breaking news
Jogulamba
-
మార్పు వచ్చేనా..?
●బాధ్యతను గుర్తుచేస్తూ.. మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటున్నాం. జిల్లాలో రోడ్డు ప్రమాదాల బారిన పడి ఎంతోమంది మృతి చెందారు. గడిచిన 9 నెలల వ్యవధిలో 73మందికిపైగా మృత్యువాతపడ్డారు. డ్రంకెన్ డ్రైవ్లో పట్టుబడిన క్రమంలో మోతాదుకు మించి మద్యం సేవించినట్లు సిబ్బంది గుర్తించారు. అలాంటి వారిని కోర్టులో హజరుపరచగా జరిమానాలు, జైలు శిక్షలు పడుతున్నాయి. అయితే వారిలో ఆశించిన మార్పు రావడంలేదు. ఈక్రమంలో వారిలో పూర్తిస్థాయిలో మార్పు రావాలనే లక్ష్యంతో బాధ్యతను గుర్తు చేస్తూ సామాజిక స్పృహ కల్పించాలనే దిశగా న్యాయశాఖ చర్యలు చేపట్టింది. వారి ఆదేశాల మేరకు డ్రంకెన్ డ్రైవ్లో పట్టుబడిన వారితో ఈ శిక్షలను అమలు చేయిస్తున్నాం. – శ్రీనివాసరావు, ఎస్పీ గద్వాల క్రైం: జిల్లాలో రోజురోజుకూ పెరిగిపోతున్న రోడ్డు ప్రమాదాలు కలకలం సృష్టిస్తున్నాయి. ఈ ప్రమాదాల్లో 60 నుంచి 80శాతం ప్రమాదాలకు మద్యం సేవించి వాహనాలు నడపడంతోనే అని పోలీసుల రికార్డుల ద్వారా తెలుస్తోంది. మద్యం తాగి వాహనాలు నడపడం.. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం చట్టరిత్యా నేరమని ప్రభుత్వ ఆదేశాలు ఉన్నప్పటికీ మద్యం ప్రియులు నిబంధనలు ఉల్లంఘించి పోలీసుల తనిఖీల్లో పట్టుబడుతున్నారు. అధికారులు జరిమానాలు విధించి కేసులు నమోదు చేసినా వారిలో మార్పు రావడంలేదు. దీంతో మద్యం ప్రియులకు జరిమానాల కంటే బాధ్యతలను గుర్తు చేయాలనే లక్ష్యంతో న్యాయశాఖ వినూత్న ఆలోచనకు తెరతీసింది. పోలీసులు, సామాన్యులతో కాకుండా.. డ్రంకెన్ డ్రైవ్లో పట్టుబడిన వారితోనే మద్యం తాగడం వల్ల జరిగే అనర్థాలపై ప్రజలకు, వాహనాదారులకు తెలియజేయాల్సిందిగా శిక్ష అమలు చేసింది. ఈ నెల 11వ తేదీన కేటీదొడ్డి మండలానికి చెందిన ఇద్దరు వ్యక్తులు మద్యం తాగుతూ పట్టుబడగా వారికి జిల్లా కేంద్రంలో ప్రధాన కూడలిలో ప్లకార్డులను చేత పట్టించి సమాజసేవలో భాగస్వాములను చేయాలని తీర్పు ఇచ్చింది. ఇదే తరహాలో అయిజకు చెందిన మద్యంతాగి పట్టుబడిన క్రమంలో న్యాయమూర్తి సదరు వ్యక్తికి జిల్లా ప్రభుత్వాసుపత్రిలో 10 మొక్కలు నాటమని సామాజిక సేవ రూపంలో శిక్షను అమలు చేయగా జిల్లా పోలీసుశాఖ శిక్షను అమలు చేశారు. డ్రంకెన్ డ్రైవ్లో పట్టుబడిన వారికి వినూత్న శిక్ష అమలు జరిమానాలకు బదులు సమాజసేవలో భాగస్వామ్యం పట్టుబడిన వారితో అవగాహన కార్యక్రమాలు మొక్కలు నాటించి బాధ్యత తెలిసేలా చర్యలు మద్యం సేవించి వాహనాలు నడపడంతోనే అనేక అనర్థాలు 9 నెలల వ్యవధిలో రోడ్డు ప్రమాదాల్లో 73 మంది మృత్యువాత -
దోస్త్.. లాస్ట్ చాన్స్
● డిగ్రీలో చేరేందుకు స్పాట్ అడ్మిషన్ పక్రియ ● నేడు, రేపు ప్రత్యేక చివరి విడత ప్రవేశాలకు నోటిఫికేషన్ ● విద్యార్థులకు ప్రభుత్వం మరో అవకాశం కల్వకుర్తి టౌన్/గద్వాల టౌన్: డిగ్రీ కోర్సులలో చేరేందుకు పలు విడతలుగా నోటిఫికేషన్ జారీచేసిన ఉన్నత విద్యామండలి మరోమారు ఆయా కోర్సులలో చేరికకు చివరి అవకాశం కల్పించింది. 2025– 26 విద్యా సంవత్సరానికి గాను సోమవారం, మంగళవారం ప్రత్యేక స్పాట్ అడ్మిషన్లు పొందేందుకు నోటిఫికేషన్ జారీచేసింది. దోస్త్ (డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ) చివరి అవకాశంగా ఇచ్చిన స్పాట్ అడ్మిషన్ను ఉపయోగించుకోవాలని, ఇప్పటి వరకు డిగ్రీలో అడ్మిషన్ తీసుకోని వారు వెంటనే స్పాట్ అడ్మిషన్ ద్వారా ఆసక్తి గల కోర్సులలో చేరాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఇప్పటికే ఆయా కళాశాలలు స్పాట్ అడ్మిషన్లకు సంబంధించిన నోటిఫికేషన్ను నోటీస్ బోర్డులలో ఉంచగా.. ఏయే కోర్సులలో ఖాళీలు ఉన్నాయో దోస్త్ పోర్టల్లో వివరాలను పొందుపరిచారు. నేరుగా రిపోర్టు.. దోస్త్ చివరి అవకాశంలో భాగంగా అడ్మిషన్ తీసుకునే విద్యార్థులు స్పాట్ అడ్మిషన్ కోసం సంబంధిత కళాశాలలో నేరుగా రిపోర్టు చేయాలి. ముందుగా విద్యార్థులు దోస్త్ పోర్టల్లో రూ.425 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలి. ఆన్లైన్లో కట్టిన రుసుంతో వచ్చిన రశీదును వారు ఎంచుకున్న కళాశాలలో చూయించాల్సి ఉంటుంది. స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియలో భాగంగా భర్తీ కాని సీట్లకు ఈ నెల 18, 19వ తేదీలలో వన్టైం స్పాట్ అడ్మిషన్ రౌండ్లో అడ్మిషన్ పొందవచ్చు. ఇదే తేదీలలో నాన్ లోకల్ విద్యార్థులకు అవకాశం కల్పించారు. ఇది వరకే కళాశాలలో అడ్మిషన్ పొందిన విద్యార్థులకు స్పాట్ అడ్మిషన్ ప్రక్రియలో పాల్గొనే అవకాశం ఉండదని తెలంగాణ ఉన్నత విద్యామండలి ఇచ్చిన ఉత్తర్వుల్లో పేర్కొంది. సద్వినియోగం చేసుకోండి.. దోస్త్ వివిధ విడతలలో అడ్మిషన్ పొందని విద్యార్థుల కోసం సోమ, మంగళవారాల్లో స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియను ఉన్నత విద్యామండలి చేపట్టనుంది. 2025– 26 విద్యా సంవత్సరానికి గాను అడ్మిషన్లు పొందేందుకు ఇదే చివరి అవకాశం. విద్యార్థులంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేలా ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. – శ్రీపాద శార్వాణి, ప్రిన్సిపాల్, ప్రభుత్వ మోడల్ డిగ్రీ కళాశాల, కల్వకుర్తి ●జోగుళాంబ గద్వాల జిల్లాలో 3,411 మిగులు సీట్లు జిల్లాలో 3 ప్రభుత్వ, 9 ప్రైవేట్ డిగ్రీ కళాశాలలు ఉండగా.. 3,411 సీట్లు స్పాట్ అడ్మిషన్లో భాగంగా విద్యార్థులకు ఎంచుకునే అవకాశం ఉంది. ఆయా కళాశాలలలో విద్యార్థులను చేర్పించేందుకు గాను లెక్చరర్లు ఎంతో శ్రమించినా.. ఆశించినంతగా అడ్మిషన్లు రాలేదని చెప్పాలి. ఇదిలాఉండగా, స్పాట్ అడ్మిషన్లో భాగంగా అడ్మిషన్ పొందాలనుకునే విద్యార్థులు వారి వెంట ఎస్సెస్సీ మెమో, ఇంటర్, టీసీ, ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు బోనోఫైడ్ సర్టిఫికెట్లు, కుల, ఆదాయం, రెసిడెన్సీ, ఏదైనా బ్రిడ్జి కోర్సు చదివి ఉంటే, దోస్త్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న ఫారంతోపాటు అన్ని సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలు వెంట తీసుకెళ్లాలి. అడ్మిషన్ల ప్రక్రియలో భాగంగా కోర్సు ప్రకారం నిర్ణయించిన రోస్టర్, మెరిట్ ఆధారంగా వివిధ కోర్సులలో సీట్లను భర్తీ చేయనున్నారు. స్పాట్ అడ్మిషన్లలో ప్రవేశం పొందే విద్యార్థులకు ప్రభుత్వం ద్వారా అందించే ఫీజు రీయింబర్స్మెంట్ వర్తించదు. విద్యార్థులే ఆయా కళాశాలలో ఉన్న ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. -
ఆసియాలోనే మొదటిది..
ఆటోమేటిక్ సైఫన్ సిస్టం అంటే.. ప్రాజెక్టులోని నీరు పూర్తిస్థాయి మట్టానికి చేరుకోగానే సైఫన్లు వాటంతట అవే తెరుచుకుంటాయి. అప్పట్లో ఈ టెక్నాలజీతో నిర్మించిన ఆసియాలోనే మొదటి ప్రాజెక్టుకు కాగా.. ప్రపంచంలో రెండోది. 17 వుడ్ సైఫన్లు, 4 ప్రీమింగ్ సైఫన్లతో 391 అడుగుల వెడల్పుతో మెయిన్ సైఫన్ నిర్మించారు. ఒక్కో సైఫన్ 520 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తుంది. మట్టికట్ట పొడువు 3,537 అడుగులు, రాతికట్ట పొడవు 520 అడుగులు, కట్ట గరిష్ట ఎత్తు 45.2 అడుగులు, నీటి విస్తరణ ప్రదేశం రెండు చదరపు మైళ్లు, కుడికాల్వ 8 కి.మీ., ఎడమ కాల్వ 20 కి.మీ.,లు ప్రవహిస్తూ ఆయకట్టుకు నీరందిస్తున్నాయి. అయితే ప్రాజెక్టుకు అనుసంధానంగా నిర్మించిన కట్ట ఇప్పటి రెండుసార్లు తెగిపోయింది. 1964లో మొదటిసారి, 2019 డిసెంబర్ 31న రెండోసారి కట్టకు గండిపడింది. వనపర్తి సంస్థానాధీశుల కాలంలో ఏడున్నర దశాబ్దాల క్రితం అమెరికాలోని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన ప్రాజెక్టు సరళాసాగర్. మదనాపురం మండలం శంకరమ్మపేట సమీపంలోని దీన్ని నిర్మించారు. దేశ స్వాతంత్య్రానికి ముందే ఇక్కడ ప్రాజెక్టు నిర్మించాలనే ఆలోచన అప్పటి వనపర్తి సంస్థానాధీశులు రాజారామేశ్వర్రావుకు వచ్చింది. తన తల్లి సరళాదేవి పేరుపై ఏదైనా ప్రత్యేకతతో దీన్ని నిర్మించాలనే ఆలోచనతో ఆయన అమెరికాలోని కాలిఫోర్నియాలో ఆటోమేటిక్ సైఫన్ సిస్టం అనే టెక్నాలజీని ఇక్కడికి తీసుకొచ్చారు. అనధికారికంగా 1947 జూలై 10న ఈ ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన చేసినా.. స్వాతంత్య్రం అనంతరం అప్పటి మిలటరీ గవర్నర్ జేఎన్ చౌదరి 1949 సెప్టెంబర్ 15న తిరిగి శంకుస్థాపన చేశారు. పదేళ్లపాటు ప్రాజెక్టు నిర్మాణం కొనసాగింది. అప్పట్లో రూ.35 లక్షలతో పూర్తి చేసిన ఈ ప్రాజెక్టును 1959 జూలై 26న అప్పటి పీడబ్ల్యూడీ మంత్రి జేవీ రంగారావు ప్రారంభించారు. వర్షం నీరు ఊకచెట్టువాగులో నుంచి వృథాగా కృష్ణానదిలో కలిసిపోవడం, ఈ వాగు సమీపంలోని గ్రామాలను తరుచూ వరద ముంపునకు గురికావడంతో ఈ సమస్యను పరిష్కరించేందుకు సరళాసాగర్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టినట్లు స్థానికులు చెబుతున్నారు. వనపర్తి సంస్థానం ఆధీనంలోని పది గ్రామాల్లోని సుమారు 4,182 ఎకరాలకు సాగునీరందించేలా 0.5 టీఎంసీ సామర్థ్యంతో సరళాసాగర్ ప్రాజెక్టు నిర్మించారు. సరళాసాగర్ ప్రాజెక్టు నిర్మించేందుకు అమెరికా వెళ్లి టెక్నాలజీని తీసుకువచ్చిన ప్రాజెక్టు రూపకర్త ఎస్ఈ పీఎస్ రామకృష్ణరాజు (ఫైల్) -
అద్భుతం.. ఆ కట్టడాలు
జోగుళాంబ గద్వాలసరళమైన కోయిల్సాగర్ ● ‘ఇంజినీర్’ నైపుణ్యతకు నిదర్శనంగా నిలుస్తున్న రెండు ప్రాజెక్టులు ● ఆసియా ఖండంలోనే మొదటిగా పేరుగాంచిన ఆటోమేటిక్ సైఫన్ సిస్టం ● అప్పట్లోనే సాంకేతికతను పరిచయం చేసిన వనపర్తి సంస్థానాధీశులు ● అతి తక్కువ వ్యయంతో కోయిల్సాగర్ నిర్మాణం ● ఉమ్మడి పాలమూరుకు తలమానికంగా నిలిచిన జలాశయాలు సోమవారం శ్రీ 15 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025 -
కోయిల్సాగర్ @ రూ.84 లక్షలు
పాలమూరు జిల్లా వరప్రదాయిని కోయిల్సాగర్ ప్రాజెక్టు ప్రారంభమై నేటికి 71 ఏళ్లు పూర్తయింది. 1947లో తెలంగాణ ప్రాంతానికి ఇంకా స్వాతంత్య్ర రాక ముందు ఆనాటి నైజాం ప్రభుత్వ హయాంలో శంకుస్థాపన చేశారు. 1.20 టీఎంసీల సామర్థ్యంతో 26.6 అడుగుల ఎత్తు అలుగు ఉండే విధంగా ప్రాజెక్టుకు అప్పటి ఇంజినీర్లు రూపకల్పన చేసి నిర్మాణ పనులు ప్రారంభించి 1954లో పూర్తిచేశారు. కేవలం రూ.84 లక్షల వ్యయంతో ఈ ప్రాజెక్టు నిర్మాణం పనులు పూర్తయ్యాయి. ప్రాజెక్టు నుంచి మొదటిసారి 9 వేల ఎకరాలకు సాగునీరు అందించారు. 1984లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం రూ.91 లక్ష వ్యయంతో 6 అడుగుల మేర కట్టను బలోపేతం చేసి ఎత్తును పెంచి అలుగుపై 13 గేట్లు నిర్మించారు. ఆనాటి ఎమ్మెల్యే వీరారెడ్డి కృషి ఫలితంగానే గేట్ల నిర్మాణం జరిగింది. దీంతో ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 32.6 అడుగులు కాగా.. 2.27 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉంది. ఆయకట్టు కుడి కాలువ కింద 9 వేల ఎకరాలు, ఎడమ కాల్వ కింద 3 వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన జలయజ్ఞంలో భాగంగా రూ.359 కోట్ల అంచనాతో కోయిల్సాగర్ ఎత్తిపోతల పథకానికి 2006లో శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారు. ప్రాజెక్టు ఆయకట్టును 50,250 ఎకరాలకు పెంచుతూ జూరాల నుంచి కృష్ణా జలాలను కోయిల్సాగర్కు తరలించేలా రూపకల్పన చేశారు. కోయిల్సాగర్ ప్రాజెక్టు గేట్ల నుంచి పరుగులు పెడుతున్న నీరు (ఫైల్)ఉమ్మడి పాలమూరు విభజన తర్వాత మహబూబ్నగర్ జిల్లాలో ఉన్న ఏకై క ప్రాజెక్టు కోయిల్సాగర్. గతంలో చిన్ననీటి తరహా ప్రాజెక్టుగా ఉండగా ఎత్తిపోతల పథకం ప్రారంభం తర్వాత భారీ నీటి పారుదల శాఖ కిందకు మార్చారు. సాగునీటితోపాటు పాలమూరు పట్టణానికి తాగునీటిని అందించే విధంగా ఏర్పాట్లు చేశారు. అలాగే నారాయణపేట జిల్లా, కొడంగల్ ప్రాంతానికి తాగునీటి వనరుగా ఉపయోగిస్తున్నారు. కోయిల్సాగర్ ప్రాజెక్టు కింద దేవరకద్ర నియోజకవర్గంలోని దేవరకద్ర, చిన్నచింతకుంట మండలాలు ఉండగా.. నారాయణపేట నియోజకవర్గంలోని మరికల్, ధన్వాడ మండలాలకు సాగునీరు అందిస్తున్నారు. మక్తల్ నియోజకవర్గంలోని నర్వ, అమరచింత మండలాల పరిధిలోని కొన్ని గ్రామాలకు సాగునీరు అందుతుంది. అలాగే ప్రాజెక్టు కాల్వ ద్వారా గొలుసు కట్టు చెరువులను నింపుతున్నారు. నైజాం ప్రభుత్వ హయాంలో 1947– 54 మధ్య నిర్మించిన కోయిల్సాగర్ ప్రాజెక్టు నేటికీ చెక్కు చెదరలేదు. కోయిలకొండ కోట సమీపంలో ఉండడం వల్ల ప్రాజెక్టుకు కోయిల్సాగర్ అని పేరు పెట్టారు. రెండు గుట్టల మధ్య ప్రాజెక్టును పటిష్టంగా సున్నం, గచ్చు ఉపయోగించి నిర్మించారు. కట్టకు రెండు వైపులా రాతి గోడ నిర్మించి.. బయటి నుంచి మట్టితో నింపారు. ఇక అలుగును సైతం సున్నం గచ్చు ఉపయోగించి నిర్మించారు. ఆనాడు ఉపయోగించిన పరికరాలు నేటికీ ప్రాజెక్టు సమీపంలోనే పడి ఉన్నాయి. ఇక ప్రాజెక్టు నమూనాను ముందుగా తయారు చేసి నిర్మాణం తర్వాత ప్రారంభించారు. ఆనాడు చేసిన నమూనా నేటికి ప్రాజెక్టు సమీపంలోనే కనిపిస్తుంది. ప్రాజెక్టును 10 జూలై 1954లో అప్పటి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి కేఎం ఖార్జు ప్రారంభించి ఆయకట్టుకు నీటిని వదిలారు. ప్రాజెక్టు నిర్మాణం వల్ల చిన్నబొల్లారం, పెద్ద బొల్లారంతోపాటు మరో రెండు చిన్న గ్రామాలు ముంపునకు గురయ్యాయి. అయితే బాధితులకు ప్రాజెక్టు ఎగువ ప్రాంతంలో ఇళ్లను నిర్మించుకోవడంతో కొత్తగా బొల్లారం పేరుతో గ్రామం ఏర్పడింది. కొనసాగుతున్న ప్రాజెక్టు నిర్మాణం పనులు (ఫైల్) కట్టను నిర్మిస్తున్న ఆనాటి కూలీలు (ఫైల్) -
పంటల సాగుపై స్పష్టత
పంటల సర్వే, నమోదు వల్ల ప్రభుత్వానికి పలు విషయాల్లో స్పష్టత రానుంది. ప్రధానంగా ఈసీజన్లో ఎన్ని ఎకరాల్లో పంటలు సాగు అయ్యాయి. ఏరకమైన పంటలు సాగు అయ్యాయి. ఇందులో ఆహార ధాన్యాల పంటలు, వాణిజ్య పంటలు సాగు అయ్యాయో తెలుస్తుంది. వీటి ఆధారంగా దిగుబడి అంచనా వేయడానికి వీలు కల్గుతుంది. ఈ దిగుబడుల ఆధారంగా ఆయా పంటలకు ఎంతమేర మద్దతు ధరలు ఇవ్వాలి, ఎన్ని కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి తదితర విషయాలపై ప్రభుత్వానికి స్పష్టత వస్తుంది. దీంతో పాటు ఆయా పంటల దిగుబడుల ఆధారంగా ఆయా పంటలకు పట్టిపీడిస్తున్న చీడపీడలు, వైరస్లు ఏవేవీ ఆశిస్తున్నాయో కూడా తెలుస్తుంది. ఈవివరాల ఆధారంగా తీసుకోవాల్సిన సస్యరక్షణ చర్యలను రైతులకు తెలియసేసే అవకాశం ఉంటుంది. -
ప్రతిభకు ప్రోత్సాహం
నారాయణపేట రూరల్/గద్వాల టౌన్: పేద విద్యార్థులు ఆర్థిక సమస్యలతో విద్యాభ్యాసాన్ని మధ్యలోనే నిలిపివేయకుండా వారిని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రతిభ ఉపకార వేతనం (ఎన్ఎంఎంఎస్) అందిస్తోంది. 2025–2026 విద్యా సంవత్సరానికి సంబంధించి అర్హత పరీక్ష ప్రకటనను ఇటీవల విడుదల చేసింది. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. అక్టోబర్ 6 వరకు అవకాశం కల్పించింది. నవంబర్ 23న ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పరీక్ష నిర్వహించేందుకు విద్యాశాఖ సిద్ధమైంది. ఇందులో ఎంపికై తే తొమ్మిదో తరగతి నుంచి 12వ తరగతి వరకు నాలుగేళ్ల పాటు ఏటా రూ.12 వేల చొప్పున మొత్తం రూ.48 వేలు విద్యార్థుల బ్యాంకు ఖాతాలో జమవుతాయి. అర్హత.. 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు పరీక్ష రాసేందుకు అర్హులు. ఏడోతరగతి పరీక్షలో 55 శాతం కంటే ఎక్కువ మార్కులు సాధించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీలైతే 50 శాతం మార్కులుంటే సరిపోతుంది. ప్రభుత్వ, మండల పరిషత్, జిల్లా పరిషత్, ఎయిడెడ్ పాఠశాలలు, హాస్టల్ సౌకర్యం లేని ఆదర్శ పాఠశాల విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఓసీ, బీసీ విద్యార్థులు రూ.100, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.50 ఫీజు చెల్లించాలి. ప్రధానోపాధ్యాయులు విద్యార్థులను ధ్రువీకరిస్తూ బోనఫైడ్ ఇవ్వాలి. అదేవిధంగా విద్యార్థి తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.3.50 లక్షల్లోపు ఉండాలి. పరీక్ష విధానం.. మల్టీపుల్ ఛాయిస్ విధానంలో ప్రశ్నలుంటాయి. మెంటలెబిలిటీ (ఎంఏటీ), లాస్టిక్ ఎబిలిటీ (ఎస్ఏటీ), ఏడు, ఎనిమిదో తరగతికి సంబంధించిన గణితం, సామాన్య శాస్త్రం, సాంఘిక శాస్త్రం పాఠ్యాంశాలకు సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. పరీక్షలో సాధించిన మెరిట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. పూర్తి వివరాలకు బీఎస్ఈ తెలంగాణ వెబ్సైట్ను పరిశీలించాలి. బాలురు 2,973 బాలికలు 2,621నవంబర్ 23న ఎన్ఎంఎంఎస్ పరీక్ష ఎంపికై తే ఏటా రూ.12 వేల ఉపకార వేతనం ప్రతిభ చాటితే నాలుగేళ్ల పాటు అందజేత దరఖాస్తునకు అక్టోబర్ 6 వరకు అవకాశం 8వ తరగతి విద్యార్థులు 5,594 -
పక్కాగా పంటల నమోదు!
గద్వాల వ్యవసాయం: గడిచిన వారం రోజుల నుంచి జిల్లాలో పంటల నమోదు (డిజిటల్ క్రాప్ సర్వే.. బుకింగ్) పక్కాగా సాగుతోంది. దీంతో ఆయా ప్రాంతాల్లో ఎన్ని ఎకరాల్లో ఏ రకమైన పంటలు వేశారు.. దిగుబడి అంచనా.. వ్యవసాయ పంటల సాగు వివరాలు తెలియనుంది. ఈవివరాలతో మద్దతు ధర, కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, ఆహారధాన్యాల లభ్యతపై ప్రభుత్వానికి స్పష్టత వస్తుంది. సాంకేతికతను జోడించి.. జిల్లాలో కృష్ణా, తుంగభద్ర నదులతోపాటు జూరాల, ఆర్డీఎస్ ప్రాజెక్ట్లతో పాటు, నెట్టెంపాడు ఎత్తిపోతల దానికింద ఆరు రిజర్వాయర్లు ఉన్నాయి. వీటి కిందతో పాటు బోర్లు, బావుల కింద ఇక్కడి రైతులు వ్యవసాయం చేస్తున్నారు. ఏటా వానాకాలం సీజన్లో 3.80 లక్షలు, యాసంగిలో 1.30లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేస్తున్నారు. పత్తి, సీడ్పత్తి, వరి, కంది, మిరప, వేరుశనగ పంటలు వేస్తున్నారు. ఇంకా ఉద్యాన, వాణిజ్య పంటల సాగు కూడా ఇక్కడ ఉంది. ఇదిలాఉండగా, పంటల వివరాలు పక్కగా తెలుసుకుని, దాని ద్వార మద్దతు ధరలను నిర్ణయించడం, కొనుగోలు కేంద్రాల ఏర్పాటు తదితరమైనవి చేసేందుకు గాను ప్రభుత్వం సాంకేతికతను జోడించి (డిజిటల్ క్రాప్ సర్వే అండ్ బుకింగ్) పంటల నమోదు కార్యాక్రమానికి శ్రీకారం చుట్టింది. కాగా జిల్లాలో ఈ వానాకాలం సీజన్లో దాదాపు 3,28,641 ఎకరాల్లో వివిద రకాల వ్యవసాయ పంటలు సాగు అయ్యాయని వ్యవసాయశాఖ అంచనాకు వచ్చింది. ఈఅంచనాకు అనుగుణంగా జిల్లాలో 97వ్యవసాయ క్లస్టర్లలో వారం రోజల క్రితం పంటల నమోదును ఆరంభించింది. ఒక్కో వ్యవసాయవిస్తరణ అధికారికి 2వేల ఎకరాల్లో పంటల సర్వే, నమోదు చేసేలా లక్ష్యంగా నిర్ధేశించారు. ఈసర్వేలో భాగంగా ప్రత్యేకంగా రూపొందించిన డీసీఎస్ యాప్లో మొబైల్ ద్వారా వివరాలు పొందుపరుస్తారు. ఈయాప్ ఓపెన్ చేసిన వెంటనే కెడెస్టల్ మ్యాప్ డిస్ప్లే అవుతుంది. ఆ మ్యాప్లో ఐదు నుంచి 10 మంది రైతుల పేర్లు, వారి భూముల సర్వే నెంబర్లు వస్తాయి. అక్షాంశ, రేఖాంశలతో వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది కాబట్టి ఏఈఓ ఖచ్చితంగా సంబంధిత రైతును సెలక్ట్ చేసుకొని, సర్వే నంబర్ ఉన్న భూమి దగ్గరకు వెళ్తున్నారు. రైతుల పొలాల దగ్గరకు వెళ్లిరైతు పేరు, ఆధార్నంబర్తో పాటు ఏపంట ఎన్ని ఎకరాల్లో వేశారో నమోదు చేస్తున్నారు. దీంతో ఉదాహరణకు వరి వేస్తే.. సాధారణమా, ఆర్ఎన్ఆర్ రకమా తెలుసుకొని వరి వివరాలన్నీ నమోదు చేయడంతో పాటు, పంట ఫొటోను కూడా అప్లోడ్ చేస్తున్నారు. 3,28,641 ఎకరాల్లో పంటల సర్వే, నమోదు లక్ష్యంగా ఉండగా ఇప్పటివరకు 29,200 ఎకరాల్లో (8.89శాతం) పూర్తి అయ్యింది. కొనసాగుతున్న డిజిటల్ క్రాప్ సర్వే 3.28 లక్షల ఎకరాలు లక్ష్యం ఇప్పటివరకు 29,200 ఎకరాలు పూర్తి సర్వేతో పంటల దిగుబడిపై అంచనా.. వ్యవసాయ పురోగతికి దోహదం -
పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చాం
గద్వాల: ‘తన తలను రైలు కింద పైట్టెనా చనిపోతా కానీ, కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లనని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి వైఎస్సార్ చౌరస్తాలో ఎంపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా చెప్పారు.. మరి ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు.. సొంత అభివృద్ధి కోసం పార్టీ మారిన ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డిని రాబోయే ఉప ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఓడించాలని’ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శనివారం కేటీఆర్ గద్వాల పర్యటన సందర్భంగా ముందుగా జిల్లాకేంద్రంలోని ప్రధాన మార్గంలో ర్యాలీ తీసి.. తేరు మైదానంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగసభలో పాల్గొని మాట్లాడారు. అభివృద్ధి కోసం పార్టీ మారానని చెబుతున్న ఎమ్మెల్యే బండ్ల ఈ రెండేళ్ల కాంగ్రెస్ పార్టీ హయాంలో ఏమి అభివృద్ధి జరిగిందో.. నియోజకవర్గానికి ఒక్క రూపాయి వచ్చిందో చెప్పాలని సూటిగా ప్రశ్నించారు. ఆరు గ్యారంటీ పథకాలు ఎగ్గొట్టినందుకు పార్టీ మారాడా? రైతుబంధు రూ.15 వేలు ఇవ్వనందుకు పార్టీ మారాడా? ఆసరా పింఛన్ ఇవ్వనందుకు పార్టీ మారాడా? షాదీముబారక్, కల్యాణలక్ష్మి పథకం కింద ఆడపడుచులకు తులం బంగారం ఇవ్వనందుకు పార్టీ మారాడా? ఎందుకు పార్టీ మారాడో ఎమ్మెల్యే బండ్ల ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. ఇంకా సిగ్గులేని విషయం ఏమంటే తాను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానంటూ చెప్పి సీఎం రేవంత్రెడ్డి సంకలో కూర్చుని సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడని మండిపడ్డారు. 2014లో గద్వాలలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఓడినప్పటికీ మెడికల్, నర్సింగ్ కళాశాలలు, గురుకులాలు, గట్టు, తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకాలు, 1,275 డబుల్ బెడ్రూం ఇళ్లు, ప్రభుత్వ ఆస్పత్రి ఇలా అన్ని రకాల సంక్షేమాభివృద్ధి పథకాలు అమలు చేసిన ఘనత కేసీఆర్కే దక్కుతుందన్నారు. పంటలు సాగు చేసుకునేందుకు ఏ ఒక్క రైతు కూడా ఇబ్బందులు పడొద్దని ఎకరాకు రూ.10వేల చొప్పున రైతుబంధు వారి ఖాతాలో జమచేశామని, పేదింటి ఆడబిడ్డలు ఇబ్బందులు పడొద్దని షాదీముబారక్, కల్యాణలక్ష్మి పథకాలు, దళితబంధు వంటి పథకాలు అమలు చేశామని గుర్తుచేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు చల్లా వెంకట్రామిరెడ్డి, నవీన్కుమార్రెడ్డి, ఎమ్మెల్యేలు విజయుడు, పాడి కౌశిక్రెడ్డి, మాజీ మంత్రులు నిరంజన్రెడ్డి, శ్రీనివాస్గౌడ్, లక్ష్మారెడ్డి, నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్, మాజీ ఎమ్మెల్యేలు జైపాల్యాదవ్, అంజయ్య, స్పోర్ట్స్ అథారిటీ మాజీ చైర్మన్ ఆంజనేయగౌడ్, మున్సిపల్ మాజీ చైర్మన్ బీఎస్ కేశవ్, బాసు హనుమంతు, నాగర్దొడ్డి వెంకట్రాములు తదితరులు పాల్గొన్నారు. కష్టకాలంలో పార్టీకి అండగా.. గద్వాలలో పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు బాసు హనుమంతు అండగా నిలబడి పార్టీ అభివృద్ధికి కృషి చేస్తున్నారని కేటీఆర్ పేర్కొన్నారు. అలాగే ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి, అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు పార్టీలో చురుకుగా ఉంటూ ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నారన్నారు. అలంపూర్ నియోజకవర్గం రాజోళిలో ఇథనాల్ ఫ్యాక్టరీని వ్యతిరేకించినందుకు 15 మంది రైతులను జైలుకు పంపారని ఆరోపించారు. నిర్మల్లో రద్దు చేసిన విధంగా ఇక్కడ కూడా ఇథనాల్ ఫ్యాక్టరీని రద్దు చేయాలని, ఆ ఫ్యాక్టరీ లైసెన్సు రద్దు చేసే వరకు బీఆర్ఎస్ పోరాటం చేస్తూ రెతులకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ హయాంలోనే 18 లక్షలఎకరాలకు సాగునీరు అందించాం సొంత అభివృద్ధి కోసమే ‘బండ్ల’ పార్టీ మారాడు ఉప ఎన్నికల్లో ఆయన్ను చిత్తుచిత్తుగా ఓడించండి గట్టు ఎత్తిపోతలను పండబెట్టారని మండిపాటు గద్వాల జిల్లాతో సహా మెడికల్, నర్సింగ్ కళాశాలలు, గురుకులాలు, ఆస్పత్రుల ఏర్పాటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ -
ప్రణాళికతో చదివితే..
మొత్తం 180 మార్కులకు పరీక్ష నిర్వహించగా.. ప్రశ్నాపత్రం రెండు విభాగాలుగా ఉంటుంది. పార్ట్–ఏలో మానసిక సామర్థ్య పరీక్ష 90 మార్కులకు 90 ప్రశ్నలు ఉంటాయి. ఇందులో రీజనింగ్ ఎబిలిటీ, సంఖ్యాశాస్త్రం, పదాల భిన్న పరీక్ష, నంబర్ అనాలజీ, ఆల్ఫాబెట్ అనాలజీ, కోడింగ్, డీ కోడింగ్, లాజికల్ ప్రశ్నలు, వెన్ చిత్రాలు, మిర్రర్ ఇమేజెస్, వాటర్ ఇమేజెస్కు సంబంధించిన అంశాలు ఉంటాయి. పార్ట్–బిలో ఏడు, 8వ తరగతికి సంబంధించి 90 ప్రశ్నలకు 90 మార్కులు కేటాయించారు. వాటిలో గణితం 20, సామాన్య శాస్త్రం 35, సాంఘిక శాస్త్రం 35 మార్కులు కేటాయిస్తారు. ప్రశ్నపత్రం తెలుగు, ఆంగ్ల మాధ్యమంలో ఉంటుంది. ప్రణాళికతో చదివి పరీక్షకు హాజరవుతే తప్పక విజయం సాధించేందుకు అవకాశం ఉంటుంది. -
లోక్ అదాలత్లో 6,884 కేసులు పరిష్కారం
గద్వాల క్రైం: సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు శనివారం గద్వాల కోర్టు ఆవరణలో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో 6,884 కేసులు పరిష్కారమైనట్లు లోక్ అదాలత్ చైర్మన్, జిల్లా న్యాయమూర్తి ఎన్.ప్రేమలత తెలిపారు. క్రిమినల్, సివిల్, సైబర్ క్రైం, బ్యాంకు లిటిగేషన్ తదితర పెండింగ్ కేసులను ఇరువర్గాల వారిని రాజీ కుదిర్చినట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు టి.లక్ష్మీ, వెంకట హైమ పూజిత, ఉదయ్నాయక్, ఏపీపీలు రెచ్చల్ సంజాన జాషువ, జిల్లా న్యాయ సేవ సంస్థ సెక్రటరీ శ్రీనివాస్, న్యాయవాదులు తదితరులు ఉన్నారు. ప్రధాని మోదీ పాలనలోనే దేశం అభివృద్ధి ఎర్రవల్లి: ప్రధాని నరేంద్ర మోదీ పాలనలోనే దేశం అభివృద్ధి చెందుతూ.. సురక్షితంగా ఉందని బీజేపీ జిల్లా అద్యక్షుడు రామాంజనేయులు అన్నారు. శనివారం మండంలోని కోదండాపురంలో ఆ పార్టీ మండలాధ్యక్షుడు జగదీష్రెడ్డి ఆధ్వర్యంలో సేవా పక్వాడ్ కార్యక్రమాన్ని నిర్వహించగా ముఖ్యఅతిథిగా ఆయన హాజరై మాట్లాడారు. బీజేపీ పాలనలో ప్రజలకు భద్రతతో పాటు అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. ఉపాధిహామీ పథకం ద్వారా గ్రామాల అభివృద్ధి, రైతుల అభ్యున్నతి కోసం సబ్సిడీపై ఎరువులు, పంటలకు మద్దతు ధరలు, కిసాన్ సమ్మాన్ నిధి యోజన వంటి పథకాలు అందుతున్నాయన్నారు. ప్రపంచ దేశాల్లో మూడో అతిపెద్ద దేశంగా ఉన్న భారత్ బీజేపీ పాలనలో మేక్ ఇన్ ఇండియా ద్వారా తయారు చేసిన ఎన్నో వస్తువులను ఇతర దేశాలకు ఎగుమతి చేస్తుందన్నారు. ఆపరేషన్ సిందూర్తో పాకిస్తాన్కు తగిన బుద్ది చెప్పి దేశ పవర్ ఎంటో ప్రదాని చూపించారన్నారు. కాంగ్రెస్ హయాంలో ప్రజా సమస్యలను, అభివృద్ధిని పక్కనబెట్టి 2జీ కుంభకోణం, గడ్డి కుంభకోణం, యూరియా వంటి కుంభకోణాలతో పూర్తిగా అవినీతిలో కూడుకుపోయిందన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో జిల్లా ఉపాద్యక్షుడు కేకే రెడ్డి, పరుశరాం నాయుడు, వెంకటరామిరెడ్డి, శివరాంరెడ్డి, విజయ్, నరేష్, మహేష్, బీసన్న, రవి, తదితరులు పాల్గొన్నారు. హమాలీలకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి ఎర్రవల్లి: హమాలీలకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి వారికి అవసరమైన సౌకర్యాలు కల్పించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు వెంకటస్వామి అన్నారు. శనివారం మండల కేంద్రంలో హమాలీ యూనియన్ అధ్యక్షుడు యాదన్న ఆధ్వర్యంలో కూడలి బజార్ లోడింగ్, అన్ లోడింగ్ హమాలీ జనరల్ బాడీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. ప్రజలకు అవసరమైన నిత్యావసర సరుకులను ప్రతిరోజు లోడింగ్ మరియు అన్ లోడింగ్ పనులు చేస్తూ బరువును మోస్తున్న హమాలీ కార్మికుల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయన్నారు. వారికి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి ప్రభుత్వం నుండి గుర్తింపు కార్డులను ఇవ్వాలన్నారు. ప్రభుత్వ పథకాలలో హమాలీలకు మొదటి ప్రాధాన్యతను ఇవ్వాలని అందులో భాగంగా వారికి ఇందిరమ్మ ఇండ్లు, స్థలాలు కేటాయించాలని అన్నారు. ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బరువును మోస్తూ బతుకును ఈడుస్తున్న హమాలీలకు ప్రభుత్వం తప్పకుండా ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలన్నారు. తమ వృత్తితో సమాజానికి సేవచేస్తున్న హమాలీలపై ప్రభుత్వాలు నిర్లక్ష్యం వీడి వారికి తగు సౌకర్యాలు కల్పించి ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు బీచుపల్లి, శేఖర్, హుస్సేన్, రామకృష్ణ, తిరుపతి, రాజు, గోపాల్, గోవిందు, నాగేష్, కార్మికులు, తదితరులు పాల్గొన్నారు. వేరుశనగ క్వింటా రూ.5,676 గద్వాల వ్యవసాయం: గద్వాల మార్కెట్ యార్డుకు శనివారం 181 క్వింటాళ్ల వేరుశనగ వచ్చింది. గరిష్టం రూ. 5676, కనిష్టం రూ. 2839, సరాసరి రూ. 3621 ధరలు లభించాయి. -
నీ అభివృద్ధి కోసం పార్టీ మారావా...?: కేటీఆర్
జోగులాంబ గద్వాల్: తెలంగాణ మారుమూల ప్రాంతాల్లో కూడా కేసీఆర్ అభివృద్ధి చేశారన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. గద్వాలను జిల్లా చేసింది.. మెడికల్ కళాశాల, నర్సింగ్ కళాశాల ఇచ్చిన ఘనత కేసీఆర్దేనన్నారు. తమ హయాంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్లకు కాంగ్రెస్ ప్రభుత్వం రంగుమార్చి ప్రారంభించిందన్నారు. ‘తెలంగాణ ఉద్యమంలో కూడ గద్వాల ముందుంది. కాంగ్రెస్ నాయకులు మాయామాటలు మాట్లాడుతున్నారు. రైలుకింద తలపెట్టిన చనిపోతా కాని కాంగ్రెస్లో చేరనన్న బండ్ల కృష్ణమోహన్రెడ్డి ఎందుకు మారాడు. నీ సొంత అభివృద్ధి కోసం పార్టీ మారావా ఎమ్మెల్యే. కాంగ్రెస్ హయంలో నియోజకవర్గానికి పార్టీ మారిన తర్వాత ఎమ్మెల్యే ఒక్క రూపాయ తెచ్చాడా?, కాంగ్రెస్ ఇచ్చిన ఒక్క హామీ నెరవేర్చలేదు. సిగ్గులేని విధంగా రేవంత్ రెడ్డి సంకలచిక్కి సన్నాయినొక్కులు నొక్కుతున్నాడు స్దానిక ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి. సుప్రీంకోర్టు సీరియస్గా ఉంది పార్టీ పిరాయింపు చేసిన పది మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయక తప్పదు.6 నుంచి 9 మాసాల్లో 10 నియోజకవర్గాల్లో ఉప ఎన్నిక రావడం ఖాయం. గద్వాలలో బీఆర్ఎస్ అభ్యర్ది 50 వేల మెజారిటీతో గెలవటం ఖాయం. దొంగలముఠాలో బండ్ల చేరాడు..ఆయన్ను చిత్తుచిత్తుగా ఓడించాలి. స్కూటీలు మరిచి సీఎం లూఠీలు చేస్తున్నారు. స్దానిక సంస్ధల ఎన్నికల్లో పార్టీ అభ్యర్దులను గెలిపించాలి. ఉపఎన్నికల్లో డంకామోగించాలి’ అని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. -
జూరాలపై వెలుగులేవి?
ప్రాజెక్టు రహదారిపై వెలగని విద్యుద్దీపాలు ●అధికారుల నిర్లక్ష్యం.. జూరాల ప్రాజెక్టుపై విద్యుద్ధీపాల ఏర్పాటు సమస్యను అధికారులు నేటికీ పరిష్కరించడం లేదు. తాగు, సాగునీటితో పాటు విద్యుదుత్పత్తికి ఉపయోగపడే ప్రాజెక్టుపై అంధకారం నెలకొంది. రాత్రిళ్లు వెలుతురు ఉండేలా విద్యుద్ధీపాలు ఏర్పాటు చేయాలి. – విష్ణువర్ధన్ యాదవ్, అమరచింత నిధులు మంజూరయ్యాయి.. జూరాల ప్రాజెక్టు రహదారిపై విద్యుద్ధీపాల ఏర్పాటుకు రూ.18 లక్షలు మంజూరయ్యాయి. వీటితో పూర్తిస్థాయిలో విద్యుత్ బల్బులు బిగించేందుకు కార్యాచరణ రూపొందించాం. సంబంధిత పనులను కాంట్రాక్టర్కు అప్పజెప్పాం. డ్యాంపై రాత్రిళ్లు చీకటి లేకుండా చర్యలు తీసుకుంటాం. – జుబేర్ అహ్మద్, ఈఈ, గద్వాల ఏళ్లుగా తీరని సమస్య.. ప్రాజెక్టు రహదారిపై విద్యుద్ధీపాలు ఏళ్ల తరబడి వెలగకున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు. సమస్యను పలుమార్లు విన్నవించినా ఫలితం లేకపోయింది. రాత్రిళ్లు రహదారిపై ప్రయాణం చేయాలంటే భయపడుతున్నాం. – వెంకటేష్, నందిమళ్ల (అమరచింత) అమరచింత: ప్రియదర్శిని జూరాల జలాశయంపై రాత్రిళ్లు వెలుతురు ఉండేలా ఏర్పాటు చేసిన విద్యుద్ధీపాలు ఏళ్లు గడుస్తున్నా మరమ్మతుకు నోచుకోవడం లేదు. దీంతో ప్రాజెక్టు రహదారి రాత్రి సమయంలో చీకట్లు కమ్ముకొని వాహనదారులు, ప్రయాణికులు, పర్యాటకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలాగే వాహనదారులు ఎదురుగా వస్తున్న వాహనాలను తప్పించబోయి ప్రమాదాలకు గురవుతున్నారు. ప్రస్తుతం తెలంగాణ, కర్ణాటక ప్రజలు ప్రాజెక్టు రహదారి మీదుగా తమ తమ గమ్యస్థానాలకు రాకపోకలు సాగిస్తుంటారు. సమస్యను పలుమార్లు సంబంధిత అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి. గుంతలమయంగా మారిన రహదారి.. ప్రాజెక్టు రహదారిపై అడుగడుగునా గుంతలపడి అధ్వానంగా మారింది. అమరచింత మండలం నందిమళ్ల పీజేపీ క్యాంపు సమీపంలోని సత్యసాయి తాగునీటి పథకం నుంచి ప్రారంభమైన ప్రాజెక్టు రహదారి జోగుళాంబ గద్వాల జిల్లా ధరూర్ మండలం చింతరేవుల వరకు సుమారు 5 కిలోమీటర్ల రహదారి పూర్తిగా దెబ్బతింది. రహదారి తాత్కాలిక మరమ్మతులు చేపట్టి ఇబ్బందులు తొలగించాల్సి ఉన్నా అధికారులు మాత్రం చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. అసలే గుంతల రహదారి.. ఆపై రాత్రిళ్లు చీకట్లు అలుముకొని ప్రయాణం నరకప్రాయంగా మారుతోంది. రహదారి మరమ్మతుకు సైతం నిధులు మంజూరు చేయాలని ప్రతిపాదనలు సైతం పంపలేని స్థితిలో అధికారులు ఉన్నారని ఆయా గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. రూ.18 లక్షలు మంజూరైనా.. జూరాల ప్రాజెక్టు రహదారిపై విద్యుద్ధీపాల ఏర్పాటుకు ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపడంతో రూ.18 లక్షలు మంజూరైనట్లు పీజేపీ అధికారులు వెల్లడిస్తున్నారు. కానీ నేటికీ మరమ్మతుల్లో మాత్రం వేగం కనిపించడం లేదు. ఏళ్లు గడుస్తున్నా మరమ్మతుకు నోచుకోని వైనం ప్రమాదాలకు నిలయంగా మారిన రహదారి పట్టించుకోని అధికారులు నిధులు మంజూరైనా.. ముందుకు సాగని పనులు -
అప్రజాస్వామ్యం..
పత్రికల గొంతు నొక్కడం ● సాక్షి ఎడిటర్, జర్నలిస్టులపై కేసులు నమోదు చేయడం సరికాదు ● మీడియాపై అణచివేత విధానాలను ఖండించిన పాత్రికేయ సంఘాలు, రాజకీయ నాయకులు ●‘సాక్షి’ ఎడిటర్ ధనుంజయరెడ్డిపై అక్రమ కేసులు పెట్టడాన్ని మహబూబ్నగర్ ప్రెస్ క్లబ్ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజాస్వామ్యంలో పత్రికా స్వేచ్ఛ చాలా ముఖ్యమైనది. అభిప్రాయాలను పంచుకునేందుకు, ప్రభుత్వానికి ప్రజల వాణిని వినిపించడంలో పత్రికలు కీలకపాత్ర పోషిస్తాయి. పత్రికలపై, సంపాదకులపై పనిగట్టుకొని కేసులు నమోదు చేయడం దారుణం. ప్రజల గొంతుకగా నిలిచే మీడియా గొంతు నులిమే ప్రయత్నం చేయడం సరికాదు. పత్రికలు తమ పని తాము స్వేచ్ఛగా చేసినప్పుడే సమాజంలోని అన్నివర్గాల అభిప్రాయాలు ప్రజలకు చేరువవుతాయి. – వి.నరేందర్చారి, ప్రెస్క్లబ్ అధ్యక్షుడు, మహబూబ్నగర్ ప్రజాస్వామ్యంలో పత్రికా స్వేచ్ఛను హరించేలా వ్యవహరించడం ఎవరికీ సమర్థనీయం కాదు. ప్రతిపక్షాలు మాట్లాడలేనప్పుడు కూడా ప్రజల సమస్యలు, ఇబ్బందులను పాలకుల దృష్టికి తీసుకొస్తాయి. అలాంటి పత్రికలు, మీడియాపై అణచివేతకు పాల్పడేలా దాడులకు దిగడం.. కేసులు నమోదు చేయడం అప్రజాస్వామిక చర్య. ప్రభుత్వాలు ఎప్పుడూ స్థిరంగా ఉండవు. ఇప్పుడు ఒకరు అనైతిక చర్యలకు దిగారంటే.. ఆ తర్వాత వచ్చే ప్రభుత్వం కూడా అలానే వ్యవహరించాల్సి ఉంటుంది. ఇలా చేస్తూ పోతే అభివృద్ధి కుంటుపడడమే కాకుండా రాష్ట్రం రావణకాష్టగా మారుతుంది. రాజకీయాల మాటున కక్షసాధింపు చర్యలు రాష్ట్రానికి, దేశానికి మంచిది కాదు. ప్రజలు అన్నీ గమనిస్తూనే ఉంటారు. ఇప్పటికై నా పత్రికా స్వేచ్ఛను హరించే చర్యలకు ఫుల్ స్టాప్ పెట్టాలి. – శ్రీనివాస్గౌడ్, మాజీ మంత్రి, మహబూబ్నగర్ -
సామాన్యులపై దాడులకు పాల్పడుతున్న పోకిరీలు
గద్వాల: జిల్లా కేంద్రమైన గద్వాలలో ఇటీవల రౌడీమూకలు రెచ్చిపోతున్నాయి. నిత్యం మద్యం మత్తులో తూగుతూ సామాన్యులతోపాటు ఏకంగా పోలీసులపైనా దాడులకు పాల్పడుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ఈ వీధిరౌడీలు ప్రజలపై విచక్షణా రహితంగా దాడులకు పాల్పడుతున్నా చర్యలు తీసుకునేందుకు ఖాకీలే వెనకంజ వేయడం గమనార్హం. అయితే, కొందరు రాజకీయ నాయకులు ఈ రౌడీమూకలకు రక్షణ కవచంగా ఉంటుండడంతోనే పదుల సంఖ్యలో దాడి ఘటనలు చోటుచేసుకుంటున్నా పోలీసులు సైతం మిన్నకుండిపోతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గ్యాంగ్లుగా ఏర్పడి.. పట్టణంలో మొత్తం జనాభా లక్ష వరకు ఉండగా.. ఇందులో 35శాతం మేర అంటే 35వేల మంది యువత ఉంటారు. వీరిలో చదువు మధ్యలో మానివేసిన వారు, దినసరి కూలీలు చేస్తున్నావారు, జల్సాలకు, మత్తు పదార్థాలకు అలవాటు పడ్డ యువకులు గ్రూపులుగా ఏర్పడ్డారు. ఇలాంటి వాట్సాప్ గ్రూపులు 90కి పైగా ఉన్నట్లు సమాచారం. ఓ యూత్కు సంబంధించి ‘చంపు–చావు’ అనే పేరుతో ఏర్పాటు చేసుకున్న వాట్సాప్ గ్రూప్పై పెద్ద ఎత్తున దుమారం లేస్తుంది.ఇలా ఏర్పాటు చేసుకున్న గ్రూపుల ద్వారా నిత్యం ఒకరిమరొకరు టచ్లో ఉంటూ సమాచారాన్ని బదిలీ చేసుకుంటారు. ఈ క్రమంలోనే ఎక్కడైనా తమ గ్రూప్లోని ఫ్రెండ్ ఘర్షణలకు పాల్పడుతుంటే వెంటనే వాట్సప్గ్రూప్ ద్వారా సమాచారం తెలుసుకుని నిమిషాల్లో ఘర్షణ జరుగుతున్న స్థలాలకు చేరుకుని దాడులకు పాల్పడుతూ రెచ్చిపోతున్నారు. ప్రధాన పార్టీలకు చెందిన తాజా మాజీ లీడర్లతో పాటు చిన్నాచితక మరో ముగ్గురు లీడర్లు గ్యాంగ్లను ఏర్పాటు చేసుకుని అన్ని రకాలుగా పెంచిపోషిస్తూ అండగా నిలబడుతున్నారనేది బహిరంగ రహస్యం. రాజకీయ ప్రాబల్యంతో కొనసాగుతున్న గ్యాంగ్లు మందు పార్టీలు చేసుకునే క్రమంలోనే దాడులకు స్కెచ్లు వేస్తూ అమలుచేస్తున్నట్లు సమాచారం. సామాన్యులు బైక్పై వెళ్తూ హెల్మెట్ పెట్టుకోకున్నా.. నిబంధనలు పాటించకున్నా పోలీసులు వారిని పట్టుకొని చలాన్లు వేయడం, ఇదేమని ప్రశ్నిస్తే లాఠీలు ఝుళిపించడం చూస్తుంటాం. కానీ, జిల్లా కేంద్రంలో ఆర్నెళ్లలో 40 వరకు దాడి ఘటనలు చోటుచేసుకోవడం, ఇందులో 70మంది వరకు తీవ్రగాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నా.. వీరిపై దాడికి పాల్పడిన రౌడీమూకలపై మాత్రం పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు ప్రజల నుంచి వినవస్తున్నాయి. దాడి ఘటనలకు బాధ్యులుగా పేర్కొంటున్న వీధిరౌడీలకు రాజకీయ నేతలు కొమ్ముకాస్తుండగా.. మరోవైపు రాజకీయ పలుకుబడితో పోస్టింగులు తీసుకున్న కొందరు పోలీసులు సైతం వీధిరౌడీలపై కఠినంగా వ్యవహరించలేకపోతున్నారనే విమర్శలు ఎదుర్కొంటూ అబాసుపాలవుతున్నారు. -
కలానికి సంకెళ్లు అప్రజాస్వామికం
ఏపీలో ‘సాక్షి’ దినపత్రికపై కొనసాగుతున్న కేసులు, దాడులను తీవ్రంగా ఖండిస్తున్నా. ప్రజాస్వామ్యంలో పత్రికలపై అక్రమ కేసులు పెట్టి అడ్డుకోవాలనుకోవడం సిగ్గుమాలిన చర్య. 30 ఏళ్ల సీనియారిటీ అని చెప్పుకొనే చంద్రబాబు ఇలాంటి కక్షసాధింపు చర్యలకు పాల్పడటం సరైనది కాదు. ప్రజాస్వామ్యంలో ఫోర్త్ పిల్లర్గా నిలిచి.. ప్రజాగొంతుకను వినిపించే పత్రికలపై దాడులు చేస్తూ, అక్రమ కేసులు బనాయించడం కలానికి సంకెళ్లు వేయడమే. దీనిని ప్రతిఒక్క ప్రజాస్వామికవాది ఖండించాలి. ఇప్పటికై నా చంద్రబాబు కక్షసాధింపు చర్యలు మానుకుని పత్రికా స్వేచ్ఛను కాపాడాలి. – బండ్ల కృష్ణమోహన్రెడ్డి, ఎమ్మెల్యే, గద్వాల ప్రజాస్వామ్య వ్యవస్థలో ఫోర్త్ ఎస్టేట్గా గుర్తింపు ఉన్న జర్నలిజంపై దాడి సరికాదు. ప్రజల పక్షాన గళం విప్పే పత్రికల గొంతు నొక్కడం ప్రజాస్వామ్య విరుద్ధం. ప్రజాస్వామ్యంలో పత్రికా స్వేచ్ఛ ప్రధానమైనది. రాజ్యాంగం కల్పించిన హక్కులపై ప్రభుత్వాలు ఉక్కుపాదం మోపడం సరికాదు. పత్రికలలో వచ్చిన వార్తలు అభ్యంతరకరంగా ఉంటే వివరణ కోరాలే తప్ప అక్రమ కేసులు పెట్టి రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడవద్దు. జర్నలిజం విలువల పరిరక్షణకు ప్రభుత్వాలు పాటుపడాలి. ఏపీలో ‘సాక్షి’ ఎడిటర్పై అనుసరిస్తున్న తీరు అభ్యంతరకరంగా ఉంది. – అనిరుధ్రెడ్డి, ఎమ్మెల్యే, జడ్చర్ల జర్నలిస్టులు ఎక్కడైనా ప్రతిపక్ష పాత్ర పోషించాల్సి ఉంటుంది. ఏపీలో ప్రశ్నిస్తున్న జర్నలిస్టులపై దాడులు, కేసులు నమోదు చేయడం వంటివి పత్రికా స్వేచ్ఛను హరించడమే అవుతుంది. ప్రశ్నిస్తున్న ‘సాక్షి’ ఎడిషన్ సెంటర్లపై దాడులు, ఆస్తులను ధ్వంసం చేయడం హేయమైన చర్య. పోలీసులు కూడా కేసులు నమోదు చేయకుండా తాత్సారం చేయడం తగదు. ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ఇచ్చిన హామీలు గెలిచిన తర్వాత నెరవేర్చకుంటే కచ్చితంగా జర్నలిస్టులు ప్రజల తరపున ప్రశ్నించడం సహజం. ఎడిటర్ స్థాయి వ్యక్తులపై కూడా కేసులు నమోదు చేసి ఇబ్బందులకు గురిచేయడం దారుణం. ఏకంగా జర్నలిస్టుల ఇళ్లు, కార్యాలయాల్లో సోదాల పేరుతో భయబ్రాంతులకు గురిచేయడం, పోలీసులు సైతం ఏకపక్షంగా వ్యవహరించడం సరికాదు. – చంద్రశేఖర్రావు, జిల్లా అధ్యక్షుడు, టీయూడబ్ల్యూజే (హెచ్–143), నాగర్కర్నూల్ -
యూరియా కోసం రైతుల అగచాట్లు
అలంపూర్: పంటలను కాపాడుకోవడానికి రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఎరువుల కోసం పోరాటం చేయాల్సిన పరిస్థితి నెలకొంది. అలంపూర్ పట్టణంలోని పీఏసీఎస్ కార్యాలయం వద్ద గురువారం తెల్లవారుజాము నుంచే రైతులు యూరియా కోసం బారులు తీరారు. వర్షం పడుతున్నప్పటికి అక్కడే వేచి చూడాల్సి వచ్చింది. అధికారుల వచ్చేలోపు వర్షం తగ్గడంతో యూరియా కోసం క్యూలైన్లలో బారులు తీరారు. ప్రధానంగా సుల్తానాపురం, జిల్లెలపాడుతో ఆయా గ్రామాల రైతులు భారీగా తరలిరాగా.. ముందుజాగ్రత్తగా వ్యవసాయ శాఖ అధికారి నాగార్జున్రెడ్డి రైతులకు టోకెన్లు అందజేశారు. పీఏసీఎస్ గోదాంకు 450 బస్తాలు వచ్చినట్లు ఏఓ తెలిపారు. రైతులకు ముందస్తుగా టోకెన్లు అందజేసి 225 మంది రైతులకు రెండు బస్తాల చొప్పున యూరియా అందించినట్లు తెలిపారు. సాయంత్రం వరకు పంపిణీ కొనసాగింది. అయితే యూరియా కోసం అధిక సంఖ్యలో రైతులు తరలిరాగా.. చాలామంది నిరాశతో వెనుదిరిగారు. -
ఉక్కుపాదం మోపుతాం
ఇటీవల కాలంలో చోటుచేసుకున్న దాడులు, వాటి బాధ్యులుగా ఉన్నవారిపై కఠినంగా వ్యవహరిస్తాం. దాడులు జరగకుండా కఠినచర్యలు తీసుకుంటాం. రౌడీయిజంపై ఉక్కుపాదం మోపుతాం. చట్టాన్ని అమలు చేసే క్రమంలో ఎవరైన అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తే వారిపై శాఖపరమైన చర్యలు తీసుకుంటాం. ఆయా వాట్సాప్ గ్రూపులను నిర్వహిస్తున్న అడ్మిన్లు, లీడర్లతో ప్రత్యేక సమావేశం ఏర్పాటుచేసి కౌన్సెలింగ్ ఇస్తాం. – టి.శ్రీనివాస్రావు, ఎస్పీ ● -
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలి
గద్వాల: జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులను ఆదేశించారు. గురువారం ఐడీవోసీ కార్యాలయంలో కాన్ఫరెన్స్ హాలులో అధికారులతో సమీక్షించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ గత వారం రాష్ట్రవ్యాప్తంగా గద్వాల జిల్లా 20వ స్థానంలో ఉండగా ఈ వారం 15వ స్థానానికి చేరుకుందని ఇదేస్ఫూర్తితో పనుల్లో వేగం పెంచి పూర్తి చేయాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు వి.లక్ష్మీనారాయణ, నర్సింగ్రావు, డీపీఓ నాగేంద్రం, హౌసింగ్ పీడీ శ్రీనివాస్రావు, మున్సిపల్ కమీషనర్లు, ఎంపీడీవోలు పాల్గొన్నారు. సంక్షేమ పథకాలు వంద శాతం అమలు చేయాలి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమాభివృద్ధి పనులను పూర్తిస్థాయిలో అమలు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఐడీవోసీ కార్యాలయంలో కాన్ఫరెన్స్హాలులో ఉపాధిహామీ పనుల జాతర–2025పై సమీక్షించారు. గ్రామాల్లో ఉపాధిహామి కూలీలకు పనికల్పించాలని అవసరమైన వసతుల కల్పనకు చర్యలు తీసుకోవాలన్నారు. మండలాల వారీగా పనుల కార్యాచరణ ప్రణాళిక వివరాలు అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా జిల్లాలో నూతనంగా 29 అంగన్వాడీ కేంద్రాల నిర్మాణాలు ఏ స్థాయిలో కొనసాగుతున్నాయని అడిగి తెలుసుకున్నారు. నిర్మాణాలు నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ పూర్తి చేయాలన్నారు. అదేవిధంగా పాఠశాలలో టాయిలెట్స్, పశువులపాకాలు, మేకల పాకలు, అజోల్లా యూనిట్లు, చెక్డ్యాంలు, పౌల్ట్రీషెడ్లు, ఇంకుడు గుంతల నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ నర్సింగ్రావు, డీపీవో నాగేంద్రం, పీఆర్ శాఖడీఈలు, ఏఈలు, ఎంపీడీవోలు తదితరులు పాల్గొన్నారు. -
శరన్నవరాత్రి ఉత్సవాలు విజయవంతం చేద్దాం
అలంపూర్: శర్ననవరాత్రి ఉత్సవాలను విజయవంతం చేద్దామని ఎమ్మెల్యే విజయుడు అన్నారు. అలంపూర్ క్షేత్రంలోని జోగుళాంబ అమ్మవారి ఆలయంలో శరన్న నవరాత్రి ఉత్సవాల పోస్టర్లు, కరపత్రాలను ఈఓ దీప్తితో కలిసి ఎమ్మెల్యే బుధవారం ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దేవి శరన్నవరాత్రి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించాలన్నారు. ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు కల్పించాలన్నారు. ఈఓ దీప్తి మాట్లాడుతూ.. ఈ నెల 22వ తేదీ నుంచి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయని, అక్టోబర్ 2వ తేదిన ముగియనున్నాయన్నారు. 22న ఉదయం 8 గంటలకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు, సాయంత్రం 6 గంటలకు ధ్వజారోహణం, 29న ఉదయం 10 గంటలకు జోగుళాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి కల్యాణమహోత్సవం, సాయంత్రం 4.30 గంటలకు జోగుళాంబ అమ్మవారికి సింహ వాహన సేవ ఉంటుందని తెలిపారు. 30న రధోత్సవం, అక్టోబర్ 1న మహార్ణవమి, రాత్రికి కాళరాత్రి పూజ, 2న విజయదశమి రోజు సాయంత్రం 4 గంటలకు శమి పూజ, 6.30 గంటలకు తుంగభద్ర నది హారతి, 7 గంటలకు తెప్పోత్సవం ఉంటుందని తెలిపారు. అదేవిధంగా ఆలయ పాలక మండలి చైర్మన్ నాగేశ్వర్రెడ్డి, ఈఓ దీప్తి పాలక మండలి సభ్యులతో కలిసి దేవి శరన్న నవరాత్రి ఉత్సవాల ఆహ్వాన పత్రికలు, పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ధర్మకర్తలు జగదీశ్వర్ గౌడ్, గోపాల్, జి. వెంకటేశ్వర్లు, విశ్వనాథ రెడ్డి, ఆలయ అర్చకులు, సిబ్బంది తదితరులు ఉన్నారు. ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు అంతకుముందు ఎమ్మెల్యే బాలబ్రహ్మేశ్వర స్వామి, శ్రీజోగుళాంబ అమ్మవారి ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు ఎమ్మెల్యేను శేషవస్త్రాలతో సత్కరించారు. తీర్ధ ప్రసాదాలను అందజేసి ఆశీర్వచనం పలికారు. ఆలయాల్లో వెంటాడుతున్న రాజకీయాలు దేవీశరన్నవరాత్రి ఉత్సవాల్లోనూ రాజకీయాలు వెంటాడుతున్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య ఆదిపత్య పోరు కొనసాగుతోంది. దేవి శరన్నవవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఎమ్మెల్యే విజయుడు ఆలయ ఈఓ దీప్తితో కలిసి మొదట ఉత్సవాల పోస్టర్లు, ఆహ్వాన పత్రికను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ఆలయ పాలక మండలి దూరంగా ఉంది. అనంతరం పాలక మండలి కార్యాలయంలో ఆలయ చైర్మన్ నాగేశ్వర్ రెడ్డి, ఈఓ దీప్తితోపాటు పాలక మండలి సభ్యులతో కలిసి పోస్టర్లు, ఆహ్వాన పత్రికను మరోసారి ఆవిష్కరించారు. ఒక కార్యక్రమాన్ని వేర్వేరుగా చేయడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. రాజకీయాలకు అతీతంగా ఉండాల్సిన ఆలయాల్లో అధికార, ప్రతిపక్ష పార్టీ నాయకులు ఆదిపత్య పోరుకు దిగడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
10 లక్షల ఎకరాల్లో పెరిగిన సాగు విస్తీర్ణం..
ఉమ్మడి పాలమూరు వ్యాప్తంగా వానాకాలం సీజన్కు సంబంధించి 2014లో 8.50 లక్షల ఎకరాల్లో మాత్రమే వివిధ పంటలు సాగు కాగా.. ప్రస్తుతం 18.50 లక్షల ఎకరాల్లో రైతులు పంటలు వేశారు. ఈ లెక్కన 11 ఏళ్లలో 10 లక్షల ఎకరాల్లో సాగు విస్తీర్ణం పెరిగినట్లు తెలుస్తోంది. ఉమ్మడి జిల్లాలో సాగు నీటి వసతి ఇంకా పెరగాల్సి ఉన్నప్పటికీ.. విస్తారంగా వర్షాలు కురవడం, వ్యవసాయానికి ఉచిత విద్యుత్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుబడి సాయం ఇస్తుండడం, రుణమాఫీ వంటి చర్యలు ఉమ్మడి జిల్లాలో సాగు గణనీయంగా పెరిగేందుకు దోహదపడ్డాయని వ్యవసాయరంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సాగు పెరిగింది..పంట మార్పిడి చేయాలి పంటల సాగు గణనీయంగా పెరిగింది. ఏటేటా వరి, పత్తినే అధికంగా పండిస్తున్నారు. ప్రతిసారి ఒకే రకమైన పంటలను సాగు చేయడం వల్ల భూమి చౌడు పొలంగా మారుతుంది. అన్ని రకాల పంటలు సాగు చేస్తేనే లాభదాయకంగా ఉంటుంది. జిల్లాలో గతేడాదితో పోలిస్తే ఈ సీజన్లో మొక్కజొన్న సాగు పెరిగింది. పంట మార్పిడి చేసి కందులు, జొన్న, ఆముదం, ఇతర పంటలు కూడా సాగు చేస్తే.. భూసారం దెబ్బ తినదు. – బి.వెంకటేష్, జిల్లా వ్యవసాయశాఖ అధికారి, మహబూబ్నగర్ ● -
రాజీ కేసులపై ప్రత్యేక డ్రైవ్
గద్వాల క్రైం: పెండింగ్ కేసుల విషయంలో పురోగతి సాధించేందుకు సమయస్ఫూర్తితో అడుగులు వేశామని జిల్లా న్యాయసేవాధికార సంస్థ, సెషన్స్ కోర్టు జడ్జి ఎన్ ప్రేమలత వెల్లడించారు. బుధవారం జిల్లా కోర్టు ఆవరణలో విలేకర్ల సమావేశం నిర్వహించి మాట్లాడారు. జిల్లాలోని పెండింగ్ కేసులు, రాజీకాదగా కేసులపై ప్రత్యేక డ్రైవ్ చేపట్టామన్నారు. ఈ నెల 13వ తేదిన జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామని, గతంతో పొలిస్తే నేటికి చాలా అంశాలను పరిగణలోకి తీసుకొని కేసుల సత్వర పరిష్కారం కోసం జాతీయ లోక్అదాలత్ నిర్వహించడం జరిగిందన్నారు. పోలీసు, ఎకై ్సజ్, రెవెన్యూ, రోడ్డు ప్రమాద, బ్యాంకు రుణాలు, స్టేషన్లలో నమోదైన కేసుల వివరాలను ఇప్పటికే ఆ శాఖ సిబ్బందితో మాట్లాడి విపత్కర కేసుల అంశాలను అడిగి తెలుసుకున్నట్లు వివరించారు. సమావేశంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రెటరీ వి శ్రీనివాస్, శోభ తదితరులు ఉన్నారు. -
కఠిన చర్యలు తీసుకుంటాం
జిల్లాలో ఇటీవల జరిగిన దాడుల్లో చదువు మానేసిన వారు, మెకానిక్లు, మేసీ్త్ర, లేబర్ పనులు చేసే యువతే ఎక్కువగా ఉన్నట్లు గుర్తించాం. పలువురిపై కేసులు నమోదుచేశాం. బెల్టు దుకాణాల నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటాం. నిషేధిత మత్తు పదార్థాలు, మద్యంకు బానిసైన వారిపై ప్రత్యేక నిఘా ఉంచుతాం. తల్లిదండ్రులు ఉండి పట్టించుకోని వారితోపాటు మిగతా వారిలో మార్పు దిశగా కౌన్సెలింగ్ అందిస్తాం. మార్పు రాకపోయినా, మరోసారి ఇలాగే పట్టుబడినా కఠిన చర్యలు తీసుకుంటాం. – మొగిలయ్య, డీఎస్పీ● -
జోగులాంబ జిల్లాలో విషాదం.. పిడుగుపాటుకు ముగ్గురి మృతి
సాక్షి, జోగులాంబ: అయిజ మండలం భూంపురంలో విషాదం జరిగింది. పిడుగుపాటుకు ముగ్గురు మృత్యువాత పడ్డారు. ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు. మృతులు సౌభాగ్య(40), పార్వతి (22), సర్వేష్ (20) గుర్తించారు.కాగా, తెలంగాణలో రాబోయే నాలుగు రోజుల పాటు ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకు ఛాన్స్ ఉందని ఐఎండీ వెల్లడించింది.కామారెడ్డి, జనగామ, ఆదిలాబాద్, జగిత్యాల, కరీంనగర్, ఖమ్మం, కొమరం భీం అసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల, మేడ్చల్ మల్కాజిగిరి, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్, యాదాద్రి భువనగిరి, ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. -
పాలమూరును జిల్లా బిడ్డే ఎండబెడుతున్నారు..
● బీఆర్ఎస్ హయాంలో 90 శాతం పనులు పూర్తి ● మిగిలిన 10 శాతం పనులు ఎందుకు పూర్తి చేయడం లేదు ● కేసీఆర్కు పేరు వస్తుందనే పడావు పెట్టారు ● సీఎం రేవంత్పై బీఆర్ఎస్వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజం సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: సీఎం రేవంత్రెడ్డి 21 నెలల పాలనలో ఎక్కడ మాట్లాడినా.. నేను పాలమూరు బిడ్డను, నల్లమల బిడ్డను అని చెప్పుకుంటారని.. కానీ ఆయనే పాలమూరును ఎండబెడుతున్నారని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. మాజీ మంత్రి సి.లక్ష్మారెడ్డి భార్య శ్వేతారెడ్డి ప్రథమ వర్ధంతి సందర్భంగా మంగళవారం ఆయన మాజీ మంత్రి హరీశ్రావుతో కలిసి నాగర్కర్నూల్ జిల్లా తిమ్మాజీపేట మండలంలోని ఆవంచ గ్రామానికి వచ్చారు. శ్వేతారెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించి నివాళులర్పించారు. ఆ తర్వాత వారు మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలోని లక్ష్మారెడ్డి ఇంట్లో భోజనం చేశారు. హరీశ్రావు తిరిగి హైదరాబాద్కు పయనమైన అనంతరం కేటీఆర్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పాలమూరు వెనుకబాటుతనానికి టీడీపీ, కాంగ్రెస్ కారణమని ఆయన టీడీపీలో ఉన్నప్పుడే చెప్పారన్నారు. పాలమూరు బిడ్డ ముఖ్యమంత్రి అయితే తమ బతుకులు మారుతాయని.. ఆరు గ్యారంటీలు 100 రోజుల్లో అమలవుతాయనే ఆశతో ఇక్కడి ప్రజలు 12 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించారన్నారు. 21 నెలలుగా పడావు పెట్టారు.. బీఆర్ఎస్ హయాంలో పాలమూరులో వివిధ ప్రాజెక్ట్లను పూర్తి చేసి 8 లక్షల ఎకరాలకు నీళ్లు పారించినట్లు కేటీఆర్ వెల్లడించారు. పాలమూరును కోనసీమగా మార్చాలనే లక్ష్యంతో కేసీఆర్ నాయకత్వంలో పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్ట్ను 90 శాతం పూర్తి చేశామని.. కానీ పాలమూరుకు చెందిన సీఎం 21 నెలలు గడిచినా పనులు పూర్తిచేయడం లేదన్నారు. మిగతా పది శాతం పనులు పూర్తి చేసి.. నీళ్లు పారిస్తే కేసీఆర్కు పేరు వస్తుందనే భయంతో పాలమూరును పడావు పెట్టారని మండిపడ్డారు. పైసా పని చేయకుండా అదే పాలమూరు ప్రాజెక్ట్కు వారి మామ జైపాల్రెడ్డి పేరు పెట్టుకోవడంపై ప్రజలే ఆలోచన చేయాలన్నారు. దురాలోచనతో కొడంగల్కు శ్రీకారం.. పాలమూరు ఎత్తిపోతల్లో భాగంగా ఉమ్మడి పాలమూరు, కొడంగల్ నియోజకవర్గంతో పాటు రంగారెడ్డి జిల్లాకు ప్రయోజనం చేకూరేలా ప్లాన్ చేసి.. ప్రాజెక్ట్ను 90 శాతం పూర్తి చేశామని తెలిపారు. అయితే హడావుడిగా కొడంగల్, రంగారెడ్డికి నీరందించే సోర్స్ను శ్రీశైలం నుంచి జూరాలకు మార్చి రూ.4 వేల కోట్లతో సీఎం రేవంత్రెడ్డి టెండర్లు పూర్తి చేశారన్నారు. మనసులో ఏదో దురాలోచనతో పర్యావరణ అనుమతుల్లేకుండా టెండర్లు పూర్తి చేయడంతో రైతులు ఎన్జీటీని ఆశ్రయించగా.. స్టే ఇచ్చిందన్నారు. కొడంగల్ ఎత్తిపోతల కింద రైతులు కూడా పరిహారం కోసం రోడ్డెక్కుతున్నారన్నారు. చెప్పుకోలేని దురావస్థలో ఉన్నారు.. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి బీఆర్ఎస్లోనే ఉన్నానని చెబుతున్నారు కదా అంటూ పార్టీ ఫిరాయింపులకు సంబంధించి విలేకరులు అడిగిన ప్రశ్నకు కేటీఆర్ సమాధానమిచ్చారు. ‘కృష్ణమోహన్రెడ్డి సమక్షంలోనే కేసీఆర్పై మంత్రులు పొంగులేటి, జూపల్లి ఆరోపణలు, విమర్శలు చేస్తుంటే ఆయన ఎందుకు మౌనం వహించారు.. కాంగ్రెస్లో చేరిన కొందరు ఎమ్మెల్యేలు ఏ పార్టీలో ఉన్నామో చెప్పుకోలేని దురావస్థలో ఉన్నారు’ అని విమర్శించారు. -
అధిక ధరలకు యూరియా విక్రయిస్తే చర్యలు
ఎర్రవల్లి/అలంపూర్ రూరల్: యూరియా కొరత పేరుతో రైతులకు అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తప్పవని జిల్లా వ్యవసాయశాఖ అధికారి సక్రియా నాయక్ అన్నారు. మంగళవారం ఎర్రవల్లి మండలం కొండేరులోని ఫర్టిలైజర్ దుకాణంలో తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎరువుల నిల్వలతో పాటు రికార్డులను పరిశీలించారు. అదే విధంగా అలంపూర్ మండలం క్యాతూర్ పీఏసీఎస్లో యూరియా స్టాక్ వివరాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డీఏఓ మాట్లాడుతూ.. ప్రతి రైతు వివరాలను ఈ పాస్లో నమోదు చేసిన తర్వాతే ఎరువులు విక్రయించాలని సూచించారు. యూరియాతో పాటు ఇతర ఎరువులు లేదా గుళికలను బలవంతంగా అంటగట్టవద్దన్నారు. రెండోసారి యూరియా వినియోగించే రైతులు వందశాతం నీటిలో కరిగే నానో డీఏపీ, నానో యూరి యా పిచికారీ చేయాలని సూచించారు. క్యాతూర్ పీఏసీఎస్లో ప్రస్తుతం 450 బస్తాల యూరియా అందుబాటులో ఉందని.. ఇప్పటి వరకు 4,150 బస్తాలు పంపిణీ చేసినట్లు వివరించారు. డీఏఓ వెంట ఏఓ నాగార్జునరెడ్డి, సీఈఓ హుస్సేన్ ఉన్నారు. -
అంకితభావంతో విధులు నిర్వర్తించాలి
● ప్రజా సమస్యల పరిష్కారంపై నిర్లక్ష్యం వహించొద్దు ● కలెక్టర్ బీఎం సంతోష్ గద్వాల: ప్రభుత్వ విధులను అంకితభావంతో నిర్వర్తించాలని కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. మంగళవారం ఐడీఓసీ కార్యాలయంలో అదనపు కలెక్టర్ వి.లక్ష్మీనారాయణతో కలిసి గ్రామపాలన అధికారుల కౌన్సెలింగ్ ప్రక్రియ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జీపీఓలు ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేయాలని సూచించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు అభ్యర్థి సొంత నియోజకవర్గం కాకుండా ఇతర నియోజకవర్గంలో మెరిట్ ఆధారంగా నియామకాలు చేపట్టినట్లు తెలిపారు. అలంపూర్ నియోజకవర్గానికి 57మంది, గద్వాల నియోజకవర్గానికి 22మంది జీపీఓలను నియమించినట్లు వెల్లడించారు. గ్రామపాలన అధికారి విధులతో పాటు ప్రస్తుతం నిర్వహిస్తున్న జూనియర్ అసిస్టెంట్ విధులు కూడా నిర్వహించాల్సి ఉంటుందని తెలిపారు. కాళోజీ జీవితం.. స్ఫూర్తిదాయకం కాలాన్ని ఆయుధంగా మార్చుకొని తన కవిత్వం, రచనలతో ప్రజల్లో చైతన్యం నింపిన మహనీయుడు కాళోజీ నారాయణరావు అని కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. కలెక్టరేట్లో ప్రజాకవి, పద్మవిభూషణ్ కాళోజీ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమమే ఊపిరిగా జీవించిన ప్రజాకవి కాళోజీ.. తెలుగుభాష, ప్రజల అవసరాల కోసం తన జీవితాన్నే త్యాగం చేశారన్నారు. ప్రతి ఒక్కరూ ఆయన చూపిన మార్గాన్ని అనుసరించి ప్రజలకు సేవచేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు వి.లక్ష్మీనారాయణ, నర్సింగ్రావు, ఏఓ భూపాల్రెడ్డి పాల్గొన్నారు. విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే చర్యలు అయిజ/మల్దకల్: ఉపాధ్యాయులు విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ బీఎం సంతోష్ హెచ్చరించారు. మంగళవారం అయిజ బాలుర ఉన్నత పాఠశాలలో ఆయన ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. అయితే పాఠశాలలో విద్యార్థులెవరూ లేకపోవడంతో హెచ్ఎం శేషపాణి శర్మను నిలదీశారు. మాలపున్నమి పండుగ కావడంతో విద్యార్థులు ఇళ్లకు వెళ్లిపోయారని హెచ్ఎం సమాధానం చెప్పడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఉన్నతాధికారుల అనుమతి లేకుండా విద్యార్థులకు సెలవు ఇచ్చిన హెచ్ఎంను సస్పెన్షన్ చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారిని ఫోన్లో ఆదేశించారు. అనంతరం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను కలెక్టర్ పరిశీలించారు. తక్కువ ఖర్చుతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పూర్తి చేసుకునే విధంగా లబ్ధిదారులను చైతన్యపరచాలని మున్సిపల్ కమిషనర్ సీహెచ్ సైదులుకు సూచించారు. కలెక్టర్ వెంట మున్సిపల్ మేనేజర్ అశోక్రెడ్డి, హౌసింగ్ ఏఈ వంశీ ఉన్నారు. మల్దకల్ కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గతేడాది సాధించిన పదో తరగతి ఫలితాలపై ఆరా తీశారు. ఈ ఏడాది వందశాతం ఫలితాలు సాధించేందుకు కృషి చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. అనంతరం తరగతి గదులను కలెక్టర్ సందర్శించి విద్యార్థినుల అభ్యసన సామర్థ్యాలను తెలుసుకున్నారు. ప్రతి విద్యార్థిని క్రమశిక్షణతో చదువుకొని పాఠశాల, తల్లిదండ్రులకు మంచిపేరు తీసుకురావాలని సూచించారు. అదే విధంగా విద్యార్థినుల కోసం వండిన ఆహారాన్ని పరిశీలించారు. మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని ప్రత్యేకాధికారి విజయలక్ష్మికి సూచించారు. -
పాలమూరుకు మరో మణిహారం!
జడ్చర్ల: పాలమూరు జిల్లాకు మరో మణిహారం దక్కనుంది. ఇప్పటికే హైదరాబాద్ చుట్టూ నిర్మించిన ఔటర్ రింగ్రోడ్డు తరహాలోనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సౌజన్యంతో చేపట్టనున్న ఆర్ఆర్ఆర్ (రీజినల్ రింగ్రోడ్డు) పరిధిలోకి ఉమ్మడి జిల్లా గ్రామాలు కూడా వెళ్లనున్నాయి. బాలానగర్ మీదుగా ట్రిపుల్ ఆర్ రోడ్డు విస్తరణ పనులు సాగనున్నాయి. ఇందుకు సంబంధించిన ప్రతిపాదిత నోటిఫికేషన్ను హెచ్ఎండీఏ ఇప్పటికే జారీ.. ఈ నెల 15వ తేదీ వరకు అభ్యంతరాల స్వీకరణకు గడువిచ్చింది. రీజనల్ రింగ్రోడ్డు వంద మీటర్ల వెడల్పుతో ప్రతిపాదిత అలైన్మెంట్ కోసం మహబూబ్నగర్ జిల్లాతో పాటు రంగారెడ్డి, వికారాబాద్, నల్లగొండ, సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్, యాదాద్రి జిల్లాలో పరిధిలోని 33 మండలాలు, 163 రెవెన్యూ గ్రామ పంచాయతీలను కలుపుతూ హెచ్ఎండీఏ ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ అలైన్మెంట్కు సంబంధించి ఇప్పటికే డిజిటల్ మ్యాప్లతో పాటు సర్వే నంబర్లు తదితర పూర్తి వివరాలను హెచ్ఎండీఏ వెబ్సైట్లో ప్రజలకు అందబాటులో ఉంచారు. ప్రజలు, సంస్థలు తమ అభ్యంతరాలను, సూచనలను రాత పూర్వకంగా సమర్పించాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులు, అభ్యంతరాలు, సూచనలను పరిశీలించిన తర్వాత హెచ్ఎండీఏ తుది నోటిఫికేషన్ను విడుదలచేయనుంది. ● ఉమ్మడి మహబూబ్నగర్లోని ఆమన్గల్, మాడ్గుల, కేశంపేట, తలకొండపల్లి, ఫరూఖ్నగర్, కొందుర్గు మండలాల్లో ఆర్ఆర్ఆర్ విస్తరించనుంది. తాజాగా విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం మహబూబ్నగర్ జిల్లా బాలాగనర్ మండలంలోని అప్పాజీపల్లి, బోడజానంపేట, చిన్నరేవల్లి, గౌతాపూర్, గుండేడు, మాచారం, పెద్దరేవల్లి, పెద్దాయపల్లి, సూరారం, ఉడిత్యాల్, వనమోనిగూడలు ట్రిపుల్ ఆర్ పరిధిలోకి వెళ్లనున్నాయి. గతంలో ఫరూఖ్నగర్ మండలం బూర్గుల గ్రామం వరకే ట్రిపుల్ ఆర్ను పరిమితం చేశారు. డిజైన్ మార్పుతో బాలానగర్ మండలంలోని కొన్ని గ్రామాలను కలిపి పెద్దాయపల్లి క్రాస్ రోడ్ వద్ద 44 వ నంబర్ జాతీయ రహదారి వరకు ఇది విస్తరించనుంది. దీని నిర్మాణం పూర్తయితే తెలంగాణలోని ఇతర ప్రాంతాలతో పాటు కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, గోవా, కేరళ, రాష్ట్రాలకు రాకపోకలు సాగించే వారికి ఎంతో ఉపయోగపడుతుంది. కొందరికి మోదం.. మరికొందరికి ఖేదం ట్రిపుల్ ఆర్ నిర్మాణాన్ని కొందరు ఆమోదిస్తుండగా మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. రహదారి నిర్మాణానికి సేకరించే భూములకు సంబంధించి ఇప్పటికే ఆయా గ్రామాల వారీగా సర్వే నంబర్లను హెచ్ఎండీఏ విడుదల చేసింది. భూములు కోల్పోతున్న రైతులు ఆందోళన పడుతున్నారు. పెద్దాయపల్లి క్రాస్రోడ్డు వద్ద 44వ నంబర్ జాతీయ రహదారిని అనుసరించి ఏర్పాటయిన వెంచర్లు కూడా ట్రిపుల్ ఆర్ పరిధిలోకి రావడంతో ఆయా వెంచర్ల నిర్వాహకులు, ప్లాట్లు కొనుగోలు చేసిన వారు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ మార్కెట్ విలువ ప్రకారంగా పరిహారం అందించే పరిస్థితి ఉండడంతో తాము నష్టపోతామని వాపోతున్నారు. కాగా.. ఆర్ఆర్ఆర్ను అనుసరించి ఉన్న భూముల విలువలు అమాంతంగా మూడు–నాలుగు రెట్లు పెరిగే అవకాశం ఉండడంతో ఆయా రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ గ్రామాల అభివృద్ధికి మహర్దశ పట్టనుందని భావిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ ఏర్పాటుతో మరింత అభివృద్ధి బాలానగర్ మండలం గుండా ట్రిపుల్ ఆర్ ఏర్పాటు కావడం వల్ల ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుంది. అలాగే విద్యాసంస్థలు, పరిశ్రమల రాకతో పాటు వ్యాపార, వాణిజ్య సంబంధాలు మెరుగవుతాయి. ఆర్ఆర్ఆర్ చుట్టూ మాల్స్, వాణిజ్య భవనాలు ఏర్పాటవుతాయి. జడ్చర్ల నియోజకవర్గంతో పాటు పాలమూరు జిల్లాకు లాభం చేకూరుతుంది. – జనంపల్లి అనిరుధ్రెడ్డి, ఎమ్మెల్యేల, జడ్చర్ల ఆర్ఆర్ఆర్ నిర్మాణానికి ప్రాథమిక నోటిఫికేషన్ జారీ ఈ నెల 15 వరకు అభ్యంతరాలకు గడువు డిజైన్ మార్పుతో ఉమ్మడి జిల్లాలో మరికొన్ని గ్రామాలకు విస్తరణ జంక్షన్గా మారనున్న పెద్దాయపల్లి క్రాస్రోడ్ -
గురువులే మార్గదర్శకులు
● వారి స్ఫూర్తితో విద్యార్థులు రాణించాలి ● కలెక్టర్ సంతోష్ ● జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులకుఘన సన్మానం గద్వాలటౌన్: తరగతి గదుల్లో దేశ భవిష్యత్ను తీర్చిదిద్దే మార్గదర్శకులు గురువులని.. ప్రతి విద్యార్థి ఉపాధ్యాయుల స్ఫూర్తితో భవిష్యత్ రాణించాలని కలెక్టర్ సంతోష్ పిలుపునిచ్చారు. సోమవారం జిల్లాలో గురుపూజోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కల్టెకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లాస్థాయి ఉత్తమ ఉపాధ్యాయులగా ఎంపికై న 55 మందిని ఘనంగా సన్మానించారు. అంతకు ముందు జరిగిన సమావేశంలో ఉపాధ్యాయులనుద్ధేశించి కలెక్టర్ మాట్లాడుతూ.. తల్లిదండ్రులు జన్మనిస్తే గురువులు జీవితాన్ని అందిస్తారన్నారు. ఉపాధ్యాయులు అంకిత భావంతో పనిచేస్తూ విద్యార్థులను ఉన్నతులుగా తీర్చి దిద్దితేనే గుర్తింపు వస్తుందని అభిప్రాయ పడ్డారు. తెలంగాణ ఉద్యమం, జిల్లా ఏర్పాటులో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని, అదే స్ఫూర్తితో జిల్లాలో అక్షరాస్యత పెంపుకు కృషి చేయాలని సూచించారు. విద్యాభివృద్ధికి కృషి: ఎమ్మెల్యే ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యాభివృద్ధి కోసం కావాల్సిన అన్ని సదుపాయాలు కల్పిస్తుందన్నారు. అక్షరాస్యతలో వెనకబడిన మన జిల్లాను మొదటి వరసలో నిలపాలని, అందుకు ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల భాగస్వామ్యం ముఖ్యమని పేర్కొన్నారు. ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ బడులు నడుస్తున్నాయని వివరించారు. విద్యార్థులను ఉత్తమ పౌరులుగా త యారు చేసే బాధ్యత ఉపాధ్యాయులదేనని చెప్పా రు. గురు పూజ మహోత్సవాన్ని పురస్కరించుకునిఏర్పాటు చేసిన కార్యక్రమంలో చిన్నారులు చేసిన నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి కార్యక్రమంలో డీఈఓ అబ్దుల్ ఘనీ, మార్కెట్యార్డు చైర్మన్ కుర్వ హనుమంతు తదితరులు పాల్గొన్నారు. డీఈఓతో ఉపాధ్యాయుల వాగ్వాదం ఇదిలా ఉండగా, జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపిక ప్రక్రియ లోపభూయిష్టంగా జరిగిందని పలు ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఆరోపించారు. సన్మాన కార్యక్రమానికి ముందు ఎంపిక ప్రక్రియపై పలువురు ఉపాధ్యాయులు డీఈఓ అబ్దుల్ ఘనితోపాటు ఎంఈఓలతో వాగ్వాదానికి దిగారు. ఎంపిక విధానంపై నిరసన వ్యక్తం చేశారు. విద్యాధికారులపై ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో కొంతసేపు గందరగోళం నెలకొంది. సిఫారస్ లేఖలు తెచ్చకున్న వారికే అవార్డులు వరించాయని ధ్వజమెత్తారు. సినియార్టీని విస్మరించి జూనియర్లను ఉత్తమ ఉపాధ్యాయులగా ఎంపిక చేశారని మండిపడ్డారు. సుమారు అరగంట పాటు ఉపాధ్యాయులు విద్యాధికారులను చుట్టుముట్టి నిలదీశారు. ఎమ్మెల్యే జోక్యంతో ఉపాధ్యాయులు సద్దుమణిగారు. -
ప్రజావాణికి 55 ఫిర్యాదులు
గద్వాల: కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 55 ఫిర్యాదులు అందాయి. కలెక్టర్ బీఎం సంతోష్ నేరుగా ప్రజలతో ఫిర్యాదులు స్వీకరించారు. అనంతరం ఫిర్యాదులను ఆయా శాఖలకు చెందిన అధికారులను పిలిచి ఆరా తీశారు. వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని, పరిష్కారం కానిపక్షంలో అందుకు గల కారణాలు వివరిస్తూ సంబంధిత ఫిర్యాదుదారుడికి అక్నాలెడ్డ్మెంట్ ద్వారా తెలియజేయాలని సూచించినట్లు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు వి.లక్ష్మీనారాయణ, నర్సింగ్రావు కలెక్టరేట్ సిబ్బంది, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. నకిలీ పట్టాలతో పరిహారం స్వాహాకు యత్నం గట్టు: ముచ్చోనిపల్లె రిజర్యాయర్కు సంబంధించి నకిలీ పట్టా సర్టిఫికెట్లతో పరిహారాన్ని స్వాహా చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, దీనిని అడ్డుకోవాలని తప్పెట్లమొర్సు గ్రామస్తులు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. 109 ప్యాకేజీలో భాగంగా నిర్మిస్తున్న ముచ్చోనిపల్లె రిజర్వాయర్లో ముంపునకు గురైన సర్వే నెంబర్లు 82, 241, 244లలోని ప్రభుత్వ భూమికి సంబందించి గొర్లఖాన్దొడ్డి గ్రామానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులు అక్రమంగా నకిలీ పట్టాలను సృష్టించి నష్టపరిహారాన్ని స్వాహా చేసేందుకు ప్రయత్నస్తున్నట్లు తప్పెట్లమొర్సు గ్రామానికి చెందిన వీరన్నగౌడు, ముక్కెరన్నలు ఆరోపించారు. దాదాపు రూ.9 లక్షలు ప్రభుత్వ సొమ్ము కాజేసేందుకు ప్రయత్నాలు సాగుతున్నట్లు ఆరోపించారు. ఈ వ్యహారంపై విచారణ నిర్వహించి, ప్రభుత్వ సోమ్ము అక్రమార్కుల పాలు కాకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్కు అందజేసిన ఫిర్యాదులో వారు పేర్కోన్నారు. పోలీస్ గ్రీవెన్స్కు 14 అర్జీలు గద్వాల క్రైం: ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పోలీస్ గ్రీవెన్స్కు 14 అర్జీలు వచ్చినట్లు ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. ప్రధానంగా భూ వివాదం, ఆస్తి తగదాలు, అప్పుగా తీసుకున్న వ్యక్తులు డబ్బులు చెల్లించడం లేదని ఫిర్యాదులు అందాయన్నారు. వీలైనంత త్వరగా సమస్యలు పరిష్కరిస్తామని, సివిల్ సమస్యలు కోర్టు ద్వారా పరిష్కారం చేసుకోవాలని ఫిర్యాదుదారులకు సూచించారు. -
అడ్డుకుంటున్నది ఎవరు..?
గద్వాల: ప్రభుత్వం ధాన్యాన్ని బియ్యంగా మార్చి ఇవ్వాల్సిందిగా ఆయా సీజన్లలో మొత్తం రూ.50 కోట్ల విలువైన ధాన్యాన్ని కేటీదొడ్డి మండలం నందిన్నె వద్ద ఉన్న రైస్మిల్లుకు కేటాయించగా.. సదరు మిల్లు యజమాని అందులో నుంచి రూ.7.80 కోట్ల ధాన్యాన్ని పక్కదారి పట్టించాడు. రాష్ట్ర విజిలెన్స్ అధికారులు విచారించి అక్రమాలు జరిగాయని నిర్ధారించి ఆర్ఆర్ యాక్టు కింద నోటీసులు సైతం జారీ చేశారు. ఐదు రోజుల క్రితం స్టేషన్లో ఫిర్యాదు చేసినా.. నేటికీ ఎఫ్ఐఆర్ నమోదు కాకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. రాజకీయ పలుకుబడితో క్రిమినల్ కేసు నమోదు కాకుండా సదరు మిల్లు యజమాని శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలాఉండగా, ప్రభుత్వ ధనాన్ని కొల్లగొట్టిన సదరు రైస్మిల్లు యజమానికి అండగా నిలబడి క్రిమినల్ కేసు కాకుండా అడ్డుపడుతున్న ఆ ఽఖద్దరు నేత ఎవరన్నది జిల్లాలో తీవ్ర చర్చనీయమైంది. రూ.7.80 కోట్లు స్వాహా కేటీదొడ్డి మండలం నందిన్నెలోని కమ్మిడిస్వామి రైస్మిల్లుకు సివిల్సప్లై శాఖ అధికారులు 2022 రబీలో 1425.520 మె.టన్నుల ధాన్యం, 2024ఖరీఫ్లో 5948.560 మె.ట. 2024–25 రబీలో 10,294.680 మె.ట. మొత్తంగా రూ.50 కోట్ల విలువ గల ధాన్యాన్ని కేటాయించారు. కానీ, నేటికీ చాలామటుకు బియ్యాన్ని తిరిగి ప్రభుత్వానికి అందించలేదు. దీంతో అక్రమాలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో కమ్మిడిస్వామి రైస్మిల్లులో విజిలెన్స్ అధికారులు గత నెల రెండు రోజుల పాటు సోదాలు నిర్వహించారు. రూ.7.80 కోట్ల విలువ గల ధాన్యాన్ని స్వాహా చేసినట్లు లెక్కతేల్చారు. ఈనివేదికను ఆధారంగానే అధికారులు సదరు రైస్మిల్లు యజమానిపై చర్యలకు ఉపక్రమించారు. అయితే, తనపై కేసు నమోదు చేయాలంటే అషామాషీ కాదంటూ అటు సివిల్సప్లైశాఖ, ఇటు పోలీసుశాఖ అధికారులకు ముచ్చెమటలు పట్టిస్తున్నారనే విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ఈ నెల 4వ తేదీన కెటి.దొడ్డి ఠాణాలో ఫిర్యాదు చేసినప్పటికీ 5రోజులు గడుస్తున్నా ఇంకా ఎఫ్ఐఆర్ నమోదు కాకపోవడం విమర్శలకు నిజమేనని ఊతమిస్తున్నాయి. అటు రాష్ట్ర విజిలెన్స్ అధికారులు విచారణ అనంతరం వెలుగుచూసిన అక్రమాలపై మిల్లు ఓనర్ వీరన్నకు ఇదివరకే ఆర్ఆర్ యాక్టుకింద నోటీసులు జారీ చేశారు. క్రిమినల్ కేసు నమోదు కాకుండా అక్రమాల నుంచి తప్పించుకునేందుకు మిల్లు ఓనర్ తనకున్న రాజకీయబలంతో శతవిధాలుగా యత్నిస్తున్నట్లు సమాచారం. పోలీసులకు ఫిర్యాదు విజిలెన్స్ అధికారులు ఇచ్చిన నివేదిక మేరకు రూ.7.80 కోట్ల విలువ గల ధాన్యానికి సంబంధించి ఇదివరకే ఆర్ఆర్ యాక్టు కింద కేటీదొడ్డి తహసీల్దార్ ద్వారా మిల్లర్కు నోటీసులు ఇవ్వడం జరిగింది. మిల్లు యజమానిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఈ నెల 4వ తేదీనాడు కెటి.దొడ్డి పోలీసుస్టేషన్లో ఎస్ఐ శ్రీనివాస్కు ఫిర్యాదు చేశాను. ఇంకా ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. – విమల, సివిల్ సప్లై డీఎం, గద్వాల ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు.. సివిల్ సప్లైశాఖ డీఎం విమల ఫిర్యాదు చేశారు. అయితే స్వాహా చేసిన ధాన్యం విలువ రూ.7.80 కోట్లు ఉండడంతో దీనిపై ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కేసు నమోదు చేస్తాం. – శ్రీనివాస్, ఎస్ఐ, కేటీదొడ్డి కొమ్ముకాస్తున్న వారెవరు.. ప్రభుత్వం వద్ద తీసుకున్న రూ.50కోట్ల ధాన్యంలో రూ.7.80కోట్ల ధాన్యాన్ని స్వాహాచేసిన రైస్మిల్లు ఓనర్పై క్రిమినల్ కేసు నమోదు కాకుండా ప్రభుత్వంలో కీలకంగా పనిచేస్తున్న ఓ ఖద్దరు నేత కొమ్ముకాస్తున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. కాజేసిన ప్రభుత్వసొమ్మును అవినీతిపరుడి నుంచి కక్కించాల్సిపోయి అందుకు భిన్నంగా కొమ్ముకాయడమేమిటనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంతకు అక్రమార్కుడికి కొమ్ముకాస్తున్న ఆఖద్దరు నేత ఎవరన్నది ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా హాట్టాపిక్గా మారింది. బియ్యం పక్కదారి పట్టించిన మిల్లు యజమానిపై ఫిర్యాదు ఐదు రోజులైనా ఎఫ్ఐఆర్ నమోదుచేయకపోవడంపై అనుమానాలు ఇదివరకే ఆర్ఆర్ యాక్ట్ కింద నోటీసులు కేసు నమోదు కాకుండా కొమ్ముకాస్తున్నఆ నేత ఎవరనే దానిపై చర్చ -
ఏసీబీకి చిక్కిన అవినీతి అధికారి
మద్దూరు: మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఓ రైతు నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టు బడ్డాడు. ఏసీబీ డీఎస్పీ సీహెచ్ బాలకృష్ణ వివరాల మేరకు.. మద్దూరు మండలం రెనివట్ల రెవెన్యూ గ్రామ పరిధిలోని అప్పిరెడ్డిపల్లికి చెందిన ఓ రైతు తన 5 గుంటల భూమి డీఎస్ పెండింగ్ సమస్యను పరిష్కరించాలని ఆర్ఐ కె.అమర్నాథ్ను సంప్రదించగా.. రూ. 5వేల లంచం డిమాండ్ చేశాడు. దీంతో సదరు రైతు ఏసీబీని ఆశ్రయించడంతో పక్కా ప్రణాళిక ప్రకారం దాడులు నిర్వహించినట్లు డీఎస్పీ తెలిపారు. రైతు నుంచి ఆర్ఐ డబ్బులు తీసుకొని మహబూబ్నగర్కు కారు లో వెళ్తున్న క్రమంలో తహసీల్దార్ కార్యాల యం ఎదుట పట్టుకొని తనిఖీ చేశామన్నారు. రైతు నుంచి తీసుకున్న లంచం డబ్బులను రికవరీ చేసి ఆర్ఐని అదుపులోకి తీసుకున్నామన్నారు. మంగళవారం అతడిని ఏసీబీ కోర్టులో హాజరుపర్చనున్నట్లు డీఎస్పీ తెలిపారు. ఉమ్మడి జిల్లాలో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులు లంచం డిమాండ్ చేస్తే ఏసీబీ టోల్ఫ్రీ నంబర్ 1064కు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఈ దాడుల్లో ఏసీబీ ఇన్స్పెక్టర్లు లింగస్వామి, సయ్యద్ అబ్దుల్ జిలానీ పాల్గొన్నారు. రైతు నుంచి రూ. 5వేల లంచంతీసుకుంటూ పట్టుబడిన మద్దూరు ఆర్ఐ -
కేటీఆర్ పర్యటనను విజయవంతం చేయాలి
● సభా స్థలాన్ని పరిశీలించిన మాజీమంత్రులు నిరంజన్రెడ్డి, శ్రీనివాస్గౌడ్ గద్వాల: ఈనెల 13వ తేదీన గద్వాలకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల రామారావు రానున్నారని, పర్యటనను విజయవంతం చేయాలని మాజీ మంత్రులు నిరంజన్రెడ్డి, శ్రీనివాస్గౌడ్, ఎమ్మెల్యే విజయుడు, ఆ పార్టీ నాయకులు ఆంజనేయగౌడ్, బీఎస్ కేశవ్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని గద్వాలలో వారు పర్యటించారు. మొదటగా స్థానిక పాతబస్టాండ్లో బహిరంగసభ స్థలాన్ని పరిశీలించారు. అదేవిధంగా రోడ్షోను నిర్వహించే ప్రాంతాల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో సమావేశమయ్యారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి రైతులను, కార్మికులను, ఉద్యోగులను ఇలా అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని, దీనిపై ప్రజా ఉద్యమంతో ప్రభుత్వాన్ని నిలదీయాలన్నారు. పదేళ్ల కాలంలో యూరియా సమస్య తలెత్తకుండా కేసీఆర్ పాలించారని గుర్తుచేశారు. కార్యక్రమంలో బాసు హనుమంతు, మోనేష్, రాజు, వెంకటేష్నాయుడు, కోటేష్, యూసూఫ్ తదితరులు పాల్గొన్నారు. -
ఇంత నిర్లక్ష్యమా..?
● ప్రమాదకరంగా విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు ● చేతికి అందే ఎత్తులో వైర్లు.. రక్షణ కంచె లేకపోవడంతో తరచూ ప్రమాదాలు ● విద్యుదాఘాతంతో మూగజీవాల మృతి అయిజ: విద్యుత్ సరఫరా వ్యవస్థలో ట్రాన్స్ఫార్మర్లు కీలక భూమిక పోషిస్తాయి. అయితే రోడ్డు పక్కన, ముఖ్య కూడళ్లు, రద్దీ ప్రాంతాల్లో ఉండే ఈ ట్రాన్స్ఫార్మర్ల వద్ద రక్షణకు పెన్సింగ్ లేకపోవడంతో అనేక ప్రమాదాలు సంభవిస్తున్నాయి. జిల్లాలోని మొత్తం ట్రాన్స్ఫార్మర్లలో కనీసం 10 శాతం ట్రాన్స్ఫార్మర్లకు కంచె ఏర్పాటు చేయలేదు. దీంతో జిల్లాలో ఎక్కడో ఓ చోట తరచూ మూగజీవాలు ప్రమాదాలకు గురవుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా పట్టణాలు, గ్రామాల్లో రద్దీ ప్రాంతాల్లో ట్రాన్స్ఫార్మర్లలో పలుమార్లు వైర్లు షార్ట్ సర్క్యూట్ కావడంతో నిప్పురవ్వలు ఎగసి పడుతున్నాయని ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. ట్రాన్స్ఫార్మర్ చుట్టూ రక్షణ వలయం ఏర్పాటు చేయాలని అధికారులకు పలుమార్లు విన్నవించినప్పటికీ పట్టించుకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. ట్రాన్స్ఫార్మర్ను అనుకుని ఏర్పాటు చేసిన పండ్లు, పూలు దుకాణాల కారణంగా ట్రాఫిక్ సమస్యతోపాటు జనం రద్దీ సమయంలో షార్ట్ సర్క్యూట్ ప్రమాదాలు సంభవిస్తాయని ప్రజలు, ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. ప్రధానంగా పిల్లలకు సైతం ప్రమాదం పొంచి ఉంది. గత నెలలో అయిజ మండలంలోని ఎక్లాస్పురం గ్రామంలో విద్యుత్ వైర్లు తగిలి రెండు గెర్రెలు మృతిచెందాయి. ఇప్పటికై నా సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి ట్రాన్స్ఫార్మర్ చుట్టూ రక్షణ వలయం ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. సామర్థ్యం మొత్తం ట్రాన్స్ఫార్మర్లు (కేవీఏల్లో) 10 కేవీఏ 1,433 15 1,677 25 12,692 63 1,003 100 2,037 160 87 200 2 250 6 315 2 500 2 చర్యలు చేపడతాం జిల్లాలో గతంలో ఏర్పాటు చేసిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు కట్టలపై అమర్చడంపై ఎక్కువ ఎత్తులో లేవు. వాటిచుట్టూ ఫెన్సింగ్ (కంచె) ఏర్పాటు చేస్తే ప్రజలు వాటిని చెత్తబుట్టలుగా వాడుకుంటున్నారు. అన్ని ట్రాన్స్ఫార్మర్ను ప్లింత్ రైజింగ్ చేయించి ప్రమాదాల నుంచి తప్పిస్తాం. ఇందుకోసం నిధులు విడుదల కావాల్సి ఉంది. – శ్రీనివాసరెడ్డి, ట్రాన్స్కో ఎస్ఈ -
918 టీఎంసీలు
వంద రోజుల్లో రికార్డుస్థాయిలో జూరాలకు పోటెత్తిన వరద ● 675 టీఎంసీలు నదిలోకి.. ● ఎత్తిపోతల పథకాల కోసం 17.2 టీఎంసీలు విడుదల ● సెప్టెంబర్ మొదటి వారంలోనే విద్యుదుత్పత్తి లక్ష్యం పూర్తి గద్వాల/ఆత్మకూర్: ఎగువ ప్రాంతాలైన మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో ఏకధాటిగా భారీ వర్షాలు కురుస్తుండడంతో జూరాలకు భారీగా వరద వచ్చి చేరుతుంది. దీంతో ఉమ్మడి జిల్లాకు పెద్దదిక్కుగా ఉన్న కృష్ణానదిపై నిర్మించిన తొలి ప్రాజెక్టు జూరాలకు జలకళ సంతరించుకుంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న సాగునీటి ప్రాజెక్టులకు నీటిని ఎత్తిపోస్తూ దానికిందున్న ఆయకట్టుకు సాగునీటిని విడుదల చేస్తున్నారు. ఈసారి జూరాలకు ముందస్తుగానే మే నెలలో 29వ తేదీన వరద మొదలవగా సెప్టెంబర్ 6వ తేదీ వరకు 918 టీఎంసీల వరద వచ్చింది. ● గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా వానాకాలంలో ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండడంతో కృష్ణాబేసిన్కు భారీగా వరదనీటితో నిండిపోయింది. కృష్ణాబేసిన్లో ఉన్న మహారాష్ట్రలోని ఉజ్జయిని, కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టులకు భారీ వరదనీరు వచ్చి చేరుతుండడంతో నీటిని దిగువనున్న జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులకు విడుదల చేస్తున్నారు. మన రాష్ట్రంలో కృష్ణాబేసిన్లో తొలిప్రాజెక్టు ప్రియదర్శిని జూరాల పాజెక్టుకు మే 29వ తేదీన మొదటిసారిగా వరద మొదలైంది. అప్పటి నుంచి ఈ నెల 6వ తేదీ వరకు ప్రాజెక్టుకు గరిష్టంగా 4.18 లక్షల క్యూసెక్కుల వరద వచ్చి చేరగా, ప్రాజెక్టులోని 44 గేట్లు ఎత్తి దిగువనున్న శ్రీశైలానికి నీటిని విడుదల చేశారు. జూరాలకు వరద మొదలైనప్పటి నుంచి ప్రాజెక్టుకు మొత్తం 918 టీఎంసీల నీరు వచ్చింది. జూన్, జూలైలో మాసాల్లో వర్షాలు లేకపోవడంతో చాలా రోజులు జూరాలకు వరద పూర్తిగా తగ్గిపోయింది. తిరిగి జూలై చివరి వారంలో వరద ప్రారంభం కావడంతో ప్రాజెక్టు గేట్లు ఎత్తి, నీటిని విడుదల చేశారు. భీమా లిఫ్ట్ – 2 2.9 నెట్టెంపాడుకు 4.3 కోయిల్సాగర్ 1.9 ఎంజీకేఎల్ఐ 4 విద్యుదుత్పత్తి 224 -
నిధులు కేటాయించాలి
విద్యుత్ శాఖ అధికారుల ట్రాన్స్ఫార్మర్ల చుట్టూ కంచె ఏర్పాటు చేసేందుకు నిధులు లేవని చెబుతున్నారు. నిధుల లేకపోవడంతో ట్రాన్స్ఫార్మర్ల చుట్టూ కంచెలను ఏర్పాటు చేయడం, దెబ్బతిన్న కంచెలకు మరమత్తులు చేయలేకపోతున్నారు. దానివలన రక్షణలేని ట్రాన్స్ఫార్మర్లు ప్రమాదకరంగా మారాయి. ప్రభుత్వం నిధులు మంజూరు చేయాలి. – మహబూబ్ బాషా, అయిజ సమస్య పరిష్కరించాలి స్థానికులు ఫిర్యాదు చేస్తే విద్యుత్ అధికారులు సకాలంలో స్పందించి సమస్యను పరిష్కరిస్తున్నారు. అయితే, అసలు సమస్యే లేకుండా చేస్తే ఇంకా బాగుంటుంది. ఉన్నతాధికారులకు నివేదిక పంపి రక్షణ కవచాలు ఏర్పాటు చేసేందుకు నిధులు సమకూర్చుకొని ప్రతి ట్రాన్స్ఫార్మర్ వద్ద కంచె ఏర్పాటు చేస్తే బాగుంటుంది. – రవీంద్రనాథరెడ్డి, అయిజ ● -
‘అక్షరాలా’.. నిర్లక్ష్యమే!
ప్రస్తుతం.. ఆవశ్యం.. తరం మారింది.. మనిషి ఆలోచనా విధానం మారింది. సాంకేతికంగా అడుగు ముందుకు వేస్తున్నాడు. ఈ నేపథ్యంలో గ్రామాల్లో ఉన్న ప్రతి పిల్లవాడి తల్లిదండ్రుల ఆలోచనా విధానం మారింది. గతంలో దీనికి భిన్నంగా ఉండేది. ఇప్పుడు తమ పిల్లలను ఉన్నతంగా చదివించేందుకు తల్లిదండ్రులు ప్రాముఖ్యం ఇస్తున్నారు. మంచి పాఠశాలలను ఎంపిక చేసుకుని మరీ పంపిస్తున్నారు. అయితే కొంతమందికి చదువు రాకపోవడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అయినా వెనుకడుగు మాత్రం వేయడం లేదు. ఈ తరుణంలో ముఖ్యంగా విద్యాభివృద్ధికి ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సామాజిక వర్గాలకు ప్రత్యేకంగా వసతి గృహాలు, గురుకుల రెసిడెన్షియల్ పాఠశాలలు, బాలికల విధ్యాభివృద్ధి కోసం కేజీబీవీ పాఠశాలలను ప్రభుత్వం నెలకొల్సింది. వయోజనులు సైతం కొద్దిపాటి అక్షరజ్ఞానంతో కొన్నింటిని అందిపుచ్చుకుంటున్నారు. ఈ తరుణంలో చదువుకున్న ప్రతి ఒక్కరూ తమ గ్రామంలో నిరక్షరాస్యులను ఆక్షరాస్యులుగా మార్చాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా నడిపించాలి. మనకెందుకులే అనే ధోరణిని వదిలి సామాజిక బాధ్యతగా గుర్తించాల్సిన అవసరం ఉంది. ఉపాధి క్షేత్ర సహాయకులు, డ్వాక్రా సంఘాలు, అంగన్వాడీ కార్యకర్తలు, యువత, సేవా సంస్థలు దీనిపై దృష్టి సారించి దేశాన్ని సంపూర్ణ అక్షరాస్యత దేశంగా మార్చేందుకు కృషి చేయాలి. గద్వాలటౌన్: అభివృద్ధితో పాటు అక్షరాస్యతలోనూ జిల్లా వెనకబడుతోంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దే కార్యక్రమాలను ప్రభుత్వం నిరంతరంగా అమలు చేస్తున్నా క్షేత్రస్థాయిలో లోపాలు.. పల్లెల్లోని నిరక్షరాస్యుల అవగాహనా రాహిత్యంలో అక్షరసుమాలను వెదజల్లలేకపోతోంది. ‘ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు’ అంటారు కానీ మహిళలే అక్షరాస్యతలో వెనుకబడిపోతున్నారు. నేటికి జిల్లాలోని గ్రామీణ ప్రజలు వేలిముద్రలు వేసే స్థాయిలోనే ఉన్నారంటే అక్షరాస్యత ఏ దుర్గతిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. సోమవారం ప్రపంచ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం. ఐదేళ్లుగా చర్యలు చేపడుతున్నా.. జిల్లా వంద శాతం అక్షరాస్యతను సాధించడంలో పూర్తిగా తడబడుతోంది. 2011 లెక్కల ప్రకారం జిల్లా జనాభా 6,09,990 ఉండగా వారిలో 3,09,274 మంది పురుషులు, 3,00,716 మంది మహిళలు ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. వీరిలో 3,04,202 మంది నేటికీ నిరక్షరాస్యులుగానే ఉన్నట్లు అధికార లెక్కలే చెబుతున్నాయి. జిల్లా అక్షరాస్యత శాతం 49.87 శాతం ఉండగా, వీరిలో పురుషులు 60.05 శాతం, మహిళలు 39.48 శాతం ఉన్నారు. రాష్ట్రంలోనే గద్వాల జిల్లాలోని మూడు మండలాలు అక్షరాస్యతలో వెనుకబడ్డాయి. కేటీదొడ్డి, గట్టు, ధరూర్ మండలాలు కింది వరసలో ఉండటం దారుణం. కేటీదొడ్డి మండలంలో 33.77 శాతం అక్షరాస్యత నమోదై ఉండటం ఆందోళన కలిగిస్తుంది. గతంతో పోలిస్తే అక్షరాస్యతలో కొంత పెరుగుదల కనిపిస్తున్నా జిల్లాలో వంద శాతం సాధించడంలో వెనుకబడిపోతున్నాం. జిల్లాలో ప్రధానంగా పేదరికం, వలసలు, అనర్థాలకు కారణం చాలా సందర్భాల్లో నిరక్షరాస్యతే కారణమవుతోంది. దీంతో పాటు బాలకార్మిక వ్యవస్థ జిల్లాలో పట్టి పీడిస్తుంది. సంపూర్ల అక్షరాస్యత కోసం జిల్లా యంత్రాంగం గత అయిదేళ్లుగా చేపడుతున్నా చర్యలు నేటికీ తడబడుతూనే ఉన్నాయి. 2010లో గ్రామాలలో ఏర్పాటు చేసిన సాక్షర భారత్ కేంద్రాలు మూతపడ్డాయి. వీటి గడువు ముగియడంతో.. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి కార్యక్రమాలను చేపట్టలేదు. ‘ మీ పిల్లలే.. మీకు టీచర్లు.. ’ అనే కార్యక్రమాన్ని విద్యాశాఖ చేపట్టిన ఆశించిన ఫలితాలను ఇవ్వలేదు. కొరవడిన పర్యవేక్షణ జిల్లాలో వయోజన విద్యా శాఖ ఆధ్వర్యంలో వయోజనులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దే కార్యక్రమాలు పర్యవేక్షణ కొరవడి, ప్రోత్సాహకాలు లేక చతికిలపడిపోయాయి. గతంలో ఉన్న వయోజన విద్యా కేంద్రాలు ప్రశ్నార్థకంగా మారాయి. గత తొమ్మిదేళ్లుగా జిల్లా అన్ని రంగాల్లో కాస్తోకూస్తో అభివృద్ధి చెందుతున్న అక్షరాస్యతలో మాత్రం ఆ ఘనతను సాధించలేకపోతోంది. ఇప్పటికీ జిల్లా అక్షరాస్యత 49.87 శాతంతో నిలుస్తుడటం గమనార్హం. ముఖ్యంగా మహిళలు 60శాతానికి పైగా అక్షరాస్యతకు దూరంగా నిలుస్తున్నారు. నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దడంలో జిల్లా తడబాటు చదువు నేర్వని మహిళలే అధికం జిల్లా అక్షరాస్యత 49.87 శాతం నేడు ప్రపంచ అక్షరాస్యత దినోత్సవం ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తున్నాం.. జిల్లాను సంపూర్ణ అక్షరాస్యత గల జిల్లాగా తీర్చిదిద్దేందుకు జిల్లా యంత్రాంగం ప్రజాప్రతినిధుల సహకారంతో ప్రణాళికబద్ధంగా కృషి చేస్తున్నాం. పలు గ్రామాలు ఈ దిశగా వృద్ధిలో ఉన్నాయి. మొదటి నుంచి ఎక్కవ శాతం నిరక్షరాస్యత గత గ్రామాలు అక్షరాస్యత సాధించేందుకు సమయం తీసుకుంటున్నాయి. అక్షరాస్యత కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. – అబ్దుల్ ఘనీ, డీఈఓ -
అలంపూర్ ఆలయాలు మూసివేత
● చంద్రగ్రహణం నేపథ్యంలో గర్భాలయాలకు తాళం వేసినఅర్చకులు ● ఉదయం కొనసాగిన పూజలు, దర్శనాలు అలంపూర్: దక్షిణ కాశీ అలంపూర్ క్షేత్ర ఆలయాలను అర్చకులు మూసివేశారు. ఆదివారం రాత్రి చంద్రగ్రహణం నేపథ్యంలో ఆలయాల్లో తాత్కాలికంగా పూజలు, భక్తుల దర్శనాలు నిలిపివేసినట్లు ఆలయ ఈఓ దీప్తి, కమిటీ చైర్మన్ నాగేశ్వర్రెడ్డి తెలిపారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పూజలు, భక్తు ల దర్శనాలు, హోమ పూజలు యథావిధిగా కొనసాగాయి. మధ్యాహ్నం నుంచి ఆలయాలను మూసివేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు జోగుళాంబ అమ్మవారు, బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయా ల్లో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఇరు గర్భాలయాలకు తాళాలు వేశారు. చంద్రగ్రహణం రాత్రి ఉండటంతో తిరిగి ఈ నెల 8వ తేదీ సోమవారం ఉదయం ఆలయాలు తెలిచి శుద్ధి, సంప్రోక్షణ కార్యక్రమాలు చేపట్టనున్నారు. అనంతరం 8.30 గంటలకు మహా మంగళహారతితో దర్శనాలు పునఃప్రారంభం అవుతాయని ఈఓ, చైర్మన్ పేర్కొన్నారు. ఆదిశిలా క్షేత్రం.. మల్దకల్: చంద్రగ్రహణం నేపథ్యంలో ఆదిశిలా క్షేత్రమైన స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని ఆదివారం ఉదయం 11.30గంటల నుంచి సోమవారం తెల్లవారుజాము వరకు మూసివేయనున్నట్లు ఆలయ ఈఓ సత్యచంద్రారెడ్డి తెలిపారు. గ్రహణం అనంతరం ఆలయ శుద్ది, సంప్రోక్షణ చేసిన తర్వాత భక్తులకు స్వామి వారి దర్శనం ఉంటుందని తెలిపారు. -
ఆధునిక హంగులతో..!
గద్వాల క్రైం: జిల్లాలో నూతన కోర్టు భవనాల నిర్మాణానికి ముందడుగు పడింది. ఆధునిక హంగులతో 9.19 ఎకరాల్లో రూ.98 కోట్లతో 12 భవనాల నిర్మాణం చేపట్టనున్నారు. జిల్లా కోర్టు, ఫ్యామిలీ, పొక్సో కోర్టు నూతన భవన నిర్మాణా పనుల కోసం ప్రభుత్వం ఆమోదం తెలిపింది. 24 నెలలో పనులు పూర్తి చేసేందుకు టెండర్ ప్రక్రియ పూర్తి చేసింది. నిర్మాణ పనులు చేపట్టేందుకు ఆర్అండ్బీ అధికారులకు ప్రభుత్వం లేఖను ఇటీవల సీఫార్సు చేసింది. కోర్టు భవన సమూదాయ నిర్మాణ పనులు ఇంజినీర్ల పరవ్యేక్షణలో జరిగేలా ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం కోర్టులు పాక్షికంగా దెబ్బతిన్న భవనాల్లో కొనసాగుతున్నాయి స్థల కేటాయింపు జిల్లాలోని పూడూరు గ్రామ శివారులోని పూటాన్పల్లి ప్రభుత్వ స్థలంలోని సర్వే నంబర్ 368లో 9.19 గుంటల భూమిని 2022లో రెవెన్యూ అధికారులు ఎంపిక చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. అయితే ఈ విషయంలో కొంత మంది సభ్యులు స్థల కేటాయింపునకు పునరాలోచన చేయాలని, జమ్మిచెడు శివారులోని సర్వే నంబర్ 691, 382లో కోర్టు భవనాల కోసం స్థల ఎంపిక చేయాల్సిందిగా సిఫార్సు చేశారు. అయితే ప్రభుత్వం వివిధ భూ సమస్యల కారణంచే జమ్మిచెడ్ శివారులోని స్థల కేటాయింపు విషయంలో పలు రకాల సమస్యలచేత నిరాకరించింది. ఎట్టకేలకు పూడూరు గ్రామ శివారు స్థలంలోనే చేపట్టేందుకు అమోదం తెలిపింది. టెండర్ ప్రక్రియ సైతం పూర్తి అయ్యింది. కేవీఎం సంస్థ రూ. 98 కోట్లకు పనులు దక్కించుకుంది. 12 భవనాల సముదాయం.. జిల్లా కోర్టు సమూదాయలను ఆధునిక హంగులతో నిర్మించనున్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు విడుదలైన డిజైన్ సైతం ప్రభుత్వం విడుదల చేసింది. ప్రస్తుతం గద్వాల సెగ్మెంట్లో జిల్లా కోర్టు, ఫాస్ట్ట్రాక్ కోర్టు, పొక్సో కోర్టు, అదనపు జిల్లా సెషన్ కోర్టు, సీనియర్, జూనియర్ సివిల్ కోర్టు, అసిస్టెంట్ సెషన్ కోర్టు, అదనపు సెషన్ కోర్టులు కక్షిదారులకు అందుబాటులో ఉన్నాయి. అలంపూర్ సెగ్మెంట్లో మార్నింగ్ కోర్టు, జూనియర్ సివిల్ కోర్టులు కక్షిదారులకు అందుబాటులో ఉన్నాయి. నూతన కోర్టు సమూదాయ భవన నిర్మాణంలో 12 కోర్టు భవనాలు ఉండేలా ప్రభుత్వం రూప కల్పన చేసింది. జిల్లాలో నూతన కోర్టు భవనాలతో కూడిన సమూదాయానికి గతంలో స్థల ఎంపిక ప్రక్రియను చేపట్టాం. రవాణా సౌకర్యం, కక్షిదారులు, ప్రజలకు అందుబాటులో ఉండేలా పలు స్థలాలను ఎంపిక చేసి ప్రభుత్వానికి నివేదికలు అందజేశాం. పూడూరు శివారులోని పూటాన్పల్లి గ్రామ సమీపంలోని 368లోని 9.19 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వం ఎంపిక చేసింది. ప్రభుత్వం సైతం ఇక్కడి స్థలానికి ఆమోదం తెలిపింది. ఈ క్రమంలో కొందరు అయిష్టత వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు, కక్షిదారులను దృష్టిలో ఉంచుకునే ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అధునిక హంగులతో త్వరలో నిర్మాణం చేపట్టనున్నాం. 24 నెలల్లో పనులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటాం. – వి. లక్ష్మీనారాయణ, అడిషనల్ కలెక్టర్● 12 భవనాల కోసం 9.19 ఎకరాలు కేటాయింపు టెండర్ ప్రక్రియ పూర్తి పూడూరు శివారులో స్థల ఎంపిక..? జిల్లా కేంద్రంలో కొత్త కోర్టు భవనాలు నిర్మించాలని 2022లో రూ.100 కోట్లు మంజూరు చేస్తూ పూడూరు గ్రామ శివారులోని పూటాన్ పల్లి వద్ద 9.19 ఎకరాల ప్రభుత్వం స్థలాన్ని కేటాయించింది. కక్షిదారులకు, ప్రజలకు దూరంగా ఉంటుందని కొంత మంది న్యాయవాదులు పూటాన్పల్లి స్థల విషయంలో విముఖత చాటారు. మరికొంత మంది న్యాయవాదులు మాత్రం హర్షం వ్యక్తం చేశారు. దీంతో స్థల ఎంపిక విషయపై న్యాయ వాదులు నిరసనలు, దీక్షలు చేపట్టారు. పీజెపీ క్యాంపులోని ప్రభుత్వ స్థలంలోనే జిల్లా కోర్టు సమూదాయాలు ఉండాల్సిందిగా పేర్కొన్నారు. ఒకవైపు హర్షం మరోవైపు వ్యతిరేఖతల మధ్య ప్రస్తుతం కొనసాగుతుంది. -
‘సర్వేపల్లి’ జీవితం ఆదర్శం
వనపర్తి: ఉపాధ్యాయులు అంకితభావంతో విధులు నిర్వర్తించి జిల్లాను విద్యాపరంగా ఉన్నతస్థాయికి తీసుకెళ్లాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డా. జి.చిన్నారెడ్డి కోరారు. శనివారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుల పురస్కార కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ జీవితం ప్రతి ఉపాధ్యాయుడికి ఆదర్శం కావాలని.. తన పుట్టినరోజును టీచర్స్ డేగా జరుపుకోవాలని సూచించడం ఉపాధ్యాయులకు గొప్ప గౌరవం అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యావ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రయత్నం చేస్తోందని.. అందులో భాగంగానే పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన, ఉపాధ్యాయులకు పదోన్నతులు, కొత్త టీచర్ల నియామకం చేపట్టిందని వివరించారు. ప్రతి నియోజకవర్గంలో అంతర్జాతీయ ప్రమాణాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏర్పాటు చేస్తోందన్నారు. కొత్త విద్యా విధానం తీసుకురావడానికి ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు తెలిపారు. -
వంతెన నిర్మాణానికి స్థల పరిశీలన
ఆత్మకూర్: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు దిగువ ప్రాంతం నుంచి గద్వాలకు వెళ్లేందుకు వంతెన నిర్మాణానికిగాను స్థల పరిశీలన చేపడుతున్నట్లు నీటిపారుదలశాఖ చీఫ్ ఇంజినీర్ నాగేంద్రం తెలిపారు. శనివారం మండలంలోని జూరాల పుష్కరఘాట్, అమరచింత మండలం వద్ద వంతెన నిర్మాణాలకు అనువైన స్థలాలను పరిశీలించి మాట్లాడారు. రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి, రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి ఆదేశాల మేరకు స్థల పరిశీలన జరిపామన్నారు. ఇటీవల జూరాలను సందర్శించిన మంత్రులు వంతెన నిర్మాణానికి కావాల్సిన రూ.120 కోట్లు మంజూరు చేసా ్తమని హామీ ఇచ్చారని.. అందులో భాగంగానే సందర్శించామన్నారు. జూరాల వద్ద వంతెన నిర్మాణంతో ఆత్మకూర్, అమరచింత మండలాల నుంచి జోగుళాంబ గద్వాల జిల్లాకు రవాణా సౌకర్యం మెరుగుపడనుందని అధికారులు పేర్కొన్నారు. ఆయన వెంట డిప్యూటీ చీఫ్ ఇంజినీర్ సత్యనారాయణరెడ్డి, డీఈ నారాయణ, మార్కెట్ చైర్మన్ రహ్మతుల్లా, కాంగ్రెస్ నాయకులు పరమేష్, తులసీరాజ్, నల్గొండ శ్రీను, మహమూద్, ఇరిగేషన్ అధికారులు ఉన్నారు. -
భక్తిశ్రద్ధలతో అనంత పద్మనాభ స్వామి వ్రతం
మల్దకల్: ఆదిశిలా క్షేత్రమైన స్వయంభూ లక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం అనంత పద్మనాభ స్వామి వ్రతాన్ని వేదపండితులు ఘనంగా నిర్వహించారు. ముందుగా ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు వేదపండితులు రమేషాచారి, మధుసూదనాచారి, రవిచారిల ఆధ్వర్యంలో ప్రవచనాలు వినిపించారు. ఈ వ్రతం తిలకించేందుకు భక్తులు వివిధ గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో హాజరుకాగా.. వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆలయ సిబ్బంది ఏర్పాట్లు చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అదే విధంగా భజన మండలి సభ్యులు కొంకల ప్రసాదాచారి ఆధ్వర్యంలో ప్రత్యేక భజన కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ సత్యచంద్రారెడ్డి, ఆలయ నిర్వాహకులు అరవిందరావు, చంద్రశేఖర్ రావు, నాయకులు చంద్రశేఖర్ రెడ్డి, బాబురావు, వాల్మీకీ పూజారులు తదితరులు పాల్గొన్నారు.వారోత్సవాలు జయప్రదం చేయండిగద్వాల: వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారోత్సవాలను జయప్రదం చేయాలని సీపీఎం రాష్ట్రకమిటీ సభ్యుడు ఆర్ శ్రీరామ్ నాయక్ పిలుపునిచ్చారు. శనివారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలోని నర్మద అధ్యక్షతన జిల్లా కమిటీ సమావేశం నిర్వహించి మాట్లాడారు. పార్టీ ఆధ్వర్యంలోని ఈ నెల 10 నుంచి 17 వరకు జరిగే వారోత్సవాలను జయప్రదం చేయాలన్నారు. వీర తెలంగాణ సాయుధ రైతాంగ పొరాటం నిజాం నవాబుకు వ్యతిరేఖంగా జరిగిందన్నారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని నేడు బీజేపీ రెండు వర్గాల మద్య ఘర్షణగా చిత్రీకరించాలని చూస్తుందని విమర్శించారు. కార్యక్రమంలో సీపిఎం జిల్లా కార్యదర్శి వెంకటస్వామి, జిల్లా కమిటీ సభ్యులు రాజు, రేపల్లె, దేవదాసు, జ్యోతి, వివి నరసింహ, పాల్గొన్నారు.నేడు బీచుపల్లి ఆలయాల మూసివేతఎర్రవల్లి: చంద్రగ్రహణం సందర్భంగా బీచుపల్లి పుణ్యక్షేత్రంలోని కోదండరామస్వామి ఆలయం ద్వారాలను ఆదివారం మధ్యాహ్నం 12.55 గంటల నుంచి మూసివేయనున్నట్లు ఆలయ మేనేజర్ సురేందర్రాజు శనివారం ఒక ప్రకనటలో తెలిపారు. గ్రహణం పూర్తి అనంతరం తిరిగి సోమవారం ఉదయం ఆలయ సంప్రోక్షణ తర్వాత ఆలయ ద్వారాలను తెరిచి స్వామివారి దర్శనం కల్పించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.శనేశ్వరాలయానికి భక్తుల తాకిడిబిజినేపల్లి: మండలంలోని నందివడ్డెమాన్ జైష్ఠ్యాదేవి సమేత శనేశ్వరాలయానికి శనివారం వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. తమ ఏలినాటి శనిదోష నివారణ కోసం శనేశ్వరుడికి తిల తైలాభిషేకాలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకుడు గవ్వమఠం విశ్వనాథశాస్త్రి ఆధ్వర్యంలో అభిషేకాలు, అర్చనలు చేసిన అనంతరం బ్రహ్మసూత్ర శివుడిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. కార్యక్రమంలో అర్చకులు శాంతికుమార్, ఉమ్మయ్య, కమిటీ సభ్యులు రాజేశ్, ప్రభాకరాచారి, వీరశేఖర్, శ్రీకాంత్రెడ్డి పాల్గొన్నారు.నూతన విద్యా విధానాన్ని విరమించుకోవాలిమహబూబ్నగర్ ఎడ్యుకేషన్: ప్రభుత్వం నూతన విద్యా విధానాన్ని అమలు చేయాలనే ఆలోచనలను విరమించుకోవాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దామెర కిరణ్ డిమాండ్ చేశారు. శనివారం జిల్లా కేంద్రంలోని ఎస్ఎఫ్ఐ కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం సెకండరీ స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్లో ఇంటర్మీడియట్ బోర్డును విలీనంచేసే మార్గదర్శకాల రూపకల్పనకు కసరత్తు చేస్తోందన్నారు. సంస్కరణల పేరుతో 42,000 ప్రభుత్వ పాఠశాలలను 6వేలకు కుదించే అవకాశం ఉందన్నారు. ప్రభుత్వం నూతన విద్యావిధానం అమలు చేయాలనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని.. ఈ మేరకు అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. అదే విధంగా పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు విడుదల చేయాలన్నారు. -
చెరుకు రైతులను ఆదుకోవాలి
అమరచింత: చెరుకు కోతలకు సరిపడా కార్మికులను ముందస్తుగా రప్పించి సకాలంలో పూర్తయ్యేలా చూడాలని కృష్ణవేణి ఘగర్ ఫ్యాక్టరీ యాజమాన్యానికి శనివారం చెరుకు రైతులు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా కృష్ణవేణి చెరుకు రైతుసంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు రాజన్న మాట్లాడుతూ.. గత సీజన్లో ప్రకటించి అమలు చేస్తున్న రాయితీలను 2025–2026 సంవత్సరం కొనసాగించాలని, అధిక దిగుబడినిచ్చే వంగడాలను పరిచయం చేసి సాగుకు సహకరించాలన్నారు. చెరుకు రవాణాకు అనుకూలంగా ఉండేలా ట్రాక్టర్ ట్రాలీలు తయారు చేయించాల్సిన అవసరం ఉందని తెలిపారు. రైతులకు ఇవ్వాల్సిన ష్యూరిటీ డబ్బులను వెంటనే వారి ఖాతాల్లో జమ చేయాలని, ప్రతి రైతుకు ఇన్వాయిస్ ఇచ్చేందుకు యాజమాన్యం చర్యలు తీసుకోవాలని కోరారు. ఫ్యాక్టరీ యాజమాన్యం సకాలంలో పంట డబ్బులు చెల్లించడం, రాయితీలు అందించడంతో మూడేళ్లుగా సాగు క్రమంగా పెరుగుతోందని.. ఇలానే కొనసాగించాలన్నారు. కార్యక్రమంలో వాసారెడ్డి, రంగన్న, చంద్రసేనారెడ్డి, నారాయణ, రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. వేరుశనగ క్వింటా రూ.5,980 గద్వాల వ్యవసాయం: గద్వాల మార్కెట్ యార్డుకు శనివారం 464 క్వింటాళ్ల వేరుశనగ వచ్చింది. గరిష్టం రూ.5980, కనిష్టం రూ.33 56, సరాసరి రూ.3789 ధరలు లభించాయి. -
రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయురాలిగా రేవతి
ధరూరు: మండలంలోని జాంపల్లి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు రేవతి రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపికయ్యారు. అత్యధికంగా డ్రాపౌట్ ఎన్రోల్మెంట్ చేయడం, టీఎల్ఎం, కల్చరల్ కార్యక్రమాలు వంటి పది అంశాలకు సంబంధించి ఉత్తమ ప్రతిభ కనబరిచారు. అందులో ప్రధానంగా ధరూరు, జాంపల్లి పాఠశాలల్లో పని చేసిన క్రమంలో చేసిన పనులకుగాను గుర్తింపు దక్కింది. శుక్రవారం హైదరాబాద్లోని శిల్ప కళావేదిక, శిల్పా రామంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేతుల మీదుగా అవార్డు అందుకోనున్నారు. చేసిన మంచి పనులను గుర్తించి ప్రభుత్వం అవార్డు ఇవ్వడం ఎంతో సంతోషంగా ఉందని రేవతి తెలిపారు. ఇదిలాఉండగా, మండల ఉపాధ్యాయురాలికి రాష్ట్ర స్థాయిలో గుర్తింపు రావడంపై ఉపాధ్యాయ సంఘాల నాయకులు, తోటి ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు. సంక్షేమ పథకాలను సద్వినియోగించుకోవాలి గద్వాల: ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుని వృద్ధిచెందాలని అదనపు కలెక్టర్ వి.లక్ష్మీనారాయణ అన్నారు. గురువారం అయిజ మండలం ఈడిగోనిపల్లికి చెందిన ఎస్సీ కులానికి చెందిన మనీషా వీరేంద్ర కులాంతర వివాహం చేసుకున్నారు. ఇందుకుగాను ప్రభుత్వ పథకం ద్వారా రూ.2.50లక్షల ప్రోత్సాహక బహుమతిని మంజూరీ చేసినట్లు తెలిపారు. ఎస్సీ కులాల అభివృద్ధి శాఖ ద్వారా ఫిక్స్డ్ డిపాజిట్ రూపంలో వీరికి బాండ్ను అందజేశారు. కార్యక్రమంలో ఎస్సీ సంక్షేమాభివృద్ధి శాఖ జిల్లా అధికారి నుషిత, మల్లిఖార్జున్ తదితరులు పాల్గొన్నారు. హైకోర్టు ఆదేశాలు అమలు చేయాలి గద్వాల: డబుల్ బెడ్రూం ఇళ్ల కేటాయింపులో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను గౌరవించి వాటిని ఖచ్చితంగా అమలు చేయాలని సీనియర్ సిటీజన్ ఫోరం జిల్లా అధ్యక్షుడు కె.మోహన్రావు కోరారు. ఈమేరకు ఆయన గురువారం కలెక్టర్ బీఎం సంతోష్ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా మాట్లాడుతూ.. పరమాల శివారులో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్లలో ఇళ్ల స్థలాలు కోల్పోయిన వారికి ఇళ్లను కేటాయించాలని కోర్టు ఆదేశాలు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఇదిలా ఉండగా ఈ నెల 6వ తేదీన రెవెన్యూ శాఖమంత్రి పొంగులేటి శ్రీనివా్స్రెడ్డి డబుల్ బెడ్రూం ఇళ్లకు సంబంధించిన పట్టాలను ఇదివరకే కేటాయించిన లబ్ధిదారులకు అందజేయనున్నట్లు తెలిసింది. ఈనేపథ్యంలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను అమలుచేయాలని కోరగా హైకోర్టు ఆదేశాలను అమలు చేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చినట్లు మోహన్రావు తెలిపారు. -
డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీకి సర్వం సిద్ధం
గద్వాల: పరమాల శివారులో రూ.85కోట్లతో నిర్మించిన 1,275 డబుల్ బెడ్రూంలలో 715 ఇళ్లను ఇదివరకే లబ్ధిదారులకే కేటాయించడం జరిగిందని, వీటిని ఈనెల 6వ తేదీన లబ్ధిదారులకు అందిస్తున్నట్లు కలెక్టర్ బీఎం సంతోష్ తెలిపారు. గురువారం ఆయన కలెక్టరేట్లో అధికారులతో సమీక్షించారు. మంత్రి పొంగులేటి చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరుగనున్నందున అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. ముఖ్యంగా అన్ని బ్లాకులో తాగునీటి వసతి, విద్యుత్ సదుపాయం, డ్రైనేజీ వ్యవస్థ వంటివి, ఎక్కడైనా మిగిలిపోయిన పెండింగ్ పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. అన్ని ఇళ్లకు రంగులు వేయడం పూర్తి చేసి తోరణాలతో అలంకరించాలన్నారు. అదేవిధంగా ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా పటిష్టమైన పోలీసుబందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీసులను ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు వి.లక్ష్మీనారాయణ, నర్సింగ్రావు, హౌసింగ్పీడీ శ్రీనివాస్రావు, ఆర్డీఓ అలివేలు, డీపీవో నాగేంద్రం, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు. -
పంట సాగు వివరాలు నమోదు చేయాలి
మానవపాడు: మండలంలోని జల్లాపురం గ్రామంలో గురువారం పంట నమోదు కార్యక్రమంలో భాగంగా జిల్లా వ్యవసాయ అధికారి సక్రియానాయక్ పంట పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలంలోని వ్యవసాయ విస్తరణ అధికారులు చేసిన పంటల బుకింగ్ వివరాలు, పొలం వద్ద తీసిన ఫొటోలు వివరాలను పరిశీలించి ధృవీకరించారు. ప్రతి వ్యవసాయ విస్తరణ అధికారి పరిదిలోని 2000 ఎకరాల్లో విస్తీర్ణనానికి డిజిటల్ పంట బుకింగ్ చేయాల్సి ఉంటుందని తెలిపారు. ఈ ప్రక్రియలో భాగంగా ఏఈఓ తప్పనిసరిగా ప్రత్యక్షంగా పొలం వద్దకు వెళ్లి, అక్కడి పంటల ఫొటోలు డీసీఎస్ యాప్లో అప్లోడ్ చేయాలని, ఫొటోలు తీసేటప్పుడు లాటిట్యూట్, లాంగిట్యుడ్ వివరాలు తప్పనిసరిగా నమోదు చేయాలన్నారు. మండలంలో పత్తి పంట 19800, మిర్చి 4000, కంది 1950, మొక్కజొన్న 750, వరి 221ఎకరాలలో మండల వ్యాప్తంగా పంటలను రైతులు సాగుచేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి ప్రదీప్కుమార్, వ్యవసాయ విస్తరణ అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. -
మార్గదర్శకులు!
బోర్డుపై చిత్రాలు గీచి.. పాఠ్య పుస్తకాల్లోని ఫొటోలు చూపించి విద్యార్థులకు బోధించడం లాంటి మూసధోరణికి స్వస్తి పలికి.. సాంకేతికతను జోడించి పాఠ్యాంశాలను కళ్లకు కట్టేలా యానిమేషన్ వీడియోలు చూపిస్తూ విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దుతున్నారు కొందరు ఉపాధ్యాయులు. ఒక్కో పాఠ్యాంశం చాలా కాలం గుర్తుండేలా వినూత్న బోధన పద్ధతులతో విద్యార్థులకు బోధిస్తూ.. పిల్లల్లోని సృజనాత్మకతను వెలికితీసి.. రాష్ట్రస్థాయి సైన్స్ఫెయిర్లలో ఉత్తమ ప్రతిభ కనబర్చేలా సంసిద్ధం చేస్తున్నారు. మొత్తంగా గ్రామీణ విద్యార్థులు ఉన్నత శిఖరాలకు చేరుకునేలా తీర్చిదిద్దుతూ ఉపాధ్యాయులు మార్గదర్శకులుగా నిలుస్తున్నారు. శుక్రవారం జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం.. – గద్వాల టౌన్ సైన్ ప్రయోగాలలో దిట్ట విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా ఉపకరణాలతో ప్రయోగ పూర్వకంగా ధరూరు మండలం మార్లబీడు జెడ్పీహెచ్ఎస్ ఉపాధ్యాయుడు ఎల్లస్వామి విజ్ఞాన శాస్త్రాన్ని బోధిస్తున్నాడు. విద్యాభివృద్ధితో పాటు విద్యార్థులకు విజ్ఞానశాస్త్రం పట్ల అభిరుచి కలిగి, పరిశోధనా, పరిశీలనాశక్తి, శారిస్తీయ నైపుణ్యాలు అలవడేలా కృషి చేస్తున్నారు. పాఠశాలలోని ఓ గదిలో సైన్స్కు సంబంధించిన వివిధ అంశాలతో ప్రయోగాలను ఏర్పాటు చేశారు. ఇందులో మానవ శరీరంలోని అవయవాలు, రక్త నమూనాలు మొదలుకొని వాటి పనితీరు వివిధ అంశాలపై క్షుణ్ణంగా చార్టులు, నమూనాల ద్వారా ప్రదర్శించారు. పాఠ్యంశాల్లోని అంశాలనే వివిధ ఉపకరణాల ద్వారా ప్రయోగపూర్వకంగా బోధిస్తూ ఆకట్టుకుంటున్నాడు. 2022లో ఎల్లస్వామి రాష్ట్రస్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యారు. 2017 తొలి తెలంగాణ ప్రతిభ అవార్డు కింద రూ.50 వేలు నగదు పురస్కారాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ చేతుల మీదుగా అందుకున్నారు. నేషనల్ చిల్డ్రన్స్ సైన్స్ కాంగ్రెస్లో రాష్ట్రస్థాయి అవార్డుతో పాటు పలు అవార్డులను ఎల్లస్వామి అందుకున్నారు. ఉపకరణాలతో బోధన భళా..పాఠాల బోధన ఒక్కటే కాదు.. వాస్తవ ప్రపంచ సమస్యలను పరిష్కరించడానికి విద్యార్థులను ప్రేరేపించడమూ గురువుల బాధ్యతంటారు గద్వాల ప్రభుత్వ అభ్యసన ఉన్నత పాఠశాల సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు నాగరాజు. పిల్లల్లో అన్వేషణ సామర్థ్యం, అందుకు అవసరమైన జిజ్ఞాస మెండుగా ఉంటుందని నమ్మి.. వినూత్న బోధనోపకరణాలు వినియోగించి పాఠాలు బోధిస్తున్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి బోధనలో డిజిటల్ బోర్డులను సమర్ధవంతంగా వినియోగిస్తున్నారు. స్వతహాగా పాఠ్యాంశాలకు సంబంధించిన వీడియోలు రూపొందించి బోధన అందిస్తున్నారు. విద్యార్థులకు గూగుల్ ఫామ్ ద్వారా ఆన్లైన్లో పరీక్షలు నిర్వహించి ప్రోత్సహిస్తున్నారు. సొంతంగా బోధనోపకరణాలు, ప్రాజెక్టులు తయారు చేయడంతో పాటు విద్యార్థుల చేత చేయిస్తున్నారు. 2022లో, 2024లో దక్షిణ భారత స్థాయిలో జరిగిన సైన్స్ ఫెయిర్లో బహుమతులు సాధించారు. పదో తరగతి విద్యార్థుల కోసం ప్రత్యేకంగా మెటీరియల్స్ రూపొందించండం, పోటీ పరీక్షలకు విద్యార్థులకు తర్పీదు ఇస్తున్నారు. బాల మేధావులుగా తీర్చిదిద్దుతూ.. ఉండవెల్లి: విద్యార్థుల మేధోశక్తికి పదును పెడుతూ.. కొత్త కొత్త ఆలోచనలకు కార్యరూపం దాల్చుతూ.. వారిని భవిష్యత్ సైంటిస్టులుగా తీర్చిదిద్దాతున్నారు ఉండవెల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల జీవశాస్త్రం ఉపాధ్యాయురాలు లక్ష్మి ఖర్చు లేకుండా, సులువుగా దుస్తులు తయారు చేసే యంత్రాన్ని విద్యార్థులచే తయారు చేయించి సైన్స్ఫెయిర్లో ప్రదర్శించడంతో రాష్ట్ర స్థాయిలో ప్రశంసలు అందుకున్నారు.ఎన్ఆర్ఐల సహాయంతో కొందరు విద్యార్థులను ఇస్రోకి తీసుకెళ్లి సైన్స్పై మరింత మక్కువ పెంచారు. మెదడుకు పదును పెట్టే చెస్ బోర్డులను అందజేశారు. ఇదే పాఠశాలలో 2007–08లో పదో తరగతి చదివిన కృష్ణ అనే విద్యార్థి ప్రస్తుతం ఇస్రోలో విధులు నిర్వహిస్తున్నారు. పదో తరగతిలో సైన్స్ టీచర్ లక్ష్మీ వల్లే సైన్స్పై మక్కువ పెరిగిందని, ఈ రంగంవైపు వచ్చానని పూర్వ విద్యార్థి కృష్ణతోపాటు పలువురు చెప్పుకొచ్చారు. తెరపై చూపుతూ... విజ్ఞానం వెలిగిస్తూ.. చెప్పడం కంటే చూపిస్తే పిల్లలకు పాఠాలు సులభంగా అర్థమవుతాయన్నది నిజం. గత కొన్నేళ్లుగా ఇదే విధానాన్ని పాటిస్తున్నారు ఉండవెల్లి మండలం పుల్లూరు జెడ్పీహెచ్ఎస్లో జీవశాస్త్ర ఉపాధ్యాయుడి రవిశంకర్. తన సబ్జెక్టు పాఠాలపై పవర్ పాయింట్ ప్రజంటేషన్, యూనిమేషన్ వీడియోలు సొంతగా రూపొందిస్తున్నారు. టీవీ, కంప్యూటర్ల ద్వారా విద్యార్థులకు వీటిని చూపిస్తూ, వివరిస్తూ బోధిస్తున్నారు. దీనికే పరిమితం కాకుండా పాఠ్యాంశాలపై విద్యార్థుల చేత ప్రయోగాలు చేయిస్తుంటారు. అందులో భాగంగా జీవశాస్త్ర సంఖ్యా క్యాలెండర్, జీవశాస్త్ర వైకుంఠపాళి, జీవశాస్త్ర పదవినోదం లాంటి వినూత్న అంశాలతో బోధనను కొనసాగిస్తూ రాష్ట్రస్థాయిలో అందరి మన్ననలను పొందుతున్నారు. ఇటీవల ఎన్సీఆర్టీ ఆధ్వర్యంలో జరిగిన విద్యా అమృత్ మహోత్సవంలో వర్చువల్ రియాలిటీ ‘సాంకేతిక పరిజ్ఞానంతో జీవశాస్త్ర బోధన’ అనే అంశం రాష్ట్రస్థాయిలో మొదటి స్థానంలో నిలిచి, జాతీయ స్థాయికి ఎంపికై ంది. ప్రయోగత్మాకంగా ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్ బోర్డులపై 3డీలో చూపుతూ బోధన చేస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు రాష్ట్ర, జాతీయ స్థాయిలో నిర్వహించిన అనేక సెమినార్లు, పోటీలలో పాల్గొని సత్తా చాటారు. వినూత్నంగా రూపొందించిన జీవశాస్త్ర సంఖ్యా క్యాలెండర్–2021కు గాను తెలుగు బుక్ ఆఫ్ రికార్ుడ్సలో స్థానం దక్కింది. దీంతోపాటు అధునాతన సాంకేతికను జోడించి ప్రత్యేకంగా ఓ యాప్తో తన సెల్ఫోన్ను ప్రొజెక్టర్కు అనుసంధానించి స్క్రీన్పై బొమ్మను చూపిస్తూ విద్యార్థులకు పాఠ్యంశాలను అర్థమయ్యేలా బోధిస్తున్నారు. అంతేకాక నూతన జాతీయ విద్యా విధానం–2020కి సంబంధించిన పలు అంశాలతో తెలుగులో డిజిటల్ పోస్టర్ను రూపొందించి జాతీయస్థాయి గుర్తింపు సాధించారు. వీటితో పాటు వివిధ అంశాల్లో ప్రావీణ్యం సాధించి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తున్నారు. సృజనాత్మకత జోడించి ఆకట్టుకునేలా కృత్యాధార బోధన అన్ని రంగాల్లో విద్యార్థులను తీర్చిదిద్దుతున్న ప్రభుత్వ ఉపాధ్యాయులు నేడు జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం -
ఉత్సాహంగా కళాఉత్సవ్ పోటీలు
గద్వాలటౌన్: పల్లెజీవనం ప్రతిబింబించే నృత్యాలు.. సంస్కృతిలో ఆచార వ్యవహారాల ప్రదర్శనలు.. శాసీ్త్రయ జానపద నృత్యాలు ఇలా ఎన్నో భారతీయ కళలు ఉట్టిపడేలా జిల్లాస్థాయి కళా ఉత్సవ్ పోటీలు సాగాయి. విద్యాశాఖ సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో రెండోరోజు గురువారం స్థానిక బాలభవన్లలో జరిగిన జిల్లాస్థాయి పోటీలను డీఈఓ అబ్దుల్ ఘనీ పరిశీలించారు. జానపద నృత్యాలు, నాటికలు, బుర్రకథలు, చిత్రలేఖనం తదితర విభాగాలలో పోటీలు జరిగాయి. ఆయా పాఠశాలలు, కళాశాలలకు చెందిన విద్యార్థులు తమ అద్భుతమైన ప్రతిభతో ఆకట్టుకొని న్యాయ నిర్ణేతల మెప్పు పొందారు. సందేశాత్మకమైన అంశాలతో పలువురు విద్యార్థులు నాటికలు నిర్వహించి మెప్పు పొందారు. బుర్ర కథలతో ఆకట్టుకున్నారు. మొదటి స్థానంలో నిలిచిన విద్యార్థులు రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులనుద్దేశించి డీఈఓ అబ్ధుల్ఘనీ మాట్లాడారు. సాంస్కృతిక కార్యక్రమాలతో మానసికోల్లాసంతో పాటు సంపూర్ణ వ్యక్తిత్వ వికాసం సిద్దిస్తుందన్నారు. విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలని కోరారు. విద్యార్థులలో సృజనాత్మక శక్తి వెలికితీయడానికి కళా ఉత్సవ్ పోటీలు దోహదం చేస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యా సమన్వయ అధికారిణి ఎస్తేర్రాణి పాల్గొన్నారు. రాష్ట్రస్థాయికి ఎంపికై ంది వీరే గాత్ర సంగీతం సోలో విభాగంలో గద్వాల మైనార్టీ గురుకుల కళాశాలకు చెందిన విద్యార్థిని తస్లీమ్, గాత్ర సంగీతం గ్రూప్ విభాగంలో గద్వాల బాలురు గురుకుల పాఠశాలకు చెందిన నాని బృందం ప్రథమ స్థానంలో నిలిచారు. సంగీతం సోలో విభాగంలో అగస్త్య పబ్లిక్ స్కూల్కు చెందిన వీవేక్ వర్థన్, గ్రూపు విభాగంలో గద్వాల బాలుర ఉన్నత పాఠశాలకు చెందిన కర్రెప్ప, రవి, దర్మ, మల్లికార్జున్ బృందం మొదటి స్థానంలో నిలిచారు. శాసీ్త్రయ నృత్యం సోలో విభాగంలో ఎస్ఎస్వీఎం స్కూల్కు చెందిన విద్యార్థిని జ్యోత్స్న, శాసీ్త్రయ నృత్యం గ్రూప్ విభాగంలో విశిష్ట నోబుల్ స్కూల్కు చెదిన హరిణి బృందం మొదటి స్థానంలో నిలిచారు. చిత్రలేఖనం, పెయింటింగ్ విభాగంలో మాంటిస్సోరి స్కూల్ విద్యార్థి ఆయేషా ఆమ్రీన్, థియేటర్ విభాగంలో గద్వాల విద్యార్థి ఉదయ్కిరణ్ ప్రథమ స్థానంలో నిలిచారు. దృశ్య కళలు 2డీ సోలో విభాగంలో కొట్టం మాణిక్యమ్మ కళాశాల విద్యార్థిని సుదేక్ష నిలిచారు. -
నయనానందం.. వినాయక నిమజ్జనం
గద్వాలటౌన్: బోలో గణేష్ మహారాజ్ కీ జై.. గణపతి బప్పా మోరియా.. అంటూ భక్తుల నినాదాలతో గద్వాల పుర వీధులు పులకించాయి. తొమ్మిది రోజులపాటు భక్తుల అశేష పూజలందుకున్న వినాయకుడు తల్లి ఒడికి చేరుకున్నాడు. జిల్లా కేంద్రంలోని ఆయా వీధుల్లో ప్రతిష్టించిన భారీ గణనాథుల విగ్రహాలను గురువారం రాత్రి నిమజ్జనం చేశారు. వివిధ ఆకృతులలో ఏకదంతుడిని తీర్చిదిద్దిన భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానికంగా ఏర్పాటు చేసిన పలు గణేష్ మండపాలలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు వేర్వేరుగా వినాయకుని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పలు గణేష్ మండపాల వద్ద అన్నదాన కార్యక్రమాలు చేపట్టారు. నిమజ్జనోత్సవం యువకులు, పెద్దల నృత్యాలు, భజనలతో కోలాహలంగా సాగింది. -
మహిళలు స్వయం సమృద్ధి సాధించాలి
గట్టు: మహిళలు స్వయం ఉపాధి వైపు దృష్టిని సారించి, ఆర్థికంగా ఎదగాలని డీఆర్డీఓ అడిషనల్ పీడీ శ్రీనివాస్ సూచించారు. గురువారం మండల మహిళా సమాఖ్యలో ఏర్పాటు చేసిన సమావేశంలో శ్రీనివాస్ మాట్లాడుతూ మహిళా సంఘాలు బలోపేతం కావడానికి సంఘం సభ్యులందరూ సహకరించాలని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న మహిళలకు గొర్రెలు, గేదెలు పెంపకంతో పాటుగా ఇతర పరిశ్రమలు ఏర్పాటు సహకారం అందిస్తున్నట్లు వివరించారు. కిరాణ షాపు, హోటల్స్ వంటి వాటి ధర ఆదాయ మార్గాలను పెట్టుకుని కుటుంబాన్ని పోషించుకోవాలని కోరారు. సేంద్రియ పద్ధతిలో పంటలను పండించాలని కోరారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీడీఓ చెన్నయ్య, మాజీ ఎంపీపీ విజయ్కుమార్, ఎంఎస్ఎస్ కార్యవర్గ సభ్యురాలు వెంకటేశ్వరి, అక్షర ఇన్చార్జ్ ఏపీఎం జయాకర్, సీసీలు ఆంజనేయులు, రామకృష్ణ, జ్యోతి, దేవదాస్ పాల్గొన్నారు. ఇదిలాఉండగా, సమాఖ్యలో 10 ఏళ్లుగా సీసీలుగా పని చేస్తూ, బదిలీపై వెళ్తున్న ఇన్చార్జ్ ఏపీఎం జయాకర్, సీసీలు రామకృష్ణ, సుదర్శన్ను న్మానించి, అభినందించారు. -
ఉన్నత లక్ష్యాలతో విద్యను అభ్యసించాలి
అలంపూర్: కళాశాల విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో విద్యను అభ్యసించాలని జిల్లా ఇంటర్మీడియట్ నోడల్ అధికారి హృదయరాజు అన్నారు. అలంపూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఆయన గురువారం తనిఖీ చేశారు. మొదట తరగతి గదులను పరిశీలించి అనంతరం విద్యార్థులతో మాట్లాడి వారి పురగతిపై ఆరా తీశారు. గణితం, ఇంగ్లీష్, తరగతులను బోధించడంతోపాటు వారి అనుమానాలను నివృత్తి చేశారు. క్రమం తప్పకుండా కళాశాలకు రావాలని, హాజరు శాతం తక్కువగా ఉంటే వచ్చే ఇబ్బందులను వివరించారు. ఒక ప్రణాళికతో పరీక్షలకు సిద్ధం కావాలన్నారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ పద్మావతి. అద్యాపకులు సుధారాణి, అభిజ్ఞ, మౌనిక, రాజు, రాముడు, రామచంద్రయ్య, రఘువీర్ కుమార్, మల్లయ్య, ఆర్. రాముడు, తిరుపాల్ పాల్గొన్నారు. -
తప్పని యూరియా తిప్పలు
గట్టు: రైతులకు యూరియా కష్టాలు తీరడం లేదు. యూరియా కోసం రైతులు తెల్లవారుజామున నుంచి చీకటి పడే దాకా పీఏసీఎస్ దగ్గర పడిగాపులు పడుతున్నారు. గురువారం యూరియా కోసం రైతులు ఉదయమే గట్టులోని పీఏసీఎస్ వద్దకు చేరుకున్నారు. పట్టాదారు పాసుపుస్తకాలు, జిరాక్స్ పత్రాలతో కూడిన కవర్లు క్యూలో పెట్టి ఎదురుచూశారు. గత నెల 30న టోకెన్లు అందుకున్న వారికి మాత్రమే గురువారం యూరియా బస్తాలను అందజేశారు. మొత్తం 600 బస్తాలను అందించినట్లు తెలిపారు. ఇక తాజాగా టోకెన్లు అందుకున్న రైతులకు వచ్చే సోమ, మంగళవారాల్లో యూరియా బస్తాలను అందిస్తామని పీఏసీఎస్ అధికారులు తెలిపారు. వ్యవసాయ అధికారులు, పోలీసుల సహకారంతో రైతులకు టోకెన్లు అందజేశారు. ఇదిలాఉండగా, రోజుల తరబడి యూరియా కోసం ఎదురుచూసే పరిస్థితి నెలకొన్నట్లు రైతులు వాపోయారు. -
ఎడ్యుకేషన్.. ఇరిగేషన్
ఇవే పాలమూరు తలరాతను మారుస్తాయి ● ఏ అవకాశం వచ్చినా మొదటి ముద్ద పాలమూరుకే.. ● ఇదే లక్ష్యంతో ముందుకు సాగుతున్నా.. ● అప్పుడే వలసలు ఆగుతాయి.. ● ఎస్జీడీ ఫార్మా 2వ యూనిట్ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్రెడ్డి ● ‘కొడంగల్’ భూనిర్వాసిత రైతులకు న్యాయం చేస్తాం పాలమూరుకే మొదటి ముద్ద.. పేదరికం, వలసలు, సమస్యలను చూపించడానికి నాటి పాలకులు ప్రపంచ నాయకులను పాలమూరు జిల్లాకు తీసుకొచ్చేవారు. భవిష్యత్లో మన అభివృద్ధి, పరిశ్రమలు, యూనివర్సిటీలు, సాగునీటి ప్రాజెక్టులను సందర్శించేలా అభివృద్ధి చేసుకోవాలి. వీటిని చూసేందుకు దేశ, విదేశాల నుంచి పర్యాటకులు రావాలి. పరిశ్రమలు కావాలంటే భూములు కావాలి. ఎక్కడెక్కడ భూములు ఉన్నాయో వాటి వివరాలను అధికారులు నాకు పంపాలి. ఏ పరిశ్రమ వచ్చినా మొదటగా పాలమూరుకు పంపుతాను. నాకు ఏ అవకాశం వచ్చినా మొదటి ముద్ద పాలమూరు ప్రజలకు పెడుతా. మంత్రి వర్గంలోని మంత్రులు ఏమనుకున్నా మంచిదే.సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: ‘పాలమూరు జిల్లా అంటే ఒకనాడు వలసలకు మారుపేరు. ఈ దేశంలో భాక్రానంగల్, నాగార్జునసాగర్, ఎస్సారెస్పీ.. ఇలా ఏ మూలన ప్రాజెక్ట్లు కట్టినా తట్ట పని, మట్టి పని చేయాలంటే పాలమూరు బిడ్డలే కావాలి. వారి భాగస్వామ్యం లేకుంటే ఏ నిర్మాణాలు పూర్తి కాలేదు. దీనికి ప్రధానం కారణం చదువులో వెనకబాటు, సాగు నీరు అందుబాటులో లేకపోవడమే. ఈ సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వాల్లోని పెద్దలు ప్రయత్నం చేయకపోవడంతో ఇప్పటికీ వలసలు ఆగలేదు. అందుకే పాలమూరు బిడ్డగా నా బాధ్యత నెరవేరుస్తా. ఎడ్యుకేషన్, ఇరిగేషన్ లక్ష్యంగా పాలమూరు జిల్లా ప్రజల తలరాతలు మార్చేందుకు కృషి చేస్తా.’ అని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. మహబూబ్నగర్ జిల్లా ముసాపేట మండలం వేముల శివారులోని ఎస్జీడీ ఫార్మా కార్నింగ్ టెక్నాలజీస్ రెండో యూనిట్ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం నిర్వహించిన ఫర్నేస్ లైటింగ్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ ‘పాలమూరు బిడ్డల చదువు కోసం ఏది కావాలన్నా.. ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. పాలమూరు ప్రాజెక్ట్లకు గ్రీన్చానల్ ద్వారా నిధులు అందించి పూర్తి చేస్తాం. రాజకీయ కారణాలతో అభివృద్ధిని అడ్డుకుంటే మనకు మనమే మరణ శాసనం రాసుకున్నవాళ్లమవుతాం.’ అని పేర్కొన్నారు. ఇంకా రేవంత్ ఏమన్నారో ఆయన మాటల్లోనే.. కర్ణాటక సరిహద్దులో అత్యంత వెనుకబడిన ప్రాంతం మక్తల్, నారాయణపేట, కొడంగల్. ఈ ప్రాంతానికి నీళ్ల కోసం 2014లో ఉమ్మడి రాష్ట్రంలో 69 జీఓ ద్వారా తెచ్చుకుంటే ఎంపీగా పనిచేసిన కేసీఆర్ పదేళ్లు ముఖ్యమంత్రిగా ఉండి మా ప్రాజెక్టును తొక్కిపెట్టి అన్యాయం చేశారు. అందుకే సుమారు రూ.4 వేల కోట్లతో ఈ ప్రాజెక్ట్కు టెండర్లు పిలిచి ముందుకు వెళుతుంటే.. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు వేసి అడ్డుకుంటున్నారు. కొడంగల్లో కోల్పోయినవి కమర్షియల్ భూములు కావడంతో అక్కడి వారికి ఎకరాకు రూ.20 లక్షలు ఇచ్చారు. మిగతా ప్రాంతాల్లో రూ.11 లక్షల వరకు ఇచ్చాం. నారాయణపేటలో రూ.14 లక్షలు ఇస్తున్నాం. భూసేకరణకు సంబంధించిన వివాదాలపై ప్రజల్లో చర్చ జరుగుతోంది. మంత్రి శ్రీహరి, ఎమ్మెల్యే, కలెక్టర్ రైతులతో మాట్లాడాలి.. భూసేకరణ విషయంలో వారంపాటు సమయం కేటాయించి రైతులతో మాట్లాడాలి. వారిని ఒప్పించి.. మంచి పరిహారం అందించాలి. భూములు కోల్పోతున్న పేదలకు ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలి. రైతులకు నష్టం జరిగితే మాకు జరిగినట్లే. మీకు న్యాయం చేసే బాధ్యత మాది. ఈ ప్రాజెక్ట్తో పాటు వికారాబాద్– కృష్ణా రైల్వేలైన్ పూర్తి చేసుకోకపోతే, పాలమూరు–రంగారెడ్డి, భీమా, కోయిల్సాగర్, నెట్టెంపాడు ప్రాజెక్ట్లు పూర్తి చేసుకోకపోతే.. ఎప్పుడూ పూర్తి చేసుకోలేం. నిధుల ఇబ్బందులు ఉన్నా.. మన జిల్లా మీద ప్రత్యేక దృష్టి పెట్టి అందజేస్తున్నాం. రాష్ట్ర పశు సంవర్ధక, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, రాష్ట్ర ఎకై ్సజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, నాగర్కర్నూల్ ఎంపీ మల్లు రవి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జి.చిన్నారెడ్డి, ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్ రెడ్డి, అనిరుధ్రెడ్డి, తూడి మేఘారెడ్డి, పర్ణికా రెడ్డి, వీర్లపల్లి శంకర్, రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, ఎస్జీడీ టెక్నాలజీస్ ఎండీ దీపక్ సర్జిత్, సుధీర్ తదితరులు పాల్గొన్నారు. -
ఇందిరమ్మ ఇళ్లను త్వరగా పూర్తి చేయాలి
ఇటిక్యాల/ఎర్రవల్లి: ఇందిరమ్మ ఇళ్లను త్వరగా పూర్తిచేసేలా కృషి చేయాలని కలెక్టర్ అధికారులకు ఆదేశించారు. బుధవారం ఇటిక్యాల మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను కలెక్టర్ తనిఖీ చేశారు. ఇంటి నిర్మాణ పనుల్లో నాణ్యతను క్షేత్రస్ధాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. నిబంధనలకు అనుగుణంగా ఇళ్ల నిర్మాణాలు జరిగేలా లబ్ధిదారులకు అవసరమైన సలహాలు, సూచనలు అందించాలని, ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం ఉచితంగా ఇసుక తీసుకెళ్లేందుకు కూలీ, రవాణా చార్జీలు మాత్రమే లబ్ధిదారులు చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. వివిధ దశలను అనుసరిస్తూ డబ్బును వెంటనే ఖాతాలో ప్రభుత్వం జమ చేస్తుందన్నారు. అనంతరం మండల కేంద్రంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్ధుల భవిష్యత్ కోసం నాణ్యమైన విద్య అందించడంలో ఎలాంటి రాజీ ఉండకూడదని, వసతి, భోజనం, శుభ్రత, భద్రతపై అధికారులు నిరంతరం పర్యవేక్షణ కొనసాగించాలని సూచించారు. పదో తరగతిలో వందశాతం ఉతీర్ణత సాధించడానికి కృషిచేయాలని అన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ వీర భద్రప్ప, ఎంపీడీఓ అబ్దుల్ సయ్యాద్ ఖాన్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు సురేష్, పంచాయతీ కార్యదర్శి రమేష్ పాల్గొన్నారు. భూ భారతి దరఖాస్తులను పరిష్కరించాలి భూ భారతి దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఎర్రవల్లి తహసీల్దార్ కార్యాలయాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి భూ భారతి రిజిస్ట్రేషన్ ప్రక్రియను పరిశీలించారు. భూ భారతి పోర్టల్లో డేటా ఎంట్రీ పనులను వేగంగా, ఖచ్చితంగా పూర్తిచేయాలని, నిబంధనల మేరకు సక్సేషన్, పెండింగ్ మ్యుటేషన్, మిస్సింగ్ సర్వే, పీవోపీ, డీఎస్ పెండింగ్ అన్ని దరఖాస్తులు పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. సాదా బైనామా అప్లికేషన్లనీ ముందుగా సిద్ధం చేసి ప్రభుత్వ ఆదేశాలు వచ్చిన వెంటనే వాటిని పూర్తిచేయవచ్చునని అన్నారు. దరఖాస్తుదారుని ఆధార్కార్డ్, పట్టాదారు పాసుపుస్తకం, సాక్షుల ఆధార్కార్డ్లు సక్రమంగా పరిశీలించాలన్నారు. ప్రతి రిజిస్ట్రేషన్లో బయోమెట్రిక్ సరిగా, తప్పులేకుండా చేయాలన్నా రు. రెవెన్యూ కార్యాయాల్లో రేషన్కార్డుల వివరాలు, మీసేవా ద్వారా సర్టిఫికేట్లు, ఆఫీస్ రికార్డులు, ఇతర అన్ని డాక్యుమెంట్లను సక్రమంగా స్పష్టంగా, ఆప్టుడేట్ గా ఉంచాలన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సేవలు సమయానికి, పారదర్శకంగా అందించేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ నరేష్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. -
యూరియా కోసం పడిగాపులు
అయిజ: యూరియా కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గంటల తరబడి ఎండనకా.. వాననకా యూరియా పంపిణీ కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. బుధవారం అయిజ సింగిల్విండో కార్యాలయానికి ఉదయాన్నే పెద్ద ఎత్తున రైతులు యూరియా కోసం తరలివచ్చారు. అధికారులు వచ్చి టోకెన్లు ఇచ్చేంత వరకు ఎంత సమయం పడుతుందో తెలియక.. అంతసేపు నిలబడలేక పాదరక్షలను క్యూలో పెట్టి ఎదురుచూశారు. అనంతరం సింగిల్విండో సిబ్బంది పాదరక్షల ఆధారంగా రైతుల వివరాలు సేకరించి టోకెన్లు జారీ చేశారు. ఈమేరకు సింగిల్విండో కార్యాలయంలో యూరియా బస్తాలను అందజేశారు. -
ఇసుక రవాణాలో ఎలాంటి సమస్యలు రానివ్వొద్దు
● ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలకు సకాలంలో ఇసుక చేర్చాలి ● టీజీఎండీసీ ఎండీ భవేష్ మిశ్రా రాజోళి: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం నేపథ్యంలో ఇసుక రవాణాలో ఎలాంటి సమస్య రానివ్వకుండా తగు చర్యలు చేపట్టాలని టీజీఎండీసీ ఎండీ భవేష్ మిశ్రా ఆదేశించారు. రాజోళి మండలం తుమ్మిళ్ల గ్రామంలో ఇసుక తవ్వకాలకు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో బుధవారం ఆయన పర్యటించారు. ఈమేరకు తుంగభద్ర నదిలో ఫ్లెడ్జింగ్ సిస్టమ్ ద్వారా తీస్తున్న ఇసుకను ఆయన పరిశీలించారు. ఇసుకను లబ్ధిదారులకు ఎలా పంపుతారంటూ ఆరా తీశారు. ఇందిరమ్మ ఇంటి నిర్మాణాల కోసం ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకున్న వారికి ఇసుక సకాలంలో చేరుకోవాలని, లేదంటే ఇంటి నిర్మాణంలో జాప్యం జరుగుతుందని అన్నారు. అలాంటి సమస్యలు తలెత్తకుండా చూడాలని సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్లకు సూచించారు. కాగా జిల్లాలోని పలు చోట్లకు ఇసుకను రవాణా చేస్తున్న క్రమంలో వారికి ఇసుకను చేర్చేందుకు ఉన్న మార్గాల ద్వారా ఇబ్బందులు వస్తున్నాయని కాంట్రాక్టర్లు తెలిపారు. తుమ్మిళ్లలోని ఇసుక రీచ్కు, రాజోళి మండలం పడమటి గార్లపాడు గ్రామం దగ్గర ఉండటంతో పాటు, ఆ వైపున ఉన్న గ్రామాలకు అదే మార్గంలో వెళ్తేనే సకాలంలో చేరుకోగలమని, లేదంటే చుట్టూ తిరిగి ఇతర మార్గాల ద్వారా వెళ్లాలంటే సమయం వృథా కావడంతో పాటు, లబ్ధిదారులకు ఇసుక అందించడంలో ఆలస్యం అవుతుందని ఆయన దృష్టికి తీసుకువచ్చారు. ఈ సమస్యపై కలెక్టర్తో మాట్లాడి పరిష్కరిస్తామన్నారు. ప్రస్తుతం ఇసుక తవ్వకాలు ఎందుకు నిలిచాయని అడగగా.. నదిలో వరద ఎక్కువగా ఉన్నందున ఇసుక తీయడం కుదరడం లేదని, నీటి ఉధృతి తగ్గగానే ఇసుకను తీస్తామని, ప్రస్తుతం ఉన్న ఇసుకతో ఇందిరమ్మ ఇళ్లకు నిలపకుండా అందిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో ఏడీ వెంకటరమణ, ప్రసాద్బాబు,తహసీల్దార్ పి.రామ్మోహన్,సీఐ టాటాబాబు తదిదరులు పాల్గొన్నారు. -
అభివృద్ధిపై చర్చకు సిద్ధం
గద్వాల: జిల్లా కేంద్రంలో జరిగిన అభివృద్ధిని అంకెలతో సహా చెప్పడానికి సిద్ధమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు అన్నారు. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి సవాల్కు ఆయన స్పందిస్తూ బుధవారం జిల్లా కేంద్రంలో విలేకర్లతో మాట్లాడారు. మీరు ఏడేళ్ల పాలనలో గద్వాలకు తీసుకొచ్చిన నిధులు ఎంత వాటి వివరాలను అంకెలతో సహా ప్రజలకు వివరించాలన్నారు. గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీలలో ఎంతనిధులతో అభివృద్ధి చేశారో చెప్పాలన్నారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వ నిధులు, కేంద్ర ప్రభుత్వ నిధులు ఎంతనో వివరించాలన్నారు. గోన్పాడు, పరమాల వద్ద కట్టిన డబుల్బెడ్రూం ఇళ్లు శిథిలావస్థకు చేరినప్పటికీ వాటిని నేటివరకు లబ్ధిదారులకు ఇవ్వకుండా ఎందుకు తాత్సారం చేస్తున్నారని ప్రశ్నించారు. పిల్లిగుంట్ల వద్ద పేదలకు ఇచ్చిన ప్లాట్లు లాక్కుని వారిని రోడ్డున పడేసిందెవరని, నియోజకవర్గంలో ఒక్కరోడ్డు అయినా వేయించారా, కనీసం దెబ్బతిన్న రోడ్లను మరమ్మతులైన చేశారా అని ప్రశ్నించారు. నెట్టెంపాడు ప్రాజెక్టులో 99, 100 ప్యాకేజీల పరిధిలో పనులు ఎందుకు పెండింగులో ఉన్నాయని, గుర్రంగడ్డ, గట్టు ఎత్తిపోతలు ఎక్కడ వేసిన పనులు అక్కడే నిలిచిపోయాయన్నారు. ఇసుక, మట్టి దందాలు చేస్తూ అక్రమాలకు పాల్పడుతున్నది మీరు, మీ అనుచరులు కాదా అన్నారు. నియోజకవర్గంలో ఏదైనా అభివృద్ధి జరిగిందంటే అది డీకే అరుణ హయాంలోనే జరిగిందని, దీనిపై బహిరంగ చర్చకు మేము సిద్ధమని తేదీ, స్థలం మీరే నిర్ణయించండని అన్నారు. కార్యక్రమంలో నాయకులు రవికుమార్, చిత్తారికిరణ్, శ్యామ్రావు, రజక జయశ్రీ, నర్సింహులు, దేవదాసు, అనిల్, మాలీం ఇసాక్ తదితరులు పాల్గొన్నారు. -
లబ్ధిదారులకు డబుల్బెడ్రూం ఇళ్లు
గద్వాల: మండలంలోని పరమాల శివారులో రూ.85 కోట్లతో నిర్మించిన 1,275 డబుల్బెడ్రూం ఇళ్లలో ఇప్పటి వరకే 715 ఇళ్లను లబ్ధిదారులకే కేటాయించామని, వీటిని ఈ నెల 6న అందిస్తున్నట్లు కలెక్టర్ బీఎం సంతోష్, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి తెలిపారు. ఈమేరకు కలెక్టర్ ఎమ్మెల్యేతో కలిసి కలెక్టరేట్లోని తన చాంబర్లో అధికారులతో సమీక్షించి, అనంతరం క్షేత్రస్థాయిలో డబుల్బెడ్రూం ఇళ్లను సందర్శించారు. ఏమైన పెండింగ్ పనులు ఉంటే వాటని పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీసులకు సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నర్సింగ్రావు, హౌసింగ్ పీడీ శ్రీనివాస్రావు, ఆర్డీఓ అలివేలు, విద్యుత్ శాఖ ఎస్ఈ శ్రీనివాస్రెడ్డి, పీఆర్ ఎస్ఈ దామోదర్రెడ్డి, మిషన్భగీరథ ఈఈ శ్రీధర్రెడ్డి, ఆర్అండ్బీ ఈఈ ప్రగతి తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 6న మంత్రి చేతుల మీదుగా పంపిణీ -
వైఎస్సార్ సేవలు నేటికీ పదిలం
గద్వాలటౌన్: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఉమ్మడి రాష్ట్ర ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలు, సేవలు నేటికీ పదిలంగా ఉన్నాయని కాంగ్రెస్ నాయకులు కొనియాడారు. వైఎస్సార్ వర్ధంతిని పురస్కరించుకొని మంగళవారం పట్టణంలోని పాతబస్టాండ్ చౌరస్తాలో ఉన్న ఆయన విగ్రహానికి కాంగ్రెస్ నాయకులు, వివిధ కుల, ప్రజాసంఘాల నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా టీపీసీసీ నాయకుడు శంకర్, ఓబీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు నల్లారెడ్డి మాట్లాడుతూ వైఎస్ రాజశేఖరరెడ్డి పేదల కోసం జీవిత బీమా, ఆరోగ్యశ్రీ, రైతులకు ఉచిత విద్యుత్, రుణమాఫీ, విద్యార్థుల కోసం ఫీజు రీయంబర్స్మెంట్, స్కాలర్షిప్లు అందించి విద్యా ప్రదాతగా నిలిచారని కొనియాడారు. ఎంతోమంది పేద పిల్లలకు గుండె ఆపరేషన్లు చేయించి వారి ఇళ్లలో నేటికి సజీవంగా ఉన్నారన్నారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని సంక్షేమ కార్యక్రమాలు రాష్ట్రంలో చేపట్టిన ఘనత వైఎస్కే దక్కుతుందని తెలిపారు. వ్యవసాయం అంటే దండుగ అనే స్థాయి నుంచి పండుగ అనే విధంగా మార్చారన్నారు. కార్యక్రమంలో ఇసాక్, భాస్కర్యాదవ్, ఎల్లప్ప, పులిపాటి వెంకటేష్, కృష్ణమూర్తి, సురేష్, రామకృష్ణ, రాజశేఖర్రెడ్డి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
యూరియా కోసం రోడ్డెక్కిన అన్నదాతలు
గద్వాల వ్యవసాయం: యూరియా కోసం రైతులు ప్రతి నిత్యం రాస్తారోకోలు, నిరసనలు చేపట్టాల్సిన దుస్థితి జిల్లాలో నెలకొంది. వారం రోజల వ్యవధిలోనే గద్వాలలో రైతులు మరోసారి ఆందోళన చేపట్టారు. మంగళవారం ఉదయం 8 గంటల వరకే గద్వాల సింగిల్విండో కార్యాలయానికి దాదాపు 400 మంది రైతులు చేరుకున్నారు. యూరియా స్టాక్ లేదని, టోకెన్లు ఇప్పుడే ఇవ్వమని కార్యాలయ సిబ్బంది తెలిపారు. దీంతో ఆగ్రహించిన రైతులు కార్యాలయం ఎదుట పాదరక్షలు వరుస క్రమంలో ఉంచి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం సమీపంలోని అంబేడ్కర్ చౌరస్తా వద్ద రాస్తారోకో చేపట్టారు. రోడ్డుపై రైతులు బైఠాయించడంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. విషయం తెలుసుకున్న డీఎస్పీ మొగిలయ్య అక్కడికి చేరుకొని రైతులు, సింగిల్విండో కార్యాలయ సిబ్బందితో మాట్లాడారు. మంగళవారం రాత్రి వరకు స్టాక్ వస్తుందని సిబ్బంది డీఎస్పీకి చెప్పడంతో.. ఇప్పుడు టోకెన్లు తీసుకోవాలని, అందరికీ బుధవారం యూరియా ఇస్తారని శాతింపజేశారు. దీంతో రైతులు రాస్తారోకో విరమించారు. 550 మంది రైతులకు 1,200 బస్తాల యూరియా టోకెన్లను సింగిల్విండో కార్యాలయ సిబ్బంది పంపిణీ చేశారు. -
కేసీఆర్పై రాజకీయ కక్ష సాధింపు సరికాదు
గద్వాలటౌన్: కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ పేరుతో బీఆర్ఎస్ అధినాయకత్వంపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని బీఆర్ఎస్ నాయకుడు హనుమంతునాయుడు ఆరోపించారు. మాజీ సీఎం కేసీఆర్ జోలికొస్తే రాష్ట్రం అగ్నిగుండం అవుతుందని హెచ్చరించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణను నిరసిస్తూ మంగళవారం బీఆర్ఎస్ నాయకులు ఆందోళన చేపట్టారు. జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహించి, కృష్ణవేణి చౌరస్తాలో బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్రెడ్డికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరంపై కాంగ్రెస్ ప్రభుత్వం విష ప్రచారం చేస్తుందని ఆరోపించారు. ఉమ్మడి రాష్ట్రంలో గోదావరి, కృష్ణా నదులపై ప్రాజెక్టులు కట్టకుండా తెలంగాణకు కాంగ్రెస్, టీడీపీలు తీరని ద్రోహం చేశాయని మండిపడ్డారు. ఘోష్ కమిషన్ ట్రాష్ అని, అసెంబ్లీలో చర్చించకుండా సీబీఐకి అప్పజెప్పడంతోనే కాంగ్రెస్ పార్టీ అభాసుపాలు అయిందని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణను సీబీఐకి ఇవ్వడం వెనక పెద్ద కుట్ర దాగి ఉందని అనుమానం వ్యక్తం చేశారు. తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్లు కలిసి పనిచేస్తున్నాయనడానికి ఇదే నిదర్శనమన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు, బీఆర్ఎస్లపై కాంగ్రెస్ చేస్తున్న కుట్రలను ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. రాబోవు రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు నాగర్దొడ్డి వెంకట్రాములు, చక్రధర్రావు, రాఘవేంద్రరెడ్డి, మోనేష్, బీచుపల్లి, రాజు, వెంకటేష్నాయుడు, రాము, శ్రీరాములు, చక్రధర్రెడ్డి, శ్రీనివాస్గౌడ్, అతికూర్ రెహమాన్, రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
గజిబిజి తీగలు
● గాల్లో కలుస్తున్న ప్రాణాలు ● ఇష్టారాజ్యంగా టీవీ, ఇంటర్నెట్ కేబుళ్లు ● ప్రమాదాలు జరిగినప్పుడే అధికారుల హడావిడి తొలగింపు చర్యలు చేపడుతున్నాం నిబంధనలకు విరుద్ధంగా కరెంటు స్తంభాలను ఉపయోగించి బిగించిన కేబుల్ తీగలను తొలగించే చర్యలు చేపట్టాం. జిల్లా కేంద్రంలో ఈ ప్రక్రియ కొనసాగుతోంది. అయితే కేబుల్ టీవీ, ఇంటర్నెట్ సంస్థల నిర్వాహకులే స్వచ్ఛందంగా తీగలను నిబంధనల వేరకు అమర్చుకోవడానికి కొంత గడువు అడిగారు. – రమేష్బాబు, ఏడీఈ, గద్వాల గద్వాల టౌన్: జిల్లాలో అనేక చోట్ల విద్యుత్ స్తంభాలకు టీవీ, ఇంటర్నెట్ కేబుళ్లు ఇష్టానుసారంగా వేయడంతో ప్రమాదాలకు కారణమవుతున్నాయి. నిబంధనల ప్రకారం 18 అడుగుల ఎత్తుపై వీటిని లాగాలి. కానీ స్తంభాలకు ముడిపెట్టి తక్కువ ఎత్తులో లాగడంతో కిందకు వేలాడుతున్నాయి. ఇవి తెగి కరెంటు తీగలపై పడి ప్రమాదాలు జరిగే అవకాశమున్నా నిబంధనలు పట్టించుకోవడం లేదు. ప్రస్తుతం గద్వాలలో భారీ వినాయకుల విగ్రహాల నిమజ్జనోత్సవ ఊరేగింపు ఉంది. తర్వాత దుర్గాదేవి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. జిల్లా కేంద్రంతో పాటు అయిజ, శాంతినగర్ పట్టణాలు, మండల కేంద్రాల్లోని వీధుల్లో శోభాయాత్రలు చేపట్టడం పరిపాటే. అప్పుడు ఈ తీగలే ప్రమాదకరంగా మారి ప్రాణాలు బలి తీసుకునే అవకాశం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రెండు వారాల కిందట హైదరాబాద్లో జరిగిన విద్యుత్ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్న విద్యుత్ శాఖ నివారణ చర్యలు చేపట్టింది. జిల్లాలో వీటి పరిస్థితిపై పరిశీలన కథనం... పరిశీలనలో గుర్తించిన అంశాలు... ● ఇటీవల కురిసిన వర్షాలకు జిల్లాలోని మున్సిపాలిటీ, పట్టణాల్లో ఇంటర్నెట్, టీవీ కేబుళ్లు తెగిపోయాయి. పాత వాటిని అలాగే ఉంచి కొత్త వాటిని వేయడంతో గజిబిజిగా మారుతున్నాయి. ● స్తంభాలకు కేబుల్, ఇంటర్నెట్ తీగల చుట్టలు వదిలేయడంతో విద్యుత్ సిబ్బంది స్తంభం ఎక్కాలంటే ఇబ్బంది పడుతున్నారు. కొన్నిసార్లు గాయాలపాలవుతున్నారు. ● స్తంభాల నుంచి ఇళ్లకు అమర్చిన తీగలపై కోతులు దూకినప్పుడు కిందకు వేలాడుతున్నాయి. ● విద్యుత్ స్తంభాలకు అనుమతులు లేకుండా కేబుల్ టీవీ, ఇంటర్నెట్ తీగలను ఇష్టారాజ్యంగా అమర్చడం వలన, విద్యుత్ సరఫరాలో తరచూ అంతరాయాలు ఏర్పడుతున్నాయి. నిత్యం ఫిర్యాదులు జనవాసాల మధ్య, ఇళ్లపై నుంచి వెళ్తున్న ప్రమాదకర విద్యుత్ తీగలను తొలగించాలని చాలాకాలంగా ప్రజలు అధికారులను కోరుతున్నారు. వీటిపై నిత్యం విద్యుత్ సిబ్బందికి ఫిర్యాదులు అందుతున్నాయి. ప్రమాదాలు జరిగి, వైర్లు తెగిపడిన సందర్భాల్లో మాత్రమే హడావుడి చేస్తున్న ట్రాన్స్కో అధికారులు తర్వాత దాని గురించి పట్టించుకోవడం లేదు. అయితే జనావాసాలకు దగ్గరగా ప్రమాదకరంగా వేలాడుతున్న విద్యుత్ తీగలు కొన్నింటిని ఇటీవల అధికారులు గుర్తించి సరిచేశారు. మరికొన్ని ప్రాంతాల్లో ఉన్న తీగలను సరిచేయాల్సి ఉన్నా సిబ్బంది పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. -
ఫిర్యాదుల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ
గద్వాల: ప్రజావాణికి వచ్చే ఫిర్యాదుల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి కలెక్టర్ నేరుగా ఫిర్యాదులు స్వీకరించారు. మొత్తం 46 ఫిర్యాదులు అందగా.. వాటిని ఆయా శాఖల అధికారులకు బదిలీ చేశారు. ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని, పరిష్కారం కానిపక్షంలో అందుకు గల కారణాలు వివరిస్తూ సంబంధిత ఫిర్యాదుదారుడికి అక్నాలెడ్డ్మెంట్ ద్వారా తెలియజేయాలని సూచించినట్లు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు వి.లక్ష్మీనారాయణ, నర్సింగ్రావు కలెక్టరేట్ సిబ్బంది, వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. -
కదంతొక్కిన ఉద్యోగ, ఉపాధ్యాయులు
గద్వాలటౌన్: కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం విధానం పేరిట అమలవుతున్న నూతన పింఛన్ విధానంతో కనీస పింఛన్ కూడా పొందలేమని, ఉద్యోగ జీవితాలకు భద్రత కల్పించాలని, తమకు న్యాయం చేయాలంటూ ఉద్యోగ, ఉపాధ్యాయులు డిమాండ్ చేశారు. ఈమేరకు సోమవారం జేఏసీ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు, ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు పెన్షన్ విద్రోహ దినాన్ని నిర్వహించారు. జేఏసీ నాయకులు భారీ ర్యాలీ చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పింఛన్ ఉద్యోగుల హక్కు అంటూ నినదించారు. ప్లకార్డులు చేతబట్టి తమ నిరసన వ్యక్తం చేశారు. సీపీఎస్ వద్దు – ఓపీఎస్ ముద్దు అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మహిళా ఉద్యోగులు, ఉపాధ్యాయులు సైతం పెద్ద ఎత్తున ఆందోళనకు తరలివచ్చారు. సీపీఎస్ విధానాన్ని రద్దు చేయకుంటే ప్రభుత్వంపై సమరం సాగిస్తామని జేఏసీ నేతలు హెచ్చరించారు. అది మన హక్కు.. ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ నాగర్జునగౌడ్, కోచైర్మన్లు నర్సింహారెడ్డి, విష్ణు, టీఎన్జీఓ రాష్ట్ర కార్యదర్శి బీమన్న, సీపీఎస్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు నాగరాజు, ఉపాధ్యాయ సంఘాల బాధ్యులు గోపాల్, బీకే వెంకటేష్, యూనుస్పాష, లక్ష్మన్న, బుచ్చన్న మాట్లాడారు. 2004 తర్వాత ఉద్యోగాలు పొందిన వారందరికీ పెన్షన్ రద్దు చేయడం దారుణమన్నారు. పెన్షన్ బిక్ష కాదని.. మన హక్కు అన్నారు. రాష్ట్రంలో సుమారు రెండు లక్షల మంది ఉద్యోగులు, ఉపాధ్యాయుల కుటుంబాల భద్రత అగమ్యగోచరంగా తయారైందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల కాలంలో చనిపోయిన, రిటైరైన ఉద్యోగులు, ఉపాధ్యాయుల కుటుంబాలు గ్రాట్యుటీ, పీఎఫ్ లేక పెన్షన్ అందక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. ప్రభుత్వం వెంటనే పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్రెడ్డి తక్షణమే స్పందించి సీపీఎస్ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టరేట్ సంతోష్కు వినతి పత్రాలు సమర్పించారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు శశీధర్రెడ్డి, ఆనంద్, ఖాజామీర్, రమేష్, లోకరాజు, రాధకృష్ణరెడ్డి, కృష్ణ, నర్సింహులు, రవికుమార్, తిమ్మప్ప, ప్రభాకర్శాస్త్రి, సుజాత, అశోక్ పాల్గొన్నారు. ఓపీఎస్ అమలు కోరుతూ ర్యాలీ, ధర్నా -
బీసీ బిల్లు చారిత్రాత్మక విజయం
అలంపూర్: రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అసెంబ్లీలో అమోదం పొందడం కాంగ్రెస్ ప్రభుత్వ చారిత్రాత్మక విజయమని ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ అన్నారు. అలంపూర్ చౌరస్తాలోని జాతీయరహదారి ఫ్లైఓవర్ కూడలిలో అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందడంపై కాంగ్రెస్ పార్టీ నాయకులు సోమవారం సంబరాలు జరుపుకొన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్గౌడ్ చిత్రపటానికి పాలతో అభిషేకించి బాణసంచా పేల్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని జనాభా ఆధారంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, గిరిజన, మైనార్టీలు ఎంత మంది అనే ప్రతిపాదికతన రిజర్వేషన్లు కల్పించడానికి సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారన్నారు. బీసీలోని బడుగు బలహీన వర్గాలకు ఈ రిజర్వేషన్లు అపూర్వ అవకాశం అన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, జెడ్పీచైర్మన్లు, అలంపూర్, వడ్డేపల్లి, అయిజ మున్సిపాలిటిలో కౌన్సిలర్లకు 42 శాతం బీసీలకు రిజర్వేషన్లు లభించే అవకాశం ఉందన్నారు. ఇటీవల ఎస్సీలకు ఏబీసీడీ వర్గీకరణ చేసి 35 ఏళ్ల వారి కలను సీఎం సాకారం చేశారని, గ్రామీణ ప్రాంతాలు మరింత అభివృద్ధి చెందాలంటే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు గెలిపించుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ నీలి శ్రీనివాస్, మార్కెట్ యార్డు కమిటీ చైర్మన్ దొడ్డెప్ప, మాజీ జడ్పీటీసీ సభ్యుడు మద్దిలేటి, నాయకులు షేక్షావలి ఆచారి, గోపాల్, వెంకట్ గౌడ్, రమణ, శ్రీకాంత్, కృష్ణయ్య, జగన్మోహన్ నాయుడు తదితరులు ఉన్నారు. -
‘గూడు’ కల చెదిరింది !
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో రాజకీయ జోక్యం ఎంపికలో రాజకీయమే ఇందిరమ్మ ఇళ్ల అర్హుల ఎంపికలో రాజకీయం చోటుచేసుకుందని, నేతలు సిఫారసు చేసిన అనర్హులకు ఇళ్లు మంజూరీ చేశారనే ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ఇదే అదనుగా కొన్ని చోట్ల ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో పేర్లు ఎంపిక చేయటానికి పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేశారని బలమైన ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఓ ఎమ్మెల్యే ఇందిరమ్మ ఇళ్ల ఎంపికలో డబ్బులు వసూలు చేస్తున్నారని కలెక్టర్ బీఎం సంతోష్ సమక్షంలోనే కొందరు బాహటంగానే ఆరోపణలు చేయడం తీవ్ర కలకలం రేపింది. ఒక్కో లబ్ధిదారుడి నుంచి రూ.30–50వేల వరకు వసూలు చేస్తున్నారని బాహటంగానే చెబుతున్నారంటే ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక ప్రక్రియ ఎంత పారదర్శకంగా జరిగిందో స్పష్టమవుతుంది. గద్వాల: తమకు ఇందిరమ్మ ఇల్లు మంజూరైందని.. ఇక తమ గూడు కష్టాలు తీరనున్నాయని ఎన్నో ఆశలతో ఎదురుచూస్తున్న జిల్లాలోని లబ్ధిదారుల గంపెడాశలపై కొందరు రాజకీయ నాయకులు నీళ్లు చల్లుతున్నారు. అటు ఉన్న ఇంటిని కూల్చేసుకొని.. ఇటు ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాక అద్దె ఇళ్లలో ఉండే పరిస్థితి దాపురించింది. జిల్లాలోని అలంపూర్, గద్వాల నియోజకవర్గాలకు చెరి 3,500 చొప్పున మొత్తం 7000 ఇళ్లు మంజూరయ్యాయి. ఇందులో 6,815 లబ్ధిదారులను గుర్తించగా.. ఇందులో 816 ఇండ్లు వివిధ నిర్మాణ దశలో కొనసాగుతున్నాయి. విచారించి చర్యలు ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక ప్రక్రియలో నిబంధనలు పాటిస్తూ అర్హులైన వారిని ఎంపిక చేయాలని ఽఅధికారులకు స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాం. మీరు చెబుతున్నట్లు ఎక్కడైన అనర్హులు ఎంపిక చేసినా.. డబ్బులు వసూలు చేసినట్లు ఎవరైన ఫిర్యాదు చేసినా వాటిపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం. – వి.లక్ష్మీనారాయణ, అదనపు కలెక్టర్ అర్ధాంతరంగా లిస్టులో నుంచి పేర్ల తొలగింపు మరికొందరు ఇంటి పనులు ప్రారంభించిన అనంతరం లిస్టులో మార్పులు దిక్కుతోచని స్థితిలో లబ్ధిదారులు జిల్లాలో నత్తనడకన సాగుతున్న ఇళ్ల నిర్మాణం -
రైతు ఆగమాగం
అధిక వర్షాలకు దెబ్బతింటున్న పంటలు ● కంది, వేరుశనగతోపాటు ప్రధాన పంటలకు తెగుళ్ల ముప్పు ● నష్ట పరిహారంపైనే ఆశలు పంట నష్టపరిహారం అందించాలి అధిక వర్షాలకు పంటలు పూర్తి స్థాయిలో దెబ్బతిన్నాయి. దిగుబడి కూడా ఘన నీయంగా పడిపోయే అవకాశం ఉంది. పంటల సాగుకు ఎకరాకు రూ.30 వేల నుంచి రూ. 50 వేలవరకు ఖర్చుచేశారు. పత్తి, మిరుప, వేరుశనుగ పంటలు పూర్తిగా తెబ్బతిన్నాయి. ఇప్పుడు వర్షాలు కురవకపోయినా పంటలు కోలుకునే పరిస్థితిలో లేవు. ప్రభుత్వం నష్టపరిహారం అందించాలి. – జగన్నాథరెడ్డి, రైతు, అయిజ దిక్కుతోచడంలేదు.. రైతులు సాగుచేసిన పంటలన్ని భారీ వర్షాలకు ఆగమయ్యాయి. కనీసం సస్యరక్షణ చర్యలు చేపడదాం అనుకున్నా వర్షాలు ఆగడంలేదు. ఏ పంట కూడా ఆరోగ్యంగా లేదు. అతి వర్షాలతో రైతులు అన్ని విధాలుగా నష్టపోయారు. ఎన్ని మందులు పిచికారి చేసినా లాభం లేకుండా పోతోంది. రైతులకు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం రైతులను ఆదుకోవాలి. – లింగన్న, రైతు, అయిజ అయిజ: రోజుల తరబడి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాలతో భూమిలో తేమశాతం ఎక్కువై ఆయా పంటలకు వేరుకుళ్లు రావడంతో మొక్కలు బలహీనపడుతున్నాయి. అదేవిధంగా తెగుళ్లు, పురుగులు ఆశించి పంటలను దెబ్బతీస్తున్నాయి. దీనివలన రైతన్నలు అపారంగా నష్టపోతున్నారు. ఒక్క అయిజ మండలంలో సుమారు 59 వేల ఎకరాలు పంట భూములున్నాయి. వానాకాలం సాగులో భాగంగా సుమారు 40 వేల ఎకరాలలో అన్నదాతలు వివిధ పంటలు సాగుచేసారు. ముఖ్యంగా పత్తి, విత్తనపత్తి, కంది, మిరుప, వేరుశనుగ పంటలు సాగుచేయగా కొందరు రైతులు బొప్పాయి పంటను సాగుచేశారు. పంటలపై తీవ్ర ప్రభావం దాదాపు 20 రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ప్రధాన పంటలన్ని దెబ్బతిన్నాయి. ముఖ్యంగా పత్తి పంటకు వేరుకుళ్లు తెగులు ఆశించింది. పూత, కాయదశలో ఉన్న పత్తి పంట దెబ్బతింది. భూమిలో తేమశాతం ఎక్కువై పూత పూయడంలేదు. పిందెలు, కాయలు రాలిపోతున్నాయి. పురుగు ఉధృతి అధికమవుతోంది. మందులు పిచికారీ చేసిన కొద్దిసేపటికే మళ్లీ వర్షాలు కురుస్తుండడంతో మార్పు కానరావడంలేదు. తెగుళ్లు అంతకంతకూ విస్తరిస్తున్నాయి. కంది పంటకు ఎక్కువగా వేరుకుళ్లు తెగులు ఆశించింది. ఉల్లి గడ్డలు పంట పొలంలోనే మురిగిపోతుండగా.. వేరుశనుగ కాయలు పొలాల్లోనే మొలకలు వస్తున్నాయి. రైతులు సాగుచేసిన బొప్పాయి పంటకు వైరస్ ఆశించి మొక్కలు తెలుపురంగులోకి మారాయి. ఎదుగుదల లేక గిడసబారాయి. -
పర్సంటేజీలపై ఉన్న శ్రద్ధ అభివృద్ధిపై ఏది..?
ప్రజలకు అందుబాటులో కోర్టు నిర్మాణాలు.. అనంతపురం గుట్టలలో కోర్టు భవన సమూదాయాలను నిర్మించాలని పాలకులు ప్రయత్నించడం వారి అసమర్థపాలనకు నిదర్శనమని విమర్శించారు. ప్రభుత్వ భూమి సిద్దాంతచారి కుంటను కబ్జా చేసుకోవడానికి పాలకులు ప్రయత్నిస్తున్నాని, ఆ భూమిని కోర్టు సముదాయానికి అప్పగిస్తే అందరికి ఆమోద యోగ్యంగా ఉంటుందన్నారు. పాలకుల బీనామీలకు, రియల్టర్లకు ప్రయోజనం చేకూర్చడానికి కాకుండా ప్రజల సౌలభ్యాన్ని దృష్టిలో ఉంచుకుని స్థలం కేటాయించాలని కోరారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ నీతి మాలిన రాజకీయాలు చేస్తుందని ధ్వజమెత్తారు. అనంతరం కలెక్టర్ సంతోష్తో సమావేశమై గద్వాల అభివృద్ధి, నూతన కోర్టు భవనాల స్థలం కేటాయింపుపై చర్చించి, వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు తూళ్ల వీరేంద్రగౌడ్, రామంజనేయులు, డీకే స్నిగ్దారెడ్డి, రామచంద్రారెడ్డి, బండల వెంకట్రాములు, రమాదేవి, కృష్ణవేణి, బండల పద్మావతి, రాజగోపాల్, శివారెడ్డి, సమత, శోభరాణి, వెంకటేశ్వర్రెడ్డి, కృష్ణంరాజు, రఘుగౌడ్, బండల పాండు పాల్గొన్నారు. గద్వాలటౌన్: పార్టీలు మారడం, పర్సంటేజీలు తీసుకోవడం తప్ప, అభివృద్ధిపై పాలకులకు ధ్యాస లేదని మహబూబ్నగర్ పార్లమెంట్ సభ్యురాలు డీకే అరుణ ధ్వజమెత్తారు. గద్వాల అభివృద్ధిలో పాలకులు విఫలమయ్యారని ఆరోపిస్తూ.. సోమవారం బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ముందుగా ఆ పార్టీ నాయకులు మోటార్ బైక్ ర్యాలీగా కలెక్టరేట్కు చేరుకున్నారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఎంపీ డీకే అరుణ మాట్లాడుతూ.. ఇక్కడున్న ప్రజాప్రతినిధికి పార్టీ కండువాలు మార్చడం మీదున్న శ్రద్ధ అభివృద్దిపై కొరవడిందని మండిపడ్డారు. ఆయన ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో ఎవరకీ అర్థం కావడం లేదని, అలాంటి వ్యక్తి గద్వాలలో ఉండటం దురదృష్టకరమన్నారు. విద్వత్ గద్వాలను వివాదాల గద్వాలగా మార్చిన చరిత్ర ఆయనకే దక్కుతుందన్నారు. అభివృద్ధి కోసమే పార్టీ మారానని చెప్పుకునే వ్యక్తి.. ఏడాదిన్నరలో ఎక్కడ అభివృద్ధి చేశారో చెప్పాలని సవాల్ విసిరారు. తుమ్మిళ్ల, నెట్టెంపాడు, గట్టు ఎత్తిపోతల, ఆర్డీఎస్ పథకాలు ఇంకా ఎందుకు పూర్తి కాలేదని ప్రశ్నించారు. ర్యాలంపాడు, జూరాల ప్రాజెక్టు లీకేజీల సమస్యను ఎందుకు సరిచేయలేదని నిలదీశారు. గద్వాలలో నీను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వేసిన రోడ్లే తప్ప మరోకటి కనిపించడం లేదని విమర్శించారు. ఏ పనిలో ఎంత దోచుకుందాం అనే యావలోనే ఇక్కడి నేతలు ఉన్నారని ఆరోపించారు. అఽధికార పార్టీ నేతలపై మండిపడ్డ ఎంపీ డీకే అరుణ -
ఐదు ఎకరాల్లో మాత్రమే వేశా..
గడిచిన రెండేళ్లు పది ఎకరాల్లో ఎండుమిర్చి సాగు చేశాను. విపరీతంగా తెగుళ్లు వచ్చా యి. పురుగు మందులకు రూ.వేలకు వేలు ఖర్చు పెట్టినా ఆశించిన స్థాయిలో దిగుబడులు రాలేదు. దీనికితోడు ధరలు కూడా పలకలేదు. ఆర్థికంగా చాలా నష్టం జరిగింది. దీంతో ఈసారి ఐదు ఎకరాల్లో మాత్రమే ఎండుమిర్చి వేశాను. – వెంకటేశ్వర్లు, రైతు, చెన్నిపాడు, మానవపాడు మండలం పత్తి సాగు చేశారు.. జిల్లాలో ఈ ఏడాది ఎండుమిర్చి దాదాపు 33 వేల ఎకరాలకు పైగా సాగు అవుతుందని అంచనా వేశాం. అయితే చాలా చోట్ల ఎండుమిర్చికి బదులుగా రైతులు పత్తి సాగు చేశారు. దీంతో ఈ ఏడాది ఎండుమిర్చి సాగు తగ్గింది. తెగుళ్ల బెడద, పంట దిగుబడి తగ్గడం, ధర లేకపోవడం వంటివి ఇందుకు కారణమయ్యాయి. – ఎంఏ అక్బర్, జిల్లా ఉద్యానవన శాఖాధికారి● -
మహబూబ్నగర్ పార్లమెంట్లోకి నడిగడ్డను తీసుకొస్తా
గద్వాల టౌన్: ప్రస్తుత మహబూబ్గనర్ పార్లమెంట్ పరిధిలో నడిగడ్డ ప్రాంతం లేకపోవడంతో తాను అనుకున్న స్థాయిలో గద్వాలను అభివృద్ధి చేయలేకపోతున్నానని ఎంపీ డీకే అరుణ తెలిపారు. గతంలో మహబూబ్నగర్ పార్లమెంట్ పరిధిలో నడిగడ్డ ప్రాంతం ఉండేదని, నాపై కోపంతో ఓ రాజకీయ పెద్ద మనిషి ఈ ప్రాంతాన్ని నాగర్కర్నూల్ పార్లమెంట్ పరిధిలో కలిపేశారని ఆరోపించారు. ఆదివారం తపస్ ఆధ్వర్యంలో నిర్వహించిన గురువందన కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. రాబోయే నియోజకవర్గాల పునర్విభజనలో నడిగడ్డ ప్రాంతాన్ని తిరిగి మహబూబ్నగర్ పార్లమెంట్ పరిధిలో వచ్చేలా కృషిచేస్తానని హామీ ఇచ్చారు. గతంలో నాయకులు చేసిన తప్పును సరిచేస్తానని వివరించారు. అసమర్థ పాలన వలన ప్రస్తుతం గద్వాల అభివృద్ధి ఆమడదూరంలో ఉందని విమర్శించారు. తాను ఎమ్మెల్యేగా చేసిన అభివృద్ధే తప్ప, ఇప్పుడేమి కనిపించడం లేదని ధ్వజమెత్తారు. నడిగడ్డ అభివృద్ధికి కృషి చేస్తూ పూర్వవైభవం తీసుకొస్తానని చెప్పారు. ఇకపై 15 రోజులకోసారి గద్వాల ప్రజలకు అందుబాటులో ఉంటానని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి మాట్లాడుతూ తన గెలుపులో నడిగడ్డ ప్రాంతం కీలకంగా ఉందన్నారు. ఉపాధ్యాయులు అంకితభావంతో పనిచేస్తూ విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దితేనే గుర్తింపు వస్తుందని అభిప్రాయపడ్డారు. సమాజంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఉపాధ్యాయులు విద్యాబుద్దులు నేర్పాలని సూచించారు. విద్యాభివృద్ధిలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. అంతకు ముందు జిల్లాలో ఉత్తమ ప్రతిభ కనభర్చిన ఉపాధ్యాయులను ఎంపిక చేసి వారిని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో తపస్ రాష్ట్ర అధ్యక్షుడు హన్మంతురావు, జిల్లా అధ్యక్షుడు మనోహర్రెడ్డి, ప్రధాన కార్యదర్శి శ్రీధర్రెడ్డి, నాయకులు రవీందర్రెడ్డి, అయ్యస్వామి, నరేష్ తదితరులు పాల్గొన్నారు. -
రూ.లక్షల్లో సంపాదన
సాధారణంగా ఆర్ఎంపీలు ప్రథమ చికిత్స మాత్రమే చేయాల్సి ఉంటుంది. అయితే ఇదే అదునుగా భావించి గ్రామాల్లో వైద్యుల అవతారం ఎత్తి సామాన్య ప్రజలు అనారోగ్య కారణాలతో అక్కడికి వెళ్తే అన్ని రకాల రక్త పరీక్షలు, మందులు, ఇంజెక్షన్లు ఇవ్వడం, వ్యాధి తగ్గకుంటే అనుబంధ ప్రైవేట్ ఆస్పత్రులకు రెఫర్ చేయడం, వారి నుంచి కమీషన్ తీసుకోవడం వంటివి చేస్తూ రూ.లక్షల్లో సంపాదిస్తున్నారు. ఈ క్రమంలో వారికి ఏదైనా సమస్య వస్తే కొందరు వైట్ కాలర్ నాయకులు సైతం అండగా నిలుస్తున్నారు. ఆర్ఎంపీలకు మందుల సరఫరాలో వివిధ మందుల ఏజెన్సీ నిర్వాహకులతో వ్యాపార ఒప్పందాలు ఉండడం, ప్రైవేట్ ఆస్పత్రుల నుంచి కూడా మందులు కొనుగోలు చేయడం జరుగుతుంది. ఇలాంటి దందాలపై నిఘా ఉంచాల్సిన డ్రగ్ కంట్రోల్ అధికారులు సైతం చూసీ చూడనట్లు వదిలేస్తున్నారు. దాడులు చేయకుండా నెలవారి మామూలు కోసం ఎదురుచూస్తారనే ఆరోపణలు ఉన్నాయి. అప్పుడప్పుడు తమ మాట వినని వారిపై దాడులు చేస్తూ చేతులు దులుపుకొంటున్నారని స్థానికులు విమర్శిస్తున్నారు. -
కేంద్రంపై ఒత్తిడి తెస్తేనే..
మద్దిమడుగు వద్ద కృష్ణానదిపై బ్రిడ్జి ఆవశ్యకత గురించి రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు రేవంత్రెడ్డి, చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లాం. కేంద్రంపై ఒత్తిడి తెస్తేనే వంతెన, రోడ్డు నిర్మాణం జరుగుతుంది. ఇది నల్లమల ప్రజల చిరకాల ఆంకాక్ష నెరవేర్చే ప్రయత్నం చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం జాతీయ రహదారుల నిర్మాణంలో చేర్చడంతో కేంద్రం పరిశీలనలో ఉంది. – వంశీకృష్ణ, ఎమ్మెల్యే, అచ్చంపేట ప్రతిపాదనలు పంపించాం.. రెండు రాష్ట్రాల మధ్య కృష్ణానదిపై మద్దిమడుగు వద్ద వంతెన అవసరం గుర్తించాం. ఇప్పటికే కొత్త జాతీయ రహదారుల నిర్మాణంలో భాగంగా కేంద్రానికి ప్రతిపాదనలు పంపించాం. జాతీయ రహదారి– 44 నుంచి నాగర్కర్నూల్, అచ్చంపేట, మద్దిమడుగు మీదుగా ఏపీలోని చిరిగిరిపాడు(మాచర్ల) వరకు 165 కి.మీ., రోడ్డును ప్రతిపాదించాం. ఈ రోడ్డు మార్గంలో కృష్ణానదిపై వంతెన ఏర్పాటు ఉంది. – మల్లురవి, ఎంపీ, నాగర్కర్నూల్ ● -
కలెక్టర్ ఆదేశాల మేరకు..
అనుమతి లేకుండా జిల్లాలో పలు ప్రథమ చికిత్స, ఆస్పత్రులు ఉన్నట్లు గుర్తించి తనిఖీలు చేపడుతున్నాం. వారి నుంచి ప్రమాదకరమైన మందులను సీజ్ చేశాం. ప్రజల ఆరోగ్యంపై కొందరు ఆర్ఎంపీలు చేస్తున్న సేవలు దారుణంగా ఉన్నాయి. ఇలాంటి చర్యలపై శాఖాపరమైన చర్యలు, కలెక్టర్ ఆదేశాల మేరకు కఠినమైన చర్యలు తీసుకుంటాం. ఆర్ఎంపీలు ప్రథమ చికిత్స మాత్రమే చేయాలి. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న వారిని ఎంతమాత్రం వదిలిపెట్టం. – సిద్ధప్ప, జిల్లా ఇన్చార్జి వైద్యాధికారి కేసులు నమోదు చేస్తాం.. రోగులను మోసం చేస్తున్న ఆర్ఎంపీలపై నిఘా ఉంచాం. వారు చేయాల్సిన సేవలు మాత్రమే చేయాలి. మత్తు కలిగించే మందులు, స్టెరాయిడ్స్, నొప్పులు నివారించే మందులు తదితర వాటిని ఎక్కడి నుంచి కొనుగోలు చేస్తున్నారు.. వారికి ఏ నిబంధనలతో మందులు ఇస్తున్నారనే అంశాలపై ప్రత్యేక విచారణ చేపడుతాం. చట్ట వ్యతిరేక కార్యకాలపాలకు పాల్పడుతున్న వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటాం. – శ్రీనివాసరావు, ఎస్పీ ● -
అల్లంత దూరాన.. ఆశల వారధి
అచ్చంపేట: తెలంగాణ– ఆంధ్రప్రదేశ్లను కలిపే మద్దిమడుగు వంతెన నిర్మాణం ఎప్పుడెప్పుడా అని రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎదురుచూస్తున్నారు. నల్లమలలోని కృష్ణానదిపై వంతెన ఏర్పాటు దశాబ్దాలుగా పాలకులు చెబుతున్నా ఆచరణకు నోచుకోవడం లేదు. ఈ ప్రాంతం నుంచి ఎన్నికై న ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రతిసారి ఎన్నికల సందర్భంగా వంతెన ఏర్పాటుపై హామీలు ఇస్తున్నారే తప్ప నెరవేర్చలేకపోతున్నారు. పదర మండలం మద్దిమడుగు సమీపంలోని కృష్ణానదిపై వంతెన నిర్మిస్తే కోస్తాంధ్ర ప్రాంతాలకు చేరువవుతుంది. నాగర్కర్నూల్ జిల్లా మద్దిమడుగు (కసన్రేవు)– గుంటూరు జిల్లా రామచంద్రాపురం తండా మధ్య కిలోమీటరు వంతెన నిర్మాణం చేపడితే మాచర్లకు 145 కి.మీ., దూరభారం తగ్గుతోంది. ఇందుకు సుమారు రూ.250 కోట్లు ఖర్చు అవుతుంది. మద్దిమడుగు వద్ద కృష్ణానదిపై వంతెన, జాతీయ రహదారి నిర్మాణానికి సహకరిస్తూ ప్రత్యేక చొరవ తీసుకోవాలని గతేడాది ఆగస్టులో, ఈ ఏడాది జూలై 8న అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీశైలం జలాశయం క్రస్ట్ గేట్లు ఎత్తేందుకు వచ్చిన ఏపీ సీఎం చంద్రబాబును కలిసి వినతిపత్రం అందజేశారు. అలాగే పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో దీని ఆవశ్యకత గురించి మాట్లాడాలని గత నెలలో ఎంపీ మల్లురవికి విన్నవించారు. తగ్గనున్న దూరభారం.. జాతీయ రహదారి–44 భూత్పూర్ నుంచి నాగర్కర్నూల్, అచ్చంపేట, మద్దిమడుగు మీదుగా కృష్ణానదికి అవతల ఏపీ 12 కి.మీ., దూరంలోని గుంటూరు జిల్లా చిరిగిరిపాడు (మాచర్ల) వరకు 165 కి.మీ., జాతీయ రహదారి, కృష్ణానదిపై వంతెన నిర్మాణం చేపట్టాలనే అంశం తెరపైకి వచ్చింది. 2017 నుంచి ఇప్పటి వరకు పలుమార్లు రాష్ట్ర ప్రభుత్వాలు జాతీయ రహదారిని ప్రతిపాదిస్తూ కేంద్రానికి పంపించారు. అమ్రాబాద్, పదర మండలాల్లోని మద్దిమడుగు, ఇప్పలపల్లి, మారడుగు, ఉడిమిళ్ల, చిట్లంకుంట, వంకేశ్వరం, పదర తదితర గ్రామాల ప్రజలకు గుంటూరు, ప్రకాశం జిల్లాలతో సంబంధాలున్నాయి. చాలా ఏళ్ల కిందట ఆ ప్రాంతం నుంచి వచ్చిన వారు ఇక్కడ స్థిరపడ్డారు. అచ్చంపేట, మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గాల మధ్య కృష్ణానది ప్రవహిస్తుండటంతో అచ్చంపేట, దేవరకొండ, కొండమల్లెపల్లి, నాగార్జునసాగర్ మీదుగా మాచర్ల 193 కి.మీ., ప్రయాణించాల్సి ఉంది. మద్దిమడుగు సమీపంలో వంతెన నిర్మాణం చేపడితే మాచర్ల 48 కి.మీ., దూరం మాత్రమే ఉంటుంది. ఫలితంగా 145 కి.మీ., దూరభారం తగ్గడంతోపాటు కోస్తా– తెలంగాణ ప్రాంతాల మధ్య వ్యాపార సంబంధాలు మెరుగుపడుతాయి. విజయవాడ, గుంటూరు జిల్లాల మధ్య ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఏర్పాటు కావడంతో ఈ వంతెన ఏర్పాటుతో తెలంగాణ ప్రాంతం రాజధానికి అతి సమీపంలో ఉండటం, మాచర్ల, కారంపూడి, దాచేపల్లి, గురజాల, దుర్గి, గుంటూరు, విజయవాడ, అమరావతి ప్రాంతాల నుంచి కర్ణాటక రాష్ట్రంలోని రాయచూర్ వెళ్లేందుకు మార్గం సుగమమవుతుంది. ప్రమాదకర ప్రయాణం.. పదర మండలం మద్దిమడుగు నుంచి కృష్ణానది వరకు బండ్ల మార్గం మాత్రమే ఉంది. మద్దిమడుగు పబ్బతి ఆంజనేయస్వామిని దర్శించుకునేందుకు ఏపీ ప్రజలతోపాటు తెలంగాణలోని ఖమ్మం, సూర్యాపేట, నల్లగొండ, కోదాడ, మిర్యాలగూడ, నాగార్జునసాగర్ ప్రాంతాల ప్ర జలు వస్తుంటారు. మాచర్ల, మద్దిమడు గు, ఇప్పలపల్లి, మారడుగు గ్రామాల ప్ర జలు కాలి నడకన కృష్ణానది వరకు చేరుకొని అక్కడి నుంచి బుట్టల ద్వారా అవ తలి ఒడ్డుకు చేరుకుంటారు. నిత్యం పశువుల వ్యాపారులు గొర్రెలు, పశువులను ప్రైవేట్ లాంచీల సాయంతో కృష్ణానదిలో ప్రమాదకరంగా దాటిస్తున్నారు. రెండు రాష్ట్రాల ప్రజలకు అవసరమై రోడ్డును ఏర్పాటు చేయడంలో ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. 2006లో మద్దిమడుగు నుంచి ప్రకాశం జిల్లాలోని కృష్ణానది ఒడ్డున ఉన్న అలాటంపెంట వరకు రోడ్డు నిర్మాణానికి అప్పటి ప్రభుత్వం రూ.3.20 కోట్లు మంజూరు చేసింది. అప్పట్లో పర్యావరణ, అటవీశాఖ అనుమతి లభించకపోవడంతో కార్యరూపం దాల్చలేదు. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చొరవ తీసుకుంటే ఎన్నో ఏళ్లుగా పరిష్కారానికి నోచుకోని వంతెన, రోడ్డు నిర్మాణం ఏర్పాటయ్యే అవకాశం ఉంది. ఎన్నికల హామీగా మారిన కృష్ణానదిపై వంతెన నిర్మాణం మూడు దశాబ్దాలకుపైగా తప్పని ఎదురుచూపులు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య తగ్గనున్న 145 కి.మీ., దూరభారం అందుబాటులోకి వస్తే వ్యాపారాలు, అభివృద్ధికి దోహదం జాతీయ రహదారి ఏర్పాటుతోనైనా మోక్షం కలిగేనా? -
శోభాయమానంగా నిమజ్జనోత్సవం
గద్వాల టౌన్: నమో పార్వతీ తనయా.. ఏకదంతాయా.. విఘ్నరాజాయా... జైజై గణేశా.. జైకొట్టు గణేశా.. అంటూ వాడవాడల పూజలు అందుకున్న బొజ్జ గణపయ్యకు ఇక సెలవంటూ భక్తులు వేడుకల మధ్య వీడ్కోలు పలికారు. ఐదు రోజుల్లో భాగంగా ఆదివారం చేపట్టిన శోభాయాత్ర వైభవంగా సాగింది. పట్టణంలోని పలు వినాయకులను నిమజ్జనం చేశారు. నిమజ్జనోత్సవానికి ముందు ఆయా మండపాల వద్ద గణనాథులకు ప్రత్యేక పూజలు జరిపారు. మహిళలు, యువకులు ఉత్సాహంగా నిమజ్జనోత్సవ ఊరేగింపులో పాల్గొన్నారు. భక్తుల అశేష పూజలు అందుకున్న గణనాథుడు గంగమ్మ ఒడికి చేరుకున్నాడు. వివిధ ఆకృతులలో ఏకదంతుడిని తీర్చిదిద్దిన భక్తులు ప్రత్యేక ఆకర్షణతో నిమజ్జనోత్సవానికి తరలివెళ్లారు. యువకులు, చిన్నారులు, పెద్దలు నృత్యాలు, భజనలతో కోలాహలంగా సాగింది. ప్రభుత్వ వైఖరిని ఖండించాలి శాంతినగర్: బాధిత ప్రజలను కలిసే హక్కు భారత రాజ్యాంగం కల్పించిందని, బాధిత ప్రజలను కలవడానికి వెళ్తుంటే పోలీసులు అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమని తెలంగాణ పీపుల్స్ జాక్ రాష్ట్ర కోకన్వీనర్ కన్నెగంటి రవి, కుల అసమానతల నిర్మూలన పోరాట సమితి ఆలిండియా కన్వీనర్ బండారి లక్ష్మయ్య అన్నారు. రాజోళి మండలంలోని పెద్దధన్వాడ సమీపంలో నిర్మిస్తున్న ఇథనాల్ కంపెనీ బాధితులను కలవడానికి వారు వెళ్తుండగా శాంతినగర్ పోలీసులు అడ్డుకొని స్టేషన్కు తరలించారు. అనంతరం శాంతినగర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఇథనాల్ కంపెనీ రద్దు చేయాలని నిరసన తెలుపుతున్న వారిపై పోలీసులు దౌర్జన్యం చేయడమే కాకుండా అక్రమంగా అరెస్ట్ చేసి జైలుకు పంపడం ఎంతవరకు సమంజసమన్నారు. ఇథనాల్ కంపెనీ వల్ల వాయు, జల, భూగర్భ కాలుష్యం వల్ల క్యాన్సర్ లాంటి ప్రమాదకర రోగాలు వస్తాయన్నారు. పర్యావరణానికి తీవ్ర నష్టం కలిగిస్తున్న ఇథనాల్ కంపెనీని వ్యతిరేకించకుండా యజమానులకు వత్తాసు పలుకుతూ, కంపెనీ నిర్మాణానికి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్య పాలన పేరుతో ప్రజలను మభ్యపెడుతూ ద్వంద్వ నీతిని ప్రదర్శిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని ప్రజాస్వామ్య వాదులు, మేధావులు ఖండించాలన్నారు. హైదరాబాద్ నుంచి మేధావులు వచ్చారని తెలుసుకున్న పెద్దధన్వాడ, మాన్దొడ్డి ప్రజలు, రైతులు కలుకుంట్ల వద్ద వెళ్తున్న వారిని కలుసుకుని తమ గోడు వెలిబుచ్చారు. ఆయా గ్రామాల ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని వారితో వివరించారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో ఇంటలెక్చువల్ ఫోరం ఫర్ డెమోక్రసీ (ఐఎఫ్డీ) స్వామిదాస్, సామాజిక కార్యకర్త రాజగోపాల్ తదితరులున్నారు. -
తగ్గిన ఎండుమిర్చి సాగు
గద్వాల వ్యవసాయం: జిల్లాలో ఎండుమిర్చి సాగు ఈ ఏడాది తగ్గింది. గతేడాదితో పోల్చితే దాదాపు 10 వేలకు పైగా ఎకరాల్లో తగ్గింది. ఎండుమిర్చికి గడిచిన మూడేళ్ల నుంచి ఆశించిన స్థాయిలో ధరలు రావడం లేదు. గోదాంలలో నిల్వ ఉంచుతున్నప్పటికీ సరైన ధరలు పొందలేకపోతున్నారు. దీంతో ఈ ఏడాది చాలామంది రైతులు ఎండుమిర్చికి బదులుగా పత్తి పంట సాగు వైపు మొగ్గు చూపారు. నల్లరేగడి భూముల్లో.. గడిచిన 15 ఏళ్లుగా ఇక్కడి రైతులు అత్యధికంగా ఎండుమిర్చి సాగుపై దృష్టిసారిస్తున్నారు. బోర్లు, బావులతోపాటు నల్లరేగడి భూముల్లో వర్షాధార పంటగా మిర్చి సాగు చేస్తున్నారు. వాతావరణం అనుకూలించి పంట బాగా చేతికి వస్తే పత్తి కన్నా మిర్చికి మంచి ధరలు లభిస్తాయన్న ఉద్దేశంతో ఈ పంట సాగు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఎకరాకు 15 నుంచి 25 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. ఎకరాకు రూ.60 వేల నుంచి రూ.70 వేల వరకు సాగు ఖర్చులు అవుతాయి. కరుణ, సూపర్టెన్, జిత్రి, కావేరి, తేజచిల్లి, బ్యాడిగ తదితర రకాలను ఎక్కువగా ఈ ప్రాంతంలో రైతులు సాగు చేస్తున్నారు. తెగుళ్ల బెడదతో.. గడిచిన 2022–23లో జిల్లాలో 36 వేలు, 2023– 24 లో 65,113 ఎకరాల్లో ఎండుమిర్చి సాగు చేశారు. పంట బాగా వస్తుందనుకునే సమయంలో త్రిప్స్, ఎండుమడత, జెమిని రకాలకు తెగుళ్లు ఆశించాయి. ఈ తెగుళ్ల ప్రభావం పంట దిగుబడులపై పడింది. ఫలితంగా దిగుబడులు గణనీయంగా తగ్గి రైతులు ఆర్థికంగా నష్టపోయారు. ఎకరాకు కనీసం 15 నుంచి 25 క్వింటాళ్ల దిగుబడి రావాల్సి ఉండగా కేవలం 8 నుంచి 12 క్వింటాళ్లు మాత్రమే వచ్చింది. ఇదే సమయంలో ధరలు కూడా పడిపోయాయి. ధరలు రాకపోవడంతో నెలల తరబడి శీతల గిడ్డంగుల్లో నిల్వ ఉంచుకున్నారు. ఇక గడిచిన ఏడాది (2024–25)లో 34,073 ఎకరాల్లో పంట సాగు చేయగా.. ఈసారి కూడా రైతులను నష్టాలే వెంటాడాయి. మొదటి మూడు నెలలు బాగా వచ్చిన పంట ఆ తర్వాత తెగుళ్లు, వాతావరణ పరిస్థితులతో దిగుబడులు ఆశించిన స్థాయిలో రాలేదు. కాగా ఎండుమిర్చిలో వైరెటీని బట్టి ధరలు లభిస్తాయి. కొన్ని వైరెటీలకు క్వింటాకు రూ.15 వేల నుంచి రూ.25 వేలు రావాల్సి ఉండగా రూ.8 వేల నుంచి రూ.12వేలు, ఇక మరికొన్ని వైరైటీలకు రూ.45 వేల నుంచి రూ.50 వేలు రావాల్సి ఉండగా రూ.30 వేల నుంచి రూ.40 వేలు మాత్రమే వచ్చాయి. ఇలా వరుసగా మూడేళ్లు ఆర్థికంగా నష్టాలు చవిచూశారు. మార్కెట్ సౌకర్యం లేక.. ఈ ఏడాది 33,472 ఎకరాల్లో ఎండుమిర్చి సాగు అవుతుందని అధికారులు అంచనా వేశారు. అయితే గడిచిన మూడేళ్ల నుంచి ఎండుమిర్చికి రకరకాల తెగుళ్లు, వైరస్లు సోకుతున్నాయి. వీటి వల్ల దిగుబడులు తగ్గుతున్నాయి. మరోవైపు ఏటా ఈ పంటకు పెట్టుబడులు పెరుగుతున్నాయి. వీటన్నింటితోపాటు స్థానికంగా మార్కెట్ సౌకర్యం లేదు. దీంతో దళారులకై నా అమ్మాలి లేదా వ్యయప్రయాసాలకు ఓర్చి కర్నూలు, గుంటూరు, రాయచూరు, హైదరాబాద్ తదితర ప్రాంతాలకు తీసుకెళ్లాల్సిన పరిస్థితులను ఇక్కడి రైతులు ఎదుర్కొంటున్నారు. అయితే ఈ ఏడాది వాతావరణ పరిస్థితులు కాస్త భిన్నంగా ఉన్నాయి. జూన్లో సరిగా కురవని వర్షాలు జూలై రెండో వారంలో వచ్చాయి. ఆ తర్వాత ఆగస్టు రెండో, చివరి వారం ఎడతెరపి లేని వర్షాలు కురిసాయి. వీటన్నింటి కారణంగా ఎండుమిర్చి సాగు ఈ ఏడాది తగ్గింది. ఎండుమిర్చికి బదులుగా చాలామంది రైతులు పత్తి పంట వేశారు. ఎండుమిర్చి 33,472 ఎకరాల్లో అంచనా ఉండగా 24,500 ఎకరాల్లో మాత్రమే సాగైంది. గతేడాదితో పోల్చితే దాదాపు 10 వేల ఎకరాల్లో సాగు తక్కువ అయ్యింది. గతేడాదితో పోల్చితే 10 వేల ఎకరాల్లో తగ్గుదుల తెగుళ్ల బెడదతో దిగుబడిపై ప్రభావం ధరలు రాకపోవడమూ కారణమే.. పత్తిపంట వైపు మొగ్గు చూపిన రైతులు -
కదలిక వచ్చేనా?
●అమలు చేయాలి గతంలో ప్రభుత్వం తీసుకువచ్చిన ఫ్రేమ్ మగ్గాల ప్రతిపాదనను ప్రస్తుత ప్రభుత్వం అమలు చేయాలి. ఆ పథకంతో కార్మికులకు మేలు జరుగుతుండటంతో వాటిని కొనసాగిస్తే బాగుంటుంది. ఫ్రేమ్ మగ్గాలను ఇవ్వడం వల్ల కార్మికులకు ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయి. అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని పథకం అమలు చేయాలి. – మంజు, చేనేత కార్మికుడు, రాజోళి దరఖాస్తులు మళ్లీపరిశీలించాలి ప్రభుత్వాలు మారినప్పటికీ చేనేత కార్మికుల జీవన విధానాన్ని దృష్టిలో ఉంచుకుని, కార్మికులు చేసుకున్న దరఖాస్తులు పరిశీలించాలి. ఫ్రేమ్ మగ్గాలు వస్తే వయసు మళ్లిన వారు కూడా మగ్గం నేయడంలో ఇబ్బందులు లేకుండా జీవనం గడుపుతారు. దరఖాస్తులు పాతవే. పథకం పాతదే అనుకోకుండా కార్మికులకు నూతన ఉత్తేజం ఇచ్చేలాగా ఈ పథకాన్ని అమలులోకి తేవాలి. – కర్జి ఖాజా,చేనేత కార్మికుడు రాజోళి ప్రభుత్వం నుంచి ఆదేశాలు వస్తే.. గతంలో ఫ్రేమ్ మగ్గాల కోసం కార్మికుల నుంచి దరఖాస్తులు తీసుకున్నాం. కానీ ప్రస్తుతం ప్రభుత్వం మారడంతో దానిపై కదలిక రాలేదు. ప్రస్తుత ప్రభుత్వం దానిపై ఆదేశిస్తే వవెంటనే దానికి సంబంధించిన ప్రక్రియ వేగవంతం చేస్తాం. – గోవిందయ్య, చేనేత జౌళి శాఖ ఏడీ బహుళ ప్రయోజనాలిచ్చే ఫ్రేమ్ మగ్గాలపై కార్మికులకు ఆశలు రాజోళి:గుంత మగ్గంతో చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలను దూరం చేసేందుకు గతంలో తీసుకువచ్చిన ఫ్రేమ్ మగ్గం ప్రతిపాదన ప్రస్తుతం అటకెక్కినట్లుందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గుంత మగ్గాలు ఉన్న వారికి సబ్సిడీ కింద ఈ ఫ్రేమ్ మగ్గాలను అందిస్తే వచ్చే బహుళ ప్రయోజనాల ద్వారా వారికి ఉపాధి పెంచుతామని గత ప్రభుత్వం చెప్పడంతో కార్మికుల్లో నూతన ఉత్సాహం నెలకొంది. కానీ అప్పట్లో తీసుకున్న దరఖాస్తుల తర్వాత మళ్లీ దానిపై ఎక్కడా ప్రభుత్వం నుంచి కూడా ప్రకటనలు రాకపోవడంతో చేనేత కార్మికులు నిరాశ చెందుతున్నారు. 2వేలకు పైగా దరఖాస్తులు చేనేత రంగంలో పలు మార్పులు చోటు చేసుకుంటున్న క్రమంలో కార్మికులకు కూడా మగ్గాల్లో మార్పులు చేసి పనులు వేగంగా పూర్తయ్యేలా చూసేందుకు ఇలాంటి మగ్గాలను తెస్తున్నామని గత ప్రభుత్వం ఫ్రేమ్ మగ్గాలను ప్రతిపాదించింది. దాని కోసం చేనేత కార్మికుల నుంచి దరఖాస్తులు కోరింది. గత ఏడాదిలో సెప్టెంబర్ 14 నాటికి చివరి తేదీగా నిర్ణయించింది. అనంతరం లబ్దిదారుల ఎంపిక చేయాలని నిర్ణయించింది. జిల్లాలో ఆ సమయానికి 6,948 మంది చేనేత కార్మికులు ఉండగా.. జియో ట్యాగింగ్ ప్రకారం 2,695 మగ్గాలు ఉన్నాయి. వాటిలో ఎక్కువగా గుంత మగ్గాలే కావడంతో 2 వేల మందికి పైగా కార్మికులు ఫ్రేమ్ మగ్గాలకు దరఖాస్తు చేసుకున్నారు. సబ్సిడీపై ఇచ్చేందుకు గత ప్రభుత్వంలో ప్రతిపాదనలు జిల్లాలో 2వేలకు పైగా దరఖాస్తులు ప్రస్తుత ప్రభుత్వం చొరవ చూపాలని కోరుతున్న వైనం -
భూసేకరణ ప్రక్రియ వేగవంతం చేయాలి
గద్వాల: నెట్టెంపాడు ప్రాజెక్టు కింద చేపట్టాల్సిన భూసేకరణ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లో కాన్ఫరెన్స్ హాలులో అధికారులతో సమీక్షించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ నెట్టెంపాడు ప్రాజెక్టులోని 99, 100 ప్యాకేజీల కింద కుడి కాలువ పరిధిలో చేపట్టాల్సిన భూసేకరణ పనులు సకాలంలో పూర్తి చేసి రైతులకు పరిహారం అందించాలన్నారు. రైతులకు బకాయిలేని విధంగా మొత్తం పరిహారం చెల్లింపులు చేయాలన్నారు. అభ్యంతరాలు వ్యక్తం చేసే రైతులకు వివరించి ఒప్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ, భూసేకరణ డిప్యూటీ కలె క్టర్ శ్రీనివాసరావు, ఇరిగేషన్ ఎస్ఈ రహీముద్దీన్ తదితరులు పాల్గొన్నారు. వృద్ధులకు రక్షణగా చట్టాలు వయో వృద్ధుల సంరక్షణలో సమస్యలు తలెత్తితే చట్టపరంగా వారి పోషకులపై చర్యలు చేపట్టేందుకు దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలని కలెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు. వృద్ధాప్యంలో ఉన్న వారికి ఇబ్బందులు కలగజేయకుండా వారి పోషణ పూర్తి బాధ్యత పిల్లలే చూడాలని, వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల పోషణలో నిర్లక్ష్యం వహిస్తే వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయని పేర్కొన్నారు. ఫిర్యాదులను ట్రిబ్యూనల్ ద్వారా 90–120రోజుల్లో పరిష్కరించబడతాయని, వారి పోషణ, వైద్యం కోసం కనీసం నెలకు రూ.10వేలు భృతి అందించాలని తెలిపారు. చట్టాన్ని అతిక్రమించేవారికి మూడునెలల జైలుశిక్ష, లేదా రూ.5వేల జరిమానా విధించబడుతుందని, ఆస్తి బదిలీ రద్దు చేయబడుతుందని తెలిపారు. -
పండుగలను శాంతియుతంగా జరుపుకోవాలి
గట్టు: గ్రామంలో అన్ని కులాల వారు కలసి మెలసి జీవించాలని, కులమత భేదాలను పాటించకుండా అన్ని పండుగలను శాంతియుతంగా జరుపుకోవాలని గద్వాల ఆర్డీఓ అలివేలు, డీఎస్పీ మొగులయ్య సూచించారు. శనివారం రాయాపురంలో పౌరహక్కుల దినోత్సవాన్ని నిర్వహించగా.. వారు ముఖ్య అథితులుగా హాజరై మాట్లాడారు. ప్రతి పండుగలను కలసిమెలసి జరుపుకోవాలని, కులమతాల పట్టింపులు ఉండకూడదని, అందరూ సమానమేనని, కుల వివక్షతను పాటించవద్దని అన్నారు. అంటరానితనం పాటించడం నేరమని, కులాల మద్య చిచ్చు పెట్టేవారి పట్ల కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రెండు గ్లాసుల విధానం గురించి ఆరా తీశారు. కార్యక్రమంలో సినియర్ అసిస్టెంట్ నాగిరెడ్డి, గిర్దావర్లు రాజు, షేక్షావలి, ఎస్ఐ మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. వేరుశనగ క్వింటా రూ.5,020 గద్వాల వ్యవసాయం: గద్వాల మార్కెట్ యా ర్డుకు శనివారం 79 క్వింటాళ్ల వేరుశనగ వచ్చింది. గరిష్టం రూ. 5020, కనిష్టం రూ. 3097, సరాసరి రూ. 4629 ధరలు లభించాయి. -
అరుణాచలం గిరి ప్రదక్షిణకు ప్రత్యేక బస్సు
స్టేషన్ మహబూబ్నగర్: మహబూబ్నగర్ నుంచి అరుణాచలం గిరి ప్రదక్షిణకు ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సు నడుపనున్నట్లు డిపో మేనేజర్ సుజాత శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ప్రత్యేక బస్సు మహబూబ్నగర్ బస్టాండ్ నుంచి వచ్చే నెల 5న రాత్రి 7 గంటలకు బయలుదేరి మార్గమధ్యలో కాణిపాకం విగ్నేశ్వరుడి దర్శనానంతరం వేలూరులోని శ్రీమహాలక్ష్మి అమ్మవారి దర్శనం చేసుకొని 6న సాయంత్రం 4 గంటలకు అరుణాచలంకు చే రుకుంటుందన్నారు. గిరి ప్రదక్షిణ అనంత రం 7న మధ్యాహ్నం 2 గంటలకు బస్సు బయలుదేరి 8న ఉదయం మహబూబ్నగర్కు చేరుకుంటుందని చెప్పారు. ఆర్టీసీ అందిస్తున్న టూర్ ప్యాకేజీని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. ఈ టూర్ ప్యాకేజీని సంస్థ అధికారిక వెబ్సైట్ tgsrtcbus.inలో ముందస్తు రిజర్వేషన్ చేసుకోవచ్చని, వివరాల కోసం సెల్ నంబర్లు 99592 26286, 94411 62588లను సంప్రదించాలని సూచించారు. -
సీఎం ఇలాకాలో భూసేక‘రణం’!
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: కొడంగల్–నారాయణపేట ఎత్తిపోతల పథకానికి గ్రహణం వీడడం లేదు. ఉమ్మడి రాష్ట్రంలోనే ఈ ప్రాజెక్ట్కు రూపకల్పన జరిగినా.. అప్పుడు, ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రంలోనూ అనేక అవాంతరాలతో అడుగు ముందుకు పడలేదు. ఎట్టకేలకు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం.. ఈ పథకం అమలుకు కృషి చేసిన ఉమ్మడి పాలమూరుకు చెందిన రేవంత్రెడ్డి సీఎం కావడంతో ఈ ఎత్తిపోతలు మళ్లీ పురుడు పోసుకున్నాయి. అయితే.. పరిహారం పెంచాలనే డిమాండ్తో భూ నిర్వాసితులు చేపట్టిన ఆందోళనలు మిన్నంటుతున్నాయి. ఉమ్మడి ఏపీలో రూపకల్పన.. నారాయణపేట, మక్తల్, కొడంగల్ నియోజకవర్గాల పరిధిలో 1.05 లక్షల ఎకరాలకు సాగు నీరు.. 5.50 లక్షల జనాభాకు తాగు నీరందించాలనే ఉద్దేశంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నారాయణపేట–కొడంగల్ ఎత్తిపోతల పథకానికి రూపకల్పన చేశారు. రూ.1,450 కోట్ల అంచనా వ్యయంతో 2014లో జీఓ 69తో పరిపాలన అనుమతులు జారీ చేశారు. రూ.133 కోట్ల నిధులు విడుదల చేశారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో అప్పటికే నిర్మించిన రాజీవ్ భీమా ఎత్తిపోతల పథకానికి కేటాయించిన నికర జలాలను ఈ ఎత్తిపోతలకు వినియోగించుకునేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. డిజైన్లో మార్పు.. అయినా.. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత బీఆర్ఎస్ అధికారంలోకి రాగా.. జీఓ 69అమలు కోసం రైతులు, మేధావులు, ప్రతిపక్షాలు, జలసాధన సమితి నేతలు ఉద్యమాలు చేశారు. కానీ అప్పటి ప్రభుత్వం ఈ పథకం డిజైన్ మార్చింది. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో నిర్మిస్తున్న ఉదండాపూర్ రిజర్వాయర్ ద్వారా నారాయణపేట, కొడంగల్ సెగ్మెంట్లలో 1.80 లక్షల ఎకరాలకు సాగు నీరందేలా ప్రణాళికలు రూపొందించినా.. అమలుకు నోచుకోలేదు. ఎట్టకేలకు గత ఏడాది శంకుస్థాపన.. 2023లో కాంగ్రెస్ అధికారంలోకి రాగా.. పాత డిజైన్ ప్రకారం కొడంగల్–నారాయణపేట ఎత్తిపోతలకు మళ్లీ అడుగు పడింది. రూ.4,369 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్ట్ నిర్మాణానికి ప్రభుత్వం 2024 ఫిబ్రవరి 21న అనుమతులు ఇచ్చింది. ఈ మేరకు సీఎం రేవంత్రెడ్డి కోస్గిలో నిర్వహించిన బహిరంగసభలో ప్రకటించడంతో పాటు శంకుస్థాపన చేశారు. ఈ మేరకు జూరాల బ్యాక్ వాటర్ నుంచి నాలుగు టీఎంసీల నీటిని నారాయణపేట–కొడంగల్ ఎత్తిపోతలకు వినియోగించనున్నారు. 2 ప్యాకేజీలుగా పనులు.. ఎత్తిపోతల్లో భాగంగా నారాయణపేట జిల్లా మక్తల్ మండలంలోని భూత్పూర్ నుంచి కానుకుర్తి చెరువు వరకు రెండు ప్యాకేజీల్లో అప్రోచ్ కాల్వలు, పంప్హౌస్లు, ప్రెషర్ మెయిన్లు, లీడ్ చానెల్, డెలివరీ సిస్టర్న్లతో పాటు సివిల్, ఎలక్ట్రిక్ పనులు చేపట్టనున్నారు. మొదటి ప్యాకేజీకి రూ.1,134.62 కోట్లు, రెండో ప్యాకేజీకి రూ.1,126.23 కోట్లు.. మొత్తం రూ.2,260.85 కోట్లు కేటాయించారు. మొత్తంగా 207 మెగావాట్ల సామర్థ్యం గల ఏడు పంప్లు ఏర్పాటు చేయనున్నారు. ‘కొడంగల్–నారాయణపేట’కు అడుగడుగునా అడ్డంకులు భూసేకరణ లక్ష్యం 1,957 ఎకరాలు 3 నెలల్లో సేకరించింది 597 ఎకరాలే.. కాట్రేవులపల్లి నుంచి కానుకుర్తి వరకు మిన్నంటిన నిరసనలు పరిహారం పెంచే వరకూ ఆందోళనలు తప్పవని రైతుల హెచ్చరిక 350 మందికి పరిహారం.. తొలి రెండు ప్యాకేజీల పనుల కోసం నారాయణపేట జిల్లాలోని మక్తల్, నారాయణపేట నియోజకవర్గాల పరిధిలో మొత్తం 1,957 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంది. ఈ ఏడాది జూన్లో సేకరణ చేపట్టగా.. ఇప్పటివరకు 590 ఎకరాల్లో మాత్రమే సర్వే పూర్తయింది. 134 ఎకరాలకు సంబంధించి అధికారులు 350 మంది రైతులకు ఎకరాకు రూ.14 లక్షల చొప్పున పరిహారం అందజేశారు. తొలి రెండు ప్యాకేజీల్లో మక్తల్, నారాయణపేట నియోజకవర్గాల పరిధిలో కాట్రేవులపల్లి నుంచి కానుకుర్తి వరకు చేపట్టిన భూసేకరణ అధికారులకు తలకు మించిన భారంగా మారింది. ఆయా మండలాల భూ నిర్వాసిత రైతులు ఎకరాకు రూ.14 లక్షల పరిహారం సరిపోదంటూ భూ సేకరణను ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. రాస్తారోకోలు, ధర్నాలు, కలెక్టరేట్ ముట్టడి వంటి కార్యక్రమాలతో సుమారు 45 రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. నారాయణపేటలో రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తున్నా రు. తాము ప్రాజెక్ట్కు వ్యతిరేకం కాదని.. బహి రంగ మార్కెట్ విలువననుసరించి 2013 చట్ట ప్రకారం పరిహారం, ఇంటికో ఉద్యోగం ఇవ్వాల ని డిమాండ్ చేస్తున్నారు. అంతవరకూ ఆందోళనలు కొనసాగుతాయని హెచ్చరిస్తున్నారు. 14 ఎకరాలు కోల్పోతున్నాం.. మా తాతల నాటి నుంచి ఈ భూమినే నమ్ముకొని బతుకుతున్నాం. సర్వే నంబర్ 355లో మాకు 14 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. మార్కెట్ విలువ ప్రకారం ఎకరాలకు రూ.35 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం స్పష్టమైన హామీతో పరిహారం ఇస్తేగానీ భూములను వదులుకోలేం. – శ్రీనివాస్రెడ్డి, భూ నిర్వాసిత రైతు. కాన్కుర్తి భూమి పోతే బతుకు కష్టమౌతుంది ఉన్న ఎకరన్నర భూమిని కోల్పోతే.. బతకడం కష్టమవుతుంది. ప్రభుత్వం మార్కెట్ ధర ప్రకారం పరిహారం ఇస్తే చాలనుకున్నాం. బలవంతంగా భూ సేకరణ చేస్తే ప్రాణాలైనా వదులకుంటాం.. కానీ భూమి వదలం. – భీమప్ప, భూ నిర్వాసిత రైతు, కాన్కుర్తి -
తేలిన లెక్కలు!
రూ.7.80 కోట్ల ధాన్యాన్ని పక్కదారి పట్టించిన రైస్ మిల్లర్ ఆర్ఆర్యాక్టు కింద నోటీసులు ప్రభుత్వం వద్ద తీసుకున్న ధాన్యంలో రూ.7.80 కోట్ల ఽఽవిలువ గల ధాన్యానికి సంబంధించి రికవరీ చేసేందుకు ఆర్ఆర్ యాక్టు కింద రైస్మిల్లు ఓనర్ వీరన్నకు నోటీసులు జారీ చేస్తాం. నోటీసులకు స్పందించకపోతే నిబంధనల మేరకు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సదరు రైస్మిల్లు ఓనర్ వీరన్న నుంచి రూ.7.80 కోట్ల విలువ గల ఆస్తులను జప్తు చేస్తాం. – హరికృష్ణ, తహసీల్దార్, కేటీదొడ్డి క్రిమినల్ కేసు విజిలెన్స్ అధికారులు ఇచ్చిన నివేదిక మేరకు రూ.7.80 కోట్ల విలువ గల ధాన్యానికి సంబంధించి ఆర్ఆర్ యాక్టు కింద రికవరీ చేయాలని కేటీదొడ్డి తహసీల్దార్కు సిఫారసు చేశాం. అలాగే, ప్రస్తుతం రైస్మిల్లులో మిగిలి ఉన్న ధాన్యాన్ని వేరే మిల్లుకు తరలించేందుకు చర్యలు చేపడుతున్నాం. ప్రభుత్వ సొమ్మును కాజేసిన నేపథ్యంలో సదరు మిల్లర్పై క్రిమినల్ కేసు నమోదు చేస్తాం. దీనిపై ఎవరి ఒత్తిళ్లకు తలొగ్గం. – విమల, సివిల్సప్లై డీఎం, గద్వాల గద్వాల: జిల్లాలో అవినీతి సామ్రాట్గా అవతారమెత్తిన రైస్ మిల్లు యజమాని నందిన్నె వీరన్న ప్రభుత్వం వద్ద తీసుకున్న ధాన్యంలో రూ.7.80 కోట్ల ధాన్యాన్ని పక్కదారి పట్టించి జేబు నింపుకొన్నట్లు విజిలెన్స్ అధికారులు విచారణ జరిపి గుర్తించారు. ఇందుకు సంబంధించి సివిల్సప్లై శాఖ ఉన్నతాధికారులకు, కలెక్టర్కు నివేదిక సమర్పించారు. ఈ నేపథ్యంలో కేటీదొడ్డి తహసీల్దార్ కార్యాలయంలో సదరు మిల్లు యజమానిపై ఆర్ఆర్ యాక్టుకింద కేసు నమోదు కావడం జిల్లా వ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ మిల్లు ఓనర్ ప్రభుత్వం నుంచి సుమారు రూ.50కోట్ల విలువ ధాన్యాన్ని తీసుకుని వాటిని దర్జాగా దొంగమార్గంలో బ్లాక్మార్కెట్కు తరలిస్తూ రూ.కోట్లు కొల్లగొట్టాడు. ఈక్రమంలోనే గత నెలా ధాన్యంలోడు లారీని అక్రమంగా కర్ణాటకకు తరలిస్తుండగా గ్రామస్తులు పట్టుకుని అధికారులకు అప్పగించడంతో ఈ అక్రమాలు వెలుగుచూశాయి. వీటి నుంచి తప్పించుకునేందుకు మిల్లు యజమాని శతవిధాలా ప్రయత్నించినప్పటికీ ‘సాక్షిశ్రీలో వరుస కథనాలు, విజిలెన్స్ అధికారుల విచారణ వెరసి ఎట్టకేలకు సదరు రైస్మిల్లు ఓనర్పై రూ.7.80 కోట్ల ప్రభుత్వం ధాన్యం కాజేసినట్లు గుర్తించి ఆర్ఆర్యాక్టు కింద కేసు నమోదైంది. విజిలెన్స్ విచారణలోవెలుగులోకి అక్రమాలు ఆర్ఆర్ యాక్టు కింద కేసు నమోదు కేసు నమోదు కాకుండా శతవిధాలా ప్రయత్నం సదరు మిల్లుకు మూడు సీజన్లలో రూ.50 కోట్ల ధాన్యం కేటాయింపు ‘సాక్షి’ వరుస కథనాలతో కదిలిన యంత్రాంగం మిల్లుకు రూ.50 కోట్ల ధాన్యం కేటాయింపు నందిన్నె రైస్మిల్లుకు 2022 రబీలో 1425 మెట్రిక్ టన్నుల ధాన్యం, 2024 ఖరీఫ్లో 5948 మె.టన్నులు, 2024–25 రబీలో 10,294 మె.టన్నులు మొత్తం రూ.50కోట్ల విలువ గల ధాన్యాన్ని సివిల్సప్లై శాఖ అధికారులు కేటాయించారు. ఇందులో ఇప్పటివరకు 2024 ఖరీఫ్, రబీకి సంబంధించి కేవలం రూ.10 కోట్ల విలువ గల సీఎమ్మార్ మాత్రమే ప్రభుత్వానికి అందించగా.. 2022 రబీకి నిర్వహించిన టెండర్ సరుకు ఇంకా అప్పజెప్పలేదు. మొత్తంగా రూ.40కోట్ల విలువ గల బియ్యాన్ని ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉంది. -
నిమజ్జనానికి పకడ్బందీ ఏర్పాట్లు
గద్వాల క్రైం: వినాయక నిమజ్జనానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని, అల్లర్లకు, ఘర్షణలకు తావివ్వకుండా నిఘా ఉంచాలని ఎస్పీ శ్రీనివాసరావు ఆదేశించారు. శుక్రవారం వివిధ మండపాల నిర్వాహకులు నిమజ్జన కార్యక్రమాలు చేపట్టగా.. ఎస్పీ నదిగ్రహారం సమీపంలోని కృష్ణానది తీర ప్రాంతంలోని నిమజ్జన ప్రాంతాలను పరిశీలించారు. నిమజ్జనం సమయంలో భక్తుల కోలాహలం, నిర్వాహకుల కార్యక్రమాలపై సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. మండపాల నుంచి పురవీధుల గుండా ఉరేగింపుగా తరలించే తరుణంలో ప్రజలకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టాలన్నారు. అల్లర్లకు, ఘర్షణలకు తావివ్వకుండా నిఘా ఉంచాలన్నారు. నిమజ్జనం సమయంలో ఎవరు కూడా నది వెలుపలికి వెళ్లకుండా కట్టడి చేయాలన్నారు. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీరు ప్రవాహం కారణంగా ఎలాంటి అపశృతి జరగకుండా గజ ఈతగాళ్లు నిరంతరం అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎస్పీ వెంట సీఐ శ్రీను, కళ్యాణ్కుమార్ తదితరులు ఉన్నారు. -
ధ్యాన్చంద్ను ఆదర్శంగా తీసుకోవాలి
గద్వాలటౌన్: ఒలింపిక్స్ హాకీలో 8 పతకాలు సాధించి దేశ ప్రతిష్టను ప్రపంచ నలమూలల వ్యాపింపజేసిన హాకీ మాంత్రికుడు ధ్యాన్చంద్ను ప్రతి క్రీడాకారుడు ఆదర్శంగా తీసుకోవాలని అడిషనల్ కలెక్టర్ లక్ష్మినారాయణ పిలుపునిచ్చారు. జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం స్థానిక మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియంలో ఉన్న ధ్యాన్చంద్ విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం క్రీడాకారులనుద్ధేశించి మాట్లాడారు. ధ్యాన్చంద్ను స్ఫూర్తిగా తీసుకుని క్రీడల్లో రాణించాలన్నారు. భారత అత్యున్నత క్రీడా అవార్డు ‘మేజర్ ధ్యాన్చంద్ ఖేల్రత్నశ్రీగా ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు. ప్రతి ఒక్కరూ క్రీడలను అలవర్చుకుని ఆరోగ్యవంతమైన సమాజం నిర్మించాలని సూచించారు. ఉత్సాహంగా ర్యాలీ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని క్రీడా ఐక్యావేదిక, గద్వాలలోని వివిధ క్రీడా సంఘాలు సంయుక్తంగా నిర్వహించిన ర్యాలీని అడిషనల్ కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. పట్టణ ప్రధాన రహదారుల గుండా ర్యాలీ ఉత్సాహంగా సాగింది. అనంతరం లాంగ్లీవ్ స్పోర్ట్స్.. అందరికీ క్రీడలు – అందరికీ ఆరోగ్యం అంటూ క్రీడాకారులు, వ్యాయమ ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున నినదించారు. క్రీడాజ్యోతితో పలవురు క్రీడాకారులు ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం క్రీడాకారులు ప్రతిజ్ఞగా చేశారు. జిల్లా కేంద్రంలోని పలు ప్రైవేటు విద్యా సంస్థలలో సైతం జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీవైఎస్ఓ జితేందర్, వివిధ క్రీడా సంఘాల కోచ్లు, వ్యాయా మ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. బాలబ్రహ్మేశ్వర ఆలయంలో కర్ణాటక మంత్రి పూజలు అలంపూర్రూరల్: జోగుళాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాన్ని కర్ణాటక రాష్ట్ర చిన్న నీటిపారుదల, సైన్స్ టెక్నాలజీ శాఖ మంత్రి బోసురాజు దంపతులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఏఐసీసీ కార్యదర్శి సంపత్కుమార్ దంపతులు బాల బ్రహ్మేశ్వర స్వామి సన్నిధిలో వారికి స్వాగతం పలికి మంత్రి దంపతులతో కుంకుమార్చన, పూజా కార్యక్రమాలను చేయించారు. అర్చకులు మంత్రికి శేష వస్త్రాలతో సత్కరించి తీర్ధ ప్రసాదాలను అందజేశారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ నాగేశ్వర్రెడ్డి, ఈఓ దీప్తి ఽమార్కెట్ యార్డ్ చైర్మన్ దొడ్డప్ప, వైస్చైర్మన్ కుమార్, ధర్మకర్తలు తదితరులు ఉన్నారు. మాతృ భాషలోవిద్యాబోధన జరగాలి గద్వాలటౌన్: పట్టణంలోని పలు విద్యా సంస్థలలో మాతృభాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. శుక్రవారం స్థానిక ఎంఏఎల్డీ ప్రభుత్వ డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రిన్సిపాల్ షేక్ కలందర్ బాషా పాటు పలవురు తెలుగుబాష కొవిదులు పాల్గొని తెలుగు భాషా వికాసానికి తోడ్పడతామని సామూహిక ప్రతిజ్ఞ చేశారు. అంతకుముందుగా గిడుగు రామమూర్తి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రాథమిక స్థాయి నుంచి తెలుగు భాషలో విద్యాబోధన జరగాలని కోరారు. మాతృ భాషలో విద్యాబోధన జరిగినప్పుడే విద్యా ప్రమాణాలు మెరుగు పడతాయన్నారు. అనంతరం విద్యార్థులకు మెమోంటోలను అందజేశారు. విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ ఉండవెల్లి: సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న నేపథ్యంలో విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆర్డీఓ అలివేలు ఆదేశించారు. శుక్రవారం మండలంలోని అలంపూర్ చౌరస్తాలోని మహాత్మాజ్యోతి బాపులే గురుకుల పాఠశాలను ఆర్డీఓ తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజనం, ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించారు. విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తాగునీటి సౌకర్యం లేదని, సరిపడా మూత్రశాలలు లేవని, దోమలతో ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు సమస్యలను ఏకరువు పెట్టారు. ఆయా సమస్యలపై ప్రిన్సిపాల్తో ఆరా తీశారు. అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని, శుద్ధమైన తాగునీరు అందించాలని ఆదేశించారు. వేరుశనగ క్వింటా రూ.5,012 గద్వాల వ్యవసాయం: గద్వాల మార్కెట్ యా ర్డుకు శనివారం 44 క్వింటాళ్ల వేరుశనగ వ చ్చింది. గరిష్టం రూ. 5012, కనిష్టం రూ. 356 9, సరాసరి రూ. 4669 ధరలు లభించాయి. -
మహిళల ఆర్థికాభివృద్ధికి కృషి
● స్వయం సహాయక సంఘాల సభ్యులు మార్కెటింగ్ నైపుణ్యాలను పెంపొందించుకోవాలి ● కలెక్టర్ బీఎం సంతోష్ గద్వాల న్యూటౌన్: స్వయం సహాయక సంఘాల సభ్యుల ఆర్థికాభివృద్ధి కోసం అనేక చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. శుక్రవారం స్థానిక అనంత కన్వెన్షన్ హాల్లో నీతి ఆయోగ్–ఆస్పిరేషనల్ బ్లాక్స్ పోగ్రాంలో భాగంగా స్వయం సహాయక సంఘాల ఆద్వర్యంలో ‘ఆకాంక్ష హట్–ఎగ్జిబిషన్ అండ్ సేల్శ్రీలో భాగంగా ఏర్పాటు చేసిన స్టాల్స్ను మధ్యాహ్నం ఆయన సందర్శించారు. మెప్మా, డీఆర్డీఏ ఆద్వర్యంలో స్వయం సహయక సంఘాల మహిళలు తయారు చేసిన హ్యండ్లూమ్ వస్త్రాలు, గద్వాల చీరలు, సేంద్రీయ ఉత్పత్తులు, మిల్లెట్స్, పర్యావరణ రహిత వస్తువులు, వివిధ రకాల క్రాఫ్ట్స్, పలు రకాల స్వీట్స్, ఆభరణాలు తదితర స్టాల్స్ను కలెక్టర్ సందర్శించారు. మాట్లాడుతూ ఎంతో నైపుణ్యంతో స్వయం సహాయక సంఘాల మహిళలు పలు రకాల వస్తువులు, డోర్ మ్యాట్స్, చీరలు, స్వీట్స్ తయారు చేస్తున్నారని చెప్పారు. వివిధ రకాల వ్యాపారాలు నిర్వహించుకునే మహిళలకు మార్కెటింగ్ నైపుణ్యాలు పెంపొందే విధంగా అన్ని చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ప్రభుత్వం అన్ని విధాలా సహకారం : ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి వివిధ రకాల వ్యాపారాలు నిర్వహించుకొని, ఆర్థికంగా అభివృద్ది చెందేందుకు స్వయం సహాయక సంఘాల మహిళలకు ప్రభుత్వం అన్ని విధాలా సహకారం అందిస్తుందని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి అన్నారు. ‘ఆకాంక్ష హట్–ఎగ్జిబిషన్ అండ్ సేల్శ్రీలో భాగంగా ఏర్పాటు చేసిన స్టాల్స్ను అడిషనల్ కలెక్టర్ నర్సింగరావ్తో కలిసి ఉదయం 11 గంటలకు ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ మహిళల వ్యాపారాల అభివృద్ధి కోసం ఎక్కడ స్టాల్లు ఏర్పాటు చేయాలనుకున్నా వారికి పూర్తి సహకారం అందిస్తామని పేర్కొన్నారు. వారి అభివృద్ధి కోసం మెప్మా, డీఆర్డీఏల ద్వార రుణాలు అందించి, పోత్స్రహిస్తామని తెలిపారు. మున్సిపల్ కమిషనర్ జానకి రామ్, జిల్లా పశుసంవర్ధకశాఖాధికారి డాక్టర్ వెంకటేశ్వర్లు, జీఎం ఇండస్ట్రీస్ రామలింగేశ్వర్గౌడ్ పాల్గొన్నారు. -
బీజేపీ నిర్లక్ష్యం వల్లే యూరియా కొరత
రాజోళి: బీజేపి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్లే రైతులకు యూరియా కొరత ఏర్పడుతుందని ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ అన్నారు. మండలంలోని పెద్దధన్వాడలో శుక్రవారం పలు అభివృద్ధి పనుల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలవకపోయినప్పటికీ.. అభివృద్ధిలో మాత్రం ఓడిపోనివ్వమని అన్నారు. సీఎం రేవంత్రెడ్డితో నియోజకవర్గ సమస్యలు తెలియచేశానని, దానికి స్పందించిన ఆయన పలు పనులు మంజూరు చేశారన్నారు. గెలిచినా.. ఓడినా నియోజకవర్గ ప్రజలకు అండగా ఉంటానని, రైతుల ఽశ్రేయస్సు కోసమే పాటు పడతానని అన్నారు. యూరియా కొరతను కూడా రైతులు తన దృష్టికి తీసుకువచ్చారని, వరి పంటల కారణంగా యూరియా మరింత మోతాదులో అవసరమవుతుందని దాని విషయమై ఉన్నతాధికారులతో మాట్లాడి, రైతులకు యూరియా కొరత లేకుండా చూస్తానన్నారు. ఇందిరమ్మ ఇళ్లతో పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు రేవంత్ సర్కారు ముందుకు వచ్చి వారికి గూడును ఏర్పాటు చేస్తుందని అన్నారు. పెద్ద ధన్వాడ గ్రామానికి రోడ్డు లేక ఏళ్లు గడుస్తుందని, గత ప్రభుత్వం దానిపై పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిందని, దాని కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ప్రస్తు తం వర్షాల కారణంగా రోడ్డు మరింత దెబ్బతినడంతో తాత్కాలిక మరమ్మతులు చేపడుతున్నట్లు తెలిపారు. అనంతరం ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల కు చె క్కులు అందచేశారు. కార్యక్రమంలో దస్తగిరి,కుమార్,ఎల్లప్ప,అలెగ్జాండర్ తదిదరులు పాల్గొన్నారు. పోలీసుల పహారా మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ గ్రామంలో పలు అభివృద్ధి పనులకు వస్తున్నాడని తెలిసిన క్రమంలో గ్రామానికి చెందిన యువకులు, ఇథనాల్ ఫ్యాక్టరీ వ్యతిరేక కమిటీల పేరుతో సంపత్కుమార్ పర్యటనను అడ్డుకోవాలని సోషల్ మీడియాలో మెసేజ్లు పెట్టడంతో పోలీసులు ముందస్తుగా పహారా నిర్వహించారు. ఎలాంటి శాంతిభద్రతల సమస్యలు తల్తెకుండా ముందస్తుగా చర్యలు చేపట్టినట్లు గ్రామస్తులకు తెలియచేస్తూ గస్తీ నిర్వహించారు. కొందరు బీఆర్ఎస్ నాయకులను హౌస్ అరెస్ట్ చేసినట్లుగా సమాచారం. -
హ్యాండ్బాల్ కోచ్నునియమించాలి..
ప్రధాన స్టేడియంలో 1997 నుంచి 2006 వరకు రవికుమార్ హ్యాండ్బాల్ కోచ్గా పనిచేసినప్పుడు ఎందరో క్రీడాకారులు వెలుగులోకి వచ్చారు. అనంతరం నేను 2009 వరకు కోచ్గా పనిచేసి అనివార్య కారణాలతో మానేశాను. తర్వాత కోచ్ నియామకం చేపట్టలేదు. అయినా క్రీడపై ఉన్న ఆసక్తితో ఇప్పటికీ శిక్షణనిస్తున్నా. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి శాశ్వత పద్ధతిన కోచ్ను నియమిస్తే మరింత మంది క్రీడాకారులను తయారు చేయవచ్చు. – ఎండీ జియావుద్దీన్, సీనియర్ హ్యాండ్బాల్ క్రీడాకారుడు, మహబూబ్నగర్ ప్రతిపాదనలు పంపించాం.. కోచ్ల నియామకంపై ఇ దివరకే ప్రతిపాదనలు పంపించాం. నూతన క్రీ డాపాలసీతో ఔత్సాహిక క్రీడాకారులకు మేలు జరగనుంది. స్టేడియంలలో కోచ్ల నియామకం జరిగే అవకాశం ఉంది. క్రీడా శిక్షణతో నైపుణ్యంగల క్రీడాకారులు వెలుగులోకి వస్తారు. గ్రామీణస్థాయి నుంచి క్రీడలను అభివృద్ధి చేసుకోవచ్చు. – ఎస్.శ్రీనివాస్, డీవైఎస్ఓ, మహబూబ్నగర్ ● -
పడిగాపులు..!
జిల్లావ్యాప్తంగా యూరియా కోసం రైతుల వెతలు గట్టు/అయిజ/శాంతినగర్: జిల్లాలో యూరియా కష్టాలు తొలగడం లేదు. పంపిణీ కేంద్రాల వద్ద రాత్రింబవళ్లు రైతులు బారులు తీరుతున్నా.. వారికి దక్కుతాయో లేదో తెలియని పరిస్థితి నెలకొంది. గురువారం గట్టు సహకార సంఘం దగ్గర యూరియా కోసం రైతులు పెద్ద ఎత్తున గుమిగూడారు. 450 బస్తాల యూరియా రావడంతో వాటి కోసం రైతులు బుధవారం రాత్రి నుంచే క్యూలైన్లో పాసుపుస్తకం, ఆధార్ జిరాక్స్ పత్రాలు కల్గిన కవర్లను వరుస క్రమంలో పెట్టారు. యూరియాను అందించే గట్టులోని సహకార సంఘం దగ్గర రైతులు రాత్రి, పగలు అనే తేడా లేకుండా పడిగాపులు పడుతున్నారు. వానాకాలంలో రైతులు సాగు చేసిన పంటలకు యూరియా అవసరం కాగా, ప్రస్తుతం యూరియా బయట మార్కెట్లో లభించడం లేదు. కేవలం సహకార సంఘం ద్వారా మాత్రమే పరిమిత సంఖ్యలో రైతుకు 2 బస్తాల మాదిరిగా అందిస్తుండడంతో రైతులు వాటి కోసం పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఇలా వచ్చిన రైతును అదుపు చేసేందుకు పోలీసులు రంగప్రవేశం చేయాల్సి వస్తోంది. గట్టుతో పాటుగా చుట్టు పక్కల గ్రామాల నుంచి యూరియా బస్తాల కోసం రాత్రి, పగలు ఎదురు చూసే పరిస్థితి నెలకొంది. ఓ వైపు వినాయక చవితి పండుగ జరుపుకొంటూనే మరో వైపు రాత్రి పూట సహకార సంఘం దగ్గర యూరియా కోసం క్యూలైన్లో జిరాక్స్ పత్రాలు కల్గిన కవర్లను పెడుతున్నారు. వ్యవసాయ అధికారుల సమక్షంలో సహకార సంఘం సిబ్బంది రైతులకు యూరియాను అందిస్తున్నారు. వర్షంలో తడుస్తూ.. అయిజ సింగిల్విండో కార్యాలయం వద్ద యూరియా కోసం గురువారం తెల్లవారుజాము నుంచే బారులు తీరారు. బుధవారం సెలవురోజు కావడంతో గురువారం తెల్లవారుజామునుంచే సుమారు 600 మంది రైతులు వర్షంలో తడుస్తూ క్యూలో నిల్చున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారండంతో శాంతినగర్ సీఐ టాటాబాబు, ఎస్ఐ శ్రీనివాసరావు, పోలీస్ బృందంతో కలిసి రైతులను కట్టడి చేశారు. జిల్లా వ్యవసాయ అధికారి సక్రియానాయక్, మండల వ్యవసాయ అధికారి జనార్ధన్, ఏఈఓలు అక్కడకు చేరుకొని సింగిల్ విండో అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డితో మాట్లాడి పరిస్థితిని తెలుసుకున్నారు. అదేవిధంగా డీఏఓ ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడారు. రైతులకు ఇచ్చేందుకు యూరియా నిల్వలు లేకపోవడంతో చివరకు రైతులకు టోకెన్లు ఇచ్చి.. టోకెన్లు తీసుకున్న వారికి రైతువేదిక వద్ద పర్మిట్ రషీదులు అందజేశారు. అక్కడ కూడా రైతుల తోపులాటతో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. పోలీసులు కలుగజేసుకొని గొడవను సద్దుమణిగించారు. ఉండవెల్లిలోని కలుగోట్ల పీఏసీఎస్ గోదాంలో యూరియా పంపిణీలో గందరగోళం నెలకొంది. ఉన్న ఒక్క మిషన్ చార్జింగ్ అయిపోవడంతో రైతులు గంటలతరబడి పడిగాపులు కాశారు. అక్కడే ఉన్న ఏఓ అనితతో వాగ్వాదానికి దిగారు. దీనికితోడు ఎకరానికి ఒక్క సంచి ఇస్తామని చెప్పడంతో రైతులు ఆందోళన చెందారు. పత్తి పంట మందు లేక ఎర్రగా మారుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎర్రవల్లి పీఏసీఎస్కు 750 బస్తాల యూరియా రాగా.. ఉదయం నుండే కార్యాల యం ముందు రైతులు బారులు తీరారు. పొలం పాస్ పుస్తకాలు, ఆధార్ కార్డులను క్యూలో పెట్టి యూరియా బస్తాల కోసం ఎదురుచూడగా.. అంతలోనే సర్వర్ మొరాయించింది. దీంతో మిగిలిన రైతులకు టోకెన్లు అందించడంతో నిరాశతో వెనుదిరిగారు. కడుపు కాల్చుకొని.. క్యూలో నిల్చొని వడ్డేపల్లి మండలంలో యూరియా కోసం రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. పీఏసీఎస్ ఎదుట గురువారం తెల్లవారుజాము నుంచి రైతులు నిల్చుని తెచ్చుకోవాల్సిన పరిస్థితులు దాపురించాయి. ఉదయం వెళ్లిన రైతులు కడుపు కాల్చుకుని సాయంత్రం వరకు క్యూలో నిల్చుంటే ఒక్కో పాస్ పుస్తకానికి రెండు చొప్పున పంపిణీ చేయడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎకరాలను బట్టి యూరియా బస్తాలు ఇవ్వకుండా పాసుపుస్తకం ప్రకారం ఇవ్వడంతో ఆగ్రహం వ్యక్తంచేశారు. యూరియా అందించకపోతే పంటలు ఏపుగా పెరిగే పరిస్థితి వుండదని, అవసరమైనంత యూరియా సరఫరా చేసి నష్టాల పాలవకుండా చూడాలని ప్రభుత్వాన్ని, అధికారులను రైతులు కోరుతున్నారు. రాత్రింబవళ్లు పీఏసీఎస్ల వద్ద ఎదురుచూపులు సరిపడా నిల్వలు లేకపోవడంతో టోకెన్ల అందజేత పలు చోట్ల తోపులాట, ఉద్రిక్తత.. పోలీసుల రంగప్రవేశం -
ప్రతి రైతుకూ యూరియా అందేలా చూస్తాం
యూరియా కొరత గట్టులో ఒక్కటే లేదని, రాష్ట్రం, దేశం మొత్తం మీద యూరియా కొరత ఉందని, రైతులకు కావాల్సిన యూరియాను అందించే విధంగా చర్యలు తీసుకుంటామని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి తెలిపారు. గురువారం గట్టుకు వచ్చిన ఎమ్మెల్యే,సహకార సంఘం దగ్గర యూరియా కోసం పెద్ద ఎత్తున గుమిగూడిన రైతులను చూసి, వారి దగ్గరకు వెళ్లి పలకరించారు. యూరియా సరఫరాపై ఆరా తీశారు. రైతులు యూరియా కోసం అధైర్య పడాల్సిన అవసరం లేదని ఇప్పటికే ఇక్కడ 400 బస్తాల యూరియా అందుబాటులో ఉందని, మరో 450 బస్తాల యూరియా లోడు వస్తుందని తెలిపారు. ఆయా దేశాల యుద్దం కారణంగా దేశంలో యూరియా కొరత ఏర్పడిందని, రైతు సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుందని తెలిపారు. గట్టుకు యూరియా కేటాయింపులపై ఉన్నతాధికారులతో ఎమ్మెల్యే నేరుగా ఫోన్లో మాట్లాడారు. ప్రతి రైతులకు యూరియా బస్తాలు అందించే విధంగా కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలిపారు. -
నడిగడ్డలో కాంగ్రెస్కు భారీ షాక్
గద్వాలటౌన్: నడిగడ్డలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. గద్వాల మున్సిపల్ మాజీ చైర్మన్ బీఎస్ కేశవ్తో పాటు పలువురు మాజీ కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. నమ్ముకున్న కార్యకర్తల కోసమే కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్లు వారు ప్రకటించారు. ఎమ్మెల్సీ ఎన్నికల ముందు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన వీరు.. ఏడాది తరువాత తిరిగి సొంత గూటికి చేరడం విశేషం. బీఎస్ కేశవ్ రెండు సార్లు మున్సిపల్ చైర్మన్గా పనిచేశారు. గద్వాల పట్టణంలో బలమైన నాయకుడిగా గుర్తింపు సాధించారు. ఆయన పార్టీని వీడడం కాంగ్రెస్కు చాలా నష్టం చేకూరనుందని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. వారికే అందలం.. ఈమేరకు మున్సిపల్ మాజీ చైర్మన్ బీఎస్ కేశవ్ గురువారం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన తరువాత విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. గద్వాల కాంగ్రెస్ పార్టీలోని కార్యకర్తలను కాంగ్రెస్ పెద్దలు, మంత్రులు పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీలో సామాజిక న్యాయం ఆర్భాటమే తప్ప.. ఆచరణలో కనిపించడం లేదన్నారు. పార్టీ కార్యకర్తల కంటే పార్టీని విమర్శించే వారికే అందలం వేస్తున్నారని విమర్శించారు. ‘నేను కాంగ్రెస్ పార్టీలో లేను, బీఆర్ఎస్లోనే కొనసాగుతున్న.. శ్రీఅని చెప్పుకుంటున్న ప్రజాప్రతినిధికి మంత్రులు దాసోహం కావడం శోచనీయమని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి జూపల్లి కృష్ణరావు గద్వాల పట్టణ అభివృద్ధి, మా రాజకీయ భవిష్యత్పై హామీ ఇవ్వడం వల్లే తనతో పాటు 15 మంది కౌన్సిలర్లు, వందల మంది కార్యకర్తలు బీఆర్ఎస్ను వీడాల్సి వచ్చిందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన తరువాత గద్వాలలో జరిగిన రాజకీయ పరిణామాలతో మంత్రి జూపల్లి మమ్మల్ని కనీసం పట్టించుకున్న పాపన పోలేదన్నారు. కాంగ్రెస్ పెద్దలు, మంత్రులు బీసీ డిక్లరేషన్, బీసీల రిజర్వేషన్లు గురించి మాట్లాడుతుంటే నవ్వొస్తుందని ఎద్దేవా చేశారు. నడిగడ్డలో బలమైన బీసీ బిడ్డగా సరిత కాంగ్రెస్ నుంచి పోటీచేసి స్వల్ప ఓట్లతో ఓడిపోతే ఎందుకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని ప్రశ్నించారు. నిజమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు సంక్షేమ పథకాలు అందడం లేదని, నామినేటేడ్ పదవులు రావడం లేదని చెప్పారు. కపట ప్రేమ ప్రదర్శించే వారికి కాంగ్రెస్ పార్టీ గుర్తింపునిస్తుందన్నారు. బీఆర్ఎస్తోనే అభివృద్ది సాధ్యమని చెప్పారు. మున్సిపల్ మాజీ చైర్మన్, పలువురు మాజీ కౌన్సిలర్ల రాజీనామా వచ్చే నెలలో బీఆర్ఎస్లోచేరికకు ముహూర్తం కార్యకర్తల కంటే పార్టీని విమర్శించే వారికే గుర్తింపు : బీఎస్ కేశవ్ -
అందరి సహకారంతో గట్టుకు గుర్తింపు
గట్టు: దేశంలోనే వెనుక బడిన ప్రాంతాల అభివృద్ది సూచిక నీతి అయోగ్ ఆస్పరేషన్ బ్లాక్లో గట్టుకు దేశ వ్యాప్తంగా 5వ స్థానం గుర్తింపు రావడానికి అందరి సహకారం ఎంతో ఉందని కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. గురువారం గట్టులో నిర్వహించిన నీతిఆయోగ్ సంపూర్ణ అభియాన్ కార్యక్రమంలో భాగంగా మండల అభివృద్ధికి కృషి చేసిన జిల్లా, మండల స్థాయి అధికారులను ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డితో కలిసి అభినందిస్తూ, మెమోంటోలు, సర్టిఫికెట్లను అందించి సత్కరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. దేశంలో 5వ స్థానానికి గట్టు మండలాన్ని తీసుకురావడం జరిగిందన్నారు. గట్టు మండల అభివృద్ధికి రాజకీయ పరంగా, పరిపాలనా పరంగా, అన్ని విధాల సహాయ సహకారాలు అందించడంలో వివిధ శాఖల అధికారుల విశేష కృషి ఉందన్నారు. దేశంలో 5వ స్థానం, రాష్ట్రంలో 2వ స్థానం సాధించినందుకు గవర్నర్ చేతుల మీదుగా అవార్డు అందుకున్నట్లు తెలిపారు. ఇదే స్ఫూర్తితో క్షేత్ర స్థాయిలో మంచి సేవలను అందించిన అధికారులను గుర్తించి సన్మానించుకోవాలనే ఉద్దేశంలోనే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నీతి అయోగ్ ద్వారా మంజూరైన రూ.కోటిలో 70లక్షలతో ఆధునిక సాంకేతికత గల భవనాలను నిర్మించడం జరుగుతుందన్నారు. భవిష్యత్లో గట్టు రూపురేఖలు మార్పు: ఎమ్మెల్యే రాబోయో రోజుల్లో గట్టు మండల రూపురేఖలు మారుతాయని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి అన్నారు. సంపూర్ణ అభియాన్లో దేశంలోనే గట్టుకు 5వ స్థానం గుర్తింపు రావడం సంతోషంగా ఉందని, ఈ విజయం అందరిది అన్నారు. జిల్లా స్థాయి, మండల స్థాయి అధికారులను సన్మానించి, మెమొంటోలను అందించారు. అదనపు కలెక్టర్ నర్సింగరావు, మాజీ ఎంపీపీ విజయ్కుమార్, తహసీల్దార్ విజయ్కుమార్ పాల్గొన్నారు. ఫోటో(28జీడీఎల్–401) గట్టు ఎంపీడీఓ చెన్నయ్యకు మెమోంటో అందజేస్తున్న కలెక్టర్ బీఎం సంతోష్, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి -
కొలువుదీరిన బొజ్జ గణపయ్య
గద్వాలటౌన్/గద్వాల క్రైం: జిల్లాలో వినాయక చవితి పండగను బుధవారం ప్రజలు భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. జిల్లా వ్యాప్తంగా సుమారు వెయ్యి విగ్రహాలకు పైగా ప్రతిమలను ప్రతిష్ఠించారు. పాటలు, భజనలతో మండపాలు హోరెత్తాయి. కలెక్టరేట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మండపంలోని మట్టి వినాయకుడిని కలెక్టర్ బీఎం సంతోష్ దర్శించుకొని శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. ప్రజలు, రైతులు సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. సకల విష్నూలు తొలగించే గణనాథుడి ఆశీస్సులు ఎల్లప్పుడు ప్రజలపై ఉండాలని ఆకాంక్షించారు. ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ శ్రీనివాసరావు దంపతులు, కార్యాలయ సిబ్బంది గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. జిల్లాలోని ప్రజలందరు సుఖ సంతోషలతో జీవించాలని, చట్టాలపై ప్రతి ఒక్కరు అవగహన కలిగి ఉండాలన్నారు. బీఎస్కే యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మట్టి గణపతికి మున్సిపల్ మాజీ చైర్మన్ బీఎస్ కేశవ్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి సరిత పట్టణంలోని పలు మండపాలలోని వినాయకులను దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఇదిలాఉండగా, వినూత్న ఆకారాల్లో కొలువుదీరిన గణనాథులు ఆకట్టుకున్నాయి. -
వసతులున్నా.. ఆటలు అంతంతే..!
మహబూబ్నగర్ క్రీడలు: ఉమ్మడి జిల్లాలో క్రీడారంగాన్ని కోచ్ల కొరత తీవ్రంగా వేధిస్తోంది. అన్ని జిల్లాల్లో మైదానాలు ఉన్నప్పటికీ కోచ్లు లేకపోవడంతో ఔత్సాహిక క్రీడాకారులు శిక్షణకు దూరమవుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. కొందరు పీఈటీలు, సీనియర్ క్రీడాకారులు తమకున్న ఆసక్తితో క్రీడాకారులకు స్వచ్ఛందంగా శిక్షణనిస్తున్నారు. కాని కోచ్లు లేకపోవడంతో చాలా క్రీడల్లో ఉమ్మడి జిల్లా క్రీడాకారులు వెనుకబడుతున్నారు. ● మహబూబ్నగర్లోని ప్రధాన స్టేడియం ఉమ్మడి జిల్లాకే తలమానికం. ఇంత గతంలో కోచ్లతో కళకళలాడిన ఈ స్టేడియం ప్రస్తుతం నలుగురు కోచ్లతోనే నెట్టుకొస్తున్నారు. 18 ఏళ్లుగా కోచ్ల కొరత తీవ్రంగా వేధిస్తోంది. కేవలం అథ్లెటిక్స్, బాస్కెట్బాల్, వాలీబాల్, స్విమ్మింగ్ కోచ్లు మాత్రమే ఉన్నారు. వేసవి సెలవుల్లో స్విమ్మింగ్ కోచ్ శిక్షణ ఇస్తారు. ఖేలో ఇండియా ఫుట్బాల్ కోచ్ ఉండగా ఇండోర్ స్టేడియంలో పే అండ్ ప్లే పద్ధతిలో బ్యా డ్మింటన్ కోచ్ మాత్రమే ఉన్నారు. మిగతా క్రీడలకు శిక్షకులు లేకపోవడంతో ఔత్సాహిక క్రీడాకారులు నిరాశకు గురవుతున్నారు. కబడ్డీ, హాకీ, ఖో–ఖో, హ్యాండ్బాల్, ఇండోర్లో బాక్సింగ్, జూడో, టేబుల్ టెన్నీస్ తదితర క్రీడలకు కోచ్ల అవసరం ఉంది. ● 2007 నుంచి స్టేడియంలలో శాశ్వత పద్ధతిన కోచ్ల నియామకం చేపట్టలేదు. ఇప్పుడున్న కోచ్లు కూడా తాత్కాలిక పద్ధతిన పని చేస్తున్నారు. మహబూబ్నగర్ జిల్లా యువజన, క్రీడాశాఖ పరిధిలో జిల్లాకేంద్రంలోని మెయిన్ స్టేడియంతో పాటు మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం, ఎంవీఎస్ కళాశాలలోని ఇండోర్ స్టేడియం, జడ్చర్లలోని మినీ స్టేడియం, సీసీకుంట అల్లీపూర్, భూత్పూర్ మండలం పోతులమడుగులో మినీ ఇండోర్ స్టేడియంలు ఉన్నాయి. మెయిన్ స్టేడియంలో ఐదుగురు, అల్లీపూర్లో కబడ్డీ కోచ్ మాత్రమే ఉన్నారు. ● వనపర్తిలో ఒక క్రీడా ప్రాంగణం, మరో ఇండోర్ స్టేడియం ఉండగా ఒక్క కోచ్ కూడా లేరు. హాకీ అకాడమీలో ఇద్దరు కోచ్లు ఉన్నారు. ● నాగర్కర్నూల్ జిల్లాలోని కొల్లాపూర్, అచ్చంపేటలో మినీ స్టేడియంలు, కల్వకుర్తిలో ఇండోర్ స్టేడి యం ఉన్నాయి. కొల్లాపూర్కు ఇటీవల అథ్లెటిక్స్ కోచ్ రాగా కల్వకుర్తిలో ఫుట్బాల్ కోచ్, ఖేలో ఇండియా కబడ్డీ కోచ్ ఉన్నారు. ● నారాయణపేట జిల్లా మక్తల్లో స్టేడియం ఉండ గా ఒక్క కోచ్ లేరు. ధన్వాడలో ఒక రెజ్లింగ్ కోచ్, నారాయణపేటలో ఖేలో ఇండియా అథ్లెటిక్స్ కోచ్ ఉన్నారు. ● గద్వాలలో స్టేడియం, ఇండోర్ స్టేడియం, ఎర్రవల్లి చౌరస్తాలో ఇండోర్ స్టేడియం ఉన్నాయి. గద్వాలలో ఖేలో ఇండియా ఫుట్బాల్ కోచ్ మాత్రమే ఉన్నారు. అయితే ఉమ్మడి జిల్లాలోని చాలా మైదానాల్లో వాచ్మెన్లు కూడా లేని పరిస్థితి నెలకొంది. కొరతలో యువజన, క్రీడాశాఖలు నిధుల కొరతను ఎదు ర్కొంటున్నాయి. 2006 వరకు వార్షిక నిర్వహణ పేరిట అప్పటి రాష్ట్ర ప్రభుత్వం డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీలకు రూ.4 లక్షల నుంచి రూ.8 లక్షల వరకు నిధులు మంజూరు చేసేది. ఈ నిధులతో క్రీడల నిర్వహణ, క్రీడాసంఘాలకు ఆర్థికసాయంతో పాటు రాష్ట్ర, జాతీయస్థాయి పోటీలకు వెళ్లే క్రీడాకారులకు టీఏ, డీఏలు చెల్లించేవారు. కాని ప్రస్తుతం నిధులు విడుదల చేసిన దాఖలాలు లేవు. వనపర్తి, గద్వాల, నాగర్కర్నూల్, నారాయణపేట జిల్లాల్లో పరిస్థితి మరీ దయనీయంగా మారింది. ఆయా జిల్లాల్లో ప్రత్యేక క్రీడాశాఖలు ఏర్పాటు చేసినా నిధుల కొరతతో కొట్టుమిట్టాడుతున్నా యి. నూతన క్రీడాపాలసీలో కోచ్ల నియామకంతో పాటు క్రీడాశాఖలను బలోపేతం చేయాలని సీనియర్ క్రీడాకారులు కోరుతున్నారు. ఉమ్మడి జిల్లాలో క్రీడల్లో శిక్షణ ఇచ్చేందుకు గురువులు కరువు కోచ్లు లేక వెలవెలబోతున్న మైదానాలు కొత్త క్రీడాపాలసీలో శిక్షకుల నియామకాలపై ఆశలు -
‘108’ అంబులెన్స్ సేవలను వినియోగించుకోండి
ధరూరు: జిల్లాలో ప్రతిఒక్కరూ జీవీకే ఈఎంఆర్ఐ 108, 102 అంబులెన్స్ సేవలను సద్విరనియోగం చేసుకోవాలని ఉమ్మడి జిల్లా ప్రోగ్రాం మేనేజర్ రవి అన్నారు. మంగళవారం ఆయన మండలంలోని ఉప్పేరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి 108, 102 వైద్య సిబ్బందితో మాట్లాడారు. గర్భిణులను పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తీసుకువెళ్లడంలో ఎలాంటి అలసత్వం చేయరాదన్నారు. అలాగే అత్యవసర సేవలకు అంబులెన్సు సేవలను వినియోగించుకోవాలని, ఆ సమయంలో ఎలాంటి అలసత్వం ప్రదర్శిచవద్దని సిబ్బందికి సూచించారు. పీహెచ్సీ పరిసర గ్రామాల ప్రజలు ఎలాంటి అత్యవసర పరిస్థితులు ఉన్నా ఈ సేవలను వినియోగించుకోవచ్చని చెప్పారు. అప్పుడే పుట్టిన బిడ్డలకు ఎలాంటి వైద్యం కోసమైనా.. ఎక్కడికై నా ఉచితంగా తీసుకువెళ్లేందుకు అంబులెన్స్ అందుబాటులో ఉంటుందన్నారు. కార్యక్రమంలో జిల్లా కోఆర్డినేటర్ రత్నమయ్య, సిబ్బంది రఫి, వెంకటేష్, 102 కెప్టెన్ రఘు తదితరులు పాల్గొన్నారు.385 క్వింటాళ్ల వేరుశనగగద్వాల వ్యవసాయం: జిల్లాకేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డుకు మంగళవారం 385 క్వింటాళ్ల వేరుశనగ వచ్చింది. క్వింటాల్ గరిష్టంగా రూ.6,416, కనిష్టంగా రూ.3,029, సరాసరిగా రూ.4,319 ధరలు లభించాయి.ఆర్ఎంపీ క్లినిక్ సీజ్గద్వాల క్రైం: జిల్లా కేంద్రంలో ఎలాంటి అర్హత లేకుండా క్లినిక్ ఏర్పాటు చేసి పరిమితికి మించి వైద్య సేవలు అందిస్తున్న ప్రథమ చికిత్స కేంద్రాన్ని మంగళవారం జిల్లా ఆరోగ్యశాఖ అధికారులు సీజ్ చేశారు. మాతా శిశు సంరక్షణ ప్రోగ్రాం అధికారి ప్రసూనరాణి కథనం మేరకు.. గద్వాల పట్టణంలోని సుంకులమ్మమెట్ సమీపంలో అరవింద్ ప్రథమ చికిత్స కేంద్రాన్ని రామన్గౌడ్ కొంత కాలంగా నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో క్లినిక్లో తనిఖీలు చేయగా యాంటీ బయోటిక్స్, పెయిన్ కిల్లర్, స్టిరాయిడ్స్, సిరప్స్, ఐవీ ప్లూయిడ్లు, బాటిళ్లు ఎక్కించడం, నెబ్యులైజేషన్ మిషన్, కుట్లు వేసే సామగ్రిని గుర్తించినట్లు తెలిపారు. డాక్టర్ పేరుతో కలిగిన సర్టిఫికెట్, ప్రైవేటు ఆస్పత్రులకు స్కానింగ్ రెఫర్ చేసే స్లిప్లు ఉన్నాయన్నారు. అనంతరం క్లినిక్ సీజ్ చేసి మందులు, పరికరాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. నిర్వాహకుడిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఆర్ఎంపీలు పరిమితికి లోబడే వైద్య సేవలు అందించాలన్నారు. నిబంధనలకు విరుద్ధంగా వైద్య సేవలు అందిస్తే కఠిన చర్యలు తప్పవని ప్రసూనరాణి హెచ్చరించారు. తనిఖీలో మధుసూదన్రెడ్డి, నరసయ్య తదితరులు పాల్గొన్నారు.జెన్కోలో ముగిసిన రాష్ట్రస్థాయి క్రీడలుఆత్మకూర్: ఎగువ జూరాల జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో మూడు రోజులుగా నిర్వహిస్తున్న తెలంగాణ జెన్కో రాష్ట్రస్థాయి క్యారం, చెస్ పోటీలు మంగళవారం ముగిశాయి. క్యారమ్స్లో మొదటి బహుమతిని యాదాద్రి జట్టు కై వసం చేసుకోగా, చెస్లో కాకతీయ థర్మల్ కేంద్రం జట్టు కై వసం చేసుకుంది. విజేతలకు జెన్కో ఎస్ఈలు శ్రీధర్, సురేష్ బహుమతులు ప్రదానం చేశారు. పోటీల్లో కొత్తగూడెం తర్మల్ కేంద్రం, శ్రీశైలం, జూరాల, భద్రాద్రి, విద్యుత్సౌథ, యాదాద్రి, పులిచింతల, కాకతీయ ప్రాజెక్టులకు చెందిన 60 మంది ఉద్యోగులు పాల్గొన్నారు. -
మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలి
గద్వాల: విరివిరిగా మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని కలెక్టర్ బీఎం సంతోష్, ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి అన్నారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వన మహోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వాతావరణ కాలుష్యం వల్ల ఇప్పటికే చాలా పట్టణాల్లో స్వచ్ఛమైన ఆక్సిజన్ లభించడం గగనమైందని, ఇది ఇలాగే కొనసాగితే రాబోయే తరాలు ఆక్సిజన్ను కొనుక్కునే పరిస్థితి తలెత్తుతాయని, ఈ దుస్థితిని అధిగమించాలంటే విరివిరిగా మొక్కలు నాటాలన్నారు. జిల్లాలో అటవీ విస్తీర్ణం తక్కువగా ఉందని ప్రతిఒక్కరు మొక్కలు నాటి ఈ శాతాన్ని పెంచేలా కృషి చేయాలన్నారు. ఇందుకోసం ప్రతిఒక్కరు కనీసం పదిమొక్కలు నాటాలన్నారు. జిల్లాకు మొత్తం 15 లక్షల మొక్కలు నాటడం లక్ష్యంగా పెట్టుకోగా.. ఇప్పటి వరకు 88 శాతం పూర్తయిందని ఈ రెండు నెలల్లో సమృద్ధిగా వర్షాలు ఉండే ఈ సమయంలో అన్ని శాఖలు తమ లక్ష్యాలను పూర్తి చేయాలన్నారు. అటవీశాఖ జిల్లా అధికారి కేవీవీఎస్ ప్రసాద్రెడ్డి మాట్లాడుతూ వనమహోత్సవంలో పెట్టుకున్న లక్ష్యం సాధించినట్లు తెలిపారు. ప్రజలు బాధ్యతగా మొక్కలు నాటి వాటిని క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని కోరారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నర్సింగ్రావు, మార్కెట్ యార్డు చైర్మన్ హనుమంతు, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పర్వేజ్ అహ్మాద్, మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ మహబూబ్ఖాన్, ప్రభుత్వ సూపరింటెండెంట్ ఇందిర, కళాశాల సూపరింటెండెంట్ నాగేశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు. -
మట్టి వినాయకులను ప్రతిష్టించండి
మట్టి వినాయక విగ్రహాలను ప్రతిష్టించి నవరాత్రి ఉత్సవాలను సంప్రదాయబద్ధంగా జరుపుకోవాలని అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ అన్నారు. జిల్లా బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సౌజన్యంతో మట్టి వినాయకులను సమకూర్చారు. మంగళవారం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు పాల్గొని కలెక్టరేట్లోని వివిధ శాఖల అధికారులతోపాటు పట్టణంలోని పలువురికి ఉచితంగా మట్టి వినాయక విగ్రహాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మట్టి వినాయకులను పూజించి పర్యావరణాన్ని పరిరక్షించాలని సూచించారు. కాలుష్యానికి కారకంగా నిలుస్తున్న ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను ప్రతిష్టించకుండా చూడాలన్నారు. ప్రతి ఏడాది మట్టి వినాయక విగ్రహాలు తయారు చేయడానికి అవసరమైన సహాయ సహకారాలను ప్రభుత్వపరంగా అందిస్తామన్నారు. తద్వారా కులవృత్తులను ప్రోత్సహిస్తామని చెప్పారు. భక్తిశ్రద్ధలతో వినాయక ఉత్సవాలను విజయవంతంగా ముగించాలని సూచించారు. అలాగే విగ్రహాల నిమజ్జన సమయంలో స్వచ్ఛత, క్రమశిక్షణ పాటించాలని, అధికార యంత్రాగం ఏర్పాటు చేసిన బీచుపల్లి, నదిఆగ్రహారం, జమ్మిచేడు, జూరాల డ్యాం ప్రాంతాలలో గణపతి విగ్రహాలను నిమజ్జనం చేయాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నర్సింగరావు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ నుశిత, ఏఓ భూపాల్రెడ్డి, బీసీ సంక్షేమ శాఖ అధికారి అక్బర్పాషా, సివిల్ సప్లైయ్ జిల్లా మేనేజర్ విమల తదితరులు పాల్గొన్నారు. -
శ్రీశైలం ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద
దోమలపెంట: ఎగువ ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి భారీగా నీటి ప్రవాహం కొనసాగుతుంది. జూరాల ప్రాజెక్టు 37 క్రస్టు గేట్లు ఎత్తి స్పీల్వే ద్వారా 3,53,573, సుంకేసుల నుంచి 17,874, హంద్రీ నుంచి 250 మొత్తం 3,71,697 క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉంది. దీంతో ఆదివారం రాత్రికి ఐదు గేట్లు ఒక్కొక్కటి 16 అడుగుల మేర పైకెత్తి స్పీల్వే ద్వారా 3,80,380 క్యూసెక్కుల నీటిని సాగర్కు విడుదల చేస్తున్నారు. మరోవైపు ఎడమగట్టు భూగర్భకేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ 35,315, ఏపీ జెన్కో పరిధిలోని కుడిగట్టు కేంద్రంలో ఉత్పత్తి చేస్తూ 26,396 మొత్తం 61,711 క్యూసెక్కుల నీటిని అదనంగా సాగర్కు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో 881.4 అడుగుల వద్ద 195.6605 టీఎంసీల నీటి నిల్వ ఉంది. -
యూరియా కోసం తప్పని తిప్పలు
గద్వాల వ్యవసాయం: యూరియా కోసం అన్నదాతలకు అవస్థలు తప్పడం లేదు. నిత్యం సింగిల్ విండో కార్యాలయం వద్ద బారులుదీరి నిలబడటంతోపాటు టోకెన్ల కోసం పడిగాపులు కాయాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నాయి. మంగళవారం గద్వాల సింగిల్ విండో కార్యాలయానికి రైతులు ఉదయం 7 గంటలకే చేరుకోగా.. టోకెన్ల పంపిణీ 8 గంటలకు ప్రారంభమైంది. ఈ క్రమంలో సుమారు 300 మంది రైతులు రాగా, ఇందులో 50 మందికి పైగా మహిళా రైతులు ఉన్నారు. కాగా టోకెన్ల కోసం వేచి ఉండలేక రైతులు నేలపైనే కూర్చున్నారు. ఇచ్చే రెండు బస్తాలకు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎదురుచూడాల్సి వస్తోందని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో యూరియా కోసం ఎప్పు డూ ఇలా పడిగాపులు కాయలేదన్నారు. ప్రస్తుతం ఇస్తున్న రెండు బస్తాల యూరియా సరిపోవడం లేదన్నారు. 300 మంది రైతులకు 700 బస్తాల యారి యా పంపిణీ చేసినట్లు సింగిల్ విండో సిబ్బంది తెలిపారు. ఇదిలా ఉంటే టోకెన్ల పంపిణీలో తోపులా ట జరగకుండా పోలీసులు నియంత్రించారు. -
భూమిని వెనక్కి తీసుకుంటాం
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీలో సబ్స్టేషన్ నిర్మాణం కోసం అధికారులు 500 గజాల భూమి కేటాయించడం, ట్రాన్స్కో అధికారులు కేటాయించిన దాని కంటే ఎక్కువ భూమిని చదును చేయడంతో వివాదం నెలకొంది. ఈ విషయమై ‘సాక్షిశ్రీలో మంగళవారం ‘పీయూలో సబ్స్టేషన్ వివాదం’ శీర్షికన కథనం ప్రచురితమైంది. దీనిపై మంగళవారం ఉదయం విద్యార్థి సంఘాల నాయకులు పీయూ ముఖద్వారం వద్ద గంటసేపు నిరసన చేపట్టారు. పలువురు విద్యార్థి సంఘాల నాయకులు వెంటనే భూములను వెనక్కి తీసుకోవాలని, ట్రాన్స్కో అధికారులు కట్టిన ప్రహరీని కూల్చివేయాలని డిమాండ్ చేశారు. దీంతో ప్రిన్సిపాల్ మధుసూదన్రెడ్డి విద్యార్థులకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. కేటాయించిన భూమి కంటే ఎక్కు వ వినియోగించుకుంటే వెనక్కి తీసుకుంటామని స్పష్టం చేశారు. అయితే విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులు వైస్ చాన్స్లర్ నుంచి స్పష్టమైన హామీ కావాలని పట్టుబట్టి అడ్మినిస్ట్రేషన్ భవనం ఎదుట బైఠాయించారు. రిజిస్ట్రార్ రమేష్బాబు కూడా విద్యార్థి సంఘాల నాయకులు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ససేమిరా వినిపించుకోలేదు. దీంతో వీసీ శ్రీనివాస్ బయటకు వచ్చి విద్యార్థులకు వివరణ ఇచ్చారు. కేటాయించిన భూమికంటే ఎక్కువ భూమిని వారు చదును చేశారని తెలిసిన వెంటనే నోటీసులు ఇచ్చామని, దీనికి వివరణ ఇవ్వాల్సి ఉందన్నారు. మరో రెండు, మూడు రోజుల్లో ఎక్కువగా వినియోగించిన భూమిని తిరిగి తీసుకుంటామని, కేటాయించిన భూమి వరకు హద్దులు నిర్ణయిస్తామని వీసీ పేర్కొన్నారు. అనంతరం నిర్మాణంలో ఉన్న సబ్స్టేషన్ దగ్గరకు వెళ్లి ఎక్కడి వరకు భూమి కేటాయించారు.. ఎక్కడి వరకు చదును చేశారు.. అని పరిశీలించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ మధుసూదన్రెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ కృష్ణయ్య పాల్గొన్నారు. -
కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు
జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): వ్యవసాయ సీజన్ పూర్తయ్యే వరకు యూరియా సరఫరాపై కలెక్టర్లు, ఎస్పీలు ప్రత్యేకంగా దృష్టిసారించి నిశితంగా పర్యవేక్షణ చేయాలని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మంగళవారం మహబూబ్నగర్ కలెక్టరేట్లో ఉమ్మడి జిల్లాకు చెందిన కలెక్టర్లు, ఎస్పీలు, వ్యవసాయ, సహకార శాఖల అధికారులతో జిల్లాల వారీగా యూరియా లభ్యత, సరఫరా, ఇండెంట్ తదితర అంశాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎరువులు, యూరియా సరఫరాలో ఎలాంటి అవకతవకలు జరిగినా.. దాచిపెట్టి కృత్రిమ కొరత సృష్టించినా, అధిక ధరలకు విక్రయించినా సదరు డీలర్లపై కేసులు నమోదు చేసి శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలన్నారు. యూరియా పంపిణీ జరగడం లేదని ఆరోపణలు వస్తున్నాయని, వాస్తవంగా కేంద్రం నుంచి 9 లక్షల మె.ట., యూరియా రావాల్సి ఉండగా ఇప్పటి వరకు 5.72 మె.ట., మాత్రమే వచ్చిందని ఇంకా సుమారు 3 లక్షల మె.ట., రావాల్సి ఉందన్నారు. కొన్ని ప్రైవేటు షాపులలో ఎక్కువ రేటుకు విక్రయిస్తూ ఇతర అనవసరమైన ఎరువులు అంటగడుతున్నారని, అలాంటి వాటిని సీజ్ చేసి తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వ్యవసాయ సీజన్ ముగిసే వరకు ప్రతి ఎరువుల షాప్, పీఏసీఎస్, ఆగ్రో సేవా కేంద్రాలు, ఒక్కొక్క షాప్ వద్ద ఒక అధికారిని నియమించి పర్యవేక్షించేలా చూడాలన్నారు. నానో యూరియా వాడకం– ప్రయోజనాల గురించి కూడా వ్యవసాయ అధికారులు రైతులకు వివరించాలని సూచించారు. సమావేశంలో ఉమ్మడి జిల్లాలోని కలెక్టర్లు విజయేందిర, సిక్తాపట్నాయక్, బదావత్ సంతోష్, ఆదర్శ్ సురభి, బీఎం సంతోష్, ఆయా జిల్లాల ఎస్పీలు జానకి, ఎస్పీ యోగేష్ గౌతమ్, గైక్వాడ్ వైభవ్ రఘునాథ్, రావుల గిరిధర్, శ్రీనివాస్రావు, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్రెడ్డి, ఎమ్మెల్యేలు కూచుకుళ్ల రాజేష్రెడ్డి, బండ్ల కృష్ణమోహన్రెడ్డి, మహబూబ్నగర్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అధిక ధరలకు అమ్మినా డీలర్పై కేసుల నమోదు విక్రయాలపై కలెక్టర్లు, ఎస్పీలు నిశితంగా పర్యవేక్షించాలి రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశం మహబూబ్నగర్ కలెక్టరేట్లో సమీక్ష సమావేశం -
పర్యావరణ హితానికి..
చిట్టి చేతులు పర్యావరణ హితానికి కదిలాయి. మట్టి గణపతులను తీర్చిదిద్దాయి. ఎన్జీసీ (నేషనల్ గ్రీన్ కోర్), కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) సంయుక్త ఆధ్వర్యంలో జిల్లాకేంద్రంలోని వివిధ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలకు చెందిన విద్యార్థిని, విద్యార్థులతో మట్టి గణపతుల తయారీ శిబిరాన్ని నిర్వహించారు. చెరువు పూడిక మట్టితో ప్రతిమలు తయారు చేశారు. గద్వాలకు చెందిన విద్యార్థిని శ్రీజ గ్రీన్ గెలాక్సీ అనే అంకుర సంస్థను ప్రారంభించి పర్యావరణ హితాన్ని కాంక్షిస్తూ.. వేరుశనగ పొట్టుతో తయారు చేసిన గణేష్ ప్రతిమలను ఉచితంగా అందజేశారు. మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ శ్రీధర్గౌడ్ సహకారంతో పర్యావరణహిత వినాయక విగ్రహాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎంఈఓ శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ మట్టి గణపతులను పూజించాలన్నారు. పూజలో వినియోగించే 21 రకాల పత్రి ఆరోగ్యాన్ని కాపాడుతుందన్నారు. మట్టి ప్రతిమతో పాటు పత్రిని జల వనరులలో నిమజ్జనం చేయాలన్నారు. -
నిరీక్షణకు తెర
●త్వరలో చేపపిల్లలు వదులుతాం 2025–26 సంవత్సరానికి చేపల సీడ్ వదిలేందుకు అవసరమైన టెండర్ ప్రక్రియ ఆరంభం అయ్యింది. సెప్టెంబర్ 1నాటికి టెండర్ ఓపెన్ చేస్తారు. జిల్లాలో సెప్టెంబర్ మొదటి వారం లేదా రెండో వారంలో చేపల సీడ్ వదిలేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. దాదాపు 60 శాతం నీరు నిండిన జలాశయాల్లో చేపలు వదిలేందుకు నిర్ణయించాం. – షకీలాభానో, జిల్లా మత్స్యశాఖ అధికారి గద్వాల వ్యవసాయం: ఎట్టకేలకు ఉచిత చేప పిల్లల పంపిణీలో సందిగ్ధం తొలగింది. కొద్ది రోజులుగా ఎదురుచూస్తున్న మత్స్యకారుల నిరీక్షణకు తెరపడింది. ఈ ఏడాది (2025–26)లో చేపపిల్లల (సీడ్) పంపిణీ నిమిత్తం అవసరమైన టెండర్ ప్రక్రియ కొద్ది రోజుల క్రితం ఆరంభమైంది. మొత్తంగా ఈ ఏడాది చేపపిల్లల పంపిణీ ఉంటుందా.. ఉండదా అన్న అనుమానాలకు తెరపడింది. ఈనెలాఖరు నాటికి టెండర్ ప్రక్రియ ముగిసి, సెప్టెంబర్ మొదటి లేదా రెండో వారంలో జలాశయాల్లో చేపల సీడ్ను వదిలేలా మత్స్యశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. జిల్లాలో 1.60కోట్ల నుంచి 2కోట్ల వరకు జలాశయాల్లో సీడ్ను వదిలే అవకాశం ఉంది. జిల్లాలో నీటి వనరులు జిల్లాలో 93 మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలు ఉండగా.. ఇందులో 7,162 మంది మత్స్యకారులు ఉన్నారు. వీరుగాక మరో 3వేల మంది దాకా చేపల విక్రయంపై ఆధారపడుతుంటారు. ఈ కుటుంబాలకు చేపలు, రొయ్యల పెంపకం, విక్రయించడమే జీవనాధారం. జిల్లాలో కృష్ణా, తుంగభద్ర నదులు, జూరాల ప్రాజెక్ట్, శ్రీశైలం బ్యాక్ వాటర్, ఆరు రిజర్వాయర్లు, 35 నోటిఫైడ్ చెరువులతో పాటు 396 చిన్న చెరువులు, కుంటలు ఉన్నాయి. వీటిలో ఏటా మత్స్యశాఖ అందించే చేపల, రొయ్యల సీడ్ను వదిలి పెంచుతున్నారు. ఇదిలాఉండగాచ గత ప్రభుత్వం 2018–19లో తీసుకొచ్చిన సమీకృత మత్స్య అభివృద్ధి పథకంతో మత్స్యకారులకు రూ.2 కోట్లు విలువ చేసే ద్విచక్ర వాహనాలు, ఆటోలు, నాలుగు చక్రాల వాహనాలు, ట్రేలు, ఐస్బాక్స్లు, వలలు, ఎలక్ట్రానిక్ కాంఠాలు తదితరమైనవి సమకూరాయి. వీటివల్ల మత్స్యకారులకు ఎంతో ప్రయోజనం చేకూరిందని చెప్పవచ్చు. ఇటీవల టెండర్ ప్రక్రియ సాధారణంగా జూలై నెలలో టెండర్లు ఆహ్వనించి ఆగస్టు నెలలో చేప సీడ్ను వదులుతారు. అయితే ఈఏడాది ప్రభుత్వం సకాలంలో బడ్జెట్ కేటాయింపు జరపకపోవడం వల్ల ఆలస్యం అయ్యింది. ఈనెల 18న టెండర్ నోటిఫికేషన్ జారీ జరిగింది. 35ఎంఎం నుంచి 40ఎంఎం సీడ్కు రూ.62పైసలు, 80ఎంఎం నుంచి 100ఎంఎం సీడ్కు రూ.1.65పైసలు రేటుగా నిర్ణయంచి టెండర్లు ఆహ్వానించారు. సెప్టెంబర్ 1న టెండర్లు ఓపన్ చేసి కాంట్రాక్టర్ను ఖరారు చేయనున్నారు. ఆ తర్వాత సెప్టెంబర్ మొదటి లేదా రెండో వారంలో సీడ్ను వదిలేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు. జిల్లా వివరాలిలా.. ఏడాది వదిలిన చేపల సీడ్ సంఖ్య (కోట్లలో) 2017–18 1.01 2018–19 0.59 2019–20 1.02 2020–21 1.15 2021–22 1.50 2022–23 1.69 2023–24 1.78 2024–25 1.30 టెండర్ ప్రక్రియ ప్రారంభం సెప్టెంబర్లో 1.60 కోట్ల నుంచి 2 కోట్ల చేపపిల్లలు వదిలే అవకాశం చేప పిల్లలను వదలాలంటే జలాశాయాల్లో 60 శాతం నీళ్లు ఉండాలి. అయితే ఎగువన కురిసిన వర్షాల జూరాల జలాశయానికి భారీగా వరద నీరు చేరింది. దీంతో నెట్టెంపాడు ఎత్తిపోథల ద్వారా రిజర్వాయర్లకు, పలు పెద్ద చెరువులకు నీటిని విడుదల చేశారు. దీంతో పాటు జూలై చివరివారం, ఆగస్టు నెలలో కురిసిన వర్షాలకు చెరువులు, కుంటలు జలకళ సంతరించుకున్నాయి. అవకాశం ఉన్న ప్రతి జలాశయంలోను చేపపిల్లలను వదలాలని మత్స్యకారులు కోరుతున్నారు. ఎందుకంటే 2023–24 సంవత్సరంలో 1.78 కోట్ల చేపల సీడ్ను వదలగా.. 2024–25లో 1.30కోట్ల సీడ్ను మాత్రమే వదిలారు. ఆ ఏడాది ఒక్క గద్వాల మండలంలోనే సంగాల, జములమ్మ చెరువులతో పాటు, పర్మాల, జిల్లెబండ లాంటి దాదాపు 20కి పైగా చిన్న చెరువుల్లో చేపల సీడ్ను వదల్లేదు. దీనివల్ల తాము ఆర్థికంగా చాలా నష్టపోయామని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఈ ఏడాదైన ఆయా జలశయాల్లో నీటి లభ్యత ఆధారంగా డిమాండ్ మేరకు సీడ్ వదలాలని, మత్స్యకారులకు మెరుగైన ఉపాధి కల్పించాలని కోరుతున్నారు. -
పీయూలో సబ్స్టేషన్ వివాదం!
500 గజాలే కేటాయించామని పీయూ అధికారుల స్పష్టం పాలమూరు యూనివర్సిటీలో విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణం కోసం కేటాయించిన భూమిపై వివాదం నెలకొంది. తాము 500 గజాల భూమిని కేటాయించామని పీయూ అధికారులు.. తమకు ఒక ఎకరా భూమిని కేటాయించారని ట్రాన్స్కో అధికారులు భిన్నవాదనలు వినిపిస్తున్నారు. తాజాగా ఎకరంన్నర భూమిని చదును చేయడంపై అటు పీయూ అధికారులు, విద్యార్థి సంఘాల నాయకుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. వేలాది మంది విద్యార్థుల ఉన్నత చదువులకు బాసటగా నిలిచే పీయూకు నూతన హాస్టల్స్, ల్యాబ్స్, తదితర వాటి ఏర్పాటు నేపథ్యంలో మరింత భూమి సమకూర్చాల్సింది పోయి..ఉన్న భూమిని వేరే వాటికి కేటాయించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: బండమీదిపల్లితో పాటు చుట్టుపక్కల ఉన్న కాలనీలకు నాణ్యమైన విద్యుత్ను అందజేసేందుకు విద్యుత్ శాఖ అధికారులు అక్కడ సబ్స్టేషన్ ఏర్పాటుకు స్థలం కోసం వెతికారు. సరైన స్థలం దొరక్కపోవడంతో పీయూలో పీజీ కళాశాల పక్కన..రాయచూర్ రోడ్డును ఆనుకుని ఉన్న స్థలాన్ని కేటాయించాలని అధికారులను కోరారు. ఈ క్రమంలో పీయూ అధికారులు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అనుమతితో విద్యుత్శాఖకు 500 గజాల భూమిని కేటాయిస్తూ అనుమతులు ఇచ్చారు. సబ్స్టేషన్ ఏర్పాటు చేసేందుకు కొన్ని రోజులుగా పనులు సైతం ప్రారంభించారు. అయితే, వారికి కేటాయించిన భూమికి మించి ఎక్కువ భూమిని చదును చేసుకుని వినియోగిస్తున్నారని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపించారు. తాము కేవలం 500 గజాలు ఇచ్చామని పీయూ అధికారులు పేర్కొంటుంటే, విద్యుత్ శాఖ తమకు ఒక ఎకరా భూమి కేటాయించారని పేర్కొంటున్నారు. ఈనేపథ్యంలో ఎకరంన్నర భూమిని చదును చేయడంతో వివాదం మరింత రాజుకుంది. ఎక్కువ భూమిని ఎలా చదును చేసి వినియోగిస్తారంటూ ఇటీవల పీయూ వీసీ శ్రీనివాస్.. ట్రాన్స్కో అధికారులకు లేఖ రాశారు. కానీ అక్కడి నుంచి ఎలాంటి స్పందన రాలేదని తెలుస్తోంది. ఎకరా కేటాయించారని విద్యుత్ అధికారుల వాదన అధిక భూసేకరణపై వీసీ లేఖ.. నేటికీ స్పందించని ట్రాన్స్కో పీయూ భూమి కాపాడాలంటూ విద్యార్థి సంఘాల ఆందోళన పీయూకు ఆనుకుని ఉన్న వెటర్నరీ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో సుమారు 20 ఎకరాల భూమిని పీయూకు అధికారులు బదిలీ చేశారు. ఇందుకు 2019లో కలెక్టర్ రొనాల్డ్రోస్, వీసీ రాజతర్నం ఎంతో కృషి చేశారు. అయితే, గతేడాది భూత్పూర్– చించోలి రోడ్డు పనులు ప్రారంభం కాగా.. పీయూకు చెందిన భూమి సైతం పోయింది. పీయూ కాంపౌండ్ వాల్ను తొలగించి పనులు కొనసాగించారు. ఇటు రోడ్డు విస్తరణ, అటు సబ్స్టేషన్ నిర్మాణం కోసం దాదాపు 5 ఎకరాల వరకు పీయూ భూమిని కోల్పోయినట్లు తెలుస్తుంది. దీనికి ప్రత్యామ్నాయంగా పీయూకు ప్రభుత్వం మరింత భూమిని కేటాయించాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. గతంలో అధికారులు పీయూకు భూమిని సమకూర్చేందుకు ప్రయత్నం చేస్తే.. ప్రస్తుత అధికారులు ఉన్న భూమిని కాపాడే పరిస్థితి లేదన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఇకనైన అధికారులు మేల్కొని పీయూ భూములను పరిరక్షించాలని విద్యార్థులు కోరుతున్నారు. పీయూలో సబ్స్టేషన్ ఏర్పాటు చేసేందుకు అధికారులు ఒక ఎకరా భూమిని కేటాయించారు. అందులో భాగంగానే ఇక్కడ భూమిని చదును చేశాం. ఎకరం కంటే ఎక్కువ భూమిని ఎట్టి పరిస్థితుల్లో వినియోగించుకోం. – సుదీర్రెడ్డి, ఈఈ, ట్రాన్స్కో పీయూలో సబ్స్టేషన్ నిర్మాణం కోసం విద్యుత్శాఖ అధికారుల విజ్ఞప్తి మేరకు కేవలం 500 గజాల భూమిని మాత్రమే కేటాయించాం. వారు ఎక్కువ భూమిని చదును చేసినట్లు తెలిసింది. ఈ విషయంపై సదరు డిపార్ట్మెంట్ వారికి లేఖ సైతం రాశాం. ఎక్కువ భూమిని వినియోగించుకోవడానికి అవకాశం లేదు. – శ్రీనివాస్, పీయూ వైస్చాన్స్లర్ -
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
ఎర్రవల్లి: పులి సంచరించింది అనే వార్తల నేపథ్యంలో ఇటిక్యాల మండలంలోని ఉదండాపురం, షాబాద్, చాగాపురం, పెద్దదిన్నె, బట్లదిన్నె శివార్లలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఫారెస్ట్ సెక్షన్ అధికారి మన్యమయ్య అన్నారు. మండల శివారులో పులి సంచరిస్తున్నట్లు సోషల్ మీడియాలో పలు పోస్టులు సోమవారం వైరల్ కావడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. విషయం తెలుసుకున్న ఫారెస్ట్ సెక్షన్ అధికారి పలు ప్రాంతాల్లో పర్యటించారు. గుర్తు తెలియని జంతువు సంచరించిన ఆనవాళ్లని గుర్తించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సంచరించిన జంతువు పులి అనడానికి పూర్తి స్థాయిలో నమ్మదగిన ఆనవాళ్లు కనబడలేదని, అటుగా చూసిన వాళ్లు మాత్రమే జింకలతో పాటు పులి, రెండు పులి పిల్లలు ఉన్నాయి అని చెప్పారన్నారు. పై గ్రామాల్లో పంట పొలాల్లో పనికి వెళ్లే రైతులు, కూలీలు, గొర్రెలు, బర్రెల కాపర్లు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎక్కడైన పులి కనబడితే వెంటనే ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించాలని ఆయన సూచించారు. అంబులెన్స్ సేవలు సద్వినియోగం చేసుకోవాలి రాజోళి/శాంతినగర్: అంబులెన్స్ సేవలను ప్రతి గ్రామ ప్రజలు సద్వినియోగంచేసుకోవాలని జిల్లా అధికారి రత్నమయ్య అన్నారు. సోమవారం రాజోళి, వడ్డేపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 108 అంబులెన్స్లను ఆయన తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. అంబులెన్స్ ద్వారా ఏ పరిస్థితుల్లో ఎలాంటి వారిని ఆసుపత్రులకు చేర్చిన వివరాలను ఆరా తీశారు. అంతేగాక 108, 102 వాహనాల్లోని ఆక్సిజన్ సిలిండర్లు, మెడికల్ ఎక్విప్మెంట్లు, మెడిసిన్స్ చెక్ చేశారు. అత్యవసర సమయంలో 108, 102 సేవలు ప్రజలు ఉపయోగించుకోవాలని, వాటి ప్రాముఖ్యతను తెలుసుకోవాలన్నారు. వైద్య సిబ్బంది కూడా ప్రజలకు అంబులెన్స్ల సేవలను గురుంచి తెలియచేయాలన్నారు. కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మధుబాబు,వైద్య సిబ్బంది పాల్గొన్నారు. -
నియమాలు పాటిస్తే నిర్విఘ్నం
● వినాయక మండపాల ఏర్పాటు వేడుకల్లో అప్రమత్తత అవసరం ● పోలీసులు, అధికారుల సూచనలు శిరోధార్యం గద్వాలటౌన్: ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వినాయక చవితా రానే వచ్చింది. కుల, మతాలకతీతంగా వాడవాడలా విఘ్న నాయకులను భక్తి శ్రద్ధలతో నెలకొల్పే సమయం అసన్నమైంది. గణేష్ నవరాత్రి వేడుకలు ఈ నెల 27 నుంచి ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే భక్తులు ఉత్సవాల ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. విగ్రహ మండపాల ఏర్పాటు, పూజలు, ఊరేగింపు, నిమజ్జనం ఇలా ప్రతి సందర్భంలో చిన్నపాటి జాగ్రత్తలు పాటిస్తే నవరాత్రులు విజయవంతమేనట్లే.. విఘ్నేశ్వరుడి కృపాకటాక్షాలు లభించినట్లే. ఈ నేపథ్యంలో నిర్వహకులు ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి. సామాన్యులకు ఆటకం కలిగించొద్దు వినాయకుడి మండపాలను నిర్మించే సమయంలో సామాన్య ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలి. రహదారి మధ్యలో మండపాలు నిర్మిస్తే వాహనాల రాకపోకలు, ఇతరత్రా ఇబ్బందులు ఎదురవుతాయి. రోడ్డు పక్కన, ఖాళీ స్థలంలో నిర్మించాలి. అలాగే, శోభాయాత్రలో యువత మద్యం మత్తులో జోగుతూ నృత్యాలు చేస్తుంటారు. నిమజ్జనం రోజు సైతం మద్యం తాగకుండా భక్తితో వేడుకల్లో పాల్గొనాలి. శోభయాత్రలో విద్యుత్తు తీగలను పరిశీలిస్తూ అప్రమత్తంగా వాహనం ముందుకు సాగాలి. అనధికార కనెక్షన్లతో ముప్పు మండపాలకు విద్యుత్ కనెక్షన్లు అనధికారికంగా తీసుకోవద్దు. అధికారిక కనెక్షన్లు అయితే విద్యుత్తు సిబ్బంది వచ్చి పరిశీలించి వైరింగ్ సక్రమంగా ఉండేలా చేస్తారు. విద్యుత్ తీగల కింద ఏర్పాటు చేయొద్దు. అలాంటి పరిస్థితి ఉంటే విగ్రహాలను వాహనాల నుంచి దించేటప్పుడు, మండపంలో ప్రతిష్టించేటప్పుడు చుట్టుపక్కల పైబాగాల్లో పరిశీలించాలి. అలాగే, మండపాల వద్ద టపాసులు, ఇతర మందుగుండు సామగ్రి ఉంచొద్దు. 24 గంటలు సభ్యులు ఉండాలి. ఒక డ్రమ్లో నీరు, రెండు బకెట్లలో ఇసుక నింపి ఉంచుకోవాలి. శాంతి కమిటీ సమావేశంలో పోలీసులు, అధికారులు సూచించే అంశాలను పాటించాలి. నిమజ్జనం రోజు చెరువుల్లో గుంతలు ఉంటాయి. నది, కాలువల్లో నీటి ప్రవాహం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలి. అధిక శబ్దాలు వద్దు పూజలు నిర్వహించే వేళల్లో వేదమంత్రాలు స్థానికులందరకీ వినిపించేలా వైకులు, డీజే బాక్సులు, భారీ స్పీకర్లు ఏర్పాటు చేస్తుంటారు. డీజేలకు అనుమతి లేదు. స్పీకర్లు, మైకు ఏర్పాటుకు పోలీసుల అనుమతి తప్పని సరి. రోజంతా భక్తి గీతాలు మోగించడంతో చిన్నారులు, వృద్దులు, విద్యార్థులకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. పూజ జరిగే వేళల్లోనే తక్కువ శబ్దంతో మైకులు వాడటం ఉత్తమం. అలాగే, మండపాలను నాణ్యమైన వస్తువులతో నిర్మించుకోవాలి. సత్ప్రవర్తన కలిగిన సభ్యులను నియమించుకుని భక్తులను క్రమబద్ధీకరించేలా చూసుకోవాలి. అదేవిధంగా సామూహిక వేడుకలు, మండపాల వద్ద భక్తులు గణనాథుని దర్శనానికి బారులుతీరుతారు. రద్దీ ప్రాంతాలలో చోరీలు జరిగే అవకాశాలు లేకపోలేదు. అప్రమత్తంగా ఉండాలి. మండపాల అలంకరణ, నిమజ్జనం రోజు అధికంగా ఖర్చు చేయడం కంటే అన్నదానాలు, పిల్లలకు విజ్ఞాన, వినోద కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇవ్వడం సముచితం. గద్వాలలో ప్రతిష్టాపన కోసం భారీ గణనాథుడిని ఊరేగింపుతో తీసుకొస్తున్న భక్తులు -
తల్లిదండ్రుల సంరక్షణ బాధ్యత వారసులదే..
అలంపూర్: తల్లిదండ్రుల సంరక్షణ బాధ్యతను వారి వారసులే తీసుకోవాలని అలంపూర్ జూనియర్ సివిల్ జడ్జి మిథున్ తేజ అన్నారు. సోమవారం అలంపూర్ కోర్టు ప్రాంగణంలో సీనియర్ సిటిజన్స్ డే నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను వారి పిల్లలు సంరక్షించాలని, ఆస్తి పంపకాలు జరిగిన తర్వాత చాలా మంది కూతుళ్లు, కుమారులు తల్లిదండ్రులను పోషించకుండా వదిలేస్తున్నారని, దీని వల్ల వారి జీవితాలు అగమ్యగోచరంగా మారుతున్నాయన్నారు. ఇలాంటి సందర్భంలో చట్టం ప్రకారం ఆస్తిని తిరిగి తల్లిదండ్రులే పొందవచ్చని అన్నారు. ప్రతి ఒక్కరు చట్టానికి లోబడి ఉండాలని సూచించారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గవ్వల శ్రీనువాసులు, న్యాయవాదులు ఈదుర్ బాషా,ఆఫ్రోజ్ తదిదరులు పాల్గొన్నారు. ఆశా కార్యకర్తల సమస్యలు పరిష్కరించాలి గద్వాలటౌన్: రాష్ట్రాన్ని ఆరోగ్య తెలంగాణగా మార్చడం కోసం క్షేత్రస్థాయిలో విస్తృత సేవలు అందిస్తున్న ఆశా కార్యకర్తలను విస్మరిస్తే ప్రభుత్వంపై సమరం సాగిస్తామని, వెంటనే సమస్యలు పరిష్కరించాలని ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు పద్మ, ప్రధాన కార్యదర్శి సునిత హెచ్చరించారు. సమస్యల పరిష్కరం కోరతూ సోమవారం ఆశా కార్యకర్తలు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం తక్షణమే ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం రూ.18 వేలుగా నిర్ణయించి అమలు చేయాలని, లేనిపక్షంలో తమ పోరాటం ఆపబోమని తేల్చిచెప్పారు. వీటితో పాటు పీఎఫ్, ఈఎస్ఐ, ఉద్యోగ భద్రత కల్పించి రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందజేయాలని డిమాండ్ చేశారు. గతంలో ఆశా వర్కర్ల సంఘటిత పోరాటాల ఫలితంగానే రూ.200 నుంచి రూ.9500 వరకు వేతనాలు పెరిగాయన్నారు. ఆశా వర్కర్లపై రోజురోజుకు పని భారం పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించకుంటే దీర్ఘకాలిక ఉద్యమానికి సిద్దమవుతామని హెచ్చరించారు. సమావేశంలో సీఐటీయు జిల్లా కార్యదర్శి వీవీ నర్సింహా, జల్లా ఉపాధ్యాక్షుడు ఉప్పేర్ నర్సింహా, ద్మమ్మ, మాధవి, కాంతమ్మ, చెన్నమ్మ, సుజాత తదితరులు పాల్గొన్నారు. 42 శాతం బీసీ రిజర్వేషన్లు అమలు చేయాల్సిందే గద్వాలటౌన్: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చి అమలు చేయాల్సిందేనని అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు. 42 శాతం బీసీ రిజర్వేషన్ల సాధన కోసం సోమవారం అఖిలపక్ష నాయకులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా పలవురు అఖిలపక్ష నాయకులు మాట్లాడారు. 42 శాతం బీసీ రిజర్వేషన్ల కోసం అన్ని పార్టీలు సహకరించాలని కోరారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం 42 శాతం బీసీ రిజర్వేషన్ల బిల్లును ఆర్డినెన్స్ ద్వారా తెచ్చి కేంద్రానికి పంపిందన్నారు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి రిజర్వేషన్లు అమలు చేయించే బాధ్యత తీసుకోవాలన్నారు. బీసీ రిజర్వేషన్లపై బీజేపీ కుట్రలు పన్నుతుందని ఆరోపించారు. బీసీ రిజర్వేషన్ల బిల్లును శాసనసభ, మండలిలలో ఆమోదం తెలిపి గవర్నర్ పరిశీలించి నివేదికను రాష్ట్రపతికి పంపించారన్నారు. మూడు నెలలు అవుతున్నా నిర్ణయం ప్రకటించలేదన్నారు. ఏ బిల్లు అయినా మూడు నెలల్లో నిర్ణయం తీసుకోకపోతే అమలు చేసినట్లేనని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. బీసీ రిజర్వేషన్లలో ముస్లింలను చేర్చుతున్నందుకే అనుకూలంగా లేమని బీజేపీ నాయకులు అనడం దారుణమన్నారు. ఇది ఆ వర్గంలో సామాజికంగా వెనకబడిన వారికి మాత్రమే వర్తిస్తుందని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్దితో వ్యవహరించి, బీసీలకు ద్రోహం చేయకుండా 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్లను వ్యతిరేకించే పార్టీలకు తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. అఖిల పక్ష నాయకులు సత్యనారాయణ, హనీఫ్, వినోద్, వాల్మీకి, నాగర్దొడ్డి వెంకట్రాములు, మధుసూదన్బాబు, అతికూర్ రెహమాన్, ఇక్బాల్పాష, ప్రభాకర్, సుభాన్, హుస్సేన్ పాల్గొన్నారు. -
పెండింగ్ పనులు పూర్తి చేయండి
● వచ్చే నెలలో డబుల్ బెడ్రూం ఇళ్ల ప్రారంభోత్సవం ● కలెక్టర్ బీఎం సంతోష్ గద్వాలటౌన్: పట్టణ శివారులో చేపట్టిన డబుల్ బెడ్రూం ఇళ్ల అసంపూర్తి పనులను త్వరగా పూర్తి యాలని, వచ్చే నెల మొదటి వారంలో ఇళ్ల ప్రారంభోత్సవం ఉంటుందని కలెక్టర్ సంతోష్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం డబుల్ బెడ్ రూం ఇళ్లను అధికారులతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. ఇళ్ల నిర్మాణ పనుల పురోగతిని తెలుసుకున్నారు. డబుల్ ఇళ్ల నిర్మాణాలలో తక్షణమే మౌలిక వసతులు కల్పించాలని, పెండింగ్ ఉన్న విద్యుత్ సౌకర్యాలు, పెయింటింగ్ పనులను త్వరిరతగతిన పూర్తి చేయాలన్నారు. ముళ్ల పొదలను తొలగించి, పరిసరాలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలన్నారు. విద్యుత్తు, తాగునీటి సరఫరాలో లోపాలు లేకుండా చూడాలని ఆదేశించారు. డ్రైనేజీ వ్యవస్థను చక్కదిద్దాలన్నారు. రహదారి పనులను పూర్తి చేయాలన్నారు. ఇళ్ల పరిశీలన అనంతరం సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అడిషినల్ కలెక్టర్లు లక్ష్మినారాయణ, నర్సింగరావు, గృహ నిర్మాణ శాఖ పీడీ శ్రీనివాసరావు, విద్యుత్శాఖ డీఈ తిరుపతిరావు, మున్సిపల్ కమిషనర్ జానకీరామ్ తదితరులు పాల్గొన్నారు. ఫిర్యాదులపై సత్వరం స్పందించండి ప్రజావాణి ఫిర్యాదులపై అధికారులు తక్షణం స్పందించాలని, లేదంటే చర్యలు తప్పవని కలెక్టర్ సంతోష్ హెచ్చరించారు. సోమవారం కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణిలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ఆసరా పెన్షన్లు, భూసంబంధిత, ప్రజారోగ్యం, పారిశుద్ధ్యం, ఉపాధి, విద్యుత్ తదితర సమస్యలపై 72 వినతులు వచ్చాయి. ఆయా జిల్లా శాఖల ఆధికారులు సంబంధిత మండల అధికారులతో చర్చించి వారి పరిధిలోని దరఖాస్తులను పరిష్కరించాలని చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అడిషినల్ కలెక్టర్లు లక్ష్మినారాయణ, నర్సింగరావు తదితరులు పాల్గొన్నారు. బయోమెట్రిక్ పరికరాలు పంపిణీ చేనేత పెన్షన్లు మరింత పారదర్శకంగా, సులభంగా లబ్ధిదారులకు అందించే విధంగా పోస్టల్ శాఖ ద్వారా ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీని అమలు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ సంతోష్ తెలిపారు. సోమవారం బ్రాంచ్ పోస్టుమాస్టర్లు, సబ్ పోస్టుమాస్టర్లు బయోమెట్రిక్ పరికరాలు, స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేశారు. మొత్తం 84 మందికి కలెక్టర్ చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో పోస్టు ఆఫీస్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. -
చెత్త నిర్వహణ అస్తవ్యస్తం
● అలంపూర్ చౌరస్తా,సర్వీస్రోడ్లు దుర్గంధమయం ● భారీ చెట్లతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు అలంపూర్: నిత్యం వేలాది వాహనాల రాకపోకలతో రద్దీగా ఉండే అలంపూర్ చౌరస్తా, సర్వీస్రోడ్లలో చెత్త నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. ఆయా శాఖల మధ్య సమన్వయ లోపం కాస్తా వాహనదారులు, ప్రజలను ఇబ్బందుల్లో పడేస్తుంది. అలంపూర్ చౌరస్తాలోని నాలుగు రోడ్ల కూడలి, సర్వీస్ రోడ్ల పక్కనే చెత్తను వేస్తుండటంతో పందులకు అవాసాలుగా మారాయి. ఫ్లైఓవర్ పక్కన ముళ్ల పొదలు, పచ్చదనం కోసం వేసిన చెట్ల కొమ్మలు ఏపుగా పెరిగి రోడ్లను కమ్మేస్తున్నా.. వాహనదారులకు ఇబ్బందులు కలుగుతున్నా పట్టించుకునేవారే కరువయ్యారు. మరికొన్ని చోట్ల చెట్లు ఏపుగా పెరిగి విద్యుత్ తీగలను తాకుతున్నాయి. ఫ్లైఓవర్ కూడలి, సర్వీస్ రోడ్ల నిర్వహణను నేషనల్ అథారిటీ సిబ్బంది.. మిగిలిన ప్రాంతాలు పంచాయతీ సిబ్బంది చేపడుతున్నారు. అయితే, నాలుగు రోడ్ల కూడలిలోని ఫ్లైఓవర్ పక్కన విశాలమైన మైదానం ఉంటుంది. గతంలో నేషనల్ ఆథారిటీ అధికారులు పచ్చదనం పెంపొందించడానికి మొక్కలను నాటారు. కానీ అది కార్యరూపం దాల్చలేదు. దీంతో ఆ ప్రాంతం అపరిశుభ్రంగా మారి పందులకు అవాసంగా మారింది. ఈ మార్గంలో రాకపోకలు సాగించే వారు, ప్రయాణికులు ఆ ప్రాంతంలో ఒంటికి, రెంటికీ వినియోగిస్తుండడంతో దుర్వాసన వెదజల్లుతోంది. అధికారులు ఇప్పటికై న నాలుగు రోడ్ల కూడలిపై దృష్టి సారించాలని, చెత్త నిర్వహణ విధిగా చేపట్టేలా చూడాలని, సర్వీస్ రోడ్లపై వాహనదారులకు ఇబ్బందిగా మారిన చెట్ల కొమ్మలు కత్తిరించాలని స్థానికులు కోరుతున్నారు. -
తాగునీటి సమస్య తీర్చండి
అయిజ: గ్రామాల్లో తాగునీటి సమస్య తీవ్రమవుతోందని, అధికారులు తాగునీటి సమస్యను పరిష్కరించాలని బీజేపీ మండల ప్రసిడెంట్ గోపల కృష్ణ అన్నారు. ఆదివారం మండలంలోని ఉప్పలలో గ్రామంలో బీజేపీ నాయకులు పర్యటించారు. ఈసందర్భంగా బీజేపీ నాయకులకు గ్రామ ప్రజలు తాగునీటి సమస్య గురించి తెలిపారు. అదేవిధంగా ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. ఈసందర్భంగాబీజేపీ నాయకులు మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామాల్లో ఎలాంటి మౌళిక వసతులు కల్పించడంలేదని, కనీసం రోడ్లు, డ్రైనేజీలు నిర్మించడంలేదని మండిపడ్డారు. ప్రజలకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఏవీ పూర్తిస్థాయిలో అమలు కావడంలేదని, స్థానిక ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెబుతారని బీజేపీ నాయకులు అన్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు లక్ష్మణ్ గౌడ్, నరసింహులు, రవి, శంకరన్న, గ్రామస్తులు పాల్గొన్నారు. -
త్వరలో మద్యం టెండర్లు!
నవంబర్తో ముగియనున్న పాత లైసెన్స్ గడువు ● పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ముందస్తు టెండర్లు నిర్వహించే అవకాశం ● దరఖాస్తు ఫీజు రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షలకు పెంపు ● జిల్లాలో 36 మద్యం దుకాణాలు దరఖాస్తులు ఎక్కువే... జిల్లాలో గతంలో నిర్వహించిన మద్యం దుకాణాల టెండర్లలో దరఖాస్తులు వెల్లువలా వచ్చాయి. ఈసారి కూడా మద్యం షాపులకు పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చే అవకాశం ఉంది. టెండర్లలో పాల్గొనేందుకు రెండు రాష్ట్రాలకు చెందిన వ్యాపారులు బృందాలుగా ఏర్పడి పోటీ పడ్డారు. 10 నుంచి 20 షాపులకు టెండర్లు వేశారు. అయితే లక్కీ డిప్లో షాపులు దక్కని వారు డిప్లో వచ్చిన వారి నుంచి గుడ్విల్తో చేజిక్కించుకున్నారు. 2023లో జిల్లాలోని 36 మద్యం దుకాణాల కోసం వ్యాపారులు 1,171 టెండర్లు దాఖలు చేశారు. ఈ దరఖాస్తుల రూపంలో ప్రభుత్వానికి రూ.23.42 కోట్లు సమకూరింది. డిపాజిట్ ధర పెంపు..? గతంలో టెండర్లో పాల్గొనాలంటే దరఖాస్తుకు రూ.2 లక్షలు డీడీ చెల్లించాలనే నిబంధనతో పాటు లక్కీ డీప్ ద్వారా దుకాణం కేటాయిస్తారు. డీడీల రూపంలో వ్యాపారులు చెల్లించిన డబ్బులు తిరిగి రాదు ప్రభుత్వానికే చెందుతుంది. అయితే తాజాగా దరఖాస్తుల ధరను మరింతగా పెంచి ప్రభుత్వం అదనపు ఆదాయం సమకూర్చుకునే పనిలో పడింది. దరఖాస్తు ఫారం ధరను రూ.2 లక్షల నుంచి రూ. 3లక్షలకు పెంచే అవకాశం ఉంది. గద్వాల క్రైం: త్వరలోనే మద్యం దుకాణాల టెండర్లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చే యోచనలో ఉంది. దరఖాస్తు ఫీజులను సైతం పెంచనుంది. జిల్లాలో గద్వాల – అలంపూర్ సెగ్మెంట్లలో 36 మద్యం దుకాణాల గడవు మరో నాలుగు నెలల్లో ముగుస్తుంది. దీనికి తోడు పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ సెప్టెంబర్ నెలాఖరు నాటికి పూర్తి చేయాల్సిన నేపథ్యంలో మద్యం షాపులకు టెండర్ల ప్రక్రియను ముందస్తుగా చేపట్టే అవకాశం ఉంది. 2023లో ఆగస్టు 21న టెండర్లు పిలిచి డ్రా తీశారు. డిసెంబర్ 1 నుంచి కొత్త మద్యం దుకాణాల నిర్వాహకులు క్రయవిక్రయాలు ప్రారంభించారు. ప్రస్తుతం జిల్లాలోని 36 మద్యం దుకాణాల లైసెన్స్ గడువు నవంబర్ 30వ తేదీన ముగియనుంది. ఈ నేపథ్యంలో మళ్లీ టెండర్లు పిలిచేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. -
ఆదేశాలు వస్తే దరఖాస్తులు స్వీకరిస్తాం
మద్యం దుకాణాల పాత లైసెన్స్ గడువు నాలుగు నెలలు ఉంది. అయితే స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ కోసం ప్రభుత్వం కసరత్తు చేపట్టింది. అందులో భాగంగా కోడ్ వస్తే ఎలాంటి టెండర్ల నిర్వహణ ఉండదని భావించి మద్యం దుకాణాల కోసం ముందస్తు టెండర్ల చేపట్టే అవకాశం ఉంది. జిల్లాలోని దుకాణాలు, అన్ని అంశాలపై నివేదికలను ప్రభుత్వానికి అందజేశాం. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వస్తే దరఖాస్తుల స్వీకరణ చేపడ్తాం. – గణపతిరెడ్డి, ఎకై ్సజ్ సీఐ, గద్వాల ● -
రక్తదానం.. మరొకరికి ప్రాణదానం
గద్వాలటౌన్: రక్తదానం చేస్తే ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తికి పునర్జన్మను ఇచ్చినట్లేనని సీఐ శ్రీనివాస్ పేర్కొన్నారు. బ్రహ్మకుమారి దాది ప్రకాష్మణి వర్ధంతిని పురస్కరించుకుని విశ్వబంధుత్వ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదివారం స్థానిక రాజయోగ సేవ కేంద్రంలో ఆవరణలో బ్రహ్మకుమారీస్ ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రక్తదానం అన్ని దానాల కన్నా మిన్న అని, ఆపత్కాకాలంలో అవసరమైన రక్తాన్ని అందించి ప్రాణాన్ని రక్షించవచ్చవన్నారు. ప్రమాదంలో గాయపడిన వారికి సకాలంలో రక్తం లభించక మృతి చెందిన సంఘటనలు నిత్యం చోటు చేసుకుంటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. బ్రహ్మకుమారీ ప్రతినిధి బీకే మంజుల మాట్లాడుతూ సమాజ హిత కార్యక్రమాల్లో బ్రహ్మకుమారీల భాగస్వామ్యం పెరిగిందని చెప్పారు. అవకాశం లభించినప్పుడల్లా ప్రతి ఒక్కరూ సామాజిక సేవా కార్యక్రమాలపై దృష్టి సారించాలన్నారు. కార్యక్రమంలో రెడ్క్రాస్ సోసైటీ ప్రతినిధులు రమేష్, అయ్యప్పురెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఇంకా పునరుద్ధరించలే!
సాక్షి, నాగర్కర్నూల్: శ్రీశైలం ఎడమగట్టు భూగర్భజల విద్యుత్ కేంద్రంలో జరిగిన ఘోర ప్రమాద ఆనవాళ్లు నేటికీ చెదిరిపోవడం లేదు. 2020 ఆగస్టు 20న రాత్రి నాలుగో యూనిట్లో చోటుచేసుకున్న షార్ట్సర్క్యూట్ కారణంగా.. రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ వెలుగులు ప్రసరింపజేసే భూగర్భ కేంద్రంలో చీకట్లు కమ్ముకున్నాయి. ప్రమాదం కారణంగా చెలరేగిన మంటలు, పొగలతో ఉక్కిరిబిక్కిరికి గురై డ్యూటీలో ఉన్న తొమ్మిది మంది ఉద్యోగులు మరణించారు. తెలంగాణ రాష్ట్రానికి విద్యుత్ అందిస్తున్న శ్రీశైలం ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రంలోని నాలుగో యూనిట్ ప్యానెల్ బోర్డులో షార్ట్సర్క్యూట్తో మంటలు చెలరేగడం, చుట్టూ మంటలు, పొగలో చిక్కుకుని ఏడుగురు జెన్కో ఉద్యోగులు, ఇద్దరు అమరాన్ బ్యాటరీ కంపెనీకి చెందిన ఉద్యోగులతో సహా మొత్తం తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా.. ప్రమాదం సంభవించిన నాలుగో యూనిట్ను నేటికీ పునరుద్ధరించకపోవడం కొసమెరుపు. ఇదే తొలి ప్రమాదం.. శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ జలవిద్యుత్ కేంద్రంలో 2001 ఫిబ్రవరిలో ఒక యూనిట్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించారు. ఈ కేంద్రంలో మొత్తం 6 యూనిట్లకు గానూ ఒక్కో యూనిట్ 150 మెగావాట్ల చొప్పున మొత్తం 900 మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యం ఉంది. 2020 వరకూ ఈ కేంద్రంలో పూర్తిస్థాయిలో విద్యుదుత్పత్తి కొనసాగింది. 24 గంటల వ్యవధిలో 6 యూనిట్ల ద్వారా 21 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి చేసేవారు. అయితే ఐదేళ్ల క్రితం జరిగిన ప్రమాదంలో నాలుగో యూనిట్ పూర్తిగా ధ్వంసం కాగా.. ఇప్పటి వరకు ఈ యూనిట్ పునరుద్ధరణ పూర్తికాలేదు. అయితే భూగర్భ కేంద్రం చరిత్రలోనే ఇదే తొలి ప్రమాదం కావడం గమనార్హం. ఐదేళ్లుగా సా..గదీత ప్రమాదం జరిగినప్పటి నుంచి నాలుగో యూనిట్ పునరుద్ధరణ పనులను చేపట్టినా ఇప్పటి వరకు అధికారులు అందుబాటులోకి తీసుకురాలేకపోయారు. పూర్తిగా ధ్వంసమైన నాలుగో యూనిట్ను పునరుద్ధరణ పనులు రెండేళ్ల కిందట పూర్తిచేసినా, సాంకేతిక సమస్యలతో విద్యుదుత్పత్తి చేపట్టడం లేదు. గతేడాది డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఈ కేంద్రాన్ని సందర్శించి నాలుగో యూనిట్ పునరుద్ధరణ పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. కేంద్రం పూర్తి విద్యుదుత్పత్తి సామర్థ్యం 900 మెగావాట్లు కాగా.. ప్రస్తుతం ఐదు యూనిట్ల ద్వారా 750 మెగావాట్ల సామర్థ్యంతోనే విద్యుదుత్పత్తి కొనసాగుతుంది. నాలుగో యూనిట్ను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెస్తేనే గరిష్ట స్థాయిలో విద్యుదుత్పత్తి చేసే అవకాశం ఉంది. ఈ విషయమై శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రం సీఈ సత్యనారాయణను సంప్రదించగా నాలుగో యూనిట్ పునరుద్ధరణ పనులు 24 గంటల పాటు కొనసాగుతున్నాయని, మరో నెల రోజుల్లో విద్యుదుత్పత్తి చేపట్టేలా కృషిచేస్తామన్నారు. శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ జల విద్యుత్ కేంద్రంలో సిద్ధంకాని నాలుగో యూనిట్ 2020 ఆగస్టు 20 నాటి దుర్ఘటనలో 9 మంది ఉద్యోగుల మృతి ఏళ్లతరబడిగా సాగుతున్న మరమ్మతు ప్రక్రియ ప్రస్తుతానికి ఐదు యూనిట్లతోనే విద్యుదుత్పత్తి -
ప్రజల దీవెనతో ప్రజాపాలన
అమ్రాబాద్/వెల్దండ: ప్రజా పాలనలో ప్రజల ప్రభుత్వం పనిచేస్తుందని, ప్రజల దీవెనలతో అన్నివర్గాల ప్రజలు, అన్నిరంగాల అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్తోందని రాష్ట్ర పంచాయతీ రాజ్, సీ్త్ర శిశు సంక్షేమ, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అన్నారు. ఆదివారం నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జంగంరెడ్డిపల్లిలో ప్రజలనుద్దేశించి మాట్లాడారు. గ్రామాలు బాగుండాలని ప్రభుత్వం పనుల జాతర కార్యక్రమంలో భాగంగా మొత్తం 1,500 పనులకు గాను రూ.20,200 కోట్లు మంజూరు చేసిందన్నారు. ఈ నిధులతో గ్రామ పంచాయతీ, అంగన్వాడీ భవనాలు తదితర అభివృద్ధి పనులు చేపట్టవచ్చన్నారు. ముఖ్యంగా మహిళా సంఘాల అభివృద్ధి కోసం ఇప్పటికే ప్రభుత్వం క్యాంటీన్లు, పెట్రోల్ బంకులు ఏర్పాటు చేసి మహిళలు ఆర్థిక స్వావలంభన సాధించే దిశగా ప్రోత్సహిస్తుందని చెప్పారు. గత ప్రభుత్వం మహిళలకు పావలా వడ్డీ రుణాలను పూర్తిస్థాయిలో అమలు చేయలేదని, కానీ, తమ ప్రజల ప్రభుత్వం మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇస్తుందని పేర్కొన్నారు. గతంలో 60 ఏళ్లు దాటిన మహిళలను తొలగించారని, ఇప్పుడు వారిని కూడా చేర్చుకోవాలని తాము చెబుతున్నామన్నారు. చదువుతోనే పేదరిక నిర్మూలన సాధ్యమని మంత్రి సీతక్క అన్నారు. మహిళలు స్వయం ఉపాధి రంగాలను ఎంచుకోని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని, తమ పిల్లలను ఉన్నత చదువులను చదివించాలని సూచింజుచారు. ఆయా కార్యక్రమంల్లో అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ, అదనపు కలెక్టర్ దేవసహాయం, డీఆర్డీఓ ఓబులేష్, గ్రంథాలయ చైర్మన్ రాజేందర్, తదితరులు పాల్గొన్నారు. -
సీపీఎస్ రద్దు చేసే వరకు పోరాటం
గద్వాలటౌన్: ఉద్యోగ, ఉపాధ్యాయుల పాలిట శాపంగా మారిన జీఓ 28ని తక్షణమే రద్దు చేయాలని జేఏసీ చైర్మన్ నాగర్జునగౌడ్ డిమాండ్ చేశారు. జీఓ 28ని వ్యతిరేకిస్తూ బాధిత ఉద్యోగ, ఉపాధ్యాయులంతా తమకు న్యాయం చేయాలని, తమ ఉద్యోగ జీవితాలకు భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ శనివారం నిరసన కార్యక్రమాలు చేపట్టారు. మధ్యాహ్న భోజన విరామ సమయంలో ఆయా శాఖల కార్యాలయాల వద్ద ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి, ఫ్లకార్డులు చేతపట్టి నిరసన వ్యక్తం చేశారు. జాక్టో, జేఏసీ వేరువేరుగా పెన్షన్ విద్రోహ దినం, బ్లాక్ డే కార్యక్రమాలు చేపట్టారు. జీఓ ప్రతులను దహనం చేసి నిరసన తెలిపారు. సీపీఎస్ వద్దు – ఓపీఎస్ ముద్దు అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సీపీఎస్ విధానాన్ని రద్దు చేయకుంటే ప్రభుత్వంపై సమరం సాగిస్తామని జేఏసీ నేతలు హెచ్చరించారు. సంఘటితంగా ఉద్యమించాలి సీపీఎస్ రద్దు కోసం శాంతియుతంగా ఉద్యమాలు చేసి సాధించుకోవాలని, ఇందుకు ప్రతి ఒక్కరూ చొరవ తీసుకొని సంఘటితంగా పోరాడాలని జేఏసీ చైర్మన్ నాగర్జునగౌడ్, టీఎన్జీఓ రాష్ట్ర నాయకుడు భీమన్న పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని సీపీఎస్ అధ్యక్షుడు నాగరాజు, విష్ణు డిమాండ్ చేశారు. -
‘ఇందిరమ్మ ఇళ్ల’ ఇసుక టిప్పర్ల నిలిపివేత
రాజోళి: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల కోసం ఇసుకను తరలిస్తున్న టిప్పర్లను మండలంలో పలు చోట్ల నిలిపేశారు.జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం రాజోళి మండలంలోని తుమ్మిళ్ల గ్రామంలో ఇసుక రీచ్ను ఏర్పాటు చేశారు. కాగా ఆన్లైన్లో ఇసుకను బుక్ చేసుకున్న వారి కోసం అక్కడి నుంచి ఇసుకను పడమటి గార్లపాడు,రాజోళి మీదుగా తరలిస్తున్న క్రమంలో పడమటి గార్లపాడు,కొత్త రాజోళిలో శుక్రవారం, శనివారం నిలిపేశారు. తమ గ్రామాల మీదుగా టిప్పర్లు వెళితే రోడ్లు దెబ్బతింటాయని, దెబ్బతిన్న రోడ్లకు బాధ్యులెవరని అంటూ వాహనాలను నిలిపేశారు. 20 టన్నుల బరువుతో టిప్పర్లు వెళితే రోడ్లు పూర్తిగా దెబ్బతింటాయని తమ గ్రామాల మీదుగా తిరగనివ్వమని వాపోయారు. ఇతర గ్రామాల గుండా వెళ్లమని చెప్పామని, అయినా ఇదే మార్గంలో బుకింగ్ ఉందని టిప్పర్లు తిరగడంతో వాటిని నిలిపేశామని ఆయా గ్రామాల వాసులు తెలిపారు. -
సురవరానికి ఘన నివాళి..
గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో శనివారం మాజీ సర్పంచ్ శేషన్గౌడ్, గ్రామస్తులు సూరిగౌడు, లక్ష్మన్న, రాంరెడ్డి, మణికుమార్, సుధాకర్రెడ్డి, ఎంఈఓ రామకృష్ణ, ప్రధానోపాధ్యాయురాలు శ్యామల, ఉపాధ్యాయులు గరీబ్, గజరాజు విద్యార్థులతో కలిసి సురవరం సుధాకర్రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన ఆత్మకూ శాంతి చేకూరాలని రెండు నిమిషాలు మౌనం పాటించారు. అదేవిధంగా సురవరం వెంకట్రామిరెడ్డి విజ్ఞాన కేంద్రం వద్ద ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించగా నాయకులు వీరాంజనేయులు, బాబు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన మరణం స్థానికంగానేగాక ఎమ్మెల్యేగా పోటీచేసిన కొల్లాపూర్లోనూ తీవ్ర విషాదం నింపింది. పాఠశాలలో నివాళులర్పిస్తున్న ఉపాధ్యాయులు, విద్యార్థులు -
ఉత్సాహంగా ఎంపిక పోటీలు
గద్వాలటౌన్: రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల కోసం జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి ఎంపిక పోటీలు ఉత్సాహంగా సాగాయి. శనివారం స్థానిక మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియంలో అండర్ –14, 16, 18, 20 విభాగాలలో బాలురు, బాలికలకు వేర్వేరుగా జిల్లాస్థాయి ఎంపిక పోటీలు నిర్వహించారు. 100 మీటర్లు, 600 మీటర్లు, 800 మీటర్లు,1500 మీటర్లు, 3000 మీటర్లు పరుగు పందెంతో పాటు లాంగ్జంప్, హైజంప్, షాట్ఫుట్, డిస్క్త్రో, జావలిన్ త్రో విభాగాలలో క్రీడాకారులు పోటీపడ్డారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 750 మంది విద్యార్థులు పోటీలలో పాల్గొన్నారు. జిల్లాస్థాయి అథ్లెటిక్స్ ఎంపిక పోటీలను డీవైఎస్ఓ జితేందర్, ఎస్జీఎఫ్ జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు జెండా ఊపి పోటీలను ప్రారంభించి మాట్లాడారు. పట్టుదల, శ్రద్ధ అనేది క్రీడల వల్ల అలవడతాయని, జిల్లాస్థాయిలో ప్రతిభ చాటిన 30 మంది క్రీడాకారులను రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేశారు. ఎంపికై న వారందరూ ఈ నెల 30, 31వ తేదీలలో పాలమూరు యూనివర్సిటీ సేడియంలో జరిగే రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీలలో పాల్గొంటారని జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు బీసన్న, సతీష్కుమార్ తెలిపారు. నగేష్బాబు, వెంకట్రాములు, బషీర్, జగదీష్, నర్సింహరాజు, మోహనమురళీ, ఆనంద్, రఘు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. -
ఉద్యమ నేతకు జోహార్లు
● స్వగ్రామం కంచుపాడులో సురవరం సుధాకర్రెడ్డికి ఘనంగా నివాళి ● నాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్న గ్రామస్తులు సాగులో మెళకువలు చెప్పేవారు.. సురవరం పొలాలను మేమే సాగు చేస్తాం. గ్రామానికి వచ్చినప్పుడు పంటలను తప్పక పరిశీలించేవారు. దిగుబడి, చీడపీడల గురించి అడిగి తెలుసుకొని కొత్త పంటల గురించి వివరించేవారు. అందరికి సహకరిస్తూ సాయంగా ఉండేవారు. – చిన్న కర్రెన్న, కంచుపాడు అన్యోన్యంగా ఉండేవారు.. సురవరం సుధాకర్రెడ్డి గ్రామానికి వచ్చిన సమయాల్లో రాజకీయాల గురించి అడిగి తెలుసుకునే అలవాటు. అలాగే ప్రతి సంక్రాంతికి యువతను ప్రోత్సహించడానికి క్రీడాపోటీలు నిర్వహించేవారు. తనతోపాటు కూర్చున్న యువకులకు క్రీడలు, జీవితంలో రాణించడం తదితర అనేక అంశాలపై అవగాహన కల్పించేవారు. అందరితో ఎంతో అనోన్యంగా ఉండేవారు. – వీరేష్, మండల అధ్యక్షుడు, ఏఐవైఎఫ్ అలంపూర్/ఉండవెల్లి: సీపీఐ అగ్రనేత సురవరం సుధాకర్రెడ్డి (83) మృతితో ఆయన స్వగ్రామం జోగుళాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం కంచుపాడులో విషాదఛాయలు అలుముకున్నాయి. గ్రామస్తులు ఆయన జ్ఞాపకాలను నెమరు వేసుకొని బాధాతప్త హృదయాలతో కన్నీటి పర్యంతమై శ్రద్ధాంజలి ఘటించారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శుక్రవారం తుది శ్వాస విడిచారు. మారుముల గ్రామం నుంచి జాతీయ నేతగా ఎదిగిన ఆయన ప్రస్థానం గురించి చర్చించారు. పేద, బడుగు బలహీనవర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన కృషిని స్మరించుకున్నారు. సొంతూరిపై మమకారం.. జాతీయ రాజకీయాలను శాసించిన సురవరానికి సొంతూరిపై మమకారం ఎక్కువ. సీపీఐ అగ్రనేతగా ఉన్న సమయంలోనూ తరుచూ వచ్చి వెళ్లేవారు. తండ్రి సురవరం వెంకట్రామిరెడ్డి పేరు మీద విజ్ఞాన కేంద్రం నెలకొల్పి యువతులు, మహిళలకు కుట్టు శిక్షణ, యువకులకు కంప్యూటర్ శిక్షణ ఇప్పించారు. అలాగే ఏటా సంక్రాంతికి ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో క్రీడాపోటీలు నిర్వహించి యువతను ప్రోత్సహించారు. కరోనా సమయంలో ఐసోలేషన్ కిట్స్, నిత్యావసర సరుకులు అందించి ఆసరాగా నిలిచారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉపయోగపడే పుస్తకాలు అందించారు. సీపీఐ మహాసభలు, యువజన ఉత్సవాలు సురవరం విజ్ఞాన కేంద్రంలోనే నిర్వహించి సొంతూరిపై అభిమానాన్ని చాటుకున్నారు. క్రీడాకారులకు క్రీడాసామగ్రిని పంపిణీ చేశారు. పర్యావరణ పరిరక్షణపై గ్రామీణులకు అవగాహన కల్పిస్తూనే సొంత ఇంటి ఆవరణలో రకరకాల మొక్కలు పెంచి ఆదర్శంగా నిలిచారు. గ్రామంలో తాగునీటి సమస్య పరిష్కారానికి ట్యాంకును నిర్మించారు. ఆర్థికంగా వెనుకబడిన పేద విద్యార్థులను ప్రోత్సహించి విశ్వవిద్యాలయాల్లో ఉన్నత విద్య అభ్యసించే అవకాశాలు కల్పించారు. నిరాడంబర జీవనం ఆయన ప్రత్యేకత.. సురవరం జీవనం నిరాడంబరంగా సాగింది. పార్టీలో జాతీయస్థాయి పదవితో పాటు ఎంపీగా రెండు పర్యాయలు సేవలందించారు. కానీ సొంతూరికి వచ్చిన సమయాల్లో ఆయన చాలా నిరాడంబరంగా ఉండేవారు. ఇంటి వద్ద బయట కూర్చొని వచ్చిపోయే వారితో మాట్లాడి వారి యోగక్షేమాలు తెలుసుకునేవారు. గ్రామ వీధుల్లో సైతం సాదాసీదాగా తిరుగుతూ అందరిని పలుకరించేవారు. -
పండుగలు ప్రశాంతంగా జరుపుకోవాలి
గద్వాల: ప్రశాంత వాతావరణంలో వినాయక చవితి, మిలాద్–ఉన్–నబీ వేడుకలు నిర్వహించేలా అధికారులు అన్ని రకాల ముందస్తు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ బీఎం సంతోష్ ఆదేశించారు. శనివారం ఐడీవోసీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్హాలులో ఎస్పీ శ్రీనివాస్రావుతో కలిసి అధికారులతో సమీక్షించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉత్సవాల నిర్వహణకు జిల్లా అధికార యంత్రాంగం సంసిద్ధంగా ఉండి అన్ని రకాల ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టాలన్నారు. అదేవిధంగా దెబ్బతిన్న రోడ్లకు వెంటనే తాత్కాలిక మరమ్మత్తులు చేపట్టాలన్నారు. ఈవేడుకలు ప్రతి ఎడాది మాదిరిగానే సహృద్భావ వాతావరణంలో జరిగేలా అందరూ స్ఫూర్తిని కొనసాగించాలన్నారు. ఈసారి కూడా వినాయక నిమజ్జనం, మిలాద్–ఉన్–నబీ వేడుక ఒకేసారి వస్తున్నందున ఎక్కడా కూడా చిన్నపాటి అవాంఛనీయ ఘనటలకు తావులేకుండా పోలీసుశాఖ అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. హైరిస్క్ కేసులపై ప్రత్యేక దృష్టి సారించండి గర్భిణులలో హైరిస్క్ కేసులను ముందస్తుగానే గుర్తించి ప్రత్యేక దృష్టి సారించాలని, మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులను ఆదేశించారు. శనివారం జిల్లా కేంద్రంలోని ఒంటెలపేటలోని అర్బన్హెల్త్సెంటర్ను ఆకస్మికంగా సందర్శించారు. సిబ్బంది హాజరు, ఓపి వివరాలు వ్యాక్సినేషన్, మందుల పంపిణీ వంటి అంశాలను పరిశీలించారు. ప్రభుత్వ ఆసుపత్రులలోనే ప్రసవాలు జరిగేలా అవగాహన కల్పించాలని, రక్తహీనతతో బాధపడుతున్న ప్రతిఒక్కరికి పౌష్టికాహారం అందించాలన్నారు. అవసరమైన వారికి ప్రభుత్వ ఆసుపత్రులలోనే వైద్యసేవలు అందించాలన్నారు. ఇమ్యునైజేషన్ నిరంతరం కొనసాగించాలన్నారు. మలేరియా, డెంగీ, చికెన్గున్యా వంటి సీజనల్ వ్యాధుల నియంత్రణకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్వో డాక్టర్ సిద్ధప్ప, డాక్టర్ మాధుర్య, వైద్యసిబ్బంది పాల్గొన్నారు. ప్రమాదాలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు ఏకధాటిగా వర్షాలు కురుస్తున్నందున ప్రమాదాలు చోటుచేసుకోకుండా వినాయక మండపాల ఏర్పాటులో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని, నిమజ్జన కార్యక్రమంలో గుర్తించిన బీచుపల్లి, నదీఅగ్రహారం, జమ్మిచేడు, జూరాల ప్రాంతాల్లో పోలీసు, రెవెన్యూ శాఖలు అప్రమత్తంగా ఉండి అన్ని రకాల చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచాలన్నారు. క్రేన్, లైటింగ్వ్యవస్థ, వైద్యశిబిరాలు, బారికేడ్లు, ట్రాఫిక్క్రమబద్దీకరణ, పారిశుద్ధ్యం వంటి చర్యలు చేపట్టాలన్నారు. అనంతరం పొల్యూషన్ శాఖ ఆధ్వర్యంలో ముద్రించిన పర్యావరణ పరిరక్షించేలా మట్టివిగ్రహాలు వినియోగించేలా అవగాహన కల్పించాలన్నారు. ఇందుకు సంబంధించి మట్టివిగ్రహం పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం ఎస్పీ శ్రీనివాస్రావు మాట్లాడుతూ జిల్లాలో భారీవర్షాల కారణంగా చెరువులు, కుంటలు పూర్తిస్థాయి నీటితో నిండుగా ఉన్నాయని నిమజ్జనం సమయంలో ఎలాంటి ప్రమాదాలు సంభవించకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా కట్టుదిట్టమైన భద్రతాఏర్పాట్లు చేపట్టనున్నట్లు తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు వి.లక్ష్మీనారాయణ, నర్సింగ్రావు, డీఎంహెచ్వో డాక్టర్ సిద్దప్ప, విద్యుత్తు శాఖ డీఈ తిరుపతిరావు, డీఎస్పీ మొగులయ్య, ఇరిగేషన్వాఖ అఽధికారి శ్రీనివాస్రావు, మత్య్సశాఖ అధికారి షకీలాభాను, తహసీల్దార్లు పాల్గొన్నారు. -
నోటీసులిచ్చిన తదుపరి చర్యలు..
పలు బీఈడీ కళాశాలల్లో ఆకస్మికంగా గతంలో తనిఖీలు నిర్వహించి.. వసతులు, నిబంధనలు పాటించని మొత్తం 7 కళాశాలలకు నోటీసులు ఇచ్చాం. వారు సమాధానం ఇస్తే పరిశీలించి తదుపరి చర్యలు తీసుకుంటాం. అంతేకాకుండా డిగ్రీ కళాశాలలపై కూడా ర్యాటిఫికేషన్, అప్లియేషన్ తనిఖీలు నిర్వహిస్తాం. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు పూర్తిస్థాయిలో కృషి చేస్తున్నాం. సెయింట్ మేరీస్ కళాశాలపై చర్యల్లో భాగంగా 50 శాతం సీట్లను కుదించాం. – శ్రీనివాస్, వీసీ, పీయూ తనిఖీలు చేపట్టాం.. గతంలో మొదటిసారి తనిఖీలు నిర్వహించిన క్రమంలో కళాశాలల్లో లేని వసతులపై రిమార్కులు కళాశాలల వారికి చూపించాం. మార్పులు లేనందుకు మరోసారి వీసీ నేరుగా తనిఖీలు చేసి.. వసతులు లేని 7 కళాశాలలకు నోటీసులు ఇ చ్చారు. గతంతో పోల్చితే తనిఖీలు మెరుగుప డ్డాయి. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు పూర్తిస్థాయిలో కృషి చేస్తున్నాం. – చంద్రకిరణ్, అకాడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ● -
పారదర్శక పాలనకే సమాచార హక్కుచట్టం
గద్వాల/అలంపూర్: పారదర్శకమైన పాలన కోసమే 2005లో అప్పటి కేంద్ర ప్రభుత్వం సమాచార హక్కుచట్టం తీసుకురావడం జరిగిందని కలెక్టర్ బీఎం సంతోష్, సమాచారహక్కు చట్టం కమిషనర్లు పీవీ శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం వారు గద్వాలకు వచ్చిన నేపథ్యంలో ఐడీవోసీ కార్యాలయంలో వివిధ శాఖలకు చెందిన అధికారులతో సమాచారం హక్కు చట్టంపై సమీక్షించారు. ఈసందర్బంగా ముందుగా పీవీ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో సిటిజన్ చార్ట్ను తప్పనిసరిగా ప్రదర్శించాలన్నారు. పౌరులకు పారదర్శక, బాధ్యతాయుత పాలన అందించడలంలో సమాచార హక్కుచట్టం కీలకపాత్ర పోషిస్తుందన్నారు. ఆర్టీఐ దరఖాస్తులు ఫిర్యాదులు తక్కువ అందిన జిల్లాలో జోగుళాంబగద్వాల జిల్లా ఒకటన్నారు. పీఐవో అధికారులు ప్రజలకు సమయానికి పూర్తి సమాచారాన్ని అందించాలని సూచించారు. ఆర్టీఐ దరఖాస్తుల పరిష్కారం ఆలస్యం కాకుండా చట్టంలో ఉన్న సమయపాలనతో కూడిన సమాచారం ఇవ్వాలన్నారు. గత మడు సంవత్సరాల నుంచి 17వేల ఆర్టీఐ కేసులు పెండింగులో ఉన్నాయని వీటిని త్వరితగతిన పరిష్కరించేందుకు జిల్లాల పర్యటన కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. అనంతరం కలెక్టర్ బీఎం సంతోష్ మాట్లాడుతూ.. సమాచార హక్కు చట్టంపై ప్రతిఒక్క అధికారి అవగాహన పెంచుకోవాలని, ఆర్టీఐ అప్పీల్ కేసులను పరిష్కరించటానికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. ఆర్టీఐ కింద అడిగిన సమాచారాన్ని తప్పకుండా నిర్ణీత గడువులోలప ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో సమాచార హక్కు చట్టం కమిషన్ కమిషనర్లు దేశాల భూపాల్, వైష్ణవి, అదనపు కలెక్టర్ వి.లక్ష్మీనారాయణ, ఆర్డీవో అలివేలు, వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. జోగుళాంబ ఆలయంలో ప్రత్యేక పూజలు అలంపూర్ జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను సమాచార హక్కు చట్టం కమిషనర్లు పీవీ శ్రీనివాస్ రావు, వైష్ణవి మెర్ల, బోరెడ్డి అయోధ్య రెడ్డి, దేశాల భూపాల్రావు శుక్రవారం దర్శించుకున్నారు. ఆలయ అధికారులు, అర్చకులు వారికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం క్షేత్రంలోని ఆలయాల్లో అర్చనలు, అభిషేక పూజలు నిర్వహించారు. దేశంలోనే ఐదో శక్తిపీఠంగా ప్రసిద్ధి చెందిన జోగుళాంబ అమ్మవారిని దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నామని వారు తెలిపారు. -
అభివృద్ధికి పెద్దపీట
గద్వాల: రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధికి పెద్దపీట వేసిందని ఇందులో భాగంగానే ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పనుల జాతర–2025 చేపట్టినట్లు కలెక్టర్ బీఎం సంతోష్, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి అన్నారు. శుక్రవారం వారు గద్వాల మండలం జిల్లెడబండతండాలో నూతన గ్రామ పంచాయతీ భవననిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జాతీయ ఉపాధిహామీ పథకం కింద గత సంవత్సరం రూ.13 కోట్లతో గద్వాల నియోజకవర్గంలో వివిధ రకాల అభివృద్ధి పనులు చేపట్టి పూర్తి చేయడం జరుగుతుందన్నారు. ఈ సంవత్సరం కూడా వంద రోజుల పనిదినాలు కల్పించి కొత్త పనులు చేపట్టనున్నట్లు తెలియజేశారు. గ్రామీణ ప్రాంత ప్రజలు ఉపాధి కోసం వలసలు వెళ్లకుండా ఉపాధి హామీ పథకం కింద పని కల్పించనున్నట్లు తెలిపారు. గ్రామంలో 900 మంది ఉన్నారని గ్రామానికి అవసరమైన సీసీ రోడ్లు, మరుగుదొడ్లు, గ్రామపంచాయతీ భవనాలు, అంగన్వాడీ భవనాలు, గ్రామాలలో మౌళికవసతుల కల్పన వంటి ముఖ్యమైన అభివృద్ధిపనులు చేయనున్నట్లు తెలిపారు. రూ.20 లక్షలతో గ్రామంలో కొత్తగా గ్రామ పంచాయతీ భవనాలు శంకుస్థాన చేసుకోవడం జరిగిందన్నారు. చేపట్టిన పనులు వచ్చేడాది మార్చి వరకు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా గ్రామాల్లో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పారిశుద్ధ్య పనులు చేపట్టాలన్నారు. అనంతరం ఉత్తమ సేవలు అందించిన పారిశుద్ధ్య కార్మికులకు సన్మానించారు. గ్రామంలో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకున్న లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. గ్రామ పంచాయతీ కార్యాలయ ప్రాంగణంలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నర్సింగ్రావు, ఎంపీడీవో ఉపాదేవి, పీఆర్ డీఈ కబీర్దాస్, ఏఈ బషీర్, పీఎస్ కార్యదర్శి కవిత, మహిళా సంఘం అధ్యక్షురాలు జ్యోతి, నాయకులు పాల్గొన్నారు. -
స్వగ్రామం కంచుపాడు..
సురవరం సుధాకర్రెడ్డి జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలోని ఉండవెల్లి మండలంలోని కంచుపాడు గ్రామంలో మార్చి 25, 1942 సంవత్సరంలో జన్మించారు. సురవరం వెంకట్రామిరెడ్డి, ఈశ్వరమ్మ దంపతులకు సుధాకర్రెడ్డి, రవీందర్రెడ్డి, ప్రభాకర్రెడ్డి, పుష్పలత నలుగురు సంతానం. కాగా అందరిలో పెద్దవాడైన సుధాకర్రెడ్డి విద్యాభ్యాసం కర్నూలు మున్సిపల్ పాఠశాలలో ఎస్ఎస్ఎల్సీ, ఉస్మానియా కళాశాలలో డిగ్రీ, ఉస్మానియా యూనివర్సిటీలో లా చదివారు. 1974 ఫిబ్రవరి 14న వివాహం కాగా.. ఆయనకు ఇద్దరు కుమారులు ఉన్నారు. -
యూరియా కోసం బారులు..
గట్టు:యూరియా కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు. శుక్రవారం పోలీస్ పహారా మధ్య గట్టు పీఏసీఎస్లో యూరియా పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. వ్యవసాయ అధికారుల సమక్షంలో ప్రతి రైతుకు 2 బస్తాల చొప్పున అందించారు. యూరియా వచ్చిందని తెలుసుకున్న రైతులు ముందుగానే పీఏసీఎస్ దగ్గరకు చేరుకొని వరుసలో కవర్ల ద్వారా పాసు పుస్తకం, ఆధార్ జిరాక్స్లను పెట్టారు. వంతు వచ్చిన రైతులు వేలి ముద్ర వేసుకుని యూరియాను తీసుకెళ్లారు. ఒక్క రోజే 420 బస్తాలను రైతులకు అందజేసినట్లు పీఏసీఎస్ అధికారులు తెలిపారు. -
ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలి
● వైద్యులు, వైద్యసిబ్బంది తప్పక బయోమెట్రిక్ ద్వారా హాజరు వేయాలి ● ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచాలి ● కలెక్టర్ బీఎం సంతోష్ గద్వాల: జిల్లాలో వైద్యులు, వైద్యసిబ్బంది.. ప్రజలకు అందుబాటులో ఉండి మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్ బీఎం సంతోష్ ఆదేశించారు. గురువారం ఐడీవోసీ కార్యాలయంలో కాన్ఫరెన్స్ హాలులో అధికారులతో సమీక్షించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని ప్రభుత్వ ఆసుపత్రులలో అన్ని రకాల వైద్యసదుపాయాలు కల్పించి ప్రజలకు మరింత మెరుగైన వైద్యం అందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు. అదేవిధంగా వైద్యులు, వైద్యసిబ్బంది తప్పక బయోమెట్రిక్ ద్వారా హాజరు నమోదు చేయాలన్నారు. ఈ నెలాఖరుకు అన్ని రిజిస్ట్రేషన్ ఎన్రోల్చేసి సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ప్రతిఒక్కరు బయోమెట్రిక్ అమలు చేయాలన్నారు. ప్రోగ్రాం ఆఫీసర్లు ప్రతి రెండుసార్లు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను క్షేత్రస్థాయిలో సందర్శించాలన్నారు. క్షేత్రస్థాయి పర్యటన సమయంలో ప్రోగ్రాం అధికారులు హైరిస్క్ రోగులను గుర్తించి వారికి అవసరమైన మెరుగైన వైద్యసేవలు అందించాలన్నారు. అన్ని ఆసుపత్రులలో డెలివరీల సంఖ్య పెంచాలన్నారు. సమావేశంలో డీఎంహెచ్వో డాక్టర్ సిద్దప్ప, ప్రోగ్రాం అధికారి డాక్టర్ సంధ్యారాణి, మెడికల్ ఆఫీసర్లు, హెల్త్సూపర్వైజర్లు పాల్గొన్నారు. చేనేత రుణమాఫీకి ప్రతిపాదనలు జిల్లాలో చేనేత కార్మికులకు రూ.11.51 కోట్ల వ్యతిగత రుణమాఫీకి సంబంధించిన ప్రతిపాదనలు రారష్ట్ర స్థాయి కమిటీకి పంపుతున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈమేరకు అధికారులతో మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా 1496మంది చేనేత కార్మికుల పెండింగ్ రుణాలు రూ.9,94,83,283 ఉన్నాయన్నారు. 265మంది కార్మికులకు రూ.1,81,10,500 కలిపి మొత్తం రూ.11.751కోట్లు మాఫీ చేయాలని జిల్లా స్థాయి కమిటీ ఆమోదించిందన్నారు. ఈ సిఫారసులను తదుపరి చర్యల కోసం రాష్ట్ర స్థాయికమిటీకి పంపుతున్నట్లు తెలిపారు. అన్ని జాతీయ బ్యాంకులు, జిల్లా సహకార బ్యాంకులు చేనేత కార్మికులపై బ్రోకెన్ పీరియడ్ వడ్డీతో సహా మొత్తం రూ.68,58,334 వడ్డీని మాఫీ చేయాలని కమిటీ నిర్ణయించినట్లు తెలిపారు. చేనేత కార్మికుల సంక్షేమార్థం ప్రభుత్వం తీసుకున్న చారిత్రాత్మక రుణమాఫీ నిర్ణయం వందలాది కుటుంబాలకు ఆర్థిక భారం నుంచి ఉపశమనం కలిగిస్తుందన్నారు. బ్యాంకులు సంపూర్ణ సహకారం అందించి వారి భవిష్యత్తు భద్రతకు తోడ్పాడాలన్నారు. సమావేశంలో ప్రాంతీయ డిప్యూటీ డైరెక్టర్ పద్మ, ఏడీ గోవిందయ్య, లీడ్బ్యాంక్ మేనేజర్ శ్రీనివాసరావు, జీఎం రామలింగేశ్వర్గౌడ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
బిగుస్తున్న ఉచ్చు..
నందిన్నె రైస్మిల్లులో విజిలెన్స్ సోదాలు రెండు రోజులపాటు విజిలెన్స్ సోదాలు.. నందిన్నె రైస్మిల్లుకు 2022 రబీలో (1425.520 మెట్రిక్ టన్నుల ధాన్యం), 2024 ఖరీఫ్లో (5948.560 మె.ట) 2024–25 రబీలో (10,294.680 మె.ట) సీజన్లలో సదరు రైస్మిల్లుకు సుమారు రూ.45 కోట్ల విలువ గల (40కేజీల సామర్థ్యం ఉన్న 4 లక్షల ధాన్యం బస్తాలు) సివిల్సప్లై శాఖ అధికారులు కేటాయించారు. ఇందులో ఇప్పటి వరకు 2024 ఖరీఫ్, రబీకి సంబంధించి కేవలం రూ.10 కోట్ల విలువ గల సీఎమ్మార్ బియ్యం మాత్రమే అందించారు. 2022 రబీకి నిర్వహించిన టెండర్ సరుకు ఇంకా అందించలేదు. ఇలా మొత్తంగా కలుపుకొని ప్రభుత్వానికి ఇంకా రూ.40కోట్ల విలువ గల బియ్యాన్ని ప్రభుత్వానికి అందించాల్సి ఉంది. ఇదిలాఉండగా, సదరు రైస్మిల్లులో ఈనెల 11, 12వ తేదీలలో విజిలెన్స్ అధికారులు సోదాలు నిర్వహించారు. ప్రభుత్వం వద్ద తీసుకున్న ధాన్యం లెక్కలతో రైస్మిల్లులో ఉన్న ధాన్యం లెక్కలు సరిచూశారు. రెండు రోజుల పాటు సాగిన సోదాల వివరాలను సదరు విజిలెన్స్ అధికారులు వెల్లడించలేదు. ప్రభుత్వం వద్ద తీసుకున్న ధాన్యం బస్తాల లెక్కకు మిల్లులో ఉన్న ధాన్యం బస్తాల లెక్కలో భారీగా వ్యత్యాసం ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. దాదాపు లక్ష ధాన్యం బస్తాలు తేడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈనేపథ్యంలో మరోమారు మిల్లులో సోదాలు నిర్వహించేందుకు రానున్నట్లు సమాచారం. గద్వాల: జిల్లాలో నందిన్నె రైస్మిల్లుకు ప్రభుత్వం నుంచి మూడు సీజన్లలో సుమారు రూ.50 కోట్ల విలువైన ధాన్యాన్ని మర ఆడించేందుకు ఇవ్వగా.. సదరు మిల్లు యజమాని ఎంచక్కా దొంగ మార్గంలో బ్లాక్మార్కెట్కు తరలించి రూ.కోట్లు వెనకేసుకున్నాడు. దీంతో జిల్లాలోనే సదరు రైస్మిల్లు పేరు అక్రమాలకు కేరాఫ్ అడ్రస్గా నిలిచింది. గత నెల ధాన్యంలోడు లారీని అక్రమంగా కర్ణాటకకు తరలిస్తుండగా గ్రామస్తులు పట్టుకుని అధికారులకు అప్పగిస్తే.. సదరు రైస్మిల్లు ఓనర్పై విచారణ చేపట్టిన అధికారులు కేసు నమోదు చేశారు. తాజాగా విజిలెన్స్ అధికారులు రెండు రోజులపాటు సోదాలు చేయగా.. మరిన్ని వివరాలు బయటకు వస్తున్నాయని సమాచారం. తుది నివేదిక ఆధారంగా చర్యలు గత నెల 15వ తేదీన ఽఅర్ధరాత్రి ప్రభుత్వ ధాన్యాన్ని లారీలో తరలిస్తున్న సంఘటనపై విచారణ జరిపి కేసు నమోదు చేశాం. సదరు రైస్మిల్లు ఓనర్కు షోకాజ్ నోటీసు ఇచ్చాం. ప్రస్తుతం విజిలెన్స్ విచారణ జరుగుతుంది. తుదినివేదిక ఆధారంగా మిల్లు, ఓనర్పై చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా ఈనెల 11వ తేదీన బోల్తాపడిన లారీలో ధాన్యం ఉన్నట్లు గుర్తించాం. దీనిని కూడా విజిలెన్స్ విచారణకు పంపించాం. రైస్మిల్లర్ సహకారం అందిస్తున్న ప్రభుత్వ అధికారులపై సైతం విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం. – వి.లక్ష్మీనారాయణ, అదనపు కలెక్టర్ యథేచ్ఛగా ధాన్యం పక్కదారి.. ● నందిన్నె రైస్ మిల్లు యజమానిపై ఆది నుంచి ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ● 2023 మే 27వ తేదీన నందిన్నె రైస్మిల్లులో ధాన్యం పక్కదారి పట్టిందనే ఆరోపణలతో విజిలెన్స్ అధికారులు సోదాలు చేశారు. దీంతో ధాన్యం అక్రమంగా తరలించినట్లు తేల్చారు. – గత నెల జూలై 15వ తేదీన నందిన్నె రైస్ మిల్లు నుంచి అర్ధరాత్రి వేళ అక్రమంగా ధాన్యం లారీ లోడు కర్నాటకకు తరలిస్తుండగా గ్రామస్తులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. దీనిపై కేసు నమోదు చేసిన అధికారులు మరింత లోతైన విచారణకు విజిలెన్స్కు అప్పగించారు. ● ఈనెల 14వ తేదీన గంగన్పల్లి గోదాం నుంచి అక్రమంగా ధాన్యం బస్తాల లోడు లారీని అక్రమంగా కర్ణాటకకు తరలిస్తుంటే వెంకటాపురం–ఇర్కిచేడు మధ్య మెట్టుబండ వద్ద రోడ్డుపక్కన బోల్తా పడింది. గమనించినన గ్రామస్తులు వివరాలను ఫొటోతో సహా సదరు మండల అధికారులకు సమాచారం అందించారు. అయితే బియ్యం తవుడును తీసుకెళ్తున్నామంటూ అధికారులను బోల్తా కొట్టించి బోల్తాపడిన లారీని కర్ణాటకకు తరలించి దర్జాగా చేతులు దులిపేసుకున్నారు. ఈవ్యవహారంపై అధికారులు ఆరా తీస్తున్నారు. గత నెల అర్ధరాత్రి ధాన్యం లారీ తరలింపులో మిల్లు యజమానిపై కేసు సోదాల్లో లక్ష వరకు ధాన్యం బస్తాలు మాయం? మూడు సీజన్లలో మిల్లుకు రూ.50 కోట్ల ధాన్యం కేటాయింపు గంగన్పల్లి గోదాం నుంచి కర్ణాటకకు అక్రమమార్గంలో తరలింపు ఇటీవల ధాన్యం లారీ బోల్తా.. ఆరా తీస్తున్న అధికారులు ప్రభుత్వ పెద్దల సాయం.. ప్రభుత్వ ధాన్యం పక్కదారి పట్టిస్తున్న సదరు రైస్మిల్లు యజమాని అక్రమాల నుంచి తప్పించుకునేందుకు ఏకంగా ప్రభుత్వంలోనే పెద్దల సాయం తీసుకున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. పైగా ఆమ్యామ్యాలకు అలవాటుపడిన ఓ జిల్లా స్థాయి అధికారి రైస్మిల్లర్కు కొమ్ము కాస్తున్నట్లు బహిరంగంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
ప్రారంభానికి ‘ట్రిపుల్ఐటీ’ సిద్ధం
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: ప్రభుత్వం ప్రతిష్టాత్మక బాసర ఐఐఐటీ కళాశాలను జిల్లాకేంద్రంలో ఏర్పాటు చేయనుంది. దీంతో పాలమూరు చరిత్రలో నూతన అధ్యాయం ప్రారంభం కానునుంది. కళాశాల ఏర్పాటుకు అధికారులు దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ మేరకు జిల్లాకేంద్రంలోని బండమీదిపల్లి వద్ద ఉన్న రెడ్డి హాస్టల్ భవనంలో తాత్కాలికంగా కళాశాల ఏర్పాటు చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. అక్కడ విద్యార్థులకు, ప్రత్యేక తరగతి గదులతోపాటు అడ్మిషన్ పొందిన ప్రతి ఒక్కరికీ హాస్టల్ గదులు, డైనింగ్ హాల్ వంటివి సదుపాయాలు కల్పించనున్నారు. ఇప్పటికే తరగతులు ప్రారంభం కావాల్సి ఉండగా.. వర్షాల కారణంగా ఆలస్యమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే వచ్చే వారం కళాశాలను ప్రారంభించి.. అక్కడే విద్యార్థులు, తల్లిదండ్రులకు ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహిస్తామని అధికారులు పేర్కొంటున్నారు. కాగా.. రెగ్యులర్ కళాశాల భవనం కోసం జిల్లాకేంద్రం సమీపంలోని దివిటిపల్లి వద్ద 40 ఎకరాల భూమిని ప్రభుత్వం సిద్ధం చేసినట్లు తెలుస్తుంది. వీటిలో త్వరలో పూర్తిస్థాయి నిర్మాణాలు చేపట్టనున్నారు. అవకాశాలతో మేలు.. సాధారణంగా ఇంజినీరింగ్ చేసే విద్యార్థులకు ఇంటర్మీడియట్ తర్వాత ఎఫ్ సెట్ వంటి పోటీ పరీక్షలు రాస్తే సీటు లభించే అవకాశం ఉంది. కానీ ప్రస్తుతం ఐఐఐటీలో ఎస్సెస్సీ పూర్తయిన తర్వాత నేరుగా మొదటి సంవత్సరంలో అడ్మిషన్ను పొందవచ్చు. ఇది ఇంటిగ్రేటెడ్ కోర్సులు కావడంతో 2 ప్లస్ 4 విధానంలో విద్యాబోధన జరుగుతుంది. మొదటి రెండేళ్లు అందరికీ కామన్ సిలబస్ ఉండగా.. తర్వాత మరో నాలుగేళ్లు వివిధ డిపార్ట్మెంట్లు విడిగా తరగతులు బోధించాల్సి ఉంటుంది. ఇందులోనే ఇంటర్తోపాటు ఇంజినీరింగ్ విద్య కూడా పూర్తి అవుతుంది. ఒక విద్యార్థి ఎస్సెస్సీ తర్వాత అడ్మిషన్ పొందితే నేరుగా ఇంజినీరింగ్ సర్టిఫికెట్తో బయటికి వచ్చి.. ఉద్యోగం పొందేందుకు సంసిద్ధంగా ఉంటారు. వచ్చేవారం ఓరియంటేషన్ కార్యక్రమాల నిర్వహణ ఇప్పటికే ఎస్సెస్సీ మెరిట్ ఆధారంగా 208 మందికి అడ్మిషన్లు ఇంటర్మీడియట్తోపాటు ఇంజినీరింగ్చదివేందుకు వెసులుబాటు బండమీదిపల్లి వద్ద ఉన్న రెడ్డి హాస్టల్భవనంలో తాత్కాలికంగా ఏర్పాటు టీచింగ్, నాన్టీచింగ్ సిబ్బంది నియామకాలు చేపడుతున్న బాసర అధికారులు ఆన్లైన్ విధానంలోనే.. ఐఐఐటీ కళాశాల ఏర్పాటు మొదటి సంవత్సరం కావడంతో అడ్మిషన్ల ప్రక్రియ అంతా కూడా యూనివర్సిటీ నుంచి నేరుగా ఆన్లైన్ విధానంలో జరిగింది. ఈ మేరకు ఎస్సెస్సీలో అత్యధిక మార్కులు సాధించిన 208 మంది విద్యార్థులకు రిజర్వేషన్ల ఆధారంగా ప్రస్తుతం 144 మంది బాలికలు, 64 మంది బాలురకు అవకాశం కల్పించారు. ఇక స్టాఫ్ నియామకాల ప్రక్రియను సైతం అధికారులు పూర్తిచేశారు. గత నెల టీచింగ్ సిబ్బంది నియామకానికి ప్రకటన ఇవ్వగా.. 31 మంది దరఖాస్తు చేసుకుంటే 9 మందిని వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించి అధ్యాపకులను భర్తీ చేశారు. మరో 6 మంది నాన్ టీచింగ్ సిబ్బందిని సైతం నియమించినట్లు తెలుస్తోంది. ఇందులో వార్డెన్లు, అటెండర్లు, స్వీపర్ ఇతర సిబ్బంది ఉన్నారు. -
కేసుల విచారణ వేగవంతం
గద్వాల క్రైం: శాంతిభద్రతల విషయంలో అప్రమత్తంగా ఉంటూ అనుమానాస్పద కేసులపై వేగవంతంగా విచారణ చేపట్టాలని ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. గురువారం ఎస్పీ కార్యాలయంలో నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమస్యలపై వచ్చే బాధితులకు న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. గణేష్ మండపాల కోసం నిర్వాహకులు పోలీసుశాఖ అనుమతి తీసుకోవాలని, ఉత్సవాలు పూర్తి అయ్యేవరకు నిత్యం నిఘా ఉంచాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రత్యేక విచారణ చేపట్టాలన్నారు. అనుమతి లేకుండా ఇసుక, మట్టి, రేషన్ బియ్యం, నిషేధిత మత్తు పదార్థాల వంటి వాటిని కట్టడి చేయాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకానికి ఇసుక తరలింపు విషయంలో ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కేసుల విషయంలో నిర్లక్ష్యం లేకుండా వీలైనంత త్వరగా కోర్టులో చార్జ్షీట్ దాఖలు చేసి నిందితులకు శిక్ష పడేలా వ్యవహరించాలన్నారు. అనంతరం ఆయా స్టేషన్లలో నమోదైన కేసులపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. డ్రగ్ రహిత సమాజ స్థాపనలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాల్సిందిగా పిలుపునిచ్చారు. సమావేశంలో డీఎస్పీ మొగిలయ్య, సీఐ టాటాబాబు, శ్రీను, రవిబాబు, ఎస్ఐలు, కళ్యాణ్కుమార్, శ్రీకాంత్, వేంకటేష్, శ్రీనివాసులు, మల్లేష్, శ్రీహరి, నందికర్ పాల్గొన్నారు. -
ఎరువుల కొరత ఉండొద్దు : కలెక్టర్
గద్వాల: రైతులకు అవసరమైన ఎరువులు అందుబాటులో ఉండాలని.. ఎట్టి పరిస్థితుల్లోనూ కొరత ఉండొద్దని కలెక్టర్ బీఎం సంతోష్ ఆదేశించారు. బుధవారం ఐడీఓసీలోని కాన్ఫరెన్స్ హాల్లో సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం జిల్లాలో 543 మెట్రిక్ టన్నుల యూరియాను అవసరమున్న రైతులకు మాత్రమే పంపిణీ చేయాలన్నారు. యూరియా పంపిణీలో అవకతవకలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లాకు వచ్చే యూరియాను పూర్తిగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారానే రైతులకు అందజేయాలని.. ఇతర ఆగ్రో షాపులకు కేటాయించరాదన్నారు. గతేడాది కంటే ఈ సారి 600 మెట్రిక్ టన్నుల యారియాను ఎక్కువగా విక్రయించడం జరిగిందని, అయినప్పటికీ యూరియా కొరతకు గల కారణాలపై సమగ్ర విచారణ జరపాలని కలెక్టర్ ఆదేశించారు. ఎరువులు పక్కదారి పట్టకుండా పర్యవేక్షణ చేయాలన్నారు. అదే విధంగా రైతులు కూడా తమకు అవసరమైనంత మేరకే ఎరువులు వినియోగించుకునేలా అవగాహన కల్పించాలని సూచించారు. ఒకసారి తీసుకున్న రైతులకు మళ్లీ ఇవ్వకుండా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో డీఏఓ సక్రియా నాయక్, ఏడీఏ సంగీతలక్ష్మి తదితరులు ఉన్నారు. కలెక్టర్ బీఎం సంతోష్ -
అత్యవసర సమయాల్లో అవస్థలు
ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో పది రోజుల నుంచి హనుమాన్పురాలోని ఆర్యూబీ ద్వారా రాకపోకలు బంద్ అయ్యాయి. రైల్వే ట్రాక్ అవతల 2.5 కి.మీ. దూరంలో మా తండా ఉంటుంది. ప్రతి రోజూ బైక్ను ఇవతల ఉంచి న్యూటౌన్లో నేను పనిచేసే ప్రైవేట్ ఆస్పత్రికి వస్తున్నాను. తిరిగి రాత్రి రైల్వే ట్రాక్ వద్ద నిలిపి అవతలికి కాలినడకన వెళ్లి ఆ తర్వాత ఏదైనా ఆటో అందుబాటులో ఉంటే తండాకు చేరుకుంటున్నాను. అత్యవసర సమయాల్లో ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పాత గేటును వెంటనే తెరిస్తే సమస్య కొంత వరకు పరిష్కారమవుతుంది. – పి.మహేష్, ప్రైవేట్ ఉద్యోగి, గొల్లబండతండా -
‘యమ’డేంజర్..!
ప్రమాదకరంగా ఆర్యూబీలు ● ప్రతి ఏటా ఇదే తంతు.. తాత్కాలిక చర్యలతోనే సరి ● భారీ వర్షాలతో అండర్ పాస్లకు పోటెత్తుతున్న వరద ● పలు గ్రామాలు, కాలనీలకు నిలిచిపోయిన రాకపోకలు ● ప్రత్యేక పైపులైన్ల ఏర్పాటును పట్టించుకోని రైల్వే శాఖ ● డ్రెయినేజీల విస్తరణ, అనుసంధానంపై నిర్లక్ష్యం2022 జూలై 08: ఇది మహబూబ్నగర్ రూరల్ మండలం సూగురుగడ్డ రైల్వే అండర్ బ్రిడ్జిలో భారీగా చేరిన వరద నీటి లో చిక్కుకున్న ఓ స్కూల్ బస్సు. ఆ సమయంలో 30 మంది విద్యార్థులు బస్సులో ఉండగా.. యువకుల సమయస్ఫూర్తితో ప్రాణాపాయం తప్పింది. 2025 ఆగస్ట్ 14: ఇది మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి బండమీదపల్లి (పాలిటెక్నిక్ కళాశాలకు వెళ్లే దారి)లోని రైల్వే అండర్ బ్రిడ్జి. భారీ వర్షంతో వరద పోటెత్తగా చెరువును తలపిస్తోంది. ఐదు రోజులుగా అటు ఇటుగా రాకపోకలు నిలిచిపోయాయి. -
యూరియా కోసం రోడ్డెక్కిన రైతులు
గద్వాలన్యూటౌన్: జిల్లాలో యూరియా సమస్య తీరడం లేదు. వారం రోజులుగా యూరియా కోసం రైతులు నానా అవస్థలు పడుతున్నారు. పీఏసీఎస్ల వద్ద గంటల తరబడి క్యూ కడుతున్నారు. అయినప్పటికీ యూరియా లభించకపోవడంతో రోడ్డెక్కి ఆందోళనకు దిగుతున్నారు. మంగళవారం అయిజ, గట్టు, కేటీదొడ్డి మండలాల్లో రైతులు ఆందోళనకు దిగగా.. తాజాగా జిల్లా కేంద్రంలో రైతులు రోడ్డెక్కారు. బుధవారం స్థానిక పీఏసీఎస్ కార్యాలయానికి రైతులు యూరియా కోసం వచ్చారు. అయితే స్టాక్ లేదని అధికారులు చెప్పడంతో ఆగ్రహించిన అన్నదాతలు.. అంబేడ్కర్ చౌరస్తా వద్ద రాస్తారోకో చేపట్టారు. యూరియా కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని.. రోజల తరబడి ఎదురుచూడాల్సి వస్తోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. యూరియా చల్లకపోవడం వల్ల మొక్కల పెరుగుదల మందగించి.. దిగుబడులు తగ్గే ప్రమాదం ఉందని వాపోయారు. రైతులకు బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి బాసు హనుమంతు నాయుడు, ఇతర నాయకులు సంఘీభావం తెలిపారు. గంట పాటు రైతులు చేపట్టిన ఆందోళనతో వాహనాల రాకపోకలు స్తంభించాయి. విషయం తెలుసుకున్న డీఎస్పీ మొగిలయ్య పోలీసులతో అక్కడికి చేరుకొని రైతులను శాంతింపజేశారు. 22 మెట్రిక్ టన్నుల యూరియా పంపిణీ.. రైతుల ఆందోళన విషయం తెలుసుకున్న పీఏసీఎస్ చైర్మన్ సుభాన్ అక్కడికి చేరుకొని విషయాన్ని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఎమ్మెల్యే కలెక్టర్తో మాట్లాడి రైతుల సమస్యను వివరించడంతో 22 మెట్రిక్ టన్నుల యూరియాను గోదాముకు పంపించారు. దీంతో పీఏసీఎస్ అధికారులు రైతులకు టోకెన్లు అందించి.. యూరియా పంపిణీ చేశారు. ● పీఏసీఎస్ కార్యాలయాన్ని ఎస్పీ శ్రీనివాసరావు సందర్శించి రైతులకు టోకెన్ల పంపిణీ విధానాన్ని పరిశీలించారు. నిల్వ ఉన్న యూరియాను నిబంధనలకు అనుగుణంగా పంపిణీ చేయాలని అధికారులకు సూచించారు. ఎరువుల కృత్రిమ కొరత తలెత్తకుండా జాగ్రత్త వహించాలన్నారు. ఎస్పీ వెంట డీఎస్పీ మొగిలయ్య, పట్టణ ఎస్ఐ కళ్యాణ్కుమార్, వ్యవసాయశాఖ అధికారులు ఉన్నారు. జిల్లా కేంద్రంలో గంట పాటు ఆందోళన ఎమ్మెల్యే చొరవతో 22 మెట్రిక్ టన్నుల యూరియా పంపిణీ -
‘ఆత్మీయ భరోసా’ అమలులో విఫలం
అలంపూర్: ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అమలులో ప్రభుత్వం విఫలమైందని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జి.రాజు విమర్శించారు. అలంపూర్లోని కేవీపీఎస్ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జీఓ 42 ప్రకారం ఉపాధి హామీ పథకం కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం ద్వారా ఆర్థిక చేయూత అందించాల్సి ఉండగా.. పథకం అమలులో తీవ్ర జాప్యం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో 5లక్షల మంది లబ్ధిదారులను ఎంపికచేసి.. కేవలం 83వేల మందికి రూ. 50.33కోట్లు చెల్లించారని తెలిపారు. మిగిలిన 4,13,658 మందికి రూ. 250కోట్లు చెల్లించాల్సి ఉండగా.. ప్రస్తుతం మరో 2లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారన్నారు. ప్రభుత్వం మాత్రం లబ్ధిదారుల ఖాతాల్లో నిధులు జమ చేయడం లేదన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం లబ్ధిదారులకు ఆత్మీయ భరోసా అందించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఆ సంఘం జిల్లా ఉ పాధ్యక్షుడు రాఘవేంద్ర యాదవ్, నర్సింహ ఉన్నారు. -
వర్షాలతో ఇబ్బంది
సీడ్ క్రాసింగ్ పనుల కోసం ప్రతి ఏటా జూలై ఈ ప్రాంతానికి వస్తాం. రైతులు మాతో ముందస్తుగా మాట్లాడుకుంటారు. నెలకు రూ.20వేల నుంచి రూ.22వేలు చెల్లిస్తారు. రైతు వీలును బట్టి 30 నుంచి 60 రోజుల వరకు క్రాసింగ్ పనులు చేపడతాం. ఈ ఏడాది ఎడతెరిపి లేని వర్షాలతో కొంత ఇబ్బంది నెలకొంది. క్రాసింగ్ చేసినవి కాయలుగా మారకుండా రాలిపోతాయనే భయం వెంటాడుతోంది. – యాకోబు, వలస కూలి, గుడేకల్లు గ్రామం, ఎమిగనూర్ మండలం, కర్నూలు జిల్లా -
సం‘పత్తి’ కలిగేనా..!?
నడిగడ్డలో అత్యధికంగా సీడ్ పత్తి సాగు గట్టు: పేరెన్నిక కల్గిన పత్తి విత్తనాలను అందించడంలో నడిగడ్డ ప్రాంతం రాష్ట్రంలోనే పేరుగాంచింది. అయితే, ఈ ఏడాది సీడ్ పత్తి రైతును ఎడతెరిపి లేని వర్షాలు.. మధ్యవర్తుల కొత్త నిబంధనలు కలవరపాటుకు గురిచేస్తున్నాయి. భారీ వర్షాలతో క్రాసింగ్ చేసినవి కాయలుగా మారకుండా రాలిపోతాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికితోడు ఎకరాకు కేవలం 150 నుంచి 200 ప్యాకెట్ల విత్తనాలు మాత్రమే కొంటామని.. అంతకుమించి సాగుచేస్తే కొనమని మధ్యవర్తులు చెబుతుండడం కలవరపెడుతోంది. విధిలేని పరిస్థితుల్లో కొంతమంది రైతులు మధ్యలోనే పంట వదిలేస్తుండగా.. మరికొందరు యథావిధిగా సాగు చేస్తున్నారు. మొత్తంగా ఈ ఏడాది పత్తి సాగు చేసిన రైతుల శ్రమకు తగిన ప్రతిఫలం దక్కుతుందా.. లేదా అన్న అనుమానం నెలకొంది. జిల్లా వ్యాప్తంగా పత్తివిత్తనోత్పత్తి సాగు 22,783 ఎకరాల్లో, కమర్షియల్ పత్తి 1,05,101 ఎకరాల్లో సాగు అవుతోంది. ఎడతెరిపి లేని వర్షాలతో ముప్పు.. ఎకరా సీడ్పత్తిని సాగు చేస్తే పెట్టుబడిగా రూ.లక్ష నుంచి 1.5 లక్షల వరకు పెట్టుబడి పెడతారు. జూన్న్ ప్రారంభంలో పత్తివిత్తనోత్పత్తిని సాగు చేస్తుండగా, జూలై చివరి వారం నుంచి క్రాసింగ్ పనులు (మగ పువ్వు పుప్పొడిని ఆడ పువ్వుతో క్రాసింగ్) ప్రారంభిస్తారు. ఇలా 30 నుంచి 60 రోజుల పాటు క్రాసింగ్ పనులను చేపడతారు. ఇలా ఆరుమాసాల్లో పంటకాలం పూర్తి చేస్తారు. ఈ క్రాసింగ్ పనులకు ఎకరాకు 5 నుంచి 7 మంది కూలీల దాకా అవసరం అవుతారు. వీరికి నెలకు రూ.18వేల నుంచి రూ.21 వేల వరకు కూలీ చెల్లిస్తారు. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు, ఎమ్మిగనూర్ ప్రాంతాలతో పాటుగా కర్ణాటకలోని రాయచూర్ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి కూలీలను రప్పిస్తుంటారు. అయితే, భారీ వర్షాలతో క్రాసింగ్ చేసినవి కాయలుగా మారకుండా రాలిపోతాయన్న భయం రైతులను వెంటాడుతోంది. జిల్లాలో పత్తి విత్తనోత్పత్తి సాగు ఇలా.. (ఎకరాల్లో) ఇటీవల రైతును కలవరపెడుతున్న ఎడతెరిపి లేని వర్షాలు మధ్యవర్తుల కొత్త నిబంధనలతోపరేషాన్ జిల్లాలో 22,783 ఎకరాల్లో సీడ్ పత్తి.. 1.05 లక్షల ఎకరాల్లో కమర్షియల్ పత్తి సాగు -
ముందస్తు ఒప్పందంతో ఆందోళన
పత్తివిత్తనోత్పత్తి సాగులో ముందుస్తు ఒప్పందం మేరకు జూన్ మొదటి వారంలోనే రైతులకు విత్తనాలతో పాటుగా పెట్టుబడి కోసం మధ్యవర్తులు కొంత డబ్బులను అందజేస్తారు. అయితే, 45 రోజుల తర్వాత ఎకరాకు కేవలం తాము 150 నుంచి 200 ప్యాకెట్లు మాత్రమే కొంటామని, అంతకన్నా ఎక్కువ పండిస్తే తాము కొనలేమని చెబుతుండడంతో పత్తి రైతులు పరేషాన్ అవుతున్నారు. ముఖ్యంగా పూత రాసే (జీఎంఎస్, స్టేరల్స్) వైరెటీ సీడ్ పత్తి పంటను సాగు చేసిన రైతులు ఆందోళనలో ఉన్నారు. ఎకరాకు 4 నుంచి 8 క్వింటాళ్ల దిగుబడి వస్తుండగా.. క్వింటన్నర, రెండు క్వింటాళ్లు మాత్రమే కొంటామని చెబుతుండడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది రైతులు పత్తి మొక్కలను తొలగించుకుని వేరే పంటలను సాగు చేసుకోగా, మరికొంత మంది అలాగే కొనసాగిస్తున్నారు. రైతులకు పంటల సాగుకయ్యే పెట్టుబడి డబ్బులను మధ్యవర్తులు నిలిపి వేయడంతో రైతులు మరింత ఆందోళన చెందుతున్నారు. -
సరిహద్దు చెక్పోస్టు వద్ద పటిష్ట నిఘా
అయిజ: జిల్లా సరిహద్దు నుంచి ఇతర రాష్ట్రాలకు యూరియా, ఇతర వస్తువులు అక్రమంగా రవాణా చేయకుండా పోలీస్ అధికారులు పహారా కాయాలని ఎస్పీ శ్రీనివాసరావు ఆదేశించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దులో ఉన్న నాగల్దిన్నె బ్రిడ్జి దగ్గర ఏర్పాటు చేసిన పోలీస్ చెక్పోస్ట్ను మంగళవారం రాత్రి ఎస్పీ సందర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీపై అందిస్తున్న యూరియాను సరిహద్దు రాష్ట్రాలకు అక్రమంగా తరలించకుండా చెక్పోస్ట్ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 24 గంటలు నిఘా ఉంచి ప్రతి వాహనాన్ని తనిఖీ చేయాలన్నారు. ఎస్పీ వెంట శాంతినగర్ సీఐ టాటాబాబు, అయిజ ఎస్సై శ్రీనివాసరావు, పోలీస్ సిబ్బంది ఉన్నారు. -
విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చూడాలి
ఎర్రవల్లి: వసతిగృహ విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని, అవసరమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ సంతోష్ ఆదేశించారు. మంగళవారం మండలంలోని ధర్మవరం బాలుర వసతి గృహం, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కలెక్టర్ పరిశీలించారు. హాస్టల్ పైకప్పు పెచ్చులూడుతున్న నేపథ్యంలో విద్యార్థులకు ప్రమాదం పొంచి ఉందని, వర్షాల నేపథ్యంలో మరమ్మతులు చేపట్టాలని, అప్పటి వరకు విద్యార్థులను పాఠశాలలోనే వసతి కల్పించాలన్నారు. మరమ్మతు అంచనా నివేదికను వెంటనే సమర్పించాలని ఇంజినీరింగ్ శాఖ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ అధికారిని నిశిత, పాఠశాల ప్రిన్సిపల్ లక్ష్మిరెడ్డి, వార్డెన్ జయరాములు, తదితరులు పాల్గొన్నారు. మోటార్లతో వర్షపు నీటిని ఎత్తిపోయాలి మానవపాడు: భారీ వర్షాల కారణంగా అండర్ రైల్వే బ్రిడ్జిలలో నీరు నిలిచిపోతుందని, ఎప్పటికప్పుడు మోటార్లతో నీరు తొలగించాలని, ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులను ఆదేశించారు. మంగళవారం మండలంలోని నారాయణపురం గ్రామం అండర్ రైల్వే బ్రిడ్జిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నీటి మట్టం మరింత పెరిగిన సందర్భంలో, ప్రజలు సురక్షితంగా గ్రామానికి చేరుకునేందుకు డైవర్షన్ రోడ్డు ఏర్పాటు చేయాలని, ఇతర మార్గాల ద్వారా రాకపోకలకు కొనసాగేలా చూడాలన్నారు. అండర్పాస్లను రెవెన్యూ సిబ్బంది, పోలీసులు నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. త్వరలోనే సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామన్నారు. తహసీల్ధార్ జోషి శ్రీనివాస్శర్మ, ఎస్ఐ చంద్రకాంత్, సిబ్బంది పాల్గొన్నారు. జోగుళాంబ ఆలయంలో ప్రత్యేక పూజలు అలంపూర్: అలంపూర్ జోగుళాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను కలెక్టర్ సంతోష్ దర్శించుకున్నారు. ఆలయ అధికారులు, అర్చకులు ఘన స్వాగతం పలికారు. జోగుళాంబ అమ్మవారు, బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాల్లో కలెక్టర్ ప్రత్యేక పూజలు చేశారు. -
దరఖాస్తుల ఆహ్వానం
గద్వాల: ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం ద్వారా స్వయం ఉపాధి అవకాశాలను వినియోగించుకోవాలనుకునే యువత, మహిళలు, గ్రామీణ పారిశ్రామికవేత్తలు ఆన్లైన్ దరఖాస్తులు చేసుకోవాలని పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ రామలిగేశ్వర్గౌడ్ తెలిపారు. ఈపథకం ద్వారా బ్యాంకు రుణాలతో పాటు కేంద్ర నిధుల నుంచి సబ్సిడీ అందుతుందని తెలిపారు. ఏప్రిల్ నుంచి సాంకేతిక సమస్యల కారణంగా ఆన్లైన్ పోర్టల్ సేవలు నిలిచిపోయాయని, ప్రస్తుతం పునరుద్ధరించబడినందున ఆసక్తి గల అభ్యర్థులు httpr.www.kviconi ne.gov.in.pmefpŠobèltal ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని, ఈపథకం ద్వారా జిల్లాలో మరిన్ని ఉపాధి అవకాశాలు సృష్టించబడతాయని పేర్కొన్నారు. మెరుగైన వైద్యసేవలు అందించాలి అలంపూర్ రూరల్: ప్రజలకు అందుబాటులో ఉండి మెరుగైన వైద్యసేవలు అందించాలని ఇన్చార్జ్ డీఎంహెచ్ఓ సిద్దప్ప అన్నారు. మండలంలోని క్యాతూర్ పీహెచ్సీని సందర్శించి ఫార్మసి గది, షేషెంట్స్ గది, రికార్డులను పరిశీలించారు. వైద్య పరీక్షల కోసం వచ్చే గర్భిణులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. కార్యక్రమంలో ప్రోగ్రాం ఆఫీసర్ ప్రసన్న రాణి, వరలక్ష్మీ, భరత్, తిరుమల్ రెడ్డి, రామంజనేయులు పాల్గొన్నారు. నాణ్యమైన విద్యుత్ సరఫరాకు కృషి అయిజ: వినియోగదారులకు నిరంతరం నాణ్యమైన విద్యుత్ను సరఫరా చేస్తామని ట్రాన్స్ కో ఎస్ఈ శ్రీనివాసరెడ్డి అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని సబ్స్టేషన్ను డీఈ తిరుపతిరావుతో కలిసి ఆయన పరిశీలించారు. మండల కేంద్రంలోని 132 /33 కేవీ సబ్స్టేషన్లో 31.5 ఎంవీఏ శక్తిని 50 ఎంవీఏకు పెంచనున్నట్లు తెలిపారు. పట్టణాల్లో, గ్రామాల్లో విద్యుత్ స్తంభాలకు ఏర్పాటు చేసిన టీవీ చానెల్ కేబుల్ వైర్లను డిష్ నిర్వాహకులు స్వచ్ఛందంగా తొలగించాలని ఆదేశించారు. విద్యుత్ స్తంభాలను, విద్యుత్ తీగలను తాకుతున్న చెట్ల కొమ్మలను తొలగించకుంటే ప్రాణ నష్టం జరుగుతుందని, వీటి వల్ల విద్యుత్ సరఫరాకు తరుచూ అంతరాయం కలుగుతుందని అన్నారు. కార్యక్రమంలో గోవిందు, ఏఈ నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. గద్వాల యువతికి నాయక్, రస్తోగి అవార్డు గద్వాల న్యూటౌన్: ఇంజినీరింగ్, టెక్నాలజీ రంగానికి సంబధించి పరిశోధనలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన వారికి ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ముంబాయి (ఐఐటీ ముంబాయి) వారు నాయక్, రస్తోగి అవార్డును 2012 నుంచి అందిస్తున్నారు. ఈ ఏడాది ఈ అవార్డును గద్వాలకు చెందిన కొంకతి ప్రీతి పొందారు. ఆసియాలోనే ప్రతిష్టత్మకమైన అవార్డులలో ఇది ఒకటి. యువతికి ఈ అవార్డు లభించడంపై వారి కుటుంబ సభ్యులు, పలువురు విద్యావేత్తలు హర్షం వ్యక్తం చేశారు. -
తరలింపే తరువాయి..
సాక్షి, నాగర్కర్నూల్: నల్లమల అటవీప్రాంతంలోని అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలో కోర్ ఏరియాలో ఉన్న ఐదు చెంచుపెంటల రీలొకేషన్కు కేంద్ర పర్యావరణ శాఖ సలహాకమిటీ ఆమోదం తెలిపింది. రెండు విడతల్లో ఐదు చెంచుపెంటల్లోని స్థానికులను అడవి నుంచి బయటకు తరలించి అక్కడ పునరావాసం కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనకు కేంద్ర పర్యావరణ శాఖ సలహా కమిటీ సూత్రప్రాయంగా ఆమోదించడంతో గ్రామాల రీలొకేషన్ ప్రక్రియ మొదలుకానుంది. మొదటి విడతలో కుడిచింతల్బైల్, కొల్లంపెంట, తాటిగుండాల పెంటల్లోని 417 కుటుంబాలతో పాటు రెండోవిడతలో వటవర్లపల్లి, సార్లపల్లి గ్రామాల్లోని 836 కుటుంబాలను అడవి నుంచి బయటకు తరలించి ప్రభుత్వం పునరావాసం కల్పించనుంది. వన్యప్రాణులు– మనుషులకు మధ్య ఘర్షణ నివారించేందుకు.. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్లోని కోర్ ఏరియాలోని చెంచుపెంటల్లో నివసిస్తున్న స్థానిక చెంచులను ఇక్కడి నుంచి తరలించి నాగర్కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం బాచారం సమీపంలో పునరావాసం కల్పించనున్నారు. టైగర్ రిజర్వ్ పరిధిలోని పులులు, వన్యప్రాణుల సంరక్షణ, వాటి ఆవాసాలకు ఆటంకాలను నిర్మూలించడం, మనుషులకు – వన్యప్రాణులకు మధ్య ఘర్షణలను నివారించేందుకు, పర్యావరణ సంరక్షణలో భాగంగా జాతీయ పులుల సంరక్షణ అథారిటీ(ఎన్టీసీఏ) నిర్వాసితులకు ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ అందిస్తోంది. స్వచ్ఛందంగా అడవి నుంచి బయట నివసించాలనుకునే వారికి ఒక్కో కుటుంబానికి రూ.15 లక్షల ఆర్థిక సహాయం లేదా ఇల్లు, ఐదెకరాల వ్యవసాయ భూమిని అందిస్తోంది. ఇందుకోసం ఇప్పటికే రీలొకేషన్ సర్వే, గ్రామసభలు నిర్వహించిన అటవీశాఖ అధికారులు గ్రామస్తుల నుంచి అంగీకారపత్రాలను తీసుకున్నారు. సార్లపల్లి గ్రామంలోని 30 కుటుంబాలు మినహా, కొల్లంపెంట, కుడిచింతల్ బైల్, తాటిగుండాల, వటవర్లపల్లి గ్రామాల్లోని స్థానికులు రీలొకేషన్కు అంగీకారం తెలిపారు. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్లోని చెంచుపెంటల తరలింపునకు కేంద్రం ఆమోదం నల్లమల అడవి నుంచి రెండు దశల్లో 5 గ్రామాల రీలొకేషన్ నిర్వాసితుల నుంచి ఎంఓయూ ఒప్పందం అనంతరంప్రారంభంకానున్న తరలింపు ప్రక్రియ ప్రభుత్వం పూర్తిస్థాయిలో పునరావాసం కల్పించాకే తమను తరలించాలంటున్న చెంచులు పెద్దకొత్తపల్లి మండలం బాచారం వద్ద పునరావాసం ఎంఓయూ అనంతరం ప్రారంభంకానున్న ప్రక్రియ.. గ్రామసభలు, జిల్లాస్థాయి కమిటీ, రాష్ట్రస్థాయి కమిటీ, జాతీయ పులుల సంరక్షణ అథారిటీ(ఎన్టీసీఏ) కమిటీల ఆమోదం మంగళవారం కేంద్రం పర్యావరణశాఖ సలహా కమిటీ సైతం ఆమోదం తెలిపింది. దీంతో నిర్వాసితుల నుంచి మెమొరెండమ్ ఆఫ్ అండర్ స్టాడింగ్(ఎంఓయూ) పత్రాలపై సంతకాలను తీసుకున్న తర్వాత గ్రామాల రీలొకేషన్ ప్రక్రియ ప్రారంభంకానుంది. మరో రెండునెలల్లోనే ఈ ప్రక్రియ మొదలవుతుందని అధికారులు చెబుతున్నారు. రీలొకేషన్ ప్రక్రియ పూర్తిగా స్వచ్ఛందంగా ఉంటుందని అటవీశాఖ అధికారులు అంటున్నారు. -
యూరియా కోసం రైతుల ఆందోళన
గద్వాల/గట్టు/అయిజ: విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పంటలకు సంబంధించి సరిపడా యూరియా అందుబాటులో లేక ఇబ్బందులు పడుతున్నామంటూ రైతులు ఆందోళన బాట పట్టారు. మంగళవారం అయిజ మండల కేంద్రంలోని సింగిల్ విండో కార్యాలయాన్ని రైతులు దిగ్బంధించగా.. గట్టు పీఏసీఎస్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. పూర్తి వివరాలిలా.. మూడు రోజుల వరుస సెలవుల నేపథ్యంలో అయిజ సింగిల్విండో కార్యాలయానికి యూరియా సరఫరా నిలిచిపోయింది. మార్క్ఫెడ్ నుంచి వచ్చిన 300 బస్తాల యూరియా కోసం రైతులు ఒకేసారి గుమికూడడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఈసందర్భంగా సింగిల్విండో అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రస్తుతం మార్కెట్లో యూరియా సరిపడినంతగా సరఫరా కాకపోవడం, బహిరంగ మార్కెట్లో ఎక్కువ ధరలకు విక్రయిస్తుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. రైతులంతా ఒకేసారి సింగిల్విండో కార్యాలయానికి చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడుతున్నా యని అన్నారు. సరిపడా యూరియాను సరఫరా చేయాలని కలెక్టర్ను కోరినట్లు తెలిపారు. ఉదయం నుంచి రాత్రి వరకు బారులు.. గట్టు పీఎసీఎస్ ఎదుట మంగళవారం యూరియా కోసం పెద్ద ఎత్తున రైతులు బారులుతీరారు. ఉదయం 6–30 గంటల నుంచే రాత్రి వరకు క్యూలైన్లో నిలబడ్డారు. రైతుల రద్దీని గమనించి పోలీసుల పీఏసీఎస్ దగ్గరకు చేరుకుని పరిస్థితిని అదుపు చేయాల్సి వచ్చింది. ప్రస్తుతం వర్షాలు జోరందుకున్న తరుణంలో రైతులు తాము సాగు చేసిన పంటలకు యూరియా అవసరం కాగా, అది బయట మార్కెట్లో లభించకపోవడంతో లబోదిబోమంటున్నారు. రైతులు వ్యవసాయ పనులు వదిలి ఎరువులు సరఫరా చేసే పీఏసీఎస్ దగ్గర పడిగాపులు పడాల్సి వస్తోంది. ఇలాంటి పరిస్థితి ఎన్నడూ చూడలేదని, పంటలను పండించుకునేందుకు యూరియా దొరకకపోవడం దారుణమని రైతులు వాపోయారు. గట్టు పీఏసీఎస్లో గత నెల 24న యూరియా పంపిణీని ప్రారంభించగా ఇప్పటి దాకా (ప్రస్తుతం పంపిణి చేస్తున్నవి కలుపుకొని) 3024 యూరియా బస్తాను రైతులకు అందించినట్లు పీఏసీఎస్ అధికారులు తెలిపారు. యూరియా కొరత లేకుండా చూడాలి : మాజీ మంత్రి జిల్లాలో యూరియా లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని యూరియా కొరత లేకుండా అవసమైన చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. ఈమేరకు మంగళవారం ఆయన గద్వాలకు వచ్చి కలెక్టర్ బీఎం సంతోష్తో ప్రత్యేక భేటీ అయ్యారు. జిల్లాలో నెలకొన్న పలు సమస్యలపై చర్చించారు. ప్రధానంగా యూరియా కొరతతో పాటు, జూరాల ప్రాజెక్టు గేట్ల మరమ్మతులు, నెట్టెంపాడు ప్రాజెక్టు పరిధిలో సంగాల, తాటికుంట రిజర్వాయర్లను పూర్తిస్థాయి నీటితో నింపి ఆయకట్టుకు సాగునీటిని అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా 99,100 ప్యాకేజీల పరిధిలో అసంపూర్తిగా ఉన్న పనులు పూర్తి చేయాలన్నారు. అనంతరం పలుసమస్యలతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టర్కు అందజేశారు. ఈకార్యక్రమంలో విష్ణువర్ధన్రెడ్డి, బాసుహనుమంతు, కుర్వపల్లయ్య, రాజు, మోనేష్, శ్రీనివాస్రెడ్డి పాల్గొన్నారు. అయిజ సింగిల్విండో కార్యాలయం దిగ్బంధం గట్టు పీఏసీఎస్ వద్ద రాత్రి వరకు ఎదురుచూపులు -
ప్రజావాణికి 40 ఫిర్యాదులు
గద్వాల: వివిధ సమస్యలపై వచ్చే ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో సమావేశం హాలులో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా జిల్లాలోని వివిధ గ్రామాలకు చెందిన ప్రజలు మొత్తం 40 ఫిర్యాదులను కలెక్టర్కు నేరుగా అందజేశారు. అనంతరం వాటిని ఆయా శాఖలకు చెందిన అధికారులకు పంపించడం జరిగిందని, వెంటనే పరిష్కరించాలని, పరిష్కారం కానిపక్షంలో అందుకు గల కారణాలు వివరిస్తూ సంబంధిత ఫిర్యాదుదారుడికి అక్నాలెడ్డ్మెంట్ ద్వారా తెలియజేయాలని సూచించినట్లు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు వి.లక్ష్మీనారాయణ, నర్సింగ్రావు కలెక్టరేట్ సిబ్బంది, వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. పోలీస్ గ్రీవెన్స్కు 10 అర్జీలు గద్వాల క్రైం: భూ వివాదం, ఆస్తి తగదాలు, అప్పుగా తీసుకున్న వ్యక్తులు డబ్బులు చెల్లించడం లేదంటూ మొత్తం 10 ఫిర్యాదులను ఎస్పీ శ్రీనివాస్రావుకు అందజేశారు. సోమవారం ఎస్పీ కార్యాలయంలో పోలీస్ గ్రీవెన్స్ నిర్వహించారు. -
ఎడతెరిపి లేని వానలు
గద్వాల: జిల్లాలో రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. రాత్రనక.. పగలనకా ముసురు వర్షంతో ప్రజలు చిత్తడవుతున్నారు. ఇక వాగులు, వంకలు పొంగి పొర్లుతుండగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. శనివారం రాత్రి నుంచి సోమవారం రాత్రి వరకు జిల్లా వ్యాప్తంగా 3.8సెం.మీ. వర్షం కురిస్తే ఇందులో గరిష్టంగా రాజోలిలో 52.1 మి.మీటర్లు, ఇటిక్యాల, మల్దకల్, గట్టు, అయిజ మండలాల్లో 40 మి.మీ. పైగా వర్షపాతం నమోదైంది. కలెక్టర్, ఎస్పీ పర్యవేక్షణ జిల్లా వ్యాప్తంగా నాలుగురోజులుగా భారీ వర్షాలు కురుస్తుండడంతో కలెక్టర్ బీఎం సంతోష్, ఎస్పీ శ్రీనివాసరావు అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ క్షేత్రస్థాయిలో పర్యటించి అప్రమత్తం చేస్తున్నారు. ప్రధానంగా ఎర్రవల్లి, మానవపాడు మండలా పరిధిలోని వాగులు ఉగ్రరూపం దాల్చుతుండడంతో పోలీసు, రెవెన్యూ సిబ్బందిని పహారపెట్టి రాకపోకలను నియంత్రిస్తున్నారు. మరో రెండు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండి అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. రాకపోకలకు అంతరాయం భారీ వర్షాలతో ప్రధానంగా అలంపూర్ మండలం కాశపురం వద్దనున్న వాగు పొంగి పొర్లడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అదేవిధంగా మానవపాడు మండలంలోని మానవపాడు– అమరవాయి మధ్యనున్న పెద్దవాగు ఉగ్రరూపం దాల్చడంతో ఆ రహదారిలో వెళ్లే వాహనాలకు ప్రమాదం పొంచి ఉందని, దాంతోపాటు పైభాగాన కురిసిన భారీ వర్షాలకు వర్షపు నీరు చేరి వాగు ఉధృతంగా పొంగే ప్రమాదం ఉందంటూ స్థానికులు హెచ్చరికలు చేస్తూ వాహనాల రాకపోకలను నిలిపివేశారు. మెన్నిపాడు వాగు ఉగ్రరూపం దాల్చడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. గద్వాల, ధరూరు, ఇటిక్యాల, మానవపాడు, కేటి.దొడ్డి, గట్టు, మల్దకల్, ఎర్రవల్లి, రాజోలి, అలంపూరు, వడ్డేపల్లి తదితర మండలాల పరిఽధిలో వాగులు, కుంటలు వర్షంనీటితో పొంగిపొర్లుతున్నాయి. పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు రాజోళిలో గరిష్టంగా 52.1 మి.మీ వర్షపాతం నమోదు కలెక్టర్, ఎస్పీల నిరంతర పర్యవేక్షణ -
సమయపాలన తప్పనిసరి
మల్దకల్: ఉదయం 9నుంచి సాయంత్రం 4.30గంటల వరకు తప్పనిసరిగా విధులు నిర్వహించాలని, సమయపాలన పాటించని వైద్య సిబ్బందిపై కఠినచర్యలు తప్పవని డీఎంహెచ్ఓ డాక్టర్ సిద్దప్ప హెచ్చరించారు. సోమవారం మండలంలోని పాల్వాయిలో ఉన్న ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాలని, మెరుగైన వైద్యసేవలు అందించాలన్నారు. కొంతమంది వైద్య సిబ్బంది సమయపాలన పాటించడం లేదనే ఫిర్యాదులు అందుతున్నాయని, అలాంటి వారు తమ పద్దతిని మార్చుకోవాలని హెచ్చరించారు. ప్రతి శుక్రవారం డ్రై డే నిర్వహించడంతో పాటు గ్రామంలో బీపీ, షుగర్ పరీక్షలు నిర్వహించాలని, ప్రభుత్వ ఆస్పత్రులలో ప్రసవాల సంఖ్యను మరింత పెంచాలన్నారు. ననీన్కుమార్, డీపీహెచ్ఎన్ఓ వరలక్ష్మీ, డీఎస్ఓ తిరుమలేష్ రెడ్డి, హెల్త్ సూపర్వైజర్ శ్రీధర్, ఏఎన్ఎం మనోహరమ్మ, ఆశాలు ఉన్నారు. -
సాహస వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న
గద్వాలటౌన్: బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం అహర్నిశలు పోరాడిన మహావీరుడు సర్దార్ సర్వాయి పాపన్న అని కలెక్టర్ సంతోష్ కొనియాడారు. సోమవారం కలెక్టరేట్లో సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకలను అధికారికంగా ఘనంగా నిర్వహించారు. కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన సర్దార్ సర్వాయి పాపన్న చిత్రపటానికి ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి కలిసి కలెక్టర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అడిషనల్ కలెక్టర్లు లక్ష్మినారాయణ, నర్సింగరావు,బీసీ సంక్షేమ శాఖ అధికారిణి నుశిత, గౌడ్ సంఘం జిల్లా నాయకుడు శ్రీధర్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. వివిధ పార్టీల ఆధ్వర్యంలో... సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకలను వివిధ పార్టీల నాయకులు, వివిధ సంఘాల నాయకులు వేరువేరుగా ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆ పార్టీ ఇన్చార్జి సరిత ఘనంగా నివాళి అర్పించి, ఆయన సేవలను కొనియాడారు. బీఆర్ఎస్ నాయకుడు హనుమంతు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామంజనేయులు, ప్రజా సంఘాల నాయకడు ప్రభాకర్, నడిగడ్డ గౌడ్ సంఘం నాయకులు వేరువేరుగా నివాళులర్పించి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. -
అనధికార మందులు విక్రయిస్తే చర్యలు
ఎర్రవల్లి: ప్రభుత్వ నిబంధనలు ఉల్లగించి అనధికార మందులు విక్రయిస్తే చర్యలు తప్పవని జిల్లా డ్రగ్ ఇన్స్పెక్టర్ వినయ్ అన్నారు. సోమవారం ఇటిక్యాల మండలంలోని ఉదండాపురంలో మసూద్ అహ్మద్ నిర్వహిస్తున్న ప్రథమ చికిత్స కేంద్రాన్ని నాగర్కర్నూల్ జిల్లా డ్రగ్స్ ఇన్స్పెక్టర్ విశ్వనాథ్రెడ్డి, మహబూబ్నగర్ రీజియన్ అసిస్టెంట్ డైరెక్టర్ దినేష్కుమార్తో కలిసి ఆయన తనిఖీ చేశారు. ఈమేరకు రూ.40వేల విలువైన 67 రకాల అలోపతి ఔషదాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వీటిని చికిత్స చేయడం, విక్రయించడం కోసం నిల్వ చేసినందుకుగాను సెక్షన్ 18 (సి) ఉల్లంఘన కింద ప్రథమ చికిత్స కేంద్రం నిర్వాహకుడిపై కేసు నమోదు చేసి ఔషధాలను సీజ్ చేసినట్లు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆర్ఎంపీలు రోగులకు కేవలం ప్రథమ చికిత్సను మాత్రమే అందించాలన్నారు. -
మాంద్యం నివారణలో కేంద్రం విఫలం
గద్వాల: దేశంలో పెరిగిపోతున్న ఆర్థికమాంద్యాన్ని నివారించి యువతకు ఉపాధి కల్పించడంలో బీజేపీ పూర్తిగా విఫలమైందని, నిత్యావసర వస్తువుల ధరలు అధికమై ద్రవ్యోల్బణం పెరిగిందని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు ఆర్.శ్రీరామ్నాయక్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని సీపీఎం పార్టీ కార్యాలయంలో పార్టీ కమిటీ సమావేశం నిర్వహించగా ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రజల ఆదాయం తగ్గి కేంద్రీకృతమవుతున్న ఆర్థిక అసమానతలు పెరిగాయని, ప్రజల దృష్టిని మళ్లించటానికి బీహార్లో ప్రజలు ప్రజాస్వామిక ఓటుహక్కును నిరాకరిస్తున్నారన్నారు. చట్టబద్ధ, రాజ్యాంగ పదవులలో ఉన్నవారు చేస్తున్న బాధ్యతారాహిత్య వ్యాఖ్యలు ప్రజల మధ్య విద్వేషాలు సృష్టిస్తున్నాయన్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికలోటు పేరుతో ప్రజలకు అందించే సంక్షేమ పథకాలకు కోతవిధించడం దారుమన్నారు. రైతులకు సంబంధించి పెట్టుబడి సాయం, బోనస్, రాజీవ్ యువవికాస్ అమలు, విద్యార్థులకు ఉపకార వేతనాలు అందజేయడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. వర్షాల వల్ల పంటనష్టం, ఇళ్లు కూలిపోయి నష్టం, మూగజీవాల మృత్యువాత వంటివాటిపై అధికారులతో ప్రత్యేక సర్వే చేయించి పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా కార్యదర్శి వెంకటస్వామి మాట్లాడుతూ సీడ్పత్తి రైతులకు కలెక్టర్ ఇచ్చిన హామీని అమలు చేయాలని, కొంతమంది సీడ్ఆర్గనైజర్లు ఇప్పటికీ రెండుక్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేస్తామని చెబు తూ బెదిరిస్తున్నారన్నారు. సమావేశంలో రేపల్లె దేవ దాసు, రాజు, పరంజ్యోతి, నర్సింహా, మద్దిలేటి, నర్మద, ఈదన్న, రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
పల్లెగడ్డను వదులుకోం
మరికల్: తమ పూర్వీకులు వ్యవసాయమే జీవనాధారంగా బతుకుతూ తమకు కానుకగా ఇచ్చిన ‘పల్లెగడ్డ’ను వదులుకోమని గ్రామస్తులు ముక్తకంఠంతో తేల్చిచెబుతున్నారు. తమ గోడును ప్రభుత్వం పట్టించుకోకపోయినా కోర్టులో న్యాయ పోరాటం చేసి.. తమ గ్రామాన్ని కాపాడుకుంటామని శపథం చేస్తున్నారు. నిజాం నిరంకుశ పాలన నాటి నుంచి తరతరాలుగా తమ పూర్వీకులు ఊరిని కాపాడుకుంటూ వస్తున్నారని.. 2018లో ఓ అజ్ఞాత వ్యక్తి సమాచార హక్కు చట్టం ద్వారా చిన్నరాజమూరు ఆంజనేయస్వామి దేవాలయ భూమిలో పల్లెగడ్డ గ్రామం ఉందని ఫిర్యాదు చేయడంతో తమకు సమస్యలు మొదలయ్యాయని వాపోతున్నారు. అప్పటి నుంచి ఎండోమెంట్ అధికారులు తమకు దశల వారీగా కోర్టు నుంచి నోటీసులు జారీచేస్తూ భయాందోళనకు గురిచేస్తున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిధులతో అభివృద్ధి పనులు.. చిన్నరాజమూరు ఆంజనేయస్వామి ఆలయ భూమిలో నిర్మితమైన పల్లెగడ్డ గ్రామం మొదట్లో అభివృద్ధికి ఆమడదూరంలో ఉండేది. మరికల్ పంచాయతీ పరిధిలో ఉండటంతో కనీస వసతులకు నోచుకోక గ్రామస్తులు ఇబ్బందులు పడేవారు. కాలక్రమేణా గ్రామ జనాభా పెరగడంతో 1980లో అప్పటి ప్రభుత్వం 15 ఇళ్లను పేదలకు నిర్మించి ఇచ్చింది. అప్పట్లోనే ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ కేంద్రం ఏర్పాటుచేశారు. గ్రామంలో అంతర్గత రహదారులకు ఇరువైపులా డ్రెయినేజీలు, పబ్లిక్ కొళాయిలు ఏర్పాటు చేశారు. ఇలా ప్రభుత్వ నిధులతో ప్రజా సమస్యలు తీరుస్తూ వచ్చారు. తెలంగాణ రాష్ట్ర వచ్చాక గత ప్రభుత్వం నూతన పంచాయతీల ఏర్పాటుకు శ్రీకారం చూట్టింది. అప్పటి ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి చొరవతో మరికల్ గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న పల్లెగడ్డను కొత్త పంచాయతీగా ఏర్పాటు చేయించారు. ఆ తర్వాత ఉపాధి హామీ పథకం నిధులతో సీసీరోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రెయినేజీలు నిర్మించారు. మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ నల్లా కనెక్షన్ ఇచ్చి తాగునీరు అందిస్తున్నారు. నూతన గ్రామ పంచాయతీ భవనం, సెగ్రిగేషన్ షెడ్, పల్లెప్రకృతి వనం, శ్మశానవాటిక, డంపింగ్యార్డు వంటివి నిర్మించారు. ప్రస్తుత ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకానికి పల్లెగడ్డ గ్రామాన్ని పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపికచేసి.. మొదటి విడతలో 66 ఇళ్లు మంజూరుచేయగా.. లబ్ధిదారులు పనులు సైతం ప్రారంభించారు. ఇలా ప్రభుత్వ నిధులతో గ్రామంలో అనేక అభివృద్ధి పనులు చేపడుతూ వస్తున్నారు. అయితే పల్లెగడ్డ గ్రామస్తుల సమస్యపై ప్రజాప్రతినిధులు పట్టనట్టుగా ఉండటం గమనార్హం. ప్రజాప్రతినిధులు స్పందించాలి.. గ్రామంలో ప్రభుత్వ పాఠశాల, అంగన్వాడీ కేంద్రం, రేషన్షాపు, సీసీరోడ్లు, డ్రెయినేజీలు, మిషన్ భగీరథ నీటి సరఫరా తదితర అభివృద్ధి పనులు ఎన్నో జరిగాయి. కొత్త పంచాయతీగానూ ఏర్పాటు చేశారు. 200 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న పల్లెగడ్డ గ్రామాన్ని ఖాళీ చేయాలని 2018 నుంచి కోర్టు చుట్టూ తిప్పడం సరికాదు. ప్రజాప్రతినిధులు స్పందించి గ్రామానికి న్యాయం చేయాలి. – కుర్మయ్య, పల్లెగడ్డ ఇందిరమ్మ ఇళ్లు కూడా.. ఇందిరమ్మ ఇళ్ల పథకానికి పల్లెగడ్డ గ్రామం పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక కావడంతో మొదటి విడతగా 66 ఇళ్లు మంజూరయ్యాయి. 1980లో కూడా అప్పటి ప్రభుత్వం 15 ఇళ్లను పేదలకు మంజూరు చేసింది. ఇన్నాళ్లుగా ప్రభుత్వ నిధులతో గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి ఎండోమెంట్ అధికారులకు కనిపించడం లేదా.. కోర్టులో న్యాయ పోరాటం చేసి గ్రామాన్ని కాపాడుకుంటాం. – విజయ్, పల్లెగడ్డ మరిన్ని నోటీసులు.. పల్లెగడ్డ గ్రామం విషయం దేవాదాయ ట్రిబ్యునల్ కోర్టు పరిధిలో ఉంది. త్వరలోనే మరికొంత మందికి కోర్టు నుంచి నోటీసులు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం 25 మందికి నోటీసులు జారీ అయ్యాయి. వారి వద్ద ఏమైనా ఆధారాలు ఉంటే దేవాదాయశాఖ ట్రిబ్యునల్ కోర్టులో సమర్పించాలి. – కవిత, దేవాదాయశాఖ ఈఓ, మహబూబ్నగర్ ముక్తకంఠంతో నినదిస్తున్న గ్రామస్తులు నేడు దేవాదాయశాఖ ట్రిబ్యునల్ కోర్టు ఎదుట హాజరుకానున్న 25మంది పుట్టిన ఊరి కోసం తమ వాదన వినిపిస్తామని వెల్లడి ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరిని విడిచివెళ్లమని శపథం స్పందించని ప్రజాప్రతినిధులు 1,624 మందికిపైగా జనాభా.. నాలుగు కుటుంబాలతో మొదలైన పల్లెగడ్డ గ్రామంలో 250కి పైగా ఇళ్ల నిర్మాణాలు జరిగాయి. 20 ఎకరాల గ్రామకంఠం ఉంది. మొత్తం 1,624 జనాభా ఉండగా.. 745 మంది ఓటర్లు ఉన్నారు. 254 రేషన్కార్డులు ఉన్నాయి. ప్రాథమిక పాఠశాలలో 40 మంది, అంగన్వాడీ కేంద్రంలో 25మంది చదువుకుంటున్నారు. 250 ఇళ్లకు పైగా విద్యుత్ మీటర్లు ఉండగా.. ఇంటి పన్ను, నల్లా పన్నులు చెల్లిస్తున్నారు. అంతేకాకుండా గ్రామంలో ఆంజనేయస్వా మి, శివాలయాలు, నలుదిక్కులా గ్రామదేవతల విగ్రహాలను ప్రతిష్ఠించి పూజిస్తున్నారు. 2 వేల ఎకరాలకు పైగా వ్యవసాయ భూములు ఉన్నాయి. -
సీపీఎస్ రద్దే లక్ష్యం
వనపర్తిటౌన్: ఉపాధ్యాయ, ఉద్యోగులకు అశనిపాతంగా మారిన కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్) రూపుమాపేందుకు పీఆర్టీయూ టీఎస్ పూనుకుందని, అదే లక్ష్యంతో పని చేస్తోందని సంఘం ఉమ్మడి రాష్ట్ర మాజీ అధ్యక్షుడు పేరి వెంకట్రెడ్డి అన్నారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని సంఘం కార్యాలయంలో నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. సెప్టెంబర్ 1న హైదరాబాద్లోని ఇందిరాపార్క్లో ఉన్న ధర్నాచౌక్ వద్ద సంఘం ఆధ్వర్యంలో చేపట్టే మహాధర్నాకు ఉద్యోగ, ఉపాధ్యాయులు అధికసంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అంతకుముందు మహాధర్నా వాల్పోస్టర్లను విడుదల చేశారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు బౌద్ధారెడ్డి, ప్రధానకార్యదర్శి సూర చంద్రశేఖర్, టీఈజేఏసీ జిల్లా కన్వీనర్ సూగూరు వరప్రసాద్రావు, టీఎస్సీపీఎస్ఈయూ జిల్లా అధ్యక్షుడు మద్దిలేటి, ప్రధానకార్యదర్శి రాజేంద్రప్రసాద్, కోశాధికారి మోహన్బాబు, సంఘం మండల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు.