Jogulamba
-
ప్రజల ప్రాణాల రక్షణ కోసమే ‘అరైవ్ అలైవ్’
ఎర్రవల్లి: ప్రజల ప్రాణాల రక్షణ కోసమే పోలీసుశాఖ అరైవ్.. అలైవ్ కార్యక్రమం చేపట్టడం జరిగిందని ఎస్పీ తోట శ్రీనివాసరావు అన్నారు. సోమవారం ఎర్రవల్లిలో అరైవ్.. అలైవ్పై నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. 44వ నంబర్ జాతీయ రహదారి ఉన్న ఎర్రవల్లి మండలంలో రోడ్డు భద్రత పాటించడం ఎంతో అవసరమన్నారు. రాష్ట్రవ్యాప్తంగా రోజు 70 నుంచి 80 వరకు రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని.. అందులో 20 నుంచి 30 మంది తమ ప్రాణాలు కోల్పోతున్నారని వెల్లడించారు. రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణం వాహనదారులు ట్రాఫిక్ నియమాలు పాటించకపోవడమేనని అన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా రోడ్డు భద్రత నియమాలు పాటిస్తేనే ప్రమాదాలను పూర్తిగా నివారించవచ్చని స్పష్టం చేశారు. అనంతరం గ్రామంలో ఏర్పాటుచేసిన రోడ్డు సేఫ్టీ కమిటీ సభ్యుల పాత్రను ఆయన వివరించారు. అదే విధంగా గ్రామస్తులతో ప్రతిజ్ఞ చేయించారు. సర్పంచ్ అనితా కృష్ణసాగర్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నీలి శ్రీనివాసులు, డీఎస్పీ మొగిలయ్య, సీఐ ప్రదీప్కుమార్, ఎస్ఐ రవి రాథోడ్, ఉపసర్పంచ్ మద్దిలేటిగౌడ్, పంచాయతీ కార్యదర్శి రంగన్న పాల్గొన్నారు. -
వృద్ధులు, దివ్యాంగుల సంక్షేమానికి కృషి
గద్వాల న్యూటౌన్: రాష్ట్రంలోని వృద్ధులు, దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలో వృద్ధుల కోసం ఏర్పాటుచేసిన మల్టీ సర్వీస్ డే కేర్ సెంటర్ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. వృద్ధుల జీవన ప్రమాణాలను మెరుగుపర్చడం.. స్వావలంబన పెంపొందించడం లక్ష్యంగా ప్రభుత్వ ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో తెలంగాణ వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య, అదనపు కలెక్టర్ నర్సింగ్రావు, మున్సిపల్ చైర్పర్సన్ జయలక్ష్మి, రెడ్క్రాస్ సొసైటీ చైర్మన్ అయ్యపురెడ్డి పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇళ్లు.. పేదలకు వరం ధరూరు/కేటీదొడ్డి: ఇందిరమ్మ ఇళ్లు పేదలకు ఓ వరమని ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి అన్నారు. ధరూరులో ఫరీదాబేగం, కేటీదొడ్డిలో శంకరమ్మ నిర్మించుకున్న ఇందిరమ్మ ఇళ్లను ఆయన ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకంతో పేదల సొంతింటి కల నెరవేరుతోందన్నారు. గద్వాల నియోజకవర్గంలో మొదటి విడతగా 3,500 ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేయగా.. ఇప్పటికే 1,500 ఇళ్ల నిర్మాణాలు ప్రారంభమై వివిధ దశల్లో ఉన్నాయన్నారు. త్వరలోనే రెండో విడత ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని తెలిపారు. అనంతరం ధరూరు శివారులో ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలతో ఎమ్మెల్యే మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. వారం రోజులుగా ఎండలు మండిపోతున్నాయని.. కూలీలు వడదెబ్బకు గురికాకుండా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. కార్యక్రమాల్లో మార్కెట్ కమిటీ చైర్మన్ హనుమంతు, సర్పంచ్ డీఆర్ విజయ్కుమార్, నాయకులు గడ్డం కృష్ణారెడ్డి, రమేశ్ నాయుడు, మాజీ వైస్ ఎంపీపీ సుదర్శన్రెడ్డి, ఉరుకుందు, టీచర్ ఆంజనేయులు, కొండన్న, మాజీ వైస్ ఎంపీపీ సుదర్శన్రెడ్డి, మాజీ సర్పంచ్ శ్రీనివాస్రెడ్డి, ఉపసర్పంచ్ ఈదన్న పాల్గొన్నారు. -
ఇంకెన్నాళ్లు.. సాగదీత?
2022లో ఆర్డీఎస్ మరమ్మతుకు రూ.11 కోట్ల కేటాయింపు ●రాజోళి: ‘దేవుడు కరుణించినా.. పూజారి కరుణించలేదు’ అన్న చందంగా మారింది ఆర్డీఎస్ కెనాల్ పరిస్థితి. దశాబ్దాల కాలంగా ఆర్డీఎస్లో ఆధునికీకరణ పనులు చేయకపోగా.. దాన్ని ప్రతిపాదనలు పక్కకు పెట్టి మరమ్మతు చేపట్టేందుకు సిద్ధయమ్యారు. ఇందుకోసం 2022లో రూ.11 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది. ఇది తాత్కాలిక ఉపశమనమైనప్పటికీ.. కెనాల్ మరింత బలహీనపడిపోతుండటంతో ఈ పనులు ఆర్డీఎస్కు ప్రయోజనకరంగానే మారాయి. కానీ, చేస్తున్న పనులే ఆలస్యమవుతుండటంతో చివరికి ప్రయోజనం ఉండకుండా పోతుందని రైతులు వాపోతున్నారు. 65 నుంచి 145 కి.మీ., వరకు.. ఆర్డీఎస్ కెనాల్ 65వ కి.మీ., నుంచి 145 కి.మీ., వరకు ఈ పనులు చేపట్టేలా ప్లానింగ్ చేశారు. అందులో భాగంగా సిల్ట్ రెన్యువల్, బ్యాకింగ్ వర్క్స్, సీసీ వర్క్, కాంక్రీట్ పనులు, జంగిల్ క్లియరెన్స్ లాంటివి చేయాల్సి ఉంది. కాగా చేపట్టిన పనులు వేగంగా జరగకపోగా.. చేస్తున్న సమయం అనుకూలించడం లేదని రైతులు అంటున్నారు. రూ.11 కోట్లకు గాను ఇప్పటికే రూ.7.20 కోట్ల విలువ చేసే పనులు పూర్తయ్యాయి. ఈ పనులు చేసిన కాంట్రాక్టర్కు అనుబంధంగా ఉన్న మరో కాంట్రాక్టర్తో అదనంగా మరో రూ.3 కోట్ల పనులు చేపట్టగా.. ఇప్పటికి దాదాపు రూ.2 కోట్ల పనులు చేయాల్సి ఉందని అధికారుల లెక్కలు చెబుతున్నాయి. వీటిని త్వరగా పూర్తి చేస్తే ప్రయోజనకరంగా ఉంటుందని రైతులు పేర్కొంటున్నారు. సమన్వయంతో పనిచేయాలి.. ఆర్డీఎస్ అంటే గద్వాల జిల్లాకు ఆయువు. దానికి సంబంధించిన పనులు చేసేటప్పుడు అధికారులు, ప్రభు త్వం సమన్వయంతో పనిచేయాలి. కెనాల్లో మరమ్మతు చేపట్టి చా లా ఏళ్లు అవుతుంది. ఇలాగే నెమ్మదిగా సాగితే ప్రయోజనం ఏముంటుంది. ప్రభుత్వం ప్రత్యేక దృష్టిపెట్టి వచ్చే వ్యవసాయ సీజన్లోగా మరమ్మతు పూర్తి చేసి రైతులకు సహకరించాలి. – మద్దిలేటి, రైతు, వడ్డేపల్లి రైతులకు ఇబ్బంది కలిగించొద్దుపనులు చేసేదే రైతుల కోసం. అలాంటప్పుడు వారికి అనుకూలించేలా చేయాలి. అంతే కానీ కెనాల్లో నీరు ఉన్న ప్పుడు, రైతులు సాగు లో బిజీగా ఉన్నప్పుడు పనులు చేస్తామంటే దా ని వల్ల రైతులకే ఇబ్బంది కలుగుతుంది. 2022 లో నిధులు మంజూరు చేస్తే ఇప్పటి వరకు 65 శాతం పనులు మాత్రమే పూర్తి చేశారు. అధికారులు వెంటనే పనులు ప్రారంభించేలా చూడాలి. – వడ్డే స్వాములు, రైతు, జిల్లేడుదిన్నె నోటీసులు ఇచ్చాం.. ఆర్డీఎస్ కెనాల్ మరమ్మతు పనులు ఇప్పటికే 65 శాతం పూర్తయ్యాయి. ఇంకా రూ.2 కోట్ల కు సంబంధించిన పనులు చేయాల్సి ఉంది. అయితే పనుల్లో ఆలస్యమవుతుందని సంబంధిత కాంట్రాక్టర్కు నోటీసులు ఇచ్చాం. ప్రస్తు తం సాగు సీజన్ కాకపోవడంతో పనులు వేగ ంగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్కు చెప్పాం. వీలైనంత త్వరగా పనులు పూర్తి చేస్తాం. – శ్రీనివాసులు, ఈఈ, ఆర్డీఎస్ నేటి వరకు నత్తనడకన కొనసాగుతున్న పనులు నాలుగేళ్లు గడిచినా 60 శాతమే పూర్తి.. సీజన్ ప్రారంభానికి ముందే చేపట్టాలంటున్న రైతులు ఇప్పటికిప్పుడు మొదలుపెడితేనే పూర్తయ్యే అవకాశం -
అర్జీలు సత్వరం పరిష్కరించాలి
గద్వాలన్యూటౌన్: ప్రజల నుంచి అందే అర్జీలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి వచ్చిన ప్రజల సమస్యలను ఆయన నేరుగా తెలుసుకుని ఫిర్యాదులు స్వీకరించారు. అనంతరం అధికారులనుద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ.. అన్ని శాఖల అధికారులు ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యత ఇచ్చి, అర్జీలను సత్వరం పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజావాణిలో వివిధ సమస్యలపై 114 అర్జీలు అందినట్లు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు లక్ష్మీనారాయణ, నర్సింగ్రావు, ఆర్డీఓ శ్రీనివాసరావు పాల్గొన్నారు. జనగణనకు పకడ్బందీ ఏర్పాట్లు జిల్లాలో జనగణనను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. సోమవారం డైరెక్టర్ ఆఫ్ సెన్సెస్ ఆపరేషన్ (డీసీఓ) భారతి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా అధికారులతో జనగణన ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో జనగణన ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ప్రస్తుతం 1,073 హౌస్ లిస్టింగ్ బ్లాక్స్ గుర్తించామని.. 1,341 మంది ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్ల నియామక ప్రక్రియ పూర్తిచేశామని వివరించారు. కాగా, చార్జ్ అధికారుల వివరాలను ఈ నెల 15వ తేదీలోగా సమర్పించాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ సూచించారు. 18 నుంచి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో సీపీఓ పాపయ్య, ఏఓ భూపాల్రెడ్డి పాల్గొన్నారు. -
ఉద్రిక్తంగా కో–ఆప్షన్ ఎన్నిక
మంత్రి వాకిటి శ్రీహరి ఎక్స్–అఫీషియో ఓటు హక్కు వినియోగించుకోవడంతో కాంగ్రెస్–2, సీపీఎం–2 కో–ఆప్షన్ స్థానాలు కై వసం చేసుకున్నాయి. కో–ఆప్షన్ ఎన్నికకుగాను పదిమంది కౌన్సిలర్లు సకాలంలో కార్యాలయానికి చేరుకోగా మంత్రి వస్తున్నారనే సమాచారంతో పుర కార్యాలయం వద్ద పోలీసు బందోబస్తు పటిష్టం చేశారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రక్రియ కొనసాగింది. సీపీఎం నుంచి చిన్నన్న, షాజహాన్, కాంగ్రెస్పార్టీ నుంచి తౌఫిక్, మణెమ్మను కో–ఆప్షన్ సభ్యులుగా ఎన్నుకున్నారు. అనంతరం మంత్రి ఎన్నికై న సభ్యులను శాలువాలతో సన్మానించి అభినందించారు. అనంతరం మాట్లాడుతూ.. రాజకీయలు పక్కనబెట్టి పట్టణాభివృద్ధికి అందరూ కలిసి రావాలని కోరారు. కార్యక్రమంలో పుర చైర్పర్సన్ జింక సువర్ణ రవి, వైస్ చైర్పర్సన్ రాధ అరుణ్, సీఐ శివకుమార్, ఎస్ఐలు స్వాతి, జయన్న పాల్గొన్నారు. అమరచింత: స్థానిక పుర కార్యాలయంలో సోమవారం జరిగిన కో–ఆప్షన్ సభ్యుల ఎన్నిక ప్రక్రియ ఉద్రిక్తతల నడుమ కొనసాగింది. వివరాల్లోకి వెళ్తే.. ఉదయం 11 గంటల సమయంలో ఎన్నిక జరుగుతుందనే సమాచారంతో బీఆర్ఎస్, బీజేపీకి చెందిన ఐదుగురు కౌన్సిలర్లు ముందుగానే పుర కార్యాలయానికి చేరుకోన్నారు. ఇచ్చిన సమయం దాటుతున్నా పుర అధికారులు ఎన్నిక నిర్వహించకపోవడం వారికి ఆగ్రహం తెప్పించింది. దీనికితోడు పుర కార్యాలయ ఆవరణ కాంగ్రెస్పార్టీ నాయకులు, కార్యకర్తలతో నిండుకోవడంతో అసహనానికి గురైన బీజేపీ కౌన్సిలర్ మేర్వ రాజు సమయం దాటిపోయిందని, వెంటనే ఎన్నిక నిర్వహించాలని అక్కడే ఉన్న పుర కమిషనర్ నూరుల్ నదీంతో వాగ్వాదానికి దిగారు. ఒకనొక సమయంలో కౌన్సిలర్ కమిషనర్ కుర్చీ, చెయ్యి పట్టుకొని లాగేందుకు యత్నించగా ఇరువురి మధ్య మాటల యుద్ధం పెరిగి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వెంటనే గమనించిన డీఎస్పీ వెంకటేశ్వర్లు తమ సిబ్బందితో కౌన్సిలర్ రాజును బయటకు తీసుకొచ్చి అదుపులోకి తీసుకోవడంతో సమస్య సద్దుమణిగింది. కమిషనర్ ఇచ్చిన లిఖితపూర్వక ఫిర్యాదుతో కౌన్సిలర్ మేర్వరాజుపై కేసు నమోదు చేశామని ఎస్ఐ స్వాతి తెలిపారు. పుర కమిషనర్, బీజేపీ కౌన్సిలర్ మధ్య వాగ్వాదం కమిషనర్ ఫిర్యాదుతో కౌన్సిలర్పై కేసు నమోదు పోలీసుల జోక్యంతో సద్దుమణిగిన వివాదం మంత్రి ఓటుతో అధికార పక్షం కై వసం చెరో రెండు స్థానాలు దక్కించుకున్న కాంగ్రెస్, సీపీఎం -
ఈ నెల 30 వరకు రేషన్ పంపిణీ
జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): జిల్లాలో ఈ నెల 30 వరకు రేషన్ బియ్యం పంపిణీ కొనసాగుతుందని జిల్లా పౌర సరఫరాల అధికారి శ్రీనివాస్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని 506 రేషన్ దుకాణాల ద్వారా మూడు నెలల ఉచిత సన్నబియ్యం పంపిణీ ప్రక్రి య కొనసాగుతుందన్నారు. జిల్లావ్యాప్తంగా 2,78,386 కార్డులకు గాను సోమవారం వరకు 1,71,328 కార్డుదారులు (61 శా తం) బియ్యం తీసుకొన్నారని చె ప్పారు. బియ్యం పంపిణీని ఈ నెల 30 వరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సరఫరా చేస్తామని, కార్డుదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. -
పీఆర్సీ నివేదిక అమలులో జాప్యం తగదు
గద్వాలన్యూటౌన్: ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ అమలు చేయడంలో జాప్యం తగదని టీఎస్ యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి గోపాల్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలో టీఎస్ యూటీఎఫ్ ఆవిర్బావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ జెండాను ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. ప్రభుత్వం రెండున్నరేళ్లు గడుస్తున్నా పీఆర్సీ నివేదిక బయటపెట్టకుండా.. సంఘాలతో చర్చలు జరపకుండా జాప్యం చేయడం సమంజసం కాదన్నారు. పీఆర్సీ నివేదికను బహిర్గతపర్చి, సంఘాలతో చర్చించిన అనంతరం ఆమోదయోగ్యమైన ఫిట్మెంట్తో పీఆర్సీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అదే విధంగా హెల్త్ కార్డ్స్ ప్రాసెస్ పూర్తిచేసి అందుబాటులోకి తీసుకురావడంతో పాటు సీపీఎస్ విధానం రద్దుచేసి.. పాత పెన్షన్ విధానాన్ని తీసుకురావాలన్నారు. పెండింగ్లో ఉన్న అన్ని రకాల బిల్లులను విడుదల చేయాలని, సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ మినహాయింపు లేదా అందరికీ ఒకే రకమైన మెరిట్ విధానం తీసుకురావాలని కోరారు. కార్యక్రమంలో టీఎస్ యూటీఎఫ్ నాయకులు చిరంజీవి నాయుడు, చంద్రకాంత్, లక్ష్మణ్, బీచుపల్లి, సుదర్శన్, చిన్న నర్సింహులు, జయన్న, రామకృష్ణ, సుధాకర్ పాల్గొన్నారు. పేదలకు రాజ్యాధికారమే అంబేడ్కర్ ఆశయం గద్వాలన్యూటౌన్: పేద వర్గాల చేతుల్లోకి అధికారం రావడమే డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆశయమని భీమ్ ఆర్మీ ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మాచర్ల ప్రకాశ్, జిల్లా అధ్యక్షుడు వర్షిత్, అఖిలపక్ష కమిటీ అధ్యక్షుడు నాగర్దొడ్డి వెంకట్రాములు, మధుసూదన్బాబు అన్నారు. అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకొని సోమవా రం జిల్లా కేంద్రంలో భీమ్ ఆర్మీ ఆద్వర్యంలో అంబేడ్కర్ ఆలోచనా పండుగ నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక అంబేడ్కర్ చౌరస్తా నుంచి వైఎస్సార్ చౌరస్తా వరకు ర్యాలీ చేపట్టారు. అనంతరం అక్కడే నిర్వహించిన సభ లో వారు మాట్లాడారు. దేశానికి అంబేడ్కర్ చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగాన్ని దేశానికి అందించారని కొనియాడారు. తన జీవితాంతం పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేశారన్నారు. కార్యక్రమంలో ఆవాస్ రాష్ట్ర నాయకుడు అతికూర్ రహ్మన్, నాయకులు రవి, పల్లయ్య, వినోద్, నర్సింహ, లక్ష్మణ్, సురేష్, విజయ్, రమేశ్, రఘునందన్ పాల్గొన్నారు. వేరుశనగ క్వింటా రూ.7,971 గద్వాలవ్యవసాయం: జిల్లాకేంద్రంలోని వ్యవసాయ మార్కెట్యార్డుకు సోమవారం 914 క్వింటాళ్ల వేరుశనగ అమ్మకానికి రాగా.. గరిష్టంగా రూ. 7,971, కనిష్టంగా రూ. 4,019, సరాసరి రూ. 6,049 ధర పలికింది. అదే విధంగా 457 క్వింటాళ్ల ఆముదాలు రాగా.. గరిష్టంగా రూ. 6,199, కనిష్టంగా రూ. 5,809, సరాసరి రూ. 6,060 ధరలు వచ్చాయి. 13 క్వింటాళ్ల కందులు రాగా.. గరిష్టంగా రూ. 6,506, కనిష్టంగా రూ. 6,219, సరాసరి రూ. 6269 ధరలు లభించాయి. 816 క్వింటాళ్ల వరి (సోన) రాగా.. గరిష్టంగా రూ. 2,456, కనిష్టంగా రూ. 1,986, సరాసరి రూ. 2,306 ధర పలికింది. -
ఫలితాలు మెరుగు
జోగుళాంబ గద్వాలగతంతో పోల్చితే ఇంటర్మీయడిట్లో పెరిగిన ఉత్తీర్ణత శాతం ● ప్రథమ సంవత్సరంలో 18.. ద్వితీయ సంవత్సరంలో 14వ స్థానం ● అత్యధిక శాతం ఉత్తీర్ణతతో సత్తాచాటిన బాలికలు సోమవారం శ్రీ 13 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026జిల్లాలో ఇంటర్ విద్యార్థుల ఉత్తీర్ణత శాతం ఇలా.... ఏడాది ఫస్టియర్ రాష్ట్రస్థాయిలో స్థానం 2023– 24 53.24 21 2024– 25 62.58 23 2025– 26 73.01 18 ఏడాది సెకండియర్ రాష్ట్రస్థాయిలో స్థానం 2023– 24 62.82 23 2024– 25 57.16 21 2025– 26 62.06 14 గద్వాల న్యూటౌన్: ఇంటర్మీడియట్ ఫలితాల్లో రాష్ట్రవ్యాప్తంగా జోగుళాంబ గద్వాల జిల్లా స్థానం కాస్త మెరుగుపడింది. ఆదివారం ఇంటర్ బోర్డు విడుదల చేసిన ఫలితాల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సర విద్యార్థులు రాణించారు. గతంతో పోల్చితే ఈసారి ఉత్తీర్ణత శాతం కాస్త పెరిగింది. ఇంటర్ ప్రథమ సంవత్సరంలో 62.06 శాతంతో 18వ స్థానం, ద్వితీయ సంవత్సరంలో 73.01 శాతంతో 14వ స్థానంలో జిల్లా నిలిచింది. అలాగే గతంలో మాదిరిగానే ఈసారి కూడా బాలికలే మెరుగైన ఫలితాలు సాధించారు. మొదటి సంవత్సరంలో 1,539 మంది బాలురు పరీక్షలు రాయగా.. 730 మంది (47.43 శాతం) ఉత్తీర్ణులయ్యారు. అలాగే 1,943 మంది బాలికలు పరీక్షలు రాయగా.. 1,431 మంది (73.65 శాతం) ఉత్తీర్ణత సాధించారు. ద్వితీయ సంవత్సరానికి సంబంధించి 1,283 మంది బాలురు పరీక్ష రాయగా.. 785 మంది (61.18 శాతం), 1,711 మంది బాలికలు హాజరు కాగా 1,401 మంది (81.88 శాతం) ఉత్తీర్ణులయ్యారు. గురుకులాల ప్రతిభ ఇంటర్ ఫలితాల్లో ప్రధానంగా గురుకుల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. బీచుపల్లి గురుకులంలో ద్వితీయ సంవత్సర విద్యార్థులు జశ్వంత్, వంశీలు ఎంపీసీ విభాగంలో 992/1000 మార్కులు సాధించారు. అలాగే ఇక్కడే చదువుతున్న నరేష్గౌడ్ బైపీసీ విభాగంలో 992/1000 సాధించాడు. ఇదే కళాశాలలో మొదటి సంవత్సరం విద్యార్థులు కార్తీక్ ఎంపీసీ విభాగంలో 466/470 సాధించగా.. బైపీసీ విభాగంలో రఫీ 436/440 సాధించాడు. అలాగే బిజ్వారం బీసీ సంక్షేమ గురుకుల కళాశాల విద్యార్థులు రాఘవి, సింధు బైపీసీ విభాగంలో 438/440 మార్కులు సాధించారు. ఇంటర్ ఒకేషనల్లో కూడా ఈసారి గతం కంటే మంచి ఫలితాలు వచ్చాయి. ద్వితీయ సంవత్సరంలో మొత్తం 706 మంది విద్యార్థులు పరీక్ష లు రాయగా ఇందులో 532 మంది (75.4 శాతం) ఉత్తీర్ణత సాధించగా.. రాష్ట్రస్థాయిలో 13వ స్థానం లభించింది. ఇక ప్రథమ సంవత్సరంలో 884 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా.. ఇందులో 612 మంది విద్యార్థులు (69.23 శాతం) ఉత్తీర్ణులవగా.. రాష్ట్రస్థాయిలో 4వ స్థానం జిల్లాకు దక్కింది. -
వందశాతం వ్యాక్సినేషన్
● పశువులు, గేదెలకు గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలు ● 13 మండలాల్లో 27 బృందాలతో పంపిణీ ● జిల్లాలో గోజాతి 30,763, గేదెజాతి 29,956 పశువులు గట్టు: జిల్లాలో పశువులను గాలికుంటు వ్యాధి బారి నుంచి రక్షించేందుకు చేపట్టిన వ్యాధి నిరోధక టీకాలు వేసే కార్యక్రమం విజయవంతంగా పూర్తిచేసినట్లు పశువైద్యాధికారులు తెలిపారు. జిల్లావ్యాప్తంగా 13 మండలాల్లో 27 బృందాలు గ్రామాల్లో నిరంతరం పర్యటించి, పశువులు, గేదెలకు వ్యాధి నిరోధక టీకాలు వేశారు. మార్చి 10న వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన పశువైద్య సిబ్బంది ఈ నెల 11 వరకు పూర్తిచేశారు. సంపూర్ణ అభియాన్ 2.0 ప్రోగ్రాంలో భాగంగా గాలికుంటు (ఎఫ్ఎండీ) ని ర్మూలనలో భాగంగా చేపట్టిన వ్యాధి నిరోధక టీకాల పంపిణీ కార్యక్రమాన్ని వందశాతం పూర్తిచేశారు. సాధారణంగా పశువులు, గేదెల్లో పుట్ అండ్ మౌత్ ద్వారా వచ్చే వ్యాధిని దూరం చేసేందుకు ప్రత్యేకంగా వ్యాధి నిరోధక టీకాలు వేసే కార్యక్రమాన్ని పశువైద్య సిబ్బంది విజయవంతంగా పూర్తిచేశారు. యాస్పిరేషన్ బ్లాక్గా ఎంపిక.. నీతి ఆయోగ్ కార్యక్రమంలో భాగంగా గట్టు మండలాన్ని యాస్పిరేషన్ బ్లాక్గా ఎంపిక చేశారు. ఇక్కడి పశువులు, గేదెలు అన్నింటికీ ముందస్తుగానే ఉచితంగా గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలను వేసినట్లు పశువైద్యాధికారులు నవీన్చంద్ర, ప్రియాంక తెలిపారు. జిల్లావ్యాప్తంగా గోజాతి 4 నెలలు పైబడిన దూడలు, ఆవులు, కోడెలు, ఎద్దులు మొత్తం 30,763 ఉండగా.. గేదెజాతి 4 నెలల పైబడిన దూడలు, గేదెలు, పడ్డలు మొత్తం 29,956 ఉండగా.. వీటన్నింటికీ వ్యాధి నిరోధక టీకాలు వేసినట్లు పశువైద్యాధికారులు తెలిపారు. ప్రత్యేక కార్యాచరణ అమలు.. నీతి ఆయోగ్ కార్యక్రమంలో భాగంగా ఉమ్మడి పాలమూరులోని నారా యణపేట జిల్లా నర్వ, జోగుళాంబ గద్వాల జిల్లా గట్టు మండలాన్ని కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి చేసేందుకు ఎంపిక చేసి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమలు చేస్తున్నారు. ఈ క్రమంలో సంపూర్ణ అభియాన్ 2.0 ప్రోగ్రాంలో భాగంగా గట్టులో ఎఫ్ఎండీ పుట్ అండ్ మౌత్ డిసీజ్ బారిన పశువులు పడకుండా ముందస్తుగా పశువైద్య సిబ్బంది ప్రత్యేకంగా ఉచిత టీకాల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. గట్టు మండలంలోని 27 గ్రామాల్లో మొత్తం 9,316 పశువులు ఉండగా.. వందశాతం వ్యాధి నిరోధక టీకాలు వేసినట్లు పశువైద్యాధికారులు తెలిపారు. -
కొల్లాపూర్కు రైల్వే టూరిజం తీసుకురావాలి
కొల్లాపూర్ రూరల్: కొల్లాపూర్కు హెలీ టూరిజంతోపాటు రైల్వే టూరిజం కూడా తీసుకురావాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు పల్లా వెంకట్రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బాల్నర్సింహ అన్నారు. ఆదివారం కొల్లాపూర్లోని ఎన్టీఆర్ చౌరస్తాలో రైల్వే లైన్ సాధన కోసం సీపీఐ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాకు వారు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. కొల్లాపూర్ మీదుగా రైల్వే లైన్ వస్తే ఈ ప్రాంతానికి పరిశ్రమలు రావడానికి అవకాశం ఉంటుందన్నారు. ఇక్కడ పరిశ్రమలకు కావాల్సిన అన్ని వసతులు, సౌకర్యాలు ఉన్నాయన్నారు. నంద్యాల నుంచి జడ్చర్ల మీదుగా రైల్వే లైన్ వేయడానికి అవకాశం వచ్చిందో.. దానిని కొల్లాపూర్ మీదుగా వేసేలా రాష్ట్ర ప్రభుత్వం, మంత్రి జూపల్లి కృష్ణారావు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రాంతంలో నేషనల్ హైవే–167తోపాటు బ్రిడ్జి నిర్మాణం కూడా జరుగుతుందని, దీనిని మల్టీపర్పస్గా అభివృద్ధి చేస్తే ఖర్చు కూడా తగ్గుతుందన్నారు. ఈ అంశాన్ని పార్లమెంట్, రాజ్యసభలో ప్రస్తావించేందుకు తమ పార్టీ ఎంపీలు కృషి చేస్తారన్నారు. సీపీఐ ఎప్పటికీ ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తుందని పేర్కొన్నారు. కమ్యూనిస్టు పార్టీలు చేసిన పోరాటాలు ఏమీ వృథాగా పోలేదని, కొల్లాపూర్కు రైల్వే లైన్ రావడానికి కూడా పోరాటాలు చేస్తామని తేల్చిచెప్పారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్ఎండీ ఫయాజ్, నాయకులు విజయుడు, శివుడు, ఇందిర తదితరులు పాల్గొన్నారు. -
మహనీయుడు జ్యోతిబాఫూలే
గద్వాల న్యూటౌన్: సమాజంలోని అసమానతలను తొలగించేందుకు జీవితాంతం కృషిచేసిన మహనీయుడు జ్యోతిబాఫూలే అని అదనపు కలెక్టర్ నర్సింగరావు అన్నారు. శనివారం మహాత్మ జ్యోతిబాఫూలే జయంతిని పురస్కరించుకొని కలెక్టరేట్లో చిత్రపటానికి, కృష్ణవేణి చౌరస్తాలోని ఫూలే విగ్రహానికి అదనపు కలెక్టర్ ఇతర అధికారులు, వివిధ సంఘాల నాయకులతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పూలే చిన్నతనం నుంచే చత్రపతి శివాజీ, జార్జివాషింగ్టన్ మొదలైన వారి జీవిత చరిత్రలను చదివి అతనిలో దేశభక్తి, సామాజిక స్పృహ అలవడ్డాయన్నారు. అప్పటి సమాజంలో నిమ్న కులాల ప్రజలు వెనకబడటానికి కారణం విద్య లేకపోవడమేనని భావించి.. పాఠశాలలు నెలకొల్పడమే కాకుండా సీ్త్ర విద్యకు ప్రాధాన్యత ఇచ్చిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. తన భార్య సావిత్రిబాయి ఫూలేకు చదువు నేర్పించి బాలికల పాఠశాలలో ఆమెను ఉపాధ్యాయురాలిగా నియమించారని చెప్పారు. కులవ్యవస్థను వ్యతిరేకించి, గులాంగిరి అనే పుస్తకాన్ని రచించారన్నారు. 1878లో పుణెలో సత్యశోధక సమాజాన్ని స్థాపించి, సీ్త్ర, పురుష లింగ వివక్షతను ఫూలే తీవ్రంగా విమర్శించారని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ శ్రీనివాసరావు, డీఎస్పీ మొగిలయ్య, ఏఓ భూపాల్రెడ్డి, జిల్లా బీసీ సంక్షేమ అధికారి అక్బర్పాషా, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ నుషిత తదితరులు పాల్గొన్నారు. -
ఆర్టిజన్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
గద్వాల న్యూటౌన్: న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని గత నాలుగు రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్న ఆర్టిజన్ కార్మికులను చర్చలకు ఆహ్వానించి.. తక్షణమే సమస్యలు పరిష్కరించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వెంకటస్వామి అన్నారు. గద్వాల డివిజన్ ఇంజినీర్ కార్యాలయం ఎదుట నిర్వహిస్తున్న సమ్మె శిబిరాన్ని శనివారం ఆయన సందర్శించి మద్దతు పలికి మాట్లాడారు. చేస్తున్న పని స్వభావం ఒక్కటే అయినప్పుడు ఒక్కో కార్మికుడి వేతనాలు ఉద్యోగ భద్రతలలో వ్యత్యాసాలు ఎందుకని ప్రశ్నించారు. ఆర్టిజన్ కార్మికులు కొత్త కోరికలను కోరడం లేదని, తమకు ఇచ్చిన హామీలనే అడుగుతున్నారని పేర్కొన్నారు. సంస్థలో 23 వేల మంది ఆర్టిజన్ ఉద్యోగులకు స్టాడింగ్ ఆర్డర్స్ రద్దు చేసి, రెగ్యులర్ ఉద్యోగులతోపాటు ఏపీఎస్ఈబీ రూల్స్ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. రెండేళ్లుగా కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నా పరిష్కరించకపోవడం వల్లే సమ్మెబాట పట్టారన్నారు. న్యాయమైన వారి డిమాండ్లను శాంతియుత వాతావరణంలో పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు నర్సింహ, అంజి, ఆర్టిజన్ యూనియన్ చైర్మన్ శివప్రసాద్, కోకన్వీనర్ రాజు తదితరులు పాల్గొన్నారు. -
ప్యాక్హౌస్లతో ప్రయోజనం
నడిగడ్డలో పెరుగుతున్న పండ్ల తోటల సాగు విస్తీర్ణం గద్వాల వ్యవసాయం: నడిగడ్డలో సాగునీటి వనరులు పుష్కలంగా ఉండటంతోపాటు ఇక్కడి నేలలు, వాతావరణ పరిస్థితులు పండ్లతోటలకు అనుకూలంగా ఉన్నాయి. దీంతో వీటి సాగుపై ఎక్కువ మంది రైతులు ఆసక్తి చూపుతున్నారు. అయితే పండ్లు తెంపిన తర్వాత వాటిని నిల్వ ఉంచడానికి, అవసరమైన ప్రాసెసింగ్ చేయడానికి రైతులు ఇబ్బందులు పడేవారు. ఈ ఇబ్బందులను అధిగమించడానికి ప్యాక్హౌస్లు ఎంతో ఉపయోగపడతాయి. ఉద్యానశాఖ ఎంఐడీహెచ్ పథకం కింద 50 శాతం సబ్సిడీపై ప్యాక్హౌస్ల నిర్మాణాలను ప్రోత్సహిస్తోంది. నేలలు.. వాతావరణం జిల్లాలో పండ్లతోటలకు అనువైన పరిస్థితులు ఉన్నాయి. పండ్లతోటలు, కూరగాయల సాగుకు ఎర్రటి, ఒండ్రుతో కూడిన ఎర్రటి నేలలు ఉండాలి. నడిగడ్డలో ఇలాంటి నేలల శాతమే ఎక్కువగా ఉంది. సాగునీటి విషయానికి వస్తే జూరాల, ఆర్డీఎస్ ప్రాజెక్ట్లతోపాటు నెట్టెంపాడు ఎత్తిపోతలు, రిజర్వాయర్లు, నోటిఫైడ్ చెరువులు, కుంటలు ఉన్నాయి. వీటన్నింటి ఆధారంగా బోర్లు, బావుల్లోనూ ఆశించిన స్థాయిలో నీరు ఉంటోంది. సాధారణంగా పండ్లతోటలను బోర్లు, బావుల కిందే సాగు చేస్తారు. ఇక వాతావరణం విషయానికి వస్తే వేసవిలో పగటి ఉష్ణోగ్రతలు ఎంత ఉన్నా.. సాయంత్రం నుంచి రాత్రి వరకు చల్లగా ఉంటుంది. శీతాకాలంలో ఎంత చలి ఉన్నా.. ఉష్ణోగ్రతలు పూర్తిగా పడిపోవు. ఇలా నేలలు, వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. బడ్జెట్ కేటాయింపు ప్రకారం.. పండ్లు తెంపిన తర్వాత పలు సందర్భాల్లో వాటిని నిల్వ ఉంచడం, కోల్డ్ స్టోరేజీలో ఉంచడం, ఎగుమతి కోసం ప్యాకింగ్, ప్రాసెసింగ్ చేయాల్సిన పరిస్థితులు ఉంటాయి. ఇలాంటి సమయంలో తగిన వసతి లేక రైతులు చాలా ఇబ్బందులు పడుతుంటారు. బయటి వాతావరణంలో తెంపిన పండ్లను ఉంచి, ఆర్థికంగా నష్టపోతుంటారు. వీటిని అధిగమించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఎంఐడీహెచ్ (మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ హార్టికల్చర్) పథకం కింద ప్యాక్హౌస్ నిర్మాణాలను 50 శాతం సబ్సిడీపై అందించి ప్రోత్సహిస్తోంది. ప్యాక్హౌస్కు రూ.4.80 లక్షల వ్యయం అవుతుండగా.. ఇందులో రైతు వాటాగా రూ.2.40 లక్షలు భరిస్తే.. మిగిలిన రూ.2.40 లక్షలు ఎంఐడీహెచ్ కింద సబ్సిడీ అందిస్తున్నారు. ఈ ప్యాక్హౌస్కు నీరు, వేయింగ్ మిషన్ సౌకర్యం కూడా ఏర్పాటు చేస్తారు. పలు ప్రయోజనాలు ఉన్న ఈ ప్యాక్ హౌస్లను బడ్జెట్ కేటాయింపుల ప్రకారం 2025– 26 ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో 10 నిర్మించాలని లక్ష్యంగా నిర్దేశించగా.. 9 చోట్ల పూర్తయ్యాయి. 2026– 27లో వీటి నిర్మాణాల కోసం మరింత బడ్జెట్ కేటాయించాలని ఉద్యాన రైతులు కోరుతున్నారు. గద్వాల మండలం అనంతపురంలో నిర్మించిన ప్యాక్హౌస్ అనుకూల పరిస్థితులతో ఆసక్తి చూపుతున్న రైతులు జిల్లావ్యాప్తంగా 2025–26లో 9 నిర్మాణాలు పూర్తి ఎంఐడీహెచ్ పథకం కింద 50 శాతం సబ్సిడీ 2026– 27లో మరింత బడ్జెట్ కేటాయించాలని వేడుకోలు 17,400 ఎకరాల్లో సాగు జిల్లాలో రైతులు పత్తి, వరి, వేరుశనగ తదితర పంటలను ఏళ్ల తరబడి నుంచి సాగు చేస్తున్నారు. అయితే గడిచిన పదేళ్ల నుంచి రైతుల ఆలోచనా విధానంలో మార్పు వస్తోంది. ప్రధానంగా పండ్లతోటలకు ఇక్కడి నేలలు, వాతావరణం అనుకూలంగా ఉండటానికి తోడు వీటి సాగు వల్ల పండ్ల రకాన్ని బట్టి 3–5 ఏళ్లపాటు మంచి యాజమాన్య పద్ధతులు అవలంభిస్తే తోటలు బాగా వచ్చి ఆర్థికంగా లాభపడతామన్న ఆలోచనతో రైతులు పండ్ల తోటల సాగుపై ఆసక్తి చూపుతున్నారు. మామిడి, బత్తాయి, పొప్పాయి, అంజీర, జామ, డ్రాగన్ ఫ్రూట్ తదితర పండ్లతోటలు సాగు చేస్తున్నారు. ఏటా పండ్లతోటల సాగు జిల్లాలో పెరుగుతోంది. ప్రస్తుతం జిల్లాలో 17,400 ఎకరాాల్లో పండ్ల తోటలు సాగులో ఉన్నాయి. -
క్రమశిక్షణతో విధులు నిర్వహించాలి
ఎర్రవల్లి: పోలీస్ సిబ్బంది క్రమశిక్షణతో విధులు నిర్వహించి వ్యవస్థకు మంచిపేరు తీసుకురావాలని పదవ పటాలం కమాండెంట్ జయరాజు అన్నారు. శుక్రవారం బీచుపల్లి పదవ బెటాలియన్లో ఆర్ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న మహ్మద్ రషీద్ సివిల్ ఎస్ఐగా పదోన్నతి పొందిన సందర్భాన్ని పురస్కరించుకొని సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి కమాండెంట్ హాజరై ఆయనకు పూలమాల వేసి శాలువాలతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మహ్మద్ రషీద్ తన సేవాకాలంలో క్రమశిక్షణ, విధేయత, కష్టపడే స్వభావంతో ఉన్నతమైన విధులు నిర్వహించి మంచి గుర్తింపు పొందారన్నారు. విధి నిర్వహణలో పటాలం సిబ్బందితో కలిసి ఆయన చేసిన సేవలను అభినందించారు. ఇతర సిబ్బంది కూడా ఆయనను ఆదర్శంగా తీసుకొని తమ విధులను అంకితభావంతో నిర్వహించాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో ఆర్ఐలు రాజు, నర్సింహరాజు, రాజేశం, శ్రీనివాసులు, ఆర్ఎస్ఐ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. -
సీఎం దృష్టికి తీసుకెళ్తా..
జూరాలలో నీటి నిల్వలు కనిష్ట స్థాయికి పడిపోవడంతో వేసవిలో తాగునీటి అవసరాలకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకోవాలి. ఈ విషయాన్ని వెంటనే సాగునీటి పారుదల శాఖ మంత్రి, సీఎం దృష్టికి తీసుకెళ్లా. కర్ణాటక నుంచి మనకు 2 టీఎంసీలు విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని కోరుతాను. – బండ్ల కృష్ణమోహన్రెడ్డి, ఎమ్మెల్యే, గద్వాల నీటి చౌర్యంతోనే.. జూరాల ఎడమ కాల్వ కింద 4 ఎకరాల్లో వరి సాగుచేశా. వారంలో నాలుగు రోజులు సాగునీరు వదులుతున్నామంటూ మిగిలిన రోజుల్లో దిగువకు తరలిస్తున్నారు. ఇలాంటి నీటి చౌర్యంతోనే ప్రాజెక్టులో నీటిమట్టం పూర్తిగా తగ్గిపోతోంది. – బాలస్వామి, రైతు, ఆరేపల్లి (ఆత్మకూర్) ● -
ప్రజారోగ్యమే ప్రభుత్వ లక్ష్యం
నాగర్కర్నూల్ క్రైం: రాష్ట్ర ప్రజల ఆరోగ్యమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం అని, ఇందులో భాగంగానే మారుమూల గ్రామీణ ప్రాంత ప్రజలకు ఎమర్జెన్సీ సమయాల్లో అత్యవసర వైద్యసేవలను అందించి ప్రాణాలు కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం క్రిటికల్ కేర్ సెంటర్లను రాష్ట్రవ్యాప్తంగా నెలకొల్పుతుందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. శుక్రవారం ఆయన జిల్లాకేంద్రంలోని మెడికల్ కళాశాల ఆవరణలో రూ.23.75 కోట్లు వెచ్చించి.. 50 బెడ్ల సామర్థ్యంతో అత్యాధునిక వసతులతో నిర్మించిన క్రిటికల్ కేర్ బ్లాక్ అత్యవసర సేవల విభాగాన్ని ప్రారంభించి మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదాలు జరిగినా.. హార్ట్ స్ట్రోక్ వచ్చినా, విష జ్వరాలు ప్రబలినా ఇకపై హైదరాబాద్కు పరుగులు తీయకుండా.. స్థానికంగానే మెరుగైన వైద్యం అందించేందుకు ఈ సెంటర్లు ఎంతో ఉపయోగపడతాయన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపరచడం, ఆధునిక వైద్య పరికరాలను అందుబాటులోకి తీసుకువచ్చే చర్యలు వేగవంతంగా చేస్తున్నామన్నారు. అలాగే వైద్యులు, నర్సుల ఖాళీలను భర్తీ చేయడానికి భారీస్థాయిలో నియామకాలు చేపడుతున్నామని వెల్లడించారు. క్రిటికల్ కేర్ సెంటర్లతో అత్యవసర వైద్యసేవలు ఆధునిక పరికరాలు అందుబాటులోకి తీసుకువస్తాం ఖాళీల భర్తీకి భారీ స్థాయిలో నియామకాలు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ -
మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభం
గద్వాల వ్యవసాయం: జిల్లాకేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో శుక్రవారం మార్కెట్ యార్డు చైర్మన్ హనుమంతు, మున్సిపల్ చైర్పర్సన్ జయలక్ష్మి, పీఏసీఎస్ చైర్మన్ సుభాన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యాసంగి సీజన్లో ఈసారి ఎక్కువగా మొక్కజొన్న పంటను రైతులు సాగు చేశారని చెప్పారు. రైతులు దళారులకు విక్రయించకుండా ప్రభుత్వం ఇస్తున్న మద్దతు ధర క్వింటాల్కు రూ.2,400 పొంది కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని సూచించారు. జిల్లా మార్కెటింగ్ అధికారి పుష్ప మాట్లాడుతూ ఒక ఎకరాకు 25 క్వింటాళ్ల వరకు కొనుగోలు చేస్తామని తెలిపారు. కొనుగోలు కేంద్రాలకు మొక్కజొన్న ధాన్యాన్ని తీసుకరావడానికి ముందే రైతులు టోకెన్ తీసుకోవాలని సూచించారు. టోకెన్తోపాటు ఏఈఓ ధ్రువీకరణ పత్రం, పట్టాదారు పాసు పుస్తకం, ఆధార్కార్డు, బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ పత్రాలను అందించాలని చెప్పారు. నియోజకవర్గంలోని ధరూర్, గద్వాల, కేటీదొడ్డి, గట్టు, మల్దకల్ మండలాల రైతులు ఈ కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో జెడ్పీ మాజీ చైర్మన్ బండారి భాస్కర్, మార్కెట్ యార్డు వైస్ చైర్మన్ శ్రీకాంత్రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ శంకర్ పాల్గొన్నారు. 627 క్వింటాళ్ల వేరుశనగ రాక గద్వాల వ్యవసాయం: జిల్లాకేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డుకు శుక్రవారం 627 క్వింటాళ్ల వేరుశనగ రాగా గరిష్టంగా రూ.7,399, కనిష్టంగా రూ.4,660, సరాసరిగా రూ.6,299 ధరలు లభించాయి. అలాగే 283 క్వింటాళ్ల ఆముదాలు రాగా.. గరిష్టంగా రూ.6,121, కనిష్టంగా రూ.5,711, సరాసరిగా రూ.5,809 చొప్పున పలికాయి. 9 క్వింటాళ్ల కంది రాగా.. గరిష్టంగా రూ.6,509, కనిష్టంగా రూ.3,019, సరాసరిగా రూ.6,339 వచ్చాయి. 417 క్వింటాళ్ల వరి (సోన) రాగా.. గరిష్టంగా రూ.2,456, కనిష్టంగా రూ.1,906, సరాసరిగా రూ.2,226 ధరలు లభించాయి. సృజనాత్మకతతో ఆలోచించాలి: వీసీ మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: విద్యార్థులు సృజనాత్మకతతో ఆలోచించి కొత్త స్టార్టప్లను ప్రారంభించాలని పాలమూరు యూనివర్సిటీ వీసీ శ్రీనివాస్ పేర్కొన్నారు. శుక్రవారం యూనివర్సిటీలోని ఎంబీఏ, మ్యాథ్స్ డిపార్ట్మెంట్ల ఆధ్వర్యంలో వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన వీసీ మాట్లాడుతూ ఎంబీఏ లాంటి డిపార్ట్మెంట్లలో చదివిన విద్యార్థులు మార్కెట్లో డిమాండ్ ఉండడంతో సులువుగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలను పొందవచ్చన్నారు. మార్కెటింగ్, బ్యాంకింగ్, ఇండస్ట్రియల్ సెక్టార్లలో అవకాశాలు మెండుగా ఉన్నాయన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ రమేష్బాబులు, కృష్ణయ్య, అర్జున్కుమార్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. రైతుల సహకారంఅభినందనీయం కొత్తకోట రూరల్: మామిడి ప్రాసెసింగ్ యూనిట్ నెలకొల్పే బాధ్యత రైతులే స్వీకరించాలని నాబార్డ్ సీజీఎం ఉదయభాస్కర్ అన్నారు. పెద్దమందడి మండలం చిన్నమందడి గ్రామంలో ఉన్న ఓ మామిడి తోటలో మొదటి కాయ కోసి రైతులను ఉద్దేశించి మాట్లాడారు. రసాయన ఎరువుల వినియోగం తగ్గించి సేంద్రియ సాగుపై దృష్టి సారించాలని సూచించారు. నాబార్డ్, రాంకీ ఫౌండేషన్ సహకారంతో మండలంలోని గిరిజన గ్రామాల్లో 450 ఎకరాల్లో మామిడి తోటలు అభివృద్ధి చేయడం సంతోషకరమని రాంకీ ఫౌండేషన్ అధ్యక్షుడు రాంరెడ్డి అన్నారు. కార్యక్రమంలో భాగంగా రాంకీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ సామాజిక బాధ్యతలో భాగంగా రాంకీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్వయం ఉపాధి పొందేందుకు పేద మహిళలకు కుట్టు మిషన్లు, రైతులకు స్ప్రేయర్లు అందించారు. నాబార్డ్ సిబ్బంది, జిల్లా ఉద్యాన అధికారి విజయభాస్కర్రెడ్డి పాల్గొన్నారు. -
సమస్యలు పరిష్కరించే దాక సమ్మె
గద్వాల న్యూటౌన్: విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఆర్టిజన్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె కొనసాగిస్తామని విద్యుత్ ఆర్టిజన్ ఉద్యోగుల జేఏసీ నాయకుడు రాజు స్పష్టం చేశారు. సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం గద్వాల డివిజన్ ఇంజినీర్ కార్యాలయం ఎదుట 3వ రోజు సమ్మె కొనసాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాక ముందు ప్రస్తుత డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క ఆర్టిజన్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించి, న్యాయం చేస్తామని హామీ ఇచ్చారన్నారు. అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడిచినా తమ గురించి పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సంస్థలో 23 వేల మంది ఆర్టిజన్ ఉద్యోగులకు స్టాడింగ్ ఆర్డర్స్ రద్దు చేసి, రెగ్యులర్ ఉద్యోగులతోపాటు ఏపీఎస్ఈబీ రూల్స్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్హతలను బట్టి కన్వర్షన్ చేయాలని, 2016 నుంచి మిగిలిపోయిన కార్మికులను ఆర్టిజన్లులుగా గుర్తించాలన్నారు. ఆర్టిజన్ కార్మికుల సమ్మెకు టీఈఈ 1104 యూనియన్ నాయకులు సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో జేఏసీ కోకన్వీనర్ రాజు, కన్వీనర్ రఫీ, కోచైర్మన్ క్రాంతి, రామకృష్ణ, కృష్ణ, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. -
బెదిరింపులకు భయపడేది లేదు
అమరచింత: కేంద్ర ప్రభుత్వం పట్టణాల అభివృద్ధితో పాటు చెరువుల సుందరీకరణకు నిధులు మంజూరు చేసిందని.. వాటిని వినియోగించుకుంటూ తనకు సమాచారం ఇవ్వకపోవడం ఏమిటని మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. పట్టణంలోని పెద్ద చెరువు సుందరీకరణకు కేంద్ర ప్రభుత్వం రూ.3.14 కోట్లు మంజూరు చేసిందని.. పుర ఎన్నికల వేళ మంత్రి వాకిటి శ్రీహరి హడావుడిగా శంకుస్థాపన చేయడం తనను అవమానించడమేనని తెలిపారు. శుక్రవారం ఆమె పట్టణంలోని పెద్ద చెరువు సుందరీకరణ పనులకు భూమిపూజ చేసేందుకు రాగా.. అప్పటికే అక్కడికి చేరుకున్న కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో బీజేపీ, కాంగ్రెస్ నాయకుల మధ్య తోపులాటలు, మాటల యుద్ధం కొనసాగింది. వీటన్నింటిని లెక్క చేయకుండా ఎంపీ కాంగ్రెస్ నాయకులను తోసుకుంటూ చెరువుకట్టపైకి చేరుకొని అభివృద్ధి పనులకు భూమిపూజ చేశారు. ఎస్ఐ స్వాతి సిబ్బందితో కాంగ్రెస్ నాయకులను బయటకు పంపే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. మంత్రి వాకిటి శ్రీహరి హుందాతనం మరిచి అహంకారం ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎంపీగా రాజకీయాల్లో ఉన్నానని.. బాధ్యతలు, గౌరవం, ప్రొటోకాల్ తనకు తెలుసన్నారు. ఎమ్మెల్యేలు కేంద్ర నిధుల గురించి చెప్పకుండా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో కూడా కేంద్ర నిధులు ఉన్నాయని.. నిజమైన పేదలకు కాకుండా కాంగ్రెస్ కార్యకర్తలకు ఇళ్లు మంజూరు చేయడం దారుణమన్నారు. ప్రజల పన్నులతో చేసే ప్రతి అభివృద్ధి పనికి ప్రజాప్రతినిధులకు ఆహ్వానం అందించాలని సూచించారు. భూమిపూజ కోసం వస్తే కొందరు గుండాలకు మద్యం తాగించి అడ్డుకునే ప్రయత్నం చేయడం తగదన్నారు. -
యోగా జీవితంలో భాగం కావాలి
గద్వాల న్యూటౌన్: ఆరోగ్యంతోపాటు శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండేందుకు యోగా దోహదం చేస్తుందని అదనపు కలెక్టర్ నర్సింగరావు అన్నారు. ప్రజాపాలన– ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న ఆరోగ్య వారోత్సవాలను పురస్కరించుకొని శుక్రవారం కలెక్టరేట్లోని గార్డెన్లో ఆయుష్ విభాగం ఆద్వర్యంలో యోగా శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి మనిషి నిత్యం యోగా చేయడాన్ని ఒక భాగం చేసుకోవాలన్నారు. భారతదేశం ప్రపంచానికి అందించిన గొప్ప కానుక యోగా అన్నారు. అనేక దేశాలు ప్రస్తుతం సాధన చేస్తుండటం మనకు గర్వకారణమన్నారు. యోగా ప్రాధాన్యతను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తూ.. ప్రజలకు అవగాహన కల్పిస్తోందని గుర్తుచేశారు. యోగా శిక్షకులు తరుచూ శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తూ, ప్రతి ఒక్కరు సాధన చేసేలా కృషి చేయాలని సూచించారు. అనంతరం పట్టణానికి చెందిన ఆరేళ్ల చిన్నారి రశ్విక చేసిన సూర్య నమస్కారాలు, యోగాసనాలు అందరినీ ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారి రాజు, డీపీఓ శ్రీకాంత్, సర్వే ఏడీ నూకరాజు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ నుషిత, డీఏఓ వీరప్ప, జిల్లా పరిశ్రమల మేనేజర్ రామలింగేశ్వర్గౌడ్, యోగా శిక్షకులు, వైద్యాధికారులు తదితరులు పాల్గొన్నారు. -
డబుల్బెడ్రూం ఇళ్లు అద్దెకిస్తే కేటాయింపు రద్దు
● ఇందిరా మహిళాశక్తి భవన నిర్మాణం త్వరగా పూర్తిచేయాలి ● కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ గద్వాల: జిల్లాకేంద్రంలోని దౌదర్పల్లి శివారులో పేదలకు అందించిన డబుల్బెడ్రూం ఇళ్లను ఇతరులకు అద్దెకిస్తే కేటాయింపు రద్దు చేస్తామని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ హెచ్చరించారు. గురువారం జిల్లాకేంద్రం శివారులో రూ. 5.7కోట్లతో నిర్మిస్తున్న ఇందిరా మహిళాశక్తి భవనంతో పాటు పక్కనే కేంద్రీయ విద్యాలయ నిర్మాణానికి ప్రతిపాదించిన స్థలాన్ని ఆయన పరిశీలించారు. అనంతరం డబుల్బెడ్రూం ఇళ్లను సందర్శించి లబ్ధిదారుల వివరాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. డబుల్బెడ్రూం ఇళ్లలో లబ్ధిదారులే నివాసం ఉండాలని.. ఇతరులకు అద్దెకు ఇవ్వరాదని తెలిపారు. ఎవరైనా అద్దెకు ఇస్తే అధికారులకు సమాచారం ఇవ్వాలని ఆయన సూచించారు. కాగా, 2026–27 విద్యా సంవత్సరంలోనే కేంద్రీయ విద్యాలయ తరగతులు ప్రారంభిస్తున్న నేపథ్యంలో పెండింగ్ పనులు త్వరగా పూర్తిచేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఇందిరా మహిళాశక్తి భవనాన్ని సైతం నిర్దేశిత సమయంలోగా పూర్తిచేయాలన్నారు. అనంతరం ప్రభుత్వ ఆస్పత్రి, మెడికల్ కళాశాల భవనాలను ఆయన కలియతిరిగారు. మెడిసిన్ విద్యార్థులతో కొంతసేపు ముచ్చటించారు. కళాశాలలో విద్యార్థులు, సిబ్బంది హాజరు నివేదికను ఎప్పటికప్పుడు నివేదించాలని ప్రిన్సిపాల్కు సూచించారు. అనంతరం క్రిటికల్ కేర్ యూనిట్ భవన నిర్మాణాన్ని పరిశీలించారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ శ్రీనివాసరావు, పీఆర్ ఈఈ ప్రభాకర్, డీఈ లక్ష్మన్న, డీఈఓ విజయలక్ష్మి, మెడికల్ కాలేజీ వైస్ప్రిన్సిపాల్ నాగేశ్వర్రావు, ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ ఇందిర, తహసీల్దార్ హరికృష్ణ త దితరులు ఉన్నారు. గద్వాల క్రైం: ఎయిడ్స్ రహిత జిల్లాగా మార్చుకోవాల్సిన ఆవశ్యకత అందరిపై ఉందని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా జిల్లా వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన ర్యాలీని ఆయన ప్రారంభించి ప్రా రంభించారు. ఎయిడ్స్ మహమ్మారి బారిన పడకుండా ప్రతి ఒక్కరూ వ్యక్తిగత ఆరోగ్య అంశాలను తెలుసుకోవాలని సూచించారు. ప్రజల్లో మార్పుతోనే మనుగడ ఉంటుందన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నర్సింగ్రావు, ఇన్చార్జి డీఎంహెచ్ఓ సంధ్యా కిరణ్మయి, జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ ఇందిర, డా.రాజు పాల్గొన్నారు. -
వైద్యసేవల్లో నిర్లక్ష్యం వహించొద్దు
మల్దకల్: ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలకు వచ్చే రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించడంలో నిర్లక్ష్యం వహించొద్దని డీఎంహెచ్ఓ డా.సంధ్యా కిరణ్మయి అన్నారు. గురువారం మల్దకల్ పీహెచ్సీలో ఆమె ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పలు రికార్డులను పరిశీలించడంతో పాటు ప్రజలకు అందిస్తున్న వైద్యసేవలపై ఆరా తీశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. గర్భిణుల ఆరోగ్య సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ వహించి, పీహెచ్సీలో ప్రసవాల సంఖ్య పెంచాలని సూచించారు. ముఖ్యంగా హెచ్ఐవీ నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. వేసవి వడదెబ్బ బారినపడే అవకాశం ఉన్నందున.. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావొద్దని ఆమె సూచించారు. ఎవరైనా వడదెబ్బకు గురైతే సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రిని సంప్రదించాలని తెలిపారు. డీఎంహెచ్ఓ వెంట పీహెచ్సీ డాక్టర్ స్వరూపరాణి, ప్రసూనరాణి, జయమ్మ, రాజు, డీపీహెచ్ఎన్ వరలక్ష్మి ఉన్నారు. -
‘ఏదుల’ ఉండగా..‘గొల్లపల్లి’ అనవసరం
● 8 నెలల్లో తుమ్మిళ్ల పూర్తి ● సాగునీటి ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేస్తున్న ప్రభుత్వం ● సరిగ్గా నెలరోజులు పనిచేస్తే 35 టీఎంసీల నీరు అందుబాటులోకి.. ● మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు ● రైతులతో దీక్ష విరమింపజేసిన బీఆర్ఎస్ నేతలు వనపర్తి/గోపాల్పేట: దశాబ్దాల పాటు ఆంధ్రా పాలకులు తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేస్తే ప్రత్యేక రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం రూ.నాలుగు వేల కోట్లతో నిర్మించి ఎనిమిది లక్షల ఎకరాలకు సాగునీరు అందించామని.. కాంగ్రెస్ పాలకులు ఏడు దశాబ్దాల కాలంలో కేవలం 25 టీఎంసీల సామర్థ్యం గల ప్రాజెక్టులను నిర్మిస్తే, కేవలం తొమ్మిదేళ్లలో 65 టీఎంసీల సామర్థ్యం గల ప్రాజెక్టులు నిర్మించిన ఘటన కేసీఆర్ సర్కార్దేనని మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు తెలిపారు. ఏదుల మండలం గొల్లపల్లి–చీర్కపల్లి రిజర్వాయర్ నిర్మాణం వద్దంటూ రైతులు 102 రోజులుగా రిలే దీక్షలు చేపడుతుండగా.. గురువారం ఆయన గ్రామానికి వచ్చి రైతుల దీక్షకు మద్దతు తెలిపి మీ వెంట మేముంటామంటూ నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. అనంతరం సమీపంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగసభకు ఆయన హాజరై మాట్లాడారు. దశాబ్దాలుగా తెలంగాణ ప్రాంతాన్ని ఎండబెట్టి మంజూరు చేసిన సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణలను ఉద్దేశపూర్వకంగా నిలిపివేసిన చరిత్ర కాంగ్రెస్దేనని ఆరోపించారు. రైతులు దీక్ష చేస్తున్నదిక్ష రాజకీయాల కోసం కాదని అధికార పార్టీ నాయకులు గుర్తించాలన్నారు. ఏడు టీఎంసీల సామర్థ్యం గల ఏదుల రిజర్వాయర్ ఉండగా.. గొల్లపల్లి రిజర్వాయర్ అవసరం లేదని 2018లోనే నాటి కేసీఆర్ ప్రభుత్వం రద్దు చేసిందని గుర్తు చేశారు. ఏదుల రిజర్వాయర్ నిర్మాణ సమయంలో కేఎల్ఐ ఆయకట్టు రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు ఓటీ (తూము) ఏర్పాటు చేసేలా సప్లిమెంటరీ డిజైన్ చేశామన్నారు. పాన్గల్, వనపర్తి, కోడేరు మండలాల రైతులకు ఉపయోగపడే రామన్నగట్టు ప్రాజెక్టును ఉద్దేశపూర్వకంగా రద్దుచేసి అవసరం లేని గొల్లపల్లి రిజర్వాయర్ను కమీషన్ల కోసం రూ.1,300 కోట్లతో నిర్మించ తలపెట్టిందని ఆరోపించారు. నల్లమల పులిని అంటూ డైలాగులు కొట్టే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పాలమూరు సాగునీటి ప్రాజెక్టులపై ఎన్నిసార్లు సమీక్షలు నిర్వహించారని ప్రశ్నించారు. ఇప్పటికే జూరాల, భీమా సాగునీటి కాాల్వల కింద యాసంగిలో క్రాప్ హాలిడేలు ప్రకటించే పరిస్థితులు ఉన్నాయని.. జూరాల వద్ద మరో ప్రాజెక్టు నిర్మాణం ఎలా సాధ్యమన్నారు. వేసవిలోనూ పంపులు నడిచేందుకు నీరుండే శ్రీశైలం ప్రాజెక్టును ఆంధ్రాకు వదిలేసి అతి తక్కువ సామర్థ్యం ఉన్న జూరాల వద్ద ప్రాజెక్టుల నిర్మాణం ఎలా చేస్తారని ప్రశ్నించారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టులో ప్రధానమైన ఏదుల, వట్టెం, ఉదండాపూర్ రిజర్వాయర్ల నిర్మాణాలు పూర్తి చేశామని.. ప్రభుత్వం దృష్టి సారించి సరిగ్గా నెలరోజులు పనిచేస్తే 35 టీఎంసీల నీరు రైతులకు అందుబాటులోకి వస్తుందని మాజీ మంత్రి వివరించారు. ఇప్పటికే మూడు సీజన్లు వృథా అయ్యాయని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రాష్ట్రంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అటకెక్కించి కేరళ ఎన్నికల ప్రచారంలో ప్రగల్భాలు పలుకుతున్నారని ఎద్దేవా చేశారు. రైతుబంధు, రుణమాఫీ, ఫీజు రీయింబర్స్మెంట్ సైతం అసమగ్రంగా అమలు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి మరోమారు ప్రజలను ఓట్లు అడిగే హక్కు లేదన్నారు. మళ్లీ కేసీఆర్ ప్రభుత్వం రావాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారని తెలిపారు. మాట్లాడుతున్న మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు వలసల జిల్లాగా పేరొందిన పాలమూరు తెలంగాణ ప్రభుత్వ హయాంలో సస్యశ్యామలమైందని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. వలసలు తగ్గించేందుకు అధికారం చేపట్టిన తొలినాళ్లలోనే కేసీఆర్ ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం చేసిందని, కుల వృత్తులకు జీవకళ వచ్చిందని తెలిపారు. కాంగ్రెస్ పాలకులు అక్రమ కేసులతో బీఆర్ఎస్ నాయకులను బెదిరింపులకు గురిచేయలేరని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ నవీన్రెడ్డి, అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు, మాజీ మంత్రి లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు అంజయ్యయాదవ్, బీరం హర్షవర్ధన్రెడ్డి, చిట్టెం రామ్మోహన్రెడ్డి, ఆల వెంకటేశ్వర్రెడ్డితో పాటు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. రైతులు వద్దన్నా.. గొల్లపల్లి–చీర్కపల్లి రిజర్వాయర్ నిర్మాణానికి ప్రభుత్వం ముందడుగు వేస్తే లగచర్ల ఘటన పునరావృతం అవుతుందని మాజీమంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి హెచ్చరించారు. వంద రోజులుగా న్యాయమైన డిమాండ్ల సాధనకు రైతులు దీక్షలు చేపడితే పట్టించుకోని కాంగ్రెస్ పాలకులు.. రైతుల దీక్ష విరమింపజేసేందుకు హరీశ్రావు వస్తున్నారనగానే ఉలిక్కిపడుతున్నారన్నారు. బాలికపై అత్యాచారయత్నం, రైతుల దీక్షలపై జిల్లా మంత్రి జూపల్లి కృష్ణారావు స్పందించకపోవడం శోచనీయమని తెలిపారు. ఏదుల రిజర్వాయర్ నిర్మాణానికి రైతులను ఒప్పించేందుకు 73 సార్లు ఈ ప్రాంతాన్ని సందర్శించానని, భూములు ఇవ్వాలంటూ రైతులను ఒప్పించేందుకు కాళ్లు మొక్కుతానని ప్రాధేయపడినట్లు చెప్పారు. -
ప్రాణాలు తీస్తున్న అప్పులు
మూడు నెలల్లో 20కి పైగా బలవన్మరణాలు ● ఆర్థిక సమస్యల భూతం బూచిగా ఘటనలు ● మృతుల్లో ప్రభుత్వ ఉద్యోగులు, యువత ● వరుస ఘటనలతో కలవరం –8లో uగద్వాల క్రైం: నలుగురిలో ప్రత్యేకతను చూపాలనే తప్పన ప్రతి ఒక్కరికీ ఉంటుంది. ఈ క్రమంలోనే ఉన్నంతలో ఒదగలేక అప్పుల కోసం పరుగులు పెట్టడం షరామామూలుగా మారింది. ఆ తర్వాత తీసుకున్న అప్పులు చెల్లించే స్థోమత లేదంటూ బలవన్మరణానికి పాల్పడుతున్న ఘటనలు జిల్లాలో నిత్యకృత్యంగా మారాయి. ఆత్మహత్యకు పాల్పడిన వ్యక్తుల్లో ప్రభుత్వ ఉపాధ్యాయుడు, వ్యాపారులు, యువత ఉండటం ఆందోళన కలిగిస్తోంది. మరికొందరు క్షణికావేశంలో బాధ్యతలు మరిచి తనువు చాలిస్తున్నారు. జిల్లాలో మూడు నెలల వ్యవధిలోనే 20 పైగా బలవన్మరణాలు చోటు చేసుకోవడం అందరినీ కలవరపెడుతోంది. బాధ్యతలు మరిచి.. ప్రతి బలవన్మరణం వెనుక ఆర్థిక అంశాలు నెలకొన్నాయి. స్థాయికి మించి అప్పులు చేయడం.. ఆపై వడ్డీలు, అసలు చెల్లించే దారిలేక తుదిశ్వాస విడిచి.. తమ కుటుంబాల్లో తీరని దుఃఖాన్ని మిగులుస్తున్నారు. సమాజంలో కొందరు ఉన్నత వ్యక్తులు, ఉపాధ్యాయులు, యువత ఒక్క రోజులోనే లక్షాధికారిగా మారిపోవాలి.. సమాజంలో తమకంటూ గుర్తింపు ఉండాలని తహాతకు మించి అప్పులు తీసుకోవడం అలవాటుగా మారింది. తీసుకున్న అప్పులకు కొన్ని నెలలు ఎలాగో వడ్డీలు చెల్లించడం చేస్తుంటారు. చివరకు అప్పులు తీర్చే క్రమంలో మరొకరితో అప్పు కోసం పాకులాడుతారు. కొత్తగా అప్పు పుట్టకపోవడం.. ముందుగా తీసుకున్న అప్పులకు వడ్డీలు చెల్లించలేక తనువు చాలిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. ప్రతి ఒక్కరిలో జీవన విధానాలపై ఆలోచన ఉండాలి. శ్రమించే తత్వంతో పాటు ఆర్థికపరమైన విషయాలపై అవగాహన పెంచుకోవాలి. ఏ వస్తువు ఎంతవరకు అవసరమో గుర్తించాలి. చెడు వ్యసనాలకు వీలైనంత వరకు దూరంగా ఉండాలి. వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టే క్రమంలో అవసరమైన సలహాలు తీసుకోవాలి. ఆర్థిక సమస్యలకు బలవన్మరణం ఒక్కటే పరిష్కారం కాదు. ఆందోళన చెందకుండా పరిష్కారం దిశగా ముందుకుసాగాలి. – శ్రీనివాసరావు, ఎస్పీ ● గద్వాల మండలం అనంతపురం గ్రామానికి చెందిన ఓ యువకుడు జిల్లా కేంద్రంలో అద్దెకు దుకాణం తీసుకొని టాటూ వేస్తూ జీవనోపాధి పొందేవాడు. ఇంటి అవసరాలు, వ్యాపారం కోసం తెలిసిన వ్యక్తులతో కొంత అప్పు తీసుకున్నాడు. ఈ క్రమంలో ఆర్థిక సమస్యలు చోటు చేసుకున్నాయి. దీంతో తీవ్ర మనస్తాపానికి గురై గత మార్చి 24న తన ఇంట్లోనే ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నూతన పోకడల దిశగా సగటు వ్యక్తి వెంపర్లాడుతున్నాడు. డబ్బులు పొదుపుగా వినియోగించాలనే ఆలోచనా దోరణి లేకపోవడం.. మార్కెట్లో హుందాగా కనిపించాలనే ఆరాటం.. లేని వాటికోసం ఇతరులతో అప్పులు తీసుకోవడం అలవాటుగా మారుతోంది. ఇదే వారిలోని పతనానికి దారితీస్తోంది. చివరకు కుటుంబ బాధ్యతలను మరిచిపోయి బలవన్మరణానికి పాల్పడుతున్నారు. జిల్లాలో తరచుగా చోటు చేసుకుంటున్న ఆత్మహత్య ఘటనలు కలవరపెడుతున్నాయి. అయిజ మండలం చిన్నతాండ్రపాడుకు చెందిన ఓ వ్యక్తి కుటుంబ అవసరాల కోసం అప్పులు చేశాడు. తిరిగి అప్పులు చెల్లించే స్థోమత లేకపోవడంతో ఈ నెల 6న పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇలా ప్రతి మరణం వెనుక ఆర్థిక అంశాలు నెలకొన్నాయి. గద్వాలకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టడంతో పాటు ఫైనాన్స్, చీటి వ్యాపారాలు చేసేవాడు. ఇందుకోసం అధిక మొత్తంలో అప్పులు చేశాడు. కొన్ని రోజుల తర్వాత వ్యాపారంలో నష్టాలు రావడంతో ఆర్థిక సమస్యలు చోటు చేసుకున్నాయి. చివరకు అప్పులు చెల్లించే స్థోమత లేకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై 2025 డిసెంబర్ 12న గడ్డి మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఒడిశాకు చెందిన ఓ యువకుడు జోవనోపాధి కోసం జిల్లా కేంద్రానికి వలస వచ్చి.. ఓ హోటల్లో సర్వర్గా పనిచేసేవాడు. అతడి వ్యక్తిగత అవసరాలు, బెట్టింగ్ కోసం స్థాయికి మించి అప్పులు చేశాడు. చివరకు అప్పులు చెల్లించే దారిలేక మనస్తాపానికి గురైన అతడు గత మార్చి 5న హోటల్ సమీపంలో అద్దెకు ఉంటున్న ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. -
మున్సిపల్ చైర్పర్సన్ వర్సెస్ కమిషనర్
రాజోళి: జోగుళాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మున్సిపాలిటీలో చైర్పర్సన్ వర్సెస్ కమిషనర్ అన్నట్టుగా ఉంది పరిస్థితి. కౌన్సిలర్లను కులం పేరుతో దూషిస్తున్నారని చైర్పర్సన్ అంటుంటే...వారితో ప్రాణహాని ఉందని కమిషనర్ అంటున్నారు. మున్సిపల్ కార్యాలయానికి వచ్చే కౌన్సిలర్లకు ప్రోటోకాల్ ప్రకారం గౌరవం ఇవ్వకపోగా.. వారిని కులం పేరుతో దూషిస్తే చూస్తూ ఊరుకోవాలా అని వడ్డేపల్లి మున్సిపల్ చైర్పర్సన్ మంజుల అన్నారు. గురువారం వడ్లేపల్లి జెడ్పీటీసీ మాజీ సభ్యుడు శ్రీనువాసులుతో కలిసి ఆమె విలేకరులతో మాట్లాడారు. కో ఆప్షన్ ఎన్నిక సందర్భంగా తాము ప్రతిపాదించిన వారి వివరాలు అందించేందుకు వెళితే.. కనీసం కూర్చునేందుకు కుర్చీలు కూడా లేవని, కో ఆప్షన్ ఎన్నిక నామినేషన్పై పలు అనుమానాలున్నాయని అడగ్గా, సక్రమంగా స్పందించ లేదన్నారు. గతంలో కమిషనర్ వసూళ్లపై ఫిర్యాదు చేశామని, వీటిని దృష్టిలో పెట్టుకొని ఆయన అక్రమ కేసులు పెడుతున్నా రని ఆరోపించారు. ఏడవ వార్డు కౌన్సిలర్ విజయ్ భాస్కర్ తనను కులం పేరుతో దూషించారని కమిషనర్ రాజయ్యపై శాంతిగనర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ విషయమై ఎస్ఐ నాగశేఖర్ రెడ్డితో మాట్లాడ గా..ఫిర్యాదు అందిందని విచారణ చేపట్టామని తెలిపారు.దాడికి యత్నించారు మున్సిపల్ కమిషనర్ రాజయ్య తనకు ప్రాణహాని ఉందని గురువారం శాంతినగర్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అంతకు ముందు ఆయన విలేకరులతో మాట్లాడుతూ వడ్డేపల్లి మున్సిపాలిటీలో రెండు నెలల క్రితం ఏఐఎఫ్బీ పార్టీ తరఫున గెలిచిన వడ్డేపల్లి శ్రీనువాసులు వర్గానికి చెందిన కౌన్సిలర్లు కొందరు మున్సిపల్ కార్యాలయానికి వచ్చి తనను బెదిరించారని ఆరోపించారు. గురువారం తాను కార్యాలయంలో ఉండగా 50 మంది తన చాంబర్లోకి దూసుకొచ్చి దాడి చేసేందుకు యత్నించారన్నారు. -
కాంగ్రెస్లో జోష్..
● కొలువుదీరిన డీసీసీ కార్యవర్గాల ప్రమాణ స్వీకారం ● టీపీసీసీ చీఫ్ మహేశ్కుమార్గౌడ్ పర్యటనతో శ్రేణుల్లో ఉత్సాహం సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్/ సాక్షి, నాగర్కర్నూల్: ఒకప్పుడు వెనుకబాటుకు గురైన పాలమూరు ప్రస్తుతం అభివృద్ధి పథంలో దూసుకెళ్తోందని, సీఎం రేవంత్రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సొంత జిల్లా అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టిసారించిందని తెలంగాణ కాంగ్రెస్ ప్రదేశ్ కమిటీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ అన్నారు. మంగళవారం ఆయన ఉమ్మడి పాలమూరులోని మహబూబ్నగర్, నాగర్కర్నూల్ జిల్లాకేంద్రాల్లో డీసీసీ నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణస్వీకార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి పాలమూరును మేటి జిల్లాగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి దృష్టికేంద్రీకరించారని చెప్పారు. ఉమ్మడి జిల్లాలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ చీఫ్ పర్యటన కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. జాతీయ హోదా కోసం పోరాటం.. ఉమ్మడి జిల్లాలో పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్ట్ను పూర్తిచేసి ఆయకట్టు రైతులకు సాగునీటితోపాటు హైదరాబాద్కు తాగునీరు అందించడం తమ ప్రభు త్వ లక్ష్యమని మహేశ్కుమార్గౌడ్ చెప్పారు. కేంద్రం ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తే ప్రాజెక్ట్ త్వరగా పూర్తవుతుందన్నారు. ఇందుకోసం కాంగ్రెస్ నిరంతరం పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. విభజన హామీల్లో జాతీయ హోదాతోపాటు చాలావరకు హామీలను కేంద్రం నెరవేర్చలేదని మండిపడ్డారు. కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, ఏఐసీసీ కార్యదర్శి సచిన్సావంత్, సీడబ్లూసీ సభ్యు డు చల్లా వంశీచంద్రెడ్డి, ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్రెడ్డి, ఎమ్మెల్యేలు కసిరెడ్డి నారాయణరెడ్డి, కూచుకుళ్ల రాజేశ్రెడ్డి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సభ్యుడు బాలాజీసింగ్ పాల్గొన్నారు. -
సీబీయూడీ యాప్ను వినియోగించాలి
గద్వాల: ఏ ప్రాంతంలోనైనా సంబంధిత శాఖలు తమ అవసరాల కోసం తవ్వకాలు జరిపే సమయంలో టెలికాం కేబుల్స్కు నష్టం వాటిల్లకుండా ముందస్తు సమాచారం ఇవ్వడమే సీబీయూడీ యాప్ ముఖ్య ఉద్దేశం అని కలెక్టర్ రిజ్వాన్బాషా షేక్ అన్నారు. ఆయా శాఖల అధికారులు సిబ్బంది కనెక్టివిటీ సమన్వయంపై దృష్టిపెట్టడమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాల మేరకు మంగళవారం కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షలో మాట్లాడారు. ప్రతి త్రైమాసికం టెలికాం కమిటీ సమావేశం నిర్వహించాలని, టెలికాం సేవలు, ఇంటర్నెట్ కనెక్టివిటీ మెరుగుదల, ఆయా విభాగాల మధ్య సమన్వయం ప్రధానమన్నారు. టెలీ కమ్యూనికేషన్ చట్టం ప్రకారం టెలికాం నెట్వర్క్కు నష్టం కలిగించే చర్యలపై కఠిన చర్యలు తీసుకుంటామని, బాధ్యులు వెంటనే సమస్యను పరిష్కరించి నివేదిక అందించాలని చెప్పారు. జిల్లాలోని మారుమూల గ్రామాల్లోనూ ఇంటర్నెట్ సదుపాయం కల్పించేందుకు ప్రతిపాదనలు రూపొందించాలన్నారు. భారత్ నెట్ ప్రగతిని సమీక్షిస్తూ చాలా పంచాయతీలకు కనెక్టివిటీ అందుబాటులో ఉందన్నారు. ముఖ్యంగా ఆశావాహ బ్లాక్గా గుర్తించిన గట్టు మండలంలోని మిగిలిన గ్రామాలకు తక్షణం కనెక్టివిటీ పూర్తి చేయాలన్నారు. ప్రభుత్వ కార్యాలయాలకు సురక్షితమైన హైస్పీడ్ ఇంటర్నెట్ అందించడానికి ఒకే విధమైన లీజు వ్యవస్థపై ఆలోచించాల్సి ఉందన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ నర్సింగ్రావు, ఏఓ భూపాల్రెడ్డి, బీఎస్ఎన్ఎల్ డీఈ లక్ష్మీకాంత్, టీఫైబర్ జోనల్ మేనేజర్ ఈశ్వర్, జిల్లా మేనేజర్ వేణు తదితరులు పాల్గొన్నారు. గద్వాల క్రైం: ఆరోగ్యవంతమైన జీవితమే అందరి లక్ష్యం కావాలని కలెక్టర్ రిజ్వాన్బాషా షేక్ అన్నారు. మంగళవారం ప్రపంచ ఆరోగ్య వారోత్సవాల నేపథ్యంలో జిల్లా ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో పాత డీఎంహెచ్ఓ కార్యాలయం నుంచి మెడికల్, నర్సింగ్ కళాశాల విద్యార్థులచే ర్యాలీని కలెక్టర్ స్థానిక ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డితో కలిసి ప్రారంభించి మాట్లాడారు. ఆరోగ్య సంరక్షణ కోసం ప్రతిఒక్కరు వ్యాయమం, యోగా, స్విమ్మింగ్ తదితర వాటిని క్రమం తప్పకుండా చేయాలన్నారు. వివిధ గ్రామాల నుంచి వైద్యసేవల కోసం వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించాలన్నారు. మనిషికి ఎంత సంపద ఉన్నా ఆరోగ్యం లేకపోతే వ్యర్థం అన్నారు. కార్యాక్రమంలో ఇన్చార్జి డీఎంహెచ్ఓ సంధ్యా కిరణ్మయి తదితరులు పాల్గొన్నారు. -
షీటీంతో మహిళలకు భరోసా : ఎస్పీ
గద్వాల క్రైం: మహిళల పట్ల ఎవరైనా అనుచిత వ్యాఖ్యలు చేసినా.. వేధింపులకు గురిచేసినా చట్టపరమైన చర్యలు తప్పవని ఎస్పీ శ్రీనివాసరావు మంగళవారం ఒక ప్రటనలో తెలిపారు. గత మార్చి నెలలో జిల్లావ్యాప్తంగా మహిళా చట్టాలపై 19 అవగాహన సదస్సులు ఏర్పాటు చేశామన్నారు. ముఖ్యంగా సామాజిక మాధ్యమాల్లో అప్రమత్తంగా ఉండాలన్నారు. వ్యక్తిగత భద్రతకు సంబంధించిన విషయాల్లో స్వీయ జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మహిళలను వేధించిన 11 మందిపై పెట్టి కేసులు నమోదు చేసి 106 హాట్స్పాట్లపై నిఘా ఉంచామన్నారు. షీటీం సమస్యలపై అందిన రెండు ఫిర్యాదులపై కేసులు నమోదు చేశామన్నారు. ఎవరైనా మహిళలపై దురుసుగా వ్యవహరించినా డయల్ 100 లేదా సెల్ నం.87126 70312కు సంప్రదించాలని సూచించారు. షీటీం మహిళలకు భరోసాగా నిలుస్తుందని పేర్కొన్నారు. పల్లీ @ రూ.7,419 గద్వాల వ్యవసాయం: జిల్లాకేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డుకు మంగళవారం 803 క్వింటాళ్ల వేరుశనగ రాగా.. గరిష్టంగా రూ.7,419, కనిష్టంగా రూ.4,217, సరాసరిగా రూ.5,889 ధరలు లభించాయి. అలాగే 402 క్వింటాళ్ల ఆముదాలు రాగా.. గరిష్టంగా రూ.6,069, కనిష్టంగా రూ.5,669, సరాసరిగా రూ.6,029 పలికాయి. 19 క్వింటాళ్ల కంది రాగా.. గరిష్టంగా రూ.6,569, కనిష్టంగా రూ.5,529, సరాసరిగా రూ.6,329 వచ్చాయి. 21 క్వింటాళ్ల వరి (సోన) రాగా.. గరిష్టంగా రూ.2,439, కనిష్టంగా రూ.1,859, సరాసరిగా రూ.2,029 చొప్పున లభించాయి. ‘చలో వరంగల్’కు తరలిరండి రాజోళి: రాష్ట్ర విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయీస్ యూనియన్ జాయింట్ కమిటీ పిలుపుమేరకు బుధవారం చేపట్టిన చలో వరంగల్ కార్యక్రమానికి తరలిరావాలని జోగుళాంబ గద్వాల జిల్లా జేఏసీ చైర్మన్ శివప్రసాద్ పిలుపునిచ్చారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సమస్యల పరిష్కారానికి దశల వారిగా ధర్నాలు, నిరసనలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ఈ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ బుధవారం ఆర్టిజన్ కార్మికులు చేపట్టే నిరవదిక సమ్మెకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. విద్యార్హతను బట్టి ఉద్యోగాలు కల్పించాలని, స్పాట్ బిల్డర్లకు జీఓ 11 ప్రకారం వేతనాలు అందించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సుధాకర్, రాముడు, అనంతరెడ్డి, సతీష్, లోకేశ్వర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. బాలభవన్లో సాంస్కృతిక వేసవి శిక్షణ శిబిరం గద్వాల న్యూటౌన్: జిల్లాకేంద్రంలోని బాలభవన్లో ఈ నెల 24 నుంచి జూన్ 2 వరకు సాంస్కృతిక వేసవి శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నట్లు సూపరింటెండెంట్ ఒక ప్రకటనలో తెలిపారు. కూచిపూడి, శాసీ్త్రయ నృత్యం, జానపద నృత్యం, గాత్ర సంగీతం, డ్రాయింగ్, వాయిద్య సంగీతం, కుట్లు, అల్లికలు తదితర అంశాల్లో శిక్షణ ఉంటుందన్నారు. 5 నుంచి 16 ఏళ్ల బాల, బాలికలు అర్హులన్నారు. సాధారణ ఫీజు రూ.50 కాగా.. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు రూ.20 మాత్రమే ఫీజు ఉంటుందని, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఫీజు మినహాయింపు ఉంటుందన్నారు. శిబిరంలో చేరే విద్యార్థులు ఆధార్, విద్యార్హత ధ్రువపత్రం, ఎస్సీ, ఎస్టీ వారు కుల ధ్రువపత్రాల జిరాక్స్తోపాటు పాస్పోర్టు సైజు ఫొటోతో దరఖాస్తు చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు సెల్ నంబర్లు 96668 53335, 94409 81190లను సంప్రదించాలని సూచించారు. పాఠశాల భవన నిర్మాణం పూర్తిచేయాలి ధరూరు: మన ఊరు– మన బడి కార్యక్రమంలో భాగంగా మండల కేంద్రంలోని కుర్వవీధి లో అర్ధంతరంగంగా ఆగిపోయిన నిర్మాణ పనులను జిల్లా విద్యాధికారి విజయలక్ష్మి పరిశీలించారు. ఈ సందర్భంగా అద్దె భవనంలో కొనసాగుతున్న పాఠశాలను పరిశీలించి విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పరిశీలించారు. ఆగిపోయిన నిర్మాణాలను పరిశీలించి విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి త్వరలో పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామని హెచ్ఎం ఆంజనేయులుకు సూ చించారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల అటెండెన్స్తోపాటు మధ్యాహ్న భోజన రిజిష్టరును తనిఖీ చేశారు. గణితంలో విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పరీక్షించారు. -
దిగుబడులు పెరగడం వల్లే..
2025– 26 ఆర్థిక సంవత్సరానికి గాను గద్వా ల, అలంపూర్ యార్డులు నిర్దేశించిన లక్ష్యానికి మించి ఆదాయం ఆర్జించా యి. వానాకాలం సీజన్ లో పంటలు ఆశించిన స్థాయిలో రాకపోయినా యాసంగిలో దిగుబడులు బాగా వచ్చాయి. గద్వాల యార్డుకు నిత్యం వేరుశనగ వస్తోంది. దీనివల్ల సెస్ బాగా వచ్చింది. అలంపూర్ యార్డుకు చెక్పోస్టులతోపాటు మిల్లులు నుంచి మంచి ఆదాయం సమకూరింది. – పుష్ప, మార్కెటింగ్ శాఖ జిల్లా అధికారి ● -
నైపుణ్యాభివృద్ధికి శిక్షణ
విద్యార్థులు చదువు పూర్తయిన వెంటనే ప్రైవేటు సెక్టార్లో, ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం ఎదురుచూడాల్సిన అవసరం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం డీట్ యాప్ను అందుబాటులోకి తీసుకువచ్చింది. విద్యార్థులు యాప్ను డౌన్లోడ్ చేసుకుని వారి పేరు, కోర్సుతో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో యాప్లో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రైవేటు కంపెనీలు యాప్లో ఇందులో రిజిస్ట్రేషన్ అయ్యి ఉండడం ద్వారా విద్యార్థి అర్హతను బట్టి ఏ ఉద్యోగం కావాలో యాప్లో పొందే అవకాశం లభిస్తుంది. ఈ క్రమంలో యాప్లో విద్యార్థులు దరఖాస్తులు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ బాలకిష్టారెడ్డి, వీసీ శ్రీనివాస్, రిజిస్ట్రార్ రమేష్బాబు ఆన్లైన్ ద్వారా సమావేశం ఏర్పాటు చేయగా.. పీయూ పరిధిలోని 80 కళాశాలల ప్రిన్సిపాళ్లు పాల్గొన్నారు. అవకాశాలు మెరుగు.. పీయూ పరిధిలో చదువుతున్న విద్యార్థులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. పీఎం ఇంటర్న్షిప్ ద్వారా కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులు నేరుగా ఇంటర్న్షిప్ చేసేందుకు వీలుపడుతుంది. ఇక రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన డీట్ యాప్ ద్వారా విద్యార్థుల చదువులు పూర్తయ్యాక వెంటనే ఉద్యోగాలు పొందేలా స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ ఇస్తున్నాం. పీయూ పరిధిలో చదువుతున్న వారిని కార్పొరేట్ సెక్టార్కు అవసరమైన విధంగా తీర్చిదిద్దుతాం. – శ్రీనివాస్, వీసీ, పీయూ విద్యార్థులకు సువర్ణావకాశం... పీయూలో తీసుకుంటున్న నిర్ణయాలతో విద్యార్థులు తమ స్కిల్స్ పెంపొందించుకోవడంతో పాటు త్వరగా ఉద్యోగాలు పొందేందుకు ఆస్కారం లభిస్తుంది. అందుకే పీయూలో ప్రభుత్వం తీసుకువచ్చిన పీఎం ఇంటర్న్షిప్తో పాటు టీసీఐఎల్ ద్వారా శిక్షణ ఇస్తున్నాం. ఇప్పటికే ఇందులో 32 వేలకు పైగా విద్యార్థులు చేరారు. పలువురు ఆన్లైన్ శిక్షణ పొందుతున్నారు. ప్రతి విద్యార్థి కూడా చదువు పూర్తయిన వెంటనే ఉద్యోగాలు పొందాలన్న లక్ష్యంతో పని చేస్తున్నాం. – రమేష్బాబు, రిజిస్ట్రార్, పీయూ మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీ పరిధిలోని విద్యార్థులు వారు చదివిన కోర్సులకు అనుగుణంగా ఉద్యోగాలు సాధించేందుకు యూనివర్సిటీ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. కళాశాల స్థాయిలో ఉన్నప్పుడే ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉద్యోగాలు సాధించేలా ఇంటర్వ్యూ, కమ్యూనికేషన్ స్కిల్స్, కాగ్నిటివ్ స్కిల్ పెంపొందించేలా పలు సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నారు. వీటితో పాటు టెక్నికల్ ఎడ్యుకేషన్, ఫార్మ, ఎంబీఏ, ఎంసీఏతో పాటు ఇతర కోర్సుల విద్యార్థులకు కళాశాల స్థాయిలోనే ఇంటర్న్షిప్కు అవకాశం కల్పించనునున్నారు. వీటి ద్వారా స్కాలర్షిప్తో పాటు విద్యార్థి అనుభవం కూడా పొందనున్నారు. డీట్ (డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్సేంజ్ తెలంగాణ) యాప్నకు సంబంధించి పీయూ పరిధిలోని వివిధ కళాశాలల ప్రిన్సిపాళ్లతో ఆన్లైన్ సమావేశం నిర్వహించగా.. హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ బాలకిష్టారెడ్డి పాల్గొన్నారు. ప్రైమినిస్టర్ ఇంటర్న్షిప్.. విద్యార్థులకు కళాశాల స్థాయిలోనే తమ వృత్తి నైపుణ్యాలను మెరుగుపర్చుకునేందుకు అధికారులు అవకాశం కల్పించారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం ప్రైమినిస్టర్ ఇంటర్న్షిప్ స్కీంను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో కళాశాల స్థాయిలో చదువుతున్న విద్యార్థులు తాము ప్రాక్టికల్గా సబ్జెక్టు, వృత్తి నైపుణ్యాలు పెంచుకునేలా ఆయా కంపెనీలు, సంస్థల్లో చేరి ఇంటర్న్షిప్ చేసేందుకు ఆస్కారం ఉంది. ఇందులో ఇంటర్న్షిప్ చేసిన వారికి రూ.6 వేల నుంచి రూ.50 వేల వరకు స్కాలర్షిప్ లభిస్తుంది. దీంతో పాటు ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్లో మార్కులు కూడా వేయనున్నారు. పేద విద్యార్థులు ఇంటర్న్షిప్ చేసి ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా చదివేందుకు ఇది దోహదపడుతుంది. ఈ స్కీం ద్వారా ఇప్పటికే పలువురు విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా వీటి ద్వారా నచ్చిన సంస్థల్లో ఇంటర్న్షిప్ చేయవచ్చు. కేంద్ర ప్రభుత్వ సంస్థతో ఒప్పందం.. విద్యార్థులకు ఇంటర్వ్యూలు, పోటీ పరీక్షలకు సిద్ధమవడంతోపాటు పలు రకాల శిక్షణ అందించేందుకు కేంద్ర ప్రభుత్వ అనుబంధ సంస్థ టీసీఐఎల్ (టెలీకమ్యూనికేషన్ కన్సల్టెన్సీ ఇండియా లిమిటెడ్)తో అధికారులు ఒప్పందం చేసుకున్నారు. దీని ద్వారా పీయూ పరిధిలోని 112 కళాశాలల్లో చదువుతున్న 32,892 మంది విద్యార్థులు ఆన్లైన్ శిక్షణ కోసం దరఖాస్తు చేసుకున్నారు. విద్యార్థి టెక్నికల్, నాన్ టెక్నికల్ వంటి వివరాలను వెబ్సైట్లో పొందుపరిస్తే వారికి అవసరమైన కోర్సులు చూపిస్తుంది. విద్యార్థి ఏ రకమైన కోర్సు కావాలో ఎంపిక చేసుకుంటే అందుకు సంబంధించి వివరాలు వస్తాయి. ఇలా విద్యార్థికి వచ్చిన స్టడీ మెటీరియల్, కంటెంట్ను పూర్తి చేయాల్సి ఉంటుంది. విద్యార్థి దీన్ని ఖాళీ సమయంలో ల్యాప్టాప్, సెల్ఫోన్లో కూడా చేయవచ్చు. పీయూ పరిధిలో చదువుతున్న విద్యార్థులకు స్కిల్స్ అందించేలా అధికారుల కసరత్తు టీసీఐఎల్తో ఒప్పందం, పోటీ పరీక్షలు ఇతర స్కిల్ డెవలప్మెంట్కు ఆన్లైన్ శిక్షణ ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న 32,892 మంది విద్యార్థులు పీఎంఐఎస్ ద్వారా ఇంటర్న్షిప్, స్కాలర్షిప్ పొందే అవకాశం డీట్ యాప్లో దరఖాస్తు చేసుకుంటే ప్రైవేటు రంగంలో ఉద్యోగాలు -
రైతులకు ఒరిజినల్ రశీదులు ఇవ్వాలి
ఎర్రవల్లి: ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు కొనుగోలు చేసిన ప్రతిరైతుకు తప్పకుండా ఒరిజినల్ రశీదు ఇవ్వాలని జిల్లా వ్యవసాయ అధికారి వీరప్ప అన్నారు. మంగళవారం మండలంలోని పుటాన్దొడ్డి రైతువేదికలో ఎరువులు, విత్తనాలు, పురుగు మందుల డీలర్లకు నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం నిషేధించిన హెచ్టీ కాటన్ విత్తనాలను డీలర్లు విక్రయించరాదన్నారు. రైతులకు యాప్ ద్వారానే యూరియాను ఎమ్మార్పీకి విక్రయించాలని సూచించారు. యూరియాను అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. ప్రతి డీలర్ స్టాక్ బుక్, బిల్లు బుక్కులు, స్టాక్ బోర్డును ప్రతిరోజు అప్డేట్ చేసుకోవాలన్నారు. ప్రభుత్వం ఇటీవల నిషేధించిన పారాక్విట్ గడ్డి మందులు ఎట్టి పరిస్థితుల్లోనూ విక్రయించరాదని, షాపుల్లో కూడా నిల్వ ఉంచరాదని సూచించారు. ప్రభుత్వ అనుమతులు ఉన్న వాటిని మాత్రమే డీలర్లు విక్రయించాలని, ప్రతినెలా 5వ తేదీ లోగా మండల వ్యవసాయ అధికారికి స్టాక్ రిపోర్టు అందజేయాలని కోరారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి లైసెన్స్ లేకుండా అక్రమంగా క్రయవిక్రయాలు జరిపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో డీఏఓ సక్రియనాయక్, ఏఓ సురేష్గౌడ్, ఏఈఓలు, డీలర్లు పాల్గొన్నారు. -
ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవం
గద్వాల: ప్రపంచంలోనే అతి పెద్ద రాజకీయ పార్టీగా బీజేపీ ఆవిర్భవించిందని జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు అన్నారు. సోమవారం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లాకేంద్రంలోని డీకే బంగ్లాలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జన్ సంఘ్ నుంచి 1980 ఏప్రిల్ 6వ తేదీన శ్యాంప్రసాద్ ముఖర్జీ, దీన్దయాల్ ఉపాధ్యాయ, అటల్ బిహారి వాజ్పేయి, లాల్కృష్ణ అద్వానీ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీగా ఆవిర్భవించిందన్నారు. మొదట ఇద్దరు ఎంపీలతో మొదలైన బీజేపీ ప్రస్తుతం మూడోసారి ప్రజల మద్దతుతో అధికారంలోకి వచ్చిందన్నారు. సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రాయాస్ అనే నినాదంతో 2047నే లక్ష్యంగా సాగుతూ ముందుకెళ్తుందన్నారు. -
బ్రిడ్జి కమ్ బరాజ్
జూరాల ఎగువ భాగాన నిర్మించేందుకు నిర్ణయం మంగళవారం శ్రీ 7 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026–8లో uజూరాల ప్రాజెక్టు ఎగువ భాగాన సుమారు 1– 2 టీఎంసీల సామర్థ్యంతో బరాజ్ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించినట్లు ప్రాథమికంగా తెలిసింది. ఈ క్రమంలోనే పాలమూరు ఇరిగేషన్ శాఖ అధికారులు సోమవారం బ్రిడ్జి కం బరాజ్ నిర్మాణం కోసం స్థలం ఎంపిక ప్రక్రియ మొదలుపెట్టినట్లు సమాచారం. వేసవిలో ఉమ్మడి జిల్లాలో తాగునీటి ఎద్దడి నెలకొనడం, తాగునీటి అవసరాల కోసం కర్ణాటకపై ఆధారపడడం, వాళ్లు ఇచ్చే 1, 2 టీఎంసీలు విడుదల చేయడం గత ఎనిమిదేళ్లుగా పరిపాటిగా మారింది. ఈ నేపథ్యంలోనే బరాజ్ నిర్మాణం చేపట్టడం వలన వేసవిలో తలెత్తే తాగునీటి సమస్యను అధిగమించవచ్చన్నది ప్రభుత్వ ఆలోచన. గద్వాల: కృష్ణాబేసిన్లో ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లోనే తొలి ప్రాజెక్టు అయిన ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ భాగాన మరో బరాజ్ నిర్మాణంతో పాటు బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని రాష్ట్ర సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఆదివారం హైదరాబాద్లో నిర్వహించిన సమావేశంలో ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా జూరాల ప్రాజెక్టుకు సంబంధించి చేపడుతున్న మరమ్మతు పనులను యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలని ఆదేశించారు. మంత్రి ఆదేశాల నేపథ్యంలో మహబూబ్నగర్ జిల్లా ఇరిగేషన్ శాఖ అధికారులు బ్రిడ్జి కమ్ బరాజ్ నిర్మాణం చేసే స్థల ఎంపిక, బ్రిడ్జి నిర్మాణం ఎన్ని కిలోమీటర్ల మేర నిర్మించాలి అనే అంశాలపై కసరత్తు మొదలుపెట్టారు. ఈ మేరకు అధికారులు సోమవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. జూరాల ప్రాజెక్టుకు సమాంతరంగా సేఫ్టీ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని ముందు నుంచి ప్రభుత్వం వద్ద ప్రతిపాదన ఉంది. అయితే గతేడాది జూలైలో ప్రాజెక్టు గేట్లు దెబ్బతిని లీకేజీలు ఏర్పడటం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన నేపథ్యంలో సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి జూరాలను సందర్శించారు. ఈ క్రమంలోనే జూరాల ప్రాజెక్టుకు సమాంతరంగా బ్రిడ్జి నిర్మాణం చేపట్టనున్నట్లు ఇందుకోసం రూ.100 కోట్ల నిధులు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. ప్రాజెక్టు సమీపంలో 900 మీటర్ల పరిధిలో దిగువ భాగాన ధరూరు మండలం చింతరేవుల, ఆత్మకూరు మండలం అమరచింతల మధ్య బ్రిడ్జి నిర్మాణం చేపట్టేలా సాగునీటి పారుదల శాఖ అధికారులు సర్వే చేశారు. ఇందుకోసం రూ.100 కోట్లపైనే వ్యయం అవుతున్నట్లు అంచనాలు రూపొందించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. అయితే బ్రిడ్జి నిర్మాణాన్ని ఆర్అండ్బీ శాఖకు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ తర్వాత బ్రిడ్జి నిర్మాణ స్థల మార్పిడి జరగడం, జూరాల సమీపంలో కాకుండా గద్వాల మండలం కొత్తపల్లి, ఆత్మకూరు జూరాల మధ్య బ్రిడ్జి నిర్మాణాన్ని చేపట్టడంతో వివాదాస్పదంగా మారింది. ఈ బ్రిడ్జి నిర్మాణానికి ఇరిగేషన్ శాఖకు చెందిన నిధులు వ్యయం చేయనున్నారు. దీంతో ఈ బ్రిడ్జి నిర్మాణానికి ఇరిగేషన్ శాఖ అనుమతులు ఇవ్వడంలో తాత్సారం జరగడం, ఎన్ఓసీ సర్టిఫికెట్ ఇవ్వడానికి వెనకంజ వేయడంతో గందరగోళంగా మారింది. స్థలం గుర్తించాలని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఆదేశాలు ఇరిగేషన్ శాఖకు నిర్మాణ పనుల అప్పగింత? తక్షణమే జూరాల గేట్లకు మరమ్మతు చేపట్టాలని సూచన స్థలం ఎంపిక, నది మధ్య నుంచి బ్రిడ్జి నిర్మాణంపై అధికారుల కసరత్తు -
నాణ్యమైన ఆహారం తీసుకోవాలి
గద్వాల క్రైం: ప్రజలు నాణ్యమైన ఆహారం తీసుకొని.. ఆరోగ్యకరమైన జీవనం అవలంబించాల ని అదనపు కలెక్టర్ నర్సింగ్రావు అన్నారు. సోమ వారం ఫుడ్ సేఫ్టీ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని పాత డీఎంహెచ్ఓ కార్యాలయం నుంచి నర్సింగ్ విద్యార్థుల ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో ఆయన పాల్గొని మాట్లా డారు. ఆహారం విషయంలో ప్రతిఒక్కరు నాణ్య త కలిగిన వంట సరుకులు కొనుగోలు చేసుకుని రుచికరమైన ఇంటి భోజనం తీసుకోవాలన్నారు. బయటి మార్కెట్లలోని హోటళ్లు, పాస్ట్ఫుడ్ సెంటర్లు, దాబాలలో కలుషిత ఆహారం తీసుకోవడం వల్ల అనారోగ్యం బారినపడాల్సి వస్తుందని హె చ్చరించారు. నాణ్యమైన వంట సరుకులు మార్కెట్లలో వినియోగదారులు కొనుగోలు చేసే క్రమంలో ప్రభుత్వం గుర్తించిన కంపెనీల దినుసులు, సరుకులు తీసుకోవాలన్నారు. కల్తీ ఆహార ధాన్యం, ఇతరత్రా సరుకుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. కల్తీ ఆహార పదార్థాలు తినడం వల్ల వివిధ రకాల రోగాలబారిన పడాల్సి వస్తుందన్నారు. కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జి డీఎంహె చ్ఓ సంధ్యాకిరణ్మయి, సిబ్బంది పాల్గొన్నారు. -
ఫిర్యాదులు పరిష్కరించని అధికారులపై చర్యలు
గద్వాల: ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులు పరిష్కరించకుండా అలసత్వం వహిస్తే కఠిన తీసుకుంటానని కలెక్టర్ రిజ్వాన్బాషా షేక్ అధికారులను హెచ్చరించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలతో 103 ఫిర్యాదులు స్వీకరించి.. సంబంధిత అధికారులకు పంపించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల సమస్యలు పరిష్కరించేందుకే ప్రతి సోమవారం ప్రజావాణి నిర్వహిస్తున్నట్లు చెప్పారు. వచ్చిన ఫిర్యాదులను నిర్ణీత కాలపరిమితిలో పరిష్కరించాలని, లేనిపక్షంలో అందుకు కారణాలు పేర్కొంటూ ఫిర్యాదుదారు నికి అక్నాలెడ్జ్మెంట్ను పంపాలన్నారు. అలాగే మండలాల్లో అధికారులు ప్రజావాణి కార్యక్రమాన్ని సక్రమంగా నిర్వహిస్తే చిన్నచిన్న సమస్యలపై ప్రజలు ఫిర్యాదు చేసేందుకు కలెక్టరేట్కు రావాల్సిన అవసరం ఉండదన్నారు. అధికార యంత్రాంగం చి త్తశుద్ధితో పనిచేస్తేనే మెరుగైన ఫలితాలు వస్తాయన్నారు. 99 రోజుల ప్రణాళికలో భాగంగా పాత ఫై ల్స్ క్లియరెన్స్, పరిశుభ్రత వంటి కార్యక్రమాలు చేపట్టాల్సి ఉన్నా కొన్ని శాఖల అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. వేసవిలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా అధికారులు అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. వసతి గృహాలను తరచుగా సందర్శించాలన్నారు. మంగళవారం నుంచి ఆరోగ్య వారోత్సవాలు నిర్వహించాలని ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు లక్ష్మీనారాయణ, నర్సింగ్రావు, ఆర్డీఓ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. హైడ్రాలిక్ లిఫ్ట్ ప్రారంభం -
అన్నీ అనుకూలిస్తే..
కొల్లాపూర్: గత కొన్నేళ్లుగా మరమ్మతుకు నోచుకోని కేఎల్ఐ మోటార్లకు ఈసారి తప్పనిసరిగా చేపట్టాలనే పట్టుదలతో అధికారులు ఉన్నారు. దశాబ్దకాలంలో ఎన్నడూ లేనంతగా ఈసారి శ్రీశైలం బ్యాక్వాటర్ మార్చి నెలలోనే భారీగా తగ్గుముఖం పట్టింది. దీంతో మోటార్ల మరమ్మతుకు ఇదే అనువైన సమయం అని నీటిపారుదల శాఖ భావిస్తోంది. అన్నీ అనుకూలిస్తే వచ్చే నెలలో మరమ్మతు చేపట్టే అవకాశం ఉందని, లేదంటే మరో ఏడాది ఆగాల్సిందేనని వారు పేర్కొంటున్నారు. నిధుల కేటాయింపు కేఎల్ఐలో పాడైన మోటార్ల మరమ్మతుకు గతేడాది ప్రభుత్వం రూ.18.80 కోట్లు మంజూరు చేసింది. ఇందులో మూడో నంబర్ మోటార్ మరమ్మతు కోసం రూ.15 కోట్లు కేటాయించగా.. ఐదో నంబర్ మోటార్కు స్పిల్ భీమ్, కాంక్రీట్ వర్క్స్, సర్జిపూల్లోకి నీళ్లు రాకుండా అడ్డుకట్ట ఏర్పాటు కోసం రూ.3.80 కోట్లు కేటాయించింది. మిషన్ భగీరథ కారణంగా.. ఉమ్మడి మహబూబ్నగర్– రంగారెడ్డి జిల్లాలకు ఎల్లూరు సమీపంలోని మిషన్ భగీరథ ద్వారా తాగునీటిని సరఫరా చేస్తున్నారు. ఈ స్కీంకు కేఎల్ఐ ప్రాజెక్టు నుంచే నీటిని ఎత్తిపోస్తున్నారు. మిషన్ భగీరథ స్కీం లేక ముందు ఎల్లూరు పంపుహౌజ్లోని మోటార్లకు వేసవిలో రెండు నెలలపాటు విరామం ఇచ్చేవారు. మిషన్ భగీరథ స్కీం వచ్చాక విరామం లేకుండా ఏడాది మొత్తం ఎల్లూరు పంప్హౌజ్ ద్వారా నీటి ఎత్తిపోతలు చేపడుతున్నారు. దీంతో పాడైన మోటార్లకు సకాలంలో మరమ్మతు చేపట్టేందుకు వీలు కావడం లేదు. బ్యాక్వాటర్ తగ్గుముఖం.. దశాబ్దకాలంలో ఎన్నడూ లేనివిధంగా ఈ ఏడాది మార్చి నెల నుంచే శ్రీశైలం బ్యాక్వాటర్ భారీగా తగ్గుతూ వస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాలు నిరంతరాయంగా విద్యుదుత్పత్తి చేపట్టడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ప్రస్తుతం శ్రీశైలం బ్యాక్ వాటర్ లెవెల్స్ 821 అడుగులుగా ఉండగా.. 805 అడుగుల వరకు కేఎల్ఐ ప్రాజెక్టు ద్వారా నీటిని ఎత్తిపోసుకునే వెసులుబాటు ఉంది. మిషన్ భగీరథ స్కీంకు నార్లాపూర్ రిజర్వాయర్లోని నీటిని మళ్లిస్తే కేఎల్ఐ ప్రాజెక్టు ద్వారా ఎత్తిపోతలకు విరామం లభిస్తుంది. ఉన్నతాధికారులు అనుమతిస్తే వచ్చే నెలలో నీటి ఎత్తిపోతలు నిలిపివేసి.. మోటార్లకు మరమ్మతు చేపట్టే యోచనలో అధికార యంత్రాంగం ఉంది. వచ్చే నెలలో కేఎల్ఐ మోటార్ల మరమ్మతుకు అధికారుల చర్యలు రూ.18.80 కోట్లు కేటాయించిన ప్రభుత్వం మరోవైపు మిషన్ భగీరథకు కొనసాగుతున్న ఎత్తిపోతలు ప్రస్తుతం 821 అడుగుల ఎత్తులోశ్రీశైలం బ్యాక్వాటర్ బ్యాక్వాటర్ భారీగా తగ్గిపోవడంతోఅనుకూలంగా భావన -
ఎల్లూరు పంపుహౌజ్లో..
కొల్లాపూర్ మండలంలోని ఎల్లూరు సమీపంలో కేఎల్ఐ ప్రాజెక్టు నిర్మించారు. ఇక్కడి నుంచే సింగోటం, జొన్నలబొగుడ, గుడిపల్లిగట్టు రిజర్వాయర్లకు నీటిని పంపింగ్ ద్వారా తరలిస్తారు. ఎల్లూరు పంప్హౌజ్లో ఐదు మోటార్లు ఏర్పాటు చేశారు. వీటిలో ఒక మోటారు 5 ఏళ్ల క్రితం, మరో మోటారు రెండేళ్ల క్రితం దెబ్బతింది. నాటినుంచి మిగిలిన మూడు మోటార్లతోనే ఎత్తిపోతలు చేపడుతున్నారు. ఒక్కో పంపు ద్వారా రోజూ 800 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తున్నారు. దీంతో వాటిపై భారం పడుతోంది. -
ఉపాధ్యాయుల చేతుల్లోనే విద్యార్థుల భవిత
రాజాపూర్(బాలానగర్): విద్యార్థుల ఆసక్తిని గుర్తించి.. వారిని ప్రోత్సహించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. సోమవారం బాలానగర్ మండలంలోని పెద్దాయపల్లి ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్లో నిర్వహించిన నేషనల్ యూత్ పార్లమెంట్ కాంపిటిషన్కు ఆమె ముఖ్య అతిథిగా హాజరై జ్యోతిప్రజ్వలన చేశారు. అనంతరం ఏర్పాటుచేసిన మాక్ పార్లమెంట్ కాంపిటిషన్ను తిలకించి విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్లో మొదటిసారిగా నేషనల్ యూత్ పార్లమెంట్ కాంపిటిషన్ నిర్వహించడం అభినందనీయమన్నారు. ఆదివాసీ, గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు మెరుగైన విద్య, సంస్కారం, జ్ఞానం అందించడానికి కేంద్ర ప్రభుత్వం ఏకలవ్య స్కూల్స్ నిర్వహిస్తుందని తెలిపారు. చట్టసభల్లో ప్రజల సమస్యలను లేవనెత్తి పరిష్కారానికి ఎలా కృషి చేయాలి.. సమాజానికి ఉపయోగపడే పాలసీలు తీసుకురావడం.. అసెంబ్లీ, పార్లమెంట్లో ఏ అంశాలపై చర్చ సాగుతుందనే అంశాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని విద్యార్థులకు సూచించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సుభాష్ శుక్లా, నోడల్ అధికారి గంగాధర్, సర్పంచ్ గాయత్రి పాల్గొన్నారు. -
గొప్ప సంఘ సంస్కర్త
గద్వాల: దివంగత ఉపప్రధాని బాబు జగ్జీవన్రామ్ గొప్ప సంఘ సంస్కర్త అని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి అన్నారు. జగ్జీవన్రామ్ జయంతి సందర్భంగా జిల్లా కేంద్రంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అణగారిన వర్గాల అభ్యునతి కోసం ఎంతో కృషి చేసిన మహనీయుడు జగ్జీవన్రామ్ అని కొనియాడారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ తుమ్మల జయలక్ష్మి, వైస్చైర్మన్ గంజిపేట శంకర్, నర్సింహులు యాదవ్, గట్టు తిమ్మప్ప, గడ్డం కృష్ణారెడ్డి, మాజీ కౌన్సిలర్ మురళి, జంబు రామన్గౌడ్ పాల్గొన్నారు. -
సిర్సనగండ్లకు పోటెత్తిన భక్తులు
చారకొండ: అపర భద్రాద్రి సిర్సనగండ్ల సీతారామచంద్రస్వామి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఆదివారం సెలవుదినం కావడంతో స్వామివారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచి భక్తులు కుటుంబ సమేతంగా తరలివచ్చి.. సీతారాముల దర్శనానికి క్యూ కట్టారు. ఈ సందర్భంగా శ్రీరామనామస్మరణ మార్మోగింది. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి.. మొక్కులు తీర్చుకున్నారు. కొండ దిగువన వంటలు చేసుకొని ఆరంగించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. సోమవారం హుండీలను లెక్కించనున్నట్లు ఆలయ చైర్మన్ రామశర్మ, ఈఓ ఆంజనేయులు తెలిపారు. -
ప్రమాదాల ముంగిట
ఉమ్మడి జిల్లాలో అగ్గి రాజుకుంటే బుగ్గిపాలే దూరభారంతో నష్టం.. ఉమ్మడి పాలమూరులో 64 మండలాలు ఉన్నాయి. ఇందులో కొన్ని మండలాల విస్తీర్ణం 100 కిలోమీటర్లకు పైగా ఉంటుంది. అలాంటి చోట్ల కనీసం ఒక ఫైర్ స్టేషన్ కూడా లేదు. కొన్ని కేంద్రాలు నాలుగైదు మండలాల్లోని గ్రామాలకు సేవలందిస్తున్నాయి. ఉదాహరణకు అచ్చంపేట ఫైర్ స్టేషన్లో ఉన్న ఫైర్ ఇంజిన్ మారుమూల ప్రాంతాలకు వెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడ చాలా మండలాల్లోని గ్రామాలకు రోడ్డు సౌకర్యం కూడా అంతంతే. ఈ లెక్కన ఫైర్ ఇంజిన్లు ఘటనా స్థలానికి చేరుకోవడానికి కనీసం గంటన్నర సమయం పడుతుంది. ఈలోగా ప్రమాదంలో ఆస్తులన్నీ కాలి బూడిదవ్వాల్సిందే. ఈ క్రమంలో ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో కొత్తగా ఫైర్ స్టేషన్లకు ప్రతిపాదనలు పంపినా ఏర్పాటు చేయడంలో అటు అధికారుల్లో, ఇటు ప్రజాప్రతినిధుల్లో చిత్తశుద్ధి కొరవడింది. మహబూబ్నగర్ క్రైం: వేసవికాలం వచ్చేసింది.. రోజురోజుకూ ఎండలు మండిపోతున్నాయి. పెరుగుతున్న వేసవితాపం అగ్ని ప్రమాదాలకు ఆజ్యంలా పనిచేస్తుంది. ఈ నేపథ్యంలో ప్రమాదాలు సంభవించే అవకాశాలు రెట్టింపు అవుతున్నాయి. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని అగ్నిమాపక కేంద్రాల నుంచి ఫైర్ ఇంజిన్లు సంఘటనా స్థలాలకు చేరుకొని ఎంతో కొంత వరకు మంటలు అదుపులోకి తెస్తున్నాయి. కానీ, కొన్ని ఫైర్స్టేషన్ల దగ్గర ఫైర్ ఇంజిన్ల పరిధి 40 కిలోమీటర్ల కంటే ఎక్కువగా ఉన్నాయి. దీనికితోడు ఉమ్మడి జిల్లాలో కొన్ని రోడ్లు సైతం అస్తవ్యస్తంగా ఉండడంతో సమయానికి ఘటనా స్థలానికి చేరుకోవడానికి కష్టంగా మారింది. జనాభా ప్రాతిపదికన చూస్తే ప్రతి 50 వేల జనాభా కోసం ప్రత్యేకంగా ఒక ఫైర్ ఇంజిన్ అందుబాటులో ఉండాలి. ఈ లెక్కన ఉమ్మడి జిల్లాలో 80 ఫైర్ ఇంజిన్లు ఉండాల్సి ఉండగా.. కేవలం 17 ఫైర్ ఇంజిన్లతోనే నెట్టుకొస్తున్నారు. ఫైర్ ఇంజిన్లు.. బుల్లెట్లు ఉమ్మడి జిల్లాలో 13 అగ్నిమాపక కేంద్రాలు ఉండగా.. రెండు కాంట్రాక్టు పద్ధతిలో నడుస్తున్నాయి. ఇందులో మహబూబ్నగర్, జడ్చర్ల, కొత్తకోట, నారాయణపేట, మక్తల్, గద్వాల, అలంపూర్, వనపర్తి, ఆత్మకూర్, కొత్తకోట, నాగర్కర్నూల్, కల్వకుర్తి, కొల్లాపూర్, అచ్చంపేట, అమ్రాబాద్లో అవుట్పోస్టు కొనసాగుతున్నాయి. ప్రతి కేంద్రానికి ఒక ఫైర్ ఇంజిన్, ఒక బుల్లెట్ ఉండగా మహబూబ్నగర్లో మాత్రం 10 వేల లీటర్లతో ఒకటి, 4,500 లీటర్లు, 2,300 లీటర్ల సామర్థ్యం కలిగిన మూడు వాహనాలు, రెండు బుల్లెట్లు ఉన్నాయి. మహబూబ్నగర్, వనపర్తి, గద్వాల, నాగర్కర్నూల్ జిల్లాల్లో ఫైర్ ఇంజిన్లతోపాటు బుల్లెట్స్ సైతం అందుబాటులో ఉన్నాయి. మహబూబ్నగర్ జిల్లాలో ఐదు, నాగర్కర్నూల్ జిల్లాలో నాలుగు నియోజకవర్గాల్లో ఐదు, గద్వాల నియోజకవర్గ వ్యాప్తంగా ఒక్కటి మాత్రమే ఉంది. అలంపూర్ నియోజకవర్గానికి ఒకటి ఏర్పాటు చేశారు. అయితే వేసవిలో అగ్నిప్రమాదాలు ఎక్కువగా సంభవించే ఆస్కారం ఉన్నందున వీటి సంఖ్య పెంచాల్సిన అవసరం ఉంది. అగ్నిమాపక కేంద్రం ఫోన్ నంబర్ మహబూబ్నగర్ 08542– 280099 గద్వాల 08546– 272299 వనపర్తి 08545– 232299 నాగర్కర్నూల్ 08540– 226299 నారాయణపేట 08546– 282401 అచ్చంపేట 08541– 272389 కొల్లాపూర్ 08501– 275164 ఆత్మకూర్ 08504– 222400 షాద్నగర్ 08548– 213744 అమ్రాబాద్ 08541– 276488 కల్వకుర్తి 08549– 200399 13 స్టేషన్ల పరిధిలో 17 ఫైర్ ఇంజిన్లు మాత్రమే.. పలు ప్రాంతాల్లో 40 కిలోమీటర్ల దూరంలో కేంద్రాలు ఘటనా స్థలానికి చేరుకోవడంలో ఆలస్యంతో తీవ్రనష్టం కొత్త కేంద్రాల ఏర్పాటుపై కొరవడిన చిత్తశుద్ధి -
చేనేత ఎన్నికలకు సన్నద్ధం
ఓటరు జాబితా తయారీకి షెడ్యూల్ విడుదల ● మే నెల 15 వరకు రూపకల్పన ● డిపాల్టర్ల ఓటుహక్కుతొలగింపునకు అవకాశం ● చనిపోయిన వారి పేర్లు తొలగించాలని జౌళిశాఖకు ఆదేశం ● ఉమ్మడి జిల్లాలో 54 సహకార సంఘాలు ఉమ్మడి జిల్లాలో ఇలా.. ఉమ్మడి జిల్లాలోని వనపర్తి, నారాయణపేట, జోగుళాంబ గద్వాల, నాగర్కర్నూల్, మహబూబ్నగర్ జిల్లాలో మొత్తం 54 చేనేత సహకార సంఘాలు ఉన్నాయి. వీటిలో కొన్ని పని చేస్తుండగా మరికొన్ని సంఘాలు అప్పుడప్పుడు పని చేస్తుండగా.. ఇంకొన్ని సంఘాలు మూతబడ్డాయని జౌళిశాఖ అధికారులు చెబుతున్నారు. ఉమ్మడి జిల్లాలో సుమారు 35 వేల మంది చేనేత కార్మికులు ఉన్నారు. అమరచింత: చేనేత సహకార సంఘాల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. మే నెల 15 వరకు ఓటరు జాబితా తయారు చేయాలని ప్రభుత్వం షెడ్యూల్ విడుదల చేయడంతో అధికార యంత్రాంగం ప్రణాళిక సిద్ధం చేస్తోంది. అయితే సంఘాల్లో అప్పులు లేని సభ్యులకే పోటీ చేసే, ఓటు వేసే హక్కు ఉంటుంది. దీంతో సహకార సంఘాల్లో ఎన్నికల సందడి మొదలైంది. 2013లో చివరిసారి.. రాష్ట్రవ్యాప్తంగా సహకార సంఘాల ఎన్నికలు చివరిసారి 2013, ఫిబ్రవరిలో జరిగాయి. వీటి పదవీ కాలం 2018లో ముగిసింది. తర్వాత మళ్లీ ఎన్నికలు జరగలేదు. తెలంగాణ ఏర్పాటు తర్వాత ప్రభుత్వం ఎనిమిది ఏళ్ల పాటు మొత్తం 16 పర్యాయాలు పాత పాలక వర్గాల పదవీ కాలన్ని పొడిగిస్తూ వచ్చింది. చివరిసారిగా గత నెల మార్చి 9 నుంచి మే నెల 10వ తేదీ వరకు పదవీ కాలం పొడిగించింది. జిల్లాలోని పలు సంఘాల్లో అక్రమాలు జరిగాయని నిర్ధారణ కావడంతో పీఏసీఎస్ చట్టం సెక్షన్ 51 కింద అధికారులను పర్సన్ ఇన్చార్జ్లుగా నియమించారు. మార్చి 24న ఉత్తర్వులు జారీ.. ఓటరు జాబితా తయారీకి గత నెల 24న చేనేత, జౌళిశాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో తయారు చేసిన ఓటరు జాబితాలను పక్కన బెట్టారు. చనిపోయిన, డిఫాల్టర్లను ఓటరు జాబితా నుంచి తొలగిస్తారు. సంఘానికి నగదు లేక వస్తు రూపంలో 90 రోజుల కంటే ఎక్కువ బకాయి ఉంటే డిఫాల్టర్గా పరిగణిస్తారు. సభ్యులు ఓటు హక్కు కలిగి ఉండాలంటే సహకార సంఘానికి ఏమైనా బకాయిలు ఉంటే ఏప్రిల్ 13లోగా చెల్లించాలని గడువు విధించారు. నారాయణపేట జోగుళాంబ గద్వాల వనపర్తి మహబూబ్నగర్ నాగర్కర్నూల్ ఓటరు జాబితా సిద్ధం చేస్తున్నాం ప్రభుత్వం ప్రకటించిన నోటిఫికేషన్ ప్రకారం చేనే త సహకార సంఘాల ఎన్ని కల నిర్వహణ ప్రక్రియ కొనసాగుతోంది. యాక్టివ్గా ఉన్న చేనేత సహకార సంఘాల్లో చనిపోయిన వారి పేర్లను ఓటరు జాబితా నుంచి తొలగించమని ఆదేశాలు జారీ చేశాం. అదేవిధంగా ఓటరు జాబితాను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించాం. తుది జాబితా ప్రకారం ఎన్నికల నోటిఫికేషన్ను ప్రభుత్వం ప్రకటిస్తుంది. – పద్మ, ఏడీ, చేనేత, జౌళిశాఖ -
అందుబాటులో ఉంటాం..
వేసవికాలం పూర్తయ్యే వరకు శాఖలో పనిచేస్తున్న సిబ్బంది, ఇతర అధికారులు ఏ ఒక్కరూ అత్యవసరం అయితే తప్ప సెలవు తీసుకోకుండా 80 శాతం మంది సిబ్బందితో పనిచేస్తాం. ప్రతి కేంద్రానికి బోరు ఉంది. జిల్లాలో నీటి వసతి బాగా ఉండటం వల్ల నీటికి ఇబ్బంది లేదు. జాతీయ రహదారి, పరిశ్రమలు, ఇతర ప్రమాదకరమైన వాటిపై ప్రత్యేకంగా దృష్టిపెట్టడం జరుగుతుంది. ఎక్కడ ప్రమాదం జరిగినా వెంటనే చేరుకోవడానికి కృషిచేస్తాం. ప్రజలు ఎక్కడ అగ్నిప్రమాదం జరిగినా వెంటనే 101, 112కు సమాచారం ఇవ్వాలి. – కిషోర్, జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి, మహబూబ్నగర్ ● -
అణగారిన వర్గాల ఆశాజ్యోతి జగ్జీవన్రామ్
గద్వాల: అణగారిన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బాబు జగ్జీవన్రామ్ అని కలెక్టర్ రిజ్వాన్బాషా షేక్ అన్నారు. ఆదివారం దివంగత ఉపప్రధాని, స్వాతంత్య్ర సమరయోధుడు బాబు జగ్జీవన్రామ్ 119వ జయంతిని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వివిధ శాఖల కేంద్రమంత్రిగా పనిచేసిన జగ్జీవన్రామ్ దేశంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు తన జీవితాంతం కృషి చేశారని కొనియాడారు. ఆయన స్ఫూర్తితో సామాజిక సమస్యల పరిష్కారానికి, అన్ని రంగాల్లో జిల్లా అభివృద్ధికి సమష్టిగా కృషి చేద్దామని పిలుపునిచ్చారు. విద్యాపరంగా వెనకబడిన జిల్లాలో విద్యార్థులు మధ్యలోనే బడి మానేసి పరిస్థితులను రూపుమాపాల్సిన అవసరం ఉందన్నారు. సెన్సెక్స్కు సంబంధించి మే మొదటి వారం నుంచి ఇళ్ల గణన చేపడుతున్నట్లు తెలిపారు. వచ్చే ఏడాది జనగణన చేసే నాటికి జిల్లా అక్షరాస్యతలో మెరుగుపడేలా అన్ని సంఘాల నాయకులు సహకరించాలని కోరారు. అదే విధంగా బాల్యవివాహాలు జరగకుండా అరికట్టాలన్నారు. ఇటీవల జిల్లాలో పోక్సో కేసులు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. చిన్నారులపై అఘాయిత్యాల నివారణకు ప్రతిఒక్కరూ కృషి చేయాలన్నారు. ఎక్కడైనా అంటరానితనం ఉన్నట్లు తెలిస్తే విజిలెన్స్ కమిటీ ద్వారా పరిశీలించి, అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తాలో అంబేడ్కర్ నూతన విగ్రహం ఏర్పాటు, అంబేడ్కర్ భవన్ నిర్మాణానికి కృషి చేస్తానన్నారు. ఇండోర్ స్టేడియం వద్ద ఉన్న సమస్యలను పరిష్కరిస్తామన్నారు. ఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. జిల్లాలో నెలకొన్న సామాజిక సమస్యలను పారద్రోలేందుకు ప్రతిఒక్కరూ కృషి చేయాలన్నారు. అంతకుముందు ప్రభుత్వ ఆస్పత్రి వద్ద వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నేతలు, ప్రజాప్రతినిధులు జగ్జీవన్రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు తమ పాటలతో అలరించారు. అదే విధంగా ఐడీఓసీ కార్యాలయంలో జగ్జీవన్రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నర్సింగ్రావు, ఆర్డీఓ శ్రీనివాసరావు, డీఎస్పీ మొగిలయ్య, ఎస్సీ సంక్షేమశాఖ జిల్లా అధికారి నుషిత, బీసీ సంక్షేమశాఖ జిల్లా అధికారి అక్బర్బాషా తదితరులు పాల్గొన్నారు. బాబు జగ్జీవన్రామ్ విగ్రహానికి నివాళులర్పిస్తున్న కలెక్టర్ రిజ్వాన్బాషా షేక్, ఎస్పీ శ్రీనివాసరావు -
నకిలీ డాక్యుమెంట్ల కేసులో కదలిక
గద్వాల క్రైం: నకిలీ డాక్యుమెంట్లతో బైక్ రిజిస్ట్రేషన్ చేసిన ఘటనపై స్థానిక రూరల్ పోలీస్స్టేషన్లో నమోదైన కేసు విచారణలో పోలీసులు వేగం పెంచారు. ఆదివారం స్థానిక మేఘనాథ ఆటో మొబైల్స్ హీరో షోరూం మేనేజర్, ఆర్టీఏ ఏజెంట్తో పాటు ఫేక్ ఫొటోతో జిల్లా రవాణాశాఖ కార్యాలయంలో బైక్ రిజిస్ట్రేషన్ చేయించిన వ్యక్తులను పోలీసులు విచారించారు. ఈ వ్యవహారంలో రెండు రోజుల క్రితం ఆర్టీఏ అధికారులతో పోలీసులు ఆరా తీశారు. అందుకు సంబంధించిన నివేదికలు, రికార్డులను సేకరించారు. వాటి ఆధారంగా పోలీసులు బైక్ కొనుగోలుదారుడి డాక్యుమెంట్లను పునఃపరిశీలించారు. ఈ నేపథ్యంలో ఫిర్యాదుదారుడి ఆధార్ కార్డును మాఫింగ్ చేసి.. తెలిసిన వ్యక్తి ఫొటోతో రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తిచేసినట్లు నిర్ధారణకు వచ్చారు. నకిలీ వ్యక్తిని ఫొటో తీయించి, రిజిస్ట్రేషన్ చేయడంలో మర్మమేమిటో తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే, బాధితుడు బైక్ కొనుగోలు చేసేందుకు సదరు షోరూంకు వెళ్లినప్పుడు రూ. 85వేల ధర చెప్పడంతో ముందుస్తుగా రూ. 20వేలు చెల్లించి బైక్ తీసుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత రిజిస్ట్రేషన్ కోసం సదరు వ్యక్తి అన్ని డాక్యుమెంట్లతో షోరూం నిర్వాహకులను సంప్రదించిన సమయంలో బైక్ విలువ రూ. 1.8లక్షలుగా పేర్కొనడం గమనార్హం. దీంతో అతడు బైక్ కొనడాన్ని విరమించుకున్నాడు. అయితే షోరూం నిర్వాహకులు మాత్రం అదే బైక్ను మరొకరి పేరుతో రిజిస్ట్రేషన్ చేయించడం అంతుచిక్కని వ్యవహారంగా మారింది. విచారణ అధికారులు పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపడితేనే అసలు విషయాలు వెలుగులోకి రానున్నాయి. విచారణకు హాజరైన షోరూం నిర్వాహకులు, ఆర్టీఏ ఏజెంట్ -
● సాగునీరు అందాలంటే.. కాపలా కాయాల్సిందే
నేడు జిల్లా అథ్లెటిక్స్ క్రీడాకారుల ఎంపికలు మహబూబ్నగర్ క్రీడలు: వరంగల్లో ఈ నెల 11, 12 తేదీల్లో జరిగే రాష్ట్రస్థాయి అంతర్ జిల్లాల ఫెడరేషన్ కప్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో పాల్గొనే జిల్లా అథ్లెటిక్స్ క్రీడాకారుల ఎంపికలను సోమవారం స్థానిక మెయిన్ స్టేడియంలో నిర్వహిస్తున్నట్లు జిల్లా అథ్లెటిక్స్ సంఘం ప్రధాన కార్యదర్శి శరత్చంద్ర ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. 20 ఏళ్లలోపు బాల, బాలికలు, పురుషులు, మహిళలకు 100 మీ., 200 మీ., 800 మీ., 1500 మీ., 3000 మీ., 5000 మీటర్ల పరుగు, షాట్పుట్, లాంగ్జంప్, జావెలిన్ త్రో అంశాల్లో ఎంపికలు ఉంటాయన్నారు. ఆసక్తిగల క్రీడాకారులు ఎస్ఎస్సీ మెమో, జనన, కుల ధ్రువపత్రాలతో మధ్యాహ్నం 2 గంటలకు రిపోర్టు చేయాలని సూచించారు. 19న హిందూ సమ్మేళనం వనపర్తిటౌన్: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ స్థాపించి వందేళ్లు పూర్తయిన సందర్భంగా ఈ నెల 19న జిల్లాకేంద్రంలో హిందూ సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు సంఘ్ జిల్లా సంపర్క్ ప్రముఖ్ అమరేందర్రెడ్డి తెలిపారు. ఆదివారం పట్టణంలో ఇందుకు సంబంధించిన కరపత్రాలు విడుదల చేసి మాట్లాడారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పోతులమడుగు సీతారామాంజనేయ ఆశ్రమ ఉత్తర పీఠాధిపతి వెంకట్చరణ్స్వామి, ముఖ్యవక్తగా తెలంగాణ ప్రాంత బౌద్ధిక్ ప్రముఖ్ కూర జయదేవ్ హాజరవుతారని చెప్పారు. హిందువులు అధికసంఖ్యలో హాజరై హిందూ సమ్మేళనాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కంచె రవి, వెంకటస్వామి, విజయ్, వరుణ్, శుభాకర్, చిన్న రాయుడు, జ్ఞానేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. – వివరాలు 8లో.. యుద్ధంతో మానవ మనుగడకు ముప్పు -
సద్వినియోగం చేసుకోండి..
108 నంబర్కు ఫోన్చేసిన 15 నిమిషాల్లో ఘటనా స్థలానికి వాహనం చేరుకొని బాధితులను దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తున్నాం.అత్యవసర పరిస్థితిలో ప్రతి ఒక్కరూ 108 వాహన సేవలను వినియోగించుకోవాలని కోరుతున్నాం. – రవి, ఉమ్మడి జిల్లా ప్రోగ్రామ్ మేనేజర్, మహబూబ్నగర్ రాష్ట్రంలో 108 వాహ నాలు విలువైన సేవలు అందిస్తున్నాయి. కొన్ని వాహనాల కాలం చెల్లిపోవడంతో మార్చాలని, అవసరమైన చోట సేవలు విస్తరించాలన్న ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు కొత్త వాహనాలు కొనుగోలు చేశాం. 108, 102 అనే హెల్ప్లైన్ సేవల నంబర్లు స్పష్టంగా కనిపించేలా ఏర్పాటు చేశాం. సీఎం రేవంత్రెడ్డి ఫొటో, తెలంగాణ ప్రభుత్వం లోగో, ఉచిత సేవ అనే పదాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అమ్మఒడి వాహనాల వెనుక భాగంలో ‘అమ్మకు ఆత్మీయతతో.. బిడ్డకు ప్రేమతో..’ అనే ట్యాగ్లైన్న్ వాహనాల పనితీరుకు అద్దం పడుతోంది. కొత్త వాహనాల రాకతో ప్రజలకు మరింత వేగంగా, విస్తృతంగా వైద్యసేవలు అందుతాయి. – వాకిటి శ్రీహరి, రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి -
‘108’కు కృతజ్ఞతలు..
మా పాపకు 2025, ఆగస్టు 20న తీవ్రమైన శ్వాస సమస్యతో బాధపడుతుండటంతో నారాయణపేట ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చి చికిత్స చేయించాం. వైద్యుల సూచన మేరకు 108 వాహనంలో మహబూబ్నగర్ ఆస్పత్రికి ప్రథమ చికిత్స అందిస్తూ సకాలంలో తీసుకురావడంతో మా పాప బతికి బయటపడింది. సకాలంలో స్పందించిన 108 సిబ్బందికి, సంస్థకు కృతజ్ఞతలు. – గోవిందు, ముస్తాపేట, దామరగిద్ద 15 ఏళ్లుగా 108 వాహనం నడుపుతున్నా. ఈ ప్రాంతంలో రాత్రిళ్లు చాలా ప్రమాదాలు జరుగుతుంటాయి. నిరంతరం విధులు నిర్వర్తిస్తూ అత్యవసర సమయంలో ఎంతో మందికి సేవలందిస్తూ వారి విలువైన ప్రాణాలు కాపాడుతున్నాం. – సి.శ్రీనివాస్, పైలట్, నారాయణపేట 108 వాహనంలో టెక్నీ షియన్గా 15 ఏళ్లుగా విధులు నిర్వర్తిస్తున్నా. రోడ్డు ప్రమాద బాధితుల్ని సకాలంలో ఆస్పత్రులకు తరలించి వారి విలువైన ప్రాణాలు కాపాడా. క్షతగాత్రులను వాహనం వరకు మోసుకొచ్చి ప్రథమ చికిత్స అందిస్తూ దగ్గరలో ఉన్న ఆస్పత్రికి తరలించిన ఘటనలు చాలానే ఉన్నాయి. – పి.రాజ్కుమార్, ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్, నారాయణపేట ● -
ప్రతి గ్రామంలో వందమంది పనిచేయాలి
మానవపాడు: జాతీయ ఉపాధి హమీ పథకం కింద ప్రతి గ్రామ పంచాయతీల్లో తప్పకుండా వందమందికిపైగా కూలీలకు కల్పించాలని అదనపు కలెక్టర్ నర్సింగరావు అన్నారు. శనివారం ఆయన మండలంలోని బోరవెల్లి, పల్లెపాడు, జల్లాపురం గ్రామాల్లో ఉపాధి పనులను పరిశీలించి మాట్లాడారు. గ్రామాల్లో ఉపాధి హామీ పనులకు ఎంత మంది వస్తున్నారు.. వేతనాలు ఎంత వస్తున్నాయి.. ఎంతమంది ఎన్ని పని దినాలు పూర్తి చేశారు అని ఆరా తీశారు. ప్రతిఒక్కరికీ పనిదినాలు కల్పించాలని ఆయా గ్రామాల సర్పంచ్లు, ఫీల్డ్ అసిస్టెంట్లకు సూచించారు. ప్రతి గ్రామంలో దాదాపు వందమంది కూలీలకు పని కల్పించాలని ఆదేశించారు. ఉపాధి హామీ పనుల్లో వేగం పెంచాలని నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయాలని చెప్పారు. పంచాయతీల్లో రికార్డులను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ రాఘవ, ఆయా గ్రామాల సర్పంచ్లు, ఫీల్ట్ అసిస్టెంట్లు, సిబ్బంది పాల్గొన్నారు. -
పనితీరు మార్చుకోకపోతే కఠిన చర్యలు
గద్వాల: ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యాధికారులు, సిబ్బంది పనితీరును మెరుగుపర్చుకోవాలని లేనిపక్షంలో కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ రిజ్వాన్బాషా షేక్ అన్నారు. శనివారం కలెక్టరేట్లో నిర్వహించిన వైద్య, ఆరోగ్యశాఖ సమీక్షలో ఆయన మాట్లాడారు. తాను ఇటీవల జిల్లాలోని పలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రభుత్వ ఆస్పత్రులన ఆకస్మికంగా సందర్శించి.. వివిధ సమస్యలను గుర్తించినట్లు చెప్పారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా పాత ఫైల్స్ క్లియరెన్స్ చేయాలన్నారు. అలాగే ఉపయోగం లేని ఫర్నీచర్ను తీసేయాలని ఆదేశించినా చాలాచోట్ల చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్యాధికారులు బాధ్యతాయుతంగా పనిచేయకున్నా.. అదేవిధంగా అనుమతి లేకుండా గైర్హాజరు అయితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అన్ని పీహెచ్సీలు, ఇతర ప్రభుత్వ ఆస్పత్రుల్లో బయోమెట్రిక్ విధానంలో హాజరు నమోదు తప్పనిసరి చేయాలన్నారు. యంత్రాల్లో ఏమైనా సమస్యలుంటే పరిష్కరించుకుని వినియోగించాలన్నారు. ఆయా ఆస్పత్రులో వివిధ రిజిస్టర్ల నిర్వహణ, వ్యాక్సినేషన్లో నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దని సూచించారు. ఆస్పత్రుల వైద్యాధికారులు తమ సమీపంలో సబ్సెంటర్లు, ఇతర క్యాంపులకు వెళ్లినప్పుడు ముందుస్తుగా రిజిస్టర్లో నమోదు చేయాలన్నారు. ఎన్సీడీ స్క్రీనింగ్తోపాటు ఇతర కార్యక్రమాలన్నీ వందశాతం విజయవంతం చేసేలా పనిచేయాలన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరగాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లా నుంచి వైద్యసేవలకు చాలామంది కర్నూలు ఆస్పత్రులకు వెళ్తున్నారని, ఈ పరిస్థితి పూర్తిగా మారాలని, ఇందుకోసం జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యసేవలు అందించాలన్నారు. అలాగే 99 రోజుల కార్యక్రమంలో భాగంగా సోమవారం నుంచి శనివారం వరకు వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహించే వివిధ కార్యక్రమాల గురించి డీఎంహెచ్ఓ కిరణ్మయి వివరించారు. -
రుణం.. వందశాతం
● 5 మండలాల్లో మినహా మిగతా చోట్ల వంద శాతానికిపైనే.. ● రుణాలతో వివిధ రకాల వ్యాపారాల యూనిట్లు ● స్వయం ఉపాధి పొందుతున్న మహిళలు ● ఆర్థిక సంవత్సరం ఆరంభం నుంచే ప్రత్యేక దృష్టి ●గద్వాల న్యూటౌన్: జిల్లాలోని స్వయం సహాయక సంఘాల మహిళలకు 2025– 26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బ్యాంకు రుణ లక్ష్యం నెరవేరింది. పట్టణ ప్రాంతాలకు సంబంధించి నాలుగు మున్సిపాలిటీల్లో వంద శాతం, గ్రామీణ ప్రాంతాల్లో ఐదు మండలాలు మినహా లక్ష్యం మేరకు రుణాలు అందించారు. డీఆర్డీఏ ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంతాల్లోని స్వయం సహాయక సంఘాల నిర్వహణ ఉంటుంది. 2025– 26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లోని స్వయం సహాయక సంఘాల రుణ లక్ష్యం 5,765 సంఘాలకు రూ.206.02 కోట్లు లక్ష్యం ఉండగా.. 2,277 సంఘాలకు రూ.218.28 కోట్లు అందించారు. బ్యాంకుల ద్వారా మంజూరు ప్రతి గ్రామంలో 10 నుంచి 15 మంది మహిళలు కలిసి స్వయం సహాయక సంఘాలుగా ఏర్పడుతారు. ఈ సంఘాల్లోని సభ్యులు ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు బ్యాంకుల ద్వారా గ్రూపు రుణాలు అందిస్తారు. బ్యాంకు ద్వారా రుణాలు పొందే మహిళలు వారు నిర్వహించుకునే వ్యాపారాలు సూచిస్తూ బ్యాంకు లింకేజీ కింద బ్యాంకులకు దరఖాస్తు చేసుకుంటారు. డోస్ల వారీగా రూ.లక్ష నుంచి రూ.20 లక్షల వరకు రుణాలు అందిస్తారు. బ్యాంకర్లు ఇచ్చిన అప్పులకు 12 నుంచి 14 శాతం వడ్డీతో తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ఇందిరా మహిళా శక్తి పథకం.. రాష్ట్ర ప్రభుత్వం 2024– 25లో ప్రతిష్టాత్మకంగా ఇందిరా మహిళా శక్తి పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం కింద బ్యాంకుల ద్వారా రుణాలు పొందిన మహిళలు వివిధ రకాల వ్యాపారాలు నిర్వహించుకునే అవకాశాన్ని కల్పించింది. 2025– 26లో వ్యక్తిగత యూనిట్లతోపాటు ప్రధానంగా ఒక సంఘంలో నలుగురు, ఐదుగురితో కలిసి గ్రూప్ యూనిట్లు నెలకొల్పేలా ప్రోత్సహించారు. ఈ పథకం కింద 2025– 26లో క్యాంటీన్లు, కిరాణాలు, టైలరింగ్, బ్యూటీపార్లర్లు, పాడి, చీరలు, స్వీట్, పచ్చళ్ల దుకాణాలు, అగర్ బత్తీలు, రోటీ మేకింగ్ సెంటర్లు తదితర వాటిని స్వయం సహాయక సంఘాల మహిళలు ఏర్పాటు చేసుకొని స్వయం ఉపాధి పొందుతున్నారు. మండలం సంఘాలు అందించిన రుణం (రూ.కోట్లలో) గద్వాల 222 25.29 ధరూర్ 266 28.20 వడ్డేపల్లి 102 12.40 ఉండవెల్లి 197 17.04 మానవపాడు 231 16.82 మల్దకల్ 254 25.47 అలంపూర్ 129 12.26 రాజోళి 127 12.49 కేటీదొడ్డి 132 13.26 అయిజ 186 17.15 గట్టు 228 19.00 ఇటిక్యాల 203 18.84 పట్టణాల పరిధిలో.. గద్వాల 245 37.39 అయిజ 103 9.92 అలంపూర్ 50 5.99 వడ్డేపల్లి 41 4.99 జిల్లాలోని పట్టణాల్లో నెరవేరిన లక్ష్యం -
దరఖాస్తుల ఆహ్వానం
గద్వాల: తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్పవర్ కంపెనీ లిమిటెడ్ సంయుక్త ఆధ్వర్యంలో మైనారిటీ నిరుద్యోగ యువతకు విదేశాలలో వివిధ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు దరఖాస్తులను ఆహ్వానిస్తున్న మైనారిటీస్ సంక్షేమ శాఖ జిల్లా అధికారి నుషిత శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆస్ట్రేలియాలో వెల్డర్, స్ప్రే పేయింటర్, ప్యానెల్ బీటర్, కారు మెకానిక్ వంటి ఉద్యోగాలతోపాటు ఓమన్లో డైరెక్టర్ ఆఫ్ స్టడీస్ అండ్ డెలివరీ చీఫ్ ప్రాజెక్టు అండ్ టెక్నికల్ ఆఫీసర్ క్లోత్ క్లీనర్, అగ్రికల్చర్ ఇంజినీర్, కొబ్బరి కోత కార్మికులు, కాంక్రీట్ 3డీ ప్రింటర్ ఆపరేటర్ పోస్టులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. అలాగే జర్మనీలో రిజిష్టర్డ్ జనరల్ నర్స్, ట్రాన్స్మిషన్ లైన్ టెక్నీషియన్ ఉద్యోగాలు, ఖతర్లో రిజిష్టర్డ్ నర్స్ (పురుషులు, మహిళలు) హౌస్కీపింగ్ వెయిటర్స్, కుక్స్, హోటల్ రిసెప్షనిస్ట్ (మహిళలు), గ్రీస్లో స్పాథెరపిస్ట్ (మహిళలు), ఎలక్ట్రీషియన్, మెయింటెనెన్స్, ప్లంబర్, లైఫ్ గార్డ్స్, గార్డెనర్స్, క్లీనర్స్, డెలివరీ బాయ్స్, ఫిషర్మెన్ ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయన్నారు. అర్హత గల మైనార్టీ అభ్యర్థులు తమ విద్యార్హత ధ్రువపత్రాలతో కలెక్టరేట్లోని రూం నం.8 మైనారిటీ సంక్షేమ శాఖ కార్యాలయంలో సమర్పించాలని కోరారు. 7న మెగా జాబ్మేళా గద్వాల: జిల్లాలో నిరుద్యోగ యువతకు వివిధ కంపెనీలలో ఉపాధి అవకాశాలు కల్పించేందుకు మంగళవారం మెగా జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి లక్ష్మి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. మంగళవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ ఎంఏఎల్డీ డిగ్రీ కాలేజీలో నిర్వహించే మేళాకు నిరుద్యోగులు అధిక సంఖ్యలో హాజరుకావాలని ఆమె కోరారు. ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవం గద్వాల: ప్రపంచంలో అత్యంత సభ్యత్వం కలిగిన పార్టీ బీజేపీ అని జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు అన్నారు. శనివారం జిల్లాకేంద్రంలో డీకే బంగ్లాలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సోమవారం బీజేపీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం ప్రతి కార్యకర్త ఇంటిపై పార్టీ జెండా ఎగురవేయాలన్నారు. అలాగే సోషల్ మీడియాలో సరళ యాప్లో అప్లోడ్ చేయాలన్నారు. సోమవారం ప్రతిబూత్ పరిధిలో 5 మంది చొప్పున జెండా ఎగరవేయాలన్నారు. ఈ నెల 14న అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకొని 13న సాయంత్రం కొవ్వొత్తులతో ర్యాలీ తీసి.. 14న ఉదయం పూలమాలతో అలంకరించి నివాళులర్పించి.. అంబేడ్కర్ జీవితం గురించి వివరిస్తామన్నారు. కార్యక్రమంలో నాయకులు శ్యాంరావు, జయశ్రీ, దాస్, అనిల్, తిరుపతిరెడ్డి, శ్రీనివాసులు, కృష్ణ, అక్బర్ తదితరులు పాల్గొన్నారు. గొల్లపల్లి రిజర్వాయర్ ప్రతిపాదన వ్యర్థం వనపర్తి: గొల్లపల్లి రిజర్వాయర్ ప్రతిపాదన వ్యర్థమని.. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం కంకణం కట్టుకుందని మాజీ మంత్రి నిరంజన్రెడ్డి ఆరోపించారు. శనివారం జిల్లాకేంద్రంలోని తన నివాసంలో విలేకర్ల సమావేశం నిర్వహించి మాట్లాడారు. రిజర్వాయర్ నిర్మాణ ప్రతిపాదన విరమించుకోవాలని 97 రోజులుగా అఖిలపక్ష పోరాట సమితి నాయకులు చేస్తున్న దీక్షకు సంఘీభావం తెలిపేందుకు ఈ నెల 9న మాజీమంత్రి హరీశ్రావు వస్తున్నారని.. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఆయన పర్యటనతో బాధిత రైతులకు తప్పకుండా న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం రావుల చంద్రశేఖర్రెడ్డి మాట్లాడుతూ.. ప్రజాపాలన, ప్రగతి ప్రణాళిక చేసేముందు ఆరు గ్యారంటీలు, 11 డిక్లరేషన్లు, 420 హామీల గురించి ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ క్యాంపు కార్యాలయంపై దాడి అమానుషం అన్నారు. -
1,997 క్వింటాళ్ల వేరుశనగ రాక
గద్వాల వ్యవసాయం: జిల్లాకేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డుకు శనివారం 1,997 క్వింటాళ్ల వేరుశనగ వచ్చింది. కాగా క్వింటాల్ గరిష్టంగా రూ.7,571, కనిష్టంగా రూ.5,470, సరాసరిగా రూ.6,659 ధరలు లభించాయి. అలాగే 363 క్వింటాళ్ల ఆముదాలు రాగా.. గరిష్టంగా రూ.6,604, కనిష్టంగా రూ.6,019, సరాసరిగా రూ.6,229 ధరలు పలికాయి. 17 క్వింటాళ్ల కంది రాగా.. గరిష్టంగా రూ.6,019, కనిష్టంగా రూ.5,909, సరాసరిగా రూ.6,011 చొప్పున వచ్చాయి. 104 క్వింటాళ్ల వరి (సోన) రాగా.. గరిష్టంగా రూ.2,310, కనిష్టంగా రూ.2,160, సరాసరిగా రూ.2,205 ధరలు లభించాయి. -
పల్లెలు కలవరింత..
కాలుష్యం కుమ్మరింత..కంపెనీల నుంచి మా పొలాల్లోకి కాలుష్యపు నీళ్లు వదులుతున్నారు. ఉన్న రెండు కుంటలూ కలుషిత నీటితో నిండి.. ఆ నీరు పంట పొలాల్లోకి చేరుతోంది. ప్రతి ఏటా తప్పనిసరిగా మారింది. ఇప్పటికే ఉన్న బోర్లన్నీ కలుషితమయ్యాయి. ఒక్క చుక్క నీరు తాగలేకపోతున్నాం. పంటలు అసలే పండడం లేదు. నష్టపరిహారం ఇప్పించాలి. – కిష్టారం మల్లేష్ గౌడ్, రైతు, రాయపల్లి మా నాయన వాళ్ల కాలంలో మేం చిన్నగా ఉన్నప్పుడు మా బావుల నీళ్లనే తాగేటోళ్లం. ఇప్పుడు బాయికాడికి వస్తే ఇంటి నుంచి ఫిల్టర్ నీటిని తెచ్చుకుని తాగాల్సిన పరిస్థితి వచ్చింది. పరిశ్రమల నుంచి వచ్చిన కలుషిత నీటిని తాగి పశువులు సచ్చిపోతున్నాయి. మా బాధలు ఎవ్వరికీ పట్టడం లేదు. చేసేది లేక వ్యవసాయం వదులుకున్నా. – పాలెం శ్రీనివాస్ రైతు మా గ్రామ శివారులో ఉన్న పరిశ్రమల కారణంగా పల్లె చెరువు కాలుష్యమైపోయింది. చెరువులో చేపలు వదిలితే చనిపోతున్నాయి. గతంలో పొల్యుషన్ బోర్డు వాళ్లు వచ్చి కళ్లారా చూశారు. ఉన్న కాలుష్యంతోనే ఇబ్బందులు పడుతుంటే పోలేపల్లి దిక్కు ఉన్న కంపెనీల నుంచి కాల్వ తీసి మా గ్రామ చెరువులోకి కలిపేందుకు చూస్తున్నారంట. దీన్ని ఎట్టిపరిస్థితిలోనూ అంగీకరించేది లేదు. అవసరమైతే ఊరోళ్లందరం కలిసి సెజ్ గేట్ ముందు ఆందోళన చేస్తాం. – దేవోళ్ల శేఖర్ గౌడ్, మాజీ ఎంపీటీసీ సభ్యుడు, ముదిరెడ్డిపల్లి పోలేపల్లి సెజ్లో 13 వరకు ఫార్మా కంపెనీలు, మరో ఎనిమిది వరకు ఇతర పరిశ్రమలు ఉన్నాయి. ప్రధానంగా పలు ఫార్మా కంపెనీల నుంచి వెలువడిన వ్యర్థ జలాలు నేరుగా చెరువులు, కుంటల్లో కలుస్తున్నాయి. భూగర్భ జలాలు సైతం కలుషితం కావడంతో జడ్చర్ల మండలంలోని పోలేపల్లి, గుండ్లగడ్డ తండా, రాజాపూర్ మండలంలోని రాయపల్లి, ముదిరెడ్డిపల్లి, నందిగామ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నీరు సాగుకు అనువుగా లేక పంటలు పండకపోవడంతో ఆర్థికంగా చితికిపోతున్నారు. బుట్టదాఖలవుతున్న ఫిర్యాదులు.. లెక్కప్రకారం పరిశ్రమల నిర్వాహకులు ఫార్మా ఉత్పత్తుల తయారీలో వెలువడిన వ్యర్థ జలాలను రీసైక్లింగ్ చేసి వదిలేయాలి. అలాంటి పరికరాలు లేకుంటే ఆ నీటిని ట్యాంకర్ల ద్వారా రీసైక్లింగ్ కేంద్రాలకు పంపించాలి. ఇవేమీ పట్టించుకోకుండా నేరుగా బయటకు వదులుతున్నారు. వర్షాకాలంలో అయితే వరద పేరిట ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. దీనిపై స్థానికులు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో వారం వారం నిర్వహించే గ్రీవెన్స్సెల్తో పాటు నెలకోసారి అయినా హైదరాబాద్లోని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులను కలిసి ఫిర్యాదు చేస్తున్నారు. అయినా ఎవరు పట్టించుకున్న దాఖలాలు లేకపోవడంతో వారి రోదన అరణ్యరోదనగా మారింది. పట్టపగలే ఓ ఫార్మా పరిశ్రమ నుంచి వెలువడుతున్న కలుషిత నీటిని ఈ దృశ్యంలో చూడవచ్చు. రసాయనాలతో రంగు మారిన నీరు నేరుగా సమీపంలోని ముదిరెడ్డిపల్లిలోని పల్లె చెరువు.. దీని గుండా పొలాల్లో చేరుతోంది. ..మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం పోలేపల్లి సెజ్లోని పరిశ్రమల నుంచి వెలువడుతున్న వాయు, జల కాలుష్యానికి ఇవి మచ్చుకు ఉదాహరణలు మాత్రమే. పలు ఫార్మా కంపెనీల నుంచి వెలువడుతున్న విష వాయులు, వ్యర్థ జలాలతో పరిసర ప్రాంతాల రైతులు, ప్రజల ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి. కలుషిత నీటిని చేలల్లోకి వదులుతుండడంతో పంటలు పండడం లేదు. చిమ్నీల నుంచి దట్టమైన పొగ ఆకాశాన్ని కప్పేస్తుండగా.. దుర్గంధంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయినా పాలక పక్షం, అధికార యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. ఈ నేపథ్యంలో బాధిత గ్రామాల దీనగాధపై ‘సాక్షి’ గ్రౌండ్ రిపోర్ట్.. – సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్గతంలో వర్షాకాలంలో వరద మాటున పలు ఫార్మా పరిశ్రమలు కలుషిత నీటిని విడుదల చేసేవి. ప్రస్తుతం ఓ కంపెనీ రసాయనాలు కలిసి రంగు మారిన వ్యర్థ జలాలను పట్టపగలే సరఫరా చేస్తోంది. ఎవరైనా ప్రశ్నిస్తే అప్పటివరకు ఊరుకోవడం.. ఆ తర్వాత యథావిధిగా మళ్లీ పంపింగ్ చేయడం సర్వసాధారణంగా మారినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా నిత్యం సదరు పరిశ్రమ నుంచి భారీస్థాయిలో దట్టమైన పొగ ఆకాశాన్ని కప్పేస్తుండడం.. భరించలేని దుర్గంధంతో పరిసరాల్లోని ఓ ప్రైవేట్ యూనివర్సిటీకి చెందిన విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనిపై విద్యార్థులు, యాజమాన్యం గతంలోనే కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. అయినా చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై పీసీబీ ఈఈ సురేష్ను ఫోన్లో సంప్రదించగా.. క్షేత్రస్థాయిలో పరిశీలిస్తామని చెప్పారు. నిబంధనలు పాటించని పరిశ్రమలపై చర్యలు తీసుకుంటామన్నారు. నిబంధనలు పట్టించుకోని ఫార్మా పరిశ్రమలు చెరువులు, చేలల్లోకి నేరుగా వ్యర్థ పంపింగ్ పంటలు పండకపోవడంతో ఆందోళనలో రైతులు వాయు కాలుష్యానికి కేరాఫ్గా మారిన పలు ఫ్యాక్టరీలు నిత్యం ఆకాశాన్ని కమ్ముకుంటున్న దట్టమైన పొగ దుర్గంధం భరించలేమంటూ స్థానికుల ఆవేదన -
సమస్యలపై రాజీలేని పోరాటం
గద్వాల: నడిగడ్డ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో 2014 సంవత్సరం నుంచి జిల్లాలోని అనేక సమస్యలపై రాజీలేని పోరాటాలు చేస్తున్నామని సమితి చైర్మన్ గొంగళ్ల రంజిత్కుమార్ అన్నారు. శువ్రవారం జిల్లాకేంద్రంలో ఆ సమితి కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. తాను 2018, 2023లో రెండుసార్లు ఎమ్మెల్యే ఎన్నికల్లో పోటీ చేసినట్లు తెలిపారు. రెండు సందర్భాల్లో కూడా ప్రజలు తనను ఆదరించారని గుర్తు చేశారు. నడిగడ్డలో కుటుంబ పాలనతో అన్నిరంగాల్లో వెనకబడిపోయిందని, ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా పరిస్థితిలో మార్పు రాలేదన్నారు. ఈ క్రమంలోనే సామాజిక తెలంగాణ నినాదంతో ఉద్యమిస్తున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నాయకత్వంలో ఆ పార్టీలో ఈ నెల 8న చేరనున్నట్లు ప్రకటించారు. సమావేశంలో నాయకులు బుచ్చిబాబు, లవన్న, వెంకట్రాములు, రంగస్వామి, గోవిందు, విష్ణు, ప్రేమ్రాజు, మునెప్ప, ఆంజనేయులు, రాము, దయాకర్, కృష్ణ, గోపాల్, లక్ష్మన్న, రామకృష్ణ, రాముడు, సర్వేష్, భూపతి తదితరులు పాల్గొన్నారు. మత్స్యరంగం అభివృద్ధికి ప్రోత్సాహం రాజాపూర్: గ్రామీణ ప్రాంత యువతకు ఆదాయ వనరులు సమకూర్చి వారికి స్వయం ఉపాధి రంగాల్లో నిలదొక్కుకునేలా చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర క్రీడలు, మత్య్సశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. శుక్రవారం బాలానగర్ మండలంలోని మొదంపల్లిలోనూతనంగా ఏర్పాటు చేసిన బయో ప్లోక్ ఫిష్ ట్యాంక్స్ను జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆధునిక వ్యవసాయ, అనుబంధ రంగాల అభివృద్ధికి కొత్త సాంకేతికతలను తీసుకొచ్చి గ్రామీణ యువతకు ప్రాత్సహించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి మాట్లాడుతూ జడ్చర్ల నియోజకవర్గ అ భివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నట్లుపేర్కొన్నారు. కొత్తగా మంజూరైన విద్యుత్ సబ్స్టేషన్ల పను లు ముమ్మరంగా సాగుతున్నాయని, అవి పూర్తయితే లోఓల్టేజి సమస్య ఉండదన్నారు. నియోజకవర్గంలో ఇప్పటికే యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్, నవోదయ పాఠశాలను బాలానగర్ మండలం పెద్దాయపల్లిలో శంకు స్థాప ్డనలు చేసినట్లు పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలనలో విద్య, వైద్యంతో పాటు వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇస్తోందన్నారు. జడ్చర్ల మున్సిపల్ చైర్పర్సన్ పుష్పలత, బాలానగర్ సర్పంచ్ వెంకటేశ్వర్రెడ్డి, నాయకులు మోహన్నాయక్, బాసునాయక్, వెంకట్రెడ్డి పాల్గొన్నారు. పెండింగ్ ప్రాజెక్టులు సత్వరమే పూర్తి చేయాలి జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): జిల్లాలోని పెండింగ్లో ఉన్న ప్రతి ప్రాజెక్ట్ను సత్వరమే పూర్తి చేయాలని తెలంగాణ జేఏసీ మాజీ చైర్మన్ రాజేందర్రెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం తన నివాసంలో ఉమ్మడి జిల్లా పెండింగ్ ప్రాజెక్టుల సత్వర పూర్తి కోసం సమాలోచన, కార్యాచరణ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తొలుత అన్ని నీటి ప్రాజెక్టులను రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా ప్రజాస్వామిక వాదులతో కలిసి పర్యటన చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఎక్కడికి అక్కడ ఆయా ప్రాజెక్టుల పరిస్థితిపై ప్రజలతో మాట్లాడాలని స్థానిక ప్రజా ప్రతినిధుల దృష్టికి సమస్యను తీసుకెళ్తామన్నారు. ఉమ్మడి జిల్లా నుంచి ముఖ్యమంత్రి ఉన్న సమయంలో కూడా జిల్లా పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి కాకపోతే మహబూబ్నగర్ జిల్లా శాశ్వత వెనుకబాటు తనంలో మిగిలిపోతుంది అని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్యల పరిష్కారం కోసం జిల్లా ప్రజలు, రైతులు, ప్రజాప్రతినిధులు, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాలు తమ సమావేశాలలో తీర్మానం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈనెలలోనే ప్రాజెక్టుల సందర్శన చేపడతామని తెలిపారు. జిల్లా ప్రయోజనం కోసం చేపట్టిన కార్యక్రమాలుగా గుర్తించి సహకారం అందించాలని కోరారు. పాలమూరు అధ్యయన వేదిక ఉమ్మడి జిల్లా కన్వీనర్ ఎం.రాఘవాచారి, న్యాయవాదులు వీరబ్రహ్మచారి, బి.జనార్దన్, పరమేశ్వర్, మధుసూదన్బాబు, రిటైర్డ్ తహసీల్దార్ చెన్నకిష్టన్న, నాయకులు టీజీ శ్రీనివాస్, వెంకట్రెడ్డి పాల్గొన్నారు. -
దొడ్డి కొమురయ్య పోరాట స్ఫూర్తి ఆదర్శప్రాయం
గద్వాల: తెలంగాణ సాయుధ పోరాటంలో కీలక పాత్ర పోషించిన గొప్ప పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య అని బీసీ సంక్షేమశాఖ అధికారి అక్బర్పాషా అన్నారు. శుక్రవారం బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో దొడ్డి కొమురయ్య 99వ జయంతి కార్యక్రమాన్ని కలెక్టరేట్లో అధికారికంగా నిర్వహించారు. ముందుగా కొమురయ్య చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అణచివేతలకు వ్యతిరేకంగా ప్రజల హక్కుల కోసం ప్రాణత్యాగం చేసిన తొలి అమరుడిగా ఆయన చరిత్రలో నిలిచారని కొనియాడారు. కొమురయ్య చూపిన ధైర్యం, త్యాగం, పోరాట స్ఫూర్తి నేటి యువతకు మార్గదర్శకం అన్నారు. ప్రజల హక్కులు, సమానత్వం కోసం ఆయన చేసిన త్యాగాలను స్మరించుకుంటూ ఆయన ఆశయాలను ఆచరణలో పెట్టడం ద్వారానే నిజమైన నివాళి అర్పించిన వారమవుతామన్నారు. సమాజంలో న్యాయం, సమానత్వం నెలకొల్పేందుకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కలెక్టరేట్ ఉద్యోగులు, బీసీ సంఘం నాయకులు పాల్గొన్నారు. -
గ్రామాల అభివృద్ధికి సమష్టిగా కృషిచేయాలి
గద్వాల: జిల్లాలో గ్రామాల అభివృద్ధికి ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు సమష్టిగా కృషిచేయాలని కలెక్టర్ రిజ్వాన్బాషా షేక్ అన్నారు. ప్రజాపాలన– ప్రగతి ప్రణాళికలో భాగంగా గురువారం మండలంలోని చెనుగోనిపల్లిలో నిర్వహించిన గ్రామసభలో పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ రకాల సంక్షేమాభివృద్ధి పథకాలను ప్రజలకు వివరించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అల్పాహారం, ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాలను ప్రవేశపెడుతుందన్నారు. అదేవిధంగా బాల్యవివాహాలు, ఇతర సామాజిక సమస్యలపై ప్రతిఒక్కరు స్పందించి వాటి నిర్మూలనకు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో డీపీఓ శ్రీకాంత్, మండల ప్రత్యేకాధికారి నూకరాజు, డీఎల్పీఓ ప్రవీణ్కుమార్రెడ్డి, తహసీల్దార్ హరికృష్ణ, ఎంపీడీఓ చంద్రకళ, హౌసింగ్ డీఈ కాశీనాథ్ పాల్గొన్నారు. -
కనులపండువగా ఆదిశిలావాసుడి కల్యాణం
మల్దకల్: ఆదిశిలా క్షేత్రంలోని స్వయంభూ లక్ష్మీవేంకటేశ్వరస్వామి కల్యాణోత్సవం గురువారం వేదపండితుల మంత్రోచ్ఛరణాల మధ్య కనులపండువగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేదపండితులు రమేషాచారి, మధుసూదనాచారి, రవిచారి, శశాంక్ స్వామివారి ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు చేశారు. అదేవిధంగా మహా హోమం నిర్వహించి స్వామివారి ఉత్సవమూర్తులకు కల్యాణం జరిపించారు. ఈ వేడుకను తిలకించేందుకు భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ప్రహ్లాదరావు, చంద్రశేఖర్రావు, దీరేంద్రదాసు పాల్గొన్నారు. విద్యాశాఖ ఉద్యోగులపై కలెక్టర్ కొరడా గద్వాల: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ముఖ గుర్తింపు విధానం (ఎఫ్ఆర్ఎస్) సక్రమంగా నిర్వహించకపోవడంపై కలెక్టర్ రిజ్వాన్బాషా షేక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు గురువారం విద్యాశాఖలోని 76 మంది ఉపాధ్యాయులు, సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీచేశారు. జిల్లావ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో అమలవుతున్న ఫేషియ ల్ రికగ్నిషన్ సిస్టం హాజరు నమోదుపై సమగ్రంగా పరిశీలించారు. ఈ సందర్భంగా చాలా పాఠశాలల్లో ఉపాధ్యాయులు, సిబ్బంది సక్రమంగా ఎఫ్ఆర్ఎస్ విధానం చేయకపోవడాన్ని గుర్తించారు. దీంతో 61 ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 76 మంది ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీ చేశా రు. మూడురోజుల్లో సరైన సంజాయిషీ ఇవ్వా లని ఆదేశించారు. ఇకపై అందరూ ఎఫ్ఆర్ఎస్ విధానాన్ని తప్పకుండా పాటించాలని,సమయ పాలన తప్పనిసరి అన్నారు. భవిష్యత్లో ఇదే తరహాలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్య లు తప్పవని హెచ్చరించారు. విద్యా వ్యవస్థను బలోపేతం చేయడంలో ప్రతిఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు. సమయపాలన పాటించాలి ధరూరు: జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు సమయపాలన కచ్చితంగా పాటించాలని డీఈఓ విజయలక్ష్మి అన్నారు. గురువారం ఆమె మండలంలోని చెన్నారెడ్డిపల్లి ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి.. రికార్డులు, విద్యార్థుల హాజరు తదితర రిజిష్టర్లను పరిశీలించారు. మిడ్లైన్, బేస్ లైన్, ఎండ్ లైన్, ఎఫ్ల్ఎన్ల తీరుపై ఆరాతీశారు. అలాగే విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనం అమలు తీరు గురించి తెలుసుకున్నా రు. మెనూ ప్రకారం భోజనం పెట్టాలని, వంటలు రుచితో పాటు శుచి, శుభ్రతగా ఉండాల ని వంట ఏజెన్సీ వారిని ఆదేశించారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడుతూ విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేశారు. బాగా చదివి ప్రయోజకులు కా వాలని విద్యార్థులకు సూచించారు. ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఉచితంగా పాఠ్య పుస్తకాలతోపాటు యూనిఫాం, మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నిష్ణాతులైన ఉపాధ్యాయులు ఉంటారని, పేరెంట్స్ తమ పిల్లలను ప్రభుత్వ పా ఠశాలల్లోనే చదివించాలని కోరారు. వచ్చే వి ద్యా సంవత్సరం మండలంలోని అన్ని పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య మరింత పెరిగేలా ఉపాధ్యాయులు కృషిచేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో హెచ్ఎం రాజేంద్రప్రసాద్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ఆర్టిజన్ల సమస్యలు పరిష్కరించాలిజెడ్పీసెంటర్(మహబూబ్నగర్): తమ న్యాయమైన డిమాండ్ల సాధించే దాక పోరాటాన్ని కొనసాగిస్తామని ఆర్టిజన్ జేఏసీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు జాకీర్ అన్నారు. ఆర్టిజన్ జేఏసీ ఆధ్వర్యంలో మంగళవారం విద్యుత్ భవన్ ఎదుట వంటావార్పు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్టిజన్ జేఏసీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు జాకీర్ మాట్లాడుతూ.. విద్యార్హతల ఆధారంగా ఆర్టిజన్ ఉద్యోగుల కన్వర్షన్ చేయాలని కోరారు. ఆర్టిజన్లకు ఏపీఎస్ఈబీ సర్వీస్ రూల్స్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. విద్యుత్ సంస్థల్లో 2016 డిసెంబర్ 4వ తేదీ కంటే ముందు అన్ని అర్హతలుండి పనిచేస్తూ ఇప్పటికీ ఔట్ సోర్సింగ్ కాంట్రాక్టు కార్మికులుగా కొనసాగుతున్న వారిని ఆర్టిజన్గా గుర్తించాలన్నారు. -
వీరహనుమాన్.. శోభాయాత్ర
జిల్లావ్యాప్తంగా హనుమంతుడి జయంతి వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. రాత్రి 7 గంటల ప్రాంతంలో జిల్లాకేంద్రంలో చేపట్టిన హనుమాన్ శోభాయాత్ర అంగరంగ వైభవంగా సాగింది. భజరంగ్దళ్, విశ్వహిందూ పరిషత్, ధర్మ ప్రసార సమితి, నాయకులతోపాటు హనుమాన్ దీక్షాపరులతో గద్వాల పట్టణం కాషాయం రంగును సంతరించుకుంది. స్థానిక కోట వద్ద నుంచి ప్రధాన రోడ్డు మార్గాలైన వైఎస్సార్ సర్కిల్, కూరగాయల మార్కెట్ రోడ్డు, పాత ఎస్బీహెచ్, కిష్టారెడ్డి బంగ్లా, రాజవీధి, గాంధీచౌక్ల మీదుగా అత్యంత భక్తిశ్రద్ధలతో ర్యాలీ సాగింది. రామలక్ష్మణ జానకి.. జైబోలో హనుమాన్కి’ అని నినదిస్తూ.. బాణసంచా కాలుస్తూ యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. డప్పులు, డీజేలతో యువకులు నృత్యాలు చేశారు. కార్యక్రమంలో ఆయా పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు పెద్దఎత్తున పాల్గొన్నారు. – గద్వాల న్యూటౌన్ -
బిగుస్తున్న ఉచ్చు
గద్వాల క్రైం: ఏం చేసిన అడిగేవారు లేరనే ధీమాతో ప్రభుత్వ ఉద్యోగులు.. ఏ తప్పుడు డాక్యుమెంట్లు తీసుకొచ్చినా రిజిస్ట్రేషన్ చేయిస్తామని చెప్పే ఏజెంట్ల వ్యవహారంపై పోలీసులు విచారణ చేపట్టారు. జోగుళాంబ గద్వాల జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో మూడు రోజుల క్రితం వెలుగులోకి వచ్చిన ఓ వ్యక్తి ఫేక్ ఫొటోతో బైక్ రిజిస్ట్రేషన్ ఘటనపై తాజాగా రూరల్ పోలీసులు బాధితుడు కృష్ణ ఫిర్యాదు మేరకు మేఘనాథ ఆటో మొబైల్స్ షోరూం మేనేజర్ ఏవీ నర్సింహులుతోపాటు మరికొంతమందిపై కేసు నమోదు చేశారు. ఈ సంఘటన జిల్లాలో హాట్టాపిక్గా మారింది. అయితే ఈ వ్యవహారంపై రూరల్ ఎస్ఐ శ్రీకాంత్ గురువారం రవాణా శాఖ కార్యాలయంలోని ఫేక్ వ్యక్తి ఫొటోతో రిజిస్ట్రేషన్ చేసిన ఉద్యోగులను విచారించారు. ఈ క్రమంలో బైక్ రిజిస్ట్రేషన్కు వచ్చిన వ్యక్తి ఎవరు..? అందుకు సమర్పించిన డాక్యూమెంట్లు ఏవి..? ఏజెంట్గా వ్యవహరించిన వ్యక్తులు..? షోరూం మేనేజర్ పాత్ర తదితర విషయాలపై కూపీ లాగినట్లు సమాచారం. మరోవైపు ‘సాక్షి’ పత్రికలో ‘ఏజెంట్ల లీలలెన్నో’ కథనం ప్రచురణ కావడంతో ప్రజల నుంచి ఉద్యోగుల పనితీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎక్కువ మొత్తంలో వసూళ్లు జిల్లాలోని పలు వాహనాల షోరూం డీలర్లు కొనుగోలుదారులను వివిధ షరతులతో ఎక్స్షోరూం ధరల కంటే ఎక్కువ మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఏళ్ల తరబడి రవాణా కార్యాలయంలోని అధికారులతో ఏర్పడిన పరిచయాలతోపాటు ఏజెంట్లుగా వ్యవహరిస్తున్న వ్యక్తుల ద్వారా వాహనాల రిజిస్ట్రేషన్కు ఫైల్స్ కార్యాలయంకు తీసుకెళ్లడం కొనుగోలు చేసిన వ్యక్తుల ద్వారా రిజిస్ట్రేషన్కు పిలవడం సర్వ సాధారణంగా మారింది. ఈ తరుణంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఎలాంటి ఆంక్షలు లేకుండా రిజిస్ట్రేషన్ చేసే తంతు కొనసాగుతుంది. ముందుస్తుగా చేసుకున్న ఒప్పందం మేరకు కొనుగోలు చేసిన వ్యక్తి డాక్యుమెంట్లు పరిశీలించే సాహసం చేయడం లేదని తెలుస్తుంది. 2023లో నకిలీ ఇన్సూరెన్స్ వ్యవహారంలోనూ ఏజెంట్లు జైలుకు వెళ్లగా.. అధికారులు మాత్రం తప్పించుకున్న విషయం తెలిసిందే. తాజాగా జరిగిన ఫేక్ రిజిస్ట్రేషన్ వ్యవహారంలో అధికారులపై కేసులు నమోదయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇప్పటికే రవాణా శాఖ అధికారులకు మెమోలు సైతం జారీ చేశారు. పోలీసులు సైతం విచారణ చేపట్టడంతో అధికారుల మెడకు ఉచ్చు బిగిస్తుందని సమాచారం. షోరూం నిర్వాహకులు ఫేక్ వ్యక్తి ఫొటోతో రిజిస్ట్రేషన్ చేయడంపై బాధితుడు ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టాం. అయితే ఈ వ్యవహారంలో షోరూం మేనేజర్తోపాటు మరి కొంతమందిపై కేసు నమోదు చేశాం. ప్రస్తుతం విచారణ దశలో ఉంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియపై రవాణా శాఖ సిబ్బందిని విచారించాం. మరి కొందరిని విచారించాల్సి ఉంది. త్వరలో పూర్తి వివరాలు వెల్లడిస్తాం. – శ్రీకాంత్, రూరల్ ఎస్ఐ, గద్వాల ఫేక్ వ్యక్తి ఫొటోతో బైక్ రిజిస్ట్రేషన్ చేసిన ఉద్యోగులు రెండు రోజుల క్రితమే షోరూం నిర్వాహకులతో రాజీ చేయించి మంగళవారం రాత్రి మరొకరి పేరిట బదలాయింపు రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేపట్టారు. ఈ విషయం తెలుసుకున్న మీడియా బృందం అధికారుల తీరును ప్రశ్నించడంతో రిజిస్ట్రేషన్ ప్రక్రియకు బ్రేకులు పడ్డాయి. అధికారులు చేసిన తప్పిదం నుంచి బయట పడేందుకు సర్దుబాటు చర్యలు చేపట్టడంతో వారిలో భయం మొదలైందని చెప్పవచ్చు. రిజిస్ట్రేషన్ ప్రక్రియకు ముందుగా ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే చేసిన తప్పును చీకట్లో చేయాలని అధికారులు వేసిన మాస్టర్ ప్లాన్ ఫెయిల్ కావడం కొసమెరుపు. జిల్లా రవాణా శాఖ కార్యాలయం సమీపంలో చాలమంది ఆర్టీఏ ఏజెంట్లుగా కార్యాలయాలు ఏర్పాటు చేసుకున్న సమూదాయాలపై ఆరా తీస్తున్నారు. రోజుకు ఎలాంటి రిజిస్ట్రేషన్ పనులు చేస్తున్నారు.. అందుకు వాహన యజమానులతో ఎంత ఫీజు వసూలు చేస్తారు.. అధికారులతో ఉన్న సంబంధాలు, ఫైల్స్కు ఇస్తున్న ఫీజులపై కూపీలాగారు. కార్యాలయాలు ఏర్పాటు చేసుకున్న ఏజెంట్లు చెల్లిస్తున్న అద్దె వివరాలను సైతం పోలీసులు తెలుసుకున్నారు. -
ఆత్మగౌరవానికి ప్రతీక పాపన్నగౌడ్
గద్వాల: ఆత్మగౌరవం, ధైర్య సాహసాలకు సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ ప్రతీకగా నిలుస్తారని అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ అన్నారు. గురువారం సర్వాయి పాపన్నగౌడ్ వర్ధంతిని కలెక్టరేట్లో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాపన్నగౌడ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గోల్కొండ కుతుబ్షాహీ పాలకులు ప్రజలపై అనేక రకాల పన్నులు విధిస్తూ వేధింపులకు పాల్పడటాన్ని వ్యతిరేకిస్తూ ఎదిరించి పోరాటాలు చేశారన్నారు. యుద్ధ విద్యలు నేర్చుకుని ప్రత్యేకంగా సైన్యాన్ని సమకూర్చుకుని పలుచోట్ల కోటలను వశం చేసుకున్నారు. సామాన్య వ్యక్తి నుంచి రాజ్యాలను స్థాపించి పరిపాలన సాగించిన గొప్పవీరుడు పాపన్నగౌడ్ అన్నారు. కార్యక్రమంలో కలెక్టరేట్ ఏఓ భూపాల్రెడ్డి, రాములు, నాయకులు అచ్చన్నగౌడ్, రామన్గౌడ్, హరిప్రసాద్గౌడ్, నందకిషోర్గౌడ్ రాజశేఖర్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
వసతి గృహం సందర్శన
ధరూరు: మండల కేంద్రంలోని బీసీ బాలుర వసతి గృహాన్ని జిల్లా వెనుకడిన తరగతుల అభివృద్ది అధికారి అక్బర్ పాష గురువారం సాయంత్రం 7 గంటలకు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా హాస్టల్లోని వంట గది, స్టోర్ రూంను పరిశీలించారు. అలాగే బాత్రూం, హాస్టల్ పరిసరాలను పరిశీలించి.. విద్యార్థుల కోసం వండిన భోజనాన్ని రుచి చూశారు. పరీక్షలకు బాగా ప్రిపేర్ కావాలని, మంచి మార్కులతో పాస్ అయితే ఉన్నత చదువులకు ఉపయోగపడుతుందని విద్యార్థులకు సూచించారు. కార్యక్రమంలో హాస్టల్ వార్డెన్ నర్సింహులు, సిబ్బంది పాల్గొన్నారు. -
ఏజెంట్ల లీలలెన్నో..!
●గద్వాల క్రైం: జిల్లా రవాణాశాఖలో ఏ పని కావాలన్నా ఓ ఏజెంట్ (దళారీ) సహాయం తప్పనిసరి. వారి ద్వారానే పనులన్నీ ఠక్కున పూర్తవుతాయి. అవసరమైతే నకిలీ పత్రాలతోనూ కానిచేస్తారు. గతంలో నకిలీ ఇన్సూరెన్స్ పత్రాలతో వాహనాల రిజిస్ట్రేషన్లు సైతం జరిగాయి. తాజాగా వాహనం కొనుగోలు చేయని ఓ వ్యక్తి పేరిట రిజిస్ట్రేషన్ చేసి మరో ఘనతను సొంతం చేసుకున్నారు. జిల్లా రవాణాశాఖ కార్యాలయ సిబ్బంది చేతివాటం ధాటికి ఏజెంట్లు సైతం తమ దందాను పూర్తిస్థాయిలో అమలుచేస్తున్నారు. సదరు కార్యాలయం చుట్టూ దాదాపు 100 మంది ఏజెంట్లు తిష్ట వేశారు. నిత్యం వివిధ వాహనాల రిజిస్ట్రేషన్, డ్రైవింగ్ లైసెన్స్, ఫిట్నెస్, వాహన బదలాయింపు, పర్మిట్లు తదితర 59కి పైగా సేవల్లో మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్నారు. ఆయా సేవలు పొందేందుకు వచ్చే వారితో ఓ రేటు కట్టి వసూలు చేస్తున్నారు. ఎవరైనా వాహనదారుడు ఏజెంట్ లేకుండా వెళ్లినప్పుడు అధికారులకు రూల్స్ అన్నీ గుర్తుకొస్తాయి. కార్యాలయ సిబ్బంది సవాలక్ష ప్రశ్నలు సందిస్తూ.. ఏజెంట్ ద్వారానే పనులు చేసుకునేలా వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. తాజాగా మరో బాగోతం.. కేటీదొడ్డి మండలానికి చెందిన ఓ వ్యక్తి గతేడాది మార్చి 31న జిల్లా కేంద్రంలోని హీరో హోండా షోరూంలో బైక్ కొనుగోలు కోసం వెళ్లాడు. ఆ సమయంలో బైక్ ధర రూ. 85వేలుగా చెప్పడంతో కొంత చెల్లించి, అవసరమైన ధ్రువపత్రాలు అందించాడు. తీరా రిజిస్ట్రేషన్ సమయంలో వాహనం ఖరీదు రూ.1.8 లక్షలుగా పేర్కొనడంతో సదరు వ్యక్తి నిరాకరించాడు. తాను చెల్లించిన డబ్బులు ఇవ్వాల్సిందిగా షోరూం నిర్వాహకులకు తేల్చిచెప్పాడు. షోరూం నిర్వాహకులు మాత్రం డబ్బులు ఇవ్వకుండా పంపించేశారు. ఆ తర్వాత అతడి డాక్యుమెంట్లతో మరొకరి పేరుతో ఆ బైక్ రిజిస్ట్రేషన్ అయింది. ఈ విషయాన్ని గుర్తించిన సదరు వ్యక్తి కలెక్టర్కు ఫిర్యాదు చేయడంతో విచారణ చేపట్టగా.. ఆర్టీఓ కార్యాలయ సిబ్బంది బాగోతం వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారంలో జిల్లా రవాణాశాఖ కార్యాలయంలో పనిచేసే ముగ్గురికి మెమోలు జారీ చేశారు. చర్యలు శూన్యం.. ప్రైవేటు బస్సులు, కార్లు, లారీలు, ఇతర గూడ్స్ వాహనాల ఫిట్నెస్ పరీక్షల సమయంలో ఇన్సూరెన్స్ తప్పనిసరిగా ఉండాలి. అయితే 2023 ఏప్రిల్లో ఆర్టీఏ ఏజెంట్లు కొందరు నకిలీ ఇన్సూరెన్స్ పత్రాలతో పలు వాహనాలకు ఫిట్నెస్ పరీక్షలు చేయించారు. అయితే ఓ వాహనాదారుడు ఇన్సూరెన్స్ కై ్లమ్ చేయించుకునేందుకు వెళ్లిన సమయంలో సదరు కంపెనీ నిర్వాహకులు నకిలీదిగా స్పష్టం చేశారు. ఈ ఘటనపై ఉండవెల్లి పోలీస్టేషన్లో కేసు నమోదైంది. జిల్లా కేంద్రానికి చెందిన 16 మంది ఏజెంట్లను పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. అయితే రవాణాశాఖ అధికారులపై మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. సిబ్బందిపై దురుసు ప్రవర్తన.. జిల్లా రవాణాశాఖ కార్యాలయంలో గతేడాది సెప్టెంబర్ 20న ఓ గూడ్స్ వాహనం ఫిట్నెస్ పరీక్షల కోసం ఏజెంట్ సహాయంతో కార్యాలయానికి వచ్చింది. ఈ క్రమంలో తనిఖీ చేయాల్సిన అధికారి జాప్యం చేయడంతో సదరు ఏజెంట్ వాగ్వాదానికి దిగాడు. రెండు రోజుల తర్వాత మరో ఏజెంట్, అధికారి మధ్య వివాదం చోటు చేసుకుంది. దీన్ని బట్టి చూస్తే ఏజెంట్లు అధికారులకు మామూళ్లు ముట్టజెప్పడమే కాకుండా దురుసుగా ప్రవర్తిస్తూ తమ పనులు చేయించుకుంటున్నారని స్పష్టమవుతోంది. ఆర్టీఓ కార్యాలయంలో దళారీ వ్యవస్థ నిబంధనల మేరకు వాహనదారులు ప్రభుత్వ ఫీజు మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. అయితే బైక్ డ్రైవింగ్ కోసం ఏజెంట్ను ఆశ్రయిస్తే రూ. 2,500, కారు లైసెన్స్ కోసం రూ. 5,400 వరకు వసూలు చేస్తున్నారు. ఇక ట్రాక్టర్ల రిజిస్ట్రేషన్లో మరో విధమైన మోసం చేస్తున్నారు. కమర్షియల్ బోర్డు నుంచి నాన్ అగ్రికల్చర్ (వైట్ బోర్డు)కు మార్చేందుకు అధికారులు వివిధ సాకులు చెబుతూ.. అందిన కాడికి దండుకుంటున్నారు. లారీలు, బస్సులు ఫిటెనెస్ పరీక్షల కోసం వెళ్తే తనిఖీలు చేయాల్సిన అధికారులు రూ. 2వేల నుంచి రూ. 4వేలు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వాహనాన్ని మరొకరి పేరుపై బదలాయించేందుకు కూడా అధికంగా చెల్లించాల్సిందేనని వాహనదారులు వాపోతున్నారు. గతంలో నకిలీ ఇన్సూరెన్స్ పత్రాలతో రిజిస్ట్రేషన్లు తాజాగా ఇతర వ్యక్తి ఫొటోతో వాహన రిజిస్ట్రేషన్ లైసెన్స్ మొదలుకొని తనిఖీల వరకు వసూలు అవినీతికి అడ్డాగా జిల్లా రవాణాశాఖ కార్యాలయం జిల్లా రవాణాశాఖ కార్యాలయంలో వాహనాల రిజిస్ట్రేషన్ లేదా ఫిట్నెస్ తనిఖీ చేసిన అధికారికి ఓ రేటు.. ధ్రువపత్రాలను ఆన్లైన్లో నమోదు చేసే అధికారికి మరో రేటు, ఫొటో దించే అధికారికి ఓ రేటు, డాక్యుమెంట్లు పునఃపరిశీలించిన అధికారికి ఓ రేటు ఇలా వివిధ స్థాయిలో ముట్టజెప్పాల్సిందే. వాస్తవంగా కార్యాలయం వెలుపలికి వాహనాదారులు, వివిధ సేవలు పొందే వారు మాత్రమే వెళ్లాల్సి ఉంటుంది. కానీ కార్యాలయం మొత్తం ఏజెంట్లతో ఉండటం గమనార్హం. -
నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు
అయిజ: డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్ఓ స్వామికుమార్ హెచ్చరించారు. బుధవారం మండల కేంద్రంలోని టీ స్టాళ్లు, హోటళ్లలో ఆయన ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పలు హోటళ్లలో డొమెస్టిక్ సిలిండర్లను వినియోగిస్తున్న ఏడుగురిపై కేసులు నమోదు చేయడంతో పాటు సిలిండర్లను సీజ్ చేశారు. జిల్లాలో గ్యాస్ సిలిండర్ల కొరత లేదని.. నిబంధనల మేరకు బుక్ చేసుకున్న వినియోగదారులకు సిలిండర్లు పంపిణీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. వంటగ్యాస్ వినియోగదారులు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని సూచించారు. డిజిటల్ క్రాప్ సర్వే త్వరగా పూర్తిచేయాలి అలంపూర్ రూరల్: యాసంగిలో రైతులు సాగుచేసిన పంటల వివరాలను పక్కాగా నమోదు చేసేందుకు గాను చేపట్టిన డిజిటల్ క్రాప్ సర్వేను త్వరగా పూర్తిచేయాలని జిల్లా వ్యవసాయశాఖ అధికారి వీరప్ప అన్నారు. బుధవారం మండలంలోని గొందిమల్లలో వ్యవసాయశాఖ సిబ్బంది నిర్వహిస్తున్న డిజిటల్ క్రాప్ సర్వేను ఆయన పరిశీలించి.. పలు సూచనలు చేశారు. వలంటీర్లు క్షేత్రస్థాయిలో పంటలను సందర్శించి.. పూర్తి వివరాలు నమోదు చేయాలని సూచించారు. ఈ సర్వే ఆధారంగానే యాసంగి ధాన్యం సేకరణ కోసం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. డీఏఓ ఏఓ నాగార్జున్రెడ్డి, ఏఈఓ శిరీష ఉన్నారు. డీలర్ల నియామకానికి నోటిఫికేషన్ అలంపూర్: జిల్లాలోని చౌకధరల దుకాణ డీలర్ల నియామకానికి నోటిఫికేషన్ జారీ చేసినట్లు ఆర్డీఓ శ్రీనివాసరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అలంపూర్ (2602009), క్యాతూర్ (2601021), ఉండవెల్లి మండలం బొంకూరు (2611010), మానవపాడు మండలం చండూరు (2609014), నారాయణాపూర్ (2609015), అయిజ మండలం జడదొడ్డి (2605030), కూటకనూరు (2605038), అయిజ (2605046), రాజోళి మండలం పడమటిగార్లపాడు (2610001), పచ్చర్ల (2610020), వడ్డేపల్లి మండలం పైపాడు (2612006), ఎరవ్రల్లి మండలం వల్లూరు (2613001), రాజశ్రీ గార్లపాడు (2613006), ఇటిక్యాల మండలం మొగిలిరావులచెరువు గ్రామాల్లో ఎఫ్పీఎస్ డీలర్ పోస్టుల ఖాళీలను భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాలు, అర్హత, రిజర్వేషన్ నిబంధనల ప్రకారం స్థానికులు ఈ నెల 15వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని కోరా రు. పూర్తి వివరాలకు తహసీల్దార్ కార్యాలయా ల్లో సంప్రదించాలని ఆయన సూచించారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలిఇటిక్యాల: అన్ని ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో వైద్యులు, సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉంటూ.. మెరుగైన సేవలు అందించాలని రాష్ట్ర పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డా.రవీంద్ర నాయక్ అన్నారు. బుధవారం ఇటిక్యాల పీహెచ్సీలో ఆయన ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పలు రికార్డులను పరిశీలించడంతో పాటు రోగులతో మాట్లాడి వైద్యసేవలపై ఆరా తీశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పీహెచ్పీలో ఓపీ, ప్రసవాల సంఖ్య పెంచే దిశగా చర్యలు చేపట్టాలని సిబ్బందికి సూచించారు. ప్రభుత్వం చేపట్టే ఆరోగ్య కార్యక్రమాలను గ్రామాల్లో వందశాతం పూర్తిచేయాలన్నారు. జాతీయ ఆరోగ్య పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా చూడాలన్నారు. ముఖ్యంగా సిబ్బంది సమయపాలన పాటిస్తూ.. రోగులకు ప్రత్యేక శ్రద్ధతో సేవలు అందించాలని సూచించారు. జిల్లాకు కేటాయించిన లక్ష్యాలను పూర్తిస్థాయిలో సాధించి.. రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచేలా ప్రతి ఒక్కరూ కృషిచేయాలన్నారు. డీఎంహెచ్ఓ సంధ్యాకిరణ్మయి, డిప్యూటీ డీఎంహెచ్ఓ సిద్ధప్ప, మండల వైద్యాధికారి డా.రాధిక, ప్రోగ్రాం అధికారులు రాజు, అజ్గర్అలీ ఉన్నారు. -
ఇందిరమ్మ ఇళ్ల పనుల్లో వేగం పెంచండి
● లబ్ధిదారులకు ఇసుక కొరత లేకుండా చర్యలు ● కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అలంపూర్: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల్లో వేగం పెంచి.. త్వరగా పూర్తిచేయాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. మంగళవారం అలంపూర్ మున్సిపాలిటీలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను ఆయన పరిశీలించి.. లబ్ధిదారుల సమస్యలను తెలుసుకున్నారు. సకాలంలో ఇళ్ల నిర్మాణం పూర్తిచేసుకోవాలని.. లబ్ధిదారులకు అన్ని విధాలుగా సహకారం అందిస్తామని ఆయన భరోసా ఇచ్చారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇసుక కొరత లేకుండా చూడాలన్నారు. ప్రభుత్వ నిబంధనల మేరకు ఇసుక సరఫరా చేయాలని ఆదేశించారు. అంతకుముందు తహసీల్దార్ కార్యాలయంలోని రికార్డు గది, ఇతర విభాగాలను కలెక్టర్ పరిశీలించారు. తమకు పెండింగ్లో ఉన్న వేతనాలను ఇప్పించాలని మున్సిపల్ కార్మికులు కోరగా.. ఆయన సానుకూలంగా స్పందించారు. అదే విధంగా పట్టణంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను తనిఖీ చేశారు. ఫార్మసీ, ఎక్స్రే, డయాలసిస్ యూనిట్, ఇతర విభాగాలను పరిశీలించి.. ప్రజలకు అందిస్తున్న వైద్యసేవలపై ఆరా తీశారు. ఆస్పత్రిలో ఓపీ సంఖ్య పెంచాలని వైద్యులకు సూచించారు. సబ్ సెంటర్స్ నుంచి రోగులను రెఫర్ చేయాల్సి వస్తే ప్రభుత్వ ఆస్పత్రులకే పంపించేలా ఆదేశాలు జారీ చేయాలన్నారు. ఆస్పత్రిలో అనవసరమైన ఫర్నిచర్ తొలగించాలని సూచించారు. అనంతరం జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయాలను కలెక్టర్ సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అర్చక స్వాములు ప్రసాదం అందజేసి, శేషవస్త్రాలతో సత్కరించారు. ఆలయ ప్రాంగణంలో మొక్కలు నాటి పచ్చదనానికి ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు సూచించారు. కలెక్టర్ వెంట మండల ప్రత్యేకాధికారిణి విమల, తహసీల్దార్ ప్రభాకర్, ఎంపీడీఓ పద్మావతి, మున్సిపల్ కమిషనర్ శంకర్ తదితరులు ఉన్నారు. గద్వాల: ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గురువారం నిర్వహించే గ్రామ, వార్డుసభల్లో ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించాలని కలెక్టర్ రిజ్వాన్బాషా షేక్ సూచించారు. జిల్లాలోని అన్ని మండలాల ప్రత్యేకాధికారులు, మున్సిపల్ కమిషనర్లతో నిర్వహించిన జూమ్ మీటింగ్లో ఆయన మాట్లాడుతూ.. షెడ్యూల్ ప్రకారం గ్రామ, వార్డు సభలను ఉదయం 9గంటలకే ప్రారంభించాలన్నారు. సభలకు వచ్చే ప్రజాప్రతినిధులు, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. సభలో లైన్ డిపార్ట్మెంట్ సిబ్బంది, మహిళా సంఘాల సభ్యులు స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు పాల్గొనేలా చూడాలన్నారు. ఇప్పటికే అమలుచేస్తున్న వివిధ ప్రభుత్వ పథకాలతో పాటు ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన పథకాలను ప్రజలకు వివరించడంతో పాటు ఆయా పథకాల వారీగా లబ్ధిదారుల వివరాలను వెల్లడించాలని తెలిపారు. బాల్యవివాహాలు వంటి సామాజిక సమస్యలపై కూడా చర్చించాలన్నారు. ప్రజలు ఏమైనా సమస్యలను తెలియజేస్తే, వాటిని నోట్ చేసుకుని పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు. వేసవిలో ఎక్కడా తాగునీటి సమస్య తలెత్తకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని ఆయన ఆదేశించారు. దాతల సహకారంతో చలివేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల్లో పనిచేస్తున్న మల్టీపర్పస్ కార్మికులు పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ చేసుకునేలా సంబంధిత అధికారులు ప్రోత్సహించాలన్నారు. 99 రోజుల కార్యక్రమంలో భాగంగా పెండింగ్ ఫైల్స్ క్లియరెన్స్, పరిశుభ్రత వంటివి చేపట్టాలన్నారు. జనగణనకు సంబంధించి ప్రభుత్వ విధి విధానాల ప్రకారం ముందుకెళ్లాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ నర్సింగ్రావు, డీపీఓ శ్రీకాంత్ ఉన్నారు. -
కేంద్రం దృష్టికి తీసుకెళ్తా..
నాగర్కర్నూల్ పార్లమెంట్ పరిధిలో రైల్వే కనెక్టివిటీని మెరుగుపరిచేందుకు కొత్త రైల్వే లైన్ల ఆవశ్యకత ఎంతో ఉంది. పార్లమెంట్ సమావేశాల్లో రైల్వేలైన్ల గురించి అడగగా రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ డోర్నకల్– గద్వాల కొత్త రైల్వే లైన్ సర్వే పూర్తయినట్లు చెప్పారు. అలాగే జడ్చర్ల– నంద్యాల మార్గం సర్వే కూడా పూర్తయిందని, కానీ ఈ మార్గంలో ట్రాఫిక్ అంచనాలు తక్కువగా ఉన్నాయనే అభిప్రాయం వెల్లడించారు. ఈ రెండు లైన్ల ఏర్పాటుకు కృషి చేస్తా. అలాగే హైదరాబాద్– శ్రీశైలం రైలు మార్గం ఏర్పాటు గురించి కేంద్రం దృష్టికి తీసుకెళ్తా. ●– మల్లు రవి, ఎంపీ, నాగర్కర్నూల్ -
1981లో బీజం.. మార్పులతో ఆమోదం
నాగర్కర్నూల్వనపర్తిగద్వాలగతంలో ప్రతిపాదించిన మాచర్ల– గద్వాల రైల్వేలైన్ రూట్ మ్యాప్ను మార్చారు. తాజాగా గద్వాల– డోర్నకల్ రైల్ మార్గం సర్వే పూర్తి చేసింది. ఈ రైల్వేలైన్లో 296 కిలోమీటర్లు తెలంగాణ జిల్లాలోనే ఉంది. రాయచూర్, గద్వాల– మాచర్ల (గుంటూరు జిల్లా) రైల్వే లైన్ ప్రతిపాదన నిజాం కాలం నుంచి కొనసాగుతుంది. ఇందుకోసం మూడు సార్లు సర్వే సైతం చేశారు. రాయచూరు– మాచర్ల రైలు మార్గం ఆవశ్యకతను వివరిస్తూ.. 1981లో అప్పటి ఎంపీ మల్లు అనంతరాములు కేంద్రానికి ప్రతిపాదించారు. అప్పట్లో 184.2 కి.మీ., రైల్వేలైన్ కోసం రూ.919 కోట్ల నిధులు కేటాయించారు. 2002లో రాయచూర్– గద్వాల రైలు మార్గానికి శంకుస్థాపన చేయగా చివరికి గద్వాలకే పరిమితమైంది. మరుగున పడిపోయిన రైల్వే అంశం 2007లో అప్పటి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి డీపీఆర్ను మరోసారి కేంద్రానికి పంపించారు. 2015లో కేంద్రం సర్వేకు రూ.20 కోట్లు కేటాయించింది. పీపీసీ మోడ్లో (పబ్లిక్, ప్రైవేట్ పార్టిసిపేషన్) కొత్త లైన్ను చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించినా.. సగం, సగం నిధులు ఖర్చు చేసే విషయం తేలకపోవడంతో రైల్వేలైన్కు అడుగులు పడలేదు. ఇప్పుడు అలైన్మెంట్ మార్చి సర్వే పూర్తికావడంతో కొత్తలైన్ ఏర్పాటుపై ఆశలు చిగురిస్తున్నాయి. -
శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు
గద్వాల క్రైం: శాంతిభద్రతల విషయంలో పోలీసు అధికారులు అప్రమత్తంగా ఉంటూ.. అనుమానాస్పద కేసుల విచారణ వేగంగా చేపట్టాలని ఎస్పీ శ్రీనివాసరావు ఆదేశించారు. మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నేర సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గుడ్ఫ్రైడే, హనుమాన్ జయంతి ఉత్సవాల సందర్భంగా ఎలాంటి అల్లర్లు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లావ్యాప్తంగా పెట్రోలింగ్, గస్తీని ముమ్మరం చేయాలన్నారు. వివిధ పోలీస్స్టేషన్లలో నమోదైన కేసులు, సమస్యలపై వచ్చే బాధితులకు న్యాయం అందేలా చూడాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం విలేజ్ రోడ్డు సేఫ్టీ కమిటీలను ఏర్పాటుచేయాలని సిబ్బందిని ఆదేశించారు. హిట్ అండ్ రన్ కేసులపై ప్రత్యేకంగా విచారణ చేపట్టాలన్నారు. అనుమతి లేకుండా ఇసుక, మట్టి, రేషన్ బియ్యం రవాణాతో పాటు నిషేధిత మత్తు పదార్థాలు, గంజాయి, పేకాట వంటి వాటిని కట్టడి చేయాలన్నారు. సరిహద్దు ప్రాంతంలో పటిష్ట నిఘా ఉంచాలని తెలిపారు. స్టేషన్లో నమోదైన కేసుల విషయంలో నిర్లక్ష్యం లేకుండా వీలైనంత త్వరగా కోర్టులో చార్జీషీట్ దాఖలు చేసి.. నేరస్తులకు శిక్ష పడేలా అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామాల్లో అల్లర్లకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరించాలని తెలిపారు. సమావేశంలో ఏఎస్పీ శంకర్, సీఐలు టాటాబాబు, శ్రీను, ప్రదీప్కుమార్, ఎస్ఐలు, శ్రీకాంత్, శేఖర్, శ్రీహరి, నందికర్ తదితరులు ఉన్నారు. -
సలేశ్వర క్షేత్రం
కుంచోని మూలచివరి పాయింట్ కార్లు, బైక్ వాహనాల పార్కింగ్ ఆర్టీసీ బస్ పార్కింగ్ షికార్నగర్ ఆటో రూట్ మన్ననూర్టికెట్ కౌంటర్ మెయిన్ ఎంట్రెన్స్కాలినడక ఏరియా కురియాల జంక్షన్ పుల్లాయిపల్లిరాంపూర్పెంట మోకాల కుర్వ చెప్పుల కుర్వ -
బినామీల హవా!
భద్రత ప్రశ్నార్థకం.. జిల్లాలోని చాలా సబ్స్టేషన్లలో అసలు ఉద్యోగులకు బదులు బినామీలు పనిచేస్తున్నారు. అయితే విద్యుత్ సబ్స్టేషన్లలో అనుకోకుండా ప్రమాదాలు సంభవిస్తే పరిస్థితి ఏమిటనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. గతంలో వడ్డేపల్లి సబ్స్టేషన్ షార్ట్ సర్క్యూట్తో పూర్తిగా దగ్ధమైంది. ఆ తర్వాత కూడా చాలా వరకు విద్యుత్ సమస్యలు తలెత్తాయి. వాస్తవంగా రిస్క్ తీసుకుని పనిచేసే వారిని ఆపరేటర్లుగా నియమించాల్సిన అధికారులు.. జీతం తప్ప తమకేం సంబంధం లేదనే ఏపీకి చెందిన రిటైర్డ్ ఉద్యోగులను నియమించడంపై ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి.. బినామీల తతంగంపై స్పందించాలని ప్రజలు కోరుతున్నారు. విద్యుత్ సబ్స్టేషన్లలో ఆపరేటర్లుగా ఏపీ రిటైర్డ్ ఉద్యోగులు రాజోళి: నిత్యం ఎంతో అప్రమత్తంగా విధులు నిర్వర్తించాల్సిన విద్యుత్ సబ్స్టేషన్లలో బినామీల జోరు సాగుతోంది. సబ్స్టేషన్లలో ఆపరేటర్లుగా నియమించిన స్థానికేతరులు తమ బినామీలతో పనులు చేయిస్తున్నా.. అధికారులు తమకేమీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. జిల్లాలోని రాజోళి మండలం పచ్చర్ల, వడ్డేపల్లి మండలం జూలకల్, మానవపాడు మండలం కలుకుంట్ల, అయిజ మండలం మేడికొండ, ఉప్పల తదితర ప్రాంతాల్లో లోఓల్టేజీ సమస్య తీర్చేందుకు ప్రభుత్వం కొత్తగా 33/11 కేవీ సబ్స్టేషన్లు అందుబాటులోకి తీసుకొచ్చింది. సబ్స్టేషన్ ఆపరేటర్లుగా పనిచేసేందుకు ఎవరూ ఆసక్తి చూపకపోవడంతో రిటైర్డ్ ఉద్యోగులను విధుల్లోకి తీసుకున్నారు. వారు మాత్రం తమ స్థానాల్లో ఇతరులతో పనులు చేయిస్తూ.. వచ్చే జీతంలో కొంత మొత్తం వారికి చెల్లిస్తున్నారు. వారు మాత్రం ఇంట్లోనే ఉంటూ హాజరు వేసుకుంటున్నారు. ఈ తతంగమంతా అధికారులకు తెలిసే జరుగుతోందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఏపీకి చెందిన వారే అధికం.. కొత్త సబ్స్టేషన్లల్లో పనిచేస్తున్న ఆపరేటర్లలో అత్యధికంగా ఏపీకి చెందిన రిటైర్డ్ ఉద్యోగులే ఉన్నారు. వారు విధులకు హాజరైన దాఖలాలు లేవు. ఆపరేటింగ్ తెలిసిన వారిని డ్యూటీలో ఉంచి.. వారు మాత్రం తమ పనులు, వ్యాపారాలను కర్నూలులో చక్కగా చూసుకుంటున్నారు. సబ్స్టేషన్లో పనిచేస్తున్న వారికి కనీసం సగం జీతం కూడా ఇవ్వకుండా తమ కష్టాన్ని దోచుకుంటున్నారని పలువురు ఆపరేటర్లు ఆందోళన చెందుతున్నారు. చర్యలు తీసుకుంటాం.. నేను జిల్లాకు రాకముందే కొన్ని సబ్స్టేషన్లు ప్రారంభమయ్యాయి. నేను వచ్చాక కొందరిని విధుల్లోకి తీసుకున్నాం. అయితే సబ్స్టేషన్లలో పనిచేసేందుకు ఎవరూ ఆసక్తి కనబర్చలేదు. అందుకే ఏపీకి చెందిన రిటైర్డ్ ఉద్యోగులను తీసుకున్నాం. వారి స్థానంలో బినామీలతో పనులు చేయిస్తున్నట్లు తేలితే శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం. – శ్రీనివాస్రెడ్డి, ఎస్ఈ విధులకు హాజరు కాకుండా బినామీలతో పనులు అధికారులకు తెలిసినా పట్టించుకోని వైనం సబ్స్టేషన్ల భద్రతపై నీలినీడలు -
నిబంధనలు అతిక్రమించొద్దు
గద్వాల క్రైం: మెడికల్ షాపుల నిర్వాహకులు ఔషధ నియంత్రణశాఖ నిబంధనలు అతిక్రమిస్తే డ్రగ్ కాస్మోటిక్ యాక్టు కింద కేసులు నమోదు చేస్తామని జిల్లా ఇన్చార్జి ఔషధ నియంత్రణ అధికారి వినయ్కుమార్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని పలు మెడికల్ దుకాణాల్లో ఆయన ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైద్యులు సిఫారసు చేసిన మందులను మాత్రమే విక్రయించాలని మెడికల్ షాపుల నిర్వాహకులకు సూచించారు. ప్రతి మెడికల్ దుకాణంలో ఫార్మసిస్ట్ ద్వారా మాత్రమే మందులను విక్రయించాలని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే లైసెన్స్లు రద్దు చేస్తామని హెచ్చరించారు. హుండీ ఆదాయం రూ. 26.96 లక్షలు అలంపూర్: ఆలయాల హుండీల లెక్కింపు ద్వారా రూ.26.96 లక్షల ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈఓ దీప్తి తెలిపారు. అలంపూర్ క్షేత్రంలోని శ్రీ జోగుళాంబ బాలబ్రహ్మేశ్వర స్వామివారి ఆలయంలో మంగళవారం దేవదాయ ధర్మాదాయ శాఖ సహాయ కమిషనర్ మదనేశ్వర్రెడ్డి, ఆలయ ఈఓ దీప్తి పర్యవేక్షణలో హుండీ లెక్కించారు. శ్రీ బాలబ్రహ్మేశ్వర స్వామివారి ఆలయ హుండీని లెక్కించగా రూ.24.77 లక్షలు, నిత్యాన్నదాన సత్రం హుండీని లెక్కించగా రూ.2.19 లక్షలు, స్వామివారి అన్నసత్ర హుండీల ద్వారా రూ.26.96 లక్షల ఆదాయం వచ్చినట్లు తెలిపారు. వీటితో పాటు స్వామివారి హుండీ ద్వారా విదేశీ కరెన్సీ 8 డాలర్లు, ఆస్ట్రేలియా డాలర్లు 20, కెనడా డాలర్లు 10, మిశ్రమ బంగారు 100 మిల్లీ గ్రాములు, మిశ్రమ వెండి 20.5 గ్రాములు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. మార్చి 12వ తేదీన శ్రీజోగుళాంబ అమ్మవారి ఆలయాల్లోని హుండీలను లెక్కించగా.. రూ.99.55 లక్షల ఆదాయం వచ్చింది. వీటితోపాటు మిశ్రమ బంగారం 28 గ్రామాలు, మిశ్రమ వెండి 298 గ్రామాలు వచ్చినట్లు పేర్కొన్నారు. వీటితోపాటు హుండీలలో విదేశీ కరెన్సీ యూఎస్డీ 39, ఫౌండ్లు 10, ఓమాన్ 100 బైసా హుండీల ద్వారా ఆదాయం సమకూరింది. ఆ రోజు సమయం లేకపోవడంతో శ్రీ బాలబ్రహ్మేశ్వరస్వామి, నిత్యాన్నదాన సత్రం హుండీలను లెక్కించలేదు. కార్యక్రమంలో గ్రామీణ బ్యాంక్ మేనేజర్ భీమా నాగరాజు, ఆలయ అర్చకులు, సిబ్బంది, వివిధ సేవా సంస్థల సభ్యులు, బ్యాంక్ సబ్బంతి తదితరులు పాల్గొన్నారు. వేరుశనగ క్వింటా రూ.7,050 గద్వాలవ్యవసాయం: జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్యార్డుకు సోమవారం 1,214 క్వింటాళ్ల వేరుశనగ అమ్మకానికి వచ్చింది. క్వింటాకు గరిష్టంగా రూ. 7,050, కనిష్టంగా రూ. 5,499, సరాసరి రూ. 5,499 ధర పలికింది. అదే విధంగా 326 క్వింటాళ్ల ఆముదాలు అమ్మకానికి రాగా.. గరిష్టంగా రూ. 6,289, కనిష్టంగా రూ. 5,759, సరాసరి రూ. 6,109 ధర వచ్చింది. 7 క్వింటాళ్ల కందులు రాగా.. గరిష్టంగా రూ. 6,809, కనిష్టంగా రూ. 6,289, సరాసరి రూ. 6,806 ధర పలికింది. ఓపెన్ యూనివర్సిటీ ప్రాక్టికల్స్ మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ సైన్స్ సబ్జెక్టు సెమిస్టర్–1కు సంబంధించి ప్రాక్టికల్స్ బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు హాల్టికెట్, ఐడీ కార్డు, ఫీజులు చెల్లించిన రశీదుతో రావాలని కోఆర్డినేటర్ సత్యనారాయణగౌడ్ ఒక ప్రకటనలో తెలిపారు. పూర్తి సమాచారం కోసం సెల్ నం.73829 29609ను సంప్రదించాలని సూచించారు. సేంద్రియ సాగుపై ఆసక్తి ● పశువుల ఎరువుపై మొగ్గు చూపుతున్న రైతులు ● పంట పొలాల్లో గొర్రెల మందలు ● సహజసిద్ధ ఎరువుతో అధిక దిగుబడులు – వివరాలు 9లో.. -
లింగమయ్య దర్శనానికి వేళాయె
సలేశ్వరం రూట్మ్యాప్వస్తున్నాం.. వెళ్లొస్తాం ఎత్తైన కొండలు, దట్టమైన చెట్లు, రాళ్లు రప్పల మధ్య నడిచివెళ్లి.. సహజసిద్ధంగా వెలసిన జలపాతాలను దాటుకొని పున్నమి వెన్నెల్లో సలేశ్వరం లింగమయ్యను దర్శించుకోవడం ఓ మహత్తర ఘట్టం. పేద, ధనిక.. చిన్నాపెద్ద.. ముసలి ముతక.. ఇలా ఎవరైనా సరే ప్రమాదభరితమైన కొండల్లో కాలినడకన గంటల తరబడి నడిచి వెళ్లాల్సిందే. దర్శనానికి వెళ్లే ముందు ‘వస్తున్నాం.. లింగమయ్యా’ తిరిగి వచ్చేటప్పుడు ‘వెళ్తొస్తాం.. లింగమయ్యా’ అంటూ భక్తిపారవశ్యంతో కదులుతారు. సుమారు వెయ్యి అడుగుల లోయలో ప్రతిధ్వనించే లింగమయ్య నామస్మరణ.. దారి పొడవునా పడే నీటి తుంపర్లు.. వెయ్యి అడుగు లపై నుంచి జాలువారే జలపాతం.. ఇలా ఒక్కో దృశ్యం ఒక్కో అద్భతం. ఒక్కసారి ఈ యాత్ర చేస్తే జీవితాంతం గుర్తుండిపోతుంది. మహబూబ్నగర్ -
పోలీస్ శాఖ సహకారం ఎంతో కీలకం
గద్వాల క్రైం: జాతీయ లోక్ అదాలత్ విజయవంతంలో పోలీసుశాఖ కృషి ఎంతో కీలకంగా ఉందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి రవికుమార్ అన్నారు. సోమవారం జిల్లా కోర్టు ఆవరణలో కోర్టు విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బందికి ప్రశంసాపత్రాలను అందజేసి మాట్లాడారు. న్యాయ వ్యవస్థ సమర్థవంతంగా విధుల నిర్వహణలో పోలీసుశాఖ సహకారం ఎంతగానో దోహదపడుతుందన్నారు. పోలీసులు కేవలం భదత్ర కల్పించడమే కాకుండా ప్రజలకు న్యాయం అందించడంలోనూ భాగస్వాములుగా ఉన్నారన్నారు. ఏళ్ల తరబడి కేసులు పెండింగ్లో లేకుండా వీలైనంత త్వరగా బాధితులకు న్యాయం కల్పిస్తూ వారి సమయం, డబ్బులు ఆదా చేయడం జరిగిందన్నారు. భవిష్యత్ ప్రణాళికలను దృష్టిలో ఉంచుకుని ప్రతిఒక్కరు సహకారం అందించాలని కోరారు. అనంతరం ఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ నిందితులకు శిక్ష పడేలా న్యాయమూర్తులు తీర్పులు ఇవ్వడం ఎంతో శుభదాయకంగా ఉందన్నారు. ఇటీవల వివిధ విపత్కర కేసులను పునఃపరిశీలించి శిక్షలు వేయడంతో పోలీసు శాఖ ఎంతో ఆమోదయోగ్యమైన సేవలు చేసిందన్నారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు శ్రీనివాస్, లక్ష్మి, పూజిత, ఉదయ్నాయక్, ఏఎస్పీ శంకర్, పీపీలు రేచల్ సంజనా జాషువా, సీఐలు శ్రీను, టాటాబాబు, ప్రదీప్కుమార్, ఎస్ఐ జిక్కీబాబు తదితరులు పాల్గొన్నారు. -
జనగణన పకడ్బందీగా చేపట్టాలి
గద్వాల: జిల్లాలో జనగణన ప్రక్రియ నిర్వహణ, సాంకేతికత వినియోగంపై పూర్తిస్థాయిలో అవగాహన పెంచుకొని, ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి యాప్ ద్వారా జనగణన ప్రక్రియ చేపట్టాలని కలెక్టర్ రిజ్వాన్బాషా షేక్ అన్నారు. సోమవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర జనగణన డైరెక్టర్ భారతి హోళికేరి కలెక్టర్లతో నిర్వహించిన వీసీలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. జిల్లాలో ప్రణాళిక గణాంక అధికారులు చార్జ్ క్లర్క్, అసిస్టెంట్ చార్జ్ క్లర్క్లుగా, కంప్యూటర్ ఆపరేటర్లు సాంకేతిక సహాయకులుగా తమకు నిర్దేశించిన విధులను సమర్థవంతంగా నిర్వహించేలా శిక్షణ తరగతులు అందించాలని కలెక్టర్ సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో వార్డులు, పట్టణ ప్రాంతాల్లో ప్రతి కాలనీ, అపార్టుమెంట్లు, చిన్నచిన్న వీధి ప్రాంతాల్లో నివసించే ప్రతి ఇంటిని, ఇంట్లోని ప్రతిఒక్కరి గణన విధిగా నిర్వర్తించాలని పేర్కొన్నారు. వందశాతం కచ్చితత్వంతో పూర్తి చేయడమే తమ లక్ష్యంతో జనగణన చేయాలని స్పష్టం చేశారు. జిల్లాలోని మారుమూల గిరిజన తండాలు, గ్రామాలు, మండలాలు, పట్టణాలు, జిల్లా స్థాయి వరకు జనగణన ప్రక్రియను సమర్థవంతంగా నిర్వర్తించేలా కచ్చితంగా అవగాహన కలిగి ఉండాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ నర్సింగ్రావు, సీపీఓ పాపయ్య, డీపీఓ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ప్రజావాణికి 81 ఫిర్యాదులు.. ప్రజావాణిలో ఫిర్యాదులపై పరిష్కరించకుండా అలసత్వం వహిస్తే కఠిన తీసుకుంటానని కలెక్టర్ రిజ్వాన్బాషా షేక్ అధికారులను హెచ్చరించారు. కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో జిల్లా నుంచి 81 ఫిర్యాదులు రాగా.. వీటిని ఆయా శాఖల అధికారులకు పంపినట్లు తెలిపారు. వచ్చిన ఫిర్యాదులను నిర్ణీత కాలపరిమితిలో పరిష్కరించాలని, లేనిపక్షంలో అందుకు కారణాలు పేర్కొటూ ఫిర్యాదుదారునికి సమాచారం పంపాలన్నారు. ప్రస్తుతం ప్రజావాణిలో ఇప్పటి వరకు అధిక దరఖాస్తులు పెండింగులో ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందులో రెవెన్యూ, పురపాలక శాఖల పరిధిలోనే అధికంగా ఉన్నాయని, వీటిని సత్వరమే పరిష్కరించాలన్నారు. జిల్లా చాలా రంగాల్లో వెనకబడి ఉందని అధికార యంత్రాంగం చిత్తశుద్ధితో పనిచేస్తేనే మెరుగైన ఫలితాలు వస్తాయన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు లక్ష్మీనారాయణ, నర్సింగ్రావు, ఆర్డీ ఓ శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
ఒకేసారి మూణ్నెళ్ల రేషన్
● ఏప్రిల్లో బియ్యం పంపిణీకి ఏర్పాట్లు ● వేసవిలో ప్రజలకు తప్పనున్న ఇక్కట్లు ● ఇప్పటికే దుకాణాలకు చేరుతున్న సన్నబియ్యం ● అధిక మొత్తంలో దిగుమతికి డీలర్ల తంటాలు నిల్వకు ఇబ్బంది.. నెలవారీ కోటా బియ్యాన్ని ప్రతినెలా వారం నుంచి పదిరోజుల సమయంలో లబ్ధిదారులకు పంపిణీ చేయాల్సి ఉంటుంది. అయితే ఈసారి ఒకేసారి మూడునెలలకు సంబంధించిన కోటా బియ్యాన్ని సరఫరా చేయాల్సి రావడంతో డీల్లర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా మూడు నెలలకు సరిపడా కోటా బియ్యం నిల్వచేసేందుకు అవసరమైన స్థలం లేకపోవడంతో డీలర్లకు తలనొప్పిగా మారింది. దీంతో ప్రత్యామ్నాయంగా గ్రామ పంచాయతీ, ప్రభుత్వ భవనాల్లో బియ్యాన్ని నిల్వ చేయాలని ఆలోచిస్తున్నారు. గద్వాల: వేసవిలో ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ప్రజలకు ఇబ్బందులు లేకుండా.. రాబోయే రబీ సీజన్లో ధాన్యం నిల్వలకు వెసులుబాటు కల్పించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో మాదిరిగా వచ్చే నెలలో మూడు నెలలకు సంబంధించిన బియ్యం కోటాను ఒకేసారి ఇవ్వనుంది. మూడు నెలల కోటాను ఒకేసారి పంపిణీ చేయాలని ఆదేశాల్లో పేర్కొనడంతో ఆ దిశగా జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. మూడు నెలలకు సంబంధించి 12,534 మెట్రిక్ టన్నుల బియ్యం జిల్లాలో పంపిణీ చేయనున్నారు. ఏప్రిల్ 1 నుంచి 30 వరకు.. జిల్లాలోని 17 మండలాల్లో మొత్తం 335 చౌకధర దుకాణాలు ఉన్నాయి. ఏప్రిల్ 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు సన్నబియ్యాన్ని పంపిణీ చేయనున్నారు. ప్రతినెలా 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు మాత్రమే బియ్యం పంపిణీ చేస్తున్నారు. అయితే కేంద్రం ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఏప్రిల్ నెల మొత్తం పంపిణీ చేయనున్నారు. లబ్ధిదారులు ఏప్రిల్, మే, జూన్ నెలల బియ్యం కోటాను తీసుకెళ్లాల్సి ఉంటుంది. అందుకోసం రేషన్కార్డు లబ్ధిదారుడు మూడుసార్లు బయోమెట్రిక్ పెట్టాల్సి ఉంటుంది. ఒక రేషన్కార్డు దారుడు వరుసగా రెండు, మూడుసార్లు వేలిముద్రలు స్వీకరించే అవకాశం పీఓఎస్లో లేదు. ఈ లెక్కన రేషన్కార్డుదారులు చౌకధర దుకాణాల్లో పడిగాపులు కాయాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. ఈ ఇబ్బందులను తొలగించేలా కేంద్రం పీఓఎస్లో ఏమైనా మార్పులు తీసుకొస్తుందో వేచిచూడాలి. సన్నబియ్యానికి డిమాండ్.. గతంలో రేషన్కార్డుదారులకు ప్రభుత్వం దొడ్డు బియ్యం పంపిణీ చేసేది. ఈ క్రమంలో రేషన్కార్డుదారులు 75– 80 శాతం లబ్ధిదారులు మాత్రమే రేషన్బియ్యం తీసుకునేవారు. అయితే ప్రభుత్వం రేషన్కార్డుదారులకు సన్న బియ్యం పంపిణీ చేయాలని నిర్ణయించిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారింది. గతంలో 80 శాతం మాత్రమే తీసుకునే రేషన్కార్డుదారులు అయితే సన్నబియ్యం వచ్చేసరికి 95 శాతానికి పైగా తీసుకుంటున్నారు. పైగా బియ్యం కూడా నాణ్యతగా ఉండటంతో సన్నబియ్యంపై ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. దీంతో జిల్లాలోని చౌకధర దుకాణాలన్నీ రేషన్కార్డు దారులతో బారులు తీరడం కనిపిస్తున్నాయి. మూడు నెలలకు అవసరమైన బియ్యం 12,534 మె.ట., నెలవారీగా పంపిణీ చేసే బియ్యం 4,178 మె.ట., పంపిణీకి చర్యలు.. ప్రభుత్వం ఆదేశాల మేరకు వేసవిలో ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ప్రజల సౌకర్యం కోసం ఏప్రిల్ నెలలోనే ఒకేసారి మూడు నెలల రేషన్ బియ్యాన్ని పంపిణీ చేసేలా చర్యలు తీసుకున్నాం. ఆహారభద్రత కార్డు ఉన్న ప్రతిఒక్కరికి మూడు నెలల రేషన్బియ్యం అందిస్తాం. – లక్ష్మీనారాయణ, అదనపు కలెక్టర్ -
‘హామీలన్నీ గాలికొదిలేశారు’
గద్వాల: కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఆరు గ్యారంటీలతోపాటు ఇచ్చిన ప్రజాస్వామ్య పరిరక్షణ హామీలను అధికారంలోకి వచ్చిన తర్వాత గాలికి వదిలేసిందని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఉప్పేరు నర్సింహ అన్నారు. ‘చలో హైదరాబాద్’ కార్యక్రమంలో భాగంగా ఆశాలపై పోలీసుల లాఠీచార్జి చేయడాన్ని నిరసిస్తూ సోమవారం జిల్లాకేంద్రంలోని బాబు జగ్జీవన్రాం చౌరస్తా వద్ద ప్రధాన రహదారిపై ఆశాలతో బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆశా కార్యకర్తలకు రూ.18 వేల ఫిక్స్డ్ వేతనం ఇస్తానని హామీ ఇచ్చి విస్మరించారని, దీనిపై ప్రశ్నిస్తే ఆశాలపై అత్యంత పాశవికంగా వ్యవహరించి లాఠీలు ఝులిపించిందని విమర్శించారు. లాఠీచార్జి చేయడమే కాకుండా మహిళలు అనే కనీస స్పృహ లేకుండా రాత్రి వరకు పోలీసుస్టేషన్లలో నిర్బంధించడం దారుణమని మండిపడ్డారు. అదేవిధంగా చాలామందిని ఇళ్ల వద్దనే అక్రమంగా అరెస్టు చేసి ఠాణాల్లో పెట్టారని, కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వలేదని ఆరోపించారు. ఇచ్చిన హామీ మేరకు రూ.18 వేలు ఇవ్వాలని, అదనపు పనిభారాన్ని తగ్గించాలని, మృతిచెందిన వారికి అంత్యక్రియలకు రూ.50 వేలు, అదేవిధంగా బీమా కింద రూ.50 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేశారు. వీటిని అమలు చేసే వరకు తమ పోరాటం ఆగదన్నారు. రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేయడంతో వాహనాలు నిలిచిపోయి.. వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో సీఐ టంగుటూరి శ్రీను ఆధ్వర్యంలో పోలీసులు వచ్చి రాస్తారోకో చేస్తున్న వారిని అడ్డుకుని పక్కకు పంపించారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టర్ రిజ్వాన్బాషా షేక్కు అందించారు. కార్యక్రమంలో నర్సింగమ్మ, నాగప్రమీల, శ్వేత, జయలక్ష్మి, సునీత, కాంతమ్మ, కవిత, పద్మ, శ్రీదేవి తదతరులు పాల్గొన్నారు. -
అడిషనల్ హెల్త్ డైరెక్టర్ ఆకస్మిక పర్యటన
రాజోళి: మండలంలోని మాన్దొడ్డి, పచ్చర్ల గ్రామాల్లో అడిషనల్ హెల్త్ డైరెక్టర్ అమర్సింగ్ శనివారం ఆకస్మికంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన స్థానికులతో మాట్లాడారు. గ్రామంలో హెచ్పీసీవీ, కిడ్నీ సంబంధిత వ్యాధులు, పక్షవాతం వ్యాధుల బారినపడిన వారి వివరాలు సేకరించారు. గ్రామంలో ఎంతమందికి ఇలాంటి వ్యాధులు ఉన్నాయి.. గతంలో ఎవరెవరికి వచ్చి.. ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారనే అంశాలను అడిగి తెలుసుకున్నారు. వారు ప్రస్తుతం చికిత్స ఎక్కడ తీసుకుంటున్నారని ఆరాతీశారు. స్థానిక వైద్య సిబ్బందితో మాట్లాడి సూచనలు చేశారు. వ్యాధులకు సంబంధించి ఎలాంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు, వైద్యం అందిస్తున్న తీరును అడిగారు. వ్యాధులు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాలపై చర్చించారు. గ్రామాల్లో ప్రజలకు రక్త పరీక్షలు నిర్వహించాలని, ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేసి, వారికి ఉన్న ఆరోగ్య సమస్యలకు తగిన వైద్యం చేసి మందులు అందించాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ సుజాత, ఉప సర్పంచ్ భీమన్న, జిల్లా కోఆర్డినేటర్ శ్యాంసుందర్, రామకృష్ణ, రంజిత్ తదితరులు పాల్గొన్నారు. -
రామయ్యకు పట్టాభిషేకం
ఎర్రవల్లి: బీచుపల్లి పుణ్యక్షేత్రంలోని కోదండరామస్వామి ఆలయంలో శనివారం సీతారాముల పట్టాభిషేకం కార్యక్రమాన్ని అర్చకులు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదోరోజు ఉదయం ఆలయంలో అర్చకులు సుప్రభాతసేవ, తిరుప్పావై తోమాల, నైవేద్యం, తీర్థప్రసాదగోష్టి తదనంతరం విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం, రక్షాబంధనం, కలశపూజ, అభిషేకం, వస్త్ర, ఆభరణ సమర్పన, హోమం, పూర్ణాహుతి వంటి పూజా కార్యక్రమాలు అర్చకులు వేదమంత్రాల నడుమ నిర్వహించారు. అనంతరం సామ్రాజ్య పట్టాభిషేకం కార్యక్రమాన్ని మంగళవాయిద్యాల మధ్య కనులపండువగా చేపట్టారు. కార్యక్రమంలో ఆలయ మేనేజర్ సురేందర్రాజు, అర్చకులు, పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు. -
పకడ్బందీగా పదో తరగతి పరీక్షలు
గద్వాల: జిల్లాలో పదో తరగతి పరీక్షలను ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పకడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ అన్నారు. శనివారం జిల్లాకేంద్రంలోని పలు పాఠశాలల్లో పదో తరగతి పరీక్ష కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పరీక్షల నిర్వహణ, విద్యార్థుల హాజరు తదితర వివరాలను అధికారులతో అడిగి తెలుసుకున్నారు. పరీక్ష కేంద్రాల వద్ద మౌలిక వసతులను పరిశీలించారు. పరీక్షా కేంద్రాల్లోకి ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు, సెల్ఫోన్లు అనుమతించరాదన్నారు. ప్రశ్నాపత్రాలను పోలీస్ ఎస్కార్ట్తోనే కేంద్రాలకు తరలించాలన్నారు. అదేవిధంగా జవాబు పత్రాలను స్థానిక తపాలా కార్యాలయంలో డిపాజిట్ చేయాలన్నారు. కార్యక్రమంలో విద్యా శాఖ అధికారి శ్రీనివాసులు పాల్గొన్నారు. చదువుతోనే సమాజంలో గౌరవం వనపర్తిటౌన్: చదువుతోనే సమాజంలో గౌరవం లభిస్తుందని.. చదువు లేదంటే రాజకీయాల్లో మాదిగలు అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, డా. ఆర్ఎస్ ప్రవీణ్కుమార్, మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, డా. కదిరె కృష్ణ అన్నారు. శనివారం జిల్లాకేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్ లో మాదిగల ఐక్యవేదిక ఆధ్వర్యంలో మాదిగ ప్రజాప్రతినిధుల సన్మానసభకు వారు ముఖ్యఅతిథులుగా హాజరై జిల్లాలోని మాదిగ సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, కౌన్సిలర్లను శాలువాలతో సన్మానించి మాట్లాడారు. మాదిగలు చరిత్రలో మొదటి కళాకారులని.. జాతి అభివృద్ధే లక్ష్యమని, విద్యావంతులు, జ్ఞానవంతులు మాదిగ యువతను ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలన్నారు. ఆర్థికంగా, రాజకీయంగా, విద్యాపరంగా మాదిగలు ఎదగాలని.. పిల్లల్ని వైద్యులు, ఇంజినీర్లు, ఉన్నతాధికారులు, రాజకీయ నాయకులుగా తయారు చేయాలని, అప్పుడే సమాజంలో గౌరవంగా జీవించగలరని చెప్పారు. చదువును నిర్లక్ష్యం చేయొద్దని, చదువుతోనే ఏదైన సాధ్యమవుతుందనే విషయాన్ని గుర్తించాలన్నారు. ప్రజాప్రతినిధులు పదవి కాలంలో సమస్యల పరిష్కారానికి శ్రమించి అభివృద్ధి చేయాలని సూచించా రు. మాదిగల ఐక్యవేదిక సభ్యులు పెద్దింటి వెంకటేష్, గంధం పరంజ్యోతి, రాములు, మీసాల రాము, తిరుపతి, రవి, నాగరాజు, రాజేష్, ప్రవీణ్ పాల్గొన్నారు. -
పారదర్శకంగా నిరుపేదల గుర్తింపు
గట్టు: సమాజంలో అట్టడుగు వర్గాలైన ఎస్సీ, ఎస్టీలలో ఉన్న అత్యంత నిరుపేదలను గుర్తించడంలో సీఆర్పీలు పూర్తి పారదర్శకంగా వ్యవహరించాలని సెర్ప్ స్టేట్ ప్రాజెక్టు మేనేజర్ రవీంద్రరావు అన్నారు. శనివారం ఆయన మండలంలోని పెంచికలపాడు, మాచర్ల, తప్పెట్లమొర్సు, గంగిమాన్దొడ్డి గ్రామాల్లో పర్యటించి.. సర్పంచులు, వార్డు సభ్యులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గట్టు మండలంలోని 17 గ్రామాలను సర్వే కోసం ఎంపిక చేశామని, మొదటి విడతగా 5 గ్రామాల్లో సర్వే ప్రక్రియ కొనసాగుతుందన్నారు. అర్హులైన నిరుపేదలను గుర్తించి, వారికి ప్రభుత్వ సహాయం అందేలా చూడడమే ఈ సర్వే ప్రధాన ఉద్దేశమని పేర్కోన్నారు. అనంతరం మండల సమాఖ్య భవనంలో ఆదివారం నిర్వహించే ఓపెన్ ఇంటర్ పరీక్షలకు సంబంధించిన ప్రశ్నాపత్రాలను వీఓఏలకు అందజేశారు. కార్యక్రమంలో అడిషనల్ డీఆర్డీఓ శ్రీనివాస్, ఎంపీడీఓ చెన్నయ్య, మండల సమాఖ్య సభ్యురాలు వెంకటేశ్వరి, ఏపీఎం మారుతి, సీసీలు శేఖర్, జ్యోతి, తిమ్మక్క, హన్మంతు తదితరులు పాల్గొన్నారు. -
కేసుల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించొద్దు
● జాతీయ మెగా లోక్ అదాలత్లో 5,345 కేసులు పరిష్కరం ● హైకోర్టు న్యాయమూర్తులు శ్యాంకోశీ, శ్రావణ్కుమార్ వెల్లడి గద్వాల క్రైం: లోక్ అదాలత్లో వివాదాలను పరిష్కరించుకుంటే కక్షిదారుల్లో సోదరభావం పెంపొందడంతోపాటు సమయం, డబ్బు ఆదా అవుతుందని హైకోర్టు న్యాయమూర్తులు శ్యాంకోశీ, శ్రావణ్కుమార్ అన్నారు. కేసులు వద్దు.. సామరస్య పరిష్కారమే ముద్దు అని పిలుపునిచ్చారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు శనివారం గద్వాల కోర్టు ఆవరణలో నిర్వహించిన జాతీయ మెగా లోక్ అదాలత్లో వారు ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు. ఏళ్ల తరబడి కేసులు పరిష్కారం చేసుకోకుంటే ప్రయోజనం ఉండదన్నారు. సాంకేతిక విప్లవంలోనూ కేసుల పరిష్కారం విషయంలో నిర్లక్ష్యం వద్దన్నారు. ఇరువర్గాలకు చెందిన కక్షిదారులు తమ విలువైన భవిష్యత్ను దృష్టిలో ఉంచుకుని కేసుల నుంచి విముక్తి దిశగా ముందుకు రావాలన్నారు. అనంతరం జిల్లా న్యాయమూర్తి రవికుమార్ మాట్లాడుతూ లోక్ అదాలత్లో 5,345 కేసులు పరిష్కారమైనట్లు వెల్లడించారు. క్రిమినల్, సివిల్, సైబర్ క్రైం, బ్యాంకు లిటిగేషన్, ప్రమాద తదితర పెండింగ్ కేసులలో ఇరువర్గాల వారిని రాజీ కుదుర్చినట్లు వివరించారు. అంతకు ముందు హైకోర్టు న్యాయమూర్తులకు కోర్టు సిబ్బంది, న్యాయవాదులు ఘన స్వాగతం పలికారు. నూతన కోర్టు నిర్మాణాల కోసం ప్రభుత్వం ఇప్పటికే కార్యాచరణ చేపట్టిందని హైకోర్టు నాయ్యమూర్తులు పేర్కొన్నారు. కార్యక్రమంలో న్యాయవాదులు, తెలంగాణ న్యాయ సేవాధికార సంస్థ, మెంబర్ పంచాక్షరి, టి.లక్ష్మి, శ్రీనివాస్, వెంకట హైమ పూజిత, ఉదయ్నాయక్, ఏపీపీలు సంజనా జాషువా, వినోదాచారి, శ్రీనివాస్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పకడ్బందీగా పంటల నమోదు
గ్రామాల్లో విస్తృతంగా పర్యటిస్తున్న వ్యవసాధికారులు ● ఇప్పటికి 40 శాతం పూర్తి ● పంటల దిగుబడిపై అంచనా ● సర్వేతో వ్యవసాయ పురోగతికి దోహదం గద్వాల వ్యవసాయం: గడిచిన ఇరవై రోజుల నుంచి జిల్లాలో పంటల నమోదు (డిజిటల్ క్రాప్ సర్వే.. బుకింగ్) పకడ్బందీగా సాగుతోంది. దీనివల్ల ఆయా ప్రాంతాల్లో ఎన్ని ఎకరాల్లో ఏ రకమైన పంటలు సాగు చేశారు.. దిగుబడిపై అంచనా వస్తుందని వ్యవసాయాధికారులు అంటున్నారు. ఈ వివరాలతో మద్దతు ధర, కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, ఆహర ధాన్యాల లభ్యతపై ప్రభుత్వానికి స్పష్టత రానుంది. గద్వాల వ్యవసాయ ఆధారిత జిల్లా. జూరాల, ఆర్డీ ఎ స్ ప్రాజెక్ట్లతో పాటు నెట్టెంపాడు ఎత్తిపోతల.. దాని కింద ఆరు రిజర్వాయర్లు ఉన్నాయి. దీంతో పాటు బోర్లు, బావుల కింద పంటల సాగు జరుగుతోంది. సుమారుగా ఏటా వానాకాలం సీజన్లో 3.80 లక్ష లు, యాసంగిలో 1.30లక్షల ఎకరాల్లో పంట లు సా గు చేస్తున్నారు. పత్తి, సీడ్పత్తి, వరి, కంది, మిరప, వేరుశనగ పంటలతో పాటు ఉద్యాన, వాణిజ్య పంటల సాగుపై స్థానిక రైతులు ఆసక్తి చూపుతున్నారు. మండలాల వారీగా.. మండలం ఎకరాలు అలంపూర్ 8,478 ధరూరు 36,850 అయిజ 47,895 ఇటిక్యాల 20,549 కేటీదొడ్డి 29,416 మానవపాడు 20,568 మల్దకల్ 34,269 రాజోళి 19,412 ఉండవల్లి 18,303 వడ్డేపల్లి 21,782 ఎర్రవల్లి 25,251 -
రైతులు సహరించాలి
జిల్లాలో పంటల సర్వే, నమోదు వేగంగా జరుగుతోంది. క్లస్టర్ల పరిధిలో ఎంపిక చేసిన వలంటీర్లు. ఏఈఓలు ఈ సర్వేను చేపడుతున్నారు. రైతుల నుంచి పలు వివరాలు సేకరించి, యాప్లో నమోదు చేయాల్సి ఉంటుంది. కాబట్టి రైతులు ఏఈఓలకు, వలంటీర్లకు తమ పొలాల వద్ద అందుబాటులో ఉండి వివరాలు అందించి, సహకరించాలి. ఈ సర్వే ఆధారంగా సాగు విస్తీర్ణానికి అనుగుణంగా ఎరువుల వినియోగంపై అవగాహన వస్తుంది. దిగుబడి అంచనా వేసి రైతులకు ఇబ్బందులు కలగకుండా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. – వీరప్ప, డీఏఓ ● -
ఉత్సాహంగా సందెరాళ్ల పోటీలు
● రోగాల నివారణకు ప్రత్యేక చర్యలు ● చిన్న, సన్నకారు రైతులకు ప్రత్యామ్నాయ ఆదాయం గట్టు: శ్రీరామనవమి సందర్భంగా శుక్రవారం మండల కేంద్రంలోని గండి ఆంజనేయస్వామి దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో ఉత్సాహంగా సందెరాళ్ల పోటీలు నిర్వహించారు. పోటీల్లో బండమీది అంజి 100 కేజీ చేతి రాయిని ఎత్తి మొదటి బహుమతి రూ.4,016, ద్వితీయ బహుమతిని గువ్వల పరశురాముడు 95 కేజీల రాయి ఎత్తి రూ.3,016, తృతీయ బహుమతి తెలుగు నల్లారెడ్డి 90 కేజీల రాయి ఎత్తి రూ.2,016, నాల్గవ బహుమతి చాకలి నాగరాజు 88 కేజీల రాయి ఎత్తి రూ.1,016లను దక్కించుకున్నారు. విజేతలకు గండి ఆంజనేయస్వామి ఆలయ కమిటి సభ్యులు బహుమతులను అందజేశారు. మూడుబండ్ల గిరక పోటీలు మూడు బండ్ల గిరక పోటీలను సంతబజారు వేదికగా నిర్వహించారు. చుట్టు పక్కల గ్రామాల నుంచి రైతులు పెద్దఎత్తున తరలివచ్చారు. మొదటి బహుమతి రూ.10,016 గట్టు తెలుగు ఆంజనేయులు ఎద్దులు 257 ఫీట్ల దూరం లాగి దక్కించుకున్నాయి. ద్వితీయ బహుమతి రూ.8,016లను సల్కాపురం మారెప్పకు చెందిన ఎద్దులు 244 ఫీట్ల దూరం గిరకను లాగి దక్కించుకున్నాయి. అంతపల్లి గ్రామంలో శ్రీరామనవమి సందర్భంగా ఎడ్లబండి గిరక పోటీలను మాజీ ఎంపీపీ విజయ్కుమార్ ప్రారంభించారు. కార్యక్రమంలో సర్పంచు శంకరమ్మ, ఉపసర్పంచ్ హనుమంతు, దానయ్య తదితరులు పాల్గొన్నారు. -
సంత.. తీరని చింత
అధికార, ప్రతిపక్ష నాయకుల మధ్య మాటల యుద్ధం ● ఏళ్లుగా నలుగుతున్న పెబ్బేరు సంత వివాదం ● రూ.కోట్ల ఆదాయం కోల్పోతున్న మున్సిపాలిటీ ● మీడియా వేదికగా ఆరోపణలు, ప్రత్యారోపణలు ● అయోమయంలో ప్రజానీకం వనపర్తి: దక్షిణ తెలంగాణలోనే అత్యధిక ఆదాయం తెచ్చిపెట్టే పెబ్బేరు సంత అంశం 2023 అసెంబ్లీ ఎన్నికల్లో సమయంలో ప్రధాన పార్టీల మధ్య ప్రచార అస్త్రంగా మారింది. సంతస్థలంపై విమర్శలు, హామీలు ఎన్నికలను ప్రభావితం చేసినట్లుగా ప్రచారంలో ఉంది. ఎన్నికల ప్రక్రియ ముగిసి సుమారు రెండున్నరేళ్లు కావస్తున్నా.. ఇప్పటి వరకు సంత స్థలం వివాదాన్ని ఎందుకు పరిష్కరించలేదంటూ మాజీ మంత్రి నిరంజన్రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు అధికార పార్టీ ఎమ్మెల్యేను నిలదీస్తుండగా.. పదేళ్లు అధికారంలో ఉండి మీరేం చేశారని కాంగ్రెస్ నాయకులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం దృష్టికి.. పెబ్బేరు సంత విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి కేబినేట్లో చర్చించి శాశ్వత పరిష్కారం చూపించే ప్రయత్నం చేస్తున్నామంటూ ఎమ్మెల్యే మేఘారెడ్డి, కాంగ్రెస్ నాయకులు చెప్తుండడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. కానీ ఏళ్లు గడుస్తున్నా నేతల మధ్య విమర్శలు తప్పా పరిష్కారం వైపు కనీసం ఒక్క అడుగు పడలేదనే ప్రజలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఈ క్రమంలో అధికార పార్టీని లక్ష్యంగా చేసుకుంటూ బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న విమర్శలకు ఎమ్మెల్యే ఇటీవల స్పందించారు. డీసీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసి న విలేకరుల సమావేశంలో మాజీ మంత్రిపై ఘాటు విమర్శలే చేశారు. దీనికి ఇంతవరకు మాజీ మంత్రి స్పందించకున్నా.. బీఆర్ఎస్ నాయకులు మీడియాలో మరోసారి ఆరోపణలు గుప్పించడం స్థానికులను అయోమయంలో పడేసేలా చేస్తోంది. పెబ్బేరు సంత జాతీయ రహదారి 44పై పెబ్బేరు సంతను నిర్వహిస్తుండటంతో ఇక్కడి సంతకు అంతర్జాతీయ గుర్తింపు ఉంది. ఇతర రాష్ట్రాల నుంచి సైతం పశువుల విక్రయదారులు ఇక్కడికి వస్తుంటారు. కూరగాయల నుంచి గృహ నిర్మాణం, వ్యవసాయానికి సంబంధించిన అన్ని రకాల పనిముట్లు ఇక్కడ సంత రోజుల్లో విక్రయానికి సిద్ధంగా ఉంటాయి. పెద్ద ఎత్తున పశువులు, గొర్రెలు, మేకల విక్రయాలు జరుగుతాయి. ప్రతి అమ్మకం, కొనుగోలుపై వచ్చే ఆదాయం పెబ్బేరు మున్సిపాలిటీకి చేరాల్సి ఉండగా.. గత కొన్నేళ్లుగా సంత అనధికారికంగా నిర్వహిస్తుండతో ఆదాయం ఎవరి చేతికి వెళ్తుందనే అంశాన్ని పాలకులు, నాయకులు, అధికారులు పట్టించుకోవడం లేదని పట్టణవాసులు మండిపడుతున్నారు. ఈ విషయంపై మున్సిపల్ చైర్మన్ను ఎప్పుడు, ఎవ్వరు ప్రశ్నించిన త్వరలో శాశ్వత పరిష్కారం చూపిస్తామనే మాటచెప్పటం పరిపాటిగా మారింది. ఆ దిశగా నూతన మున్సిపల్ పాలకవర్గం ఇప్పటి వరకు ఎలాంచి చర్యలు చేపట్టకపోవటం గమనార్హం. రాజకీయ ప్రాబల్యాన్ని చాటుకోవడం కోసం అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటన్నారే తప్పా.. ఈ వివాదం కారణంగా సంత నిర్వహణ కోసం టెండర్ నిర్వహించకపోవడంతో ఏటా మున్సిపాలిటీకి రావాల్సిన రూ.కోట్ల ఆదాయానికి గండి పడుతుందనే విషయంపై ఎందుకు దృష్టి సారించడం లేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే రూ.12 కోట్లకుపైగా ఆదాయం మున్సిపాలిటీ కోల్పోయినట్లు అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. -
భక్తిశ్రద్ధలతో తిక్కవీరప్పస్వామి రథోత్సవం
కేటీదొడ్డి: శ్రీరామ నవమిని పురస్కరించుకొని మండలంలోని ఇర్కిచేడు తిక్కవీరప్ప ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం రథోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి, బీఆర్ఎస్ జిల్లా నాయకులు బాసు హనుమంతు నాయుడు హజరై ప్రత్యేక పూజలు చేసి, రథం లాగారు. భక్తుల గోవిందనామ స్మరణతో ఇర్కిచేడు మార్మోగింది. భక్తులు స్వామివారికి నైవేద్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. రథోత్సవంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ కుర్వ హనుమంతు, మాజీ కౌన్సిలర్ మురళి, సర్పంచు ఆంజనేయులు, నాయకులు కులకర్ణి శ్రీధర్, ఉరుకుందు, చంద్రశేఖర్, కృష్ణ, భగవంతు, డీలర్ జంగిలప్ప, గోపి తదితరులు ఉన్నారు. -
దరఖాస్తు గడువు పొడిగింపు
గద్వాల: జిల్లా షెడ్యూల్డ్ కులాల సేవా సహకార అభివృద్ధి సంఘాల ద్వారా అమలుచేస్తున్న ఎస్సీ యాక్షన్ ప్లాన్ 2025–26 పథకాల నమోదుకు దరఖాస్తు గడువును వచ్చేనెల 2వ తేదీ వరకు పొడిగించినట్లు జిల్లా ఎస్సీ సంక్షేమశాఖ అధికారి నుషిత గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. బ్యాంకు లింకేజీతో రవాణా విభాగానికి సంబంధించి ద్విచక్ర వా హనాలు, త్రీచక్రాల గూడ్స్, ప్యాసింజర్ వాహనాలు, వ్యవసాయ రంగంలో అగ్రి డ్రోన్ సేవలు, అగ్రి మెషినరీ కామన్ హైరింగ్ సెంటర్లు, సో లార్ పంప్సెట్లు, ఇతర అనుబంధ వ్యవసాయ పథకాలు ఉన్నట్లు పే ర్కొన్నారు. పశుసంవర్థక రంగంలో పాడిపశువులు, సెరికల్చర్, హార్టికల్చర్ పథకంలో మల్బరీసాగు, చౌకీసెంటర్లు, కిసాన్ నర్సరీలు, కూర గాయలు, ఆయిల్పాం పెంపకం వంటి అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు. బ్యాంక్ లింకేజీ లేని పథకాల్లో మైనర్ ఇరిగేషన్, ఎంటర్ప్రైజేషన్ కింద బోర్వెల్లకు సబ్మర్సిబుల్ పంప్సెట్లు, పైప్లైన్ ఏర్పాట్లు, సర్వీస్ కనెక్షన్ చార్జీలు. ఓఆర్సీ లైనింగ్ వంటి సదుపాయాలు రూ. 1.50లక్షల వరకు అందించనున్నట్లు పేర్కొన్నారు. అర్హులైన అభ్యర్థులు వచ్చేనెల 2వ తేదీలోగా ఎస్సీ కార్పొరేషన్ అధికారిక ఓబీఎంఎంఎస్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అన్ని గ్రామాలకు బస్సు సౌకర్యం కల్పించండి గద్వాల: నియోజకవర్గంలో ని అన్ని గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి కోరారు. ఈ మేరకు గురువారం హైదరాబాద్లో రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రతి గ్రామంలో ప్రయాణికుల కోసం బస్టాండ్ నిర్మించడంతో పాటు గద్వాలకు ఎలక్ట్రిక్ బస్సులను అధిక మొత్తంలో కేటాయించాలన్నారు. జిల్లా కేంద్రంలో ఎలక్ట్రిక్ వాహనాల చార్జింగ్ స్టేషన్ నిర్మించాలని, బస్టాండ్లో మెరుగైన వసతులను అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. -
కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
గద్వాల: విద్యుత్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గురువా రం తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయిస్ జాయింట్ కమిటీ ఆధ్వర్యంలో డీఈ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ.. ఆర్టిజన్ కార్మికులను కన్వర్షన్ చేయడంతో పాటు మీటర్ రీడింగ్, పోల్ టు పోల్ వర్కర్లను ఎఫ్ఓసీ వర్కర్లను విద్యుత్ సంస్థలో విలీనం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో సుధాకర్, సతీశ్, రామకృష్ణ, రాముడు పాల్గొన్నారు.శుక్రవారం శ్రీ 27 శ్రీ మార్చి శ్రీ 2026 -
ప్రణాళికాబద్ధంగా చదవాలి
ఇటిక్యాల: విద్యార్థులు ప్రణాళికాబద్ధంగా చదివితేనే ఉత్తమ ఫలితాలు సాధ్యమవుతాయని కలెక్టర్ రిజ్వాన్బాషా షేక్ అన్నారు. గురువారం ఇటిక్యాలలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను సందర్శించిన కలెక్టర్.. పదో తరగతి గణితం పరీక్షకు సిద్ధమవుతున్న విద్యార్ధులకు పలు సూచనలు చేశారు. ఇప్పటిదాక అసలే చదవని పాఠ్యాంశాన్ని ప్రసుత్తం చదివితే లాభం లేదని.. ఇప్పటి వరకు చదివిన పాఠ్యాంశాలను పునశ్చరణ చేసుకోవాలని సూచించారు. పరీక్ష కేంద్రంలో ప్రశ్నపత్రం చదివాక.. ముందుగా వచ్చిన ప్రశ్నలను ఎంచుకొని సమాధానం రాయాలన్నారు. ప్రతి విద్యార్ధి ఎక్కువ మార్కులు తెచ్చుకునేలా సాధన చేయాలని సూచించారు. అనంతరం గురుకుల పాఠశాలలోని వంటగది, స్టోర్రూం, విద్యార్ధుల వసతి గదులను పరిశీలించారు. అదే విధంగా తహసీల్దార్ కార్యాలయాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. కుల, ఆదాయ, భూ భారతి తదితర దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి.. నిర్ణీత గడువులోగా వాటిని పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ముందుగా కార్యాలయంలోని రికార్డు గది, ఇతర విభాగాలను పరిశీలించారు. అనంతరం ఎంపీడీఓ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ కార్యాలయాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. అదే విధంగా ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని సందర్శించి.. ప్రజలకు అందిస్తున్న సేవలపై ఆరా తీశారు. గర్భిణులు, చిన్నారులకు అందించే వ్యాధినిరోధక టీకాలు, ఔషధాల నిల్వలతో పాటు పలు రికార్డులను పరిశీలించారు. గర్భిణులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని.. హైరిస్క్ కేసులను మెడికల్ అధికారి పర్యవేక్షించాలని తెలిపారు. ఏఎన్ఎంలు, ఆశావర్కర్లు, మెడికల్ అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. అనంతరం డిజిటల్ క్రాప్ సర్వేను కలెక్టర్ పరిశీలించారు. ఆయన వెంట ఏఓ రవికుమార్, తహసీల్దార్ శ్రీకాంత్రెడ్డి, ఎంపీడీ ఓ అజార్ మొహియొద్దీన్, వైద్యా ధికారి రాధిక, గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ సురేశ్ తదితరులు ఉన్నారు. -
పక్కాగా జనగణన
గద్వాల: జనగణన–2027 ప్రక్రియను పక్కాగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ వి.లక్ష్మీనారాయణ అధికారులను ఆదేశించారు. గురువారం ఐడీఓసీ కార్యాలయంలో జనగణన సిబ్బందికి నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రెండు దశల్లో నిర్వహించే జనగణనను సమర్థవంతంగా నిర్వహించేందుకు అవసరమైన విధానాలు, మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. మే 11 నుంచి మొదటి దశలో ప్రారంభమయ్యే ఇళ్ల జాబితా (హౌస్లిస్టింగ్, హౌస్ ఎన్యూమరేషన్) గణన జూన్ 9వ తేదీ వరకు కొనసాగుతుందన్నారు. రెండవ దశ ప్రక్రియ 2027 ఫిబ్రవరి 9 నుంచి ప్రారంభమవుతుందన్నారు. ఈసారి జనగణనను డిజిటల్ విధానంలో నిర్వహించనున్నట్లు తెలిపారు. మొదటి దశలో 33 ప్రశ్నల వివరాలను ఎన్యూమరేటర్లు ఇంటింటికీ వెళ్లి సేకరించాలన్నారు. జనగణనలో ఏ ఒక్కరిని కూడా వదలకుండా సమగ్ర వివరాలను నమోదు చేయాలన్నారు. మండల, మున్సిపల్ స్థాయిలో అధికారులకు సహాయం అందించేందుకు చార్జీ క్లర్క్లు, టెక్నికల్ అసిస్టెంట్లు తప్పనిసరిగా ఉండాలని సూచించారు. చార్జీ క్లర్క్లు, టెక్నికల్ అసిస్టెంట్లకు ఈ నెల 30 నుంచి మూడు రోజులపాటు క్షేత్రస్థాయిలో శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో తెలంగాణ డైరెక్టరేట్ స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ సుల్తాన్అలీ, జాయింట్ డైరెక్టర్ లాగర్, సీపీఓ పాపయ్య పాల్గొన్నారు. -
యాప్ ద్వారానే యూరియా విక్రయించాలి
గట్టు: యూరియాను యాప్ ద్వారానే విక్రయించాలని గద్వాల డివిజన్ వ్యవసాయ సహాయ సంచాలకులు సంగీతలక్ష్మి సూచించారు. బుధవారం గొర్లఖాన్దొడ్డి రైతువేదికలో గట్టు, మల్దకల్ మండలాల్లోని వివిధ గ్రామాలకు చెందిన ఎరువుల దుకాణ దారులతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వచ్చే వానాకాలం నాటికి రైతులకు ఎరువుల కొరత లేకుండా ఎరువుల దుకాణదారులు తగినంత ఎరువుల స్టాకులో పెట్టుకోవాలన్నారు. ఎరువుల నిల్వకు సంబంధించి ఏ రోజుకు ఆరోజు స్టాకు రిజిస్టర్లో తప్పనిసరిగా నమోదు చేయాలని కోరారు. అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారులు హనుమంతురెడ్డి, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
లోక్అదాలత్లో కేసుల సత్వర పరిష్కారం
గద్వాల క్రైం: పెండింగ్ కేసుల విషయంలో పురోగతి సాధించేందుకు సమయస్ఫూర్తితో అడుగులు వేస్తున్నామని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్.రవికుమార్ అన్నారు. ఈ నెల 28న జాతీయ లోక్అదాలత్ సందర్భంగా బుధవారం జిల్లా కోర్టులో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో న్యాయమూర్తి మాట్లాడారు. జిల్లాలోని న్యాయస్థానాల్లో పెండింగ్ కేసులు, రాజీ అయ్యే కేసుల పరిష్కారానికి స్పెషల్ డ్రైవ్ చేపట్టామన్నారు. ప్రస్తుతం అనేక అంశాలను పరిగణనలోకి తీసుకొని కేసుల సత్వర పరిష్కారానికి జాతీయ లోక్అదాలత్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 2025లో జిల్లావ్యాప్తంగా 32,854 కేసులను విజయవంతంగా పరిష్కరించినట్లు వెల్లడించారు. శనివారం జరిగే జాతీయ లోక్అదాలత్కు రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్, హైకోర్టు న్యాయమూర్తి పి.సామ్కోషి హాజరుకానున్నట్లు తెలిపారు. లోక్అదాలత్లో వీలైనన్ని ఎక్కువ కేసులు రాజీ అయ్యేలా సంబంధిత అధికారులు, న్యాయవాదులు చొరవ చూపాలన్నారు. సమావేశంలో అదనపు సీనియర్ సివిల్జడ్జి టి.లక్ష్మి ఉన్నారు. -
2న యూనివర్సిటీస్థాయి కామర్స్ ఫెస్ట్
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పీయూలో వచ్చే నెల 2న తెలంగాణ కామర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో యూనివర్సిటీ స్థాయి అంతర్ కళాశాలల కామర్స్ ఫెస్ట్ ప్రేరణ–2026 నిర్వహించనున్నారు. ఈ మేరకు బుధవారం కార్యక్రమ బ్రోచర్ను వీసీ శ్రీనివాస్, రిజిస్ట్రార్ రమేష్బాబు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వీసీ శ్రీనివాస్ మాట్లాడుతూ ఇది కేవలం ఫెస్ట్ మాత్రమే కాదని, కామర్స్ విద్యార్థుల్లో దాగి ఉన్న సృజన, ప్రతిభను వెలికి తీసేందుకు చేస్తున్న కార్యక్రమం అన్నారు. ఈ నెల 30లోగా విద్యార్థులు తమ పేరును నమోదు చేసుకోవాలని, ఇక్కడ గెలుపొందిన విద్యార్థులు సికింద్రాబాద్లోని అవినాష్ కళాశాలలో వచ్చేనెల 7న జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనాల్సి ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఆడిట్సెల్ డైరెక్టర్ చంద్రకిరణ్, కంట్రోలర్ ప్రవీణ, ప్రిన్సిపాల్ మధుసూదన్రెడ్డి, అడిషనల్ కంట్రోలర్ అనురాధరెడ్డి, బీఓఎస్ చైర్మన్ ఆఫ్ కామర్స్ రాజ్కుమార్, రంగప్ప, సురేష్ తదితరులు పాల్గొన్నారు. పీయూలో అధ్యాపకులు మధు మోటమారి, భారతి సంయుక్తంగా రచించిన నానోఫ్లూయిడ్స్ రంగంలో విశేష పరిశోధన, నూతన గ్రంథం పుస్తకాన్ని వీసీ శ్రీనివాస్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిశోధన విద్యార్థులకు ఇది ఒక దిక్సూచిలా పనిచేస్తుందన్నారు. -
అడ్డు తొలగేనా..?
–8లో uగద్వాల: ఉమ్మడి పాలమూరు జిల్లాలోని బీడు భూ ములను సస్యశ్యామలం చేయాలనే సంకల్పంతో చేపట్టిన పాలమూరు–రంగారెడ్డి, కేఎల్ఐ, భీమా, నెట్టెంపాడు, గట్టు ఎత్తిపోతలతోపాటు ఆర్డీఎస్ ప్రా జెక్టు పనులు దశాబ్దాలుగా అసంపూర్తిగానే ఉన్నా యి. ప్రాజెక్టుల పూర్తికి నిధుల లేమికి తోడు భూసేకరణ ప్రక్రియ ప్రధాన అడ్డంకిగా మారింది. ము ఖ్యంగా రెండు దశాబ్దాల క్రితం ప్రారంభించిన నెట్టెంపాడు ప్రాజెక్టుకు పదేళ్లుగా నిధులు లేకపోవడంతోపాటు భూసేకరణ ప్రక్రియ ముందుకు సాగ డం లేదు. అదేవిధంగా ఎనిమిదేళ్ల క్రితం చేపట్టిన గట్టు ఎత్తిపోతల కుడి, ఎడమ కాల్వల పరిధిలో 461 ఎకరాల భూసేకరణలో జరుగుతున్న జాప్యం పనులకు అడ్డంకిగా మారింది. ఆర్డీఎస్ ప్రాజెక్టు పరిధిలో నిర్మించాల్సిన మల్లమ్మకుంట రిజర్వాయ ర్ కోసం 567 ఎకరాల భూమి సేకరించాల్సి ఉంది. 6–7 లక్షల ఎకరాలకు మాత్రమే.. ఉమ్మడి పాలమూరు జిల్లాలో 10 లక్షల ఎకరాల లక్ష్యంతో చేపట్టిన ఆయా ప్రాజెక్టుల ద్వారా కేవలం 6– 7 లక్షల ఎకరాలకు మాత్రమే సాగునీరు అందుతోంది. ప్రాజెక్టుల పూర్తిస్థాయి నిర్మాణాలనకు భూ సేకరణ ప్రక్రియ అడ్డంకిగా మారడంతో లక్ష్యం నెరవేరడం లేదు. దీనిపై దృష్టిసారించిన ప్రభుత్వం.. భూ సేకరణ ప్రక్రియను వేగవంతం చేసి, పనులు పూర్తిచేసేలా చర్యలు చేపట్టింది. అందులో భాగంగా ఆర్అండ్ఆర్ కమిషనర్ శివకుమార్నాయుడు ఇటీవల గద్వాల జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల భూ సేకరణపై ప్రత్యేకంగా సమీక్షించారు. భూ సేకరణ ప్రక్రియ త్వరగా పూర్తిచేసి.. పెండింగ్ పనులు పూర్తిచేయాలని ఇరిగేషన్, రెవెన్యూశాఖ అధికారులను ఆదేశించారు. ఇదీ పరిస్థితి.. గద్వాల, అలంపూర్ నియోజకవర్గాల పరిధిలో 2లక్షల ఎకరాలకు సాగునీటిని అందించాల్సిన నెట్టెంపాడు ప్రాజెక్టు.. కేవలం 1.45 లక్షల ఎకరాలకే పరిమితమైంది. ఈ ప్రాజెక్టు 99, 100 ప్యాకేజీల పరిధిలో 541 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంది. 2018లో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గట్టు ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేశారు. ఎత్తిపోతల కుడి, ఎడమ కాల్వల పరిధిలో 249 ఎకరాలు, రిజర్వాయర్ నిర్మాణానికి మరో 212 ఎకరాలు అవసరం. భూసేకరణ ప్రక్రియ మధ్యలోనే ఆగిపోయింది. 87,500 ఎకరాలకు సాగునీటిని అందించాల్సిన ఆర్డీఎస్ ప్రాజెక్టు.. అంతర్రాష్ట్ర జలవివాదం కారణంగా వానాకాలంలో గరిష్టంగా 50వేల ఎకరాలకు మించి సాగునీరు అందిన పరిస్థితి లేదు. దీంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాజోళి మండలంలో మల్లమ్మకుంట రిజర్వాయర్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. అయితే రిజర్వాయర్ నిర్మాణానికి 567 ఎకరాలు సేకరించాల్సి ఉండగా.. భూములు ఇచ్చేందుకు స్థానిక రైతులు అభ్యంతరం చెబుతుండటంతో పనులకు అడ్డంకిగా మారింది. పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు సైతం వివిధ దశల్లో పెండింగ్లో ఉన్నాయి. ఈ ప్రాజెక్టులో సివిల్, మెకానికల్ పనులతోపాటు భూసేకరణ సమస్య నెలకొంది. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా 4.50 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉండగా.. రెండు దశాబ్దాలుగా పనులు అసంపూర్తిగానే ఉన్నాయి. ఇక్కడ సుమారు 130 ఎకరాల వరకు భూమి సేకరించాల్సి ఉంది. అసంపూర్తి పనులతో కేవలం 2.50 లక్షల ఎకరాలకు మాత్రమే సాగునీరు పారుతుంది. 4లక్షల ఎకరాలకు సాగునీటిని అందించాల్సిన భీమా ఎత్తిపోతల పథకం పనులు రెండు దశాబ్దాలుగా పెండింగ్లోనే ఉన్నాయి. వేగవంతం చేస్తాం.. నెట్టెంపాడు, ఆర్డీఎస్, గట్టు ఎత్తిపోతల పథకాలకు సంబంధించి భూసేకరణ ప్రక్రియ కొంత పెండింగ్లో ఉంది. దీనిపై ఇటీవలి ఆర్అండ్ఆర్ కమిషనర్ సమీక్షించారు. ఆయా ప్రాజెక్టుల పరిధిలో పెండింగ్లో ఉన్న భూమిని సేకరించాలని చెప్పారు. భూసేకరణ ప్రక్రియ పూర్తయితే పూర్తిస్థాయి ఆయకట్టుకు సాగునీటిని అందించవచ్చు. పెండింగ్లో ఉన్న భూేమిని వేగవంతంగా సేకరించేలా సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుని ముందుకెళ్తాం. – రహీముద్దీన్, ఎస్ఈ, ఇరిగేషన్శాఖ సాగునీటి ప్రాజెక్టులకుభూ సేకరణ సమస్య ముందుకు సాగని పెండింగ్ పనులు భూసేకరణ పూర్తయితేనే పూర్తి ఆయకట్టుకు సాగునీరు ఇరిగేషన్, రెవెన్యూ శాఖల అధికారులతో ఆర్అండ్ఆర్ కమిషనర్ సమీక్ష త్వరితగతిన చేపట్టాలని ఆదేశం -
వరిధాన్యం సేకరణకు పకడ్బందీ ఏర్పాట్లు
● జిల్లాలో 87 కొనుగోలు కేంద్రాలు ● కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ గద్వాల: యాసంగి సీజన్లో పండించిన వరిధాన్యం సేకరణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో యాసంగి ధాన్యం కొనుగోలుపై సంబంధిత అధికారులతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. 2025–26 యాసంగి సీజన్ ధాన్యం సేకరణ లక్ష్యానికి అనుగుణంగా జిల్లాలో మొత్తం 87 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. ● జిల్లాలో ప్రాధాన్యతరంగ రుణాల లక్ష్య సాధనలో బ్యాంకర్లు ముందుండాలని.. బ్యాంకుల సహకారంతోనే అర్హులైన వారు రుణాలను సద్వినియోగం చేసుకోగలుగుతారని కలెక్టర్ అన్నారు. కలెక్టరేట్లో డీసీసీ, డీఎల్ఆర్పీ కన్సల్టేటివ్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించి అన్ని బ్యాంకులు సమన్వయంతో పనిచేసి.. నిర్దేశించిన లక్ష్యాలను వందశాతం సాధించాలన్నారు. రుణాల మంజూరులో సమతుల్యత అవసరమని.. బ్యాంక్ లింకేజీ ద్వారా స్వయం సహాయక మహిళా సంఘాలకు అందిస్తున్న రుణాలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. మత్తు పదార్థాల నిర్మూలనకు కృషి.. జిల్లాలో నిషేధిత మత్తు పదార్థాల నిర్మూలనకు అధికారులు కలిసికట్టుగా కృషిచేయాలని కలెక్టర్ రిజ్వన్ బాషా షేక్ అన్నారు. కలెక్టరేట్లో నిర్వహించిన నార్కోటిక్స్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. విద్యాసంస్ధలు, గ్రామీణ ప్రాంతాల్లో డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాల నివారణపై పెద్దఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. స్కూల్ కాంప్లేక్స్ సమావేశాలు, అంగన్వాడీ, కేంద్రాలు, మహిళా సంఘాల సమావేశాల్లో కూడా డ్రగ్స్ వల్ల కలిగే దుష్ప్రభావాలను వివరించాలని సూచించారు. జిల్లాలో ఎక్కడైనా డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాలు సరఫరా చేస్తున్నట్లు సమాచారం ఇచ్చే పౌరులకు రూ. 10వేల నగదు బహుమతి అందజేస్తామని కలెక్టర్ తెలిపారు. ● నమూనా ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశాల నిర్వహణతో విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నడిగడ్డ తెలంగాణ సోషల్ ఫోరం సహకారంతో ఐడీఓసీ సమావేశ మందిరంలో నిర్వహించిన మోడల్ తెలంగాణ యునైటెడ్ నేషన్స్ కార్యక్రమంలో జిల్లాలోని 22 పీఎంశ్రీ పాఠశాలల నుంచి 44 మంది విద్యార్థులు వివిధ దేశాల ప్రతినిధులుగా పాల్గొని తమ వాణి వినిపించారు. మానవ హక్కులు, వాతావరణ మార్పులు, గ్లోబల్ వార్మింగ్పై నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలెక్టర్ హాజరై జ్యోతిప్రజ్వలన చేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు లక్ష్మీనారాయణ, నర్సింగ్రావు, ఏఎస్పీ శంకర్, ఆర్డీఓ శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
క్షయ రహిత జిల్లాగా మారుద్దాం
గద్వాల క్రైం: క్షయ రహిత జిల్లాగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా ఇన్చార్జి వైద్యాధికారి సంధ్యా కిరణ్మయి అన్నారు. క్షయ నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం జిల్లా కేంద్రంలోని ఎంసీహెచ్లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. క్షయ నివారణ దిశగా వైద్యారోగ్యశాఖ ప్రత్యేక చర్యలు చేపట్టిందన్నారు. వ్యాధిగ్రస్తులను గుర్తించేందుకు ఇంటింటి సర్వే నిర్వహించడంతో పాటు అనుమానితులకు పరీక్షలు చేసి.. వ్యాధిగ్రస్తులకు అవసరమయ్యే మందులను ఉచితంగా అందిస్తున్నామన్నారు. అదే విధంగా ప్రతినెలా రూ. 500 ఆర్థికసాయం చేస్తున్నట్లు తెలిపారు. క్షయ బారిన పడకుండా ప్రతి ఒక్కరూ ముందస్తు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. పోషకాలతో కూడిన మంచి ఆహారం తీసుకోవాలని.. రెండు వారాలకు మించి దగ్గు, జ్వరం తదితర లక్షణాలు కలిగిన వారు సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో సంప్రదించాలని తెలిపారు. అంతకు ముందు పురవీధుల్లో అవగాహన ర్యాలీ నిర్వహించి.. సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. -
జోగుళాంబ గద్వాల
చేనేత కార్మికుల సమస్యలు పరిష్కరిస్తాం ● బ్యాంకుల ద్వారా రుణాలు అందించేందుకు చర్యలు ● నేత చీరలను నేరుగా మార్కెటింగ్ చేసుకోవాలి ● కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ బుధవారం శ్రీ 25 శ్రీ మార్చి శ్రీ 2026గట్టు: చేనేత కార్మికుల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. మంగళవారం గట్టు మండలం ఆరగిద్దలోని చేనేత కార్మికుల ఇళ్లకు ఆయన స్వయంగా వెళ్లి మగ్గాలను పరిశీలించారు. ఈ సందర్భంగా చేనేత చీరల తయారీకి కావాల్సిన ముడి సరుకు, యంత్రాలు, డిజైనింగ్ తదితర వివరాలను కార్మికులతో తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. గద్వాల చేనేత జరీ చీరలు ఎంతో ప్రఖ్యాతిగాంచాయన్నారు. ఆరగిద్ద చేనేత పారిశ్రామిక సహకార ఉత్పత్తి సంస్థ ఆధ్వర్యంలో నేసిన చీరలను నేరుగా మార్కెటింగ్ చేసుకోవాలని కార్మికులకు సూచించారు. కాగా, సంస్థ కార్మికులు ఆర్థికంగా ఎదగడానికి వర్కింగ్ క్యాపిటల్ కింద రూ. 98 లక్షల రుణాలు ఇప్పించాలని సంఘం అధ్యక్షుడు నర్సప్ప కోరారు. స్పందించిన కలెక్టర్.. ఎల్డీఎం శ్రీనివాసరావుతో మాట్లాడి బ్యాంకు రుణాలు మంజూరు చేయిస్తామని తెలిపారు. అనంతరం ఆరగిద్దలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను కలెక్టర్ పరిశీలించారు. ఇళ్ల నిర్మాణ పనులను త్వరగా పూర్తిచేసుకోవాలని లబ్ధిదారులకు సూచించారు. అనంతరం ప్రభుత్వ పాఠశాలలో మరుగుదొడ్ల నిర్మాణాన్ని పరిశీలించారు. కాగా, ఇళ్లపై హైటెన్షన్ విద్యుత్ తీగలు ఉన్నాయని గ్రామస్తులు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా.. విద్యుత్శాఖ అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. లింగాపురంలో పశుసంవర్ధకశాఖ, భవి ష్య భారత్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకా కార్యక్రమాన్ని కలెక్టర్ పరిశీలించారు. కార్యక్రమంలో చేనేత, జౌళీశాఖ డీఓ సుధారాణి, జిల్లా పశు సంవర్ధకశాఖ అధికారి శివానందస్వా మి, సర్పంచులు బాలకృష్ణ, శకుంతల మ్మ, ఎంపీడీఓ చెన్నయ్య పాల్గొన్నారు.గద్వాల: జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులను నీటి పారుదలశాఖ అధికారులతో కలిసి కలెక్టర్ రిజ్వాన్బాషా షేక్ పరిశీలించారు. మొదటగా ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టును సందర్శించి.. కుడి, ఎడమ ప్రధాన కాల్వలను పరిశీలించి, వివరాలను తెలుసుకున్నారు. అనంతరం హైడల్ పవర్ ప్రాజెక్టు ను పరిశీలించి.. విద్యుత్ ఉత్పత్తి తదితర అంశాలపై ఆరా తీశారు. అదే విధంగా నెట్టెంపాడు ఎత్తిపోతల ప్రాజెక్టులోని గూడెందొడ్డి, ర్యాలంపాడు రిజర్వాయర్లను సందర్శించారు. రిజర్వాయర్ల కింద భూములు కోల్పోయిన రైతుల వివరాలు, గ్రామస్తులకు కల్పించిన సౌకర్యాలను తెలుసుకున్నారు. కలెక్టర్ వెంట ఎస్ఈ రహీముద్దీన్, ఈఈలు జుబేర్ అహ్మద్, శ్రీనివాసులు తదితరులు ఉన్నారు. -
ఫిర్యాదులపై అలసత్వం వహిస్తే చర్యలు
● కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ● ఇప్పటి వరకు 435 అర్జీల పెండింగ్పై ఆగ్రహం గద్వాల: ప్రజావాణి ఫిర్యాదులను పరిష్కరించకుండా అలసత్వం వహిస్తే కఠిన తీసుకుంటామని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అధికారులను హెచ్చరించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి వచ్చిన ప్రజల నుంచి ఆయన ఫిర్యాదులు స్వీకరించారు. వివిధ సమస్యలపై 56 ఫిర్యాదులు అందగా.. పరిష్కారం నిమిత్తం సంబంధిత శాఖలకు చెందిన అధికారులకు పంపించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజావాణి ఫిర్యాదులను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని, లేనిపక్షంలో అందుకు కారణాలు పేర్కొంటూ ఫిర్యాదుదారుడికి అక్నాలెడ్జ్మెంట్ పంపాలన్నారు. ప్రజావాణికి సంబంధించి ఇప్పటి వరకు 435 దరఖాస్తులు పెండింగ్లో ఉండటంపై ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇందులో రెవెన్యూ శాఖ పరిధిలోనే అధికంగా ఉన్నాయన్నారు. వీటిని సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. మండలాల్లో అధికారులు ప్రజావాణి కార్యక్రమాన్ని సక్రమంగా నిర్వహిస్తే.. చిన్నచిన్న సమస్యలపై ప్రజలు ఫిర్యాదు చేసేందుకు కలెక్టరేట్కు రావాల్సిన అవసరం ఉండదన్నారు. కాగా, ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ కార్యాలయాల్లో పరిశుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు. పెండింగ్ ఫైల్స్ క్లియరెన్స్పై స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ చాలా మంది అధికారులు అమలు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడ్డారు. వారంలోగా షెడ్యూల్ ప్రకారం పూర్తి చేయని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అదే విధంగా అధికారులు సమయపాలన కచ్చితంగా పాటించాలన్నారు. ప్రతి ప్రభుత్వ కార్యాలయం వద్ద బయోమెట్రిక్ ద్వారా హాజరు నమోదు చేయాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలు, వసతిగృహాలు, ఆస్పత్రుల్లో ప్రత్యేకాధికారులు, తహసీల్దార్లు ఎంపీడీఓలు తరచుగా తనిఖీలు చేపట్టాలని సూచించారు. ప్రతి శుక్రవారం అన్ని ప్రభుత్వ గురుకులాల్లో విద్యార్థులతో పాటు భోజనం చేయాలని.. పంచాయతీ కార్యదర్శులు తమ పరిధిలోని పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రతి బుధవారం ఉదయం 11గంటలకు వారి గ్రామాల్లో అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేయాలని తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు వి.లక్ష్మీనారాయణ, నర్సింగ్రావు, ఆర్డీఓ శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు. -
కాళ్లు పట్టుకుంటాం.. కనికరించండి
మానవపాడు: ‘‘మాకు వారసత్వంగా దక్కాల్సిన భూమిని నకిలీ పత్రాలతో కాజేశారు.. మాకు న్యాయం చేయండి’’ అంటూ ఓ మహిళ తహసీల్దార్ కాళ్లు పట్టుకుంది. ఈ ఘటన మానవపాడు తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని బోరవెల్లికి చెందిన బిచ్చన్న – మంగమ్మ దంపతులకు ఐదుగురు కుమార్తెలు ఉన్నారు. మంగమ్మ పేరుపై బోరవెల్లి, ధర్మవరం శివారుల్లో 4.53 ఎకరాల భూమి ఉంది. ఆమె నాలుగేళ్ల క్రితం మృతిచెందింది. ఆ భూమి ఆమె ఐదుగురు కూతుళ్లకు సమానంగా చెందాల్సి ఉండగా.. మూడో కూతురు వరలక్ష్మి తానే ఏకై క వారసురాలినంటూ ఫ్యామిలీ సర్టిఫికెట్ సృష్టించి భూమిని తన పేరుపైకి మార్చుకుంది. ఈ క్రమంలో తమకు న్యాయం చేయాలని మిగతా నలుగురు నెల రో జులుగా తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. సోమవారం తహసీల్దార్ జోషి శ్రీనివాస్ శర్మ కాళ్లు పట్టుకొని తమకు న్యాయం చేయాలని మొరపెట్టుకున్నారు. ఈ విషయాన్ని కలెక్టర్, ఆర్డీఓ దృష్టికి తీసుకెళ్లి తప్పుడు స క్సెషన్ను రద్దు చేస్తామని త హసీల్దార్ హా మీ ఇచ్చారు. నకిలీ పత్రాలతో వారసత్వ భూమి కాజేశారని తహసీల్దార్తో మొర -
పంట మార్పిడితో అధిక దిగుబడులు
ఇటిక్యాల: పంట మార్పిడి విధానంతో అధిక దిగుబడులు సాధించవచ్చని జిల్లా వ్యవసాయశాఖ అధికారి వీరప్ప, శాస్త్రవేత్త అర్చన రైతులకు సూచించారు. సోమవారం ఎర్రవల్లి మండలం పుటాన్దొడ్డి రైతువేదికలో వ్యవసాయశాఖ, ఆత్మ ఆధ్వర్యంలో శాస్రవేత్తలతో రైతుల ఇష్టాగోష్టి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతుల సందేహాలను నివృత్తి చేయడంతో పాటు పంటల సాగులో పాటించాల్సిన మెళకువలపై సూచనలు చేశారు. యాసంగి సీజన్లో రైతులు వరికి బదులుగా మొక్కజొన్న, పప్పుదినుసుల పంటలు వేసుకోవాలని సూచించారు. ఎప్పుడే ఒకేరకం పంటసాగు, విచక్షణరహితంగా ఎరువుల వినియోగంతో పంటపొలం నిస్సారంగా మారుతుందన్నారు. అదే విధంగా పెట్టుబడులు పెరుగుతాయని తెలిపారు. రైతులు పంటమార్పిడి విధానం పాటించాలని సూచించారు. కార్యక్రమంలో ఏడీఏ సక్రియా నాయక్, ఏఓ సురేశ్, సర్పంచ్ నారాయణ, పంచాయతీ కార్యదర్శి వెంకటనారాయణ పాల్గొన్నారు. -
మిగిలింది 9 రోజులే..
● ఉమ్మడి జిల్లాలోని మున్సిపాలిటీల్లో అంతంతమాత్రంగానేపన్నుల వసూళ్లు ● గడువు సమీపిస్తుండటంతో వేగం పెంచిన అధికారులు ● ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళికలో స్పెషల్ డ్రైవ్ ● పుర ఎన్నికలు, సిబ్బంది కొరతతోనే జాప్యం నారాయణపేట/ అమరచింత: మున్సిపాలిటీల అభివృద్ధిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మంజూరు చేసే నిధులతోపాటు ఆస్తి పన్ను వసూళ్లు ప్రధాన భూమిక పోషిస్తాయి. మున్సిపాలిటీల్లోని నివాస, వాణిజ్య సముదాయాలకు సంబంధించి 2025– 26 ఆర్థిక సంవత్సరం ఆస్తిపన్ను వసూళ్లపై పుర యంత్రాంగం దృష్టిసారించింది. క్యూఆర్కోడ్ స్కాన్, డెబిట్, క్రెడిట్ కార్డులు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూపీఐ, వాట్సప్ నంబర్, ఏటీఎం ద్వారా నేరుగా ఆయా పురపాలికల ఖాతాల్లో జమ చేయవచ్చని చెబుతోంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ నెల 16 నుంచి 31వ తేదీ వరకు పన్ను వసూళ్లకు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తోంది. కాగా ఈ ఏడాది ఇప్పటి వరకు పన్ను వసూలు అంతంత మాత్రమే ఉండటం.. లక్ష్యం చేరుకునేందుకు కేవలం 9 రోజులు మాత్రమే గడువు ఉండటంతో అధికారులు, సిబ్బంది వసూళ్లలో వేగం పెంచారు. తొమ్మిదో స్థానంలో వడ్డేపల్లి.. పన్ను వసూళ్లలో ఉమ్మడి జిల్లాలోని వడ్డేపల్లి మున్సిపాలిటీ రాష్ట్రంలోనే తొమ్మిదో స్థానంలో నిలిచింది. 4,116 ఆస్తులకుగాను రూ.1.07 కోట్ల డిమాండ్ ఉండగా.. వరకు రూ.0.81 కోట్లు (75.70 శాతం) వసూలయ్యాయి. అలాగే సీఎం రేవంత్రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గి పురపాలికలో 6,445 ఆస్తులుండగా.. రూ.2.11 కోట్ల డిమాండ్కు రూ.1.66 కోట్లు(55.17 శాతం) పన్ను వసూలు చేయడంతో 65వ స్థానంలో.. మద్దూరు మున్సిపాలిటీ 3,177 ఆస్తులకుగాను రూ.0.49 కోట్లకు గాను రూ.0.36 కోట్లు (72.86) పన్ను వసూలు చేయడంతో 12వ స్థానంలో నిలిచింది. అలాగే రాష్ట్ర ఎకై ్సజ్శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రాతినిధ్యం వహిస్తున్న కొల్లాపూర్లో 6,517 ఆస్తులుండగా.. రూ.1.32 కోట్లకుగాను రూ.0.74 కోట్లు (55.91 శాతం) వసూలు చేసి 61 స్థానంలో నిలిచింది. మంత్రి వాకిటి శ్రీహరి ప్రాతినిధ్యం వహిస్తున్న మక్తల్ మున్సిపాలిటీలో 7,629 ఆస్తులకుగాను రూ.2.16 కోట్ల డిమాండ్ ఉండగా.. రూ.1.23 కోట్ల (56.81 శాతం) పన్ను వసూలు కావడంతో రాష్ట్రస్థాయిలో 59వ స్థానంలో నిలిచింది. మున్సిపాలిటీ ఆస్తులు లక్ష్యం వసూలైంది శాతం రాష్ట్రస్థాయిలో (రూ.కోట్లలో..) స్థానం మహబూబ్నగర్ 53,751 51.98 18.75 36.07 121 జడ్చర్ల 18,976 7.03 3.26 46.32 93 వనపర్తి 18,616 12.94 4.29 33.14 124 గద్వాల 16,097 7.51 3.94 52.52 74 నాగర్కర్నూల్ 10,998 7.01 3.74 53.31 69 నారాయణపేట 9,304 3.87 2.04 52.71 73 కల్వకుర్తి 8,295 6.77 2.85 42.10 111 అయిజ 8,186 2.09 1.51 72.30 13 మక్తల్ 7,629 2.16 1.23 56.81 59 కొత్తకోట 7,303 2.29 1.16 50.70 80 అచ్చంపేట 6,763 3.39 2.70 68.78 25 కొల్లాపూర్ 6,517 1.32 0.74 55.91 61 కోస్గి 6,445 2.11 1.66 55.17 65 ఆత్మకూర్ 5,322 2.26 1.00 44.34 102 పెబ్బేరు 5,284 1.20 0.86 71.92 15 వడ్డేపల్లి 4,116 1.07 0.81 75.70 09 భూత్పూర్ 3,671 3.65 1.77 48.44 84 అలంపూర్ 3,578 0.50 0.32 64.60 35 దేవరకద్ర 3,442 0.51 0.34 66.86 29 మద్దూర్ 3,177 0.49 0.36 72.86 12 అమరచింత 2,796 0.63 0.36 56.99 58 పురపాలికల వారీగా పన్ను వసూళ్లు ఇలా.. -
కొట్టేయ్.. అమ్మేయ్!
దొంగ బంగారం కొనుగోలుకు కేరాఫ్ నడిగడ్డ గద్వాల క్రైం: మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉన్న వస్తువుగా మారింది బంగారం. ఒకప్పుడు రూ.వేలల్లో పలికిన పసిడి ధర.. ప్రస్తుతం రూ.లక్షలకు ఎగబాకింది. ఇదే అదునుగా భావించిన దొంగలు తాళం వేసిన ఇళ్లు, ఒంటరి మహిళలను టార్గెట్ చేసుకుని విచ్చలవిడిగా చోరీలకు పాల్పడుతుండగా.. తస్కరించిన బంగారాన్ని కొందరు వ్యాపారులు తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆదివారం జిల్లా కేంద్రంలోని స్వర్ణకారుల కాంప్లెక్స్లో ఉన్న ఓ వ్యాపారి నుంచి ఏపీ పోలీసులు దొంగ బంగారాన్ని రికవరీ చేయడం హాట్ టాఫిక్గా మారింది. గుర్తుతెలియని దొంగల నుంచి సదరు వ్యాపారి రూ. 4.50లక్షల విలువైన 29 గ్రాముల బంగారు ఆభరణాలు కొనుగోలు చేసినట్లు నిర్ధారించారు. జిల్లాలోని కొందరు వ్యాపారులు దొంగల నుంచి బంగారం కొనుగోలు చేయడం పరిపాటిగా మారిందనే చర్చ సాగుతోంది. అక్రమ దందాకు తెర.. ప్రస్తుతం బంగారం వ్యాపారంలోనే ఆశించిన లాభాలు ఉన్నాయి. సామాన్యుడు, ధనికుడు, మధ్యతరగతి అని తేడా లేకుండా సామర్థ్యానికి మించి ఎంతో కొంత బంగారం కొనుగోలు చేస్తుంటారు. అయితే కొందరు వ్యాపారులు దొంగ బంగారం కొనుగోలుతో అక్రమ దందాకు తెర తీస్తున్నారు. మరోవైపు తరుగు, ప్యూరిటీ, జీఎస్టీ ఇతరాత్ర అంశాల్లో మోసాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సంబంధిత అధికారుల పర్యవేక్షణ లోపం కూడా వ్యాపారులకు కలిసి వస్తుందని తెలుస్తోంది. చర్యలు శూన్యం.. దొంగల నుంచి బంగారు ఆభరణాలు కొనుగోలు చేసిన వ్యాపారుల నుంచి పోలీసులు రికవరీ చేస్తున్నారు తప్ప.. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం లేదు. దీంతో వ్యాపారుల్లో ఎలాంటి భయం లేకుండాపోతోంది. సాధారణంగా దొంగ బంగారం కొనుగోలు చేసినా.. విక్రయాలు చేసినా శిక్షార్హులు. అయితే సొమ్ము రికవరీ సమయంలో వ్యాపారులు అదనంగా ఎంతో కొంత ముట్టజెప్పుతుండటంతో వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఇదిలా ఉంటే, రికవరీ చేసిన ఆభరణాలను సైతం బాధితులకు అందించడంలో చేతివాటం చూపిస్తున్నారనే ఆరోపణలు లేకపోలేదు. తాజాగా నాగర్కర్నూల్ జిల్లా పోలీసులు ఇక్కడి వ్యాపారి నుంచి రికవరీ చేసిన ఆభరణాలను పూర్తిస్థాయిలో చూపించలేదని వ్యాపారులు చెబుతున్నారు. దొంగల నుంచి బంగారు ఆభరణాల కొనుగోలుచేసే వ్యాపారులపై కఠిన చర్యలు చేపట్టాల్సిన అవసరముందని పలువురు అభిప్రాయడుతున్నారు. వ్యాపారులకు లాభసాటిగా మారిన వైనం తరచుగా ఇతర రాష్ట్రాల పోలీసుల తనిఖీలు చోరీ సొమ్ము రికవరీకే పరిమితం తాజాగా 29 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం -
వేగంగా.. తగ్గుముఖం
నీటి ఎత్తిపోతలకు ఇక్కట్లు.. ప్రస్తుతం శ్రీశైలం డ్యాంలో 60 టీఎంసీల నీటినిల్వ ఉంది. విద్యుత్ ఉత్పత్తి నిరంతరాయంగా కొనసాగితే కేఎల్ఐ ద్వారా తాగు, సాగునీటి ఎత్తిపోతలకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ సీజన్లో కేఎల్ఐలోని మూడు మోటార్ల ద్వారా 33 టీఎంసీల నీటిని ఎత్తిపోశారు. రోజు రెండు మోటార్లను నడిపిస్తున్నారు. 805 అడుగుల వరకు నీటిని ఎత్తిపోసుకోవచ్చు. ఆ తర్వాత నీటిని ఎత్తిపోస్తే మోటార్లపై తీవ్ర ప్రభావం పడుతుంది. అందుకే 810 అడుగుల వరకు మాత్రమే కేఎల్ఐ ద్వారా ఎత్తిపోతలు సాగుతున్నాయి. మోటార్లపై భారం పడకుండా నీటి ఎత్తిపోతలు కొనసాగించాలని అధికారులు భావిస్తున్నారు. మిషన్ భగీరథ పథకానికి తాగునీటిని అందించడంతో పాటు సాగు అవసరాలకు ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన చర్యలు చేపడుతున్నట్లు నీటిపారుదలశాఖ అధికారులు చెబుతున్నారు. కొల్లాపూర్: కృష్ణానదిలో నీటిమట్టం క్రమంగా తగ్గుతోంది. శ్రీశైలంలో రెండు తెలుగు రాష్ట్రాలు నిరంతరాయంగా విద్యుదుత్పత్తి చేపడుతుండటంతో కొ న్ని రోజులుగా బ్యాక్ వాటర్ లెవల్స్ భారీగా పడిపోతున్నాయి. దీనికితోడు కేఎల్ఐ ప్రాజెక్టులో నీటి ఎత్తిపోతలు విరామం లేకుండా సాగుతున్నాయి. ఇ దే తరహాలో నీటిమట్టం తగ్గితే.. వచ్చే నెలలో ఎత్తిపోతలకు బ్రేక్ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. 837 అడుగుల దిగువకు.. గతేడాది మార్చి నెలాఖరు వరకు శ్రీశైలం బ్యాక్ వాటర్ 850 అడుగులకు పైగానే ఉంది. ఏప్రిల్లో బ్యాక్ వాటర్ తగ్గడం ప్రారంభమైంది. కానీ ఈ ఏడాది నెల రోజుల ముందునుంచే బ్యాక్ వాటర్ లెవెల్స్ తగ్గుతూ వస్తున్నాయి. శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి ప్రారంభించడంతో రోజుకు 1 నుంచి 1.5 టీఎంసీల నీటిని వినియోగిస్తున్నారు. ఫలితంగా బ్యాక్ వాటర్ లెవెల్స్ వేగంగా తగ్గుతున్నాయి. ప్రస్తుతం శ్రీశైలం బ్యాక్వాటర్ లెవెల్స్ 837 అడుగులకు చేరుకుంది. నెలాఖరు వరకు ఇంకా తగ్గనుంది. మోటార్లకు మరమ్మతు.. కేఎల్ఐ ప్రాజెక్టు ద్వారా ఏప్రిల్లోనే ఎత్తిపోతలు ఆగితే ఎల్లూరు పంపుహౌజ్లోని మోటార్లకు మరమ్మతులు చేపట్టాలనే యోచనలో అధికారులు ఉన్నారు. కొన్నేళ్ల క్రితమే పంపుహౌజ్లోని రెండు మోటార్లు పాడయ్యాయి. మిషన్ భగీరథ కోసం విరామం లేకుండా నీటి ఎత్తిపోతలు కొనసాగిస్తుండటంతో.. వాటికి మరమ్మతు చేయడం వీలు కా వడం లేదు. అయితే ఈ ఏడాది నార్లాపూ ర్ రిజర్వాయర్లో ఉన్న నీటిని మిషన్ భగీరథకు మళ్లించి.. కేఎల్ఐ మోటార్లకు మరమ్మ తు చేపట్టాలని అధికారులు భావిస్తున్నారు. తేలిన పురాతన కట్టడాలు.. శ్రీశైలం బ్యాక్ వాటర్ తగ్గిపోవడంతో పురాతనమైన సంగమేశ్వరాలయం బయటపడింది. ఈ నెలాఖరు నుంచే ఆలయంలో పూజలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అదే విధంగా సోమశిల సమీపంలోని మసీదు, జటప్రోల్ సమీపంలో శిథిలమైన సురభి రాజుల కోట, పురాతన దర్గాలు కూడా తేలాయి. వీటిని తిలకించేందుకు పర్యాటకులు ప్రతి సంవత్సరం పెద్దసంఖ్యలో వస్తుంటారు. సోమశిల సమీపంలో కృష్ణానదిలో బ్యాక్ వాటర్ మరో ఐదు టీఎంసీలు మాత్రమే.. శ్రీశైలం బ్యాక్ వాటర్ లెవెల్స్ వేగంగా తగ్గుతున్నాయి. కేఎల్ఐ ద్వారా ఇప్పటివరకు 33 టీఎంసీల నీటిని ఎత్తిపోశాం. మరో ఐదు టీఎంసీలు ఎత్తిపోసే వీలుంది. రోజూ ఎత్తిపోతలు చేపడుతుండటం వల్ల మోటార్లపై ప్రభావం పడుతోంది. రోజువారీగా చిన్నచిన్న మరమ్మతులు చేపడుతూ.. ఎత్తిపోతలు కొనసాగిస్తున్నాం. ఈ ఏడాది త్వరగా ఎత్తిపోతలు నిలిచిపోతే.. వెంటనే పాడైన మోటార్లకు మరమ్మతు చేయాలని భావిస్తున్నాం. – లోకిలాల్ నాయక్, డీఈ, నీటిపారుదలశాఖ కృష్ణానదిలో భారీగా పడిపోతున్న బ్యాక్ వాటర్ లెవల్స్ శ్రీశైలం డ్యాంలో 837 అడుగుల ఎత్తులో నీటిమట్టం గతేడాది కంటే నెలరోజులు ముందుగానే తగ్గుముఖం వచ్చేనెలలో కేఎల్ఐ ద్వారా ఎత్తిపోతలకు బ్రేక్ పడే అవకాశం ఇప్పటి వరకు 33 టీఎంసీలు పంపింగ్ -
సిబ్బంది కొరతతోనే..
ఉమ్మడి జిల్లాలోని పురపాలికల్లో పన్ను వసూళ్లకు బిల్ కలెక్టర్లే దిక్కయ్యారు. రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, సిబ్బంది సరిపడా లేకపోవడంతో వసూళ్లలో జాప్యం జరుగుతోందని అధికారులు బహిరంగంగానే చెబుతున్నారు. ప్రధాన మున్సిపాలిటీల్లో మినహా కొత్తగా ఏర్పాటైన వాటిలో ఇప్పటి వరకు రెవెన్యూ ఇన్స్పెక్టర్ల పోస్టులు ఖాళీగానే ఉన్నాయని తెలుస్తోంది. పన్నులు ఆన్లైన్లో నమోదు చేసే సమయంలో సాంకేతిక ఇబ్బందులు ఎదురవుతుండటం మరో సమస్యగా చెబుతున్నారు. వందశాతం లక్ష్యంగా.. ఏటా మార్చిలోనే అత్యధికంగా పన్ను వసూళ్లు అవుతాయి. ఆర్థిక సంవత్సరం ముగుస్తుంది.. ప్రజాపాలన–పట్టణ ప్రణాళిక కార్య క్రమంలో భాగంగా పన్ను వసూళ్లపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నాం. పుర ప్రజలు, వ్యాపారులు ఆస్తి పన్ను సకాలంలో చెల్లించి అభివృద్ధికి సహకరించాలి. వారం రోజులుగా పన్ను వసూళ్లపై ప్రత్యేక దృష్టిసారించాం. ఈ నెల 31 వరకు వంద శాతం పన్ను వసూలు చేసేందుకు కృషి చేస్తున్నాం. – నర్సయ్య, పుర కమిషనర్, నారాయణపేట ● -
క్రిమినల్ కేసులు నమోదు..
ఇటీవల ఇతర రాష్ట్రాల పోలీసులు ఇక్కడి వ్యాపారుల నుంచి బంగారు ఆభరణాలు రికవరీ చేసినట్లు మా దృష్టికి వచ్చింది. బాధితులకు న్యాయం చేస్తూనే.. దొంగ బంగారమని తెలిసి కొనుగోలుచేసే వ్యాపారులపై చట్టపరమైన చర్యలు తప్పవు. పదే పదే దొంగల నుంచి బంగారు ఆభరణాలు కొనుగోలు చేసిన వ్యాపారులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం. జిల్లాలోని బంగారు వ్యాపారుల వివరాలు సేకరించి.. అక్రమ దందాకు పాల్పడే వారిపై తగు చర్యలు తీసుకుంటాం. – మొగిలయ్య, డీఎస్పీ, గద్వాల ● -
ఆదాయం అంతంతే..
తలసరి ఆదాయంలో అట్టడుగునే నారాయణపేట, గద్వాల, వనపర్తి జిల్లాలు ● నారాయణపేట జిల్లా రాష్ట్రంలోనే 29వ స్థానం ● జీడీడీపీలోనూ పాలమూరు జిల్లాలు వెనుకంజ ● తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్ లుక్ సర్వేలో వెల్లడి సాక్షి, నాగర్కర్నూల్: దేశంలో ఇతర రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణ రాష్ట్ర తలసరి ఆదాయం గణనీయంగా పెరుగుతోంది. అన్ని రంగాల్లో క్రమంగా వృద్ధి కనిపిస్తోంది. కానీ రాష్ట్రంలో మిగతా జిల్లాల కన్నా ఉమ్మడి పాలమూరులోని మహబూబ్నగర్ మినహా నారాయణపేట, జోగుళాంబ గద్వాల, వనపర్తి, నాగర్కర్నూల్ జిల్లాలు తలసరి ఆదాయం విషయంలో అట్టడుగు స్థానంలో కొనసాగుతున్నాయి. నారాయణపేట జిల్లా రాష్ట్రంలోనే 28వ స్థానంలో కొనసాగుతుండగా, జోగుళాంబ గద్వాల జిల్లా 26వ స్థానంలో ఉంది. వస్తు సేవల ఉత్పత్తిలో ప్రామాణికంగా నిలిచే జీడీడీపీ విషయంలోనూ ఈ జిల్లాలు వెనుకంజలో ఉన్నాయి. తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్ లుక్ సర్వే 2026లో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ఏడాదిలో వ్యక్తులకు లభిస్తున్న సగటు ఆదాయం విషయంలో మహబూబ్నగర్ మినహా మిగతా జిల్లాలు అట్టడుగునే కొనసాగుతున్నాయి. మహబూబ్నగర్ తలసరి ఆదాయం రూ. 3.36 లక్షలతో రాష్ట్రంలోనే 6వ స్థానంలో మెరుగ్గా ఉంది. నారాయణపేట జిల్లా రూ.2.59 లక్షల తలసరి ఆదాయంతో 28 స్థానంలో, గద్వాల జిల్లా రూ. 2.66 లక్షలతో 26వ స్థానంలో ఉండగా, వనపర్తి జిల్లా రూ.2.74 లక్షలతో 21వ స్థానం, నాగర్కర్నూల్ జిల్లా రూ. 2.79 లక్షల తలసరి ఆదాయంతో 19వ స్థానంలో నిలిచింది. వస్తుసేవల ఉత్పత్తిలోనూ పాలమూరు జిల్లాలు వెనుకంజలో ఉన్నాయి. ప్రస్తుత ధరల వద్ద జీడీడీపీ రూ.37,456తో మహబూబ్నగర్ జిల్లా 11వ స్థానంతో మెరుగ్గా కనిపిస్తుండగా, మిగతా జిల్లాలు వెనుకబడ్డాయి. నారాయణపేట జిల్లా రూ.17,278 జీడీపీపీతో 29వ స్థానంలో ఉండగా, వనపర్తి జిల్లా 27వ స్థానం, గద్వాల 26వ స్థానం, నాగర్కర్నూల్ జిల్లా 19వ స్థానంలో ఉంది. ఉమ్మడి పాలమూరు జిల్లావ్యాప్తంగా ఆశించినంతంగా పరిశ్రమలు ఏర్పాటు కావడం లేదు. చిన్న తరహా పరిశ్రమలు, ఉత్పత్తి కేంద్రాల ద్వారా స్థానికులు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి. కానీ ఉమ్మడి జిల్లాలో పరిశ్రమలు, ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటు తక్కువగా ఉంది. అత్యధికంగా మహబూబ్నగర్ జిల్లాలో 8,165 ఉత్పత్తి యూనిట్లు ఏర్పాటుకాగా, అతి తక్కువగా నారాయణపేట జిల్లాలో 2,298 యూనిట్లు మాత్రమే ఉన్నాయి. ఉపాధి హామీ పథకం కింద కూలీలకు పూర్తిస్థాయిలో పనిదినాలు కల్పించి వారి ఆదాయం పెంచాల్సి ఉండగా, ఉమ్మడి జిల్లాలో భిన్నమైన పరిస్థితులు ఉన్నాయి. కూలీలకు లక్ష్యం మేరకు పూర్తిస్థాయిలో పనిదినాలు కల్పించడం లేదు. ఉపాధి హామీలో లక్ష్య సాధన విషయంలోనూ మహబూబ్నగర్ మినహా మిగతా జిల్లాలు వెనుకే ఉన్నాయి. మహబూబ్నగర్లో 88.60 శాతం లక్ష్యం చేరుకోగా, వనపర్తి జిల్లాలో అత్యల్పంగా 73.10 శాతం, గద్వాల జిల్లాలో 74.60 శాతం, నారాయణపేట జిల్లాలో 77.40 శాతం, నాగర్కర్నూల్ జిల్లాలో 81.60 శాతం లక్ష్యం నెరవేరింది. వ్యవసాయ రంగంలో మిశ్రమ పంటల విధానం, పంటల సాంద్రతలో ఉమ్మడి జిల్లా చివరన ఉంది. వనపర్తి జిల్లాలో పంటల సాంద్రత 169 కాగా, మహబూబ్నగర్లో 146, నాగర్కర్నూల్ 143, నారాయణపేట 133, గద్వాలలో 132 పాయింట్లుగా పంటల సాంద్రత నమోదైంది. -
హైలెవల్ వంతెన నిర్మించి తీరుతాం
ఆత్మకూర్: జూరాల–కొత్తపల్లి గ్రామాల మధ్య కృష్ణానదిపై హైలెవల్ వంతెన నిర్మాణం పూర్తిచేసి తీరుతామని.. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా వెనకడుగు వేసేది లేదని రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి స్పష్టం చేశారు. శనివారం రంజాన్ సందర్భంగా స్థానిక ఈద్గా వద్ద ముస్లింలకు పండుగ శుభాకాంక్షలు తెలిపిన అనంతరం ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో 87 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేసి మాట్లాడారు. ఆత్మకూర్కు గత వైభవం తీసుకొచ్చేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని, హైలెవల్ వంతెన నిర్మాణాన్ని అడుగడుగున అడ్డుకునేందుకు కొందరు కుట్రలు చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. పురపాలికలో రెండేళ్ల వ్యవధిలో రూ.400 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని, ఆత్మకూర్ రెవెన్యూ డివిజన్ సాధించడమే తన లక్ష్యమని చెప్పారు. పదవులు కాదు.. అభివృద్ధి శాశ్వతం... అమరచింత: పదవులు ముఖ్యం కాదని.. మనం చేసిన అభివృద్ధి పనులే శాశ్వతంగా నిలిచిపోతాయని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. అమరచింత పుర కార్యాలయ ఆవరణలో శనివారం నిర్వహించిన పుర సభ్యుల పదవీ బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. రాజకీయాలకు అతీతంగా అర్హులైన పేదలకు సంక్షేమ పథకాలు అందాలన్నారు. ప్రజల ఆశీర్వాదంతో ఎన్నికై న ప్రజాప్రతినిధులు వారి సేవకు పునరంకితం కావాలని సూచించారు. మండలంలో కొత్తగా గోదాంల నిర్మాణాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. మండలానికి మొదటి విడత 450 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామని.. అవి పూర్తిచేస్తే మరో 500 ఇళ్లు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి మున్సిపాల్టీకి రూ.15 కోట్లు విడుదల చేసినట్లు చెప్పారు. పురపాలికకు పొక్లెయిన్, డోజర్ మంజూరు చేయాలని చైర్పర్సన్ జింక సువర్ణ, వైస్ చైర్పర్సన్ రాధ మంత్రికి విన్నవించగా.. ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో టీపీసీసీ కల్లుగీత సెల్ చైర్మన్ కేశం నాగరాజుగౌడ్, కౌన్సిలర్లు మాధవి, రాములు, పార్టీ మండల అధ్యక్షుడు మహేందర్రెడ్డి, పట్టణ అధ్యక్షుడు అరుణ్కుమార్, నాయకులు తౌఫిక్, శ్యామ్, కమలాకర్గౌడ్, నందిమళ్ల సర్పంచ్ రాజేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
భక్తిశ్రద్ధలతో రంజాన్ వేడుకలు
–8లో uగద్వాల: జిల్లావ్యాప్తంగా శనివారం ఈద్–ఉల్–ఫితర్ (రంజాన్) పర్వదినాన్ని ముస్లింలు భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. ఉదయం నుంచే మసీదులు, ఈద్గాల వద్దకు చేరుకొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకొని పండుగ శుభాకాంక్షలు తెలుపుకొన్నారు. రంజాన్ను పురస్కరించుకొని జిల్లాకేంద్రంలోని ఈద్గా వద్ద కలెక్టర్ రిజ్వాన్బాషా షేక్ స్థానిక ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డితో కలిసి ప్రార్థనలు చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ శాంతి, సామరస్యాలకు ప్రతీక రంజాన్ పండుగ అన్నారు. రంజాన్ పరస్పర గౌరవం, సేవాభావం, దానగుణాన్ని పెంపొందించే పవిత్ర మాసమన్నారు. హిందువులు, ముస్లింలు సహా అన్ని మతాల ప్రజలు కలసిమెలసి సఖ్యతతో జీవించాలని, సమాజంలో ఐక్యత, సామరస్యాన్ని కాపాడాలని ఆకాంక్షించారు. ముస్లింలకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి మాట్లాడుతూ అన్ని కులాలు, మతాల ప్రజలు పరస్పరం గౌరవించుకుంటూ ఐక్యతతో మెలగాలన్నారు. అదేవిధంగా ముస్లిం మతపెద్దలు ప్రత్యేక ప్రార్థనలు చేసి సందేశాన్ని వినిపించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ జయలక్ష్మి, వైస్ చైర్మన్ శంకర్ తదితరులు పాల్గొన్నారు. -
ఆదిశిలా క్షేత్రంలో ప్రత్యేక పూజలు
మల్దకల్: ఆదిశిలా క్షేత్రమైన స్వయంభూ లక్ష్మీవేంకటేశ్వరస్వామిని శనివారం అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ దంపతులు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ ప్రహ్లాదరావు, అర్చకులు మధుసూదనాచారి, రవిచారి, అధికారులు వారికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అర్చకులు ఆలయ విశిష్టతను వివరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. శేషవస్త్రంతో సత్కరించి జ్ఞాపిక బహూకరించారు. తుమ్మిళ్ల ప్రాజెక్ట్లో రిజర్వాయర్ నిర్మించరా? ‘చలో అసెంబ్లీ’ని జయప్రదం చేయండి గద్వాల: ఐకేపీ వీఓఏల సమస్యల పరిష్కారం కోసం బుధవారం సీఐటీయూ ఆధ్వర్యంలో చేపట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఐకేపీ వీఓఏ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు అంజి పిలుపునిచ్చారు. శనివారం జిల్లాకేంద్రంలోని సీఐటీయూ కార్యాలయంలో నిర్వహించిన జిల్లా కమిటీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం ఏర్పాటు చేసి రెండేళ్లు కావొస్తున్నా ఇంకా నెరవేర్చడం లేదన్నారు. ప్రస్తుత అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలోనే నిధులు కేటాయించి ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడంలో భాగంలో బుధవారం చలో అసెంబ్లీ కార్యక్రమం చేపట్టామని, కార్యక్రమంలో వీఓఏ ఉద్యోగులు పెద్దసంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. సమావేశంలో నాయకులు శ్రీనివాస్, తిరుమలేష్, బీసమ్మ, వెంకట్రామయ్య, మునీశ్వరి, రాధమ్మ పాల్గొన్నారు. -
ప్రత్యేక నిధుల్లేవ్..!
అంచనాల మేరకు దక్కని ప్రాధాన్యత సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్/ సాక్షి, నాగర్కర్నూల్: రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ప్రవేశపెట్టిన బడ్జెట్పై ఉమ్మడి పాలమూరు జిల్లాకు నిరాశే మిగిల్చింది. ప్రధానంగా పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్ట్ పూర్తి చేసేందుకు అధిక మొత్తంలో ప్రత్యేక నిధులు సమకూరుస్తారని భావించగా, కేవలం రూ.1,800 కోట్ల కేటాయింపులు దక్కాయి. గతేడాది బడ్జెట్లో ఈ ప్రాజెక్టుకు రూ.2,514 కోట్లు ఇవ్వగా.. ఈసారి రూ.714 కోట్ల తగ్గించారు. కాగా.. జిల్లావ్యాప్తంగా పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్ట్ల కోసం మొత్తం రూ.4252.53 కోట్లు కేటాయించగా... మక్తల్– పేట–కొడంగల్ ఎత్తిపోతల పథకానికి పెద్దపీట వేశారు. అసెంబ్లీలో రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్పై ఉమ్మడి జిల్లావాసుల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. సంక్షేమం కోసం కొత్త పథకాలు.. రాష్ట్ర బడ్జెట్లో ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఈసారి కొత్త పథకాలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందుకు అవసరమైన నిధులు కేటాయింపులు చేసింది. ప్రధానంగా విద్యార్థుల కోసం అల్పాహారం పథకం అమలు చేయనుంది. 2026– 27 విద్యా సంవత్సరం ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ప్రీప్రైమరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు బ్రేక్ఫాస్ట్ అందించనున్నారు. వారంలో మూడు రోజులపాటు పాలు, మూడు రోజులపాటు రాగిజావతో చేసిన నాణ్యమైన అల్పాహారం అందిస్తారు. అలాగే ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఉదయం అల్పాహారంతోపాటు మధ్యాహ్నం భోజన సౌకర్యం కల్పిస్తారు. అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఈ పథకం అమలుకానుంది. ఇంటర్మీడియట్ చదివే దివ్యాంగ విద్యార్థుల కోసం రెట్రోఫిట్టెడ్ మోటరైజ్డ్ టూ వీలర్ వాహనాలను పంపిణీ చేయనున్నారు. విదేశాల్లో చదివే విద్యార్థుల కోసం ఉపాధి, భాషా నైపుణ్యాల కోసం ప్రత్యేక పథకాన్ని అమలుచేయనున్నారు. పెండింగ్లో ఉన్న వాటికి.. ఉమ్మడి జిల్లాలో దశాబ్దాల కాలంపాటు పెండింగ్లోనే ఉన్న సాగునీటి ప్రాజెక్ట్లకు ఈ బడ్జెట్లో ప్రభుత్వం నిధులు కేటాయించింది. ప్రధానంగా కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కింద కాల్వలు, డిస్ట్రిబ్యూటరీ కెనాళ్ల నిర్మాణం చేపట్టాల్సి ఉంది. ఈ పనుల కోసం రూ.800 కోట్లు కేటాయించింది. కోయిల్సాగర్ కోసం రూ.56.13 కోట్లు, సంగంబండ రూ.25.23 కోట్లు, ఆర్డీఎస్ రూ.88 కోట్లు, నెట్టెంపాడు ప్రాజెక్ట్కు రూ.232.50 కోట్లు, భీమా ఎత్తిపోతలకు రూ. 119.22 కోట్లు, జూరాల రిజర్వాయర్ గేట్ల మరమ్మతు, ఇతర పనుల కోసం రూ.3 కోట్లు కేటాయించింది. ఉమ్మడి జిల్లా ప్రాజెక్టులకు రూ.4,252.53 కోట్లు కేటాయింపు మక్తల్– పేట–కొడంగల్ లిఫ్టులకు పెద్దపీట ‘పాలమూరు–రంగారెడ్డి’ ప్రాజెక్టులకు మరోసారి నిరాశే.. కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి రూ.800 కోట్లు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి వెచ్చింపు -
రైతుకు భరోసా..
● రేపటి నుంచి ఎకరాకు రూ.6 వేల చొప్పున రైతుల ఖాతాలో జమ ● జిల్లాల్లో మొత్తం 1,69,299 మంది రైతులు గద్వాల: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రైతన్నలకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు అందించనుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో రైతుభరోసా రూ.18 వేల కోట్ల నిధులు కేటాయింపులు చేసింది. దీంతో యాసంగిలో రైతులకు ఇవ్వాల్సిన రైతుభరోసా డబ్బులు ఆదివారం నుంచి వారి బ్యాంకు ఖాతాలో జమ కానున్నాయి. జిల్లాలో మొత్తం 1,69,299 మంది రైతులు ఉన్నారు. అదేవిధంగా ఈ ఏడాది ఫిబ్రవరి 28 వరకు పాస్బుక్కులు పొందిన వారు మరో 6 వేల మంది రైతులకు సైతం రైతుభరోసా అందుకునేందుకు అర్హత పొందారు. మొత్తం జిల్లావ్యాప్తంగా సాగు విస్తీర్ణం 3,52,821 ఎకరాలు ఉంది. కాగా మొదటి విడతలో ఎకరం భూమి ఉన్న 1,64,546 మంది రైతులకు ఎకరాకు రూ.6 వేల చొప్పున రైతుభరోసా అందనుంది. 1,69,299 రైతులు.. 3,52,400 ఎకరాలు జిల్లావ్యాప్తంగా మొత్తం 1,69,299 మంది రైతులు ఉండగా.. జిల్లావ్యాప్తంగా 3,52,400 ఎకరాల భూమి ఉంది. వీరిలో తొలి విడతలో ఎకరాకు రూ.6 వేల చొప్పున రైతులకు పెట్టుబడి సాయం కింద అందజేయనున్నారు. గత ఖరీఫ్ సీజన్లో రైతుభరోసా కింద మొత్తం 1,69,299 మంది రైతులకు ఎకరాకు రూ.6 వేల చొప్పున రూ.268.84కోట్లు పెట్టుబడి సాయం కింద వారి ఖాతాలో జమచేశారు. రబీలో కొత్తగా మరో 6 వేల మంది రైతులు పాస్బుక్కులు పొందగా వారికి కూడా ఈసారి రైతుభరోసా అందనుంది. అంటే 1.75 లక్షలకుపైగా రైతులకు ఎకరాకు రూ.6 వేల చొప్పున రైతుభరోసా అందనుంది. అర్హులందరికీ అందిస్తాం.. రైతుభరోసా పథకం కింద ఆదివారం నుంచి ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయం కింద ఎకరాకు రూ.6 వేల చొప్పున అందించనుంది. వ్యవసాయ సాగు యోగ్యమైన ప్రతి ఎకరాకు రైతుభరోసా కింద పెట్టుబడి సాయం అందుతుంది. అదేవిధంగా ఈ ఏడాది ఫిబ్రవరి 28 వరకు కొత్తగా పాస్బుక్కులు పొందిన వారికి సైతం రైతుభరోసా వస్తుంది. కొత్త పాసుబుక్కులు పొందిన రైతులు ఏఈఓలకు వివరాలు అందిస్తే వారికి రైతుభరోసా లభిస్తుంది. – సక్రియానాయక్, ఏడీఏ -
మోసపూరిత హామీలు..
ప్రజా సంక్షేమానికి పెద్దపీట.. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేసింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీల కోసం రూ.50 వేల కోట్లు కేటాయింపులు చేసింది. ఇందులో ప్రధానంగా పేదలకు సంబంధించి ఇందిరమ్మ ఇళ్లు, ఆసరా పింఛన్లు, గృహజ్యోతి ఉచిత విద్యుత్, రైతుభరోసా, మహాలక్ష్మి, సన్నవడ్ల బోనస్ వంటి పథకాలకు పెద్దఎత్తున నిధులు కేటాయించారు. అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం చేస్తూ ముందుకు వెళ్తున్నారు. – బండ్ల కృష్ణమోహన్రెడ్డి, ఎమ్మెల్యే, గద్వాల ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ అమలు సాధ్యం కాని ఉచిత హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత హామీలను పూర్తిగా విస్మరించి ప్రజలను నిలువునా మోసం చేసింది. అధికారంలోకి వచ్చిన అనంతరం ఒక్క హామీ పూర్తిగా నెరవేర్చలేదు. యువతకు జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ భృతి, వృద్ధాప్య, వితంతు, దివ్యాంగ పింఛన్లు, కల్యాణలక్ష్మి, పేదలకు గృహ నిర్మాణ పథకం, రైతుభరోసా వంటి అనేక హామీలను తుంగలో తొక్కేశారు. – రామాంజనేయులు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు -
విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు
అయిజ: అధికారులు, సిబ్బంది విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ రిజ్వాన్బాషా షేక్ అన్నారు. శుక్రవారం అయిజలోని పీహెచ్సీని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆయన భవనం అపరిశుభ్రంగా ఉండటంతో సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడ వైద్య సిబ్బంది అటెండెన్స్ రిజిస్టర్లో సరైన సంతకాలు చేయకపోవడం, లీవ్ లెటర్ ఇవ్వకుండా గైర్హాజరు కావడం, సంతకాలు పెట్టి వెళ్లిపోవడం వంటి కారణాలతో 9 మందికి షోకాజు నోటీసులు ఇవ్వాలని డీఎంహెచ్ఓ సంధ్య కిరణ్మయిని ఫోన్లో ఆదేశించారు. అలాగే ఒకరిని సస్పెండ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. అనంతరం లక్ష్మీశ్రీనివాస గ్యాస్ ఏజెన్సీ కార్యాలయం, హెచ్పీ గ్యాస్ గోదాంలను సందర్శించారు. ఏజెన్సీ నిర్వాహకులు రాంకుమార్తో మాట్లాడి గ్యాస్ సిలిండర్లు బుక్ చేసుకుంటున్న వారి సంఖ్య, గోదాంకు ప్రతిరోజు వస్తున్న సిలిండర్ల గురించి అడిగి తెలుసుకున్నారు. గ్యాస్ సిలిండర్ల కొరత లేదని, నిర్ణీత గడువులోగా గ్యాస్ సిలిండర్ కోసం బుక్ చేసుకున్న వారికి ఓటీపీ వస్తుందని, నిబంధనలు పాటించకుండా బుక్ చేసుకుంటే ఉపయోగం లేదని చెప్పారు. ఏజెన్సీ వద్ద వినియోగదారులు బారులుతీరకుండా వారికి అవసరమైన సమాచారాన్ని అందజేసేందుకు హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలని డీపీఆర్ఓ స్వామికుమార్ను ఆదేశించారు. అనంతరం కేజీబీవీలో వంటలను పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి వసతుల గురించి ఆరాతీశారు. ఏవైనా సమస్యలు ఉంటే తనకు తెలియజేయాలని సూచించారు. అలాగే ఆగ్రో రైతు సేవా కేంద్రం తనిఖీ చేసి.. స్టాక్ రిజిస్టర్, ధరల పట్టికను పరిశీలించారు. జిల్లాలో ఫార్మర్ రిజిస్ట్రీ వేగవంతం చేయాలని ఆదేశించారు. -
లక్ష్యం కొండంత.. నిధులు అరకొర
ఉమ్మడి జిల్లాకు ఆశాదీపంగా ఉన్న పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్ట్ పూర్తిచేసేందుకు ప్రభుత్వం మరోసారి గడువు పొడిగించింది. మరో 20 నెలల్లో ప్రాజెక్ట్ పనులు పూర్తిచేసి ఆయకట్టుకు సాగునీరు అందిస్తామని చెబుతోంది. అయితే ఈ మేరకు నిర్మాణం పూర్తి కావాలంటే ఇంకా కనీసం రూ.22 వేల కోట్లు అవసరమని ప్రభుత్వమే చెబుతోంది. ఈ లెక్కన ప్రాజెక్ట్ను గడువులోగా పూర్తి చేయాలంటే ఈ బడ్జెట్లోనే సింహభాగం నిధులు అవసరం. కానీ, ఇందుకు బదులుగా కేవలం రూ.1, 800 కోట్లే కేటాయించడంతో పనుల పురోగతిపై నీలినీడలు అలుముకొన్నాయి. రూ.20 వేల కోట్లకుపైగా నిధులు అవసరం ఉంటే ఇంత తక్కువ కేటాయించడంపై సాగునీటి రంగ నిపుణులు పెదవి విరుస్తున్నారు. ప్రభుత్వం నిర్దేశించుకున్న గడువులోగా ప్రాజెక్ట్ పూర్తి చేయడం కష్టమేనన్న భావన నెలకొంది. కొడంగల్కు అధిక ప్రాధాన్యం.. ఈసారి రాష్ట్ర బడ్జెట్లో పేట–కొడంగల్–మక్తల్ ఎత్తిపోతల పథకానికి అధిక ప్రాధాన్యం లభించింది. తొలుత రూ.4,350 కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభించిన ఈ ప్రాజెక్ట్ను రెండు విడతల్లో నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. ఇప్పటికే మొదటి విడత కోసం రూ.1,126 కోట్లను కేటాయించగా.. రెండో విడత కింద మరోసారి రూ.2,945 కోట్లు మంజూరు చేశారు. ఈ ప్రాజెక్ట్ను పూర్తిచేసేందుకు తాజాగా రాష్ట్ర బడ్జెట్లో రూ.1,103.28 కోట్ల కేటాయింపులు దక్కాయి. రెండో విడతలో ఇందిరమ్మ ఇళ్లు రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ పథకాన్ని మరింత వేగంగా అమలు చేసేందుకు బడ్జెట్లో నిధులు కేటాయించింది. ఇప్పటికే మొదటి విడత కింద ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను చేపట్టగా, రెండో విడతలోనూ కొత్త లబ్ధిదారులకు ఇళ్లను మంజూరు చేయనుంది. -
మంత్రి ఇంటి ఎదుట ఆశాల ధర్నా
మక్తల్: తమ సమస్యలు పరిష్కరించాలంటూ శుక్రవారం పట్టణంలోని రాష్ట్ర పశుసంవర్దకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి నివాసం ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో ఆశా కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా ఆశా కార్యకర్తలు సంఘం అధ్యక్షురాలు సావిత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో 28 వేల మంది ఆశా కార్యకర్తలు 20 ఏళ్లుగా పేద ప్రజలకు ఆరోగ్య సేవలు అందిస్తున్నారని చెప్పారు. అధికారంలోకి రాగానే రూ.18 వేలు ఇస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్పార్టీ హామీ ఇచ్చిందని.. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రకటించాలని, ఇతర సమస్యల పరిష్కారానికి ఎన్ఎచ్ఎంకు సరిపడా నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. అలాగే రూ.50 లక్షల ఇన్సూరెన్స్, రూ.5 లక్షల రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని కోరారు. కుష్టు సర్వే, ఎన్నికలు, పరీక్షల విధులకు సంబంధించిన పెండింగ్ బిల్లులు చెల్లించాలన్నారు. అనంతరం మంత్రి పీఏ యాదయ్యకు వినతిపత్రం అందజేశారు. అంతకుముందు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు.సీఐటీయూ నాయకులు వెంకట్రాంరెడ్డి, బాల్రాం, రాజు, నిక్సన్, గోవిందరాజ్, నరహరి, గోవిందమ్మ, యశోద, ఇందిరమ్మ, సుజాత, లక్ష్మి, వెంకటలక్ష్మి పాల్గొన్నారు. తూముకు అడ్డుకట్ట కల్వకుర్తి రూరల్: కల్వకుర్తి ఎత్తిపోతల కాల్వ నుంచి నీరు కిందికి రాకుండా తూము వద్ద అడ్డుకట్ట వేయడంపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని ముకురాల అన్నారం సమీపంలో కొంత మంది రైతులు కల్వర్టు వద్ద రాళ్లు వేయడాన్ని పలువురు రైతులు అభ్యంతరం తెలియజేశారు. వెంటనే రాళ్లు తొలగించి నీరు వెళ్లే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
ఎంపీడీఓను కలిసి విన్నవించా..
ప్రస్తుతం నేను తుమ్మిళ్లగా సర్పంచుగా ఉన్నాను. గతంలో ఎంపీటీసీగా కూడా పనిచేశాను. ఆ సమయంలో ప్రతి మూడు నెలలకు ఒకసారి సర్వసభ్య సమావేశం నిర్వహించేవారు. అప్పుడు అన్ని శాఖల అధికారులు హాజరై.. సమస్యలు, అభివృద్ధిపై సమీక్ష నిర్వహించేవారు. ప్రస్తుతం సమస్యలు ఎవరికో చెప్పాలో తెలియడం లేదు. ప్రతి సమస్యను ప్రజావాణిలో తెలిపేందుకు గద్వాలకు వెళ్లాలంటే ఇబ్బంది. గత వారంలో ఇదే విషయంపై ఎంపీడీఓను కలిసి వివరించాను. – అడివప్ప, సర్పంచ్, తుమ్మిళ్ల, రాజోళి మండలం ● -
ప్రభుత్వ విప్గా యెన్నం
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: మహబూబ్నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డికి ప్రభుత్వ విప్గా అవకాశం దక్కింది. ఈమేరకు గురువారం రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఉత్తర్వులు జారీచేశారు. ఉమ్మడి జిల్లాలో మహబూబ్నగర్ ఎమ్మెల్యేకు కీలకమైన విప్ పదవి వరించడంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఉమ్మడి జిల్లాకు చెందిన రేవంత్రెడ్డి ముఖ్యమంత్రి కాగా, మంత్రులుగా జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరిలకు అవకాశం దక్కింది. ప్రణాళికా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా జి.చిన్నారెడ్డి ఉన్నారు. తాజాగా మహబూబ్నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డికి ప్రభుత్వ విప్గా అవకాశం రావడంతో ఆయన సైతం కేబినెట్ సత్సమాన ర్యాంకులో వ్యవహరించనున్నారు. 2012 ఉప ఎన్నికలో యెన్నం మహబూబ్నగర్ అసెంబ్లీ స్థానం నుంచి బీజేపీ తరపున మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2023 ఎన్నికల్లో మహబూబ్నగర్ నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. బీఆర్ఎస్ హయాంలో ఇద్దరికీ.. ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్ పాలనలో ఇద్దరు మంత్రులతో పాటు మరో ఇద్దరు ప్రభుత్వ విప్లుగా వ్యవహరించారు. బీఆర్ఎస్ హయాంలో గతంలో మంత్రులుగా శ్రీనివాస్గౌడ్, నిరంజన్రెడ్డితో పాటు ప్రభుత్వ విప్లుగా ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్రెడ్డి, గువ్వల బాలరాజు వ్యవహరించారు. 2016లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా కాంగ్రెస్ నుంచి గెలుపొందిన కూచుకుళ్ల అనంతరం బీఆర్ఎస్లో చేరారు. 2019లో బీఆర్ఎస్ ఆయనకు ప్రభుత్వ విప్గా అవకాశం కల్పించింది. ● మహబూబ్నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్రెడ్డికి అవకాశం ● ఉమ్మడి జిల్లాకు మరో కీలక పదవి -
సమస్యల వాణి.. చెప్పుకొనే వేదికేది?
జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): జిల్లాలో కొత్తగా ఎన్నికై న సర్పంచులు గ్రామ సమస్యలను ఎవరికి చెప్పుకోవాలో తెలియని అయోమయ పరిస్థితిలో ఉన్నారు. సమస్యలను ప్రభుత్వానికి, అధికారులకు తెలియజేయడానికి సరైన వేదిక దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో మండల పరిషత్ పాలకవర్గం ఉన్నప్పుడు మూడు నెలలకోసారి మండల సభలు నిర్వహించేవారు. అప్పుడు మండల సభలో సర్పంచులు తమ గ్రామ సమస్యలు అధికారుల దృష్టికి తెచ్చేవారు. ఫలితంగా ఆయా సమస్యలు కొద్దో గొప్పో పరిష్కారానికి నోచుకునేవి. కానీ, ఇప్పుడు రెండేళ్లుగా ఎన్నికలు జరపకపోవడంతో మండల పాలకవర్గాలు లేవు. దీంతో గత డిసెంబర్లో కొత్తగా ఎన్నికై న సర్పంచులు తమ సమస్యలు ఎవరికి చెప్పాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎలా చెప్పాలి.. గడువు ముగిసిన వెంటనే పంచాయతీలు, మండల పరిషత్ పాలకవర్గాలకు ఎన్నికలు నిర్వహించకపోవడంతో స్థానిక సంస్థల పాలన అస్తవ్యస్తంగా మారింది. రెండేళ్ల అనంతరం గత డిసెంబర్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించారు. అప్పటికే గ్రామాల్లో సమస్యలు పేరుకుపోయాయి. పలుచోట్ల సీసీరోడ్లు, మురుగు కాల్వలు నిర్మించాల్సి ఉంది. రోడ్ల మరమ్మతు చేపట్టాలి. వీధిదీపాలు, పారిశుద్ధ్యం మెరుగు తదితర అభివృద్ధి పనుల కోసం నిధుల లేమి వెంటాడుతోంది. ఈ క్రమంలో సర్పంచులు తమ గ్రామాల సమస్యలు ఎలా తెలపాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం మండలస్థాయి అధికారులకు తమకు మధ్య పరిచయం కోసమైనా మండల సభలు నిర్వహిస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. ఎవరికి విన్నవించాలో తెలియని స్థితిలో సర్పంచ్లు గతంలో మూడు నెలలకోసారి మండల సభలు ప్రస్తుతం పాలకవర్గాలు లేకపోవడంతో అయోమయం -
ఉద్యానానికి ఊతం..
జిల్లాలో విస్తరిస్తున్న ఉద్యాన పంటలు గద్వాల వ్యవసాయం: జిల్లాలోని నేలలు, వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండటంతో ఉద్యాన పంటల సాగు ఏటా పెరుగుతోంది. కూరగాయలు, ఎండుమిర్చిలకు తోడు ఏటా కొత్తగా పండ్ల తోటలు, ఆయిల్పాం తదితర పంటలపై ఇక్కడి రైతులు ఆసక్తి కనబరుస్తున్నారు. ఉద్యాన పంటలకు సంబంధించిన పథకాలకు డిమాండ్ మేరకు నిధులు మంజూరు చేస్తే ఉద్యాన పంటల సాగు మరింత పెరిగే అవకాశం ఉంటుంది. నేలలు, వాతావరణం జిల్లాలో ఉద్యాన పంటలకు అనువైన పరిస్థితులు ఉన్నాయి. పండ్లతోటలు, ఆయిల్పాం, కూరగాయల సాగుకు ఎర్రటి, ఒండ్రుతో కూడిన ఎర్రటి నేలలు ఉండాలి. నడిగడ్డలో ఇలాంటి నేలల శాతమే ఎక్కువగా ఉంది. సాగునీటి విషయానికి వస్తే జూరాల, ఆర్డీఎస్ ప్రాజెక్ట్లతోపాటు నెట్టెంపాడు ఎత్తిపోథల, రిజర్వాయర్లు, నోటిఫైడ్ చెరువులు, చెరువులు ఉన్నాయి. వీటన్నింటి ఫలితంగా బోర్లు, బావుల్లో ఆశించిన స్థాయిలో నీరు ఉంటోంది. సాధారణంగా ఉద్యాన పంటలను బోర్లు, బావుల కిందే సాగు చేస్తారు. ఇక వాతావరణ విషయానికి వస్తే వేసవిలో పగటి ఉష్ణోగ్రతలు ఎంత ఉన్నా.. సాయంత్రం నుంచి రాత్రి వరకు చల్లగా ఉంటుంది. శీతాకాలంలో ఎంత చలి ఉన్నా.. ఉష్ణోగ్రతలు పూర్తిగా పడిపోవు. ఇలాంటి వాతావరణ పరిస్థితులు ఉద్యాన పంటలకు అనుకూలంగా ఉంటాయని అధికారులు చెబుతున్నారు. ఏడాది పంటల విస్తీర్ణం 2019– 20 52,172 2020– 21 53,500 2021– 22 54,200 2022– 23 58,000 2023– 24 72,800 2024– 25 49,500 2025– 26 55,500 ఏటేటా పెరుగుదల.. నేలలు, వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండటంతో ఏటా ఉద్యాన పంటల సాగు పెరుగుతోంది. ప్రతి ఏడాది రైతులు కొత్తగా పండ్లు, ఆయిల్పాం తోటలు వేస్తున్నారు. ఇక కూరగాయల విషయానికి వస్తే ఎండుమిర్చి, ఉల్లితోపాటు వంకాయ, బీర, కాకర, టమాట, క్యాలీఫ్లవర్, క్యాబేజీ, పచ్చిమిర్చి, సోరకాయ తదితర కూరగాయలను సాగు చేస్తున్నారు. ఈఏడాది వానాకాలం సీజన్లో అధిక వర్షాలు కొంత ఉద్యాన పంటలను దెబ్బతీసినప్పటికీ సాగు బాగా జరిగింది. వానాకాలం సీజన్లో కూరగాయల సాగు కొంత తగ్గినా.. యాసంగిలో పెరిగింది. ఎండుమిర్చి సాగు కొంత తగ్గింది. ఆయిల్పాం సాగుసైతం ఆశించిన స్థాయిలో సాగుతోంది. పలు పంటల్లో అంతర్ పంటల సాగుగా ఉద్యాన పంటలను ఇక్కడి రైతులు వేస్తున్నారు. గడిచిన ఐదేళ్లలో ఉద్యాన పంటల సాగు ఇలా (ఎకరాలలో).. పండ్లు, ఆయిల్పాం సాగుౖపైరెతుల ఆసక్తి విస్తారంగా కూరగాయల తోటలు గతేడాది తగ్గినా..ఈసారి పెరిగిన సాగు ప్రోత్సహిస్తే మరింత మంది ముందుకు.. ఆశించిన స్థాయిలో సాగు.. ఉద్యానవన పంటలకు జిల్లా నేలలు, వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. ఇక్కడి రైతులు ఉన్యాన పంటలపై ఆసక్తి కనబరుస్తున్నారు. ఎండుమిర్చి సాగు ఈ ఏడాది కొంత తగ్గింది. ఆయిల్పాం సాగు ఆశించిన స్థాయిలో ఉంది. ఉద్యాన పంటలు సాగు చేసే రైతులను ప్రోత్సహిస్తున్నాం. – ఎంఏ అక్బర్, జిల్లా ఉద్యానవన శాఖాధికారి -
భక్తిశ్రద్ధలతో ఉగాది పండుగ
గద్వాల న్యూటౌన్: తెలుగు సంవత్సరాది ఉగాది వేడుకలను జిల్లావాసులు గురువారం భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. శ్రీపరాభవసు నామ సంవత్సరం తీపి, చేదు అనుభవనాలను మరిచి ఘన స్వాగతం పలికారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేపట్టారు. గ్రామాల్లో వేకువజామునే చేలకు చేరిన అన్నదాతలు దేవతామూర్తుల విగ్రహాలకు ప్రత్యేక పూజలు చేసి సాగు పనులకు శ్రీకారం చుట్టారు. కొత్త దుస్తులు ధరించి నూతన సంవత్సరంలో అంతా శుభం కలగాలని దేవుడిని ప్రార్థించారు. పండితులు పంచాగ శ్రవణాలు చదువుతూ జిల్లా భవిష్యత్ను వివరించడంతోపాటు ప్రజలు తమతమ రాశి ఫలాలు, జాతక చక్రాలు, గ్రహస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకున్నారు. జిల్లాకేంద్రంలోని సుంకులమ్మ, ఈదమ్మ అమ్మవార్ల ఆలయాలను భక్తులు వేలాదిగా దర్శించుకున్నారు. ఉదయం 8 గంటల నుంచే క్యూలైన్లలో బారులుదీరారు. ఆలయాల్లో ఉగాది పచ్చడిని పంపిణీ చేశారు. సిరిసంపదలు కలగాలని.. గ్రామాల్లో రైతులు వేకువజామునే చేలకు వెళ్లి అరక పూజలు చేసి.. నాగలి తోలి వ్యవసాయ పనులకు శ్రీకారం చుట్టారు. గోవులను అలకరించి పూజలు చేసి పొలాల్లో ఐదుసార్లు నాగిలిసాళ్లు పట్టించారు. ఇలా చేయడం వల్ల పాడి పంటలు బాగా పండుతాయని రైతులు నమ్ముతారు. చిరుధాన్యాలను పొలాల్లో చల్లి దేవుడికి కొబ్బరికాయ కొట్టి, నైవేద్యం పెట్టారు. వివిధ కులవృత్తుల వారు వస్తువులకు, పరికరాలకు పూజలు చేశారు. ఆటంకం లేకుండా గ్యాస్ సరఫరా : కలెక్టర్ గద్వాల: జిల్లాలో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల సరఫరాలో ఎలాంటి ఆటంకం లేకుండా పకడ్బందీ చర్యలు చేపట్టినట్లు కలెక్టర్ రిజ్వాన్బాషా షేక్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో గ్యాస్ సిలిండర్ల వినియోగదారులకు సరిపడా నిల్వలు ఉన్నాయన్నారు. ఒకసారి గ్యాస్ రీఫిల్ బుకింగ్ చేసుకున్న తర్వాత సిలిండర్ బుకింగ్ కోసం కనీసం 45 రోజుల వ్యవధి ఉంటుందన్నారు. ఈ కాల పరిమితిలోపు బుకింగ్ చేయడానికి అనుమతి ఉండదన్నారు. 45 రోజుల వరకు సిలిండర్ను పొదుపుగా వినియోగించుకోవాలని సూచించారు. వినియోగదారులు తమ గ్యాస్ కనెక్షన్తో అనుసంధానమైన మొబైల్ నంబర్ నుంచి మాత్రమే బుకింగ్ చేయాలన్నా రు. ఏదైనా సమస్యలు తలెత్తితే వెంటనే 1906 టోల్ఫ్రీకు గాని, సెల్ నం.90103 10309కు ఫిర్యా దు చేయాలని సూచించారు. -
పుట్టెడు దుఃఖంలో ‘పది’ పరీక్షకు హాజరు
కేటీదొడ్డి: కన్నతండ్రి ఇక లేరనే నిజాన్ని జీర్ణించుకోలేక ఆ పిల్లాడి గుండె తల్లడిల్లింది. కంటిపాపలా చూసుకున్న తండ్రి భౌతికంగా దూరమైనా ఆశయమే లక్ష్యంగా ఆ విద్యార్థి పుట్టెడు దుఃఖంలోనూ పదో తరగతి పరీక్షకు హాజరయ్యాడు. వివరాల్లోకి వెళ్తే.. జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కేటీదొడ్డి మండలం గంగన్పల్లికి చెందిన విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు సదానందం ఆచారి మృతిచెందారు. ఇంట్లో పార్థివదేహం ఉండగానే బుధవారం పాతపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పరీక్ష కేంద్రంలో జరిగే హిందీ పరీక్షకు అతడి కుమారుడు సాయివిష్ణు హాజరు కావాల్సి ఉంది. సమాచారం అందుకున్న ఎంఈఓ విజయభాస్కర్, ఉపాధ్యాయులు విద్యార్థికి ధైర్యం చెప్పడంతో పరీక్షకు హాజరయ్యాడు. పరీక్ష రాస్తున్నంత సేపు ఆ విద్యార్థి కళ్లు కన్నీళ్లతో నిండిపోవడం చూసిన తోటి విద్యార్థులు, ఉపాధ్యాయులు చలించిపోయారు. పరీక్ష అనంతరం తండ్రి అంత్యక్రియల్లో పాల్గొన్నాడు. -
టీజీఆర్జేసీ సెట్– 2026 కు దరఖాస్తుల ఆహ్వానం
ఎర్రవల్లి: రాష్ట్రంలోని 35 గురుకుల (రెసిడెన్సియల్) జూనియర్ కళాశాల లు, 93 కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఇంటర్ ప్రథమ సంవత్సరం ఆంగ్ల మాధ్యమంలో ప్రవేశం కోసం తెలంగాణ రాష్ట్ర గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న టీజీఆర్జేసీ సెట్– 2026 కు దరఖాస్తు చేసుకోవాలని ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా కోఆర్డినేటర్ బి. శ్రీనివాస్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రవేశ పరీక్షకు మే 3వ తేదీన ఉంటుందని, మార్చి 2026 లో పదో తరగతి పరీక్షకు హాజరైన విద్యార్థులు మార్చి 16 నుంచి ఏప్రిల్ 15 వరకు సంబంధిత వెబ్సైట్లో ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకో వచ్చన్నారు. దరఖాస్తు రుసుము రూ.200 ఉంటుందని, ప్రవేశ పరీక్షలో ప్రతిభ, రిజర్వేషన్ ఆధారంగా విద్యార్థుల ఎంపిక జరుగుతుందన్నారు. మరిన్ని వివరాలకు ఫోన్ నంబర్లు 040– 24734899, 78429 91708, 180024 52428 లను సంప్రదించాలని కోరారు. -
నియోజకవర్గ సమస్యలు పరిష్కరించండి
అలంపూర్: నియోజకవర్గ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేయాలని ఎమ్మెల్యే విజయుడు అసెంబ్లీలో కోరారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా బుధవారం అలంపూర్ నియోజకవర్గ స్థానిక సమస్యలపై ప్రస్తావించినట్లు తెలిపారు. నియోజకవర్గం రాష్ట్రానికి సరిహద్దుగా ఉండడంతో అభివృద్ధికి దూరంగా ఉన్నామన్నారు. అత్యవసర వైద్య సేవలు అందక, ఆర్థిక ఇబ్బందులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. అత్యవసర సేవల కోసం హైదరాబాద్కు రావాలంటే కనీసం 250 కి.మీ ప్రయాణించాల్సి రావడంతో సకాలంలో వైద్య అందక అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అలంపూర్ చౌరస్తాలో వంద పడకల ఆస్పత్రి ఉన్నా.. వైద్య సిబ్బంది లేక సేవలు అందడం లేదన్నారు. అదేవిధంగా డయాలసిస్, కేర్ సెంటర్ ఏర్పాటుకు కృషి చేయాలని కోరినట్లు ఎమ్మెల్యే తెలిపారు. పొరుగున ఏపీలోని కర్నూల్లో పేద, మధ్య తరగతి, జర్నలిస్టులకు, ఉద్యోగులకు ఆరోగ్యశ్రీ ద్వారా వైద్య సేవలు అందించడానికి చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. అయిజ మున్సిపాలిటీలో అగ్రిమాపక కేంద్రం ఏర్పాటు చేయాలని కోరారు. వీటిపై సంబంధిత మంత్రి సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. ప్రోటోకాల్పై స్పీకర్కు ఫిర్యాదు అలంపూర్: ప్రోటోకాల్ పాటించని అధికారులపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే విజయుడు స్పీకర్ గడ్డం వినోద్కు ఫిర్యాదు చేశారు. అలంపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్న తనకు అధికారులు అధికారిక కార్యక్రమాల ప్రోటోకాల్ పాటించడం లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రభుత్వం తరఫున అందజేస్తున్న రంజాన్ తోఫా, ఇఫ్తార్ విందులకు ప్రోటోకాల్ పాటించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. -
నూతన ఆశల లోగిలి
జోగుళాంబ గద్వాలగద్వాలన్యూటౌన్/రాజోళి/ఎర్రవల్లి: శ్రీపరాభవ నామ సంవత్సర ఉగాది పండుగను పురస్కరించుకొని బుధవారం నుంచే జిల్లాలోని ఆలయాలు సుందరంగా ముస్తాబు చేశారు. జిల్లా వ్యాప్తంగా ఉగాది సందడి కొట్టొచ్చినట్లు కనిపించింది. పట్టణాల నుంచి ప్రజలు గ్రామా లకు రావడంతో పాటు ఇంటర్ పరీక్షలు కూడా పూర్తవడంతో గ్రామాలు కళకళలాడుతున్నా యి. జిల్లాకేంద్రంలోని పాతబస్టాండ్, రథశాల, కూరగాయల మార్కెట్, గాంధీచౌక్ తదితర ప్రాంతాలన్ని కొనుగోలుదారులతో కిక్కిరిసిపోయాయి. గద్వాలతో పాటు అయిజ, రాజోళి, ఎర్రవల్లి, శాంతినగర్, అలంపూర్ పట్టణాల్లో సైతం ఉగాది హడావుడి కనిపించింది. ఉగాదిని పురస్కరించుకొని ఆలయాల్లో భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా జిల్లా కేంద్రంలో సుంకులమ్మ, ఈదమ్మ ఆలయాల వద్ద భక్తులు నైవేద్యాలు సమర్పిస్తారు. ఇక్కడ వేల సంఖ్యలో కోళ్లను బలిస్తారు. అందుకుగాను ఆలయ నిర్వాహకులు, ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. మండల కేంద్రాలతో పాటు జిల్లా కేంద్రంలోని మార్కండేయస్వామి ఆలయం, అహోబిల మఠం, శ్రీకన్యకా పరమేశ్వరి ఆలయం, నది ఆగ్రహారంలోని ఆలయాల వద్ద, జిల్లాలో ప్రసిద్ధ పుణ్య క్షేత్రాలైన అలంపూర్, బీచుపల్లి, మల్దకల్, పాంగుంట, చింతరేవుల తదితర ఆలయాలలో పంచాంగ శ్రవణం నిర్వహించనున్నారు. నేడు ఉగాది సంబురం భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేసిన నిర్వాహకులు ప్రధాన ఆలయాల్లో పంచాగ శ్రవణం చేయనున్న పండితులు -
ఉడిమిళ్లలో గుప్తనిధుల తవ్వకాలు
అమ్రాబాద్: పదర మండలం ఉడిమిళ్ల సమీపంలోని వినాయకగుడి మాన్యంలోగల చిన్న వినాయకుడి విగ్రహం ఎదుట గుప్తనిధుల తవ్వకాలు జరిపిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వనపర్తి జిల్లా పెబ్బేరుకు చెందిన ఇద్దరు వ్యక్తులతో కలసి కొంతమంది స్థానికులు ఈ నెల 13న రాత్రి గుడి ఎదుట జేసీబీతో తవ్వకాలు జరుపుతుండగా అటవీశాఖ సిబ్బంది వారిని అదుపులోకి తీసుకున్నారు. కొంతమంది పరారుకాగా పెబ్బేరుకు చెందిన ఇద్దరు వ్యక్తుల అదుపులోకి తీసుకొని విచారించి వదిలిపెట్టినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై ఎఫ్ఆర్ఓ వీరేష్గౌడ్ను వివరణ కోరగా తవ్వకాలు రెవెన్యూ భూమిలో ఉండటం వల్ల గ్రామ పంచాయతీ దృష్టికి విషయం తీసుకెళ్లామన్నారు. స్థానికులు ఉండటంతో గ్రామపెద్దల ఒత్తిడితో కేసు నమోదు చేయనట్లు సమాచారం. -
మన్యంకొండలో వసంత నవరాత్రి ఉత్సవాలు
మహబూబ్నగర్ రూరల్: మన్యంకొండ శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి దేవస్థానంలో వసంత నవరాత్రి ఉత్సవాలు ఈనెల 19 నుంచి 28వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఉగాది పర్వదినం సందర్భంగా గురువారం నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభం కానున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఉదయం స్వామివారికి అభిషేకాలు, నూతన వస్త్రాలంకరణలు నిర్వహించనుండగా, మధ్యాహ్నం 11 గంటలకు పంచాంగ శ్రవణం నిర్వంచనున్నారు. రాత్రి స్వామివారికి నిర్వహించే ప్రత్యేక సేవలు భక్తులను ఆకట్టుకోనున్నాయి. వసంత నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ప్రతిరోజు విశేష పూజలు నిర్వహించనున్నారు. ఈనెల 23, 24వ తేదీల్లో సుందరకాండ పారాయణం ప్రత్యేకంగా చేపట్టనున్నారు. 28న శ్రీరామ నవమి సందర్భంగా స్వామివారికి కల్యాణోత్సవం వైభవంగా నిర్వహించనున్నారు. అనంతరం అఖండ భజన ప్రారంభమవుతుంది. ఉత్సవాల్లో భక్తులు పాల్గొని స్వామివారి కటాక్షాన్ని పొందాలని ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త అళహరి మధుసూదన్కుమార్, ఈఓ శ్రీనివాసరాజు కోరారు. -
ప్రకృతి వ్యవసాయం లాభదాయకం
గోపాల్పేట: రసాయన ఎరువులతో పండిన పంటలకు మార్కెట్లో విలువ తగ్గుతోందని.. ప్రకృతి వ్యవసాయం చేస్తే ఎంతో లాభదాయకమని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు డా. చిన్నారెడ్డి సూచించారు. బుధవారం మండలంలోని జయన్నతిర్మలాపూర్లో రైతులకు ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందన్నారు. ఏళ్ల కిందట చూసుకుంటే దేశంలో పండించే పంటలకు ఎంతో విలువ ఉండేదని.. 200 రోజుల్లో పంట దిగుబడి వచ్చేదని సాంబార్, వరి వంగడాలు చాలా ఏపుగా పెరిగి దిగుబడి అధికంగా ఉండేదని వివరించారు. ప్రస్తుత సమయంలో దిగుబడి అధికంగా రావాలన్న ఉద్దేశంతో రసాయన ఎరువుల వినియోగం పెరగడంతో బయటి దేశాల్లో డిమాండ్ తగ్గిందని వివరించారు. రైతులు ఇప్పటికై నా రసాయన ఎరువులు తగ్గించి ప్రకృతి సేద్యంపై దృష్టి సారించాలని సూచించారు. ప్రస్తుతం గ్రామంలో 125 మంది ప్రకృతి వ్యవసాయం చేసేందుకు సానుకూలంగా ఉన్నారని.. రాబోయే కాలంలో ఈ సంఖ్య మరింత పెరగనుందని వివరించారు. కార్యక్రమంలో సర్పంచ్ జ్యోతి గోపాల్, టీపీసీసీ ప్రధానకార్యదర్శి నందిమళ్ల యాదయ్య, మండల ప్రధాన కార్యదర్శి ప్రవీణ్రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి ఆంజనేయులు, భాస్కర్రెడ్డి, కరుణశ్రీ తదితరులు పాల్గొన్నారు. -
చట్టాలపై అవగాహన పెంచుకోవాలి
అడ్డాకుల: చట్టాలపై అందరూ అవగాహన పెంంచుకోవాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి డి.ఇందిర అన్నారు. మూసాపేట మండలం నిజాలాపూర్ గ్రామంలో బుధవారం జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జరిగిన అవగాహన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఉచితంగా న్యాయ సహాయం అందిస్తామని చెప్పారు. హెల్ప్ లైన్ సెంటర్ 15100కు డయల్ చేసి న్యాయ సహాయం కోసం తగిన సలహాలు పొందవచ్చని తెలిపారు. ఎస్సీ, ఎస్టీలు, మహిళలు, చిన్న పిల్లలు, మానసిక, శారీరక దివ్యాంగులు, అనాధలు, సీనియర్ సిటిజన్ల కేసుల కోసం ఉచితంగా న్యాయవాదులను అందుబాటులో ఉంచుతున్నట్లు చెప్పారు. న్యాయ సహాయం కోసం మొదట పారా లీగల్ వలంటీర్లను సంప్రదించాలని కోరారు. రైతులకు సంబంధించిన చట్టాల గురించి వారికి అవగాహన కల్పించారు. మూసాపేటలోని అగ్రి లీగల్ ఎయిడ్ క్లీనిక్కు వెళ్లి రైతులు తమ సమస్యలను పరిష్కరించుకోవచ్చని తెలిపారు.గ్రామాల్లో బాల్య వివాహాలను అరికట్టాలని సూచించారు. తల్లిదండ్రులను, పెద్దలను గౌరవించాలని, సమాజంలో అందరు సత్ప్రవర్తనతో మెలగాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ వి.రాంచందర్, పంచాయతీ కార్యదర్శి సురేష్, ఉప సర్పంచ్ దేవుని శ్రీను, లీగల్ వాలంటీర్ బాలయ్య, తదితరులు పాల్గొన్నారు. -
జూరాల కాల్వలోకి దూసుకెళ్లిన కారు
వనపర్తి రూరల్: పెబ్బేరు పట్టణ శివారులోని జూరాల కాల్వలోకి కారు దూసుకెళ్లిన ఘటన బుధవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. మహబూబ్నగర్ చెందిన షకీల్ కారులో పెబ్బేరు మండలంలోని సూగూరుకు వస్తుండగా మార్గ మధ్యలో పెబ్బేరు శివారులోని జూరాల కాల్వ వద్ద బైక్ అడ్డు రావడంతో వాహనం అదుపు తప్పి కాల్వలోకి దూసుకెళ్లి పల్టీ కొట్టింది. కారులో ఉన్న షకీల్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. కారు వెనుక అద్దాలు పగులగొట్టి బయటకు రావడంతో ప్రమాదం తప్పింది. బస్టాండ్లో వృద్ధురాలు మృతి మరికల్: మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్లో మంగళవారం అర్ధరాత్రి సమయంలో ఓ వృద్ధురాలు మృతి చెందింది. ధన్వాడకు చెందిన లలిత (65) భర్త ఏడాది క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. అప్పటి నుంచి మరికల్లో యాచిస్తూ బస్టాండ్లోనే ఉండేది. ఈ క్రమంలో ఆరోగ్యం క్షీణించడంతో మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం గ్రామ పంచాయతీ సిబ్బంది అంత్యక్రియలు నిర్వహించారు. హోటళ్లపై అధికారుల దాడులు తెలకపల్లి: పట్టణంలోని పలు హోటళ్లపై రెవెన్యూ, పోలిసులు దాడులు నిర్వహించారు. సిలిండర్ కొరత నేపథ్యంలో వినియోగదారులు సిలిండర్లు అందక అవస్థలు పడుతున్నారు. దీంతో హోటళ్లలో తనిఖీలు చేపట్టి అక్రమంగా వినియోగిస్తన్న గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ నరేష్ తెలిపారు. దాదాపు ఏడు డొమెస్టిక్ సిలిండర్లు స్వాధీనం చేసుకొని గ్యాస్ ఏజెన్సీకి అప్పగించారు. డొమెస్టిక్ సిలిండర్లను హోటళ్లలో వాడితే చర్యలు తీసుకుంటామన్నారు. దాడుల్లో నాయబ్ తహసిల్దార్ పట్టాబి, ఎస్ఐ నరేష్, ఆర్ఐ రామస్వామి, జీపీఓలు పాల్గొన్నారు. ఆలయానికి బంగారం విరాళం కేటీదొడ్డి: మండలంలోని వెంకటాపురం గ్రామంలోని వెలసిన శ్రీపాగుంట లక్ష్మీవేంకటేశ్వర స్వామి ఆలయానికి కర్ణాటక రాష్ట్రం కురుతిప్లకు చెందిన నారాయణరెడ్డి, దివ్యవాణి దంపతులు బుధవారం తులం బంగారు ఉంగారం విరాళం అందజేశారు. ఈ సందర్భంగా దాతలను శాలువాతో సన్మానించి తీర్థప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో ఆలయ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. -
సేంద్రియ ఎరువులతో భూసారం పెంపు
వర్మీ కంపోస్టు ఎరువు జీలుగ ఎరువు అలంపూర్: పంటల సాగులో కొన్నేళ్లుగా రసాయన ఎరువుల వాడకం విపరీపతంగా పెరిగింది. దీంతో నేల తన సహజత్వాన్ని కోల్పోతుంది. భూసారం క్షీ ణిస్తుండడంతో అనుకున్న స్థాయిలో పంట దిగుబడి రాక రైతులు తీవ్రంగా నష్టపోవాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. పంట ఉత్పత్తుల్లోనూ రసాయ న ఎరువులు, పురుగు మందుల అవశేషాలు ఉండి ప్రజా ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. ఈ పరిస్థితుల్లో నేల సంరక్షణకు సేంద్రియ పోషకాల అవసరం ఎక్కువగా ఉంటుందని వ్యవసాయ శాఖ ఏడీఏ సక్రియానాయక్ రైతులకు సూచించారు. రసాయన ఎరువుల వాడకం తగ్గించి వాటి స్థానంలో పశువులు, గొర్రెలు, మేకల, కోళ్ల ఎరువులు, వేప, కానుగ లాంటి వృక్ష సంబంధిత ఎరువులు వర్మి, పచ్చిరొట్టె ఎరువులు వేయాలి. భూమిలో పోషకాల లభ్యతకు అనుగుణంగా ఎరువుల యాజమాన్యం చేపట్టాలి. సేంద్రియ ఎరువుల్లో స్థూల పోషకాలైన నత్రజని, భాస్వరం, పొటాష్ శాతం ఎంత ఉందని తెలసుకోవాలి. దీనిని బట్టి సేంద్రియ ఎరువులు పంటకు వేయాలి. ఇలా చేయడం వలన భూమి సారవంతం కావడంతో పాటు పెట్టుబడి తగ్గి పంటల దిగుబడి పెరిగే అవకాశం ఉంటుందని ఏడీఏ వివరించారు. పాడి–పంట -
పీఏసీఎస్ మాజీ చైర్మన్ బలవన్మరణం
నాగర్కర్నూల్ క్రైం: క్రషర్ మెషిన్ మూసివేశారని మనస్తాపానికి గురైన నాగర్కర్నూల్ పీఏసీఎస్ మాజీ చైర్మన్ బండారు శ్రీనివాస్రెడ్డి (60) బుధవారం తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్ఐ గోవర్ధన్ వివరాల మేరకు.. నాగర్కర్నూల్ మండలం వనపట్లకు చెందిన శ్రీనివాస్రెడ్డి గ్రామ శివారులో క్రషర్ మెషిన్ ఏర్పాటు చేసుకున్నారు. మూడు నెలల క్రితం అదే గ్రామానికి చెందిన కొందరు క్రషర్ మెషిన్పై ఫిర్యాదు చేయడంతో అధికారులు మూసివేశారు. నాటి నుంచి క్రషర్ కార్యకలాపాలతో పాటు లావాదేవీలు నిలిచిపోయాయి. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన శ్రీనివాస్రెడ్డి.. క్రషర్ మెషిన్ వద్ద ఉన్న తన నివాసంలో ఉరివేసుకున్నారు. గమనించిన కుటుంబ సభ్యులు అతడిని కొల్లాపూర్ చౌరస్తాలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. ఘటనకు సంబంధించి మృతుడి భార్య చంద్రకళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ వెల్లడించారు. శ్రీనివాస్రెడ్డి మృతి విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే రాజేశ్రెడ్డి జిల్లా ఆస్పత్రికి చేరుకొని కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. -
రైతుల సంక్షేమానికి కృషి
గద్వాల: ప్రభుత్వం పాడి రైతుల సంక్షేమానికి కృషి చేస్తోందని, పశువులకు ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేస్తున్నట్లు కలెక్టర్ రిజ్వాన్బాషా షేక్ తెలిపారు. పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో బుధవారం గాలికుంటు వ్యాఽ ది నివారణ టీకాల కార్యక్రమానికి సంబంధించిన ప్రచార వాహనాన్ని కలెక్టరేట్లో ప్రారంభించారు. ఆయిల్పాం సాగును ప్రోత్సహించాలి సంప్రదాయ పంటలతో పోలిస్తే ఆయిల్పాం సాగు చేస్తే 30 ఏళ్ల పాటు స్థిరమైన ఆదాయం వస్తుందని కలెక్టర్ అన్నారు. ఆయిల్పాం, వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు తదితర అంశాలపై ఐడీఒసీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నర్సింగరావు, అధిరులు తదితరులు ఉన్నారు. గ్యాస్ వినియోగదారులు నిబంధనలు పాటించాలి గద్వాల: గృహ అవసరాలకు గ్యాస్ సిలిండర్లను బుక్ చేసుకునే వినియోగదారులు ప్రభుత్వ నిబంధనలు పాటించాలని కలెక్టర్ రిజ్జాన్బాషా షేక్ అన్నారు. గ్యాస్ సిలిండర్ల కొరత కారణంగా బ్లాక్ మార్కెట్లో అమ్మకాలు అంటూ కొన్ని మీడియాల్లో వస్తున్న వార్తల నేపథ్యంలో బుధవారం కలెక్టర్ పట్టణంలోని రాఘవేంద్ర, ధనుష్, హెచ్పీ గ్యాస్ డిస్ట్రిబ్యూటరీ కార్యాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్యా స్ బుకింగ్ సంబంధించి కేంద్ర ప్రభుత్వ నిబంధన ల ప్రకారం ప్రతి సిలిండర్ బుకింగ్కు మధ్య 45 రో జులు సమయం తప్పనిసరిగా ఉండాలని తెలిపారు. అనంతరం కేజీబీవీ ల గురుకుల పాఠశాలలో మధ్యాహ్న భోజనం వండేందుకు సిలిండర్ల కొరత లేకుండా సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో పౌర సరఫరా అధికారి స్వామికుమార్, ఏజెన్సీల ప్రతినిధులు ఉన్నారు. జిల్లాలో పదో తరగతి పరీక్షల నిర్వహణలో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా చూడాలని కలెక్టర్ రిజ్జాన్బాషా షేక్ అన్నారు. జిల్లా కేంద్రంలోని శ్రీ చైతన్య పాఠశాల, ప్రభుత్వ ఉన్నత బాలుర పాఠశాల పరీక్ష కేంద్రాల్లో పదో తరగతి పరీక్షల నిర్వ హణ తీరును పరిశీలించారు. కార్యక్రమంలో చీఫ్ సూపరింటెండెంట్ ఉషారాణి, శివశంకర్, ప్రసాద్, సిబ్బంది, విద్యార్ధులు ఉన్నారు. -
త్వరలోనే పరిహారం..
కొల్లాపూర్ సమీపం నుంచి కృష్ణానదిపై ఐకానిక్ బ్రిడ్జి నిర్మించే ప్రాంతం వరకు రెవెన్యూ భూముల సేకరణకు ఏడాది కిందటే నోటిఫికేషన్ ఇచ్చాం. రైతుల నుంచి భూ యాజమాన్య పత్రాలను స్వీకరించాం. పరిహారం చెల్లింపు కోసం నేషనల్ హైవే అధికారులకు ఆ వివరాలు పంపించాం. త్వరలోనే పరిహారం చెల్లింపు ప్రక్రియ ప్రారంభమవుతుంది. – భన్సీలాల్, ఆర్డీఓ, కొల్లాపూర్ కేంద్రం సానుకూలం.. ఆసియాలోనే మొదటిసారిగా భారీ కేబుల్ బ్రిడ్జి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. నేషనల్ హైవే నిర్మాణం, బ్రిడ్జి పనుల గురించి ఇటీవలే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని బీజేపీ రాష్ట్ర ప్రతినిధి బృందంగా వెళ్లి కలిశాం. అటవీ శాఖ నుంచి క్లియరెన్స్ వచ్చినందున పనుల్లో వేగం పెంచుతామని మంత్రి చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కూడా ఇందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని కోరుతున్నాం. – ఎల్లేని సుధాకర్రావు, బీజేపీ నియోజకవర్గ ఇన్చార్జి -
‘ఆరు గ్యారంటీలు అటకెక్కించారు’
అయిజ: కాంగ్రెస్ నాయకులు ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయకుండా అటకెక్కించారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు ఆరోపించారు. మంగళవారం తహసీల్దార్ కార్యాలయంలో ఆర్ఐ రజనీకాంత్రెడ్డికి బీజేపీ నాయకులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆరు గ్యారంటీలని అబద్ధాలు చెప్పి గద్దెనెక్కిన కాంగ్రెస్ నాయకులు ఏ ఒక్క హామీ కూడా సంపూర్ణంగా అమలు చేయడం లేదని మండిపడ్డారు. ఇదే విధమైన పాలన కొనసాగిస్తే భవిష్యత్లో ప్రజల తరఫున పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు రామచంద్రారెడ్డి, భీమసేనరావు, మహేష్, భగత్రెడ్డి, లక్ష్మణ్గౌడ్, రాజశేఖర్, భీమన్న తదితరులు పాల్గొన్నారు. -
ప్రకృతి సేద్యంతో సుస్థిర దిగుబడులు
అలంపూర్: ప్రకృతి సేద్యంతో సుస్థిర దిగుబడులు సాధించవచ్చని ఏడీఏ సక్రియా నాయక్ అన్నారు. అలంపూర్ మండలం బుక్కాపురం రైతువేదికలో మంగళవారం ప్రకృతి వ్యవసాయంపై రైతులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏడీఏ మాట్లాడుతూ.. రైతులు రసాయన ఎరువుల వాడకాన్ని పూర్తిగా తగ్గించి, ప్రకృతి వ్యవసాయంపై దృష్టిసారించాలని సూచించారు. ప్రకృతి సేద్యం రైతులకు లాభసాటిగా ఉంటుందన్నారు. అదే విధంగా పర్యావరణానికి మేలు చేకూరడంతో పాటు మానవాళికి నాణ్యమైన ఆహారం లభిస్తుందన్నారు. కార్యక్రమంలో ఏఓ నాగార్జున్ రెడ్డి, సర్పంచ్ రూపదేవి, ఏఈఓలు నీలిమ, శిరీష, శ్రీధర్రెడ్డి పాల్గొన్నారు. వాణిజ్య ఒప్పందాన్ని రద్దు చేయండి అయిజ: కేంద్ర ప్రభుత్వం రైతులకు కీడుచేసే విధంగా చేసుకున్న అమెరికా, భారత్ వ్యవసాయ వాణిజ్య ఒప్పందాన్ని వెంటనే రద్దుచేయాలని తెలంగాణ రైతాంగ సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోపాల్ డిమాండ్ చేశారు. మంగళవారం అయిజలో వివిధ సంఘాల నాయకులు ర్యాలీ నిర్వహించి.. నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అమెరికాతో వాణిజ్య ఒప్పందాన్ని చేసుకున్న కేంద్రం.. వ్యవసాయ ఉత్పత్తులను అమ్ముకోవడానికి జీరో పన్ను చేసి, దేశ రైతాంగాన్ని తీవ్రంగా నష్టపరుస్తున్నారని ఆరోపించారు. రైతు, కార్మిక, ప్రజా వ్యతిరేకమైన 2025 విద్యుత్ సవరణ బిల్లు, విత్తన బిల్లును రద్దుచేయాలని డిమాండ్ చేశారు. అదే విధంగా కార్మిక వ్యతిరేక నిర్ణయాలను ఉపసంహరించుకోవాలన్నారు. కార్యక్రమంలో టీపీఎప్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రభాకర్, విజయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు. -
ఆశావర్కర్లకు రూ.18వేల వేతనం ఇవ్వాలి
గద్వాల: ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు ఆశావర్కర్లకు రూ. 18వేల వేతనం ఇచ్చేలా ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లో నిర్ణయించాలని సీఐటీయూ నాయకుడు ఉప్పేరు నర్సింహ డిమాండ్ చేశారు. మంగళవారం సీఐటీయూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఆశావర్కర్లతో కలిసి కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. అనంతరం అక్కడే భోజనాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మాత్రం నెరవేరలేదన్నారు. ఆశావర్కర్లకు కేంద్ర ప్రభుత్వం రూ.1,500 పారితోషికం పెంచినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నేటికీ అమలు చేయలేదన్నారు. పనికి తగ్గ వేతనాలు ఇవ్వలేని దౌర్భాగ్య స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని మండిపడ్డారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఈ నెల 28న చలో హైదారాబాద్ కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్కు అందజేశారు. కార్యక్రమంలో నాయకులు నర్సింహ, కాంతమ్మ, పద్మ, సరస్వతి, శశికళ, నర్సమ్మ, మేరీ తదితరులు పాల్గొన్నారు. -
పెండింగ్ పీఆర్సీ ప్రకటించాలి
అలంపూర్: ఉపాధ్యాయ, ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న పీఆర్సీని వెంటనే ప్రకటించాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు రవి డిమాండ్ చేశారు. అలంపూర్ చౌరస్తాలోని ప్రైవేటు పాఠశాలలో మంగళవారం నిర్వహించిన టీఎస్ యూటీఎఫ్ జిల్లా కమిటీ సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. ఉపాధ్యాయులకు పెండింగ్లో ఉన్న డీఏలను ప్రకటించడంతో పాటు టీఎస్జీఎల్ఐ జెడ్పీ జీపీఎఫ్ పార్ట్ ఫైనల్స్ సరెండర్ బిల్స్, మెడికల్ రియంబర్స్మెంట్, విశ్రాంత ఉపాధ్యాయుల పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలన్నారు. కేజీబీవీ యూఆర్ఎస్, సమగ్ర శిక్షణ ఉద్యోగులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్ అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన హెల్త్ కార్డుల జారీ ట్రస్టులో టీఎస్ యూటీఎప్కు అవకాశం కల్పించినట్లు తెలిపారు. అనంతరం గద్వాల మండలం మదనపల్లికి చెందిన టీఎస్ యూటీఎఫ్ కార్యకర్త ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం మోహన్ కుమార్ ఇటివల మృతిచెందగా.. అతడి కుటుంబానికి టీఎస్ యూటీఎఫ్ కుటుంబ సంక్షేమ నిధి నుంచి రూ. 6లక్షల చెక్కును అందజేశారు. ఈ నెల 29న అలంపూర్లో రాష్ట్రస్థాయి కార్యవర్గ సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు డి.రమేశ్, ప్రధాన కార్యదర్శి ఎం.గోపాల్, రాష్ట్ర కార్యదర్శి రవి ప్రసాద్గౌడ్, జిల్లా ఉపాధ్యక్షుడు కుమార్ నాయుడు, నాయకులు వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. -
అటవీ భూముల బదలాయింపు..
పెంట్లవెల్లి మండలం మల్లేశ్వరం గ్రామ సమీపం నుంచి ఆంధ్రప్రదేశ్లోని కొత్తపల్లి మండలం సంగమేశ్వరం వరకు కృష్ణానది మీదుగా ఐకానిక్ బ్రిడ్జి నిర్మిస్తారు. ఈ ప్రాంతం మొత్తం నల్లమల అటవీ ప్రాంతంలోనే ఉంది. అదేవిధంగా వంతెనకు అనుసంధానంగా జాతీయ రహదారి నిర్మించే ప్రాంతాల్లోనూ అటవీ భూములు ఉన్నాయి. కొల్లాపూర్ నుంచి ఐకానిక్ బ్రిడ్జి నిర్మించే వరకు మొత్తం 53 హెక్టార్ల భూమి ఉండగా.. అందులో 25 హెక్టార్ల భూమి అటవీ ప్రాంతంలోనిది. అటవీ శాఖ నుంచి భూమిని సేకరించేందుకు రెవెన్యూ అధికారులు భూ బదలాయింపు ప్రక్రియ చేపట్టారు. అమ్రాబాద్ సమీపంలో రెవెన్యూ భూమి ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నారు. దీంతో గతేడాది అక్టోబర్ 28న రాష్ట్ర ఫారెస్టు అధికారులు, ఈ ఏడాది ఫిబ్రవరి 21న సెంట్రల్ ఫారెస్టు అధికారుల బృందం అటవీ భూమిలో జాతీయ రహదారి నిర్మించబోయే ప్రాంతాలను పరిశీలించి కేంద్రానికి నివేదిక పంపారు. మార్చి మొదటి వారంలో అటవీ భూముల బదలాయింపునకు కేంద్రం క్లియరెన్స్ ఇచ్చింది. దీంతో బ్రిడ్జి నిర్మాణానికి ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయాయి. -
ఐకానిక్కు అడుగులు
జోగుళాంబ గద్వాల● ఇటీవలే అటవీ శాఖ నుంచి క్లియరెన్స్ ● టెండర్లు ఓపెన్ చేయడమే తరువాయి ● ఆలోగా వంతెనకు అప్రోచ్ రోడ్లు నిర్మించేలా చర్యలు ● కొల్లాపూర్ నుంచి మల్లేశ్వరం వరకు భూ సేకరణ వేగవంతం బుధవారం శ్రీ 18 శ్రీ మార్చి శ్రీ 2026కొల్లాపూర్: నాగర్కర్నూల్ జిల్లాలోని కల్వకుర్తి నుంచి నంద్యాల వరకు నూతనంగా నిర్మిస్తున్న జాతీయ రహదారి–167కే పనులకు అన్ని రకాల అడ్డంకులు తొలగుతున్నాయి. కొన్నిచోట్ల ఈ రహదారి నల్లమల అటవీ ప్రాంతం గుండా వెళ్తుండగా.. మల్లేశ్వరం– సంగమేశ్వరం మధ్యలో కృష్ణానదిపై ఐకానిక్ సస్పెన్సివ్ కేబుల్ బ్రిడ్జి నిర్మించే ప్రాంతం సైతం నల్లమల అటవీ భూ భాగంలోనే ఉంది. ఇన్నాళ్లు అటవీ క్లియరెన్స్ లేకపోవడంతో ఈ పనులు చేపట్టడంలో జాప్యం జరుగుతుండగా.. ఇటీవలే జాతీయ అటవీ శాఖ నుంచి రహదారి, కేబుల్ బ్రిడ్జి నిర్మాణాలకు అనుమతులు లభించాయి. దీంతో నిర్మాణ పనుల్లో వేగం పెంచేందుకు నేషనల్ హైవే అథారిటీ అధికారులు చర్యలు ప్రారంభించారు. టెండర్ల ఓపెన్పైనే ఉత్కంఠ రూ.963 కోట్ల వ్యయంతో కృష్ణానదిపై నిర్మించనున్న ఐకానిక్ కేబుల్ బ్రిడ్జి టెండర్ల కాలపరిమితిని రెండున్నరేళ్లుగా అధికారులు పొడిగిస్తూ వస్తున్నారు. అటవీ శాఖ నుంచి క్లియరెన్స్ కోసమే ఇన్నాళ్లు ఆగుతూ వచ్చారు. 2023 అక్టోబర్లో బ్రిడ్జి టెండర్లను ఆహ్వానించగా.. పలు జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు టెండర్ దాఖలు చేశాయి. కానీ, ఇప్పటి వరకు టెండర్లు ఓపెన్ చేయలేదు. ఈ నెల 16 వరకు టెండర్లకు చివరి గడువుగా ఎన్హెచ్ అధికారులు తమ వెబ్సైట్లో పొందుపర్చారు. అటవీ శాఖ క్లియరెన్స్ వచ్చినందున త్వరలోనే టెండర్లు ఓపెన్ చేస్తారని అఽధికారులు చెబుతున్నారు. ● కృష్ణానదిపై తీగల వంతెన నిర్మాణానికి తొలగిన అడ్డంకులు -
జిల్లా అభివృద్ధిలో మహిళల పాత్ర కీలకం
గద్వాల: జిల్లా జనాభాలో మహిళలే అధికంగా ఉండగా.. ఉద్యోగుల్లో సైతం మహిళల సంఖ్య ఎక్కువేనని.. అందరూ జిల్లా అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. మంగళవారం ఐడీఓసీ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో పాల్గొన్న కలెక్టర్.. జ్యోతిప్రజ్వలన, తెలంగాణ గీతాలపనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో అధికంగా బాల్యవివాహాలు చేస్తున్నారని, దీనివల్ల అనేక దుష్ప్రరిణామాలు ఎదురవుతాయన్నారు. మరోవైపు ఇటీవలి కాలంలో పోక్సో కేసులు అధికంగా నమోదు కావడం ఆందోళన కలిగిస్తుందన్నారు. బాలికలకు గుడ్టచ్, బ్యాడ్టచ్పై అవగాహన కల్పించాలని సూచించారు. వరకట్న వేధింపులు ఇతర సమస్యలపై మహిళలు ధైర్యంగా ముందుకొచ్చి ఫిర్యాదు చేస్తేనే దోషులకు శిక్షపడుతున్నారు. సఖి కేంద్రంలో కౌన్సెలింగ్ వారికి అవసరమైన సాయం అందిస్తున్నామన్నారు. అదే విధంగా మహిళల అక్షరాస్యత శాతం పెంచేందుకు కృషి చేయాలన్నారు. అనంతరం వివిధ రంగాలకు చెందిన మహిళలు ప్రసగించారు. మహిళా సంక్షేమంపై రూపొందించిన పోస్టర్ను ఆవిష్కరించారు. అంతకు ముందు పలు విద్యాసంస్థలకు చెందిన విద్వార్థినుల సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నర్సింగ్రావు, ఏఎస్పీ శంకర్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ నుషిత, డీడబ్ల్యూఓ సునంద, డీఈఓ విజయలక్ష్మి, మున్సిపల్ చైర్పర్సన్ జయలక్ష్మి పాల్గొన్నారు. కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కేటాయించిన బడ్జెట్ను పూర్తిగా వినియోగించాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో సంబంధిత అధికారులతో ఆయన సమావేశమై మాట్లాడారు. కేజీబీవీల్లో పటిష్ట భద్రత ఏర్పాటుపై ప్రత్యేక దృష్టిసారించాలన్నారు. అనుమతి లేనిది బయటి వ్యక్తులను అనుమతించరాదన్నారు. అదే విధంగా పరిశుభ్రత, సురక్షితమైన తాగునీరు, నాణ్యమైన భోజనం వంటివి తప్పకుండా కల్పించాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ నర్సింగ్రావు, డీఈఓ విజయలక్ష్మి, మధుసూదన్, అంపయ్య ఉన్నారు. సీఎం కప్ క్రీడా పోటీల్లో ప్రతిభ చాటిన జిల్లా క్రీడాకారులను కలెక్టర్ శాలువాలతో సత్కరించి అభినందించారు. క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభకనబరిచి జిల్లా ఖ్యాతిని ఇనుమడింపజేయాలని ఆయన ఆకాంక్షించారు. కార్యక్రమంలో డీవైఎస్ఓ కృష్ణయ్య, శ్రీనివాసులు పాల్గొన్నారు. -
జన గణనపై అవగాహన పెంచుకోవాలి
గద్వాల: జనాభా లెక్కల ప్రక్రియలో భాగంగా మొదట ఇళ్ల గణన కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని, అందుకనుగుణంగా గణనపై సంపూర్ణ అవగాహన పెంచుకోవాలని కలెక్టర్ రిజ్వాన్బాషా షేక్ అన్నారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రతి పదేళ్లకు ఒకసారి నిర్వహించే జనగణన, ఇళ్ల గణన కార్యక్రమంలో భాగంగా 2026లో మొదటి విడతలో ఇళ్ల గణన కార్యక్రమాన్ని పూర్తిగా డిజిటలైజేషన్ విధానంలో స్మార్ట్ఫోన్ ద్వారా చేపట్టాలన్నారు. ఎన్యుమరేటర్లు ఇంటింటికి వెళ్లి సమాచారాన్ని సేకరించి వివరాలు నమోదు చేసి ఇళ్ల జాబితా రూపొందిస్తారన్నారు. ఈ ప్రక్రియను ఎన్యుమరేటర్లు సూపర్వైజర్లు, చార్జీ అధికారులైన తహసీల్దార్లు, ఎంపీడీఓలు నిర్వహిస్తారన్నారు. జిల్లాలో ఆయా ప్రాంతాల్లో ఉండే జనాభా ఆధారంగా బ్లాక్లుగా విభజించుకుని గణన చేపట్టాలన్నారు. ప్రస్తుతం ఇళ్ల గణన పూర్తయితే 2027 ఫిబ్రవరిలో ఎన్యుమరేటర్లు ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం నిర్దేశించి 33 ప్రశ్నలను అడిగి వివరాలను నమోదు చేస్తారన్నారు. ప్రస్తుతం చేపట్టే గణన ఆధారంగానే భవిష్యత్లో వివిధ వర్గాలకు పథకాలు అందుతాయన్నారు. జిల్లాలో సుమారు 1,100 మంది ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లు అవసరమవుతారని, ఉపాధ్యాయులకు ఈ విధులను అప్పగించనున్నట్లు వెల్లడించారు. ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా జాబితా రూపొందించాలని చెప్పారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నర్సింగ్రావు, ఆర్డీఓ శ్రీనివాసరావు, సెన్సెస్ ఆపరేషన్ జేడీ లాజర్, సీపీఓ పాపయ్య, ట్రైనర్ సుల్తాన్ తదితరులు పాల్గొన్నారు. ఎరువుల కొరత రానీయొద్దు రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు కొరత లేకుండా సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రిజ్వాన్బాషా షేక్ ఆదేశించారు. సోమవారం ఆయన జిల్లాకేంద్రంలో సుడిగాలి పర్యటన చేసి ఎరువుల దుకాణాలు, గాంధీచౌక్లోని దూద్ దవాఖానాను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎరువు దుకాణంలో స్టాక్, ధరలను పరిశీలించారు. అన్ని విక్రయాలను ఈపాస్ యంత్రం ద్వారా మాత్రమే నిర్వహించాలని, లైసెన్స్ లేకుండా ఎరువుల విక్రయాలు చేపట్టరాదన్నారు. అనంతరం గాంధీచౌక్లోని దూద్దవాఖానాలో వైద్య సిబ్బందితో వివరాలు తెలుసుకున్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వైద్యసేవలు అందించాలన్నారు. అంతకు ముందు గోనుపాడు శివారులో సాగుచేసిన పంటలను పరిశీలించారు. డిజిటల్ క్రాప్ సర్వే, ఫార్మర్ రిజిస్ట్రీ పకడ్బందీగా చేపట్టాలని ఆదేశించారు. -
2,428 క్వింటాళ్ల వేరుశనగ రాక
గద్వాల వ్యవసాయం: జిల్లాకేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డుకు సోమవారం 2,428 క్వింటాళ్ల వేరుశనగ రాగా గరిష్టంగా రూ.8,020, కనిష్టంగా రూ.2,821, సరాసరిగా రూ.5,149 ధరలు లభించాయి. అలాగే 164 క్వింటాళ్ల ఆముదాలు రాగా.. గరిష్టంగా రూ.6,179, కనిష్టంగా రూ.3,419, సరాసరిగా రూ.6,179 చొప్పున పలికాయి. 29 క్వింటాళ్ల కంది రాగా.. గరిష్టంగా రూ.7,089, కనిష్టంగా రూ.6,759, సరాసరిగా రూ.7,069 చొప్పున ధరలు వచ్చాయి.పంట మార్పిడితో అధిక దిగుబడులు గోపాల్పేట: పంటల సాగులో సేంద్రియ ఎరువుల వినియోగం, పంట మార్పిడి విధానంతో అధిక దిగుబడులు సాధించవచ్చని కృషి విజ్ఞానకేంద్రం శాస్త్రవేత్త రాజేందర్రెడ్డి రైతులకు సూచించారు. సోమవారం గోపాల్పేట రైతువేదికలో డీఏఓ ఆంజనేయులుగౌడ్తో కలిసి రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్త మాట్లాడుతూ.. రైతులు సహజసిద్ధంగా లభించే మక్కిన పశువుల ఎరువులు, జీవామృతం, నీమాస్త్రం, దశపత్రి తదితర కషాయాలతో పంటల్లో చీడపీడలను నివారించవచ్చన్నారు. ఏటా ఒకే రకం పంటను వానాకాలం, యాసంగి సీజన్లో పండించకూడదని.. భూసార పరీక్షలకు అనుగుణంగా పంటమార్పిడి విధానం పాటించాలని సూచించారు. గ్రామస్థాయిలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం అమరచింత: కాంగ్రెస్ పార్టీని గ్రామస్థాయి నుంచి బలపేతం చేయడానికే నూతన కమిటీలను ఏర్పాటు చేస్తున్నామని డీసీసీ అధ్యక్షుడు, శాట్ చైర్మన్ శివాసేనారెడ్డి అన్నారు. సోమవా రం అమరచింతలోని పార్టీ కార్యాలయ ఆవరణలో టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిది కేశం నాగరాజ్గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మండలస్థాయి సమావేశానికి డీసీసీ అధ్యక్షుడు హాజరై మాట్లాడారు. మునుపెన్నడూ లేని విధంగా కాంగ్రెస్ పార్టీ గ్రామ, మండల అధ్యక్షులకు మరిన్ని అధికారాలు కల్పించేందుకు సీఎం రేవంత్రెడ్డి కార్యాచరణ రూపొందించారన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని.. గ్రామాల్లో సర్పంచులతో పాటు పార్టీ అధ్యక్షుడికి సైతం అదే స్థాయిలో అధికారాలు కట్టబెట్టేందుకు శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు గ్రామంలో ఎవరికి అందించాలనే పూర్తి స్వేచ్ఛ గ్రామ పార్టీ అధ్యక్షుడికి అప్పగిస్తున్నామన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తూ.. పార్టీ బలోపేతానికి నిరంతరం శ్రమించే నాయకుడిని అధ్యక్షుడిగా ఎన్నుకోవాలని సూచించారు. అనంతరం నాగరాజ్గౌడ్ మాట్లాడుతూ.. పార్టీకి వ్యతిరేకంగా ఎవరైనా పనిచేస్తే ఉపేక్షించేది లేదన్నారు. వారిని పార్టీ నుంచి బయటికి పంపిస్తామన్నారు. గత సర్పంచ్, మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ లైన్కు వ్యతిరేకంగా పనిచేసిన వారిపై చర్యలు తప్పవన్నారు. -
బైపాస్పై ఆశలు
●జడ్చర్ల: జడ్చర్లకు బైపాస్ మంజూరుపై ఆశలు చిగురిస్తున్నాయి. జడ్చర్ల పట్టణ ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసం ప్రతిపాదించిన బైపాస్ రహదారి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. నిత్యం ట్రాఫిక్ సమస్యతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఉపశమనం కలిగించే విధంగా కేంద్రం పంపే కబురు కోసం ఎదురుచూస్తున్నారు. జడ్చర్ల పట్టణం చుట్టూ బైపాస్ రోడ్డు నిర్మాణం చేపట్టేందుకు రంగం సిద్ధం అయ్యింది. రాష్ట్ర రాజధానికి సమీపంలో ఉన్న జడ్చర్ల పట్టణం గుండా ప్రయాణం నరకప్రాయంగా మారింది. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి రాకపోకలు సాగించే వారు జడ్చర్ల దాటితే సరి అన్న ఆందోళనలో ప్రయాణాలు సాగిస్తున్నారు. పట్టణ విస్తీర్ణం కూడా అడ్డదిడ్డంగా ఉండడంతోపాటు పట్టణంలోని ప్రధాన రహదారులు ఇరుగ్గా ఉన్నాయి. ఇక్కడ వాహనాల రాకపోకలకు.. రహదారుల వెడల్పునకు ఎక్కడా పొంతన లేక అడుగడుగునా ట్రాఫిక్తో నిత్యం సతమతమవుతున్నారు. మరోవైపు జాతీయ రహదారి–44, ఇంకోవైపు ఎన్హెచ్–167తోపాటు రాష్ట్రీయ రహదారులు సైతం పట్టణం నడిబొడ్డుగుండా వెళ్తున్నాయి. వీటికి తోడు రైల్వే మార్గం కూడా ఉండడంతో రాకపోకలు అంత సునాయసంగా ముందుకు సాగని పరిస్థితి నెలకొంది. రైల్వే మార్గం కారణంగా రెండు ప్రాంతాల రాకపోకలు సిగ్నల్గడ్డ వద్ద ఉన్న సింగిల్ బ్రిడ్జి మీదుగా మాత్రమే దాటే పరిస్థితి ఉండడంతో ఇక్కడ ట్రాఫిక్ స్తంభించి ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది. అలాగే జడ్చర్ల కొత్త బస్టాండ్ సమీపంలో ఎన్హెచ్–44పై ఫ్లై ఓవర్ బ్రిడ్జి దగ్గర సైతం ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతాయి. ఇలా అనేక దశాబ్దాలుగా ఇక్కడి ప్రజలతోపాటు ఇతర ప్రాంతాల ప్రజలు సైతం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి పరిస్థితులలో జడ్చర్లకు బైపాస్ రోడ్డు నిర్మిస్తే బాగుంటుందని ఎంతో కాలంగా ప్రజలు భావిస్తున్నారు. ట్రాఫిక్తో సతమతం.. జడ్చర్ల మీదుగా ఒక్క హైదరాబాద్కు మాత్రమే కాకుండా కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళ, మహారాష్ట్ర తదితర ఉత్తర, దక్షిణ భారతం వైపు భారీ సంఖ్యలో రాకపోకలు సాగుతుంటాయి. అయితే ఆయా ప్రాంతాలకు వెళ్లాలంటే జడ్చర్ల పట్టణం గుండానే అది కూడా సింగిల్ రోడ్డుగా ఉన్న ఒక చిన్నపాటి రైల్వే వంతెనపైనే రాకపోకలు సాగించే పరిస్థితి ఉండేది. కాగా ఇటీవల జాతీయ రహదారి–167 విస్తరణ పనులలో భాగంగా ఒకవైపు సింగిల్ బ్రిడ్జి నిర్మాణం పూర్తిచేయగా.. మరోవైపు బ్రిడ్జి విస్తరణ పనులు నిలిచిపోవడంతో గుంతల రహదారిపైనే రాకపోకలు సాగుతున్నాయి. జడ్చర్ల పట్టణం వ్యూ డీపీఆర్కు రంగం సిద్ధంతో ముందడుగు ఈ నెలాఖరులోగా కొలిక్కి వచ్చే అవకాశం అన్నీ సవ్యంగా జరిగితే జడ్చర్ల మరింత అభివృద్ధి ఈ నెలాఖరులోగా.. జడ్చర్ల పట్టణంలో ట్రాఫిక్ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని బైపాస్ రోడ్డు నిర్మాణం చేయాలన్న డిమాండ్ కొన్నేళ్లుగా ఉంది. అ యితే బీఆర్ఎస్ పాలనలో బైపాస్ రోడ్డుకు అప్పటి ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ప్రతిపాదించినా కార్యాచరణ రూపొందలేదు. తాజాగా ఎంపీ డీకే అరుణ, ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి జడ్చర్ల బైపాస్ రోడ్డు ఏర్పాటు చేయాలని కోరుతూ కేంద్ర మంత్రి నితిన్గడ్కరీకి ప్రతిపాదించడంతో అడుగులు ముందుకు పడుతున్నాయి. ఈ నెలాఖరులోగా బిడ్డింగ్ ఓపెన్ చేసి డీపీఆర్ బాధ్యతలను అప్పగించే సూచనలు కనిపిస్తుండటంతో ఈ నెలాఖరులోగా డీపీఆర్ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. -
మళ్లీ మొండిచెయ్యి..
నిధుల కేటాయింపులో మల్లమ్మకుంటకు దక్కని చోటు రాజోళి: ఆర్డీఎస్ రైతులకు జీవం పోస్తున్న తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకంలో కీలకపాత్ర పోషించే మల్లమ్మ కుంటపై మళ్లీ చిన్నచూపే చూశారు. తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకంలో మూడు రిజర్వాయర్లు (మల్లమ్మకుంట, జూలకల్, వల్లూరు) నిర్మిస్తేనే ఆర్డీఎస్ చివరి ఆయకట్టుకు వరకు పుష్కలంగా సాగునీరు అందేలా డిజైన్ చేశారు. కానీ, రైతుల అవసరాల దృష్ట్యా నీటిని మోటార్ల ద్వారా ఆర్డీఎస్ కెనాల్లోకి ఎత్తిపోస్తున్నారు. దీంతో ఆయకట్టు పూర్తిగా కాకపోయినా కొంతమేర నీరంది పంటలు పండుతున్నాయి. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మొదలైన తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం నేటికీ పూర్తికాకపోవడం రైతులను నిరాశకు గురిచేస్తుంది. తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకంలో మూడు రిజర్వాయర్లు నిర్మించాల్సి ఉండగా.. రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతోపాటు జరుగుతున్న కాలయాపన, భూ సేకరణలో ఎదురవుతున్న ఇబ్బందులతో రైతులు నిరాశ చెందుతున్నారు. దీంతో మూడు రిజర్వాయర్లు కాకపోయినా కనీసం మల్లమ్మకుంట రిజర్వాయర్ ఒక్కటైనా పూర్తి చేస్తే ఆయకట్టును కాపాడుకోవచ్చని అంటున్నారు. కానీ, దానిపై కూడా ప్రభుత్వం అడుగు ముందడుగు వేయడం లేదు. తుమ్మిళ్ల ఎత్తిపోతలలో మొదటి రిజర్వాయర్ మల్లమ్మ కుంటనే. 1.02 టీఎంసీల సామర్థ్యంతో ఈ రిజర్వాయర్ నిర్మించాల్సి ఉంది. వర్షాకాలం మొదట్లో తుంగభద్ర నదిలో వరద ఉన్న సమయంలో నీటిని ఈ రిజర్వాయర్లో ఎత్తిపోసి.. ఆయకట్టుకు సాగునీరు అవసరమైన సమయంలో వాడుకునేలా ప్లానింగ్ చేశారు. తుమ్మిళ్ల లిఫ్టు ప్రారంభమైనప్పటి నుంచి కేవలం పైప్లైన్ ద్వారా నీటిని కెనాల్లో వదులుతున్నారే తప్ప.. రిజర్వాయర్ పనులు మొదలుపెట్టడం లేదు. నాలుగేళ్ల తర్వాత 2024లో మల్లమ్మకుంటకు సంబందించి భూ సేకరణ పనులపై కొంత కదలిక రావడంతో రైతుల్లో ఆశలు చిగురించాయి. మూడు రిజర్వాయర్లు.. పెండింగ్ ప్రాజెక్టుల్లోనూ ప్రాముఖ్యం కల్పించని వైనం ఈ రిజర్వాయర్పైనే ఆశలు పెట్టుకున్న ఆర్డీఎస్ రైతులు ఇప్పటికే భూ సేకరణకు ప్రతిపాదనలు -
వీబీజీ రాం బిల్లు రద్దు చేయాలి
గట్టు: కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన వీబీజీ రాం చట్టం వ్యవసాయ కూలీలకు తీవ్రనష్టం చేసేలా ఉందని సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు నర్సింహ అన్నారు. సోమవారం ఆయన గట్టులో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులను పరిశీలించారు. ఉపాధి కూలీల చేత పనిచేసే చోట నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్త చట్టం ద్వారా ఉపాధి కూలీలు పని అడిగే హక్కు కోల్పోతారని ఆరోపించారు. ఈ చట్టం వల్ల ఇప్పటికే వ్యవసాయ కూలీలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారన్నారు. పనిచేస్తున్న కూలీల కళ్ల ఫొటోలను తీసి అప్లోడ్ చేస్తున్నారని, కొందరు కూలీలవి సరిగా నమోదు కాకపోవడంతో తిరిగి ఇంటికి వెళ్లే పరిస్థితి దాపురించిందన్నారు. ఉపాధి హామీ చట్టంలో కేంద్రం 90 శాతం, రాష్ట్రం 10 శాతం చెల్లించాల్సి ఉండగా, కొత్త చట్టం ప్రకారం కేంద్రం 60 శాతం, రాష్ట్రం 40 శాతం చెల్లించాలనే కొత్త నిబంధన పెట్టిందని విమర్శించారు. కొత్త చట్టాన్ని రద్దు చేసిన పాత, ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. -
పట్టాలెక్కిన కొడంగల్
నారాయణపేట–మక్తల్–కొడంగల్ ఎత్తిపోతల్లో కదలిక ● తొలి విడతలో రూ.1,400 కోట్లు మంజూరు.. స్టేజీ–1 పనులు షురూ ● కాట్రేవులపల్లి వద్ద అప్రోచ్ చానల్, పంప్హౌస్ వర్క్స్ ముమ్మరం ● మొత్తంగా లక్ష ఎకరాలకు సాగునీరు.. ప్రాజెక్ట్ వెంట గ్రీన్బెల్ట్ ● 56 హెక్టార్లలో మొక్కల పెంపకం.. రైతాంగంలో హర్షాతిరేకాలు సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: ఉమ్మడి పాలమూరులోని నారాయణపేట, మక్తల్, కొడంగల్ నియోజకవర్గాలను సస్యశ్యామలం చేయడమే లక్ష్యంగా చేపట్టిన కొడంగల్ ఎత్తిపోతల పథకంలో ఎట్టకేలకు కదలిక వచ్చింది. పది మండలాల పరిధిలో లక్ష ఎకరాలకు సాగు, 123 గ్రామాలకు తాగునీరు అందించేందుకు ఉద్దేశించిన ఈ పథకానికి ఇటీవలే తొలి విడత నిధులు మంజూరు కాగా.. పనులు ఊపందుకున్నాయి. ఆర్థిక భారం పడకుండా ఇదివరకే అనుకూలంగా ఉన్న చెరువులను రిజర్వాయర్లుగా మార్చడంతోపాటు ప్రాజెక్ట్ వెంట గ్రీన్బెల్ట్ ఏర్పాటు చేయనున్నారు. అదేవిధంగా 56 హెక్టార్లలో మొక్కలను పెంచనున్నారు. స్టేజీ–1 పనులు ప్రారంభం.. రూ.4,885 కోట్ల వ్యయంతో కొడంగల్–నారాయణపేట–మక్తల్ ఎత్తిపోతల పథకం పనులను మూడు విడతలుగా చేపట్టాలని నిర్ణయించారు. మొదటి విడత కింద రూ.2,945 కోట్ల పనులను రెండు ప్యాకేజీలుగా విభజించారు. ఇందులో స్టేజీ–1 (కాట్రేవులపల్లి), స్టేజీ–2 (ఊట్కూరు/బాపూర్), స్టేజీ–3 (జాయమ్మ చెరువు)కి సంబంధించి పంప్హౌస్లు, పైపులైన్ పనులు చేయాలి. ప్రస్తుతం మొదటి విడతకు సంబంధించి టెండర్ల ప్రక్రియ పూర్తయింది. ఇటీవల రూ.1,400 కోట్లు మంజూరు కాగా.. సంబంధిత కాంట్రాక్టర్లు స్టేజీ–1లో భాగంగా మక్తల్ మండలం కాట్రేవులపల్లి వద్ద అప్రోచ్ చానల్, పంప్హౌస్ పనులు ప్రారంభించారు. అదేవిధంగా కాట్రేవులపల్లి, మంథన్గోడు, కాచ్వార్ మీదుగా ఊట్కూరు పెద్దచెరువు వరకు అనుసంధానం చేసేలా ప్రెషర్ మెయిన్ పైపులను కాచ్వార్ వద్ద అందుబాటులో ఉంచారు. ఆ రిజర్వాయర్లు ఇవే.. ఊట్కూరు (మక్తల్), జాజాపూర్, పేరుపళ్ల జాయమ్మ (నారాయణపేట), కాన్కుర్తి (దామరగిద్ద), దౌల్తాబాద్, కొడంగల్, హస్నాబాద్, బొంరాస్పేట, లక్ష్మీపూర్, ఈర్లపల్లి (కొడంగల్). సీఎం ప్రత్యేక నజర్.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2014లో జీఓ 69 ద్వారా కొడంగల్ లిఫ్ట్కు అప్పటి ప్రభుత్వం అనుమతులు జారీ చేసినప్పటికీ పనులు ప్రారంభం కాలేదు. ఆ తర్వాత తెలంగాణ నూతన రాష్ట్రంగా ఆవిర్భవించింది. అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ (అప్పటి టీఆర్ఎస్) ప్రభుత్వం దీన్ని పక్కనబెట్టి పాలమూరు–రంగారెడ్డి నుంచి ఆ మూడు నియోజకవర్గాలకు నీరందించేలా ముందుకు సాగింది. అయితే ఆనాడు జీఓ 69ని తీసుకురావడంలో అప్పటి కొడంగల్ ఎమ్మెల్యే, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రధాన పాత్ర పోషించారు. ఈ క్రమంలో 2023లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం.. ఆయనే సీఎంగా బాధ్యతలు స్వీకరించడంతో మళ్లీ కొడంగల్ ఎత్తిపోతలపై ఆశలు చిగురించాయి. ఆయన ఇచ్చిన హామీ మేరకు ప్రత్యేకంగా దృష్టిసారించి.. పలు సమీక్షలు, భూసేకరణ, ప్రజాభిప్రాయ సేకరణ అడ్డంకులు అధిగమించి కొడంగల్–నారాయణపేట–మక్తల్ ఎత్తిపోతలకు శ్రీకారం చుట్టారు. ఎట్టకేలకు పనులు ప్రారంభం కావడంతో మూడు నియోజకవర్గాల రైతాంగంలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. -
చెరువులు, బావుల వద్ద అప్రమత్తం
● చిన్నారుల రక్షణపై పోలీసు నిఘా ● ఈత కొట్టేందుకు వెళ్లి ఇటీవల ఓ విద్యార్థి మృతి ● గతేడాది జరిగిన ఘటనలపై ఆరా గద్వాల క్రైం: వేసవి సెలవుల్లో చిన్నారులు వినోదం కోసం ఎంచుకునే మార్గాలు విషాధం కాకూడదని పోలీసులు సూచిస్తున్నారు. వేసవి తాపం నుంచి రక్షణ పొందేందుకు చెరువులు, బావులు, నీటి గుంతల్లో ఈత పడేందుకు పిల్లలు ఆసక్తి చూపుతుంటారు. ఈ క్రమంలో సరదా కోసం ఈత పడే సమయంలో కొందరు చిన్నారులు మృత్యువాత పడిన ఘటనలు జరిగాయి. ఈ క్రమంలో పోలీసులు నిరంతరం గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈత రాని వారు నీటి కుంటలకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. మరి కొందరు బావుల్లో సరదా ఆటల పేరుతో ఎక్కువ సేపు మునగడం, మరికొన్ని వింత చేష్టలు చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. బావుల్లో కంప చెట్లు, రాళ్లు ఉండడంతో వాటిలో చిక్కుకొని మరికొందురు మృత్యువాత పడుతున్నారని, ఈత వెళ్లే సమయంలో ఇలాంటి ప్రమాదాలను గుర్తించాలని పలువురు సూచిస్తున్నారు. గతేడాది ఏడుగురు చిన్నారులు ఈతకు వెళ్లి మృతి చెందడంతో జిల్లా వ్యాప్తంగా చెరువులు, బావులు, నీటి గుంతల పరిసర ప్రాంతాల్లో పోలీసుశాఖ నిఘా ఏర్పాటు చేసింది. ఘటనలు.. ● మల్దకల్ మండలంలోని అమరవాయి గ్రామానికి చెందిన విద్యార్థి (13) ఈ నెల 8 వ తేదీన తోటి స్నేహితులతో కలిసి గ్రామ సమీపంలోని బావిలో ఈత నేర్చుకునేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు బావిలో మునిగి మృతి చెందాడు. ● అయిజ మండలం మూగోనిపల్లికి చెందిన విద్యార్థి (10) మార్చి 16, 2025 న గ్రామ సమీపంలోని బావిలో ఈత కొట్టేందుకు తోటి స్నేహితులతో కలిసి వెళ్లాడు. బావిలోకి పై నుంచి దూకగా.. నీటిలో ఉన్న కర్ర ముక్క గొంతుకు గుచ్చుకుంది. ఈ ప్రమాదంలో విద్యార్థి మృతి చెందాడు. ● గట్టు మండల కేంద్రానికి చెందిన ఓ విద్యార్థి (17) ఏప్రిల్ 10, 2025 న గ్రామం సమీపంలోని బావికి ఈత కొట్టేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు బావిలో మునిగి మృతి చెందాడు. పిల్లలకు వేసవి సెలవుల్లో తల్లిదండ్రులు రక్షణగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. పిల్లల సంతోషాలను స్వీకరిస్తూనే వారిని సరైన మార్గంలో తీసుకువెళ్లాలి. చిన్నారులకు ఈత నేర్చించాలనుకుంటే తల్లిదండ్రులే దగ్గరుండి తీసుకెళ్లాలని కోరారు. వాళ్లకు స్నేహితులకు ఈత వచ్చు అని, వారే నేర్పిస్తారనే ధోరణిలో తల్లిదండ్రులు ఉంటే అనర్థాలు తప్పవని హెచ్చరిస్తున్నారు. ఏదైనా అనుకోని ఘటన జరిగితే వేగంగా స్పందించేందుకు పిల్లల్లో ఆలోచనా శక్తి తక్కువగా ఉంటుందని తెలిపారు. ఒంటరిగా నీటి కుంటల వద్దకు వెళ్లకూడదని అవగాహన కల్పించాలన్నారు. చిన్నారులకు ఈత నేర్పించే సమయంలో మొదట వాళ్లు అలవాటు పడే వరకు రక్ష ణ చర్యలు తీసుకోవాలని సూ చించారు. తప్పనిసరిగా లైఫ్జాకెట్లు, కట్టెలతో తయారు చేసిన బెండ్లు వాడాలన్నారు. కొన్నిసార్లు పిల్లలకు ఖాళీ ప్లాస్టిక్ క్యాన్లను కట్టి పంపి స్తారని, అలా చేయకూడదన్నారు. అనుకోని పరిస్థితుల్లో వాటిలోకి నీరు వెళితే చిన్నారులు మునిగిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ప్రమాదాల నివారణకు జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో స్వీయ జాగ్రత్తలపై నిరంతరం అవగాహన కల్పిస్తాం. వ్యవసాయ బావులు, రిజర్వాయర్లు, నీటి కుంటల వద్దకు పిల్లలు వెళ్లకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలి. దీనిపై గ్రామ పోలీసు సిబ్బంది అప్రమత్తంగా ఉండేలా ఆదేశాలు జారీ చేశాం. నిరుపయోగంగా ఉన్న బోరు వెల్స్ను మూసివేసేలా గ్రామ పంచాయతీ, మున్సిపల్ అధికారులు చొరువ తీసుకోవాలి. దీనిపై కళాజాత బృందం ఆధ్వర్యంలో అవగాహన సదస్సుల ద్వారా వివరిస్తాం. తల్లిదండ్రులు, ప్రజలు పోలీసు శాఖకు సహరించాలి. ప్రమాదభరితంగా ఉన్న బావులు, చెరువులు, నీటి కుంటల వద్ద ప్రహారీ ఏర్పాటుకు కృషి చేస్తాం. – శ్రీనివాసరావు, ఎస్పీ -
రైతుకు కూర‘గాయాలు’
గద్వాల వ్యవసాయం: కూరగాయలు సాగు చేసిన రైతులు విలవిలలాడుతున్నారు. బావులు, బోర్లలో ఉన్న నీటి లభ్యత ఆధారంగా సాగు చేసిన కూరగాయల పంటను అధిక ఉష్ణోగ్రతలు దెబ్బతీస్తున్నాయి. వేడి కారణంగా పూత రాలుతోంది. కాయలు వచ్చిన చోట వాటి రంగులు మారుతున్నాయి. వాతావరణ మార్పులతో దిగుబడులు తగ్గి, ఆర్థికంగా నష్టాలు వచ్చే పరిస్థితి ఏర్పడిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో సాధారణ పంటలతో పాటు రెండు సీజన్లతో కలిపి ఏటా దాదాపు 10 వేల ఎకరాల్లో ఇక్కడి రైతులు వివిధ రకాల కూరగాయలు సాగు చేస్తారు. గద్వాల మండలంలో వంకాయ, బెండ, పచ్చిమిర్చి, చిక్కుడు, క్యాలిఫ్లవర్, క్యాబేజీ, ధరూర్ మండలంలో బెండ, టమాట, మల్దకల్ మండలంలో చిక్కుడు, టమాట, బీర, సోరకాయ, బెండ, కాకర, అయిజలో బెండ, చిక్కుడు, వడ్డేపల్లిలో వంకాయ, బెండ, కాకర, క్యాబేజీ, క్యాలిఫ్లవర్, ఉల్లి, అలంపూర్లో ఉల్లి, రాజోళిలో పచ్చిమిర్చి, ఉల్లి, టమాట, గట్టు, కేటీదొడ్డి మండలాల్లో టమాటతో ఆయా మండలాల్లో ఆకుకూరలు సైతం సాగు చేస్తారు. ఏటా వానాకాలం సీజన్లో 4 వేల నుంచి 5 వేల ఎకరాల్లో, యాసంగిలో 3 నుంచి 4 వేల ఎకరాల్లో కూరగాయలు సాగు అవుతున్నట్లు ఉద్యానశాఖ రికార్డులు చెబుతున్నాయి. అయితే 2025–26 వానాకాలం సీజన్ కూరగాయల రైతులను తీవ్ర నిరాశకు గురి చేసింది. జిల్లా వ్యాప్తంగా 3,750 ఎకరాల్లో సాగు చేయగా.. జూన్, జూలైలో ఎలాంటి ఇబ్బందులు రాలేదు. ఆగస్టు, సెప్టెంబర్లో కురిసిన అధిక వర్షాలు కూరగాయల సాగుపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. దిగుబడులు గణనీయంగా తగ్గాయి. పలుచోట్ల వర్షపు నీరు నిలిచి తోటలు నీట మునిగాయి. అక్టోబర్లో కురిసిన వర్షాలు సైతం నష్టాన్ని మిగిల్చాయి. చేతికి వచ్చిన కొద్దిపాటి కూరగాయలు సైతం రంగులు మారడంతో నాణ్యత తగ్గి బహిరంగా మార్కెట్లో ఆశించిన ధర పలకలేదని రైతులు వాపోయారు. వానాకాలంలో కురిసిన వర్షాల వల్ల బోర్లు, బావులో భూగర్భ జలం పెరిగింది. దీంతో యాసంగిలో జిల్లావ్యాప్తంగా 2,450 ఎకరాల్లో కూరగాయలు సాగు చేశారు. కొంతమంది రైతులు విత్తనాలు వేయగా.. చాలా మంది నారుమళ్లతో కూరగాయల సాగు చేశారు. అయితే గడిచిన ఇరవై రోజల నుంచి వాతావరణంలో చాలా మార్పులు వచ్చాయి. తెల్లవారుజామున చలిగా ఉంటుండగా.. ఉదయం 9గంటల నుంచే ఉష్ణోగ్రతలు మొదలవుతున్నాయి. అప్పటి నుంచి క్రమేణ ఎండల తీవ్రత పెరుగుతూ వస్తోంది. సాయంత్రం వరకు ఇదే పరిస్థితి ఉంటోంది. అధికంగా నమోదు అవుతున్న ఉష్ణోగ్రతలు కూరగాయల సాగుపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. దీనికి తోడు భూమిలో తేమశాతం తగ్గిపోయింది. దీంతో కూరగాయల పూత రాలుతోంది. మొక్క పెరగడం లేదు. ఎండవేడిమికి టమాట, క్యాప్సికం, క్యాలిఫ్లవర్, కాకర, బీర, వంకాయ తదితర కూరగాయల రంగులు మారి, సైజులు తగ్గిపోతున్నాయిని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెట్టుపైనే కాయలు కుచించుకుపోతున్నాయని అంటున్నారు. పెట్టిన పెట్టుబడులు వచ్చే పరిస్థితులు కనబడటం లేదని వాపోతున్నారు. వానాకాలంలో అధిక వర్షాలతో, యాసంగిలో అధిక ఉష్ణోగ్రతలతో ఆర్థికంగా నష్టాలు వచ్చాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భూమిలో తగ్గిన తేమశాతం రాలుతున్న పూత.. మారుతున్న కాయల రంగులు దిగుబడిపై తీవ్ర ప్రభావం కొద్ది రోజులుగా పగటి ఉష్ణోగ్రతలు పెరిగాయి. దీని ప్రభావం కూరగాయల పంటలపై ఉంటుంది. ఎండ వేడిమి తగలకుండా షెడ్నెట్లు ఏర్పాటు చేసుకోవాలి. కాయలు, పూత రాలకుండా తగిన యాజమాన్య పద్ధతులు పాటించాల్సి ఉంటుంది. రైతులు ఉద్యానశాఖ అధికారుల, సిబ్బంది సలహలు, సూచనలు తీసుకోవాలి. – ఎంఏ అక్బర్, జిల్లా ఉద్యానశాఖ అధికారి -
నేటి నుంచి ఒంటిపూట బడులు
గద్వాల: ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో సోమవారం నుంచి ఒంటిపూట బడులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జిల్లా విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. వచ్చే నెల 23వ తేదీ వరకు ఒంటిపూట బడులు నిర్వహించనున్నారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు తరగతులు కొనసాగనున్నాయి. పదో తరగతి పరీక్ష కేంద్రాలు ఏర్పాటుచేసిన పాఠశాలలను మధ్యాహ్నం 1గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్నారు. అయితే ఒంటిపూట బడులు నిర్వహిస్తున్నప్పటికీ మధ్యాహ్న భోజనం యథావిధిగా కొనసాగనుంది. తరగతులు పూర్తయిన తర్వాత మధ్యాహ్న భోజనం అందించి విద్యార్థులను ఇంటికి పంపాలని అధికారులు సూచించారు. దరఖాస్తు చేసుకోండి కందనూలు: ఎస్సీ యాక్షన్ ప్లాన్లో భాగంగా ఎస్సీలకు బ్యాంకు లింకేజీ ద్వారా అందించే వివిధ ఉపకరణాల కోసం దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ బదావత్ సంతోష్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. 2025–26 సంవత్సరానికి గాను ఎలక్ట్రిక్ ద్విచక్ర, త్రిచక్ర వాహనాలు, సోలార్ యూనివర్సల్ పంప్ కంట్రోళ్లకు రాయితీలు అందించనున్నట్లు పేర్కొన్నారు. వ్యవసాయ రంగానికి సంబంధించి 21 నుంచి 50 ఏళ్ల వయసు, వ్యవసాయ ఆధారిత పథకాలకు 21 నుంచి 60 ఏళ్ల వయసు వారు అర్హులని తెలిపారు. అలాగే గ్రామీణ ప్రాంతాల వారికి రూ. 1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల వారికి రూ. 2 లక్షల వార్షిక ఆదాయం మినహాయింపు ఉంటుందని.. అర్హత కలిగిన వారు ఆధార్, రేషన్ కార్డు, కుల, ఆదాయ ధ్రువపత్రాలు, శాశ్వత డ్రైవింగ్ లైసెన్స్, పట్టాదారు పాస్బుక్లతో tsobmmr.cgg.gov.in వెబ్సైట్లో ఈ నెల 17 నుంచి 24వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పేదల గొంతుక కాన్షీరాం గద్వాల న్యూటౌన్: పేదల గొంతుకై తన జీవిత చరమాంకం వరకు పోరాడిన కాన్షీరామ్ అని భీమ్ ఆర్మీ రాష్ట్ర అధ్యక్షులు వి.మహేందర్ కొనియాడారు. ఆదివారం కాన్సీరామ్ జయంతిని పురస్కరించుకుని భీమ్ఆర్మీ నాయకులు జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తాలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో న్యాయవాది మధుసుదన్బాబు, వినయ్, వీరేష్, ఏసేపు తదితరులు పాల్గొన్నారు. రాజ్యాధికారమే అన్ని సమస్యలకు పరిష్కారం ఎర్రవల్లి: రాజ్యాధికారమే అన్ని సమస్యలకు పరిష్కారమని బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు మణికుమార్ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో బీఎస్పీ ఆధ్వర్యంలో ఆ పార్టీ వ్యవస్థాపకుడు కాన్షీరామ్ 92వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన హాజరై నాయకులతో కలిసి కాన్షీరామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో శాంతిరాజు, రాంబాబు, రాముడు, శివ, బొజ్జన్న, బుచ్చన్న, నారాయణ తదితరులు పాల్గొన్నారు.: మొబైల్ వాహనాలతో న్యాయ సేవలు పాలమూరు: తెలంగాణ రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ (టీఎస్ఎల్ఎస్ఏ) రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలో న్యాయ సేవలను మరింత విస్తరించడానికి రెండు మొబైల్ లోక్ అదాలత్ వ్యాన్లు అందుబాటులోకి తీసుకువచ్చి ప్రారంభించినట్లు జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్.ప్రేమలత ఒక ప్రటకనలో తెలిపారు. ఈ మొబైల్ వాహనాలు రొటేషన్ పద్ధతిలో జిల్లావ్యాప్తంగా పర్యటిస్తూ లీగల్ క్యాంపులు, లీగల్ సర్వీసెస్ ప్రచార కార్యక్రమాలు, జైలు సందర్శన చేస్తారన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో తిరుగుతూ ప్రజలకు చట్టాలపై అవగహన కల్పించడం, బాధితులకు న్యాయ సలహాలు ఇవ్వడం జరుగుతుందన్నారు. ప్రజలకు పూర్తిస్థాయిలో న్యాయ సేవలను దగ్గర చేయాలనే లక్ష్యంతో ఈ మొబైల్ వాహనాలు ఏర్పాటు చేయడం ప్రధాన ఉద్దేశమన్నారు. టోల్ఫ్రీ నం.15100 ద్వారా న్యాయ సలహాలు పొందవచ్చన్నారు. ఈ మొబైల్ వాహనాల్లో మొదటి క్యాబిన్లో కంప్యూటర్లు, ఎల్ఈడీ టీవీ, వెబ్ కెమెరాలు, హైస్పీడ్ ఇంటర్నెట్, సీసీటీవీ, యూపీఎస్, రెండో క్యాబిన్లో జ్యుడీషియల్ అధికారులు, ప్యానెల్ న్యాయవాదులు, పీఎల్ఓలు, ఇతర సిబ్బంది ఉంటారని తెలిపారు. -
తరచుగా తనిఖీలు చేపట్టాలి..
వ్యవసాయ మార్కెట్లతోపాటు ప్రైవేటు వ్యాపారుల వద్ద నిర్వహిస్తున్న కాంటాల్లో తేడాలు ఉంటున్నాయి. ప్రామాణికమైన తూకం రాళ్లకు బదులుగా సాధారణ బండరాళ్లను వినియోగిస్తున్నారు. తూకంలో తేడాలు వస్తున్నాయని ఫిర్యాదు చేస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. లీగల్ మెట్రాలజీ అధికారులు తరచుగా తనిఖీలు చేపట్టాలి. – వర్దం సైదులు, అచ్చంపేట మోసాలను అరికట్టాలి.. నిత్యావసరాలు, కూరగాయలు, పండ్లు ఇలా ఏవైనా కొనుగోలు చేసేందుకు మార్కెట్కు వెళితే తూకాలలో మోసాలు జరుగుతున్నాయి. వాస్తవానికి ఎలక్ట్రానిక్ తూకాలు వాడాల్సిన చోట చాలా వరకు మ్యాన్వల్ తూకాలనే ఉపయోగిస్తున్నారు. ఫలితంగా తూకాలలో మోసాలు పెరిగి కష్టమర్లు నష్టపోతున్నారు. దీనిపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకుని మోసాలను అరికట్టాలి. – నాయుడు, గద్వాల పర్యవేక్షణ లేదు.. ప్రస్తుతం బంగారు ధర ఆకాశంలో ఉంది. శుభాకార్యలకు కొనుగోలు చేసేందుకు వెళితే తూకాలలో మోసాలు జరిగి కష్టమర్లు చాలా నష్టపోతున్నారు. దీనిపై నిరంతరం పర్యవేక్షణ చేయాల్సిన తూనికలు, కొలతల శాఖ అధికారులు పత్తాలేకుండా పోయారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి చర్యలు తీసుకుని కష్టమర్లు నష్టపోకుండా చూడాలి. – రమేష్, గద్వాల●


