Jogulamba
-
కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టాలి
● బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: కాంగ్రెస్ ప్రభుత్వం ఉమ్మడి పాలమూరు జిల్లాకు తీరని అన్యాయం చేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు మండిపడ్డారు. చివరలో మిగిలిన పాలమూరు ప్రాజెక్టు పనులు చేపట్టకుండా.. రైతులకు సాగునీరు అందించకుండా ద్రోహం చేస్తోందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్లోని మాజీ మంత్రి లక్ష్మారెడ్డి నివాసంలో ఆదివారం ఆయన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ నేతలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నియోజకవర్గాల వారీగా క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితులపై సుదీర్ఘంగా సమీక్షించారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న సమావేశాలు, నియోజకవర్గ స్థాయిలో పార్టీ కార్యక్రమాల తీరుపై నేతల వద్ద ఆరా తీశారు. త్వరలో ప్రారంభం కానున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఓటర్ల జాబితా సవరణ, పార్టీ చేపట్టనున్న సభ్యత్వ నమోదు కార్యక్రమంపై చర్చించారు. ఈ సందర్భంగా క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్పై ప్రజల్లో భారీగా ఆదరణ పెరిగిందని, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రతిఒక్కరూ గుర్తించారని, ఆ పార్టీ అన్నివర్గాలకు చేస్తున్న మోసం పట్ల తీవ్రంగా ఆగ్రహంతో ఉన్నారని జిల్లా నాయకులు కేటీఆర్కు వివరించినట్లు తెలిసింది. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ రానున్న ఎన్నికలు, పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశా రు. ప్రతి గ్రామంలో బూత్ల వారీగా పార్టీని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రజల్లో ఉన్న సానుకూలతను పార్టీకి అనుకూలంగా మలు చుకోవాలని.. ఆ దిశగా కలిసికట్టుగా.. పక్కా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని సూచించారు. సమావేశంలో ఎమ్మెల్సీలు చల్లా వెంకట్రామిరెడ్డి, నవీన్కుమార్రెడ్డి, ఎమ్మెల్యే విజయుడు, మాజీ మంత్రులు శ్రీనివాస్గౌడ్, నిరంజన్రెడ్డి, లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్రెడ్డి, రాజేందర్రెడ్డి, హర్షవర్ధన్రెడ్డి, మర్రి జనార్దన్రెడ్డి, పట్నం నరేందర్రెడ్డి, జైపాల్యాదవ్, అంజయ్యయాదవ్, చిట్టెం రామ్మోహన్రెడ్డి, రావుల చంద్రశేఖర్రెడ్డి, మాజీ ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి పాల్గొన్నారు. -
టెట్ వాయిదా వేయాలి
అయిజ: రాష్ట్రంలో ఈ నెల 17న నిర్వహించే టెట్ను వాయిదా వేయాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రామచంద్రారెడ్డి కోరారు. ఆదివారం అయిజలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో టెట్, ఆర్ఆర్బీ పరీక్షలు ఒకే రోజు ఉండటంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారన్నారు. ఉపాధ్యాయ ఉద్యోగాలతో పాటు రైల్వే ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న నిరుద్యోగులను దృష్టిలో ఉంచుకొని టెట్ను వాయిదా వేయాలని కోరారు. సమావేశంలో పట్టణ అధ్యక్షుడు నర్సింహులు, మాజీ అధ్యక్షుడు భగత్రెడ్డి, లక్ష్మణ్గౌడ్, భీమన్న ఉన్నారు. -
మురిపిస్తున్న తొలకరి
అలంపూర్: తొలకరి వర్షం అన్నదాతలను మురిపిస్తోంది. ఇప్పటికే పంటల సాగులో నిమగ్నమైన రైతాంగానికి ఊరట కలిగిస్తోంది. వేసవి ఎండతో నెర్రెలుబారిన పంట పొలాలు వర్షపు నీటిలో ఓళలాడుతున్నాయి. బక్కచిక్కిని వాగులు వరద ప్రవాహంతో పారుతున్నాయి. వర్షానికి తోడు భారీ ఈదురుగాలులు వీస్తుండటంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. చినుకుపడినా.. గాలి వీచినా విద్యుత్ సమస్యతో అవస్థలు పడుతున్నారు. జిల్లాలో వర్షపాతం ఇలా.. జిల్లావ్యాప్తంగా రెండు రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం తెల్లవారుజామున సైతం జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షం కురిసింది. కేటీదొడ్డి మండలంలో అత్యధికంగా 82.8 మి.మీ. వర్షపాతం నమోదైంది. వడ్డేపల్లి మండలంలో అత్యల్పంగా 6.8 మి.మీ. వర్షం కురిసింది. అయిజలో 44.5 మి.మీ., మానవపాడులో 18.5 మి.మీ., ఇటిక్యాలలో 11.8 మి.మీ., రాజోళిలో 25.5 మి.మీ., ఉండవెల్లిలో 15.2 మి.మీ., అలంపూర్ మండలంలో 9.9 మి.మీ. వర్షపాతం నమోదైంది. అదే విధంగా గద్వాల నియోజకవర్గంలోని ధరూరులో 43.9 మి.మీ., గద్వాలలో 11.3 మి.మీ., మల్దకల్లో 9.6 మి.మీ., గట్టులో 39 మి.మీ. వర్షం కురిసింది. ప్రస్తుతం కురిసిన వర్షానికి అక్కడక్కడ వాగులు, వంకలు పారుతున్నాయి. ఈదురుగాలులకు చెట్లు, కరెంటు స్తంభాలు పడిపోవడంతో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. జిల్లావ్యాప్తంగా విస్తారంగా వర్షాలు అత్యధికంగా కేటీదొడ్డిలో 82.8 మి.మీ. అత్యల్పంగా వడ్డేపల్లిలో 6.8 మి.మీ. తడిసిన పంట పొలాలు.. సాగు పనుల్లో రైతన్నలు -
సమస్యల బడి
ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగుపడని వసతులు ● నేటి నుంచి బడుల పునఃప్రారంభం ● తరగతి గదులు, మరుగుదొడ్లు, ఇతర వసతులు కరువు ● జిల్లాలో 460 పాఠశాలలు.. 71,780 మంది విద్యార్థులు శిథిలావస్థలోతరగతి గదులు.. అనేక గ్రామాల్లో పాఠశాల భవనాలు శిధిలావస్థలో ఉన్నాయి. పైకప్పు పెచ్చులూడి విద్యార్థులపై పడిన ఘటనలు లేకపోలేదు. తరగతి గదులు శిథిలావస్థకు చేరడంతో విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ చదువు సాగించాల్సిన పరిస్థితి నెలకొంది. చాలా పాఠశాలల్లో మరుగుదొడ్లు, మూత్రశాలు సైతం పూర్తిస్థాయిలో అందుబాటులో లేవు. ఉన్న చోట సైతం కొన్ని నిరుపయోగంగా ఉంటున్నాయి. తాగునీటి వసతి సైతం అంతంత మాత్రంగానే ఉంది. ప్రహరీలు లేని పాఠశాలలు, తరగతి గదుల కొరత తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. ఇప్పటికై నా ప్రభుత్వం విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించడానికి కృషి చేయాల్సిన అవసరముంది. పంపిణీకి సిద్ధంగా పాఠ్యపుస్తకాలు.. ప్రభుత్వ పాఠశాలల్లో నూతన విద్యా సంవత్సరం విద్యార్ధులకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేందుకు ఏర్పాట్లు చేశారు. విద్యార్ధులను ప్రత్యేకంగా ఆకర్షించేలా గోడలపై విద్యా సంబంధిత చిత్రాలు, సూక్తులు, రంగురంగుల పెయింటింగ్ వేయించారు. పాఠ్యపుస్తకాలు, నోటుబుక్స్ పంపిణీకి సైతం ఏర్పాట్లు పూర్తిచేసినట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. అలంపూర్/కేటీదొడ్డి/ఇటిక్యాల: వేసవి సెలవులు ముగిశాయి. సోమవారం నుంచి పాఠశాలు పునఃప్రారంభం కానున్నాయి. ఉన్నత విద్యతో భవిష్యత్ను తీర్చిదిద్దుకోవడానికి విద్యార్థులు బడిబాట పట్టనున్నారు. దాదాపు నెలన్నర రోజులపాటు కొనసాగిన వేసవి సెలవులకు స్వస్తి పలికి.. ఆట–పాటల మధుర స్మృతులతో పాఠశాలలో అడుగు పెట్టనున్నారు. చాలా వరకు ప్రభుత్వ పాఠశాలల్లో ఎప్పటిలాగే అరకొర వసతుల మధ్యే తమ విద్యాభ్యాసం కొనసాగించనున్నారు. ప్రభుత్వం విద్యాలయాల్లో కనీస సౌకర్యాలు కల్పించడంలో దృష్టిసారించకపోవడంతో చదవుకునేందుకు వచ్చే కొత్త, పాత విద్యార్థులకు కష్టాలు తప్పని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం నూతన విద్యావిధానాన్ని అమల్లోకి తెచ్చినప్పటికీ.. సమస్యలు మాత్రం పూర్తిస్థాయిలో పరిష్కారానికి నోచుకోలేదు. అసంపూర్తిగా పనులు.. గతేడాది మౌలిక వసతుల కల్పనలో భాగంగా ప్రభుత్వం అమ్మ ఆదర్శ పాఠశాల కార్యక్రమానికి 142 బడులను ఎంపిక చేసింది. ఆయా పాఠశాలల అభివృద్ధి కోసం చేపట్టిన అనేక పనులు నేటికీ అసంపూర్తిగానే ఉన్నాయి. ఫలితంగా విద్యార్థులు మౌలిక వసతులకు నోచుకోక ఇబ్బందులు ఎదుర్కొవాల్సిన పరిస్థితి నెలకొంది. -
శ్రీశైలం దారిలో..
ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం దిశగా అడుగులు ● రూ.18,500 కోట్లతో కేంద్రానికి ప్రతిపాదనలు ● తాజాగా ప్రధాని మోదీని కలిసిన సీఎం రేవంత్రెడ్డి ● కారిడార్ నిర్మాణంతో బ్రాహ్మణపల్లి– శ్రీశైలం, పెద్దదోర్నాల– శ్రీశైలం మధ్య రవాణా సౌకర్యం మెరుగు ● మరోవైపు ఏపీ ప్రభుత్వం సైతం కేంద్రంపై ఒత్తిడి డీపీఆర్ పూర్తయింది.. ఎలివేటెడ్ కారిడార్కు కేంద్రం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల పరిధిలో నిర్మించే కారిడార్ సమగ్ర ప్రాజెక్టు రిపోర్ట్ (డీపీఆర్) పూర్తయింది. కేంద్రం జాతీయ వన్యప్రాణి సంరక్షణ బోర్డు అనుమతుల కోసం నివేదిక పంపాం. బోర్డు అనుమతులు వస్తే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కుతుంది. అనుమతుల కోసం ఎంపీల బృందం కేంద్ర మంత్రి నితీన్ గడ్కరీని కలిసి ప్రతిపాదనలు అందజేయగా సానుకూలంగా స్పందించారు. – వంశీకృష్ణ, ఎమ్మెల్యే, వన్యప్రాణి సంరక్షణ బోర్డు సభ్యుడు అచ్చంపేట: శ్రీశైలం క్షేత్రానికి వెళ్లాలంటే నల్లమల ఘాట్ రోడ్డు ఒక్కటే మార్గం. అందులో అనేక మలుపులు, ఎత్తుపల్లాలు ఉంటాయి. దీనికితోడు ఘాట్ రోడ్డులో రాత్రిళ్లు ప్రయాణం నిషిద్ధం. ఈ నేపథ్యంలో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శ్రీకారం చుట్టాయి. అయితే ఈ ప్రాజెక్టు ఇంకా ప్రతిపాదన దశలోనే ఉండగా.. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రధాని నరేంద్రమోదీని కలిసి ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని విన్నవించారు. మరోవైపు ఏపీ ప్రభుత్వం సైతం కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తున్నట్లు తెలిసింది. ఈ కారిడార్ పూర్తయితే బ్రాహ్మణపల్లి (మన్ననూర్)– శ్రీశైలం, పెద్దదోర్నాల– శ్రీశైలం మార్గాల మధ్య దూరం తగ్గి.. రవాణా సౌకర్యం మెరుగుపడనుంది. ఎక్కడి నుంచి ఎక్కడికి.. తెలంగాణ వైపు బ్రాహ్మణపల్లి నుంచి శ్రీశైలం వరకు 45.35 కి.మీ., ఏపీలోని పెద్ద దోర్నాల నుంచి శ్రీశైలం వరకు 41.39 కి.మీ.,తో కలిపి మొత్తం 86.74 కి.మీ. ఎత్తైన కారిడార్ నిర్మించనున్నారు. శ్రీశైలం ఆలయ సమీపం నుంచి వెళ్లేలా మార్పులతో కూడిన డీపీఆర్ ప్రతిపాదనలు కేంద్రానికి పంపించారు. ఇందుకు రూ.18,500 కోట్ల నిధులు అవసరం కాగా.. కారిడార్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం 2025 మార్చి 2న సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. ఇప్పటికే సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) పూర్తయింది. అలాగే ఈ ప్రాజెక్టులో భాగంగా ఈగలపెంట– సున్నిపెంటల (లింగాలగట్టు) మధ్య తెలంగాణ– ఏపీలను అనుసంధానిస్తూ.. కృష్ణానదిపై రూ.300 కోట్లతో ఐకానిక్ వంతెన నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. జాతీయ వన్యప్రాణి బోర్డు అనుమతుల కోసం.. ఈ ప్రాజెక్టు పర్యావరణ ప్రభావ అధ్యయనం కోసం భారత వన్యప్రాణి సంస్థ సహాయం తీసుకుంటున్నారు. వారి నివేదిక ఆధారంగా జాతీయ వన్యప్రాణి మండలి అనుమతులు పొంది.. త్వరలోనే పనులు ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అక్కడి నుంచి అనుమతులు వస్తే.. కారిడార్ పట్టాలు ఎక్కే అవకాశం ఉంది. నల్లమల అభయారణ్యం ప్రాంతం కావడంతో వన్యప్రాణులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా 32 అడుగుల ఎత్తులో కారిడార్ నిర్మించనున్నారు. నిత్యం వెయ్యికిపైగా వాహనాలు.. హైదరాబాద్ నుంచి శ్రీశైలం మల్లన్న దర్శనం కోసం నిత్యం వెయ్యికిపైగా వాహనాలు వస్తుంటాయి. శని, ఆది, సోమవారాల్లో రద్దీ మరింత ఎక్కువగా ఉంటుంది. ఒక్కోసారి కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ నిలిచిపోతుంది. గత ఏప్రిల్ 24న కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ సహాయ మంత్రి హర్ష మల్హోత్రా ఈ రహదారి మీదుగా శ్రీశైలం వెళ్తూ.. వాహనదారులు పడుతున్న అవస్థలను ప్రత్యక్షంగా చూశారు. ఈ క్రమంలోనే ఎలివేటెడ్ కారిడార్ మంజూరుకు సహకరిస్తామని చెప్పినట్లు తెలిసింది. ప్రమాదాలు చోటు చేసుకుంటున్నా.. ఈ మార్గంలో అనేక మూల మలుపులు, ఘాట్ రోడ్డు ఉండటంతో అనేక ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. శ్రీశైలం దైవ దర్శనం కోసం వచ్చి రోడ్డు ప్రమాదాల్లో మరణించిన ఘటనలు అనేకం ఉన్నాయి. ఈ నెల 7న కృష్ణగిరి (ఈగలపెంట) సమీపంలో మలుపు వద్ద ఓ ప్రైవేటు టూరిస్టు బస్సు రోడ్డు పక్కనున్న గోతిలో కూరుకుపోవడంతో 10 కి.మీ., మేర వాహనాలు నిలిచిపోయాయి. అటవీశాఖ సహకారంతో హైటికోస్ స్వచ్ఛంద సంస్థ శ్రీశైలం ప్రధాన రహదారిలో 2024 జూలై నుంచి 2025 జూన్ మధ్యకాలంలో ప్రమాదాలపై సర్వే నిర్వహించింది. ఏడాదిలో 51 రకాలకు చెందిన 456 వన్యప్రాణులు మృతిచెందినట్లు తేలింది. వీటన్నింటికీ చెక్ పెట్టేందుకు కారిడార్ ఒక్కటే మార్గమని నిపుణులు చెబుతున్నారు. భూ సేకరణే కీలకం.. ఎలివేటెడ్ కారిడార్ స్తంభాల ఆధారంగా నిర్మించడం వల్ల అటవీ భూమి వినియోగం చాలా తక్కువగా ఉంటుంది. నల్లమలలో కారిడార్ నిర్మాణానికి అవసరమైన భూసేకరణ కీలకంగా మారింది. బ్రాహ్మణపల్లి నుంచి మన్ననూర్, వటువర్లపల్లి, దోమలపెంట, పాతాళగంగ వరకు 147.31 హెక్టార్ల భూమి సేకరించాల్సి ఉండగా.. 128.63 హెక్టార్ల భూమి అటవీశాఖ పరిధిలోనే ఉంది. 18.68 హెక్టార్ల భూమి మాత్రమే పట్టాదారుల నుంచి సేకరించాల్సి ఉంది. -
ప్రజా శ్రేయస్సు కోసం అహర్నిశలు కృషి
ఎర్రవల్లి: ప్రజా శ్రేయస్సు కోసం నిరంతరం శ్రమిస్తున్నట్లు అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు అన్నారు. ఆదివారం మండలంలోని పుటాన్దొడ్డిలో రూ. 20లక్షలతో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. నియోజకవర్గ అభివృద్ధే తన ప్రథమ కర్తవ్యమని అన్నారు. గ్రామ పంచాయతీల సమగ్ర ప్రగతి ద్వారానే రాష్ట్రం, దేశాబివృద్ధి సాధ్యమవుతుందన్నారు. నూత నంగా అందుబాటులోకి వచ్చిన పంచాయతీ భవనాన్ని ప్రజలు వినియోగించుకోవాలని ఆయన సూచించారు. గ్రామంలో మౌలిక సదు పాయాలు మెరుగుపరిచే దిశగా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నీలి శ్రీనివాసులు, పీఏసీఎస్ మాజీ చైర్మన్ రంగారెడ్డి, మాజీ జెడ్పీటీసీ హనుమంతురెడ్డి, సర్పంచ్ నారాయణ, ఉపసర్పంచ్ విజయలక్ష్మి, నాయకులు పరమేశ్వర్రె డ్డి, మహేశ్వర్రెడ్డి, పరందామిరెడ్డి, రాముడు, మద్దిలేటి, బీసన్న పాల్గొన్నారు. పాలమూరు రెడ్క్రాస్కు మొదటి బహుమతి పాలమూరు: రాష్ట్రంలో అత్యధికంగా 7323 యూనిట్ల రక్త నిల్వలు సేకరించి మొదటి స్థానంలో నిలిచిన మహబూబ్నగర్ ఇండియన్ రెడ్క్రాస్ రక్తనిధి కేంద్రానికి ఆదివారం హైదరాబాద్లోని లోక్భవన్లో గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా చేతులమీదుగా రెడ్క్రాస్ చైర్మన్ నటరాజ్ బహుమతి అందుకున్నారు. 2025– 26 సంవత్సరంలో స్వచ్ఛంద రక్తదాన శిబిరాలు, రక్తమార్పిడి సేవలలో విశేష సేవలకు గుర్తింపుగా ఈ అవార్డు అందించారు. గత 24 ఏళ్లుగా రక్త సేకరణలో మహబూబ్నగర్ రెడ్క్రాస్ రక్తనిధి కేంద్రం అగ్రస్థానంలో నిలుస్తుందని నటరాజ్ వెల్లడించారు. నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): జిల్లాలోని నిరుద్యోగ యువతకు అమర్రాజా ఈఎస్ఎస్సీఐ ఆధ్వర్యంలో ఉపాధి రంగాల్లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు సంస్థ సెంటర్ మేనేజర్ ఆనంద్కుమార్ ఆదివారం ఒక ప్రకనటలో తెలిపారు. ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రిక్ వెహికిల్ సర్వీస్, ఏసీ టెక్నీషియన్ రంగాల్లో 90 రోజులపాటు ఉచిత శిక్షణ ఇవ్వనునట్లు చెప్పారు. పూర్తి వివరాల కోసం సెల్ నంబర్లు 73034 44397, 73034 44561లను సంప్రదించాలని సూచించారు. -
భారీ వర్షం.. రైతన్న హర్షం
● వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన అన్నదాతలు ధరూరు/ అయిజ/ రాజోళి/ ఉండవెల్లి/ అలంపూర్ రూరల్/ మానవపాడు: జిల్లాలో శుక్రవారం రాత్రి నుంచి శనివారం తెల్లవారుజాము వరకు భారీ వర్షం కురిసింది. ప్రధానంగా ధరూరు మండలంలో శనివారం ఉదయం 5 నుంచి 6 గంటల వరకు గంటపాటు కుండపోత వర్షం కురిసింది. అలాగే మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలు ఆరుతడి పంటల సాగుకు అనువుగా మారింది. ముఖ్యంగా ఖరీఫ్ పంట సాగుకు పొలాలను సిద్ధం చేసుకున్న రైతులు పత్తి, ఇతర విత్తనాలు నాటుకునేందుకు ఈ వర్షం అనుకూలంగా మారిందని పేర్కొంటున్నారు. అలాగే మానవపాడు మండలంలో శనివారం 36.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని అధికారులు వెల్లడించారు. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లాయి. అలాగే అలంపూర్ మండల పరిధిలో 41.2 మి.మీ., వర్షపాతం నమోదైందని తహసీల్దార్ ప్రభకర్ వెల్లడించారు. ఉండవెల్లి మండలంలోని అన్ని గ్రామాల్లోనూ మోస్తారు వర్షం కురిసింది. దీంతో శనివారం రైతులు పంట పొలాల్లో పత్తి విత్తనాలు నాటడంలో నిమగ్నమయ్యారు. ఈ క్రమంలో మండల పరిధిలో జాతీయ రహదారిపై అడ్డుగా పడిన చెట్లను ఎస్ఐ శేఖర్ ఆధ్వర్యంలో పోలీసులు తొలగించారు. రాజోళి, వడ్డేపల్లి మండలాల్లోనూ శనివారం పలుచోట్ల వర్షం కురిసింది. ఉదయం చినుకులతో మొదలైన వర్షం అక్కడక్కడా మోస్తరుగా కురవడంతో రైతులు సంబరపడ్డారు. అయిజ మండలంలో అత్యల్పంగా 2.4 మి.మీ., వర్షపాతం నమోదయ్యింది. -
ఆదిశిలా క్షేత్రంలో న్యాయమూర్తి ప్రత్యేక పూజలు
మల్దకల్: ఆదిశిలా క్షేత్రం స్వయంభూ లక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం గద్వాల అదనపు జూనియర్ సివిల్ జడ్జి వెంకటేష్ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. ఈసందర్భంగా ఆలయ అర్చకులు, చైర్మన్ జడ్జి దంపతులకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం వారిని శేషవస్త్రంతో సత్కరించి మెమోంటోను బహూకరించారు. వారి వెంట అర్చకులు ధీరేంద్రదాసు, మధుసూదనాచారి, శశాంక్, చంద్రశేఖర్రావు, చంద్రశేఖర్రెడ్డి తదితరులున్నారు. జూరాలకు 2,596 క్యూసెక్కుల ఇన్ఫ్లో ధరూరు/ రాజోళి: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి స్వల్పంగా ఇన్ఫ్లో కొనసాగుతుంది. కొన్ని రోజులుగా స్థానికంగా కురుస్తున్న వర్షాల ఆధారంగా ప్రాజెక్టుకు శనివారం సాయంత్రం వరకు 2,596 క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చినట్లు పీజేపీ అధికారులు తెలిపారు. దీంతో నెట్టెంపాడు ఎత్తిపోతలకు రెండు పంపులను రన్ చేసి గుడ్డెందొడ్డి, ర్యాలంపాడు రిజకర్వాయర్లను నింపుతున్నారు. నెట్టెంపాడు ఎత్తిపోతలకు 1,500 క్యూసెక్కులు వదలగా.. మరో 43 43 క్యూసెక్కులు ఆవిరైంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం 3.773 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టులో దాదాపు 3 టీఎంసీల నీరు చేరినట్లు అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా.. సుంకేసుల డ్యాంలో శుక్రవారం ఒక గేటు తెరిచి దిగువకు నీటిని వదిలిన అధికారులు శనివారం గేటును మూసేశారు. డ్యాంకు శనివారం ఎలాంటి ఇన్ఫ్లో లేకపోవడంతో గేటును మూసినట్లు అధికారులు తెలిపారు. ఆర్టీసీ విలీనానికి ఉన్నత స్థాయి కమిటీ మహబూబ్నగర్ మున్సిపాలిటీ: ప్రభుత్వంలో టీజీఆర్టీసీ విలీనం చేసేందుకు గాను ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటైందని ఆర్ఎం సంతోష్ కుమార్ తెలిపారు. శనివారం తన చాంబర్లో విలేకరులతో ఆయన మాట్లాడుతూ గత ఏప్రిల్లో కార్మికుల సమ్మె అనంతరం వివిధ డిమాండ్ల పరిష్కారంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కేబినెట్ సబ్ కమిటీ ముఖ్యంగా మూడు అంశాలపై ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. ఇందులో 2021 వేతన సవరణను ఈనెల నుంచే అమలు చేయడం, కార్మిక సంఘాల పునరుద్ధరణ.. గుర్తింపు సంఘం కోసం ఎన్నికలు, తదుపరి విలీన ప్రక్రియ ఉన్నాయన్నారు. దీనికి సంబంధించి ప్రతి కార్మికుడి అభిప్రాయానికి విలువ ఇవ్వాలని నిర్ణయించిందన్నారు. త్వరలోనే అన్ని డిపోలలో కార్మిక శాఖ ఆధ్వర్యంలో యూనియన్ వెరిఫికేషన్ ప్రక్రియ ఉంటుందన్నారు. ఎన్నికల్లో మెజారిటీ సాధించిన కార్మిక సంఘాల ప్రతినిధులను విలీన ప్రక్రియలో ప్రత్యక్ష భాగస్వాములుగా చేస్తారన్నారు. వారి సూచనలు, సలహాలను కేబినెట్ సబ్ కమిటీ పరిశీలించి తుది నిర్ణయం తీసుకుంటుందన్నారు. -
పరిహారమిచ్చిన తర్వాతే స్వాధీనం చేసుకోవాలి..
కానుకుర్తి రిజర్వాయర్ ని ర్మాణంలో భాగంగా సర్వే నంబర్ 361, 383 381 382,387లో మొత్తం 10.6 ఎకరాల సాగు భూమిని కోల్పోయా. చివరగా ఉన్న మా భూముల్లో పనులు ఆలస్యంగా ప్రారంభమవుతాయి. ఈ వానాకాలం నారు పోసుకునేందుకు సిద్ధం చేస్తున్నా. పక్క గ్రామంలో ఈ సారి పంట వేయొద్దని చాటింపు వేశారట. మాకై తే ఎవ రూ చెప్పలేదు. పరిహారం పూర్తి స్థాయిలో అందజేసిన తర్వాతే భూమి స్వాధీనం చేసుకోవాలి. అప్పటివరకు సాగు చేస్తాం. – ప్రకాష్ రెడ్డి, కానుకుర్తి, దామరగిద్ద, నారాయణపేట -
రైతు మురిసేలా.. సాగు మారాల
గద్వాల వ్యవసాయం: సంప్రదాయ పంటలకు స్వస్తిచెబుతూ.. సాగులో వినూత్న ఒరవడిని సృష్టిస్తేనే రైతులకు మేలు జరిగి లాభాలు వస్తాయని నిపుణులు అభిప్రాయం వెలిబుచ్చుతున్నారు. ఈ క్ర మంలో ప్రస్తుత వానాకాలం సీజన్లో పంట మార్పిడిలు చేయాలని, నానో యూరియా వినియోగించాలని, సేంద్రియ పద్ధతులు పాటించాలని వ్యవ సాయ శాఖ గడిచిన నెల రోజుల నుంచి విస్తృతంగా రైతులకు అవగాహన సమావేశాలు నిర్వహిస్తోంది. ఈసారి రైతులు సాగులో కొంతైనా మార్పులు వస్తాయని వ్యవసాయశాఖ భావిస్తోంది. అయితే ప్రస్తుత వానాకాలం సీజన్లో 4,35,252 ఎకరాల్లో పంటలు సాగయ్యే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. మరి ఈసారి జిల్లాలో పంటల మార్పు ఏ మేరకు జరుగుతుందో వేచిచూడాలి. పలు అంశాలపై అవగాహన.. రైతులు ఇష్టానుసారంగా రసాయనిక ఎరువులను వినియోగిస్తున్నారు. దీనివల్ల భూసారం క్షీణిస్తోంది. దీనిని నివారించేందుకు ప్రభుత్వాలు పలుమార్లు ప్రయత్నించినా పెద్దగా ఫలితం రాలేదు. కానీ, ఈసారి వ్యవసాయ శాఖ అధికారులు మే నెలలో రైతులకు దీనిపై విస్తృతంగా అవగాహన కల్పించారు. రసాయనిక ఎరువుల వినియోగం వల్ల కలిగే అనర్థాలను వివరిస్తూ.. సేంద్రియ ఎరువుల ఆవశ్యకత గురించి చెప్పారు. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నేషనల్ మిషన్ ఆన్ న్యాచురల్ ఫార్మింగ్ (ఎన్ఎంఎన్ఎఫ్) పథకాన్ని ఈ వానాకాలం సీజన్లో జిల్లాలో అమలు చేయించి రైతులు ప్రకృతి వ్యవసాయం చేసేలా ప్రోత్సహించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా జిల్లాలో 2,500 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం పద్ధతిలో సేద్యం చేయించి పంటలు పండించనున్నారు. ఇందుకోసం ఐదు నెలల క్రితమే జిల్లాలోని ప్రతి మండలంలో ఒకటి లేదా రెండు క్లస్టర్ల నుంచి, ఒక్కో క్లస్టర్కు 125 ఎకరాల చొప్పున మొత్తం 20 వ్యవసాయ క్లస్టర్ల నుంచి 2500 ఎకరాల భూములు, రైతులను ఎంపిక చేశారు. అయితే ప్రకృతి వ్యవసాయ విధాన పద్దతులపై రైతులకు అవగాహన కల్పించేందుకు మహిళా సంఘాల్లో సభ్యులుగా ఉన్న మహిళలను కృషి సఖిలుగా నియామకం చేశారు. వీరికి సెంటర్ ఫర్ సస్స్టెనబుల్ అగ్రికల్చర్ అనే ఎన్జీఓ ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కల్పించడంతోపాటు, వ్యవసాయ శాస్త్రవేత్తల ద్వారా శిక్షణ అందించారు. కృషి సఖిలు ఎంపిక చేసిన పొలాల్లో క్షేత్రస్థాయిలో రైతులకు అవగాహన కల్పిస్తారు. పూర్తిగా ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో వారితో వ్యవసాయం చేయించనున్నారు. ఎప్పుడూ ఒకే రకమైన పంట వేయడం వల్ల దిగుబడులు రావని, పంట మార్పిడి చేయాలని రైతులకు అవగాహన కల్పించారు. అలాగే యూరియా ఇబ్బందులను అధిగమించేందుకు నానో యూరియా వినియోగించాలని సూచించారు. దీనివల్ల పంట ఎదుగుదల మెరుగుపడటమే కాకుండా.. దిగుబడి సైతం పెరుగుతుందని వివరిస్తున్నారు. పంట ప్రణాళిక ఖరారు.. వానాకాలం సీజన్కు సంబంధించి పంట ప్రణాళికను వ్యవసాయ అధికారులు సిద్ధం చేశారు. ఈ మేరకు జిల్లాలో 3,92,882 ఎకరాల్లో వ్యవసాయ, 42,370 ఎకరాల్లో ఉద్యాన పంటలు కలిపి మొత్తం 4,35,252 ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు అవుతాయని అంచనా వేశారు. వ్యవసాయ పంటలకు సంబంధించి ప్రధానంగా పత్తి, వరి, కంది పంటలను ఎక్కువగా సాగు చేస్తారని భావిస్తున్నారు. అయితే వర్షాలు ఇంకా ఆరంభం కాలేదు. ప్రస్తుతానికి జిల్లాలో మోస్తరుగా రెండుసార్లు మాత్రమే వర్షాలు వచ్చాయి. దీంతో వర్షాల కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. అయితే జిల్లాలోని బోర్లు, బావులు ఉన్న రైతులు అక్కడక్కడ సాగు పనులు మొదలుపెట్టారు. ఇప్పటి వరకు 27,074 ఎకరాల్లో పంటలు సాగు అయ్యాయి. వ్యవసాయంలో మార్పులుతీసుకొచ్చేందుకు ముమ్మరంగా కసరత్తు పంటల మార్పిడి, నానో యూరియాపై అన్నదాతలకు అవగాహన సేంద్రియ పద్ధతులపై అధికారుల విస్తృత ప్రచారం ఈసారి 2,500 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయానికి చర్యలు జిల్లాలో ఈసారి 4,35,252 ఎకరాల్లో పంటల సాగు అంచనా సలహాలు, సూచనలు పాటించాలి ప్రస్తుత వానాకాలం సీజన్లో పంటలు వేసేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. అయితే ఈసారి సేంద్రియ ఎరువులు, నానో యూరియా ఇలా పలు విషయాలపై రైతులకు అవగాహన కల్పించాం. వాటిని తప్పకుండా పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. వ్యవసాయ శాఖ అధికారుల సలహాలు, సూచనలు తీసుకుంటూ పంటలు సాగు చేస్తే లాభదాయకంగా ఉంటుంది. – వీరప్ప, జిల్లా వ్యవసాయాధికారి జిల్లాలో సాగైన పంటలు ఇలా.. పంట అంచనా ఇప్పటి వరకు సాగైనవి పత్తి 2,09,144 26,584 వరి 1,21,941 – కంది 23,739 450 మొక్కజొన్న 22,982 – వేరుశనగ 6,396 – ఇతర పంటలు 8,680 – ఉద్యానపంటలు 42,370 40 -
ఎన్నటికో..?!
కొల్లాపూర్: పర్యాటక ప్రియులను ఆకర్షించేలా.. కొల్లాపూర్ నుంచి సోమశిలకు వెళ్లే దారిలో నల్లమల అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఎకో పార్కు ప్రారంభం రెండేళ్లుగా పెండింగ్లో పడుతూ వస్తోంది. అడవులపై అవగాహన, జంతు సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ, ప్రకృతి అందాల గురించి ప్రజలకు తెలియజేయాలనే లక్ష్యంతో దీనిని నిర్మించారు. నల్లమల అడవిలో ఏర్పాటు చేసిన ఈ పార్కులో వ్యూ పాయింట్ సైతం అందుబాటులో ఉంది. అమ్రాబాద్ వ్యూ పాయింట్ తరహాలో ఎత్తైన కొండపై నుంచి నల్లమల అందాలు, కృష్ణానది ప్రవాహం తిలకించేలా ఇక్కడ వ్యూ పాయింట్ నిర్మించారు. అయితే అన్నిరకాల పనులు పూర్తయ్యాయి అని అటవీ అధికారులు చెబుతున్నప్పటికీ పార్కు అధికారికంగా ప్రారంభానికి నోచుకోవడం లేదు. రూ.1.50 కోట్లతో నిర్మాణం కొల్లాపూర్ నుంచి సోమశిల వెళ్లే దారిలో అటవీ ప్రాంతంలో ఫారెస్ట్ అధికారులు ఐదేళ్ల క్రితం పార్కు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. తర్వాతి కాలంలో పార్కుకు సమీపంలోనే అటవీ ప్రాంతంలో వ్యూ పాయింట్ నిర్మించాలని నిర్ణయించారు. ఇందుకోసం రూ.1.50 కోట్ల నిధులను హరిత, టీకేహెచ్ఎస్ ద్వారా కేటాయించారు. ఈ పనులను అటవీ శాఖ ఆధ్వర్యంలోనే చేపట్టారు. రెండేళ్ల క్రితమే నిర్మాణ పనులు దాదాపుగా పూర్తయ్యాయి. అప్పట్లో భారీ వర్షాల కారణంగా పార్కు నుంచి వ్యూ పాయింట్కు వెళ్లే రోడ్డు కోతలకు గురికావడంతో ప్రారంభాన్ని వాయిదా వేసినట్లు సమాచారం. తర్వాతి కాలంలో రోడ్డుకు మరమ్మతు చేసినా.. పార్కు మాత్రం ప్రారంభానికి నోచుకోలేదు. షార్ట్ఫిల్మ్లకు వేదికగా.. పార్కు నుంచి అటవీ ప్రాంతం లోపల ఎత్తైన ప్రాంతంలో వ్యూపాయింట్ నిర్మించారు. పార్కు నుంచి వ్యూపాయింట్కు వెళ్లేందుకు వీలుగా కిలోమీటర్ మేర మట్టి రోడ్డు ఏర్పాటుచేశారు. రోడ్డుకు ఇరువైపులా ట్రెంచ్, కంచె నిర్మించారు. వ్యూ పాయింట్ వద్దకు పర్యాటకులను తీసుకువెళ్లేందుకు రెండు ప్రత్యేక వాహనాలను అటవీ శాఖ ఆధ్వర్యంలో అందుబాటులో ఉంచారు. పార్కు నిర్వహణను పర్యవేక్షించేందుకు సిబ్బందిని సైతం ఏర్పాటు చేశారు. అధికారికంగా పార్కు ప్రారంభం కానప్పటికీ.. అనధికారికంగా పర్యాటకులు వ్యూ పాయింట్ వరకు వెళ్లేందుకు ఇటీవల కాలంలో అనుమతులు ఇస్తున్నారు. పార్కు ప్రారంభమైతే షార్ట్ఫిల్మ్ షూటింగ్లకు వ్యూపాయింట్ వేదికగా మారే అవకాశం ఉంటుంది. త్వరలోనే ప్రారంభిస్తాం.. ఎకో పార్కులో నిర్మాణ పనులన్నీ పూర్తయ్యాయి. వ్యూ పాయింట్ను తిలకించేందుకు పర్యాటకులు ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం పర్యాటకుల కోసం తాగునీటి వసతులు ఏర్పాటు చేశాం. టాయిలెట్స్ నిర్మించాం. మట్టి రోడ్డు కోతలకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. పర్యాటకుల తాకిడిని బట్టి వసతుల కల్పనకు అవసరమైన చర్యలు చేపడతాం. వచ్చే నెలలో పార్కును అధికారికంగా ప్రారంభించే అవకాశం ఉంది. – వాణికుమారి, ఫారెస్టు రేంజర్, కొల్లాపూర్ సోమశిల వెళ్లే దారిలో అటవీ ప్రాంతంలో పార్కు ఏర్పాటు కృష్ణానది, నల్లమల అందాలుతిలకించేలా వ్యూ పాయింట్ నిర్మాణం ఇప్పటికే రోడ్డు నిర్మాణం, వసతుల కల్పన పూర్తి రెండేళ్లుగా ప్రారంభం కోసం ఎదురుచూపులు అందుబాటులోకి వస్తే పర్యాటకులకు మధురానుభూతి -
జాతీయ రహదారికి కనెక్టివిటీ కల్పించాలి
గట్టు: జిల్లాలో నూతనంగా నిర్మిస్తున్న ఆరు వరుసల జాతీయ రహదారికి గట్టు మండలానికి కనెక్టివిటీ కల్పించే అప్రోచ్ రోడ్డు, రాయాపురం డబుల్ రోడ్డు దగ్గర వంతెన నిర్మించాలని గట్టు, రాయాపురం, ఆలూరు, తుమ్మలచెరువు గ్రామాల ప్రజలు డిమాండ్ చేశారు. పీఏసీఎస్ మాజీ అధ్యక్షుడు రాముడు ఆధ్వర్యంలో నాలుగు గ్రామాల ప్రజలు చేపట్టిన రిలే దీక్షలు శుక్రవారం నాటికి 116వ రోజుకు చేరాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొత్తగా నిర్మించే జాతీయ రహదారి విషయంలో అధికారులు అవసరమున్న చోట కాకుండా అవసరం లేని చోట వంతెన నిర్మాణం చేపట్డడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు. డబుల్ రోడ్డు ఉన్న చోటే వంతెన నిర్మాణం చేపట్టాలని, కొత్త రోడ్డుపైకి గట్టు మండల ప్రాంత ప్రజలు చేరుకునేలా అప్రోచ్ రోడ్డు నిర్మించాలని డిమాండ్ చేశారు. రోడ్డు కనెక్టివిటీ వల్ల ఈ ప్రాంతం అభివృద్ధి చెందే అవకాశం ఉంటుందని ఆయా గ్రామాల ప్రజలు అభిప్రాయపడ్డారు. రిలే దీక్షలను కొనసాగిస్తున్న వారు మహాబూబ్నగర్లోని జాతీయ రహదారి నిర్మాణ ప్రాజెక్టు ఇంప్లిమెంటేషన్ యూనిట్ అధికారి భన్సల్కుమార్ను కలిసి విన్నవించారు. అధికారుల బృందం పరిశీలన.. గట్టు మండలంలో ఆందోళన కొనసాగుతున్న ప్రాంతాన్ని జాతీయ రహదారి నిర్మాణ సంస్థ రీజినల్ అధికారి శివశంకర్, ప్రాజెక్టు ఇంప్లిమెంటేషన్ యూనిట్ మహబూబ్నగర్ అధికారి భన్సల్కుమార్, టెక్నికల్ మేనేజర్ తోటబాబు, మెగా ప్రాజెక్టు మేనేజర్ వినోద్కుమార్, అసిస్టెంట్ ప్రాజెక్టు మేనేజర్ అసదుల్లా పరిశీలించారు. రాయాపురం స్టేజీతోపాటు పాత ఆలూరు దారిలో నిర్మించిన వంతెనను అధికారులు పరిశీలించి వెళ్లారు. వంతెన ప్రతిపాదన విషయంలో ఇంజినీరింగ్ అధికారుల తప్పిదాన్ని గుర్తించినట్లు సమాచారం. ఈ ప్రాంత ప్రజల డిమాండ్ను కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదించినట్లు జాతీయ రహదారి నిర్మాణ సంస్థ అధికారులు చెప్పారు. -
సరళాసాగర్లో ఇలా..
సరళాసాగర్ జలాశయం కింద 9 గ్రామాల పరిధిలో 3,200 ఎకరాల ఆయకట్టు ఉంది. ప్రస్తుతం వర్షాలు కురుస్తుండటంతో వరి నారు పోసుకోవడానికి రైతులు సిద్ధమవుతున్నారు. మదనాపురం సమీపంలోని ఊకచెట్టు వాగు వద్ద రెండో రైల్వే వంతెన నిర్మాణ పనులు కొనసాగుతుండగా రామన్పాడు వెనుక జలాల నుంచి సరళాసాగర్ ప్రాజెక్టుకు నీటిని తరలించే ప్రధాన పైప్లైన్ను తొలగించాల్సి వచ్చింది. దీంతో సరళాసాగర్ ప్రాజెక్టుకు సాగునీటి సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. సమస్యను గుర్తించిన ఎమ్మెల్యే మధుసూదన్రెడ్డి పైప్లైన్ పనులు త్వరగా పూర్తి చేయాలని నీటిపారుదలశాఖ అధికారులను ఆదేశించడంతో పాటు రూ.49.50 లక్షలు మంజూరు చేశారు. కాంట్రాక్టర్, అధికారుల నిర్లక్ష్యంతో ఇప్పటికీ పైప్లైన్ ఏర్పాటు పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఇప్పటికిప్పుడు పనులు వేగవంతం చేసినా మరో 15 రోజుల సమయం పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. సమయం దాటిపోతే ఈ ఏడాది వానాకాలం పంటలకు నీరందడం కష్టమని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
‘సర్’ పై అప్రమత్తంగాఉండండి
కొల్లాపూర్: కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న ‘సర్’ పట్ల కాంగ్రెస్ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని, ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా ఓట్లు తొలగించే ప్రమాదం ఉంటుందని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖమంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. సర్పై అవగాహన కోసం డీసీసీ ఆధ్వర్యంలో కొల్లాపూర్లోని మంత్రి క్యాంపు కార్యాలయం వద్ద కాంగ్రెస్ నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మల్లు రవి, డీసీసీ అధ్యక్షుడు వంశీకృష్ణతో కలిసి మంత్రి జూపల్లి పాల్గొని మాట్లాడారు. సర్ అనేది ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు లాంటిదన్నారు. మతం పేరుతో ఓట్లు తొలగించేందుకు ఇదో రకమైన కుట్ర అన్నారు. బూత్ స్థాయిలో ఉండేవారు ఓటరు జాబితాను జాగ్రత్తగా గమనించాలని, ఇతర ప్రాంతాల్లో ఓటర్లు ఉంటే వారితో ఫోన్లో మాట్లాడి వివరాలు రిజిస్ట్రేషన్ చేసేలా చూడాలన్నారు. వచ్చే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే వారు వీటిపై ప్రత్యేకంగా దృష్టిపెట్టాలని సూచించారు. ఎంపీ మల్లురవి మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ సర్కారుకు మేలు చేసేలా ఎన్నికల కమిషన్ చర్యలు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మీనాక్షి నటరాజన్ వ్యవహారంతోపాటు పలు అంశాల్లో ఇదే జరుగుతోందన్నారు. విపక్షాల ఓటుబ్యాంకును తగ్గించేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని, కాంగ్రెస్ శ్రేణులు దీనిపై అప్రమత్తంగా ఉండాలన్నారు. డీసీసీ అధ్యక్షుడు వంశీకృష్ణ మాట్లాడుతూ కాంగ్రెస్ ఓటు బ్యాంకుగా ఉన్న ముస్లింలు, ఎస్సీ, ఎస్టీ, బలహీన వర్గాల ఓటుబ్యాంకును తగ్గించే కుట్ర జరుగుతుందని ఆరోపించారు. అనంతరం ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించే బస్సు యాత్రను ప్రారంభించారు. కాంగ్రెస్ శ్రేణులకు మంత్రి జూపల్లి కృష్ణారావు సూచన -
సలహాలతో సాగు.. లాభాలు బాగు
● ప్రశ్న: ఎనిమిదేళ్ల నుంచి పత్తి పంట వేస్తున్నాం. దిగుబడులు ఎందుకు ఎక్కువగా రావడం లేదు.? – శ్రీనివాస్రెడ్డి, సుదర్శన్ (గద్వాల), రాజు, తిమ్మన్న (ధరూర్) ● డీఏఓ : ఎప్పుడూ ఒకే రకమైన పంట వేయరాదు. దీని వల్ల దిగుబడులు ఎక్కువగా రావు. పంట మార్పిడి చేయాలి. వ్యవసాయ విస్తరణ అధికారుల సలహాలు, సూచనలు తీసుకోండి. ● ప్రశ్న: విత్తనాలు కొనేముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.? – రాజేష్, వెంకట్రెడ్డి (గద్వాల), రాముడు, గోవిందు (అయిజ), గోపాల్, భీమేష్నాయుడు, ఆంజనేయులు (మానవపాడు) ● డీఏఓ : లైసెన్స్ కలిగిన డీలర్ల వద్ద మాత్ర మే విత్తనాలు కొనుగోలు చేయాలి. సీల్ ఉన్న పాకెట్ను తీసుకోవాలి. ఎక్స్పైరీ తేదీ గమనించాలి. రశీదు తప్పక తీసుకొని, పంట పూర్తయ్యే వరకు జాగ్రత్తగా దాచుకోవాలి. గద్వాల వ్యవసాయం: ‘జిల్లాలో ఇప్పటి వరకు ఇంకా సాధారణ వర్షపాతమే నమోదు కాలేదు. తొందరపడి విత్తనాలు వేయొద్దు. జూలై 15 వరకు వేయడానికి అవకాశం ఉంటుంద’ని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వీరప్ప అన్నారు. శుక్రవారం ఉదయం నిర్వహించిన ‘సాక్షి’ ఫోన్ ఇన్ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. జిల్లావ్యాప్తంగా రైతులు అడిగిన సందేహాలను నివృత్తి చేశారు. విత్తనాల ఎంపిక, వాడకం, విత్తనశుద్ధి, దుక్కులు సిద్ధం చేసిన తర్వాత చేయాల్సిన పని, ఏయే భూముల్లో ఏ రకమైన పంటలు వేయాలి.. తదితర అంశాలపై రైతులకు సలహాలు, సూచనలు అందించారు. రైతులు అధికారుల సలహాలు తీసుకొని పంటలు సాగు చేస్తే.. మంచి దిగుబడులతో లాభాలు వస్తాయని అభిప్రాయపడ్డారు. ● ప్రశ్న: విత్తనాలు వేయక ముందు ఎలాంటి సస్యరక్షణ చేపట్టాలి.? – వెంకటేష్, రంగన్న (గట్టు), రామకృష్ణ, మధుబాబు (మల్దకల్), నర్సింహులు, రాజు (కేటీదొడ్డి) ● డీఏఓ : పాత పంటను పూర్తిగా తొలగించాలి. లోతు దుక్కులు వాలుకు అడ్డంగా దున్నాలి. దీనివల్ల పురుగుల అవశేషాలు చనిపోతాయి. పురుగుల బెడద తగ్గుతుంది. ఆ తర్వాత ఎకరాకు నాలుగు టన్నుల పశువుల ఎరువును వేయాలి. వరి పంటకు అయితే పచ్చిరొట్టె ఎరువులైన జీలుగ, జనుము, పిల్లి పెసర వేయాలి. ● ప్రశ్న: ఏ నేలలో.. ఏ రకమైన పంటలు వేయాలి.? – హన్మంతు, సురేష్ (గట్టు), శ్రీరాములు, నర్సింహ (గద్వాల) ● డీఏఓ : నల్లరేగడి భూముల్లో పత్తి, మిరప, నూనె గింజలు వేయాలి. కందిపంట వేసి అంతర పంటగా పెసర వేయవచ్చు. ఎర్రటి నేలల్లో సాగునీరు అందుబాటులో ఉంటే పత్తి, ఉల్లి, నూనె గింజలు, కంది సాగు చేయవచ్చు. ఇసుక నేల ల్లో పత్తి, మిరప, పప్పు దినుసులు పండించవచ్చు. ● ప్రశ్న: జిల్లాలో అందుబాటులో ఉన్న పత్తి విత్తనాల రకాలు.? – నర్సింహారెడ్డి, పాండురెడ్డి (గద్వాల), త్రివిక్రమ్, గోపాల్రెడ్డి (అయిజ), దేవదాసు,ఆంజనేయులు (శాంతినగర్) ● డీఏఓ : సదానంద, మైకో, యూఎస్, ఆద్య తదితర వాటితోపాటు పలు రకాల పత్తి విత్తనాలు జిల్లాలో అందుబాటులో ఉన్నాయి. ● ప్రశ్న: నాలుగేళ్ల నుంచి ఏ పంట వేసినా ఆశించిన మేర దిగుబడులు రావడం లేదు. ఎందుకు? – కృష్ణవర్ధన్రెడ్డి, మనోహర్ (గద్వాల), రామకృష్ణ, కోటేష్ (ఇటిక్యాల) ● డీఏఓ : మీరు నాలుగేళ్లుగా వేసిన పంటల వివరాలు, వాడిన ఎరువులు, మందుల వివరాలు ఏఈఓల దృష్టికి తీసుకెళ్లండి. రైతులందరూ వ్యవసాయ అధికారుల సలహాలు, సూచనలు తీసుకోవాలి. ● ప్రశ్న: పంట పెట్టుబడులు బాగా పెరుగుతున్నాయి.. తగ్గించడానికి గల మార్గాలు తెలియజేయండి..? – రాకేష్, (గద్వాల) ● డీఏఓ : పంట పెట్టుబడుల్లో ప్రధానంగా ఇష్టానుసారంగా రసాయనిక ఎరువులు, పురుగు మందులకు ఖర్చు చేస్తున్నారు. వీటికి బదులుగా సేంద్రియ ఎరువులు వినియోగించాలి. అదేవిధంగా పాత పద్ధతులు కాకుండా నూతన వ్యవసాయ పద్ధతులు అవలంభించాలి. పంటలకు ఏ మందులు వేయాలన్నా విస్తరణాధికారుల సలహాలు, సూచనలు తీసుకోండి. టీజీ టీ–20 లీగ్లో మనోళ్లు ఈ నెల 21 నుంచి జరగనున్న టీజీ టీ–20 క్రికెట్ లీగ్కు ఉమ్మడి పాలమూరుకు చెందిన నలుగురు క్రికెటర్లు ఎంపికయ్యారు. –8లో uసకాలంలో వర్షాలు రాకపోతే ఆరుతడి పంటలు వేయాలి జిల్లాలో అందుబాటులో ఎరువులు, విత్తనాలు లైసెన్స్డ్ డీలర్లతోనే విత్తనాలుకొనుగోలు చేయాలి యూరియాకు బదులుగా నానో యూరియా వినియోగించండి ‘సాక్షి’ ఫోన్ ఇన్లో జిల్లా వ్యవసాయాధికారి వీరప్ప ప్రశ్న: ప్రస్తుత వానాకాలం సీజన్లో ఏ సమయం వరకు విత్తనాలు వేసుకోవచ్చు.? – రాధాకృష్ణ, తిమ్మోతి (ధరూర్), వాసు, కృష్ణ, అంజి (వడ్డేపల్లి), రాజనర్సింహ, గోపాల్ (ఉండవెల్లి) డీఏఓ : వర్షాలు ఇంకా ఆరంభం కాలేదు. కొద్ది రోజుల క్రితం కురిసిన వర్షాలకు భూమి పదును కాలేదు. రైతులు తొందరపడరాదు. జూలై 15 వరకు విత్తనాలు వేయవచ్చు. జూలై 15 వరకు కూడా సాధారణ వర్షపాతం నమోదు కాకపోతే ఏయే రకమైన పంటలు వేయాలో సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారులు చెబుతారు. వారి సలహాల ప్రకారం పంటలు వేయండి. ప్రశ్న: జిల్లాలో సరిపడా ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉన్నాయా.? – రాధాకృష్ణ, మాధవ్ (మల్దకల్), గోపాల్, భీంసేన్రెడ్డి (ఎర్రవల్లి) డీఏఓ : జిల్లాలో అన్ని రకాల పంటలకు సంబంధించిన విత్తనాలు అందుబాటులో ఉన్నాయి. ఈ వానాకాలం సీజన్లో 1,11,922 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరం ఉంటుందని అంచనా వేశాం. అయితే ఇప్పుడు 50,318 మెట్రిక్ టన్నుల ఎరువులు అందుబాటులో ఉన్నాయి. ఎరువుల కొరత రాకుండా అన్నిరకాల ముందస్తు చర్యలు తీసుకుంటాం. నానో యూరియాతో పలు ప్రయోజనాలు ఉన్నాయి. యూరియాకు బదులుగా నానో యూరియాను వాడండి. -
అత్యవసర పరిస్థితుల్లో స్పందించాలి : ఎస్పీ
అలంపూర్: అత్యవసర పరిస్థితుల్లో డైలీ వచ్చే కాల్స్కు తక్షణమే స్పందించాలని ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. అలంపూర్ పోలీస్స్టేషన్ను ఎస్పీ శుక్రవారం ఆకస్మికంగా సందర్శించి.. స్టేషన్లోని రిసెప్షన్, రైటర్ సెక్షన్, టెక్ టీం, ఎస్హెచ్ఓ కార్యాలయం, లాకప్, విశ్రాంతి గదులు, వాహనాల పార్కింగ్ ప్రాంతాలను పరిశీలించారు. సిబ్బంది యూనిఫాం నిర్వహణతోపాటు జనరల్ డైరీ, బీట్ డ్యూటీ బుక్స్, ఉన్నతాధికారుల సందర్శన రికార్డులు తదితర పత్రాలను పరిశీలించారు. అనంతరం ఎస్పీ సిబ్బందితో సమావేశమై పోలీస్స్టేషన్ పరిధిలోని గ్రామాలు, బీట్ వ్యవస్థ, పెట్రోల్ వాహనాల విధుల గురించి తెలుసుకున్నారు. గ్రామాల్లో క్రమం తప్పకుండా పర్యటిస్తూ సైబర్ నేరాలు, ఆన్లైన్ మోసాలు, మూఢనమ్మకాలు, బాల్య వివాహాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. అలాగే డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలను విస్తృతంగా నిర్వహించి రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేయాలని ఆదేశించారు. డయల్ 100 కాల్ అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సమస్యలను పరిష్కరించడంతోపాటు ప్రజా ఫిర్యాదులపై ఎలాంటి జాప్యం లేకుండా స్పందించాలన్నారు. సర్వీసు ఉపాధ్యాయులకు టెట్ మినహాయించాలి గద్వాల న్యూటౌన్: న్యాయబద్ధంగా, నోటిఫికేషన్ ప్రకారం నియామకమైన ఉపాధ్యాయులకు 1 ఏప్రిల్ 2010 పూర్వం టెట్ ప్రస్తావన లేదని తపస్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రవీందర్రెడ్డి, నాగరాజు శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 2010 తర్వాత డీఎస్సీ నోటిఫికేషన్లో టెట్ అర్హత ఆధారంగా నియామకాలు జరుగుతున్నాయని చెప్పారు. 1 ఏప్రిల్ 2010 ఆర్టీఈ రూల్స్కు అనుగుణంగా ఎన్సీటీఈ టెట్ నిబంధనను చేర్చిందన్నారు. ఈ నిబంధనల ఆధారంగానే 2028 ఆగస్టు 31లోపు ఇన్ సర్వీసు ఉపాధ్యాయులు టెట్ ఉత్తీర్ణులు కావాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందన్నారు. ఇది దాదాపు రాష్ట్రవ్యాప్తంగా 30 వేల మంది ఇన్ సర్వీసు ఉపాధ్యాయులకు ఇబ్బంది కలిగించే అంశం అన్నారు. 1 ఏప్రిల్ 2010 కన్నా ముందు వేసిన నోటిఫికేషన్ ద్వారా నియామకమైన ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఆర్డినెన్స్ తీసుకురావాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని ఒప్పించేలా తగు చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. 523 క్వింటాళ్ల వేరుశనగ రాక గద్వాల వ్యవసాయం: జిల్లాకేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డుకు శుక్రవారం 523 క్వింటాళ్ల వేరుశనగ అమ్మకానికి వచ్చింది. క్వింటాకు గరిష్టంగా రూ.7,611, కనిష్టంగా రూ. 3,599, సరాసరిగా రూ.6,399 ధరలు లభించాయి. అలాగే 33 క్వింటాళ్ల వరి (సోన) రాగా.. గరిష్టంగా రూ.1,659, కనిష్టంగా రూ. 1,300, సరాసరిగా ధర రూ.1,659 పలికింది. -
కనువిందు చేసే అందాలు..
కొల్లాపూర్లోని పర్యాటక ప్రాంతాలను తిలకించేందుకు ఆగస్టు నుంచి మార్చి నెల వరకు పర్యాటకులు వస్తుంటారు. సోమశిలకు వెళ్లే మార్గంలో కొల్లాపూర్ పట్టణానికి దగ్గరలోనే ఉన్న ఎకో పార్కు, నల్లమల వ్యూ పాయింట్ పర్యాటకులకు ప్రధాన ఆకర్షణ కానుంది. వ్యూ పాయింట్ వద్ద నుంచి చూస్తే సోమశిల గ్రామం, సమీపంలోని కృష్ణానది, కర్నూలు జిల్లా పరిసర ప్రాంతాలు, నల్లమల అభయారణ్యం వంటి దృశ్యాలు కనువిందు చేస్తాయి. పక్షులు, జంతువుల కదలికలు కూడా పర్యాటకులను ఆహ్లాదపర్చనున్నాయి. వ్యూ పాయింట్ ఇదే.. -
నేల బతికితేనే పంట పండుతుంది
మానవపాడు: రైతుల పంటలు నేల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఖేత్ బచావో అభియాన్ కార్యక్రమాన్ని ఏటీఎంఏ జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ జగ్గు నాయక్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూసార పరీక్షకు 3 సూత్రలు పాటించాలని సూచించారు. సమతుల్యత ఎరువుల వినియోగం నేల పరీక్షల ఆధారంగానే ఎరువులు వేయాలన్నారు. పచ్చిరొట్ట ఎరువులు పెంచాలని, రసాయనికి ఎరువులు, పురుగు మందులు విచక్షణా రహితంగా వాడొద్దని, అధిక వాడకం వల్ల నేల చనిపోయి దిగుబడి నాణ్యత తగ్గిపోతుందన్నారు. నానో ఎరువులు వాడితే తక్కువ మోతాదులో ఎక్కువ ఫలితం వచ్చి.. నేల పర్యావరణ కాలుష్యం తగ్గుతుందన్నారు. ఎరువుల హోర్డింగ్, బ్లాక్ మార్కెటింగ్, అక్రమ రవాణా అరికట్టేందుకు పంచాయతీ, మండల, జిల్లా స్థాయిల్లో ‘ఫర్టిలైజర్ నిఘా సమితులు’ ఏర్పాటు చేసినట్లు వివరించారు. గ్రామ కమిటీలో సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి, ఏఈఓ, పీఏసీఎస్ సిబ్బంది సభ్యులుగా ఉంటారని వివరించారు. దీంతో రైతులకు ఎరువులు సకాలంలో సరైన ధరకు అందుతాయన్నారు. కార్యక్రమంలో బీటీఎం శ్రీధర్రెడ్డి, ఏఓ ప్రదీప్కుమార్, ఇన్పుట్ డీలర్లు, రైతులు పాల్గొన్నారు. -
సేవలు విసర్తిసాం..
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా యూనివర్సిటీ సేవలను విస్తరించి.. జిల్లా విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేస్తున్నాం. అందులో భాగంగా నాగర్కర్నూల్ జిల్లాలో పీజీ కళాశాల ఏర్పాటుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించగా.. హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఆమోదం లభించింది. ప్రభుత్వం నుంచి జీఓ వస్తే ఏర్పాటు చేస్తాం. వీటితోపాటు వనపర్తి పీజీ కళాశాల హాస్టళ్ల నిర్మాణం కోసం 5 గుంటల భూమిని కేటాయిస్తూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. – జీఎన్ శ్రీనివాస్, వైస్ చాన్స్లర్, పీయూ ● -
వికసిత్ భారత్ లక్ష్యంగా ప్రధాని కృషి
గద్వాల: వికసిత్ భారత్ లక్ష్యంగా దేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీ అహర్నిషలు కృషిచేస్తున్నారని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రామచంద్రారెడ్డి అన్నారు. గురువారం జిల్లాకేంద్రంలోని డీకే బంగ్లాలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశ ప్రధానిగా నరేంద్రమోదీ ఆధ్వర్యంలో భారతదేశం గడిచిన పన్నెండేళ్లలో ఎంతో పురోగతి సాధించిందన్నారు. పన్నెండేళ్ల సేవా ప్రస్థానంలో 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడినట్లు వెల్లడించారు. 58.15 కోట్ల జనధన్ ఖాతాలు, 44 కోట్ల ఆయుష్మాన్ భారత్ కార్డులు, 15.7 కోట్ల కుటుంబాలకు నూతనంగా నల్లానీటి కనెక్షన్లు, 1.46 లక్షల కిలోమీటర్ల రోడ్లు, 12 కోట్ల మరుగుదొడ్లు, 10 కోట్ల పక్కా ఇళ్ల నిర్మాణం, 2.9 కోట్ల ఇళ్లకు ఉచిత విద్యుత్ కనెక్షన్లు, కోట్లాది మందికి ఉచిత రేషన్ బియ్యం సరఫరా, జనధన్ ఖాతాలో రూ.3 లక్షల కోట్లకుపైగా డిపాజిట్లు, 9 కోట్లకు పైగా అటల్ పెన్షన్ యోజన సభ్యులు, 58 కోట్లకు పైగా బీమా పథకాల లబ్ధిదారులు వంటి అనేక సంక్షేమాభివృద్ధి పథకాలు అందించినట్లు చెప్పారు. అంతేకాకుండా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా సర్జికల్ స్ట్రైక్, ఆపరేషన్ సింధూర్, నక్సల్స్ విముక్తి, కోవిడ్ సమయంలో ఉచితంగా వ్యాక్సిన్ పంపిణీ వంటివి ప్రజలకు, దేశానికి రక్షణ కల్పించే చర్యలు చేపట్టినట్లు వివరించారు. కార్యక్రమంలో నాయకులు రామాంజనేయులు, డీకే స్నిగ్ధారెడ్డి, బండల వెంకట్రాములు, రమాదేవి, రవికుమార్, దాస్, శాలన్న తదితరులు పాల్గొన్నారు. -
రాజధానికి చేరిన ధాన్యం పంచాయితీ
రైస్మిల్లులపై వరుస టాస్క్ఫోర్స్ దాడులు ● కనిపించని రూ.కోట్ల విలువజేసే వరి ధాన్యం ● తూతూమంత్రంగా జిల్లాస్థాయి అధికారుల చర్యలు ● చేసేది లేక రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులకు ఫిర్యాదులు ●వనపర్తి: జిల్లాలో గడిచిన పదేళ్లలో వరి సాగు, ఉత్పత్తి రికార్డుస్థాయిలో పెరగగా.. అంతేస్థాయిలో ధాన్యం నిల్వల మాయం, కేటాయింపుల్లో లోపాలు, రవాణా కాంట్రాక్టర్ల అక్రమాలు సైతం పెరిగాయి. కొంతకాలంలో జిల్లా నుంచి టాస్క్ఫోర్స్ అధికారులకు తరుచూ వెళ్తున్న ఫిర్యాదులతో వరుస దాడులు చేస్తుండగా విస్తుపోయే నిజాలు వెలుగు చూడటం గమనార్హం. కొన్ని మిల్లుల్లో రూ.కోట్ల విలువజేసే ధాన్యం కాగితాల్లో కనిపిస్తున్నా.. క్షేత్రస్థాయిలో మాయం చేస్తూ ప్రభుత్వానికి కుచ్చుటోపీ పెడుతున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు ఇప్పటి వరకు తీసుకున్న చర్యలు శూన్యమనే చెప్పవచ్చు. 2025, నవంబర్ 13న పెద్దమందడి మోజర్ల సమీపంలోని రెండు మిల్లుల్లో టాస్క్ఫోర్స్ అధికారులు దాడులు నిర్వహించగా.. సుమారు రూ.12.50 కోట్ల విలువైన ధాన్యం నిల్వలు మాయమైనట్లు గుర్తించి మిగతా ధాన్యాన్ని సీజ్ చేశారు. గత నెల 22న తిరిగి అవే మిల్లుల్లో అధికారులు తనిఖీలు చేసి సీజ్ చేసిన మిగులు ధాన్యం నిల్వలను పరిశీలిస్తే సుమారు రూ.9 కోట్ల విలువజేసే ధాన్యం అక్కడ లేకపోవడం విస్మయానికి గురిచేసింది. సీజ్ చేసిన ధాన్యం ఎలా మాయమవుతుందనే విషయంపై ఇప్పటి వరకు జిల్లా అధికారులు ఎలాంటి విచారణ చేపట్టకపోవడం, రూ.కోట్ల విలువజేసే ధాన్యం సంరక్షించాల్సిన అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారనే విషయాన్ని ఉన్నతాధికారులు వెల్లడించడానికి విముఖత చూపిస్తున్నారు. కొత్తకోట మండలం నాచాంపేట శివారులోని ఓ కొత్త మిల్లుకు గత సీజన్లో రూ.6.50 కోట్ల వరి ధాన్యం అధికారులు కేటాయించారు. వచ్చిన ఫిర్యాదుల మేరకు ఈ నెల 9న టాస్క్ఫోర్స్ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేయగా.. సుమారు రూ.2.50 కోట్ల విలువైన ధాన్యం మాయమైంది. ఇది చూసిన జిల్లా ఉన్నతాధికారులతో పాటు టాస్క్ఫోర్స్ అధికారులు అవాక్కయ్యారు. జిల్లాలో కొందరు అధికారులు, మిల్లర్లు కుమ్మకై ్క.. రూ.కోట్ల విలువజేసే వరి ధాన్యం బ్లాక్ మార్కెట్కు తరలించి సొమ్ము చేసుకుంటూ బియ్యం అడిగినప్పుడు రీసైక్లింగ్ పద్ధతిన సీఎస్సీకి అప్పగిస్తూ ఒక ప్రణాళికతో అక్రమాలకు పాల్పడుతున్నట్లు ప్రచారం జోరందుకుంది. అధికారులపై ఫిర్యాదుల వెల్లువ.. జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారులపై మొదటి నుంచి ఫిర్యాదు చేస్తున్న బీసీ పొలిటికల్ జేఏసీ నాయకులు వరుస టాస్క్ఫోర్స్ దాడులు జరిగిన మిల్లుల్లో వరి ధాన్యం నిల్వలు మాయం కావడంపై బుధవారం రాష్ట్రస్థాయి అధికారులకు ఫిర్యాదు చేయడంతో జిల్లా అవినీతి బాగోతం రాజధాని చేరినట్లయింది. ఈ విషయంపై వారు స్పందించి సమగ్ర విచారణ చేస్తారా? లేక జిల్లా అధికారుల మాదిరిగానే నిమ్మకుంటారనే విషయంపై స్థానికంగా చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మిల్లర్లకు ధాన్యం కేటాయింపులు చేయాలంటే కనీసం పదిశాతం బ్యాంకు గ్యారెంటీ బాండ్లు ఇవ్వాలనే నిబంధన తీసుకొచ్చింది. కానీ జిల్లాలోని కొందరు మిల్లర్లపై అధికారులు ఉదాసీనత కనబరుస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల టాస్క్ఫోర్స్ అధికారులు దాడి చేసిన నాచారంపేట శివారులోని మిల్లు యజమాని కేవలం రూ.10 లక్షల బ్యాంకు గ్యారంటీ చెల్లిస్తే రూ.కోటి విలువ చేసే ధాన్యం మాత్రమే ఇవ్వాలి. కానీ అధికారులు సుమారు 6.50 కోట్ల ధాన్యం కేటాయింపులు చేయడం ఆరోపణలకు బలం చేకూరినట్లుగా భావించాల్సి వస్తుంది. ధాన్యం కేటాయింపులు, కొన్ని మిల్లుల్లో నిల్వలు లేకపోవడం తదితర అంశాలపై కొనుగోళ్ల ప్రక్రియ పూర్తికాగానే విచారణ చేపడతాం. అవకతవకలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవు. బ్యాంకు గ్యారంటీ విలువ ఆధారంగానే ధాన్యం కేటాయింపులు చేయాలనే నిబంధన ఉంది. కొనుగోలు కేంద్రాలకు అత్యధికంగా ధాన్యం రావడంతో కొన్నిసార్లు ఎక్కువ మోతాదులో కేటాయింపులు చేయాల్సి వచ్చింది. – వినోద్కుమార్, అదనపు కలెక్టర్, వనపర్తి జిల్లాలోని శ్రీరంగాపురం మండలానికి చెందిన ఓ మిల్లర్ ప్రభుత్వం నుంచి సుమారు రూ.120 కోట్ల విలువైన వరి ధాన్యం తీసుకున్నారు. అందులో కనీసం పదిశాతం బియ్యం కూడా ఇవ్వలేదు. ఆయనకే కొనుగోలు కేంద్రాల నుంచి వరి ధాన్యం తరలింపు కాంట్రాక్టును అధికారులు అప్పగించారు. ఈ విషయంపై ప్రతిపక్ష నాయకులు పలుమార్లు విమర్శలు చేసినా.. కనీసం విచారణ చేపట్టకపోవడం గమనార్హం. -
ప్రయాణం.. ప్రాణసంకటం
జిల్లాలో నిత్యకృత్యమైన రోడ్డు ప్రమాదాలు ● మితిమీరిన వేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్తోనే అనర్థాలు ● గడిచిన ఆరు నెలల వ్యవధిలో 54 మంది మృతి ● అవగాహన కల్పిస్తున్నా మారని కొందరు డ్రైవర్లు ● నివారణ చర్యలపై పోలీస్ శాఖ కసరత్తు గద్వాల క్రైం: జిల్లాలో రోడ్డు ప్రయాణం ప్రాణసంకటంగా మారుతోంది. వాహనాలు మృత్యు శకటాలుగా మారుతున్నాయి. ఇంటి నుంచి బయటకు వెళ్లిన వారు క్షేమంగా వస్తే చాలనుకునే స్వరం వినిపిస్తోంది. మరోవైపు అవగాహన లేని డ్రైవర్లు వాహనాలను వాయువేగంతో నడుపుతూ ప్రమాదాల కారకులవుతున్నారు. జాతీయ, రాష్ట్ర, పట్టణ రహదారులపై ప్రమాదాలు నిత్యకృత్యమవుతున్నాయి. జిల్లాలోని ధరూరు, మానవపాడు, ఇటిక్యాల, అలంపూర్, అయిజ మండలాల్లో ఇటీవల అత్యధికంగా రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. గడిచిన ఆరు నెలల వ్యవధిలో 54 మంది మృతి చెందగా.. 70మందికి పైగా గాయాలపాలయ్యారంటే.. ప్రమాదాల తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ఏటా జాతీయ రోడ్డు భద్రత వారోత్సవాలు, పోలీసు శాఖ అరైవ్– అలైవ్ కార్యక్రమాల ద్వారా చైతన్యం తీసుకువచ్చినప్పటికీ కొందరు డ్రైవర్లు, వాహనదారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. నిర్లక్ష్యపు వైఖరితోనే.. వాహనాలు నడపడం ఎంత సరదానో.. అంతకంటే మనిషి ప్రాణం ముఖ్యం అనే విషయాన్ని కొందరు డ్రైవర్లు పెడచెవిన పెడుతున్నారు. వాహనాన్ని రోడ్డుపై ఎంత స్పీడ్గా వెళ్లాలి.. ఎటు నుంచి వాహనాలను ఓవర్టెక్ చేయాలి.. ఎదురుగా వస్తున్న వాహనాలు ప్రమాదాలకు గురికాకుండా ఎలా బయట పడాలి అనే విషయాలపై ఏమాత్రం అవగాహన పెంచుకోవడం లేదు. కొందరు యువ డ్రైవర్లు వాహనాలను మితిమీరిన వేగంతో నడుపుతూ ఎదురుగా వచ్చే వాహనాలను ప్రమాదాలకు గురిచేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. 13.04.2026న నాగర్కర్నూల్ జిల్లాకు చెందిన నలుగురు స్నేహితులు గోవా నుంచి కారులో తిరుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో జిల్లా పరిధిలోని వీరాపురం గ్రామ శివారులో డ్రైవింగ్ చేస్తున్న యువకుడు నిద్రలోకి జారుకోవడంతో రోడ్డు పక్కనున్న భారీ వృక్షాన్ని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. 12.05.2026న గద్వాల పట్టణానికి చెందిన ఓ యువకుడు బైక్పై కర్నూలు వైపు వెళ్తుండగా.. ఇటిక్యాల శివారులో గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు. 06.6.2026న కేటీదొడ్డి మండలానికి చెందిన ఓ వ్యక్తి పని నిమిత్తం ఓ గూడ్స్ వాహనంలో గద్వాలకు వస్తుండగా.. గోనుపాడు గ్రామ శివారులో గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలవడంతో జిల్లా ఆస్పత్రికి తరలించగా.. వైద్యులు మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు రెఫర్ చేశారు. ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఇలా గడిచిన ఆరు నెలల వ్యవధిలోనే 54 మంది రోడ్డు ప్రమాదాల్లో మృతిచెందగా.. 70 మందికి పైగా గాయాల పాలయ్యారు. వాహనాన్ని రోడ్డుపైకి తీసుకురావాలంటే ముందుగా దానిపై పూర్తి అవగాహన కలిగి ఉండాలి. రవాణా శాఖ అధికారులచే లైసెన్స్ తీసుకోవాలి. రాత్రివేళలో హెడ్ ల్యాంపు, ఇండిగేటర్లు వేస్తూ ఎదురుగా వస్తున్న వాహనాలకు ముందుగా సంకేతాలు ఇవ్వాలి. కానీ, కొందరు వాహనాలు ఎంత త్వరగా వెళ్తే.. అంత గొప్ప డ్రైవర్గా ఊహించుకుంటున్నారు. మద్యం తాగి వాహనాలు నడపడం పరిపాటిగా మారింది. అయితే వివిధ వాహనాలు నడపాలంటే లైసెన్స్ ఉండాలి. కానీ, కొంతమంది డ్రైవింగ్ రాకున్నా రవాణా శాఖ కార్యాలయాల్లో లైసెన్స్లు పొందడం కొసమెరుపు. ముందుగా ఇలాంటి వారిని కట్టడి చేస్తే కొంత వరకై నా ప్రమాదాలు నివారించవచ్చు. -
చర్యలు తీసుకుంటాం..
రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. రవాణ, పోలీసు శాఖ సంయుక్తంగా వాహనదారులకు రోడ్డు నిబంధనలపై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా గూడ్స్ వాహనాలలో సరుకులను మాత్రమే ట్రాన్స్పోర్టు చేయాలి. అయితే కొందరు ప్రజలను గూడ్స్ వాహనాలపై ఇతర ప్రాంతాలకు తీసుకెళ్తున్నారు. ఇలాంటి వాహనదారుల పట్ల కఠినంగా వ్యవహరిస్తాం. రోడ్డు ప్రయాణాలు చేస్తున్న ప్రతిఒక్కరు నిబంధనలు పాటించాలి. మద్యం, నిద్రలేమి, అవగాహన, సామర్థ్యం లేని వ్యక్తులు డ్రైవింగ్ చేయరాదు. అన్ని ప్రధాన రహదారులపై సూచిక బోర్డులు ఏర్పాటుకు చర్యలు చేపట్టాం. రోడ్డు నిబంధనలు పాటించని వారిపై కేసులు నమోదు చేస్తాం. – మొగిలయ్య, డీఎస్పీ, గద్వాల ● -
మార్పు గమనించాలి
నేను ఈ కోర్సులో రాణించలేకపోతున్నా.. నేను ఎంచుకున్న లక్ష్యంలో ముందుకు వెళ్లలేకపోతున్నా.. నా చదువుకు సరైన న్యాయం చేయలేకపోతున్నా. కుటుంబ సభ్యులు.. తల్లిదండ్రులు ఇకనన్ను తిడతారు. అనే భావన ఏర్పడిన వారు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అయితే అప్పటికప్పుడు కాకుండా ఇలాంటి వారు ముందుగానే బలవన్మరణాలకు సిద్ధమవుతారని అంతకు ముందు కొన్ని లక్షణాలను చెబుతుంటారు. కుటుంబ సభ్యులతో ముభావంగా ఉండటం, ఏదో పరలోకంలో ఉన్నట్లు ఆలోచించడం, చిన్న చిన్న విషయాలకు ఏడ్వడం, నేను లేకపోయినా మీరు బాగుండాలని చెబుతుండటం, తోటి విద్యార్థులతో సన్నిహితంగా మెలగకపోవడం, ఒకరిద్దరితో జీవితం అంతమైతే తర్వాత ఏం జరుగుతుందని చర్చించడం, ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన కలిగినప్పుడే చనిపోవచ్చు. లేదా ఆరు నెలల తర్వాతనైనా అదే మదిలో మెదలవచ్చు. అలాంటి సందర్భాల్లో వారి తీరు మనస్తత్వాలకు విరుద్ధంగా ఉంటుంది. ఎవరితోనూ కలవలేకపోవడం, ఒంటరితనం లక్షణాలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. – అనిల్రాజ్, మానసిక వైద్య నిపుణుడు -
జనగణనలో భాగస్వాములు కావాలి
● అదనపు కలెక్టర్ నర్సింగ్రావుగద్వాల(మల్దకల్): దేశాభివృద్ధికి దిక్సూచిగా నిలిచే జనగణన ప్రక్రియలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని అదనపు కలెక్టర్ నర్సింగ్రావు కోరారు. బుధవారం మల్దకల్ మండలం నేతువానిపల్లిలో సర్పంచ్ పద్మమ్మ అధ్యక్షతన జరిగిన గ్రామసభకు ఆయన హాజరై మాట్లాడారు. జనగణన ప్రక్రియలో భాగంగా ఇళ్ల లెక్కింపు చేపట్టడం జరిగిందని.. ప్రతి కుటుంబం తమ వివరాలను ఎన్యూమరేటర్లకు తెలియజేయాలని సూచించారు. అదే విధంగా వ్యవసాయ, ఉద్యానశాఖల ద్వారా రైతులకు అందిస్తున్న రాయితీలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. పేదల సొంతింటి కల సాకారం చేసేందుకు మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్లను లబ్ధిదారులు త్వరగా నిర్మించుకోవాలని సూచించారు. బడిబయట ఉన్న పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి.. వారి విద్యాభివృద్ధికి కృషి చేయా లని కోరారు. వర్షాకాలంలో వ్యాధులు ప్రబలకుండా తగిన జాగ్రత్తలు పాటించాలన్నారు. అనంతరం ప్రకృతి వైపరీత్యాలపై అవగాహన కల్పించారు. రైతులకు కూరగాయల విత్తనాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీడీఓ ఆంజనేయరెడ్డి, ఉపసర్పంచ్ మునినాయక్, పంచాయతీ కార్యదర్శి నరేశ్ తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదాల నివారణ కోసమే ‘అరైవ్ అలైవ్’
● జోగుళాంబ జోన్ డీఐజీ ఎల్ఎస్ చౌహాన్ ఎర్రవల్లి: రోడ్డు ప్రమాదాల నివారణ కోసమే ప్రభుత్వం అరైవ్ అలైవ్ కార్యక్రమాన్ని చేపట్టిందని జోగుళాంబ జోన్–7 డీఐజీ ఎల్ఎస్ చౌహాన్ అన్నారు. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా బుధవారం ఎర్రవల్లిలో సర్పంచ్ అనితా కృష్ణసాగర్ అధ్యక్షతన జరిగిన గ్రామ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్పీ శ్రీనివాసరావు పుష్పగుచ్ఛం అందజేసి ఘన స్వాగతం పలికారు. అనంతరం రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన అవగాహన వీడియోలను ప్రదర్శించారు. హెల్మెట్ లేకుండా, మద్యం తాగి వాహనాలను నడపడం వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించారు. అదే విధంగా రోడ్డు ప్రమాదాల్లో కుటుంబ సభ్యులను కోల్పోయిన వారి భావోద్వేగాలను ప్రత్యక్షంగా వినిపించారు. ఈ సందర్భంగా డీఐజీ మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా రోజు 70 నుంచి 80 వరకు రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటుడగా.. 20 నుంచి 30 మంది వరకు ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణం ప్రజలు ట్రాఫిక్ నియమాలు పాటించకపోవడమేనని ఆయన స్పష్టం చేశారు. ప్రతి వ్యక్తి బాధ్యతగా వ్యవహరిస్తేనే ప్రమాదాలను పూర్తిగా నివారించవచ్చని అన్నారు. ద్విచక్ర వాహనంపై ప్రయాణించే వారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. ఇద్దరికి మాత్రమే అనుమతించిన వాహనంపై ముగ్గురు లేదా నలుగురు ప్రయాణించడం ప్రమాదకరమని హెచ్చరించారు. డ్రంకెన్ డ్రైవ్, రాంగ్ రూట్ డ్రైవింగ్ వంటి అలవాట్లు ప్రాణాలకు తీవ్ర ముప్పును కలిగిస్తాయని ఆయన వివరించారు. అనంతరం అక్కడ ఉన్న వారితో డీఐజీ రోడ్డు భద్రతపై ప్రతిజ్ఞ చేయించారు. ద్విచక్ర వాహనదారులకు ఉచితంగా హెల్మెట్లను పంపిణీ చేశారు. ● ఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ఫోర్ వీలర్ డ్రైవింగ్చేసే వారు తప్పనిసరిగా సీట్ బెల్టు ధరించాలన్నారు. పరిమిత వేగంతోనే ప్రయాణం చేయాలని.. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని సూచించారు. ● పదో పటాలం కమాండెంట్ జయరాజు మాట్లాడుతూ.. జీవితంలో కోల్పోయిన అన్నింటినీ తిరిగి సంపాదించుకోవచ్చని, ప్రాణం పోతే తిరిగి తీసుకురాలేమని అన్నారు. ఎంతో మంది తెలిసి కూడా రాంగ్రూట్, మద్యం తాగి వాహనాలను నడుపుతూ ప్రమాదాలను కొనితెచ్చుకుంటున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో డీటిఓ రాధిక, డీఎస్పీ మొగిలయ్య, సీఐ ప్రదీప్కుమార్, ఎస్ఐ రవిరాథోడ్ తదితరులు పాల్గొన్నారు. -
బాధ్యత తీసుకోవాలి..
చాలామంది చిన్నపాటి విషయాలకే మనోవేదనకు లోనవుతున్నారు. అయితే ఒత్తిడిని తగ్గించుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆత్మహత్యలు జరగకుండా సమాజంలో బాధ్యత కలిగిన పోలీస్ వ్యవస్థ, స్వచ్ఛంద సంస్థలు, ఇతర మేధావులు ఆత్మహత్యల ద్వారా చిన్నాభిన్నమైన కుటుంబాలు లేకుండా.. ఆత్మహత్యలు లేని సమాజ నిర్మాణానికి ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. అందరూ కలిసి దీనిపై శ్రద్ధ పెడితే.. ఆత్మన్యూనతా భావంతో.. క్షణికావేశంతో ఆసువులు బాస్తున్న వారిని రక్షించుకోవచ్చు. ఆత్మహత్య చేసుకోవాలి అనుకునే వ్యక్తికి ఆఖరి నిమిషంలో భరోసా లభించినా తన ప్రయత్నాన్ని విరమించుకుంటాడు. నానాటికి క్షీణించి పోతున్న మౌళిక విలువలు.. పెరుగుతున్న మానసిక సంఘర్షణ ఆత్మహత్యలకు ప్రేరణగా నిలుస్తున్నాయి. మానవ సంబంధాలు బలహీనంగా మారే వాతావరణంలో సకారాత్మక మార్పులు తీసుకురావడం.. జీవన విధానంలో పలు కారణాలతో ఏర్పడుతున్న అగాధాలను పూడ్చడం.. సామాజిక తోడ్పాటు ద్వారా ఆత్మహత్యలు పూర్తి తగ్గుతాయి. – వంగీపురం శ్రీనాథచారి, ప్రముఖ మానసిక విశ్లేషకులు -
రసాయన ఎరువుల వాడకం తగ్గించండి
అయిజ: రైతులు పంటల సాగులో రసాయనిక ఎరువుల వాడకం తగ్గించి.. సేంద్రియ ఎరువులు వినియోగించాలని ఆత్మ డిప్యూటీ డైరెక్టర్ జగ్గూ నాయక్ సూచించారు. బుధవారం అయిజ మండలం ఈడుగోనిపల్లిలో నిర్వహించిన గ్రామసభకు ఆయన హాజరై.. ఆధునిక వ్యవసాయ పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించారు. రసాయన ఎరువులను అధికంగా వినియోగించడం ద్వారా పంట పొలం సహజ లక్షణం కోల్పోయి నిస్సారంగా మారుతుందన్నారు. సేంద్రియ ఎరువుల వినియోగంతో అధిక దిగుబడులు సాధించవ్చన్నారు. రైతులు నానో డీఏపీ, యూరియాపై దృష్టి సారించాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ మంజుల, ఉపసర్పంచ్ గోవిందమ్మ, ఏఓ జనార్దన్, ఏఈఓ అనిల్కుమార్, పంచాయతీ కార్యదర్శి సురేంద్ర పాల్గొన్నారు. అన్ని రంగాల్లో సమగ్రాభివృద్ధి గద్వాలన్యూటౌన్: ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో దేశం అన్ని రంగాల్లో సమగ్రాభివృద్ధి సాధిస్తోందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు అన్నారు. మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టి 12 ఏళ్లు పూర్తయిన సందర్భంగా బుధవారం బీజేపీ నాయకులు స్థానిక కోటలోని చెన్నకేశవస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ చరిత్రలో అత్యధిక కాలం నిరవధికంగా పరిపాలించిన ప్రధానిగా మోదీ కొత్త చరిత్ర సృష్టించారన్నారు. 12 ఏళ్ల కాలంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, డిజిటల్ విప్లవం, జాతీయ భద్రత బలోపేతం, ఆర్థిక రంగంలో సంస్కరణల ద్వారా దేశం సరికొత్త దిశగా పయనిస్తోందన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శులు ఎక్బోటే రవి, శ్యామ్రావు, కౌన్సిలర్లు చంద్రశేఖర్, శాలన్న, నాయకులు శ్రీమన్నారాయణ, సమత, కృష్ణ, పాండు, నర్సింహ పాల్గొన్నారు. వేరుశనగ క్వింటా రూ.6,279 గద్వాలవ్యవసాయం: జిల్లాకేంద్రంలోని వ్యవసాయ మార్కెట్యార్డుకు బుధవారం 500 క్వింటాళ్ల వేరుశనగ అమ్మకానికి వచ్చింది. క్వింటాకు గరిష్టంగా రూ. 7,360, కనిష్టంగా రూ. 3,119, సరాసరి రూ. 6,279 ధరలు లభించాయి. 4 క్వింటాళ్ల వరి (సోన) రాగా.. రూ. 1,875 ధర పలికింది. ముందు ప్రభుత్వంలో విలీనం చేయండి మహబూబ్నగర్ మున్సిపాలిటీ: టీజీఎస్ఆర్టీసీని ముందుగా ప్రభుత్వంలో విలీనం చేసి, ‘అపాయింటెడ్ డే’ ప్రకటించిన తర్వాతే గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని టీఎంయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అశ్వత్థామరెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం జిల్లాకేంద్రంలో సంఘం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం తొలుత కార్మిక సంఘాల ఎన్నికలు జ రపాలని భావించడం సరైన నిర్ణయం కాదన్నా రు. గతంలో ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు వెంటనే విలీనం జరగాలన్నారు. గత నెలలో సమ్మెకు ముందు కార్మికుల్లో ఏ మాత్రం బలం లేని జేఏసీ నోటీసు ఇవ్వడంతో ఎలాంటి చల నం రాలేదని, దీంతో మెజారిటీ ఉన్న టీఎంయూ ఆధ్వర్యంలో 16 డిమాండ్లతో నోటీసు ఇచ్చి సమ్మెలోకి వెళ్లామన్నారు. సమ్మె ఉద్ధృతమైన క్రమంలో రెండోరోజే డ్రైవర్ శంకర్గౌడ్ ఆత్మాహుతి చేసుకోవడం దురదృష్టకరమన్నా రు. చివరకు టీఎంయూ కార్మికుల బలంతోనే సమ్మె విజయవంతమైందని, ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం దిగి వచ్చి తమ డిమాండ్లను అంగీకరించిందన్నారు. ఇది భరించలేని జేఏసీ నాయకులు ‘ముందే విలీనం వద్దు.. గుర్తింపు సంఘం ఎన్నికలు జరపాలి..’ అని ప్రభుత్వాన్ని తాను కోరినట్లు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సంఘం రాష్ట్ర కార్యదర్శి బీఎస్ రెడ్డి, రీజియన్ అధ్యక్షుడు కె.రవీందర్రెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు వీసీఎస్ రెడ్డి, రవి, బీవీ రెడ్డి, నారాయణ, నాయకులు శ్రీనివాసులు, భానుప్రకాష్రెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఉమ్మడి జిల్లా అడ్హాక్ కమిటీ చైర్మన్గా సంజీవరెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షుడిగా చంద్రయ్య, అధ్యక్షుడిగా వి.ఎస్.నారాయణ, రీజినల్ కార్యదర్శిగా మధుసూదన్, అదనపు కార్యదర్శిగా బి.శ్రీనివాసులును ఎన్నుకున్నారు. -
అధిక ధరలకు హద్దులేకుండా పోయింది
గద్వాలన్యూటౌన్: బీజేపీ పాలనలో ధరల పెంపునకు హద్దులేకుండా పోయిందని సీపీఐ జాతీయ కమిటీ సభ్యురాలు సురవరం విజయలక్ష్మి ఆరోపించారు. పెరిగిన పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసర ధరలను నిరసిస్తూ.. బుధవారం సీపీఐ జిల్లా సమితి ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. ముందుగా పీజేపీ క్యాంపు నుంచి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రధాని మోదీ పాలనలో సామాన్యుడు ధరల భారాలతో నలిగిపోతున్నాడన్నారు. ధరలను విపరీతంగా పెంచుతూ.. కార్పొరేట్ శక్తులకు దేశ సంపదను దోచి పెడుతున్నారని విమర్శించారు. నీట్ పరీక్ష పేపర్ లీకేజీపై నోరు మెదపడం లేదన్నారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని అధికారంలోకి వచ్చిన మోదీ ప్రభుత్వం.. నిరుద్యోగుల నడ్డి విరిచిందన్నారు. ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తూ, కార్పొరేట్కు కొమ్ము కాస్తున్నారన్నారు. కార్పొరేటర్ల డబ్బుతోనే ఎన్నికల్లో గెలుస్తున్నారని ఆరోపించారు. దేశంలో రూపాయి విలువ పడిపోతున్నా.. పట్టించుకోకుండా సాకులు చెబుతున్నారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో దేశ ప్రజలంతా ఏకమై బీజేపీని గద్దె దించాలన్నారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టరేట్ అధికారికి అందజేశారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ఆంజనేయులు, నాయకులు రంగన్న, ఊశన్న, నాగార్జున, రవి, ప్రతాప్, ఈశ్వర్, వెంకటేశ్ పాల్గొన్నారు. -
మరిన్ని యూనిట్లు ఇవ్వాలి..
ప్రభుత్వం రైతులకు రాయితీపై ఇస్తున్న యూనిట్లను పెంచాలి. ముఖ్యంగా కోల్డ్రూం స్టాగింగ్, కోల్డ్ స్టోరేజ్ యూనిట్లు మరిన్ని నెలకొల్పాలి. రైతులకు సకాలంలో రాయితీ అందే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలి. – నర్సింహారెడ్డి, రైతు, అయిజ రాయితీ శాతం పెంచాలి.. రైతులు పండ్ల తోటలను పెంచేందుకు ప్రభుత్వం కల్పిస్తున్న రాయితీలను మరింతగా పెంచాలి. రైతుల్లో ఎక్కవ శాతం పేదలు ఉన్నారు. రాయితీ శాతం పెంచితే గాని కోల్డ్ స్టోరేజ్, కోల్డ్రూం స్టాగింగ్లను ఏర్పాటు చేసుకోలేరు. రాయితీపై ఇస్తున్న యూనిట్ల సంఖ్యను కూడా పెంచితే మరికొందరు రైతులు పండ్ల తోటలను సాగుచేస్తారు. – దర్శెల్లి, రైతు, అయిజ ● -
నకిలీపై చర్యలేవి..?
రాజోళి: కొన్నేళ్లుగా గట్టుచప్పుడు కాకుండా సాగుతున్న నకిలీ ధ్రువపత్రాల దందాను కొన్ని నెలల క్రితం ‘సాక్షి’ వెలుగులోకి తీసుకొచ్చింది. నకిలీ పత్రాలతో మోసపోయిన బాధితులు జిల్లా అధికారులను కలిసి ఫిర్యాదులు సైతం చేశారు. అయినప్పటికీ నకిలీగాళ్లపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. అధికారుల నిర్లక్ష్యధోరణి కారణంగానే దొంగచాటుగా చేసే ఫేక్ సర్టిఫికెట్ల దందా.. ప్రస్తుతం యథేచ్ఛగా దుకాణాల్లోనే నిర్వహించే దాక వచ్చిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఫేక్ సర్టిఫికెట్లతో తమ ఆస్తులు కబ్జాకు గురయ్యాయని జిల్లా అధికారులకు ఆధారాలతో సహా ఫిర్యాదు చేసినా తమకు ఎలాంటి న్యాయం జరగలేదని బాధితులు ఆవేదన చెందుతున్నారు. ప్రైవేటు బ్యాంకర్లతో కుమ్మకై ్క.. రాజోళి మండలం మాన్దొడ్డి కేంద్రంగా ఫేక్ సర్టిఫికెట్ల దందా జోరుగా సాగుతోంది. గ్రామానికి చెందిన ఓ యువకుడు అయిజలోని పలు ప్రైవేటు బ్యాంకర్లతో కుమ్మకై ్క.. ఫేక్ ఓనర్షిప్ సర్టిఫికెట్లు తయారు చేస్తున్నట్లు తేలింది. ఫేక్ సర్టిఫికెట్లతో ఒకరి ఇంటిని మరొకరికి రిజిస్ట్రేషన్ చేయడంతో పాటు సాక్షుల సంతకాలను సైతం ఫోర్జరీ చేశారు. దీనిపై బాధితుడు గతేడాది జూన్లో అధికారులకు పిర్యాదు చేసినా ఇంతవరకు చర్యలు తీసుకోలేదు. ఫేక్ సర్టిఫికెట్లు తయారీ చేసిన వ్యక్తి.. అది చేసింది తానేనని మాట్లాడిన ఫోన్ సంభాషణ ఉన్నప్పటికీ అధికారులు చర్యలు తీసుకోకపోవడంపై పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాగా, ప్రైవేటు బ్యాంకుల్లో ఇంటి రుణాలు ఇప్పిస్తే వచ్చే కమీషన్ కోసం, సాధారణ నిరక్ష్యరాసులను లక్ష్యంగా చేసుకొని రుణాల మాయలో పడేస్తున్నారు. సర్టిఫికెట్లు లేని వారి వద్ద కావాల్సినంత డబ్బు దండుకొని నకిలీ ధ్రువపత్రాలు, రిజిస్ట్రేషన్లు, ఇతర తతంగం ముగిస్తున్నట్లు తెలిసింది. ఇతర మండలాల్లో సైతం.. మాన్దొడ్డిలో మొదటి నుంచి ఓ వ్యక్తి ఓనర్షిప్ సర్టిఫికెట్లు తయారు చేస్తుండగా.. ఆయన ద్వారా మరికొందరు లింకులు కలుపుకొని పచ్చర్ల, రాజోళి, తుమ్మిళ్ల, శాంతిగనర్, మానవపాడు తదితర గ్రామాలతో పాటు, గట్టు మండలం వరకు ఫేక్ మేకర్లు తయారయ్యారు. ఇందులో విచిత్రం ఏంటంటే.. ఫేక్ సర్టిఫికెట్లు ఎక్కడ తయారు చేస్తున్నారనేది అధికారులకు సమాచారం ఉన్నప్పటికీ పట్టించుకోకుండా, అదే సర్టిఫికెట్లతోనే ప్రక్రియను ముగిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. సాధారణంగా గ్రామ పంచాయతీ నుంచి ఇంటిని రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు గతంలో ఓనర్షిప్ సర్టిఫికెట్ ఇచ్చేవారు. కొన్నేళ్లుగా ఓనర్షిప్ సర్టిఫికెట్ ఇవ్వడం లేదు. కాని అదే ఓనర్షిప్ సర్టిఫికెట్లను ఆధారంగా చూపి.. వందల రిజిస్ట్రేషన్లు చేయడం విడ్డూరంగా ఉందని ప్రజలు అంటున్నారు. ఓనర్షిప్ సర్టిఫికెట్లను తాము ఇవ్వలేదని గ్రామ పంచాయతీ అధికారులే చెబుతున్నా.. అందుకు ఆధారాలతో సహా రాతపూర్వకంగా రాసి ఇచ్చినా కూడా కారకులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని బాధితులు వాపోతున్నారు. ప్రాణం ఖరీదు.. వైద్యుల నిర్లక్ష్యంతో మృతిచెందిన ఓ మహిళ కుటుంబానికి రూ.9.50 లక్షల పరిహారం చెల్లించడం చర్చనీయాంశంగా మారింది.–8లో uసంతకాలు ఫోర్జరీ.. గతేడాది పచ్చర్లకు చెందిన వ్యక్తి ఇంటిని ఫేక్ సర్టిఫికెట్లతో మరొకరికి అమ్మారని తెలుసుకున్న బాధితుడు.. ఆధారాలతో సహా జిల్లా అధికారులకు తెలిపారు. ఈ మేరకు మండల అధికారులు విచారణ జరపగా.. గ్రామ పంచాయతీ కార్యదర్శి సంతకాలను కూడా ఫోర్జరీ చేశారని నిర్ధారణ అయ్యింది. ఫోర్జరీలు చేసిన వ్యక్తులు కూడా ఇతరులు చేయమంటేనే చేశామని చెప్పా రు. అయినా కూడా చర్యలు తీసుకోలేదు. బాధితులకు న్యాయం జరగలేదు. దీంతో విసిగిపోయిన బాధితులు న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకు సిద్ధమయ్యారు. ఇలా గ్రామస్థాయి నుంచే ఫేక్ మేకర్లు విచ్చలవిడిగా దందా సాగిస్తున్నా.. అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అక్రమ దందాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని ప్రజలు కోరుతున్నారు. ఈ విషయమై జిల్లా అధికారులను ఫోన్లో వివరణ కోరేందుకు ప్రయత్నించగా.. అందుబాటులోకి రాలేదు. ప్రైవేటు బ్యాంకర్లతో కుమ్మకై ్క ఫేక్ ఓనర్షిప్ సర్టిఫికెట్ల దందా బాధితులు ఫిర్యాదు చేసినా పట్టని అధికారులు ఇతర గ్రామాలకు పాకుతున్న ఫేక్ మేకర్లు యథేచ్ఛగా నకిలీ ధ్రువపత్రాల తయారీ -
జూరాలకు 2,815 క్యూసెక్కుల ఇన్ఫ్లో
● నెట్టెంపాడుకు కొనసాగుతున్న నీటి పంపింగ్ గద్వాల (ధరూరు): ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు కు స్వల్పంగా ఇన్ఫ్లో కొనసాగుతోంది. మంగళవారం సాయంత్రం వరకు ప్రాజెక్టుకు 2,815 క్యూ సెక్కుల ఇన్ఫ్లో ఉన్నట్లు పీజేపీ అధికారులు తెలిపా రు. నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంలో రెండు పంపులను రన్ చేసి.. రిజర్వాయర్లను నింపుతున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం నెట్టెంపాడుకు 1,500 క్యూ సెక్కులు, ఆవిరి రూపంలో 42 క్యూసెక్కులతో కలి పి మొత్తం 1,542 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థా యి నీటిమట్టం 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 3.372 టీఎంసీల నీరు నిల్వ ఉందన్నారు. -
నేరస్తుల విషయంలో కఠినంగా వ్యవహరించాలి
గద్వాల(గద్వాల క్రైం): నేరస్తుల విషయంలో పోలీసు సిబ్బంది కఠినంగా వ్యవహరించాలని ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన నేర సమీక్షలో ఆయన మాట్లాడా రు. జిల్లాలో శాంతి భద్రతల విషయంలో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో అనుమానిత వ్యక్తులను గుర్తించి పూర్తిస్థాయిలో విచారించాలని తెలిపారు. సరిహద్దు ప్రాంతాల్లో పటిష్ట నిఘా ఉంచడంతో పాటు చెక్పోస్టుల వద్ద ప్రతి గూడ్స్ వాహనం, కంటెయినర్లను తనిఖీ చేయాలని ఆదేశించారు. పోలీస్స్టేషన్కు సమస్యలపై వచ్చే బాధితులకు న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రత్యేక చర్యలు చేపట్టాలని తెలిపారు. అనుమతి లేకుండా ఇసుక, మట్టి, రేషన్ బియ్యం, నిషేధిత మత్తు పదార్థాలు, గంజాయి, పేకాట వంటి వాటిని గుర్తించి కట్టడి చేయాలని ఎస్పీ ఆదేశించారు. సిబ్బందిపై బాధితులు ఎవరైనా ఫిర్యాదులు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. నమోదైన కేసుల విషయంలో నిర్లక్ష్యం లేకుండా వీలైనంత త్వరగా కోర్టులో చార్జీషీట్ దాఖలు చేసి.. నిందితులకు శిక్ష పడేలా వ్యవహరించాలన్నారు. అదే విధంగా భరోసా సెంటర్లో బాధితుల సమస్యలను వీలైనంత వరకు పరిష్కరించాలని ఆయన సూచించారు. సమావేశంలో ఏఎస్పీ శంకర్, డీఎస్పీ మొగిలయ్య, సీఐలు శ్రీను, ప్రదీప్కుమార్, ఎస్ఐలు కళ్యాణ్కుమార్, శ్రీకాంత్, శ్రీహరి, నాగశేఖర్రెడ్డి తదితరులు ఉన్నారు. -
45 రోజుల్లో భూసేకరణ పూర్తిచేయాలి
● ఆర్అండ్ఆర్ కమిషనర్శివకుమార్నాయుడు గద్వాల: నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంలో భాగంగా వివిధ ప్యాకేజీల పరిధిలో సేకరించాల్సిన 534 ఎకరాల్లో ఎలాంటి ఇబ్బందులు లేని భూ సేకరణ ప్రక్రియను 45 రోజుల్లోగా పూర్తిచేయాలని ఆర్అండ్ఆర్ కమిషనర్ శివకుమార్నాయుడు అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో ఆయన కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్తో కలిసి అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులపై ఇటీవల సీఎం రేవంత్రెడ్డి నిర్వహించిన సమీక్షలో భూ సేకరణ ప్రక్రియ ఆలస్యం కావడంపై అసంతృప్తి వ్యక్తం చేశారన్నారు. గట్టు ఎత్తిపోతల పథకంలో 462 ఎకరాలు, తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం ఫేజ్–2 కింద నిర్మిస్తున్న మల్లమ్మకుంట రిజర్వాయర్ పరిధిలో 567 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉందన్నారు. అదేవిధంగా నెట్టెంపాడు ప్రాజెక్టు పరిధిలో 534 ఎకరాలు సేకరించాల్సి ఉండగా.. ఇందులో కోర్టు కేసులు, సమస్యలు లేని 220 ఎకరాలకు ఈ నెల 15వ తేదీలోగా ప్రిలిమినరీ డిక్లరేషన్ ఇవ్వాలని ఆదేశించారు. ఆయా ప్రాజెక్టుల పరిధిలో భూసేకరణ ప్రక్రియ పూర్తయితేనే పెండింగ్ పనులు వేగవంతమవుతాయని ఆయన గుర్తుచేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. భూసేకరణ ప్రక్రియకు సంబంధించి రైతుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమైతే ప్రాజెక్టుల ఆవశ్యకతను వివరించి ఒప్పించాలన్నారు. రెవెన్యూ, సర్వే, ఇరిగేషన్శాఖల అధికారులు సమన్వయంతో త్వరితగతిన భూసేకరణ ప్రక్రియ పూర్తిచేయాలని సూచించారు. సమావేశంలో ఎస్డీసీ కృష్ణ, ఇరిగేషన్శాఖ ఎస్ఈ రహీముద్దీన్, సర్వే ఏడీ నూకరాజు, ఏఓ భూపాల్రెడ్డి, తహసీల్దార్లు ఉన్నారు. -
‘చేనేత’ ఎన్నికలు
అమరచింత: చేనేత సహకార సంఘాల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం ఎట్టకేలకు పచ్చజెండా ఊపింది. మొదటి విడతలో 50 మంది సభ్యులున్న సంఘాలకు ఈ నెల 12న ఎన్నికలు నిర్వహించేందుకు చేనేత, జౌళిశాఖ అధికారులు ప్రకటన జారీ చేశారు. దీంతో ఉమ్మడి జిల్లాలో చేనేత సహకార సంఘాల్లో ఎన్నికల వేడి రాజుకుంది. ● చేనేత సహకార సంఘాల ఎన్నికల నిర్వహణకు ఏప్రిల్ 4 నుంచి మే నెల 15 వరకు సహకార సంఘాల సభ్యుల ఓటరు జాబితా తయారు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయగా.. చేనేత జౌళిశాఖ అధికారులు ఓటరు జాబితా సవరణను యుద్ధ ప్రాతిపదికన చేపట్టింది. అయితే సంఘాల్లో ఎలాంటి అప్పులు లేని సభ్యులు మాత్రమే పోటీ చేసే, ఓటు వేసే హక్కు ఉంటుందని ప్రకటించడంతో ఆశావహులు సంఘాలు, బ్యాంకుల్లో తీసుకున్న రుణాలను చెల్లించారు. ఈ నెల 12న 9 మంది డైరెక్టర్లను ఎన్నుకోవడంతో పాటు వారిలో అధ్యక్షుడు, ఉపాధ్యక్షులను ప్రకటిస్తారు. ఈ వ్యవహారమంతా అభ్యర్థికి సభ్యులు చేతులెత్తి ఓటేసే ప్రక్రియతో కొనసాగనుందని అధికారులు తెలిపారు. 100 మంది కంటే ఎక్కువ మంది సభ్యులున్న సంఘాలకు ఇదే నెల చివరి వారంలో ఓటింగ్ విధానంలో ఎన్నికలను నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. 2013లో చివరిసారి.. రాష్ట్రవ్యాప్తంగా సహకార సంఘాల ఎన్నికలు 2013, ఫిబ్రవరిలో చివరిసారి జరగగా.. 2018లో వీటి కాల పరిమితి ముగిసింది. ఆ తర్వాత మళ్లీ ఎన్నికలు జరగలేదు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత ప్రభుత్వం ఎనిమిది ఏళ్ల పాటు పాత పాలకవర్గాల పదవీ కాలన్ని మొత్తం 16 పర్యాయాలు పొడిగించింది. చివరిసారి 2026, మార్చి 9 నుంచి మే నెల 10 వరకు పదవీ కాలం పొడిగించారు. జిల్లాలోని పలు సొసైటీల్లో అక్రమాలు జరిగాయని తేలడంతో పీఏసీఎస్ చట్టం సెక్షన్ 51 కింద అధికారులను పర్సన్ ఇన్చార్జ్లుగా నియమించారు. మొదటి దశలో 10 సంఘాలకు... చేనేత సహకార సంఘాల ఎన్నికలు దశల వారీగా నిర్వహించనున్నారు. మొదటి విడతలో 50 ఓట్ల కంటే తక్కువ ఉన్న సంఘాలకు ఈ నెల 12న నిర్వహించాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఉమ్మడి జిల్లాలోని 10 సంఘాలకు ఎన్నికలు జరగనుండగా.. చేతులెత్తే పద్ధతిలో 9 మంది డైరెక్టర్లను ఎన్నుకోవాల్సి ఉంటుంది. అదేరోజు అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నిక ఉండనుంది. నారాయణపేటలోని చేనేత సంఘం, మార్కండేయ మహిళా సంఘం, శ్రీలక్ష్మి సిల్క్స్ సంఘం, ఆదర్శ చేనేత సంఘాలతో పాటు చిన్నజట్రం, కోటకొండ, మద్దూరులోని శ్రీబాలాజీ, పోతిరెడ్డిపల్లిలోని టసర్ ఖాదీ సిల్క్ బోర్డు, గద్వాల జిల్లాలో అనంతపురం పవర్లూమ్ సంఘం, నాగర్కర్నూల్ జిల్లాలోని బిజినేపల్లి సంఘాలకు మొదటి విడతలో ఎన్నికలు జరగనున్నాయి. ఉమ్మడి జిల్లాలో ఇలా.. జోగుళాంబ గద్వాల, వనపర్తి, నాగర్కర్నూల్, నారాయణపేట, మహబూబ్నగర్ జిల్లాలో మొత్తం 54 చేనేత సహకార సంఘాలు ఉన్నాయి. వీటిలో కొన్ని సంఘాలు పనిచేస్తుండగా.. మరికొన్ని అప్పుడప్పుడు పని చేస్తున్నాయని, కొన్ని సంఘాలు మూతబడ్డాయని చేనేత, జౌళిశాఖ అధికారులు తెలిపారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సుమారు 25 వేల మంది చేనేత కార్మికులు ఉన్నారు. ఈ నెల 12న నిర్వహణకు ప్రభుత్వం పచ్చజెండా మొదటి విడతలో 50 మంది సభ్యులున్న సంఘాలకే.. ఓటరు జాబితా సిద్ధం చేసిన అధికారులు డిఫాల్టర్లు, మృతిచెందిన వారి ఓటుహక్కు తొలగింపు ఉమ్మడి జిల్లాలో 54 చేనేత సహకార సంఘాలు -
జనరల్ ఆస్పత్రిలో భారీగా బదిలీలు
పాలమూరు: మహబూబ్నగర్ జిల్లా జనరల్ ఆస్పత్రిలోపాటు పాలమూరు మెడికల్ కళాశాల లో పనిచేస్తున్న అన్నివిభాగాల హెచ్ఓడీలు హైదరాబాద్కు బదిలీ అయ్యారు. మొత్తం 9 విభాగాల ప్రొఫెసర్ల (హెచ్ఓడీ)లకు స్థానం చలనం కావడం విశేషం. మత్తు విభాగం హెచ్ఓడీ డాక్టర్ మాధవి ఉస్మానియా, రేడియాలజీ విభాగం హెచ్ఓడీ హన్మంతు ప్రసాద్ గాంధీ ఆస్పత్రి, ఈఎన్టీ హెచ్ఓడీ డాక్టర్ శ్రీకాంత్ కోఠి, చిన్నపిల్లల విభాగం (పీడియాట్రిక్) హెచ్ఓడీ డాక్టర్ సురేష్ శ్రీనివాస్ నిలోఫర్, జనరల్ మెడిసిన్ హెచ్ఓడీ డాక్టర్ అమరావతి ఉస్మానియా, ఎస్పీఎం హెచ్ఓడీ డాక్టర్ ఉషారాణి ఉస్మానియా, ఫిజియాలజీ హెచ్ఓడీ డాక్టర్ సునందిని ఉస్మానియా, ఫోరెన్సిక్ హెచ్ఓడీ డాక్టర్ పార్వతి ఉస్మానియా, మైక్రోబయాలజీ హెచ్ఓడీ డాక్టర్ రమాదేవి నిలోఫర్కు బదిలీ అయ్యారు. అదేవిధంగా జనరల్ ఆస్పత్రిలోని గైనిక్ విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న డాక్టర్ లక్ష్మీపద్మప్రియ నారాయణపేట, జనరల్ మెడిసిన్లో అసోసియేట్ ప్రొఫెసర్ స్వప్న ఉస్మానియాకు, జనరల్ మెడిసిన్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ బాల శ్రీనివాస్ నాగర్కర్నూల్కు బదిలీ అయ్యారు. ఇక జిల్లాకు వచ్చిన వారిలో ఎస్పీఎం హెచ్ఓడీగా డాక్టర్ కోటేశ్వరమ్మ గాంధీ నుంచి బదిలీపై వచ్చారు. మైక్రోబయాలజీ హెచ్ఓడీగా డాక్టర్ శ్రీవాణి, జనరల్ మెడిసిన్ హెచ్ఓడీగా డాక్టర్ శకుంతల రావడం జరిగింది. కొత్తవారు ఎప్పుడో..? జిల్లా జనరల్ ఆస్పత్రితోపాటు మెడికల్ కళాశాలలోని ఆయా విభాగాల్లో పనిచేసే హెచ్ఓడీలు (ప్రొఫెసర్లు) బదిలీ కావడంతో సదరు పోస్టులు ఖాళీ అయ్యాయి. దీంతో ఖాళీ అయిన పోస్టుల్లో కొత్తవారు వచ్చి విధుల్లో చేరే వరకు ఎన్ని రోజులు పడుతుందనే విషయం తెలియడం లేదు. సాధారణంగా హైదరాబాద్ నుంచి బదిలీ అయ్యి వచ్చే వారిలో ఇక్కడ విధుల్లో చేరడానికి ఆసక్తి చూపారు. ఒకవేళ చేరిన నిత్యం హైదరాబాద్ నుంచే రాకపోకలు సాగిస్తుంటారు. ఈ క్రమంలో స్థానికంగా వారు అందుబాటులో ఉండే అవకాశం లేదు. డీఎంహెచ్ఓ కృష్ణ బదిలీ జిల్లా వైద్య, ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరిని బదిలీ చేయడం జరిగింది. అలాగే డీఎంహెచ్ఓగా డిప్యూటేషన్పై పనిచేస్తున్న కృష్ణ నాగర్కర్నూల్ డీఎంహెచ్ఓగా బదిలీ కాగా.. ఆయన స్థానంలో జిల్లాకు ఇంకా ఎవరిని కేటాయించలేదు. అలాగే జిల్లా అంధత్వ నివారణ సంస్థ అధికారిగా డాక్టర్ సునీతరెడ్డి వికారాబాద్ నుంచి బదిలీపై వచ్చారు. జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి (డీఐఓ)గా డాక్టర్ శైలజ నారాయణపేట నుంచి బదిలీపై వచ్చారు. ఇక పీహెచ్సీల్లో పనిచేస్తున్న వైద్యాధికారులు, ఫార్మాసిస్ట్లు, 24 మంది ఏఎన్ఎంలు, ముగ్గురు ఎంపీహెచ్ఓలు, నలుగురు హెల్త్ ఎడ్యుకేటర్లు, సూపర్వైజర్లు, సీనియర్ అసిస్టెంట్స్, జూనియర్ అసిస్టెంట్స్, సీహెచ్ఓలు బదిలీ కావడం జరిగింది. కిందిస్థాయి సిబ్బందికి జిల్లాలోని ఆయా పీహెచ్సీలు, మెడికల్ కళాశాల, జనరల్ ఆస్పత్రిలో పోస్టింగ్ ఇవ్వగా.. కొందరు ఇతర జిల్లాలకు బదిలీపై వెళ్లారు. రోగులకు దిక్కెవరు..? ప్రస్తుతం జిల్లా జనరల్ ఆస్పత్రిలోని అన్ని విభాగాల్లో పనిచేస్తున్న ప్రొఫెసర్లు, అసోసియేట్లు, అసిస్టెంట్లకు బదిలీ అయిన నేపథ్యంలో కొత్త వారు వచ్చి విధుల్లో చేరడానికి ఇంకా సమయం పట్టనుంది. అలాగే కొంతమందిని ఇక్కడికి బదిలీ చేసిన విధుల్లో చేరడానికి ఏమాత్రం ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. ఈ క్రమంలో జనరల్ ఆస్పత్రికి వైద్యం కోసం వచ్చే రోగులకు అవస్థలు తప్పవు. అందరూ విధుల్లో ఉన్న రోగులకు సరైన వైద్యం అందక ఇబ్బందులు పడేవారు ప్రస్తుతం అందరూ బదిలీ హడావుడిలో ఉండటంతో రోగులను పట్టించుకునే నాథుడే ఉండరు. దీంతో అడ్మిట్ అయిన రోగులతోపాటు అవుట్ పేషెంట్లకు మెరుగైన చికిత్స అందడం కష్టసాధ్యమే అనిపిస్తోంది. 9 విభాగాల హెచ్ఓడీలు, అసోసియేట్లకు స్థానచలనం డీఎంహెచ్ఓ కృష్ణ నాగర్కర్నూల్కు.. ఆరోగ్య శాఖలో వైద్యాధికారులు,ఏఎన్ఎంలు అందరూ బదిలీ జనరల్ ఆస్పత్రిలో కొత్త వైద్యులు విధుల్లో చేరే వరకు రోగులకు తప్పని అవస్థలు -
గోదాంల నిర్మాణానికి ప్రణాళికలు
అయిజ: పట్టణంలో గోదాంల నిర్మాణానికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు జాతీయ సహకార వినియోగదారుల సమాఖ్య (ఎన్సీసీఎఫ్) అధికారులు వినయ్, యశ్వంత్ తెలిపారు. మంగళవారం జిల్లా సహకారశాఖ అసిస్టెంట్ రిజిస్ట్రార్ మహేశ్కుమార్తో కలిసి పట్టణ సమీపంలో స్థానిక పీఏసీఎస్కు కేటాయించిన రెండెకరాల ప్రభుత్వ స్థలాన్ని వారు పరిశీలించి మాట్లాడారు. ప్రస్తుతం రైతులు పండిస్తున్న అన్నిరకాల పంటల కొనుగోళ్లకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాయన్నారు. ఈ క్రమంలో పంటల నిల్వకు గోదాంల కొరత తీవ్రంగా ఉందన్నారు. అయిజ పీఏసీఎస్కు కేటాయించిన స్థలంలో 2,500 మెట్రిక్ టన్నుల సామర్ధ్యం కలిగిన రెండు గోదాంలు నిర్మించవచ్చని అన్నారు. రూ. 3కోట్ల అంచనా వ్యయంతో నిర్మించ తలపెట్టిన ఈ గోదాంలు ఎఫ్సీఐ, గిడ్డంగుల అభివృద్ధి రెగ్యులేటరీ అథారిటీ ప్రమాణాలతో ఉంటాయని తెలిపారు. టెండర్ల ప్రక్రియ పూర్తయిన అనంతరం ఆరు నెలల్లో గోదాంల నిర్మాణం పూర్తిచేసి.. సొసైటీకి అందించే విధంగా కృషిచేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ మధుసూదన్రెడ్డి, సీఈఓ మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. సామాజిక తెలంగాణే టీఆర్ఎస్ లక్ష్యం గద్వాలన్యూటౌన్: సామాజిక తెలంగాణనే తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) లక్ష్యమని ఆ పార్టీ రాష్ట్ర పరిశీలకుడు ఆర్వీఆర్ ప్రసాద్ అన్నారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని పాత బస్డాండ్ ప్రాంతంలో టీఆర్ఎస్ జెండా పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా ఇన్చార్జి గొంగళ్ల రంజిత్కుమార్తో కలిసి ఆయన పార్టీ జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. అన్ని వర్గాల ఆకాంక్షలకు అనుగుణంగా టీఆర్ఎస్ పనిచేస్తోందన్నారు. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తామని.. విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలకు ప్రాధాన్యత ఇస్తామన్నారు. రంజిత్ కుమార్ మాట్లాడుతూ.. తెలంగాణ అమరులు, ఉద్యమకారుల ఆశయాలు నెరవేర్చే ఉద్యమ పార్టీ టీఆర్ఎస్ అని అన్నారు. రాష్ట్రంలో ప్రశ్నించే గొంతుకగా తమ పార్టీ సమస్యలపై పోరాడుతుందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, పేద వర్గాలకు పార్టీ అండగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ జిల్లా కన్వీనర్ బుచ్చిబాబు, విష్ణు, బలరాం నాయుడు, వెంకట్రాములు, కృష్ణ, గుండన్న, గోపాల్, కిష్టన్న, ఆశన్న పాల్గొన్నారు. -
ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు..
చేనేత సహకార సంఘా ల ఎన్నికల నిర్వహణకుగాను ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. మొదటి విడతలో 50 మంది సభ్యులున్న సంఘాలకు ఈ నెల 12న ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నాం. మిగిలిన సంఘాల ఎన్నికలు ఉన్నతాధికారుల నుంచి నోటిఫికేషన్ వెలువడగానే నిర్వహిస్తాం. సంఘాల వారీగా ఓటరు జాబితా సిద్ధం చేసి సంఘాలకు పంపించాం. యాక్టివ్గా ఉన్న చేనేత సహకార సంఘా ల్లో చనిపోయిన వారి పేర్లను ఓటరు జాబితా నుంచి తొలగించాలని ఆదేశాలు జారీ చేశాం. – ఇందిర, ఏడీ, చేనేత జౌళిశాఖ, గద్వాల జిల్లా ● -
పంటల సాగులో తొందరపాటు వద్దు
ఎర్రవల్లి: ఈసారి ఎల్నినో ప్రభావంతో వర్షపాతం సాధారణం కంటే తక్కువగా ఉండే అవకాశం ఉన్నందున రైతులు నీటి అవసరం తక్కువగా ఉండే పంటలను సాగుచేయాలని జిల్లా వ్యవసాయశాఖ అధికారి వీరప్ప సూచించారు. సోమవారం ఎర్రవల్లి మండలం ధర్మవరం రైతువేదికలో నిర్వహించిన గ్రామసభలో ఆయన మాట్లాడారు. రైతులు పంటల సాగులో తొందరపాటు నిర్ణయాలు తీసుకొని నష్టపోవద్దన్నారు. ప్రత్యామ్నాయ పంటలైన పెసర, మినుములు, జొన్న, వేరుశనగ, ఆయిల్పామ్ సాగుపై ప్రత్యేక దృష్టిసారించాలని ఆయన సూచించారు. ప్రతి రైతు తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రీ చేసుకోవాలని తెలిపారు. సబ్సిడీపై అందించే జిప్సం, జీలుగ విత్తనాలు అందుబాటులో ఉన్నాయని.. రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అదే విధంగా వ్యవసాయ పొలాల్లో పంటల అవశేషాలను కాల్చవద్దని తెలిపారు. పంటల అవశేషాలను కాల్చడం వల్ల భూసారం తగ్గడంతో పాటు పర్యావరణం దెబ్బతింటుందన్నారు. వర్షాకాలం వస్తున్నందున ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. సమావేశంలో ఉద్యానశాఖ అధికారిణి ఇమ్రానా, ఏఓ సురేశ్గౌడ్, ఆర్ఐ శ్రీను, కార్యదర్శి నాగరాజు, ఏఈఓ వేదావతి తదితరులు ఉన్నారు. -
భూసేకరణ ప్రక్రియ వేగవంతం
● నిబంధనల మేరకు పరిహారం చెల్లింపులు ● కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ గద్వాల/మానవపాడు: జిల్లాలోని నెట్టెంపాడు, గట్టు ఎత్తిపోతల పథకాలతో పాటు మల్లమ్మకుంట రిజర్వాయర్ నిర్మాణానికి అవసరమైన భూ సేకరణ ప్రక్రియను వేగవంతంగా పూర్తిచేయాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో ఇరిగేషన్, రెవెన్యూ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి భూ సేకరణ ప్రక్రియలో జిల్లా వెనకబడిందని.. ఈ విషయంపై సీఎం ఆగ్రహం వ్యక్తంచేశారని గుర్తుచేశారు. తహసీల్దార్లు, సర్వేయర్లు సమన్వయం చేసుకుని ప్రత్యేక బృందాలుగా ఏర్పడి భూసేకరణ ప్రక్రియను పూర్తిచేయాలన్నారు. భూసేకరణ అవార్డు పాస్ చేసిన వెంటనే రైతులకు ప్రభుత్వ నిబంధనల మేరకు పరిహారం చెల్లింపులు పూర్తిచేయాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ మధుమోహన్, ఎస్డీసీ కృష్ణ, సర్వే ఏడీ నూకరాజు, ఇరిగేషన్ ఽఅధికారి సంజీవ్ ప్రసాద్ తదితరులు ఉన్నారు. -
ఫిట్లెస్ బస్సులు.. రోడ్డెక్కితే ముప్పే!
స్కూల్ బస్సుల ఫిట్నెస్ పరీక్షలపై యాజమాన్యాల నిర్లక్ష్యం ● ఉమ్మడి జిల్లాలో 1,574 బస్సులకు గాను 885కు మాత్రమే పరీక్షలు ● కాలం చెల్లిన, సామర్థ్యంలేని వాహనాలతో పొంచి ఉన్న ప్రమాదం ● విద్యార్థుల భద్రత పట్టని అధికారులు మహబూబ్నగర్ క్రైం: పాఠశాలల పునఃప్రారంభ సమయం ఆసన్నమవుతోంది. పిల్లలను బడులకు పంపించేందుకు తల్లిదండ్రులు సన్నద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రైవేటు స్కూల్బస్సుల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. పలు పాఠశాలల యాజమాన్యాలు బస్సుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ.. కాలం చెల్లినవి, సామర్థ్యంలేని వాహనాలను వినియోగిస్తున్నారు. దీంతో విద్యార్థుల ప్రాణాలకే ముప్పు పొంచి ఉంది. పర్యవేక్షించాల్సిన అధికారులు సైతం పట్టించుకోవడం లేదు. ఈ నెల 15న కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం సందర్భంగా ప్రైవేటు స్కూల్ బస్సుల ఫిట్నెస్పై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. నిబంధనలకు విరుద్ధంగా.. చాలా వరకు ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు నిబంధనలకు విరుద్ధంగా బస్సులను నడుపుతున్నాయి. ముఖ్యంగా అటెండెంట్ లేకుండానే డ్రైవర్లతో బస్సులను తిప్పడం.. ఒక రూట్లో వెళ్లే బస్సును మరో రూట్లో నడపడం వంటివి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం విద్యాసంస్థల బస్సుల ఫిట్నెస్ ధ్రువపత్రాల జారీకి కఠిన నిబంధనలు అమలు చేస్తోంది. అయినప్పటికీ మార్పు రావడం లేదు. ఉమ్మడి పాలమూరు జిల్లావ్యాప్తంగా 1,574 విద్యాసంస్థల బస్సులు ఉండగా జూన్ 8వ తేదీ వరకు 885 బస్సులు మాత్రమే ఫిట్నెస్ పరీక్షకు వచ్చాయి. మరో 689 బస్సులు ఇంకా ఫిట్నెస్ చేయించలేదు. ఈ బస్సులకు ఫిట్నెస్ లేకుండా రోడ్లు ఎక్కితే ప్రమాదం పొంచి ఉంది. మహబూబ్నగర్ జిల్లాలో అత్యధికంగా 469 స్కూల్ బస్సులు ఉండగా.. 50 వేల మంది విద్యార్థులు రాకపోకలు సాగిస్తుంటారు. ఈ బస్సులన్నింటికీ విద్యాసంస్థల యాజమాన్యాలు ఏటా ఆర్టీఓ వద్ద ఫిట్నెస్ పరీక్షలు జరిపి.. అనుమతి పత్రాలు పొందాల్సి ఉంది. అదే విధంగా బస్సుల నిర్వహణకు సంబంధించి విద్యార్థుల పూర్తి సంరక్షణ బాధ్యత తమదేనంటూ పాఠశాల యాజమాన్యాలు రవాణాశాాఖకు హామీపత్రం సమర్పించాలి. అయితే పాఠశాలలు ప్రారంభమయ్యే నాటికి అర్హత పత్రాలు తీసుకోవాల్సిన పలు పాఠశాలల యాజమాన్యాలు.. మరమ్మతు, ఇతర కారణాలతో పూర్తిస్థాయిలో ఫిట్నెస్ పరీక్షలు చేయించుకోవడం లేదని తెలుస్తోంది. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు ప్రైవేటు స్కూల్ బస్సులకు గడవులోపు ఫిట్నెస్ పరీక్షలు చేయించుకోవాలి. లేనిచో రవాణాశాఖ ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్లు చేపట్టి.. నిబంధనలు పాటించని స్కూల్ బస్సులపై చర్యలు తీసుకుంటాం. ప్రస్తుతం ఫిట్నెస్ పరీక్షలకు వచ్చిన ప్రతి బస్సును క్షుణ్ణంగా తనిఖీ చేసి.. ఫైర్ సేఫ్టీ, ప్రాథమిక చికిత్స బాక్స్, బస్సు బ్రేక్, కండీషన్ ఇలా ప్రతీది పరిశీలిస్తున్నాం. ఏదైనా బాగాలేకపోతే వెంటనే రిటన్ పంపిస్తున్నాం. కనీసం లైట్ లేకపోయినా సర్టిఫికెట్ ఇవ్వడం లేదు. అనుమతులు లేకుండా స్కూల్ బస్సులను నడిపితే కఠిన చర్యలు తప్పవు. అవసరమైతే బస్సుల డ్రైవర్లు, యాజమాన్యాలపై క్రిమినల్ కేసులు నమోదు చేయిస్తాం. – నర్సింహస్వామి, ఎంవీఐ, మహబూబ్నగర్ నిబంధనలు ఏం చెబుతున్నాయి ఏడాదిన్నర క్రితం 185వ చట్టం క్లాజ్ (ఎఫ్) తర్వాత క్లాజ్ (జీ) ప్రకారం విద్యాసంస్థల బస్సుల కోసం అదనపు నిబంధనలు జోడించారు. స్కూల్ బస్సుపై కళాశాల/పాఠశాల పేరు, ఫోన్, సెల్ నంబర్లతో పాటు పూర్తి చిరునామాను బస్సు ఎడమవైపు, బస్సు ముందు భాగంలో స్పష్టంగా కనిపించేలా రాయాల్సి ఉంటుంది. 60 ఏళ్లు దాటిన డ్రైవర్ను నియమించుకోరాదు. పాఠశాల యాజమాన్యం, బస్సు డ్రైవర్, బస్సుకు సంబంధించిన పూర్తి వివరాలు ఆన్లైన్లో నమోదు చేయాలి. బస్సు డ్రైవర్ను నియమించే సమయంలో అతడి లైసెన్స్ను ఆర్టీఏ కార్యాలయంలో ఒకసారి సరిచూసుకోవడంతో పాటు బస్సును ఐదేళ్ల పాటు నడిపిన అనుభవం ఉండాలి. బస్సులో ఒక అత్యవసర ద్వారం ఉండాలి. దానిపై పెద్ద అక్షరాలతో అత్యవసర ద్వారం అని రాయాలి. బస్సులో తప్పనిసరిగా ఉండాల్సినవి.. ప్రతి స్కూల్ బస్సులో అవసరమైన మందులు, పరికరాలతో కూడిన ప్రథమ చికిత్స బాక్స్ ఉండాలి. బస్సులో తప్పకుండా ఒక అటెండర్ను ఉంచాలి. అతను తప్పనిసరిగా యూనిఫాం ధరించాలి. బస్సులో ప్రయాణిస్తున్న విద్యార్థుల పూర్తి వివరాలు ఉంచాలి. విద్యార్థి ఎక్కాల్సిన ప్రదేశం, దిగాల్సిన ప్రదేశం నమోదు చేయాలి. బస్సులో ఉన్న విద్యార్థులు కిందకు దిగే సమయంలో డ్రైవర్కు వారు కనిపించే విధంగా మిర్రర్ ఏర్పాటుచేయాలి. ముఖ్యంగా బస్సు ఇంజిన్ కంపార్ట్మెంట్లో అగ్నిమాపక పరికరం ఉండేలా చూసుకోవాలి. బస్సు సీట్ల కింద విద్యార్థుల బ్యాగులు పెట్టుకునేందుకు గాను ర్యాక్ ఉండాలి. బస్సు పాఠశాల కమిటీ పేరుమీద రిజిస్ట్రేషన్ అయి ఉండాలి. బస్సు తయారీ సంసవత్సరం నుంచి 15 ఏళ్లు మించరాదు ప్రతి బస్సుకు హ్యాండ్బ్రేక్, పూర్తిస్థాయిలో బీమా, రవాణా పన్నులు చెల్లించి ఉండాలి. బస్సు అద్దాలకు ఆనుకుని అడ్డంగా ఇనుప గ్రిల్స్ ఏర్పాటుచేయాలి. నాణ్యమైన ఇంజిన్, స్టీరింగ్, రూఫ్, టైర్లు తదితర ప్రభుత్వం గుర్తించిన పూర్తి సౌకర్యాలు కల్పించాలి. విద్యార్థులకు సౌకర్యవంతంగా ఉండేలా తక్కువ ఎత్తులో సీట్లు బిగించాలి. ఉమ్మడి జిల్లాలో స్కూల్ బస్సుల ఫిట్నెస్ ఇలా.. జిల్లా బస్సులు ఫిట్నెస్ ఉన్నవి లేనివి మహబూబ్నగర్ 482 317 165 నాగర్కర్నూల్ 305 194 111 వనపర్తి 253 144 109 జోగుళాంబ గద్వాల 277 166 111 నారాయణపేట 257 64 193 -
రుణ లక్ష్యం.. నిర్దేశం
● జిల్లాలోని మహిళా సంఘాలకు రూ.272.99 కోట్ల రుణాలు ● గ్రామీణ ప్రాంతాల్లో 7,222 ఎస్జీహెచ్లకు రూ.212.65 కోట్లు ● పట్టణ ప్రాంతాల్లో 504 సంఘాలకు రూ.64.34 కోట్లు ● ప్రభుత్వ లక్ష్యం మేరకు రుణాలు అందించేందుకు అధికారుల ప్రణాళిక –8లో uగద్వాలన్యూటౌన్: జిల్లాలోని స్వయం సహాయక సంఘాల మహిళలకు 2026–27 ఆర్థిక సంవత్సరం బ్యాంకుల ద్వారా అందించే రుణ లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని మహిళా సంఘాల సభ్యులు ఆర్థికాభివృద్ధి సాధించేందుకు బ్యాంక్ లింకేజీ కింద ఇచ్చే రుణ లక్ష్యం గత ఆర్థిక సంవత్సరం నెరవేరింది. ఈ ఏడాది కూడా లక్ష్యానికి అనుగుణంగా రుణాలు అందించేందుకు అధికారులు నెలవారీ ప్రణాళికలు రూపొందించారు. ఇందిరా మహిళాశక్తితో యూనిట్ల ఏర్పాటు.. స్వయం సహాయక సంఘాల మహిళలు ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు బ్యాంకుల ద్వారా గ్రూపు రుణాలు అందిస్తారు. మహిళా సంఘాల వారు నిర్వహించుకునే వ్యాపారాలను సూచిస్తూ.. బ్యాంకు లింకేజీ రుణాల కోసం దరఖాస్తు చేసుకుంటారు. అర్హులైన సంఘాలకు రూ. 2లక్షల నుంచి రూ. 20లక్షల వరకు రుణాలు అందిస్తున్నారు. అయితే 2024–25లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరా మహిళాశక్తి పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం కింద భ్యాంకుల ద్వారా రుణాలు పొందిన మహిళలు వివిధ రకాల వ్యాపారాలు నిర్వహించుకునే అవకాశాన్ని కల్పించింది. అయితే వ్యక్తిగత యూనిట్లతో పాటు ప్రధానంగా ఒక సంఘంలో నలుగురు, ఐదుగురితో కలిసి గ్రూప్ యూనిట్లు నెలకొల్పుకునేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. 2025–26లో మహిళాశక్తి పథకం ద్వారా క్యాంటీన్లు, కిరాణాలు, టైలరింగ్, బ్యూటీ పార్లర్లు, పాడి, చీరలు, స్వీట్, పచ్చళ్ల దుకాణాలు, అగర్బత్తీలు, రోటీ మేకింగ్ సెంటర్లు తదితర వాటిని స్వయం సహాయక సంఘాల మహిళలు ఏర్పాటు చేసుకున్నారు. 2026–27లో సైతం బ్యాంకు రుణాల ద్వారా ఇందిరా మహిళాశక్తి కింద వివిధ వ్యాపార యూనిట్లను మహిళలు నెలకొల్పుకునేలా అధికారులు ప్రణాళికలు రూపొందించారు. గతేడాది లక్ష్యానికి మించి.. డీఆర్డీఓ ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంతాల్లోని స్వయం సహాయక సంఘాలు, మెప్మా ఆధ్వర్యంలో పట్టణ ప్రాంతాల్లోని మహిళా సంఘాల నిర్వహణ చూస్తుంటారు. అయితే 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రుణాలు అందించేందుకు గాను రెండు శాఖల అధికారులు అర్హత గల సంఘాల వివరాలను తీసుకున్నారు. ఎంత మొత్తంలో వారికి రుణాలు అందించాలనే దానిపై లెక్కలు వేసి.. ప్రభుత్వానికి నివేదించారు. అధికారులు ఇచ్చిన వివరాల ఆధారంగా ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించింది. జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న 7,222 స్వయం సహాయక సంఘాలకు రూ. 212.65కోట్లు, పట్టణ ప్రాంతాల్లోని 504 సంఘాలకు రూ. 64.34కోట్ల రుణాలు అందించాలని లక్ష్యంగా నిర్దేశించారు. అయితే పట్ణణ, గ్రామీణ ప్రాంతాల్లోని స్వయం సహాయక సంఘాల మహిళలు రుణాలతో ఇందిరా మహిళాశక్తి కింద చిన్న, పెద్ద వ్యాపారాలు నిర్వహించుకునేలా చర్యలు తీసుకుంటున్నారు. గత ఆర్థిక సంవత్సరంలో రుణ లక్ష్యానికి మించి అందించారు. ఈ ఏడాది సైతం రుణ లక్ష్యం సాధించేందుకు ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచే ప్రత్యేక దృష్టిసారించారు. సద్వినియోగం చేసుకోవాలి.. స్వయం సహాయక సంఘాల మహిళలకు బ్యాంకుల ద్వారా అందించే రుణాలను సద్వినియోగం చేసుకోవాలి. తీసుకున్న రుణాలను క్రమం తప్పకుండా చెల్లించాలి. రుణాలతో వ్యాపారాలు నిర్వహించుకుని ఆర్థికంగా అభివృద్ది సాధించాలి. 206–27 రుణ లక్ష్యం నెరవేరేలా చర్యలు తీసుకుంటున్నాం. – ముషాహిదాబేగం, డీఆర్డీఓ -
అసమగ్ర ఐటీడీఏ
రెగ్యులర్ పోస్టులకు నోచుకోని మన్ననూర్ ప్రాజెక్టు ఐటీడీఏలో అంతర్భాగంగా.. గతంలో ఐటీడీఏ ప్రాజెక్టు కార్యాలయం కలెక్టరేట్ ను తలపించేంది. సున్నిపెంట కేంద్రంగా ఉన్నప్పు డు వివిధ శాఖల అధికారులు, సిబ్బందితో కళకళాడేది. మన్ననూర్ ఐటీడీఏ పరిధిలో కమ్యూనిటీ హె ల్త్ సెంటర్తోపాటు 11 ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రాలు, 46 ఆరోగ్య ఉప కేంద్రాలు, 56 ప్రాథమిక పాఠశాలలు, 16 ఆశ్రమ పాఠశాలు, చెంచులకు ఉపాధి కల్పించేందుకు జాతీయ ఉపాధి హామీ పథకం, వ్యవసాయ, గిరిజన సహకార సంస్థతోపాటు ఐకేపీ, టీపీఎంయూ ఐటీడీఏలో అంతర్భాగంగా ఉన్నాయి.నేటికీ వందలాది మంది చెంచులకు వ్యవ సాయ భూమి లేదు. అటవీ ప్రాంతంలో ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్నా భూమిపై హక్కు కోసం దరఖాస్తు చేసుకున్నా అతీగతీ లేదు. అటవీ ఉత్పత్తు ల సేకరణతోపాటు వ్యవసాయం వైపు మొగ్గు చూ పుతున్న చెంచులకు భూ పంపిణీ జరగడం లేదు. ఒకే ఒక్కడు.. చెంచులకు అన్ని సంక్షేమ పథకాలు, అధికారులను అందుబాటులోకి తెచ్చి వారికి సేవలను విస్తృతపర్చడమే ఐటీడీఏ లక్ష్యం. సున్నిపెంట నుంచి ప్రాజె క్టు విభజన సమయంలో 57:43 నిష్పత్తిలో ఉద్యోగులను నియమిస్తే అన్ని విభాగాల్లో కలిపి 20 పోస్టులు ఉండాలి. విలీనమైన తర్వాత రికార్డులతో పాటు సీనియర్ అసిస్టెంట్ జాఫర్ను నియమించా రు. అతను ఇప్పుడు అన్నీ తానై వ్యవహరిస్తున్నా రు. ట్రైబల్ వెల్ఫేర్ ఇంజినీరింగ్ విభాగం, డీఎస్ఓ, మేనేజర్, సీఎస్ఓ, హెచ్ఓలు, మత్య్సశాఖ, హార్టికల్చర్, పశువైద్యం, ఇద్దరు పర్యవేక్షకులు, ముగ్గురు సీనియర్ అసిస్టెంట్లు, ముగ్గురు జూనియర్ అసిస్టెంట్లు, వ్యవసాయాధికారి, ఏఈఓ, కార్యాలయ సిబ్బంది పోస్టులకు గాను ఇప్పటి వరకు ఒక్క పోస్టు కూడా భర్తీ చేయలేదు. అచ్చంపేట: ప్రభుత్వాల పట్టింపులేని ధోరణి.. ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం.. వెరసీ మన్ననూరులోని సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) అంపశయ్యపై కొట్టుమిట్టాడుతోంది. గత ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురైన ఐటీడీఏలను చక్కదిద్ది పూర్వవైభవం తెస్తామని చెప్పిన నేతల మాటలు నీటి మూటలుగానే మారిపోతున్నాయి. ఉమ్మడి ఏపీలో శ్రీశైలం (సున్నిపెంట) ఐటీడీఏలో భాగంగా ఉండి.. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత మన్ననూర్లో ఏర్పాటైంది. అయితే ఐటీడీఏగా అవతరించి పన్నెండేళ్లు గడిచినా ప్రభుత్వం ఇప్పటి వరకు రెగ్యులర్ ప్రాజెక్టు అధికారి, ప్రధాన పోస్టులు మంజూరు చేయలేదు. నల్లమలలోని చెంచులు, ఆదివాసీల జీవనోపాధి, ఆర్థికాభివృద్ధికి తోడ్పడే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఐటీడీఏ కార్యకలాపాలకు పీఓనే కీలకం. అలాంటిది ఏళ్ల తరబడి ప్రాజెక్టు అధికారి, ఇతర సిబ్బందిని నియమించకపోవడంతో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పీఎం జన్మన్కే పరిమితం.. అత్యంత దర్భర జీవితం గడుపుతున్న చెంచులకు చేయూత అందించేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం జన్ మన్ కార్యక్రమాన్ని చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో పీఎం కిసాన్, ఆయుష్మాన్ భారత్, జాతీయ ఉపాధి హామీ పథకం తదితర పథకాల ప్రయోజనాలను పొందేందుకు అవసరమైన ఆధార్, కుల ధ్రువీకరణ పత్రం, జన్ధన్ బ్యాంకు ఖాతా వంటి మౌళిక సదుపాయాలు ప్రతి చెంచుకు అందించాల్సి ఉంటుంది. దీనికోసం ప్రత్యేక ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి అందిస్తున్నారు. ఇవీ మినహా గిరిజనుల కోసం చేపట్టే మిగతా ఏ పథకాలు సక్రమంగా అమలు కావడం లేదు. ఐటీడీఏలో అంతర్భాగంగా.. గతంలో ఐటీడీఏ ప్రాజెక్టు కార్యాలయం కలెక్టరేట్ను తలపించేంది. సున్నిపెంట కేంద్రంగా ఉన్నప్పు డు వివిధ శాఖల అధికారులు, సిబ్బందితో కళకళాడేది. మన్ననూర్ ఐటీడీఏ పరిధిలో కమ్యూ నిటీ హెల్త్ సెంటర్తోపాటు 11 ప్రాథమిక ఆరో గ్య ఉపకేంద్రాలు, 46 ఆరోగ్య ఉప కేంద్రాలు, 56 ప్రాథమిక పాఠశాలలు, 16 ఆశ్రమ పాఠశాలు, చెంచులకు ఉపాధి కల్పించేందుకు జాతీయ ఉపాధి హామీ పథకం, వ్యవసాయ, గిరిజన సహకార సంస్థతోపాటు ఐకేపీ, టీపీఎంయూ ఐటీడీఏలో అంతర్భాగంగా ఉన్నాయి. నేటికీ వందలాది మంది చెంచులకు వ్యవసాయ భూమి లేదు. అటవీ ప్రాంతంలో ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్నా భూమిపై హక్కు కోసం దరఖాస్తు చేసుకున్నా అతీగతీ లేదు. అటవీ ఉత్పత్తుల సేకరణతోపాటు వ్యవసాయం వైపు మొగ్గు చూపుతున్న చెంచులకు భూ పంపిణీ జరగడం లేదు. జిల్లాలు : నాగర్కర్నూల్, మహబూబ్నగర్, నల్లగొండ, వికారాబాద్, రంగారెడ్డి చెంచు కుటుంబాలు 4,041 గిరిజన జనాభా 14,436 గ్రామాలు 173 మొత్తం పోస్టులు (అన్ని విభాగాల్లో కలిపి) 20 ప్రస్తుత ఖాళీలు (అన్ని విభాగాల్లో కలిపి) 19 పన్నెండేళ్లు గడిచినా సిబ్బంది నియామకంలో కాలయాపన ఇన్చార్జి పీఓలతో నెట్టుకొస్తున్న ప్రభుత్వం చెంచుల ఆర్థికాభివృద్ధి పథకాల అమలులో ఆటంకం నెరవేరని ప్రజాప్రతినిధుల హామీలు.. అధికారుల ప్రతిపాదనలు మన్ననూర్ ఐటీడీఏ స్వరూపం.. గిరిజనులకు సంబంధించి విద్య, వైద్యం, ఇతర మౌళిక సదుపాయాల కల్పన, నీటి పారుదల, వ్యవసాయం, రాయితీపై వ్యవసాయ పరికరాల పంపిణీ, ట్రైకార్ రుణాలు, మత్స్యశాఖ పరిధిలో చేపపిల్లల పెంపకం వంటి పథకాలు సరిగా అమలు కావడం లేదు. ఇందుకు ఏటా నిధులు కేటాయిచడం లేదని చెంచులు వాపోతున్నారు. చెంచు మహిళలు, చిన్నారులకు పోషకాహారం అందించేందుకు గిరిపోషణ పథకం కింద రూ.కోటి నిధులు మంజూరైనా రూ.20 లక్షలకు మించి ఖర్చు కావడం లేదని తెలుస్తోంది. గిరివికాసం కింద గిరిజనులు వ్యవసాయం చేసుకునేందుకు ఉచితంగా బోర్లు వేసి మోటార్లు ఇవ్వాల్సి ఉండగా చాలామందికి ఈ పథకం అందడం లేదు. పశుసంవర్ధక శాఖ ద్వారా గొర్రెలు, మేకలు, పశువులు సబ్సిడీపై అందించేది. కానీ, ఆ శాఖ అధికారులు లేకపోవడంతో పూర్తిగా మరుగున పడింది. ప్రభుత్వం ఇప్పటికై నా రెగ్యులర్ పీఓతోపాటు మిగతా పోస్టులు భర్తీ చేస్తేనే చెంచులకు ప్రాజెక్టు సేవలు అందుతాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మండలాలు 25 -
జోగుళాంబ గద్వాల
వైద్యో నారాయణో.. ప్రాణాలు ‘హరీ’!జిల్లా ఆస్పత్రిలో తరచుగా వికటిస్తున్న వైద్యం సోమవారం శ్రీ 8 శ్రీ జూన్ శ్రీ 2026గద్వాల క్రైం: వైద్యో నారాయణో హరి.. వైద్యులు దేవుళ్లతో సమానమని అర్థం. తల్లిదండ్రులు జన్మనిస్తే.. వైద్యులు పునర్జన్మనిస్తారు. ఎవరికి ఎలాంటి జ బ్బు చేసినా ఆస్పత్రిని ఆశ్రయించి.. తగిన చికిత్సతో నయం చేయాలని వైద్యులను వేడుకుంటాం. అయితే కొందరు వైద్యులు వ్యవహరిస్తున్న తీరు, నిర్లక్ష్యం కారణంగా రోగుల ప్రాణాల గాలిలో దీపంలా మారుతున్నాయి. అందులో జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి నిదర్శనంగా నిలుస్తోంది. వైద్యం కోసం వస్తే ప్రాణాలు కోల్పోవాల్సిందేనని బాధిత కుటుంబాలు గుండెలు బాదుకుంటున్నాయి. నడిగడ్డ వైద్యులంటేనే వామ్మో అంటున్నారు. జిల్లా ప్రభు త్వ ఆస్పత్రిలో గర్భిణులు ప్రసవం కోసం వస్తే శిశువు లేదా తల్లి మృతిచెందడం.. కడుపునొప్పి భరించలేక యవతి వస్తే అపెండిక్స్గా గుర్తించి.. చికిత్స అందించినా మృతిచెందడం వంటి ఘటనలతో వైద్యులు వివాదాల్లో చిక్కుకుంటున్నారు. అనుభవం లేని వైద్యులతో తప్పిదాలు.. జిల్లా ఆస్పత్రిలో రోగులకు వివిధ చికిత్సలు చేయాల్సిన తరుణంలో అనుభవం కలిగిన వైద్యుల పర్యవేక్షణ కరువైందని తెలుస్తోంది. ప్రధానంగా ప్రభుత్వ వైద్యుడు మేజర్ చికిత్సలు చేయాల్సి ఉండగా.. కాంట్రాక్టు పద్ధతిన కొలువు చేపట్టిన వైద్యుడు మేజర్ చికిత్సలు చేయడంతోనే పలు తప్పిదాలు చోటు చేసుకుంటున్నాయని కొందరు వైద్యులు బహిరంగంగా చెబుతున్నారు. మరోవైపు మెడికల్ కళాశాలకు అనుబంధంగా జిల్లా ఆస్పత్రి ఉండటం.. ప్రాక్టిస్ వైద్యులతో చికిత్సలు చేయించడం కూడా సమస్యగా మారిందని తెలుస్తోంది. అయితే అనుభవజ్ఞులైన వైద్యులు విధుల్లో అలసత్వంగా వ్యవహరించడం.. పైగా వారిపై ఫిర్యాదు లు చేసినా చర్యలు లేకపోవడం కొసమెరుపు. జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి గాలిలో దీపంలా మారుతున్న రోగుల ప్రాణాలు నడిగడ్డ వైద్యులంటేనే హడలెత్తుతున్న జనం తాజాగా శస్త్రచికిత్స వికటించి బాలిక మృత్యువాత గత మార్చి 10న అయిజ మండలం మేడికొండకు చెందిన ఓ గర్భిణి ప్రసవం కోసం జిల్లా ఆస్పత్రికి వచ్చింది. ప్రసవ సమయంలో వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో కడుపులోనే శిశువు మృతిచెందింది. ఈ ఘటనపై కలెక్టర్ విచారణకు ఆదేశించారు. మే 27న మానవపాడు మండలానికి చెందిన ఓ గర్భిణి ప్రసవం కోసం జిల్లా ఆస్పత్రికి రాగా.. వైద్యులు పరీక్షించి కాన్పు చేస్తామని కుటుంబ సభ్యులకు తెలిపారు. అయితే ప్రసవం తర్వాత శిశువు మృతిచెందింది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే శిశువు మృతిచెందిందని బాధిత కుటుంబ సభ్యులు వైద్యులతో గొడవకు దిగారు. తాజాగా రెండు రోజుల క్రితం ఎర్రవల్లికి చెందిన ఇందు (17)కు తీవ్రమైన కడుపునొప్పి రావడంతో కుటుంబ సభ్యులు జిల్లా ఆస్పత్రికి తీసుకొచ్చారు. వైద్యులు పరీక్షించి.. బాలికకు అపెండిక్స్గా గుర్తించారు. ఈ క్రమంలోనే శస్త్రచికిత్స చేయాల్సిందిగా కుటుంబ సభ్యులకు వివరించి.. మరుసటి రోజు మధ్యాహ్నం శస్త్రచికిత్స చేశారు. అయితే చికిత్స అనంతరం బాలిక మృతిచెందింది. విషయాన్ని కుటుంబసభ్యులకు తెలియజేసి.. హుటాహుటినా అంబులెన్స్ ద్వారా స్వగ్రామానికి మృతదేహాన్ని తరలించారు. జిల్లా ఆస్పత్రిలో తరచుగా ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం కలకలం రేపుతోంది. -
బాధిత కుటుంబీకుల ఆందోళన..
తాజాగా ఇందు మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని మృతురాలి తల్లిదండ్రులు గోపాల్, మద్దమ్మ, ఇతర కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ జిల్లా కేంద్రంలో ఆందోళనకు దిగారు. ఆదివారం జిల్లా ఆస్పత్రి ఎదుట ప్రధాన రహదారి (ఫ్లైఓవర్ బ్రిడ్జి) వద్ద బైఠాయించి ధర్నా చేపట్టగా.. బీఆర్ఎస్, ప్రజా సంఘాలు, కుల సంఘాల నాయకులు మద్దతు ప్రకటించి పాల్గొన్నారు. సమాచారం అందుకున్న ఏఎస్పీ శంకర్, ఆర్డీఓ శ్రీనివాసులు అక్కడికి చేరుకొని బాధిత కుటుంబసభ్యులకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. బాలికకు శస్త్రచికిత్స చేసిన వైద్యులను శాశ్వతంగా విధుల నుంచి తప్పించి.. మెడికల్ కౌన్సిల్లో లైసెన్స్ రద్దు చేయడంతో పాటు మృతురాలి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, ఇల్లు, వ్యవసాయ భూమి ఇవ్వాలని, ఎక్స్గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. తమ న్యాయమైన డిమాండ్లను నెరవేరిస్తేనే ఆందోళన విరమిస్తామని తేల్చిచెప్పారు. 2గంటలకు పైగా ఆందోళన కొనసాగడంతో పోలీసులు ముందుగా మద్దతు తెలిపిన ఆయా పార్టీల నాయకులను అతికష్టం మీద అరెస్టు చేశారు. ఈ క్రమంలో పోలీసులు, బాధిత కుటుంబ సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో మరోసారి బాధిత కుటుంబ సభ్యులతో ఆర్డీఓ చర్చలు జరిపారు. విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. కాగా, పోలీసులు అరెస్టు చేసిన నాయకులను ధరూర్ స్టేషన్కు తరలించారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. కాగా, ఆందోళనకారులను అరెస్టుచేసే సమయంలో రూరల్ ఎస్ఐ శ్రీకాంత్ చేతికి రక్తగాయమైంది. ఎలాంటి హింసాత్మక ఘటనలు చోటు చేసుకోకుండా గద్వాల సీఐ శ్రీను, ఎస్ఐలు మల్లేష్, శ్రీహరి, నందికర్, శ్రీనివాస్గౌడ్, కుమార్తో పాటు 100 మంది పోలీసు సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. బాలిక కుటుంబానికి న్యాయం చేయాలని ఆందోళనకు దిగిన నాయకులను అరెస్టు చేస్తున్న పోలీసులు -
కార్పొరేట్కు దీటుగా..!
నారాయణపేట రూరల్: ఐదేళ్లలోపు చిన్నారులకు సైతం ప్రైవేట్, కార్పొరేట్ విద్యాలయాలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లోనే ఆటపాటలతో చదువుపై ఆసక్తి పెంపొందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం గతేడాది ప్రీ ప్రైమరీ పాఠశాలలు ప్రారంభించింది. చిన్నారుల మనోవికాస అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు అమలు చేసి పాఠశాల విద్యాశాఖ, మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ, వైద్య, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖల సమన్వయంతో ప్రత్యేక మార్గదర్శకాలు రూపొందించింది. గతేడాది కార్యాచరణలో భాగంగా పాఠశాలలకు ప్రీ ప్రైమరీ తరగతుల నిర్వహణకు అనుమతులు మంజూరు చేసింది. సత్ఫలితాలతో ముందుకు.. గతేడాది ప్రారంభించిన ప్రీ ప్రైమరీ పాఠశాలలు సత్ఫలితాలు ఇవ్వడంతో 2026–27 విద్యా సంవత్సరంలో మరిన్ని పాఠశాలలకు విస్తరించాలని ప్రభుత్వం భావించింది. ఈ మేరకు కొత్తగా మంజూరు చేసిన పాఠశాలల్లో అవసరమైన సౌకర్యాలు కల్పిస్తోంది. ఇప్పటికే ఒక్కో పాఠశాలకు రూ.లక్ష మంజూరు చేసి సామగ్రి కొనుగోలు, పెయింటింగ్ కోసం వినియోగిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో మొదటి విడత 94 పాఠశాలల్లో ప్రారంభించగా.. తాజాగా వాటి సంఖ్య మూడింతలు చేసి 292 పాఠశాలలకు అనుమతినిచ్చింది. దీంతో ఇప్పటి వరకు 386 పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ విద్య అందనుంది. ప్రవేశాలు ఇలా.. వచ్చే ఏడాది ఒకటో తరగతిలో చేరడానికి అర్హులైన పిల్లలను 2026–27 విద్యా సంవత్సరంలో ప్రీ ప్రైమరీ విభాగంలో చేర్చుకోవాలి. ఆయా చిన్నారులను పాఠశాలలకు సిద్ధం చేయడం, పూర్వ ప్రాథమిక విద్య అందించడం ముఖ్య ఉద్దేశం. వయస్సు, నివాస ధ్రువీకరణతో సహా అవసరమైన అన్ని పత్రాలను సేకరించి ప్రవేశాలు కల్పించాలి. విద్యాహక్కు చట్టం ప్రకారం అట్టడుగు వర్గాల పిల్లలు, ప్రత్యేక అవసరాల పిల్లలను మొదట చేర్చుకుంటారు. ప్రీ ప్రైమరీ విభాగానికి ప్రత్యేక గదిని కేటాయిస్తారు. అందులో పిల్లలకు అవసరమైన ఫర్నీచర్, వాల్ పెయింటింగ్, సామగ్రి తగిన వాటిని సమకూరుస్తారు. సరైన వెలుతురు, ఇండోర్, అవుట్ డోర్ ఆట వస్తువులు, నిద్రించడానికి ప్రత్యేక స్థలం ఉండేలా చర్యలు తీసుకున్నారు. పక్కాగా పాఠ్య ప్రణాళిక.. పూర్తిగా ఎన్సీఈఆర్టీ రూపొందించిన పాఠ్య ప్రణాళికలను అనుసరిస్తారు. ఇది నేషనల్ కరికులం ఫ్రేమ్ వర్క్ ఫర్ ది ఫౌండేషన్ స్టేజ్తో అనుసంధానం చేసి ఉంటుంది. బోధనకు నియమించిన ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణనిచ్చారు. ప్రీ ప్రైమరీ విభాగాల్లోని పిల్లలందరికీ మధ్యాహ్న భోజనం, అల్పాహారం అందిస్తున్నారు. అంగన్వాడీ కేంద్రం నుంచి వచ్చే అల్పాహారం సైతం అదనంగా ఇస్తున్నారు. సాధారణ ఆరోగ్య పరీక్షలు నిర్వహించడమే కాకుండా పిల్లల రక్షణకు చైల్డ్ రైడ్ ప్రొడక్షన్ పాలసీని పకడ్బందీగా అమలు చేస్తారు. ప్రీ ప్రైమరీ విభాగాలను ఆయా పాఠశాలల హెచ్ఎంలు ప్రతిరోజు పర్యవేక్షించాలి. పిల్లల పురోగతిని సమీక్షించడానికి క్రమం తప్పకుండా పేరెంట్స్– టీచర్స్ సమావేశాలు నిర్వహిస్తారు. అలాగే స్కూల్ ఎడ్యుకేషన్, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ, ఆరోగ్యశాఖ విభాగ అధికారుల ఉమ్మడి తనిఖీలతో కలిసి ఏడాదిలో రెండుసార్లు సమావేశాలు నిర్వహిస్తున్నారు. జిల్లాల వారీగా ప్రీ ప్రైమరీ పాఠశాలల మంజూరు ఇలా.. జిల్లా పాఠశాలలు మహబూబ్నగర్ 85 నాగర్కర్నూల్ 74 నారాయణపేట 44 వనపర్తి 48 జోగుళాంబ గద్వాల 41 ప్రభుత్వం పేద, మధ్య తరగతి కుటుంబాలను దృష్టిలో ఉంచుకొని ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలకు డబ్బులు వెచ్చించకుండా ప్రీ ప్రైమరీ తరగతులు ఏర్పాటు చేసింది. ప్రత్యేక నిధులు కేటాయించి తరగతి గదులను ఆకర్షణీయంగా తీర్చిదిద్దడంతోపాటు అదనంగా బోధకులు, ఆయాలను కేటాయించింది. విడతల వారీగా అన్ని గ్రామాలకు విస్తరించి వంద శాతం ప్రీ ప్రైమరీ పాఠశాలలు ఉండేలా చర్యలు తీసుకుంటుంది. – విద్యాసాగర్, జిల్లా అకడమిక్ మానిటరింగ్ అధికారి, నారాయణపేట ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ పైమరీ తరగతుల నిర్వహణ ఉమ్మడి జిల్లాలో రెండో విడతలో 292 పాఠశాలలు ఎంపిక తరగతి గది, సామగ్రి కొనుగోలుకు నిధులు మంజూరు ఐదేళ్లలోపు చిన్నారులకు అవకాశం ఇన్స్ట్రక్టర్లు, ఆయాల నియామకానికి దరఖాస్తులు -
అవధుల్లేని ‘అమ్మ ప్రేమ’
నైతిక విలువలకు మనదేశంలో ప్రపంచంలోనే ఎంతో ప్రసిద్ధి. అందుకే మన దేశం నుంచి అనాథ చిన్నారులను దత్తత తీసుకొని వారి బాగోగులు చూడడంతో పాటు వారిపై ప్రేమాభిమానం కనబరచడం ఇందుకు నిదర్శనం. తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్నగర్ జిల్లా నుంచి ఇప్పటి వరకు ఆయా దేశాలకు చెందిన పలువురు దంపతులు 32 మంది అనాథ చిన్నారులను చేరదీశారు. రూ.కోట్లు ఆస్తులు కలిగిన దంపతుల చేతిలో ఇక్కడి అనాథ పిల్లలు పెరగడం విశేషం. 2014 సంవత్సరం నుంచి విదేశీ దంపతులు ఇక్కడికి తరచూ రావడం.. చిన్నారులను దత్తత తీసుకోవడం అధికారికంగా తమ దేశాలకు వెళ్లి పిల్లలను పెంచుకోవడం విశేషం. మాతృత్వం కోసం పరితపిస్తున్న తల్లిదండ్రులు తమ ప్రేమకు హద్దులు లేవని నిరూపిస్తున్నారు. తల్లి మాధుర్యం కోసం పరితపిస్తున్న మహిళల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండగా.. సంతానం కోసం ఆస్పత్రులు.. సంతాన సాఫల్య కేంద్రాల చుట్టూ తిరుగుతున్న దంపతులు కోకొల్లలు. వీరి మాతృత్వం అనుభూతిని తీర్చడానికి జిల్లాకేంద్రంలోని శిశుగృహ కేంద్రం ఎంతో కృషి చేస్తుందనడంలో సందేహం లేదు. శిశుగృహలోని చిన్నారులను ఎంతోమందికి చట్టబద్ధంగా దత్తత ఇస్తున్నారు. అమెరికాకు 17 మంది, స్పెయిన్కు ఐదుగురు, ఇటలీకి ముగ్గురు, స్వీడన్కు ముగ్గురు, మాల్టాకు ఇద్దరు, ఫిన్లాండ్, కెనడాకు ఒక్కొక్కరు చొప్పున దత్తత ఇచ్చారు. అమ్మ అనే పదంలోని తీయదనం.. అభిమానం వెల కట్టలేనిది.. తొమ్మిది నెలలు మోసి కనిపెంచిన అమ్మకు ఉన్న గొప్పతనం అటువంటిది. అయితే ఏ కారణం ఏదైనప్పటికీ.. అమ్మ ప్రేమకు దూరమైన శిశువుల దుస్థితిపై అంచనా వేయడం అసాధ్యం. అయితే తల్లిదండ్రుల ఆలనాపాలనా కరువైన శిశువులకు మేమున్నామంటూ ప్రభుత్వం ముందుకొచ్చి శిశు సంరక్షణ బాధ్యత నిర్వహిస్తుంది. ఈ మేరకు మహబూబ్నగర్లోని ఐసీడీఎస్ శిశుగృహ అనాథ శిశువులను అక్కున చేర్చుకుంటూ.. అండగా నిలుస్తోంది. దీంతోపాటు సంతానానికి నోచుకోని దంపతులకు ఆ చిన్నారులను దత్తత ఇస్తూ వారి బంగారు భవిష్యత్కు బాటలు వేస్తోంది. – మహబూబ్నగర్ రూరల్ మహబూబ్నగర్లోని శిశుగృహలో చిన్నారులు (ఫైల్) అనాథ బాలలను అక్కున చేర్చుకుంటున్న ఐసీడీఎస్ శిశుగృహ పాలమూరు శిశువులను దత్తత తీసుకున్న విదేశీయులు గడిచిన 16 ఏళ్లలో 32 మందిని చేరదీసిన విదేశీ దంపతులు సులువైన పద్ధతులు ఉండటంతో ఆసక్తి చూపుతున్న వైనం -
రైతులకు అవగాహన కరువు..
జిల్లాలోని ప్రతి క్లస్టర్లో రైతువేదికలు ఉన్నాయి. వ్యవసాయ, విస్తరణ అధికారులు సమయానికి రైతులకు అందుబాటులో లేక రైతులకు సూచనలు, సలహాలు ఇచ్చేవారు కరువయ్యారు. గ్రామీణ రైతులు పంటలను ఏ సమయంలో వేయాలి.. ఏయే పంటలు వేయాలో అడిగే అవకాశం ఉంటుంది. కానీ, ప్రస్తుతం అధికారులందరూ ప్రతి సమావేశంలోనూ ఆయిల్పాం పంటను అధికంగా సాగు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. రైతులకు నల్లరేగడి పొలాల్లో బోర్లు లేని పరిస్థితుల్లో డిమాండ్లు పెరగడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయిల్పాం సాగుకు మాత్రమే అవగాహన కల్పిస్తే.. మిగతా పంటల పరిస్థితి ఏమిటని రైతులు ప్రశ్నిస్తున్నారు. జిల్లాలో అధికంగా పత్తి 2.20 లక్షల ఎకరాల్లో, వరి లక్ష ఎకరాల్లో, మొక్కజొన్న 30 వేల ఎకరాల్లో, వివిధ పంటలు కూడా సాగవుతుండగా.. వాటి గురించి ఏమాత్రం పట్టించుకోకపోవడంతో రైతులకు ఎలాంటి సూచనలు అందడం లేదు. ఇప్పటికై నా అధికారులు స్పందించి పంట సాగు, ఎరువుల వాడకం తదితర వాటిపై సూచనలు, సలహాలు ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. ఉండవెల్లి: తొలకరి జల్లులు కురవగానే రైతులు విత్తనాలు నాటడంలో నిమగ్నమవుతారు. అయితే ఈసారి వానాకాలంలో ‘ఎల్నినో’ ప్రభావంతో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. దీంతో ముందస్తుగా విత్తనాలు నాటితే ఆ తర్వాత వర్షాలు కురవక రైతులు ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే దీనిపై పెద్దగా అవగాహన లేని రైతులు ఇప్పటికే కురిసిన వర్షాలకు అక్కడక్కడ విత్తనాలు నాటే పనుల్లో నిమగ్నమయ్యారు. మరోవైపు రైతులకు అవగాహన కల్పించడంలోనూ జిల్లా వ్యవసాయశాఖ ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. వ్యవసాయమే జీవనాధారం.. నడిగడ్డ అంటేనే వ్యవసాయానికి పెట్టింది పేరు. 90 శాతానికిపైగా రైతులకు జీవనాధారం. ఈ ఖరీఫ్ సీజన్లో 3.75 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు కానున్నాయని అధికారులు అంచనా వేశారు. అయితే ఈసారి ఎల్నినో ప్రభావంతో తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తోంది. అదే జరిగితే రైతులు ఆరుతడి పంటలు సాగు చేయాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. ఇందుకోసం విత్తనాలను అందుబాటులో ఉంచేందుకు కసరత్తు చేస్తున్నారు. గతేడాది మే 26న రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించగా.. ఈసారి కాస్త ఆలస్యంగా ఈ నెల రెండో వారంలో వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. దీంతో కురవాల్సిన సమయంలో కాకుండా.. ఒకేసారి భారీ వర్షం కురిసి.. పెద్దఎత్తున వరదలు వచ్చే అవకాశం కూడా ఉంటుందని, అలాంటి పరిస్థితి ఆగస్టు 15 వరకు జరిగితే యథావిధిగా వరిసాగు, పత్తి చేసుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. కాబట్టి సాగు పద్ధతులు మార్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అక్టోబర్ 202.1 198.5 ఇటీవల కురిసిన వర్షాలతో విత్తనాలు నాటుతున్న రైతాంగం రైతులకు అవగాహన కల్పించడంలో వ్యవసాయ శాఖ నిర్లక్ష్యం సాగు పద్ధతులు మార్చుకోవాలని నిపుణుల సూచన జిల్లాలో 3.75 లక్షల ఎకరాల్లో పంటల సాగు అంచనా -
జూరాలకు 4,505 క్యూసెక్కుల ఇన్ఫ్లో
ధరూరు/ అచ్చంపేట: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి స్వల్పంగా ఇన్ఫ్లో పెరిగినట్లు పీజేపీ అధికారులు తెలిపారు. గత వారం రోజులుగా స్థానికంగా కురుస్తున్న వర్షాల ఆధారంగా ప్రాజెక్టుకు శనివారం సాయంత్రం 4,505 క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చింది. దీంతో నెట్టెంపాడు ఎత్తిపోతలకు 750 క్యూసెక్కులు వదలగా.. మరో 40 క్యూసెక్కులు ఆవిరైంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 2.740 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఇప్పటి వరకు ప్రాజెక్టులో దాదాపు 2.5 టీఎంసీల నీరు చేరినట్లు అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా.. దిగువనున్న శ్రీశైలం జలాశయానికి ఎలాంటి ఇన్ఫ్లో రావడం లేదు. ప్రస్తుతం ప్రాజెక్టులో 818 అడుగుల వద్ద 39 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు సంబంధిత అధికారులు చెప్పారు. గ్రామసభలతో సమగ్రాభివృద్ధి ఇటిక్యాల: గ్రామసభలతో పంచాయతీల్లో సమగ్రాభివృద్ధి సాధ్యమని డివిజినల్ పంచాయతీ అధికారి ప్రవీణ్కుమార్ అన్నారు. శనివారం మండలంలోని చాగాపురం గ్రామ పంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన గ్రామసభలో ఆయన పాల్గొని ప్రజలతో ముఖాముఖి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ, వార్డుసభలు ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చేరవేసే ముఖ్య వేదికలన్నారు. ఎస్ఐఆర్ కార్యక్రమంపై సయగ్ర వివరాలు తెలియజేసి ప్రజలు అడిగిన సందేహాలను నివృత్తి చేశారు. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన రాష్ట్రంలో సుపరిపాలన పరిమితులు నామినేషన్లో చాగాపురం గ్రామ పంచాయతీ ఉందని రాష్ట్ర బృందం ప్రత్యేకంగా సందర్శించి క్షేత్రస్థాయిలో మునుపటి పరిస్థితి, ఇప్పటి మార్పులకు గల తేడాలను పరిశీలించడం జరుగుతందన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ రాఘవ, ఏపీఓ సునీల్, సర్పంచ్ సావిత్రి, పంచాయతీ కార్యదర్శి రవి తదితరులు పాల్గొన్నారు. ఆరుగురు ఆర్టీసీ డిపో మేనేజర్ల బదిలీ నారాయణపేట రూరల్: ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఆరుగురు ఆర్టీసీ డిపో మేనేజర్లను బదిలీ చేస్తూ సంస్థ చీఫ్ పర్సనల్ మేనేజర్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. నారాయణపేట డీఎం టి.లావణ్య హైదరాబాద్లోని హయత్నగర్ డిపో–1కు బదిలీ కాగా.. ఆమె స్థానంలో హెడ్ఆఫీస్లోని ఏటీఎం కార్గో ఇన్చార్జి డీఎన్ రాజన్ను కేటాయించారు. అలాగే షాద్నగర్ డీఎం ఉషను జనగాంకు బదిలీ చేయగా.. ఆమె స్థానంలో హైదరాబాద్ డిపో–2 నుంచి కరుణశ్రీ రానున్నారు. అచ్చంపేట డీఎం పీఎండీ ప్రసాద్ హయత్నగర్ డిపో–2కు బదిలీ కాగా.. ఆయన స్థానంలో డిప్యూటీ ఈ–ఎలక్ట్రికల్ హెచ్ఆర్గా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాస్ను కేటాయించారు. గద్వాల డీఎం సునీతను కూకట్పల్లి డిపోకు బదిలీ చేయగా.. ఆమె స్థానంలో రాణిగంజ్ డిపో నుంచి శ్రీధర్ వస్తున్నారు. కొల్లాపూర్ డిపో మేనేజర్ ఉమాశంకర్గౌడ్ను ఐటీ డిపార్ట్మెంట్కు బదిలీ చేయగా.. ఆయన స్థానంలో వరంగల్ బస్టాండ్ ఏటిఎంగా విధులు నిర్వహిస్తున్న మల్లేశ్వరయ్యను కేటాయించారు. కల్వకుర్తి డీఎం సుహాసినిని ఇల్లందు డిపోకు కేటాయించగా.. ఆమె స్థానంలో ఎవరినీ నియమించలేదు. 218 క్వింటాళ్ల వేరుశనగ రాక గద్వాల వ్యవసాయం: జిల్లాకేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డుకు శనివారం 218 క్వింటాళ్ల వేరుశనగ దిగుబడి వచ్చింది. కాగా క్వింటాల్ గరిష్టంగా రూ.6,489, కనిష్టంగా రూ. 5,169, సరాసరిగా రూ.5,469 ధరలు లభించాయి. అలాగే 4 క్వింటాళ్ల వరి (సోన) రాగా.. సరాసరిగా రూ.2,426 ఒకే ధర పలికింది. -
పాదయాత్ర అంటే ప్రభుత్వం ఉలిక్కిపడింది
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్ట్ను పూర్తిచేయాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ తలపెట్టిన పాదయాత్ర ప్రకటనకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉలిక్కిపడిందని మాజీ మంత్రి, జిల్లా అధ్యక్షుడు లక్ష్మారెడ్డి అన్నారు. శనివారం పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. రెండున్నరేళ్లయినా పాలమూరు ప్రాజెక్ట్పై ప్రభుత్వానికి చలనం లేదని, ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు పాదయాత్ర చేస్తామని ప్రకటన చేయగానే ముఖ్యమంత్రి పర్యటనలు, సమీక్షలు, మంత్రుల పర్యటన ప్రారంభించారన్నారు. ప్రభుత్వం అనుకున్న రీతిలో పనులు చేయకుంటే పాదయాత్ర చేపడుతామన్నా రు. మేము ప్రాజెక్టు పూర్తిచేస్తే తుది మెరుగులు దిద్దే ందుకు ఏడాది పడుతది అంటున్నారన్నారు. ప్రాజె క్టు పూర్తి చేసేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటారో సీఎం స్పష్టంగా చెప్పలేదని ఆరోపించారు. ● పాదయాత్ర చేస్తామంటే ప్రభుత్వం భయపడి సీఎం రేవంత్రెడ్డి పాలమూరు ప్రాజెక్ట్ను సందర్శించి 6 నెలల్లో పూర్తి చేస్తామని ప్రకటించారని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. 90 శాతం పనులు పూర్తయిన పాలమూరు ఎత్తిపోతల పనులు మూడునెలల్లో పూర్తి చేయాలని లేకుంటే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. ీసీఎం రెండురోజుల పర్యటనలో జిల్లాకు ఒరిగిందేమి లేదని, ఏదైనా వరాలు కురిపిస్తారని ప్రజలు ఆశించారని విమర్శించారు. నిలిచిన పనులు పూర్తి చేసేందుకు నిధులు ఇవ్వకుండా బీఆర్ఎస్పై విమర్శించడానికే ప్రాజెక్టుల సందర్శన పెట్టుకున్నట్లు ఉందని ఎద్దేవా చేశారు. ‘పాలమూరు’ ప్రాజెక్ట్ ఎప్పుడు పూర్తి చేస్తామో కూడా స్పష్టంగా చెప్పలేదని ఆరోపించారు. జూరాల పరిధిలో చెక్ డ్యామ్ కట్టేందుకు ఏరియల్ సర్వే రేవంత్రెడ్డి చేశారని, కర్ణాటక వైపు వెళ్లిండు అక్కడ పనులు చెక్ డ్యామ్లు చూసిండని దాంతో తెలంగాణకు ఒరిగిందేమి లేదన్నారు. మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. సీఎం కేవలం కేసీఆర్ను తిట్టడానికి ప్రజాధనం ఖర్చు చేశారన్నారు. ప్రాజెక్ట్ల వారీగా ఎంత పని అయింది, మిగిలిన పనులు ఎప్పుడు చేస్తారో జిల్లా పర్యటనలో చెప్పలేదని ఆరోపించారు. కేసీఆర్ ప్రభుత్వ సమయంలోనే పంట ఎక్కువ పెరిగిందన్నారు. కేసీఆర్ సాగునీరు ఇవ్వడంతోనే సాధ్యమైందన్నారు. అనంతరం పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పనులు ఎంతవరకు పూర్తిచేశారో వివరిచే చిత్రాలను విడుదల చేశారు. -
‘నీట్’కు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలి
గద్వాల న్యూటౌన్: నీట్–2026 పునఃపరీక్షకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తెలంగాణ ఇన్చార్జి అభిషేక్ సింగ్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు అన్నారు. శనివారం వారు ఉన్నతాధికారులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో వీసీ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నీట్ దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తో ముడిపడి ఉందన్నారు. గతంలో జరిగిన పరిణామాల నేపథ్యంలో ఈసారి పరీక్ష నిర్వహణలో గోప్యత, భద్రత, పారదర్శకతకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. పశ్నపత్రాలు భద్రపరిచే ప్రక్రియ, పరీక్ష కేంద్రాల నిర్వహణ తదితర అంశాల్లో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు, బయోమెట్రిక్ పరికరాలు, విద్యుత్, తాగునీరు, వైద్య సదుపాయాలు ముందుగానే ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం సీఎస్ రామకృష్ణరావు మాట్లాడుతూ రబీ వరి ధాన్యం కొనుగోళ్లను పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రిజ్వాన్బాషా షేక్ స్పందిస్తూ జిల్లాలో నీట్ను సజావుగా నిర్వహించాలని, ఇందుకోసం అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. ఈ నెల 9న మహిళా సంఘాలకు హైదరాబాద్లోని పరేడ్ గ్రౌండ్లో జరిగే బస్సుల పంపిణీ కార్యక్రమంలో జిల్లా నుంచి బయలుదేరే సభ్యులకు అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. జిల్లా మహిళా సమాఖ్య తరపున ఎలక్ట్రికల్ స్కూటీలు, ఆటో, సైకిళ్లు కొనుగోలు చేసి గట్టు మండలంలోని మహిళా సంఘాలకు శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు మధుమోహన్, నర్సింగరావు, డీఆర్డీఓ ముషాహిదాబేగం, ఏపీడీ శ్రీనివాస్, డీఏఓ వీరప్ప, పౌరసరఫరాల శాఖాధికారి స్వామికుమార్, నీట్ సిటీ కోఆర్డినేటర్ దేవేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఆరునెలలకోసారి పర్యవేక్షణ
శిశుగృహ నుంచి దత్తత వెళ్లిన పిల్లలను మా సిబ్బంది ఆధ్వర్యంలో ప్రతి ఆరునెలలకోసారి పర్యవేక్షిస్తాం. దత్తత తీసుకున్న దంపతులు వారి ఆలనాపాలన సరిగా చూసుకుంటున్నారా.. లేదా.. అనేది తెలుసుకుంటాం. రెండేళ్లలో నాలుగు సార్లు పిల్లలను పర్యవేక్షిస్తాం. పిల్లలను సక్రమంగా చూసుకోకపోతే కారా చట్టం ప్రకారం దత్తత తీసుకున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఇప్పటి వరకు అలాంటి సమస్య ఎదురుకాలేదు. – జరీనాబేగం, జిల్లా సీ్త్ర, శిశు సంక్షేమశాఖ అధికారి -
పాలమూరుకు మంచి రోజులు
పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తాం.. ఉదండాపూర్ రిజర్వాయర్ వరకు వచ్చే ఏడాదిలోగా పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్ట్ను పూర్తిచేస్తామని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. ఉదండాపూర్ నుంచి లక్ష్మీదేవునిపల్లి వరకు భూ సేకరణను మొదలుపెడతామన్నారు. ఉమ్మడి జిల్లాలో అన్ని ప్రాజెక్ట్లకు సంబంధించి ఆర్అండ్ఆర్, అటవీ శాఖ వంటి వాటిని పరిష్కరిస్తామన్నారు. ఉదండాపూర్ నిర్వాసితులకు నెలరోజుల్లో రూ.630 కోట్లు ఆర్అండ్ఆర్ పరిహారం ఇవ్వడం అసాధారణ విషయమన్నారు. ఉమ్మడి జిల్లాలో దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్సాగర్ వంటి ప్రాజెక్టులను పూర్తి చేస్తామన్నారు. 20 లక్షల పైచిలుకు ఎకరాలు.. ఉమ్మడి జిల్లాలో 20 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించాలన్న సదుద్దేశంతో సీఎం రేవంత్రెడ్డి రెండు రోజులపాటు ప్రాజెక్ట్ల బాట పట్టారని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. వలసలు, ఆత్మహత్యల జిల్లాగా ఉన్న పాలమూరును చూపించే తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నామని, పదేళ్లపాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పాలమూరును పట్టించుకోలేదని విమర్శించారు. మాది చేతల ప్రభుత్వం.. ఉదండాపూర్ నిర్వాసితులకు పరిహారం అందించిన ఘనత తమదేనని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. గత బీఆర్ఎస్ నరకయాతన పాలన చూశామని, ఆర్థిక పరిస్థితులు బాగా లేకున్నా సీఎం రేవంత్రెడ్డి నిర్వాసితుల ఖాతాల్లో పరిహారం జమచేసి ఇక్కడికి వచ్చారని పేర్కొన్నారు. తమది చేతల ప్రభుత్వం అని అభిప్రాయపడ్డారు. ఇలాంటి సీఎంను చూడలేదు ఉమ్మడి జిల్లాలో ప్రాజెక్టులను పూర్తి చేయాలన్న దృఢసంకల్పంతో పర్యటిస్తున్న ఇలాంటి సీఎంను తాను ఎక్కడా చూడలేదని ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి అన్నారు. ఉదండాపూర్ నిర్వాసితుల సమస్యలను పరిష్కరించిన సీఎం రేవంత్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. నాటి సీఎం కేసీఆర్ నిర్వాసితులను జైలుకు పంపితే.. తమ సీఎం నిర్వాసితులను కలిసేందుకు వచ్చారని కొనియాడారు. వచ్చేనెలలో సీఎం రేవంత్రెడ్డి మిడ్జిల్ పర్యటనకు రావాలని ఆహ్వానించారు. రంగనాయకస్వామి గుట్టపై వంద అడుగుల ఆంజనేయస్వామి విగ్రహం పెట్టాలన్నది తన కోరిక అని, అదేవిధంగా జడ్చర్లకు బైపాస్, తదితర సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని విన్నవించారు. సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్/సాక్షి, నాగర్ కర్నూల్ ‘ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ప్రతిష్టాత్మక పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్ట్కు సంబంధించి త్వరలో శుభవార్త చెబుతాం. కృష్ణానది ఆధారంగా నిర్మాణంలో ఉన్న ఈ ప్రాజెక్ట్కు 90 టీఎంసీలు, డిండికి 25 టీఎంసీలతో కేంద్రం నుంచి ఎన్ఓసీ తీసుకొస్తాం. ఈ మేరకు పక్క రాష్ట్రంతో చర్చలు జరుగుతున్నాయి. డిసెంబర్లోగా ఎన్ఓసీ తీసుకొచ్చే బాధ్యత నాది.’ అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో పలు ఎత్తిపోతల పథకం పనులను పరుగులు పెట్టించాలనే లక్ష్యంతో రెండు రోజులుగా చేపట్టిన ప్రాజెక్ట్ల సందర్శన ముగిసింది. రెండోరోజు శుక్రవారం ఆయన మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరితో నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం సోమ శిలలోని మృగవాణి రిసార్ట్ నుంచి బయలుదేరి వరుసగా పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మిస్తున్న నార్లాపూర్, ఏదుల, వట్టెం, కరివెన, ఉదండాపూర్లోని తదతర రిజర్వాయర్లు, పంప్హౌస్ల పనులను పరిశీలించారు. భూత్పూర్ మండలంలోని కర్వెన రిజర్వాయర్ వద్ద నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆ తర్వాత జడ్చర్ల మండలం గంగాపూర్ శివారులో నిర్వహించిన ప్రజాపాలన–ప్రగతిబాట బహిరంగసభలో మాట్లాడారు. రెండున్నరేళ్లలో కృష్ణాపై కొత్త రిజర్వాయర్, బ్రిడ్జి కం బ్యారేజ్ నిర్మాణం చేపట్టడంతో పాటు ఏడాదిలోగా పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్ట్ పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. జిల్లా ప్రాజెక్ట్లకు రూ.8వేల కోట్లు ఖర్చు చేశాం గడిచిన రెండున్నరేళ్లలో రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్ట్ల కోసం రూ.22 వేల కోట్లు ఖర్చుచేస్తే అందులో రూ.8వేల కోట్లు పాలమూరు జిల్లాలోని ప్రాజెక్ట్లకే ఖర్చు చేశామని రేవంత్రెడ్డి వెల్లడించారు. మట్టికి పోయినా మనోడే ఉండాలె, ఎట్టికిపోయినా ఇంటోడే కావాలె. 60 ఏళ్ల గోస, వలసల బతుకులు మారాలి. ఇక్కడి బిడ్డనై ఉండి ఈ ప్రాంతానికి అన్యాయం చేస్తానా? అని ప్రశ్నించారు. మీ పాలమూరు బిడ్డగా రెండు రోజులుగా జిల్లా రైతుల కోసం సాగునీరు ప్రాజెక్ట్లను పరిశీలించానని.. సమస్యలు ఏవిధంగా పరిష్కరించాలి.. ప్రాజెక్టులు ఏవిధంగా పూర్తి చేసుకోవాలో సూచనలు ఇవ్వడం జరిగిందని వివరించారు. ఆరు నెలలు సమయం ఇవ్వండి.. అన్ని సమస్యలకు పరిష్కారం చూపుతా. రెండేళ్లలో పాలమూరు ప్రాజెక్టులను పూర్తిచేసి చూపిస్తానని పునరుద్ఘాటించారు. ఉమ్మడి జిల్లాలో 26 లక్షల ఎకరాలకు నీరు.. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్ట్లను రెండున్నరేళ్లలో పూర్తిచేసి తీరుతామని రేవంత్ అన్నారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్ట్ పనులు పూర్తిచేసి ఏడాదిలోగా ఉదండాపూర్ వరకు నీరందిస్తామని చెప్పారు. తర్వాత ప్రణాళికాబద్ధంగా డిస్ట్రిబ్యూటరీ కెనాళ్ల నిర్మాణం చేపడతామన్నారు. ఇంకా నాలుగు వేల ఎకరాల భూసేకరణ పెండింగ్లో ఉందని, రూపాయి ఎక్కువ ఇచ్చి అయినా సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు. దీన్నే ప్రాధాన్యాంశంగా తీసుకుంటామని.. ఉమ్మడి జిల్లాలో ప్రాజెక్ట్ పనుల కోసం గ్రీన్ చానల్ ద్వారా నిధులు మంజూరుచేయిస్తానని హామీ ఇచ్చారు. తాను సీఎంగా ఉన్నప్పుడే ఈ ప్రాజెక్టులు పూర్తవుతాయన్నారు. ఇప్పుడు కాకపోతే మరెప్పుడూ చేసుకోలేమని, చరిత్ర కూడా మనల్ని క్షమించదన్నారు. ఉమ్మడి జిల్లాలో పెండింగ్లో ఉన్న అన్ని ప్రాజెక్ట్లను పూర్తిచేసి మొత్తం 26 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు. ‘జిల్లాలోని బీఆర్ఎస్ నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నా.. కేసీఆర్కు ఊడిగం చేయడం ఆపండి. భూసేకరణ పనులు, ప్రాజెక్ట్ పనులు ఆపాలని, కాళ్లలో కట్టెలు పెట్టాలని చూడకండి. రాజకీయాలు ఏమైనా ఉంటే ఎన్నికలప్పుడు చూద్దాం. ఈ రెండేళ్లు మన జిల్లాను అభివృద్ధి చేసుకుందాం’ అని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జి.చిన్నారె డ్డి, కలెక్టర్ ఖుష్బూ గుప్తా, ప్రభుత్వ విప్, యెన్నం శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి, రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, ఎమ్మెల్యేలు వీర్లపల్లి శంకర్, కూచుకుళ్ల రాజేష్రెడ్డి, చిక్కుడు వంశీకృష్ణ, తూడి మేఘారెడ్డి, ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్లు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. సభ అనంతరం రేవంత్రెడ్డి రోడ్డు మార్గాన హైదరాబాద్కు వెళ్లారు. పీఆర్ఎల్ఐకి 90 టీఎంసీలతో ఎన్ఓసీ తీసుకొస్తాం డిసెంబర్లోపు దీన్ని నెరవేర్చే బాధ్యత నాదే.. కృష్ణాపై మరో కొత్త రిజర్వాయర్, బ్రిడ్జి కం బ్యారేజ్ నిర్మిస్తాం నాకు జడ్చర్లకు వస్తే గుండె వేగం పెరుగుతుంది.. మిడ్జిల్ జెడ్పీటీసీగా నాటిన మొక్క నేడు వృక్షమైంది.. నేనుండగా జిల్లాకు అన్యాయం జరుగనిస్తనా? జడ్చర్ల బహిరంగసభలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ముగిసిన ప్రాజెక్ట్ల సందర్శన ఇక్కడికి వస్తే నా గుండె వేగం పెరుగుతుంది.. ‘జడ్చర్ల ప్రాంతానికి వస్తే గుండె వేగం పెరుగుతుందని రేవంత్రెడ్డి భావోద్వేగంతో మాట్లాడారు. నల్లమల అడవి, మారుమూల గ్రామంలో పుట్టిన నన్ను సరిగ్గా 20 ఏళ్ల కిందట 2006 జూలై 4న మిడ్జిల్ జెడ్పీటీసీగా మీ భుజాలపై నిలబెట్టుకున్నారని... ఆనాడు మీరు నాటిన చిన్న మొక్కే ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా నేడు ముఖ్యమంత్రిగా ఎదిగి వృక్షమై మీ ముందు నిలబడ్డడని సంతోషం వ్యక్తం చేశారు. తాను ఉండగా ఈ జిల్లాకు నష్టం జరుగనిస్తనా అని ప్రశ్నించారు. జైళ్లు కట్టాలని గత పాలకులు భావిస్తే.. స్కూళ్లు కట్టాలని మనం అనుకున్నామని.. అందుకే ట్రిపుల్ ఐటీ, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మిస్తున్నామన్నారు. ఏం చదవాలన్నా పాలమూరు జిల్లాకు వచ్చేలా కొడంగల్లో ఎడ్యుకేషన్ హబ్ నిర్మిస్తున్నామని చెప్పారు. చదువు తోనే కష్టాలు పోతాయని.. బతుకులు బాగు పడతాయని.. పిల్లలను చదివించాలని ఆయన తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. ప్రతిపక్ష సభ్యు లు కొందరు పాదయాత్రలు చేస్తామంటున్నారని.. వారు కాశీదాక పొర్లు దండాలు పెట్టినా వారు చేసిన పాపాలు తొలిగిపోవని, ప్రజలు క్షమించరని చెప్పారు. పాలమూరులో ఊరు లేకపోయినా, పార్లమెంటులో నోరు లేకపోయినా ఇక్కడికి రాజకీయంగా వల స వచ్చిన కేసీఆర్ను ఇక్కడి ప్రజలు గుండెల్లో పెట్టుకొని ఎంపీగా గెలిపించార ని గుర్తు చేశారు. తెలంగాణకు రెండు సార్లు ముఖ్యమంత్రిని చేస్తే.. పదేళ్లలో పాలమూరు జిల్లాలోని ఏ ఒక్క ప్రాజెక్ట్ పూర్తి చేయలేదని విమర్శించారు. -
గాలిమోటార్లో తిరుగుతూ గాలి మాటలు
పాలమూరు: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి గాలి మోటార్లో తిరుగుతూ గాలి మాటలు చెబుతున్నారని ఎంపీ డీకే అరుణ విమర్శించారు. కాంగ్రెస్ వైఫల్యాలపై పోరాటాలు, నిరసన దీక్షలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ అభివృద్ధిపై కాంగ్రెస్ వాళ్లకు అవగాహన, చిత్తశుద్ధి లేవన్నారు. నగరంలోని రెడ్డి కన్వెన్షన్ హాల్లో శుక్రవారం ఏర్పాటు చేసిన దీన్ దయాళ్ ఉపాధ్యాయ శిక్షణ తరగతులను ఎంపీ ప్రారంభించారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును కేసీఆర్ కుర్చీ వేసుకుని పూర్తి చేస్తానని చెప్పినా పూర్తి చేయలేదని, ఇక కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నర ఏళ్లలో నిధులు ఇచ్చింది లేదని విమర్శించారు. జిల్లా నుంచి గెలుపొందిన సీఎం రేవంత్రెడ్డి పెండింగ్ ప్రాజెక్టులపై చేసింది ఏం లేదన్నారు. ఇందిరమ్మ ఇళ్లను కాంగ్రెస్ కార్యకర్తలకు ఇస్తున్నారు తప్పా అర్హులకు అందడం లేదన్నారు. కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో 90 శాతం ఎగ్గొట్టారన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంపై విశ్వాసంతో పశ్చిమ బెంగాల్లో బీజేపీ అధికారంలోకి వచ్చిందని, అదేవిధంగా తెలంగాణలో కూడా అధికారంలోకి తీసుకురావాలనే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పని చేయాలన్నారు. జిల్లా స్థాయి నుంచి మండలస్థాయి వరకు స్థానిక సమస్యలపై పోరాటాలు, దీక్షలు, నిరసన కార్యక్రమాలను ప్రజాస్వామ్య పద్ధతిలో భారీగా నిర్వహించాలన్నారు. తెలంగాణ మొత్తాన్ని కాషాయమయం చేస్తామనే సంకల్పబలంతో ముందుకు వెళ్లాలన్నారు. పదేళ్ల పాటు తెలంగాణ రాష్ట్రాన్ని బీఆర్ఎస్ దొచుకుందని, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే పద్ధతిలో ఉందని విమర్శించారు. ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి 14 మంది బీజేపీ ఎమ్మెల్యేలను గెలిపించుకునే రోజు తొందరలో వస్తుందన్నారు. రాష్ట్ర వైఫల్యాలను క్షేత్రస్థాయిలో ప్రజల వద్దకు తీసుకువెళ్లాలన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి, నేతలు పద్మజారెడ్డి, పవన్కుమార్రెడ్డి, బాలరాజు, రాములు, రమేష్ కార్పొరేటర్లు పాల్గొన్నారు. ఆకట్టుకున్న చిన్నారుల నృత్యాలు మహబూబ్నగర్ మున్సిపాలిటీ: జిల్లా బాల కేంద్రంలో సుమారు నెల రోజుల పాటు రాష్ట్ర ప్రభుత్వం–విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వేసవి సాంస్కృతిక శిక్షణ శిబిరం శుక్రవారం ముగిసింది. ఇందులో శిక్షణ పొందిన చిన్నారులు చివరిరోజు రాత్రి స్థానిక బా దం రామస్వామి గోల్డెన్ జూబ్లీ ఆడిటోరియంలో ప్రదర్శలిచ్చారు. ముఖ్యంగా వీరి సంప్రదాయ నృత్యాలు ఆహూతులను ఎంతగా నో ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో బాల కేంద్రం ఇన్చార్జి సూపరింటెండెంట్ రాజేష్ఖన్నా, ఏఎంఓ దుంకుడు శ్రీనివాస్ పాల్గొన్నారు. ● రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో 90 శాతం ఎగ్గొట్టారు ● ఎంపీ డీకే అరుణ -
అన్నదాతలకు ఊరట
పంటల మద్దతు ధరలు పెంచిన ప్రభుత్వం ● అత్యధికంగా పత్తిపై రూ.557.. అత్యల్పంగా మొక్కజొన్నపై రూ.10 పెంపు.. ● సకాలంలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని రైతుల వేడుకోలు పంట రకం 2025– 26 2026– 27 వరి(సాధారణం) 2,369 2,441 వరి (ఏ–గ్రేడ్) 2,389 2,461 జొన్న (హైబ్రీడ్) 3,699 4,023 జొన్న (ఎం–35) 3,749 4,073 కంది 8,000 8,450 వేరుశనగ 7,263 7,517 మొక్కజొన్న 2,400 2,410 పత్తి (24.5– 7,710 8,267 25.5 మి.మీ.,) పత్తి (29.5– 8,110 8,667 30.5 మి.మీ.,) గద్వాల వ్యవసాయం: అన్నదాతలకు కాసింత ఊరట లభించింది. కేంద్రం ప్రభుత్వం కొద్ది రోజుల క్రితం వివిధ రకాల పంటల మద్దతు ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. 2026– 27 ఆర్థిక సంవత్సరానికి పెంచిన మద్దతు ధరలు అమలు చేయాలని ఉత్తర్వులు సైతం జారీ అయ్యాయి. అయితే మద్దతు ధర లు పెంచిన ప్రభుత్వం.. ఏటా సకాలంలో కొనుగోలు కేంద్రాలు కూడా సకాలంలో ప్రారంభించి.. ధాన్యం సేకరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల రైతులు దళారులకు ధాన్యం విక్రయించి నష్టపోకుండా.. ప్రభుత్వానికి అమ్మి లాభపడతారని అభిప్రాయపడుతున్నారు. దళారులకు విక్రయించి నష్టాలు.. ఏటా పంట మద్దతు ధరలు కొంత పెరుగుతున్నప్పటికీ.. పంట ఉత్పత్తులు చేతికి వచ్చిన వెంటనే కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కావడం లేదు. దీంతో చాలామంది రైతులు తక్కువ ధరలకు దళారులకు విక్రయిస్తూ నష్టపోతున్నారు. వానాకాలం సీజన్లో రైతులు ఎక్కువగా కంది పంటను జూన్లో మొదలు పెడతారు. డిసెంబర్ చివరి వారం నాటికి పంట చేతికి వస్తుంది. అయితే కొనుగోలు కేంద్రాలు ఫిబ్రవరి మొదటి వారంలో ఏర్పాటు చేస్తున్నారు. 2025– 26లో కంది మద్దతు ధర రూ.8 వేలు ఉండగా.. కొనుగోలు కేంద్రాలు ఆలస్యంగా ఏర్పాటు చేయడంతో వేలాది మంది రైతులు రూ.6,500 నుంచి రూ.7 వేల వరకు మాత్రమే విక్రయించి నష్టపోయారు. మొక్కజొన్న రైతులు అదే పరిస్థితి ఎదుర్కొన్నారు. మద్దతు ధర రూ.2,400 ఉండగా.. చాలామంది రూ.1,700 నుంచి రూ.1,800లకు దళారులకు విక్రయించారు. పత్తి రైతులు సైతం రూ.8,110 మద్దతు ధర ఉండగా.. రూ.7200 నుంచి రూ.7500కే విక్రయించారు. ఇవన్నీ కూడా సకాలంలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడం వల్లే జరిగాయి. కొనుగోలు కేంద్రాలను సకాలంలో ప్రారంభిస్తేనే రైతులకు కాస్త ఆర్థిక ప్రయోజనం ఉంటుంది. ● జొన్న పంట సాగు తక్కువగా ఉంటుందని ఏటా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయ డం లేదు. వేరుశనగ సాగు ఎక్కువగా ఉంటున్నప్పటికీ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం లేదు. చేసేది లేక మార్కెట్ యార్డుల లో వ్యాపారులు ఇచ్చే ధరలనే రైతులు పొందుతున్నారు. మద్దతు ధరలు ఉండే ప్రతి పంటకు కేంద్రాలు ఏర్పాటు చేసినప్పుడే రైతులకు ప్రయోజనం చేకూరుతుంది. గట్టు శివారులో పత్తి విత్తనాలు వేసేందుకు ట్రాక్టర్తో దుక్కి దున్నుతున్న రైతు పెంచిన మద్దతు ధరలు ఇలా.. (క్వింటాకు.. రూ.లలో..) ఏటా పెంపుతో మేలు.. వ్యవసాయం చేయడం అంటే ఏటా రైతులకు కత్తి మీద సామె. ఏటేటా పంటల పెట్టుబడులు పెరుగుతుండటంతో రైతులు నానా అవస్థలు పడుతున్నారు. అందిన కాడ అప్పులు చేసి పెట్టుబడులు పెట్టి వాతావరణం సైతం అనుకూలించి.. పంట ఉత్పత్తులు చేతికి వచ్చిన తర్వాత మద్దతు ధరలు లభించడం లేదు. కష్టించి పండించిన పంటలకు సరైన ధరలు రాక రైతులు ఆర్థికంగా చాలా నష్టపోతున్నారు. ప్రభుత్వం ఏటా పంటల మద్దతు ధరలు పెంచుతుండటం కొంతమేలు చేస్తోంది. 2026– 27 సంవత్సరానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇటీవల పంట మద్దతు ధరలను పెంచింది. గతేడాదితో పోల్చితే క్వింటా వరిపై రూ.72, జొన్న రూ.324, కంది రూ.450, వేరుశనగ రూ.254, మొక్కజొన్న రూ.10, పత్తిపై రూ.557 పెంచింది. ప్రస్తుతం పెంచిన ధరలు రైతులకు కాస్త ఊరటనిచ్చాయి. -
కాలుష్య నివారణకు కృషి చేద్దాం
గద్వాల క్రైం: ప్లాస్టిక్ కాలుష్య నివారణకు ప్రతిఒక్కరు మొక్కలు నాటి వాటి సంరక్షణ కోసం కృషిచేయాలని జిల్లా అదనపు న్యాయమూర్తి రవికుమార్ అన్నారు. శుక్రవారం జిల్లా కోర్టు ఆవరణలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ మానవ మనుగడుకు జీవనధారం, స్వచ్ఛమైన గాలి, ప్రకృతి పరమైన మొక్కల నుంచే అందుతాయన్నారు. ప్రస్తుతం ఎక్కడ చూసినా కలుషిత వాతావరణమే కనిపిస్తుందన్నారు. ప్లాస్టిక్ నివారణ కోసం ప్రజలు స్వచ్ఛందంగా వాటికి దూరంగా ఉండాలన్నారు. కాలుష్య నివారణ, నియంత్రణ, సకాలంలో వర్షాలు కురవాలంటే మొక్కలే ఆధారమన్నారు. అంతకు ముందు జిల్లాకేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు శ్రీనివాస్, నాగరాజు, లక్ష్మి, వెంకటేష్ దుర్వా, కోర్టు సిబ్బంది శోభ, న్యాయవాదులు వరలక్ష్మి, అటవీ శాఖ అధికారులు పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత గట్టు: పర్యావరణ పరిరక్షణ సమష్టి బాధ్యతగా స్వీకరించి, ప్రతి ఒక్కరూ ప్రతిఏటా మొక్కలు నాటి, వాటిని సంరరక్షించుకోవాలని గద్వాల ఫారెస్టు రేంజ్ అధికారి ఫర్వేజ్ అహ్మద్ అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం ముసలంపల్లి రిజర్వు ఫారెస్టులో అటవీ శాఖ అధికారులు, ఉపాధి సిబ్బంది మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు పెంచాలన్నారు. ఇంటి పరిసరాలు, పొలాలు, ఖాళీ ప్రదేశాల్లో మొక్కలను పెంచాలని, తద్వారా వాతవరణ కాలుష్యాన్ని తగ్గించవచ్చని, ఫలితంగా పుష్కలంగా వర్షాలు కురిసే అవకాశం ఉంటుందన్నారు. అటవీ భూముల్లో మొక్కలను పెంచి కాపాడుకుందామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డిప్యూటీ రేంజ్ అధికారి సుమలత, బీట్ ఆధికారి కీర్తి, ఏపీడీ శ్రీనివాసులు, ఏపీఓ స్వామి, బల్గెర సర్పంచు డేవిడ్, ఉపసర్పంచు గోపాల్, పంచాయతీ కార్యదర్శి సురేష్, వాచర్లు వీరారెడ్డి, భీమయ్య పాల్గొన్నారు. 217 క్వింటాళ్ల వేరుశనగ రాక గద్వాల వ్యవసాయం: జిల్లాకేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డుకు శుక్రవారం 217 క్వింటాళ్ల వేరుశనగ వచ్చింది. కాగా క్వింటాల్ గరిష్టంగా రూ.7,641, కనిష్టంగా రూ.2,519, సరాసరిగా రూ.7,641 ధరలు లభించాయి. అలాగే 16 క్వింటాళ్ల వరి (సోన) రాగా.. గరిష్టంగా రూ.2,520, కనిష్టంగా రూ.2,316, సరాసరిగా రూ.2,520 చొప్పున పలికాయి. -
బీఆర్ఎస్లో దుమారం..!
● సీఎం పర్యటనలో అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు ● గతంలోనూ పలు పర్యాయాలు స్వయంగా కలిసిన వైనం ● అప్పట్లో ఎంపీ మల్లురవితో కలిసి సరిత ఇంటికి వెళ్లడంతో రచ్చ ● ‘గులాబీ’ల పోరుబాట క్రమంలో రేవంత్ను కలవడంపై అనుమానాలు ● ఉమ్మడి జిల్లాలో హాట్టాపిక్గా రాజకీయ పరిణామాలు సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: సీఎం రేవంత్రెడ్డి పర్యటనలో అలంపూర్ ఎమ్మెల్యే విజయుడి వ్యవహారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. రెండు రోజుల పాటు ప్రాజెక్ట్ల సందర్శనకు వచ్చిన ముఖ్యమంత్రి తొలి రోజు గురువారం జోగుళాంబ గద్వాల జిల్లాలో నెట్టెంపాడు ప్రాజెక్ట్లో భాగమైన గుడ్డెందొడ్డి పంప్హౌస్ను సందర్శించారు. ఈ క్రమంలో బీఆర్ఎస్కు చెందిన విజయుడు సీఎంను కలవడం.. ప్రాజెక్ట్ స్థితిగతులపై ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్, అధికారుల ప్రజెంటేషన్లో ఆయనతో కలిసి పాల్గొనడం హాట్టాపిక్గా మారింది. తమ హయాంలో ఉమ్మడి జిల్లాలో ప్రతిష్టాత్మక పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు 90 శాతం పూర్తయ్యాయని.. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ రెండున్నరేళ్లుగా నిర్లక్ష్యం వహిస్తోందని.. ఈ మేరకు పనులు పూర్తి చేయించాలనే డిమాండ్తో జూన్లో పాదయాత్ర చేపట్టనున్నట్లు బీఆర్ఎస్ నేతలు గత నెల చివరి వారంలో ప్రకటించారు. మహబూబ్నగర్లో మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ స్వగృహంలో జరిగిన సమావేశానికి మాజీ మంత్రులు నిరంజన్రెడ్డి, లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు ఆ పార్టీకి చెందిన ఉమ్మడి జిల్లాలోని ఒకే ఒక ఎమ్మెల్యే విజయుడు సైతం హాజరయ్యారు. బీఆర్ఎస్ పాదయాత్రకు పిలుపునివ్వడం.. ఆ తర్వాత ముఖ్యమంత్రి ప్రాజెక్ట్ల సందర్శన చేపట్టడంపై ఇరుపార్టీల నేతల మధ్య పరస్పర విమర్శలు చోటుచేసుకున్నాయి. అంతేకాదు.. సీఎం పర్యటనను అడ్డుకుంటామని గద్వాలకు చెందిన బీఆర్ఎస్ నేతలు పిలుపునిచ్చారు. దీంతో ఆ పార్టీకి చెందిన పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడిని వారు వదిలిపెట్టడం.. ఆయన ముఖ్యమంత్రిని కలవడం ఆ పార్టీలో దుమారం రేపింది. కాగా.. అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు సీఎంను కలవడంపై కొందరు ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్నారని.. అందులో ఎలాంటి ఉద్దేశం లేదని ఆయన అనుచరులు కొట్టి పారేస్తున్నారు. మరికొందరు మాత్రం అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. -
వడివడిగా..
పాలమూరులో తొలి రోజు ముగిసిన సీఎం రేవంత్రెడ్డి పర్యటన సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: ఉమ్మడి పాలమూరు జిల్లాలో సీఎం రేవంత్రెడ్డి పర్యటన తొలి రోజు గురువారం వడివడిగా సాగింది. కర్ణాటక రాష్ట్ర చిన్న నీటి పారుదలశాఖ మంత్రి బోసురాజు తో కలిసి ఆయన ప్రత్యేక హెలీకాప్టర్లో బెంగళూ రు నుంచి బయలుదేరి ముందుగా నారాయణపేట జిల్లా మక్తల్కు చేరుకున్నారు. రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్రెడ్డి, దామోదర రాజనర్సింహ తదితరులు బేగంపేట నుంచి మరో హెలీకాప్టర్లో, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి తమ వాహనా ల్లో వచ్చారు. ఆ తర్వాత వారు రోడ్డు మార్గాన మక్త ల్ మండలం కాట్రేవులపల్లికి చేరుకుని కొడంగల్ – నారాయణపేట – మక్తల్ ఎత్తిపోతల పథకం పనులపై ఆరా తీశారు. తిరిగి మక్తల్కు వెళ్లి కోయిల్సాగర్తో పాటు కృష్ణా, భీమా నదులపై రోడ్ కం బ్యారేజీల ప్రతిపాదిత స్థలం, గద్వాల జిల్లా పరిధి లోని జూరాల డ్యామ్ను ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. అనంతరం ధరూర్ మండలంలో నెట్టెంపాడు ప్రాజెక్ట్లో భాగమైన గూడెందొడ్డి రిజర్వాయర్కు చేరుకున్నారు. అక్కడ పంప్ హౌస్ పనులపై ఆరా తీశారు. ఆ తర్వాత హెలీకాప్టర్లో నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం సోమశిలలోని మృగవాణి రిసార్ట్కు చేరుకున్నారు. విరామం అనంతరం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని అన్ని ప్రధాన ప్రాజెక్ట్లపై మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో సమీక్షించారు. ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్రెడ్డి, రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్రెడ్డి, చిక్కుడు వంశీకృష్ణ, కూచుకుళ్ల రాజేష్రెడ్డి, మేఘారెడ్డి, జి.మధుసూదన్రెడ్డి, అనిరుధ్రెడ్డి, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు జితేందర్రెడ్డి, కార్పొరేషన్ల చైర్మన్లు, కలెక్టర్లు, ఎస్పీలు, డీఐజీ చౌహాన్, ఇరిగేషన్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. నేడు జడ్చర్లలో బహిరంగ సభ.. గురువారం ప్రాజెక్ట్ల సందర్శనకు వచ్చిన సీఎం రాత్రి ఉన్నతాధికారులతో సమీక్ష అనంతరం మృగవాణి రిసార్ట్లో బస చేశారు. శుక్రవారం పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతలు, ఎంజీకేఎల్ఐలో భాగమైన ఎల్లూరు, నార్లాపూర్, ఏదుల, వట్టెం, కరివెన, ఉదండాపూర్లలో ఆయా చోట్ల నిర్మాణంలో ఉన్న రిజర్వాయర్లు, పంప్ హౌస్లలో పలు ప్యాకేజీల పనులను పరిశీలించనున్నారు. ఆ తర్వాత సాయంత్రం జడ్చర్ల సమీపంలోని గంగాపూర్ రోడ్లో ఉన్న మైదానంలో నిర్వహించే బహిరంగ సభకు హాజరుకానున్నారు. అనంతరం హైదరాబాద్కు బయలుదేరనున్నారు. పలువురి గృహనిర్బంధం.. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో ఎలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా పలు ప్రాంతాల్లో పోలీసులు తెల్లవారుజామునే బీఆర్ఎస్, బీజేపీతో పాటు పలు సంఘాల నాయకులను గృహనిర్బంధం చేశారు. మక్తల్లో మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి, పుంగనూరు గ్రామానికి చెందిన రాఘవేందర్తో పాటు పలువురిని హౌస్ అరెస్ట్ చేశారు. గద్వాల జిల్లా అయిజలో స్థానిక బీఆర్ఎస్ నాయకులతోపాటు బీజేపీ అనుబంధ ఏబీ వీపీ విద్యార్థి సంఘాల నాయకులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్లో బీజేపీ నియోజకవర్గ ఇన్చార్జి సుధాకర్రావు తదితరులను గృహనిర్బంధం చేశారు. కాట్రేవుపల్లికి చెందిన పలువురు రైతులు కొడంగల్ ఎత్తిపోతల పథకంలో తాము భూములు కోల్పోయామని, తమకు భూపరిహారం ఇంకా అందలేదని ముఖ్యమంత్రితో విన్నవించుకునేందుకు రాగా.. పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారు నిరాశగా వెనుదిరిగారు. కర్ణాటక మంత్రితో కలిసి రోడ్ కం బ్యారేజీల ప్రతిపాదిత స్థల పరిశీలన కొడంగల్–నారాయణపేట– మక్తల్ ఎత్తిపోతల ప్రగతిపై ఆరా ఏరియల్ వ్యూ ద్వారా కోయిల్సాగర్, జూరాల డ్యామ్ వీక్షణ గుడ్డెందొడ్డి పంప్ హౌస్ సందర్శన.. ఆ తర్వాత సోమశిలలో ఉన్నతాధికారులతో సమీక్ష నేడు పీఆర్ఎల్ఐ, కేఎల్ఐ పనుల పరిశీలన.. జడ్చర్ల శివారులో బహిరంగసభ పలు చోట్ల బీఆర్ఎస్, బీజేపీ నాయకుల గృహనిర్బంధం -
సొంతంగా తవ్వుకుంటున్నాం..
కాల్వ పనులు పూర్తికాకపోవడంతో రైతులమే సొంతంగా కాల్వలు ఏర్పాటు చేసుకొని పంటలకు నీరు పారించకుంటున్నాం. కాల్వలకు దూరంగా ఉన్న వారికి అలాంటి అవకాశం కూడా లేకుండా పోయింది. ఫీటు కాల్వలు ఏర్పాటు చేస్తేనే రైతులందరికీ మేలు జరుగుతుంది. – దావూద్, రైతు, అయిజ ఫీటు కాల్వ పనులు చేపట్టేందుకు అనేక ఆటంకాలు ఉన్నాయి. ముఖ్యంగా భూ సేకరణ చేయలేదు. దీనికి సంబంధించి భూములు కోల్పోతు న్న రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించ నందున కొంతమంది రైతులు అడ్డుపడుతున్నా రు. ప్రాజెక్ట్ రూపొందించిన సమయంలో కాల్వలకు లైనింగ్ ఏర్పాటు చేసేందుకు ఎస్టిమేషన్ వే యకపోవడంతో ఆ పనులు చేపట్టడం లేదు. దీ నికోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. – ఇమ్మానుయల్, డీఈ, నెట్టెంపాడు ప్రాజెక్ట్ ఆయకట్టుకు నీరందించేందుకు చేపట్టిన కాల్వ పను లు నత్తనడకన సాగుతున్నా యి. దీంతో డీజిల్ ఇంజిన్లు ఏర్పాటు చేసుకొని సాగునీ రు పారించుకుంటున్నాం. ఇందుకోసం రూ.వేలల్లో ఖర్చవుతుంది. కాల్వ పనులు వెంటనే పూర్తిచేసి సాగునీటి ఇబ్బందు లు తీర్చాలి. – సత్యారెడ్డి, రైతు, అయిజ ● -
ఫీటు కాల్వలకు.. పాట్లు
అయిజ: నెట్టెంపాడు ప్రాజెక్ట్ పనులు ప్రారంభించి దాదాపు రెండు దశాబ్దాలు గడుస్తున్నా మల్దకల్ మండలంలోని నాగర్దొడ్డి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్కు సంబంధించిన 106 ప్యాకేజీ పనులు పూర్తి కాకపోవడంతో పంట పొలాలకు సాగునీరందని దుస్థితి నెలకొంది. నిధుల కొరతతో ఫీటు కాల్వ పనులు పూర్తి కాకపోవడంతో ఆయకట్టు విస్తీర్ణం తగ్గిపోయింది. అప్పటి ఉమ్మడి ఏపీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కృషితో నెట్టెంపాడు ప్రాజెక్ట్ పనులు 2006లో ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా 108 ప్యాకేజీ కింద మల్దకల్ మండలంలో రూ.18 కోట్లతో 0.7 టీఎంసీల సామర్థ్యంతో నాగర్దొడ్డి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మించారు. వీటి ద్వారా అయిజ మండలంలోని పంటలకు సాగునీరందించాలనేది ప్రధాన ఉద్దేశం. రిజర్వాయర్ నిర్మాణంలో భాగంగా నాగర్దొడ్డి శివారులో 1,380 ఎకరాల రైతుల భూములు ముంపునకు గురయ్యాయి. ఇందుకు సంబంధించి ప్రభుత్వం రైతులకు నష్టపరిహారం కింద సుమారు రూ.15 కోట్లు చెల్లించింది. అయిజ మండలంలోని 6 వేల ఎకరాలకు సాగునీరందించేందుకు ప్రణాళిక రూపొందించగా.. రిజర్వాయర్ పనులు 90 శాతం పూర్తయ్యాయి. ముళ్లపొదలు.. జమ్ముగడ్డి నాగర్దొడ్డి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లోని 106 ప్యాకేజీలో మెయిన్ కెనాల్ పూర్తయినా లైనింగ్ పనులు మాత్రం చేపట్టలేదు. దీంతో కాల్వల్లో ముళ్ల పొదలు, జమ్ముగడ్డి దట్టంగా వ్యాపించాయి. నల్లరేగడి భూముల్లో ప్రధాన కాల్వలు తవ్వడంతో నీరు పారుతున్నప్పుడు మట్టి కరిగిపోయి ప్రతి సంవత్సరం కాల్వల వెడల్పు పెరిగిపోతుండగా.. కాల్వలో మట్టి జారిపడి లోతు ప్రతిఏటా తగ్గిపోతుంది. చాలామంది రైతుల పంట పొలాల్లో ఇంత వరకు ఫీటు కాల్వలు (చిన్నవి) ఏర్పాటు చేయలేదు. ఫీటు కాల్వలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించడం లేదనే కారణంతో రైతులు తమ పొలాల్లో కాల్వలు తవ్వేందుకు అంగీకరించడం లేదు. కొన్నిచోట్ల కాంట్రాక్టర్ ఏర్పాటు చేసిన ఫీటు కాల్వలను రైతులు పూడ్చివేశారు. దీంతోపాటు ఇతరత్రా కారణాలతో 106 ప్యాకేజీలోని ఆయకట్టులో సగం పొలాలకు కూడా సాగునీరు రావడం లేదు. దీంతో రైతన్నలు కేవలం వర్షాధారంగా పంటలు సాగుచేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. సాగునీరు.. వాగుపాలు జూరాల మిగులు జలాలు వృథాపోకుండా నెట్టెంపాడు ద్వారా రైతుల పంటలకు పారించాలని రిజర్వాయర్లు నిర్మిస్తే కాల్వల నిర్మాణం పనులు పూర్తికాకపోవడంతో నాగర్దొడ్డి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లో నీరు ఆయకట్టు భూములకు అందకుండా వాగుల ద్వారా వృథాగా పోతోంది. ఫలితంగా రైతులు పంటలకు నీరు పారించేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. రైతులు సొంత ఖర్చులతో యంత్రాలతో తాత్కాలికంగా కాల్వలు నిర్మించుకొని డీజిల్ ఇంజిన్లతో పైపుల ద్వారా నీరు పారించుకుంటున్నారు. వానాకాలంలో బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లో నీళ్లు నింపుకొని యాసంగి పంటల సాగుకు ఆ నీటిని విడుదల చేయాల్సి ఉంటుంది. రూ.18 కోట్లతో నాగర్దొడ్డి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ రెండు దశాబ్దాలుగా పూర్తికాని పంట కెనాళ్ల నిర్మాణం చిన్నపాటి కాల్వల దుస్థితితో ఆయకట్టుపై ప్రభావం నీళ్లున్నా నిరుపయోగంగా మారిన భూములు -
‘గుడ్డెందొడ్డి’ని 15 టీఎంసీలకు పెంచాలి
గద్వాల: నెట్టెంపాడు ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన గుడ్డెందొడ్డి రిజర్వాయర్ సామర్థ్యాన్ని 1.19 టీఎంసీల నుంచి 11 లేదా 15 టీఎంసీలకు పెంచా లని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి సీఎం రేవంత్రెడ్డిని కోరారు. కృష్ణాబేసిన్లో తొలి ప్రాజెక్టు జూ రాల అని, వానాకాలంలో వేల టీఎంసీల వర ద వస్తున్నా.. వాటిని ఒడిసిపట్టుకోవడానికి సరిపడా జలాశయాలు లేని కారణంగా అవన్నీ వృథా గా పోతున్నాయన్నారు.జూరాల ప్రాజెక్టు బ్యాక్వాటర్ ద్వారా చేపట్టిన నెట్టెంపాడు ఎత్తిపోతలలో నిర్మించిన గుడ్డెందొడ్డి జలాశయం సామర్థ్యం పెంచితే జిల్లాలోని ప్రాజెక్టులకే కాకుండా.. ఉమ్మడి పాలమూరులోని సాగునీటి ప్రాజెక్టులకు సాగు, తాగునీటి ఇబ్బందులు తొలగిపోతాయని వివరించారు. ఈ క్రమంలో సీఎం రేవంత్రెడ్డికి గుడ్డెందొడ్డి పంపుహౌస్ను ఇరిగేషన్ శాఖ అధికారులతో కలిసి చూపించారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన పీపీటీ ప్రజెంటేషన్ ద్వారా జిల్లా ప్రాజెక్టుల గురించి సాగునీటి పారుదల శాఖ అధికారులు క్షుణ్ణంగా వివరించారు.ఇందులో ప్రధానంగా జూ రాల ప్రాజెక్టు, ఆర్డీఎస్, నెట్టెంపాడు ప్రాజెక్టుల ప్రస్తుత స్థితిగతుల గురించి దృశ్యరూపంలో అవగాహన కల్పించారు. అలాగే ఆర్డీఎస్ ప్రాజెక్టు పరిధిలో మల్లమ్మకుంట రిజర్వాయర్కు అవసరమైన భూ సేకరణ ప్రక్రియపై అధికారులు వివరాలు తెలియజేశారు. పటిష్ట బందోబస్తు.. సీఎం రేవంత్రెడ్డి పర్యటన నేపథ్యంలో జిల్లా పోలీసు శాఖ పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసింది. ఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో హెలీప్యాడ్ నుంచి గు డ్డెందొడ్డి పంపుహౌస్ వరకు అడుగడుగునా పోలీ సు బందోబస్తు కల్పించారు. ఈ క్రమంలో గుడ్డెందొడ్డి పంపుహౌస్ వద్దకు చేరుకున్న సీఎం రేవంత్రెడ్డి అక్క డే ఉన్న ప్రజలకు అభివాదం చేస్తూ.. కరచాలనం చేస్తూ వారితో సెల్ఫీలు దిగారు. కార్యక్రమం అనంత రం తిరిగి వెళ్లే సమయంలో మీడియా ప్రతినిధులను పలకరించారు. కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, వాకిటి శ్రీహరి, కర్ణాటక మంత్రి బోసురాజు, కలెక్టర్ రిజ్వాన్బాషాషేక్, ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్రెడ్డి, విజయుడు, రాష్ట్ర వాల్మీకి అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ గట్టు తిమ్మప్ప, గొర్రెలు, మేకల అభివృద్ధి కార్పొరేషన్ చైర్పర్సన్ సరిత, అదనపు కలెక్టర్ మధుమోహన్, మాజీ ఎమ్మెల్యే సంపత్కుమార్, డీసీసీ అధ్యక్షుడు రాజీవ్రెడ్డి, ఇరిగేషన్శాఖ ఎస్ఈ రహీముద్దీన్ తదితరులు పాల్గొన్నారు. పంపుహౌస్ను పరిశీలించిన సీఎం రేవంత్రెడ్డి జిల్లా ప్రాజెక్టులపై ఫొటో ఎగ్జిబిషన్, పీపీటీ ప్రజెంటేషన్ గంటపాటు ప్రాజెక్టులపై వివరాలు తెలుసుకున్న సీఎం సీఎం రేవంత్రెడ్డి గురువారం సాయంత్రం 4.49 గంటలకు గుడ్డెందొడ్డి రిజర్వాయర్ వద్ద ఏర్పాటు చేసిన హెలీపాడ్ వద్దకు హెలీకాప్టర్లో చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి పూలబొకేతో స్వాగతం పలికారు. అనంతరం కలెక్టర్ రిజ్వాన్బాషా షేక్, కార్పొరేషన్ చైర్మన్లు గట్టు తిమ్మప్ప, సరిత తదితరులు ఘనంగా స్వాగతం పలికారు. అక్కడి నుంచి గుడ్డెందొడ్డి పంపుహౌస్ వద్దకు చేరుకుని ప్రాజెక్టులపై ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ను తిలకించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టుల వివరాలను ఎమ్మెల్యే బండ్ల, సాగునీటి పారుదల శాఖ అధికారులు సీఎంకు వివరించారు. -
పల్లీ @ రూ.7,239
గద్వాల వ్యవసాయం: జిల్లాకేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డుకు గురువారం 112 క్వింటాళ్ల వేరుశనగ రాగా..గరిష్టంగారూ. 7,239,కనిష్టంగా రూ.3,699, సరాసరిగా రూ.6,154 ధర లు లభించాయి. ప్రస్తుతం అన్నిరకాల సీజన్లు ముగియడంతో వేరుశనగా మాత్రమే విక్రయానికి వచ్చినట్లు అధికారులు తెలిపారు. అరకొరగా డిగ్రీ సీట్ల భర్తీ మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పీయూ పరిధిలో వివిధ ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీ ప్రక్రియ ప్రభుత్వం దోస్తు వెబ్సైట్ ద్వారా చేపట్టింది. ఇప్పటికే రెండు దశల్లో ప్రక్రియ ముగిసింది. సీటు అలాట్మెంట్ అనంతరం విద్యార్థులు సంబంధిత కళాశాల్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేసేందుకు శుక్రవారం అవకాశం కల్పించింది. పీయూ పరిధిలో 65 ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కళాశాలలు ఉండగా వీటిలో 27,720 సీట్లు ఉన్నాయి. ఇప్పటి వరకు అన్ని కళాశాలల్లో కలిపి 2,487 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. ఈ క్రమంలో మొదటి దశలో 3,292 మంది విద్యార్థులకు సీటు అలాట్మెంట్ చేయగా, ఇందులో 2,157 మంది కళాశాలల్లో రిపోర్టు చేశారు. రెండో దశలో 3,315 మందికి సీటు అలాట్మెంట్ చేయగా.. ఇందులో 330 మంది మాత్రమే గురువారం సాయంత్ర వరకు రిపోర్టు చేశారు. భర్తీ అయిన సీట్లలో అత్యధికంగా 4 ప్రభుత్వ అటానమస్ కళాశాలలో మొదటి దశలో 1,020, రెండో దశలో 166 మంది చేరారు. 22 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలలో మొదటి దశలో 744, రెండో దశలో 127 మంది చేరారు. ఇక 34 ప్రైవేటు డిగ్రీ కళాశాలలలో రెండు దశల్లో కలిపి కేవలం 406 మంది విద్యార్థులు మాత్రమే చేరారు. సీట్ల భర్తీ లేక ప్రైవేటు డిగ్రీ కళాశాలలు వెలవెల బోతున్నాయి. మరో దశ మాత్రమే ఉండగా.. 25వేల సీట్లు భర్తీ కావాల్సి ఉంది. వనరులను భవిష్యత్ తరాలకు అందించాలి మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: సహజ వనరులను భవిష్యత్ తరాలకు అందించాని పీయూ వీసీ శ్రీనివాస్ పేర్కొన్నారు. లైబ్రరీ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఆధునిక జీవన విధానంలో వ్యర్థాల ఉత్పత్తి పెరుగుతుందని, వ్యర్థాల నిర్వహణ రీయూజ్, రికవరీ, రీసైకిల్ విధానంలో జరగాలన్నారు. అవసరానికి మంచి వస్తువులను వినియోగించవద్దని, వస్తువులను తిరిగి వినియోగించేందుకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే పర్యావరణానికి ఇబ్బంది లేకుండా ఉంటుదన్నారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి ప్లాస్టిక్ రహిత సమాజం కోసం కృషి చేయాలని సూచించారు. కంపోస్టు ఎరువు చెట్ల వ్యర్థాలు ద్వారా కూడా తయారు చేసేందుకు అవకాశం ఉందన్నారు. విద్యార్థులు పర్యావరణ పరంగా చైతన్యవంతులు కావాలని సమాజంలో చైతన్యం తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ రమేష్బాబు, ఇంజినీర్ మహ్మద్ సమీర్, రాజశేఖర్, కోఆర్డినేటర్ ప్రవీణ, ఓఎస్డీ మధుసూదన్రెడ్డి, ఆడిట్ సెల్ డైరెక్టర్ చంద్రకిరణ్, కృష్ణయ్య, ఈశ్వర్కుమార్, రవికుమార్ పాల్గొన్నారు. -
అర్హులకు ఓటుహక్కు కల్పించడమే సర్ లక్ష్యం
ఇటిక్యాల: అర్హులైన ప్రతిఒక్కరికి ఓటు హక్కు కల్పించడమే సర్ (ఎస్ఐఆర్) లక్ష్యమని అదనపు కలెక్టర్ నర్సింగరావు అన్నారు. గురువారం మండలంలోని చాగాపురం గ్రామ రైతువేదికలో నిర్వహించిన గ్రామసభలో ఆయన పాల్గొని మాట్లాడారు. గ్రామ, వార్డుసభలు ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చేరవేసే ముఖ్య వేదికలన్నారు. ఎస్ఐఆర్ కార్యక్రమంపై సయగ్ర వివరాలు తెలియజేసి ప్రజలు అడిగిన సందేహాలను నివృత్తి చేశారు. ఇరిగేషన్ శాఖకు సంబంధించిన కాల్వల అభివృద్ధి, సాగునీటి పురోగతిపై గ్రామస్తులతో చర్చించారు. రాబోయే ఖరీఫ్ సీజన్లో ఎరువుల కొరత తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నామని, నానో యూరియా వినియోగాన్ని ప్రోత్సహించాలని సూచించారు. గ్రామంలో చెత్తను సమర్థవంతంగా నిర్వహించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. అనంతరం గ్రామంలోని పంచాయతీ కార్యాలయాన్ని, అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేసి రికార్డులు పరిశీలించారు. గ్రామంలోని రైతులకు కూరగాయల విత్తనాలకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా బాలల సంరక్షణ అధికారి సునంద, ఏపీఓ సునీల్, సర్పంచ్ సావిత్రి, పంచాయతీ కార్యదర్శి రవి పాల్గొన్నారు. -
పొలాల్లో పంట వ్యర్థాలను కాల్చొద్దు
మానవపాడు: పొలాల్లో పంట వ్యర్థాలను కాల్చకుండా వాటిని గుంతలలో వేసి కుళ్లబెట్టి సేంద్రియ ఎరువుగా వినియోగించాలని డీఆర్డీఓ ముషాయిదాబేగం, జిల్లా వ్యవసాయాధికారి వీరప్ప అన్నారు. గురువారం మండలంలోని పెద్దపోతులపాడులో నిర్వహించిన గ్రామసభలో పాల్గొని పంట పొలాలను సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 6, 8, 10 తేదీల్లో ప్రత్యేకంగా గ్రామసభలు నిర్వహించి రైతులకు అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. పంట వ్యర్థాలను కాల్చడం వల్ల పర్యావరణ కాలుష్యం పెరగడమే కాకుండా నేలలోని సూక్ష్మజీవులు నశించి భూసారం తగ్గుతుందన్నారు. శాసీ్త్రయ పద్ధతుల్లో సేంద్రియ ఎరువుగా మార్చాలని సూచించారు. పొలాల్లో వ్యర్థాలను కాల్చడం చట్టరీత్యా నేరం అని, రూ.50 వేల జరిమానా విధిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి ప్రదీప్కుమార్, సర్పంచ్ రజాక్, విస్తరణాధికారి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. -
దళారులను నమ్మి మోసపోవద్దు
రాజోళి: రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు సూచించారు. బుధవారం రాజోళి మండలం పచ్చర్లలో జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి మద్దతు ధర పొందాలన్నారు. కమీషన్లకు ఆశపడి రైతులను మోసంచేసే వారిపై అప్రమత్తంగా ఉండాలన్నారు. జొన్నల కొనుగోలు ప్రక్రియ పారదర్శకంగా, పక్షపాతం లేకుండా జరగాలని.. అక్రమంగా అమ్మకాలు చేసే వారిపై, సరిహద్దులు దాటి ధాన్యం తెచ్చే వారిపై ప్రత్యేక నిఘా ఉంచాలని ఆయన అధికారులకు సూచించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ దొడ్డెప్ప, శ్రీనివాసులు పాల్గొన్నారు. పెండింగ్ ప్రాజెక్టులపై సమాధానం చెప్పాలి గద్వాలన్యూటౌన్: జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టుల పరిస్థితిపై సమాధానం చెప్పిన తర్వాతే సీఎం రేవంత్రెడ్డి పర్యటించాలని బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి బాసు హనుమంతునాయుడు డిమాండ్ చేశారు. బుధవారం స్థానిక బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన ర్యాలంపాడు, గట్టు ఎత్తిపోతల, నెట్టెంపాడు ప్రాజెక్టుల పనులు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏమాత్రం ముందుకు సాగలేదన్నారు. కాల్వల్లో పెరిగిన ముళ్లపొదలను సైతం తొలగించలేదని విమర్శించారు. సీఎం పర్యటన అభివృద్ధి కోసమే అయితే పెండింగ్ ప్రాజెక్టుల పరిస్థితిపై సమాధానం చెప్పాలన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి అవసరమైన నిధులపై సీఎం రేవంత్రెడ్డి స్పష్టమైన హమీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమావేశంలో మున్సిపల్ మాజీ చైర్మన్ బీఎస్ కేశవ్, నాయకులు నాగర్దొడ్డి వెంకట్రాములు, వెంకటేశ్వర్రెడ్డి, రాఘవేంద్రరెడ్డి, పటేల్ జనార్దన్రెడ్డి, కుర్వ పల్లయ్య, చిత్తారి కిరణ్, మోహన్, రామకృష్ణ, వినయ్, శ్రీనివాసులు ఉన్నారు. వేరుశనగ క్వింటా రూ.8,312 గద్వాలవ్యవసాయం: జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్యార్డుకు బుధవారం 161 క్వింటాళ్ల వేరుశనగ అమ్మకానికి రాగా.. గరిష్టంగా రూ. 8,312, కనిష్టంగా రూ. 3,080, సరాసరి రూ. 6,510 ధరలు లభించాయి. అదే విధంగా 4 క్వింటాళ్ల ఆముదాలు రాగా.. గరిష్టం రూ. 6,149, కనిష్టంగా రూ. 5,961 ధర పలికింది. 4 క్వింటాళ్ల కందులు రాగా.. గరిష్టంగా రూ. 6,489, కనిష్టం రూ. 6,009 ధర లభించింది. 12 క్వింటాళ్ల వరి (సోన) రాగా.. గరిష్టంగా రూ. 2,497, కనిష్టంగగారూ. 2,380, సరాసరి రూ. 2,497 ధర పలికింది. గ్రామీణ క్రీడాకారులు ప్రతిభ చాటాలి మహబూబ్నగర్ మున్సిపాలిటీ: ఉమ్మడి జిల్లా క్రికెట్ టోర్నీల్లో గ్రామీణ క్రీడాకారులు తమ ప్రతిభ చాటాలని ఎండీసీఏ ప్రధాన కార్యదర్శి ఎం.రాజశేఖర్ అన్నారు. ఎండీసీఏ ఆధ్వర్యంలో ఈనెల 9వ తేదీ వరకు జరగనున్న ఇంట్రా డిస్ట్రిక్ట్ అండర్–14, 16 క్రికెట్ టోర్నీలను బుధవారం బోయపల్లి సమీపంలోని ఎండీసీఏ మైదానంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి జిల్లా నుంచి ప్రతిభ గల క్రీడాకారులతో ఆరు జట్లను ఎంపిక చేశామన్నారు. మహబూబ్నగర్, జడ్చర్ల, నారాయణపేట, నాగర్కర్నూల్, గద్వాల, వనపర్తి జట్లు 30 ఓవర్ల మ్యాచ్లు ఒక్కో జట్టు ఐదు మ్యాచ్లు ఆడతాయన్నారు. ఈ పోటీలు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లావ్యాప్తంగా నిర్వహిస్తున్నామన్నారు. ఈ టోర్నీలో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను ఎంపిక చేస్తామన్నారు. కార్యక్రమంలో ఎండీసీఏ ప్రతినిధులు సురేష్ కుమార్, వెంకటరామారావు, కోచ్లు అబ్దుల్లా, మన్నాన్, పీడీ రమణ, సీనియర్ క్రీడాకారుడు రంజిత్ తదితరులు పాల్గొన్నారు. -
మహిళా సంక్షేమానికి ప్రాధాన్యం
గట్టు: రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి అన్నారు. బుధవారం గట్టు మండల మహిళా సమాఖ్య భవనంలో ఉచిత కుటుంబ సలహా కేంద్రాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడా రు. మహిళలను ఆర్థికంగా మరింత బలోపేతం చేసేందుకు సీఎం రేవంత్రెడ్డి ప్రభుత్వం చిత్తశుద్దితో పని చేస్తోందన్నారు. కుటుంబపరంగా మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను వినూత్న ఆలోచనలతో పరిష్కరించుకునేందుకు ఉచిత సలహా కేంద్రం ఎంతో ఉపయోగపడుతుందని.. మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. అనంతరం వేసవిలో కిషోర బాలికలకు నిర్వహించిన ఆటల పోటీల్లో ప్రతిభకనబరిచిన వారికి బహుమతులను అందజేసి అభినందించారు. అదే విధంగా ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో మహిళా సంఘాల సభ్యులకు ఉచిత ఆరోగ్య పరీక్షల శిబిరాన్ని డీఎంహెచ్ఓ సంధ్యా కిరణ్మయితో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. కార్యక్రమంలో మహిళా సమాఖ్య అధ్యక్షురాలు వెంకటేశ్వరి, ఏపీఎం మారుతి, మాజీ ఎంపీపీ విజయ్కుమార్, నాయకులు రామకృష్ణారెడ్డి, అలీ, శ్రీనివాస్రెడ్డి, రాజప్ప, గద్వాల తిమ్మప్ప, హనుమంతురెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ముంపు బాధితులకు రూ.1,500 కోట్ల పరిహారం
మక్తల్: సంగంబండ, భూత్పూర్, జూరాల ప్రాజెక్టు ముంపు బాధితులకు రూ.1,500 కోట్ల నష్ట పరిహా రం ఇచ్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అంగీకరించిందని తెలంగాణ పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. నియోజకవర్గంలో గురువారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పర్యటన సందర్భంగా బుధవారం ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం బీసీ గురుకుల పాఠశాల ఆవరణలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉమ్మడి జిల్లా ప్రజల దశ, దిశ మానర్చేందుకు సీఎం పర్యటిస్తున్నారని.. గురువారం మధ్యాహ్నం 3 గంటలకు హెలికాప్టర్లో పట్టణంలోని బీసీ వెల్ఫేర్ పాఠశాల మైదానానికి చేరుకొని మక్తల్–నారాయణపేట–కొడంగల్ ఎత్తిపోతల పనులపై అధికారులతో సమీక్షిస్తారన్నారు. తెలంగాణ, కర్ణాటక సరిహద్దులో ఇరురాష్ట్రాల మంత్రులు బోసురాజు, ఉత్తమ్కుమార్రెడ్డితో మాట్లాడామని.. తెలంగాణ వాటా నీటిని పూర్తిస్థాయిలో వినియోగించుకొనేలా ప్రణాళిక సిద్ధం చేశామని తెలిపారు. ముఖ్యమంత్రి, నీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి గురు, శుక్రవారం ఉమ్మడి జిల్లాలోని ప్రాజెక్టుల ఏరియల్ సర్వే నిర్వహిస్తారని.. కృష్ణా, బీమా నదులపై బ్రిడ్జి కం బ్యారేజీల నిర్మాణం చేపట్టేందుకు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒప్పుకున్నారని తెలిపారు. రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండటంతో సమస్య పరిష్కారమైందని చెప్పారు. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలను కలుపుతూ గుడ్డెబల్లూర్ నుంచి తండిగి మీదుగా బీమా నదిపై వంతెన నిర్మాణం చేపడితే రాకపోకలు పెరిగి ప్రజలకు మరింత ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. పెండింగ్లో ఉన్న భూత్పూర్, నేరెడుగాం ముంపు గ్రామాల ప్రజలకు సరైన పరిహారం ప్రకటించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని కలెక్టర్ను ఆదేశించినట్లు మంత్రి వివరించారు. భూత్పూర్ రిజర్వాయర్లో 15 టీఎంసీల నీటిని నిల్వ చేయగలిగితే ఈ ప్రాంతం సుభిక్షంగా ఉంటుందని తెలిపారు. సమావేశంలో మార్కెట్ వైస్ చైర్మన్ గణేష్కుమార్, పార్టీ పట్టణ అధ్యక్షుడు రవికుమార్, కౌన్సిలర్ రహీం పటేల్, వాకిటి హన్మంతు పాల్గొన్నారు. -
ప్రజలకు అవగాహన కల్పించాలి
గద్వాల: జిల్లాలో చేపట్టిన ఎస్ఐఆర్ ప్రక్రియతో పాటు సాలిడ్వేస్ట్ మేనేజ్మెంట్, వర్షపునీటి సంరక్షణ, వానాకాలం పంటల సాగుపై పూర్తి అవగాహన కల్పించాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. బుధవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి అధికారులతో గూగుల్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆయా అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు అధికారులు అన్ని గ్రామాలు, వార్డుల్లో సభల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో రెండు వార్డులకు కలిపి ఓ చోట సభ నిర్వహించేలా షెడ్యూల్ రూపొందించాలని సూచించారు. ముఖ్యంగా రైతులకు ఆయిల్పాం సాగు, హార్టికల్చర్, ఫార్మర్ రిజిస్ట్రీ, నానో యూరియా అంశాలపై అవగాహన కల్పించాలన్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియ అక్టోబర్ 1న తుది జాబితా ప్రకటనతో ముగుస్తుందన్నారు. పోలింగ్ కేంద్రాల వారీగా విధులు నిర్వహించే బీఎల్ఓలు ఓటర్ల ఇంటికి వచ్చినప్పుడు అవసరమైన డాక్యుమెంట్లు సమర్పించేలా ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. అదే విధంగా జనగణనలో భాగంగా చేపట్టిన ఇళ్ల లెక్కింపును పకడ్బందీగా నిర్వహించాలని ఆయన ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు మధుమోహన్, నర్సింగ్రావు, ఆర్డీఓ శ్రీనివాసరావు, డీఏఓ వీరప్ప ఉన్నారు. ● ప్రభుత్వ విద్యాసంస్థల్లో విద్యార్థుల సంఖ్య పెంచాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా నిర్వహించిన వీసీలో ఆయన పాల్గొన్నారు. అనంతరం జిల్లా అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. ఎస్సెస్సీ, ఇంటర్ ఉత్తీర్ణులైన విద్యార్థులు డిగ్రీ, ఇతర కోర్సుల్లో చేరేలా సంబంధిత ప్రభుత్వ విద్యాసంస్థల యాజమాన్యాలు కృషి చేయాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ నర్సింగ్రావు, డీఈఓ విజయలక్ష్మి, ఎస్సీ సంక్షేమశాఖ అధికారి నుషిత, డీఐఈఓ హృదయరాజు తదితరులు ఉన్నారు. సీఎం పర్యటనకుపకడ్బందీ ఏర్పాట్లు ధరూరు: జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. బుధవారం ఎస్పీ శ్రీనివాసరావుతో కలిసి గూడెందొడ్డి రిజర్వాయర్ వద్ద సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి, సీఎం పర్యటనలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. అదే విధంగా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి, ఇరిగేషన్ ఎస్ఈ రహీముద్దీన్ పనులను పర్యవేక్షించారు. -
కొత్తగా 3 రోడ్ కం బ్యారేజీలు
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: కుడివైపు కర్ణాటక.. ఎడమవైపు తెలంగాణ రాష్ట్రాలకు ఉపయోగపడేలా కృష్ణా, భీమా నదులపై రోడ్ కం బ్యారేజీల ఏర్పాటుకు కసరత్తు జరుగుతోంది. ఉభయులకు మేలు చేకూరేలా ఇరు రాష్ట్రాలకు చెందిన ఇరిగేషన్ మంత్రులు, అధికారుల మధ్య ఇప్పటికే ప్రాథమిక చర్చలు పూర్తయ్యాయి. మొత్తం మూడు చోట్ల రోడ్ కం బ్యారేజీలు నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఈ నెల 4, 5వ తేదీల్లో రెండు రోజులపాటు ఉమ్మడి పాలమూరులోని ప్రాజెక్ట్ల సందర్శనకు వస్తున్న సీఎం రేవంత్ రెడ్డి తొలి రోజు గురువారం కర్ణాటక రాష్ట్ర చిన్న నీటి పారుదల శాఖ మంత్రి బోసురాజుతో కలిసి ప్రతిపాదిత రోడ్ కం బ్యారేజీల నిర్మాణ స్థలాలను పరిశీలించనున్నారు. జూరాలకు ప్రత్యామ్నాయంగా.. ఉమ్మడి పాలమూరుకు వరప్రదాయిని అయిన జూరాల ప్రాజెక్ట్ సామర్థ్యం ఏటేటా తగ్గుతోంది. వరదలతో వస్తున్న ఒండ్రు పేరుకుపోవడం.. పూడిక తీయకపోవడమే ఇందుకు కారణం. ఈ ప్రాజెక్ట్ నీటి నిల్వ సామర్థ్యం 9.675 టీఎంసీలు కాగా.. 2.50 టీఎంసీల పూడిక పేరుకుపోయినట్లు 2012లో నిర్ధారించారు. ఈ క్రమంలో ప్రతి సంవత్సరం ఎండా కాలంలో తాగునీటి అవసరాలకు నారాయణపూర్ నుంచి విడుదల చేయాలని కర్ణాటక ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం సర్వసాధారణంగా మారింది. తెలంగాణ ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు 2024, 2025 వేసవిలో కర్ణాటక ప్రభుత్వం నీరు విడుదల చేసినా.. సగానికంటే తక్కువగానే జూరాలకు చేరాయి. ఈ క్రమంలో ప్రభుత్వం జూరాలకు ప్రత్యామ్నాయంగా చేపట్టాల్సిన చర్యలపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా కృష్ణా, భీమా నదులపై మూడు రోడ్ కం బ్యారేజీల నిర్మాణానికి అడుగులు పడినట్లు తెలుస్తోంది. వీటి నుంచి జూరాలకు కావాల్సినప్పుడు నీటిని విడుదల చేయొచ్చని ప్రభుత్వం భావిస్తోంది. కర్ణాటకలో సత్ఫలితాలు ఇవ్వడంతో.. కృష్ణానదిపై కర్ణాటక రాష్ట్రం రాయచూర్ తాలూకాలోని గిరిజాపూర్ రోడ్ కం బ్యారేజీని 1.5 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో నిర్మించారు. మొత్తం 194 గేట్లు అమర్చారు. అదేవిధంగా దేవదుర్గ తాలూకాలో 0.5 టీఎంసీల సామర్థ్యంతో గుగల్, ఆల్మట్టి డ్యాం కింది భాగంలోని బాగల్కోట్ జిల్లా పరిధిలో ఆరు టీఎంసీల సామర్థ్యంతో హిప్పర్గి రోడ్ కం బ్యారేజీలు నిర్మించారు. మరికొన్ని సైతం నిర్మాణంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆల్మట్టి దిగువన మూడు ప్రధాన బ్యారేజీలతో జూరాల వైపు ఆఫ్ సీజన్లో రీజనరేటెడ్ వాటర్ ఆశించినంత రావడం లేదు. అయినా రోడ్ కం బ్యారేజీలతో కర్ణాటకలోని పలు ప్రాంతాలకు సంబంధించి తాగు, సాగు నీటి అవసరాలు తీరుతున్నాయి. అంతేకాకుండా రోడ్ కం బ్యారేజీలతో కనెక్టివిటీ పెరగడం.. పలు ప్రాంతాలకు దూరాభారం తగ్గుతుండడంతో తెలంగాణ ప్రభుత్వం రోడ్ కం బ్యారేజీల వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. వీటితో కుడివైపున కర్ణాటకలో సాగు నీటితోపాటు థర్మల్ పవర్ ప్రాజెక్ట్లకు నీరు సరఫరా చేసుకునే అవకాశం ఉండడంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం సైతం సానుకూలంగా ఉన్నట్లు సమాచారం. కృష్ణా, భీమా నదులపై ఏర్పాటుకు యోచన తెలంగాణలో నారాయణపేట, కర్ణాటకలో రాయచూర్ జిల్లాలకు మేలు ఉభయ రాష్ట్రాలకు తాగు, సాగు నీరందేలా ఉమ్మడి కార్యాచరణ ఇదివరకే ఇరు రాష్ట్రాల మంత్రులు, అధికారుల మధ్య ప్రాథమిక చర్చలు రేపు సీఎం రేవంత్, కర్ణాటక మంత్రి బోసురాజు ప్రత్యక్ష పరిశీలన కృష్ణాపై ఒకటి.. భీమాపై రెండు.. నారాయణపేట జిల్లా కృష్ణా మండల పరిధిలోని కొల్పూరు–కొడ్తికొండ మధ్య కృష్ణా నదిపై 1.08 టీఎంసీల సామర్థ్యంతో ఒకటి.. బీమా నదిపై కుసుమర్తి– సుకుర్ లింగంపల్లితోపాటు దేవసుగూర్లోని తంగిడి వద్ద 0.4 టీఎంసీల సామర్థ్యంతో ఒక్కొక్కటి చొప్పున బ్యారేజీల నిర్మించాలని ఇరు రాష్ట్రాలు అంగీకారానికి వచ్చాయి. కొల్పూరు–కొడ్తికొండ మధ్య రోడ్ కం బ్యారేజీకి సుమారు రూ.700 కోట్లు.. మిగతా రెండింటికి దాదాపు రూ.600 కోట్ల వరకు వ్యయమవుతుందని ప్రాథమికంగా అంచనాలు సైతం వేసినట్లు తెలిసింది. -
ఏర్పాట్ల పరిశీలన..
ధరూరు: మండలంలోని గూడెందొడ్డి రిజర్వాయర్ను ఈ నెల 4న సీఎం రేవంత్రెడ్డి సందర్శించనున్నారు. మంగళవారం సీఎం పర్యటన ఏర్పాట్లను ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి, ఎస్పీ శ్రీనివాసరావులతో కలిసి కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ పరిశీలించారు. ఈ సందర్భంగా హెలీప్యాడ్ స్థలంతో పాటు పంప్హౌజ్కు వెళ్లే మార్గాన్ని చూశారు. సీఎం పర్యటనలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర వివరాలతో పాటు ఫొటో ఎగ్జిబిషన్ ఏర్పాటుచేయాలని కలెక్టర్ ఆదేశించారు. వారి వెంట అదనపు ఎస్పీ శంకర్, ఆర్డీఓ శ్రీనివాసరావు, ఇరిగేషన్ ఎస్ఈ రహీముద్దీన్, డీఎస్పీ మొగులయ్య, ఆర్అండ్బీ ఈఈ ప్రగతి, మాజీ వైస్ ఎంపీపీ సుదర్శన్రెడ్డి, నాయకులు రఘువర్ధన్రెడ్డి, కృష్ణకుమార్రెడ్డి ఉన్నారు. -
కాంగ్రెస్తోనే అన్నివర్గాల అభ్యున్నతి
● నాగర్కర్నూల్ ఎంపీ మల్లు రవి ● ప్రజాపాలన – ప్రగతి నివేదిక బస్సు యాత్ర ప్రారంభం అలంపూర్: అన్నివర్గాల అభ్యున్నతికి కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని నాగర్కర్నూల్ ఎంపీ మల్లు రవి అన్నారు. మంగళవారం అలంపూర్లో ప్రజాపాలన – ప్రగతి నివేదిక బస్సు యాత్రను ఆయన ప్రారంభించారు. అంతకు ముందు రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సహకార సమాఖ్య చైర్పర్సన్ సరిత, ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే సంపత్కుమార్తో కలిసి ఆయన అలంపూర్ ఆలయాలను సందర్శించగా.. ఈఓ దీప్తి అర్చక స్వాములతో కలిసి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం వారు శ్రీబాలబ్రహ్మేశ్వరస్వామి జోగుళాంబ అమ్మవారి ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అధికారులు వారిని శేషవస్త్రాలతో సత్కరించి.. తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించడానికి బస్సు యాత్ర చేపట్టినట్లు తెలిపారు. ఈ యాత్ర నాగర్కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో 30 రోజులపాటు కొనసాగుతుందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల వారికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రేషన్కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీతో పాటు అర్హులందరికీ రూ. 5లక్షలతో ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తుందన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో లక్ష ఇందిరమ్మ ఇళ్లను పూర్తిచేసినట్లు చెప్పారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక కాళేశ్వరం ప్రాజెక్టుకే రూ. లక్ష కోట్లు ఖర్చు చేసి.. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేసిందన్నారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో కోయిల్సాగర్, నెట్టెంపాడు, భీమా, కల్వకుర్తి, పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టులను పూర్తిచేయకుండా.. ఇప్పుడు పాదయాత్ర చేస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఉమ్మడి జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులపై సీఎం రేవంత్రెడ్డి ప్రత్యేక దృష్టిసారించారని తెలిపారు. అందులో భాగంగా ఈ నెల 4న జూరాల ప్రాజెక్టు, పాలమూరు–రంగారెడ్డి, కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా ఎత్తిపోతల పథకాలను పరిశీలిస్తారన్నారు. 5న నాగర్కర్నూల్ జిల్లాలో ప్రాజెక్టుల పరిశీలన అనంతరం 50వేల మందితో సభ నిర్వహించి.. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు, ప్రాజెక్టుల నివేదికను ప్రజలకు వివరిస్తారని తెలిపారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు. -
ప్రజా సంక్షేమం.. అభివృద్ధే ధ్యేయం
● తెలంగాణ రైజింగ్–2047 విజన్తో ముందుకు ● అమరుల త్యాగాల పునాలదులపై ప్రగతి పథం ● 58,113 మంది రైతులకు రూ. 513.99కోట్ల రుణమాఫీ ● రాష్ట్ర అవతరణ వేడుకల్లో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి, క్రీడావ్యవహారాల సలహాదారు ఏపీ జితేందర్రెడ్డి గద్వాల: ప్రజా సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తోందని ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి, క్రీడావ్యవహారాల సలహాదారు ఏపీ జితేందర్రెడ్డి అన్నారు. మంగళవారం ఐడీఓసీ కార్యాలయంలో నిర్వహించిన రాష్ట్ర అవతరణ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా పోలీసు గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, ఎస్పీ శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్రెడ్డి, విజయుడులతో కలిసి మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళి అర్పించి.. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జితేందర్రెడ్డి మాట్లాడుతూ.. స్వరాష్ట్ర సాధన కోసం అమరులైన వారి త్యాగాల పునాలదులపై నేటి తెలంగాణ అభివృద్ధి సాధిస్తోందన్నారు. తెలంగాణ రైజింగ్–2047 విజన్లో పేదల సంక్షేమం, సమగ్ర విధానాల రూపకల్పన, ప్రపంచస్థాయి మౌలిక వసతులు, పారదర్శక సుపరిపాలన అనే నాలుగు కీలక అంశాలకు ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. మార్చి 6 నుంచి నిర్వహిస్తున్న ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99రోజుల కార్యాచరణలో భాగంగా వివిధ థీమ్స్పై జిల్లావ్యాప్తంగా విస్తృత కార్యక్రమాలు నిర్వహించి.. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చేరవేసినట్లు వివరించారు. మహిళా సాధికారతకు పెద్దపీట.. మహిళా సాఽధికారతకు ప్రభుత్వం పెద్దపీట వేసి.. అనేక పథకాలను అమలు చేస్తోందన్నారు. జిల్లాలో ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణంతో 3.275 కోట్ల మంది మహిళలకు ఇప్పటివరకు సుమారు రూ.117.45 కోట్ల విలువైన ప్రయోజనం కల్పించినట్లు వివరించారు. 8,231 స్వయం సహాయక, వృద్ధుల, దివ్యాంగుల స్నేహ సంఘాల్లో 87,22 మంది మహిళలు సభ్యులుగా ఉండగా.. 2026–27 ఆర్థిక సంవత్సరంలో 2,283 సంఘాలకు రూ. 17కోట్ల బ్యాంకు రుణాలు, 1095 మంది సభ్యులకు స్రీనిధి ద్వారా రూ. 52కోట్ల రుణాలు మంజూరు చేసినట్లు తెలిపారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద 16,391 మందికి రూ. 46.32కోట్ల వ్యయంతో వైద్యసేవలు అందించినట్లు తెలిపారు. అధికారులకు ప్రశంసా.. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99రోజుల కార్యాచరణలో విశేష కృషి చేసిన వ్యవసాయ, మహిళా, శిశు సంక్షేమ, విద్య, పంచాయతీరాజ్, ఎస్సీ అభివృద్ధి, యువజన క్రీడలు, వైద్యారోగ్య, అటవీ, జిల్లా గ్రామీణాభివృద్ధి, పురపాలక, పరిశ్రమల, పోలీస్ తదితర శాఖల అధికారులకు ప్రశంసాపత్రాలు అందజేసి సత్కరించారు. 172 స్వయం సహాయక సంఘాలకు రూ. 18.38కోట్ల విలువైన చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం వివిధ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన స్టాల్స్ను ముఖ్య అతిథులు పరిశీలించారు. అంతకు ముందు కలెక్టరేట్, జెడ్పీ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం స్మృతివనంలోని అమరవీరుల స్మారక స్థూపం వద్ద ముఖ్యఅతిథి జితేందర్రెడ్డి, ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి, కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, ఎస్పీ శ్రీనివాసరావు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పుష్పాంజలితో నివాళులర్పించారు. అదే విదంగా స్థానిక పాతబస్టాండ్ వద్ద అమరవీరులు పాశం సర్వారెడ్డి, కొట్టం వేణుగోపాల్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో రాష్ట్ర మేకలు, గొర్రెల అభివృద్ధి సహకార సమాఖ్య చైర్పర్సన్ సరిత, వాల్మీకి కార్పొరేషన్ చైర్మన్ గట్టు తిమ్మప్ప, మున్సిపల్ చైర్పర్సన్ జయ లక్ష్మి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నీలి శ్రీనివాసులు, అదనపు కలెక్టర్లు మధుమోహన్, నర్సింగ్రావు, అదనపు ఎస్పీ శంకర్, ఆర్డీఓ శ్రీనివాసరావు, డీఎస్పీ మొగిలయ్య పాల్గొన్నారు. 4.50లక్షల ఇళ్ల నిర్మాణమే లక్ష్యం.. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపడుతూ.. మొత్తం 4.50లక్షల ఇళ్ల నిర్మాణ లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. జిల్లాకు 6,899 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా.. 649 ఇళ్లు పూర్తయి, 388 కుటుంబాలు గృహప్రవేశం చేశాయన్నారు. మరో 4,889 ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయన్నారు. రూ.500 గ్యాస్ పథకం ద్వారా 95,736 మందికి రూ. 13.84కోట్ల సబ్సిడీ అందించగా.. గృహజ్యోతి కింద 87,845 కుటుంబాలకు 9.96లక్షల జీరో బిల్లులపై రూ. 25.93కోట్ల సబ్సిడీ అందించినట్లు తెలిపారు. అనంతరం బాలభవన్, దివ్య, రెబల్డ్యాన్స్ అకాడమీ విద్యార్థులు అద్భుతమైన సాంస్కృతిక ప్రదర్శనలతో అలరించారు. వారి ప్రతిభను గుర్తిస్తూ.. ముఖ్య అతిథులు జ్ఞాప్తికలను అందజేసి అభినందించారు. -
అమరవీరుల త్యాగాలు మరువలేనివి
ఎర్రవల్లి: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అమరవీరులు చేసిన త్యాగాలు మరవలేనివని పదో పటాలం అసిస్టెంట్ కమాండెంట్ పార్ధసాథిరెడ్డి అన్నారు. మంగళవారం బీచుపల్లి పదో పటాలంలో రాష్ట్ర అవతరణ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రొ.జయశంకర్, తెలంగాణ తల్లి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. రాష్ట్ర సాధనలో ఎంతో మంది విద్యార్థులు, ఉద్యోగులు తమ ప్రాణాలను సైతం కోల్పోయారన్నారు. వారి ఆకాంక్షలకు అనుగుణంగా ముందుకెళ్లాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. బంగారు తెలంగాణలో అందరూ భాగస్వాములు కావాలని కోరారు. అనంతరం వివిద విభాగాల్లో ప్రతిభకనబర్చిన సిబ్బందికి ప్రశంసా పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్ వెంకటరమణ, యూనిట్ మెడికల్ అధికారిణి సాయి, వెల్ఫేర్ అధికారి రాజేశం, ఆర్ఐలు రాజు, రాజేశం, నర్సింహరాజు, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. -
ఉమ్మడి జిల్లాలో ఆరుగురికి ఉత్తమ పోలీస్ సేవా పతకాలు
మహబూబ్నగర్ క్రైం: రాష్ట్ర ఆవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం పోలీస్శాఖలో పని చేస్తున్న అధికారుల, సిబ్బంది పనితీరుకు గుర్తింపుగా సేవా పతకాలు ప్రకటించింది. అందులో ఆరుగురు ఉత్తమ సేవా పతకాలు పొందారు. వారిలో మహబూబ్నగర్ టూటౌన్ పోలీస్స్టేషన్లో ఏఎస్ఐగా పని చేస్తున్న ఎం.పోశెట్టి, ఇంటలిజెన్స్లో హెడ్కానిస్టేబుల్గా పని చేస్తున్న కె.శ్రీనివాస్రావు, వనపర్తి వీఆర్ ఎస్ఐ ఎస్.సుబ్బరాజు, గద్వాల జిల్లాలో డీఎస్బీలో ఏఎస్ఐ శ్రీనివాసులు, పదో బెటాలియన్ ఏఆర్ ఎస్ఐ శివరావు, నారాయణపేట జిల్లాలో ఏఆర్లో హెడ్కానిస్టేబుల్ నర్సిరెడ్డి ఉన్నారు. ● మహబూబ్నగర్ జిల్లాలో సేవా పతకం పొందిన వారిలో ఆర్ఐ క్రిష్ణయ్య, టూటౌన్ సీఐ ఇజాజుద్దీన్, ఏఆర్ ఎస్ఐ శ్రీరాములు, దేవరకద్ర హెడ్కానిస్టేబుల్స్ రాజశేఖర్, మహ్మద్ గఫర్, ఏఆర్ హెడ్కానిస్టేబుల్స్ ఆంజనేయులు, శ్రీనివాసులు, శ్రీరాములు, నర్సింహులు, ఏఆర్ కానిస్టేబుల్ సురేందర్గౌడ్, ఇంటలిజెన్స్లో సీఐ సాయికుమార్, ఏఎస్ఐ ప్రభాకర్రావు, కానిస్టేబుల్ పర్వతచారి, టెక్నికల్ విభాగంలో ఐటీ సీఐ ప్రకాష్, ఉన్నారు. వనపర్తి జిల్లాలో ఆత్మకూర్ సీఐ శివకుమార్, ఏఎస్ఐ రోశన్న, ఏఆర్ ఎస్ఐ జాకీర్ హుస్సెన్, పెద్దమందడి హెడ్కానిస్టేబుల్ లక్ష్మప్పలు ఉన్నారు. ఇక గద్వాల జిల్లాలో గద్వాల సీఐ సీహెచ్ నాగేశ్వర్రెడ్డి, కోదాండపూర్ ఏఎస్ఐ శ్రీనివాసులుగౌడ్, మానవపాడు ఏఎస్ఐ మహ్మద్ జమీరుద్దీన్, ఇటిక్యాల ఏఎస్ఐ వెంట్రామిరెడ్డి ఉన్నారు. నాగర్కర్నూల్ జిల్లాలో నాగర్కర్నూల్ డీసీఆర్బీ సీఐ ఉపేందర్రావు, ఏఆర్ హెడ్కానిస్టేబుల్ రాజు, ఏఆర్ కానిస్టేబుల్ శ్రీనివాసులు, తెలకపల్లి మహిళ కానిస్టేబుల్ పద్మ ఉన్నారు. ఇక నారాయణపేట జిల్లాలో కోస్గి సీఐ సైదులు,క్రిష్ణ ఏఎస్ఐ సురేందర్బాబు, ఊట్కూర్ ఏఎస్ఐ సాయిబాబ, హెడ్కానిస్టేబుల్ బాలరాజు, ధన్వాడ ఏఎస్ఐ ఎండీ ముస్తాక్ అలీ, ఏఆర్ హెడ్కానిస్టేబుల్స్ మురళీధర్, వెంకటేశ్వర్లు, ఎండీ లయిక్ అహ్మద్ సేవా పతకాలు అందుకోనున్నారు. -
వేడుకలకు ముస్తాబు
గద్వాల: రాష్ట్ర అవతరణ వేడుకలకు జిల్లాకేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానం ముస్తాబైంది. మంగళవారం వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. స్థానిక పరేడ్ గ్రౌండ్లో జరిగే వేడుకలకు కలెక్టర్ రిజ్వాన్బాషాషేక్ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మరోవైపు పోలీసు బందోబస్తును ఎస్పీ శ్రీనివాసరావు పర్యవేక్షించారు. మంగళవారం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి, ప్రభుత్వ సలహాదారు, క్రీడా వ్యవహారాల ఇన్చార్జి ఏపీ జితేందర్రెడ్డి హాజరుకానున్నారు. వేడుకలకు హాజరయ్యే ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు. -
స్వరాష్ట్రంలో మారిన స్వరూపం
పన్నెండేళ్ల కాలంలో అభివృద్ధి పథంలో నడిగడ్డ ప్రాంతం గద్వాల: స్వరాష్ట్ర ఆకాంక్ష నెరవేరి నేటికీ.. పన్నెండేళ్లు అయ్యింది. రాష్ట్ర సాధనతో నడిగడ్డ ప్రాంతంగా ఉన్న గద్వాల, అలంపూర్ నియోజకవర్గాల స్వరూపం మారింది. రాష్ట్రం సాధించిన రెండేళ్లకు 2016లో ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్న నడిగడ్డ ప్రాంతం ప్రత్యేక జిల్లాగా అవతరించింది. ఈ క్రమంలో గద్వాల జిల్లా కేంద్రంగా గద్వాల, అలంపూర్ నియోజకవర్గాలను కలుపుతూ జోగుళాంబ గద్వాల జిల్లాగా 2016 అక్టోబర్లో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అనంతరం జిల్లాకు నర్సింగ్ కాలేజీ, జిల్లాకేంద్రంలోని వంద పడకల ఆస్పత్రిని 200 పడకలకు పెంచడం, మెడికల్ కాలేజీ, అలంపూర్లో వంద పడకల ఆస్పత్రి, ప్రభుత్వ పాఠశాలలో అదనపు తరగతి గదులు, విద్యార్థులకు మౌళిక సదుపాయాలు, సాగునీటి రంగంలో నూతనంగా గట్టు, తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకాలు వంటి ప్రధానమైన అభివృద్ధితోపాటు జిల్లా వ్యాప్తంగా సాగు విస్తీర్ణం పెరగడం, జిల్లాకేంద్రం గద్వాలపట్టణం అన్ని రంగాల్లో శరవేగంగా అభివృద్ధి చెందడం వంటి వాటితో జిల్లా ముఖచిత్రమే మారింది. ఆర్డీఎస్కు తీరని అన్యాయం.. ఆర్డీఎస్ కింద అలంపూర్ నియోజకవర్గంలో 87,500 ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉండగా.. ఉమ్మడి ఏపీలో ఆర్డీఎస్కు తీరని అన్యాయం జరిగింది. ఈ నేపథ్యంలో తుంగభద్ర నది నుంచి నీటిని ఎత్తిపోసుకునేలా రాజోళి సమీపంలో తుమ్మిళ్ల ఎత్తిపోతలు చేపట్టారు. ఇక్కడి నుంచి నేరుగా కాల్వల్లోకి నీటిని పంపింగ్ చేసి 50 వేల ఎకరాలకు సాగునీటిని అందించేలా తుమ్మిళ్ల ఎత్తిపోతల డిజైన్ చేశారు. 2018లో అప్పటి సీఎం కేసీఆర్ తుమ్మిళ్లను జాతికి అంకితం చేశారు. అలాగే గట్టు, కేటీదొడ్డి మండలాల పరిధిలో 35 వేల ఎకరాలకు సాగునీరు అందించేలా 2018లో గట్టు ఎత్తిపోతలకు అప్పటి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయగా.. ప్రస్తుతం పనులు పురోగతిలో ఉన్నాయి. వైద్య, ఆరోగ్య శాఖ పరిధిలో.. జిల్లా ఏర్పాటు అనంతరం నూతనంగా నర్సింగ్ కాలేజీ మంజూరైంది. అలాగే జిల్లాకేంద్రంలోని వంద పడకల ఆస్పత్రిని 200 పడకలకు అప్గ్రేడ్ చేశారు. ప్రస్తుతం నూతన ఆస్పత్రికి సంబంధించిన పనులు పురోగతిలో ఉన్నాయి. అలాగే అలంపూర్ చౌరస్తాలో నూతనంగా వంద పడకల ఆస్పత్రి మంజూరు కాగా ప్రస్తుతం అక్కడ ప్రజలకు వైద్యసేవలు అందుతున్నాయి. అలాగే చిరకాల స్వప్నంగా ఉన్న మెడికల్ కళాశాల రెండేళ్ల కిందట మంజూరవగా.. ఈ ఏడాది మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభమయ్యాయి. మౌళిక సదుపాయాల కల్పన జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అవసరమైన మౌళిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం పెద్దపీట వేసింది. అదేవిధంగా అవసరమైన పాఠశాలలో అదనపు తరగతి గదుల నిర్మాణం వంటివి అభివృద్ధి చేశారు. అన్నిరంగాల్లో అభివృద్ధి.. జిల్లాకేంద్రమైన గద్వాల పట్టణం అన్నిరంగాల్లో శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. ప్రధానంగా జిల్లాకేంద్రంలో వైద్యం, విద్య, ఇతర రంగాల్లో జరగడంతో గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు గద్వాల పట్టణానికి వచ్చి స్థిరపడుతున్నారు. ఫలితంగా ఇక్కడ రియల్ ఎస్టేట్ రంగం ఒకానొక సమయంలో హైదరాబాద్తో పోటీపడింది. అలాగే ప్రైవేటు పాఠశాలలు, ఆస్పత్రులు, వివిధ విభాగాల్లో నిపుణులైన వైద్యులు అందుబాటులోకి వచ్చారు. పదేళ్ల కిందట జోగుళాంబ గద్వాల జిల్లా ఏర్పాటు ప్రభుత్వ మెడికల్, నర్సింగ్ కళాశాలలు మంజూరు గట్టు, తుమ్మిళ్ల ఎత్తిపోతలు.. పెరిగిన సాగు విస్తీర్ణం విద్యారంగంలో మౌలిక వసతులకు పెద్దపీట -
పుష్కర తెలంగాణ.. పచ్చని పాలమూరు
ఉమ్మడి జిల్లాలో గణనీయంగా పెరిగిన సాగు విస్తీర్ణం ● 2014కు ముందు వానాకాలంలో 8.50 లక్షల ఎకరాల్లోపే.. ● ప్రస్తుతం 22.54 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు ● యాసంగి సాగులోనూ మూడింతల వృద్ధి ● వరి, పత్తి వైపే రైతన్నల మొగ్గు తలాపునే కృష్ణమ్మ ఉన్నప్పటికీ కరువుతో అల్లాడిన ప్రాంతం.. ఎటు చూసినా ఎండిన పంటలు.. బీళ్లుగా మారిన భూములు.. తాగునీటి కోసం తండ్లాట తప్పని పల్లెలు, పట్టణాలు.. ఉపాధి దొరక్క తట్ట, బుట్ట పట్టుకుని పిల్లాజెల్లలతో సహా వలసలు.. కిక్కిరిసిన జనాలతో పుణె, బొంబై, హైదరాబాద్కు వెళ్లే బస్సులు.. విద్య, వైద్యానికి నోచుకోని దీన పరిస్థితులు.. భరోసా లేని బతుకులు ...ఇది ఒకప్పటి పాలమూరు ముఖచిత్రం. ఈ జిల్లా వెనుకబాటుతనం, దయనీయ పరిస్థితులు తెలంగాణ ఉద్యమ గళంగా మారాయి. ప్రత్యేక రాష్ట్ర సాధనలో భావజాల వ్యాప్తికి దోహదం చేయడంతో పాటు తెలంగాణ వాదులకు సత్తువనిచ్చాయి. పల్లెపల్లెనా పల్లేర్లు మొలిసే పాలమూరులోనా మన తెలంగాణలోనా.. అనే పాట తెలంగాణ జిల్లాల్లో జ్వాల రగిలించడమే ఇందుకు నిదర్శనం. తెలంగాణ ఆకాంక్ష, ‘ప్రత్యేక’ పోరుకు దిక్సూచిగా నిలిచిన పాలమూరు రూపురేఖలు స్వరాష్ట్రంలో క్రమక్రమంగా మారుతున్నాయి. నెర్రెలు బారిన వ్యవసాయ భూముల్లో సిరుల పంటలు పండుతున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి పుష్కర కాలమైన నేపథ్యంలో ‘సాక్షి’ ప్రత్యేక కథనం.. – సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్ యాసంగిలోనూ గణనీయంగా.. ఎండాకాలం సాగుకు సంబంధించి ఉమ్మడి పాలమూరులో గణనీయంగా మార్పు వచ్చింది. 2014లో నాలుగు లక్షల లోపే యాసంగి సాగు అయ్యేది. 2019లో ఇదే సీజన్లో 6.72 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు కాగా.. గత ఏడాది 13.44 లక్షల ఎకరాల్లో రైతులు వివధ పంటలు సాగు చేశారు. ఈ లెక్కన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం యాసంగి పంటల సాగు మూడింతలకు పైగా పెరిగినట్లు స్పష్టమవుతోంది. -
సీఎం పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు
గద్వాల: జిల్లాలోని జూరాల ప్రాజెక్టు, గుడ్డెందొడ్డి రిజర్వాయర్లను పరిశీలించేందుకు ఈ నెల 4న సీఎం రేవంత్రెడ్డి జిల్లాకు రానున్నారు. ఈ నేపథ్యంలో సీఎం పర్యటనకు సంబంధించి ఏర్పాట్లను సోమవారం కలెక్టర్ రిజ్వాన్బాషాషేక్, ఎస్పీ శ్రీనివాసరావు, వనపర్తి ఎస్పీ సునీతారెడ్డి, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి మాట్లాడుతూ సీఎం రేవంత్రెడ్డి గురువారం జిల్లాకు రానున్నారని, ఇందుకు సంబంధించి హెలీప్యాడ్ స్థలం పరిశీలన, అదేవిధంగా జూరాల ప్రాజెక్టు, గుడ్డెందొడ్డి రిజర్వాయర్ ప్రాంతాల్లో బందోబస్తు ఏర్పాట్లు వంటివి యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులతో చర్చించినట్లు చెప్పారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మధుమోహన్, మార్కెట్ యార్డు చైర్మన్ హన్మంతు, ఆర్డీఓ శ్రీనివాసరావు, డీఎస్పీ మొగిలయ్య, ఈఈలు సంజీవ్, ప్రగతి పాల్గొన్నారు. చిట్టీల పేరుతో టోకరా ● ఉలిగేపల్లి గుడిపూజారి నిర్వాహకం ● రూ.10కోట్లకు పైగా ఘారానామోసం మల్దకల్: అధిక వడ్డీలతో చిట్టీ వ్యాపారం చేస్తూ ఓ వ్యక్తి రూ.10కోట్లకు పైగా మోసం చేసి ఉడాయించిన ఘటన మండలంలోని బిజ్వారంలో సోమవారం చోటు చేసుకుంది. బిజ్వారం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి గ్రామ సమీపంలోని మరో గ్రామంలో ఆంజనేయస్వామి గుడి పూజారిగా ఉంటూ ఇరు గ్రామాల ప్రజలతో సత్సంబంధాలు పెంచుకున్నాడు. ఈక్రమంలో చిట్టీలు వేయించుకుని వారికి తిరిగి డబ్బులు ఇవ్వకపోవడంతో చిట్టీలు వేసిన లబ్ధిదారులు లబోదిబోమంటూ బిజ్వారంలోని అతని ఇంటి వద్దకు చేరుకుని ఆ వ్యక్తిపై ఆరాతీయగా.. 5 రో జుల నుంచి కనిపించకుండాపోవడంతో బాధి తులు ఆవేదన వ్యక్తం చేశారు. బిజ్వారంతోపాటు ఉలిగేపల్లి, దాసరపల్లి, గద్వాల పట్టణం, ధరూరు మండలంలోని 6 గ్రామాల్లో పరిచయస్తులతోపాటు ప్రభుత్వ ఉద్యోగులతో చిట్టీ లు వేయించుకున్నాడు. చిట్టీలతోపాటు చిట్టీలు వేసిన లబ్ధిదారులతో అధిక వడ్డీల ఆశతో ఒ క్కొక్కరి నుంచి రూ.5లక్షల నుంచి రూ.30లక్షలకు పైగా వడ్డీలకు తీసుకుని వారి నెలనెలా వడ్డీ చెల్లిస్తూ నమ్మకం ఏర్పరచుకున్నాడు. అదే నమ్మకంతో చిట్టీలు వేసిన వారితోపాటు అప్పు లు ఇచ్చినవారిని మోసగించి రాత్రికిరాత్రే కు టుంబ సభ్యులతో ఉడాయించాడు. అప్పులు ఇచ్చినవారు సర్పంచ్ను కలిసి తమకు న్యాయ ం చేయాలని విన్నవించారు. తాను చేసేదేమి లేదని, పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూ చించారు. ఈ విషయమై మల్దకల్ ఎస్ఐ కొండ శ్రీహరిని వివరణ కోరగా చిట్టీలతో ఉడాయించిన విషయం తమ దృష్టికి వచ్చిందని, బాధితులు ఎవరూ ఇప్పటి వరకు ఉడాయించిన వ్యక్తిపై ఫిర్యాదు చేయలేదని తెలిపారు. 198 క్వింటాళ్ల వేరుశనగ రాక గద్వాల వ్యవసాయం: జిల్లాకేంద్రంలోని మార్కెట్ యార్డుకు సోమవారం 198 క్వింటాళ్ల వేరుశనగ రాగా.. గరిష్టంగా రూ.7,800, కనిష్టంగా రూ.5,469, సరాసరిగా రూ.6,865 ధరలు లభించాయి. 8 క్వింటాళ్ల ఆముదాలు రాగా.. సరాసరిగా రూ.5,759 ధర పలికింది. -
వైభవంగా ఆదిశిలావాసుడి కల్యాణం
మల్దకల్: ఆదిశిలా క్షేత్రంలోని స్వయంభూ లక్ష్మీవేంకటేశ్వరస్వామి కల్యాణోత్సవం ఆదివారం అంగరంగ వైభవంగా జరిగింది. వేదమంత్రోచ్ఛారణలు, మంగళ వాయిద్యాల నడుమ పండితులు రమేషాచారి, మధుసూదనాచారి, రవిచారి స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించి.. కల్యాణ తంతు జరిపించారు. జీలకర్ర బెల్లం, మాంగళ్యధారణ, తలంబ్రాల కార్యక్రమం కనులపండువగా సాగగా.. భక్తులు కనులారా వీక్షించి భక్తిపారవశ్యంతో ఉప్పొంగారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో మహా హోమం నిర్వహించారు. భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటుచేశారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ప్రహ్లాదరావు, చంద్రశేఖర్రావు, దీరేంద్రదాసు, సిబ్బంది పాల్గొన్నారు. -
ఇబ్బందులు తొలగించాలి..
సర్వీస్ బుక్ల డిజిటలైజేషన్కు సంబంధించి ఆన్లైన్ చేసేందుకు మరింత సమయం ఇవ్వాలి. సెలవులు కావడంతో కొంతమంది టూర్లకు వెళ్లడం, ఇతర పనులు, ఆరోగ్యం సమస్యలు ఉన్నవారు ఉన్నారు. వెంటనే ఆన్లైన్ చేయడం వల్ల తప్పులు దొర్లితే ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. ప్రభుత్వం స్పంచింది ఈ నెలాఖరు వరకు గడువు పొడిగించడంతోపాటు సర్వీస్ బుక్ల ఆన్లైన్ నమోదులో ఇబ్బందులు లేకుండా చూడాలి. – మదన్మోహన్యాదవ్, పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు గడువు పొడిగించాలి.. ఉద్యోగ, ఉపాధ్యాయుల సర్వీస్ బుక్కులను ఆన్లైన్ చేయడం మంచి నిర్ణయమే. ఇలా చేయ డం వల్ల భవిష్యత్లో ఎలాంటి ఇబ్బందులు లే కుండా ఉంటాయి. కానీ, వీటిని ఆన్లైన్ చేసేందుకు కేవలం 10 రోజులు మాత్రమే సమయం ఇచ్చి ప్రక్రియ పూర్తి చేయాలి అని చెప్పడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కొంతమంది బడిబాట, కొంత మంది జనగనణలో ఉన్నారు. అలాంటి వారికి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం గడువు తేదీని పొడిగించాలి. – శ్యాంబాబు, టీపీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు● -
సీఎం పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు
కొల్లాపూర్ రూరల్/భూత్పూర్: ఉమ్మడి పాలమూరు జిల్లాలో 4, 5 తేదీల్లో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పర్యటన నేపథ్యంలో యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. ఆదివారం కొల్లాపూర్ మండలం నార్లాపూర్ రిజర్వాయర్ను కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్, ఎస్పీ సంగ్రామ్ సింగ్జీ పాటిల్ సందర్శించి.. హెలిప్యాడ్ స్థలాన్ని పరిశీలించారు. పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పరిశీలనలో భాగంగా సీఎం రేవంత్రెడ్డి నార్లాపూర్ రిజర్వాయర్ను సందర్శించనున్నారని.. సీఎం పర్యటనకు అన్ని ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను వారు ఆదేశించారు. అనంతరం సోమశిలలో హెలిప్యాడ్ స్థలంతో పాటు కృష్ణా ఘాట్లను పరిశీలించి.. అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా భద్రతాపరమైన ఏర్పాట్లపై పలు సూచనలు చేశారు. వారి వెంట జిల్లా పర్యాటకశాఖ అధికారి నర్సింహ, ఆర్డీఓ బన్సీలాల్, తహసీల్దార్ మాధవి, ఇరిగేషన్ ఈఈ శ్రీనివాస్రెడ్డి, ఆర్అండ్బీ ఈఈ శ్రీధర్ ఉన్నారు. ● భూత్పూర్ మండలంలోని కర్వెన ప్రాజెక్టును 5న సీఎం రేవంత్రెడ్డి సందర్శించనున్నారు. ఈ సందర్భంగా జిల్లా నీటిపారుదలశాఖ సీఈ సత్యనారాయణరెడ్డితో కలిసి దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డి హెలీప్యాడ్ కోసం అనువైన స్థలాన్ని పరిశీలించారు. వారి వెంట ఇరిగేషన్ అధికారి విజయభాస్కర్రెడ్డి, సర్పంచ్ సుశీల రెడ్యానాయక్, నరేందర్రెడ్డి, తిరుపతిరెడ్డి ఉన్నారు. -
రేపు అమరవీరులకు వందన కార్యక్రమం
గద్వాలన్యూటౌన్: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని జూన్ 2న జిల్లా కేంద్రంలోని కొట్టం వేణుగోపాల్ పార్కులో 1969 తెలంగాణ అమరవీరులు, ఉద్యమకారులకు వందన కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు మోహన్రావు తెలిపారు. ఆదివారం కొట్టం వేణుగోపాల్ పార్క్లో తెలంగాణ తొలిదశ ఉద్యమంలో అమరులైన పాశం సర్వారెడ్డి, కొట్టం వేణుగోపాల్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వపరంగా ఉదయం 9గంటలకు జరిగే వందన కార్యక్రమానికి కలెక్టర్ హాజరవుతారని తెలిపారు. కార్యక్రమానికి కవులు, ఉద్యమకారులు, అన్ని పార్టీల నాయకులు, ప్రజలు హాజరుకావాలని కోరారు. కార్యక్రమంలో సంఘం నాయకులు బాలరాజు, శంకర ప్రభాకర్, వల్లూరు వెంకట్రామారెడ్డి, భీమ్సేన్రావు, అబ్దుల్ మోమిన్, లక్ష్మణస్వామి, హమ్మద్ హుస్సేన్ పాల్గొన్నారు. ఉమ్మడి జిల్లాలో పుర కమిషనర్ల బదిలీలు మహబూబ్నగర్ మున్సిపాలిటీ: ఉమ్మడి పాలమూరు జిల్లాలో పలువురు మున్సిపల్ కమిషనర్లు బదిలీ అయ్యారు. వీరిలో జోగుళాంబ గద్వాల జిల్లాలోని వడ్డేపల్లి మున్సిపల్ కమిషనర్గా పనిచేస్తున్న ఎస్.రాజయ్య (గ్రేడ్–2) నారాయణపేట జిల్లాలోని మక్తల్కు బదిలీపై వెళ్తున్నారు. ఇంత వరకు వెయిటింగ్ జాబితాలో ఉన్న మహమ్మద్ మునవర్ అలీ (గ్రేడ్–3)ని వనపర్తికి, ఎ.నరేష్కుమార్ (గ్రేడ్–3)ను ఆత్మకూర్కు, ఎం.శంకర్ (గ్రేడ్–2)ను నాగర్కర్నూల్ జిల్లాలోని కొల్లాపూర్కు బదిలీ చేశారు. మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లాలోని మూడుచింతలపల్లి మున్సిపల్ కమిషనర్ (గ్రేడ్–2)గా పనిచేస్తున్న జె.పవన్కుమార్ మహబూబ్నగర్ జిల్లాలోని భూత్పూర్కు వస్తున్నారు. కాగా.. ఇటీవల గ్రూప్–1కు ఎంపికై న పి.రాజేష్ అలంపూర్ మున్సిపల్ కమిషనర్ (గ్రేడ్–2)గా, పి.సాయి శ్రీనివాస్యాదవ్ మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్కు అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ (ఏఎంసీ)గా బదిలీపై వస్తున్నారు. ఇంత వరకు ఇక్కడ పనిచేసిన ఏఎంసీ అజ్మీర రాజన్న గత నెలలో హైదరాబాద్లోని సెక్రెటరియట్కు బదిలీపై వెళ్లిన విషయం విదితమే. ఇక జోగుళాంబ గద్వాల జిల్లాలోని అయిజ మున్సిపాలిటీలో మేనేజర్గా పనిచేస్తున్న అశోక్రెడ్డిని వడ్డేపల్లి మున్సిపల్ కమిషనర్ (ఓడీ)గా పంపిస్తున్నారు. అలాగే వనపర్తిలో మున్సిపల్ కమిషనర్ (గ్రేడ్–1)గా పనిచేస్తున్న ఎన్.వెంకటేశ్వర్లు జీహెచ్ఎంసీకి బదిలీ అయ్యారు. మున్సిపాలిటీలో మురుగు తొలగేదెలా? ●రోడ్లపైనే నిలుస్తున్న మురుగు,వర్షపు నీరు -
సర్వీస్ తంటాలు
– వివరాలు 9లో..మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వివిధ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగ, ఉపాధ్యాయుల సర్వీస్లో పూర్తిస్థాయి పారదర్శకత ఉండేందుకు ప్రభుత్వం సర్వీస్ బుక్ డిజిటలైజేషన్ చేసే ప్రక్రియ చేపట్టింది. ఇందులో భాగంగా ఐఎఫ్ఎంఎస్ (ఇంటిగ్రేటెడ్ ఫైనాన్సియల్ మేనేజ్మెంట్ సిస్టం)ను తీసుకువచ్చింది. ఉద్యోగులు తమ సర్వీస్ బుక్కులను డిజిటలైజేషన్ చేసేందుకు పెద్దఎత్తున కసరత్తు చేస్తున్నారు. అయితే చాలామంది ఉద్యోగులు సకాలంలో సర్వీస్బుక్ల నమోదు, ఆన్లైన్లో అప్లోడ్ చేయలేక ఇబ్బందులు పడుతున్నారు. ఇక నాగర్కర్నూల్, జోగుళాంబ గద్వాల, నారాయణపేట జిల్లాల్లోని కొన్ని మారుమూల ప్రాంతాల్లో ఇంటర్నెట్ రాకపోవడం, సదుపాయాలు లేకపోవడం వంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇందుకు సంబంధించి మే 31 నాటికే గడువు ముగియగా.. మరిన్ని రోజులు గడువు ఇవ్వాలని ఉపాధ్యాయ, ఉద్యోగ వర్గాలు కోరుతున్నాయి. పారదర్శకత పెంచేలా.. ప్రతి ఉద్యోగికి సర్వీస్ బుక్ ఎంతో కీలకమైంది. ఉద్యోగంలో చేరిన నాటి నుంచి రిటైర్డ్ అయ్యే వరకు పూర్తి వివరాలను ఇందులో పొందుపరుస్తారు. ఈ క్రమంలో సర్వీస్ బుక్కుల్లో పారదర్శకత పాటించేందుకు ఇప్పుడు ఆన్లైన్ విధానాన్ని తీసుకువచ్చారు. ఇందులో ప్రధానంగా మ్యానువల్ గ్రేడ్ ఇంక్రిమెంట్, జనరల్ ఇన్సూరెన్స్, మ్యానువల్ వెరిఫికేషన్ వంటి అంశాలను తప్పకుండా నమోదు చేయాల్సి ఉంటుంది. వీటితోపాటు ముఖ్యంగా పదోన్నతులు, బదిలీ వివరాలు, వివిధ డిపార్ట్మెంట్ల పరీక్షలు, ఉపాధ్యాయుల టెట్ అర్హత వివరాలను పొందుపర్చాలి. డిప్యూటేషన్లు, ఫారిన్ సర్వీస్ వివరాలను సాధారణంగా ఎంట్రీ చేయాల్సి ఉంది. అంతేకాకుండా ప్రభుత్వం తీసుకువచ్చిన హెల్త్ స్కీం వర్తించేందుకు సర్వీస్ బుక్కులో కుటుంబ సభ్యుల వివరాలను కూడా పొందుపర్చాల్సి ఉంటుంది. నమోదులో ఇబ్బందులు.. సర్వీస్ బుక్కులు సీనియర్ ఉద్యోగి అయితే 50 నుంచి 60 పేజీలు, జూనియర్ ఉద్యోగి అయితే 40 నుంచి 50 పేజీలు ఉంటాయి. వీటిని ఆన్లైన్లో పొందుపర్చాలంటే అన్ని పేజీలను స్కాన్ చేయడంతోపాటు అన్నీ కూడా 50 ఎంబీలోపు ఉండేలా చూసుకోవాలి. అయితే చాలామంది సీనియర్ ఉద్యోగులు ఈ ప్రక్రియ తెలియకపోవడంతో ఆన్లైన్లో నమోదు కోసం కంప్యూటర్ ఆపరేటర్లను సంప్రదించాల్సి వస్తుంది. ఈ క్రమంలో బడిబాట, జనాభా లెక్కలు వంటి పనులు ఉపాధ్యాయ, ఉద్యోగులు సర్వీస్ బుక్కులో ఎంట్రీలను మరింత ఆసల్యం చేస్తున్నారు. కార్యాలయంలోనే ప్రక్రియ.. ప్రభుత్వం సర్వీస్ బుక్ల డిజిటలైజేషన్ చేపడుతున్న క్రమంలో పలు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. బుక్లకు సంబంధించి డ్రాయింగ్ అధికారి వద్ద మాత్రమే ఆన్లైన్ ప్రక్రియ చేయాల్సి ఉంది. ఐఎంఎఫ్ పోర్టల్కు సంబంధించిన పాస్వర్డ్, ఐడీలను సదరు అధికారులకు మాత్రమే ప్రభుత్వం ఇచ్చింది. ఈ ప్రక్రియను వివిధ డిపార్ట్మెంట్లలోని మండల స్థాయి అధికారులు, ఉపాధ్యాయుల సర్వీస్ బుక్లను కాంప్లెక్స్ హెచ్ఎంలు చేపడుతున్నారు. వారు బుక్కులోని అంశాలను పూర్తిగా పరిశీలించి, అన్నింటినీ సరిచూసి ఆన్లైన్లో పొందుపరుస్తున్నారు. ఈ క్రమంలో ఒక్కో ఉపాధ్యాయుడి సర్వీస్ బుక్ను ఆన్లైన్ చేసేందుకు చాలా సమయం పడుతుంది. కొన్నిచోట్ల నెట్ సమస్య, కొన్నిచోట్ల సిబ్బంది కొరత వంటివి అడ్డంకిగా మారుతున్నాయి. డిజిటలైజేషన్ ప్రక్రియలో వేధిస్తున్నసాంకేతిక, ఇతరత్రా సమస్యలు వివిధ స్థాయిలలో నమోదులో తీవ్రజాప్యంతో ఇక్కట్లు గత నెల 31 వరకే ముగిసిన గడువు మరిన్ని రోజులు పొడిగించాలని కోరుతున్న ఉద్యోగులు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 26 వేలఉపాధ్యాయ, 18 వేల ఇతర ఉద్యోగులు -
ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి
మానవపాడు: రాష్ట్ర సాధన కోసం అవిశ్రాంతంగా పోరాడిన ఉద్యమకారులకు గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకోవాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర కార్యదర్శి గుమ్మ గోవర్ధన్, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా అధ్యక్షుడు గార్లపాడు భూషణం, గద్వా ల జిల్లా కార్యదర్శి దుబ్బన్న డిమాండ్ చేశారు. ఆదివారం మండల కేంద్రంలో విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. తెలంగాణ ఉద్యమం కోసం ఎంతోమంది జైలుకు జీవితం గడిపామన్నారు. ఉద్యమకాలంలో జిల్లా వ్యాప్తంగా దిగ్బంధం, ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించిన విషయాన్ని గుర్తు చేశారు. హామీలు నెరవేర్చేంత వరకు రాష్ట్రం ప్రభుత్వంపై ఉద్యమిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు శంకర్నాయుడు, మండల ఉపాధ్యక్షుడు వివేకానందం, మండల ప్రధాన కార్యదర్శి రఘు, మండల కార్యదర్శి జయ్యన్న, నరసింహులు, అయ్యన్న, మండల సలహాదారుడు మాజీ ఎంపీటీసీ అయ్యన్న, శేఖర్ పాల్గొన్నారు. -
నమ్మించి.. నట్టేట ముంచి!
గద్వాల క్రైం: డిజిటల్ యాప్ల రాకతో కాళ్లు కదపకుండానే బ్యాంకు రుణాలు, ఇంటి పన్నులు, కరెంట్ బిల్లులు తదితర నగదు చెల్లింపులు పూర్తవుతున్నాయి. సాధారణ వ్యక్తితో మొదలుకొని సంపన్నులు, ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు, వైద్యులు, న్యాయవాదులు సైతం ఆర్థికపరమైన లావాదేవీలన్నీ దాదాపుగా ఆన్లైన్లోనే నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే సైబర్ నేరగాళ్లు సరికొత్త పంథాతో మోసాలకు పాల్పడుతున్నారు. వాట్సప్, మొబైల్ నంబర్లకు లింక్లను పంపిస్తూ.. వాటిని క్లిక్ చేయాల్సిందిగా నమ్మబలికి బ్యాంకు ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. మరికొందరు ఆన్లైన్ ట్రేడింగ్ మార్కెటింగ్లో పెట్టుబడుల పేరుతో మోసాలకు పాల్పడుతున్నారు. జిల్లా కేంద్రంతో పాటు గట్టు, ధరూరు, మానవపాడు, అలంపూర్, ఉండవెల్లి, శాంతినగర్, అయిజ తదితర పోలీస్స్టేషన్ల పరిధిలో ఐదు నెలల కాలంలోనే 98కి పైగా సైబర్ నేరాలు చోటుచేసుకోగా.. రూ. 88లక్షల నగదును సైబర్ నేరగాళ్లు దోచుకున్నారు. బాధితుల్లో ఉన్నత విద్యావంతులు, వ్యాపారులు, వైద్యులు, బ్యాంకు మేనేజర్ సైతం ఉండటం గమనార్హం. అత్యాశతో మోసం.. అదనపు ఆదాయం వస్తుందనే అత్యాశే సైబర్ మోసగాళ్లకు వరమవుతోంది. సామాజిక మాధ్యమాల్లో ప్రకటనల ద్వారా నేరగాళ్లు ప్రజలను ఆకట్టుకొని పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టే వరకు నమ్మకంగా ఉంటారు. ఆ తర్వాత పత్తా లేకుండాపోతున్నారు. సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి విద్యావంతులు, సాఫ్ట్వేర్ ఇంజినీర్లు, వైద్యులు, యువతతో పాటు మరికొందరు తమ కష్టార్జితాన్ని క్షణాల్లో పోగొట్టుకుంటున్నారు. బాధితులు తేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేసేలోగా జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. అప్రమత్తంగా ఉండాలి.. రోజురోజుకూ సైబర్ నేరాలు పెరుగుతున్న క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. సైబర్ నేరగాళ్ల బారినపడి ఎవరైనా మోసపోతే ఫిర్యాదు చేయడానికి కేంద్ర హోంశాఖ ప్రత్యేక వేదికను అందుబాటులోకి తీసుకొచ్చింది. సైబర్ క్రైం వెబ్సెట్ లేదా 1930 టోల్ఫ్రీ నంబర్కు ఫోన్చేసి ఫిర్యాదు చేయవచ్చు. లేదా సమీపంలోని పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయాలి. సైబర్ నేరగాళ్ల బారినపడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. బాధితులు పోగొట్టుకున్న డబ్బులు త్వరగా అందేలా చర్యలు తీసుకుంటున్నాం. – శ్రీనివాసరావు, ఎస్పీ ●మచ్చుకు కొన్ని ఘటనలు.. గత మార్చిలో జిల్లా కేంద్రానికి చెందిన ఓ బ్యాంకు ఉద్యోగి వాట్సప్కు చిన్నారుల కోసం నగదు సహాయం పేరిట ఫేక్ ఖాతా నుంచి సందేశం వచ్చింది. ఇది నిజమని నమ్మిన సదరు ఉద్యోగి.. వ్యక్తిగత నంబర్కు వచ్చిన ఓటీపీని సైబర్ నేరగాళ్లకు చెప్పడంతో క్షణాల్లోనే బ్యాంకు ఖాతాలోని రూ.1.50 లక్షలు మాయమయ్యాయి. గత ఫిబ్రవరిలో అయిజ పట్టణానికి చెందిన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడిని ఇన్స్ట్రాగామ్ ద్వారా ఆన్లైన్ ట్రేడింగ్ మార్కెటింగ్లో తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వస్తాయని సైబర్ నేరగాళ్లు నమ్మబలికారు. ఇది నమ్మిన సదరు ఉపాధ్యాయుడు.. అందులో పెట్టుబడులు పెట్టాడు. కొంతమేర లాభాలు రావడంతో ట్రేడింగ్ కంపెనీ నుంచి నగదు డ్రా చేసుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో సదరు కంపెనీ నిర్వాహకులు పన్నుల రూపంలో చెల్లించేందుకు కొంత నగదు జమ చేయాల్సిందిగా పేర్కొన్నారు. దీంతో మరికొంత నగదును డిపాజిట్ చేశారు. కంపెనీ నుంచి ఎలాంటి సమాచారం రాకపోవడంతో రూ. 1.50లక్షలు మోసపోయినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత ఏప్రిల్లో జిల్లా కేంద్రానికి చెందిన ఓ వ్యాపారికి సైబర్ నేరగాలు వీడియో కాల్ చేశారు. అతడు తప్పుడు ధ్రువపత్రాలతో లోన్ తీసుకున్నట్లు నమ్మబలికారు. మీపై కేసు నమోదు చేశామని.. వెంటనే తాము చెప్పిన ప్రాంతానికి రావాల్సిందిగా చెప్పారు. కేసు నుంచి మినహాయింపు కావాలంటే తాము చెప్పిన ఖాతాలోకి ఆన్లైన్ ద్వారా నగదు చెల్లించాలని ఒత్తిడి తెచ్చారు. దీంతో ఎలాగైనా కేసు నుంచి బయటపడాలని సదరు వ్యాపారి రూ. 1.80లక్షలు ఆన్లైన్లో జమచేశాడు. ఈ విషయాన్ని తెలిసిన స్నేహితులతో వివరించగా.. మోసం చేసినట్లు స్పష్టమైంది. ఐదు నెలల్లోనే 98కి పైగాసైబర్ నేరాలు రూ.88 లక్షలకు పైగా కాజేసిన నేరగాళ్లు ఆన్లైన్ మోసాలతో జనం విలవిల ఆందోళన చెందుతున్న ఖాతాదారులు -
నిషేధిత దందా
జడ్చర్ల: వానాకాలం (ఖరీఫ్) సీజన్ ఆరంభమవుతున్న వేళ బీటీ–3 నిషేధిత పత్తి విత్తనాల చెలామణి కలవరపెడుతుంది. సీజన్కు ముందే గ్రామీణ ప్రాంతాల్లో నకిలీ విత్తన వ్యాపారులు చాపకింద నీరులా అల్లుకుపోతున్నారు. ఇటీవల వర్షాలు కురవడంతో రైతులు సాగుకు సిద్ధమవుతూ.. విత్తనాల కోసం వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. అయితే విత్తన వ్యాపారులు వారికి ఎక్కువ కమీషన్ ఇచ్చే విత్తన కంపెనీలు సరఫరా చేసే నాసిరకం విత్తనాలను రైతులకు అంటగడుతున్నారు. ఈ ఏడాది విత్తనాల కొరత అంటూ కృత్రిమ కొరత సృష్టించే కుట్రలు చేస్తూ.. తమ పబ్బం గడుపుతున్నారు. అయితే రైతులు అధిక దిగుబడులు సాధించాలంటే ప్రాథమిక స్థాయిలో విత్తన ఎంపిక కీలకం. నాణ్యమైన విత్తనాలను ఎంపిక చేసుకుని సాగు చేస్తేనే అధిక దిగుబడులు వస్తాయి. ఇందుకు జన్యు, భౌతిక స్వచ్ఛత కలిగిన విత్తనాలను ఎంపిక చేసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నారు. భౌతిక స్వచ్ఛతకు సంబంధించి గింజ పరిమాణం, రంగు వంటి లక్షణాలను గమనించి విత్తనాలను ఎంపిక చేసుకోవాలి. వెంటాడుతున్న నాసిరకం విత్తనాలు నాసిరకం విత్తనాలు రైతాంగాన్ని వెంటాడుతున్నాయి. గతంలో అనేకసార్లు లూజు విత్తనాలకు రంగులద్దీ వివిధ కంపెనీల పేర్లతో ముద్రించిన కవర్లలో నింపి రైతులకు అంటగట్టిన పరిస్థితులు ఉన్నాయి. ఈ క్రమంలో పలుమార్లు నకిలీ విత్తనాలు, వాటికి సంబంధించిన కవర్లు అనేకం జడ్చర్లలో పట్టుబడిన సంఘటనలు లేకపోలేదు. పత్తి విత్తన కంపెనీలు కలిగిన భూత్పూర్లో సైతం అధికారులు పలుమార్లు సోదాలు చేసి నకిలీ పత్తి విత్తనాలను స్వాధీన పర్చుకున్నారు. అలాగే జడ్చర్ల మండలంలోని గోప్లాపూర్, ఈర్లపల్లి తదితర గ్రామాల్లో పలు వురు రైతుల వద్ద బీటీ–3 పత్తి విత్తనాలు దొరి కాయి. ఈ క్రమంలో ఈసారి నాణ్యత కలిగిన పత్తి విత్తనాలను రైతులకు విక్రయించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. రైతులను చైతన్యపరిస్తేనే.. బీటీ–3 పత్తి విత్తనాలకు సంబంధించి వ్యవసాయ శాఖ అధికారులు, శాస్త్రవేత్తలు రైతులకు తగు సూచనలు, సలహాలు ఇచ్చి అవగాహన కల్పించాలని పలువురు కోరుతున్నారు. తద్వారా బీటీ–3 విత్తనాలు సాగు చేయకుండా తగు చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ● బీటీ–3 పత్తి విత్తనాలను అడ్డుకోవడంలో పోలీస్, వ్యవసాయ శాఖల నిఘా కొరవడింది. ఇటీవలి వరకు ఎక్కడా తనిఖీలు చేసిన దాఖలాలు లేవు. ఇప్పటికే కొంత మంది రైతుల చేతుల్లోకి ఈ విత్తనాలు వెళ్లాయి. ఇప్పటికై నా పూర్తిస్థాయిలో నిఘా పెంచి బీటీ–3 విత్తనాలను అరికట్టేందుకు చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు. పెరుగుతున్న సాగు విస్తీర్ణం.. కొందరు రైతులు ప్రభుత్వం నిషేధించిన బీటీ–3 పత్తి విత్తనాలను గుట్టుగా సాగు చేస్తున్నారు. గత రెండు, మూడేళ్లుగా జిల్లాలో బీటీ33 పత్తి సాగు విస్తీర్ణం పెరుగుతూ వస్తుంది. ప్రభుత్వ ఆమోదం లేని బీటీ–3 (హెచ్టీ) పత్తి విత్తనాలను సైతం కొందరు వ్యాపారులు గుట్టుగా విక్రయిస్తున్నారు. ఏపీలోని గుంటూరు, మాచర్లతోపాటు గుజరాత్ రాష్ట్రాల నుంచి ఇప్పటికే లూజ్ పత్తి విత్తనాలు గ్రామాల్లోకి చేరాయి. వీటిని తక్కువ ధరలకే ఇస్తుండటం, కలుపు సమస్య కూడా పెద్దగా లేకపోవడంతో రైతులు ఆయా విత్తనాలే కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటి వరకు బీటీ–1, 2 రకాలకు మాత్రమే ప్రభుత్వ అనుమతి ఉండగా.. బీటీ–3 విత్తనాలకు ఇవ్వలేదు. అయితే అంతగా అవగాహన లేని రైతులకు కొందరు వ్యాపారులు వీటిని అంటగట్టేస్తున్నారు. బీటీ–3 విత్తనాలను రౌండప్ రెడీ ప్లెక్స్, గ్లైసల్ బీటీ పేర్లుతో కూడా పిలుస్తున్నారు. గుట్టుగా బీటీ–3 విత్తనాల అమ్మకాలు ఏపీ, గుజరాత్ రాష్ట్రాల నుంచి దిగుమతి ఇప్పటికే రైతులకు అంటగడుతున్న వ్యాపారులు సీజన్ ప్రారంభమైనా మేల్కోని వ్యవసాయ అధికారులు కలుపు మొక్కల భయంతో బీటీ–3 వైపే రైతుల మొగ్గు -
పకడ్బందీగా ఇళ్ల గణన
జనగణన–2027లో భాగంగా ఇళ్ల గణనను పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ పేర్కొన్నారు. శనివారం కలెక్టర్ క్యాంపు కార్యాలయం వివరాలను సేకరించేందుకు వచ్చిన స్థానిక బ్లాక్ అధికారులకు కలెక్టర్ వివరాలు తెలియజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను అమలు చేసేందుకు, వివిధ అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించేందుకు, ప్రజలకు రిజర్వేషన్లు కల్పించేందుకు జనగణన దోహదపడుతుందన్నారు. ప్రజలు సంబంధిత అధికారులకు ప్రభుత్వం నిర్దేశించిన వివరాలను తెలియజేసి జిల్లాలో సెన్సెస్ విజయవంతం చేసేందుకు సహకరించాలని కోరారు. -
నిబంధనలు కఠినం
నారాయణపేట రూరల్: పాఠశాలలకు పదేళ్లకు ఒకసారి ప్రభుత్వ గుర్తింపును పునరుద్ధరించుకునే వెసులుబాటు ఉండగా.. జూనియర్ కళాశాలలు ఏటా అిఫిలియేషన్ పొందాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ప్రభుత్వ కళాశాలలకు నామమాత్రంగా అనుమతులు ఇస్తుండగా, ప్రైవేట్లకు అన్నిరకాల సౌకర్యాలు పరిశీలించి నిబంధనల ప్రకారం విద్యార్థుల అడ్మీషన్లు తీసుకోవడానికి అవకాశం కల్పిస్తారు. ఈ క్రమంలో నాలుగేళ్లుగా వాటిని మరింత కచ్చితంగా అమలు చేసేందుకు ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడంతో ఇంటర్బోర్డు అదే పద్ధతిలో ముందుకుసాగుతోంది. నిబంధనలు ఇలా.. వాస్తవంగా అన్నిరకాల విద్యాసంస్థలు కొత్తగా తెరిచే సమయంలో అనుమతులు తీసుకుంటారు. పాఠశాలలకు పదేళ్లకు ఓసారి పునరుద్ధరించుకోవాల్సి ఉంటుంది. కాని కళాశాలలు మాత్రం ఏటా అనుమతి తీసుకోవాలి. దీనికి అన్నిరకాల పత్రాలు సమర్పించడంతోపాటు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అయితే ప్రభుత్వ, ప్రభుత్వ సెక్టార్లోని కళాశాలలకు నామమాత్రంగా నిబంధనలు వర్తింజేస్తున్నారు. ముఖ్యంగా ఆర్అండ్బీ అధికారులు ఇచ్చే బిల్డింగ్ సౌండ్నెస్ సర్టిఫికేట్, మున్సిపాలిటీ, పంచాయతీ ఇచ్చే శానిటరీ సర్టిఫికేట్, అగ్నిమాపకశాఖ ఇచ్చే ఫైర్ సేఫ్టీ సర్టిఫికేట్లతో అనుమతులు ఇస్తున్నారు. ఇక ప్రైవేట్ కళాశాలల విషయంలో గతంలో కంటే ప్రస్తుతం నిబంధనలు కట్టుది ట్టం చేశారు. ప్రతి కళాశాల తప్పకుండా ఎన్ఓసీ అందిస్తూ ఆటస్థలం, గుర్తింపు పత్రం, సరిపడ అధ్యాపకులు, సిబ్బంది, సామగ్రి, ల్యాబ్, గ్రంథాలయం, రూ.4 లక్షల ఎఫ్డీ బాండ్లు, బిల్డింగ్ లీజ్ డీడ్ వివరాలు తెలియజేయాలి. ఇక అద్దె భవనం, ఆట స్థలం అయితే తప్పకుండా లీజ్ డీడ్ విద్యా సంవత్సరానికి సరిపడా సమయం ధ్రువపత్రం జత చేయాలి. కళాశాల భవనంలో ఇతర వ్యాపార సంస్థలు ఉండరాదనే నిబంధనలు పరిశీలిస్తున్నారు. మౌలిక వసతులు, అగ్నిమాపక అనుమతులు తప్పనిసరి చేశారు. 2026–27 సంవత్సరానికిగాను.. నిబంధనలు కఠినతరం చేయడంతో అన్ని సౌకర్యాలు లేని కళాశాలలకు 2026–27 విద్యా సంవత్సరానికిగాను గుర్తింపు ఇవ్వడం లేదు. ఉమ్మడి జిల్లాలో 71 జనరల్, 31 ఒకేషనల్ ప్రైవేట్ కళాశాలు ఉండగా.. కేవలం 13 కళాశాలలకు మాత్రమే అనుమతులు వచ్చాయి. అవి కూడా అన్ని గద్వాల జిల్లాకు చెందినవి కావడం విశేషం. ఇక నారాయణపేట, వనపర్తి, నాగర్కర్నూల్, మహబూబ్నగర్లో ఏ ఒక్క కళాశాలకు కూడా అఫ్లియేషన్ ప్రక్రియ పూర్తికా లేదు. దరఖాస్తు గడువు పూర్తయినా వివిధ కారణాలతో చాలా కళాశాలలు పెండింగ్లోనే ఉన్నాయి. కొనసాగుతున్న ప్రవేశాలు..? సోమవారం కళాశాలలు పునః పారంభం కానున్నాయి. అయినా ప్రైవేట్ కళాశాలలకు ఇప్పటికీ అనుబంధ గుర్తింపు రాలేదు. ప్రస్తుతం అనుమతులు రాని కళాశాలలు సై తం అిఫిలియేషన్ విషయాన్ని బయటకు చెప్పకుండా కళాశాల ఫారంపై విద్యార్థులతో ప్రవేశాలు తీసుకుంటున్నారు.ప్రైవేట్ కళాశాలల్లో లోపం.. ప్రభుత్వ గుర్తింపులో జాప్యం గద్వాల మినహా మిగతా జిల్లాల్లోఅనుమతులు నిల్ అయోమయంలో ‘పది’ పూర్తిచేసిన విద్యార్థులు -
వారంలోగా ధాన్యం సేకరణ పూర్తి
జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): జిల్లాకు సంబంధించిన ధాన్యం కొనుగోలు ప్రక్రియను వారం రోజుల్లో (జూన్ 4, 5 తేదీలో)గా పూర్తి చేయాలని రాష్ట్ర పౌర సరఫరాలు, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అధికారులను ఆదేశించారు. రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని స్పష్టం చేశారు. శనివారం మహబూబ్నగర్ కలెక్టరేట్లోని మీటింగ్ హాల్లో ఉమ్మడి పాలమూరుకు సంబంధించిన ధాన్యం కొనుగోళ్లపై ఎమ్మెల్యేలు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోనే అత్యధిక వరిధాన్యం పండించిన రాష్ట్రంగా తెలంగాణ నంబర్వన్ స్థానంలో నిలిచిందన్నారు. వరి, మొక్కజొన్న ధాన్యం చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని, రైతులు నష్టపోకుండా తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేసి బాయిల్డ్ మిల్లులకు తరలించినట్లు వెల్లడించారు. వాతావరణ శాఖ జూన్ 4 తర్వాత వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించిన నేపథ్యంలో వారం రోజుల్లోగా జూన్ 4, 5 తేదీల్లోగా కొనుగోళ్లు ప్రక్రియ పూర్తిచేయాలని సూచించారు. కొనుగోలు, రవాణా, నిల్వ, రైతులకు చెల్లింపుల ప్రక్రియను సమన్వయంతో వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ధాన్యం సేకరణలో రాష్ట్రవ్యాప్తంగా 8,575 కేంద్రాలు, 13 వేల వాహనాలు, 2 లక్షల మంది సిబ్బంది, 2008 రైస్ మిల్లులు భాగస్వామ్యం అయ్యాయని, 20.80 కోట్ల గన్నీ సంచులు సరఫరా చేశామన్నారు. శనివారం వరకు 62 లక్షల మె.ట., ధాన్యం సేకరించి.. 8.75 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.1,11,500 కోట్లు జమ చేసినట్లు వెల్లడించారు. జిల్లాల వారీగా గోదాంలలో నిల్వ స్థలాల కేటాయింపుపై పరస్పర సమన్వయం చేసుకోవాలని రాష్ట్ర పౌర సరఫరాల కమిషనర్ స్టీఫెన్ రవీంద్రను ఆదేశించారు. జూన్ 4, 5 తేదీల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఉమ్మడి జిల్లాలో ప్రాజెక్టుల సందర్శిస్తారని, జూరాలతో పాటు పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టును పరిశీలిస్తారని చెప్పారు. రైతు పండించిన ప్రతిగింజను కొనుగోలు చేస్తాం తడిసిన ధాన్యాన్ని కొని గోదాంలకు తరలించాం 4, 5 తేదీల్లో సీఎం రేవంత్రెడ్డి ప్రాజెక్టుల సందర్శన రాష్ట్ర పౌర సరఫరాలు, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి -
ప్రజా సంక్షేమానికి నిరంతరం కృషి
అలంపూర్: నియోజకవర్గ ప్రజల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తానని ఎమ్మెల్యే విజయుడు అన్నారు. అలంపూర్ చౌరస్తాలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీకి ఆయన హాజరై మాట్లాడారు. నియోజకవర్గంలోని అలంపూర్, వడ్డేపల్లి, ఇటిక్యాల, ఎర్రవల్లి, ఉండవెల్లి, రాజోలి, మానవపాడు మండలాల్లోని 428 మంది లబ్ధిదారులకు రూ.4,28,49,648 విలువైన చెక్కులు అందజేశామన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలన్నారు. పేద, మధ్య తరగతి ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించడమే లక్ష్యంగా పని చేస్తానన్నారు. గ్రామాల్లో సమస్యలు ఉంటే తమ దృస్టికి తీసుకురావాలని, వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని చెప్పారు. కార్యక్రమంలో ఆయా మండలాల రెవెన్యూ అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. వేరుశనగ క్వింటా రూ.7,529 గద్వాల వ్యవసాయం: జిల్లాకేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డుకు శనివారం 43 క్వింటాళ్ల వేరుశనగ రాగా.. గరిష్టంగా రూ.7,529, కనిష్టంగా రూ.5,320, సరాసరిగా రూ.7,242 ధరలు లభించాయి. 6 క్వింటాళ్ల ఆముదాలు రాగా.. సరాసరిగా రూ.6,171 ధర పలికింది. 49 క్వింటాళ్ల వరి (సోన) రాగా.. గరిష్టంగా రూ.2,470, కనిష్టంగా రూ.2,018, సరాసరిగా రూ.2,226 ధరలు వచ్చాయి. వచ్చేనెల పీయూలో జాతీయ సదస్సు మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీలో జూన్ చివరి వారంలో జాతీ య సదస్సును నిర్వహిస్తున్నట్లు వీసీ జీఎన్ శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ మేరకు పీయూలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయ న మాట్లాడారు. పీయూకు ప్రభుత్వం రూ.100 కోట్లు కేటాయించిన నేపథ్యంలో ‘విజన్ ఇండియా 2047 ఇంటిగ్రేటింగ్ సైన్స్ ఇన్నోవేషన్ అండ్ యూత్ ఎంపవర్మెంట్’ థీమ్తో సదస్సు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమానికి సీఎం రేవంత్రెడ్డి, కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరుకానున్నారని పేర్కొన్నారు. వీరితో పాటు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ సెక్రటరీ, ప్రభుత్వ కార్యదర్శులు, కేంద్ర, రాష్ట్రాలకు చెందిన యూనివర్సిటీల వైస్ఛాన్స్లర్లు, అన్ని యూనివర్సిటీలు, కళాశాలల పీఎం ఉషా స్కీం కోఆర్డినేటర్స్ పాల్గొనున్నట్లు పేర్కొన్నారు. రెండు రోజులపాటు నిర్వహించే కార్యక్రమంలో పలు సెషన్స్లో వివిధ అంశాలపై కార్యక్రమాలు ఉంటాయన్నారు. ఇటువంటి కార్యక్రమం దక్షిణ భారత్లో నిర్వహించడం మొదటిసారని, గతంలో ఉత్తరభారత్లో ఒక సారి నిర్వహించారన్నారు. ముఖ్యంగా ఇండస్ట్రీలను యూనివర్సిటీలతో కలిసిపోయే విధంగా కార్యక్రమం ఉంటుందని, స్టార్టప్లు, వివిధ కంపెనీలు, రీసెర్చ్ స్కాలర్స్తో కార్యక్రమలలో భాగంగా స్టాళ్లను ఏర్పా టు చేసి విద్యార్థులతోపాటు అందరికీ వీటిపై అవగాహన పెంచే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. జాతీయ సదస్సు కోఆర్డినేటర్ మధుసూదన్రెడ్డి మాట్లాడుతూ.. యూనివర్సిటీకి జాతీయస్థాయిలో కార్యక్రమాన్ని నిర్వహించేందుకు అవకాశం రావడం గొప్ప విషయమన్నారు. -
నష్టాల్లో కూరుకుపోయాం..
మామిడి తోటల కారణంగా ఈసారి తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చింది. 20 ఎకరాలు లీజుకు, సొంతంగా 10 ఎకరాలు మొత్తం 30 ఎకరాలకు గాను రూ.15 లక్షల దాకా పెట్టుబడులు పెట్టాం. ఈసారి పూత బాగానే వచ్చినా.. తర్వాత చీడపీడల కారణంగా పిందెలు రాలిపోయాయి. ఉన్న మామిడి కాయలను అమ్ముకునేందుకు మార్కెట్కు వెళ్తే.. 22 కిలోల బాక్స్ రూ.500–700 వరకు కొన్నారు. మామిడి కాయలను నిల్వ ఉంచుకునేందుకు వీలు కాక తక్కువ ధరకే అమ్ముకోవాల్సి వచ్చింది. వ్యాపారులు సిండికేట్గా మారి కనీస మద్దతు ధర కూడా ఇవ్వలేదు. – తెలుగు తిమ్మప్ప, కౌలురైతు, గట్టు -
మామిడీలా..!
మార్కెట్లో ఫలరాజుకు అంతంతగానే ధరలు గట్టు: మామిడి రైతులు ఈసారి గిట్టుబాటు ధరలు లభించకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. వ్యాపారులు సిండికేట్గా మారడంతో గిట్టుబాటు ధరలు లభించక మామిడి రైతులు తీవ్ర నిరాశకు గురయ్యారు. జోగుళాంబ గద్వాల జిల్లావ్యాప్తంగా 5,020 ఎకరాల్లో మామిడి తోటలు సాగు చేయగా.. అందులో ఈసారి 3,525 ఎకరాల్లో మామిడి తోటలు కాపునకు వచ్చేశాయి. గట్టు, కేటీదొడ్డి, ధరూరు మండలాల్లో ఎక్కువగా మామిడి తోటలను సాగు చేస్తుంటారు. ఇక్కడి భూములు మామిడి సాగుకు అనుకూలంగా ఉండడంతో రైతులు తోటల సాగు వైపు దృష్టిని సారిస్తున్నారు. ఇక్కడ పండిన మామిడి కాయలను హైదరాబాద్తోపాటుగా పక్కనే ఉన్న కర్ణాటకలోని రాయచూర్కు మార్కెట్లకు తరలిస్తుంటారు. మహారాష్ట్ర నుంచి కూడా కొంత మంది వ్యాపారులు ఇక్కడికి వచ్చి మామిడి కాయలను కొనుగోలు చేస్తుంటారు. మామిడి సీజన్ ప్రారంభంలో పూత విపరీతంగా ఉండగా వాటిని చూసిన రైతులు సంతోషపడ్డారు. అయితే పూత దశ తర్వాత పిందెలు, కాయలుగా మారే క్రమంలో వాతావరణంలో మార్పులు, చీడపీడల కారణంగా పిందెలు రాలిపోవడంతో రైతులు డీలా పడ్డారు. పంట దిగుబడి కేవలం 60 శాతానికి పడిపోగా.. దీనికి తోడు మార్కెట్ ధరలు సీజన్ ప్రారంభ దశలో ఆశాజనకంగా ఉన్నా.. ఆ తర్వాత రేట్లు పడిపోవడంతో మామిడి మరింత నిరాశకు గురయ్యారు. మృగశిర కార్తె (జూన్ 8) వరకు మామిడి తోటల్లో ఉండాల్సిన మామిడి కాయలను మే నెల రెండో వారం (మే 15 వరకు) వరకే ఖాళీ చేశారు. తోటల్లో ఉన్న మామిడి కాయలను పూర్తిగా తెంపి మార్కెట్లో తక్కువ ధరకు విక్రయించినట్లు రైతులు వాపోయారు. లీజుకు తోటలు.. మామిడి తోటల నిర్వహణను కొంతమంది రైతులే స్వయంగా చూసుకుంటుండగా.. మరికొంత మంది వాటిని లీజుకు ఇచ్చేస్తుంటారు. కర్ణాటక ప్రాంతానికి చెందిన చాలామంది రైతులు ఇక్కడికి వచ్చి మామిడి తోటలను లీజుకు తీసుకుని వాటి నిర్వహణ బాధ్యతలు చేపడుతుంటారు. స్థానికంగా ఉండేవారు కూడా కొంత మేరకు మామిడి తోటలను లీజుకు తీసుకుంటారు. ఇందుకోసం రూ.లక్షల్లో కౌలు చెల్లిస్తారు. అయితే ప్రకృతి వైపరీత్యాలు ఒకవైపు.. మార్కెట్ ధరలు మరోవైపు రైతులను కుదురుకోకుండా చేస్తుండడంతో నష్టాల ఊబిలో చిక్కుకుంటారు. ఈసారి వాతావరణ పరిస్థితులతో తగ్గిన దిగుబడులు సిండికేట్గా మారి చక్రం తిప్పుతున్న వ్యాపారులు గిట్టుబాటు కాక రైతుల ఆందోళన జిల్లావ్యాప్తంగా 5,020 ఎకరాల్లో సాగు -
ధరల హెచ్చుతగ్గులతో..
మామిడి మార్కెట్ మొదట మార్చి, ఏప్రిల్ నెలల్లో రైతులను ఊరించింది. మార్కెట్కు మామిడి కాయలు పోటెత్తడంతో వ్యాపారులు సిండికేట్గా మారి ధరలను ఒక్కసారిగా తగ్గించేయడంతో రైతులు తల్లడిల్లిపోయారు. మామిడి కాయల రకాల విషయానికొస్తే హిమాయత్ మొదట్లో 22 కిలోల బాక్స్ ధర మార్చి, ఏప్రిల్ మొదటి వారం వరకు రూ.4,500 ఉండగా.. మే వచ్చేసరికి రూ.వెయ్యికి పడిపోయింది. కేసరి రకం మొదట్లో 22 కిలోల బాక్స్ రూ.3 వేలు ఉండగా.. చివరికి రూ.500కు చేరింది. బేనిషాన్ మొదట్లో 22 కిలోల బాక్స్ రూ.1,600 వరకు లభించగా.. చివరికి రూ.500, దసిరి మొదట్లో 22 కిలోల బాక్స్ రూ.2 వేలు కాగా.. ప్రస్తుతం రూ.500లకు చేరింది. మిగతా సుందరి, ఆపూస, తోతాపరి, మల్లిక వంటి రకాల మామిడి కాయలు మొదట్లో ఓ మాదిరి మద్దతు ధర లభించగా.. చివరలో తక్కువ ధరకు పడిపోవడంతో తోటలు సాగు చేస్తున్న, లీజుకు తీసుకున్న రైతులు లబోదిబోమంటున్నారు. -
వివక్ష లేని సమాజాన్ని నిర్మిద్దాం
గద్వాల: ప్రస్తుతం మహిళలు అనేక రంగాల్లో రాణిస్తున్నారని, మహిళా సాధికారతతో వివక్ష లేని సమాజ నిర్మాణం జరుగుతుందని అదనపు కలెక్టర్ నర్సింగ్రావు అన్నారు. ప్రజాపాలన– ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న మహిళా సంక్షేమ వారోత్సవాల్లో శనివారం కలెక్టరేట్లో జిల్లాలోని స్నేహ సంఘాల సభ్యులతో మాక్ పార్లమెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూనిసెఫ్ సహకారంతో బాలికల సర్వతోముఖాభివృద్ధికి జిల్లాలోని అన్ని గ్రామాల్లో స్నేహ సంఘాలను ఎన్నుకోవడం జరిగిందన్నారు. బాలికలు ప్రజాస్వామ్య వ్యవస్థ, నాయకత్వ నైపుణ్యాలు, ప్రజా సమస్యల ప్రతిపాదన, ప్రశ్నించడం తదితర విషయాలపై అవగాహన పెంపొందించేందుకు మాక్ పార్లమెంట్ దోహదపడుతుందన్నారు. స్నేహసంఘాల ద్వారా అమ్మాయిలు తమ గ్రామాల్లోని బాల్యవివాహాలు, నిరక్షరాస్యత వంటి సామాజిక సమస్యలను పరిష్కరించేందుకు తమవంతుగా కృషి చేయాలన్నారు. అనంతరం బాలికలు మాక్పార్లమెంట్ ద్వారా జిల్లాలోని వివిధ సామాజిక సమస్యలను ప్రస్తావించారు. పలు పాఠశాలల్లో మరుగుదొడ్లు లేకపోవడం, ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలల ఏర్పాటు, రవాణా సౌకర్యాల కల్పన తదితర సమస్యలను బాలికలు తెలియజేయగా సంబంధిత అధికారులు స్పందిస్తూ వాటి పరిష్కారానికి కృషిచేస్తామన్నారు. కార్యక్రమంలో యూనిసెఫ్ రాష్ట్ర సమన్వయకర్త మురళి, డీఆర్డీఓ ముషాయిదాబేగం, ఏపీడీ శ్రీనివాస్, డీడబ్ల్యూఓ సునంద, డీఈఓ విజయలక్ష్మి, మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు ప్రభావతి తదితరులు పాల్గొన్నారు. -
పోక్సో.. కాస్కో
ఉమ్మడి జిల్లాలో బాలికలపై పెరుగుతున్న అత్యాచారాలు ● 2020 నుంచి ఉమ్మడి జిల్లాలో 2,369 పోక్సోకేసులు ● ఏడేళ్ల వ్యవధిలో ఒక్క మహబూబ్నగర్లోనే 758 కేసులు నమోదు ● కీచకులుగా మారుతున్న కొందరు ఉపాధ్యాయులు ● పకడ్బందీగా చట్టం అమలుతో నిందితులకు కఠిన శిక్షలు మహబూబ్నగర్ క్రైం: బాలికలు, అమ్మాయిలను లైంగిక వేధింపులు, దాడుల నుంచి రక్షించడానికి కేంద్ర ప్రభుత్వం పోక్సో (ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రం సెక్సువల్ అఫెన్సెస్) చట్టాన్ని 2012 నుంచి అమల్లోకి తీసుకువచ్చింది. ఈ సెక్షన్ కింద అభియోగం మోపబడిన వారికి రెండు నెలలు లేదా ఆరు నెలలు లేదా ఏడేళ్లు లేకుంటే జీవితఖైదు శిక్ష పడుతుంది. ప్రధానంగా పోక్సో కేసు నమోదు చేసిన అతి తక్కువ కాలంలో పరిశోధన చేసి సంబంధిత వ్యక్తిపై చార్జిషీటు దాఖలు చేసి కోర్టులో హాజరుపరచాలి. ఆ తర్వాత న్యాయమూర్తి సంఘటన తీవ్రతను బట్టి నిందితుడికి జైలుశిక్ష ఖరారు చేస్తారు. గురువులు సైతం వక్ర బుద్ధి ఏం చేసిన బయటకు పొక్కదనో.. లేదా నోరు లేదనో అభంశుభం తెలియని బాలికలపై కొందరు ప్రబుద్ధులు వెకిలి చేష్టలకు పాల్పడుతున్నారు. కొందరు యువత అశ్లీల వీడియోల ప్రభావంతో మైనర్లపై అఘాయిత్యాలకు తెగబడుతున్నారు. అలాగే విద్యార్థినులకు విద్యాబుద్దులు నేర్పాల్సిన గురువులు సైతం వారిపై అఘాయిత్యాలకు పాల్పడుతున్న ఘటనలు జిల్లాలో నిత్యం చోటు చేసుకుంటున్నాయి. అయితే ఉమ్మడి జిల్లావ్యాప్తంగా కొన్ని ప్రభుత్వ పాఠశాలలోనే ఇలాంటి ఘటనలు జరుగుతుండటం బాధాకారం. కొంతకాలంగా జిల్లాలో కేసుల సంఖ్య పెరుగుతూ వస్తుండగా, తీవ్రతను బట్టి కోర్టులు జీవిత ఖైదు శిక్షలు విధిస్తున్నాయి. బెయిల్ దొరకడం కష్టమే.. పోక్సో కేసులు చాలా సున్నితమైనవి. అంతే కాకుండా నేరం రుజువైతే నిందితులకు బెయిల్ దొరకడం కష్టమేనని పోలీసులు పేర్కొంటున్నారు. ఒక్కసారి కేసు నమోదైతే ఆ తర్వాత ఇతర కేసుల మాదిరిగా రాజీ కుదుర్చుకునే అవకాశం కూడా ఉండదు. కేవలం దోషిని కటకటాల్లోకి నెట్టడంతోనే దీని పర్యావసనం ఆగిపోదు. మొత్తం కుటుంబం సమాజంలో విలువను కోల్పోయి తలదించుకు బతకాల్సి వస్తుంది. ఉమ్మడి పాలమూరులోని ఐదు జిల్లాలో కలిపి 2020 నుంచి ఇప్పటి వరకు మొత్తం 2,369 పోక్సో కేసులు నమోదయ్యాయి. వీటిలో నేరారోపణలు రుజువై 40 మందికి శిక్ష పడింది. దాదాపు 90 శాతం కేసులు ఇంకా కోర్టు పరిధిలోనే ఉన్నాయి. అత్యధికంగా మహబూబ్నగర్ జిల్లాలో 758 పోక్సో కేసులు నమోదయ్యాయి. ● ‘నారాయణపేట జిల్లా మద్దూరు మండలంలోని ఓ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న బాలికపై అక్కడ పనిచేస్తున్న ఉపాధ్యాయుడు స్వామి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ కేసులో మొత్తం ఏడుగురిని రిమాండ్కు తరలించారు.’ ● మహబూబ్నగర్ రూరల్ పోలీస్స్టేషన్ పరిధిలోని ధర్మాపూర్ పాఠశాలతోపాటు షాసాబ్గుట్ట, వన్టౌన్ స్టేషన్ పరిధిలో వీరన్నపేట హైస్కూల్లో పనిచేసే ప్రభుత్వ ఉపాధ్యాయులు ఆయా పాఠశాలల్లో చదువుతున్న పదో తరగతి అమ్మాయిలపై లైంగిక దాడి చేయగా ఈ ముగ్గురిపై పోక్సో కేసులు నమోదయ్యాయి.’ 2020 నుంచి జిల్లాల వారీగా నమోదైన పోక్సో కేసులు ఇలా... మహబూబ్నగర్ జోగుళాంబ గద్వాలనారాయణపేట నాగర్కర్నూల్వనపర్తిఅవగాహన కల్పిస్తున్నాం.. అమ్మాయిల పట్ల లైంగిక దాడులకు పాల్పడే వారు ప్రభుత్వ ఉద్యోగులైనా.. ఇతరులైనా పోక్సో చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. 7వ తరగతి నుంచి ఈ చట్టంపై అవగాహన కల్పించే విధంగా పోలీస్ శాఖ చర్యలు చేపట్టింది. పాఠశాల, ఇంటర్ విద్యార్థులతో పాటు గ్రామాల్లో ప్రజలకు సైతం ఈ చట్టం గురించి వివరిస్తున్నాం. బాలికల పట్ల ఎవరైనా దాడులకు పాల్పడితే వెంటనే డయల్ 100కు సమాచారం ఇవ్వడం, పోలీసులకు ఫిర్యాదు వంటివి చేయాలి. – వెంకటేశ్వర్లు, డీఎస్పీ, మహబూబ్నగర్ 2026 28 2025 51 2024 44 -
మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించాలి
గద్వాల న్యూటౌన్: స్వయం సహాయక సంఘాల మహిళలు బ్యాంకులు అందిస్తున్న రుణాలతో వ్యాపారాలు నిర్వహించుకొని, ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి అన్నారు. ప్రజా పాలన– ప్రగతి ప్రణాళికలో భాగంగా శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పట్టణ ఇందిరా క్రాంతి పథం (మెప్మా)– గద్వాల మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన రుణమేళాలో ఆయన మాట్లాడారు. మహిళలు ఆర్థికంగా ఎదిగినప్పుడే ఆ కుటుంబం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ, అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందన్నారు. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఉచిత బస్సు సౌకర్యం కల్పించిందని చెప్పారు. మహిళలు ప్రతిఒక్కరు సంఘాల్లో సభ్యులుగా చేరాలని సూచించారు. ప్రభుత్వం స్వయం సహాయక సంఘాల మహిళలకు బ్యాంకుల ద్వారా రుణాలు అందించడంతోపాటు, వాటి వడ్డీ డబ్బులను కూడా చెల్లిస్తోందన్నారు. మహిళలు కుటీర పరిశ్రమలతోపాటు పరిశ్రమలు, సూపర్ మార్కెట్లు నెలకొల్పాలన్నారు. వివిధ వృత్తులు, వ్యాపారాలకు సంబంధించి ప్రావీణ్యం పొందేందుకు గద్వాలలో త్వరలోనే మహిళా శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. మున్సిపల్ చైర్పర్సన్ జయలక్ష్మి మాట్లాడుతూ బ్యాంకుల ద్వారా అందుతున్న రుణాలతో మహిళలు అన్నిరంగాల్లో రాణించాలన్నారు. పట్టణంలో స్వయం సహాయక సంఘాల మహిళలకు అండగా ఉంటానన్నారు. అనంతరం ఎమ్మెల్యే, చైర్పర్సన్లు బ్యాంకు లింకేజీ కింద రూ.4.37 కోట్ల చెక్కును పట్టణ స్వయం సహాయ సంఘాల మహిళలకు అందించారు. కార్యక్రమంలో కమిషనర్ జానకిరాంసాగర్, కౌన్సిలర్లు బాబర్, ముత్యాల లక్ష్మి, వేదవతి, రామలింగేశ్వర్ కాంమ్లే, నాగులు యాదవ్, మెప్మా సిబ్బంది, ఆర్పీలు, మహిళలు పాల్గొన్నారు. -
సర్ ప్రక్రియకు పకడ్బందీ చర్యలు
గద్వాల: ఓటరు జాబితాలో ఎలాంటి తప్పిదాలకు ఆస్కారం లేకుండా పారదర్శకంగా రూపొందించేలా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రిజ్వాన్బాషాషేక్ అన్నారు. ఎస్ఐఆర్(స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్)పై శుక్రవారం హైదరాబాద్ నుంచి ఎన్నికల అదనపు ముఖ్య అధికారి వెంకటేశ్వర్రెడ్డి సంబంధిత ఉన్నతాధికారులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొని మాట్లాడారు. అనంతరం కలెక్టర్ జిల్లా అధికారులతో మాట్లాడుతూ సరిగ్గా పనిచేయని బీఎల్వోల స్థానంలో కొత్తవారి నియామకం చేపట్టాలన్నారు. సంబంధిత మండలాల తహసీల్దార్లు తమ పరిధిలోని సూపర్వైజర్లు, బీఎల్ఓలతో సమావేశాలు నిర్వహించి ఎస్ఐఆర్ ప్రక్రియ వేగవంతంగా పూర్తి చేసేందుకు కృషి చేయాలన్నారు. ఇప్పటివరకు జిల్లాలో 78.52 శాతం మ్యాపింగ్ పూర్తయిందని, జిల్లావ్యాప్తంగా గద్వాల మండలంలో చాలా తక్కువ మ్యాపింగ్ జరిగిందని వేగవంతం చేయాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ మధుమోహన్, ఆర్డీఓ శ్రీనివాసరావు, తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు. -
రైతన్నకు మరో బరువు
భారీగా పెరిగిన ఎరువుల ధరలు ● ఏటా రెట్టింపవుతున్నపంట పెట్టుబడులు ● ఇప్పటికే కూలీలు, ఇతర ఖర్చులతో కుంగుబాటు ● తాజాగా ఎరువులతో అన్నదాతలపై మరింత ఆర్థిక భారం ● చివరికి రైతులకు మిగిలేది కష్టాలు.. నష్టాలే ఎరువుల వాడకం తగ్గించాలి.. ఇష్టానుసారంగా రసాయనిక ఎరువులను వినియోగించడం వల్ల భూసారం తగ్గడంతోపాటు అనేక అనర్థాలు కలుగుతాయి. కాబట్టి రైతులు రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గించాలి. సేంద్రియ పద్ధతుల ద్వారా వ్యవసాయం చేయాలి. దీనివల్ల ఖర్చు తగ్గడంతోపాటు పంట ఉత్పత్తులు నాణ్యతగా ఉండి, మంచి దిగుబడులు వస్తాయి. – వీరప్ప, జిల్లా వ్యవసాయాధికారి ధరలు తగ్గించాలి.. ప్రతి ఏడాది పంట పెట్టుబడులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇప్పుడు ఎరువుల ధరలు పెరగడం వల్ల కొత్త కష్టం వచ్చింది. అన్ని రకాల ఎరువుల ధరలు పెరిగాయి. పెరుగుతున్న ధరల ప్రకారం పంటల గిట్టుబాటు ధరలు పెంచడం లేదు. పెంచిన ధరలను తగ్గించాలి. – సూరి, రైతు, గద్వాల రైతులకు ఇబ్బందే.. ప్రతి పంటకు ఎరువులు వాడాల్సిన పరిస్థితి ఉంది. రకాన్ని బట్టి ఎరువుల బస్తాపై రూ.150 నుంచి రూ.450 వరకు పెరగడం రైతులుగా మా మీద ఆర్థికంగా చాలా భారం పడుతుంది. ప్రభుత్వం అందిస్తున్న పెట్టుబడి సాయం ఏమాత్రం సరిపోవడం లేదు. ఏటా పెట్టబడులు పెరుగుతూ పోతే వ్యవసాయం చేయడం కష్టమే. – అక్కన్న నాయుడు, రైతు, గోకులపాడు, మానవపాడు మండలం గద్వాల వ్యవసాయం: ఆరుగాలం కష్టించి పంటలు పండించే అన్నదాతలకు ఉన్న కష్టాలకు తోడు.. ఏటా ఏదో ఒక రూపంలో కొత్త కష్టాలు ఎదురవుతూనే ఉన్నాయి. కొద్దిరోజుల క్రితం పెరిగిన ఎరువుల ధరలు దరువులు వేస్తున్నాయి. ఏటేటా పెరుగుతున్న పెట్టుబడులతో సతమతమవుతున్న అన్నదాతలకు పెరిగిన ఎరువుల ధరలు మరింత ఆర్థికభారాన్ని మోపనున్నాయి. క్రమంగా ఎరువుల వాడకం.. గతంలో రైతులంతా సేంద్రియ పద్ధతిన పంటలు పండించే వారు. తర్వాతి కాలంలో వచ్చిన మార్పులు.. ఆహార కొరతను అధిగమించడానికి, దిగుబడులను పెంచడానికి రసాయనిక ఎరువుల వాడకం మొదలైంది. ఒకరిని చూసి మరొకరు అన్నట్టుగా వీటి వాడకం పెరుగుతూ వచ్చింది. రసాయనిక ఎరువులతో మాత్రమే మొక్కలకు అవసరమైన పోషకాలు, ఖనిజాలు తక్షణమే అంది దిగుబడులు పెరుగుతాయని రైతులు నిర్ధారించుకుని, వాటినే వినియోగిస్తూ వస్తున్నారు. మొక్కల పెరుగుదల, వేరు వ్యవస్థను బలోపేతం చేయడానికి, పూత, కాయలు రావడానికి, తెగుళ్లను తట్టుకునేశక్తి రావడానికి వీటిలో ఉండే నత్రజని, భాస్వరం, అమ్మోనియం, పొటాషియం తదితర పోషకాలు పుష్కలంగా ఉంటాయని రైతులు భావిస్తూ వచ్చారు. వరి, పత్తి, కంది, ఆముదాలు, వేరుశనగ, జొన్న, సజ్జ, మొక్కజొన్న ఇలా అన్ని రకాల పంటలతోపాటు కూరగాయలు, పండ్లతోటలను సైతం రసాయనిక ఎరువులతోనే పండిస్తున్నారు. ఎరువు పాత ధర కొత్త ధర 14–35–14 1,900 2,350 24–24–0 2,000 2,300 10–26–26 1,950 2,250 20–20–0–13 1,800 2,150 16–16–16 1,675 2050 15–15–15–09 1,650 1,950 16–20–0–13 1,400 1,750 ఎంఓపీ 1,850 1,975 ఎస్ఎస్పీ 615 775 రైతుకు మిగిలేది అప్పులే.. ధర రూ.లలో..) రూ.వందకుపైనే పెంపు.. కొద్ది రోజుల క్రితమే కంపెనీలు ఎరువుల ధరలను పెంచాయి. 50 కిలోలు ఉండే బస్తాపై ఆయా ఎరువుల రకాన్ని బట్టి రూ.160 నుంచి రూ.450 వరకు పెరిగాయి. నత్రజని, భాస్వరం, పొటాషియం ఉండి అన్నిరకాల పంటల్లో ఎక్కువగా వినియోగించే 14–35–14పై రూ.450 పెరిగింది. పాస్పరస్, నైట్రోజిన్ ఎక్కువగా ఉండే 24–24–0పై రూ.300, భాస్వరం, పొటాషియం ఉండే 10–26–26 పై రూ.300, నత్రజని, భాస్వరం, సల్ఫర్ ఉండే 20–20–013పై రూ.350, నత్రజని, భాస్వరం, పొటాషియం సమాన నిష్పత్తిలో ఉండే 16–16–16పై రూ.375, అమ్మోనియం పాస్పెట్, పైట్రోజిన్, పాస్పరస్, సల్పర్ ఉండే 16–20–0–13పై రూ.350 పెంచారు. ఇలా దాదాపు అన్నిరకాల ఎరువుల ధరలు వందకుపైనే పెరిగాయి. అన్నదాతలకు కష్టాలు తప్పడం లేదు. కాలం కలిసి వస్తేనే పంటలు చేతికి వస్తాయి. లేదంటే ఆ ఏడాది రైతుకు మిగిలేది అప్పులే. ఒకవేళ కాలం కలిసొచ్చి.. చేతికి వచ్చిన పంటలకు గిట్టుబాటు ధరలు రావు. ఇలా రైతులు కష్టాలు ఎదుర్కొంటూనే ఉంటారు. ఇదిలా ఉంటే.. ఏటేటా పంట పెట్టుబడులు పెరుగుతున్నాయి. రైతు భరోసా, కిసాన్ సమ్మాన్ యోజన లాంటి పథకాలు ఉన్నప్పటికీ వాటితో పెట్టుబడి అవసరాలు తీరవు. ప్రతి పంటకు పెట్టుబడుల రూపంలో రైతలు చాలా డబ్బు వెచ్చించాల్సి ఉంటుంది. విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, పంట ఉత్పత్తుల రవాణా ఇలా అన్నింటికి ఎక్కువ మొత్తంలో వెచ్చించాల్సిందే. ఇప్పటికే పెరిగిన పెట్టుబడులతో సతమతమవుతున్న రైతన్నకు పెరిగిన ఎరువుల ధరలు ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రస్తుతం పెరిగిన ఎరువుల ధరలతో ఎకరాకు రూ.500 నుంచి రూ.వెయ్యి వరకు అదనంగా అన్నదాతపై ఆర్థికభారం పడనుంది. కూలీలు, ఇతర ఖర్చులు బాగా పెరుగుతున్నాయని, ఇప్పుడు ఎరువుల ధరలు పెరగడం రైతులను మనోవేదనకు గురి చేస్తోంది. -
ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి
ధరూరు: జిల్లాలో ధాన్యం కొనుగోలులో నిర్లక్ష్యం తగదని, కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్ మధుమోహన్ అన్నారు. శుక్రవారం ఆయన మండలంలోని భీంపురం గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఇప్పటి వరకు కొనుగోలు చేసిన ధాన్యం వివరాలను అడిగి తెలుసుకున్నారు. సెంటర్ నిర్వహణపై ఆరా తీశారు. సంబంధిత అధికారులు, సిబ్బందితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో ధాన్యం తడవకుండా టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ధాన్యం లోడ్ చేసే ప్రక్రియను మరింత వేగవంతం చేసి త్వరితగతిన ధాన్యం కొనుగోళ్లను పూర్తి చేయాలన్నారు. ట్యాబ్ ఎంట్రీలు వెను వెంటనే చేపట్టి ధాన్యాన్ని తరలించడం ద్వారా రైతులకు చెల్లింపుల్లో సమస్యలు తలెత్తకుండా చూడాలని, లారీల కొరత లేకుండా చూడాలని ఆదేశించారు. రైతులకు ఇబ్బందులు కలిగిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో తహసీల్దార్ నందిని, సెంటర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వడ్డీ లేని రుణాలను వినియోగించుకోండి ధరూరు: ప్రభుత్వం మహిళా సంఘాలకు ఇస్తున్న వడ్డీ లేని రుణాలు రూ.10 లక్షలకు పెంచడం జరిగిందని, ఈ రుణాలను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని డీఆర్డీఓ ముసాయిదాబేగం అన్నారు. శుక్రవారం ధరూరులోని మండల మహిళా సమాఖ్య భవనంలో నిర్వహించిన మండల మహిళా సమాఖ్య ఈసీ మీటింగ్కు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మహిళా సంఘాల సభ్యులనుద్దేశించి మాట్లాడారు. తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించడంతోపాటు వడ్డీలేని రుణాలను సద్వినియోగం చేసుకోవాలని గ్రామ సర్పంచు విజయ్కుమార్ కోరారు. కార్యక్రమంలో డీపీఎం సలోమి, ఏపీఎం నరహరి, సీసీలు నవీన్, నాగ్యానాయక్, వెంకటేష్, మహిళా సమాఖ్య సభ్యులు తదితరులు పాల్గొన్నారు. జూరాలకు స్వల్ప ఇన్ఫ్లో ధరూరు: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి స్వల్పంగా ఇన్ఫ్లో వచ్చి చేరుతుందని పీజేపీ అధికారులు తెలిపారు. గత రెండు రోజులుగా స్థానికంగా కురుస్తున్న వర్షాల ఆధారంగా ప్రాజెక్టుకు శుక్రవారం సాయంత్రం వరకు ప్రాజెక్టుకు 3,005 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉన్నట్లు పీజేపీ అధికారులు తెలిపారు. 30 క్యూసెక్కులు ఆవిరి అయ్యిందని చెప్పారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 0.950 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఇదిలా ఉండగా.. డెడ్ స్టోరేజీ లెవెల్లో ఉన్న జూరాల నీటిమట్టం స్థానికంగా కురుస్తున్న వర్షాలతో స్వల్పంగా ఇన్ఫ్లోలు రావడంతో తాగునీటి పథకాలకు ఇబ్బందులు తప్పినట్లయింది. వేరుశనగ @ రూ.7,810 గద్వాల వ్యవసాయం: జిల్లాకేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డుకు శుక్రవారం 64 క్వింటాళ్ల వేరుశనగ దిగుబడి వచ్చింది. కాగా.. క్వింటా గరిష్టంగా రూ.7,810, కనిష్టంగా రూ.4,849, సరాసరి రూ.7,190 ధరలు లభించాయి. అలాగే 14 క్వింటాళ్ల ఆముదాలు రాగా.. సరాసరిగా రూ.5,876 ఒకే ధర పలికింది. 49 క్వింటాళ్ల వరి (సోన) రాగా.. గరిష్టంగా రూ.2,436, కనిష్టంగా రూ.2,088, సరాసరిగా రూ.2,168 చొప్పున పలికాయి. పీయూలో నలుగురికి ప్రొఫెసర్లుగా పదోన్నతి మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పీయూలో పలు డిపార్ట్మెంట్లలో పనిచేస్తున్న అధ్యాపకులకు ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్లుగా పదో న్నతులు కల్పించే ప్రక్రియను చేపట్టారు. 15 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసుకున్న వారిని అసోసియేట్ ప్రొఫెసర్ నుంచి ప్రొఫెసర్కు పదోన్నతులు కల్పించారు. ఇందులో మైక్రోబయోలజీ డిపార్ట్మెంట్లో మధుసూదన్రెడ్డి, కిషోర్, కెమిస్ట్రీ డిపార్ట్మెంట్లో చంద్రకిరణ్, నూర్జహాన్ ఉన్నారు. కామర్స్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ రాజ్కుమార్కు అసోసియేట్ ప్రొఫెసర్గా పదోన్నతి కల్పించారు. -
4, 5 తేదీల్లో ప్రశిక్షణ
గద్వాల: జిల్లాకేంద్రంలో వచ్చే నెల 4, 5 తేదీ ల్లో జిల్లా ప్రశిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు బీజేపీ నేత, జిల్లా ప్రశిక్షణ ఇన్చార్జి అయ్యంగారి ప్రభాకర్ తెలిపారు. గురువారం జిల్లా కేంద్రంలోని డీకే బంగ్లాలో నిర్వహించిన సన్నాహాక కార్యక్రమంలో ఆయన మాట్లాడా రు. జిల్లా కేంద్రంలోని ఎస్వీ ఈవెంట్ హాల్లో రెండు రోజులపాటు ఉదయం 7 నుంచి సాయంత్రం 5గంటల వరకు ప్రశిక్షణ ఉంటుందన్నారు. ఈ కార్యక్రమానికి ఎంపీ డీకే అరుణతో పాటు జిల్లా పదాధికారులు, మండల అధ్యక్షులు, కౌన్సిలర్లు, నాయకులు మొదలుకొని 200 మంది హాజరవుతారన్నారు. మొత్తం 11 అంశాలపై శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ప్రతి మూడేళ్లకోసారి జాతీయ, జిల్లా, మండలాల్లో శిక్షణ తరగతులు నిర్వహించడం ఒక్క బీజేపీకే సాధ్యమన్నారు. సమావేశంలో నాయకులు రామాంజనేయులు, రామచంద్రారెడ్డి, బండల వెంకట్రాములు, రవి, కేకే, జయశ్రీ, సమతగౌడ్, చంద్రశేఖర్ ఉన్నారు. రాజకీయ వేధింపులకు భయపడం : సీపీఎం గద్వాల: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈడీని అడ్డుపెట్టుకుని రాజకీయ వేధింపులకు పాల్పడితే భయపడే ప్రసక్తే లేదని సీపీఎం జిల్లా కార్యదర్శి వెంకటస్వామి అన్నారు. కేరళ మాజీ ముఖ్యమంత్రి విజయన్పై ఈడీ దాడులకు వ్యతిరేకంగా గురువారం జిల్లా కేంద్రంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేరళలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీతో కలిసి చట్టవిరుద్ధ పనులు మొదలుపెట్టారన్నారు. రాజ్యాంగబద్ధ సంస్థలను అడ్డుపెట్టుకొని దాడులు చేయడం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు అని అన్నారు. రాష్ట్రానికి 15 సంత్సరాలు నీతివంతమైన పాలన అందించిన మాజీ సీఎంను ఉద్దేశపూర్వకంగా అవమానపర్చడానికి ఈడీ దాడులు చేయడం తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. సీపీఎం నాయకత్వాన్ని అక్రమ కేసులతో బలహీనపర్చాలనుకోవడం సరైన విధానం కాదని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు ఉప్పేరు నర్సింహ, రంగన్న, రామకృష్ణ అంజి, నర్సింహ, రామాంజనేయులు పాల్గొన్నారు. ఆర్టీసీ విలీనంతోనే ఉద్యోగ భద్రత కందనూలు: ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనంతోనే కార్మికులకు ఉద్యోగ భద్రత ఉంటుందని ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వీరాంజనేయులు అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని సీఐటీయూ కార్యాలయంలో జరిగిన స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. గత నెలలో జరిగిన ఆర్టీసీ కార్మికుల సమ్మె సందర్భంగా ప్రభుత్వం సానుకూలంగా స్పందించి సమస్యల పరిష్కారానికి హామీ ఇవ్వడంపై ధన్యవాదాలు తెలియజేశారు. కార్మికులకు నష్టం జరగకుండా ఉండేందుకు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం ప్రక్రియను పూర్తిచేయాలని కోరారు. అదే విధంగా 2021 వేతన సవరణలో ఉన్నా తేడాలను సవరించాలని.. విలీన కమిటీలో అన్ని సంఘాలకు ప్రాతినిధ్యం ఉండేలా చూడాలన్నారు. సమావేశంలో ఎస్డబ్ల్యూఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రభాకర్, రీజియన్ కార్యదర్శి వెంకటయ్య, ఉపాధ్యక్షుడు సుమలత, పద్మ, కృష్ణయ్య ఉన్నారు. -
భక్తిశ్రద్ధలతో బక్రీద్
● మసీదులు, ఈద్గాల వద్ద ముస్లింల ప్రత్యేక ప్రార్థనలు ● శుభాకాంక్షలు తెలియజేసిన ప్రజాప్రతినిధులు గద్వాల: జిల్లావ్యాప్తంగా గురువారం బక్రీద్ పర్వదినాన్ని ముస్లింలు భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. జిల్లా కేంద్రంతోపాటు మండల కేంద్రా లు, గ్రామాల్లో ఉదయం నుంచే ఆనందోత్సాహాలతో ఈద్గాలు, మసీదుల వద్దకు చేరుకొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకొని పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. జిల్లాకేంద్రంలోని ఈద్గా వద్ద ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి ముస్లింలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అల్లా ఆశీస్సులతో సకాలంలో వర్షాలు కురిసి, అందరూ సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. అనంతరం ఆయన ముస్లిం నాయకుల ఇళ్లకు వెళ్లి తేనేటి విందు స్వీకరించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ జయలక్ష్మి, వైస్చైర్మన్ శంకర్, నాయకులు సుభాన్, రామన్గౌడ్, భాస్కర్, గోవిందు, మాజీద్ పాల్గొన్నారు. -
మినీ జూరాల నిర్మాణానికి కృషి
మక్తల్: కృష్ణా మండలం కోల్పూర్ వద్ద కృష్ణానదిపై మినీ జూరాల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర పశుసంవర్ధఽకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. కర్ణాటక నీటిపారుదలశాఖ మంత్రి బోసురాజు, రాష్ట్ర మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి చర్చలు జరిపి బ్రిడ్జి కం బ్యారేజీ నిర్మాణానికి యత్నిస్తున్నారని చెప్పారు. గురువారం నియోజకవర్గంలో మక్తల్, మాగనూర్, ఊట్కూర్ మండలాల్లో కొనసాగుతున్న అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. మొదట మండలంలోని గొల్లపల్లి–మంతన్గోడ్ బీటీ రోడ్డు, చిట్యాల–గజరందొడ్డి మధ్య వాగుపై వంతెన పనులను పరిశీలించి నెల రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. పదవులు శాశ్వతం కాదని.. చేసిన అభివృద్ధే శాశ్వతంగా నిలుస్తోందని చెప్పారు. రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామన్నారు. మక్తల్లో 220 కేవీ విద్యుత్ సబ్స్టేషన్ మంజూరుకు ప్రయత్నిస్తున్నామని.. త్వరలో తీసుకొస్తామని వెల్లడించారు. రహదారి విస్తరణలో ఇళ్లు కోల్పోతే ప్రభుత్వం నుంచి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. గ్రామాల్లో సీసీ రహదారుల నిర్మాణాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని అన్నారు. జూరాల బ్యాక్వాటర్ కింద ముంపునకు గురైన అంకెన్పల్లి భూ సేకరణకు జీఓ విడుదలైందని తెలిపారు. మంత్రి వెంట జెడ్పీటీసీ మాజీ సభ్యుడు లక్ష్మారెడ్డి, వైస్ చైర్మన్ గణేష్కుమార్, మాగనూర్ మండల అధ్యక్షుడు ఆనంద్గౌడ్, చిట్య్లా సర్పంచ్ రహమత్పాషా, కౌ న్సిలర్ రహీం పటేల్, మహేష్, శంషోద్దీన్, అమరేందర్రెడ్డి, చిట్యాల లక్ష్మణ్, వాకిటి హన్మంతు, గోవర్ధన్, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి -
‘రుణ’ం తీర్చలేక.. ప్రాణాలతో ‘విముక్తి’
● (2025 డిసెంబర్ 12 : గద్వాలకి చెందిన ఓ ఉపాధ్యాయుడు రియల్ ఎస్టేట్తో పాటు ఫైనాన్స్, చిట్టీ వ్యాపారాలు చేసేవాడు. పెట్టుబడుల కోసం భారీగా అప్పు చేశాడు. నష్టాలు రావడం.. అప్పులు చెల్లించే స్థోమత లేక గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.) అత్యాశతో సామర్థ్యానికి మించి అప్పులు.. త్వరగా డబ్బు సంపాదించాలనే ఆశతో కొందరు సామర్థ్యానికి మించి అప్పులు చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో ప్రధానంగా యువకులు రియల్ ఎస్టేట్, ఇతరత్రా వ్యాపార పెట్టుబడుల కోసం భారీగా రుణాలు సేకరిస్తున్నారు. తమకు తెలిసిన వారి వద్ద, పలు ప్రైవేట్ బ్యాంకుల్లో అప్పులు తీసుకుంటున్నారు. ఆ తర్వాత వ్యాపారాలు సరిగ్గా నడవకపోవడం.. రియల్ ఎస్టేట్ రంగం పడిపోవడం వంటి విపత్కర పరిస్థితుల్లో బ్యాంక్లకు నెలనెలా ఈఎంఐలు కట్టలేని పరిస్థితి ఉంటోంది. ఈ క్రమంలో మరో చోట రుణం తీసుకొచ్చి వడ్డీలు చెల్లించడం.. క్రెడిట్ కార్టుల నుంచి నెల వారీగా సర్దుబాటు చేయడం వంటివి చేస్తూ.. చివరకు అప్పులు తీర్చలేక చతికిలపడుతోంది. మధ్య తరగతి జీవితాలతో చెలగాటమాడుతున్న అప్పులు 10 నెలల్లో సుమారు 25 మంది వరకు.. ఉమ్మడి పాలమూరులోని మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, జోగుళాంబ గద్వాల, నారాయణపేట జిల్లాల్లో గత ఏడాది ఆగస్టు నుంచి ఇప్పటివరకు సుమారు 25 మంది అప్పుల బాధతో బలవన్మరణాలకు పాల్పడ్డట్లు తెలుస్తోంది. ఒక్క గద్వాల జిల్లాలోనే 20 మంది వరకు ఉన్నారు. ఆత్మహత్యలకు పాల్పడిన వారిలో అత్యధికంగా అత్యాశతో అప్పులు చేసిన వారు.. ఆన్లైన్ బెట్టింగ్లో డబ్బులు పోగొట్టుకున్న యువకులు తనువు చాలించినట్లు తెలుస్తోంది. సాధారణ ఖర్చులు పెరగడంతో.. ఉమ్మడి పాలమూరులో ప్రధానంగా మధ్య తరగతి వర్గాలు ఎక్కువగా వ్యవసాయం, కూలీ పనులు, చిరు వ్యాపారాలతో పాటు పలు ప్రైవేట్ సంస్థల్లో చిన్నపాటి ఉద్యోగాలు చేస్తూ జీవనం సాగిస్తున్నాయి. పిల్లల చదువులు, వైద్యం, ఇంటి అద్దెల వంటి సాధారణ ఖర్చులు ఏటేటా పెరుగుతున్నాయి. ఇందుకనుగుణంగా జీతాలు పెరగకపోవడంతో సరిపోక కుటుంబ పోషణ భారంగా మారింది. బ్యాంకుల్లో రుణాలు సులభంగా అందకపోవడంతో చాలా మంది ప్రైవేట్ ఫైనాన్స్, రోజు వారీ వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. చిన్న మొత్తంతో ప్రారంభమైన అప్పు.. ఆ తర్వాత నెల నెలా వడ్డీలతో కలిపి అధిక భారంగా మారుతుండడం ఆయా కుటుంబాలను ఛిన్నాభిన్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. ● (2026 ఏప్రిల్ 6: గద్వాల జిల్లా అయిజ మండలం చిన్నతాండ్రపాడుకు చెందిన ఓ వ్యక్తి కుటుంబ అవసరాల కోసం తెలిసిన వారి వద్ద అప్పులు చేశాడు. కొన్ని నెలలు సక్రమంగా వడ్డీలు చెల్లించాడు. ఆ తర్వాత చెల్లించకపోవడంతో ఒత్తిళ్లు రావడం.. తీర్చే స్థోమత లేకపోవడంతో పురుగుల మందు తాగి తనువు చాలించాడు.) నారాయణపేట జిల్లా మక్తల్కి చెందిన కర్రెమ్ సూర్యనారాయణ అలియాస్ తిమ్మప్ప అలియాస్ సూర్య, అలియాస్ తిప్పియ్య అనే 27 ఏళ్ల వ్యక్తి ఆన్లైన్ బెట్టింగ్కు బానిసయ్యాడు. గత ఏడాది కాలంగా డబ్బుల కోసం దొంగతనాలు చేయడం మొదలుపెట్టాడు. మక్తల్తో పాటు పరిసర ప్రాంతాల్లో కిరాణం, వైన్ షాపులు, తాళం వేసి ఉన్న ఇళ్లను టార్గెట్గా చేసుకుని దొంగతనాలకు పాల్పడేవాడు. ఇటీవల పోలీసులకు పట్టుబడడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. లోన్, బెట్టింగ్ యాప్ల బారిన పడి.. ప్రస్తుత తరంలో సెల్ఫోన్ నిత్యావసరంగా మారడం.. సామాజిక మాధ్యమాల్లో లోన్ యాప్ల ఆకర్షణీయ ప్రకటనలు కట్టిపడేసేలా ఉంటున్నాయి. ఆధార్, పాన్, ఫోన్ నంబర్ ఉంటే చాలు.. నిమిషాల్లో రుణాలు ఇస్తుండడంతో అప్పుల పాలైన వారు వాటిని ఆశ్రయిస్తున్నారు. ఆ తర్వాత వడ్డీల పేరుతో నిర్వాహకులు వేధింపులకు దిగడం.. చెల్లించని పక్షంలో రుణ గ్రహీతలు ఇచ్చిన కాంటాక్ట్ నంబర్లకు ఫోన్లు చేసి అసభ్యకరంగా వ్యవహరిస్తున్నారు. ఈ అవమానాలు భరించలేక పలువురు ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. అయితే జిల్లాలో వీటిపై ఇప్పటివరకు కేసులు నమోదు కాలేదు. మరోవైపు త్వరగా డబ్బు వస్తుందనే ఆశతో చాలా మంది యువత ఆన్లైన్ బెట్టింగ్కు దిగుతున్నారు. మొదట చిన్న మొత్తాలతో ప్రారంభమైన బెట్టింగ్.. చివరకు లక్షల్లో నష్టాలకు దారితీస్తోంది. ఈ క్రమంలో కుటుంబాలకు తెలియకుండా చేసిన అప్పులు కట్టలేక.. కుటుంబ సభ్యులకు చెప్పలేక అవమాన భారంతో బలవన్మరణాలు చోటుచేసుకుంటున్నట్లు పలు ఘటనలు స్పష్టం చేస్తున్నాయి. ఆన్లైన్ లోన్, బెట్టింగ్ యాప్ల బారిన పడి కుంగుబాటు అర్ధాంతరంగా తనువు చాలిస్తున్న యువతరం ఉమ్మడి జిల్లాలో ఇటీవల పెరుగుతున్న బలవన్మరణాలు పిల్లల నూరేళ్ల జీవితాన్నిచేజేతులా కాలరాస్తున్న వైనం 2025 ఆగస్టు 15: నాగర్కర్నూల్ జిల్లా వెల్దండకి చెందిన ఓ విద్యార్థి ఆన్లైన్ బెట్టింగ్లకు అలవాటు పడ్డాడు. గమనించిన తల్లిదండ్రులు అతడిని హెచ్చరించారు. అప్పులు ఇచ్చిన వారికి చెల్లిస్తామని హామీ ఇచ్చారు. ఈ క్రమంలో విద్యార్థి మరోసారి ఆన్లైన్ బెట్టింగ్ ఆడగా.. డబ్బులు పోయాయి. దీంతో మనస్తాపానికి గురై అతడు ఉరి వేసుకుని మృతిచెందాడు. గద్వాల జిల్లా వడ్డేపల్లి మున్సిపాలిటీ పరిధిలో సెలూన్ నిర్వహిస్తున్న ఓ వ్యక్తి కొంతకాలంగా మట్కా జూదానికి అలవాటు పడి అప్పుల పాలయ్యాడు. చేసిన అప్పులు తీర్చలేక ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. అవసరమైతే కౌన్సెలింగ్ తీసుకోవాలి... అందరికీ ఆర్థిక క్రమశిక్షణ ముఖ్యం. ఆదాయానికి మించి అప్పులు చేయొద్దనే ప్రాథమిక సూత్రాన్ని మరవొద్దు. ఆన్లైన్ యాప్లు, బెట్టింగ్లకు దూరంగా ఉండాలి. ఏ వ్యాపారమైతే చేయదలుచుకున్నారో దానిపై పూర్తి అవగాహన ఉండాలి. పెట్టుబడులకు రుణాలు చేసే ముందు కుటుంబసభ్యులతో చర్చించాలి. మానసిక ఒత్తిడి పెరిగితే కుటుంబసభ్యులతో పంచుకోవాలి. అప్పులు జీవితంలో ఒక సమస్య మాత్రమే. అది జీవితానికి ముగింపు కాదు. అవసరమైన పక్షంలో కౌన్సెలింగ్ తీసుకోవాలి. – డాక్టర్ అనిల్రాజ్, మానసిక వైద్య నిపుణుడు, జిల్లా జనరల్ ఆస్పత్రి -
కబ్జాకోరల్లో..
జిల్లా కేంద్రంలో రూ.కోట్ల విలువైన భూములు అన్యాక్రాంతం ● 10శాతం స్థలాలపై బడా నాయకుల కన్ను ● చోద్యం చేస్తున్న అధికారులు ● నోటీసులతోనే సరిపెడుతున్న వైనం గద్వాల: జిల్లాకేంద్రమైన గద్వాల మున్సిపాలిటీ శరవేగంగా విస్తరిస్తోంది. జిల్లా ఏర్పాటు అనంతరం జమ్మిచేడు, దౌదర్పల్లి మున్సిపాలిటీలో విలీనం చేయడంతో పట్టణ విస్తీర్ణం పెరిగింది. ప్రభుత్వ భూములు, 10శాతం స్థలాలు రూ.కోట్లలో ధరలు పలుకుతున్నాయి. ఈ క్రమంలోనే కొందరు పలుకుబడి ఉన్న వ్యక్తులు వీటిపై కన్నేశారు. వీరికి కొందరు అవినీతి అధికారులు తోడుకావడంతో మున్సిపాలిటీ అక్రమ కట్టడాలకు నిలయంగా మారింది. రూ.కోట్ల విలువజేసే ప్రభుత్వ భూములకు రక్షణ లేకుండా పోతోంది. 20ఫీట్ల సర్వీస్రోడ్డు సైతం.. ఆర్వోబీ నుంచి జములమ్మ ఆలయం వరకు ప్రధానరోడ్డు పక్కన భవిష్యత్ అవసరాలను దృిష్టిలో ఉంచుకొని ప్రభుత్వం 20ఫీట్ల సర్వీస్ రోడ్డు ఏర్పాటు చేసింది. అయితే సర్వీస్ రోడ్డును ఆక్రమిస్తూ.. సమీపంలో పలు నిర్మాణాలు వెలిశాయి. దీంతో 20ఫీట్ల సర్వీస్రోడ్డు ఎక్కడ ఉందో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. సర్వీస్ రోడ్డు పక్కన ఏమైనా నిర్మాణాలు చేపడితే, కచ్చితంగా సెట్బ్యాక్ స్థలం వదిలేసి మిగిలిన స్థలంలో నిర్మాణాలు చేపట్టాలనే నిబంధనలు ఉన్నారు. కానీ ఇవేవి అమలుకు నోచుకోవడం లేదు. అనుమతులు లేకుండా బహుళ అంతస్తులు.. గద్వాల కొత్త హౌసింగ్బోర్డుకు వెళ్లే మార్గం, ఫైర్స్టేషన్కు వెనకాల ఓ ప్రైవేటు ఆస్పత్రి పక్కన నిర్మించే భవనం, అదే విధంగా కోర్టుకు ఎదురుగా ఉన్న ఓ ప్రైవేటు హోటల్ పక్కన నిర్మిస్తున్న నిర్మాణాలకు ఎక్కడా సరైన అనుమతులు లేవు. తీసుకున్న అనుమతులు, చేపడుతున్న నిర్మాణాలకు ఎక్కడా పొంతన లేకుండా పోయింది. పైగా నిర్మాణాలు అన్ని కూడా ప్రధాన రహదారుల వెంట నిర్మిస్తున్నవే. వీటికి కచ్చితంగా సెట్బ్యాక్ చేస్తూ నిర్మాణాలు చేపట్టాల్సి ఉండగా.. నిబంధనలు ఎక్కడా అమలు కావడంలేదు. పట్టింపులేని అధికారులు.. గద్వాల మున్సిపాలిటీలో విలువైన 10శాతం స్థలా లు అన్యాక్రాంతం అవుతున్నాయి. ముఖ్యంగా కొ న్ని కులాలకు ఇష్టానుసారంగా 10శాతం స్థలాలను అప్పనంగా కట్టబెట్టారు. అదే విధంగా భీంనగర్లోని ఓ ప్రైవేటు కాలేజీ సమీపంలో ఏకంగా రహదారిని ఆక్రమించి నిర్మాణం చేపట్టారు. దీనిపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. ఇక్కడ చేపట్టిన అక్రమ నిర్మాణం వెనకాల పలుకుబడి గల నాయకుడు ఉండటమే కారణమని తెలుస్తోంది. -
ఆశావర్కర్ల సమస్యల పరిష్కారానికి కృషి
కొల్లాపూర్: ఆశావర్కర్ల సమస్యలను సీఎం రేవంత్రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. గురువారం ఆశావర్కర్ల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ కొల్లాపూర్లోని మంత్రి జూపల్లి కృష్ణారావు క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆశావర్కర్లకు ఫిక్స్డ్ వేతనం చెల్లించడంతో పాటు కనీస వేతన చట్టాన్ని అమలు చేయాలని, తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని, ప్రమాద బీమా, హెల్త్ కార్డు సౌకర్యం కల్పించాలని కోరారు. అనంతరం మంత్రికి వినతిపత్రం సమర్పించగా.. ఆయన సానుకూలంగా స్పందించారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు శివవర్మ, జ్యోతి, గౌరమ్మ, మాధవి, శివలీల పాల్గొన్నారు. ● పేదల సంక్షేమమే తమ ప్రభుత్వ ధ్యేయమని మంత్రి జూపల్లి అన్నారు. కొల్లాపూర్ మండలం సోమశిలకు చెందిన పుట్టపాగ కృష్ణయ్య ఏడేళ్ల క్రితం ప్రమాదవశాత్తు కృష్ణానదిలో పడి మరణించాడు. ఆయన కుటుంబానికి ప్రభుత్వ నుంచి మంజూరైన రూ. 3లక్షల చెక్కును ఆయన అందజేశారు. కార్యక్రమంలో ఆర్డీఓ బన్సీలాల్, తహసీల్దార్ మా ధవి, ఉపసర్పంచ్ ఖాదర్పాషా, రామకృష్ణ, గోరటి రామ్మోహన్, చిన్నకురుమయ్య, ఆశన్న, నర్సింహ, లింగన్న తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు -
20 నుంచి 45 ఏళ్లలోపు వారే..
మద్యం తాగి ఎవరూ వాహనాలు నడపవద్దు. తనిఖీలలో 20 నుంచి 45 ఏళ్లలోపు వారే ఎక్కువగా డ్రంకెన్ డ్రైవ్లో పటుబడుతున్నారు. యువత పార్టీల పేరుతో బైక్లపై బయటకు వస్తున్నారు. ఈ క్రమంలోనే ఎంతో మంది ప్రమాదాల బారినపడి మృతిచెందిన ఘటనలు ఉన్నాయి. తల్లిదండ్రులు తమ పిల్లలను ఓ కంట కనిపెట్టుకొని ఉండాలి. పదే పదే తనిఖీల్లో పటుబడితే జైలుశిక్షతోపాటు లైసైన్స్ రద్దుకు చర్యలు ఉంటాయి. ప్రతిఒక్కరూ రోడ్డు నిబంధనలు పాటించి సురక్షితమైన ప్రయాణం చేయాలి. యువత ఉన్నత లక్ష్యలపై దృషి సారించి భవిష్యత్ను ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలి. రోడ్డు ప్రమాదాల నివారణకు జిల్లా పోలీసు శాఖ ప్రత్యేక చర్యలు చేపడుతోంది. – మొగిలయ్య, డీఎస్పీ, గద్వాల -
అప్పులుంటే.. చంపేస్తావా..
నీ మనసెంత కాఠిన్యమో.. నాన్నా ● నమ్మివచ్చిన భార్య, జన్మనిచ్చిన పిల్లల్ని కడతేర్చిన తండ్రి ● కాళ్లు చేతులు కట్టి నీటిసంపులో పడేసి.. తానూ ఉరేసుకుని బలవన్మరణం ● తాను చేసిన అప్పులు వారినేం చేస్తాయోననే భయంతో ఘాతుకం ● కౌలు రైతు కుటుంబాన్ని చిదిమేసిన అప్పులు ● తెలిసీ తెలియని వయస్సులో ఈ చేతులే కదా మాకు గోరు ముద్దలు తినిపించాయి.. ఈ చేతులే కదా మమ్మల్ని ఆడించాయి.. ఈ చేతులే కదా మాకు నడక నేర్పించాయి.. అలాంటి ఈ చేతులతోనే మమ్మల్ని కాటికి సాగనంపుతున్నావా నాన్న అంటూ ఆ చిన్నారుల మూగరోదన ఆ తండ్రికి వినిపించలేదు.. ● అల్లారు ముద్దుగా పెంచి.. అడిగినవన్నీ అరచేతిలో పెట్టి.. మమ్మల్ని ప్రయోజకులుగా తీర్చిదిద్దాల్సిన నువ్వే.. ఏమాత్రం కనికరం లేకుండా.. కాళ్లు, చేతులు కట్టేసి.. కాటికి సాగే నంపే తరుణంలో నీ గుండె ఎంత బండలా మారింది నాన్నా.. అన్న ఆ పసిహృదయాల మౌనవేదన ఆ తండ్రికి కనిపించలేదు. ..కేవలం తాను చేసిన అప్పులకు తన భార్యాపిల్లలు ఎక్కడ బలవుతారో అన్న చిన్న కారణంతో.. ఎన్నో విజయాలు అందుకొని.. నిండు నూరేళ్లు జీవించాల్సిన మూడు నిండు ప్రాణాలను బలితీసుకున్నాడు ఓ తండ్రి. ఇంటి నిర్మాణం, వ్యవసాయంలో నష్టాలు.. వెరసీ అప్పులపాలైన ఓ కౌలు రైతు.. తన కుటుంబాన్ని తానే చిదిమేసుకు న్న విషాదకర సంఘటన తీవ్రంగా కలచివేసింది. వనపర్తి: జీవనోపాధి కోసం మామిడితోటలు లీజుకు తీసుకుని మామిడి పండ్లు విక్రయిస్తూ.. మిగతా సమయంలో తోటల సంరక్షణ చేసుకుంటూ జీవించే ఓ కుటుంబం సరైన లాభాలు లేక.. చేసిన అప్పులకు వడ్డీలు కట్టలేక.. అప్పులు ఇచ్చిన వారి ఒత్తిళ్లు తట్టుకోలేక ఓ కుటుంబ పెద్ద తన భార్య, ఇద్దరు పిల్లలను నీటిలో సంపులో పడేసి ప్రాణాలు తీసి.. తానూ ఉరేసుకున్న ఉదంతం ఉమ్మడి పాలమూరు జిలాల్లో తీవ్ర కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర మండలంలోని డోకూరు గ్రామానికి చెందిన నర్సింహులు(40) నాలుగేళ్ల క్రితం ఖిల్లాఘనపురం మండలం సల్కెలాపురం శివారులో సుమారు 50 ఎకరాల మామిడి తోటను లీజు తీసుకుని కుటుంబ సభ్యులతో కలిసి అక్కడే ఉంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో తోటల లీజు, ఇతర అవసరాల కోసం గద్వాలలో కొందరితో అప్పు చేశాడు. డోకూరులోని తన సొంత ఇంటిపై ఓ ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీలో రూ.లక్షల్లో అప్పు చేశాడు. ఇటీవల ఈఎంఐలు సక్రమంగా చెల్లించడం లేదని ఫైనాన్స్ కంపెనీ ప్రతినిధులు ఇంటి గోడలపై ఈ ఇంటిని అప్పుకింద జప్తు చేయనున్నట్లు రాయడంతో గ్రామంలో తోటివారు, బంధువులు, సన్నిహితుల ఎదుట అవమానంగా భావించాడు. ఐపీ పెట్టే ప్రయత్నం చేశాడు. తన వద్ద ఉన్న వాహనాలు, వస్తువులను అమ్మేసి అప్పులు తీర్చే ప్రయత్నం చేశాడు. అయినా.. వడ్డీలు వసూలు చేసేవారు, ఈఎంఐలు చెల్లించాల్సిన ఫైనాన్స్ కంపెనీల నుంచి ఒత్తిడి తగ్గలేదు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆయన కుటుంబ సభ్యులతో సహా ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలోనే భార్య ఎల్లమ్మ(36), కుమారుడు నిహాల్(15), కూతురు సాహితీశ్రీ(13)ల కాళ్లు, చేతులు కట్టేసి తోటలోని సంపులోకి తోసి తాను నివాసం ఉండే కంటైనర్కు చీరతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. పరిశీలించిన డీఎస్పీ గిరిబాబు విషయం తెలుసుకున్న వనపర్తి డీఎస్పీ గిరిబాబు ఖిల్లాఘనపురం మండలం సల్కెలాపురం గ్రామ శివారులోని మామిడి తోటకు వెళ్లి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను మహబూబ్నగర్ జనరల్ ఆస్పత్రికి పోస్టుమార్టం కోసం తరలించి ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. -
తాగి నడిపితే.. కటకటాలే
జోగుళాంబ గద్వాల● అయిదు నెలల్లో 253 కేసులు.. రూ.3.70 లక్షల జరిమానా ● ఒకటి కంటే ఎక్కువసార్లు పట్టుబడితే జైలుశిక్ష విధింపు ● ప్రమాదాల నివారణే లక్ష్యంగా పోలీసుల చర్యలు ● అవగాహన కల్పిస్తున్నా.. కొందరిలో మారని తీరు గురువారం శ్రీ 28 శ్రీ మే శ్రీ 2026●గద్వాల క్రైం: మద్యం మత్తులో వాహనాలు నడిపి ప్రమాదాల బారిన పడుతున్న వాహనదారులకు కళ్లెం వేసేందుకు జిల్లా పోలీసు శాఖ విస్తృతంగా తనిఖీలు చేపడుతోంది. రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా జిల్లా పోలీసులు డ్రంకెన్ డ్రైవ్పై ప్రత్యేకంగా దృష్టిసారిస్తున్నారు. ఈ క్రమంలో జిల్లాలో ఈ ఏడాది అయిదు నెలల వ్యవధిలో 253 డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదు చేసి వారిని కోర్టులో హాజరుపరుస్తున్నారు. డ్రంకెన్ డ్రైవ్ కేసుల్లో ఇప్పటి వరకు రూ.3.70 లక్షల వరకు జరిమానా విధించారు. ఒకటి కంటే ఎక్కువ సార్లు తనిఖీల్లో పట్టుబడిన వారికి జైలుశిక్ష పడేలా న్యాయమూర్తుల ముందు హాజరుపరుస్తున్నారు. ముఖ్యంగా యువత మద్యం మత్తులో బైక్లను మితిమీరిన వేగంతో నడుపుతూ ప్రమాదాలకు కారణమవుతున్నారు. అలాగే పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రోడ్డు ప్రమాదాలు, డ్రంకెన్ డ్రైవ్పై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా.. కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. యువత.. కూలీలే పోలీసుల తనిఖీల్లో యువకులు, కూలీలే ఎక్కువగా డ్రంకెన్ డ్రైవ్లో పట్టుబడుతున్నారు. వివిధ గ్రామాల నుంచి జిల్లాకేంద్రంకు వచ్చిన వారే ఉంటున్నారు. నిబంధనలు పాటించకుండా మద్యం మత్తులో వాహనాలను ఇష్టారీతిగా నడపడం, ఎదురుగా వచ్చే వాహనదారులకు ఇబ్బందులు కలిగించడం చేస్తున్నారు. పట్టణ శివారుల్లో సాయంత్రం నుంచి రాత్రి 10 గంటల వరకు పోలీసులు తనిఖీలు చేపడుతూ.. మందుబాబుల ఆగడాలను నిలువరించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. పట్టుబడిన మద్యం బాబులకు కౌన్సిలింగ్ నిర్వహించి మద్యం మత్తులో జరిగే అనర్థాల గురించి వివరిస్తున్నారు. ప్రమాదాల నివారణకు చర్యలు.. జిల్లావ్యాప్తంగా రాత్రి సమయాల్లో బైక్లు రేసు బైక్ల్లాగా దూసుకుపోతున్నారు. దురదృష్టవశాత్తు జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువ మంది యువతే ప్రాణాలు కోల్పోతున్నారు. కొంతమంది హెల్మెట్ ధరించకపోవడం వల్ల.. ఇంకొందరు మద్యం మత్తులో వాహనాలు నడపడం వల్ల మృత్యువాత పడుతున్నారు. దీంతో ప్రమాదాల నివారణకు నిత్యం తనిఖీలు చేపట్టి బ్రీత్ ఎనలైజర్లతో గుర్తించి ఆల్కహాల్ శాతం 35పైన ఉంటే కేసు నమోదు చేసి వారిని కోర్టుకు హాజరుపస్తున్నారు. ఆల్కహాల్ శాతాన్ని బట్టి న్యాయమూర్తి రూ.5 వేల జరిమానా లేదా జైలుశిక్షను అమలు చేస్తున్నారు. ఒక వ్యక్తి పదే పదే పట్టుబడితే రూ.10 వేల జరిమానాతోపాటు లైసెన్స్ రద్దు చేస్తున్నారు. మరోవైపు పోలీసులు నిత్యం ఎక్కడో చోట అవగాహన కల్పిస్తున్నారు. జిల్లాలో విస్తృతంగా డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు -
రైతులు పంట వ్యర్థాలను కాల్చొద్దు
ఎర్రవల్లి: రైతులు యాసంగిలో సాగు చేసిన పంటల వ్యర్థాలను కాల్చొద్దని జిల్లా వ్యవసాయ అధికారి వీరప్ప అన్నారు. బుధవారం మండలంలోని జింకలపల్లి శివారులో మొక్కజొన్న పంట అవశేషాలను కాలుస్తున్న పొలాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి పంట వ్యర్థాలను కాల్చడం వల్ల కలిగే నష్టాలపై అవగాహన కల్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వానాకాలం కోసం రైతులు భూమిని సిద్ధం చేసుకుంటున్న తరుణంలో గత పంటలకు సంబంధించిన వ్యర్థాలను తొలగించేందుకు సులభమైన మార్గంగా కాల్చివేస్తారని, ఇలా చేయడం వల్ల రైతులకు లాభాల కంటే నష్టాలే అధికంగా ఉన్నాయని చెప్పారు. పంట వ్యర్థాల దహనం వల్ల నేలలోని సేంద్రియ కర్బనం దెబ్బతింటుందని, దీంతోపాటు నత్రజని, భాస్వరం, పొటాష్ వంటి ప్రధాన, సూక్ష్మ పోషకాలు కూడా నశిస్తాయన్నారు. దీని ప్రభావంతో భూసారం తగ్గి భవిష్యత్లో రైతులు రసాయనిక ఎరువులపై ఆధారపడాల్సి వస్తుందన్నారు. అలాగే పంటల దహణం వల్ల కాలుష్యం పెరిగి.. ప్రజలకు ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయన్నారు. రైతులు పంట వ్యర్థాలను కాల్చకుండా శాసీ్త్రయ పద్ధతులను అనుసరించి నేల సారాన్ని కాపాడుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఏఓ సురేష్గౌడ్, రైతులు పాల్గొన్నారు. -
పాలమూరే ప్రధానాస్త్రం!
అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల మంటలు తెలంగాణ ఉద్యమంలో పాలమూరు వెనుకబాటు ప్రధానాంశంగా మారింది. తెలంగాణ రాాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఎన్నికలు పాలమూరు ప్రాజెక్ట్ చుట్టే నడిచాయి. తొలి పర్యాయంలో బీఆర్ఎస్ అధికారంలోకి రాగా.. పీఆర్ఎల్ఐ ప్రాజెక్ట్కు అడుగడుగునా అవాంతరాలు ఎదురయ్యాయి. నీటి తరలింపునకు సంబంధించి జూరాల నుంచి శ్రీశైలం బ్యాక్ వాటర్కు మార్చిన సోర్సుపై ప్రధాన రాజకీయ పక్షాల మధ్య భిన్న వాదనలు నడిచాయి. ఎట్టకేలకు 2015 జూన్లో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ప్రాజెక్ట్కు శంకుస్థాపన చేశారు. తొలి విడతలో ఐదు రిజర్వాయర్ల (నార్లాపూర్, ఏదుల, వట్టెం, కర్వెన, ఉదండాపూర్) పనులు మొదలుపెట్టారు. 2023 సెప్టెంబర్ 16న నార్లాపూర్ వద్ద మొదటి పంప్ను ప్రారంభించారు. అయితే నార్లాపూర్ నుంచి ఏదుల రిజర్వాయర్ వరకు 16 కిలోమీటర్ల టన్నెల్, 8.3 కిలోమీటర్ల ఓపెన్ కెనాల్ ద్వారా నీటిని తరలించాల్సి ఉంటుంది. ఇందులో టన్నెల్ పూర్తి కాగా.. 2.5 కి.మీ. మేర ఓపెన్ కెనాల్ పెండింగ్లో ఉంది. ఇక్కడ దాదాపు 15 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని తొలగించాల్సి ఉంది. ఈ పనులు పూర్తయితే నార్లాపూర్ నుంచి కర్వెన వరకు అంటే నాలుగు రిజర్వాయర్లకు నీటిని తరలించే అవకాశం ఉంది. ఈ అంశాన్ని లేవనెత్తుతూ రెండున్నరేళ్లుగా తట్టెడు మట్టి తీయడం లేదని.. కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే చివరలో మిగిలిన పనుల పూర్తిపై నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని గత జనవరిలో మాజీ సీఎం కేసీఆర్ ధ్వజమెత్తారు. ఈ క్రమంలో అసెంబ్లీలో ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, తెలంగాణ భవన్లో మాజీ ఇరిగేషన్ మంత్రి హరీశ్రావు పోటాపోటీగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఇవ్వడం తీవ్ర చర్చకు దారితీసింది. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి పీఆర్ఎల్ఐ పనులు పూర్తిచేయించేందుకు బీఆర్ఎస్ పోరుబాటకు సిద్ధమైంది. ఇటీవల జిల్లాకు చెందిన మాజీ మంత్రులు నిరంజన్రెడ్డి, శ్రీనివాస్గౌడ్, లక్ష్మారెడ్డి ఉమ్మడి జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో సమావేశమై జూన్లో పాదయాత్ర చేయాలని నిర్ణయించారు. తొలి రోజు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మధ్యలో మాజీ మంత్రి హరీశ్రావు పాల్గొనేలా.. చివరకు ముగింపు రోజున కేసీఆర్ పాల్గొనేలా భారీ బహిరంగసభ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తుండడంతో రాజకీయ సందడి నెలకొంది. మరోవైపు పాలమూరు ప్రాజెక్ట్ అస్త్రంగా తెలంగాణ రాష్ట్ర సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కూడా పోరు కొనసాగిస్తోంది. ఈ క్రమంలో అధికార, ప్రతిపక్ష నేతల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు ఉమ్మడి జిల్లా రాజకీయాలను హీటెక్కించాయి. పీఆర్ఎల్ఐతో పాటు జిల్లాలోనిఎండింగ్ ప్రాజెక్ట్లను వెంటనే పూర్తి చేయాలని జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలకు ఉమ్మడి పాలమూరు జిల్లా పెండింగ్ ప్రాజెక్ట్ల సాధన జేఏసీ నేతలు వినతిపత్రాలు ఇచ్చారు. పాలమూరు పథకంలోని ఏదుల రిజర్వాయర్ నుంచి 0.5 టీఎంసీల నీటిని డిండి ప్రాజెక్ట్కు తరలించాలనే ప్రతిపాదనను విరమించుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. దీని వల్ల జిల్లాకు తీవ్ర నష్టం జరుగుతుందని.. తాము పోరాటం చేస్తామని.. ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు అడ్డుకోవాలని జేఏసీ చైర్మన్ రాజేందర్రెడ్డి పిలుపునిచ్చారు. సీఎం పర్యటన సందర్భంగా జేఏసీ నేతలు ఆయనను కలిసి వినతిపత్రం అందించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ అంశం ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ నేతలతో పాటు ముఖ్యమంత్రిని ఇరుకున పెట్టే అవకాశం ఉండగా.. రాజకీయ వర్గాల్లో హాట్టాపిక్గా మారింది. ప్రాజెక్ట్ పూర్తి చేయాలనే డిమాండ్తో బీఆర్ఎస్ పోరు వచ్చే నెలలో పాదయాత్ర, బహిరంగ సభకు సన్నాహాలు ఇదే అంశంతో టీఆర్ఎస్ అధ్యక్షురాలు కవిత ఉద్యమ బాట 2027 డిసెంబర్లోపు పూర్తి చేసేలా కాంగ్రెస్ కార్యాచరణ 2 రోజుల పాటు ప్రాజెక్ట్ల సందర్శనకు సీఎం సమాయత్తం పొలిటికల్ డ్రామాలకే పరిమితమని బీజేపీ విమర్శలు బీఆర్ఎస్ పాదయాత్రకు సన్నాహాలు చేస్తున్న క్రమంలో కాంగ్రెస్ సైతం పోటాపోటీగా అడుగులు వేస్తోంది. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంతో పాటు ఉమ్మడి జిల్లాలో మిగిలిన పెండింగ్ ప్రాజెక్ట్లపై ఇటీవల హైదరాబాద్లో సీఎం రేవంత్రెడ్డి, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ వేర్వేరుగా జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలతో సమీక్షించారు. వెంటనే భూసేకరణ పూర్తి చేయాలని.. గ్రీన్చానల్ ద్వారా నిధులు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి పాలమూరులోని అన్ని ప్రాజెక్ట్ల పెండింగ్ పనులు పూర్తి చేయాలని అధికారులకు డెడ్లైన్ పెట్టినట్లు తెలిసింది. అంతేకాదు.. సీఎం స్వయంగా ఈ నెల 30, 31న లేదంటే వచ్చే నెల మూడు, నాలుగో తేదీన రెండు రోజుల పాటు పాలమూరు–రంగారెడ్డితో పాటు ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాజెక్ట్ల సందర్శనకు సమాయతమైనట్లు సమాచారం. పెండింగ్ ప్రాజెక్ట్ల పూర్తికి చర్యలను వేగిరం చేయడంతో పాటు గత ప్రభుత్వం పదేళ్ల కాలంలో ఉమ్మడి జిల్లా ప్రాజెక్ట్లకు ఏ విధంగా అన్యాయం చేసిందనే దానిపై ప్రజలకు వివరించనున్నట్లు తెలుస్తోంది. -
వర్షంతో ఉపశమనం
● మంగళవారం అర్ధరాత్రి తర్వాత దంచికొట్టిన వర్షం ● అత్యధికంగా కేటిదొడ్డిలో 68.3 మి.మీ., వర్షపాతం నమోదు ● ఆరుతడి పంటల సాగులో నిమగ్నమైన రైతులు –8లో uగట్టు/ ధరూరు/ ఎర్రవల్లి/ : జిల్లాలో వేసవి ఎండలతో ఉక్కిరిబిక్కిరి అయిన ప్రజలు ఇటీవల కురిసిన వర్షాలు ఉపశమనం కలిగించాయి. మంగళవారం అర్ధరాత్రి కురిసిన భారీ వర్షంతో బుధవారం మొత్తం వాతావరణం పూర్తిగా చల్లబడింది. అర్ధరాత్రి తర్వాత ఉరుములు, మెరుపులతో మొదలై.. బుధవారం తెల్లవారుజాము వరకు దాదాపు 3 గంటలపాటు భారీ వర్షం కురిసింది. ఈ నెల 25న రోహిణి కార్తె ప్రారంభం కాగా.. ఈ కార్తెలో ఉండే ఎండలకు రోళ్లు పగులుతాయనే నానుడి ఉంది. అయితే ఇదే రోహిణి కార్తెలో విత్తుకున్న విత్తనాలు మంచిగా మొలకెత్తి పంటలు బాగా పండుతాయని రైతులు నమ్ముతారు. కార్తె ప్రారంభంలోనే వరుణు కరుణించడంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. 5 రోజుల వ్యవధిలో రెండు పర్యాయాలు వర్షాలు కురవడంతో రైతులు వేసవి దుక్కులు ప్రారంభించారు. ఇది వరకే కురిసిన వర్షాలకు పొలాలను దుక్కి దున్ని సిద్ధం చేసుకున్న రైతులు, ప్రస్తుతం కురిసిన వర్షాలకు విత్తనాలను విత్తుకుంటున్నారు. ముఖ్యంగా కమర్షియల్ పత్తి సాగు చేసే రైతులు తమ పొలాల్లో విత్తనాలు నాటుతున్నారు. సీడ్ పత్తి రైతులు కూడా పొలాలను సిద్ధం చేసుకుని పత్తి విత్తనాలను నాటుకునే పనిలో పడ్డారు. జిల్లావ్యాప్తంగా ధాన్యం కొనుగోలు ఒక్క మల్దకల్ మండలంలో తప్పా మిగతా అన్నీ చోట్ల దాదాపుగా పూర్తి చేయడంతో అకాల వర్షాల ప్రభావం వాటిపై పడలేదు. గట్టు మండలం మిట్టదొడ్డి, చిన్నోనిపల్లె పునరావాస కేంద్రం మధ్య రోడ్డుపై పడిన చెట్లు ధరూరు మండలంలోని పారుచర్ల, ధరూరు, మన్నాపురం, గార్లపాడు, సోంపురం, అల్వాలపాడు తదితర గ్రామాల్లో ఊర దేవర ఉత్సవాల్లో నిమగ్నమైన జనం భారీ వర్షం కారణంగా సవారమ్మ ఆలయాల వద్ద ఇబ్బందులకు గురయ్యారు. గాలులకు టెంట్లు, వంట సామగ్రి లేచిపోయింది. ధరూరు ఎస్సీ కాలనీలో కల్లంపల్లి సత్యన్న ఇంటి పైకప్పు కూలింది. ఆ సమయంలో బయట రేకుల షెడ్డు కింద ఉండడంతో ప్రాణాపాయం తప్పింది. తమకు ఇందిరమ్మ ఇల్లు కేటాయించి ఆదుకోవాలని బాధితులు కోరారు. మానవపాడు మండలంలోని జల్లాపురం గ్రామంలో కురిసిన వర్షం, ఈదురుగాలులకు కోళ్లఫాం షెడ్ ధ్వంసమైందని బాధితుడు చంద్రకాంత్నాయుడు తెలిపారు. కోళ్ల ఫాం షెడ్లో ఫ్యాన్లు, రేకులు, పైపులు దెబ్బతిని రూ.3.50 లక్షల నష్టం వాటిల్లిందని, ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. -
రైతులకు తగ్గిన భారం!
ఐడీసీ పరిధిలోకి ఎత్తిపోతల పథకాల నిర్వహణ ● ఆర్డీఎస్ ఆయకట్టుదారులకు తప్పిన వెతలు ● గతంలో ఎత్తిపోతల పథకాల నిర్వహణ మొత్తం రైతులపైనే.. ● జిల్లావ్యాప్తంగా ఇరిగేషన్ డివిజన్ కింద 11 సాగునీటి స్కీంలు అలంపూర్(రాజోళి): ఆర్డీఎస్ ఆయకట్టు పరిధిలో సాగుచేసే పంటలకు నీరందించేందుకు రైతులు పడే పాట్లు అన్నీ ఇన్నీ కాదు. ఓవైపు పంటసాగు పెట్టుబడులతో పా టు నీటి కోసం కూడా కొంత మొత్తం వెచ్చించా ల్సి వస్తోంది. అయినప్పటికీ సాగునీటి ఇబ్బందులు త ప్పడం లేదు. ఆర్డీఎస్ కెనాల్కు పూర్తిస్థాయిలో నీరందినప్పుడు మాత్రమే రైతులకు ఏ సమస్య ఉండదు. ఎగువ నుంచి ఆర్డీఎస్ కెనాల్లో పూర్తిస్థాయి వాటా రాకపోయినా.. ఆయకట్టులో సా గుచేసిన పంటలకు ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్న సమయంలో తుంగభద్ర నది సమీపంలో ఉన్న రైతు లు ఎన్నో అవస్థలు పడుతుంటారు. ఈ క్రమంలో సాగునీటి ఇబ్బందుల ను అధిగమించేందుకు రైతులే స్వయంగా చిన్నపాటి ఎత్తిపోతల పథకాలను రూపొందించుకున్నారు. వాటి ద్వారా నది నుంచి నీటిని తోడు కుని పంటలు ఎండకుండా చూసుకుంటున్నారు. అన్ని స్కీంలు ఐడీసీ పరిధిలోకి.. గత ప్రభుత్వం జిల్లాలోని ఆర్డీఎస్ పరిధిని డివిజన్–4లోకి చేర్చింది. ఆ తర్వాత ఇరిగేషన్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ (ఐడీసీ)లో డివిజన్–4ను కలిపారు. దీంతో ఆర్డీఎస్, తుంగభద్ర నది కింద ఉన్న చిన్నపాటి ఎత్తిపోతల పథకాలతో పాటు ఇతరత్రా నీటి వనరులు ఐడీసీ పరిధిలోకి వచ్చాయి. తద్వారా ఏదేని ఎత్తిపోతల పథకం మరమ్మతుకు గురైతే ఆ భారం రైతులపై పడకుండా కొంత ఊరట కలిగింది. వాటి నిర్వహణకు అయ్యే ఖర్చులు, కావాల్సిన సిబ్బంది, ఇతర ఖర్చులను రైతు కమిటీలు, ప్రభు త్వం సంయుక్తంగా భరిస్తుండటంతో ఎత్తిపోతల పథకాల నిర్వహణ సవ్యంగా సాగుతోంది. గతంలో పథకాల మోటార్ల మరమ్మతుకు గురైనా, విద్యుత్కు సంబంధించిన సమస్య ఏర్పడినా రైతులే ఖర్చుచేసి.. మరమ్మతు చేయించాల్సి వచ్చేది. అలా కాకుండా ప్రభుత్వం, రైతు కమిటీలు కలిసి నిర్వహణ ఖర్చులను భరిస్తుండటంతో రైతులకు అదనపు పెట్టుబడి భారం తగ్గింది. గతంలో పలుచోట్ల ఏర్పాటుచేసుకున్న ఎత్తిపోతల పథకాల్లో ప్రతి చిన్న పని నుంచి మేజర్ రిపేర్ వర కు రైతులే భరించే వారు. ఇందుకోసం రైతులందరం ప్రత్యేకంగా నిధిని ఏర్పాటు చేసుకు న్నాం. ప్రస్తుతం ఈ స్కీంలన్నీ ప్రభుత్వం ఆధీనంలోకి వెళ్లడంతో కేవలం చిన్నపాటి రిపేర్లు మాత్రమే రైతుల ద్వారా చేసుకుంటున్నాం. మోటార్ల రిపేర్లు, మేజర్ మరమ్మతులను ఆర్డీఎస్ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. – పరుశరాముడు, రైతు, రామేశ్వర ఎత్తిపోతల పథకం, రాజోళి ఐడీసీ పరిధిలోకి ఎత్తిపోతల పథకాలను చేర్చిన త ర్వాత రైతులకు భారం తగ్గింది. మేజర్ రిపేర్లు మొత్తం ప్రభుత్వమే భరిస్తుంది. రైతుల విజ్ఞప్తి మేర కు మోటార్ల రిపేర్లు, తదితర మరమ్మతులకు ప్రతిపాదనలు పంపుతున్నాం. ప్రభుత్వం నుంచి నిధులు వచ్చిన వెంటనే పనులు పూర్తిచేస్తున్నాం. ఇటీవల ఊట్కూర్, క్యాతూర్ తదితర లిఫ్టుల వద్ద పనులను చేయించాం. – నాగరాజు, ఆర్ఈఎస్ డీఈ -
మొక్కజొన్న కొనుగోళ్లలో జాప్యం చేయొద్దు
అయిజ:మొక్కజొన్న కొనుగోళ్లలో జాప్యం చేయొద్దని.. రైతుల నుంచి సేకరించిన ధాన్యా న్ని ఎప్పటికప్పుడు గోదాంలకు తరలించాలని డీసీఓ శ్రీనివాస్ అన్నారు. అయిజ వ్యవసాయ మార్కెట్ సబ్యార్డులో ఏర్పాటుచేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం పరిశీలించారు. ఇప్పటి వరకు రైతుల నుంచి సేకరించిన ధాన్యం వివరాలను తెలుసుకోవడంతో పాటు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆరా తీశారు. కొనుగోలు కేంద్రంలో హమాలీలు, లారీల కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రైతుల నుంచి సేకరించిన మొక్కజొన్నలను బుధవారం నాటికి గోదాంలకు తరలిస్తామన్నారు. ఆయన వెంట పీఏసీఎస్ చైర్మన్ మధుసూదన్రెడ్డి ఉన్నారు. 29న ఉద్యోగ మేళా కల్వకుర్తి: ప్రజాపాలన 99 రోజుల వారోత్సవాలలో భాగంగా నిరుద్యోగులకు ఉద్యోగమేళా నిర్వహిస్తున్నట్లుగా జిల్లా ఐటీఐ కన్వీనర్ జయమ్మ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పదో తరగతి ఆపై చదివిన నిరుద్యోగులకు ఈ నెల 29వ తేదీ స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లుగా పేర్కొన్నారు. జాబ్మేళాలో 10 ప్ర ముఖ కంపెనీలు పాల్గొంటాయని, ఐటీఐ చదివిన ట్రైనీలకు అధిక ప్రాధాన్యత ఉంటుందని వివరించారు. అభ్యర్థులు విధిగా వారి బయోడేటా, ఒరిజినల్ విద్యార్హత పత్రాలు,ఆధార్ కా ర్డు, పాస్పోర్టు సైజు ఫొటోలు, అన్నింటి జిరా క్స్ పత్రాలు తీసుకొని కల్వకుర్తిలోని ఐటీఐ కళా శాలలో హాజరుకావాలని కోరారు. వివరాలకు 8500461186, 9848759326, 8801567267 నంబర్లలో సంప్రదించాలని కోరారు. పీఎం బాల పురస్కార్ అవార్డులకు దరఖాస్తులు మహబూబ్నగర్ రూరల్: పిల్లల్లోని ప్రతిభను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందించే ‘ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్’ అవార్డులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా సీ్త్ర, శిశు సంక్షేమశాఖ అధికారి జరీనాబేగం మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. సాహసం, క్రీడలు, సామాజిక సేవ, పర్యావరణ పరిరక్షణ, సైన్స్– టెక్నాలజీ, కళలు, సంస్కృతి వంటి రంగాల్లో విశిష్ట ప్రతిభ కనబరిచిన బాల, బాలికలకు ఈ అవార్డులు అందజేయనున్నారు. 5– 18 ఏళ్లలోపు పిల్లలు ఆన్లైన్లో https://awards.gov.in వెబ్సైట్ ద్వారా జూలై 31 వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. బాలబాలికల విజయాలు, సేవా కార్యక్రమాలు, విద్య, క్రీడా ప్రతిభ తదితర వివరాలతో చేసిన దరఖాస్తు అక్నాలెడ్జ్మెంట్ ప్రతిని జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయంలో జూలై 31లోగా అందజేయాలని కోరారు. పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్సైట్ను సంప్రదించాలని సూచించారు. -
సాగునీటి ప్రాజెక్టులు వేగవంతం
కందనూలు: నాగర్కర్నూల్, వనపర్తి జిల్లాల్లో సాగునీటి రంగానికి ప్రాధాన్యత ఇస్తూ.. ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్టుల నిర్మాణాలను వేగవంతం చేయాలని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. మంగళవారం పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్యాకేజీ–8 పరిధిలోని వట్టెం అతిథిగృహంలో కలెక్టర్లు హేమంత కేశవ్ పాటిల్, ఆదర్శ్ సురభి, ఎమ్మెల్యేలు కూచుకుళ్ల రాజేశ్రెడ్డి, వంశీకృష్ణ, కసిరెడ్డి నారాయణరెడ్డి, తూడి మేఘారెడ్డితో కలిసి పాలమూరు ఎత్తిపోతల, ఎంజీకేఎల్ఐ, డిండి, ఉమామహేశ్వర బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, అచ్చంపేట లిఫ్ట్ ఇరిగేషన్, మార్కండేయ, కర్నెతండా బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లతోపాటు వివిధ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలు, భూసేకరణ పనుల పురోగతిపై మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా నాగర్కర్నూల్, వనపర్తి జిల్లాల్లో ప్రాజెక్టుల వారీగా చేపట్టిన పనులు, భూ సేకరణ పురోగతిని అధికారులు వివరించారు. ముఖ్యంగా కాల్వల నిర్మాణం, రిజర్వాయర్ల అనుబంధ పనులు, పంప్హౌజ్ల ఏర్పాటు, విద్యుత్ కనెక్షన్లు వంటి అంశాలపై చర్చించారు. అనంతరం మంత్రి జూపల్లి మాట్లాడుతూ.. ప్రాజెక్టుల పనులను వేగవంతం చేసేందుకు రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. రైతులకు సాగునీరు అందించడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. అందుకు అనుగుణంగా ప్రతి పనిని గడువులోగా పూర్తిచేయాలని మంత్రి స్పష్టం చేశారు. ముఖ్యంగా భూ సేకరణ ప్రక్రియలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా పారదర్శకంగా వ్యవహరించాలన్నారు. నష్టపరిహారం చెల్లింపుల్లో జాప్యం జరగకుండా చూడాలన్నారు. వారం రోజుల్లో భూ సేకరణ ప్రక్రియను పూర్తిచేయాలని ఆయన ఆదేశించారు. నిర్లక్ష్యాన్ని సహించం.. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలు పూర్తయితే వేలాది ఎకరాలకు సాగునీరు అందుతుందని మంత్రి జూపల్లి అన్నారు. అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యాన్ని సహించబోమన్నారు. పనుల నాణ్యత విషయంలోనూ రాజీ పడొద్దన్నారు. త్వరలో ఉమ్మడి జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల సందర్శనకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రానున్నారని.. ఆయన దృష్టికి తీసుకెళ్లే ప్రధాన సమస్యల పరిష్కారానికి అవసరమైన అనుమతుల కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని తెలిపారు. వారం రోజుల్లో భూసేకరణ పూర్తిచేయాలి త్వరలో ప్రాజెక్టుల సందర్శనకు సీఎం రేవంత్రెడ్డి రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు -
ఏసీబీకి చిక్కిన సర్వేయర్
రాజోళి/ గట్టు: లంచం తీసుకుంటూ ప్రభుత్వ సర్వేయర్ ఏసీబీకి పట్టుబడిన ఘటన వడ్డేపల్లి మండలంలో చోటు చేసుకుంది. ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణ కథనం ప్రకారం.. వడ్డేపల్లి మండలం కొంకల గ్రామానికి చెందిన ఓ రైతు తనకున్న 4.14 ఎకరాల భూమిని సర్వే చేయాలని సర్వేయర్ బ్రహ్మయ్యను సంప్రదించా డు. దీనికి గాను సర్వేయర్ ఎకరాకు రూ.5 వేల చొప్పున రూ.20 వేలు లంచం డిమాండ్ చేశాడు. అడ్వాన్సుగా రూ.5 వేలు తీసుకున్నాడు. మిగిలిన డబ్బు కోసం ఒత్తిడి చేయడంతో.. విసిగిపోయిన రైతు మహబూబ్నగర్లో ఏసీబీ అధికారులను సంప్రదించాడు. ఈ క్రమంలో మంగళవారం శాంతిగనర్లోని తహసీల్దార్ కార్యాలయంలో సదరు రైతు నుంచి రూ. 10 వేలు లంచం తీసుకుంటుండగా అధికారులు సర్వేయర్ను రెడ్హ్యాండెడ్గా పట్టుకొని విచారణ చేపట్టా రు. ఇదిలా ఉండగా.. ఏసీబీ అధికారులు గట్టులోని సర్వేయర్ బ్రహ్మ య్య ఇంట్లోనూ తనిఖీలు చేపట్టారు. రైతు దగ్గర నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడిన వ్యవహారంపై ఏసీబీ అధికారులు నేరుగా గట్టులోని బ్రహ్మయ్య ఇంటికి చేరుకు ని తనిఖీలు చేశారు. -
డివిజన్–4 పరిధిలో 11 స్కీంలు..
ఆర్డీఎస్ డివిజన్–4లో మొత్తం 11 ఎత్తిపోతల పథకాలు కలిశాయి. అందులో ఊట్కూర్ 1, 2, బుడమరుసు, మద్దూర్, రాజోళి, తూర్పు గార్లపాడు, క్యాతూర్ 1, 2, అలంపూర్, గొందిమళ్ల పథకాలు ఉన్నాయి. కాగా, ఇందులో కొన్నింటిని ప్రభుత్వమే ఏర్పాటు చేయగా.. మరికొన్ని రైతులు ఏర్పాటు చేసుకున్నారు. వాటి నిర్వహణ ప్రస్తుతం ప్రభుత్వ పరిధిలోకి రావడంతో రైతులకు కొంత ఉపశమనం కలిగింది. ప్రస్తుతం ఏదేని ఎత్తిపోతల పథకం పైప్లైన్ పగిలిపోయినా, పూడిక తొలగించడం, స్టార్టర్లను బాగుచేయడం, మోటార్ల రిపేర్లు, మేజర్ మరమ్మతులకు సంబంధించిన ప్రతిపాదనలను ఆర్డీఎస్ అధికారులే సిద్ధం చేయడంతో పాటు మరమ్మతులు చేయిస్తున్నారు. -
తేలని సరిహద్దు వివాదం
అలంపూర్(రాజోళి): రెండు తెలుగు రాష్ట్రాల నడు మ సరిహద్దు వివాదం తీరడం లేదు. కొన్నేళ్లుగా తుంగభద్ర నదిలో ఇసుకతీతకు సంబంధించి సరిహద్దు సమస్యగా మారుతోంది. ఏపీలోని కర్నూ లు జిల్లా వారు తెలంగాణ సరిహద్దులోకి వచ్చినప్పుడు స్థానికులు కేవలం అభ్యంతరం చెబితే వెనక్కి వెళ్లిపోయ్యే వారు. కానీ జిల్లావాసులు అనుకోకుండా అవతలి వైపు వెళ్లినప్పుడు నిరభ్యంతరంగా కేసులు నమోదు చేసి.. జరిమానాలు విధించిన ఘటనలు అనేకం ఉన్నాయి. ఏపీలో టీడీపీ ప్రభుత్వం వచ్చాక రాజోళి మండలం తూ ర్పు గార్లపాడుకు వచ్చి మరీ ఒకేసారి పదుల సంఖ్యలో ట్రాక్టర్లకు జరిమానాలు విధించారు. అది కూడా ఇక్కడి ప్రభుత్వ అనుమతుల మేరకు ఇసు కను తీసుకొచ్చిన ట్రాక్టర్లపై కావడం గమనార్హం. ఏడాది క్రితం సర్వేకు యత్నం.. ఏపీ అధికారుల జరిమానాల నేపథ్యంలో జిల్లావాసుల వాదనలు విన్న అప్పటి అడిషనల్ కలెక్టర్ లక్ష్మీనారాయణ రాజోళి మండల పరిధిలోని తుంగభద్ర నదిలో సరిహద్దు సమస్యను తేల్చేందుకు వెళ్లారు. అయితే కేవలం ఏపీ పోలీసు అధికారులు మాత్రమే వచ్చారు. మైనింగ్ అధికారులు రాకపోవడంతో సర్వే నిలిచిపోయింది. అయితే ఆ సమ యంలో నదిలో హద్దులు ఏముంటాయనే మాట ను ఏపీకి చెందిన వారు చెప్పి తప్పించుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. జిల్లా ప్రజల అవసరాల కోసం నదిలో నుంచి ఇసుకను తీస్తే కేసులు నమోదుచేసే స్థానిక అధికారులు.. ఏపీ నుంచి ఇసుక వాహనాలు జిల్లా సరిహద్దులోకి వ స్తున్నా పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నా యి. వీరి తీరుతోనే ఏపీ అధికారులు జిల్లాకు వచ్చి మరీ కేసులు నమోదు చేశారని ఆవేదన చెందుతున్నారు. తాజాగా మరోసారి.. ఇటీవలి కాలంలో తమ పరిధిలోకి వస్తున్నారంటూ.. ఏపీకి చెందిన వారు అభ్యంతరాలు చెప్ప డం పరిపాటిగా మారింది. ఈ క్రమంలోనే మంగళవారం తుంగభద్ర నదిలో ఇరు రాష్ట్రాల అధికారులు సర్వే చేసేందుకు సన్నద్ధమయ్యారు. జిల్లా నుంచి మైనింగ్శాఖ ఏడీ వెంకటరమణ, ఇతర అధికారులు హాజరయ్యారు. నదిలో వారు సరిహద్దును తేల్చేందుకు మ్యాప్లను పరిశీలించారు. ఈ క్రమంలోనే కర్నూలుకు చెందిన టీడీపీ నాయకుడు, కేడీసీసీబీ చైర్మన్ విష్ణువర్ధన్రెడ్డి అక్కడికి చేరుకున్నారు. నదిలో నుంచి తట్ట ఇసుక తీసేందుకు వీలు లేదని.. తమ పరిధిలో కూడా తీయకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటికే గద్వాల జిల్లాకు చెందినవారు ఇసుక తరలించడంతో కర్నూలు జిల్లాలో తాగునీటికి ఇబ్బందిగా ఉందన్నారు. ఇప్పటికే సమస్యను తెలంగాణ అధికారులకు కూడా తెలియజేశామని చెప్పడంతో సర్వే నిలిచిపోయింది. ఈ విషయమై జిల్లాకు చెందిన ఏడీ వెంకటరమణను అడగగా, ఆయన మౌనం వహించారు. అంతకు ముందు నదిలోకి వచ్చిన మైనింగ్ ఏడీపై బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు సంజీవరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీకి చెందిన వాహనాలు, జిల్లాకు చెందిన వాహనాలు ఇసుకను అక్రమంగా తరలిస్తున్నాయని సమాచారం ఇస్తే పట్టించుకోలేదని.. కనీసం ఫోన్ కూడా ఎత్తడం లేదన్నారు. అక్రమ వ్యాపారం చేసే వారి ఫోన్ మాత్రం ఎత్తడం.. వారి దందాకు సహకరించడం మైనింగ్ అధికారులకు పరిపాటిగా మారిందని ఆరోపించారు. తుంగభద్ర నదిలో ఇసుకతీతకు హద్దు సమస్య తాజాగా ఇరు రాష్ట్రాల అధికారుల రాక ఏపీ టీడీపీ నాయకుడి అభ్యంతరంతో వెనుదిరిగిన అధికారులు -
రాయితీలను సద్వినియోగం చేసుకోవాలి
ఎర్రవల్లి: ప్రభుత్వం రైతులకు అందించే రాయితీలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే విజయుడు సూచించారు. మంగళవారం ఎర్రవల్లి సింగిల్విండో ఆధ్వర్యంలో రైతులకు రాయితీపై జిప్సం, జీలుగ విత్తనాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వానాకాలం సీజన్కు సంబంధించి 90శాతం రాయితీపై జిప్సం, 50శాతం రాయితీపై జీలుగ విత్తనాలు అందుబాటులో ఉన్నట్లు చెప్పారు. 30కిలోల జీలుగ విత్తనాల ధర రూ. 4,904 ధర ఉండగా.. రైతులు రూ. 2,452 చెల్లిస్తే సరిపోతుందన్నారు. అదే విధంగా 50కిలోల జిప్సం ధర రూ.283 ఉండగా.. రాయితీ పోను రూ.28.30 చెల్లించాలని తెలిపారు. జీలుగను సాగుచేసి భూమిలో కలియదున్నడం ద్వారా సహజ ఎరువు లభిస్తుందన్నా రు. తద్వారా రైతులకు పెట్టుబడులు తగ్గి, దిగు బడి పెరుగుతుందన్నా రు. వేరుశనగ పంటలో జిప్సం వినియోగించడం ద్వారా నాణ్యమైన దిగుబడి ఉంటుందన్నారు. జిప్సం, జీలుగ విత్తనాలు అవసరమున్న రైతులు పట్టాదారు పాస్పుస్తకం, ఆధార్కార్డు జిరాక్స్తో పీఏసీఎస్ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నీలి శ్రీనివాసులు, డీఏఓ వీరప్ప, అలంపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ దొడ్డెప్ప, పీఏసీఎస్ చైర్మన్ రంగారెడ్డి, ఏఓలు సురేశ్గౌడ్, రవికుమార్, సర్పంచ్ అనిత, నాయకులు వెంకటేశ్యాదవ్, జోగుల రవి, శ్రీధర్రెడ్డి, నారాయణ నాయుడు, గిడ్డారెడ్డి, కృష్ణసాగర్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రజావాణికి 99 అర్జీలు
గద్వాల: అన్నిశాఖల అధికారులు ప్రజావాణి కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ.. ప్రజల అర్జీలను సత్వరం పరిష్కరించాలని అదనపు కలెక్టర్ మధుమోహన్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి వచ్చిన ప్రజల సమస్యలను ఆయన నేరుగా తెలుసుకుని దరఖాస్తులు స్వీకరించారు. మొత్తం 99 దరఖాస్తులు అందగా.. పరిష్కారం నిమిత్తం సంబంధిత అధికారులకు పంపించారు. ఫిర్యాదులను పెండింగ్లో ఉంచకుండా ఎప్పటిప్పుడు పరిష్కరించాలని ఆయన సూచించారు. విద్యార్థుల్లో నైపుణ్యాలను వెలికితీసేందుకే శిబిరాలు మానవపాడు: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో నైపుణ్యాలను వెలికితీసేందుకే వేసవి శిబిరాలు నిర్వహిస్తున్నట్లు డీఈఓ విజయలక్ష్మి అన్నారు. సోమవారం మానవపాడు మండలంలోని పీఎంశ్రీ జల్లాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన వేసవి శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమానికి ఆమె హాజరై మాట్లాడారు. విద్యార్థులకు జీవన నైపుణ్యాలు, క్రీడలు, ఆరోగ్యం, పౌష్టికాహారం, వినోదం, సామూహిక కృషి, అభ్యసనం విలువలను తెలియజేసేందుకు వేసవి శిబిరాలు ఎంతో దోహదపడుతున్నట్లు తెలిపారు. ప్రతి విద్యార్థి పట్టుదల, పరస్పర సహకారం, ఆత్మవిశ్వాసం, గౌరవం, బాధ్యతతో మెలగాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ నందిని వజ్ర, హెచ్ఎం విష్ణువర్ధన్ పాల్గొన్నారు. జూన్ 1 నుంచి మయూరి పార్క్లో ప్లాస్టిక్ నిషేధం జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): ప్రకృతి పరిరక్షణ, పర్యావరణ సంరక్షణ, పార్క్ పరిశుభ్రతను దృష్టిలో ఉంచుకొని, మయూరి పార్క్లో జూన్ 1 నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులను పూర్తిగా నిషేధిస్తున్నట్లు డీఎఫ్ఓ శివ్ ఆశిష్ సింగ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. పార్క్లోకి ప్లాస్టిక్ కవర్లు, ప్లాస్టిక్ బాటిళ్లు, ప్లేట్లు, గ్లాసులు, స్పూన్లు, ఇతర ప్లాస్టిక్ పదార్థాలు తీసుకురావడం అనుమతించమని స్పష్టం చేశారు. సందర్శకులు పర్యావరణహిత వస్తువులు మాత్రమే ఉపయోగించాలని కోరారు. వన్యప్రాణులు, పక్షులు, పార్క్లోని సహజ వాతావరణాన్ని కాపాడేందుకు ఈ నిర్భయం తీసుకున్నట్లు వెల్లడించారు. ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల పర్యావరణానికి కలిగే హానిని తగ్గించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అని, సందర్శకులు, పర్యాటకులు ఈ నియమాలను పాటించి అటవీ శాఖకు సహకరించాలని విన్నవించారు. ఎవరైనా నియమాలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జోరుగా ధాన్యం విక్రయాలు జడ్చర్ల: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో సోమవారం వివిధ ప్రాంతాల నుంచి భారీగా ధాన్యం విక్రయానికి వచ్చింది. 15,904 బస్తాల ధాన్యం విక్రయానికి రాగా.. ఆర్ఎన్ఆర్ క్వింటా గరిష్టంగా రూ.2,835, కనిష్టంగా రూ.1,602 ధరలు లభించాయి. అలాగే 9,130 బస్తాల మొక్కజొన్న రాగా క్వింటా గరిష్టంగా రూ.1,963, కనిష్టంగా రూ.1,601 చొప్పున పలికాయి. వేరుశనగ క్వింటా గరిష్టంగా రూ.8,269, కనిష్టంగా రూ.7,169, ఆముదాలు గరిష్టంగా రూ.6,295, కనిష్టంగా రూ.6,175, పొద్దుతిరుగుడు గరిష్టంగా రూ.6,808, కనిష్టంగా రూ.6,528 ధరలు లభించాయి. ఇదిలా ఉండగా.. బాదేపల్లి యార్డుకు సోమవారం భారీగా దిగుబడులు వచ్చిన కారణంగా బస్తాలను లిఫ్టింగ్ చేయని పరిస్థితి ఏర్పడిందని యార్డు కార్యదర్శి అశ్వక్ అహ్మద్ తెలిపారు. దీంతో మంగళవారం యార్డులో క్రయవిక్రయాలు నిలిపివేస్తున్నట్లు చెప్పారు. -
పటిష్ట నిఘా..!
నకిలీ విత్తనాల నియంత్రణకు పకడ్బందీ చర్యలు గద్వాల(గద్వాల క్రైం): జిల్లాలో రైతులపాలిట శాపంగా మారుతున్న నకిలీ విత్తనాలపై అధికార యంత్రాంగం పటిష్ట నిఘా పెట్టింది. ఏ రైతు కూడా నకిలీ విత్తనాలతో మోసపోకుండా వ్యవసాయ, పోలీసుశాఖలు సమన్వయంతో ముందుకు సాగుతున్నాయి. ఇప్పటికే జిల్లా పోలీసుశాఖ ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపి.. ప్రధాన చెక్ పాయింట్ల వద్ద తనిఖీలను ముమ్మరం చేసింది. నడిగడ్డ కేంద్రంగా కొనసాగుతున్న నకిలీ విత్తన మాఫియాను నిలువరించేందుకు వ్యూహాత్మకంగా చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో ప్రధానంగా సీడ్పత్తి విత్తన కంపెనీలకు పేరుగాంచింది. ఇక్కడి నుంచే నాసిరకం సీడ్పత్తి ముఠా కూడా పెచ్చుమీరుతోంది. నకిలీ విత్తన మాఫియా వెనుక ప్రధాన వ్యక్తులు ఉండటం.. వీరికి రాజకీయ భరోసా ఉండటంతో తమ అక్రమార్జనకు ఎదురులేకుండా ఉంది. ఈ నేపథ్యంలో రెండు శాఖల అధికారులు విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. ముందస్తు ఒప్పందాలతో మోసం.. జిల్లాలోని గద్వాల, అలంపూర్ నియోజకవర్గాల్లో రైతులు పత్తి, మిరప, వరి, శనగ, వేరుశనగ పంటలతో పాటు కూరగాయలు, పండ్ల తోటలను సాగుచేస్తున్నారు. వీటిలో సీడ్పత్తి, మిరపను వేలాది ఎకరాల్లో పండిస్తున్నారు. సీడ్పత్తి పంటకు అనుకూలమైన నేలలు ఉండటంతో రైతులు ఎక్కువగా మక్కువ చూపుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయా కంపెనీలు సీడ్ ఆర్గనైజర్ల వ్యవస్థతో కుమ్మక్కవుతున్నాయి. రైతులకు ముందస్తుగా పంట రుణాలు అందించి.. తమ వద్దే విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసేలా ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు. ఆ త ర్వాత రైతులకు సునాయసంగా నాసిరకం మందులు, విత్తనాలు అంటగడుతున్నారు. అయితే కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సరిహద్దు ప్రాంతం కావడంతో గుట్టుగా నాసిరకం విత్తనాలను సరఫరా చేస్తున్నారు. గతేడాది టాస్క్ఫోర్స్ బృందాలు పలు ఇళ్లు, గోదాంలు, రహస్య స్థావరాల్లో నిల్వ చేసిన నాసిరకం విత్తనాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నాయి. జిల్లావ్యాప్తంగా 8 కేసులు నమోదయ్యాయి. రంగంలోకి టాస్క్ఫోర్స్.. నడిగడ్డలో నకిలీ విత్తనాలకు అడ్డుకట్ట వేసేందుకు వ్యవసాయ, పోలీసుశాఖ ప్రత్యేకంగా టాస్క్ఫోర్స్ బృందాలను రంగంలోకి దించాయి. నకిలీ విత్తన దందాపై నిరంతరం దాడులు చేపట్టడంతో పాటు సీడ్ ఆర్గనైజర్ల కార్యకలాపాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ.. వారి కదలికలపై ప్రత్యేక దృష్టిసారించారు. జిల్లా సరిహద్దుల్లో పటిష్టమైన నిఘా పెట్టారు. ఎవరైనా పట్టుబడిన క్రమంలో అధికారులకు వచ్చే ఒత్తిళ్లను అధిగమించి ఎలా ముందుకెళ్లాలనే అంశంపై తర్పీదు సైతం ఇచ్చారు. ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు సమాచారం అందించేలా ప్రణాళికలు రూపొందించారు. పాత కేసుల్లో పట్టుబడిన నిందితుల కదలికలను ఇప్పటి నుంచే వాకబు చేస్తున్నారు. పొరుగు రాష్ట్రాలకు చెందిన సూత్రధారులను సైతం గుర్తించేందుకు సన్నద్ధమవుతున్నారు. జిల్లాలో నాసిరకం విత్తనాలపై ఉక్కుపాదం మోపుతారా? లేక ఉలిక్కిపాటుతో సరిపెడతారా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. రెండేళ్ల క్రితం నల్లగొండ పోలీసులు జోగుళాంబ గద్వాల జిల్లాకు చెందిన నకిలీ విత్తన వ్యాపారులను పట్టుకు న్నారు. ఈ క్రమంలో ఇక్కడి యంత్రాంగం ఉరుకు లు, పరుగులు తీసింది. అయితే ఇక్కడి నిఘా వ్య వస్థ కొరవడటం.. వ్యాపారులిచ్చే కానుకలకు మసకబారిన కళ్లతో ఉండటంతోనే ఇక్కడ వదిలేశారనే ఆరోపణలు వెల్లువెత్తా యి. అయితే జిల్లాలో నాసి రకం విత్తనాల మాట వినపడకూడదని కలెక్టర్ సంబంధిత అధికారులకు ఖరాఖండిగా చెప్పారు. ప్రధానంగా మిరప, పత్తిసాగు చేస్తున్న రైతుల వివరాలు, కంపెనీల వివరాలు తప్పనిసరిగా అధికారులతో ఉండాలని స్పష్టంచేశారు. తనిఖీల పేరుతో వ్యాపారులను ఏమాత్రం ఇబ్బందులు పెట్టొదని.. అన్ని వివరాలను పరిశీలించిన తర్వా తే కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. జిల్లా సరిహద్దుల్లో చెక్పోస్టుల ఏర్పాటు వ్యవసాయ, పోలీసుశాఖ సంయుక్తంగా తనిఖీలు నకిలీ విత్తన మాఫియాకు అడ్డుకట్ట వేసేందుకు వ్యూహాత్మకంగా చర్యలు -
ఆ ఒక్కటే అడ్డంకి..
‘సూపర్’ సేవలకు ‘ఫోరం’ విఘాతం 2016లో అడుగులు.. 2023లో పనులు.. మహబూబ్నగర్లోని ఎదిరలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ, ఆర్టీసీ బస్స్టాండ్ ఎదుట ఉన్న పాత కలెక్టరేట్ స్థానంలో 1,000 పడకల సామర్థ్యంతో ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి 2016లో మొత్తం రూ.450 కోట్లతో గత బీఆర్ఎస్ హయాంలో అడుగులు పడ్డాయి. ఇందులో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి రూ.270 కోట్లు కేటాయించారు. 2022 డిసెంబర్లో ఈ ఆస్పత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. పాత కలెక్టరేట్లోని సామగ్రిని కొత్తగా నిర్మించిన ఇంటిగ్రేటెడ్ కలెక్టర్ కార్యాలయ సముదాయంలోకి మార్చేందుకు రెండున్నర నెలల సమయం పట్టింది. 2023లో ఆస్పత్రి భవన నిర్మాణాల పనులు ప్రారంభమయ్యాయి. 4 బ్లాక్లు పూర్తి.. ఈ–బ్లాక్ పనులు షురూ.. వెయ్యి పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని ఏ, బీ, సీ, డీ, ఈ బ్లాక్లుగా విభజించి బీఆర్ఎస్ హయాంలోనే నిర్మాణం ప్రారంభించారు. తొలి నాలుగు బ్లాక్ల (ఏ, బీ, సీ, డీ) నిర్మాణం ఏడాది క్రితమే పూర్తయింది. ఈ–బ్లాక్ నిర్మించాల్సిన స్థలంలో ఈవీఎంల గోదాం ఉండగా.. ఈ అంశం కోర్టులో పెండింగ్లో పడింది. మూడు నెలల కిత్రం కోర్టు ఆదేశాలతో ఈవీఎంలను కొత్త కలెక్టరేట్కు తరలించడంతో సమస్య పరిష్కారం కాగా.. ఈ–బ్లాక్ పనులు ప్రారంభమయ్యాయి. చివరి దశలో పరికరాల బిగింపు.. మహబూబ్నగర్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణంలో భాగంగా హైదరాబాద్లోని గాంధీ ప్రభుత్వ ఆస్పత్రి తరహాలో అధునాతన హాస్పిటల్ థియేటర్లు(ఎంఓటీ) ఐదు, ఆక్సిజన్ పైప్లైన్ వర్క్స్, ఫైర్ ఫైటింగ్ ట్యాంక్లు, పబ్లిక్ అడ్రెసింగ్ సిస్టం, పవర్, పవర్ బ్యాక్ అప్ సిస్టం, నాలుగు బ్లాక్లలో డొమెస్టిక్ పంప్లు, అంబులెన్స్ గ్యారేజీతో పాటు మెడికల్ గ్యాస్ పైప్లైన్లు, భారీ సామర్థ్యం గల రెండు వాటర్ ట్యాంక్లు, తొమ్మిది లిఫ్ట్లు, తొమ్మిది కౌంటర్లు, కేథల్యాబ్స్, ఎంఆర్ఐ, సిటీ స్కాన్కు సంబంధించిన నిర్మాణాలు పూర్తి చేశారు. ఇంటర్నల్ రోడ్లు, స్ట్రీట్ లైట్లు. ఆస్పత్రి చుట్టూ ప్రహరీ పనులు సైతం పూర్తయ్యాయి. అదేవిధంగా గుండె, మూత్రపిండాలు, కంటి, న్యూరో, ఆర్థో, ఈఎన్టీ వంటి మొత్తం 35 వైద్య విభాగాలకు సంబంధించి సుమారు రూ.120 కోట్ల వ్యయంతో అధునాతన వైద్యసేవలందించేలా వైద్య పరికరాలు అమర్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఈ–బ్లాక్ అయితేనే వైద్య పరికరాల బిగింపు.. ఈవీఎంల సమస్య తీరడంతో ఆలస్యంగా ప్రారంభించిన ఈ–బ్లాక్లో మొత్తం ఐదు స్లాబ్లు నిర్మించాల్సి ఉండగా.. ప్రస్తుతం రెండు అంతస్తుల స్లాబ్ వరకు నిర్మాణం పూర్తయింది. ఈ భవన నిర్మాణ పనులు పూర్తయితే అధునాతన వైద్య పరికరాలను అన్ని బ్లాక్లలో అమర్చనున్నారు. ఆక్సిజన్, ఫైర్ ఫైటింగ్ వంటివి అనుసంధానంగా ఏర్పాటు చేయాల్సి రావడంతో ఆయా పనులను ఒకేసారి చేయాల్సి వస్తుందని ఇంజినీర్లు చెబుతున్నారు. ఉమ్మడి పాలమూరులో పేద రోగులకు ఉచితంగా అత్యాధునిక వైద్య సేవలందించాలనే లక్ష్యంతో మహబూబ్నగర్లో చేపట్టిన సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణంలో తీవ్ర జాప్యం చోటుచేసుకుంది. ఎట్టకేలకు ఈవీఎంల గోడౌన్ సమస్య పరిష్కారమై పనులు తుది దశకు చేరుకున్నా.. వినియోగదారుల ఫోరం కేంద్రం తరలింపుపై అనిశ్చితి కొనసాగుతూనే ఉంది. ఫలితంగా వాహనాల పార్కింగ్ పనులు ఇంకా మొదలు కాలేదు. ఫలితంగా వైద్యసేవలు అందుబాటులోకి వచ్చేందుకు మరికొంత కాలం పట్టే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ‘అధికార’ యంత్రాంగంలో కొరవడిన చిత్తశుద్ధి, ప్రణాళిక లేమి, పర్యవేక్షణ లోపమే ఇందుకు కారణమనే విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ‘సాక్షి’ ఫోకస్.. – సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్ కొనసాగుతున్న సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఈ–బ్లాక్ నిర్మాణంజిల్లాకేంద్రంలోని 650 పడకల సామర్థ్యం గల ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో 165 మంది వైద్యులు ఉన్నారు. ఉమ్మడి పాలమూరులోని ఐదు జిల్లాల్లో ప్రభుత్వ జనరల్ ఆస్పత్రులు ఉన్నాయి. అయినా.. ఆయా జిల్లాల నుంచి ఎక్కువ శాతం మంది రోగులు మహబూబ్నగర్లోని జీజీహెచ్కే వస్తున్నారు. ఈ ఆస్పత్రిలో రోజుకు సగటున 1,800 నుంచి 2,000 వరకు ఓపీ ఉంటోంది. వెయ్యి పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి అందుబాటులోకి వస్తే జీజీహెచ్పై భారం తగ్గనుండగా.. వైద్యుల సంఖ్య రెట్టింపు కావడంతో పాటు పేదరోగులకు ఉచితంగా అత్యాధునిక వైద్యసేవలు అందనున్నాయి. వినియోగదారుల కేంద్రంపై వీడని అనిశ్చితే కారణం స్పందిస్తే త్వరలో అందుబాటులోకి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఈవీఎంల గోదాం తరలింపుతో చురుగ్గా సాగుతున్న ఈ–బ్లాక్ పనులు అత్యాధునిక వైద్యం కోసం నాలుగేళ్లుగా పేద రోగుల ఎదురుచూపులు ఈవీఎంల అడ్డంకి తొలగినా.. వాహనాల పార్కింగ్కు కేటాయించిన స్థలంలో ఉన్న వినియోగదారుల ఫోరం కేంద్రంపై ఇంకా అనిశ్చితి కొనసాగుతోంది. దీన్ని న్యూటౌన్లోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి ఎదుట ఉన్న వెటర్నరీ ఆస్పత్రికి మార్చాలని అధికారులు ప్రతిపాదించారు. ఆ తర్వాత మరి కొన్ని చోట్ల ప్రభుత్వ భవనాలను సైతం పరిశీలించారు. కానీ.. ఇప్పటివరకు ఏ నిర్ణయం తీసుకోకపోవడం.. వినియోగదారుల ఫోరం కార్యకలాపాలు అక్కడి నుంచే కొనసాగుతుండడంతో ఇంటర్నల్ రోడ్లు, స్ట్రీట్ లైన్ల ఏర్పాటు పూర్తయినా.. వాహనాల పార్కింగ్ పనులు ప్రారంభం కాలేదు. దీన్ని తరలిస్తే ఒక వైపు ఈ బ్లాక్.. మరోవైపు చివరి దశలో ఉన్న వైద్య పరికరాల బిగింపుతో పాటు వాహనాల పార్కింగ్ పనులు పూర్తి చేయనున్నారు. ఈ సమస్యను పరిష్కరిస్తేనే సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి సేవలు పేద రోగులకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుంది. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఈ ఆస్పత్రిని పలు పర్యాయాలు పరిశీలించారు. ఈ నెల మొదటి వారంలో ఆస్పత్రిని సందర్శించిన క్రమంలో రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన్ 2న సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని ప్రారంభిస్తామని చెప్పారు. అయితే క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే ఆ లోపు పనుల పూర్తి గగనమేనని తెలుస్తోంది. -
మాదాసి, మాదారి కురవలను ఎస్సీలుగా గుర్తించండి
గద్వాల: మాదాసి, మాదారి కురువలను ఎస్సీలుగా గుర్తించి.. కుల ధ్రువపత్రాలు జారీ చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. ముందుగా జిల్లాకేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తా నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకుడు కురువ విజయ్కుమార్ మాట్లాడుతూ.. జాతీయ జనగణనలో మాదాసి, మాదారి కురువలను ఎస్సీలుగా నమోదు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 244 కులాలకు లేని ఆంక్షలు ఒక్క మాదాసి, మాదారి కురువలకు మాత్రమే పెట్టడం సరికాదన్నారు. అనంతరం అదనపు కలెక్టర్ మధుమోహన్కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో నాయకులు వెంకటేశ్, రవిప్రకాశ్, మహేశ్, కిష్టప్ప, రంగప్ప, నర్సింహులు, రాజేశ్, రామాంజనేయులు, తిరుమలేష్ పాల్గొన్నారు. -
ఓడీఎఫ్ వట్టిదేనా?
2019లో బహిరంగ మలవిసర్జన రహిత జిల్లాగా కేంద్రం ప్రకటన –8లో uగద్వాల: కేంద్ర ప్రభుత్వం ప్రకటించినట్లు జోగుళాంబ గద్వాల బహిరంగ మలవిసర్జన రహిత (ఓపెన్ డిఫికేషన్ ఫ్రీ) జిల్లా కాదా..? అలాంటప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎందుకు ప్రకటించినట్లు..? అయితే కేంద్ర ప్రభుత్వానిదే తప్పుడు ప్రకటనా..? లేక జిల్లా లో ఉన్న అధికారులే కేంద్రానికి తప్పుడు సమాచా రం ఇచ్చి, తప్పుదోవ పట్టించారా..? ఇలాంటి ప్రశ్న లు ఉత్పన్నం కావడానికి ప్రస్తుతం జిల్లాలో కొనసాగుతున్న జాతీయ జనగణన–2027 ప్రక్రియే కారణం. ఇదేమిటి జనగణనకు, బహిరంగ మలవిసర్జన రహిత జిల్లాకు ఉన్న లింకేమిటని ఆలోచిస్తున్నారా..? అయితే ‘సాక్షి’ కథనాన్ని పూర్తిగా చదవండి. ● ప్రతి ఇంటికీ వ్యక్తిగత మరుగుదొడ్డి ఉండాలని.. ఎవరూ బహిరంగ మలవిసర్జనకు వెళ్లరాదని కేంద్ర ప్రభుత్వం సంకల్పించింది. అందులో భాగంగా 2014 అక్టోబర్ 2న స్వచ్ఛభారత్ మిషన్ చేపట్టగా.. అదే సంవత్సరం జిల్లాలో మొదటి విడతగా వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలను ప్రారంభించారు. జిల్లాలోని అన్ని మండలాలు, మున్సిపాలిటీల్లో ప్రతి ఇంటికీ వ్యక్తిగత మరుగుదొడ్డి నిర్మాణం చేపట్టినట్లు అధికారులు కేంద్రానికి నివేదిక పంపారు. ఈ నివేదిక ఆధారంగా జిల్లాను 2019 అక్టోబర్ 2 నాటికి వందశాతం మరుగుదొడ్లు నిర్మాణం పూర్తిచేసుకున్న (ఓడీఎఫ్) జిల్లాగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం కూడా జిల్లాను ఓడీఎఫ్ కిందనే పరిగణిస్తూ వస్తున్నారు. నిర్మించుకున్న మరుగుదొడ్లను నిరంతర వినియోగం ద్వారా ఘన ద్రవవ్యర్థాల నిర్వహణ లక్ష్యాలతో ఓడీఎఫ్ ప్లస్ కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. జనగణనలో తేలిన లెక్క.. 2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లాలో 1,32,261 నివాసగృహాలు ఉన్నాయి. మొత్తం 6,09,990 జనాభాకు గాను పురుషులు 3,09,274 మంది, మహిళలు 3,00,716 మంది ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 5,46,813 మంది, పట్టణ ప్రాంతంలో 63,177మంది నివాసం ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. అయితే ఎనిమిదేళ్ల కాలంలో ఇళ్ల సంఖ్య పెరిగింది. నూతన ఇళ్లలో కూడా వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకున్నారని జిల్లా అధికారులు కేంద్రానికి నివేదిక పంపడంతో ఓడీఎఫ్ జిల్లాగా ప్రకటించింది. ప్రస్తుతం ఓడీఎఫ్ ప్లస్ కిందనే జిల్లాను పరిగణిస్తున్నారు. అయితే ఇటీవల కేంద్ర ప్రభు త్వం చేపట్టిన జాతీయ జనగణన–2027 ప్రక్రియ లో గ్రామీణ ప్రాంతాల్లో 20శాతం మేర వ్యక్తిగత మరుగుదొడ్లు లేవని తేలింది. ఇదే అంశాన్ని పేర్కొటూ జనగణన చేపడుతున్న అధికారులు అధికారిక వెబ్సైట్లో నమోదు చేశారు. ఓడీఎఫ్ విషయమై కలెక్టర్ రిజ్వాన్బాషా షేక్ను ‘సాక్షి’ వివరణ కోరగా.. తాను జిల్లాకు కొత్తగా వచ్చానని, ప్రస్తుతం రెండురోజుల పాటు సెలవుల్లో ఉన్నానని తెలిపారు. 2019కి సంబంధించిన అంశం కావడంతో సమగ్ర వివరాలు తెలుసుకుంటానని బదులిచ్చారు. జనగణన వివరాల నమోదుపై దృష్టిసారించిన కేంద్ర ప్రభుత్వం.. జిల్లాలో వందశాతం వ్యక్తిగత మరుగుదొడ్డు లేకపోవడం ఏమిటని ఆరా తీసింది. దీనిపై రెండు రోజుల క్రితం కేంద్ర విజిలెన్స్ అధికారులు జనగణనలో నమోదు చేసిన వివరాల ఆధారంగా ఆయా గ్రామాల్లో రహస్యంగా విచారణ జరిపినట్లు సమాచారం. వీరి విచారణలో మరుగుదొడ్లు లేవనే విషయం తేలినట్లు తెలిసింది. మరి వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం చేసినట్లు చూపించి ప్రభుత్వం నుంచి తీసుకున్న రూ. 12వేలు ఎవరి ఖాతాలోకి వెళ్లాయనే దానిపై పూర్తి విచారణ జరిపేందుకు సిద్ధమవుతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ విషయం తెలిసిన అధికారులు ఎవరిమీద ఎలాంటి పిడుగు పడుతుందో అని బెంబేలెత్తిపోతున్నట్లు తెలిసింది. ఈ విచారణలో అవినీతీపరులు బయటకు వస్తారా..? లేక పలుకుబడి పనిచేసి తప్పించుకుంటారో వేచి చూడాలి. జాతీయ జనగణనలో 20శాతం పైగా వ్యక్తిగత మరుగుదొడ్లు లేవని వెలుగులోకి రహస్య విచారణ చేపట్టిన విజిలెన్స్ అధికారులు తప్పుడు నివేదికలతో కేంద్రాన్ని తప్పుదారి పట్టించిన అధికారుల్లో గుబులు -
తాగునీరు, పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి
గద్వాల: జిల్లా ప్రజలకు శుద్ధమైన తాగునీరు అందించడంతో పాటు పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టిసారించాలని అదనపు కలెక్టర్ నర్సింగ్రావు అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. జాతీయ జలజీవన్ మిషన్ ప్రకారం ప్రతి కుటుంబానికీ అవసరమైన నీటిని సరఫరా చేయాలన్నారు. జిల్లాలో ఎక్కడా తాగునీటి సమస్య తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలోని గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల్లో గృహ అవసరాలకే కాకుండా విద్యాసంస్థలు, వైద్యశాలలు వంటి ప్రభుత్వ విభాగాలకు నల్లా కనెక్షన్లు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఎక్కడైనా సమస్యలు ఏర్పడితే వెంటనే సంబంధిత అధికారులు స్పందించి పరిష్కరించాలన్నారు. స్వచ్ఛభారత్ మిషన్లో భాగంగా కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్ నిర్మాణాలకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. అదే విధంగా వసతిగృహాలు, ప్రభుత్వ పాఠశా లు, కేజీబీవీల్లో మురుగు వ్యవస్థ నిర్వహణకు ఇంకుడుగుంతల నిర్మాణం చేపట్టాలన్నారు. వ్యర్థాలను రీసైక్లింగ్ చేసేందుకు అవసరమైన కార్యాచరణ రూపొందించాలని అధికారులకు సూచించారు. సమావేశంలో ఈఈ శ్రీధర్రెడ్డి, డీబ్ల్యూఓ సునంద, కలెక్టరేట్ ఏఓ భూపాల్రెడ్డి ఉన్నారు. ● రాష్ట్రంలో కోటిమంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యమని అదనపు కలెక్టర్ నర్సింగ్రావు అన్నారు. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న మహిళా సంక్షేమ వారోత్సవాల సందర్భంగా సీఎం రేవంత్రెడ్డి వర్చువల్గా నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. జిల్లాలో స్వయం సహాయక మహిళా సంఘాల పనితీరు, రుణాల పంపిణీ, ఆర్థిక ప్రగతి వంటి అంశాలను వివరించారు. సమావేశంలో డీఆర్డీఓ ముషాయిదాబేగం, ఏపీడీ శ్రీనివాస్, పీఆర్ ఈఈ ప్రభాకర్, మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు ప్రభావతమ్మ పాల్గొన్నారు. -
ముస్లింలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి
స్టేషన్ మహబూబ్నగర్: ముస్లింలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చాలని ముస్లిం పర్సనల్ లా బోర్డు సభ్యుడు మౌలానా అబుతాలిబ్ కోరారు. ఆల్ పార్టీ ముస్లిం రైట్స్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో నగరంలోని ఓ ఫంక్షన్హాల్లో ఆదివారం రాత్రి ‘హమారీ ఆవాజ్’ పేరుతో భారీ బహిరంగసభ నిర్వహించారు. ముఖ్య వక్తగా పాల్గొన్న మౌలానా అబుతాలిబ్ మాట్లాడుతూ దేశంలో మత విద్వేషాలను వీడి అభివృద్ధి వైపు దృష్టిసారించాలని సూచించారు. అదేవిధంగా ఎమ్మెల్సీలు ప్రొఫెసర్ కోదండరాం, నెల్లంటి సత్యం, మాజీ ఎమ్మెల్యేలు గుమ్మడి నర్సయ్య, జూలకంటి రాంరెడ్డి మాట్లాడుతూ ముస్లింల సమస్యలను పరిష్కరించాలని కోరారు. ముస్లిం లీగ్ రాష్ట్ర అధ్యక్షులు మహ్మద్ షకీల్ అహ్మద్తోపాటు పలువురు ముస్లిం సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ ముస్లిం డిక్లరేషన్ను వెంటనే అమలు చేయాలని విన్నవించారు. జనాభా నిష్పత్తి ప్రకారం అన్నివర్గాలకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని, సచార్, రంగనాథ్ మిశ్రా కమిషన్ సిఫార్సులను పూర్తిగా అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. సమస్యల పరిష్కారం కోసం అందరం ఏకమవుదామని పిలుపునిచ్చారు. అలాగే సభలో టీఎఫ్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు కాచం సత్యనారాయణ, ప్రొఫెసర్ ఇస్లాముద్దీన్ ముజాహిద్, ప్రముఖ సామాజికవేత్త జిలకరి శ్రీనివాసులు తదితరులు ప్రసంగిస్తూ ముస్లింల సంక్షేమానికి ప్రభుత్వాలు కృషి చేయాలని అవసరం ఉందన్నారు. సభలో పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్ రాఘవాచారి, హజ్రత్ మర్దాన్అలీషా దర్గా పీఠా ధిపతి అబ్దుల్రజాక్షా ఖాద్రీ, జేఏసీ కమిటీ ప్రతినిధులు ఖాజా ఫయాజుద్దీన్ అన్వర్పాష, హనీఫ్ అ హ్మద్, ఎస్ఎం ఖలీల్, జాకీర్ అడ్వకేట్, మోసీన్ఖాన్, మౌలానా నాసిర్ మజహరి, ఇస్మాయిల్, మహ్మ ద్ అహ్మద్ అలీ సనా, హాఫిజ్ ఇద్రీస్, షేక్ సిరాజుద్దీన్, మౌలానా ఖవి, సాధిక్ హుస్సేన్, తయ్యబ్ బాష్వార్, అబ్దుల్లా సున్నీ పాల్గొన్నారు. -
జూరాల పూడినది!
–8లో u జలాశయంలో కష్టసాధ్యంగా పూడికతీత వ్యవహారం జూరాల ప్రాజెక్టులో సుమారు 2 టీఎంసీలకు పైనే బురద పేరుకుపోయినట్లు సర్వేలో తేలింది. ఈ క్రమంలో ఇసుకను తీసుకుని బురద తొలగించేందుకు పనులు దక్కించుకునే ఏజెన్సీలు ప్రభుత్వానికి రూ.300 కోట్లు చెల్లించాలని తుది నివేదిక సిద్ధం చేసి ప్రభుత్వానికి మూడు నెలల కిందట పంపించాం. దీనిపై ప్రభుత్వం నుంచి నిర్ణయం రావాల్సి ఉంది. – జుబేర్, జూరాల డ్యాం ఈఈ గద్వాల: కృష్ణాబేసిన్ పరిధిలో ఉమ్మడి తెలుగు రా ష్ట్రాల్లోనే తొలిప్రాజెక్టు ప్రియదర్శిని జూరాల. ఉమ్మ డి పాలమూరులోని నెట్టెంపాడు, భీమా, కల్వకుర్తి, పాలమూరు– రంగారెడ్డి, కోయిల్సాగర్తోపాటు నల్లగొండ జిల్లాలోని నాగార్జునసాగర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీశైలం ప్రాజెక్టుకు జూరాల నుంచే నీరు విడుదల అవుతుంది. ఇంతటి ప్రాధాన్యత గల జూరాల జలాశయం ప్రస్తుతం బురదతో పూడుకుపోయింది. ఫలితంగా జలాశయంలో నీటినిల్వ సామర్థ్యం తగ్గిపోయి.. రబీ సీజన్లో సాగు, తాగు నీటి కష్టాలు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో జూరాల జలాశయంలో పూడిక తీసేందుకు అధికారులు సన్నాహాలు చేపట్టారు. ఇందులో భాగంగా జలాశయంలో ఎంతమేర బురద పేరుకుపోయింది. ఎన్నిటీఎంసీల నీటినిల్వ సామర్థ్యం తగ్గిందనే లెక్క లు వేశారు. జలాశయంలో పేరుకుపోయిన బురదను తొలగించేందుకు సుమారు రూ.312 కోట్లు వ్యయం అవుతుందని అంచనాలు రూపొందించి నివేదికను మూడు నెలల కిందట ప్రభుత్వానికి సమర్పించారు. 1,045 అడుగులు.. జూరాల ప్రాజెక్టు జలాశయం పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు (1,045 అడుగులు) కాగా.. ఇందులో ప్రస్తుతం 2 టీఎంసీలపైనే బురద పేరుకుపోయింది. దీనిపై ప్రభుత్వం పలుమార్లు సర్వే చేయించగా.. సుమారు 2.16 టీఎంసీల బురద పేరుకుపోయినట్లు అధికారులు లెక్క తేల్చారు. అంటే జలాశయం సామర్థ్యం 7.5 టీఎంసీలకు కుదించుకుపోయినట్లయింది. 2012 నాటికే.. ఇందులో మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే కృష్ణాబేసిన్లో నిర్మించిన జూరాల ప్రాజెక్టులో 2012 సంవత్సరం నాటికే 2.16 టీఎంసీల బురద పేరుకు పోయినట్లు,ఆ తర్వాత బురద పేరుకునేందుకు సరి పడా స్థలం కూడా లేకపోవడంతో వరదల సమయంలో నీటితోపాటు బురద సైతం దిగువకు వెళ్తు న్నట్లు గుర్తించారు. ఈ క్రమంలోనే ప్రాజెక్టుకు ఉన్న క్రస్టుగేట్లలో పెద్దఎత్తున బురద పేరుకుపోయి గేట్లు, ఇనుప రోపులకు నష్టం వాటిల్లుతున్నట్లు గుర్తించారు. 2.30 టీఎంసీల మేర పేరుకుపోయిన బురద పలుమార్లు సర్వేలు.. రూ.312.77 కోట్ల అంచనా వ్యయం నివేదిక అందజేసిన సాగునీటి పారుదలశాఖ అంతర్గత చర్చలో అసాధ్యమనే అధికారుల అభిప్రాయం సాధారణంగా జలాశయంలో బురద తొలగించిన అనంతరం బయటకు వచ్చే ఇసుక సుమారు 20– 30 శాతం మేర ఉంటుందని అధికారుల అంచనా. అయితే కృష్ణాబేసిన్ సహజ స్వరూపం రాళ్లతో కూడినది కావడంతో ఇసుక మేట్లు అనుకున్నంత స్థాయిలో ఏర్పడవు. అదే తుంగభద్ర నది సహజ స్వరూపం అధిక భాగం ఇసుకతో కూడుకున్నదై ఉంటుంది. దీంతో తుంగభద్ర బేసిన్లో ఏర్పడే ఇసుకమేట్లు కృష్ణాబేసిన్లో ఏర్పడవని అధికారులు తేల్చారు. ఏప్రిల్ చివరి వారంలో హైదరాబాద్లో ఈఎన్సీ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలోనూ ఇదే అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చినట్లు తెలిసింది. 7 శాతం ఇసుక వస్తే బురద తొలగించేందుకు ఏజెన్సీలు ముందుకు రావని, దీంతో జూరాలలో బురద తొలగింపు అసాధ్యమైన పని అని సమావేశంలో అభిప్రాయానికి వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. -
రేపు సాగునీటి ప్రాజెక్టులపై సమీక్ష
కందనూలు: నాగర్కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని సాగునీటి ప్రాజెక్టులపై మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో కీలక సమీక్ష నిర్వహించనున్నట్లు కలెక్టర్ హేమంతకేశవ్ పాటిల్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సమావేశానికి రాష్ట్ర వైద్యారోగ్యశాఖ, జిల్లా ఇన్చార్జి మంత్రి దామోదర రాజనర్సింహ, రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర పాడి పరిశ్రమ, క్రీడలు, యువజనశాఖల మంత్రి వాకిటి శ్రీహరి, ఎంపీ డా.మల్లు రవి, ఎమ్మెల్సీలతో పాటు నాగర్కర్నూల్, వనపర్తి, జోగుళాంబ గద్వాల జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, నీటిపారుదలశాఖ ఉన్నతాధికారులు హాజరవుతారని పేర్కొన్నారు. నాగర్కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో నీటిపారుదల ప్రాజెక్టుల ప్రస్తుత స్థితి, పనుల పురోగతి, భూసేకరణ సమస్యలు, పెండింగ్ పనులు, పునరావాసం తదితర అంశాలపై సమగ్రంగా సమీక్షించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. నేటి నుంచి డీఎడ్ పరీక్షలు వనపర్తిటౌన్: జిల్లాలో డీఎడ్ ప్రథమ సంవత్సర పరీక్షలు సోమవారం నుంచి జూన్ 1వ తేదీ వరకు కొనసాగనున్నట్లు జిల్లా విద్యాధికారి అబ్దుల్ ఘనీ, ఏసీజీఈ గణేష్కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాకేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు పరీక్ష ఉంటుందని పేర్కొన్నారు. పరీక్ష రాసే అభ్యర్థులు ఉదయం 8:30 గంటల వరకు కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. మైసమ్మ జాతరకు పోటెత్తిన భక్తజనం పెద్దకొత్తపల్లి: నాయినోనిపల్లి మైసమ్మ జాతర కు ఆదివారం భక్తులు పోటెత్తారు. వివిధ ప్రాంతాల నుంచి కుటుంబ సమేతంగా తరలివచ్చి, అమ్మవారిని దర్శించుకున్నారు. ముందుగా జా తర మైదానంలో ప్రత్యేకంగా తయారుచేసిన పచ్చిపులుసు అన్నంతో మైసమ్మకు నైవేద్యం సమర్పించారు. అనంతరం ఆలయంలో ప్రత్యే క పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. భక్తుల సౌకర్యార్థం నాగర్కర్నూల్, కొల్లాపూర్, వనపర్తి ఆర్టీసీ డిపోల నుంచి ప్రత్యేక బస్సులను నడిపించారు. భక్తులతో జాతర మైదానం కిక్కిరిసింది. భక్తులకు సరిపడా షెడ్లు లేకపోవడంతో ఇబ్బందులకు గురయ్యారు. సుమారు 10వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. మంచినీటి కోసం అవస్థలు.. నాయినోనిపల్లి మైసమ్మ జాతరలో మంచినీటి కోసం భక్తులు అవస్థలు పడ్డారు. భక్తుల రద్దీకి అనుగుణంగా నీటి వసతి లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. కొందరు మినీ వాటర్ట్యాంకుపైకి ఎక్కి మరీ నీటిని తెచ్చుకున్నారు. జాతర మైదానంలో ఓవర్హెడ్ వాటర్ట్యాంకు నిరుపయోగంగా మారినా ఎవరూ పట్టించుకోవడం లేదని.. భక్తులకు నీటి సమ స్య లేకుండా చూడాలని పలువురు కోరారు. -
గాలివాన బీభత్సం
● కొనుగోలు కేంద్రాల్లో తడిసిన మొక్కజొన్న ● నేలకూలిన చెట్లు.. తెగిన విద్యుత్ వైర్లు ● పలు గ్రామాల్లో అంధకారం అలంపూర్/అయిజ/ఉండవెల్లి: జిల్లాలోని అలంపూర్, అయిజ, ఉండవెల్లి తదితర మండలాల్లో శనివారం రాత్రి గాలివాన బీభత్సం సృష్టించింది. ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. ఈదురుగాలుల ధాటికి భారీ చెట్లు నేలకొరిగాయి. ప్రధాన రోడ్లపై చెట్లు విరిగిపడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పలు గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు చీకట్లోనే కాలం వెల్లదీయాల్సిన పరిస్థి తి నెలకొంది. అయిజ వ్యవసాయ మార్కెట్ సబ్యార్డులో ఏర్పాటుచేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రంలో మొక్కజొన్న బస్తాలు తడిసి ముద్దయ్యాయి. కొందరు రైతుల మొక్కజొన్నలు మొలకెత్తడంతో తీవ్రనష్టం వాటిల్లింది. కొనుగోలు కేంద్రంలో 20 – 30 రోజుల క్రితం కాంటా వేసిన మొక్కజొన్న బస్తాలను గోదాంలకు తరలించకపోవడంతో అకాల వర్షానికి తడిసిపోయాయని రైతు లు ఆవేదన వ్యక్తంచేశారు. అదే విధంగా మామిడి తోటల్లోని కాయలు నేలరాలాయి. ఎకరాకు రూ. లక్ష నష్టం వాటిల్లిందని రైతులు వాపోయారు. ● ఈదురుగాలుల ధాటికి అలంపూర్ జోగుళాంబ బాలబ్రహ్మేశ్వరస్వామి క్షేత్రంలోని పురావస్తు మ్యూజియం వద్ద ఓ చెట్టుతో పాటు హైమాస్ట్ లైటు నేలకూలింది. జూనియర్ సివిల్ కోర్టు ఆవరణలోని చెట్టు సైతం నేలకొరిగింది. పలు కాలనీల్లో విద్యుత్ వైర్లు తెగిపడ్డాయి. సాలేవిధిలో ఆదివారం సైతం విద్యుత్ సరఫరా పునరుద్దరించకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అలంపూర్ చౌరస్తా ప్రధాన మార్గంలోని పెట్రోల్బంక్ వద్ద ఓ చెట్టు విరిగిపడటంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందిగా మారింది. బూడిదపాడు సర్కిల్లోని బసవేశ్వర బస్టాఫ్ షెడ్ ఈదురుగాలుల ధాటికి ఓవైపు వాలిపోయింది. ఉండవెల్లిలో రేకుల షెడ్లు ధ్వంసమయ్యాయి. ఈదురుగాలులతో కూడిన కురిసిన వర్షాని కి మామిడితోటలకు అపారంగా నష్టం వాటిల్లింది. గాలికి నేలరాలడంతో పండ్లు దెబ్బతిని నాణ్యత కోల్పోయాయి. కొన్ని మార్కెట్లో విక్రయించేందుకు పనికిరాకుండా పోయాయి. దీంతో తోటల రైతులకు రూ. లక్షల్లో నష్టం వాటిల్లింది. ప్రభుత్వం స్పందించి నష్టపరిహారం అందించి ఆదుకోవాలి. – దర్శల్లి, రైతు, అయిజ -
వానాకాలం.. ‘సాగు’దాం
గద్వాల వ్యవసాయం: నడిగడ్డలో వానాకాలం (2026–27) పంట ప్రణాళిక ఖరారైంది. ఈసారి 4,35,252 ఎకరాల్లో పంటలు సాగయ్యే అవకాశం ఉందని వ్యవసాయశాఖ అంచనా వేసింది. గతేడాది వానాకాలం రైతులను నిరాశపర్చింది. ఈ ఏడాది వర్షాలు బాగా కురిసి.. పంటలు బాగా పండుతాయన్న ఆశతో అన్నదాతలు సాగుకు సమాయత్తమవుతున్నారు. ఇదే సమయంలో పంటలకు అవసరమైన విత్తనాలు, ఎరువులను వ్యవసాయశాఖ సిద్ధం చేస్తోంది. గతేడాది నిరాశే.. గతేడాది వానాకాలం రైతులకు కన్నీరు తెప్పించింది. ప్రారంభంలో ఆశించిన వర్షాలు కురవలేదు. ఆ తర్వాత జూలై, ఆగస్టు నెలల్లో కురిసిన అధిక వర్షాల ప్రభావం పంటలపై పడింది. పలుచోట్ల నీటి నిల్వలతో మొక్కలు ఎదగలేదు. ఆ తర్వాత సెప్టెంబర్లో కురిసిన వర్షాలతో పంటలు బాగా దెబ్బతిన్నాయి. దాదాపు అన్ని రకాల పంటలకు తెగుళ్లు, రకరకాల పురుగులు ఆశించాయి. జిల్లాలో అధికంగా సాగుచేసిన పత్తి పంట దిగుబడులు సగానికి పడిపోయాయి. పత్తి, వరి, వేరుశనగ, కంది ఇలా అన్నిరకాల పంటల దిగుబడులు తగ్గడంతో రైతులు ఆర్థికంగా నష్టపోయారు. అధిక వర్షాలతో కూరగాయల తోటలు సైతం దెబ్బతిన్నాయి. తోటలకు కాయలు పట్టే దశలో వర్షాలు రావడంతో మొక్కపైనే మురిగిపోయాయి. దిగుబడులు గణనీయంగా తగ్గాయి. పలుచోట్ల వర్షపు నీరు నిలిచి తోటలు నీటమునిగాయి. అక్టోబర్లో కురిసిన వర్షాలు సైతం నష్టాన్ని కలిగించాయి. చేతికొచ్చిన కొద్దిపాటి కూరగాయలు సైతం రంగులు మారాయి. వాటి నాణ్యత తగ్గి.. మార్కెట్లో రైతులకు ధరలు రాలేదు. పత్తి వైపే మొగ్గు.. ఈసారి వానాకాలంలో 3,92,882 ఎకరాల్లో వ్యవసాయ, 42,370 ఎకరాల్లో ఉద్యాన పంటలు సాగవుతాయని వ్యవసాయశాఖ అంచనా వేసింది. ఇందులో అత్యధికంగా 2,09,144 ఎకరాల్లో పత్తి సాగయ్యే అవకాశం ఉంది. అదే విధంగా వరి, కంది, వేరుశనగ పంటలను ఎక్కువగా సాగుచేస్తారని భావిస్తున్నారు. ఇక ఉద్యాన పంటలకు సంబంధించి 25వేల ఎకరాల్లో ఎండుమిర్చి, 4వేల నుంచి 5వేల ఎకరాల్లో ఆయిల్పామ్, మిగిలిన ఎకరాల్లో ఇతర పంటలు సాగు అంచనాగా ఉంది. ఇదిలా ఉంటే, పంటలకు అవసరమయ్యే విత్తనాలు, ఎరువుల లెక్కలను సైతం అధికారులు సిద్ధం చేశారు. దాదాపు 59వేల క్వింటాళ్ల పత్తి, వరి, కంది తదితర పంటలకు విత్తనాలు అవసరం అవుతాయని అంచనాకు వచ్చారు. సాగుకు అవసరమైన విత్తనాలు, ఎరువుల కొరత రాకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని అధికారులు వెల్లడించారు. జిల్లాలో పంటల ప్రణాళిక ఖరారు ఈసారి 4,35,252 ఎకరాల్లో సాగు అంచనా విత్తనాలు, ఎరువులను సిద్ధం చేస్తున్న వ్యవసాయశాఖ వానాకాలం సాగుకు అన్నదాతలు సిద్ధమయ్యారు. గత రెండు రోజుల వ్యవధిలో ఓ మోస్తారు వర్షాలు కురవడంతో జిల్లాలోని పలు ప్రాంతాల్లో రైతులు వేసవి దుక్కులు దున్నుతున్నారు. విత్తనాల కొనుగోలుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. జూన్ రెండు, మూడో వారం నాటికి వర్షాలు ఆశించిన స్థాయిలో కురిస్తే చివరి వారంలో విత్తనాలు వేయాలని రైతులు భావిస్తున్నారు. పంట సాగు (ఎకరాల్లో) పత్తి 2,09,144 వరి 1,21,941 కంది 23,739 మొక్కజొన్న 22,982 వేరుశనగ 6,396 ఇతర పంటలు 8,680 ఉద్యానపంటలు 42,370 రకం అవసరం (మెట్రిక్ టన్నుల్లో) యూరియా 27,390 డీఏపీ 13,919 పొటాష్ 7,615 కాంప్లెక్స్ ఎరువులు 55,173 -
రైతు సంక్షేమానికి పెద్దపీట
అచ్చంపేట: రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని ఎంపీ డా.మల్లు రవి అన్నారు. శనివారం అచ్చంపేటలోని బీఆర్ అంబేడ్కర్ ప్రజా భవన్లో ఆయన విలేకర్లతో మాట్లాడారు. రూ. 21వేల కోట్లతో రైతులందరి పంట రుణాలను మాఫీ చేయడంతో పాటు రైతుభరోసాతో పంట పెట్టుబడి సాయం అందిస్తున్నామన్నారు. భూసార పరీక్షలకు అనుగుణంగా రైతులు లాభసాటి పంటలు పండించేలా ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. వ్యవసాయశాఖ అంచనాలకు మించి పంట దిగుబడులు రావడం.. సరైన నివేదికలు లేని కారణంగా కొనుగోళ్లలో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయన్నారు. అయినప్పటికీ ప్రభుత్వం ప్రతి గింజను మద్దతు ధరకు కొనుగోలు చేస్తోందన్నారు. ప్రస్తుతం వేగంగా కొనుగోళ్ల ప్రక్రియ సా గుతోందని చెప్పారు. ప్రతిపక్షాలు అవగాహన లేకుండా ప్రభుత్వంపై బురద జల్లుతున్నాయని మండిపడ్డారు. రైతు సంక్షేమానికి పాటుపడుతున్న ప్రభుత్వంపై లేనిపోని విమర్శలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. రానున్న కాలంలో ప్రతి మండలం నుంచి ఇద్దరు ఆదర్శ రైతులను ఎంపికచేసి.. జిల్లాస్థాయిలో అవార్డులు అందజేస్తామని, వారితో పంటల సాగుపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే వంశీకృష్ణ మాట్లాడుతూ.. పంటల సాగు కు అవసరమైన నీటి వనరులు పుష్కలంగా ఉండటంతో యా సంగిలో వరి, మొక్కజొన్న దిగుబడులు పెరిగాయన్నారు. ధా న్యం సేకరణలో ఎదురైన సమస్యలను అధిగమించి కొనుగోళ్ల ప్రక్రియను వేగవంతం చేశామన్నారు. వర్షానికి తడిసిన ధా న్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని.. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 8,575 కొనుగోలు కేంద్రాల ద్వారా 48లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి, రైతుల ఖాతాల్లో రూ. 9,850 కోట్లు జమ చేయడం జరిగిందన్నారు. -
పాలిసెట్లో ఇద్దరికి స్టేట్ ఫస్ట్ ర్యాంక్
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: ప్రభుత్వం విడుదల చేసిన పాలిసెట్ పరీక్ష ఫలితాల్లో ఉమ్మడి జిల్లాకు చెందిన ఇద్దరికి రాష్ట్ర మొది ర్యాంక్ వచ్చింది. మహబూబ్నగర్లోని షాషాబ్గుట్టకు చెందిన కోట్ల మురళీధర్, శ్రీలతల కుమార్తె కోట్ల అపూర్వ ఎంపీసీ, ఎంబైపీసీ విభాగంలో 120 మార్కులకు 120 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో మొదటిర్యాంక్ సాధించింది. అలాగే నాగర్కర్నూల్కు చెందిన వాన్మయ్రెడ్డి సైతం రాష్ట్ర మొదటి ర్యాంక్ సాధించండం విశేషం. ‘రాష్ట్రస్థాయిలో మొదటిర్యాంక్ సాధించడం మాటల్లో చెప్పలేని సంతోషంగా ఉంది. తాను డాక్టర్ కావడమే లక్ష్యమని, అందుకోసం కష్టపడి చదువుతాను.’అని అపూర్వ పేర్కొన్నారు. పాలిసెట్ ఫలితాల్లో రాష్ట్ర స్ధాయిలో మొదటి ర్యాంకు రావడం చాలా ఆనందంగా ఉంది. అమ్మనాన్నల ప్రోత్సాహం, మా పాఠశాల ఉపాధ్యాయుల సహకారంతో నేను ఈ ర్యాంకు సాధించాను.పదో తరగతి స్థాయిలో పాఠ్యపుస్తకాలు సేకరించి ఇంటి వద్దనే ప్రిపరేషన్ కొనసాగించా. భవిష్యత్తులో ఇంజనీర్ కావాలని నా కోరిక. – వాన్మయ్రెడ్డి, నాగర్కర్నూల్ -
చీకట్లోనే కాలం గడుపుతున్నాం..
పునరావాస కేంద్రంలో ఏడా ది క్రితం ఇంటిని నిర్మించుకున్నాం.మేము ఉంటున్న కా లనీకి ఇప్పటికీ కరెంట్ లేదు. చీకట్లోనే కాలం గడు పుతున్నాం. వడ్డే వీధి, కుర్వ వీధు ల్లో సుమారు 40 వరకు ఇళ్లు నిర్మించుకున్నాం. మాకు కరెంట్ సౌకర్యం కల్పించాలని మొర పెట్టుకుంటున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. – వడ్డె వెంకటేశ్, చిన్నోనిపల్లె మాకు పునరావాస కేంద్రంలో ఒకే ప్లాటు ఇచ్చారు. నా కు ఇద్దరు కొడుకులు ఉన్నా రు. వారికి పెళ్లిళ్లు అయ్యా యి. పిల్లలు ఉన్నారు. ఒకే ఇంట్లో మూడు కుటుంబాలతో జీవనం సాగిస్తున్నాం. ఇద్దరు కుమారులకు ప్లాట్టు ఇవ్వాలని పాత ఊరిలో ఉన్నప్పుడే అడిగాం. ఎవరూ పట్టించుకోలేదు. అధికారులు, ప్రజాప్రతినిధులకు చెప్పి చెప్పి విసుగొచ్చింది. మా గోడు ఎవరూ పట్టించుకోవడం లేదు. – లక్ష్మి, చిన్నోనిపల్లె చిన్నోనిపల్లె పునరావాస కేంద్రంలో ఒక్క ప్రభుత్వ భవనం కూడా లేదు. అసంపూర్తిగా ఉన్న పాఠశాల భవనాన్ని పూర్తిచేసి అందుబాటులోకి తీసుకురావాలి. పునరావాస సమస్యలపై ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి, కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ప్రత్యేక దృష్టిసారించి పరిష్కరించాలి. – యు.దేవేందర్, సర్పంచ్, చిన్నోనిపల్లె చిన్నోనిపల్లె పునరావాస కేంద్రంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటాం. ఇదివరకే పునరావాస కేంద్రంలో చేపట్టిన వివిధ పనులు పురోగతిలో ఉన్నాయి. 360 కుటుంబాలకు షిఫ్టింగ్ చార్జీలను చెల్లించడం జ రిగింది. ఇంకా ఎవరైనా ఉంటే, వారికి అందించే విధంగా చర్యలు తీసుకుంటాం.అన్ని శాఖల అఽ దికారులను సమన్వయం చేసుకుని పునరావాస కేంద్రంలోని సమస్యలను పరిష్కరిస్తాం. – శ్రీనివాసరావు, ఆర్డీఓ, గద్వాల ● -
వేరుశనగ క్వింటా రూ.7,951
గద్వాలవ్యవసాయం: జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్యార్డుకు శనివారం 52 క్వింటాళ్ల వేరుశనగ అమ్మకానికి రాగా.. గరిష్టంగా రూ. 7,951, కనిష్టంగా రూ. 6,899, సరాసరి రూ. 7,099 ధరలు లభించాయి. అదే విధంగా 11 క్వింటాళ్ల ఆముదాలు రాగా.. గరిష్టంగా రూ. 6,149, కనిష్టంగా రూ. 5,709, సరాసరి రూ. 6,089 ధరలు పలికాయి. 141 క్వింటాళ్ల వరి (సోన) రాగా.. గరిష్టంగా రూ. 2,482, కనిష్టంగా రూ. 1,860, సరాసరి రూ. 2,482 ధరలు లభించాయి. 5 క్వింటాళ్ల కందులు రాగా.. రూ. 6,089 ధర పలికింది. హిందూ బంధువుల ఐక్యతే లక్ష్యం దేవరకద్ర: హిందూ సమాజాన్ని చైతన్యవంతం చేసి ఐక్యపరిచి మనదేశాన్ని విశ్వగురువుగా నిర్మాణం చేయాలనే లక్ష్యం చేరుకోవాలని తెలంగాణ హిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు శంకర్స్వామిజీ పిలుపునిచ్చారు. శనివారం రాత్రి దేవరకద్రలో శ్రీనివాసగార్డెన్లో హిందూ సమ్మేళన ఉత్సవ సమితి ఆధ్వర్యంలో హిందూ సామ్రాజ్య దినోత్సవాన్ని నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న స్వామిజీ మాట్లాడుతూ.. యువత భారతీయ సంస్కృతిని కాపాడటంలో కీలక పాత్ర పోషించాలని కోరారు. హిందూ సమాజంలో ఐక్యత సేవాభావం పెంపొందిచడమే కార్యక్రమ ముఖ్య ఉద్దేశమన్నారు. ధర్మరక్షణకు ముందుకు రావాలి సమాజంలో సనాతన ధర్మ విలువలను పరిరక్షించాల్సి అవసరం ఉందని, మహిళలు, యువత సామాజిక చైతన్యంతో ముందుకొచ్చి భారతీయ సంస్కృతిని భావితరాలకు అందిచాలని హైకోర్టు న్యాయవాది మౌనిక సుంకర కోరారు. ఆమె ముక్యవక్తగా ప్రసంగించారు. సంస్కార భారతి ప్రాంత సంఘటన మంత్రి నిరంజన్, బీజేపీ నియోజకవర్గ ఇన్చార్జి కొండ ప్రశాంత్రెడ్డి, ఉత్సవ సమితి అధ్యక్షుడు ఆంజనేయులు, కల్వ నరేష్, భాస్కర్ పాల్గొన్నారు. శాసీ్త్రయ విద్యావిధానం అమలు చేయాలి కొల్లాపూర్: శాసీ్త్రయ విద్యా విధానం అమలు కోసం విద్యార్థులు ఉద్యమాలకు సిద్ధం కావా లని యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి శ్రీధర్శర్మ అన్నారు. కొల్లాపూర్లోని పీజీ సెంటర్లో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి విద్యా వైజ్ఞానిక శిక్షణ తరగతులను శ్రీధర్శర్మ, జన విజ్ఞాన వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడు జితేందర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మా ట్లాడుతూ జాతీయ విద్యా విధానాన్ని రద్దుచేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యా రంగానికి కనీస నిధులు కేటాయించడం లేదని ఆరోపించారు. ప్రభుత్వ యూనివర్సిటీలను నిర్వీర్యం చేసే కుట్రలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. సంపన్న వర్గాలకే ఉన్నత చదువులు లభించే మార్గాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి తారాసింగ్, రామార్జున్ తదితరులు ఉన్నారు. జాతీయస్థాయికి ఎదగాలి మహబూబ్నగర్ క్రీడలు: జిల్లా క్రికెటర్లు జాతీయస్థాయికి ఎదగాలని ఎండీసీఏ చీఫ్ ప్యాట్రన్, ప్రముఖ న్యాయవాది మనోహర్రెడ్డి అన్నారు. జిల్లా సీనియర్ క్రీడాకారులకు శనివారం పిల్లలమర్రి సమీపంలోని ఎండీసీఏ మైదానంలో క్రీడాదుస్తులు పంపిణీ చేశారు. ఎలాంటి ఒత్తిడి లెకుండా సమష్టిగా ఆడితే క్రికెట్లో విజయం సాధింవచ్చన్నారు. ఎండీసీఏ ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ మాట్లాడుతూ.. హెచ్సీఏ బి–డివిజన్ టీ–20 లీగ్ కమ్ నాకౌట్ టోర్నమెంట్లో ఉమ్మడి మహబూబ్నగర్ జట్టు మెరుగైన ప్రతిభ కనబరిచి ఇప్పటికే రెండు మ్యాచుల్లో విజయం సాధించినట్లు తెలిపారు. రానున్న మ్యాచుల్లో విజయాలు సాధించాలని కోరారు. ఎండీసీఏ ఉపాధ్యక్షులు సురేష్కుమార్, సంయుక్త కార్యదర్శి వెంకటరామారావు, కోచ్లు గోపాలకృష్ణ, అబ్దుల్లా, మన్నాన్, ముఖ్తార్అలీ పాల్గొన్నారు. -
ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడదాం
గద్వాలన్యూటౌన్: ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు జిల్లా ఇన్చార్జీలు మెట్టు శ్రీనివాస్, ఆంజనేయులుగౌడ్ పిలుపునిచ్చారు. శనివారం బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి బాసు హనుమంతునాయుడు ఆధ్వర్యంలో నిర్వహించిన సభ్యత్వ నమోదు సన్నాహక సమావేశంలో వారు మాట్లాడారు. తెలంగాణ అస్థిత్వానికి రక్షణ కవచంగా నిలిచేందుకు కార్యకర్తల సమూహంగా సభ్యత్వ నమోదు జరగాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రైతులు అధ్వాన పరిస్థితులు ఎదుర్కొంటున్నారని అన్నారు. రేవంత్ పోవాలి.. కేసీఆర్ రావాలనే నినాదంతో ప్రతి కార్యకర్త పనిచేయాలన్నారు. సభ్యత్వ నమోదుతో పార్టీ సంస్థాగత నిర్మాణం పటిష్టం చేయాలన్నారు. పార్టీపై విధేయతతో ఉండే నాయకులు, కార్యకర్తలను గుర్తించి.. వారికి ప్రాధాన్యత ఇస్తుందన్నారు. సభ్యత్వ నమోదు డిజిటల్ పద్ధతిన సాగుతుందన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఈ నెల 25 నుంచి వచ్చే నెల 25 వరకు ‘సర్’ కార్యక్రమం నిర్వహిస్తుందని, బూత్ కమీటీ సభ్యులు అప్రమత్తంగా ఉండి, బీఆర్ఎస్ సానుభూతిపరుల ఓట్లను కాపాడుకోవాలన్నారు. గద్వాల ఇన్చార్జి బాసు హనుమంతునాయుడు మాట్లాడుతూ.. రానున్న ఎన్నికలకు ఇప్పటి నుంచే సన్నద్ధం కావాలన్నారు. సభ్యత్వ నమోదులో గద్వాల ముందు ఉండాలని కార్యకర్తలు, నాయకులకు సూచించారు. ఉద్యమ నేత కేసీఆర్ స్ఫూర్తితో మళ్లీ బీఆర్ఎస్ పాలనను తెచ్చుకుందామని చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ బీఎస్ కేశవ్, నాయకులు నాగర్దొడ్డి వెంకట్రాములు, పద్మ వెంకటేశ్వర్రెడ్డి, బాసు శ్యామల, రాఘవేంద్రరెడ్డి, చక్రధర్రావు, కోటేష్, అతికూర్ రహమాన్, మోనేష్, కురవ పల్లయ్య తదితరులు పాల్గొన్నారు. -
బోగస్ పింఛన్లకు చెక్!
గద్వాలన్యూటౌన్: రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాల్లో ముఖ్యమైనది చేయూత పథకం. ఈ పథకం ద్వారా సమాజంలో ఆర్థికంగా వెనకబడిన, ఆదరణ లేని వృద్ధులు, వితంవులు, ఒంటరి మహిళలు, బీడీ, గీత కార్మికులకు నెలకు రూ. 2,016, దివ్యాంగులకు రూ.4,016 చొప్పున అందిస్తున్నారు. అయితే ఈ పింఛన్ డబ్బులు లబ్ధిదారుల పోస్టల్, బ్యాంక్ అకౌంట్లలో జమ చేస్తున్నారు. పోస్టల్ అకౌంట్లలో జమ అవుతున్న లబ్ధిదారులకు సంబంధిత ఏరియా పోస్ట్మన్ బయోమెట్రిక్ లేదా ఫేస్ రికగ్నిషన్ యాప్లో క్యాప్చర్ చేసి పింఛన్ డబ్బులు అందిస్తున్నారు. ఈ విధానం ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో ఉంది. ఇక పట్టణ, మండల కేంద్రాల్లో లబ్దిదారుల బ్యాంక్ అకౌంట్లలో జమ అవుతుంది. వీరు ఏటీఎం ద్వార లేదా బ్యాంక్కు వెళ్లి నగదు తీసుకుంటున్నారు. అయితే చాలా మంది పింఛన్దారులు మృతిచెందినా వారి ఖాతాలో డబ్బులు జమ అవుతున్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. అలాంటి వాటికి చెక్ పెట్టేందుకు గాను ప్రతి పింఛన్దారుడిని ప్రత్యక్ష ధ్రువీకరణ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన సర్వే ఇప్పటికే జిల్లాకేంద్రంలో ప్రారంభం కాగా.. సోమవారం నుంచి అన్ని గ్రామాల్లో చేపట్టనున్నారు. అక్రమాలు ఇలా.. చేయూత పథకం కింద పింఛన్ పొందే వ్యక్తి మృతిచెందితే సదరు కుటుంబ సభ్యులు పింఛన్ నిలిపివేయాలని పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్ కఇషనర్కు, గ్రామీణ ప్రాంతాల వారు ఎంపీడీఓకు లిఖిత పూర్వకంగా తెలియజేయాలి. ఇలా చేస్తే అధికారులు జిల్లా గ్రామీణభివృద్ధిశాఖకు సమాచారం అందించి పింఛన్ నిలిపివేస్తారు. కానీ ఇక్కడే అక్రమాలు చోటు చేసుకుంటున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. పింఛన్ పొందుతున్న వ్యక్తి చనిపోతే వారి కుటుంబ సభ్యులు ఉద్దేశ్యపూర్వకంగా ఎలాంటి సమాచారం అందించడం లేదు. పింఛన్ డబ్బులను ఏటీఎం లేదా ఫోన్పే, గూగుల్ పే తదితర వాటి ద్వారా పొందుతున్నట్లు గుర్తించిన ప్రభుత్వం.. బోగస్ పింఛన్ల ఏరివేతకు చర్యలు చేపట్టింది. ప్రత్యేక యాప్తో.. చేయూత లబ్ధిదారుల ప్రత్యక్ష ధ్రువీకరణ కోసం ప్రత్యేకంగా యాప్ రూపొందించారు. నిబంధనల ప్రకారం లాగిన్ ఐడీతో యాప్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది. పింఛన్దారుడి ఐడీ లేదా ఆధార్ నంబర్ను ఎంట్రీ చేసిన తర్వాత వివరాలు వస్తాయి. ఆ వివరాలను నిర్ధారించుకొని పింఛన్దారుడి ముఖాన్ని కెమెరా ద్వారా (లైవ్ అథెంటికేషన్) ప్రత్యక్ష ధ్రువీకణ చేస్తున్నారు. పింఛన్ పొందుతున్న ప్రతి అబ్ధిదారుడు ప్రత్యక్ష ధ్రువీకరణ చేయించుకోవాల్సిందే. ఈ సర్వే ఐదు రోజల క్రితం జిల్లాకేంద్రమైన గద్వాల మున్సిపాలిటీలో ప్రారంభమైంది. ఇక మండల్లాలో సోమవారం నుంచి ప్రారంభం కానుంది. సర్వే చేపట్టే విషయంపై జిల్లాలోని 13 మండలాల గ్రామ కార్యదర్శులు, మిగిలిన మూడు మున్సిపాలీటీల వార్డు ఆఫీసర్లకు గురువారం కలెక్టరేట్లోని ఐడీఓసీలో శిక్షణ అందించారు. కాగా, సర్వే సమయంలో పింఛన్దారుడు స్థానికంగా అందుబాటులో లేకపోతే ఎనిమిది రోజుల గడువు ఇస్తున్నారు. చేయూత పథకం లబ్ధిదారుల ప్రత్యక్ష ధ్రువీకరణ ప్రత్యేక యాప్తో సర్వే ప్రారంభం సర్వేతో అక్రమాలకు కళ్లెం ప్రభుత్వ ఆదేశాల ప్రకారం చేయూత పింఛన్ పొందుతున్న లబ్దిదారుల లైవ్ అథెంటికేషన్ సర్వేను పకడ్బందీగా నిర్వహిస్తాం. యాప్ ద్వారా నిర్వహించనున్న ఈ సర్వేపై పంచాయతీ కార్యదర్శులు, వార్డు ఆఫీసర్లకు ఒకరోజు శిక్షణ అందించాం. గద్వాల మున్సిపాలిటీలో ఇప్పటికే సర్వే ప్రారంభమైంది. సర్వేకు పింఛన్దారులు సహకరించాలి. – మసాయిదాబేగం, డీఆర్డీఓ -
రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలి
ఎర్రవల్లి: కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని టాస్క్ఫోర్స్ డీఎస్పీ వెంకటేశ్వర్లు అన్నారు. శనివారం మండలంలోని తిమ్మాపురంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇప్పటివరకు రైతుల నుంచి సేకరించిన ధాన్యం వివరాలతో పాటు నిర్దేశిత మిల్లులకు ధాన్యం రవాణా ప్రక్రియను తెలుసుకున్నారు. కొనుగోలు కేంద్రానికి కేటాయించిన టార్ఫాలిన్లు, గన్నీబ్యాగులపై ఆరా తీశారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించి.. రైతుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలని సిబ్బందికి సూచించారు. ప్రస్తుతం అకాల వర్షాలు కురుస్తుంన్నందున అప్రమత్తంగా ఉండాలన్నారు. కొనుగోలు కేంద్రంలో ఉన్న ధాన్యాన్ని త్వరగా తరలించి.. రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. ఆయన వెంట టాస్క్ఫోర్స్ సీఐ పండరి, ఎస్ఐ వెంకటేశ్వర్లు, సివిల్ సప్లయ్ డీటీ ప్రశాంత్గౌడ్, ఏఈఓ నరేశ్ ఉన్నారు. -
‘అభివృద్ధి పేరుతో మా పొట్ట కొట్టొద్దు’
కొల్లాపూర్ రూరల్: పర్యాటక అభివృద్ధి పేరుతో తమ పొట్టలు కొట్టొద్దని, తమ భూములకు పట్టాలిస్తే అభివృద్ధికి సహకరిస్తామని ప్రభుత్వానికి, మంత్రి జూపల్లి కృష్ణారావుకు సోమశిల దళిత రైతులు విజ్ఞప్తి చేశారు. శనివారం సోమశిల శివారులోని సర్వే నంబర్ 54 భూమిలో దళిత రైతులు గ్రామ పెద్దలతో కలిసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పర్యాటక రంగ అభివృద్ధి పేరుతో తమ భూముల్లో హెలిప్యాడ్ ఏర్పాటు చేయొద్దని డిమాండ్ చేశారు. అభివృద్ధికి మేము వ్యతిరేకం కాదన్నారు. 1996లో ఆనాటి ప్రభుత్వం 54 సర్వే నంబర్లో 118 ఎకరాలను స్థానిక దళితులకు పట్టా ఇచ్చిందన్నారు. కానీ బీఆర్ఎస్ హాయాంలో ధరణిలో ఎక్కకపోవడంతో ప్రభుత్వం నుంచి వచ్చే అన్ని పథకాలు కోల్పోయామని వాపోయారు. గ్రామంలోనే సర్వే నంబర్ 80లో ప్రభుత్వ భూమి ఉన్నా.. హెలిప్యాడ్ నిర్మాణానికి తమ భూములే తీసుకోవడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. మంత్రి జూపల్లి కృష్ణారావు కక్షపూరితంగా వ్యవహరించి, అధికార బలంతో రాత్రికిరాత్రే హెలిప్యాడు నిర్మాణ పనులు చేపట్టారని మండిపడ్డారు. తమ భూములకు పట్టాలు ఇస్తే హెలిప్యాడ్ నిర్మాణానికి 2 ఎకరాల భూమి ఇస్తామన్నారు. లేని పక్షంలో ప్రభుత్వంపై పోరాటం చేస్తామని హెచ్చరించారు. అనంతరం ఆర్డీఓ బన్సీలాల్ వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్లు వెంకటస్వామి, రంగస్వామి, మాజీ జెడ్సీటీసీ సభ్యులు కాటం జంబులయ్య, బాల్రెడ్డి, రవి, బీజేపీ మండల అధ్యక్షుడు కేతూరి నారాయణ తదితరులు పాల్గొన్నారు. -
తపాలశాఖలో కలవరం!
వివరాలు 8లో...సీబీఐ ఎఫ్ఐఆర్లో పోస్టల్ సూపరింటెండెంట్ భూమన్న పేరు ● బదిలీ వేటు వేసి పోస్టింగ్ ఇవ్వని ఉన్నతాధికారులు ● పూర్తి వివరాలు సేకరిస్తున్న సీబీఐ అధికారులు ● బిల్లుల చెల్లింపులపై సృష్టత కరువు నీటికోసం వెళ్తే.. నిండుప్రాణం బలి ● పనిప్రదేశంలో కరువైన కనీస వసతులు ● పాడుబడ్డ బావిలోకి దిగి ఉపాధి కూలీ మృతి ● ‘ఉపాధి’ అధికారుల బాధ్యతారాహిత్యమే శాపం.. – మదనాపురం వనపర్తిటౌన్: బీపీఎంలు,ఏబీపీఎంలు, డాక్ సేవక్ల అదనపు బిల్లుల చెల్లింపు కోసం పోస్టల్ ఇన్స్పెక్టర్ గోపీనాథ్ లంచం ఆశిస్తూ ఈ నెల 8న సీబీఐకి పట్టుబడిన విషయం పాఠకులకు విధితమే. ఈ వ్యవ హా రంలో పోస్టల్ సూపరింటెండెంట్ భూమన్న పాత్ర ఉందని ఆరోపణలు వెల్లువెత్తాయి. వీటిని భూమ న్న ఖండించినప్పటికీ.. అనూహ్యంగా సీబీఐ ఎఫ్ఐఆర్లో అతడి పేరు నమోదు కావడంతో తపాలశాఖలో కలవరం మొదలైంది. భూమన్నను వనపర్తి నుంచి బదిలీ చేసిన ఉన్నతాధికారులు ఇప్పటి వరకు ఎక్క డా పోస్టింగ్ ఇవ్వలేదు. రెండ్రోజుల కిందట సీబీఐ అధికారులు భూమన్న,పోస్టల్ ఇన్స్పెక్టర్ గోపీనాథ్ కు సంబంధించిన పూర్తి వివరాలను వనపర్తి ప్రధా న పోస్టల్ కార్యాలయం నుంచి తెప్పించుకున్నట్లు సమాచారం. ఈ కేసులో పోస్టల్ సూపరింటెండెంట్ పేరు నమోదు కావడంతో సీబీఐ విచారణ ఎవరెవరికి తలనొప్పి తెచ్చిపెడుతుందోనని సిబ్బందిలో కలవరం మొదలైంది. భూమన్న ఎక్కడెక్కడ విధులు నిర్వర్తించారు.. ఆయన వ్యవహారం శైలిపై సీబీఐ దృష్టి సారించినట్లు అధికారులు చర్చించుకుంటున్నారు. అసలు సమస్య ఇక్కడే.. వనపర్తి తపాల ప్రధాన కార్యాలయంలో అదనపు విధులు నిర్వర్తించిన ఉద్యోగుల బిల్లుల చెల్లింపుల జాప్యం సీబీఐ వరకు చేరింది. 2023 నుంచి 2026 వరకు బీపీఎంలు, ఏబీపీఎంలు, డాక్సేవక్లు లేని శాఖల్లో ఉన్న సిబ్బంది అదనపు బాధ్యతలు నిర్వర్తించేలా తపాలాశాఖ చర్యలు చేపట్టింది. వీరికి రెగ్యులర్ వేతనంతో పాటు అదనపు విధులకు సంబంధించిన బిల్లులను తపాలాశాఖ చెల్లిస్తుంది. అదనపు విధులు నిర్వర్తించిన సుమారు 192 మంది ఉద్యోగుల బిల్లులు మూడేళ్లుగా నిలిచిపోయాయి. ఈ క్రమంలో గతేడాది చివరిలో బిల్లులు చెల్లింపునకుగాను పోస్టల్ సూపరింటెండెంట్ ఉన్నతాధికారులకు దస్త్రం సమర్పించారు. ఇందుకు అనుమతిస్తున్నట్లు ప్రతి దస్త్రం అందజేసిన నాలుగు నెలల తర్వాత నిలిపివేయాలని ఆదేశాలొచ్చాయి. ఈ దశలోనే అదనపు విధులు నిర్వర్తించిన ఉద్యోగులు లంచం ఇస్తే ఎలాగైనా బిల్లులు జారీ చేస్తామని పోస్టల్ ఇన్స్పెక్టర్ పట్టుబట్టడంతో ఓ బీపీఎం సీబీఐకి ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ చేపట్టిన సీబీఐ అధికారులు ఈ నెల 8న అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత పోస్టల్ సూపరింటెండెంట్ పేరు కూడా సీబీఐ ఎఫ్ఐఆర్లో నమోదు కావడంతో కేసు కొత్త మలుపు తిరిగింది. బిల్లుల చెల్లింపుతో రూ.20 వేల నుంచి రూ.లక్ష వరకు వచ్చే ఉద్యోగులు ఉన్నారు. సుమారు రూ.10 లక్షల వరకు బిల్లులు ఉన్నట్లు తెలుస్తోంది. వీటికి ఆమోదం తెలిపారా? లేక తిరస్కరించారా అనేది బయటడటం లేదు. కొందరు అధికారులు మాత్రం బిల్లుల చెల్లింపు ప్రక్రియ చేపట్టినట్లు చెబుతున్నా అధికారికంగా ధ్రువీకరించేందుకు ఇష్టపడటం లేదు. ఇక్కడ విధులు నిర్వర్తించే పోస్టల్ సూపరింటెండెంట్ భూమన్న బదిలీ కావడంతో ఉన్నతాధికారులు అదనపు బాధ్యతలు అప్పగించారు. రెండు రోజుల కిందటే బాధ్యతలు తీసుకోవడంతో అదనపు విధుల బిల్లుల చెల్లింపు సమాచారం తీసుకోలేదు. పూర్తిస్థాయిలో అధ్యాయనం చేసి నిబంధనలకు అనుగుణంగా తగిన చర్యలు చేపడతాం. – ఎన్.వెంకటేశ్వర్, ఇన్చార్జ్ సూపరింటెండెంట్, వనపర్తి -
కౌన్సిలర్ భర్తపై మాజీ కౌన్సిలర్ దాడి
● ప్రజాపాలన కార్యక్రమంలో చెలరేగిన వివాదం ● బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు గద్వాల క్రైం: రెండు పార్టీల మధ్య జరిగిన ఆధిపత్య పోరులో ఓ పార్టీకి చెందిన మాజీ కౌన్సిలర్.. ప్రస్తు త మహిళ కౌన్సిలర్ భర్త చెంపను చెల్లుమన్పించిన సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. బాధితులు, పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. గ ద్వాల మున్సిపాలిటీలోని 36వ వార్డులో శుక్రవారం ఉదయం ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలనలో భాగంగా పెన్షన్కు అర్హులైన లబ్ధిదారుల బయోమెట్రిక్ వివరాలు సేకరణ వార్డు అధికారి సమక్షంలో చేపట్టారు. అయితే ఆ వార్డుకు సంబంధించిన కౌన్సిల్ సభ్యురాలు (బీఆర్ఎస్ పార్టీ) కమ్మరి సునీతతోపాటు భర్త రాము సైతం హాజరయ్యారు. ఈ క్రమంలో ఇదే వార్డుకు సంబంధించిన మాజీ కౌన్సిలర్ నర్సింహులు, అనుచర వర్గం కార్యక్రమ వివరాలు తెలిజేయకుండా ఏర్పాటు చేశారని ఆరోపించగా.. కౌన్సిలర్, ఆమె భర్త ప్రతి ఒక్కరికి తెలియజేశామని వివరించారు. దీంతో మాటమాట పెరగడంతో క్షణికావేశంలో మహిళా కౌన్సిలర్ భర్త రామును మాజీ కౌన్సిలర్ (బీజేపీ) నర్సింహులు ఒక్కసారిగా చెంప చెల్లుమన్పించాడు. దీంతో వాతవరణం గందరగోళంగా మారి.. ఇరువురు దాడులకు పాల్పడేందుకు ప్రయత్నించడంతో స్థానికులు కట్టడి చేశారు. రెండు పార్టీల మధ్య వైరం.. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు చెందిన వ్యక్తులు కావడంతో దాడి ఘటన ఉద్రిక్తతకు దారీ తీసింది. ఇరు కుటుంబాలకు ముందు నుంచి వైరం ఉండటంతో స్థానికంగా హాట్టాపిక్గా మారింది. గత మున్సిపల్ ఎన్నికల సమయంలో బాధితుడు రామును అప్పటి మహిళా కౌన్సిలర్ (రజక నర్సింహులు భార్య) సైతం దాడి చేయడం కొసమెరుపు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ప్రస్తుత మహిళా కౌన్సిల్ సభ్యురాలు భర్త జీవించి ఉండగానే వితంతువు పెన్షన్ పొందుతుందని ఫిర్యాదు చేయడంతో పట్టణ పోలీసుస్టేషన్లో కేసు సైతం కేసు నమోదైంది. పాత కక్షలు మనస్సులో పెట్టుకుని ఈ దాడికి పాల్పడినట్లు బాధితుడు ఆరోపించారు. దాడి ఘటనపై పట్టణ పోలీసు స్టేషన్లో బాధితుడు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ కల్యాణ్కుమార్ తెలిపారు. -
జడ్చర్లలో స్వైన్ఫ్లూ కలకలం
జడ్చర్ల: పట్టణంలో స్వైన్ఫ్లూ కేసు నమోదైంది. వారం రోజులుగా జ్వరం, జలుబు, దగ్గు, గొంతు నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు రావడంతో జడ్చర్లకు చెందిన ఓ వ్యక్తి (42) జడ్చర్లలో ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయించాడు. జ్వరం, నిమోనియాకు సంబంధించి వైద్యచికిత్సలు అందించినా ఫలితం లేకపోవడంతో అనుమానంతో స్వైన్ఫ్లూ పరీక్షలు చేయించడంతో పాజిటివ్గా తేలింది. ఈ విషయాన్ని జిల్లా వైద్యశాఖ అధికారులకు సమాచారం అందించారు. కాగా స్వైన్ ఫ్లూ వచ్చిన వ్యక్తి స్విమ్మింగ్ఫూల్లో ఈతకు వెళ్లిన వెంటనే జలుబు, జ్వరంతో అనారోగ్యానికి గురయినట్లుగా సమాచారం. మొదట జ్వరం కోసం చికిత్స తీసుకున్నా.. తగ్గకపోవడంతో పాటు శ్వాస సంబంధిత సమస్యలు రావడంతో పరీక్షలు చేయడంతో స్వైన్ ప్లూ నిర్ధారణ అయింది. ప్రజలు మాస్కులు ధరించడం, చేతులు శుభ్ర పరుచుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. -
అర్హులందరికీ సంక్షేమాభివృద్ధి పథకాలు
గద్వాల: జిల్లాలో అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాలను అమలు చేయడమే కాకుండా ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు ప్రజాపాల న– ప్రగతి ప్రణాళిక కార్యక్ర మం దోహదపడుతుందని అదనపు కలెక్టర్ మధుమోహన్ అ న్నారు. ప్రగతి ప్రణాళికలో భాగంగా వివిధ శాఖల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమాల గురించి శుక్రవారం జిల్లాకేంద్రంలోని ఓ ఫంక్షన్హాల్లో నిర్వహించిన జిల్లాస్థాయి సమావేశంలో ఎస్పీ శ్రీనివాసరావుతోపాటు అదనపు కలెక్టర్లు మధుమోహన్, నర్సింగ్రా వు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ అధికారులు, ప్రజాప్రతినిధులు క్షేత్ర స్థాయిలో ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలను తెలుసుకోవడమే కాకుండా ఇప్పటి వరకు ప్రభు త్వం అమలు చేసిన త్వరలో అమలు చేయబోయే సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి పనుల గురించి వివరించారు. గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయిలో సమావేశాలు నిర్వహించి ప్రజల సమస్యలు తెలుసుకున్నామని, వాటి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ప్రణాళికతో ముందుకెళ్తే మంచి ఫలితాలు వస్తాయనే ఉద్దేశంతో ప్రభుత్వం వారోత్సవాలు నిర్వహించిందని చెప్పారు. ఆయా శాఖల్లో పెండింగ్లో ఉన్న ఫైళ్ల క్లియరెన్స్, పరిశుభ్రత పనులు కూడా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ● ఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ మూడు నెలలు నిర్వహించిన ప్రజాపాలన– ప్రగతి ప్రణాళికలో భాగంగా పోలీసుశాఖ ఆధ్వర్యంలోనూ అరైవ్– అలైవ్లో ప్రజలకు రహదారి భద్రతపై అవగాహన కల్పించామన్నారు. ప్రతిరోజు రోడ్డు ప్రమాదాల్లో ఎంతోమంది మరణించడమే కాకుండా గాయపడిన సురక్షితంగా ఇళ్లకు చేర్చుతున్నామన్నారు. డ్రగ్స్కు బానిసైన యువతకు కౌన్సిలింగ్ ఇచ్చి అవగాహన కల్పిస్తున్నామన్నారు. ● అదనపు కలెక్టర్ నర్సింగ్రావు మాట్లాడుతూ ప్రభుత్వం గృహజ్యోతి, రేషన్కార్డులు పంపిణీ చేస్తున్నామన్నారు. అలాగే ప్రభుత్వ హాస్టళ్లలో అల్పాహా రం, జూనియర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజన పథకం గురించి వివరించారు. రైతులు పండించిన ధాన్యం కొనుగోలు చేయడమే కాకుండా క్వింటాకు రూ.500 బోనస్ చెల్లిస్తున్నట్లు తెలిపారు. బాలభవ న్ విద్యార్థులచే నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ జయలక్ష్మి, గ్రంథాలయ చైర్మన్ శ్రీనివాస్, వైస్ చైర్మన్ శంకర్, మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు ప్రభావతమ్మ పాల్గొన్నారు. -
అకాల కష్టాలు
● జిల్లాలో బీభత్సం సృష్టించిన ఈదురుగాలులు, అకాల వర్షం ● నేలకొరిగిన విద్యుత్ స్తంభాలు, భారీ వృక్షాలు ● అలంపూర్ యార్డులో తడిసిన మొక్కజొన్న ● ఎన్హెచ్–44పై విరిగిపడిన సిగ్నల్ లైట్స్, చెట్లు ● లారీ బోల్తా, ట్రాఫిక్కు అంతరాయం వల్లూరులో కూలిన గుడిసె పైభాగంఉండవెల్లిలో పొలంలో విరిగిపడిన విద్యుత్ స్తంభంఅలంపూర్ చౌరస్తాలోని యార్డులో తడిసిన మొక్కజొన్న ధాన్యం చూపుతున్న రైతులుఎర్రవల్లి మండలం నారాయణపురం స్టేజీలో జాతీయ రహదారిపై బోల్తాపడిన లారీ -
కనీస వేతనాలు సవరించాలి
గద్వాల న్యూటౌన్: ముఖ్యమంత్రి ప్రకటించిన వేతనాలను సవరించి, ప్రతి కార్మికుడి కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఉప్పేర్ నర్సింహ డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక సీఐటీయూ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం ప్రకటించిన వేతనాలు పెరిగిన ధరలకు అనుగుణంగా లేవన్నారు. కార్మికులు, సంఘాలు చేసిన డిమాండ్లను పట్టించుకోలేదని ఆరోపించారు. కనీస వేతనాలను కార్పొరేషన్, మున్సిపాలిటీలు, గ్రామీణ ప్రాంతాలుగా విభజించి వేర్వేరుగా ప్రకటించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. వేతనాలను అన్స్కిల్డ్, స్కిల్డ్, సెమీ స్కిల్డ్, హైస్కిల్డ్ అని నాలుగు కేటగిరీలుగా విభజించి, అన్ని రంగాల్లో ఒకే రకంగా వేతనం పెంచడం వల్ల కార్మికవర్గం తీవ్రంగా నష్టపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. వేతనాల పెంపులో కరువు భత్యానికి సంబంధించిన అంశాన్ని గాలికి వదిలేశారని విమర్శించారు. కార్మిక సంఘాలు, కనీస వేతనాల మండలి సిఫార్సులను పరిగణలోకి తీసుకోకుండా.. మంత్రివర్గ ఉపసంఘం పేరిట ఏకపక్షంగా కనీస వేతనాలు నిర్ణయించడం అన్యాయం అన్నారు. 1948 కనీస వేతనాల చట్టం, డాక్టర్ ఫార్ములా, సుప్రీంకోర్టు తీర్పులకు అనుగుణంగా వేతనాలు పెంచకపోవడం దారుణమన్నారు. సమావేశంలో నాయకులు నర్సింహులు, గోవిందు, మోష, రాముడు, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. -
నత్తనడకన ఇందిరమ్మ ఇళ్లు
● పెరిగిన సామగ్రి ధరలతో సాగుతున్న నిర్మాణాలు ● కూలీలకూ డిమాండ్తో లబ్ధిదారుల బెంబేలు మానవపాడు: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఇంటి నిర్మాణ సామగ్రి ధరలతోపాటు కార్మికులకు డిమాండ్ భారీగా పెరిగింది. దీంతో ఇళ్ల నిర్మాణానికి ఖర్చు పెరగడంతో లబ్ధిదారులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లోని అర్హులైన పేదలకు ఇళ్లు మంజూరు చేసినప్పటికీ ఆర్థిక కష్టాలతో ఇళ్లను నిర్మించుకోలేని వారు చాలా మంది ఉన్నారు. వీరికి మొదటి దశలో ఇళ్లు మంజూరైనప్పటికీ పనులు ప్రారంభించలేక మధ్యలోనే ఆపేశారు. మరికొందరు లబ్ధిదారులకు ఇళ్లు మంజూరు కాకపోవడంతో నిరాశలో ఉన్నారు. ఇందిరమ్మ ఇళ్లు నిర్మించిన వారు అనేక ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. పెరిగిన ధరలు ఇలా.. ఇందిరమ్మ లబ్ధిదారుల ఇంటి నిర్మాణానికి ఇసుక, సిమెంట్, స్టీల్ సెంట్రింగ్, కంకర, బైండింగ్ వైర్, బోర్వెల్ లాంటి సామగ్రి సమకూర్చుకోవాల్సి ఉంటుంది. ఒకేసారి లబ్ధిదారుల ఎంపిక జరగడంతో ఈ సామగ్రికి డిమాండ్ పెరిగింది. దీంతో లబ్ధిదారుల ఇబ్బందులు పడుతూ ఇంటి నిర్మాణ పనులు చేపడుతున్నారు. 2025 సంవత్సరానికి ముందు సిమెంట్ ఒక బస్తాకు రూ.265 ఉండగా ప్రసుత్తం రూ.320కి చేరింది. అలాగే 2025 డిసెంబర్లో స్టీల్ ధర క్వింటా 10 ఎంఎం బార్లు 20కి రూ.2,300 ఉండగా.. ప్రస్తుతం రూ.3800కు చేరుకుంది. ఇసుక ట్రాక్టరు రూ.2 వేలు ఉండగా.. ఇప్పుడు రూ.3,500కు ఇస్తున్నారు. ఇలా అనేక ముడి సరుకుల ధరలు పెరగడంతో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులపై మరింత భారం పెరిగింది. భవన నిర్మాణ కార్మికులకు.. ఇంటి నిర్మాణ సామగ్రితోపాటు భవన నిర్మాణ కార్మికుల కూలీ రేట్లు సైతం పెరిగాయి. గతంలో 400 గజాల స్లాబ్ను మేసీ్త్రలు రూ.1.65 లక్షలకు నిర్మించి ఇచ్చేవారు. అదే ఏరియాలో ఇప్పుడు ప్రస్తుతం రూ.2.65 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు నిర్మిస్తున్నారని లబ్ధిదారులు వాపోతున్నారు. ఇలా అనేక సామగ్రితోపాటు కూలీల ధరలకు రెక్కలు వచ్చాయని చెబుతున్నారు. గతంలో మేసీ్త్రకి కూలి రూ.800 ఉంటే ఇప్పుడు రూ.వెయ్యికిపైగా తీసు కుంటున్నారు. 10 వేల ఇటుకల లారీ లోడ్ రూ.71 వేలు ఉండగా.. ప్రస్తుతం రూ.92 వేలకు చేరుకుంది. ఇప్పటికై నా ప్రభుత్వం, ఉన్నతాధికారులు స్పందించి ఇంటి సామగ్రి ధరలు తగ్గించాలని లబ్ధిదారులు కోరుతున్నారు. -
ధరలు పెరగడం వల్లే..
సిమెంట్తోపాటు ఇతర వస్తువుల ధరలు తగ్గించాలి. ధరలు పెరగడంతో ఇళ్ల నిర్మాణం చేపట్టిన లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు. అనేక మంది ఇళ్ల ప్రారంభానికి ముహూర్తాలు చేసుకొని ఆర్థిక పరిస్థితి లేక పనులు మొదలు పెట్టడం లేదు. ముడి సరుకులకు ధరలు పెంచడం వల్ల సామాన్యులపై ఆర్థిక భారం పడుతుంది. – మహాలక్ష్మి, లబ్ధిదారురాలు, మానవపాడు రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రవేశపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ధరల పరిస్థితి పెరుగుతుంది. సామగ్రితోపాటు రేట్లు పెరుగుతూ వస్తున్నాయి. ఇసుక, సిమెంట్ ధరలు సైతం పెరిగిపోయాయి. మరోవైపు కూలీలకు డిమాండ్ చాలా ఉంది. ప్రభుత్వం పెరుగుతున్న ధరలను నియంత్రించేలా చర్యలు తీసుకోవాలి. – గాయత్రి, లబ్ధిదారురాలు, చెన్నిపాడు జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటాం. ఈ మేరకు క్షేత్రస్థాయిలో లబ్ధిదారులను ప్రోత్సహించేలా సంబంధిత అధికారులకు సూచనలు ఇచ్చాం. ఇక ధరల పెరుగుదల అనేది మా చేతుల్లో లేదు. ప్రభుత్వం నిర్ణయించిన మేరకు ఇళ్ల నిర్మాణాలు చేపట్టాలి. – శ్రీనివాస్, గృహ నిర్మాణ శాఖ పీడీ ● -
పేద విద్యార్థులకు కార్పొరేట్ విద్య
● పదో తరగతి మెరిట్ ఆధారంగా ఎంపిక ● జూన్ 5వ తేదీ వరకు దరఖాస్తులకు అవకాశం కందనూలు: విద్యార్థుల ఉజ్వల భవిష్యత్కు ఇంటర్ విద్య ఎంతో కీలకం. దీంతో చాలామంది విద్యార్థు లు ప్రైవేటు, కార్పొరేట్ కళాశాలల్లో ఇంటర్ అభ్యసించడానికి పట్టణ, నగర ప్రాంతాలకు వెళ్తుంటా రు. అయితే కార్పొరేట్ విద్య నిరుపేద విద్యార్థులకు అందని ద్రాక్షలా మారింది. ఈ నేపథ్యంలో సర్కా రు బడుల్లో పదో తరగతి చదివి ప్రతిభ కనబరిచిన పేద విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్ కళాశాలల్లో ఇంటర్ చదివేందుకు సహకారం కల్పిస్తోంది. కార్పొరేట్ విద్యా పథకం కింద ఎంపికై న ఒక్కో విద్యార్థికి రూ.35 వేలు, పాకెట్ మనీగా రూ.3వేలు చెల్లిస్తుంది. దీని కోసం ఆసక్తి గల విద్యార్థుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తోంది. పదో తరగతిలో సాధించిన మార్కులు, రిజర్వేషన్ పరిగణలోకి తీసుకొని 2026– 27 విద్యా సంవత్సరానికి సంబంధించి కార్పొరేట్ కళాశాలకు ఎంపిక చేయనుంది. దరఖాస్తు గడువు జూన్ 5వ తేది వరకు ఉంది. ఇవీ అర్హతలు.. జెడ్పీ, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, ఎయిడెడ్, కేజీబీవీలు, నవోదయ, మోడల్ స్కూల్స్, గురుకులాలు, బెస్ట్ అవైలబుల్ పాఠశాలల్లో చదివే విద్యార్థులు ఈ పథకానికి అర్హులు. అలాగే ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.2 లక్షలు, బీసీ, మైనారిటీ, ఈబీసీ విద్యార్థుల తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.1.50 లక్షలు మించకూడదు. దరఖాస్తుకు మీసేవ కేంద్రాల నుంచి పొందిన కుల, ఆదాయ, ధ్రువపత్రాలు, 4 నుంచి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్లు, పదో తరగతి మెమో, ఆధార్, బ్యాంక్ పాస్బుక్, దివ్యాంగులైతే సంబంధిత ధ్రువపత్రాలను జతపరచాలి. పదో తరగతిలో 400కిపైగా మార్కులు సాధించిన వారిని ప్రవేశాలకు అధికారులు ఎంపిక చేస్తారు. అలాగే మీసేవ కేంద్రాల ద్వారా టీఎస్ ఈపాస్ పోర్టల్లో telanganaepass.cgg.gov.in దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా ఇంటర్మీడియట్ చదివే అవకాశాన్ని కార్పొరేట్ విద్యా పథకం ద్వారా పేద విద్యార్థులకు అవకాశం కల్పించింది. దీనిని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి. రాష్ట్రవ్యాప్తంగా ఏ కార్పొరేట్ కళాశాలనైనా ఎంపిక చేసుకునే అవకాశం కల్పిస్తోంది. అర్హులైన విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. – ఉమాపతి, షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి, నాగర్కర్నూల్ -
డీసీసీబీలో యూపీఐ సేవలు
● ఇకపై గూగుల్ పే, ఫోన్ పే ద్వారా సులభంగా లావాదేవీలు ● నగదు రహిత చెల్లింపులకు ముందడుగు మహబూబ్నగర్ (వ్యవసాయం): జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ (డీసీసీబీ) డిజిటల్ బ్యాంకింగ్ దిశగా మరో కీలక ముందడుగు వేసింది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో 1920 సంవత్సరంలో స్థాపించబడిన ఈ బ్యాంక్, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు దశాబ్దాలుగా అండగా నిలుస్తూ వస్తోంది. ప్రస్తుతం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 22 బ్రాంచ్లతో సేవలందిస్తున్న డీసీసీబీ.. తాజాగా తన ఖాతాదారులకు యూపీఐ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ కొత్త సేవలతో ఖాతాదారులు గూగుల్ పే, ఫోన్పే వంటి ప్రముఖ డిజిటల్ యాప్ల ద్వారా నేరుగా బ్యాంక్ ఖాతాలకు అనుసంధానం చేసుకుని నగదు రహిత లావాదేవీలు సులభంగా నిర్వహించుకోవచ్చు. డబ్బు పంపడం, స్వీకరించడం, క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేసి చెల్లింపులు చేయడం, చిన్న వ్యాపార లావాదేవీలను తక్షణమే పూర్తి చేయడం వంటి సేవలు ఇప్పుడు మొబైల్ ఫోన్ ద్వారానే సాధ్యమవుతున్నాయి. 3 లక్షలకుపైగా ఖాతాదారులు డీసీసీబీ పరిధిలో ప్రస్తుతం మూడు లక్షలకు పైగా ఖాతాదారులు ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రైతులు, మహిళా సంఘాలు, చిన్న వ్యాపారులు, ఉద్యోగులు, విద్యార్థులు అధిక సంఖ్యలో ఈ బ్యాంక్ సేవలను వినియోగి స్తున్నారు. యూపీఐ సేవలు అందుబాటులోకి రావడంతో వీరికి బ్యాంక్ శాఖలకు వెళ్లే అవకాశం తగ్గి.. ఇంటి వద్ద నుంచే వేగవంతమైన డిజిటల్ సేవలు పొందే అవకాశం ఏర్పడింది. 24 గంటల పాటు.. ఖాతాదారులు తమ మొబైల్ నంబర్ను బ్యాంక్ ఖాతాతో అనుసంధానం చేసుకుని యూపీఐ యాప్లో నమోదు చేసుకుంటే సేవలు వెంటనే యాక్టివేట్ అవుతాయి. రోజులో 24 గంటల పాటు ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. భద్రతా ప్రమాణాలతో కూడిన ఈ వ్యవస్థ ద్వారా కేవలం కొన్ని సెకన్లలోనే డబ్బు బదిలీలు పూర్తవుతాయని పేర్కొన్నారు. చెల్లింపులపై అవగాహన.. సహకార బ్యాంకింగ్ వ్యవస్థను ఆధునిక సాంకేతికతకు అనుగుణంగా తీర్చిదిద్దే క్రమంలో డీసీసీబీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గ్రామీణ ప్రజల్లో డిజిటల్ చెల్లింపులపై అవగాహన పెంపొందించేందుకు ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు కూడా నిర్వహించనున్నట్లు సమాచారం. 2025–26 ఆర్థిక సంవత్సరం నాటికి డీసీసీబీ రూ.2,500 కోట్ల టర్నోవర్ను అధిగమించడం బ్యాంక్ ప్రగతికి నిదర్శనంగా భావిస్తున్నారు. సహకార రంగంలో విశ్వసనీయ సేవలతోపాటు ఆధునిక సాంకేతిక సేవలను అందిస్తూ డీసీసీబీ ముందుకు సాగుతుండటంపై ఖాతాదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ‘మన బ్యాంక్తో స్మార్ట్ బ్యాంకింగ్ను ఆస్వాదించండి’ అనే నినాదంతో యూపీఐ సేవలను విస్తృతంగా వినియోగించుకోవాలని బ్యాంక్ యాజమాన్యం ఖాతాదారులను కోరుతుంది. -
రైతుల పాలిట శాపంగా భారత్మాల జాతీయ రహదారి
● జిల్లాలో శరవేగంగా 6 వరుసల రోడ్డు పనులు ● పంట పొలాలకు వెళ్లే అవకాశం లేకపోవడంతో ఆందోళనలు ● ఆరు మండలాల గుండా సుమారు 53 కి.మీ., నిర్మాణం ● 775 ఎకరాలు కోల్పోయిన రైతులు ప్రభుత్వం చేపట్టిన ఆరు వరుసల హైవే రోడ్డు నిర్మా ణం రైతుల పాలిట శాపంగా మారింది. రైతులు పొలాలకు వెళ్లేందుకు ఎద్దు ల బండ్ల రస్తా మూసుకుపోయింది. దీంతో రైతులు తమ పంట పొలాలకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఎక్కడెక్కడ పంట పొలాలకు దారులు ఉన్నాయో ఆయా ప్రదేశాల్లో హైలెవల్ బ్రిడ్జిలు ఏర్పాటు చేసి, కింద పంట పొలాలకు దారి వదలాలి. – రాఘవేంద్రగౌడ్, అయిజ ఆరు వరుసల హైవే నిర్మా ణంలో రైతులు పంట పొలలకు ఏర్పాటు చేసుకున్న రోడ్లు మూసుకుపోతున్నా యి. దీంతో రైతులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. రైతులకు ఇబ్బంది కలగకుండా హై లెవల్ బ్రిడ్జి నిర్మించి హైవే నిర్మాణం పనులు పూర్తిచేయాలని అధికారులను కోరుతూ.. వినతిపత్రాలు అందజేసినా పట్టించుకోవడం లేదు. – నాగిరెడ్డి, రైతు సంఘం మండల అధ్యక్షుడు, అయిజ భారత్మాల రోడ్డు నిర్మాణంలో రైతుల పంట పొ లాలకు వెళ్లే దారులు మూ సుకుపోయాయి. భారత్మాల హైవేలో అక్కడక్కడ ఏర్పాటు చేసిన దారిలోనే రైతులు వెళ్లాల్సి ఉంటుంది. దీనికోసం రెండు, మూడు కి.మీ., ఎక్కువ దూరం ప్రయాణం చేయాల్సి వస్తుంది. దీంతో చాలామంది రైతులం దిక్కుతోచని స్థితిలో పొలాలకు కూడా వెళ్లలేకపోతున్నాం. – యువతేజేశ్వర్రెడ్డి, గుడుదొడ్డి అయిజ: ‘చిన్న చేపను పెద్ద చేప.. పెద్ద చేపను సొర చేప మింగేసిన’ చందంగా తయారైంది.. భారత్మాల రోడ్డు పరిస్థితి. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ఆరు వరుసల హైవే రోడ్డు రైతుల పంట పొలాలకు ఏర్పాటు చేసుకున్న మట్టి దారులు, గ్రామాల మధ్య రాకపోకలు సాగించే చిన్నపాటి రోడ్లను మూసివేసింది. పంట పొలాలకు వెళ్లేందుకు రైతులు ఏర్పాటు చేసుకున్న ఎద్దుల బండ్ల రస్తాలు (బాటలు) సైతం రోడ్డు నిర్మాణంలో మూసుకుపోయాయి. మరోవైపు రోడ్డు నిర్మాణ పనులు శరవేగంగా సాగుతుండడంతో రైతుల గుండెల్లో గుబులు మొదలైంది. రోడ్డు నిర్మాణం పూర్తయితే రైతులు తమ పంట పొలాలకు వెళ్లేందుకు కూడా అష్టకష్టాలు పడాల్సి వస్తుందని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలోనే హైవే రోడ్డు నిర్మాణం పనులను రైతులు అనేకసార్లు అడ్డుకొని నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అదేవిధంగా తహసీల్దార్ కార్యాలయాలు, కలెక్టరేట్లోనూ వినతిపత్రాలు అందజేసినా ఏ ఒక్కరూ పట్టించుకున్న పాపానపోలేదు ఆరు మండలాల మీదుగా.. జోగుళాంబ గద్వాల జిల్లాలోని ఆరు మండలాల్లో భారత్మాల రోడ్డు నిర్మాణం పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. అయిజ, మల్దకల్, కేటీదొడ్డి, గట్టు, వడ్డేపల్లి, రాజోళి మండలాల మీదుగా 53 కి.మీ., దూరం హైవే రోడ్డు నిర్మాణం చేపట్టారు. రోడ్డు నిర్మాణంలో ప్రభుత్వం నుంచి 35 ఎకరాల భూమి, రైతుల నుంచి 775 ఎకరాల పంట పొలాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. భారత్మాల రోడ్డు నిర్మాణానికి గతంలోనే డిజైన్ చేశారు. రోడ్డు నిర్మాణం వలన వ్యవసాయ భూముల రోడ్లు మూసుకుపోయాయని గతంలో రైతులు అధికారులకు వినతిపత్రాలు అందజేస్తే.. రైతులు ఇచ్చిన ఫిర్యాదులను సంబంధిత అధికారులు పీడీఎన్హెచ్ఐకు లేఖ రాశారు. ఇటీవల గట్టు మండలంలోని పాత ఆలూరు రోడ్డు సమస్య నా దృష్టికి వచ్చింది. రైతుల సమస్యలను కలెక్టర్కు తెలియజేస్తాను. – శ్రీనివాసరావు, ఆర్డీఓ -
మక్తల్ను అన్నిరంగాల్లో తీర్చిదిద్దుతా
మక్తల్: నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో తీర్చిదిద్దడమే తన లక్ష్యమని రాష్ట్ర మత్స్య, పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. గురువారం మక్తల్లో అసంపూర్తి భవనాలను ఆయన పరిశీలించి.. అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలో 19 బీటీరోడ్లను 65 కి.మీ. మేర నిర్మించేందుకు రూ. 68కోట్లు మంజూరయ్యాయని చెప్పారు. కొల్పూర్ – కుర్తికొండ వద్ద జూరాల ప్రాజెక్టు తరహాలో బ్రిడ్జి కమ్ బ్యారేజీ నిర్మించేందుకు అవసరమైన నిధుల మంజూరుకు కృషి చేస్తున్నట్లు వివరించారు. హిందూపూర్ వద్ద ఽథర్మల్ పవర్ స్టేషన్కు సైతం త్వరలో గ్రీన్ సిగ్నల్ వచ్చే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే మక్తల్లో డిగ్రీ కళాశాల, రిజిస్ట్రర్ కార్యాలయం, కోర్టు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మక్తల్ మండలంలోని గొల్లపల్లి –మంతన్గోడ్ బీటీరోడ్డు నిర్మాణానికి రూ. 1.50కోట్లు, చిట్యాల – గుర్రందొడ్డి మార్గంలో వంతెన నిర్మాణానికి రూ. 20కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. మక్తల్లో నిర్మిసు న్న 150 పడకల ఆస్పత్రిని త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. అదే విధంగా 220 కేవీ విద్యుత్ సబ్స్టేషన్, టౌల్ హాల్ నిర్మాణాలకు కృషి చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. రాజీవ్గాంధీ ఆశయసాధనకు కృషి.. దివంగత మాజీ ప్రధాని రాజీవ్గాంధీ దేశానికి అందించిన సేవలు మరువలేనివని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. రాజీవ్గాంధీ వర్ధంతి సందర్బంగా మక్తల్లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. యువత శక్తిపై అపారమైన విశ్వాసం ఉంచిన రాజీవ్ గాంధీ.. 18 ఏళ్ల వయసు నుంచే ఓటు హక్కు కల్పించి, ప్రజాస్వామ్య వ్యవస్థల్లో యువశక్తి ప్రాధాన్యం పెంచారన్నారు. రాజీవ్గాంధీ ఆశయాలను కాంగ్రెస్ ప్రబుత్వం ముందుకు తీసుకెళ్తుందన్నారు. సీఎం రేవంత్రెడ్డి నాయకత్వంలో యువత అభ్యున్నతికి కట్టుబడి పనిచేస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్చైర్మన్ గణేశ్కుమార్, నాయకులు వాకిటి హన్మంతు, కట్ట సురేశ్, ఫయాజ్, మాజీ ఎంపీపీ శ్రీనివాస్రెడ్డి, కావాలి తయాప్ప, రవికుమార్, మందుల నరేందర్, ఆనంద్గౌడ్, నర్సింహులు, గణేశ్, ఓబులేషు, వెంకటేశ్, లక్ష్మణ్, శ్యామ్, రవి పాల్గొన్నారు. -
పురాతన కట్టడాలను పరిరక్షించుకోవాలి
జడ్చర్ల: శతాబ్దాల చరిత్ర కలిగిన పురాతన కట్టడాలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని పిల్లలమర్రి మ్యూజియం సహాయ సంచాలకులు నాగలక్ష్మి పేర్కొన్నారు. ఆల్వాన్పల్లి గ్రామశివారులో గొల్లత్తగుడి ఆవరణలో ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గురువారం పురావస్తు శాఖ ఆధ్వర్యంలో పరిశుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించారు. గొల్లత్తగుడి వైభవాన్ని ఈ సందర్భంగా అక్కడి వారికి వివరించారు. క్రీ.శ. 7–8వ శతాబ్దానికి సంబంధించి జైన దేవాలయంగా ప్రసిద్ధి చెందిందన్నారు. జైన దేవాలయ అవశేషాలు, ఇటుకలతో నిర్మాణశైలి, తవ్వకాలలో లభించిన జైన శిల్పాలు చాలా ప్రసిద్ధి చెందిందన్నారు. వారసత్వ సంపద పరిరక్షణ, పురాతన కట్టడాలను పరిరక్షించకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజల్లో వారసత్వ పరిరక్షణపై చైతన్యం పెంపొందించడం ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. కార్యక్రమంలోసర్పంచ్ దాసుయాదవ్ పాల్గొన్నారు.


