Jogulamba
-
ఆస్పత్రిలో వైద్యసేవలు మెరుగుపర్చాలి
అలంపూర్: ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య సేవలను మరింత మెరుగుపర్చాలని డీసీహెచ్ఎస్ రమేష్చంద్ర అన్నారు. సోమవారం అలంపూర్ చౌరస్తాలోని ఏరియా ఆస్పత్రిలో పీహెచ్సీ వైద్యాధికారులు, పీఓ ఎంసీహెచ్ సర్వీసెస్, ఏరియా ఆస్పత్రి సిబ్బందితో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏరియా ఆస్పత్రిలో మదర్ అండ్ చైల్డ్ కేర్ సర్వీసెస్ మరింత మెరుగుపర్చాలన్నారు. ఆస్పత్రిలో ప్రసవాల సంఖ్య పెంచాలన్నారు. చికిత్స కోసం వచ్చే వారికి డైట్ సర్వీసెస్ అందించడం జరుగుతుందన్నారు. ఆస్పత్రిలో పారిశుద్ధ్య నిర్వహ ణ మెరుగుపర్చాలన్నారు. జనరల్ సర్జరీలు, ఆప్త మాలజీ, పీడియాట్రిక్, ఆర్థోపెడిక్ సేవలను ఆస్ప త్రిలో అందిస్తున్నట్లు వివరించారు. ఆరోగ్యశ్రీలో జనరల్ సర్జరీలో అప్రెంటిక్స్ ఫిస్టులా శరీరంలో కంతులు రొమ్ములో కంతులు థైరాయిడ్ సమస్యలకు చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు. ఈ ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవా లన్నారు. సమావేశంలో ఆస్పత్రి సూపరింటెండెంట్ సయ్యద్ బాష, ప్రోగ్రాం ఆఫీసర్ ప్రసన్న, డాక్టర్లు నిఖిల, సుహానా, ఆనస్తీషియా గిరిభాస్కర్, వైద్య సిబ్బంది సుబ్బలక్ష్మి, త్రివేణి పాల్గొన్నారు. -
సరిహద్దులు దాటిన లింకులు
● ఏపీ, కర్ణాటక రాష్ట్రాల్లోనూ నకిలీ ధ్రువపత్రాల దందా ● కర్ణాటక రాష్ట్రంలోని గుల్బర్గా సబ్ రిజిస్ట్రార్ ముద్రలు గుర్తింపు ● పోలీస్, రెవెన్యూ అధికారుల విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి..గట్టు: జోగుళాంబ గద్వాల జిల్లాలోని అయిజ కేంద్రంగా సాగిన నకిలీ ధ్రువపత్రాల తయారీ దందా వ్యవహారం ఏకంగా మూడు రాష్ట్రాలకు విస్తరించింది. ఇటీవల అయిజలోని ఓ ప్రింటింగ్ ప్రెస్ను రెవెన్యూ అధికారులు తనిఖీ చేయగా నకిలీ ధ్రువపత్రాల ముద్రింపు దందా వెలుగు చూసిన విష యం తెలిసిందే. అయితే అయిజ కేంద్రంగా కొనసాగిన నకిలీ పత్రాల సృష్టిలో గట్టు మండలానికి చెందిన మాజీ ప్రజాప్రతినిధులు, పైరవీకారుల ప్రమే యం ఎక్కువగా ఉన్నట్లు అధికారులు గుర్తించినట్లు సమాచారం. ఈ క్రమంలోనే సోమవారం ‘సాక్షి’లో ప్రచురితమైన ‘అయిజ టు గట్టు’ కథనం మండలంలో చర్చనీయాంశంగా మారింది. నకిలీ పత్రాల దందాలో పాత్రదారులు, సూత్రదారులను గుర్తించి.. శిక్షిస్తారా.. లేక ఒత్తిళ్లకు తలొగ్గి వదిలేస్తారా.. అన్న సందేహాలను ఇక్కడి వారు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలైన కల్యాణలక్ష్మి, రైతుబీమా, భూ భారతి పోర్టల్కు సంబంధించి నకిలీ పత్రాలతో పెద్దఎత్తున అక్రమాలకు పాల్పడినట్లు తెలుస్తోంది. నకిలీ దందాలో భాగస్వాములుగా ఉన్న వారిలో ఇప్పటికే టెన్షన్ నెలకొంది. ఎక్కడ తమ పేర్లు బయట పడతాయోనని ఆందోళన చెందుతున్నారు. నకిలీ దందా నుంచి బయట పడేందుకు మార్గాలనే వెతుక్కుంటున్నారు. ఇప్పటికే ప్రింటింగ్ ప్రెస్లో ఉన్న కంప్యూటర్ హార్డ్ డిస్క్ను రెవెన్యూ, పోలీస్ అధికారులు స్వాధీనం చేసుకుని గుట్టు విప్పే పనిలో ఉన్నట్లు సమాచారం. దిమ్మతిరిగే వాస్తవాలు.. కంప్యూటర్ లోగుట్టును విప్పుతున్న క్రమంలో అధికారులు దిమ్మతిరిగే వాస్తవాలను గుర్తించినట్లు తెలిసింది. ఈ నకిలీ దందా వ్యవహారం కేవలం అయిజ, గట్టు మండలాలకే కాకుండా.. ఏకంగా అంతర్ రాష్ట్ర స్థాయికి చేరుకున్నట్లు తెలిసింది. కర్ణాటకతోపాటుగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన స్టాంపులు, ఆధార్ కార్డులను అధికారులు గుర్తించినట్లు సమాచారం. కర్ణాటకలోని గుల్బర్గా సబ్ రిజిస్ట్రార్ స్టాంపు, సంతకం ఉన్న స్టాంపు, ఆంధ్రప్రదేశ్లోని పత్తికొండ ప్రాంతానికి చెందిన అధికారుల ముద్రలు, సంతకాలు ఉన్న స్టాంపులను గుర్తించినట్లు సమాచారం. ఇక గతంలో ఇక్కడ పనిచేసిన తహసీల్దార్ల సంతకాలకు సంబంధించిన స్టాంపు (ముద్ర)లను సైతం అధికారులు గుర్తించారు. వీటితోపాటు డిగ్రీ, ఎస్సెస్సీ సర్టిఫికెట్లు, ఆయా బ్యాంకులకు సంబందించిన నో డ్యూలు ఉన్నట్లు అధికారుల పరిశీలనలో వెలుగు చూసింది. అయిజ ప్రింటింగ్ ప్రెస్ కేంద్రంగా కొనసాగిన నకిలీదందా వ్యవహారంపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు. -
విద్యార్థులు ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి
ఎర్రవల్లి: విద్యార్థులు విద్యతోనే ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని పదో పటాలం కమాండెంట్ జయరాజ్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని పదో బెటాలియన్ సాయుధ చైతన్య పాఠశాలలో నిర్వహించిన సక్సెస్ మీట్ కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. విద్యార్థులు ఇక్కడితో ఆగిపోకుండా భవిష్యత్లో మరింత ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని వాటిని సాధించే దిశగా కృషి చేయాలన్నారు. తల్లిదండ్రులపై అనవసర ఆర్థిక భారం మోపకుండా చెడు అలవాట్లకు దూరంగా ఉండి మంచి విద్యను అభ్యసిస్తూ తమ లక్ష్యాలను చేరుకోవాలన్నారు. అనంతరం పాఠశాలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అభినందనలు తెలుపుతూ సన్మానించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్ పార్థసారధిరెడ్డి, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు నర్సింహారెడ్డి, శ్రీనివాసులు, రాజేశం, పాఠశాల హెచ్ఎం షేక్షావలి, ఉపాధ్యాయులు, పటాలం సిబ్బంది పాల్గొన్నారు. ధాన్యం బస్తాలు తరలించండి అలంపూర్: కొనుగోలు కేంద్రాల్లోని మొక్కజొన్న ధాన్యం బస్తాలు తరలించడానికి చర్యలు తీసుకోవాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు జీకే ఈదన్న అన్నారు. అలంపూర్ చౌరస్తాలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన డివిజన్ స్థాయి ప్రజావాణిలో సోమవారం ఆర్డీఓ శ్రీనివాస్రావుకు తెలంగాణ రైతు సంఘం నాయకులు సోమవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొక్కజొన్న కొనుగోలు చేసి మార్క్ఫెడ్ సంస్థ వాటిని తరలించడంలో చేతులెత్తేసిందన్నారు. ప్రభుత్వం జిల్లావ్యాప్తంగా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందన్నారు. రైతులు కేంద్రాల్లో మద్దతు ధర లభిస్తుండటంతో ఇక్కడే తమ ధాన్యం విక్రయించారని, రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసిన అధికారులు ఆ తర్వాత వాటిని గోదాంలకు తరలించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. ఫలితంగా జిల్లావ్యాప్తంగా కొనుగో లు కేంద్రాల్లో 50 వేల క్వింటాళ్ల ధాన్యం బస్తాలు పేరుకుపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ విషయాన్ని పలుమార్లు ప్రభుత్వ యంత్రాంగం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. అధికారులు వెంటనే స్పందించి కేంద్రాల్లో నిలిచిన ధాన్యం బస్తాలను తరలించడానికి చర్యలు తీసుకోవాలని వినతిలో కోరారు. అధికారులు ధాన్యం బస్తాల తరలింపులో స్పందించకపోతే జాతీయ రహదారి–44పై ఆందోళన చేస్తామని హెచ్చరించారు. వినతిపత్రం అందజేసిన వారిలో రైతు సంఘం నాయకులు మద్దిలేటి, రైతులు వెంకటేశ్వర్లు, నర్సింహరాజు, చాంద్బాష తదితరులు పాల్గొన్నారు. నిరుపేదలకు ఇళ్లు ఇవ్వకపోతే పోరాటం జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): నిరుపేదలందరికీ డబుల్ బెడ్రూం ఇవ్వాలని టీఎఫ్టీయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఖలీల్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నాలో ఆయన మాట్లాడుతూ గతంలో కాంగ్రెస్ హయాంలో 900మందికి 60–75 చదరపు గజాల ఇళ్ల స్థలాలు ఇచ్చినట్లు గుర్తుచేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత డబుల్బెడ్రూం ఇళ్లను ఇస్తామని హామీ ఇచ్చి.. పట్టాలను వెనక్కి తీసుకున్నారని ఆరోపించారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా పేదలకు మోసం మండిపడ్డారు. అర్హులైన వారికి డబుల్బెడ్రూం ఇళ్లు ఇవ్వకుండా కొన్నేళ్లుగా కాలయాపన చేస్తూ నిరుపేదలను క్షోభకు గురి చేస్తున్నారని ఆరోపించారు. తమ గూడు వింటారని ఆశతో ఏడాది నుంచి కలెక్టర్తో పాటు ఎమ్మెల్యే కలుస్తూనే ఉన్నారని తెలిపారు. ఇప్పటికై నా ప్రభుత్వం పట్టించుకోకపోతే పోరాటం తప్పదని హె చ్చరించారు. అనంతరం ఆర్డీఓ నవీన్కు వినతిపత్రం అందజేశారు. -
వరి.. వర్షార్పణం
రాజోళి: ‘మూలిగే నక్క మీద తాటికాయ పడ్డ’ చందంగా మారింది రైతుల పరిస్థితి. పంటను పండించే వరకు నానా కష్టాలు పడి కాపాడుకుంటే.. కోత కోసి అమ్ముకుందామనేలోగా ప్రకృతి వైపరీత్యాలతో పూర్తిగా దెబ్బతింటుంది. ఈ ఏడాది కూడా రైతుకు పూర్తిస్థాయిలో నష్టమే జరిగినట్లుగా అధికారుల అంచనాలు తెలుస్తున్నాయి. జిల్లాలో గత నెలలో కురిసిన అకాల వర్షాలకు కోతకు సిద్ధంగా ఉన్న అరటి, మినుము, మామిడి పంటలతోపాటు.. అత్యధికంగా సాగవుతున్న వరి పంట పూర్తిగా దెబ్బతినడంతో పైసా చేతికి రాలేదని రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. జిల్లా పరిధిలో ఇలా.. గత నెలలో ఉరుములు, మెరుపులతో కురిసిన అకాల వర్షం కారణంగా పలుచోట్ల పంటలపై ప్రభావం తీవ్రంగా పడింది. రాజోళి మండలంలోని మాన్దొడ్డితోపాటు చుట్టు పక్కల గ్రామాలు, అయిజ మండలంలో తీవ్రంగా చూపడంతో ఆ ప్రాంతంలో ఉన్న రైతులు రూ.లక్షల్లో నష్టపోయారు. గంటల వ్యవధిలోనే జిల్లా ఉన్నతాధికారులు గ్రామాలకు చేరుకుని పంటలను పరిశీలించారంటే నష్టం ఎంత మొత్తంలో ఉంటుందో ఊహించవచ్చు. అధికారుల అంచనా వేసిన దాని ప్రకారం 33 శాతంపైగా పంట దెబ్బతిందని గుర్తించారంటే ఆ పంటలు అసలు పనికి రావని నిర్ధారణ అయినట్లే. అలాంటి జాబితాలో ప్రస్తుతం పంటల వివరాలు నమోదు చేశారు. క్షేత్రస్థాయిలో పరిశీలించిన అధికారులు 1,800 ఎకరాలకుపైగా (80 శాతం) పంటలు దెబ్బతిన్నట్లు గుర్తించారు. వరి కంకి మొత్తం రాలిపోయి.. పైరు అడ్డం పడిపోయి, నేలరాలిన గింజ దేనికి పనికి రాకుండా పోయిందని రైతులు వాపోతున్నారు. జిల్లాలో ప్రకృతి ప్రకోపానికి బలైన రైతు అధికారుల అంచనాల్లోనే 1,800 ఎకరాలకుపైగా పంట నష్టం జిల్లాలో సింహభాగం నష్టపోయింది వరి రైతులే.. 85 శాతం మేర పూర్తిగా నష్టపోయినట్లు గుర్తింపు పరిహారంపైనే రైతుల ఆశలు -
ఫిర్యాదులు పరిష్కారంలో అలసత్వం వద్దు
గద్వాల: ప్రజావాణి ఫిర్యాదులపై పరిష్కరించకుండా అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ రిజ్వాన్బాషా షేక్ అన్నారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో జిల్లా నుంచి వివిధ సమస్యలపై వచ్చిన ప్రజలతో 74 ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమస్యలను పరిష్కరించుకునేందుకు ప్రతి సోమవారం ప్రజావాణి నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వచ్చిన ఫిర్యాదులను నిర్ణీత కాలంలో పరిష్కరించాలని, లేనిపక్షంలో అందుకు కారణాలు పేర్కొంటూ ఫిర్యాదుదారునికి అక్నాలెడ్జ్మెంట్ పంపాలన్నారు. అలాగే మండలాల్లో అధికారులు ప్రజావాణిని సక్రమంగా నిర్వహిస్తే చిన్నపాటి సమస్యలపై ప్రజలు ఫిర్యాదు చేసేందుకు కలెక్టరేట్కు రావాల్సిన అవసరం ఉండదన్నారు. ప్రజావాణి అనంతరం జిల్లా అధికారులతో మాట్లాడుతూ వేసవిలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా అధికారులు అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. జనాభా గణనలో భాగంగా ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు సెల్ఫ్ ఎన్యూమరేషన్ నిర్వహించడం జరుగుతుందన్నారు. ఇందులో ప్రతి పంచాయతీ నుంచి కనీసం వందమంది పాల్గొనేలా సంబంధిత అధికారులు కృషి చేయాలన్నారు. సర్పంచులు, వార్డు సభ్యులు, మహిళా సంఘాల సభ్యులు వివరాలను సంబంధిత పోర్టల్లో నమోదు చేసుకునేలా ప్రోత్సహించాలన్నారు. ఇందిరమ్మ ఇళ్లడ్ల నిర్మాణం వేగవంతం చేయాలన్నారు. వనమహోత్సవాన్ని విజయవంతం చేయాలి వన మహోత్సవంలో భాగంగా వర్షాకాలంలో లక్ష్యం మేరకు మొక్కలు నాటేందుకు ఆయా శాఖల అధికారులు ఇప్పటి నుంచే సిద్ధంగా ఉండాలని కలెక్టర్ రిజ్వాన్బాషా షేక్ అన్నారు. కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ ఏడాది జిల్లాకు 11 లక్షల మొక్కలు నాటే లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించిందని, ఇందుకు అనుగుణంగా నర్సరీలలో మొక్కలను సిద్ధం చేయాలన్నారు. ఆయా శాఖల అధికారులు మొక్కలు పెంచడానికి తమ పరిధిలో ఎక్కడెక్కడ అవకాశం ఉందో గుర్తించి నివేదిక సిద్ధం చేయాలన్నారు. జిల్లా అధికార యంత్రాంగం సమన్వయంతో పనిచేసి వన మహోత్సవం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ నర్సింగ్రావు, డీఎఫ్ఓ ఆశీస్సింగ్, ఎస్డీసీ కృష్ణ, ఏఓ భూపాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలపై పర్యవేక్షణ వరిధాన్యం కొనుగోలు ప్రక్రియలో ఎలాంటి అవకతవకలు చోటుచేసుకోకుండా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పర్యవేక్షించాలని కలెక్టర్ రిజ్వాన్బాషా షేక్ ఆదేశించారు. అకాల వర్షాల కారణంగా తడిసిన వరిధాన్యం కొనుగోలుపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నిర్వహించిన వీసీలో ఆయన పాల్గొని మాట్లాడారు. విజిలెన్స్ అధికారులు తమ పరిధిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి ఎప్పటికప్పుడు నివేదిక సమర్పించాలన్నారు. రైతులతో ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే వివరాలు ఓపీఎంఎస్లో ఎంట్రీ చేసి సకాలంలో వారికి డబ్బులు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో డీఎస్ఓ స్వామికుమార్, డీఎం విమల తదితరులు పాల్గొన్నారు. -
10 ఎకరాలు పోయింది..
సొంత భూమితోపాటు కౌలు తీసుకున్న దానితో కలిపి మొత్తం 10 ఎకరాలు వరి పంట సాగు చేశాను. ఇటీవల కురిసిన అకాల వర్షానికి ధాన్యం మొత్తం రాలిపోయింది. చేనులోనే రాలిపోయిన గింజలను చూస్తే ప్రాణం తరుక్కుపోతుంది. రూ.లక్షల్లో పెట్టుబడి పెట్టి నష్టపోయాను. – పాపన్న, రైతు, మాన్దొడ్డిఉన్నతాధికారులకు పంపాం.. అకాల వర్షానికి జిల్లాలో ఎక్కువగా రాజోళి మండలంలోని మాన్దొడ్డి పరిసర గ్రామాలు, అయిజ మండలంలో పంటలు ఎక్కువగా దెబ్బతిన్నాయి. ఎక్కువగా వరి పంట చేతికి రాని విధంగా తయారైంది. పంటలో జరిగిన నష్టాన్ని పూర్తిస్థాయిలో నివేదికను తయారు చేసి ఉన్నతాధికారులకు పంపాం. – వీరప్ప, డీఏఓ ● -
టెండర్ ప్రక్రియ పూర్తి..
జూరాలలో 42 గేట్లకు సంబంధించి ఇనుప రోపులను పూర్తిస్థాయిలో మార్చేందుకు వారం క్రితం టెండర్ ప్రక్రియ పూర్తయింది. అయితే గతంలో విడుదలైన రూ.11 కోట్ల నిధులతో ఇది వరకే 10 గేట్లకు సంబంధించి ఇనుప రోపులను పూర్తిస్థాయిలో మార్చేందుకు చర్యలు చేపట్టారు. తాజాగా మరో 42 గేట్లకు సంబంధించిన ఇనుప రోపుల మరమ్మతుకు టెండర్ పూర్తికావడంతో ఈ వేసవిలోనే గేట్లకు సంబంధించి మరమ్మతు పూర్తిచేసేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు. మరమ్మతు పూర్తి చేస్తాం.. జూరాల ప్రాజెక్టు గేట్లకు సంబంధించి ఇది వరకే విడుదలైన నిధులతో మరమ్మతు ప్రక్రియ చేపట్టాం. తాజాగా 42 గేట్లకు ఇనుప రోపులను పూర్తిస్థాయిలో కొత్తవి ఏర్పాటు చేసేందుకు రూ.4.30 కోట్లు విడుదలవగా.. వారం రోజుల కిందట టెండర్ ప్రక్రియ పూర్తయింది. ఈ వేసవిలో వీలైనంత మేరకు మరమ్మతు పూర్తి చేసి వచ్చే వానాకాలం నాటికి సిద్ధం చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. – రహీముద్దీన్, ఎస్ఈ, ఇరిగేషన్ శాఖ● -
మత్తు.. భవితకు చేటు
గద్వాల క్రైం: గంజాయి, డ్రగ్స్, పొగాకు వంటి మత్తు పదార్థాల బారిన పడితే భవిష్యత్ అంధకారంలోకి నెట్టే ప్రమాదం ఉంది. చెడు వ్యవసనాలపై ఉక్కుపాదం మోపుతూ, చట్టాలపై పూర్తిస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు రచిస్తోంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన – పల్లె ప్రగతి 99 రోజుల కార్యక్రమంలో భాగంగా జిల్లా పోలీసుశాఖ ప్రధాన అంశమైన పిల్లల రక్షణ, మత్తు పదార్థాల రహిత నవ సమాజ నిర్మాణ కార్యాక్రమాన్ని వారం రోజల పాటు వారోత్సవాల కార్యచరణ చేపట్టింది. గద్వాల, అలంపూర్ సెగ్మెంట్లలో డ్రగ్స్ నిర్మూలనపై పోలీసుశాఖ ఆధ్వర్యంలో నిరంతరం అవగాహన కల్పిస్తున్నారు. విక్రేతలపై కేసులు నమోదు చేసి, బహిరంగ మార్కెట్లో వాటి సరఫరాకు అడ్డుకట్ట వేసింది. తాజాగా అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో అధికారులు ప్రజల వద్దకు చేరుకుని చట్టాలపై ప్రజలను చైతన్యం పరుస్తున్నారు. సోమవారం నుంచి జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాల, కళాశాల, రైల్వేస్టేషన్, బస్టాండ్, అంగన్వాడీ కేంద్రాలు, ఆస్పత్రులు, ఫ్యాక్టరీలు తదితర ప్రాంతాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. చెడు వ్యసనాలకు ఆకర్శితులై.. ప్రభుత్వం మత్తు పదార్థాల కట్టడికి తీసుకుంటున్న చర్యలు ప్రజల్లోకి పూర్తి స్థాయిలో చేరడం లేదనే విమర్శలు లేకపోలేదు. మరోవైపు అధికారులు నిరంతరం నిఘా పెట్టినా చెడ్డు వ్యవసనాలకు ఆకర్శితులైన కొందరు తమ విలువైన జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. మత్తు పదార్థాలకు బానిసలైన యువతపై పోలీసు శాఖ నిఘా ఉంచి, కౌన్సిలింగ్ ఇస్తున్నారు. మరోవైపు మహిళలపై జరుగుతున్న దాడులు, చిన్నారులపై జరుగుతున్న వికృత చేష్టలపై (బ్యాడ్ టచ్, గుడ్ టచ్) విషయాలు తెలియజేస్తున్నారు. బాల్య వివాహాల వల్ల కలిగే సమస్యలు, లైగింక దాడులు, పోక్సో కేసుల తీవ్రత, లింగ సమానత్వం, పౌష్టికాహారం వినియోగంతో పాటు విద్య, వైద్య సదుపాయాలపై అవగాహన కల్పిస్తున్నారు. విద్య అంటే కేవలం ఉద్యోగం, డబ్బు సంపాదించడం కాదనే విషయాన్ని యువత గుర్తించాలని, జీవనశైలి అలవరుస్తుందన్నారు. పోలీసు, రెవెన్యూ, పంచాయతీరాజ్, విద్యాశాఖ అధికారులు, భరోసా సెంటర్ నిర్వాహకులు గ్రామాల్లోకి వెళ్లి ప్రజాప్రతినిధులు, యువత, మహిళా సంఘాలు, విద్యావంతులు, సామాజిక కార్యకర్తలతో మమేకమై మత్తు పదార్థాల నిర్మూలనపై పోరాడాలని సూచిస్తున్నారు. గంజాయి తాగినా, అమ్మినా వెంటనే పోలీసులకు సమాచారం అందజేయాలనే చైతన్యాన్ని ప్రజల్లో తీసుకురావాలని భావిస్తున్నారు. ప్రత్యేక నిఘా.. గ్రామాల్లో 15 నుంచి 25 ఏళ్ల వయస్సు గల యువకుల జాబితాను గ్రామాల వారీగా సిద్ధం చేసి వారిపై ప్రత్యేక నిఘా ఉంచారు. వేసవి సెలువుల నేపథ్యంలో వారిని స్కిల్ డెవలప్మెంట్ వైపు మళ్లించేలా చూస్తున్నారు. స్నేహితులతో కలిసి పార్టీలు చేసుకునే సమయంలో యువత తీసుకునే మత్తు పదార్థాలు, గంజాయి వినియోగం వంటి వాటిపై మఫ్టీ పోలీసులు నిరంతరం కూపీలాగుతున్నారు. జిల్లా వ్యాప్తంగా గంజాయి నిర్మూలన వారోత్సవాలు ప్రజాపాలన–పల్లె ప్రగతి కార్యక్రమంలో కసరత్తు మత్తు పదార్థాల నిర్మూలనే లక్ష్యం అన్ని శాఖల సమన్వయంతోకార్యక్రమాలు చట్టాలపై అవగాహన అవసరం -
నేడు ఆర్డీఓ స్థాయిలో ప్రజావాణి : కలెక్టర్
అలంపూర్: క్షేత్రస్థాయిలో ప్రజాసమస్యల పరిష్కారం నిమిత్తం సోమవారం ఆర్డీఓ స్థాయిలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అలంపూర్ చౌరస్తాలోని వ్యవసాయ మార్కెట్యార్డు కార్యాలయంలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1గంట వరకు జరిగే ప్రజావాణిలో అన్ని శాఖల డివిజన్స్థాయి అధికారులు అందుబాటులో ఉంటారన్నారు. కార్యక్రమాన్ని సజావుగా నిర్వహించేందుకు డిప్యూటీ తహసీల్దార్లు వేణుగోపాల్రెడ్డి, వెంకటరమణలను పర్యవేక్షణ అధికారులుగా నియమించినట్లు తెలిపారు. ప్రజావాణిలో అందే ఫిర్యాదులను సీజీజీ ప్రజావాణి పోర్టల్లో నమోదుచేసి.. అంగీకార పత్రం ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. రేపు జిల్లా అథ్లెటిక్స్ క్రీడాకారుల ఎంపికలు మహబూబ్నగర్ క్రీడలు: వరంగల్లో ఈ నెల 10న జరిగే రాష్ట్రస్థాయి అంతర్ జిల్లాల అథ్లెటిక్స్, 17న హైదరాబాద్లో జరిగే రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొనే జిల్లా అథ్లెటిక్స్ క్రీడాకారుల ఎంపికలను మంగళవారం ఉదయం 9 గంటలకు స్థానిక మెయిన్ స్టేడియంలో నిర్వహిస్తున్నట్లు జిల్లా అథ్లెటిక్స్ సంఘం ప్రధాన కార్యదర్శి జి.శరత్చంద్ర ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. మైసమ్మ జాతరకు పోటెత్తిన భక్తులు పెద్దకొత్తపల్లి: నాయినోనిపల్లి మైసమ్మ జాతరకు ఆదివారం భక్తులు పోటెత్తారు. విద్యాసంస్థలకు వేసవి సెలవులు ఇవ్వడంతో పాటు వ్యవసాయ పనులు ముగియడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్దఎత్తున తరలివచ్చి మైసమ్మను దర్శించుకున్నారు. అప్పటికే జాతర మైదానంలో సిద్ధంచేసిన నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. భక్తుల రద్దీతో జాతర మైదానం కిక్కిరిసిపోయింది. కొంతసేపు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. దాదాపు 15వేల మంది భక్తులు మైసమ్మను దర్శించుకున్నట్లు దేవాదాయశాఖ అధికారి రామేశ్వరశర్మ తెలిపారు. ‘పాలమూరు’కు జాతీయ హోదా ఇవ్వాలి జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): పాలమూర్–రంగారెడ్డి ప్రాజెక్ట్కు జాతీయ హోదా సాధనకు ఎంపీ డీకే అరుణ కృషి చేయాలని సీపీఐ జిల్లా మాజీ కార్యదర్శి పరమేశ్గౌడ్ ఆదివారం ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. మే 10న రాష్ట్రానికి ప్రధాని మోదీ వస్తున్నారని, పాలమూరుకు జాతీయ హోదా ప్రకటన చేయించాలని కోరారు. 2014లో ఎన్నికల ముందు పాలమూరు సాక్షిగా ఆనాటి సుష్మాస్వరాజ్ బీజేపీ అధికారంలోకి వస్తే పాలమూరుకు జాతీయ హోదా కల్పిస్తామని ఇచ్చిన మాటను గుర్తు చేశారు. మూడోసారి అధికారంలోకి వచ్చినా పాలమూరుకు ఇవ్వాల్సిన జాయతీ హోదాను మరిచిపోందని విమర్శించారు. జాతీయ హోదా కల్పించకుండా బీజేపీ తెలంగాణ ప్రజలను మోసం చేసిందని తెలిపారు. ఎంపీగా బీజేపీ అభ్యర్థి డీకే అరుణను గెలిపించిన పాలమూరుకు మాత్రమే జాతీయ హోదా రాలేదని ఎద్దేవా చేశారు. బీజేపీ నాయకత్వం చొరవ చూపడంలో పూర్తిగా వైఫల్యం చెందిందని తెలిపారు. కృష్ణ బేసిన్లో పాలమూరు క్యాచ్మెంట్ ఏరియా 70శాతం ఉన్న పాలమూరుకు దక్కాల్సిన నీళ్ల వాటా దక్కడం లేదని ఆరోపించారు. ఈనెల 10న రాష్ట్రానికి వచ్చే ప్రధాని నోటితో పాలమూరుకు జాతీయ హోదాను ప్రకటించేలా ఇక్కడి బీజేపీ నాయకులు కృషి చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రం నుంచి ఎనిమిది మంది ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్నా.. కేంద్ర ప్రభుత్వంనుంచి మనకు ప్రత్యేకంగా ఒరిగిందేమి లేదని అసహనం వ్యక్తం చేశారు.అయిజ టు గట్టు ● నకిలీ పత్రాల తయారీ దందాలో గట్టుకు లింకులు ● కూపీ లాగుతున్న రెవెన్యూ, పోలీస్ అధికారులు – వివరాలు 8లో.. -
ప్రశాంతంగా నీట్
● 911మంది అభ్యర్థులు హాజరు బాలుర జూనియర్ కళాశాల పరీక్ష కేంద్రాన్ని పరిశీలిస్తున్న ఎస్పీ శ్రీనివాసరావు బాలుర పాఠశాల పరీక్ష కేంద్రం వద్ద అభ్యర్థులను తనిఖీ చేస్తున్న పోలీసు సిబ్బంది ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల వద్ద అభ్యర్థులు, వారి కుటుంబీకుల సందడి గద్వాల: జిల్లాలో నీట్–యూజీ పరీక్ష ఆదివారం ప్రశాంతంగా జరిగింది. జిల్లావ్యాప్తంగా నాలుగు పరీక్ష కేంద్రాల్లో పరీక్ష నిర్వహించగా.. విద్యార్థులను ఉదయం 11 నుంచి 1.30 గంటల వరకు కేంద్రాల్లోకి అనుమతించారు. దీంతో ఉదయం 8 గంటల నుంచే పరీక్ష కేంద్రాల వద్ద హడావుడి కనిపించింది. పరీక్షల నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేసిన అధికారులు.. విద్యార్థులు పరీక్ష కేంద్రంలోకి వెళ్లే క్రమంలో క్షుణ్ణంగా తనిఖీ చేశారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర, బాలికల జూనియర్ కళాశాలలు, ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల, ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలల్లో ఏర్పాటుచేసిన పరీక్ష కేంద్రాల్లో మొత్తం 930 మంది అభ్యర్థులు హాజరు కావాల్సి ఉండగా.. 911మంది అభ్యర్థులు హాజరైనట్లు పరీక్షల కో–ఆర్డినేటర్ దేవేందర్రెడ్డి తెలిపారు. కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్, రెవెన్యూ, విద్యాశాఖల అధికారులు సమన్వయంతో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5గంటల వరకు పరీక్ష కొనసాగగా.. ఎస్పీ శ్రీనివాసరావు, ఏఎస్పీ శంకర్ పర్యవేక్షించారు. అన్ని పరీక్ష కేంద్రాల వద్ద అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించినట్లు కో–ఆర్డినేటర్ దేవేందర్రెడ్డి తెలిపారు. -
సన్నాలకే మొగ్గు..
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా యాసంగిలో 8,33,679 ఎకరాల్లో రైతులు వరి సాగు చేశారు. అయితే ప్రభుత్వం గ్రేడ్–1 సన్న వడ్లు క్వింటాల్కు మద్దతు ధర రూ.2,389, గ్రేడ్–2కు రూ.2,369 ఇస్తోంది. దీంతోపాటు సన్నాలకు బోనస్ కింద క్వింటాల్కు రూ.500 చొప్పున చెల్లిస్తోంది. ఈ నేపథ్యంలో రైతులు సన్నాల సాగుకే మొగ్గు చూపారు. 5,31,181 ఎకరాల్లో సన్న ధాన్యం సాగు చేయగా.. 3,02,498 ఎకరాల్లో రైతులు దొడ్డు రకం వరి సాగు చేశారు. అయితే సన్నాలను కొనేందుకు ప్రైవేట్ వ్యాపారులు ముందుకు వస్తున్నా.. దొడ్డు రకాల ధాన్యం కొనేందుకు ఇష్టపడడం లేదు. పలు ప్రాంతాల్లో మాత్రమే దళారులు దొడ్డు రకం వడ్లను క్వింటాకు రూ.2,200లోపు వెచ్చించి కొనుగోలు చేస్తున్నారు. ఫలితంగా రైతులు ప్రభుత్వ కేంద్రాల్లో రోజుల తరబడి నిరీక్షిస్తూ.. కొనుగోళ్ల కోసం ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది. ఆశలు.. అడియాసలు ప్రస్తుతం ప్రభుత్వ కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లలో జాప్యంతో పలు ప్రాంతాల్లో రైతులు ప్రైవేట్ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. పూర్తిగా ఆరబెట్టిన సన్న వడ్లు క్వింటాకు రూ.2,400 నుంచి రూ.2,450.. తేమ ఉంటే రూ.2,300 నుంచి రూ.2,350 వరకు వెచ్చించి దళారులు కొనుగోలు చేస్తున్నారు. వెంటనే డబ్బులు చెల్లిస్తుండడంతో రైతులు వారి వైపే మొగ్గుచూపుతున్నారు. అయితే బోనస్ ఆశతో సన్నాలు పండించిన రైతుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. బోనస్ చెల్లించాల్సి వస్తుందనే ప్రభుత్వం కావాలని కొనుగోలు చేయకుండా.. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శిస్తున్నారు. -
కేజీబీవీ, గురుకుల కళాశాలల ప్రవేశ పరీక్ష
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: జిల్లావ్యాప్తంగా కేజీబీవీ, గురుకుల కళాశాలల్లో ఇంటర్మీడియట్ కోర్సుల్లో 2026–27 విద్యా సంవత్సరంలో ప్రవేశాల కోసం ఆదివారం నిర్వహించిన పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఈ మేరకు ఉదయం 10 నుంచి 12.30 గంటల వరకు పరీక్ష కొనసాగింది. జిల్లావ్యాప్తంగా మొత్తం 54 కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షలకు 13,222 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా.. 10,385 మంది హాజరు కాగా.. 2,837 మంది గైర్హాజరయ్యారని పరీక్ష కోఆర్డినేటర్ శ్రీనివాస్ తెలిపారు. ఈ మేరకు పరీక్ష కేంద్రాలను డీఈఓ ప్రవీణ్కుమార్ తదితరులు పర్యవేక్షించారు. -
పంట కోసి 15 రోజులు..
వరిధాన్యం కొనుగోలు కేంద్రానికి దాదాపు 15 రోజులు అవుతుంది. కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి 20 రోజులు గడుస్తున్నా ఒక్కరోజు మాత్రమే దొడ్డు వడ్లను కొనుగోలు చేసి మధ్యలోనే ఆపేశారు. వడగండ్ల వానలు పడుతుండటంతో చేతికొచ్చిన పంట ఆగమవుతుందని పానం గుబులవుతుంది. ఉదయం, సాయంత్రం వేళల్లో వడ్ల కుప్పలకు టార్పాలిన్ కవర్లను కప్పుతూ నిత్యం ఇబ్బందులు పడుతున్నాం. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి వెంటనే వడ్లను కొనుగోలు చేయాలి. – బోయ పరశురాముడు, రైతు, కొండేరు గ్రామం, ఇటిక్యాల● -
ప్రగతి వైపు పయనించాలి
జిల్లావ్యాప్తంగా ప్రజలను చైతన్యం చేస్తు, యువతను ప్రగతి వైపునకు తీసుకురావాలనే లక్ష్యంతో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. గద్వాలను గంజాయి రహిత జిల్లాగా చేయాలనే సంకల్పంతో ముందుకెళ్తున్నాం. అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో వారం రోజులపాటు వారోత్సవాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా బాల్య వివాహాల వల్లన జరిగే సమస్యలు, మహిళలపై వేధింపులు, దాడులకు విధించే శిక్షలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలను చైతన్యపరుస్తున్నాం. – టి శ్రీనివాసరావు, ఎస్పీ ● -
మళ్లీ మొదటికొచ్చింది
ప్రయాణానికి ప్రతికూలంగా అంతర్రాష్ట్ర రహదారి అయిజ: అంతర్రాష్ట్ర రహదారి కర్నూలు– రాయచూరు రోడ్డుపై అయిజ సమీపంలో పెద్దవాగుపై సుమారు 50 ఏళ్ల క్రితం నిర్మించిన కాజ్వే పూర్తిగా శిథిలమైంది. రక్షణ గోడల రాళ్లు ఊడిపడ్డాయి. శిథిలమైన రోడ్డుపై ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. అయితే శిథిలమైన కాజ్వేను తొలగించి.. అదే ప్రదేశంలో హైలెవల్ బ్రిడ్జి నిర్మించేందుకు గతేడాది రూ.18 కోట్ల అంచనాతో ఆర్అండ్బీ అధికారులు ప్రతిపాదనలు పంపారు. 2024– 25 ఆర్థిక సంవత్సరం ముగియడంతో 2025– 26 ఆర్థిక సంవత్సరానికి కొత్తగా ప్రతిపాదనలు పంపాలని ప్రభుత్వం నుంచి ఆర్అండ్బీ అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో కథ మళ్లీ మొదటికి వచ్చింది. అధికారులు ప్రతిపాదనలు పంపిన అనంతరం ప్రభుత్వం నుంచి అనుమతులు రావడం, వాటికి నిధుల మంజూరు, సకాలంలో విడుదల చేయడం వంటివి చేయాలి. ఈ ఆర్థిక సంవత్సరం సమయం ముగియకముందే ప్రక్రియ మొత్తం పూర్తవ్వాల్సి ఉంటుంది. శిథిలావస్థలో నాలుగు కల్వర్టులు.. మండలంలోని వెంకటాపురం నుంచి అయిజ పట్టణం వరకు గతంలో నిర్మించిన కల్వర్టులు శిథిలమయ్యాయి. బీటీ రోడ్డుపై అనేక చోట్ల మోకాలులోతు గోతులు ఏర్పడ్డాయి. వాటిని తొలగించి నూతనంగా కల్వర్టులు నిర్మించేందుకు గతేడాది రూ.3 కోట్లు నిధులు మంజూరయ్యాయి. టెక్నికల్ డ్రాయింగ్ అప్రూవల్ కాకపోవడంతో పనులు ప్రారంభించలేదు. ఇదిలా ఉంటే ప్రజాప్రతినిధులు రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని చుట్టపు చూపుగా వెళ్లి పరామర్శించడం, మృతిచెందిన వారి కుటుంబ సభ్యులను ఓదార్చడం చేస్తున్నారే గాని సమస్యలను పరిష్కరించడంలో శ్రద్ధ చూపడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్లు వెళ్లలేని దుస్థితి నిధులున్నా ప్రారంభించని కల్వర్టు పనులు ఇప్పటికీ పూర్తికాని డ్రాయింగ్ అప్రూవల్ కొత్తగా ప్రతిపాదనలు పంపాలంటున్న ప్రభుత్వం -
కాంగ్రెస్ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలి
గద్వాల: అబద్ధపు హామీలతో నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని, ఈ క్రమంలోనే బీజేపీ ఆధ్వర్యంలో ఈ నెల 10న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించే జనాగ్రహ సభకు ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చి జయప్రదం చేయాలని మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. శనివారం ఆమె స్థానిక బంగ్లాలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికల వేళ ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. అధికారం కోసం అబద్ధపు హామీలిచ్చి అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు జనాగ్రహసభ నిర్వహిస్తున్నామని, ప్రజలు, కార్యకర్తలు స్వచ్ఛందంగా పాల్గొని ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలని కోరారు. పదేళ్లు బీఆర్ఎస్ పాలించి రాష్ట్రాన్ని అప్పులకుప్పుగా మార్చిందని విమర్శించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్లను నమ్మి మోసపోయిన ప్రజలు ఇప్పుడు బీజేపీ వైపు చూస్తున్నారన్నారు. గతంలో వాజ్పేయి ఆధ్వర్యంలో ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లు అడ్డుకుంది కాంగ్రెస్ పార్టీ అని, అనంతరం మోదీ ఆధ్వర్యంలో ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకుంది కూడా అదే పార్టీ అన్నారు. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పశ్చిమబెంగాల్లో బీజేపీ జెండా ఎగురవేస్తుందన్నారు. దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, కేరళలోనూ పార్టీ బలోపేతం అవుతుందన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తేనే తెలంగాణ అభివృద్ధి చెందుతుందన్నారు. దేశ ప్రధానిగా మూడోసారి ఎన్నికై న నరెంద్రమోదీ తొలిసారిగా ఈ నెల 10వ తేదీన రాష్ట్రానికి వస్తున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు వాసుదేవరావు, రామాంజనేయులు, రాంచంద్రారెడ్డి, వెంకట్రాములు, రవికుమార్, శివారెడ్డి, రాజగోపాల్, దేవదాస్ తదితరులు పాల్గొన్నారు. -
అంజన్న నామస్మరణతో మారుమోగిన బీచుపల్లి
ఎర్రవల్లి: బీచుపల్లి పుణ్యక్షేత్రం ఆంజనేయస్వామి నామస్మరణతో మారుమోగింది. ఉత్సవాలలో భాగంగా నాలుగో రోజైన శనివారం ఆలయ ప్రధాన అర్చకులు ఆంజనేయస్వామికి పంచామృత అభిషేకం, ఆకుపూజ, మహా మంగళహారతి, చౌకిసేవ, బలిహరణం వంటి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నెల రోజుల పాటు జరిగే జాతర ఉత్సవాలలో భాగంగా మొదటి శనివారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో బీచుపల్లికి తరలివచ్చారు. పవిత్ర కృష్ణానదిలో పుణ్య స్నానాలను ఆచరించి స్వామి వారిని దర్శించుకున్నారు. దాసంగాలతో మట్టి కుండలలో ప్రత్యేక నైవేద్యం వండి ఆంజనేయస్వామికి సమర్పించారు. అనంతరం ద్వజస్తంభం ముందు కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. భక్తుల కొనుగోళ్లతో ఆలయాల పరిసరాల్లో వెలసిన వివిధ దుకాణాలు రద్దీగా మా రాయి. కార్యక్రమంలో ఈఓ పురేందర్ కుమార్, అర్చకులు, భక్తులు, తదితరులు పాల్గొన్నారు. -
వేసవి శిబిరాలను సద్వినియోగం చేసుకోండి
గద్వాల: విద్యార్థులు చదువుతోపాటు వివిధ రకాల కళల్లోనూ రాణించాలని, ఇందుకోసం బాలభవన్లో వివిధ అంశాలపై ఇచ్చే వేసవి శిక్షణ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ రిజ్వాన్బాషా షేక్ అన్నారు. శనివారం గద్వాల బాల భవన్లో ఏర్పాటు చేసిన వేసవి శిక్షణ శిబిరాన్ని ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా స్వాతంత్య్ర సమరయోధులు, మాజీ ఎమ్మెల్యే పాగ పుల్లారెడ్డి 107వ జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ వేసవిలో పిల్లలు సెల్ఫోన్లు, టీవీలు చూస్తూ సమయాన్ని వృథా చేయకుండా బాలభవన్లో నేర్పించే శాసీ్త్రయ, జానపద నృత్యం, చిత్రలేఖనం, సంగీతం తదితర అంశాలపై శిక్షణ పొందితే గొప్ప కళాకారులుగా రాణించే అవకాశం ఉందన్నారు. ఒకే అంశంలో కాకుండా విభిన్న రంగాల్లో శిక్షణ పొంది బహుముఖ ప్రజ్ఞశాలురుగా పేరు తెచ్చుకోవాలన్నారు. విద్యార్థులు తాము నేర్చుకునే నృత్యం, సంగీతం, వేదికలపై స్టేజీఫియర్ లేకుండా ధైర్యంగా ప్రదర్శించాలన్నారు. ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక 99రోజుల కార్యక్రమంలో భాగంగా త్వరలో విద్యా వారోత్సవాలను నిర్వహించడం జరుగుతుందన్నారు. ఒకరోజు బాలభవన్లో ప్రత్యేకంగా సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించేందుకు కలెక్టర్ బాలభవన్ విద్యార్థులతో నేర్చుకునే వివిధ అంశాల గురించి వారి భవిష్యత్ లక్ష్యాల గురించి మాట్లాడారు. అంతకు ముందు బాలభవన్ సూపరింటెండెంట్ విజయలక్ష్మి పూర్వ విద్యార్థులు రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో చూపిన ప్రతిభ సాధించిన అవార్డులు అక్కడ ఇస్తున్న శిక్షణ గురించి క్షుణ్ణంగా వివరించారు. కార్యక్రమంలో డీఈఓ విజయలక్ష్మి, డాక్టర్ అనంతలక్ష్మి, విద్యాశాఖ అధికారులు శ్రీనివాసులు, మైఖేల్, సత్యం, శంకర్ తదితరులు పాల్గొన్నారు. -
అడవి ‘బయటికి’ బిడ్డలు
●జీవనోపాధి కావాలి.. ఏళ్లుగా అడవిని నమ్ముకుని బతుకుతున్నాం. ఇప్పుడు ఖాళీ చేయాలని అంటున్నారు. ప్రభుత్వం తరపున పరిహారం ఇస్తామని చెబుతున్నారు. అయితే అది ఎప్పుడు జరుగుతుందన్నది చెప్పడం లేదు. ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయిలో పరిహారం అందించి రీలొకేషన్ చేపట్టాలి. పునరావాసంతోపాటు జీవనోపాధి కల్పించాలి. – పోషప్ప, కుడిచింతల్ బైల్, అమ్రాబాద్ మండలం పరిహారం ఇస్తేనే వెళ్తాం.. అడవి నుంచి బయటకు వెళ్తే పరిహారం ఇస్తామని, జీవనోపాధి కల్పిస్తామని చెబుతున్నారు. పిల్లలకు చదువు, వైద్యం, కుటుంబాలకు ఆదాయంతో అభివృద్ధి చెందుతామని భావిస్తున్నాం. పరిహారం త్వరగా ఇచ్చిన తర్వాతే మమ్మల్ని బయటకు తరలించాలి. – మండ్ల అంజయ్య,తాటిగుండాలపెంట సాక్షి, నాగర్కర్నూల్: నల్లమల అటవీ ప్రాంతంలోని అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ కోర్ ఏరియా పరిధిలో నివశిస్తున్న చెంచులు, గిరిజనులను అడవి నుంచి బయటకు తరలించేందుకు వేగంగా అడుగులు పడుతున్నాయి. మొదటి విడతలో కొల్లంపెంట, తాటిగుండాల చెంచు పెంటల్లోని స్థానికులను అడవి బయటకు తరలించి పునరావాసం కల్పించాలని అధికారులు నిర్ణయించారు. రెండో విడతలో సార్లపల్లి, కుడిచింతల్బైల్, వటువర్లపల్లి గ్రామాల ప్రజల రీలొకేషన్ ప్రక్రియ చేపట్టనున్నారు. ఇందుకు సంబంధించి ఆయా గ్రామాల ప్రజల నుంచి కుటుంబాల వారీగా ఎంవోయూ ఒప్పందాలను అటవీ అధికారులు పూర్తిచేస్తున్నారు. సంఘర్షణ నిర్మూలన కోసం.. అటవీ ప్రాంతంలోని పులులు, వన్యప్రాణులతో అక్కడే నివశిస్తున్న మనుషులకు మధ్య ఘర్షణ, దాడులను నివారించేందుకు, వన్యప్రాణుల సంరక్షణ కోసం నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ (ఎన్టీసీఏ) పునరావాస ప్యాకేజీని అందిస్తోంది. ఇందులో భాగంగా నిర్వాసిత కుటుంబానికి రూ.15 లక్షల ఆర్థిక సహాయం లేదా 5 ఎకరాల భూమిని అందిస్తుంది. ఈ రెండింటిలో ఏదైనా ప్యాకేజీని ఎంచుకుని పరిహారం పొందవచ్చు. పునరావాస ప్యాకేజీ కోసం ఒప్పుకొంటున్న కుటుంబాలతో అటవీ అధికారులు ఎంవోయూ ఒప్పందాలను చేయిస్తున్నారు. ఇప్పటి వరకు సార్లపల్లి, కుడిచింతల్బైల్, కొల్లంపెంట, తాటిగుండాల గ్రామాల్లో మొత్తం 96 వరకు చెంచు కుటుంబాలు పునరావాస ప్రక్రియను అనుకూలంగా ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఆయా గ్రామాల్లోనూ కొంతమంది చెంచులు ఈ రీలొకేషన్ ప్రక్రియను వ్యతిరేకిస్తున్నారు. అయితే అధికారులు మాత్రం స్వచ్ఛందంగా ముందుకు వస్తేనే ప్రక్రియ చేపడతామని చెబుతున్నారు. స్పష్టత కరువు నల్లమల నుంచి చెంచులు, స్థానికుల తరలింపు ప్రక్రియలో పునరావాస ప్రక్రియ కీలకంగా మారనుంది. అడవి నుంచి బయటకు వెళ్లేందుకు అంగీకరించిన వా రికి పూర్తిస్థాయిలో పునరావాసం కల్పించాల్సి ఉంది. ఇందుకోసం జిల్లాలోని పెద్దకొత్తపల్లి మండలం బా చారంలోని ఫారెస్ట్ భూముల్లో పునరావాస కాలనీల ను ఏర్పాటు చేయనున్నారు. అయితే ఈ ప్రక్రియ ఎంతకాలంలో చేపడతారన్న దానిపై స్పష్టత కరువైంది. పరిహారం అందితేనే రీలొకేషన్కు.. నిర్వాసితులకు ఎన్టీసీఏ తరపున పూర్తిస్థాయిలో ప్యాకేజీతోపాటు పునరావాసం కల్పించిన తర్వాతే తాము అడవిని వీడుతామని స్థానికులు స్పష్టం చేస్తున్నారు. ఏళ్లుగా అడవినే నమ్ముకున్న తాము బయటకు వెళ్లి బతికేందుకు అవసరమైన జీవనోపాధి కల్పించాలని, ఇందుకు భరోసా కల్పించాలని కోరుతున్నారు. రీలొకేషన్ ప్రక్రియలో భాగంగా చేపట్టాల్సిన పునరావాస ప్రక్రియ పూర్తయిన తర్వాతే తాము అడవి నుంచి బయటకు వెళ్తామని తేల్చి చెబుతున్నారు. నల్లమలలో చెంచుపెంటల తరలింపు ప్రక్రియ వేగవంతం మొదటి విడతలో కొల్లంపెంట, తాటిగుండాల చెంచుపెంటలు మలివిడతలో సార్లపల్లి, కుడిచింతల్బైల్, వటవర్లపల్లి గ్రామాల రీలొకేషన్ స్వచ్ఛందంగా ముందుకొస్తున్న వారితో కొనసాగుతున్న ఒప్పందాలు పునరావాస ప్రక్రియే కీలకం.. పూర్తిస్థాయి పరిహారం అందించాలంటున్న స్థానికులు బలవంతం లేదు.. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ కోర్ ఏరియా పరిధిలో ఉన్న స్థానికులను అడవి నుంచి మైదాన ప్రాంతాలకు రీలొకేషన్ చేపట్టే ప్రక్రియ కొనసాగుతోంది. స్వచ్ఛందంగా ముందుకు వస్తున్న వారితోనే ఎంవోయూ చేసుకుంటున్నాం. ఎన్టీసీఏ తరపున అందించే ప్యాకేజీ వివరాలను వారికి వివరిస్తున్నాం. రీలొకేషన్ విషయంలో ఎలాంటి బలవంతం లేదు. పూర్తిస్థాయిలో పరిహారం అందించాక పునరావాస ప్రక్రియ చేపడతాం. – రేవంత్చంద్ర, ఐఎఫ్ఎస్ అధికారి, డీఎఫ్ఓ, నాగర్కర్నూల్ -
ప్రతిపాదనలు బుట్టదాఖలు..
అయిజ సమీపంలోని పెద్దవాగుపై హైలెవల్ బ్రిడ్జి నిర్మించేందుకు గతేడాది రూ.18 కోట్ల అంచనాతో ఆర్అండ్బీ ఈఈ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. కానీ, ఇంత వరకు నిధులు మంజూరు కాలేదు. అదేవిధంగా నాలుగు కల్వర్టులు పునర్ నిర్మించేందుకు 2024లో రూ.3 కోట్లు మంజూరైనా పనులు ప్రారంభించలేదు. – నజీర్, అయిజ మరమ్మతు చేపట్టాలి.. క్షతగాత్రులకు అత్యవసర సేవలందించేందుకు ఎక్కువగా అంబులెన్స్లు గద్వాల జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రితోపాటు కర్నూలుకు తీసుకెళ్లాల్సి వస్తుంది. కానీ, ఇక్కడి కాజ్వే పూర్తిగా దెబ్బతినడంతో రోడ్డుపై వేగంగా వెళ్లలేని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. సకాలంలో ఆస్పత్రికి చేరుకోలేక ప్రాణాల మీదకు వస్తుంది. హైలెవల్ బ్రిడ్జి నిర్మించి, కల్వర్టులలకు మరమ్మతు చేస్తే బాగుంటుంది. – తిరుమలేష్, 108 సిబ్బంది ప్రతిపాదనలు పంపించాం.. అయిజ పెద్దవాగుపై శిథిలమైన కాజ్వేను తొలగించి హైలెవల్ బ్రిడ్జి నిర్మించేందుకు గతేడాది రూ.18 కోట్లతో ప్రతిపాదనలు పంపాం. ఆర్థిక సంవత్సరం ముగియడంతో మళ్లీ ఈసారి కొత్తగా పంపించాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి. ఈ ప్రక్రియ పూర్తయి నిధులు విడుదలైతేనే హైలెవల్ బ్రిడ్జి నిర్మాణం పనులు ప్రారంభిస్తాం. అలాగే నాలుగు కల్వర్టులు నిర్మించేందుకు 2024లో రూ.3 కోట్లు మంజూరయ్యాయి. టెక్నికల్ డ్రాయింగ్ అప్రూవల్కు పంపాం. – అల్తాఫ్, ఆర్అండ్బీ ఏఈ ● -
రాయితీ.. అనాసక్తి!
–8లో uగద్వాలన్యూటౌన్: జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో ముందస్తు ఆస్తిపన్ను చెల్లింపుదారులకు కల్పించిన 5శాతం రాయితీకి ఆదరణ కరువైంది. ఇందుకు నెలరోజుల సమయం ఉన్నా.. చాలా తక్కువ మంది మాత్రమే ముందస్తుగా ఆస్తిపన్ను చెల్లించేందుకు ఆసక్తి చూపారు. దీంతో ప్రభుత్వ లక్ష్యం నెరవేరలేదు. 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఏప్రిల్లో ముందస్తుగా ఆస్తిపన్ను చెల్లించిన వారికి 5శాతం రాయితీ ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అధికారులు సైతం దీనిపై విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. అయినప్పటికీ ఆశించిన స్పందన రాలేదు. నాలుగు మున్సిపాలిటీల్లో ఓ మోస్తారుగా మాత్రమే ఆస్తిపన్ను చెల్లించారు. ప్రచారం చేసినా ఫలితం శూన్యం.. జిల్లాలోని గద్వాల, అయిజ, అలంపూర్, వడ్డేపల్లి మున్సిపాలిటీల పరిధిలో ఉన్న నివాసగృహాలు, దుకాణాలు, వాణిజ్య సముదాయాలు తదితర వాటి నుంచి ప్రతి ఏడాది ఆస్తిపన్ను వసూలు చేస్తారు. అయితే ఆర్థిక సంవత్సరం చివరి రెండు నెలలపాటు అధికారులు, రెవెన్యూ సిబ్బంది, బిల్ కలెక్టర్లు బృందాలుగా ఏర్పడి పన్ను వసూలు చేపట్టారు. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలు గత ఆర్థిక సంవత్సరం (2025–26) పన్నుల వసూలులో లక్ష్యాన్ని చేరుకోలేదు. 60 నుంచి 70 శాతానికి చేరుకోవడానికి సైతం తడబడ్డాయి. తాజాగా మార్చిలో ఆర్థిక సంవత్సరం ముగిసినప్పటికీ.. ఏప్రిల్లో ముందస్తుగా పన్ను చెల్లించే వారికి రాయితీ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏడాది మొత్తం చెల్లించాల్సిన పన్నులో 5శాతం మినహాయిస్తామని ప్రకటించింది. ఇందుకు పట్టణాల్లో ప్రచారం కోసం ప్రధాన కూడళ్లలో ఫ్లెక్సీలు ఏర్పాటుచేశారు. బిల్ కలెక్టర్లు కాలనీల వారీగా అవగాహన కల్పించారు. అయినప్పటికీ ప్రజల నుంచి మాత్రం స్పందన అంతగా రాలేదని చెప్పవచ్చు. మున్సిపాలిటీల్లో ముందస్తుఆస్తిపన్ను వసూలు అంతంతే 5శాతం రాయితీతో నెరవేరని ప్రభుత్వ లక్ష్యం జిల్లాలోని నాలుగు పురపాలికల్లోఓ మోస్తారుగా మాత్రమే చెల్లింపు ఫలించని అధికారుల ప్రచారం -
‘మొక్కజొన్న తరలింపులో నిర్లక్ష్యం’
అలంపూర్: రైతుల నుంచి సేకరించిన మొక్కజొన్న ధాన్యం తరలించడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఎ.వెంకటస్వామి ఆరోపించారు. శుక్రవారం అలంపూర్ చౌరస్తాలోని వ్యవసాయ మార్కెట్యార్డులో ఏర్పాటుచేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ.. జిల్లావ్యాప్తంగా మార్క్ఫెడ్ కొనుగోలు చేస్తున్న మొక్కజొన్న ధాన్యాన్ని సకాలంలో తరలించకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోందన్నారు. అలంపూర్ మార్కెట్యార్డు కొనుగోలు కేంద్రంలోనే దాదాపు 40వేల బస్తాలు నిల్వ ఉన్నాయని తెలిపారు. అదే విధంగా ధాన్యం కాంటా చేసిన తర్వాత రైతులకు కనీసం రశీదు కూడా ఇవ్వడం లేదన్నారు. దీంతో రైతులు రోజుల తరబడి కేంద్రాల్లోనే ఉంటూ ఇబ్బందులు పడుతున్నారన్నారు. రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని వెంటనే గోదాములకు తరలించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు జీకే ఈదన్న, వెంకటేశ్వర్లు, రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు. మదనగోపాలుడి రథోత్సవం కొల్లాపూర్: పెంట్లవెల్లి మండలం జటప్రోల్లో శ్రీరుక్మిణీ సత్యభామ సమేత మదనగోపాలస్వామి రథోత్సవం శుక్రవారం అంగరంగ వైభవంగా సాగింది. స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన రథోత్సవానికి సమీప గ్రామాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. పచ్చటి తోరణాలు, వివిధ రకాల పూలతో అలంకరించిన రథంపై స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను కొలువుదీర్చి.. వేదమంత్రోచ్ఛారణ, భాజాభజంత్రీలు, భక్తుల గోవిందనామస్మరణ నడుమ ఊరేగించారు. ఈ సందర్భంగా భక్తులు భక్తిపారవశ్యంతో ఉప్పొంగారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త సురభి రాజవెంకటలక్ష్మాదిత్యారావు, సర్పంచ్ పద్మమ్మ, గోవిందుగౌడ్, భీంరెడ్డి, ఉపసర్పంచ్ ప్రమోద్, నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పీహెచ్సీలకు పైసల్లేవ్..!
‘ఇందిరమ్మ కలలను సాకారం చేద్దాం’ పాలమూరు: ఉమ్మడి జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నిర్వహణ భారంగా మారుతోంది. నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా ప్రతి పీహెచ్సీకి హెచ్డీఎఫ్ (హాస్పిటల్ డెవలప్మెంట్ ఫండ్) నిధులు రాక వసతులు సమకూర్చుకోలేని పరిస్థితి దాపురించింది. మరోవైపు పీహెచ్సీ అభివృద్ధి కమిటీకి ఎంపీపీలు అధ్యక్షులుగా ఉండి విడుదలయ్యే నిధులపై పర్యవేక్షిస్తుండేవారు. వారి పదవీకాలం ముగిసి రెండేళ్లు గడుస్తుండటంతో వీటి గురించి పట్టించుకునే నాథుడే కరువయ్యారు. దీంతో క్షేత్రస్థాయిలో రోగులకు నాణ్యమైన వైద్యం అందడానికి అడ్డంకులు ఏర్పడుతున్నాయి. సరైన వసతుల కల్పన లేకపోవడంతో చాలా వరకు వైద్యాధికారులు పీహెచ్సీల వైపు చూడటం లేదు. చివరగా 2023 మార్చిలో.. మహబూబ్నగర్ జిల్లాలోని 17 పీహెచ్సీలు, ఆరు యూపీహెచ్సీలకు, మూడు సీహెచ్సీలకు గత మూడేళ్లుగా నిధుల కేటాయింపు లేవు. చివరగా 2023 మార్చిలో రూ.59.46 లక్షల నిధులు విడుదల కాగా.. దీంట్లో రూ.37.14 లక్షలు ఖర్చు చేశారు. తాజాగా ఈ ఏడాది మార్చిలో కాయకల్ప కింద కేవలం 9 పీహెచ్సీలకు కలిపి రూ.6 లక్షలు విడుదల చేయగా దీంట్లో ఒక్కో పీహెచ్సీకి రూ.50 వేల చొప్పున.. ఒక్క రాజాపూర్ పీహెచ్సీకి మాత్రం రూ.2 లక్షలు విడుదల చేశారు. ● గద్వాల జిల్లాలో గత మూడేళ్లు నిధులు లేకపోవడంతో పీహెచ్సీల నిర్వహణ కష్టసాధ్యంగా మారింది. ఈ ఏడాది మార్చిలో కాయకల్ప కింద ఆరు పీహెచ్సీకు రూ.6.35 లక్షలు విడుదలైన నిధులు తప్పా ఇతర బడ్జెట్ రాలేదు. ● వనపర్తి జిల్లాలో కేవలం హెచ్డీఎస్ కింద 2023– 24 ఏడాదిలో మొత్తం 13 పీహెచ్సీలలో ఒక్కోదానికి రూ.1.39 లక్షలు విడుదల చేయగా.. 2024– 25లో ఒక్కో పీహెచ్సీకి రూ.61,579 విడుదల చేయడం జరిగింది. ఆ తర్వాత ఎలాంటి నిధుల కేటాయింపులకు నోచుకోలేదు. ● నారాయణపేట జిల్లాలో 11 పీహెచ్సీలు ఉండగా 2023 అక్టోబర్ నుంచి హెచ్డీఎస్ నుంచి కానీ కాయకల్ప విభాగం ఎలాంటి నిధులు విడుదల చేయలేదు. ఏటా ఆస్పత్రి అభివృద్ధి నిధి.. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 69ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. నేషనల్ హెల్త్ హెల్త్ మిషన్ కింద ప్రతి ఏటా ఆస్పత్రి అభివృద్ధి నిధి కింద ఒక్కో పీహెచ్సీకి రూ.1.50 లక్షల చొప్పున నిధులు మంజూరయ్యేవి. వీటి ద్వారా ఆయా పీహెచ్సీల్లో అభివృద్ధి కమిటీ తీర్మానం మేరకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించేవారు. అయితే గత మూడేళ్లుగా నిధులు మంజూరు ఊసేలేకపోవడంతో ఎక్కడి సమస్యలు అక్కడే ఉంటున్నాయి. రోజురోజుకూ పెరుగుతున్న వైద్య అవసరాలు, రోగుల తాకిడికి అనుగుణంగా కనీస సౌకర్యాలు లేక పీహెచ్సీకి వచ్చిన రోగులతోపాటు సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. ఏ వస్తువులు మరమ్మతుకు గురైనా వాటిని బాగు చేయించే పరిస్థితి లేక సిబ్బంది సతమతమవుతున్నారు. అవసరాలు తీరేదెలా? బడ్జెట్ కేటాయింపు లేకపోవడంతో పీహెచ్సీల్లో అవసరాలు తీర్చడం కష్టంగా మారింది. ప్రధానంగా పీహెచ్సీ భవనంలో చిన్నపాటి మరమ్మతు, పరిసరాలు శుభ్రం చేయడానికి వర్కర్లకు కూలీ, చిన్నపాటి పరికరాలు, బ్లడ్గ్రూప్ టెస్ట్ కిట్ల కొనుగోలు, విద్యుద్దీపాలు, టాయిలెట్స్ నిర్వహణ, రిజిస్టర్లు కొనుగోలు ఇలా ప్రతీది సమస్యగా మారింది. ప్రధానంగా పీహెచ్సీ పరిధిలోని గర్భిణులతోపాటు దీర్ఘకాలిక రోగులు ఇతర వివరాలను ఆన్లైన్లో నమో దు చేయాలంటే తప్పక ఇంటర్నెట్ సౌకర్యం ఉండాలి. దీనికి ఏటా రూ.6వేల వరకు ఖర్చు అవుతుంది. వీటికి కూడా నిధులు లేకపోవడంతో పలుచోట్ల వైద్యాధికారులే సొంత డబ్బులు వెచ్చిస్తున్నారు. గట్టు ప్రాథమిక ఆరోగ్యకేంద్రంరమణీయం.. అంజన్న రథోత్సవం బీచుపల్లి క్షేత్రంలో అభయాంజనేయస్వామి రథోత్సవం శుక్రవారం అంగరంగ వైభవంగా జరిగింది. స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన అంజన్న రథోత్సవానికి వేలాది భక్తులు తరలివచ్చి.. భక్తిపారవశ్యంతో ఉప్పొంగారు. – ఎర్రవల్లి – వివరాలు 8లో..ఊట్కూర్: ఇందిరమ్మ కలలను సాకారం చేసేందుకు కృషి చేస్తానని యువజన క్రీడల మత్స్యశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. శుక్రవారం మండలంలోని ముగ్దుంపూర్లో ఇందిరమ్మ గృహ ప్రవేశ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు మోనప్ప దంపతులను సన్మానించారు. అనంతరం మాట్లాడుతూ.. సొంతిల్లు లేని నిరుపేదలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తుందన్నారు. ప్రభుత్వం అందించే రూ.5 లక్షలతో ఎంతోమంది నిరుపేదలు ఇంటి నిర్మాణం పూర్తి చేసుకొని గృహప్రవేశాలు చేపట్టడం సంతోషకరంగా ఉందన్నారు. గత ప్రభుత్వం పదేళ్ల కాలంలో ఏ ఒక్కరికీ కూడా ఇళ్లను మంజూరు చేసిన పాపాన పోలేదని దుయ్యబట్టారు. గ్రామాల్లో ఇల్లు లేని వాళ్లే ఉందకూడదని, విడతల వారీగా అర్హులందరికీ ఇళ్లు మంజూరు చేద్దామని భరోసానిచ్చారు. కార్యక్రమంలో సర్పంచ్ తిరుమలేష్, యజ్ఞేశ్వర్రెడ్డి, ఎల్కోటి జనార్దన్రెడ్డి, సూర్యప్రకాష్రెడ్డి, కోరం మహేష్రెడ్డి, రవికుమార్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి జిల్లాలోని 69 పీహెచ్సీలకు అందని నిధులు గత మూడేళ్లుగా విడుదల కానిహెచ్డీఎస్, కాయకల్ప బడ్జెట్ నిర్వహణకు సైతం అవస్థలు.. పేరుకుపోతున్న సమస్యలు జిల్లాల నుంచి ప్రతిపాదనలు వెళ్తున్నాకనికరించని ప్రభుత్వం నెట్ సదుపాయం కోసం సొంతంగా చెల్లిస్తున్న వైద్యాధికారులు -
ఇదీ పరిస్థితి..
గద్వాలలో 12,203 అసెస్మెంట్లతో 5శాతం రాయితీకి అర్హులుగా ఉన్నారు. వీరిలో కేవలం 2,660 మంది పన్ను చెల్లించి రాయితీ పొందారు. అయిజలో 8,223 అసెస్మెంట్లకు గాను 955 మంది రాయితీపై పన్ను చెల్లించారు. అదే విధంగా అలంపూర్లో 3,593 మందికిగాను 618 మంది, వడ్డేపల్లి మున్సిపాలిటీలో 4,132 మందికి గాను కేవలం 845 మంది మాత్రమే ఆస్తిపన్ను చెల్లించి రాయితీ అవకాశాన్ని పొందారు. విస్తృత ప్రచారం చేశాం.. ఆర్థిక సంవత్సరం (2026–27)కు సంబంధించి ముందస్తుగా ఆస్తిపన్ను చెల్లించిన వారికి 5శాతం రాయితీ వర్తిస్తుంది.. ఏడాదికి చెల్లించే పన్నులో రాయితీని మినహాయించి తీసుకున్నాం. ఇందుకోసం నాలుగు మున్సిపాలీటీల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించాం. ఫ్లెక్సీలు సైతం ఏర్పాటుచేశాం. బిల్ కలెక్టర్లు వార్డుల్లో ప్రజలకు అవగాహన కల్పించారు. – నర్సింగ్రావు, అదనపు కలెక్టర్ ● -
3 నెలలకోసారి ఉద్యోగ మేళాలు
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: ప్రతి ఉమ్మడి జిల్లాలో మూడు నెలలకోసారి ఉద్యోగ మేళా నిర్వహిస్తామని రాష్ట్ర పశు సంవర్ధక, క్రీడలు, యువజన శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. ‘ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక’లో భాగంగా శుక్రవారం నగరంలోని శిల్పారామంలో మెగా జాబ్మేళాను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. విద్యారంగం పటిష్టత, యువతకు ఉద్యోగావకాశాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందన్నారు. గురుకులాలు, వసతి గృహాల్లో మెరుగైన సౌకర్యాల కోసం మెస్, కాస్మొటిక్ చార్జీలను పెంచి విద్యార్థులకు నాణ్యమైన విద్యనందిస్తున్నామన్నారు. గత పదేళ్లుగా నిలిచిపోయిన ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతులను పునఃప్రారంభించి సుమారు 25 వేల మందికి ప్రయోజనం కల్పించామన్నారు. పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరతను అధిగమించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. యువతకు కేవలం ప్రభుత్వ ఉద్యోగాలకే పరిమితం కాకుండా ప్రైవేట్ రంగంలోనూ విస్తృత అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో రాష్ట్రవ్యాప్తంగా జాబ్మేళాలు నిర్వహిస్తున్నామన్నారు. ఇప్పటికే 1.30 కోట్ల మంది యువత వివిధ ఉద్యోగాల కోసం ఆన్లైన్లో నమోదు చేసుకున్నారని, వారికి అవకాశాలు కల్పించేందుకు 2,200 ప్రైవేట్ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకున్నామన్నారు. ముఖ్యంగా సెట్విన్, టాస్క్ ద్వారా నైపుణ్య శిక్షణ ఇప్పిస్తూ, యువతను ఉద్యోగ యోగ్యులుగా తీర్చిదిద్దుతున్నామన్నారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుంచి 24,680 మంది అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా ఈ జాబ్మేళాలో నమోదు చేసుకున్నారని చెప్పారు. ● ఉద్యోగార్థులకు డిగ్రీ సర్టిఫికెట్లు మాత్రమే కాకుండా ప్రొఫెషనల్ స్కిల్స్ కూడా అవసరమని మహబూబ్నగర్ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి అన్నారు. ముఖ్యంగా టెక్నాలజీ పరిజ్ఞానం, ప్రాక్టికల్ అనుభవం ఉద్యోగ సాధనలో ఎంతో కీలకమని పేర్కొన్నారు. జిల్లాలో మహిళలకు ప్రత్యేక నైపుణ్య శిక్షణ ఇప్పిస్తున్నామని, కంప్యూటర్ కోడింగ్, ఫ్యాషన్ డిజైన్, బ్యూటీషియన్ కోర్సులను అందుబాటులోకి తెచ్చామన్నారు. ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ ప్రాజెక్టు ద్వారా భవిష్యత్లో పెద్దఎత్తున ఉద్యోగాలు లభిస్తాయన్నారు. ● 99 రోజుల కార్యాచరణలో భాగంగా పది థీమ్లను నిర్ణయించి కార్యక్రమాలు చేపడుతున్నామని దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డి అన్నారు. యూత్ సర్వీసెస్ థీమ్ కింద ఈ జాబ్మేళా నిర్వహించడం గొప్ప నిర్ణయమన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే 70 వేల ఉద్యోగాలు కల్పించామని, ఈ మేళాలో 105 కంపెనీలు పాల్గొనడమే గాక 3,500 ఉద్యోగాలు అందుబాటులో ఉంచాయన్నారు. ఎంపికై న అభ్యర్థులకు ఈనెల 23న ఆయా జిల్లాల కలెక్టర్ల ద్వారా నియామక పత్రాలు అందజేస్తారన్నారు. నియామక పత్రాల అందజేత ఇంటర్వ్యూలలో ఎంపికై న సుమారు పది మంది అభ్యర్థులకు మంత్రి వాకిటి శ్రీహరి నియామక పత్రాలు అందజేశారు. కాగా, వీరిలో దేవరకద్రకు చెందిన గాయత్రి, జడ్చర్లకు చెందిన చంద్రకాంత్కు ఏడాదికి రూ.3 లక్షల చొప్పున, నారాయణపేట వాసి విష్ణుమూర్తికి రూ.2.05 లక్షల చొప్పున ప్యాకేజీ లభించనుంది. కార్యక్రమంలో ఎమ్మెల్సీ, శాసన మండలిలో చీఫ్ విప్ పట్నం మహేందర్రెడ్డి, రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లాకొత్వాల్, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి, వైస్ చైర్మన్, ఎండీ ఎ.సోని బాలాదేవి, టాస్క్ సీఈఓ నితిన్కుమార్రెడ్డి, కలెక్టర్ కుష్బూ గుప్తా, అదనపు కలెక్టర్లు హరిప్రియ, మధుసూదన్నాయక్, పరిశ్రమల శాఖ జీఎం యాదయ్య, డీవైఎస్ఓ రాజశేఖర్రెడ్డి, మూడా చైర్మన్ కె.లక్ష్మణ్యాదవ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ బెక్కరి అనిత, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర పశుసంవర్ధక, క్రీడలు,యువజన శాఖ మంత్రి వాకిటి శ్రీహరి మెగా జాబ్మేళాలో పాల్గొన్న 105 కంపెనీలు ఉమ్మడి జిల్లా నుంచి 3,450 మంది నిరుద్యోగుల హాజరు -
పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
● ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’లోఅందరూ భాగస్వాములు కావాలి ● కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ గద్వాల: ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా శనివారం నియోజకవర్గ స్థాయిలో సమావేశాలు నిర్వహించి.. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆదేశించారు. శుక్రవారం జిల్లా యంత్రాంగంతో గూగుల్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గ స్థాయిలో నిర్వహించే కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అన్నిశాఖల అధికారులు, స్వయం సహాయక మహిళా సంఘాల సభ్యులు, పౌరులు పెద్ద సంఖ్యలో భాగస్వాములు కావాలని కోరారు. ప్రభుత్వం అమలుచేస్తున్న గృహజ్యోతి, మహాలక్ష్మి, రైతుభరోసా, రైతుబీమా, ఇందిరమ్మ ఇళ్లు తదితర పథకాలకు సంబంధించిన లబ్ధిదారుల వివరాలను తెలియజేయడంతో పాటు వచ్చే విద్యాసంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో అల్పాహారం, ఇంటర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజనం, ఇందిరమ్మ జీవిత బీమా పథకాలపై అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. కాగా, జిల్లాలో నకిలీ విత్తనాలు సరఫరా కాకుండా, ఇతర రాష్ట్రాల నుంచి వరిధాన్యం కొనుగోలు కేంద్రాలకు రాకుండా చెక్పోస్టుల వద్ద కట్టుదిట్టమైన తనిఖీలు నిర్వహించాలని తెలిపారు. వ్యవసాయశాఖ అధికారులు ఫర్టిలైజర్ దుకాణాలను తరచుగా తనిఖీలు చేపట్టాలన్నారు. నానో యూరియాపై రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. జిల్లాలో ఎక్కడా తాగునీటి కొరత లేకుండా చూడాలన్నారు. ఈ నెల 4 నుంచి నిర్వహించే రైతువారం కార్యక్రమాలను షెడ్యూల్ ప్రకారం నిర్వహించి విజయవంతం చేయాలని సూచించారు. కార్మికుల కృషితోనే అభివృద్ధి.. సంఘటిత, అసంఘటిత కార్మికుల కృషితోనే ఏరంగంలోనైనా అభివృద్ధి సాధ్యమవుతుందని కలెక్టర్ రిజ్వాన్బాషా షేక్ అన్నారు. కలెక్టరేట్లో కార్మిక ఉపాధి, శిక్షణ, కర్మాగారాలశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రపంచ కార్మిక దినోత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడారు. సమాజ అభివృద్ధికి కార్మికు లు ఎంతో బాధ్యతతో పనిచేస్తుంటారన్నారు. కార్మికశాఖ ఆధ్వర్యంలో అందించే లేబర్ కార్డులను ప్రతిఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వేగవంతంగా ఇళ్ల నిర్మాణాలు.. ఇందిరమ్మ పథకం కింద మంజూరైన ఇళ్లను లబ్ధిదారులు వేగవంతంగా పూర్తిచేసుకునేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ రిజ్వాన్బాషా షేక్ ఆదేశించారు. కలెక్టరేట్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల పురోగతిపై సంబంధిత అఽధికారులతో ఆయన సమీక్షించారు. ఇళ్ల నిర్మాణంలో జిల్లా రాష్ట్రంలో చివరిస్థానంలో ఉండటంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. పంచాయతీ కార్యదర్శుల పనితీరును ఎంపీడీఓలు పర్యవేక్షిస్తూ.. ఇళ్ల నిర్మాణం త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశాల్లో అదనపు కలెక్టర్ నర్సింగ్రావు, ఆర్డీఓ శ్రీనివాసరావు, డీఎస్పీ మొగిలయ్య, లీగల్ సర్వీసెస్ అఽథారిటీ ప్రతినిధి రాజేందర్, సహాయ కార్మిక అధికారి వేణుగోపాల్, ఎస్సీ సంక్షేమశాఖ అధికారి నుషిత, బీసీ సంక్షేమశాఖ అధికారి అక్బర్ బాషా, డీఈఓ విజయలక్ష్మి, హౌసింగ్ పీడీ శ్రీనివాసరావు, డీఆర్డీవో ముసాయిదాబేగం ఉన్నారు. -
‘ఇందిరమ్మ’కు నీటి కష్టాలు!
రాజోళి: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు సొంతింటి కలను నెరవేర్చుకునేందుకు అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రభుత్వం నుంచి ఇల్లు మంజూరైందని సంతోషించే లోగా రాజకీయ కారణాలతో తమ పేరు మొదటి విడతలో వస్తుందా లేదా అనే ఆందోళన చెందారు. తీరా ఇల్లు మంజూరై నిర్మాణం ప్రారంభించాక తలెత్తుతున్న ఇబ్బందులతో ఆందోళనకు గురవుతున్నారు. ప్రస్తుతం వేసవి దృష్ట్యా చాలా గ్రామాల్లో తాగునీటి కొరత ఉందనే సాకుతో నల్లా నీటిని ఇళ్ల నిర్మాణాలకు వినియోగించనివ్వడం లేదు. దీంతో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు తమ ఇంటి నిర్మాణానికి క్యూరింగ్ చేసుకునేందుకు అష్టకష్టాలు పడాల్సి వస్తోంది. సరిపోని సాయం.. తప్పని అప్పులు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు ప్రభుత్వం అందించే రూ. 5లక్షల సాయం సరిపోకపోయినా.. లబ్ధిదారులు అప్పులుచేసి మరీ నిర్మాణాలు చేపడుతున్నారు. ఈ క్రమంలో ఇంటి నిర్మాణం కోసం బోరుబావి డ్రిల్లింగ్, విద్యుత్మోటారు ఏర్పాటు లబ్ధిదారులకు అయ్యే పని కాకపోవడంతో నల్లా నీటిపైనే ఆధారపడుతున్నారు. అయితే వేసవిలో తాగునీటి కొరత సాకుతో ప్రజాప్రతినిధులు, అధికారులు మిషన్ భగీరథ నీటిని ఇంటి నిర్మాణాలకు వినియోగించొద్దని లబ్ధిదారులకు తేల్చిచెబుతున్నారు. కొన్ని గ్రామాల్లో సర్పంచులు ఏకంగా ఇందిరమ్మ ఇళ్లకు మిషన్ భగీరథ నీటిని వినియోగించే వారి నల్లా కనెక్షన్ కట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. దీనిపై పలువురు గత సోమవారం ప్రజావాణిలో అధికారులకు ఫిర్యాదు చేశారు. ప్ర భుత్వం మంజూరు చేసిన ఇళ్ల నిర్మాణాలకు మోకాలడితే ఎలా అని లబ్ధిదారులు ప్రశ్నిస్తున్నారు. ఇళ్ల నిర్మాణాలక్యూరింగ్కు అవస్థలు గ్రామాల్లో మిషన్ భగీరథ నీటినివినియోగించుకోనివ్వని వైనం బిందెలతో నీటిని తెచ్చుకుంటున్న లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాల పూర్తిపై నీలినీడలు -
భానుడి విలయతాండవం
పాలమూరు: రోజురోజుకూ భానుడు విలయతాండవం చేస్తున్నాడు. ఉమ్మడి పాలమూరు వ్యాప్తంగా పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో ప్రజలు ఎండ వేడిమిని తట్టుకోలేకపోతున్నారు. మార్చి రెండో వారం నుంచే వేసవి ఉష్ణోగ్రతల్లో గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయి. దీంతో మే నెలలో పరిస్థితి ఎలా ఉంటుందోనని జనం ఆందోళన చెందినట్లుగానే భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. గతేడాది మార్చి, ఏప్రిల్, మే నెలలతో పోలిస్తే ఈసారి ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయని అధికారులు చెబుతున్నారు. సాయంత్రం వరకు ఎండలు ఉక్కిరిబిక్కిరి చేస్తుండగా.. అర్ధరాత్రి తర్వాత చల్ల గాలులు కొంత ఉపశమనం కలిగిస్తున్నాయి. మే నెల మొదటి వారం నుంచే ఎండల తీవ్రత పెరిగి అర్ధరాత్రి వరకు ఉక్కపోత పరిస్థితులు కొనసాగుతాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఏటా రెండు డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని పరిశోధకుల హెచ్చరించిన విధంగానే మార్పును ప్రజలు అనుభవించారు. ఊపిరాడనంత కష్టం వారం రోజులుగా ఎండల తీవ్రతకు ఊపిరి కూడా ఆడడం లేదని పలువురు వాపోతున్నారు. ఉమ్మడి పాలమూరు వ్యాప్తంగా దాదాపు ఎండ వేడిమి అధికంగా ఉంటోంది. ఇలాంటి పరిస్థితుల్లో వేడెక్కిన ఉపరితలాల నుంచి వెలువడే వాయువులు ఇక్కడే తిరుగుతుంటాయి. ఇందులో కర్బన వాయువుల మోతాదు అధికంగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో పచ్చని చెట్ల కింద సేదతీరితేనే కొంత ఉపశమనం కలుగుతుందని వాతావరణ నిపుణులు సూచిస్తున్నారు. ఏటా పెరుగుదల.. ఉమ్మడి జిల్లాలో ఎండల ప్రభావంతో ఏటా వడదెబ్బ మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే జిల్లాలో 20 మంది వరకు మృతిచెందారు. ఎండలో పనిచేసే వారు వడదెబ్బకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. శరీర ఉష్ణోగ్రత 106 డిగ్రీల ఫారెన్ హీట్ దాటితే వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఉంటుంది. కళ్లు తిరగడం, తీవ్రమైన తలనొప్పి, గుండె దడ, చెమట ఎక్కువగా రావడం కిడ్నీలు దెబ్బతినడం, ఫిట్స్ రావడం తదితర లక్షణాలు బయటపడతాయి. ఒక్కోసారి కోమాలోకి సైతం వెళ్లొచ్చు. శరీరంలో ప్రొటీన్ స్థాయిలు తగ్గి అవయవాలు పనిచేయడం ఆగిపోతాయి. కాబట్టి వీలైనంత వరకు శరీర ఉష్ణోగ్రత మాములు స్థితిలో ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులకు వేడిగాలులు తగిలినా వడదెబ్బ సోకే ప్రమాదం ఉంది. ఇవీ వడదెబ్బ లక్షణాలు శరీర నియంత్రణ వ్యవస్థ దెబ్బతింటుంది. విపరీతమైన దాహం వేయడంతోపాటు శరీరం వేడెక్కుతుంది. తలనొప్పి, కళ్లు తిరగడం, తూలడం, వాంతులు, కాళ్లు, కండరాలు పట్టేసి నొప్పిగా ఉండటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. జాగ్రత్తలుఇలా.. వడదెబ్బ లక్షణాలున్న బాధితుడిని వెంటనే చల్లని ప్రదేశానికి చేర్చాలి. చల్లని నీరు ముఖంపై చిలకరించాలి కూలర్ లేదా ఏసీల వద్ద విశ్రాంతి తీసుకునేలా ఏర్పాటు చేయాలి. చల్లని నీరు లేదా ఐస్ ముక్కలతో నుదురు, శరీరంపై తుడవాలి. అరచేయి, కాళ్లకు రక్తప్రసరణ మెరుగుపడేలా రుద్దాలి. వీలైనంతా త్వరగా వైద్యులను సంప్రదించాలి. ఉమ్మడి పాలమూరులోతీవ్రమవుతున్న ఎండలు రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ఉక్కపోతతో చిన్నారులు, వృద్ధుల ఉక్కిరిబిక్కిరి ముందస్తు జాగ్రత్తలతోనే వడదెబ్బ నివారణ చల్లని చెట్లతో ఉపశమనం అంటున్న వైద్య నిపుణులు -
టీజీజీడీఏ జిల్లా అధ్యక్షుడిగా నాగేశ్వరావు
గద్వాల క్రైం: తెలంగాణ ప్రభుత్వ డాక్టర్స్ అసోసియేషన్ జిల్లా నూతన కార్యవర్గ ఎన్నికల్లో స్థానిక ప్రభుత్వ మెడికల్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.నాగేశ్వరావు అధ్యక్షుడిగా ఎన్నికై నట్లు రిటర్నింగ్ అధికారి డాక్టర్ కె.శ్రీనివాస్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ ఏర్పాటు అనంతరం తొలిసారిగా జిల్లా ప్రభుత్వ డాక్టర్స్ అసోసియేషన్ ఎన్నికలు నిర్వహించగా.. పలువురు వైద్యులు పోటీచేసినట్లు పేర్కొన్నారు. ఉపాధ్యక్షులుగా డా.శ్యామ్, డా. ఎస్కే సిద్ధప్ప, కె.రాణి, జనరల్ సెక్రెటరీగా జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ ఇందిరా, జాయింట్ సెక్రెటరీలుగా ఇన్చార్జి డీఎంహెచ్ఓ సంధ్యా కిరణ్మయి, నవీన్క్రాంతి కుమార్, వృశాలి, జనరల్ కౌన్సిల్ సభ్యులుగా వెంకటదాస్, రమేశ్చంద్ర, నరహరి, ఎగ్జిక్యూటివ్ సభ్యులుగా వినోద్కుమార్, ప్రియాంక ఎన్నికై నట్లు తెలిపారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు మాట్లాడుతూ.. ప్రభుత్వ వైద్యుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషిచేస్తానని అన్నారు. నూతన కమిటీ సభ్యులను పలువురు ఆభినందించారు. నాసిరకం విత్తనాలు విక్రయిస్తే చర్యలుధరూరు: విత్తన డీలర్లు రైతులకు నాసిరకం విత్తనాలు అంటగట్టి మోసాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా వ్యవసాయశాఖ అధికారి వీరప్ప హెచ్చరించారు. గురువారం ధరూరు రైతువేదికలో మండలంలోని సీడ్ విత్తన డీలర్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రానున్న వానాకాలంలో రైతులకు అవసరమయ్యే వివిధ రకాల విత్తనాలతో పాటు పత్తి విత్తనాలను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. విత్తన విక్రయాలకు సంబంధించిన రికార్డులను పక్కాగా నిర్వహించాలని సూచించారు. అదే విధంగా స్టాక్ బోర్డుపై రోజువారీగా ధరలను రాసి ఉంచాలన్నారు. విత్తనాలు కొనే రైతులకు తప్పనిసరిగా రశీదు ఇవ్వాలన్నారు. రైతులు కూడా విత్తనాలకు సంబంధించిన రశీదులను పంట చేతికొచ్చే వరకు జాగ్రత్తగా ఉంచుకోవాలని సూచించారు. జిల్లాలో నకిలీ విత్తనాల విక్రయాలను అరికట్టేందుకు వ్యవసాయ, పోలీసు శాఖల సమన్వయంతో ప్రత్యేక టాస్క్ఫోర్స్ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం అల్వలపాడులో ధాన్యం కొనుగోలు కేంద్రంతో పాటు ఫర్టిలైజర్ దుకాణాలను తనిఖీ చేశారు. డీఏఓ వెంట ఏఓ శ్రీలత, ఏఈఓలు ఉన్నారు జాతీయ ఫుట్బాల్ పోటీలకు ఎంపిక వనపర్తి రూరల్: పెబ్బేరుకు చెందిన పరమేష్ జాతీయ ఫుట్బాల్ పోటీలకు ఎంపికై నట్లు కోచ్ నాగరాజు గురువారం తెలిపారు. ఇటీవల హైదరాబాద్లో తెలంగాణ ఫుట్బాల్ అసోసియేషన్ (టీఎఫ్ఏ) ఆధ్వర్యంలో జరిగిన అండర్–20 జట్టు ఎంపికలో పరమేష్ అత్యంత ప్రతిభ కనబర్చి జాతీయస్థాయికి ఎంపికై నట్లు వివరించారు. మే నెల 3 నుంచి 25వ తేదీ వరకు ఛత్తీస్ఘడ్లో జరిగే జాతీయస్థాయి ఫుట్బాల్ పోటీల్లో తెలంగాణ జట్టు తరఫున ఆడతారని పేర్కొన్నారు. గురువారం పట్టణంలో జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు కృష్ణకుమార్రెడ్డి, ఉపాధ్యక్షుడు సురేందర్రెడ్డి, వెంకట్, అఫ్సర్, రాజేందర్, సీనియర్ క్రీడాకారులు పరమేష్ను అభినందించారు. వేరుశనగ క్వింటా రూ.6,789 గద్వాలవ్యవసాయం/దేవరకద్ర: జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్యార్డుకు గురువా రం 89 క్వింటాళ్ల వేరుశనగ అమ్మకానికి రాగా.. గరిష్టంగా రూ. 6,789, కనిష్టంగా రూ. 4,229, సరాసరి రూ. 5,889 ధర పలికింది. అదే విధంగా 95 క్వింటాళ్ల ఆముదాలు రాగా.. గరిష్టంగా రూ. 6,059, కనిష్టంగా రూ. 5,219, సరాసరి రూ. 5929 ధర లభించింది. 11 క్వింటాళ్ల కందులు రాగా.. గరిష్టంగా రూ. 6,569, కనిష్టంగా రూ. 6,069, సరాసరి రూ. 6,559 ధరలు వచ్చాయి. 2,018 క్వింటాళ్ల వరి (సోన) రాగా.. గరిష్టంగా రూ. 2,136, కనిష్టంగా రూ. 1,729, సరాసరి రూ. 1,919 ధరలు లభించాయి. ● దేవరకద్ర మార్కెట్ యార్డులో జరిగిన టెండర్లలో ఆర్ఎన్ఆర్ ధాన్యం క్వింటాల్ గరిష్టంగా రూ.2,319, కనిష్టంగా రూ.1,949 ధరలు పలికాయి. హంస ధాన్యం గరిష్టంగా రూ.1,820, కనిష్టంగా రూ.1,709 ధరలు లభించాయి. మార్కెట్కు దాదాపు 4 వేల బస్తాల ధాన్యం అమ్మకానికి వచ్చింది. -
ఉజ్వల భవిష్యత్కు చదువే పునాది
గట్టు: ఉజ్వల భవిష్యత్కు చదువే పునాది అని.. చిన్నచిన్న కారణాలతో ఎవరూ కూడా మధ్యలోనే చదువును నిలిపివేయొద్దని అదనపు కలెక్టర్ నర్సింగ్రావు సూచించారు. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా గురువారం గొర్లఖాన్దొడ్డి రైతువేదికలో జిల్లా మహిళా, శిశుసంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాలల భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాబోయే తరాలు బలంగా ఎదగడానికి చదువు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. విద్యార్థులు అవాంఛనీయ ప్రభావాలు, ఆకర్షణలకు లోనై చదువును అశ్రద్ధ చేయొద్దని సూచించారు. తల్లిదండ్రుల ఆశలకు అనుగుణంగా చదువులో రాణించి కుటుంబానికి మంచి పేరు తీసుకురావాలన్నారు. పిల్లల చదువుపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. ముఖ్యంగా బాల్యవివాహాలతో శారీరక, మానసిక ఎదుగుదల కుంటుపడుతుందని తెలిపారు. బాల్యవివాహాల నిర్మూలనలో అందరూ భాగస్వాములు కావాలని కోరారు. బాల్యవివాహం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. అదే విధంగా సెల్ఫోన్ అవసరానికి మించి వినియోగించొద్దని సూచించారు. సైబర్ నేరగాళ్ల బారినపడకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు. అనాథ పిల్లల చదువుకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. అనంతరం మత్తు పదార్థాల వినియోగంతో కలిగే అనర్థాలను వివరించారు. సర్పంచ్ శ్వేత అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జిల్లా మహిళా, శిశుసంక్షేమ శాఖ అధికారిణి సునంద, డీసీపీఓ నర్సింహ, ఎంపీడీఓ చెన్నయ్య, ఎస్ఐ శేఖర్గౌడ్, పంచాయతీ కార్యదర్శి రవి, ఎంవీ ఫౌండేషన్ కోఆర్డినేటర్ కిరణ్, చైల్డ్ లైవ్ సూపర్వైజర్ నవీన్, హబ్ కోఆర్డినేటర్ సరోజ తదితరులు పాల్గొన్నారు. -
మెగా జాబ్మేళాకు పకడ్బందీగా ఏర్పాట్లు
జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా మెగా జాబ్మేళా శుక్రవారం జిల్లాకేంద్రంలోని శిల్పారామంలో నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ఖుష్బూ గుప్తా తెలిపారు. గురువారం శిల్పారామంలో జాబ్మేళా ఏర్పాట్లను ఆమె పరిశీలించి మాట్లాడారు. జాబ్ మేళాలో హైదరాబాద్ నుంచి సుమారు 80 కంపెనీలు, జిల్లాలో స్థానికంగా ఉన్న 35 కంపెనీలు పాల్గొననున్నాయని వెల్లడించారు. వీరికోసం 120 స్టాళ్లను ఏర్పాటు చేశామని, ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సుమారు 10 వేల మంది నిరుద్యోగ యువతీ, యువకులు హాజరయ్యే అవకాశం ఉందన్నారు. ఈ మేరకు ఏర్పాట్లపై మున్సిపల్, యువజన సంక్షేమ క్రీడలు, పంచాయతీ శాఖ, విద్య, వైద్య, గ్రామీణాభివృద్ధి, మెప్మా, ఉపాధి కల్పన అధికారులకు సూచనలు చేశారు. మున్సిపల్, యువజన సంక్షేమ శాఖ అధికారులు సమన్వ యం చేసుకొని జాబ్ మేళాకు టెంట్లు, కుర్చీలు, టేబుళ్లు, తాగునీటి వసతి, మరుగుదొడ్లు, వంటి మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. అలాగే స్టేజీ, స్టాళ్లలో కావాల్సిన సౌకర్యాలను రెవెన్యూ, జిల్లా విద్యా శాఖ అధికారులు చూసుకోవాలన్నారు. పలువురు మంత్రుల రాక.. మేళాలో మొత్తం 30 కౌంటర్ల ద్వారా రిజిస్ట్రేషన్లు నిర్వహిస్తారని, నమోదు అనంతరం అభ్యర్థులను హాల్లో కూర్చోబెట్టి, ప్రారంభోత్సవం తర్వాత వివిధ కంపెనీల స్టాళ్ల వద్ద ఇంటర్వ్యూలకు అనుమతి ఇస్తారన్నారు. ఎంపికై న అభ్యర్థులకు అక్కడే నియామక పత్రం అందజేస్తారన్నారు. అలాగే పోలీస్ శాఖ రద్దీ నియంత్రణకు చర్యలు తీసుకోవడంతోపాటు, శిల్పారామం వైపు వెళ్లే రహదారులపై ట్రాఫిక్ నియంత్రణకు తగిన సిబ్బందిని నియమించాలని సూచించారు. మేళాకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు, ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, పశు సంవర్ధక, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి హాజరు కానున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మధుసూదన్నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
పీఎండీడీకేవై అమలులో ముందుండాలి
గద్వాల: కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న ప్రధానమంత్రి ధన్–ధాన్య కృషి యోజన (పీఎండీడీకేవై) పథకం అమలులో జిల్లా ముందుండేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆదేశించారు. గురువారం ఐడీఓసీ వీసీ హాల్లో సంబంధిత అధికారులతో పథకం అమలు తీరుపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పూర్తి సమాచార ఆధారిత పాలన ద్వారానే జిల్లా అభివృద్ధి వేగవంతమవుతుందన్నారు. ప్రతిశాఖ తమ లక్ష్యాలు, సాధించిన ఫలితాలను కచ్చితమైన గుణాంకాలతో ఆన్లైన్ పోర్టల్లో నమోదు చేయాలని సూచించారు. చిన్న పురోగతినైనా నమోదు చేయాలని.. ఎక్కడా జీరో చూపించకుండా పారదర్శకంగా వ్యవహరించాలన్నారు. గత ఏడాదితో పోల్చుకుంటే ప్రస్తుత ప్రగతి మెరుగ్గా ఉండాలని.. ఇందుకు ప్రతినెలా డేటాను సరిచూసుకోవాలని ఆయన దిశానిర్దేశం చేశారు. సూచికలను సక్రమంగా అమలు చేయడం ద్వారా ప్రభుత్వ పతకాలు ప్రజలకు సమర్ధవంతంగా చేరుతాయని తెలిపారు. సమావేశంలో డీఏఓ వీరప్ప, డీఆర్డీఓ ముషాహిదాబేగం ఉన్నారు. విద్యావ్యవస్ధ బలోపేతానికి కృషి జిల్లాలో అక్షరాస్యత శాతాన్ని పెంచి, విద్యావ్యవస్థ బలోపేతానికి చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తెలిపారు. హైదరాబాద్ నుంచి రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా అధికారులు పాల్గొనగా.. ఆమె పలు సూచనలు చేశారు. పదో తరగతి, ఇంటర్లో పెయిల్ ఆయిన విద్యార్ధులను అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలకు సన్నద్ధం చేయాలని సూచించారు. మే 11 నుంచి నిర్వహించే విద్యా వారోత్సవాల్లో భాగంగా పాఠశాలలో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. కాగా, ఇటీవల ఫిన్లాండ్ పర్యటనకు వెళ్లిన కలెక్టర్ రిజ్వాన్ బాషా అక్కడి విద్యా విధానం విశేషాలను ఈ సందర్భంగా పంచుకున్నారు. ఫిన్లాండ్లో వృత్తి విద్యాకోర్సులు, డిజిటల్ బోధనా పద్ధతులు అద్భుతంగా ఉన్నాయని పేర్కొన్నారు. వీసీలో డీఈఓ విజయలక్ష్మి పాల్గొన్నారు. -
గర్భిణులు జాగ్రత్తలు తీసుకోవాలి
ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నందున గర్భిణులు మరింత జాగ్రత్తగా ఉండాలి. శరీరం నిర్జలీకరణం కాకుండా ఎప్పటికప్పుడు ద్రవ పదార్థాలు అధికంగా తీసుకోవాలి. తాగునీటిలో ఉప్పు లేదా చక్కెర వేసుకొని తాగాలి. ఎండల తీవ్రతకు గర్భస్రావమయ్యే అవకాశాలు, తొమ్మిది నెలలు నిండిన వారికి కడుపులో బిడ్డ చనిపోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఎండల కారణంగా ఐదో నెల నుంచి గర్భంలో బిడ్డ కదలికలు తగ్గుతాయి. వేసవిలో గర్భిణులు బయటకు వెళ్లకపోవడం మంచిది. మాంసాహారం, మసాలా దినుసులు, నూనె పదార్థాలు అధికంగా వాడరాదు. బాలింతలు గదిలో ఫ్యాన్ను తక్కువ వేగంతో పెట్టుకోవాలి. కీరదోస, పుచ్చకాయ లాంటి తాజా పండ్లు తీసుకోవడం ఉత్తమం. – డాక్టర్ ప్రతిభ, సీ్త్ర వైద్య నిపుణులు, మహబూబ్నగర్ నీరు ఎక్కువగా తాగాలి ఎండల తీవ్ర త కారణంగా వడదెబ్బ తగలకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. వదులుగా ఉండే కాటన్ దుస్తులు ధరించాలి. లవణాలతో కూడిన నీరు, పండ్ల రసాలు, కొబ్బరినీళ్లు అధికంగా తీసుకోవాలి. ఓఆర్ఎస్ పాకెట్లు అందుబాటులో ఉంచుకోవాలి. తప్పనిసరి పరిస్థితుల్లో ఎండలో బయటకు వెళ్లాల్సి వస్తే తాగునీటిని వెంట తీసుకెళ్లాలి. వంట గదులు చల్లగా ఉండేలా చూసుకోవాలి. ప్రతి 30 నిమిషాలకు అర లీటరు నీటిని తాగుతూ ఉండాలి. – డాక్టర్ స్వరూప్, జనరల్ మెడిసిన్, మహబూబ్నగర్ ● -
అనారోగ్యానికి గురయ్యా..
నిత్యం వాటర్ట్యాంకు నుంచి బిందెలతో నీరు తెచ్చుకుని ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి వినియోగిస్తున్నా. ఈ క్రమంలో గుండెలో సమస్య ఏర్పడింది. అలాగే పనికి వెళ్లడంతో అక్కడే పడిపోయాను. గ్రామస్తులు ఇంటికి చేర్చారు. మాలాంటి వారు ట్యాంకు నుంచి నీరు తెచ్చుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. నీటి వసతి కల్పించాలి. – లక్ష్మక్క, ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారు, ముండ్లదిన్నె ఇబ్బంది పడుతున్నాం.. ఇల్లు మంజూరైందని సంతోషపడాలో.. లేక క్యూరింగ్ చేసుకునేందుకు నీటి కష్టాలు తప్పడం లేదని బాధపడాలో తెలియడం లేదు. కొళాయి ద్వారా నీరు పట్టుకునేందుకు వీలు లేకుండా చేశారు. కాని కొందరి ఇళ్లకు మాత్రం ప్రత్యేకంగా కొళాయిలు ఏర్పాటుచేశారు. ట్యాంకుల నుంచి రోజూ ఉదయం, సాయంత్రం నీరు తెచ్చుకునేందుకు ఇబ్బంది పడుతున్నాం. ఇంటి నిర్మాణం పూర్తయ్యే వరకు నీరు అందించే ఏర్పాటుచేస్తే బాగుంటుంది. – నాగేశ్వరమ్మ, ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారు, ముండ్లదిన్నె క్షేత్రస్థాయిలో నిఘా ఉంచుతాం మిషన్ భగీరథ ద్వారా ఇంటి నిర్మాణాలకు నీరు ఇవ్వలేం. కానీ కొందరు నర్సరీలు, ఇళ్లకు ప్రత్యేకంగా నల్లాలు ఏర్పాటుచేశారని సమాచారం. ఈ విషయమై గ్రామ పంచాయతీ అధికారులు, మండల అధికారులకు క్షేత్రస్థాయిలో నిఘా ఉంచమని చెబుతాం. అలాంటి వాటికి పాల్పడే వారిపై కఠిన చర్యలు ఉంటాయి. – శ్రీధర్రెడ్డి, మిషన్ భగీరథ డీఈ ● -
పదిలో మెరుగు
గద్వాల: పదో తరగతి వార్షిక పరీక్షల్లో జిల్లా విద్యార్థులు గతం కంటే కొంత మెరుగైన ఫలితాలు సాధించారు. మొత్తం 8,037 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా.. 7,549 మంది ఉత్తీర్ణత సాధించారు. వీరిలో 4,001మంది బాలికలు, 3,548 మంది బాలురు ఉన్నారు. బాలికలు 95.49శాతం, బాలురు 92.23శాతం ఉత్తీర్ణత సాధించగా.. మొత్తం 93.93శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలోనే జిల్లా 29వ స్థానంలో నిలిచింది. 2024–25 విద్యా సంవత్సరంలో 91.74 ఉత్తీర్ణత శాతంతో రాష్ట్రంలో 26వ స్థానంలో నిలువగా.. ఈసారి ఉత్తీర్ణత శాతం పెరిగినప్పటికీ రాష్ట్రస్థాయిలో మూడు స్థానాలు పడిపోయి 29వ స్థానానికి చేరింది. ఫలితాల్లో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, గురుకులాల విద్యార్థులు రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబర్చారు. ముందంజలో నిలపాలి: కలెక్టర్ పదో తరగతి పరీక్ష ఫలితాల్లో జిల్లా 93.9శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలో 29వ స్థానంలో నిలిచినట్లు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తెలిపారు. ఈమేరకు ఆయన బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరం పదో తరగతి పరీక్ష ఫలితాల్లో జిల్లా రాష్ట్రంలోనే ముందుంజలో నిలిచేందుకు విద్యాశాఖ అధికారులు కృషిచేయాలని సూచించారు. విద్యార్థులకు ఎమ్మెల్యే అభినందన పదో తరగతిలో అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులు భవిష్యత్లో ఇదేస్ఫూర్తితో ముందుకుసాగి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి ఆకాంక్షించారు. జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో పలు పాఠశాలల విద్యార్థులను అభినందించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థిని పూజిత 577, మరో 20మంది విద్యార్థులు 500 మార్కులకు పైగా సాధించి ప్రైవేటుకు ధీటుగా ప్రతిభ చాటడం అభినందనీయమన్నారు. రీకౌంటింగ్.. రీవెరిఫికేషన్కు.. జవాబుపత్రాలను రీ వెరిఫికేషన్, రీకౌంటింగ్ చేసుకోవాలనుకునే విద్యార్థులకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. మార్కుల రీకౌంటింగ్ కోసం ఒక్కో సబ్జెక్టు కోసం రూ.500, రీ వెరిఫికేషన్కు రూ.వెయ్యి ఫీజు చెల్లించాలని సూచించింది. గురువారం నుంచి వచ్చేనెల 14 వరకు విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. వీరితోపాటు ఫెయిలైన విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్ష రాసే విధంగా ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఇందుకోసం మే 14 వరకు పరీక్ష ఫీజు చెల్లించాల్సి ఉండగా.. జూన్ 6 నుంచి 12 వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. 55 పాఠశాలల్లో వందశాతం.. జిల్లావ్యాప్తంగా 55 పాఠశాలల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించారు. ఇందులో ప్రభుత్వ పాఠశాలలు 34 ఉండగా, ప్రైవేటు స్కూళ్లు 21 ఉన్నాయి. అదే విధంగా గద్వాల ప్రభుత్వ పాఠశాల, అయిజ మండలం ఉత్తనూరు పాఠశాలకు చెందిన విద్యార్థులు పి.పూజిత, పి.పవిత్ర 577 మార్కులతో జిల్లా టాపర్లుగా నిలిచారు. ప్రైవేటు పాఠశాలకు చెందిన టి.అభిరామ్ 591 మార్కులతో అత్యుత్తమ ప్రతిభ చాటాడు. సంతోషంగా ఉంది.. నాకు 577 మార్కులు రావడం చాలా సంతోషంగా ఉంది. నేను బాగా చదువుకునేందుకు అమ్మ సుజాత, నాన్న గోవిందు ఎంతో సహకరించారు. అదే విధంగా పాఠశాల ఉపాధ్యాయులు ప్రోత్సహించారు. భవిష్యత్లో ఇదేస్థాయిలో చదివి పర్యావరణ ఇంజినీరు కావాలని లక్ష్యంగా పెట్టుకున్నాను. – పి.పూజిత, ప్రభుత్వ ఉన్నత పాఠశాల, గద్వాల 93.93శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలో జిల్లాకు 29వ స్థానం 8,037మంది విద్యార్థులకు గాను 7,549 మంది పాస్ గతం కంటే పెరిగిన ఉత్తీర్ణత శాతం 55 పాఠశాలల్లో వందశాతం ఫలితాలు -
బీచుపల్లిలో బ్రహ్మోత్సవాలు ప్రారంభం
ఎర్రవల్లి: మండలంలోని బీచుపల్లి ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాలు బుధవారం అర్చకులు భక్తిశ్రద్ధలతో ప్రారంభించారు. ఐదు రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో భాగంగా.. మొదటి రోజు ఉదయం ఆలయంలో పంచామృతాభిషేకం, వాస్తుపూజ హోమం, అగ్ని ప్రతిష్ఠ, ధ్వజారోహణం, బలిహరణ, పల్లకీసేవను వేద పండితుల మంత్రోచ్ఛరణలతో చేశారు. అదేవిధంగా రాత్రి తెప్పతేరు కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ పురేందర్కుమార్, పాలక మండలి సభ్యులు, అర్చకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. ఎస్పీ ప్రత్యేక పూజలు ఉత్సవాలను పురస్కరించుకొని బీచుపల్లి పుణ్యక్షేత్రాన్ని ఎస్పీ తోట శ్రీనివాసరావు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అభయాంజనేయస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకు ముందు ఆలయ సిబ్బంది ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయ ఈఓ పురేందర్కుమార్ ఆయనకు శేషవస్త్రాలతో సత్కరించగా, అర్చకులు మారుతిచారి తీర్థ ప్రసాదాలను అందించి ఆలయ విశిష్టతను గురించి వివరించారు. ఎస్పీ వెంట సీఐ ప్రదీప్కుమార్, పోలీస్ సిబ్బంది తదితరులు ఉన్నారు. -
రైతులను ఇబ్బందులకు గురిచేస్తే సహించం
గద్వాల: సీడ్ కంపెనీలు రైతులకు చెల్లించాల్సిన డబ్బులను సకాలంలో చెల్లించకుండా ఇబ్బందులకు గురిచేస్తే సహించమని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. బుధవారం ఐడీఓసీ కార్యాలయంలో సీడ్ కాటన్పై వ్యవసాయశాఖ అధికారులు, సీడ్ ఆర్గనైజర్లు, కంపెనీల ప్రతినిధులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. సీడ్ పత్తికి సంబంధించిన పలు కంపెనీలు కొన్ని నెలలుగా బకాయి లు చెల్లించకపోవడంతో రైతులు, ఆర్గనైజర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. సీడ్ కంపెనీలు ఎలాంటి ఆలస్యం లేకుండా పెండింగ్ డబ్బులను వెంటనే చెల్లించాలని.. లేనిపక్షంలో సదరు కంపెనీ యాజమాన్యాలకు షోకాజు నోటీసులు జారీ చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అదే విధంగా కంపెనీలు నిర్ణీత గడువులోగా విత్తనాల సర్టిఫైడ్ పరీక్షలు పూర్తిచేసి.. నివేదికలు సమర్పించాలన్నారు. రైతులు, ఆర్గనైజర్లు, కంపెనీల మధ్య రౖతైపాక్షిక ఒప్పందాలు తప్పనిసరి అని స్పష్టం చేశారు. ఒప్పందాల్లో చెల్లింపుల గడువు, బాధ్యతలు, గడువులోగా డబ్బులు చెల్లించకుంటే జరిమానాలు, చట్టపరమైన చర్యలు తీసుకునేలా అన్ని అంశాలను పొందుపర్చాలని సూచించారు. ఒప్పందం లేకుండా విత్తన కొనుగోలు లేదా ఉత్పత్తి కార్యకలాపాలు అనుమతించబోమని అన్నారు. అదే విధంగా సీడ్ కంపెనీలు రైతులకు తగిన శిక్షణ, సాంకేతిక మార్గదర్శకాలు అందించడం లేదని గుర్తించామని.. ఇకనుంచి క్షేత్రస్థాయి సందర్శనలు, శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. జిల్లాలో వేలాది రైతులు సీడ్పత్తి సాగుచేస్తున్నారని.. కంపెనీలు, ఆర్గనైజర్లు పరస్పర సహకారం లేకపోతే సీడు వ్యవస్థనే దెబ్బతినే ప్రమాదముందని తెలిపారు. అనంతరం జిల్లా టాస్క్ఫోర్స్ అధికారులతో కలెక్టర్ ప్రత్యేక సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఎరువులు, విత్తనాల దుకాణాల్లో వ్యవసాయశాఖ అధికారులు క్రమం తప్పకుండా తనిఖీలు చేపట్టాలన్నారు. దుకాణాల వద్ద స్టాక్ వివరాలు, ధరల పట్టి క, రికార్డుల నమోదు పక్కాగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో అదనపు ఎస్పీ శంకర్, డీఏఓ వీరప్ప తదితరులు ఉన్నారు. సీడ్ ఆర్గనైజర్లు, కంపెనీలు నిబంధనలు పాటించాలి కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ -
సమస్యల పరిష్కారంలో ప్రభుత్వాలు విఫలం
అమరచింత: ప్రజా సమస్యలు పరిష్కరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని సీపీఐ(ఎంఎల్) మాస్లైన్ రాష్ట్ర కార్యదర్శివర్గసభ్యుడు కేజీ రామచందర్ ఆరోపించారు. మంగళవారం పట్టణంలోని మార్క్స్ భవనంలో జరిగిన పార్టీ ఉమ్మడి జిల్లా కార్యదర్శుల సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయడంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయని విమర్శించారు. ఉద్యోగాల కల్పన, నిరుద్యోగ భృతి, పంటలకు మద్దతు ధర కల్పించడం, నాణ్యమైన విత్తనాలు అందించడం లేదన్నారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కార్పొరేట్లకు ఊడిగం చేస్తూ ఉన్న సంపాదన వారికి దోచి పెట్టడమేగాక ప్రశ్నిస్తున్న గొంతుకలకు నొక్కేస్తోందని ఆందోళళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుభరోసా నిధులు సకాలంలో ఇవ్వకపోగా కోతలు విధిస్తోందని, పది ఎకరాలలోపు అందరికీ చెల్లించాలని డిమాండ్ చేశారు. మహిళలకు రూ.2,500, వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళల పింఛన్ల పెంపు నేటికీ అమలుగాక పోవడం శోచనీయమన్నారు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యడు ఎం.కృష్ణ, ఉమ్మడి జిల్లా కార్యదర్శి సీహెచ్ రాంచందర్, జిల్లా కార్యదర్శి హన్మంతు, ప్రసాద్, గణేష్, రాజన్న, మస్లమణి పాల్గొన్నారు. -
పారదర్శకంగా జనగణన
గద్వాల: జనగణన–2027 ప్రక్రియను సమగ్రంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రభుత్వం డిజిటల్ స్వీయ గణన విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింద ని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. జనగణనలో భాగంగా మంగళవారం ఆ యన తన చాంబర్లో స్వీయ గణన నమోదు చేసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజాప్రతినిధులు, అధికారులతో పాటు ప్రతి పౌరుడు మొబైల్ యాప్ లేదా వెబ్సైట్లో తమ వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని 15 నిమిషా ల వ్యవధిలో పూర్తిచేసుకోవచ్చని తెలిపారు. వివరాల నమోదు అనంతరం సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఐడీ జారీ చేయడం జరుగుతుందని.. ప్రభు త్వం నియమించిన ఫీల్డ్ ఎన్యూమరేటర్లు ఇంటికి వచ్చిన సమయంలో సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఐడీ నంబర్ తెలియజేయాలని సూచించారు. ప్రజలు తమ వివరాలను ప్రస్తుతం ఆన్లైన్ పోర్టల్ ద్వారా స్వీయ నమోదు చేసుకుంటే ధ్రువీకరణ సమయంలో వారు ఇంట్లో భౌతికంగా ఉండాల్సిన అవసరం లేదన్నారు. ఆన్లైన్లో నమోదుచేసిన సమాచారాన్ని సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఐడీ ద్వారా ఎన్యూమరేటర్ పరిశీలించి ధ్రువీకరిస్తారన్నారు. తద్వారా ఉద్యోగరీత్యా ఇతర ప్రాంతాల్లో ఉండేవారు, విద్యార్థులు, వలస కార్మికులు, ప్రయాణాల్లో ఉన్న ప్రజలు కూడా జనగణనలో వివరాలు నమోదు చేసుకునే వెసులుబాటు ఉంటుందన్నారు. అయితే స్వీయ గణనలో కచ్చితమైన చిరునామా, సరైన వివరాలు నమోదు చేయాలన్నారు. జనగణన ప్రక్రియలో సాంకేతికతను వినియోగించి సమగ్రతను పెంచడం.. ప్రతిపౌరుడి వివరాలు నమోదు చేసేలా చూ డటమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈ అవకాశాన్ని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరా రు. కార్యక్రమంలో సీపీఓ పాపయ్య పాల్గొన్నారు. ● వృద్ధుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని జిల్లా కేంద్రంలో సీనియర్ సిటిజన్ డే కేర్ సెంటర్ ఏర్పాటుచేసినట్లు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఒక ప్రకటనలో తెలిపారు. మహిళా, శిశు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమశాఖతో పాటు రెడ్క్రాస్ సంస్థ సహకారంతో స్థానిక రెండవ రైల్వే గేట్ సమీపంలో ఉన్న పాతసాయుధ దళాల కార్యాలయ ప్రాంగణంలో పంచాయతీరాజ్ ఇంజినీర్ కార్యాలయం పక్కన డే కేర్ సెంటర్ ప్రారంభించినట్లు పేర్కొన్నారు. ఈ సెంటర్లో రోజు ఉదయం 9 నుంచి సాయంత్రం 6గంటల వరకు వృద్ధులకు మధ్యాహ్న భోజనం, సాయంత్రం టీ, అల్పాహార సౌకర్యం కల్పించినట్లు తెలిపారు. ఆదివారాలు, ప్రభుత్వ సెలవు దినాల్లో సెంటర్ను మూసివేయనున్నట్లు చెప్పారు. అర్హులైన వృద్ధులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు 99494 63238 నంబర్ను సంప్రదించాలని సూచించారు. స్వీయ నమోదు అవకాశాన్నిసద్వినియోగంచేసుకోవాలి కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ -
ముందుకు.. వెనక్కి..
సాక్షి, నాగర్కర్నూల్: కృష్ణాతీరంలోని సుందర దృశ్యాలు, నల్లమల అడవి అందాలను ఆకాశం నుంచి వీక్షించేందుకు వీలుగా ప్రభుత్వం చేపట్టిన హెలీ టూరిజం కార్యక్రమానికి బ్రేక్ పడింది. రాష్ట్రంలోనే మొదటిసారిగా నల్లమల, సోమశిల ప్రాంతంలోనే హెలీ టూరిజానికి అడుగులు పడగా, ఈ కార్యక్రమం అమలుపై నీలినీడలు అలుముకున్నాయి. అసైన్డ్ భూముల వివాదంలో సంబంధిత భూనిర్వాసితులు హైకోర్టును ఆశ్రయించారు. హెలీప్యాడ్ నిర్మాణ పనులపై హైకోర్టు స్టే ఇవ్వడంతో పనులు నిలిచిపోయాయి. అయితే ప్రభుత్వం పర్యాటకాభివృద్ధి కోసం చేపట్టిన కీలకమైన ప్రాజెక్ట్లో భూసేకరణకు సంబంధించి రెవెన్యూ, పర్యాటక శాఖ అధికారుల పనితీరు, సమన్వయ లోపంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలోనే మొదటిసారిగా సోమశిలలో.. కృష్ణాతీరంలోని సుందరమైన ప్రదేశాలు, నదీ గర్భంలోని దీవులు, నల్లమల అడవి అందాలను విహంగ వీక్షణం చేసేందుకు వీలుగా ప్రభుత్వం హెలీటూరిజం ప్యాకేజీని రూపొందించింది. హైదరాబాద్ నుంచి సోమశిల వరకు హెలికాప్టర్లో చేరుకుని ఇక్కడి అందాలను ఆకాశం నుంచే వీక్షించేందుకు వీలుగా ఏర్పాట్లను ప్రారంభించింది. శ్రీశైలం మల్లికార్జున ఆలయంలో దర్శనం చేసుకుని తిరిగి హైదరాబాద్ పయనమయ్యేలా టూర్ ప్లాన్ చేపట్టింది. హెలికాప్టర్లో ఒకరోజు పర్యటనకు రూ.1.10 లక్షలు, రెండు రోజుల పాటు పర్యటించేందుకు 1.40 లక్షలను చార్జ్ చేయనున్నారు. రెండు రోజుల ప్యాకేజీలో ఒకరోజు శ్రీశైలంలో, మరొకరోజు సోమశిలలో స్టే చేసేందుకు అవకాశం ఉంటుంది. ఈ హెలీ టూరిజం ప్యాకేజీని బుక్ చేసుకునే సందర్శకులకు శ్రీశైలం మల్లికార్జున స్వామిని వీఐపీ తరహాలో దర్శించుకునేందుకు అవకాశం కల్పించడంతో పాటు విడిది, భోజన వసతి కల్పించనున్నారు. అయితే హెలీ టూరిజం కార్యక్రమానికి కీలకమైన హెలీప్యాడ్ నిర్మాణాన్ని సోమశిల గ్రామంలో చేపట్టారు. ఏప్రిల్ 9నే హెలీ టూరిజం ప్రారంభోత్సవానికి పర్యాటకశాఖ అధికారులు ఏర్పాట్లు సైతం పూర్తి చేశారు. అయితే ప్రారంభానికి ముందే బ్రేక్ పడటంతో హెలీ టూరిజం ప్రాజెక్ట్ ముందుకు సాగుతుందా, లేదా అన్న అనుమానాలు నెలకొన్నాయి. అమరగిరిలో ఊసేలేని కాటేజీల నిర్మాణం.. సోమశిలతో పాటు అమరగిరి సమీపంలోని ద్వీపంలోనూ ప్రభుత్వం నూతనంగా కాటేజీల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. అమరగిరి ద్వీపంలో 8 ఎకరాల విస్తీర్ణంలో వెల్నెస్, స్పిరిట్చువల్ ప్రాజెక్ట్ కోసం గతేడాది ఆగస్టులోనే శంకుస్థాపన చేశారు. మొత్తం రూ.45.84 కోట్ల వ్యయంతో వెల్నెస్ సెంటర్లో కా టేజీల నిర్మాణంతో పాటు కెఫెటేరియా, యోగా డెస్క్, స్పా సెంటర్, ఇండోర్ గేమ్స్, స్విమ్మింగ్పూ ల్, ల్యాండ్స్కేప్ గార్డెన్, వ్యూపాయింట్లు తదితర సౌకర్యాలు కల్పించేందుకు ప్రణాళికలు పూర్తి చేశా రు. అయితే ఈ ప్రాజెక్ట్లోనూ కేటాయించిన స్థలం విషయంలో రెవెన్యూ, ఫారెస్ట్, పర్యాటక శాఖ అధికారులకు మధ్య సమన్వయం లేకపోవడంతో వెల్నెస్, రిట్రీట్ ప్రాజెక్ట్ అటకెక్కింది. అసైన్డ్ భూముల్లో ఏర్పాటుతో.. హెలీటూరిజం ప్రాజెక్ట్ కింద హెలీప్యాడ్ నిర్మాణానికి అధికారులు కృష్ణాతీరంలోని సోమశిల గ్రామాన్ని ఎంచుకున్నారు. కొల్లాపూర్ మండలంలోని సోమశిలలోని రైతుల అసైన్డ్ భూముల్లో హెలీప్యాడ్ నిర్మాణం చేపట్టడం వివాదాస్పదమైంది. గ్రామంలోని సర్వే నంబర్ 54లో సుమారు ఎకరం స్థలంలో హెలీప్యాడ్ నిర్మాణ పనులు ప్రారంభించారు. అయితే కనీస పరిహారం లేకుండా చట్టవిరుద్ధంగా హెలీప్యాడ్ పనులు చేపడుతున్నారని, నిర్వాసిత రైతులు దేవ సుంకన్న, పెంటయ్య, పుల్లయ్య, జాముడు, సాయన్న తదితరులు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో హెలీప్యాడ్ నిర్మాణ పనులను తక్షణమే నిలిపివేయాలని ఉత్తర్వులు జారీ చేస్తూ కోర్టు విధించింది. ఈ క్రమంలో హెలీప్యాడ్ నిర్మాణ పనులతో పాటు హెలీటూరిజం ప్రాజెక్ట్ కొనసాగింపుపై సందిగ్ధం నెలకొంది. నల్లమల హెలీ టూరిజంపై నీలినీడలు హైదరాబాద్–సోమశిల హెలికాప్టర్ రైడ్ ప్రతిపాదనలు చేసిన ప్రభుత్వం ఈనెల 9నే ప్రారంభానికి సిద్ధమైన పర్యాటకశాఖ అధికారులు హైకోర్టు తీర్పుతో హెలిప్యాడ్ పనులకు బ్రేక్ హెలీ టూరిజం అమలుపై సందిగ్ధత -
అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా
● రికార్డు స్థాయిలో 18వేల మెగావాట్ల వినియోగం ● ఆర్టిజన్ కార్మికులకు త్వరలోనే తీపికబురు ● టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ జితేష్ వి పాటిల్ కల్వకుర్తి/చారకొండ/మన్ననూర్: రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా విద్యుత్ డిమాండ్ 18వేల మెగావాట్లకు చేరినప్పటికీ.. వినియోగదారులకు ఎలాంటి అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా కొనసాగిస్తున్నామని టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ జితేష్ వి పాటిల్ అన్నారు. మంగళవారం కల్వకుర్తి పట్టణంలోని ట్రాన్స్ఫార్మర్ల మరమ్మతు కేంద్రంతో పాటు 33/11 కేవీ సబ్స్టేషన్ను పరిశీలించారు. ఈ సందర్భంగా ట్రాన్స్ఫార్మర్ల మరమ్మతు కేంద్రంలో నెలకొన్న సమస్యలను సిబ్బందితో తెలుసుకున్నారు. అనంతరం విద్యుత్శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వేసవిలో పెరిగిన విద్యుత్ వినియోగాన్ని దృష్టిలో ఉంచుకుని ముందస్తు ప్రణాళికతో విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ వ్యవస్థలను బలోపేతం చేసినట్లు వివరించారు. ముఖ్యంగా ట్రాన్స్ఫార్మర్లు, లైన్ల మరమ్మతు, లోడ్ మేనేజ్మెంట్ చర్యలతోనే ఈ స్థాయిలో సరఫరా సాధ్యమైందన్నారు. వేసవి తీవ్రత నేపథ్యంలో విద్యుత్ వినియోగం మరింత పెరిగే అవకాశముందని.. అయినప్పటికీ సరఫరాలో ఎలాంటి అంతరాయం రానివ్వబోమని ఆయన స్పష్టం చేశారు. సిబ్బంది సమన్వయంతో పనిచేసి.. ఎక్కడా లోపాలు తలెత్తకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. సబ్స్టేషన్ల ఆపరేటర్లు, లైన్మన్లే విద్యుత్ సంస్థకు నిజమైన బలమని చెప్పారు. వేసవి తీవ్రతలోనూ, అధిక లోడ్తోనూ నిరంతరం పనిచేస్తూ ప్రజలకు అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా అందిస్తున్న సిబ్బంది సేవలు ప్రశంసనీయమన్నారు. విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న ఆర్టిజన్ కార్మికులకు త్వరలో శుభవార్త అందిస్తామని సీఎండీ పేర్కొన్నారు. వారి సమస్యలను సమగ్రంగా పరిశీలించి.. భవిష్యత్లో ఎలాంటి ఇబ్బందులు రాకుండా శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అదే విధంగా చారకొండ మండల కేంద్రంలోని 33/11 కేవీ సబ్స్టేషన్ను ఆయన తనిఖీ చేశారు. విద్యుత్ కార్యాలయ భవనంతో పాటు ప్రహరీ నిర్మాణానికి ప్రతిపాదనలు పంపించాలని స్థానిక అధికారులకు సూచించారు. కాగా, ఆర్జిజన్ కార్మికులను కన్వర్షన్ చేయాలని కోరుతూ ఆ సంఘం డివిజన్ అధ్యక్షుడు నాయిని పరంజ్యోతి సీఎండీకి విజ్ఞప్తి చేశారు. ● అమ్రాబాద్ మండలం మాచారంలో పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టిన ఇందిరా సౌరగిరి జలవికాసం పథకం అమలు తీరును సీఎండీ జితేష్ వి పాటిల్ పరిశీలించారు. ఈ సందర్భంగా గిరిజన రైతులు ఏర్పాటుచేసుకున్న సోలార్ సిస్టమ్, బోరుబావులతో పాటు పండ్ల తోటల సాగు వివరాలను తెలుసుకున్నారు. అనంతరం రైతు పెద్దిరాజు వ్యవసాయ క్షేత్రంలో గిరిజన రైతులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. వ్యవసాయ రంగంలో గిరిజన రైతులు సాధిస్తున్న ప్రగతిని ఆయన ప్రశంసించారు. కార్యక్రమంలో విద్యుత్శాఖ సీఈ బాలస్వామి, ఎస్ఈ వెంకటనర్సింహారెడ్డి, డీఈటీ రవికుమార్, డీఈఈ శ్రీధర్రెడ్డి, ఏడీఈలు ఆంజనేయులు, శంకరయ్య, ఎస్ఓ పార్థసారధి తదితరులు ఉన్నారు. -
బాల్యవివాహాలను నిర్మూలిద్దాం
గద్వాల క్రైం: బాల్యవివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని భరోసా కేంద్రం నిర్వాహకులు శివాణి, శిరీష కోరారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ నర్సింగ్, పాలిటెక్నిక్ కళాశాలల్లో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో వారు మాట్లాడారు. కౌమర దశలోనే బాలికలకు వివాహం చేయడం వల్ల భవిష్యత్లో అనేక అనర్థాలు చోటు చేసుకుంటాయని తెలిపారు. అమ్మాయిలకు 18 ఏళ్లు నిండిన తర్వాతే వివాహం చేయాలని.. ఎక్కడైనా బాల్యవివాహం చేస్తున్నట్లు గుర్తిస్తే వెంటనే అధికారులకు సమాచారం అందించాలని సూచించారు. అదే విధంగా యువత చెడు వ్యసనాలకు ఆకర్షితులై విలువైన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారని.. వారిలో మార్పునకు చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బీచుపల్లి ఈఓగా బాధ్యతల స్వీకరణ ఎర్రవల్లి: బీచుపల్లి అభయాంజనేయస్వామి ఆలయ ఈఓగా పురేందర్ కుమార్ మంగళవారం బాధ్యతలు చేపట్టారు. ముందుగా అభయాంజనేయస్వామిని ఆయన దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఈఓ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ సిబ్బంది, అర్చకులతో నిర్వహించిన సమావేశంలో ఆలయ అభివృద్ధి, బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై చర్చించారు. ఉత్సవాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని సిబ్బందికి సూచించారు. సద్వినియోగం చేసుకోవాలి వనపర్తి: జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు జాబ్మేళా నిర్వహిస్తున్నామని.. సద్వినియోగం చేసుకోవాలని జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ జ్యోతి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. మే నెల 1న మహబూబ్నగర్లో జాబ్ మేళా ఉంటుందని.. ఇంటర్, డిగ్రీ, డిప్లొమా, పీజీ, ఇంజినీరింగ్ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులని పేర్కొన్నారు. అభ్యర్థులు ముందుగా http://satg.telangana.gov.in/prajapalana వెబ్సైట్లో తమ వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు. -
శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు
గద్వాల క్రైం: జిల్లాలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఎవరైనా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ శ్రీనివాసరావు హెచ్చరించారు. మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన నేర సమీక్షలో ఆయన మాట్లాడారు. పోలీసు అధికారులు, సిబ్బంది శాంతిభద్రతల విషయంలో అప్రమత్తంగా ఉంటూ.. అనుమానాస్పద కేసులను వేగంగా విచారించాలని ఆదేశించారు. జిల్లావ్యాప్తంగా రాత్రివేళ పెట్రోలింగ్, గస్తీని ముమ్మరం చేయాలన్నారు. ఇదివరకే నమోదైన కేసులను పారదర్శకంగా విచారించి.. బాధితులకు భరోసానివ్వాలని సూచించారు. వివిధ సమస్యలపై పోలీస్స్టేషన్కు వచ్చే బాధితులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించి ఫిర్యాదులు స్వీకరించాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం విలేజ్ రోడ్డు సేఫ్టీ కమిటీలను ఏర్పాటుచేయాలని సిబ్బందిని ఆదేశించారు. హిట్ అండ్ రన్ కేసులపై ప్రత్యేకంగా విచారణ చేపట్టాలన్నారు. ఇసుక, మట్టి, రేషన్ బియ్యం అక్రమ రవాణాతో పాటు నిషేధిత మత్తు పదార్థాలు, గంజాయి, పేకాట వంటి వాటిని కట్టడి చేయాలని సూచించారు. సరిహద్దు ప్రాంతాల్లో పటిష్ట నిఘా ఉంచాలన్నారు. స్టేషన్లో నమోదైన కేసుల విషయంలో నిర్లక్ష్యం లేకుండా వీలైనంత త్వరగా కోర్టులో చార్జీషీట్ దాఖలు చేసి, నిందితులకు శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామాల్లో అల్లర్లకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరించాలని సూచించారు. సైబర్ నేరాలపై ప్రజలకు పూర్తి అవగాహన కల్పించాలన్నారు. ఈ నెల 27 నుంచి మే 2వ తేదీ వరకు ప్రతి మండలంలో చైల్డ్ అండ్ ఉమెన్ సేఫ్టీ కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. సమావేశంలో డీఎస్పీ మొగిలయ్య, సీఐలు శ్రీను, ప్రదీప్కుమార్, ఎస్ఐలు, శ్రీకాంత్, శేఖర్, శ్రీహరి, నందికర్ ఉన్నారు. -
మార్కెట్ ఏర్పాటు చేయాలి..
కొల్లాపూర్లో వేలాది మామిడి రైతులు ఉన్నారు. వారి శ్రమను వ్యాపారులు దోస్తున్నారు. దీన్ని ప్రభుత్వం సీరియస్ అంశంగా గుర్తించారు. గతంలో మాచినేనిపల్లి సమీపంలో, ప్రభుత్వ పీజీ కళాశాల సమీపంలో మామిడి మార్కెట్ ఏర్పాటుకోసం స్థలాలను గుర్తించారు. రెండింట్లో ఏదో ఒక చోట మార్కెట్ ఏర్పాటుచేసి, వ్యాపారులు ఇక్కడే కాయలు కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటే రైతులకు మేలు చేకూరుతుంది. – సాయికృష్ణగౌడ్, మామిడి రైతు, సింగోటం ధరలు తగ్గించేశారు.. రైతులకు మామిడి పంట ఇప్పుడిప్పుడే చేతికొస్తోంది. ఈ సమయంలోనే ధరలు తగ్గించడం దారుణం. గాలివానకు భయపడి రైతులు కాయలు తెంచుతున్నారు. ఇదే అదనుగా వ్యాపారులు ధరలు తగ్గించేస్తున్నారు. ఇప్పుడున్న ధరల ప్రకారం కాయలు అమ్మితే రైతుకు నష్టమే తప్ప లాభం ఉండదు. దీనిపై అధికారులు దృష్టిపెట్టాలి. రైతులకు న్యాయం జరిగేలా చూడాలి. – పెద్దూరి లక్ష్మయ్య, మామిడి రైతు, కొల్లాపూర్ ● -
మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి
గద్వాల క్రైం: యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ఎస్పీ శ్రీనివాసరావు సూచించారు. స్థాని క భరోసా కేంద్రం ఆధ్వర్యంలో ఆరు రోజులపాటు నిర్వహించే అవగాహన కార్యక్రమాలకు సంబంధించిన బ్యానర్ను సోమవారం ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. యువత చెడు వ్యసనాలకు ఆకర్షితులై విలువైన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారన్నా రు. వారిలో చైతన్యం తీసుకొచ్చేందుకు భరోసా కేంద్రం నిర్వాహకులు అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డీఎస్పీ మొగిలయ్య, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. పోలీసు ప్రజావాణికి 13 ఫిర్యాదులు.. జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో వివిధ గ్రామాలకు చెందిన 13మంది తమ సమస్యలపై ఎస్పీ శ్రీనివాసరావుకు ఫిర్యాదులు సమర్పించారు. ఈ సందర్భంగా ఫిర్యాదుదారుల సమస్యలను ఎస్పీ నేరుగా తెలుసుకుని పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని భరోసానిచ్చారు. సివిల్ సమస్యలను కోర్టు ద్వారా పరిష్కరించుకోవాలని ఫిర్యాదుదారులకు సూచించారు. -
మామి‘డీలా’..!
కోడేరు మండలానికి చెందిన రైతు వెంకటస్వామి ఇటీవల 2.50 టన్నుల మామిడికాయలను హైదరాబాద్ మార్కెట్కు తీసుకెళ్లగా.. టన్నుకు రూ. 22వేల ధర పలికింది. మొత్తం కాయలకు రూ. 55వేలు వచ్చాయి. వీటిలో దళారుల కమీషన్ రూ. 6వేలు, కాయలు తెంపినందుకు కూలీలకు రూ. 8వేలు, వాహనం కిరాయి రూ. 7,500, మార్కెట్లో హమాలీ, భోజనం ఖర్చులు అన్నీ పోగా.. రైతుకు రూ. 29వేలు మిగిలాయి. మామిడితోట సాగుకోసం చేసిన ఖర్చులు కూడా రాలేదని సదరు రైతు ఆవేదన వ్యక్తంచేశారు. కొల్లాపూర్: ఈసారి మామిడి దిగుబడులు అరకొరగా ఉండటంతో ధరలు బాగానే ఉంటాయని రైతులు భావించారు. అయితే మార్కెట్లో వ్యాపారుల సిండికేట్కు తోడు ఏపీ నుంచి పెద్దమొత్తంలో మామిడి వస్తుండటంతో ధరలు భారీగా పడిపోయాయి. కేవలం రెండు రోజుల్లోనే ధరలను అమాంతం తగ్గించడంతో మామిడి రైతులు అయోమయంలో పడిపోయారు. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో ఉన్న ధరల ప్రకారం రైతులకు కూలి కూడా మిగలని దుస్థితి నెలకొంది. చివరలో నిలిచిన పూతలు.. ఈ ఏడాది మామిడి పూతలు గతంలో ఎన్నడూ లేనంతగా విరబూశాయి. కానీ అవి నిలవలేదు. కొన్ని తోటల్లో మాత్రమే మొదటి దశ పూతలు నిలిచాయి. జనవరిలో వచ్చిన ఆఖరి దశ పూతలు చాలా తోటల్లో నిలిచాయి. మొదటి దశ పూతలకు సంబంధించిన పంట దిగుబడి ఫిబ్రవరి, మార్చిలో వచ్చేసింది. వీటికి భారీగా ధరలు లభించాయి. టన్ను ధర పచ్చకాయలు రూ. లక్షకు పైగా, కవర్ కట్టిన కాయలు టన్నుకు రూ. 2లక్షల వరకు ధర పలికాయి. చివరలో నిలిచిన పూతలకు సంబంధించిన పంట దిగుబడి ఈ నెలలో ప్రారంభం కాగా.. మొదటి వారం నుంచే మామిడి ధరలను వ్యాపారులు తగ్గిస్తూ వస్తున్నారు. టన్నుకు కనిష్టంగా రూ.20వేల ధర.. నాగర్కర్నూల్, వనపర్తి జిల్లాల నుంచి పెద్ద మొత్తంలో మామిడికాయలను హైదరాబాద్ మార్కెట్కు తీసుకెళ్తారు. బాటసింగారం మార్కెట్యార్డుతో పాటు బాలాపూర్ మార్కెట్లో మామిడికాయల కొనుగోళ్లు సాగుతున్నాయి. వీటితో పాటు కొల్లాపూర్, పెద్దకొత్తపల్లి, జడ్చర్ల, కల్వకుర్తి ప్రాంతాల్లో కూడా వ్యాపారులు కొనుగోలు దుకాణాలను ఏర్పాటుచేశారు. మార్చి నెలాఖరు వరకు హైదరాబాద్ మార్కెట్కు రోజు 500 నుంచి 600 వాహనాల్లో మామిడికాయలు తరలించగా.. ఏప్రిల్ ప్రారంభం నుంచి ఈ సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది. రెండు వారాలుగా రోజూ 1200 వాహనాల్లో కాయలు వస్తున్నాయి. విజయవాడ, చిత్తూరు తదితర ప్రాంతాల నుంచి హైదరాబాద్ మార్కెట్కు మామిడికాయలు వస్తుండటంతో వ్యాపారులు సిండికేట్ అయ్యారు. ధరలను అమాంతం కుదించేశారు. పచ్చకాయలు టన్నుకు రూ. 20వేల నుంచి రూ. 50వేల వరకు మాత్రమే కొంటున్నారు. ఎవరో ఒక రైతుకు మాత్రమే రూ. 50వేల వరకు ధరను కట్టబెడుతున్నారు. మిగతా వారందరికీ రూ. 20వేల నుంచి రూ. 30వేలకే పరిమితం చేస్తున్నారు. కవర్కాయల ధరలు కూడా అంతంతమాత్రంగానే ఉన్నాయి. టన్నుకు రూ. 70వేల నుంచి రూ. 1.30 లక్షల వరకు కొనుగోలు చేస్తున్నామని వ్యాపారులు చెబుతుండగా.. వాస్తవానికి టన్నుకు రూ. 40వేల నుంచి రూ. 70వేల వరకే కొనుగోలు చేస్తున్నారు. ఎవరో ఒక రైతుకు మాత్రమే రూ.లక్ష వరకు ధర కల్పిస్తున్నారు. స్థానికంగా మార్కెట్ లేకపోవడమే సమస్య.. మామిడికి ప్రసిద్ధిగాంచిన కొల్లాపూర్లో మార్కెట్ లేకపోవడం పెద్ద సమస్యగా మారింది. హైదరాబాద్ మార్కెట్లో కొల్లాపూర్ మామిడిని కొనుగోలు చేసేందుకు వ్యాపారులు పోటీపడతారు. కానీ దళారులు, వ్యాపారులు కుమ్మకై ్క ధరలను అమాంతం తగ్గించేస్తున్నారు. రైతులు అడిగితే ఏపీ నుంచి కాయలు పెద్దమొత్తంలో వస్తుండటంతో ధరలు తగ్గించామనే సమాధానం చెబుతున్నారు. హైదరాబాద్ మార్కెట్లో ధరలు తగ్గితే.. స్థానికంగా కాయలు కొనుగోలుచేసే ప్రైవేటు వ్యాపారులు కూడా ధరలను తగ్గించేస్తున్నారు. కొల్లాపూర్లో ప్రభుత్వమే మార్కెట్ ఏర్పాటుచేసి.. ఇక్కడి కాయలను స్థానికంగా విక్రయించుకునే వెసలుబాటు ఉంటే రైతులకు మద్దతు ధర లభించే అవకాశం ఉంటుంది. పాలకులు ఈ దిశగా చర్యలు చేపట్టాలని మామిడి రైతులు కోరుతున్నారు. మార్కెట్లో భారీగా పడిపోయిన ధరలు టన్నుకు రూ. 20వేల నుంచి రూ. 45వేలకు మాత్రమే కొనుగోలు కవర్ కాయల పరిస్థితి కూడా అంతే.. ఆందోళనలో మామిడి రైతులు -
జనగణనకు సహకరించండి
● అన్ని వర్గాలు స్వీయ గణనలోభాగస్వాములు కావాలి ● అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ గద్వాల: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జనగణన–2027కు అందరూ సహకరించాలని అదనపు కలెక్టర్, జిల్లా ప్రధాన జనగణన అధికారి వి.లక్ష్మీనారాయణ కోరారు. సోమవారం కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ నర్సింగ్రావుతో కలిసి ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. జనగణనలో భాగంగా ఈ నెల 26 నుంచి మే 10వ తేదీ వరకు స్వీయగణనకు ప్రభుత్వం అవకాశం కల్పించిందన్నారు. ఎన్యూమరేటర్ల అవసరం లేకుండానే ప్రజలే తమ వివరాలను స్వయంగా సంబంధిత వెబ్సైట్లో నమోదు చేసుకునే సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. https:// se.census.gov.in వెబ్సైట్లో వివరాల నమోదుకు సంబంధించిన వివరాలను ఆయన వివరించారు. అన్ని వర్గాల ప్రజల స్వీయగణనలో భాగస్వాములై జిల్లాను రాష్ట్రంలోనే ముందుండేలా సహకరించాలని ఆయన కోరారు. సమావేశంలో ఆర్డీఓ శ్రీనివాసరావు, సీపీఓ పాపయ్య ఉన్నారు. పెట్రోలియం కొరత నివారణకు చర్యలు జిల్లాలో పెట్రోలియం ఉత్పత్తుల కొరత లేకుండా సరఫరా చేసేందుకు అన్ని చర్యలు చేపడుతున్నట్లు అదనపు కలెక్టర్ వి.లక్ష్మీనారాయణ అన్నారు. కలెక్టరేట్లోని తన చాంబర్లో ఎనర్జీ సప్లయ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు, పెట్రోల్ బంకుల యాజమాన్యాలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పెట్రోల్బంకుల డీలర్లకు ఆయిల్ కంపెనీలు క్రెడిట్ ప్రాతిపదికన పెట్రోలియం ఉత్పత్తులను సరఫరా చేసేవారని.. ప్రస్తుతం ముందే డబ్బులు చెల్లించాల్సిన పరిస్థితులు నెలకొనడంతో సమస్య ఉత్పన్నమైందన్నారు. మూడురోజులుగా ఆంధ్రప్రదేశ్ పెట్రోల్ బంకుల్లో స్టాక్ లేనందున కర్నూలు, సమీప ప్రాంతాల ప్రజలు పెట్రోల్, డీజిల్ కోసం జిల్లాకు వస్తుండటంతో కొరత ఏర్పడిందన్నారు. పెట్రోల్బంకుల రోజువారీ రిపోర్టు ఆధారంగా ఇంధనం కోసం బుక్ చేసిన వెంటనే కంపెనీలు సకాలంలో సరఫరా చేసేలా పౌర సరఫరాలశాఖ కమిషనర్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. సమావేశంలో జిల్లా పౌరసరఫరాల అధికారి స్వామికుమార్, కమిటీ సభ్యులు వీరప్ప, సునంద, నుషిత ఉన్నారు. అవకాశాలను అందిపుచ్చుకోవాలి నిరుద్యోగ యువత ఉద్యోగ, ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవాలని అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ అన్నారు. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లా క్రీడలు, యువజన సర్వీసులశాఖ ఆధ్వర్యంలో మే 18నుంచి 23వ తేదీ వరకు నిర్వహించనున్న వివిధ కార్యక్రమాలకు సంబంధించిన పోస్టర్ను ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. ఉమ్మడి జిల్లాస్థాయిలో మే 1న మహబూబ్నగర్లో నిర్వహించే జాబ్మేళాలో నిరుద్యోగ యువత పెద్ద ఎత్తున పాల్గొని ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అదే విధంగా ఈ నెల 30న హైదరాబాద్లో నిర్వహించే యంగ్ ఇండియా స్పోర్ట్స్ సమ్మిట్కు సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు. అర్జీలు సత్వరం పరిష్కరించాలి ప్రజావాణి అర్జీలను సత్వరం పరిష్కరించాలని అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ అన్నారు. కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. వివిధ సమస్యలపై మొత్తం 61 ఫిర్యాదులు అందగా.. పరిష్కారం నిమిత్తం ఆయా శాఖల అధికారులకు పంపించారు. నిర్ణీత సమయంలోగా ఫిర్యాదులను పరిష్కరించాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నర్సింగ్రావు, ఆర్డీఓ శ్రీనివాసరావు, ఇన్చార్జి డీవైఎస్ఓ రామలింగేశ్వర్గౌడ్ పాల్గొన్నారు. -
తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
● ఎక్కడైనా అగ్నిప్రమాదం చోటు చేసుకుంటే వెంటనే మంటలను ఆర్పివేసేందుకు నీటిని అందుబాటులో ఉంచుకోవాలి. ● ఐఎస్ఐ మార్క్ కలిగిన ఎలక్ట్రికల్ పరికరాలను ఉపయోగించాలి. ● కాల్చిన సిగరేట్లు, బీడీలు, అగ్గిపుల్లలను పూర్తిగా ఆర్పివేయాలి. ● సెల్లార్లలో ఆటోమెటిక్ స్ప్రింక్లర్లను అమర్చుకోవాలి. ● వంటగదిలో కిరోసిన్, డీజిల్, పెట్రోల్, అదనపు గ్యాస్ సిలిండర్లు ఉంచొద్దు. ● స్కూల్, షాపింగ్ మాల్స్, ఆస్పత్రుల్లో కాంక్రిట్ స్లాబ్లను మాత్రమే పైకప్పుగా వాడాలి. ● గ్రామాల్లో గడ్డివాములను నివాసగృహాలకు కనీసం 60 అడుగుల దూరంలో ఏర్పాటు చేసుకోవాలి. పూర్తిగా ఎండిన గడ్డిని మాత్రమే నిల్వ చేసుకోవాలి. ● గుడిసెకు గుడిసెకు 30 అడుగుల దూరం ఉండాలి. ప్రమాదాల నియంత్రణకు కృషి.. అగ్నిప్రమాదాల నియంత్రణకు నిరంతరం కృషి చేస్తున్నాం. ఒడిదుడుకులను ఎదుర్కొటూ విపత్తులను అధిగమిస్తున్నాం. ప్రమాదాలు చోటు చేసుకున్న క్రమంలో అగ్నిమాపక సిబ్బంది పూర్తిస్థాయిలో మంటలను అదుపులోకి తీసుకొస్తున్నారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటున్నాం. జిల్లాలో రెండు ఫైర్స్టేషన్ల ద్వారా సేవలను అందిస్తున్నాం. ఇంకా అవసరమైన మౌలిక వసతులు, సమస్యలపై ప్రభుత్వానికి నివేదిక అందజేశాం. – అశోక్, జిల్లా అగ్నిమాపక అధికారి ● -
వారబందీ మరో రెండ్రోజులే..
● ఆయకట్టులో తుది దశకు చేరుకున్న పంటలు అమరచింత: ప్రియదర్శిని జూరాల ప్రా జెక్టు కుడి, ఎడమ కాల్వల ఆయకట్టు పరిధిలో యాసంగి వరి పంట తుది దశకు చేరుకోవడంతో కాల్వలకు మరో రెండ్రోజులు మాత్ర మే సాగునీరు వదలనున్నట్లు ప్రాజెక్టు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం వారంలో మూడురోజుల పాటు సాగునీటిని అధికారులు అందిస్తున్నారు. ప్రాజెక్టులో 1.461 టీఎంసీల నీరు ఉండటంతో వేసవి దృష్ట్యా తాగునీటి అవసరాలకు వినియోగించుకునే అవకాశం ఉంది. పీజే పీ నందిమళ్ల డివిజన్ డీఈ చెన్నకేశవరెడ్డి మాట్లాడుతూ.. నీటి అవసరం ఉందని ఒకరిద్దరు రైతులు అడుగుతున్నారని.. రెండురోజుల్లో సాగునీటి సరఫరాను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు ఉన్నతాధికారులకు నివేదించినట్లు చెప్పారు. -
ఫిర్యాదు చేయండి..
జిల్లాలో విద్యాశాఖ నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా కోచింగ్ సెంటర్లను నిర్వహించొద్దు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం నిర్ణీత ఫీజు చెల్లించి.. ఫిజికల్ వెరిఫికేషన్ తర్వాత అనుమతి మంజూరు చేస్తాం. కోచింగ్ సెంటర్లను ప్రభుత్వ ఉపాధ్యాయులు నిర్వహించడానికి వీల్లేదు. ఎవరైనా అక్రమంగా కోచింగ్ సెంటర్లు నిర్వహిస్తున్నట్లు తెలిస్తే మాకు ఫిర్యాదు చేయండి. – ప్రవీణ్కుమార్, డీఈఓ సీజ్ చేయాలి కోచింగ్ సెంటర్లలో అధి క ఫీజులు, హాస్టల్ ఫీజు లు, మెటీరియల్ ఫీజులు సంఖ్యతో సంబంధం లేకుండా డబ్బులు వసూలు చేస్తున్నారు. ఎంత మంది వచ్చినా అడ్మిషన్లు ఇస్తున్నారు. అడ్డగోలుగా ప్రైవేటు భవనాలు తీసుకుని, కనీస వ సతులు లేకుండా శిక్షణ ఇస్తున్నారు. అనుమతి లేని కోచింగ్ సెంటర్లను వెంటనే సీజ్ చేయాలి. – భరత్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి, మహబూబ్నగర్ అడ్డగోలుగా ఫీజులు.. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అనేక కోచింగ్ సెంటర్లు అనుమతులు లేకుండా నిర్వహిస్తున్నారు. వెంటనే అధికారులు చర్య తీసుకోవాలి. జిల్లాస్థాయిలో కమిటీ వేసి విచారణ జరిపించాలి. చాలా కోచింగ్ సెంటర్లు ప్రారంభంలో చూపించిన ఆర్భాటం చివరి నాటికి ఉండదు. హాస్టల్స్ కూడా ఇందులో నిర్వహిస్తున్నా పట్టింపు లేదు. – మారుతి, పీడీఎస్యూ జిల్లా అధ్యక్షుడు, మహబూబ్నగర్ ● -
ఇదేం శిక్షణ!
ఉమ్మడి జిల్లాలో అడ్డగోలుగా కోచింగ్ సెంటర్ల నిర్వహణ ● ఐఐటీ, నీట్, ఎఫ్సెట్ వంటి వాటికి కొత్త ట్రెండ్ ● నవోదయ, గురుకుల, సైనిక్ స్కూల్ పోటీ పరీక్షలకు సైతం శిక్షణ ● షార్ట్, లాంగ్టర్మ్ కోచింగ్, హాస్టళ్లు సైతం కొనసాగింపు ● అన్నీ తెలిసినా.. పట్టనట్లుగా అధికారుల తీరు మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: విద్యార్థులు, వారి తల్లిదండ్రుల ఆశలను ఆసరాగా చేసుకొని ప్రైవేటు కోచింగ్ సెంటర్ల యాజమాన్యాలు విచ్చలవిడిగా నిర్వహిస్తున్నారు. కోచింగ్ సెంటర్ల ఏర్పాటుకు విద్యాశాఖ నుంచి అనుమతులు తీసుకోవాలి. కానీ, ఇక్కడి కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు వాటిని తుంగలో తొక్కి ఎలాంటి అనుమతులు లేకుండా యథేచ్ఛగా ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం ఇంటర్, పదో తరగతి పరీక్షలు ముగియగా.. ఎంసెట్, ఐఐటీ, నీట్ వంటి వాటికి డిమాండ్ ఉండడంతో పెద్దఎత్తున లాంగ్టర్మ్, షార్ట్టర్మ్ కోచింగ్ ఇస్తున్నారు. గతంలో ఎస్ఐ, కానిస్టేబుల్కు శిక్షణ ఇచ్చిన కోచింగ్ సెంటర్లు సైతం ప్రస్తుతం ఐఐటీ, నీట్కు శిక్షణ ఇవ్వడం గమనార్హం. వీటితోపాటు నవోదయ, గురుకులాలు, సైనిక్ స్కూల్స్కు సైతం పెద్దఎత్తున కోచింగ్ సెంటర్లు వెలిశాయి. వీటికి అనుమతులు లేకపోవడంతోపాటు కనీసం ట్రేడ్ లైసెన్స్ కూడా తీసుకోకుండా ఏర్పాటు చేస్తుండగా విద్యాశాఖ అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతుంది. -
మరమ్మతుకు ఎదురుచూపులు
● ‘చంద్రగఢ్’కు రూ.6.58 కోట్లు మంజూరు ● టెండర్ పూర్తయినా అగ్రిమెంట్లో జాప్యం ● 9 ఏళ్లుగా నిరుపయోగంగా నాగిరెడ్డిపల్లి ఎత్తిపోతల ● చంద్రగఢ్ లిఫ్ట్లో తాజాగా కాలిన ప్యానల్ బోర్డు ● వేసవి నాటికి పనులు పూర్తయ్యేనా? అమరచింత: దేవరకద్ర నియోజకవర్గంలోనే అతిపెద్ద ఎత్తిపోతల చంద్రగఢ్ మరమ్మతుల కారణంగా మరుగునపడింది. ఏళ్లుగా ఆయకట్టుకు సాగునీరు అందించకుండా నిరుపయోగంగా మారిన ఎత్తిపోతల మరమ్మతునకు మంత్రి వాకిటి శ్రీహరి ప్రత్యేక దృష్టి సారించి నిధులు మంజూరు చేయించారు. అప్పట్లో మక్తల్ పర్యటనకు వచ్చిన నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డికి సమస్యను విన్నవించి నిధులు మంజూరు చేయాలని వేడుకోవడం, ఎనిమిది నెలల కిందట ఆయకట్టు రైతులతో కలిసి మరోమారు వివరించడంతో వెంటనే రూ.6.58 కోట్లు మంజూరు చేయడంతో పాటు ఇందుకు సంబంధించిన జీఓ ప్రతులను సైతం సంబంధిత శాఖ అధికారులకు అందించడంతో టెండర్లు ఆహ్వానించారు. టెండర్ ప్రక్రియ 4 నెలల కిందట పూర్తవగా పనులు దక్కించుకున్న కంపెనీ నేటికీ ఒప్పందం కుదుర్చుకోలేదు. ఇదీ పరిస్థితి.. జూరాల ప్రాజెక్టు నిల్వనీటి ఆధారంగా చంద్రగఢ్, బెక్కర్పల్లి, నాగిరెడ్డిపల్లి ఎత్తిపోతలను 2005లో రూ.50 కోట్లతో పూర్తి చేశారు. ఒక్కో ఎత్తిపోతల కింద 5 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందేవిధంగా పైప్లైన్ నిర్మించారు. కాని కాంట్రాక్టర్ పనులు నాసిరకం చేపట్టడంతో పాటు పథకం నిర్వహణ బాధ్యతలను రైతులకు అప్పగించారు. నాణ్యత లేని పైపులు కావడంతో ఎక్కడికక్కడే పగిలిపోయాయి. గత ప్రభుత్వ హయంలో పైపులు మార్చేందుకు నిధులు మంజూరుకు అనేక పర్యాయలు ప్రతిపాదనలు పంపినా ఒక్క పైసా కూడా విడుదల చేయలేదు. చంద్రగఢ్, బెక్కర్పల్లి ఎత్తిపోతల పరిధిలో ప్రస్తుతం 2,800 ఎకరాల ఆయకట్టు మాత్రమే సాగవుతోంది. ● నాగిరెడ్డిపల్లి, చంద్రగఢ్ ఎత్తిపోతల పథకాల ప్యానల్ బోర్డులు కాలిపోవడంతో వీటి స్థానంలో కొత్తవి అమర్చాల్సి ఉంది. అదేవిధంగా ఆయకట్టుకు నీరందించేందుకు ఏర్పాటు చేసిన పైప్లైన్ మార్పు, లీకేజీలు సరిచేయడం, చిన్న చిన్న మరమ్మతులతో పాటు విద్యుత్ సబ్స్టేషన్లో కొత్త ట్రాన్స్ఫార్మర్లు బిగించాల్సి ఉందని ఆయకట్టు రైతులు మంత్రికి వివరించగా.. వీటి కోసం త్వరితగతిన నిధులు మంజూరు చేయించారు. ఎత్తిపోతల వారీగా ప్రతిపాదనలు.. ● నాగిరెడ్డిపల్లి ఎత్తిపోతల పథకానికి సంబంధించి గ్రావిటీ కెనాల్, పైప్లైన్ మార్పు, చిన్న సంపుహౌజ్ల నిర్మాణం, కొత్త ప్యానల్ బోర్డు ఏర్పాటుకు రూ.2.52 కోట్ల ప్రతిపాదనలు చేశారు. ● చంద్రగఢ్ ఎత్తిపోతల పథకంలో ప్యానల్ బోర్డుతో పాటు పైపులైన్ మార్చేందుకు రూ.1.93 కోట్లు అవసరమని ప్రతిపాదించారు. ● బెక్కర్పల్లి ఎత్తిపోతలకు సంబంధించిన పనుల కోసం రూ.2.13 కోట్లు అవసరమంటూ అప్పట్లోనే ఇరిగేషన్శాఖ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసి ఉన్నతాదికారులు, ప్రజాప్రతినిధులకు అందించా రు. తాజాగా మంత్రి వాకిటి శ్రీహరికి సైతం విన్న వించడంతో నిధులు మంజూరయ్యాయి. చంద్రగఢ్, బెక్కర్పల్లి, నాగి రెడ్డిపల్లి ఎత్తిపోతల పథకాల ఆధునికీకరణకు మంత్రి వాకిటి శ్రీహరి చొరవతో నిధులు మంజూ రయ్యాయి. వీటికి సంబంధించిన టెండర్ ప్రక్రియ కూడా పూర్తయింది. పనులు దక్కించుకున్న కన్స్ట్రక్షన్ కంపెనీ ఇప్ప టి వరకు అగ్రిమెంట్ మాత్రం పూర్తి చేయలేదు. త్వరలోనే అగ్రిమెంట్ పూర్తిచేసి మరమ్మ తులు చేపట్టేందుకు తగిన చర్యలు తీసుకుంటాం. – జగన్మోహన్, ఈఈ, పీజేపీ నందిమళ్ల డివిజన్ -
చదువు ప్రాముఖ్యతపై అవగాహన తప్పనిసరి
గద్వాల: అక్షరాస్యతలో జిల్లాను ముందంజలో నిలిపేందుకు గాను ప్రతి ఒక్కరికీ చదువు ప్రాముఖ్యతపై అవగాహన కల్పించాల్సిన అవసరముందని అదనపు కలెక్టర్ నర్సింగ్రావు అన్నారు. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా ఆదివారం జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ వద్ద బడిబాట ర్యాలీని ఆయన ప్రారంభించి మాట్లాడారు. విద్యార్థులు ఖాళీ సమయాల్లో నిరక్షరాస్యులైన పెద్దలకు అక్షరాలు నేర్పించాలని సూచించారు. చదువు మధ్యలో మానేసిన వారి కోసం ప్రభుత్వం సార్వత్రిక విద్యా కోర్సుల ద్వారా మరో అవకాశం కల్పిస్తోందన్నారు. ప్రభుత్వ వసతిగృహాల్లో కల్పిస్తున్న సౌకర్యాలతో పాటు ఈ ఏడాది నుంచి ఇంటర్ విద్యార్థులకు వర్తించే మధ్యాహ్న భోజన పథకంపై విస్తృతంగా ప్రచారం చేయాలని అధికారులకు సూచించారు. కాగా, చదువు మనిషికి ఆత్మస్థైర్యాన్ని, స్వయం సమృద్ధిని ఇస్తుందని పేర్కొంటూ అధికారులు, విద్యార్థులతో ప్రతిజ్జ చేయించారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమశాఖ అధికారి నుషిత, అక్బర్బాషా, రవీంద్రబాబు పాల్గొన్నారు. -
ఇందిరమ్మ ఇళ్ల పథకం.. పేదలకు వరం
ధరూరు: నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్ల పథకం ఓ వరమని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి అన్నారు. ఆదివారం ధరూరు మండలం ఓబులోనిపల్లిలో పద్మమ్మ – చిన్నజమ్మన్న ఇందిరమ్మ ఇంటిని ఆయన ప్రారంభించి.. లబ్ధిదారుకు కొత్త దుస్తులు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకంతో పేదల సొంతింటి కల నెరవేరుతోందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ దశల వారీగా ఇళ్లు నిర్మించి ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. గద్వాల నియోజకవర్గంలో మొదటి విడతగా 3,500 ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేయగా.. ఇదివరకే 1,500 ఇళ్ల నిర్మాణాలు ప్రారంభమై వివిధ దశల్లో ఉన్నాయన్నారు. త్వరలోనే ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల రెండో జాబితా విడుదలవుతుందని తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ విజయ్, సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్, మాజీ వైస్ఎంపీపీ సుదర్శన్రెడ్డి, శేఖర్, నాగన్న, సురేశ్, పాండు పాల్గొన్నారు. విద్యార్థుల జీవితాలతో చెలగాటం తగదు అలంపూర్: కాంగ్రెస్ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడటం తగదని ఎమ్మెల్యే విజ యుడు అన్నారు. బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో నిర్వహించతలపెట్టిన ఫీజుల పోరుబాట పోస్టర్లను ఆదివారం అలంపూర్ చౌరస్తాలో ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. కమీషన్లు ఇచ్చే కాంట్రాక్టర్లకు ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లిస్తున్న ప్రభుత్వం.. 13లక్షల మంది విద్యార్థుల భవిష్యత్ కోసం ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను విడుదల చేయకపోవడం దారుణమన్నారు. వి ద్యార్థుల ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్వీ జిల్లా కోఆర్డినేటర్ కుర్వ పల్లయ్య, బీఆర్ఎస్ నాయకులు నాగర్దొడ్డి వెంకట్రాములు, కిషోర్ కుమార్, రఘురెడ్డి, నర్సింహ, మాధవ్, ఆనంద్ పాల్గొన్నారు. నేటి నుంచి ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’ గద్వాలవ్యవసాయం: ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా సోమవారం నుంచి మే 23వ తేదీ వరకు రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం నిర్వహించనున్నట్లు క్లస్టర్ ఇన్చార్జి, శాస్త్రవేత్త డా.శంకర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు ఐదు బృందాలుగా ఏర్పడి, 40 గ్రామాల్లో రైతులకు శాసీ్త్రయ వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పించనున్నట్లు పేర్కొన్నారు. అదే విధంగా ఉద్యాన, పశుసంవర్ధకశాఖ అధికారులు, వ్యవసాయ విద్యార్థులు పాల్గొంటారని తెలిపారు. పాలిటెక్నిక్లో ప్రవేశాలకు దరఖాస్తులు వనపర్తిటౌన్: హైదరాబాద్లోని దుర్గాబాయి దేశ్ముఖ్ ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో అనాథ బాలికల ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీడౠ్ల్యఓ కె.సుధారాణి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుత విద్యాసంవత్సరంలో 10వ తరగతి పూర్తి చేసిన అనాథలు, తల్లిదండ్రుల నిర్లక్ష్యానికి గురైన, అక్రమ రవాణా బాధిత బాలికలు ఎలాంటి అర్హత పరీక్ష లేకుండా కళాశాలలో ప్రవేశం పొందవచ్చని పేర్కొన్నారు. డీసీఈ, డీఈఈఈ, డీసీఎం, డీఈసీఈ, డిప్లొమా ఇన్ సెమీ కండక్టర్ టెక్నాలజీ. డిప్లొమా ఇన్ ల్యాడ్స్కేప్ డైసైన్ కోర్సులు అందుబాటులో ఉన్నాయన్నారు. కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు (అనాథ బాలికలకు అవసరం లేదు), అనాథ బాలికలు తల్లిదండ్రుల మరణ ధ్రువీకరణ పత్రాలు, డిక్లరేషన్/బోనఫైడ్ సర్టిఫికేట్, టీసీ, స్టడీ సర్టిఫికేట్, పదోతరగతి మార్కుల మెమో (కౌన్సిలింగ్ సమయంలో సమర్పించాలి), 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోలతో మే నెల 25వ తేదీలోగా దరఖాస్తులను మహిళాభివృద్ధి, శిశుసంక్షేమశాఖ జిల్లా కార్యాలయంలో సమర్పించాలన్నారు. మరిన్ని వివరాలకు సెల్నంబర్లు 84659 57488, 96037 24113 లేదా జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రి ఎదురుగా ఉన్న జిల్లా బాలల పరిరక్షణ విభాగం (డీసీపీయూ)లో సంప్రదించాలని సూచించారు. -
వాసవీమాతకు ప్రత్యేక పూజలు
గద్వాలన్యూటౌన్: జిల్లా కేంద్రంలోని కన్యాకా పరమేశ్వరిదేవి ఆలయంలో ఆదివారం వాసవీమాత జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి పంచామృతాభిషేకాలు, సామూహిక క్షీరాభిషేకాలు చేశారు. అనంతరం సంప్రదాయబద్ధంగా హోమం నిర్వహించారు. సాయంత్రం అమ్మవారి ఉరేగింపు చేపట్టగా.. మహిళలు, చిన్నారుల కోలాటాలు, పోతరాజుల విన్యాసా లు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు బిలకంటి రాము, ప్రధానకార్యదర్శి నరహరి శ్రీనివాసులు, కోశాధికారి పత్తి రత్నాకర్ తదితరులు పాల్గొన్నారు. -
స్వీయ నమోదు షురూ
–8లో uగద్వాలన్యూటౌన్: జనగణన–2027లో భాగంగా స్వీయ నమోదు ప్రక్రియ ఆదివారం నుంచి ప్రారంభమైంది. ప్రభుత్వం ప్రత్యేకంగా రూపొందించిన వెబ్సైట్, యాప్ ద్వారా మే 10వ తేదీ వరకు స్వీయ గణనకు అవకాశం కల్పించారు. జనగణన మొదటి దశలో చేపట్టే ఇళ్ల లెక్కింపును 11 నుంచి జూన్ 9వ తేదీ వరకు ఎన్యూమరేటర్లు క్షేత్రస్థాయిలో చేపట్టనున్నారు. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. మొదటి దశలో ఇళ్ల గణన.. ప్రభుత్వం పదేళ్లకోసారి జనగణన నిర్వహిస్తూ వస్తోంది. అందులో భాగంగా 2011లో జనాభాను లెక్కించారు. ఆ తర్వాత 2021లో కరోనా, ఇతరత్రా కారణాలతో జనగణన ప్రక్రియ ముందుకుసాగలేదు. 2027లో డిజిటల్గా చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే జనగణనకు ఇళ్ల లెక్కింపు కీలకమైనది. ఇళ్ల గణన ద్వారా నివాసాల స్థితిగతులు, మౌలిక వసతులపై కచ్చితమైన సమాచారం సేకరించాలన్నది ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం. అందులో భాగంగా మొదటి దశలో ఇళ్ల గణన కోసం గ్రామీణ ప్రాంతాల్లో 130 నుంచి 150, పట్టణ ప్రాంతాల్లో 230 నుంచి 250 నివాసగృహలతో హౌసింగ్ లిస్టింగ్ బ్లాక్స్ (హెచ్ఎల్బీ)గా ఏర్పాటుచేశారు. బ్లాక్ వారీగా ఎన్యూమరేటర్లు ఇంటింటికీ వెళ్తారు. ఈ గణనలో ఇంటి నిర్మాణ స్వభావం, యజమాని వివరాలు, ఇంటిలో ఉండే మౌలిక సదుపాయాలైన తాగునీరు, విద్యుత్, వంటగ్యాస్, మరుగుదొడ్డి, డ్రెయినేజీ.. ఇలా మొత్తం 33 వివరాలను సేకరిస్తారు. ఇళ్ల గణనతో ప్రభుత్వానికి విద్య, వైద్యం, రహదారులు, ఇళ్లు వంటి అంశాల్లో స్పష్టత వస్తుంది. దీన్ని ఆధారంగా సంక్షేమ పథకాల రూపకల్పన చేస్తుంది. జిల్లాలో హెచ్ఎల్బీలు : 1,071 ఎన్యూమరేటర్లు : 1,087 సూపర్వైజర్లు : 191 ఇళ్ల గణన పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశాం. ఇప్పటికే గణన అధికారులకు శిక్షణ అందించాం. సూపర్వైజర్లు నిరంతరం పర్యవేక్షిస్తారు. స్వీయ గణనను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. అదే విధంగా క్షేత్రస్థాయి గణనలో భాగంగా ఇళ్లకు వచ్చే గణన అధికారులకు ప్రజలు వివరాలు తెలియజేసి, సహకరించాలి. – పాపయ్య, జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి జిల్లాలో మొదలైన జనగణన ప్రక్రియ మే 10 వరకు స్వీయ గణనకు అవకాశం 11నుంచి జూన్ 9 వరకు క్షేత్రస్థాయి పరిశీలన, నమోదు ఏర్పాట్లు పూర్తిచేసిన యంత్రాంగం స్వీయ గణన నమోదు కోసం https://se.-ce nsus.gov.i n లింక్ ఓపెన్ చేసి.. సెల్ఫ్ ఎన్యూమరేషన్ (హెచ్ఎల్ఓ) స్వీయగణన లాగిన్ వద్ద తెలంగాణ ఎంపిక చేయాలి. ఆ తర్వాత captcha ఎంటర్ చేసి, వెరిఫై, ప్రొసీడ్ క్లిక్ చేయాలి. అప్పుడు వెల్కం పేజీ డిస్ప్లే అవుతుంది. ఇక్కడి నుంచి మూడు స్టెప్లలో అడిగిన వివరాలు నమోదు చేసి సబ్మిట్ చేయాలి. తర్వాత ఏతో ప్రారంభమయ్యే 11 అంకెల ఐడీ వస్తుంది. ఈ ఐడీని నోట్ చేసుకోవాలి. మే 11 తర్వాత ఇంటికి వచ్చే గణన అధికారి (ఎన్యూమరేటర్)కు చూపిస్తే ఆయన అఫ్రూవ్ చేస్తారు. -
కాపు బాగా వస్తోంది..
నాకు మూడెకరాల మామిడి తోట ఉంది. ఏటా కాపు బాగానే వస్తోంది. ఈ ఏడాది పూత, పిందెలు రాలి కొంత దిగుబడి తగ్గింది. అయితే ధరలు బాగానే ఉన్నాయి. మా ప్రాంతంలో చాలా మంది రైతులు పండ్ల తోటలపై ఆసక్తి కనబరుస్తున్నారు. – కొండయ్య, మామిడి రైతు, కేటీదొడ్డి రెండున్నరెకరాల్లో సాగు.. నేను రెండున్నర ఎకరాల్లో బత్తాయి తోట సాగుచేస్తున్నా. మా ప్రాంతంలోని నేలలకు పండ్ల తోటలు బాగా వస్తున్నాయి. వాతావరణం కూడా అనుకూలంగానే ఉంటోంది. ఈఏడాది దిగుబడులు బాగానే వచ్చాయి. ప్రస్తుతం బత్తాయి ధరలు కూడా ఆశాజనకంగా ఉన్నాయి. – మనోహర్రెడ్డి, బత్తాయి రైతు, షాబాద్, ఇటిక్యాల మండలం రైతులను ప్రోత్సహిస్తున్నాం.. పండ్లతోటలకు ఇక్కడి నేలలు, వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండటంతో ఇక్కడి రైతులు ఆసక్తి చూపుతున్నారు. పండ్ల తోటల సాగుకు ముందుకొచ్చే రైతులను ఉద్యానశాఖపరంగా ప్రోత్సహిస్తున్నాం. ఇందుకు సంబంధించి పథకాల అమల్లో అర్హులైన రైతులను గుర్తించి.. వారికి ప్రోత్సాహకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నాం. – ఎంఏ అక్బర్, జిల్లా ఉద్యానశాఖాధికారి ● -
దాహం తీర్చడం గొప్ప సంకల్పం
అలంపూర్: ప్రజల దాహం తీర్చాలనుకోవడం గొప్ప సంకల్పమని ఎమ్మెల్యే విజయుడు అన్నారు. అలంపూర్ చౌరస్తాలో పుల్లూరు గ్రామ పంచాయతీ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని శనివారం ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పుల్లూరు పంచాయతీ ద్వారా చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ సునీతమ్మ, ఉపసర్పంచ్ అబ్దుల్ నబీ, కార్యదర్శి శ్రీనివాసులు, పీఏసీఎస్ మాజీ చైర్మన్ గజేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. చలువపందిళ్ల పరిశీలన : అలంపూర్ చౌరస్తాలోని నాలుగు రోడ్ల కూడలిలో ఏర్పాటు చేసిన చలువ పందిళ్లను ఎమ్మెల్యే పరిశీలించారు. వేసవి ఎండలు తీవ్రమవడంతో కలెక్టర్ పంచాయతీ తరుఫున చలవ పందిళ్లు ఏర్పాటు చేయాలని సూచించినట్లు తెలిపారు. దీంతో అలంపూర్, అయిజ, గద్వాల, కర్నూలు రోడ్డు మార్గాల్లో నాలుగు చోట్ల ప్రయాణికులు బస్సులు ఎక్కి దిగే చోట చలువ పందిళ్ల్లు ఏర్పాటు చేశారు. వీటిని ఎమ్మెల్యే పరిశీలించారు. ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే మార్గాల్లో చలువ పందిళ్లను పెంచాలని సూచించారు. -
తాగునీటి శాంపిల్స్ సేకరణ
ఉండవెల్లి: మండలంలోని కలుగోట్ల గ్రామస్తులు కొన్ని రోజులుగా కాళ్లు, చేతుల వాపు, కండరాళ్ల బలహీనతతో బాధపడుతున్నారు. సమాచారం అందుకున్న మిషన్ భగీరథ అధికారులు శనివారం గ్రామానికి చేరుకొని తాగునీటి శాంపిల్స్ సేకరించారు. వైద్యసిబ్బందికి ఇంటింటికెళ్లి పరీక్షలు చేశారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న వారిని కుటుంబీకులు అలంపూర్ చౌరస్తాలోని 100 పడకల ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. మరికొందరు కర్నూలులోని ఆస్పత్రికి వెళ్లి చికిత్స పొందుతున్నట్లు గ్రామస్తులు తెలిపారు. ఏఈఓ సస్పెన్షన్ కందనూలు: బిజినేపల్లి మండలం పాలెం క్లస్టర్లో పనిచేస్తున్న వ్యవసాయ విస్తరణాధికారి ఎస్.విష్ణువర్ధన్ను సస్పెన్షన్ చేస్తూ కలెక్టర్ బదావత్ సంతోష్ శనివారం ఆదేశాలు జారీ చేశారు. రైతుభరోసా పథకం నిధులను దారి మళ్లించినట్లు వచ్చిన ఆరోపణలపై విచారణ పూర్తయ్యే వరకు ఏఈఓ సస్పెన్షన్లో కొనసాగుతారని పేర్కొన్నారు. సస్పెన్షన్ కాలంలో సంబంధిత అధికారి తన ప్రధాన కార్యాలయాన్ని వదిలివెళ్లకూడదని తెలిపారు. కాగా, వెల్లగొండకు చెందిన అధికార పార్టీ నాయకుడు ఒకరు ఏఈఓ సస్పెన్షన్ నిలుపుదల చేసేందుకు విఫలయత్నం చేసినట్లు తెలిసింది. -
ఆరోగ్యవంతులే.. శ్రీమంతులు
ఔషధ గుణాలు కలిగిన దవాచాయ్.. గ్రీన్ జ్యూస్లకు ఆదరణ వనపర్తి: కరోనా తర్వాత ప్రజల ఆలోచన తీరులో చాలా మార్పు వచ్చిందనడానికి ఆరోగ్యంపై పెరిగిన శ్రద్ధనే ఉదాహరణగా చెప్పవచ్చు. యసిడిక్ ఆహారం, పానియాలను తగ్గించి సేంద్రియ ఎరువులతో పండించిన వాటిని తినడం, వందేళ్ల క్రితం నాటి ఆహారపు అలవాట్లను మళ్లీ పునఃప్రారంభించే ప్రయత్నాలు చేస్తూ.. బతికినంత కాలం ఆరోగ్యంగా జీవించే ప్రయత్నం చేస్తున్నారు. కరోనాకు ముందు డబ్బు సంపాదించే వారిని ధనవంతులుగా చెప్పుకొనేవారు. ప్రస్తుతం సంపూర్ణ ఆరోగ్యం కలవారే నిజమేన శ్రీమంతులుగా అభివర్ణించడం విశేషం. మారిన ప్రజల ఆలోచన తీరుకు అనుగుణంగా చద్దన్నం, మిల్లేట్ టిఫిన్స్, దవాచాయ్, గ్రీన్ జ్యూస్ సెంటర్లు వెలుస్తున్నాయి. శతాబ్దాల నాటి ధన్వంతరి ఆయుర్వేద శాస్త్రంతో అనుబంధం ఉన్న ధాతు ఆయుర్వేదంకు సంబంధించిన డాక్టర్ గుమ్మడవెల్లి శ్రీనివాస్ సహకారంతో ఉమ్మడి పాలమూరులోని అన్ని జిల్లాకేంద్రాల్లోనూ దవాచాయ్ సెంటర్లు వెలిశాయి. 24 మూలికల చూర్ణంతో దవాచాయ్ తయారీ కరోనా తర్వాత ప్రజల్లో ఆరోగ్యంపైపెరిగిన శ్రద్ధ నిత్యం వాకింగ్ తర్వాత తీసుకుంటున్న ఔత్సాహికులు ధాతు ఆయుర్వేదం సహకారంతోసెంటర్ల ఏర్పాటు -
మహిళలు స్వశక్తితో ఎదగాలి
గట్టు: మహిళలు స్వశక్తితో ఎదిగి ఆర్థికంగా బలపడాలని డీఆర్డీఓ ముసాయిదాబేగం సూచించారు. గట్టు మండల మహిళా సమాఖ్యలో శనివారం డబ్ల్యూసీఎంఓ సంస్థ ఆధ్వర్యంలో మహిళలు, బాలికలకు స్వయం ఉపాధి, డ్రైవింగ్పై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఆర్డీఓ మాట్లాడుతూ.. మహిళలు ఇతరులపై ఆధారపడకుండా ద్విచక్ర, త్రిచక్ర వాహనాలతో పాటు సైకిల్ డ్రెవింగ్ నేర్చుకోవాలని సూచించారు. 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళ తప్పనిసరిగా స్వయం సహాయక మహిళా సంఘాల్లో సభ్యత్వం తీసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో ఏపీడీ శ్రీనివాసులు, ఎంపీడీఓ చెన్నయ్య, ఏపీఎం మారుతి, మహిళా సమాఖ్య ప్రతినిధులు వెంకటేశ్వరి, అక్షర, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు జయభారతి, శ్రీవల్లి, జానెల్లి పాల్గొన్నారు. వేరుశనగ క్వింటా రూ.6,789 గద్వాలవ్యవసాయం: జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్యార్డుకు శనివారం 278 క్వింటాళ్ల వేరుశనగ విక్రయానికి రాగా.. గరిష్టంగా రూ. 6,789, కనిష్టంగా రూ. 3,880, సరాసరి రూ. 5,899 ధర పలికింది. అదే విధంగా 118 క్వింటాళ్ల ఆముదాలు అమ్మకానికి రాగా.. గరిష్టంగా రూ. 6,091, కనిష్టంగా రూ. 5,759, సరాసరి రూ. 5,919 ధర లభించింది. 2,119 క్వింటాళ్ల వరి (సోన) రాగా.. గరిష్టంగా రూ. 2,306, కనిష్టంగా రూ. 1,771, సరాసరి రూ. 2,009 ధర పలికింది. శనేశ్వరుడికి ప్రత్యేక పూజలు బిజినేపల్లి: మండలంలోని నందివడ్డెమాన్ శనేశ్వరాలయానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. శనిదోష నివారణ కోసం ఆలయ ప్రధాన అర్చకులు గవ్వమఠం విశ్వనాథశాస్త్రి భక్తుల చేత జిల్లేడు పూలు, తిలతైలాభిషేక పూజలు చేశారు. లింగదర్శనం అనంతరం భక్తులకు ఆలయ కమిటీ తీర్థ ప్రసాదాలు అందించారు. కార్యక్రమంలో అర్చకులు శాంతికుమార్, ఉమ్మయ్య, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. -
ఆర్టీసీ కార్మికులను గెలిపించిన ప్రభుత్వం
కల్వకుర్తి: రాష్ట్ర ప్రభుత్వం మానవత్వంతో ఒక మెట్టు దిగి.. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లకు అంగీకారంతో ప్రజాపాలన అర్థాన్ని చాటడంతో పాటు కార్మికులను గెలిపించిందని నాగర్కర్నూల్ ఎంపీ డా.మల్లు రవి అన్నారు. శనివారం కల్వకుర్తి పట్టణంలోని మున్సిపల్ చైర్పర్సన్ రత్నమాల స్వగృహంలో స్థానిక ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డితో కలిసి ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో రాష్ట్ర ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సూచన మేరకు డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క ఆధ్వర్యంలో మంత్రులు, అధికారులు కార్మికులతో చర్చించి.. వారి డిమాండ్లకు ఆమోద ముద్ర వేసిందన్నారు. గతంలో 55 రోజులపాటు ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తే నియంతలా వ్యవహరించిన మాజీ సీఎం కేసీఆర్ పార్టీ నాయకులు ప్రస్తుతం సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని ఎద్దేవా చేశారు. డబుల్బెడ్రూం ఇళ్ల పేరుతో రెండుమార్లు అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ప్రజలను మోసం చేశారన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామన్నారు. ఆర్థిక పరిస్థితులు ఇబ్బంది పెడుతున్నా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను పకడ్బందీగా అమలుచేసేందుకు ప్రణాళికాబద్ధంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని అన్నారు. సమావేశంలో రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సభ్యుడు బాలాజీ సింగ్, మాజీ సర్పంచ్ ఆనంద్ కుమార్, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి శ్రీకాంత్రెడ్డి, ఉపాధ్యక్షుడు భూపతిరెడ్డి తదితరులు ఉన్నారు. -
ఘనంగా శేషదాసుల ఆరాధనోత్సవాలు
మల్దకల్: మండల కేంద్రంలో శేషదాసుల ఆరాధనోత్సవాలు శనివారం ముగిసాయి. శేషదాసుల వంశస్తులు ధీరేంద్రదాసు, రాఘవేంద్రదాసు, శశాంకల ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు ఉత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు ప్రత్యేక భజనల చేశారు. దాసుల చరిత్రను వేదపండితులు వివరించారు. ఉత్సవాలకు గ్రామీణ భక్తులతో పాటు మహిళలు పెద్ద సంఖ్యలో హజరయ్యారు. కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు అరవిందరావు, బాబురావు, చంద్రశేఖర్రావు, ముకుందరావు, అర్చకులు మధుసూదనాచారి, రమేషాచారి, రవిచారి, శ్రీకాంత్ జోషి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
ఎస్జీఎఫ్ క్రికెట్ సంబురం
నేటినుంచి 69వ జాతీయస్థాయి అండర్–17 బాలుర క్రికెట్ టోర్నీ ● పాల్గొననున్న 31 రాష్ట్రాల జట్లు ● ఇప్పటికే జడ్చర్ల చేరుకున్న 28 జట్లు జడ్చర్ల టౌన్: పాలమూరు వేదికగా మరోసారి జాతీయ స్థాయి క్రీడాపోటీలు జరగనున్నాయి. జడ్చర్ల, మహబూబ్నగర్ కేంద్రాల్లో ఆదివారం నుంచి 69వ ఎస్జీఎఫ్ జాతీయ అండర్–17 బాలుర క్రికెట్ టోర్నీ ప్రారంభం కానుంది. మొత్తం 31 జట్లు పాల్గొంటుండగా.. ఇప్పటికే 28 రాష్ట్రాల జట్లు జడ్చర్లకు చేరుకున్నాయి. నేటి ఉదయం వరకు మిగిలిన మూడు జట్లు రానున్నాయి. ఆరు రోజుల పాటు జరిగే ఈ మెగా టోర్నీ కోసం అన్ని ఏర్పాటు చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన క్రీడాకారులు, కోచ్లకు జడ్చర్ల బస్టాండ్, రైల్వేస్టేషన్లలో ఘన స్వాగతం పలికారు. స్వామినారాయణ గురుకుల పాఠశాలలో వీరికి బస ఏర్పాటు చేశారు. జడ్చర్ల మినీ స్టేడియంలో టోర్నీ ప్రారంభం కానుంది. రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి, మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి హాజరుకాన్నారు. డీఈఓ పరిశీలన.. మెగా టోర్నీ ఏర్పాట్లను డీఈఓ ప్రవీణ్కుమార్ పర్యవేక్షించారు. స్వామి నారాయణ గురుకులానికి చేరుకుని ఇతర రాష్ట్రాల క్రీడాకారులతో మాట్లాడారు. వారికి కల్పించిన సౌకర్యాల గురించి తెలుసుకున్నారు. రిజిస్ట్రేషన్, వసతిపై ఆరా తీశారు. ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించనున్న జడ్చర్ల మినీ స్టేడియాన్ని పరిశీలించారు. ఆయన వెంట టోర్నీ కన్వీనర్ మంజులాదేవి, ఎస్జీఎఫ్ కార్యదర్శి శారదబాయి ఉన్నారు. 31 జట్లు.. 61 మ్యాచ్లు.. టోర్నమెంట్ను లీగ్ కమ్ నాకౌట్ పద్ధతిలో 20–20 ఓవర్ల విధానంలో 61 మ్యాచ్లు నిర్వహించనున్నారు. 31 జట్లను ఎనిమిది గ్రూప్లుగా విభజించారు. ఏడు గ్రూప్లో నాలుగేసి జట్లు ఉంటాయి. ఒక్క గ్రూప్లో మాత్రం మూడే జట్లు ఉంటాయి. డ్రా ద్వారా గ్రూప్లను విభజిస్తారు. ఆయా గ్రూపుల్లో అగ్రస్థానంలో నిలిచిన ఎనిమిది జట్లు క్వార్టర్ఫైనల్కు చేరుకుంటాయి. మ్యాచ్లు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, సాయంత్రం 3 గంటల నుంచి 6 గంటల వరకు నిర్వహిస్తారు. మ్యాచ్లు జరిగే మైదానాల్లో మ్యాట్లు వేశారు.క్రీడాకారులు ఇబ్బందులు పడకుండా ఉండేలా సౌకర్యాలు కల్పిస్తున్నారు. మ్యాచ్లు తిలకించేందుకు వచ్చే వారి కోసం సైతం మైదానాల వద్ద తాగునీటిని ఏర్పాటు చేస్తున్నారు. -
వికసిత్ భారత్లో యువత పాత్ర కీలకం
● ఫిట్నెస్ను జీవితంలో భాగస్వామ్యం చేసుకోవాలి ● గవర్నర్ శివప్రతాప్ శుక్లా ● ముగిసిన సంసద్ ఖేల్ మహోత్సవ్ మహబూబ్నగర్ క్రీడలు: యువతే వికసిత్ భారత్లో కీలకపాత్ర అని గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. యువతలో క్రీడాస్ఫూర్తి పెంపొందించడం ద్వారా బలమైన దేశ నిర్మాణం సాధ్యమన్నారు. మహబూబ్నగర్ జిల్లాకేంద్రంలోని మెయిన్ స్టేడియంలో పార్లమెంట్ సభ్యురాలు డీకే అరుణ ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం నిర్వహించిన ప్రధానమంత్రి సంసద్ ఖేల్ మహోత్సవ్ బహుమతుల ప్రదానోత్సంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల ప్రతిభను ఒక వేదికపైకి తీసుకొచ్చే ఈ తరహా క్రీడా ఉత్సవాలు సమగ్ర అభివృద్ధికి దోహదపడుతాయన్నారు. యోగా, మార్షల్ ఆర్ట్స్ వంటి కళలు భారతీయ సంప్రదాయాలు, శరీరక, మనస్సు, ఆత్మల సమతుల్యతను పెంపొందిస్తాయన్నారు. ఫిట్నెస్ను ప్రతి ఒక్కరూ జీవితంలో భాగస్వామ్యం చేసుకోవాలన్నారు. విజేతలందరికీ అభినందనలు తెలిపిన గవర్నర్, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన నిర్వాహకులు, కోచ్లు, తల్లిదండ్రులు, యువతను ప్రత్యేకంగా అభినందించారు. ప్రతిభను ప్రోత్సహిస్తూ క్రీడాస్ఫూర్తిని పెంపొందిస్తూ బలమైన ఐక్య భారతదేశ నిర్మాణానికి అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ పోటీల్లో ట్రోఫీలతో పాటు విన్నర్ జట్టుకు రూ.50 వేలు, రన్నరప్ జట్టుకు రూ.25 వేలు నగదు పారితోషికం అందజేశారు. క్రీడా ప్రతిభను వెలికి తీసేందుకు ఖేల్ మహోత్సవ్ గ్రామీణ యువతలోని క్రీడా ప్రతిభను వెలికితీసి, వారిని అంతర్జాతీయస్థాయిలో చేర్చేందుకు ప్రధానమంత్రి సంసద్ ఖేల్ మహోత్సవ్ దోహదం చేస్తుందని ఎంపీ డీకే అరుణ పేర్కొన్నారు. ప్రధానమంత్రి క్రీడలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. మోదీ చొరవతో ఇటీవల అంతర్జాతీయస్థాయి క్రీడల్లో దేశం ముందంజలో నిలుస్తుందన్నారు. ఖేలో ఇండియా ద్వారా గ్రామీణ ప్రాంతాల క్రీడాకారులను ప్రోత్సాహం ఇస్తున్నట్లు తెలిపారు. ● బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు మాట్లాడుతూ పిల్లలు క్రీడల్లో పాల్గొనేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని కోరారు. క్రీడల తో మంచి సమాజ నిర్మాణం జరుగుతుందన్నా రు. క్రీడల్లో ఉత్సాహంగా పాల్గొన్న యువతను అభినందిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో అంతర్జాతీయ మహిళా క్రికెటర్లు డయానా డేవిడ్, త్రిషా పూజిత, కలెక్టర్ ఖుష్బూ గుప్తా, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి మేయర్ గుమ్మాల మమత, డిప్యూటీ మేయర్ సురేందర్రెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ బెక్కరి అనిత, బీజేపీ నాయకులు శ్రీనివాస్రెడ్డి, శ్రీవర్ధన్రెడ్డి, పీఎంఎస్కేఎం పార్లమెంట్ ఇన్చార్జి జనార్దన్రెడ్డి, జిల్లా కన్వీనర్ కిరణ్కుమార్రెడ్డి, నవీన్కుమార్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ● అంతకు ముందు ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల క్రీడా జట్లు మార్చ్ఫాస్ట్ నిర్వహించగా గవర్నర్ వారి నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఖేల్ మహోత్సవ్ సందర్భంగా చిన్నారుల సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. -
కాంగ్రెస్ కౌన్సిలర్ల గైర్హాజరు
అయిజ: మున్సిపాలిటీలో శుక్రవారం కోఆప్షన్ సభ్యుల ఎన్నిక ఏకగ్రీవమైంది. మున్సిపాలిటీలోని సమావేశ మందిరంలో నిర్వహించిన ఎన్నిక కార్యక్రమానికి మున్సిపల్ చైర్మన్ సురేష్ అధ్యక్షత వహించగా.. కమిషనర్ సైదులు ప్రక్రియ నిర్వహించారు. మొత్తం 20 మంది కౌన్సిలర్లకు గాను 13 మంది బీఆర్ఎస్ పార్టీ వారు ఉండగా.. 7మంది కాంగ్రెస్ పార్టీకి చెందిన కౌన్సిలర్లు గైర్హాజరయ్యారు. పోటీ లేకపోవడంతో మొత్తం నలుగురు బీఆర్ఎస్ పార్టీ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికై న వారిలో నాగన్నగౌడ్ (జనరల్), సువర్ణ (జనరల్ మహిళ), మౌలా (మైనార్టీ), శంషాద్బేగం (మైనార్టీ మహిళ) ఉన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ నర్సింహులు, కౌన్సిలర్లు జ్యోతి, మహేశ్వరి, సరోజమ్మ, పద్మ, నర్సమ్మ, శారదాసువర్ణ, రామేశ్వరమ్మ, తిరుమలేష్, రజాక్షేక్, శివ, కృష్ణయ్య, మున్సిపల్ మేనేజనర్ అశోక్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మూడోరోజు.. నిరసనల హోరు
గద్వాల క్రైం: తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె మూడోరోజుకు చేరింది. తమ సమస్యలను పరిష్కరించే వరకు సమ్మె విరమించేదిలేదని ఆర్టీసీ కార్మికులు భీష్మించారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం జేఏసీ నాయకులను చర్చలకు పిలిచి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయాలని, గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని, కార్మికులకు రావాల్సిన పెండింగ్ బకాయిలను చెల్లించాలని నినదించారు. కండక్టర్ శంకర్గౌడు ఆత్మబలిదానం చేసుకున్నా ప్రభుత్వంలో చలనం రావడం లేదని విమర్శించారు. కార్మికులు అవినీతికి తావు లేకుండా ప్రగతి చక్రాలు పరుగులు పెడితేనే సంస్థ మనుగడ సాధిస్తుందన్న విషయం మరువొద్దన్నారు. ఎమ్మెల్యే బండ్ల మద్దతు.. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి మద్దతు తెలిపి మాట్లాడారు. రాష్ట్ర ఏర్పాటులో ఆర్టీసీ కార్మికులు కీలకంగా వ్యవహరించారన్నారు. వేలాది మంది కార్మికుల సమస్యలపై ప్రభుత్వం స్పదించి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. మృతి చెందిన ఆర్టీసీ కార్మికుడి కుటుంబానికి రూ.కోటి ఎక్స్గ్రేషియా అందించాలని పేర్కొన్నారు. బాధిత కార్మికుడి కుటుంబానికి తన తరపున రూ.లక్ష ఆర్థిక సహాయం అందజేస్తానని కార్మికుల సమక్షంలో ప్రకటించారు. కార్మికుల సమ్మెకు అఖిలపక్ష నాయకులు మద్దతు తెలిపి మాట్లాడారు. మూడోరోజు సమ్మెలో ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా 58కు పైగా బస్సులను నడిపించినట్లు డిపో మేనేజర్ సునీత వెల్లడించారు. ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో కొనసాగిన ఆందోళనలు అరకొరగానే బస్సులు.. ప్రయాణికుల తిప్పలు మద్దుతు తెలిపిన ఎమ్మెల్యే బండ్ల.. రూ.లక్ష ఆర్థిక సహాయం ప్రకటన -
పట్టించుకోవడం లేదు..
ఉపాధి హామీ కూలి డబ్బులు ఖాతాల్లో జమ కాలేదు. చాలాసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎవరూ పటించుకోవడం లేదు. కుటుంబ పోషణకు ఇబ్బందులు పడుతున్నాం. ఉన్నతాధికారులు స్పందించి ఉపాధి హామీ కూలి డబ్బులు త్వరగా వచ్చేవిధంగా చర్యలు తీసుకోవాలి. – సునీత, ఉపాధి కూలి, చంద్రశేఖర్నగర్ పైసలు వస్తలేవు.. జనవరి నుంచి ఇప్పటి వరకు ఉపాధి హామీ పనులకు వెళ్తున్నాం. గడిచిన మూడు నెలలుగా కూలి పైసలు వస్తలేవు. ఎండల్లో పనులు చేస్తున్నాం. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఉన్నతాధికారులు స్పందించి వెంటనే కూలి డబ్బులు ఇప్పించేలా చొరవ చూపాలి. – పురుషోత్తం, ఉపాధి కూలి, చెన్నిపాడు బడ్జెట్ రాగానే.. ఉపాధి హామీ కూలీలకు సంబంధించి ఉన్నతాధికారులకు నివేదిక పంపిస్తాం. ప్రభుత్వం నుంచి కూలి డబ్బులు వచ్చిన వెంటనే కూలీల ఖాతాల్లో జమ చేస్తాం. ప్రజలు ఉపాధి హామీ పథకం ద్వారా కల్పిస్తున్న కూలీ పనులను సద్వినియోగం చేసుకోవాలి. – ముసాయిదాబేగం, డీఆర్డీఓ● -
పోటీ లేకుండా ‘సహకారం’
అచ్చంపేట: అచ్చంపేట: రాష్ట్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకా ర సంఘాల(పీఏసీఎస్)పాలక వర్గాలకు నామినేటెడ్ పద్ధతిలో కొత్త కార్యవర్గాలను నియమించాలనే నిర్ణయం రాజకీయ వేడెక్కించింది. 2025 ఫిబ్రవరిలో పాలకవర్గాల గడువు ముగిసింది. గత పాలకవర్గాలనే పర్సన్ ఇన్చార్జి మేనేజింగ్ కమిటీలుగా ఆరు నెలల పాటు కొనసాగిస్తూ ఫిబ్రవరి 14న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ తర్వాత నిరవధికంగా మరో ఆరు నెలలు గడువును పొడిగిస్తూ ఆగస్టు 14న ఉత్తర్వులు జారీ చేసింది. ఇంకా గడువు ఉన్నప్పటికీ అకస్మాత్తుగా డిసెంబర్ 19న ప్రభుత్వం పాలకవర్గా లను రద్దు చేసింది. కాగా..ఊహించినట్లుగానే గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో పదవీకాలం ముగిసిన ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘాలకు త్వరలోనే నామినేటేడ్ పద్ధతిన పాలకవర్గాలను నియమించాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఉమ్మడి పాలమూరులోని ఐదు జిల్లాలో 76 పీఏసీఎస్లు ఉన్నాయి. వీటి అన్నింటికి త్వరలోనే కొత్త పాలక వర్గాలను ఏర్పాటు చేయనున్నారు. మరోవైపు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు(డీసీసీబీ), జిల్లా మార్కెటింగ్ సొసైటీ(డీసీఎంఎస్)లకు కూడా పాలకవర్గాలను నామినేటేడ్ చేసే అవకాశం ఉంది. పోటీ లేకుండా పదవులు? ఇక డైరెక్టర్ల ఎంపికలో పాత పద్ధతిలో అనుసరించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ముగ్గురు లేదా ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. సహకార శాఖ వర్గాల ప్రకారం ఈ కమిటీలో చైర్మన్, వైస్ చైర్మన్, మిగిలిన వారిని డైరెక్టర్లుగా ఎంపిక చేసే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి ఆమోదం తరువాత నామినేటేడ్ కమిటీల నియామక ప్రక్రియ త్వరలోనే ఏర్పాటయ్యే అవకాశం ఉంది. వ్యవసాయ మార్కెట్ కమిటీల మాదిరిగా ఇందులో స్థానిక ఎమ్మెల్యేలు, ఇన్చార్జి మంత్రుల నేతృత్వంలో కమిటీల ఎంపిక చేయనున్నారు. దీంతో అధికార పార్టీ నేతల్లో హర్షం వ్యక్తవుతుంటే, ప్రతిపక్షాలు ప్రజాస్వామ్య వ్యతిరేక నిర్ణయంగా అభివర్ణిస్తున్నాయి. పీఏసీఎస్ పాలనపై నియంత్రణను స్థానిక ఎమ్మెల్యేల చేతుల్లోకి అప్పగి ంచేలా ప్రభుత్వ ఆలోచనలు ఉన్నాయన్న ప్రచారం కూడా బలంగా వినిపిస్తోంది. ఉమ్మడి పాలమూరు లో 76 సొసైటీలుంటే.. నాగర్కర్నూల్లో 23, వనపర్తి 15, జోగుళాంబగద్వాల 11, మహబుబ్నగర్ 17, నారాయణపేట 10 చొప్పున సొసైటీలు పని చేస్తున్నాయి. మరో 20 కొత్త సొసైటీలు ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు వెళ్లాయి. దీంతో సొసైటీల పరిధిలో 380 మంది డైరెక్టర్లకు అవకాశం ఉంటుంది. ఇందులో నుంచి 76 మంది చైర్మన్లు, 76 మంది వైస్ చైర్మన్లను నియమిస్తారు. రాజకీయ వర్గాల్లో చర్చ పీఏసీఎస్ల గడువు ముగిసినా ప్రభుత్వం ఆరు నెల ల చొప్పున రెండుసార్లు గడువు పొడిగిస్తూ వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆదే జీఓను కొనసాగిస్తూ అకస్మాత్తుగా రద్దు చేయడం, తిరిగి నామినేటేడ్ పద్ధతిలో భర్తీ చేసేందుకు నిర్ణయం తీసుకోవడం రాజకీయ వర్గాలు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈసారి ఎన్నికలు నిర్వహించకుండా నామినేటేడ్ చేయనున్న నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీలకు మరింత చికాకుగా మారాయి. సహకార ఎన్నికల స్వస్తి పలికి, నామినేటేడ్ విధానాన్ని అమలు చేసేందుకు మొగ్గు చూపుతున్న తరుణంలో రాజకీయాలను ఒక్కసారిగా కుదిపేస్తోంది. పీఏసీఎస్ పదవులు ఇక నామినేటెడ్ నూతన సంస్కరణలా..? రాజకీయ వ్యూహమా..? ఎమ్మెల్యేల చేతుల్లోకి పీఏసీఎస్ పగ్గాలు డీసీసీబీకి కూడా నామినేటేడ్ చేసే అవకాశం -
‘ఉపాధి’కి విఘాతం
మానవపాడు: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథ కం లక్ష్యం నీరుగారుతోంది. చెమటోడ్చి పనిచేసిన కూలీలకు సకాలంలో కూలి ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారు. ప్రభుత్వ బాధ్యరాహిత్యంతో చా లామందికి మూడు నెలలుగా కూలి డబ్బులు నిలిచిపోయాయి. రెక్కాడితే గానీ.. డొక్కాడని నిరుపేదలు, చెమట చిందించి చేసిన పనికి పైసలు రాక పోవడంతో అల్లాడిపోతున్నారు. మూడు నెలలుగా కూలి డబ్బులు అందక.. ఈకేవైసీ కొర్రీలతో కూలీలు పనులకు వెళ్లడమే మానేస్తున్న పరిస్థితి వచ్చింది. మరోపక్క అధికారులేమో గ్రామాల్లో కనీసం వందమంది ఉపాధి హామీ పనులు కల్పించాలని సర్పంచ్లకు, ఫీల్డ్ అసిస్టెంట్లకు ఆదేశాలు ఇస్తున్నారు. అయితే పనిచేసిన కూలీలకు డబ్బులు రాకపోతే పనులకు ఎలా వెళ్లాలని ప్రశ్నిస్తున్నారు. చట్ట ప్రకారం 15 రోజులలో కూలి డబ్బులు జమవ్వకపోతే రోజువారీగా లెక్కేసీ పరిహారం అందించాలి. కానీ, కేంద్ర ప్రభుత్వం బ్యాంక్ అకౌంట్లు, ఆధార్ లింక్ అంశాలను అడ్డుపెట్టుకొని పథకం ఉద్దేశాన్ని నీరుగారుస్తుంది. ఉపాధి హామీ పనులు చేయించే ఫీల్డ్ అసిస్టెంట్లకు సైతం మూడు నెలలుగా వేతనాలు అందడం లేదు. ముఖ ఆధారిత హాజరు.. కేంద్ర ప్రభుత్వం జాతీయ మొబైల్ పర్యవేక్షణ విధానం (ఎస్ఎంఎంఎస్) యాప్లో కూలీల ముఖ ఆధారిత హాజరు తీసుకున్నాకే పని కల్పించాల్సి ఉంటుంది. ఫీల్డ్ అసిస్టెంట్లు, మేటీలు యాప్లో కూలీల ఫొటో తీసినప్పుడు కూలీలు కనురెప్పలు మూసి తెరవాలి. ఇలా ఐదారు సార్లు చేయాల్సి ఉంటుంది. ఇదే తరహాలో అందరి ఫొటోలు తీసి యాప్లో అప్లోడ్ చేయాలి. ఉదయం 8 గంటలకు ఒకసారి ఫొటో దిగితే మళ్లీ 12 గంటలకు తీయాలి. ఒక గ్రామంలో వందమంది కూలీలు నాలుగు, ఐదు ప్రాంతాల్లో పని చేస్తున్నారంటే అన్నిచోట్ల వెళ్లి ఫీల్డ్ అసిస్టెంట్లు రెండుసార్లు అథెంటికేషన్ ఫొటోలు తీయాల్సిందే. లేకపోతే పని చేసిన డబ్బులు అకౌంట్లో జమ కావు. ఈ ఫొటో క్యాప్చర్ ప్రక్రియను యాప్ సరిగా గుర్తించకపోవడం టెక్నికల్ సమస్యలు, సిగ్నల్స్ సరిగా అందకపోవడంతో కూలీలు పనులకు దూరమవుతున్నారు. మూడు నెలలుగా అందని కూలీల వేతనాలు ఫీల్డ్ అసిస్టెంట్లదీ అదే పరిస్థితి సకాలంలో చెల్లించకుండా అధికారుల కాలయాపన ఈకేవైసీ కొర్రీలతో పనులకు వచ్చేందుకు అనాసక్తి -
పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవాలి
గద్వాల: అకాల వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని బీఆర్ఎస్ నాయకులు నాగర్దొడ్డి వెంకట్రాములు, కుర్వపల్లయ్య ఆధ్వర్యంలో రైతులతో కలిసి శుక్రవారం కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బుధవారం కురిసిన వడగండ్ల వానకు అయిజ, రాజోలి, వడ్డేపల్లి మండలాల్లో వందలాది ఎకరాల్లో పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు. దీనిపై అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం తక్షణమే పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కోరుతూ నినాదాలు తెలిపారు. అనంతరం కలెక్టరేట్లో ఏఓ భూపాల్రెడ్డికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో నాయకులు, రైతులు రవికుమార్, కృష్ణ, వీరేష్, తిమ్మప్ప, వినయ్, వినోద్, లింగప్ప, మల్లేష్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
ఆడపిల్లల చదువే ఇంటికి వెలుగు
ఉండవెల్లి: ఆడపిల్లలు పదో తరగతి చదివితే వివాహం చేసి పంపించేవారని, ప్రస్తుతం ఆడపిల్లలే చదువులలో రాణిస్తున్నారని అదనపు కలెక్టర్ నర్సింగరావు అన్నారు. గురువారం మండలంలోని పుల్లూరు బాలికల గురుకుల పాఠశాలలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు నిర్వహించిన సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అదనపు కలెక్టర్తోపాటు ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి నుషిత, బీసీ సంక్షేమ శాఖ అధికారి అక్బర్బాషా హాజరయ్యారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ఒకప్పుడు ఇంట్లో అమ్మాయి పుట్టిందని చులకనగా చూసిన సమాజం.. ప్రస్తుతం ఆడపిల్లలు ఉన్నత చదువులు చదివి ఉద్యోగాలు చేస్తుంటే ఆడపిల్లలు అద్భుతం అని కొనియాడుతుందని పేర్కొన్నారు. గొప్ప చదువులు చదివి ఉత్తమ ఫలితాలు సాధించి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకువచ్చి మంచి ఉద్యోగాలు సాధించాలని కోరారు. ఆడపిల్లల చదువే ఇంటికి వెలుగు అని కొనియాడారు. అనంతరం విద్యార్థులు వారి తల్లిదండ్రులతో కలిసి అధికారులు మధ్యాహ్న భోజనం చేశారు. నృత్య ప్రదర్శనలతో విద్యార్థులు అలరించారు. అనంతరం కలుగోట్ల పంచాయతీ, కేజీబీవి పాఠశాలను అధికారులు తనిఖీ చేశారు. పాఠశాల ప్రహరీ త్వరగా పూర్తి చేయించాలని ప్రిన్సిపల్ రాధమ్మకు సూచించారు. -
అంగరంగ వైభవంగా రాములోరి కల్యాణం
ఎర్రవల్లి: శ్రీరాముడి జన్మనక్షత్రమైన పునర్వసు నక్షత్రాన్ని పురస్కరించుకొని బీచుపల్లి పుణ్యక్షేత్రంలోని కోదండరామస్వామి ఆలయంలో గురువారం సీతారాముల కల్యాణ వేడుకను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు సీతారాములను శోభాయమానంగా అలంకరించి.. వేదమంత్రాల నడుమ కల్యాణతంతు జరిపించారు. కల్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు ఆలయ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ముందుగా భక్తులు పవిత్ర కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించి భక్తిశ్రద్ధలతో సీతారాముల కల్యాణంలో పాల్గొని కార్యక్రమాన్ని కనులారా తిలకించారు. భక్తులకు ఆలయ పాలక మండలి ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. కార్యక్రమంలో ఆలయ మేనేజర్ సురేందర్రాజు, అర్చకులు భువనచంద్ర, దత్తుస్వామి, భానుమూర్తి, పాలక మండలి సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. -
‘నామినేషన్ తీసుకునే దిక్కులేదు’
గద్వాల: మున్సిపల్ కోఆప్షన్ సభ్యుల ఎన్నికకు సంబంధించి నామినేషన్ వేసేందుకు మున్సిపల్ కార్యాలయానికి వెళ్తే తీసుకునేందుకు ఒక్క అధికారి కూడా లేరని బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు ఆరోపించారు. గద్వాల మున్సిపల్ కౌన్సిల్లో కోఆప్షన్ సభ్యుల ఎంపికకు సంబంధించి బీఆర్ఎస్ నుంచి నామినేషన్ను వేసేందుకు గురువారం గద్వాల మున్సిపల్ కార్యాలయానికి వెళ్లారు. అయితే నామినేషన్ స్వీకరించేందుకు కార్యాలయంలో కమిషనర్ జానకీరామ్ అందుబాటులో లేరు. దీంతో నామినేషన్ పత్రాన్ని ఎవరికి ఇవ్వాలో తెలియక కొంత గందరగోళానికి గురైనట్లు కౌన్సిలర్ పులిపాటి వెంకటేష్ విలేకరులతో తెలిపారు. నామినేషన్ స్వీకరణకు చివరి తేదీ ఉన్నప్పటికీ ఉద్దేశపూర్వకంగా అధికారులు అందుబాటులో లేకుండా పోయారని ఆరోపించారు. ఈ క్రమంలో కౌన్సిలర్లు కమిషనర్తో ఫోన్లో మాట్లాడగా.. ఇన్వార్డులో నామినేషన్ పత్రం ఇచ్చి వెళ్లండని చెప్పారు. దీంతో నిర్లక్ష్య సమాధానానికి నిరసనగా కమిషనర్ చాంబర్లో బైఠాయించి నిరసన తెలిపారు. ఈ క్రమంలోనే పట్టణ ఎస్ఐ కల్యాణకుమార్ అక్కడికి చేరుకుని నిరసన తెలుపుతున్న బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లతో మాట్లాడారు. చివరికి కమిషనర్ కార్యాలయానికి వచ్చి మేనేజర్కు నామినేషన్ పత్రాన్ని ఇప్పించడంతో వివాదం సద్దుమణిగింది. కార్యక్రమంలో బీఆర్ఎస్ కౌన్సిలర్లు పులిపాటి వెంకటేష్, జగదీష్, నర్సింహ, మోహన్యాదవ్, గోపాల్, సంటెన్న, రాముడు, మంజులరాణి, జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
భగీరథ మహర్షి అందరికీ ఆదర్శం
గద్వాల: అసాధ్యం అనుకున్న గంగమ్మను భూమికి తీసుకొచ్చి సకల జీవరాశులకు నీటిని అందించిన భగీరథ మహర్షి ప్రతిఒక్కరికీ ఆదర్శమని అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ అన్నారు. గురువారం భగీరథ మహర్షి జయంతిని పురస్కరించుకుని బీసీ సంక్షేమాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్లో భగీరథుడి చిత్రపటానికి పూలమాల వేసి పూజలు చేశారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ మహర్షులు అంటేనే గొప్ప వ్యక్తులని, అందులోనూ భగీరథ మహర్షి తన తపో శక్తితో సాధించిన విజయం భవిష్యత్ తరాలకు స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు. ఎవరైనా ఏదైనా ప్రయత్నం చేసేటప్పుడు విజయం వరించకుంటే భగీరథ మహర్షిని తలుచుకోమని పెద్దలు చెప్పేవారని, దాంతో విజయం సాధించే వరకు ప్రయత్నం చేస్తూనే ఉండాలన్న అర్థం వస్తుందన్నారు. ఇలాంటి గొప్పవాళ్లు చూపిన మార్గం చేసిన సమాజ సేవ గుర్తు చేసుకునేందుకు ప్రభుత్వం ఏటా అధికారికంగా జయంతి ఉత్సవాలు నిర్వహిస్తుందన్నారు. కార్యక్రమంలో ఏఓ భూపాల్రెడ్డి, డీఈఓ విజయలక్ష్మి, సగర సంఘం నాయకులు పాల్గొన్నారు. జనగణనలో స్వీయ లెక్కింపునకు అవకాశం జనగణన–2027లో ప్రజల సౌలభ్యం నిమిత్తం స్వీయ లెక్కింపునకు అవకాశం కల్పిస్తున్నట్లు అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 26 నుంచి వచ్చేనెల 10 వరకు మొబైల్ ఫోన్, ఇంటర్నెట్ సౌకర్యం ఉన్న కంప్యూటర్ ద్వారా సెన్సెస్కు సంబంధించిన వెబ్పోర్టల్లో తమ వివరాలను పొందుపర్చవచ్చన్నారు. నమోదైన తర్వాత ఒక యూనిక్ కోడ్ వస్తుందని, దీనిని తమ ప్రాంత ఎన్యుమరేటర్లకు చూపించాలని చెప్పారు. ఇంటి సభ్యుల వివరాలను స్వయంగా నమోదు చేసుకోవడానికి ఇది సులభమైన, వేగవంతమైన పద్ధతి అన్నారు. స్వీయ లెక్కింపులో పాల్గొనడం ద్వారా గణన ప్రక్రియను వేగవంతం చేయడానికి సహకరించిన వారవుతారన్నారు. జిల్లాలోని ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులు, యువత, మహిళా, స్వయం సహాయక సంఘాలు ఇలా అన్నివర్గాల వారు స్వీయ లెక్కింపులో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. -
ఇబ్బందులు పడుతున్నాం..
మొత్తం 4 ఎకరాల్లో మొక్కజొన్న సాగుచేశాను. 100 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చి 12 రోజువుతుంది. ఇప్పటి వరకు కాంటా వేయలేదు. మొక్కజొన్న రాశుల వద్ద కాపలా కాయలేక ఇబ్బందులు పడుతున్నాం. అనుకోకుండా వర్షం పడటంతో చాలామంది రైతుల మొక్కజొన్న తడిసిపోయింది. – మార్కు, రైతు, ఉప్పల క్యాంపు, అయిజ మండలం రాత్రంతా కాపలా.. మొత్తం 120 క్వింటాళ్ల మొక్కజొన్నను కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చి 15 రోజులయ్యింది. రాత్రి సమయంలో పందులు సంచరిస్తున్నాయి. వాటిని పారదోలేందుకు రాత్రంతా కాపలా కాయాల్సి వస్తోంది. దీని వలన ఆరోగ్యం దెబ్బతింటుంది. రైతులు తెచ్చిన మొక్కజొన్నను వెంటనే కొనుగోలు చేస్తే బాగుంటుంది. – ఈశ్వరన్న, రైతు, తూంకుంట, అయిజ మండలం బ్యాగులు తెచ్చుకోవాలంట గన్నీ బ్యాగులు లేకపోవడంతో మొక్కజొన్న కాంటా వేసేందుకు ఆలస్యం అవుతుంది. రైతులే గన్నీ బ్యాగులు తెచ్చుకుంటే కొనుగోలు చేస్తామని అధికారులు చెబుతున్నారు. ఒక్కొక్క బ్యాగు ధర రూ.30. అధికారులు మాత్ర ఒక్కొక్క బ్యాగుకు రూ.15 చెల్లిస్తామంటున్నారు. ఒక్కొక్క బాగ్యుపై రైతు రూ.15 నష్టపోవాల్సి వస్తోంది. – అబ్రహం, రైతు, తూంకుంట, అయిజ మండలం ఎక్కడికక్కడే కొనుగోళ్లు చేపడుతున్నాం.. మొక్కజొన్న రైతులకు ఇబ్బందులు లేకుండా కొనుగోళ్లు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నాం. జిల్లాలో 13 చోట్ల మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేశాం. జిల్లాకేంద్రంలోని మార్కెట్ యార్డుకు రైతుల తాకిడి ఎక్కువగా ఉంది. రైతులు సమీప ప్రాంతంలోని కొనుగోలు కేంద్రంలో విక్రయించుకునేలా ఏర్పాట్లు చేస్తున్నాం. – తహమీనా, జిల్లా మార్క్ఫెడ్ అధికారి, నాగర్కర్నూల్ ● -
మక్కలు.. తిప్పలు..
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: ఉమ్మడి జిల్లాలో మొక్కజొన్న రైతులు తమ పంటను విక్రయించుకునేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో అరకొరగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేసినా పూర్తిస్థాయిలో కొనుగోళ్లు కొనసాగకపోవడంతో రైతులు తిప్పలు పడుతున్నారు. అత్యధికంగా నాగర్కర్నూల్ జిల్లాలో 1.80 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న పంటను రైతులు సాగుచేశారు. కొనుగోలు కేంద్రాల ఏర్పాటు ఆలస్యం కావడంతో పాటు అవసరం మేరకు కేంద్రాలను ఏర్పాటుచేయలేదు. ఉన్న కొద్దిపాటి కేంద్రాలకే రైతులు పెద్దసంఖ్యలో వస్తుండటం, పంటను కొనుగోలు చేసేందుకు అధికారులు చేతులెత్తేస్తుండటంతో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. పక్షం రోజులైనా కొలిక్కిరాని కొనుగోళ్లు.. ఉమ్మడి జిల్లాలో మొక్కజొన్న పంట చేతికొచ్చి సుమారు నెలరోజులు అవుతోంది. ఈసారి మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో మొక్కజొన్న కొనుగోళ్లు ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి 15 రోజులు కావస్తున్నా ఇప్పటి వరకు కొనుగోళ్లు ఊపందుకోలేదు. నారాయణపేట జిల్లాలో ఇప్పటి వరకు మొక్కజొన్న కొనుగోళ్లు ప్రారంభం కాలేదు. ఈ జిల్లాలో నర్వ మండలకేంద్రంలో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించినట్టు చెబుతున్నా ఇప్పటివరకు ఒక బస్తా కూడా కొనుగోళ్లు మొదలుపెట్టలేదు. నాగర్కర్నూల్ జిల్లాలో మొత్తం లక్ష మెట్రిక్ టన్నుల మొక్కజొన్న పంటను కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటి వరకు 24 వేల మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేశారు. మహబూబ్నగర్ జిల్లాలో 50 వేల మెట్రిక్ టన్నులకు ఇప్పటివరకు కొన్నది 760 బస్తాల మొక్కజొన్న మాత్రమే. వనపర్తి జిల్లాలో 30 వేల మెట్రిక్ టన్నులకు గానూ కేవలం వెయ్యి మెట్రిక్టన్నులు, జోగుళాంబ గద్వాల జిల్లాలో లక్ష మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయాలని లక్ష్యాన్ని నిర్దేశించుకోగా ఇప్పటివరకు 8,500 మెట్రిక్ టన్నుల మొక్కజొన్న పంటను కొనుగోలు చేశారు. అరకొర కేంద్రాలతో అవస్థలు.. ప్రధానంగా మొక్కజొన్న కొనుగోళ్లు ఆలస్యం కావడంతో పాటు అరకొరగా కేంద్రాలను ఏర్పాటుచేయడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. నాగర్కర్నూల్ జిల్లాలో ఈసారి అత్యధికంగా 1.80 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగైంది. కనీసం మండలానికో కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాల్సి ఉండగా, ఇప్పటివరకు 13 కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. వీటిలో కూడా కొనుగోళ్లు పూర్తిస్థాయిలో ప్రారంభంకాలేదు. నారాయణపేట జిల్లాలో కేవలం ఒక్కటే కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయగా, జోగుళాంబ గద్వాలలో 7, వనపర్తి జిల్లాలో 4, మహబూబ్నగర్ జిల్లాలో మూడు కేంద్రాలను ఏర్పాటుచేశారు. దూరప్రాంతాల్లోని కొనుగోలు కేంద్రాలకు పంటను తరలించేందుకు రైతులు ఇబ్బందులు పడుతున్నారు. జాతీయస్థాయిలో సత్తా అమ్రాబాద్ టైగర్ రిజర్వులోని 5 గ్రామాలకు పునరావాసం కల్పించడంపై నమూనా ప్రజెంటేషన్లో రాష్ట్ర ప్రతినిధులు సత్తాచాటారు. –8లో u -
ప్రతి గింజను ప్రభుత్వమే కొనాలి
రాజోళి: అకాల వర్షం కారణంగా దెబ్బతిన్న పంటలో ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు అన్నారు. గురువారం మండలంలోని మాన్దొడ్డి, పచ్చర్ల గ్రామాల్లో ఆయన పర్యటించి వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటలు అకాల వర్షానికి దెబ్బతినడం చాలా బాధాకరమన్నారు. పొలాల్లో ఉన్న పంటలు దెబ్బతింటే అది ప్రకృతి నష్టంగా రైతులు భావించారని, కానీ, అమ్మకానికి తీసుకెళ్లిన మొక్కజొన్న ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా తడిసిపోయిందన్నారు. కొనుగోలు కేంద్రాల దగ్గర రోజుల తరబడి ధాన్యం కుప్పలుగా ఉంచినా గన్నీ బ్యాగులు లేక కొనలేకపోవడంతో రైతులు నష్టపోతున్నారని ఆరోపించారు. ప్రభుత్వం వీలైనంత త్వరగా ధాన్యం కొనుగోలు ప్రక్రియ పూర్తిచేయాలని కోరారు. నేడు కోఆప్షన్ ఎన్నిక అయిజ: మున్సిపాలిటీలో శుక్రవారం కోఆప్షన్ సభ్యుల ఎన్నిక నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ సీహెచ్ సైదులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. మున్సిపాలిటీలోని సమావేశ మందిరంలో నిర్వహించే కోఆప్షన్ సభ్యుల ఎన్నికకు కౌన్సిలర్లు, సంబంధిత ప్రజాప్రతినిధులు హాజరుకావాలని కోరారు. బీచుపల్లి ఆలయ ఈఓగా పురేందర్ ఎర్రవల్లి: బీచుపల్లి ఆంజనేయస్వామి ఆలయ ఈఓగా పురేందర్కుమార్ను నియమిస్తూ గురువారం దేవాదాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఇక్కడ ఇన్చార్జి ఈఓగా విధులు నిర్వహిస్తున్న రామన్గౌడ్ బదిలీపై పొన్నకల్ ఆలయానికి వెళ్లడంతో ఆయన స్థా నంలో ప్రస్తుత జమ్మిచేడు జమ్ములమ్మ ఆలయ ఈఓగా విధులు నిర్వహిస్తున్న పురేందర్కు ఇన్చార్జి ఈఓగా బాధ్యతలు అప్పగించింది. 204 క్వింటాళ్ల వేరుశనగ రాక గద్వాల వ్యవసాయం: జిల్లాకేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డుకు గురువారం 204 క్వింటాళ్ల వేరుశనగ రాగా.. గరిష్టంగా రూ.6,606, కనిష్టంగా రూ.4,409, సరాసరిగా రూ.5,819 ధరలు లభించాయి. 124 క్వింటాళ్ల ఆముదాలు రాగా.. గరిష్టంగా రూ.6,069, కనిష్టంగా రూ.3,301, సరాసరిగా రూ.5,931 చొప్పున పలికాయి. 13 క్వింటాళ్ల కంది రాగా.. గరిష్టంగా రూ.6,519, కనిష్టంగా రూ.5,219, సరాసరిగా రూ.6,219 ధరలు వచ్చాయి. 1,530 క్వింటాళ్ల వరి (సోన) రాగా.. గరిష్టంగా రూ.2,308, కనిష్టంగా రూ.1,809, సరాసరిగా రూ.2,069 ధరలు లభించాయి. డ్రైవర్, కండక్టర్లు కావాలి స్టేషన్ మహబూబ్నగర్: టీజీఎస్ఆర్టీసీలో ఆర్టీసీ కార్మికుల నిరవధిక సమ్మె జరుగుతున్న నేపథ్యంలో సమ్మెకాలంలో పనిచేసేందుకు డ్రైవర్, కండక్టర్ అభ్యర్థుల నుంచి అత్యవసరంగా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆర్టీసీ రీజినల్ మేనేజర్ సంతోష్కుమార్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎంపికై న డ్రైవర్ అభ్యర్థులకు రోజుకు రూ.1000 చొప్పున, కండక్టర్ అభ్యర్థులకు రోజు రూ.800 చొప్పున పారితోషికం ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. అచ్చంపేట, గద్వాల, కల్వకుర్తి, కొల్లాపూర్, కోస్గి, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, నారాయణపేట, షాద్నగర్, వనపర్తిల నుంచి ఆసక్తిగల అభ్యర్థులు తమ సమీప డిపో మేనేజర్ లేదా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్, జిల్లా రవాణా అధికారులను సంప్రదించాలని కోరారు. డ్రైవర్ అభ్యర్థులకు తెలుగులో రాయడం, చదవడం, హెవీ ట్రాన్స్పోర్టు వెహికల్ లైసెన్స్ లేదా హెవీ గూడ్స్ వెహికల్ లైసెన్స్ లేదా హెవీ ప్యాసింజర్ వెహికల్ లైసెన్స్ (18 నెలల అనుభవంతో), 25 నుంచి 50 ఏళ్లలోపు, అదే విధంగా కండక్టర్ అభ్యర్థులకు ఎస్ఎస్సీ ఉత్తీర్ణత, 21 నుంచి 58 ఏళ్లలోపు అర్హులని తెలిపారు. నేడు సంసద్ ఖేల్ మహోత్సవ్ ముగింపు హాజరవుతున్న గవర్నర్ శివప్రతాప్ శుక్లా మహబూబ్నగర్ క్రీడలు: మహబూబ్నగర్ పార్లమెంట్ పరిధిలో ఎంపీ డీకే అరుణ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రధానమంత్రి సంసద్ఖేల్ మహోత్సవ ముగింపు వేడుకలను జిల్లాకేంద్రంలోని మెయిన్ స్టేడియంలో శుక్రవారం సాయంత్రం 5 గంటలకు నిర్వహించనున్నారు. ఇందుకోసం ప్రత్యేక వేదికను సిద్ధం చేశారు. రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు బహుమతులు అందజేయనున్నారు. అలాగే అతిథులుగా అంతర్జాతీయ మహిళా క్రికెటర్లు డయానా డేవిడ్, గొంగిడి త్రిషారెడ్డి, డబ్ల్యూపీఏల్ మహిళా క్రికెటర్ త్రిషా పూజితలు హాజరుకానున్నారు. ముగింపు వేడుకల సందర్భంగా ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. కాగా.. గురువారం బీజేపీ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్రెడ్డి, పీఎంఎస్కేఎం పార్లమెంట్ ఇన్చార్జి జనార్దన్రెడ్డి, జిల్లా కన్వీనర్ కిరణ్కుమార్, నవీన్కుమార్రెడ్డి స్టేడియంలో ఏర్పాట్లను పరిశీలించారు. -
బస్సులు.. అంతంతే
● రెండోరోజు సమ్మెలోనే ఆర్టీసీ కార్మికులు ● ప్రైవేట్ సిబ్బందితో కొనసాగిన సర్వీసులు ● భద్రత కల్పించిన పోలీసులు ● మద్దతు తెలిపిన అఖిలపక్ష నాయకులు గద్వాల క్రైం: ప్రభుత్వ నిరంకుశ వైఖరిని నిరసిస్తూ.. తమ డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ కార్మికులు గురువారం రెండోరోజు సైతం గద్వాల డిపో ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ పీఆర్సీ, డీఏ అమలు చేయకుండా తమను నిర్లక్ష్యం చేయడమే ప్రభుత్వ లక్ష్యంగా ఉందన్నారు. ఏళ్ల తరబడి సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్తున్నా పట్టించుకోవడం లేదన్నారు. తమ న్యాయమైన డిమాండ్లను విస్మరించడం సమంజసం కాదని నినదించారు. కార్మికుల సమ్మెకు అఖిలపక్ష నాయకులు మద్దతు తెలిపి మాట్లాడారు. కార్మికులను ప్రతి ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. తెలంగాణ ఉద్యమంలోనూ ఆర్టీసీ కార్మికులు సంపూర్ణ మద్దతు తెలిపారన్నారు. ఉద్యమ పార్టీగా ప్రభుత్వంలోకి వచ్చిన ప్రభుత్వం సైతం కార్మికులను విస్మరించదన్నారు. న్యాయమైన డిమాండ్ల సాధన కోసం పూర్తిస్థాయిలో మద్దతు ఉంటుందని వివరించారు. అయితే రెండోరోజు సమ్మెలో ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా 50కిపైగా బస్సు సర్వీసులను డిపో మేనేజర్ సునీత అందుబాటులోకి తీసుకువచ్చారు. గమ్యస్థానాలకు వెళ్లే బస్సులకు ఎలాంటి అవాంతరాలు లేకుండా పోలీసులు భద్రత చర్యలు చేపట్టారు. ఆర్టీసీ సిబ్బంది ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంతో సుదూర ప్రాంతాలకు వెళ్లే వారి కోసం ప్రైవేట్ సిబ్బందితో బస్సులు నడిపించారు. గ్రామీణ ప్రాంతాలకు బస్సులు లేకపోవడంతో ఆటోలు, జీపులలో రాకపోకలు సాగించారు. ఇదిలా ఉండగా ఆర్టీసీ కార్మికుల సమ్మెతో డిపోకు రెండోరోజు రూ.7 లక్షల నష్టం వాటిల్లింది. రీజియన్లో 426 నడిచిన బస్సులు రెండు రోజు గురువారం మహబూబ్నగర్ రీజియన్ పరిధిలో సాయంత్రం 5 గంటల వరకు ఆర్టీసీ అధికారుల వివరాలు మేరకు 925 బస్సులకుగాను 426 బస్సులు మాత్రమే నడిచాయి. 57 ఆర్టీసీ బస్సులు, 346 ప్రైవేట్ హైర్ బస్సులు, 23 ఈవీ బస్సులు నడిచాయి. -
కదలని ప్రగతి రథం
పోలీసుల పహారాలో.. ఆర్టీసీ ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారం కోసం సమ్మె చేపట్టడంతో పోలీసుశాఖ కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టింది. సీఐ శ్రీను ఆధ్వర్యంలో ఎస్ఐలు కల్యాణ్కుమార్, జహగీంర్, పోలీసు సిబ్బంది డిపో వద్ద సమ్మెలో ఉన్న ఉద్యోగుల నుంచి ఎలాంటి విపత్కర సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకున్నారు. ప్రయాణికుల నుంచి వ్యతిరేకత రాకుండా డిపో అధికారులతో మాట్లాడి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టి 20కిపైగా బస్సు సర్వీసులను నడిపించారు. విధుల్లోకి వచ్చిన ప్రైవేట్ డ్రైవర్లు, కండక్టర్లకు పోలీసులు రక్షణ కల్పించారు. ఉద్యోగులు సమ్మెలో పాల్గొనడంతో ఆర్టీసీ రూ.12 లక్షల ఆదాయం కోల్పోయింది. ప్రయాణికులు, బస్సులు లేక నిర్మానుష్యంగా మారిన బస్టాండ్ ప్రాంగణం గద్వాల డిపోలో నిలిచిపోయిన బస్సులు గద్వాల క్రైం: డిమాండ్ల పరిష్కారం కోసం ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెతో బుధవారం జిల్లావ్యాప్తంగా బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. రాష్ట్ర ఆర్టీసీ కార్మికుల జేఏసీ పిలుపు మేరకు తమ సమస్యలు పరిష్కరించాలని కండక్టర్లు, డ్రైవర్లు బస్ డిపోల ఎదుట ధర్నా నిర్వహించి నిరసన తెలిపారు. సమ్మెతో జిల్లావ్యాప్తంగా రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. జిల్లాలోని అనేక మార్గాల్లో బస్సులు నడవక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రధానంగా ప్రభుత్వ ఉద్యోగులు, పాఠశాల, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు, దినసరి కూలీలు, ఇతర పనుల కోసం వెళ్లే ప్రజలు బస్సులు లేక ఆటోలు, జీపులను ఆశ్రయించారు. అయితే అధికారులు ముందస్తు చర్యల్లో భాగంగా పోలీసుల పహారాలో ఉదయం 10 గంటల తర్వాత 20కిపైగా బస్సు సర్వీసులు నడిపించారు. ప్రధానంగా కర్నూలు, అయిజ, వనపర్తి జిల్లాకు ప్రైవేట్ డ్రైవర్లు, కండక్టర్లను ఏర్పాటు చేసి డిపో మేనేజర్ సునీత బస్సు సర్వీసులను ఏర్పాటు చేశారు. ఉద్యోగుల ఆగ్రహం.. ప్రభుత్వం ఉద్యోగులను ఆర్టీసీలో విలీనం చేసే ప్రక్రియ, 2021 వేతన సవరణ, 30 శాతం ఫిట్మెంట్ అమలు, మహాలక్ష్మీ పథకం కింద ఇవ్వాల్సిన నిధులు, ఉద్యోగ భద్రత, ట్రేడ్ యూనియన్లపై ఆంక్షల ఎత్తివేత, కండక్టర్, డ్రైవర్లలపై కేఎంపీఎల్, ఈపీకే వేధింపులు, 2019 సమ్మెకాలంలో నమోదైన కేసుల ఎత్తివేత తదితర విషయాలపై కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే పరిష్కారం చేస్తామని నమ్మించి మోసం చేయడంపై ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. డిపో ఎదుట గేట్ ధర్నా అనంతరం పట్టణంలో ర్యాలీ చేపట్టారు. పాత బస్టాండ్లో మానవహారం నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. మంగళవారం రాత్రి వరకు ప్రభుత్వం తమ సమస్యల పరిష్కారం కోసం స్పదించి చర్చలు చేపడుతుందని ఆశాభావం వ్యక్తం చేసినా.. మొండివైఖరితో ఈ ప్రభుత్వం వ్యవహరించడం సిగ్గుచేటన్నారు. సంస్థ అభివృద్ధికి నిర్విరామంగా పనులు చేస్తున్నామని, అలాంటి తమపై ప్రభుత్వం చిన్నచూపు చూడటం భావ్యం కాదన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి సమస్యల పరిష్కారం కోసం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. రీజియన్లో 134 నడిచిన బస్సులు స్టేషన్ మహబూబ్నగర్: ఆర్టీసీ సమ్మెతో మహబూబ్నగర్ రీజియన్ పరిధిలో సాయంత్రం 5 గంటల వరకు ఆర్టీసీ అధికారుల వివరాలు మేరకు పది డిపోల పరిధిలో 925 బస్సులకు గాను కేవలం 134 బస్సులు మాత్రమే నడిచాయి. ఆర్టీసీ బస్సులతోపాటు ప్రైవేట్ హైర్, ఈవీ బస్సులు రోడ్డెక్కాయి. కోస్గి డిపోలో ఒక్క బస్సు రోడ్డెక్కలేదు. మహబూబ్నగర్ డిపో పరిధిలో అత్యధికంగా 40 బస్సులు నడిపించారు. జిల్లాలో మొదటి రోజు రోడ్డెక్కని ఆర్టీసీ బస్సులు డిపో గేటు ఎదుట జేఏసీ ఆధ్వర్యంలోకార్మికుల ధర్నా జిల్లావ్యాప్తంగా తీవ్ర ఇబ్బందులు పడిన ప్రయాణికులు జిల్లాకేంద్రంలో పోలీసుల పహారాలో బస్సులు రాకపోకలు ప్రభుత్వం తీరుపై ఉద్యోగుల ఆగ్రహావేశాలు -
చేతి నైపుణ్యం కళలను నేర్చుకోవాలి
గద్వాల న్యూటౌన్: మనల్ని మనం గెలవాలంటే ముందుగా మన మనస్సును గెలవాలని అదనపు కలెక్టర్ నర్సింగరావు అన్నారు. ప్రజాపాలన– ప్రగతి ప్రణాళికలో భాగంగా కేజీబీవీ సంక్షేమ వారో త్సవాలను పురస్కరించుకొని బుధవారం బాలభవన్లో విద్యార్థులకు చిత్రలేఖనం, స్టోరీ టెల్లింగ్, నాట్యం, పాటలు, ఆర్ట్ క్రాప్ తదితర పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన మనస్సును గెలవాలని, దానికి తగిన శ్రమను అందించాలని అప్పుడు విజయం అనేది సొంతమవుతుందని చెప్పారు. విద్యార్థిని, విద్యార్థులు చదువుతోపాటు, మానసికంగా ఆరోగ్యంగా ఉండటానికి చేతి నైపుణ్యం కలిగిన కళలను కూడా నేర్చుకోవాలన్నారు. ఇలాంటి పోటీలు విదార్థినుల్లో ఉత్సాహాన్ని నింపుతాయన్నారు. డీఈఓ విజయలక్ష్మి మాట్లాడుతూ ప్రతి విద్యార్థి నిర్ధిష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకొని చదవాలని, అప్పుడే ఉన్నత స్థానానికి చేరుకుంటామన్నారు. అనంతరం విద్యార్థినులకు జ్ఞాపికలు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా ఎస్సీ సంక్షేమ అధికారి నుషిత, జిల్లా బీసీ సంక్షేమ అధికారి సయ్యద్ అక్బర్ పాషా, కేజీబీవీ కోఆర్డినేటర్ జ్యోతి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
వీధుల్లో భౌయం..!
గద్వాల: జిల్లాలో వీధికుక్కల బెడదతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. గుంపులు, గుంపులుగా తిరుగుతూ ఆరుబయట కనిపిస్తే చాలు జనాలపై దాడులు చేస్తున్నాయి. వృద్ధులు, చిన్నారులు బయటకు వెళ్లాలన్నా.. విద్యార్థులు పాఠశాల నుంచి ఇంటికి రావాలన్నా.. తల్లిదండ్రుల గుండెల్లో వణుకు పుట్టిస్తున్నాయి. ప్రజలు ఇంట్లోంచి కిరాణా షాపులు, ఇతర పనులకు, కూలీకి వెళ్లాలన్న భయపడుతున్నారు. ప్రజలు ఏమాత్రం అప్రమత్తంగా లేకున్నా వెంబడించి మరీ దాడి చేస్తున్నాయి. ఇక రాత్రిళ్లు రోడ్లపై ద్విచక్రవాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. జిల్లావ్యాప్తంగా గడిచిన మూడు నెలల వ్యవధిలో వెయ్యికిపైగా కుక్కకాటు కేసులు నమోదవడమే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఎండలకు తాళలేక.. కుక్కలు మనుషులపై దాడులకు పాల్పడటానికి ప్రధాన కారణం ఇటీవల వేసవిలో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో కుక్కలు ఎండతాపానికి తాళలేక ఇరిటేషన్కు గురై ఇలాంటి దాడులు చేస్తున్నాయని పశుసంవర్ధక శాఖ అధికారులు చెబుతున్నారు. అధిక ఉష్ణోగ్రతలకు దాహం ఎక్కువై పిచ్చిగా ప్రవర్తిస్తాయని చెప్పారు. అదేవిధంగా సరైన ఆహారం దొరక్కపోవడం వంటి కారణాలతో ఆగ్రహం చెంది ఎవరు కనిపిస్తే వారిపై దాడులకు తెగబడుతాయని పేర్కొంటున్నారు. మాంసం దుకాణాల వద్ద జిల్లాలో చికెన్ సెంటర్లు, మాంసం దుకాణాలు అధికంగా వెలిశాయి. ఇందులో ముఖ్యంగా గద్వాల మున్సిపాలిటీ పరిధిలోనే ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి. మాంసం, చికెన్ సెంటర్ల వద్ద కుక్కలు గుంపులు, గుంపులుగా ఉండి అక్కడ లభించే వ్యర్థాలు తినేందుకు అలవాటు పడ్డాయి. చికెన్ తీసుకెళ్లేందుకు వచ్చే జనాల మీదకు విరుచుకుపడుతూ చికెన్ను లాగేసుకుంటున్న సందర్భాలు లేకపోలేదు. ఈ క్రమంలో ప్రతిఘటించలేక కుక్కకాటుకు గురై గాయపడుతున్నారు. అనధికారికంగా మరిన్ని.. జిల్లావ్యాప్తంగా గడిచిన మూడు నెలల్లో వెయ్యికిపైగా కుక్క కాటు కేసులు నమోదయ్యాయి అంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఫిబ్రవరిలో 520, మార్చిలో 321, ఏప్రిల్లో 220 కుక్కకాటు కేసులు నమోదైనట్లు వైద్యాధికారుల లెక్కలు వెల్లడిస్తున్నాయి. అధికారిక లెక్కలే ఇంతమొత్తంలో ఉంటే అనధికారికంగా మరిన్ని ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. నిర్లక్ష్యం చేయొద్దు.. కుక్క కాట్లపై ప్రజలు ఏమాత్రం నిర్లక్ష్యం చేయొద్దని వైద్యాధికారులు చెబుతున్నారు. కుక్క కాటు వేసిన ప్రాంతంలో ముందుగా సబ్బుతో శుభ్రం చేయాలి. ఆ తర్వాత వెంటనే ఆస్పత్రికి వెళ్లి సరైన వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలి. ఇందులో ముఖ్యంగా వీధికుక్కలు కరిస్తే కచ్చితంగా ఇమ్యూనోగ్లోబిన్, వ్యాక్సినేషన్ ఇప్పించాలి. అదేవిధంగా కుక్కల బారిన పడకుండా బయటకు వెళ్లే సమయంలో చేతిలో కర్రను తీసుకెళ్లడం అలవాటుగా చేసుకోవాలి. అదేవిధంగా వీధుల్లో తిరిగే కుక్కల ప్రవర్తనలో తేడా గమనిస్తే వెంటనే మున్సిపల్ అధికారులకు సమాచారం అందించి వాటిని తరలించేలా చర్యలు తీసుకోవాలి. అందుబాటులో మందులు.. కుక్కకాటుకు సంబంధించి మూడు నెలల కాలంలో వెయ్యికిపైగా కేసులు నమోదయ్యా యి. వీరికి అవసరమైన వ్యాక్సిన్లను అందిస్తు న్నాం. అదేవిధంగా కుక్కకాటుకు గురైన వారు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్య చికిత్స తీసుకోవాలి. జిల్లాలోని అన్ని పీహెచ్సీలు, జనరల్ ఆస్పత్రి, అలంపూర్ సీహెచ్సీలో పూర్తిస్థాయిలో మందులు అందుబాటులో ఉన్నాయి. – రాజ్యలక్ష్మి, జిల్లా ఎపిడమాలజిస్ట్ జిల్లాలో భయపెడుతున్న గ్రామసింహాలు అధిక ఉష్ణోగ్రతలతో మరింత రెచ్చిపోతున్న వీధికుక్కలు మూడు నెలల వ్యవధిలో వెయ్యికిపైగా కుక్కకాటు కేసులు -
క్రీడల్లో ఉన్నత స్థాయికి ఎదగాలి
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: విద్యార్థులు క్రీడల్లోనూ ఉన్నత స్థాయికి ఎదగాలని పాలమూరు యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ జి.ఎన్.శ్రీనివాస్ అన్నారు. ‘ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళికశ్రీలో భాగంగా పీయూలో విద్యార్థులకు ఇంటర్ డిపార్ట్మెంటల్ స్పోర్ట్స్ మీట్ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం కబడ్డీ క్రీడలను ప్రారంభించి ఆయన మాట్లాడారు. మనిషి ఆరోగ్యానికి క్రీడలు ఎంతో మేలు చేస్తాయని, నిరంతరం ఉత్తేజంగా పనిచేయడానికి సహకరిస్తాయన్నారు. అనంతరం గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో పీయూ రిజిస్ట్రార్ పూస రమేష్బాబు, ఫిజికల్ డైరెక్టర్ డా.వై.శ్రీనివాసులు, సిబ్బంది అభిషేక్, శారద, మన్యం పాల్గొన్నారు. -
ఆదిశిలా క్షేత్రంలో న్యాయమూర్తి పూజలు
మల్దకల్: ఆదిశిలా క్షేత్రమైన స్వయంభూ లక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయాన్ని బుధవారం గద్వాల ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి నేరళ్ల వెంకట హైమాపూజిత దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ ప్రహ్లాదరావు, అర్చకులు రమేషాచారి, మధుసూదనాచారి, రవిచారి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అర్చకులు పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ చైర్మన్ ప్రహ్లాదరావు ఆలయ విశిష్టతను వివరించి శేషవస్త్రంతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు. 271 క్వింటాళ్ల వేరుశనగ రాక గద్వాల వ్యవసాయం: జిల్లాకేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డుకు బుధవారం 271 క్వింటాళ్ల వేరుశనగ రాగా గరిష్టంగా రూ.6,880, కనిష్టంగా రూ.4,099, సరాసరిగా రూ.5,686 ధరలు లభించాయి. 195 క్వింటాళ్ల ఆముదాలు రాగా.. గరిష్టంగా రూ.6,059, కనిష్టంగా రూ.3,961, సరాసరిగా రూ.5,869 పలికాయి. 24 క్వింటాళ్ల కంది రాగా.. గరిష్టంగా రూ.6,619, కనిష్టంగా రూ.2,166, సరాసరిగా రూ.5,689 ధరలు పలికాయి. 1,550 క్వింటాళ్ల వరి (సోన) రాగా.. గరిష్టంగా రూ.2,256, కనిష్టంగా రూ.1,809, సరాసరిగా రూ.2,109 ధరలు లభించాయి. జడ్చర్ల/దేవరకద్ర: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్లో బుధవారం వేరుశనగకు క్వింటా గరిష్టంగా రూ.7,151, కనిష్టంగా రూ.4,879 ధరలు లభించాయి. ఆముదాలు గరిష్టంగా రూ.6,347, కనిష్టంగా రూ.5,760, జొన్నలు రూ.5,209, ధాన్యం హంస రూ.1,669, ఆర్ఎన్ఆర్ గరిష్టంగా రూ.2,500, కనిష్టంగా రూ.1,689, మొక్కజొన్న గరిష్టంగా రూ.1,818, కనిష్టంగా రూ.1,416 ధరలు పలికాయి. దేవరకద్ర మార్కెట్లో ఆర్ఎన్ఆర్ ధాన్యం గరిష్టంగా రూ.2,161, కనిష్టంగా రూ.1,900, హంస ధాన్యం గరిష్టంగా రూ.1,729, ఆముదాలు రూ.6,092గా ధరలు నమోదయ్యాయి. ఇద్దరు ఆర్టీసీ కార్మికులపై కేసు నమోదు : ఎస్పీ నాగర్కర్నూల్ క్రైం: ఆర్టీసీ సమ్మెలో భాగంగా బస్సులు నడపకుండా ఇబ్బందులకు గురిచేసిన ఇద్దరు కార్మికులపై కేసు నమోదు చేసినట్లు ఎస్పీ సంగ్రామ్ సింగ్జీ పాటిల్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. సమ్మెలో నేపథ్యంలో ఆర్టీసీ బస్సులకు ఆటంకం కలిగించిన కొల్లాపూర్లో, కల్వకుర్తిలో ఒక్కొక్కరిపై కేసు నమోదైందన్నారు. ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా ప్రైవేటు ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు విధుల్లో చేరితే వారిని ఎవరైనా ఆర్టీసీ కార్మికులు ఆపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 50 శాతం సబ్సిడీపై తీగజాతి కూరగాయలు కొల్లాపూర్ రూరల్: రాష్ట్ర ఉద్యాన శాఖ ద్వారా ఆర్కేవీవై పథకంలో భాగంగా రైతులు తీగ జాతి కూరగాయలు సాగు చేయడానికి తీగ జాతి పందిరి నిర్మాణాల కోసం 50 శాతం సబ్సిడీ అందిస్తుందని కొల్లాపూర్ ఉద్యాన శాఖ అధికారి లక్ష్మణ్ తెలిపారు. బుధవారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వం పందిరి నిర్మాణానికి అయ్యే ఖర్చులో 50 శాతం రైతులకు చెల్లిస్తుందన్నారు. కాకర, బీర, సోర, పొట్ల, దొండ వంటి తీగ జాతి కూరగాయలు పండించడానికి ప్రభుత్వం ప్రోత్సాహం ఇస్తుందన్నారు. -
కన్నీళ్లే మిగిలాయి..
● నిండా ముంచేసిన అకాల వర్షం ● తడిసిన వరి, మొక్కజొన్న ధాన్యం మాన్దొడ్డిలో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న రైతులు శాంతినగర్ కొనుగోలు కేంద్రం వద్ద మొక్కజొన్న ఆరబోస్తున్న రైతు రాజోళి: అకాల వర్షానికి రైతులు నట్టేట మునిగారు. పలుచోట్ల కురిసిన వడగళ్ల వాన దెబ్బకు రైతులకు ధాన్యం ఆనవాళ్లు మాత్రమే మిగిలాయి. పొలాల్లో ఉన్న వరి పంట, అమ్మేందుకు తీసుకువచ్చిన మొక్కజొన్న వర్షంలో తడిసిపోయి రైతులకు కన్నీళ్లే మిగిలాయి. మంగళవారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో మొదలైన వర్షం.. రాత్రి మొత్తం కురిసింది. దీంతో ఆరుకాలం కష్టపడి పండించిన పంట మొత్తం వర్షార్పణం అయ్యింది. రాజోళి మండలంలో మార్కెట్కు తీసుకువచ్చిన మొక్కజొన్న తడిసిపోగా.. మాన్దొడ్డి, పెద్దధన్వాడ, పచ్చర్ల శివార్లలో వరి పంట మొత్తం నేలవాలింది. చేతికొస్తున్న పంటకు ఉన్న వడ్ల గింజలు మొత్తం రాలిపోయాయి. వరి పంటలో నీరు నిలిచి పంట పూర్తిగా దెబ్బతింది. అధికారులపై ఆగ్రహం.. మండలంలో అకాల వర్షం కురిసి పంటలు నష్టపోతే సంబంధిత అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని మాన్దొడ్డిలో అధికారులపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పంట నష్టపరిహారం ఇవ్వాల్సిందేనని, ఎంత ఇస్తారో చెప్పాలని అధికారులను నిలదీశారు. శాంతిగనర్లోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రం దగ్గర మంగళవారం కురిసిన వర్షానికి ధాన్యం తడిసింది. రైతులు ధాన్యంపై కవర్లు కప్పినా ఈదురు గాలులు కారణంగా కవర్లు తొలగిపోయి.. ధాన్యం మొత్తం తడిసిపోవడంతో ఆరబెట్టడానికి నానా ఇబ్బందులు పడ్డారు. -
నాణ్యతా ప్రమాణాలు పాటించండి
అయిజ: కొనుగోలు కేంద్రానికి మొక్కజొన్నను తీసుకువచ్చే ముందు రైతులు నాణ్యతా ప్రమాణాలు కచ్చితంగా పాటించాలని జిల్లా వ్యవసాయ అధికారి వీరప్ప సూచించారు. అయిజలోని వ్యవసాయ మార్కెట్ సబ్ యార్డులో నిర్వహిస్తున్న మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం ఆయన ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొక్కజొన్నలో తేమశాతం 14 కంటే తక్కువ ఉండాలని, తాలు, గింజలు, దుమ్ము, మట్టి, ఇసుక లేకుండా శుభ్రపరచాలని రైతులకు సూచించారు. రైతులకు టోకెన్లు త్వరగా ఇవ్వాలని కొనుగోలు కేంద్రం నిర్వాహకులను ఆదేశించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి జనార్దన్, వ్యవసాయ విస్తరణ అధికారులు అశోక్, కృష్ణవర్ధన్రెడ్డి, పీఏసీఎస్ సీఈఓ మల్లేష్, సిబ్బంది జీవన్, ఆంజనేయులు, రైతులు పాల్గొన్నారు. -
తుమ్మిళ్లకు షాక్
–8లో uరాజోళి: ఆర్డీఎస్ ఆయకట్టు కోసం తుంగభద్ర నది నుంచి సాగునీరు ఎత్తిపోసే పథకానికి అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం 2018లో శ్రీకారం చుట్టింది. తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం పేరుతో చేపట్టిన ఈ పథకంలో భాగంగా నది నుంచి నీటిని మోటార్ల ద్వారా ఎత్తిపోసి ఆర్డీఎస్ కెనాల్ నుంచి ఆయకట్టుకు అందిస్తున్నారు. ఈ ప్రక్రియ ద్వారా రైతులకు గడ్డు కాలంలో ఉపశమనం కలుగుతుంది. చివరి ఆయకట్టు వరకు పూర్తిస్థాయిలో కాకపోయినా.. పంటలు ఎండకుండా కొంత వరకు, పూర్తిస్థాయిలో తడులను అందిస్తూ కొంత వరకు ఆయకట్టుకు ఊపిరి పోస్తుందనే చెప్పాలి. ఈ నేపథ్యంలో జిల్లాలో అత్యంత ప్రాముఖ్యత ఉన్న తుమ్మిళ్ల లిఫ్టునకు కరెంటు బిల్లు బకాయి పేరుకుపోవడంతో జిల్లా రైతుల చర్చ దానిపైనే వినిపిస్తుంది. ఇప్పటికై తే బిల్లులు కట్టకపోయినా ఇబ్బందిపడే అవసరం లేకపోయినప్పటికీ భవిష్యత్లో ఎత్తిపోతల నుంచి అవసరాలు పెరిగి కరెంటు వాడకం పెరిగితే అప్పుడైనా సమస్య వస్తుందని దాని కంటే ముందే ప్రభుత్వం దీనిపై చర్యలు తీసుకోవాలని రైతులు పేర్కొంటున్నారు. 50 టీఎంసీలకు పైగానే.. 2018లో తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం ప్రారంభం కాగా అప్పటి అవసరాల దృష్ట్యా మూడు మోటార్లకు బదులుగా ఒక 5.5 మెగావాట్ల మోటార్ ద్వారానే నీటిని ఎత్తిపోసి డిస్ట్రిబ్యూటర్–23 దగ్గర కెనాల్లోకి వదులుతున్నారు. దీని ద్వారా నీరు ఆర్డీఎస్ ఆయకట్టుకు అందుతుంది. అయితే లిఫ్టు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు 50 టీఎంసీలపైగా నీటిని ఎత్తిపోసినట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. లిఫ్టు ప్రారంభం నుంచి గడిచిన ఏడాదిలో అత్యల్పంగా 2.2 టీఎంసీలను విడుదల చేశారు. వర్షాలు సమృద్ధిగా కురిసిన నేపథ్యంలో నీటి విడుదల ఎక్కువగా చేయకపోవడంతో, వర్షాలు లేని సమయంలో నీటి విడుదల చేసేందుకు మోటార్ వాడకం ఎక్కువగా జరిగిందని అధికారులు చెబుతున్నారు. దీంతో లిఫ్టు ప్రారంభం నుంచి ఇప్పటి దాకా 50 టీఎంసీల వరకు నీటిని వినియోగించగా.. దాని కోసం ఒక మోటార్ పనిచేయడంతో ఒక్క టీఎంసీకి రూ.కోటి చొప్పున బిల్లు వచ్చినట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. తుమ్మిళ్ల మోటార్ ద్వారా ఆర్డీఎస్ కెనాల్కు విడుదల అవుతున్న నీరు ఒక్క మోటారుకే ఇంత బిల్లా? తుమ్మిళ్లకు సంబంధించి ఇప్పటి వరకు రూ.121.12 కోట్ల బిల్లు రాగా.. ఇందులో రూ.20.68 కోట్లు మాత్రమే చెల్లింపులు చేశారు. ఇంకా రూ.99.04 కోట్లకు పైగా బిల్లు బకాయిలు ఉన్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం వాడుతున్న నీటికి కేవలం ఒక్క 5.5 మెగావాట్ల మోటార్నే వాడుతున్నారు. పథకం మొత్తంలో రెండు 5.5, ఒక 10.5 మెగావాట్ల మోటార్ ఏర్పాటు చేశారు. కానీ, ప్రస్తుతం వాడుతుంది ఒక్క 5.5 మోటార్ మాత్రమే. రిజర్వాయర్లు ఏర్పాటైతే మూడు మోటార్లు వాడాల్సి వస్తుంది. ఒక్క మోటార్ వాడితేనే ఇంత బిల్లు వస్తే.. మూడు మోటార్లు వాడితే వచ్చే బిల్లు, చెల్లించడంలో ప్రభుత్వం ఇంకెంత నిర్లక్ష్యం చేస్తుందోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. బిల్లు తడిసిమోపెడయ్యాక కరెంట్ అధికారులు ఒక్కసారిగా మీద పడితే అప్పుడు చేసేదేమి ఉండదని, సమస్య తక్కువగా ఉన్నప్పుడే పరిష్కరించుకోవాలని సూచిస్తున్నారు. గడ్డు కాలంలో లిఫ్టు నుంచి నీరు వాడుకోవాల్సిన సమయంలో విద్యుత్ శాఖ నుంచి షాక్ వస్తే రైతులకే నష్టం వస్తుందని అంటున్నారు. ఇలా బిల్లులు పెండింగ్లో ఉంచడం వల్ల భవిష్యత్లో నిర్మించాల్సిన రిజర్వాయర్లపైన, ఇతర పనులపైనా ప్రభావం చూపే అవకాశాలు లేకపోలేదని రైతులు అంటున్నారు. ఎత్తిపోతల విద్యుత్ బకాయిలు రూ.90 కోట్లపైమాటే.. 2018 నుంచి పెండింగ్లో రూ.121.12 కోట్ల కరెంట్ బిల్లు ఇప్పటి వరకు చెల్లించింది రూ.20.68 కోట్లే.. -
సమ్మెకు సై..
నేటి నుంచి ‘ఆర్టీసీ’ బంద్ ● పలు డిమాండ్ల సాధనకు కార్మికుల ఆందోళన బాట ● రీజియన్లోని 10 డిపోల పరిధిలో నిలిచిపోనున్న బస్సు సర్వీసులు ● అధికారుల ప్రత్యామ్నాయ ఏర్పాట్లు.. అద్దె బస్సులు నడిపేలా చర్యలు కార్మికుల ప్రధాన డిమాండ్లు ● ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియను వెంటనే ప్రారంభించాలి. ● 2021 వేతన సవరణను 30 శాతం ఫిట్మెంట్తో అమలు చేయాలి. 2025 వేతన సవరణ అమలు చేయాలి. ● మహాలక్ష్మి పథకం కింద ప్రభుత్వం ఇవ్వాల్సిన డబ్బులను క్రమం తప్పకుండా నెలనెలా ఆర్టీసీకి ఇవ్వాలి. ● ఆర్టీసీ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలి. ● ట్రేడ్ యూనియన్లపై ఆంక్షలు ఎత్తివేసి గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలి. ● ఆర్టీసీ ఉద్యోగులపై పనిభారాలు తగ్గించాలి. ● ఎలక్ట్రిక్ బస్సులను ప్రభుత్వమే కొనుగోలు చేసి ఆర్టీసీకి ఇవ్వాలి. ● రద్దీకనుగుణంగా బస్సుల సంఖ్యను పెంచాలి. ● అన్ని కేటగిరీల్లో ఖాళీలను భర్తీ చేయాలి. ● రిటైర్డ్ అయిన ఉద్యోగుల బకాయిలు అన్నింటినీ చెల్లించాలి. ● మహిళా కార్మికుల సమస్యలను పరిష్కరించాలి. డిపో బస్సులు అచ్చంపేట 80 గద్వాల 108 కల్వకుర్తి 103 కొల్లాపూర్ 65 కోస్గి 27 మహబూబ్నగర్ 152 నాగర్కర్నూల్ 81 నారాయణపేట 97 షాద్నగర్ 91 వనపర్తి 121 సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: పలు డిమాండ్ల సాధన దిశగా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కార్మికులు సమ్మె సైరన్ మోగించారు. ఇప్పటికే ప్రభుత్వానికి సమ్మె నోటీస్ అందజేసిన ఆర్టీసీ జేఏసీ డిపోల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఆయా సంఘాల ఆధ్వర్యంలో డిపోల ఎదుట గేటు సమ్మె చేపట్టి కార్మికులను జాగృతం చేశారు. ఈ మేరకు బుధవారం నుంచి సమ్మెకు దిగనున్నారు. తొలి సర్వీస్ నుంచే విధులు బహిష్కరించనున్నట్లు జేఏసీ నేతలు స్పష్టం చేశారు. తమ సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన సమ్మెకు అన్ని వర్గాల ప్రజలు, ప్రయాణికులు మద్దతు పలకాలని కోరారు. 2019లో డిమాండ్ల సాధనకు అక్టోబర్ ఐదు నుంచి 52 రోజులపాటు నిరవధిక సమ్మె చేపట్టిన కార్మికులు.. తాజాగా మళ్లీ సమ్మె బాట పట్టారు. 925 బస్సులు.. 3267 మంది కార్మికులు మహబూబ్నగర్ ఆర్టీసీ రీజియన్లోని పది డిపోల పరిధిలో 925 ఆర్టీసీ బస్సులు ఉన్నాయి. వీటిలో ఆర్టీసీ బస్సులు 543, అద్దె బస్సులు 359, ఈవీ బస్సులు 23 ఉన్నాయి. మొత్తంగా 1,523 మంది కండక్టర్లు, 923 మంది రెగ్యులర్ డ్రైవర్లు, 148 మంది ఔట్ సోర్సింగ్ డ్రైవర్లు, 385 మంది మెకానిక్ సిబ్బంది, 288 మంది వరకు ఇతర ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నారు. రీజియన్ పరిధిలో ప్రతి రోజు సుమారు 4.30 లక్షల మందికి పైగా ప్రయాణిస్తున్నట్లు ఆర్టీసీ గణాంకాలు చెబుతున్నాయి. ఈ మేరకు ప్రతి రోజు ఆర్టీసీకి దాదాపు రూ.2.05 కోట్లకుపైగా ఆదాయం సమకూరుతోంది. కార్మికుల సమ్మె ఆర్టీసీ ఆదాయంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. అయితే అద్దె బస్సులు నడిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో సమ్మె ఉన్నా 50 శాతం బస్సులు రోడ్డెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇబ్బందుల్లేకుండా ఏర్పాట్లు.. సమ్మె అనివార్యమైతే ప్రయాణికులకు ఇబ్బందుల్లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తాం. ముఖ్యంగా అద్దె బస్సులను నడుపుతాం. కాంట్రాక్ట్ ఉద్యోగులతో బస్సులు నడిచేలా తగిన చర్యలు చేపడుతాం. – సంతోష్కుమార్, ఆర్టీసీ రీజినల్ మేనేజర్, మహబూబ్నగర్ -
భూ సమస్యలు వెంటనే పరిష్కరించాలి
మల్దకల్: దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న భూ సమస్యలను వెంటనే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ అధికారులను ఆదేశించారు. మంగళవారం మల్దకల్ తహసీల్దార్ కార్యాలయాన్ని ఆయన ఆకస్మికంగా సందర్శించి.. పలు రికార్డులను పరిశీలించారు. పెండింగ్లో ఉన్న భూ సమస్యలు అన్నింటినీ వెంటనే పరిష్కరించాలని అధికారులను సూచించారు. గ్రామాల్లో జీపీఓలు ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ప్రతి గ్రామంలో రైతు సమస్యలను పరిష్కరించేందుకు జీపీఓలు చర్యలు తీసుకోవాలని చెప్పారు. చిన్నచిన్న సమస్యలతో రైతులను కార్యాలయాల చుట్టూ తిప్పవద్దని హెచ్చరించారు. ఈ సందర్భంగా జీపీఓలకు ప్రత్యేక గదులు కేటాయించాలని అదనపు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఆయన సమస్యను ఉన్నతాధికారులతో చర్చించి పరిష్కరిస్తానన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ ఝాన్సీరాణి, సీనియర్ అసిస్టెంట్ కరీం, ఆర్ఐ మహేందర్, రవితేజ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
ఏసీబీ వలలో నారాయణపేట ఆర్డీఓ
● బర్త్ సర్టిఫికెట్ల జారీకి రూ.25 వేల లంచం డిమాండ్ ● రెడ్హ్యాండెడ్గా పట్టుకున్న ఏసీబీ అధికారులు నారాయణపేట: మరో ఆరునెలల్లో ఉద్యోగ విరమణ చేయాల్సిన నారాయణపేట ఆర్డీఓ పి.రాంచందర్ నాయక్ రూ.25 వేల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణయ్య వివరాల మేరకు.. జిల్లాలోని ఊట్కూర్కు చెందిన ఓ వ్యక్తి తనతో పాటు మరో నలుగురికి సంబంధించిన బర్త్ సర్టిఫికెట్ల కోసం గతేడాది జూలైలో మీ సేవ ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. మీ సేవ నుంచి తహసీల్దార్ లాగిన్లోకి వెళ్లిన దరఖాస్తులు.. అక్కడి నుంచి ఆర్డీఓ లాగిన్కు ఫార్వర్డ్ అయ్యాయి. అయితే దరఖాస్తు చేసుకున్న 45 రోజులలోగా విచారణ చేపట్టి, బర్త్ సర్టిఫికెట్ జారీ చేయాల్సి ఉండగా.. 10 నెలలు అవుతున్నా ఇవ్వకపోవడంతో దరఖాస్తుదారులు విసిగిపోయారు. వారం రోజులుగా డివిజనల్ కార్యాలయానికి తిరుగుతూ బర్త్ సర్టిఫికెట్లు ఇవ్వాలని ఆర్డీఓను వేడుకున్నారు. ఈ క్రమంలో ఒక్కొక్కరికి రూ.7,500 చొప్పున ఇస్తే జారీ చేస్తామని ఆర్డీఓ చెప్పినట్లు ఆ కార్యాలయంలోని సెక్షన్ అధికారి దరఖాస్తుదారుడికి చెప్పినట్లు తెలిసింది. అన్ని డబ్బులు ఇచ్చుకోలేమని రూ.5 వేల చొప్పున ఇస్తామని సదరు అధికారి ద్వారా ఆర్డీఓతో బేరం కుదుర్చుకున్నారు. ఈ విషయాన్ని మూడు రోజుల క్రితం ఏసీబీ అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో మంగళవారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ముందుగా బర్త్ సర్టిఫికెట్ల కోసం దరఖాస్తు చేసుకున్న వ్యక్తికి డబ్బులు ఇచ్చి ఆర్డీఓ కార్యాలయంలోకి పంపించారు. సదరు వ్యక్తి నుంచి ఆర్డీఓ డబ్బులు తీసుకుంటుండగా.. ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఆర్డీఓకు సంబంధించిన ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నారాయణపేటలోని నివాసగృహంతో పాటు మహబూబ్నగర్ జిల్లా భూత్పూర్ మండలంలోని మరో ఇంట్లో, తన కుటుంబీకుల నివాసాల్లో సైతం ఏసీబీ సోదాలు చేపట్టినట్లు తెలిసింది. ఆర్డీఓ కార్యాలయంలోని భూ దరఖాస్తులు, కంప్యూటర్లోని డేటా, మిగతా అంశాలపై ఆర్డీఓను విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది. పట్టుబడిన ఆర్డీఓను అరెస్టు చేసి, నాంపల్లి ఏసీబీ కోర్టుకు తరలిస్తున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. -
కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోండి
ఎర్రవల్లి: రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి ప్రభుత్వం అందిస్తున్న మద్దతు ధర పొంది ఆర్థికాభివృద్ధి సాధించాలని ఎమ్మెల్యే విజయుడు అన్నారు. మంగళవారం మండలంలోని తిమ్మాపురం, జింకలపల్లి, కొండేరు గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాలను స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 17 శాతం తేమ వచ్చేలా వడ్లను ఎండబెట్టి రైతులు కొనుగోలు కేంద్రానికి తీసుకురావాలన్నారు. ఏ–గ్రేడ్ రకానికి రూ.2,389, సాధారణ రకానికి రూ.2,369 ప్రభుత్వం మద్దతు ధరగా అందిస్తుందన్నారు. అదేవిధంగా సన్న రకాలకు ప్రభుత్వం బోనస్గా మరో రూ.500 వరకు చెల్లిస్తుందన్నారు. ముఖ్యంగా వడ్లలో తాలు, రాళ్లు, మట్టి పెల్లలు లేకుండా తీసుకువచ్చి కేంద్రాల్లో ఉన్న అధికారులకు సహకరించాలన్నారు. ఏఈఓ ద్వారా ముందుగా టోకెన్ తీసుకొని క్రమపద్ధతిలోనే కేంద్రానికి ధాన్యం తీసుకురావాలని ఎమ్మెల్యే సూచించారు. కార్యక్రమంలో అలంపూర్ మార్కెట్ యార్డు చైర్మన్ దొడ్డెప్ప, వైస్చైర్మన్ కుమార్, ఏఓ సురేష్గౌడ్, నాయకులు నారాయణనాయుడు, వెంకటేష్యాదవ్, నర్సిరెడ్డి, రుక్మాందర్రెడ్డి, సోమనాద్రి తదితరులు పాల్గొన్నారు. -
నాణ్యతగా ఉంటుంది..
గద్వాల యార్డుకు నిత్యం వేరుశనగ వస్తుంది. దీని నుంచి యార్డు కు మంచి ఆదాయం సమకూరుతుంది. ఇక్కడి వే రుశనగకు మంచి డిమాండ్ ఉంటుంది. నవంబర్ నుంచి జనవరి వరకు వచ్చే వేరుశనగ గింజ గట్టిగా నాణ్యతగా ఉంటుంది. దుమ్ము, మట్టిపెల్లలు లేకుండా, బా గా ఆరబెట్టి తీసుకొచ్చే వేరుశనగకు మంచి ధరలు వస్తున్నాయి. – నర్సింహ, యార్డు కార్యదర్శి, గద్వాల నాకు నాలుగు ఎకరాల పొలం ఉంది. ఇందులో ఏటా రెండు ఎకరాల్లో మూడు సార్లు వేరుశనగ సాగు చేస్తాను. పంట బాగానే చేతికి వస్తోంది. గద్వాల యార్డులో విక్రయిస్తాను. ధరలు కూడా బాగానే వస్తున్నాయి. నాతోపాటు చాలా మంది రైతులు వేరుశనగను బోర్లు, బావుల కింద సాగు చేస్తున్నారు. – సూరి, రైతు, గద్వాల ● -
ప్రభుత్వానికి నివేదిక..
వనపర్తి జిల్లాకు కొత్తగా మూడు యూనిట్లతో పాటు వనపర్తి జనరల్ ఆస్పత్రికి మరో రెండు పడకలు అదనంగా మంజూరయ్యాయి. కొత్తగా వచ్చిన రేవల్లి, వీపనగండ్ల, ఖిల్లాఘనపురంలో డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేయడానికి అనువైన స్థలం, విద్యుత్, నీళ్లు ఇలా వసతులపై పరిశీలించి.. ఎంత ఖర్చు అవుతుంది.. ఇతర అంశాలపై ప్రత్యేక రిపోర్ట్ తయారు చేసి ఈ నెల చివరి నాటికి ప్రభుత్వానికి నివేదిక అందిస్తాం. త్వరలో పనులు ప్రారంభించి.. అందుబాటులోకి తీసుకువచ్చేలా చూస్తాం. – సాయినాథ్రెడ్డి, డీఎంహెచ్ఓ, వనపర్తి వైద్యుడిని సంప్రదించాలి.. కిడ్నీ సమస్య ఉన్నవారిలో మొదట నీరసం, ఆకలి మందగించడం, మూత్రం తక్కువగా రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి వారు వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. అయితే నాణ్యతతో కూడిన డయాలసిస్ చేసుకోకపోవడం వల్ల సమస్య పరిష్కారం కావడం లేదు. హెచ్డీఎఫ్ కానీ హెచ్వోఎంఎల్, హెచ్డీ, నాచ్యురల్ హెచ్బీ చేస్తే ఫలితం మెరుగైన స్థితిలో ఉంటుంది. – డాక్టర్ శంకర్, నెఫ్రాలజిస్టు ● -
మరింత చేరువైన రక్తశుద్ధి
పాలమూరు: ఉమ్మడి జిల్లాలో పలు కారణాలతో కిడ్నీ వ్యాధిగ్రస్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేసి ఆరోగ్యశ్రీలో భాగంగా తెల్లరేషన్ కార్డు కలిగిన బాధితులకు ఉచితంగా సేవలు అందిస్తోంది. అయితే ఉమ్మడి పాలమూరులో సరిపడా డయాలసిస్ కేంద్రాలు లేక రోగులు దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోంది. దీంతో రోగులు, వారి సహాయకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోగుల ఇబ్బందులను దూరం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా 11 డయాలసిస్ కేంద్రాలను మంజూరు చేసింది. 11 కేంద్రాల్లో 55 పడకలతో సేవలు అందుబాటులోకి తీసుకువచ్చే విధంగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. పబ్లిక్– ప్రైవేట్ భాగస్వామ్యం విధానంలో వీటిని నిర్వహించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వందలాది మంది బాధితులు.. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో మొత్తం 12 కేంద్రాలు అందుబాటులో ఉండగా వీటి ద్వారా వందలాది మంది బాధితులకు డయాలసిస్ చేస్తున్నారు. మహబూబ్నగర్లో 10, బాలానగర్లో 5, నారాయణపేటలో 10, మక్తల్లో 5, ఆత్మకూర్లో 5, వనపర్తిలో 10, నాగర్కర్నూల్లో 10, అచ్చంపేటలో 5, కొల్లాపూర్లో 5, కల్వకుర్తిలో 5, గద్వాలలో 12, అలంపూర్లో 5 మిషన్ల ద్వారా సేవలు అందిస్తున్నారు. 5 పడకల చొప్పున.. కిడ్నీ వ్యాధిగ్రస్తులకు దూరం, ఆర్థిక భారం తగ్గించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉమ్మడి జిల్లాలో ప్రతి 25 కిలోమీటర్ల దూరానికి ఒక యూనిట్ చొప్పున డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేస్తుంది. ఇందులో భాగంగా ఉమ్మడి జిల్లాకు నూతనంగా 11 కేంద్రాలు మంజూరు చేయగా.. అన్నిచోట్ల ఐదు పడకలకు ఐదు మిషన్స్ ఏర్పాటు చేసి మరో మూడు నెలల్లో సేవలు ప్రారంభించేలా చర్యలు చేపడుతున్నారు. పీహెచ్సీలు లేదా సివిల్ ఆస్పత్రులు ఉన్నచోట ఒక గదిలో వీటిని ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. అవసరమైన చోట నూతన భవనాలు నిర్మించనున్నారు. ప్రతి కేంద్రం దగ్గర నీటిశుద్ధి ప్లాంటు, ఫ్రిజ్లు, వైద్య నిపుణులతో పాటు ఇద్దరు సాంకేతిక నిపుణులు, ఇద్దరు స్టాఫ్ నర్సులు అందుబాటులో ఉంటారు. ఈ ఐదు పడకలు ఉన్నచోట నిత్యం 20 మందికి రక్తం శుద్ధి చేయనున్నారు. పీపీపీ విధానంలో ఏజెన్సీల ద్వారా నిర్వహించనున్న కొత్త డయాలసిస్ కేంద్రాల్లో రక్తశుద్ధి కోసం ఆధునిక యంత్రాలు అందుబాటులోకి తీసుకురానున్నారు. జిల్లా యూనిట్ పడకలు గద్వాల వడ్డేపల్లి 5 గద్వాల గట్టు 5 గద్వాల అయిజ 5 వనపర్తి ఖిల్లాఘనపురం 5 వనపర్తి రేవల్లి 5 వనపర్తి వీపనగండ్ల 5 నారాయణపేట కోస్గి 5 నారాయణపేట మద్దూరు 5 నాగర్కర్నూల్ లింగాల 5 నాగర్కర్నూల్ అమ్రాబాద్ 5 నాగర్కర్నూల్ తిమ్మాజిపేట 5 కొత్తగా 11 డయాలసిస్ కేంద్రాలు మంజూరు ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే 12 చోట్ల సేవలు నూతన యూనిట్లతో రోగులకు మరింత ఊరట మూడు నెలల్లో అందుబాటులోకి తీసుకువచ్చేలా కసరత్తు పాలమూరు వ్యాప్తంగా 908 మంది బాధితులు కొత్తగా మంజూరైన డయాలసిస్ కేంద్రాలు ఇలా.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. కిడ్నీ వ్యాధిని కట్టడి చేయాలంటే ప్రధానంగా రోజూ తగినంత వ్యాయామం చేయడం, కావాల్సినంత నిద్రపోవడం, ఒత్తిడి లేకుండా జీవన విధానం పాటించాలి. సరైన మోతాదులో నీరు తాగడం, బీపీ, షుగర్ నియంత్రణలో పెట్టుకోవడం చేయాలి. దీర్ఘకాలికంగా కిడ్నీలు చెడిపోయిన రోగుల్లో క్రియాటీన్, పొటాషియం శాతాల పెరుగుదల శరీరంలో అదనంగా నీరు చేరిన ఆధారంగా ఎన్నిసార్లు డయాలసిస్ చేయాలన్నది ఆధారపడి ఉంటుంది. -
ట్రాఫిక్ సిబ్బందికి చలువ కళ్లద్దాల అందజేత
గద్వాల క్రైం: వేసవిలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల దృష్ట్యా ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి కంటి సమస్యలు చోటు చేసుకునే ప్రమాదం ఉంద ని ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. సోమవారం తన కార్యాలయంలో సిబ్బందికి చలువ కళ్లద్దాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ని త్యం ట్రాఫిక్ సమస్యల పరిష్కారం, ప్రమాదాల నివారణకు శ్రమిస్తున్న సిబ్బంది సేవలు కీలకంగా ఉన్నాయన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ట్రాఫిక్ విధు లు నిర్వహించే సిబ్బంది ఎండలు తీవ్రరూపం దా ల్చడంతో పలు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటుంన్నారన్నారు. ముఖ్యంగా కంటి చూపుపై తీవ్ర ప్ర భావం చూపుతుందన్నారు. సిబ్బంది ఆరోగ్యంగా ఉంటేనే ఎలాంటి అవాంతరాలు లేకుండా విధులు నిర్వర్తిస్తారని చెప్పారు. కంటి సమస్యలు దరిచేరకుండా చలువ కళ్లద్దాలను అందజేయడం జరిగిందన్నారు. కార్యక్రమంలో ఏఎస్పీ శంకర్, ట్రాఫిక్ ఎస్ఐ బాలచంద్రుడు, సిబ్బంది పాల్గొన్నారు. -
బసవేశ్వరుడి బోధనలు అనుసరణీయం
గద్వాల: కుల, మత, లింగ బేధాలను తీవ్రంగా వ్యతిరేకించి సమాజంలో సీ్త్రలకు సమాన హక్కులు ఉండాలని నినదించిన బసవేశ్వరుడి బోధనలు, మార్గం అనుసరణీయమని అదనపు కలెక్టర్లు లక్ష్మీనారాయణ, నర్సింగరావు అన్నారు. విశ్వగురు బసవేశ్వరుడి జయంతిని పురస్కరించుకొని సోమవారం కలెక్టరేట్లో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి అధికారులు, వీరశైవ సంఘం నేతలు పూలమాల వేసి పూజలు చేశారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ పాల్కురికి సోమనాథుడి బసవ పురాణం ద్వారా కర్ణాటకకు చెందిన బసవన్న జీవితాన్ని తెలుగులో ప్రసిద్ధి చేశారన్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియ వేగవంతం చేయాలి జిల్లాలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా ఎస్ఐఆర్ మ్యాపింగ్ ప్రక్రియను పట్టణ ప్రాంతాల్లో మరింత వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ అధికారులను ఆదేశించారు. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియపై సోమవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్రెడ్డి నిర్వహించిన వీడియో కాన్పరెన్స్లో అదనపు కలెక్టర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు వివరిస్తూ జిల్లాలో ఇప్పటి వరకు 73.52 శాతం ప్రక్రియ పూర్తయిందని వెల్లడించారు. రాజకీయ పార్టీల ప్రతినిధుల సహకరంతో బూత్స్థాయి అధికారులు మ్యాపింగ్ ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలని, ఈ విషయంలో ఈఆర్ఓలు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. ప్రభుత్వం ఉద్యోగులు స్వచ్ఛందంగా మ్యాపింగ్ చేయించుకోవడం ద్వారా మిగిలిన వారికి మార్గదర్శకంగా నిలవాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ శ్రీనివాసరావు తదితరుల పాల్గొన్నారు. -
తరుగు పేరుతో ధాన్యం దోపిడీని అరికట్టాలి
అలంపూర్: తరుగు పేరుతో రైతు పండించిన ధాన్యం అదనపు దోపిడీని అరికట్టాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా అద్యక్షుడు ఈదన్న, కార్యదర్శి వెంకటేశ్వర్లు అన్నారు. సోమవారం అలంపూర్ మార్కెట్ యార్డులోని మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. రైతులు పండించిన పంటను త్వరగా కొనుగోలు చేయాలని, 12 రోజులవుతున్న ప్రజాప్రతినిధులు, అధికారుల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ప్రస్తుతం ప్రారంభమైన కొనుగోలు కేంద్రంలో కనీస సౌకర్యాలు కూడా కరువయ్యాయని, తాగడానికి నీరు కూడా లేని పరిస్థితి నెలకొందన్నారు. సర్వర్ సమస్యల వల్ల కంప్యూటర్లు కూడా పనిచేయకపోవడం, ధాన్యానికి సరిపడా గన్నీ బ్యాగులు లేకపోవడం దారుణమన్నారు. జిల్లాకు లక్ష బ్యాగులు రావాల్సి ఉండగా కేవలం 16 వేల బ్యాగులు మాత్రమే పంపించారని, ఇంకా 50 వేలకుపైగా బ్యాగులు అవసరం ఉన్నాయని వాటిని వెంటనే తెప్పించాలని డిమాండ్ చేశారు. అలంపూర్ పీఏసీఎస్కు కాకుండా సంబంధం లేని మానవపాడు, కలుకుంట్ల పీఏసీఎస్లకు కేటాయించడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని, మార్కెట్ యార్డు కార్యదర్శి కూడా ఎందుకు సెలవులో ఉన్నారని ప్రశ్నించారు. తూకం వేయడానికి సరైన కాంటాలు కూడా అందుబాటులో లేవని విమర్శించారు. కలెక్టర్ మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను పరిశీలించి రైతులకు న్యాయం చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో రైతులు మద్దిలేటి, మహేష్, వెంకటరాముడు, రామచంద్రుడు, కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. -
నిప్పులకుంపటి!
జిల్లాలో 44 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు–8లో uరోజురోజుకూ ఉష్ణోగ్రత లు పెరుగుతున్నాయి. ఎక్కువ ఎండలో తిరగడం ఏమాత్రం మంచిది కాదు. అత్యవసరమైతే జాగ్రత్తలతో బయటకు రావాలి. డీహైడ్రేషన్ కాకుండా తరచుగా నీరు తాగుతూ ఉండాలి. వడదెబ్బకు గురైతే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. అవసరమైన మందులు అందుబాటులో ఉన్నాయి. ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో సేవల విషయంలో సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవు. – సంధ్యకిరణ్మయి, జిల్లా ఇన్చార్జి డీఎంహెచ్ఓ చిన్నారులను జాగ్రత్తగా చూసుకోవాలి. ఎండలో ఎట్టి పరిస్థితుల్లోనూ బ యటికి తీసుకెళ్లొదు. ఆడు కోనివ్వద్దు. తరచుగా మంచినీటిని తాగించాలి. వడదెబ్బ తగిలినట్లు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వైద్యుడి వద్దకు తీసుకెళ్లాలి. ఉష్ణోగ్రతలు పెరుగుతున్నందున స్వీయ జాగ్రత్తలు తీసుకోవాలి. – దామ భరత్, చిన్నపిల్లల వైద్యుడు గద్వాల క్రైం: కొన్ని రోజులుగా ఎండల తీవ్రతతో ప్రజలు తల్లడిల్లిపోతున్నారు. భరించలేనంత ఉక్కపోత.. వేడి సెగలకు బెంబేలెత్తున్నారు. బాబోయ్ ఎండలోనే ఉన్నామా.. లేక నిప్పుల కొలిమిలో ఉన్నామా అనే భవన కలుగుతోంది. చాలా వరకు ఎండ తీవ్రతను తట్టుకోలేక మధ్యాహ్నం 12 గంటలలోపు ఇంటిబాట పడుతున్నారు. చిన్నారులు, వృద్ధులు మరింత ఇబ్బంది పడుతున్నారు. తాజా పరిస్థితుల్లో ఏమాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. జిల్లాలో గరిష్ట ఉష్ణోగ్రత 42 –44 డిగ్రీలకు చేరడంతో ప్రభుత్వం ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. వారం రోజులుగా నమోదైన ఉష్ణోగ్రతలు ఇలా.. తేదీ కనిష్టం గరిష్టం 13 41.6 24.7 14 42.8 25.8 15 42.7 24.9 16 42.8 25.6 17 43.1 25.4 18 43.6 25.2 19 44.1 25.0 రోజురోజుకు పెరుగుతున్న ఎండల తీవ్రత అల్లాడుతున్న చిన్నారులు, వృద్ధులు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించిన ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలంటున్న వైద్యులు ఉదయం నుంచే భానుడి భగభగ మొదలవుతోంది. 10 నుంచి 11 గంటల వరకే 30 – 35 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుండటంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4గంటల దాకా ఎండ తీవ్రత విపరీతంగా ఉంటుంది. ఇక సాయంత్రం 7గంటలైనా వేడి సెగలు తగ్గడం లేదు. జిల్లాలో సాధారణంగా వేసవి ఉష్ణోగ్రతలు గరిష్టంగానే ఉంటాయి. అయితే ఏప్రిల్లోనే 42 –44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. రానున్న రోజుల్లో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇక వచ్చే నెలలో పరిస్థితి ఎలా ఉంటుందోనని ప్రజలు బెంబేలెత్తుతున్నారు. -
తాగునీటికి ఢోకా లేనట్టే!
ఉమ్మడి జిల్లా పరిధిలో ఇలా.. జిల్లా ఎస్సెస్సీ విద్యార్థులు ఇంటర్ విద్యార్థులు సెంటర్లు సెంటర్లు మహబూబ్నగర్ 6 1,110 9 1,665 నారాయణపేట 4 796 6 1,358 నాగర్కర్నూల్ 4 492 7 1,097 గద్వాల 3 580 4 844 వనపర్తి 2 421 3 818 ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సోమవారం నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పరీక్షల నిర్వహణకు పూర్తిస్థాయిలో అన్ని ఏర్పాట్లు చేశాం. వేసవి నేపథ్యంలో పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. కాపీయింగ్ను అరికట్టేందుకు ఫ్లయింగ్, సిట్టింగ్ స్క్వాడ్ను నియమించాం. – శివయ్య, ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ ●కొల్లాపూర్: శ్రీశైలం డ్యాం బ్యాక్వాటర్ లెవెల్స్ క్రమంగా తగ్గుతుండటంతో తాగునీటి అవసరాలపై అధికారులు దృష్టిసారించారు. మిషన్ భగీరథ పథకానికి నీటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టారు. కొల్లాపూర్ మండలం ఎల్లూరులో ఏర్పాటుచేసిన మిషన్ భగీరథ స్కీంతో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాతో పాటు రంగారెడ్డి జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో మొత్తం 84 మండలాలకు తాగునీరు అందుతోంది. వేసవిలో ప్రజలకు తాగునీటి ఇక్కట్లు తలెత్తకుండా చూస్తామని అధికారులు చెబుతున్నారు. సరఫరా ఇలా.. ఎంజీకేఎల్ఐ ప్రాజెక్టుకు అనుసంధానంగా కొల్లాపూర్ మండలం ఎల్లూరులో మిషన్ భగీరథ పంప్హౌజ్ నిర్మించారు. ఇక్కడి నుంచి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాతో పాటు రంగారెడ్డి జిల్లా ప్రజలకు తాగునీరు అందించేందుకు పైప్లైన్లు, వాటర్ట్యాంకులు నిర్మించి.. నీటి సరఫరా చేస్తున్నారు. తగ్గుతున్న నీటిమట్టం.. కృష్ణానదిలో కొన్ని రోజులుగా నీటిమట్టం భారీగా తగ్గుతోంది. ప్రస్తుతం శ్రీశైలం డ్యాంలో 820 అడుగుల మేరకు నీటిమట్టం ఉంది. మిషన్ భగీరథ కోసం 800 అడుగుల వరకు నీటిని వినియోగించుకునే వెసులుబాటు ఉంది. కేఎల్ఐ ప్రాజెక్టు ద్వారా ప్రస్తుతం తాగు, సాగునీటి అవసరాల కోసం నీటిని ఎత్తిపోస్తున్నారు. యాసంగి సీజన్ ముగింపునకు చేరడంతో సాగునీటి సరఫరా నిలిపివేసి.. కేవలం మిషన్ భగీరథ కోసమే నీటిని వినియోగించాలని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఎలాంటి ఇబ్బందులు లేవు.. ప్రస్తుతం తాగునీటి సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు లేవు. కేఎల్ఐ ప్రాజెక్టు వద్ద 820 అడుగుల మేరకు కృష్ణా బ్యాక్వాటర్ ఉంది. 800 అడుగుల వరకు తాగునీటి అవసరాలకు నీటిని ఎత్తిపోసుకోవచ్చు. తాగునీటి అవసరాల మేరకు ఎత్తిపోతలు సాగుతున్నాయి. కృష్ణా బ్యాక్వాటర్ నిల్వలు, మిషన్ భగీరథ అవసరాలను ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు తెలియజేస్తున్నాం. నార్లాపూర్ రిజర్వాయర్ నుంచి మిషన్ భగీరథకు నీటిని మళ్లించేందుకు చేపట్టిన పనులు తుదిదశకు చేరాయి. ఈ పనులు పూర్తయితే తాగునీటి అవసరాలకు ఇక ఢోకా ఉండదు. – అంజాద్ పాషా, డీఈఈ, మిషన్ భగీరథ ‘మిషన్ భగీరథ’కు కేఎల్ఐ ద్వారా ఎత్తిపోతలు ప్రస్తుతం శ్రీశైలం డ్యాంలో 820 అడుగుల నీటిమట్టం 800 అడుగుల వరకు నీటిని ఎత్తిపోసుకునే అవకాశం వేసవిలో తాగునీటి ఎద్దడి లేకుండా అధికారుల చర్యలు రోజూ 0.02 టీఎంసీలు అవసరం మిషన్ భగీరథ పథకానికి రోజూ 0.02 టీఎంసీల నీరు అవసరం. కేఎల్ఐ పరిధిలోని ఎల్లూరు రిజర్వాయర్ నీటినిల్వ సామర్థ్యం 0.36 టీఎంసీలు. ఒకసారి రిజర్వాయర్ను నింపితే.. దాదాపుగా 18 రోజులపాటు తాగునీటి అవసరాలు తీరుతాయి. అయితే వేసవిలో ఎల్లూరు రిజర్వాయర్లో ఉన్న నీటి నిల్వ ప్రజల అవసరాలకు ఏమాత్రం సరిపోదు. దీన్ని దృష్టిలో ఉంచుకొని అధికారులు ముందుజాగ్రత్తగా పాలమూరు ప్రాజెక్టు పరిధిలోని నార్లాపూర్ రిజర్వాయర్లో 4 టీఎంసీలకు పైగా నీటిని నిల్వచేసి ఉంచారు. ఈ నీటిని మిషన్ భగీరథకు తరలించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. సున్నపుతండా వద్ద రూ. 10కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న రెగ్యులేటరీ సిస్టమ్ పనులు కూడా తుది దశకు చేరాయి. ఈ పనులు పూర్తయితే ఇకనుంచి రెగ్యులర్గా నార్లాపూర్ రిజర్వాయర్ నుంచే మిషన్ భగీరథకు నీటిని సరఫరా చేయవచ్చు. ఇది అమలైతే కేఎల్ఐ ప్రాజెక్టుపై ఇన్నాళ్ల నుంచి పడుతున్న ఒత్తిడి తగ్గుతోంది. -
ప్రజలకు అందుబాటులో వైద్యసేవలు
గద్వాల/కేటీదొడ్డి: ప్రజల ఆరోగ్యానికి ప్రభు త్వం పెద్దపీట వేస్తోందని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని 9వ వార్డులో పట్టణ ప్రాథమిక ఆరోగ్యకేంద్రం భవన నిర్మాణానికి భూమిచేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. జిల్లా కేంద్రంలో బస్తీ దవాఖానా ఏర్పాటుకు ప్రభుత్వం రూ. 14లక్షలు మంజూరు చేసిందన్నారు. ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందుబాటులో ఉంచేందుకు బస్తీ, పల్లె దవాఖానాలను ఏర్పాటు చేస్తోందన్నారు. అత్యవసర సేవలు అందించేందుకు బస్తీ దవాఖానాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయన్నారు. అనంతరం 21, 18 వార్డుల్లో వాటర్ ట్యాంకుల నిర్మాణానికి ఆయన భూమి పూజ చేశారు. తాగునీటి సమస్య పరిష్కారానికి అమృత్ పథకంలో భాగంగా రూ. 14లక్షలు మంజూరైనట్లు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ జయలక్ష్మి, వైస్చైర్మన్ శంకర్, నాయకులు బాబర్, వెంకటమ్మ, వేదావతి, మురళి, రామలింగేశ్వర్ కామ్లీ, వెంకటమ్మ, లత, చంద్రశేఖర్, సత్యం, మురళి పాల్గొన్నారు. ● కేటీదొడ్డి మండల కేంద్రంలోని సౌడుక్యాంపులో లబ్ధిదారు నర్సమ్మ నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటిని ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి ప్రారంభించి మాట్లాడారు. పేదల సొంతింటి కల సాకా రం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇళ్ల పథకం చేపట్టిందన్నారు. నియోజకవర్గంలో ప్రతి పేద కుటంబానికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ హనుమంతు, జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు రాజశేఖర్, సర్పంచ్ ఆంజనేయులు, మాజీ వైస్ఎంపీపీ విజయ్, సర్పంచు నారాయణ, నాయకులు ఉరుకుందు, గోవిందు పాల్గొన్నారు. అలంపూర్ కొనుగోలు కేంద్రంలో మొక్కజొన్న ధాన్యం పరిశీలిస్తున్న ఎమ్మెల్యే విజయుడు అలంపూర్: నియోజకవర్గ రైతుల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని ఎమ్మెల్యే విజయుడు అన్నారు. పట్టణంలోని పీఏసీఎస్, క్యాతూర్ పీఏసీఎస్లో మార్క్ఫెడ్ సహకారంతో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతులకు మద్దతు ధర కల్పించడానికి ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందన్నారు. కొనుగోలు కేంద్రాల్లో క్వింటాల్కు రూ. 2,400 మద్దతు ధర కల్పిస్తున్నట్లు తెలిపారు. రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. అకాల వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ధాన్యాన్ని భద్రపర్చుకోవడానికి తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కేంద్రానికి వచ్చిన రైతులను ఇబ్బందులకు గురి చేయకుండా మద్దతు ధర కల్పించడానికి అధికారులు తగు చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ నీలి శ్రీనివాసులు, మార్కెట్ యార్డు కమిటీ చైర్మన్ దొడ్డెప్ప, వైస్చైర్మన్ పచ్చర్లకుమార్, మున్సిపల్ చైర్మన్ జయరాముడు, వైస్చైర్మన్ విక్రమ్ తదితరులు పాల్గొన్నారు. సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ అలంపూర్ పట్టణంలో సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన చెక్కులను ఎమ్మెల్యే విజయుడు లబ్ధిదారులకు అందజేశారు. అలంపూర్ మండలం భీమవరానికి చెందిన జయన్నకు రూ.18 వేలు, పుష్పావతమ్మకు రూ.60 వేల చెక్కును అందజేశారు. -
‘పరిషత్’ ఎన్నికలకు కసరత్తు
● ఈ నెల 23 వరకు మ్యాపింగ్ ప్రక్రియ ● జిల్లాలో 16 జెడ్పీటీసీ, 175 ఎంపీటీసీ స్థానాలు ● జిల్లావ్యాప్తంగా 4,99,582 మంది ఓటర్లు జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు ముగియగా.. మిగిలిన పరిషత్ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఈ మేరకు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు వీలుగా ఓటరు జాబితా సిద్ధం చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం సైతం ఉత్తర్వులు జారీచేసింది. సీఈసీ ఇటీవల ప్రకటించిన అసెంబ్లీ నియోజకవర్గాల ఓటరు జాబితా అనుసరించి అదనంగా నమోదైన ఓటర్ల ప్రకారం వార్డులు, పోలింగ్ కేంద్రాల వారీగా మ్యాపింగ్ ప్రక్రియ చేపట్టాలని ఆదేశించింది. దీంతో ఆశావాహుల్లో ఆశలు చిగురించాయి. ఎస్ఈసీ ఆదేశాల మేరకు జిల్లా పంచాయతీరాజ్ అధికారులు కసరత్తు సైతం ప్రారంభించారు. జిల్లాలో 16 జెడ్పీటీసీ, 175 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. జిల్లాలో ఇటీవల మహమ్మదాబాద్, కౌకుంట మండలాలు కొత్తగా ఏర్పడగా.. ఈ స్థానాలకు కూడా ఎన్నికలు జరగనుండటంతో 16కు సంఖ్య చేరింది. అసెంబ్లీ జాబితా ఆధారంగా.. కేంద్ర ఎన్నికల సంఘం గతేడాది జూలై 10 నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 5 వరకు చేపట్టిన ఓటర్ల సవరణ ప్రక్రియకు అనుగుణంగా అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఓటర్ల జాబితా సిద్ధం చేసింది. దీంతో కొత్త ఓటర్లు స్పల్పంగా పెరిగారు. పంచాయతీ ఎన్నికల సమయంలో ప్రకటించిన తుది జాబితా ప్రకారం జిల్లాలో 4,99,582 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 2,48,222, మహిళలు 2,51,349 మంది ఉండగా.. ఇతరులు 11 మంది ఉన్నారు. ఈ నెల 23 వరకు ఓటరు జాబితాను మ్యాపింగ్ ప్రక్రియ పూర్తి చేయాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. చిగురించిన ఆశలు.. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ పూర్తి కావడంతో ఇక పరిషత్ ఎన్నికలను ప్రభుత్వం నిర్వహిస్తుందని రాజకీయ పార్టీలతోపాటు ఆశావాహులంతా భావించారు. అయితే బీసీ రిజర్వేషన్ల్ అంశం కోర్టులో తేలాకే వాటిపై ముందుకుపోవాలని ప్రభు త్వం భావించడంతో ఈ ప్రక్రియ వాయిదా పడింది. తాజాగా ఎస్ఈసీ ఓటర్ల జాబితాకు ఆదేశించడంతో ఎన్నికల అంశం మరోసారి తెరపైకి వచ్చన ట్టయింది. అయితే వెంటనే చేపడుతుందా.. రిజర్వేషన్లు ప్రకటించాకే నిర్వహిస్తుందా అనే దానిపై మాత్రం అధికారికంగా ఎలాంటి స్పష్టత లేదు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎన్నికల నిర్వహణలో ముఖ్యమైన ఓటర్ జాబితాను మ్యాపింగ్ చేయనున్నాం. అసెంబ్లీ ఎన్నికల ఓటర్ జాబితా ఆధారంగా మ్యాపింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఎన్నికల సంఘం ఎప్పుడు ఆదేశాలు ఇచ్చినా ఎన్నికల నిర్వహణకు అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నాం. ఈ మేరకు అధికార యంత్రాంగాన్ని సమాయత్తం చేశాం. – వెంకట్రెడ్డి, జెడ్పీసీఈఓ, మహబూబ్నగర్ -
కురుమూర్తిస్వామి సేవ కోసం అమ్మాపురంలో మకాం
గోపాల్పేట: గోపాల్పేట సంస్థానం 19వ శతాబ్దంలో ఏర్పాటైంది. గోపాల్పేట సంస్థానం రాణి రంగనాయకమ్మ తన భర్త గోపాల్రావు పేరుమీద గోపాల్పేట అనే పేరు పెట్టారు. ఇక్కడి సంస్థానంతో వనపర్తి సంస్థానాధీశులకు సంబంధాలు ఉండేవని చరిత్రకారులు చెబుతారు. గోపాల్పేట సంస్థానం పరిధిలో 12 గ్రామాలు ఉండగా.. రాణి రంగనాయకమ్మ గ్రామంలో వేలాది మందికి అన్నదానాలు చేసేవారు. చిన్నచింతకుంట: అమ్మాపురం అమరచింత, ఆత్మకూర్ సంస్థానాల పాలన కేంద్రంగా సాగింది. అప్పట్లో 69 గ్రామాలు, 190 చ.కి.మీ., విస్తీర్ణంలో కలిగి ఉన్న అమ్మాపురం సంస్థానాన్ని కాకతీయుల కాలం నుంచి రెడ్డి రాజుల కాలం వరకు ముక్కెర వంశీయులు పరిపాలించారు. ఇది 19వ శతాబ్దంలో భారత యూనియన్లో విలీనమైంది. కురుమూర్తి స్వామి క్షేత్రం అభివృద్ధి కోసం ముక్కెర వంశీయులు అమ్మాపురంలో సంస్థానం ఏర్పాటు చేసినట్లు చరిత్ర చెబుతోంది. 16వ శతాబ్దంలో రాణి భాగ్యలక్ష్మీదేవి అమ్మాపురంలో నిర్మించిన కోట బురుజు, శివాలయం, మసీద్తో పా టు 200 ఏళ్ల క్రితం వారి వంశీయులు నిర్మించిన రాజ భవనం, సింహద్వారం, రాజ భవనంలోని కోనేరు, గుర్రాల స్థావరాలు, అతిథి గృహాలు నేటికీ ఉన్నాయి. -
డీలిమిటేషన్ను మహిళా బిల్లుతో ముడిపెట్టొద్దు
స్టేషన్ మహబూబ్నగర్: డీలిమిటేషన్ బిల్లును మహిళా బిల్లుతో ముడిపెట్టడం సరికాదని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మహబూబ్నగర్లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంత్రి వాకిటి శ్రీహరితో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పార్లమెంట్లో బిల్లు వీగిపోవడం నియంతృత్వ ధోరణితో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదని విమర్శించారు. 46 ఏళ్ల బీజేపీ ఒక్క మహిళను పార్టీ జాతీయ అధ్యక్షురాలిగా చేయలేదని ఎద్దేవా చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు కాంగ్రెస్ కట్టుబడి ఉందన్నారు. ఇప్పుడున్న 543 సీట్లలో ఇది వరకు ఆమోదం పొందిన మహిళా బిల్లు ప్రకారం రిజర్వేషన్లు వచ్చే ఎన్నికల్లో అమలయ్యేలా బిల్లు పెడితే బేషరుతుగా మద్దతు ఇస్తామని, మహిళా కోటాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు సబ్ కోటా ఉండాలని కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమి స్టాండ్ అని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును పాకిస్తాన్–ఇండియా విభజనతో బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య పోల్చి ఇక్కడి ప్రజలను అవమానపరిచార ని, దీనిని సహించేది లేదన్నారు. ఆ ఎంపీ తెలంగాణ పట్ల మాట్లాడిన మాటలను పార్లమెంట్ రికార్డులో తొలగించే బాధ్యత ఇక్కడి బీజేపీ ఎంపీలపై ఉందన్నారు. సమావేశంలో ఎమ్మెల్యేలు జి.మధుసూదన్రెడ్డి, వంశీకృష్ణ, మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ -
రాజసానికి చిహ్నం
కొల్లాపూర్: జటప్రోల్ను సంస్థానంగా చేసుకొని కొల్లాపూర్ ప్రాంతాన్ని ప్రజారంజకంగా సురభి రాజులు పాలించారు. సురభిరాజుల పాలనకు సంబంధించి 14వ శతాబ్దం నుంచి సాక్ష్యాధారాలు ఉన్నాయి. ఆనె గొంది రాజుల నుంచి జటప్రోల్ సంస్థానాన్ని సురభి రాజవంశస్థుడు మల్లనాయుడు కానుకగా పొందినట్లు చరిత్ర చెబుతోంది. నాటి నుంచి సురభి రాజులు ఏకచత్రాధిపత్యంగా కొల్లాపూర్ను పాలించారు. సురభి సంస్థానం పరిధిలో 81 గ్రామాలు ఉండేవి. మొదట్లో జటప్రోల్లో సంస్థాన కోట నిర్మించారు. రాయలసీమ ప్రాంతం నుంచి ముస్లిం రాజులు తరుచూ దాడులకు దిగుతుండటంతో 1840లో సంస్థానం పరిపాలనను కొల్లాపూర్కు మార్చారు. ఇక్కడే రాజాబంగ్లాను నిర్మించగా.. 1884లో ప్రారంభించారు. మంత్రమహల్, చంద్రమహల్, రాణిమహల్గా బంగ్లాలోని భవనాలకు నామకరణం చేశారు. రాజ కుటుంబీకులు ఉద్యాన విహారం చేసేందుకు ఎల్లూరు సమీపంలోని పెద్దతోటలో బంగ్లా కట్టించారు. కొల్లాపూర్లోని రాజాబంగ్లాతో పాటు తోటబంగ్లా కూడా పర్యాటకులను కనువిందు చేస్తుంది. -
పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు కృషి
● చమన్ఖాన్దొడ్డిలో ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశాలు ● అంగన్వాడీ, ప్రాథమిక పాఠశాలలను తనిఖీ చేసిన కలెక్టర్ రిజ్వాన్బాషా షేక్ ● ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి మాట్లాడుతూ ఒకప్పుడు చమన్ఖాన్దొడ్డిలో ఎక్కడ చూసినా తాటాకు గుడిసెలు ఉండేవని, గుడిసెల స్థానంలో ప్రస్తుతం ఇందిరమ్మ పక్కా ఇళ్లు వచ్చాయని పేర్కొన్నారు. బతుకుదెరువు కోసం వలస వెళ్లే పరిస్థితులు రూపుమాపి, ప్రజలు తమ సొంత కాళ్లపై నిలబడేలా ప్రభుత్వం అనేక ఉపాధి అవకాశాలు కల్పిస్తుందని, అర్హులైన ప్రతి ఒక్కరూ వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం సీఎస్ఆర్సీ, భవిష్యత్ భారత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్మించిన డిజిటల్ సేవల భవనాన్ని కలెక్టర్, ఎమ్మెల్యేలు ప్రారంభించారు. కార్యక్రమంలో గద్వాల మార్కెట్ కమిటీ చైర్మన్ హన్మంతు, సర్పంచు భీమయ్య, ఉపసర్పంచు రేణుక, హౌసింగ్ డీఈ కాశీనాథ్, తహసీల్దార్ విజయ్కుమార్, ఎంపీడీఓ చెన్నయ్య, నాయకులు రామన్గౌడ్, విజయ్కుమార్, రాముడు తదితరులు పాల్గొన్నారు. గట్టు: ప్రభుత్వం అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తోందని, లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ రిజ్వాన్బాషా షేక్ అన్నారు. శనివారం మండలంలోని చమన్ఖాన్దొడ్డి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశాలకు కలెక్టర్తోపాటు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకున్న లబ్ధిదారులంతా ఒకేసారి గృహ ప్రవేశాలు చేయడం సంతోషాన్ని కలిగించిందన్నారు. పేదల సొంతింటి కల నెర్చేందుకు ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తుందన్నారు. గ్రామంలో ప్రతి ఇంటి ముందు మరుగుదొడ్డి నిర్మించుకుని ఉపయోగించుకోవాలని కోరారు. స్వచ్ఛభారత్ మిషన్లో భాగంగా మరుగుదొడ్డి నిర్మించుకునేందుకు ఆర్థిక సహాయం అందజేస్తున్నట్లు వివరించారు. లైవ్లీహుడ్ ఇంక్లూజివ్కు ఎంపిక.. లైవ్లీహుడ్ ఇంక్లూజివ్ ప్రోగ్రాంకు గట్టు మండలాన్ని ఎంపిక చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ఈ పథకం ద్వారా మండలంలోని 15 గ్రామాలను ఎంపిక చేసి, ఒక్కొక్క గ్రామంలో 25 కుటుంబాల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరిచేందుకు సమన్వయకర్తల సహకారంతో ముందుకు వెళ్లడం జరుగుతుందన్నారు. బీపీ, షుగర్ వ్యాధులు పెరుగుతున్నాయని, ప్రజలు ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రభుత్వ ఆస్పత్రులను ఉపయోగించుకోవాలని కోరారు. ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ కేంద్రాలను కలెక్టర్ తనిఖీ చేశారు. పిల్లలకు అందిస్తున్న పౌష్టికాహారం గర్భిణులు, బాలింతల సేవలు, పిల్లల బరువు నమోదు, పౌష్టికాహారం పంపిణీ గురించి తెలుసుకున్నారు. -
మట్టితో కోట నిర్మాణం..
గద్వాల: గద్వాల కోట 400 ఏళ్ల చరిత్ర కలిగి ఉంది. గద్వాల సంస్థానం 17వ శతాబ్దం (1663– 1670)లో నల్లసోమనాద్రి (పెద్ద సోమభూపాలుడు) పూడూరు కేంద్రంగా గద్వాల కోట నిర్మించారు. కర్ణాటక సరిహద్దులోని రాయచూరు, రాయలసీమలోని నందికొట్కూరు వరకు పాలన చేసినట్లు చరిత్ర చెబుతుంది. ఈ కోట నిర్మాణం మొత్తం మట్టితో నిర్మించడం ప్రత్యేకత. దీని లోపల అద్భుతమైన శిల్పకళతో కూడిన చెన్నకేశవస్వామి ఆలయం, ఆలయం ఎదుట 90 అడుగుల గాలిగోపురం నిర్మించారు. కృష్ణానది, తుంగభద్ర నదుల మ ధ్య గద్వాలలో సుమారు 10 ఎకరాల విస్తీర్ణంలో నిర్మి ంచిన కోట చుట్టూ భారీ ప్రహరీ నిర్మాణం ఉంది. ఈ కోట వలయాకారంలో నిర్మించగా.. లోపలి వైపు రాతి తో కూడిన గోడ కట్టారు. కోటలోపల కందకం, బావి నిర్మాణాలు ఉన్నాయి. ఈ కోటలో ప్రముఖ నటుడు చిరంజీవి కొండవీటిరాజా సినిమాను నిర్మించారు. -
మోసం గ్యారంటీ..
ఉద్యోగాల పేరుతో అక్రమార్కుల దందా ● బాధితుల నుంచి భారీ మొత్తంలో నగదు వసూలు ● సులువుగా సంపాదించాలనే ఆశతో రూ.లక్షల్లో ముట్టజెప్తున్న వైనం ● తాజాగా గద్వాలలో వెలుగులోకి ఘటన.. పోలీసులకు ఫిర్యాదులు ● అవగాహన కల్పించినా మోసపోతున్న నిరుద్యోగులు చివరికి.. న్యాయం కోసం మోసపోయిన బాధితులు చివరికి న్యాయం చేయాలని కోరుతూ పోలీస్స్టేషన్లో ఫిర్యాదులు చేస్తున్నారు. అయితే విచారణ అధికారులకు కేసుల ఛేదన సవాల్గా మారుతుంది. మోసం చేసిన ముఠా సభ్యులు వివిధ ప్రాంతాలకు చెందిన వారు కావడం, సరైన ఆచూకీ లేకపోవడం వంటి కారణాలతో విచారణ ముందుకు వెళ్లే పరిస్థితి లేకుండాపోతుంది. మోసగాళ్లంతా భారీ మొత్తంలో వసూలు చేసిన డబ్బులతో ఇతర దేశాలకు వెళ్లిపోతున్నారు. దీంతో బాధితులు న్యాయం కోసం ఏళ్ల తరబడి ఎదురుచూడాల్సిన దుస్థితి దాపురించింది. గద్వాల క్రైం: డిగ్రీ పూర్తయిన ప్రతిఒక్కరి కల ఉద్యోగం.. ఆ కల నెరవేర్చేందుకు చేయాల్సిన పనులు చేస్తే వరిస్తుంది. కానీ, కొందరు నిరుద్యోగులు సులువుగా కొలువు సాధించాలనే ఆశతో మోసం చేయడమే లక్ష్యంగా పనిచేసే వారి చేతిలో పడుతున్నారు. కొంత నగదు ముట్టజెప్తే చాలు.. ఉద్యోగం వస్తుందనే భ్రమలో పడి రూ.లక్షలు అందజేస్తున్నారు. చివరకు ఉద్యోగం రాకపోవడంతో మోసపోయినట్లు గుర్తించి న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించడం పరిపాటిగా మారింది. ఈ క్రమంలోనే జోగుళాంబ గద్వాల జిల్లాలో నిరుద్యోగులకు జాబ్ గ్యారంటీ పేరుతో కేటుగాళ్లు భారీ మొత్తంలో నగదు వసూలు చేసి తప్పించుకుని తిరుగుతున్నారు. ఒకవైపు స్వచ్ఛంద సంస్థల ముసుగు.. మరోవైపు కార్పొరెట్ కంపెనీల్లో ఉద్యోగం పేరుతో బురిడీ కొట్టిస్తున్నారు. గడిచిన నాలుగు నెలల వ్యవధిలో గద్వాల, అలంపూర్, శాంతినగర్ సర్కిల్ పరిధిలోనే 10 చీటింగ్ కేసులు నమోదవగా.. గత (2025)ఏడాదిలోనూ 20పైకి కేసులు నమోదయ్యాయంటే మోసం గ్యారంటీ పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. చర్యలు తీసుకుంటాం.. ఎక్కడైనా డబ్బులు ఇస్తే ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పే వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉంటూ పోలీసులకు ఫిర్యాదు చేయాలి. ఇలా చేయడం వల్ల మొదట్లోనే మోసాన్ని కట్టడి చేసేందుకు అవకాశం ఉంటుంది. మోసపోయిన బాధితులకు పోలీసుశాఖ నుంచి వీలైనంత త్వరగా న్యాయం అందేలా చర్యలు తీసుకుంటాం. నమోదైన కేసులపై ప్రత్యేక బృందంచే గాలింపు చర్యలు చేపడుతున్నాం. ఇలాంటి మోసాల పట్ల ప్రతిఒక్కరు అప్రమత్తంగా ఉండాలి. – శ్రీనివాసరావు, ఎస్పీ -
23 నుంచి శేషదాసుల ఆరాధనోత్సవాలు
మల్దకల్: ఆదిశిలా క్షేత్రమైన స్వయంభూ లక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయంలో ఈ నెల 23 నుంచి 25 వరకు శేషదాసుల వారి ఆరాధనోత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ చైర్మన్ ప్రహ్లాదరావు తెలిపారు. ఈ మేరకు శనివారం ఆదిశిలా క్షేత్రంలో శేషదాసుల వారి వంశస్థులు దీరేంద్రదాసు, శశాంక్, అర్చకులు మధుసూదనాచారి, రమేషాచారి, రవిచారి, చంద్రశేఖర్రావు, ఆలయ సిబ్బంది దాసుల వారి ఆరాధనోత్సవాల కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ మాట్లాడుతూ ప్రతిఏటా నిర్వహించే ఆరాధనోత్సవాలను విజయవంతం చేపట్టాలని కోరారు. ఆరాధనోత్సవాలకు హాజరయ్యే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. కార్యక్రమంలో నిర్వాహకులు అరవిందరావు, చంద్రశేఖర్రావు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. దరఖాస్తుల ఆహ్వానం గద్వాల: గద్వాల మున్సిపాలిటీలో కోఆప్షన్ సభ్యుల నియామకం కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ జానకీరాం శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇద్దరు సభ్యులను నియామకానికి గాను ఒక మహిళ, ఒక పురుష అభ్యర్థులకు అవకాశం ఉందన్నారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ప్రత్యేక పరిజ్ఞానం, అనుభవం కలిగి, మున్సిపాలిటీలో ఓటరు అయి ఉండి, 21 సంవత్సరాల వయసు గలవారు అర్హులన్నారు. దరఖాస్తులను శనివారం నుంచి ఈ నెల 23వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు మున్సిపాలిటీలో అందజేయాలని సూచించారు. టాస్ ఇంటర్, ఎస్సెస్సీ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి గద్వాల న్యూటౌన్: జిల్లాలో టాస్ ఇంటర్, ఎస్సెస్సీ పరీక్షలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పరీక్షలు సోమవారం నుంచి ఈనెల 27 వరకు జరగనున్నాయి. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పరీక్షల నిర్వహణ ఉంటుంది. ఇందుకోసం జిల్లా కేంద్రంలో ఇంటర్ పరీక్షల కోసం నాలుగు కేంద్రాలు (ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల, ప్రభుత్వ అభ్యసన ఉన్నత పాఠశాల, ప్రభుత్వ అభ్యసన (పీఎస్), ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలు) ఏర్పాటు చేశారు. అలాగే ఎస్సెస్సీ పరీక్షల కోసం మూడు కేంద్రాలు (ప్రభుత్వ ఉన్నత పాఠశాల బుర్దపేట, ప్రభుత్వ ఉన్నత పాశాల మోమిన్ మెహల్లా, జెడ్పీహెచ్ఎస్ జమ్మిచేడు)లను ఏర్పాటు చేశారు. ఎస్సెస్సీ పరీక్షలు 528 మంది, ఇంటర్కు 748 మంది మొత్తం 1,276 మంది రాయనున్నారు. పరీక్షల ఏర్పాటు, నిర్వహణపై డీఈఓ విజయలక్ష్మి మాట్లాడుతూ టాస్ ఇంటర్, ఎస్సెస్సీ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేశామని చెప్పారు. పరీక్ష కేంద్రానికి అభ్యర్థులు గంట ముందుగా హాజరుకావాలన్నారు. సెల్ఫోన్లు అనుమతించమని, పరీక్ష కేంద్రాల సమీపంలో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, సమీపంలోని జిరాక్స్ సెంటర్లు మాసివేయాలని సూచించారు. ఎలాంటి అనుచిత సంఘటనలు చోటుచేసుకున్నా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
అన్నదాతకు ఊరట..
పంట రుణ పరిమితి పెంపుతో ప్రయోజనం ● ఎస్ఎల్టీసీ నుంచి ఉత్తర్వులు ● బ్యాంకులకు ఆదేశాలు జారీ ● ప్రతి పంటకు రూ.2 నుంచి 3 వేల వరకు పెంపు పంట 2025–26లో 2026–27లో వరి 44–46 48 వరి (సీడ్) 48–50 51 జొన్న 19–21 22 జొన్న (సీడ్) 24–26 26 మొక్కజొన్న 34–36 38 సజ్జ 16–18 19 కంది 23–25 27 పప్పుశనగ 25–27 28 పత్తి 46–48 50 పత్తి (సీడ్) 140–150 150 వేరుశనగ 30–32 34 ఆముదం 20–21 22 గద్వాల న్యూటౌన్: బ్యాంకుల ద్వారా పొందే పంట రుణ పరిమితి పెరగడంతో రైతులకు ఊరట కలగనుంది. వివిధ రకాల పంటలకు ఇచ్చే రుణ పరరిమితిని పెంచుతూ డీఎల్టీసీ చేసిన ప్రతిపాదనలను ఎస్ఎల్టీసీ ఆమోదించింది. డీసీసీబీ బ్యాంక్ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా స్థాయిలో బ్యాంకర్లు, వ్యవసాయ శాఖ, దాని అనుబంధ శాఖల అధికారులతో డిస్ట్రిక్ట్ లెవెల్ టెక్నికల్ కమిటీ (డీఎల్టీసీ) సమావేశం నిర్వహిస్తారు. ఈ సమావేశంలో వివిధ రకాల పంటలకు అయ్యే పెట్టుబడులు, ఇతరత్రా ఖర్చులు, గడిచిన ఆర్థిక సంవత్సరం ఆయా పంటలకు ఇచ్చిన రుణాలు గురించి చర్చిస్తారు. దీని ఆధారంగా ఆయా పంటలకు బ్యాంకుల ద్వారా అందించాల్సిన పంట రుణాలు ఎంతమేర పెంచాలో చర్చించి, ప్రతిపాదనలు రూపొందిస్తారు. ఫిబ్రవరిలో నిర్వహించిన డీఎల్టీసీ సమావేశంలో 2026–27 వానాకాలం, యాసంగి సీజన్కు సంబంధించి పంట రుణ పరిమితిపై ప్రతిపాదనలు రూపొందించి రాష్ట్ర స్థాయిలోని స్టేట్ లెవెల్ టెక్నికల్ కమిటీ (ఎస్ఎల్టీసీ)కి నివేదించారు. అధికారులు అక్కడ మరోసారి చర్చించి పంట రుణ పరిమితిని పెంచుతూ మార్చి నెలాఖరులో నిర్ణయం తీసుకున్నారు. దాదాపు అన్ని రకాల పంటలకు ఇరిగేటెడ్, వర్షాధారం కింద వేరువేరుగా రూ.వెయ్యి నుంచి 2వేల వరకు పెంచారు. అదేవిధంగా కూరగాయలకు సంబంధించి సాధారణ సాగుకు రూ.వెయ్యి నుంచి 2వేల వరకు మల్చింగ్ పద్ధతిన సాగుకు రూ.2వేల నుంచి 3 వేలకు పెంచారు. గద్వాల శివారులో సాగు చేసిన క్యాలిఫ్లవర్ ఆదేశాలు జారీ చేశాం పంట రుణాలపై రుణ పరిమితిని పెంచుతూ ఎస్ఎల్టీసీ నుంచి ఉత్తర్వులు అందాయి. వివరాలను జిల్లాలోని అన్ని బ్యాంకులకు పంపించాం. 2026–27 వానాకాలం, యాసంగి సీజన్లలో పెంచిన రుణ పరిమితికి అనుగుణంగా పంట రుణాలు అందించాలని అన్ని బ్యాంకులకు ఆదేశాలు జారీ చేశాం. పెంచిన రుణ పరిమితికి అనుగుణంగా బ్యాంకర్లు పంట రుణాలు అందించేలా చర్యలు తీసుకుంటాం. – శ్రీనివాసరావు, ఎల్డీఎం జిల్లావ్యాప్తంగా.. జోగుళాంబ గద్వాల వ్యవసాయ ఆధారిత జిల్లా. ఇక్కడ జూరాల, ఆర్డీఎస్ ప్రాజెక్ట్లతో పాటు, నెట్టెంపాడు ప్రాజెక్ట్ కింద ఏడు రిజర్వాయర్లు, 120 దాకా చెరువులు, ఇంకా కుంటలు ఉన్నాయి. రైతులకు పంట పెట్టుబడి కింద రైతుబంధు, కిసాన్ సమ్మాన్ యోజన లాంటి పథకాలు ఉన్నా.. వాటితో అవసరాలు పూర్తిగా తీరవు. ఈ క్రమంలో బ్యాంకుల ద్వారా పంట రుణాలు తప్పక తీసుకోవాల్సిందే. -
‘సురక్షిత ప్రయాణమే మన లక్ష్యం’
గద్వాల క్రైం: రోడ్డు నిబంధనలు, వాహన ప్రమాదాలు నివారించేందుకు అవగాహన కల్పించడంలో భాగంగా పోలీసు శాఖ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా అరైవ్ అలైవ్ పేరిట భద్రత కార్యాక్రమాలు చేపట్టినట్లు ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. శుక్రవారం గద్వాల మండలంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాల్లో ఏటా అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇంట్లో ఎదురుచూస్తున్న మీ కుటుంబ సభ్యుల కోసం రోడ్డుపై జాగ్రత్తగా డ్రైవింగ్ చేసి సురక్షితంగా ఇంటికి చేరాలని ఆకాంక్షించారు. మద్యం తాగి వాహనం నడపడం వల్ల జరిగే నష్టం కుటుంబ వ్యవస్థ ఛిద్రం చేస్తుందని వివరించారు. ప్రమాదం జరిగిన వెంటనే క్షత్రగాతులను రక్షించేందుకు గోల్డెన్ అవర్ ఎంతో కీలకమన్నారు. ప్రమాదం జరిగిన సమయంలో ప్రథమ చికిత్సతో పాటు అందుబాటులో ఉన్న వైద్యుల వద్దకు సకాలంలో తీసుకేళ్తే క్షతగాత్రుల ప్రాణాలను కాపాడేందుకు అవకాశం ఉంటుందని వివరించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న క్యాష్లెస్ స్కీంలో భాగంగా గాయపడిన వారిని ఆస్పత్రిలో చేర్పించిన వారికి రూ.25వేల నగదు అందుతుందన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ మొగిలయ్య, సీఐ శ్రీను, ఎస్ఐ శ్రీకాంత్, బాల చంద్రుడు, వైద్యులు తదితరులు ఉన్నారు. -
డిమాండ్లు నెరవేర్చే వరకు పోరాడుదాం
గద్వాల న్యూటౌన్: పెండింగ్ బిల్లుల విడుదల, పీఆర్సీ, హెల్త్కార్డుల అమలు, సీపీఎస్ రద్దుతో పాటు, మరో 62 డిమాండ్లు నెరవేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ టీజీఈజేసీ ఆధ్వర్యంలో కార్యాచరణను రూపొందించారు. శుక్రవారం కలెక్టరేట్లోని అన్ని విభాగాల గెజిటెడ్ అధికారులు, ఉద్యోగులు, సిబ్బందితో పాటు ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కార్మికులు నల్లబ్యాడ్జీలు ధరించి భోజన విరామ సమయంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా టీజీఈజేసీ గద్వాల జిల్లా శాఖ చైర్మన్ నాగార్జునగౌడ్, కోచైర్మన్ తిమ్మారెడ్డి మాట్లాడుతూ.. పీఆర్సీ కమిటీ ఏర్పాటు చేసి దాదాపు 30 నెలలు గడిచిన నేపథ్యంలో ఉద్యోగులకు 51శాతం ఫిట్మెంట్తో 2వ పీఆర్సీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. పీఆర్సీ కాలాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ పొడగించరాదని, నివేదికను జూన్ 2 లోపు అమలు చేయాలని డిమాండ్ చేశారు. పెండింగ్ బిల్లులు నెలకు రూ.700 కోట్లు విడుదల చేసినప్పట్టికీ, రాష్ట్రంలో నెలకు సగటున 600 మంది ఉద్యోగులు రిటైర్డ్ అవుతున్నందున బకాయిలు భారీగా పేరుకుపోతున్నాయని చెప్పారు. పెండింగ్లో ఉన్న రూ.13 వేల కోట్లను వెంటనే విడుదల చేయాలని కోరారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అదనపు కలెక్టర్ నరసింగరావుకు అందజేశారు. కార్యక్రమంలో టీజీఈజేసీ నాయకులు బీజాపూర్ ఆనంద్, వెంకటరాజారెడ్డి, లక్ష్మారెడ్డి, వేణుగోపాల్, లక్ష్మణ్, యూనుస్ బాషా, బుచ్చన్న, ఆర్.మోహన్, నాగరాజు, ఉద్యోగులు, పెన్షనర్లు పాల్గొన్నారు. -
బీసీలు 54.82%
జోగుళాంబ గద్వాల● కులాల వారీగా జనాభా మొత్తం 37.01 లక్షలు ● ఇందులో బీసీలు 20,29,001 మంది ● బీసీల్లో ముదిరాజ్లు, ఎస్సీల్లో మాదిగలదే అగ్రస్థానం ● గద్వాల, వనపర్తిలో ప్రభావిత వర్గాలుగా వాల్మీకి బోయలు ● కందనూలులో చెంచుజనాభా 9 వేలకే పరిమితం ● రాష్ట్ర సామాజిక, ఆర్థిక, కులగణన రిపోర్ట్లో వెల్లడి .. కొనుగోలు మంట రాజోళిలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు క్రెడిట్ను తీసుకోవడానికి ప్రధాన పార్టీల నాయకులు వాదులాటకు దిగారు. శనివారం శ్రీ 18 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026–8లో uఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీల్లో మెజార్టీ వర్గాలు ఓసీల్లో రెడ్డిలదే ఆధిపత్యం.. ఉమ్మడి జిల్లాలో మొత్తం ఓసీ జనాభా 2,97,406 మంది కాగా, 8.03 శాతంగా నమోదైంది. ఓసీల్లో మెజార్టీ సంఖ్యలో రెడ్డి సామాజికవర్గానికి చెందిన వారే ఉన్నారు. వీరిలో నారాయణపేటలో అత్యధికంగా 69.19 శాతం, వనపర్తిలో 66.84 శాతం, జోగుళాంబ గద్వాలలో 63.30 శాతం, నాగర్కర్నూల్లో 61.06 శాతం, మహబూబ్నగర్లో 52.40శాతం రెడ్డి జనాభా ఉంది. ఓసీల్లో రెడ్డి సామాజిక వర్గం తర్వాత వైశ్యులు ప్రభావిత వర్గంగా ఉన్నారు. ప్రధానంగా నాగర్కర్నూల్లో 15.69 శాతం, వనపర్తిలో 13.86 శాతం వైశ్యుల జనాభా ఉంది. మహబూబ్నగర్ జిల్లా.. సామాజికవర్గం జనాభా మాదిగ (ఎస్సీ) 1,04,613 మాల (ఎస్సీ) 16,873 బంజార(ఎస్టీ) 1,12,127 ముదిరాజ్ (బీసీ) 1,34,794 యాదవ(బీసీ) 94,144 రెడ్డి(ఓసీ) 44,825 నాగర్కర్నూల్ జిల్లా మాదిగ (ఎస్సీ) 1,26,990 మాల (ఎస్సీ) 56,426 బంజార(ఎస్టీ) 96,053 ఎరుకల(ఎస్టీ) 8,073 చెంచు(ఎస్టీ) 8,739 ముదిరాజ్(బీసీ) 95,079 రెడ్డి(ఓసీ) 47,021 వైశ్య(ఓసీ) 12,083 వనపర్తి జిల్లా మాదిగ(ఎస్సీ) 91,157 మదాసికురువ(ఎస్సీ) 8,076 మాల(ఎస్సీ) 5,703 బంజార(ఎస్టీ) 48,978 ఎరుకల (ఎస్టీ) 5,373 వాల్మీకిబోయ(బీసీ) 79,364 ముదిరాజ్(బీసీ) 65,605 యాదవ(బీసీ) 79,140 రెడ్డి(ఓసీ) 34,319 వైశ్య(ఓసీ) 7,114 ఎస్సీల్లో 70 శాతానికి మించి మాదిగలే.. ఉమ్మడి జిల్లాలో బీసీల తర్వాత 20.09 శాతంతో అత్యధికంగా ఎస్సీ జనాభా ఉండగా, ఇందులో సింహభాగం 70 శాతానికి మించి మాదిగలే ఉన్నారు. ఎస్సీల్లో వీరి జనాభా అత్యధికంగా జోగుళాంబ గద్వాల జిల్లాలో 83.13 శాతం, వనపర్తిలో 78.86 శాతం, మహబూబ్నగర్లో 71.88 శాతం, నారాయణపేటలో 71.18 శాతం, నాగర్కర్నూల్లో 62.41 శాతం ఉంది. నాగర్కర్నూల్ జిల్లాలో మాలల జనాభా అత్యధికంగా 27.73 శాతం ఉంది. ఎస్సీల్లో మాదాసికురువల జనాభా నారాయణపేటలో అత్యధికంగా 10.75 శాతం, గద్వాలలో 5.61 శాతం నమోదైంది. సాక్షి, నాగర్కర్నూల్: ఉమ్మడి పాలమూరు జిల్లావ్యాప్తంగా ఉన్న సామాజికవర్గాల జనాభా లెక్కలు తేలాయి. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ కులగణన సర్వే వివరాలను వెల్లడించింది. ఉమ్మడి జిల్లా జనాభా 37,01,072 మంది కాగా.. అందులో అత్యధికంగా 20,29,001 మంది బీసీలు ఉండడం విశేషం. మొత్తం జనాభాలో బీసీలదే 54.82శాతం ఉన్నట్లు తేలింది. మిగిలిన వర్గాల్లో 20.09 శాతంతో 7,43,606 మంది ఎస్సీ జనాభా ఉండగా, 9.37 శాతంతో 3,42,055 మంది ఎస్టీ జనాభా ఉంది. ఓసీల జనాభా 2,97,408 మందితో 8.03 శాతం కాగా, మైనార్టీల జనాభా 2,89,004 మందితో 7.80 శాతంగా తేలింది. బీసీల్లో ముది‘రాజులు’.. ఉమ్మడి జిల్లాలోని జనాభాలో సింహభాగం బీసీలే కాగా, ఇందులో ముదిరాజ్ సామాజిక వర్గమే అత్యధిక సంఖ్యలో ఉన్నారు. మొత్తం బీసీ జనాభా 20,29,001 కాగా, వీరి శాతం మొత్తం జనాభాలో సగానికి మించింది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ముదిరాజుల ప్రాబల్యమే ఎక్కువగా ఉండగా, అత్యధికంగా నారాయణపేట జిల్లాలో 36.03 శాతం ఉండటం గమనార్హం. ఆ తర్వాత మహబూబ్నగర్ జిల్లాలో 22.92 శాతం, నాగర్కర్నూల్లో 20.37 శాతం, వనపర్తి జిల్లాలో 17.35 శాతం ఉండగా, జోగుళాంబ గద్వాల జిల్లాలో మాత్రం వాల్మీకి బోయ, కురుమ, యాదవ కులాల ప్రభావం ఎక్కువగా ఉంది. ఉమ్మడి జిల్లాలో కులాల వారీగా జనాభా.. జిల్లా ఎస్సీలు శాతం ఎస్టీలు శాతం బీసీలు శాతం ఓసీలు శాతం ముస్లిం శాతం మహబూబ్నగర్ 1,45,543 15.46 1,22,358 12.99 4,76,910 50.65 85,550 9.09 1,11290 11.82 నాగర్కర్నూల్ 2,03,470 23.61 1,14,503 13.29 4,21,022 48.86 77,004 8.94 45,676 5.30 వనపర్తి 1,15,594 19.22 56,365 9.37 3,46,031 57.54 51,342 8.54 32,032 5.33 జోగుళాంబగద్వాల 1,51,075 22.66 12,141 1.82 4,11,783 61.76 41,749 6.26 49,992 9.51 నారాయణపేట 1,27,924 20.32 36,688 5.83 3,73,255 59.28 41,761 6.63 50,014 7.94 మొత్తం 7,43,606 20.09 3,42,055 9.37 20,29,001 54.82 2,97,408 8.03 2,89,004 7.80 ఉమ్మడి పాలమూరులో తేలిన లెక్కలు -
రోగులకు మెరుగైన సేవలు అందించాలి
అయిజ: రోగులకు మెరుగైన సేవలు అందించేందుకు వైద్య సిబ్బంది పీహెచ్సీలో అందుబాటులో ఉండాలని డీఎంహెచ్ఓ డాక్టర్ సంధ్య కిరణ్మయి అన్నారు. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శుక్రవారం డీఎంహెచ్ఓ జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ నవీన్ క్రాంతితో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా హెచ్పీవీ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పరిశీలించారు. ఆస్పత్రి నిర్వహణ, సదుపాయాలు, రోగులకు అందుతున్న వైద్యం, మందుల పంపిణీ గురించి పీహెచ్సీ డాక్టర్లు రామలింగారెడ్డి, కిరణ్, ఎంపీహెచ్ఈఓ ఓబులేష్ను అడిగి తెలుసుకున్నారు. అదే విధంగా 5 పడకల డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు కావాల్సిన సదుపాయాలను పరిశీలించారు. అసంపూర్తిగా నిలిచిపోయిన 30 పడకల ఆస్పత్రి భవనాన్ని పరిశీలించారు. కలెక్టర్కు సమస్యను వివరించి, 30 పడకల ఆస్పత్రి భవన నిర్మాణం పనులు పూర్తిచేయించాలని కోరుతామని పేర్కొన్నారు. -
చమ్మగిల్లిన ఖాన్దొడ్డి..!
● బిక్కుబిక్కుమంటున్న ప్రజలు.. వీడని ఉత్కంఠ ● కొత్తగా ఎవరు వచ్చినా ఉలిక్కిపడుతున్న వైనం ● ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరి మాత్రం వదులుకోమని ప్రతిన ● పరస్పర ఫిర్యాదులతో గ్రామస్తులు.. భూ యజమాని, బంధువులపై కేసుల నమోదు ఊరిని ఖాళీ చేయించేందుకు వచ్చిన ఘటనను తలుచుకుని ఆందోళన గట్టు: ఊరి కోసం ఊరంతా ఏకమయ్యారు.. ఊరిని ఖాళీ చేయించేందుకు వచ్చిన వారిని గట్టిగానే ప్రతిఘటించారు. కానీ, ఎప్పుడు ఎవరు వచ్చి తమను ఖాళీ చేయిస్తారోనని చమ్మగిల్లిన కళ్లతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారని మండలంలోని చమన్ఖాన్దొడ్డి గ్రామస్తులు. గ్రామాన్ని ఖాళీ చేయించేందుకు ఉత్తర్వులతో కోర్టు సిబ్బంది, యజమానుల తరపున వచ్చిన బంధువులను ఘటన గ్రామస్తులను కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. గ్రామంలోకి కొత్తగా ఎవరు వచ్చినా గ్రామస్తులు ఉలిక్కిపడే పరిస్థితి నెలకొంది. బుధవారం కోర్టు ఉత్తర్వులతో కోర్టు ఫీల్డ్ అసిస్టెంట్లు గ్రామానికి చేరుకుని గ్రామాన్ని ఖాళీ చేయాలని ప్రయత్నించిన సంఘటన ప్రజలకు ఆగ్రహాన్ని తెప్పించింది. గ్రామస్తులంతా కలిసి కోర్టు సిబ్బందితోపాటు భూ యజమానులుగా చెప్పుకొంటున్న బంధువులపై రాళ్లు, రప్పలు, కర్రలతో దాడికి ప్రయత్నించడంతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసిన విషయం తెలిసిందే. పోలీసుల జోక్యంతో వివాదం సద్దుమణిగింది. అయితే గ్రామంలో ఎక్కడ చూసినా ఇదే సంఘటనను తలుచుకుని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా ఇక్కడ ఇళ్లు నిర్మించుకుని జీవనం సాగిస్తున్న తాము ఇప్పుడు ఉన్నదంతా వదిలి ఎక్కడికి వెళ్లాలి.. ఎలా బతకాలని ఆందోళన చెందుతున్నారు. ఇక్కడే పుట్టి పెరిగినం.. ఎన్నో ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నాం, ఇప్పుడు ఈ స్థలం మాది, ఖాళీ చేయమంటే ఎక్కడికి పోవాలి.. ఎలా బతకాలి. మా పెద్దల నుంచి ఇప్పటి పిల్లల దాకా ఇక్కడే పుట్టి పెరిగాం. మమ్మల్ని బలవంతంగా ఇక్కడి నుంచి ఖాళీ చేయించేందుకు ప్రయత్నిస్తున్నారు. మాకు న్యాయం చేయాలి. – ఆంజనేయులు, చమన్ఖాన్దొడి) ఎక్కడికి పోవాలి.. మా తాతలకాలం నుంచి ఇక్కడే పుట్టి, ఇక్కడే పెరిగాం. ఇప్పుడు ఎవరో వచ్చి.. ఈ జాగ మాది.. ఖాళీ చేయాల్సిందే అంటే మేం ఎక్కడికి పోవాలి. ఇదే జాగలో కొత్తగా ఇళ్లు కట్టుకుని జీవనం సాగిస్తున్నాం. ఇన్నాళ్లు లేనిది ఇప్పుడు ఖాళీ చేయమంటే ఎట్లా. మాకు న్యాయం చేయాలి. మేం ఎక్కడికి పోం. ఇక్కడే ఉంటాం. – మల్లేష్, చమన్ఖాన్దొడ్డి ఇదీ అసలు విషయం.. పరస్పర కేసుల నమోదు.. కోర్టు ఉత్తర్వులతో చమన్ఖాన్దొడ్డి గ్రామానికి వెళ్లిన కోర్టు ఫీల్డ్ అసిస్టెంట్లను గ్రామస్తులు కొట్టడం, విధులకు ఆటంకం కలిగించడం, భయబ్రాంతులకు గురి చేసిన ఘటనపై కోర్టు ఫీల్డ్ అసిస్టెంట్ సంధ్యారాణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు చమన్ఖాన్దొడ్డి గ్రామానికి చెందిన 8 మందితోపాటు మరి కొంత మందిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ శేఖర్గౌడ్ తెలిపారు. తమ ఇళ్లను కూలగొట్టడానికి వచ్చిన భూమి యజమాని బంధువులపై గ్రామానికి చెందిన పూజారి భీమయ్య ఫిర్యాదు చేయగా, భూమి యజమానులతోపాటు వారి బంధువులు 8 మందితోపాటు మరి కొంతమందిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ శేఖర్గౌడ్ చెప్పారు. మల్లంపల్లి గ్రామ పంచాయతీ శివారుగా ఉన్న చమన్ఖాన్దొడ్డి సుమారు ఏడేళ్ల క్రితం పంచాయతీగా అవతరించింది. సుమారు 200 కుటుంబాలు, 450 మంది ఓటర్లు గ్రామంలో ఉన్నారు. గ్రామం మధ్యలో ఇందువాసి, బోయలగూడెం గ్రామానికి రోడ్డు వెళ్తుంది. పడమట దిక్కున ఉన్న సర్వే నం.129లో 11.02 ఎకరాల పొలంలో ఇళ్లను అక్రమంగా నిర్మించుకున్నారని, ఇది పట్టా భూమి అని భూ యజమానులు అయిన ఖాసీంసాబ్, మదర్సాబ్, నబీసాబ్లు గద్వాల సీనియర్ సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు తీర్పు భూ యజమానులకు అనుకూలంగా వచ్చింది. అయితే ఈ భూమిలో ఇది వరకే ప్రభుత్వ పాఠశాల, వాటర్ ట్యాంకు, నల్లా కనెక్షన్లు, సీసీ రోడ్డు, బ్రహ్మంగారి గుడి, వాల్మీకి, కనకదాసు, దర్గా, ఇందిరమ్మ ఇళ్లను నిర్మించుకుని జీవనం సాగిస్తున్నట్లు చమన్ఖాన్దొడ్డి గ్రామస్తులు పేర్కొంటున్నారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ తమ గ్రామాన్ని వదులుకోమని తెగేసి చెబుతున్నారు. -
ఆదర్శ మండలంగా తీర్చిదిద్దుదాం
కేటీదొడ్డి: గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకుంటూ కేటీదొడ్డిని ఆదర్శవంతమైన మండలంగా తీర్చిదిద్దుదామని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రంలోని రైతు వేదికలలో ప్రజాపాలన– ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహించిన మండల స్థాయి సమావేశానికి అదనపు కలెక్టర్ నర్సింగ్రావుతో కలిసి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్య రంగాలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. మండల కేంద్రానికి రూ.200 కోట్లతో యంగ్ ఇండియా సైనిక్ స్కూల్ మంజూరైందని త్వరలో పనులు ప్రారంభించి విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి వసతులు కల్పిస్తామని చెప్పారు. నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లను కేటాయించామని అర్హులైన ప్రతి పేదవానికి సొంతింటి కల నెరవేరుస్తామని ధీమా వ్యక్తం చేశారు. వచ్చే ఏడాది నుంచి విద్యార్థులకు మధ్యాహ్న భోజనంతోపాటు అల్పాహారం కూడా అందిస్తామని పేర్కొన్నారు. ఎర్రవల్లి నుంచి నందిన్నె వరకు డబుల్ రోడ్డు నిర్మాణం పనులు త్వరలో మొదలవుతాయన్నారు. వేసవి దృష్టా ప్రజలకు తాగు, సాగునీటి ఇబ్బందులు కలగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ప్రతిఒక్కరూ హెల్మెట్ ధరించి.. ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని కోరారు. కార్యక్రమంలో మార్కెట్ యార్డు చైర్మన్ హన్మంతు, తహసీల్దార్ కరుణాకర్, ఎంపీడీఓ రమణారావు తదితరులు పాల్గొన్నారు. -
హత్యల కంటే రోడ్డు మరణాలే ఎక్కువ
జడ్చర్ల: హత్యల సంఖ్య కంటే రోడ్డు ప్రమాదాల బారిన పడి మరణించిన వారి సంఖ్యనే ఎక్కువగా ఉంటుందని, పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలు అత్యంత ఆందోళన కలిగిస్తోందని డీజీపీ శివధర్రెడ్డి పేర్కొన్నారు. గురువారం జడ్చర్లలోని ఓ ఫంక్షన్ హాల్లో జరిగిన అరైవ్–అలైవ్ అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో గత ఏడాది 800 మంది హత్యల కారణంగా మరణిస్తే 7,500 మంది రోడ్డు ప్రమాదాల వల్ల మృత్యువాత పడ్డారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి సీఎం రేవంత్రెడ్డి రోడ్డు భద్రతకు సంబంధించి ఈనెల 13 నుంచి 18 వరకు అరైవ్ అలైవ్ ద్వారా క్షేత్రస్థాయి వరకు అవగాహన కల్పించాలన్న సదుద్దేశంతో కార్యక్రమాన్ని చేపట్టారని తెలిపారు. పోలీస్, రోడ్డు రవాణా శాఖల ద్వారానే కాకుండా అందరి భాగస్వామ్యంతో ప్రజలకు అవగాహన కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. రోడ్డు ప్రమాదాలపై సరైన అవగాహన లేకపోవడం కారణంగానే విలువైన ప్రాణాలను పోగొట్టుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మోటార్ బెక్లు నడిపేవారు, రోడ్లపై నడుచుకుంటూ వెళ్లే వారే ఎక్కువగా ప్రమాదాలకు గురవుతున్నారని అన్నారు. హెల్మెట్ ధరించకపోవడ వల్లే ప్రమాదాలు జరిగినప్పుడు మరణాలు సంభవిస్తున్నా యని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి, డీఐజీ ఎల్ఎస్ చౌహాన్, కలెక్టర్ ఖుష్బూ గుప్తా, తదితరులు పాల్గొన్నారు. అరైవ్–అలైవ్ అవగాహన సదస్సులో డీజీపీ శివధర్రెడ్డి -
అభివృద్ధే ధ్యేయంగా సంక్షేమ పథకాల అమలు
ఎర్రవల్లి: అభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వం వివిధ రకాల సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని, వీటిపై ప్రజాపాలన– ప్రగతి ప్రణాళికలో ప్రజలకు పెద్దఎత్తున అవగాహన కల్పించాలని కలెక్టర్ రిజ్వాన్బాషా షేక్ అన్నారు. గురువారం ఎర్రవల్లిలో నిర్వహించిన మండల స్థాయి సమావేశంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని 10 ముఖ్యాంశాలను అజెండాగా తీసుకొని 99 రోజులపాటు వివిధ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఇప్పటికే జిల్లాస్థాయిలో స్థానిక ప్రజాప్రతినిధులకు అవగాహన కల్పించడం జరిగిందని, గ్రామసభలను కూడా పూర్తి చేశామన్నారు. మండల స్థాయి కార్యక్రమాల అనంతరం నియోజకవర్గ స్థాయిలోనూ కార్యక్రమాలు కొనసాగిస్తామన్నారు. హెచ్పీవీ టీకాతో సర్వైకల్ క్యాన్సర్ను నివారించవచ్చని, 14–15 ఏళ్లలోపు బాలికలకు వేయించాలని సూచించారు. ప్రస్తుతం ఇందిరమ్మ ఇళ్లు రాని వారికి రెండో విడతలో మంజూరు చేస్తామన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అల్పాహారం ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. సర్పంచులు తమ పరిధిలోని పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలను క్రమం తప్పకుండా సందర్శించాలని సూచించారు. రైతులు ఆయిల్పాం పంటలు సాగు చేస్తే లాభసాటిగా ఉంటుందని, యూరియా వినియోగాన్ని తగ్గించి సేంద్రియ ఎరువులపై దృష్టిసారించాలని కోరారు. అరైవ్– అలైవ్ వారోత్సవాల్లో రహదారి భద్రతపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారని, వాహనదారులు నిబంధనలు పాటిస్తూ సురక్షిత ప్రయాణం చేయాలన్నారు. అనంతరం ఐసీడీఎస్ ఆధ్వర్యంలో గర్భిణులకు సామూహిక సీమంతం, చిన్నారులకు అన్నప్రాసన చేశారు. అలాగే పలు గ్రామాల సర్పంచులు, ప్రజలు సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా వాటి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి నుషిత, హెచ్ఓ ఇమ్రానా, తహసీల్దార్ నరేష్, ఎంపీడీఓ మహేష్, సీఐ ప్రదీప్కుమార్, ఏఓ సురేష్గౌడ్, ఎస్ఐ తరుణ్కుమార్రెడ్డి, సర్పంచ్ అనిత తదితరులు పాల్గొన్నారు. -
దాహం తీర్చేలా..!
అచ్చంపేట: వేసవిలో ఎండలు దంచికొడుతున్న నేపథ్యంలో అడవుల్లో వన్యప్రాణుల దాహార్తి తీర్చేందుకు అటవీ శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. వన్యప్రాణులు సంచరించే ప్రాంతాలను గుర్తించి వాగులు, వంకలు, ఊటకుంటలు, చెలిమెలు, చెక్డ్యాంలు, నీటి గుంటలు, సోలార్ కుంటలు, సాసర్ పిట్లు నిర్మించారు. సోలార్ పిట్లలో ప్రతి నాలుగు రోజులకోసారి ట్యాంకర్ల ద్వారా నీటిని నింపి వన్యప్రాణుల దాహార్తి తీర్చుతున్నారు. ప్రతిఏటా ఏప్రిల్, మే నెలల్లో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. కానీ, ఈసారి ఎండలు మరింత ఎక్కువగా ఉండటంతో సమస్య జటిలమయ్యే పరిస్థితి నెలకొంది. దీంతో దాహం తీర్చుకునేందుకు పంట పొలాలు, నీటి ఆవాసాల వైపు వస్తున్న వన్యప్రాణులు వేటగాళ్ల బారిన పడ కుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తున్నారు. వాటి సంరణకు చర్యలు చేపడుతూ సత్ఫలితాలు సాధిస్తున్నారు. దాహం తీర్చడంతో పాటు వాటి మనుగడకు ఎలాంటి ముప్పు వాటిల్లకుండా ఉండేందుకు అటవీ శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. జంతువుల ఆవాసాల్లోనే.. అమ్రాబాద్ పులుల రక్షిత అభయారణ్యం 2,611.39 చ.కి.మీ., విస్తరించి ఉంది. ఇందులో 2,166.37 చ.కి.మీ., అభయారణ్యం కాగా.. 445.02 చ.కి.మీ., బఫర్జోన్గా ఉంది. నేషనల్ టైగర్ కన్జర్వేటర్ (ఎన్జీసీఏ) లెక్కల ప్రకారం ప్రస్తుతం 42 పులులు, 250కిపైగా చిరుతలతో పాటు ఎలుగుబంట్లు, అడవి పందులు, మచ్చల జింకలు, దుప్పులు, మనుబోతులు, ముళ్లపందులు, నక్కలు, తోడేళ్లు, కొండ గొర్రెలు, కుందేళ్లు, నెమళ్లు, వంటి ఇతర వన్యప్రాణులు ఉన్నాయి. వీటితోపాటు అరుదైన వివిధ రకాల పక్షులు, సర్పాలు, కీటకాలు, వృక్ష సంపద నల్లమల సొంతం. ప్రతిఏటా వన్యప్రాణుల సంతతి గణనీయంగా పెరుగుతోంది. నీటి సమస్య తీవ్రతతో అటవీ జంతువుల ఇబ్బందులు వర్ణణాతీతం. జంతువులు సాధారణంగా ఆహార అన్వేషణలో భాగంగా 4 కి.మీ., పరిధిలో తిరుగుతాయి. నల్లమలను అనుసరించి 140 కి.మీ., పరిధిలో కృష్ణానది ప్రవహిస్తుంది. అటవీ ప్రాంతంలో నిరంతరం నీళ్లు ఉండే సహజ జలవనరుల దగ్గర ఎక్కువగా ఉంటాయి. ప్రస్తుతం బిల్లకల్లు అటవీ ప్రాంతంలోని రుసులచెరువులో మాత్రమే కొద్దిగా నీరు ఉండటంతో అత్యధికంగా వన్యప్రాణులు ఇక్కడికి వస్తుంటాయి. ఏర్పాట్లు చేస్తున్నాం.. నల్లమలలో వన్యప్రాణులకు ఆహారంతో పాటు దాహార్తి తీర్చేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నాం. అడవిలో పారే వాగులు, నీటి వనరులు ఉన్న ప్రదేశాల్లో సోలార్ పంపులు ఏర్పాటు చేశాం. నీటి ఆనకట్టలు, ర్యాంపు వెల్స్, చెలిమెల ద్వారా సహజసిద్ధమైన నీటిని వన్యప్రాణులకు అందించేందుకు చర్యలు చేపట్టాం. సీసీ సాసర్ల వినియోగం తగ్గించి సహజ సిద్ధమైన నీరిందించేందుకు చూస్తున్నాం. కెమెరాల పర్యవేక్షణలో నీరు అయిపోయినట్లు గుర్తించి వెంటనే నింపుతున్నాం. – రేవంత్చంద్ర, డీఎఫ్ఓ నల్లమల అటవీ ప్రాంతంలో మూగజీవాలకు నీటి సౌకర్యం అభయారణ్యంలో ఎండుతున్న వాంగులు, చెక్డ్యాంలు, కుంటలు మండుతున్న ఎండలతో అడుగంటుతన్న జలాలు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్న అటవీశాఖ అధికారులు 1,150 సీసీ సాసర్ల ఏర్పాటు నీటికుంటలు, సోలార్ పంపులు, ర్యాంపువెల్స్ లేని ఎత్తైన ప్రాంతాల్లో 1,150 సీసీ సాసర్లు ఏర్పాటు చేశారు. వీటిలో ట్యాంకర్ ద్వారా నీరు నింపి వన్యప్రాణులకు అందిస్తారు. బేస్క్యాంపు సిబ్బంది, బీట్ అధికారులు నాలుగు రోజులకోసారి సాసర్లు నింపేలా చర్యలు తీసుకుంటున్నారు. ఏటీఆర్(అమ్రాబాద్ టైగర్రిజర్వ్)లో 75 సోలార్ విద్యుత్తో నడిచే పంపుల ద్వారా నీటి సౌకర్యం కల్పిస్తున్నారు. ఏటీఆర్ పరిధిలో 80 వరకు నీటికుంటలు, చెక్డ్యాంలు, పర్కులేషన్ ట్యాంక్లు, పాంపాండ్లు ఏర్పాటు చేశారు. నీటి ఊట ఉన్న ప్రదేశంలో బావిలా గుంత తవ్వి నీరు పడగానే వన్యప్రాణులు సులువుగా దిగి నీరు తాగేలా రెండువైపుల ర్యాంపు తయారు చేస్తారు. మూడు మీటర్ల లోతు, పది మీటర్ల వెడల్పుతో గుంత తవ్వుతారు. అందులోకి స్వచ్ఛమైన నీరు ఊటల ద్వారా చేరుతుంది. వీటిని 20 వరకు ఏర్పాటు చేశారు. వీటిని ప్రతి రెండురోజులకోసారి బేస్ క్యాంపు సిబ్బంది, బీట్ అధికారులు పర్యవేక్షిస్తారు. -
మున్సిపల్ కమిషనర్ తీరు మార్చుకోవాలి
గద్వాల: గద్వాల మున్సిపల్ కమిషనర్ జానకిరాం కార్మిక వర్గ వ్యతిరేక ధోరణిని వీడి సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఉప్పేరు నర్సింహ, కార్యదర్శి వీవీ నర్సింహ డిమాండ్ చేశారు. గురువారం జిల్లాకేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో లింగంబావి వద్ద కార్మికులతో నిర్వహించిన జనరల్ బాడీ సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. జిల్లాలో ఎక్కడా లేని విధంగా గద్వాల మున్సిపాలిటీలో కమిషనర్ కార్మికుల పట్ల బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. పారిశుద్ధ్య కార్మికులకు నాలుగు నెలలుగా పీఎఫ్, ఈఎస్ఐ కార్మికుల ఖాతాలో జమ చేయలేదని, కార్మికులకు ఇవ్వాల్సిన దుస్తులు, సబ్బులు, నూనె, రెయిన్ కోట్లు కూడా ఇవ్వలేదని, ప్రతినెలా వేతనాలు పీఎఫ్ సక్రమంగా కార్మికుల ఖాతాలో జమచేయడం లేదని ఆరోపించారు. మరణించిన కార్మికుల కుటుంబ సభ్యులకు రావాల్సిన పరిహారం కోసం ఎదురుచూస్తున్నారని, వీటి పరిష్కారం కోసం కమిషనర్ను సంప్రదిస్తే కార్మిక సంఘం సీఐటీయూపై అక్కసు వెళ్లగక్కడం దారుణమన్నారు. అట్టడుగు కులాలు, కార్మిక సంఘం పట్ల కమిషనర్ తీరు మార్చుకోకపోతే పోరాటాల ద్వారా తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. సమావేశంలో గట్టన్న, మహేష్, లలితమ్మ, శివ, పరమేష్, రవి, నర్సింహ, శ్రీనివాస్, జాఫర్, రూతమ్మ, రాము తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్ర సరిహద్దు పోలీసులతో సమన్వయ నేర సమీక్ష
నారాయణపేట: కర్ణాటకలోని రాయచూర్ జిల్లా శక్తినగర్ అతిథిగృహంలో రాయచూర్ ఎస్పీ అరుణ్ష్ గిరి ఆధ్వర్యంలో రాష్ట్ర సరిహద్దు పోలీసు అధికారులతో సమన్వయ నేర సమీక్ష బుధవారం జరిగింది. సరిహద్దుల్లో శాంతిభద్రతల పరిరక్షణకు పరస్పర సమన్వయం ఎంతో కీలకమని అధికారులు పేర్కొన్నారు. రాష్ట్రాల మధ్య నేరస్తుల కదలికలను అరికట్టడం, నేరాల నియంత్రణలో సమర్థవంతమైన చర్యలు తీసుకోవడానికి సమాచారం పంచుకోవడం అవసరమని అభిప్రాయపడ్డారు. పరారీలో ఉన్న నేరస్తుల వివరాల సేకరణ, ఎన్బీడబ్ల్యూ అమలుపై సమన్వయం, మిస్సింగ్ కేసుల పరిష్కారం కోసం సమాచార మార్పిడి, రోడ్డు ప్రమాదాల నియంత్రణకు సంయుక్త చర్యలు, గుర్తుతెలియని మృతదేహాల గుర్తింపు, దొంగతనాలు, ఇతర నేరాల నియంత్రణకు ముందస్తు చర్యలు, సహరిద్దు ప్రాంతాల్లో జరిగే నేరాలపై తక్షణ సమాచార మార్పిడి కోసం ప్రత్యేక వాట్సాప్గ్రూపు ఏర్పాటు చేసి నిరంతర పురోగతిని పంచుకోవాలని నిర్ణయించారు. ఈ తరహా సమన్వయ సమావేశాలు సరిహద్దు ప్రాంతాల్లో నేర నియంత్రణకు ఎంతో దోహదపడతాయని అధికారులు పేర్కొన్నారు. రాష్ట్రాల మధ్య సమన్వయంతో పని చేయడం ద్వారా ప్రజల భద్రతను మరింత బలోపేతం చేయగలమని తెలిపారు. సమావేశంలో కర్ణాటక సరిహద్దు జిల్లాల పోలీసు అధికారులు, తెలంగాణలోని గద్వాల, నారాయణపేట జిల్లాల ప్రతినిధులు, అలాగే ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా పోలీసు అధికారులు పాల్గొనగా.. నారాయణపేట జిల్లా నుంచి మక్తల్ సీఐ రాంలాల్, కృష్ణా ఎస్ఐ ఎస్ఎం నవీద్ హాజరయ్యారు. -
నీరుపయోగమేనా?
● 20ఏళ్లు గడిచినా పూర్తికాని పనులు ● డీజిల్ ఇంజిన్లతో పంటలకు సాగునీరు ● రైతులకు తడిసిమోపెడవుతున్న పెట్టుబడి ఖర్చులు అసంపూర్తిగా ముచ్చోనిపల్లి రిజర్వాయర్ కాల్వలు అయిజ: నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంలో అంతర్భాగమైన ముచ్చోనిపల్లి రిజర్వాయర్ కాల్వల పనులు నత్తనడకన సాగుతున్నాయి. సంవత్సరాలు గడుస్తున్నా కాల్వల నిర్మాణం పూర్తికాకపోవడంతో ఆయకట్టు రైతులకు సాగునీరు అందని ద్రాక్షగా మారింది. ముచ్చోనిపల్లి జలాశయం ద్వారా అయిజ మండలంలోని ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు 20 ఏళ్ల క్రితం కాల్వల నిర్మాణ పనులు చేపట్టగా.. నేటికీ అసంపూర్తిగానే ఉన్నాయి. దీంతో వచ్చే కొద్దిపాటి నీటిని రైతులు ఇంజిన్ల ద్వారా పంట పొలాలకు పారించాల్సిన దుస్థితి నెలకొంది. పంటలకు పూర్తి నీటితడులు లేక దిగుబడులు రావడంలేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. సంవత్సరాల తరబడి.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 2006లో నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం పనులకు శ్రీకారం చుట్టారు. ఈ ప్రాజెక్ట్లో భాగంగా 109 ప్యాకేజీ కింద గట్టు మండలం ముచ్చోనిపల్లి శివారులో రూ. 38.25 కోట్ల వ్యయంతో 1.634 టీఎంసీల సామర్థ్యం గల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మించారు. దీంతో సుమారు 2,500 ఎకరాల భూములు ముంపునకు గురయ్యాయి. రిజర్వాయర్ నిర్మాణం పూర్తయిన తర్వాత 16వేల ఎకరాలకు సరిపడా నీటిని నిల్వ ఉంచుతున్నారు. అయితే 107వ ప్యాకేజీ కింద ర్యాలంపాడు వద్ద ఏర్పాటుచేసిన ఎత్తిపోతల నుంచి మెయిన్ కెనాల్ ద్వారా 38వేల ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉంది. అనుకోని పరిస్థితుల్లో మెయిన్ కెనాల్ నుంచి పంటపొలాలకు సాగునీరు అందకపోవడంతో అధికారులు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ద్వారా నీరందించేందుకు మైనర్ కెనాల్స్ నిర్మాణ పనులు చేపట్టగా.. సంవత్సరాల తరబడి అసంపూర్తిగానే ఉన్నాయి. ముచ్చోనిపల్లి రిజర్వాయర్ ద్వారా 107 ప్యాకేజీ కింద 38వేల ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉండగా.. కేవలం 28 వేల ఎకరాలకు మాత్రమే నామమాత్రంగా నీరందుతోంది. మరో 10వేల ఎకరాలకు సాగునీరందక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. రిజర్వాయర్ కింద ఫీటు కాల్వల నిర్మాణ పనులను ఇప్పటికీ ప్రారంభించలేదు. దీంతో రైతు లు ఆందోళనకు గురవుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో కాల్వలు తవ్వినా నీరు ముందుకు పారని పరిస్థితి ఉంది. రైతులు డీజిల్ ఇంజిన్లు ఏర్పా టు చేసుకొని పంటపొలాలకు సాగునీటిని అందిస్తున్నారు. ఇప్పటికైనా పాలకులు స్పందించి కాల్వల నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని రైతులు కోరుతున్నారు. నెట్టెంపాడు ప్రాజెక్ట్ ను ంచి పంటపొలాల కు సాగునీరు వస్తుందని ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్నాం. ము చ్చో నిపల్లి రిజర్వాయర్లో నీరు ఉన్నా లాభం లేకుండా పోయింది. పంటపొలాల్లో కాల్వలు తవ్వి అసంపూర్తి గా వదిలేశారు. కాల్వలు తవ్వకుండా ఉ న్నా ఆ స్థలంలో పంటలు పండించుకునే వాళ్లం. – లింగన్న, రైతు, అయిజ పంటపొలాల్లో కాల్వ లు ఉన్న రైతులు ఏదో రకంగా నీటిని వినియోగించుకుంటున్నారు. కాల్వలకు దూరంగా భూములు ఉన్న వారి పరిస్థితి దీనంగా ఉంది. వచ్చే వర్షాకాలం నాటికై నా కాల్వ పనులు పూర్తిచేసి.. సాగునీటిని అందించాలి. – గోవిందు, రైతు, ఎక్లాస్పురం ముచ్చోనిపల్లి రిజర్వాయర్కు సంబంధించి 107 ప్యాకేజీ కింద పెండింగ్లో ఉన్న కాల్వ ల నిర్మాణ పనులను పూర్తిచేసేందుకు మ రో కాంట్రాక్టర్తో ఒప్పందం కుదుర్చుకుంటాం. ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమం ద్వారా కాల్వల్లో ముళ్లపొదల తొలగింపు, పూడిక తీసేందుకు ప్రణాళిక రూపొందించాం. ఇప్పటికే ఉపాధిహామీ పథకం ద్వారా కొన్ని పనులు చేపట్టాం. వీలైనంత వరకు పనులు పూర్తిచేసేందుకు చర్యలు తీసుకుంటాం. – సంజీవ్ ప్రసాద్, ఈఈ, 107వ ప్యాకేజీ -
నిబంధనలు పాటిస్తేనే సురక్షిత ప్రయాణం
అలంపూర్: క్రమశిక్షణతో రోడ్డు నిబంధనలు పాటి స్తేనే సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకుంటారని ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. అలంపూర్ మాంటిస్సోరి పాఠశాలలో బుధవారం జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో రోడ్డు భద్రత నియమాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా హెల్మెట్ వినియోగం, సీట్ బెల్టు ధరించే విధానం, జీబ్రా క్రాసింగ్ వంటి అంశాలపై డెమో ద్వారా వి ద్యార్థులకు వివరించారు. అనంతరం ఆరైవ్.. అలైవ్ సందేశంతో విద్యార్థులు మానవహారం ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ద్వి చక్ర వాహనదారులు హెల్మెట్ ధరించడం బాధ్యత గా భావించాలన్నారు. భావిభారత పౌరులైన విద్యార్థులకు రోడ్డు భద్రతపై స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలని సూచించారు. తనతో పాటు ఇతరులు ఎవరికీ ప్రమాదం జరగకూడదనే ఆలోచన ఉండాలని తెలిపారు. ప్రపంచం అంతరిక్షంలో అద్భుతాలు సృష్టిస్తుండగా.. రహదారి భద్రతపై చాలా మందికి అవగాహ న లేక ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. విద్యార్థులే కుటుంబాల్లో మార్పు తీసుకురావాలని సూచించారు. కుటుంబ సభ్యులు బైక్పై బయట కు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించేలా చూడాలన్నారు. ఎంవీఐ ప్రవీణ్కుమార్ మాట్లాడుతూ.. ప్రతి వ్యక్తి ప్రయాణం భద్రంగా సాగాలన్నారు. అందుకోసం రోడ్డు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూ చించారు. డీఎస్పీ మొగిలయ్య మాట్లాడుతూ.. మైనర్ డ్రైవింగ్పై కఠిన చర్యలు ఉంటాయన్నారు. మైనర్లు వాహనాలు నడిపితే రూ. 25 వేల జరిమానాతో పాటు తల్లిదండ్రులకు శిక్ష విధించే అవకాశం ఉందన్నారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడపొద్దన్నారు. కార్యక్రమంలో సీఐ ప్రదీప్కుమార్, ఎంపీడీఓ పద్మావతి, ఎంఈఓ అశోక్ కుమార్, స్కూల్ కరస్పాండెంట్ రవిప్రకాశ్ పాల్గొన్నారు. -
మామిడి క్లస్టర్తో మేలు
కొల్లాపూర్: నాణ్యమైన ఉత్పత్తులు.. ఎగుమతులకు అనుకూలమైన పంటల సాగును ప్రోత్సహించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న క్లస్టర్ విధానం మామిడి రైతులకు ఉపయోగకరంగా మారింది. మామిడి సాగుకు ప్రసిద్ధిగాంచిన గుజరాత్ రాష్ట్రంలోని కచ్, ఉత్తర్ప్రదేశ్లో లక్నో, తెలంగాణలోని ఉమ్మడి పాలమూరు జిల్లాలను మూడేళ్ల క్రితం కేంద్రం క్లస్టర్ జోన్లుగా గుర్తించింది. పాలమూరు క్లస్టర్లో ఉమ్మడి జిల్లాలోని మహబూబ్నగర్, నాగర్కర్నూల్, నారాయణపేట, గద్వాల, వనపర్తి ఉండగా.. క్లస్టర్ సేవల్లో భాగంగా జిల్లాకు రూ.200 కోట్లు కేటాయించింది. నాలుగేళ్ల పాటు ప్రణాళికాబద్ధంగా నిధుల విడుదలకు నిర్ణయించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో.. ఉమ్మడి పాలమూరులోని కొల్లాపూర్ నియోజకవర్గంలో మామిడి సాగు అధికంగా ఉంటుంది. ఇక్కడ పండే మామిడికి అంతర్జాతీయ ఖ్యాతి ఉంది. కేంద్రం ప్రకటించిన క్లస్టర్ డెవలప్మెంట్ అథారిటీని కేంద్ర, రాష్ట్ర ఉద్యాన శాఖలు సయన్వయంతో నిర్వహిస్తున్నాయి. క్లస్టర్ అభివృద్ధిలో భాగంగా ఈ ఏడాది ఒక్క కొల్లాపూర్ నియోజకవర్గంలోనే 62 లక్షల మామిడి కవర్లను సబ్సిడీపై రైతులకు అందజేశారు. జిల్లావ్యాప్తంగా కోటికిపైగా కవర్ల పంపిణీ జరిగింది. మామిడి కాయలకు కవర్లు కట్టడం వల్ల ఎలాంటి రసాయనాలు వాటిపై పడవు. చీడపీడలు కూడా ఆశించవు. కాయలు మంచి రంగులో ఉంటాయి. కవర్లు కట్టిన కాయలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ప్రస్తుతం మార్కెట్లో సాధారణ కాయలకు, కవర్ కాయలకు మధ్య టన్నుకు రూ.30 వేలకు పైగా ధర అధికంగా పలుకుతోంది. దీనివల్ల రైతులు ఆర్థికంగా లబ్ధి పొందుతున్నారు. ఉమ్మడి జిల్లాలో సాగు ఇలా.. ఉమ్మడి పాలమూరు జిల్లావ్యాప్తంగా 62,612 ఎకరాల్లో మామిడి తోటలు ఉన్నాయి. మరో 10 వేల ఎకరాల్లో కొత్తగా సాగు చేపట్టారు. అత్యధికంగా కొల్లాపూర్ నియోజకవర్గంలోనే 31,728 ఎకరాల్లో మామిడి సాగు జరుగుతోంది. వీటిలో పంట కాపు వచ్చే తోటలు 30 వేల ఎకరాల మేరకు ఉన్నాయి. సురభి సంస్థానాధీశుల కాలం నుంచి ఈ ప్రాంతంలో మామిడి తోటలు సాగుచేస్తున్నారు. ఇక్కడ పండే బేనిషాన్ రకం మామిడికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుంది. బేనిషాన్ రకం మామిడికి జాతీయస్థాయి గుర్తింపు కూడా ఉంది. బేనిషాన్తోపాటు హిమాయత్, దెషేరీ, కలెక్టర్, బంగారు, జహంగీర్ పసంద్, మోతిమోనీ పసంద్, చిన్నరసాలు, పెద్దరసాలు, మల్గుబా వంటి నోరూరించే మామిడి పండ్లు ఇక్కడ పండుతాయి. క్లసర్ ద్వారా ప్రోత్సాహకాలు.. క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం బాధ్యతలను గ్రాండ్ కార్టన్ కంపెనీ, ప్రసాద్ సీడ్స్ కంపెనీ నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా మామిడి సాగు విధానాలపై అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నారు. నాణ్యమైన పంట ఉత్పత్తి కోసం సబ్సిడీపై పేపర్ కవర్లు ఇస్తున్నారు. కాయలు కత్తిరించేందుకు, కొమ్మలు నరికేందుకు అవసరమైన సామగ్రిని ఇస్తున్నారు. డ్రిప్ సౌకర్యం, క్లయిమింగ్ ల్యాడర్స్, దపోలి హార్వెస్టర్ పరికరాల పంపిణీ, పండ్లు మాగ బెట్టేందుకు అవసరమైన వసతులను స్థానికంగా కల్పించేందుకు చర్యలు చేపట్టారు. క్లస్టర్ పరిధిలోని మొత్తం 62 వేల ఎకరాల రైతులందరికీ ప్రోత్సాహకాలు అందించాలని నిర్ణయించారు. త్వరలోనే ప్రాసెసింగ్ యూనిట్.. పెద్దకొత్తపల్లి మండలంలో రూర్బన్ మిషన్ పథకం కింద రూ.4 కోట్ల వ్యయంతో నిర్మించిన మామిడి ప్రాసెసింగ్ యూనిట్ త్వరలోనే అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం విద్యుత్ లైనింగ్ పనులు జరుగుతుండగా.. మిగతావన్నీ పూర్తయ్యాయి. దీని నిర్వహణ బాధ్యతలు మహిళా సంఘాలు లేదా మామిడి రైతులకు అప్పగించాలని భావిస్తున్నారు. ఇది అందుబాటులోకి వస్తే గ్రేడింగ్ వారీగా ఇక్కడే ప్రాసెసింగ్ చేసి ఎగుమతులు చేసేందుకు వీలుంటుంది. రైతులకు అప్పగించాలి పెద్దకొత్తపల్లి మండలంలో ఏర్పాటు చేస్తున్న మామిడి ప్రాసెసింగ్ యూనిట్ నిర్వహణ బాధ్యతలను మామిడి సాగు చేస్తున్న రైతులకే అప్పగించాలి. ప్రాసెసింగ్ యూనిట్ ద్వారా కలిగే ప్రయోజనాలను రైతులకు రెగ్యులర్గా వివరించాలి. దీంతో ఎగుమతులకు ఉపయోగపడేలా మామిడి సాగుకు రైతులు ఆసక్తి చూపుతారు. క్లస్టర్ ఏజెన్సీ ద్వారా అందుతున్న సహకారంతో నాణ్యమైన ఉత్పత్తులు వస్తున్నాయి. – శ్రీనివాసులు, మామిడి రైతు, కొల్లాపూర్నాణ్యతలో బెటర్.. కొల్లాపూర్ మామిడికి దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉంది. కేంద్రం మన ఉమ్మడి పాలమూరు జిల్లాను క్లస్టర్గా గుర్తించడం వల్ల మామిడి సాగుకు అవసరమైన వసతి, సదుపాయాలను ప్రభుత్వం కల్పిస్తుంది. ఇందుకోసం నిధులను కూడా కేటాయించింది. మన మామిడి మంచి రంగు, రుచి, వాసన కలిగి ఉంటుంది. నాణ్యతలో ఇది బెటర్గా ఉంది. ఈ ఏడాది క్లస్టర్ ఏజెన్సీలో ఆశించిన ఫలితాలు వచ్చాయి. – లక్ష్మణ్, ఉద్యాన అధికారి, కొల్లాపూర్ మూడేళ్ల క్రితం పాలమూరును క్లస్టర్గా ఎంపిక చేసిన కేంద్రం ఎగుమతులకు ఉపయోగపడేమామిడి ఉత్పత్తి కోసం రూ.200 కోట్ల కేటాయింపు నాలుగేళ్లపాటు ప్రణాళికబద్ధంగా నిధుల విడుదలకు నిర్ణయం నాణ్యమైన కాయలను ఉత్పత్తి చేస్తున్న రైతాంగం -
మెరుగైన వైద్యసేవలు అందించాలి
గద్వాల: ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి వైద్యులకు సూచించారు. బుధవారం కలెక్టరేట్లో వైద్యాధికారులతో నిర్వహించిన సమావేశంలో పలు అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రజలకు మెరుగైన వైద్యం అందించినప్పుడే ప్రజలకు ప్రభుత్వ ఆస్పత్రులపై నమ్మకం కలుగుతుందన్నారు. ఆస్పత్రుల్లోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న వైద్యులు, ఇతర సిబ్బంది పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటామని తెలిపారు. జిల్లా ఆస్పత్రిలో విభాగాల వారీగా అవసరమైన పరికరాలు, వసతుల కల్పనకు ప్రతిపాదనలు పంపాలని సూచించారు. అదే విధంగా ఆస్పత్రి వద్ద పార్కింగ్ సమస్య లేకుండా చూడాలన్నారు. మెప్మాకు సంబంధించిన అర్బన్ సెల్టర్ హోమ్ నిర్మాణానికి గతంలోనే రూ.కోటికి పైగా నిధులు మంజూరయ్యాయని.. తగిన స్థలంలో నిర్మించాలన్నారు. సదరం క్యాంపులకు వచ్చే దివ్యాంగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. గాంధీచౌక్లోని పాత జిల్లా వైద్యాధికారి కార్యాలయంలో ఖాళీగా ఉన్న గదుల్లోకి ఆయూష్ ఆస్పత్రిని తరలించాలని అధికారులకు సూచించారు. స్థానికంగా మెరుగైన వైద్య సేవలు లభించకపోవడంతో చాలా మంది వైద్యం కోసం కర్నూలుకి వెళ్తున్నారన్నారు.గర్భిణులు ప్రసవం కోసం ప్రైవేటు ఆస్ప త్రులకు వెళ్తే సిజేరియన్లు చేస్తూ.. రూ. 30వేలకు పైగా బిల్లులు వేస్తున్నారన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే కాన్పులు జరిగేలా చూడాలన్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటామని తెలిపారు. సమావేశంలో డీఎంహెచ్ఓ డా.సంధ్యాకిరణ్మయి, సూపరింటెండెంట్ డా.ఇందిర, మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ నాగేశ్వర్రావు పాల్గొన్నారు. ● 2026–27 విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వం ఏర్పాటుచేసే తెలంగాణ పబ్లిక్ స్కూల్లో అన్ని వసతులు కల్పించాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అధికారులను ఆదేశించారు. గద్వాల మండలం కాకులారం జెడ్పీహెచ్ఎస్ వద్ద భవన నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని పరిశీలించారు. ప్రస్తుతం ఇక్కడ సుమారు 130మంది విద్యార్థులు ఉన్నప్పటికీ.. భవిష్యత్లో సుమారు 1500 మంది విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని మౌలిక సదుపాయాలు కల్పించాలని తెలిపారు. కాగా, ఇదివరకే మంజూరైన 24 తరగతి గదుల నిర్మాణంపై అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఆయన వెంట డీఈఓ విజయలక్ష్మి, ఈడబ్ల్యూఐడీసీ డీఈ ఇక్బాల్ హుస్సేన్, ఏఈ మోహన్రెడ్డి, సెక్టోరియల్ అధికారి మైఖేల్ ఉన్నారు. ● మహనీయుల జీవిత చరిత్రలు అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని కలెక్టర్ అన్నారు. బాబు జగ్జీవన్రామ్, డా.బీఆర్ అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకొని జిల్లా ఎస్సీకులాల అభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో సంక్షేమ వసతిగృహ విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన, ఉపన్యాస పోటీల్లో ప్రతిభకనబరిచిన వారికి బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో ఎస్సీ సంక్షేమశాఖ అధికారి నుషిత పాల్గొన్నారు. ఆస్పత్రుల్లో వైద్యులు, సిబ్బంది పోస్టుల భర్తీకి చర్యలు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి -
అంబేడ్కర్ ఆశయాలు కొనసాగించాలి
ఇటిక్యాల: రాజ్యాంగాన్ని నిర్మించడం కోసం అహర్నిషలు కృషిచేసిన అంబేడ్కర్ ఆశయాలను ప్రతిఒక్కరూ కొనసాగించాలని పదవ పటాలం కమాండెంట్ జయరాజు అన్నారు. పటాలంలో అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి మాట్లాడారు. దేశంలో అంటరానితనం, దళితుల హక్కుల కోసం ఎన్నో పోరాటాలు చేసి వారికి ఒక ప్రత్యేక స్థానాన్ని కల్పించారన్నారు. ప్రతిఒక్కరూ ఆయన అడుగు జాడల్లో నడిచి ఆశయాలను కొనసాగించాలని కోరారు. అలాగే మండలంలోని కొండేరులో నిర్వహించిన కార్యక్రమానికి కమాండెంట్ హాజరై మాట్లాడారు. కార్యక్రమంలో రిజర్వు ఇన్స్పెక్టర్లు ధర్మారావు, నర్సింహరాజు, రాజేశం, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. -
ప్రారంభించి రెండేళ్లు.. వినియోగానికి ఎన్నేళ్లో?
●రూ.17 కోట్లతో అధునాతన వసతులతో భవన నిర్మాణం ● గత అసెంబ్లీ ఎన్నికలకు ముందే అట్టహాసంగా ప్రారంభం ● అందుబాటులోకి తేవడంలో అధికారుల అలసత్వం ● చిన్నపాటి మార్కెట్లతో ప్రజలకు తప్పని ఇబ్బందులు జిల్లాకేంద్రంలో దిష్టిబొమ్మగా మారిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ గద్వాల న్యూటౌన్: జిల్లాకేంద్రమైన గద్వాలలో ఇంటిగ్రేటెడ్ (సమీకృత) మార్కెట్ ఇక్కడి ప్రజలకు అందని ద్రాక్షలా మారింది. వ్యవసాయ మార్కెట్ యార్డు పక్కనున్న ఖాళీ స్థలం 2.30 ఎకరాల్లో అధునాతనంగా దాదాపు రూ.17 కోట్లతో నిర్మించారు. ఈ మార్కెట్ను ఘనంగా ప్రారంభించి.. దాదాపు రెండేళ్లకుపైగా గడుస్తున్నా వినియోగంలోకి తీసుకురావడంలో అధికారులు తమ మార్క్ నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. గద్వాల పట్టణం జిల్లాకేంద్రంగా మారినప్పటి నుంచి చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాలవారు ఉద్యోగ, ఉపాధి, విద్యా రంగాల కోసం పట్టణానికి వచ్చి స్థిరపడుతున్నారు. దీంతో పట్టణం నలువైపులా షరవేగంగా విస్తరిస్తోంది. ఈ క్రమంలో ప్రజల అవసరాలకు తగ్గట్టుగా సౌకర్యాల కల్పనపై ప్రజాప్రతినిధులు, అధికారులు దృష్టిసారించారు. అయితే ఇప్పటికే పట్టణంలో ఉన్న మటన్, ఫిష్ మార్కెట్లు చిన్నవిగా ఉన్నాయి. కూరగాయల మార్కెట్ పెద్దదిగా ఉన్న అది కూడా ఒక్కటే కావడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో అన్నీ ఒకేచోట ఉంటే ప్రజలకు సౌకర్యంగా ఉంటుందనే ఉద్దేశంతో మార్కెట్ యార్డు ఆవరణలో 2.30 ఎకరాల స్థలంలో స్టేట్ డెవలప్మెంట్ ఫండ్ నుంచి దాదాపు రూ.17 కోట్లతో సమీకృత మార్కెట్ నిర్మాణం పూర్తిచేశారు. 2021 సెప్టెంబర్ 14న శంకుస్థాపన చేసిన మార్కెట్ను గడిచిన అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్కు ముందు ప్రారంభించారు. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ అందుబాటులోకి వస్తే ఇక్కడి ప్రజలకు ఎంతో సౌకర్యంగా ఉంటుంది. పట్టణం రోజురోజుకూ విస్తరిస్తుండటంతో ప్రజలకు అన్నీ ఒకేచోట లభించే మార్కెట్ లేదు. ప్రస్తుతం నిర్మాణం పూర్తి చేసుకున్న మార్కెట్ వల్ల అన్నీ ఒకేచోట లభిస్తాయి. కూరగాయలు, నిత్యావసర సరుకులు, మటన్, ఫిష్, చికెన్ ఇలా అన్ని ఒకేచోట వినియోగదారులు కొనుగోలు చేయవచ్చు. ఇవన్నీ మార్కెట్ అందుబాటులోకి వస్తేనే సాధ్యపడుతాయి. ఇప్పటికై నా అధికారులు అటువైపు అడుగులు వేసి రూ.కోట్లతో నిర్మించిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ను అందుబాటులోకి తీసుకురావాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. సమీకృత మార్కెట్ వివరాలు ఇలా.. మార్కెట్ నిర్మించిన స్థలం : 2.30 ఎకరాలు కమర్షియల్ దుకాణాలు : 34 వెజిటేరియన్ బ్లాక్లో దుకాణాలు : 107 మటన్, చికెన్ బ్లాక్లో దుకాణాలు : 46 ఫిష్ బ్లాక్లో దుకాణాలు : 39 ఇంటిగ్రేటెడ్ మార్కెట్ను అధునాతనంగా నిర్మించారు. విశాలమైన పార్కింగ్ స్థలంతోపాటు బ్లాక్ వైస్గా వెజ్, నాన్వెజ్, సూపర్ మార్కెట్, కమర్షియల్ దుకాణాలను వేర్వేరుగా నిర్మాణం చేశారు. అడ్మిన్ కార్యాలయం సైతం ఏర్పాటు చేశారు. వెజ్ బ్లాక్లోని దుకాణాల్లో కూరగాయల గంపలు పెట్టడానికి స్టెప్ వైజ్గా కట్టారు. ఇక నాన్వెజ్కు సంబంధించి మటన్, ఫిష్, చికెన్ దుకాణాల్లో ప్రతిచోట నాన్వెజ్ను శుభ్రం చేసేందుకు నీటి సౌకర్యంతో సింక్, తగిలించేందుకు ప్రత్యేకంగా స్టీల్ రాడ్లను ఏర్పాటు చేశారు. నిర్మాణం పూర్తయిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ను ప్రారంభించి దాదాపు ఏడాది గడుస్తున్నా ఇంత వరకు అందుబాటులోకి రాలేదు. గడిచిన అసెంబ్లీ ఎన్నికల అనంతరం అప్పటి అదనపు కలెక్టర్ అధికారులతో కలిసి మార్కెట్ను సందర్శించారు. అందుబాటులోకి తీసుకురావడానికి అవసరమైన పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఇందులో భాగంగా అప్పుడు హడావుడిగా మున్సిపల్ అధికారులు కూరగాయల, ఫ్రూట్, మటన్, చికెన్, ఫిష్ వ్యాపారుల అసోసియేషన్ నాయకులతో సమావేశం నిర్వహించి.. మార్కెట్లో ఉన్న సౌకర్యాలను చూపించారు. వ్యాపారులు, వీధి వ్యాపారులు ఇక్కడ వ్యాపారం చేసుకునే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆ తర్వాత దీని గురించి పట్టించుకోకపోవడంతో అందుబాటులోకి తీసుకురావడానికి ఒక్క అడుగు ముందుకు పడలేదు. -
రాజకీయాల్లో మహిళల ప్రాధాన్యత పెరగాలి
పాలమూరు: చట్ట సభల్లో 33 శాతం మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతుగా మంగళవారం సాయంత్రం స్టేడియం గ్రౌండ్ నుంచి తెలంగాణ చౌరస్తా వరకు నారీ శక్తి వందన్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ డీకే అరుణ హాజరై మహిళలతో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం తెలంగాణ కూడలిలో మహిళలతో కలిసి ఎంపీ బతుకమ్మ ఆడారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ 2029 సార్వత్రిక ఎన్నికల్లో పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్ అమలు చేయాలని చట్టం చేయబోతున్నట్లు తెలిపారు. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ప్రతి ఒక్క పార్టీ సభ్యులు పాల్గొని ఈ బిల్లుకు మద్దతు ఇవ్వాలని కోరారు. మహిళలు రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉందని, రాజకీయాల్లో రాణించే శక్తి, పాలించే శక్తి మహిళలకు ఉందన్నారు. దేశ పరిపాలనలో మహిళలు భాగస్వామ్యం కావాలన్నారు. మహిళలు రాజకీయాల్లోకి వస్తే తమ కుర్చీలు, ప్రాధాన్యత పోతుందని మహిళ బిల్లును అడ్డుకునే ప్రయత్నం గతంలో కొందరు చేశారన్నారు. 2029లో మహిళా రిజర్వేషన్ 33 శాతం అమలు చేయాలని ప్రధాని కంకణం కట్టుకొని పని చేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణలో కొత్తగా 60 అసెంబ్లీ స్థానాలు పెరిగితే 60 మంది మహిళలు ఎమ్మెల్యేలు అవుతారని వెల్లడించారు. మహిళా బిల్లుకు మద్దతు తెలుపుతూ 9667173333 నంబర్కు మిస్డ్కాల్ ఇవ్వాలన్నారు. అసెంబ్లీ స్థానాలు పెరిగితే రాష్ట్రంలో 60 మంది మహిళ ఎమ్మెల్యేలు అవుతారు 9667173333 నంబర్కు మిస్డ్కాల్ ఇచ్చి మహిళా బిల్లుకు మద్దతు తెలపండి ఎంపీ డీకే అరుణ -
ఎవరూ సీరియస్గా తీసుకోవడం లేదు..
ఫార్మా కంపెనీల పక్కనే మా పొలాలున్నాయి. కలుషిత నీటిని వదులుతున్నప్పుడల్లా ఆ నీటి శాంపిళ్లను తీసుకుపోయి పీసీబీ అధికారులకు ఇస్తున్నాం. లిఖితపూర్వకంగా ఎన్నోసార్లు ఫిర్యాదులు ఇచ్చాం. వాళ్లు వస్తారు.. మమ్మల్ని హైదరాబాద్కు పిలుస్తారు. పరిశ్రమల సిబ్బందిని పిలిచి ఇంకోసారి వదలకండనీ చెబుతారు. ఆ తర్వాత కంపెనీలది మళ్లీ షరామామూలే. మా సమస్యలను ఎవరూ సీరియస్గా తీసుకోవడం లేదు. మా బాధలు ఎవరికి చెప్పుకోవాలో తెలియడం లేదు. – మాధవీలత, మహిళా రైతు -
మాకు న్యాయం చేయాలి..
కంపెనీల నుంచి శుద్ధి చేయకుండా బయటకు వదిలే రసాయనాలు కలిసిన నీరు మూలంగా పంటలు పండవని.. ఆ నీళ్లు తాగడానికి కూడా పనికిరావని అగ్రికల్చర్, గ్రౌండ్ వాటర్ అధికారులు ఎప్పుడో తేల్చారు. మా బోర్లు, భూములు పరిశీలించి.. టెస్టులు చేసి.. సర్టిఫికెట్లు ఇచ్చారు. మేం ఊరి వదిలిపెట్టి పోవాల్నా.. లేకుంటే ఏమైనా తాగి సావాల్నా అర్థమైతలేదు. కాలుష్యపు నీళ్లు వదిలే కంపెనీలపై చర్యలు తీసుకుని.. పరిహారం ఇప్పించాలి. మాలాంటి రైతులందరికీ తగిన న్యాయం చేయాలి. – ముల్గర నారాయణగౌడ్, రైతు, ముదిరెడ్డిపల్లి -
అలంపూర్ అభివృద్ధికి సహకరించండి
అలంపూర్: అలంపూర్ మున్సిపాలిటీ అభివృద్ధికి సహకరించాలని కాంగ్రెస్ నాయకులు కోరారు. ఈ మేరకు జిల్లాకేంద్రంలో ఎంపీ మల్లురవికి ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే సంపత్కుమార్, అలంపూర్ పట్టణ అధ్యక్షుడు నర్సింహ తదితరులు మంగళవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా అలంపూర్ పట్టణానికి డిగ్రీ కళాశాల మంజూరు చేయాలని వినతిలో కోరినట్లు వారు చెప్పారు. స్థానికంగా ఇంటర్ కళాశాల మాత్రమే ఉండటంతో ఉన్న త విద్య కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థి తి నెలకొందన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్న పేద, మధ్య తరగతి విద్యార్థులు డిగ్రీ కళాశాల లేకపోవడంతో ఉన్నత చదువులకు దూరమవుతున్నారని పేర్కొన్నారు. పేద విద్యార్థుల ఉన్నత చదువుల కోసం స్థానికంగా డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాల ని విన్నవించారు. నియోజకవర్గ కేంద్రంలో గ్యాస్ ఏజెన్సీ కేంద్రం లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, గ్యాస్ కోసం అలంపూర్ చౌరస్తాకు వెళ్లాల్సి వస్తుందని వివరించారు. అక్కడికి వెళ్లిన సకాలంలో గ్యాస్ లభిస్తుందనే నమ్మకం లేదని, దీంతో పట్టణంతోపాటు మండల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకోని గ్యాస్ ఏజెన్సీ కేంద్రం ఏర్పాటు చేయాలని, బాబు జగ్జీవన్రాం విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని వినతిలో కోరారు. సానుకులంగా స్పందించిన ఎంపీ గ్యాస్ ఏజెన్సీ ఏ ర్పాటుకు ఉన్నతాధికారులతో మాట్లాడతానని హా మీ ఇచ్చారన్నారు. డిగ్రీ కళాశాల అంశాన్ని సీఎం రేవంత్రెడ్డి దృష్టికి తీసుకెళ్లి తమవంతుగా కృషి చేస్తానన్నారు. వినతిపత్రం అందజేసిన వారిలో నాయకులు సుందర్రాజు, జాన్, సుంకన్న తదితరులున్నారు. -
అణగారిన వర్గాల ఆశాజ్యోతి అంబేడ్కర్
గద్వాల: దేశంలోని బడుగు, బలహీన, అణగారిన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అని కలెక్టర్ రిజ్వాన్బాషా షేక్ అన్నారు. మంగళవారం అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకొని జిల్లాకేంద్రంలోని అంబేడ్కర్ విగ్రహానికి ఎంపీ మల్లురవి, ఎస్పీ శ్రీనివాసరావుతో కలిసి కలెక్టర్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అణగారిన వర్గాల అభ్యున్నతికి అంబేడ్కర్ కల్పించిన రిజర్వేషన్లనే కారణమని కొనియాడారు. రాజ్యాంగంపై అవగాహన కోసం స్వయంగా 30 వేల రాజ్యాంగ ముఖ్యాంశాలు పుస్తకాలను ముద్రింపజేసినట్లు వెల్లడించారు. కార్యక్రమంలోని అదనపు కలెక్టర్లు లక్ష్మీనారాయణ, నర్సింగ్రావు, మున్సిపల్ చైర్మన్ జయలక్ష్మి, మాజీ ఎమ్మెల్యే సంపత్కుమార్, తహసీల్దార్ హరికృష్ణ, తదితరులు పాల్గొన్నారు. -
‘గరళ’కంఠుడే రావాలేమో..!
‘పోలేపల్లి’ పరిసర ప్రాంత వాసుల దీనగాధ విచారణలో తేలినా.. జడ్చర్ల మండలం పోలేపల్లి, రాజాపూర్ మండలం ముదిరెడ్డిపల్లి గ్రామాల శివారులో గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కు కోసం సుమారు 1,100 ఎకరాల్లో భూములను సేకరించారు. ఇందులో పోలేపల్లి సెజ్ కోసం 250 ఎకరాలు కేటాయించారు. దీని పరిధిలో ఇప్పటివరకు 12 ఫార్మా, మరో పది వరకు ఇతర పరిశ్రమలు కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. 2023లో ‘సాక్షి’లో ప్రచురితమైన వరుస కథనాలకు స్పందించిన అప్పటి కలెక్టర్ వెంకట్రావ్ ఆదేశాల మేరకు క్షేత్రస్థాయి తనిఖీలు నిర్వహించిన అనంతరం విచారణ బృందం శాఖల వారీగా ఆధారాలతో నివేదిక అందజేసింది. పలు ఫార్మా పరిశ్రమలు వర్షాకాలంలో వరద మాటున రసాయనాలతో కూడిన వ్యర్థ జలాలను శుద్ధి చేయకుండా చెరువులు, కుంటలు, పొలాల్లోకి వదులుతున్నాయని.. దీంతో పంటలు పండడం లేదని, జలాశయాల్లో చేపలు ఎదగకుండా మృతి చెందుతున్నాయని నివేదికలో పేర్కొంది. జడ్చర్ల మండలంలోని పోలేపల్లి, గుండ్లగడ్డ తండా, గొల్లపల్లి, రాజాపూర్ మండలంలోని రాయపల్లి, ముదిరెడ్డిపల్లి, నందిగామకు చెందిన పలువురు చర్మ, కీళ్ల నొప్పులు, శ్వాసకోశ, మూత్రపిండ సంబంధిత వ్యాధులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు వెల్లడించింది. కాగితాలకే పరిమితం.. విచారణ బృందం నివేదిక అందజేసిన క్రమంలో అప్పటి కలెక్టర్ వెంకట్రావ్ ప్రతి నెలా 11న కాలుష్య ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాలని అధికారులను ఆదేశించారు. ఆ రోజు సెలవు దినమైతే మరుసటి రోజున సందర్శించి పరిశ్రమల ప్రతినిధులు, స్థానికులతో సమావేశం ఏర్పాటు చేసి సమస్యలు లేకుండా చూడాలని సూచించారు. కాలుష్య కట్టడిలో భాగంగా వివిధ నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని టీజీఐఐసీ అధికారులకు సైతం సూచనలు చేశారు. అయితే ఇవేమీ అమల్లోకి రాకముందే వెంకట్రావ్ సూర్యాపేటకు బదిలీ అయ్యారు. అనంతరం రవినాయక్, ఆయన తర్వాత విజయేందిర బోయి మహబూబ్నగర్ కలెక్టర్లుగా పనిచేశారు. వీరి హయాంలో నెలనెలా తనిఖీల అంశం తెర మీదకే రాలేదు. ఇటీవల ఖుష్బూ గుప్తా కలెక్టర్గా రాగా.. నిబంధనలకు విరుద్ధంగా రసాయనాలతో కూడిన వ్యర్థ జలాలను శుద్ధి చేయకుండా వదులుతున్న పలు పరిశ్రమలపై కొందరు కలెక్టరేట్ గ్రీవెన్స్ సెల్లో ఫిర్యాదు చేశారు. ఫొటోలతో సహా పలు ఆధారాలు సమర్పించినట్లు తెలిసింది. ‘పోలేపల్లి సెజ్ పరిసర ప్రాంతాల్లోని ఆరు గ్రామాలు కాలుష్యం బారిన పడ్డాయి. ప్రధానంగా ఫార్మా పరిశ్రమల నుంచి వెలువడుతున్న వ్యర్థాలతో భూగర్భ జలాలు కలుషితమయ్యాయి. తాగేందుకు, పంటల సాగుకు, జీవచరాల ఉనికికి ఈ నీరు అసలే పనికి రాదు.’ ...పరిశ్రమల కాలుష్యం, ప్రభావిత ప్రాంతాలపై పలు ప్రభుత్వ శాఖలతో ఏర్పాటైన విచారణ కమిటీ 2023 జనవరి 31న అప్పటి కలెక్టర్ వెంకట్రావ్కు అందజేసిన నివేదికలోని అంశాలు ఇవి. మూడేళ్లుగా ఇవి కాగితాలకే పరిమితమయ్యాయి. నిబంధనలు పాటించని ఫ్యాక్టరీలతో పాటు ప్రభావిత పల్లెల్లో సంరక్షణ చర్యలనూ ‘అధికార’ యంత్రాంగం గాలికొదిలేసింది. ఈ క్రమంలో నెలనెలా ఫిర్యాదుల పరంపర కొనసాగుతున్నా.. అటు పీసీబీ, ఇటు జిల్లా అధికారులెవరూ పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. – సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్ ప్రస్తుతం పీసీబీ ఆడిందే ఆట.. పరిశ్రమల కాలుష్యంపై జిల్లా అధికారిక యంత్రాంగం సీరియస్గా వ్యవహరించిన క్రమంలో హైదరాబాద్లోని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారుల్లో కదలిక వచ్చింది. అప్పటివరకు నామమాత్రపు తనిఖీలకే పరిమితమైన వారు వర్షాకాలంలో పలుమార్లు స్వయంగా పర్యటించారు. ఆ తర్వాత మూడేళ్లలో పరిస్థితి తారుమారైనట్లు తెలుస్తోంది. జిల్లాస్థాయిలో వచ్చిన ఫిర్యాదులు చెత్తబుట్టలకే పరిమితం కాగా.. పీసీబీ ఆడిందే ఆటగా మారినట్లు తెలుస్తోంది. ఆధారాలతో సహా అందజేసినా.. కనీసం శాంపిళ్ల సేకరణకూ రాకపోవడంతో ఫిర్యాదుదారుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. పరిశ్రమల నుంచి నెలనెలా అందుతున్న మామూళ్లతోనే వారు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ప్రస్తుత కలెక్టర్ అయినా తమ గోడును పట్టించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. బీఓఎస్ (బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్) పరీక్ష సైతం చేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఫార్మా, తదితర పరిశ్రమల పొల్యూషన్తో బతుకులు ఛిద్రం తాగు, సాగుకు ఆ నీరు పనికిరాదని తేల్చిన విచారణ బృందం కలెక్టర్లు మారినా.. మారని బాధిత గ్రామాల ప్రజల తలరాతలు ఉత్తుత్తి మాటలుగానే నెలనెలా తనిఖీలు.. పీసీబీ తీరుపై అనుమానాలు ? ప్రస్తుత కలెక్టర్ అయినా దృష్టి సారించాలని బాధిత రైతుల విజ్ఞప్తి -
ప్రజల ప్రాణాల రక్షణ కోసమే ‘అరైవ్ అలైవ్’
ఎర్రవల్లి: ప్రజల ప్రాణాల రక్షణ కోసమే పోలీసుశాఖ అరైవ్.. అలైవ్ కార్యక్రమం చేపట్టడం జరిగిందని ఎస్పీ తోట శ్రీనివాసరావు అన్నారు. సోమవారం ఎర్రవల్లిలో అరైవ్.. అలైవ్పై నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. 44వ నంబర్ జాతీయ రహదారి ఉన్న ఎర్రవల్లి మండలంలో రోడ్డు భద్రత పాటించడం ఎంతో అవసరమన్నారు. రాష్ట్రవ్యాప్తంగా రోజు 70 నుంచి 80 వరకు రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని.. అందులో 20 నుంచి 30 మంది తమ ప్రాణాలు కోల్పోతున్నారని వెల్లడించారు. రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణం వాహనదారులు ట్రాఫిక్ నియమాలు పాటించకపోవడమేనని అన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా రోడ్డు భద్రత నియమాలు పాటిస్తేనే ప్రమాదాలను పూర్తిగా నివారించవచ్చని స్పష్టం చేశారు. అనంతరం గ్రామంలో ఏర్పాటుచేసిన రోడ్డు సేఫ్టీ కమిటీ సభ్యుల పాత్రను ఆయన వివరించారు. అదే విధంగా గ్రామస్తులతో ప్రతిజ్ఞ చేయించారు. సర్పంచ్ అనితా కృష్ణసాగర్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నీలి శ్రీనివాసులు, డీఎస్పీ మొగిలయ్య, సీఐ ప్రదీప్కుమార్, ఎస్ఐ రవి రాథోడ్, ఉపసర్పంచ్ మద్దిలేటిగౌడ్, పంచాయతీ కార్యదర్శి రంగన్న పాల్గొన్నారు. -
వృద్ధులు, దివ్యాంగుల సంక్షేమానికి కృషి
గద్వాల న్యూటౌన్: రాష్ట్రంలోని వృద్ధులు, దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలో వృద్ధుల కోసం ఏర్పాటుచేసిన మల్టీ సర్వీస్ డే కేర్ సెంటర్ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. వృద్ధుల జీవన ప్రమాణాలను మెరుగుపర్చడం.. స్వావలంబన పెంపొందించడం లక్ష్యంగా ప్రభుత్వ ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో తెలంగాణ వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య, అదనపు కలెక్టర్ నర్సింగ్రావు, మున్సిపల్ చైర్పర్సన్ జయలక్ష్మి, రెడ్క్రాస్ సొసైటీ చైర్మన్ అయ్యపురెడ్డి పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇళ్లు.. పేదలకు వరం ధరూరు/కేటీదొడ్డి: ఇందిరమ్మ ఇళ్లు పేదలకు ఓ వరమని ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి అన్నారు. ధరూరులో ఫరీదాబేగం, కేటీదొడ్డిలో శంకరమ్మ నిర్మించుకున్న ఇందిరమ్మ ఇళ్లను ఆయన ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకంతో పేదల సొంతింటి కల నెరవేరుతోందన్నారు. గద్వాల నియోజకవర్గంలో మొదటి విడతగా 3,500 ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేయగా.. ఇప్పటికే 1,500 ఇళ్ల నిర్మాణాలు ప్రారంభమై వివిధ దశల్లో ఉన్నాయన్నారు. త్వరలోనే రెండో విడత ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని తెలిపారు. అనంతరం ధరూరు శివారులో ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలతో ఎమ్మెల్యే మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. వారం రోజులుగా ఎండలు మండిపోతున్నాయని.. కూలీలు వడదెబ్బకు గురికాకుండా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. కార్యక్రమాల్లో మార్కెట్ కమిటీ చైర్మన్ హనుమంతు, సర్పంచ్ డీఆర్ విజయ్కుమార్, నాయకులు గడ్డం కృష్ణారెడ్డి, రమేశ్ నాయుడు, మాజీ వైస్ ఎంపీపీ సుదర్శన్రెడ్డి, ఉరుకుందు, టీచర్ ఆంజనేయులు, కొండన్న, మాజీ వైస్ ఎంపీపీ సుదర్శన్రెడ్డి, మాజీ సర్పంచ్ శ్రీనివాస్రెడ్డి, ఉపసర్పంచ్ ఈదన్న పాల్గొన్నారు. -
ఇంకెన్నాళ్లు.. సాగదీత?
2022లో ఆర్డీఎస్ మరమ్మతుకు రూ.11 కోట్ల కేటాయింపు ●రాజోళి: ‘దేవుడు కరుణించినా.. పూజారి కరుణించలేదు’ అన్న చందంగా మారింది ఆర్డీఎస్ కెనాల్ పరిస్థితి. దశాబ్దాల కాలంగా ఆర్డీఎస్లో ఆధునికీకరణ పనులు చేయకపోగా.. దాన్ని ప్రతిపాదనలు పక్కకు పెట్టి మరమ్మతు చేపట్టేందుకు సిద్ధయమ్యారు. ఇందుకోసం 2022లో రూ.11 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది. ఇది తాత్కాలిక ఉపశమనమైనప్పటికీ.. కెనాల్ మరింత బలహీనపడిపోతుండటంతో ఈ పనులు ఆర్డీఎస్కు ప్రయోజనకరంగానే మారాయి. కానీ, చేస్తున్న పనులే ఆలస్యమవుతుండటంతో చివరికి ప్రయోజనం ఉండకుండా పోతుందని రైతులు వాపోతున్నారు. 65 నుంచి 145 కి.మీ., వరకు.. ఆర్డీఎస్ కెనాల్ 65వ కి.మీ., నుంచి 145 కి.మీ., వరకు ఈ పనులు చేపట్టేలా ప్లానింగ్ చేశారు. అందులో భాగంగా సిల్ట్ రెన్యువల్, బ్యాకింగ్ వర్క్స్, సీసీ వర్క్, కాంక్రీట్ పనులు, జంగిల్ క్లియరెన్స్ లాంటివి చేయాల్సి ఉంది. కాగా చేపట్టిన పనులు వేగంగా జరగకపోగా.. చేస్తున్న సమయం అనుకూలించడం లేదని రైతులు అంటున్నారు. రూ.11 కోట్లకు గాను ఇప్పటికే రూ.7.20 కోట్ల విలువ చేసే పనులు పూర్తయ్యాయి. ఈ పనులు చేసిన కాంట్రాక్టర్కు అనుబంధంగా ఉన్న మరో కాంట్రాక్టర్తో అదనంగా మరో రూ.3 కోట్ల పనులు చేపట్టగా.. ఇప్పటికి దాదాపు రూ.2 కోట్ల పనులు చేయాల్సి ఉందని అధికారుల లెక్కలు చెబుతున్నాయి. వీటిని త్వరగా పూర్తి చేస్తే ప్రయోజనకరంగా ఉంటుందని రైతులు పేర్కొంటున్నారు. సమన్వయంతో పనిచేయాలి.. ఆర్డీఎస్ అంటే గద్వాల జిల్లాకు ఆయువు. దానికి సంబంధించిన పనులు చేసేటప్పుడు అధికారులు, ప్రభు త్వం సమన్వయంతో పనిచేయాలి. కెనాల్లో మరమ్మతు చేపట్టి చా లా ఏళ్లు అవుతుంది. ఇలాగే నెమ్మదిగా సాగితే ప్రయోజనం ఏముంటుంది. ప్రభుత్వం ప్రత్యేక దృష్టిపెట్టి వచ్చే వ్యవసాయ సీజన్లోగా మరమ్మతు పూర్తి చేసి రైతులకు సహకరించాలి. – మద్దిలేటి, రైతు, వడ్డేపల్లి రైతులకు ఇబ్బంది కలిగించొద్దుపనులు చేసేదే రైతుల కోసం. అలాంటప్పుడు వారికి అనుకూలించేలా చేయాలి. అంతే కానీ కెనాల్లో నీరు ఉన్న ప్పుడు, రైతులు సాగు లో బిజీగా ఉన్నప్పుడు పనులు చేస్తామంటే దా ని వల్ల రైతులకే ఇబ్బంది కలుగుతుంది. 2022 లో నిధులు మంజూరు చేస్తే ఇప్పటి వరకు 65 శాతం పనులు మాత్రమే పూర్తి చేశారు. అధికారులు వెంటనే పనులు ప్రారంభించేలా చూడాలి. – వడ్డే స్వాములు, రైతు, జిల్లేడుదిన్నె నోటీసులు ఇచ్చాం.. ఆర్డీఎస్ కెనాల్ మరమ్మతు పనులు ఇప్పటికే 65 శాతం పూర్తయ్యాయి. ఇంకా రూ.2 కోట్ల కు సంబంధించిన పనులు చేయాల్సి ఉంది. అయితే పనుల్లో ఆలస్యమవుతుందని సంబంధిత కాంట్రాక్టర్కు నోటీసులు ఇచ్చాం. ప్రస్తు తం సాగు సీజన్ కాకపోవడంతో పనులు వేగ ంగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్కు చెప్పాం. వీలైనంత త్వరగా పనులు పూర్తి చేస్తాం. – శ్రీనివాసులు, ఈఈ, ఆర్డీఎస్ నేటి వరకు నత్తనడకన కొనసాగుతున్న పనులు నాలుగేళ్లు గడిచినా 60 శాతమే పూర్తి.. సీజన్ ప్రారంభానికి ముందే చేపట్టాలంటున్న రైతులు ఇప్పటికిప్పుడు మొదలుపెడితేనే పూర్తయ్యే అవకాశం -
అర్జీలు సత్వరం పరిష్కరించాలి
గద్వాలన్యూటౌన్: ప్రజల నుంచి అందే అర్జీలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి వచ్చిన ప్రజల సమస్యలను ఆయన నేరుగా తెలుసుకుని ఫిర్యాదులు స్వీకరించారు. అనంతరం అధికారులనుద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ.. అన్ని శాఖల అధికారులు ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యత ఇచ్చి, అర్జీలను సత్వరం పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజావాణిలో వివిధ సమస్యలపై 114 అర్జీలు అందినట్లు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు లక్ష్మీనారాయణ, నర్సింగ్రావు, ఆర్డీఓ శ్రీనివాసరావు పాల్గొన్నారు. జనగణనకు పకడ్బందీ ఏర్పాట్లు జిల్లాలో జనగణనను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. సోమవారం డైరెక్టర్ ఆఫ్ సెన్సెస్ ఆపరేషన్ (డీసీఓ) భారతి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా అధికారులతో జనగణన ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో జనగణన ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ప్రస్తుతం 1,073 హౌస్ లిస్టింగ్ బ్లాక్స్ గుర్తించామని.. 1,341 మంది ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్ల నియామక ప్రక్రియ పూర్తిచేశామని వివరించారు. కాగా, చార్జ్ అధికారుల వివరాలను ఈ నెల 15వ తేదీలోగా సమర్పించాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ సూచించారు. 18 నుంచి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో సీపీఓ పాపయ్య, ఏఓ భూపాల్రెడ్డి పాల్గొన్నారు. -
ఉద్రిక్తంగా కో–ఆప్షన్ ఎన్నిక
మంత్రి వాకిటి శ్రీహరి ఎక్స్–అఫీషియో ఓటు హక్కు వినియోగించుకోవడంతో కాంగ్రెస్–2, సీపీఎం–2 కో–ఆప్షన్ స్థానాలు కై వసం చేసుకున్నాయి. కో–ఆప్షన్ ఎన్నికకుగాను పదిమంది కౌన్సిలర్లు సకాలంలో కార్యాలయానికి చేరుకోగా మంత్రి వస్తున్నారనే సమాచారంతో పుర కార్యాలయం వద్ద పోలీసు బందోబస్తు పటిష్టం చేశారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రక్రియ కొనసాగింది. సీపీఎం నుంచి చిన్నన్న, షాజహాన్, కాంగ్రెస్పార్టీ నుంచి తౌఫిక్, మణెమ్మను కో–ఆప్షన్ సభ్యులుగా ఎన్నుకున్నారు. అనంతరం మంత్రి ఎన్నికై న సభ్యులను శాలువాలతో సన్మానించి అభినందించారు. అనంతరం మాట్లాడుతూ.. రాజకీయలు పక్కనబెట్టి పట్టణాభివృద్ధికి అందరూ కలిసి రావాలని కోరారు. కార్యక్రమంలో పుర చైర్పర్సన్ జింక సువర్ణ రవి, వైస్ చైర్పర్సన్ రాధ అరుణ్, సీఐ శివకుమార్, ఎస్ఐలు స్వాతి, జయన్న పాల్గొన్నారు. అమరచింత: స్థానిక పుర కార్యాలయంలో సోమవారం జరిగిన కో–ఆప్షన్ సభ్యుల ఎన్నిక ప్రక్రియ ఉద్రిక్తతల నడుమ కొనసాగింది. వివరాల్లోకి వెళ్తే.. ఉదయం 11 గంటల సమయంలో ఎన్నిక జరుగుతుందనే సమాచారంతో బీఆర్ఎస్, బీజేపీకి చెందిన ఐదుగురు కౌన్సిలర్లు ముందుగానే పుర కార్యాలయానికి చేరుకోన్నారు. ఇచ్చిన సమయం దాటుతున్నా పుర అధికారులు ఎన్నిక నిర్వహించకపోవడం వారికి ఆగ్రహం తెప్పించింది. దీనికితోడు పుర కార్యాలయ ఆవరణ కాంగ్రెస్పార్టీ నాయకులు, కార్యకర్తలతో నిండుకోవడంతో అసహనానికి గురైన బీజేపీ కౌన్సిలర్ మేర్వ రాజు సమయం దాటిపోయిందని, వెంటనే ఎన్నిక నిర్వహించాలని అక్కడే ఉన్న పుర కమిషనర్ నూరుల్ నదీంతో వాగ్వాదానికి దిగారు. ఒకనొక సమయంలో కౌన్సిలర్ కమిషనర్ కుర్చీ, చెయ్యి పట్టుకొని లాగేందుకు యత్నించగా ఇరువురి మధ్య మాటల యుద్ధం పెరిగి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వెంటనే గమనించిన డీఎస్పీ వెంకటేశ్వర్లు తమ సిబ్బందితో కౌన్సిలర్ రాజును బయటకు తీసుకొచ్చి అదుపులోకి తీసుకోవడంతో సమస్య సద్దుమణిగింది. కమిషనర్ ఇచ్చిన లిఖితపూర్వక ఫిర్యాదుతో కౌన్సిలర్ మేర్వరాజుపై కేసు నమోదు చేశామని ఎస్ఐ స్వాతి తెలిపారు. పుర కమిషనర్, బీజేపీ కౌన్సిలర్ మధ్య వాగ్వాదం కమిషనర్ ఫిర్యాదుతో కౌన్సిలర్పై కేసు నమోదు పోలీసుల జోక్యంతో సద్దుమణిగిన వివాదం మంత్రి ఓటుతో అధికార పక్షం కై వసం చెరో రెండు స్థానాలు దక్కించుకున్న కాంగ్రెస్, సీపీఎం -
ఈ నెల 30 వరకు రేషన్ పంపిణీ
జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): జిల్లాలో ఈ నెల 30 వరకు రేషన్ బియ్యం పంపిణీ కొనసాగుతుందని జిల్లా పౌర సరఫరాల అధికారి శ్రీనివాస్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని 506 రేషన్ దుకాణాల ద్వారా మూడు నెలల ఉచిత సన్నబియ్యం పంపిణీ ప్రక్రి య కొనసాగుతుందన్నారు. జిల్లావ్యాప్తంగా 2,78,386 కార్డులకు గాను సోమవారం వరకు 1,71,328 కార్డుదారులు (61 శా తం) బియ్యం తీసుకొన్నారని చె ప్పారు. బియ్యం పంపిణీని ఈ నెల 30 వరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సరఫరా చేస్తామని, కార్డుదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. -
పీఆర్సీ నివేదిక అమలులో జాప్యం తగదు
గద్వాలన్యూటౌన్: ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ అమలు చేయడంలో జాప్యం తగదని టీఎస్ యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి గోపాల్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలో టీఎస్ యూటీఎఫ్ ఆవిర్బావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ జెండాను ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. ప్రభుత్వం రెండున్నరేళ్లు గడుస్తున్నా పీఆర్సీ నివేదిక బయటపెట్టకుండా.. సంఘాలతో చర్చలు జరపకుండా జాప్యం చేయడం సమంజసం కాదన్నారు. పీఆర్సీ నివేదికను బహిర్గతపర్చి, సంఘాలతో చర్చించిన అనంతరం ఆమోదయోగ్యమైన ఫిట్మెంట్తో పీఆర్సీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అదే విధంగా హెల్త్ కార్డ్స్ ప్రాసెస్ పూర్తిచేసి అందుబాటులోకి తీసుకురావడంతో పాటు సీపీఎస్ విధానం రద్దుచేసి.. పాత పెన్షన్ విధానాన్ని తీసుకురావాలన్నారు. పెండింగ్లో ఉన్న అన్ని రకాల బిల్లులను విడుదల చేయాలని, సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ మినహాయింపు లేదా అందరికీ ఒకే రకమైన మెరిట్ విధానం తీసుకురావాలని కోరారు. కార్యక్రమంలో టీఎస్ యూటీఎఫ్ నాయకులు చిరంజీవి నాయుడు, చంద్రకాంత్, లక్ష్మణ్, బీచుపల్లి, సుదర్శన్, చిన్న నర్సింహులు, జయన్న, రామకృష్ణ, సుధాకర్ పాల్గొన్నారు. పేదలకు రాజ్యాధికారమే అంబేడ్కర్ ఆశయం గద్వాలన్యూటౌన్: పేద వర్గాల చేతుల్లోకి అధికారం రావడమే డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆశయమని భీమ్ ఆర్మీ ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మాచర్ల ప్రకాశ్, జిల్లా అధ్యక్షుడు వర్షిత్, అఖిలపక్ష కమిటీ అధ్యక్షుడు నాగర్దొడ్డి వెంకట్రాములు, మధుసూదన్బాబు అన్నారు. అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకొని సోమవా రం జిల్లా కేంద్రంలో భీమ్ ఆర్మీ ఆద్వర్యంలో అంబేడ్కర్ ఆలోచనా పండుగ నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక అంబేడ్కర్ చౌరస్తా నుంచి వైఎస్సార్ చౌరస్తా వరకు ర్యాలీ చేపట్టారు. అనంతరం అక్కడే నిర్వహించిన సభ లో వారు మాట్లాడారు. దేశానికి అంబేడ్కర్ చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగాన్ని దేశానికి అందించారని కొనియాడారు. తన జీవితాంతం పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేశారన్నారు. కార్యక్రమంలో ఆవాస్ రాష్ట్ర నాయకుడు అతికూర్ రహ్మన్, నాయకులు రవి, పల్లయ్య, వినోద్, నర్సింహ, లక్ష్మణ్, సురేష్, విజయ్, రమేశ్, రఘునందన్ పాల్గొన్నారు. వేరుశనగ క్వింటా రూ.7,971 గద్వాలవ్యవసాయం: జిల్లాకేంద్రంలోని వ్యవసాయ మార్కెట్యార్డుకు సోమవారం 914 క్వింటాళ్ల వేరుశనగ అమ్మకానికి రాగా.. గరిష్టంగా రూ. 7,971, కనిష్టంగా రూ. 4,019, సరాసరి రూ. 6,049 ధర పలికింది. అదే విధంగా 457 క్వింటాళ్ల ఆముదాలు రాగా.. గరిష్టంగా రూ. 6,199, కనిష్టంగా రూ. 5,809, సరాసరి రూ. 6,060 ధరలు వచ్చాయి. 13 క్వింటాళ్ల కందులు రాగా.. గరిష్టంగా రూ. 6,506, కనిష్టంగా రూ. 6,219, సరాసరి రూ. 6269 ధరలు లభించాయి. 816 క్వింటాళ్ల వరి (సోన) రాగా.. గరిష్టంగా రూ. 2,456, కనిష్టంగా రూ. 1,986, సరాసరి రూ. 2,306 ధర పలికింది. -
ఫలితాలు మెరుగు
జోగుళాంబ గద్వాలగతంతో పోల్చితే ఇంటర్మీయడిట్లో పెరిగిన ఉత్తీర్ణత శాతం ● ప్రథమ సంవత్సరంలో 18.. ద్వితీయ సంవత్సరంలో 14వ స్థానం ● అత్యధిక శాతం ఉత్తీర్ణతతో సత్తాచాటిన బాలికలు సోమవారం శ్రీ 13 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026జిల్లాలో ఇంటర్ విద్యార్థుల ఉత్తీర్ణత శాతం ఇలా.... ఏడాది ఫస్టియర్ రాష్ట్రస్థాయిలో స్థానం 2023– 24 53.24 21 2024– 25 62.58 23 2025– 26 73.01 18 ఏడాది సెకండియర్ రాష్ట్రస్థాయిలో స్థానం 2023– 24 62.82 23 2024– 25 57.16 21 2025– 26 62.06 14 గద్వాల న్యూటౌన్: ఇంటర్మీడియట్ ఫలితాల్లో రాష్ట్రవ్యాప్తంగా జోగుళాంబ గద్వాల జిల్లా స్థానం కాస్త మెరుగుపడింది. ఆదివారం ఇంటర్ బోర్డు విడుదల చేసిన ఫలితాల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సర విద్యార్థులు రాణించారు. గతంతో పోల్చితే ఈసారి ఉత్తీర్ణత శాతం కాస్త పెరిగింది. ఇంటర్ ప్రథమ సంవత్సరంలో 62.06 శాతంతో 18వ స్థానం, ద్వితీయ సంవత్సరంలో 73.01 శాతంతో 14వ స్థానంలో జిల్లా నిలిచింది. అలాగే గతంలో మాదిరిగానే ఈసారి కూడా బాలికలే మెరుగైన ఫలితాలు సాధించారు. మొదటి సంవత్సరంలో 1,539 మంది బాలురు పరీక్షలు రాయగా.. 730 మంది (47.43 శాతం) ఉత్తీర్ణులయ్యారు. అలాగే 1,943 మంది బాలికలు పరీక్షలు రాయగా.. 1,431 మంది (73.65 శాతం) ఉత్తీర్ణత సాధించారు. ద్వితీయ సంవత్సరానికి సంబంధించి 1,283 మంది బాలురు పరీక్ష రాయగా.. 785 మంది (61.18 శాతం), 1,711 మంది బాలికలు హాజరు కాగా 1,401 మంది (81.88 శాతం) ఉత్తీర్ణులయ్యారు. గురుకులాల ప్రతిభ ఇంటర్ ఫలితాల్లో ప్రధానంగా గురుకుల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. బీచుపల్లి గురుకులంలో ద్వితీయ సంవత్సర విద్యార్థులు జశ్వంత్, వంశీలు ఎంపీసీ విభాగంలో 992/1000 మార్కులు సాధించారు. అలాగే ఇక్కడే చదువుతున్న నరేష్గౌడ్ బైపీసీ విభాగంలో 992/1000 సాధించాడు. ఇదే కళాశాలలో మొదటి సంవత్సరం విద్యార్థులు కార్తీక్ ఎంపీసీ విభాగంలో 466/470 సాధించగా.. బైపీసీ విభాగంలో రఫీ 436/440 సాధించాడు. అలాగే బిజ్వారం బీసీ సంక్షేమ గురుకుల కళాశాల విద్యార్థులు రాఘవి, సింధు బైపీసీ విభాగంలో 438/440 మార్కులు సాధించారు. ఇంటర్ ఒకేషనల్లో కూడా ఈసారి గతం కంటే మంచి ఫలితాలు వచ్చాయి. ద్వితీయ సంవత్సరంలో మొత్తం 706 మంది విద్యార్థులు పరీక్ష లు రాయగా ఇందులో 532 మంది (75.4 శాతం) ఉత్తీర్ణత సాధించగా.. రాష్ట్రస్థాయిలో 13వ స్థానం లభించింది. ఇక ప్రథమ సంవత్సరంలో 884 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా.. ఇందులో 612 మంది విద్యార్థులు (69.23 శాతం) ఉత్తీర్ణులవగా.. రాష్ట్రస్థాయిలో 4వ స్థానం జిల్లాకు దక్కింది. -
వందశాతం వ్యాక్సినేషన్
● పశువులు, గేదెలకు గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలు ● 13 మండలాల్లో 27 బృందాలతో పంపిణీ ● జిల్లాలో గోజాతి 30,763, గేదెజాతి 29,956 పశువులు గట్టు: జిల్లాలో పశువులను గాలికుంటు వ్యాధి బారి నుంచి రక్షించేందుకు చేపట్టిన వ్యాధి నిరోధక టీకాలు వేసే కార్యక్రమం విజయవంతంగా పూర్తిచేసినట్లు పశువైద్యాధికారులు తెలిపారు. జిల్లావ్యాప్తంగా 13 మండలాల్లో 27 బృందాలు గ్రామాల్లో నిరంతరం పర్యటించి, పశువులు, గేదెలకు వ్యాధి నిరోధక టీకాలు వేశారు. మార్చి 10న వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన పశువైద్య సిబ్బంది ఈ నెల 11 వరకు పూర్తిచేశారు. సంపూర్ణ అభియాన్ 2.0 ప్రోగ్రాంలో భాగంగా గాలికుంటు (ఎఫ్ఎండీ) ని ర్మూలనలో భాగంగా చేపట్టిన వ్యాధి నిరోధక టీకాల పంపిణీ కార్యక్రమాన్ని వందశాతం పూర్తిచేశారు. సాధారణంగా పశువులు, గేదెల్లో పుట్ అండ్ మౌత్ ద్వారా వచ్చే వ్యాధిని దూరం చేసేందుకు ప్రత్యేకంగా వ్యాధి నిరోధక టీకాలు వేసే కార్యక్రమాన్ని పశువైద్య సిబ్బంది విజయవంతంగా పూర్తిచేశారు. యాస్పిరేషన్ బ్లాక్గా ఎంపిక.. నీతి ఆయోగ్ కార్యక్రమంలో భాగంగా గట్టు మండలాన్ని యాస్పిరేషన్ బ్లాక్గా ఎంపిక చేశారు. ఇక్కడి పశువులు, గేదెలు అన్నింటికీ ముందస్తుగానే ఉచితంగా గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలను వేసినట్లు పశువైద్యాధికారులు నవీన్చంద్ర, ప్రియాంక తెలిపారు. జిల్లావ్యాప్తంగా గోజాతి 4 నెలలు పైబడిన దూడలు, ఆవులు, కోడెలు, ఎద్దులు మొత్తం 30,763 ఉండగా.. గేదెజాతి 4 నెలల పైబడిన దూడలు, గేదెలు, పడ్డలు మొత్తం 29,956 ఉండగా.. వీటన్నింటికీ వ్యాధి నిరోధక టీకాలు వేసినట్లు పశువైద్యాధికారులు తెలిపారు. ప్రత్యేక కార్యాచరణ అమలు.. నీతి ఆయోగ్ కార్యక్రమంలో భాగంగా ఉమ్మడి పాలమూరులోని నారా యణపేట జిల్లా నర్వ, జోగుళాంబ గద్వాల జిల్లా గట్టు మండలాన్ని కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి చేసేందుకు ఎంపిక చేసి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమలు చేస్తున్నారు. ఈ క్రమంలో సంపూర్ణ అభియాన్ 2.0 ప్రోగ్రాంలో భాగంగా గట్టులో ఎఫ్ఎండీ పుట్ అండ్ మౌత్ డిసీజ్ బారిన పశువులు పడకుండా ముందస్తుగా పశువైద్య సిబ్బంది ప్రత్యేకంగా ఉచిత టీకాల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. గట్టు మండలంలోని 27 గ్రామాల్లో మొత్తం 9,316 పశువులు ఉండగా.. వందశాతం వ్యాధి నిరోధక టీకాలు వేసినట్లు పశువైద్యాధికారులు తెలిపారు. -
కొల్లాపూర్కు రైల్వే టూరిజం తీసుకురావాలి
కొల్లాపూర్ రూరల్: కొల్లాపూర్కు హెలీ టూరిజంతోపాటు రైల్వే టూరిజం కూడా తీసుకురావాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు పల్లా వెంకట్రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బాల్నర్సింహ అన్నారు. ఆదివారం కొల్లాపూర్లోని ఎన్టీఆర్ చౌరస్తాలో రైల్వే లైన్ సాధన కోసం సీపీఐ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాకు వారు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. కొల్లాపూర్ మీదుగా రైల్వే లైన్ వస్తే ఈ ప్రాంతానికి పరిశ్రమలు రావడానికి అవకాశం ఉంటుందన్నారు. ఇక్కడ పరిశ్రమలకు కావాల్సిన అన్ని వసతులు, సౌకర్యాలు ఉన్నాయన్నారు. నంద్యాల నుంచి జడ్చర్ల మీదుగా రైల్వే లైన్ వేయడానికి అవకాశం వచ్చిందో.. దానిని కొల్లాపూర్ మీదుగా వేసేలా రాష్ట్ర ప్రభుత్వం, మంత్రి జూపల్లి కృష్ణారావు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రాంతంలో నేషనల్ హైవే–167తోపాటు బ్రిడ్జి నిర్మాణం కూడా జరుగుతుందని, దీనిని మల్టీపర్పస్గా అభివృద్ధి చేస్తే ఖర్చు కూడా తగ్గుతుందన్నారు. ఈ అంశాన్ని పార్లమెంట్, రాజ్యసభలో ప్రస్తావించేందుకు తమ పార్టీ ఎంపీలు కృషి చేస్తారన్నారు. సీపీఐ ఎప్పటికీ ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తుందని పేర్కొన్నారు. కమ్యూనిస్టు పార్టీలు చేసిన పోరాటాలు ఏమీ వృథాగా పోలేదని, కొల్లాపూర్కు రైల్వే లైన్ రావడానికి కూడా పోరాటాలు చేస్తామని తేల్చిచెప్పారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్ఎండీ ఫయాజ్, నాయకులు విజయుడు, శివుడు, ఇందిర తదితరులు పాల్గొన్నారు. -
మహనీయుడు జ్యోతిబాఫూలే
గద్వాల న్యూటౌన్: సమాజంలోని అసమానతలను తొలగించేందుకు జీవితాంతం కృషిచేసిన మహనీయుడు జ్యోతిబాఫూలే అని అదనపు కలెక్టర్ నర్సింగరావు అన్నారు. శనివారం మహాత్మ జ్యోతిబాఫూలే జయంతిని పురస్కరించుకొని కలెక్టరేట్లో చిత్రపటానికి, కృష్ణవేణి చౌరస్తాలోని ఫూలే విగ్రహానికి అదనపు కలెక్టర్ ఇతర అధికారులు, వివిధ సంఘాల నాయకులతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పూలే చిన్నతనం నుంచే చత్రపతి శివాజీ, జార్జివాషింగ్టన్ మొదలైన వారి జీవిత చరిత్రలను చదివి అతనిలో దేశభక్తి, సామాజిక స్పృహ అలవడ్డాయన్నారు. అప్పటి సమాజంలో నిమ్న కులాల ప్రజలు వెనకబడటానికి కారణం విద్య లేకపోవడమేనని భావించి.. పాఠశాలలు నెలకొల్పడమే కాకుండా సీ్త్ర విద్యకు ప్రాధాన్యత ఇచ్చిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. తన భార్య సావిత్రిబాయి ఫూలేకు చదువు నేర్పించి బాలికల పాఠశాలలో ఆమెను ఉపాధ్యాయురాలిగా నియమించారని చెప్పారు. కులవ్యవస్థను వ్యతిరేకించి, గులాంగిరి అనే పుస్తకాన్ని రచించారన్నారు. 1878లో పుణెలో సత్యశోధక సమాజాన్ని స్థాపించి, సీ్త్ర, పురుష లింగ వివక్షతను ఫూలే తీవ్రంగా విమర్శించారని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ శ్రీనివాసరావు, డీఎస్పీ మొగిలయ్య, ఏఓ భూపాల్రెడ్డి, జిల్లా బీసీ సంక్షేమ అధికారి అక్బర్పాషా, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ నుషిత తదితరులు పాల్గొన్నారు. -
ఆర్టిజన్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
గద్వాల న్యూటౌన్: న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని గత నాలుగు రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్న ఆర్టిజన్ కార్మికులను చర్చలకు ఆహ్వానించి.. తక్షణమే సమస్యలు పరిష్కరించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వెంకటస్వామి అన్నారు. గద్వాల డివిజన్ ఇంజినీర్ కార్యాలయం ఎదుట నిర్వహిస్తున్న సమ్మె శిబిరాన్ని శనివారం ఆయన సందర్శించి మద్దతు పలికి మాట్లాడారు. చేస్తున్న పని స్వభావం ఒక్కటే అయినప్పుడు ఒక్కో కార్మికుడి వేతనాలు ఉద్యోగ భద్రతలలో వ్యత్యాసాలు ఎందుకని ప్రశ్నించారు. ఆర్టిజన్ కార్మికులు కొత్త కోరికలను కోరడం లేదని, తమకు ఇచ్చిన హామీలనే అడుగుతున్నారని పేర్కొన్నారు. సంస్థలో 23 వేల మంది ఆర్టిజన్ ఉద్యోగులకు స్టాడింగ్ ఆర్డర్స్ రద్దు చేసి, రెగ్యులర్ ఉద్యోగులతోపాటు ఏపీఎస్ఈబీ రూల్స్ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. రెండేళ్లుగా కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నా పరిష్కరించకపోవడం వల్లే సమ్మెబాట పట్టారన్నారు. న్యాయమైన వారి డిమాండ్లను శాంతియుత వాతావరణంలో పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు నర్సింహ, అంజి, ఆర్టిజన్ యూనియన్ చైర్మన్ శివప్రసాద్, కోకన్వీనర్ రాజు తదితరులు పాల్గొన్నారు. -
ప్యాక్హౌస్లతో ప్రయోజనం
నడిగడ్డలో పెరుగుతున్న పండ్ల తోటల సాగు విస్తీర్ణం గద్వాల వ్యవసాయం: నడిగడ్డలో సాగునీటి వనరులు పుష్కలంగా ఉండటంతోపాటు ఇక్కడి నేలలు, వాతావరణ పరిస్థితులు పండ్లతోటలకు అనుకూలంగా ఉన్నాయి. దీంతో వీటి సాగుపై ఎక్కువ మంది రైతులు ఆసక్తి చూపుతున్నారు. అయితే పండ్లు తెంపిన తర్వాత వాటిని నిల్వ ఉంచడానికి, అవసరమైన ప్రాసెసింగ్ చేయడానికి రైతులు ఇబ్బందులు పడేవారు. ఈ ఇబ్బందులను అధిగమించడానికి ప్యాక్హౌస్లు ఎంతో ఉపయోగపడతాయి. ఉద్యానశాఖ ఎంఐడీహెచ్ పథకం కింద 50 శాతం సబ్సిడీపై ప్యాక్హౌస్ల నిర్మాణాలను ప్రోత్సహిస్తోంది. నేలలు.. వాతావరణం జిల్లాలో పండ్లతోటలకు అనువైన పరిస్థితులు ఉన్నాయి. పండ్లతోటలు, కూరగాయల సాగుకు ఎర్రటి, ఒండ్రుతో కూడిన ఎర్రటి నేలలు ఉండాలి. నడిగడ్డలో ఇలాంటి నేలల శాతమే ఎక్కువగా ఉంది. సాగునీటి విషయానికి వస్తే జూరాల, ఆర్డీఎస్ ప్రాజెక్ట్లతోపాటు నెట్టెంపాడు ఎత్తిపోతలు, రిజర్వాయర్లు, నోటిఫైడ్ చెరువులు, కుంటలు ఉన్నాయి. వీటన్నింటి ఆధారంగా బోర్లు, బావుల్లోనూ ఆశించిన స్థాయిలో నీరు ఉంటోంది. సాధారణంగా పండ్లతోటలను బోర్లు, బావుల కిందే సాగు చేస్తారు. ఇక వాతావరణం విషయానికి వస్తే వేసవిలో పగటి ఉష్ణోగ్రతలు ఎంత ఉన్నా.. సాయంత్రం నుంచి రాత్రి వరకు చల్లగా ఉంటుంది. శీతాకాలంలో ఎంత చలి ఉన్నా.. ఉష్ణోగ్రతలు పూర్తిగా పడిపోవు. ఇలా నేలలు, వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. బడ్జెట్ కేటాయింపు ప్రకారం.. పండ్లు తెంపిన తర్వాత పలు సందర్భాల్లో వాటిని నిల్వ ఉంచడం, కోల్డ్ స్టోరేజీలో ఉంచడం, ఎగుమతి కోసం ప్యాకింగ్, ప్రాసెసింగ్ చేయాల్సిన పరిస్థితులు ఉంటాయి. ఇలాంటి సమయంలో తగిన వసతి లేక రైతులు చాలా ఇబ్బందులు పడుతుంటారు. బయటి వాతావరణంలో తెంపిన పండ్లను ఉంచి, ఆర్థికంగా నష్టపోతుంటారు. వీటిని అధిగమించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఎంఐడీహెచ్ (మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ హార్టికల్చర్) పథకం కింద ప్యాక్హౌస్ నిర్మాణాలను 50 శాతం సబ్సిడీపై అందించి ప్రోత్సహిస్తోంది. ప్యాక్హౌస్కు రూ.4.80 లక్షల వ్యయం అవుతుండగా.. ఇందులో రైతు వాటాగా రూ.2.40 లక్షలు భరిస్తే.. మిగిలిన రూ.2.40 లక్షలు ఎంఐడీహెచ్ కింద సబ్సిడీ అందిస్తున్నారు. ఈ ప్యాక్హౌస్కు నీరు, వేయింగ్ మిషన్ సౌకర్యం కూడా ఏర్పాటు చేస్తారు. పలు ప్రయోజనాలు ఉన్న ఈ ప్యాక్ హౌస్లను బడ్జెట్ కేటాయింపుల ప్రకారం 2025– 26 ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో 10 నిర్మించాలని లక్ష్యంగా నిర్దేశించగా.. 9 చోట్ల పూర్తయ్యాయి. 2026– 27లో వీటి నిర్మాణాల కోసం మరింత బడ్జెట్ కేటాయించాలని ఉద్యాన రైతులు కోరుతున్నారు. గద్వాల మండలం అనంతపురంలో నిర్మించిన ప్యాక్హౌస్ అనుకూల పరిస్థితులతో ఆసక్తి చూపుతున్న రైతులు జిల్లావ్యాప్తంగా 2025–26లో 9 నిర్మాణాలు పూర్తి ఎంఐడీహెచ్ పథకం కింద 50 శాతం సబ్సిడీ 2026– 27లో మరింత బడ్జెట్ కేటాయించాలని వేడుకోలు 17,400 ఎకరాల్లో సాగు జిల్లాలో రైతులు పత్తి, వరి, వేరుశనగ తదితర పంటలను ఏళ్ల తరబడి నుంచి సాగు చేస్తున్నారు. అయితే గడిచిన పదేళ్ల నుంచి రైతుల ఆలోచనా విధానంలో మార్పు వస్తోంది. ప్రధానంగా పండ్లతోటలకు ఇక్కడి నేలలు, వాతావరణం అనుకూలంగా ఉండటానికి తోడు వీటి సాగు వల్ల పండ్ల రకాన్ని బట్టి 3–5 ఏళ్లపాటు మంచి యాజమాన్య పద్ధతులు అవలంభిస్తే తోటలు బాగా వచ్చి ఆర్థికంగా లాభపడతామన్న ఆలోచనతో రైతులు పండ్ల తోటల సాగుపై ఆసక్తి చూపుతున్నారు. మామిడి, బత్తాయి, పొప్పాయి, అంజీర, జామ, డ్రాగన్ ఫ్రూట్ తదితర పండ్లతోటలు సాగు చేస్తున్నారు. ఏటా పండ్లతోటల సాగు జిల్లాలో పెరుగుతోంది. ప్రస్తుతం జిల్లాలో 17,400 ఎకరాాల్లో పండ్ల తోటలు సాగులో ఉన్నాయి. -
క్రమశిక్షణతో విధులు నిర్వహించాలి
ఎర్రవల్లి: పోలీస్ సిబ్బంది క్రమశిక్షణతో విధులు నిర్వహించి వ్యవస్థకు మంచిపేరు తీసుకురావాలని పదవ పటాలం కమాండెంట్ జయరాజు అన్నారు. శుక్రవారం బీచుపల్లి పదవ బెటాలియన్లో ఆర్ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న మహ్మద్ రషీద్ సివిల్ ఎస్ఐగా పదోన్నతి పొందిన సందర్భాన్ని పురస్కరించుకొని సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి కమాండెంట్ హాజరై ఆయనకు పూలమాల వేసి శాలువాలతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మహ్మద్ రషీద్ తన సేవాకాలంలో క్రమశిక్షణ, విధేయత, కష్టపడే స్వభావంతో ఉన్నతమైన విధులు నిర్వహించి మంచి గుర్తింపు పొందారన్నారు. విధి నిర్వహణలో పటాలం సిబ్బందితో కలిసి ఆయన చేసిన సేవలను అభినందించారు. ఇతర సిబ్బంది కూడా ఆయనను ఆదర్శంగా తీసుకొని తమ విధులను అంకితభావంతో నిర్వహించాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో ఆర్ఐలు రాజు, నర్సింహరాజు, రాజేశం, శ్రీనివాసులు, ఆర్ఎస్ఐ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. -
సీఎం దృష్టికి తీసుకెళ్తా..
జూరాలలో నీటి నిల్వలు కనిష్ట స్థాయికి పడిపోవడంతో వేసవిలో తాగునీటి అవసరాలకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకోవాలి. ఈ విషయాన్ని వెంటనే సాగునీటి పారుదల శాఖ మంత్రి, సీఎం దృష్టికి తీసుకెళ్లా. కర్ణాటక నుంచి మనకు 2 టీఎంసీలు విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని కోరుతాను. – బండ్ల కృష్ణమోహన్రెడ్డి, ఎమ్మెల్యే, గద్వాల నీటి చౌర్యంతోనే.. జూరాల ఎడమ కాల్వ కింద 4 ఎకరాల్లో వరి సాగుచేశా. వారంలో నాలుగు రోజులు సాగునీరు వదులుతున్నామంటూ మిగిలిన రోజుల్లో దిగువకు తరలిస్తున్నారు. ఇలాంటి నీటి చౌర్యంతోనే ప్రాజెక్టులో నీటిమట్టం పూర్తిగా తగ్గిపోతోంది. – బాలస్వామి, రైతు, ఆరేపల్లి (ఆత్మకూర్) ● -
ప్రజారోగ్యమే ప్రభుత్వ లక్ష్యం
నాగర్కర్నూల్ క్రైం: రాష్ట్ర ప్రజల ఆరోగ్యమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం అని, ఇందులో భాగంగానే మారుమూల గ్రామీణ ప్రాంత ప్రజలకు ఎమర్జెన్సీ సమయాల్లో అత్యవసర వైద్యసేవలను అందించి ప్రాణాలు కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం క్రిటికల్ కేర్ సెంటర్లను రాష్ట్రవ్యాప్తంగా నెలకొల్పుతుందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. శుక్రవారం ఆయన జిల్లాకేంద్రంలోని మెడికల్ కళాశాల ఆవరణలో రూ.23.75 కోట్లు వెచ్చించి.. 50 బెడ్ల సామర్థ్యంతో అత్యాధునిక వసతులతో నిర్మించిన క్రిటికల్ కేర్ బ్లాక్ అత్యవసర సేవల విభాగాన్ని ప్రారంభించి మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదాలు జరిగినా.. హార్ట్ స్ట్రోక్ వచ్చినా, విష జ్వరాలు ప్రబలినా ఇకపై హైదరాబాద్కు పరుగులు తీయకుండా.. స్థానికంగానే మెరుగైన వైద్యం అందించేందుకు ఈ సెంటర్లు ఎంతో ఉపయోగపడతాయన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపరచడం, ఆధునిక వైద్య పరికరాలను అందుబాటులోకి తీసుకువచ్చే చర్యలు వేగవంతంగా చేస్తున్నామన్నారు. అలాగే వైద్యులు, నర్సుల ఖాళీలను భర్తీ చేయడానికి భారీస్థాయిలో నియామకాలు చేపడుతున్నామని వెల్లడించారు. క్రిటికల్ కేర్ సెంటర్లతో అత్యవసర వైద్యసేవలు ఆధునిక పరికరాలు అందుబాటులోకి తీసుకువస్తాం ఖాళీల భర్తీకి భారీ స్థాయిలో నియామకాలు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ -
మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభం
గద్వాల వ్యవసాయం: జిల్లాకేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో శుక్రవారం మార్కెట్ యార్డు చైర్మన్ హనుమంతు, మున్సిపల్ చైర్పర్సన్ జయలక్ష్మి, పీఏసీఎస్ చైర్మన్ సుభాన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యాసంగి సీజన్లో ఈసారి ఎక్కువగా మొక్కజొన్న పంటను రైతులు సాగు చేశారని చెప్పారు. రైతులు దళారులకు విక్రయించకుండా ప్రభుత్వం ఇస్తున్న మద్దతు ధర క్వింటాల్కు రూ.2,400 పొంది కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని సూచించారు. జిల్లా మార్కెటింగ్ అధికారి పుష్ప మాట్లాడుతూ ఒక ఎకరాకు 25 క్వింటాళ్ల వరకు కొనుగోలు చేస్తామని తెలిపారు. కొనుగోలు కేంద్రాలకు మొక్కజొన్న ధాన్యాన్ని తీసుకరావడానికి ముందే రైతులు టోకెన్ తీసుకోవాలని సూచించారు. టోకెన్తోపాటు ఏఈఓ ధ్రువీకరణ పత్రం, పట్టాదారు పాసు పుస్తకం, ఆధార్కార్డు, బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ పత్రాలను అందించాలని చెప్పారు. నియోజకవర్గంలోని ధరూర్, గద్వాల, కేటీదొడ్డి, గట్టు, మల్దకల్ మండలాల రైతులు ఈ కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో జెడ్పీ మాజీ చైర్మన్ బండారి భాస్కర్, మార్కెట్ యార్డు వైస్ చైర్మన్ శ్రీకాంత్రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ శంకర్ పాల్గొన్నారు. 627 క్వింటాళ్ల వేరుశనగ రాక గద్వాల వ్యవసాయం: జిల్లాకేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డుకు శుక్రవారం 627 క్వింటాళ్ల వేరుశనగ రాగా గరిష్టంగా రూ.7,399, కనిష్టంగా రూ.4,660, సరాసరిగా రూ.6,299 ధరలు లభించాయి. అలాగే 283 క్వింటాళ్ల ఆముదాలు రాగా.. గరిష్టంగా రూ.6,121, కనిష్టంగా రూ.5,711, సరాసరిగా రూ.5,809 చొప్పున పలికాయి. 9 క్వింటాళ్ల కంది రాగా.. గరిష్టంగా రూ.6,509, కనిష్టంగా రూ.3,019, సరాసరిగా రూ.6,339 వచ్చాయి. 417 క్వింటాళ్ల వరి (సోన) రాగా.. గరిష్టంగా రూ.2,456, కనిష్టంగా రూ.1,906, సరాసరిగా రూ.2,226 ధరలు లభించాయి. సృజనాత్మకతతో ఆలోచించాలి: వీసీ మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: విద్యార్థులు సృజనాత్మకతతో ఆలోచించి కొత్త స్టార్టప్లను ప్రారంభించాలని పాలమూరు యూనివర్సిటీ వీసీ శ్రీనివాస్ పేర్కొన్నారు. శుక్రవారం యూనివర్సిటీలోని ఎంబీఏ, మ్యాథ్స్ డిపార్ట్మెంట్ల ఆధ్వర్యంలో వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన వీసీ మాట్లాడుతూ ఎంబీఏ లాంటి డిపార్ట్మెంట్లలో చదివిన విద్యార్థులు మార్కెట్లో డిమాండ్ ఉండడంతో సులువుగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలను పొందవచ్చన్నారు. మార్కెటింగ్, బ్యాంకింగ్, ఇండస్ట్రియల్ సెక్టార్లలో అవకాశాలు మెండుగా ఉన్నాయన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ రమేష్బాబులు, కృష్ణయ్య, అర్జున్కుమార్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. రైతుల సహకారంఅభినందనీయం కొత్తకోట రూరల్: మామిడి ప్రాసెసింగ్ యూనిట్ నెలకొల్పే బాధ్యత రైతులే స్వీకరించాలని నాబార్డ్ సీజీఎం ఉదయభాస్కర్ అన్నారు. పెద్దమందడి మండలం చిన్నమందడి గ్రామంలో ఉన్న ఓ మామిడి తోటలో మొదటి కాయ కోసి రైతులను ఉద్దేశించి మాట్లాడారు. రసాయన ఎరువుల వినియోగం తగ్గించి సేంద్రియ సాగుపై దృష్టి సారించాలని సూచించారు. నాబార్డ్, రాంకీ ఫౌండేషన్ సహకారంతో మండలంలోని గిరిజన గ్రామాల్లో 450 ఎకరాల్లో మామిడి తోటలు అభివృద్ధి చేయడం సంతోషకరమని రాంకీ ఫౌండేషన్ అధ్యక్షుడు రాంరెడ్డి అన్నారు. కార్యక్రమంలో భాగంగా రాంకీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ సామాజిక బాధ్యతలో భాగంగా రాంకీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్వయం ఉపాధి పొందేందుకు పేద మహిళలకు కుట్టు మిషన్లు, రైతులకు స్ప్రేయర్లు అందించారు. నాబార్డ్ సిబ్బంది, జిల్లా ఉద్యాన అధికారి విజయభాస్కర్రెడ్డి పాల్గొన్నారు. -
సమస్యలు పరిష్కరించే దాక సమ్మె
గద్వాల న్యూటౌన్: విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఆర్టిజన్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె కొనసాగిస్తామని విద్యుత్ ఆర్టిజన్ ఉద్యోగుల జేఏసీ నాయకుడు రాజు స్పష్టం చేశారు. సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం గద్వాల డివిజన్ ఇంజినీర్ కార్యాలయం ఎదుట 3వ రోజు సమ్మె కొనసాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాక ముందు ప్రస్తుత డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క ఆర్టిజన్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించి, న్యాయం చేస్తామని హామీ ఇచ్చారన్నారు. అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడిచినా తమ గురించి పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సంస్థలో 23 వేల మంది ఆర్టిజన్ ఉద్యోగులకు స్టాడింగ్ ఆర్డర్స్ రద్దు చేసి, రెగ్యులర్ ఉద్యోగులతోపాటు ఏపీఎస్ఈబీ రూల్స్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్హతలను బట్టి కన్వర్షన్ చేయాలని, 2016 నుంచి మిగిలిపోయిన కార్మికులను ఆర్టిజన్లులుగా గుర్తించాలన్నారు. ఆర్టిజన్ కార్మికుల సమ్మెకు టీఈఈ 1104 యూనియన్ నాయకులు సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో జేఏసీ కోకన్వీనర్ రాజు, కన్వీనర్ రఫీ, కోచైర్మన్ క్రాంతి, రామకృష్ణ, కృష్ణ, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.


