breaking news
Jogulamba
-
యువత చూపు.. మోదీ వైపు
గద్వాలన్యూటౌన్: ప్రపంచంలోనే భారతదేశాన్ని బలమైన శక్తిగా మారుస్తున్న ప్రధాని మోదీ వైపు యువత చూస్తోందని బీజేపీ జిల్లా అద్యక్షుడు రామాంజనేయులు అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో అవకాశం కల్పించాలని కోరుతూ బుధవారం జిల్లా కేంద్రంలోని 8వ వార్డు యువకులు డీకే బంగ్లాలో ఆయనను కలిసి వినతిపత్రం అందజేశారు. ఎన్నికల్లో బీజేపీకి పూర్తి మద్దతు ఇస్తామని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ 37 వార్డుల్లో పోటీచేస్తుందని తెలిపారు. ఎంపీ డీకే అరుణ, స్నిగ్దారెడ్డిల నాయకత్వంలో గద్వాలలో బీజేపీ బలపడుతోందని అన్నారు. మున్సిపాలీటీలకు కేంద్రం ప్రత్యేకంగా నిధులు అందిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రవి ఎక్బోటే, ఓబీసీ మోర్చా అధ్యక్షుడు దేవదాస్, రజక నర్సింహులు పాల్గొన్నారు. పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి కృషి అలంపూర్: పెన్షనర్లు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని పెన్షనర్స్ అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షుడు వెంకట్రామయ్యశెట్టి అన్నారు. అలంపూర్లోని వాసవీ కాన్యకా పరమేశ్వరిదేవి నిత్యన్నదాన సత్రంలో బుధవారం పెన్షనర్స్ యూనియన్, జేఏసీ, ఆర్యవైశ్య సంఘం అధ్వర్యంలో ఆయనకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకట్రామయ్యశెట్టి మాట్లాడుతూ.. ఈ ప్రాంతానికి చెందిన పెన్షనర్ల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తానన్నారు. రాష్ట్ర, జిల్లా పెన్షనర్స్ అసోసియేషన్ నాయకుల సహకారంతో అలంపూర్లో పెన్షనర్ల భవన నిర్మాణానికి కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో నిర్మలమ్మ, కృష్ణమూర్తి, మద్దిలేటి, కేశవాచారి, వెంకటస్వామి, సలీం, జమ్మన్న, శ్రీనివాసులు, రమేశ్గుప్తా, కృష్ణమూర్తి పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాలకు ఆహ్వానం అలంపూర్: జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వరస్వామి క్షేత్రంలో జరిగే బ్రహ్మోత్సవాలకు రావాలని బుధవారం నాగర్కర్నూల్ ఎంపీ మల్లు రవి, దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజ రామయ్యార్, ధార్మిక సలహాదారు గోవింద హరిని ఆహ్వానించినట్లు ఆలయ ఈఓ దీప్తి తెలిపారు. జోగుళాంబ అమ్మవారి ఆలయంలో ఈ నెల 19 నుంచి 23వ తేదీ వరకు జరిగే వార్షిక బ్రహ్మోత్సవాలు, బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయంలో ఫిబ్రవరి 14 నుంచి 18వ తేదీ వరకు నిర్వహించే మహాశివరాత్రి ఉత్సవాలకు ప్రముఖులను ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. -
ఇంటింటా సందడి
● భోగి మంటలతో మొదలైన పండగ ● సప్తవర్ణాలతో శోభిల్లిన లోగిళ్లు ● బంధుమిత్రులతో కళకళ జిల్లా కేంద్రంలో ఓ ఇంటి ముందు తీర్చిదిద్దిన రంగవల్లి గద్వాలటౌన్: ముంగిళ్లలో గొబ్బెమ్మలతో ముచ్చటైన ముగ్గులు.. వెచ్చదనాన్ని అందించే భోగి మంటలు.. గంగిరెద్దుల విన్యాసాల నడుమ బుధవారం సంక్రాంతి సంబురాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. తెలుగు ప్రజల సంస్కృతీ సంప్రదాయానికి నిదర్శనంగా నిలిచే సంక్రాంతి వేడుకల్లో భాగంగా మొదటి రోజు భోగి పండగను జిల్లా ప్రజలు ఆనందోత్సాహాలతో నిర్వహించుకున్నారు. జిల్లా అంతటా పిండి వంటల ఘుమఘుమలు.. పతంగుల కోలాహలం నెలకొంది. జిల్లా కేంద్రంతో పాటు అలంపూర్, వడ్డేపల్లి, అయిజ, మానవపాడు, మల్దకల్ తదితర ప్రాంతాల్లో సంక్రాంతి సౌరభాలు వెల్లివిరిశాయి. కాలనీల్లో భోగి మంటలు వేసి పండగ జరుపుకొన్నారు. భోగి మంటల చుట్టూ యువత, చిన్నారులు కేరింతలు కొడుతూ సందడి చేశారు. సూర్యోదయానికి ముందే మహిళలు లేచి ఇంటి ముందు అలుకు చల్లి.. ముచ్చటైన ముగ్గులు వేయడంలో పోటీపడ్డారు. హరివిల్లు రంగులను పులుముకున్న గాలిపటాలతో పిల్లలు ఆనందంగా గడిపారు. పెద్దలను సైతం గాలిపటాలు రంజింప చేశాయి. ప్రతి ఇంటి ముంగిళ్లు రంగవల్లులతో మెరిసిపోయాయి. తెల్లవారుజాము నుంచే ప్రతి ఇంట్లో సంక్రాంతి సందడి కనిపించింది. భోగి సందర్భంగా సంప్రదాయ వంటకాలైన సజ్జ, నువ్వుల రొట్టెలు, వాటికి తోడుగా రుచికరమైన కూరలు చేసుకొని కుటుంబ సమేతంగా ఆరగించారు. పండగను పురస్కరించుకొని పలుచోట్ల రంగవల్లుల పోటీలు నిర్వహించి బహుమతులను అందజేశారు. -
డూడూ.. బసవన్న
అయ్య వారికి.. అమ్మవారికి దండంపెట్టు ● గంగిరెద్దులతో సంక్రాంతికి కళ ● పండగకు ముందు నుంచే సందడి ● ఉమ్మడి జిల్లాలో వంద కుటుంబాలపైగా గంగిరెద్దులోళ్లు డూడూ బసవన్న అనగానే సంక్రాంతి సంబరాల్లో గంగిరెద్దు గుర్తుకు వస్తుంది. పండగ భోగి మొదలు కనుమ వరకు మూడు రోజుల పాటు గంగిరెద్దులను ఇంటింటికి తిప్పుతూ యాచిస్తూ గంగిరెద్దుల వాళ్లు చేసే విన్యాసాలు అలరిస్తుంటాయి. రెండు మూడు దశాబ్దాల కిందటి వరకు నాలుగైదు ఊర్లలో మూడు నాలుగు వందల కుటుంబాలు ఉండే గంగిరెద్దుల వాళ్లు ప్రస్తుతం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా 105 కుటుంబాలు మాత్రమే మిగిలాయి. గంగిరెద్దులను ఆడించే వారు యాదవ కులంకు చెందిన వారే అయినప్పటికీ వారితో సంబంధాలు అంతంత మాత్రమే. వీరిది అంతా సంచార జీవనమే. యాచక వృత్తి ప్రధానంగా జీవిస్తుంటారు. పండగలు, పర్వదినాలతో పాటు ఎవరైనా మరణిస్తే అక్కడ ప్రత్యక్షం అవుతుంటారు. ముఖ్యంగా పంటలు చేతికి వచ్చే సమయానికి గంగిరెద్దులతో వీరు ప్రత్యక్షం అవుతుంటారు. అప్పటి వరకు ఊరూరా సంచరిస్తూ జీవనం గడుపుతుంటారు. -
కమనీయం.. గోదా రంగనాథుడి కల్యాణం
ఎర్రవల్లి: బీచుపల్లి క్షేత్రంలోని కోదండరామస్వామి ఆలయంలో బుధవారం గోదా రంగనాథస్వామి కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ధనుర్మాస వ్రత మహోత్సవాల్లో భాగంగా ఆలయంలో సుప్రభాత సేవ, పుణ్యహవచనం, పంచామృత అభిషేకం, ప్రభంద పారాయణం, సాత్తుముణై తదితర పూజలు నిర్వహించారు. అనంతరం గోదా రంగనాథస్వామి కల్యాణ వేడుకను శాస్త్రోక్తంగా జరిపారు. ముందుగా వల్లూరుకు చెందిన దివంగత నాగేశ్వరెడ్డి కుటుంబ సభ్యులు స్వామి, అమ్మవార్లకు పట్టువస్త్రాలు, కల్యాణ మాంగళ్యాలు సమర్పించారు. ఆలయ ప్రధాన అర్చకులు ఉత్సవ మూర్తులను ప్రత్యేకంగా అలంకరించి.. వేదమంత్రాలు, మంగళవాయిద్యాల మధ్య కల్యాణ వేడుక నిర్వహించారు. జీలకర్ర బెల్లం, మాంగళ్యధారణ, తలంబ్రాల కార్యక్రమం కమనీయంగా సాగింది. భక్తులు గోదా రంగనాథుడి కల్యాణాన్ని కనులారా తిలకించి భక్తిపారవశ్యంతో ఉప్పొంగారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ మేనేజర్ సురేందర్రాజు, పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు. -
అభివృద్ధి దిశగా పాలమూరు
● ప్రాజెక్టుల నిర్మాణాలపై కేసీఆర్వి పచ్చి అబద్ధాలు ● మున్సిపల్ ఎన్నికల్లో అభివృద్ధికి పట్టం కట్టండి ● రాష్ట్ర రోడ్డు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి దేవరకద్ర/ భూత్పూర్: వెనకబడిన ఉమ్మడి పాలమూరు జిల్లాను ఈ ప్రాంత బిడ్డ, సీఎం రేవంత్రెడ్డి అభివృద్ధిగా నడిపిస్తున్నారని రాష్ట్ర రోడ్డు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. మాజీ సీఎం కేసీఆర్ మాత్రం పాలమూరు ప్రాజెక్టు పనులు 10 శాతమే మిగిలి ఉన్నాయని, వాటిని సీఎం రేవంత్రెడ్డి పూర్తి చేయడం లేదని పచ్చి అబద్ధాలు ఆడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి మున్సిపాలిటీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. బుధవారం దేవరకద్ర, భూత్పూర్ పురపాలికల్లో పలు అభివృద్ధి పనులకు రాష్ట్ర పశుసంవర్ధక, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డితో కలిసి కోమటిరెడ్డి శంకుస్ధాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ హయాంలో జిల్లాను దత్తత తీసుకుని వివక్ష చూపించారని విమర్శించారు. దేవరకద్ర నియోజవవర్గ అభివృద్ధి కోసం ఇక్కడి ఎమ్మెల్యే కురుమూర్తి ఘాట్ రోడ్డుకు రూ.110 కోట్లు మంజూరు చేయించుకున్నారని, అలాగే కోయిల్సాగర్ రోడ్డుకు, డ్యాం డెవలప్మెంట్ పనులకు నిధులు కేటాయిస్తానని మంత్రి హామీ ఇచ్చారు. సర్పంచ్ ఎన్నికల మాదిరిగానే మున్సిపల్, రాబోయే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లోనూ కార్యకర్తలే నాయకులుగా పనిచేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులను గెలిపించాలన్నారు. మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టలేదన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రూ.కోట్లలో నిధులు విడుదల చేసి అభివృద్ధి చేస్తుందని పేర్కొన్నారు. ఆయా కార్యక్రమాల్లో కలెక్టర్ విజయేందిర, జెడ్పీ మాజీ చైర్పర్సన్ స్వర్ణమ్మ పాల్గొన్నారు. -
రవాణా రంగంపై అక్కసు వెళ్లగక్కడం అన్యాయం
అలంపూర్: రవాణా రంగంపై సీఎం రేవంత్రెడ్డి అక్కసు వెళ్లగక్కడం అన్యాయమని తెలంగాణ పబ్లిక్ అండ్ ప్రైవేటు రోడ్డు ట్రాన్స్ఫోర్ట్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్లు అన్నారు. ఏదేని వాహనం సిగ్నల్ జంప్ చేసినా.. లేదా చలానా వేసిన వెంటనే యజమాని బ్యాంకు ఖాతా నుంచి డబ్బులు కట్టయ్యే పద్ధతి తీసుకొస్తామని సీఎం ప్రకటించడాన్ని వ్యతిరేకిస్తూ బుధవారం అలంపూర్ చౌరస్తాలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్రెడ్డి రవాణా రంగంపై ఏకపక్ష వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఏడాదికి రూ. 12వేల జీవనభృతి ఇవ్వాలని.. రవాణారంగ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉందని.. సిగ్నల్స్, రోడ్డు క్రాసింగ్ల వద్ద తరచుగా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని తెలిపారు. 50 కి.మీ.లకు ఒక విశ్రాంతి గది ఏర్పాటు చేయాల్సి ఉండాలని, వాహనాల రద్దీ నియంత్రణకు పోలీసులను నియమించడంతో పాటు రోడ్డు వెడల్పు, స్పీడ్ బ్రేకర్స్, ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. ఆయా సమస్యలను పరిష్కరించలేని ప్రభుత్వం.. రవాణా రంగంపై అక్కసు వెళ్లగక్కడం దారుణమన్నారు. రవాణా రంగ కార్మికులకు ఇచ్చిన హామీలను అమలుచేయాలని.. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా పోరాటాలకు సిద్ధమవుతామన్నా రు. రవాణారంగ కార్మికులు స్వాములు, రాముడు, రాఘవేంద్ర, పరమేశ్, మౌలాలి, మద్దిలేటి, భాస్కర్, మధు, మహేశ్, రామకృష్ణ పాల్గొన్నారు. -
ఆదరణ తగ్గింది
మా గ్రామం చర్లపల్లి అయినా పెద్దలనుంచి వచ్చిన గంగిరెద్దులను ఆడించటం కోసం సంచార జీవనం గడుపుతున్నా. భార్య ఇద్దరు పిల్లలతో గంగాపూర్లో గుడారాలు వేసుకొని జీవిస్తున్నాను. నా చిన్నతనం నుంచి ఇదే వృత్తిలో ఊరూరా తిరుగుతుంటాను. ఏడాదిలో ఈ మూడు రోజులే జడ్చర్లలో తిరిగి యాచకం చేస్తా. ఇంతకుముందు అయితే ధనం, ధాన్యం, గడ్డి అన్ని దానం చేసేవారు. ఇప్పుడు పూర్తిగా ఆదరణ తగ్గిపోయింది. – రాములు, గంగిరెద్దులను ఆడించే వ్యక్తి ఎద్దులే సాకుతాయి.. ఎద్దులను మంచిగా చూసుకుంటే అవి మా కుటుంబాలను సాకుతున్నాయి. వాటినే నమ్ముకుని ఏళ్ల తరబడి బతుకుతున్నాం. ఎద్దులు మంచిగా ఉంటేనే మా కుటుంబాలు చల్లగా ఉంటాయి. మారుతున్న సమాజంతో పొటీ పడేలా మాకు ప్రత్యేకమైన సదుపాయలు కల్పిస్తే మానుగడ సాగిస్తాం. తాతల నుంచి వస్తున్న ఆచారాన్ని కొనసాగించేలా నెట్టుకొస్తున్నాం. – రాములు, నవాబుపేట -
మున్సిపల్ రిజర్వేషన్లు ఖరారు
గద్వాలన్యూటౌన్: మున్సిల్ ఎన్నికల ప్రక్రియ వేగంగా సాగుతోంది. ఇప్పటికే ముసాయిదా ఓటరు జాబితాపై అభ్యంతరాలు స్వీకరించిన అధికారులు.. తుది ఓటరు జాబితా విడుదల చేసిన విషయం తెలిసిందే. తాజాగా వార్డుల రిజర్వేషన్లు ఖరారు చేస్తూ సీడీఎంఏ టీకే శ్రీదేవి ఉత్తర్వులు జారీ చేశారు. 2011 జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకొని రిజర్వేషన్లు ఖరారు చేశారు. ● గద్వాల మున్సిపాలిటీలో 37 వార్డులకు గాను ఎస్టీ జనరల్కు 1, ఎస్సీలకు 4 వార్డులు కేటాయించారు. బీసీ డెడికేటెడ్ కమిషన్ ప్రకారం బీసీలకు 13 వార్డులు దక్కనున్నాయి. ఇందులో 7 వార్డులు బీసీ జనరల్కు, 6 వార్డులు బీసీ మహిళలకు కేటాయించారు. 19 వార్డులను జనరల్కు కేటాయించగా.. 10 వార్డులు జనరల్ మహిళ, 9 వార్డులు జనరల్కు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ● అయిజలో 20 వార్డులు ఉండగా.. ఎస్టీ జనరల్కు 1 రిజర్వు చేశారు. ఎస్సీలకు 5 వార్డులకు గాను ఎస్సీ జనరల్కు 3, ఎస్సీ మహిళకు 2 కేటాయించారు. బీసీలకు 4 వార్డులు రిజర్వు కాగా.. 2 వార్డులు బీసీ జనరల్, 2 వార్డులు బీసీ మహిళలకు దక్కనున్నాయి. 10 వార్డులు జనరల్కు రిజర్వు కాగా.. ఇందులో 6 వార్డులు జనరల్ మహిళ, 4 వార్డులు జనరల్కు కేటాయించచారు. ● అలంపూర్లో 10 వార్డులు ఉండగా.. ఎస్టీ జనరల్కు 1 రిజర్వు చేశారు. 2 వార్డులు ఎస్సీలకు, 2 వార్డులు బీసీలకు కేటాయించారు. 3 జనరల్కు రిజర్వు చేయగా.. 1 మహిళకు, 2 జనరల్కు కేటాయించారు. ● వడ్డేపల్లిలో 10 వార్డులకు గాను 1 ఎస్టీ జనరల్కు కేటాయించారు. ఎస్సీలకు 2, బీసీలకు 2 వార్డులు రిజర్వు చేశారు. 3 వార్డులు జనరల్కు రిజర్వు కాగా.. 1 మహిళకు, 2 జనరల్ స్థానాలుగా ఖరారు చేశారు. -
ఆలయ గ్రంథం ఆవిష్కరణ
గద్వాలన్యూటౌన్: జిల్లా కేంద్రంలోని శ్రీసంతాన వేణుగోపాలస్వామి ఆలయ చరిత్ర గ్రంథాన్ని తెలుగు అధ్యాపకుడు బోరవెల్లి పవన్కుమార్ రచించగా.. రాజవంశీయుడు లక్ష్మీకేశవరెడ్డి ఆవిష్కరించారు. బుధవారం వేణుగోపాలస్వామి ఆలయంలో గోదా రంగనాథస్వామి కల్యాణ మహోత్సవంతో పాటు ఆలయ చరిత్ర గ్రంథావిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మీకేశవరెడ్డి మాట్లాడుతూ.. వేణుగోపాలస్వామి ఆలయ చరిత్ర గ్రంథ రూపంలో రచించడం ఆనందంగా ఉందన్నారు. ఆలయ విశిష్టత, శ్రీవైష్ణవ సంప్రదాయాన్ని గ్రంథంలో విపులంగా వివరించారని చెప్పారు. కార్యక్రమంలో డా.బాలస్వామి, రామ్మోహన్రావు, వారణాసి నాగేశ్వరాచారి, గోవర్ధన్శెట్టి, నందకిషోర్, లక్ష్మణ్, వగ్గు నాగరాజు, గోసాయి వేణు, భానుప్రకాశ్, మహేందర్, జయన్న, బసవరాజ్, బుచ్చన్న తదితరులు పాల్గొన్నారు. -
జాతీయస్థాయిలో సత్తాచాటిన దివ్యాంగ విద్యార్థులు
ఆత్మకూర్: గోల్బాల్ జాతీయ స్థాయి పోటీల్లో ఆత్మకూర్కు చెందిన దివ్యాంగ విద్యార్థులు సత్తాచాటి మొదటి బహుమతి సాధించారు. ఈ నెల 10 నుంచి బిహార్ రాష్ట్రం పాట్నాలో జరుగుతున్న 5వ నేషనల్ గోల్బాల్ పోటీలు మంగళవారం రాత్రి ముగిశాయి. ఈ క్రమంలో ఆత్మకూర్ సమ్మిలిత ఫౌండేషన్కు చెందిన విద్యార్థి పవన్కల్యాణ్ రాష్ట్ర జట్టుకు కెప్టెన్గా వ్యవహరించగా ఇక్కడి దివ్యాంగ విద్యార్థులు రాజేష్, వేణు, కిరణ్, మధు, సాయిరాంవర్మ ప్రతిభ కనబర్చి ఫైనల్లో ఏపీ జట్టుపై విజయం సాధించారని కోచ్, సంస్థ డైరెక్టర్ శివకుమార్ తెలిపారు. రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి ఆర్థిక సహకారంతోనే తమ విద్యార్థులు జాతీయ స్థాయిలో రాణిస్తున్నారని పేర్కొన్నారు. -
చింతలకుంటవాస.. శ్రీఆంజనేయ
● నేటినుంచి స్వామివారి ఉత్సవాలు ● ఇక్కడ మాంసం, కల్లుతోనే నైవేద్యం ● కోళ్లు, పొట్టేళ్లు బలిచ్చి మొక్కుల చెల్లింపు వనపర్తి రూరల్: ఆంజనేయస్వామికి సింధూరం, తమల పాకులు, టెంకాయలతో పూజలు నిర్వహిస్తారు. కానీ, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా పెబ్బేరు మండలంలోని పాతపల్లి శివారులో వెలసిన చింతలకుంట ఆంజనేయస్వామికి మాత్రం మాంసం, కల్లుతో నైవేద్యం సమర్పిస్తారు. ఏకంగా స్వామివారి ఎదుటే పొట్టేళ్లు, కోళ్లు బలిస్తారు. ప్రతిఏటా సంక్రాంతి పండుగ నుంచి మూడురోజులపాటు నిర్వహించే ఈ ఉత్సవాలకు స్థానికులేగాక వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. ఇక్కడి స్వామివారికి అపారమైన శక్తి ఉందని.. కోరిన కోర్కెలు తీరుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. కాగా.. బుధవారం ప్రారంభమయ్యే ఉత్సవాలు శుక్రవారం ముగుస్తాయి. ఉత్సవాలను పురస్కరించుకొని తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో తాగునీరు ఇతర ఏర్పాట్లు చేశారు. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా పెబ్బేరు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. -
గ్రామీణ క్రీడాకారులకు ప్రోత్సాహం
అలంపూర్: ప్రభుత్వం గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించడానికే సీఎం కప్ క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు డీవైఎస్ఓ కృష్ణయ్య అన్నారు. మంగళవారం అలంపూర్లో సీఎం కప్ టార్చ్ ర్యాలీని మంగళవారం ఉత్సాహంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రీడల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండి ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడిపేందుకు క్రీడలు దోహదం చేస్తాయన్నారు. సీఎం కప్ క్రీడా పోటీల నిర్వహణలో భాగంగా ఈ నెల 17 నుంచి 22వ తేదీ వరకు గ్రామీణ స్థాయిలో క్రీడలు నిర్వహించి.. మండల స్థాయి క్రీడాకారులను ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. 28 నుంచి 31వ తేదీ వరకు నియోజకవర్గ స్థాయి ఎంపికలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఫిబ్రవరి 3 నుంచి 7వ తేదీ వరకు జిల్లాస్థాయి క్రీడా పోటీలు ఉంటాయన్నారు. 10 నుంచి 14వ తేదీ వరకు రాష్ట్రస్థాయి క్రీడాకారుల ఎంపిక ఉంటుందన్నారు. కాగా, సీఎం కప్ టార్చ్ ర్యాలీ అలంపూర్ నుంచి అలంపూర్ చౌరస్తా వరకు కొనసాగింది. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శంకర్ నాయక్, ఎస్జీఎఫ్ కార్యదర్శి తోట శ్రీనివాసులు, కరాటే శ్రీహరి, అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బీసన్న, ఫుట్బాల్ అసోసియేషన్ కార్యదర్శి విజయ్, స్టేడియం అసిస్టెంట్ బషీర్ అహ్మద్, రిటైర్డ్ టీచర్ వెంకట్రామయ్య శెట్టి, భరత్కుమార్, నాగరాజు, ఈశ్వర్, నాగరాజు పాల్గొన్నారు. -
ఉచిత విద్యుత్ను సద్వినియోగం చేసుకోండి
అయిజ: రాష్ట్ర ప్రభుత్వం గృహజ్యోతి పథకం లబ్ధిదారులకు అందిస్తున్న 200 యూనిట్ల ఉచిత విద్యుత్ను సద్వినియోగం చేసుకోవాలని విద్యుత్ ఎస్ఈ శ్రీనివాస్రెడ్డి సూచించారు. మంగళవారం ఏడీఈ నీలి గోవిందుతో కలిసి మండల కేంద్రంలో గృహజ్యోతి పథకం లబ్ధిదారులకు ప్రభుత్వం తరఫున గ్రీటింగ్ కార్డులను అందజేశారు. అనంతరం సబ్స్టేషన్ వద్ద విద్యుత్శాఖ నూతన సంవత్సర క్యాలెండర్, డైరీ, నోట్బుక్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్ఈ మాట్లాడుతూ.. విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసేందుకు గాను అయిజ సబ్స్టేషన్లో 33 కేవీ ప్రత్యామ్నాయ పరికరాలను అమర్చుతున్నట్లు తెలిపారు. విద్యుత్శాఖ ప్రజాబాట కార్యక్రమం కొనసాగిస్తూ ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో విద్యుత్శాఖ సిబ్బంది పాల్గొన్నారు. -
పిండి వంటల ఘుమఘుమలు..
మహిళలందరూ ఒక చోట చేరి పిండి వంటలు చేసుకోవడం పండగ ప్రత్యేకత. సకినాలు, అరిసెలు, కారపూసలు, జంతికలు, నువ్వుల ఉండలు, గారెలు చేస్తుంటారు. ఇప్పటికే గ్రామాల్లో పిండి వంటలు తయారీ పూర్తయింది. ఉద్యోగాలు, చదువుల కోసం హైదరాబాద్, బెంగళూరు తదితర నగరాల్లో ఉన్న వారంతా పండగకు ఇంటికి వచ్చా రు. విద్యాసంస్థలకు కూడా సెలవులు ఇవ్వడంతో చాలా మంది విద్యార్థులు పట్నం నుంచి పల్లెబాట పట్టారు. అయితే నడిగడ్డకు చెందిన చాలా మంది యువకులు ఆంధ్రపదేశ్లోని గోదావరి తీరంలో సంక్రాంతి పండగ వేడుకలను ఆస్వాదించడానికి పయనమయ్యారు. -
ఫార్మర్ రిజిస్ట్రీతోనే పథకాలు
ఎర్రవల్లి: ప్రభుత్వ పథకాలను పొందేందుకు ప్రతి రైతు తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రీ చేసుకోవాలని జిల్లా వ్యవసాయశాఖ అధికారి సక్రియా నాయక్ అన్నారు. మంగళవారం మండలంలోని తిమ్మాపురం, పుటాన్దొడ్డి, కొండేరు, ధర్మవరం గ్రామాల్లో ఏఈఓలు నిర్వహిస్తున్న ఫార్మర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి రైతుకు 11 అంకెల ఫార్మర్ యూనిక్ ఐడీ ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ ప్రక్రియను చేపట్టిందన్నారు. ఫార్మర్ ఐడీతో వ్యవసాయ ఉత్పత్తులను సరైన ధరలకు విక్రయించడంతో పాటు ప్రభుత్వం అందించే ఎన్నో సేవలను సులభంగా పొందవచ్చన్నారు. ఫార్మర్ రిజిస్ట్రీ కోసం రైతులు ఆధార్, బ్యాంక్ ఖాతా, భూమి పట్టాదారు పాస్పుస్తకం, ఆధార్తో లింక్ ఉన్న మొబైల్ నంబర్తో స్థానిక వ్యవసాయ విస్తరణ అధికారిని సంప్రదించాలని సూచించారు. అదే విధంగా అందుబాటులో ఉన్న మీసేవ లేదా సీఎస్సీ కేంద్రాల్లోనూ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని తెలిపారు. ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే ప్రభుత్వ పథకాలకు దూరమయ్యే అవకాశం ఉందన్నారు. అనంతరం కోదండాపురంలోని ఆగ్రోస్ రైతు సేవా కేంద్రాన్ని ఆయన తనిఖీ చేశారు. డీఏఓ వెంట ఏఓ సురేశ్గౌడ్, ఏఈఓలు నరేశ్, ప్రవళిక, హిమబిందు, జెన్నిఫర్, సురేశ్, వేదావతి పాల్గొన్నారు. -
సరదాల సంక్రాంతి
వేళ పిండివంటల ఘుమఘుమలు.. పతంగుల కోలాహలం.. ముంగిట్లో ముత్యాల ముగ్గులు.. గంగిరెద్దుల విన్యాసాలు.. హరిదాసుల కీర్తనలు.. మహిళలు నోములు నోచుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ముచ్చటైన తెలుగు పండగ సంక్రాంతిని మూడు రోజులపాటు ఘనంగా జరుపుకొనేందుకు జిల్లా ప్రజలు సిద్ధమయ్యారు. బుధవారం భోగభాగ్యాల భోగి, గురువారం సంకాంత్రి, శుక్రవారం కనుమను కుటుంబ సమేతంగా నిర్వహించుకునేందుకు దూర ప్రాంతాల్లో ఉన్న వారు సొంతూళ్లకు చేరుకున్నారు. ముంగిళ్లను రంగవల్లులతో తీర్చిదిద్దేందుకు యువతులు, మహిళలు సన్నద్ధమవుతున్నారు. మూడు రోజుల ముచ్చటైన ఉత్సవం.. పంట ఇంటికొచ్చే వేళ ఎక్కడ చూసినా పండగ వాతావరణం నెలకొంది. – గద్వాలటౌన్ సరదాల సంక్రాంతిసంక్రాంతి అంటేనే సంబురం. ఈ పర్వదినానికి పల్లెల్లో ఎనలేని ప్రాధా న్యం ఉంటుంది. గ్రామాల్లో అన్ని వర్గాలకు వ్యవసాయమే మూలాధారం. ఏటా వానాకాలం పంటలు చేతికొచ్చే సందర్భంలో చేసుకునే వేడుకే ఇది. అందుకే పంటలకు, పండగకూ విడదీయలేని సంబంధం. అయితే ఈ సారి మాత్రం జిల్లాలోని పల్లెల్లో వానాకాలం పంటలు చేతికి రావడంతో పాటు యాసంగి కలిసొచ్చిన సందర్భం తోడవుతూ ఉత్సాహాన్ని మరింత రెట్టింపు చేస్తోంది. రైతుల నాగళ్ల చప్పుళ్లతో పొలాలన్నీ సందడిగా మారాయి. వరితో పాటు జొన్న, కంది, వేరుశనగ, శనగ, మొక్కజొన్న, కూరగాయలు తదితర పంటలు సాగవుతున్నాయి. ఈ తరుణంలో సంకాంత్రి పండగ గ్రామీణులకు ప్రత్యేకంగా నిలిచింది. సంక్రాంతి పర్వదినానికి ముందుగానే ముగ్గుల సందడి మొదలైంది. సూర్యోదయానికి ముందే మహిళలు లేచి ఇంటి ముందు అలుకు చల్లి ముచ్చటైన ముగ్గులు వేయడంలో పోటీ పడతారు. సృజనాత్మకతకు రంగవల్లులనే వేదికగా చేసుకుంటారు. ఇందుకు అవసరమైన రంగుల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. వారం రోజుల నుంచే రంగుల కొనుగోలుదారులతో మార్కెట్లు కళకళలాడుతున్నాయి. వివిధ స్వచ్ఛంద సంస్థలు, పార్టీల నాయకులు, పాఠశాలల్లో వేర్వేరుగా మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించి ఉత్సాహపరుస్తున్నారు. ముత్యాల ముగ్గులు ప్రత్యేకం.. జిల్లాలో మొదలైన పండగ సందడి నేడు భోగభాగ్యాల భోగి రేపు సంక్రాంతి.. ఎల్లుడి కనుమ పల్లెల్లో పండగ కోలాహలం -
‘పుర’ పోరుకు సంసిద్ధం
ప్రాథమిక సమాచారం సేకరణ పూర్తి .. జిల్లాలో మున్సిపల్ ఎన్నికలకు అవసరమైన ఉద్యోగుల ప్రాథమిక సమాచారాన్ని సేకరించే ప్రక్రియ ముగిసింది. నాలుగు మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరుగుతుండటంతో ఆర్ఓలు, పీఓలు, సహాయ ఎన్నికల సిబ్బందిగా నియమించేందుకు ఎంతమంది ఉద్యోగులు అవసరమనే విషయంపై స్పష్టత తీసుకొచ్చారు. వీరితో పాటు జోనల్ అఽధికారులు, వెబ్ కాస్టింగ్, మైక్రో అబ్జర్వర్ల ఎంపిక సైతం పూర్తిచేశారు. వారికి గతంలోనే శిక్షణ ఇచ్చారు. ప్రస్తుతం సిబ్బంది తక్కువగా అవసరం కానుండటంతో చాలా మందికి విధుల కేటాయింపు నుంచి ఉపశమనం కలిగించారు. అత్యధికంగా విద్యాశాఖ అధికారులకే ఎన్నికల బాధ్యతలను కట్టబెట్టనున్నారు. గద్వాలటౌన్: మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో జిల్లా యంత్రాంగం నిమగ్నమైంది. ఇప్పటికే వార్డుల వారీగా తుది ఓటరు జాబితా విడుదలచేసిన అధికారులు... ఎన్నికల నిర్వహణకు అవసరమైన కార్యదళం కోసం కసరత్తు ప్రారంభించారు. అందులో భాగంగా ప్రభుత్వ శాఖల నుంచి ఉద్యోగుల వివరాలు సేకరించారు. ఎన్నికల విధులు నిర్వహించే అధికారుల జాబితాను రూపొందించాలన్న ఈసీ ఆదేశాల మేరకు జిల్లా ముఖ్య ప్రణాళికశాఖ ఆధ్వర్యంలో వివరాలు సేకరించారు. అత్యవసర విభాగాలైన వైద్యారోగ్యశాఖ మినహా మిగిలిన శాఖల్లో విధులు నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరి వ్యక్తిగత సమాచారం తీసుకున్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా పలు అంశాలతో కూడిన సమాచారాన్ని రాబడుతున్నారు. జిల్లాలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో విధులు నిర్వహించిన సిబ్బంది వివరాలను టీపోల్ సాఫ్ట్వేర్లో పొందుపరిచారు. ఈ జాబితాలో ఎవరైనా ఉద్యోగులు పదవీ విరమణ పొందారా.. సస్పెన్షన్కు గురయ్యారా అనే సమాచారం సేకరించి.. వారి వివరాలను తొలగిస్తున్నారు. అత్యధికంగా విద్యాశాఖ సిబ్బందిపైనే దృష్టి సారించారు. జిల్లాలోని గద్వాల, అయిజ, అలంపూర్, వడ్డేపల్లి మున్సిపాలిటీల్లో ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. నాలుగు చోట్ల ఎన్నికల నిర్వహణకు ప్రాథమికంగా సుమారు 700 మంది అధికారులు, సిబ్బంది అవసరం ఉన్నట్లు గుర్తించారు. వీరందరి వివరాలను ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. ఏదైనా కారణాలతో విధులకు హాజరు కాకుంటే.. ఎన్నికల నిర్వహణలో ఇబ్బందులు లేకుండా ఉండేందుకు 20 శాతం సిబ్బందిని అదనంగా నియమిస్తున్నారు. ఒకటి రెండు రోజుల్లో ఎన్నికల సిబ్బంది వివరాల నమోదు కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. సమగ్ర సమాచారం.. మున్సిపల్ ఎన్నికలు ఎప్పుడొచ్చినా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉంది. ముఖ్యంగా ఎన్నికల విధుల నిర్వహణకు జిల్లాస్థాయి అధికారి నుంచి కిందిస్థాయి ఉద్యోగుల సమగ్ర సమాచారం సేకరిస్తున్నారు. జిల్లా, మండల స్థాయిలో గెజిటెడ్, నాన్ గెజిటెడ్ ఉద్యోగుల వివరాలు ముందుగానే నమోదు కావడంతో గుర్తింపు ప్రక్రియ సులువుగా మారింది. ఉద్యోగులు ఎన్నికల విధులు నిర్వహించేందుకు స్థానికంగా నివాసం ఉండరాదనే విషయాన్ని పరిగణనలోకి తీసుకోనున్నారు. స్థానికత ఆధారంగా విధులు కేటాయించే అవకాశం ఉండటంతో.. ఉద్యోగుల జన్మస్థలం వివరాలు తప్పనిసరి కానున్నాయి. జిల్లాలో ఎన్నికల అధికారులు సిబ్బంది ఇలా.. శాఖల వారీగా ఉద్యోగుల నియామకానికి కసరత్తు ఎన్నికల విధులు బాధ్యతగానిర్వర్తించేలా చర్యలు అత్యవసర శాఖల సిబ్బందికి మినహాయింపు -
మద్యం తాగి వాహనాలు నడపొద్దు
ఉండవెల్లి: ఎట్టి పరిస్థితుల్లోనూ మద్యం తాగి వాహనాలు నడపరాదని ఏఎస్పీ శంకర్ అన్నారు. మంగళవారం ఉండవెల్లి పోలీస్స్టేషన్లో నిర్వహించిన రోడ్డు భద్రత మాసోత్సవాల్లో ఆయన మాట్లాడుతూ.. మద్యం తాగి వాహనాలు నడపడం, అతివేగం, అజాగ్రత్త కారణంగా రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకొని ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు. ప్రతి వాహనదారుడు రోడ్డు భద్రత నియమాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. ద్విచక్ర వాహనదారులు విధిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. మైనర్లకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులపై చర్యలు ఉంటాయన్నారు. వాహనదారులు రోడ్డు భద్రత నియమాలు పాటిస్తూ ప్రమా దాల నివారణకు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ మొగలయ్య, సీఐ రవిబాబు, ఎస్ఐ శేఖర్, సర్పంచ్ నాగరాజు పాల్గొన్నారు. పశువులకు టీకాలు తప్పనిసరి కేటీదొడ్డి: పశువులకు తప్పనిసరిగా వ్యాధినిరోధక టీకాలు వేయించాలని జిల్లా పశువైద్యాధికారి శివానందస్వామి అన్నారు. మండలంలోని వెంకటాపురంలో మంగళవారం గర్భకోశ వ్యాధి నివారణ చికిత్స శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పశుసంపదతో రైతుల ఆర్థిక స్థితి మెరుగుపడుతుందన్నారు. చూడి కట్టని పశువులతో పాటు సకాలంలో ఎదకు రాని పశువులకు సరైన చికిత్స అందేలా చూడాలన్నారు. కాగా, పశుగణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన శిబిరంలో 20 ఆవులు, 15 గేదెలకు గర్భకోశ చికిత్సలు అందించారు. మరో 15 పశువులకు సాధారణ చికిత్స చేశారు. డా.వినయ్, రమేశ్, వెంకట్రాజీ, ప్రియాంక, నవీన్ చంద్ర, అర్పిత, యామిని, ఉష, గోపాల్రెడ్డి పాల్గొన్నారు. వైభవంగా ధనుర్మాస ఉత్సవాలు ఎర్రవల్లి: బీచుపల్లి క్షేత్రంలోని కోదండరామస్వామి ఆలయంలో ధనుర్మాస వ్రత మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం సుప్రభాత సేవ, పుణ్యహవచనం, పంచామృత అభిషేకం, తీర్థగోష్టి, ప్రభంద పారాయణం వంటి పూజా కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. బుధవారం భోగి సందర్భంగా గోదా రంగనాథస్వామి కల్యాణం నిర్వహించనున్నట్లు ఆలయ మేనేజర్ సురేందర్ తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కల్యాణ వేడుక కనులారా తిలకించి స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. -
కేసీఆర్ వస్తేనే పాలమూరుకు నీళ్లు
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: ‘పాలమూరు అభివృద్ధి చెందాలంటే మళ్లీ కేసీఆరే రావాలి. ఐటీ హబ్ పునర్ వైభవం పొందాలంటే, ఉద్యోగాలు రావాలంటే, అమర్ రాజా కంపెనీ మళ్లీ రావాలన్నా, రైతులు, మహిళల ముఖాల్లో చిరునవ్వు చూడాలన్నా, భూముల ధరలు పెరగాలన్నా మళ్లీ కేసీఆర్ రావాలి’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సోమవారం మహబూబ్నగర్లో ఎస్వీఎస్ మెడికల్ కళాశాల నుంచి ఎంబీసీ మైదానం వరకు బీఆర్ఎస్ నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం ఎంబీసీ మైదానం నిర్వహించిన బీఆర్ఎస్ నూతన సర్పంచులు, ఉపసర్పంచుల సన్మాన కార్యక్రమంలో మాట్లాడారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో ఉమ్మడి పాలమూరు జిల్లాలో కొడంగల్తో సహా 14 నియోజకవర్గాల్లో గులాబీ జెండా ఎగురుతుందని చెప్పారు. అభ్యర్థిగా ఎవరున్నా గులాబీ జెండాను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. పల్లె, పట్టణం తేడా లేకుండా అభివృద్ధి.. బీఆర్ఎస్ హయాంలో పల్లె, పట్టణం తేడా లేకుండా అభివృద్ధి చేశామన్నారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి ద్వారా సమాంతరంగా అభివృద్ధి పనులు చేపట్టామని చెప్పారు. తాను మున్సిపల్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించాక మహబూబ్నగర్తో పాటు వనపర్తి, నాగర్కర్నూల్, గద్వాల మున్సిపాలిటీల్లో చేసిన అభివృద్ధిని గమనించాలని కోరారు. మహబూబ్నగర్ జిల్లాకేంద్రంలో మెడికల్ కళాశాల, జనరల్ ఆస్పత్రి, కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం, జంక్షన్ల అభివృద్ధి, ఫైఓవర్ల నిర్మాణం, వీధి వ్యాపారుల దుకాణాలను చూశాక తనకు కడుపు నిండిందని వ్యాఖ్యానించారు. ప్రతి గ్రామంలో ట్రాక్టర్లు, వైకుంఠధామాలు, పల్లె ప్రకృతి వనాలతో పనులన్నీ కళ్ల ముందే కనిపిస్తున్నాయని చెప్పారు. కాంగ్రెస్ పాలనలో రెండేళ్లు గడిచినా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉందన్నారు. మైగ్రేషన్ జిల్లా కాదు.. ఇరిగేషన్కు మారుపేరుగా మార్చాం పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చిన ఘనత కేసీఆర్దే పాలమూరు బిడ్డనంటూ రేవంత్ గద్దెనెక్కారు రెండేళ్లయినా ఒక్క పనీ చేయలేదు పాలమూరు నుంచే మున్సిపల్ ఎన్నికల జైత్రయాత్ర మహబూబ్నగర్లో సర్పంచుల సన్మాన కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మైగ్రేషన్ జిల్లాను ఇరిగేషన్ జిల్లాగా మార్చాం.. వలసలకు మారుపేరుగా ఉన్న పాలమూరు జిల్లాను బీఆర్ఎస్ హయాంలో ఇరిగేషన్ జిల్లాగా మార్చామని చెప్పారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు కోసం రూ.30 వేల కోట్లు ఖర్చు రిజర్వాయర్లతో సహా 90 శాతం పనులు పూర్తి చేశామన్నారు. పాలమూరులో పెండింగ్ ప్రాజెక్టులన్నింటినీ రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చామని చెప్పారు. భీమా, నెట్టెంపాడు, కోయిల్సాగర్, కల్వకుర్తి ప్రాజెక్టులను పూర్తి చేసి ఉమ్మడి జిల్లాలో 8లక్షల ఎకరాలకు సాగునీరు అందించామన్నారు. పాలమూరులోని ఐటీ హబ్లో ఏర్పాటైన 14 పరిశ్రమలు ఎందుకు పారిపోయాయని ప్రశ్నించారు. -
ఫార్మర్ రిజిస్ట్రీ తప్పనిసరి
గద్వాలవ్యవసాయం: పీఎం కిసాన్ సమ్మాన్నిధి లబ్ధిదారులు తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రీ చేయించుకోవాలని జిల్లా వ్యవసాయశాఖ అధికారి సక్రియానాయక్ అన్నారు. సోమవారం జిల్లాకేంద్రం సమీపంలోని నది అగ్రహారంలో ఏర్పాటుచేసిన ఫార్మర్ రిజిస్ట్రీ అవగాహన కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. పట్టా భూమి కలిగిన రైతులు తమ ఆధార్కు లింక్ ఉన్న ఫోన్ నంబర్తో ఫార్మర్ రిజిస్ట్రీ పూర్తిచేసుకోవాలని చెప్పారు. ప్రతి రైతుకు 11 నంబర్లు గల రిజిస్ట్రేషన్ నంబర్ వస్తుందని.. జాగ్రత్తగా ఉంచుకోవాలని సూచించారు. జిల్లాలో అర్హులైన రైతులందరూ ఈ నెల 15వ తేదీలోగా ఫార్మర్ రిజిస్ట్రీ చేయించుకోవాలని తెలిపారు. అదే విధంగా పీఎం కిసాన్ ఈకేవైసీ తప్పనిసరిగా చేయించుకోవాలన్నారు. ఫార్మర్ రిజిస్ట్రీతో కలిగే ప్రయోజనాలను రైతులకు వివరించచారు. కార్యక్రమంలో ఏఈఓ హరీశ్ పాల్గొన్నారు. -
జోగుళాంబ బ్రహ్మోత్సవాలకు సీఎంకు ఆహ్వానం
అలంపూర్: జోగుళాంబదేవి వార్శిక బ్రహ్మోత్సవాలకు రావాలని సీఎం రేవంత్రెడ్డిని ఆహ్వానించినట్లు ఈఓ దీప్తి తెలిపారు. ఈ మేరకు సోమవారం హైదరాబాద్లో సీఎం రేవంత్రెడ్డితోపాటు దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను కలిసినట్లు చెప్పారు. ఈ నెల 19 నుంచి 23 వరకు జోగుళాంబ అమ్మవారి ఆలయంలో వార్శిక బ్రహ్మోత్సవా లు, అదేవిధంగా వచ్చేనెల 14 నుంచి 18 వర కు బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు కొనసాగుతాయని పేర్కొన్నారు. వీరితోపాటు ఆలయ అర్చకులు కృష్ణమూర్తిశర్మ, జానకిరామశర్మ తదితరులున్నారు. ఫిర్యాదుల స్వీకరణ గద్వాల క్రైం: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి వచ్చిన ప్రజల నుంచి ఏఎస్పీ శంకర్ ఫిర్యాదులు స్వీకరించారు. ప్రధానంగా భూ వివాదాలు, ఆస్తి తగాదాలు తదితర సమస్యలపై ఫిర్యాదులు అందాయి. వీలైనంత త్వరగా వాటిని పరిష్కరించి బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని ఏఎస్పీ తెలిపారు. సివిల్ సమస్యలను కోర్టు ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు. రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అలంపూర్: రోడ్డు భద్రత నియమాలు పాటించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని సీఐ రవిబాబు అన్నారు. రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా సోమవారం అలంపూర్ చౌరస్తా సమీపంలోని పుల్లూరు టోల్ప్లాజా వద్ద పోలీసుశాఖ, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా, రవాణాశాఖ సంయుక్త ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా 44వ జాతీయ రహదారిపై రాకపోకలు సాగిస్తున్న వాహనదారులకు రోడ్డు భద్రత నియమాలపై ప్రత్యక్షంగా అవగాహన కల్పించారు. హెల్మెట్ ధరించని ద్విచక్ర వాహనదారులకు ఉచితంగా హెల్మెట్లు అందజేసి భద్రతను ప్రోత్సహించారు. కార్లు, లారీలు, ఆటోలు వంటి వాహనాలకు రాత్రివేళ స్పష్టంగా కనిపించేలా రేడియం స్టిక్కర్లను అతికించారు. ఎన్హెచ్ఏఐలో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి రిఫ్లేక్టివ్ సేఫ్టీ జాకెట్లు అందజేశారు. వాహనదారులకు గులాబీ పువ్వులు అందించి.. నిదానంగా, జాగ్రత్తగా ప్రయాణించాలని స్నేహపూర్వకంగా సూచనలు చేశారు. కార్యక్రమంలో ఎస్ఐ ఆర్.శేఖర్, ఏఎంవీఐ పవన్కుమార్, రమేశ్, నేషనల్ హైవే అథారిటీ అధికారి శ్రీధర్ పాల్గొన్నారు. -
మహిళలే కీలకం..!
పురుషులతో పోలిస్తే 10,891 మంది అధికం పరిష్కారం చూపించలేదంటూ విమర్శలు.. ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకటించిన తర్వాత దాదాపుగా అన్ని మున్సిపాలిటీల్లోనూ అభ్యంతరాలు వెల్లువెత్తాయి. ఇంటి నంబర్ల ప్రకారం ఓటు హక్కు కల్పించలేదని.. ఇతర వార్డుల్లో ఓట్లు నమోదయ్యాయని.. వేరే జిల్లాలు, గ్రామాలు, ఇతర ప్రాంతాల ఓటర్లు తమ వార్డుల్లో నమోదైనట్లు వందలాది మంది ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ఈ నెల పదో తేదీనే తుది ఓటర్ల జాబితాను ప్రకటించాల్సి ఉండగా.. మరో రెండు రోజులు పొడిగించారు. ఈ మేరకు సోమవారం అధికారులు ఫైనల్ ఓటర్ల జాబితాను వెల్లడించగా.. ఇందులోనూ పలు అభ్యంతరాలకు పరిష్కారం చూపలేదని రాజకీయ పార్టీల నేతలు విమర్శిస్తున్నారు. ప్రధానంగా మహబూబ్నగర్ కార్పొరేషన్, అయిజ, పెబ్బేరు, అమరచింత, మద్దూరు పురపాలికల్లో ఈ పరిస్థితి నెలకొన్నట్లు తెలుస్తోంది. అధికారులు మాత్రం ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా ఫిర్యాదులు పరిష్కరించి.. తుది జాబితాను వెల్లడించినట్లు చెబుతున్నారు. సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: పురపాలికల ఓటర్ల లెక్క తేలింది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో పదవీ కాలం పూర్తి కాని జడ్చర్ల, అచ్చంపేట మినహా మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్తో పాటు మరో 18 పురపాలికలకు సంబంధించి సోమవారం తుది ఓటర్ల జాబితాను ఖరారు చేశారు. అన్ని మున్సిపాలిటీల్లోనూ పురుషుల కంటే మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో అభ్యర్థుల జయాపజయాల్లో వారి కీలకంగా మారనున్నట్లు తెలుస్తోంది. పురపాలికల్లో తేలిన ఓటర్ల లెక్క ఒక కార్పొరేషన్, 18 మున్సిపాలిటీల్లో వెల్లడి జడ్చర్ల, అచ్చంపేటకు పూర్తి కాని పదవీ కాలం ఉమ్మడి జిల్లాలో పట్టణ ఓటర్లు 6,18,604 మంది పలు మున్సిపాలిటీల్లో పరిష్కారం కాని అభ్యంతరాలు? -
వివేకానందుడి స్ఫూర్తితో ఎదగాలి
గద్వాలటౌన్: యుక్త వయసులోనే దేశ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన మహనీయుడు స్వామి వివేకానందుడని.. ఆయన స్ఫూర్తితో యువత ముందుకుసాగాలని వివిధ పార్టీల నాయకులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని సోమవారం జిల్లా కేంద్రంలోని రాజీవ్మార్గ్ రోడ్డులో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి వివేకానందుడి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించగా.. యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు తిరుమలేష్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. జెడ్పీ మాజీ చైర్పర్సన్ సరిత తన క్యాంపు కార్యాలయంలో వివేకానందుడి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బీజేపీ, బీఆర్ఎస్ ఆధ్వర్యంలో వేర్వేరుగా వివేకానందుడి జయంతి వేడుకలు నిర్వహించారు. వీహెచ్పీ నాయకులు కోటలో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటుచేశారు. కార్యక్రమంలో బీజేపీ నా యకులు రామాంజనేయులు, జయశ్రీ,, రవికుమా ర్, రమాదేవి, సమత, అనిల్, భారతి పాల్గొన్నారు. -
క్రీడా నైపుణ్యాన్ని వెలికితీయడమే లక్ష్యం
గద్వాలటౌన్: గ్రామీణ క్రీడాకారుల్లో నైపుణ్యాన్ని వెలికితీయడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ) లక్ష్మీనారాయణ అన్నారు. సోమవారం స్థానిక ఇండోర్ స్టేడియంలో జిల్లా యువజన, క్రీడల అభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో చేపట్టిన సీఎం కప్ టార్చ్ ర్యాలీని అడిషనల్ కలెక్టర్ (స్థానిక సంస్థలు) నర్సింగ్రావు, ఏఎస్పీ శంకర్తో కలిసి ఆయన ప్రారంభించారు. పట్టణ ప్రధాన రహదారుల గుండా టార్చ్ ర్యాలీ ఉత్సాహంగా సాగింది. అనంతరం ఏర్పాటుచేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ.. ఔత్సాహిక క్రీడాకారులకు సీఎం కప్ గొప్ప అవకాశమని, జిల్లా క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ చాటాలని పిలుపునిచ్చారు. చీకట్లో ఏదైనా వస్తువును వెతికేందుకు టార్చ్ లైట్లు ఎలా వినియోగిస్తామో.. అలాగే ప్రతిభ గల క్రీడాకారులను వెలికితీసేందుకు ఈ టార్చ్ ర్యాలీ దోహదపడుతుందన్నారు. వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో కొంత సమయాన్ని ఆటలు ఆడేందుకు కేటాయించాలని సూచించారు. ప్రతిభ గల క్రీడాకారులందరికీ ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు ప్రభుత్వం యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేసిందన్నారు. క్రీడాకారులకు ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఉన్నతస్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో డీఈఓ విజయలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ జానకీరామ్సాగర్, డీవైఎస్ఓ కృష్ణయ్య, ఎస్జీఎఫ్ జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ప్రజావాణికి 72 ఫిర్యాదులు గద్వాల: ప్రజావాణిలో వచ్చిన ప్రతి ఫిర్యాదుకు ప్రాధాన్యతనిచ్చి పరిష్కరించాలని అదనపు కలెక్టర్ వి.లక్ష్మీనారాయణ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు తమ సమస్యలపై అదనపు కలెక్టర్కు నేరుగా వినతిపత్రాలు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వివిధ సమస్యలపై మొత్తం 72 ఫిర్యాదులు అందాయని, వాటిని పెండింగులో ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నర్సింగ్రావు, ఎస్డీసీ శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
లక్ష్యం.. గ్రీన్ గంగాపురం
జడ్చర్ల టౌన్: స్వామి వివేకానందుడిని స్ఫూర్తిగా తీసుకుని మండలంలోని గంగాపురం గ్రామంలో 6 మంది సభ్యులతో 2013 ఏడాదిలో హెల్పింగ్ హార్ట్స్ ఫర్ గంగాపూర్ (స్వామి వివేకానంద యూత్) పేరిట ఏర్పాటైనన యువజన సంఘం నేడు 222 మంది సభ్యులకు చేరింది. గ్రామాభివృద్ధే లక్ష్యంగా ఏర్పాటైన ఈ సంఘం అనేక సేవా కార్యక్రమాలు చేపడుతూ ప్రతిఒక్కరిలోనూ సేవాభావం పెంపొందిస్తున్నారు. ఉత్తరాఖండ్ వరద బాధితుల కోసం గ్రామంలో విరాళాలు సేకరించి అప్పటి కలెక్టర్కు అందజేశారు. తొలి అడుగు విజయవంతం కావడంతో హెల్పింగ్ హార్ట్స్ ఫర్ గంగాపూర్ సంఘం నమోదు చేయించారు. 6 మందితో ప్రారంభమైన సంఘంలో ప్రస్తుతం 222 మంది సభ్యులు చేరారు. ఎన్నో భవిష్యత్ లక్ష్యాలు నిర్దేశించుకొని ముందుకు సాగుతున్నారు. ప్రధానంగా గ్రీన్ గంగాపురంగా మార్చడానికి కృషిచేస్తున్నారు. -
పోలీసులకు సమాచారం అందించండి
గద్వాల క్రైం: సంక్రాంతి పండగ సెలవులను పురస్కరించుకొని ఇళ్లకు తాళాలు వేసి ఇతర ప్రాంతాలకు వెళ్లే వారు పోలీసు శాఖ సూచనలు పాటించాలని ఎస్పీ శ్రీనివాసరావు ఆదివారం ఒక ప్రటకనలో పేర్కొన్నారు. ఇంట్లో ఒక్కరూ కూడా ఉండకుండా తాళం వేసి ఇతర ప్రాంతాలకు వెళ్లే క్రమంలో ఇరుగు పొరుగు వారిని తెలపడంతో పాటు సమీప పోలీసు స్టేషన్లో సమాచారం అందించాలని కోరారు. విలువైన బంగారు ఆభరణాలు, నగదును బ్యాంక్ లాకర్లో భద్రపరచుకోవాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా పెట్రోలింగ్ పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. కాలనీలో ఎవరైనా అనుమానిత వ్యక్తులు సంచరిస్తున్నట్లు గుర్తిస్తే తక్షణమే డయల్ 100 లేదా సమీపంలోని పోలీసులకు సమాచారం అందించాలన్నారు. పోలీసుశాఖ సూచనలు ప్రతి ఒక్కరూ పాటించి దొంగతనాలను కట్టడి చేద్దామన్నారు. సీపీఐ శతాబ్ది ఉత్సవాలకు తరలిరండి గద్వాల: సీపీఐ శతాబ్ది భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి బి.ఆంజనేయులు కోరారు. ఆదివారం పార్టీ కార్యాలయంలో ఈ నెల 18న ఖమ్మంలో జరిగే బహిరంగ సభ వాల్పోస్టర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీపీఐ ఏర్పడి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శతాబ్ది ఉత్సవాల ముగింపు నేపథ్యంలో పార్టీ బహిరంగ సభను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సభకు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. పార్టీకి చెందిన అగ్రనాయకులతో పాటు, 40 దేశాలకు చెందిన కమ్యూనిస్టు ప్రతినిధులు హాజరవుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు రంగన్న, ఆశన్న, కృష్ణ, పరమేష్, ప్రవీణ్, రాజు, వెంకట్రాములు, రవి తదితరులు పాల్గొన్నారు. బాలికలను అన్నిరంగాల్లో తీర్చిదిద్దాలి మహబూబ్నగర్ మున్సిపాలిటీ: బాలికలను అన్నిరంగాల్లో తీర్చిదిద్దాలని హైదరాబాద్ ప్రాంతీయ విద్యా సంచాలకులు ఎం.సోమిరెడ్డి అన్నారు. జాతీయ విద్యా ప్రణాళిక, పరిపాలన సంస్థ (ఎన్ఐఈపీఏ– నీపా) ఆధ్వర్యంలో మహబూబ్నగర్, నారాయణపేట, జోగుళాంబ గద్వాల జిల్లాలకు చెందిన కేజీబీవీల ప్రత్యేకాధికారులకు సాధికారతపై నిర్వహించిన ఐదు రోజుల శిక్షణ తరగతులు ఆదివారం జిల్లాకేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో ముగిశాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలికల అభ్యున్నతికి నాణ్యమైన విద్యతోపాటు జీవన నైపుణ్యాలు, క్రీడలు, కళలు, శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. తల్లిదండ్రుల వద్ద కంటే విద్యార్థినులు ఎక్కువ సమయం ఉపాధ్యాయులు, వార్డెన్లతోనే గడుపుతారని వారి భవిష్యత్ కేజీబీవీల ప్రత్యేకాధికారులు, ఉపాధ్యాయులపైనే ఆధారపడి ఉంటుందన్నారు. విద్యార్థినులకు ఉత్తమ విద్య, అవసరమైన సౌకర్యాలు కల్పించడమే గాక సత్ప్రవర్తనతో ఆదర్శంగా మెలగాలన్నారు. ఇక్కడ నేర్చుకున్న అంశాలను కేజీబీవీలలో తప్పక అమలు చేయాలని సూచించారు. జీసీడీఓలు అర్షాఖాద్రీ, సంగీత, మాస్టర్ ట్రైనర్లు నాయు డు, పల్లవి, శివలీల, నర్మద పాల్గొన్నారు. -
సేవాతత్పరులు
స్వామి వివేకానంద.. తన జీవన విధానంలో ఎందరికో స్ఫూర్తినిచ్చిన మహనీయుడు. లక్ష్యం లేకుండా పయనించే యువతకు ఆయనే ఓ దిక్సూచి. మానవ సేవయే.. మాధవసేవగా భావించి సామాన్య ప్రజలపై అసామాన్య సానుభూతిని కనబరిచిన మానవతావాది. ఈయనను స్ఫూర్తిగా తీసుకొని కొంతమంది యువకులు ఎవరో వస్తారు.. ఏదో చేస్తారని ఆశించకుండా మనల్ని మనమే సంస్కరించుకోవాలని ముందడుగు వేస్తున్నారు. రక్తదానం, అన్నదానం, విద్యాదానం, విద్యార్థులకు పుస్తకాలు, ప్యాడ్లు పంపిణీ, మొక్కల పెంపకం, శ్రమదానంతోపాటు.. సామాజిక, ఆర్థిక అసమానతలపై చైతన్యం కల్పిస్తూ ఇతరుల్లోనూ స్ఫూర్తిని రగిలిస్తున్నారు. ఏటికేడాది తమ లక్ష్యాలను మార్చుకుంటూ.. వాటి సాధన కోసం అవిశ్రాంతగా శ్రమిస్తూ ముందుకు సాగుతున్నారు. సోమవారం స్వామి వివేకానందుడి జయంతి (జాతీయ యువజన దినోత్సవం)ని పురస్కరించుకొని సేవా కార్యక్రమాలు చేస్తున్న యువజన సంఘాలపై ప్రత్యేక కథనం.. ముందుండి.. రక్తదానం నవాబుపేట: సేవా కార్యక్రమాల్లో అతి ముఖ్యమైన రక్తదానాలకు పెట్టింది పేరు నవాబుపేట స్వామి వివేకానంద సేవాసమితి. మరికొందరు యువత తమ తల్లిదండ్రుల పేరుతో సంస్థలను స్థాపించి.. పేదలకు ఎల్లవేళలా సహాయ సహకారాలు అందిస్తున్నారు. రక్తదాన శిబిరాలు ఒకరు ఏర్పాటు చేస్తుంటే.. మరొకరు అన్నదాన కార్యక్రమాలు, పేదలకు ప్రతినెలా కొంత ఆర్థిక సాయం అందిస్తూ అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నారు. సామాజిక సేవలో తరిస్తున్న యువతరం రక్తదానం, అన్నదానంతోపాటు ప్రగతిలో మమేకం సామాజిక, ఆర్థిక అసమానతలపై చైతన్యం స్వామి వివేకానందుడి స్ఫూర్తితో ముందుకు.. నేడు జాతీయ యువజన దినోత్సవం -
సంక్షేమ పథకాలతో చేయూత
అలంపూర్: ప్రభుత్వ సంక్షేమ పథకాలతో పేదలకు చేయూత అందిస్తామని ఎమ్మెల్యే విజయుడు అన్నారు. కర్నూలులోని క్యాంప్ కార్యాలయంలో సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన చెక్కును ఎమ్మెల్యే విజయుడు ఆదివారం అందజేశారు. అలంపూర్ మండలం భీమవరానికి చెందిన జయంద్రకు రూ.10 వేల చెక్కు మంజూరైనట్లు పేర్కొన్నారు. ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేను కలిసిన నాయకులు: క్యాంప్ కార్యాలయంలో నియోజకవర్గంలోని ఆయా మండలాల నాయకులు ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్యే విజయుడును కలిసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా వారిక పుష్పగుచ్ఛం అందజేసి సత్కరించారు. కార్యక్రమంలో నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
వసూళ్లలో తగ్గిన దూకుడు
2025–26లో కేటాయించిన లక్ష్యంలో డిసెంబర్ 31 వరకు చేరుకున్నది ఇలా.. (రూ.కోట్లలో..) పాలమూరు: ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఆర్టీఏ శాఖకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన లక్ష్యం చేరుకోవడానికి సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టిపెట్టారు. ఆర్థిక సంవత్సరం ముగియడానికి మరో మూడు నెలల గడువు ఉన్న క్రమంలో అప్పటి వరకు ఇచ్చిన లక్ష్యం కంటే అధిక మొత్తంలో పూర్తి చేయాలని చూస్తున్నారు. అయితే ఉమ్మడి జిల్లాలో వాహనాలకు జరిమానాలు, అధిక లోడ్, పత్రాలు లేకుండా, డ్రైవర్కు లైసెన్స్ లేకుండా తిరిగే వాహనాలకు జరిమానాలు విధించడానికి తనిఖీలు పూర్తిస్థాయిలో జరగడం లేదు. జిల్లా ఆర్టీఏ శాఖ జీవిత కాల పన్నుతోపాటు ఫీజుల వసూలులోనూ పూర్తిగా వెనుకబడి ఉంది. ప్రధానంగా త్రైమాసిక పన్నులు అయితే పూర్తిగా తగ్గిపోవడంతో సమస్యగా మారింది. దీంతోపాటు తనిఖీల వల్ల వచ్చిన ఆదాయం కూడా తగ్గింది. ప్రతిరోజు తనిఖీలు చేయాలని లక్ష్యం ఉన్నా.. సిబ్బంది కొరత వల్ల అది సాధ్యం కావడం లేదు. అరకొరగా ఉన్న అధికారులు రోడ్ల మీద వాహన తనిఖీలకు వెళ్తే కా ర్యాలయంలో పనులు నిలిచిపోయే పరిస్థితి నెలకొంది. అధిక లోడ్.. పత్రాలు.. జిల్లాలో జాతీయ రహదారి–44 ఉండటంతో అధిక లోడ్ కలిగిన వాహనాలు అధిక సంఖ్యలో వెళ్తుంటాయి.. అలాంటి వాహనాలపై ఆర్టీఏ శాఖ కొరడా ఝులిపిస్తుంది. అదేవిధంగా పత్రాలు లేకుండా కూడా అధిక సంఖ్యలో వాహనాలు తిరుగుతున్న నేపథ్యంలో వాటిపై కూడా పన్నులు వసూలు చేస్తున్నారు. ఇలాంటి వాహనాల కోసం ఆర్టీఏ శాఖ వారు జాతీయ రహదారిపై చెక్పోస్టులు ఏర్పాటు చేసి పన్నులు వసూలు చేస్తున్నారు. అదేవిధంగా జిల్లాకు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాలకు పత్రాలు లేకుండా అధిక మొత్తంలో పన్నులు వసూలు చేయడం జరుగుతుంది. ఇందులో మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి సర్వీస్ ఫీజు, డిటెక్షన్, గ్రీన్ట్యాక్స్ వసూలులో లక్ష్యానికి మించి సాధించారు. మహబూబ్నగర్ జిల్లాలో వసూలు చేసిన పన్నుల వివరాలు పన్ను రకాలు లక్ష్యం వసూలు చేసింది శాతం (రూ.లక్షల్లో..) మూడునెలల పన్ను 1,735.01 1,639.03 94.46 జీవితకాల పన్ను 5,301.00 4,230.19 79.79 ఫీజులు 990.00 798.84 80.69 సర్వీస్ ఫీజు 243.00 295.46 121 డిటెక్షన్ 207.00 338.68 163 గ్రీన్ట్యాక్స్ 117.00 119.28 101 లక్ష్యం చేరుకోవడంలో వెనకబడిన ఉమ్మడి జిల్లా ఆర్టీఏ శాఖ జీవితకాల ఫీజు, త్రైమాసిక పన్నుల వసూళ్లలో నిర్లక్ష్యం సిబ్బంది కొరతతో నామమాత్రంగా తనిఖీలు మూడు నెలల్లో ముగియనున్న ఆర్థిక సంవత్సరం జిల్లాలో ప్రభుత్వం ఇచ్చిన లక్ష్యం చేరుకోవడానికి ప్రత్యేక కార్యాచరణతో వెళ్తున్నాం. ప్రత్యేక టీంల ద్వారా ఎన్ఫోర్స్మెంట్ తనిఖీలు చేసి ఆదాయం పెరిగే విధంగా చూస్తాం. జీవిత కాల బీమా, నూతన వాహనాల ట్యాక్స్ ఇతర ఆదాయ మార్గాల్లో లక్ష్యం పూర్తి చేస్తాం. మరో మూడు నెలల గడువు ఉన్న నేపథ్యంలో అన్ని రకాల వాహనాల ధ్రువపత్రాలపై తనిఖీలు చేసి జరిమానాలు విధిస్తాం. – రఘుకుమార్, ఆర్టీఓ, మహబూబ్నగర్ -
క్రీడాస్ఫూర్తితో ఉన్నత శిఖరాలకు
గద్వాలటౌన్: ప్రతి క్రీడాకారుడికి క్రీడాస్ఫూర్తి ముఖ్యమని, దీని వల్లే భవిష్యత్లో ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చని జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు మురారి సోమశేఖర్రెడ్డి పేర్కొన్నారు. సంక్రాంతి పండగను పురస్కరించుకుని కబీర్దాస్ అనిత నర్సింహులు సహకారంతో డీటీడీసీ యూత్ నిర్వహించిన తెలుగుపేట ప్రిమియర్ లీగ్ క్రికెట్ పోటీలను ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడారు. ప్రతి క్రీడాకారుడు జాతీయస్థాయి పోటీలను లక్ష్యంగా పెట్టుకొని ఆడాలని సూచించారు. క్రీడలతో శారీరక దృఢత్వంతో పాటు, మానసిక దృఢత్వం లభిస్తుందన్నారు. గెలుపోటముల కంటే పోటీల్లో క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించడం ప్రధానమన్నారు. పట్టుదల, శ్రద్ధ అనేది క్రీడల వల్ల అలవడుతాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ అనిత, నాయకులు నర్సింహులు, తాయన్న, కిట్టు, వెంకట్రాములు, దేవన్న, చిన్న తదితరులు పాల్గొన్నారు. -
సేవ చేయడం అదృష్ట్రం..
ఆత్మకూర్లో వివేకానంద సేవాసమితిని నెలకొల్పిన నాటి నుంచి యువతను సేవా కార్యక్రమాల్లో భాగస్వాములను చేస్తున్నాం. రక్తదాన, వైద్యశిబిరాలకు ప్రాధాన్యం ఇస్తున్నాం. పారిశుద్ధ్య కార్యక్రమాలు, విద్యార్థులకు ఆటల పోటీలు నిర్వహిస్తున్నాం. పేదలకు సేవ చేయడం అదృష్టంగా భావిస్తున్నాం. – బాలు, సేవాసమితి అధ్యక్షుడు, ఆత్మకూర్ ఆత్మకూర్: పట్టణానికి చెందిన డాన్స్మాస్టర్ బాలు, మ్యాడం శ్రీను, ల్యాబ్ టెక్నీషియన్ రాజేశ్ తదితరులు ఎనిమిదేళ్ల క్రితం స్వామి వివేకానంద సేవాసమితిని నెలకొల్పి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గ్రామాల్లో స్వచ్ఛత కార్యక్రమాలు నిర్వహిస్తూ.. ప్లాస్టిక్ రహిత సమాజం కోసం క్లాత్ సంచులను పంపిణీ చేస్తున్నారు. తలసేమియా బాధితుల కోసం రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తూ.. ఇప్పటివరకు 275 మందితో రక్తదానం చేయించారు. నేత్రం ఫౌండేషన్ సహకారంతో విద్యార్థుల్లో కంటి లోపాలను గుర్తించి.. చికిత్స అందేలా చూస్తున్నారు. యువతను క్రీడల్లో ప్రోత్సహిస్తున్నారు. ●తలసేమియా బాధితులకు అండగా.. -
అలంపూర్ ఆలయాల బ్రహోత్సవాలకు ఆహ్వానం
అలంపూర్: దక్షిణకాశీలో జరిగే వార్శిక బ్రహోత్సవాలకు ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలకు ఆహ్వానం అందించారు. కర్నూలులోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్యే విజయుడులను అలంపూర్ క్షేత్ర ఆలయాల ఈఓ దీప్తి అర్చకులతోపాటు శనివారం కలిసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా అలంపూర్ క్షేత్రంలో జరిగే జోగుళాంబ అమ్మవారి వార్శిక బ్రహోత్సవాలకు, బాలబ్రహ్మేశ్వరస్వామి మహా శివరాత్రి ఉత్సవాల ఆహ్వాన పత్రిక అందజేసినట్లు పేర్కొన్నారు. అమ్మవారి వార్శిక బ్రహోత్సవాలు ఈ నెల 19 నుంచి 23 వరకు, స్వామివారి మహాశివరాత్రి మహోత్సవాలు ఫిబ్రవరి 14 నుంచి 18 వరకు జరగనున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో ఆలయ ఉద్యోగి బ్రహ్మయ్యఆచారి, అర్చకులు జానకిరామశర్మ, త్యాగరాజుస్వామి తదితరులు పాల్గొన్నారు. కేటీఆర్ సభ ఏర్పాట్ల పరిశీలన జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): ఈనెల 12వ తేదీన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జిల్లా పర్యటనను విజయవంతం చేయాలని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక ఎంబీసీ మైదానంలో బహిరంగసభ ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. సభా వేదిక, పార్కింగ్ ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలో సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పార్టీ తరఫున గెలుపొందిన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డుమెంబర్లను కేటీఆర్ సన్మానిస్తారని పేర్కొన్నారు. సభకు నాయకులు, కార్యకర్తలు భారీగా హాజరుకావాలని కోరారు. కార్యక్రమంలో గ్రంథాలయం సంస్థ మాజీ చైర్మన్ రాజేశ్వర్గౌడ్, ముడా మాజీ చైర్మన్ వెంకన్న, పట్టణ అధ్యక్షుడు శివరాజు, మున్నూరురాజు, ప్రభాకర్, వర్ధభాస్కర్, కిషన్, రమేష్, సత్తి, తదితరులు పాల్గొన్నారు. -
పరవశించే మది
ప్రకృతి ఒడి..● పర్యాటక ప్రియులను ఆకర్షిస్తున్న నల్లమల టూరిజం ● ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్న ఫర్హాబాద్, ఆక్టోపస్ వ్యూపాయింట్లు ● జంగిల్ సఫారీలో పెద్ద పులులు, ఇతర వన్యప్రాణుల కనువిందు ● వారాంతాలు, సెలవు రోజుల్లో విశేషంగా పెరుగుతున్న ఆదరణ ● రెండు రకాల ప్యాకేజీల్లో అవకాశం కల్పిస్తున్న అటవీశాఖ – సాక్షి, నాగర్కర్నూల్ -
రిజర్వేషన్లపై ఉత్కంఠ
మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో జోరుగా చర్చ ● టికెట్ల కోసం ఆశావహుల ముమ్మర ప్రయత్నాలు ● వార్డులకు ఐదారుగురు పేర్లు పరిశీలిస్తున్న పార్టీలు ● జనరల్ స్థానాలపై సీనియర్ నేతల ప్రత్యేక దృష్టి ● జిల్లాలోని నాలుగు పురపాలికల్లో రాజకీయ సందడి గద్వాల టౌన్: మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ వేగవంతమైంది. ఇప్పటికే ఓటరు ముసాయిదా జాబితాపై స్వీకరించిన అభ్యంతరాలను పరిష్కరించే ప్రక్రియ దాదాపు పూర్తికావొచ్చింది. ఈ నెల 12న వార్డుల వారీగా ఓటరు తుది జాబితాను ప్రకటించడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. దీంతోపాటు 16న ఫొటోలతో కూడిన ఓటర్ల తుది జాబితాను ఆయా వార్డులోని పోలింగ్ కేంద్రాల్లో విడుదల చేయడానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఆ తర్వాత కీలకమైన రిజర్వేషన్ల ప్రక్రియకు మున్సిపల్ శాఖ శ్రీకారం చుడుతుంది. ఈ క్రమంలోనే అందరి దృష్టి వార్డుల రిజర్వేషన్లపై పడింది. రిజర్వేషన్లు ఖరారుకాక ముందే ఆశావహులు ఇప్పటి నుంచే టికెట్ల కోసం ఎవరికి వారు ప్రయత్నాలు చేస్తున్నారు. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలైన గద్వాల, అయిజ, అలంపూర్, వడ్డేపల్లిలో పోటీ చేసేందుకు ఉత్సాహం చూపుతున్న ఆశావహుల్లో చాలామంది పేర్లు బయటకు వినిపిస్తున్నాయి. తాజా మాజీ కౌన్సిలర్లు, కొత్తగా పోటీ చేయాలనుకునే వారు, పార్టీలో ఏళ్లుగా కొనసాగుతున్న చోటామోటా నాయకులు పోటీకి సై అంటున్నారు. ఓటర్ల జాబితా, వార్డుల వారిగా కులగణనకు సంబంధించి లెక్కలు అనధికారికంగా విడుదల కావడంతో ఆ దిశగా రిజర్వేషన్లపై ఎవరికి వారే అంచనాలు వేసుకుంటున్నారు. టికెట్ల కోసం ఆయా పార్టీల నాయకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. గద్వాల పట్టణ కాంగ్రెస్లో బీఫారం లొల్లి నెలకొంది. ఏడాదిన్నరగా గద్వాల కాంగ్రెస్ గ్రూపు రాజకీయాలతో నడుస్తోంది. ఎమ్మెల్యే వర్గం, జెడ్పీ మాజీ చైర్పర్సన్ వర్గాలుగా నాయకులు, కార్యకర్తలు విడిపోయి వేర్వేరుగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గత నెలలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో సైతం ఎవరికివారు పోటీ చేసి ఇరువురు అభ్యర్థులు సత్తాచాటారు. ప్రస్తుత మున్సిపల్ ఎన్నికల్లోనూ అదే దూకుడు కనిపిస్తుంది. అయితే పార్టీ పరంగా ఎన్నికలు కావడంతో పార్టీ బీఫాం అభ్యర్థులకు కీలకంగా మారనుంది. రెండు వర్గాలలో ఎవరికి పార్టీ బీఫాంలు దక్కుతాయోననే చర్చ అందరిలో నెలకొంది. ఎమ్మెల్యే వర్గానికే అన్ని బీఫాంలు వస్తాయని అంచనా వేసుకుని ఆ వర్గంలోని నాయకులు అన్ని వార్డులలో పోటీకి సై అంటున్నారు. జెడ్పీ మాజీ చైర్పర్సన్ సరిత వర్గానికి సగం వార్డులో పోటీ చేయడానికి పార్టీ బీఫాం ఇస్తారనే చర్చ సైతం జోరుగా సాగుతోంది. ఎవరికి వారు అంచనాలు వేసుకుంటూ పోటీకి సిద్ధమవుతున్నారు. ఆయా వర్గాలలో పార్టీ బీఫాం రాని అభ్యర్థులకు బీఆర్ఎస్ నాయకులు గాలం వేస్తున్నారు. ఇప్పటికే ఒక దఫా చర్చలు జరిపినట్లు సమాచారం. కాంగ్రెస్లో పార్టీ బీఫాం రాని అభ్యర్థులు సైతం ఆచితూచి వ్యవహరిస్తున్నారు. పార్టీ బీఫాం రాకుంటే రెబల్గా పోటీ చేయడమా.. లేదా పార్టీ ఫిరాయించడమా అనే దానిపై అందరి ముఖ్యులతో మంతనాలు చేస్తున్నారు. -
హైలెవల్.. ముందడుగు
జూరాల వద్ద ప్రారంభమైన వంతెన నిర్మాణం ● రూ.123 కోట్ల అంచనా వ్యయంతో.. ● తాత్కాలిక రోడ్డు ఏర్పాటు.. కొనసాగుతున్న రాకపోకలు ● ఆత్మకూర్, గద్వాల మధ్య తగ్గనున్న దూరం ● ఆనందం వ్యక్తం చేస్తున్న ప్రాంతవాసులు గద్వాల మండలం కొత్తపల్లి, ఆత్మకూర్ మండలం కొత్తపల్లి మధ్యనున్న కృష్ణానదిపై వంతెన నిర్మిస్తారని చిన్నతనం నుంచి వింటున్నా. ప్రస్తుతం నిర్మాణానికి అడుగులు పడగా.. తాత్కాలిక రోడ్డు పనులు పూర్తయి గ్రామం మీదుగా రాకపోకలు కొనసాగుతుండటంతో ఆనందంగా ఉంది. ఏళ్లనాటి కలను సాకారం చేసిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి రుణపడి ఉంటాం. – మహేశ్వర్రెడ్డి, మాజీ సర్పంచ్, కొత్తపల్లి (గద్వాల) మండలంలోని జూరాల వద్ద కృష్ణానదిపై వంతెన నిర్మాణానికి మంత్రి వాకిటి శ్రీహరి ఎంతో శ్రమించారు. కొందరు కావాలని అడ్డంకులు సృష్టించి ఇబ్బందులకు గురిచేసినా సీఎంను ఒప్పించి రూ.123 కోట్లు మంజూరు చేయించి పనులు ప్రారంభించారు. – పరమేష్, కాంగ్రెస్పార్టీ మండల అధ్యక్షుడు, ఆత్మకూర్ మా ఊరి మీదుగా ఆత్మకూర్, గద్వాలకు వాహనాలు తిరుగుతుంటే సందడిగా మారింది. గతంలో మా గ్రామంవైపు కన్నెత్తి చూడనివారు సైతం ఊరి మీదుగా ప్రయాణం చేస్తున్నారు. ఊరి రూపురేఖలు మారడం ఖాయం. – నర్సింహ, సర్పంచ్, జూరాల (ఆత్మకూర్) ఆత్మకూర్: ఈ ప్రాంతవాసుల ఏళ్ల నాటి కల సాకారం కాబోతుంది. మండలంలోని జూరాల, గద్వాల జిల్లా కొత్తపల్లి మధ్యనున్న కృష్ణానదిపై హై లేవల్ వంతెన నిర్మాణ పనులు ప్రారంభం కావడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆయా గ్రామాల మధ్య తాత్కాలిక రోడ్డు నిర్మించడంతో కార్లు, ద్విచక్ర వాహనాలు, ఆటోలు రాకపోకలు సాగిస్తున్నాయి. రూ.123 కోట్లతో హై లేవల్ వంతెన నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి డిసెంబర్ 1న శంకుస్థాపన చేశారు. వెంటనే తాత్కాలిక రోడ్డు నిర్మాణం చేపట్టి రాకపోకలు ప్రారంభించారు. ఆత్మకూర్ నుంచి జూరాల మీదుగా గద్వాలకు వెళ్లాలంటే 32 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. వంతెన నిర్మాణం పూర్తయితే కేవలం పది కిలోమీటర్లు ప్రయాణించి గద్వాలకు చేరుకోవచ్చు. అలాగే గద్వాల నుంచి హైదరాబాద్కు వెళ్లాలంటే ఎర్రవల్లి చౌరస్తా మీదుగా హైవేపై ప్రయాణం చేయాల్సి ఉంటుంది. వంతెన నిర్మాణం అనంతరం గద్వాల నుంచి ఆత్మకూర్ మీదుగా కొత్తకోట హైవేకు చేరుకోవచ్చు. దీంతో 40 కిలోమీటర్ల దూరం తగ్గనున్నట్లు అంచనా వేస్తున్నాయి. అలాగే ఎమ్మిగనూరు, ఆదోని, బళ్లారి, మంత్రాలయం వెళ్లే ప్రయాణికులకు దూరభారం తగ్గనుంది. రవాణా సౌకర్యం మెరుగుపడటంతో వ్యాపారపరంగా ఆత్మకూర్, జూరాల, గద్వాల జిల్లా కొత్తపల్లి ప్రాంతాలు అభివృద్ధి చెందనున్నాయి. కృష్ణానదిపై వంతెన నిర్మాణానికి ప్రభుత్వం రూ.123 కోట్లు కేటాయించడంతో ఆర్అండ్బీశాఖ టెండర్ల ప్రక్రియ పూర్తి చేసింది. గత నెలలోనే పనులను ముఖ్యమంత్రి లాంఛనంగా ప్రారంభించగా.. మంత్రి వాకిటి శ్రీహరి త్వరతగతిన నిర్మాణం పూసేందుకు సంబంధిత కాంట్రాక్టు కంపెనీ, ఆర్అండ్బీ అధికారులతో మాట్లాడుతున్నారు. కృష్ణానదిపై హైలేవల్ వంతెన నిర్మాణ పనులు రెండేళ్లలోపు పూర్తిచేసేలా ముందుకు సాగుతున్నాం. ఇందులో భాగంగా మొదట తాత్కాలిక రోడ్డు నిర్మాణం పూర్తిచేసి అందుబాటులోకి తీసుకొచ్చాం. టెండర్ దక్కించుకున్న కాంట్రాక్ట్ కంపెనీ పనులు వేగంగా కొనసాగిస్తోంది. – దేశ్యానాయక్, ఈఈ, ఆర్అండ్బీ -
జిల్లాకు ఈ నెల 19న మంత్రుల రాక
● పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం ● రెండో విడత డబుల్ ఇళ్ల పంపిణీ ● కలెక్టర్ బీఎం సంతోష్ గద్వాల: జిల్లాలో పలు అభివృద్ధి పనులు, నూతన భవనాలను ప్రారంభించేందుకు ఈ నెల 19 న రాష్ట్ర మంత్రులు జిల్లాకు రానున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డితో కలిసి నర్సింగ్కాలేజీ, డబుల్ బెడ్రూం ఇళ్లు, మహిళా సమాఖ్య భవన్ను సందర్శించారు. ఈ సందర్భంగా వారు పనుల పురోగతిపై సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. జిల్లాకు నర్సింగ్ కాలేజీ మంజూరై నాల్గో సంవత్సరం తరగతులు ప్రైవేటు భవనంలో కొనసాగుతున్నాయని, నూతనంగా నిర్మిస్తున్న ప్రభుత్వ నర్సింగ్ కాలేజీలో పెండింగ్లో ఉన్న పనులన్నీ పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని సూచించారు. అదేవిధంగా రెండో విడతలో భాగంగా అర్హులైన లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు డబుల్బెడ్ రూమ్ ఇళ్ల జాబితాను సిద్ధం చేయాలని ఆదేశించారు. కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు 5 ఎకరాల స్థలాన్ని కేటాయించనున్నట్లు పేర్కొన్నారు. ఇదివరకే కేంద్రం నుంచి సంబంధిత అధికారులు గద్వాలకు వచ్చిస్థలాన్ని సైతం పరిశీలించారన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వి.లక్ష్మీనారాయణ, విద్యుత్ శాఖ ఎస్ఈ శ్రీనివాసరెడ్డి, టీజీఎంఎస్ఐడీసీ ఈఈ వేణుగోపాల్, నర్సింగ్ కాలేజీ ప్రిన్సిపల్ హనుమంతమ్మ పాల్గొన్నారు. -
‘తాగునీటి సమస్య రానివ్వొద్దు’
గద్వాల: జిల్లాలో వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా అవసరమైన ముందస్తు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో జలజీవన్ మిషన్, జిల్లా నీటి, పారిశుద్ధ్య మిషన్ కమిటీ సమన్వయ సమావేశంలో అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాగునీటి ఎద్దడిని నివారించే పథకాలు జలజీవన్ మిషన్, హర్ఘర్ జల్ వంటి కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఈ నెల 3వ వారంలోగా ప్రతి మండలంలో ఎంపిక చేసిన రెండు గ్రామ పంచాయతీల్లో విలేజ్ వాటర్ అండ్ శానిటేషన్ కమిటీ సమావేశాలు నిర్వహించాలని అధికారులకు సూచించారు. ఆయా గ్రామాలకు సంబంధించిన పూర్తి తాగునీటి సమాచారాన్ని ఈ–పంచాయతీ డాష్బోర్డులో జనవరి 26లోగా నమోదు చేయాలన్నారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా ఎక్కడా కూడ తాగునీటి సమస్యలు లేనప్పట్టికీ సరఫరాలో ఆకస్మికంగా వచ్చే ఇబ్బందులను అప్పటికప్పుడు పరిష్కరించేలా ముందస్తు ప్రణాళిక తీసుకోవాలని ఆదేశించారు. జిల్లాలో వివిధ కారణాలతో 39 ప్రభుత్వ పాఠశాలలో తాగునీటి సరఫరా నిలిచిందని, వెంటనే సమస్య పరిష్కరించాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ నర్సింగ్రావు, జెడ్పీ డీసీఈఓ నాగేంద్రం, మిషన్భగీరథ ఎస్ఈ వెంకటరమణ, ఈఈలు శ్రీధర్రెడ్డి, పరమేశ్వరి, డీఈ కృష్ణ, ఆయా మండలాల ఏఈలు పాల్గొన్నారు. -
బాల్య వివాహాలను ప్రోత్సహిస్తే చర్యలు
అలంపూర్: బాల్య వివాహాలు బాలల భవిష్యత్ అధంకారంలోకి నెడతాయని, వాటిని ఎట్టి పరిస్థితుల్లో ప్రోత్సహించొద్దని సీడీపీఓ సుజాత, డీసీపీఓ నరసింహ అన్నారు. వడ్డేపల్లి మండల కేంద్రంలోని ఐకేపీ భవనంలో మహిళాభివృద్ధి, శివు సంక్షేమ శాఖ బాలల సంరక్షణ విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం బాల్య వివాహ్ ముక్త్ భారత్ 100 రోజుల ప్రోగ్రాం నిర్వహించారు. ఈ సందర్భంగా సీడీపీఓ సుజాత మాట్లాడుతూ.. ఏదైనా పెళ్లి సమాచారం తెలిసినప్పుడు సర్వీస్ ప్రొవైడర్లు, పురోహితులు, ఖాజీలు, పాస్టర్లు, ఫొటో, వీడియోగ్రాఫర్స్, టెంట్ హౌస్, ప్రింటింగ్ ప్రెస్ వారు వధూవరుల వయస్సును ధృవీకరించుకోవాలని సూచించారు. ఒకవేళ వారి వయస్సు ధృవీకరించుకోకపోతే బాల్య వివాహాలను ప్రోత్సహించిన వారిగా శిక్షార్హులవుతారని తెలిపారు. బాల్య వివాహాలు చేస్తే రూ.లక్ష జరిమాన, రెండేళ్ల జైలు శిక్ష ఉంటుందని హెచ్చరించారు. పిల్లలకు ఏ సమస్య ఉన్నా 100, 1098కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ రామకృష్ణ, ఐసీపీఎస్ మండల ఇన్చార్జులు లక్ష్మీదేవి, ప్రకాష్, సూపర్వైజర్లు పుష్ప, లక్ష్మీదేవి, ఏపీఎం ఎల్లప్ప, ఎంఈఓ నర్సింహులు, హబ్ సిబ్బంది చిట్టెమ్మ, సరోజ, నాగరాజు తదితరులు ఉన్నారు. హుండీ ఆదాయం రూ.29,42,618 మల్దకల్: ఆదిశిలా క్షేత్రమైన స్వయంభూ శ్రీలక్ష్మీ వేంకటేశ్వర స్వామివారి ఆలయ హుండీ ఆదాయం రూ.29,42,618 వచ్చినట్లు ఆలయ చైర్మన్ ప్రహ్లాదరావు తెలిపారు. శుక్రవారం ఆలయ ఆవరణలోని కల్యాణ మండపంలో ఆలయ ఈఓ సత్యచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరమ్మ పర్యవేక్షణలో 200 మంది ఎస్వీఎస్ సేవాసంఘం సభ్యులు హుండీ లెక్కింపు నిర్వహించారు. అదే విధంగా చింతలముని నల్లారెడ్డి స్వామి ఆలయ హుండీ ఆదాయం రూ.1,32,406 వచ్చినట్లు ఆయన తెలిపారు. గతేడాది కంటే ఈ ఏడాది ఆలయ హుండీ ఆదాయం పెరిగిందన్నారు. అనంతరం సేవాసమితి సభ్యులను ఆలయ చైర్మన్, ఈఓలు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో సర్పంచు చిట్టెమ్మ, ఆలయ నిర్వాహకులు అరవిందరావు, చంద్రశేఖర్రావు, బాబురావు, నాయకులు సీతారామిరెడ్డి, మధుసూదన్రెడ్డి, నరేందర్, నారాయణ, పద్మారెడ్డి, వీరారెడ్డి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. విద్యార్థుల్లో మేథోశక్తిని పెంపొందించాలి గద్వాలటౌన్: ఆంగ్లభాషలో ప్రావీణ్యం పెంపొందించడంతో పాటు స్పెల్లింగ్పై అవగాహన కల్పించేందుకు ‘ఎల్టా’ నిర్వహించిన ఒలింపియాడ్, ఉపన్యాస పోటీల కార్యక్రమానికి విద్యార్థుల నుంచి విశేష స్పందన లభించింది. శుక్రవారం స్థానిక బాలభవన్లో తెలంగాణ రాష్ట్ర ఆంగ్ల భాషోపాధ్యాయ సంఘం (ఎల్టా) ఆధ్వర్యంలో విద్యార్థులకు ఆంగ్లభాషా నైపుణ్యంపై జిల్లాస్థాయి పోటీలు నిర్వహించారు. మండల స్థాయిలో విజేతలుగా నిలిచిన విద్యార్థులతో పాటు ఆంగ్ల భాషా ఉపాధ్యాయులు హాజరయ్యారు. విద్యార్థులు ఆయా విభాగాల్లో ప్రతిభ చాటి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. సాయంత్రం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంఈఓలు శ్రీనివాస్గౌడ్, సురేష్ బహుమతుల ప్రదానం చేశారు. విద్యార్థుల్లో అంతర్గతంగా దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీయడానికి ఇలాంటి పోటీలు దోహదం చేస్తాయని అధికారులు తెలిపారు. కార్యక్రమంలో ఎల్టా అధ్యక్షుడు మైఖేల్, ప్రధాన కార్యదర్శి సుమలత, కోశాధికారి వెంకట్రాములు తదితరులు పాల్గొన్నారు. వివేకానందుడి స్ఫూర్తితో ఎదగాలి గద్వాలటౌన్: యుక్త వయస్సులోనే భారతదేశ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన మహనీయుడు స్వామి వివేకానందుడని, ఆయన స్ఫూర్తితో యువకులు ముందుకు సాగాలని డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ షేక్ కలందర్బాషా పిలుపునిచ్చారు. స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో ముందస్తుగా శుక్రవారం స్థానిక కళాశాల ఆవరణలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. -
బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు కృషి
అలంపూర్: బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనే లక్ష్యంగా ఆపరేషన్ స్మైల్–12 నిర్వహిస్తున్నట్లు సహాయ కార్మిక అధికారి వేణుగోపాల్, జిల్లా బాలల సంరక్షణ కౌన్సిలర్ సురేష్ పేర్కొన్నారు. అలంపూర్ పట్టణంలోని కిరాణాలు, పంట పొలాలు, బైక్ మెకానిక్ షాపులు, హోటళ్లలో వారు శుక్రవారం తనిఖీ చేశారు. వివిధ పనుల్లో 18 ఏళ్ల లోపు ఉన్న ముగ్గురు పనిచేస్తున్నట్లు గుర్తించారు. 14 ఏళ్ల లోపు ఇద్దరు కూల్డ్రింక్ షాప్లో పని చేస్తున్నట్లు తెలిపారు. యజమానిపై అలంపూర్ పోలీస్స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. గుర్తించిన బాలలను చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఎదుట హాజరు పర్చారు. కార్యక్రమలో కానిస్టేబుల్ భరత్, శిల్ప, చైల్డ్ లైన్ సిబ్బంది లక్ష్మి తదితరులు ఉన్నారు. -
సిబిల్ సప్లయ్..!
ఉమ్మడి పాలమూరు జి ల్లాలో 2020 నుంచి న వంబర్ వరకు 148 మంది మిల్లులను డీఫాల్ట్గా గుర్తించి.. 52 మిల్లులపై కేసులు నమోదు చేశారు. వీటి పరిధిలో రూ.566 కోట్ల విలువైన ధాన్యం ఉంది. ఇందులో రూ.450 కోట్ల విలువైన ధాన్యాన్ని రాబట్టాల్సి ఉండగా..ఈ ప్రక్రియ సక్రమంగా సాగడం లేదు. పైగా ఆయా రైస్ మిల్లర్ల చేతిలోని మిల్లులు సహకరించే అధికారులు, నేతలకు అక్షయపాత్రగా మారాయి. దీనిపై విజిలెన్స్, ఎన్ఫోర్మెంట్ అధికారులు సైతం సందర్భాన్ని బట్టి దాడులు నిర్వహించి.. చేతులు తడుపుకొని పోతారనే విమర్శలూ ఉన్నాయి. రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యం పంపిణీ చేస్తున్న క్రమంలో ప్రభుత్వ పెద్దలు ఆ శాఖపై సీరియస్ అయ్యారు. ఈ నేపథ్యంలో వనపర్తి జిల్లాలోనే మిల్లర్ల అక్రమాలు ఎక్కువగా జరుగుతున్నట్లు గ్రహించిన విజిలెన్స్ అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: అవినీతికి కేరాఫ్గా నిలిచిన సివిల్ సప్లయ్ శాఖపై ముప్పేట దాడులు కొనసాగుతున్నాయి. ఒకవైపు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్, మరోవైపు అవినీతి నిరోధకశాఖ దూకుడు పెంచడంతో అధికార యంత్రాంగం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ప్రధానంగా ఇటీవల వనపర్తి జిల్లా పౌరసరఫరాల శాఖ డీఎం జగన్మోహన్ రెడ్హ్యాండెడ్గా లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కడం.. ఆ తర్వాత ఆ జిల్లా అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ), డీఎస్ఓలను సైతం విచారించడం చర్చనీయాంశంగా మారింది. కలెక్టరేట్ వేదికగా చోటుచేసుకున్న ఈ పరిణామాలు ఉమ్మడి పాలమూరులో సంచలనం సృష్టిస్తున్నాయి. కింది స్థాయి సిబ్బంది నుంచి మొదలు పైస్థాయి దాకా లంచాల్లో వాటాల పంపకాలు నిత్యకృత్యంగా మారాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మిల్లర్లతో ‘దోస్తాన్’ దందాతోనే.. మర ఆడిచేందుకు ప్రభుత్వం మిల్లులకు కేటాయించిన సీఎమ్మార్ ధాన్యంలో మిల్లర్ల అక్రమాలు అన్నీ ఇన్నీ కావు. పెట్టుబడి పెట్టకుండా అవకతవకలకు పాల్పడుతూ బహిరంగ మార్కెట్లో విక్రయిస్తూ అప్పనంగా సొమ్ము చేసుకుంటున్నారు. ఈ అక్రమాలను అరికట్టాల్సిన సివిల్ సప్లయ్ శాఖ మిన్నకుండిపోయింది. ప్రధానంగా మిల్లర్ల నుంచి ఆ శాఖకు చెందిన పలువురు సిబ్బంది, అధికారులు కుమ్మకై ్క నెల నెలా లంచాలు తీసుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. సహకరించని మిల్లర్లను నానా తిప్పలు పెట్టి దారికి తెచ్చుకున్న ఘటనలు కూడా వెలుగుచూశాయి. ఇలా మిల్లర్లతో పౌర సరఫరాల శాఖ అధికారులు దోస్తాన్ దందాకు తెగబడడంతో ప్రధానంగా వనపర్తిలో పరిస్థితులు మరింత దిగజారాయి. ఈ నేపథ్యంలో విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్.. ఏసీబీ అధికారులు ప్రత్యేక నిఘా పెట్టినట్లు తెలుస్తోంది. తాజాగా ఏ‘సీ’బీ.. చిక్కిన డీఎం వనపర్తి జిల్లా పౌరసరఫరాల సంస్థ డీఎం జగన్మోహన్ ఏసీబీకి చిక్కిన విషయం తెలిసిందే. కొత్తకోట మండలంలోని ఓ రైస్ మిల్లుకు సంబంధించి సీఎమ్మార్ అనుమతి కోసం రూ.1.70 లక్షలు డిమాండ్ చేశాడు. గురువారం రాత్రి 7.30 గంటల ప్రాంతంలో కలెక్టరేట్లోని తన కార్యాలయం నుంచి బయటకు వెళ్తూ కారులో మిల్లు నిర్వాహకులను ఎక్కించుకుని తొలి విడతగా రూ.50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. ఈ ఘటనతో పౌర సరఫరాల శాఖలో వేళ్లూనుకున్న అవినీతి పర్వం, అధికారుల ధనదాహం మరోసారి వెలుగుచూసినట్లయింది. ముందుగావిజి‘లెన్స్’.. డీఎస్ఓ, అడిషల్ కలెక్టర్పై విచారణతో.. పౌరసరఫరాల సంస్థ డీఎం జగన్మోహన్ను వల పన్ని పట్టుకున్న అవినీతి నిరోధక శాఖ అధికారులు తాజాగా శుక్రవారం డీఎస్ఓ కాశీనాథం, అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ) కీమ్యానాయక్ను విచారించడం సంచలనం సృష్టిస్తోంది. ఉదయం కలెక్టరేట్లోని డీఎం కార్యాలయానికి చేరుకున్న ఏసీబీ అధికారులు వారిని పిలిపించుకున్నారు. సుమారు ఏడు నుంచి పది గంటల వరకు ఇద్దరు జిల్లాస్థాయి అధికారులను విచారించడం ఉమ్మడి జిల్లాలో హాట్ టాపిక్గా మారింది. పౌర సరఫరాల శాఖలో లంచావతారులు కింది స్థాయి నుంచి పైదాకా వాటాల పంపకాలు? రూ.50 వేలతో రెడ్హ్యాండెడ్గా ఏసీబీకి చిక్కిన వనపర్తి డీఎం తాజాగా అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ), డీఎస్ఓలపై విచారణతో కలకలం ఓ వైపు విజిలెన్స్, మరోవైపు అవినీతి నిరోధక శాఖ దాడులు ఉమ్మడి పాలమూరులో అధికారులఉక్కిరిబిక్కిరి -
అందరికీ ఉపాధి కల్పించడమే లక్ష్యం
గద్వాల: అందరికీ ఉపాధిని కల్పించడమే లక్ష్యంగా వీబీజీ రామ్ జీ బిల్లును తీసుకొచ్చినట్లు ఎంపీ డీకే అరుణ అన్నారు. శుక్రవారం ఆమె పట్టణంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. మహాత్మాగాంధీకి, కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులకు ఎలాంటి బంధం లేదని, కేవలం వారు గాంధీ అని పేరు పెట్టుకుని రాజకీయ లబ్ధి పొందుతున్నారని విమర్శించారు. గతంలో మాదిరి నిధుల దుర్వినియోగం, అవినీతి, అక్రమాలకు తావులేకుండా పారదర్శకంగా పథకాన్ని అమలు చేయాలనే సంకల్పంతో బీజేపీ ప్రభుత్వం పథకంలో మార్పులు తీసుకొచ్చిందన్నారు. అదే విధంగా వంద రోజుల పని దినాల నుంచి 125 రోజులకు పెంచినట్లు తెలిపారు. వ్యవసాయ పనులు జరిగే సమయాల్లో కూలీల కొరత లేకుండా 60 రోజులు హాలీడే వెసులుబాటును కల్పించినట్లు పేర్కొన్నారు. ఉమ్మడి పాలమూరుకు గుండె లాంటి జూరాల ప్రాజెక్టు నిర్వహణను గత, ప్రస్తుత ప్రభుత్వాలు గాలి కొదిలేశాయని, దీంతో ప్రాజెక్టు ఆయుషు తగ్గుతుందన్నారు. ప్రాజెక్టు రక్షణ కోసం నిర్మించాల్సిన బ్రిడ్జిని ఆర్అండ్బీ బ్రిడ్జిగా మార్చడం సరైంది కాదని, దీనివల్ల జూరాల డ్యాం కు ప్రమాదం తలెత్తుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని తాను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా స్పందించలేదని దుయ్యబట్టారు. కార్యక్రమంలో నాయకులు రామాంజనేయులు, రాంచంద్రారెడ్డి, బండల వెంకట్రాములు, మిర్జాపురం వెంకటేశ్వర్రెడ్డి, శివారెడ్డి, శ్రీనివాసులు తదతరులు పాల్గొన్నారు. -
సంక్రాంతికి ఆర్టీసీ సన్నద్ధం
● రీజియన్ నుంచి అదనపు బస్సులు ● హైదరాబాద్ నుంచి డిపోల వైపు 430 సర్వీసులు ● నేటినుంచి ప్రారంభం కానున్న రాకపోకలు స్టేషన్ మహబూబ్నగర్: పల్లె సంస్కృతి ప్రతిబింబించే సంక్రాంతి పండుగకు ఎక్కడున్న వారి స్వస్థలాలకు రావడం పరిపాటిగా మారింది. దూర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తున్నవారు, శ్రామికులు ఈ పండుగకు ఇళ్లకు వచ్చి మూడు రోజులు జరిగే పండుగ సంబరాలను ఆస్వాదిస్తారు. అయితే ఈ ఏడాది పండుగను పురస్కరించుకొని ఆర్టీసీ సంస్థ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ప్రయాణికుల సౌకర్యార్థం మహబూబ్నగర్ ఆర్టీసీ రీజియన్ పరిధిలోని 10 డిపోల నుంచి అదనపు బస్సులను నడపనున్నారు. శుక్రవారం నుంచి 13 వరకు హైదరాబాద్ నుంచి రీజియన్లోని పది డిపోలకు 430 బస్సులు నడపనున్నారు. పండుగ తిరుగు ప్రయాణంలో ఈ నెల 17 నుంచి 21 వరకు ఆయా డిపోల నుంచి హైదరాబాద్ వైపు 364 బస్సులను నడపడానికి చర్యలు తీసుకుంటున్నారు. ఉమ్మడి జిల్లాలోని ప్రజలు సంక్రాంతి పండుగకు ఎక్కువ సంఖ్యలో వారి స్వస్థలాలకు వచ్చే అవకాశం ఉండడంతో హైదరాబాద్కు అదనపు సర్వీసులు నడపడానికి అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. అన్ని డిపోలకు హైదరాబాద్ రూట్లో ఎక్కువ ఆదాయం వస్తుండడంతో ఈ రూట్లోనే ఎక్కువగా అదనపు బస్సులు నడపనున్నారు. తిరగనున్న బస్సు సర్వీసులుడిపో అచ్చంపేట 7 11 11 7 11 గద్వాల 7 11 11 7 11 కల్వకుర్తి 7 11 11 7 11 కొల్లాపూర్ 6 10 10 6 10 కోస్గి 2 3 3 2 3 మహబూబ్నగర్ 8 11 11 8 11 నాగర్కర్నూల్ 7 10 10 7 10 నారాయణపేట 7 11 11 7 11 షాద్నగర్ 7 11 11 7 11 వనపర్తి 7 11 11 7 11 తిరుగు ప్రయాణంలో డిపోల నుంచి హైదరాబాద్ వైపు డిపో 17న 18న 19న 20న 21న అచ్చంపేట 7 11 11 7 5 గద్వాల 7 10 10 7 5 కల్వకుర్తి 7 11 11 7 5 కొల్లాపూర్ 5 8 8 5 4 కోస్గి 2 3 3 2 2 మహబూబ్నగర్ 7 10 10 7 5 నాగర్కర్నూల్ 7 10 10 7 5 నారాయణపేట 7 11 11 7 5 షాద్నగర్ 7 11 11 7 5 వనపర్తి 7 11 11 7 5 -
క్రీడలతో శారీరక దృఢత్వం
● బీచుపల్లి పదో బెటాలియన్ సిబ్బంది సేవలు విలువైనవి ● కలెక్టర్ బీఎం సంతోష్ గద్వాల టౌన్/ఎర్రవల్లి: శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతో అవసరమని కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. గురువారం ఎర్రవల్లి మండలంలోని బీచుపల్లి పదో బెటాలియన్ పోలీస్ సిబ్బందికి మూడు రోజులపాటు నిర్వహించిన వార్షిక క్రీడా పోటీల ముగింపు కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా వివిధ కంపెనీల బెటాలియన్ సిబ్బంది కవాతును కలెక్టర్ తిలకించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. పోలీస్ శాఖలో సమర్థవంతంగా పనిచేసేందుకు శారీరకంగా దృఢంగా ఉండటం ప్రధానమని పేర్కొన్నారు. ఏటా నిర్వహించే క్రీడల పోటీల సందర్బంగా కాకుండా ప్రతినిత్యం ఇక్కడ పోలీస్ సిబ్బంది వ్యాయామం, వివిధ క్రీడల్లో సాధన చేస్తూ ఫిట్గా ఉండాలని సూచించారు. విజేతలుగా ఎవరు నిలిచినప్పటికీ పోటీల్లో పాల్గొనడం, క్రీడాస్పూర్తితో ఆడటం ముఖ్యమని తెలియజేశారు. బెటాలియన్ అతిధి గృహం విస్తరణకు కలెక్టర్ నిధుల నుంచి రూ.10లక్షలు ఇవ్వడం జరిగిందని, భవిష్యత్తులోనూ తన వంతుగా సహకారం అందిస్తామనన్నారు. ఎన్నికల నిర్వహణకు, ప్రకృతి వైపరిత్యాలు సంభవించినప్పుడు, బందోబస్తు సమయంలో బెటాలియన్ పోలీసుల సేవలు ఎంతో విలువైనవని కొనియాడారు. మూడు దశాబ్దాలుగా సేవలు : కమాండెంట్ జయరాజు 1995లో ప్రారంభమైన పదో బెటాలియన్ సుమారు మూడు దశాబ్దాల పాటు రాష్ట్రంలో బందోబస్తు, నక్సలిజం నిర్మూలన, పరేడ్స్, తదితర విభాగాల్లో విధులు నిర్వహిస్తుందని కమాండెంట్ జయరాజు అన్నారు. ప్రతి ఏటా సిబ్బందిలో స్నేహభావం పెంచడంతో పాటు శరీర దృఢత్వాన్ని పెంచడం కోసం వార్షిక క్రీడలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వివిధ క్రీడల్లో విజేతలుగా నిలిచిన సిబ్బందికి కలెక్టర్ పతకాలు, ట్రోఫీలు అందజేసి అభినందించారు. కలెక్టర్కు జ్ఞాపిక అందజేసి శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్లు పాణి, నరేందర్రెడ్డి, ఏఓ తాజుద్దీన్, సంక్షేమ అధికారి నర్సింహరాజు, ఇతర అధికారు పాల్గొన్నారు. అంధులు అత్మస్థైర్యంతో ముందుకు సాగాలి అంధులు తమ లోపాన్ని అధికమించి ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలని కలెక్టర్ పేర్కొన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని స్థానిక అంధుల ఆశ్రమ పాఠశాలలో లూయిస్ బ్రెయిలీ జయంతి వేడుకలను నిర్వహించగా.. కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తమ అంధత్వాన్ని శాపంగా భావించకుండా, లూయీస్ బ్రెయిలీని ఆదర్శంగా తీసుకుని రాణించాలని కోరారు. దివ్యాంగుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అంధులు ఎన్నికల్లో ఓటు వేసేందుకు వీలుగా ప్రత్యేక ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లను అందుబాటులోకి తీసుకురావడం జరిగిందన్నారు. యుడీఐడీ కార్డుల మంజూరు చేయడంలో ఉన్న సమస్యలను పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. ఇటీవల మున్సిపల్ వార్డు ఆఫీసర్గా ఉద్యోగం సాధించిన పాఠశాల పూర్వ విద్యార్థి శివకుమార్ను ఘనంగా సన్మానించారు. అనంతరం విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేశారు. అంతకుముందు పాఠశాల ఆవరణలో ఉన్న లూయిస్ బ్రెయిలీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ శాఖ అఽధికారిణి సునంద, డీఈఓ విజయలక్ష్మి, పాఠశాల కార్యదర్శి రంగన్న తదితరులు పాల్గొన్నారు. -
పునఃపరిశీలన
పుర పోరు నేపథ్యంలో ఇటీవల ఓటరు ముసాయిదా విడుదల ఓటరు ముసాయిదా జాబితాపై వచ్చిన ప్రతి అభ్యంతరాన్ని పరిగణలోకి తీసుకుంటున్నాం. ఫిర్యాదుల ఆధారంగా క్షేత్రస్థాయిలో నేరుగా వెళ్లి పరిశీలన చేస్తున్నాం. ఫిర్యాదులో పేర్కొన్న అంశాల సాధ్యాసాధ్యాలను, పొరపాట్లను సవరించి తుది జాబితా విడుదలకు కసరత్తు చేస్తున్నాం. – జానకిరామ్సాగర్, కమిషనర్, గద్వాల గద్వాలటౌన్: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ప్రచురించిన వార్డుల వారీ ఓటరు ముసాయిదా జాబితాపై వచ్చిన అభ్యంతరాలను అధికారులు క్షేత్రస్థాయిలో పునఃపరిశీలించారు. జిల్లాలో గద్వాల, అయిజ, అలంపూర్, వడ్డేపల్లి మున్సిపాలిటీల పరిధిలో ముసాయిదాపై అభ్యంతరాలను స్వీకరించారు. అయితే వీటిపై జిలాల్లో పెద్ద ఎత్తున దుమారం రేగిన విషయం తెలిసిందే. వివిధ వార్డులలో వేర్వేరు కాలనీలకు చెందిన నివాస ఓటర్లను మరో వార్డులోకి పెద్ద సంఖ్యలో కలపడం, ఒకే కాలనీకి చెందిన నివాస ప్రాంతాలను విభజించడంపై వచ్చిన ఫిర్యాదులపై ప్రధానంగా దృష్టి సారించారు. విజ్ఞాపన పత్రంలో పేర్కొన్న అభ్యంతరాలను సవరించేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించారు. వివిధ కాలనీలలో నివాస గృహాల ఓటర్ల సరళి, విస్తరించిన తీరు, సమీపంలోని వార్డులలో కలపడం లేదా తొలగించడం వంటి అంశాలతో పాటు ఫిర్యాదులో పేర్కొన్న అభ్యంతరాల తీవ్రత, వాటి ప్రభావం తదితర అంశాలను పరిశీలించారు. వీటన్నింటిని మదింపు చేసి ఈ నెల 12న తుది జాబితాపై తయారీకి సమాయత్తమవుతున్నారు. అనుకూలతలే ప్రామాణికంగా ఫిర్యాదులు గద్వాల మున్సిపాలిటీలో వార్డుల వారీ ఓటర్ల ముసాయిదా జాబితాపై వచ్చిన అభ్యంతరాల్లో ఎక్కువగా ఆశావహుల అనుకూలతలే ప్రామాణికంగా ఫిర్యాదులు వచ్చాయి. తమకు సంబంధించిన ఓటర్లు ఇతర వార్డులకు వెళ్లడం, వార్డుల్లో కుల సమీకరణలు మారితే రిజర్వేషన్లపై ప్రభావం చూపడం తదితర అంశాల ప్రాతిపదికన నాయకులు విజ్ఞాపనలు అందజేసినట్లు అధికారుల పరిశీలనలో తేటతెల్లమవుతుంది. ఇవి కాక పట్టణంలో ప్రధానంగా 07, 16, 17, 30వ వార్డుల పరిఽధిలో ఓటర్లను గంపగుత్తగా ఇతర వార్డులకు బదలాయించారని ఎక్కువగా అభ్యంతరాలు రావడంతో ప్రతి ఫిర్యాదుపై అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ నిర్వహించారు. ఇంటి నంబరు, ఓటర్లు ఉన్నారా లేదా అనే వాటిపై ఆరా తీశారు. వార్డు సమీపంలో ఉన్న ఓటర్లను దూరంగా ఉన్న మరో వార్డులోకి చేర్చడం వంటి వాటిపై కూడా ప్రధానంగా అభ్యంతరం వ్యక్తమవుతుంది. ఈ అభ్యంతరాలను పరిగణలోకి తీసుకొని వార్డులలో ఉన్న ఓటర్ల వ్యత్యాసంపై కూడా దృష్టి సారించారు. వార్డు లలో ఓటర్ల వ్యత్యాసం హెచ్చు తగ్గులు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఓటర్ల సంఖ్యను సమ న్వయం చేయడానికి కొన్ని ప్రాంతాలను వార్డు మ్యా పింగ్ ద్వారా విభజన చేస్తున్నారు. ప్రధానమైన అభ్య ంతరాలను ఇప్పటికే పరిష్కరించామని, ప్రక్రియ తు ది దశకు చేరుకుందని అధికారులు చెబుతున్నారు. మున్సిపాలిటీలు వార్డులు ఫిర్యాదులు గద్వాల 37 36 అయిజ 20 53 అలంపూర్ 10 00 వడ్డేపల్లి 10 56 ఓటరు ముసాయిదాపై వచ్చిన విజ్ఞాపనల్లో పలు ప్రాంతాలను కలపడం, విడగొట్టడంపై అధికారులు ఆసక్తి చూపే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఒక వార్డులో పెద్ద సంఖ్యలో ఉన్న ఓటర్లను, మరో వార్డులో చేర్చడంపై మరోసారి కసరత్తులు చేసేందుకు అధికారులు సమాయత్తమవుతున్నారు. ఇక్కడే అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఒక వార్డు ఓటర్లను సరిచేసే ప్రయత్నంలో మరో వార్డుకు చిక్కులు వస్తున్నాయి. ముసాయిదాలో జరిగిన లోపాలు, సవరించే అవకాశాలపై అధికారులు సాధ్యాసాధ్యాలను పరిశీలించి ఒక కొలిక్కి తెచ్చారు. వీటిని మరోసారి సమీక్షించి, వార్డుల వారీ ఓటర్లతో పాటు పోలింగ్ కేంద్రాల మ్యాపింగ్ ప్రక్రియకు ప్రయత్నాలు చేస్తున్నారు. మార్పు చేర్పులకు ఓటర్ల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టిన అధికారులు 12న తుది జాబితా తయారీకి సమాయత్తం ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆశావహులు ముసాయిదా జాబితాలో కొంతమేర మార్పులు, చేర్పులు, జరిగే అవకాశం ఉందనే ఊహగానాలు వస్తుండటంతో ఆశావహుల్లో ఆసక్తి నెలకొంది. సరిహద్దులు, ఓటర్ల మార్పు ఏ విధంగా ఉంటుందనే విషయాలపై కూడికలు, తీసివేతలు చేసుకుంటున్నారు. మొత్తానికి అభ్యంతరాల పరిశీలనలో ఎన్ని తిరస్కరిస్తారు..? ఎన్ని పరిష్కరిస్తారనేది చూడాల్సి ఉంది. -
గతంలో రెండు పంటలకు సాగునీరు..
గతంలో అమరచింత ఎత్తిపోతల పథకం ద్వారా రెండు పంటలకు సాగునీరు అందేది. గతేడాది యాసంగిలోనూ నీరు వదలడంతో 5 ఎకరాల్లో వరి సాగు చేశా. ప్రస్తుత యాసంగిలో ఎత్తిపోతలకు నీటి సరఫరా నిలిపినట్లు అధికారులు ప్రకటించడంతో వ్యవసాయ పనులు మానుకున్నాం. పంట సాగుకు దూరమై నష్టపోతున్నాం. – కడియాల నర్సింహులు, రైతు, అమరచింత ఎత్తిపోతల పథకాల ఆయకట్టుకు యాసంగిలో పంటల సాగుకు నీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు ఇరిగేషన్ అధికారులు ప్రకటించారు. సాగునీరు అందించాలని ఏఈలు, ఈఈలకు విన్నవించాం. జూరాలలో నిల్వ నీటిమట్టం తగ్గుతున్నందున వేసవిలో సాగునీరు అందక పంటలు ఎండిపోయే ప్రమాదం ఉందని చెబుతున్నారు. జూరాలలో సమృద్ధిగా నీరు నిలిచేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. – ఆంజనేయులు, ప్రధాన కార్యదర్శి, అమరచింత ఎత్తిపోతల పథకం ప్రభుత్వ ఆదేశాల మేరకు అమరచింత, చంద్రగఢ్ ఎత్తిపోతల పథకాల ఆయకట్టుకు యాస ంగిలో సాగునీరు ఇవ్వలేమని ముందస్తుగా ప్రకటించాం. ఈ విషయాన్ని సంబంధిత ఎత్తిపోతల నిర్వహణ కమిటీ సభ్యులకు వివరించాం. జూరాలలో ప్రస్తుతం 4 టీఎంసీలు మాత్రమే ఉండటంతో వేసవిలో తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తుగా ఎత్తిపోతల పథకాలకు నీటి సరఫరా నిలిపివేశాం. – జగన్మోహన్, ఈఈ, జూరాల ఎడమకాల్వ విభాగం -
కేంద్ర నిధులతోనే మున్సిపాలిటీల అభివృద్ధి
అలంపూర్: బీజేపీతోనే మున్సిపాలిటీల అభివృద్ధి సాధ్యమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామంజనేయులు అన్నారు. అలంపూర్ పట్టణంలో బీజేపీ ముఖ్య కార్యకర్తల సమావేశం గురువారం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ....కేంద్ర ప్రభుత్వ నిధులతో అలంపూర్ మున్సిపాలిటీ రూపురేఖలు మారుస్తామన్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటుదామన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరవేయాల్సిన బాధ్యత కార్యర్తలపై ఉందన్నారు. అలంపూర్ మున్సిపాలిటీలో తాగునీరు, డ్రైనేజీ, రోడ్లు, పారిశుదద్ధ్యం వంటి సమస్యలు ఏళ్ల తరబడి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు తెలిపారు. రాబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో బీజేపీ బలమైన అభ్యర్థులను బరిలో నిలిపి గెలిపించుకుందామన్నారు. ఎంపీ డీకే అరుణ సహకారంతో కేంద్ర ప్రభుత్వం నుంచి నేరుగా నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేసుకుందామన్నారు.సమావేశంలో నాయకులు శరత్, మధుసుధన్ గౌడు, సుధాకర్ యాదవ్, రాజగోపాల్, నాగేశ్వర్ రెడ్డి, నరేష్, మహేష్, వినీత్ కుమార్, మద్దిలేటి, హేమంత్, జగన్మోహన్ రెడ్డి, రవి, వెంకటస్వామి తదితరులు ఉన్నారు. -
క్రాప్ హాలిడే
● యాసంగి సాగుకు రైతులు దూరం ● జూరాల జలాశయంలో తగ్గుతున్న నీటిమట్టం ● గతేడాది అతి కష్టం మీద సరఫరా ●అమరచింత: ప్రియదర్శిని జూరాల జలాశయంలో నిల్వనీటి మట్టం రోజురోజుకు తగ్గుతుండటంతో ప్రాజెక్టుతో పాటు దానిపై ఆధారపడిన ఎత్తిపోతల పథకాల ఆయకట్టుకు యాసంగిలో సాగునీరు అందించలేమని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో అమరచింత, చంద్రగఢ్ ఎత్తిపోతల ఆయకట్టులో యాసంగి సాగుకు బ్రేక్ పడింది. గతేడాది యాసంగిలో అతికష్టం మీద సాగునీటిని పొందిన ఆయకట్టు రైతులు ఈసారి ముందస్తుగానే సాగునీటిని ఇవ్వలేమని ఇరిగేషన్ అధికారులు ప్రకటించడంతో రైతులు తమ వ్యవసాయ పనులు వదులుకున్నారు. యాసంగి సాగుకు నీరు అందితే వరి వేద్దామనుకున్న ఆయకట్టు రైతుల ఆశలు అడియాశలయ్యాయి. గతంతో రెండు పంటలకు సాగునీరు పొందిన రైతులు ఈసారి వానాకాలం పంటకు మాత్రమే నీరందింది. ప్రాజెక్టుకు వరదలు వచ్చినప్పుడు ఒడిసి పట్టుకునేందుకు వీలైనన్ని రిజర్వాయర్లు లేకపోవడంతో ప్రతి ఏటా యాసంగిలో సాగు, తాగునీటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. ప్రస్తుత పాలకులు జూరాలపై మరిన్ని రిజర్వాయర్లు నిర్మించి వరద నీరు కిందకు వెళ్లకుండా ఇక్కడే అడ్డుకట్ట వేస్తే ఆయకట్టుకు సమృద్ధిగా సాగునీరు అందుతుందని రైతులు అభిప్రాయపడుతున్నారు. జూరాల ప్రధాన ఎడమ కాల్వకు అనుసంధానంగా అమరచింత ఎత్తిపోతల పథకం కొనసాగుతోంది. ఈ లిఫ్ట్ ఆయకట్టు 2,400 ఎకరాలు ఉండగా.. మూలమళ్ల, మస్తీపురం, అమరచింత, సింగంపేట, ఖానాపురం, పాంరెడ్డిపల్లి గ్రామాల్లోని 1,090 మంది రైతుల భాగస్వామ్యంతో 23 ఏళ్లుగా సజావుగా కొనసాగుతోంది. ప్రతి ఏటా లిఫ్ట్ ద్వారా 1,200 ఎకరాలకు నీరు అందుతుండగా.. రైతులు పంటలు సాగు చేస్తున్నారు. జూరాల ప్రధాన ఎడమ కాల్వ పరిధిలో 85 వేల ఎకరాల ఆయకట్టు ఉండగా.. ● ప్రస్తుత యాసంగిలో రామన్పాడ్ రిజర్వాయర్ వరకు కేవలం 20 వేల ఎకరాలకు మాత్రమే సాగునీరు అందిస్తామని అధికారులు ప్రకటించారు. దీంతో అమరచింత ఎత్తిపోతలకు నీటి సరఫరా నిలిచిపోవడంతో ఆయకట్టు రైతులు తమ పంటల సాగుకు విరామం ప్రకటించారు. చంద్రగఢ్ ఎత్తిపోతల పథకం జూరాల బ్యాక్వాటర్పై ఆధారపడటంతో అధికారులు యాసంగిలో ముందస్తుగా నీటి సరఫరా నిలిపివేశారు. ఈ పథకం ద్వారా 15 వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు ప్రణాళిక సిద్ధం చేసి పైప్లైన్ పనులు పూర్తి చేశారు. లిఫ్ట్ను చంద్రగఢ్, బెక్కర్పల్లి, నాగిరెడ్డిపల్లి ఎత్తిపోతల పథకాలుగా విభజించి ఒక్కో లిఫ్ట్ ద్వారా 5 వేల ఎకరాల ఆయకట్టుకు నీరందించాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఎత్తిపోతల నిర్వహణ సరిగా లేకపోవడంతో పాటు యంత్రాలు కాలిపోవడంతో కేవలం 5 వేల ఎకరాలు మాత్రమే సాగవుతుంది. ఈ ఆయకట్టుకు కూడా యాసంగి సాగుకు నీటి సరఫరా నిలిచిపోవడంతో వ్యవసాయ బోరుబావుల వద్ద ఉన్న కొంతమేర వరిసాగు చేసుకుంటున్నారు. -
పకడ్బందీగా ఓటరు జాబితా
గద్వాల: మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి వార్డుల వారీగా తుది ఓటరు జాబితాను పకడ్బందీగా రూపొందించాలని కలెక్టర్ బీఎం సంతోష్ కమిషనర్లను ఆదేశించారు. బుధవారం రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణికుముదిని నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్న ఆయన అనంతరం అధికారులపై సమీక్షించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. నాలుగు మున్సిపాలిటీలలో ఓటర్ల ముసాయిదా జాబితాను వార్డుల వారీగా పకడ్బందీగా రూపొందించాలన్నారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తుది ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలని ఆదేశించారు. అక్టోబర్ 1, 2025 నాటి ఓటరు జాబితాను ఆధారంగా చేసుకుని ఎన్నికలు నిర్వహించాలన్నారు. ప్రతిఓటరును వారి నివాస భౌగోళిక పరిధి ఇంటి నంబర్, వార్డు సరిహద్దుల ఆధారంగా సంబంధిత వార్డులోనే నమోదు చేయాలన్నారు. ఒకవార్డులో నివసిస్తూ మరో వార్డులో నమోదైన ఓట్లను గుర్తించి క్షేత్రస్థాయిలో పరిశీలన చేయాలన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో రెండుచోట్ల నమోదైన ఓట్లకు ప్రత్యేకంగా మ్యాపింగ్ నిర్వహించాలన్నారు. ప్లాట్నంబర్ ఆధారంగా నమోదైన ఓటర్లను గుర్తించి మ్యాపింగ్ చేయాలని, పోలింగ్ కేంద్రాలు ఓటర్లకు సులభంగా చేరుకునేలా ఉండాలన్నారు. ప్రతి మున్సిపాలిటీలో నామినేషన్, పోలింగ్, ఓట్ల లెక్కింపు సమయంలో వెబ్కాస్టింగ్ నిర్వహించేలా అవసరమైన చర్యలు తీసుకునేలా ఆదేశించారు. మున్సిపాలిటీలో రాజకీ య పార్టీల అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుని ఓటర్ల జాబితాను పారదర్శకంగా రూపొందించాల ని సూచించారు. ఈవీడియో కాన్ఫరెన్స్లో జడ్పీ డీసీఈవో నాగేంద్రం, మున్సిపల్ కమీషనర్లు పాల్గొన్నారు. -
చేనేతకు పూర్వవైభవం తీసుకొస్తాం
గద్వాల/అలంపూర్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో చేనేత కార్మికులకు పూర్వవైభవం తీసుకొచ్చేందుకు కృషి చేద్దామని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రస్తుతం చేనేత రంగంలో టెక్నాలజీ అనుకూలంగా ఎన్నో రకాల పరికరాలు వచ్చాయని, వాటికి అనుకూలంగా కార్మికులు చీరలను తయారు చేయాలని సూచించారు. అక్రమ వ్యాపారానికి అలవాటుపడ్డ కొందరు గద్వాల పేరు ప్రతిష్టను గద్వాల పేరుమీదుగా చీరలు తయారు చేసి డబ్బు వెనకేసుకుంటున్నట్లు, దీనివల్ల నిజమైన గద్వాల చేనేత కార్మికులకు తీరని అన్యాయం జరుగుతుందన్నారు. చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. అనంతరం ఆయన గద్వాల, గట్టు చేనేత కార్మికులకు ఎన్హెచ్డీపీ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వ క్లస్టర్ అభివృద్ధి పథకం కింద కార్మికులకు పరికరాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో నాయకులు రామలింగేశ్వర్, అక్కల శ్రీనివాసులు, మంత్రి సురేష్, జంబు రామన్గౌడ్, విజయ్, రాజశేఖర్, శ్రీనివాసులు మురళి, నాగిరెడ్డి, శ్రీను, షుకూరు, అన్వర్, భాస్కర్, మొబిన్, సంగాల నర్సింహులు, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. అలంపూర్, రాజోళిలో.. రాజోళి రైతువేదికలో రాజోళి, అలంపూర్ క్లస్టర్లలోని చేనేత కార్మికులకు చేనేత లిఫ్టింగ్ యంత్రాలు ఎమ్మెల్యే విజయుడు అందించారు. మొత్తం 407 మంది చేనేత కార్మికులకు సబ్సిడీపై పరికరాలు అందించారు. చేనేత కార్మికులు ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని, రుణమాఫీ అంశాన్ని అసెంబ్లీలో ప్రస్తావించానని ఈ సందర్భంగా ఎమ్మెల్యే అన్నారు. అర్హులందరికీ సబ్సిడీపై పరికరాలు అందజేస్తామని, నియోజకవర్గంలో 800 మంది కార్మికులకు మిషన్లు అందనున్నట్లు చేనేత జౌళిశాఖ ఏడీ గోవిందయ్య అన్నారు. ప్రస్తుతం 407 మంది కార్మికులకు అందిస్తున్నట్లు తెలిపారు. లిఫ్టింగ్ మిషన్తో చేనేత కార్మికులు బరువైన జాక్వార్డులను కాళ్లతో తొక్కాల్సిన పని ఉండదన్నారు. కార్యక్రమంలో ఏడీఓ ఉపేంద్ర, క్లస్టర్ సీడీఈలు శివమణి, సాకేత్, చేనేత సహకార సంఘం ఇన్చార్జి పరన్స్ తదితరులు పాల్గొన్నారు. -
అర్హులకు సబ్సిడీపై చేనేత యంత్రాలు
అలంపూర్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అర్హులైన చేనేత కార్మికులకు చేనేత లిఫ్టింగ్ యంత్రాలు అందిస్తున్నట్లు ఎమ్మెల్యే విజయుడు అన్నారు. రాజోళి మండల కేంద్రంలోని రైతువేదికలో రాజోళి, అలంపూర్ క్లస్టర్లలోని చేనేత కార్మికులకు చేనేత సబ్సిడీ పనిముట్ల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జాతీయ చేనేత అభివృద్ధి పథకం ద్వారా అలంపూర్, రాజోలి క్లస్టర్లలో చేనేత కార్మికులకు సబ్సిడీ పనిముట్లను ఎమ్మెల్యే విజయుడు అందజేశారు. క్లస్టర్–1లో 212 మందికి, క్లస్టర్– 2లో 195 మందికి మొత్తం 407 మంది చేనేత కార్మికులకు సబ్సిడీ పనిముట్లను అందజేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. చేనేత కార్మికులు ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. చేనేత కార్మికులు ఏళ్ల తరబడిగా ఎదురు చూస్తున్న రుణమాఫీ అంశాన్ని అసెంబ్లీలో ప్రస్తావించినట్లు తెలిపారు. చేనేత జౌళిశాఖ ఏడీ గోవిందయ్య మాట్లాడుతూ.. అర్హులందరికీ సబ్సిడీ పనిముట్లు అందజేస్తామన్నారు. నియోజకవర్గంలో 800 మంది కార్మికులకు మిషన్లు అందనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం 407 మంది కార్మికులకు సబ్సిడీ మిషన్లు అందిస్తున్నట్లు తెలిపారు. లిఫ్టింగ్ మిషన్తో చేనేత కార్మికులు బరువైన జాక్వార్డులను కాళ్లతో తొక్కాల్సిన పని ఉండదన్నారు. చేనేత కార్మికులకు రుణమాఫీ నిధులు 50 శాతం వచ్చిట్లు తెలిపారు. చేనేత భరోసా పథకం ఈ నెలలో అమలవుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఏడీఓ ఉపేంద్ర, క్లస్టర్ సీడీఈలు శివమణి, సాకేత్, చేనేత సహకార సంఘం ఇన్చార్జి పరన్స్ తదితరులు పాల్గొన్నారు. -
డయాలస్ట్రెస్!
పాలమూరు: రోజురోజుకు మూత్రపిండ సంబంధిత వ్యాధులు విస్తరిస్తున్నాయి. ఏటా పదుల సంఖ్యలో బాధితులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఉమ్మడి జిల్లాలో నెలకొన్న విభిన్న పరిస్థితులు, అలవాట్లు, భూగర్భజలాలు కలుషితం కావడం వంటివి కూడా బాధితుల పెరుగుదలకు కారణమవుతున్నాయి. గతేడాది 7,270 మందికి డయాలసిస్ చేయగా.. ప్రస్తుతం ప్రభుత్వ సెంటర్లలో 550 మంది, ప్రైవేటులో మరో 350 మందికి పైగా బాధితులు డయాలసిస్ చేయించుకుంటున్నారు. ప్రధానంగా మక్తల్, నారాయణపేట, వనపర్తి ప్రాంతాలతో పాటు భూత్పూర్ మండలంలోని గ్రామాల్లో కిడ్నీ సమస్యతో బాధపడుతున్న బాధితులు అధికమవుతున్నారు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో 12 సెంటర్లు ఉండగా.. కొత్తగా మళ్లీ ప్రతి 20 కి.మీ. పరిధిలో ఒక డయాలసిస్ సెంటర్ ఏర్పాటుకు ప్రభుత్వం సుముఖంగా ఉండటంతో.. ఉమ్మడి జిల్లా నుంచి 20 సెంటర్లు నూతనంగా ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు పంపించారు. రెండు నెలల్లో గద్వాలలో అత్యధికంగా డయాలసిస్ చేయించుకున్న బాధితులున్నారు. ఉమ్మడి జిల్లాలో గద్వాల సెంటర్లో 12 మిషన్లు ఉండగా.. నవంబర్లో 963, డిసెంబర్లో 976 మందికి డయాలసిస్ సేవలు అందించారు. కాగా.. అధునాత కేంద్రాలున్నా.. పాలమూరులో రోగులకు సలహాలు, సూచనలు అందించేందుకు ఒక్క నెఫ్రాలజిస్టు అందుబాటులో లేకపోవడం గమనార్హం. ప్రొస్టేట్ గ్రంథి ఉబ్బడం. ఇది 50 ఏళ్ల వయసు పైబడిన వారిలో ఎక్కువగా ఉంటుంది. మూత్ర విసర్జన దారిలో ఏమైనా అడ్డంకులు ఏర్పడితే ప్రొస్టేట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ. రసాయన అవశేషాలున్న ఆహార పదార్థాలు తినడం, పొగాకు, ధూమపానం, గుట్కా వినియోగం చేయడం కలుషిత నీటిని తాగడంతో మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడి సమస్యగా మారుతుంది. నాటువైద్యంతో సైతం కిడ్నీల్లో రాళ్లు ఏర్పడతాయి. ప్రతి ఒక్కరూ బీపీ, షుగర్ పరీక్షలు ప్రతి మూడు నెలలకోసారి చేసుకోవాలి. సిరామ్ పరీక్షతో కిడ్నీ పనితీరు తెలుస్తుంది. ప్రస్తుతం చాలా మంది సరైన సమయంలో పరీక్షలు చేసుకోకపోవడం వల్ల బాధితులు పెరుగుతున్నారు. నాటువైద్యం ఆశ్రయిస్తే భవిష్యత్లో మరిన్ని ఇబ్బందులు వస్తాయి. ప్రస్తుతం బాధితులకు వారంలో మూడుసార్లు డయాలసిస్ చేస్తున్నాం. మహబూబ్నగర్లో 15, ఆత్మకూర్ 10, అలంపూర్ 15, బాలానగర్ 20, గద్వాల 10, నాగర్కర్నూల్10, నారాయణపేట 20, కొల్లాపూర్లో 15మందికి డయాలసిస్ చేయడానికి ఖాళీలు ఉన్నాయి. బాధితులు సద్వినియోగం చేసుకోవాలి. – సిబాతుల్లా, క్లస్టర్ మేనేజర్ ఉమ్మడి జిల్లా వనపర్తి, గద్వాల, మహబూబ్నగర్ జిల్లాల్లో అధికం అధునాతన పరికరాలున్నా.. వైద్యులు కరువు గతేడాది 7,270 మందికి డయాలసిస్.. ప్రస్తుతం 900 మందికి చికిత్స -
పశుసంపదతోనే వ్యవసాయాభివృద్ధి
గద్వాల వ్యవసాయం: పశుసంపద సమృద్ధిగా ఉంటేనే వ్యవసాయం అభివృద్ధి చెందుతుందని ఉమ్మడి జిల్లా పశుగణాభివృధ్ది సంస్థ అధికారి మధుసూదన్గౌడ్ అన్నారు. బుధవారం గద్వాల మండలం బీరెల్లీ గ్రామంలో పశుగణాభివృధి సంస్థ, జిల్లా పశుసంవర్ధకశాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత పశు గర్భకోశ వ్యాధి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పశుసంపద వల్ల రైతుల ఆర్థిక స్థితి మెరుగవుతుందని, చూడి కట్టని, సకాలంలో ఎదకు రాని పశువులకు సరైన వైద్యం అందించాలని రైతులకు సూచించారు. పశుగణాభివృధ్ది సంస్థ ఆద్వర్యంలో గ్రామాల్లో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామని వివరించారు. జిల్లా పశుసంవర్ధకశాఖాధికారి శివానంద్ మాట్లాడుతూ.. పాల దిగుబడి పెంపునకు పాడి రైతులు నిత్యం సరైన పోషణ అందించాలని సూచించారు. సరిపడా పచ్చిమేత, ధాన్యపు జాతి జొన్న, మొక్కజొన్న గడ్డి రకాలు, కాయ జాతి అలసందలు, బలమైన దినుసులతో సమీకృత దాణ, లవణ మిశ్రమాన్ని తయారు చేసి పశువులకు అందించాలన్నారు. చూడి పశువులకు తప్పకుండా గాలికుంటు నివారణ టీకాలు వేయించాలన్నారు. రాయితీపై గడ్డి విత్తనాలు అందిస్తామని తెలిపారు. శిబిరంలో భాగంగా 12 ఆవులు, 33 గేదెలకు గర్భకోశ పరీక్షలు, 15 పశువులకు సాధారణ చికిత్సలు నిర్వహించి, మందులు అందించారు. కార్యక్రమంలో సర్పంచ్ కవిత రాధాకృష్ణారెడ్డి, మాజీ జడ్పీ వైస్ చైర్మన్ సరోజమ్మ రమేష్నాయుడు, యుఆర్ రమేష్, వెంకటేశ్వర్లు, అర్పిత, శంకరయ్య, వెంకట్రాజు, ప్రియాంక, నవీన్చంద్ర పాల్గొన్నారు. -
కదులుతున్న డొంక
రెండు హత్యలపై పూర్తి స్థాయి విచారణ ● పాత కేసులను తిరగతోడుతున్న పోలీసులు ● మిల్లు వీరన్నపై బిగుస్తున్న ఊచ్చు ● ఒక్కొక్కటిగా వెలుగులోకి నేర చరిత్ర –8లో uమాజీ సర్పంచ్ భీమరాయుడును సుపారీ గ్యాంగ్చే హత్య చేయించినట్లు నిందితుడు నేరం అంగీకరించాడు. ఈ కేసులో మిల్లు వీరన్నతో పాటు మరికొందరు ఉన్నారు. కస్టడీలో మరో రెండు హత్యలు చేయించినట్లు నిందితుడు పేర్కొన్నాడు. ఈ కేసులపై పూర్తి స్థాయిలో విచారణ చేపడతాం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గట్టు, కర్ణాటకలో నమోదైన కేసులపై పూర్తి స్థాయిలో వివరాలు సేకరిస్తాం. నేరం చేసిన నిందితులు ఎవరైన సరే శిక్ష నుంచి తప్పించుకోలేరు. – శ్రీను, సీఐ గద్వాల గద్వాల క్రైం: కేటీదొడ్డి మండలం నందిన్నె మాజీ సర్పంచ్ భీమ రాయుడు హత్య కేసులో జిల్లా పోలీసుశాఖ విచారణ చేపట్టి సుపారీ గ్యాంగ్ ముఠా సభ్యులను కటాకటాల్లోకి పంపారు. అయితే మాజీ సర్పంచ్ను హత్య చేయించేందుకు మిల్లు వీరన్న రూ.25 లక్షలు సుపారీ ఇవ్వడంతో.. బొలెరో వాహనంతో ఢీకొట్టి హత్య చేశారనే విషయం బహిర్గతం అయ్యింది. అయితే, కోర్టు అనుమతితో మిల్లు వీరన్నను మరోసారి కస్టడీలోకి తీసుకొని పోలీసులు విచారించగా.. మరో రెండు హత్య చేయించినట్లు వెల్లడించడంతో వాటిపై పోలీసులు అన్వేషణ చేపట్టారు. 2006 గట్టు మండలంలో, 2014లో కర్ణాటక రాష్ట్రం ఈడుపునూర్ పోలీసు స్టేషన్లో కేసులు నమోదడంతో అధికారులు పాత కేసులను తిరగదోస్తున్నారు. ఇన్నాళ్లు వ్యాపారం, రాజకీయం చేస్తున్నట్లు కనిపించిన ఇతను.. ఎవరికీ తెలియనీయకుండా నేరచరిత్రను కొనసాగిస్తున్నట్లు తాజా హత్యలతో బయటపడింది. పాత కేసులపై ఆరా.. 2006లో ఎర్రప్ప, 2014లో తాయప్పను హత్య చేసి తప్పించుకున్నాడు. ఇదే క్రమంలో మాజీ సర్పంచ్ హత్య కేసు నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించినా.. ఎట్టకేలకు దొరికాడు. ఈ క్రమంలో పైరెండు పాత కేసులపై ఇప్పటికే ఓ ప్రత్యేక బృందం విచారణ చేపట్టింది. 2006లో నమోదైన కేసు ఇక్కడి జిల్లాలోని గట్టు పోలీసు స్టేషన్ కావడంతో అప్పటి ఎఫ్ఐఆర్, కోర్టులో దాఖలు చేసిన చార్జ్షీట్, కేసులోని నిందితులు, సాక్షుల వివరాలను సేకరించే పనిలో పడ్డారు. మరోవైపు అప్పటి విచారణ అధికారులు అనుసరించిన అంశాలపై ఆరా తీస్తున్నట్లు తెలుస్తుంది. ఇక్కడి జిల్లాలో కేసు నమోదైన క్రమంలో మిల్లు వీరన్న ప్రమేయాన్ని గుర్తించడంలో అధికారులు నిర్లక్ష్యం వహించారా.. లేక రాజకీయ ఒత్తిళ్లతో వదిలేశారా అనే కోణంలో విచారణ చేపడుతున్నట్లు సమాచారం. మరోవైపు 2014లో తాయప్పను కారులోనే హత్య చేసి మృతదేహాన్ని కర్ణాటక రాష్ట్రం ఈడుపునూర్ పోలీసు స్టేషన్ సమీపంలో రోడ్డు ప్రమాదంగా చీత్రికరించి అక్కడి పోలీసులను తప్పుదోవ పట్టించాడు. ఈ కేసు కర్ణాటకలో నమోదు కావడంతో అక్కడి పోలీసులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. ఈడుపునూర్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్, చార్జ్షీట్, రోడ్డు ప్రమాదం చేసిన క్రమంలో ఏ వాహనం ఇలా అనేక ప్రశ్నలతో పోలీసులు ఆరా తీస్తున్నారు. మాజీ సర్పంచ్ హత్య కేసులో మిల్లు వీరన్న ఏ–1గా ఉన్నట్లు పోలీసులు ధృవీకరించారు. హత్య చేయించిన విధానం, సీసీ ఫుటెజీలు, కాల్ డేటా, సుపారీ గ్యాంగ్కు ఇచ్చిన నగదు, తప్పించుకునేందుకు వినియోగించిన వాహనాలు, ఇద్దరి మధ్య వైర్యం, రాజకీయ మనస్పర్థాలు తదితర నివేదికలు సేకరించారు. తాజాగా రెండు హత్యల విషయం తెలియడంతో దానికి సంబంధించి ఆధా రాలు సేకరించే పనిలో పడ్డారు. మొత్తంగా కేసులో వీరన్న చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. హ త్యకు సహకరించిన నిందితులకు శిక్ష పడే విధంగా పోలీసులు తగు చర్యలు తీసుకుంటున్నారు. -
సమాజంలో భాగస్వాములు కావాలి
గద్వాల(ధరూరు): ఉపాధ్యాయులు సమాజంలో భాగస్వాములు కావాలని డీఈఓ విజయలక్ష్మి అన్నారు. బుధవారం మండల పరిధిలోని జాంపల్లి గ్రామంలో పాఠశాల కాంపౌండ్ వాల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆమె ముఖ్య అఽథితిగా హాజరై మాట్లాడారు. సొంత నిధులతో ప్రహరీ నిర్మించిన పాఠశాల హెచ్ఎం రేవతిని అందరూ ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ధరూరులో పనిచేసిన సందర్భంలోనూ ఎస్సీ కమ్యూనిటీ హాల్కు మరమ్మతు చేయించడంతో పాటు ప్రాథమిక పాఠశాలకు ప్రహరీ నిర్మించినట్లు తెలిపారు. ఇలాంటి మరెన్నో సేవా కార్యక్రమాలు చేయాలని కోరారు. అందరూ ఉపాధ్యాయులు ఇలాంటి సేవా కార్యక్రమాల్లో ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నారు. చేతనైనంత సహాయం చేస్తే ఎందరికో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో డీసీఈబీ సెక్రటరీ ప్రతాప్రెడ్డి, మాజీ జెడ్పీటీసీ పద్మా వెంకటేశ్వరరెడ్డి, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ధాన్యం డబ్బులు చెల్లించాలి గద్వాల: ఖరీఫ్ 2025–26 ధాన్యానికి సంబంధించిన నగదు వెంటనే రైతుల ఖాతాల్లో జమ అయ్యేలా చూడాలని పౌరసరఫరాల కమిషనర్ సీఫ్టెన్ రవీంద్ర ఆదేశించారు. బుధవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా.. అదనపు కలెక్టర్ వి.లక్ష్మీనారాయణ, డీఎస్వో స్వామికుమార్, డీఎం విమల తదితరులు పాల్గొన్నారు. వేరుశనగ క్వింటా రూ.8,500 గద్వాల వ్యవసాయం: గద్వాల మార్కెట్ యార్డుకు బుధవారం 391 క్వింటాళ్ల వేరుశనగ వచ్చింది. గరిష్టం రూ.8500, కనిష్టం రూ.5080, సరాసరి రూ.6810 ధరలు లభించాయి. అలాగే, 3 క్వింటాళ్ల ఆముదాలు రాగా గరిష్టం, కనిష్టం, సరాసరి రూ.5630 ధర పలికింది. 187 క్వింటాళ్ల కంది రాగా, గరిష్టం రూ.6879, కనిష్టం రూ.1859, సరాసరి రూ.6 869 ధరలు వచ్చాయి. 12 క్వింటాళ్ల వరి (సోన ) రాగా గరిష్టం రూ. 2187, కనిష్టం రూ. 206 1, సరాసరి రూ. 2187 ధరలు లభించాయి. -
పాలమూరును ఎడారి చేసేందుకు కుట్ర
● 90 శాతం పూర్తయిన ప్రాజెక్టుపై నిందలా ● జూరాల నుంచి కొడంగల్కు నీటి పంపింగ్ ఎలా సాధ్యమవుతుంది ● సీఎం, మంత్రులకు ‘పాలమూరుశ్రీపై కనీస అవగాహన లేదు ● ఉమ్మడి జిల్లాలోని ప్రాజెక్టుల సందర్శనలో మాజీ మంత్రుల ధ్వజం అమరచింత/ కొల్లాపూర్/ కొల్లాపూర్ రూరల్: కేవలం 9 టీఎంసీల సామర్థ్యం గల జూరాల నుంచి కొడంగల్, పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతలకు కృష్ణా నీటిని తరలించి పాలమూరును ఎడారిగా మార్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పన్నుతుందని మాజీ మంత్రులు శ్రీనివాస్గౌడ్, సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, లక్ష్మారెడ్డి అన్నారు. బీఆర్ఎస్ జలపోరులో భాగంగా జూరాల, పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలను మంగళవారం ఉమ్మడి జిల్లాలోని బీఆర్ఎస్ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సందర్శించారు. ముందుగా జూరాల వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. పాలమూరు ప్రాజెక్టులపై అసెంబ్లీలో సీఎం రేవంత్రెడ్డి, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ పాలనలో పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతలు ముందుకు సాగలేదని విమర్శించడం సరికాదన్నారు. జూరాలలో నీటి నిల్వలను కాపాడుకునే ప్రయత్నం చేయలేని సీఎం రైతులు, ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే ఈ ప్రచారం తెరపైకి తెచ్చారన్నారు. వేసవి రాక ముందే జూరాలలో నీటి నిల్వలు అడుగంటాయని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. జూరాల ప్రాజెక్టు ద్వారా ఆయకట్టుకు రెండు పంటలకు సాగునీరు ఇవ్వలేక క్రాప్ హాలీడే ప్రకటించడమే ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనం అన్నారు. కేవలం 9 టీఎంసీల సామర్థ్యం కలిగిన జూరాలను కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా మాజీ సీఎం కేసీఆర్ పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టుకు శ్రీశైలం నుంచి తరలించేలా పనులు ప్రారంభించి 90 శాతం పూర్తిచేశారని చెప్పారు. ప్రస్తుతం మిగులు పనులు చేస్తే ఆంధ్ర రాష్ట్రానికి నీటి కొరత ఉంటుందనే సాకుతో ఇక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీశైలం నుంచి నీటి తరలింపు దండగని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. పాలమూరు జిల్లా ఉమ్మడి ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలోనే అత్యంత నష్టపోయిందని అలాంటి జిల్లాలో సాగునీటితోపాటు పెండింగ్ ప్రాజెక్టులను పూర్తిచేసి 7 లక్షల ఎకరాలకు సాగునీరు అందించిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు. కృష్ణానది జలాలు వందశాతం వాడుకునే హక్కు పాలమూరుకే ఉందన్నారు. -
క్రీడలతో ఆరోగ్యకరమైన జీవనశైలి
ఎర్రవల్లి: క్రీడలతో పోలీస్ సిబ్బందికి ఆరోగ్యకరమైన జీవనశైలి అలవడుతుందని ఎస్పీ తోట శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని పదో బెటాలియన్లో కమాండెంట్ జయరాజు ఆధ్వర్యంలో వార్షిక స్పోర్ట్స్ మీట్– 2026 నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎస్పీ కమాండెంట్తో కలిసి జెండా ఊపి క్రీడలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసులు, క్రీడలు వేర్వేరు కాదని, మన జీవితంలో భాగమన్నారు. క్రీడల వల్ల కలిగే శారీరక దృఢత్వం, మానసిక స్థైర్యం పోలీస్ జీవితానికి అత్యంత అవసరమని తెలిపారు. క్రీడల వల్ల సిబ్బందిలో క్రమశిక్షణ, సమన్వయం ఏర్పడుతుందని పేర్కొన్నారు. సిబ్బందిలో స్నేహాభావం పెరుగుతుంది.. స్పోర్ట్స్ మీట్ ద్వారా సిబ్బందిలో స్నేహాభావం పెరుగుతుందని కమాండెంట్ జయరాజు అన్నారు. పోటీలో మొత్తం 250 మంది సిబ్బంది పాల్గొన్నారన్నారు. ఇందులో 100 మీటర్లు, 400 మీటర్లు, 4.400 రిలే, లాంగ్ జంప్, హైజంప్, షాట్పుట్, జావలిన్త్రో, 5 కే రన్, క్రికెట్ వంటి క్రీడలను నిర్వహిస్తున్నామని తెలిపారు. పటాలం సిబ్బంది ఆయా క్రీడల్లో పాల్గొని తమ ప్రతిభను కనబర్చాలని సూచించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్లు నరేందర్రెడ్డి, పాణి, సీఐ రవిబాబు, అధికారులు, సిబ్బంది, క్రీడాకారులు పాల్గొన్నారు. -
తల్లిదండ్రులు గర్వపడేలా ఎదగాలి
అలంపూర్: ప్రభుత్వ కళాశాలల విద్యార్థులు తల్లిదండ్రులు గర్వపడేలా ఎదగాలని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి హృదయరాజు అన్నారు. మంగళవారం అలంపూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఆయన ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా బోటనీ ల్యాబ్ను పరిశీలించారు. ల్యాబ్ సామగ్రి అందుబాటులో ఉంచుకోవాలని సంబంధిత అధ్యాపకుడికి ఆయన సూచించారు. అనంతరం విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చదువు మనిషి జీవితంలో విలువ పెంచుతుందన్నారు. విద్యార్థులు కొత్త సంవత్సరంలో పాత అలవాట్లకు స్వస్తి పలికి.. భవిష్యత్ను ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ చదువును అశ్రద్ధ చేయొద్దన్నారు. అన్ని సబ్జెక్టుల్లో మంచి ఫలితాలు సాధించాలని తెలిపారు. స్వీపర్ల వేతనాలు విడుదల చేయాలి గద్వాల: ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న స్వీపర్లకు పెండింగ్లో ఉన్న మూడు నెలలు వేతనాలు వెంటనే విడుదల చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఉప్పేరు నర్సింహ డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం కలెక్టరేట్లో అడిషనల్ కలెక్టర్ నర్సింగ్రావుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వీపర్ల వేతనాలకు సంబంధించిన నిధులు మంజూరైనప్పటికీ.. వారి ఖాతాల్లో జమ చేయడం లేదని తెలిపారు. ఇప్పటికై నా స్వీపర్లకు పెండింగ్ వేతనాలు అందించాలని కోరారు. కార్యక్రమంలో రఘు, మురళి, మల్లమ్మ పాల్గొన్నారు. వ్యాధి నిరోధక టీకాలు తప్పనిసరి ఎర్రవల్లి: పశువులకు సరైన సమయంలో వ్యాధి నిరోధక టీకాలు వేయించాలని జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి డా.శివానందస్వామి అన్నారు. మంగళవారం మండలంలోని రాజశ్రీ గార్లపాడులో పశువైద్య శిబిరం ఏర్పాటుచేసి.. ఎదకు రాని పాడి పశువులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. గర్భకోశ వ్యాధుల నివారణ కోసం టీకాలు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పశువులు ఆరోగ్యంగా ఉంటేనే సకాలంలో ఎదకు వచ్చి చూడి కడతాయన్నారు. దీనివల్ల పాడి రైతులు ప్రతి ఏటా ఒక దూడను పొంది ఆర్థికంగా లాభం పొందుతారని సూచించారు. అనంతరం చికిత్స అందించిన 11 గేదెలు, 6 ఆవుల పెంపకందారులకు ఉచితంగా మందులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో పశువైద్యులు భువనేశ్వరి, వినయ్, సర్పంచ్ తిమ్మారెడ్డి పాల్గొన్నారు. -
ప్రకృతి సేద్యం దిశగా..
సేంద్రియ వ్యవసాయానికి కేంద్రం ప్రోత్సాహం గద్వాలవ్యవసాయం: సుస్థిర వ్యవసాయం దిశగా అడుగులు పడేలా కేంద్రం చర్యలు చేపట్టింది. అందులో భాగంగా నేషనల్ మిషన్ ఆన్ న్యాచురల్ ఫార్మింగ్ (ఎన్ఎంఎన్ఎఫ్) ద్వారా ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహిస్తోంది. రసాయనిక ఎరువులు, పురుగు మందులు ఏమాత్రం వినియోగించకుండా ప్రకృతి సిద్ధమైన బీజామృతం, జీవామృతం, ఆచ్చాదన తదితర పద్ధతులతో ప్రకృతి వ్యవసాయం చేసేందుకు గాను జిల్లాలో 40 మంది కృషి సఖిలను వ్యవసాయశాఖ నియమించింది. వీరికి ప్రకృతి వ్యవసాయంపై పూర్తి శిక్షణ అందించి.. ఎంపిక చేసిన క్లస్టర్లలో పూర్తిగా ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో 2,500 ఎకరాల్లో పంటలు పండించాలని ప్రణాళికలు రూపొందించింది. ప్రకృతి వ్యవసాయంతో నేల ఆరోగ్యంగా ఉండటంతో పాటు భూ సారం పెరుగుతుంది. పెట్టుబడులు సైతం తక్కువ అవుతాయి. పంట ఉత్పత్తులు నాణ్యతగా ఉండి.. ఆరోగ్యకరమైన ఆహారం లభిస్తుంది. పండించిన పంట ఉత్పత్తులతో రైతులకు మంచి ధరలు లభిస్తాయి. గాలి, నీరు, భూమి కలుషితం కాకుండా పర్యావరణం పరిరక్షించబడుతుంది. మండలం క్లస్టర్లు ఎకరాలు అలంపూర్ 2 250 ధరూర్ 2 250 గద్వాల 2 250 గట్టు 1 125 అయిజ 2 250 కేటీదొడ్డి 1 125 ఇటిక్యాల 1 125 ఎర్రవల్లి 2 250 మల్దకల్ 2 250 మానవపాడు 2 250 రాజోళి 1 125 ఉండవెల్లి 1 125 వడ్డేపల్లి 1 125 జిల్లాలో మండలాల వారీగా ప్రకృతి సేద్యం ఇలా.. జిల్లాలో మొదటి విడతగా 2,500 ఎకరాల్లో సాగు లక్ష్యం ఎన్ఎంఎన్ఎఫ్ ద్వారా 40 మంది కృషి సఖిల నియామకం పూర్తి శిక్షణ అందిస్తున్న వ్యవసాయ శాస్త్రవేత్తలు -
యూరియా కొరత రానివ్వొద్దు
గద్వాల(ధరూరు): రబీలో రైతులకు ఎలాంటి యూరియా కొరత రాకుండా చూడాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సక్రియనాయక్ అన్నారు. మంగళవారం ఆయన ధరూరు మండల కేంద్రంలోని ఫర్టిలైజర్ అండ్ పెస్టిసైడ్స్ దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టాక్ రిజిష్టర్లను పరిశీలించారు. ప్రతి దుకాణం వద్ద విధిగా స్టాక్బోర్డుతో పాటు ధరల పట్టికను ఏర్పాటు చే యాలన్నారు. యూరియా కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. రైతులకు ఎ లాంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలన్నారు. అధిక ధరలకు ఎరువులు విక్రయిస్తే చర్యలు తప్ప వని హెచ్చరించారు. అంతకు ముందు రైతువేదికలో వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమంలో రైతులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ రైతు జయరామాచారిని సన్మానించారు. ప్రతి రైతు సేంద్రీయ సాగువైపు మొగ్గు చూపాలన్నారు. కార్యక్రమంలో ఏఓ శ్రీలత, ఏఈఓ పాల్గొన్నారు. -
పారదర్శకంగా ఓటరు జాబితా రూపకల్పన
గద్వాల: మున్సిపాలిటీల తుది ఓటరు జాబితాను పూర్తి పారదర్శకంగా రూపొందిస్తామని కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. మంగళవారం ఐడీఓసీ కాన్ఫరెన్స్ హాల్లో ముసాయిదా ఓటరు జాబితాపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించగా.. తమ అభ్యంతరాలు, ఫిర్యాదులను కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని గద్వాల, అయిజ, వడ్డేపల్లి, అలంపూర్ మున్సిపాలిటీల్లో 2025 డిసెంబర్ 1 నాటి ఓటరు జాబితాను ఆధారంగా చేసుకుని ఎన్నికల ప్రక్రియ నిర్వహించనున్నట్లు తెలిపారు. ముసాయిదా ఓటరు జాబితాపై వచ్చిన అభ్యంతరాలను క్షేత్రస్ధాయిలో పరిశీలించి.. పూర్తి పారదర్శకతతో తుది జాబితాను రూపొందిస్తామన్నారు. ఒటరు జాబితా సమరణలో భాగంగా ఓటర్లను ఇంటింటి సర్వే ద్వారా పరిశీలించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ నర్సింగ్రావు, తహసీల్దార్ మల్లికార్జున్, మున్సిపల్ కమిషనర్లు ఉన్నారు. భూ సమస్యలను పరిష్కరించాలి కేటీదొడ్డి: భూ సమస్యలపై అందిన దరఖాస్తులపై క్షేత్రస్ధాయిలో సమగ్రంగా విచారించి పరిష్కరించాలని కలెక్టర్ సంతోష్ అన్నారు. కేటీదొడ్డి మండలం పాగుంట శివారులోని 103 సర్వే నంబర్లో భూ భారతి కింద పట్టా భూములు నిషేధిత జాబితాలో ఉన్నాయని.. సమస్య పరిష్కరించాలని దరఖాస్తు చేసుకున్న స్ధానిక రైతులను కలెక్టర్ స్వయంగా కలుసుకొని సమస్యలను తెలుసుకున్నారు. వ్యవసాయ పొలాలకు వెళ్లేందుకు దారి సరిగ్గా లేకపోయినా బైక్పై వెళ్లి క్షేత్రస్ధాయిలో పరిస్ధితిని పరిశీలించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ సంబంధిత భూముల పూర్వ రికార్డులు, సర్వే వివరాలు, డాక్యుమెంట్లను సమగ్రంగా కలెక్టర్కు వివరించారు. అనంతరం కేటీదొడ్డిలోని 67 సర్వే నంబర్ ప్రభుత్వ భూమిని కలెక్టర్ పరిశీలించారు. దరఖాస్తులో ఉన్న మిస్సింగ్ సర్వే నంబర్లను క్షేత్రస్థాయిలో స్వయంగా తనిఖీ చేశారు. అదే విధంగా పాగుంట ప్రాధమికోన్నత పాఠశాలను కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించి.. విద్యార్థుల హాజరు, బోధనా విధానం, సౌకర్యాలు తదితర వివరాలను తెలుసుకున్నారు. విద్యార్థులకు పలు ప్రశ్నలు వేసి అభ్యసన సామర్థ్యాన్ని తెలుసుకున్నారు. మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని సిబ్బందికి సూ చించారు. అనంతరం పింఛన్ల పంపిణీని పరిశీలించారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ నర్సింగ్రావు, తహసీల్దార్ హరికృష్ణ, హెచ్ఎం రవి ఉన్నారు. -
గ్రామాల్లో క్రీడల సందడి
● సీఎం కప్ కోసం సన్నాహాలు ● గ్రామ, మండల, అసెంబ్లీ, జిల్లా, రాష్ట్రస్థాయి వరకు పోటీలు ● 17 నుంచి వచ్చేనెల 26 వరకు సీఎం కప్ క్రీడలు ఔత్సాహికులకు మంచి అవకాశం సీఎం కప్ క్రీడలు ఔత్సాహిక క్రీడాకారులకు మంచి అవకాశం. గ్రామీణ క్రీడాకారుల్లో దాగి ఉన్న ప్రతిభ బయటికి వస్తుంది. గ్రామస్థాయి నుంచి ప్రపంచస్థాయి వరకు క్రీడాకారులను తీర్చిదిద్దడమే సీఎం కప్ ప్రధాన ఉద్దేశం. అధికారులు, క్రీడాసంఘాలు, పీడీ, పీఈటీలు, సీనియర్ క్రీడాకారుల సహకారంతో జిల్లాలో సీఎం కప్ పోటీలను విజయవంతంగా నిర్వహిస్తాం. ఆసక్తిగల క్రీడాకారులు htt ps://sats. telangana.govi.in/cmcup వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. – ఎస్.శ్రీనివాస్, డీవైఎస్ఓ, మహబూబ్నగర్ మహబూబ్నగర్ క్రీడలు: రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేస్తోంది. గ్రామీణస్థాయి నుంచి క్రీడాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ ఏడాది కూడా సీఎం కప్ క్రీడా పోటీలు నిర్వహించనున్నారు. గ్రామస్థాయి, మండల–అర్బన్, అసెంబ్లీ నియోజకవర్గం, జిల్లా, రాష్ట్రస్థాయి వరకు సీఎం కప్ పోటీలు జరగనున్నాయి. ఈ నెల 17, 22 వరకు గ్రామస్థాయి, 28 నుంచి 31 వరకు మండల/అర్బన్, వచ్చేనెల 3 నుంచి 7 వరకు అసెంబ్లీ స్థాయి, 10 నుంచి 14 వరకు జిల్లాస్థాయి, వివిధ ప్రాంతాల్లో 19 నుంచి 26 వరకు రాష్ట్రస్థాయిలో సీఎం కప్ క్రీడాపోటీలు జరగనున్నాయి. ముఖ్యంగా గ్రామస్థాయిలో క్రీడలతో ఒక నూతన ఉత్సాహం నెలకొనే అవకాశం ఉంటుంది. ఈసారి చిన్నారులు, ఇతరులకు కూడా రీక్రియేషన్ క్రీడలు జరగనున్నాయి. సీఎం కప్ సందర్భంగా జనవరి 8 నుంచి 17 వరకు రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక టార్చ్ ర్యాలీ నిర్వహించనున్నారు. వివిధ క్రీడాంశాల్లో పోటీలు సీఎం కప్లో 44 క్రీడాంశాల్లో పోటీలు జరగనున్నాయి. అథ్లెటిక్స్, ఆర్చరీ, బ్యాడ్మింటన్, బాక్సింగ్, స్విమ్మింగ్, రెజ్లింగ్, టేబుల్ టెన్నిస్, లాన్ టెన్నిస్, వెయిట్ లిఫ్టింగ్, జిమ్నాస్టిక్, షూటింగ్, బాస్కెట్బాల్, హ్యాండ్బాల్, హాకీ, ఫుట్బాల్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, సెపక్తక్రా, చెస్, బేస్బాల్, నెట్బాల్, కిక్బాక్సింగ్, సైక్లింగ్, రోయింగ్, స్క్వాష్ రాకెట్, కనోయింగ్–కయాకింగ్, వుషు, అత్యపత్య, పవర్ లిఫ్టింగ్, సాఫ్ట్బాల్, తైక్వాండో, బిలియర్డ్స్ స్నూకర్స్, జూడో, కరాటే, యోగా, స్కేటింగ్, ఫెన్సింగ్, పికిల్బాల్, సెయిలింగ్, బాల్బ్యాడ్మింటన్, మల్లకంబ్, పారా గేమ్స్, రీక్రియషనల్ క్రీడలులకు పోటీలు నిర్వహిస్తారు. గతేడాది 90 పతకాలు.. సీఎం కప్ క్రీడాపోటీలు క్రీడాకారుల ప్రతిభకు వేదికగా నిలుస్తున్నాయి. 2024 డిసెంబర్ నుంచి 2025 జనవరి 2వ తేదీ వరకు గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు మొదటి సీఎం కప్ పోటీలను విజయవంతంగా నిర్వహించారు. మహబూబ్నగర్లో రాష్ట్రస్థాయి కబడ్డీ, నెట్బాల్ పోటీలు జరిగాయి.రాష్ట్రస్థాయిలో ఉమ్మడి జిల్లా క్రీడాకారులు 90 పతకాలు సాధించడం విశేషం. వీటిలో 26 బంగారు పతకాలతో సత్తాచాటారు. మహబూబ్నగర్ జిల్లా క్రీడాకారులు 9 బంగారు, 15 రజతం, 11 కాంస్య పతకాలతో మొత్తం 35 పతకాలు సాధించారు. వనపర్తి జిల్లా 8 బంగారు, 6 రజతం, 5 కాంస్య పతకాలు మొత్తం 19 పతకాలు, నారాయణపేట జిల్లా 6 బంగారు, 6 రజతం, 2 కాంస్యంతో 14 పతకాలు, జోగుళాంబ గద్వాల జిల్లా 2 బంగారు, 2 రజతం, 5 కాంస్య పతకాలతో మొత్తం 9 పతకాలు, నాగర్కర్నూల్ జిల్లా ఒక బంగారు, 2 రజతం, 10 కాంస్యంతో 13 పతకాలు సాధించారు. జిల్లా కేంద్రంలోని మెయిన్ స్టేడియంలో జరిగిన రాష్ట్రస్థాయి సీఎంకప్ నెట్బాల్ పోటీలు (ఫైల్) -
వ్యూహరచన..!
● ప్రధాన పార్టీలసన్నాహకాలు షురూ ● అభ్యర్థుల జల్లెడకు శ్రీకారం చుట్టిన కాంగ్రెస్ ● ఆశావహుల నుంచి వ్యక్తిగత సమాచార సేకరణ ● బీఆర్ఎస్, బీజేపీ సైతం రంగంలోకి.. ● ఎత్తులకు పైఎత్తులతో ముందుకు.. సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: ‘పుర’ పోరుపై ప్రధాన రాజకీయ పార్టీలు కసరత్తు ముమ్మరం చేశాయి. కార్పొరేషన్/మున్సిపల్ పీఠాలను కై వసం చేసుకోవడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. పంచాయతీ ఎన్నికల్లో విజయం నేపథ్యంలో కాంగ్రెస్లో ఉత్సాహం తొణికిసలాడుతోంది. అసెంబ్లీ, ఎంపీ ఎన్నికల్లో చతికిలపడినప్పటికీ సం‘గ్రామంశ్రీలో బీఆర్ఎస్ అనూహ్యంగా పుంజుకోవడం.. శ్రేణుల్లో ఆత్మస్థైర్యం నింపింది. గతంతో పోల్చితే మెరుగైన పంచాయతీ స్థానాలను సాధించడంతో బీజేపీలోనూ జోష్ నెలకొంది. ఈ క్రమంలో అధికార కాంగ్రెస్తో పాటు విపక్ష పార్టీలు పోటాపోటీగా పోరు సన్నాహాలకు శ్రీకారం చుట్టాయి. పుర పాలికల ఎన్నికల్లో పాగా వేసేలా వ్యూహాలు పన్నుతున్నాయి. వెలిసిన ఫ్లెక్సీలు.. విందులు పురపాలిక ఎన్నికలపై ప్రధాన రాజకీయ పార్టీలు దృష్టి సారించిన క్రమంలో ఆయా డివిజన్లు/వార్డుల్లోని ఆశావహ అభ్యర్థులు ఇప్పటికే తమ ప్రయత్నాలను ప్రారంభించారు. యువతను ఆకట్టుకునేందుకు విందులకు తెర లేపారు. తాము బరిలో నిలుస్తామనే సంకేతాలను వార్డు ప్రజలకు తెలిసేలా ప్రచారం ప్రారంభించారు ఈ క్రమంలో దాదాపుగా అన్ని వార్డుల్లోనూ నూతన సంవత్సరంతో పాటు సంక్రాంతి, ఉగాది శుభాకాంక్షలు చెబుతూ భారీగా ఫ్లెక్సీలు వెలిశాయి. రిజర్వేషన్లు అనుకూలంగా వస్తే తమకే అవకాశం ఇవ్వాలని ఇప్పటికే ఆయా పార్టీలకు చెందిన పెద్దలను కలిసి విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయా పార్టీల కార్యాలయాలతో పాటు వార్డుల్లో రాజకీయ సందడి నెలకొంది. ప్రధానంగా మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్గా ఆవిర్భవించిన మహబూబ్నగర్ పీఠంపై అన్ని రాజకీయ పార్టీలు కన్నేశాయి. ఈ నేపథ్యంలో అభ్యర్థులతో పాటు పార్టీల నాయకుల మధ్య కూడా పోరు రసవత్తరంగా సాగనున్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్: పట్టు నిలుపుకునేలా.. గత మున్సిపల్ ఎన్నికల్లో అప్పటి అధికార బీఆర్ఎస్ అత్యధిక స్థానాల్లో విజయం సాధించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం మారిన రాజకీయ పరిణామాల క్రమంలో పట్టు నిలుపుకునేలా తగిన వ్యూహాలతో ముందుకు సాగుతోంది. ప్రత్యక్షంగా ఇప్పటివరకు ఎలాంటి సన్నాహక సమావేశాలు నిర్వహించకున్నా.. ఆయా నియోజకవర్గాల ముఖ్య నేతలు తమ తమ అనుచరుల ద్వారా గెలుపు గుర్రాలపై జల్లెడ పడుతున్నట్లు తెలుస్తోంది. ఆయా వార్డుల్లో ఆశావహులను ప్రోత్సహిస్తూ రంగం సిద్ధం చేసుకోవాలని.. రిజర్వేషన్ల ప్రకారం పార్టీ నిర్ణయం మేరకు నడుచుకునేలా వారిని సమాయత్తం చేస్తున్నట్లు సమాచారం. అధికార కాంగ్రెస్ పన్నుతున్న వ్యూహాలను పరిశీలిస్తూ.. పై ఎత్తులతో పార్టీ నేతలు ముందుకు సాగుతున్నారు. -
పకడ్బందీగా ధనధాన్య కృషి నమోదు
గద్వాల: ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన అమలు ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. ఈమేరకు సోమవారం కలెక్టరేట్లో అధికారులతో సమీక్షించారు. పీఎండీడీకేవై అమలుకు సంబంధించి పూర్తి సమాచారాన్ని క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా సిద్ధం చేసి వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని, నమోదు చేసే సమాచారం క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవ పరిస్థితి స్పష్టంగా ఉండాలన్నారు. అదేవిధంగా కేంద్రం నిర్వహించే అన్ని వీడియో కాన్ఫరెన్స్లలో సంబంఽధిత శాఖలు తప్పక పాల్గొలన్నారు. లక్ష్యాలను సాధించే దిశగా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని పీడీఎండీడీకేవై అర్హులైన వారందరూ సద్వినియోగం చేసుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ నర్సింగ్రావు, డీఏవో సక్రియనాయక్, ఏడీఏ సంగీతలక్ష్మీ, మార్కెటింగ్ అధికారిని పుష్పమ్మ, ఉద్యావనశాఖ అధికారి అక్బర్, పరిశ్రమల అధికారి రామలింగేశ్వర్గౌడ్, ఎల్డీఎం శ్రీనివాస్రావు, కో–ఆపరేటీవ్ అధికారి శ్రీనివాసులు ఉపాధికల్పన జిల్లా అఽధికారి ప్రియాంక తదితరులు పాల్గొన్నారు. ట్రాన్స్జెండర్లకు గుర్తింపు కార్డులు ట్రాన్స్జెండర్లకు సమాజంలో సమానహక్కులు గౌరవం భద్రత కల్పించడమే ప్రభుత్వం ఇచ్చే గుర్తింపు కార్డు ప్రధాన ఉద్ధేశమని కలెక్టర్ అన్నారు. కలెక్టరేట్లో తన ఛాంబర్లో దరఖాస్తు చేసుకున్న ఎనిమిది మంది ట్రాన్స్జెండర్లకు గుర్తింపు కార్డులు ఇచ్చారు. ఈకార్డు ద్వారా ట్రాన్స్జెండర్లు ప్రభుత్వ సంక్షేమ పథకాలు విద్యాసహాయం, ఉపాధి అవకాశాలు ఆరోగ్యసేవలు వంటి అనేక సేవలను సులభంగా పొందవచ్చన్నారు. అర్హులైన ట్రాన్స్జెండర్లు సంబంధిత ప్రభుత్వ పోర్టల్ జ్ట్టి ఞ.్టట్చ ుఽటజ్ఛ ుఽఛ్ఛీట.ఛీౌట్జ్ఛ.జౌఠి.జీ ుఽ లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో సంక్షేమశాఖ జిల్లా అధికారి సునంద, ట్రాన్స్జెండర్లు పాల్గొన్నారు. -
వైద్య విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
అలంపూర్: విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని డీసీహెచ్ఎస్ రమేష్ చంద్ర అన్నారు. అలంపూర్ చౌరస్తాలోని ఏరియా ఆస్పత్రిని ఆయనతోపాటు ఆస్పత్రి సూపరింటెండెంట్ సయ్యద్బాష సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆస్పత్రి వైద్య సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డీసీహెచ్ఎస్ రమేష్ చంద్ర మాట్లాడుతూ.. ఆస్పత్రికి వైద్యులు సకాలంలో హాజరు కావాలని, ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఓపీ సేవలు అందుబాటులో ఉండాలన్నారు. ప్రతి రోజు మొబైల్ యాప్లో హాజరు నమోదు తప్పనిసరిగా ఉండాలని, ముందస్తు సమాచారంతోనే విధులకు సెలవులో వెళ్లాలన్నారు. సమాచారం లేకుండా విధుల్లో గైర్హాజరైతే శాఖపరంగా చర్యలు ఉంటాయన్నారు. ఆస్పత్రికి త్వరలోనే వామర్లు, ఫోటోథెరపీ సామగ్రి వస్తాయని తెలిపారు. ఆర్ఓ ప్లాంట్ సైతం అబదుబాటులోకి రానున్నట్లు తెలిపారు. సమావేశంలో వైద్యులు రూపాలి, అమీర్, ప్రవీణ్ తదితరులు ఉన్నారు. వేరుశనగ క్వింటా రూ.8,900 గద్వాల వ్యవసాయం: గద్వాల మార్కెట్ యార్డుకు సోమవారం 368 క్వింటాళ్ల వేరుశనగ వచ్చింది. గరిష్టం రూ.8900, కనిష్టం రూ.4590, సరాసరి రూ.8590 ధరలు లభించాయి. 8 క్వింటాళ్ల వరి (సోన) రాగా గరిష్టం రూ.6060, కనిష్టం రూ.5355, సరాసరి రూ.6060 ధరలు పలికాయి. 234 క్వింటాళ్ల కంది రాగా.. గరిష్టం రూ.7049, కనిష్టం రూ. 2323, సరాసరి రూ. 7029... 15 క్వింటాళ్ల వరి (సోన) రాగా గరిష్టం రూ. 2562, కనిష్టం రూ. 2326, సరాసరి రూ. 2326 ధరలు లభించాయి. 616 ఫిర్యాదులు సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని పురపాలికల పరిధిలో ఓటర్ల ముసాయిదా జాబితాపై భారీగా ఫిర్యాదులు వెల్లువెత్తాయి. జడ్చర్ల, అచ్చంపేట మినహా మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్లో 60 డివిజన్లు.. మిగిలిన 18 మున్సిపాలిటీలో మొత్తం 316 వార్డులు ఉన్నాయి. ఈ మేరకు ఇప్పటివరకు మొత్తంగా 616 అభ్యంతరాలు వచ్చాయి. అదేవిధంగా సోమవారం ఆయా పురిపాలికల పరిధిలో అధికారులు రాజకీయ పార్టీల నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు పలు అభ్యంతరాలు చెబుతూ.. పరిష్కరించాలని విన్నవించారు. మహబూబ్నగర్ కార్పొరేషన్లో 60 డివిజన్ల పరిధిలో 144 ఫిర్యాదులు వచ్చాయి. మున్సిపాలిటీల విషయానికి వస్తే.. దేవరకద్రలో 9, నాగర్కర్నూల్లో 121, కొల్లాపూర్లో 8, కల్వకుర్తిలో 36, నారాయణపేటలో 4, మక్తల్ 10, కోస్గిలో 5, మద్దూరులో 16, గద్వాలో 17, అయిజలో 22, వడ్డేపల్లిలో 36, వనపర్తిలో 8, కొత్తకోటలో 6చ అమరచింత 4, ఆమ్మకూర్లో 11, పెబ్బేరులో 71 ఫిర్యాదులు రాగా.. అలంపూర్ మన్సిపాలిటీలో ఒక్క ఫిర్యాదు కూడా రాలేదు. -
అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుంటాం : కమిషనర్
● గెజిట్ ప్రకారమే జాబితా విడుదల చేశామని కమిషనర్ స్పష్టం ● కలెక్టర్ను ఆశ్రయించిన నాయకులు గద్వాలటౌన్: మున్సిపాలిటీలకి ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే రాజకీయ దుమారం చెలరేగుతోంది. గద్వాల మున్సిపాలిటీలలో చేసిన వార్డుల వారీ ఓటర్ల ముసాయిదా జాబితాపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీలోని కొంతమంది నాయకులతో పాటు ప్రతి పక్ష పార్టీలకు చెందిన మాజీ కౌన్సిలర్లు, నాయకులు దీనిని ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నారు. అధికారుల ఊదాసీనత, సిబ్బంది నిర్లక్ష్యంతో ఓటరు ముసాయిదా జాబితా తప్పుల తడకగా మారిందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. లోపాలపై నాయకుల ఆగ్రహం గద్వాల మున్సిపాలిటీలో ఓటరు ముసాయిదా జాబితాలో లోపాలు ఉన్నాయని వివిధ పార్టీల నాయకులు ఆరోపణలు చేశారు. సోమవారం స్థానిక మున్సిపల్ కార్యాలయ హాల్లో వివిధ రాజకీయ పక్షాలతో కమిషనర్ జానకీరామ్ సాగర్ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అధికారుల తీరును అన్ని రాజకీయ పక్షాల నాయకులు ఎండగట్టారు. ముసాయిదా జాబితా అస్తవ్యస్తంగా ఉందని, కొన్ని వార్డులలో ఓటర్లను చిన్నాభిన్నం చేశారని మండిపడ్డారు. పక్కనున్న ఇళ్లను అదే వార్డులో కాకుండా దూరంగా ఉన్న మరో వార్డులో కలపడం పట్ల ఇబ్బందులు తలెత్తుతాయని పలువురు కమిషనర్ దృష్టికి తెచ్చారు. సిబ్బంది క్షేత్రస్థాయికి వెళ్లి అభ్యంతరాలను పరిష్కరించాలని కోరారు. కలెక్టర్కు ఫిర్యాదు వార్డుల వారీ ఓటరు ముసాయిదా జాబితా మొత్తం అశాసీ్త్రయంగా, అసంబద్ధంగా ఉందని వివిధ రాజకీయ పక్షాల నాయకులు మిర్శించారు. మున్సిపాలిటీలో జరిగిన సమావేశం అనంతరం ఆయా రాజకీయ పార్టీల నాయకులు వేర్వేరుగా కలెక్టర్ సంతోష్ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఓటర్ ముసాయిదాపై అభ్యంతరాలను బీజేపీ నాయకులు వివరించారు. అధికార కాంగ్రెస్లోని ఓ వర్గం నాయకులు ముసాయిదా జాబితాపై తమకూ కొన్ని అభ్యంతాలున్నాయని చెబుతుండడం విశేషం. పార్టీల ఆరోపణల మాటలు ఎలా ఉన్నా.. మున్సిపల్ అధికారులు విడుదల చేసిన ముసాయిదా జాబితాలో స్పష్టత కనిపించడం లేదు. గెజిట్ ప్రకారమే జాబితా విడుదల చేశామని చెప్పి చేతులు దులిపేసుకున్నారే తప్ప.. ఆ జాబితా లోపల ఉన్న ఇళ్ల నంబర్లు, కనీసం కాలనీల వివరాలు గానీ స్పష్టంగా చెప్పలేదు. రెండు, మూడు నెలల పాటు శాసీ్త్రయంగా చేయాల్సిన ఓటర్ల ప్రక్రియను కేవలం రెండు రోజుల్లో పూర్తి చేశారనే విమర్శలు ఉన్నాయి. చాలా వార్డులలో భౌగోళిక స్వరూపం కొరవడిందని మండిపడుతున్నారు. 7, 16, 17, 30వ వార్డుల పరిధిలో చేరిన ఇతర వార్డు ఓట్లను చేర్చడంపై పలు అనుమానాలను వ్యక్తం చేస్తూ.. ఆయా వార్డుల నాయకులు ఫిర్యాదు చేశారు. ఇది ఓటరు ముసాయిదా జాబితా మాత్రమే అని, అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుంటామని మున్సిపల్ కమిషనర్ జానకీరామ్ సాగర్ పేర్కొన్నారు. మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వివిధ రాజకీయ పార్టీల నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ గెజిట్ ప్రకారం ఓటరు ముసాయిదా జాబితా విడుదల చేయడం జరిగిందన్నారు. ఇందుకు అన్ని రాజకీయ పార్టీల నాయకులు సహకరించాలని కోరారు. ముసాయిదా జాబితాలో ఏవైనా అభ్యంతరాలు ఉంటే లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయాలని సూచించారు. ఇప్పటి వరకు 17 ఫిర్యాదులు అందయని చెప్పారు. వాటి సాధ్యసాధ్యాలను పరిశీలించి పరిష్కరిస్తామన్నారు. ఈ సమావేశంలో ఆయా రాజకీయల పార్టీల నాయకులు రాజీవ్రెడ్డి, భీంసేన్రావు, రామాంజనేయులు, సుభాన్, ఆంజనేయులు, ఉప్పేర్ నర్సింహా, త్యాగరాజు, మోహన్రావు, కోటేష్, ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు. -
వంతెన నిర్మాణం పూర్తి చేయాలి
అయిజ: కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ నాయకులు ఆదివారం అంతరాష్ట్ర రహదారిపై వంటావార్పు కార్యక్రమం నిర్వహించి నిరసన తెలిపారు. పట్టణ సమీపంలోని తుపత్రాల రోడ్డుకు సంబంధించిన పోలోనివాగుపై నిర్మించతలపెట్టిన హైలెవల్ బ్రిడ్జి నిర్మాణం వద్ద వంట చేసుకొని, రోడ్డుపైనే కూర్చొని సహపంక్తి భోజనం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈసందర్భంగా బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. మంత్రాలయం, ఆదోని, ఎమ్మిగనూరులకు సంబంధించిన అంతరాష్ట్ర రహదారి వెంట సుమారు 15 గ్రామాలు ఉన్నాయని, అదేవిధంగా మంత్రాలయ పుణ్యక్షేత్రానికి ఇదే దారిలో వెళ్లాల్సి ఉంటుందని అన్నారు. ఈ రోడ్డుపై ప్రతిరోజు వేలాదిమంది ప్రజలు ప్రయాణిస్తున్నారని, వాగుపై హైలెవల్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టి 2 సంవత్సరాలవుతున్నా ఇంకా పూర్తికాలేదని, ఈరోడ్డు నిర్మాణం దశాబ్దకాలంగా పూర్తికాలేదని మండిపడ్డారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ నాయకుడు సంపత్కుమార్ ఆరు మాసాల్లో నిర్మాణం పూర్తిచేస్తానని ప్రజలను నమ్మించి మోసంచేశారని ఆరోపించారు. అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే విజయుడు, ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి కూడా ఎన్నికల సందర్భంగా హామీలు ఇచ్చారని, ఇప్పుడు మాత్రం తొంగి చూడడంలేదని ఆరోపించారు. వెంటనే నిర్మాణ పనులు పూర్తిచేయకుంటే నిరసన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు భగత్ రెడ్డి, శివారెడ్డి, ఆంజనేయులు, చక్రవర్తి, అశోక్, ప్రదీప్ కుమార్, లక్ష్మణ్ గౌడ్, వెంకటేష్; అంజి తదితరులు పాల్గొన్నారు. అంతర్రాష్ట్ర రహదారిపై వంటావార్పుతో నిరసన -
పంచాయతీలకు ఊరట
● నూతన సర్పంచ్లకు ఉపశమనం ● రెండేళ్లుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులు లేక ఖజానా ఖాళీ చిన్న, మేజర్ జీపీలకు ప్రత్యేక నిధులు కేటాయిస్తామని సీఎం ప్రకటన సొంత నిధులతోనే.. సర్పంచ్గా గెలిచిన అనంతరం గ్రామంలో నెలకొన్న చిన్న చిన్న సమస్యల పరిష్కారానికి సొంతంగానే నిధులు ఖర్చు చేస్తున్నాను. సీఎం ప్రకటనతో నిధులు వస్తే గ్రామంలో నెలకొన్న సమస్యలు పరిష్కరించే అవకాశం ఉంటుంది. – సరోజినమ్మ, సర్పంచు సోంపురం కేటి.దొడ్డి మండలం త్వరగా విడుదల చేయాలి గ్రామంలో పారిశుద్ధ్య పనులు, వీధిలైట్లు వంటివి మొదలుకుని మౌలిక వసతుల కల్పనకు నిధులు అవసరం. ప్రభుత్వం త్వరగా నిధులు విడుదల చేస్తే గ్రామ అభివృద్ధి కోసం కృషి చేస్తా. – వీరన్న, సర్పంచు కొండేరు ఎర్రవల్లి మండలం గద్వాల: రెండేళ్లుగా ప్రత్యేక పాలనలో నిధులలేమితో కొట్టుమిట్టాడుతున్న గ్రామ పంచాయతీలకు ఎన్నికల క్రతువు పూర్తికావడం, నూతన సర్పంచులు కొలువుతీరడం జరిగిపోయింది. గెలుపొందిన సర్పంచులు ఆనందంతో బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆనందం కాస్త ఆవిరైపోయింది. గ్రామా పంచాయతీ ఖజానాలో చిల్లిగవ్వ లేకపోవడం, నిత్యఅవసరాల నిమిత్తం కూడా నిధులు లేకపోవడం వంటి స్వాగతం పలకడంతో సర్పంచులు కొంత ఆందోళనకు గురయ్యారు. రోజు వారి పారిశుద్ధ్య పనులకు, పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు చెల్లించేందుకు సైతం డబ్బులు లేనిదుస్థితి. ఈనేపథ్యంలో చాలా చోట్ల నూతన సర్పంచులు సొంతడబ్బులతోనే చిన్నాచితక పనులు చేయిస్తున్నారు. అయితే ఇటీవల సీఎం రేవంత్రెడ్డి గ్రామపంచాయతీలకు ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నట్లు ప్రకటించడం, మైనర్ జీపీలకు రూ.5లక్షలు, మేజర్ జీపీలకు రూ.10లక్షల చొప్పున కేటాయిస్తామని చెప్పడంతో సర్పంచులు కొంతవరకు ఊరట చెందారు. -
అంతటా అంతేగా..!
తప్పులతడకగా ముసాయిదా ఓటర్ల జాబితా ● మహబూబ్నగర్ కార్పొరేషన్లో ఇతర జిల్లాల ఓటర్లు ● ఉమ్మడి పాలమూరులోని అన్ని పురపాలికల్లోనూ గందరగోళం ● ఇప్పటివరకు మొత్తం 291 ఫిర్యాదులు.. అత్యధికంగా మహబూబ్నగర్ కార్పొరేషన్లో 98 ● అధికారుల నిర్లక్ష్య వైఖరిపై విమర్శల వెల్లువ మున్సిపాలిటీ వారు్ుడ్ల ఫిర్యాదులు మ.నగర్ (కా) 60 98 భూత్పూర్ 10 20 దేవరకద్ర 12 03 నాగర్కర్నూల్ 24 51 కొల్లాపూర్ 19 05 కల్వకుర్తి 22 32 నారాయణపేట 24 – మక్తల్ 16 07 కోస్గి 16 03 మద్దూర్ 16 03 గద్వాల 37 06 అలంపూర్ 10 – అయిజ 20 06 వడ్డేపల్లి 10 01 వనపర్తి 33 18 కొత్తకోట 15 01 అమరచింత 10 – ఆత్మకూర్ 10 06 పెబ్బేరు 12 31 మొత్తం 376 291 మొత్తం 291 ఫిర్యాదులు ఉమ్మడి పాలమూరులోని ఒక కార్పొరేషన్, 18 మున్సిపాలిటీల పరిధిలో గురువారం పోలింగ్ స్టేషన్లు, ఓటర్ల ముసాయిదా జాబితాను ప్రకటించారు. అదేరోజు నుంచి అభ్యంతరాలు స్వీకరణ ప్రారంభించారు. ఈ మేరకు అన్ని పురపాలికల్లో కలిపి ఆదివారం వరకు మొత్తం 291 ఫిర్యాదులు వచ్చాయి. మహబూబ్నగర్ కార్పొరేషన్ పరిధిలో అత్యధికంగా 98 రాగా.. ఆ తర్వాత నాగర్కర్నూల్ మున్సిపాలిటీలో 51 అభ్యంతరాలు వచ్చాయి. ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో పరిష్కారం గడువును ఆదివారం నుంచి ఈ నెల 9వ తేదీ వరకు పొడిగించారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. ఇది ముసాయిదా జాబితా మాత్రమేనని.. అన్నింటినీ పరిష్కరించి ఈ నెల 10న తుది జాబితా వెల్లడించనున్నట్లు అధికారులు చెబుతున్నారు. ప్రహసనంగా మారడం.. సర్దుబాటు చేయడంతో.. ప్రధానంగా మహబూబ్నగర్ కార్పొరేషన్ పరిధిలో ముసాయిదా ఓటర్ల జాబితా తప్పుల తడకగా మారింది. కార్పొరేషన్గా ఆవిర్భవించిన క్రమంలో డివిజన్ల వారీగా తీసిన లెక్కలతో పోలిస్తే ప్రస్తుతం విడుదల చేసిన ముసాయిదా జాబితాలో ఓటర్ల సంఖ్య పెరిగినట్లు తెలుస్తోంది. ఈసీ ఆదేశాల మేరకు 2023 అసెంబ్లీ ఎన్నికల్లో నియోజకవర్గాల ఓటరు జాబితా ప్రకారం.. ఆయా పురపాలికల్లో డివిజన్ల వారీగా ఓటర్ల జాబితా రూపొందించారు. ఇంటి నంబర్ల ఆధారంగా సంబంధిత డివిజన్లు/ వార్డుల్లో పోలింగ్ బూత్ల వారీగా ఓటర్లను చేర్చినట్లు చెబుతున్నారు. అయితే ఈ ప్రక్రియ ప్రహసనంగా మారగా.. తప్పులు దొర్లినట్లు తెలుస్తోంది. పలు డివిజన్లు/ వార్డుల్లో ఇంటి నంబర్లు లేకుండా.. కొన్నిచోట్ల ఇంటి నంబర్లకు బై నంబర్లు చేర్చి జాబితా వెల్లడించినట్లు అభ్యంతరాలు వ్యక్తం కావడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. ఉన్న ఓట్లను తొలగించే అధికారం లేకపోవడం కారణంగా పలు వార్డుల్లో ఆయా ఓట్లను సర్దుబాటు చేయడంతో సమస్యలు ఉత్పన్నమైనట్లు సీనియర్ రాజకీయ నేతలు అభిప్రాయపడుతున్నారు. – సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్ ఆన్లైన్ నమోదులో.. బీఎల్ఓలు ఇంటింటికీ తిరిగి ఓటర్ల వివరాలు సేకరించి రెవెన్యూ అధికారులకు సమర్పించారు. ఆ తర్వాత వాటిని ఆన్లైన్లో నమోదు చేసే క్రమంలో తప్పిదాలు చోటుచేసుకున్నట్లు సమాచారం. పెద్దఎత్తున అభ్యంతరాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో అధికార యంత్రాంగంలో ఈ చర్చ జరిగినట్లు తెలిసింది. దీనిపై ఏ ఒక్క అధికారి కూడా నేరుగా సమాధానం ఇవ్వడం లేదు. ఇది ముసాయిదా జాబితానే.. ఫిర్యాదులు స్వీకరిస్తున్నామంటూ కొట్టిపారేస్తూనే.. గడువులోపు పరిష్కరిస్తామని చెబుతున్నారు. అయితే అధికారుల నిర్లక్ష్య వైఖరితోనే ఓటర్ల జాబితాలో తప్పులు దొర్లాయంటూ రాజకీయ నేతలు విమర్శిస్తున్నారు. -
వైభవంగా రాములోరి కల్యాణం
ఎర్రవల్లి: శ్రీరాముని జన్మనక్షత్రమైన పునర్వసు నక్షత్రాన్ని పురస్కరించుకొని బీచుపల్లి కోదండరామస్వామి ఆలయంలో ఆదివారం సీతారాముల కల్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు సీతారాముల విగ్రహాలను అపురూపంగా ముస్తాబుచేసి వేదమంత్రాల నడుమ కల్యాణ తంతు నిర్వహించారు. ఇదిలాఉండగా, వివిధ ప్రాంతాల నుంచి భక్తులు ఉదయాన్నే బీచుపల్లికి చేరుకొని కృష్ణానదిలో స్నానాలు ఆచరించి కల్యాణోత్సవాన్ని కనులారా తిలకించారు. భక్తులకు గోపల్దిన్నెకు చెందిన రంగస్వామి, జానకి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. కార్యక్రమంలో ఆలయ మేనేజర్ సురేందర్రాజు, అర్చకులు భువనచంద్ర, దత్తుస్వామి, భానుమూర్తి, పాలకమండలి సభ్యులు పాల్గొన్నారు. -
ఒకేరోజు ఆరు సాధారణ కాన్పులు
ఒకప్పుడు ప్రభుత్వ ఆస్పత్రి అంటేనే జంకే వారు. కానీ, ప్రస్తుతం పరిస్థితి మారింది. అధునాతన వసతులతో మెరుగైన వైద్యం అందిస్తూ ప్రైవేట్ ఆస్పత్రులకు ఏమాత్రం తీసిపోవడంలేదు. తాజా ఘటన ఇందుకు ఉదాహరణగా నిలుస్తోంది. ధరూరు పీహెచ్సీలో ఆదివారం ఒక్కరోజే ఆరుగురు గర్భిణులకు సాధారణ కాన్పులు చేశారు. ఆరుగురు శిశువులు, తల్లులు క్షేమంగా ఉన్నారని వైద్యురాలు అయేషాబేగం పేర్కొన్నారు. ఈ సందర్భంగా వైద్యులు, సిబ్బందిని వైద్యాధికారులు అభినందించారు. – ధరూరు -
నియోజకవర్గ అభివృద్ధికి కృషి
మానవపాడు: సీఎం రేవంత్రెడ్డి సహకారంతో అలంపూర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని, గ్రామాల అభివృద్ధి కాంగ్రెస్తోనే సాధ్యమని ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే సంపత్కుమార్ అన్నారు. ఆదివారం మండలంలోని పల్లెపాడులో కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరించి, సీసీ రోడ్డు నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలో 124 మందిలో 77మంది కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులే సర్పంచ్లుగా గెలిచారని, 17మంది స్వతంత్య్ర అభ్యర్థుల్లో 12మంది కాంగ్రెస్ పార్టీలోనే చేరారన్నారు. అర్హులందరికీ సంక్షేమ పథకాల ఫలాలు అందాలనేదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని, ఇందిరమ్మ ఇళ్లు, రుణమాఫీ, ఉచిత బస్సు, సన్నబియ్యం, రేషన్కార్డులు ఇలా ఎన్నో పథకాలు తీసుకొచ్చిందని గుర్తు చేశారు. కార్యక్రమంలో నాయకులు నాగరాజు, మహ్మద్ సిరాజ్, జగన్మోహన్నాయుడు, వెంకటేశ్వర్లు, బీసీరెడ్డి, మాస్తన్, నాగరాజు, మధు తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు భద్రత నిబంధనలు తప్పనిసరి
గద్వాల క్రైం: ప్రతి ఒక్కరు రోడ్డు భద్రత నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఏఎంవీఐ జానకిరాములు అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఆటో డ్రైవర్లతో ఏర్పాటు చేసిన అవగహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేసేందుకు రోడ్డు భద్రత మాసోత్సవాలు ఎంతో దోహదపడతాయన్నారు. కారు, బైక్ నడిపే క్రమంలో సీటు బెల్టు, హెల్మెట్ ధరించాలని, వాహనానికి ఇన్సూరెన్స్, డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా కలిగి ఉండాలన్నారు. మద్యం సేవించి, ఫోన్లో మాట్లాడుతూ, నిద్రలేమి కారణాలతో డ్రైవింగ్ చేయడం ద్వారానే రోడ్డు ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయని, ప్రతిఒక్కరూ నిబంధనలు పాటించాలని, క్షేమంగా ప్రయాణం చేయాలన్నారు. అనంతరం ప్రతిజ్ఙ చేయించారు. కార్యక్రమంలో ఆటో డ్రైవర్లు, సిబ్బంది రుషి, గోవిందు పాల్గొన్నారు. -
శిథిలం నుంచి సుందరీకరణ
మక్తల్: మక్తల్లో ప్రసిద్ధిగాంచిన పడమటి ఆంజనేయస్వామి దేవాలయంలో శిథిలాస్థకు చేరిన కోనేరు సుందరీకరణ దిశగా పయనిస్తోంది. గతంలో ఇదే కోనేరు నుంచి తీసుకెళ్లి ఆంజనేయస్వామికి పుష్కర స్నానం చేయించి పూజలు చేసేవారు. కాలక్రమంలో ఎవరూ పట్టించుకోకపోవడంతో శిథిలావస్థకు చేరి.. చెత్తాచెదారంతో నిండిపోయింది. ఈ క్రమంలో కోనేరు దుస్థితిని గమనించిన రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి సొంత నిధులు రూ.60 లక్షలు వెచ్చించి.. మరమ్మతు పనులు చేపట్టారు. ప్రస్తుతం కోనేరు పూర్వవైభవం సంతరించుకోగా.. భక్తులు స్నానాలు ఆచరించేందుకు సౌకర్యాలు కల్పించారు. మక్తల్లో పూర్వవైభవం సంతరించుకున్న కోనేరు -
సామాజిక రుగ్మతలు రూపుమాపాలి
గద్వాల: సమాజాన్ని పట్టిపీడిస్తున్న బాలకార్మిక వ్యవస్థ, బాల్యవివాహాలు వంటి రుగ్మతలు తొలగిపోయేలా ఉపాధ్యాయులు విద్యాబోధన చేయాల్సిన అవసరం ఉందని కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. శనివారం దేశతొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే జయంతిని రాష్ట్ర ప్రభుత్వం మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించిన నేపథ్యంలో శనివారం ఐడీవోసీ కార్యాలయంలో కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ఉత్తమ మహిళా ఉపాధ్యాయుల పురస్కారాలు అందించారు. అంతకు ముందు ఆయన సావిత్రిబాయి చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాజంలో నేటికి మహిళల పట్ల వివక్ష కొనసాగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. 19వ శతాబ్దంలో మన దేశంలో మహిళలకు చదువు నేర్పించేందుకు ఎన్నో అవాంతరాలను ఎదుర్కొని మహాత్మా జ్యోతిరావుపూలే విశేష కృషి చేయగా ఆయన సహకారంతో సావిత్రి బాయిపూలే 1848లో పూణేలో మహిళలకు మొట్టమొదటి పాఠశాలను ఏర్పాటు చేసి విద్యాబోధన చేశారన్నారని కొనియాడారు. ఆమె స్ఫూర్తితో మహిళా ఉపాధ్యాయులు పుస్తకాల్లోని పాఠ్యాంశాలనే కాకుండా విద్యార్థులకు సామాజిక అంశాల పట్ల కూడా అవగాహన కల్పించాలన్నారు. మన జిల్లాలో కొన్ని మారుమూల ప్రాంతాల్లో నేటికి బాల్యవివాహాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వీటిని పూర్తిగా రూపుమాపేందుకు ఉపాధ్యాయులు తమవంతు పాత్ర పోషించాలని కోరారు. బాలికలు పదో తరగతి, ఇంటర్తోనే చదువును మధ్యలో ఆపేస్తున్నారని అలా కాకుండా ఉన్నత విద్యాభ్యాసం కొనసాగించేలా ప్రోత్సహించాలన్నారు. దేశంలో 50శాతానికి పైగా మహిళా ఉపాధ్యాయురాలు ఉండడం మనకెంతో గర్వకారణమన్నారు. భవిష్యత్లో దేశాభివృద్ధికి కృషి చేసే భావి భారత పౌరులైన నేటిబాలలను ఉత్తములుగా తీర్చిదిద్దే గురుతర బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. అనంతరం ఉత్తమ మహిళా ఉపాధ్యాయులను సన్మానించారు. కార్యక్రమంలో డీఈఓ విజయలక్ష్మీ, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ నుషిత, బీసీ సంక్షేమశాఖ అధికారి అక్బర్బాషా తదితరులు పాల్గొన్నారు. -
మిరపలో యాజమాన్య పద్ధతులు పాటించాలి
ఇటిక్యాల: మిరప సాగులో రైతులు సరైన యాజమాన్య పద్ధతులు పాటించాలని జిల్లా ఉద్యాన శాఖ అధికారి అక్బర్ బాషా అన్నారు. శనివారం మండలంలోని మునగాలో రైతు నరసింహారెడ్డి సాగు చేసిన మిరప పంటను ఆయన సందర్శించి మిరప పంటపై రక్షణపై స్థానిక రైతులకు అవగాహన కల్పించారు. మిరప పంటలో రసం పీల్చు పురుగుల ఉధృతి పెరిగి ఆకులు ముడుచుకోవడం, పంట ఎదుగుల తగ్గడం మరియు జెమినీ వైరస్ వ్యాప్తి సమస్యలపై అప్రమత్తంగా ఉండి సమగ్ర యాజమాన్య పద్ధతులు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. మిరపపంట పొలాల చుట్టూ 2–3 వరుసలుగా జొన్న లేదా మొక్కజొన్న, సజ్జను పంటగా వేసుకోవడం ద్వారా పురుగుల దాడిని తగ్గించవచ్చని, పొలం గట్ల మీద వైరస్ సోకిన మొక్కలను గుర్తించిన వెంటనే పీకి నాశనం చేయాలని పేర్కొన్నారు. తామర పురుగులు నీలి రంగుకు, తెల్లదోమలు పసుపు రంగుకు ఎక్కువగా ఆకర్షితమవుతాయని, అందువల్ల రైతులు ఒక పొలానికి తగిన సంఖ్యలో నీలి, మరియు జిగురు రంగు అట్టలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. పంటలో పురుగుల నియంత్రణకు వేపనూనెను సూచించిన మోతాదులో కలిపి పిచికారీ చేయాలన్నారు. పురుగుల నివారణ ఇలా.. పంటలో పురుగుల నివారణకు ఫిఫ్రోనీల్ 80 శాతం విజి 0.20 గ్రా. లేదా అసిటామిప్రిడ్ 20 శాతం, ఎస్పి 0.20 గ్రాములు లేదా, ఇమిడాక్లోఫ్రిడ్ 40 శాతం మరియు ఫిప్రోనీల్ 40 శాతం లేదా స్పినోటోరమ్ 1 మీ.లీ లీటరుకు కలిపి 7– 10 రోజుల వ్యవధిలో మందులను ఆకులు పూర్తిగా తడిచే విధంగా పిచికారీ చేయాలన్నారు. మిరపపంటలో క్రింది ముడత నల్లీ ఆకుల అడుగు భాగం నుండి రసం పీల్చడం వల్ల ఏర్పడుతుందని, నల్లీ ఆశించిన ఆకులు తీరగేశిన పడవ ఆకారంలో కనిపిస్తాయని తెలిపారు. ఈ సమస్య నివారణకు స్పైరోమెసాఫెన్ 1 మీ.లీ లేదా ప్రోపెర్గిట్ 2.50 మి.లీ లేదా ఫెనాజూక్విన్ 2 మి.లీ నీటికి కలిపి ఆకుల అడుగు భాగం పూర్తిగా తడిచే విధంగా పిచికారీ చేయాలని సూచించారు. ఆకులపై మచ్చలు లేదా కాయకుళ్లు కనిపించిన వెంటనే ప్రొపికోనజోల్ 1 మి.లీ, అజాక్జీస్ట్రోబిన్ 1గ్రా, లేదా థయెఫినేట్ బిత్తెల్ 1 మి,లీ లీటరు నీటికి కలిపి పిచికారీ చేసి పంటలను కాపాడుకోవాలన్నారు. కార్యక్రమంలో ఇమ్రాన్, రైతులు పాల్గొన్నారు. -
నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు
అలంపూర్/ఎర్రవల్లి/మానవపాడు: ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి అనధికార ఔషధాలను విక్రయించినా, ప్రిస్కిప్సన్ లేకుండా హైగర్ యాంటీబయాటిక్స్, స్టెరాయిడ్స్ను విక్రయించినా చర్యలు తప్పవని ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా డ్రగ్ ఇన్స్పెక్టర్ మహ్మద్ రఫి అన్నారు. శనివారం డిప్యూటీ డైరెక్టర్, డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారిణి అంజుమ్ అబిదా ఆదేశాల మేరకు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా అసిస్టెంట్ డైరెక్టర్ దినేష్ కుమార్ ఆధ్వర్యంలో ఉండవెల్లి, మానవపాడు, ఎర్రవల్లి మండలంలోని మెడికల్ దుకాణాల్లో జిల్లా డ్రగ్ ఇన్స్పెక్టర్లు వినయ్, మొహమ్మద్. రఫీ, రష్మి, విశ్వంత్రెడ్డి తనిఖీలు చేపట్టినట్టు తెలిపారు. షాపు లైసెన్స్లు, స్టాక్ రిజిస్టర్లు, కొనుగోలు, విక్రయ వివరాలను పరిశీలించారు. ఆర్ఎంపీలు రోగులకు కేవలం ప్రథమ చికిత్స మాత్రమే అందించి మెరుగైన చికిత్స కోసం స్థానిక ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలకు పంపించాలని తెలపారు. ప్రభుత్వ నిభందనలను పాటించకుండా రోగులకు తెలిసీ తెలియని చికిత్సలు చేసి వారికి నిషేదిత ఔషదాలను విక్రయించినా లేదా చికిత్సకు వాటిని వినియోగించినా కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. మొత్తం 9 మెడికల్ దుకాణాల్లో విక్రయాల్లో ఉల్లంఘనలు గుర్తించినట్లు పేర్కొన్నారు. సేల్బిల్స్, ప్రిస్క్రిప్షన్ లేకుండా హైగర్ యాంటీబయాటిక్స్, స్టెరాయిడ్స్ విక్రయించినట్లు తెలిపారు. ఒక మెడికల్ షాప్లో ఫిజీషియన్ శాంపిల్స్ తనిఖీ చేసి షోకాజ్ నోటీసు జారీ చేసినట్లు తెలిపారు. విచారణ అనంతరం తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. మెడికల్ దుకాణాల్లో సంబంధిత రికార్డులు, స్టాక్ రిజిస్టర్లు, క్రయవిక్రయాలను, లైసెనన్స్ నిబంధనలపై అధికారులు ఆరా తీసినట్లు తెలిపారు. -
400 ఏళ్ల చరిత్ర
జడ్చర్ల టౌన్: పాలవాది వంశస్థులు కావేరమ్మపేట ఈదమ్మ ఆలయం ఎదురుగా 400 ఏళ్ల క్రితం గచ్చుబావి నిర్మించారు. కాలక్రమేణా గచ్చుబావి చెత్తాచెదారంతో నిండిపోగా ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి జయపాల్ అనే యూట్యూబర్, వార్డు కౌన్సిలర్ బుక్క మహేష్ స్పందించి పరిరక్షణ కోసం చర్యలు చేపట్టారు. అలాగే జడ్చర్లలోని వేంకటేశ్వరస్వామి ఆలయం పక్కన దాదాపు 10వ శతాబ్దంలో నిర్మించిన కోనేరు శిథిలావస్థకు చేరింది. ప్రస్తుతం ఈ కోనేరు పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయి. కోనేరుకు ఎంతో విశిష్టత ఉంది. కోనేరుకు ఒకవైపు శివాలయం, మరోవైపు ఆంజనేయస్వామి ఆలయాలు ఉన్నాయి. కోనేరులోంచి నేరుగా పైఆలయాలకు వెళ్లేలా సొరంగ మెట్ల మార్గాలు నిర్మించారు. ఒకవైపు మాత్రమే మెట్లు ఉండగా.. రెండు వైపులా గోడలున్నాయి. ప్రస్తుతం కోనేరు పునరుద్ధరణ పనులు చురుకుగా కొనసాగుతున్నాయి. కావేరమ్మపేటలోని గచ్చుబావి -
కనులపండువగా ఆదిశిలావాసుడి కల్యాణం
ఆదిశిలావాసుడి కల్యాణం నిర్వహిస్తున్న వేదపండితులు మల్దకల్: ఆదిశిలా క్షేత్రమైన స్వయంభూ లక్ష్మీవెంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం స్వామి వారి కల్యాణోత్సవాన్ని వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య ఘనంగా నిర్వహించారు. ముందుగా స్వామివారి ఉత్సవమూర్తులకు వేదపండితులు మధుసూధనాచారి, రమేషాచారి, రవిచారి, శశాంక్ ప్రత్యేక పూజలు నిర్వహించి భాజాభజంత్రీలు, మేళతాళాలతో కల్యాణ మండపానికి తీసుకువచ్చారు. అనంతరం మహాహోమం నిర్వహించి స్వామి వారి కల్యాళణ ఘట్టాన్ని నిర్వహించారు. ఈ వేడుకను తిలకించేందుకు భక్తులు పెద్దసంఖ్యలో హాజరుకాగా.. వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా, శనివారం కావడంతో ఆలయంలో భక్తులతో కిక్కిరిసింది. అర్చకులు స్వామి వారికి అభిషేకాలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ప్రహ్లాదరావు, ఈఓ సత్యచంద్రారెడ్డి, నాయకులు మధుసూదన్రెడ్డి, సీతారామిరెడ్డి, రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. -
ఇన్స్ట్రాగాంలో వచ్చి.. వాట్సప్లో మెరిసి
కల్వకుర్తి రూరల్: ఒకానొక సందర్భంలో కల్వకుర్తి పట్టణ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించిన సుభాష్నగర్లోని గచ్చుబావి కాలక్రమేణా శిథిలావస్థకు చేరింది. ఈ బావి దుస్థితిని పట్టణానికి చెందిన యువకుడు కల్వ కార్తీక్ ‘కల్వకుర్తి డైరీ ఇన్స్ట్రాగాం’ పేజీలో కళ్లకు కట్టినట్లు వీడియో తీసి పోస్టు చేయడంతో పెద్దఎత్తున స్పందన లభించింది. వందలాది మంది యువకులు ముందుకు వచ్చి వాట్సప్ గ్రూపు ఏర్పాటు చేసి ‘సేవ్ గచ్చుబావి కమిటీ’ పేరిట చైతన్యం చేశారు. దీంతో గత 52 రోజులుగా శివాలయం మెట్ల బావి మరమ్మతు చేపట్టారు. మేముసైతం అంటూ మహిళలు శ్రమదానంలో పాల్గొని తమవంతు సహకారం అందించారు. అయితే బావి లోతు తీయడానికి ఇబ్బందిగా మారడంతో ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సైతం మరమ్మతుకు నిధులు మంజూరు చేయించి పెద్ద క్రేన్ ఏర్పాటు చేయించారు. దీంతో వేగంగా పనులు పూర్తి కావొస్తున్నాయి. శివరాత్రి నాటికి శివాలయం, గచ్చు బావికి పూర్వవైభవం తీసుకువచ్చేలా కృషిచేస్తున్నారు. శివాలయంలోని శివలింగానికి బావినీటితో అభిషేకం చేసేందుకు సేవ్ గచ్చుబావి కమిటీ సభ్యులు సంసిద్ధులు అవుతున్నారు. సేవ్ గచ్చుబావి పేరుతో మొదలుపెట్టిన కార్యక్రమం విజయవంతం కావడంతో యువకుల శ్రమ ఫలించనుంది. యువత తలుచుకుంటే సాధ్యం కానిది ఏదీ లేదని నిరూపించారు. ఇందుకు సామాజిక మాధ్యమాల ద్వారా చేసిన చైతన్యం కూడా గచ్చుబావి పూర్వవైభవానికి ఒక మెట్టులా ఉపయోగపడింది అనేది అక్షర సత్యం. -
వేరుశనగ క్వింటా రూ.7,602
గద్వాల వ్యవసాయం: గద్వాల మార్కెట్ యార్డుకు శుక్రవారం 439 క్వింటాళ్ల వేరుశనగ వచ్చింది. గరిష్టం రూ.7602, కనిష్టం రూ.4276, సరాసరి రూ.6399 ధరలు లభించాయి. అలాగే, 16 క్వింటాళ్ల వరి (సోన) రాగా గరిష్టం, కనిష్టం, సరాసరి రూ. 2309 ధర పలికింది. 28 క్వింటాళ్ల కంది రాగా, గరిష్టం రూ. 6630, కనిష్టం రూ. 2209, సరాసరి రూ. 6489 ధరలు వచ్చాయి. జాతీయ స్థాయి కబడ్డీ పోటీల శిక్షణకు క్రీడాకారులు గద్వాలటౌన్: ఈ నెల 26వ తేదీ నుంచి 30వ తేదీ వరకు విజయవాడలో జరిగే జాతీయ స్థాయి జూనియర్ కబడ్డీ పోటీల శిక్షణ క్యాంపునకు గద్వాలకు చెందిన క్రీడాకారులు అజిత్, మహేష్ ఎంపికయ్యారని జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు డీకే స్నిగ్దారెడ్డి, ప్రధాన కార్యదర్శి నర్సింహ తెలిపారు. ఈ నెల 5వ తేది నుంచి 7వ తేదీ వరకు మహబూబ్నగర్ జిల్లాలో జరిగిన రాష్ట్రస్థాయి జూనియర్ బాలుర కబడ్డీ పోటీల్లో జిల్లా జట్టు తరపున అజిత్, మహేష్ పాల్గొని అత్యంత ప్రతిభ కనబర్చారు. రాష్ట్రస్థాయి పోటీలలో మన జిల్లా క్రీడాకారులు అజిత్, మహేష్ క్రీడా నైపుణ్యాన్ని గుర్తించి సెలక్టర్లు జాతీయ స్థాయి పోటీల శిక్షణా శిబిరాన్నికి ఎంపిక చేశారు. వీరు రెండు వారాల పాటు హైదరాబాద్లో జరిగే శిక్షణలో పాల్గొననున్నారు. వీరు ఎంపిక పట్ల జిల్లా కబడ్డీ అసోసియేషన్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి మానవపాడు: విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని డీఈఓ విజయలక్ష్మి సూచించారు. శుక్రవారం మండలంలోని కేజీబీవీ, మండల పరిషత్ పాఠశాలలను తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పాఠశాలలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేయాలని, కేజీబీవీ భవన నిర్మాణం నాణ్యతతో నిర్మించాలని కాంట్రాక్టర్ను ఆదేశించారు. పాఠశాలలో రికార్డులను పరిశీలించి విద్యార్థుల సమర్థ్యాలను మెరుగుపర్చాలని ఉపాధ్యాయులకు సూచించారు. కార్యక్రమంలో ఎంఈఓ శివప్రసాదు, ఎస్ఓచ జ్యోతి, ఉపాధ్యాయులు, విద్యార్థినులు పాల్గొన్నారు. రేపు బీచుపల్లిలో సీతారాముల కల్యాణం ఎర్రవల్లి: బీచుపల్లి పుణ్యక్షేత్రంలోని కోదండరామస్వామి ఆలయంలో పునర్వసు నక్షత్రం సందర్భంగా ఆదివారం సీతారాముల కల్యాణన్ని నిర్వహించనున్నట్లు ఆలయ మేనేజర్ సురేందర్ రాజు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి జిల్లా నుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరై రాములోరి కల్యాణ వేడుకను కనులారా తిలకించాలని ఆయన కోరారు. ఇథనాల్ ఫ్యాక్టరీ స్తంభాల తరలింపు రాజోళి: మండలంలోని పెద్దధన్వాడ గ్రామంలో ఇథనాల్ ఫ్యాక్టరీపై జరిగిన రగడ తెలిసిందే. ఫ్యాక్టరీ నిర్మించవద్దని ఆయా గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున పోరాటం చేశారు. కొద్ది రోజుల ఫ్యాక్టరీ విషయం తెరపైకి రాకపోయినప్పటికీ ఈ మధ్యకాలంలో ఫ్యాక్టరీ యాజమాన్యం తమ నిర్ణయం మార్చుకుందని, ఏపీకి తరలి వెళ్లిపోయిందని సోషల్ మీడియాలో ప్రచారాలు వస్తున్నాయి. వాటికి బలం చేకూరుస్తున్నట్లుగా శుక్రవారం ఫ్యాక్టరీకి సంబందించిన విద్యుత్ స్తంభాలను అక్కడి నుండి తరలించారు. క్రేన్ల సహాయంతో ట్రాక్టర్లపైకి ఎత్తి అక్క డి నుండి తరలించడంతో చుట్టు పక్కల గ్రా మాల వారు కూడా ఫ్యాక్టరీ ఇక్కడ నిర్మించడం లేదని భావిస్తూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
యాసంగికి సరిపడా యూరియా నిల్వలు
అలంపూర్: యాసంగి సీజన్కు సంబంధించి పంట సాగుకు సరిపడా యూరియా అందుబాటులో ఉందని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సక్రియానాయక్ తెలిపారు. అలంపూర్ మున్సిపాలిటిలోని ఆగ్రోస్ సేవా కేంద్రాన్ని ఆయన శుక్రవారం పరిశీలించారు. అనంతరం కేంద్రంలోని యూరియాను, రికార్డులను పరిశీలించారు. ఈమేరకు ఆయన మాట్లాడుతూ.. అలంపూర్ మండలంలోని రైతులకు యాసంగి పంట సాగుకు కావాల్సిన యూరియా అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. ఆగ్రోస్ సేవా కేంద్రంలో ప్రస్తుతం 660 బ్యాగుల యూరియా అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. యూరియా అవసరం ఉన్న రైతులు పట్టాదారు పుస్తకం, ఆధార్ కార్డులతో ఎరువుల దుకాణాలకు రావాలని సూచించారు. వాటిని పరిశీలించి యూరియా ఇవ్వడం జరుగుతుందన్నారు. యూరియా కోసం రైతులు అందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అవసరం ఉన్న రైతులు అందుబాటులో ఉన్న యూరియాను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అదేవిధంగా ఫర్టిలైజర్ దుకాణాలను ఆయన తనిఖీ చేశారు. దుకాణాల్లో రికార్డులను పరిశీలించడం జరిగింది. వీరితోపాటు మండల వ్యవసాయ శాఖ అధికారి నాగార్జున్ రెడ్డి తదితరులు ఉన్నారు. -
తాలు పేరిట.. నిలువు దోపిడీ
ఖరీఫ్లో రైస్ మిల్లర్ల అక్రమార్జన రూ.45 కోట్లు ●నాలుగు క్వింటాళ్ల ధాన్యం ఏమైందని డ్రైవర్ను నిలదీస్తే నాకేమీ తెలియదంటూ రైస్ మిల్లు యజమాని ఫోన్ నంబర్ ఇచ్చాడు. ఆయనకు ఫోన్ చేయగా.. వేబ్రిడ్జి తూకం అంతే వచ్చిందని చెప్పి.. దురుసుగా మాట్లాడుతూ ఫోన్ కట్ చేశాడు. కొనుగోలు కేంద్రంలో బస్తాకు కిలోన్నర పైన అదనంగా తూకం వేశారు. ఇప్పుడు మళ్లీ పది బస్తాల కోత పెట్టారు. అధికారులకు చెప్పినా పట్టించుకుంటలేరు. – ఆంజనేయరెడ్డి, శివాజీ, అప్పంపల్లి గ్రామం, మరికల్ మండలం, నారాయణపేట జిల్లా అన్నదాతలను రైస్ మిల్లర్లు నిలువు దోపిడీ చేస్తున్నారు. మట్టి, తాలు పేరిట కోతలపై కోతలు పెడుతూ వారి కష్టాన్ని అప్పనంగా సొమ్ము చేసుకుంటున్నారు. అంగీకరించని రైతులను దారికి తెచ్చుకునే వరకూ ముప్పుతిప్పలు పెడుతున్నారు. ఇలా ఈ వానాకాలం సీజన్లో ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి ఇప్పటివరకు కోట్లాది రూపాయలు దండుకున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎవరూ దీని గురించి పట్టించుకోకపోవడంతో వారు ఆడిందే ఆట.. పాడిందే పాటగా సాగిన దందాపై ‘సాక్షి’ గ్రౌండ్ రిపోర్ట్.. – సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నిర్వాహకులు మట్టి, తాలు, తేమ శాతం అన్ని పరిశీలించి.. నిబంధనల ప్రకారం ఉంటేనే తూకం వేస్తున్నారు. లెక్క ప్రకారం బస్తాకు 40 కిలోల ధాన్యం నింపాలి. బస్తా బరువుతో కలిపి 40.600 కిలోలు తూకం వేయాలి. అయితే తాలు, మట్టి, బస్తా బరువు పేరిట ఇందుకు అదనంగా కిలో నుంచి రెండు కిలోల వరకు ధాన్యం తూకం వేసి మిల్లులకు పంపిస్తున్నారు. ఈ వ్యవహారం ఆయా జిల్లాల్లో ఒక్కోచోట ఒక్కోలా సాగుతోంది. రైతులకు ఫోన్లు చేసి మరీ.. కొనుగోలు కేంద్రాల్లో క్వింటాల్కు 3 నుంచి 4 కిలోలు అదనంగా తూకం వేస్తున్నారు. ఈ ధాన్యాన్ని వాహనాల్లో మిల్లులకు తరలించగా.. అక్కడ మిల్లర్లు కొందరు మళ్లీ దోపిడీకి తెగబడ్డారు. ఆ వాహనంలో ఏయే రైతులకు సంబంధించిన ధాన్యం ఉందో.. వారికి ఫోన్లు చేస్తున్నారు. తాలు ఎక్కువగా ఉంది.. క్వింటాల్కు కిలో నుంచి రెండు కిలోల కోత తప్పదు.. అలా అయితేనే కొనుగోలు చేస్తామని చెబుతున్నారు. కొన్ని చోట్ల మిల్లుల్లో కోత పెట్టకుండా నేరుగా సెంటర్లలోనే క్వింటాల్కు 4 నుంచి 5 కిలోల వరకు కోత పెడుతున్నట్లు తెలుస్తోంది. ఒప్పుకోకుంటే.. అన్లోడ్ చేయకుండా ఆయా ప్రాంతాల్లో అనధికారికంగా క్వింటాల్ ధాన్యంలో సుమారు 4 నుంచి 6 కిలోల వరకు తరుగు తీస్తూ దందాకు తెగబడ్డారు. రైతులు ఒప్పుకుంటేనే ట్రక్షీట్లు తిరిగి ఇస్తున్నారు. ట్రక్ షీట్లు తిరిగి ఇస్తేనే బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమచేసే అవకాశం ఉండగా.. దీన్ని ఆసరాగా చేసుకుని కోతకు అంగీకరించని రైతుల ధాన్యాన్ని అన్లోడ్ చేయకుండా తిరిగి సెంటర్లకు పంపిస్తున్నారు. ఇలా ఇబ్బందులకు గురిచేయడం ద్వారా వారికి విధి లేని పరిస్థితులు కల్పిస్తూ.. దారిలోకి తెచ్చుకుంటున్నారు. కిలోకు రూ.24 చొప్పున నష్టం.. వానాకాలం సీజన్కు సంబంధించి ఉమ్మడి జిల్లాలో 1,049 ప్రభుత్వ కేంద్రాల్లో మొత్తంగా 13,24,145 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో ఇప్పటి వరకు 6,16,398 మె.ట., కొనుగోలు చేశారు. ఏ గ్రేడ్ ధాన్యం క్వింటాల్కు మద్దతు ధర రూ.2,389 పలుకుతోంది. క్వింటాల్కు 3 కిలోల చొప్పున కోత పెడితే రైతుకు రూ.72 నష్టం వాటిల్లుతోంది. ఈ లెక్కన ఇప్పటి వరకు కొనుగోలు చేసిన 61,63,980 క్వింటాళ్ల ధాన్యానికి రూ.44.38 కోట్లు నష్టపోయారు. తక్కువలో తక్కువ 3 కిలోలు తీసుకుంటేనే ఈ పరిస్థితి ఉంది. సగటున 4 కిలోలు వేసుకున్నా.. మిల్లర్లు తాలు పేరిట దోచుకున్న ధాన్యం విలువ రూ.60 కోట్లు ఉంటుందని రైతు సంఘాల నాయకులు అంచనా వేస్తున్నారు. ధాన్యం కొనుగోళ్ల వివరాలు (మెట్రిక్ టన్నుల్లో).. జిల్లా కేంద్రాలు కొనుగోళ్ల లక్ష్యం కొన్నది మహబూబ్నగర్ 195 2,00,000 1,25,219 నాగర్కర్నూల్ 236 2,57,145 71,779 జోగుళాంబ గద్వాల 87 1,25,000 83,933 నారాయణపేట 117 3,12,000 1,29,467 వనపర్తి 414 4,30,000 2,06,000 తాలు పేరిట దోపిడీకి సంబంధించి ఇటు సెంటర్లు, అటు మిల్లుల నిర్వాహకులు కుమ్మకై ్కనట్లు తెలుస్తోంది. లేకుంటే తమకేం మిగులుతుందని పలు సెంటర్ల నిర్వాహకులు రైతులతో బాహాటంగానే మాట్లాడుతున్నారు. మరోవైపు మిల్లులకు తరలించిన తర్వాత అక్కడ కోత పెట్టడంపై పలువురు మార్కెటింగ్ అధికారులను ప్రశ్నిస్తే.. తాలు ఉంటే ఏంచేస్తారని మిల్లర్లను వెనుకేసుకురావడం అనుమానాలకు తావిస్తోంది. రైతుల కష్టాన్ని దోచుకుంటుంటే.. అధికారులు చూస్తూ మిన్నంకుండిపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. క్వింటాల్కు 3 కిలోల కోత వేసుకుంటేనే ఈ విలువ ఒక్కో చోట 4, 5 కేజీల వరకు తరుగు తొలుత సెంటర్లలో.. ఆ తర్వాత మళ్లీ మిల్లుల్లో.. అంగీకరించకుంటే ధాన్యం లారీ వెనక్కే.. మిల్లుల నిర్వాహకులకే అధికారుల వత్తాసు ట్రక్షీట్ చూపిస్తూ ఆందోళన చేస్తున్న ఈ రైతులు నారాయణపేట జిల్లా మరికల్ మండలం అప్పంపల్లి గ్రామానికి చెందినవారు. గతేడాది నవంబర్ 25న ఈ గ్రామానికి చెందిన ఏడుగురు రైతుల ధాన్యాన్ని కొనుగోలు కేంద్రంలో తూకం చేశారు. మొత్తం 796 ధాన్యం బస్తాలకు 318.40 క్వింటాళ్లుగా లెక్క తేలింది. ధన్వాడ సొసైటీ నుంచి లారీ రాగా లోడ్ చేశారు. సొసైటీ కార్యదర్శి వెంకట్రాములు లోడ్ చేసిన లారీని నారాయణపేట మండలం కొల్లంపల్లి మిల్లుకు తీసుకెళ్లాలని డ్రైవర్కు ట్రక్షీట్ రాసిచ్చాడు. లారీ డ్రైవర్ ఒప్పుకోకుండా కోస్గి మహాలక్ష్మి రైస్ మిల్లుకు రాయించుకుని తీసుకెళ్లాడు. అక్కడ అన్లోడ్ అయిన తర్వాత లారీ డ్రైవర్ 29న తిరిగి వచ్చి ట్రక్షీట్ రైతులకు ఇచ్చాడు. దాన్ని చూసి వారు కంగుతిన్నారు. 796 బస్తాలకు 786 బస్తాలు వచ్చినట్లు ఉంది. పది బస్తాలు.. సుమారు 4 క్వింటాళ్ల ధాన్యం తక్కువగా చూపడంతో రైతులు ఆందోళనకు దిగారు. -
అందరి సహకారంతో జిల్లాకు గుర్తింపు
గద్వాలటౌన్: అందరి సహకారంతో జిల్లాకు గుర్తింపు వచ్చిందని కలెక్టర్ సంతోష్ అన్నారు. శుక్రవారం తన ఛాంబర్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్, తెలంగాణ తహసీల్దార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రూపొందించిన 2026 నూతన సంవత్సర క్యాలెండర్ను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2025లో అధికారులు, సిబ్బంది సమన్వయంతో ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు విజయవంతమయ్యాయని, అదే స్ఫూర్తితో 2026లో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆయా యూనియన్ల నాయకులు వీరభద్రప్ప, కరుణాకర్, అజిత్కుమార్ తదితరులు పాల్గొన్నారు. యూటీఎఫ్ క్యాలెండర్ ఆవిష్కరణ... యూటీఎఫ్ నూతన సంవత్సర క్యాలెండర్, డైరీని కలెక్టర్ ఆవిష్కరించారు. క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని యూటీఎఫ్ ఉపాధ్యాయ సంఘం క్యాలెండర్లను ఆవిష్కరించారు. అక్షరాస్యతలో జిల్లాను అగ్రగామిగా నిలపాలని, విద్యా అభివృద్ధిలో ఉపాధ్యాయులు భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. అంకితభావంతో విద్యార్థులకు మెరుగైన విద్యాబోధన అందించాలని, పదిలో మంచి ఫలితాలు తీసుకరావాలని సూచించారు. కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు రమేష్, ప్రధాన కార్యదర్శి గోపాల్, నాయకులు కుమార్నాయుడు, వెంకటరమణ, బీసన్న, తిమ్మప్ప, రాజశేఖర్, చంద్రకాంత్, రాముడు తదితరులు పాల్గొన్నారు. -
బాధ్యతగా విధులు నిర్వర్తించాలి
గద్వాల క్రైం: పోలీస్ సిబ్బంది బాధ్యతగా విధులు నిర్వర్తించాలని, సమస్యాత్మక కేసులను సాంకేతికతను ఉపయోగించి పరిష్కరించాలని ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. గురువారం ఎస్పీ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకల సందర్భంగా కేక్ కట్ చేసి సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడారు. పెండింగ్ కేసులపై నిర్లక్ష్యం వహించొద్దని, నిందితులకు శిక్ష పడేలా చార్జిషీట్ దాఖలు చేయాలని, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నిఘా, గస్తీ ముమ్మరం చేయాలన్నారు. ప్రజలతో స్నేహపూర్వకంగా మెలగాలని, భూ సంబంధ కేసులపై జోక్యం వద్దన్నారు. అనంతరం ఎస్పీకి పలువురు సిబ్బంది నూతన సంవత్సర శుభకాంక్షలు తెలయజేశారు. కార్యక్రమంలో ఏఎస్పీ శంకర్, డీఎస్పీ మొగిలయ్య, నరేందర్రావు, సీఐలు శ్రీను, టాటబాబు, రవిబాబు, ఎస్ఐలు సిబ్బంది తదితరులు ఉన్నారు. ఎస్పీ శ్రీనివాసరావు 2013 బ్యాచ్కు చెందిన ఐపీఎస్ (జూనియర్ జిల్లా అడ్మిని స్ట్రేటివ్ గ్రేడ్) సెలక్షన్ గ్రేడ్కు పదోన్నతి కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులులు జారీ చేసింది. నేటి నుంచి ఎస్పీ సెలక్షన్ గ్రేడ్ హోదాలో విధులు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఎస్పీని జిల్లా పోలీసుశాఖ సిబ్బంది ప్రత్యేకంగా ఆభినందించారు. -
తెగ తాగేశారు..!
● న్యూ ఇయర్ వేడుకల్లో మద్యం ప్రియుల జోష్ ● 24 గంటల్లో రూ.కోటిన్నర మద్యం అమ్మకాలు గద్వాలటౌన్: పాత ఏడాదికి వీడ్కోలు పలుకుతూ.. నూతన సంవత్సరానికి స్వాగతం పలికే సంబరాలు అంబరాన్నంటాయి. అర్ధరాత్రి యువత బాణసంచా కాలుస్తూ సందడి చేశారు. మద్యం కొనుగోళ్లు మాత్రం రికార్డు స్థాయిలో సాగాయి. న్యూ ఇయర్ వేడుకల్లో మందుబాబులు పండుగ చేసుకున్నారు. తాగడం మానేద్దాం అని అనుకునే వారు.. బీరు లేని సంబరమేముందని భావించే వారు.. మద్యం ప్రియులు అంతా కలిసి జిల్లా పరిధిలో రూ.లక్షల్లో ఖర్చు చేశారు. ఒక్కరోజులోనే రూ. కోటిన్నర వరకు మద్యం అమ్మకాలు జరిగాయంటే ఎంత తాగేశారో తెలుసుకోవచ్చు. బుధవారం రాత్రి గద్వాల పట్టణంతో పాటు మండల కేంద్రాల్లోని అనేక ప్రాంతాలు మందుబాబులతో కిటకిటలాడాయి. నిబంధనలన్ని తుంగలోకి తొక్కి కొంత మంది అర్ధరాత్రి దాటిన తరువాత కూడా రహస్య కేంద్రాల్లో విక్రయాలు చేశారు. ఎకై ్సజ్ శాఖ రాబడులకు ఢోకా లేకుండా జోరుగా వ్యాపారం జరిగింది. మద్యం మత్తులో యువత రోడ్లపైకి చేరి చిందులేస్తూ, ఇతరులకు ఇబ్బందులను సృష్టించారు. పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పట్టణంలో ముమ్మరంగా గస్తీ నిర్వహించారు. -
5 నుంచి పీడీఎస్యూ రాష్ట్ర మహాసభలు
గద్వాలటౌన్: వరంగల్ జల్లా కేంద్రంలో ఈ నెల 5 నుంచి 7వ తేదీ వరకు జరిగే పీడీఎస్యూ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని పీడీఎస్యూ జిల్లా అధ్యక్షుడు హలీంపాష కోరారు. గురువారం రాష్ట్ర మహాసభల పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..విద్యారంగ సమస్యల పరిష్కారంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆరోపించారు. గురుకులాలు, వసతి గృహాలలో నిత్యం ఫుడ్పాయిజన్ జరుగుతున్నా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. కార్యక్రమంలో పీడీఎస్యూ నాయకులు ఈశ్వర్, బుడ్డన్న, శ్రావ్య, దివ్య, శిరీషా, విజయ్, కల్పన, నర్సింహా పాల్గొన్నారు. -
60 డివిజన్లు, 316 వార్డులు.. 798 పీఎస్లు
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: పుర పాలికల ఎన్నికలకు సంబంధించి తొలి కసరత్తు పూర్తయింది. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు అధికారులు కార్పొరేషన్/మున్సిపాలిటీల్లో వార్డుల వారీగా పోలింగ్ సెంటర్లు ఖరారు చేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల ఓటర్లను ప్రమాణికంగా తీసుకుని వార్డుల వారీగా ఫొటోలతో కూడిన ముసాయిదా ఓటరు లిస్ట్ను విడుదల చేశారు. ఈ మేరకు ఆయా బల్దియా, రెవెన్యూ, కలెక్టరేట్ కార్యాలయాల నోటీస్ బోర్డుల్లో జాబితా ప్రతులను అతికించారు. ఈ నెల నాలుగు వరకు అభ్యంతరాలను స్వీకరించనున్నారు. ఐదో తేదీన ఆయా పురపాలికల్లో స్థానిక, ఆరున జిల్లా స్థాయిలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం కానున్నారు. ఈ నెల పదిన తుది ఓటరు జాబితాను విడుదల చేయనున్నారు. ఆ తర్వాత ఎప్పుడైనా ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్తో కలుపుకుని మొత్తం 21 పురపాలికలు ఉన్నాయి. వీటిలో మహబూబ్నగర్ జిల్లాలోని జడ్చర్ల, నాగర్కర్నూల్ జిల్లాలోని అచ్చంపేట మున్సిపాలిటీ మినహా మిగిలిన వాటికి ఎన్నికలు జరగనున్నాయి. మహబూబ్నగర్ కార్పొరేషన్ పరిధిలో 60 డివిజన్లు, మిగతా 18 మున్సిపాలిటీల్లో 316 వార్డులు ఉండగా.. మొత్తంగా 798 పోలింగ్ కేంద్రాలను ఖరారు చేశారు. మహబూబ్నగర్ కార్పొరేషన్తో పాటు 18 మున్సిపాలిటీల పరిధిలో మొత్తంగా 6,19,423 మంది ఓటర్లు ఉన్నట్లు పురపాలికల అధికారులు ముసాయిదా జాబితాను వెల్లడించారు. ఇందులో పురుషులు 3,04,294, మహిళలు 3,15,094 కాగా.. ఇతరులు 35 మంది ఉన్నారు. అన్ని పురపాలికల్లోనూ పురుషులతో పోలిస్తే మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. ● మహబూబ్నగర్ జిల్లాలో మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్తో పాటు దేవరకద్ర, భూత్పూర్ మున్సిపాలిటీలు ఉన్నాయి. వీటి పరిధిలో మొత్తం 82 డివిజన్లు/వార్డులు ఉన్నాయి. ఈ మేరకు 223 పోలింగ్ కేంద్రాలను కేటాయించారు. మొత్తంగా 2,19,989 మంది ఓటర్లలో మహిళలు 1,11,416, పురుషులు 1,08,559 మంది కాగా.. ఇతరులు 14 మంది ఉన్నారు. ● వనపర్తి జిల్లాలో ఐదు మున్సిపాలిటీలు ఉన్నాయి. మొత్తం 80 వార్డులు ఉండగా.. 162 పోలింగ్ కేంద్రాలను ఖరారు చేశారు. వీటి పరిధిలో మొత్తంగా 1,18,074 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 57,828, మహిళలు 60,238, ఇతరులు ఎనిమిది మంది ఉన్నారు. ● జోగుళాంబ గద్వాల జిల్లాలో నాలుగు మున్సిపాలిటీల్లో మొత్తం 77 వార్డులు ఉండగా.. 145 పోలింగ్ సెంటర్లు కేటాయించారు. అదేవిధంగా మొత్తంగా 1,08,619 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 52,894, మహిళలు 55,713 మంది కాగా.. ఇతరులు 12 మంది ఉన్నారు. ● నారాయణపేట జిల్లాలో నాలుగు మున్సిపాలిటీల పరిధిలో 72 వార్డులు ఉన్నాయి. ఈ మేరకు 138 పోలింగ్ కేంద్రాలను కేటాయించారు. మొత్తంగా 91,859 మంది ఓటర్లలో 44,909 మంది పురుషులు, 46,949 మంది మహిళలు.. ఇతరులు ఒకరు ఉన్నారు. ● నాగర్కర్నూల్ జిల్లాలో మూడు మున్సిపాలిటీల పరిధిలో 65 వార్డులు ఉండగా.. 130 పోలింగ్ కేంద్రాలను ఖరారు చేశారు. అదేవిధంగా 80,882 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 40,104 మంది కాగా.. మహిళలు 40,778 మంది ఉన్నారు. మొత్తం 60 డివిజన్లు.. 316 వార్డుల వారీగా వెల్లడి 2023 అసెంబ్లీ ఎన్నికల ఓటర్లే ప్రామాణికంగా రూపకల్పన బల్దియా, రెవెన్యూ, కలెక్టరేట్ కార్యాలయాల్లో జాబితా ప్రదర్శన 10న ఫైనల్ లిస్ట్.. ఆ తర్వాత ఎప్పడైనా ఎన్నికల షెడ్యూల్ -
ఆనందోత్సాహాలతో స్వాగతం
● కేక్లు కట్ చేసి సంబరాలు ● అర్ధరాత్రి వీధుల్లో యువత నృత్యాలు గద్వాలటౌన్: కొత్త ఆశలు.. ఆశయాలు, ఆలోచనలు.. కొత్త లక్ష్యాలు.. గమ్యాలు.. కోటి కాంతులతో నూతన సంవత్సరానికి ఆనందోత్సాహాలతో స్వాగతం పలికారు. జిల్లా ప్రజలు బుధవారం రాత్రి నుంచి గురువారం అంతా సంబరాలను ఘనంగా జరుపుకొన్నారు. కేరింతలతో ‘విష్యు హ్యాపీ న్యూ ఇయర్’ అంటూ పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఇళ్ల ముంగిట రంగుల హరివిల్లులుగా రంగవళ్లికలను అలంకరించారు. ఇళ్లు, యువజన సంఘాలు, ప్రైవేటు కార్యాలయాల్లో కేక్ కట్ చేశారు. నూతన సంవత్సరం వేడుకలను పురస్కరించుకొని పట్టణ శివారు ప్రాంతాల్లో యువకులు మ్యూజికల్ నైట్ ఏర్పాటు చేసుకున్నారు. ఆయా ఏర్పాట్లులో యువత పెద్ద సంఖ్యలో తరలివచ్చి చిందులేస్తూ నృత్యాలు చేశారు. కిక్కిరిసిన ఆలయాలు నూతన సంవత్సరంలో అంతా మంచి జరగాలని కోరుకుంటూ భక్తులు వేడుకున్నారు. గురువారం పట్టణంలోని పలు ఆలయాలు భక్తులతో కిక్కిరిశాయి. నూతన సంవత్సర వేడుకలతో తెల్లవారుజామునుంచే పట్టణంలోని ఆలయాలు కిటకిటలాడాయి. విశేషపూజలు, ఆరాధనలు, అభిషేకాలు, పారాయణాలు జరిపారు. స్థానిక కోటలోని చెన్నకేశవస్వామి, రాఘవేంద్రస్వామిమఠం, కృష్ణమందిరం, సాయిబాబ ఆలయం, కన్యకాపరమేశ్వరి, సంతాన వేణుగోపాలస్వామి, అయ్యప్పస్వామి, నల్లకుంట శివాలయం తదితర ఆలయాల్లో విశేష పూజలు నిర్వహించారు. అయ్యప్ప పడిపూజలు, పల్లకి సేవలతో భక్తులు పరవశించిపోయ్యారు. కొత్త సంవత్సరంలో విజయం చేకూర్చాలని కోరుకున్నారు. కుటుంబ సమేతంగా స్వామివార్లను దర్శించుకున్నారు. చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు కోటి ఆశలతో 2026 నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ క్రైస్తవులు ప్రభువును ప్రార్థించారు. గురువారం ఉదయం పట్టణంలోని పలు చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. స్థానిక ఎంబీ మిస్పా చర్చిలో సండే స్కూల్ విద్యార్థులు కేక్ కట్ చేసి నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా చర్చిలలో పాస్టర్లు శాంతి సందేశాలను బోధించారు. -
కష్టపడి చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలి
గద్వాల: ప్రభుత్వం అందిస్తున్న అన్ని రకాల వసతులను సద్వినియోగం చేసుకుని కష్టపడి చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలని కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. గురువారం ఆయన జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఎస్సీ సంక్షేమ బాలుర వసతిగృహం, ఆనందనిలయాలను సందర్శించారు. ఈసందర్భంగా ఆయన హాస్టల్ విద్యార్థులతో కలిసి నూతన సంవత్సర వేడుకలను కేక్ కట్ చేసి జరుపుకొన్నారు. విద్యార్థులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆయన విద్యార్థులతో ముట్లాడి వారి వివరాలు తెలుసుకున్నారు. మీరు చాలా దూరప్రాంతాల నుంచి తల్లిదండ్రులను వదిలి ఒక్కడికి వచ్చి చదువుకుంటున్నారని, మీఉజ్వల భవిష్యత్తు కోసం ప్రభుత్వం అన్ని రకాల వసతి, నాణ్యమైన భోజనం, విద్యను అందిస్తున్నట్లు తెలిపారు. వీటిని ప్రతిఒక్కరు కూడాసద్వినియోగం చేసుకుని ఉన్నత స్థాయికి చేరుకోవాలన్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ కూడా ప్రభుత్వ పాఠశాల నుంచే వచ్చి ఐఏఎస్ సాధించి ప్రస్తుతం ప్రభుత్వంలో ఉన్నత స్థానంలో ఉన్నారని విద్యార్థులకు వివరించారు. ఏదైన సాధించాలంటే గొప్ప కలలు కనాలని వాటిని సాధించేందుకు క్రమశిక్షణతో నిరంతరం కష్టపడి చదువుకోవాలని తద్వారా నిర్ధేశించుకున్న గొప్ప కలలు సాకారమవుతాయని సూచించారు. అదేవిధంగా విద్యతో పాటు ప్రతిఒక్కరు శారీరక ఆరోగ్యం కూడ ముఖ్యమని ఇందుకోసం ప్రతిరోజూ విద్యార్థులందరూ వ్యాయమం చేయాలని సూచించారు. సాల్కర్షిప్ నమోదులో రాష్ట్రంలో మన జిల్లా 5వ స్థానంలో నిలిచిందన్నారు. పదో తరగతిలో మంచి ఫలితాలు సాధించిన విద్యార్థులకు తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకల్లో ప్రత్యేకంగా సత్కరిస్తామన్నారు. కార్యక్రమంలో ఎస్సీ సంక్షేమశాఖ జిల్లా అధికారి నుషిత, బీసీ సంక్షేమ శాఖ జిల్లా అధికారి అక్బర్పాషా, వార్డెన్లు శ్రీను, మధు, రామకృష్ణ, హాస్టల్ విద్యార్థులు పాల్గొన్నారు. -
డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేయాలి
అయిజ: పట్టణంలోని పీహెచ్సీలో డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేయాలని బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు రామచంద్రారెడ్డి డిమాండ్ చేశారు. గురువారం పట్టణంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బీజేపీ నాయకులు సందర్శించారు. ఈ సందర్భంగా రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. మండలంలో మొత్తం 47 మంది కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారన్నారు. వారందరూ గద్వాల ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి డయాలసిస్ చేయించుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని మండిపడ్డారు. రోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని వాపోయారు. దీర్థకాలిక రోగులపై కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని ఆరోపించారు. అయిజ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వెంటనే డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేయని పక్షంలో ప్రజల తరఫున ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు భగత్రెడ్డి, లక్ష్మణాచారి, ఖుషి, డయాలసిస్ బాధితులు పాల్గొన్నారు. వేరుశనగ క్వింటా రూ.7,779 గద్వాల వ్యవసాయం: గద్వాల మార్కెట్ యార్డుకు గురువారం 81 క్వింటాళ్ల వేరుశనగ వచ్చింది. గరిష్టం రూ.7779, కనిష్టం రూ.3419, సరాసరి రూ.7799 ధరలు లభించాయి. అలాగే, 15 క్వింటాళ్ల వరి (సోన) రాగా, గరిష్టం రూ. 2409, కనిష్టం రూ. 2309, సరాసరి ధరలు రూ. 2409 వచ్చాయి. 28 క్వింటాళ్ల కంది రాగా గరిష్టం రూ. 6509, కనిష్టం రూ. 5259, సరాసరి రూ. 6509 ధరలు లభించాయి. మన్యంకొండకు పాదయాత్ర స్టేషన్ మహబూబ్నగర్: ధనుర్మాసాన్ని పురస్కరించుకొని నగర ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో గురువారం మన్యంకొండకు మహాపాదయాత్ర చేపట్టారు. జిల్లాకేంద్రం బ్రాహ్మణవాడిలోని శ్రీవాసవీ కన్యకాపరమేశ్వరి దేవాలయం నుంచి ప్రారంభమైన పాదయాత్ర బండమీదిపల్లి, ధర్మాపూర్ మీదుగా మన్యంకొండ దేవస్థానం వరకు నిర్వహించారు. వందలాది మంది భక్తులు గోవిందనామ, హరినామ సంకీర్తనలతో పాదయాత్ర చేపట్టారు. అనంతరం భక్తులు మన్యంకొండ శ్రీవెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. వాసవీ ఆలయ ప్రధాన అర్చకులు గొండ్యాల రాఘవేంద్రశర్మ మాట్లాడుతూ ఇలాంటి యాత్రలు చేయడం వల్ల హిందువుల్లో ఐక్యతను పెంపొందిస్తాయన్నారు. భక్తిమార్గం దిశగా యువతను నడిపించడానికి ఇలాంటి పాదయాత్రలు చాలా ఉపయోగపడుతాయన్నారు. ధనుర్మాసంలో విష్ణు క్షేత్రాన్ని దర్శించుకోవడం మోక్షదాయకమని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం నాయకులు గుండ వెంకటేశ్వర్లు, తల్లం నాగరాజు, సూది రాము, రాఘవ, రాఘవేందర్శర్మ పాల్గొన్నారు. -
నిరుద్యోగులను మోసం చేస్తున్న ప్రభుత్వం
గద్వాలటౌన్: జాబ్ క్యాలెండర్ పేరుతో రేవంత్రెడ్డి ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేస్తుందని బీఆర్ఎస్వీ జిల్లా కోఆర్డినేటర్ కుర్వపల్లయ్య విమర్శించారు. గురువారం స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో నిరుద్యోగ జేఏసీ నిరసన వ్యక్తం చేశారు. సీఎంకు, రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సంవత్సరానికి కొత్త క్యాలెండర్లు మారుతున్నాయని, జాబ్ క్యాలెండర్ మాత్రం అమలు కావడం లేదని ఆరోపించారు. సీఎం రేవంత్ పాలన రెండేళ్లు పూర్తయిన ఇప్పటి వరరు జాబ్ క్యాలెండర్ విడుదల చేయలేదని విమర్శించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే వంద రోజుల్లో మెగా డీఎస్పీ ద్వారా 25 వేల టీచర్ల పోస్టులు భర్తీ చేస్తామని చెప్పి సీఎం మోసం చేశారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగుల జీవితాలతో చలగాటం ఆడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. నిరుద్యోగ భృతి ఏమైందని ప్రశ్నించారు. విద్యాశాఖకు మంత్రిని నియమించకపోవటం సిగ్గు చేటన్నారు. తక్షణమే జాబ్ క్యాలెండర్ విడుదల చేసి నిరుద్యోగులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నిరుద్యోగ జేఏసీ నాయకులు మహేష్, చక్రవర్తి, మాధవ్, గోపాల్, కాశీం, పటేల్, నర్సింహా, రాము, కిరణ్, అభిషేక్, గోవిందు, చక్రి, జహంగీర్, శీనునాయక్ పాల్గొన్నారు. -
కొలువే లక్ష్యంగా..
● ప్రభుత్వ ఉద్యోగం, సమాజసేవ, ఉన్నత స్థానాల వైపు అడుగులు ● జీవితంలో స్థిరపడి తల్లిదండ్రుల కల నెరవేరుస్తాం.. ● జిల్లా కేంద్రంలోని శ్రీ సత్యసాయి డిగ్రీ, పీజీ (ఆర్ట్స్ అండ్ సైన్స్) కళాశాల విద్యార్థులతో ‘సాక్షి’ టాక్షో నూతన సంవత్సరంలో యువత ప్రణాళికలు గద్వాల: ఉపాధ్యాయుడు.. లెక్చరర్.. డాక్టర్.. ఇంజినీర్.. సైంటిస్ట్.. ఇలా కొలువే లక్ష్యంగా.. జీవితంలో స్థిరపడేలా యువత అడుగులు వేస్తున్నారు. లక్ష్యాలు చేరుకోవాలంటే చదువే మార్గమని.. ప్రతి ఒక్కరి జీవితంలో కళాశాల విద్యార్థి దశ ఎంతో ముఖ్యమని.. కష్టపడి చదివితే లక్ష్యాలు చేరుకోవడం సులువని కళాశాల విద్యార్థులు పేర్కొంటున్నారు. భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకొని తమ కుటుంబాలకు అండగా నిలబడడమే కాకుండా ఉత్తమ సమాజ నిర్మాణంలో తమ వంతు పాత్ర పోషించాలనుకుంటున్నట్లు అభిప్రాయాలు వ్యక్తం చేశారు. 2025 సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ.. నూతన సంవత్సరంలో జీవితానికి సంబంధించి స్థిరపడేలా పలు లక్ష్యాలను నిర్దేశించుకొని వాటిని చేరుకునే ప్రణాళికలతో సిద్ధమయ్యారు. గద్వాల పట్టణంలోని శ్రీసత్యసాయి డిగ్రీ, పీజీ కాలేజీ (ఆర్ట్స్అండ్ సైన్స్) విద్యార్థులతో బుధవారం ‘సాక్షి’ టాక్షోను నిర్వహించింది. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు తమ లక్ష్యాలు, వాటిని సాధించుకునేందుకు వేసుకున్న ప్రఽణాళికలను పంచుకున్నారు. శ్రీసత్యసాయి డిగ్రీ, అండ్ పీజీ కళాశాల విద్యార్థులు బీఎస్సీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. పీజీ పూర్తి చేసిన తర్వాత లెక్చరర్ కావాలని లక్ష్యం నిర్దేశించుకున్నాను. దాని కోసం ఇప్పటి నుంచే సన్నద్ధం అవుతున్నాను. మా తల్లిదండ్రుల ప్రోత్సాహం, కాలేజీలో గురువుల సహకారంతో నేను అనుకున్న లక్ష్యం సాధిస్తాననే నమ్మకం పెరిగింది. పీజీ సాధించేందుకు అవసరమైన మెటీరియల్ను ఇప్పటి నుంచే సేకరిస్తున్నాను. పీజీ సాధించి ఖచ్చితంగా లెక్చరర్ను అవుతాను. – రాజేశ్వరి, బీఎస్సీ(బీజెడ్సీ) ఫైనల్ ఇయర్ చదువుకుంటే భవిష్యత్తు బాగుంటుందని చెబుతూ మా నాన్న, అమ్మలు నన్ను చిన్నప్పటి నుంచి ప్రోత్సహిస్తున్నారు. వారి ప్రోత్సాహంతో నాకు చదువు పట్ల ఇష్టం పెరిగింది. బాగా చదువుకొని ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే బలమైన కోరిక ఏర్పడింది. డిగ్రీ తరువాత బీఈడీ, పీజీ పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగం సాధించేలా ఇప్పటి నుంచే లక్ష్యం పెట్టుకున్నాను. – శృతి, బీఎస్సీ(ఎంపీసీఎస్) ఫస్టియర్ చిన్నప్పటి నుంచి డాక్టర్ కావాలని బలమైన సంకల్పం ఉంది. ముఖ్యంగా పేదలకు వైద్యం అందించి తనవంతుగా సమాజసేవలో భాగస్వామ్యం కావాలనుకుంటున్నా. ఇందుకోసం మా తల్లిదండ్రులు, కాలేజీలో లెక్చరర్లు కూడా ఎంతో ప్రోత్సహిస్తున్నారు. – శృతి, ఇంటర్మీడియట్ నేను బీకాం చదువుతున్నాను. అనంతరం చార్టర్డ్ అకౌంటెంట్ కావాలన్నదే లక్ష్యం. ఇందుకోసం తనకు ఇంట్లో తల్లిదండ్రుల ప్రోత్సాహం, కుటుంబ సభ్యుల సహకారంతో పాటు మాకా లేజీ లెక్చరర్లు అన్ని విధాలా సలహాలు, సూచనలు ఇస్తూ సహకారం అందిస్తున్నారు. నూతన సంవత్సరంలో సీఏ కావడమే లక్ష్యంగా పెట్టుకున్నాను. – అమీజ్, బీకాం చదువు పూర్తి చేసుకుని ఎవరిమీద ఆధారపడకుండా సొంతంగా స్థిరపడాలన్నదే నా లక్ష్యం. వచ్చిన డబ్బుతో తనవంతుగా సమాజం కోసం ఏదైన మంచి పనులు చేయాలని ఉంది. – బుడ్డన్న, ఎంఎల్టీ ల్యాబ్టెక్నీషియన్ కోర్సు పూర్తి చేసిన అనంతరం ప్రభుత్వ పరంగా కాని, ప్రైవేటులో ఉద్యోగం సాధించాలని నూతన సంవత్సరంలో లక్ష్యంగా పెట్టుకున్నాను. – శివకుమార్, ఎంఎల్టీ నూతన సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలుకుదాం. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనేదే నా తల్లిదండ్రుల కల. చిన్నతనం నుంచి చదువు విషయంలో ఎంతో ప్రోత్సహించారు. తల్లిదండ్రుల ఆశయాలకు అనుగుణంగా ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే లక్ష్యంగా ప్రణాళికలు వేసుకొని ముందుకు వెళ్తా. – కె.కావ్య బీఎస్సీ (బీజెడ్సీ) జీవితంలో త్వరగా స్థిరపడాలని నా తల్లిదండ్రులు నన్ను ల్యాబ్ టెక్నీషియన్ కోర్సులో చేర్పించారు. ల్యాబ్టెక్నీషియన్ కోర్సు పూర్తి త్వరగా ఉద్యోగంలో స్థిరపడి తమ కుటుంబ సభ్యులకు అండగా ఉంటాను. ఈ నూతన సంవత్సరంలో ఇదే లక్ష్యంగా పెట్టుకున్నాను. – నరేష్, ఎంఎల్టీ చదువు పూర్తి చేసి త్వరగా ఉద్యోగం సాధించి తల్లిదండ్రులకు అండగా నిలబడతాను. వారి బాగోగులు చూసుకుంటూ ముందుకు సాగాలన్నదే లక్ష్యంగా పెట్టుకున్నాను. – ఈశ్వర్, ఎంఎల్టీ ల్యాబ్ టెక్నీషియన్ కోర్సు పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనేదే లక్ష్యం. ఉద్యోగం అనంతరం అమ్మ, నాన్నలను బాగా చూసుకుంటాను. – ఇమ్రాన్, ఎంఎల్టీ -
మున్సిపల్ ఎన్నికలకు సిద్ధం కావాలి
గద్వాల: మున్సిపాలిటీల ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేలోగానే సంబంధిత అధికారులు ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్హాలులో అధికారులతో సమీక్షించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆయా మున్సిపాలిటీల పరిఽధిలోని వార్డుల వారిగా ఓటర్ల లిస్టు ఫైనల్ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ పబ్లిష్ చేసేందుకు అవసరమైన ప్రక్రియ వేగవంతం చేయాలన్నారు. ఓటర్ల సంఖ్య ఆధారంగా రెండు, మూడు వార్డులకు కలిపి ఒక రిటర్నింగ్ అధికారిని నియమించాలన్నారు. ఒక్కో వార్డులో 850 పైగా ఓటర్లు ఉంటే రెండు పోలింగ్ స్టేషన్లు, ఏర్పాటు చేయాలన్నారు. ఆయా మున్సిపాలిటీల్లో ఎన్నికల అధికారులు, ఇతర సిబ్బంది స్థానికులు కాకుండా ఇతర మండలాల వారిని నియమించాలని ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా నాలుగు మున్సిపాలిటీలలో మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వందశాతం పూర్తి చేయాలన్నారు. ఇందుకు సంబంధించి జనవరి 6వ తేదీలోపు అన్ని అనుమతులు పూర్తిచేసి మార్కౌట్ చేసి పునాదులు వేయించేలా చర్యలు తీసుకోవాలన్నారు. గద్వాల, అయిజ, వడ్డేపల్లి, అలంపూర్ మున్సిపాలిటీలలో వివిధ రకాల అభివృద్ధి పనులకు నిధులు మంజూరీ అయినట్లు వీటిని సైతం ఎన్నికల నోటిఫికేషన్ వెలువడేలోపు టెండర్ ప్రక్రియ పూర్తి చేసి వెంటనే పనులు చేపట్టేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో హౌసింగ్పీడీ శ్రీనివాస్రావు, జడ్పీడి.సీఈవో నాగేంద్రం, మున్సిపల్ కమీషనర్లు డీఈ, ఏఈలు పాల్గొన్నారు. -
పురపోరు.. కసరత్తు జోరు
● ఉమ్మడి జిల్లాలో ఒక కార్పొరేషన్.. 20 మున్సిపాలిటీలు ● అచ్చంపేట, జడ్చర్ల పురపాలికలకు ముగియని పదవీ కాలం ● మిగిలిన 19 పురపాలికల్లో పోలింగ్ కేంద్రాల గుర్తింపు పూర్తి ● ఓటర్ల జాబితా సైతం.. నేడు ముసాయిదా విడుదల ● రాజకీయ పార్టీల్లో హడావుడి షురూ సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో వార్డుల వారీగా ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాల ఖరారుకు సంబంధించి ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేయగా.. అధికారులు కసరత్తు ప్రారంభించారు. పోలింగ్ కేంద్రాల గుర్తింపు పూర్తి కాగా.. ముసాయిదా ఓటరు జాబితా సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఫిబ్రవరిలో ఎన్నికలు జరిగే అవకాశం ఉండడంతో రాజకీయ పార్టీల్లోనూ హడావుడి మొదలైంది. కొందరు కౌన్సిలర్/కార్పొరేటర్ ఆశావహులు రిజర్వేషన్లపై అంచనాలు వేసుకుంటుండగా.. మరికొందరు అనుకూలంగా వస్తాయనే ధీమాతో బరిలో ఉంటున్నామనే సంకేతాలను పంపిస్తున్నారు. తొలిసారిగా కార్పొరేషన్లో.. స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీగా ఉన్న మహబూబ్నగర్ 2025 జనవరి 27న మున్సిపల్ కార్పొరేషన్గా ఆవిర్భవించిన విషయం తెలిసిందే. అప్గ్రేడ్ అయిన తర్వాత కార్పొరేషన్ పరిధిలో తొలిసారిగా ఎన్నికలు జరగనున్నాయి. గతంలో 49 వార్డులు ఉండగా.. 60 డివిజన్లు అయ్యాయి. ఈ క్రమంలో డివిజన్ల వారీగా పోలింగ్ కేంద్రాలను అధికారులు పునర్ వ్యవ్యస్థీకరించారు. అదేవిధంగా డివిజన్ల వారీగా ఓటర్ల జాబితా రూపకల్పన పూర్తి చేశారు. కొత్తగా దేవరకద్ర.. మద్దూరు మహబూబ్నగర్ మున్సిపాలిటీ కార్పొరేషన్గా ఆవిర్భవించిన రోజే మహబూబ్నగర్ జిల్లాలోని దేవరకద్ర, నారాయణపేట జిల్లాలోని మద్దూరు గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీగా అవతరించాయి. మద్దూరు జీపీగా ఉన్న సమయంలో 14 వార్డులు ఉండగా.. ఐదు గ్రామాలను కలుపుకుని 16 వార్డులుగా విభజించారు. అదేవిధంగా దేవరకద్ర మేజర్ గ్రామ పంచాయతీలో 14 వార్డులు ఉండగా.. నాలుగు గ్రామాలను కలుపుకుని 12 వార్డులకు కుదించారు. జీపీల నుంచి మున్సిపాలిటీలుగా ఆవిర్భవించిన తర్వాత వీటికి తొలిసారిగా ఎన్నికలు జరగనున్నాయి. ఉమ్మడి పాలమూరు జిల్లాలో మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్తో కలుపుకుని మొత్తం 21 పురపాలికలు ఉన్నాయి. వీటిలో మహబూబ్నగర్ జిల్లాలోని జడ్చర్ల, నాగర్కర్నూల్ జిల్లాలోని అచ్చంపేట మున్సిపాలిటీ మినహా మిగిలిన వాటికి ఎన్నికలు జరగనున్నాయి. ఈ రెండు పురపాలికల పాలక వర్గాల పదవీకాలం ఈ ఏడాది మే వరకు ఉంది. 2021 ఏప్రిల్లో వీటికి ఎన్నికలు జరిగాయి. మిగతా మున్సిపాలిటీలకు సంబంధించి 2020 జనవరి 22న ఎన్నికలు జరగ్గా.. అదే నెల 25న ఓట్లు లెక్కించి ఫలితాలను వెల్లడించారు. అదే నెల 28న పాలకవర్గాలు కొలువుదీరాయి. ఈ నేపథ్యంలో 2025 జనవరి 27తో వాటి పాలకవర్గాల కాలపరిమితి ముగియగా.. అప్పటి నుంచి ప్రత్యేకాధికారుల పాలన కొనసాగుతోంది. 2023 అసెంబ్లీ నియోజకవర్గ ఓటర్ల జాబితా ప్రమాణికంగానే పురపాలక ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల కమిషన్ ఆదేశాలకు అనుగుణంగా ఆ ఏడాది అక్టోబర్ ఒకటి నాటికి ఉన్న ఓటర్ల జాబితా మేరకు కార్పొరేషన్/మున్సిపాలిటీల్లో అధికారులు వార్డుల వారీగా పోలింగ్ కేంద్రాలు, ఓటర్ల జాబితాను సిద్ధం చేశారు. జనవరి ఒకటి (గురువారం)న వార్డుల వారీగా ముసాయిదా ఓటర్ల జాబితాను ఆయా పురపాలికల కార్యాలయాల్లో విడుదల చేయడంతోపాటు ప్రదర్శించనున్నారు. అదేరోజు నుంచి నాలుగో తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరించనున్నారు. ఐదో తేదీన ఆయా మున్సిపాలిటీల పరిధిలో రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఆరున జిల్లా స్థాయిలో సమావేశం కానున్నారు. పదో తేదీన తుది ఓటర్ల జాబితా ప్రకటించనున్నారు. -
బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనే లక్ష్యం
గద్వాల క్రైం: బాల కార్మికుల వ్యవస్థ నిర్మూలనే లక్ష్యంగా ప్రతి ఒక్కరు శ్రమించాలని ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. బుధవారం సీడబ్యూలసీ, సీడీపీఓ, డీసీపీఓ అధికారులతో ఎస్పీ కార్యాలయంలో సమావేశం నిర్వహించి ఆయన మాట్లాడారు. జనవరి 1 నుంచి 31 వరకు జిల్లా వ్యాప్తంగా పర్యటించి బాల కార్మికులను గుర్తించాలని, ఎవరైన 18 సంవత్సరాలలోపు పిల్లలను పనిలో చేర్చుకుంటే చట్టపరమైన చర్యలు తప్పవన్నారు. చిన్నారుల భవిష్యత్తు పరిరక్షణ దిశగా ఆపరేషన్ స్మైల్ పని చేస్తుందన్నారు. 12వ ఆపరేషన్ స్మైల్లో రెండు బృందాలు విధిగా విధులు నిర్వహిస్తాయన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఎక్కడైన బాలలను పనిలో చేర్చుకున్నట్లు తెలిస్తే పోలీసుశాఖకు సమాచారం అందించాలన్నారు. సమావేశంలో డీఎస్పీ మొగిలయ్య, సహాదేవుడు, శైలజ, దీప్తి, వెంకటస్వామి సిబ్బంది తదితరులు ఉన్నారు. -
వైకుంఠ వైభవం
మహా విష్ణువును ముక్కోటి దేవతలు నేరుగా దర్శించి ఆశీస్సులు పొందిన వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని మంగళవారం భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. జిల్లా కేంద్రంలోని కోటలో వెలసిన శ్రీలక్ష్మీ చెన్నకేశవస్వామిని, కృష్ణానది తీరంలోని శ్రీకల్యాణ లక్ష్మీవేంకటేశ్వర స్వామి, భీంనగర్లోని సంతాన వేణుగోపాలస్వామి, గంజిపేటలోని శ్రీవేంకటేశ్వరస్వామిని వైకుంఠ నాథుడిగా భక్తులు దర్శించి దివ్యానుభూతి పొందారు. ఐదో శక్తిపీఠమైన అలంపూర్ బాలబ్రహ్మేశ్వరస్వామి క్షేత్రం, మల్దకల్ స్వయంభూ లక్ష్మీవేంకటేశ్వరస్వామి, అయిజ మండలం ఉత్తనూరు ధన్వంతరి వేంకటేశ్వరస్వామి, బీచుపల్లిలోని కోదండరామస్వామి, కేటీదొడ్డి మండలం పాగుంట శ్రీలక్ష్మీ వేంకటేశ్వరస్వామి, రాజోళిలోని వైకుంఠ నారాయణస్వామి తదితర ఆలయాల్లో భక్తులకు వైకుంఠ ద్వారం ద్వారా స్వామివారు దర్శనమిచ్చారు. కోటలోని ఆలయంలో సీనియర్ సివిల్జడ్జి లక్ష్మి ఉత్తరద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డితో పాటు పలువురు నాయకులు, అధికారులు వేర్వేరుగా స్వామివారిని దర్శించుకున్నారు. – గద్వాలటౌన్ -
ఆహార విక్రయశాలలపై పర్యవేక్షణ పెంచాలి
గద్వాలటౌన్/గద్వాలన్యూటౌన్: జిల్లా ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఆహార పదార్థాలు విక్రయింతే హోటల్స్, ఇతర కేంద్రాలపై ఫుడ్ సేఫ్టీ అధికారులు పర్యవేక్షణ పెంచాలని కలెక్టర్ బీఎం సంతోష్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో ఏర్పాటుచేసిన జిల్లాస్థాయి ఆహార భద్రత సలహ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో ఇప్పటి వరకు 1,278 ఆహార విక్రయశాలలకు సంబంధింత శాఖల ద్వారా రిజిస్ట్రేషన్ పొందారని.. కొత్తగా ఏర్పాటుచేసిన ఆహార విక్రయశాలలపై దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. ప్రతినెలా 25 హోటళ్లలో మాత్రమే ఫుడ్ శాంపిల్స్ సేకరించి ల్యాబ్కు పంపుతున్నారని, వీటి సంఖ్య పెంచాలన్నారు. మూడేళ్లలో కల్తీ ఆహారం తయారు చేసిన కేంద్రాలపై 26 కేసులు నమోదు చేసి, రూ.1.50 లక్షల జరిమానా విధించిన విషయాన్ని గుర్తుచేశారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ లక్ష్మీనారాయణ, డీఎంహెచ్ఓ సంధ్యా కిరణ్మయి, ఫుడ్సేఫ్టీ అధికారి కరుణాకర్ ఉన్నారు. ● అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు ప్రభు త్వం అందించే ప్రీ మెట్రిక్ ఉపకార వేతనాలు సద్వినియోగం అయ్యేలా సంబంధిత అధికారులు కృషి చేయాలని కలెక్టర్ సంతోష్ అన్నారు. కలెక్టరేట్లో ప్రీ మెట్రిక్ ఉపకార వేతనాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో 5 నుంచి 10 తరగతులు చదువుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు ఉపకార వేత నాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. జిల్లాలో 2,617 మంది ఎస్సీ విద్యార్థులకు 1,196 మంది, 1,819 మంది బీసీ విద్యార్థులకు గాను 859 మంది మాత్రమే ఇప్పటివరకు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని తెలిపారు. అర్హులైన విద్యార్థులందరూ ఉపకార వేత నాలకు దరఖాస్తు చేసుకునేలా సంబందిత పాఠశాలల యాజమాన్యాలు సహకరించాలని సూచించా రు. దరఖాస్తు చేసుకునేందుకు అవసరమైన కుల, ఆదాయ ధ్రువపత్రాలు త్వరగా జారీ చేయాలని రెవెన్యూ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో జిల్లా ఎస్సీ సంక్షేమశాఖ అధికారిణి నుషిత, బీసీ సంక్షేమశాఖ అధికారి అక్బర్ పాషా, ఎల్డీఎం శ్రీనివాసరావు ఉన్నారు. -
ప్రకృతి వ్యవసాయంతో నాణ్యమైన ఉత్పత్తులు
గద్వాల వ్యవసాయం: ప్రకృతి వ్యవసాయంతో నాణ్యమైన, ఆరోగ్యకరమైన పంట ఉత్పత్తులు సాధించవచ్చని డీఏఓ సక్రియా నాయక్ అన్నారు. మంగళవారం గద్వాల మండలం అనంతాపురం రైతువేదికలో ప్రకృతి వ్యవసాయంపై కృషి సఖిలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రకృతి వ్యవసాయంతో పెట్టుబడి తగ్గడంతో పాటు, పండించిన పంట ఉత్పత్తులకు మంచి ధరలు వస్తాయన్నారు. ఈ విధానంతో రసాయనిక ఎరువులు, మందుల వినియోగం తగ్గి.. భూ సారం పెరుగుతుందన్నారు. కృషి సఖిలు శిక్షణలో నేర్చుకున్న అంశాలను రైతులకు పూర్తిస్థాయిలో వివరించి, ప్రకృతి వ్యవసాయంపై అగాహన కల్పించాలని సూచించారు. అనంతరం ప్రకృతి వ్యవసాయం ఉద్దేశం, ఆవశ్యకత, సూత్రాలు, నేల ఆరోగ్యం తదితర వివరాలను సీఎస్ఏ ప్రోగ్రాం అధికారి ఉపేంద్ర, అగ్రి ఎక్స్పర్ట్ వీరబాబు తెలియజేశారు. అనంతరం రైతులు గోకారి, రవిరెడ్డి, సత్యమ్మను డీఏఓ సన్మానించారు. కార్యక్రమంలో ఏఓ ప్రతాప్కుమార్, ఏఈఓలు పాల్గొన్నారు. వేరుశనగ క్వింటా రూ.7,777 గద్వాల వ్యవసాయం: జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్యార్డుకు మంగళవారం 296 క్వింటాళ్ల వేరుశనగ విక్రయానికి వచ్చింది. క్వింటాకు గరిష్టంగా రూ. 7,777, కనిష్టంగా రూ. 4,906, సరాసరి రూ. 5,850 ధరలు వచ్చాయి. అదే విధంగా 8 క్వింటాళ్ల ఆముదాలు అమ్మకానికి రాగా.. గరిష్టంగా రూ. 6,026, కనిష్టంగా రూ. 5,980, సరాసరి రూ. 6026 ధరలు లభించాయి. 81 క్వింటాళ్ల వరి (సోన) అమ్మకానికి రాగా.. గరిష్టంగా రూ. 2,559, కనిష్టంగా రూ. 2,096, సరాసరి రూ. 2,551 ధరలు వచ్చాయి. 150 క్వింటాళ్ల కందులు అమ్మకానికి రాగా.. గరిష్టంగా రూ. 6,649, కనిష్టంగా రూ. 2,116, సరాసరి రూ. 6,613 ధరలు లభించాయి. -
స్థానికం.. సంస్థాగతం!
జోగుళాంబ గద్వాలపాలమూరులో కాంగ్రెస్కు కలిసొచ్చిన కాలం బుధవారం శ్రీ 31 శ్రీ డిసెంబర్ శ్రీ 20253 జిల్లాల్లో ‘ఢీ’సీసీ.. ఈ ఏడాది తొలి నుంచి డీసీసీ అధ్యక్షుల ఎంపిక కసరత్తు కొనసాగింది. ఆ తర్వాత క్షేత్రస్థాయిలో ఏఐసీసీ పరిశీలకులు అభిప్రాయాలు సేకరించారు. అనంతరం నవంబర్ 22న ఐదు జిల్లాలకు డీసీసీ అధ్యక్షులను ప్రకటించారు. నాగర్కర్నూల్, నారాయణపేట జిల్లాల్లో పాత నేతలు ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ, ప్రశాంత్ కుమార్రెడ్డికి అవకాశం దక్కింది. మిగిలిన మూడు జిల్లాల్లోనూ డీసీసీ అధ్యక్షుల ఎంపిక చిచ్చు రేపింది. మహబూబ్నగర్లో సంజీవ్ ముదిరాజ్, వనపర్తిలో రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి, గద్వాలలో రాజీవ్రెడ్డికి డీసీసీ పీఠం అప్పగించారు. కాంగ్రెస్: పై‘చేయి’.. అయినా డీలా.. మూడు విడతలుగా డిసెంబర్ 11, 14, 17న జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుదారులు అధిక సంఖ్యలో సర్పంచ్ పీఠాలను కై వసం చేసుకున్నారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 1,678 సర్పంచ్ స్థానాలు ఉండగా.. ఏడు జీపీల్లో ఎన్నికలు జరగలేదు. మిగిలిన వాటిలో 964 మంది కాంగ్రెస్ మద్దతుదారులు సర్పంచ్లుగా గెలుపొందారు. వనపర్తి, కొల్లాపూర్, జడ్చ ర్ల నియోజకవర్గాల్లో అధికార పార్టీకి ఆశించిన ఫలితాలు రాకపోవడంతో నాయకుల్లో నిరాశ అలుముకుంది. జడ్చర్ల, దేవరకద్ర, వనపర్తి ఎమ్మెల్యేలు అనిరుధ్రెడ్డి, మధుసూదన్రెడ్డి, మేఘారెడ్డికి తమతమ స్వగ్రామాల్లో ఎదురుదెబ్బ తగిలింది. పల్లె పోరులో పై‘చేయి’.. సత్తా చాటిన బీఆర్ఎస్ గతంతో పోలిస్తే పలు చోట్ల పుంజుకున్న బీజేపీ ‘హస్తం’లో చిచ్చు రేపిన డీసీసీ అధ్యక్షుల ఎంపిక ఉమ్మడి జిల్లాలో 10సార్లు పర్యటించిన సీఎం రేవంత్ వాకిటికి అమాత్య యోగం.. ముదిరాజుల్లో హర్షం పల్లె పోరులో పై‘చేయి’.. సత్తా చాటిన బీఆర్ఎస్ గతంతో పోలిస్తే పలు చోట్ల పుంజుకున్న బీజేపీ ‘హస్తం’లో చిచ్చు రేపిన డీసీసీ అధ్యక్షుల ఎంపిక ఉమ్మడి జిల్లాలో 10సార్లు పర్యటించిన సీఎం రేవంత్ వాకిటికి అమాత్య యోగం.. ముదిరాజుల్లో హర్షం గువ్వల బీజేపీకి జై.. బండ్లకు ఊరట -
సాగులో నూతన ఒరవడి
పాలమూరులో వినూత్న పంటల వైపు రైతుల మొగ్గు ● పలుచోట్ల ఆయిల్పాం, వాణిజ్య తోటల పెంపకం ● ఉమ్మడి జిల్లావ్యాప్తంగా భారీగా తగ్గిన పత్తి సాగు, దిగుబడి ● తీవ్ర నష్టాలు మిగిల్చిన వానాకాలం సీజన్ ● యూరియా కోసం రైతాంగానికి తప్పని పడిగాపులు సాక్షి, నాగర్కర్నూల్: పాలమూరు రైతులు సాగులో నూతన ఒరవడికి శ్రీకారం చుడుతున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఈసారి పత్తి కన్నా.. వరి, మొక్కజొన్న ఇతర పంటలు సాగు చేసేందుకు మొగ్గుచూపారు. పత్తి పంటకు ప్రత్యామ్నాయంగా.. పలుచోట్ల ఆయిల్పాం, ఉద్యాన, వాణిజ్య పంటలు పండించేందుకు ఆసక్తి చూపారు. నాగర్కర్నూల్ జిల్లాలో ఈసారి 900 ఎకరాల్లో ఆయిల్పాం తోటలు సాగైంది. గద్వాల జిల్లాలో పొగాకు, వనపర్తి జిల్లాలో చెరకు, బెబ్బర పంటలు పండించారు. ఈ క్రమంలోనే నాగర్కర్నూల్, జోగుళాంబ గద్వాల జిల్లాల్లో ఈ ఏడాది పత్తి పంట సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గింది. మిగతా మహబూబ్నగర్, నారాయణపేట, వనపర్తి జిల్లాల్లో రైతులు గతేడాది కన్నా ఈసారి వానాకాలంలో వరి, పత్తి పంటలు అధికంగా సాగుచేశారు. కానీ, జిల్లాలో ఈ ఏడాది పత్తి పంట సాగుచేసిన రైతులకు నష్టాలే మిగిలాయి. అధిక వర్షాల నేపథ్యంలో పత్తి పంట దెబ్బతిని దిగుబడి సగానికి పడిపోయింది. దీంతో పత్తి రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చింది. ఇతర పంటలకే ప్రాధాన్యం.. ఉమ్మడి పాలమూరులోని మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగుళాంబ గద్వాల జిల్లాల్లో రైతులు అధికంగా వరి, పత్తి పంటలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈసారి నాగర్కర్నూల్ మినహా అన్ని జిల్లాల్లోనూ పత్తి పంట సాగు తగ్గించి వరి వైపు రైతులు మొగ్గుచూపారు. మహబూబ్నగర్లో ఈసారి వరి 10 వేల విస్తీర్ణం పెరగగా.. పత్తి 2 వేల ఎకరాలు తగ్గింది. నాగర్కర్నూల్లో వరి విస్తీర్ణం ఏకంగా 66 వేల ఎకరాలు పెరిగింది. అలాగే పత్తి విస్తీర్ణం సైతం గతేడాది కన్నా 4 వేలు అధికంగా సాగైంది. నారాయణపేటలో వరి గతేడాది కంటే 10 వేల ఎకరాల్లో రైతులు అధికంగా సాగుచేశారు. ఇక్కడ అధికంగా 50 వేల ఎకరాల్లో కందిపంట సాగవుతోంది. వనపర్తి జిల్లాలో వరి 8 వేల ఎకరాలు పెరగగా.. పత్తి విస్తీర్ణం 5 వేల ఎకరాలు తగ్గింది. జోగుళాంబ గద్వాల జిల్లాలో ఈసారి పత్తి సాగు 70 వేల ఎకరాల వరకు తగ్గగా.. వరి పంట విస్తీర్ణం 7 వేల ఎకరాలు తక్కువగా నమోదైంది. -
రాష్ట్రస్థాయి కబడ్డీ రన్నరప్గా గద్వాల
గద్వాలటౌన్: కరీంనగర్ జిల్లాలో గత నాలుగు రోజులుగా కొనసాగుతున్న సీనియర్ పురుషుల కబడ్డీ పోటీలు ఆదివారం రాత్రి ముగిశాయి. ఈ పోటీల్లో గద్వాల జిల్లా జట్టు రన్నరప్గా నిలిచింది. ఫైనల్ మ్యాచ్లో సూర్యాపేట, జోగులాంబ గద్వాల జల్లా జట్లు తలపడ్డాయి. ఇరు జట్ల క్రీడాకారులు హోరాహోరీగా తలబట్టారు. 44–32 పాయింట్ల తేడాతో సూర్యాపేట గెలుపొంది విజేతగా నిలిచింది. గద్వాల జిల్లా జట్టు రన్నర్గా నిలిచింది. రన్నర్గా నిలిచిన గద్వాల కబడ్డీ క్రీడాకారులను కబడ్డీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షురాలు డీకే స్నిగ్దారెడ్డి, ప్రధాన కార్యదర్శి నర్సింహ, ట్రెజరర్ చందు, ఆర్గనైజింగ్ సెక్రటరీ రవి, కోచ్ హుస్సేన్ అభినందించారు. ‘ప్రజావాణి’కి 82 వినతులు గద్వాలటౌన్: కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 82 వినతులు అందాయి. కలెక్టర్ సంతోష్, అడిషనల్ కలెక్టర్లు లక్ష్మినారాయణ, నర్సింగరావులు ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు ప్రజావాణి కొనసాగింది. మొత్తం 82 దరఖాస్తులు ప్రజావాణికి వచ్చాయి. ఆసరా పెన్షన్లు, భూసంబంధిత, ప్రజారోగ్యం, పారిశుద్ధ్యం, ఉపాధి, విద్యుత్తు తదితర సమస్యలపై వినతులు వచ్చాయి. వినతులను త్వరగా పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. పోలీస్ గ్రీవెన్స్కు 20 అర్జీలు గద్వాల క్రైం: భూవివాదం, ఆస్తి తగాదాలు, అప్పు తీసుకున్న వ్యక్తులు డబ్బు తిరిగి ఇవ్వడంలేదు.. ఇలా ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పోలీస్ గ్రీవెన్స్కు బాధితులు 20 అర్జీలు అందజేశారు. ఎస్పీ శ్రీనివాసరావు వారితో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వీలైనంత త్వరగా సమస్యలను పరిష్కరిస్తామని, సివిల్ సమస్యలపై కోర్టు ద్వారా పరిష్కారం చేసుకోవాలన్నారు. వేరుశనగ క్వింటా రూ.8,600 గద్వాల వ్యవసాయం: గద్వాల మార్కెట్ యార్డుకు సోమవారం 645 క్వింటాళ్ల వేరుశనగ రాగా, గరిష్టం రూ.8600, కనిష్టం రూ.3570, సరాసరి రూ.6307 ధరలు లభించాయి. అలాగే, 13 క్వింటాళ్ల ఆముదాలు రాగా, గరిష్టం రూ.6060, కనిష్టం రూ.5830, సరాసరి రూ.6060 ధరలు పలికాయి. 53 క్వింటాళ్ల వరి (సోన)కిగాను గరిష్టం రూ. 2509, కనిష్టం రూ. 2146, సరాసరి ధరలు రూ. 2250 వచ్చాయి. అలాగే, 294 క్వింటాళ్ల కంది రాగా గరిష్టం రూ. 6639, కనిష్టం రూ. 1719, సరాసరి రూ. 6619 ధరలు లభించాయి. వేడుకలు శాంతియుతంగా జరుపుకోవాలి : ఎస్పీ గద్వాల క్రైం: నూతన సంవత్సర వేడుకలను జిల్లా ప్రజలు శాంతియుతంగా జరుపుకోవాలని ఎస్పీ శ్రీనివాసరావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. డిసెంబర్ 31న అర్ధరాత్రి నుంచి వేడుకలపై ప్రత్యేక నిఘా ఉంటుందని, మద్యం సేవించి అల్లర్లకు పాల్పడినా, పెద్ద శబ్దంతో సౌండ్బాక్సులు ఏర్పాటు చేసినా సామాన్యులకు అసౌకర్యం కలిగిస్తే చర్యలు తప్పవని తెలిపారు. -
నర్సింగ్ కళాశాల పనులు త్వరగా పూర్తి చేయాలి
యూరియా కొరత లేకుండా పూర్తి స్థాయి చర్యలు గద్వాలన్యూటౌన్: జిల్లాలో రబీ సీజన్కు అవసరమైన యూరియా నిల్వలు ఉన్నాయని, రైతులకు కొరత లేకుండా సరఫరా చేస్తున్నట్లు కలెక్టర్ సంతోష్ తెలిపారు. యూరియా సరఫరాపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావ్, ఉన్నతాధికారులు సోమవారం హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, వ్యవసాయ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వార సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా గద్వాల కలెక్టరేట్ నుంచి కలెక్టర్ వీసీలో పాల్గొని మాట్లాడారు. రబీ సీజన్కు సంబంధించి జిల్లాలో ప్రస్తుతం 8124 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని, ఇప్పటి వరకు 5816 మెట్రిక్ టన్నుల యూరియా రైతులకు సరఫరా చేసినట్లు చెప్పారు. కౌంటర్ల వద్ద రైతులు క్యూలైన్లలో వేచి ఉండకుండా అదనపు కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. గద్వాలటౌన్: పట్టణ శివారులో నిర్మించిన ప్రభుత్వ నర్సింగ్ కళాశాల భవనాల ప్రారంభోత్సవానికి మిగిలిన అసంపూర్తి పనులను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ సంతోష్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం నర్సింగ్ కళాశాల అకాడమిక్ బ్లాక్ భవనం, వసతి గృహ భవనాల సమూదాయాలను కలెక్టర్ పరిశీలించారు. పనుల పురోగతిని తెలుసుకున్నారు. నర్సింగ్ కళాశాల, వసతి గృహ నిర్మాణాలలో మౌలిక వసతులు కల్పించి, పెండింగ్ పనులను త్వరిరతగతిన పూర్తి చేయాలన్నారు. ముళ్ల పొదలను తొలగించి, పరిసరాలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలన్నారు. విద్యుత్, తాగునీటి సరఫరాలో లోపాలు లేకుండా చూడాలని ఆదేశించారు. డ్రైనేజీ వ్యవస్థను చక్కదిద్దాలన్నారు. జనవరిలో నర్సింగ్ కళాశాల ప్రారంభోత్సవం ఉంటుందని, త్వరలోనే తేదీని ప్రకటిస్తామని చెప్పారు. కేంద్రీయ విద్యాలయ స్థల పరిశీలన కేంద్ర ప్రభుత్వం 2026–27 విద్యా సంవత్సరంలో జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయనున్న కేంద్రీయ విద్యాలయ భవన నిర్మాణం కోసం స్థలాన్ని పరిశీలించారు. డబుల్ బెడ్ రూం ఇళ్ల సమీపంలో అయిదు ఎకరాల స్థలంలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను నివేదిక రూపంలో రెవెన్యూ అధికారులు అందజేశారు. కేంద్రీయ విద్యాలయం భవనం పూర్తయ్యే వరకు తరగతులను పాత ఎస్పీ కార్యాలయంలో లేదా గద్వాల కేజీబీవీలో నిర్వహించడానికి ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో అడిషినల్ కలెక్టర్ లక్ష్మినారాయణ, తహసీల్దార్ మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు. -
సాగునీరు, వైద్య ఇక్కట్లపై అసెంబ్లీలో ప్రస్తావన
అలంపూర్: నియోజకవర్గంలో సాగునీరు అందక రైతులు, మెరుగైన వైద్యం అందక ప్రజలు, పలు గ్రామాలకు రోడ్డు సౌకర్యం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని.. ఈ సమస్యలను పరిష్కరించేలా ప్రభుత్వం చొరవ చూపాలని ఎమ్మెల్యే విజయుడు సోమవారం అసెంబ్లీలో ప్రస్తావించారు. చిన్నోనిపల్లి నుంచి ఆర్డీఎస్ కెనాల్కు లింకు కలపాలని, నెట్టంపాడు 99,100 ప్యాకెజీల పనులు పూర్తి చేయాలని, తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం రిజర్వాయర్ల ప్రముఖ్యతను వివరించినట్లు తెలిపారు. తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం సాగు నీరు అందించడానికి వీలుగా మల్లమ్మ కుంట, జూలకల్, వల్లూరు రిజర్వాయర్ల నిర్మాణాలు చేపట్టకపోవడంతో సాగునీరు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. వైద్యం అందక రోగులు అనేక కష్టాలు పడుతున్నారని, విధిలేక కర్నూల్కు వెళ్తే రాష్ట్రం మారడం, ఆరోగ్యశ్రీ వంటి పథకాలు వర్తించకపోవడంతో జేబులు ఖాళీ అవుతున్నాయని పేర్కొన్నారు. కొత్తగా ఎన్నికై న గ్రామ సర్పంచ్లకు ఎక్కువ నిధులిచ్చి గ్రామాల అభివృద్ధికి తోడ్పాటు అందించాలని, అలంపూర్, అయిజ, వడ్డేపల్లి మున్సిపాలిటీలకు ఎక్కువ మొత్తంలో నిధులు కేటాయించాలని కోరారు. సంబంధిత మంత్రి ఈ విషయాలపై స్పందించినట్లు తెలిపారు. నేడు జాబ్మేళా జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): ఎంప్లాయిమెంట్ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక జిల్లా ఎంప్లాయిమెంట్ కార్యాలయంలో జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎంప్లాయిమెంట్ అధికారి మైత్రిప్రియ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. మూడు రకాల ప్రైవేట్ కంపెనీలో 200 ఉద్యోగాల భర్తీ కోసం ఈ మేళా నిర్వహిస్తున్నామని, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇతర వివరాల కోసం 89193 80410, 99485 68830 నంబర్లను సంప్రదించాలని కోరారు. -
వైకుంఠ ఏకాదశికి సర్వం సిద్ధం
గద్వాలటౌన్: వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని జిల్లాలోని ప్రముఖ ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అలంకారాలు, వైకుంఠ ద్వార దర్శనానికి నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. ఈక్రమంలో అగ్రహారంలోని కృష్ణానది చెంతన ఉన్న కల్యాణ లక్ష్మీవెంకటేశ్వర స్వామి దేవస్థానాన్ని తిరుమల శ్రీవారి ఆలయంలోని ఉత్తర ద్వారం తరహాలోనే వైకుంఠ ద్వారాన్ని విద్యుద్దీపాలు, పూలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. శ్రీవారి దశావతారాల ప్రతిమలతో పాటు అష్టలక్ష్మీదేవి ప్రతిమలను ద్వారంలో ఏర్పాటు చేశారు. బెంగళూరు, హైదరాబాద్, కర్నూలు తదితర ప్రాంతాల నుంచి తీసుకొచ్చిన పుష్పాలతో అలంకరించారు. దర్శనానంతరం వైకుంఠ ద్వారంలోకి వెళ్లిన భక్తులకు గోవింద నామాలు వినపడేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. గర్భాలయంతో పాటు పరివార దేవతామూర్తల ఆలయాలను సైతం విశేషంగా అలంకరించారు. అదే విధంగా జిల్లాలోని అలంపూర్, మల్దకల్, పాగుంట, ఉత్తనూరు, బీచుపల్లి లక్ష్మీవెంకటేశ్వరస్వామి ఆలయాలు ముస్తాబయ్యాయి. -
స్వీయ జాగ్రత్తలతోనే రక్షణ
చలికాలంలో పిల్లలు, వృద్ధులపై అప్రమత్తత అవసరం ● నిర్లక్ష్యం వహిస్తే న్యుమోనియా, శ్వాస సంబంధ సమస్యలు తీవ్రం ● గోరువెచ్చటి నీరు, వేడి పదార్థాలతో మేలు ● ‘సాక్షి’ ఫోన్ఇన్లో ఇన్చార్జి డీఎంహెచ్ఓ సంధ్యా కిరణ్మయి ప్రశ్న: చలికాలంలో ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి? – కిరణ్, గద్వాల డీఎంహెచ్ఓ: ఆహార పదార్థాలు వేడిగా ఉన్నప్పుడే తీసుకోవడం ఉత్తమం. నిల్వ ఉన్నవి, ఫ్రిడ్జ్లో స్టోర్ చేసినవి, బయట దొరికే చిరుతిండ్లు, ఐస్క్రీంల జోలికి వెళ్లొద్దు. చలికాలంలో నీటిని తక్కువగా తీసుకుంటారు. అలా చేయకుండా తగిన మోతాదులో తీసుకోవాలి. లేదంటే కిడ్నీ సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. మాంసాహారాన్ని తగ్గించి తాజా పండ్లు, ఆకు కూరలు, పీచు పదార్ధాలు తీసుకోవాలి. ప్రశ్న: బీపీ, షుగర్, గుండె జబ్బు రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటి.? – ఏడీ అరుణ్కుమార్, గద్వాల డీఎంహెచ్ఓ: బీపి, షుగర్, గుండె జబ్బు ఉన్నవారు చలి ఎక్కువగా ఉన్న సమయంలో తిరగరాదు. చలి ప్రభావంతో రక్త నాళాలు మూసుకుపోయి రక్త ప్రసరణలో ఇబ్బందులు ఏర్పడుతాయి. తద్వారా అకస్మత్తుగా గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది. బీపీ పేషెంట్లకు ఆక్సిజన్ అందక హైపర్ టెన్షన్కు గురవుతారు. షుగర్ వ్యాధిగ్రస్తులకు రక్తం చలికి చిక్కబడి బ్రెయిన్స్ట్రోక్కు దారి తీస్తుంది. వృద్ధులు, గర్భిణులకు ప్రాణాంతకంగా మారే పరిస్థితులు ఉంటాయి. ఇంట్లోనే ఉన్ని దుస్తులు ధరించి ఉండడం మంచిది. యోగా లేదా తేలికపాటి ఎక్సర్సైజ్లు చేయాలి. గద్వాల క్రైం: చలి తీవ్రత అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో పిల్లలు, వృద్ధులపై అప్రమత్తంగా ఉండాలని.. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందని.. జలుబు, జ్వరం, న్యుమోనియా, ఆస్తమా, శ్వాస సంబంధ వ్యాధుల బారిన పడకుండా స్వీయ జాగ్రత్తలే రక్షణగా నిలుస్తాయని ఇన్చార్జి డీఎంహెచ్ఓ సంధ్యా కిరణ్మయి అన్నారు. సోమవారం ‘సాక్షి’ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫోన్ఇన్ కార్యక్రమంలో శీతాకాలంలో ఎదురయ్యే సమస్యలు, వ్యాధులపై ప్రజల సందేహాలను నివృత్తి చేయడంతోపాటు పలు సూచనలు సలహాలు ఇచ్చారు. ఏదైనా వ్యాధి భారిన పడితే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, లేదా జిల్లా ఆస్పత్రిలోని వైద్యులను సంప్రదించి మెరుగైన వైద్యం పొందాలని సూచించారు. అన్ని రకాల మందులు అందుబాటులో ఉన్నాయన్నారు. ఫోన్ ఇన్లో ప్రజల సందేహాలు, డీఎంహెచ్ఓ సూచనలు ఇలా.. ప్రశ్న: చలికాలంలో ప్రధానంగా వచ్చే వ్యాధులు ఏమిటీ? ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? – విజయ్కుమార్, గద్వాల డీఎంహెచ్ఓ: జలుబు, చలి జ్వరం, ఆస్తమా, న్యుమోనియా, ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంది. వ్యాధిగ్రస్తులను గుర్తించేందుకు ఇంటింటికీ తిరిగి సర్వే చేస్తాం. ప్రస్తుతం లెప్రసీ సర్వే కొనసాగుతుంది. సర్వేలో భాగంగా ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తున్నాం. ప్రతి ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు మెరుగైన వైద్యం అందిస్తున్నాం. ప్రశ్న: మూడు రోజులుగా ఒళ్లు నొప్పులు, తలనొప్పితో ఇబ్బంది పడుతున్నాం. ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోవాలి ? – రవిబాబు నాయుడు, కేటీదొడ్డి డీఎంహెచ్ఓ: వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా ఇలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. సమీపంలోని పీహెచ్సీకి వెళ్లి వైద్యుడిని కలవండి. వ్యాధి నివారణకు మందులు తీసుకోండి. చలి తీవ్రత అధికంగా ఉండే సమయంలో వీలైనంత వరకు బయటకు వెళ్లకుండా ఉండండి. వ్యాధి తగ్గకుంటే రక్త పరీక్షలు తప్పనిసరిగా చేయించుకుని వైద్యం పొందండి. ప్రశ్న: తరచూ ఇంటిల్లిపాది జ్వరం, జలుబు బారినపడుతున్నాం. వీటి బారిన పడకుండా ఉండాలంటే ఏం చేయాలి? – వసంత, గృహిణి, అలంపూర్ డీఎంహెచ్ఓ: ఉదయం ఎండ వచ్చే వరకు బయటకు రావద్దు. పిల్లలపై మరింత జాగ్రత్తగా ఉండాలి. గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తాగితే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇంట్లో యోగా చేయడం ఉపశమనంగా ఉంటుంది. ఉన్ని దుస్తులు ధరించాలి. ప్రశ్న: శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉంది. బయట పడేదెలా? – సుఫియాన్, ఆనంద్, గద్వాల డీఎంహెచ్ఓ: గోరువెచ్చని నీటితో ఆవిరి తీసుకోండి. వీలైనంత వరకు పౌష్టికాహరం, తాజా పండ్లు, గోరువెచ్చని నీరు తాగండి. మందులు వాడినా సమస్య అలాగే ఉంటే వైద్యుడిని సంప్రదించాలి. అవసరమైతే చాతీ ఎక్సరే చేయించుకుని మందులు తీసుకోవాలి. చలి గాలులతో ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం ఉంది. చల్లటి గాలిలో ప్రయాణాలు చేయొద్దు. ప్రశ్న: పిల్లలపై తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పండి..? – ధరణి గృహిణి, గద్వాల డీఎంహెచ్ఓ: కూల్డ్రింక్స్, స్వీట్స్కు దూరంగా ఉంచాలి. వేడి ఆహార పదార్థాలు ఇవ్వాలి. సాయంత్రం నుంచే వెచ్చని దుస్తులు ధరించాలి. ఇంట్లోనే వ్యాయామాలు చేయాలి. చలి పెరిగే సమయాల్లో బయటకు పంపొద్దు. -
రైతుబంధు పాలన పోయి.. రాబంధుల పాలన వచ్చే
● బీఆర్ఎస్ హయాంలో ఆగిన వలసలు మళ్లీ మొదలయ్యాయి ● పాలమూరు ప్రాజెక్టును పండబెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ● సర్పంచ్ల సన్మాన సభలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాగర్కర్నూల్: రాష్ట్రంలో రైతుబంధు పాలన పోయి.. రాబంధుల పాలన వచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి అధ్యక్షతన బీఆర్ఎస్ సర్పంచ్లకు సన్మాన కార్యక్రమం నిర్వహించగా.. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలతో కలిసి కేటీఆర్ పాల్గొని మాట్లాడారు. బీఆర్ఎస్ హయాంలో ఉమ్మడి పాలమూరులో ఆగిన వలసలు తిరిగి మొదలయ్యాయన్నారు. ఈ ఘనత రేవంత్రెడ్డికే దక్కుతుందని విమర్శించారు. ఎప్పుడూ పండబెట్టి తొక్కుతా అంటూ మాట్లాడే రేవంత్రెడ్డి.. పాలమూరు ప్రాజెక్టును పండబెట్టి రైతులను తొక్కుతున్నారని ధ్వజమెత్తారు. పాలమూరు ప్రాజెక్టును కాపాడుకొని రైతన్నలకు అండగా నిలిచేందుకు కేసీఆర్ మరో పోరాటానికి సిద్ధమయ్యారని వెల్లడించారు. త్వరలోనే పాలమూరుకు కేసీఆర్ రాబోతున్నారని.. ఆయన చేపట్టే పోరాటానికి పాలమూరు బిడ్డలు అండగా నిలబడాలని విజ్ఞప్తి చేశారు. రెతులు యూరియా బస్తాల కోసం గోస పడుతున్నారని కేటీఆర్ అన్నారు. చలిలో చెప్పులు క్యూలో పెట్టి నిలబడాల్సిన పరిస్థితి దాపురించిందన్నారు. రేవంత్రెడ్డికి రైతులపై ప్రేమ ఉంటే పరిస్థితి ఇలా ఉండేది కాదన్నారు. కేసీఆర్ ఉన్నప్పుడు యూరియా ఎన్ని బస్తాలు కావాలంటే అన్ని ఇచ్చామని గుర్తుచేశారు. కేసీఆర్ గ్రామాలను ఎంతో అభివృద్ధి చేశారన్నారు. సర్పంచ్ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబితే రేవంత్కు సోయి వచ్చిందన్నారు. ప్రతి ఎన్నికలో కాంగ్రెస్ను ఓడిస్తేనే వాళ్లకు బుద్ధి వస్తుందని.. జిల్లా పరిషత్, మున్సిపల్ ఎన్నికలు సెమీ ఫైనల్, అసెంబ్లీ ఎన్నికలు ఫైనల్ అని పేర్కొన్నారు. -
ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడమే లక్ష్యం
గద్వాలటౌన్: ఎస్జీటీ యూనియన్ నూతన సంవత్సర క్యాలెండర్ను ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి ఆవిష్కరించారు. ఆదివారం క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని ఎస్జీటీ యూనియన్ ఉపాధ్యాయ సంఘం క్యాలెండర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రతి ఉపాధ్యాయడు పనిచేయాలన్నారు. అక్షరాస్యతలో జిల్లాను అగ్రగామిగా నిలపాలన్నారు. విద్యా అభివృద్ధిలో ఉపాధ్యాయులు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. నూతన సంవత్సరం అన్ని వర్గాల ప్రజలకు మంచి చేకూరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అంకితభావంతో విద్యార్థులకు మెరుగైన విద్యాబోధన అందించాలని కోరారు. పదిలో మంచి ఫలితాలు తీసుకరావాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్జీటీ యూనియన్ జిల్లా అధ్యక్షుడు గోపాల్, ప్రధాన కార్యదర్శి వినోద్, నాయకులు వెంకటయ్య, బాలరాజ్, సుమిత్ర, నిమినా నాయక్, జీవన్కుమార్, సోమసుందర్రెడ్డి, రవీందర్రెడ్డి మల్లికార్జున్, సురేందర్ తదితరులు పాల్గొన్నారు. -
రేపు బీచుపల్లిలో ఉత్తరద్వార దర్శనం
ఎర్రవల్లి: బీచుపల్లి పుణ్యక్షేత్రంలోని కోదండరామస్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని ఈ నెల 30న ఆలయంలో ఉత్తర ద్వార దర్శనానికి ఏర్పాట్లు చేయనున్నట్లు ఆలయ మేనేజర్ సురేందర్రాజు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి జిల్లా ప్రజలు ఉత్తర ద్వార దర్శనంలో స్వామి, అమ్మవార్ల దివ్య అనుగ్రహానికి పాత్రులు కాగలరని ఆయన కోరారు. ముక్కోటి ఏకాదశికి మన్యంకొండ ముస్తాబు మహబూబ్నగర్ రూరల్: ముక్కోటి ఏకాదశికి మన్యంకొండ శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి దేవస్థానం ముస్తాబు అయ్యింది. ప్రతి ఏడాది దేవస్థానంలో ముక్కోటి ఏకాదశి పర్వదిన వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా మంగళవారం జరిగే వేడుకలకు దేవస్థానంలో అన్ని ఏర్పాట్లు చేశారు. స్వామివారు హనుమద్దాసుల మండపంలో కొలువుదీరి ఉత్తరద్వారం ద్వారా భక్తులకు దర్శనం ఇస్తారు. ఉదయం 6.30 గంటలకు స్వామివారి శేషవాహన సేవ నిర్వహిస్తారు. దిగువకొండ వద్దను న్న అలివేలు మంగతాయారు దేవస్థానంలోనూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని చైర్మన్ మధుసూదన్కుమార్ తెలిపారు. యువత వ్యవసాయంలో రాణించాలి మరికల్: దేశంలో అతిపెద్ద రంగమైన వ్యవసాయ రంగంలో యువత రాణించాల్సిన సమయం వచ్చిందని ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. ఆత్మీయ రైతు దినోత్సవాన్ని పురస్కరించుకొని మరికల్లో రైతు మహోత్సవ వేడుకలను నిర్వహించారు. కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడుతూ.. ప్రభుత్వాలు మారుతున్నా రైతుల తలరాత మారకపోవడం బా ధారమన్నారు. దుకాణంలో విక్రయించే వస్తువుకు ఒక ధర నిర్ణయించి అమ్ముతారు కానీ, రైతు పండించిన ధాన్యానికి వ్యాపారులు నిర్ణయించిన ధరకే విక్రయించాల్సిన పరిస్థితులు దేశంలో ఉండటంతో వ్యవసాయం రంగం అభివృద్ధి చెందడం లేదన్నారు. రైతు తాను పండించిన పంటను స్వేచ్ఛగా విక్రయించుకునే రోజులు రావాలని, అప్పుడే వారి జీవితాలు బాగుంటాయన్నారు. -
కూల్పై కూపీ..!
‘సాక్షి’ కథనాలపై కదిలిన ‘అధికార’ యంత్రాంగం దుకాణాల కేటాయింపులపై.. నగరంలోని రోడ్లపై చిరు వ్యాపారాలతో నిత్యం ట్రాఫిక్ ఇక్కట్లు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో చిరు వ్యాపారుల కోసం నగరంలోని క్లాక్టవర్ వద్ద పది.. మార్కెట్ రోడ్డులో మరో మూడు షెటర్లు నిర్మించిన విషయం తెలిసిందే. వీటిని వీధి వ్యాపారులకు కేటాయించాల్సి ఉండగా.. ఇందులో దుకాణానికి ఒక్కో రేటు చొప్పున ఫిక్స్ చేసి కొందరు నాయకులు వసూళ్లకు పాల్పడడం చర్చనీయాంశంగా మారింది. ఇది ఎక్కడ తమ మెడకు చుట్టుకుంటుందోననే భయంతో మున్సిపల్ కార్పొరేషన్కు చెందిన కొందరు ఉద్యోగులు ముఖ్య నేత దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. ఈ క్రమంలో సదరు ముఖ్య నేత ఆదేశాలతో ఆ శాఖ అధికారులు విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది. ‘ఇంటెలిజెన్స్’ అధికారుల ఆరా.. కూల్ పాయింట్లకు సంబంధించి మద్యం షాపుల యజమానులపై ఎలాంటి ఒత్తిళ్లు తీసుకొచ్చారు.. ఎలా ఇబ్బందులు పెట్టారు.. ఏమని బెదిరించారు.. ఎవరా నాయకులు..? షటర్ల వ్యవహారంలో వసూళ్లకు పాల్పడింది ఎవరు.. ఇందులో నాయకులు, మున్సిపల్, మెప్మా శాఖల సిబ్బంది పాత్ర ఏమిటి? అని పోలీస్ ఇంటెలిజెన్స్ అధికారులు సైతం ఆరా తీస్తున్నట్లు తెలిసింది. ముఖ్య నేత ఆదేశాలతోనే వారు కూపీ లాగుతున్నారా.. లేకపోతే పై నుంచి ఆదేశాలు వచ్చాయా అనేది తెలియడం లేదు. ఇప్పటికే కూపీ లాగిన ఇంటెలిజెన్స్ అధికారులు కూల్ పాయింట్ల తతంగంలో ఓ నాయకుడి దు రుసు ప్రవర్తనే ఇందుకు ప్రధాన కారణమనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. ఆయనతోపాటు పలువురు నాయకుల చిట్టాను వెలికితీసే పనిలో వారు నిమగ్నమైనట్లు సమాచారం. ఈ వ్యవహారాలకు సంబంధించి ఆయా శాఖల అధికారుల ను ఫోన్లో సంప్రదించేందుకు ‘సాక్షి’ ప్రయత్ని ంచగా.. అధికారులు అందుబాటులోకి రాలేదు. సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: ఉమ్మడి జిల్లాలోని వైన్స్ షాపుల్లో కూల్ పాయింట్లు, వీధి వ్యాపారులకు ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుకాణాల కేటాయింపుల్లో చోటుచేసుకున్న దందాపై ‘అధికార’ యంత్రాంగం దృష్టిసారించింది. ప్రధానంగా మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కొనసాగిన బాగోతాలపై ‘కూల్శ్రీగా దోపిడీ’, ‘నేతల వసూళ్ల పర్వం’ శీర్షికన ‘సాక్షిశ్రీలో ప్రచురితమైన వరుస కథనాలు సంచలనం సృష్టించాయి. అధికార కాంగ్రెస్లోని కొందరు ద్వితీయ శ్రేణి నాయకులు నడిపించిన ఈ వ్యవహారం వెలుగులోకి రాగా.. ఆయా ప్రభుత్వ శాఖల అధికారులు కూపీ లాగుతున్నారు. దీంతో అసలేం జరుగుతోంది.. ఈ వివాదాలకు ఎవరెవరు కారణం అని పూర్తిస్థాయిలో తెలుసుకునేందుకు ప్రభుత్వ పెద్దలు సైతం నేరుగా రంగంలోకి దిగారు. తమకు పార్టీలో అత్యంత నమ్మకంగా ఉన్న వేగుల ద్వారా సమాచారం సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఉన్నతాధికారుల ఆదేశాలతో.. మహబూబ్నగర్ నగర పరిధిలో 13 వైన్స్ షాపులు ఉన్నాయి. వీటిలో కూల్ పాయింట్ల ద్వారా తమ ముఖ్య అనుచరులకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో కొందరు కాంగ్రెస్ ద్వితీయ శ్రేణి నేతలు పంచుకున్నారు. అయితే మాట వినని నిర్వాహకులను పలువురు ఇబ్బందులకు గురిచేయడం వివాదానికి దారితీసింది . దీనిపై కొందరు యజమానులు రాష్ట్రస్థాయిలో కాంగ్రెస్ ముఖ్యులు, ఎకై ్సజ్ శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. రూ.లక్షలు, కోట్లు పెట్టాం.. లక్ష్యం మేరకు అమ్ముతున్నాం.. నిర్ణీత కోటా దాటిన తర్వాత ఒరిగేదేమీ లేదని.. ఇప్పుడు ఇలా వేధిస్తే ఎలా అని వారు ప్రశ్నించారు. ఈ క్రమంలో ఎకై ్సజ్ శాఖ జిల్లా అధికారులకు ఉన్నతాధికారులు చీవాట్లు పెట్టడంతోపాటు ప్రాథమిక సమాచారం తీసుకున్నారు. పూర్తిస్థాయిలో నివేదిక ఇవ్వాలని ఆదేశించడంతో వారు ఆయా వైన్స్ యజమానుల నుంచి గుట్టుచప్పుడు కాకుండా వివరాలు సేకరిస్తున్నట్లు తెలిసింది. మద్యం షాపుల్లో కూల్ పాయింట్ల వివాదంపై నజర్ నేరుగా రంగంలోకి దిగిన ‘ఎకై ్సజ్’ ఉన్నతాధికారులు వెన్స్ దుకాణాల ఓనర్ల నుంచి వివరాల సేకరణ ‘షెటర్ల’ కేటాయింపుల్లో అక్రమాలపైనా విచారణ పురపాలక శాఖకు ముఖ్య నేత ఆదేశాలు ఇంతకు ఎవరా నాయకులు.. ‘ఇంటెలిజెన్స్’ ఆరా? -
సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ : 8008297534
తేదీ : 29–12–2025 సమయం : మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు గద్వాల క్రైం: రోజురోజుకు చలి తీవ్రత అధికమవుతున్న నేపథ్యంలో వృద్ధులు, చిన్నారులు, అనారోగ్యం బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ‘సాక్షి’ ఆధ్వర్యంలో ఈ నెల 29న ఇన్చార్జి డీఎంహెచ్ఓ సంధ్యా కిరణ్మైతో ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహించనుంది. దగ్గు, జలుబు, జ్వర పీడితులకు జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో అందిస్తున్న వైద్యం, మందులు, ఇతర సేవలపై తమ సందేహాలను నివృత్తి చేసుకునేందుకు మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు ఫోన్లో ఇన్చార్జి డీఎంహెచ్ఓను సంప్రదించవచ్చు. ఈ అవకాశాన్ని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. నేడు డీఎంహెచ్ఓతో ‘సాక్షి’ ఫోన్ ఇన్ -
ఒకటే పార్టీ.. రెండు కార్యక్రమాలు
● గద్వాల కాంగ్రెస్లో అదే తీరు ● మరోసారి వర్గ రాజకీయాలకు వేదికగా మారిన పార్టీ ఆవిర్భావం గద్వాలటౌన్: గద్వాల కాంగ్రెస్ అంటేనే గ్రూపు రాజకీయాలకు పెట్టింటి పేరని మరోసారి రుజువైంది. పార్టీ ఒక్కటే.. కానీ కార్యక్రమాలు మాత్రం రెండు చోట్ల పోటాపోటీగా జరిగాయి. ఆదివారం జిల్లా కేంద్రంలో జరిగిన కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ వేడుకలు గ్రూపు రాజకీయాలకు మరోసారి వేదికయ్యాయి. ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి, జెడ్పీ మాజీ చైర్పర్సన్ సరిత వర్గాల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతుండగా.. తాజాగా డీసీసీ అధ్యక్షుడు రాజీవ్రెడ్డి నియామకంతో మరో శిబిరం ఏర్పడింది. రాజీవ్రెడ్డికి ఎమ్మెల్యే వర్గీయులు మద్దతుగా ఉండటంతో సరిత వర్గీయులు గుర్రుగా ఉన్నారు. మొదటి నుంచి రాజీవ్రెడ్డి కార్యక్రమాలకు సరిత వర్గీయులు దూరంగా ఉన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలో వేర్వేరు కార్యక్రమాలు నిర్వహించడం చర్చనీయాంశమైంది. క్రమశిక్షణ ఉల్లంఘిస్తే వేటు తప్పదు :డీసీసీ అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణ ఉల్లంఘిస్తే వేటు తప్పదని డీసీసీ అధ్యక్షుడు రాజీవ్రెడ్డి హెచ్చరించారు. డీసీసీ కార్యాలయంపై కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ప్రతి కార్యకర్త పార్టీ నిబంధనల ప్రకారమే పని చేయాలని సూచించారు. జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఒక్కటే ఉందని, అది డీసీసీ కార్యాలయమే అన్నారు. ఎవరైనా కాంగ్రెస్ పార్టీ పేరుతో కార్యాలయాలు ఏర్పాటు చేసి, కార్యక్రమాలు నడిపితే సస్పెండ్ చేస్తానని హెచ్చరించారు. రాబోవు ఎన్నికల్లో పార్టీ బీ–ఫామ్ టిక్కెట్లు ఇచ్చేది నేనేనని చెప్పారు. జనవరి 5 నుంచి గ్రామాలలో పర్యటన చేస్తానన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే వర్గీయులు, తదితరులు పాల్గొన్నారు. -
పల్లికి రికార్డు ధర..
● రెండు వారాల నుంచి ధరలు పైకి.. ● జిల్లా నుంచి చైన్నె, మహారాష్ట్రకు ఎగుమతి ● క్వింటా రూ.8,821 పలికిన వైనం మంచి ధరలు వేరుశనగను మట్టి పెల్లలు లేకుండా నాణ్యతగా తీసుకొస్తుండడంతో యార్డులో మంచి ధరలు వస్తున్నాయి. ఇక్కడికి వస్తున్న వేరుశనగను విత్తనానికి వినియోగిస్తున్నారు. అందువల్లే ధరలు బాగా వస్తున్నాయి. – పుష్ప, జిల్లా మార్కెటింగ్ అధికారి రెండు ఎకరాల్లో పంట సాగుచేశా యాసంగికి ముందే రెండు ఎకరాల్లో వేరుశనగ వేశాను. చేతికి వచ్చిన పంటను కొద్ది రోజుల క్రితం విక్రయానికై యార్డుకు తీసుకెళ్లాను. క్వింటాలుకు రూ. 7800 వచ్చింది. ధర మంచిగా రావడంతో పంట ఖర్చులు పోను కొంత మిగిలింది. – సూరి, రైతు, శెట్టిఆత్మకూర్, గద్వాల మండలం ఆనందంగా ఉంది ప్రతి సంవత్సరం నేను వేరుశనగ సాగు చేస్తాను. మా మండలంతో పాటు కొన్ని మండలాల్లో సంవత్సరంలో మూడు సార్లు వేరుశనగ సాగు చేస్తారు. ఏటా నవంబర్, డిసెంబర్లో ఇతర యార్డులకు వేరుశనగ రాదు. ఇక్కడ మాత్రమే వస్తుంది. దీనివల్ల ధరలు బాగా వస్తున్నాయి. ఆనందంగా ఉంది. – కృష్ణన్న, రైతు, అమరవాయి, మల్దకల్ మండలం గద్వాల వ్యవసాయం: పల్లి ధరలు పరుగెత్తుతున్నాయి. నడిగడ్డ రైతులు యాసంగి సీజన్కు ముందుగా వేరుశనగ వేయగా.. ఈ పంట చేతికి రావడంతో విక్రయానికి గడిచిన మూడు నెలల నుంచి గద్వాల మార్కెట్యార్డుకు తీసుకవస్తున్నారు. ఇలా వస్తున్న వేరుశనగకు అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు పోల్చితే నెల నెలా రికార్డు ధరలు పలుకుతున్నాయి. గరిష్టంగా రూ.8821 పలకడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలాఉండగా, వేరుశనగ పంట 90 నుంచి 100 రోజులకు చేతికి వస్తుంది. ఎకరాకు రూ.12వేల నుంచి రూ.15వేల వరకు ఖర్చు అవుతుంది. అయితే ఈసారి వానాకాలం సీజన్లో అధిక వర్షాల వల్ల వేరుశనగ బాగా దెబ్బతినడంతో కొన్ని చోట్ల పంటను తీసివేశారు. జిల్లాలో పలుచోట్ల అనుకున్న స్థాయిలో దిగుబడులు రాలేదు. అయితే విస్తారంగా కురిసిన వర్షాల వల్ల బోర్లు, బావులు రీచార్జ్ అయ్యాయి. దీంతో ఆగస్టు, సెప్టెంబర్లో దాదాపు 7వేల నుంచి 10వేల ఎకరాల్లో ముందస్తు యాసంగి సీజన్ పంటలో బాగంగా మల్దకల్, కేటీదొడ్డి, గట్టు, గద్వాల, ఇటిక్యాల, అయిజ మండలాల్లో పంట వేశారు. ఇలా వేసిన వేరుశనగ పంట అక్టోబర్ నుంచి యార్డుకు అమ్మకానికి వస్తోంది. యా, వ,వే: యార్డుకు వచ్చిన వేరుశనగ గద్వాల మార్కెట్యార్డుకు విక్రయానికి వచ్చిన వేరుశనగ కొనుగోళ ్లు ఇలా.. -
వణికిస్తున్న చలి..
● రెండు వారాలుగా పెరిగిన తీవ్రత ● ఉష్ణోగ్రతల మార్పులతో పెరుగుతున్న వ్యాధులు ● అప్రమత్తతే ముఖ్యమంటున్న వైద్యులు ●చలి గాలులతో ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం ఉంటుంది. ముఖ్యంగా పిల్లలు వీటి నుంచి కోలుకోవాలంటే సమయం పడుతుంది. ఆసుపత్రికి దగ్గు, జలుబు తదితర బాధిత చిన్నారులు, వృద్ధులు ఎక్కువగా వస్తున్నారు. సమస్య తీవ్రమైతే ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. గోరు వెచ్చని నీటిని తాగించాలి. తాజా ఆహారం తీసుకోవాలి. – డాక్టర్ వంశీ, ప్రభుత్వ వైద్యుడు గద్వాలటౌన్: జిల్లా ప్రజలను చలి వణికిస్తోంది. శీతాకాలం ఆరంభంలో మొదట చలి తీవ్రత తక్కువగా ఉన్నప్పటికి.. గడిచిన రెండు వారాలుగా చలి తీవ్రత పెరిగింది. ఇటీవల కాలంలో పగటి ఉష్ణోగ్రతలు బాగా తగ్గాయి. ఇప్పటి వరకు కనిష్ట ఉష్ణోగ్రత 12 డిగ్రీల స్థాయికి పడిపోయింది. ముందు ముందు పగటి ఉష్ణోగ్రతలు ఘననీయంగా పడిపోయే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. సాయంత్రం 5 గంటల నుంచి చలి మొదలవుతుండగా ఉదయం 9 గంటల వరకు కొనసాగుతోంది. పిల్లలు, వృద్ధులు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు. చాలా మంది స్వెటర్లు, శాలువాలు, దుప్పట్లతో చలి నుంచి రక్షణ పొందడానికి యత్నిస్తున్నారు. వాతావరణం ఒక్కసారిగా చల్లబడడంతో ఆరోగ్య పరమైన సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి. జలుబు, దగ్గు, వైరల్జ్వరాలు సొకుతున్నాయి. శ్వాసకోశ సంబంధ వ్యాధులు ఉన్నవారు ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు. వయోబేధం లేకుండా ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో చలికాలం ఎదురయ్యే ఇబ్బందులు, ఆరోగ్య పరిరక్షణకు ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలివి. చిన్నారులపై ప్రత్యేక శ్రద్ధ చిన్నారుల విషయంలో తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. నిరోదకశక్తి తక్కువగా ఉంటుంది కాబట్టి వాతావరణ మార్పుల వలన వారు త్వరగా అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. అందువల్ల ఉదయం, సాయంత్రం వారిని బయటతిరగనీయొద్దు. గ్రామాల నుంచి పట్టణాల్లోని పాఠశాలలకు ఉదయం సమయాల్లో బస్సులో, ఆటోల్లో వెళ్లే విద్యార్థులకు విధిగా స్వెటర్లు, మంకీ క్యాప్లు దరించాలి. పిల్లలకు ఎక్కువగా జలుబు చేస్తే ఏ మాత్రం నిర్లక్ష్యం చేయొద్దు. దీంతోపాటు పొడి చర్మం ఉన్నవారు ఎక్కువ ఇబ్బందిపడే అవకాశం ఉంది. చర్మం పగుల్లిచ్చి మంట పుడుతుంది. అందువల్ల చర్మం పొడిబారి పోకుండా చూసుకోవాలి. ఇందుకోసం వ్యాస్లెన్, పెట్రోలియంజెల్లి, మాయిశ్ఛరైజర్లు వాడాలి. స్నానానికి కూడా గ్లీజరిన్, మాయిశ్ఛరైజర్ ఉన్న సబ్బులు వాడటం ఉత్తమం. పొగమంచు.. రోడ్డు ప్రమాదాలు అధికం తెల్లవారుజామున పొగమంచు కురుస్తుంది. ఒక్కసారి మంచు చాలా దట్టంగా కురిసి దారి కనిపించకుండా పోతోంది. దీనివల్ల ముందుగా వచ్చే వాహనాలు దగ్గరకు వచ్చే వరకు కనిపించక ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. అందువల్ల మంచుకురిసేటప్పుడు వాహనాలు నడిపేవారు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. లైట్లు వేసుకోవడంతో పాటు తక్కువ వేగంతో వాహనాలు నడపాలి. చలికాలం మామూలుగా ఉంటేనే చలితో వణికిపోతాం. అలాంటిది వాహనాలపై ప్రయాణిస్తే వణుకు పుడుతుంది. ఉదయం, సాయంత్రం సమయాల్లో ముఖ్యంగా ద్విచక్రవాహనాలపై ప్రయాణించాల్సి వస్తే వెచ్చగా ఉండే జర్కిన్లు, తలకు, చెవులకు రక్షణగా మంకీక్యాప్, చేతులకు గ్లౌజులు తప్పక ధరించాలి. జిల్లాలో నమోదైన కనిష్ట ఉష్ణోగ్రత వివరాలు.. తేదీ కనిష్ట ఉష్ణోగ్రత 23వ తేదీ 13.4 24వ తేదీ 13.7 25వ తేదీ 13.6 26వ తేదీ 14.0 27వ తేదీ 12.8 -
విశ్రాంత ఉద్యోగుల సంక్షేమానికి కృషి
గద్వాలటౌన్: విశ్రాంత ఉద్యోగుల సంక్షేమానికి కృషి చేస్తామని ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి పేర్కొన్నారు. స్థానిక పాత హౌసింగ్బోర్డు కాలనీలోని విశ్రాంత ఉద్యోగుల భవనంలో ఏర్పాటు చేసిన పెన్షనర్ డే వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. విశ్రాంత ఉద్యోగులకు ప్రభుత్వ పరంగా అందాల్సిన అన్ని సౌకర్యాలు కల్పించేలా చూస్తామన్నారు. శేష జీవితాన్ని కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపాలని, సుదీర్ణ కాలంగా సేవలందించిన తమ అనుభవాలను నేటితరం ఉద్యోగులు మార్గదర్శకంగా ఉపయోగించుకోవాలన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ విద్యుక్త ధర్మాన్ని పాటించే ఉద్యోగులు ఎల్లప్పుడు గుర్తుండిపోతారన్నారు. ప్రతి ఉద్యోగి తమ జీవిత కాలంలో తనకంటూ ఓ ప్రత్యేకతను సాధించుకుంటే ఆదర్శంగా నిలుస్తారని పేర్కొన్నారు. ఉద్యోగుల వైద్య చికిత్సలకు సంబంధించి కర్నూల్లో ఈహెచ్ఎస్ సౌకర్యం త్వరలోనే సాకారం అవుతుందని హామీ ఇచ్చారు. విశ్రాంత ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు లక్ష్మిరెడ్డి మాట్లాడుతూ.. జిల్లాలో సైతం వైద్యసేవలు మెరుగు పడేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కొత్త పీఆర్సీని ప్రభుత్వం వెంటనే ఏర్పాటు చేయాలని, పాత పీఆర్సీ, డీఆర్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు. అనంతరం పలువురు సీనియర్ విశ్రాంత ఉద్యోగులను ఎమ్మెల్యే శాలువతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ట్రెజరీ అధికారిణి గాయత్రి, ఏటీఓ వెంకట్రెడ్డి, సీనియర్ అధికారి మురళీ, విశ్రాంతి ఉద్యోగుల సంఘం నాయకులు చక్రధర్, హనుమంతు, బాలకిషన్రావు, రామన్గౌడ్, వీరవసంతరాయుడు, సవారన్న, బీసీరెడ్డి పాల్గొన్నారు. -
సైబర్.. టెర్రర్
–8లో uసాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: సైబర్ నేరగాళ్లు సామాజిక మాధ్యమాలే వేదికగా వల పన్ని దోపిడీకి పాల్పడుతున్నారు. ఆయా వర్గాల వ్యక్తుల బలహీనత అయిన అత్యాశను ఆసరాగా చేసుకుని రూ.కోట్లు కొల్లగొడుతున్నారు. రకరకాల పేర్లతో ఏపీకే లింక్లు పంపించి నిలువునా దోచుకుంటున్నారు. ఈ ఏడాది ఎక్కువగా ఆన్లైన్ ట్రేడింగ్ పేరిట యువత నుంచి భారీగా డబ్బులు తమ ఖాతాల్లోకి మళ్లించుకున్నారు. వారి మాయలో చిక్కుకున్న వారిలో అమాయకులే కాకుండా.. రైతులు మొదలుకొని విద్యాధికులు, రాజకీయ నాయకులు సైతం ఉన్నారు. ఈ క్రమంలో ఉమ్మడి పాలమూరు జిల్లాను సైబర్ మాయ కమ్మేసిన తీరుపై ‘సాక్షి’ క్రైం రౌండప్.. ఉమ్మడి పాలమూరులోని మహబూబ్నగర్, జోగుళాంబ గద్వాల, నారాయణపేట, వనపర్తి జిల్లాల పరిధిలో సైబర్ నేరాలకు సంబంధించి గతేడాది (2024)లో మొత్తం 3,003 ఫిర్యాదులు రాగా.. 236 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుత 2025 సంవత్సరంలో 3,625 ఫిర్యాదులు అందగా.. 454 కేసులు నమోదైనట్లు అధికారిక రికార్డులు చెబుతున్నాయి. ఈ లెక్కన గతేడాదితో పోలిస్తే 622 ఫిర్యాదులు.. 218 కేసులు పెరిగినట్లు తెలుస్తోంది. గత సంవత్సరంలో నమోదైన కేసులతో పోలిస్తే మహబూబ్నగర్, జోగుళాంబ గద్వాల, నారాయణపేట, వనపర్తి జిల్లాల్లో సైబర్ నేరాల సంఖ్య అధికంగా ఉంది. జిల్లాలో గణనీయంగా పెరిగిన సైబర్ నేరాలు ఉమ్మడి పాలమూరులోని 4 జిల్లాల్లో ఇదే పరిస్థితి ఈసారి మొత్తం 3,625 ఫిర్యాదులు.. 454 కేసులు నమోదు అత్యధికంగా మహబూబ్నగర్లో.. అత్యల్పంగా వనపర్తిలో.. ఈ ఏడాది కేటుగాళ్లు కొల్లగొట్టింది రూ.9.29 కోట్లు గతంతో పోల్చితే కాస్త మెరుగుపడిన రికవరీ -
పాలమూరులో 18,446 కేసులు పెండింగ్
పాలమూరు: మహబూబ్నగర్ జిల్లాలో ఈ ఏడాది నవంబర్ 30 నాటికి 18,446 కేసులు పెండింగ్లో ఉన్నాయని, మౌళిక సదుపాయాల కల్పనతో కోర్టులలో పెండింగ్ కేసులు తగ్గించే విధంగా న్యాయవాదులు కృషిచేయాలని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి, జిల్లా పరిపాలన ఇన్చార్జి న్యాయమూర్తి జస్టిస్ శ్రావణ్కుమార్ అన్నారు. నగరంలోని బండమీదిపల్లి సమీపంలో రూ.81 కోట్లతో నూతనంగా నిర్మించనున్న కోర్టు సముదాయ భవన నిర్మాణానికి హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ కె.లక్ష్మణ్, జస్టిస్ బి.విజయ్సేన్రెడ్డి, జస్టిస్ టి.మాధవిదేవి, జస్టిస్ నర్సింగ్రావులతో కలిసి జస్టిస్ శ్రావణ్కుమార్ శంకుస్థాపన చేసి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రావణ్కుమార్ మాట్లాడుతూ మహబూబ్నగర్ నగరంలో 16, జడ్చర్లలో 3 మొత్తం 19 కోర్టులు ఉండగా.. 293 మంది సిబ్బందికి గాను 252 మంది ఉన్నారని వెల్లడించారు. 504 మంది న్యాయవాదులు ఉండగా 35 మంది మహిళా న్యాయవాదులు ప్రాక్టీస్ చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న కోర్టు భవనం 2.5 ఎకరాల స్థలంలో సరిపోని విధంగా ఉందని, నూతన కోర్టు భవన సముదాయం విశాలంగా నిర్మించాలని ప్రభుత్వం 2024 నవంబర్ 14న ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. 10.5 ఎకరాల స్థలంలో రూ.81 కోట్లతో మూడు అంతస్తులలో 12 కోర్టుల ఒకే భవన సముదాయం ఒకేదగ్గర నిర్మాణం అవుతుందన్నారు. ఈ నూతన భవన నిర్మాణం రాబోయే 24 నెలల్లో పూర్తిచేయనున్నట్లు తెలిపారు. జిల్లాకు భౌగోళికంగా, పరిపాలన పరంగా ప్రాముఖ్యత ఉందని, వ్యవసాయ జీవనోపాధిగా, పట్టణీకరణతో అభివృద్ధి చెందుతున్న జిల్లా అన్నారు. నూతన కోర్టు భవన సముదాయంతో కోర్టుకు వచ్చే కక్షిదారులకు సత్వర న్యాయం లభించాలని, ఈ దిశగా న్యాయవాదులు, న్యాయమూర్తులు సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు. రెండేళ్లలో కోర్టు భవన నిర్మాణం పూర్తికావాలి రూ.81 కోట్లతో ఒకే సముదాయంలో 12 కోర్టులు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రావణ్కుమార్ -
సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ : 8008297534
తేదీ : 29–12–2025 సమయం : మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు గద్వాల క్రైం: రోజురోజుకు చలి తీవ్రత అధికమవుతున్న నేపథ్యంలో వృద్ధులు, చిన్నారులు, అనారోగ్యం బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ‘సాక్షి’ ఆధ్వర్యంలో ఈ నెల 29న ఇన్చార్జి డీఎంహెచ్ఓ సంధ్యా కిరణ్మైతో ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహించనుంది. దగ్గు, జలుబు, జ్వర పీడితులకు జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో అందిస్తున్న వైద్యం, మందులు, ఇతర సేవలపై తమ సందేహాలను నివృత్తి చేసుకునేందుకు మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు ఫోన్లో ఇన్చార్జి డీఎంహెచ్ఓను సంప్రదించవచ్చు. ఈ అవకాశాన్ని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. రేపు డీఎంహెచ్ఓతో ‘సాక్షి’ ఫోన్ ఇన్ -
భక్తులతో కిటకిటలాడిన ఆదిశిలా క్షేత్రం
మల్దకల్: ఆదిశిలా క్షేత్రమైన స్వయంభూ లక్ష్మీవెంకటేశ్వరస్వామి ఆలయం శనివారం భక్తులతో పోటేత్తింది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక నుంచి భక్తులు పెద్దసంఖ్యలో తరలిరావడంతో ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి. క్యూలైన్లలో బారులుతీరారు. భక్తులు దాసంగాలు సిద్ధం చేసి స్వామివారికి సమర్పించగా.. వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఉదయం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ సత్యచంద్రారెడ్డి, అరవిందరావు, నాయకులు మధుసూధన్రెడ్డి, నరేందర్ , వీరారెడ్డి, రాజశేఖర్ రెడ్డి, శిరీష, అర్చకులు మధుసూదనాచారి, రవిచారి, ధీరేంద్రదాసు, చంద్రశేఖర్రావు భక్తులు పాల్గొన్నారు. -
పెరిగిన చోరీలు..!
సైబర్ నేరాలు రెట్టింపు.. రోడ్డు ప్రమాదాలు, అత్యాచార కేసులు సైతం పెంపు గద్వాల క్రైం: జిల్లాలో గతేడాదితో పోల్చితే చోరీ కేసులు.. సైబర్ నేరాలు.. అత్యాచార కేసులు.. రోడ్డు ప్రమాదాలు పెరిగాయి. రోడ్డు ప్రమాదాల నివారణకు బ్లాక్ స్పాట్లను గుర్తించి తగు చర్యలు చేపట్టినా ప్రయోజనం లేకుండా పోయింది. పలు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 135 మంది దుర్మరణం చెందగా.. 189 మంది క్షతగాత్రులయ్యారు. ఈ ఏడాది మొత్తంగా 2,410 కేసులు నమోయ్యాయని, గతేడాది నమోదైన 2703 కేసులతో పోల్చితే కొంత కేసుల శాతం తగ్గిందని ఎస్పీ శ్రీనివాసరావు శుక్రవారం వార్షిక నేర సమీక్షలో వెల్లడించారు. ఇక చోరీ కేసుల్లో 67 శాతం సొమ్ము రికవరీ చేశామని, దొంగల ముఠాలను, రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన పలు హత్య కేసులను ఛేదించి నిందితులను పట్టుకున్నామని తెలిపారు. ఇదిలాఉండగా, జిల్లాలో సుపారీగ్యాంగ్ హత్యలు.. చోరీ ఘటనలు ప్రజలను భయాందోళనకు గురిచేశాయి. ముఖ్యంగా జూలై 12న అయిజలోని ఓ గోదాం షట్టర్లు పగలగొట్టి రూ.18 లక్షల విలువ చేసే సిగరెట్ల చోరీ.. జూన్ 5న గద్వాల వ్యవసాయ మార్కెట్లో నిలిపి ఉంచిన రూ.25 లక్షల విలువైన 10 టైర్ల లారీ అపహరణ.. ఆగస్టు 17న జిల్లా కేంద్రంలో హమాలీకాలనీలోని ఓ ఇంట్లోకి చొరబడి 16 తులాల బంగారు ఆభరణాలను దొంగలు చోరీ చేయడంతో ప్రజలకు కంటిమీద కునుకు కరువైంది. సైబర్ నేరాలు రెట్టింపు జిల్లాలో గతేడాది 161 దొంగతనాలకుగాను రూ.1.94 కోట్లు చోరీ అయ్యింది. ఇందులో రూ.63 లక్షలు రికవరీ చేశారు. ఈ ఏడాది 184 దొంగతనాలకుగాను రూ.1.43 కోట్లు చోరీ అయ్యింది. ఇందులో రూ.96 లక్షలు రికవరీ చేశారు. ఇక సైబర్ నేరాల విషయానికి వస్తే.. స్వల్పంగా పెరిగాయి. గతేడాది 50 కేసులు కాగా.. ఈ ఏడాది 95 నమోదయ్యాయి. ఈ 95 కేసుల్లో రూ.2.60 కోట్లు అపహరించగా.. సాంకేతికతను ఉపయోగించి బ్యాంక్ ఖాతాల నుంచి రూ.47,62లక్షల నగదును ఫ్రీజ్ చేశారు. రూ.11.24లక్షల నగదును రికవరీ చేశారు. ఇక రోడ్డు ప్రమాదాలు సైతం స్వల్పంగా పెరిగాయి. మొత్తం 204 రోడ్డు ప్రమాదాల్లో 135 మంది మృతి చెందారు. జిల్లాలో తొలి వైట్కాలర్ కేసు నమోదైంది. నందిన్నె రైసుమిల్లు యాజమాని మిల్లు వీరన్న రూ.40 కోట్ల ప్రభుత్వ ధాన్యాన్ని పక్కదారి పట్టించినట్లు విజెలెన్స్ అధికారుల దాడుల్లో బయటపడింది. ఈమేరకు కేటీదొడ్డి పోలీసు స్టేషన్లో అధికారులు ఫిర్యాదు చేయగా.. సదరు వ్యక్తిపై కేసు నమోదు చేశారు. హత్య కేసుల ఛేదన జిల్లాలో సంచలనం సృష్టించిన పలు హత్య కేసులను పోలీసులు ఛేదించారు. ప్రధానంగా నవంబర్ 21న కేటీదొడ్డి మండలం నందిన్నెకు చెందిన మాజీ సర్పంచ్ బీమరాయుడు హత్య.. జూన్ 15న గద్వాలకు చెందిన ఓ ప్రైవేటు సర్వేయర్ హత్య.. ఏప్రిల్ 17న కేటీదొడ్డి మండలం గంగన్పల్లి హత్య.. ఫిబ్రవరి 12న వడ్డేపల్లి మండలం తనగాలకి చెందిన రమేష్ హత్యలు సంచలనం సృష్టించాయి. ఈ హత్య కేసులను పోలీసులు ఛాలెంజ్గా తీసుకుని ఛేదించి నిందితులను కటకటాల్లోకి పంపించారు. కేటగిరీ నమోదైన కేసులు 2024 2025 బీఎన్ఎస్ యాక్టు 1052 846 రోడ్డు ప్రమాదాలు 194 204 దొంగతనాలు 161 184 మిస్సింగ్ 187 177 ఇసుక రవాణా 133 112 సైబర్ క్రైమ్ 50 95 గ్రేవ్ కేసులు 69 92 చీటింగ్ 169 77 పేకాట 35 64 పోక్సో 44 51 మహిళా వేధింపులు 196 50 అత్యాచారం 31 41 రేషన్ బియ్యం 53 40 ఎస్సీ, ఎస్టీ 40 32 హత్యలు 10 10 ఎన్డీపీఎస్ యాక్టు 4 5 ఇతర కేసులు 325 425 నమోదైన మొత్తం కేసులు 2,410 గతేడాదితో పోల్చితే 293 కేసులు తగ్గుదల జిల్లా వార్షిక నేర సమీక్షలో ఎస్పీ శ్రీనివాసరావు లోక్ అదాలత్ ద్వారా 22,426 కేసులు పరిష్కారం 985.8 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం స్వాధీనం గేమింగ్ యాక్టు కేసులో రూ.7.75 లక్షలు స్వాధీనం 7056 డ్రంకెన్ డ్రైవ్ కేసులకుగాను రూ.33.96 లక్షలు జరిమానా వసూలు మోటార్ వెహికిల్ యాక్టు ద్వారా 1.05 లక్షల కేసులకుగాను జరిమానా రూపంలో రూ.6.49 కోట్లు వసూలు -
‘ఉపాధి’ పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్ర
గద్వాలటౌన్: మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి, కొత్తగా తీసుకొచ్చిన వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్ గార్ అండ్ అజీవిత మిషన్ పథకం వల్ల ప్రజలు, కార్మికుల వేతనాలు పెరగకుండా కేంద్రం అడ్డుకునే చర్యలకు పాల్పడుతుందని సీఐటీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఉప్పేర్ నర్సింహా, వీవీ నర్సింహా ఆరోపించారు. శుక్రవారం స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో నల్లబ్యాడ్జీలు ధరించి సీఐటీయూ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తరువాత ఉపాధి పథకంలో నిధుల కోత పెట్టిందని, ప్రస్తుతం పేరు మార్చుతున్నారని మండిపడ్డారు. ఉపాధి పథకాన్ని నిర్వీర్యం చేయడానికి కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నుతుందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం తన వాటాను 60 శాతానికి తగ్గించి, మిగిలిన 40 శాతం భారాన్ని రాష్ట్రాలపై మోపడం అన్యామన్నారు. కేంద్ర ప్రభుత్వ అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు నరేష్, బాబన్న, రామకృష్ణ, మల్లేష్, వీరేష్, వెంకటన్నపాల్గొన్నారు. -
జిల్లాను సందర్శించిన ట్రైనీ ఐపీఎస్లు
గద్వాల క్రైం: జిల్లాను నలుగురు ట్రైనీ ఐపీఎస్లు రాహుల్కాంత్, మానిషానెహ్రా, సోహం సునీల్, ఆయషా ఫాతిమా శుక్రవారం సందర్శించారు. ఈమేరకు మొదట ఎస్పీ శ్రీనివాసరావును కలిసి జిల్లాలో నమోదు అవుతున్న కేసులు, రాష్ట్ర సరిహద్దులు, జిల్లా భౌగోళిక విషయాలు, విద్యా, వైద్యం, సాగు, తాగునీటి, రాజకీయ అంశాలు, ప్రాచీన ఆలయాలు, సందర్శించే ప్రాంతాలు, పురాతన నిర్మాణాలు, ప్రాజెక్ట్లు, పోలీసు స్టేషన్లు తదితర విషయాలపై ఆరా తీశారు. అనంతరం వారు జోగుళాంబ ఆయలం, జిల్లా కేంద్రంలోని చేనేత కార్మికులను కలిసి పలు విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఆ బాలవీరుల త్యాగం స్ఫూర్తిదాయం గద్వాలన్యూటౌన్: జిల్లా కేంద్రంలోని బాల సదనంలో శుక్రవారం మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వీర్ బాల దివస్ను ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా ఏర్పాటు సమావేశంలో బాలల సంరక్షణ అధికారి నరసింహ మాట్లాడుతూ.. అతి చిన్న వయస్సులో స్వేచ్ఛ, ధర్మ పరిరక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన సాహిబ్ గురు గోబింద్ సింగ్ కుమారులు జోరవర్ సింగ్ (7 ఏళ్లు), బాబా ఫతే సింగ్ (9 ఏళ్లు)ల వీరత్వం దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందని చెప్పారు. అతి చిన్న వయస్సులో వారు మొఘల్ పాలకుల ఆజ్ఞలకు లొంగకుండా, తమ ధర్మాన్ని కాపాడుకుంటూ వీరమరణం పొందారని, ఈ బాలవీరుల స్మారకంగా ఏటా డిసెంబర్ 26న వీర్ బాల్ దివస్ నిర్వహిస్తున్నారని వివరించారు. చిన్నారులు ధైర్యంగా ఉండాలని సూచించారు. నైతిక విలువలు పాటిస్తూ ధర్మ మార్గంలో నడవాలని చెప్పారు. అనంతరం ఢిల్లీలో జరిగిన వీర్ బాల్ దివస్ కార్యక్రమాన్ని ప్రొజెక్టర్ ద్వారా ప్రదర్శించారు. చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ సురేష్, బాలసదనం సూపరింటెండెంట్ వెంకటేశ్వరీ, సోషల్ వర్కర్ పద్మ, స్నేహ, నిర్మల బాలబాలికలు పాల్గొన్నారు. ఉమ్మడి జిల్లా బ్యాడ్మింటన్ జట్ల ఎంపికలు మన్ననూర్: స్థానిక సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల విద్యాలయం క్రీడా మైదానంలో శుక్రవారం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా బ్యాడ్మింటన్ బాలబాలికల జట్ల ఎంపిక పోటీలు నిర్వహించారు. బ్యాడ్మింటన్ జిల్లా అధ్యక్షుడు భాస్కర్గౌడ్, ప్రధాన కార్యదర్శి వెంకటరామిరెడ్డి సమక్షంలో నిర్వహించిన పోటీల్లో గద్వాల, పెబ్బేరు, వనపర్తి, అచ్చంపేట, కల్వకుర్తి, తెలకపల్లి, మన్ననూర్ సాంఘిక సంక్షేమ గురుకులాల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను ఉమ్మడి జిల్లా బాలబాలికల జట్లకు ఎంపిక చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. జట్ల వివరాలు.. బాలుర జట్టుకు ప్రణీత్ (గద్వాల), రంజిత్ (పెబ్బేరు), ఎం.చరణ్ (గద్వాల), భాస్కర్ (పెబ్బేరు), మణికంఠ (అచ్చంపేట), సుదర్శన్ (గద్వాల), జి.చరణ్ (గద్వాల), మోహన్ (వనపర్తి), బాలికల జట్టుకు అక్షిత (మన్ననూర్), అను (పెబ్బేరు), కావేరి (మన్ననూర్), మేరీ (మన్ననూర్), రాధిక (మన్ననూర్), రేణుక (కల్వకుర్తి), మహాలక్ష్మి (కల్వకుర్తి), శ్రావణి (మన్ననూర్), సమారిన్ బేగం (గద్వాల), యశస్విని (తెలకపల్లి) ఎంపికై నట్లు నిర్వాహకులు తెలిపారు. పాఠశాల ప్రిన్సిపాల్ రూపాదేవి, అలీం, చుక్క చంద్రశేఖర్, డా.నరేందర్రెడ్డి, శ్యామ్, బాబునాయక్, పీఈటీలు అస్మత్, అనిత, స్నేహ పాల్గొన్నారు. ముగిసిన రాష్ట్రస్థాయి హాకీ పోటీలు వనపర్తి రూరల్: మండలంలోని కడుకుంట్ల క్రీడా మైదానంలో కొనసాగిన ఎస్జీఎఫ్ అండర్–14 బాలికల రాష్ట్రస్థాయి హాకీ పోటీలు శుక్రవారం ముగిశాయి. చివరి మ్యాచ్లో మహబూబ్నగర్ జట్టుపై నిజామాబాద్ జట్టు 1–0 గోల్స్తో విజయం సాధించింది. ప్రథమ స్థానంలో నిజామాబాద్, ద్వితీయ స్థానంలో మహబూబ్నగర్, మూడో స్థానంలో హైదరాబాద్ జట్లు నిలిచాయని ఎస్జీఎప్ కార్యనిర్వాహక కార్యదర్శి ఎస్.నిరంజన్గౌడ్ తెలిపారు. గ్రామంలో హాకీ క్రీడలు నిర్వహించడానికి సహకరించిన గ్రామస్తులు, యువతకు కృతజ్ఞతలు తెలిపారు. -
ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
వనపర్తి: అహంకారపూరిత అధికారం, మద్యం, డబ్బు ఏవీ నిబద్ధత ఎదుట నిలబడలేవని స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు నిరూపించాయని.. బీఆర్ఎస్ మద్దతుదారులు అధికార పార్టీకి ధీటుగా విజయం సాధించడం గర్వంగా ఉందని మాజీమంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లాపార్టీ కార్యాలయంలో కృష్ణానది జలాల హక్కుల సాధన, పార్టీ గ్రామపంచాయతీ పాలకవర్గాల సన్మాన కార్యక్రమానికి ఆయనతో పాటు మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్రెడ్డి హాజరయ్యారు. ముందుగా మాజీ మంత్రి నివాసం నుంచి జిల్లా పార్టీ కార్యాలయం వరకు గులాబీ శ్రేణులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించాయి. అనంతరం పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో మాజీ మంత్రి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలకు రెండేళ్లకే విరక్తి వచ్చిందని పంచాయతీ ఫలితాలతో స్పష్టమవుతోందన్నారు. రైతులు యూరియా కోసం కష్టాలు పడుతుంటే పాలకులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. 45 రోజుల పాటు వచ్చిన జూరాల జలాలను సముద్రానికి వదిలేశారని.. వరద జలాలను ఒడిసి పట్టుకునే చేతగాని పాలకులని ఆరోపించారు. కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడలేక యాసంగి సాగుకు క్రాప్ హాలిడే ప్రకటించారన్నారని విమర్శించారు. ఖిల్లాఘనపురం మండలం సోళీపురం, వనపర్తి మండలం సవాయిగూడెం గ్రామపంచాయతీ ఫలితాలపై అనుమానం ఉందని.. రీ కౌంటింగ్ కోసం కోర్టును ఆశ్రయించామని వెల్లడించారు. జిల్లాలోని అన్ని ప్రధాన గ్రామాల్లో పార్టీ మద్దతుదారులు విజయఢంకా మోగించారని తెలిపారు. రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీ సాధించిన గోపాల్పేటలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రజలు బీఆర్ఎస్కు మద్దతునిచ్చారని గుర్తుచేశారు. అభివృద్ధి చేసి చూపండి.. విమర్శలు కాదు.. ఇచ్చిన హామీలు అమలుచేసి, అభివృద్ధి పనులు చేసి చూపించాలని మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్రెడ్డి అధికార పార్టీకి సవాల్ విసిరారు. కేసీఆర్ మిషన్ భగీరథ పథకంతో ఊరూరా ట్యాప్లు ఏర్పాటు చేస్తే.. ప్రస్తుత ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్పై దృష్టి సారించిందని ఆరోపించారు. గ్రామ పాలకులకు విశేష అధికారాలు ఉంటాయని, చట్టం తెలుసుకొని ప్రజలకు మంచి పాలన అందించాలని సర్పంచులు, వార్డు సభ్యులకు సూచించారు. 2018లో అప్పటి ప్రభుత్వం కొత్త పంచాయతీరాజ్ చట్టం తీసుకొచ్చిందని, కేంద్రం నిధులు నేరుగా గ్రామపంచాయతీలకు వస్తాయని వివరించారు. పారిశుద్ధ్యం, తాగునీరు, విద్య, వైద్యంపై దృష్టి సారించాలన్నారు. సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు గట్టుయాదవ్, పట్టణ అధ్యక్షుడు రమేష్గౌడ్, మాజీ ఎంపీపీ కృష్ణానాయక్, నాయకులు మాణిక్యం, విజయ్, కురుమూర్తి యాదవ్, చిట్యాల రాము తదితరులు పాల్గొన్నారు. -
అలివిలవిల..
కృష్ణానది తీరం వెంట తనిఖీలను ముమ్మరం చేస్తాం. కృష్ణానదిలో అలివి వలలతో చేపల వేటను అరికట్టేందుకు పకడ్బందీ చర్యలు తీసుకుంటాం. ఇందుకు ప్రధానంగా స్థానిక మత్స్యకారులు అధికారులకు సహకరించాలి. – నర్సింహారావు, ఏడీ, మత్స్యశాఖ కొల్లాపూర్: అలివి వలలతో చేపల వేట నిషేధం. అయినప్పటికీ కొందరు వ్యాపారులు తమ స్వలాభం కోసం కృష్ణానదిలో అలివి వలలతో వేట సాగిస్తూ.. చిన్న చేప పిల్లలను యథేచ్ఛగా పట్టేస్తున్నారు. ఫలితంగా సంప్రదాయ మత్స్యకారులు జీవనోపాధి కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో అలివి వలలను పూర్తిస్థాయిలో నిషేధిస్తామని.. అవసరమైతే ఏపీ అధికారుల సమన్వయంతో అలివి వలలతో చేపల వేటను కట్టడి చేస్తామని ఇటీవల కొల్లాపూర్లో నిర్వహించిన ప్రపంచ మత్స్యకారుల దినోత్సవ సభలో రాష్ట్ర మత్స్య, పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. చాలాకాలంగా అలివి వలల వినియోగంపై మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే అధికార యంత్రాంగంలో మాత్రం స్పందన కనిపించడం లేదు. కృష్ణానదిలో విచ్చలవిడిగా అలివి వలల వినియోగం జరుగుతోంది. దీనిపై ప్రజాప్రతినిధులు చెబుతున్న మాటలకు, అధికారులు చేతలకు పొంతన లేకుండాపోయింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిఏటా కృష్ణానదిలో వదులుతున్న చేప పిల్లలను కొన్ని రోజుల్లోనే అలివి వలలతో పట్టేస్తుండటంతో క్రమేణా మత్స్య సంపద తగ్గుతూ వస్తోంది. కృష్ణాతీరంలోనే గుడారాలు.. కొల్లాపూర్ నియోజకవర్గ సరిహద్దు గుండా కృష్ణానది ప్రవహిస్తోంది. వనపర్తి, నాగర్కర్నూల్ జిల్లాల పరిధిలో ఉన్న కృష్ణానది తీరం వెంట పదుల సంఖ్యలో అలివి వలలతో చేపల వేట సాగించే వారి గుడారాలు ఉన్నాయి. చిన్నంబావి, పెంట్లవెల్లి, కొల్లాపూర్ మండలాల్లోని నది తీర ప్రాంతాల్లో విస్తృతంగా అలివి వలలతో చేపల వేట సాగుతోంది. వైజాగ్, కర్నూలు, కొల్లాపూర్ ప్రాంతాలకు చెందిన వ్యాపారులు నదీ తీరంలోని పట్లు (చేపలు అధికంగా లభించే ప్రాంతాలు) కొనుగోలు చేసి దందా సాగిస్తున్నారు. పర్యాటక ప్రాంతాల చెంతనే.. పర్యాటక ప్రాంతమైన సోమశిలకు నిత్యం జిల్లా, రాష్ట్రస్థాయి అధికారులతోపాటు ఎమ్మెల్యేలు, ఎంపీలు వస్తుంటారు. స్థానిక ప్రజాప్రతినిధులు, పోలీసులు, రెవెన్యూ, మత్స్యశాఖ అధికారులు ఇక్కడికి రావడం.. కృష్ణానదిలో బోట్ల ద్వారా విహరించడం కనిపిస్తుంది. అయితే సోమశిలలోని టూరిజం కాటేజీలు, పుష్కరఘాట్ల వద్ద నుంచి కనుచూపు మేరలోనే అలివి వలలతో చేపల వేట సాగించే మత్స్యకారుల గుడారాలు ఉన్నాయి. నదీ తీరానికి రెండు వైపులా గుడారాలు, ఆరబెట్టిన చేపపిల్లలు కనిపిస్తాయి. కానీ, ఎవరూ అటువైపు కన్నెత్తి చూడటం లేదు. మంచాలకట్ట, మల్లేశ్వరం, జటప్రోల్, అమరిగిరిలోని నదీ తీర ప్రాంతాల్లో ఎక్కడ చూసినా అలివి వలల గుడారాలే కనిపిస్తాయి. అలివి వ్యాపారులకు స్థానిక రాజకీయ నాయకుల అండదండలు ఉన్నాయనేది బహిరంగ రహస్యం. అందుకే అటువైపు అధికారులు కన్నెత్తి చూడటం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కార్మికుల నిర్బంధం.. అలివి వలలు లాగేందుకు చాలామంది కార్మికులు అవసరం పడతారు. దీంతో వ్యాపారులు బలవంతంగా కార్మికులను ఇక్కడికి తీసుకొచ్చి నిర్బంధిస్తున్నారు. ఈ ఏడాది స్వచ్ఛంద సంస్థల జోక్యంతో 100 మందికిపైగా బాండెడ్ లేబర్కు విముక్తి కల్పించారు. అయినప్పటికీ కార్మికశాఖ అధికారులు ఎప్పుడు కూడా స్వయంగా వచ్చి తనిఖీలు చేసిన దాఖలాలు లేవు. జిల్లాలోని నీటి వనరుల్లో ఈ ఏడాది 2.50 కోట్ల చేపపిల్లలను వదలాలని మత్స్యశాఖ నిర్ణయించింది. ఇప్పటి వరకు కొల్లాపూర్, అచ్చంపేట, కల్వకుర్తి, నాగర్కర్నూల్ నియోజకవర్గ కేంద్రాల్లో చేపపిల్లల విడుదలను లాంచనంగా ప్రారంభించారు. జిల్లావ్యాప్తంగా 23 లక్షల చేపపిల్లలను విడుదల చేశారు. సోమశిల వద్ద కృష్ణానదిలో మంత్రి జూపల్లి కృష్ణారావు 58 వేల చేపపిల్లలను వదిలారు. నదిలో 30 లక్షల చేపపిల్లలను వదిలేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కృష్ణానదిలో యథేచ్ఛగా సాగుతున్న చిన్నసైజు చేపల వేట ఇలా వదిలితే.. అలా పట్టేస్తున్న అక్రమార్కులు అటువైపు కన్నెత్తి చూడని అధికారులు స్వయంగా మంత్రులు హెచ్చరించినా కనిపించని స్పందన క్రమంగా తగ్గిపోతున్న మత్స్య సంపద కృష్ణానది తెలంగాణ, ఏపీ సరిహద్దులో ప్రవహిస్తోంది. తాము తనిఖీలకు వెళ్లే సమయానికి అలివి గుడారాలను ఏపీ సరిహద్దులోకి మారుస్తున్నారంటూ తెలంగాణ అధికారులు చెబుతూ.. తమ బాధ్యతల నుంచి తప్పించుకుంటున్నారు. సోమశిల, మల్లేశ్వరం, మంచాలకట్ట, వేంకల్, జటప్రోల్, అమరగిరి ప్రాంతాల్లో నెలల తరబడి గుడారాలు తెలంగాణ సరిహద్దులోనే ఉంటాయి. అధికారులు అనుకుంటే ఏ క్షణమైనా వారిని పట్టుకోవచ్చు. కానీ అలా జరగడం లేదు. -
నట్టల నివారణతో జీవాలు సురక్షితం
● జిల్లాలో ఇప్పటివరకు 35 శాతం మందుల పంపిణీ గద్వాలవ్యవసాయం: జీవాల్లో (గొర్రెలు, మేకలు) నట్టలు ఏర్పడకుండా ముందస్తుగా వాటికి ఉచిత నివారణ మందులు వేసే కార్యక్రమం జిల్లాలో కొనసాగుతోంది. పశుసంవర్ధకశాఖ ఈనెల 22 నుంచి ఆరంభించింది. ఇప్పటి వరకు 35శాతం పూర్తి అయ్యింది. జీవాల్లో నట్టలు.. బాహ్య, అంతర్ పరాన్నజీవులుగా నట్టలు రెండు రకాలుగా ఉంటాయి. అంతర్ పరాన్న జీవులు (నులిపురుగులు, పొట్టజలగలు, బద్దెపురుగులు) బాహ్య పరాన్న జీవులు (టిక్స్, ఫ్లైస్,మైక్స్)ను నట్టలు అని పిలుస్తారు. నట్టలు ప్రధానంగా వర్షాకాలం, చలికాలంలో వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఏర్పడతాయి. ఈ వ్యాదిగ్రస్థ జీవాలు ఆరుబయట మేతపైన కాని, తాగునీటిపైన కానీ మల విసర్జనచేస్తే.. ఆ మేతను తిన్న, ఆనీటిని తాగిన ఇతర ఆరోగ్యకరమైన జీవాల్లో కూడా నట్టలు ఏర్పడతాయి. నట్టలు ఏర్పడితే జీవాలు మేత తినక బలహీనంగా మారుతాయి. తర్వాత రక్తహీనతకు గురి అయి తీవ్ర అనారోగ్యానికి గురి అవుతాయి. బరువు తగ్గిపోతాయి. కొన్ని సందర్బాల్లో మృతి చెందుతాయి. కొనసాగుతున్న కార్యక్రమం పశుసంవర్ధకశాఖ ఆధ్వర్యంలో నట్టల నివారణ మందులు వేసేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. ప్రతి బృందంలో పశువైద్యాధికారి, పార్యవేట్ ఉన్నారు. వీరు ఆయా గ్రామాల్లో ముందస్తుగా పెంపకందారులకు సమాచారం అందించి జీవాలకు నట్టల నివారణ మందులను వేస్తున్నారు. జిల్లాలో 5,40,650 గొర్రెలు ఉండగా 1,28,165 వాటికి, 65,355 మేకలు ఉండగా 10,784 వాటికి ఇప్పటి వరకు వేసినట్లు జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ నట్టల నివారణ కార్యక్రమం మరో వారం రోజుల పాటు నిర్వహిస్తామని, పెంపకందారులు దీనిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. -
హత్యల పరంపర..
నడిగడ్డలో 11 నెలల్లో 9 హత్యలు –8లో u●అన్నదమ్ముల మధ్య ఆస్తి తగాదాలు.. వ్యాపారుల మధ్య వైరం.. భార్యభర్తల మధ్య వివాహేతర సంబంధాలు.. ఇలా కారణం ఏదైనా సదరు వ్యక్తులను అడ్డుతొలగించుకునేందుకు వెనకాడడంలేదు. ఇతర రాష్ట్రాలకు చెందిన సుపారీగ్యాంగ్లతో చేతులు కలిపి సొంతవారిని హత్య చేయించే విష సంస్కృతికి జిల్లాలో అడుగులు పడుతున్నాయి. జిల్లాలో గడచిన 11 నెలల వ్యవధిలో 9 హత్యలు చోటు చేసుకోవడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ వరుస హత్యలు జిల్లాతోపాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించాయి. ప్రజల భద్రతే లక్ష్యంగా పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. సమస్య ఏదైనా చర్చించి సామరస్యంగా పరిష్కరించేలా ప్రజలకు అవగాహన కల్పిస్తాం. గ్రామాల్లో కళాజాత కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. దాడులు, హత్యలకు పాల్పడడం సరికాదని వివరిస్తున్నాం. ప్రజల్లో మార్పునకు చర్యలు తీసుకుంటాం. జిల్లాలో శాంతియుత వాతావారణం కల్పిస్తాం. ఎవరూ అధైరపడొద్దు. విపత్కర కేసుల ఛేదనలో ఒత్తిడి ఉంటుంది. అయినప్పటికి ప్రజలు పోలీసు వ్యవస్థపై పెట్టుకున్న నమ్మకాన్ని ఎట్టి పరిస్థితిలో చెదరని ముద్ర వేయాలనే ధృఢ సంకల్పంతో సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. – శ్రీనివాసరావు, ఎస్పీ -
బంగ్లాదేశ్లో హింసాకాండకు వ్యతిరేకంగా ఆందోళన
గద్వాలటౌన్: బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులపై గద్వాలలో నిరసన వ్యక్తమైంది. గురువారం సాయంత్రం వీహెచ్పీ, భజరంగ్దళ్, బీజేపీ సంయుక్త ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. స్థానిక కోటలోని ఆలయం నుంచి నిరసన ప్రదర్శన చేపట్టారు. బంగ్లాదేశ్లో జిహాదీలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం స్థానిక కృష్ణవేణి చౌరస్తాలో బంగ్లాదేశ్ దేశ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా వీహెచ్పీ జిల్లా అధ్యక్షుడు అల్లూరి ఫణిమోహన్రావు, ధర్మ ప్రసార సమితి జిల్లా అధ్యక్షుడు జగదీశ్వర్రెడ్డి మాట్లాడారు. బంగ్లాదేశ్లో హిందువులపై కొనసాగుతున్న దాడులను అడ్డుకునేందుకు కేంద్రం తక్షణమే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. హిందువులపై జరుగుతున్న హింసాకాండను దేశ ప్రజలు ముక్తకంఠంతో వ్యతిరేకించాలన్నారు. బంగ్లాదేశ్లో జిహాదీ శక్తుల నుంచి హిందువులకు రక్షణ కల్పించాలని కోరారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందూ సంఘాలు ఒక్కతాటిపైకొచ్చి బంగ్లాదేశ్లో ఉగ్రవాదాన్ని తుదముట్టించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం మతోన్మాదుల దాడిలో మృతిచెందిన దీప్ చంద్రదాస్కు నివాళులర్పించారు. కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు రామంజనేయులు, బండల వెంకట్రాములు, భాస్కర్, తిరుపతి, నర్సింహా, మణికృష్ణ, శ్రీకాంత్, జనార్థన్, మనోజ్, జయశ్రీ, రమాదేవి, శ్యామ్, దేవదాసు తదితరులు పాల్గొన్నారు. -
రైతులను పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం
ఉండవెల్లి: రైతులు రెక్కలు ముక్కలు చేసుకొని సాగుచేసిన పంటలను కొనుగోలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తుందని, రైతులను అసలు పట్టించుకోవడంలేదని ఎమ్మెల్యే విజయుడు ఆరోపించారు. గురువారం మండలంలోని బొంకూరులో మొక్కజొన్న పంట విక్రయానికి వెళ్లి కొనుగోలు కేంద్రం వద్దే మృతిచెందిన జమ్మన్న ఇంటికి వెళ్లి రైతు మృతదేహానికి నివాళులర్పించారు. వారి కుటుంబసభ్యులను పరామర్శించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతు పంటను విక్రయించడానికి వెళ్లి రోజుల తరబడి పడిగాపులు కాచాడని, చలికి ఎండకు కేంద్రం వద్దే గుండెపోటుతో మృతిచెందడంపై ప్రభుత్వ నిర్లక్ష్యం కళ్లకు కట్టినట్లు కనబడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముమ్మాటికి రైతు మృతికి రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని అన్నారు. ఆయన వెంట బొంకూరు సర్పంచు దేవన్న, బీఆర్ఎస్ నాయకులు గజేందర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, భరత్ కుమార్ రెడ్డి, పల్లయ్య, చంద్రన్న, సురేష్ రెడ్డి, రాంభూపాల్ రెడ్డి, రంగస్వామి ఉన్నారు. -
ఆదిశిలా క్షేత్రంలో జడ్జీల ప్రత్యేక పూజలు
మల్దకల్: ఆదిశిలా క్షేత్రమైన స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో గురువారం జిల్లా సీనియర్ సివిల్ జడ్జీ లక్ష్మి, వనపర్తి జిల్లా ప్రిన్సిపల్ సబ్కోర్టు జడ్జీ కళార్చన వేర్వేరుగా స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకు ముందు ఆలయ నిర్వాహకులు అరవిందరావు, అర్చకులు వారికి సాదర స్వాగతం పలికి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆలయ విశిష్టతలను వివరించి స్వామి వారి శేషవస్త్రంతో సత్కరించి మెమోంటో అందజేశారు. వారి వెంట ఆలయ నిర్వాహకులు చంద్రశేఖరరావు, అర్చకులు మధుసూధనాచారి, రమేషాచారి, రవిచారి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కోయిల్సాగర్ నీటి విడుదల షెడ్యూల్ ఖరారు దేవరకద్ర: ప్రస్తుత యాసంగి సీజన్లో కోయిల్సాగర్ ప్రాజెక్టు నుంచి సాగునీటి విడుదలకు షెడ్యూల్ ఖరారు చేశారు. కలెక్టరేట్లో మంగళవారం సాగునీటి సలహా మండలి సమావేశం కలెక్టర్ విజయేందిర, దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. జిల్లా ఇరిగేషన్శాఖ అధికారులు, ఆయకట్టు రైతులతో చర్చించి నీటి విడుదల చేసే తేదీలను ఖరారు చేశారు. ప్రాజెక్టు పాత ఆయకట్టు కింద కుడి, ఎడమ కాల్వలకు నీటిని వదులుతారు. గతేడాది రూపొందించిన షెడ్యూల్లో తేదీలను అటు ఇటుగా మార్చి అయిదు తడులుగా నీటిని వదలడానికి నిర్ణయించారు. రెండేళ్లలో రూ.1.50 లక్షల కోట్ల వడ్డీ చెల్లించాం వనపర్తి: గడిచిన 64 ఏళ్లలో 22 మంది సీఎంలు రూ.63 వేల కోట్ల అప్పు చేస్తే.. పదేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం రూ.8 లక్షల కోట్ల అప్పులు చేశారని.. ఆయన చేసిన అప్పుల కోసం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రూ.1.50 లక్షల కోట్లు వడ్డీ చెల్లించామని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. గురువారం ఆయన వనపర్తిలో విలేకరులతో మాట్లాడారు. పాలమూరు ఎత్తిపోతల డీపీఆర్కు కేంద్రం అనుమతి లభించలేదనే విషయం పక్కన పెడితే.. ఉమ్మడి పాలమూరులో సాగునీటి ప్రాజెక్టుల రూపకల్పన, నిధులు వెచ్చించింది దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనేనని పునరుద్ఘాటించారు. సాగునీటి ప్రాజెక్టుల పేరిట బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన దోపిడి, అధికారం కోల్పోయాక చేస్తున్న అబద్ధపు ఆరోపణలపై నూతనంగా ఎన్నికై న సర్పంచులు, వార్డు సభ్యులు ప్రజలతో నిజాలు సవివరింగా చర్చించాలని సూచించారు. దరఖాస్తుల ఆహ్వానం మహబూబ్నగర్ మున్సిపాలిటీ: సమాజ సేవకు తన జీవితాన్ని అంకితం చేసిన జనమంచి గౌరీశంకర్ (గౌరీజీ) పేరిట ఏటా అందజేసే యువ పురస్కార్కు దరఖాస్తు చేసుకోవచ్చని ఏబీవీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నరేష్తేజ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. సమాజంపై సానుకూల ప్రభావం చూపే సేవా కార్యక్రమాలు, నూతన ఆవిష్కరణలు, ప్రముఖ రంగాల్లో విశేష కృషి చేస్తూ యువతకు స్ఫూర్తిగా నిలిచే జాతీయ భావాలు కలిగిన 40 ఏళ్లలోపు వారు అర్హులన్నారు. -
గాంధీ ప్రతిష్టను తగ్గించడానికే పేరు తొలగింపు
● డీసీసీ కార్యాలయ ప్రారంభంలో వీహెచ్ ● కార్యక్రమానికి సంపత్, సరిత వర్గీయులు దూరం గద్వాలటౌన్: జాతిపిత మహాత్మాగాంధీ ప్రతిష్టను తగ్గించడం కోసమే ఉపాధి హామీ పథకానికి ఆయన పేరును తొలగించారని సీనియర్ కాంగ్రెస్ నాయకుడు వీ.హనుమంతురావు ఆరోపించారు. గద్వాలలోని రాజీవ్మార్గ్ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన డీసీసీ కార్యాలయాన్ని సీనియర్ కాంగ్రెస్ నాయకుడు వీ హనుమంతురావు గురువారం ప్రారంభించారు. డీసీసీ అధ్యక్షుడిగా నియామకమైన రాజీవ్రెడ్డి బాధ్యతలు చేపట్టారు. బాధ్యతలు తీసుకున్న వెంటనే రాజీవ్రెడ్డిని పలువురు నాయకులు వేర్వేరుగా సన్మానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వీహెచ్ మాట్లాడారు. ఉపాధి పథకానికి గాంధీ పేరు తొలగింపు చర్య దేశ ప్రతిష్టకు భంగం కలిగించే అంశమన్నారు. పేదల కడుపు నింపే లక్ష్యంతో యూపీఏ ప్రభుత్వం ఉపాధి హామీ పఽథకాన్ని తెచ్చిందన్నారు. ఉపాధి పథకాన్ని నిర్వీర్యం చేయడానికి కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నుతుందని విమర్శించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించడానికి చట్టసభల నుంచి అన్ని స్థాయిల్లో ప్రయత్నం చేయటం జరుగుతుందన్నారు. చివరిగా ప్రజా కోర్టులో తేల్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రజా బంగ్లాగా డీసీసీ కార్యాలయం నడిగడ్డలో నడుస్తున్న బంగ్లా రాజకీయాలకు రోజులు దగ్గర పడ్డాయని.. ఇప్పుడు డీసీసీ కార్యాలయమే ప్రజా బంగ్లాగా ప్రజలకు అండగా ఉంటుందని డీసీసీ అధ్యక్షుడు రాజీవ్రెడ్డి పేర్కొన్నారు. బాధ్యతలు చేపట్టిన తరువాత ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. డీసీసీ కార్యాలయానికి ప్రజా బంగ్లాగా నామకరణం చేస్తున్నామని చెప్పారు. ప్రజా బంగ్లా ప్రతి కాంగ్రెస్ కార్యకర్తది అన్నారు. నడిగడ్డలో ఎవరికి ఇబ్బందులు కలిగిన ప్రజా బంగ్లాకు వస్తే న్యాయం జరుగుతుందన్నారు. ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ ప్రాధాన కార్యదర్శి మిథున్రెడ్డి, మహబూబ్నగర్ డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ తదితరులు సన్మానించిన వారిలో ఉన్నారు. అంతకుముందు డీసీసీ కార్యాలయం ఎదుట ఏర్పాటు చేసిన కాంగ్రెస్ జెండాను ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ ఆవిష్కరించారు. సంపత్, సరిత వర్గీయులు దూరం డీసీసీ అధ్యక్షుడు రాజీవ్రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవానికి ఏఐసీసీ కార్యదర్శి సంపత్కుమార్, గద్వాల నియోజకవర్గ ఇన్చార్జి సరిత దూరంగా ఉన్నారు. వారి వర్గీయులు సైతం కార్యక్రమానికి హాజరు కాలేదు. సంపత్, సరిత వర్గీయులు ఇరువురు గద్వాలలో ఉన్నప్పటికి ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు కాకపోవడంపై చర్చ మొదలైంది. ఫ్లెక్సీలలో ఫొటోలు వేయలేదనే చర్చ సైతం జరుగుతుంది. ఉద్దేశ్య పూర్వకంగానే ప్రమాణ స్వీకారానికి తమను పిలవలేదని, బంగ్లా డైరెక్షన్లోనే డీసీసీ అధ్యక్షుడు పనిచేస్తున్నారని సరిత వర్గీయులు ఆరోపించారు. అయితే ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి మినహా ఆయన వర్గీయులు ప్రమాణ స్వీకారానికి హాజరై, రాజీవ్రెడ్డిని పూలమాలలతో సన్మానించారు. గద్వాలలో కాంగ్రెస్ పార్టీ మూడు గ్రూపులుగా చీలిపోయిందనే చర్చ సాగుతోంది. -
భక్తిశ్రద్ధలతో క్రిస్మస్ వేడుకలు
గద్వాలటౌన్: క్రిస్మస్ వేడుకలను క్రైస్తవులు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. గురువారం జిల్లా పరిధిలోని ఆయా చర్చిలలో వేడుకల సందర్భంగా చర్చిలను అందంగా తీర్చిదిద్దారు. చర్చి పాస్టర్లు, మత పెద్దలు, ఇతర రాజకీయ నాయకులు వేరువేరుగా జిల్లా కేంద్రంతోపాటు మండలాల పరిధిలోని పలు చర్చిలలో పాల్గొని కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయా చర్చిలలోని పాస్టర్లు సందేశాన్ని ఇచ్చారు. ప్రేమ, కరుణలతో ప్రపంచాన్ని జయించవచ్చని తెలిపి సర్వ మానవాళికి శాంతి సందేశాన్ని వినిపించిన యేసు ప్రభువును ప్రతి ఒక్కరూ అనుసరించాలని గుర్తు చేశారు. ఈ సందర్భంగా ఒకరికొకరు క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ఇదిలాఉండగా, క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని జిల్లా వ్యాప్తంగా చర్చిలు రంగురంగుల విద్యుద్దీపాలతో తేజరిల్లాయి. ప్రపంచానికి శాంతి సందేశం అందించిన యేసుక్రీస్తు ఆగమనవేళ.. జిల్లా అంతటా చర్చిలు ప్రార్థనలతో ప్రతిధ్వనించాయి. బుధవారం అర్థరాత్రికి ముందే చర్చిలన్నీ విద్యుద్దీపాలంకరణ నడుమ సందడిగా మారాయి. బాలయేసును స్వాగతించడానికి చిన్నా, పెద్ద అంతా ఉత్సాహంగా ఎదురుచూశారు. ‘పరిశుద్ధాత్ముని కృప వల్ల అంతా శుభమే జరగాలంటూ’ మత పెద్దలు ఆకాంక్షించగా, భక్తులంతా జీసస్కు జేజేలు పలికారు. పొద్దు పోయేదాక క్రిస్మస్ వేడుకలను ఆనందోత్సహాలతో జరుపుకొన్నారు. ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి, జెడ్పీ మాజీ చైర్పర్సన్ సరిత వివిధ పార్టీల నాయకులు వేర్వేరుగా పలు చర్చిలలో జరిగిన ప్రార్థనల్లో పాల్గొన్నారు. -
పద్యకృతుల ఆవిష్కరణ మహోత్సవం
స్టేషన్ మహబూబ్నగర్: జాతీయ సాహిత్య పరిషత్ పాలమూరు జిల్లాశాఖ ఆధ్వర్యంలో ప్రముఖ కవి రాచాలపల్లి బాబుదేవిదాస్రావు రచించిన ‘రామచంద్ర ప్రభో’, ‘చిత్రాంగద– సారంగధరుడు’ పద్యకృతుల ఆవిష్కరణ మహోత్సవాన్ని గురువారం జిల్లా కేంద్ర గ్రంథాలయంలో నిర్వహించారు. జాతీయ సాహిత్య పరిషత్ జిల్లాశాఖ అధ్యక్షుడు ఇరివింటి వెంకటేశ్వరశర్మ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ సాహిత్యం జగద్వితం కోసం సృష్టించబడుతుందన్నారు. కవులు సమాజ హితాన్ని కోరుకుంటారని తెలిపారు. ముఖ్య అతిథి ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ రామచంద్ర ప్రభో కావ్యం సరళమైన, సుందరమైన సుమధుర తెలుగు భాషలో అందించినట్లు తెలిపారు. ఇందులో ప్రాచీన కవుల గుంబనం, లలిత పదజాతం ఆకట్టుకుంటుందన్నారు. రామచంద్రప్రభో మకుటంతో ఆద్యంతం పద్యాలను ఎంతో శ్రావ్యంగా చదువుతూ బాబుదేవిదాసును అభినందిస్తూ సమీక్ష చేశారు. డాక్టర్ పొద్దుటూరు ఎల్లారెడ్డి రామచంద్రప్రభో మకుటం ఉన్న 131 పద్య కావ్యాన్ని, పద్యాలను చదువుతూ రామ కథను అసాంతం పరిచయం చేశారు. డాక్టర్ తంగెళ్లపల్లి శ్రీదేవి చిత్రాంగద–సారంగధరుడు కథను 126 ప్యదాల కృతిని సమీక్ష చేస్తూ చక్కగా వివరించారు. అదేవిధంగా ప్రముఖ న్యాయవాది వి.మనోహర్రెడ్డి, అవధాని చుక్కాయపల్లి శ్రీదేవి, డాక్టర్ కె.బాలస్వామి, తెలంగాణ మహిళా సాహిత్య సాంస్కృతిక సంస్థ అధ్యక్షురాలు రావూరి వనజ పద్యకృతులపై ప్రసంగించారు. పాలమూరు నగర అధ్యక్షులు జి,శాంతారెడ్డి, కవులు ప్రభులింగంశాస్త్రి, దేవదానం, రవీందర్రెడ్డి, ఖాజా మైనొద్దీన్, జగపతిరావు, గడ్డం వనజ, డాక్టర్ కృష్ణవేణి, జమున, ఈశ్వరమ్మ, గుముడాల చక్రవర్తి, శ్యాంప్రసాద్, అనురాధ, వీరేందర్గౌడ్, శ్రీరాములు పాల్గొన్నారు. -
ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన అవసరం
● ‘మీ డబ్బు.. మీ హక్కు’ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోండి ● కలెక్టర్ సంతోష్ గద్వాలన్యూటౌన్: బ్యాకింగ్ లావాదేవీలు సమర్థవంతంగా నిర్వహించుకోవడానికి ప్రజలందరికి ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన అవసరమని కలెక్టర్ సంతోష్ అన్నారు. ఫైనాన్షియల్ రంగంలో క్లెయిమ్ చేయని ఆస్తుల సమస్యలను పరిష్కరించడానికి ఉద్దేశించి ఏర్పాటు చేసిన ‘మీ డబ్బు మీ హక్కు’ కార్యక్రమంపై అవగాహన కల్పించేందుకు బుధవారం కలెక్టరేట్లోని ఐడీఓసీ హల్లో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పదేళ్లు, ఆపైబడి వివిధ బ్యాంకులు, ఇన్సూరెన్స్ తదితర కంపెనీల్లో ఖాతాదారులకు సంబందించి క్లెయిమ్ చేయకుండా మిగిలిన డిపాజిట్లను తిరిగి పొందేందుకు, ఆయా ఖాతాలను మళ్లీ పునరుద్దరించుకోవడానికి ‘మీ డబ్బు మీ హక్కు’ సువర్ణ అవకాశంగా పేర్కొన్నారు. జిల్లాలో సుమారు లక్షకు పైగా ఖాతాలకు చెందిన రూ. 16.39కోట్లు క్లైయిమ్ చేయని డిపాజిట్లు ఉన్నాయని, వీటిని తిరిగి చెల్లించేందుకు ఆర్బీఐ అధికారులు కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఇందులో సాధారణ ప్రజలతో పాటు, వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన ఖాతాలు కూడా ఉన్నాయని ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మొదట బ్యాంకుల్లో అత్యధిక డిపాజిట్లు కల్గిన వెయ్యి మంది ఖాతాధారులను గుర్తించి, వారు తమ డబ్బులను క్లెయిమ్ చేసుకునేలా ప్రోత్సహించాలన్నారు. తర్వాత మిగతా ఖాతాదారులకు అవగాహన కలిగించి, తమ డిపాజిట్లను తిరిగే పొందేలా బ్యాకింగ్ అధికారులు ప్రణాళికతో ముందుకెళ్లాలన్నారు. వినియోగంలో లేని ఖాతాల పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఉద్గం పోర్టల్ సహకరిస్తుందన్నారు. సైబర్ నేరగాళ్లతో అప్రమత్తంగా ఉండాలి సైబర్ నేరాలకు పాల్పడే వాళ్లు తాము బ్యాంకుల నుంచి మాట్లాడుతున్నామని చెప్పి, వివిధ లింకులు పంపించి, ఖాతాలకు సంబందించిన వివరాలు అడుగుతూ ఓటీపీలు చెప్పాలని మోసం చేస్తుంటారని, ఏ బ్యాంకు అధికారులు కూడా ఇలా అడగరని, ప్రతి ఖాతాదారుడు తెలుసుకుంటే సైబర్ నేరాల ఉచ్చులో చిక్కుకోకుండా జాగ్రత్త పడవచ్చునని చెప్పారు. బ్యాంకులకు సంబందించిన యాప్ల ద్వారానే నగదు బదిలీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఈసందర్భంగా ఇటీవల క్లెయిమ్ చేసుకున్న పలువురు ఖాతాదారులకు ప్రొసీడింగ్ కాపీలను అందించారు. అనంతరం ఆర్థిక అక్షరాస్యతపై రూపొందించిన కరదీపికలను కలెక్టర్ బ్యాంకింగ్ అధికారులతో కలిసి ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఆర్బీఐ జనరల్ మేనేజర్ సుప్రభాత్, యూబీఐ జోనల్ హెడ్ అరవింద్ కుమార్, డీజీఎం సత్యనారాయణ, నాబార్డ్ డీడీఎం మనోహర్రెడ్డి, ఎల్డీఎం శ్రీనివాసరావ్, వివిధ బ్యాంకుల మేనేజర్లు, భీమా రంగ సిబ్బంది పాల్గొన్నారు. -
డిమాండ్ ఉన్న పంటలు సాగు చేయాలి
ఎర్రవల్లి: రైతులు ఉద్యానశాఖ ద్వారా అందిస్తున్న వివిధ పథకాలను సద్వినియోగించుకోవాలని, గ్రూపులుగా కలిసి మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను సాగు చేసి లాభసాటిగా మార్చుకోవచ్చునని జిల్లా ఉద్యానవన శాఖ అధికారి మహ్మద్ అలీ అక్బర్ అన్నారు. బుధవారం మండలంలోని బీచుపల్లి ఆయిల్పాం నర్సరీలో వర్షాధార ప్రాంత అభివృద్ధిలో భాగంగా రైతులకు కూరగాయలు బుట్టల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ఆయన హాజరై కొండేరు, కుర్తి రాయలచెర్వు క్లస్టర్లకు చెందిన 110మంది రైతులకు రూ.11లక్షల విలువగల కూరగాయల బుట్టలను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైతులు వైవిద్యమైన పంటలు సాగుచేస్తూ సుస్థిర వ్యవసాయ పద్ధతులను అవలంభించి మెరుగైన ఆదాయాన్ని పొందేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎండీడీకేవై పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. దీని ద్వారా జిల్లాలో ఉద్యాన, పశు, మత్స్య, తదితర రంగాలకు చెందిన లబ్దిదారులు సైతం తమ వృత్తుల్లో గణనీయమైన అభివృద్ధిని సాదించేందుకు ఈ పథకం ఎంతగానో దోహదపడుతుందన్నారు. కార్యక్రమంలో అలంపూర్ డివిజన్ ఉద్యానశాఖ అధికారిణి ఇమ్రానా, సర్పంచులు ఈరన్న, మద్దిలేటి, నాయకులు సోమనాద్రి, వెంకటేష్, రాముడు, మద్దిలేటి పాల్గొన్నారు. -
క్రిస్మస్ వేడుకలకు ముస్తాబు
● విద్యుద్దీపాలతో చర్చిల అలంకరణ ● ముందస్తు సంబరాలు షురూ.. గద్వాలలో విద్యుద్దీపాలతో ముస్తాబైన ఎంబీ మిస్పా చర్చి గద్వాలటౌన్: క్రిస్మస్ పర్వదినం పురస్కరించుకొని కరుణామయుడి కోవెలలు ముస్తాబు అయ్యాయి. గురువారం పండగకు మరి కొన్ని గంటలు మాత్రమే గడువు ఉండటంతో ఇప్పటికే చర్చిలకు రంగులు వేసి విద్యుద్దీపాలతో అలంకరించారు. ముఖద్వారాలను అందంగా ఏర్పాటుచేశారు. చర్చిలు, ఇళ్లపై రంగురంగుల విద్యుద్దీపాలను ఉంచిన నక్షత్రాలను ఏర్పాటు చేశారు. స్థానిక ఎంబీ మిస్ఫా చర్చిలో ఏసుక్రీస్తు జననం, శాంతి సందేశాలు, జీవిత విషయాలతో కూడిన చిత్రవర్ణ పటాలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఆయా చర్చిలలో ముందస్తుగా క్రిస్మస్ సంబురాలు మొదలయ్యాయి. క్రైస్తవులు పండగ నిమిత్తం కొత్త దుస్తులు, వస్తు సామగ్రి కొనుగోలు చేశారు. కొంతమంది ఇళ్లల్లో క్రిస్మస్ చెట్టును పెంచుకుంటుండగా మరికొందరు చెట్లను కొనుగోలు చేసి ఇంటి ఆవరణలో విద్యుద్దీపాల మధ్య అలంకరిస్తున్నారు. కోలాహలంగా చర్చిలు.. జిల్లా పరిధిలోని పలు గ్రామాల్లో ఉన్న చర్చిల్లో ముందస్తుగానే ముస్తాబు చేపట్టడంతో పండగ వాతావరణం నెలకొంది. విద్య, ఉద్యోగ, కార్మిక, వ్యాపార రంగాల్లో ఇతర ప్రాంతాల్లో నివాసముంటున్న వారు సైతం పండగకు సొంత గ్రామాలకు వచ్చారు. పట్టణంలోని పలు వ్యాపార సంస్థలు వినియోగదారులకు పండగకు సంబంధించిన వస్తువులను అందుబాటులో పెట్టారు. అదే విధంగా క్రిస్టియన్ యువజన సంఘాల సభ్యులు, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో క్రిస్మస్ సంబురాలు జరుపుకొంటున్నారు. విద్యార్థులకు మిఠాయిలు, కేక్లు పంచిపెడుతూ ఆనందోత్సవాల మధ్య పండగకు సిద్ధమవుతున్నారు. చర్చిల ఆవరణలో ఏసుక్రీస్తు జననం, దేవుని జీవిత చరిత్ర, తదితర అంశాలను వివరిస్తున్నారు. ప్రతి సాయంత్రం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తుండటంతో పలు చర్చిలు సందడిగా మారాయి. -
అభివృద్ధి చేసుకుందాం
పార్టీలు, పంతాలు వద్దు.. చదువుతోనే వెలుగులు ‘చదువుతోనే వెలుగు, మార్పు వస్తుంది. నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తున్నాం. కొడంగల్ నియోజకవర్గంలో 25 వేల మంది విద్యార్థులకు అల్పాహారం, మధ్యాహ్న భోజనం అందిస్తున్నాం. రాష్ట్రం మొత్తం అన్ని పాఠశాలల్లో అల్పాహారం, మధ్యాహ్న భోజనం పెట్టించి చదువు చెప్పించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. మీ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపండి. విద్యా, వసతులు, భోజనం అందిస్తేనే విద్యార్థులకు చదువు పట్ల ఆసక్తి పెరుగుతుంది. నియోజకవర్గంలోని లగచర్లలో 250 ఎకరాల్లో ఎడ్యుకేషన్ హబ్ కడుతున్నాం. రాష్ట్రంలో ఎక్కడా లేని సైనిక్ స్కూల్ ఏర్పాటు చేస్తున్నాం. దేశంలోని ఇతర రాష్ట్రాల విద్యార్థులు ఇక్కడికి వచ్చి చదువుకునేలా విద్యా సంస్థలు ఏర్పాటు చేస్తున్నాం. ఈ ప్రాంతం నుంచి ఉన్నత చదువులు చదివి ఐఏఎస్, ఐపీఎస్లు అయ్యి తల్లిదండ్రుల కలలు నెరవేర్చాలి.’ అని సీఎం సూచించారు. సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్/కోస్గి: గ్రామాలు అభివృద్ధి చెందితేనే దేశం సమగ్ర అభివృద్ధి చెందినట్లనే విషయాన్ని గుర్తించి నూతనంగా ఎన్నికై న సర్పంచులు గ్రామాల అభివృద్ధికి తమవంతు కృషి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సూచించారు. సమష్టి కృషితో దేశంలోనే కొడంగల్ నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు. ఎన్నికలు వచ్చినప్పుడే పార్టీలు, రాజకీయాలుంటాయని, ఎన్నికలు ముగిసిన తర్వాత పార్టీలు, పంతాలు పక్కన బెట్టి అభివృద్ధియే ఏకై క ఎజెండాగా గ్రామాలను అభివృద్ధి చేసుకుందామని పేర్కొన్నారు. బుధవారం నారాయణపేట కోస్గి పట్టణంలోని ఓ ఫంక్షన్హాల్లో కొడంగల్ నియోజకవర్గ పరిధిలో నూతనంగా ఎన్నికై న సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులతో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్లను సన్మానించారు. అనంతరం సీఎం రేవంత్రెడ్డి మాట్లాడుతూ.. ‘ మీరు ఆశీర్వదించిన మీ బిడ్డ ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇలాంటి అవకాశం మళ్లీ రాదు. బెట్టి గ్రామాలను అభివృద్ధి చేసుకోవడమే లక్ష్యంగా నూతన సర్పంచ్లు పాలకవర్గాలతో కలిసి పని చేయాలి. అభివృద్ధికి ఎన్ని నిధులైన మంజూరు చేస్తా. గ్రామ పంచాయతీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే నిధులు కాకుండా చిన్న పంచాయతీలకు రూ.5 లక్షలు, పెద్ద పంచాయతీలకు రూ.10 లక్షలు ప్రత్యేక ముఖ్యమంత్రి నిధులు అందిస్తా. ప్రజలు మీపై నమ్మకంతో ఓట్లు వేసి సర్పంచులుగా గెలిపించారు. వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రతి ఇంటికీ వెళ్లి ప్రభుత్వ పథకాలు అందించే బాధ్యత నూతన సర్పంచ్లుగా మీపైనే ఉంది. గ్రామస్థాయి మొదలు మండలస్థాయి నాయకుల వరకు రాజకీయాలు పక్కనబెట్టి అన్ని పార్టీల సర్పంచ్లను కలుపుకొని గ్రామాల అభివృద్ధియే ఏకై క లక్ష్యంగా పని చేయాలి.’ అని పేర్కొన్నారు. పాలమూరు ప్రాజెక్టులను పట్టించుకోలేదు.. పాలమూరు జిల్లాలో ఇల్లు లేకపోయినా ఇక్కడి ప్రజలు నమ్మి చంద్రశేఖర్రావును ఎంపీగా గెలిపిస్తే జిల్లాకు చేసింది శూన్యమని ముఖ్యమంత్రి అన్నారు. గత పాలకులు పాలమూరు జిల్లా ప్రాజెక్టులను పట్టించుకోకపోవడంతోనే గత పదేళ్లలో ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేకపోయారన్నారు. 2014లో తెచ్చిన జీఓ 69ను మంజూరు చేయిస్తే గత ప్రభుత్వం తొక్కి పెట్టిందన్నారు. కోట్లాది రూపాయలు ఖర్చు చేసిన గత ప్రభుత్వం పాలమూరు ఎత్తిపోతల పథకంలో ఏ ప్రాజెక్టును పూర్తి చేయకుండానే కమీషన్లు దండుకుందన్నారు. పాలమూరుపై చిన్నచూపుతోనే పదేళ్లలో నెట్టెంపాడు, భీమా, కల్వకుర్తి, డిండి, కోయిల్సాగర్, ఎస్ఎల్బీసీతో పాటు ఏ ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేకపోయారన్నారు. తొడుక్కోవడానికి చెప్పులు, వేసుకోవడానికి బట్టలు లేని వాళ్లకు వేల కోట్ల ఆస్తులు వచ్చాయి తప్ప పాలమూరుకు నీళ్లు రాలేదన్నారు. నారాయణపేట–మక్తల్–కొడంగల్ ఎత్తిపోతల ప్రాజెక్టును ప్రారంభించుకుంటుంటే కోర్టులో కేసులు వేసి అడ్డుకుంటున్నారన్నారు. కొడంగల్ ఎత్తిపోతల పథకం భూసేకరణలో ఎకరాకు 14 లక్షలు సరిపోవడం లేదని మంత్రి శ్రీహరి వచ్చి అడిగి ఎకరాకు రూ.18 లక్షలు ఆశిస్తున్నారని చెబితే.. ముఖ్యమంత్రిగా నేను ఎకరాకు రూ.20 లక్షలు ఇవ్వాలని నిర్ణయించగా కేబినెట్ ఆమోదం పొందిందన్నారు. పేట–కొడంగల్ ఎత్తిపోతల పథకానికి 96 శాతం మంది రైతులు భూములు ఇస్తున్నారన్నారు. దేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా కొడంగల్ గ్రామాల అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు మంజూరు చేస్తా ప్రభుత్వ పథకాలను ప్రతి ఇంటికీ అందించే బాధ్యత సర్పంచులదే నాడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ పాదయాత్ర చేసి ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకువచ్చి పేదల కోసం సంక్షేమ పథకాలు అమలు చేశారని, అలాగే పదేళ్లు అభివృద్ధిలో వెనుకబడిన తెలంగాణ రాష్ట్రం అభివృద్ధియే లక్ష్యంగా నేడు రేవంతన్న అలుపెరగని పోరాటం చేసి కాంగ్రెస్ను అధికారంలోకి తెచ్చి పేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. రేవంతన్న హయాంలో దేశంలో ఎక్కడ లేని విధంగా రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలు జరుగుతుందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు రామ్మోహన్రెడ్డి, మనోహర్రెడ్డి, కాలె యాదయ్య, నారాయణపేట, వికారాబాద్ జిల్లాల కలెక్టర్లు సంచిత్ గంగ్వార్, ప్రతిక్ జైన్, అదనపు కలెక్టర్ శ్రీను, ఆర్డీఓ రాంచందర్ నాయక్, డీసీసీ అధ్యక్షుడు ప్రశాంత్రెడ్డి, నాయకులు కుంభం శివకుమార్రెడ్డి, వార్ల విజయ్కుమార్, రఘువర్ధన్రెడ్డి, విక్రంరెడ్డి, నర్సిములు, మహేందర్రెడ్డి, యూసూఫ్, శేఖర్, మద్దప్ప దేశ్ముఖ్, అన్న కిష్టప్ప, నాగులపల్లి నరేందర్, తదితరులు పాల్గొన్నారు. -
‘కంది’పోయిన రైతు
● చీడపీడలతో తగ్గనున్న దిగుబడులు ● రెండేళ్లుగా ఆర్థికంగా నష్టపోయిన కంది రైతు –8లో uగద్వాల వ్యవసాయం: ఈ ఏడాది సైతం కంది పంట రైతులను నిరాశ పర్చింది. 2023–24లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు, అధిక ఉష్ణోగ్రతలతో, 2024–25లో వాతావరణం అనుకూలించలేదు. ఫలితంగా పంట దిగుబడులు గణనీయంగా తగ్గి రైతులు ఆర్థికంగా నష్టాలు చవిచూశారు. ఈ ఏడాది 2025–26 వానాకాలంలో ఇష్టంగా సాగు చేసిన ఈపంటకు పూత, గింజ దశలో చీడపీడలు ఆశించి పంటపై ప్రబావాన్ని చూపడం వల్ల ఈ ఏడాది సైతం దిగుబడులు తగ్గే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇదిలాఉండగా, ఆహార పంట అయిన కంది పప్పుకు మార్కెట్లో ఎప్పుడు డిమాండ్తో మంచి ధరలు ఉంటాయి. కంది పంటను ఈ ప్రాంత రైతులు చాలా ఇష్టంగా సాగు చేస్తారు. వర్షాలు కొంత మేర వచ్చినా.. చలితో పంట బాగా వస్తుందని సాగు చేస్తుంటారు. కంది పంట సాగు చేయడానికి ఎకరాకు రూ.18వేల నుంచి 20వేల వరకు ఖర్చు వస్తుంది. ఆరు నెలలు పంట కాలం. వాతావరణం సహకరిస్తే నీటి లభ్యత ఉన్న చోట 8నుంచి 10 క్వింటాళ్లు, వర్షాదారం కింద అయితే ఎకరాకు 3నుంచి 5 క్వింటాళ్లు పంట దిగుబడి వస్తుంది. అనుకూలించని వాతావరణం.. నష్టం జిల్లాలో 2023–24 వానాకాలం సీజన్లో కంది పంటను 22,503 ఎకరాల్లో సాగు చేశారు. అయితే ఇందులో వర్షాధారం కింద, నీటి లభ్యత ఉన్న రెండు చోట్ల వేశారు. ఈ సీజన్లో వర్షాలు ఆశించిన స్థాయిలో కురవలేదు. వర్షాకాలం ముగిసిన తర్వాత శీతాకాలంలో సైతం చలి తీవ్రత తక్కువగానే ఉండింది. ఇలా వాతావరణ పరిస్థితులు అనుకూలించలేదు. ఫలితంగా వర్షాధారం కింద ఎకరాకు 3 నుంచి 5 క్వింటాళ్లు రావాల్సి ఉండగా, కేవలం రెండు నుంచి రెండున్నర క్వింటాళ్లు, నీటి లభ్యత ఉన్న చోట 8నుంచి 10 క్వింటాళ్లు రావాల్సి ఉండగా 5 నుంచి 6 క్వింటాళ్లు మాత్రమే వచ్చింది. వర్షాలు బాగా కురుస్తాయన్న అంచనాతో 2024–25లో 41,235 ఎకరాల్లో కంది సాగు చేశారు. వర్షాలు బాగా కురిశాయి. దీంతో కంది మొక్కలు బాగా ఏపుగా పెరిగాయి. అయితే అక్టోబర్లో వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో పాటు, పూత దశలో ముసురు వర్షాలు రావడం వల్ల పూతకు తెగుళ్లు, నల్లి, దోమ ఆశించాయి. దీంతో వర్షాధారం కింద ఎకరాకు 2 క్వింటాళ్లు నీటి లభ్యత ఉన్న చోట 6 నుంచి 7 క్వింటాళ్లు వచ్చాయి. ఇలా గడిచిన రెండు సీజన్లలో ఆశించిన స్థాయిలో దిగుబడులు రాక ఆర్థికంగా నష్టపోయారు. ఈ ఏడాది సైతం తగ్గిన దగుబడులు గడిచిన రెండేళ్ల నష్టాన్ని దిగమింగుకొని ఈఏడాది గంపెడు ఆశతో జిల్లా వ్యాప్తంగా 23,484 ఎకరాల్లో కంది పంట వేశారు. ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో అధిక వర్షాలు కొంత ప్రభావాన్ని చూపాయి. అక్టోబర్ నవంబర్ నెలల్లో పూత దశలో మోడాలు, వర్షాలకు పూతలు రాలాయి. గుళ్ల, పచ్చపురుగులు విపరీతంగా ఆశించాయి. ఇక గింజ దశలో కాయతొలుచు, పచ్చ పురుగులు ఆశించాయి. రూ.వేలకు వేలు మందులకు ఖర్చు చేసినా పురుగు ఉధృతి కొనసాగింది. ఫలితంగా పంట దిగుబడిపై ప్రభావం చూపింది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో పంట కోతలు ఆరంభం అయ్యాయి. చాలా చోట్ల వచ్చే నెలలో కోతలు ఉంటాయి. కాగా గింజలను బట్టి పంట దిగుబడులు తగ్గినట్లు అంచనాకు వచ్చామని రైతులు అంటున్నారు. వర్షాధారం కింద ఎకరాకు 2 క్వింటాళ్లు, నీటి లభ్యత ఉన్న చోట ఎకరాకు 3 నుంచి 5 క్వింటాళ్లు మాత్రమే వస్తోందనిఆవేదన వ్యక్తం చేశారు. గడిచిన రెండేళ్లు నష్టాలు వచ్చాయని, ఈ ఏడాది సైతం దిగుబడులు తగ్గి ఆర్థికంగా కోలుకోలేకున్నామని వాపోతున్నారు. ఈ ఏడాది 5ఎకరాల్లో కంది పంట వేశాను. గుళ్ల, పచ్చపురుగులు విపరీతంగా ఆశించాయి. ఆరు సార్లు మందులు కొట్టాను. రూ.వేలకు వేలు ఖర్చు అయ్యింది. కానీ, దిగుబడి మాత్రం తగ్గింది. ఐదు ఎకరాలకు కేవలం 15 క్వింటాళ్లు మాత్రమే వచ్చింది. – సూరి, కంది రైతు, శెట్టిఆత్మకూర్, గద్వాల మండలం ఈసారి వానాకాలం సీజన్లో వేసిన కంది పంట ఆరంభంలో బాగా వచ్చింది. అయితే అక్టోబర్, నవంబర్ నెలల్లో పూత దశలో పురుగు, తెగుళ్లు ఆశించాయి. వీటి నివారణ కోసం రైతులకు అవసరమైన సలహాలు, సూచనలు చేశాం. దిగుబడులు బాగానే వస్తాయని అంచనా వేస్తున్నాం. – సక్రియానాయక్, డీఏఓ -
చేనేత మగ్గం నేసి..
గద్వాల జరీ చీరల ప్రాముఖ్యత తెలుసుకున్న గవర్నర్ చేనేత స్టాల్ దగ్గర కార్మికులతో మాట్లాడారు. నెలకు ఎన్ని చీరలు నేస్తారు.. కూలీ ఎంత వస్తుందని ఆరాతీశారు. ఖండాంతర ఖ్యాతి ఘడించిన గద్వాల జరీ చీరల ప్రాముఖ్యతను మరింత ఇనుమడింపజేయాలని సూచించారు. కలెక్టరేట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన చేనేత స్టాల్లో మగ్గంపై కూర్చొని చీర నేసే విధానాన్ని పరిశీలించి.. రాట్నం ద్వారా ధారం చుట్టారు. అనంతరం మహిళా స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేసిన స్టాల్స్ పరిశీలించి రుణాలను సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. రెడ్క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో చేపట్టిన రక్తదాన శిబిరాల వివరాలు తెలుసుకుని ప్రశంసించారు. అనంతరం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజలకు దగ్గరగా ఉండాలనే ఉద్దేశంతో రాజ్భవన్ను లోక్భవన్గా మార్చామన్నారు. అంతకు ముందు కలెక్టర్ సంతోష్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా జిల్లా భౌగోళిక స్వరూపం, చరిత్ర, ప్రసిద్ధ క్షేత్రాలు, ప్రాముఖ్యత, సాధించిన ప్రగతిని వివరించారు. అనంతరం గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు గద్వాల జరీ చీర ఫ్రేమ్ను జ్ఞాపికగా అందజేశారు. -
వణుకుతోన్న సంక్షేమం
ప్రభుత్వ వసతిగృహాల్లో చన్నీళ్లే దిక్కు ● జిల్లాలో అధికమైన చలి తీవ్రత ● ఉదయాన్నే స్నానం చేసేందుకు విద్యార్థుల అవస్థలు ● కొన్ని హాస్టళ్లకు కిటికీలు, డోర్లు కూడా సరిగా లేని వైనం రోజు శుభ్రంగా స్నానం చేసి పాఠశాలకు వెళ్లడం మంచి అలవాటు. ఇది ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. అయితే శీతాకాలం భానుడు 9 గంటల వరకు కూడా మబ్బులను దాటుకొని రావడం లేదు. దీంతో మంచుదుప్పటి పరిచినట్లుగా ఉంటుంది. దీంతో విద్యార్థులు చన్నీటితో స్నానం చేసేందుకు జంకుతున్నారు. కొందరు విద్యార్థులు ఉదయం స్నానం చేయకుండానే వెళ్లి, సాయంత్రం పాఠశాల నుంచి వచ్చిన తర్వాత చేస్తున్నారు. ఇదేమని ప్రశ్నిస్తే.. ఉదయం చలికి తట్టుకోలేకపోతున్నామనే సమాధానం చెబుతున్నారు. ఇక రోజు చన్నీటితో ఉదయం, సాయంత్రం స్నానాలు చేయడం వల్ల ఆయాసం, ఉబ్బసం, ఇతర శ్వాసకోశ సంబంధ వ్యాధులు ఉన్న విద్యార్థుల ఆరోగ్య పరిస్థతి కాస్త ఇబ్బందులకు గురిచేసే అవకాశం ఉంది. వారం రోజులుగా మరీ తీవ్రం.. రోజంతా ఆకాశం మేఘావృతమై ఉంటోంది. జిల్లా అంతటా మబ్బులు ప ట్టింది. వారం రోజులుగా వాతావరణంలో మార్పుల కారణంగా చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రోజు ఉదయం 8 గంటల వరకు పొగమంచు కురుస్తుంది. దీంతో వసతి గృహాల్లో ఉండే విద్యార్థులు చాలా ఇబ్బందుల తో పాటు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఊడిన కిటకీ తలుపులు.. జిల్లాలోని 30 వసతిగృహాల్లో 3,881 మంది విద్యార్థులు ఉన్నారు. అనేక వసతిగృహాల్లో విద్యార్థులకు సరైన గదులు, వెచ్చదనాన్నిచ్చే దుప్పట్లు లేక చలికి గజగజ వణికిపోతున్నారు. కొన్ని గదులకు కిటికీ తలపులు ఊడిపోయాయి. చలి తీవ్రత భరించలేక కొన్ని చోట్ల విద్యార్థులు అట్టలు, చెక్కలను అడ్డుపెట్టారు. చల్లటి బండలపై పలచని దుప్పట్లను వేసుకుని వణుకుతూ పడుకుంటున్నారు. ఇప్పటి వరకు కళాశాల విద్యార్థులకు దుప్పట్లు అందకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉదయం 9:40 గంటలకే పాఠశాల ప్రారంభమవుతుంది. వేకువజామున 6 గంటలకే కాలకృత్యాలు తీర్చుకొని జావ తాగాలి. అనంతరం స్టడీ అవర్స్కు హాజరుకావాలి. ఆ తర్వాత స్నానాలు చేసి.. ఆల్పాహారం ఆరగించి బడికి బయలుదేరివెళ్లాలి. ఇదీ ప్రభుత్వ సంక్షేమ వసతిగృహాల్లోని విద్యార్థుల దైనందిన కార్యక్రమాలు. ఇవన్నీ క్రమం తప్పకుండా జరగాలంటే విద్యార్థులు రోజు ఉదయం 5 గంటలకే నిద్రలేవాలి. అప్పుడే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని పాఠశాలకు చేరుకుంటారు. ఇది బాగానే ఉన్నప్పటికీ.. చలికాలం విద్యార్థుల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. చలిపులి విజృంభిస్తుండటంతో ఉదయం నిద్రలేవాలంటేనే జంకుతున్నారు. ఇక కాలకృత్యాలతో మొదలుకొని స్నానాలు పూర్తయ్యే వరకు ప్రతి అవసరానికి చన్నీళ్లనే ఉపయోగించాల్సి వస్తోంది. ఈ పరిస్థితి జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఎస్సీ, ఎస్టీ, బీసీ వసతి గృహాల్లో నెలకొంది. మంగళవారం పలు వసతిగృహాలను ‘సాక్షి’ పరిశీలన చేయగా.. అనేక సమస్యలు వెలుగులోకి వచ్చాయి. – గద్వాలటౌన్/అయిజ/మానవపాడు/ఉండవెల్లి విద్యార్థులు 120 మంది ఎస్టీ వసతిగృహాలు 1 గత వారం నుంచి నమోదైన ఉష్ణోగత్రలు జిల్లా కేంద్రంలోని బాలుర బీసీ కళాశాల వసతిగృహాంలో వణుకుతూ పడుకున్న విద్యార్థులు -
బీచుపల్లి క్షేత్రంలో దేవాదాయశాఖ కమిషనర్
ఎర్రవల్లి: బీచుపల్లి పుణ్యక్షేత్రాన్ని మంగళవారం రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయశాఖ కమిషనర్ హరీశ్ సందర్శించారు. అభయాంజనేయస్వామిని ఆయన దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు ఆలయ సిబ్బంది ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయ ఈఓ రామన్గౌడ్ కమిషనర్ను శేషవస్త్రంతో సత్కరించగా.. అర్చకులు మారుతీచారి తీర్థప్రసాదాలను అందజేశారు. జాతీయ కబడ్డీ టోర్నీకి జిల్లా క్రీడాకారిణి గద్వాలటౌన్: కలకత్తాలో ఈ నెల 25 నుంచి 28వ తేదీ వరకు జరిగే జాతీయస్థాయి జూనియర్ కబడ్డీ పోటీలకు జిల్లా క్రీడాకారిణి రాజేశ్వరి ఎంపికయ్యారు. అయిజ మండలం పులికల్కు చెందిన రాజేశ్వరి ఎంఏఎల్డీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు. ఇటీవల నల్లగొండ జిల్లాలో జరిగిన రాష్ట్రస్థాయి జూనియర్ కబడ్డీ పోటీల్లో జిల్లా జట్టు తరఫున ఆమె పాల్గొని అత్యంత ప్రతిభకనబర్చడంతో జాతీయస్థాయి పోటీలకు ఎంపిక చేశారు. ఈ సందర్భంగా మంగళవారం జిల్లా కేంద్రంలో రాజేశ్వరిని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో కబడ్డీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షురాలు డీకే స్నిగ్ధారెడ్డి, ప్రధాన కార్యదర్శి నర్సింహ, కోశాధికారి చందు, ఆర్గనైజింగ్ సెక్రటరీ రవి, ఉపాధ్యక్షులు నగేశ్, వెంకటేశ్, సంయుక్త కార్యదర్శులు జగదీశ్, పాషా, రాజేందర్ పాల్గొన్నారు. నట్టల నివారణతోనే జీవాల్లో ఎదుగుదల గద్వాల(ఇటిక్యాల): జీవాలు ఆరోగ్యంగా ఎదిగేందుకు నట్టల నివారణ ముఖ్యమని జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి డా.శివానందస్వామి అన్నారు. మంగళవారం ఇటిక్యాలలో సర్పంచ్ జీవన్రెడ్డితో కలసి జీవాలకు నట్టల నివారణ మందు పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. జీవాల ఆరోగ్య సంరక్షణ దృష్ట్యా ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న నట్టల నివారణ మందును పెంపకందారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మేకలు, గొర్రెల్లో నట్టలను నివారించడం వల్ల ఆకలి గుణం పెరిగి, మేత అధికంగా తీసుకుంటాయని తెలిపారు. యజ మానులకు అధిక మాంసం ఉత్పత్తి జరిగి, ఆర్ధికంగా లాభాలు పొందవచ్చన్నారు. కార్యక్రమంలో మండల పశువైద్యాధికారి భువనేశ్వరి, సిబ్బ ంది మాసుమన్న, కార్తీక్, మురళి పాల్గొన్నారు. కుష్టు నిర్మూలనకు కృషి చేద్దాం ఎర్రవల్లి: కుష్టివ్యాధిని నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరూ కృషిచేయాలని రాష్ట్ర ఎల్సీడీసీ ప్రోగ్రాం అధికారిణి డా.జరీనా భాను అన్నారు. ఎల్సీడీసీ కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఎర్రవల్లి మండలం కొండేరులో ఆశావర్కర్లు చేపట్టిన ఇంటింటి సర్వేను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. చర్మంపై మచ్చలు ఏర్పడి, స్పర్శ కోల్పోతే సస్పెక్టెడ్ కేసుగా నమోదు చేయాలని సూచించారు. ఆ కేసులను మండల వైద్యాధికారి పరీక్షించిన తర్వాత నిర్దారణ చేసుకోవాలన్నారు. లెప్రసీ వ్యాధిపై అందరికీ అవగాహన కల్పించాలని సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో లెప్రసీ నోడల్ పర్సన్ రమేశ్, ఏఎన్ఎం నర్మద పాల్గొన్నారు. వేరుశనగ క్వింటా రూ.8,090 గద్వాల వ్యవసాయం: జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్యార్డుకు మంగళవారం 326 క్వింటాళ్ల వేరుశనగ విక్రయానికి వచ్చింది. క్వింటా గరిష్టంగా రూ. 8,090, కనిష్టంగా రూ. 5,299, సరాసరి రూ. 6,890 ధరలు లభించాయి. అదే విధంగా క్వింటా ఆముదాలు అమ్మకానికి రాగా.. రూ. 5,877 ధర పలికింది. 286 క్వింటాళ్ల వరి (సోన) అమ్మకానికి రాగా.. గరిష్టంగా రూ. 2,570, కనిష్టంగా రూ. 2,110, సరాసరి రూ. 2,368 ధరలు వచ్చాయి. 86 క్వింటాళ్ల కందులు అమ్మకానికి రాగా.. గరిష్టంగా రూ. 6,469, కనిష్టంగా రూ. 4,526, సరాసరి రూ. 5,829 ధరలు లభించాయి. -
దేశం గర్వించే స్థాయికి ఎదగాలి
గద్వాలటౌన్: శాస్త్ర, సాంకేతిక రంగాల్లో విద్యార్థులు దేశం గర్వించే స్థాయికి ఎదగాలని ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్రెడ్డి, విజయుడు సూచించారు. మంగళవారం స్థానిక బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శన ముగింపు కార్యక్రమానికి వారు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. రాష్ట్రం, దేశం అభివృద్ధిలో ముందుకుసాగాలంటే పరిశోధనలు ఎంతో ముఖ్యమన్నారు. విద్యార్థులను తరగతి గదిలో కంటే ప్రయోగశాలల్లోనే ఎక్కువగా ఉంచి.. కొత్త విషయాలను తెలియజేయాలన్నారు. విద్యార్థులు విజ్ఞాన శాస్త్రంపై ఆసక్తి పెంచుకొని భవిష్యత్లో గొప్ప శాస్త్రవేత్తలుగా ఎదగాలని పిలుపునిచ్చారు. డీఈఓ విజయలక్ష్మి మాట్లాడుతూ.. నేటి బాలబాలికల్లో భావి శాస్త్రవేత్తలు ఎంతోమంది ఉంటారని.. వారిని గుర్తించాల్సిన బాధ్యత గురువులదేనని అన్నారు. కాగా, సీనియర్, జూనియర్ విభాగాల్లో ఏడుగురు చొప్పున, టీచర్ ఎగ్జిబిట్, సెమినార్, ఇన్స్ఫెయిర్ మనక్ విభాగాల్లో విజేతలను ఎంపిక చేశారు. వచ్చే నెల హైదరాబాద్లో ప్రారంభమయ్యే రాష్ట్రస్థాయి ప్రదర్శనలో వీరు పాల్గొంటారని జిల్లా సైన్స్ అఽధికారి బాస్కర్ పాపన్న తెలిపారు. అనంతరం జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనల్లో అత్యుత్తమ ప్రదర్శన చాటిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు, మెమోంటోలను అందజేశారు. -
నేడు కోస్గికి సీఎం రాక
కోస్గి: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి బుధవారం కోస్గికి రానున్నారు. కొడంగల్ నియోజకవర్గ పరిధిలో పంచాయతీ పాలకవర్గాల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొననున్నారు. సీఎం పర్యటన ఏర్పాట్లను మంగళవారం ఎస్పీ వినీత్తో కలిసి నారాయణపేట, వికారాబాద్ కలెక్టర్లు సంచిత్ గంగ్వార్, ప్రతీక్ జైన్ పరిశీలించారు. పంచాయతీ పాలకవర్గాల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించే స్థానిక లక్ష్మీనర్సింహ ఫంక్షన్హల్తోపాటు సభాస్థలం, హెలీప్యాడ్, సీఎం కాన్వాయ్ రూట్, వాహనాల పార్కింగ్, బారికేడ్లు తదితర భద్రతాపరమైన అంశాలను పరిశీలించి.. అధికారులకు సూచనలు చేశారు. అనంతరం వికారాబాద్, సంగారెడ్డి, సూర్యాపేట, నల్లగొండ జిల్లాల నుంచి సీఎం పర్యటన బందోబస్తుకు వచ్చిన 800 మంది పోలీసులతో ఎస్పీ వినీత్ సమావేశమై మాట్లాడారు. మొత్తం 10 సెక్టార్లుగా విభజించి.. ఏఎస్పీలు, డీఎస్పీలను ఇన్చార్జిలుగా నియమించామని తెలిపారు. ప్రత్యేక బృందాలు క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. ప్రజాప్రతినిధుల సన్మాన కార్యక్రమం జరిగే ప్రదేశంలో అదనపు బలగాలతో భద్రతా చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. సీఎం కాన్వాయ్ రూట్లో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా, ప్రజలకు ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామన్నారు. -
యేసు జననం.. గొప్ప సందేశం
గద్వాలటౌన్: పరిశుద్ధాత్మ కుమారుడిగా యేసుక్రీస్తు జననం ప్రపంచ మానవాళికి శాంతి సందేశం ఇచ్చిందని.. ఆ కరుణామయుడి జన్మదినం అందరికీ శుభదినమని పలువురు సందేశకులు అన్నారు. క్రిస్మస్ పర్వదనాన్ని పురస్కరించుకొని మంగళవారం స్థానిక ఎంబీ మిస్పా చర్చిలో ప్రదర్శించిన ‘క్రీస్తు జననం’ నాటిక ఆకట్టుకుంది. స్వాగత నృత్యంతో పాటు వైవిధ్య ఆహార్యం, అభినయంతో పండగ ప్రత్యేకతను సండే స్కూల్ విద్యార్థులు ప్రదర్శన ద్వారా చాటి చెప్పారు. అనంతరం స్కిట్ల ప్రదర్శన సుమారు గంటపాటు సాగింది. ఈ సందర్భంగా చర్చి కమిటీ చైర్మన్ ప్రభుదాస్, పాస్టర్ చార్లెస్ శాంతిరాజ్, కార్యదర్శి సైమన్ సుధాకర్ మాట్లాడారు. ప్రతి ఒక్కరూ యేసు చూపిన బాటలో నడుచుకొని సేవాభావాన్ని అలవర్చుకోవాలని సూచించారు. -
వచ్చే అసెంబ్లీ ఎన్నికల బరిలో జాగృతి
గద్వాల టౌన్/అలంపూర్/ధరూరు/కేటీదొడ్డి/: ‘వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో కచ్చితంగా జాగృతి వైపు నుంచి మేం పోటీలో ఉంటాం.. పేరు అదే ఉంటదా.. ఇంకొకటి ఉంటదా.. అనేది సెకండరీ.. 2029లో సాధారణ అసెంబ్లీ ఎన్నికలు వస్తాయని అనుకుంటున్నామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. రెండు రోజుల జాగృతి జనంబాట కార్యక్రమం అనంతరం సోమవారం గద్వాల జిల్లాకేంద్రంలోని హరిత హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడే తనకు, తన ఫ్యామిలీకి మధ్య అనేక సంఘటనలు చోటుచేసుకున్నాయని వివరించారు. తన భర్త ఫోన్ ట్యాపింగ్ చేశారని, తీన్మార్ మల్లన్న తనపై అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు పార్టీ నుంచి ఏ ఒక్కరూ మాట్లాడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మా పార్టీ నాయకులే నాపై కుట్ర చేసి ఎంపీగా ఓడించారని, వద్దంటే ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టారని చెప్పారు. తిరిగి బీఆర్ఎస్లో చేరే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. పదవిలో ఉన్నా.. లేకున్నా ఎప్పటికీ ప్రజల మధ్యనే ఉంటామని చెప్పారు. ఎంపీగా ఉన్న సమయంలో ‘మన ఊరు– మన ఎంపీ’ పేరుతో అనేక కార్యక్రమాలు చేపట్టానని గుర్తుచేశారు. ఎడ్యుకేషన్, ఇరిగేషన్ అభివృద్ధిపై సీఎం రేవంత్రెడ్డి చేసే ప్రకటనలు శుద్ధ అబద్దమని విమర్శించారు. తెలంగాణలో డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తున్నాయన్నారు. రాష్ట్రంలో విద్యారంగంపై ప్రభుత్వ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. అక్షరాస్యతలో గద్వాల ప్రాంతం అత్యంత వెనకబడి ఉండటం చాలా బాధాకరమన్నారు. సీఎం రేవంత్రెడ్డి గద్వాలపై ప్రత్యేక దృష్టిపెట్టి విద్యారంగం అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ఉందన్నారు. రాష్ట్రంలోని గురుకులాలు, సంక్షేమ వసతి గృహాలు, పాఠశాలలో ఫుడ్ పాయిజన్ నిత్యం జరుగుతున్నా ప్రభుత్వం పట్టనట్లుగా వ్యవహరిస్తుందని ధ్వజమెత్తారు. గురుకుల పాఠశాలల అద్దెలు కూడా చెల్లించలేని దుస్థితిలో ఉండటం దారుణమన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకొని, వాటి పరిష్కారం కోసం జాగృతి జనం బాట చేపట్టిందని వివరించారు. ● అంతకుముందు ధరూరు మండలంలోని నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంలో భాగమైన గుడ్డెందొడ్డి పంపుహౌస్, రిజర్వాయర్ను, కేటీదొడ్డి మండలం మల్లాపురం తండా శివారులో నిర్మిస్తున్న గట్టు ఎత్తిపోతల పథకం రిజర్వాయర్ పనులను ఆమె పరిశీలించారు. అలాగే, అలంపూర్ జోగుళాంబ ఆల యాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. -
కూల్గా దోపిడీ..!
మద్యం షాపులే టార్గెట్గా అ(న)ధికార దందా రూ.2 వేల నుంచి రూ.4 వేలు.. వైన్స్ దుకాణాల్లో ఏర్పాటు చేసిన పర్మిట్ రూంలలో నిబంధనల ప్రకారం మద్యం ప్రియులు నిల్చొనే మందు తాగి వెళ్లాలి. ఇలా అయితే తగిన ఆదాయం సమకూరదని పర్మిట్ రూంలలో సిట్టింగ్లు కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం ఏటేటా జిల్లాలకు మద్యం అమ్మకాల లక్ష్యం పెంచుతున్న క్రమంలో ఎకై ్సజ్ శాఖ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో పర్మిట్ రూంల పక్కనే కూల్ పాయింట్లు (స్నాక్స్, నీళ్లు, గ్లాసులు, కూల్ డ్రింక్లు అమ్మేవి) తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ మేరకు కూల్ పాయింట్లను కొన్ని చోట్ల మద్యం షాపుల యజమానులే నడిపిస్తుండగా.. మరికొన్ని ప్రాంతాల్లో పలువురికి అప్పగించి నడిపిస్తున్నారు. ఇతరులు నడిపిస్తున్న వాటికి సంబంధించి ప్రాంతం, గిరాకీని బట్టి కూల్ పాయింట్ల నిర్వాహకులు రోజుకు రూ.2 వేల నుంచి రూ.4 వేలను మద్యం దుకాణాల యజమానులకు చెల్లిస్తున్నారు. వాటిపై కన్ను.. వెంటాడి దారికి.. మద్యం షాపులకు దీటుగా కూల్ పాయింట్ల వ్యాపారం నడుస్తుండడంతో పలువురు రాజకీయ నేతల కన్ను వాటిపై పడినట్లు తెలుస్తోంది. ప్రధానంగా కార్పొరేషన్, మున్సిపాలిటీల పరిధిలో ఏర్పాటు చేసిన మద్యం దుకాణాల యజమానులతో పలువురు నాయకులు వేర్వేరుగా భేటీ అయినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా కూల్ పాయింట్లను తమ అనుచరులు, ముఖ్య నాయకులకు ఇవ్వాలని అల్టిమేటం జారీ చేసినట్లు తెలుస్తోంది. దీనిపై మద్యం వ్యాపారుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనట్లు సమా చారం. ఈ క్రమంలో మాట వినని వారిపై పరోక్షంగా వేధింపులకు దిగడం చర్చనీయాంశంగా మారింది. కొందరు అలా.. మరి కొందరు ఇలా.. కూల్ పాయింట్లకు సంబంధించి ఆయా ప్రాంతాల్లో ఐదారుగురు ద్వితీయ శ్రేణి నేతలు పంచుకున్నట్లు సమాచారం. తమ ముఖ్య అనుచరులకు ఇవ్వాలని కోరిన పలువురు నేతలు.. రోజు వారీగా చెల్లించే దానిలో గతం కంటే కొంత తక్కువగా ఇస్తారని.. రెండు, మూడు నెలల తర్వాత వారు కరెక్ట్గా ఇస్తేనే ఉంచుకోవాలని సూచించారు. కరెక్ట్గా ఇవ్వకున్నా, సరిగ్గా నడవకున్నా.. వారిని తీసేయొచ్చని చెప్పారు. ఇలాంటి చోట్ల పెద్దగా ఇబ్బంది లేదు. ఎవరైతే కూల్పాయింట్ల నుంచి ఒక్క రూపాయి ఇవ్వరు అని చెప్పడం.. మాట వినని మద్యం షాపుల యజమానులపై ఒత్తిళ్లు పెంచడంతో వివాదాలు తలెత్తినట్లు తెలుస్తోంది. ఆయా ప్రాంతాల్లో ముఖ్య నేతలు సైతం ఆ నాయకులకే మద్దతు పలకడంతో మద్యం షాపుల యజమానుల్లో అసహనం వ్యక్తమవుతోంది. చిచ్చు.. దుమారం.. మరో వైపు కూల్ పాయింట్ల వ్యవహారం పలు ప్రాంతాల్లో ‘అధికార’ నాయకుల మధ్య చిచ్చు రాజేసినట్లు శ్రేణుల్లో చర్చ జరుగుతోంది. తమకు అవకాశం ఇవ్వకుండా కొందరికే అప్పగించేలా నేతలు చొరవ చూపడం వారిని నొప్పించినట్లు తెలుస్తోంది. మరోవైపు ఇప్పటికే అన్ని సర్దుకోగా.. కూలింగ్ పాయింట్లను దక్కించుకున్న వారు వేరే వారికి నెలకు కొంత మొత్తం చొప్పున చెల్లించేలా వారితో ఒప్పందాలు కుదర్చుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపైనా దుమారం చెలరేగినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఇదిలా ఉంటే వేధింపులపై ఒకరిద్దరు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. అయినా.. ఎవరూ స్పందించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కూలింగ్ పాయింట్లపైపలువురు నాయకుల నజర్ తమ ముఖ్య అనుచరులకు ఇచ్చేలా పావులు కొన్ని చోట్ల రోజు వారీ చెల్లింపులు ఎగవేసేలా యత్నాలు? ఒత్తిళ్లతో వైన్స్ దుకాణాల ఓనర్లలో ఆందోళన పట్టించుకోని ఎకై ్సజ్ శాఖ అధికారులపై ఆగ్రహం -
ఎస్ఐఆర్ ప్రక్రియ వేగవంతం చేయాలి
గద్వాలన్యూటౌన్: ఓటర్ల జాబితా సవరణకు చేపట్టిన ఎస్ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్)ను ఎలాంటి పొరపాట్లు లేకుండా పూర్తి చేయాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్రెడ్డి అన్నారు. సోమవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ఎన్నికల అధికారులతో కలిసి ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎన్నికల అధికారులు, ఈఆర్ఓలతో ఎస్ఐఆర్ పురోగతిపై సమీక్ష నిర్వహించారు. జిల్లా నుంచి పాల్గొన్న కలెక్టర్ సంతోష్ మాట్లాడుతూ మ్యాపింగ్ ప్రక్రియపై ఇప్పటికే జిల్లాలోని బీఎల్ఓలు, సూపర్వైజర్లకు శిక్షణ ఇచ్చామన్నారు. జిల్లాలో ఇప్పటివరకు 45శాతం మ్యాపింగ్ పూర్తి అయ్యిందని తెలిపారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా నిర్ణీత గడువులోగా పూర్తి చేస్తామని చెప్పారు. 40శాతం కన్నా తక్కువ మ్యాపింగ్ జరిగిన పోలింగ్ స్టేషన్లను గుర్తించి, అక్కడ వేగవంతం అయ్యేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) లక్ష్మీనారాయణ, ఆర్డీఓ అలివేలు, ఎన్నికల విభాగం అధికారి కరుణాకర్, తహశీల్దార్లు పాల్గొన్నారు. ప్రజావాణిలో అర్జీదారుల మొర గద్వాలటౌన్: ప్రజల ముంగిటకు పాలన రావడంతో గద్వాల కలెక్టరేట్ కిటకిటలాడింది. కలెక్టర్, అడిషినల్ కలెక్టర్లకు వినతులు, సమస్యలు చెబితే పరిష్కారం అవుతాయనే ఉద్దేశ్యంతో బాధితులు తరలివచ్చారు. వివిధ వర్గాలకు చెందిన ప్రజలు ప్రజావాణికి వచ్చారు. సోమవారం కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణిలో అడిషినల్ కలెక్టర్లు లక్ష్మినారాయణ, నర్సింగరావులు ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు ప్రజావాణి కొనసాగింది. మొత్తం 42 దరఖాస్తులు అందాయి. ప్రజావాణిలో అధికారులు బాధితుల నుంచి నేరుగా దరఖాస్తులు స్వీకరించి వారి సమస్యలను విన్నారు. సంబంధిత శాఖల అధికారులను పిలిపించి పరిష్కరించాలని సూచించారు. వివిధ శాఖలకు చెందిన జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఆసరా పెన్షన్లు, భూసంబంధిత, ప్రజారోగ్యం, పారిశుద్ధ్యం, ఉపాధి, విద్యుత్తు తదితర సమస్యలపై వినతలు వచ్చాయి. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదుల పట్ల అలసత్వం వద్దని అడిషినల్ కలెక్టర్లు సంబంధిత అధికారులకు సూచించారు. పోలీస్ గ్రీవెన్స్కు 10 వినతులు గద్వాల క్రైం: ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్కు 10 వినతులు అందగా.. ఎస్పీ శ్రీనివాసరావు వారితో నేరుగా మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. భూ వివాదం, ఆస్తి తగదాలు, అప్పుగా తీసుకున్న వ్యక్తులు డబ్బులు చెల్లించడంలేదు తదితర కారణాలతో 10 మంది వినతులు చేశారు. వీలైనంత త్వరగా సమస్యలను పరిష్కారం చేకూరుస్తామని బాధితులకు వివరించారు. సివిల్ సమస్యలపై కోర్టు ద్వారా పరిష్కారం చేసుకోవాలన్నారు. -
గ్రామాల్లో నవశకం..
పంచాయతీల్లో కొలువుదీరిన పాలక వర్గాలు సంబురంగా ప్రమాణ స్వీకారాలు జిల్లాలో పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థుల ప్రమాణ స్వీకారం సంబురంగా నిర్వహించారు. కొత్త పాలక వర్గం ప్రమాణ స్వీకారాన్ని పురస్కరించుకొని కొన్ని చోట్ల పంచాయతీ భవనాలకు రంగులు వేసి ముస్తాబు చేశారు. మరికొన్ని చోట్ల రంగు రంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు. పండగ వాతవరణంలో సర్పంచ్లు, వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. జిల్లాలోని 255 పంచాయతీలు, 2390 వార్డులకు ఎన్నికలు జరిగాయి. మూడు విడతల్లో 40 మంది సర్పంచ్లు, 719 మంది వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగతా స్థానాలకు ఎన్నికలు జరగగా.. 215 మంది సర్పంచ్లు, 1668 మంది వార్డుమెంబర్లు విజయం సాధించారు. ఇదిలాఉండగా, ఉండవెల్లిలోని బస్వాపురంలో మూడు వార్డులకు నామినేషన్ల తిరస్కరణతో 3 వార్డులకు ఎన్నికలు జరగలేదు. ఏకగ్రీవంగా, ఎన్నికల బరిలో నిలిచిన వారిలో ఒక్క జల్లాపురం మినహా మిగిలిన చోట సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డుల సభ్యులు ప్రమాణ స్వీకారాలు చేసి పదవి బాధ్యతలు స్వీకరించారు. అలంపూర్: పంచాయతీల పాలక వర్గం కొలువుదీరింది. రెండేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత పంచాయతీల్లో పాలక వర్గం సందడి ఆరంభమైంది. కొత్త పాలక వర్గం సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవంతో పల్లెల్లో పండగా వాతవరణం నెలకొంది. జిల్లాలో పంచాయతీల సర్పంచ్లు, ఉపసర్పంచ్లు, వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారం సోమవారం జరిగింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆయా పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థుల ప్రమాణ స్వీకారాన్ని అధికారులు ఘనంగా నిర్వహించారు. పంచాయతీల పాలక వర్గ ప్రమాణ స్వీకారంలో వింతలు విశేషాలు చోటు చేసుకున్నాయి. విధులు.. బాధ్యతలు గ్రామ పంచాయతీల పరిపాలకులుగా సర్పంచులు వ్యవహరిస్తూ గ్రామసభలు నిర్వహించాలి. ఎన్నిక తర్వాత 15 రోజుల్లో తొలి గ్రామసభ జరపాలి. 15వ ఆర్థిక సంఘం నిధులు రాబట్టుకునేలా చొరవ తీసుకోవాలి. బడ్జెట్ ఆమోదం, అభివృద్ధి పనులు, రోడ్డు, నీటి సరఫరా, ఆరోగ్యం, విద్య, వీధి దీపాలు, పారిశుద్ధ్యం పర్యవేక్షణ, గ్రామీణాభివృద్ధి, ఉపాధిహామీ, స్వచ్ఛభారత్ వంటి కేంద్ర, రాష్ట్ర పథకాలను అమలు చేయాల్సిన బాధ్యత సర్పంచులపైనే ఉంటుంది. పంచాయతీ ఆర్థిక నిర్వహణ, లాభనష్టాల రిపోర్టులు సమర్పించాల్సి ఉంటుంది. పీఎం ఆవాస్ యోజన వంటి పథకాల్లో పారదర్శకత ఉండాలి. ఇదిలాఉండగా, ఎన్నో ఆశలు, ఆశయాలతో కొలువుదీరిన పంచాయతీల పాలకవర్గాలకు నిధులలేమి అసలు సమస్యగా కనిపిస్తోంది. బాధ్యతలు చేపట్టిన 255 మంది సర్పంచులు, 2387 మంది వార్డు మెంబర్లు జల్లాపురంలో సర్పంచ్, వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారం వాయిదా జీపీ భవనాల్లేక చెట్ల కింద, ప్రభుత్వ పాఠశాలల్లో ప్రమాణ స్వీకారం -
సమాజానికి మేలు చేసే ప్రాజెక్టులు రూపొందించాలి
● కలెక్టర్ సంతోష్ ● ఘనంగా జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శన ప్రారంభం గద్వాలటౌన్: విద్యార్థులు ప్రకృతితో మమేకమవుతూ సమాజానికి మేలు చేసే ఆవిష్కరణలు, ప్రాజెక్టులు రూపొందించాలని కలెక్టర్ సంతోష్ అన్నారు. సోమవారం స్థానిక ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శన ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. నేటి తరం విద్యార్థులు విజ్ఞాన ఆవిష్కరణలపై ఆసక్తిని చాటుతూ పలు సమస్యలకు పరిష్కారాన్ని చూపించేలా వాటిని రూపొందించాలని పేర్కొన్నారు. శాస్త్ర, సాంకేతిక రంగాలలో భారతదేశం గర్వించే స్థాయికి విద్యార్థులు ఎదగాలని, ఆ దృష్టితో విద్యార్థులు పరిశోధనలు సాగించాలన్నారు. గద్వాలలో సైన్స్ మ్యూజియం ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ● గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగివున్న సృజనాత్మకతను వెలికితీసి సమాజానికి ఉపయోగపడే విధంగా ప్రదర్శనలను ఆవిష్కరించాలని సూచించారు. విద్యార్థులలో శాస్త్ర విజ్ఞానానికి కొదవ లేదని, దీనిని ప్రజాపరం చేసే ఆలోచన ప్రభుత్వాలకు ఉన్నప్పుడే పలు సమస్యలు పరిష్కారానికి నోచుకుంటాయన్నారు. ● అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు మాట్లాడుతూ విద్యార్థులు నిర్మాణాత్మక ఆలోచనలతో ఎదుగుతూ వారు తయారు చేసే ఆవిష్కరణలతో దేశం పులకించిపోవాలని పేర్కొన్నారు. డీఈఓ విజయలక్ష్మి మాట్లాడుతూ విజ్ఞాన శాస్త్రాన్ని మానవాళి మనుగడకు ఉపయోగించాలని కోరారు. శాసీ్త్రయ విద్యా ప్రమాణాలు ఉన్న విద్యార్థులను మరో కోణంలో నిలబెడతాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ శ్రీనివాస్గౌడ్, జిల్లా సైన్స్ అధికారి భాస్కర్పాపన్న తదితరులు పాల్గొన్నారు. -
కొలువుదీరనున్నారు..!
నేడు సర్పంచ్, వార్డుమెంబర్ల ప్రమాణ స్వీకారం● ప్రత్యేక అధికారుల పాలనలో ఎక్కడి సమస్యలు అక్కడే ● కొత్త సర్పంచ్లపైన కోటి ఆశలు ● జిల్లాలో 255 మంది సర్పంచ్లు.. 2,387 మంది వార్డు సభ్యులు అలంపూర్: గ్రామాల్లో కొత్త పాలకవర్గం కొలువుదీరనుంది. జిల్లా వ్యాప్తంగా 255 గ్రామ పంచాయతీలు, 2387 వార్డు మెంబర్ల సభ్యులకు ఎన్నికలు జరగగా.. విజయం సాధించిన సర్పంచ్లు, వార్డుమెంబర్లు ఈ నెల 22న (నేడు) ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎట్టకేలకు సోమవారం నుంచి నూతన పాలకవర్గం ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీల పాలన సాగనుంది. దాదాపు రెండేళ్లపాటు ఖాళీగా ఉన్న పంచాయతీలు సర్పంచ్ల రాకతో కళకళాడనున్నాయి. ప్రజా మద్దతు కూడగట్టి పాలన పగ్గాలు చేతబట్టిన సర్పంచ్లు ప్రజా సమస్యల పరిష్కారానికి శ్రీకారం చుట్టనున్నారు. ప్రత్యేక అధికారుల పాలనలో ఎక్కడి సమస్యలు అక్కడే ఉండిపోగా.. కొత్త సర్పంచ్ల రాకతో అయినా సమస్యలు పరిష్కారానికి నోచుకుంటాయని ప్రజలు ఆశిస్తున్నారు. రెండేళ్లు ప్రత్యేక అధికారుల పాలన జిల్లాలోని గ్రామ పంచాయతీలు దాదాపు రెండేళ్లుగా ప్రత్యేక అధికారుల పాలనలో కొనసాగాయి. పంచాయతీలకు సర్పంచ్లు, వార్డు సభ్యులు లేకుండానే కొనసాగాయి. ప్రభుత్వం ప్రస్తుతం ఎన్నికలు నిర్వహించడంతో పంచాయతీల పాలకవర్గం కొలువుదీరనుంది. 2019 జనవరి 30వ తేదీన సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలు ముగిశాయి. ఆ తర్వాత 2019 ఫిబ్రవరి 2వ తేదీన గత సర్పంచ్లు, వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత 2024 ఫిబ్రవరి నుంచి పంచాయతీల పాలన పూర్తిగా ముగిసింది. అప్పటి నుంచి ప్రత్యేక అధికారులు గ్రామ పాలన సాగిస్తున్నారు. ప్రస్తుతం ఎన్నికలు ముగియడంతో ఈ నెల 22వ తేది నుంచి సర్పంచ్ల పాలన ఆరంభం కానుంది. కొత్త వారిపైనే కోటి ఆశలు.. గ్రామాల్లో దాదాపు రెండేళ్లుగా నెలకొన్న సమస్యల పరిష్కారంపై కొత్తగా బాధ్యతలు స్వీకరించే సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు సభ్యులపైనే ప్రజలు ఆశలు ఉంచారు. కొత్తగా వచ్చిన సర్పంచ్లు గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తారని ఆకాంక్షిస్తున్నారు. దాదాపు రెండేళ్లుగా పాలకవర్గాలు లేకపోవడంతో ఎక్కడి సమస్యలు అక్కడే అన్నట్లుగా మారింది. పారిశుద్ధ్యం లోపించి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అస్తవ్యస్తంగా మారిన డ్రెయినేజీ వ్యవస్థతో గ్రామాల్లో కాలనీలు మురికి కుంటలుగా మారాయి. రోడ్ల నిర్మాణాలు లేక అంతర్గత రోడ్లపై నడవడానికి సాహసం చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామంలో వీధి లైట్లు లేక రాత్రిళ్లు చీకట్లు కమ్మేస్తున్నాయి. గ్రామాల్లో తాగునీటి వసతి లేక శీతాకాలంలోనే తాగునీటి ఎద్దడి ఎదుర్కొంటున్నారు. ఇలా అనేక సమస్యలతో గ్రామ పాలన కుంటుపడింది. అత్యధిక స్థానాల్లో అధికార పార్టీ మద్దతు తెలిపిన అభ్యర్ధులే గ్రామాలను జేజిక్కించుకున్నారు. స్వతంత్రులుగా గెలిచిన వారు సైతం కొన్ని పార్టీలకి జైకొట్టే అవకాశం ఉంది. మరీ గ్రామాల్లో ఎలాంటి అభివృద్ది ఉంటుందో వెచి చూడాలి మరి...! -
నూతన విద్యా విధానంతో తీవ్ర నష్టం
గద్వాలటౌన్: నూతన విద్యావిధానాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధమవుతుందని, దీని వలన పేద, మధ్య తరగతి ప్రజలకు తీవ్ర నష్టం వాటిల్లిడంతో పాటు నాణ్యమైన విద్యా దూరమవుతుందని యూటీఎఫ్ రాష్ట్ర నాయకుడు రవిప్రసాద్గౌడ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం స్థానిక యూటీఎఫ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జిల్లా కమిటీ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హజరై మాట్లాడారు. ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహించే, ఫెడరల్ స్ఫూర్తిని దెబ్బతిసేలా ఉన్న జాతీయ విద్యావిధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. నూతన విద్యావిధానం రద్దు అయ్యే వరకు మన పోరాటం ఉండాలన్నారు. పార్లమెంటులో పెన్షన్ బిల్లు ఆమోదం పొందడం వలన ప్రస్తుతం ఉన్న పెన్షన్దారులకు నష్టం వాటిల్లుతుందని చెప్పారు. సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. పెండింగ్లోని డీఏలును, పీఆర్సీ ఆరియర్లను, ఇతర ట్రైజరీ బిల్లులను త్వరగా క్లియర్ చేయాలని కోరారు. కేజీబీవీ, గురుకుల, మోడల్ స్కూల్, గిరిజన సంక్షేమ ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలన్నారు. సమావేశంలో యూటీఎఫ్ రాష్ట్ర నాయకులు కిష్టయ్య, రామన్గౌడ్, స్వామి, జిల్లా అధ్యక్షుడు రమేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి గోపాల్, నాయకులు కుమార్నాయుడు, బీసన్న, తిమ్మప్ప, రాజశేఖర్, చంద్రకాంత్, తిలక్, రాజశేఖర్ పాల్గొన్నారు. తపస్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శుల ఎన్నిక గద్వాలటౌన్ : తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) జిల్లా అధ్యక్ష, కార్యదర్శులను ఎన్నుకున్నారు. ఆదివారం స్థానిక ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో జరిగిన తపస్ సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. తపస్ జిల్లా అధ్యక్షుడిగా రవీందర్రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శిగా నాగరాజులను ఎన్నికయ్యారు. ఎన్నికై న అధ్యక్ష, కార్యదర్శులను ఘనంగా సన్మానించారు. ఎన్నికల పరిశీలకులుగా వెంకటరెడ్డి, శ్రీనివాస్గౌడ్, నరేష్ వ్యవహరించారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్ష, కార్యదర్శులు మాట్లాడుతూ..ఉపాధ్యాయులకు రావాల్సిన అయిదు డీఏలతో పాటు ఈ–కుబేర్లో ఉన్న పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే పీఆర్సీని ప్రకటిస్తామన్న హామీ ఇప్పటి వరకు ఆ ఊసే ఎత్తకపోవడం ఏంటని ప్రశ్నించారు. సమస్యల సాధన కోసం దశల వారీగా ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. ఐద్వా మహాసభలను జయప్రదం చేయండి నాగర్కర్నూల్ రూరల్: ఐద్వా 14వ జాతీయ మహాసభలు హైదరాబాద్లో వచ్చే నెల 25 నుంచి 28 వరకు కొనసాగుతాయని.. పెద్దఎత్తున మహిళలు పాల్గొని జయప్రదం చేయాలని సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కందికొండ గీత పిలుపునిచ్చారు. ఆదివారం జిల్లాకేంద్రంలో ఆమె మాట్లాడారు. మహాసభల్లో దేశవ్యాప్తంగా మహిళలు ఎదుర్కొనే ప్రధానమైన సమస్యలపై చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందించి పోరాటాలు చేపడుతామని ఈ సందర్భంగా పేర్కొన్నారు. -
గాంధీజీ పేరు తొలగించడం అనైతికం
గద్వాలటౌన్: జాతిపిత మహాత్మాగాంధీ ప్రతిష్టను తగ్గించడం కోసమే ఉపాధి హామీ పథకంలో ఆయన పేరును తొలగించారని డీసీసీ అధ్యక్షుడు రాజీవ్రెడ్డి ఆరోపించారు. ఉపాధి హామీ పథకం నుంచి మహాత్ముని పేరును తొలగించడాన్ని నిరసిస్తూ ఆదివారం స్థానిక గాంధీ చౌరస్తాలో కాంగ్రెస్ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉపాధి పథకానికి గాంధీ పేరు తొలగింపు చర్య దేశ ప్రతిష్టకు భంగం కలిగించే అంశమన్నారు. ఇలాంటి చర్యల ద్వారా కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని మార్చేందుకు, మనువాద రాజ్యాంగాన్ని అమలు చేసేందుకు కుట్ర పన్నుతుందని ఆరోపించారు. పేదల కడుపు నింపే లక్ష్యంతో యూపీఏ ప్రభుత్వం ఉపాధి హామీ పఽథకాన్ని తెచ్చిందన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తరువాత ఉపాధి పథకంలో నిధుల కోత పెట్టిందని, ప్రస్తుతం పేరు మార్చతున్నారని మండిపడ్డారు. ఉపాధి పథకాన్ని నిర్వీర్యం చేయడానికి కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నుతుందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం తన వాటాను 60 శాతానికి తగ్గించి, మిగిలిన 40 శాతం భారాన్ని రాష్ట్రాలపై మోపడం అన్యామన్నారు. కేంద్ర ప్రభుత్వ అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మళ్లీ గాంధీ పేరును పెడుతామని చెప్పారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు నరహరిగౌడ్, శ్రీనివాసులు, కృష్ణ, సుదర్శన్, వెంకటేష్, శ్రీనివాస్యాదవ్, అన్వర్, రిజ్వాన్, గోవిందు, ప్రవీణ్, నాగులు, మోహన్ తదితరులు పాల్గొన్నారు.


