గ విస్తరణలో ముదిరాజ్లకు స్థానం కల్పిస్తామని సైతం హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ఆ సామాజిక వర్గానికి చెంది.. అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న వారిలో వాకిటి శ్రీహరి మాత్రమే ఉన్నారు. ఈ నేపథ్యంలో త్వరలో చేపట్టనున్న రాష్ట్ర కేబినెట్ కూర్పులో ఆయనకు బెర్త్ ఖరారైనట్లు తెలుస్తోంది. మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి మంత్రి పదవి ముదిరాజ్ సామాజిక వర్గం నుంచి కేబినెట్ బెర్త్ ఖరారు ఫైనల్ చేసిన కాంగ్రెస్ అధిష్టానం.. నేడు లేదంటే పదో తేదీ లోపు అధికారికంగా వెల్లడి ? -
నెలకు మూడు చీరలు..
గతంలో మాస్టర్ వీవర్స్పై ఆధారపడి మగ్గాలపై చీరలు నేసి కుటుంబాన్ని పోషించుకునేవాడిని. ప్రస్తుతం కంపెనీ ద్వారా ముడి సరుకులతో పాటు మగ్గాన్ని ఇవ్వడం, తయారు చేసిన చీరలకు మాస్టర్ వీవర్స్ కంటే అధిక ధర వస్తుంది. దీంతో మూడేళ్లుగా నెలకు మూడు జరీ చీరల తయారీతో రూ.12 వేల ఆదాయం పొందుతున్నా. – దాస్పత్తి తిమ్ములు, నేత కార్మికుడు అత్యంత ప్రామాణికంతో.. చేనేత ఉత్పత్తుల సంఘం ఏర్పాటుతో తమకు జీవనోపాధి దొరికినట్లయింది. మాస్టర్ వీవర్స్ వద్ద చీరలు నేయడం వల్ల వారం, పక్షం రోజులకు వేతనాలు అందించేవారు. ప్రస్తుతం సంఘం ద్వారా చీరలు నేస్తూ నెలకు రెండు చీరలను అత్యంత ప్రామాణికంతో తయారు చేయడం వల్ల అధిక డబ్బులు వస్తున్నాయి. నెలలో రెండు చీరల తయారీతో రూ.20– 25 వేల ఆదాయం వస్తుంది. – స్వప్న, నేత కార్మికురాలు స్థల ప్రభావం లేదు.. ఇంట్లో మగ్గాల ఏర్పాటుకు స్థలాలు ఉండేవి కాదు. దీంతో కిరాయి ఇంట్లో ఉంటూ మగ్గాలను నేసుకొని చీరలు తయారు చేసేవాళ్లం. ప్రస్తుతం సంఘం ద్వారా భవనం నిర్మించడం, వీటిలోనే మగ్గాలు ఏర్పాటు చేయడంతో ప్రతిరోజు అక్కడికే వెళ్లి జరీ చీరలు నేస్తూ జీవనం సాగిస్తున్నా. – పద్మ, నేత కార్మికురాలు నెలవారీగా వేతనాలు.. అప్పట్లో యజమానుల ద్వారా డబ్బులు తీసుకుని చీరలు నేసి వాటి ద్వారా అడ్వాన్సుగా తీసుకున్న డబ్బులను చెల్లించేవాళ్లం. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. స్వయంగా తయారు చేసిన చీరలకు క్రమం తప్పకుండా నెలవారీగా వేతనాలు బ్యాంక్ ఖాతాలో జమ చేస్తున్నారు. – గంజి కృష్ణయ్య చేనేత అంతరించకుండా.. పుట్టి పెరిగిన ఊరిలో చేనేత కార్మికులు ఉపాధి కోల్పోవడం చూసి సగటు నేత కార్మికుడిగా ఎంతో బాధపడ్డా. ఇలాంటి పరిస్థితుల నుంచి చేనేత పరిశ్రమను కాపాడాలని భావించా. స్వయంగా నేత కార్మికులను యజమానులను చేయాలనుకున్నా. నాబార్డుతో సంప్రదించి కంపెనీ ఏర్పాటుకు ప్రయత్నించా. కార్మికులు, ప్రజల సహకారంతో పాటు అధికారులు, ప్రజాప్రతినిధుల చొరవతో కంపెనీ ఏర్పాటు చేశాను. 40 మందితో ప్రారంభించి ఇప్పుడు 538 కార్మికులతో కొనసాగుతోంది. వచ్చిన ఆదాయంతో పాటు తయారు చేసిన చీరలకు నెలవారీగా వేతనాలు అందిస్తూ కార్మికుల ఆర్థిక పురోగతికి కృషి చేస్తున్నాం. – మహంకాళి శేఖర్, కంపెనీ సీఈఓ ● -
ఆ.. 40లో ఉన్నదెవరు?
●టెంట్ సప్లై చేసినందుకు.. మాది చిన్నధన్వాడ గ్రామం. అయితే గ్రామంతో పాటు చుట్టు పక్కల గ్రామాల వారికి టెంట్లు, డ్రమ్ములు, సప్లయి వస్తువులు అద్దెకు ఇస్తూ జీవనం సాగిస్తున్నాం. గతంలో ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా రిలే నిరాహార దీక్షలు జరుగుతున్న క్రమంలో మా ఆయన పరుశరాముడు టెంట్ ఇతర వస్తువులు సప్లై చేశాడు. దానికి బుధవారం జరిగిన ఘటనలో ఆయన పేరు చేర్చి రిమాండ్కు తరలించారు. నాయకులు, పెద్ద వాళ్లు అయితే ఏదోలా బయట పడతారు. కానీ పని చేసుకుని బతికే మమ్మల్ని ఎవరు బయటకు తీసుకువస్తారు. మాకు ముగ్గురు పిల్లలున్నారు. పిల్లలకు బడులు ప్రారంభమవుతాయి. కానీ ఇంట్లో నా భర్త లేని కారణంగా మాకు ఏం అర్ధం కావడం లేదు. – శ్రావణి, రిమాండ్కు వెళ్లిన పరుశరాముడి భార్య రాజోళి: రాజోళి మండలంలోని పెద్దధన్వాడలో ఇథనాల్ ప్యాక్టరీ వద్ద జరిగిన రగడ రోజురోజుకో మలుపు తిరుగుతుంది. బుధవారం ఫ్యాక్టరీ, వాహనాలపై దాడులు, కంటైనర్ తగలబెట్టిన ఘటనల్లో పోలీసులు 41 మందిపై కేసులు నమోదు చేశారు. అందులో 12 మందిని ఇప్పటికే రిమాండ్కు తరలించారు. తాజాగా మిగిలిన వారిపై కేసులు, రిమాండ్కు తరలిస్తారని తెలియడంతో పెద్దధన్వాడతో పాటు ఆయా గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 12 మందిని రిమాండ్ పంపించగా అందులో ఒకరు చిన్నధన్వాడకు చెందిన వ్యక్తి ఉన్నాడు. మిగతా వారు పెద్దధన్వాడ గ్రామస్తులే. అయితే మిగిలిన 29 మందిలో ఏ గ్రామానికి చెందిన వ్యక్తులు ఉన్నారు? వారిపై ఎలాంటి కేసులు నమోదు చేశారనే ఆందోళన నెలకొంది. అసలు ఆ కేసుల్లో రాజకీయ పార్టీల నాయకులు ఉన్నారా, రైతులా, కూలీలా, మహిళలు ఉన్నారా అనే అనుమానాలు ఆయా గ్రామాల ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి. జైలుకు వెళితే రాజకీయ నాయకులు ఏదోలా బయటకు వస్తారు మా పరిస్థితి ఏంటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. అసలు 40 మందితోనే కేసులు ఆగుతాయా లేక వీడియోల ఆధారంగా మరికొంత మందిపై కేసులు నమోదు చేస్తారా అనే అనుమానాలు వెంటాడుతున్నాయి. చిన్నధన్వాడలో ఒక్కరిపైనే కేసు నమోదు కాగా.. మాన్దొడ్డి, నసనూరు, తుమ్మిళ్ల తదితర గ్రామాల్లో ఎవరిౖపైనెనా కేసులు నమోదు చేశారు అనే అనుమానాలు ఉత్కంఠ రేపుతున్నాయి. ఇప్పటికే ఒక జైలర్ శాఖకు సంబందించిన ఒక ప్రభుత్వ ఉద్యోగి ఉండగా.. ప్రభుత్వ ఉద్యోగులు ఇంకా ఎవరైనా దీని వెనుక ఉన్నారా అనే కోణంలో దర్యాప్తులు జరుగుతున్నట్లు సమాచారం. ఇథనాల్ ఫ్యాక్టరీ ఘటనలో పలువురిపై పోలీసుల ప్రత్యేక నజర్ కొందరి స్వార్థంతో అమాయక రైతులు బలయ్యారని వాదన ఇప్పటికే 12 మంది రిమాండ్.. మరికొందరిపై కేసులు ? ఆందోళనలో జైలుకు వెళ్లిన వారి కుటుంబ సభ్యులు -
ఆర్టీసీ టూర్ ప్యాకేజీ
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: పుణ్యక్షేత్రాలు, దర్శనీయ స్థలాలకు వెళ్లే వారికి ప్రత్యేక టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తెస్తున్నట్లు ఆర్టీసీ ఆర్ఎం సంతోష్కుమార్ చెప్పారు. శుక్రవారం ఆర్ఎం కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా పరిధిలోని పది డిపోల నుంచి ఈ బస్సు (సూపర్ లగ్జరీ, డీలక్స్)లను అవసరమైన చోటకు పంపడానికి సిద్ధంగా ఉంచుతామన్నారు. ఏడు రూట్లలో ఆయా ప్యాకేజీలను బట్టి చార్జీలు వసూలు చేస్తామని పేర్కొన్నారు. ఒకవేళ బస్సులో సామూహికంగా ఏదైనా సంస్థ (పాఠశాలలు, కళాశాలలు) లేదా ఇతర సంఘాల తరఫున ఒకేసారి 30 నుంచి 35 మంది వరకు వెళ్లొచ్చేందుకు బుక్ చేసిన వారి పేర ఒకరికి ఉచిత సౌకర్యం కల్పిస్తామన్నారు. అలాగే అందరికీ కలిపి పది శాతం రిబేటు ఇస్తామన్నారు. ఈ అవకాశాన్ని అవసరమైన వారు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. పూర్తి వివరాలకు మహబూబ్నగర్ డిపో మేనేజర్ (ఫోన్ నం.99592 26286)ను సంప్రదించవచ్చన్నారు. దీనికి సంబంధించి ఈనెల 27న రాష్ట్రస్థాయిలో రోడ్లు, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ లాంఛనంగా ప్రారంభించనున్నారన్నారు. అంతకంటే ముందే ఎవరైనా ఈ ప్యాకేజీలను వినియోగించుకోవచ్చని పేర్కొన్నారు. అనంతరం ఈ ప్యాకేజీకి చెందిన పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో డిప్యూటీ ఆర్ఎం లక్ష్మీధర్మ, డీఎం బి.సుజాత, పీఓ వి.సుజాత, ఏఓ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. మహబూబ్నగర్ నుంచి పుణ్యక్షేత్రాలు, దర్శనీయ ప్రదేశాలకు ప్రత్యేక బస్సులు ఈ నెల 27వ తేదీన ప్రారంభం: ఆర్ఎం -
మూడేళ్లలో పాలమూరు పూర్తి
అడ్డాకుల/నవాబుపేట: ‘కుట్రదారులు ఎన్ని కుతంత్రాలు పన్నినా.. తెలంగాణ రైజింగ్ను ఆపలేరని.. తెలంగాణ వెలుగుతోంది.. మనకు ఇక ప్రపంచంతోనే పోటీ’ అని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. తెలంగాణ ప్రజల అవసరాలు, ఆకాంక్షలే ఎజెండాగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్తోందని చెప్పారు. ‘పాలమూరు– రంగారెడ్డి’ ఎత్తిపోతలను మూడేళ్లలో పూర్తి చేస్తామని తెలిపారు.శుక్రవారం నవాబ్పేట, మూసాపేటలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. రాబోయే రోజుల్లో విద్యుత్ డిమాండ్ను బట్టి 2033– 35 సంవత్సరానికి ప్రణాళిక వేసుకుని 33,700 మెగావాట్ల విద్యుదుత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. సంపద సృిష్టించి.. పారిశ్రామిక రంగంలో తెలంగాణను అభివృద్ధి చేసేందుకు విద్యుత్ పరంగా అన్ని ఏర్పాట్లు చేసి భవిష్యత్లో తెలంగాణ ప్రపంచంతోనే పోటీ పడేలా వివిధ దేశాల కంపెనీలు మన ప్రాంతంలో ఏర్పాటు చేసేందుకు కృషిచేస్తున్నామన్నారు. బీజేపీ తెలంగాణ ఇవ్వలేదు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు దేశంలో 3 కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేసినా చంద్రబాబునాయుడు వద్దన్నందుకే బీజేపీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వలేదని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. కాంగ్రెస్ పార్టీకి నష్టం వస్తుందని తెలిసినా నాడు సోనియాగాంధీ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చారని గుర్తు చేశారు. కాంగ్రెస్ పాలన గత బీఆర్ఎస్ పాలన మాదిరిగా సాగితే రాష్ట్రాన్ని అమ్ముకునే పరిస్థితి వచ్చేదన్నారు. అందుకే బీఆర్ఎస్ను దగ్గరికి రాకుండా దూరం పెట్టాలని ప్రజలను కోరారు. ఆయా కార్యక్రమాల్లో కలెక్టర్ విజయేందిర, ఎమ్మెల్యేలు మధుసూదన్రెడ్డి, అనిరుధ్రెడ్డి, తూడి మేఘారెడ్డి, వాకిటి శ్రీహరి, మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, డీసీసీబీ చైర్మన్ విష్ణువర్ధన్రెడ్డి, జెడ్పీ మాజీ చైర్మన్ స్వర్ణమ్మ, ముడా చైర్మన్ లక్ష్మణ్యాదవ్, మార్కెట్ చైర్మన్లు ప్రశాంత్, కథలప్ప, తదితరులు పాల్గొన్నారు. ఆర్అండ్ఆర్ ప్యాకేజీలకు రూ.102 కోట్లు విడుదల చేస్తాం చౌదర్పల్లి లిఫ్ట్కు త్వరలో అనుమతులిస్తాం తెలంగాణ రైజింగ్ను ఆపలేరు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పాలమూరును సస్యశ్యామలం చేస్తాం నిధులు ఆవిరైనా.. నీళ్లు రాలేదని... కాంగ్రెస్ ప్రభుత్వమే పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేసి కృష్ణా జలాలతో పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేస్తుందని డిప్యూటీ సీఎం అభిప్రాయపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో పాలమూరు జిల్లాలో ఒక్క ఎకరాకు అదనంగా నీళ్లు ఇవ్వలేదని విమర్శించారు. సీఎం రేవంత్రెడ్డి పాలమూరును సస్యశ్యామలం చేస్తారని, అందుకు కేబినెట్ కూడా పూర్తిగా సహకరిస్తుందని చెప్పారు. ఉదండాపూర్ ఆర్అండ్ఆర్ ప్యాకేజీకి రూ.70 కోట్లు, శంకరసముద్రం ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కోసం రూ.32 కోట్లను విడుదల చేస్తామన్నారు. అలాగే చౌదర్పల్లి లిఫ్ట్కు సాధ్యమైనంత త్వరగా ఆర్థికపరమైన అనుమతులిస్తామని ప్రకటించారు. బీఆర్ఎస్ నాయకులు రాష్ట్రంలో దొంగలు పడ్డట్లు దోపిడీ చేశారని విమర్శించారు. లేనిది ఉన్న ట్లు.. ఉన్నది లేనట్లు చెప్పి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. -
అలంపూర్ తేనేటి విందుతో ప్రకంపనలు
ఎంపీ మల్లు రవి, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ మధ్య కొన్నాళ్లుగా అంతర్గత వైరం కొనసాగుతున్నట్లు సమాచారం. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మల్లురవి.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడితో కలిసి జెడ్పీ మాజీ చైర్పర్సన్న్ సరిత ఇంట్లో తేనేటి విందులో పాల్గొనడం కాంగ్రెస్లో ప్రకంపనలు సృష్ట్టించింది. దీంతో నేతల మధ్య విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. సంపత్కుమార్ వర్గీయులు మల్లు రవికి వ్యతిరేకంగా గళం వినిపించారు. అలంపూర్లో సంపత్ అన్నీ తానై ఎంపీగా మల్లు రవిని గెలిపించాడని.. ఆయనేమో సంపత్ను రాజకీయంగా దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేను కాంగ్రెస్లోకి రప్పించే ప్రయత్నం చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. పార్టీ క్రమశిక్షణ సంఘం చైర్మన్ అయి ఉండి క్రమశిక్షణ తప్పారని.. వివిధ ప్రభుత్వ, ఇతర పనుల్లో పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారాయని ఆరోపించడం పార్టీలో కాక రేపింది. -
నువ్వా.. నేనా!
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం చేపట్టిన అనంతరం సుమారు ఆరు నెలల వరకు గద్వాల జిల్లా కాంగ్రెస్లో పెద్దగా లుకలుకలు లేవు. బీఆర్ఎస్కు చెందిన ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి కాంగ్రెస్లో చేరడంతో వర్గ పోరు మళ్లీ తీవ్రమైంది. జెడ్పీ మాజీ చైర్పర్సన్ సరిత, బండ్ల బీఆర్ఎస్లో ఉన్నంతకాలం ఇరువురి మధ్య ఆధిపత్య పోరు నడిచింది. 2023 ఎన్నికల ముందు సరిత కాంగ్రెస్లో చేరి.. ఎమ్మెల్యేగా పోటీ చేసిన విషయం తెలిసిందే. బండ్ల చేతిలో ఓటమి పాలైనప్పటికీ.. నియోజకవర్గంలో ఆమెదే పైచేయిగా నిలిచింది. ఎప్పుడైతే ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డిని మంత్రి జూప ల్లి కాంగ్రెస్లో చేర్పించారో.. అప్పటి నుంచి వర్గ పోరు మళ్లీ మొదలైంది. ఇటీవల మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి పర్యటనలో ఎమ్మె ల్యే ఏ పార్టీలో ఉన్నారంటూ సరిత వర్గీయులు నినాదాలు చేయడం, ప్రతిగా బండ్ల వర్గం వాదనకు దిగడం రాష్ట్రవ్యాప్తంగా హాట్టాపిక్గా మారింది. ఈ క్రమంలో ఎమ్మెల్యేకు మంత్రి జూపల్లి.. సరితకు ఎంపీ మల్లురవి అండదండలు ఉ న్నట్లు పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది. కాంగ్రెస్లో నేతల మధ్య తారస్థాయికి ఆధిపత్య ‘పోరు’ ● ఇప్పటికే గద్వాలలో సరిత, ఎమ్మెల్యే బండ్ల మధ్య వైరం ● తాజాగా తెరపైకి అలంపూర్ ఎమ్మెల్యే విజయుడి ఎపిసోడ్.. ● సరిత ఇంట్లో తేనేటి విందుకు హాజరుకావడంపై దుమారం ● ఎంపీ మల్లు రవిపై మాజీ ఎమ్మెల్యే సంపత్ వర్గీయుల మండిపాటు ● పలువురికి షోకాజ్ నోటీసులు.. ప్రతిగా ఎంపీపై అధిష్టానానికి ఫిర్యాదు ● పోటాపోటీ పరిణామాలతో పార్టీ శ్రేణుల్లో గందరగోళం సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: నువ్వా.. నేనా అన్నట్లు నేతల మధ్య ఆధిపత్య పోరుతో జోగులాంబ గద్వాల జిల్లాలో అధికార పార్టీ కాంగ్రెస్ పరిస్థితి అస్తవ్యస్తంగా తయారైంది. గద్వాల అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి, జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ సరిత మధ్య వైరం ఇదివరకే పార్టీ అధిష్టానానికి సంకటంగా మారగా.. ఇటీవల అలంపూర్ సెగ్మెంట్కు సంబంధించి బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడి ఎపిసోడ్ మరిన్ని తలనొప్పులు తెచ్చిపెట్టింది. సరిత ఇంట్లో తేనీటి విందుకు నాగర్కర్నూల్ ఎంపీ మల్లు రవి.. విజయుడిని వెంటబెట్టుకుని వెళ్లడంతో వివాదం తలెత్తింది. దీంతో మల్లు రవి, ఏఐసీసీ కార్యదర్శి, అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ మధ్య ఉన్న వైషమ్యాలు వీధికెక్కాయి. ఈ క్రమంలో పలువురు యువజన నాయకులకు షోకాజ్ నోటీసుల జారీ.. ప్రతిగా ఎంపీ వైఖరిపై సంపత్ అధిష్టానానికి ఫిర్యాదు చేయడం వంటి పోటాపోటీ పరిణామాలు కాంగ్రెస్ను కుదిపేస్తున్నాయి. తెరదించే ప్రయత్నం.. అంతలోనే.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడు ఎపిసోడ్ కాంగ్రెస్లో కలకలం సృష్టించగా.. వివాదంపై ఎంపీ మల్లురవి స్పందించారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా యాధృచ్ఛికంగా సరిత ఇంట్లో తేనేటి విందుకు విజయుడితో కలిసి హాజరయ్యామని.. మా మధ్య రాజకీయ పరమైన చర్చలు జరగలేదని వీడియోను పోస్టు చేశారు, సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారం కల్పితాలేనంటూ కొట్టిపారేశారు. తాను డబ్బులు తీసుకున్నానని నిరూపిస్తే రాజకీయాల నుంచి శాశ్వతంగా వైదొలుగుతానని చెప్పారు. ఎంపీ స్పందనతో వివాదం సద్దుమణిగిందని భావిస్తున్న తరుణంలో మాజీ ఎమ్మెల్యే సంపత్కుమార్ వర్గీయులైన యువజన కాంగ్రెస్ నాయకులు కోల నర్సింహ, వరకుంట్ల గణేష్, కేఎంఆర్ యేసు, కాశపోగు శేఖర్ తదితరులకు షోకాజ్ నోటీసులు జారీ కావడం మళ్లీ మలుపు తిరిగినట్లయింది. ప్రతిగా సంపత్ తన వర్గీయులతో కలిసి మల్లు రవితో పాటు సరితపై కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేశ్కుమార్ గౌడ్కు పలువురు నాయకులు సంతకాలతో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ పనులకు సంబంధించి పెండింగ్ బిల్లులను ఇప్పించి.. వారి నుంచి 10–20 శాతం కమీషన్ వసూలు చేసినట్లు ఎంపీపై ఫిర్యాదు చేయడంతోపాటు ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తూ పార్టీని అభాసుపాలు చేస్తున్నారని.. ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కోరడం మరింత సెగ రాజేసినట్లు తెలుస్తోంది.ఈ పరిణామాలతో గద్వాల జిల్లా కాంగ్రెస్ శ్రేణుల్లో గందరగోళం నెలకొంది. నడిగడ్డలో ‘హస్త’వ్యస్తం గద్వాల -
సంక్షేమ పథకాలతో పేదలకు మేలు
గద్వాల: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలుచేస్తున్న వివిధ రకాల సంక్షేమాభివృద్ధి పథకాలు దివ్వాంగుల అభ్యున్నతికి దోహదపడుతున్నాయని కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. శుక్రవారం ఐడీవోసీ కార్యాలయంలో మహిళాశిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆలిమ్కో సంస్థ ద్వారా జిల్లాలోని 93మంది దివ్యాంగులకు రూ.21.27లక్షల విలువైన పరికాలను అందజేశారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సమాజంలో దివ్యాంగుల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. దివ్యాంగులు ఎదుర్కొంటున్న వివిధ రకాల సమస్యలను పరిష్కరిస్తామన్నారు. గట్టు మండంలో గతంలో నిర్వహించిన శిబిరంలో అర్హులైన దివ్యాంగులు గుర్తించి వారికి అవసరమైన అత్యాధునిక పరికరాలు అందజేయడం జరిగిందన్నారు. ప్రతిఒక్క దివ్యాంగుడు యూడీఐడీ కార్డు పొందడం ద్వారా దేశంలో ఎక్కడైనా వసతులు పొందవచ్చని సూచించారు. అనంతరం ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి మాట్లాడుతూ దివ్యాంగుల సంక్షేమాభివృద్ధి కోసం ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని ప్రభుత్వం అందించే సంక్షేమాభివృద్ధి పథకాలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు వి.లక్ష్మీనారాయణ, నర్సింగ్రావు, సునంద, ఆల్మిమ్కోప్రతినిధి సునిత తదితరులు పాల్గొన్నారు. త్వరగా ధాన్యం చెల్లింపులు చేయండి రైతుల వద్ద సేకరించిన ధాన్యానికి వెంటనే చెల్లింపులు చేయాలని కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఐడీవోసీ కార్యాలయంలో అధికారులత సమీక్షించారు. జిల్లా వ్యాపంగా ఖరీఫ్ సీజన్కు సంబంధించి 90శాతం ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు, మిగిలిన పదిశాతం ధాన్యాన్ని త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. అదేవిధంగా సేకరించిన ధాన్యానికి సంబంధించిన డబ్బులను ఆన్లైన్ నమోదు చేసి సంబంధిత రైతులకు చెల్లింపులు చేయాలన్నారు. గతం కంటే ఈసారి మూడు వేల శాతం అధికంగా ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు తెలిపారు. ఈసమావేశంలో అదనపు కలెక్టర్లు వి.లక్ష్మినారాయణ, నర్సింగ్రావు, డీఎస్ఓ స్వామికుమార్, శ్రీనివాసులు, ఏపీఎంలు తదితరులు పాల్గొన్నారు. -
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత
గద్వాలటౌన్: పర్యావరణ వ్యవస్థలో సమస్త జీవరాశులు మనుగడ సాగిస్తున్నాయని, అటువంటి పర్యావరణాన్ని కలుషితం కాకుండా కాపాడుకోవల్సిన బాధ్యత అందరిపై ఉందని అడిషినల్ కలెక్టర్ లక్ష్మినారాయణ అన్నారు. జిల్లా కేంద్రంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. దీన్ని పురస్కరించుకుని గురువారం కాలుష్య నియంత్రణ బోర్డు ఆధ్వర్యంలో ఉత్సహాంగా ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ పట్టణ ప్రధాన రహదారుల వెంట సాగింది. అనంతరం స్థానిక రాజీవ్ సర్కిల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మొక్కల పెంపకం వల్ల కాలుష్యం తగ్గుతుందని, వర్షాలు సమృద్ధిగా పడుతాయని, వాతావరణంలో సమతుల్యత దెబ్బతినకుండా కాపాడుతుందని అన్నారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించుకోవాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరి భాగస్వామ్యం అవసరమన్నారు. ప్లాస్టిక్ భూతం నుంచి మన ధరిత్రిని రక్షించుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా పర్యావరణ పరిరక్షణకు అందరూ కంకణబద్దులై ఉంటామని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో అడిషినల్ కలెక్టర్ నర్సింగరావు, సహాయక పర్యావరణ శాస్త్రవేత్త డాక్టర్ విద్యులత, ఎస్సీ కార్పోరేషన్ ఈడీ రమేష్బాబు, ఎఫ్ఆర్ఓ పర్వేజ్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. -
భూ సమస్యల పరిష్కారానికే రెవెన్యూ సదస్సులు
ధరూరు: భూ సమస్యల పరిష్కారానికే రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. గురువారం మండలంలోని అల్వలపాడులో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. క్షేత్ర స్థాయిలో రైతుల సందేహాలను నివృత్తి చేయడంతో పాటు సమస్యలను పరిష్కరించడంలో భాగంగానే ఈ సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భూ సమస్యలను పరిష్కరించి రైతులకు వారి భూములపై పూర్తి హక్కులు కల్పించేందుకు ప్రభుత్వం భూ భారతి చట్టాన్ని తీసుకువచ్చిందని వివరించారు. భూ రికార్డులలో తప్పులు, విస్తీర్ణం హెచ్చు తగ్గులు, వారసత్వ భూములు, భూ స్వభావం తప్పులు, నిషేదిత జాబితాలో ఉన్న భూ సమస్యలు, సర్వే నంబర్ మిస్సింగ్, పట్టా పాస్ బుక్కులు లేకపోవడం ప్రభుత్వ భూములను నవీకరించడం, సాదాబైనామా కేసులు, హద్దులు నిర్ధారణ, పార్ట్ బీలో చేర్చిన భూముల సమస్యలు, భూ సేకరణ కేసులు తదితర భూ సమస్యలకు సంబందించిన దరఖాస్తులు రెవెన్యూ సదస్సులలో స్వీకరించి భూ భారతి కొత్త చట్టం ప్రకారం అధికారులు క్షేత్ర స్థాయిలో విచారణ జరిపి నిర్ధేశిత గడువులోగా సమస్యలను పరిష్కరించడం జరుగుతుందన్నారు. ఆయా గ్రామాలలో అధికారులు ఉదయం నుంచి సాయంత్రం వరకు అందుబాటులో ఉండి అర్జీలను స్వీకరిస్తారని, ఆగస్టు 14వ తేదీ అన్ని ఆర్జీలను పరిష్కరిస్తామన్నారు. ఈ సందర్భంగా రైతు గుర్తింపు కార్డుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ, హెల్ప్ డెస్క్, జనరల్ డెస్క్ల వద్ద వసతులు, సిబ్బంది పని తీరును పరిశీలన చేసి అధికారులకు కలెక్టర్ పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ నరేందర్, రెవన్యూ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. భూ సేకరణ ప్రక్రియ పూర్తి చేయాలి గద్వాల: జవహార్ నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు పరిధిలో పెండింగ్లో ఉన్న భూ సేకరణ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులను ఆదేశించారు. గురువారం ఐడీఓసీ కలెక్టర్ చాంబర్లో పెండింగ్ ఆయకట్టు, భూ సేకరణపై సమీక్షను నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నెట్టెంపాడు ఎత్తిపోతల పథకానికి సంబందించి భూ సేకరణను సకాలంలో పూర్తి చేయాలన్నారు. రైతులు పంట సాగుకు ప్రారంభించే ముందే భూ సేకరణ పూర్తి చేయాలన్నారు. వచ్చే రెండు వారాల్లోగా ఫీల్డ్ సర్వే పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. భూ సేకరణ ప్రక్రియకు సంబందించి పురోగతిని ప్రతి వారం నివేదికను సమర్పించాలన్నారు. భూ సేకరణలో ప్రక్రియలో ఇప్పటికే అవార్డుల దశకు చేరుకున్న వాటిని వెంటనే నష్టపరిహారం చెల్లించాలన్నారు. రైతులను ఒప్పించి, భూ సేకరణ ప్రక్రియను నిర్దిష్ట గడువులోగా పూర్తి చేయాలన్నారు. క్షేత్ర స్థా యిలో పరిష్కారం కాని సమస్యలను తమ దృష్టికి తీసుకురావాలన్నారు. సర్వే చేసేందుకు సర్వే ల్యాండ్, ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు సమన్వయంతో పని చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షలో అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ, భూ సేకరణ స్పెషల్ డీప్యూటీ కలెక్టర్ శ్రీనివాసరావు, ఇరిగేషన్ ఈఈ రహిముద్దీన్, అధికారులు పాల్గొన్నారు. -
ఎంపీపై అధిష్టానానికి ఫిర్యాదు
అలంపూర్: నాగర్కర్నూల్ ఎంపీ మల్లు రవిపై మాజీ ఎమ్మెల్యే, అలంపూర్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జ్ సంపత్కుమార్ అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లు పలు పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ నెల 2వ తేదీన రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎంపీ మల్లు రవి జిల్లాలో పర్యటించారు. ఈక్రమంలో కాంగ్రెస్ గద్వాల నియోజకవర్గ ఇన్చార్జ్ సరిత ఇంటికి ఎంపీతోపాటు అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు వెళ్లడంపై అలంపూర్ కాంగ్రెస్ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా మల్లు రవి బాధ్యతలు స్వీకరించిన మరుసటి రోజే అలంపూర్ క్షేత్రానికి ఆయన విచ్చేయగా.. సొంత పార్టీ నేతలు ఈ కార్యక్రమాన్ని బహిష్కరించారు. మీడియా ముందుకు వచ్చి ఆరోపణలు చేశారు. ఈ వ్యవహారంపై ఈ నెల 5వ తేదీన రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజ్తోపాటు పీసీసీ అధ్యక్షుడు మహేష్గౌడ్ను మాజీ ఎమ్మెల్యే సంపత్కుమార్, స్థానిక కాంగ్రెస్ నాయకులు కలిసి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. -
అక్రమ కేసులతో భయపెడుతున్నారు
ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మించవద్దని 12 గ్రామాల ప్రజలు వ్యతిరేకిస్తున్న కూడా బలవంతంగా ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలనుకోవడం అవివేకం. దీన్ని నిరసిస్తున్న క్రమంలో చోటు చేసుకున్న ఉద్రిక్తతల ఆధారంగా పోలీసులు కేసులు నమోదు చేశామంటున్నారు. ఆ కేసులు వెంటనే ఎత్తివేయాలి. అమాయక రైతులను జైలుకు పంపి వారి జీవితాలతో ఆడుకోవడం సరికాదు. – శ్రీనువాసులు, బీఆర్ఎస్ నాయకుడు, రాజోళి పొలం వద్దకు వెళ్లి అరెస్టు చేశారు.. పొలంలో బోర్ మోటార్ ఆన్ చేసి వస్తానని చెప్పిన మా బాబును పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారు. పని చేసుకుని జీవించే మా ఇంట్లో వాళ్లను ఇలా అరెస్టు చేస్తే మేము బతికేది ఎలా. వెంటనే మా బాబు చిన్న నాగేంద్రంను వదిలిపెట్టాలి. – నర్సమ్మ, చిన్న నాగేంద్రం తల్లి ఆధారాలు ఉంటేనే కేసులు గ్రామస్తులు మమ్మల్ని లెక్కచేయకుండా వందలాదిగా ఫ్యాక్టరీ దగ్గర ఉన్న వాహనాలను ధ్వంసం చేసి, వ్యక్తులపై కూడా దాడులు చేసే ప్రయత్నం చేశారు. వారిని ఆపే ప్రయత్నంలో పోలీసులకు కూడా గాయాలయ్యాయి. దాడులకు సంబందించి ఆధారాలను చూసే కేసులు నమోదు చేస్తున్నాం. వారు చేస్తున్న నేరం తీవ్రతను బట్టే సెక్షన్లను పెడుతున్నాం. అమాయక రైతులు, దాడుల్లో పాల్గొనని వారు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. – జగదీశ్, ఎస్ఐ రాజోళి ● -
బడిబాటకు వేళాయె..!
నేటి నుంచి 19 వరకు నిర్వహణ ● ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు పెంచేలా చర్యలు గద్వాలటౌన్: కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమవుతోంది. పిల్లలు వేసవి సెలవులు ముగించుకుని తిరిగి ఈ నెల 12 నుంచి పాఠశాలలకు పయనమయ్యేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు కార్యక్రమాన్ని పెంచేందుకు విద్యాశాఖ ‘బడిబాట’ కార్యక్రమాన్ని చేపట్టింది. జిల్లాలో ఈ నెల 6 నుంచి 19 వరకు చేపట్టనున్నారు. పక్షం రోజుల పాటు పలు కార్యక్రమాల ద్వారా తల్లిదండ్రులకు అవగాహన కల్పించనున్నారు. ఇందుకోసం ఉపాధ్యాయులు ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. సిబ్బందికి సూచనలు బడిబాట కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులకు, ఎంఐఎస్ సమన్వయకర్తలకు, సీఆర్పీలకు ఇప్పటికే జిల్లా విద్యాశాఖాధికారులు ఆదేశాలు జారీ చేశారు. గద్వాల, అలంపూర్ నియోజకవర్గాల పరిధిలోని ప్రభుత్వ యాజమాన్యాలకు చెందిన పాఠశాలల్లో ‘మేమున్నాం.. మీ పిల్లలను చేర్పించండి’, ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా విద్యా బోధన సాగిస్తామని పేర్కొంటూ ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికలను పెంచేందుకు శుక్రవారం నుంచి ప్రత్యేక కార్యచరణతో ముందుకు సాగనున్నారు. గతేడాది ప్రవేశాలు.. జిల్లాలో 503 వివిధ ప్రభుత్వ యాజమాన్య పాఠశాలలు ఉన్నాయి. గతేడాది బడిబాట సందర్భంగా మొత్తం 3,530 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చేరారు. ఇందులో అంగన్వాడీల నుంచి 2,852 మంది విద్యార్థులు చేరగా... ప్రైవేటు పాఠశాలల నుంచి ఒకటో తరగతి విద్యార్థులు 46 మంది విద్యార్థులు చేరారు. 404 మంది విద్యార్థులు నేరుగా ప్రభుత్వ పాఠశాలలకు వచ్చి అడ్మిషన్ పొందారు. వీరితో పాటు 197 మంది కొత్త విద్యార్థులు వారి వయస్సు ఆధారంగా 2 నుంచి 12వ తరగతుల్లో చేరారు. 31 మంది విద్యార్థులు బడీడు పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో చేరారు. షెడ్యూల్ ఇలా.. జూన్ 6న గ్రామ సభ, 7న ప్రతి ఇంటికి వెళ్లి బడీడు పిల్లలను గుర్తించాలి. 8, 9, 10వ తేదీల్లో ఇంటింటి ప్రచారం. అంగన్వాడీ కేంద్రాల సందర్శన. బడి బయట ఉన్న చిన్నారులను గుర్తించి బడిలో చేర్పించడం. 11న అప్పటి వరకు నిర్వహించిన కార్యక్రమాలపై సమీక్ష సమావేశం. 12న అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన పనుల ప్రారంభం. అదే రోజు పాఠ్య పుస్తకాలు, ఏకరూప దుస్తుల పంపిణీ. 13న సామూహిక అక్షరభ్యాసం. బాలల సభ. 17న విలీన విద్య, బాలిక విద్యా దినోత్సవాన్ని నిర్వహించాలి. 18న తరగతి గదులు డిజిటలీకరణపై అవగాహన, మొక్కల పెంపకం ప్రాధాన్యాన్ని విద్యార్థులకు వివరించాలి. 19న బడిబాట ముగింపు సందర్భంగా విద్యార్థులకు క్రీడాపోటీలు నిర్వహించాలి. -
ఉద్యోగ భద్రత కల్పించాలి
అలంపూర్: పురాతత్వ శాఖలో పని చేస్తున్న వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని కాంట్రాక్టు ఉద్యోగులు డిమాండ్ చేశారు. అలంపూర్ పట్టణంలోని పురాతత్వ శాఖ కార్యాలయం ముందు భారతీయ పురాతత్వ సర్వేక్షణ కాంట్రాక్టు ఉద్యోగులు తమ డిమాండ్ల సాధనకు గురువారం సమ్మె చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ..పురాతత్వ సర్వేక్షణలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగుల జీతాలను 75 శాతానికి తగ్గించినట్లు తెలిపారు. 26 రోజులు ఉన్న పనిదినాలను 18 రోజులకు కుందించినట్లు వాపోయారు. పని చేసిన వారికి గత ఆరు నెలల నుంచి జీతాలు రాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నట్లు పేర్కొన్నారు. పదేళ్లకుపైగా పని చేస్తున్న వారిని రెగ్యులరైజ్ చేయకుండా ఔట్సోర్సింగ్కు మళ్లించినట్లు తెలిపారు. కాంట్రాక్టు ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సురేష్, రవి, పాష, రంగ ఉన్నారు. ఫ్యాక్టరీ అనుమతులు రద్దు చేయాలి గద్వాల: రాజోలి మండలం పెద్దధన్వాడ గ్రామ శివారులో ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణానికి ఇచ్చిన అనుమతులను రద్దు చేయాలని గద్వాల రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి. గురువారం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం తలపెట్టిన ఇథనాల్ పరిశ్రమను రద్దు చేయాలని 12 గ్రామాల రైతులు గత 9 నెలలుగా శాంతియుతంగా వివిధ రూపాల్లో ఆందోళనలు చేస్తున్నారని తెలిపారు. జనవరి నెలలో రైతుల నిరాహార దీక్షలు చేస్తున్న సందర్భంగా ప్రభుత్వం తరపున మాజీ ఎమ్మెల్యే సంపత్కుమార్ పరిశ్రమను రద్దు చేస్తామని రైతులకు హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. అర్థరాత్రి కంపెనీ యాజమాన్యం ఏకపక్షంగా పనులు చేపట్టారని విమర్శించారు. శాంతియుత నిరసన చేపట్టడానికి వచ్చిన రైతులపై దాడులు చేయడమే కాకుండా అక్రమంగా కేసులు పెట్టి జైలుకు పంపారని, అఖిలపక్ష, సామాజిక, ప్రజాసంఘాల,రాజకీయ పార్టీల నాయకులను బలవంతంగా నిర్భందంలోకి తీసుకున్నారని విమర్శించారు. ప్రజాభిప్రాయానికి విరుద్దంగా, ఇథనాల్ పరిశ్రమ నిర్మాణానికి అనుమతులు రద్దు చేసి, రైతులపై దాడులకు పాల్పడిన కంపెనీ యాజమాన్యంపై కేసు నమోదు చేయాలని, రైతులపై పెట్టిన కేసును ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష పార్టీల నాయకులు నాగర్దొడ్డి వెంకట్రాములు, వెంకటస్వామి, కుర్వ పల్లయ్య, వాల్మీకి సింగరాజు, మద్దిలేటి,సుబాన్,టవర్ మక్బూల్,ఆంజనేయులు, జమ్మిచెడు కార్తీక్ తదితరులు పాల్గొన్నారు. -
రేపు డిప్యూటీ సీఎం పర్యటన
అడ్డాకుల: మూసాపేట మండలకేంద్రంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శుక్రవారం పర్యటించనున్నారని, దీనిని పార్టీ శ్రేణులు విజయవంతం చేయాలని ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డి కోరారు. మూసాపేటలోని అయ్యప్పగుట్ట పక్కన ఏర్పాటు చేయనున్న 132/33కేవీ విద్యుత్ సబ్ స్టేషన్తో పాటు అడ్డాకుల, మూసాపేట, భూత్పూర్ మండలాల్లోని గ్రామాలకు మంజూరైన 33/11కేవీ విద్యుత్ సబ్ స్టేషన్లకు కూడా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఇక్కడే శంకుస్థాపన చేయన్నుందున వాటికి సంబంఽధించిన ఏర్పాట్లను బుధవారం సాయంత్రం ఆయన పరిశీలించారు. సబ్ స్టేషన్ స్థలంలో పాటు బహిరంగ సభ ఏర్పాట్లపై విద్యుత్ శాఖ అధికారులు, పార్టీ నేతలతో చర్చించారు. డిప్యూటీ సీఎం సభకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు తరలిరావాలని కోరారు. అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో తహసీల్దార్ రాజునాయక్, పార్టీ మండలాధ్యక్షుడు శెట్టిశేఖర్, నాగిరెడ్డి, బాలనర్సిములు, బగ్గి కృష్ణయ్య, సుధాకర్రెడ్డి, రాంచందర్, ఎన్టీగౌడ్, కృష్ణయ్య, రవి, సుధాకర్ ఉన్నారు. -
అమాయక రైతులపైఅక్రమ కేసులు పెడతారా?
వ్యవసాయ పనులు చేసుకుని జీవనం సాగించే అమాయక రైతులపై కేసులు పెట్టడం తగదని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు అన్నారు. ఇథనాల్ కంపెనీ ఘటనలో అరెస్టు చేసిన రైతులను మానవపాడు పోలీస్స్టేషన్కు వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫ్యాక్టరీ వద్దని చెబితే రైతులను తీసుకొచ్చి అక్రమంగా కేసులు నమోదు చేస్తారా అని ఎమ్మెల్యే ప్రశ్నించారు. పెద్ద ధన్వాడలో జరిగిన ఘటనలో రైతులకు దెబ్బలు తగిలాయని చెప్పారు. రైతులకు తగిలిన దెబ్బలను పోలీసులకు చూపుతూ...వారి నిర్లక్ష్యాన్ని దుయ్యబట్టారు. ఫ్యాక్టరీకి కాంగ్రెస్ ప్రభుత్వం తొత్తుగా మారిందని, అందుకే రైతులపై దాడులు చేయిస్తోందని విమర్శించారు. మండలంలో 45 మంది రైతులపై అక్రమంగా కేసులు పెట్టారని, వాటిని వెంటనే ఎత్తి వేయాలని డిమాండ్ చేశారు. 12 గ్రామాల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలిగినా దానికి ప్రభుత్వం, పోలీసులే బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు. -
నూతన విత్తన చట్టం రూపకల్పనకు కృషి
గద్వాల/మల్దకల్/మానవపాడు: నూతన విత్తన చట్టం –2025 రూపకల్పనలో ప్రజల సూచనలు తీసుకొని త్వరలో అమలులోకి వచ్చేలా చర్యలు చేపడతామని తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్ధ చైర్మన్ అన్వేష్ రెడ్డి తెలిపారు. బుధవారం ఐసీడీసీ మీటింగ్ హాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నూతన విత్తన చట్టం–2025 ముసాయిదా తయారి కోసం ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులు జిల్లాకు చెందిన వ్యవసాయ శాఖ అధికారులు, సీడ్ ఆర్గనైజర్లు, విత్తన కంపెనీ ప్రతినిధులు, డీలర్లు, రైతుల అభిప్రాయ సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి ఈవిత్తన చట్ట ముసాయిదా కమిటీని ఏర్పాటు చేయడంతో అర్థం చేసుకోవచ్చని తెలిపారు. అందరి సూచనలు సలహాలు కమిటీ పరిగణలోకి తీసుకుని విత్తన చట్టం ఏర్పాటుకు కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు నర్సింహరెడ్డి, శివప్రసాద్, (డీఏఓ సంగారెడ్డి) జిల్లా వ్యవసాయ అధికారి సక్రీయ నాయక్ , ఏడిఏలు, డీలర్లు తదితరుల ఉన్నారు. బైబ్యాక్ విధానంలో ‘కంది’ కొనుగోలు కంది రెడ్గ్రామ్లో పీఆర్జీ–176, ఎల్ఆర్జీ–52, మినుములు బ్లాక్గ్రామ్లో విబిఎన్–8 రకాల విత్తన పంటను బై బ్యాక్ విధానంలో కోనుగోలు చేస్తామన్నాని అన్వేష్రెడ్డి, రాష్ట్ర అగ్రికల్చర్ డైరెక్టర్ గోపి అన్నారు. బుధవారం మల్దకల్, మానవపాడు ఏర్పాటుచేసిన సమావేశాల్లో వారు పాల్గొని మాట్లాడారు. 900 రకాల ఉత్పత్తులను చేసి బై బ్యాక్ పద్ధతిలో విత్తనాభివృద్ధి సంస్థ కోనుగోలు చేస్తుందన్నారు. ఒప్పందం ప్రకారం మద్దతు రేట్ కంటే అధిక ధరను ఇచ్చి విత్తన పంటను కోనుగోలు చేస్తామని తెలిపారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కంది, మినుములు బై బ్యాక్ పద్ధతిలో తప్పకుండా ప్రభుత్వం తరుపున కొనుగోలు చేస్తామని సూచించారు. అలాగే, రైతులు లైసెన్సు కలిగిన డీలర్ల వద్ద నాణ్యమైన విత్తనాలను కొనుగోలు చేయాలని, అప్పుడే దిగుబడులు సాధించవచ్చని అన్నారు. ఎరువులు, విత్తనాలు కొని తప్పనిసరిగా బిల్లులు తీసుకోవాలని, రసాయనిక ఎరువుల అధికంగా వాడడంతో పంటపొలాల భూసారం దెబ్బతిని పంటలు నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. కార్యక్రమంలో సీడ్డ్రప్ట్ బిల్ చైర్మన్ నరసింహరావు, మార్కెట్ చైర్మన్ దోడ్డెప్ప, మార్కెట్ వైస్ చైర్మన్ కుమార్, పీఏసీఎస్ అధ్యక్షులు శ్రీధర్రెడ్డి, టీఎస్ సీడ్ డీఎం ఆదినారాయణ, టీఎస్ సీడ్ ప్రాడెక్ట్ సంధ్యరాణి తదితరులు పాల్గొన్నారు. రైతులు నాణ్యమైన విత్తనాలు కొనుగోలు చేయాలి తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్ధ చైర్మన్ అన్వేష్రెడ్డి -
వనమహోత్సవాన్ని విజయవంతం చేయాలి
గద్వాల: వనమహోత్సవం– 2025 కార్యక్రమంలో భాగంగా నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి స్థాయిలో చేరుకునేందుకు అన్ని శాఖల ప్రణాళికాబద్దంగా కృషి చేయాలని కలెక్టర్ సంతోష్ అన్నారు. బుధవారం ఐడీఓసీ కాన్పరెన్స్ హల్ నందు వన మహోత్సవంపై సంబందిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వనమహోత్సవ కార్యక్రమంలో భాగంగా జిల్లాకు 15 లక్షల మొక్కలు నాటేందుకు లక్ష్యంగా కేటాయించినట్లు కలెక్టర్ తెలిపారు. జూలై, ఆగస్టు మాసాలలో సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని, ఈ రెండు నెలలో వివిధ శాఖలకు కేటాయించిన లక్ష్యాలను సాధించే విధంగా మొక్కలు నాటి మొక్కలను సంరక్షించాలన్నారు. వనమహోత్సవాన్ని అన్ని శాఖల అధికారులు సమన్వయంతో విజయవంతం చేయాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ న ర్సింగ్ రావు, డీపీఓ నాగేంద్రం, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పర్వేజ్ అమ్మాద్, తదితరులు ఉన్నారు. -
ఉద్యానం.. షురూ
వానాకాలంలో 45,906 ఎకరాల్లో ఉద్యానసాగు అంచనా గద్వాల వ్యవసాయం: నడిగడ్డలో ఉద్యాన పంటల సాగు ఆరంభం అయ్యింది. వానాకాలం సీజన్ ప్రారంభం అయిన నేపథ్యంలో ఇటీవల కురిసిన వర్షాలకుతోడు బోర్లు, బావుల కింద రైతులు ఉద్యాన పంటలు వేయడం ఆరంభించారు. కొద్ది రోజుల నుంచి పలుచోట్ల కూరగాయల విత్తనాలు వేయడం, నారు నాటడం, పండ్ల తోటలకు సంబందించి మొక్కలు నాటడం తదితరమైనవి చేస్తున్నారు. ఈ వానాకాలం సీజన్లో 45,906 ఎకరాల్లో ఉద్యాన పంటలు సాగు అవుతాయని అధికారులు అంచనాకు వచ్చారు. ఇందులో ఎక్కువగా ఎండుమిర్చి, కూరగాయలు, ఆయిల్ఫాం సాగు ఉండనున్నాయి. గతేడాది ఉద్యానానికి అనుకూలం 2023–24లో అటు వానాకాలం, ఇటు యాసంగి సీజన్లలో ఉద్యాన పంటలకు వాతావరణ పరిస్థితులు ఏమ్రాతం అనుకూలించలేదు. కానీ, 2024–25 ఉద్యాన పంటలకు ఊరట ఇచ్చింది. జూన్, జులై, ఆగస్టు నెలల్లో వర్షాలు విస్తారంగా కురిసాయి. బోర్లు, బావులు రీచార్జ్ అయ్యాయి. ఉష్టోగ్రతలు కూడా తగ్గాయి. ఇలా వర్షాలు కురవడం, నీటి వనరులు రీచార్జ్ కావడం, వాతావరణం అనుకూలంగా మారడం ఉద్యాన పంటల సాగుకు కలిసొచ్చింది. వీటి ఫలితంగా 2023–24 కన్నా 2024–25లో ఉద్యాన సాగు పెరిగింది. కాగా ఉద్యాన పంటల్లో భాగంగా ఈ ప్రాంతంలో ఎండుమిర్చి సాగు ఏటా పెరుగుతోంది. అయితే 2024–25 ఏడాదిలో ఎండుమిర్చి దిగుబడులు బాగా వచ్చినా.. ధరలురాలేదు. దీనివల్ల రైతులు ఆర్థికంగా నష్టాలు చూశారు. వానాకాలం సాగు అంచనా.. (ఎకరాల్లో) అనువైన నేలలు.. ఉద్యాన పంటలకు జిల్లాలో అనువైన పరిస్థితులు ఉన్నాయి. పండ్లతోటలు, ఆయిల్పాం, కూరగాయల సాగుకు ఎర్రటి, ఒండ్రుతో కూడిన ఎర్రటి నేలలు ఉండాలి. నడిగడ్డలో ఇలాంటి నేలల శాతమే ఎక్కువగా ఉంది. వంకాయ, టమాట, బెండ, బీర, కాకర, క్యాలిఫ్లవర్, క్యాబేజీ, సోరకాయ, పచ్చిమిర్చి, ఉల్లి తదితర కూరగాయల, మామిడి, బత్తాయి, నిమ్మ, జామ, దానిమ్మ తదితర పండ్లతోటలు ఆయిల్ ఫాం తోటలు, ఎండుమిర్చి ఏటా సాగు చేస్తున్నారు. అయితే వానాకాలం సీజన్ ఆరంభం అవ్వడంతో ఉద్యాన సాగు జిల్లాలో షురూ అయ్యింది. గడిచిన పది రోజుల వ్యవధిలో ఐదుసార్లు ఓ మోస్తారు వర్షాలు కురిసాయి. వాతావరణం చల్లబడింది. దీంతో బోర్లు, బావుల కింద ఉద్యాన పంటలు వేయడం ఆరంభం అయ్యింది. మే నెలలోనే వివిధ రకాల కూరగాయల నారు కోసం విత్తనాలు మడిలో వేశారు. నారు చేతికి వచ్చింది. జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే పలు చోట్ల కూరగాయల నారు, కొనిచోట్ల విత్తనాలు వేస్తున్నారు. ఇంకా కొన్ని చోట్ల ఆయిల్ ఫాం, పండ్లతోటలు వేయడానికి సిద్ధం అవుతున్నారు. ఎండుమిర్చి జూన్ ఆఖరు, జులై రెండో వారం నుంచి వేయనున్నారు. అయితే గడిచిన ఏడాదితో పోల్చితే ఈఏడాది ఎండుమిర్చి సాగు తగ్గే అవకాశం ఉంది. ఇంకా సుబాబుల్, పూల తదితర ఉద్యాన పంటలు సైతం ఇక్కడి రైతులు వేస్తారు. మొత్తం మీద జిల్లా వ్యాప్తంగా 45,906 ఎకరాల్లో ఉద్యాన పంటలు సాగు అవుతాయని అధికారుల అంచనా. ఇదిలాఉంటే ఈఏడాది వర్షాలు బాగా కురిసి, ఉద్యాన పంటలు ఆశజనకంగా పండుతాయని రైతులు భావిస్తున్నారు. ఎండుమిర్చి 30,305 ఆయిల్పాం తోటలు 3,936 కూరగాయలు 4,754 పండ్లతోటలు 1,850 ఇతర పంటలు 5,061 సలహాలు సూచనలు తీసుకోవాలి ఉద్యాన పంటలకు ఇక్కడి నేలలు, వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. వానాకాలం సీజన్లో భాగంగా ఉద్యాన పంటల సాగు ఆరంభం అయ్యింది. కూరగాయలు, పండ్లతోటలు, ఆయిల్ ఫాం తోటలు వేసే రైతులు తగిన సలహలు, సూచనలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాము. – ఎంఏ అక్బర్, జిల్లా ఉద్యాన శాఖాధికారి గత పది రోజులుగా ఓ మోస్తరు వర్షాలు పలు చోట్ల విత్తనాలు విత్తుతున్న రైతులు -
పల్లెల్లో ఇథనాల్ చిచ్చు
ఫ్యాక్టరీ వద్దంటూ గ్రామస్తుల ఆందోళన రాజోళి/మానవపాడు: ‘12 గ్రామాలకు ఇబ్బందిగా మారిన ఈ ఇథనాల్ ఫ్యాక్టరీ మాకొద్దు.. పచ్చని పల్లెల్లో ఫ్యాక్టరీ చిచ్చు పెట్టొద్దు.. ఈ విషయం ఎన్నో సార్లు ఫ్యాక్టరీ వారికి చెప్పాం.. శాంతియుతంగా నిరసన దీక్షలు చేపట్టాం.. ఎమ్మెల్యేలు, మంత్రులు, అధికారులకు విన్నవించాం.. అయినా మా మాట లెక్కచేయకుండా పనులు ఎలా ప్రారంభిస్తారు’ అంటూ సహనం కోల్పోయిన స్థానికులు సదరు ఫ్యాక్టరీకి సంబంధించిన ఆస్తులను ధ్వంసం చేశారు. సామగ్రితో వచ్చిన కంటైనర్తో పాటు అక్కడ ఏర్పాటు చేసిన టెంట్లు, షెడ్లకు నిప్పు పెట్టారు. ఇతర వాహనాలను ధ్వంసం చేశారు. గతేడాది అక్టోబర్ నుంచి శాంతియుతంగా కొనసాగుతున్న ఇథనాల్ ఫ్యాక్టరీ వ్యతిరేక నిరసన కాస్తా.. బుధవారం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. గతేడాది అక్టోబర్ నుంచి రిలే దీక్షలు.. జోగుళాంబ గద్వాల జిల్లా రాజోళి మండలం పెద్దధన్వాడలో 27.5 ఎకరాల భూమిని గాయిత్రి ఇథనాల్ ప్యూయల్స్ ఫ్యాక్టరీ కొనుగోలు చేసింది. అక్కడ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తున్నారనే విషయం అప్పటి వరకు ఎవరికీ తెలియదు. గతేడాది అక్టోబర్లో ఫ్యాక్టరీ యాజమాన్యం అక్కడ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తున్నామని గ్రామస్తులతో సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. కాగా గ్రామస్తులు కొన్ని రోజుల తర్వాత, ఇతర గ్రామాలతో కలిసి ఫ్యాక్టరీ ఏర్పాట్లుకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నారు. ఫ్యాక్టరీ ఏర్పాటుతో తమకు ఇబ్బంది కలుగుతుందని చుట్టు పక్కల 12 గ్రామాల ప్రజలతో కలిసి తమ కార్యాచరణను ప్రకటించారు. అందులో భాగంగా నిరసనలు, ఎమ్మెల్యేలకు, మంత్రులకు వినతులు అందజేశారు. అనంతరం ఈ ఏడాది జనవరి 23న రిలే నిరాహార దీక్షను ప్రారంభించి ఫిబ్రవరి 11న విరమించారు. ఆ సమయంలో అధికార పార్టీ నాయకులు, అధికారులు ఫ్యాక్టరీ విషయంలో తమకు అనుకూలంగా నిర్ణయం వచ్చేలా కృషి చేస్తామని మాట ఇచ్చి తమతో దీక్ష విరమింపచేశారని.. కానీ ప్రస్తుతం పరిస్థితి ఇంతదాకా వచ్చిందని వ్యతిరేక పోరాట సమితి సభ్యులు పేర్కొన్నారు. పరిశ్రమకు సంబంధించి కంటైనర్,టెంట్లు, షెడ్లకు నిప్పు..వాహనాలు ధ్వంసం పచ్చని పల్లెల్లో చిచ్చుపెట్టొద్దంటూ ఆగ్రహం రాజోళి మండలం పెద్ద ధన్వాడలో తీవ్ర ఉద్రిక్తత -
గ్రామస్తులకు గాయాలయ్యాయి
పనులు చేపట్టవద్దని అడగడానికి వెళితే వారు చెప్పిన సమాధానాలు, మాట్లాడిన తీరు వల్ల ఇంతటి పరిస్థితికి దారి తీసింది. ప్రైవేట్ వ్యక్తులు దాడులు చేశారు. అందులో గ్రామస్తులకు గాయాలయ్యాయి. పచ్చని పంటలను దెబ్బతీసే ఫ్యాక్టరీ వద్దని చెబుతుంటే, వారు మాపై దాడులు చేస్తే భవిష్యత్తులో మా పరిస్థితి తలుచుకుంటే భయమేస్తుంది. – శ్యాం ప్రసాద్, పెద్ద ధన్వాడ పికెటింగ్ ఏర్పాటు చేశాం ఫ్యాక్టరీకి సంబందించిన వారు అన్ని అనుమతులు తెచ్చుకున్నారు. వాటి ఆధారంగా పెద్దధన్వాడలో పనులు చేసుకునేందుకు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో ఇలాంటి ఘటన చోటుకుంది. మళ్లీ గ్రామంలో అలజడి రేగకుండా పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశాం. – మొగిలయ్య, డీఎస్పీ, గద్వాల ● -
మున్సిపాలిటీలో ఉద్యోగుల వాగ్వాదం
గద్వాలటౌన్: పురు ప్రజలకు మెరుగైన సేవలందించి, మార్గదర్శకంగా ఉండాల్సిన ఇద్దరు ఉద్యోగులు సహనం కోల్పోయారు. బిల్లుల చెల్లింపులో తలెత్తిన అంశం వారి వాగ్వాదానికి కారణమైంది. దీంతో కోపోద్రిక్తులైన ఇరువురు నువ్వెంత అంటే నువ్వెంత అంటూ వాగ్వాదానికి దిగిన సంఘటన గద్వాల మున్సిపల్ కార్యాలయంలో బుధవారం చోటుచేసుకుంది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు వివరాలిలా.. పట్టణంలో పారిశుద్ధ్య పనులు చేసేందుకు ఓ కార్మికుడిని శానిటేషన్ విభాగంలో అనధికారికంగా నియమించుకున్నారు. ఆయనకు ఒక నెల వేతనం సైతం చెల్లించారు. దీనిపై ఇటీవల పలువురు కమిషనర్కు ఫిర్యాదు చేశారు. విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని, తక్షణమే అనధికారికంగా పొందుతున్న కార్మికుడి వేతనం నిలిపివేయాలని సంబంధిత సెక్షన్ అధికారులకి కమిషనర్ ఆదేశించారు. ఆ కార్మికుడి వేతనం కోసం శానిటరీ ఇన్స్పెక్టర్ మన్సూర్ పలుసార్లు సీనియర్ అసిస్టెంట్ అశోక్కుమార్కు విన్నవించుకున్నారు. బుధవారం శానిటరీ ఇన్స్పెక్టర్ మన్సూర్.. సీనియర్ అసిస్టెంట్ అశోక్కుమార్ చాంబర్కు వెళ్లి కార్మికుడి వేతనం కోసం పట్టుపట్టి నిలదీశారు. సహనం కోల్పోయి దుర్బాషలాడారు. అశోక్కుమార్ సైతం అదేస్థాయిలో మన్సూర్తో వాదనకు దిగారు. ఇరువురు ఉద్యోగుల మధ్య మాటా మాటా పెరిగి వాదన తీవ్రస్థాయికి చేరుకుంది. ఒకరి మీదకు మరొకరు వెళ్లి తోసుకునే పరిస్థితి నెలకొంది. ‘బయటకు రా నీ కథ చూస్తా అంటూ..’ శానిటరీ ఇన్స్పెక్టర్ మన్సూర్ హెచ్చరించాడు. నీ బెదిరింపులకు ఎవరూ భయపడరని సీనియర్ అసిస్టెంట్ అశోక్కుమార్ తెగేసి చెప్పాడు. తీవ్రస్వరంతో ఇరువురు ఉద్యోగులు వాగ్వివాదానికి దిగడంతో కార్యాలయంలోని ఉద్యోగులు, సిబ్బంది మొత్తం గుమిగూడారు. తోటి ఉద్యోగులు కలగజేసుకుని వాగ్వివాదాన్ని సద్దుమణిగేలా చేశారు. కొద్దిసేపటికే ఈ విషయం పట్టణంలో దావణంలా వ్యాపించింది. మున్సిపల్ కార్యాలయంలో జరిగిన గొడవ వ్యవహరాన్ని ఇరువురు ఉద్యోగులు ఉన్నతాధికారులు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ఇరువురు ఉద్యోగుల వివరణ కోరగా.. బిల్లుల చెల్లింపు విషయంలో కొంత వాదన జరిగింది. అంతే తప్ప ఏ గొడవ లేదని చెప్పారు. ఉద్యోగుల గోడవపై విచారించి చర్యలు తీసుకుంటామని అడిషినల్ కలెక్టర్ నర్సింగరావు తెలిపారు. -
మతోన్మాద విధానాలపై సమరశీల పోరాటాలు
కల్వకుర్తి రూరల్: దేశంలో ఆర్ఎస్ఎస్, బీజేపీ మతాల మధ్య చిచ్చు పెడుతూ రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు అబ్బాస్ అన్నారు. మంగళవారం కల్వకుర్తిలోని యూటీఎఫ్ భవనంలో నిర్వహించిన సీపీఎం జిల్లా రాజకీయ శిక్షణ తరగతులకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మతోన్మాద విధానాలకు వ్యతిరేకంగా సమరశీల పోరాటాలు నిర్వహిస్తామన్నారు. మతం పేరుతో రాజకీయ లబ్ధి పొందడమే కాకుండా ప్రజా సమస్యలను తీర్చకుండా దేశాన్ని బడా కార్పొరేట్ శక్తులకు అప్పగించేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని విమర్శించారు. దేశాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ నడుపుతున్నారా లేక అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పరిపాలిస్తున్నాడో అర్థం కావడం లేదన్నారు. పాకిస్తాన్, భారత్ యుద్ధాన్ని తానే ఆపానని అమెరికా అధ్యక్షుడు పదే పదే ప్రకటిస్తున్న దేశ ప్రధాని ఆ మాటలను ఖండించకపోవడం ఆక్షేపణీయమన్నారు. పాకిస్తాన్ మతోన్మాద చర్యలను అణచివేసేందుకు అన్ని పార్టీలు కేంద్ర ప్రభుత్వానికి మద్దతు తెలిపిన అమెరికా అధ్యక్షుడి ఆదేశాలతో యుద్ధం ముగించడం దుర్మార్గమన్నారు. ఉగ్రవాదుల చేతిలో మరణించిన కుటుంబాలను పరామర్శించే సమయం లేని ప్రధానమంత్రి ఎన్నికలు జరిగే బీహార్లో మాత్రం సుడిగాలి పర్యటనలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఎన్నికలపై ఉన్న ప్రేమ ప్రధానికి దేశ ప్రజలపై లేదని ఆయన విధానాల వల్లే అర్థమవుతుందని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి పర్వతాలు, కార్యదర్శివర్గ సభ్యుడు ఆంజనేయులు, శ్రీనివాస్, మల్లయ్య, పరశురాములు, బాలస్వామి, శ్రీనివాస్ పాల్గొన్నారు. -
సమస్యల పరిష్కారానికే రెవెన్యూ సదస్సులు
గద్వాల: గ్రామాల్లో నెలకొన్న వివిధ రకాల భూ సమస్యల పరిష్కారం కోసమే ప్రభుత్వం భూ భారతి చట్టం తీసుకొచ్చిందని కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. ఇందులో భాగంగా మంగళవారం గద్వాల మండలంలోని అనంతపురం గ్రామంలో రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సును కలెక్టర్ బీఎం సంతోష్ ఆకస్మికంగా సందర్శించి.. సదస్సులో వచ్చిన ప్రజలతో నేరుగా మాట్లాడారు. ఎలాంటి సమస్యలు ఉన్నాయో అడిగి తెలుసుకున్నారు. అలాగే దరఖాస్తులు ఇచ్చిన తర్వాత అధికారులు రశీదులు ఇస్తున్నారా అని ఆరాతీశారు. భూ భారతి కార్యక్రమం ద్వారా గ్రామాలకు రెవెన్యూ అధికారులు వెళ్లి భూమి సంబంధిత సమస్యలు పరిష్కరిస్తారని, వీటిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ, ఆర్డీఓ అలివేలు, తహసీల్దార్ మల్లికారుర్జున్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. -
భూ భారతితో సమస్యలకు చెక్
నిబంధనల మేరకు.. ధరణిలో నిషేధిత జాబితాలో ప్రభుత్వ భూముల, ఎండోమెంట్, భూదాన్, వక్ఫ్, కోర్టు కేసులకు సంబంధించిన భూములు ఉన్నాయి. వీటిపై కూడా భూ భారతి చట్టం నిబంధనల మేరకు పరిష్కారం చూపుతాం. 3,500 దరఖాస్తులు పెండింగ్.. జిల్లాలో సాదాబైనామాల కింద 2,500 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. అలాగే ధరణిలో వివిధ రకాల సమస్యలు, వివిధ దశల్లో మరో వెయ్యి వరకు పెండింగ్లో ఉన్నాయి. వీటన్నింటికి భూ భారతి చట్టం ద్వారా పరిష్కారం చూపుతాం. స్పష్టమైన ఆదేశాలు.. జిల్లావ్యాప్తంగా 18 రోజులపాటు నిర్వహించే రెవెన్యూ సదస్సుల ద్వారా స్వీకరించిన భూ సంబంధిత దరఖాస్తులను ఒక్కొక్కటిగా పరిశీలించి వాటి పరిష్కారం ఎక్కడెక్కడ ఉందో స్పష్టంగా తెలుసుకుని పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటాం. ఇలా వచ్చిన మొత్తం దరఖాస్తులను ఆగస్టు 14 వరకు పరిష్కరించాలని ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చాయి. అందుకనుగుణంగా చర్యలు చేపడుతాం. జిల్లావ్యాప్తంగా ప్రారంభమైనరెవెన్యూ సదస్సులు ● గ్రామస్థాయిలో రెండు బృందాల పర్యటన ● ఈ నెల 20 వరకు దరఖాస్తుల స్వీకరణ.. ఆగస్టు 14 నాటికి పరిష్కారం ● నిషేధిత జాబితా భూములకూ మోక్షం కల్పిస్తాం ● ‘సాక్షి’ ఇంటర్వ్యూలో అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ గద్వాల: ‘అన్ని రకాల భూ సమస్యల పరిష్కారం కోసం ధరణి స్థానంలో రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా భూ భారతి చట్టం–2025 రూపొందించింది. ఇప్పటికే భూ భారతి చట్టం కింద జిల్లాలో ఇటిక్యాల మండలాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. ఈ చట్టం భూ సమస్యల పరిష్కారానికి ఎంతో ఉపయోగకరంగా ఉంద’ని ఇందులో భాగంగానే జిల్లావ్యాప్తంగా ఈ నెల 2 నుంచి 20 వరకు రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు అదనపు కలెక్టర్ (రెవెన్యూ) లక్ష్మీనారాయణ అన్నారు. జిల్లాలోని 12 మండలాల్లో 18 రోజులపాటు నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సుల నేపథ్యంలో ఆయన మంగళవారం ‘సాక్షి’తో ముఖాముఖిగా మాట్లాడారు. భూ భారతి చట్టం–2025 అమలు తీరు, భూ సమస్యల పరిష్కారం వంటి అంశాలు, పెండింగ్లో ఉన్న వివిధ రకాల సమస్యల పరిష్కారం వివరాలు ఆయన మాటల్లోనే.. 12 మండలాలు.. 18 రోజులు భూ భారతి చట్టం–2025 కింద ఇటిక్యాల మండలాన్ని ఎంపిక చేశాం. తాజాగా ఈ నెల 2 నుంచి 20వ తేదీ వరకు జిల్లాలోని 12 మండలాల్లో రెవెన్యూ సదస్సులు నిరహిస్తున్నాం. ఇందుకోసం తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్ల ఆధ్వర్యంలో రెండు బృందాలను ఏర్పాటు చేశాం. ఈ రెండు బృందాలు వారికి కేటాయించిన గ్రామాల్లో ప్రతిరోజు ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పర్యటిస్తారు. సమస్యలు ఉన్న వారితో నేరుగా మాట్లాడి వారి వద్ద దరఖాస్తులు స్వీకరిస్తారు. ఈ ప్రక్రియను కలెక్టర్, అదనపు కలెక్టర్ పర్యవేక్షిస్తారు. చదువురాని వారికోసం.. భూ సమస్యలపై దరఖాస్తులు ఇచ్చే ఫిర్యాదుదారులతో నేరుగా దరఖాస్తు స్వీకరస్తారు. అయితే ఫిర్యాదుదారునికి చదువురాని పక్షంలో వారికోసం ప్రత్యేకంగా అక్కడే ఓ వ్యక్తిని ఏర్పాటు చేసి ఫిర్యాదుదారు చెప్పే సమస్యలను దరఖాస్తులో నమోదు చేసి అనంతరం సదరు ఫిర్యాదుదారునికి రశీదు ఇస్తాం. -
ఆయిల్పాం సాగుతో అధిక లాభాలు
ధరూరు: ఆయిల్పాం తోటల సాగుతో అధిక లాభాలు పొందవచ్చని అదనపు కలెక్టర్ నర్సింగ్రావు అన్నారు. మంగళవారం ఆయన మండలంలోని ర్యాలంపాడు గ్రామంలో ఆయిల్పాం మెగా ప్లాంటేషన్ కార్యక్రమానికి ముఖ్య అథితిగా హాజరై మాట్లాడారు. ఆయిల్పాం ఒక మొక్క ఖరీదు రూ.193 కాగా.. అందులో రూ.173 సబ్సిడీ ప్రభుత్వం ఇస్తుందని, మిగిలిన రూ.20 మాత్రమే రైతులు చెల్లించాల్సి ఉంటుందన్నారు. అలాగే ఎస్సీ, ఎస్టీలకు 100 శాతం సబ్సిడీతో డ్రిప్ పరికరాలు అందిస్తారని, మిగిలిన చిన్న, సన్నకారు రైతులకు 90 శాతం సబ్సిడీతో పరికరాలు అందించడం జరుగుతుందన్నారు. ఆయిల్పాం తోట సాగు కోసం రూ.2,100, అంతర పంట సాగు కోసం మరో రూ.2,100 కలిపి ఏడాదికి రూ.4,200 ప్రభుత్వం అందిస్తుందని చెప్పారు. ఆయిల్పాం తోట సాగుకు ఖర్చు తక్కువగా ఉంటుందని, ఈ సాగు కోసం జిల్లాలోని రైతులు ముందుకు రావాలని ఆయన కోరారు. వన్ టైం పరీక్ష రాసే అవకాశం మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ కళాశాలల్లో బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సుల్లో బ్యాక్లాగ్ సబ్జెక్టులు ఉన్న విద్యార్థులకు వన్టైం పరీక్ష రాసే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రవీణ ఒక ప్రకటనలో తెలిపారు. మూడు సంవత్సరాల కోర్సు, అదనంగా రెండు సంవత్సరాల గ్రేస్ పీరియడ్ కలిగి ఉండాలని, బ్యాక్లాగ్ ఉన్న విద్యార్థులకు ఇది చివరి అవకాశం అని, ఈ నెల 16వ తేదీ లోగా ఎలాంటి జరిమానా లేకుండా దరఖాస్తులు చేసుకోవాలని, 20వ తేదీ వరకు జరిమానాతో ఫీజుచెల్లించి, దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. -
‘భారత్ను ప్రపంచంలో అగ్రగామిగా నిలబెట్టాం’
గద్వాల: దేశంలో 11 ఏళ్ల ఎన్డీఏ పాలనలో అభివృద్ధే అభిమతంగా ప్రధాని నరేంద్రమోదీ పనిచేస్తున్నారని మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. మంగళవారం గద్వాలలోని డీకే బంగ్లాలో జరిగిన కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. 11 ఏళ్ల పాలనలో మోదీ సాధించిన విజయాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలన్నారు. ముఖ్యంగా 370 ఆర్టికల్, ట్రిపుల్ తలాఖ్ రద్దు, వక్ఫ్ సరవణ చట్టం, అయోధ్య రామమందిర నిర్మాణం వంటి అనేక సాహసోపేత నిర్ణయాలు తీసుకుని భారతదేశాన్ని ప్రపంచంలో అగ్రగామిగా నిలబెట్టేలా కృషి చేస్తున్నారన్నారు. పెహల్గాంలో ఉగ్రదాడి అనంతరం ఉగ్ర శిబిరాలు, పాక్పై నరేంద్రమోదీ చేపట్టిన చర్యలకు ప్రపంచ దేశాలు మెచ్చుకుంటుంటే మన దగ్గర మాత్రం కాంగ్రెస్ నాయకులు విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. మోదీ 11 ఏళ్ల పాలనపై కేంద్రకమిటీ పిలుపు మేరకు జిల్లాస్థాయిలో విస్తృత ప్రచారం, ఈ నెల 6న అన్ని మండలాల్లో ఒకేస్థాయి కార్యశాలలు, 9, 10, 11 తేదీల్లో ప్రెస్ కాన్ఫరెన్స్, ప్రపోషన్ మీట్స్, మేధావుల సదస్సులు, ప్రతి మండలంలో వికసిత్ భారత్ సంకల్ప్ సభలు నిర్వహించాలన్నారు. రచ్చబండ కార్యక్రమాలు, ఎగ్జిబిషన్లు, ఈ ప్రోగ్రామ్స్, డిజిటల్ కాంపిటీషన్స్ వంటివి నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో నాయకులు డీకే స్నిగ్ధారెడ్డి, రామాంజనేయులు, వెంకట్రాములు, రమాదేవి, రవికుమార్, జయశ్రీ, దేవదాసు, వెంకటేశ్వర్రెడ్డి, కృష్ణవేణి పాల్గొన్నారు. -
నాణ్యమైన విత్తనాలతో అత్యధిక దిగుబడులు
రాజోళి: నాణ్యమైన విత్తనాలను నాటడం వల్ల రైతులే నాణ్యమైన పంటలను పండించడంతోపాటు ఫౌండేషన్ విత్తనాలను సాటి రైతులకు అందించవచ్చని జిల్లా వ్యవసాయ అధికారి సక్రియానాయక్, పాలెం శాస్త్రవేత్త సిద్దప్ప అన్నారు. మంగళవారం రాజోళిలోని రైతువేదికలో వారు ఫౌండేషన్ విత్తనాలను మండలంలోని 26 మంది రైతులకు పచ్చజొన్న, ఆర్ఎన్ఆర్ వడ్ల విత్తనాలను అందజేశారు. రైతులు ఈ విత్తనాలను నాటి వాటిని పండించిన అనంతరం వాటి ద్వారా ఫౌండేషన్ విత్తనాలను తీసి రైతులకు సరఫరా చేయాలన్నారు. మార్కెట్లో ఫౌండేషన్ విత్తనాలను రైతులే అందించేలా వీటిని సాగు చేయాలన్నారు. విత్తనోత్పత్తిలో రైతులు ముందుండి నాణ్యమైన విత్తనాలను మార్కెట్లోకి తీసుకురావాలన్నారు. గ్రామ గ్రామాన రైతులు విత్తనాలు నాటి నాణ్యమైన, లాభసాటి వ్యవసాయాన్ని సాధించవచ్చన్నారు. ఈ విత్తనాల కోసం పరిశోధన కేంద్రాల చుట్టూ తిరగాల్సిన పని లేదన్నారు. కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి రాధ, ఇబ్రహిం, చంద్రశేఖరాచారి, శ్వేతారెడ్డి, హిమబిందు, పుష్ప పాల్గొన్నారు. -
గద్వాల: ఇళ్ల మధ్యలోకి మొసలి.. వణికిపోయిన జనం
సాక్షి, జోగులాంబ గద్వాల: జిల్లా కేంద్రంలో మొసలి కలకలం రేగింది. స్థానిక హమాలీ కాలనీలో అర్ధరాత్రి కుక్కలు గట్టి గట్టిగా అరవడంతో గమనించిన కాలనీవాసులు.. మొసలి సంచరించడం చూసి వణికిపోయారు. అయితే కొందరు ధైర్యం చేసి తాడుతో దానిని అతికష్టం మీద బంధించి ఉంచారు. మంగళవారం ఉదయం ఫారెస్టు అధికారులు వచ్చి మొసలిని తీసుకెళ్లారు.అర్ధరాత్రి కావడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదని కాలనీవాసులు చెబుతున్నారు. మొసలి సంచరించిన ప్రాంతం.. పిల్లలు ఆడుకునే పప్రాంతమని, అదృష్టవశాత్తూ ఘటన అర్ధరాత్రి జరగిందని అంటున్నారు.హామాలి కాలనీకి సమీపంలో జూరాల ప్రాజెక్టు కుడి కాలువ ఉందని, అట్టి కాలువ నుంచి మొసలి వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ క్రమంలో.. చుట్టుపక్కల ఉన్న ముళ్లపొదలను తొలగించి.. వీధిలైట్లు ఏర్పాటు చేయించాలని అధికారులకు కాలనీవాసులు విజ్జప్తి చేస్తున్నారు. -
ధాన్యం తరలించాలంటూ నిరసన
అయిజ: మండలంలోని పులికల్లో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రంలో సరిపడినన్ని లారీలు రాకపోవడంతో ధాన్యం నిలువలు పేరుకపోయాయని, వర్షం వస్తే ధాన్యం తడిసిపోతుందని రైతులు సోమవారం నిరసన తెలిపారు. ఒక రైతు లారీ టైరు కింద పడుకొని నిరసన తెలిపారు. ప్రతి రోజు 10 లారీలు రావాల్సి ఉండగా మూడు రోజులనుంచి 3 నుంచి 5 లారీలు మాత్రమే వస్తున్నాయని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అకాల వర్షాలు పడుతున్న కారణంగా ఆరుగాలం కష్టించి పండించిన ధాన్యం రాశుల్లో, బస్తాల్లో తడిసిపోయి నాణ్యత లేకుండా పోతుందని రైతులు వాపోయారు. ఈవిషయంపై ఐకేపీ ఏపీఎం, అన్నపూర్ణ, సీసీ జయన్నను వివరణ కోరగా లారీల కొరత ఏర్పడిందని, త్వరలో ధాన్యం తరలిస్తామని తెలిపారు. -
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం
నియోజకవర్గానికి 3500 చొప్పున ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. ఇవి వివిధ దశాలలో కొనసాగుతున్నట్లు వివరించారు. సమగ్ర భూసమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం భూభారతి చట్టం 2025 తీసుకొచ్చి ప్రభుత్వ భూములను పరిరక్షించడంతో పాటు, దీర్ఘకాలిక భూసమస్యలకు పరిష్కారం చూపనున్నట్లు తెలిపారు. జూన్ 3వ తేదీ నుంచి 20వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మిగతా రెవెన్యూ గ్రామాల్లో రెవెన్యూ సదస్సులను నిర్వహించి రెవెన్యూ సమస్య రహిత తెలంగాణగా తీర్చిదిద్దుటకు ప్రణాళికలు తయారు చేసుకుని అమలు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో ఇప్పటి వరకు 43,670భూసమస్యలు పరిష్కరించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీ మల్లురవి, కలెక్టర్ బీఎం సంతోష్, ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్రెడ్డి, విజయుడు, ఎస్పీ శ్రీనివాస్రావు, అదనపు కలెక్టర్లు వి.లక్ష్మీనారాయణ, నర్సింగ్రావు, వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. -
అమరవీరుల త్యాగాలు మరువలేనివి
గద్వాల క్రైం/అలంపూర్/ఎర్రవల్లి: ఎందరో అమరవీరుల త్యాగఫలం వలనే మనమంతా ఈరోజు స్వతంత్రంగా జీవిస్తున్నామని.. అలాంటి అమరవీరుల త్యాగాన్ని ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని ప్రముఖులు పిలుపునిచ్చారు. అలంపూర్ చౌరస్తాలోని క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు ఎమ్మెల్యే విజయుడు ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. తెలంగాణ సాధన కోసం ప్రజలు అనేక పోరాటాలు చేశారని, నాలుగు దశాబ్దాల పోరాటంలో ఎందరో మహనీయులు ప్రాణాత్యాగాలు చేశారన్నారు. అలాగే, జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయం వద్ద ఎస్పీ శ్రీనివాసరావు జాతీయ జెండా ఎగురవేశారు. ఎన్నో పోరాటాలు, ఎందరో విద్యార్థులు, ఉద్యమకారులు, ఆత్మబలిదానాలు చేసి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నారని, వారి ఆంక్షలను బావితరాలకు అందించాల్సిన ఆవశ్యకత మన అందరిపై ఉందని ఎస్పీ అన్నారు. అదేవిధంగా, ఎర్రవల్లి మండలంలోని బీచుపల్లి పదో బెటాలియన్లో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఇన్చార్జ్ కమాండెంట్ జయరాజు జాతీయ జెండాను ఎగుర వేశారు. -
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ సేవలు
మెట్టుగడ్డ: ఉమ్మడి జిల్లాలోని అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 12 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉండగా అందులో పైలెట్ ప్రాజెక్ట్ కింద ఏప్రిల్ నెలలోనే మహబూబ్నగర్, నాగర్కర్నూల్ కార్యాలయాల్లో ఈ సేవలు ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత రెండో దశలో నారాయణపేట, కల్వకుర్తి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ సేవలు అమలు చేసిన విషయం తెలిసిందే. కాగా.. ఉమ్మడి జిల్లాలోని అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సోమవారం నుంచి స్లాట్ బుకింగ్ సేవలు అందుబాటులోకి వచ్చాయని జిల్లా రిజిస్ట్రార్ రవీందర్ తెలిపారు. ఇందులో భాగంగా జిల్లాలోని జడ్చర్ల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో స్లాట్ బుకింగ్ సేవలు పరిశీలించి కొనుగోలుదారులకు దస్తావేజులు అందజేశారు. అవగాహన లేకపోవడంతో.. సోమవారం స్లాట్ బుకింగ్ సేవలు ప్రారంభమైన కార్యాలయాల్లో దస్తావేజుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొన్ని కార్యాలయాల్లో సాఫీగానే సాగగా.. మరికొన్ని కార్యాలయాల్లో ప్రజలకు స్లాట్ బుకింగ్పై సరైన అవగాహన లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ క్రమంలోనే అలంపూర్లో ఒక్క స్లాట్ కూడా బుక్ కాలేదు. ఆత్మకూర్లో కేవలం 1 దస్తావేజు మాత్రమే రిజిస్ట్రేషన్ అయ్యింది. గద్వాల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో 44 స్లాట్ బుకింగ్ చేసుకోగా 35 దస్తావేజులు మాత్రమే రిజిస్ట్రేషన్ కాగా.. మిగతా 9 దస్తావేజుల అమ్మకపు, కొనుగోలుదారులు కార్యాలయానికే రాలేదు. సోమవారం స్లాట్ బుకింగ్ ప్రారంభమైన కార్యాలయాల్లో జడ్చర్లలో 40, వనపర్తిలో 45, గద్వాలలో 35, మక్తల్లో 7, అచ్చంపేటలో 5, కొల్లాపూర్లో 7, ఆత్మకూరులో ఒక స్లాట్ బుక్ అయ్యాయి. మరో ముగ్గురు సబ్ రిజిస్ట్రార్లు ఉమ్మడి జిల్లాలోని అన్ని కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ సేవలు ప్రారంభమైన నేపథ్యంలో ప్రజలకు పారదర్శకంగా, మరింత వేగంగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తిచేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా రద్దీ ఎక్కువగా ఉండే కార్యాలయాలకు అదనంగా సబ్ రిజిస్ట్రార్లను కేటాయించారు. ఇందులో భాగంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని జడ్చర్ల, వనపర్తి, గద్వాల కార్యాలయాలకు ఒక్కొక్కరు చొప్పున సబ్ రిజిస్ట్రార్లను కేటాయించారు. ఈ మేరకు సోమవారం జడ్చర్లలో నూతన సబ్ రిజిస్ట్రార్ భానుప్రసాద్ బాధ్యతలు సైతం స్వీకరించారు. ఉమ్మడి జిల్లాలోని 12 చోట్ల పూర్తిస్థాయిలో అమలు తొలిరోజు 140 స్లాట్స్ బుకింగ్ జిల్లాకు ముగ్గురు సబ్ రిజిస్ట్రార్ల కేటాయింపు -
నేటినుంచి ఇంట్రా డిస్ట్రిక్ట్ అండర్–19 క్రికెట్
లీగ్ మ్యాచ్ల వివరాలు ఉమ్మడి జిల్లాలోని ఆరు వేదికల్లో అండర్– 19 లీగ్ మ్యాచ్లు జరగనున్నాయి. మొదటి రౌండ్కు సంబంధించి సోమవారం మహబూబ్నగర్– వనపర్తి జట్లు (వేదిక– మహబూబ్నగర్), జడ్చర్ల– గద్వాల జట్లు (జడ్చర్ల), నారాయణపేట– నాగర్కర్నూల్ (నారాయణపేట) జరుగుతాయి. ● రెండో రౌండ్ మంగళవారం నాగర్కర్నూల్– మహబూబ్నగర్ జట్లు (మహబూబ్నగర్), గద్వాల– వనపర్తి (వనపర్తి), జడ్చర్ల– నారాయణపేట (జడ్చర్ల) మ్యాచ్లు ఉంటాయి. ● మూడో రౌండ్ బుధవారం మహబూబ్నగర్– గద్వాల (మహబూబ్నగర్), నాగర్కర్నూల్– జడ్చర్ల (జడ్చర్ల), వనపర్తి– నారాయణపేట (వనపర్తి) కొనసాగుతాయి. ● నాలుగో రౌండ్ గురువారం మహబూబ్నగర్– నారాయణపేట (మహబూబ్నగర్), జడ్చర్ల– వనపర్తి (జడ్చర్ల), గద్వాల– నాగర్కర్నూల్ (గద్వాల) ఉంటాయి. ● ఐదో రౌండ్ శుక్రవారం జడ్చర్ల– మహబూబ్నగర్ (మహబూబ్నగర్), నాగర్కర్నూల్– వనపర్తి (నాగర్కర్నూల్), గద్వాల– నారాయణపేట (గద్వాల)లో నిర్వహిస్తారు. మహబూబ్నగర్ క్రీడలు: ఉమ్మడి జిల్లాలో ఎండీసీఏ ఆధ్వర్యంలో మరోసారి ఇంట్రా డిస్ట్రిక్ర్ట్ టోర్నమెంట్ జరగనుంది. గత నెల 19 నుంచి 31 వరకు అండర్– 23 ఇంట్రా డిస్ట్రిక్ట్ టూడే లీగ్ను నిర్వహించగా మహబూబ్నగర్ జట్టు చాంపియన్షిప్గా నిలిచింది. క్రీడాకారులను ప్రోత్సహించడానికి ఇప్పుడు అండర్– 19 క్రికెట్ లీగ్ను నిర్వహించనున్నారు. 2 నుంచి 6 వరకు.. ఔత్సాహిక గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించడం కోసం సోమవారం నుంచి శుక్రవారం వరకు ఇంట్రా డిస్ట్రిక్ట్ పురుషుల అండర్–19 క్రికెట్ లీగ్ నిర్వహించనున్నారు. ఈ మేరకు ఎండీసీఏ ఆధ్వర్యంలో లీగ్కు సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ లీగ్లో పాల్గొనే ఆరు జట్లను రెండు పూల్లుగా విభజించారు. పూల్–ఏలో జడ్చర్ల, వనపర్తి, నాగర్కర్నూల్ జట్లు, పూల్–బీలో మహబూబ్నగర్, నారాయణపేట, గద్వాల జట్లు ఉన్నాయి. ఐదు రౌండ్లలో 15 లీగ్ మ్యాచ్లు జరగనున్నాయి. 50 ఓవర్ల మ్యాచ్లు నిర్వహించనున్నారు. లీగ్లో ఎక్కువ పాయింట్లు సాధించిన జట్టు చాంపియన్గా నిలుస్తుంది. ఆరు జట్లు.. 15 లీగ్ మ్యాచ్లు ఉమ్మడి జిల్లాలోని ఆరు వేదికల్లో మ్యాచ్ల నిర్వహణ అధిక పాయింట్లు సాధించిన జట్టు విజేత -
అభివృద్ధి దిశగా అడుగులు
ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావం, జిల్లా ఏర్పాటుతో ప్రగతి పరుగులు వివరాలు 8లో uగద్వాల: తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావంతో పరిపాలన, అభివృద్ధి, సంక్షేమ పరంగా వడివడిగా జిల్లా అడుగులు వేస్తూ ముందుకు సాగుతుంది. 2016లో నూతన జిల్లాల ఏర్పాటులో భాగంగా జోగుళాంబ జిల్లా ఏర్పాటుతో ప్రగతి మరింత పరుగులు పెట్టింది. గడచిన పదేళ్లలో జిల్లాలో నూతనంగా తుమ్మిళ్ల, గట్టు ఎత్తిపోతలు, మెడికల్, నర్సింగ్ కళాశాలల ఏర్పాటయ్యాయి. అలాగే, 30శాతం మేర వ్యవసాయ పంటల సాగు విస్తీర్ణం పెరిగింది. రాష్ట్ర ఆవిర్భావం సందర్భంగా గడిచిన పదేళ్ల కాలంలో జిల్లాలో వివిధ శాఖల పరంగా జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ఓ సారి పరిశీలిద్దాం. నిరంతర విద్యుత్ సరఫరా.. జిల్లాలోని పరిశ్రమలు, వ్యవసాయ రంగానికి 24గంటల పాటు నిరంతరాయంగా విద్యుత్ను అందించేలా అవసరమైన సబ్స్టేషన్లు, ట్రాన్స్ఫార్మర్లు, ఫీడర్లు, సర్వీస్ కనెక్షన్లు ఏర్పాటు చేశారు. ఉచిత విద్యుత్ పథకం ద్వారా జిల్లాలో ఇప్పటి వరకు 6 లక్షల 17వేల మంది కుటుంబాలకు రూ.15.96కోట్లు లబ్ధిచేకూరింది. అలాగే, జిల్లా వ్యాప్తంగా ఇంటింటికీ సురక్షిత తాగునీటిని అందించేందుకు ప్రభుత్వం మిషన్ భగీరథ పథకం అమలు చేసింది. దీని ద్వారా జిల్లాలోని 319గ్రామాలకు తాగునీటిని అందించేందుకు రూ.209కోట్లు వ్యయం చేశారు. అదేవిధంగా రూ.508కోట్లతో తాగునీటిని అందించేందుకు అవసరమైన పైపులైన్లు, ఓహెచ్బీఆర్, డబ్ల్యూటీపీ, జీఎల్బీఆర్ సంపుల నిర్మాణాలు పూర్తి చేశారు. వైద్య కళాశాలల ఏర్పాటుతో సంపూర్ణ సేవలు జిల్లాకు మెడికల్ కాలేజీ మంజూరైంది. తరగతులు సైతం మొదలయ్యాయి. భవన నిర్మాణ పనులు మొదలుకావాల్సి ఉంది. అలాగే, రూ.34.90కోట్లతో నూతనంగా నర్సింగ్ కళాశాల సైతం మంజూరు కాగా.. 2021 డిసెంబర్ 22న అడ్మిషన్లు సైతం మొదలయ్యాయి. ఇక అలంపూర్లో రూ.21 కోట్లతో వంద పడకల ఆసుపత్రి నిర్మాణం, అయిజ పీహెచ్సీని రూ.79లక్షలతో 30 పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్, జిల్లా కేంద్రంలో రూ.39.79కోట్లతో జిల్లా ఆసుపత్రి నిర్మాణ పనులు చేపట్టారు. కేంద్ర ప్రభుత్వ పథకం కింద రూ.23కోట్లతో క్రిటికల్ కేర్ యూనిట్లు, రూ.2.50కోట్లతో సెంట్రల్ డ్రగ్ స్టోర్ మంజూరు, కంటివెలుగు ద్వారా మొదటి విడతలో జిల్లాలో 2,83,216 మందికి, రెండో విడతలో 2,63,320మంది పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి కంటి అద్దాలు పంపిణీ చేశారు. ఇక గద్వాల మున్సిపాలిటీలో సీఎం ప్రత్యేక ఽనిధి కింద రూ.56కోట్ల విలువైన వివిధ రకాల అభివృద్ధి పనులు చేపట్టారు. అయిజ, వడ్డేపల్లి, అలంపూర్ మున్సిపాలిటీల పరిధిలో రూ.40కోట్లకు పైగా వివిధ రకాల అభివృద్ధి పనులు చేపట్టారు. ఆసరా పథకం ద్వారా 68,952 మంది లబ్ధిదారులకు ప్రతినెలా రూ.16.82కోట్లు అందజేస్తున్నారు. 262 మహిళా సంఘాల నుంచి నేడు 6,653 సంఘాలకు పెంచారు. రుణాల ద్వారా 74,002మంది లబ్ధి చేకూరింది. బ్యాంకు లింకేజీ ద్వారా 2014–15నుంచి 2022–23వరకు రూ.8.65కోట్లు రుణాలు ఇచ్చారు. ఇక హరితహారం పథకం కింద ఇప్పటి వరకు జిల్లాలో 137.09లక్షల మొక్కలు నాటారు. రైతులకు చేదోడుగా ‘రైతుబంధు’ 2019–20 సంవత్సరం నుంచి ప్రవేశపెట్టిన రైతు బంధు పథకం ద్వారా పది విడతలుగా ఎకరాకు రూ.5వేల చొప్పున జిల్లాలో 1,60,799 మంది రైతులకు రూ.1,924.61కోట్లను వారి ఖాతాల ద్వారా అందజేశారు. అదేవిధంగా రైతుబీమా ద్వారా జిల్లాలో చనిపోయిన 2,572 మంది రైతుల కుటుంబాలకు రూ.128.60కోట్లు అందజేశారు. ఇక వ్యవసాయ యాంత్రీకరణ పథకం ద్వారా 231మంది రైతులకు సబ్సిడీపై రూ.7.33కోట్ల విలువైన 231ట్రాక్టర్లు, 14,397మంది రైతులకు రూ.5.46 కోట్ల విలువైన వివిధ రకాల వ్యవసాయ పరికరాలను పంపిణీ చేశారు. రూ.23.34కోట్లతో 97 రైతు వేదికలను నిర్మాణం, రైతులకు రూ.914కోట్ల రుణమాఫీ చేయడం జరిగింది. పదేళ్లలో రూ.1,942.61 కోట్లు రైతుబంధు పంపిణీ తుమ్మిళ్ల, గట్టు ఎత్తిపోతల పథకాలు ప్రారంభం 30.16శాతం వ్యవసాయ పంటల సాగు విస్తీర్ణం పెంపు రూ.39.65 కోట్లతో జిల్లా ఆసుపత్రి.. రూ.21 కోట్లతో అలంపూర్లో వంద పడకల ఆస్పత్రి నిర్మాణం మెడికల్, నర్సింగ్ కళాశాలల ఏర్పాటు రూ.96 కోట్లతో గద్వాల, అయిజ, వడ్డేపల్లి, అలంపూర్ పురపాలికల్లో అభివృద్ధి పనులు ఆకలి తీరుస్తున్న ‘ఆహార భద్రత’ జిల్లాలో 335 చౌకధర దుకాణాల నుంచి ప్రతినెలా 1,69,693 మంది లబ్ధిదారులకు ఆహారభద్రత పథకం కింద 3591.42టన్నుల బియ్యం పంపిణీ చేస్తున్నారు. అలాగే, మన ఊరు మన బడి పథకం కింద జిల్లాలో 161 పాఠశాలలను ఎంపిక చేసి వివిధ రకాల అభివృద్ధి పనులు వివిధ దశలలో పురోగతిలో ఉన్నాయి. ఽజిల్లాల ఏర్పాటులో భాగంగా నూతన కలెక్టరేట్, ఎస్పీ భవనాల నిర్మాణాలు చేశారు. అలాగే, 2023 వరకు 2035 మందికి రూ.17.10కోట్ల పరిశ్రమల స్థాపనకు అందజేశారు. అలాగే, జిల్లాలోని 5 చేనేత సహకార సంఘాలకు ఇప్పటి వరకు రూ.59.27లక్షలు పావలా వడ్డీ రుణాలు, 40శాతం రాయితీ ద్వా రా 6234మందికి నూలు అందజేశారు. ఇందుకోసం రూ.10.11కోట్లు డీబీటీ పద్దతి ద్వరా లబ్ధిదారుల వ్యక్తిగత ఖాతాలో జమచేశారు. పెరిగిన సాగు విస్తీర్ణం రాష్ట్రం ఏర్పడే నాటికి జిల్లాలో 2014–15లో రెండు సీజన్లు కలిపి మొత్తం పంటల సాగు విస్తీర్ణం 4,27,397 ఎకరాలు ఉంటే 2022–23 నాటికి రెండు సీజన్లు కలిపి 5,56,335 ఎకరాలకు పెరిగింది. అంటే గడచిన తొమ్మిదేళ్లలో 30.16శాతం మేర పంటల సాగు విస్తీర్ణం పెరిగింది. మిషన్ కాకతీయ ద్వారా జిల్లాలో గద్వాల, అలంపూర్ నియోజకవర్గాలలోని 8 మండలాల్లో రూ.45.06కోట్లతో 345 చెరువులను పుణరుద్ధరించారు. ఇందులో 262 చెరువు పనులు పూర్తి కాగా మిగిలిన పనులు వివిధ దశలలో పురోగతిలో ఉన్నాయి. ఇవి పూర్తయితే వీటి కింద 16.909ఎకరాల ఆయకట్టుకు నీరందుతుంది. ఇదిలాఉండగా, ఆర్డీఎస్ కింద సాగునీరు అందక ఇబ్బందులు పడుతున్న 55,600 ఎకరాల ఆయకట్టుకు నీరందించేందుకు రూ.783కోట్లతో తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకాన్ని చేపట్టారు. ఇందులో మొదటి దశంలో రూ.397కోట్లతో పనులు ప్రారంభించి రూ.159కోట్ల పనులు పూర్తి చేయగా, దీనిద్వారా మొదటి పంపు ద్వారా 2018లో ఆర్డీఎస్ ఆయకట్టుకు నీరందుతుంది. ఇక గట్టు, కె.టి.దొడ్డి మండలాల్లోని 33వేల ఎకరాల బీడుభూములకు సాగునీటిని అందించే లక్ష్యంతో రూ.487.03కోట్లతో గట్టు ఎత్తిపోతల పథకాన్ని చేపట్టారు. అలాగే, ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు పూర్తిస్థాయిలో మరమ్మతు చేసేందుకు రూ.11కోట్లు నిధులు విడుదల చేసింది. పనులు కొనసాగుతున్నాయి. అన్ని రంగాల్లో అభివృద్ధి ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావం.. అందులోనూ జిల్లాగా ఏర్పడిన తర్వాత గద్వాలలో అభివృద్ధి పరుగులు పెట్టింది. విద్య, వైద్యం, సాగునీటి రంగాల్లో అభివృద్ధి చేయడం జరిగింది. మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజీ, 200 బెడ్స్ ఆసుపత్రి, గట్టు లిఫ్ట్, నూతన విద్యుత్ సబ్స్టేషన్లు నిర్మించాం. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిని ఈ ప్రభుత్వంలో కూడా కొనసాగించి గద్వాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తాను. – బండ్ల కృష్ణమోహన్రెడ్డి, గద్వాల ఎమ్మెల్యే -
అవతరణ దినోత్సవానికి ముస్తాబు
గద్వాల: తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు కలెక్టరేట్ ముస్తాబైంది. అలాగే జిల్లాకేంద్రంలోని ముఖ్య కూడళ్లను విద్యుద్దీపాలతో అలంకరించారు. దీంతోపాటు జిల్లా కేంద్రంలో ఉన్న వివిధ ప్రభుత్వ కార్యాలయాలను లైట్లతో అలంకరించారు. ఇందులో భాగంగా సోమవారం కలెక్టరేట్ భవనంపై ఢిల్లీలో రాష్ట్ర అధికార ప్రతినిధి ఏపీ జితేందర్రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించి.. ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. కార్యక్రమానికి కలెక్టర్ బీఎం సంతోష్, అదనపు కలెక్టర్లు, ఎమ్మెల్యేలు, జిల్లా అధికారులు హాజరుకానున్నారు. విద్యుద్దీపాల వెలుతురులో కలెక్టరేట్ -
జిల్లా పోలీసులకు ఉత్తమ సేవా పతకాలు
గద్వాల క్రైం: రాష్ట్ర ప్రభుత్వం పోలీసు శాఖలో పని చేస్తున్న పోలీసు సిబ్బందికి ఉత్తమ, సేవా పతకాల జాబితాను ఆదివారం విడుదల చేసింది. జిల్లా పోలీసుశాఖలో విధులు నిర్వహిస్తున్న నలుగురు పోలీసు సిబ్బంది ఉత్తమ, కఠిన సేవా పతకాలకు ఎంపికయ్యారు. ఉత్తమ సేవా పతకాల విభాగంలో ధరూరు పోలీసు స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న తెలుగు వెంకట్రాములు ఎస్ఐ (సీఐడి హైద్రాబాద్ లకిడీకపూల్ ప్రస్తుత స్థానం), జిల్లా సాయుధ బలగాల విభాగంలో ఏఆర్ఎస్ఐ టి ఆంజనేయులు ఎంపికయ్యారు. సేవా పతకానికి ఇటిక్యాల, అలంపూర్ పోలీసు స్టేషన్లో హెడ్ కానిస్టేబుళ్లు ఆర్.రాజవర్ధన్రెడ్డి, టి.అమరనాథ్లు ఎంపికయ్యారు. ఉత్తమ, సేవా పథకాలకు జిల్లా పోలీసుశాఖ నుంచి నలుగురు ఎంపిక కావడంతో ఎస్పీ శ్రీనివాసరావు, డీఎస్పీ మొగిలయ్య, సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు. వీరిని ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. -
ఉపాధ్యాయుల సర్దుబాటు వద్దు
గద్వాల: ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రాథమిక విద్యకు గొడ్డలిపెట్టని, ప్రభుత్వం వెంటనే సర్దుబాటు నిర్ణయాన్ని విరమించుకోవాలని డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ నాయకులు డిమాండ్ చేశారు. ఆదివారం గద్వాల పట్టణంలో స్మృతివనంలో విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వం విద్యా రంగాన్ని బలోపేతం చేస్తామని ఓ వైపు ప్రకటిస్తూనే మరోవైపు ఉపాధ్యాయుల సంఖ్య కుదింపునకు ఉత్తర్వులు జారీ చేయడం ఏమిటని ప్రశ్నించారు. వేసవికాలం మొత్తం ఉపాధ్యాయులు, అధికారులకు శిక్షణ, బడిబాట పేరిట అనేక కార్యక్రమాలు చేపడుతూనే మరోవైపు పిల్లలు తక్కువగా ఉన్నారన్న ఉద్దేశంతో టీచర్లను ఇతర పాఠశాలలకు సర్దుబాటు చేయడం ప్రాథమిక పాఠశాలలపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. విద్యా హక్కుచట్టం ప్రకారం విద్యార్థుల ఉపాధ్యాయుల నిష్పత్తి 1:30అనేది కేవలం ఉన్నత పాఠశాలలకే పరిమితం చేయాలన్నారు. ప్రభుత్వం వెంటనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ప్రభాకర్శాస్త్రి, ఉదయ్కిరణ్, హరిబాబు, ప్రవీణ్కుమార్, ప్రకాశ్ పాల్గొన్నారు. ఉత్సాహంగా బాస్కెట్బాల్ క్రీడాకారుల ఎంపికలు మహబూబ్నగర్ క్రీడలు: జిల్లాకేంద్రంలోని మెయిన్ స్టేడియంలో ఆదివారం ఉమ్మడి జిల్లా 3X3 పురుషులు, మహిళా బాస్కెట్బాల్ క్రీడాకారుల ఎంపికలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా బాస్కెట్బాల్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు మక్సూద్ బిన్ అహ్మద్, జాకీర్ క్రీడాకారులను పరిచయం చేసుకొని మాట్లాడుతూ బుధ, గురువారాల్లో జిల్లాకేంద్రంలోని ఇండోర్, అవుట్డోర్ స్టేడియంలో మొదటి రాష్ట్రస్థాయి 3X3 బాస్కెట్బాల్ చాంపియన్షిప్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. టోర్నీ లో ఆయా జిల్లాల నుంచి 150 మంది క్రీడాకారులు, 50 మంది అఫీషియల్స్ హాజరవుతారని తెలిపారు. ఉమ్మడి జిల్లా జట్లకు ఎంపికై న క్రీడాకారులను ఆయన అభినందించారు. కార్యక్రమంలో సభ్యులు మీర్ ఖాలెద్అలీ, మహ్మద్ ఇలియాజ్, సుబాన్జీ, గోపాలకృష్ణ, ఫారూఖ్ ముకర్రం, మహ్మద్ షకీల్, వినోద్కుమార్, బాలరాజు పాల్గొన్నారు. 8 వేల బస్తాల వరిధాన్యం రాక నవాబుపేట: స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డుకు ఆదివారం ఆర్ఎన్ఆర్, ఇతర సీడ్ (1010) కలిపి దాదాపు 8 వేల బస్తాలకు పైగా ధాన్యం వచ్చిందని మార్కెట్ కమిటీ కార్యదర్శి రమే్ష్ తెలిపారు. కాగా వరి (1010) రకం 2,613 బస్తాలు రాగా క్వింటాల్కు సరాసరిగా రూ.1,973 ధర వచ్చింది. అలాగే వరి ఆర్ఎన్ఆర్ 5,283 బస్తాలు రాగా.. క్వింటాల్ గరిష్టంగా రూ.2,272, కనిష్టంగా రూ.1,612 ధర లభించిందని ఆయన వివరించారు. -
నేడు జిల్లాలో నీటి సరఫరా బంద్
గద్వాల: ధరూరు మండలం రేవులపల్లిలో నీటిశుద్ధి కర్మాగారాన్ని సోమవారం శుభ్రపర్చనున్న నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా సోమవారం తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనుందని మిషన్ భగీరథ గ్రిడ్ డీఈ రవిచంద్రకుమార్రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి తగిన ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని తెలిపారు. కార్మిక హక్కుల పరిరక్షణకు పోరాటం అచ్చంపేట రూరల్: ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న సంక్షేమ బోర్డు సమస్యలకు నిలయంగా మారిందని, కార్మిక హక్కుల పరిరక్షణ కోసం ఏఐటీయూసీ పోరాడుతుందని ఏఐటీయూసీ భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లా దేవేందర్ అన్నారు. ఆదివారం అచ్చంపేటలోని టీఎన్జీఓ భవనంలో జరిగిన భవన నిర్మాణ కార్మికుల సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. భవన నిర్మాణ కార్మికులకు రూ.5 వేల పింఛన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్మిక సంక్షేమబోర్డులో సెస్ సక్రమంగా జమ కాకపోవడంతో కార్మిక సంక్షేమ నిధులు పెరగడం లేదన్నారు. బోర్డులో కార్మిక సంఘాలకు ప్రాతినిథ్యం కల్పించాలని, మెడికల్ చెకప్ల పేరుతో జరుగుతున్న ఆర్థిక దోపిడీపై సమగ్ర విచారణ చేపట్టాలని కోరారు. సంక్షేమబోర్డును ఎత్తి వేసేందుకు కేంద్రం కుట్ర పన్నుతోందని.. రక్షించుకోవాల్సిన బాధ్యత కార్మికులపై ఉందన్నారు. కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టేందుకు పోరాటాలు తీవ్రతరం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సంఘం జిల్లా నాయకులు పెర్ముల గోపాల్, మల్లేష్, కృష్ణ, చంద్రం, శివరాజు, రాములు, తిరుపతయ్య, సైదమ్మ, శాంతమ్మ తదితరులు పాల్గొన్నారు. పంటల సాగుపై రైతులకు అవగాహన వనపర్తి రూరల్: మండలంలోని కడుకుంట్ల గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో ఆదివారం వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్లో భాగంగా ఐఐఓఆర్ ప్రధాన శాస్త్రవేత్తలు డా. ఆర్డీ ప్రసాద్ వానాకాలం పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించారు. ఆముదం, వేరుశనగ సాగులో మెళకువలు, సాంకేతికత గురించి వివరించారు. కేవీకే మదనాపురం శాస్త్రవేత్త భవాని మాట్లాడుతూ.. వానాకాలంలో వరి, కంది సాగుకు అనుకూలమైనవని, రైతులు భూసార పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. కిసాన్ డ్రోన్లు, బయో ఎరువుల గురించి వివరించారు. ఏఈఓ కవిత మాట్లాడుతూ.. భూమి సారవంతంగా ఉండాలంటే రైతులు పచ్చిరొట్ట పైర్లు 40 రోజులు ముందుగా వేసుకొని పూత దశలో కలియదున్నాలని, దీంతో భూసారం దెబ్బ తినకుండా ఉంటుందని తెలిపారు. ముఖ్యంగా వరి కొయ్య లను తగలబెట్టరాదని సూచించారు. మాజీ స ర్పంచ్ గోవర్ధన్, గ్రామ రైతులు పాల్గొన్నారు. నర్సింగాపురంలో.. మదనాపురం: మండలంలోని నర్సింగాపురంలో ప్రధాన పంటలైన వరి, పత్తి, వేరుశనగ, జీలుగ, కంది పంటల సాగుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కేవీకే శాస్త్రవేత్త అనిత సంతులిత, సేంద్రియ ఎరువుల వినియోగం, భూసార పరీక్షల ప్రాముఖ్యతను వివరించారు. విత్తన ఎంపికపై ప్రతి రైతు అవగాహన కలిగి ఉండాలన్నారు. కార్యక్రమంలో ఏఓ గాయత్రి, మాజీ సర్పంచ్ హనుమాన్రావు, మైనుద్దీన్, కాశన్న, గట్టన్న పాల్గొన్నారు. 3 నుంచి ఇంటర్ ప్రయోగ పరీక్షలు వనపర్తి విద్యావిభాగం: ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ప్రాక్టికల్ పరీక్షలు జూన్ 3 నుంచి 6వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు డీఐఈఓ ఎర్ర అంజయ్య శనివారం వెల్లడించారు. జిల్లాలోని అన్ని కళాశాలల విద్యార్థులకు జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రోజు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు ప్రయోగ పరీక్షలు కొనసాగుతాయన్నారు. 3న వృక్షశాస్త్రం, 4న జంతు శాస్త్రం, 4, 5 తేదీల్లో భౌతిక శాస్త్రం, 5, 6న రసాయన శాస్త్రం పరీక్షలు జరుగుతాయని వివరించారు. అదేమాదిరిగా జూన్ 9, 10న ఇంగ్లీష్, 11న పర్యావరణ విద్య పరీక్ష, 12న నైతికత, మానవ విలువలు పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థులు హాల్టిక్కెట్లను కళాశాల నుంచి లేదా ఇంటర్బోర్డు వెబ్సైట్ నుంచి పొందవచ్చని, సకాలంలో కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. -
రైతులకు న్యాయం చేయాలి
గద్వాల: సీడు పత్తి రైతులపై జరుగుతున్న దోపిడీని అరికట్టాలని, రైతు పండించిన సీడుపత్తి ధరను పెంచి ఫెయిలైన విత్తనాలను రీశాంపిల్కు పెట్టాలని నడిగడ్డ హక్కుల పోరాట సమితి నాయకులు గొంగళ రంజిత్కుమార్, బుచ్చిబాబు డిమాండ్ చేశారు. శనివారం సీడుపత్తి రైతులతో ర్యాలీగా వచ్చి కలిసి కలెక్టరేట్ ఎదుట మోకాళ్లపై నిలబడి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సీడుపత్తి రైతులను ఆర్గనైజర్లు, సీడుపత్తి కంపెనీలు మోసం చేస్తున్నాయన్నారు. కంపెనీల నుంచి వచ్చే ప్రయోజనాలను దళారులుగా ఉన్న ఆర్గనైజర్లే దోచేస్తూ రైతులను నట్టేట ముంచుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు పంటలు సాగుచేసేముందు అడ్వాన్స్ రూపంలో ఇచ్చే పెట్టుబడిని బాకీల కింద లెక్కకట్టి వాటికి వడ్డీలు వేసి పంటలు వచ్చిన తరువాత రైతుల వద్ద నుంచి ముక్కుపిండి వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపించారు. రైతులు పండించిన సీడుపత్తి విత్తన పాకెట్ ధరలను పెంచాలని డిమాండ్ చేశారు. జిల్లాలో ఆర్గనైజర్లు చేస్తున్న దోపిడీకి అడ్డుకట్ట వేసి రైతులకు న్యాయం చేయాలని కోరారు. అనంతరం అదనపు కలెక్టర్ వి.లక్ష్మీనారాయణకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో రంగస్వామి, వెంకట్రాములు, జమ్మన్న, శ్రీనివాస్, బలరాం, గోవిందు, విష్ణు, ప్రేమ్కుమార్, దయాకర్, ఆంజనేయులు, రైతులు పాల్గొన్నారు. కలెక్టరేట్ ఎదుట మోకాళ్లపై నిలబడి నిరసన -
చెరుకు బిల్లులు సకాలంలో చెల్లించాలి
అమరచింత: చెరుకు రైతులకు సకాలంలో బిల్లులు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కృష్ణవేణి చెరుకు రైతు సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు రాజన్న ఆధ్వర్యంలో పలువురు రైతులు శనివారం కృష్ణవేణి షుగర్ ఫ్యాక్టరీ ఈడీ రవికుమార్, డీజీఎం నాగార్జునరావుకు వినతిపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫ్యాక్టరీకి చెరుకు తరలించిన 14 రోజుల్లో డబ్బులు చెల్లించాలని, లేదంటే 16 శాతం వడ్డీతో చెల్లించాల్సి ఉందని, వాటిని నేటికీ అమలు చేయడం లేదని తెలిపారు. విత్తన బిల్లులు 40 రోజుల్లో ఇస్తామన్న యాజమాన్యం ఇప్పటి వరకు చెల్లించలేదని వివరించారు. యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగా సాగు విస్తీర్ణం తగ్గుతుందని.. రాయితీలు సకాలంలో చెల్లించి రైతులను ప్రోత్సహించాలని కోరారు. వచ్చే సీజన్లో రికవరీతో సంబంధం లేకుండా గిట్టుబాటు ధర కల్పించాలని, వేరు పురుగు సోకిన పంట రైతులకు యాజమాన్యం నష్ట పరిహారం చెల్లించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. నేటి వరకు రూ.3 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందని.. త్వరగా చెల్లించి రైతు ప్రయోజనాలను కాపాడాలని కోరారు. కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు వాసారెడ్డి, వెంకటేశ్వర్రెడ్డి, శ్రీనివాసులు, చంద్రసేనారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 4న ఇంటర్వ్యూలు నాగర్కర్నూల్ క్రైం: నేషనల్ హెల్త్మిషన్ ద్వారా 2025–26 ఆర్థిక సంవత్సరానికిగాను బస్తీ దవాఖానాల్లో ఒప్పంద పద్ధతిన వైద్యాధికారుల నియామకానికి ఈ నెల 4న వాక్–ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నట్లు జిల్లా వైద్యాధికారి డా. స్వరాజ్యలక్ష్మి శనివారం ఒక ప్రకటనలో తెలిపా రు. అభ్యర్థులు కలెక్టరేట్లోని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయంలో ఉదయం 11 నుంచి సా యంత్రం 5 వరకు దరఖాస్తుతో పాటు ఒరిజినల్ ధ్రువపత్రాలతో హాజరుకావాలని పేర్కొన్నారు. -
రాష్ట్ర అవతరణ దినోత్సవానికి ఘనంగా ఏర్పాట్లు
గద్వాల: జూన్ 2వ తేదీ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని అడిషనల్ కలెక్టర్ లక్ష్మీనారాయణ అన్నారు. శనివారం ఐడీవోసీ కార్యాలయంలోని తనఛాంబర్లో అధికారులతో సమీక్షించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర అవతరణ దినోత్సవం పురస్కరించుకొని ఐడీవోసీ కార్యాలయాల సముదాయ భవన ఆవరణలో ఉదయం 10గంటలకు నిర్వహించే వేడుకలలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై ఆయా శాఖల అధికారులకు దిశానిర్ధేశం చేశారు. వేడుకలను ఎలాంటి లోటుపాట్లు లేకుండా అట్టహాసంగా నిర్వహించాలని, అన్ని సంక్షేమాభివృద్ధి శాఖలకు చెందిన కార్యక్రమాలు ప్రతిబింభించేలా ప్రదర్శన స్టాళ్లను ఏర్పాటు చేయాలన్నారు. అదేవిధంగా గద్వాల పట్టణంలోని స్మృతివనం, పాతబస్టాండ్ వద్ద గల తెలంగాణ పోరాయోధుల విగ్రహాల వద్ద సభాస్థలి సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. పరేడ్గ్రౌండ్లో పోలీసుగౌరవ వందనం, విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు పకడ్బందిగా నిర్వహించేలా చర్యలు చేపట్టాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ నర్సింగ్రావు, ఆర్డీవో శ్రీనివాస్రావు, ఏవో భూపాల్రెడ్డి, డీఎస్పీ మొగులయ్య, తహసీల్దార్, మున్సిపల్ కమీషనర్ వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. -
ధీరవనిత అహల్యబాయి
పాలమూరు: ఒక హిందూ మహిళగా హైందవ సంస్కృతిని కాపాడుతూ, రాజ్య సంరక్షణలో అహల్యబాయి హాల్కెర్ చేసిన కృషిని స్మరించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఎంపీ డీకే అరుణ అన్నారు. శనివారం జిల్లాకేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో మరాఠా మహారాణి అహల్యబాయి 300వ జయంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ ఆమె చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ దేశ స్వాతంత్య్ర సంగ్రామంలో చరిత్రలోని ధీర వనితలలో అహల్యబాయి ఒకరు అని కొనియాడారు. ఆమె ఎన్నో పురాతన ఆలయాలు నిర్మించిందని, వందకు పైగా కొత్తగా శివాలయాలను అభివృద్ధి చేసిందన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి, నాయకులు పద్మజారెడ్డి, బాలాత్రిపురసుందరి, సాహితీరెడ్డి, కృష్ణవర్ధన్రెడ్డి పాల్గొన్నారు. -
పాలమూరు
సార్థకనామం.. నేడు ప్రపంచ పాల దినోత్సవం పాడి రైతులపై ఆర్థిక భారం ఒకప్పుడు రాష్ట్రానికి రోజువారీగా అవసరమైన పాలు ఒక్క ఉమ్మడి పాలమూరు జిల్లాలోనే ఉత్పత్తి అయ్యేవి అనడం ఏమాత్రం అతిశయోక్తి కాదేమో. అయితే ప్రస్తుతం పాడి పరిశ్రమ ఒడుదొడుకులను ఎదుర్కొంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వరుసగా మూడుసార్లు ఆవు పాల ధర తగ్గించింది. ఇప్పటికే పాడి రైతులు పశుపోషణ భారమై తమ ఆవులు, గేదెలను అమ్ముకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ పరంగా విజయ డెయిరీ ద్వారా ఇస్తున్న దాణా, మినరల్ మిక్చర్స్, క్యాల్షియం మందులు సబ్సిడీలు అర్ధాంతరంగా నిలిచిపోవడంతో రైతులు ఆర్థిక భారం మోయాల్సి వస్తుంది. కాల్షియం మందులు, విజయ దాణా కొనుగోలు చేయాలంటే సబ్సిడీ కాకుండా పూర్తి ధర చెల్లించాల్సి వస్తుందని పాడి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికితోడు పాడి రైతుల సంక్షేమం కోసం డెయిరీ పరంగా అనేక ప్రోత్సాహక కార్యక్రమాలు నిర్వహిస్తున్నా అవి రైతులకు భరోసా కల్పించడం లేదు. ఉచిత పశువైద్య శిబిరాల నిర్వహణ, పాడి రైతులకు డీబీటీ సదుపాయంతోపాటు ప్రతి 15 రోజులకు ఒకసారి పాల బిల్లులు సక్రమంగా అందడం లేదు. దీంతో రైతులు ప్రైవేటు సెంటర్లలో విక్రయించేందుకు ఆసక్తి చూపుతున్నారు. -
1975లోనే పాలకేంద్రం
గద్వాల ప్రాంతంలో 1975లో ప్రభుత్వం పాలకేంద్రం స్థాపించింది. చాలా ఏళ్లపాటు రైతులు ఇక్కడ పాలు విక్రయించారు. ఆ తర్వాత ప్రభుత్వాలు, అధికారుల నిర్లక్ష్యం మూలంగా పాల కేంద్రం మూతబడింది. కాగా 2020 ప్రాంతంలో విజయ డెయిరీ ఆధ్వర్యంలో 5 వేల లీటర్ల సామర్థ్యంతో పాలకేంద్రం పునఃప్రారంభమైంది. దీనిద్వారా జిల్లావ్యాప్తంగా 25 పాలసేకరణ కేంద్రాలు ఏర్పాటు చేసి.. ప్రతిరోజు 2,500 లీటర్ల పాలు సేకరిస్తున్నారు. ఇవి కాకుండా ప్రైవేట్ పరంగా మరో పది దాక పాల సేకరణ కేంద్రాలు ఉన్నాయి. -
వైభవంగా సామూహిక అక్షరాభ్యాసం
ఎర్రవల్లి: బీచుపల్లి పుణ్యక్షేత్రంలోని జ్ఞాన సరస్వతి ఆలయంలో శుక్ల పంచమిని పురస్కరించుకొని శనివారం భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయంలో ఉదయం సుప్రభాతసేవ, పంచామృత అభిషేకం, కుంకుమార్చనలు, మహానైవేద్య నీరాజనాలు, విశేష అలంకరణ వంటి పూజలను అర్చకులు ఘనంగా నిర్వహించారు. చుట్టు పక్కల ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో బీచుపల్లికి చేరుకొని భక్తిశ్రద్ధలతో సరస్వతి దేవిని దర్శించుకొన్నారు. ఆలయ ప్రధాన అర్చకులు.. చిన్నారులకు సామూహికంగా అక్షరాభ్యాసం కార్యక్రమాన్ని వేదమంత్రాల నడుమ వైభవంగా చేయించారు. వివిధ ప్రాంతాల నుండి హాజరైన భక్తులకు పాలక మండలి ఆధ్వర్యంలో అల్పాహారం, అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. కార్యక్రమంలో ఆలయ మేనేజర్ సురేందర్రాజు, పాలక మండలి సభ్యులు, అర్చకులు, భక్తులు, తదితరులు పాల్గొన్నారు. -
రైతువేదికలు.. సౌర కేంద్రాలు
భవనాలపై ప్యానల్స్ ఏర్పాటుకు ప్రభుత్వం సన్నద్ధం జిల్లాల వారీగా రైతువేదికలు ●● ఒక్కో కేంద్రం వద్ద 5 కిలోవాట్ల సామర్థ్యం.. ● కేంద్రాల నిర్వహణకు విద్యుత్ విక్రయం ● పైలెట్ గ్రామాలైన జానంపేట, కొండారెడ్డిపల్లిలో విజయవంతం ● అన్ని వేదికల్లో ఏర్పాటుకుసిద్ధమవుతున్న టీజీ రెడ్కో ప్రభుత్వ నిర్ణయం మేరకే.. రైతులకు అందుబాటులో ఉంటూ సాగు సలహాలు, సూచనలు, సమీక్షల కోసం నిర్మించిన రైతువేదికల నిర్వహణకు నిధులు మంజూరుకావడం లేదు. సొంతంగా ఆదాయం సమకూర్చుకునేందుకు ప్రభుత్వం సౌర విద్యుత్ పలకలను ఏర్పాటు చేయడం హర్షణీయం. ప్రభుత్వ నిర్ణయంతో రైతులకు మరింత మెరుగైన సేవలు అందుతాయి. – తిరుపతి, ఏఈఓ, గుండుమాల్ క్లస్టర్ అన్ని వేదికలపై ఏర్పాటు.. ఉమ్మడి జిల్లాలో పైలెట్ గ్రామాలైన జానంపేట, కొండారెడ్డిపల్లి రైతులవేదికల్లో సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు విజయవంతమైంది. ఉమ్మడి జిల్లాలోని 467 రైతువేదికలపై ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నాం. అన్ని భవనాలు ఒకే నమూనాలో నిర్మించడంతో సౌర పలకల బిగింపు ఒకేసారి చేపట్టేందుకు వీలుంటుంది. సౌర విద్యుత్ తయారీ, విక్రయం తదితర అంశాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి వచ్చే ఆదేశాలకు అను గుణంగా తదుపరి చర్యలు తీసుకుంటాం. – మనోహర్రెడ్డి, మేనేజర్, టీజీ రెడ్కో, ఉమ్మడి పాలమూరు జిల్లా నాగర్కర్నూల్ 140 కోస్గి: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన రైతువేదికల నిర్వహణకు నిధులు సమకూరడం లేదు. ఈ క్రమంలో ప్రభుత్వం ఆదాయ సమీకరణకు రైతువేదిక భవనాలపై సోలార్ ప్యానెల్లు ఏర్పాటుచేసి విద్యుదుత్పత్తి చేసి విక్రయించేలా చర్యలు తీసుకుంటోంది. ఒక్కో వేదికపై 5 కిలోవాట్ల సామర్థ్యం గల సౌర పలకలు అమర్చడంతో విద్యుత్ అవసరాలు పోను ఏడాదికి సుమారు రూ.25 వేల ఆదాయం సమకూరేలా ప్రణాళికలు రూపొందించింది. పైలెట్ గ్రామాల్లో విజయవంతం.. రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి జిల్లాను ప్రామాణికంగా తీసుకొని జిల్లాకు రెండు చొప్పున పైలెట్ గ్రామాల రైతువేదికలను ఎంపిక చేసి సౌర విద్యుదుత్పత్తి చేపట్టింది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో మహబూబ్నగర్ జిల్లా జానంపేట, నాగర్కర్నూల్ జిల్లా వంగూర్ మండలం కొండారెడ్డిపల్లిని ఎంపిక చేసింది. ఆయా గ్రామాల్లో విజయవంతం కావడంతో మిగిలిన రైతువేదికపై సోలార్ ప్యానెల్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించడంతో రెడ్కో అధికారులు సిద్ధమయ్యారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో మొత్తం 467 రైతువేదికలపై సోలార్ ప్యానెల్స్ బిగించి సౌర విద్యుత్ తయారీకి చర్యలు తీసుకుంటోంది. నిర్వహణ భారం.. గత ప్రభుత్వ హయంలో రైతులను సమావేశపర్చి శాస్త్రవేత్తల ద్వారా శిక్షణ, సలహాలు, సూచనలు అందించడంతో పాటు ఎరువులు, విత్తనాల పంపిణీ కోసం 5 వేల ఎకరాలను ఓ క్లస్టర్గా విభజించి ఒక్కో క్లస్టర్కు ఒకటి చొప్పున రైతువేదిక నిర్మించారు. వీటి నిర్వహణ బాధ్యతను ఏఈఓలకు అప్పగించారు. భవనాల నిర్మాణం పూర్తయినా.. నిర్వహణకు నిధులు మంజూరుగాకపోవడంతో అధికారులు సైతం మిన్నకుండిపోయారు. సొంతంగా ఆదాయం లేకపోవడం, ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో రైతువేదికల లక్ష్యం నీరుగారుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు చేపడుతోంది. రైతువేదికలపై సోలార్ పలకల ఏర్పాటుతో ఆదాయం సమకూర్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ప్రభుత్వం తాజా నిర్ణయంతో రైతువేదికల నిర్వహణకు నిధుల కొరత లేకుండా సక్రమంగా సాగాలని రైతులు ఆకాంక్షిస్తున్నారు. జోగుళాంబ గద్వాల 94 వనపర్తి 69 మహబూబ్నగర్ 87 ఆదాయ సమీకరణ ఇలా.. రెడ్కో సంస్థ అధికారిక లెక్కల ప్రకారం ఒక్కో రైతువేదికపై 5 కిలోవాట్ల సామర్థ్యం గల సౌర విద్యుత్ పలకలు బిగిస్తే నెలకు 600 యూనిట్ల విద్యుదుత్పత్తి అవుతుంది. సొంత అవసరాలకు 100 యూనిట్లు వినియోగించినా.. మిగిలిన 500 యూనిట్లను విక్రయించి ఆదాయం సమకూర్చుకోవచ్చు. యూనిట్ రూ.4కు అమ్మినా నెలకు రూ.2 వేలు, ఏడాదికి రూ.24 వేల ఆదాయం వస్తుంది. అయితే సౌర పలకల ఏర్పాటుకు ప్రభుత్వం ఒక్కో వేదికకు రూ.3 లక్షలు వెచ్చించాల్సి ఉంటుంది. కేంద్రం అమలు చేస్తున్న పీఎం కుసుమ్ పథకం కింద సౌర పలకలు ఏర్పాటు చేయనున్నారు. -
స్వీయ రక్షణే ముఖ్యం
ప్రశ్న : ఎవరికి ప్రమాదకరం.. వాళ్లు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. – ప్రభాకర్, బుర్దాపేట్, గద్వాల పట్టణం డీఎంహెచ్ఓ : కరోనా ప్రమాదకరం కాదు కాని, వృద్ధులు, పిల్లలు, గర్భిణులు, గతంలో కరోనా వచ్చి ఇబ్బందులకు గురైన వాళ్లు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్లకు రిస్క్ ఉంటుంది. వీళ్లందరూ స్వీయరక్షణ అంటే చేతులు కడుక్కోవడం, మాస్క్ ధరించడం, సామాజిక దూరం పాటించడం వంటివి పాటిస్తూనే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుని రోగ నిరోధక శక్తిని పెంచుకునేలా జాగ్రత్తలు పాటించాలి. అలాగే వాకింగ్ వంటి వ్యాయామం చేయాలి. గద్వాల: కరోనా ప్రస్తుతం పాండమిక్ దశ నుంచి ఎండమిక్ దశకు చేరుకుంది. అంటే జ్వరం, జలుబు, దగ్గు, టైఫాయిడ్ లాంటివి ఎలానో కరోనా కూడా మనిషి జీవన విధానంలో అలా భాగమైంది. కరోనా నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే రోగ నిరోధక శక్తి పెంచుకోవడంతోపాటు, స్వీయరక్షణ చర్యలు పాటిస్తే అవే మనల్ని కాపాడుతాయని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి సిద్దప్ప అన్నారు. ప్రస్తుతం కరోనా వ్యాప్తి చెందుతుండడం పట్ల ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో శుక్రవారం ‘సాక్షి’ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫోన్ ఇన్ కార్యక్రమంలో ఆయన పాల్గొని.. కరోనాతోపాటు సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలు అడిగిన సందేహాలకు సమాధానం ఇచ్చి నివృత్తి చేశారు. ప్రశ్న : కరోనా కొత్త వేరియంట్ ఏమైనా ప్రమాదకరమా..? – వెంకటేష్, నల్లకుంట, గద్వాల డీఎంహెచ్ఓ : కరోనా కొత్త వేరియంట్ మ్యూటేషన్ (రూపాంతరం) చెందింది. మొదట్లో కరోనా పాండమిక్ దశగా ఉండేది. ప్రస్తుతం ఎండమిక్ దశకు చేరింది. అంటే మన జీవనంలో భాగమైంది. జలుబు, దగ్గు, జ్వరం మాదిరిగా ఉంది. ప్రమాదకరం కాదు.. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. అయితే స్వీయరక్షణ పాటించాల్సిందే. ప్రశ్న : కరోనాను ఎలా ఎదుర్కోవాలి.? – శ్రీను, సెంకడ్ రైల్వేగేట్, గద్వాల డీఎంహెచ్ఓ : కరోనాకు భయపడాల్సిన పనిలేదు. అయితే దీనిని ఎదుర్కోవాలంటే మనం రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలి. పరిశుభ్రమైన ఆహారం తీసుకోవడం, కలుషిత ఆహారం, నీటిని తీసుకోకుండా జాగ్రత్తలు పాటించడం మంచింది. ప్రశ్న : సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి. – విజయ్కుమార్, పాతహౌసింగ్బోర్డు, గద్వాల డీఎంహెచ్ఓ : సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా వానాకాలం సీజన్ కంటే కూడా 15, 20 రోజుల ముందస్తుగానే వానలు వచ్చాయి. వానలు నిరంతరాయంగా కురిస్తే ఇబ్బందులు ఉండవు. కానీ, వానలు వెలసిపోయిన తర్వాత నిలిచిన నీటి వల్ల ఇబ్బందులు తలెత్తుతాయి. ప్రధానంగా దోమలకు ఆవాసంగా మారుతుంది. దోమలు గుడ్లు పెట్టి వాటిని పెద్దఎత్తున వ్యాప్తి చెందిస్తాయి. దీంతో టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా లాంటివి వస్తాయి. మన ఇంటి చుట్టూ పరిసర ప్రాంతాల్లో నీటినిల్వ లేకుండా చూడడం, ఎప్పటికప్పుడు పారిశుద్ధ్యం చర్యలు తీసుకోవడం వంటివి పాటించాలి. అలాగే దోమల నివారణకు ఫాగింగ్ వంటివి చేపట్టి నాశనం చేస్తాం. ప్రత్యేక వైద్య బృందాలతో పర్యవేక్షణ చేపడతాం. జిల్లాస్థాయిలో డీఎంహెచ్ఓ ఆధ్వర్యంలో ఐదుగురు అధికారుల బృందం, మండల స్థాయిలో మెడికల్ ఆఫీసర్ ఆధ్వర్యంలో ఐదుగురు అధికారుల బృందం నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తాం. ఎక్కడైనా జ్వరం, డెంగ్యూ, చికెన్గున్యా వంటివి ఎక్కువ మందికి వస్తే అక్కడే ప్రత్యేకంగా క్యాంపులు ఏర్పాటు వైద్యం అందిస్తాం. జిల్లాలోని జీజీహెచ్, అన్ని పీహెచ్సీల డాక్టర్లకు కరోనా, సీజనల్ వ్యాధుల నివారణ కోసం అవసరమైన చర్యలు తీసుకునేలా ఇప్పటికే ఆదేశాలిచ్చాం. ఇందుకోసం ప్రత్యేకంగా ఏఎన్ఎం, ఆశాల వరకు ప్రత్యేక శిక్షణ కూడా ఇవ్వడం జరిగింది. కరోనా వ్యాప్తి గురించి ఆందోళన వద్దు మాస్క్ ధరించడం, చేతులు కడుక్కోవడం తప్పనిసరి జనరల్ ఆస్పత్రిలో ఐసోలేషన్ వార్డు ఏర్పాటు చేశాం సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి ‘సాక్షి’ ఫోన్ ఇన్లో డీఎంహెచ్ఓ సిద్దప్ప ప్రశ్న : ప్రభుత్వ పరంగా కరోనా వ్యాప్తి చెందకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటారు. – రమేష్, చిన్నఅగ్రహారం, గద్వాల డీఎంహెచ్ఓ : కరోనా వ్యాప్తి చెందకుండా ప్రభుత్వ చర్యలు తీసుకోవాలి. ఇటీవలి జూమ్ మీటింగ్ నిర్వహించారు. జలుబు, జ్వరం, దగ్గు వంటి లక్షణాలు ఉంటే కరోనా పరీక్ష నిర్వహిస్తాం. కరోనా కేసులు అధికంగా నమోదు అవుతున్నట్లయితే వెంటనే వారి కోసం ప్రత్యేకంగా ఐసోలేషన్ వార్డు ఏర్పాటు చేసి వారికి ప్రత్యేకంగా వైద్యం అందిస్తాం. కరోనా పరీక్షలకు అవసరమైన కిట్లు అన్ని సిద్ధం చేస్తున్నాం. అదేవిధంగా వాటికి సరిపడా మందులు సైతం పూర్తిస్థాయిలో అందుబాటులో ఉన్నాయి. -
పకడ్బందీగా భూ భారతి సదస్సులు
గద్వాల: జిల్లాలో జూన్ 3 నుంచి 20 వరకు భూ భారతి సదస్సులను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో భూ భారతి రెవెన్యూ సదస్సులపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ భూమికి సంబంధించిన అన్ని సమస్యలను పరిష్కరించడమే ప్రభుత్వం ప్రధాన ఉద్దేశం అని, ఇందుకోసం ధరణి స్థానంలో భూ భారతి చట్టం అమలు చేస్తుందన్నారు. కొత్త చట్టం ద్వారా రిజిస్ట్రేషన్, ముటేషన్, నిషేధిత భూములు, ఆర్ఓఆర్ మార్పులు– చేర్పులు, వారసత్వ భూములు, సాదాబైనామాలు, ఓఆర్సీలు వంటి సేవలు సులభతరం అవుతాయన్నారు. జిల్లాలోని ఇటిక్యాల మండలంలో భూ భారతి పైలెట్ ప్రాజెక్టును విజయవంతం చేశామన్నారు. అలాగే మంగళవారం నుంచి జరిగే రెవెన్యూ సదస్సులకు మండలం నుంచి రెండు బృందాలు ఏర్పాటు చేసుకుని రోజుకో గ్రామాన్ని సందర్శించి రెవెన్యూ సదస్సులు నిర్వహించాలన్నారు. ప్రజల నుంచి వచ్చే దరఖాస్తులు, ఫిర్యాదులు స్వీకరించి పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ, ఆర్డీఓ శ్రీనివాసరావు, తహసీల్దార్లు, డీటీలు, ఆర్ఐలు తదితరులు పాల్గొన్నారు. ● రాజీవ్ యువ వికాసం పథకం కింద ఎంపిక చేసిన లబ్ధిదారుల వివరాలను సమర్పించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో రా జీవ్ యువ వికాసం, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికపై అధికారులతో సమీక్షించారు. లబ్ధిదారుల ఎంపికను త్వరితగతిన, పారదర్శకంగా చేపట్టాలన్నారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా ధాన్యం మిల్లులకు తరలించాలని కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ధాన్యం సేకరణ చివరి దశలో ఉందని ఇప్పటికే అనుకున్న లక్ష్యంలో 90 శాతం ధాన్యం సేకరించామని, మిగిలిన 10 శాతం వారం రోజుల్లో పూర్తి చేయాలన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా గన్నీ బ్యాగులు, లారీల ట్రాన్స్పోర్ట్ వంటివి వేగవంతంగా చేపట్టాలన్నారు. -
బరువు తక్కువ పిల్లలకు బాలామృతం
గట్టు: సాధారణం కంటే తక్కువ బరువుతో రెడ్జోన్లో ఉన్న శ్యామ్ పిల్లలకు, సాధారణం కంటే తక్కువ బరువుతో ఆరెంజ్ జోన్లో ఉన్న మామ్ పిల్లలను సాధారణ స్థితికి తీసుకువచ్చేందుకు తప్పనిసరిగా బాలామృతం ప్లస్ అందించాలని యూనిసెఫ్ ప్రతినిధి, న్యూట్రిషన్ స్పెషలిస్టు ఖ్యాతి అన్నారు. శుక్రవారం మండలంలోని ఆలూరు అంగన్వాడీ కేంద్రంతోపాటు ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాన్ని కమిషనర్ కార్యాలయం నుంచి డాక్టర్ సౌజన్య, హెల్త్ కమిషనర్ కార్యాలయం నుంచి డాక్టర్ నర్సింహారావు, స్టేట్ కన్సల్టేషన్ యూనిసెఫ్ నుంచి శిరీష్ సందర్శించారు. ఈ సందర్భంగా డాక్టర్ ఖ్యాతి మాట్లాడుతూ రెడ్జోన్లో ఉన్న పిల్లలకు 9 బాలామృతం పాకెట్లను అందించి, వాటిని నిరంతరం వాడుకునేలా పర్యవేక్షణ చేయాలన్నారు. అతి తక్కువ బరువు ఉన్న పిల్లలను బాలామృతం తీసుకుంటే సాధారణ స్థితికి చేరుకుంటారన్నారు. ఆరోగ్య ఉప కేంద్రంలో గర్భిణులకు అందజేస్తున్న సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఆల్బెండజోల్, ఆమాక్సిలిన్, జింక్ ట్యాబ్లెట్లు, సిరప్స్ అందుబాటులో ఉంచాలని, వాటిని ఆరోగ్య ఉప కేంద్రాలకూ సరఫరా చేయాలని సూచించారు. కార్యక్రమంలో వ్యాక్సిన్ మేనేజర్ నరేంద్రబాబు, ఎన్సీడీ సమన్వయకర్త శ్యాంసుందర్, డాక్టర్ రమేష్, జిల్లా ఎస్ఎస్ఎఫ్పీ కోఆర్డినేటర్లు పరమేష్, సురేష్, వికాస్, సూపర్వైజర్లు వెంకటేష్, వెంకటాద్రినాయుడు, తాహేరాబేగం తదితరులు పాల్గొన్నారు. -
ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తాం
ధరూరు: వర్షాకాలంలో వరద నీటితో రిజర్వాయర్లను నింపి నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం కింద ఉన్న ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మండలంలోని జూరాల ప్రాజెక్టు రిజర్వాయర్ వద్ద గంగమ్మకు ప్రత్యేక పూజలు చేసి కుడి కాల్వకు సాగునీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈసారి కూడా గతేడాది మాదిరిగానే సమృద్ధిగా వర్షాలు కురుస్తున్నాయని, రైతులకు ఇబ్బంది కలగకుండా సాగు నీరందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ముందస్తుగా వర్షాలు కురవడంతో ప్రాజెక్టులకు వరద రావడం సంతోషంగా ఉందన్నారు. ప్రస్తుతం ఎగువ నుంచి జూరాలకు వస్తున్న వరద ఆధారంగా వారం రోజుల క్రితమే నీటి పంపింగ్ను ప్రారంభించి ర్యాలంపాడు, గుడ్డెందొడ్డి రిజర్వాయర్లను నింపేందుకు చర్యలు చేపట్టామన్నారు. వీటిని నింపడం ద్వారా గద్వాల, అలంపూర్ నియోజకవర్గాల్లోని ప్రజానీకానికి తాగు, సాగు నీరందించేందుకు ఉపయోగపడతాయన్నారు. అధికారులు రిజర్వాయర్లను పూర్తిస్థాయిలో నింపేందుకు చర్యలు తీసుకోవాలని, సాగునీరు వృథా కాకుండా చూడాలని పీజేపీ అధికారులకు సూచించారు. నడిగడ్డ ప్రాంతానికి జూరాల గుండెకాయ లాంటిదని, ఈ ప్రాజెక్టు నుంచే ఎత్తిపోతల పథకాలకు సాగు నీరందుతోందన్నారు. ఏ ప్రభుత్వాలు వచ్చినా రైతు సంక్షేమం కోసం పాటు పడతాయన్నారు. రెండు పంటలకు సాగు నీరందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు. కార్యక్రమంలో జెడ్పీ మాజీ చైర్మన్ బండారి భాస్కర్, గ్రంథాలయ సంస్థ జిల్లా మాజీ చైర్మన్ రామన్గౌడ్, జెడ్పీటీసీ మాజీ సభ్యురాలు పద్మ, నాయకులు కృష్ణారెడ్డి, ప్రభాకర్రెడ్డి, రఘువర్ధన్రెడ్డి, ప్రభాకర్గౌడ్, వంశీ, ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు. -
నేరాల నియంత్రణకే కార్డెన్ సెర్చ్
శాంతినగర్: జిల్లాలో నేరాల నియంత్రణ కోసమే కార్డెన్ సెర్చ్ చేపడుతున్నామని, ప్రజలు సహకరించాలని డీఎస్పీ మొగిలయ్య అన్నారు. వడ్డేపల్లి మున్సిపాలిటీ శాంతినగర్లోని ఇందిరానగర్కాలనీలో శుక్రవారం సాయంత్రం డీఎస్పీ ఆధ్వర్యంలో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీలోని అన్ని ఇళ్లు, వాహనాలను పోలీసులు తనిఖీ చేశారు. రిజిస్ట్రేషన్, నంబర్ ప్లేట్లు లేని 70 మోటార్సైకిళ్లు, 5 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం డీఎస్పీ మాట్లాడుతూ వివిధ ప్రాంతాల నుంచి కొత్తగా వచ్చి కొందరు నేరాలకు పాల్పడుతున్నారని, ఎవరైనా కొత్త వ్యక్తులు కనిపిస్తే వారి పూర్తి వివరాలు కనుక్కొని ఇళ్లు అద్దెకు ఇవ్వాలని, అపరిచితులు, అనుమానం ఉన్న వ్యక్తులు కాలనీల్లో సంచరిస్తుంటే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. అంతేగాక వాహనం నడిపే సమయంలో తప్పనిసరిగా హెల్మెట్, సీట్బెల్ట్ పెట్టుకోవాలని, ప్రమాదాలు జరిగితే కుటుంబాలు రోడ్డున పడతాయన్నారు. వాహనాలకు సంబంధించిన డాక్యుమెంట్లు, డ్రైవింగ్ లైసెన్స్ దగ్గర ఉంచుకోవాలన్నారు. ఇటీవల సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయని, ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని, సెల్ఫోన్లు జాగ్రత్తగా వాడాలన్నారు. హెల్మెట్, సీట్బెల్ట్ తప్పనిసరిగా ధరిస్తామని ప్రజలచే ప్రతిజ్ఞ చేయించారు. డ్రగ్స్ రవాణా, పేకాట, అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని సీఐ టాటాబాబు హెచ్చరించారు. -
ఫిర్యాదులపై వేగవంతంగా చర్యలు : ఎస్పీ
గద్వాల క్రైం: సమస్యలపై వచ్చే బాధితుల పట్ల సిబ్బంది స్నేహపూర్వకంగా మెలగాలని ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. గురువారం ఉదయం ఎస్పీ రూరల్ పోలీసుస్టేషన్ ఆకస్మికంగా తనిఖీ చేసి మాట్లాడారు. ఫిర్యాదులపై వేగవంతగా విచారణ చేపట్టి బాధితులకు పోలీస్ శాఖపై నమ్మకం కలిగేలా విధులు నిర్వహించాలని ఎస్ఐ శ్రీకాంత్కు సూచించారు. గ్రామాల్లో నిత్యం గస్తీ, పెట్రోలింగ్ నిర్వహించాలన్నారు. రోడ్డు ప్రమాదాలు, సైబర్ క్రైం, మహిళల వేధింపులు, అత్యాచార యత్నం, మిస్సింగ్ కేసులలో ప్రత్యేక నిఘా ఉంచి తగు చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామ శివారుల్లో నిత్యం వాహనాల తనిఖీలతోపాటు డ్రంకెన్ డ్రైవ్ చేపట్టాలన్నారు. స్టేషన్ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. సిబ్బంది విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. నమోదైన కేసుల వివరాలు, కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసి నేరస్తులకు శిక్షపడేలా కృషి చేయలన్నారు. డయల్ 100 కాల్స్ విషయంలో త్వరగా స్పదించాలని ఆదేశించారు.వేరుశనగ క్వింటాల్ రూ.5,339గద్వాల వ్యవసాయం: జిల్లాకేంద్రంలోని మార్కెట్ యార్డుకు శుక్రవారం 12 క్వింటాళ్ల వేరుశనగ రాగా.. గరిష్టంగా రూ.5,339, కనిష్టంగా రూ.3,619, సరాసరిగా రూ.3,619 ధరలు పలికాయి. అలాగే 94 క్వింటాళ్ల వరి (సోన) రాగా గరిష్టంగా రూ.1,979, కనిష్టంగా రూ.1,509, సరాసరిగా రూ.1,979, 2 క్వింటాళ్ల కంది రాగా.. సరాసరిగా రూ.6,106 ధరలు లభించాయి.ఫీల్డ్ అసిస్టెంట్ల బకాయిలు విడుదల చేయాలిజెడ్పీసెంటర్(మహబూబ్నగర్): ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లు ఇవ్వాల్సిన పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఫీల్డ్ అసిస్టెంట్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి నారాయణగౌడ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం జిల్లాకేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో ధర్నా నిర్వహించారు. అంతకుముందు మున్సిపల్ కార్యాలయ నుంచి తెలంగాణ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్త జాబ్కార్డులను వెంటనే ఇవ్వాలని కోరారు. ఉపాధి పనిని పట్టణ కూలీలకు వర్తింపచేయాలని సూచించారు. పని దినాలను 200 రోజులకు పెంచి రోజుకు రూ.600 కూలి ఇవ్వాలని డిమాండ్ చేశారు. గ్రామ పంచాయతీల్లో జాబ్కర్డాలలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. పని చేసిన వారికి వారంలోపు వేతనాలు చెల్లించాలన్నారు. పని ప్రదేశంలో మం చినీళ్ల, మెడికల్ కిట్లు, టెంట్ ఏర్పాటు, పనిమూర్లు, ఓఆర్ఎస్ పాకెట్లను ఇవ్వాలన్నారు. జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మోహన్ మాట్లాడుతూ బీజేపీ మూడోసారి అధికారంలోకి వచ్చిన తరువాత దేశవ్యాప్తంగా నిధులను పని దినాలను కూలీలకు జాబ్కార్డులను పెద్ద ఎత్తున కోత విధించిందని ఆరోపించరు. అనంతరం డీఆర్డీఓ నర్సిములుకు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో నాయకులు ఆంజనేయులు, హన్మంతు, భగవంతు రాములు, శివలీలా, ఎఫ్ఏలు వెంకటయ్య, నర్సిములు, సాయిలు, చంద్రశేఖర్, వెంకటయ్య, మొగులయ్య, కొం్డయ్య, నీలమ్మ, మంజుర చెన్న య్య, దాసు, జయమ్మ నాగలక్ష్మి పాల్గొన్నారు.మక్తల్ ఎమ్మెల్యేకు తప్పిన ప్రమాదంషాద్నగర్రూరల్: నారాయణపేట జిల్లా మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి వాహనాన్ని కారు ఢీ కొట్టింది. ఈ ఘటన ఫరూఖ్నగర్ మండల పరిధిలోని రాయికల్ టోల్ప్లాజా వద్ద చోటుచేసుకుంది. వివరాలివీ.. మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి శుక్రవారం తన కారులో హైదరాబాద్ నుంచి మహబూబ్నగర్వైపు వెళ్తున్నారు. జడ్చర్లవైపు నుంచి షాద్నగర్వైపు వెళ్తున్న మరో కారు టోల్ప్లాజాలోని వేరే లైన్కు మారేందుకు డ్రైవర్ పక్కకు తిప్పాడు. ఎమ్మెల్యే వాహనం టోల్ప్లాజాను దాటి వెళ్తున్న సమయంలో పక్కనుంచి వచ్చిన కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో రెండు వాహనాలూ దెబ్బతిన్నాయి. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. అనంతరం మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి స్థానిక నేతలు గుమ్మడికాయ కొట్టి దిష్టి తీసి మరో వాహనంలో పంపించారు. -
జూరాలకు వరదొచ్చింది
పూర్తిస్థాయి నీటి మట్టంతో కళకళాడుతున్న జూరాల ప్రాజెక్టు గద్వాల/ధరూరు/ఆత్మకూర్: కృష్ణా బేసిన్లో ఎగువ ప్రాంతంలోని మహారాష్ట్ర, కర్ణాటకలో వారం రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద వస్తోంది. బుధవారం సాయంత్రానికి ప్రాజెక్టుకు కేవలం 3,624 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా.. గురువారం మధ్యాహ్నం నుంచి క్రమంగా వరద పెరిగింది. ఎగువన ఉన్న నారాయణపూర్ ప్రాజెక్టు నుంచి 10 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగుతుండగా.. భీమా ప్రాజెక్టు నుంచి దాదాపు లక్ష క్యూసెక్కులు విడుదల చేశారని పీజేపీ అధికారులు తెలిపారు. దీంతో ఈ సీజన్లో తొలిసారి జూరాల ప్రాజెక్టు గేట్లు ఎత్తారు. గురువారం రాత్రి 9 గంటల సమయంలో ప్రాజెక్టుకు 99 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా.. 12 గేట్లను ఎత్తి 83,616 వేల క్యూసెక్కుల నీటిని దిగువన శ్రీశైలం ప్రాజెక్టుకు విడుదల చేశారు. ఇదిలా ఉండగా.. చివరిసారిగా 2007లో మే నెలలోనే జూరాలకు వరద వచ్చిందని, మళ్లీ 18 ఏళ్ల తర్వాత ఈ నెలలో వరద రావడం ఇదే మొదటిసారి అని అధికారులు చెబుతున్నారు. 40 ఏళ్ల ప్రాజెక్టు చరిత్రలో మే నెలలో వరద రావడం ఇది ఐదోసారి మాత్రమే. జూరాల ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటినిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా, ప్రస్తుతం జలశయంలో 8.571 టీఎంసీల నీరు ఉంది. ● జవహర్ నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంలో భాగమై లిఫ్టు–1 గుడ్డెందొడ్డి వద్ద రెండు పంపులను ప్రారంభించి 1,500 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోసి.. గుడ్డెందొడ్డి, ర్యాలంపాడు రిజర్వాయర్లను నింపుతున్నారు. జూలై మూడో వారంలో ప్రారంభం కావాల్సిన వరద ముందు రావడంతో.. అన్నదాతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. విద్యుదుత్పత్తి ప్రారంభం కాగా.. గురువారం అర్ధరాత్రి ఎగువ, దిగువ జల విద్యుత్కేంద్రాల్లో విద్యుదుత్పత్తి ప్రారంభమైంది. ఎస్ఈ శ్రీధర్ బృందం ప్రత్యేక పూజలు నిర్వహించి విద్యుదుత్పత్తిని ప్రారంభించారు. శ్రీశైలం ప్రాజెక్టుకు పరుగులు పెడుతున్న కృష్ణమ్మ 18 ఏళ్ల తర్వాత మే నెలలోనే ప్రవాహం 99 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో.. 12 గేట్లు ఎత్తివేత అర్ధరాత్రి 11 యూనిట్లలో విద్యుదుత్పత్తి ప్రారంభం అప్రమత్తంగా ఉండాలి జూరాల ప్రాజెక్టుకు వరద వస్తున్న నేపథ్యంలో దిగువనున్న లోతట్టు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చేపల వేట కోసం మత్య్సకారులు నదిలోకి వెళ్లవద్దని జోగుళాంబ గద్వాల జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ హెచ్చరించారు. సాగునీటి పారుదల శాఖ అధికారులు, రెవెన్యూ, పోలీసు శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండి ఎప్పటికప్పుడు వరద పరిిస్థితిని సమీక్షిస్తూ అందుకనుగుణంగా అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. -
ఫిట్లెస్ బస్సులు
ఈ నెల 16 నుంచి మొదలైన ప్రైవేట్ బస్సుల సామర్థ్య పరీక్షలు ● ఉమ్మడి జిల్లాలో 1,383 బస్సులకు గాను 245 పూర్తి ● కండీషన్లో లేని వాహనాలు వెనక్కి పంపాలని నిర్ణయం ● ఫిట్నెస్ పరీక్షలకు రాకుండానే నడిపిస్తున్న వైనం ● విద్యార్థుల సంరక్షణ బాధ్యత యాజమాన్యాలదే ప్రైవేట్ విద్యాసంస్థల బస్సుల ఫిట్నెస్ విషయంలో కొందరు అధికారులు ఉదాసీనంగా, ఏజెంట్లు చెప్పినట్లుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. 2024– 25లో దాదాపు వందకు పైగా బస్సులు ఫిట్నెస్ పరీక్షలు చేసుకోకుండానే విద్యార్థులను తరలించినట్లు తెలుస్తోంది. పాఠశాలలు ప్రారంభమయ్యే నాటికి అర్హత పత్రాలు తీసుకోవాల్సిన కొందరు యాజమాన్యాలు మరమ్మతు ఇతర కారణాలతో ఫిట్నెస్ పరీక్షలు చేయించుకోవడం లేదు. విద్యాసంస్థల బస్సులన్నీ నిబంధనల మేరకు వసతులు కల్పించి ఫిట్నెస్ పరీక్షలు పూర్తి చేసుకోవాలి. బస్సుల నిర్వహణకు సంబంధించి విద్యార్థుల పూర్తి సంరక్షణ బాధ్యత తమదేనంటూ పాఠశాల యాజమాన్యాలు రవాణా శాఖకు హామీపత్రం సమర్పించాలి. కఠినంగా వ్యవహరిస్తేనే.. -
పకడ్బందీగా నకిలీ విత్తనాల నియంత్రణ
గద్వాల క్రైం: జిల్లాలో నకిలీ విత్తనాల నియంత్రణకు పకడ్బందీగా నిఘాపెట్టి కఠినంగా వ్యవహరించాలని ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. గురువారం ఎస్పీ కార్యాలయంలో నేర సమీక్ష సమావేశం నిర్వహించి మాట్లాడారు. రైతులు వివిధ పంటల సాగుకు మార్కెట్లో విత్తనాలు, మందులు, పెస్టిసైడ్స్ తదితర వాటిని కొనుగోలు చేసేందుకు వస్తుంటారని, ఈ క్రమంలో రైతులకు నాసిరకం విత్తనాలు, మందులను ఫర్టిలైజర్ దుకాణాల యజమానులు అంటగట్టే అవకాశం ఉందన్నారు. నాసిరకం మందులు, విత్తనాల విక్రయాలపై ప్రత్యేకంగా దృష్టిసారించి నిలువారించలన్నారు. ఎక్కడైన నకిలీ విత్తనాలు రైతులకు విక్రయిస్తున్నట్లు తెలిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే బక్రీద్ పండుగా సందర్భంగా జిల్లాలో శాంతిభద్రతల విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. అన్ని ప్రార్థనా మందిరాల వద్ద పోలీసు పికెట్ నిర్వహించి అనుమానిత వ్యక్తులను గుర్తించి విచారణ చేపట్టాలన్నారు. అన్ని మతాలకు సంబంధించిన పెద్దలతో పీస్ కమిటీ సమావేశాలు నిర్వహించి స్వీయ జాగ్రత్తలపై అవగాహన కల్పించాలన్నారు. అలాగే సమస్యలపై వచ్చే బాధితులకు న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రోడ్డు ప్రమాదాలపై ప్రత్యేక విచారణ చేపట్టాలన్నారు. అనుమతి లేకుండా ఇసుక, మట్టి, రేషన్ బియ్యం, నిషేధిత మత్తు పదార్థాలు, గంజాయి, పేకాట స్థావరాలను గుర్తించి కట్టడి చేయాలన్నారు. సరిహద్దు ప్రాంతాల్లో పటిష్టమైన నిఘా ఉంచాలన్నారు. సిబ్బందిపై బాధితులు ఎవరైనా ఫిర్యాదు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. స్టేషన్ పరిధిలో సిబ్బంది ఎవరైనా ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసినా అనర్హత వేటు తప్పదన్నారు. నమోదైన కేసుల విషయంలో నిర్లక్ష్యం లేకుండా వీలైనంత త్వరగా కోర్టులో చార్జీషీట్ దాఖలు చేసి నిందితులకు శిక్ష పడేలా చూడాలన్నారు. అనంతరం ఆయా స్టేషన్లలో నమోదైన కేసుల గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో డీఎస్పీ మొగిలయ్య, సీఐలు టాటాబాబు, శ్రీను, రవిబాబు, ఎస్ఐలు శ్రీకాంత్, శ్రీహరి, వెంకటేష్, శ్రీనివాసులు, నాగశేఖర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
9 ఏళ్లు.. 5 కి.మీ.,
డబుల్ నిర్మాణానికి నోచుకోని అంతర్రాష్ట్ర రహదారి ●అయిజ: ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన రెండేళ్లకే తెలంగాణ– ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్యన ఉన్న సింగిల్ రోడ్డును డబుల్గా మార్చేందుకు, 5 కల్వర్టులను నిర్మించేందుకు 2016లో అప్పటి ప్రభుత్వం రూ.12 కోట్లు మంజూరు చేసింది. అలాగే ఇదే దారిలో అయిజ సమీపంలోని పోలోని వాగుపై హైలెవల్ బ్రిడ్జి నిర్మించేందుకు మరో రూ.2 కోట్ల నిధులు కేటాయించారు. అయితే పనులు ప్రారంభించి.. తొమ్మిదేళ్లు గడుస్తున్నా నేటికీ పూర్తి కాలేదు. డబుల్ రోడ్డు నిర్మాణం చేపట్టేందుకు అధికారులు అప్పట్లోనే సింగిల్ రోడ్డును తొలగించారు. రోడ్డు వెడల్పు చేసి కంకరవేసి నాలుగేళ్లపాటు బీటీ వేయకుండా వదిలేశారు. దీంతో రోడ్డుపై ప్రయాణించే వారు ద్విచక్రవాహనాలపై నుంచి కిందపడి అనేక మంది క్షతగాత్రులయ్యారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరికొందరు మృతిచెందారు. అధికారులు, ప్రజా ప్రతినిధులపై ప్రజలు తీవ్ర విమర్షలు చేయడంతో తిరిగి మూడు సంవత్సరాల క్రితం పనులు పునర్ ప్రారంభించారు. అయితే ఇప్పటి వరకు సగం పనులు కూడా పూర్తికాలేదు. కాంట్రాక్టర్ను మార్చినా.. బిల్లులు చెల్లించడం లేదని మొదటి కాంట్రాక్టర్ పనులు నిలిపివేశాడు. దీంతో రెండేళ్ల క్రితం ఆర్అండ్బీ అధికారులు సదరు కాంట్రాక్టర్ను తొలగించి మరొకరికి బాధ్యతలు అప్పగించారు. అయినప్పటికీ పనుల్లో ఎలాంటి పురోగతి కనిపించలేదు. మొత్తం 10 కి.మీ., బీటీ నిర్మించాల్సి ఉండగా ఇప్పటి వరకు కేవలం 5 కి.మీ. మాత్రమే నిర్మించారు. అలాగే అయిజ సమీపంలో పోలోని వాగుపై రూ.2 కోట్లతో నిర్మించతలపెట్టిన హై లెవల్ బ్రిడ్జి సైతం అసంపూర్తి గానే ఉంది. ఇక్కడ కూడా కాంట్రాక్టర్కు బిల్లు చెల్లించకపోవడంతో పనులు నిలిపివేశాడని సమాచారం. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న సింగిల్ రోడ్డును డబుల్గా మార్చేందుకు 2016 సంవత్సరంలో క్రితం రూ.12 కోట్లు మంజూరు చేశారు. 10 కి.మీ., పొడవైన ఈ రోడ్డులో 5 కల్వర్టులు నిర్మించాల్సి ఉంది. అయితే అధికారుల నిర్లక్ష్యం.. ప్రజాప్రతినిధుల అలసత్వం మూలంగా గడిచిన తొమ్మిదేళ్లుగా రోడ్డు నిర్మాణం సా..గుతోంది. ఇప్పటి వరకు కేవలం 5 కి.మీ., మేర రోడ్డు నిర్మించిన కాంట్రాక్టర్.. ఒక్క కల్వర్టు కూడా ఏర్పాటు చేయలేకపోయారు. ఫలితంగా ఇదే రోడ్డు మీదుగా రాకపోకలు సాగించాల్సిన 20 గ్రామాల ప్రజలు అష్టకష్టాలు పడాల్సి వస్తోంది. అసంపూర్తిగా హై లెవల్ బ్రిడ్జి నిర్మాణం బిల్లులు రావడం లేదు.. పులికల్ రోడ్డుపై పోలోనివాగు వద్ద రూ.2 కోట్లతో హై లెవల్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాను. అలాగే మండలంలోని చిప్పదొడ్డి, యాపదిన్నె గ్రామాల పరిసర ప్రాంతాల్లో బ్రిడ్జి పనులు చేపట్టాను. పనులు పూర్తి చేసినా బ్రిడ్జిలకు కూడా అధికారులు బిల్లులు చెల్లించడం లేదు. ఇప్పటి వరకు రూ.2.30 కోట్లు బిల్లులు పెండింగ్లో ఉండటంతో పనులు ఆపేశాను. బిల్లు మంజూరు చేస్తేనే పనులు తిరిగి ప్రారంభిస్తాను. – హన్మంతురెడ్డి, కాంట్రాక్టర్ ప్రమాదాలు జరుగుతున్నాయి రోడ్డు, బ్రిడ్జి నిర్మాణం పూర్తి కాకపోవడంతో ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే అనేక మంది గాయాలపాల య్యారు. చికిత్స పొందు తూ కొందరు వ్యక్తులు ఆస్పత్రిలో మృతిచెందారు. ఇప్పటికై నా సరే అధికారులు స్పందించి రోడ్డు, బ్రిడ్జి నిర్మాణం పనులు పూర్తిచేయా లని కోరుతున్నాం. – పుల్లారెడ్డి, అయిజ త్వరలోనే పూర్తి చేస్తాం.. రోడ్డు నిర్మాణానికి అనేక ఆటంకాలు ఎదురవుతు న్నాయి. మొదటి కాంట్రాక్టర్ పనులు వేగవంతం చేయకపోవడంతో తొలగించి.. మరొకరికి అప్ప గించాం. పనులు వేగంగా పూర్తిచేయాలని ఆ దేశించాం. అయితే బిల్లులు రాలేదని హైలెవ ల్ బ్రిడ్జి నిర్మాణం పనులు నిలిపివేశారు. సమ స్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం. – రాజేందర్, ఆర్అండ్బీ ఎస్ఈ 20 గ్రామాలకు ఈ రోడ్డే ఏకై క మార్గం ఏళ్లతరబడిగా సా..గుతున్న పనులతో నరకయాతన సగం కూడా పూర్తికాని రోడ్డు పనులు హై లెవల్ బ్రిడ్జిది అదే పరిస్థితిప్రమాదపుటంచున ప్రయాణం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమీపంలోని నాగులదిన్నె, నందరవరం, ముగితి గ్రామాలతోపాటు తెలంగాణ రాష్ట్రంలోని కొత్తపల్లి, మైనిపల్లి, రాజాపురం, పులికల్, మేడికొండ తదితర గ్రామాలు, అయిజ మున్సిపాలిటీ పరిధిలోని తుపత్రాల, అయిజ పట్టణ ప్రజలు ఈ రోడ్డుపైనే ప్రయాణం చేయాల్సి ఉంది. వీరంతా ఏళ్లతరబడిగా సాగుతున్న రోడ్డు నిర్మాణ పనులతో ప్రమాదపుటంచున ప్రయాణం చేయాల్సి వస్తోంది. కంకర వేయడంతో ద్విచక్రవాహనదారులు తరుచుగా ప్రమాదాలకు గురవుతున్నారు. -
భూమి కోల్పోయిన ప్రతిరైతుకు పరిహారం
గద్వాల: భారత్మాల రహదారి నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులకు న్యాయపరంగా నష్టపరిహారం అందించేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ సంతోష్ అన్నారు. గురువారం కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో జాతీయ రహదారి నిర్మాణానికి భూములు కోల్పోయిన కేటీదొడ్డి, మండలం కుచినెర్ల, అయిజ మండలం దేవబండ గ్రామాల రైతలతో నుంచి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కేటీదొడ్డి నుంచి రాజోలి వరకు సుమారు 55 కిలోమీటర్ల పొడవునా భారత్ మాల రహదారి నిర్మించబడుతుందని తెలిపారు. భారత్మాల రహదారి పూర్తయిన తర్వాత రవాణా, వ్యవసాయం, వ్యాపారం వంటి అనేక రంగాల్లో జిల్లా వేగవంతమైన అభివృద్ధి సాధించగలదని కలెక్టర్ తెలిపారు. ఈ ప్రాజెక్టులో ఇప్పటికి 70 నుంచి 80 శాతం వరకు పనులు పూర్తయ్యాయని, ఇది రైతుల సహకారంతోనే సాధ్యమైందని పేర్కొన్నారు. రహదాని నిర్మాణంలో భూములు కోల్పోయిన ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా చూస్తామన్నారు. నష్టపరిహారం పెంచే దిశగా ఎన్హెచ్ఏఐ అధికారులతో చర్యలు జరుపుతామన్నారు. తగిన నిధులు మంజూరయ్యేలా చొరవ తీసుకుంటామని హామీ ఇచ్చారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు లక్ష్మీనారాయణ, నర్సింగ్రావు, రైతులు తదితరులు పాల్గొన్నారు. ● పదవీ విరమణ పొందుతున్న ముఖ్య ప్రణాళిక అధికారి లక్ష్మణ్, షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి సరోజకు జిల్లా యంత్రాంగం తరపున సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 35 ఏళ్లపాటు వివిధ హోదాలతో ఉత్తమ సేవలు అందించడం అభినందనీయమన్నారు. అనంతరం పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. -
రేపు సీతారాముల కల్యాణం
ఎర్రవల్లి: బీచుపల్లి పుణ్యక్షేత్రంలోని కోదండరామస్వామి ఆలయంలో శుక్రవారం పునర్వసు నక్షత్రాన్ని పురస్కరించుకొని సీతారాముల కల్యాణాన్ని నిర్వహించనున్నట్లు ఆలయ మేనేజర్ సురేందర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆలయ చుట్టు ప్రక్కల ప్రాంతాల నుండి భక్తులు అధిక సంఖ్యలో హాజరవ్వాలని ఆయన కోరారు.కొనుగోలు కేంద్రంలో తనిఖీలుఅయిజ: మండలంలోని బైనిపల్లిలో నిర్వహిస్తున్న వరి కొనుగోలు కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తులు ధాన్యాన్ని విక్రయిస్తున్నారనే సమాచారంతో అధికారులు విచారించారు. బుధవారం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన బీఆర్ఎస్వీ జిల్లా కోఆర్డినేటర్ పల్లయ్య ఇతర రాష్ట్రాల నుంచి వరి ధాన్యం తరలించి కొనుగోలు కేంద్రాల్లో విక్రయిస్తున్నారని అడిషనల్ కలెక్టర్ లక్ష్మీనారాయణకు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. స్పందించిన అడిషనల్ కలెక్టర్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ప్రశాంత్ను విచారణకు పంపారు. ఆయన కొనుగోలు కేంద్రం చేరుకొని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ రైతులు, నిర్వాహకులతో మాట్లాడారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న రైతుల పంట పొలాలకు వెళ్లి వరి పండించారో లేదో పరిశీలించి రిపోర్ట్ ఇవ్వాలని ఏఈఓ శివకుమార్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఆదేశించారు.మొక్కలే మానవాళికి జీవనాధారంఎర్రవల్లి: మొక్కలే మానవాళికి జీవనాధారమని పదో బెటాలియన్ కమాండెంట్ జయరాజ్ అన్నారు. బుధవారం మండలంలోని బీచుపల్లి పదో బెటాలియన్లో ఎన్ఆర్ఈజీఎస్ నిధుల నుంచి నీటి కుంట ఏర్పాటు కోసం కమాండెంట్ భూమిపూజ చేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నీటి కుంటలను ఏర్పాటు చేసుకుంటే మొక్కలకు అవసరమైనప్పుడు నీరు వినియోగించుకోవచ్చునని అన్నారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ ద్వారా రూ. 3లక్షల వ్యయంతో బెటాలి యన్లో నీటి కుంటను ఏర్పాటు చేయడం గర్వకారణమన్నారు. అసిస్టెంట్ కమాండెంట్ శ్రీనివాస్, ఆర్ఐ రాజేశం ఉన్నారు.ప్రభుత్వ విద్యతోనే అంతరాలు లేని సమాజంగద్వాలన్యూటౌన్: విద్యతోనే సమాజంలో ఆర్థిక, సామాజిక అంతరాలు తగ్గుతాయని మాజీ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి అన్నారు. ప్రభుత్వ పాఠశాలలను పరిరక్షించాలని, అంతరాలు లేనివిద్య అందించాలని రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ పౌర స్పందన వేదిక చేపట్టిన ప్రచార జాత బుధవారం గద్వాలలోని పాతబస్టాండ్కు చేరుకుంది. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో సామాజిక ఆర్థిక అంతరాలు తగ్గడానికి విద్య ప్రధాన ఆయుధమని అందులోను విద్య ప్రభుత్వ ఆధీనంలో ఉండడం మరీ అవసరం అన్నారు. సమాజంలోని అంతరాలను తొలగించే ఉద్దేశ్యం లేకే పాలకులు ఉద్దేశపూర్వకంగా విద్యపై దాడి చేస్తున్నారని, అందులో భాగంగా విద్యా ప్రైవేటీకరణ విధానాలను పాల్పడుతున్నారని విమర్శించారు. విద్య ప్రభుత్వ ఆధీనంలో ఉంటే సమాన అవకాశాలు దొరుకుతాయని మేధావులందరూ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులే అని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలను ప్రజలే పరిరక్షించుకోవాలని పిలుపునిచ్చారు. విద్యా ప్రైవేటీకరణ ద్వార వ్యాపార దృక్పథం మూడనమ్మకాలు పెరుగుతాయన్నారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతం కోసం ప్రజలు ఐక్యంగా పోరాడాలని కోరారు. రమేష్, గోపాల్, రమణ, చంద్రకాంత్, బీసన్న పాల్గొన్నారు. -
ఫోన్ చేయాల్సిన నంబర్: 7013959920, 7013959652
గద్వాల: కరోనా కేసులు నమోదు అవుతున్న నేపథ్యంలో జెన్ –1 వైరస్ వేరియంట్ లక్షణాలపై తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ఈ నెల 30న శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు డీఎంహెచ్ఓ సిద్దప్పతో ‘సాక్షి’ ఫోన్ ఇన్ నిర్వహిస్తుంది. జిల్లా ప్రజలు కరోనా వైరస్పై తమకు ఉన్న అనుమానాలు, వైరస్ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు వంటి అంశాలపై నేరుగా ఫోన్ చేసి మాట్లాడి నివృత్తి చేసుకోవచ్చు. రేపు డీఎంహెచ్ఓతో ‘సాక్షి’ ఫోన్ ఇన్ -
జిల్లాను యూనిట్గా తీసుకొని పరిహారం చెల్లించాలి
గట్టు: భారత్ మాల రోడ్డు నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం చెల్లింపుల్లో చాలా తేడాలున్నాయని, జిల్లాను యూనిట్గా తీసుకొని నష్టపరిహారం చెల్లించాలని రైతులతో కలసి నాయకులు జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణను బుధవారం కలసి వినతిపత్రాన్ని అందజేశారు. బీఆర్ఎస్ రాష్ట్ర సినియర్ నాయకుడు నాగర్దొడ్డి వెంకట్రాములు, కాంగ్రెస్ పార్టీ నాయకుడు గౌస్, మహాబూబ్పాష, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు మాచర్ల ప్రకాష్ రైతులతో కలసి అదనపు కలెక్టర్ను కలిశారు. భారత్మాల ఆరు వరుసల జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా భూములు కోల్పోయిన గట్టు, గంగిమాన్దొడ్డి గ్రామాలకు చెందిన కొంత మంది రైతులకు ఆర్భిట్రేషన్ తర్వాత అందించే పరిహారం అందకపోవడంతో గంగిమాన్దొడ్డి గ్రామం దగ్గర మంగళవారం పనులను అడ్డుకుని నిరసన తెలియజేసిన విషయం తెలిసిందే. దీంతో రైతులు రహదారి పనుల సైట్ ఇన్చార్జ్ అప్జల్తో కలసి అదనపు కలెక్టర్ను కలిశారు. రహదారి నిర్మాణంలో భూముల కోల్పోయిన రైతులకు ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా నష్ట పరిహారం చెల్లించడం ద్వారా రైతులు నష్టపోతున్నారని, జిల్లాను యూనిట్గా తీసుకుని మార్కెట్ ధరలకు అనుగుణంగా రైతులకు నష్టపరిహారం చెల్లించాలని అదనపు కలెక్టర్కు విన్నవించారు. ఆర్భిట్రేషన్ తర్వాత రైతులకు చాలా మంది నోటీసులు రాక డబ్బులు అందక ఇబ్బంది పడుతున్నారని, రెండవ విడత పరిహారం అందుకొని రైతులను గుర్తించి, తక్షణమే వారికి పరిహారం చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. రెండవ విడత పరిహారం అందుకొని రైతులను గుర్తించి, వారికి పరిహారం అందించే విధంగా చర్యలు తీసుకుంటామని అదనపు కలెక్టర్ హామీ ఇచ్చినట్లు రైతులు తెలిపారు. -
చెక్పోస్టు వద్ద కొనసాగుతున్న తనిఖీలు
రాజోళి: మండలంలోని తుంగభద్ర నదిపై గల సుంకేసుల డ్యాం వద్ద తనిఖీలు కొనసాగుతున్నాయి. పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఈ చెక్పోస్టు ఏర్పాటుచేసిన విషయం విధితమే. ఏపీ తదితర ప్రాంతాల నుంచి ఆవులు, పశువులను తీసుకువెళ్లే వాహనాలను తనిఖీ చేస్తున్నారు. బక్రీద్ పండుగ సందర్భంగా ఆవులను తరలించే అవకాశమున్నందున ఈ తనిఖీలు నిర్వహిస్తున్నారు. బుధవారం కూడా వీఎల్ఓ ప్రసాద్ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బందితో కలిసి వాహనాల తనిఖీలు నిర్వహించారు. వాహనాల్లో ఆవులు, పశువులు ఉన్నట్లయితే వాటికి సంబందించిన రశీదులు, అనుమతి పత్రాలు ఉన్నాయా, లేదా ఆరా తీస్తున్నారు. ఎవరైనా నిబంధనలను ఉల్లంఘించి అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలుంటాయని వారు హెచ్చరించారు. -
బాధ్యతగా పనిచేయాలి
గద్వాల: లైసెన్స్డ్ సర్వేయర్లు బాధ్యతగా పనిచేయాలని అదనపు కలెక్టర్ వి.లక్ష్మీనారాయణ అన్నారు. మంగళవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో లైసెన్స్డ్ సర్వేయర్లకు కిట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భూ భారతి చట్టం ప్రకారం రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ వంటి ప్రక్రియలో సర్వే మ్యాప్లు తప్పనిసరిగా ఉండటంతో గ్రామీణ ప్రాంతాల్లో లైసెన్స్డ్ సర్వేయర్ల ప్రాధాన్యత గణనీయంగా పెరుగుతుందన్నారు. శిక్షణ పొందుతున్న అభ్యర్థులు పనిలో నైపుణ్యాన్ని మెరుగుపర్చుకోవాలని సూచించారు. సర్వే ప్రక్రియలో థియరీ ఎంతో ముఖ్యమో ప్రాక్టికల్ కూడా అంతే ముఖ్యమన్నారు. శిక్షణ విజయవంతంగా పూర్తిచేసిన అభ్యర్థులకు పరీక్ష అనంతరం లైసెన్స్డ్ సర్టిఫికెట్లు జారీ చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడీ రాంచందర్, చందర్ పాల్గొన్నారు.ఈ–శ్రమ్ పోర్టల్లో నమోదు చేసుకోండిగద్వాల: జిల్లాలో కొరియర్, హోంసర్వీస్, ఫుడ్ డెలివరీ, ఏసీ టెక్నీషియన్లు, డిజైనర్స్, వీడియో ఎడిటర్లు వంటి విధులు నిర్వర్తించే కార్మికులు ఈ–శ్రమ్ పోర్టల్లో నమోదు చేసుకుని గుర్తింపు కార్డులు పొందాలని కార్మికశాఖ ఏసీ మహేశ్ కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. అమెజాన్, ఫ్లిప్కార్డు, జొమాటో, స్విగ్గి వంటి సంస్థల్లో పనిచేసే వారిని కార్మికులుగా ప్రభుత్వం గుర్తించి.. వివిధ సంక్షేమ పథకాలు వర్తింపచేస్తుందని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు 14434 హెల్ప్లైన్ నంబర్ను సంప్రదించాలని సూచించారు.ఉపాధ్యాయులకు శిక్షణఅలంపూర్: అలంపూర్ చౌరస్తాలోని విశ్వశాంతి జూనియర్ కళాశాలలో ప్రభుత్వ ఉపాధ్యాయులకు రెండో విడత శిక్షణ తరగతులు మంగళవారం ప్రారంభమయ్యాయి. అలంపూర్, ఉండవెల్లి, మానవపాడు, రాజోళి, వడ్డేపల్లి, ఇటిక్యాల మండలాల్లోని స్కూల్ అసిస్టెంట్స్ శిక్షణ తరగతుల్లో పాల్గొనగా.. జిల్లా రీసోర్స్పర్సన్లు వెంకటేశ్, రాఘవేంద్ర పలు అంశాలపై శిక్షణ ఇచ్చారు. విద్యార్థులకు సులభ పద్ధతుల్లో బోధించాలని సూచించారు. శిక్షణ తరగతులను రాష్ట్ర రీసోర్స్పర్సన్లు గీత, వాణి పరిశీలించారు. నూతన విద్యా విధానంపై ఉపాధ్యాయులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో కోర్సు డైరెక్టర్ శివప్రసాద్, ఇన్చార్జి హేమలత తదితరులు పాల్గొన్నారు.రైతులను ఆదుకోవాలిగద్వాల: అకాల వర్షాలకు ధాన్యం తడిసి ఇబ్బందులు పడుతున్న రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని బీజేపీ నాయకులు కోరారు. ఈ మేరకు మంగళవారం కలెక్టర్ బీఎం సంతోష్కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు రామాంజనేయులు, డీకే స్నిగ్దారెడ్డి మాట్లాడుతూ.. ప్రస్తుతం వాతా వరణంలో తేమశాతం ఎక్కువగా ఉన్నందున ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ధాన్యంలో తేమశాతం రావడం కష్టతరమన్నారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు పండించిన ధాన్యాన్ని త్వరగా కొనుగోలు చేయాలని కోరారు. అదే విధంగా పొగాకును సంబంధిత కంపెనీలు కొనుగోలు చేయకుండా.. ధరలు, తూకం విషయాల్లో రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని తెలిపారు. రైతులతో చేసుకున్న అగ్రిమెంట్ ప్రకా రం పొగాకు కొనుగోలు చేయించాలన్నారు. కార్యక్రమంలో రాంచంద్రారెడ్డి, బండల వెంకట్రాములు, అక్కల రమాదేవి, బలిగెర శివారెడ్డి, దేవాదాసు, రవికుమార్ పాల్గొన్నారు.రామన్పాడుకు నీటి సరఫరా నిలిపివేతమదనాపురం: మండలంలోని రామన్పాడు జలాశయంలో మంగళవారం సముద్రమట్టానికి పైన 1,016 అడుగులు ఉన్నట్లు ఏఈ వరప్రసాద్ తెలిపారు. జూరాల జలాశయం ఎడమ, కుడి కాల్వల ద్వారా నీటి సరఫరా లేదని.. రామన్పాడు జలాశయం నుంచి కుడి, ఎడమ కాల్వలకు 12 క్యూసెక్కుల నీటి ని విడుదల చేస్తున్నామని వివరించారు. -
పత్తి సాగుకు సన్నద్ధం
●8 ఎకరాల్లో సాగు.. గతేడాది క్వింటాల్ పత్తి రూ. 7,500 పైగా ధర పలికింది. ఈఏడాది కూడా మంచి దిగుబడి, ధర వస్తుందన్న ఆశతో 8 ఎకరాల్లో పంటసాగు చేసేందుకు పొలాన్ని సిద్ధం చేస్తున్నాను. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వ్యవసాయశాఖ అధికారులు చర్యలు తీసు కోవాలి. – రవికుమార్, రైతు, చెన్నిపాడు మంచి దిగుబడి వస్తుందని.. గత సీజన్లో పత్తిని సాగుచేయగా.. ఎకరాకు 15 క్వింటాళ్లకు పైగా దిగుబడి వచ్చింది. తక్కువ పెట్టుబడితో ఎక్కువ పంట వస్తుందనే ఆశతో ఈసారి 15 ఎకరాల్లో పత్తిసాగు చేస్తున్నా. వరుణదేవుడు కరుణించాలి. – గొల్ల వెంకట్రాములు, రైతు, మానవపాడు నకిలీ విత్తనాలను అరికడుతున్నాం.. జిల్లాలో నకిలీ విత్తనాలను అరికడుతున్నాం. ప్రభుత్వం అనుమతించిన విత్తనాలను ఫర్టిలైజర్ దుకాణాల్లో ఎమ్మార్పీ ధరలకే విక్రయించేలా చర్యలు తీసుకుంటున్నాం. బ్లాక్ మార్కెట్లో పత్తి విత్తనాలు అమ్మితే మా దృష్టికి తీసుకురావాలి. – సక్రియా నాయక్, జిల్లా వ్యవసాయశాఖ అధికారి మానవపాడు: పత్తికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. తక్కువ పెట్టుబడితో పండించే పంటకు మార్కెట్లో గిట్టుబాటు ధర లభిస్తుండటం.. జిల్లావ్యాప్తంగా నల్ల, ఎర్రనేలలు ఉండటం.. ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని వాతావరణశాఖ పేర్కొంటున్న నేపథ్యంలో జిల్లా రైతులు పత్తిసాగుకు సై అంటున్నారు. అదే విధంగా పంట చేతికొచ్చే సమయానికి ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు అందుబాటులో ఉండటం కలిసొచ్చే అంశంగా రైతులు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే, వానాకాలం ప్రారంభానికి ముందే మోస్తరు వర్షాలు కురుస్తుండటం రైతుల్లో మరింత ఉత్సాహం నింపుతోంది. వ్యవసాయ పొలాల్లో దుక్కులు దున్నే పనుల్లో నిమగ్నమయ్యారు. పత్తిసాగుకు అవసరమైన విత్తనాలు, ఎరువులను సమకూర్చుకుంటున్నారు. 1,42,410 ఎకరాల్లో సాగు అంచనా.. గతేడాది జిల్లావ్యాప్తంగా 1,33,206 ఎకరాల్లో పత్తి సాగైంది. ఈ ఏడాది 1,42,410 ఎకరాల్లో సాగయ్యే అవకాశం ఉందని వ్యవసాయశాఖ అంచనా వేస్తోంది. ఈ మేరకు సాగు ప్రణాళికలను సిద్ధం చేసింది. గతేడాది కంటే 9వేలకు పైగా ఎకరాల్లో పత్తిపంట అదనంగా సాగయ్యే అవకాశం ఉండటంతో రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. మానవపాడులోని ఫర్టిలైజర్ దుకాణంలో తనిఖీ చేస్తున్న టాస్క్ఫోర్స్ అధికారులు (ఫైల్) జిల్లాలో పత్తిసాగు ఇలా.. జిల్లాలో ప్రధాన పంటగాతెల్లబంగారం గతేడాది 1,33,206 ఎకరాల్లో సాగు ఈసారి అదనంగా 9వేల ఎకరాల్లో సాగవుతుందని అంచనా దక్కులు సిద్ధం చేస్తున్న అన్నదాతలునకిలీ విత్తనాలకు అడ్డుకట్ట.. జిల్లావ్యాప్తంగా నకిలీ పత్తి విత్తనాలు మార్కెట్లోకి రాకుండా అరికట్టేందుకు ప్రభుత్వ శాఖల అధికారులతో టాస్క్ఫోర్స్ బృందాలను ఏర్పాటుచేశారు. మండల, డివిజన్, జిల్లాస్థాయిలో ఏర్పాటుచేసిన ఈ బృందాల్లో వ్యవసాయ, పోలీస్, రెవెన్యూశాఖల అధికారులను నియమించారు. జిల్లాస్థాయి బృందాల్లో ఏడీఏ, డీఎస్పీ, సీఐ, అగ్రికల్చర్ యూనివర్సిటీ అధికారి, డివిజన్స్థాయి కమిటీలో ఏడీఏ, ఎంఈఓ, మండలస్థాయి కమిటీలో ఏఓ, ఎస్ఐలు, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు. అనుమతి లేకుండా గ్రామాల్లో విత్తనాలు విక్రయించే దళారులు, అక్రమాలకు పాల్పడే డీలర్లపై నిఘా ఉంచి.. రైతులు మోసపోకుండా చర్యలు తీసుకుంటున్నారు. -
జలయజ్ఞం ప్రాజెక్ట్లపై నజర్
కోయిల్సాగర్: చివరి దశలో పనులు 2006లో రూ.349 కోట్లు కేటాయించి.. కోయిల్సాగర్ ఎత్తిపోతల పథకానికి మహానేత వైఎస్సార్ శ్రీకారం చుట్టారు. పనులు పూర్తి కాకుండానే పదేళ్ల తర్వాత 2016లో ప్రారంభించారు. ప్రస్తుతం కుడి, ఎడమ కాల్వలు, లింక్ కెనాల్ కింద కొత్తగా పిల్ల కాల్వల పనులు చేపట్టడానికి రూ.50 కోట్లతో రీ టెండర్లు పిలిచారు. అలాగే నాగిరెడ్డిపల్లి ఫేస్1, తీలేర్ ఫేస్ 2 పంపుహౌస్లలో పెండింగ్లో ఉన్న పనులకు రూ.16.90 కోట్లతో రీ టెండర్లను పిలిచారు. ఎత్తిపోతల పథకం లక్ష్యం 50,250 ఎకరాలు కాగా.. వానాకాలం పంటల కింద 36 వేల ఎకరాలలకు, యాసంగిలో 12వేల ఎకరాలకు సాగునీరు అందుతోంది. కోయిల్సాగర్ బ్యాక్ వాటర్ నుంచి దేవరకద్ర గ్రావిటీ కెనాల్ను రూ.23 కోట్లతో చేపట్టగా పనులు చివరిదశలో ఉన్నాయి. అజిలాపూర్, చౌదర్పల్లి ఎత్తిపోతల పథకం, రాజోలి నుంచి పేరూర్ వరకు ఎడమ కాల్వ పొడిగింపు పనులు చేపట్టాల్సి ఉంది. పెండింగ్ భూసేకరణపై సర్కారు ప్రత్యేక దృష్టి ● నెట్టెంపాడులో 610 ఎకరాలకు రూ.25 కోట్లు విడుదల ● ‘పాలమూరు’లో 15 వేల ఎకరాలకు రూ.300 కోట్లు.. ● భీమా, కల్వకుర్తి ఎత్తిపోతల పనులపైనా కసరత్తు ● పనుల పురోగతిపై ప్రత్యేక అధికారి రవినాయక్ ఆరా ● ఇటీవల ఉమ్మడి జిల్లాల కలెక్టర్లు,ఇరిగేషన్ అధికారులతో సమీక్ష ప్రాజెక్ట్ -
కేఎల్ఐ: మరో 1.50 లక్షల ఎకరాలకు..
కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి 2002లో అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబా బు శంకుస్థాపన చేసినా.. పనులు ప్రారంభం కాలేదు. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వలో అప్పటి సీఎం వైఎస్ఆర్ ప్రాజెక్ట్ నిర్మాణానికి రూ.2,990 కోట్లు కేటాయించారు. ఇందులో నాలుగు రిజర్వాయర్లు ఎల్లూరు, సింగోటం, జొన్నలబొగుడ, గుడి పల్లి నిర్మించారు. ఆ తర్వాత దాదాపు 90 శాతం పనులు పూర్తి చేశారు. వైఎస్ మరణానంతరం పూర్తిగా నిర్లక్ష్యం చేయబడిన ప్రాజెక్ట్కు తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రూ.1000 కోట్లు కేటాయించి పలు పనులు చేపట్టింది. మొదట ఈ ప్రాజెక్ట్ ద్వారా 2.30 లక్షల ఎకరాలకు నీరందించాలనేది లక్ష్యం కాగా.. ఆ తర్వాత ఆయకట్టు 4.20 లక్షల ఎకరాలకు పెరిగింది. ఇప్పటికీ చాలా పనులు పెండింగ్లో ఉండడంతో రెండు లక్షల ఎకరాలకు మాత్రమే నీరందుతోంది. ఈ ఏడాది బడ్జెట్లో ఈ ప్రాజెక్ట్కు రూ.900 కోట్లు కేటాయించగా.. వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి స్థాయి ఆయకట్టుకు సాగునీటిని అందించాలనే లక్ష్యంతో పనులు చేపట్టేలా కసరత్తు చేస్తున్నారు. -
సబ్సిడీ విత్తనాలను సద్వినియోగం చేసుకోవాలి
గద్వాల వ్యవసాయం: సబ్సిడీపై అందించే విత్తనాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని మార్కెట్యార్డ్ చైర్మన్ హనుమంతు సూచించారు. సోమవారం గద్వాల సింగిల్విండో కార్యాలయంలో సబ్సిడీపై అందించే జీలుగ విత్తనాల విక్రయ కార్యక్రమాన్ని పీఏసీఎస్ చైర్మన్ సుభాన్తో కలిసి ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం 30 కేజీల జీలుగ విత్తనాలను సబ్సిడీ ధరపై రూ. 2,137.50 ఇస్తుందని తెలిపారు. దీనిని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. పీఏసీఎస్ చైర్మన్ సుభాన్ మాట్లాడుతూ పచ్చిరొట్టె ఎరువు వాడటం వల్ల పంటకు పోషకాలు అందుతాయని, నేల గుల్ల బారి నీటిని నిలుపుకొనే సామర్థ్యం పెరిగి, వేరు వ్యవస్థ భూమిలోకి పటిష్టంగా పెరుగుతుందన్నారు. దీంతో పాటు భూమిలో నత్రజని శాతం పెరుగుతుందన్నారు. అనంతరం పలువురు రైతులకు సబ్సీడీ జీలుగ విత్తనాలను అందజేశారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి ప్రతాప్కుమార్, పీఏసీఎస్ సీఈఓ వెంకటేశ్వర్రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. -
భూ సమస్యల పరిష్కారంలో సర్వేయర్ల పాత్ర కీలకం
గద్వాల: లెసెన్స్ సర్వేయర్లతో భూవివాదాలకు పరిష్కారం దొరకడంతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని స్థానిక పాత ఎంపీడీవో ఆఫీసులో ఏర్పాటు చేసిన లైసెన్స్ సర్వేయర్ల శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భూభారతి భూమి హక్కుల రికార్డు చట్టం–2025ను అమలులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. భూ యజమానులైన రైతులకు మెరుగైన సేవలను అందించే ప్రణాళికలో భాగంగా లైసెన్స్ పొందిన సర్వేయర్లను అందుబాటులోకి తీసుకురావడం జరిగిందన్నారు. భూభారతి చట్టం ప్రకారం భూమి రిజిస్ట్రేషన్, ముటేషన్, తదితర వాటిలో తప్పనిసరిగా సర్వే చేసి మ్యాప్ జత చేయాల్సి ఉంటుందని దీనికోసం లైసెన్స్ సర్వేయర్లను ఎంపిక చేసి వారికి ప్రభుత్వం శిక్షణ అందిస్తుందన్నారు. మే 26వ తేదీ నుంచి 50రోజుల పాటు శిక్షణ కార్యక్రమం ఉంటుందన్నారు. ఈశిక్షణ కార్యక్రమంలో థియరీతో పాటు, ఫీల్డ్ట్రైనింగ్ కూడా ఉంటుందన్నారు. అదేవిధంగా శిక్షణ కాలంలో సెలవులు ఇవ్వరని అందరూ కూడా తప్పకుండా హాజరు కావాలన్నారు. అందులో ఉత్తీర్ణులైన వారికి లైసెన్స్డ్ సర్వేయర్ సర్టిఫికెట్ జారీ చేయబడుతుందన్నారు. అవకాశాన్ని ప్రతిఒక్కరూ సద్వినియోగం చేసుకుని సూచించారు. కార్యక్రమంలో సర్వేయర్ ఏడీ రామ్చందర్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రతి ఎకరాకు సాగునీరందించడమే లక్ష్యం
ధరూరు: ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే తమ లక్ష్యమని, రైతులు సమన్వయంతో నీటిని వినియోగించుకోవాలని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని గుడ్డెందొడ్డి గ్రామ సమీపంలోని నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం పేస్ 1 నుంచి పంపుహౌస్ను ఎమ్మెల్యే హాజరై గంగమ్మ పూజ చేసి సాగు నీటిని విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది ముందస్తుగా వర్షాలు కురవడంతో కృష్ణనదిలో నీటి సామర్థ్యం పెరిగిందని అన్నారు. దీంతో గుడ్డెందొడ్డి రిజర్వాయర్ ద్వారా నీటిని విడుదల చేశామని, ఈ ఏడాది రైతులకు రెండు పంటలకు నీళ్లను అందించడం జరుగుతుందన్నారు. రైతులు పండించిన వరి ధాన్యం ప్రభుత్వమే కొనుగోలు చేసిందని, ఇప్పటి వరకు 80 శాతం ధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేసిందని, మిగిలిన 20 శాతం త్వరలో కొనుగోలు చేయనుందని తెలిపారు. ర్యాలంపాడు.. నాలుగు టీఎంసీల సామర్యం గల రిజర్వాయర్లు ప్రస్తుతం రెండు టీఎంసీల నీళ్లు నిలువ ఉంటుందని, రెండు టీఎంసీలలో కొంత ఇబ్బందిగా ఉందని, విషయాన్ని నీటిపారుదల శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లి రైతులకు చివరి ఆయకట్టు వరకు సాగునీటిని అందించడానికి కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో జడ్పీ మాజీ చైర్మన్ జంబురామన్ గౌడు, మార్కేట్ యార్డ్ చైర్మన్ కుర్వ హనుమంతు, నాయకులు గడ్డం కృష్ణరెడ్డి, జంబురామన్ గౌడు, సుదర్శన్ రెడ్డి, రామకృష్ణ నాయుడు, విజయ్ పాల్గొన్నారు. -
ప్రాధాన్యతా క్రమంలో.. ప్రాజెక్టులు పూర్తిచేస్తాం
అచ్చంపేట/ బల్మూర్: ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని జూరాల, కోయిల్సాగర్, భీమా, నెట్టెంపాడు, కేఎల్ఐతోపాటు పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రణాళిక, జీఓ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో వచ్చినవేనని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న పాలమూరు– రంగారెడ్డి, అచ్చంపేట ఎత్తిపోతలు, ఉమామహేశ్వరం రిజర్వాయర్ నిర్మాణాలపై ప్రత్యేక దృష్టిసారించి.. ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేస్తామని తెలిపారు. సోమవారం అచ్చంపేట నియోజకవర్గంలోని బల్మూర్ మండలం గట్టుతుమ్మెన్లో రూ.43 కోట్లతో చేపట్టనున్న పలు విద్యుత్ సబ్స్టేషన్లకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల పాలనలో అభివృద్ధి పనులు మొదలు పెట్టిందే తప్ప పూర్తి చేయలేదని విమర్శించారు. అచ్చంపేట నియోజవర్గానికి, తమకు విడదీయని బంధం ఉందని, అన్న మల్లు అనంతరాములుతోపాటు మల్లు రవి ఇక్కడి నుంచే ఎన్నికల్లో పోటీ చేశారని, తాను అప్పట్లో విద్యాభ్యాసం చేస్తూ ఇక్కడికి వచ్చానని గుర్తుచేసుకున్నారు. పదేళ్లలో ఒక్క ఉద్యోగం ఇవ్వలే.. నీళ్లు, నిధులు, నియామకాలంటూ కొట్లాడి ప్రత్యేక రాష్ట్రాన్ని తెచ్చుకున్న యువతకు గత పాలకులు అన్యాయం చేశారని డిప్యూటీ సీఎం విమర్శించారు. పదేళ్లు పాలించిన కేసీఆర్ ఒక్కసారి కూడా గ్రూప్–1 పరీక్ష నిర్వహించలేకపోయారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే లక్ష ప్రభుత్వ ఉద్యోగాల కలను సాకారం చేశామని, ఇప్పటికే 57 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని, మరో 30 వేల ఉద్యోగ నియామకాల ప్రక్రియ కొనసాగుతుందని చెప్పారు. రూ.12,600 కోట్లతో నల్లమల డిక్లరేషన్ చేసిందని, దేశ చరిత్రలో ఎవరూ ఇప్పటి వరకు ఈ ఆలోచన చేయలేదని వివరించారు. ఇందిర సౌర గిరి జల వికాసం పేరిట నాటి కాంగ్రెస్ ప్రభుత్వం పట్టాలిచ్చిన 6.70 లక్షల ఎకరాలకు సోలార్ కరెంట్, పంపుసెట్లు, డ్రిప్ స్ప్రింక్లర్లను వినియోగించి ఉద్యానశాఖ ద్వారా ఉచితంగా అవకాడో, వెదురు, నిమ్మ వంటి మొక్కలను ఉచితంగా గిరిజన రైతులకు అందిస్తున్నామని తెలిపారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 25 ఎకరాల విస్తీర్ణంలో రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మిస్తున్నామన్నారు. రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనేది ప్రజా ప్రభుత్వం లక్ష్యమని.. మొదటి సంవత్సరం రూ.21 వేల కోట్లు వడ్డీ లేని రుణాలు స్వయం సహాయక సంఘాల సభ్యులకు అందించామని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీ మల్లు రవి, టీజీఎస్పీడీసీఎల్ చైర్మన్ ముషారఫ్ అలీ ఫారూఖీ, ట్రాన్స్కో సీఎండీ కృష్ణభాస్కర్, కలెక్టర్ బదావత్ సంతోష్, ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్, వనపర్తి, దేవరకద్ర ఎమ్మెల్యేలు మేఘారెడ్డి, మధుసూదన్రెడ్డి, రాష్ట మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, డీసీసీబీ అధ్యక్షుడు మామిళ్లపల్లి విష్ణువర్ధన్రెడ్డి, రాజేందర్, జిల్లా ఓబీసీ చైర్మన్ గిరివర్ధన్గౌడ్ పాల్గొన్నారు. పాలమూరును అభివృద్ధి చేసే బాధ్యత మాది కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యం బీఆర్ఎస్ పనులు చేపట్టింది తప్పా పూర్తిచేయలే.. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క -
నట్టేట ముంచి
జోగుళాంబ గద్వాలనమ్మించి.. మంగళవారం శ్రీ 27 శ్రీ మే శ్రీ 2025వివరాలు 8లో u●దళారులను నమ్మొద్దు జిల్లాలోని రైతులు ఎవరూ భూ సమస్యలపై మధ్య దళారులను ఆశ్రయించొద్దు. చట్టబద్దంగా సమస్యలు పరిష్కారం చేసుకోవాలి. డబ్బులు ఇస్తే పనులు అవుతాయి అంటే అక్కడ ఖచ్చితంగా మోసం జరుగుతుందని గ్రహించాలి. పలు సాంకేతిక సమస్యల కారణంగా సమస్య పరిష్కారంలో జాప్యం జరగవచ్చు. మోసపోయిన రైతుల విషయంలో విచారణ చేపట్టి చట్టపరమైన చర్యలు తీసుకుని న్యాయం అందేలా చర్యలు తీసుకుంటాం. – శ్రీనివాసరావు, ఎస్పీ ప్రభుత్వ భూములపై దళారుల నజర్... గద్వాల – అలంపూర్ సెగ్మెంట్లలో సీలింగ్, వక్ఫ్, దేవాదాయ, ప్రభుత్వ భూములు ఉండగా.. వీటిని సైతం దళారులు, భూకబ్జాదారులు రెవెన్యూలోని సాంకేతిక లొసుగులను ఆసరాగా చేసుకొని పట్టా భూములుగా మార్చుకున్నారు. వాస్తవంగా ప్రభుత్వ భూముల క్రయ విక్రయాలు నిర్వహించరాదనే నిబంధనలు ఉన్నాయి. భూ బాదలాయింపు జరగాల్సి ఉంటే అట్టి భూములను వారుసుల పేరిట రెవెన్యూ రికార్డులో నమోదు చేయాల్సి ఉంటుంది. అయితే జిల్లాలో ప్రభుత్వ భూములు సైతం దళారుల చేతివాటంతో రికార్డులు తారుమారు అవుతున్నాయి. జిల్లాలో అత్యధికంగా అలంపూర్, గట్టు, కేటీదొడ్డి, వడ్డేపల్లి, అయిజ, గద్వాల, మానవపాడు మండలాల్లో భూ సమస్యలపై ఫిర్యాదులు అధికంగా వస్తున్నాయి. వీటిని ఆసరాగా చేసుకుంటున్న దళారులు రైతులను నమ్మించి దోచుకుంటున్నారు. గద్వాల క్రైం: భూ సమస్యలు.. పాసు బుక్కులు.. ఆన్లైన్లో పేర్ల మార్పు.. తదితర సమస్యలను పరిష్కరించాలని రైతులు అటు అధికారులకు వినతులు.. ఇటు ప్రజావాణి.. ప్రజాదర్భార్లో దరఖాస్తులు చేస్తుంటారు. ఇలాంటి బాధితులనే లక్ష్యంగా చేసుకున్న కొందరు కేటుగాళ్లు.. భూములకు సంబంధించి ఏ సమస్య అయినా పరిష్కరిస్తామని నమ్మబలుకుతున్నారు. వీరి మాటలు నమ్మిన రైతులు రూ.లక్షలు వారికి అందజేయడం.. ఆ తర్వాత మోసపోయామని తెలుసుకొని లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించిన ఘటనలు జిల్లాలో కో కొల్లలుగా ఉన్నాయి. జిల్లాలో కొన్ని సంఘటనలు.. గద్వాల పట్టణానికి చెందిన ఓ మహిళా రైతు పేరుపై 5 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. అయితే సాంకేతిక సమస్యల కారణంగా రెవెన్యూ రికార్డులో పేరు నమోదు కాలేదు. ఈ క్రమంలో ఆమెతోపాటు అతని సోదరుడు హైద్రాబాద్లో ఏర్పాటు చేసిన ప్రజాదర్భర్లో ఫిర్యాదు చేశారు. అక్కడే ఓ దళారీ నేను ఓఎస్డీలో విధులు నిర్వహిస్తున్నట్లు నమ్మించి భూభారతి పోర్టల్ ద్వారా ఆన్లైన్ నమోదు చేయించేందుకు ఈ ఏడాది మార్చిలో రూ.1.45క్షలు వసూలు చేశాడు. అయితే నెల రోజులైనా ఎలాంటి ఫలితం లేక పోయింది. దీంతో బాధితులు మోసపోయినట్లు గుర్తించి 24.05.2025 తేదీన హైద్రాబాద్కు చెందిన దళారీపై పట్టణ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు. ● గద్వాల పట్టణానికి చెందిన ఓ రైతు వ్యవసాయ భూమి గద్వాల మండలంలోని పరుమాలలో ఉంది. అయితే అక్రమార్కులు ఆ భూమిపై నకిలీ పాసుబుక్కులు సృష్టించి ప్రభుత్వం నుంచి వచ్చే అన్ని పథకాలను పొందుతున్నారు. దీనిపై రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. దీంతో హైకోర్టులో న్యాయం కోసం ఫిర్యాదు చేయగా కోర్టు రైతుకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. అయితే రైతుకు న్యాయం చేయాల్సిన రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదని 26.5.2025 తేదీన కలెక్టర్, ఎస్పీకి సైతం ఫిర్యాదు చేశాడు. బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సిందిగా జిల్లా అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ సంఘటనలో రైతు రూ.4లక్షలు దళారులకు ఇచ్చి మోసపోయాడు. ● రాజోళి మండలానికి చెందిన ఓ రైతు తన రెండు ఎకరాల వ్యవసాయ భూమికి సంబంధించిన పాసుబుక్కుల కోసం తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నాడు. వివిధ సమస్యల కారణంగా పాసుబుక్ల జారీ ఆలస్యమైంది. దీంతో రైతు గద్వాలకు చెందిన ఓ దళారీని ఆశ్రయించాడు. అందుకు రూ.50వేలు ఒప్పందం చేసుకున్నాడు. ఆరు నెలలు అయినా దళారీ పాసుబుక్కు ఇప్పించడం లేదని 17.3.2025 తేదీన కలెక్టర్కు ఫిర్యాదు చేశాడు. జిల్లా వ్యాప్తంగా ఇలా ఎంతో మంది రైతులు భూసమస్యలపై రెవెన్యూ అధికారులకు దరఖాస్తులు చేసుకున్నారు. కానీ, సమస్యల పరిష్కారం లేకపోవడంతో దళారులను ఆశ్రయించి మోసపోతున్నారు. న్యూస్రీల్ అమాయక రైతులే లక్ష్యంగా దోచుకుంటున్న మధ్య దళారులు భూ వివాదాలు పరిష్కరిస్తామని.. పాసుబుక్కులు ఇప్పిస్తామని బుకాయింపు రూ.లక్షలు వసూలు చేసి మొఖం చాటేస్తున్న వైనం పట్టణ పోలీసు స్టేషన్లో తాజా కేసు నమోదుతో వెలుగులోకి.. -
రసాయనిక ఎరువుల వాడకం తగ్గించాలి
తాడూరు: రైతులు సాగు చేసే పంటల్లో యూరియాతో పాటు రసాయనిక ఎరువులను తగ్గించాలని పాలెం కేవీకే శాస్త్రవేత్తలు శ్రీరాం అన్నారు. సోమవారం మండలంలోని బలాన్పల్లిలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమంలో భాగంగా పంటల సాగుపై అవగాహన కల్పించారు. అనంతరం శాస్త్రవేత్త శ్రీరాం మాట్లాడుతూ పంట మార్పిడీతో భూసారం పెరుగుతుందన్నారు. విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసినప్పుడు రశీదులు భద్రపర్చుకోవాలని సూచించారు. శాస్త్రవేత్త రాజిరెడ్డి మాట్లాడుతూ పురుగు మందులు అవసరం ఉన్నప్పుడే మాత్రం పిచికారి చేయాలన్నారు. నేల తేమ సంరక్షణ పద్ధతులపై అవగాహన కల్పించారు. అధికారులు సూచనలు, సలహాలు పాటించి అధిక దిగుబడులు సాధించాలని కోరారు కార్యక్రమంలో ఏఓ సందీప్కుమార్రెడ్డి, ఏఈఓ దీపక్, వ్యవసాయ కళాశాల విద్యార్థులు రైతులు పాల్గొన్నారు. -
పూడిక తొలగేనా..?
జిల్లా కేంద్రంలో పూడుకపోయిన డ్రెయినేజీలు లోతట్టు ప్రాంతాలకు ముప్పు వేసవి ముగుస్తుంది. మరికొన్ని రోజుల్లో నైరుతి రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకనున్నాయి. మూడు నాలుగు రోజుల నుంచే ముసురు వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పట్టణంలోని కొన్ని ప్రాంతాల ప్రజలకు మాత్రం వర్షాకాలం వస్తోందంటేనే భయం మొదలవుతుంది. అవన్నీ లోతట్టు ప్రాంతాలు కావడంతో వానొస్తే నీరు నిలిచిపోతుంది. మురికి నీరు డ్రయిన్లలోంచి పొంగి ప్రవహిస్తోంది. ప్రధానంగా జిల్లా కేంద్రంలోని కుంట వీధి, నల్లకుంట, జివిలివీధి, పాత హౌసింగ్బోర్డు కాలనీలోని కొంతభాగం, సుంకులమ్మమెట్టు, ఒంటెలపేట తదితర కాలనీలు జలమయమవుతూ ఉంటాయి. పట్టణంలోని తుల్జారాం గుడి, కూరగాయల మార్కెట్, రథశాల ప్రధాన పరిసర ప్రాంతాలు అధ్వాన్నంగా మారతాయి. అయినా ముందస్తు జాగ్రతలు చేపట్టడంలో అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. పైన పేర్కొన్న కాలనీలలో డ్రైనేజీ వ్యవస్త అస్తవ్యస్థంగా ఉంది. ఇప్పటికై నా అధికారులు ముందస్తుతో సమగ్రమైన ప్రణాళిక రూపొందించుకొని డ్రైనేజీ వ్యవస్థను చక్కదిద్దాలని ప్రజలు కోరుతున్నారు. గద్వాలటౌన్: మరికొన్ని రోజుల్లో వానాకాలం ప్రారంభం కానుంది. అప్పుడే వర్షాలు సైతం కురుస్తున్నాయి. అయినా కూడా జిల్లా కేంద్రంలోని అధికారులు ముందస్తు చర్యలు చేపట్టడంలో మీనమేషాలు లెక్కిస్తున్నారనే ఆరోపణలు ప్రజల నుంచి వినవస్తున్నాయి. గద్వాల మున్సిపాలిటీల్లో చాలామటుకు డ్రెయినేజీలు చెత్తా చెదారంతో, శివారు ప్రాంతాల్లోని ప్రధాన మురికి కాల్వలు అన్నీ పిచ్చి మొక్కలతో నిండిపోయాయి. భారీ వర్షాలు కురిస్తే అవన్ని పొంగి పొర్లుతాయని, పట్టణం దుర్గంధంగా మారుతుందని, లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడతారని అధికారులకు తెలిసినా.. తగు చర్యలు మాత్రం చేపట్టరు. ప్రజలను వర్షాకాలం కష్టాల నుంచి తప్పించేందుకు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాల్సిన అవసరం వారిపై ఎంతైనా ఉంది. జనాభా 80,000 మురుగు కాల్వల ఆక్రమణ.. యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు వర్షాకాలంలో లోతట్టు ప్రాంతాలకు పొంచి ఉన్న ముప్పు ముందుజాగ్రత్త చర్యలు చేపట్టడంలో అధికారుల తాత్సారం త్వరలో చేపడతాం వర్షా కాలాన్ని దృష్టిలో ఉంచుకొని డ్రైనేజీలలో పేరుకుపోయిన చెత్తా, చెదారం పూడికతీత పనులను చేపడతాం. ఇందుకోసం అవసరమైన డ్రెయినేజీలు గుర్తించడంతో పాటు వాటికి ప్రతిపాదనలు రూపొందిస్తున్నాం. అవసరమైన చోట యంత్రాలను ఉపయోగించి పూడికతీత చేస్తాం. త్వరలోనే పనులు ప్రారంభిస్తాం. – దశరథ్, ఇన్చార్జ్ కమిషనర్, గద్వాల -
నీటి వృథాకు అడ్డుకట్ట
సుమారు 30 ఏళ్ల కిందట.. జూరాల ఎడమ కాల్వ కింద జిల్లాలో సుమారు 85 వేల ఎకరాల ఆయకట్టు ఉండగా.. ఏడాదికి రెండుసార్లు పంటలకు సాగునీరు అందిస్తారు. సుమారు 30 ఏళ్ల కిందట బిగించిన షట్టర్లు వంగిపోయి దెబ్బతినడంతో మూసినా నీరు వృథాగా పారుతోంది. వారబందీ సమయంలో లీకేజీల కారణంగా నిత్యం 150 క్యూసెక్కులకు పైగా నీరు వృథా అవుతుండటంతో మరమ్మతులు చేపట్టారు. యాసంగిలో వారబందీ విధానంలో రామన్పాడు రిజర్వాయర్ వరకు సాగునీటిని వదిలారు. పూర్తయిన జూరాల ఎడమ కాల్వ సాధారణ షట్టర్ల మరమ్మతు ●● నాలుగు షట్టర్లకు రూ.7.50 లక్షల వ్యయం ● వారబందీ సమయంలో నీరు వృథా కాకుండా చర్యలు ● ఎట్టకేలకు మోక్షం అమరచింత: ప్రియదర్శిని జూరాల జలాశయం ప్రధాన ఎడమకాల్వ సాధారణ షట్టర్ల మరమ్మతుకు ఎట్టకేలకు మోక్షం లభించింది. ఆయకట్టుకు సాగునీటి సరఫరా నిలిపివేసినా షట్టర్ల లీకేజీలతో రోజు కాల్వలో వృథాగా పారి జలాశయంలో నిల్వ నీటిమట్టం తగ్గుముఖం పట్టేది. నిత్యం 150 నుంచి 200 క్యూసెక్కుల నీరు వృథా అవుతుండటంతో అధికారులు మరమ్మతులకు శ్రీకారం చుట్టారు. ఎడమ కాల్వకు 4 సాధారణ, 4 ఎమరెన్సీ షటర్లు ఉండగా.. 4 సాధారణ షట్టర్లకు లీకేజీలు ఏర్పడి నీరు వృథా అవుతుంది. దీంతో వీటి మరమ్మతుకు రూ.7.50 లక్షలతో టెండర్లు ఆహ్వానించారు. పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ వేగంగా మరమ్మతులు పూర్తిచేశారు. ఇకనుంచి యాసంగి సీజన్లో ఆయకట్టుకు వారబందీ సమయంలో సాగునీరు నిలిపివేసే సమయంలో చుక్కనీరు ముందుకు పారకుండా షట్టర్లను పక్కాగా బిగించనున్నారు. సమాంతర కాల్వకు మోక్షమెన్నడో? భీమా ఫేజ్–2 ఎత్తిపోతల కోసం సమాంతర కాల్వను ఏర్పాటు చేశారు. కృష్ణానదికి వరదలు వచ్చినప్పుడు ప్రాజెక్టుకు వస్తున్న నీటిని కాల్వ ద్వారా పంపింగ్ చేసేందుకు వినియోగిస్తున్నారు. కాని భీమా అధికారులు కాల్వ ప్రధాన షట్టర్లు దెబ్బతిన్నా పట్టించుకోవడం లేదు. దీంతో నిత్యం 150 క్యూసెక్కుల నీరు కాల్వలో వృథాగా పారుతోంది. ఇప్పటికై నా అధికారులు స్పందించి నీటి వృథాను అరికట్టాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు. నీరు వృథా అయ్యేది.. జూరాల ప్రాజెక్టు ప్రధాన ఎడమ కాల్వ షట్టర్లు పూర్తిగా దెబ్బతినడంతో నీరు కాల్వలో వృథాగా పారేది. అధికారులు ఎట్టకేలకు మరమ్మతులు చేపట్టడంతో వేసవిలో జలాశయంలోని నీటిమట్టం తగ్గకుండా ఉంటుంది. – వెంకటేశ్వర్రెడ్డి, రైతు, అమరచింత పనులు పూర్తి చేశాం.. జలాశయం ప్రధాన ఎడమ కాల్వ షట్టర్ల మరమ్మతులు త్వరగా పూర్తి చేశాం. మరమ్మతులను డీఈ నారాయణ పర్యవేక్షించారు. ఇకపై కాల్వకు నీరు నిలిపితే షట్టర్ల నుంచి లీకేజీ కాకుండా పక్కాగా పనులు చేపట్టాం. వారబందీ విధానంలో పూర్తిస్థాయిలో నీటిని అందించే సమయంలో సమస్యలు తలెత్తకుండా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. – జగన్మోహన్, ఈఈ, జూరాల ప్రాజెక్టు నందిమళ్ల డ్యాం డివిజన్ -
ఉత్సాహంగా తిరంగా ర్యాలీ
అలంపూర్: భారత సైనికులకు మద్దతుగా తిరంగా ర్యాలీ చేపట్టినట్లు బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామంజనేయులు అన్నారు. అలంపూర్ పట్టణంలోని బీజేపీ మండల అధ్యక్షుడు ఈశ్వర్, పట్టణ అధ్యక్షుడు శరత్ బాబుల ఆధ్వర్యంలో తిరంగ ర్యాలీ ఆదివారం నిర్వహించారు. ఈ ర్యాలీకి బీజేపీ జిల్లా అధ్యక్షుడు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ.. జమ్మూ కాశ్మీర్లోని పహల్గంలో జరిగిన ఉగ్రదాడిని నిరసిస్తూ భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సిందూర్కు సంఘీభావం, సైనికులకు మద్దతుగా తిరంగ ర్యాలీ నిర్వహించడం జరిగిందన్నారు. ఆపరేషన్ సిందూర్తో భారత్.. సత్తా ప్రపంచ దేశాలకు తెలిసిందన్నారు. దేశంలో పాకిస్తాన్ వంటి దేశాలు మతకల్లోలాలు సృష్టించడానికి ప్రయత్నించాయని, అలాంటి దేశాలు దాడులకు పాల్పడితే భారత ప్రభుత్వం అందుకు తగ్గట్టుగా ఉగ్రస్థావరాలను నాశనం చేసిందన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ సభ్యురాలు అక్కల రమసాయిబాబ, బీజేపీ నాయకులు స్వప్న, రాజగోపాల్, కేకే రెడ్డి, రాజశేఖర్ శర్మ, నరేశ్, మద్దిలేటి, శ్రీనివాసులు, నరసింహ్ములు, నాగేశ్వర్ రెడ్డి, నాగమద్ది లేటి, నరేష్ గౌడ్, పరుశురాముడు తదితరులు పాల్గొన్నారు. -
ప్రశాంతంగా ముగిసిన జీపీఓ పరీక్ష
గద్వాల: గ్రామ పాలన అధికారి (జీపీఓ) రాత పరీక్ష ప్రశాంతంగా ముగిసినట్లు అదనపు కలెక్టర్ వి.లక్ష్మీనారాయణ తెలిపారు. ఆదివారం జిల్లా కేంద్రంలో ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో జరిగే పరీక్షా కేంద్రాన్ని ఆయన తనిఖీ చేశారు. పరీక్షలు నిర్వహిస్తున్న తీరును పరిశీలించారు. నిబంధనలు పక్కాగా పాటించాలని అధికారులకు సూచించారు. జీపీఓ పరీక్షకు మొత్తం 81మంది అభ్యర్థులు హాజరు కావాల్సి ఉండగా 77మంది అభ్యర్థులు హాజరయ్యారని, 95.06శాతం హాజరుశాతం నమోదైందని తెలిపారు. ఆయన వెంట తహసీల్దార్ మల్లిఖార్జున్, పరీక్ష నిర్వాహకులు ఇమ్మానియెల్ ఉన్నారు. కోయిల్సాగర్లో 11 అడుగుల నీటిమట్టం దేవరకద్ర: కోయిల్సాగర్ ప్రాజెక్టులో నీటిమట్టం రోజురోజుకూ అడుగంటుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 32.6 అడుగులు కాగా.. ఆదివారం సాయంత్రం వరకు 11 అడుగులకు చేరింది. వానాకాలం తర్వాత యాసంగి పంటలకు నీటిని వదిలే సమయంలో ప్రాజెక్టు నీటిమట్టం 31.6 అడుగులుగా ఉండగా గత నెలలో పంటలు పూర్తయ్యే నాటికి 13.3 అడుగులకు పడిపోయింది. యాసంగి పంటల సాగు పూర్తయిన తర్వాత ప్రాజెక్టులో ఉన్న మూడు పంప్హౌస్ల నుంచి పంపులను రన్ చేసి తాగునీటి అవసరాలకు సరఫరా చేస్తున్నారు. నారాయణపేట, కొడంగల్, కోస్గి, దేవరకద్ర, మరికల్, ధన్వాడ, మహబూబ్నగర్ తదితర ప్రాంతాలకు మిషన్ భగీరథ కింద తాగునీటిని అందిస్తున్నారు. దీంతో గత నెల రోజుల్లో 2.3 అడుగుల నీటిమట్టం తగ్గి 11 అడుగులకు చేరింది. జూన్ నెలలో వర్షాలు సమృద్ధిగా కురిస్తే పెద్దవాగు ద్వారా కోయిల్ సాగర్కు నీరు చేరే అవకాశం ఉంది. అలాగే జూరాలకు వరదలు వస్తే కోయిల్సాగర్ ఎత్తిపోతల పథకం పంపులను రన్ చేసి ప్రాజెక్టుకు నీటిని తరలిస్తారు. నేడు ‘పాలమూరు’ అథ్లెటిక్స్ జట్టు ఎంపికలు మహబూబ్నగర్ క్రీడలు: సికింద్రాబాద్లోని జింఖానా మైదానంలో వచ్చే నెల 1న జరిగే రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ అండర్– 8, 10, 12 ఏళ్లలోపు బాల, బాలికల అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొనే జిల్లా క్రీడాకారుల ఎంపికలను సోమవారం ఉదయం 10 గంటలకు జిల్లాకేంద్రంలోని మెయిన్ స్టేడియంలో నిర్వహిస్తున్నట్లు జిల్లా అథ్లెటిక్స్ సంఘం ప్రధాన కార్యదర్శి శరత్చంద్ర ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తిగల క్రీడాకారులు ఎస్సెస్సీ మెమో, తహసీల్దార్ ద్వారా కుల, జనన ధ్రువపత్రాలతో రిపోర్ట్ చేయాలని సూచించారు. -
జీపీఓ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు
గద్వాల: ఈనెల 25వ తేదీ ఆదివారం గ్రామ పాలన అధికారి రాతపరీక్ష (జీపీఓ)కు పకడ్బందీ ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. శనివారం సీసీఎల్ఏ కార్యదర్శి నవీన్మిట్టల్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన పాల్గొని మాట్లాడారు. జిల్లాలో మొత్తం 81మంది అభ్యర్థులు పరీక్ష హాజరు కానున్నారని తెలిపారు. వీరికి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో కేంద్రం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1:30గంటల వరకు కొనసాగతున్నట్లు తెలిపారు. పరీక్ష కేంద్రానికి గంట ముందే అభ్యర్థులను అనుమతిస్తామన్నారు. అదేవిధంగా కాపీయింగ్కు ఆస్కారం లేకుండా పటిష్ట ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.సమావేశంలో అదనపు కలెక్టర్ వి.లక్ష్మీనారాయణ, ఏవో నరేందర్, తహసీల్దార్ మల్లికార్జున్,తదితరులు పాల్గొన్నారు. -
చిన్నారుల పొదరిల్లు
● వేసవి శిక్షణకు వేదికగా బాలభవన్, బాలకేంద్రాలు ● నృత్యం, సంగీతం, చిత్రలేఖనం నేర్చుకునేందుకు చిన్నారుల ఆసక్తి ● ఉమ్మడి జిల్లాలో 4 కేంద్రాల్లో 16 ఏళ్ల లోపు బాలబాలికలకుప్రత్యేక శిక్షణ నారాయణపేటలో 1983లో 9 మంది చిన్నారులతో ఏర్పాటైన బాలకేంద్రం చౌక్బజార్లోని అద్దె భవనంలో కొనసాగింది. ఆ తర్వాత మినీస్టేడియం గ్రౌండ్లో వృథాగా ఉన్న ఓ భవనంలోని మార్చారు. ఇక్కడ తబలా, సితార్, గాత్రం, నృత్యం, చిత్రలేఖనంపై శిక్షణ ఇస్తున్నారు. 6 నుంచి 15 ఏళ్లలోపు చిన్నారులకు ప్రతిరోజు సాయంత్రం 5 నుంచి 7 గంటల వరకు బాలకేంద్రంలో శిక్షణ ఇస్తున్నారు. జనరల్ విద్యార్థులకు రూ.50, ఎస్సీ, ఎస్టీ, బీసీ చిన్నారులకు రూ.20 ప్రవేశ రుసుం వసూలు చేస్తారు. ఏటా వేసవిలో వందమంది పిల్లలు శిక్షణ పొందడానికి వస్తుంటారు. వీరికి దాతల సహకారంతో నోట్ పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్లు, ప్యాడ్ వంటి పరికరాలు ఉచితంగా అందిస్తున్నారు. ఇక తరచుగా దాతలతో స్నాక్స్ సైతం అందించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక్కడ శిక్షణ పొందిన ఎంతో మంది చిన్నారులు రాష్ట్ర, జాతీయ స్థాయి వరకు పాల్గొని మంచి పేరు తీసుకువచ్చారు. ఉత్సాహభరితంగా.. గద్వాల బాలభవన్లో400కు పైగా విద్యార్థులు వివిధ కళల్లో శిక్షణ పొందారు. 5–16 ఏళ్లలోపు చిన్నారులకు ఉత్సాహభరిత వాతావరణంలో వేసవి శిబిరం కొనసాగుతుంది. వివిధ కళల్లో నైపుణ్యం ఉన్న శిక్షకులు చిన్నారులకు శిక్షణ ఇస్తూ బాల కళాకారులుగా తీర్చిదిద్దారు. చిన్నారులకు భరతనాట్యం, జానపద నృత్యం, శాసీ్త్రయ నృత్యాలను శిక్షకులు సత్యం, చిత్రలేఖనం గణేష్, సంగీతం శివకుమార్, వాయిద్యాలు శంకర్, ఎంబ్రాయిడరీ, టైలరింగ్లో గాయిత్రి తదితరులు విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు. కళల ప్రపంచం.. ‘పేట’ బాలకేంద్రం -
రాయితీ ఎరువులు సిద్ధం
●రాయితీ వివరాలు ఇలా.. ప్రస్తుతం ఉమ్మడి పాలమూరు జిల్లాలో జీలుగ, జనుము రెండు రకాల పచ్చిరొట్ట ఎరువులను ఎక్కువగా ఉపయోగిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఈ విత్తనాలను 50 శాతం రాయితీపై పంపిణీ చేస్తోంది. జీలుగ క్వింటాల్కు రూ.14,250 కాగా.. రాయితీపై కేవలం రూ.7,425కు, జనుము పూర్తి ధర క్వింటాల్కు రూ.12,550 ఉండగా.. రాయితీపై రూ.6,275కే రైతులకు అందజేస్తోంది. అందుబాటులో జనుము, జీలుగ రకాలు ● ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పంపిణీ చేసేందుకు చర్యలు ● వ్యవసాయ శాఖ అధికారులు ఇచ్చిన ఇండెంట్ మేరకు సరఫరా చాలా ఉపయోగం.. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు 50 శాతం రాయితీపై అందజేస్తున్న పచ్చిరొట్ట విత్తనాలను ఉమ్మడి జిల్లాలోని అన్ని మండలాల్లో డిమాండ్ మేరకు అందుబాటులోకి తీసుకువస్తున్నాం. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. రసాయనిక ఎరువుల వాడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఏడాదికి ఒకసారి పచ్చిరొట్ట ఎరువుల వాడకం పొలానికి చాలా ఉపయోగకరం. – ఆదినారాయణరెడ్డి, రీజినల్ మేనేజర్, తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ, వనపర్తి వనపర్తి: రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గించి భూ ఆరోగ్యాన్ని పెంపొందించేందుకు వ్యవసాయ శాఖ ఏటా పచ్చిరొట్ట ఎరువులు ఉపయోగించేలా రైతులను ప్రోత్సహిస్తోంది. ఇందుకు రైతులకు 50 శాతం రాయితీపై మండల వ్యవసాయ శాఖ కార్యాలయాల్లో పంపిణీ షురూ చేశారు. ఉమ్మడి పాలమూరులోని ఆయా జిల్లాలకు కావాల్సిన పచ్చిరొట్ట ఎరువుల ఇండెంట్ ఆధారంగా జిల్లా విత్తనాభివృద్ధి సంస్థ జీలుగ, జనుము రకాల విత్తనాలను సిద్ధం చేసింది. వనపర్తి జిల్లాకేంద్రంలోని తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ కర్మాగారంలో ఐదు జిల్లాలకు కావాల్సిన విత్తనాలను సిద్ధం చేసి తొలకరి వర్షాలు కురుస్తున్న ప్రస్తుతం సమయంలో సరఫరా కోసం ఆయా ప్రాంతాలకు పంపిణీ చేశారు. జీలుగ రకం ఉమ్మడి పాలమూరు జిల్లాకు 7 వేల క్వింటాళ్లు, జనుము 760 క్వింటాళ్లను సిద్ధం చేసినట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. రైతులకు ఈ విత్తనాలను వారి అభ్యర్థన మేరకు ఆయా రకాలను 50 శాతం రాయితీపై పంపిణీ చేస్తారు. పచ్చిరొట్టతో ఉపయోగాలిలా.. పచ్చిరొట్ట ఎరువులతో బహుళ ప్రయోజనాలు కలుగుతాయి. వ్యవసాయ పొలాల్లో రసాయనిక ఎరువుల వాడకం పరిమితికి మించడంతో భూమిపై గల సారవంతమైన పొర చౌడు నేలగా మారే ప్రమాదం ఉంది. ఏటా ఖరీఫ్ పంటల సాగుకు ముందు వర్షాధారంగా పచ్చిరొట్ట ఎరువులను సాగు చేసి భూమిలో కలియదున్నడం వలన భూమి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. పంటకు మేలు చేసే సూక్ష్మజీవులు నశించకుండా ఈ పచ్చిరొట్ట ఎరువులు వాటి మనుగడను కాపాడుతాయి. నేలపై పొరలోని సహజ భౌతిక లక్షణాల రక్షణకు ఉపయోగపడతాయి. పచ్చిరొట్ట ఎరువుల నాటేందుకు ప్రస్తుత సమయం అనువైనదని ఇటీవల నిర్వహించిన శాస్త్రవేత్తల పల్లెబాట కార్యక్రమంలో రైతులకు వ్యవసాయశాఖ అధికారులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు అవగాహన కల్పించారు. తొలకరి వర్షాలు ప్రారంభమైన వెంటనే పచ్చిరొట్ట ఎరువు నాట్లు వేసుకోవాలి. సాధారణ పంటల సాగుకు ముందు 45 రోజుల ముందు ఈ పచ్చిరొట్ట ఎరువులను నాటుకుంటే.. పచ్చిరొచ్చ మొక్కలు పూత దశకు వచ్చినప్పుడు భూమిలో కలియదున్నేందుకు అవకాశం ఉంటుంది. తర్వాతి సాగు చేసే పంటలకు ఎంతగానో సారవంతమైన ఎరువుగా పచ్చిరొట్ట ఉపయోగపడుతుంది. జిల్లాల వారీగా అందుబాటులో ఉన్న ఎరువులు ఇలా (క్వింటాళ్లలో).. ఇదే అనువైన సమయం.. -
ఆదిశిలా క్షేత్రంలో భక్తుల ప్రత్యేక పూజలు
మల్దకల్: ఆదిశిలా క్షేత్రమైన స్వయంభూ లక్ష్మీవెంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈసందర్భంగా ఆలయ అర్చకులు అభిషేకాలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. అదే విధంగా సద్దలోనిపల్లి కృష్ణస్వామి, కుర్తిరావులచెర్వు గట్టు తిమ్మప్ప, శేషంపల్లి శివసీతారామస్వామి, చర్లగార్లపాడు వెంకటేశ్వరస్వామి ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే కొంత మంది భక్తులు స్వామి వారికి దాసంగాలు పెట్టి నైవేద్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ప్రహ్లదరావు, ఆలయ అర్చకులు రమేషాచారి, మధుసూదనాచారి, రవిచారిలు సిబ్బంది గురునాథ్, ఉరుకుందు, శ్రీను, రంగస్వామి, శివమ్మ, కృష్ణ, తదితరులు ఉన్నారు. ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం మహబూబ్నగర్ మున్సిపాలిటీ: జిల్లాలోని మూడు బాలికల, రెండు బాలుర పాఠశాలలు/కళాశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులకు అర్హుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని ప్రాంతీయ అధికారిణి ఫ్లోరెన్స్రాణి ఒక ప్రకటనలో తెలిపారు. సంబంధిత సబ్జెక్టులలో పీజీ, బీఈడీ పూర్తి చేసి ఆసక్తి, అనుభవం కలిగిన అభ్యర్థులే అర్హులని పేర్కొన్నారు. ఈనెల 26వ తేదీ ఉదయం పది నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు రాంరెడ్డిగూడెంలోని బాలికల సాంఘిక సంక్షేమ గురుకులంలో నిర్వహించే డెమోకు హాజరుకావాల్సి ఉంటుందని పేర్కొన్నారు. కాగా బాలికల కళాశాలల్లో తెలుగు రెండు, ఇంగ్లిష్, మ్యాథ్స్, బాటనీ, ఫిజిక్స్, కామర్స్, సివిక్స్, ఎకనామిక్స్లో ఒక్కో పోస్టు తాత్కాలిక పద్ధతిన భర్తీ చేయనున్నామని వివరించారు. ఇక పాఠశాలల్లో హిందీ, మ్యాథ్స్, బయో సైన్స్లో మూడు చొప్పున, తెలుగు, ఇంగ్లిష్, సోషల్ స్టడీస్, పీఈటీ రెండు చొప్పున, ఫిజికల్ సైన్స్ ఒక పోస్టు ఖాళీగా ఉన్నాయని, బాలుర కళాశాలల్లో ఇంగ్లిష్ రెండు, బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ ఒక్కొక్కటి చొప్పున; పాఠశాలల్లో బయోసైన్స్ రెండు, ఇంగ్లిష్ ఒక పోస్టు ఖాళీగా ఉన్నాయని వెల్లడించారు. 30న ఇంటర్వ్యూలు పాలమూరు: జిల్లా ఆరోగ్యశాఖ పరిధిలోని ప్రధానమంత్రి జన్జాతి ఆదివాసి న్యాయ మహా అభియాన్ పథకం కింద కాంట్రాక్ట్ పద్ధతిలో ఖాళీలు భర్తీ చేస్తున్నట్లు జిల్లా వైద్యారోగ్యశాఖ డాక్టర్ కృష్ణ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఒకటి మెడికల్ ఆఫీసర్, ఒక ల్యాబ్ టెక్నీషియన్, ఒకటి పారా మెడికల్ అసిస్టెంట్ పోస్టులను ఒక ఏడాది పాటు కాంట్రాక్ట్ పద్ధతిన తీసుకోనున్నట్లు పేర్కొన్నారు. ఈనెల 30న డీఎంహెచ్ఓ కార్యాలయంలో ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నామని, అర్హులైన బలహీన గిరిజన అభ్యర్థులు హాజరుకావాలని సూచించారు. రేపు గిరిజన విద్యార్థులకు స్పాట్ కౌన్సెలింగ్ మహబూబ్నగర్ మున్సిపాలిటీ: ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని బాలానగర్, కల్వకుర్తిలోని తెలంగాణ గిరిజన ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాల (టీజీఈఎంఆర్ఎస్– కాలేజ్ ఆఫ్ ఎక్స్లెన్స్)ల్లో ఇంటర్ మొదటి సంవత్సరంలో మిగిలిన సీట్లకు ఈనెల 26న స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నామని జీటీ గురుకులం ప్రాంతీయ సమన్వయ అధికారి కె.సుధాకర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపీసీ, బీపీసీ, సీఈసీలలో సీబీఎస్ఈ సిలబస్కు సంబంధించి ఈ ఖాళీలు ఉన్నాయని పేర్కొన్నారు. పదో తరగతిలో ఎక్కువ మార్కులు పొందిన గిరిజన విద్యార్థులను ఎంపిక చేస్తామని తెలిపారు. సోమవారం ఉదయం పది గంటలకల్లా మహబూబ్నగర్ జిల్లా బాలానగర్లోని టీజీఈఎంఆర్ఎస్లో అన్ని ఒరిజినల్ ధ్రువపత్రాలతో పాటు ఒక సెట్ జిరాక్స్, ఐదు పాస్పోర్ట్ సైజు ఫొటోలను వెంట తెచ్చుకోవాలని, పూర్తి వివరాలకు ఫోన్ నం.94156 06618, 98557 37578, 98857 38387, 8520 041973లలో సంప్రదించవచ్చని సూచించారు. రేపు డిప్యూటీ సీఎం రాక బల్మూర్: మండలంలోని గట్టుతుమ్మెన్ గ్రామానికి సోమవారం రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క రానున్నారని ఎమ్మెల్యే వంశీకృష్ణ తెలిపారు. ఈ మేరకు శనివారం గట్టుతుమ్మెన్లో ఏర్పాటు చేయనున్న సభాస్థలాన్ని ఎమ్మెల్యే పరిశీలించారు. గ్రామంలో విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణం కోసం శంకుస్థాపన చేసి, అనంతరం నియోజకవర్గ ప్రజలతో ఏర్పాటు చేసిన సభలో పాల్గొంటారని చెప్పారు. -
ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక జాబితా సిద్ధం చేయండి
గద్వాల: ఇందిరమ్మ ఇళ్లు, రాజీవ్ యువవికాసం పథకాల కింద అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేసి జాబితాను వెంటనే జిల్లాస్థాయికి పంపాలని అదనపు కలెక్టర్ వి.లక్ష్మీనారాయణ ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలులో ఇందిరమ్మ ఇళ్లు, రాజీవ్యువ వికాసం పథకాలపై అధికారులతో సమీక్షించారు. జిల్లాలోని ఆయా మండలాలు, మున్సిపాలిటీల పరిధిలో అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేయాలని, అర్హుల వివరాల జాబితాను వెంటనే అందజేయాలన్నారు. పైలట్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల గ్రౌండింగ్ ప్రక్రియను వేగవంతంగా పూర్తిచేసి, పురోగతిని పర్యవేక్షించాలన్నారు. ఈఈలు పంచాయతీ కార్యదర్శులతో కలిసి లబ్ధిదారుల నిర్మాణం పనులను ప్రారంభించుకునే విధంగా ప్రోత్సహించాలన్నారు. వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో ప్రతిగ్రామంలో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అదేవిధంగా వర్షాకాలంలో అంటువ్యాధులు ప్రబలకుండా అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. అదేవిధంగా రాజీవ్యువ వికాసం పథకం కింద లబ్ధిదారుల ఎంపికను వేగవంతం చేయాలని, అర్హుల ఎంపికను పారదర్శకంగా పూర్తి చేయాలని లబ్ధిదారుల వివరాల సాఫ్ట్ కాపీని బ్యాంకులకు వెంటనే పంపించాలన్నారు. సెక్టార్ వారీగా నాన్లింకేజి బ్యాంకింగ్ వివరాలతో జాబితాను సిద్ధం చేయాలన్నారు. సోమవారంలోపు లబ్ధిదారుల బ్యాంకు వివరాలు నిర్ధారణను పూర్తి చేతి తుది జాబితాను సమర్పించాలన్నారు. అధికారులు, బ్యాంకర్లు పరస్పర సమన్వయంతో పనిచేసి నిర్దేశించిన లక్ష్యాలను సాధించుకునే విధంగా కృషి చేయాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ నర్సింగ్రావు, ఎస్సీ కార్పోరేషన్ ఈడీ రమేష్బాబు, ఎల్డీఎం శ్రీనివాసరావు, హౌసింగ్ పీడీ శ్రీనివాసులు, మున్సిపల్ కమీషనర్లు, ఎంపీడీవోలు, ప్రత్యేక అధికారులు పాల్గొన్నారు. శనేశ్వరుడికి ప్రత్యేక పూజలు బిజినేపల్లి: మండలంలోని నందివడ్డెమాన్లో జేష్ట్యాదేవి సమేతంగా వెలసిన శనేశ్వరస్వామికి పాక్షిక శనిత్రయోదశి సందర్భంగా శనివారం ఆలయ ప్రధాన అర్చకులు గవ్వమఠం విశ్వనాథశాస్త్రి తిలతైలాభిషేకాలతో పూజలు చేశారు. అలాగే వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తుల చేత శనిదోష నివారణ కోసం గోత్రనామార్చన, అభిషేకాలు, అర్చనలు వంటి పూజలను అర్చకులు చేయించారు. భక్తులు శనేశ్వరుడి పూజల అనంతరం శివాలయంలో బ్రహ్మసూత్ర శివుడికి పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. -
రసాయన మందుల వాడకాన్ని నియంత్రించాలి
అలంపూర్: పంటలపై రసాయన మందుల వాడకాన్ని నియంత్రించాలని వ్యవసాయ శాస్త్రవేత్త శ్రీధర్ అన్నారు. ఉండవెల్లి మండలం పుల్లూరులో ప్రొఫెసర్ జయశంకర తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వ్యవసాయ పరిశోధనల స్థానం పాలెం, జిల్లా వ్యవసాయ శాఖల సంయుక్త అధ్వర్యంలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అనే కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సమావేశంలో శాస్త్రవేత్తలు తక్కువ యూరియా, తక్కువ రసాయనిక మందులను వినియోగం, సాగు నీటి ఆదా, పంట మార్చిడి, చెట్లను పెంచి– పర్యావరణానికి కాపాడడం వంటి అంశాలపై రైతులకు అవగాహన కల్పించారు. శాస్త్రవేత్త శ్రీధర్ మాట్లాడుతూ..తక్కువ యూరియాను వినియోగంచడం వలన పంటల్లో వచ్చే పురుగు, తెగుళ్లను నివారించవచ్చన్నారు. డ్రిప్లు, స్పీంక్లర్ల ద్వార తక్కువ నీటిని వినియోగించుకోవచ్చన్నారు. శాస్త్రవేత్త శంకర్ విత్తన శుద్ధి, పంటలో అట్టల వినియోగం, లింగాకార్షక బుట్టలు, అంతర పంటల సాగు గురించి వివరించారు. ఏఓ అనిత ప్రభుత్వ పథకాలు, విత్తనాల లభ్యత, జీలుగు విత్తనాల గురించి వివరించారు. కార్యక్రమంలో విస్తరణ అధికారిణి హసీనా బేగం, అదిల్, యం.వి. రాజేశ్, పీఏసీఎస్ అధ్యక్షుడు గజేందర్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ మద్దిలేటి, రైతులు తదితరులు పాల్గొన్నారు. -
జూరాలకు 5,609 క్యూసెక్కుల వరద
ధరూరు: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి వస్తున్న వరద శుక్రవారం స్వల్పంగా తగ్గినటు్ల్ పీజేపీ అధికారులు తెలిపారు. ఎగువన స్థానికంగా కురుస్తున్న వర్షాలతో రెండ్రోజులుగా ప్రాజెక్టుకు స్వల్పంగా వరద వస్తున్న విషయం తెలిసిందే. గురువారం 8,953 క్యూసెక్కుల వరద వస్తుండగా.. శుక్రవారం సాయంత్రానికి 5,609 క్యూసెక్కులకు తగ్గినట్లు వివరించారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం ప్రాజెక్టులో 4.657 టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్లు అధికారులు వివరించారు. -
శిక్షణను వినియోగించుకోవాలి
ఎర్రవల్లి: ఉపాధ్యాయులు శిక్షణను వినియోగించుకోవాలని.. ఇక్కడ నేర్చుకున్న ప్రతి అంశాన్ని కూడా పాఠశాలలో తప్పకుండా అమలు చేయాలని ఆర్జేడీఎస్ఈ అసిస్టెంట్ డైరెక్టర్, ప్రోగ్రాం స్టేట్ అబ్జర్వర్ విష్ణుశాస్త్రి అన్నారు. శుక్రవారం మండలంలోని కొండేరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉమ్మడి ఇటిక్యాల మండలంలోని ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులకు కెపాసిటీ బిల్డింగ్పై ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించగా ఆయన కార్యక్రమాన్ని పర్యవేక్షించి పాఠశాలల్లో చేపట్టాల్సిన పలు అంశాలను గురించి ఉపాధ్యాయులకు అవగాహన కల్పించారు. ప్రతి పాఠశాలలో నిర్వహిస్తున్నటువంటి బెస్ట్ ప్రాక్టీస్లను చర్చించి వాటిని ఇతర పాఠశాలల్లో కూడా అమలు చేయాలని సూచించారు. అనంతరం ఐదు రోజుల ఉపాధ్యాయుల కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రాంలో ఆబ్జెక్టివ్, ఇంప్లిమెంటేషన్ ల గురించి డీఆర్పీలు వివరించారు. కార్యక్రమంలో ఎఎంఓ ఎస్తేర్ రాణి, ఎంఈఓలు అమీర్ఫాష, వెంకటేశ్వర్లు, డిఆర్పీలు, ఆర్పీలు, తదితరులు ఉన్నారు. -
లాటరీ విధానంలో ఎంపిక
గద్వాల: జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో మూడు స్వీపర్ పోస్టులను లాటరీ విధానంలో భర్తీ చేసినట్లు అదనపు కలెక్టర్ బి.నర్సింగ్రావు తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్లో వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో మూడు స్వీపర్ పోస్టులకు లాటరీ విధానంలో ఎంపిక ప్రక్రియ చేపట్టారు. ఈ పోస్టులకు మొత్తం 54 దరఖాస్తులు రాగా.. వారి సమక్షంలో లాటరీ విధానాన్ని చేపట్టారు. లాటరీ విధానంలో ఎస్సీ మహిళ యశోధ, జనరల్ పోస్టుకు మహిళ శివమ్మ, జనరల్ ఆల్ కెటగిరీలో ఎం లీలావతిని ఎంపిక చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఇంచార్జీ డీఎంహెచ్ఓ సిద్ధప్ప, ఎంప్లాయిమెంట్ జిల్లా అధికారి ప్రియాంక తదితరులు పాల్గొన్నారు. ఆర్టికల్ 371జే అమలు చేయాలి గద్వాల: అభివృద్ధిలో పూర్తిగా వెనకబడిన నడిగడ్డ ప్రాంతంలో ఆర్టికల్ 371జే అమలు చేసి అభివృద్ధి చేయాలని సీనియర్ సిటిజన్ ఫోరం కన్వీనర్ మోహన్రావు కోరారు. శుక్రవారం ఆయన హైదరాబాద్లో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యాక్షుడు డాక్టర్ చిన్నారెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటుకు నివేదిక అందజేయండి వనపర్తి: జిల్లాలో సమీకృత స్పోర్ట్స్ స్కూల్, హాకీ స్టేడియం ఏర్పాటుకు స్థల కేటాయింపుపై సమర్థన నివేదిక అందజేయాలని ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ డా. సువర్ణ కోరారు. శుక్రవారం మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి 41వ స్క్రీనింగ్ కమిటీ సమావేశం వీడియో కాన్ఫరెన్స్లో నిర్వహించగా జిల్లా నుంచి కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఫారెస్ట్ రేంజ్ అధికారి అరవింద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాల పక్కన 25 ఎకరాల విస్తీర్ణంలో సమీకృత స్పోర్ట్స్ స్కూల్, హాకీ స్టేడియం నిర్మాణానికి ప్రతిపాదించగా, ఇందులో 12 ఎకరాల ప్రభుత్వ భూమి, మరో 7.166 హెక్టార్ల అటవీ భూమి ఉన్నట్లు పటం ద్వారా తెలుస్తోందన్నారు. అటవీ భూమి కేటాయిస్తే తదుపరి కార్యాచరణ రూపొందిస్తామని వివరించారు. స్పందించిన డా. సువర్ణ 7.166 హెక్టార్ల స్థలం దేని కొరకు కావాలో సమర్థన నివేదిక అందజేయాలని ఫారెస్ట్ రేంజ్ అధికారిని ఆదేశించారు. వీసీలో జిల్లా యువజన క్రీడల అధికారి సుధీర్రెడ్డి, సెక్షన్ సూపరింటెండెంట్ పాల్గొన్నారు. నేతన్నలను ఆదుకుంటాం అమరచింత: పట్టణంలోని చేనేత ఉత్పత్తుల సంఘంలో వస్త్రాలు తయారు చేస్తూ ఉపాధి పొందుతున్న నేత కార్మికులతో పాటు కుట్టు శిక్షణలో నైపుణ్యం పొందిన మహిళలకు నాబార్డు తరఫున ఆదుకునేందుకు సిద్ధంగా ఉన్నామని సీజీఎం ఉదయభాస్కర్ తెలిపారు. పట్టణంలోని చేనేత ఉత్పత్తుల కంపెనీని నాబార్డు సీజీఎంగా బాధ్యతలు స్వీకరించిన ఆయన శుక్రవారం సందర్శించి రోలింగ్ గదిని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నేతన్నలు తయారు చేసిన చీరలు రోలింగ్ కోసం గద్వాలకు తీసుకెళ్లకుండా ఇక్కడే చేసుకునే అవకాశం కల్పించడం సంతోషకరమన్నారు. మహిళలు కుట్టు శిక్షణ పొందడమే గాకుండా పలు రకాల డిజైన్ల వస్త్రాలను కుట్టడంలో మెళకువలు నేర్చుకున్నారని చేనేత ఉత్పత్తుల సంఘం కంపెనీ సీఈఓ మహంకాళి శేఖర్ వివరించారు. రాబోయే రోజుల్లో ఇక్కడ తయారు చేస్తున్న వస్త్రాలు జాతీయ, అంతర్జాతీయస్థాయితో పాటు ఆన్లైన్ మార్కెటింగ్కు కావాల్సిన మద్దతునిస్తామని హామీనిచ్చారు. అనంతరం మగ్గాలపై జరీ చీరలు తయారు చేస్తున్న కార్మికులతో మాట్లాడి వారి ఆదాయం అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం తాము సైతం కంపెనీ యజమానులమని.. ఇక్కడ పనిచేసే ప్రతి ఒక్కరికి లాభాలు సమానంగా చేరుతాయని కార్మికులు వివరించారు. కార్యక్రమంలో నాబార్డు డీజీఎం దీప్తి సునీల్, డీడీఎం మనోహర్రెడ్డి, ఆర్డీఎస్ సంస్థ సీఈఓ చిన్నమ్మ థామస్, కంపెనీ డైరెక్టర్లు పబ్బతి వెంకటస్వామి, అశోక్, జగదీశ్ తదితరులు పాల్గొన్నారు. -
భూసేకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి
ధరూరు: నెట్టెంపాడు ఎత్తిపోతల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పరిధిలోని డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ భూసేకరణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన మండలంలోని చింతరేవుల గ్రామ శివారులో చేపట్టిన భూసేకరణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా భూ సేకరణ వివరాలు, లేఅవుట్ మ్యాప్, పెగ్ మార్కింగ్ చేసిన ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. జవహార్ నెట్టెంపాడు ఎత్తిపోతల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పరిదిలోని డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ పరిదిలో భూసేకరణ సర్వే పనులకు ఎలాంటి నిధుల కొరత లేదని, ఏ విధమైన ఆలస్యం లేకుండా త్వరగా పనులు చేయాలని అన్నారు. ప్రతి రోజు ఎంత మేర భూసర్వే జరుగుతోంది, ఎన్ని ఎకరాలు పూర్తయ్యాయి అనే వివరాలు స్పష్టంగా ఉండాలని అన్నారు. సర్వే, పెగ్ మార్కింగ్ పనులను ఒకే సారి జరుపుతూ రైతులను చైతన్యపరిచి వారి సహకారంతో భూ సేకరణను సమర్థవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఇంకా ఎక్కడైన సమస్యలు పరిష్కారం కాకపోతే తన దృష్టికి తీసుకురావాలన్నారు. ఈ విషయంలో సర్వే ల్యాండ్, ఇరిగేషన్, రెవెన్యూ శాఖల అధికారులు సమన్వయంతో పని చేసి పనులను పూర్తి చేయాలని అన్నారు. ఈ భూసర్వే పూర్తి అయితే ఆయకట్టు పెరగడంతోపాటు రైతులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని అన్నారు.కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ, నీటి పారుదల శాఖ ఎస్ఈ రహీముద్దీన్, ఆర్డీఓ శ్రీనివారావు, తహసీల్దార్ బైపాల్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
గుట్టుగా గంజాయి దందా
బానిసలుగా మారుతున్న యువత, కార్మికులు ●గద్వాల క్రైం: నడిగడ్డలో గంజాయి విక్రయాలు గుట్టుగా సాగుతున్నాయి. పట్టణాలు, పల్లెల్లో యువకులు మొదలుకొని కార్మికులు ఈ మత్తుకు బానిసలుగా మారి కుటుంబాలను చిద్రం చేసుకుంటున్నారు. తాజాగా గంజాయి విక్రయాలు జరుగుతున్నట్లు గమనించిన పోలీసులు ప్రత్యేక నిఘా ఉంచి.. ఎట్టకేలకు పక్కా సమాచారంతో దాడి చేసి గంజాయి అమ్మకాల గుట్టు రట్టు చేశారు. ఈ నెల 13వ తేదీన గద్వాల జిల్లాకు చెందిన ఓ యువకుడు గద్వాల వ్యవసాయ మార్కెట్లో గంజాయి విక్రయించేందుకు వచ్చినట్లు గుర్తించి అరెస్టు చేసి 680 గ్రాముల ఎండు గంజాయి (రూ. 27 వేల విలుగల) స్వాధీనం చేసుకోవడంతో ఈ దందా వెలుగులోకి వచ్చింది. ఈ దందాలో ఇంకా ఎంత మంది ఉన్నారు, ఎక్కడెక్కడ విక్రయిస్తున్నారు, ఎలా దిగుమతి చేసుకుంటున్నారు.. అసలు సూత్రధారులు ఎవరనే విషయమై పోలీసులు కూపీ లాగుతున్నారు. రిమాండ్కు తరలించాం.. జిల్లా కేంద్రంలో గంజాయి విక్రేయించేందుకు వచ్చిన యువకుడిని అదుపులోకి తీసుకొని పూర్తి వివరాలు సేకరిస్తున్నాం. గంజాయి తీసుకునే వారిలో యువత, కార్మికులు ఉన్నట్లు విచారణలో తెలిసింది. గంజాయిని హైదరాబాద్, షోలాపూర్ నుంచి గుర్తు తెలియని వ్యక్తుల నుంచి కొనుగోలు చేసినట్లు సదరు యువకుడు తెలిపాడు. త్వరలో వారిని సైతం గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. అయితే నిందితుడిపై ఎన్డీపీఎస్ యాక్టు కింద కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించాం. – కళ్యాణ్కుమార్, పట్టణ ఎస్ఐ. కట్టడికి ప్రత్యేక నిఘా గంజాయి సరఫరా, విక్రయాలపై ప్రత్యేక నిఘా పెట్టాం. జిల్లాలో కొంతమంది యువకులు గంజాయి విక్రయాలు చేస్తున్నట్లు తెలిసింది. వీరు ఎక్కడి నుంచి తీసుకువస్తున్నారు, దందాలో ఎంతమంది ఉన్నారనే విషయాలపై విచారణ జరుగుతుంది. యువత, ప్రజలు గంజాయికి దూరంగా ఉండాలి. ఆ మత్తుకు అలవాటు పడి జీవితాలను ఆగం చేసుకోవద్దు. జిల్లాలో గంజాయి అమ్మకాలు, వినియోగంపై సమాచారం తెలిస్తే పోలీసుశాఖకు తెలియజేయాలి. నిషేధిత మత్తు పదార్థాల కట్టడి, వాటితో వచ్చే సమస్యలపై అవగాహన సదస్సుల ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకువస్తాం. – శ్రీనివాసరావు, ఎస్పీ ఇటీవల జిల్లా కేంద్రంలో గంజాయి విక్రేత అరెస్టు 280 గ్రాముల ఎండు గంజాయి స్వాధీనం కూపీ లాగుతున్న పోలీసులు -
ధాన్యం కొనుగోలులో అలసత్వం వద్దు
గద్వాల: ధాన్యం కొనుగోలులో అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులను ఆదేశించారు. గురువారం గద్వాల మండలం చెనుగోనిపల్లి, గుంటిపల్లి గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ధాన్యం తేమశాతం పరిశీలించి రైతులతో మాట్లాడుతూ.. ఏవైన సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని లారీలో లోడింగ్, ఓపిఎంఎస్లో డేటా ఎంట్రీ తదితర అంశాలను పరిశీలించారు. అకాల వర్షాలు కురిసే అవకాశమున్నందున ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని, కేంద్రాలలో ధాన్యం తడిసిపోకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా గన్నీబ్యాగుల కొరత, ట్రాన్స్పోర్ట్లో లారీల కొరత లేకుండా చూసుకోవాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నర్సింగ్రావు, సివిల్సప్లై డీఎం విమల, ఏడీఆర్డీఏ నర్సింహులు, మండల వ్యవసాఽయాధికారులు పాల్గొన్నారు. దళితుల విద్యకోసం కృషి దళితుల విద్యాభివృద్ధి కోసం నిరంతరం కృషి చేయడమే కాకుండా వారికోసం పాఠశాలలు స్థాపించిన గొప్ప ఆదర్శమూర్తి భాగ్యరెడ్డివర్మ అని కలెక్టర్ బీఎం సంతోష్ కొనియాడారు. గురువారం కలెక్టరేట్లో భాగ్యరెడ్డివర్మ జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో అసమానతలను తొలగించిన మహనీయుడు భాగ్యరెడ్డివర్మ అన్నారు. ప్రధానంగా దళిత బాలకలకు విద్యను అందించేందుకు పాఠశాలలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అస్పృశ్యత, దేవదాసి వంటి అన్యాయాలను ఎదిరించి సమాజంలో మార్పు కోసం ఎంతగానో కృషి చేసినట్లు వివరించారు. ఈతరం యువత భాగ్యరెడ్డివర్మ చూపిన మార్గాన్ని అనుసరించి సమాజంలో మార్పు కోసం కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు వి.లక్ష్మీనారాయణ, న ర్సింగ్రావు, ఆర్డీఓ శ్రీనివాసరావు, ఏవో నరెందర్, బీసీ సంక్షేమశాఖ అధికారి సరోజ, వివిధ కులసంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. -
ప్రాజెక్టులకు నీటి ప్రవాహం
గద్వాల/ ధరూరు/ దోమలపెంట: ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా పరిధిలోని రెండు ప్రధాన సాగునీటి ప్రాజెక్టులకు గతంలో ఎన్నడూ లేని విధంగా మే నెల చివరలోనే కొత్త నీటి రాక మొదలైంది. గురువారం ఎగువ ప్రాంతం నుంచి ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు 8,953, సుంకేసుల, హంద్రీ నుంచి శ్రీశైలం జలాశయానికి 8,940 క్యూసెక్కుల నీరు వచ్చింది. ఎగువ నుంచి స్వల్పంగా ఇన్ఫ్లోలు వస్తున్నట్లు పీజేపీ అధికారులు తెలిపారు. సాధారణంగా జూన్, జూలైలో కృష్ణానదికి వరదలు వస్తుంటాయి. జూరాల ప్రాజెక్టుకు కొన్ని నెలలుగా ఎలాంటి ఇన్ఫ్లో లేకపోవడంతో ఈ వేసవిలో తాగునీటికి ఇబ్బందులు తలెత్తే పరిస్థితులు దాపురించారు. మొన్నటి వరకు 3 టీఎంసీలకు పడిపోయిన నీటిమట్టం రెండు రోజులుగా వస్తున్న ఇన్ఫ్లోతో దాదాపు 1.25 టీఎంసీల నీరు చేరిందని అధికారులు చెప్పారు. డెడ్ స్టోరేజీ దశలో ఉన్న జూరాలకు స్థానికంగా కురుస్తున్న అకాల వర్షాలు కొంత మేలు చేశాయి. జూరాల ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం 4.175 టీఎంసీల నీరు నిల్వ ఉందని పీజేపీ అధికారులు తెలిపారు. సుంకేసుల, హంద్రీ నుంచి.. శ్రీశైలం జలాశయానికి గురువారం సుంకేసుల నుంచి 8,690, హంద్రీ నుంచి 250 కలిపి మొత్తం 8,940 క్యూసెక్కుల నీటి ప్రవాహం వచ్చిందని జలాశయం గేజింగ్ నిర్వాహకులు తెలిపారు. కాగా.. గత 24 గంటల వ్యవధిలో శ్రీశైలం ఎగువన రేగుమాన్గడ్డ నుంచి ఎంజీకేఎల్ఐకి 1,305 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం జలాశయంలో 817.2 అడుగుల వద్ద 38.8 టీఎంసీల నీటి నిల్వ ఉంది. జూరాల స్టాప్లాక్ గేట్ల ఓవర్ఫ్లో జూరాల ప్రాజెక్టు గేట్ల మరమ్మతు ప్రక్రియ కొనసాగుతుండగా.. మరోవైపు రెండు రోజులుగా కురిసిన వర్షాలకు జూరాలకు వర్షపు నీరు వచ్చి చేరింది. దీంతో గేట్ల మరమ్మతు చేసే క్రమంలో ప్రధాన గేట్లకు రక్షణగా ఉన్న స్టాప్లాక్ గేట్లపై నుంచి వర్షపు నీరు పొంగిపొర్లినట్లు ఎస్ఈ రహీముద్దీన్ తెలిపారు. జూరాలకు 8,953, శ్రీశైలానికి 8,940 క్యూసెక్కుల ఇన్ఫ్లో జూన్కు ముందే మొదలైన కొత్త నీటి రాక -
శరవేగంగా పాలమూరు..!
పాలమూరు ప్రాజెక్ట్కు సంబంధించి మొత్తం 18 ప్యాకేజీలుగా విభజించి పనులు చేపట్టారు. ప్రస్తుతం నార్లాపూర్, ఏదుల, వట్టెం, కరివెన రిజర్వాయర్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. ప్రస్తుతం ప్యాకేజీ–1, 5 , 8లో భాగంగా పంప్ హౌస్లలో మోటార్ల బిగింపు పూర్తయింది. నార్లాపూర్లో నాలుగు, ఏదుల, వట్టెంలో ఐదు చొప్పున మోటార్లు ఏర్పాటు చేశారు. నార్లాపూర్లో మరో రెండు మోటార్ల బిగింపు పనులు కొనసాగుతున్నాయి. ఇక్కడ రెండు మోటార్లకు విద్యుత్ కనెక్షన్లు ఇవ్వగా.. మిగతా వాటి పనులు జరుగుతున్నాయి. కాగా, గతేడాది సెప్టెంబర్లో కురిసిన భారీ వర్షాలకు వట్టెం పంప్ హౌస్ నీట మునగగా.. అప్పటి వరకు ఏర్పాటు చేసిన నాలుగు మోటార్లు దెబ్బతిన్నాయి. వీటిని మరమ్మతు చేయడంతోపాటు మరో మోటారు ఏర్పాటు చేశారు. మొత్తంగా నార్లాపూర్ నుంచి కర్వెన వరకు అంటే నాలుగు జలాశయాల వరకు నీటిని ఎత్తిపోసేలా.. ఆ రిజర్వాయర్లలో నీటిని నిల్వ చేసేలా అధికారులు అంతా సిద్ధం చేస్తున్నారు. ఉదండాపూర్లో జఠిలంగా పరిహారం.. పాలమూరులో భాగంగా చేపట్టిన కరివెన రిజర్వాయర్ పనులు అన్నీ పూర్తయ్యాయి. అయితే కాల్వకు కీలకమైన వయాడక్ట్ ఏర్పాటులో భూసేకరణ సమస్యగా మారినట్లు తెలుస్తోంది. కేవలం రెండు ఎకరాల భూ సమస్య కోర్టులో పెండింగ్ ఉన్నట్లు సమాచారం. ఇది ఓ కొలిక్కి వస్తే ప్రభుత్వం తాజాగా నిర్దేశించిన గడువు అంటే ఈ ఏడాది డిసెంబర్ వరకు అటు ఇటుగా కరివెన జలాశయాన్ని నీటితో నింపి.. పంటలకు సాగు నీరందించే అవకాశం ఉంది. అదేవిధంగా ఉదండాపూర్ రిజర్వాయర్కు సంబంధించి భూసేకరణ సమస్య ప్రధాన అడ్డంకిగా మారింది. పరిహారం రూ.800 కోట్లు అవసరం ఉండగా.. ఇందులో రూ.72 కోట్లు మాత్రమే విడుదలయ్యాయి. రిజర్వాయర్ నిర్మాణంలో భూమి కోల్పోతున్న వారు పరిహారం పెంచాలని డిమాండ్ చేస్తుండడంతో సమస్య జఠిలంగా మారింది. ఈ క్రమంలో ఈ రిజర్వాయర్ పూర్తికి ప్రభుత్వం 2027 మార్చి వరకు గడువు నిర్దేశించినట్లు సమాచారం. రిజర్వాయర్లో నీరు వచ్చేందుకు ఏర్పాటు చేసిన పైప్లైన్ డెడ్లైన్.. డిసెంబర్ మిగతా పెండింగ్ ప్రాజెక్ట్ల పూర్తికి డెడ్లైన్.. కృష్ణా పరివాహకంలోని ప్రాజెక్ట్ల స్థితిగతులపై ఇటీవల జలసౌధలో పలువురు మంత్రులు, వివిధ శాఖల ఉన్నతాధికారులతో సీఎం రేవంత్రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్ట్ను ఉదండాపూర్ జలాశయం వరకు మొదటి ప్రాధాన్యతగా పూర్తి చేయాలని..18 నెలల్లో పెండింగ్ పనులను పూర్తి చేసేలా కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని ఆదేశించారు. అదేవిధంగా ఈ ఏడాది డిసెంబర్లోపు మహాత్మాగాంధీ కల్వకుర్తి, జవహర్ నెట్టెంపాడు, రాజీవ్ భీమా ఎత్తిపోతల పథకం.. వచ్చే ఏడాది జూన్లోపు కోయిల్సాగర్ ఎత్తిపోతల ప్రాజెక్ట్ పనులు పూర్తి చేయాలని సూచించారు. ఈ మేరకు రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారులు ప్రత్యేక కార్యాచరణతో పనులు పూర్తి చేయించేలా సన్నాహాలు మొదలుపెట్టారు. డిసెంబర్లో సాగు నీరందిస్తాం.. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్ట్పై సీఎం రేవంత్రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. నిధుల సమస్య లేదని.. పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ మేరకు పెండింగ్లో ఉన్న పనులను ముమ్మరం చేశాం. డిసెంబర్లోపు నార్లాపూర్ నుంచి కరివెన వరకు పనులు పూర్తి చేస్తాం. నాలుగు రిజర్వాయర్ల నిల్వ సామర్థ్యం 48.94 టీఎంసీలు కాగా.. అన్నింటినీ నీటితో నింపుతాం. వీటి పరిధిలోని సుమారు 3 లక్షల ఎకరాల ఆయకట్టుకు డిసెంబర్ నుంచే సాగు నీరందించే లక్ష్యంతో పనుల్లో వేగం పెంచాం. – విజయభాస్కర్ రెడ్డి, సీఈ, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్ట్ 4 రిజర్వాయర్లు పూర్తి.. 14 మోటార్లు సిద్ధం -
‘నెట్టెంపాడు’ భూసేకరణ వేగవంతం చేయాలి
గద్వాల: జవహార్ నెట్టెంపాడు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పరిధిలో భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని, అదేవిధంగా పెండింగ్ పనులు త్వరగా పూర్తి చేయాలని ఉమ్మడి జిల్లా ప్రత్యేక అధికారి రవినాయక్, కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులను ఆదేశించారు. గురువారం ఐడీవోసీ కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ నెట్టెంపాడు ప్రాజెక్టు కింద పెండింగ్లో ఉన్న 480ఎకరాల భూసేకరణపై వెంటనే చర్యలు తీసుకుని భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. ప్రధానంగా 99,100 ప్యాకేజీలలో సేకరించాల్సిన భూసేకరణపై ప్రత్యేక దృష్టి సారించాలని, చింతరేవుల, శెట్టిఆత్మకూరు, మెలచెర్వు గ్రామాల్లో భూసేకరణపై రెవెన్యూ శాఖతో సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు. డిస్ట్రిబ్యూషన్స్, కెనాల్స్, వారిగా తహసీల్దార్, రెవెన్యూ ఇన్స్పెక్టర్, మండల సర్వేయర్, ఇరిగేషన్ అధికారులతో కూడిన ప్రత్యేక టీంలను ఏర్పాటు చేయాలని,భూసేకరణ పరిహారం చెల్లించిన వెంటనే అవసరమైన సివిల్ పనులు ప్రారంభించాలన్నారు. కాల్వల నిర్మాణం వల్ల గ్రామాల అభివృద్ధి, సాగు సౌకర్యాలు మెరుగవుతాయని, త్వరలోనే ప్రాజెక్టు పనులను పరిశీలిస్తానని తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ, ఆర్డీవో శ్రీనివాసరావు, ఎస్ఈ రహీముద్దీన్, ఇరిగేషన్, రెవెన్యూ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. -
పవనపుత్రా.. పాహిమాం
ఎర్రవల్లి: బీచుపల్లి పుణ్యక్షేత్రంలోని అభయాంజనేయస్వామి ఆలయంలో హనుమాన్ జయంతిని పురస్కరించుకొని గురువారం భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు ఉదయం ఆంజనేయస్వామికి పంచామృత అభిషేకం, వడమాల, మంగళహారతి, తీర్థ ప్రసాద వితరణ చేశారు. ఆలయ చుట్టు ప్రక్కల ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో బీచుపల్లికి చేరుకొని స్వామివారిని దర్శించుకున్నారు. అదేవిదంగా వికాస తరంగిణి, విశ్వ హిందూపరిషత్, ధర్మప్రసార సమితి ఆధ్వర్యంలో చినజీయర్ స్వామి శిష్య బృందం సభ్యులు ఆలయంలో 1008 పర్యాయాలు హనుమాన్ చాలిసా పారాయణం చేశారు. హనుమంతుని గొప్పతనం, ధైర్య సాహసాలను భక్తులకు వివరించారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ రామన్గౌడ్, పాలక మండలి సభ్యులు, అర్చకులు, హిందూ సంఘాల సభ్యులు, భక్తులు, తదితరులు పాల్గొన్నారు. వనపర్తి ఎమ్మెల్యే దంపతుల ప్రత్యేక పూజలు బీచుపల్లి పుణ్యక్షేత్రాన్ని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, శారద దంపతులు గురువారం దర్శించుకున్నారు. హనుమాన్ జయంతిని పురస్కరించుకొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ ఈఓ రామన్గౌడ్ ఎమ్మెల్యే దంపతులను శేష వస్త్రాలతో సత్కరించగా.. అర్చకులు మారుతిచారి తీర్థ ప్రసాదాలు అందించారు. వారి వెంట నాయకులు విజయవర్దన్రెడ్డి, అక్కి శ్రీనివాస్గౌడ్, వెంకట్రాములు, సురేందర్గౌడ్, రంజిత్కుమార్, రాంరెడ్డి, తదితరులు ఉన్నారు. బీచుపల్లి అభయాంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు భక్తిశ్రద్ధలతో హనుమాన్ జయంత్యుత్సవాలు -
సాగుదాం..
జోగుళాంబ గద్వాలవానాకాలం పంటల సాగు ప్రణాళిక ఖరారుగురువారం శ్రీ 22 శ్రీ మే శ్రీ 2025వివరాలు 8లో uవిత్తనాలు, ఎరువుల కొరత రాకుండా చర్యలు గడిచిన ఏడాది వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండటంతో పంటల దిగుబడులు బాగా వచ్చాయి. రానున్న వానాకాలం సీజన్లో పంటలు వేసేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. అయితే పంటలు, ఎరువులు, క్రిమిసంహారక మందుల విషయంలో రైతులు వ్యవసాయశాఖ అధికారుల సలహాలు, సూచనలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా. ఈసీజన్లో ఎరువులు, విత్తనాల కొరత రాకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. – సక్రియానాయక్, డీఏఓ గద్వాల వ్యవసాయం: నడిగడ్డలో ఈఏడాది వానాకాలం సీజన్ పంట ప్రణాళిక ఖరారు అయ్యింది. 3,67,211 ఎకరాల్లో పంటలు సాగు అయ్యే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. గడిచిన ఏడాది వానాకాలం, యాసంగి సీజన్లు సాఫీగానే సాగయ్యాయి. ఈఏడాది కూడా వర్షాలు బాగా కురిసి పంటలు బాగా పండుతాయన్న ఆశతో అన్నదాతలు సిద్ధం అవుతున్నారు. ఇదే సమయంలో పంటలకు కావాల్సిన విత్తనాలు, ఎరువులను సిద్ధంగా ఉంచేందుకు వ్యవసాయ అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. గడిచిన ఏడాది సాఫీగా సాగు 2024–25 వానాకాలం, యాసగి సీజన్లలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురిశాయి. జూన్, జులై, ఆగస్టు నెలల్లో వర్షాలు సమృద్ధిగా కురిశాయి. దీంతో బోర్లు, బావులు రిజార్జ్ అయ్యాయి. ఇదే సమయంలో ఎగువన కురిసిన వర్షాల వల్ల జూరాల జలాశయం నుంచి అనుకున్న సమయలో నీటి విడుదల జరిగింది. ఇలా అన్ని పరిస్థితులు అనుకూలించడం వల్ల గడిచిన ఏడాది వానాకాలం సీజన్లో అన్ని పంటలు దిగుబడులు బాగా వచ్చాయి. అయితే వానాకాలం సీజన్లో సెప్టెంబర్ నెలాఖరులో కురిసిన ఎడతెరిపి లేని వర్షాల వల్ల జిల్లాలో దాదాపు 2వేల ఎకరాల్లో పత్తి, ఆముదం, వేరుశనగ తదితర పంటలు దెబ్బతిన్నాయి. ఇక యాసంగిలోనూ వాతావరణ పరిస్థితులు అనుకూలించడం వల్ల వరి, వేరుశనగ, పప్పుశనగ తదితర పంటల దిగుబడులు ఆశించిన మేర వచ్చాయి. అత్యధికం పత్తి, వరి.. వానాకాలం సీజన్కు అవసరమైన పంట ప్రణాళికను ఇక్కడి వ్యవసాయ అధికారులు సిద్ధం చేశారు. ఈఏడాది పరిస్థితులు అనుకూలంగా ఉంటాయన్న ఉద్దేశ్యంతో ఆయా ప్రాంతాలలో 3,21305 ఎకరాల్లో వ్యవసాయ పంటలు, 45906 ఎకరాల్లో ఉద్యాన పంటలు, మొత్తం 3,67,211 ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు అవుతాయని అంచనా వేశారు. వ్యవసాయ పంటలకు సంబంధించి ప్రధానంగా పత్తి, వరి,కంది పంటలను ఎక్కువగా సాగు చేస్తారని భావిస్తున్నారు. ఇక కంది పంటకు సంబందించి గడిచిన ఏడాది దాదాపు 40వేల ఎకరాల్లో వేశారు. అంతకుముందు మూడేళ్లు తక్కువగా వేశారు. ఈ ఏడాది సాగు ఎక్కువగా ఉంటుంది. వేరుశనగ పంట అంచనాకు మించి సాగు అయ్యే అవకాశం ఉంది. ఇక ఉద్యాన పంటలకు సంబంధించి 30వేల ఎకరాల్లో ఎండుమిర్చి, 3936 ఎకరాల్లో ఆయిల్పాంమ్, 11,665 ఎకరాల్లో ఇతర పంటలు సాగు అంచనాగా ఉంది. ఇదిలా ఉంటే పంటలకు అవసరమయ్యే విత్తనాలు, ఎరువుల లెక్కలు సైతం అధికారులు సిద్ధం చేశారు. దాదాపు 49వేల క్వింటాళ్ళ పత్తి, వరి, కంది తదితర పంటలకు విత్తనాలు అవసరం అవుతాయని అంచనాకు వచ్చారు. విత్తనాలు, ఎరువులు కొరత రాకుండా ముందస్తుగా అన్ని చర్యలు తీసుకుంటున్నామని అధికారులు అన్నారు. ఇదిలాఉండగా, ఈ ఏడాది వానాకాలం సీజన్కు అన్నదాతలు సిద్ధం అయ్యారు. గడిచిన పది రోజల వ్యవదిలో మూడునాలుగు సార్లు ఓ మోస్తరు వర్షాలు కురవడంతో జిల్లాలోని పలు ప్రాంతాల్లో రైతులు వేసవి దుక్కులు దున్నుతున్నారు. విత్తనాల కొనుగోలుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. జూన్ రెండో, మూడో వారం నాటికి వర్షాలు ఆశించిన స్తాయిలో కురిస్తే చివరి వారంలో విత్తనాలు వేయాలని రైతులు భావిస్తున్నారు. న్యూస్రీల్ఎరువులు ఇలా... 3.67 లక్షల ఎకరాల్లో వివిధ పంట సాగవుతాయని అంచనా పత్తి, వరి, కంది పంటలు అధికంగా సాగుచేసే అవకాశం వేసవి దుక్కులు దున్నుతున్న రైతులు -
క్రీడారంగ అభివృద్ధికి కృషి
నర్వ/మక్తల్: ఔత్సాహిక క్రీడాకారుల ఇబ్బందులు తీర్చేందుకే జాండ్రగుట్ట వద్ద క్రీడామైదానం ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి, ఎమ్మెల్యే వాకిటీ శ్రీహరీ అన్నారు. బుధవారం సాయంత్రం నర్వ జాండ్ర గుట్ట వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతనంగా ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల, క్రీడామైదానానికి అనుమతి పత్రాన్ని వారు అందజేశారు. అనంతరం మాట్లాడుతూ.. రూ. 60 లక్షల నిధులు క్రీడామైదానం ఏర్పాటు కోసం కేటాయిస్తున్నట్లు శివసేనారెడ్డి ప్రకటించి ఇందుకు సంబందించిన పత్రాన్ని అందించారు. ఎమ్మెల్యే తన నిధుల నుంచి రూ. 45 లక్షలు క్రీడామైదానం అభివృద్ధికి కేటాయించినట్లు తెలిపారు. త్వరలో క్రీడామైదానం పనులు చేపట్టి పూర్తి చేసి క్రీడాకారులు ఆటలు ఆడే విధంగా తయారు చేస్తామని అన్నారు. దీంతో పాటు జూనియర్ కళాశాలను ఈ అకాడమిక్ ఇయర్లో ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం స్పోర్ట్స్ చైర్మన్ను, ఎమ్మెల్యేను కాంగ్రెస్ పార్టీ నాయకులు శాలువాలతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో తహసీల్ధార్ మల్లారెడ్డి, ఎంపీడీఓ శ్రీనువాసులు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బీసం చెన్నయ్యసాగర్, జిల్లా నాయకులు గౌని లక్ష్మారెడ్డి, క్రిష్ణారెడ్డి, శ్రీనివాస్రెడ్డి, మండల నాయకులు శరణప్ప, వివేకవర్ధన్రెడ్డి, అశోక్గౌడ్, తదితరులు పాల్గొన్నారు. ● ప్రభుత్వం క్రీడారంగం అభివృద్ధికి ఎనలేని కృషి చేస్తుందని శివసేనారెడ్డి, ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు. మక్తల్లోని మినీ స్టేడియంలో ఏర్పాటు చేసిన క్రీడాకారుల సమావేశంలో వారు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో రూ.5.30 కోట్లతో మైదానాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. విద్యార్థులు చిన్నప్పటి నుండే క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలని కోరారు. మారుమూల గ్రామాలలోని క్రీడాకారులు జాతీయ స్థాయిలో రాణించాలని కోరారు. మినీ స్టేడియంలో క్రీడాకారులకు అన్ని వసతులు కలిపిస్తున్నామని తెలిపారు. -
నిలిచిన ‘సీయూఈటీ’
షార్ట్సర్క్యూట్ కారణంగా పనిచేయని కంప్యూటర్లు వర్షంలో తడుచుకుంటూ వచ్చాం.. రాత్రి 2 గంటలకు గద్వాల నుంచి బయలుదేరి, ఉదయం 6 గంటలకు పరీక్ష కేంద్రానికి చేరుకున్నాం. షార్ట్ సర్క్యూట్తో పరీక్ష నిలిచిపోతే పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కరెంట్ పోతే మేమేం చేయాలని పేర్కొంటున్నారు. అలాంటప్పుడు పరీక్ష కేంద్రం ఎందుకు పెట్టుకోవాలి. వెంటనే ప్రభుత్వం, అధికారులు స్పందించి మా పిల్లలకు న్యాయం చేయాలి. – సునీత, విద్యార్థిని తల్లి, గద్వాల పరీక్ష జరగలేదు. సీయూఈటీ పరీక్ష రాసేందుకు రాత్రి బయలుదేరి మద్దూరు నుంచి వచ్చాను. తీరా ఇక్కడికి వచ్చాక షార్ట్ సర్క్యూట్తో కంప్యూటర్లు పనిచేయలేదు. దీంతో పరీక్ష రాయకుండా వెనుదిరిగే పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం స్పందించి మాకు న్యాయం చేయాలి. – మహేశ్కుమార్, విద్యార్థి, మద్దూరు ●● మహబూబ్నగర్ ‘ఫాతిమా’ స్కూల్ కేంద్రంలో పరీక్షకు దూరమైన 180 మంది విద్యార్థులు ● న్యాయం చేయాలని ఆందోళనకు దిగిన తల్లిదండ్రులు మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: సెంట్రల్ యూనివర్సిటీల్లో యూజీ (అండర్ గ్రాడ్యుయేషన్) స్థాయిలో సీట్ల భర్తీ కోసం ప్రభుత్వం దేశవ్యాప్తంగా సీయూఈటీ (కామన్ యూనివర్సిటీ ఎంట్రెన్స్ టెస్టు) నిర్వహిస్తోంది. వివిధ గ్రూపుల విద్యార్థులు ఈ నెల 13 నుంచి జూన్ 3వ తేదీ వరకు ఆన్లైన్లో పరీక్షలు రాస్తున్నారు. ఈ మేరకు మహబూబ్నగర్ జిల్లాకేంద్రంలోని ఫాతిమా విద్యాలయంలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రంలో ఉమ్మడి జిల్లా పరిధిలోని 180 మంది విద్యార్థులు బుధవారం ఉదయం సెషన్ 9 నుంచి మధ్యాహ్నం 11 గంటల వరకు ఆన్లైన్లో పరీక్ష రాయాల్సి ఉంది. అయితే ఉదయం వర్షం కారణంగా పాఠశాల కంప్యూటర్ ల్యాబ్ ఉన్న ప్రాంతంలో షార్ట్ సర్క్యూట్ ఏర్పడింది. దీంతో పరీక్ష ప్రారంభమైన కొద్దిసేపటికే విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. కంప్యూటర్లు సైతం ఆఫ్ అయ్యాయి. గంట తర్వాత విద్యుత్ సరఫరాను పునరుద్ధరించగా.. మళ్లీ 10 నిమిషాల్లోనే మరోసారి షార్ట్ సర్క్యూట్తో సరఫరా నిలిచిపోయింది. ఈ క్రమంలో విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. 180 మంది విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారడంతో వారి తల్లిదండ్రులు పాఠశాల వద్ద ఆందోళనకు దిగారు. దేశవ్యాప్తంగా కొనసాగిన పరీక్ష దేశవ్యాప్తంగా 60కి పైగా సెంట్రల్ యూనివర్సిటీల్లో విద్యార్థులకు ప్రవేశం కల్పించేందుకు ఆన్లైన్లో ఎంట్రెన్స్ టెస్టు నిర్వహిస్తున్నారు. ఇందుకోసం ఒక్కో విద్యార్థి రూ.950 చెల్లించి దరఖాస్తు చేసుకున్నారు. బుధవారం దేశవ్యాప్తంగా పరీక్ష కొనసాగగా.. ఒక్క మహబూబ్నగర్లోని ఫాతిమా విద్యాలయ పరీక్ష కేంద్రంలో మాత్రం జరగలేదు. పరీక్షకు సంబంధించి ప్రశ్నపత్రం కూడా బయటికి వచ్చాక.. మరోసారి పరీక్ష ఎలా నిర్వహిస్తారని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ప్రశ్నించారు. ఈ విషయంపై ఫాతిమా విద్యాలయ ప్రిన్సిపాల్ థెరిస్సా మాదను స్పందిస్తూ.. పరీక్ష నిర్వహణలో ఏర్పడిన అంతరాయంపై ఎన్టీఏ (నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి) సమాచారం ఇచ్చామని.. మరోసారి పరీక్ష నిర్వహించే విధంగా ఎన్టీఏ చర్యలు తీసుకుంటుందని చెప్పినట్లు విద్యార్థుల తల్లిదండ్రులు పేర్కొన్నారు. ఏపీ ఎంసెట్ వదులకున్నా.. పరీక్ష ప్రారంభమైన కొన్ని నిమిషాలకే విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. గంటసేపు వరకు పునరుద్ధరించలేదు. అప్పటికే సమయం కూడా ముగిసింది. అనంతరం పరీక్ష నిర్వాహకులు వచ్చి పరీక్షకు మరోసారి ఎన్టీఏ వారు సమాచారం ఇస్తారు.. అప్పడు వచ్చి పరీక్ష రాయాలని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా పరీక్షలు రాసి ఇక్కడ మాత్రం నిర్వహించలేదు. ఏపీ ఎంసెట్ వదులుకుని ఈ పరీక్షకు వచ్చాను. న్యాయం చేయాలి. – సాయివర్షిణి, విద్యార్థి, మరికల్ మరో అవకాశం ఇవ్వాలి.. సీయూఈటీ పరీక్ష రాయడానికి మరికల్ నుంచి వచ్చాను. కొన్ని రోజులుగా పరీక్ష కోసం సిద్ధమయ్యాను. తీరా పరీక్షకు వస్తే విద్యుత్ సరఫరా నిలిచిపోయి కంప్యూటర్లు పనిచేయలేదు. ప్రభుత్వం మరోసారి పరీక్ష నిర్వహిస్తుందా.. లేక రీషెడ్యూల్ చేస్తారా అనే అంశంపై స్పష్టత ఇవ్వాలి. – రామకృష్ణ, విద్యార్థి, మరికల్ -
విషాదం నింపిన ప్రమాదం
గద్వాల క్రైం: కుటుంబసభ్యులతో కలిసి కారులో హైదరాబాద్కు బయలుదేరారు. అయితే అప్పటి వరకు బాలుడు ప్రవీణ్.. తల్లిదండ్రులు, తోబుట్టువులతో స్వరాష్ట్రానికి వెళ్తున్నానంటూ ఆనందంతో గడిపాడు. సంతోషంగా సాగుతున్న వారి ప్రయాణంలో ఒక్కసారిగా జరిగిన రోడ్డు ప్రమాదం వల్ల కారులో చిక్కుకుని కుటుంబసభ్యులు కళ్లముందే మృతి చెందడంతో ప్రవీణ్ అనాథగా మారాడు. వివరాల్లోకి వెళ్తే.. తెలుగు భాస్కర్ (41), అతని తల్లిదండ్రుల స్వగ్రామం మల్దకల్ మండలం మల్లెందొడ్డి గ్రామం కాగా, బతుకుదెరువు కోసం కొన్నేళ్ల క్రితం గద్వాలకు వలస వచ్చారు. పట్టణంలోని బీసీ కాలనీలో నివాసం ఉంటున్నారు. తెలుగు భాస్కర్ బీటెక్ పూర్తి చేసిన అనంతరం కెనరా బ్యాంకులో ఉద్యోగం సాధించాడు. మేనమామ కూతురు పవిత్ర (38)ను వివాహం చేసుకొని గద్వాలలోనే కొన్నేళ్లు క్యాషియర్గా జీవనం సాగించాడు. ఈ క్రమంలోనే 2022 సంవత్సరంలో పదోన్నతి పొందడంతో కుటుంబసభ్యులతో కలిసి మహారాష్ట్రలోని భండారా జిల్లా వార్తి మండలంలోని కెనరా బ్యాంకులో మేనేజర్గా విధులు నిర్వహిస్తున్నాడు. ఇటీవల హైదరాబాద్కు బదిలీ కావడంతో బుధవారం కుటుంబసభ్యులతో కలిసి కారులో బయల్దేరాడు. ఈక్రమంలోనే కర్ణాటక రాష్ట్రంలోని విజయపుర జిల్లా మనగులి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలుగు భాస్కర్, అతని భార్య పవిత్ర, కుమార్తె జ్యోత్స్న (9), అభిరాం (7)తో పాటు కారు డ్రైవర్ (41)మృతిచెందగా..మరో కుమారుడు ప్రవీణ్ మాత్రం స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఈ విషయం తెలియడంతో అటు గద్వాల, మల్దెందొడ్డిలో విషాదఛాయలు అలుముకున్నాయి. విషయం తెలుసుకున్న మృతుడి కుటుంబసభ్యులు వెంటనే కర్ణాటకకు బయలు దేరారు. కొన్ని నిమిషాల ముందు వరకు కుటుంబసభ్యులతో సంతోషంగా కారులో బయలుదేరిన ప్రవీణ్... రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు అమ్మానాన్నతో పాటు అక్క, తమ్ముడిని కోల్పోయి అనాథగా మారాడు. నేడు జిల్లాకు మృతదేహాలు.. ఈ ప్రమాదంపై కర్ణాటక పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. పోస్టుమార్టం అయిన తర్వాత మృతదేహాలు ఇవ్వనున్నారు. అయితే అక్కడి నుంచి గురువారం మధ్యాహ్నం గద్వాలకు వచ్చే అవకాశాలు ఉన్నాయని మృతుడి బంధువులు పేర్కొన్నారు. ఇదిలాఉండగా, తెలుగు భాస్కర్ చిన్ననాటి నుంచి ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాడని, బంధువుల సాయంతో బీటెక్ పూర్తి చేసి ఎంతో కష్టపడి బ్యాంకులో ఉద్యోగం సంపాదిచాడని బంధువులు, కాలనీవాసులు గుర్తు చేశారు. ఉద్యోగంలో ఒక్కో మెట్టు పైకి ఎక్కి, భార్య, పిల్లలతో సంతోషంగా ఉన్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకోవడం కలిచివేస్తుందని.. వారి కుమారుడు ప్రవీణ్ ఆలనా పాలన చూసేది ఎవరంటూ వారు కన్నీటి పర్యంతమయ్యారు. కర్ణాటకలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు గద్వాల వాసులు మృతి మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారే తల్లిదండ్రులు, తోబుట్టువులను కోల్పోయి అనాథగా మారిన బాలుడు గద్వాలలోని బీసీ కాలనీలో విషాదఛాయలు -
విద్యార్థుల భవిష్యత్ను ఉన్నతంగా తీర్చిదిద్దాలి
మల్దకల్: సమ్మర్ క్యాంపులో విద్యార్థుల భవిష్యత్ను ఉన్నతంగా తీర్చిదిద్దాలని డీఈఓ అబ్దుల్ఘని ఉపాధ్యాయులకు సూచించారు. బుధవారం మల్దకల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న సమ్మర్ క్యాంపును డీఈఓ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి విద్యార్థికి అర్థమయ్యే రీతిలో విద్యాబోధన చేసి వారి మేధాశక్తిని పెంచేందుకు కృషి చేయాలన్నారు. అలాగే విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత స్థానాలను అధిరోహించాలని విద్యార్థులకు సూచించారు. ముఖ్యంగా విద్యార్థులు చెడు వ్యసనాలకు ఆకర్షితులు కాకుండా విద్యపై దృష్టి పెట్టాలన్నారు. విద్య ద్వారానే సమాజం ఎంతో అభివృద్ధి చెందుతుందని, ముఖ్యంగా తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలలకు పంపించి వారిపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. కార్యక్రమంలో ఇన్చార్జి ఎంఈఓ సురేష్, ఉపాధ్యాయులు, విధ్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఆకట్టుకున్న ప్రదర్శనలు గద్వాలటౌన్: గద్వాల కేజీబీవీలో గత 15 రోజులుగా విద్యార్థినులకు నిర్వహించిన వేసవి శిక్షణ శిబిరం ఘనంగా ముగిసింది. జిల్లాలోని 12 కేజీబీవీల నుంచి సుమారు వంద మంది బాలికలు శిక్షణ పొందారు. నృత్యం, డ్రాయింగ్, క్రాప్ట్, కంప్యూటర్ తదితర అంశాలలో శిక్షణ ఇచ్చారు. శిక్షణ పొందిన విద్యార్థినులు తమ ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. బుధవారం ఏర్పాటు చేసిన ముగింపు కార్యక్రమానికి డీఈఓ అబ్దుల్ ఘనీ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వేసవి శిక్షణతో విద్యార్థినులు మంచి ఫలితాలు సాధించారని చెప్పారు. నేర్చుకున్న విషయాల్లో మరింత ప్రావీణ్యం సాధించేందుకు కృషి చేయాలన్నారు. అనంతరం ప్రతిభ చాటిన విద్యార్థినులకు మెమోంటోలను అందజేశారు. కార్యక్రమంలో జీసీడీఓ ఫర్జానాబేగం, ఎస్ఓ శ్రీదేవి, ఆర్పీలు పుష్పలత, చంద్రకళ, దివ్య, నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
లేబర్ కోడ్లను రద్దు చేసే వరకు పోరాటం
గద్వాల: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన లేబర్ కోడ్లను రద్దు చేసే వరకు పోరాటం కొనసాగిస్తామని సీఐటీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వెంకటస్వామి, నర్సింహ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని పాతబ బస్టాండ్లో నిసరన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం కార్మికుల హక్కులను హరించేందుకు తీసుకువచ్చిన లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా కార్మిక వర్గాన్ని సంఘటితం చేసి దీర్ఘకాల ఉద్యమానికి సిద్ధమవుతున్నట్లు చెప్పారు. పెట్టుబడిదారులు, కార్పొరేట్ శక్తులకు రూ.లక్షల కోట్ల కార్మికవర్గ సంపదను రాయితీల రూపంలో అందిస్తుందన్నారు. కార్మికులకు మాత్రం కనీస వేతనాలు ఇవ్వకుండా, భద్రత కల్పించకుండా హక్కులను కాలరాసే విధానాలను కొనసాగించడం దారుణమన్నారు. రూ.లక్షల కోట్ల ధనాన్ని కార్పొరేట్ శక్తులకు అప్పగించే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి దేశభక్తి గురించి మాట్లాడే అర్హత కూడా లేదన్నారు. దేశంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఈ నెల 20న జరగాల్సిన సార్వత్రిక సమ్మెను జూలై 9వ తేదీకి వాయిదా వేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో దానయ్య, రామకృష్ణ, కోళ్ల అంజి, భరత్, నిజాముద్దీన్, హనీఫ్ పాల్గొన్నారు. -
‘నెట్టెంపాడు’ పెండింగ్ పనులు పూర్తి చేయండి
గద్వాల: జవహర్ నెట్టెంపాడు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పరిధిలో పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ బీఎం సంతోష్ ఆదేశించారు. మంగళవారం ఐడీఓసీ కార్యాలయంలో సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. నెట్టెంపాడు ప్రాజెక్టు కింద పెండింగ్లో ఉన్న 480 ఎకరాల భూ సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. భూ సేకరణలో డిస్ట్రిబ్యూషన్స్, కెనాల్స్ వారీగా తహసీల్దార్, రెవెన్యూ ఇన్స్పెక్టర్, మండల సర్వేయర్, ఇరిగేషన్ అధికారులతో కూడిన ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలన్నారు. ప్రాజెక్టుకు అవసరమైన భూ సేకరణపై నిర్లక్ష్యం చేయరాదన్నారు. అదే విధంగా భూ సేకరణ పరిహారం చెల్లించిన వెంటనే అవసరమైన సివిల్ పనులు పూర్తిచేయాలని సూచించారు. కాల్వల నిర్మాణంతో సాగు సౌకర్యాలు మెరుగవుతాయని తెలిపారు. త్వరలోనే ప్రాజెక్టు పనులను పరిశీలిస్తానని అన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ, ఆర్డీఓ శ్రీనివాసరావు, ఎస్ఈ రహీముద్దీన్, ఇరిగేషన్, రెవెన్యూ శాఖల అధికారులు ఉన్నారు. -
ధాన్యం కొనుగోళ్లలో జాప్యం చేయొద్దు
ధరూరు: రైతుల నుంచి ధాన్యం కొనుగోళ్లలో జాప్యం చేయొద్దని అదనపు కలెక్టర్ నర్సింగ్రావు అన్నారు. మంగళవారం మండలంలోని భీంపురం, రేవులపల్లి, గార్లపాడు గ్రామాల్లో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. ఇప్పటి వరకు కొన్న ధాన్యం వివరాలతో పాటు సెంటర్లో కల్పిస్తున్న సదుపాయాలపై ఆరా తీశారు. రికార్డులను పరిశీలించారు. ధాన్యం విక్రయించిన రైతుల వివరాలను ట్యాబ్లో ఎంట్రీ చేసి బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ అయ్యే విధంగా చూడాలని నిర్వాహకులకు సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో గన్నీ బ్యాగులు, లారీల కొరత లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. నాణ్యతా ప్రమాణాలు ఉన్న ధాన్యాన్ని త్వరగా తూకం వేయాలని సూచించారు. అదనపు కలెక్టర్ వెంట ఏపీఎం శోభారాణి ఉన్నారు. -
చట్టాలపై అవగాహన తప్పనిసరి
గద్వాల: చట్టాలపై ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలని ప్రిన్సిపల్ సీనియర్ సివిల్జడ్జి వి.శ్రీనివాస్ అన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం గద్వాల మండలం మదనపల్లిలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ.. అసంఘటిత రంగ కార్మికులు అంటే ప్రభుత్వంలో నమోదుకాని వ్యాపారాల్లో పనిచేసే వ్యక్తులు అని.. నిత్యం చట్టానికి వెలుపల పనిచేస్తారన్నారు. ఈ రంగం చిన్న వ్యాపారాలను మొదలుకుని ఇంటి ఆధారిత పని వరకు విస్తృత శ్రేణి కార్యకలాపాలను కలిగి ఉంటుందన్నారు. కార్మికులకు తక్కువ వేతనాలు ఇవ్వడం, సామాజిక భద్రత లేకపోవడం, క్రమరహిత ఉపాధి వంటి సమస్యలు ఉంటాయన్నారు. ఏదైనా సమస్యలు తలెత్తితే నేరుగా దరఖాస్తు రూపంలో ఫిర్యాదు చేయాలని సూచించారు. కార్మికులందరూ గుర్తింపు కార్డులు పొందాలని.. తద్వారా ప్రభుత్వం కల్పించే సదుపాయాలను సద్వినియోగం చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. కార్యక్రమంలో లీగల్ ఎయిడ్ కౌన్సిల్ వి.రాజేందర్, బి.శ్రీనివాసులు, లక్ష్మణస్వామి తదితరులు పాల్గొన్నారు. -
ఇంట్రా లీగ్లో రాణిస్తే హెచ్సీఏ టోర్నీలో అవకాశం
గద్వాలటౌన్: ఇంట్రా డిస్ట్రిక్ట్ లీగ్లో రాణించే క్రీడాకారులను హెచ్సీఏ టోర్నీలో పాల్గొనే ఉమ్మడి జిల్లా జట్టుకు ఎంపిక చేస్తామని గద్వాల క్రికెట్ అసోసియేషన్ జిల్లా కోశాధికారి పట్వారీ వెంకటేశ్ అన్నారు. స్థానిక మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియంలో అండర్–23 పురుషుల ఇంట్రా డిస్ట్రిక్ట్ టూడే లీగ్ మంగళవారం ప్రారంభమైంది. క్రీడాకారులను పరిచయం చేసుకున్న అనంతరం ఆయన మాట్లాడారు. జిల్లాలో మొదటిసారిగా హెచ్సీఏ అపెక్స్ కౌన్సిల్ ఇంట్రా డిస్ట్రిక్ట్ టూడే లీగ్లు ప్రారంభించిందన్నారు. జిల్లా క్రీడాకారులు సత్తా చాటాలని సూచించారు. అనంతరం జరిగిన మ్యాచ్లో ఆతిఽథ్య గద్వాల జట్టు నారాయణపేట జట్టుపై 94 పరుగుల ఆధిక్యం సాధించింది. మొదట బ్యాటింగ్కు దిగిన గద్వాల జట్టు 40 ఓవర్లలో 240 పరుగులు చేసింది. జట్టు క్రీడాకారుడు జయసింహ 48, అరుణ్కుమార్ 47 పరుగులతో రాణించారు. నారాయణపేట జట్టు బౌలర్ ఆశిష్ 35 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్కు దిగిన నారాయణపేట జట్టు 146 పరుగులకు ఆలౌట్ అయింది. జట్టు క్రీడాకారుడు ప్రతీష్ 50 పరుగులతో రాణించారు. గద్వాల జట్టు క్రీడాకారుడు అరుణ్కుమార్ 18 పరుగులు ఇచ్చి 3 వికెట్ల తీశారు. ఆల్ రౌండర్ ప్రతిభతో ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో గద్వాల క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు శరత్చంద్ర, కార్యదర్శి శ్రీనివాస్, కోచ్లు రుషేంద్ర, హరినాథ్ పాల్గొన్నారు. -
‘హద్దు’ మీరిన దందా!
●చర్యలు తీసుకుంటాం.. పొరుగు రాష్ట్రాల నుంచి ధాన్యాన్ని తీసుకొచ్చి విక్రయాలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటాం. అదే విధంగా కొత్తపల్లి కొనుగోలు కేంద్రంలో చోటు చేసుకున్న వ్యవహారంపై విచారణ జరిపాం. వేరే వడ్లు తీసుకొచ్చి విక్రయిస్తున్నట్లు గుర్తించి కొనుగోలు నిలిపివేశాం. సివిల్సప్లై శాఖలో, రైస్మిల్లర్లపై వస్తున్న ఆరోపణలపై నిఘా ఉంచాం. ఎవరైనా అక్రమాలకు పాల్పడినట్లు తేలితే రెవెన్యూ చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటాం. – వి.లక్ష్మీనారాయణ, అదనపు కలెక్టర్ గద్వాల: ‘‘కాయ్ రాజా కాయ్.. మంచి తరుణం మించిన దొరకదు.. మీ రాష్ట్రంలో వరిధాన్యం క్వింటాల్కు రూ. 1,900 ఉంటే.. ఇక్కడ రూ. 2,300కు కొంటాం.. పైగా రూ. 500 బోనస్ వస్తుంది.. ఈ అవకాశం కొన్ని రోజులు మాత్రమే.. మీరు చేయాల్సిందల్లా ఒకటే.. నాకు ఇవ్వాల్సిన వాటా అడ్వాన్స్గా టేబుల్ మీద పెడితే మీ పని చిటికెలో అయిపోతుంది.’’ .. జిల్లాలో ధాన్యం కొనుగోలులో ఓ సివిల్ సప్లయ్ శాఖ అధికారి బాహాటంగానే లంచావతారమెత్తి ఓపెన్ యాక్షన్ బోర్డు పెట్టేయడం సంచలనంగా మారింది. జిల్లా సివిల్ సప్లయ్ శాఖలో సదరు అధికారి వ్యవహార శైలి నా రూటే సప‘రేటు’ అన్న సినిమా డైలాగ్ తరహాలో ఉంటుందనే పేరుంది. ఆయన మెచ్చిన బడా రైస్మిల్లర్లతోనే మంతనాలు జరుపుతూ.. వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో రైతుల నుంచి ధాన్యం సేకరణలో సైతం అక్రమార్కులతో ముందస్తు ఒప్పందం చేసుకుని పొరుగు రాష్ట్రాల ధాన్యాన్ని గోల్మాల్ చేస్తున్నారనే ఆరోపణలు పెద్దఎత్తున వినిపిస్తున్నాయి. సదరు అధికారి వ్యవహారశైలి ఉన్నతాధికారులకు సైతం తలనొప్పిగా మారిందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే, జిల్లాలో నూతనంగా ఏర్పాటు చేసిన ఓ రైస్మిల్లుకు అధికంగా ధాన్యం కేటాయించటానికి ఏకంగా రూ.లక్షక్షల్లో వసూళ్లు చేశారనే విషయం షికారు చేస్తోంది. అయితే సదరు మిల్లర్కు మిగతా మిల్లుల కంటే అధికంగా ధాన్యం కేటాయింపులు చేయడం ఇందుకు బలాన్ని చేకూరుస్తుంది. పొరుగు రాష్ట్రాల నుంచి జిల్లాలోకి ధాన్యం ఆయన రూటే సప‘రేటు’.. బినామీ పేర్లమీద జోరుగా అమ్మకాలు ధాన్యం గోల్మాల్లో చక్రం తిప్పుతున్న సివిల్సప్లయ్ అధికారి ఇప్పటికే రూ.లక్షల్లో వసూళ్లు? అంతర్గత విచారణకు ఆదేశించిన అదనపు కలెక్టర్ -
జోగుళాంబ సన్నిధిలో ఎన్ఐసీడీసీ సీఈఓ
అలంపూర్: దక్షిణకాశీ అలంపూర్ జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను మంగళవారం నేషనల్ ఇండస్ట్రీయల్ కారిడార్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎన్ఐసీడీసీ) సీఈఓ, ఎండీ రజత్ కుమార్ శైనీ సందర్శించారు. ముందుగా ఆయనకు ఆలయ ఈఓ పురేందర్ కుమార్, అర్చకులు స్వాగతం పలికారు. అనంతరం జోగుళాంబ బాలబ్రహ్మేశ్వర స్వామిని ఆయన దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అర్చక స్వాములు తీర్థప్రసాదాలను అందజేసి ఆశీర్వచనం పలికారు. ఆలయ సిబ్బంది శేషవస్త్రాలతో సత్కరించారు. సీఈఓ వెంట తహసీల్దార్ మంజుల ఉన్నారు. పిల్లల పెంపకంలో లింగభేదం చూపొద్దు అలంపూర్: పిల్లల పెంపకంలో లింగభేదం చూపొద్దని.. ఆడ–మగ పిల్లలను సమానంగా పెంచాలని యూనిసేఫ్ ప్రతినిధి మేరీ జోన్స్ అన్నారు. మంగళవారం ఉండవెల్లి మండల కేంద్రంలో కిషోర బాలికలకు నిర్వహించిన శిక్షణ తరగతుల్లో ఆమె పాల్గొని మాట్లాడారు. ఆడ–మగ పిల్లలు ఇద్దరు సమానమేనని అన్నారు. చిన్నప్పటి నుంచి ఇద్దరినీ సమాన భావంతో విద్యావంతులను చేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందన్నారు. ఈ నెల 2 నుంచి జూన్ 2వ తేదీ వరకు వేసవిలో కిషోర బాలికలకు ప్రత్యేకంగా శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అదే విధంగా అలంపూర్ మండలం క్యాతూర్లో కిషోర బాలికలకు శిక్షణ తరగతులు నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జి ఎల్లప్ప, ఏపీఎం ప్రవీణ్, సీసీలు విజయలక్ష్మి, రజిత, వీఓఏలు అంజలి, మౌనిక లావణ్య, రియాజ్ పాల్గొన్నారు. వేరుశనగ క్వింటాల్ రూ.4,790 గద్వాల వ్యవసాయం: జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్యార్డుకు మంగళవారం 72 క్వింటాళ్ల వేరుశనగ అమ్మకానికి రాగా.. గరిష్టంగా రూ. 4,790, కనిష్టంగా రూ. 3,421, సరాసరి రూ. 4,430 ధరలు వచ్చాయి. 22 క్వింటాళ్ల ఆముదాలు అమ్మకానికి రాగా.. గరిష్టంగా రూ. 5,839, కనిష్టంగా రూ. 5,819, సరాసరి రూ. 5,839 ధరలు లభించాయి. 294 క్వింటాళ్ల వరి (సోన) రాగా.. గరిష్టంగా రూ. 1,972, కనిష్టంగా రూ. 1,521, సరాసరి రూ.1959 ధర పలికింది. ఏడు క్వింటాళ్ల కందులు రాగా.. గరిష్టంగా రూ. 6,429, కనిష్టంగా రూ. 6,119, సరాసరి రూ. 6,229 ధరలు వచ్చాయి. రేపు జాబ్మేళా జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): జిల్లా ఎంప్లాయిమెంట్ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 22వ తేదీన (గురువారం) పిల్లలమర్రి రోడ్డులోని జిల్లా ఎంప్లాయిమెంట్ కార్యాలయంలో జాబ్మేళా నిర్వహించనున్నట్లు జిల్లా అధికారి మైత్రిప్రియ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. 8 ప్రైవేట్ కంపెనీల్లో 450 ఉద్యోగాల భర్తీకి జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇతర వివరాల కోసం 99485 68830, 89193 80410 నంబర్లను సంప్రదించాలని సూచించారు. ఇద్దరు ఎస్ఐల బదిలీ మహబూబ్నగర్ క్రైం: ఉమ్మడి జిల్లాలో ఇద్దరు ఎస్ఐలకు స్థానచలనం కల్పిస్తూ జోగులాంబ జోన్–7 డీఐజీ ఎల్ఎస్ చౌహన్ ఉత్తర్వులు జారీ చేశారు. కోయిలకొండ ఎస్ఐగా పని చేస్తున్న భాస్కర్రెడ్డిని వీఆర్ వనపర్తికి బదిలీ చేయగా, వీఆర్ వనపర్తిలో ఉన్న కె.తిరుపాజీని కోయిలకొండ పోలీస్స్టేషన్కు ఎస్ఐగా బదిలీ చేశారు. -
విస్తరణకు గ్రీన్సిగ్నల్
మల్లన్న చెంతకు.. నాలుగు వరుసల రోడ్డు అనుసంధానంగా మరో రెండు.. ఎన్హెచ్–765కి అనుసంధానంగా కల్వకుర్తి (కొట్ర గేట్)–నంద్యాల–167కే జాతీయ రహదారి ఏర్పాటవుతుంది. అలాగే సోమశిల ఐకానిక్ బ్రిడ్జి పూర్తయితే హైదరాబాద్ నుంచి తిరపతి వెళ్లే ప్రయాణికులకు 80 కి.మీ., దూరభారం తగ్గుతుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్– శ్రీశైలం హైవేలోని కల్వకుర్తి వరకు ట్రాఫిక్ మరింత పెరగనుంది. ఈ పరిస్థితుల్లో ప్రస్తుతం ఉన్న రెండు వరుసల ఈ రోడ్డుపై ప్రయాణం చేయడం అంత సులువు కాదు. దీంతో హైదరాబాద్– శ్రీశైలం రహదారిని నాలుగు వరుసలుగా విస్తరించాలని కొన్నేళ్లుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కేంద్రాన్ని కోరుతున్నాయి. ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వ ఆమోదంతో మూడు నెలల్లో టెండర్ ప్రక్రియ పూర్తయ్యే అవకాశం కనిపిస్తోంది. ● హైదరాబాద్– డిండి, మన్ననూర్ రహదారికి మహర్దశ ● రూ.2,800 కోట్ల వ్యయంతో ఎన్హెచ్–765 నిర్మాణం ● మన్ననూర్– శ్రీశైలం మధ్య ఎలివేటేడ్ కారిడార్ ఏర్పాటు ● స్వయంగా ప్రకటించిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ● మూడు నెలల్లో టెండర్ ప్రక్రియ.. శ్రీశైలానికి తప్పనున్న ప్రయాణ పాట్లు అచ్చంపేట: మల్లికార్జునస్వామి కొలువై ఉన్న నల్లమల అభయారణ్య ప్రాంతంలో ఆహ్లాదకరమైన ప్రయాణానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వడివడిగా అడుగులు వేస్తున్నాయి. అన్ని అడ్డంకులను అధిగమించుకొని హైదరాబాద్– శ్రీశైలం జాతీయ రహదారి–765 త్వరలోనే నాలుగు వరుసలుగా మారనుంది. రెండు వరుసలుగా ఉన్న ఈ రోడ్డును నాలుగు లేన్ల గ్రీన్ ఫీల్డ్ హైవేగా త్వరితగతిన పూర్తిచేయాలని కేంద్రం నిర్ణయించింది. రూ.2,800 కోట్లతో ఈ రోడ్డును విస్తరిస్తామని, మూడు నెలల్లో టెండర్ ప్రక్రియ పూర్తిచేసి.. పనులు ప్రారంభిస్తామని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్వయంగా ప్రకటించారు. హైదరాబాద్– డిండి, బ్రాహ్మణపల్లి (మన్ననూర్) 105.6 కి.మీ., గ్రీన్ఫీల్డ్ హైవేతో పాటు మన్ననూర్– శ్రీశైలం మధ్య ఎలివేటేడ్ కారిడార్ పూర్తయితే 6 గంటల ప్రయాణ సమయం 3 గంటలకు తగ్గనుంది. శ్రీశైలం దారిలోని తుక్కుగూడ– డిండి వరకు ఉన్న మిషన్ భగీరథ పైపులైన్ను తొలగించే పని రాష్ట్ర ప్రభుత్వం త్వరగా పూర్తి చేయాలని కేంద్రం కోరింది. అత్యంత కీలక మార్గం హైదరాబాద్– శ్రీశైలం– తోకలపల్లి జాతీయ రహదారి–765 రెండు తెలుగు రాష్ట్రాలకు అత్యంత కీలకమైంది. దక్షిణకాశీగా గుర్తింపు పొందిన శ్రీశైలంను హైదరాబాద్తో అనుసంధానించే ఎన్హెచ్–765లో 125 కి.మీ., దూరం జాతీయ రహదారుల ప్రమాణాలతో ఉంది. వన్యప్రాణులు తిరిగే 62.5 కి.మీ., ప్రాంతంలో ఎలివేటెడ్ కారిడార్ నిర్మిస్తూ మిగతా ప్రాంతంలో భూ భాగంలోనే రోడ్డును విస్తరిస్తారు. శ్రీశైలం పుణ్యక్షేత్రానికి హైదరాబాద్ నుంచి వెళ్లే భక్తులు తుక్కుగూడ, కందుకూరు, కడ్తాల్, మైసిగండి, ఆమనగల్, డిండి, మన్ననూర్ మీదుగా ప్రయాణిస్తారు. తెలంగాణ నుంచి తిరుపతికి వెళ్లే భక్తులు ఈ మార్గం గుండానే వెళ్తారు. ప్రస్తుతం ప్రతిరోజు సగటున 7,750 వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయని రవాణా శాఖ అంచనా. శని, ఆదివారాల్లో అయితే ఈ సంఖ్య 10 వేలకు చేరుతుంది. ఇక 2027 నాటికి 12,200, 2040 నాటికి 27,580కి చేరుతుందని ట్రాఫిక్ అధ్యయనంలో తేలింది. అయితే ఈ రహదారి నల్లమల అటవీ గుండా సాగుతోంది. సుమారు 56 కి.మీ., మార్గం అమ్రాబాద్ టైగర్ రిజర్వు ఉండటంతో పెద్దపులులు, ఇతర వన్యప్రాణుల సంచారం ఉంటుంది. ఈ రోడ్డు విస్తరణకు గతంలో చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఈ నేపథ్యంలో అటవీ మార్గంలో ఎలివేటేడ్ కారిడార్ ప్రతిపాదన తెరపైకి వచ్చింది. డీపీఆర్ రూపొందించారు.. హైదరాబాద్– శ్రీశైలం జాతీయ రహదారి త్వరలోనే నాలుగు వరుసలుగా విస్తరిస్తారు. ఇప్పటికే డీపీఆర్ రూపొందించారు. మహేశ్వరం గేటు నుంచి డిండి వరకు సర్వే పనులు కొనసాగుతున్నాయి. మూడు నెలల్లో టెండర్ ప్రక్రియ పూర్తి చేసి పనులు ప్రారంభిస్తారు. అలాగే మన్ననూర్– శ్రీశైలం మార్గంలో వన్యప్రాణులను దృష్టిలో పెట్టుకొని సీఎం రేవంత్రెడ్డి ఎలివేటేడ్ కారిడార్ను ప్రతిపాదించారు. దీనిపై కూడా కేంద్ర ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకోనుంది. – మల్లురవి, ఎంపీ, నాగర్కర్నూల్ ప్రమాదాలకు నెలవు.. హైదరాబాద్– శ్రీశైలం రహదారిపై పెరిగిన వాహనాల రద్దీతో ప్రయాణం ఇబ్బందికరంగా మారింది. గతంలో పోలిస్తే ప్రస్తుతం ఈ హైవేపై వాహనాల రాకపోకలు భారీగా పెరిగాయి. ఈ క్రమంలోనే రహదారిపై తరుచుగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. పదుల సంఖ్యలో ప్రయాణికులు మృత్యువాత పడుతుండగా మరికొందరు క్షతగాత్రులుగా మారుతున్నారు. పెరిగిన వాహనాల రద్దీకి అనుగుణంగా రోడ్డు విస్తరించకపోవడంతో పాటు మధ్యలో డివైడర్ లేకపోవడం కూడా ప్రమాదాలకు కారణమవుతోంది. -
ప్రజావాణి ఫిర్యాదులు సత్వరం పరిష్కరించాలి
గద్వాల: వివిధ సమస్యలపై వచ్చే ఫిర్యాదులను సత్వరం పరిష్కరించాలని కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో సమావేశం హాలులో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 73 ఫిర్యాదులు అందాయి. కలెక్టర్ సంతోష్ ఫిర్యాదుదారులతో నేరుగా మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయా శాఖలకు చెందిన అధికారులను పిలిచి ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని, పరిష్కారం కానిపక్షంలో అందుకు గల కారణాలు వివరిస్తూ సంబంధిత ఫిర్యాదుదారుడికి అక్నాలెడ్డ్మెంట్ ద్వారా తెలియజేయాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ, ఆర్డీఓ శ్రీనివాసరావు, కలెక్టరేట్ సిబ్బంది, వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. పోలీస్ గ్రీవెన్స్కు 13 అర్జీలు గద్వాల క్రైం: పోలీస్ గ్రీవెన్స్లో భాగంగా ఎస్పీ శ్రీనివాసరావు బాధితుల నుంచి అర్జీలు స్వీకరించారు. మొత్తం 13 అర్జీలు రాగా.. అందులో ప్రధానంగా భూ వివాదం, ఆస్తి తగాదాలు, అప్పుగా తీసుకున్న వ్యక్తులు డబ్బులు చెల్లించడంలేదని వచ్చినట్లు వివరించారు. వీలైనంత త్వరగా సమస్యలు పరిష్కరిస్తామని, సివిల్ సమస్యలను కోర్టు ద్వారా పరిష్కరించుకోవాలని ఎస్పీ సూచించారు. -
జాతీయ రక్షణ నిధికి రూ.లక్ష విరాళం
గద్వాల: జాతీయ రక్షణ నిధికి రిటైర్డ్ ఉపాధ్యాయుడు గోరంట్ల లక్ష్మీకాంతారెడ్డి రూ.1లక్ష విరాళం ఇచ్చినట్లు కలెక్టర్ బీఎం సంతోష్ తెలిపారు. సోమవారం ఐడీవోసీ కార్యాలయంలో ఫిర్యాదుల దినోత్సవం సందర్భంగా లక్ష్మీకాంతారెడ్డి కలెక్టర్ను కలిసి రైతుభరోసా పథకం ద్వారా జమ అయిన రూ.లక్షను జాతీయ రక్షణ నిధికి విరాళంగా అందజేశారు. సేవాగుణం గొప్పదని ఇందుకు లక్ష్మీకాంతారెడ్డినే ఉదాహరణ అని, వీరి సేవలు మిగతావారికి స్ఫూర్తినిస్తాయని కలెక్టర్ అభినందించారు. స్కాలర్షిప్లకు దరఖాస్తుల ఆహ్వానం గద్వాల: 2024–25 విద్యాసంవత్సరానికిగాను పోస్ట్మెట్రిక్ స్కాలర్షిప్లకు ఈనెల 31వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని ఎస్సీ సంక్షేమశాఖ జిల్లా అధికారి సరోజ ప్రకటనలో తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థినీ, విద్యార్థులు అర్హతను బట్టి పోస్ట్మెట్రిక్ స్కాలర్షిప్లకు ఫ్రెష్, రెన్యూవల్ కోసం www.epass.cgg.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని తరలించాలి మల్దకల్: ప్రభుత్వం ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రంలో రైతుల నుంచి కొన్న వరి ధాన్యాన్ని అధికారులు వెంటనే లారీల ద్వారా ప్రభుత్వ గోదాములకు తరలించాలంటూ రైతులు ఆందోళనకు దిగారు. సోమవారం మల్దకల్లోని వరి కొనుగోలు కేంద్రానికి సమీపంలో ఉన్న అయిజ–గద్వాల రోడ్డుపై ధర్నా చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ వరి కొనుగోలు కేంద్రంలో తమ నుంచి కొన్న ధాన్యాన్ని అధికారులు పది రోజులు గడుస్తున్న గోదాములకు తరలించడంలేదని, వర్షాలకు ధాన్యం తడిస్తే ఎవరు బాధ్యులని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల ధర్నాతో అయిజ–గద్వాల ప్రధాన రోడ్డుపై ఎక్కడి వాహనాలు అక్కడ నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ధర్నా చేస్తున్న రైతుల వద్దకు చేరుకొని రైతులకు నచ్చచెప్పి ధర్నా విరమింప చేశారు. రెవెన్యూ, సివిల్ సప్లయి అధికారులు ప్రశాంత్గౌడ్, కిరణ్ మల్దకల్కు చేరుకొని రైతుల నుంచి కొన్న వరి ధాన్యాన్ని వెంటనే లారీల ద్వారా గోదాములకు తరలిస్తామని చెప్పారు. వేరుశనగ క్వింటా రూ.5,602 గద్వాల వ్యవసాయం: గద్వాల మార్కెట్యార్డుకు సోమవారం 67 క్వింటాళ్ల వేరుశనగ రాగా, గరిష్టం రూ. 5602, కనిష్టం రూ. 2739, సరాసరి రూ. 4802 ధరలు పలికాయి. 29 క్వింటాళ్ల ఆముదాలు రాగా గరిష్టం రూ. 5839, కనిష్టం రూ. 4819, సరాసరి రూ. 5810 ధరలు లభించాయి. 270 క్వింటాళ్ల వరి (సోన) రాగా గరిష్టం రూ.1986, కనిష్టం రూ. 1575, సరాసరి రూ.1769 ధరలు వచ్చాయి. 10 క్వింటాళ్ల కంది రాగా గరిష్టం రూ. 6425, కనిష్టం రూ. 2500, సరాసరి రూ. 6275 ధరలు పలికాయి. ప్రశాంతంగా డిగ్రీ పరీక్షలు మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పీయూ పరిధిలోని పలు పరీక్ష కేంద్రాల్లో డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు సోమవారం ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. వీసీ శ్రీనివాస్ జిల్లాకేంద్రంలోని ఎన్టీఆర్ మహిళా డిగ్రీ కళాశాల, వాసవీ డిగ్రీ కళాశాల పరీక్ష కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి పరీక్ష కేంద్రంలోనికి విద్యార్థి వెళ్లే క్రమంలో తప్పకుండా హాల్టికెట్తో పాటు ఒక గుర్తింపు కార్డును పరిశీలించిన అనంతరం కేంద్రంలోనికి అనుమతించాలని ఆదేశించారు. విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా పూర్తిస్థాయిలో వసతులు కల్పించాలని సూచించారు. సెమిస్టర్–4కు సంబంధించి మొత్తం 8,142 మంది విద్యార్థులకు 7,859 మంది విద్యార్థులు హాజరై 283 గైర్హాజరయ్యారు. సెమిస్టర్–5కు సంబంధించి 467 మంది విద్యార్థులు 435 మంది హాజరై 32 మంది గైర్హాజరైనట్లు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ప్రవీణ ఒక ప్రకటనలో తెలిపారు. -
పీడిత ప్రజల పక్షపాతి పుచ్చలపల్లి
గద్వాల: పీడిత ప్రజల అభ్యున్నతి కోసం జీవితాన్నే త్యాగం చేసిన గొప్ప సంఘ సంస్కర్త, తెలంగాణ రైతాంగ పోరాటయోధుడు పుచ్చలపల్లి సుందరయ్య అని సీపీఎం జిల్లా కార్యదర్శి వెంకటస్వామి కొనియాడారు. సోమవారం పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతిని పురస్కరించుకుని గద్వాలలోని పాతబస్టాండ్లో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈసందర్భంగా వెంకటస్వామి మాట్లాడుతూ దేశ స్వాతంత్య్రోద్యమంలో ఎంతో క్రియాశీలపాత్ర పోషించినట్లు తెలిపారు. అదేవిధంగా తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో నిజాం నవాబులకు వ్యతిరేకంగా పోరాడి 10 లక్షల ఎకరాల భూములను పేద ప్రజలకు పంపిణీ చేయించిన గొప్ప సంఘ సంస్కర్త అన్నారు. పీడిత ప్రజల అభ్యున్నతి కోసం తన సొంత ఆస్తులను దానం చేయడమే కాకుండా సమాజం కోసం పిల్లల్ని కూడా వద్దనుకున్న గొప్ప ఆదర్శవాది అన్నారు. చట్టసభలకు వెళ్లే సమయంలో ఎలాంటి ఆర్భాటాలకు వెళ్లకుండా సాదాసీదాగా సైకిల్పై వెళ్లిన మహోన్నత వ్యక్తి అన్నారు. అగ్రకులంలో పుట్టినప్పటికీ కుల వివక్షతకు వ్యతిరేకంగా పోరాడి దళితుల చేత ఆలయాల ప్రవేశాలు చేయించి సహపంక్తి భోజనాలు చేయించారన్నారు. నీటివనరులు, భూమిపై ఉన్న సహజ వనరులు ప్రజలందరికి సమానంగా అందితే సమాజ అభివృద్ధి జరుగుతుంతని దున్నేవాడిదే భూమి అనే నినాదంతో పోరాటాలు చేశారన్నారు. ఆయన వేసిన బాటలో అందరు నడవాలన్నారు. కార్యక్రమంలో ఉప్పేరు నర్సింహా, ఆంజనేయులు, విష్ణుభాస్కర్, వీరేష్కృష్ణ, నరష్, రామాంజనేయులు పాల్గొన్నారు. -
పాలమూరు బాధ్యత నాదే
నల్లమల డిక్లరేషన్ను విడుదల చేస్తున్న సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, సీతక్క, దామోదర రాజనర్సింహ, ఉత్తమ్కుమార్రెడ్డి, తుమ్మల నాగేశ్వర్రావు, పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్రెడ్డి, వంశీకృష్ణ, వీర్లపల్లి శంకర్, కసిరెడ్డి నారాయణరెడ్డి, వాకిటి శ్రీహరి, సీఎం సలహాదారులు షబ్బీర్అలీ, వేం నరేందర్రెడ్డిదేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతా.. నా సొంత గడ్డ అచ్చంపేట నియోజకవర్గాన్ని దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతా. నియోజకవర్గంలోని రైతులు గిరిజన, గిరిజనేతరులు అనే తేడా లేకుండా రైతులందరికీ ఉచితంగా సోలార్ పంప్సెట్లను ఏర్పాటు చేస్తాం. నియోజకవర్గంలో ఎన్ని మోటార్లు అవసరమైనా ఉచితంగా అందిస్తాం. సోలార్ విద్యుత్ ద్వారా నెలనెలా రూ.6 వేల వరకు ఆదాయం పొందేలా చర్యలు చేపడతాం. రానున్న వంద రోజుల్లోనే అందరికీ సోలార్ విద్యుత్ అందించి దేశానికి మోడల్గా తీర్చిదిద్దుతాం. వ్యవసాయ, గృహ వినియోగానికి సోలార్ విద్యుత్ను వినియోగిస్తూ అదనపు విద్యుత్ను ప్రభుత్వానికి అమ్ముకునేలా ఏర్పాట్లు చేస్తామని, ఇందుకోసం ఒక ప్రత్యేకాధికారిని నియమించాలని డిప్యూటీ సీఎంకు సూచించారు. అసెంబ్లీ ఎన్నికల్లో మేం కోరినట్లు వంశీకృష్ణను గెలిపించి మీ మాట నిలుబెట్టుకున్నారు.. ఇప్పుడు నా బాధ్యతగా అచ్చంపేట అభివృద్ధికి కావాల్సిన ప్రత్యేక ప్రణాళికలు తయారు చేస్తే నిధులు మంజూరు చేస్తామని సీఎం ప్రకటించారు. స్వంత నియోజకవర్గం నల్లమలలో సాగునీరు, విద్య, ఉపాధి, రోడ్లు, ఇతర అవసరాలను తీర్చడంలో ఎమ్మెల్యేకు ఎంత బాధ్యత ఉందో నాకు అంతే ఉందని సీఎం అన్నారు. ● ప్రత్యేక ప్రణాళికతో సంక్షేమ పథకాలకు నిధులు ● ఈ ప్రాంత బిడ్డగా నా బాధ్యత మరింత పెరిగింది ● విద్య, ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తాం ● స్వగ్రామం కొండారెడ్డిపల్లిలోనూ పర్యటన.. ఘన స్వాగతం పలికిన ప్రజలు సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్/ సాక్షి, నాగర్కర్నూల్/ అచ్చంపేట: ‘ఉమ్మడి పాలమూరు జిల్లా అభివృద్ధికి నాదే బాధ్యత. ఇక్కడి నుంచి ఎమ్మెల్యేలను గెలిపించి.. నాపై విశ్వాసాన్ని చూపి ఆశీర్వదించారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మీ ముందు నిలబడే అవకాశం దక్కింది. నా బాధ్యత మరింత పెరిగింది. ఈ ప్రాంత అభివృద్ధికి ప్రత్యేకంగా ప్రణాళిక రూపొందించి, నిధులు విడుదల చేస్తా. విద్య, ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తాను’ అని సీఎం ఎనుముల రేవంత్రెడ్డి అన్నారు. సోమవా రం అమ్రాబాద్ మండలం మాచారంలో ఇందిర సౌరగిరి జల వికాసం పథకాన్ని ప్రారంభించారు. మాచారంలోని చెంచు రైతుల పోడు భూముల్లోకి వెళ్లి అక్కడ ఏర్పాటు చేసిన సోలార్ పంప్సెట్, ప్లాంటేషన్, స్ప్రింక్లర్లు, డ్రిప్ వ్యవస్థలను పరిశీలించారు. గ్రామంలోని సీతారామాంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నిర్వహించిన బహిరంగసభలో మాట్లాడారు. ‘పాలమూరు బిడ్డలు అంటేనే తట్ట, పార పని.. ముంబయి, పుణె వలస వెళ్లి కష్టపడేవాళ్లని అందరికీ తెలుసు. దేశంలో ఎక్కడ ప్రాజెక్టులు కట్టాలన్నా పాలమూరు బిడ్డలే కావాలి. దేశం నలుమూలలా భూములను సస్యశ్యామలం చేసేందుకు మన బిడ్డలు రక్తాన్ని చెమటగా మార్చి కష్టపడుతున్నారు. నేను పాలమూరు బిడ్డను అని చెప్పుకునేందుకు గర్వపడుతున్నా. ఎవరైనా నేను పాలమూరుకు చెందిన వాడిన ని చెప్పినప్పుడు నా గుండె ఉప్పొంగుతుంది’ అని పేర్కొన్నారు. సభావేదిక వద్దకు నడిచి వస్తున్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి,ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఇందిర సౌర జల వికాసం ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్రెడ్డి -
నిరుద్యోగులకు ఉపాధి
50 రోజులపాటు శిక్షణ నక్ష ఆధారంగా రిజిస్ట్రేషన్లు.. భూ వివాదాల పరిష్కారమే లక్ష్యంగా ప్రతి వ్యవసాయ క్షేత్రానికి హద్దులు నిర్ణయించే భూపటం (నక్ష) ఉండాలని ప్రభుత్వం నిర్ధేశించింది. ఈ మేరకు భూ భారతి చట్టం అమలులో నక్ష ఆధారంగా రిజిస్ట్రేషన్లు చేయాలని నిర్ణయం తీసుకోవడంతో ఆ మేరకు అధికార యంత్రాంగం చర్యలు ప్రారంభించింది. భూ వివాదాల పరిష్కారంతో పాటు నిరుద్యోగులకు ఉపాధి చూపించే దిశగా లైసెన్స్ కలిగిన సర్వేయర్ల నియామకానికి చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరించింది. శనివారం ఆర్ధరాత్రి వరకు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా 1449 మంది దరఖాస్తు చేసుకున్నారు. నిజాం పాలనలోని సర్వే వివరాలే కోలమానం జిల్లాలో నిజాం పాలనలో సేత్వార్ పేరిట 1938, 1945 మధ్యకాలంలో సర్వే నిర్వహించారు. అప్పట్లో రెవెన్యూ గ్రామాల వారీగా వాటాదారుల సమాచారంతో ఖస్రా పహాణీ తయారు చేసి అందుబాటులో ఉంచారు. ప్రభు త్వం ఏర్పడ్డాక వాటినే కొలమానంగా రెవెన్యూ శాఖ పరిగణిస్తూ వస్తోంది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఖస్రా పహాణీ ఆధారంగా భూ దస్త్రాల ప్రక్షాళన కార్యక్రమం కొనసాగించింది. భూ హద్దులను గుర్తించేలా సర్వే చేయకపోవడంతో వివాదాలు అలాగే కొనసాగుతూ వస్తున్నాయి. వీటి శాశ్వత పరిష్కారం దిశగా భూ సర్వేకు ప్రభు త్వం ముందుకొచ్చింది. ప్రభుత్వ భూముల సర్వేకు ప్రభుత్వ సర్వేయర్లు ఉన్నా ప్రైవేట్ వ్యక్తులకు భూ క్రయ విక్రయాల సమయంలో నక్ష సమర్పించాలనే నిబంధన పెట్టడంతో సర్వేయర్లకు ప్రాధాన్యం పెరిగింది. ‘భూ భారతి’లో భాగంగా క్షేత్రస్థాయి భూ సర్వేకు ప్రభుత్వం నిర్ణయం ● భూ వివాదాలకు శాశ్వత పరిష్కారమే లక్ష్యంగా అడుగులు.. ● లైసెన్సుడ్ సర్వేయర్ శిక్షణ పొందేందుకు అర్హులకు అవకాశం ● ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 1,449 మంది దరఖాస్తులు నారాయణపేట/నారాయణపేట రూరల్: భూ వివాద రహిత తెలంగాణగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తీసుకువచ్చింది. దీనిని అమలు చేసేందుకు ఇప్పటికే పైలట్ గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు సైతం చేపడుతున్నారు. వ్యవసాయ భూములకు కచ్చితమైన హద్దులు నిర్ణయించి భూ సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటోంది. నక్ష ఆధారంగా రిజిస్ట్రేషన్లు చేయాలని నిర్ణయించడంతో ఆమేరకు అధికార యంత్రాంగం చర్యలు ప్రారంభించింది. అయితే, ఉమ్మడి జిల్లాలో సర్వేయర్ల కొరత తీవ్రంగా ఉంది. దీంతో అర్హులైన యువతకు శిక్షణ ఇచ్చి లైసెన్స్ సర్వేయర్ సర్టిఫికెట్ ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించి దరఖాస్తులు స్వీకరించింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం 1449 మంది దరఖాస్తు చేసుకున్నారు. అందులో.. ఓసీలు 54 మంది, బీసీలు 850, ఎస్సీలు 388, ఎస్టీలు 157 మంది అభ్యర్థులు ఉన్నా రు. ఈ దరఖాస్తులను సోమవారం నుంచి పరిశీలిస్తారని రెవెన్యూ అధికార యంత్రాంగం పేర్కొంది. ఈ వారంలోనే శిక్షణకు అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేసి 50 రోజుల శిక్షణ అనంతరం జులై చివరి నాటికి లైసెన్స్డ్ సర్వేయర్లను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం సంకల్పించింది. శిక్షణ పూర్తి అయితే వీరికి మెరుగైన ఉపాధి లభించనుంది. ఉమ్మడి జిల్లాలో దరఖాస్తుల వివరాలిలా.. -
నేడు నల్లమలకు సీఎం రేవంత్
సాక్షి, నాగర్కర్నూల్: ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి నేడు జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలోని అమ్రాబాద్ మండలం మాచారం గ్రామంలో ఇందిరా సౌర జల వికాసం పథకానికి అంకురార్పణ చేయనున్నారు. మాచారం గ్రామంలోని చెంచుల పోడు భూముల్లో ఇప్పటికే ఏర్పాటు చేసిన సోలార్ పంప్సెట్ మోటారు ఆన్ చేసి సీఎం పథకాన్ని ప్రారంభిస్తారు. అక్కడే ఇందిరా సౌర జల వికాసం ప్రాజెక్ట్ పైలాన్ను సీఎం ఆవిష్కరిస్తారు. అనంతరం మాచారం గ్రామంలో నిర్వహించే భారీ బహిరంగసభలో పాల్గొంటారు. సీఎం పర్యటన నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ఇప్పటికే మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ మల్లురవి, ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, కసిరెడ్డి నారాయణరెడ్డి, కలెక్టర్ సంతోష్ సీఎం పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షించారు. పైలట్ ప్రాజెక్ట్ కింద 27 మంది లబ్ధిదారులు.. ఇందిర సౌర జల వికాసం కింద అమ్రాబాద్ మండలం మాచారం గ్రామాన్ని పైలట్ ప్రాజెక్ట్గా ఎంపిక చేయగా, ఇప్పటికే 27 మంది చెంచు రైతులకు చెందిన మొత్తం 50 ఎకరాల పోడు భూములను అధికారులు సిద్ధం చేశారు. రైతుల పోడు భూములను చదును చేయడంతో పాటు భూగర్భ జల వనరుల శాఖ ఆధ్వర్యంలో 16 బోర్లను తవ్వించారు. వాటికి సోలార్ విద్యుత్, 5 హెచ్పీ మోటారును ఏర్పాటు చేశారు. ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో రైతుల భూముల్లో ఇప్పటికే నిమ్మ, బత్తాయి, అవకాడో, మామిడి మొక్కలతో పాటు సరిహద్దుల్లో కొబ్బరి, వెదురు మొక్కలను నాటించారు. వాటికి నీటి సరఫరా కోసం స్ప్రింక్లర్లు, డ్రిప్ వ్యవస్థలను ఏర్పాటుచేశారు. మొక్కల ద్వారా శాశ్వత ఆదాయం వచ్చేంత వరకు ప్రత్యామ్నాయంగా అంతర్గత పంటలను వేసేలా చెంచు రైతులకు అవగాహన కల్పించారు. ఈ పథకం కింద లబ్ధిదారులకు పూర్తిస్థాయిలో మేలు జరిగేలా చూసేందుకు ఐదేళ్ల పాటు అధికారులు ప్రత్యేకంగా పర్యవేక్షించనున్నారు. అమ్రాబాద్ మండలం మాచారంలో ఇందిరా సౌర జలవికాసం పథకం ప్రారంభం అనంతరం భారీ బహిరంగ సభ స్వగ్రామం కొండారెడ్డిపల్లెలోనూ పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షించిన మంత్రి జూపల్లి, ఎంపీ మల్లురవి సీఎం పర్యటన షెడ్యూల్ ఇలా.. సీఎం రేవంత్రెడ్డి హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ ద్వారా బయలుదేరి ఉదయం 11 గంటలకు అమ్రాబాద్ మండలం మాచారంలో ఏర్పాటు చేసిన హెలిపాడ్ వద్దకు చేరుకుంటారు. ఉదయం 11.10 గంటలకు గ్రామంలోని చెంచుల పోడుభూముల్లో సోలార్ విద్యుత్తో నడిచే బోరు మోటారును ఆన్చేసి ఇందిరా సౌర జలవికాసం పథకాన్ని ప్రారంభిస్తారు. అక్కడే ఈ పథకానికి సంబంధించిన ఫొటో ఎగ్జిబిషన్ను ప్రారంభించి తిలకిస్తారు. 11.35 గంటలకు గ్రామంలోని సీతా రామాంజనేయ స్వామి ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. 11.45 గంటలకు గ్రామంలో నిర్వహించే భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. మధ్యాహ్నం ఒంటి గంటకు రోడ్డు మార్గంలో వంగూరు మండలం కొండారెడ్డిపల్లికి చేరుకుంటారు. 1.45 గంటలకు కొండారెడ్డిపల్లిలోని ఆంజనేయస్వామి ఆలయంలో పూజలు నిర్వహిస్తారు. అనంతరం హెలికాప్టర్ ద్వారా హైదరాబాద్కు తిరుగుపయనమవుతారు. -
లక్ష్యం.. నిర్దేశం
గద్వాల వ్యవసాయం: జిల్లాలోని గద్వాల, అలంపూర్ మార్కెట్యార్డులకు 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆదాయ లక్ష్యాలను ప్రభుత్వం నిర్దేశించింది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో రెండు మార్కెట్యార్డులకు నిర్దేశించిన లక్ష్యానికి మించి ఆదాయం సమకూరింది. ఈఏడాది కూడా పంట ఉత్పత్తులు యార్డులకు బాగా వచ్చి లక్ష్యం మేరకు ఆదాయం సమకూరుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఇదిలాఉండగా, జిల్లాలో జూరాల, ఆర్డీఎస్ ప్రాజెక్ట్లతో పాటు, నెట్టెంపాడు ప్రాజెక్ట్ పరిధిలోని ఏడు రిజర్వాయర్లు, 120దాకా చెరువులు, ఇంకా కుంటలు ఉన్నాయి. దీంతో ఇక్కడ వ్యవసాయమే ప్రధాన జీవనాధారం. ఏటా వానాకాలం సీజన్లో 1.27లక్షల హెక్టార్లు, యాసంగిలో 48వేల హెక్టార్లలో వరి, పత్తి, కంది, ఆముదం, వేరుశనగ, మొక్కజొన్న, ఎండుమిర్చి తదితర పంటలు రైతులు పండిస్తున్నారు. పండించిన పంట ఉత్పత్తులను విక్రయించేందుకు గద్వాల, అలంపూర్ మార్కెట్ యార్డులు ఉన్నాయి. ఇందులో అలంపూర్ మార్కెట్యార్డుకు అయిజ సబ్మార్కెట్గా ఉంది. యార్డులకు ఆదాయం ఇలా.. యార్డులలో పంట ఉత్పత్తుల క్రయ, విక్రయాలపై మొత్తం సరుకు విలువలో నూటికి రూపాయి లెక్కన యార్డుకు సెస్ వస్తుంది. ఇతర ప్రాంతాలకు పంట ఉత్పత్తులను విక్రయించేందుకు తీసుకెళ్తే చెక్పోస్టుల వద్ద కూడా యార్డులు మొత్తం సరుకు విలువలో నూటికి రూపాయి వసూలు చేస్తాయి. ఇదిలాఉండగా, ప్రతి ఆర్థిక సంవత్సరంలో మార్కెట్యార్డులకు ప్రభుత్వం ఆదాయ లక్ష్యాలను నిర్దేశిస్తుంది. 2025–26కి గాను గద్వాల యార్డుకు రూ. 5.25 కోట్లు, అలంపూర్ యార్డుకు రూ. 4 కోట్లు లక్ష్యంగా నిర్దేశించారు. కాగా 2024–25లో గద్వాల యార్డు నిర్దేశించిన లక్ష్యం రూ. 4.24కోట్లకు గాను రూ.4.77కోట్లు, అలంపూర్ యార్డు లక్ష్యం రూ.2.44కోట్లకు గాను రూ. 4.07 కోట్లు సాధించాయి. జిల్లాలో ఏడాది అంతా వేరుశనగ యార్డుకు విక్రయానికి వస్తోంది. దీనివల్ల ఆదాయం బాగా వస్తుందని చెబుతున్నారు. ఇంకా ప్రభుత్వ రంగ సంస్థలు ఏర్పాటు చేసే కొనుగోలు కేంద్రాల వల్ల కూడా ఆదాయం వస్తుందని, వీటన్నింటి వల్ల లక్ష్యం మేరకు ఆదాయం లభిస్తుందని అంననా వేశారు. ఇక అలంపూర్ మార్కెట్యార్డుకు విషయానికి వస్తే ఇక్కడ రోజువారి పంట ఉత్పత్తుల కొనుగోళ్లు నిర్వహించరు. లైసెన్స్ ఉన్న ట్రేడర్స్ రైతుల నుంచి కొన్ని సార్లు పంట ఉత్పత్తులు కొనుగోలు చేసినప్పుడు యార్డుకు సెస్ లభిస్తుంది. ఈమార్కెట్ యార్డు పరిది కింద ఎర్రవల్లి, పుల్లూరు, అయిజలలో చెక్పోస్టులు ఉన్నాయి. ఈ చెక్పోస్టుల నిర్వహణ ద్వారా ఆదాయం ఎక్కువగా వస్తుందని అంచనా వేస్తున్నారు. మిల్లుల నుంచి కూడా ఆదాయం వస్తోంది. అయిజ సంత నుంచి రెండేళ్లుగా ఆదాయం బాగా పెరిగింది. మార్కెట్ యార్డు నుంచి 2.50 ప్రభుత్వ రంగ సంస్థలు 1.26 మిల్లులు 1.15 చెక్పోస్టులు 0.25 పశువుల సంత 6 లక్షలు కూరగాయల మార్కెట్ 3లక్షలు గద్వాల యార్డులో వరి ధాన్యాన్ని కాంటా వేస్తున్న కార్మికులు (ఫైల్)అలంపూర్ యార్డు లక్ష్యం ఇలా.. (రూ.కోట్లలో) చెక్పోస్టుల నుంచి 2.00 మిల్లులు, ట్రేడర్స్ 1.10 ప్రభుత్వ రంగ సంస్థలు 0.70 సంత నుంచి 0.20 గతేడాది గద్వాల, అలంపూర్ యార్డులకు రికార్డు స్థాయిలో ఆదాయం జిల్లా కేంద్రంలో జోరుగా పంట ఉత్పత్తుల క్రయ విక్రయాలు ఈ ఆర్థిక సంవత్సరం గద్వాలకు రూ.5.25 కోట్లు.. అలంపూర్కు రూ.4 కోట్లు ఆదాయ లక్ష్యాల నిర్దేశం -
పాలమూరు అందాలు చూసొదా్దం
పిల్లలమర్రి మహబూబ్నగర్కు 5 కిలోమీటర్ల దూరంలో పిల్లలమర్రి ఉంది. అతిపెద్ద ఆకుపచ్చ గొడుగులాగా నాలుగు ఎకరాల్లో విస్తరించిన ఈ భారీ వృక్షానికి 750 ఏళ్లు ఉంటాయని అంచనా. ఇది రాష్ట్రంలోనే అతిపెద్ద మర్రి వృక్షం. పిల్లలమర్రి పురావస్తు మ్యూజియంలో క్రీ.శ.7వ శతాబ్దం నుంచి 15వ శతాబ్ది శిల్ప పరిణతిని చాటే అపురూప శిల్పాలున్నాయి. మహబూబ్నగర్లోని మెట్టుగడ్డ నుంచి వెళ్లాల్సి ఉంటుంది. ఏడు తరాలకు సజీవ సాక్ష్యంగా నిలిచిన పిల్లలమర్రి, చారిత్రక కట్టడాలు, పురాతన దేవాలయాలు, ఆకట్టుకునే ప్రాజెక్టులు, ప్రకృతి అందాల నడుమ అలల సవ్వడిలో కృష్ణమ్మ ఒడిలో సాగే బోటు ప్రయాణాలు, జలపాతాలు, జంగిల్ సఫారీ.. ఇలాంటి ఎన్నో విశేషాలతో పాలమూరు పర్యాటకం సందర్శకులను కనువిందు చేస్తోంది. రోజురోజుకు సరికొత్త హంగులతో రూపుదిద్దుకుంటున్న పర్యాటక ప్రాంతాలు ఎప్పటికప్పుడు కొత్తదనం సంతరించుకుంటున్నాయి. పిల్లలు, పెద్దలకు ఆహ్లాదాన్ని పంచుతూ హాలీడేస్ను జాలీడేస్గా మార్చేస్తోంది. -
చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి
మానవపాడు: చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని అలంపూర్ జూనియర్ సివిల్ కోర్డు జడ్జి మిథున్ తేజ అన్నారు. శనివారం మండలంలోని మద్దూరు గ్రామంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చదువు కోవడం వల్ల కలిగే లాభాలను వివరించారు. అలాగే, బాల్యవివాహాలను అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలు వివరించారు. ఆర్థిక లావాదేవీలు, భూ క్రయవిక్రయాలకు సంబంధించి ఖచ్చితంగా లిఖితపూర్వకంగా పత్రాలు కలిగి ఉండాలని, రైతులు విత్తనాలు, ఎరువులు కొన్నప్పుడు రశీదు తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. నష్టపోతే రశీదు ఉండటం వల్ల లబ్ధి పొందే అవకాశం ఉందన్నారు. తల్లిదండ్రులు ఎట్టి పరిస్థితుల్లో మైనర్లకు వాహనాలు ఇవ్వరాదని సూచించారు. ఉచిత న్యాయ సహాయం, గృహహింస చట్టం, న్యాయ సేవాసంస్థ అందించే సేవలతోపాటు వివిధ చట్టాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో శ్రీనివాసులు, నారాయణరెడ్డి, శ్రీధర్రెడ్డి, మధు, గజేంద్రగౌడ్, వెంకటేష్ పాల్గొన్నారు. -
విద్యార్థులను ఉత్తమంగా తీర్చిదిద్దాలి
గద్వాలటౌన్: ఉపాధ్యాయులు.. విద్యార్థులను ఉత్తమంగా తీర్చిదిద్దాలని కలెక్టర్ సంతోష్ అన్నారు. ఐదురోజులుగా ఆంగ్లం, గణితం, సాంఘికశాస్త్రం, ప్రత్యేక విద్య స్కూల్ అసిస్టెంట్లు, ఎస్జీటీలకు కొనసాగిన శిక్షణ కార్యక్రమాలు శనివారం ముగిశాయి. స్థానిక ప్రభుత్వ అభ్యసన ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ముగింపు కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మారుతున్న లక్ష్యాలకు అనుగుణంగా బోధన సామర్థ్యాలు, నైపుణ్యాలను పెంపొందించుకోవాలని, అందుకోసమే విద్యాశాఖ ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమాలను నిర్వహించిందన్నారు. విద్యార్థి సర్వతోముఖాభివృద్ధికి శిక్షణ దోహదపడుతుందని, వారిని మెరుగ్గా తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. రానున్న విద్యా సంవత్సరం కృత్రిమ మేధ బోధన అన్ని పాఠశాలల్లో ప్రారంభమవుతుందని చెప్పారు. డీఈఓ అబ్దుల్ ఘనీ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించడానికి ఉపాధ్యాయులకు ఈ శిక్షణ ఉపయోగపడుతుందన్నారు. విద్యార్థులకు అర్థమయ్యేలా సులభమైన బోధన పద్ధతులు అవలంభించాలన్నారు. కార్యక్రమంలో కో ఆర్డినేటర్ ఎస్తేర్రాణి, కోర్సు డైరెక్టర్లు బీకే రమేష్, అమీర్బాష, వెంకటనర్సయ్య, అంపయ్య తదితరులు పాల్గొన్నారు. -
రసాయన ఎరువుల వాడకం తగ్గించాలి
మల్దకల్: పంటల సాగులో రైతులు రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించాలని.. సేంద్రియ ఎరువుల వాడకంతో అధిక దిగుబడులు పొందవచ్చని పాలెం శాస్త్రవేత్తలు నళిని, శంకర్ రైతులకు సూచించారు. రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అనే కార్యక్రమాన్ని శనివారం మండలంలోని విఠలాపురంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతులు తక్కువ పెట్టుబడులతో ఎక్కువ లాభాలు వచ్చే పంటలు సాగు చేయాలని సూచించారు. పంటలకు ఆశించే చీడపీడల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేశారు. నాణ్యమైన విత్తనాలను వాడి అధిక దిగుబడులను పొందాలని, రసాయన ఎరువుల వాడకంతో భూసారం దెబ్బతిని పంటలు నష్టపోయే వీలుందన్నారు. వ్యవసాయ అధికారుల సలహాలు సూచనలు తప్పనిసరిగా రైతులు పాటించాలన్నారు. కార్యక్రమంలో ఏఓ రాజశేఖర్, ఏఈఓ భాస్కర్, రైతులు తదితరులు పాల్గొన్నారు. -
పిల్లలమర్రిలో అందగత్తెల సందడి
పిల్లలమర్రి మహావృక్షం వద్ద సుందరీమణులను సన్మానిస్తున్న మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, శ్రీహరి, మధుసూదన్రెడ్డి, వీర్లపల్లి శంకర్, బండ్ల కృష్ణమోహన్రెడ్డి, పర్ణికారెడ్డి, తదితరులు విద్యార్థులతో మాటామంతీ.. మహా వృక్షం సందర్శించిన తర్వాత మిస్ వరల్డ్ పోటీదారులు జిల్లాకు చెందిన విద్యార్థులతో చిట్చాట్ చేశారు. నలుగురు విద్యార్థులు నాలుగు ప్రశ్నలు అడిగారు. అందులో ఓ చిన్నారి మీ మిస్ వరల్డ్ జర్నీ గురించి వివరించండని ప్రశ్నించగా.. జపాన్కు చెందిన పోటీదారు నవ్వుతూ సమాధానం ఇచ్చారు. మరో చిన్నారి పిల్లలమర్రి సందర్శన తర్వాత వృక్ష సంరక్షణపై మీరు ఇతరులకు అవగాహన కల్పిస్తారా? అని అడిగారు. దీనిపై ఇండియాకు చెందిన పోటీదారు మాట్లాడుతూ ఇండియన్ అని, మాది రైతు కుటుంబమని, చెట్ల గురించి తనకు తెలుసని.. వాటి పెంపకం గురించి అందరికీ అవగాహన కల్పిస్తానని వివరించారు. విశ్వ వేదికలపై మాట్లాడటానికి సూచనలివ్వాలని ఓ విద్యార్థి కోరగా.. బంగ్లాదేశ్ చెందిన కంటెస్టెంట్ సమాధానమిచ్చారు. ఆత్వవిశ్వాసంతో ముందుకెళ్లాలని చెప్పారు. చివరగా ఓ విద్యార్థి మీ చిన్ననాటి కలల గురించి చెప్పండని ప్రశ్నించగా.. నేపాల్, థాయ్లాండ్, ఇండియా, ఆస్ట్రేలియా, జపాన్కు చెందిన మిస్వరల్డ్ పోటీదారులు స్పందించారు. మహావృక్షం వద్ద 2 గంటలు.. రాజరాజేశ్వర ఆలయం, మ్యూజియం సందర్శన తర్వాత సాయంత్రం 6.01 గంటలకు అందాలభామలు మహావృక్షం వద్దకు చేరుకున్నారు. జిల్లా అటవీ అధికారి సత్య నారాయణ పిల్లలమర్రి చరిత్రను వివరించారు. 700 ఏళ్ల నాటి ఈ వృక్షాన్ని 2018 నుంచి ఎలా సంరక్షిస్తూ వస్తున్నామనే అంశాన్ని పవర్పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తెలియజేశారు. అనంతరం మర్రిచెట్టు సమీపంలో 11 మొక్కలు నాటారు. ఆ తర్వాత మహావృక్షం చెంత ఏర్పాటు చేసిన స్టేజ్ వద్దకు చేరుకున్నారు. అక్కడే టీ, స్నాక్స్ తీసుకొని సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు. దాదాపు 2 గంటలు మహావృక్షం వద్దే ఉన్నారు. అనంతరం చేనేత స్టాల్స్ను సందర్శించారు. గద్వాల, నారాయణపేట చేనేతలు తయారు చేసిన చీరలను పరిశీలించారు. అక్కడే ఉన్న మగ్గాన్ని, వెదురుతో తయారు చేసిన వస్తువులను పరిశీలించారు. తొలుత రాజరాజేశ్వర ఆలయం నుంచి.. పిల్లలమర్రికి చేరుకున్న అందాల భామలకు కలెక్టర్ విజయేందిర బోయి, ఎస్పీ డి.జానకి సంపంగి, లైట్ పింక్ గులాబీ పువ్వులతో తయారు చేసిన మాలలను వేసి స్వాగతం పలికారు. ముందుగా 16వ శతాబ్దం కాలం నాటి రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించారు. ఈ ఆలయ చరిత్రతో పాటు శ్రీశైలం ప్రాజెక్ట్ నిర్మాణంలో ఈ ఆలయం ముంపునకు గురైతే ఇక్కడికి తీసుకొచ్చి పునఃప్రతిష్టించినట్లు మిస్వరల్డ్ పోటీదారులకు గైడ్ శివనాగిరెడ్డి వివరించారు. అక్కడి నుంచి మ్యూజియం వద్దకు చేరుకోగా.. వివిధ విగ్రహాలు, శిల్పాల విశిష్టత, పాత రాతియుగం పనిముట్లు, నవీన శిలాయుగపు పనిముట్లు, బృహత్ శిలాయుగపు పాత్రలు, విజయనగర, కుతుబ్ షాహీల కాలంనాటి ఆయుధాలు, విగ్రహాల గురించి వివరించారు. మ్యూజియంలో శాతవాహనుల నుంచి అసఫ్జాహి రాజుల వరకు ముద్రించిన వెండి, సీసపు, రాగి, బంగారు నాణేలతో పాటు మహా శివలింగం, దాని ముందు ఉన్న నంది విగ్రహాల గురించి శివనాగిరెడ్డి వివరించారు. -
డెంగీ రహిత జిల్లాగా మార్చుదాం
గద్వాల క్రైం: డెంగీ రహిత జిల్లాగా మార్చుదామని.. దీనికోసం దోమల నివారణలో అంతా భాగస్వాములు కావాలని జిల్లా ఇన్చార్జ్ వైద్యాధికారి సిద్ధప్ప అన్నారు. శుక్రవారం జాతీయ డెంగీ నివారణ దినోత్సవం సందర్భంగా పట్టణంలో ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, చెత్తా, చెదారం, మురుగు నీటి నిల్వ లేకుండా చూసుకోవాలన్నారు. సాధారణ జ్వరం కంటే దోమల ద్వారా వచ్చే విషజ్వరాలు మనుషుల నాడీ వ్యవస్థపై దాడి చేసి తీవ్ర ప్రభావం చూపుతాయన్నారు. ఏడిస్ దోమ కుట్టడం వల్ల డెంగీ వ్యాధి సోకుతుందని, ప్రజలు ఆరోగ్య విషయాలపై వైద్యుల సూచనలు, సలహాలు పాటించాలన్నారు. జ్వరం వచ్చిన వెంటనే వైద్యులను సంప్రదించి తగు మందులు వాడాలని సూచించారు. -
జోగుళాంబ గద్వాల
పకడ్బందీగా ధాన్యం కొనుగోలు శనివారం శ్రీ 17 శ్రీ మే శ్రీ 2025ఫొటో తీస్తున్న మిస్ ఇండియా గద్వాల: ధాన్యం కొనుగోలు ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఐడీవోసీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్హాలులో అధికారులతో సమీక్షించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ అకాల వర్షాలు కురిసే అవకాశాలున్నందున ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. 17శాతం తేమ ఉన్న ధాన్యాన్ని సంచుల్లో నింపి వెంటనే మిల్లులకు తరలించి అన్లోడ్ చేయాలన్నారు. అదేవిధంగా ధాన్యం తరలింపులో ఎలాంటి జాప్యం చోటుచేసుకోకుండా అవసరమైన ట్రాన్స్ఫోర్ట్ వాహనాలను సిద్ధం చేసుకోవాలన్నారు. గన్నీబ్యాగుల కొరత లేకుండా, వర్షాలు కురిసినప్పుడు ధాన్యం రక్షణకు టార్పాలిన్లను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. అదనపు కలెక్టర్లు వి.లక్ష్మీనారాయణ, నర్సింగ్రావు, డీఎస్వో స్వామికుమార్, డీఎం విమల, మార్కెటింగ్ అధికారి పుష్పమ్మ, డీఏవో సక్రియనాయక్ పాల్గొన్నారు. అర్హులకే ఇందిరమ్మ ఇళ్లు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకత పాటించాలని అర్హులైన వారికే ఇళ్ల కేటాయింపులు చేయాలని కలెక్టర్ అఽధికారులను ఆదేశించారు. శుక్రవారం ఐడీవోసీ కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ పంచాయతీల వారీగా లబ్ధిదారుల ఎంపికను త్వరగా పూర్తి చేసి జాబితాను సిద్ధం చేయాలన్నారు. అర్హత లేనివారి గల కారణాలు వివరిస్తూ జాబితాలో పొందుపర్చాలన్నారు. పారదర్శకంగా ‘యువ వికాసం’ లబ్ధిదారుల ఎంపిక జిల్లాలో రాజీవ్యువ వికాసం పథకం లబ్ధిదారుల ఎంపిక ఎక్కడా అవకతవకలకు ఆస్కారం లేకుండా పూర్తి పారదర్శకంగా చేపట్టాలన్నారు. లబ్ధిదారుల ఎంపికలో అధికారులు, బ్యాంకర్లు సమన్వయంతో ప నిచేస్తూ నిర్దేశించిన లక్ష్యాలను సాధించాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు వి.లక్ష్మీనారాయణ, నర్సింగ్రావు, డీపీవో నాగేంద్రం, ఎస్సీ కార్పోరేషన్ ఈడీ రమేష్; ఎల్డీఎం శ్రీనివాసరావు, మున్సిపల్ కమీ నర్లు, ఎంపీడీవోలు పాల్గొన్నారు. ఈవీఎంల పరిశీలన పటిష్ట భద్రత ఏర్పాట్లతో నిరంతరం ఈవీఎంలను భద్రపర్చాలని కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. శుక్రవారం ఐడీవోసీ కార్యాలయ ఆవరణలో ఉన్న స్ట్రాంగ్ రూంలో ఈవీఎం యంత్రాలను పరిశీలించారు. సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్ బీఎం సంతోష్ తళుక్కుమన్న సుందరీమణులు ● మహావృక్షాన్ని సందర్శించిన మిస్వరల్డ్–25 పోటీదారులు ● 22 దేశాలకు చెందిన యువతుల రాక ● ఉల్లాసంగా, ఉత్సాహంగా సాగిన పర్యటన