Jogulamba
-
గద్వాల విద్యార్థికి ప్రధాని ప్రశంస
గద్వాలటౌన్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థి ఆదికేశవ్ను ప్రధాని నరేంద్ర మోడీ అభినందిస్తూ లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వం గతేడాది నవంబర్లో గుజరాత్లోని వాద్నగర్లో నిర్వహించిన జాతీయస్థాయి ప్రేరణ సదస్సుకు విద్యార్థి ఆదికేశవ్ ఎంపికయ్యారు. రాష్ట్రం నుంచి ఇద్దరు విద్యార్థులు ఎంపిక కాగా, అందులో గద్వాల విద్యార్థి ఉండటం విశేషం. దేశ చరిత్ర, సాంస్కృక, స్వాభిమాన్, ధైర్య సహసాలు, పరిశ్రములు, కరుణ, సత్యనిష్ట, నాయకత్వం, విశ్వసనీయత, కర్తవ్యం, సత్యం, అహింసా తదితర అంశాలపై శిక్షణ పొందారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ విద్యార్థిని అభినందిస్తూ లేఖ రాశారు. ‘జాతీయస్థాయి ప్రేరణ సదస్సుకు ఎంపికై , అక్కడ నిర్వహించిన శిక్షణలో చక్కటి అంశాలను నేర్చుకోవడం శుభపరిణామం. వాటిని జీవితంలో అవలంభిస్తూ ఆదర్శవంతంగా ఎదగాలి’ అని లేఖలో ప్రస్తావించారు. హెచ్ఎం ఇమ్మానియేల్, ఉపాధ్యాయులు.. విద్యార్థిని సన్మానించారు.మిరపకు మద్దతు ధర కల్పించాలి అలంపూర్: ప్రభుత్వం మిరప రైతులకు మద్దతు ధర కల్పించాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు జీకే ఈదన్న డిమాండ్ చేశారు. అలంపూర్ మండలంలోని సింగవరంలో బుధవారం మిరప రైతులను కలిసి పంటలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుత.. ఎకర మిరప పంట సాగుకు రూ.లక్షకుపైగా ఖర్చు చేశారని, కానీ మిరపను విక్రయించేందుకు వెళితే సాగు వ్యయం ఖర్చులు రావడం లేదన్నారు. బహిరం మార్కెట్లో విక్రయించేందుకు వెళ్తే క్వింటాల్ ధర రూ.10 వేల నుంచి రూ. 12 వేల వరకు మాత్రమే పలుకుతుందన్నారు. పంట మొత్తం విక్రయించిన కనీసం పెట్టిన పెట్టుబడులు వచ్చే పరిస్థితులు లేవని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మిరప బోర్డును ఏర్పాటు చేయా లన్నారు. క్వింటాల్కు రూ. 25 వేల ప్రకటించి కొ నుగోలు చేయాలని డిమాండ్ చేశారు. నరసింహ్మా, రజాక్, గోపాల్, చిన్న ఈరన్న, బాబు సాబ్, మహమ్మద్, నరసింహులు ఉన్నారు. నెలాఖరు వరకు ఆర్డీఎస్కు నీరు శాంతినగర్: ఫిబ్రవరి 28 వరకు ఆర్డీఎస్కు సాగు నీరు పుష్కలంగా అందుంతుందని ఏఈ శ్రీనివాసులు తెలిపారు. వడ్డేపల్లి మండలంలో ప్రవహించే ఆర్డీఎస్ కెనాల్లో బుధవారం నీటి ప్రవాహం కొనసాగింది. మరో తొమ్మిది రోజుల పాటు ఆయకట్టుకు సాగునీరు అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. టీబీ డ్యాంలో నాల్గో ఇండెంట్గా పెట్టిన 1.16 టీఎంసీల నీరు బుధవారం ఆర్డీఎస్ హెడ్వర్క్స్ రాజోళిబండకు చేరాయని పేర్కొన్నారు. సాయంత్రం ఆనకట్టపై ఇంచు మేర ఓవర్ ఫ్లో కొనసాగుతోందని, గురువారం ఉదయం వరకు ఓవర్ ఫ్లో మరింత పెరిగే అవకాశం వుందన్నారు. తుమ్మిళ్ల లిఫ్ట్ సంప్ వద్ద నీటి నిల్వలు తక్కువగా ఉన్నాయని, ఇండెంట్ నీరు గురువారం సాయంత్రం వరకు తుమ్ళిళ్లకు చేరుతుందని, తుమ్మిళ్ల లిఫ్ట్కు ఇండెంట్ నీరు నెలాఖరు వరకు అందుతుందని, ఆర్డీఎస్ కెనాల్కు పూర్తిస్థాయిలో సాగునీరందిస్తామని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఐదో చివరి ఇండెంట్ 0.8 టీఎంసీలు మిగిలి వుందని, కేసీ కెనాల్కు ఇండెంట్ పెట్టిన సమయంలో పెడతామని ఏఈ పేర్కొన్నారు. అంతేగాక ఆర్డీఎస్ హెడ్వర్క్స్ రాజోళి బండ షెట్టర్ల నుంచి ప్రధాన కాల్వ ద్వారా విడుదలైన నీరు బుధవారం అయిజ మండలం చిన్నతాండ్రపాడుకు చేరాయని, గురువారం ఉప్పల వరకు చేరుతాయన్నారు. ఆధ్యాత్మికతతోనే మానసిక ప్రశాంతత అయిజ: ఆధ్యాత్మికతతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని హైదరాబాద్ రామకృష్ణ మఠం అధ్యక్షుడు బోదమయానందాజీ మహారాజ్ అన్నారు. బుధవారం మండలంలోని సంకాపురంలో రామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన రామకృష్ణ ధ్యాన మందిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ.. మనిషి దైనందిన జీవితంలో ఆధ్యాత్మికత చాలా వసరమని అన్నారు. చిన్ననాటినుంచి ఆధ్యాత్మికత కలిగి ఉండాలని, దానివలన సమాజం భక్తి మార్గం వైపు నడుస్తుందని అన్నారు. అహింసా మార్గాన్ని విడనాడాలని, ప్రతి రోజు ప్రతి ఒక్కరు గంటసేపు ధ్యానం చేయాలని సూచించారు. కార్యక్రమంలో సుబ్రహ్మణ్యం శర్మ, సూర్య ప్రకాష్, ఉమాదేవి, రాముడు, రాజీవ్, వెకంట్రాములు, కృష్ణ, సత్యనారాయణ, ఈశ్వర్, దామోదర్, ఈశ్వరన్న పాల్గొన్నారు. -
స్వచ్ఛందంగా తరలింపు..
అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలోని కోర్ ఏరియాలో ఉన్న ఆవాసాల్లో ఉంటున్న వారిని అడవి బయట పునరావాసం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. తరలింపు ప్రక్రియ స్వచ్ఛందంగా అంగీకారం తెలిపిన వారికే చేపడతాం. పునరావాసం కింద రూ.15 లక్షల ఆర్థిక సహాయం, లేదా 2 హెక్టార్ల భూమి కేటాయింపు ఉంటుంది. – రోహిత్ గోపిడి, జిల్లా అటవీశాఖ అధికారి, నాగర్కర్నూల్ మాకు జీవనోపాధి కల్పించాలి.. ఏళ్లుగా ఉన్న మా ఊరిని ఖాళీ చేయించి, మమ్మల్ని మరో చోటుకి తరలిస్తామని చెబుతున్నారు. ఈ ప్రక్రియ ఎప్పుడు మొదలవుతుంది, పరిహారం ఎప్పుడు అందుతుందన్న దానిపై ఎవరికీ స్పష్టత లేదు. పునరావాసం కల్పిస్తే అక్కడ జీవనోపాధి కల్పించి మా కుటుంబాలను ఆదుకోవాలి. – పోషప్ప, కుడిచింతల్బైల్, అమ్రాబాద్ మండలం సక్రమంగా ఇస్తేనే వెళతాం.. ఎన్నాళ్ల నుంచో అడవినే నమ్ముకుని ఉంటున్నాం. పులులు, వన్యప్రాణుల సంరక్షణకు మా ఊరిని ఖాళీ చేసి మరో చోటికి పంపిస్తాం అంటున్నారు. పునరావాసం కింద నష్టపరిహారాన్ని అందించి, అక్కడ సౌకర్యాలు కల్పించిన తర్వాతే వెళతాం. అందరికీ న్యాయమైన పరిహారాన్ని అందించి పునరావాస ప్రక్రియ చేపట్టాలి. – మండ్లి భౌరమ్మ, కుడిచింతల్బైల్, అమ్రాబాద్ మండలం ● -
సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించండి
గద్వాలటౌన్: జిల్లా కేంద్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి, వాటి పరిష్కారానికి చొరవ చూపాలని..గద్వాల పట్టణంలో ‘ప్రత్యేక’ పాలన మార్కు చూపించి, ప్రజల మన్ననలు పొందాలని కలెక్టర్ సంతోష్ సూచించారు. బుధవారం మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ అధికారులు, వార్డు అధికారులు, సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. విభాగాల వారీగా సమీక్షించి, వారి నుంచి సమగ్ర వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పట్టణంలో ప్రగతి పనుల నిమిత్తం ఆదాయ మార్గాలపై దృష్టి సారించాలన్నారు. పన్ను బకాయిలపై ప్రత్యేక శ్రద్ద కనబర్చి, రెగ్యులర్ పన్నులను వసూళ్లు చేయాలని ఆదేశించారు. సిబ్బందికి లక్ష్యలను నిర్ధేశించి పన్ను, అద్దెలను వసూలు చేయాలన్నారు. పట్టణంలో పారిశుద్ధ్య సమస్య తలెత్తకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సమస్య జఠిలంగా ఉన్న వార్డులలో ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని సూచించారు. తక్షణమే వార్డు అధికారులకు వార్డులను కేటాయించి, వారికి బాధ్యతలను అప్పగించాలన్నారు. ఇక నుంచి వార్డు అధికారులు ఆయా వార్డులలో ప్రజలకు అందుబాటులో ఉండి వారితో మమేకం కావాలన్నారు. పారిశుద్ధ్య నిర్వహణ, ఆస్తిపన్ను వసూళ్లు, తాగునీటి సరఫరా, లే అవుట్లు, విద్యుత్తు తదితర విభాగాలను సమర్ధవంతంగా పర్యవేక్షించాలన్నారు. ప్రతి వార్డు అధికారికి ఆయా వార్డులపై పూర్తిస్థాయిలో అవగాహన కలిగి పట్టు సాధించాలన్నారు. 15 రోజుల తరువాత మరోసారి సమీక్ష నిర్వహించి, పురోగతిపై అంచనా వేస్తామన్నారు. రాబోవు వేసవికాలం తాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకోవాలని ఆదేశాంచారు. ఎక్కడ తాగునీటి సమస్య తలెత్తకుండా చూడాలన్నారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఇప్పటి నుంచి ప్రణాళికలు రూపొందించాలన్నారు. రెవెన్యూ, టౌన్ ప్లానింగ్ అధికారులపై ఆగ్రహం మున్సిపాలిటీలో ప్రధానంగా టౌన్ ప్లానింగ్, రెవెన్యూ విభాగాలపై ఆరోపణలు, విమర్శలు వస్తున్నాయని ఆయా విభాగాల అధికారులపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్తిపన్ను మదింపులో అక్రమాలపై ఫిర్యాదులు ఉన్నాయని చెప్పారు. అక్రమ కట్టడాలు, మున్సిపల్ స్థలాల ఆక్రమణలపై టౌన్ ప్లానింగ్ అధికారులు ఊదాసీనంగా ఉన్నారని, ఇలాగే కొనసాగితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో అడిషినల్ కలెక్టర్ నర్సింగరావు, కమిషనర్ దశరథ్ తదితరులు పాల్గొన్నారు. పన్ను వసూళ్ల లక్ష్యాలను చేరుకోవాలి వేసవి దృష్ట్యా నీటి ఎద్దడి నివారణకు చర్యలు కలెక్టర్ బీఎ సంతోష్ -
పునరావాసానికి సన్నద్ధం
సాక్షి, నాగర్కర్నూల్: నల్లమల అటవీప్రాంతంలోని అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలోని కోర్ ఏరియాలో ఉన్న చెంచుపెంటల తరలింపునకు అవసరమైన చర్యలను అటవీశాఖ వేగవంతం చేసింది. ఇప్పటికే కోర్ ఏరియాలో ఉన్న సార్లపల్లి, కుడిచింతల్బైల్, వటవర్లపల్లి గ్రామాలను ఖాళీ చేయించేందుకు కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. నేషనల్ టైగర్ కన్జర్వేటివ్ అథారిటీ(ఎన్టీసీఏ) ద్వారా బాధితులకు పునరావాస ప్రత్యేక ప్యాకేజీని అందజేయనున్నారు. కేంద్రం నుంచి ఆమోదం లభించిన వెంటనే అధికారులు పునరావాస ప్రక్రియను మొదలుపెట్టనున్నారు. మరో రెండు నెలల్లోనే పునరావాసానికి పూర్తిస్థాయి అనుమతులు లభిస్తాయని భావిస్తున్నారు. విడతల వారీగా చెంచుపెంటల తరలింపు.. నల్లమల అటవీప్రాంతంలో ఉన్న పులులు, వన్యప్రాణుల సంరక్షణలో భాగంగా అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ కోర్ ఏరియా పరిధిలో ఉన్న చెంచుపెంటలను ఖాళీ చేయించి, అడవి బయట వారికి పునరావాసం కల్పించేందుకు అటవీశాఖ సిద్ధమవుతోంది. ప్రధానంగా పెద్దపులుల సంరక్షణ, వాటికి స్వేచ్ఛగా సంచరించేందుకు వీలు కల్పించడం, వన్యప్రాణులకు, మనుషులకు మధ్య ఘర్షణ వాతావరణాన్ని నిరోధించడంలో భాగంగా పునరావాస ప్రక్రియను చేపడుతున్నట్టు అటవీశాఖ చెబుతోంది. ఇప్పటికే ఇందుకోసం ప్రక్రియను ప్రారంభించగా, తొలి విడతగా తరలించనున్న సార్లపల్లి, కుడిచింతల్ బైల్, వటవర్లపల్లి గ్రామాల్లో సర్వే నిర్వహించి, స్థానికుల నుంచి అంగీకార పత్రాలను తీసుకుంటున్నారు. స్వచ్ఛందంగా తరలింపునకు ఒప్పుకున్న వారికే పునరావాస ప్యాకేజీని అమలు చేస్తామని, ఎట్టి పరిస్థితుల్లోనూ వారిని బలవంతం చేయబోమని అటవీ శాఖ అధికారులు చెబుతున్నప్పటికీ స్థానిక చెంచుల్లో మాత్రం భయాందోళనలు నెలకొన్నాయి. తొలి విడతలో మూడు గ్రామాలు.. నల్లమల అటవీ ప్రాంతంలోని కోర్ ఏరియాలో ఉన్న సుమారు 20 వరకు చెంచుపెంటలను విడతల వారీగా ఖాళీ చేయించి మరో చోట పునరావాసం కల్పించాలని అటవీశాఖ భావిస్తోంది. వీటిలో మొదటి విడతగా సార్లపల్లి, కుడిచింతల్బైల్, వటవర్లపల్లి గ్రామాలను ఖాళీ చేయించాలని నిర్ణయించింది. ఇందుకోసం క్షేత్రస్థాయి సర్వేతో పాటు కుటుంబాల నుంచి అంగీకార పత్రాలను సేకరిస్తోంది. సార్లపల్లిలో మొత్తం 269 కుటుంబాలు ఉండగా, వీరిలో 83 కుటుంబాలు మాత్రమే చెంచులు కాగా, మిగతా ఇతర వర్గాలకు చెందినవారు ఉన్నారు. వీరిలో ఇతర వర్గాలు మాత్రమే తరలింపునకు అంగీకారం చెబుతుండగా, మెజార్టీ చెంచులు ఒప్పుకోవడం లేదు. ప్యాకేజీ కింద 5 ఎకరాలు, లేదంటే రూ.15 లక్షలు అడవిని ఖాళీ చేసి మరో చోటుకు తరలుతున్న స్థానికులకు పునరావాసం కింద ఎన్టీసీఏ ప్రత్యేక ప్యాకేజీని అందిస్తోంది. ఒక్కో కుటుంబానికి రూ.15 లక్షల చొప్పున పునరావాస ప్యాకేజీ, లేదా 5 ఎకరాల భూమి కేటాయిస్తుంది. ఈ రెండింటిలో ఏదైనా ప్యాకేజీని బాధితులు ఎంచుకోవచ్చు. ఖాళీ చేయనున్న గ్రామస్తులకు పునరావాసం కల్పించేందుకు పెద్దకొత్తపల్లి మండలం బాచారం వద్ద ఇప్పటికే భూమిని గుర్తించారు. అక్కడే పునరావాస కాలనీలను ఏర్పాటు చేసి నిర్వాసితులకు ఇళ్లు, పాఠశాల, రోడ్లు, ఇతర మౌలిక వసతులను కల్పించనున్నారు. నల్లమల అడవి నుంచి చెంచుపెంటలతరలింపునకు కొనసాగుతున్న కసరత్తు మొదటి విడతలో కుడిచింతలబైల్,సార్లపల్లి, వటవర్లపల్లి గ్రామాలు ఎన్టీసీఏ ద్వారా ప్రత్యేక పునరావాస ప్యాకేజీ పెద్దకొత్తపల్లి మండలం బాచారం వద్ద ఏర్పాట్లు -
ఇథనాల్ పరిశ్రమను ఏర్పాటు చేయొద్దు
రాజోళి: గ్రామాల మధ్య ఇథనాల్ పరిశ్రమను ఏర్పాటు చేయొద్దని మండలంలోని పెద్దధన్వాడతోపాటు ఇతర గ్రామాల రైతులు పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు విన్నవించారు. మండలంలోని పెద్దధన్వాడలో 20 రోజులుగా ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా దీక్షలను మాజీ ఎమ్మెల్యే సంపత్కుమార్ తెలుసుకొని వారిని బుధవారం సెక్రటేరియట్లోని మంత్రి కార్యాలయానికి తీసుకెళ్లారు. అక్కడ వారు మంత్రి శ్రీధర్బాబుతో మాట్లాడారు. పచ్చని పొలాలు ఉన్న తమ గ్రామాల నడుమ ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడం వల్ల ప్రజల ఆరోగ్యం దెబ్బతిని, క్యాన్సర్లు రావడం, ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో పాటు, తాగునీరు కలుషితం అవుతుందని, పొలాల్లో పంటలు పండవని, దిగుబడి తగ్గుతుందని తెలిపారు. ఫ్యాక్టరీ ఏర్పాటుతో 14 గ్రామాలకు పైగా ప్రత్యక్షంగా ఇబ్బందులు ఎదుర్కోగా, తాగునీటి విషయంలో ఏపీలోని గ్రామాలు సైతం ఇబ్బందులు పడతాయని మంత్రికి తెలిపారు. ఎన్నో గ్రామాల ప్రజలు ఫ్యాక్టరీని వ్యతిరేకిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ మంత్రికి తెలిపారు. ప్రజలు వ్యతిరేకిస్తున్న ఫ్యాక్టరీని రద్దు చేసే విధంగా చర్యలు తీసుకుంటామని ఆయన హామి ఇచ్చారు.ఈ కార్యక్రమంలో పెద్దదన్వాడతో పాటు ఆయా గ్రామాల ఇథనాల్ ఫ్యాక్టరీ వ్యతిరేక పోరాట సమితి సభ్యులు పాల్గొన్నారు. -
No Headline
● గద్వాల రూరల్ ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న పర్వతాలు గద్వాల మండలంలోని ఓ గ్రామంలో నాసీరకం ఇసుకను తరలిస్తున్న క్రమంలో ఓ కూలీ ట్రాక్టర్పై నుంచి కిందపడి మృతి చెందాడు. ఈ విషయంలో సదరు ఎస్ఐపై అవినీతి ఆరోపణలు వచ్చాయి. కొన్ని రోజుల తర్వాత స్థాన చలనం కల్పిస్తూ నాగర్కర్నూల్ జిల్లాకు వీఆర్కు అటాచ్ చేశారు. ఇటీవల శాంతినగర్ ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న సంతోష్కుమార్పై పలు ఆరోపణలు రావడంతో స్థానం చలనం కల్పిస్తూ వనపర్తి జిల్లాకు అటాచ్ చేశారు.● మల్దకల్ పోలీసు స్టేషన్లో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న రమేష్నాయక్ గద్వాల మండలంలోని ఓ గ్రామ శివారులో పేకాట ఆడుతున్న స్థావరం వద్దకు చేరుకుని డబ్బులు వసూలు చేసినట్లు ఫిర్యాదులు అందాయి. దీంతో విచారణ చేపట్టి వాస్తవాలు వెలుగులోకి రావడంతో అతనిపై అనర్హత వేటు పడింది. అయిజ, ధరూర్ పోలీసు స్టేషన్లో ఇద్దరు కానిస్టేబుళ్ల ఫిర్యాదులు అందాయి. వారిపై సైతం విచారణ చేపట్టి శాఖ పరమైన చర్యలు తీసుకుని అనర్హత వేటు వేశారు. తీవ్రమైన అవినీతి ఆరోపణలు వస్తున్నప్పటికీ కొందరిని కేవలం బదిలీ చేస్తున్నారే తప్పా.. చర్యలకు వెనుకాడుతున్నారని, జిల్లా పోలీసు శాఖలో మార్పు సాధ్యమేనా అన్న విమర్శలు ప్రజల నుంచి వినవస్తున్నాయి. 30.08.2024 తేదీన అలంపూర్ పోలీసు స్టేషన్ ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న నాగరాజుకు ఓ మహిళతో వివాహేతర సంబంధం ఉన్నట్లు పలు సామాజిక మాద్యమాలలో పోస్టులు వైరల్గా మారాయి. ఈ సంఘటన పోలీసుశాఖలో తీవ్ర చర్చకు దారి తీసింది. ప్రజల నుంచి విమర్శలు రావడంతో ఉన్నతాధికారులు సదరు ఎస్ఐను నాగర్కర్నూల్ జిల్లాకు బదిలీ చేస్తూ వీఆర్కు ఆటాచ్ చేశారు. 25.01.2025న అయిజ ఎస్ఐగా విజయభాస్కర్ విధులు నిర్వహిస్తుండగా.. ఓ భూ వివాదం విషయమై తమకు రావాల్సిన డబ్బులు ఇవ్వడం లేదని, న్యాయం చేయాలని బాధితులు పోలీసులను ఆశ్రయించారు. అయితే తమ ఫిర్యా దును పట్టించుకోకుండా మాకు అన్యాయం చేసిన వ్యక్తితో పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్లు బాధితులు మీడియా ముందుకు వచ్చి ఆరోపించారు. ఈక్ర మంలోనే 10 రోజుల పాటు ఎస్ఐ శిక్షణ కోసం హైదరాబాద్కు వెళ్లగా..ఆ క్రమంలోనే ఎస్ఐని మహబూబ్నగర్ జిల్లాకు వీఆర్కు ఆటాచ్ చేస్తు ఉత్తర్వులు జారీ అయ్యాయి. 2.09.2024 తేదీన కేటీదొడ్డి పోలీసుస్టేషన్ ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాసరావు ఓ వర్గానికి చెందిన నాయకులకు సహకరిస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే కొందరు అక్రమంగా రేషన్ బియ్యం రాయచూర్కు తరలిస్తున్నట్లు సమాచారం మేరకు సిబ్బంది సహాయంతో సదరు వాహనాన్ని పట్టుకునే ప్రయత్నంలో పెట్రోలింగ్ వాహనం అదుపుతప్పి కింద పడింది. ఈ ప్రమాదం నుంచి ఎస్ఐ, సిబ్బంది బయటపడ్డారు. కానీ, వాహనం దెబ్బతింది. ఈ మొత్తం ఘటనను వెలుగులోకి రాకుండా దెబ్బతిన్న వాహనాన్ని గుట్టుగా వేరే రాష్ట్రానికి తరలించి రిపేర్ చేయించారు. ఉన్నతాధికారులు విచారణ చేపట్టి వాస్తవాలు వెలుగులోకి రావడంతో గద్వాల డీసీఆర్బీకి బదిలీ చేస్తూ ఉత్తర్ుయ్వలు జారీ చేశారు. -
మారని పోలీసు తీరు..!
●శాఖాపరమైన చర్యలు తప్పవు పోలీసుశాఖలో ఏ స్థాయి అధికారి తప్పు చేసిన శాఖ పరమైన చర్యలు ఉంటాయి. గతంతో పోలిస్తే ప్రస్తుతం సమూల మార్పులు తీసుకువస్తున్నాం. పేకాట విషయంలో సిబ్బందిపై వచ్చిన ఆరోపణాలపై ఇప్పటికే అనర్హత వేటు వేశాం. సీఐ స్థాయి అధికారులు మొదలుకుని ఎస్ఐ, కానిస్టేబుళ్ల వరకు విచారణ చేపట్టి చర్యలు తీసుకున్నాం. అన్ని పోలీసు స్టేషన్లలో విధులు నిర్వహిస్తున్న సిబ్బందిపై ప్రత్యేక విభాగం నిఘా ఉంచింది. వివిధ స్థాయిలో చేసిన తప్పిదాలపై మెమోలు జారీ చేశాం. నాయకులు, ప్రజలు అనే భేదం లేకుండా పోలీసులు సేవలు అందిస్తారు. దళారీ వ్యవస్థలో ఎవరిని సహించేది లేదు. చట్ట పరిధిలో అందరూ సమానమే. – శ్రీనివాసరావు, ఎస్పీ● పేకాటరాయుళ్లతో డబ్బులు వసూలు ● క్షేత్రస్థాయిలో ఇష్టారాజ్యం ● ఆరోపణల నేపథ్యంలో పలువురు సిబ్బందిపై వేటు గద్వాల క్రైం: శాంతిభద్రతలను కాపాడుతూ.. ప్రజలకు మేమున్నామనే భరోసానిచ్చేది పోలీసులు. అలాంటి ఘనమైన చరిత్ర కలిగిన పోలీసు శాఖకు కొందరు సిబ్బంది మాయని మచ్చ తెస్తున్నారు. అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్న వారితో చేతులు కలుపుతున్నారు. ఓవైపు ఇసుక, బియ్యం, మట్టి, పేకాట తదితర అసాంఘిక దందాలను కట్టడి చేస్తున్నా.. మరో వైపు అవీనితికి పాల్పడిన వారికి అండగా నిలుస్తూ.. స్థాన చలనం.. అనర్హత వేటుకు గురవుతున్నారు. జిల్లా పోలీసుశాఖలో గత ఎనిమిది నెలలుగా జరుగుతున్న సంఘటనలే ఇందుకు నిదర్శనమయ్యాయి. జిల్లాలోని కొన్ని సంఘటనలు.. ● 21.08.2024వ తేదీన అలంపూర్ నియోజకవర్గం ఉండవెల్లి పోలీసుస్టేషన్ సమీపంలో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన కొంత మంది పేకాటరాయుళ్లు నిత్యం పేకాట దందాను నిర్వహిస్తుండగా పోలీసులు మెరుపు దాడులు చేపట్టి పలువురిని అరెస్టు చేశారు. అయితే పోలీసు సిబ్బందితోపాటు ప్రైవేట్ వ్యక్తులు ఈ దాడుల్లో పాల్గొని పేకాటరాయుళ్ల నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసి.. పట్టుబడిన నగదును తక్కువగా చూయించారు. ఈ ఘటనపై విచారించి ఆరోపణలు వాస్తవమని పోలీసు పైఅధికారులు నిగ్గు తేల్చారు. దీంతో మల్టీ జోన్ –2 ఐజీ పీవి.సత్యనారాయణ గద్వాల స్పెషల్ బ్రాంచ్లో విధులు నిర్వహిస్తున్న సీఐ జములప్ప, ఎస్ఐలు విక్రం, శ్రీనివాసులును విధుల నుంచి తొలగించి వీఆర్కు ఆటాచ్ చేశారు. అవినీతి, అక్రమాల్లో కొందరు.. -
ఎస్బీఐ సేవలు సద్వినియోగం చేసుకోవాలి
అలంపూర్: ఎస్బీఐ సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఎస్బీఐ చైర్మన్ చల్లా శ్రీనివాసులు శెట్టి అన్నారు. అలంపూర్ చౌరస్తాలో ఎస్బీఐ బ్రాంచీని బుధవారం ఆయనతోపాటు హైదరాబాద్ సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్ రాజేష్కుమార్తో కలిసి వర్చువల్గా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి జనరల్ మేనేజర్ నెట్వర్క్–2 ప్రకాష్ చంద్ర బరోర్, రీజినల్ మేనేజర్ సునిత, ఆయా గ్రామాల ప్రజలు డిజిటల్ స్క్రీన్పై వర్చువల్ ప్రారంభాన్ని వీక్షించారు. అనంతరం సేవలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్బీఐ చైర్మన్ బ్రాంచ్ మేనేజర్ శ్రీనివాస్నాయక్తో మాట్లాడారు. ఇక్కడి భూములు, పంటల వివరాలు, పరిశ్రమలు, మిల్లుల వివరాలు అడిగి తెలుసుకున్నట్లు పేర్కొన్నారు. రైతులకు, ప్రజలకు రుణాలు, సేవల గురించి వివరించారు. ఇదిలాఉండగా, ఎస్బీఐ చైర్మన్ శ్రీనివాసులు శెట్టిది మానవపాడు మండలం పెద్దపోతులపాడు గ్రామం. ఈ ప్రాంత ప్రజల కోరిక మేరకు అలంపూర్ చౌరస్తాలో ఎస్బీఐ సేవలు అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. ఎస్బీఐ సేవలు తీసుకొచ్చిన చైర్మన్కు చుట్టు పక్కల గ్రామాల ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. -
కూలీలు, సాగుదారులు
87.6%92.2%కూలీలు సాగుదారులు86.9%88.2%33.9 %81.1%27.3 %25.9 %22.3 %20.8 %జో.గద్వాలనారాయణపేటవనపర్తినాగర్కర్నూల్మహబూబ్నగర్ -
వేసవిలో తాగునీటి ఇబ్బందులు రానివ్వం
వేసవిలో తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టినట్లు కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. అందులో భాగంగా పాత చేతిపంపులు, స్కీం బోరుమోటార్లకు మరమ్మతు చేయిస్తున్నట్లు చెప్పారు. మంగళవారం ప్రభుత్వ కార్యక్రమాల అమలుపై సీఎస్ శాంతికుమారి కలెక్టర్తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా తాగునీటి సరఫరా, యాసంగి పంటలకు సాగునీరు, విద్యుత్ సరఫరా, రేషన్ కార్డుల దరఖాస్తుల ధ్రువీకరణ, రైతు భరోసా పథకాల అమలుపై సీఎస్ సుదీర్ఘంగా చర్చించి.. పలు సూచనలు చేశారు. జిల్లాలో విద్యుత్ డిమాండ్కు అనుగుణంగా సరఫరా చేసే విధంగా ఏర్పాట్లు చేయాలని సూచించారు. వ్యవసాయం, నివాసగృహాలు, ఆస్పత్రులు, పరిశ్రమలకు నిరంతరం విద్యుత్ సరఫరా కొనసాగాలని ఆదేశించారు. అవసరమైన మేర విద్యుత్ అందుబాటులో ఉన్నందున ఎక్కడ ఎటువంటి లోటు రావడానికి వీలు లేదన్నారు. రేషన్ కార్డుల వెరిఫికేషన్ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని తెలిపారు. ప్రజాపాలన కార్యక్రమం, గ్రామసభల్లో వచ్చిన దరఖాస్తులతో పాటు మీసేవ కేంద్రాల ద్వారా వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, అర్హులందరికీ రేషన్కార్డులు జారీ చేయాలని ఆదేశించారు. జిల్లాలోని రెసిడెన్షియల్ పాఠశాలలు, సంక్షేమ హాస్టల్స్, కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాలను నిరంతరం తనిఖీ చేస్తూ.. విద్యార్థులకు అవసరమైన వసతులు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో విద్యుత్శాఖ ఎస్ఈ తిరుపతిరావు, ఇరిగేషన్ ఈఈ రహిముద్దీన్, జిల్లా ఇరిగేషన్ అధికారి శ్రీనివాస్, జిల్లా వ్యవసాయశాఖ అధికారి సక్రియనాయక్ తదితరులు ఉన్నారు. -
ఏసీబీకి చిక్కిన మక్తల్ సీఐ
మక్తల్: ఓ కేసు విషయంలో వ్యక్తి నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటున్న సీఐ, ఇద్దరు కానిస్టేబుళ్లు ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఈ ఘటనకు సంబంధించి ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణ కథనం ప్రకారం.. మహబూబ్నగర్ జిల్లాకేంద్రానికి చెందిన సందె వెంకట్రాములు మక్తల్లో శ్రీనిధి అనే సొసైటీని ఏర్పాటు చేసి.. ప్రజల నుంచి ప్రతినెలా కిస్తుల ప్రకారం డబ్బులు కట్టిస్తున్నారు. అయితే సొసైటీలో కొందరు వ్యక్తులతో బేధాభిప్రాయాలు రావడంతో మక్తల్ పోలీస్స్టేషన్లో ఒకరు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సందె వెంకట్రాములుపై కేసు నమోదు చేశారు. అయితే సందె వెంకట్రాములు బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ వేయగా.. ప్రతి సోమవారం మక్తల్ పోలీస్స్టేషన్కు రావాలని షరతులతో కూడిన ముందస్తు బెయిల్ వచ్చింది. ఆఫీసు, ఇళ్లలో సోదాలు.. కేసుకు సంబంధించిన చార్జీషీటు కోర్టులో దాఖలు చేయాల్సిన విషయంలో నిందితుడికి అనుకూలంగా వ్యవహరించేందుకు గాను మక్తల్ సీఐ జి.చంద్రశేఖర్, కానిస్టేబుళ్లు నర్సింహ, శివారెడ్డి రూ.20 వేలు లంచం డిమాండ్ చేశారు. దీంతో సందె వెంకట్రాములు ఏసీబీ అధికారులను ఆశ్రయించగా ముందస్తుగా ప్రణాళిక ప్రకారం మంగళవారం మక్తల్ పోలీస్ కార్యాలయంలో నిందితుడి నుంచి కానిస్టేబుల్ నర్సింహ రూ.20 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడులు చేసి రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఇందులో ప్రమేయం ఉన్న మక్తల్ సీఐ చంద్రశేఖర్, కానిస్టేబుల్ శివారెడ్డిని సైతం అదుపులోకి తీసుకున్నారు. అనంతరం సీఐ కార్యాలయం, కానిస్టేబుళ్ల ఇళ్లలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ మేరకు సీఐ చంద్రశేఖర్, కానిస్టేబుళ్లు నర్సింహ, శివారెడ్డిలను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి రిమాండ్ తరలిస్తామని ఏసీబీ డీఎస్పీ తెలిపారు. ప్రభుత్వ అధికారులు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే తమకు సమాచారం ఇవ్వాలని కోరారు. దాడుల్లో ఏసీబీ అధికారులు లింగస్వామి, జిలాని సయ్యద్, వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. -
ఆశాజనకంగా..
జిల్లాలో కూరగాయల సాగు.. భలే బాగు అంచనా మేరకు.. గతేడాది వానాకాలంలో 3,400 ఎకరాల్లో కూరగాయల సాగు అవుతుందని ఉద్యానశాఖ అధికారులు అంచనా వేశారు. అయితే సకాలంలో వర్షాలు కురవడం వల్ల బోరుబావులు రీచార్జ్ కావడంతో 3,600 ఎకరాల్లో కూరగాయలను పండించారు. ఇలా అంచనా కన్నా కొంత ఎక్కువ సాగైంది. ఇక ప్రస్తుత యాసంగి సీజన్కు సంబంధించి 2వేల ఎకరాల్లో కూరగాయల సాగు అవుతుందని అధికారులు అంచనా వేయగా.. 2,015 ఎకరాల్లో సాగు అయ్యింది. టమాటా, వంకాయ, ఉల్లి, బీర్నిస్, క్యాలీఫ్లవర్, బెండ ఎక్కువగా వేశారు. అయితే యాసంగి సీజన్ ప్రస్తుతం సాఫీగా సాగుతోంది. బోర్లు, బావుల కింద సాగు చేసిన కూరగాయల సాగు ఆశాజనకంగా ఉందని అధికారులు అంటున్నారు. కాగా, టమాటాకు మార్కెట్లో ధరలు లేకపోవడం వల్ల చాలా మంది రైతులు పంటను తీసివేశారు. మిగిలిన కూరగాయల పంటలకు ధరలు బాగానే ఉన్నాయి. గద్వాల వ్యవసాయం: 2023–24 వర్షాకాలంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు, అధిక ఉష్ణోగ్రతల కారణంగా కూరగాయల సాగు గణనీయంగా తగ్గింది. యాసంగిలోనూ అదే పరిస్థితి ఏర్పడింది. వర్షాభావ పరిస్థితులతో ఆశించిన స్థాయిలో రైతులు కూరగాయలను పండించలేకపోయారు. అయితే 2024–25 వానాకాలం సీజన్ రైతులకు కలిసి వచ్చింది. ఉద్యానశాఖ అధికారుల అంచనా మేరకు సాగైంది. ప్రస్తుత యాసంగి సీజన్లోనూ ఆశాజనకంగా సాగుతోంది. జిల్లాలో విస్తారంగా సాగు.. జిల్లాలో ప్రతి ఏటా సాధారణ పంటలతో పాటు కూరగాయలను విస్తారంగా పండిస్తారు. రెండు సీజన్లతో కలిపి దాదాపు 9వేల నుంచి 10వేల ఎకరాల్లో ఇక్కడి రైతులు వివిధ రకాల కూరగాయలను సాగుచేస్తూ వస్తున్నారు. గద్వాల మండలంలో వంకాయ, బెండ, పచ్చిమిర్చి, చిక్కుడు, క్యాలీఫ్లవర్, క్యాబేజీ, ధరూర్ మండలంలో బెండ, టమాటా, మల్దకల్ మండలంలో చిక్కుడు, టమాటా, బీర, సోరకాయ, బెండ, కాకర, అయిజలో బెండ, చిక్కుడు, వడ్డేపల్లిలో వంకాయ, బెండ, కాకర, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, ఉల్లి, అలంపూర్లో ఉల్లి, రాజోళిలో పచ్చిమిర్చి, ఉల్లి, ట మాటా గట్టు, కేటీదొడ్డి మండలాల్లో టమాటాతో ఆకుకూరలను సైతం సాగు చేస్తారు. తమకున్న పొలంలో రెండు నుంచి ఐదు ఎకరాల్లో బోరుబావుల కింద రైతులు కూరగాయలను పండిస్తున్నారు. మండలాల వారీగా కూరగాయల సాగు ఇలా.. యాసంగిలో 2,015 ఎకరాల్లో తోటలు బోరుబావుల కింద జోరుగా సాగుబడి -
రెసిడెన్షియల్ పాఠశాలకు స్థలం పరిశీలన
శాంతినగర్: వడ్డేపల్లి గట్టు సమీపంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలను నిర్మించేందుకు కేటాయించిన స్థలాన్ని మంగళవారం అడిషనల్ కలెక్టర్ (లోకల్ బాడీస్) నరసింగరావుతో కలిసి రాష్ట్ర గురుకులాల కార్యరద్శి రవి నాయక్ పరిశీలించారు. సర్వే నంబర్ 377లో 25 ఎకరాల భూమిని ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణానికి కేటాయించారు. అయితే పాఠశాల నిర్మాణానికి స్థలం సౌకర్యంగా ఉందా లేదా అన్న విషయాలపై ఆరా తీశారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నట్లు కార్యదర్శి రవినాయక్ తెలిపారు. కార్యక్రమంలో ఏడీ రామచందర్, ఇన్చార్జి తహసీల్దార్ ప్రభాకర్, డిప్యూటీ తహసీల్దార్ శ్రీకాంత్ రెడ్డి, ఆర్ఐ ఆంజనేయులు, మండల సర్వేయర్ బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులకు కంటి పరీక్షలు గద్వాల క్రైం: జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో మంగళవారం విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఇన్చార్జి వైద్యారోగ్యశాఖ అధికారి సిద్దప్ప మాట్లాడుతూ.. 5 నుంచి 10వ తరగతి విద్యార్థుల్లో దృష్టిలోపం సమస్యలను గుర్తించేందుకు కంటి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లావ్యాప్తంగా 2,188 మంది విద్యార్థులు కంటి సమస్యలకు గురైనట్లు గుర్తించామని.. వారికి అవసరమైన మందులతో పాటు కంటి అద్దాలు అందించనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో వైద్యులు రమేష్చంద్ర, తన్వీర్ రిజ్వానా, ప్రసూన్నరాణి, జయరాజ్, ప్రవీణ్ కార్తీక, ప్రతిమలింగ, అమూల్య పాల్గొన్నారు. వేరుశనగ క్వింటాల్ రూ.6,409 గద్వాల వ్యవసాయం: జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్యార్డుకు సోమవారం 393 క్వింటాళ్ల వేరుశనగ అమ్మకానికి రాగా.. గరిష్టంగా రూ. 6,409, కనిష్టంగా రూ. 4,280, సరాసరి రూ. 5,289 ధరలు వచ్చాయి. అదే విధంగా 77 క్వింటాళ్ల కందులు అమ్మకానికి రాగా.. గరిష్టంగా రూ. 7,100, కనిష్టంగా రూ. 1,702, సరాసరి రూ. 7,029 ధరలు లభించాయి. 8 క్వింటాళ్ల ఆముదాలు అమ్మకానికి రాగా.. గరిష్టంగా రూ. 5,591, కనిష్టంగా రూ. 5,329, సరాసరి రూ. 5,591 ధరలు వచ్చాయి. 11 క్వింటాళ్ల వరి (సోన) అమ్మకానికి రాగా.. క్వింటాల్ రూ. 1,850 ధర పలికింది. అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు ఇటిక్యాల: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనుల్లో అవినీతి, అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తప్పవని అడిషనల్ కలెక్టర్ నర్సింగ్రావు హెచ్చరించారు. సోమవారం మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో 14వ విడత సామాజిక తనిఖీ బహిరంగ చర్చావేదిక ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మండలంలోని గ్రామాల వారీగా ఉపాధి పనుల్లో జరిగిన అక్రమాలను సామాజిక తనిఖీ బృందాలు వెల్లడించాయి. గ్రామాల్లో రోడ్లకు ఇరువైపులా నాటిన మొక్కలతో పాటు తోటల పెంపకంలో అవినీతి, అక్రమాలు జరిగినట్లు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. కొన్ని గ్రామాల్లో పనులు చేపట్టకపోయినా జరిగినట్టు రికార్డులు సృష్టించి బిల్లులు డ్రా చేసినట్లు వెల్లడించారు. కాగా, మొత్తం 29 జీపీల్లో రూ. 3,97,59,510 ఖర్చులతో ఉపాధి హామీ పనులు చేపట్టినట్లు ఎంపీడీఓ అజార్ మొహియుద్దీన్ తెలిపారు. ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ.. ఉపాధి హామీ పథకంలో దుర్వినియోగమైన నిధులను రికవరీ చేయనున్నట్లు తెలిపారు. సమావేశంలో జిల్లా విజిలెన్స్ ఏపీడీ శ్రీనివానులు, ఎస్ఆర్పీ బాలునాయక్, ఏపీఓలు అనిల్, శివజ్యోతి తదితరులు ఉన్నారు. -
మంత్రి దృష్టికి ఇథనాల్ ఫ్యాక్టరీ సమస్య
రాజోళి: ఇథనాల్ ఫ్యాక్టరీ సమస్యను పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు దృష్టికి తీసుకెళ్లనున్నట్లు మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ అన్నారు. మంగళవారం ఫ్యాక్టరీ వ్యతిరేక పోరాట సమితి సభ్యులు శాంతినగర్లోని క్యాంప్ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యేను కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పెద్ద ధన్వాడలో ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా 20 రోజులపాటు రిలే నిరాహార దీక్షలు చేపట్టిన క్రమంలో సమస్యను పరిష్కరిస్తామని సంపత్ కుమార్ ఇచ్చిన హామీ మేరకు దీక్షలను విరమించినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో సంపత్కుమార్ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో ఫోన్లో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని కోరారు. ఈ మేరకు బుధవారం హైదరాబాద్లో మంత్రిని కలవనున్నట్లు వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఫ్యాక్టరీ వ్యతిరేక పోరాట సమితి సభ్యులు బాబురావ్, రఘువర్ధన్ రెడ్డి, మధు రెడ్డి, మన్సూర్, దేవన్న తదితరులు పాల్గొన్నారు. -
అన్నింటా.. అట్టడుగు
సాక్షి, నాగర్కర్నూల్: ప్రజల జీవన ప్రమాణాల స్థాయిని సూచించే అక్షరాస్యత, తలసరి ఆదాయం, జీఎస్డీపీ, మౌలిక సదుపాయాల కల్పన ఇలా అన్నింట్లోనూ ఉమ్మడి పాలమూరు జిల్లాలు రాష్ట్రంలోనే అట్టడుగున కొనసాగుతున్నాయి. అక్షరాస్యత విషయంలో జోగుళాంబ గద్వాల, నారాయణపేట జిల్లాలు రాష్ట్రంలోనే వెనకబడే ఉన్నాయి. ఈ జిల్లాల్లో అక్షరాస్యత శాతం కనీసం 50 శాతం కూడా మించలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన తెలంగాణ స్టేట్ స్టాటిస్టిక్ రిపోర్టులో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ● పాఠశాల విద్యార్థుల డ్రాపౌట్స్లోనూ గద్వాల జిల్లా రాష్ట్రంలోనే రెండోస్థానంలో నిలిచింది. ఈ జిల్లాలో 28.8 శాతం మంది విద్యార్థులు పాఠశాల దశలోనే చదువుకు దూరమవుతున్నారు. ఇక వనపర్తి జిల్లా 8.81 శాతం మంది డ్రాపౌట్స్తో కాస్త మెరుగ్గా ఉంది. విద్యార్థులకు, ఉపాధ్యాయుల నిష్పత్తిలోనూ గద్వాల, నారాయణపేట జిల్లాలు వెనకబడి ఉన్నాయి. ఉపాధ్యాయుల కొరతలో జోగుళాంబ గద్వాల జిల్లా రాష్ట్రంలోనే మొదటిస్థానంలో ఉంది. ● తలసరి ఆదాయం విషయంలో ఉమ్మడి పాలమూరు జిల్లాలు చివరి వరుసలో ఉన్నాయి. నారాయణపేట జిల్లా రూ.1,94,962 తో అట్టడుగున ఉండగా.. తర్వాతి వరుసలో జోగుళాంబ గద్వాల జిల్లా కొనసాగుతోంది. అభివృద్ధి పురోగతికి సూచీగా నిలిచే జీఎస్డీపీలోనూ నారాయణపేట జిల్లా చివరి నుంచి నాలుగో స్థానంలో ఉంది. ఈ విషయంలో మహబూబ్నగర్ జిల్లా కాస్త మెరుగ్గా మొదటి నుంచి పదో స్థానంలో కొనసాగుతోంది. ఉపాధి, పరిశ్రమలు కరువు.. ఉమ్మడి జిల్లాలో ఉపాధి కల్పన, పరిశ్రమల ఏర్పాటు లేకపోవడంతో పాటు మౌలిక సదుపాయాల కల్పన తదితర విషయాల్లోనూ వెనుకబాటు కనిపిస్తోంది. పరిశ్రమల ఏర్పాటు విషయంలో నారాయణపేట జిల్లా రాష్ట్రంలోనే చిట్టచివరి స్థానంలో ఉంది. ఈ జిల్లాలో కేవలం 18 పరిశ్రమలు మాత్రమే ఉండగా.. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మహబూబ్నగర్లో అత్యధికంగా 297 పరిశ్రమలు ఉన్నాయి. పశుసంపదలో మేటి.. పశుసంపద విషయంలో రాష్ట్రంలోని మిగతా జిల్లాలతో పోల్చితే ఉమ్మడి పాలమూరు మేటిగా నిలిచింది. ముఖ్యంగా నారాయణపేట జిల్లా 12.95 లక్షల గొర్రెలతో రాష్ట్రంలో మొదటిస్థానంలో ఉంది. కూలీల సంఖ్య విషయానికి వస్తే గద్వాల జిల్లా 92.2 శాతంతో రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉండగా.. వనపర్తి జిల్లాలో 88.2 శాతం మంది కూలీలు ఉన్నారు. నాగర్కర్నూల్ జిల్లాలో అత్యధికంగా 33.9 శాతం మంది సాగుదారులు ఉన్నట్టు నివేదికలో వెల్లడయింది. రాష్ట్రంలోని మంచిర్యాల, భూపాలపల్లి జిల్లాల తర్వాత నాగర్కర్నూల్లోనే అత్యధికంగా 21.4 శాతం ఎస్సీ జనాభా ఉంది. హైదరాబాద్, కరీంనగర్ తర్వాత జోగుళాంబ గద్వాల జిల్లాలో తక్కువగా 1.5 శాతం మంది మాత్రమే ఎస్టీలు ఉన్నారు. జాతీయ రహదారుల విస్తరణ విషయంలో నల్లగొండ మొదటిస్థానంలో ఉండగా.. నాగర్కర్నూల్ జిల్లా 252.83 కి.మీ., విస్తీర్ణంతో రాష్ట్రంలోనే రెండో స్థానంలో ఉంది. సీ్త్ర, పురుష నిష్పత్తి (ప్రతి వెయ్యి మంది పురుషులకు ఉన్న మహిళల సంఖ్య) అక్షరాస్యతలో రాష్ట్రంలోనే చివరన ఉమ్మడి పాలమూరు గద్వాల, పేటలో 50 శాతంలోపే.. తలసరి ఆదాయంలోనూ అంతంత మాత్రమే మౌలిక సదుపాయాల కల్పనలో చివరి వరుసలోనే తెలంగాణ స్టాటిస్టిక్ రిపోర్టులో వెల్లడి జనాభా సాంద్రతలో.. (ప్రతి చదరపు కిలోమీటర్కు) -
పథకాలను సమర్థవంతంగా అమలు చేయాలి
గద్వాల: ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేసేందుకు క్షేత్రస్థాయిలో పొందిన శిక్షణ అనుభవాన్ని సక్రమంగా ఉపయోగించుకోవాలని కలెక్టర్ బీఎం సంతోష్ కేంద్ర సచివాలయ సేవల అధికారులకు సూచించారు. ఎంసీఆర్, హెచ్ఆర్డీ ఇనిస్టిట్యూట్ 139వ స్థాయి–డీ శిక్షణ కార్యక్రమంలో భాగంగా కేంద్ర సచివాలయ సేవల సెక్షన్ ఆఫీసర్లు 16 మందితో మంగళవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హల్లో కలెక్టర్ సమావేశమై పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పథకాల క్రియాశీల అమలుతోనే ప్రజలకు లబ్ధి చేకూరుతుందన్నారు. ప్రతి పథకం లక్ష్యం, ఆచరణ విధానాన్ని క్షేత్రస్థాయిలో సరిగ్గా అర్థం చేసుకోవడం ద్వారానే ప్రభుత్వ పాలనలో పారదర్శకతను పెంచుతుందన్నారు. శిక్షణలో భాగంగా అధికారులు మల్దకల్ మండలంలోని శేషంపల్లి, గద్వాల మండలంలోని మైలగడ్డ, గద్వాల మున్సిపాలిటీలను సందర్శించి పథకాల అమలు తీరును పరిశీలించారని.. ఆయా పథకాల ప్రభావాన్ని క్షేత్రస్థాయిలో ప్రజలతో తెలుసుకున్నారని కలెక్టర్ వివరించారు. వ్యవసాయం, డీఆర్డీఓ, మిషన్ భగీరథ, జెన్కో, జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్, స్వచ్ఛభారత్, చేయూత పింఛన్లు తదితర పభుత్వ పథకాలపై విశ్లేషణ చేపట్టారని తెలిపారు. సమావేశంలో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రమేష్బాబు తదితరులు ఉన్నారు. -
వైభవంగా అంజన్న రథోత్సవం
ధరూరు: మండలంలోని అల్వలపాడు తెలుగోనిపల్ల్లి ఆంజనేయ స్వామి రథోత్సవం వైభవంగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం స్వామి వారి రథోత్సవం నిర్వహించారు. ఉదయం ఆలయంలో స్వామి వారి అలంకరణ, పంచామృతాభిషేకం, కుంకుమార్చన, తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య స్వామి వారి రథోత్సవాన్ని రాత్రి 8 గంటలకు ఘనంగా నిర్వహించారు. జిల్లా నలుమూలలతో పాటు కర్ణాటక భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ప్రత్యేక పూజలు నిర్వహించుకుని మొక్కులు సమర్పించుకున్నారు. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా దాసంగాలు( నైవేద్యాలు) తయారు చేసి స్వామి వారికి సమర్పించుకున్నారు. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి రథోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా చైర్మన్ గొంగళ్ల రంజిత్ కుమార్ ఆలయాన్ని దర్శించుకున్నారు. కార్యక్రమంలో మాజీ సర్పంచులు సర్పంచులు, ప్రతాప్, వీరన్నగౌడ్ నాయకులు జాంపల్లి వెంకటేశ్వరరెడ్డి, అర్చకులు వామనాచార్యులు, మద్వాచార్యులు తదితరులు పాల్గొన్నారు. -
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలి
ఎర్రవల్లి: ఇందిరమ్మ ఇళ్లతో పేదల కలను సాకారం చేసేందుకుగాను ప్రభుత్వం ఎంపిక చేసిన గ్రామాల్లో నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలని రాష్ట్ర గృహ నిర్మాణశాఖ మేనేజింగ్ డైరెక్టర్ వీ.పీ గౌతమ్ అన్నారు. సోమవారం మండలంలోని బట్లదిన్నెలో ఇందిరమ్మ ఫేజ్–1 ఇళ్ల నిర్మాణ పనులను, లబ్ధిదారుల ఇళ్ల స్థలాలను కలెక్టర్ బీఎం సంతోష్తో కలిసి ఆయన పరిశీలించారు. కొత్త ఇళ్ల నిర్మాణ పనులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో మండలంలో ఒక్కో మోడల్ గ్రామాన్ని ఎంపిక చేసిందన్నారు. దీనిలో భాగంగా ఎంపికై న మీ గ్రామంలో లబ్ధిదారులు తమ స్థలాల్లో ఇళ్లను నిర్మించుకోవాలని సూచించారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ప్రతి లబ్ధిదారుడు కనీసం 400 చదరపు అడుగుల విస్తీర్ణంలో కొత్త ఇళ్లు నిర్మించుకోవాలని సూచించారు. పునాది నుంచి బేస్మెంట్ వరకు నిర్మాణం పూర్తి చేసుకున్న తర్వాత ప్రభుత్వ నిధులు రూ.లక్ష లబ్ధిదారుల ఖాతాలోకి జమ చేయడం జరుగుతుందన్నారు. ఇంటి నిర్మాణం పూర్తయ్యే వరకు విడతల వారీగా లబ్ధిదారుల ఖాతాలోకి మొత్తం రూ. 5లక్షలు నేరుగా జమచేయబడతాయని వివరించారు. మేసీ్త్రలు అందుబాటులో ఉంటారని, పంచాయతీ సెక్రటరీ మీ ఇంటి దగ్గరకు వచ్చి ఎప్పటికప్పుడు ఫొటోలు తీసుకొని ప్రభుత్వానికి పంపిస్తారని అన్నారు. ఎవరైనా మధ్యవర్తులు డబ్బు కోరితే వెంటనే ఫిర్యాదు చేయాలని సూచించారు. పాత ఇళ్ల మరమ్మతు లేదా విస్తరణకు ప్రభుత్వం నిధులను అందించదని తెలిపారు. లబ్ధిదారులు వీలైనంత త్వరగా ఇళ్ల నిర్మాణ పనులను ప్రారంభించాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న సహాయాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకొని నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ నర్సింగరావు, గృహ నిర్మాణశాఖ చీఫ్ ఇంజనీర్ చైతన్య, ఎస్ఈ భాస్కర్రెడ్డి, హౌసింగ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ భాస్కర్, ఎంపీడీఓ అజార్ మొహియుద్దీన్, కార్యదర్శి నివేష్ పాల్గొన్నారు. రాష్ట్ర గృహ నిర్మాణశాఖ మేనేజింగ్ డైరెక్టర్ వీ.పీ గౌతమ్ కలెక్టర్తో కలిసి బట్లదిన్నె గ్రామం సందర్శన -
మచ్చుకు మరికొన్ని..
● జమ్మిచేడు శివారులోని సర్వే నంబర్ 389లో ఉన్న లేఅవుట్లోని పది శాతం స్థలాన్ని ప్లాట్లుగా చేసి విక్రయించారనే దానిపై బాధితులు కలెక్టర్కు ఫిర్యాదు చేసిన ఇంత వరకు చర్యలు లేకపోవడం గమన్హారం. ● కొత్తహౌసింగ్ బోర్డు కాలనీకి ఆనుకొని సర్వేనంబర్ 789లోని ఎల్పీలో నాలుగు గుంటల స్థలాన్ని ప్రజా అవసరాల కోసం వదిలారు. ఈ ఖాళీ స్థలంతో పాటు 40 అడుగుల రోడ్డును కొంతమంది కబ్జాచేసి ప్లాట్లుగా డాక్యుమెంట్లు సృష్టించారు. కబ్జాకు గురైన ఆ స్థలం బహిరంగ మార్కెట్లో రూ.4 కోట్లు ఉంటుంది. దీనిపై స్థానికులు అభ్యంతరం తెలిపి, ఫిర్యాదు చేసినా నేతల బలం ముందు ఫలితం లేకుండా పోయింది. ● రాఘవేంద్ర కాలనీలో చేనేత కార్మికుల వర్క్షాప్ కోసం ఇచ్చిన స్థలం సైతం కబ్జాకు గురైందని బాధితులు ఫిర్యాదు చేశారు. వాటిపైనే చర్యల లేవు. ● ముఖ్యంగా 2వ, 6వ వార్డుల పరిధిలోని ప్రజా అవసరాల స్థలంలో ఆర్థిక, రాజకీయ బలం ఉన్న కొంత మంది నాయకులు నిబంధనలు ఉల్లంఘించి పెద్ద సంఖ్యలో బహుళ అంతస్తులు నిర్మించారు. వాటిపైనే చర్యలు కరవయ్యాయి. ● 34వ వార్డులోని కుంటవీధిలో ప్రజా అవసరాల స్థలంలో నకిలీ డాక్యుమెంట్లతో చేపట్టిన అక్రమ నిర్మాణం యేథేచ్ఛగా సాగుతుంది. కలెక్టర్ ఆదేశాలను సైతం పట్టించుకోవడం లేదు. మున్సిపల్ అధికారులు అయితే వెళ్లడానికి సైతం జంకుతున్నారు. ఈ నేపథ్యంలో టాస్కుఫోర్సు కమిటీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సామాన్యులపైనే టాస్కుఫోర్సు తన ప్రతాపాన్ని చూపుతుందనే ఆరోపణలు ఉన్నాయి. -
కేసీఆర్ హయాంలోనే రాష్ట్ర అభివృద్ధి
గద్వాల టౌన్/అలంపూర్/అయిజ: కేసీఆర్ హయాంలోనే రాష్ట్రం అభివృద్ధి చెందిందని ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్యే విజయుడు అన్నారు. కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ రాజ్యసభ సభ్యుడు సంతోష్ పిలుపు మేరకు సోమవారం మొక్కలు నాటారు. అనంతరం మా ట్లాడుతూ.. కేసీఆర్ పదేళ్ల పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందన్నారు. కాంగ్రెస్ ఏడాది పాలనలో ఎక్కడ అభివృద్ధి కనిపించడం లేదన్నారు. రాష్ట్ర అభివృద్ది కోసం మళ్లీ కేసీ ్డఆర్ సీఎం కావాలని ఆకాంక్షించారు. అంతకుముందు కన్యకాపరమేశ్వరి అమ్మవారిని దర్శించుకొని నిత్యాన్నదాన సత్రాన్ని పరిశీలించారు. అలాగే అత్యవసర సమయాల్లో రోగులకు రక్తదానం చేసి ప్రాణదాత లు అవ్వాలని అన్నారు. సోమవారం అయిజలో రక్తదా న శిబిరం ఏర్పాటుచేయగా.. దానిని ప్రారంభించారు. రక్తదానం చేస్తే పునర్జన్మనిచ్చినట్లే రక్తదానం చేస్తే ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తికి పునర్జన్మను ఇచ్చినట్లేనని బీఆర్ఎస్ నాయకులు బాసు శ్యామల, హనుమంతునాయుడు పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని సోమవారం బీఆర్ఎస్ పార్టీ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరాన్ని వారు ప్రారంభించారు. అనంతరం పలు చోట్ల ఏర్పాటు చేసిన అన్నదానం, పండ్ల పంపిణీ, మొక్కల నాటడం వంటి సేవా కార్యక్రమాలకు హజరయ్యారు. విజయ్కుమార్ ఆధ్వర్యంలో నాయకులు జిల్లా ఆసుపత్రిలోని రోగులకు పండ్లు పంపిణీ చేశారు. -
ఆక్రమణలు నేలమట్టం
●నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు ప్రభుత్వ, మున్సిపల్ స్థలాలను ఆక్రమించినా.. అనుమతి లేకుండా భవన నిర్మాణాలు చేపట్టిన కఠిన చర్యలు తప్పవు. ప్రజా అవసరాల స్థలాలను ఆక్రమించినా చర్యలు తీసుకుంటాం. టీఎస్–బీపాస్ ద్వారా అనుమతులు పొంది నిర్మాణాలు చేపట్టాలి. నిబంధనలు ఉల్లంఘించిన భవన నిర్మాణాల కూల్చివేతలు కొనసాగుతాయి. – దశరథం, టాస్క్ఫోర్స్ కమిటీ సభ్యుడు, కమిషనర్, గద్వాల గద్వాలటౌన్: నిబంధనలు ఉల్లంఘించి నిర్మాణాలు చేపట్టిన అక్రమార్కులకు అధికారులు చెక్ పెడుతున్నారు. కలెక్టర్ పర్యవేక్షణలో ఏర్పాటైనా టాస్క్ఫోర్స్ కమిటీ అధికారుల బృందం సోమవారం తెల్లావారుజామున అక్రమ నిర్మాణాలపై కొరఢా ఝులింపించారు. జిల్లా కేంద్రంలో ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపట్టడంపై ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులు రావడం.. ‘సాక్షి’ వరుస కథనాలు ప్రచురించగా.. అధికారులు స్పందించి చర్యలకు ఉపక్రమించారు. అక్రమ నిర్మాణాలను కూల్చివేసి అధికారులు ‘ప్రత్యేక’ మార్క్ చూపుతున్నారు. కూల్చివేతల్లో దూకుడు.. జిల్లా కేంద్రంలోని 6వ వార్డు బసవన్న చౌరస్తా ఎదురుగా లేఅవుట్లో ప్రజా అవసరాల కోసం వదిలిన పది శాతం స్థలంలో ఇటీవల వాణిజ్య దుకాణాలను నిర్మించారు. దీంతో ‘అక్రమం... పలుకుబడితో సక్రమం’ అనే కథనాన్ని ప్రచురించింది. మున్సిపల్ స్థలం కబ్జాకు గురవుతుందనే విషయాన్ని అధికారులు నిర్ధారించుకుని కలెక్టర్ సంతోష్, అడిషనల్ కలెక్టర్ నర్సింగ్రావులకు నివేదించారు. ముందస్తు ప్రణాళిక ప్రకారం టాస్క్ఫోర్సు కమిటీలోని అధికారుల బృందం పెద్దసంఖ్యలో పోలీసు బందోబస్తును ఏర్పాటు చేసుకుని కూల్చివేతకు పూనుకున్నారు. తెల్లవారుజామున జేసీబీ సాయంతో ప్రజా అవసరాల స్థలంలో నిర్మించిన నాలుగు దుకాణాల సముదాయాన్ని కూల్చివేశారు. కూల్చివేతలను అడ్డుకోవడానికి పలువురు రాజకీయ నాయకులు అధికారులపై ఒత్తిళ్లు తెచ్చారు. కొంతమంది హెచ్చరికలు జారీ చేస్తూ బెదరింపులకు పాల్పడ్డారు. వాటిని సైతం లెక్కచేయకుండా అధికారులు అక్రమంగా నిర్మించిన వాణిజ్య దుకాణాలను కూల్చివేశారు. మొత్తం మీద ప్రత్యేక పాలనలో కూల్చివేతలతో అక్రమార్కుల గుండెల్లో రైలు పరుగెడుతున్నాయి. పేదవారిపైనే ప్రతాపమా..? గత కొంత కాలంగా మున్సిపల్, టాస్కుఫోర్సు అధికారులు క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లడం మానేశారు. దీంతో రాజకీయ, అంగబలం ఉన్న వారు నిబంధనలు ఉల్లంఘించి, అనుమతులు లేకుండా, మున్సిపల్ స్థలాన్ని కబ్జా చేసి చేపట్టిన నిర్మాణాలు పుట్టగొడుగుల్లా వెలిశాయి. గతంలో వివిధ సంఘాల నాయకులు, కాలనీల ప్రజలు అక్రమ కట్టడాలు, మున్సిపల్ స్థలాల కబ్జాలపై ఆధారాలతో ఫిర్యాదు చేశారు. వాటిపై చర్యలు తీసుకోలేదు. కనీసం విచారణ సైతం చేపట్టలేదు. దీంతో టాస్కుఫోర్సు కమిటీపై విమర్శలు సైతం వెల్లువెత్తుతున్నాయి. పేదోడికి ఒక న్యాయం, పేరున్నోడికి ఒక న్యాయమా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అక్రమ నిర్మాణాలు, మున్సిపల్ స్థలాల కబ్జాలపై కొరఢా ఝులిపించాలని స్థానికులు కొరుతున్నారు. ప్రభుత్వ స్థలంలో నిర్మించిన దుకాణాలు కూల్చివేసిన అధికారులు పోలీసు బందోబస్తు నడుమ కొనసాగిన తొలగింపులు ప్రత్యేక పాలనతో అక్రమార్కుల్లో ఆందోళన -
మండలానికో మోడల్ ఇందిరమ్మ ఇల్లు
గద్వాల: జిల్లా వ్యాప్తంగా ప్రతి మండలానికో ఇందిరమ్మ నమూనా గృహాన్ని నిర్మించాలని రాష్ట్ర గృహనిర్మాణ శాఖ ఎండీ వీపి గౌతమ్ అధికారులను ఆదేశించారు. సోమవారం రాత్రి ఐడీవోసీ కార్యాలయంలో కలెక్టర్ బీఎం సంతోష్తో కలిసి సమీక్షించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతిమండలానికి ఒక గ్రామం చొప్పున ఎంపిక చేసి ఇందిరమ్మ మోడల్ గృహాలను అత్యాధునిక సాంకేతికతతో నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ లబ్ధిదారులకు ఆదర్శంగా నిలిచే విధంగా నిర్మించి వీలైంత త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. లబ్ధిదారులు నిర్మించుకునే ఇళ్ల నిర్మాణపు పనులను ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షించాలన్నారు. లబ్ధిదారుల ఖాళీస్థలం, బేస్మెట్ వరకు ఫొటోలను గ్రామ కార్యదర్శులు యాప్లో అప్లోడ్ చేయాలన్నారు. అంతకు ముందు దౌదర్పల్లి సమీపంలో నిర్మిస్తున్న డబుల్బెడ్రూం ఇళ్లను పరిశీలించారు. వివరాలు అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు లక్ష్మీనారాయణ, నర్సింగ్రావు, హౌసింగ్ సీఈ చైతన్య,ఎస్ఈ భాస్కర్రెడ్డి పాల్గొన్నారు. -
బీచుపల్లిని సందర్శించిన ఎంపీ మల్లురవి
ఎర్రవల్లి: మండలంలోని బీచుపల్లి పుణ్యక్షేత్రాన్ని సోమవారం నాగర్కర్నూల్ పార్లమెంట్ సభ్యుడు మల్లురవి సందర్శించారు. ఈ సందర్బంగా అభయాంజనేయస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు ఆలయ సిబ్బంది పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయ ప్రధాన అర్చకుడు మారుతి చారి శేషవస్త్రాలతో సత్కరించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆయన వెంట టీపీసీసీ జనరల్ సెక్రటరీ చరణ్ కౌశిక్ యాదవ్, డీసీసీబీ చైర్మన్ విష్ణువర్ధన్రెడ్డితోపాటు మధుసూదన్రెడ్డి, రంగారెడ్డి, గట్టు తిమ్మప్ప తదితరులు ఉన్నారు. -
జోగుళాంబ సన్నిధిలో ప్రముఖులు
అలంపూర్: అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటైన అలంపూర్ జోగుళాంబ ఆలయాలను సోమవారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ముందుగా ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్యే విజయుడు, గద్వాలకు జిల్లా కేంద్రానికి చెందిన బీహార్లో విధులు నిర్వహిస్తున్న ఐఏఎస్ అధికారి శ్రీరామచంద్రుడు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అమ్మవారిని, బాలబ్రహ్మేశ్వర స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు వారికి తీర్థ ప్రసాదాలను అందజేసి అశీర్వచనం పలికారు. వేర్వేరు సమయాల్లో వీరు ఆలయాన్ని దర్శించుకోగా.. ఆలయ ఈఓ పురేందర్ కుమార్ ఘన స్వాగతం పలికి అనంతరం శేషవస్త్రాలతో సత్కరించారు. జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపిక గద్వాలటౌన్: ఈ నెల 21వ తేదీ నుంచి 24వ తేదీ వరకు ఒడిశాలో జరిగే జాతీయ స్థాయి సీనియర్ కబడ్డీ పోటీలకు గద్వాలకు చెందిన క్రీడాకారుడు సద్దాం ఎంపికయ్యారని జిల్లా కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి నర్సింహ తెలిపారు. అదిలాబాద్ జిల్లాలో జరిగిన రాష్ట్రస్థాయి సీనియర్ బాలుర కబడ్డీ పోటీలలో మన జిల్లా జట్టు తరపున సద్దాం పాల్గొని అత్యంత ప్రతిభ కనభర్చారు. రాష్ట్రస్థాయి పోటీలలో మన జిల్లా క్రీడాకారుడు సద్దాం క్రీడా నైపుణ్యాన్ని గుర్తించి సెలెక్టర్లు జాతీయ స్థాయి పోటీల ఎంపిక చేశారన్నారు. క్రీడాకారుడు సద్దాం ఎంపిక పట్ల జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షురాలు డీకే స్నిగ్ధారెడ్డి, చైర్మన్ అబ్రహాం, రవి, చందు, నగేష్, కరెంటు నర్సింహా, జగదీష్, రైల్వేపాష, రాజేందర్, వెంకటన్న సీనియర్ క్రీడాకారులు హర్షం తెలిపారు. 21న ‘పేట’కు సీఎం రాక నారాయణపేట: ఈ నెల 21న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నారాయణపేటకు రానున్నారని కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆమె హెలీప్యాడ్ స్థలాన్ని ఎస్పీ యోగేష్ గౌతమ్తో కలిసి పరిశీలించారు. అలాగే ఫొటో ఎగ్జిబిషన్, స్టేజీ తదితర ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. ముఖ్యమంత్రి పలు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించనున్నట్లు, వాటిలో మెడికల్ కళాశాల టీచింగ్ హాస్పిటల్, 100 పడకల ఆస్పత్రి, నర్సింగ్ కళాశాల, రెండు పోలీస్స్టేషన్ల భవన నిర్మాణాలు, పెట్రోల్ బంక్, మహిళా సమాఖ్య భవనాలు ప్రారంభించనున్నారు. సీఎం పర్యటనలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలని ఆమె అధికారులను ఆదేశించారు. శ్రీశైలం యాత్రికులకు 24 గంటలు అనుమతి మన్ననూర్: మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీశైలం వెళ్లే యాత్రికుల సౌకర్యార్థం ఈ నెల 23 నుంచి మార్చి 1వ తేదీ వరకు అటవీశాఖ చెక్పోస్టుల ద్వారా 24 గంటలు వాహనాల రాకపోకలకు అనుమతి ఇస్తున్నట్లు డీఎఫ్ఓ రోహిత్రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. కొంతకాలంగా వన్యప్రాణుల సంరక్షణలో భాగంగా రాత్రి 9 నుంచి ఉదయం 6 గంటల వరకు మన్ననూర్ చెక్పోస్టు వద్ద రాకపోకలు నిలిపివేసినట్లు పేర్కొన్నారు. -
కార్చిచ్చు ముప్పు..
● అగ్నిప్రమాదాల నివారణకు అటవీశాఖ ముందస్తు చర్యలు ● క్విక్ రెస్పాన్స్ బృందాల ఏర్పాటు ● వీవ్లైన్స్, ఫైర్లైన్స్తో మంటల అదుపు ● అటవీ సమీప గ్రామాల్లో అవగాహన సదస్సులు ● నల్లమలలో విలువైన ఔషధ మొక్కలు, వ్యనప్రాణులు అచ్చంపేట: వేసవి నేపథ్యంలో నల్లమలలోని వన్యప్రాణులతోపాటు విలువైన అటవీ సంపదకు కార్చిచ్చు ముప్పు పొంచి ఉంది. ప్రస్తుతం అడవుల్లో చెట్ల ఆకులు రాలే సీజన్. చెట్ల నుంచి కింద పడిన ఆకులు ఎండిపోవడంతోపాటు కుప్పలుగా కనిపిస్తుంటాయి. ఈ పరిస్థితుల్లో వాటిపై నిప్పు పడితే కార్చిచ్చు వ్యాపించే ప్రమాదం ఉంటుంది. తద్వారా అటవీ సంపదతోపాటు వన్యప్రాణులకూ ముప్పు వాటిల్లుతోంది. అయితే జాగ్రత్తలు తీసుకుంటేనే ఈ విపత్తును నివారించవచ్చని భావిస్తున్న అటవీశాఖ అధికారులు.. జిల్లాలోని అడవుల్లో అగ్ని ప్రమాదాలు జరగకుండా ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నారు. అడవి బుగ్గిపాలు కాకుండా కాపాడుకునేందుకు ముందస్తుగా హైదరాబాద్– శ్రీశైలం జాతీయ రహదారికి ఇరువైపులా వీవ్లెన్స్, ఫైర్లైన్స్ ఏర్పాటు చేస్తోంది. ఇందుకోసం అటవీశాఖ సిబ్బందితో అడవిలో ఎండిన ఆకులను వరుసగా పేర్చి కాల్చివేస్తున్నారు. ఒకవేళ అగ్గి రాజుకున్నా శరవేగంగా విస్తరించకుండా ఈ ఫైర్ లైన్స్తో అడ్డుకట్ట వేసే అవకాశం ఉంది. నల్లటి రంగుతో సరిహద్దు వేసవిలో చెట్ల ఆకులు రాలడం వల్ల చిన్నపాటి నిప్పురవ్వ పడినా అడవి దావనంలా వ్యాపిస్తోంది. ఈ నేపథ్యంలో అటవీశాఖ సిబ్బంది నేలపై రాలిన చెట్ల ఆకులను ఒకచోట పోగు చేసి.. కిలోమీటర్ పొడవునా కాల్చుతున్నారు. తద్వారా నిప్పు అంటుకున్నా మంటలు విస్తరించవు. మరోవైపు నల్లటి రంగుతో సరిహద్దు గీత ఏర్పడి వన్యప్రాణులు సైతం అడవి దాటి బయటకు వెళ్లకుండా ఫైర్లైన్స్ ఉపయోగపడతాయి. విలువైన చెట్లు.. ఔషధ మొక్కలు దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద టైగర్ రిజర్వుగా నల్లమల అమ్రాబాద్ అభయారణ్యం గుర్తింపు పొందింది. ఇక్కడ ఔషధ మొక్కలతోపాటు టేకు, నల్లమద్ది, వేప, చేదు వేప, ఇప్ప తదితర చెట్లు అధికంగా ఉన్నాయి. వేసవి ప్రారంభంలోనే ఆకులు రాలి ఎండిపోయాయి. వాహనాల్లో వెళ్తున్న వారు సిగరెట్, బీడీలు తాగి.. పూర్తిగా ఆర్పకుండానే రోడ్డు పక్కనున్న అడవుల్లోకి విసురుతుంటారు. మరోవైపు పశువుల కాపరులు, అడవుల్లోకి ప్రవేశించే ఇతర వ్యక్తులు సైతం చుట్ట, బీడీ, సిగరెట్లు కాల్చిన అగ్గిపుల్లలను నిర్లక్ష్యంగా పడేస్తుంటారు. తద్వారా మంటలు వ్యాపించే ప్రమాదం ఉంటుంది. శాటిలైట్ సహాయంతో.. నల్లమల అటవీ ప్రాంతంలో అగ్గి అంటుకున్న వెంటనే ఆర్పేందుకు వీలుగా అటవీశాఖ అధికారులు తక్షణ స్పందన (క్విక్ రెస్పాన్స్) బృందాలను ఏర్పాటు చేస్తున్నారు. రేయింభవళ్లు ఎక్కడ అగ్గి రాజుకున్నా శాటిలైట్ సహాయంతో ప్రమాదాన్ని గుర్తించి.. మంటలను ఆర్పివేసేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. మరోవైపు అటవీ సమీప గ్రామాల్లో అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. -
అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం
కోడేరు: అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతిరావుపూలే బాలికల గురుకుల పాఠశాలలో రూ.25 లక్షలతో నిర్మించే టాయిలెట్స్, డార్మెటరీ, డైనింగ్ హాల్, కస్తూర్బా విద్యాలయంలో రూ.10 లక్షలతో నిర్మించే అదనపు తరగతి గదులు, కొండ్రావుపల్లిలో ఎస్సీ సబ్ప్లాన్ నిధులతో సీసీ రోడ్డు, డ్రైనేజీ, జనుంపల్లిలో రూ.16 లక్షలతో సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణాలకు ఆయన శంకుస్థాపన చేసి మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే రైతులకు రూ.2 లక్షల పంట రుణమాఫీ, ఉచిత విద్యుత్, రూ.500కే గ్యాస్ సిలిండర్, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, రైతు భరోసా పథకాలు అమలు చేసిందన్నారు. త్వరలో అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని.. గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్కు దీటుగా మౌలిక వసతుల కల్పనకు ప్రజా ప్రభుత్వం కృషి చేస్తోందని.. చదువుతోనే ఉజ్వల భవిష్యత్ ఉంటుందని వివరించారు. అనంతరం మహాత్మాగాంధీ, అంబేడ్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కొత్త రామ్మోహన్రావు, మాజీ కో–ఆప్షన్ సభ్యుడు అబ్దుల్ కరీం, బావాయిపల్లి మాజీ సర్పంచ్ వేణుగోపాల్యాదవ్, ఎంపీడీఓ శ్రావణ్కుమార్, కాంగ్రెస్ నాయకులు మహేశ్వర్రెడ్డి, జగదీశ్వర్రావు, ఆది రాజు, రామకృష్ణ, పొండేళ్ల సురేశ్, ఇమ్రాన్, బాబు పాల్గొన్నారు. -
పలుకుబడితో సక్రమం
గద్వాల టౌన్: జిల్లాలో గద్వాల, అయిజ, అలంపూర్, వడ్డేపల్లి మున్సిపాలిటీలు ఉన్నాయి. ప్రతి మున్సిపాలిటీ పరిధిలో ఒక టాస్కుఫోర్స్ బృందాన్ని ఏర్పాటు చేశారు. అక్రమ నిర్మాణాలను కూల్చివేయడమే టాస్కుఫోర్స్ ప్రధాన లక్ష్యం. అక్రమ నిర్మాణాల విషయంలో ఉన్నతాధికారులు రాజకీయ పలుకుబడి ఉన్న వారికి ఓ విధంగా.. సామాన్యుల నిర్మాణాల విషయంలో మరో విధంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు, ఆరోపణలు ఉన్నాయి. దీనిపై ప్రజలు అధికారుల తీరును ఎండగడుతున్నారు. నిబంధనలు అతిక్రమించి.. అందరూ టీఎస్ బీపాస్లో దరఖాస్తు చేసుకుని నేరుగా అనుమతులు పొందిన తర్వాతే ఇంటి నిర్మాణాలు చేపట్టాలి. కానీ చాలా మంది అవగాహనలేమితో ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నారు. మరికొందరూ తెలిసి కూడా అనుమతులు తీసుకోకుండా భవన నిర్మాణాలు చేపడుతున్నారు. ఈ తరహాలో నిర్మించే అక్రమ నిర్మాణాలు కూల్చివేసేందుకు మున్సిపల్ పట్టణ ప్రాంతాలలో గత ప్రభుత్వం టాస్కుఫోర్సును ఏర్పాటు చేసింది. ఇది అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపాలి. కానీ గద్వాల, అయిజ పట్టణాలలో నిర్మాణాలు సక్రమంగా జరగడం లేదు. అందుకు ప్రధాన కారణం రాజకీయ ఒత్తిళ్లు, ప్రజాప్రతినిధుల పైరవీలతో అసలు లక్ష్యం పక్కదారి పడుతోంది. ప్రధానంగా గద్వాల, అయిజ మున్సిపల్ పరిధిలో పెద్ద సంఖ్యలో అనుమతి లేని నిర్మాణాలు జరుగుతున్నా.. వాటి గురించి అధికారులకు తెలిసిన పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అనుమతి లేని కట్టడాల గురించి ప్రారంభ దశలోనే ఫిర్యాదు చేసిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు బహిరంగంగానే విమర్శిస్తున్నాయి. గత మూడేళ్ల నుంచి అక్రమ నిర్మాణాలపై ప్రజల నుంచి అనేక ఫిర్యాదులు వస్తున్నా... చర్యలు తీసుకోవడం లేదు. ‘జిల్లా కేంద్రంతోపాటు అయిజ పట్టణంలో అనుమతి లేని కట్టడాలు, అక్రమ నిర్మాణాలపై టాస్కుఫోర్సు అధికారులు కొరఢా ఝులిపించారు. ఇళ్ల నిర్మాణాలతోపాటు ప్రజా అవసరాల కోసం వదిలిన పది శాతం స్థలంలో పలు సామాజిక వర్గాలకు చెందిన కట్టడాలను అక్రమ నిర్మాణాలు అని నిర్ధాక్షిణ్యంగా కూల్చివేశారు. ఎలాంటి సానుభూతి చూపించకుండా చర్యలు తీసుకున్నారు..’ ఇదీ మూడేళ్ల క్రితం మాట. ప్రస్తుతానికి వచ్చేసరికి.. ‘జిల్లా కేంద్రంలో ఎలాంటి అనుమతులు లేకుండా చాలా అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. మున్సిపల్ స్థలాలను ఆక్రమించి కట్టడాలు చేస్తున్నారు. ప్రజా అవసరాల స్థలంలో సైతం యేథేచ్ఛగా ఇళ్లు, వాణిజ్య దుకాణాలను చేపడుతున్నారు. అక్రమ నిర్మాణాలపై అధికారులు ఒక్కొక్కరిపై ఒక్కో విధంగా వ్యవహరిస్తున్నారు. పలుకుబడి ఉన్న వాటిపై టాస్కుఫోర్సు బృందం స్పందించకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది.’ అక్రమ నిర్మాణాల కూల్చివేతలో అధికారుల పక్షపాత వైఖరి ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి యథేచ్ఛగా నిర్మాణం అధికారులకు మొర పెట్టుకున్నా.. చర్యలు శూన్యం కనిపించని ‘ప్రత్యేక’ మార్క్ అక్రమ నిర్మాణాలను ఉపేక్షించం అక్రమ నిర్మాణాలు, మున్సిపల్ స్థలాల కబ్జాపై ప్రజల నుంచి ఫిర్యాదులు వచ్చాయి. వాటిపై క్షేత్రస్థాయి పరిశీలన చేసి, అట్టి నిర్మాణ పనులను నిలిపివేశాం. మిగిలిన స్థలాలపైనా విచారణ చేసి.. వాటి నివేధికను జిల్లా కలెక్టర్కు అందజేస్తాం. అక్రమ నిర్మాణాలపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం. – నర్సింగరావు, అడిషినల్ కలెక్టర్. -
వీడని మిస్టరీ
● ఏళ్లు గడుస్తున్నా హత్య కేసుల్లో దోషులను గుర్తించని పోలీసులు ● ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పెండింగ్లోనే పలు మర్డర్ కేసులు ● రాజకీయంగా సంచలనం సృష్టించినవి సైతం అదే తీరు ● రెండు, మూడు రోజుల్లో దొరక్కుంటే అంతే సంగతులు.. ● ఆధునిక సాంకేతికత అందుబాటులో ఉన్నా ఛేదించడంలో విఫలం సాక్షి, నాగర్కర్నూల్: అధునాతన సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చి నేర పరిశోధన, కేసుల ఛేదింపుల్లో పోలీసులకు ఆయుధంగా మారుతోంది. సీసీ కెమెరాలు, సెల్ఫోన్లు, ఫోరెన్సిక్ ఆధారాల సాయంతో హత్య కేసులను ఛేదించడం సులభతరం అవుతోంది. అయితే ఉమ్మడి జిల్లావ్యాప్తంగా చోటుచేసుకున్న కొన్ని హత్యకేసుల్లో నిందితులు మాత్రం పోలీసులకు చిక్కడం లేదు. మరికొన్ని కేసుల విచారణ ఏళ్లతరబడిగా కొనసాగుతోంది. చాలా సందర్భాల్లో రెండు, మూడు రోజుల్లో నిందితులు పట్టుబడకపోతే ఆ కేసు పెండింగ్లో పడిపోతోంది. ఉమ్మడి జిల్లాలో సంచలనం కలిగించిన హత్య కేసుల్లోనూ నిందితులను గుర్తించలేకపోవడం పోలీసుల పనితీరుకు మచ్చగా నిలుస్తోంది. నాగర్కర్నూల్, మహబూబ్నగర్లోనే ఎక్కువ గతేడాది ఉమ్మడి జిల్లావ్యాప్తంగా నాగర్కర్నూల్ జిల్లాలో అత్యధికంగా 33 హత్యలు చోటుచేసుకున్నాయి. జిల్లాలోని బిజినేపల్లి, నాగర్కర్నూల్ మండలాల్లో ఎక్కువగా నేరాలు నమోదయ్యాయి. ఆ తర్వాత మహబూబ్నగర్ జిల్లాలో 30 హత్యలు జరిగాయి. ఆ తర్వాత వనపర్తిలో 14, జోగుళాంబ గద్వాలలో 9, నారాయణపేట జిల్లాలో 8 హత్య కేసులు నమోదయ్యాయి. విచారణ కొనసాగుతోంది.. చిన్నంబావి మండలం లక్ష్మీపల్లిలో వ్యక్తి హత్య కేసుపై పోలీసుల విచారణ కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఇంకా నిందితులను గుర్తించలేదు. ఈ కేసు మినహా ఎక్కడా మర్డర్ కేసులు పెండింగ్లో లేవు. ఎప్పటికప్పుడు పెండింగ్ కేసుల పరిష్కారానికి కృషిచేస్తున్నాం. – వెంకటేశ్వరరావు, డీఎస్పీ, వనపర్తి -
‘ప్రత్యేక పాలన’పై పెదవి విరుపు
మున్సిపల్ పాలకవర్గం కాలపరిమితి ముగియడంతో చైర్మన్ల స్థానంలో ప్రత్యేక అధికారులు బాధ్యతలు చేపట్టారు. అయితే, ప్రత్యేక పాలనలో ఆక్రమాలు ఉండవని, పారదర్శక పాలన లభిస్తుందని, సమస్యలు తొలిగి న్యాయం జరుగుతుందని ప్రజలు భావించారు. అయితే ఆ దిశగా ప్రత్యేక పాలన సాగడం లేదని పెదవి విరుస్తున్నారు. ఇటీవల స్థానిక 34వ వార్డు పరిధిలోని కుంటవీధిలో, 6వ వార్డు బసవన్న చౌరస్తా ఎదురుగా ఉన్న పది శాతం మున్సిపల్ స్థలంలో చేపట్టిన నిర్మాణాలు వివాదాస్పదమయ్యాయి. ఈ అక్రమ నిర్మాణాలపై కలెక్టర్, అడిషినల్ కలెక్టర్కు స్థానికులు ఫిర్యాదు చేశారు. దీనిపై చర్యలు తీసుకోవాలని మున్సిపల్ అధికారులను ఆదేశించినా.. ఇప్పటి వరకు చర్యలు లేవు. రాజకీయ ఒత్తిళ్లతో మున్సిపల్ అధికారులు ఆ నిర్మాణ చాయలకు కూడా వెళ్లడం లేదు. పైగా వెళ్లిన కిందస్థాయి సిబ్బందిపై విరుచకపడుతున్నారు. ‘మా అన్నతో మీ సార్కు చెప్పించాం కదా.. మళ్లీ ఎందుకు వచ్చావ్’ అంటూ సిబ్బందిపై రుబాబు ప్రదర్శించారు. రాజకీయ అండతో ఆక్రమణదారుడు బరితెగించి నిర్మాణాల వేగాన్ని మరింత పెంచి అధికారులకే సవాల్ విసురుతున్నాడు. వీటిపై అధికారులు ఏవిధంగా స్పందిస్తారో అనే దానిపై స్థానికుల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా అక్రమ నిర్మాణాలు, ఆస్తిపన్ను మదింపులో పెద్ద ఎత్తున్న అవినీతి జరుగుతుందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వీటిపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం అధికారులపై ఉంది. -
ఎండుమిర్చి ఏడిపిస్తోంది..!
ధర లేక సతమతమవుతున్న రైతులు మానవపాడు: ఎన్నో ఆశలతో ఎండుమిర్చి సాగు చేసిన రైతుకు అటు ధరలు లేక.. ఇటు దిగుబడి తగ్గి నష్టాలు వెంటాడుతున్నాయి. వర్షాభావం, చీడపీడలు తట్టుకొని.. పెట్టుబడి వ్యయం పెరిగినా భరించి పంటను పండిస్తే నిరాశే ఎదురవుతుంది. గతేడాది ఇదే సీజన్లో క్వింటా రూ.20వేలు పలకగా.. ప్రస్తుత సీజన్లో రూ.7వేల నుంచి రూ.11,500 వరకు మార్కెట్ రేటు పలుకుతుండడంతో రైతు దిక్కుతోచని స్థితిలో పడ్డాడు. జిల్లాలో ఈ సీజన్లో దాదాపు 37వేల ఎకరాల్లో ఎండు మిర్చి సాగు చేశారు. గతేడాది ఎండుమిర్చికి మంచి ధర పలికింది. క్వింటా మిర్చి రూ. 20వేల వరకు పలికింది. కొంతమంది మరింత ఎక్కువ ధర వస్తుందని ఆశతో కోల్డ్స్టోరేజీలో మిర్చిని దాచారు. అయితే, గత సీజన్ నుంచి ఈ సీజన్ వరకు సుమారు 50శాతం ధరలు పడిపోవడం గమనార్హం. దిగుబడులు తగ్గటంతో పాటు ధరలు కూడా పతనం కావడంతో మిర్చి రైతులు దిక్కుతోచని స్థితిలో చేరుకున్నాడు. కోల్డ్స్టోరేజీలో బస్తాకు ఏడాదికి రూ.170 నుంచి రూ.200 వరకు వసూలు చేశారు. తేజ రకం మిర్చి కొత కూలీ క్వింటాకు రూ.3 వేల వరకు ఖర్చుఅవుతుంది. దీనికితోడు పెటుబడి ఖర్చులు కలుపుకొంటే దాదాపు రూ.7వేల వరకు ఖర్చు వస్తుంది. వర్షాల కారణంగా కాయల్లో నాణ్యత లోపించింది. నాణ్యత తక్కువగా ఉందని ధరలు తక్కువ ఇస్తుండడంతో రైతు అవస్థలు పడుతున్నారు. మిర్చి సాగుకు ఈ ఏడాది ఖర్చులు భారీగా పెరిగాయి. విత్తనాలు, ఎరువులు కూలి ధరలు అమాంతం పెరిగాయి. ఎకరా సాగుకు రూ.1.50 లక్షల నుంచి రూ.1.80 లక్షల దాకా ఖర్చు చేయగా.. దిగుబడి మాత్రం 7 నుంచి 12 క్వింటాళ్ల లోపే వచ్చిందని పేర్కొన్నారు. గత ఏడాది ఈ సీజన్లో గుంటూరు మిర్చి రకం క్వింటాకు రూ.14 వేల నుంచి రూ.20వేల దాకా ధర పలికింది. సింజేంటా, బ్యాడిగ, రకం రూ.18వేల నుంచి రూ.30వేలు, సూపర్ 10, గుంటూరు మిర్చి రకాలు రూ.14వేల నుంచి రూ.22వేల వరకు ధర ఉండగా.. నేడు దాదాపు 50 శాతానికి తగ్గిపోయాయి. ఇప్పటికై నా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి మద్దతు ధర వచ్చేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని రైతులు కోరుతున్నారు. ప్రకృతి వైపరిత్యాలు వల్ల రైతులు నష్టపోతే ప్రభుత్వాలు ఎంతో కొంత ఆదుకునేవని, అలాగే ఈ ఏడాది ఎండుమిర్చి రైతులను ప్రభుత్వాలు ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. జిల్లా వివరాలిలా.. మండలం సాగు (ఎకరాల్లో) ఇటిక్యాల 8,368 మానవపాడు 5,759 గద్వాల 4,361 అయిజ 4,301 గట్టు 3,153 మల్దకల్ 2,869 ఉండవెల్లి 2,771 రాజోలి 795 వడ్డేపల్లి 783 అలంపూర్ 683 ధరూరు 131 కేటీదొడ్డి 99 పెరిగిన అప్పులు ధరల పతనం గతేడాది క్వింటా రూ.20వేలు పలికిన వైనం ప్రస్తుత సీజన్లో రూ.10వేల దిగువకు.. పెరిగిన కూలీలు, కౌలు ఖర్చులతో అప్పుల ఉబ్బిలో అన్నదాతలు ఎలా బతికేది.. ? 10ఎకరాల్లో మిర్చి పంట సాగు చేశాను. పంటకౌలు, మందులు, ఎరువులు, కూలీల ఖర్చులు కలిపి ఎకరాకు రూ.1.50 లక్షల నుంచి రూ. 2లక్షల వరకు ఖర్చు అయ్యింది. కానీ, దిగుబడి మాత్రం రాలేదు. 10 నుంచి 12 క్వింటాళ్లు మాత్రమే మిర్చి దిగుబడి వస్తోంది. నాణ్యతను బట్టి రూ.7వేల నుంచి రూ.12వేలు ధర ఇస్తే మేం ఎలా బతికేది. – రామాంజనేయులు, రైతు, చెన్నిపాడు ప్రభుత్వం ఆదుకోవాలి ఎండు మిర్చి పంట సాగుకు రూ.లక్షలు ఖర్చు చేశాం. ఇప్పుడేమో ధరలు లేక అప్పులు పేరుకుపోయే పరిస్థితి నెలకొంది. మార్కెట్లో మిర్చికి రూ.10వేలకు తక్కువగానే ధర పలుకుతోంది. దీంతో పంటకు పెట్టిన పెట్టుబడులు కూడా రావు. రాష్ట్ర ప్రభుత్వం ఎండు మిర్చికి మద్దతు ధర లభించేలా చర్యలు తీసుకోవాలి. – గోపాల్, రైతు, గోకులపాడు -
అదును చూసి పూర్తిచేసి..
జిల్లా కేంద్రంలోని 6వ వార్డు పరిఽధిలోని బసవన్న చౌరస్తా క్రాస్రోడ్డులో ప్రజా అవసరాల కోసం వదిలిన పది శాతం మున్సిపల్ స్థలంలో అక్రమంగా వాణిజ్య దుకాణ నిర్మాణాలను చేపట్టారు. గతంలో ఇదే స్థలంలో నిర్మాణాలు చేపడితే అప్పటి మున్సిపల్ అధికారులు అక్రమమని తేల్చి కూల్చివేశారు. తర్వాత చాలాకాలం పాటు నిర్మాణాల జోలికి వెళ్లలేదు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో.. అధికార యంత్రాంగమంతా ఎన్నికల విధుల్లో ఉండటాన్ని గమనించి, ఇదే అదనుగా మళ్లీ వాణిజ్య దుకాణ నిర్మాణాలు చేపట్టారు. అప్పుడు కూడా స్థానికులు దీనిపై అధికారులకు ఫిర్యాదు చేస్తే పనులను నిలిపివేశారు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. కొద్దిపాటి పనులతో దుకాణ నిర్మాణాలు పూర్తయ్యాయి. తాజాగా కబ్జాదారుడు కొంతమంది నాయకులకు ముడుపులు చెల్లించి, రెండు రోజుల క్రితం దర్జాగా దుకాణాలను పూర్తిచేశాడనే అరోపణలు ఉన్నాయి. -
అలరించిన పద్యనాటక ప్రదర్శనలు
స్టేషన్ మహబూబ్నగర్: మన్యంకొండ శ్రీలక్ష్మీవెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ఆలయ ప్రాంగణంలో శ్రీమిత్ర కళానాట్య మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన పౌరాణిక పద్యనాటక ప్రదర్శనలు ఆదివారం రెండోరోజు కొనసాగాయి. కోయిలకొండ మండలం అంకిళ్ల గ్రామానికి చెందిన రామాంజనేయ కళానాట్య మండలి కళాకారులు శ్రీరామాంజనేయ యుద్ధ ఘట్టం, శ్రీమిత్ర కళానాట్య మండలి ఆధ్వర్యంలో దేవేంద్ర సభ, శ్రీకృష్ణ రాయబారం, మిడ్జిల్ మండలం మల్లాపూర్కు చెందిన శ్రీవీరాంజనేయస్వామి నాట్య మండలి ఆధ్వర్యంలో కౌరవసభ, కళాకారుడు ఎ.శ్రీశైలం రావణ ఏకపాత్రాభినయాన్ని ప్రదర్శించారు. ఈ సందర్భంగా శ్రీమిత్ర కళానాట్యమండలి ప్రధాన కార్యదర్శి వి.నారాయణ మాట్లాడుతూ మన్యంకొండ బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతికశాఖ, రాష్ట్ర సంగీత నాటక అకాడమీ సహకారంతో మంగళవారం వరకు పద్యనాటక ప్రదర్శనలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. పద్యనాటక ప్రదర్శనలకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుందని చెప్పారు. సోమవారం వివిధ సంస్థలచే శ్రీకృష్ణాంజనేయ యుద్ధ ఘట్టం, మయసభ దుర్యోధన నాటకాల ప్రదర్శన ఉంటుందని తెలిపారు. పోటెత్తిన వేరుశనగ నవాబుపేట: మండల కేంద్రంలోని మార్కెట్ యార్డుకు ఆదివారం వేరుశనగ పోటెత్తింది. చుట్టుపక్కల ప్రాంతాల రైతులు ఆదివారం మార్కెట్కు ఒక్కసారిగా 10,071 బస్తాల వేరుశనగ తీసుకువచ్చారు. అయితే క్వింటాల్ గరిష్టంగా రూ.6,960, కనిష్టంగా రూ.4,884 ధర వచ్చిందని మార్కెట్ కార్యదర్శి రమేష్ తెలిపారు. ఎవరికై నా ఇబ్బందులు కలిగితే వెంటనే వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో అధికారులకు ఫిర్యాదు చేయాలని చైర్మన్ లింగం రైతులకు సూచించారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి స్టేషన్ మహబూబ్నగర్: ఉద్యోగుల ఆర్థిక సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ ఆల్ మైనార్టీ ఎంప్లాయిస్ వర్కర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు షేక్ ఫారుఖ్ హుస్సేన్ అన్నారు. గత ప్రభుత్వం ఉద్యోగుల ఏ ఒక్క సమస్యను పరిష్కరించకపోవడం వల్లే ఉద్యోగులంతా ఏకమై రాష్ట్రంలో ప్రభుత్వ మార్పునకు శ్రీకారం చుట్టారన్నారు. జిల్లాకేంద్రంలోని సంఘం కా ర్యాలయంలో ఆదివారం జరిగిన ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పెండింగ్లో ఉన్న 4 డీఏలు, పీఆర్సీ నివేదికను ప్రవేశపెట్టి ఆమోదం తెలపాలని కోరారు. గత రెండేళ్లుగా ఈ–కుబేర్లో ఉన్న ఉద్యోగుల బిల్లు లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. -
జిల్లాలో 45 మంది హాజరు..
శనివారం రాత్రి వరకు డీఎస్సీ–2008 బీఎడ్ అభ్యర్థులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. మొత్తం జిల్లా వ్యాప్తంగా 50 మందికి అభ్యర్థులకు గాను 45 మంది అభ్యర్థులు కౌన్సెలింగ్కు హాజరయ్యారు. అయిదు మంది గైర్హాజరయ్యారు. హైకోర్టు ఆదేశాలతో వీరందరిని జిల్లాలో ఖాళీగా ఉన్న పాఠశాలలో అకాడమిక్ ఇన్స్ట్రక్టర్ పేరిట నియమించారు. వీరికి అడిషనల్ కలెక్టర్ నర్సింగరావు, డీఈఓ అబ్దుల్ఘనీ నియామక ఉత్తర్వులు అందజేశారు. 17 ఏళ్ల నిరీక్షణ ఫలించడంతో డీఎస్పీ–2008 అభ్యర్థులు ఆనందం వ్యక్తం చేశారు. అభ్యర్థికి నియామక పత్రాన్ని అందజేస్తున్న అడిషనల్ కలెక్టర్ నర్సింగరావు -
కాసులు కురిపిస్తున్న రియల్ భూం
రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరుగా సాగుతున్న గద్వాలతో పాటు అయిజ, వడ్డేపల్లి, ఉండవెల్లి, ఇటిక్యాల మండలాల్లో రెవెన్యూ అధికారులతో పాటు పంచాయతీ అధికారులకు కాసుల పంట కురిపిస్తున్నాయి. వ్యవసాయేతర భూమిగా మార్చడం కోసం రియల్ వ్యాపారులను ముప్పుతిప్పలకు గురిచేసి రూ.లక్షల్లో డబ్బులు దండుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి. భూ సర్వేలో అనధికారికంగా మండల సర్వేయర్కు ఒక రేటు, జిల్లా సర్వేయర్కు మరో రేటును ఫిక్స్ చేశారు. అయితే ఏసీబీ దాడులలో చిన్నపాటి ఉద్యోగులు, సిబ్బందే బలిపశువులు అవుతున్నారనే వాదన కూడా బలంగా ఉంది. రెవెన్యూ ఉన్నతాధికారులు, తహసీల్దార్ వంటి అధికారుల పాత్ర లేనిదే రెవెన్యూశాఖలో ఏ పని జరగదు. మధ్యవర్తులను ఏర్పాటు చేసుకొని వారిద్వారానే వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలున్నాయి. ఏసీబీ అధికారులు సైతం పట్టుబడిన క్రిందిస్థాయి అధికారులపైనే కేసులు నమోదు చేసి పైస్థాయి అధికారులపై ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు లేకపోలేదు. -
అన్ని శాఖల్లో వేళ్లూనుకుపోయి..
ప్రజలకు మేమున్నాం అని భరోసానిచ్చే పోలీసుశాఖలో సైతం ఇదే తంతు నడుస్తోంది. చట్టాలు, నిబంధనలు తోసిరాజసి.. తమకు నచ్చిన తీరుతో బాధితులతో ఇష్టానుసారంగా ప్రవర్తి స్తున్నారు. శాంతిభద్రతలు, నేరాల అదుపు పేరుతోనే సివిల్ పంచాయతీలలో తలదూర్చి ‘మాకేంటి లాభమనే’ విధంగా కొందరు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మట్టి, ఇసుక, భూ మాఫియాకు వత్తాసు పలుకుతున్నారనే అభియోగా లు కొన్ని స్టేషన్లపై లేకపోలేదు. అదేవిధంగా మున్సిపాలిటీల్లో ఇంటి నిర్మాణాలకు, లేఅవుట్లకు, పేరు మార్పిడికి, ఇంటి నంబర్ల కోసం, ఆస్తిపన్ను మదింపు.. ఇలా ప్రతి పనికి అమ్యామ్యాలు ఇవ్వాల్సిందే. రిజిస్ట్రేషన్ శాఖలో ప్రతి డాక్యుమెంటుకి, రవాణా శాఖలో ప్రతి లైసెన్స్కి రేటు ఫిక్స్ చేసి వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఎకై ్సజ్ శాఖలో నెలవారీ మామూళ్లు అనేది బహిరంగ రహస్యమే. -
సంత్ సేవాలాల్ మార్గం అనుసరణీయం
గద్వాలటౌన్: సంత్ సేవాలాల్ మార్గం అనుసరణీయమని బీజేపీ నాయకులు అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలో సద్గురు సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. సేవాలాల్ చిత్రపటానికి బీజేపీ నాయకులు జయశ్రీ పూలమాలలు వేసి నివాళులర్పించారు. బంజారా జాతిని చీకటి నుంచి వెలుగులోకి తీసుకొచ్చిన గొప్ప విప్లవ చైతన్య మూర్తి సంత్ సేవాలాల్ అని కొనియాడారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు రవికుమార్ఏక్బోటే, రామాంజనేయులు, బండల వెంకట్రాములు, శివారెడ్డి, దేవదాసు, అనిల్, కృష్ణ, మోహన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అలాగే, ప్రభుత్వ పీజీ సెంటర్లో సేవాలాల్ చిత్రాపటానికి కళాశాల ప్రిన్సిపల్ వెంకట్రెడ్డి పూలమాలలు వేసి నివాళుర్పించారు. దేశం గర్వించదగ్గ గొప్ప ఆధ్యాత్మికవేత్తలలో సంత్ సేవాలాల్ ఒకరని పేర్కొన్నారు. సేవాలాల్ మహారాజ్ తన బోధనల వల్ల బంజారా జాతి పురోగమించడానికి ఎంతో కృషి చేశారని చెప్పారు. సంప్రదాయ బద్ధంగా సుదర్శన ‘చక్ర’ స్నానం గద్వాలటౌన్: పండితులు వేద మంత్రోచ్ఛరణల మధ్య భూలక్ష్మీ చెన్నకేశవస్వామి సుదర్శన చక్రానికి చక్రస్నానం సంప్రదాయబద్ధంగా చేయించారు. లక్ష్మీ చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలల్లో భాగంగా శనివారం గద్వాల కోటలోని ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. స్వామి సన్నిదానంలో నిత్యపూజ కార్యక్రమాల అనంతరం స్వామివారికి అవబృత స్నానం గావించారు. ఉత్సవ మూర్తులకు పంచామృతాభిషేకం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అత్యంత భక్తి శ్రద్ధలతో సత్యనారాయణ స్వామి పూజ కార్యక్రమం నిర్వహించారు. వైభవంగా ఊరేగింపు భూలక్ష్మీచెన్నకేశవస్వామి ఉత్సవమూర్తుల ఉరేగింపు వైభవంగా జరిగింది. స్వామివారి ఉత్సవ మూర్తులకు ప్రత్యేక పూజలు చేసి సాయంత్రం అశ్వవాహనంపై ఊరేగించారు. చెన్నకేశవస్వామి ఆలయం నుంచి పురవీధుల గుండా పెద్ద అగ్రహంలోని అహోబిళమఠం వరకు ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు. మఠంలోని లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో పూజలు నిర్వహించి తిరిగి ఊరేగింపుగా ఆలయానికి తీసుకొచ్చారు. భజనలు చేస్తూ, భక్తీ గీతాలు ఆలపిస్తు భక్తులు ఊరేగింపులో పాల్గొన్నారు. అనంతరం రాత్రి నాగవళీ, దేవత విసర్జన, సర్వసమర్పణోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంతో బ్రహ్మోత్సవ వేడుకలు ఘనంగా ముగిశాయి. ఈ కార్యక్రమంలో ఆలయ విచారణ కర్త ప్రభాకర్, మేనేజర్ స్వామిరాయ్ తదితరులు పాల్గొన్నారు. నెలాఖరు నాటికి సర్వే పూర్తి చేయాలి అలంపూర్: ఈ నెలాఖరు వరకు డిజిటల్ క్రాప్ సర్వేను పూర్తి చేయాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సక్రియానాయక్ అన్నారు. అలంపూర్ పట్టణంలోని పశు సంవర్ధక శాఖ శిక్షణ భవనంలో అలంపూర్ నియోజకవర్గంలోని మండలాల అధికారులు, విస్తరణ అధికారులకు శనివారం సమావేశం నిర్వహించగా ఆయన మాట్లాడారు. మండలాల వ్యవసాయ అధికారులు, విస్తరణ అధికారులు రైతుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు. ప్రతి రైతుకు చెందిన పంట వివరాలు, సర్వే నెంబర్తో సహా నమోదు చేయాలన్నారు. రైతు బీమాకు సంబందించిన పెండింగ్ ఉంటే నామినీకి సంబందించిన పత్రాలను సమర్పించి వారికి బీమా డబ్బులు అందించేలా చూడాలని, పీఎం కిసాన్, రైతు భరోసా, రుణ మాఫీ సమస్యలు ఉంటే తక్షణమే పరిష్కరించాలన్నారు. అధికారులు నిత్యం రైతులకు అందుబాటులో ఉంటూ యాసంగిలో సాగు చేసిన పంట సమస్యలు పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో డివిజనల్ వ్యవసాయ సాంకేతిక అధికారి సుబ్బారెడ్డి, వ్యవసాయ శాఖ మండలాల అధికారులు అనిత, సురేఖ, నాగార్జున్ రెడ్డి, సందీప్, జనార్థన్, రవికుమార్, విస్తరణ అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
ఉచిత కుట్టు మిషన్ల కోసం దరఖాస్తు చేసుకోండి
గద్వాల: రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ పథకం కింద మహిళలకు ఇందిరమ్మ మహిళా శక్తి పథకం కింద ఉచితంగా కుట్టుమిషన్లను అందిస్తున్నట్లు మైనార్టీ సంక్షేమ శాఖ జిల్లా అధికారి రమేష్బాబు ప్రకటనలో తెలిపారు. అర్హులైన మహిళలు దరఖాస్తు ఫారంతో పాటు ఆధార్కార్డు, తెల్లరేషన్కార్డు, కనీసం 5వ తరగతి చదివి ఉండాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో వారికి వార్షిక ఆదాయం రూ.1.50లక్షలు, పట్టణాల్లో ఉన్నవారికి రూ.2లక్షల వార్షిక ఆదాయం కలిగి ఉండాలని, దరఖాస్తులను మార్చి 2వ తేదీ లోపు జిల్లా మైనారిటీ కార్యాలయంలో సమర్పించాలని తెలిపారు. -
పాలకవర్గాలకే ‘సహకారం’
అచ్చంపేట: జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ), ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పాక్స్) పాలకవర్గాల పదవీకాలాన్ని ఆరు నెలలు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వం నుంచి వెలువడిన ఉత్తర్వులను ఆయా జిల్లాల సహకార శాఖ అధికారులు అందుకొని పీఏసీఎస్లకు పంపించారు. ఎన్నికల ప్రక్రియకు ఆరు నెలల ముందే కసరత్తు మొదలుపెట్టాల్సి ఉండగా ఇప్పటి వరకు ఆ ఊసేలేదు. దీంతో ప్రత్యేకాధికారుల పాలనా.. ప్రస్తుతం పాలకవర్గ పదవీకాలాన్ని పొడిగిస్తారా అన్న సందేహాలకు తాజా ఉత్తర్వులతో తెరపడింది. జిల్లాలోని 87 సొసైటీల పాలకవర్గాలు మరో ఆరు నెలలపాటు కొనసాగనున్నాయి. డీసీసీబీ పాలకవర్గ పదవీకాలాన్ని కూడా పొడిగిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే డీసీఎంఎస్కు సంబంధించి అంశం ఉత్తర్వుల్లో లేకపోవడం గమనార్షం. డీసీసీబీ, డీసీఎంఎస్ పాలకవర్గాలకు మరో పదిరోజుల సమయం ఉండటంతో ఈలోగా డీసీఎంఎస్ పాలకవర్గ పదవీ కాలం పొడిగింపు ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. హర్షాతిరేకాలు.. ఉమ్మడి జిల్లాలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల అధ్యక్షుల పదవీకాలం శనివారంతో ముగిసింది. జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ), జిల్లా సహకార మార్కెటింగ్ సంస్థ (డీసీఎంఎస్) పాలకవర్గాల పదవీకాలం ఈ నెల 20తో పూర్తవుతుంది. ప్రభుత్వం తాజా నిర్ణయంతో డీసీసీబీ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, పాలకవర్గ సభ్యులు, డీసీఎంఎస్ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, పాలకవర్గ సభ్యులు, సహకార సంఘాల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, డైరెక్టర్లలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. గతంలోనూ పొడిగింపు.. బీఆర్ఎస్ హయంలోనూ 2018 ఫిబ్రవరి 4న పాలకవర్గాల పదవీకాలం ముగియగా ఆరు నెలల చొప్పున రెండుసార్లు పర్సన్ ఇన్చార్జ్ల పదవీకాలాన్ని పొడిగించారు. 2020 ఫిబ్రవరి 15న ఎన్నికలు నిర్వహించారు. అంతకు ముందు కాంగ్రెస్ హయాంలోనూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఉన్నప్పుడు రెండేళ్లు, టీడీపీ హయాంలో అప్పటి సీఎం చంద్రబాబు మూడేళ్లపాటు పొడిగించారు. పర్చన్ ఇన్చార్జ్లను నియమిస్తే కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం రపదవీకాలాన్ని పొడిగించింది. పీఏసీఎస్, డీసీసీబీ చైర్మన్లపదవీకాలం ఆరు నెలలు పొడిగింపు డీసీఎంఎస్కు సంబంధించి వెలువడని నిర్ణయం -
జిల్లాలో ఏసీబీ దాడుల వివరాలిలా..
● 2018 ఫిబ్రవరి 19వ తేదీన అయిజ మండలం చిన్న తాండ్రపాడుకు చెందిన వీఆర్ఓ మద్దిలేటి రైతు నుంచి రూ.10 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు దొరికాడు. ● 2019 మార్చి 12వ తేదీన మల్దకల్ తహసీల్దార్ కార్యాలయంలో వీఆర్ఏ చిన్నయ్య రైతుల నుంచి రూ.15 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ వలలో చిక్కారు. ● 2020 జూలైలో డీఎంహెచ్ఓ బీమానాయక్ డాక్టర్ నుంచి రూ.7 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. ● 2021 సెప్టంబర్ 21వ తేదీ కేటీదొడ్డి మండల సర్వేయర్ తిక్కన్న రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికారు. ● 2023లో అయిజ విద్యుత్ శాఖలో పనిచేస్తున్న లైన్మెన్ జీవరత్నం రూ.20 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికారు. ● 2024 జూన్ 12న బీచుపల్లి పదో బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్ నరసింహతో పాటు రిటైర్డు ఏఆర్ఎస్ఐ అబ్దుల్ వహాబ్ రూ.50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. ● 2024 నవంబర్ 18న ఎర్రవల్లి మండలంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి పాండురంగరావు రూ.50 వేలు లంచం తీసుకుంటూ దొరికారు. -
సీఎంకు కృతజ్ఞతలు
పీఏసీఎస్ పాలకవర్గాల కాలపరమితి మరో ఆరు నెలలు పొడిగించేందుకు ప్రభుత్వ నిర్ణయం తీసుకోవడం సంతోషంగా ఉంది. మా విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకొని పెంచిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తమ్మల నాగేశ్వర్రావుకు కృతజ్ఞతలు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను రైతులకు మ రింత చేరువ చేసేందు కు సహకార వ్యవస్థను బలోపేతం చేస్తాం. – విష్ణువర్ధన్రెడ్డి, డీసీసీబీ చైర్మన్, మహబూబ్నగర్ ● -
ఎన్నాళ్లకెన్నాళ్లకు..
● ఫలించిన 17 ఏళ్ల ఎదురుచూపులు ● హైకోర్టు ఉత్తర్వులతో పోస్టింగులు ● కాంట్రాక్టు ఎస్జీటీలుగా అవకాశం ● ఉమ్మడి జిల్లాలో 182 మందికి న్యాయం సర్వీస్ కల్పించాలి.. 17 ఏళ్ల నిరీక్షణ తర్వాత ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వడం సంతోషంగా ఉంది. అయితే మేమంతా 17 ఏళ్ల సర్వీస్ కోల్పోయాం. ఇప్పటికి మాకు అనుకూలంగా తీర్పులు వచ్చాయి. ఉద్యోగం ఇస్తూ సర్వీస్, ఏరియర్స్ కల్పిస్తూ.. రెగ్యులర్ చేస్తే బాగుంటుంది. – విజయ్కుమార్, మద్దూరు నారాయణపేట/మద్దూర్: డీఎస్సీ– 2008 నష్టపోయిన బీఈడీ అభ్యర్థులకు కాంట్రాక్టు విధానంలో ఎస్టీటీలుగా వారం రోజుల్లోగా నియామకాలు పూర్తి చేయాలని హైకోర్టు తాజాగా ఉత్తర్వులు జారీ చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఉమ్మడి జిల్లాలోని బాధిత అభ్యర్థుల్లో సంతోషం వ్యక్తమవుతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నోటిఫికేషన్ అనంతరం తీసుకున్న నిర్ణయం మేరకు 30 శాతం పోస్టులు ప్రత్యేకంగా డీఈడీ అభ్యర్థులకు కేటాయించడంతో బీఈడీ అభ్యర్థులు నష్టపోయారు. మెరిట్ జాబితాలో ఉన్నా.. ఉద్యోగాలు రాకపోవడంతో కోర్టుల చుట్టూ తిరుగుతూ వస్తున్నారు. 17 ఏళ్ల న్యాయ పోరాటం.. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు వీరందరికీ మినిమం టైం స్కేల్ వర్తింపజేస్తూ కాంట్రాక్టు విధానంలో నియమించనున్నారు. అయితే వీరందరికీ సాధ్యమైనంత త్వరగా పోస్టింగ్ ఇవ్వాలని గతంలోనే హైకోర్టు స్పష్టం చేసినా వివిధ కారణాలతో జ్యాపం జరుగుతూ వచ్చింది. సర్టిఫికెట్ల పరిశీలన ఇప్పటికే సర్టిఫికెట్ల పరిశీలన ఉమ్మడి జిల్లాల వారీగా పూర్తయింది. ఈ పరిశీలన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 5 వరకు కొనసాగింది. తాజాగా కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించగా ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నియామక ఉత్తర్వులను వారం రోజుల్లో ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో బాధిత అభ్యర్థులు కాంట్రాక్టు ఎస్జీటీలుగా నియామకం కానున్నారు. దీంతో ఉమ్మడి పాలమూరు జిల్లావ్యాప్తంగా 182 మందికి ఉద్యోగాలు దక్కనున్నాయి. ఉమ్మడి జిల్లాల వారీగా సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తయినప్పటికీ నూతన జిల్లాల వారీగానే పోస్టింగ్ ఇవ్వాలని అభ్యర్థులు కోరుతుండగా.. ఖాళీలను బట్టీ పూర్తి చేయనున్నట్లు తెలుస్తోంది. ఉద్యోగుల సంఖ్య జోగుళాంబ గద్వాల50 మహబూబ్నగర్ 10 డీఎస్సీ 2008 అభ్యర్థులకు ఉద్యోగాలు జిల్లాల వారీగా అభ్యర్థులు ఇలా.. నారాయణపేట 50 నష్టపోయాం.. డీఎస్సీ– 2008లో వెలువడిన నోటిఫికేషన్ ద్వారా పోటీ పరీక్షల్లో ఎంపికై కౌన్సెలింగ్ సమయంలో ట్రిబ్యునల్ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల కారణంగా చాలా నష్టపోయాం. అప్పటి నుంచి కోర్టుల చుట్టూ తిరుగుతున్నాం. ఇప్పటికై నా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వడం హర్షణీయం. – బుగ్గప్ప, మద్దూరు సంతోషంగా ఉంది.. 17 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత మాకు ఉద్యోగం రావడం చాలా సంతోషంగా ఉంది. గత 17 ఏళ్లుగా వ్యాపారం చేస్తూ జీవనం కొనసాగించాను. 2008లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలోనే మాకు అన్యాయం జరిగి.. మళ్లీ అదే ప్రభుత్వంలో ఉద్యోగం రావడం ఆనందంగా ఉంది. – రవిప్రకాష్, నారాయణపేట వనపర్తి 40 నాగర్కర్నూల్ 32 న్యాయ పోరాటంతోనే.. ఎన్నో సంవత్సరాల పోరాటంతో ఫలించిన అద్భుత క్షణం ఇది. 2008లో డీఎస్సీ రోస్టర్లో మా పేర్లు ఉన్నా కొన్ని కారణాలతో ఉద్యోగం రాలేదు. 28 జీఓ ప్రకారం మా ఉద్యోగాలు మాకు రావాలని న్యాయస్థానాన్ని ఆశ్రయించగా.. ఎట్టకేలకు అనుకూలంగా తీర్పు రావడం సంతోషంగా ఉంది. – బాలస్వామి, నాగర్కర్నూల్ కొత్త జిల్లాల వారీగా.. ఇప్పటికై నా ఉద్యోగం రావడం చాలా ఆనందంగా ఉంది. కానీ, మమ్మల్ని మా స్థానికత ఆధారంగా కొత్త జిల్లాల వారీగా నియమిస్తే బాగుండేది. అలాగే ఎంటీఎస్ విధానంలో జీతాలు ఇవ్వకుండా రెగ్యులర్ టీచర్ల మాదిరిగానే చెల్లించేలా చూడాలి. – అరుణ, వనపర్తి -
ఆగని అవినీతి
కొన్ని ప్రభుత్వ కార్యాలయాలు అవినీతికి అడ్డాగా మారాయి. ప్రభుత్వం నుంచి ప్రతి నెలా ఠంచన్గా జీతాలు పొందుతున్నా.. కొందరు ఉద్యోగులు ధనార్జనే ధ్యేయంగా అవినీతికి తెరలేపారు. ఫైలు ముందుకు కదలాలన్న.. పని పూర్తి కావాలన్నా.. ప్రతి పనికో రేటు చొప్పున చేయి తడపాల్సిందే. దీంతో కాళ్లరిగేలా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగి తిరిగి వేసారిన కొందరు బాధితులు ఎంతో కొంత నగదు ముట్టజెబుతుండగా.. మరికొందరు ఏసీబీని ఆశ్రయిస్తున్నారు. అడపాదడపా ఏసీబీ ఉచ్చులో అధికారులు చిక్కుతున్నారు. అయినా కూడా మిగతా వారిలో మార్పు రావడంలేదు. పైపెచ్చు అవినీతిని కొంత పంథాలో కొనసాగిస్తూ.. మధ్య దళారులతో వ్యవహారం నడిపిస్తుండడం గమనార్హం. -
ఉన్నతాధికారులపరిశీలనలో ఉంది..
ఎల్లూరు లిఫ్టులోని ఐదు మోటార్లలో రెండు మోటార్లు పాడై చాలా కాలం అవుతోంది. ఇటీవల మరో పంపు మోటారు కూడా స్వల్ప మరమ్మతుకు గురైంది. అయితే దీనికి ఇక్కడే మరమ్మతు చేయవచ్చు. ప్రస్తుతం రెండు మోటార్లతోనే నీటి ఎత్తిపోతలు సాగుతున్నాయి. అయితే మిషన్ భగీరథ కోసం రెగ్యులర్గా నీటి ఎత్తిపోతలు చేపట్టాలి. ఇలా చేయడం వల్ల మోటార్ల మరమ్మతు చేపట్టేందుకు ఆటంకం ఏర్పడుతుంది. ఇప్పటికై తే మరమ్మతు అంశం ఉన్నతాధికారుల పరిశీలనలో ఉంది. – లోకిలాల్నాయక్, పంపుహౌజ్ నిర్వహణ విభాగం డీఈఈ ● -
రెవెన్యూ అధికారిపై విచారణకు ఆదేశం
గద్వాల: నిబంధనలకు తూట్లు పొడుస్తూ.. పనికో రేటు చొప్పున డబ్బులు వసూలు చేస్తున్న రెవెన్యూ అధికారిపై అంతర్గత విచారణకు ఉన్నతాధికారులు ఆదేశించినట్లు తెలుస్తోంది. లంచం ఇస్తే చాలు పట్టా భూముల్లో మార్పులు చేయడం, ఇసుక, మట్టి అక్రమ రవాణాకు గ్రీన్సిగ్నల్ ఇవ్వడం తదితర వాటిపై ‘పనికో రేటు’ శీర్షికన శుక్రవారం ‘సాక్షి’లో కథనం ప్రచురితమవగా ‘జిల్లాలో కలకలం రేగింది. అలాగే, ఈ అవినీతి వసూళ్లను చక్కబెట్టేందుకు ఏకంగా ఓ వ్యక్తిని మధ్యవర్తిగా పెట్టుకోగా.. సదరు వ్యక్తి శుక్రవారం ఆఫీసు పరిసర ప్రాంతాల్లో కూడా కనిపించలేదని కార్యాలయ సిబ్బంది చర్చించుకోవడం గమనార్హం. జిల్లాలో ఇప్పటికే పలువురు రెవెన్యూ అధికారుల పనితీరు, డబ్బుల వసూళ్లపై పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. ఈక్రమంలోనే గట్టు మండల తహసీల్దార్ సరితపై పలు ఆరోపణలు వెల్లువెత్తగా అంతర్గత విచారణ జరిపిన కలెక్టర్ తహసీల్దార్పై శాఖపరమైన చర్యల్లో భాగంగా సస్పెండ్ వేశారు. ఇదేక్రమంలో మరో రెవెన్యూ అధికారి అవినీతి లీలలపై సోషల్మీడియాలో వెలుగుచూడగా.. ‘సాక్షి’ కథనంపై జిల్లా పరిపాలన ఉన్నతాధికారి అంతర్గత విచారణకు ఆదేశించినట్లు విశ్వసనీయ సమాచారం. విచారణలో నిజాలు వెలుగు చూసి ఏమేర చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి. -
మహాశివరాత్రి ఉత్సవాలకు పటిష్ట ఏర్పాట్లు
గద్వాల: అలంపూర్ జోగుళాంబ శక్తిపీఠంలో మహాశివరాత్రి ఉత్సవాలకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ మేరకు శుక్రవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలులో అధికారులతో సమీక్షించారు. ఈనెల 25వ తేదీ నుంచి మార్చి 1వ తేదీ వరకు నిర్వహించే మహాశివరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలన్నారు. ఇందుకు సంబంధించిన అన్ని రకాల ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలన్నారు. దేవాదాయ, పోలీసు, రెవెన్యూ శాఖల అధికారులు సమన్వయం చేసుకుంటూ ఎక్కడా అవంతారాలు, ఆటంకాలు తలెత్తకుండా ఉత్సవాలను నిర్వహించాలన్నారు. హాజరయ్యే భక్తుల సంఖ్య అంచనాకు అనుగుణంగా బారికేడ్స్, తాగునీటి వసతి, మరుగుదొడ్లు, వైద్యసేవలు, విద్యుత్ సరఫరా, శానిటేషన్, పుష్కరఘాట్ వద్ద ప్రమాదం చోటుచేసుకోకుండా గజ ఈతగాళ్లతోపాటు, పోలీసు పహారాను ఏర్పాటు చేయాలన్నారు. భక్తులకు రవాణా సౌకర్యం కోసం అవసరమైన మేర ఆర్టీసీ బస్సులు నడిపించాలని సూచించారు. అగ్నిప్రమాదాల కట్టడికి, ప్రసాదాల పంపిణీ సజావుగా జరిగేలా అవసరమైన మేర కౌంటర్లు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. -
గజ వాహనంపై ఊరేగిన చెన్నకేశవుడు
గద్వాలటౌన్: భూలక్ష్మీ చెన్నకేశవస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని శుక్రవారం రాత్రి 7గంటలకు చెన్నకేశవస్వామి గజవాహనంపై ఊరేగాడు. అంతకు ముందు ఆలయ నిర్వాహకులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. అనంతరం భూలక్ష్మీ చెన్నకేశవస్వామి ఉత్సవ మూర్తులను రాఘవేంద్రస్వామి మఠం వరకు గజవాహనంపై ఊరేగించారు. శేషదాస భజన మండలి సభ్యులు భక్తిగీతాలు ఆలపిస్తూ ముందుకు సాగారు. స్వామి వారి దర్శనం చేసుకొని భక్తులు తరించారు. నేడు సత్యనారాయణస్వామి వ్రతం బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం ఉదయం ఆలయ ప్రాంగణంలో సత్యనారాయణస్వామి వ్రతాన్ని నిర్వహిస్తున్నట్లు ఆలయ విచారణ కర్త ప్రభాకర్ తెలిపారు. సాయంత్రం చెన్నకేశవస్వామి ఉత్సవ మూర్తులను పెద్ద అగ్రహారంలోని అహోబిల మఠం వరకు అశ్వవాహనంపై ఊరేగింపు ఉంటుందన్నారు. సైనికుల సేవలు వెలకట్టలేనివి గద్వాలటౌన్: శ్రీనగర్లోని పుల్వామా వద్ద జరిగిన దాడిలో అమరులైన జవాన్లకు విద్యార్థులు ఘన నివాళులర్పించారు. శుక్రవారం ప్రభుత్వ పీజీ సెంటర్తో పాటు ప్రభుత్వ డిగ్రీ, జూనియర్ కళాశాలల్లో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించారు. వీరమరణం పొందిన 44 మంది జవాన్ల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. వీర జవాన్ల ఆత్మకు శాంతి కలగాలని మౌనం పాటించారు. ఈ సందర్భంగా పీజీ సెంటర్ ప్రిన్సిపల్ వెంకట్రెడ్డి మాట్లాడుతూ.. తమ ప్రాణాలను పణంగా పెట్టి దేశ రక్షణ కోసం శ్రమిస్తున్న సైనికులు సేవలు వెలకట్టలేనివని, వారి వల్లే ప్రజలు స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్నారని కొనియాడారు. ‘పెద్ద చింతరేవుల’లో ప్రముఖుల ప్రత్యేక పూజలు ధరూరు: మండల ంలోని పెద్ద చింతరేవుల ఆంజనేయ స్వామి ఆలయంలో శుక్రవారం ఆయుష్మాన్ భారత్ రాష్ట్ర అడిషనల్ డైరెక్టర్ లింగరాజు దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా వారికి ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా స్వామి వారికి మొక్కులు సమర్పించుకున్నారు. అనంతరం అర్చకులు ఆలయ ప్రాశస్త్యాన్ని వారికి వివరించి తీర్థ ప్రసాదాలు, స్వామి వారి శేష వస్త్రాన్ని అందజేశారు. అర్చకులు కిష్టాచార్యులు, ఆలయ ధర్మకర్త గిరిరావు పాల్గన్నారు. క్రీడాస్ఫూర్తితో ఉన్నత శిఖరాలు గద్వాలటౌన్: ప్రతి క్రీడాకారుడికి క్రీడాస్ఫూర్తి ముఖ్యమని, దీని వల్లే భవిష్యత్లో ఉన్నత శిఖరాలకు చేరుకుంటారని మున్సిపల్ మాజీ చైర్పర్సన్ పద్మావతి, డీవైఎస్ఓ జితేందర్ పేర్కొన్నారు. ఈ నెల 20 తేదీ నుంచి 23వ తేదీ వరకు వికారాబాద్లో జరిగే రాష్ట్రస్థాయి సబ్ జూనియర్స్ బాలుర, బాలికల కబడ్డీ టోర్నమెంట్కు జిల్లాస్థాయి ఎంపిక పోటీలు నిర్వహించారు. శుక్రవారం స్థానిక ఇండోర్ స్టేడియంలో జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎంపిక పోటీలకు ఆయన ముఖ్య అతిథిగా హజరై క్రీడాకారులను ఉద్ధేశించి మాట్లాడారు. ప్రతి క్రీడాకారుడు జాతీయస్థాయి పోటీలను లక్ష్యంగా నిర్దేశించుకొని ఆడాలని సూచించారు. జిల్లా కబడ్డీ అసోసియేషన్ సెక్రటరి నర్సింహా, చైర్మన్ అబ్రహాం, రవి, చందు, నగేష్, కరెంటు నర్సింహా, జగదీష్, రైల్వేపాష, రాజశేఖర్ పాల్గొన్నారు. స్కూటీలు ఇవ్వాలంటూ పోస్టుకార్డు ఉద్యమం గద్వాలటౌన్: ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ విద్యార్థులు, యువతకు ఇచ్చిన ఉచిత స్కూటీ హామీపై బీఆర్ఎస్ ఆధ్వర్యంలో విద్యార్థులు పోస్టుకార్డు ఉద్యమం చేపట్టారు. శుక్రవారం స్థానిక ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ, పీజీ కళాశాలలో విద్యార్థినుల చేత పోస్టుకార్డు ఉద్యమాన్ని నిర్వహించారు. ‘ప్రియాంక జీ వేర్ ఈజ్ స్కూటీ’ అంటూ విద్యార్థులు ఉత్తరాలు రాశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఉచిత ఎలక్ట్రిక్ స్కూటీల హామీను అమలు చేసేంత వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని బీఆర్ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి కుర్వ పల్లయ్య అన్నారు. -
అవినీతి ‘ప్లానింగ్’
పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న అనధికార నిర్మాణాలు ‘ఈ చిత్రంలో కనిపిస్తున్న భవన నిర్మాణం.. 34వ వార్డులోని కుంటవీధిలో ప్రజాఅవసరాల కోసం వదలిన పదిశాతం స్థలంలో చేపడుతున్నారు. 266 చదరపు గజాల స్థలంలో నకిలీ డాక్యుమెంట్లతో అనుమతి పొంది, అక్రమంగా ఇంటి నిర్మాణం చేపడుతున్నారు. ఏడాదిన్నర క్రితం ఈ అక్రమ భవన నిర్మాణంపై ఫిర్యాదు చేస్తే, అప్పటి అడిషనల్ కలెక్టర్ అపూర్వ్చౌహన్ అనుమతులు రద్దుచేసి, నిర్మాణ పనులు నిలిపివేయించారు. తాజాగా మళ్లీ స్థలాన్ని ఆక్రమించిన వ్యక్తి (మాజీ కోఆప్షన్ సభ్యుడు) పనులు ప్రారంభించారు. దీనిపై అధికారుల నుంచి మీసమెత్తు స్పందన లేకపోవడం గమనార్హం. దీనిపై స్థానికులు కోర్టును ఆశ్రయిస్తున్నారు.’ -
No Headline
గద్వాలటౌన్: పట్టణ అభివృద్ధి మొత్తం ‘ఆక్రమణలు.. అనధికార నిర్మాణాలు.. అధికారుల అవినీతి..’ అన్న చందంగా సాగిపోతోంది. ఇందులో మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ విభాగం కీలకపాత్ర వహిస్తోంది. నిబంధనల ప్రకారం నిర్మాణాల్లో అధికారులు సూచించిన ప్రమాణలేవీ అమలుకావడం లేదు. అధికారులు వివిధ వర్గాల ఒత్తిళ్లకు తలొగ్గుతుండటమే ఇందుకు కారణమవుతోంది. అదే సందర్భంలో కొందరు అధికారులు ఇంటి యజమానులను వేధిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. టౌన్ ప్లానింగ్ అవినీతి ఊబిలో కూరుకుపోతుండటంతో మున్సిపాలిటీ ఖజానాకు భారీగా గండి పడుతోంది. ఎందుకిలా.. టౌన్ ప్లానింగ్ అధికారులపై కమిషనర్లు నేరుగా చర్యలు తీసుకునే పరిస్థితి లేదు. టౌన్ ప్లానింగ్ డైరెక్టర్కు ఫిర్యాదు చేయాలి. ఈ విభాగంపై వచ్చిన ఫిర్యాదులు ఉన్నత స్థాయిలో పేరుకుపోయిన అవినీతి మూలంగా బుట్టదాఖలవుతున్నాయి. ఫలితంగా ఇష్టారాజ్యంగా నిర్మాణాలు జరిగాయి. అయితే ప్రస్తుత మున్సిపల్ కొత్త చట్టం ప్రకారం కలెక్టర్లకు పూర్తి అధికారాలు ఉన్నాయి. అవినీతిని కట్టడి చేయడంతో పాటు టౌన్ ప్లానింగ్లో అక్రమాలను నియంత్రించవచ్చు. పర్యవేక్షణ శూన్యం జిల్లాలోని గద్వాల, అయిజ, అలంపూర్, వడ్డేపల్లి మున్సిపాలిటీలలో టౌన్ ప్లానింగ్ అధికారుల పర్యవేక్షణ కరవైంది. జిల్లా కేంద్రంలో ఇద్దరికిగాను ఒక టీపీఎస్, అయిజలో ఒక టీపీఎస్ మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. మిగిలిన చోట్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీనికి తోడు టౌన్ ప్లానింగ్ అధికారులపై రాజకీయ ఒత్తిళ్లు కూడా సహజంగానే ఎక్కువ. అధికారుల ఊదాసీనత కారణంగా రాజకీయ నాయకులు పెత్తనం చెలాయిస్తూ టౌన్ ప్లానింగ్ వ్యవస్థను తమ కనసన్నలలో నడుపుతున్నారు. దీంతో టౌన్ ప్లానింగ్ అవినీతి బాటలో పయనిస్తోంది. -
3, 5 నంబర్ల మోటార్లు
కేఎల్ఐ ప్రాజెక్టులోని ఎల్లూరు పంప్హౌజ్ నుంచి నీటిని ఎత్తిపోసి.. ఎల్లూరు, సింగోటం, జొన్నలబొగుడ, గుడిపల్లి గట్టు రిజర్వాయర్లు నింపాలి. ఈ రిజర్వాయర్లకు అనుసంధానంగా ఉన్న చెరువులను కూడా రెగ్యులర్గా నింపుతూ ఉండాలి. ఇందుకోసం ఎల్లూరు పంప్హౌజ్లో 5 మోటార్లను ఏర్పాటు చేశారు. వీటిలో రెండు మోటార్లు పాడయ్యాయి. నాలుగున్నరేళ్ల క్రితం పంప్హౌజ్లోకి నీరు చేరడంతో మూడో నంబర్ పంప్ మోటార్ దెబ్బతినగా.. ఇప్పటి వరకు ఆ మోటార్ మరమ్మతుకు నోచుకోలేదు. అలాగే రెండేళ్ల క్రితం 5వ నంబర్ పంప్ మోటార్ కూడా దెబ్బతినగా.. దీనిని కూడా అలాగే వదిలేశారు. దీంతో మిగిలిన మూడు మోటార్లతోనే నీటి ఎత్తిపోతలు చేపడుతున్నారు. -
నిబంధనలకు తిలోదకాలు..
జిల్లా కేంద్రంతోపాటు అయిజ, శాంతినగర్లలో 90 శాతం నివాస గృహ నిమిత్తం అనుమతి పొంది వాణిజ్య దుకాణాలు, సముదాయాలుగా నిర్మిస్తున్నారు. నిర్మాణాలకు ఎదుట సెట్బ్యాక్ వదలకుండా నిబంధనలను తుంగలో తొక్కి కట్టడాలను చేపట్టారు. వాస్తవానికి నివాస గృహ నిమిత్తం పొందే అనుమతి కంటే వాణిజ్య నిర్మాణానికి సంబంధించిన అనుమతికి మూడింతల సొమ్ము ఫీజు రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. దీంతోపాటు ఆస్తిపన్ను రూపేనా రూ.లక్షల్లో ఆదాయం కోల్పోవాల్సి వస్తుంది. ఈ లెక్కన మున్సిపాలిటీకి రావాల్సిన ఆదాయం కొంతమంది నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారుల జేబుల్లోకి చేరిపోతోంది. వీటితో పాటు చాలా మంది జీ+1 అనుమతితో మూడు, నాలుగు అంతస్తులతో పాటు సెల్లార్లు నిర్మిస్తున్నారు. ఇలా జరుగుతున్న నిర్మాణాల వైపు అధికారులు కన్నెత్తి చూడటం లేదు. -
నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలి
గద్వాల: రానున్న వేసవిని దృష్టిలో ఉంచుకుని జిల్లాలో నాణ్యమైన విద్యుత్ను అంతరాయం లేకుండా సరఫరా చేయాలని కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. శుక్రవారం ఆయన విద్యుత్ శాఖ అధికారులతో సమీక్షించారు. వేసవిలో డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని అందుకు సరిపడా విద్యుత్ను సరఫరా చేయాలని ఆదేశించారు. అదేవిధంగా వివిధ రకాల పనులు చేపట్టేందుకు రూ.50కోట్లు విడుదల అయ్యాయని త్వరలోనే పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. ఇందులో అదనంగా 33 కేవీ, 11 కేవీ ఎల్టీ లైన్స్ అదనపు ట్రాన్స్ఫార్మర్లు వంటి పనులు చేపట్టాల్సి ఉందన్నారు. సమావేశంలో ఎస్ఈ తిరుపతిరావు, ఏడీలు రమేష్బాబు, గోవిందు, నవీన్బాబు తదితరులు పాల్గొన్నారు. -
మరమ్మతు చేయరా..?
కేఎల్ఐ ప్రాజెక్టులో పాడైన రెండు మోటార్లు ● ఎల్లూరు పంప్హౌజ్లో నాలుగున్నరేళ్లుగా గాలికొదిలేసిన వైనం ● మూడింటితోనే కొనసాగుతున్న ఎత్తిపోతలు ● వివిధ రకాల సాకులతో కాలయాపన ● ఏటా వేసవిలో తప్పని సాగు, తాగునీటి కష్టాలు మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో పంపు మోటార్ల మరమ్మతు ఏళ్ల తరబడిగా పెండింగ్లో పడుతూనే ఉంది. నాగర్కర్నూల్ జిల్లాలోని నాలుగు నియోజకవర్గాలతో పాటు వనపర్తి జిల్లాలోని పలు ప్రాంతాలకు సాగునీరు, ఉమ్మడి పాలమూరు–రంగారెడ్డి జిల్లాలకు తాగునీరు కేఎల్ఐ ప్రాజెక్టు ద్వారా అందుతున్నాయి. ప్రాజెక్టు పరిధిలోని ఎల్లూరు లిఫ్టు నుంచి కృష్ణానది నీటిని ఎత్తిపోసి రిజర్వాయర్లు, చెరువులు నింపుతున్నారు. అయితే ప్రాజెక్టులోని మొదటి పంపుహౌజ్ (ఎల్లూరు లిఫ్టు)లో రెండు మోటార్లు పాడై ఏళ్లు గడుస్తున్నా.. నేటికీ మరమ్మతుకు నోచుకోవడం లేదు. ఇందుకు ఇటు ఇంజినీరింగ్ అధికారులు, సంబంధిత కంపెనీ ప్రతినిధులు వేర్వేరు కారణాలు చెబుతున్నారు. ఎత్తిపోతలకు ఇక్కట్లు.. ఎల్లూరు పంప్హౌజ్లో ప్రస్తుతం పనిచేస్తున్న మూడు మోటార్లలో రెండింటితోనే నీటి ఎత్తిపోతలు నిర్వహిస్తుండగా.. మరొకటి స్పేర్లో ఉంది. రెండు మోటార్లతోనే నీటి ఎత్తిపోతలు చేపడుతుండటంతో వరదల సమయంలో జిల్లాలోని రిజర్వాయర్లు, చెరువులు నింపేందుకు ఆలస్యమవుతోంది. కృష్ణానది వరద ప్రవాహ సమయంలో ఎల్లూరు పంప్హౌజ్లో నాలుగు మోటార్లు నడిపించి రోజుకు 3,200 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోయాలి. ఈ నీటితో రిజర్వాయర్లతో పాటు, చెరువులు కూడా నింపుకోవాలి. కానీ, ఎల్లూరు లిఫ్టులో రెండు మోటార్లు మాత్రమే పనిచేస్తుండడంతో ఆశించిన స్థాయిలో ఎత్తిపోతలు జరగడం లేదు. దీంతో జిల్లావ్యాప్తంగా ఉన్న 2,208 చెరువులు నింపేందుకు నెలలు గడిచిపోతోంది. మరమ్మతులకు ఆటంకం కేఎల్ఐ ప్రాజెక్టులో మోటార్లు పాడైతే మరమ్మతు చేపట్టడం ఇబ్బందికరంగా మారుతోంది. ఉమ్మడి పాలమూరు, రంగారెడ్డి జిల్లాలకు తాగునీటిని సరఫరా చేసే మిషన్ భగీరథ స్కీం కేఎల్ఐ ప్రాజెక్టుకు అనుసంధానంగా ఉండటంతో రెగ్యులర్గా నీటి ఎత్తిపోత జరుగుతుంది. దీంతో మోటార్ల మరమ్మతుకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి. మోటార్లు మరమ్మతు చేయాలంటే నీటి ఎత్తిపోతలు కొంతకాలం పాటు పూర్తిగా నిలిపివేయాల్సి ఉంటుంది. పాలమూరు ప్రాజెక్టు పూర్తిగా అందుబాటులోకి వస్తేనే కేఎల్ఐ ప్రాజెక్టు ద్వారా నీటి ఎత్తిపోతలు నిలిపే అవకాశం ఉంది. పాలమూరు ప్రాజెక్టు ద్వారా నీటి సరఫరా ప్రారంభమయ్యే వరకు మోటార్లకు మరమ్మతు చేపట్టడం కష్టమేనని అధికారులు చెబుతున్నారు. అయితే పాత బిల్లులు పెండింగ్లో ఉండటం కూడా కొంత కారణమని సంబంధిత కంపెనీ ప్రతినిధులు పేర్కొంటున్నారు. ఉమ్మడి పాలమూరువాసుల సాగు, తాగునీటి కష్టాలు తీర్చాలనే ఉద్దేశంతో.. రూ.వేల కోట్లు వెచ్చించి.. సంవత్సరాల తరబడి శ్రమించి ప్రాజెక్టు నిర్మించారు.. కానీ, రెండు మోటార్లకు చిన్నపాటి మరమ్మతు చేసేందుకు అంతకు మించి కాలయాపన చేస్తున్నారు. ఇందులో ఎవరి నిర్లక్ష్యం ఉంది.. ఎవరు అలసత్వం ప్రదర్శిస్తున్నారనే విషయం పక్కనపెడితే.. ఉమ్మడి జిల్లా ప్రజలు మాత్రం ప్రతిఏటా ఎండాకాలంలో ఇటు సాగునీటికి, అటు తాగునీటికి గోస పడక తప్పడం లేదు. – కొల్లాపూర్ -
న్యాయవాదుల విధుల బహిష్కరణ
అలంపూర్: రంగారెడ్డి జిల్లా కోర్టులో మహిళా జడ్జిపై దాడి ఘటనను ఖండిస్తూ శుక్రవారం అలంపూర్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు నిరసన తెలిపి విధులు బహిష్కరించారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సురేష్ కుమార్ మాట్లాడుతూ...రంగారెడ్డి జిల్లా కోర్టులో న్యాయమూర్తి తీర్పు వెలువరిస్తున్న క్రమంలో జీర్ణించుకోలేని ముద్దాయి న్యాయమూర్తిపై దాడికి పాల్పడినట్లు అందోళన వ్యక్తం చేశారు. న్యాయమూర్తి పై దాడి న్యాయవ్యవస్థపై దాడిగా భావించాలన్నారు. ఇటీవల న్యాయవాదులపై దాడులు పెరుగుతున్నాయని భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా రక్షణ కోసం ప్రత్యేక చట్టం తీసుకురావాల డిమాండ్ చేశారు. కార్యక్రమంలో న్యాయవాదులు రాజేశ్వరి, నారాయణ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, గ వ్వల శ్రీనివాసులు, నాగరాజు యాదవ్, తిమ్మారెడ్డి, ఆంజనేయులు, వెంకటేష్ తదితరులు ఉన్నారు. -
విద్యార్థులు పరీక్షలంటే భయం వీడాలి
ఇటిక్యాల: విద్యార్థులు పరీక్షలపై భయం వీడాలని.. క్రమశిక్షణతో చదివి వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలని ఎస్పీ శ్రీనివాస్రావు అన్నారు. గురువారం మండలంలోని ఉదండాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించి వివేక్ ట్రస్ట్ నుంచి పలు వస్తువులను పాఠశాలకు ఎస్పీ అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన విద్య లభిస్తుందని, విద్యార్థులు సేవాగుణంతో మెలిగి విలువలతో కూడిన విద్యను అభ్యసించాలని సూచించారు. ప్రతి విద్యార్థి ఉన్నత శిఖరాలకు చేరుకొని తల్లిదండ్రులకు, గురువులకు మంచి పేరును తీసుకురావాలన్నారు. అనంతరం జిల్లా పోలీస్ యంత్రాంగం ద్వారా పాఠశాలకు రూ.25 వేలను అందించారు. అనంతరం వివేక్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ నుంచి భీమన్న మాట్లాడుతూ చదువు ద్వారానే గుర్తింపు లభిస్తుందని, భవిష్యత్ను మారుస్తుందని అన్నారు. పాఠశాలకు రూ.40వేల విలువ గల సామగ్రిని అందించడం జరిగిందన్నారు. పదో తరగతి ఫలితాల్లో 10 జీపీఏ గ్రేడ్ సాధించిన విద్యార్థులకు రూ.10 వేల నగదును అందిస్తానని ఆయన తెలిపారు. కార్యక్రమంలో సిఐ రవిబాబు, ఎంఈఓ వెంకటేశ్వర్లు, ఎస్ వెంకటేష్, హెచ్ఎంలు రెడ్డినాయక్, నాగరాజ్, పాఠశాల చైర్మెన్ నాగేశ్వరమ్మ పాల్గొన్నారు. -
మెరుగైన బోధన చేయాలి
గద్వాల: విద్యార్థులకు మెరుగైన బోధనతోపాటు, నాణ్యమైన పోషకాహారాన్ని అందించాలని అదనపు కలెక్టర్ నర్సింగ్రావు అధికారులను ఆదేశించారు. గురువారం గద్వాల మండలం పుటాన్పల్లి గ్రామంలో గిరిజన సంక్షేమశాఖ రెసిడెన్సియల్ జూనియర్ కాలేజీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా వంటగది, సిద్ధంగా ఉంచిన భోజనాన్ని పరిశీలించారు. మెనూ ప్రకారం విద్యార్థులకు పోషకాహారాన్ని అందించాలన్నారు. విద్యార్థులతో సమస్యలపై ఆరా తీశారు. హాజరు రిజిస్టర్ను పరిశీలించారు. విద్యార్థుల హాజరుశాతం మెరుగుపడేలా ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, అదేవిధంగా పరిశుభ్రత విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. -
పనికో రేటు..!
జిల్లాకేంద్రంలో ఓ రెవెన్యూ అధికారి అవినీతి లీలలు గద్వాల: ఆయనొక రెవెన్యూ అధికారి. నిబంధనల ప్రకారం జరగాల్సిన పనులను తాత్సారం చేస్తూ.. ఎవరైతే లంచం ఇస్తారో వెనువెంటనే నిబంధనలను తుంగలో తొక్కేసి ఠక్కున పనిచేసి పెడుతూ అక్రమార్కుల నీరాజనాలు పొందుతున్నారు. ఈ అవినీతి వసూళ్లను చక్కబెట్టేందుకు ఏకంగా ఓ వ్యక్తిని దళారీగా పెట్టుకున్నాడు. ప్రభుత్వ అసైన్డ్ భూములు.. ఇనామ్ భూములు..లిటిగేషన్ ఉన్న పట్టా భూముల్లో ఏ మార్పులు చేయాలన్నా.. ఇసుక, మట్టి అక్రమ రవాణా చేయాలన్నా.. ఇలా ఏ పనైనా సరే లంచం ఇస్తే తెల్లారేసరికి అంతా ఓకే చేసి అందినకాడికి రూ.లక్షల్లో జేబులు నింపుకొంటున్నాడు. సదరు రెవెన్యూ అధికారి అవినీతిపై ఇప్పటికే సోషల్ మీడియాలో పోస్టులు చక్కర్లు కొడుతుండడంతో జిల్లాలో హాట్టాపిక్గా మారింది. మధ్యవర్తి ఆధ్వర్యంలోనే సెటిల్మెంట్లు ఇదిలాఉంటే రాత్రి వేళలో సదరు రెవెన్యూ అధికారి ఇంటి వద్ద భూపైరవీకారులు, ఇసుక, మట్టి దందా చేసే వ్యక్తులతో పెద్ద క్యూలైనే ఉంటుందని ప్రచారం వినిపిస్తోంది. రాత్రి వేళ వచ్చి సెటిల్మెంట్ చేసుకున్న వారికి మరుసటినాడే పని పక్కా అయిపోతుందని పైరవీకారులు బాహటంగా చెబుతున్నారు. ఈ అవినీతి దందాలకు సంబంధించి సెటిల్మెంట్ చేసేందుకు వడ్డేపల్లి మండలం రామాపురానికి చెందిన ఓ వ్యక్తిని మధ్యవర్తి (బ్రోకర్)గా నియమించుకున్నాడు. ఇతని ద్వారానే అన్ని రకాల లావాదేవీలు కొనసాగుతాయని కార్యాలయ సిబ్బందే పేర్కొంటున్నారు. ఒకవేళ సదరు మధ్యవర్తి అధికారి కార్యాలయంలో ఉన్నాడంటే.. బయటి వ్యక్తులతోపాటు కార్యాలయ సిబ్బంది కూడా ఆ గదిలోకి వెళ్లాలంటే హడలెత్తిపోతున్నారని సమాచారం. ప్రజాప్రతినిధి ఆగ్రహం ప్రజలకు సేవలందించాల్సిన కీలక శాఖలో ఉండే అధికారి ఇలా బరితెగించి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న వైనంపై ఓ నియోజకవర్గ ప్రజాప్రతినిధికి పలువురు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంలో వారి కుటుంబ సభ్యుల పేర్లు సైతం వినిపిస్తుండడంతో దీనిపై సదరు ప్రజాప్రతినిధి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. తప్పుడు పనులకు తమను బదనాం చేస్తే సహించేది లేదని సదరు రెవెన్యూ అధికారిని తీవ్రంగా హెచ్చరించినట్లు సమాచారం. అదేవిధంగా రామాపురానికి చెందిన మధ్యవర్తి ఎవరు, అతని గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలని కొందరిని ఆదేశించినట్లు సమాచారం. మధ్యదళారులతో పనులన్నీ చక్కదిద్దుతున్న వైనం వడ్డేపల్లి మండలం రామాపురానికి చెందిన మధ్యవర్తే కీలకసూత్రధారి అధికారి అవినీతిపై సోషల్ మీడియాలో దుమారం నియోజకవర్గ ప్రజాప్రతినిధి ఆగ్రహం -
కేఎస్పీకి నీటి విడుదల
కోయిల్సాగర్ ప్రాజెక్టు నుంచి మూడో తడి పంటలకు నీటిని విడుదల చేశారు. వివరాలు 8లో uచేయి తడపాల్సిందే.. లంచం కొట్టు.. పనిపట్టు అనే సూత్రాన్ని వంట పట్టించుకున్న సదరు రెవెన్యూ అధికారి అందరికీ ఇదే సూత్రాన్ని ఫాలో అవ్వమని సలహా ఇస్తున్నాడు. ఇందుకు మచ్చుకు కొన్ని ఉదాహరణలు.. ● గత ప్రభుత్వంలో మూడెకరాల ప్రభుత్వ అసైన్డ్ భూమిని జిల్లా సమీపంలోని ఓ వ్యక్తికి కేటాయించారు. ఇతనికి ముగ్గురు సంతానం. కొద్ది కాలానికి సదరు వ్యక్తి మృతి చెందాడు. వాస్తవానికి వారసత్వం ప్రకారం ముగ్గురికి తండ్రి ఆస్తిలో సమానవాటా రావాలి. కానీ ఇక్కడ అలా జరగలేదు. ముగ్గురు అన్నదమ్ముల్లో ఇది వరకే ఒకరు మృతి చెందడంతో మిగిలిన ఇద్దరి వద్ద రూ.4 లక్షల లంచం తీసుకుని ఇద్దరి పేరిట భూమిని రికార్డు చేశారు. మృతి చెందిన కుటుంబానికి అన్యాయం చేశాడని సదరు కుటుంబ సభ్యులు ఆవేదన చెందుతున్నారు. ● ఓ మండలంలోని ఇనామ్ భూమికి సంబంధించి రికార్డులో పేర్లు చేర్చేందుకు సదరు భూ యజమానితో రూ.1.50లక్షలు తీసుకుని రికార్డు చేసినట్లు తెలిసింది. ● అనంతపురం గ్రామశివారులో ఆరు ఎకరాలకు సంబంధించి రికార్డు పేర్లు మార్చేందుకు రూ.10లక్షల వరకు డీల్ చేసుకున్నట్లు జోరుగా ప్రచారం వినిపిస్తుంది. రెవెన్యూ అధికారి అవినీతిపై పలు పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కొద్దిరోజులు ఆగమని వారికి చెప్పినట్లు సమాచారం. ● ఇవేగాక రాత్రివేళలలో బైక్పై తనిఖీల పేరిట చక్కర్లు కొడుతూ అనుమతులు లేకుండా మట్టి, ఇసుక దందా చేసే వారి వద్ద పెద్ద ఎత్తున వసూళ్లకు పాల్పడుతున్నట్లు ప్రచారం. అయితే దొరికిన వాహనాలకు చిన్నమొత్తంలో ఫైన్లు వేస్తూ ఉన్నతాధికారులకు అనుమానం రాకుండా తెలివి తేటలు ప్రదర్శిస్తున్నారని సదరు అధికారి సిబ్బంది చెవులు కొరుక్కోవడం గమనార్హం. -
‘అపార్’పై ప్రత్యేక దృష్టి సారించండి
అయిజ: ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులు అపార్ ఐడీల నమోదుపై ప్రత్యేక దృష్టి సారించాలని.. నిబంధనలు పాటించకుంటే చర్యలు తప్పవని డీఈఓ అబ్దుల్ ఘని అన్నారు. గురువారం అయిజ ఎమ్మార్సీ కార్యాలయంలో ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలల ఉపాధ్యాయులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. పాఠశాలల వారీగా అపార్ ఐడీ క్రియేట్ చేసిన శాతాన్ని అడిగి తెలుసుకున్నారు. ఈ విషయంలో ప్రయివేటు పాఠశాలలు వెనుకబడి ఉన్నాయని, చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో సెక్టోరియల్ ప్లానింగ్ కోఆర్డినేటర్ శాంతిరాజు, మండల విద్యాధికారి రాములు, వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ‘పది’లో ఉత్తమ ఫలితాలు సాధించాలి ఉండవెల్లి: ఉపాధ్యాయులు విద్యార్థులకు సరైన బోధన అందించడమే కాకుండా ఎంఈఓలకు సహకరించాలని.. పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించేలా విద్యార్థులను తీర్చిదిద్దాలని డీఈఓ అబ్దుల్ ఘని అన్నారు. గురువారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడారు. ప్రతి పాఠశాల గ్రాంట్స్ను వెంటనే రిలీజ్ చెయ్యాలని ప్రధానోపాధ్యాయులకు సూచించారు. పాఠశాలలో ఉన్న అన్ని సమస్యలను ఆ గ్రాంట్స్ను రిలీజ్ చేసి ఖర్చు పెట్టి పరిష్కరించాలని తెలిపారు. విద్యార్థుల హాజరు శాతాన్ని, పదో తరగతి విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేందుకు కృషి చేయ్యాలని ఉపాధ్యాయులకు సూచించారు. కార్యక్రమంలో జిల్లా సెక్టోరియాల్ అధికారి శాంతిరాజ్, ఎంఈఓలు రామకృష్ణ, భగీరథ రెడ్డి, ఉపద్యాయులు తదితర్లు పాల్గోన్నారు. ప్రతి విద్యార్థికి అపార్ ఐడీ క్రియేట్ చేయాలి అలంపూర్: ప్రతి విద్యార్ధి అపార్ ఐడీ ఖచ్చితంగా క్రియేట్ చేయాలని డీఈఓ మహ్మద్ అబ్దుల్ ఘని అన్నారు. అలంపూర్ చౌరస్తాలో విశ్వశాంతి డిగ్రీ కళాశాలలో అలంపూర్, ఉండవెల్లి, మానవపాడు మండలాల ఎంఈఓలతో గురువారం అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి డీఈఓ, సెక్టోరియల్ ప్లానింగ్ కో–ఆర్డీనేటర్ శాంతిరాజ్ హాజరై మాట్లాడారు. ఖచ్చితంగా ప్రతి విద్యార్ధి అపార్ ఐడీ క్రియేట్ చేయాలని, ఏమైన సమస్యలు ఉంటే ఎంఈఓలతో మాట్లాడి వంద శాతం పూర్తి చేయాలన్నారు. -
జీవితమే ముఖ్యం
ప్రేమపేరుతో ప్రాణాలు తీసుకోవద్దు.. తీయొద్దు ప్రేమ అనేది రెండు మనసుల మధ్యన ఏర్పడే విడదీయరాని బంధం. ఇరువురిది ఒకేదారి అయినప్పుడే ఈ బంధం సాఫీగా సాగుతుంది. పెళ్లి అనే సరికొత్త జీవనం వైపు అడుగులు వేయించి భవిష్యత్ పునాదులకు బీజం వేస్తోంది. కానీ, ఇలాంటి ప్రేమ ప్రస్తుత రోజుల్లో తాత్కాలికమే అయింది. తెలిసీతెలియని వయసులో కొందరు ఆకర్షణకు లోనై.. మత్తులో మునిగి తేలుతున్నారు. మరికొందరు చిన్న వయసులోనే ప్రేమ పేరిట జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ప్రేమ ఎంతో బలమైందన్నది ఎంత నిజమో.. మనస్ఫూర్తిగా ప్రేమించి వివాహం చేసుకున్న వారి జీవితం అంతే బలంగా.. సాఫీగా సాగుతుందన్నది అంతే నిజం. ఈ నేపథ్యంలో శుక్రవారం ప్రేమికుల దినోత్సవం సందర్భంగా జిల్లాలో ప్రేమ వివాహాలు, ప్రేమ ముసుగులో జరుగుతున్న దారుణాలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. – మహబూబ్నగర్ క్రైం/ గద్వాల క్రైంమిడిమిడి జ్ఞానంతో ప్రేమకు దగ్గరవుతున్న కొందరు పెళ్లి విషయం వచ్చేసరికి ఇల్లు విడిచి వెళ్తున్నారు. ఇలాంటి కేసులు ఏటా సుమారు 200 వరకు ఉంటున్నాయి. వీరిలో బాలికలే ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగించే అంశం. చిన్నతనంలో కుటుంబ నేపథ్యం, సామాజిక స్థితిగతులు, ఆర్థికాంశాలు కూడా దోహదపడుతున్నాయి. గతేడాది జిల్లాలో 210కి పైగా అదృశ్య కేసులు నమోదయ్యాయి. డబ్బు ఉన్నా.. లేకపోయినా అమ్మాయిలు, అబ్బాయిలు ప్రేమించుకోవడానికి.. కలిసి జీవించడానికి సిద్ధమవుతున్నారు. ఉమ్మడి జిల్లాలో కులాంతర వివాహాలు ఎక్కువగా జరుగుతున్నాయి. వీరిలో కొంతమంది తల్లిదండ్రులను ఒప్పిస్తే.. మరికొందరు ఎదిరించి పెళ్లి చేసుకుంటున్నారు. విడిపోతున్న జంటలు అధికమే తెలిసీతెలియని వయసులో ప్రేమ వివాహాలు చేసుకుంటున్న జంటల్లో చాలామంది విడిపోతున్నారు. పట్టణ ప్రాంతాలకు చదువుకోవడానికి వస్తున్న అమ్మాయిలు ఆటోడ్రైవర్లు, ఇతర పోకిరీల ఉచ్చులో పడి మోసపోతున్నారు. అయితే ప్రేమ పెళ్లి చేసుకుంటున్న వారిలో మనస్పర్థలు ఎక్కువగా వస్తున్నాయి. దీంతో ఇద్దరి మధ్య దూరం ఏర్పడి, విడాకులకు దారి తీస్తోంది. ఇలా ఏటా పదుల సంఖ్యలోనే జంటలు విడిపోతున్న దాఖలాలున్నాయి. ప్రేమ వివాహాలు చేసుకున్న వారు, పెద్దలను ఒప్పించి ఒక్కటైన జంటలు సైతం చిన్నపాటి కారణాలకే విడిపోతుండటం ఆందోళన కలిగించే అంశం. గతేడాది జిల్లాలో 15 బాల్య వివాహాలను అధికారులు అడ్డుకున్నారు. ఒప్పుకోకపోతే దాడులు మహబూబ్నగర్లో షీటీం నమోదు చేసిన కేసులు, కౌన్సెలింగ్ వివరాలు వివాహానికి చట్టబద్ధంగా కనీస వయసు తప్పనిసరి. ఇందుకోసం ప్రభుత్వం నుంచి జారీ చేసిన గుర్తింపు కార్డు లేదా పదో తరగతి ఉత్తీర్ణత ధ్రువపత్రాన్ని ఆధారంగా చూపాల్సి ఉంటుంది. చట్టపరంగా యువతికి 18 ఏళ్లు, యువకుడికి 21 ఏళ్లు నిండి ఉండాలి. కానీ, ఏ మాత్రం అవగాహన లేకుండా కేవలం ఆకర్షణకు లోనై ప్రస్తుతం చాలామంది పెళ్లి చేసుకుంటున్నారు. ఇదే సమయంలో వయసు గురించి పెద్దగా పట్టించుకోవట్లేదు. అయితే యువతుల కనీస వయసు 18 ఏళ్లు నిండని పక్షంలో వారిని మైనర్లుగా భావించాల్సి ఉంటుంది. ఇదే సమయంలో మైనర్లను వివాహం చేసుకోవడం, పెద్దల అనుమతి లేకుండా తీసుకెళ్లడం చట్టరీత్యా నేరం. ఇలాంటి కేసుల్లో యువతి సమ్మతి లేకుంటే యువకుడిపై అత్యాచారం, అపహరణ కేసులు కూడా నమోదు చేస్తారు. ఒకవేళ యువతి సమ్మతి ఉంటే కనీస వయసు పూర్తయ్యే వరకు ఆమె ఇష్టానుసారం ప్రభుత్వ సంరక్షణ కేంద్రంలో ఉంచుతారు. ఒప్పుకోకపోతే యువతులపై దాడులు సరికాదు పెద్దలు అంగీకరించకపోయినా ఆత్మహత్యలు జిల్లాలో అమ్మాయిలు, మహిళలపై పెరుగుతున్న దాడులు -
ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలి
గద్వాల: గ్రామ పంచాయతీ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో సన్నద్ధం కావాలని కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని మీటింగ్ హాలులో స్టేజ్–1,స్టేజ్–2 ఆర్ఓలకు నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఎన్నికల కమిషన్ నియమ నిబంధనలకు తూచా తప్పకుండా పాటించాలని, జిల్లాలో 255 గ్రామ పంచాయతీల ఎన్నికల నిర్వహణ బాధ్యతగా నిర్వర్తించేందుకు 255 అధికారులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. ఆర్ఓలు క్రియాశీలక పాత్ర పోషించాల్సి ఉంటుందని, ఏదైన సందేహాలుంటే మాస్టర్ ట్రైనర్లను సంప్రదించి అవగాహన పెంచుకోవాలన్నారు. అదేవిధంగా సెన్సిటీవ్ ప్రాంతాలను గుర్తించి అక్కడ అవసరమైన జాగ్రత్తలను తీసుకోవాలన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ ప్రకారం నామినేషన్ల స్వీకరణ, స్క్రూటినీ, ఉపసంహరణ వంటి ప్రక్రియలు పూర్తి పారద్శకంగా నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నర్సింగ్రావు, డీపీఓ శ్యాంసుందర్, ఆర్ఓలు పాల్గొన్నారు. -
14న కబడ్డీ ఎంపిక పోటీలు
గద్వాలటౌన్ : ఈ నెల 20 తేదీ నుంచి 23వ తేదీ వరకు వికారాబాద్లో జరిగే రాష్ట్రస్థాయి సబ్ జూనియర్స్ బాలుర, బాలికల కబడ్డీ టోర్నమెంట్కు జిల్లాస్థాయి ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు కబడ్డీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షురాలు డీకే స్నిగ్దారెడ్డి, కార్యదర్శి నర్సింహ తెలిపారు. ఈ నెల 14వ తేదీ ఉదయం 10 గంటలకు స్థానిక ఇండోర్ స్టేడియంలో ఎంపిక పోటీలు ఉంటాయని, బాలురు 55 కేజీలు, బాలికలు 50 కేజీలలోపు బరువు ఉన్న కేటగిరిలో పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. 2009 ఏప్రిల్ 1వ తేదీ తరువాత పుట్టినవారే ఎంపిక పోటీలకు అర్హులని, ఆధార్ కార్డు, పది మెమో వెంట తీసుకురావాలని, ఇతర వివరాలకు సెల్ నంబర్లు : 8919216300ను సంప్రదించాలన్నారు. ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలి మానవపాడు: విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని వాటిని చేరుకునేందుకు కష్టపడి చదవాలని జిల్లా ఎంప్లాయిమెంట్ ఆీఫీసర్ ప్రియాంక అన్నారు. బుధవారం మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించారు. పదో తరగతి విద్యార్థులతో మాట్లాడుతూ.. విద్యార్థులు కష్టపడి చదివి స్కిల్ బెవలప్మెంట్, ఇంటర్, పాలిటెక్నిక్, మెడికల్ కోర్స్కు సంబందించి విద్యాసామార్థ్యలను మెరుగుపర్చుకోవాలని సూచించారు. పదో తరగతి వార్షిక పరీక్షల్లో పదికి పది జీపీఏ సాధించాలని సూచించారు. అనంతరం భోజన నాణ్యతను, ప్రత్యేక తరగతులను పరిశీలించారు. ఎంఈఓ శివప్రసాదు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గోన్నారు. -
నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు
గద్వాల: అపార్ ఐడీల నమోదు, పీఎంశ్రీ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని.. నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని ప్రధానోపాధ్యాయులను కలెక్టర్ బీఎం సంతోష్ హెచ్చరించారు. బుధవారం కలెక్టరేట్లో తన ఛాంబర్లో విద్యాశాఖ అధికారులతో సమీక్షించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పీఎంశ్రీ నిధులను నిబంధనల మేరకు వ్యయం చేయాలని, అదేవిధంగా అపార్ నమోదులో రాష్ట్రంలోనే జిల్లా వెనకబడి ఉందని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆధార్, పాన్కార్డుల మాదిరి పాఠశాల, కాలేజీల విద్యార్థులకు అపార్ ఐడీ కార్డులను పంపిణీ చేయాలన్నారు. మొదటి విభాగంలో విద్యార్థి పూర్తి వివరాలు సక్రమంగా అపార్ జనరేషన్కు ఇబ్బంది లేని పిల్లల లిస్ట్ తయారు చేసి పేరెంట్ ఆమోదంతో వారికి అపార్ జనరేట్ చేయాలన్నారు. రెండవ విభాగంలో విద్యార్థుల ఆధార్కార్డులని వివరాల ప్రకారం పాఠశాలలో అడ్మిషన్రికార్డు, ఆన్లైన్ యూడీఐఎస్ఈ వెబ్సైట్లో పేరెంట్ డిక్లరేషన్ ప్రకారం మార్పులు చేసి అపార్ జనరేట్ చేయాలన్నారు. మూడో విభాగంలో విద్యార్థుల అడ్మిషన్ రికార్డు, యూడీఐఎస్ఈ వివరాలతో ఆధార్ మ్యాచ్ కాని పిల్లలు, ఆధార్కార్డు ప్రకారం రికార్డులు సవరించి అపార్ను జనరేట్ చేయాలన్నారు. జిల్లాలోని అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ప్రధానాచార్యులు నిర్ధేశించిన లక్ష్యం మేరకు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. నిర్లక్ష్యం వహించే వారికి మెమో జారీ చేయాలని డీఈవోను ఆదేశించారు. శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న ఆర్వోలు శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న ఆర్ఓలు -
ప్రభుత్వ భూమి విక్రయంపై విచారణకు ఆదేశం
గద్వాల: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ భూమిని కొందరు కబ్జా చేసి ఏకంగా రూ.2 కోట్లకు విక్రయించిన ఘటనపై అదనపు కలెక్టర్, గద్వాల మున్సిపాలిటీ ప్రత్యేకాధికారి నర్సింగ్రావు స్పందించారు. సమగ్ర నివేదిక అందించాలని మున్సిపల్ కమిషన్ను ఆదేశించారు. ప్రభుత్వ స్థలం కబ్జా విషయమై ‘ప్రభుత్వ భూమినే అమ్మేశారు’ శీర్షికన 11వ తేదీన ‘సాక్షి’లో కథనం ప్రచురించిన విషయం విధితమే. పట్టణంలోని సుంకులమ్మమెట్టు కాలనీలో మున్సిపాలిటీకి చెందిన సర్వే నంబర్ 452లో ఎక్కడెక్కడ ప్రభుత్వ భూములు ఉన్నాయి, వాటికి తీసుకున్న రక్షణ చర్యల వివరాలను సమగ్ర నివేదిక అందించాలని మున్సిపల కమిషనర్ దశరథ్ను ఆదేశించారు. ఈ విషయం తెలియడంతో కబ్జాదారుల గుండెల్లో గుబులు పట్టుకుంది. -
పథకాల అమలు తీరుపై కేంద్ర బృందం ఆరా
మల్దకల్: కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై కేంద్ర బృందం సభ్యులు రెండో రోజైన బుధవారం మండలంలోని శేషంపల్లిలో పరిశీలించారు. ఈసందర్భంగా కేంద్ర బృందం సభ్యులు దీపక్ వర్మ, అమిత్ వర్మ, మహేష్లాల్, మయాంక్, రంజాన్పాల్ గ్రామంలో స్వచ్ఛభారత్ పథకంలో భాగంగా నిర్మించిన మరుగుదొడ్లు, ఇంకుడు గుంతలతోపాటు సెగ్రిగేషన్ షెడ్లు, పింఛన్ల అమలుపై గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. నిరుపేదలకు కేంద్ర ప్రభుత్వ పథకాలు క్షేత్రస్థాయిలో ఏ విధంగా అమలవుతున్నాయనే దానిపై పరిశీలన చేపట్టి ఉన్నతాధికారులకు సమాచారం అందివ్వనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీఓ ఆంజనేయ రెడ్డి, ఎంపీఓ రాజశేఖర్, అంగన్వాడీ సూపర్వైజర్ నాగరాణి, పంచాయతీ కార్యదర్శి రూపరాణి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
పీఏసీఎస్ పాలకవర్గాల పదవీకాలం పొడిగించాలి
మహబూబ్నగర్ (వ్యవసాయం): ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పదవీకాలాన్ని మరో ఏడాదిపాటు పొడిగించాలని ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా పీఏసీఎస్ చైర్మన్లు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బుధవారం జిల్లాకేంద్రంలోని డీసీసీబీ ప్రధాన కార్యాలయ సమావేశ మందిరంలో చైర్మన్ మామిళ్లపల్లి విష్ణువర్ధన్రెడ్డి అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సందర్భంగా చైర్మన్తోపాటు వైస్ చైర్మన్ కోరమోని వెంకటయ్య, పాలక మండలి సభ్యులు రంగారెడ్డి, మంజులారెడ్డి, భూపాల్రావు, బక్కన్నయాదవ్, భీంరెడ్డి, వెంకటేష్గుప్తా, వంశీచంద్రెడ్డి, సింగిల్విండో చైర్మన్లు పలు విషయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చేలా సంతకాల సేకరణ చేపట్టారు. ● ఇదిలా ఉండగా.. సర్పంచ్లు, ఎంపీపీలు, జిల్లా పరిషత్, మున్సిపల్ పాలకవర్గాల కాలపరిమితి ముగియగానే ప్రత్యేకాధికారుల పాలన మొదలవుతుంది. కానీ, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో మాత్రం మళ్లీ ఎన్నికలు జరిగే వరకు ప్రస్తుతం ఉన్న పాలకవర్గాన్ని ఆరు నెలల కాలపరిమితితో పొడిగిస్తూ ఆదేశాలు ఇవ్వడం ప్రభుత్వ సంప్రదాయంగా కొనసాగుతుంది. గత మూడు దశాబ్దాలుగా పీఏసీఎస్ పదవీకాలం ముగిసిన రెండేళ్ల వరకు ఎన్నికలు జరగకపోయినా ప్రతి ఆరునెలలకు ఒకసారి పాలకవర్గాన్ని కొనసాగిస్తూ ఎన్నికలు నిర్వహించే పద్ధతి ఉంది. గత ఐదేళ్లుగా రాష్ట్రంలో ఉన్న 9 డీసీసీబీ బ్యాంకుల్లో రైతులకు అన్ని రకాలుగా అండగా ఉండటంతోపాటు వాణిజ్యపరంగా మంచి అభివృద్ధి సాధించాయి. అందుకే అధికారుల ఇన్చార్జి పాలనలో కొనసాగే కంటే ఉన్న పాలక వర్గాలను కొనసాగించాలని కోరుతూ అన్ని ఉమ్మడి జిల్లాల్లోని డీసీసీబీ చైర్మన్ల అధ్యక్షతన సమావేశం నిర్వహించి వినతిపత్రాలు అందించాలనే రాష్ట్రంలోని ఉమ్మడి డీసీసీబీ చైర్మన్ల నిర్ణయంలో భాగంగానే ఈ సమావేశం జరిగింది. ప్రస్తుతం ఒక్క పాలమూరు జిల్లాలోనే కాకుండా అన్ని ఉమ్మడి జిల్లా కేంద్రాల డీసీసీబీ బ్యాంకుల్లో వాటి పర్యవేక్షణలో పనిచేసే పీఏసీఎస్ల చైర్మన్లు తమ సొసైటీల అభివృద్ధికి సంపూర్ణంగా సేవలు చేస్తున్నందున ఈ పాలక వర్గాలనే కొనసాగించాలని ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా పీఏసీఎస్ చైర్మన్ల ఫోరం అధ్యక్షుడు మధుసూదన్రెడ్డి, ప్రధాన కార్యదర్శి సుదర్శన్గౌడ్ ఆకాంక్షించారు. -
వైభవంగా చెన్నకేశవస్వామి రథోత్సవం
గద్వాలటౌన్: చెన్నకేశవస్వామి రథోత్సవం కనులపండువగా సాగింది. గద్వాల చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు కర్ణాటకకు చెందిన భక్తులతో జిల్లా కేంద్రంలోని పురవీధులు కిటకిటలాడాయి. బుధవారం రాత్రి 10:49 గంటల ప్రాంతంలో భూలక్ష్మీ చెన్నకేశవస్వామి రథాన్ని భక్తులు పోటీపడి లాగారు. పగ్గాలు చేతపట్టి రథాన్ని లాగగా.. ఆ ప్రాంతం గోవిందనామస్మరణలతో మార్మోగింది. అంతకుముందు శోభాయమానంగా రథాన్ని తీర్చిదిద్దారు. రథోత్సవానికి ముందు స్థానిక పాతబస్టాండ్లోని రథశాల దగ్గర మంత్రాలయ పీఠాధిపతి సుబుధేంద్రతీర్థ శ్రీపాదులు రథానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రజలు పీఠాధిపతి సుబుధేంద్రతీర్థ శ్రీపాదుల నుంచి ఆశీర్వాదం పొందారు. సుమారు 10వేల మంది భక్తులు రథోత్సవంలో పాల్గొన్నారు. గద్వాలకు పూర్వవైభవం.. తెలంగాణలో కృష్ణా, తుంగభద్ర నదుల మధ్యలో ఉండటం వల్ల గద్వాల చాలా ప్రాశస్త్యం గల ప్రాంతమని.. ఈ పాంత్రంకున్న ప్రాస్యస్తం, కోటకున్న ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని గద్వాలకు పూర్వవైభవం తీసుకవస్తామని మంత్రాలయ పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థ శ్రీపాదుల స్వామి అన్నారు. బుధవారం రాత్రి రథోత్సవం సందర్భంగా స్వామి భక్తులనుద్ధేశించి మాట్లాడారు. గద్వాలను పవిత్ర యాత్ర స్థలంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నామన్నారు. గద్వాల సంస్థానంలో రాజగురువు భువనేంద్రునికి ఇచ్చిన స్థలంలో బృందావనాన్ని ఏర్పాటు చేయడం, కోటలో చెన్నకేశవస్వామి ఉత్సవాలు నిర్వహించడం వలన అంతా శుభం జరుగుతుందన్నారు. -
ప్రతి రైతుకు యూనిక్ ఐడీ
ఐడీల ఆధారంగానే ప్రోత్సాహకాలు అందించే యోచన ●విధివిధానాలు వస్తే చెబుతాం.. వ్యవసాయ రంగ డిజిటలైజేషన్లో భాగంగా రైతులకు ప్రత్యేక యూనిక్ ఐడీకి సంబంధించి ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి సమాచారం లేదు. కొత్త గుర్తింపు కార్డు గురించి ప్రభుత్వం నుంచి అలాంటి ఆదేశాల వస్తే వాటి విధివిధానాల గురించి రైతులకు చేరవేస్తాం. ప్రస్తుతానికి ఎలాంటి ఆదేశాలు రాలేదు. – సక్రియానాయక్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అలంపూర్: జిల్లాలోని ప్రతి రైతుకూ ఆధార్ తరహా యూనిక్ ఐడీలను ఇచ్చేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు ఎన్నో ప్రోత్సాహకాలు, సబ్సిడీపై రుణాలు, వ్యవసాయ పరికరాలు, ధాన్యానికి మద్దతు ధర వంటివి ఇస్తున్నా.. అవగాహన లేని కారణంగా కొంత మంది రైతులు వీటిని పొందడంలో విఫలమవుతున్నారు. ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టడానికి.. ప్రతి రైతుకు ప్రభుత్వ సాయం అందించడానికి త్వరలో ప్రతి రైతుకు యూనిక్ ఐడీ ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఆధార్ తరహా యూనిక్ ఐడీ తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. 14 అంకెల గుర్తింపు కార్డు పట్టాదారు పాస్ పుస్తకం ఉన్న ప్రతి రైతుకు ఆధార్ తరహాలో ఒక యూనిక్ ఐడీ అందించనున్నాయి. కేంద్ర ప్రభుత్వ సూచనతో త్వరలో రాష్ట్రంలో ఫార్మర్ రిజిస్ట్రీ పేరుతో ఐడీ రాబోతుంది. వ్యవసాయ సంచాలకుల నేతృత్వంలో ఫార్మర్ రిజిస్ట్రీ జరగనున్నట్లు సమాచారం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు అందించే చేయూత, ప్రోత్సాహకాలు అందించడానికి ప్రత్యేక యూనిక్ నంబర్ తప్పనిసరిగా భావిస్తున్నారు. ఈ విధానం ఇప్పటికే దేశంలోని పలు రాష్ట్రాల్లో పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభించడం.. అది విజయవంతమవడంతో రాష్ట్రంలోను ప్రారంభించనున్నట్లు సమాచారం. 14 అంకెలతో కూడిన ఈ యూనిక్ ఐడీని రైతులకు గుర్తింపు కార్డు అందించడానికి సన్నహాలు చేస్తున్నట్లు అధికారుల ద్వారా తెలిసింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో ముందుకు వెళ్తే త్వరలోనే రైతులకు యూనిక్ ఐడీ కార్డు ప్రామాణికం కానుంది. అయితే సొంత భూమి కలిగిన పట్టాదారు రైతులకే ఈ యూనిక్ ఐడీ జారీ చేసే యోచన చేస్తున్నట్లు సమాచారం. ఉపయోగాలెన్నో.. జిల్లాలోని 13 మండలాల్లో 46.49లక్షల ఎకరాలు సాగు భూమి ఉంది. పంట సాగు చేసే రైతులు 1.81 లక్షల మంది ఉన్నారు. ప్రభుత్వ రాయితీలు, పంటల బీమా, పీఎం కిసాన్ చెల్లింపులు, పంట రుణాలు, రాయితీపై వ్యవసాయ పరికరాలు అందించే తదితర పథకాలను యూనిక్ ఐడీతో అనుసంధానం చేయనున్నట్లు సమాచారం. వీటితోపాటు ప్రకృతి వైపరిత్యాలతో నష్టపోయే రైతులకు పరిహారం, పంట బీమా ద్వారా నష్టపరిహారం, భవిష్యత్లో రైతులకు అందిస్తున్న రైతు భరోసా వంటి వాటిని ఐడీ ఆధారం కానున్నట్లు తెలుస్తోంది. వీటితోపాటు నీటి పారుదల, తెగుళ్ల నియంత్రణ, వాతావరణ సూచనలు వంటి సేవలు నేరుగా రైతులకే అందేలా ఐడీని ఉపయోగించనున్నట్లు అధికారుల ద్వారా తెలుస్తుంది. జిల్లా వివరాలిలా.. మండలం సాగు విస్తీర్ణం రైతుల సంఖ్య (ఎకరాల్లో) అయిజ 55,812 23,502 గద్వాల 46,242 19,252 మల్దకల్ 46,009 18,974 గట్టు 45,924 18,369 ధరూరు 36,125 14,622 కేటీదొడ్డి 35,606 12,542 మానవపాడు 31,643 11,587 ఉండవెల్లి 30,357 11,019 రాజోలి 25,369 10,865 వడ్డేపల్లి 27,177 10,884 అలంపూర్ 27,642 10,282 ఎర్రవల్లి 27,824 10,134 ఇటిక్యాల 29,178 9,887 వ్యవసాయ రంగం డిజిటలైజేషన్ వైపు అడుగులు రైతు వివరాల నమోదుకు ప్రత్యేకంగా ఫార్మర్ రిజిస్ట్రీ ఏర్పాటు జిల్లాలో 13 మండలాలు.. 1.81 లక్షల మంది రైతులు -
బీచుపల్లిలో వైభవంగా పవమాన హోమం
ఎర్రవల్లి: మాఘ పౌర్ణమిని పురస్కరించుకొని బీచుపల్లి పుణ్యక్షేత్రంలోని అభయాంజనేయస్వామి ఆలయంలో బుధవారం పవమాన హోమాన్ని అర్చకులు వేదమంత్రాల నడుమ వైభవంగా నిర్వహించారు. విశ్వ హిందూపరిషత్ మరియు వికాస్ తరంగిణి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి చుట్టు పక్కల గ్రామాల నుంచి దంపతులు పాల్గొని భక్తిశ్రద్ధలతో హోమ పూజలు చేశారు. అనంతరం ఆరు గ్రామాలకు చెందిన గ్రామ కమిటీ సభ్యులు ఆలయంలో హనుమాన్ చాలీసా పారాయణాన్ని చేపట్టి భక్తులకు సనాతన ధర్మం యొక్క విశిష్టతను గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో వివిద సంఘాల నాయకులు సత్యం, నర్సింహ, అర్చకులు, కమిటీల సభ్యులు, భక్తులు, తదితరులు పాల్గొన్నారు.20న పేటెంట్ రైట్స్పై అవగాహన సదస్సుమహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీలో ఈ నెల 20న పేటెంట్ రైట్స్పై అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు వీసీ శ్రీనివాస్ తెలిపారు. ఈ మేరకు పీయూలో కార్యక్రమానికి సంబంధించిన బ్రోచర్ను బుధవారం ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పేటెంట్ రైట్ పొందే వారు ఏ విధంగా నమోదు చేసుకోవాలి.. అందులో ఎదురయ్యే సవాళ్లు, పరిష్కార మార్గాలు తదితర అంశాలపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పిస్తామన్నారు. ముఖ్య వక్తగా శంకర్రావు ముంజం హాజరవుతారని, ఈ అవకాశాన్ని విద్యార్థులు, అధ్యాపకులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో చైర్మన్ చంద్రకిరణ్, వైస్ ప్రిన్సిపాల్ కృష్ణయ్య, కోకన్వీనర్ మధు, క్రైటీరియ కోఆర్డినేటర్ కరుణాకర్రెడ్డి, శ్రీధర్రెడ్డి, ఈశ్వర్కుమార్, గాలెన్న తదితరులు పాల్గొన్నారు.రైతులకు ఒరిజినల్ రశీదులు ఇవ్వాలిఎర్రవల్లి: ఎరువులు కొనుగోలు చేసిన రైతులకు తప్పకుండా ఒరిజినల్ రశీదులు ఇవ్వాలని జిల్లా వ్యవసాయ అధికారి సక్రియానాయక్ అన్నారు. బుధవారం మండలంలోని కోదండాపురంలో పలు ఎరువుల దుకాణాలను ఆయన తనిఖీ చేసి స్టాక్ నిల్వలు, రికార్డులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ అనుమతులు గల ఎరువులను మాత్రమే డీలర్లు విక్రయించాలని అన్నారు. ఈ పాస్ మిషన్ ద్వారానే రైతులకు ఎరువులు విక్రయించాలన్నారు. ప్రతి రోజు తప్పకుండా ఈ పాస్ మిషన్లో స్టాక్ వివరాలను అప్డేట్ చేయాలన్నారు. జిల్లాలో యాసంగిలో 54,918 ఎకరాల్లో వరి, 27,178 ఎకరాల్లో మొక్కజొన్న, 8,070 ఎకరాల్లో వేరుశనగ, 8,945 ఎకరాల్లో పప్పుశనగ, 4,686 ఎకరాల్లో మినుము, 4,686 ఎకరాల్లో జొన్న వంటి పంటలను సాగు చేసే అవకాశం ఉందన్నారు. ఈ పంటలకు అవసరమైన 16,704 టన్నుల యూరియా, 817 టన్నుల డీఏపీ, 2,363 టన్నుల పొటాష్, 14,457 టన్నుల కాంప్లెక్స్ ఎరువులు జిల్లాలోని వివిధ ఎరువుల దుకాణాలు, మార్క్ఫెడ్ గోదాముల నందు రైతులకు అందుబాటులో ఉంచామని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి రవికుమార్, తదితరులు ఉన్నారు. -
పథకాల అమలుపై కేంద్ర బృందం ఆరా
మల్దకల్: మండలంలోని శేషంపల్లిలో కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు తీరును మంగళవారం కేంద్ర అధికారుల బృందం పరిశీలించింది. స్వచ్ఛభారత్, పింఛన్లు, ఇంకుడుగుంతల నిర్మాణం, రైతులకు పంట పెట్టుబడి సాయం వంటి పథకాల అమలుతో చేకూరుతున్న లబ్ధిపై గ్రామస్తులతో కేంద్ర బృందం దీపక్ వర్మ, అమిత్ వర్మ, మహేష్ లాల్, మయాంక్, రంజాన్ పాల్ ఆరా తీశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. పేదలకు కేంద్ర ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ముఖ్యంగా మరుగుదొడ్లు, ఇంకుడు గుంతలు ప్రతి ఇంటికీ అవసరమన్నారు. ఈ సందర్భంగా వ్యక్తిగత మరుగుదొడ్డి ఆవశ్యకతపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. వారి వెంట ఎంపీడీఓ ఆంజనేయరెడ్డి, ఎంపీఓ రాజశేఖర్, ఐసీడీఎస్ సూపర్వైజర్ నాగరాణి, టీఏ ఇబ్రహీం ఉన్నారు. -
టమాటా.. నష్టాలబాట
మార్కెట్లో గిట్టుబాటు ధరలు రాక రైతుల దిగాలు పంట తీసివేశా.. ఏటా అరెకరాలో టమాటా పండిస్తాను. ఈసారి కూడా సాగుచేశాను. డిసెంబర్లో చేతికి వచ్చిన టమాటాను మార్కెట్కు తీసుకువెళ్తే కొంత రేట్లు వచ్చాయి. జనవరిలో ఽకనీసం కూలీలు, రవాణా ఖర్చులు కూడా రాలేదు. చేసేది లేక పంట వదిలేశా. – శివ, రైతు, ధరూర్ నష్టం వచ్చింది.. ఎకరా పొలంలో టమా టా సాగుచేశాను. రూ. 18వేల వరకు ఖర్చయ్యింది. జనవరిలో రేట్లు పూర్తిగా పడిపోయాయి. టమాటా తెంపి న కూలీల ఖర్చులు కూడా రాలేదు. టమాటా సాగుతో ఆర్థికంగా నష్టం వాటిల్లింది. – వెంకటన్న, రైతు, షాబాద్, ఇటిక్యాల మండలం ధరలు పెరిగే అవకాశం ఉంది.. టమాటాకు గత జనవరిలో ధరలు రాలేదు. స్థానికంగా సాగు అయిన టమాటాతో పాటు రాయలసీమలోని కొన్ని ప్రాంతాల నుంచి ఇక్కడి మార్కెట్కు రావడంతో ధరలు తగ్గాయి. అయితే మూడు, నాలుగు రోజుల నుంచి కొంతమేర ధరలు పెరిగాయి. ఈ ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉంది. – ఎంఏ అక్బర్, జిల్లా ఉద్యానశాఖాధికారి గద్వాల వ్యవసాయం: వ్యయప్రయాసాలకోర్చి పండించిన టమాటాకు మార్కెట్లో ధరలు లేకపోవడంతో రైతులు దిగాలు చెందుతున్నారు. కూలీల ఖర్చులు కూడా రాక అల్లాడుతున్నారు. ప్రతి ఏటా నెల నుంచి రెండు నెలలపాటు ధరలు పూర్తిగా పడిపోతుండటంతో ఆర్థికంగా నష్టపోతున్నారు. టమాటా తెంపేందుకు కూలీల ఖర్చు, రవాణా చార్జీలు కూడా రావడం లేదని రైతులు వాపోతున్నారు. జిల్లాలో సాగు ఇలా.. జిల్లాలో ఏటా వానాకాలం, యాసంగి సీజన్లో బోరుబావుల కింద కూరగాయల సాగులో భాగంగా టమాటా పండిస్తున్నారు. ధరూర్, మల్దకల్, గద్వాల, ఇటిక్యాల, అయిజ, వడ్డేపల్లి, మండలాల్లో టమాటను ఎక్కువగా సాగుచేస్తారు. టమాటా విత్తిన నాటి నుంచి 55 – 60 రోజులకు చేతికి వస్తుంది. ఎకరాకు రూ. 15వేల నుంచి రూ. 18వేల వరకు ఖర్చు అవుతోంది. అయితే పంట చేతికి వచ్చిన తర్వాత టమాటా తెంపడానికి ఒక కూలీకి రోజుకు రూ.400, మార్కెట్కు తరలించడానికి ఒక బాక్స్కు రూ. 20 నుంచి రూ. 40 వరకు వెచ్చిస్తున్నారు. ఎకరాకు 20 టన్నుల దిగుబడి.. వానాకాలంలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురిశాయి. దీంతో బోరుబావులు రీచార్జ్ అయ్యాయి. ఫలితంగా జిల్లావ్యాప్తంగా కూరగాయల సాగులో భాగంగా 352 ఎకరాల్లో రైతులు టమాటా సాగుచేశారు. అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండటంతో ఎకరాకు 15 నుంచి 20 టన్నుల వరకు దిగుబడి వచ్చింది. 20 కేజీల టమాటా బాక్స్కు వచ్చిన ధరలు ఇలా.. నెల ధర (రూ.పాలలో) డిసెంబర్ 400 నుంచి 450 జనవరి 100 నుంచి 150 ఫిబ్రవరి 200 నుంచి 220 -
భారంగా మారిన ఖర్చులు..
యాసంగిలో పండించిన టమాటాను డిసెంబర్ నుంచి విక్రయించడానికి రైతులు మార్కెట్కు తరలిస్తారు. ఇదే సమయంలో ఏపీలోని పత్తికొండ, దేవనకొండ, ఆలూరు, ఆస్పరి, ప్యాపిలి తదితర ప్రాంతాల నుంచి రైతులు టమాటాను అమ్మకానికి తెచ్చారు. దీంతో డిసెంబర్లో ఓ మాదిరి ధర లు వచ్చాయి. జనవరిలో ధరలు పూర్తిగా పడిపోయాయి. టమాటా తెంపిన ఖర్చులు కూడా రావ డంలేదని కొందరు రైతులు తోటల్లోనే పారబోశారు. మరికొందరు తోటలను వదిలేశారు. జీవాలకు ఆహారంగా వేస్తున్నారు. ఫిబ్రవరిలో సైతం ధరలు పెద్దగా రాలేదు. ధరలు రాక టమాటా రైతు ఆర్థికంగా నష్టపోతున్నారు. కూలీలు, రవాణా ఖర్చులు కూడా రావడం లేదని వాపోతున్నారు. ఏటా డిసెంబర్, జనవరి నెలల్లో ధరలు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
ఉమ్మడి పాలమూరు జిల్లా పరిధిలో సహకార సంఘాలు ఇలా..
డీసీసీబీ 1డీసీఎంఎస్ 1 మహబూబ్నగర్ 17 నారాయణపేట10 వనపర్తి 15 జోగుళాంబ గద్వాల11 నాగర్కర్నూల్ 23 రంగారెడ్డి, వికారాబాద్ 11 -
లబ్ధిదారులకు డబుల్బెడ్రూం ఇళ్లు కేటాయించాలి
గద్వాల: లక్కీ డిప్ విధానంలో ఎంపికై న లబ్ధిదారులకు డబుల్బెడ్రూం ఇళ్లను తక్షణమే కేటాయించాలని బీజేపీ జిల్లా అఽధ్యక్షుడు రాంచంద్రారెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం పార్టీ నాయకులతో కలిసి కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెండేళ్ల క్రితం వార్డు సభల్లో లక్కీ డిప్ ద్వారా ఎంపిక చేసిన 771 మంది లబ్ధిదారులకు నేటికీ డబుల్బెడ్రూం ఇళ్లు కేటాయించక పోవడం శోచనీయమన్నారు. ఇళ్లకు ఎంపికై న వారిలో 84 మందిని తొలగించడం సరికాదన్నారు. లబ్ధిదారులందరికీ ఇళ్లను కేటాయించాలని కోరారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు బండల వెంకట్రాములు, రామాంజనేయులు, చిత్తారి కిరణ్, రవికుమార్ ఎక్బోటే, రజక జయశ్రీ, నర్సింహ, దేవదాసు, కృష్ణ, పాండు పాల్గొన్నారు. -
స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం
గద్వాల: జిల్లాలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు అధికారులందరూ సన్నద్ధం కావాలని కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో రిటర్నింగ్ అధికారులకు ఏర్పాటుచేసిన శిక్షణ తరగతుల్లో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. గతంలో నిర్వహించిన ఎన్నికల అనుభవాలను దృష్టిలో ఉంచుకుని రాబోయే ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించాలని సూ చించారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలు తప్పనిసరిగా పాటిస్తూ ఎన్నికల నిర్వహణ చేపట్టాలన్నా రు. ఇందుకు రిటర్నింగ్ అఽధికారులు కీలకపాత్ర పో షించాల్సి ఉంటుందని అన్నారు. ఎంపీటీసీ, జెడ్పీ టీసీ ఎన్నికలను పూర్తి పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని తెలిపారు. ఎన్నికల సిబ్బంది నిబద్దతతో పనిచేయాలన్నారు. నామినేషన్ల నుంచి మొదలుకుని పోలింగ్ వరకు ఎన్నికల ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు లక్ష్మీనారాయణ, నర్సింగ్రావు, జెడ్పీ సీఈఓ నాగేంద్రం పాల్గొన్నారు. -
హనుమత్ వాహనంపై స్వామివారు
మహబూబ్నగర్ రూరల్: మ న్యంకొండ బ్రహ్మోత్సవాల్లో భా గంగా మంగళవారం రాత్రి శ్రీలక్ష్మీ వేంకటేశ్వరస్వామి హనుమత్ వాహనసేవ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శో భాయమానంగా అలంకరించిన హనుమత్వాహనంపై స్వామివారిని గర్భగుడి నుంచి దేవస్థానం ముందు ఉన్న మండపం వరకు ఊరేగింపుగా తీసుకొచ్చారు. సన్నాయి వాయిద్యాలు, పురోహితుల వేదమంత్రాలు, భక్తుల హరినామస్మరణ మధ్య స్వామివారి సేవ ముందుకు కదిలింది. బంగారు ఆభరణాలు, వివిధ రకాల పూల అలంకరణల మధ్య స్వామివారు భక్తకోటికి దర్శనమిచ్చారు. అనంతరం ప్రభోత్సవం వైభవంగా సాగింది. ఈ వేడుకను తిలకించేందుకు వేలాది మంది భక్తులు హాజరయ్యారు. ఉదయం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామివారికి దాసంగాలు పెట్టి మొక్కులు తీర్చకున్నారు. గుండంలో తలస్నానాలు ఆచరించి తడి దుస్తులతోనే స్వామివారిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో దేవస్థాన చైర్మన్ అళహరి మధుసూదన్కుమార్, ఈఓ శ్రీనివాసరాజు, సూపరింటెండెంట్ నిత్యానందాచారి పాల్గొన్నారు. వైభవంగా సాగిన శ్రీనివాసుడి ప్రభోత్సవం -
ప్రత్యేకమా.. పొడిగింపా?
14న ముగియనున్న ‘సహకార’ పాలకవర్గాల గడువు ● ఆరు నెలల వరకు ఎన్నికల నిర్వహణ అనుమానమే.. ● పదవీకాలం పొడిగించాలని కోరుతున్న చైర్మన్లు ● స్పెషలాఫీర్ల నియామకానికి అధికారుల కసరత్తు ● ఉమ్మడి జిల్లాలో మొత్తం 87 సహకార సంఘాలు జిల్లాకో కేంద్ర బ్యాంకు.. కొత్త జిల్లాలు ఏర్పడినా ఉమ్మడి జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) ఆధ్వర్యంలోనే ఏడు జిల్లాల ప్యాక్స్లను నిర్వహిస్తున్నారు. కొత్తగా జిల్లాకో కేంద్ర బ్యాంకు ఏర్పాటు చేయాలంటే కేంద్ర ప్రభుత్వం, రిజర్వు బ్యాంకు అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో సంప్రదింపులు జరుపుతోంది. అయితే ఈ ప్రక్రియకు మరింత సమయం పట్టనున్న నేపథ్యంలో ఎన్నికలు ఒకే డీసీసీబీ కింద నిర్వహించనున్నారు. ఉమ్మడి జిల్లా కొత్తగా 40 ప్యాక్స్లను ఏర్పాటు చేయాలని అధికారులు గతంలో ప్రభుత్వానికి నివేదిక పంపారు. అచ్చంపేట: రైతులకు క్షేత్రస్థాయిలో సాగుపరమైన సేవలందిస్తూ.. అండగా నిలుస్తున్న ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్) పాలకవర్గాల పదవీకాలం ఈ నెల 14తో ముగియనుంది. అయితే వీటికి ఇప్పట్లో ఎన్నికలు నిర్వహించే అవకాశం లేకపోవడంతో ప్రత్యేకాధికారులను నియమించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. మరికొన్ని రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయన్న ప్రచారం నేపథ్యంలో ఆ తర్వాతే వీటి ఎన్నికలు ఉంటాయని అధికార వర్గాలు వెల్లడించాయి. అయితే బ్యాంకు కార్యకలాపాలన్నీ ఆర్థిక లావాదేవీలతో ముడిపడి ఉండటంతో ప్రత్యేకాధికారుల పాలనతో వ్యవస్థ దెబ్బతినే ప్రమాదం ఉందని, ప్రస్తుతం ఉన్న పాలకవర్గాలనే మరో ఆరు నెలలు పొడిగించాలని డీసీసీబీ నాయకుడొకరు అభిప్రాయపడ్డారు. తెలంగాణ ఆవిర్భావ సమయంలోనూ అప్పటి ప్రభుత్వం ఆరు నెలల చొప్పున నాలుగు సార్లు డీసీసీబీ పాలక వర్గాలకు కొనసాగించిందని గుర్తు చేశారు. అయితే ప్రభుత్వం గడువు పొడిగిస్తుందా.. లేక ప్రత్యేకాధికారుల పాలనకే మొగ్గుచూపుతుందా అన్నది ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉంటే సొసైటీల ప్రత్యేకాధికారుల నియమాకానికి ఉమ్మడి జిల్లాలోని సహకార శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఆరు నెలల ముందుగానే ప్రక్రియ ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 76 సొసైటీలు ఉన్నాయి. మహబూబ్నగర్ డీసీసీబీ పరిధిలోని ఐదు జిల్లాలు, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల పరిధులు కలుపుకొంటే మొత్తం 87 పీఏసీఎస్లు ఉన్నాయి. అయితే పీఏసీఎస్లకు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం 2020 ఫ్రిబవరి 14న ఎన్నికలు నిర్వహించింది. సొసైటీ పరిధిలో ఎన్నికై న చైర్మన్లతో అదే నెల 25న డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్, వైస్ చైర్మన్ పదవులకు ఎన్నికలు నిర్వహించారు. పలువురు డైరెక్టర్లను సైతం ఎన్నుకున్నారు. ఈ పాలకవర్గాల గడువు ఈ నెల 14తో ముగుస్తుంది. సాధారణంగా సొసైటీల కాలపరిమితి ముగిసే ఆరు నెలల ముందుగానే ప్రభుత్వం ఎన్నికల ప్రక్రియ చేపట్టి గడువు వరకు పూర్తిచేసేది. అయితే ప్రస్తుతం వీటి నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహించే పరిస్థితి లేకపోవడంతో ప్రత్యేకాధికారుల పాలన అనివార్యంగా మారింది. మండల స్థాయి అధికారులు ప్రత్యేక పాలనకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి ఆదేశాలు అందలేదు. అయితే పంచాయతీ, మండల, జిల్లా పరిషత్లకు ప్రభుత్వం ఇప్పటికే స్పెషలాఫీసర్లను నియమించిన సంగతి తెలిసిందే. సహకార సంఘాలకు సైతం అదే మాదిరిగా ప్రత్యేకాధికారుల పాలనకే మొగ్గు చూపే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాల సహకార శాఖ అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఎంపీడీఓ, తహసీల్దార్ స్థాయి అధికారులను సొసైటీలకు ప్రత్యేకాధికారులుగా నియమించవచ్చనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో సొసైటీకి ఒక్కొక్కరిని నియమిస్తారా.. లేక రెండు, మూడు సొసైటీలకు కలిపి ఒకరిని నియమిస్తారా అనేది చర్చనీయాంశంగా మారింది. ఆదేశాలు రాలేదు.. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పాలకవర్గాల గడువు ఈ నెల 14న ముగియనుంది. అయితే ప్రత్యేకాధికారులను నియమిస్తుందా.. లేక పాలకవర్గాల గడువు పొడిగిస్తుందా.. అనే దానిపై ఇంకా ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆ దేశాలు అందలేదు. ప్రభుత్వం ఆదేశాలకనుగుణంగా చర్యలు తీసుకుంటాం. – రఘునాథరావు, జిల్లా సహకార శాఖాధికారి, నాగర్కర్నూల్ -
నయనానందం.. చెన్నకేశవుడి తెప్పోత్సవం
గద్వాలటౌన్: జిల్లా కేంద్రంలో శ్రీభూలక్ష్మీ చెన్నకేశవస్వామి తెప్పోత్సవం మంగళవారం కనులపండువగా జరిగింది. స్వామివారి ఉత్సవాల్లో భాగంగా రాత్రి 9 గంటల ప్రాంతంలో సంస్థానాధీశుల కాలంనాటి లింగంబావిలో తెప్పోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. విద్యుద్ధీపాలతో సుందరంగా అలంకరించిన లింగంబావిలో స్వామివారు విహరించారు. అంతకుముందు వేద పండితుల మంత్రోచ్ఛారణలు, మంగళ వాయిద్యాల నడుమ మంత్రాలయ రాఘవేంద్రస్వామి మఠం పండితులు కోటలోని చెన్నకేశవస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం చెన్నకేశవస్వామి మూల విరాట్కు అభిషేకం నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో హోమం, కలశాలకు ప్రత్యేక పూజల అనంతరం స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తుల ఊరేగింపు చేపట్టారు. కాగా, శ్రీభూలక్ష్మీ చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలు.. మంత్రాలయ రాఘవేంద్రస్వామి పండితులచే ప్రత్యేక పూజలు.. జములమ్మ దేవతను కొలిచేందుకు వస్తున్న భక్తుల తాకిడితో జిల్లా కేంద్రంలో పండగ వాతావరణం నెలకొంది. ఎక్కడ చూసినా భక్తుల కోలాహలం కనిపించింది. ● గద్వాల కోటలో శ్రీభూలక్ష్మీ చెన్నకేశవ స్వామిని కలెక్టర్ సంతోష్ దర్శించుకున్నారు. ముందుగా ఆలయ నిర్వాహకులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయంలో కలెక్టర్ ప్రత్యేక పూజల అనంతరం స్వామివారికి గరుడవాహన సేవలో పాల్గొన్నారు. నేడు రథోత్సవం.. భూలక్ష్మీ చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి మహా రథోత్సవం నిర్వహించనున్నట్లు ఆలయ విచారకర్త ప్రభాకర్ తెలిపారు. రథోత్సవానికి మంత్రాలయ పీఠాధిపతి సుభుదేంద్ర తీర్థ శ్రీపాదుల స్వామి హాజరవుతున్నారని చెప్పారు. భక్తులు పెద్ద సంఖ్యలో హజరై రథోత్సవాన్ని విజయవంతం చేయాలని కోరారు. -
కల్యాణం.. కమనీయం
గద్వాలటౌన్: గద్వాల సంస్థానాధీశుల ఇలవేల్పు భూలక్ష్మీ చెన్నకేశవస్వామి కల్యాణం కనులపండుగగా నిర్వహించారు. సోమవారం రాత్రి గద్వాల కోటలోని చెన్నకేశవస్వామి ఆలయంలో ముందుగా దేవతామూర్తులను పూజించారు. అనంతరం స్వామి, అమ్మవార్లకు మంత్రాలయ రాఘవేంద్రస్వామి ఆలయ విద్యా పీఠానికి చెందిన పండితుడు వెంకటేశచార్యల బృందం సాంప్రదాయబద్దంగా కల్యాణోత్సవాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే సతీమణి జ్యోతి స్వామి పట్టువస్త్రాలు సమర్పించారు. కల్యాణోత్సవాన్ని తిలకించడానికి పట్టణానికి చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఔత్సాహిక గాయకులు పాటలు పాడి ఆకట్టుకున్నారు. కార్యక్రమంలో ఆలయ విచారణకర్త ప్రభాకర్, మేనేజర్ స్వామిరాయ్ పాల్గొన్నారు. -
తరగతి గదిలోనే విద్యార్థి భవిష్యత్
అలంపూర్: తరగతి గదిలోనే విద్యార్ధి భవిష్యత్ దాగి ఉందని వందేమాతరం ఫౌండేషన్ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు, మోటివేషన్ స్పీకర్ రవీందర్ అన్నారు. సోమవారం అలంపూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్, పదో తరగతి ప్రేరణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి విద్యార్ధికి లక్ష్యం, గమ్యం తప్పక ఉండాలని, ఒకరు చెబితే చదవడం కంటే చదవాలనే ఆసక్తి ఆత్రుత ఉన్నప్పుడే విద్యార్ధి ఉన్నత స్థాయిలో రాణిస్తారన్నారు. ప్రభుత్వం, దాతలు అందించే సౌకర్యాలను అంది పుచ్చుకోవాలని, పదో తరగతి విద్యార్థులు 10కి 10 గ్రేడ్ సాధించాలని అనారను. కార్యక్రమంలో చిన్నయ్య, రాముడు, అమరేందర్రెడ్డి, బలగం నాగరాజు, భరత్, నాగరాజు, శ్రీకాంత్, నాగశేషన్న ఉన్నారు. -
పథకాలపై అవగాహన పెంచుకోవాలి
గద్వాల: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ రకాల సంక్షేమాభివృద్ధి పథకాలపై సంపూర్ణ అవగాహన చేసుకోవాలని కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. సోమవారం కలెక్టరేట్లో కాన్ఫరెన్స్హాలులో నిర్వహించిన ఎంసీఆర్హెచ్ఆర్డీ ఇనిస్టిట్యూట్ 139వ స్థాయి–డి శిక్షణా కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా భౌగోళిక పరిస్థితులు, నియోజకవర్గాలు, మండలాల్లో అమలవుతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు గురించి క్షేత్రస్థాయిలో పర్యటించి అవగాహన చేసుకోవాలన్నారు. ప్రధానంగా ప్రజల అవసరాలను అనుసరించి పాలసీ మార్పులు చేయడంతో పాటు, పథకాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న అధికారులంతా ఈనెల 10వ తేదీ నుంచి 18వ తేదీ వరకు నిర్ధేశించిన షెడ్యూల్డ్ ప్రకారం పనిచేయాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ నర్సింగ్రావు, ఎస్సీ కార్పోరేషన్ ఈడీ రమేష్బాబు, ఏడీఆర్డీవో నర్సింహులు తదితరులు పాల్గొన్నారు. పోలీస్ గ్రీవెన్స్కు ఆరు అర్జీలు గద్వాల క్రైం: సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్కు 6 ఫిర్యాదులు అందినట్లు ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. ఇందులో భూ సంబంధ, స్థల అక్రమణ ఫిర్యాదులు అందాయన్నారు. సివిల్ సమస్యలను కోర్టు ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు. ఫిర్యాదుల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దు గద్వాల: వివిధ సమస్యలపై కలెక్టరేట్వకు వచ్చే ఫిర్యాదులను త్వరిగా పరిష్కరించాలని కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో సమావేశం హాలులో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ గ్రామాల నుంచి ప్రజలు సమస్యలపై 41మంది వినతులు అందజేసినట్లు కలెక్టర్ తెలిపారు. వచ్చిన వాటిని ఆయా శాఖలకు చెందిన అధికారులకు పంపినట్లు వాటిని వెంటనే పరిష్కరించాలని, లేనిపక్షంలో సంబంధిత ఫిర్యాదుదారుడికి అక్నాలెడ్డ్మెంట్ ద్వారా తెలియజేయాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.