breaking news
Jogulamba
-
మెనూ ప్రకారం భోజనం అందించాలి
గద్వాల: ప్రభుత్వం సూచించిన మేరకు విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించకపోతే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ బీఎం సంతోష్ హెచ్చరించారు. సోమవారం సాయంత్రం గద్వాల పట్టణంలోని చింతలపేటలో ఎస్సీ సంక్షేమ వసతిగృహాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా వసతిగృహంలోని స్టోర్రూం, వంటగది, కాంపౌండ్లోని పరిసర ప్రాంతాల్లో కలియతిరిగారు. ఈసందర్భంగా ఆయన విద్యార్థులతో మాట్లాడారు. పాఠ్యపుస్తకంలోని ప్రశ్నలు అడిగారు. దూరప్రాంతాల నుంచి విద్య కోసం ఇంత దూరం వచ్చారని, ఏమాత్రం నిర్లక్ష్యం వహించకుండా క్రమశిక్షణతో ముందుకెళ్లాలని విద్యార్థులకు సూచించారు. స్వయంగా విద్యార్థుల హాజరును పరిశీలించి విద్యార్థుల హాజరు వందశాతం లేని యెడల సక్రమంగా హాజరు కాని వారిపేర్లు తొలగించి వారి స్థానంలో కొత్తవారిని చేర్చుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఎస్సీ సంక్షేమశాఖ జిల్లా అధికారి నుషితా, వార్డెన్లు శ్రీను, ఽమధు, రామకృష్ణ పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పరిశీలన అనంతరం పట్టణంలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించారు. పనుల నాణ్యతపై ఏమాత్రం రాజీపడకుండా ప్రతిదశలో పనులు వేగంగా చేయాలన్నారు. ప్రతిఇంటిని అనుమతించిన 600 చదరపు అడుగుల లోపే నిర్మించేలా లబ్ధిదారులకు తెలియజేయాలని, అవసమరైన ఇసుక, మట్టిని అందజేయాలని, ఏఏ పనులు పూర్తయితే వాటి వివరాలు దశలవారిగా ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. లబ్ధిదారులకు విధిగా డబ్బులు జమచేయాలన్నారు.కార్యక్రమంలో మున్సిపల్ కమీషనర్ దశరథ్, హౌసింగ్పీడీ కాశీనాథ్ తదితరులు పాల్గొన్నారు. -
వరుణుడిపైనే ఆశలు..!
జిల్లాలో జూన్, జూలైలో సాధారణం కంటే కనిష్ట వర్షపాతం నమోదు ●గద్వాల: వానాకాలానికి ముందుగానే మే నెలలో ముందస్తుగా వర్షాలు కురవడంతో రైతులు ఎంతో సంతోషించారు. దుక్కులు దున్ని పంటలు సాగుచేసుకునేందుకు సిద్ధం చేసుకున్నారు. ఖరీఫ్లో మెట్టపంటలైన పత్తి, వేరుశనగ, మొక్కజొన్న, పొగాకు, ఆముదాలు, కందులు, కూరగాయలు వంటి పంటలు 1,73,211 ఎకరాల్లో సాగుచేశారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ, జూన్, జూలైలో సాధారణ వర్షపాతం కంటే కూడా తక్కువ వర్షపాతం నమోదు కావడంతో సాగుచేసిన పంటలు ఎండుముఖం పడుతూ రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. దీంతోపాటు వానాకాలంలో సమృద్ధిగా కురవాల్సిన వర్షాలు.. కురవకపోవడంతో భూగర్భజలాలపై కూడా ప్రభావం చూపుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో ఆశలతో రైతులు పంటలు సాగు చేయగా.. వరుణుడు కురవాల్సిన సమయంలో మాత్రం ముఖం చాటేశాడు. ప్రధానంగా జూన్, జూలై మాసాల్లో సాధారణం కంటే కూడా కనిష్ట వర్షపాతం నమోదైంది. వాస్తవానికి జూన్లో 84.4మిల్లీ మీటర్ల మేర వర్షం నమోదు కావాల్సి ఉండగా.. అందుకు భిన్నంగా 72.4మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. కేవలం 5 రోజులు మాత్రమే వర్షం కురవగా మిగిలిన 25రోజుల పాటు వర్షమే కురవలేదు. అంటే సాధారణం కంటే 13.5 శాతం వర్షపాతం కనిష్టంగా కురిసింది. అదేవిధంగా జూలైలో సాధారణ వర్షం 112.1 మి.మీటర్లు కురవాల్సి ఉండగా, అందుకు భిన్నంగా కనిష్టంగా 96.9 మి.మీటర్ల వర్షం కురిసింది. కేవలం 9 రోజులు మాత్రమే వర్షం కురిసింది. 22రోజుల పాటు వర్షం జాడేలేదు. అంటే 13.6శాతం వర్షపాతం కనిష్టంగా కురిసింది. కనిష్ట వర్షపాతం నమోదు పత్తి పంట ఎండుతుంది.. గతేడాది పత్తిపంట దిగుబడి బాగా వచ్చింది. ఈసారి ముందస్తు వర్షాలు కురవడంతో 11 ఎకరాల్లో పత్తి పంట సాగుచేశాను. కానీ, జూన్, జూలై రెండు నెలల్లో సరైన వర్షాలు కురవనేలేదు. బాగా కాపుకాసి చెట్టు పెరిగే దశలో నీరు అందకుండా పోయింది. మొక్క పెరుగుదల అనుకున్నంతగా పెరగలేదు. ఇప్పటికే ఎకరాకు రూ.70వేల చొప్పున మొత్తం రూ.7లక్షల వరకు పెట్టుబడి పెట్టాను. మరో వారం రోజుల్లో సరైన వర్షాలు కురవకపోతే పంట మొత్తం ఎండిపోతుంది. – నాయుడు, బోరెల్లి, మానవపాడు దిగుబడిపై ప్రభావం జూన్, జూలై నెలలో సాధారణ వర్షపాతం కంటే కూడా తక్కువ వర్షాలు కురిశాయి. దీంతో వర్షాధార పంటలకు ఇబ్బందులు తలెత్తాయి. మరో వారం, పది రోజుల్లో ఇలాగే వర్షాలు కురవకపోతే పంటల దిగుబడిపై తీవ్ర ప్రభావం పడుతుంది. – సక్రియానాయక్, డీఏఓ ఇప్పటికే 1.70 లక్షల ఎకరాల్లో మెట్టపంటలు సాగు ఎండుముఖం పడుతున్న పత్తి, మిరప, వేరుశనగ పంటలు రూ.వేల పెట్టుబడులు పెట్టామంటూ ఆందోళనలో రైతులు -
సీఎం సార్.. మా సమస్యలు పట్టించుకోండి
గట్టు : గట్టులోని ఉన్నత పాఠశాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని విద్యార్థులు సీఎం రేవంత్రెడ్డికి పోస్టుకార్డుల ద్వారా విన్నవించారు. హై స్కూల్లో నెలకొన్న సమస్యలపై విద్యాశాఖ అధికారులకు పలు మార్లు విన్నవించినా సమస్యను పరిష్కరించకపోవడంతో విద్యార్థులు సోమవారం నేరుగా సీఎం రేవంత్రెడ్డికు సమస్యలను పోస్టుకార్డు ద్వారా తెలియజేయాలనే ఉద్దేశంతో పోస్టు కార్డులను పంపారు. పాఠశాల విద్యార్థులు సమస్యలతో సతమతమవుతున్నారని, వారి సమస్యలను పరిష్కరించాలని పీడీఎస్యూ జిల్లా అధ్యక్షుడు హలీంపాష డిమాండ్ చేశారు. పీడీ పోస్టు ఖాళీగా ఉందని, ఉపాధ్యాయుల కొరత, గదుల కొరత చాలా ఉందని తెలిపారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి గట్టు హైస్కూల్ సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలని డిమాంఢ చేశారు. -
‘నౌరోజ్ కళా బృందానికి’ రాష్ట్రస్థాయి గుర్తింపు
అయిజ: లలిత కళా సమాఖ్య సేవా సామాజిక సంస్కృతి ఆధ్వర్యంలో హైదరాబాద్లో ఆదివారం నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ 31వ సువర్ణ కంకరణ అవార్డు సంబరాల్లో అయిజ మండలం నౌరోజ్ క్యాంప్ కళా బృందం ఉత్తమ ప్రతిభ కనబర్చి మొదటి బహుమతి గెలుపొందింది. ఈ గెలుపులో అయిజ మండలం దేవబండ గ్రామానికి చెందిన మాస్టర్ శివకుమార్ ప్రత్యేక పాత్ర పోషించారు. వీరి కుటుంబం మూడు తరాల నుంచి కోలాటం నేర్పిస్తూ.. ఇంటిపేరే కోలంట్లగా మారింది. ఇదిలాఉండగా, హైదరాబాద్లోని కోలాట ప్రదర్శనలో మొత్తం 9 రాష్ట్రాల బృందాలు పాల్గొనగా.. రాష్ట్రం తరపు నుంచి మాస్టర్ శివకుమార్ ఆధ్వర్యంలో అయిజ మండలానికి చెందిన నౌరోజ్ క్యాంప్ కళా బృందం పాల్గొనింది. ఈమేరకు ఉత్తమ ప్రతిభ కనబర్చగా ఈ బృందానికి ప్రథమ, ఏపీ బృందానికి ద్వితీయ, కేరళ బృందానికి తృతీయ బహుమతి లభించింది. ఈమేరకు నిర్వాహకులు మాస్టర్కు బంగారు కంకణం, మెడల్, బృందం సభ్యులకు ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ రుద్రరాజు పద్మరాజు, ఎమ్మెల్యే కోమటిరెడ్డి, సినీ నటులు జార్జారావు, శివాజీ రాజు పలువురు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా సోమవారం పలువురు ప్రముఖులు కోలాటం శివకుమార్ను, నౌరోజ్ క్యాంప్ కళా బృందాన్ని అభినందించారు. -
1.73 లక్షల ఎకరాల్లో పంటలు సాగు
మే నెలలో వర్షాలు కురవడంతో మెట్ట పంటలు సాగుచేసుకునేందుకు రైతులు భూములు దుక్కులు దున్నుకుని సిద్ధం చేసుకున్నారు. మృగశిరకార్తిలో పత్తి, వేరుశనగ, ఆముదం, మొక్కజొన్న, కందులు వంటి వివిధ రకాల పంటలు సాగుచేశారు. ఈ ఏడాది ఖరీఫ్లో మొత్తం 1,73,211 ఎకరాల్లో పంటలు సాగుచేయగా ఇందులో 1.50 లక్షల ఎకరాల్లో మెట్టపంటలు సాగుచేశారు. ఈ పంటలన్ని కూడా పూర్తిగా వర్షాధారంగానే పండుతాయి. ఇదిలాఉండగా, సాధారణంగా జూన్ చివర, జూలై మాసంలో సమృద్ధిగా వర్షాలు మొదలవుతాయి. అయితే ఈ సారి మే నెలలోనే వర్షాలు కురిశాయి. మే నెలలో జిల్లా వ్యాప్తంగా 117.3మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. వాస్తవానికి మే నెలలో సాధారణ వర్షపాతం 25.8 మి.మీటర్లు కురవాల్సి ఉండగా.. అధికంగా కురిసింది. -
రేపటి నుంచి బీచుపల్లిలో పవిత్రోత్సవాలు
ఎర్రవల్లి: బీచుపల్లి పుణ్యక్షేత్రంలోని కోదండరామస్వామి ఆలయంలో 6వ తేదీ నుంచి 9వ వరకు పవిత్రోత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ మేనేజర్ సురేందర్ రాజు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో భాగంగా 6న విశ్వకేశ ఆరాధన, పుణ్యహం, రక్షాబంధనం, 7న మంగళవాయిద్యాల నడుమ పవిత్ర గ్రామ ప్రదక్షణం, వేద ప్రబంధ పారాయణం, 8న మూల మూర్తి హోమాలు, పూర్ణాహుతి, అనంతరం సామూహిక వరలక్ష్మి వ్రతాలు, 9న లక్ష్మీ హయగ్రీవ స్వామి వారి తిరుకళ్యాణ మహోత్సవం, ఉత్సవ పరిసమాప్తి, వేద ఆశీర్వచనం వంటి కార్యక్రమాలతో ఉత్సవాలు ముగియనున్నట్లు తెలిపారు. శివాలయంలో ప్రత్యేక పూజలు బీచుపల్లి పుణ్యక్షేత్రంలోని శివాలయంలో సోమవారం భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. శ్రావణమాసం అందులోనూ రెండో సోమవారం కావడంతో ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. ఉదయాన్నే అధిక సంఖ్యలో ప్రజలు బీచుపల్లికి చేరుకొని కృష్ణానదిలో స్నానాలు ఆచరించి శివుడిని దర్శించుకొన్నారు. -
రాజకీయ కలకలం
అబ్రహం దారెటు? అలంపూర్ మాజీ ఎమ్మెల్యే అబ్రహం బీజేపీలో చేరే అవకాశాలు ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రచారంపై ఆయన స్పందించలేదు. పార్టీ మార్పును ఇప్పటివరకు ధ్రువీకరించలేదు. అలంపూర్ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి సీటు దక్కలేదు. దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే కాంగ్రెస్లోనూ వర్గపోరు కొనసాగుతోంది. ఈ క్రమంలో ఆయన బీజేపీ వైపు అడుగులు వేస్తున్నారన్న ప్రచారం సాగుతోంది. ఇప్పటికే చర్చలు జరిగినట్టు చెబుతున్నా పార్టీ మార్పుపై ఎలాంటి నిర్ణయం వెలువడలేదు. అయితే స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే సమయానికి పార్టీ మార్పుపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఆయన ముఖ్య అనుచరులు చెబుతున్నారు. ● కారు పార్టీకి గుడ్బై చెప్పిన మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ● ఈ నెల 9న బీజేపీలో చేరే అవకాశం? ● ప్రచారంలో మరికొందరు మాజీ ఎమ్మెల్యేల పేర్లు సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్/ సాక్షి, నాగర్కర్నూల్: బీఆర్ఎస్ పార్టీ నాగర్కర్నూల్ జిల్లా అధ్యక్షుడు, అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పార్టీకి రాజీనామా చేయడం బీఆర్ఎస్లో ప్రకంపనలు సృష్టించింది. ఆయనతో పాటు మరికొందరు మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారన్న ప్రచారం నేపథ్యంలో ఉమ్మడి పాలమూరు జిల్లావ్యాప్తంగా తీవ్రంగా చర్చ సాగుతోంది. రెండు దశాబ్దాలుగా గులాబీ పార్టీలో క్రియాశీలకంగా పనిచేసిన గువ్వల పార్టీ వీడుతుండటంతో ఏం జరుగుతోందన్న ఆందోళన పార్టీ కేడర్లో నెలకొంది. ఈనెల 9న ఆయన బీజేపీలో చేరే అవకాశం ఉందని, ఆయనతో పాటు మరికొందరు మాజీ ఎమ్మెల్యేలు సైతం బీజేపీ గూటికి చేరుతారన్న ప్రచారం జరుగుతోంది. ప్రాధాన్యత లేదని.. బీఆర్ఎస్ పార్టీలో 2007లో చేరిన గువ్వల బాలరాజు మొదటి నుంచి క్రియాశీలకంగా ఉన్నారు. 2009లో మొదటిసారిగా నాగర్కర్నూల్ పార్లమెంట్ స్థానం నుంచి బీఆర్ఎస్, టీడీపీ కూటమి అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. తర్వాత 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో అచ్చంపేట ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచాక ప్రభుత్వ విప్గా వ్యవహరించారు. ప్రస్తుతం బీఆర్ఎస్ నాగర్కర్నూల్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో నాగర్కర్నూల్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా సీటు ఆశించినా భంగపాటు ఎదురైంది. ఈ సీటును ఆర్ఎస్ ప్రవీణ్కుమార్కు కేటాయించడంతో అసంతృప్తికి గురయ్యారు. పార్టీలో తనకు ప్రాధాన్యతను తగ్గిస్తున్నారని, పార్టీ అధినేత కేసీఆర్ తనను పట్టించుకోవడం లేదని అనుచరులతో చెబుతున్నారు. భవిష్యత్లో బీఆర్ఎస్, బీజేపీ పొత్తు పెట్టుకుంటారని, వారి కన్నా ముందే తానే బీజేపీలో చేరుతున్నట్లు ముఖ్య అనుచరులతో స్పష్టం చేశారు. అయోమయంలో పార్టీశ్రేణులు.. గువ్వల బాలరాజు పార్టీకి రాజీనామా చేయడం, ఆయనతో పాటు మరికొందరు మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు బీజేపీలో చేరనున్నారన్న ప్రచారం నేపథ్యంలో గులాబీ పార్టీ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది. అకస్మాత్తుగా గువ్వల రాజీనామా, పార్టీ మార్పు ప్రకటనతో పార్టీలో ఏం జరుగుతోందన్న అయోమయంలో పార్టీ శ్రేణులు ఉన్నారు. గువ్వల రాజీనామా క్రమంలో మిగతా నేతలు కూడా అదే బాటలో పడుతున్నారన్న ప్రచారం, వదంతుల నేపథ్యంలో పలువురు నేతలు స్పందించి పార్టీ మార్పు ప్రచారాన్ని ఖండిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీలో ప్రకంపనలు ఎప్పటికీ పార్టీ లైన్లోనే ఉంటా: జైపాల్యాదవ్ చివరి శ్వాస వరకు బీఆర్ఎస్తోనే: మర్రి తాను చివరి శ్వాస వరకు బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటానని, పార్టీ మారే ఆలోచన తనకు లేదని నాగర్కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి స్పష్టం చేశారు. తాను పార్టీ మారుతున్నట్టు సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారాన్ని ఖండించారు. పార్టీ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మార్గ దర్శకాలతో పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తానని చెప్పారు. తాను ఎప్పటికీ బీఆర్ఎస్ పార్టీ లైన్లోనే ఉంటానని కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. గువ్వల నిర్ణయంతో తమకు సంబంధం లేదని చెప్పారు. తాను నిత్యం పార్టీ కార్యకర్తల నడుమ ఉంటున్నానని, బీఆర్ఎస్ పార్టీ కోసమే నిరంతరం పని చేస్తానని స్పష్టం చేశారు. -
ఫిర్యాదుల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి
గద్వాల: వివిధ సమస్యలపై ప్రజావాణికి వచ్చే ఫిర్యాదుల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో సమావేశం హాలులో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా జిల్లాలోని వివిధ గ్రామాలకు చెందిన ప్రజలు మొత్తం 43 ఫిర్యాదులను నేరుగా కలెక్టర్కు అందించారు. వాటిని ఆయా శాఖలకు చెందిన అధికారులకు పంపించారు. వీటిని వెంటనే పరిష్కరించాలని, పరిష్కారం కానిపక్షంలో అందుకు గల కారణాలు వివరిస్తూ సంబంధిత ఫిర్యాదుదారుడికి అక్నాలెడ్డ్మెంట్ ద్వారా తెలియజేయాలని సూచించినట్లు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు వి.లక్ష్మీనారాయణ, నర్సింగ్రావు కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు. పోలీస్ గ్రీవెన్స్కు 21 వినతులు గద్వాల క్రైం: జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పోలీస్ గ్రీవెన్స్ కార్యక్రమానికి మొత్తం 21 ఫిర్యాదులు అందాయి. ఎస్పీ శ్రీనివాసరావు ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులు స్వీకరించారు. ప్రధానంగా భూ వివాదం, ఆస్తి తగదాలు, అప్పుగా తీసుకున్న వ్యక్తులు డబ్బులు చెల్లించడం లేదని ఫిర్యాదులు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. వీలైనంత త్వరగా సమస్యలను పరిష్కరిస్తామని, బాధితులకు న్యాయం చేస్తామని వివరించారు. సివిల్ సమస్యలపై కోర్టు ద్వారా పరిష్కారం చేసుకోవాలన్నారు. కలెక్టర్కు సన్మానం గద్వాల: వెనుకబడిన జిల్లాల అభివృద్ధి కోసం నీతిఅయోగ్ ద్వారా చేపట్టిన సంపూర్ణత అభియాన్ కార్యక్రమంలో భాగంగా గట్టు మండలం ఆరుకీలక సూచికలలో ఉత్తమ ప్రగతి సాధించింది. దీంతో దేశంలోనే గట్టుకు ఉత్తమ ర్యాంకు రావడంతో గవర్నర్ విష్ణుదేవ్వర్మ చేతుల మీదుగా రాజ్భవన్లో కలెక్టర్ బీఎం సంతోష్ ఈ నెల 2వ తేదీన అవార్డు అందుకున్నారు. ఈనేపథ్యంలో అవార్డు పొందిన కలెక్టర్ను జిల్లా అధికారులు సోమవారం ఘనంగా సన్మానించారు. రేపు జాబ్ మేళా కందనూలు: జిల్లాకేంద్రంలోని నేషనల్ ఐటీఐ కళాశాలలో బుధవారం జాబ్మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి, శిక్షణ శాఖాధికారి రాఘవేంద్రసింగ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. అపోలో ఫార్మసీ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో వివిధ కేటగిరీల్లో వంద ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. జిల్లాలోని యువతీ, యువకులు 10వ తరగతి, డిగ్రీ, ఫార్మసీ, పాసై 18–35 ఏళ్లలోపు నిరుద్యోగులు హాజరుకావాలని సూచించారు. పూర్తి వివరాలకు సెల్ నం.97012 00819 సంప్రదించాలని కోరారు. పాలిటెక్నిక్ కళాశాలలో స్పాట్ అడ్మిషన్లు కోస్గి రూరల్: కోస్గి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో మిగిలిన సీట్ల భర్తీకి స్పాట్ అడ్మిషన్లు చేపట్టామని కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాసులు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ కోర్సులలో సీట్లు ఉన్నా యని తెలిపారు. ఈ నెల 5వ తేదీ నుంచి 11వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకోవాలని అన్నారు. విద్యార్థులు తమ ఒరిజినల్, జిరాక్స్ సర్టిఫికెట్లతో కళాశాలలో సంప్రదించాలని కోరారు. కాల్వలో జమ్ము తొలగింపునకు చర్యలు అమరచింత: భూత్పూర్ రిజర్వాయర్ నుంచి ప్రదాన ఎడమ కాల్వ నుంచి అమరచింత పెద్ద చెరువుకు సాగునీరు అందడంలో ఆలస్యం అవుతుండటంతో కాల్వలో ఉన్న జమ్మును తొలగించేందుకు ఇరిగేషన్ అధికారులు ముందుకు వచ్చారు. అమరచింత,పాంరెడ్డిపల్లి, పిన్నంచర్ల గ్రామాలకు చెందిన పలువురు రైతులు తమ చెరువులకు సాగునీరు అందడం లేదని విషయాన్ని ఇరిగేషన్ అధికారులకు విన్నవించాలని మాజీ అడ్వకేట్ జనరల్ దేశాయి ప్రకాష్రెడ్డికి ఆదివారం కలిసి విన్నవించారు. తమ సొంత డబ్బులను వెచ్చించి జమ్ము తొలగిస్తామని అధికారులకు తెలపడంతో సోమవారం ఇరిగేషన్ అధికారులు కాల్వ వెంట ఎన్ని మీటర్ల పొడవున జమ్ము, ముళ్ళ పొదలు వ్యాపించి ఉన్నాయనే విషయాలను కాల్వ వెంట తిరుగుతూ పరిశీలించారు. త్వరగా జమ్ము తొలగించే కార్యక్రమం చేపడతామని ఇరిగేషన్ అధికారులు తెలిపారు. -
పర్యావరణహిత విద్యుత్ ఉత్పత్తి చేద్దాం
కొల్లాపూర్: పెరుగుతున్న డిమాండ్, భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని పర్యావరణ హితమైన విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు ప్రణాళిక రూపొందించాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఆదివారం ఉదయం ఆయన నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలంలోని సోమశిలలో జెన్కో, ట్రాన్స్కో అధికారులతో విద్యుదుత్పత్తి, వినియోగం, ఉత్పాదక సామర్థ్యం తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. హైడల్ పవర్తోపాటు పంప్డ్ స్టోరేజీతో పెద్దఎత్తున విద్యుదుత్పత్తి చేసి వినియోగంలోకి తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 23 పాయింట్స్ గుర్తించి, వాటిమీద సమగ్ర నివేదిక ఇవ్వాలని సూచించారు. కృష్ణానదిపై ఉన్న జూరాల నుంచి పులిచింతల వరకు గల హైడల్ ప్రాజెక్టులను సమీక్షించాలని అధికారులను ఆదేశించారు. ఇందుకోసం అవసరమైతే అంతర్జాతీయంగా పేరుగాంచిన కన్సల్టెంట్ల సహకారం తీసుకోవాలని చెప్పారు. సోలార్ ద్వారా పగటిపూట ఉత్పత్తి చేసే విద్యుత్ను స్టోరేజీ చేసి రాత్రివేళల్లో వినియోగించుకునేందుకు అవసరమైన సాంకేతిక, స్టోరేజీ వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఆధునిక సాంకేతిక వినియోగానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు. 1978లోనే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం తోషిబా, మిస్టుబుషి వంటి సంస్థల సాంకేతికతను వినియోగించుకున్న విషయాలను ఆయన గుర్తుచేశారు. సాంకేతికత వినియోగం కోసం కిందిస్థాయి అధికారులకు శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు. విద్యుత్ శాఖ అధికారులతో సమీక్ష అనంతరం స్థానిక లంబాడీ గిరిజనులతో డిప్యూటీ సీఎం మాట్లాడారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క -
చేనేత కార్మికులకు కేంద్రమంత్రి సన్మానం
గద్వాల: నేషనల్ డెవ్లప్మెంట్ హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్ ఆధ్వర్యంలో వీవర్ సర్వీసింగ్ సెంటర్ ద్వారా ఎలక్ట్రానిక్ జాకార్డ్స్ సబ్సిడీపై లబ్ధిపొందిన గద్వాలకు చెందిన ఎనిమిది మంది చేనేత కార్మికులను కేంద్ర మంత్రి జి.కిషన్రెడ్డి సన్మానం చేశారు. ఆదివారం ఎన్హెచ్డీసీ వారు హైదరాబాద్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చేనేత కార్మికులు శ్రీహరి, శివశంకర్, శ్రీను, సరిత, హిమబిందు, మల్లిఖార్జున్, వెంకటేష్, రాధను కేంద్రమంత్రి మంత్రి సన్మానించారు. కార్యక్రమంలో నిఫ్ట్ డైరెక్టర్ మాలిని, అక్కల శాంతారాం, హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. దేశభక్తి చాటుదాం గద్వాల: విజ్ఞానం, వినోదం, వికాసం, ఆటపాటలు వ్యాయమం వంటి శారీరక శ్రమ తగ్గిపోతున్న తరుణంలో విద్యార్థి దశలోనే ప్రతిభ పోటీలు నిర్వహించి వారిలో మనోవికాసాన్ని పెంపొందించేందుకు దోహదపడుతాయని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి అన్నారు. ఆదివారం ప్రజానాట్యమండలి ఆధ్వర్యంలో నిర్వహించే ప్రతిభపోటీలకు సంబంధించిన కరపత్రాన్ని తన క్యాంపు కార్యాలయంలో విడుదల చేశారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశభక్తిని చాటుదాం అనే నినాదంతో ప్రజానాట్యమండలి వాళ్లు చేపడుతున్న ఈ ప్రతిభపోటీలు మంచి కార్యక్రమం అన్నారు. కార్యక్రమంలో శ్రీనివాస్రెడ్డి, ఆశన్న, నాయకులు విజయ్, రాజశేఖర్, ఖలీల్ పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ దైవభక్తిని పెంపొందించుకోవాలి మల్దకల్ : మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రతి ఒక్కరూ భక్తి మార్గంలో నడుచుకుంటూ దైవ భక్తిని పెంపొందించుకోవాలని త్రిదండి దేవనాథ జీయర్ స్వామి భక్తులకు సూచించారు. ఆదివారం మండలంలోని అమరవాయిలో ఏర్పాటు చేసిన వెంకట్రామిరెడ్డి పరమావధి కార్యక్రమానికి త్రిదండి దేవనాథ జీయర్స్వామి హాజరై భక్తులకు వేదర్వశీచనాలు అందజేసి ప్రవచనాలు వినిపించారు. ప్రజలు చెడు వ్యసనాలకు దూరంగా ఉండి భక్తి మార్గంలో నడుచుకోవాలన్నారు. భగవద్గీత ద్వారా సమాజంలో ఉన్న కులమతాలను రూపుమాపడానికి ప్రజల మధ్య ఉన్న అసమానతలను తొలగించడానికి సర్వమతాలకు దేవుడు ఒక్కడేనని, ప్రజలలో దైవ భక్తిని పెంపొందించడానికి ఎంతో దోహదపడుతుందన్నారు. భక్తులు ఆధ్యాత్మికతను అలవరచుకోవడం వలన జీవితంలో రాణించి ఉన్నత స్థానాలను చేరుకునే వీలుంటుందన్నారు. భగవంతుని చేరడానికి నాలుగు మార్గాలు ఉన్నాయని తెలిపారు. కార్యక్రమంలో కరుణాకర్రెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, కృష్ణారెడ్డి, నారాయణరెడ్డి, భక్తులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలి గద్వాల: సీపీఎస్ రద్దు– ఓపీఎస్ అమలు కోసం పీఆర్టీయూ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 1వ తేదీన హైదరాబాద్లోని ఇందిరాపార్కులో మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆ సంఘం నాయకులు తిమ్మారెడ్డి తెలిపారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని పీఆర్టీయూ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం తన మేనిఫెస్టోలో పెట్టిన సీపీఎస్ రద్దును వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల హక్కుల పరిరక్షణలో భాగంగా సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ ని వెంటనే అమలు చేయాలని కోరారు. ఈ డిమాండ్ను కోరుతూ పీఆర్టీయూ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 1వ తేదీన హైదరాబాదులోని ఇందిరాపార్కు వద్ద మహాధర్నా చేపడుతున్నట్లు, కార్యక్రమంలో ఉపాధ్యాయులందరూ అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో యూనియన్ నాయకులు వేణుగోపాల్, నర్సింహారెడ్డి, పరమేశ్వర్రెడ్డి, వెంకట్నాయుడు, జాహేద్, రవిప్రకాష్రెడ్డి, ఎల్లస్వామి, గోవిందు తదితరులు పాల్గొన్నారు. -
అభివృద్ధిని ఇంటింటా వివరించండి
రాజోళి: బీజేపి హయాంలోనే గ్రామాల్లో నూతన శకం మొదలైందని.. బీజేపీ హయాంలో గ్రామాల్లో చేసిన అభివృద్ధిని ఇంటింటా వివరించాలని నాగర్కర్నూల్ మాజీ ఎంపీ పోతుగంటి రాములు అన్నారు. గృహ మహా సంపర్క్ అభియాన్లో భాగంగా ఆదివారం మండల కేంద్రం రాజోళిలో మండల అధ్యక్షుడు శశి కుమార్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరుగుతూ..బీజేపి ప్రభుత్వం, నరేంద్ర మోదీ ప్రధానిగా గ్రామాలకు అందించిన సేవలను వివరించారు. నేడు గ్రామాల్లో కనిపిస్తున్న అభివృద్ధి ప్రధాని మోదీ ద్వారానే సాధ్యమైందని అన్నారు. సీసీ రోడ్లు, ఉచిత బియ్యం, ముద్ర రుణాలు, విశ్వకర్మ రుణాలను అందించి సాధారణ, మద్య తరగతి ప్రజలకు మేలు చేసిందన్నారు. దేశ భద్రతలో భాగంగా ఆర్టికల్ 370 రద్దు, మైనార్టీ మహిళల కోసం త్రిపుల్ తలాక్ రద్దు, ఆపరేషన్ సిందూర్ చేపట్టి ఉగ్రమూకలను తోక ముడుచుకునేలా చేసిన ఘనత మోదీకే దక్కుతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరిత హామీలను ఇచ్చి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి, హామీలను తుంగలో తొక్కిందని అన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని అబద్దపు హామీలను, రిజర్వేషన్ల పేరుతో ఓట్లు కాజేసేందుకు మళ్లీ ప్రజల్లోకి వస్తుందని, వారిని ఎవరూ నమ్మే పరిస్థితి లేదన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంపై, బీజేపీ పాలనపై ప్రజలకు అపారమైన నమ్మకం ఉందని, రానున్న అన్ని ఎన్నికల్లో బీజేపి విజయఢంకా మోగిస్తుందని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల జిల్లా కన్వీనర్ రామచంద్రారెడ్డి మాట్లాడుతూ...ఈ నెల 4,5 తేదీలల్లో మండల నాయకులు, బూత్ అధ్యక్షులు, రాష్ట్ర నాయకులు 100 ఇళ్లకు తిరిగి బీజేపి ప్రభుత్వం చేసిన అభివృద్ది పనులను ప్రజలకు తెలియజేయాలన్నారు. కార్యక్రమంలో రాజగోపాల్,సంజీవ రెడ్డి,రాజశేఖర్,నాగేశ్వర్ రెడ్డి, నాగరాజు, గోవిందు రాజులు, గోపాల కృష్ణ, భగత్ రెడ్డి బీమన్న తదిదరులు పాల్గొన్నారు. -
అయ్యో దేవుడా!
ముంపునకు గురైన ‘ఆలూరు’ నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంలో భాగంగా ర్యాలంపాడు రిజర్వాయర్ నిర్మాణంలో ఆలూరు గ్రామం ముంపునకు గురైంది. 2016లో ర్యాలంపాడు రిజర్వాయర్ను పూర్తి స్థాయి 4 టీఎంసీల నీటిని నింపడంతో ఆలూరు గ్రామస్తులు గ్రామాన్ని ఖాళీ చేసి, పునరావాస కేంద్రంలోకి మకాం మారారు. ముంపు గ్రామస్తులకు అప్పట్లో బింగిదొడ్డి తండా సమీపంలో ప్రభుత్వం 130 ఎకరాల్లో పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేసి, 1,452 మందికి ప్లాట్లను కేటాయించింది. ఆలూరు ముంపు గ్రామస్తులతో పాటుగా ఆలయాలకు ప్రభుత్వం పరిహారాన్ని అందజేసింది. ఇక్కడి గ్రామస్తుల ప్రధాన దైవం ఆంజనేయస్వామి, శివాలయం. ఆలయాలకు ప్రభుత్వం సుమారుగా రూ.28 లక్షల పరిహారం అందజేస్తే.. బ్యాంకులో దాచుకున్న ఆ డబ్బులు ఇప్పుడు రెట్టింపయ్యాయి. ఈ నిధులు రూ. 50 లక్షలకు చేరాయి. రెండున్నర నెలల క్రితమే ఆలూరు పునరావాస కేంద్రంలో ఆంజనేయస్వామి, శివాలయాల నిర్మాణానికి ప్రభుత్వం టెండర్లను పిలిచి పనులు అప్పగించింది. పనులు ఇప్పటికి ప్రారంభం కాలేదు. ఆలూరు గ్రామంలోని ప్రధాన రహదారి పక్కనే ఉన్న 10 శాతం ఖాళీ స్థలంలో ఆంజనేయస్వామి, శివాలయంలో పాటుగా వాల్మీకి, కనకదాసుల విగ్రహాలు రేకుల మధ్య గుడిసెల్లో పూజలందుకుంటున్నారు. ఇక్కడి ఆంజనేయస్వామి జాతరను ప్రతి ఏటా జనవరిలో గ్రామస్తులు నిర్వహిస్తుంటారు. అయితే ఇక్కడ ఆలయ నిర్మాణం కోసం 6 పాట్లను కేటాయించారు. మిగతా దాంట్లో కొందరికి ప్లాట్లను కేటాయించిన నేపథ్యంలో వివాదం నెలకొంది. ఈ స్థలం మొత్తంలో ఆలయ నిర్మాణంతోపాటుగా జాతర, వివాహాది శుభకార్యాయాలు జరుపుకొనేందుకు అనువుగా ఆలయంతో పాటుగా ఖాళీ స్థలం ఉండాలని కొందరు పట్టుబట్టారు. ఈ పురనరావాస కేంద్రంలో రెండు చోట్ల పబ్లిక్ పర్పస్ కోసం బస్టాండ్ దగ్గర 3 ఎకరాలు, గ్రామం మధ్యలో 3 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. ఇందులో కొంత మేరకు అన్యాక్రాంతం అయినట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. బస్టాండ్ పక్కనే ఉన్న మొత్తం ఖాళీ స్థలం మొత్తం దేవాలయాలు, గ్రామంలో నిర్వహించే శుభకార్యాలు, ఉత్సవాల కోసం అలానే ఉంచాలని మరికొందరు గ్రామస్తులు పట్టుపడుతుడుతున్నారు. ఆలయానికి కావాల్సిన 6 ప్లాట్లు సరిపోతాయని, మిగిలినవి లోతట్టు ప్రాంతంలో కట్టడాలకు పనికి రాని చోట కేటాయించిన వారికి ప్లాట్లను ఇవ్వాలని మరి కొందరంటున్నారు. ఆలయ నిర్మాణంపై గ్రామస్తుల్లో ఏకాభిప్రాయం లేని కారణంగా ఆలయాల నిర్మాణంపై ప్రభావం పడింది. రూ.లక్షలు ఉన్నా పూరి గుడిసెల్లోనే పూజలందుకుంటున్న దేవుళ్లు గట్టు: ఏ ఊరిలో అయినా పెళ్లి లేదా.. పండుగ.. ఇలా ఏ శుభకార్యమైనా మొదట ఆలయానికి వెళ్లి అంతా మంచి జరగాలంటూ దేవుడికి మొక్కులు చెల్లించుకుంటుంటారు. కానీ, ఆ ఊరిలో మాత్రం ఏళ్లుగా ఆలయాల నిర్మాణానికి నోచుకోక దేవుళ్లు పూరి గుడిసెలోనే ఉండిపోవడంతో గ్రామస్తులు పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలయాలను పక్క గ్రామాలకు వెళ్లి చేయించుకునే పరిస్థితి నెలకొంది. చివరికి ఏటా ఘనంగా జరుపుకొనే జాతర సైతం కల తప్పినట్లయ్యింది. గట్టు మండలం ఆలూరు పునరావాస కేంద్రంలో నెలకొన్న విచిత్ర పరిస్థితి ఇదీ. ఆలూరులోని దేవుళ్ల పేరిట బ్యాంకుల్లో రూ.లక్షలు ఉన్నా ఆలయ నిర్మాణానికి మాత్రం నోచుకోవడేంలేదు. రెండున్నర ఏళ్ల క్రితం టెండర్లు పిలిచి పనులు అప్పగించినా.. నేటికీ ఆలయ నిర్మాణ పనులు ప్రారంభం కాలేదు. అటు ఆలయాల నిర్మాణాలు చేపట్టక.. రేకుల గుడిసెలో దేవుడు తలదాచుకుంటూ పూజలందుకునే పరిస్థితి నెలకొంది. ఆలూరు గ్రామంలో ఆలయాలు లేకపోవడంతో గ్రామస్తులు ఇబ్బంది పడుతున్నారు. శుభకార్యాయాలు, పెళ్లిళ్లు జరుపుకోవాలన్నా ఆరు బయటే జరుపుకోవాల్సిందే. దేవుడి దీవెనల కోసం పూరి గుడిసెలో ఉన్న స్వామి వారిని దర్శించుకునే పరిస్థితి గ్రామంలో ఇప్పటికి కొనసాగుతోంది. గ్రామంలో ఆలయాల నిర్మాణం ప్రారంభం కాకపోవడంతో ఇప్పటికి పండుగలు, వివాహాది శుభకార్యాయాలు నిర్వహించుకునే సందర్భంలో గ్రామస్తులు ఇబ్బంది పడుతున్నారు. గ్రామానికి కొత్తగా వచ్చిన వారు గ్రామంలో ఆలయాలు లేకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. పట్టువిడుపులు మాని ఆలయ నిర్మాణానికి అధికారులు, ప్రజా ప్రతి నిధులు కృషి చేయాలని ఆలూరు గ్రామస్తులు కొరుతున్నారు. ఆలూరులో వివాదాస్పదంగా మారిన ఖాళీ స్థలం ఇదే.. త్వరలో నిర్మాణాలు చేపడతాం పునరావాస కేంద్రంలో ఆలయ నిర్మాణానికి చర్యలు తీసుకుంటాం. ఆలయంతో పాటుగా వివిధ నిర్మాణాలకు మరిన్ని నిధులు రావాల్సి ఉంది. వీటిపై సమీక్షించి, ఏడాదిలోపు నిర్మాణాలను ప్రారంభించే విధంగా చర్యలు తీసుకుంటాం. – లక్ష్మీనారాయణ, అడిషనల్ కలెక్టర్ ఆలయం నిర్మించాలి ఆలూరు పునరావాస కేంద్రంలో నూతన ఆలయాల నిర్మాణం చేపట్టని కారణంగా ఇబ్బంది పడుతున్నాం. పెళ్లిళ్లను ఊరిలో కాకుండా ఇతర ప్రాంతాల్లో చేసుకునే పరిస్థితి నెలకొంది. దేవుళ్లను గుడిసెల్లోనే పూజించుకుంటున్నాం. బస్టాండ్ పక్కనే ఉన్న 10 శాతం ఖాళీ స్థలం ఆలయాలు, ఫంక్షన్ హాల్, పబ్లిక్ పార్కు కోసం కేటాయించాలి. అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి పునరావాస కేంద్రంలో నూతన ఆలయాలను నిర్మించాలి. – మహేష్గౌడ్, ఆలూరు ●ప్లాట్ల కేటాయింపు వివాదం ఆలూరు పునరావాస కేంద్రంలో ఆలయాల నిర్మాణాలకు గ్రహణం ఆలయాల పేరిట బ్యాంకులో మూలుగుతున్న రూ.50 లక్షలు రెండున్నరేళ్ల క్రితమే నిర్మాణానికి టెండర్లు ఎటూ తేలని 10 శాతం స్థలంలో ప్లాట్ల పంచాయితీ -
పాలమూరుపై బీఆర్ఎస్ నిర్లక్ష్యం
కొల్లాపూర్: ‘పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తిచేయడంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది.. ప్రాజెక్టు పనులు పూర్తిచేసి ఉంటే రిజర్వాయర్లలో కృష్ణానీటిని నింపుకొనేవాళ్లం.. పాలమూరు ప్రాజెక్టుతోపాటు జిల్లాలోని జూరాల, కోయిల్సాగర్, నెట్టెంపాడు, కేఎల్ఐ ప్రాజెక్టుల్లోని పెండింగ్ పనులన్నీ పూర్తిచేస్తాం.. ఇందుకు అవసరమైన నిధులు కేటాయిస్తామని’ రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. శనివారం ఆయన కొల్లాపూర్ నియోజకవర్గంలో పర్యటించి.. పలు విద్యుత్ సబ్స్టేషన్ల నిర్మాణాలకు శిలాఫలకాలను ఆవిష్కరించారు. అనంతరం రాజాబంగ్లా ఎదుట ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పలువురు లబ్ధిదా రులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు, కల్యాణలక్ష్మి చెక్కులు, రేషన్కార్డులు, రైతులకు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ.. కొల్లాపూర్తో తనకు ప్రత్యేక అనుబంధం ఉందన్నారు. 1980లో మల్లు అనంతరాములు నాగర్కర్నూల్ ఎంపీగా పోటీ చేశారని, తాను అప్పుడు కొల్లాపూర్ నియోజకవర్గానికి ఇన్చార్జిగా వ్యవహరించానని పేర్కొన్నారు. మధిర ప్రజలతో ఉన్న అనుబంధమే కొల్లాపూర్ ప్రజలతో నూ ఉందన్నారు. పాలమూరు బిడ్డ సీఎం రేవంత్రెడ్డి, కొల్లాపూర్తో అను బంధం ఉన్న తాను ఈ ప్రాంత అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని పునరుద్ఘాటించారు. మంత్రి జూపల్లి కృష్ణారావు విజ్ఞప్తి మేరకు కొల్లాపూర్లో అడ్వాన్స్ టెక్నాలజీతో ఐటీఐ ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు. గతంలో తొలగించిన బ్యాంకులన్నింటినీ తిరిగి గ్రామాల్లో ఏర్పాటు చేసేందుకు అధికారులతో మాట్లాడతామన్నారు. శ్రీశైలం నిర్వాసితుల అంశం ఆర్థిక పరమైనది కాబట్టి దీనిపై పరిశీలన చేసి చెబుతానన్నారు. ముంపు బాధితుల కోసం జూపల్లి కోరిన 3 వేల అదనపు ఇళ్ల గురించి కలెక్టర్లతో మాట్లాడి సమాచారం తెలుసుకొని తగిన న్యాయం చేస్తానన్నారు. అభివృద్ధికి సహకరించండి: మంత్రి జూపల్లి కొల్లాపూర్ నియోజకవర్గ అభివృద్దికి సహకరించా లని మంత్రి జూపల్లి కృష్ణారావు డిప్యూటీ సీఎంను కోరారు. ఇక్కడ ఐటీఐ, పాలిటెక్నిక్, ఇంజినీరింగ్ కళాశాలలు మంజూరు చేయాలని, శ్రీశైలం నిర్వాసితులకు పంచాయతీ కార్యదర్శి, లష్కర్ పోస్టులు ఇవ్వాలని, లేనిచో ఒక్కో కుటుంబానికి రూ.25 లక్ష ల చొప్పున అదనపు పరిహారం చెల్లించాలని, నిర్వాసితుల కోసం నియోజకవర్గానికి అదనంగా 3 వేల ఇళ్లు మంజూరు చేయాలని విన్నవించారు. డిజిటల్ బుక్స్ ఆవిష్కరణ.. ఐఐఎఫ్సీఎల్ ఆధ్వర్యంలో ఎస్ఎస్సీ విద్యార్థుల కోసం రూపొందించిన డిజిటల్ బుక్స్ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆవిష్కరించారు. వీటికి స హకరించిన ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డిని ఆయ న అభినందించారు. ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, మేఘారెడ్డి, రాజేష్రెడ్డి, నారాయణరెడ్డి, శ్రీనివాసరెడ్డి, డీసీ సీబీ చైర్మన్ విష్ణువర్ధన్రెడ్డి, నాయకులు జగదీశ్వర్రావు, ఒబేదుల్లా కొత్వాల్, సరిత పాల్గొన్నారు. ప్రభుత్వాన్ని విమర్శిస్తే బుద్ధి చెప్పండి: ఎంపీ మల్లురవి ముగ్గురు, నలుగురు సీఎంలు మారినా పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నించి.. కల్వకుర్తి నుంచి నంద్యాల వరకు జాతీయ రహదారి, సోమశిల– సిద్దేశ్వరం బ్రిడ్జిని మంత్రి జూపల్లి కృష్ణారావు సాధించారని ఎంపీ మల్లురవి అన్నారు. సీఎంను, డిప్యూటీ సీఎంను, మంత్రులను, ప్రభుత్వాన్ని ఎవరైనా అనవసరంగా విమర్శిస్తే వారికి కుక్కకాటుకు చెప్పుదెబ్బ తరహాలో బుద్ధిచెప్పాలని పార్టీ శ్రేణులకు సూచించారు. జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టుల పూర్తికి రూ.899 కోట్లు కేటాయించాలని, పాలమూరు ప్రాజెక్టు పనులకు రూ.5 వేలు లేదా రూ.10 వేల కోట్లు విడుదల చేయాలని డిప్యూటీ సీఎంను కోరారు. నాగర్కర్నూల్ పార్లమెంట్ పరిధిలో కొత్తగా 50 గ్రామీణ లైబ్రరీలను సీఎస్ఆర్ ఫండ్స్ ద్వారా ఏర్పాటు చేయబోతున్నామని, అందులో 8 లైబ్రరీలు కొల్లాపూర్ ప్రాంతంలోనే ఉంటాయన్నారు. అప్పుడే పూర్తి చేసి ఉంటే రిజర్వాయర్లలో కృష్ణానీళ్లు నింపుకొనేవాళ్లం జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల అసంపూర్తి పనులకు నిధులు కేటాయిస్తాం అడ్వాన్స్ టెక్నాలజీతో ఐటీఐ ఏర్పాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క -
పర్యవరణాన్ని పరిరక్షించుకుందాం
అలంపూర్: పర్యవరణాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని జిల్లా జడ్జి ప్రేమలత అన్నారు. వనమహోత్సవంలో భాగంగా శనివారం అలంపూర్ కోర్టు ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి మాట్లాడుతూ.. మొక్కల పెంపకంతోనే మానవ మనుగడ ఆధారపడి ఉందన్నారు. భవిష్యత్ తరాలను దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి సంరక్షించాలని సూచించారు. అనంతరం జిల్లా జడ్జితో పాటు స్థానిక జూనియర్ సివిల్కోర్టు జడ్జి మిథున్ తేజను న్యాయవాదులు శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గవ్వల శ్రీనివాసులు, ఏపీపీ కార్తిక్ రాజ్, ఏజీపీ మధుసూదన్, ఎంఈఓ అశోక్కుమార్, న్యాయవాదులు, పోలీసు అధికారులు పాల్గొన్నారు. దరఖాస్తుల ఆహ్వానం గద్వాల: బేగంపేట, రామనంతాపూర్లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో 2025–26 విద్యా సంవత్సరం ఒకటో తరగతిలో డేస్కాలర్గా ప్రవేశాల నిమిత్తం జిల్లాలోని గిరిజన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు గిరిజన సంక్షేమశాఖ అధికారి పవన్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 2018 జూన్ 1నుంచి 2019 మే 31వ తేదీ మధ్య జన్మించిన విద్యార్థులు అర్హులని పేర్కొన్నారు. దరఖాస్తు ఫారాలను జిల్లా గిరిజన సంక్షేమశాఖ కార్యాలయంలో పొందవచ్చన్నారు. దరఖాస్తుతో పాటు నివాస, కులం, ఆదాయం, జనన ధ్రువపత్రాల జిరాక్స్తో ఈ నెల 8వ తేదీలోగా జిల్లా గిరిజన సంక్షేమశాఖ కార్యాలయంలో సమర్పించాలని సూచించారు. 12న లక్కీ డిప్ ద్వారా విద్యార్థుల ఎంపిక ఉంటుందని తెలిపారు. 7న సీపీఐ జిల్లా మహాసభలు గద్వాల: జిల్లా కేంద్రంలోని వాల్మీకి భవన్లో ఈ నెల 7న సీపీఐ జిల్లా 3వ మహాసభలు నిర్వహించనున్నట్లు ఆ పార్టీ జిల్లా కార్యదర్శి బి.ఆంజనేయులు అన్నారు. ఈ మేరకు శనివారం జిల్లా పార్టీ కార్యాలయంలో మహాసభలకు సంబంధించిన పోస్టర్లను విడుదల చేశారు. అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తూ దేశ సంపదను దోచిపెడుతోందని ఆరోపించారు. దేశ ఐక్యత, లౌకిక ప్రజాస్వామ్య వ్యవస్థకు తీరని హాని తలపెడుతున్నారన్నారు. రాజ్యాంగ మూలాలను నాశనం చేయాలనే ఉద్దేశంతోనే దళితులపై దాడులకు తెగబడుతున్నారని అన్నారు. డీజిల్, పెట్రోల్, గ్యాస్ వంటి నిత్యావసర ధరలు పెంచి సామాన్యులపై భారం మోపుతున్నారన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందన్నారు. సీపీఐ ఆధ్వర్యంలో భవిష్యత్ పోరాటాలకు నాంది పలికేందుకు జిల్లా మహాసభల్లో పలు నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాసంఘాలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో రంగన్న, ఖాసీం, ఉప్పేరు కృష్ణ, ప్రవీణ్, రవి, రామాంజనేయులు, తిమ్మప్ప, గోకారి పాల్గొన్నారు. ఇద్దరు పంచాయతీ కార్యదర్శుల సస్పెన్షన్ గద్వాల: ఫేక్ డీఎస్ఆర్ అటెండెన్స్ నమోదు చేసిన ఇద్దరు పంచాయతీ కార్యదర్శులపై సస్పెన్షన్ వేటు పడింది. మల్దకల్ మండలం విఠలాపురం, గట్టు మండలం బోయలగూడెం పంచాయతీ కార్యదర్శులు తిరుమలేశ్, శ్రీనివాసులును సస్పెన్షన్ చేసినట్లు కలెక్టర్ బీఎం సంతోష్ తెలిపారు. లైవ్ డీఎస్ఆర్ అటెండెన్స్ నమోదు చేయకుండా ఫేక్ డీఎస్ఆర్ నమోదు చేస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. వేరుశనగ క్వింటాల్ రూ.6,100 గద్వాల వ్యవసాయం: జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్యార్డుకు శనివారం 482 క్వింటాళ్ల వేరుశనగ విక్రయానికి వచ్చింది. క్వింటాల్కు గరిష్టంగా రూ. 6,100, కనిష్టంగా రూ. 3,499, సరాసరి రూ. 5,090 ధరలు లభించాయి. -
రుణ లక్ష్యం ఖరారు
రూ. 2998.57కోట్ల పంట రుణాలు ఇవ్వాలని నిర్దేశం రుణ లక్ష్యం నెరవేరేలా చర్యలు. పంట పెట్టుబడుల్లో బాగంగా పంట రుణాలకై ధరఖాస్తు చేసుకునే అర్హులైన రైతులందరికి రుణాలు అందిస్తాం. 2025–26 ఆర్థిక సంవత్సరంలో రుణ లక్ష్యం మేరకు రుణాలు అందించేందుకు చర్యలు తీసుకుంటాము. ఇందులో బాగంగా ఆయా బ్యాంకులకు లక్ష్యాలను నిర్దేశించాము. – శ్రీనివాసరావు, ఎల్డీఎం గద్వాలన్యూటౌన్: జిల్లాలో పంట రుణ లక్ష్యం ఖరారైంది. 2025–26 ఆర్థిక సంవత్సరానికి గాను వానాకాలం, యాసంగి రెండు సీజన్లలో 1,47,258 మంది రైతులకు రూ. 2998.57 కోట్ల రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా నిర్దేశించారు. నడిగడ్డ రైతాంగం బ్యాంకులు అందించే రుణాలపైనే ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారు. ఇదీ పరిస్థితి.. జిల్లాలో వ్యవసాయమే ప్రధాన జీవనాధారం. జూరాల, ఆర్డీఎస్ ప్రాజెక్టులతో పాటు నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం కింద ఏడు రిజర్వాయర్లు, వందకు పైగా చెరువులు, కుంటలు ఉన్నాయి. ఏటా రెండు సీజన్లలో దాదాపు 5లక్షల ఎకరాల వరకు వివిధ రకాల పంటలను సాగు చేస్తుంటారు. పండ్లతోటలు, కూరగాయలు కూడా పండిస్తున్నారు. అయితే జిల్లాలో సన్న, చిన్నకారు రైతులు వేల సంఖ్యలో ఉన్నారు. రైతుభరోసా, పీఎం కిసాన్ సమ్మాన్ యోజన వంటి పంట పెట్టుబడుల పథకాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలుచేస్తున్నా.. వాటితో రైతలు అవసరాలు పూర్తిగా తీరడం లేదు. దీంతో వీరంతా బ్యాంకులు అందించే పంట రుణాలపైనే ఆధారపడి సేద్యం చేస్తున్నారు. బ్యాంకర్లు సకాలంలో రుణాలు ఇవ్వకపోతే అధిక వడ్డీలకు ప్రైవేటులో అప్పులుచేసి ఆర్థికంగా నష్టపోతున్నారు. బ్యాంకర్లు సకాలంలో రుణాలు అందిస్తేనే రైతులకు ప్రయోజనం చేకూరుతుంది. ● ఆర్థిక సంవత్సరం నిర్దేశించిన పంట రుణ పరిమితి మేరకు బ్యాంకులు రైతులకు రుణాలు అందిస్తాయి. అందులో బాగంగా 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆయా బ్యాంకుల వారీగా రెండు సీజన్లకు రుణ లక్ష్యాన్ని లీడ్ బ్యాంక్ అధికారులు రూపొందించారు. వానాకాలంలో 88,356 మంది రైతులకు రూ. 1798 కోట్లు, యాసంగిలో 58,902 మంది రైతులకు రూ. 1200.58 కోట్లు లక్ష్యంగా నిర్దేశించారు. దీన్ని కొన్నిరోజల క్రితం కలెక్టర్ అధ్యక్షతన జరిగిన డీఎల్ఆర్సీ సమావేశంలో ఆమోదించారు. బ్యాంకుల వారీగా రుణ లక్ష్యం ఇలా (రూ.కోట్లలో) వానాకాలంలో 88,356మంది, యాసంగిలో 58,902మందిరైతులకు ఆర్థిక తోడ్పాటు లక్ష్యం నెరవేరితేనే ప్రయోజనం -
వైద్యసేవలు అందించడంలో నిర్లక్ష్యాన్ని సహించం
గద్వాల క్రైం: ప్రజలకు వైద్యసేవలు అందించడంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని రాష్ట్ర వైద్యరోగ్యశాఖ మానిటరింగ్ అధికారి ఫణిందర్రెడ్డి హెచ్చరించారు. శనివారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఆయన ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ముందుగా జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిని సందర్శించి.. రోగులకు అందుతున్న సేవలు, మందుల నిల్వలు, వైద్యుల పనితీరు, స్కానింగ్ పరికరాల వినియోగం, మౌలిక వసతులు తదితర వివరాలను సూపరింటెండెంట్ ఇందిరతో తెలుసుకున్నారు. ప్ర సవాల కోసం వచ్చే గర్భిణులకు సాధ్యమైనంత వర కు సాధారణ ప్రసవం చేయాలని వైద్యులకు సూచించారు. అత్యవసరమైతేనే సిజేరియన్ చేయాలన్నారు. ప్రస్తుతం సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున అన్నిరకాల మందులను అందుబాటు లో ఉంచుకోవాలని సూచించారు. అనంతరం రోగులతో మాట్లాడి వైద్యసేవలపై ఆరా తీశారు. సెంట్రల్ మెడిసిన్ స్టోర్లో మందుల నిల్వ వివరాలను ఫార్మసిస్ట్తో తెలుసుకున్నారు. ప్రమాదకర వ్యాధులు, శస్త్ర చికిత్సల కోసం అందజేసిన మందులు, రోగుల వివరాలకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. అందుబాటులో లేని మందుల కోసం సమర్పించిన నివేదికలపై ఆరా తీశారు. కాగా, టెక్నిషియన్ పోస్టు ల భర్తీ కోసం ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేశామని సూపరింటెండెంట్ తెలిపారు. అనంతరం జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిని ఆయన తనిఖీ చేశా రు. మానిటరింగ్ అధికారి వెంట సిబ్బంది కౌటిల్య, వేణుగోపాల్, శ్రీనివాసులు, అభినేష్, రాజు, మధుసూదన్రెడ్డి, వినోద్ తదితరులు ఉన్నారు. -
హాస్టళ్ల నిర్వహణలో నిర్లక్ష్యం వద్దు
● అధికారులు సమన్వయంతో పనిచేయాలి.. ● నిర్లక్ష్యం వహిస్తే వేటుతప్పదు ● కలెక్టర్ బీఎం సంతోష్ గద్వాల: గురుకులాలు, సంక్షేమ శాఖల వసతిగృహాల నిర్వహణలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటానని కలెక్టర్ బీఎం సంతోష్ హెచ్చరించారు. శుక్రవారం ఐడీవోసీ కార్యాలయంలో ఎస్పీ శ్రీనివాస్రావుతో కలిసి సమీక్షించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖపై ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. పాఠశాలలు, హాస్టళ్లల్లో నిర్వాహణలో ఎలాంటి నిర్లక్ష్యం వహించినా తగిన వేటుతప్పదన్నారు. ఇటీవల ఓ పాఠశాలలో జరిగిన ఘటనపై సంబంధిత డిప్యూటీ వార్డెన్, సూపర్వైజర్లను సస్పెండ్ చేసిన విషయాన్ని గుర్తుచేశారు. నిర్లక్ష్యం వహించిన ఇతర సంబంధిత అధికారులకు కూడా మొమోలు జారీ చేసినట్లు తెలిపారు. పాఠశాలలో విద్యార్థుల సంక్షేమం కోసం మండల స్థాయి అధికారులు పరస్పరం సమన్వయంతో పనిచేయాలన్నారు. అన్ని మండలాలకు జిల్లా స్థాయి స్పెషల్ అధికారులను నియమించడం జరిగిందన్నారు. ప్రతినెలా కనీసం రెండుసార్లు పాఠశాలలు సందర్శించి అక్కడి విద్య, భద్రతా, మౌళిక వసతులైన తాగునీరు, మరుగుదొడ్లు ఇతర అవసరాలను సమీక్షించాలన్నారు. విద్యార్థులకు ప్రతిరోజు మెను ప్రకారం నాణ్యమైన పోషకాహారంతో కూడిన భోజనం తప్పనిసరిగా అందించాలన్నారు. ఏదైనా సమస్యలు తలెత్తితే వెంటనే తహసీల్దార్, ఎంపీడీవో పోలీసు అధికారులకు తెలియపర్చాలని తహసీల్దార్ మండల స్థాయి మెజిస్ట్రేట్ వెంటనే స్పందించాలన్నారు. బాధ్యతాయుతంగా వ్యవహరించాలి అనంతరం ఎస్పీ శ్రీనివాస్రావు మాట్లాడుతూ.. జిల్లాల్లో ఎలాంటి సంఘటన జరిగిన వెంటనే పోలీసుశాఖ అన్ని సమయాల్లో అందుబాటులో ఉంటుందని, వసతిగృహాల ప్రతివిషయం అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. వ్యక్తులు ఎవరైనా విద్యార్థులను రోడ్డుపైకి వచ్చేలా చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. వసతి గృహాల్లోకి బయటి వారిని అనుమతించకూడదని వసతిగృహాల విద్యార్థుల హక్కులకు భంగం కలిగించే వారిపై కేసులు నమోదు చేస్తామన్నారు. విద్యాలయాల ఆవరణలో ఎవరైనా మద్యం సేవిస్తే కేసులు నమోదు చేస్తామన్నారు. మండల స్థాయిలో అధికారులు, పోలీసువిభాగం పరస్పరం సమన్వయంతో పనిచేయాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు వి.లక్ష్మీనారాయణ, నర్సింగ్రావు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శ్రీనివాసరావు, ఆర్డీవో అలివేలు, అధికారులు పాల్గొన్నారు. సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా చర్యలు వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు వ్యాప్తిచెందకుండా అవసరమైన ముందస్తు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని బీస్తీదవాఖానాను ఆకస్మింకగా తనిఖీ చేశారు. దగ్గు, జలుబు, జ్వరం నివారణకు సంబధించి మెరుగైన వైద్యం అందించాలని, దోమల నివారణకు ఆయిల్బాల్స్, బ్లీచింగ్ వంటి నివారణ కారకాలను ఉపయోగించాలన్నారు. ఎరువుల కొరత సృష్టించొద్దు రైతులకు అవసరమైన ఎరువులు అందుబాటులో ఉంచాలని, వాటి కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటానని కలెక్టర్ అన్నారు. రైతు నుంచి ఆధార్ వివరాలు సేకరించిన అనంతరమే యూరియా విక్రయాలు చేయాలని, ఈ–పాస్ ద్వారా అమ్మకాలు జరగాలన్నారు. జిల్లాలో ఎరువుల నిల్వలు, వినియోగంపై సమగ్ర నివేదికను ఇవ్వాలని డీఏవో సక్రియానాయక్ను ఆదేశించారు. -
కేంద్రియ విద్యాలయ ఏర్పాటుకు స్థల పరిశీలన
మల్దకల్ : మండల కేంద్రమైన మల్దకల్, కుర్తిరావుల చెర్వు గ్రామ పరిసరాల్లోని ప్రభుత్వ భూమిని శుక్రవారం కేంద్రియ విద్యాలయ అధికారులు కృష్ణవేణి, హరిప్రసాద్, డీఈఓ అబ్దుల్ ఘని పరిశీలించారు. మల్దకల్ తహసీల్దార్ ఝాన్సీరాణి, ఎంఈఓ సురేష్ల ఆధ్వర్యంలో మల్దకల్ టూరిజం శాఖ నిర్మించిన అతిథిగృహాన్ని తాత్కాలిక కేంద్రంగా ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని వారు పేర్కొన్నారు. ప్రభుత్వ స్థలాన్ని గుర్తించి నిర్మాణాలు చేపట్టే వరకు ప్రస్తుతం వాటిలో పాఠశాలను ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కేంద్రియ విద్యాలయ ఏర్పాటుతో గ్రామీణ విద్యార్థులకు మెరుగైన విద్యాబోధన అందనుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సెక్టోరియల్ అధికారి శాంతిరాజు, సూపరిండెంట్ వీరశేఖర్, సర్వేయర్ హరికృష్ణ, ఆర్ఐ మద్దిలేటి తదితరులు ఉన్నారు. -
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఇసుక ఉచితం
గద్వాల: జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు అవసరమైన ఇసుకను ఉచితంగా కేటాయించేందుకు చర్యలు తీసుకుంటున్నామని అదనపు కలెక్టర్ వి.లక్ష్మీనారాయణ అన్నారు. శుక్రవారం ఐడీవోసీ కార్యాలయంలోని వీనియోకాన్ఫరెన్స్ హాలులో ఇసుక బుకింగ్ విధానంపై రారష్ట్ర స్థాయి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈకార్యక్రమంలో అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ పాల్గొని మాట్లాడారు. జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల పథకానికి అవసరమైన ఇసుక సరఫరా కోసం తుమ్మిళ్ల ప్రాంతంలో ఒక ఇసుక రీచ్ను గుర్తించామని, రేట్చార్జ్ను సిద్ధం చేసి లబ్ధిదారుల జాబితాను త్వరగా ఇస్తే వారికి ఉచిత ఇసుకను వెంటనే పంపిణీ చేసేలా ప్రఽణాళిక చేశామన్నారు. ఒక్కో ఇంటి నిర్మాణానికి 25క్యూబిక్ మీటర్ ఇసుకను అందించనున్నట్లు తెలిపారు. ఇసుక రవాణాకు ట్రాక్టర్ యజమానులు రిజిస్ట్రేషన్ చేసుకున్న ట్రాక్టర్లు, సొంత ట్రాక్టర్ల ద్వారా రవాణా చేసుకోవాలని సూచించారు. ఇసుక పక్కదారి పట్టకుండా అవసరమైన చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు సమావేశంలో అదనపు కలెక్టర్ నర్సింగ్రావు, ఎస్డీసీ శ్రీనివాస్రావు, హౌసింగ్పీడీ కాశీనాథ్, అన్ని మండలాల తహసీల్దార్లు, ఎంపీడీవోలతోపాటు మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు. -
టీచర్లకు తీపికబురు
ఉమ్మడి జిల్లా పరిధిలో ఇలా.. నిలిచిన డిప్యూటేషన్లు.. ఉమ్మడి జిల్లాలోని వివిధ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఉపాధ్యాయులను సర్దుబాటు చేసేందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు అన్ని జిల్లాల్లో ఎంఈఓల నుంచి డిప్యూటేషన్ ఇవ్వాల్సిన ఉపాధ్యాయుల వివరాలను డీఈఓలు సేకరించారు. వీటికి కలెక్టర్ అనుమతితో ఆర్డర్ ఇవ్వాల్సి ఉంది. ఉమ్మడి జిల్లాలో సుమారు 680 మందికి డిప్యూటేషన్లు ఇవ్వాల్సి ఉండగా ఒక్క మహబూబ్నగర్లోనే 330 మంది బదిలీ కావాలి. కానీ, ప్రస్తుతం ప్రభుత్వం పదోన్నతుల ప్రక్రియను చేపట్టనున్న నేపథ్యంలో డిప్యూటేషన్లు నిలిచిపోయాయి. పదోన్నతుల అనంతరం అక్కడ ఏర్పడిన ఖాళీల ఆధారంగా డిప్యూటేషన్లు చేపట్టనున్నట్లు విద్యాశాఖ అధికారులు పేర్కొంటున్నారు. పదోన్నతుల ప్రక్రియ ఈ నెల 11లోగా పూర్తయితే 15లోగా డిప్యూటేషన్లు కూడా పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నట్లు సమాచారం. నేటినుంచి ఉపాధ్యాయుల పదోన్నతుల ప్రక్రియ ప్రారంభం ● ఎస్జీటీలకు ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం, ఎస్ఏలుగా అవకాశం ● స్కూల్ అసిస్టెంట్లకు గెజిటెడ్ హెచ్ఎంలుగా ప్రమోషన్ ● ఉమ్మడి జిల్లాలో 650 నుంచి 750 మందికి మేలు ● ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేసిన ప్రభుత్వం మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: విద్యాశాఖలో ఖాళీగా ఉన్న వివిధ పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా అర్హులైన సీనియర్ ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించనుంది. గత మూడేళ్ల క్రితమే ప్రమోషన్లు ఇచ్చిన తాజాగా ప్రభుత్వం మరోసారి ప్రక్రియ చేపట్టాలని పేర్కొంటూ ఉత్తర్వులు సైతం జారీ చేసింది. దీంతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 2,991 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా.. 14,221 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. ప్రభుత్వం ప్రస్తుతం చేపడుతున్న పదోన్నతులతో సుమారు 650 నుంచి 750 మంది ఉపాధ్యాయులు అర్హత పొందే అవకాశం ఉందని విద్యాధికారులు పేర్కొంటున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం ఎస్జీటీలుగా విధులు నిర్వహిస్తున్న వారికి ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం, స్కూల్ అసిస్టెంట్లుగా అవకాశం కల్పించనున్నారు. ఇక స్కూల్ అసిస్టెంట్లకు గెజిటెడ్ హెచ్ఎంలుగా, ఎంఈఓలుగా పదోతున్నతులు ఇచ్చే అవకాశం ఉంది. ఈ నెల 11 వరకు.. ఉపాధ్యాయులకు పదోన్నతుల ప్రక్రియ శనివారం నుంచే ప్రారంభం కానుంది. ఈ క్రమంలో ఆయా జిల్లాల వారీగా డీఈఓ వెబ్సైట్లలో గ్రేడ్–2 హెడ్మాస్టర్, స్కూల్ అసిస్టెంట్ సమానమైన క్యాడర్ ఖాళీల వివరాలను ఆన్లైన్లో పొందుపర్చాల్సి ఉంది. వీటితోపాటు గెజిటెడ్ హెచ్ఎంలుగా పదోన్నతులు పొందాల్సిన ఎస్జీటీ ఉపాధ్యాయులు సీనియార్టీ ప్రొవిజనల్ లిస్టు, స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులు పొందనున్న ఎస్జీటీల ప్రొవిజనల్ సీనియార్టీ లిస్టును ఆన్లైన్లో అందుబాటులో ఉంచాలి. ఈ మేరకు సీనియార్టీ జాబితాలపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే చెప్పుకొనేందుకు ఈ నెల 3న అవకాశం ఉంటుంది. అలాగే 4, 5 తేదీల్లో సీనియార్టీ జాబితాపై వచ్చిన అభ్యంతరాలను పరిష్కరించి తుది జాబితా విడుదల చేస్తారు. 6న పదోన్నతులకు అర్హులైన వారు వెబ్ఆప్షన్లు పెట్టుకునేందుకు అవకాశం ఉంది. 7న సంబంధిత ఆర్జేడీ, డీఈఓల నుంచి ప్రమోషన్ ఆర్డర్ వెలువడనున్నాయి. ఇలా మొదట హెచ్ఎంలు, స్కూల్ అసిస్టెంట్లు, ఎస్జీటీల ప్రక్రియను ఈ నెల 11 వరకు పూర్తి చేసేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. జిల్లా పాఠశాలలు విద్యార్థులు ఉపాధ్యాయులు మహబూబ్నగర్ 791 62,724 4,650 నాగర్కర్నూల్ 808 54,152 3,513 వనపర్తి 495 38,147 2,097 జోగుళాంబ గద్వాల 448 55,289 2,064 నారాయణపేట 458 52,314 1,879 షెడ్యూల్ ప్రకారమే.. ప్రభుత్వం ప్రమోషన్లకు సంబంధించి షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నెల 11లోగా ప్రక్రియను పూర్తి చేసే విధంగా ఆదేశించింది. అందులో భాగంగా ఆదివారం సీనియార్టీ లిస్టులను ప్రదర్శిస్తాం. జిల్లా పరిధిలో 1:3 ప్రకారం 450 మందిని ఎంపిక చేసి 150 మందికి ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది. ఇక డిప్యూటేషన్లు ఆగిపోయే అవకాశం లేదు. కలెక్టర్ ఆదేశాల ప్రకారం ఫైల్ ప్రాసెస్ చేసి డిప్యూటేషన్లు ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. ఎక్కడ కూడా తప్పిదాలకు తావులేకుండా ప్రక్రియ నిర్వహిస్తాం. – ప్రవీణ్కుమార్, డీఈఓ, మహబూబ్నగర్ -
లక్ష్యం దిశగా ముందుకు
నీతి ఆయోగ్ సంపూర్ణ అభియాన్లో గట్టుకు కాంస్య పతకం గట్టు: దేశ వ్యాప్తంగా వెనుకబడిన మండలాలను గుర్తించి, వాటిని అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్ సంపూర్ణ అభియాన్ ద్వారా మండలాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే దేశ వ్యాప్తంగా 500 మండలాలను ఎంపిక చేయగా, అందులో గట్టు మండలం కూడా ఉంది. ఈమేరకు కలెక్టర్ బీఎం సంతోష్ ఆధ్వర్యంలో మండల స్థాయి అధికారులు అన్ని శాఖల సమన్వయంతో అభివృద్ధికి అహర్నిశలు శ్రమించారు. అధికారుల శ్రమకు తగిన ఫలితం లభించింది. 6 అంశాలను పరిగణలోకి తీసుకుని కేంద్ర ప్రభుత్వం వాటికి ర్యాంకులు ఇవ్వగా.. గట్టు మండలానికి 5వ ర్యాంకు లభించిన విషయం తెలిసిందే. దీంతోపాటుగా దక్షణాది రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలను జోన్ –3గా గుర్తించగా ఈ జోన్–3 లో గట్టు మండలం అభివృద్ధి సూచికలో 2వ ర్యాంకును సాధించింది. నేడు రాజ్ భవన్లో అవార్డు అందుకోనున్న కలెక్టర్ బీఎం సంతోష్ 6 అంశాలకు 3 అంశాల్లో వంద శాతం లక్ష్య సాధన సంపూర్ణ అభియాన్లో అధికారుల సమష్టి కృషికి గుర్తింపు -
మహిళా హక్కుల రక్షణకు ఉద్యమిద్దాం
గద్వాలటౌన్: దేశంలో మహిళా హక్కుల పరిరక్షణ కోసం ఐక్యంగా ఉద్యమించాలని ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు అరుణజ్యోతి పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక సీఐటీయూ కార్యాలయంలో జరిగిన ఐద్వా జిల్లా రాజకీయ శిక్షణ తరగతుల కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దేశంలో సీ్త్ర, పురుషులకు అనేక హక్కులను ప్రకటించినప్పటికి సమస్యలు వెంటాడుతున్నాయన్నారు. సీ్త్ర, పురుషుల మధ్య సమానత్వం లేదని.. విద్యా, వైద్యం, ఉపాధి రంగాలలో సీ్త్రలు ఇప్పటికి వెనుకబడే ఉన్నారని చెప్పారు. చట్టరీత్యా హక్కులున్నా అవేవీ సీ్త్రలకు అందుబాటులో లేవన్నారు. వీటికి తోడు హత్యాచారాలు, వరకట్నపు మరణాలు, కుటుంబంలో హింస, బలవంతపు పెళ్లిలు, బాల్యవివాహాలు, బహు భార్యత్వం వంటి అనేక సమస్యలు సీ్త్రలను వేధిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు వీటిని అరికట్టేందుకు సమగ్రమైన ప్రతిపాదిత చట్టాలు చేయాలని కోరారు. ప్రజాస్వామ్యం, సమానత్వం, సీ్త్ర విముక్తి అనే నినాదంతో ఐద్వా పనిచేస్తుందని వివరించారు. ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా కార్యదర్శి నర్మద, కమిటీ సభ్యులు పద్మ, రత్నమ్మ, రాణి, సుధా, పద్మ, భాగ్యమ్మ, అమ్ములు, రాధా, కై యూమ్ తదితరులు పాల్గొన్నారు. -
వైద్య పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
గద్వాల: అలంపూర్ ఏరియా ఆసుపత్రిలో కాంట్రాక్టు విధానంలో వైద్యాధికారుల నియామకాలు చేపడుతున్నట్లు అర్హుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రమేష్చంద్ర శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. అలంపూర్ ఏరియా ఆసుపత్రిలో గైనకాలజిస్ట్–2, జనరల్ సర్జన్–2, జనరల్ మెడిసిన్–2, అనస్తిటిస్ట్–2, ఈఎన్టీ–1, ఆర్థోపెడిక్–1, పాథాలజిస్ట్–1, సైక్రియార్టిస్ట్–1, డెర్మటాలజిస్ట్–1 పోస్టు ఖాళీగా ఉన్నాయని, అదేవిధంగా అలంపూర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో జనరల్ మెడిసిన్–1, పిడియాట్రీషియన్–1, జీడీఎంవో(ఎంబీబీఎస్)–2 కాంట్రాక్టు పోస్టులకు దరరఖాస్తులు చేసుకోవాలని కోరారు. దరఖాస్తుదారులు ఈనెల 7వ తేదీన అలంపూర్ ఏరియా ఆసుపత్రి, అలంపూర్ క్రాస్రోడ్డులో వాక్–ఇన్ ఇంటర్వ్యూకు హాజరుకావాలని తెలిపారు. ఆపరేషన్ ముస్కాన్లో 75 మంది బాలలకు విముక్తి గద్వాల క్రైం: జిల్లా వ్యాప్తంగా చేపట్టిన ఆపరేషన్ ముస్కాన్ –11 విజయవంతమైందని, మొత్తం 75 మంది బాలకార్మికులను గుర్తించి విముక్తి కల్పించినట్లు ఎస్పీ శ్రీనివాసరావు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. గద్వాల – అలంపూర్ సెగ్మెంట్లో జులై 1 నుంచి 31వ తేదీ వరకు పోలీసు, కార్మిక, విద్య, స్వచ్ఛంద సంస్థలు సమష్టిగా కృషి చేశాయని, పలు ప్రాంతాల్లో బాలకార్మికులుగా పని చేస్తున్న 75 మంది చిన్నారులను గుర్తించి వారిని వెట్టి నుంచి విముక్తి కల్పించామని తెలిపారు. అనంతరం చిన్నారులను పాఠశాలలో చేర్పించామని, వారిని పనిలో పెట్టుకున్న యజమానులపై 18 కేసులు నమోదు చేశామని పేర్కొన్నారు. జిల్లాలో ఎవరైన చిన్నారులను పనిలో పెట్టుకుంటే డయల్ 100 లేదా 1098కు సమాచారం అందించాలని, ఆపరేషన్ ముస్కాన్లో విధులు నిర్వహించిన సిబ్బంది కృషి మరువలేనిదని తెలిపారు. కేంద్రం నిధులిస్తే.. కాంగ్రెస్ ప్రారంభోత్సవాలా ? అలంపూర్: కేంద్ర ప్రభుత్వం నిధులిచ్చి నిర్మిస్తే కాంగ్రెస్ మంత్రులు ప్రారంభోత్సవాలు చేయడం హాస్యాస్పదంగా ఉందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు అన్నారు. అలంపూర్లోని ప్రసాద్ స్కీం భవనంలో బాలబ్రహ్మేశ్వర నిత్య అన్నదాన సత్రాన్ని, ఏర్పాట్లను ఆయనతోపాటు బీజేపీ నాయకులతో కలిసి శుక్రవారం సందర్శించారు. అనంతరం మాట్లాడుతూ.. కేంద్రం ప్రసాద్ స్కీం పథకం ద్వారా జోగుళాంబ ఆలయానికి 2021లో రూ.80 కోట్లు పలు భవనాలు, అభివృద్ధి పనుల కోసం కేటాయించారన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కేవలం రూ.36.72 కోట్లు మాత్రమే వినియోగించుకున్నట్లు తెలిపారు. నిర్మించిన వసతి గృహాలను సైతం వినియోగంలోకి తేవడానికి సరైన చర్యలు చేపట్టడం లేదన్నారు. ఈ భవనంలో భక్తుల సౌకర్యార్థం కళ్యాణమండపం, ఆడిటోరియం వంటివి అందుబాటులోకి రావాల్సి ఉందన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల ప్రసాద్ స్కీంలోని సౌకర్యాలతోపాటు నిత్య అన్నదాన సత్రం తెలిసే విధంగా సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు.కార్యక్రమంలో బీజేవైఎం ఉపాధ్యాక్షుడు రాజశేఖర్ శర్మ, బీజేపీ నాయకులు రాజగోపాల్, నాగేశ్వర్ రెడ్డి, శరత్, ఈశ్వర్, మురళికృష్ణ, రామకృష్ణ, నాగమల్లయ్య ఉన్నారు. జీవన ప్రమాణాలు మెరుగుపడాలి: వీసీ మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: జీవన ప్రమాణాలు మెరుగుపడాలంటే ఆర్థిక క్రమశిక్షణ అవసరం అని పాలమూరుయూనివర్సిటీ వీసీ శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ మేరకు పీయూలో ఎంబీఏ విభాగం ఆధ్వర్యంలో ఆర్థిక విద్య, జీవన నైపుణ్యాలు అనే అంశంపై ఒకరోజు జాతీయ వెబినార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆన్లైన్లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. జాతీయ విద్యా విధానం–2020 ప్రకారం నైపుణ్య ఆధారిత పరిజ్ఞానం అవసరం అన్నారు. విద్యార్థి దశలోనే ఆర్థిక అవగాన పెంచుకుని, దేశ స్థూల జాతీయోత్పత్తిలో మీ వంతు పాత్ర పోషించాలన్నారు. కీనోట్ స్పీకర్, సీనియర్ కన్సల్టెంట్ బ్రహ్మ, రిజిస్ట్రార్ రమేష్బాబు, మధుసూదన్రెడ్డి, అర్జున్కుమార్ పాల్గొన్నారు. వేరుశనగ క్వింటా రూ.6,570 గద్వాల వ్యవసాయం: గద్వాల మార్కెట్ యార్డుకు శుక్రవారం 622 క్వింటాళ్ల వేరుశనగ రాగా గరిష్టం రూ. 6570, కనిష్టం రూ. 2276, సరాసరి రూ. 5370 ధరలు లభించాయి. -
మామిడి కొమ్మల కత్తిరింపుతో అధిక దిగుబడులు
కొల్లాపూర్ రూరల్: మండలంలోని అంకిరావుపల్లి గ్రామ శివారులో ఉమ్మడి జిల్లాలోని మామిడి రైతులకు ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ ఆధ్వర్యంలో క్లస్టర్ డెవలప్మెంట్ కార్యక్రమంలో భాగంగా గురువారం రైతులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్యాన శాఖ జాయింట్ డైరెక్టర్ బాబు మాట్లాడుతూ మామిడి కొమ్మల కత్తిరింపు, పునరుద్ధరణపై రైతులకు శిక్షణతోపాటు మామిడి కొమ్మలను కత్తిరింపు చూపించడం జరిగిందన్నారు. మామిడి కొమ్మలను కత్తిరించడం వల్ల దిగుబడి బాగా వస్తుందన్నారు. ప్రతి ఏటా ఆగస్టులోగా ఈ పద్ధతి పాటించాలని రైతులకు సూచించారు. మామిడి దిగుబడి రావాలంటే కొమ్మ కత్తిరింపు అనంతరం మొక్కకు కావాల్సిన సేంద్రియ, రసాయనిక ఎరువులను చెట్టు వయస్సు బట్టి వేసుకోవాలని చెప్పారు. కొమ్మల కత్తిరింపుతో గాలి, తేమ, సూర్యరష్మి తగిలి దిగుబడి ఎక్కువ వస్తుందన్నారు. అలాగే చీడపీడల బెడదను సమర్థవంతంగా నివారిచవచ్చున్నారు. కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా ఉ ద్యాన అధికారి వేణుగోపాల్, వనపర్తి, గద్వాల, నా గర్కర్నూల్ జిల్లాల అధికారులు విజయభాస్కర్రె డ్డి, అక్బర్, వెంకటేశం, హార్టికల్చర్ యూనివర్సిటీ ఉద్యాన శాస్త్రవేత్త హరికాంత్, పాలెం శాస్త్రవేత్తలు ఆదిశంకర్, శైల, ప్రసాద్, సీడ్ రిస్క్ మేనేజర్ భూపేష్కుమార్, ఇండియా గ్యాప్ సర్టిఫికేషన్ శ్రీహరి, ఉమ్మడి జిల్లా రైతులు పాల్గొన్నారు. -
కార్మికులకు కనీస వేతనం ఇవ్వాలి
గద్వాలటౌన్: కాంట్రాక్టు వర్కర్ల క్రమబద్ధీకరణ, కనీస వేతనాలు, పెన్షన్ తదితర డిమాండ్ల సాధన కోసం కార్మికులు కదం తొక్కారు. గురువారం టీయూసీఐ ఆధ్వర్యంలో స్థానిక పాత బస్టాండ్ నుంచి నిరసన ర్యాలీ నిర్వహించి.. కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా టీయూసీఐ జిల్లా అధ్యక్షుడు హనుమంతు మాట్లాడుతూ.. రాష్ట్రంలో కనీస వేతనాల జీఓ అమలు కాకపోవడంతో కాంట్రాక్టు సిబ్బంది చాలీచాలని జీతాలతో కాలం గడుపుతున్నారన్నారు. కాంట్రాక్టు సిబ్బందిని వెంటనే క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టరేట్లో వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో టీయూసీఐ నాయకులు కృష్ణ, చెన్నరాములు, శంకరన్న, మహేశ్వరమ్మ, రంగన్న, నాగరాజు, వెంకటరామిరెడ్డి, భీమన్న, బీచుపల్లి, నల్లాస్వామి, సలీం, రాజు తదితరులు పాల్గొన్నారు. -
ఎర్రమట్టి గుట్టలను పరిశీలించిన విజిలెన్స్
అలంపూర్: మండలంలో ఎర్రమట్టి గుట్టలను కొల్లగొడుతున్న వైనంపై జూలై 27న ‘సాక్షి’లో ప్రచురితమైన ‘ఆగని మట్టి దందా’ కథనానికి రాష్ట్ర విజిలెన్స్ అధికారులు స్పందించారు. గురువారం విజిలెన్స్ డీఎస్పీ శ్రీనివాస్, ఏడీఎంజీ కేఎల్ఎన్ రావు, ఆర్ఐ సత్యనారాయణ తదితరుల ఆధ్వర్యంలో మూడు బృందాలుగా ఏర్పడి సుల్తానాపురం, రేలంపాడు శివారుల్లో ఉన్న గుట్టలను పరిశీలించారు. గుట్టల్లో మట్టి తవ్వకాలతో పాటు ఇసుక అక్రమ రవాణాపై ఆరా తీసినట్లు తెలిసింది. మట్టి తవ్వకాలు ఎంత మేర జరిగాయనే దానిపై నివేదిక ఇవ్వాలని స్థానిక అధికారులకు సూచించినట్లు సమాచారం. అయితే విజిలెన్స్ అధికారులకు తగిన సమాచారం ఇవ్వడంలో స్థానిక అధికారులు దోబూచులాడటంపై విమర్శలు వ్యక్తవుతున్నాయి. ప్రకృతి సంపదను అక్రమార్కులు కొల్లగొడుతున్నా.. కనీస సమాచారాన్ని రహస్యంగా ఉంచడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా, ఈ విషయమై మైనింగ్ అధికారులను ఫోన్లో సంప్రదించగా.. అందుబాటులోకి రాలేదు. విజిలెన్స్ అధికారుల వెంట ఆర్ఐ దుర్గాసింగ్ ఉన్నారు. -
గూడు.. తీరొక్క గోడు!
‘ఇందిరమ్మ ఇళ్ల’లో కొర్రీలు ●● అర్హుల జాబితాలో చేర్చి.. ఆపై తీసేయడంతో ఆందోళన ● 600 ఎస్ఎఫ్టీలలోపే అనుమతితో పలువురు దూరం ● పక్కా ఇళ్లలో అద్దెకున్న వారికి వర్తించని పథకం ● అడ్డంకిగా మారిన పలు నిబంధనలు కేటీదొడ్డి మండలం ఇర్కిచేడుకు చెందిన పద్మమ్మ తన భర్త, ముగ్గురు పిల్లలతో కలిసి గుడిసెలో నివాసం ఉంటోంది. ఆమె ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఇల్లు మంజూరు కాలేదు. నివాసముంటున్న గుడిసె కూడా పూర్తిగా దెబ్బతింది. ఎప్పుడు కూలుతుందో తెలియని పరిస్థితి. వర్షం వస్తే పూర్తిగా కురుస్తుంది. కప్పుపై కవర్ కప్పుకొని కాలం వెల్లదీస్తున్నారు. అన్ని అర్హతలు ఉన్న తమకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి ఆదుకోవాలని కోరుతుంది. అద్దె ఇంట్లో ఉంటున్నాం.. మా ఇల్లు పాడుపడటంతో ఖాళీ చేసి.. అద్దె ఇంట్లో ఉంటున్నాం. నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రతినెలా రూ. 5వేల ఇంటి అద్దె చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నా. సెంటు భూమి లేని మాకు కుటుంబం గడవడమే కష్టంగా ఉంది. ఇందిరమ్మ ఇంటి కోసం అధికారులను అడిగితే మీకు ఇల్లు రాలేదని అంటున్నారు. ఏం చేయాలో తోచడం లేదు. ఏళ్ల తరబడిగా ఎదురుచూస్తున్న సొంతింటి కల కలగానే మిగిలింది. – శ్రీధర్, ధరూరు సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: పేద, మధ్య తరగతి కుటుంబాలకు గూడు కల్పించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకంలో నిబంధనల కొర్రీలు లబ్ధిదారుల ఆశలపై నీళ్లు చల్లుతున్నాయి. ప్రధానంగా 600 చదరపు అడుగుల (ఎస్ఎఫ్టీ) కంటే ఎక్కువ విస్తీర్ణంలో ఇల్లు నిర్మిస్తే ఇందిరమ్మ పథకం వర్తించదని అధికారులు తేల్చిచెబుతుండడంతో ఎటూ తేల్చుకోలేని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ క్రమంలో ఎక్కువ మొత్తంలో లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణం చేపట్టకుండా వేచి చూస్తున్నారు. మరో వైపు అర్హుల జాబితాలో చేర్చి, ఆపై తీసేయడం.. పక్కా ఇళ్లలో అద్దెకుంటున్న వారికీ మొండిచేయి చూపడంతో పలువురు ఆందోళనలో కొట్టుమిట్టాడుతున్నారు. ప్రతిబంధకాలుగా మారిన నిబంధనలతో ఉమ్మడి పాలమూరు జిల్లావ్యాప్తంగా ఇబ్బందిపడుతున్న లబ్ధిదారులు, ఆశావహుల తీరొక్క గోడుపై ‘సాక్షి’ గ్రౌండ్ రిపోర్ట్.. జిల్లాల వారీగా ఇందిరమ్మ ఇళ్ల వివరాలు.. -
రోడ్డు భద్రతా నియమాలు తప్పనిసరి
అయిజ: ప్రైవేటు స్కూల్ బస్సులను నిబంధనల మేరకు నడుపుకోవాలని.. రోడ్డు భద్రతా నియమాలను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని డీటీఓ వెంకటేశ్వరరావు హెచ్చరించారు. గురువారం అయిజలో ప్రైవేటు స్కూల్ బస్సులను మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ రాములు, అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ వెంకటరమణారెడ్డిలతో కలిసి ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అనుమతి పత్రాలను పరిశీలించారు. బస్సు సీటింగ్ కెపాసిటీ మేరకు విద్యార్థులను తరలించాలని సూచించారు. దరఖాస్తుల ఆహ్వానం గద్వాల: హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ప్రవేశాలకు సంబంధించి ఎస్సీ విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ బీఎం సంతోష్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఒకటో తరగతిలో జిల్లాకు ఒక సీటు కేటాయించినట్లు పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 2018 జూన్ 1నుంచి 2019 మే 31వ తేదీ మధ్య జన్మించి ఉండాలని.. గ్రామీణ ప్రాంతాల వారి వార్షిక ఆదాయం రూ. 1.50లక్షలు, పట్టణ ప్రాంతానికి చెందిన వారి వార్షికాదాయం రూ. 2లక్షలు మించరాదన్నారు. దరఖాస్తు ఫారాలు ఎస్సీ సంక్షేమాభివృద్ధిశాఖ కార్యాలయంలో పొందవచ్చన్నారు. ఆసక్తి, అర్హత గల విద్యార్థులు 8వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని.. 10న కలెక్టరేట్లో లక్కీ డిప్ ద్వారా ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. మెరుగైన వైద్యం అందించాలి ఇటిక్యాల: ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డా.సిద్దప్ప అన్నారు. గురువారం ఇటిక్యాల పీహెచ్సీలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పలు రికార్డులను పరిశీలించడంతో పాటు వైద్యసేవలపై ఆరా తీశారు. వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటిస్తూ.. ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆయన సూచించారు. ముఖ్యంగా ప్రసవాల సంఖ్య పెంచాలన్నారు. సీజనల్ వ్యాధుల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. డీఎంహెచ్ఓ వెంట ఎంసీహెచ్ పోగ్రాం అధికారి డా.ప్రసూనారాణి, డీపీఎన్ఎం వరలక్ష్మి, మండల వైద్యాధికారి రాధిక తదితరులు ఉన్నారు. వేరుశనగ @రూ. 6,189 గద్వాల వ్యవసాయం: జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్యార్డుకు గురువారం 725 క్వింటాళ్ల వేరుశనగ విక్రయానికి వచ్చింది. క్వింటాల్కు గరిష్టంగా రూ. 6,189, కనిష్టంగా రూ. 3,352, సరాసరి రూ. 4050 ధరలు లభించాయి. -
మహిళల ఆర్థికాభివృద్ధే లక్ష్యం
అలంపూర్: మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించాలనే సంకల్పంతో ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర మత్స్య, పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. అలంపూర్ చౌరస్తాలోని ఓ ఫంక్షన్ హాల్లో గురువారం నిర్వహించిన ఇందిరా మహిళాశక్తి సంబురాలు, రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి మంత్రితో పాటు ఎమ్మెల్యే విజయుడు, కలెక్టర్ బీఎం సంతోష్, అదనపు కలెక్టర్లు లక్ష్మీనారాయణ, నర్సింగ్రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం మహిళా అభ్యున్నతికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందన్నారు. కోటిమంది మహిళలను కోటీశ్వరులను చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. అందులో భాగంగానే 2,600 మహిళా సంఘాలకు రూ. 3.15కోట్ల వడ్డీ లేని రుణాలు అందించినట్లు చెప్పారు. పలు పెట్రోల్ బంకులు, 1000 ఆర్టీసీ బస్సులకు మహిళా సమాఖ్యలను యజమానులుగా చేసిందన్నారు. మహిళల పేరుపైనే సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామన్నారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేందుకు సీఎం రేవంత్రెడ్డి కృషి చేస్తున్నారని అన్నారు. పేదల సొంతింటి కలను నెరవేర్చడానికి ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసినట్లు తెలిపారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి బడుగు బలహీన వర్గాల కోసం అనేక సంక్షేమ పథకాలు అందించారని.. అదే తరహాలో రేవంత్రెడ్డి ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. తెలంగాణ వచ్చాక పేదలకు రేషన్కార్డులు అందించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు. కలెక్టర్ సంతోష్ మాట్లాడుతూ.. అలంపూర్ నియోజకవర్గంలో 2,041 మహిళా సంఘాల సభ్యులు ఉండగా.. బ్యాంకు లింకేజీ రుణాలు రూ. 30.58 కోట్లు, 2,600 సంఘాలకు రూ. 3.15 కోట్ల వడ్డీ లేని రుణాలు అందిస్తున్నట్లు తెలిపారు. 23మందికి రూ. 13.89లక్షల బీమా చెక్కులు అందజేసినట్లు వివరించారు. కొత్తగా 3వేల రేషన్ కార్డులు మంజూరు కాగా.. 19వేల మంది పేర్లను కొత్తగా నమోదు చేసినట్లు తెలిపారు. అనంతరం గొర్రెలకు నీలినాలుక వ్యాధి నిరోధక టీకాల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి వాకిటి శ్రీహరి ప్రారంభించారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తాం రాష్ట్ర మత్స్య, పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి -
రహదారులకు మహర్దశ
ఉమ్మడి జిల్లాలో రోడ్ల విస్తరణకు నిధులు కేటాయించిన ప్రభుత్వం సాక్షి, నాగర్కర్నూల్: ఉమ్మడి జిల్లావ్యాప్తంగా కీలకమైన రహదారులకు మహర్దశ పట్టనుంది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం వీటి విస్తరణ కోసం పెద్దఎత్తున నిధులు విడుదల చేసింది. మహబూబ్నగర్, వనపర్తి సర్కిళ్ల వారిగా ఉమ్మడి జిల్లాలోని మొత్తం 41 రోడ్ల విస్తరణ, బలోపేతం చేసేందుకు రోడ్డు, భవనాల శాఖ నిధులు కేటాయించింది. ప్రధానంగా జిల్లాలను అనుసంధానం చేస్తూ కొనసాగుతున్న రహదారులతోపాటు మండలాలు, గ్రామాలకు కనెక్టింగ్ రోడ్లను విస్తరించనున్నారు. మహబూబ్నగర్ ఆర్అండ్బీ సర్కిల్లో మహబూబ్నగర్, జోగుళాంబ గద్వాల, నారాయణపేట జిల్లాలు ఉండగా.. వీటి పరిధిలోని 26 రోడ్ల నిర్మాణానికి సంబంధించి మొత్తం 380.85 కి.మీ., మేర రోడ్లను విస్తరించనున్నారు. ఇందుకు గానూ ప్రభుత్వం రూ.434.19 కోట్లు కేటాయించింది. అలాగే వనపర్తి సర్కిల్లో వనపర్తి, నాగర్కర్నూల్ జిల్లాలు ఉండగా.. వీటి పరిధిలో 15 రోడ్లను ప్రభుత్వం డబుల్ రోడ్లుగా విస్తరించనుంది. మొత్తం 279.16 కి.మీ., మేర రహదారులను విస్తరించాల్సి ఉండగా ఇందుకోసం రూ.399.34 కోట్లు మంజూరు చేసింది. పెండింగ్లో ఉన్నవాటికి మోక్షం.. ఉమ్మడి జిల్లాలో గత కొన్నేళ్లుగా ప్రధాన రహదారుల విస్తరణ, మరమ్మతు పనులు దాదాపుగా నిలిచిపోయాయి. రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ చేపట్టిన జాతీయ రహదారుల నిర్మాణాలు మాత్రమే ముమ్మరంగా కొనసాగుతున్నాయి. జిల్లాలను ఒక దానితో మరొకటి అనుసంధానిస్తూ ఉన్న ఆర్అండ్బీ రోడ్లు, మండల కేంద్రాలను అనుసంధానం చేస్తూ ఉన్న రోడ్ల విస్తరణతోపాటు మరమ్మతుకు సైతం నోచుకోవడం లేదు. సుమారు ఐదేళ్లకుపైగా ఆర్అండ్బీ రోడ్లకు మరమ్మతు లేకపోవడంతో రోడ్లు పూర్తిగా దెబ్బతిని అధ్వానంగా మారాయి. మండల కేంద్రాల నుంచి గ్రామాలకు వెళ్లే కనెక్టింగ్ రోడ్లు వర్షాలకు దెబ్బతిని, కంకర తేలి దర్శనమిస్తున్నాయి. తాజాగా ప్రభుత్వం ఆర్అండ్బీ రోడ్ల విస్తరణ, మరమ్మతుకు నిధులను మంజూరు చేయడంతో ఈ రోడ్ల రూపురేఖలు మారిపోనున్నాయి. హెచ్ఏఎం విధానంలో.. ఈసారి రహదారుల నిర్మాణ ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం హైబ్రిడ్ యాన్యూటీ మోడ్ (హెచ్ఏఎం) విధానంలో చేపడుతోంది. పూర్తిస్థాయిలో నిధులను ప్రభుత్వమే ఖర్చు చేయకుండా ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో రహదారులను నిర్మించాలని నిర్ణయించింది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం జాతీయ రహదారుల నిర్మాణాలను ఈ విధానంలోనే చేపడుతుండగా.. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం హెచ్ఏఎం విధానంలో రోడ్ల విస్తరణ చేపట్టనుంది. ఈ విధానంలో రోడ్ల నిర్మాణానికి అవసరమైన నిధుల్లో 40 శాతం నిధులను ప్రభుత్వం సమకూర్చితే మిగతా 60 శాతం నిధులను ఆయా రోడ్డు నిర్మాణ కాంట్రాక్టు సంస్థలే భర్తీ చేయాల్సి ఉంటుంది. తర్వాత 15 ఏళ్లపాటు రోడ్డు నిర్వహణ బాధ్యతలతోపాటు టోల్ రుసుం సంబంధిత సంస్థలే నిర్వహిస్తాయి. రోడ్ల విస్తరణకు నిధుల కొరత లేకుండా, నిర్ణీత గడువులోగా వేగంగా పనులు పూర్తిచేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వనపర్తి సర్కిల్ పరిధిలో.. వనపర్తి– జడ్చర్ల వయా వట్టెం, తిమ్మాజిపేట రోడ్డు, బల్మూరు– నాగర్కర్నూల్ వయా గోదల్, తుమ్మన్పేట్, అచ్చంపేట– రాకొండ వయా ఉప్పునుంతల రోడ్డు, పెంట్లవెల్లి– వనపర్తి వయా శ్రీరంగాపూర్, అమ్రాబాద్– ఇప్పలపల్లి రోడ్డు, వనపర్తి– ఆత్మకూర్, ఆత్మకూర్– మరికల్ రోడ్డు, వనపర్తి– బుద్దారం రోడ్డు, చిన్నంబావి– చెల్లెపాడు రోడ్ల నిర్మాణాలను ప్రభుత్వం చేపట్టనుంది. అలాగే బల్మూర్– నాగర్కర్నూల్ వయా గోదల్, తుమ్మన్పేట్ రోడ్డు, అచ్చంపేట– రాకొండ, పెంట్లవెల్లి– వనపర్తి రోడ్లను డబుల్గా విస్తరించనున్నారు. మహబూబ్నగర్ సర్కిల్ పరిధిలో జోగుళాంబ గద్వాలలోని ఎర్రిగెర– అయిజ– అలంపూర్ రోడ్డు (బల్గెర, మిట్టిదొడ్డి, తుమ్మపల్లి, శాంతినగర్, కౌకుంట్ల, శ్రీనగర్, కొరివిపాడు, బొంకూర్)ను విస్తరించారు. అలాగే గద్వాల– రంగాపూర్ రోడ్డు, తుంగభద్ర బ్రిడ్జి అప్రోచ్ రోడ్డు, గద్వాల– అయిజ రోడ్డు (బింగిదొడ్డి, అయిజ) రోడ్లను మెరుగుపరచనున్నారు. మహబూబ్నగర్ జిల్లాలోని వనపర్తి– జడ్చర్ల వయా బిజినేపల్లి రోడ్డు, మహబూబ్నగర్– మంగనూర్ రోడ్డు, మహబూబ్నగర్– నవాబుపేట రోడ్డు, వేపూర్ జెడ్పీ రోడ్డు నుంచి కొమ్మిరెడ్డిపల్లి వయా షేక్పల్లి, కురుమూర్తిరాయ టెంపుల్ రోడ్డు, గుడిబండ– తిరుమలాపూర్– అప్పంపల్లి రోడ్డు, కోడూరు– కోయిల్కొండ రోడ్డు వయా మల్కాపూర్, మణికొండ రోడ్డు, జడ్చర్ల రైల్వేస్టేషన్– కొత్తమొల్గర రోడ్డు, రాజాపూర్– తిరుమలాపూర్, మరికల్– మిన్సాపూర్ రోడ్డు, మక్తల్– నారాయణపేట వయా లింగంపల్లి రోడ్లను పునరుద్ధరించనున్నారు. మహబూబ్నగర్ సర్కిల్ పరిధిలో 380.85 కి.మీ మేర రోడ్ల నిర్మాణానికి రూ.434 కోట్లు వనపర్తి సర్కిల్లో 15 రోడ్ల నిర్మాణానికి రూ.399.34 కోట్లు మంజూరు హైబ్రిడ్ యాన్యూటీ విధానంలో పనులు చేపట్టేందుకు చర్యలు జిల్లాలు, మండలాలు, గ్రామాల కనెక్టింగ్ రోడ్లకు ప్రాధాన్యం -
మెరుగైన వైద్య సేవలు అందించాలి
గద్వాల క్రైం: జిల్లా ప్రభుత్వాసుపత్రిలో రోగులకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని కలెక్టర్ సంతోష్ అన్నారు. బుధవారం జిల్లా ఆసుపత్రిలో రూ.3 కోట్లతో చేసిన అభివృద్ధి పనులను కలెక్టర్తోపాటు ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్రెడ్డి, విజయుడులు ముఖ్యఅతిథులుగా హాజరై ప్రారంచారు. కలెక్టర్ మాట్లాడుతూ.. అత్యవసర సమయాల్లో రోగులకు ఆక్సిజన్ అందక మృతి చెందిన సంఘటనలు ఎన్నో ఉన్నాయని, ఇక నుంచి ఆక్సిజన్ కొరత లేకుండా ప్లాంట్ ఏర్పాటుకు రూ.2.65 కోట్లు వెచ్చించి ఏర్పాటు చేశామన్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులకు తక్షణ సహాయం అందించడం జరుగుతుందన్నారు. రేడియాలజీ సేవల కోసం వచ్చే గర్భిణులు వేచి ఉండేందుకు సిటీ స్కాన్ బ్లాక్ వద్ద నూతనంగా రూ. 8.90లక్షలతో వెయింటింగ్ హాల్ నిర్మించామన్నారు. ఆస్పత్రి ఆవరణలో సీసీ రోడ్లు, తదితర పనులు చేపట్టినట్లు తెలిపారు. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి మాట్లాడుతూ.. 300 పడకల ఆసుపత్రిగా ఉన్నప్పటికి 550 పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేసేందుకు ప్రభుత్వానికి నివేదిక అందజేశామన్నారు. ఆధునిక వైద్య పరికరాలు, మౌలిక వసతులు అందుబాటులోకి తీసుకురావడం జరిగిందన్నారు. ఎమ్మెల్యే విజయుడు మాట్లాడుతూ.. జిల్లాలోని ఆయా ప్రాంతాల్లోంచి వచ్చే రోగులకు ఎలాంటి సమస్యలు లేకుండా వైద్యులు చూడాలని, సిబ్బంది, వైద్యులు తప్పనిసరిగా సమయపాలన పాటించాలని అన్నారు. ఎల్లప్పుడు అందుబాటులో ఉండాలన్నారు. కార్యక్రమంలో ఆస్పత్రి సూపరింటెండెంట్ ఇందిర, అభినేష్, సిబ్బంది, నాయకులు పాల్గొన్నారు. కలెక్టర్ బీఎం సంతోష్ జిల్లా ఆస్పత్రిలో రూ.3 కోట్లతో అభివృద్ధి పనులు -
నిబంధనలు పట్టవా?
ప్రిస్కిప్షన్ లేకుండానే ఔషధాల విక్రయాలు ●లైసెన్స్ రద్దు చేస్తాం అనుమతి లేకుండా మెడికల్ దుకాణాలు, ఏజెన్సీలు ఏర్పాటు చేసినా.. వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు విక్రయిస్తే సదరు దుకాణాల లైసెన్స్ రద్దు చేస్తాం. గర్భవిచ్ఛిత్తి మాత్రలు, అబార్షన్ కిట్ విక్రయాలు, వాటికి సంబంధించిన రికార్డులపై తనిఖీలు నిర్వహించాం. మూడు మెడికల్ దుకాణాల నిర్వాహకులు సరైన రికార్డులు చూయించకపోవడంతో షోకాజ్ నోటీసులు జారీ చేశాం. ప్రజలు సైతం ఇష్టారీతిలో మందులు కొనుగోలు చేసి ప్రాణాల మీదికి తెచ్చుకోవద్దు. – వినయ్, జిల్లా ఇన్చార్జి ఔషధ నియంత్రణ అధికారి గద్వాల క్రైం: జిల్లాలో కొందరు మెడికల్ షాపు యజమానులు.. వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండానే పలు మందులు విక్రయిస్తూ నిబంధనలు తుంగలో తొక్కుతున్నారు. ఔషధ నియంత్రణ అధికారులు గత వారం రోజులుగా గద్వాల – అలంపూర్ సెగ్మెంట్లలో తనిఖీలు నిర్వహించిన క్రమంలో బహిర్గతం అయ్యింది. నిబంధనలు ఉల్లంఘించిన 21 మెడికల్ దుకాణాలకు నోటీసులు జారీ చేసి అయిదు రోజుల పాటు సస్పెనషన్ వేటు వేశారు. మరో వైపు గర్భవిచ్చిత్తి మాత్రలు, అబార్షన్ కిట్ అమ్మకాలపై ఈ నెల 16వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా డ్రగ్ కంట్రోల్ అధికారులు మెడికల్ దుకాణాలలో తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో జిల్లాలోని ప్రైవేటు ఆసుపత్రులకు అనుసంధానంగా ఉన్న మూడు ఫార్మసీలలో తనిఖీలు చేయగా గర్భవిచ్ఛిత్తి మాత్రలు, అబార్షన్ కిట్ రికార్డులు లేకపోవడంతో ముగ్గురికి షోకాజ్ నోటీసులను జిల్లా ఇంచార్జ్ డ్రగ్ ఇన్స్పెక్టర్ వినయ్ ఇచ్చారు. మొత్తంగా జిల్లాలో నిబంధనలు ఉల్లంఘించి మందుల విక్రయాలు జరుగుతున్నాయని తనిఖీల్లో బహిర్గతం అయ్యింది. తనిఖీలు ముమ్మరం గద్వాల, అయిజ, అలంపూర్, ధరూర్, గట్టు, ఇటిక్యాల, శాంతినగర్ తదితర మండలంలోని మెడికల్ దుకాణాలపై ఔషధ నియంత్రణ అధికారులు ముమ్మరంగా తనిఖీలు చేయడంతో వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు విక్రయాలు చేస్తున్నట్లు గుర్తించారు. ఈ క్రమంలో పలువురికి షోకజ్ నోటీసులు జారీ చేసి శాఖ పరమైన చర్యలు తీసుకున్నారు. మరో వైపు గ్రామీణ ప్రాంతాల్లో ఎలాంటి అనుమతి లేకుండా మందులు, ఇంజక్షన్లు ఆర్ఎంపీలు సైతం విక్రయాలు చేయడం వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు గుర్తించి సీజ్ చేసిన సంఘటనలు ఉన్నాయి. పూర్తి స్థాయిలో తనిఖీలు చేపడితే నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకునేందుకు దోహద పడుతుంది. మెడికల్ షాపు యజమానుల ఇష్టారాజ్యం మత్తు ఇంజెక్షన్లు, గర్భస్త్రావం మాత్రలు యథేచ్ఛగా విక్రయాలు రికార్డుల నిర్వహణలోనూ నిర్లక్ష్యం అధికారుల తనిఖీల్లో పలు విషయాలు వెలుగులోకి.. -
నేడు అలంపూర్కు మంత్రుల రాక
అలంపూర్: జోగుళాంబ శక్తిపీఠాన్ని దర్శించుకోవడంతోపాటు అలంపూర్లోని పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఈ నెల 31వ తేదీన గురువారం మంత్రులు పట్టణానికి రానున్నుట్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక ప్రకటనలో తెలిపారు. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జిల్లెల చిన్నారెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే సంపత్కుమార్ ఆలయంలో ఉదయం 10 గంటలకు నిర్వహించే జోగుళాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి కల్యాణ మహోత్సవంలో పాల్గొంటారని, అనంతరం అలంపూర్ చౌరస్తాలో మహిళా సాధికారత, మహిళలకు వడ్డీలేని రుణాలు, రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండండి అయిజ: సీజనల్ వ్యాధుల భారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని, ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని ఇంచార్జ్ డీఎంహెచ్ఓ సిద్దప్ప అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. డెలివరీ రూం, ఏఎంసీలను, ల్యాబ్ను, ఫార్మసీ గదిని పరిశీలించారు. మెడికల్ ఆఫీసర్లు విష్ణు, కిరణ్తో వైద్య సేవలు, అందుబాటులో ఉన్న మందుల గురించి ఆరా తీశారు. సాధారణ కాన్పుల సంఖ్యను పెంచాలని, కుక్క, పాము కాటుకు మందులను సిద్ధంగా ఉంచుకోవాలని అన్నారు. పీహెచ్సీకి నలుగురు డాక్టర్లను ఏర్పాటు చేశామని, ఇన్ పేషంట్లకు మెరుగైన వైద్యసేవలు అందించాలన్నారు. ప్రజలు సీజనల్ వ్యాధుల బారినపడకుండా ఉండేందుకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని పలు సలహాలు చేశారు. దండం పెడతా.. విద్యార్థుల జీవితాలతో ఆటలొద్దు ఉండవెల్లి: విద్యార్థుల జీవితాలతో ఆటలొద్దని.. వారికి నాణ్యమైన భోజనం అందించాలంటూ ఎమ్మెల్యే విజయుడు వంట సిబ్బందికి సూచించారు. మండలంలోని అలంపూర్ చౌరస్తాలోని గురుకుల పాఠశాలను ఎమ్మెల్యేతోపాటు బీఆర్ఎస్వి జిల్లా కోఆర్డినేటర్ పల్లయ్య, పీఎసీఎస్ చైర్మన్ గజేందర్రెడ్డి పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పురుగుల అన్నం, ఉప్పు నీటితో చారు చేసి ఇస్తున్నారని ఉపాధ్యాయులపై, రాష్ట్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారని, అనేక సమస్యలున్నా నిధులు విడుదల చేయక ఇబ్బందులు పెడుతున్నారని, అందుకే విద్యార్థులు రోడెక్కుతున్నారని అన్నారు. వంట గదికి వెళ్లి విద్యార్థులకు నాణ్యమైన భోజనం మెనూ ప్రకారం అందించాలని దండం పెట్టి వేడుకున్నారు. అనంతరం ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాద్యక్షుడు దామర కిరణ్ సైతం పాఠశాలకు చేరుకొని భోజనాన్ని పరిశీలించారు.ప్రభుత్వం నిధులు విడుదల చేయాలని, సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈదన్న, సింగరాజు మద్దిలేటి, శేషన్ గౌడు, తదితరులు పాల్గ్గొన్నారు. -
టీచర్గా మారిన కలెక్టర్..
గద్వాలటౌన్: పిల్లలూ... ఎలా చదువుతున్నారు, ఇంగ్లీష్ చదవడం వచ్చా.. అంటూ విద్యార్థినులను పలకరించారు కలెక్టర్ సంతోష్. కలెక్టర్ అడిగిన ప్రశ్నకు ఆ.. వచ్చు సార్ అంటూ పిల్లలు బదులిచ్చారు. బుధవారం గద్వాల మండలం గోనుపాడులో ఉన్న కేజీబీవీ పాఠశాలను కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఓ తరగతి గదిలోకి వెళ్లి విద్యార్థులతో ముచ్చటించారు. విద్యార్థుల చేత పాఠాలు చదివించారు. టీచర్లు బాగా చెబుతున్నారా అని అడిగి సమాధానాలు రాబట్టారు. బాగా చదువుకోవాలని విద్యార్థినులకు సూచించారు. ఉపాధ్యాయుల హాజరు పట్టిని, విద్యార్థుల ఫెషియల్ రికగ్నిషన్ను పరిశీలించారు. యూడైస్ ఎంట్రీలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలన్నారు.ఇదిలాఉండగా, మధ్యాహ్న భోజన తనిఖీలో లోపాలు కనిపించడం, మెనూ పాటించకపోవడంపై కలెక్టర్ సంతోష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మెనూ ప్రకారం భోజనం అందించకపోవడంతో ఎస్ఓకు మెమో జారీ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆకస్మిక తనిఖీలో భాగంగా కలెక్టర్ పాఠశాలలోని వంటగది, తగునీరు, భోజనం నాణ్యత, స్టోర్ రూంలోని సరుకులు, పరిసరాలను పరిశీలించారు. విద్యార్థులు ఆరోగ్యంగా ఉండేందుకు మెనూ ప్రకారం ప్రతిరోజు పౌష్టికాహారం ఇవ్వాలన్నారు. -
ఈ–పాస్ ద్వారానే ఎరువుల విక్రయాలు
ఎర్రవల్లి: ఎరువుల డీలర్లు రైతులకు ఈ –పాస్ మిషన్ ద్వారానే ఎరువులు విక్రయించాలని జిల్లా వ్యవసాయశాఖ అధికారి సక్రియా నాయక్ అన్నారు. బుధవారం మండలంలోని కోదండాపురం, పుటాన్దొడ్డి గ్రామాలను సందర్శించి రైతులు వానాకాలంలో సాగు చేసిన వివిధ పంటలను ఏఓ రవికుమార్తో కలిసి పరిశీలించారు. అలాగే కోదండాపురం స్టేజీలోని రైతు సేవా కేంద్రం ఎరువుల దుకాణాన్ని, ఎరువుల నిల్వలు, రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా డీఏఓ మాట్లాడుతూ.. ఎరువుల కోసం వచ్చే ప్రతి రైతు నుంచి ఆదార్ కార్డు తీసుకొని ఈ పాస్లో నమోదు చేసిన తర్వాతే ఎరువులను విక్రయించాలన్నారు. ప్రభుత్వం ముద్రించిన ధరల కంటే అధికంగా విక్రయించరాదని ఆదేశించారు. రైతులు తమకు కావాల్సిన మోతాదు మేరకు మాత్రమే యూరియాను పంటలకు వాడుకోవాలన్నారు. ఎక్కువ మొత్తంలో యూరియాను వాడటం వల్ల పంటలకు లాభం కంటే నష్టం అధికంగా జరుగుతందన్నారు. రెండవ సారి యూరియాను వాడాలనుకునే రైతులు వంద శాతం నీటిలో కలిగే సూక్ష్మ రూపంలో దొరికే నానో డీఏపీ, నానో యూరియాను ఒక ఎకరానికి 500 మిల్లీ లీటర్లు 200 లీటర్ల నీటిలో కలిపి స్ప్రే చేస్తే మొక్కలకు ఎక్కువ ప్రయోజనం ఉంటుందని సూచించారు. కార్యక్రమంలో ఏఓ రవికుమార్, డీలర్ రవి, రైతులు రామిరెడ్డి, మల్లికార్జున్ ఉన్నారు. -
లక్కీడిప్ ద్వారా విద్యార్థుల ఎంపిక
గద్వాల: బెస్ట్అవైలబుల్ పాఠశాలలో మిగిలిన సీట్లను నిబంధనల మేరకు లక్కీడిప్ ద్వారా విద్యార్థులను ఎంపిక చేసినట్లు అదనపు కలెక్టర్ నర్సింగ్రావు తెలిపారు. మంగళవారం ఐడీవోసీ కార్యాలయంలో ఎస్సీ సంక్షేమాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో బెస్ట్ అవైలబుల్ పాఠశాలలో గ్రూప్–3లో మిగిలిన సీట్లకు దరఖాస్తులు లేకపోవడంతో కలెక్టర్ ఆదేశాల మేరకు గ్రూప్–1, గ్రూప్–2 నుంచి దరఖాస్తు చేసిన విద్యార్థులను వారి తల్లిదండ్రుల సమక్షంలో లక్కీడిప్ ద్వారా ఎంపిక చేసినట్లు తెలిపారు. మొత్తం 20 మంది విద్యార్థులు ఎంపికై నట్లు తెలిపారు. వీరిలో 1వ తరగతిలో ఏడు మంది విద్యార్థులు, 5వ తరగతిలో 13మంది విద్యార్థులు ఎంపిక చేసినట్లు తెలిపారు. ఎంపికై న విద్యార్థులు తమ ధ్రువపత్రాలను తీసుకుని ఎస్సీ సంక్షేమ శాఖ కార్యాలయంలో సంప్రదించాలన్నారు. లక్కీడిప్ ప్రక్రియను నిబంధనలకు అనుగుణంగా పారదర్శకంగా పూర్తి చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎస్సీ సంక్షేమాభివృద్ధి శాఖ జిల్లా అధికారి నుషిత, కో–ఆర్డినేటర్ ఆంజనేయులు, కెజిబివి కన్వీనర్ హాంపయ్య, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. -
మహిళలను కోటీశ్వరులుగా చేయడమే లక్ష్యం
మల్దకల్: కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి అన్నారు. మంగళవారం మల్దకల్లో గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఇందిరా మహిళా శక్తి సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అథితులుగా ఎమ్మెల్యే, కలెక్టర్ బీఎం సంతోష్, అడిషనల్ కలెక్టర్లు లక్ష్మీనారాయణ, నర్సింగరావు హాజరయ్యారు. ముందుగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళలను కోటీశ్వర్లు చేయడమే లక్ష్యంగా మహిళా సంఘాలకు ప్రత్యేక పథకాలను అమలు చేస్తున్నట్లు, మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందినప్పుడే నియోజక వర్గం అన్ని రంగాల్లో ముందుకు వెళుతుందన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను మహిళలు సద్వినియోగం చేసుకోని మరింత అభివృద్ధి చెందాలని పేర్కొన్నారు. ప్రజల సంక్షేమాభివృద్ధి కోసం ప్రభుత్వం చేపట్టిన 6 గ్యారెంటీలలో రైతుబంధు, రణమాఫీ, మహిళలకు ఉచిత బస్సు, రూ.500 కు గ్యాస్ సిలిండర్, 200 యూనిట్లు కరెంట్ ఉచితం, ఇందిరమ్మ ఇల్లు, సన్న బియ్యం పంపిణీ వంటి సంక్షేమ పథకాలను నిరుపేద ప్రజలకు అందించడం జరుగుతుందని తెలిపారు. అర్హులైన ప్రతి లబ్ధిదారునికి ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. మహిళలు చదువుకోవాలి: కలెక్టర్ మహిళలందరు తప్పనిసరిగా చదువుకోవాలని అప్పుడే ఆ కుటుంబం అభివృద్ధి చెందుతుందని కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. మహిళల అర్థిక అభివృద్ధి కోసం ప్రభుత్వం సోలార్ విద్యుత్ ప్లాంటు, మూడు బస్సులు, త్వరలో పెట్రోల్ బంకులతో పాటు ఇందిరా మహిళా శక్తి సంఘాలకు వడ్డీ లేని రుణాలను అందించి ఆదుకోవడం జరుగుతుందన్నారు. మండలంలోని నిరుపేదలకు 900 రేషన్కార్డులు ఇవ్వడం జరిగిందన్నారు. మండలంలోని మహిళా సంఘాలకు గత ఏడాది రూ.26 కోట్లు రుణంగా మంజూరు చేయగా ఈ ఏడాది రూ.72 లక్షలు వడ్డీ మాఫీ చేశామన్నారు. అంతకు ముందు జిల్లా స్థాయిలో ఉత్తమ పీఎం శ్రీ పాఠశాలగా ఎంపికై న మల్దకల్ జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో మాజీ జడ్పీచైర్మన్ బండారి భాస్కర్, నాయకులు గడ్డం కృష్ణారెడ్డి, తిమ్మారెడ్డి, సీతారామిరెడ్డి, సత్యారెడ్డి, విక్రమ్సింహరెడ్డి, రాజారెడ్డి, వీరన్న, నరేందర్గోపాల్రెడ్డి, తహసీల్దార్ ఝూన్సీరాణి, ఎంపీడీఓ సాయిప్రకాష్ , అధికారులు పాల్గొన్నారు. -
తేళ్లు కుట్టని పంచమి
అరచేతిలో తేలు.. ఆనందంలో యువతి తేళ్లను చూస్తేనే ఒళ్లు జలదరిస్తుంది. ఎక్కడ కుట్టి చంపేస్తుందేమోననే భయంతో ఆమడదూరం పారిపోతాం. కానీ, తేలు కుట్టని రోజంటూ ఒకటుందని మీకు తెలుసా.. అదే తేళ్ల పంచమి. ఈ రోజు తేలును పట్టుకున్నా.. ఒంటిపై, చెంపపై, చేతిపై వేసుకున్నా.. ఏకంగా నోట్లో నాలుకపై పెట్టుకున్నా ఏమీ చేయని అరుదైన దృశ్యాలను రాష్ట్ర సరిహద్దులోని కర్ణాటక రాష్ట్రం యాద్గీర్ జిల్లా కందుకూరులో చూడవచ్చు. నాగుల పంచమి పర్వదినమైన మంగళవారం నాడు తేళ్ల పంచమిని పురస్కరించుకొని స్థానికంగా కొండమవ్వగుట్టపైకి వందలాది మంది తరలివెళ్లి తేళ్ల విగ్రహాలకు ప్రత్యేక పూజలు చేశారు. గుట్టపై రాళ్ల కింద, చెట్ల పొదల్లో ఉన్న తేళ్లను చిన్నా, పెద్ద తేడా లేకుండా పట్టుకొని సందడి చేశారు. మరికొందరు తమ ఇంటికి తేళ్లను తీసుకెళ్లి పూజించారు. తేళ్ల పంచమి జరుపుకోవడం ద్వారా తమను తాము తేళ్ల బారి నుంచి రక్షించుకోవచ్చని నమ్ముతారు.ఈ జాతరకు వేలాదిగా రాగా గుర్మిట్కల్ పోలీసులు బందోబస్తు నిర్వహించారు. – నారాయణపేట -
హైదరాబాద్ చేరిన నాయకుల పంచాయితీ
గద్వాల: నియోజకవర్గంలో అధికార పార్టీలో నెలకొన్న వర్గపోరు హైదరాబాద్కు చేరింది. మంగళవారం జెడ్పీ మాజీ చైర్పర్సన్ సరిత వర్గం నాయకులు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్కుమార్గౌడ్ను కలిశారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొంది కాంగ్రెస్లోకి వచ్చిన ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డికి అధిక ప్రాధాన్యత ఇస్తూ నిజమైన కాంగ్రెస్ పార్టీ నాయకులను విస్మరించడంతో పాటు అక్రమ కేసులు నమోదు చేస్తూ ఇబ్బందులు గురిచేస్తున్నట్లు ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా నామినేటెడ్ పదవులు, ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ, ఇందిరమ్మ కమిటీలలో పదవులు అన్ని కూడా ఎమ్మెల్యే వర్గానికి ఇస్తూ తీవ్ర అన్యాయం చేస్తున్నట్లు తెలిపారు. స్థానిక సంస్థలలో బీ–ఫారాలను పాత కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇవ్వాలని, ఇదేవిషయంపై పలుమార్లు అధిష్టానానికి ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయిందన్నారు. పరిస్థితి ఇదేవిధంగా కొనసాగితే అన్ని మండలాల నుంచి నాయకులు, కార్యకర్తలతో కలిసి ఛలో గాంధీభవన్కు పాదయాత్ర చేపట్టాల్సి వస్తుందన్నారు కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్చైర్మన్ శంకర్, డీఆర్ శ్రీధర్, లత్తిపురం వెంకట్రామిరెడ్డి, వెంకటస్వామిగౌడ్, కృష్ణ, డీటీడీసీ నర్సింహులు, ఆనంద్గౌడ్, పటేల్ శ్రీనివాసులు, ప్రకాష్, మాభాషా, రాఘవేంద్రరెడ్డిలు ఉన్నారు. -
ఎరువులు అధిక ధరకు విక్రయిస్తే చర్యలు
మల్దకల్: ఎరువులను అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తప్పవని డీఏఓ సక్రియానాయక్ ఫర్టిలైజర్ షాపు నిర్వాహకులను హెచ్చరించారు. మంగళవారం పాల్వాయి గ్రామంలోని ఫర్టిలైజర్ షాపును ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు ఎరువులను విక్రయించిన వెంటనే రశీదులను ఇవ్వాలని, విత్తనాలు కొనుగోలు చేసే రైతులు తప్పనిసరిగా షాపు యజమానులతో రశీదులు పొందాలన్నారు. ఫర్టిలైజర్ షాపులలో ఈ – పాస్మెషిన్ ద్వారానే మందులు పంపిణీ చేపట్టాలని, స్టాక్ వివరాలను రికార్డులలో పొందుపరచాలన్నారు. అనుమతులు లేని ఎరువులు, విత్తనాలు విక్రయిస్తే లైసెన్సులను రద్దు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయఽ అధికారి రాజశేఖర్, ఫర్టిలైజర్ షాపు నిర్వాహకులు పాల్గొన్నారు. -
అక్రమ నిర్మాణాలపై చర్యలు చేపట్టండి
ఎక్కడా లేని విధంగా నాలలు, కందకాలు కబ్జాకు గురయ్యాయి. అధికారులు, పాలకుల ఊదాసీనత వల్లే అక్రమ నిర్మాణాలు, ఆక్రమణలు పెరిగాయి. ఇప్పటికై నా అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి అక్రమ నిర్మాణాలు, కబ్జాలపై చేపట్టాల్సిన చర్యలపై సమీక్షించాలి. తద్వారా రానున్న రోజుల్లో ఎదుర్కొనే సమస్యల పరిష్కారంపై స్పష్టత వస్తుంది. ఇప్పటికై నా మేల్కొనపోతే భవిష్యత్లో త్రీవ ఇబ్బందులు పడాల్సి వస్తుంది. – శ్రీధర్, గద్వాల దారులు అధ్వానం పట్టణంలోని ప్రధాన రహదారులతో పాటు కాలనీ అంతర్గత రోడ్లు అధ్వానంగా తయారయ్యాయి. ఎక్కడపడితే అక్కడ గుంతలు ఏర్పాడ్డాయి. నిత్యం గుంతల రోడ్లపై ప్రయాణం అంటే సాహసం చేయాల్సి వస్తోంది. ప్రమాదాలు చోటుచేసుకుంటున్న అధికారుల పట్టనట్లుగా ఉన్నారు. మరమ్మతులు సైతం మొక్కుబడిగా చేపట్టి చేతులు దులుపుకొంటున్నారు. ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి రహదారులను మెరుగుపర్చాలి. – గోపాల్, గద్వాల -
క్రమశిక్షణతో చదివితే ఉజ్వల భవిష్యత్
మల్దకల్: విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని ఉన్నతంగా ఎదగాలని కలెక్టర్ బీఎం సంతోష్ సూచించారు. మంగళవారం మల్దకల్ జెడ్పీహెచ్ఎస్ను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు రిజిష్ట్రర్లను పరిశీలించారు. గత ఏడాది పదో తరగతి ఫలితాలపై ఆరా తీసి ఈ ఏడాది వంద శాతం ఫలితాలు సాధించేలా కృషి చేయాలన్నారు. అనంతరం పాఠశాల తరగతి గదులను సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. విద్యార్థుల బంగారు భవిష్యత్తు ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉంటుందని, క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత స్థాయికి చేరుకోవాలని విద్యార్థులకు సూచించారు. ప్రతి విద్యార్థి క్రమశిక్షణతో చదువుకుని పాఠశాలకు, తల్లిదండ్రులకు మంచిపేరు ప్రతిష్టలు తీసుకురావాలన్నారు. ముఖ్యంగా తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలలకు పంపించి పిల్లల చదువుపట్ల ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. జిల్లా స్థాయిలో ఉత్తమ పీఎం శ్రీ పాఠశాలగా ఎంపికై న మల్దకల్ జెడ్పీహెచ్ఎస్ పాఠశాల ప్రధానోపాధ్యాయుని, ఉపాధ్యాయులను అభినందించారు. అదే విధంగా పాఠశాలలో విద్యార్థులకు వడ్డించే మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం అందించేలా ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఇన్చార్జ్ ఎంఈఓ సురేష్, జిల్లా సెక్టోరియల్ అధికారి ఎస్తేర్రాణి, జాకీర్హుసేన్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. -
ఎక్కడి పనులు అక్కడే!
పురపాలికల్లో ప్రత్యేక అధికారుల పాలన మరో ఆర్నెళ్లు పెంపు గద్వాలటౌన్: సర్కార్ మళ్లీ ప్రత్యేక పాలన పెంపునకే మొగ్గుచూపింది. ఇప్పటికే ఎక్కడి పనులు అక్కడే పడి వున్నా స్పందించేవారు కరవయ్యారు. తాజాగా మున్సిపాలిటీలకు ప్రత్యేకాధికారుల పాలన మరో ఆరు నెలలు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. ఈ మేరకు మున్సిపాలిటీలకు ఉత్తర్వులు అందాయి. అయితే వచ్చే ఆరు నెలల్లో మున్సిపాలిటీల పనితీరు ఇంకా ఏమేరకు దిగజారుతుందన్నదే ఇప్పుడు అందర్నీ వేధిస్తున్న ప్రశ్న..? గత ఆరు నెలలుగా జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలో ప్రత్యేక అధికారి పాలన సాగుతుంది. ఇప్పటికే అస్తవ్యస్తంగా ఉన్న గద్వాల మున్సిపాలిటీ పరిస్థితి మరింత దీనంగా తయారు కానుందని ప్రజలు ఆరోపిస్తున్నారు. పాలన నత్తనడకన సాగుతోంది. అభివృద్ధి పనులు మందగించాయి. గద్వాల మున్సిపాలిటీలో ప్రత్యేకాధికారి ముద్ర ఏమాత్రం లేదు. అడిషినల్ కలెక్టర్ నర్సింగరావు ప్రత్యేకాధికారిగా వ్యవహరిస్తున్నారు. మరోవైపు ఆయనతో పాటు కమిషనర్ దశరథ్పై రాజకీయ ఒత్తిళ్లు ఎక్కువగా పని చేస్తున్నాయి. నాయకులను కాదని ఆయన ఏ పనీ చేయలేకపోతున్నారు. సిబ్బంది కొరత కూడ ఆయన కాళ్లకు బంధాలు వేస్తోంది. పడకేసిన పథకాలు.. అమృత్ 2.0 పథకం కింద చేపట్టిన తాగునీటి ప్రాజెక్టు పనులను చూస్తే నత్తే నయమనిపిస్తుంది. డబుల్ బెడ్రూం ఇళ్ల అప్పగింత కాగితాలకే పరిమితం అయింది. ఇందిరమ్మ ఇళ్ల పురోగతి కనిపించడం లేదు. ఐదేళ్లు గడుస్తున్నా పట్టణ ఆడిటోరియం భవన నిర్మాణం పనుల ప్రారంభానికి మోక్షం లభించడం లేదు. రోడ్ల అభివృద్ధి, విస్తరణ అనేది మర్చిపోయారు. రింగ్రోడ్డు అభివృద్ధి ఊసేలేదు. కూరగాయల మార్కెట్తో పాటు ఇతర దుకాణాల నుంచి ఆదాయం లభించడం లేదు. ఐడీఎస్ఎంటీ దుకాణాల లీజు పూర్తయినా చర్యలు లేవు. ప్రకృతి వనాల నిర్వహణ గాడితప్పింది. అక్రమ నిర్మాణాలు పెరిగిపోతున్నా నివారణ చర్యలు కనిపంచడం లేదు. పన్ను వసూళ్లపై రాజకీయ పెత్తనం కనిపిస్తుంది. ఇలా ఏది తీసుకున్నా అంగుళం కూడా ముందుకు కదల్లేదు. పథకాలన్ని ‘ఎక్కడవేసిన గొంగడి అక్కడే’ అన్న చందంగా మారాయి. పట్టణంలో ఏ సమస్యనైనా ఇది వరకు ప్రజలు తమ వార్డు కౌన్సిలర్ వద్దకు వెళ్లి మొరపెట్టుకునేవాళ్లు. చాలా సమస్యలు వాళ్ల స్థాయిలో పరిష్కారమయ్యేందుకు అవకాశం ఉండేది. ప్రస్తుతం ప్రజలు తమ సమస్యలను కమిషనర్, ప్రత్యేక అధికారి దృష్టికే తీసుకువెళ్లాల్సి వస్తోంది. సరైన పర్యవేక్షణ లేకపోవడంతో పట్టణంలో పారిశుద్ధ్య పరిస్థితి కూడా అంతంతమాత్రంగానే ఉంది. తాగునీటి సరఫరాలోనూ ఇబ్బందులతో పాట్లు తప్పడం లేదు. వార్డు ఆఫీసర్లు ఉన్నా వారికి మొక్కుబడి పనులే అప్పగిస్తున్నారు. ఈ ఆరు నెలల కాలంలో పట్టణంలో గొప్పగా చెప్పుకునే పథకం ఒక్కటీ లేదు. అక్రమ నిర్మాణాలు చేపడుతున్నా కానరాని నివారణ చర్యలు పన్ను వసూళ్లపై రాజకీయనాయకుల పెత్తనం పడకేసిన పథకాలు.. నత్తనడకన అభివృద్ధి పనులు కనిపించని ‘ప్రత్యేక’ మార్క్ -
జాతీయస్థాయికి ‘అనంతపురం’ విద్యార్థుల ప్రాజెక్టు
గద్వాలటౌన్ : 2024–25 విద్యా సంవత్సరానికి గాను రాష్ట్రస్థాయి స్కూల్ ఇన్నోవేషన్ మారథాన్ ప్రదర్శనలో గద్వాల మండలం అనంతపురం పీఎంశ్రీ జడ్పీహెచ్ఎస్ విద్యార్థులు ప్రతిభ చాటారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్నోవేషన్ సెల్ వారు పాఠశాల విద్యార్థులకు ఈ పోటీలను నిర్వహిస్తున్నారు. అనంతపురం పీఎంశ్రీ జెడ్పీహెచ్ఎస్ ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయురాలు జానకమ్మ ఆధ్వర్యంలో విద్యార్థులు ఇర్ఫాన్, పవన్, ప్రశాంత్ ఇన్నోవేషన్ మారథాన్ ప్రదర్శనలో ప్రతిభ చాటారు. ‘మొక్కజొన్న కంకులపై పొట్టుతో తయారు చేసిన ఎకో ఫ్రెండ్లీ కార్న్ హస్క్ పెన్స్’ అనే అంశంపై ప్రాజెక్టును రూపొందించగా.. ఆ ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. జులై 28 నుంచి 31 వరకు డిల్లీలో జరుగుతున్న జాతీయస్థాయి ఇన్నోవేషన్ మారథాన్ ప్రదర్శనకు ఎంపిక చేశారు. దేశ వ్యాప్తంగా మొత్తం 27 ప్రదర్శనలను ఎంపిక చేశారు. ఇందులో రాష్ట్రం నుంచి గద్వాలతో పాటు సిద్దిపేట, సిరిసిల్ల పాఠశాలలు ఉన్నాయి. అనంతపురం విద్యార్థులు జాతీయస్థాయి ఇన్నోవేషన్ మారథాన్ ప్రదర్శనకు ఎంపిక కావడంపై డీఈఓ అబ్దుల్ ఘనీ, ఎంఈఓ శ్రీనివాస్గౌడ్, జిల్లా సైన్స్ అధికారి బాస్కర్పాపన్న, ఉపాధ్యాయలు హర్షం వ్యక్తం చేశారు. -
బీజేపీలో రగడ..!
నేతల మధ్య రచ్చకెక్కిన అంతర్గత పోరు ● రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు సమక్షంలోనే బహిర్గతం ● చిచ్చురేపిన డీకే మాటలు.. మనస్తాపానికి గురైన శాంతికుమార్? ● ఎంపీ అనుచరుల గోబ్యాక్ నినాదాలపై పార్టీలో భిన్నస్వరాలు ● తెరపైకి బీసీ వాదం.. ‘కమలం’ శ్రేణుల్లో అయోమయం ● ‘స్థానిక’ ఎన్నికల వేళ నష్టం వాటిల్లుతుందని ఆందోళన సీనియర్ల మండిపాటు.. పార్టీలో లోటుపాట్లు, నేతల మధ్య విభేదాలపై అంతర్గత వేదికలపైనే చర్చించుకోవడం.. సమస్యలను పరిష్కరించుకోవడం బీజేపీకి ఆనవాయితీగా వస్తోంది. రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికై న తర్వాత రాంచందర్రావు తొలిసారి చేపట్టిన జిల్లా పర్యటనలో నేతల మధ్య విభేదాలు బహిరంగ సమావేశంలో రచ్చకెక్కడంపై ఆ పార్టీ లోని సీనియర్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పార్టీలో కొత్త సంప్రదాయానికి తెరలేపారని.. ఇది మంచి పద్ధతి కాదని మండిపడుతున్నారు. ఆదిలోనే కట్టడి చేయాలని.. లేకుంటే మరిన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. స్థానిక ఎన్నికల వేళ పార్టీకి నష్టం వాటిల్లేలా ప్రస్తుత పరిణామాలు ఉన్నాయని.. పార్టీ అధిష్టానం దృష్టిసారించి సమస్య సద్దుమణిగేలా చూడాలని కోరుతున్నారు. సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: క్రమశిక్షణకు పెద్దపీట వేసే భారతీయ జనతా పార్టీకి సంబంధించి పాలమూరులో ఇటీవల చోటుచేసుకున్న అనూహ్య పరిణామాలు కలకలం సృష్టిస్తున్నాయి. మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ, బీజేపీ రాష్ట్ర కోశాధికారి బండారి శాంతికుమార్ మధ్య ఉన్న విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు సమక్షంలో బహిరంగ సమావేశం వేదికగా అంతర్గత పోరు రచ్చకెక్కగా.. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. శాంతికుమార్ గో బ్యాక్ అంటూ డీకే అనుచరుల నినాదాలు.. వేదికపై ఆయననుద్దేశించి అరుణ పరోక్షంగా మాట్లాడిన మాటలు పార్టీలో చిచ్చు రాజేశాయి. ఈ ఘటనతో మనస్తాపానికి గురైన శాంతికుమార్ స్తబ్దుగా ఉండగా.. ఆయన అనుచరులు మాత్రం మండిపడుతున్నారు. ఈ క్రమంలో బీసీ వాదం తెరపైకి రాగా.. పార్టీ శ్రేణుల్లో అయోమయం నెలకొంది. రానున్న స్థానిక ఎన్నికల వేళ నష్టం వాటిల్లే అవకాశం ఉందని గ్రామ, మండల, పట్టణ స్థాయి నాయకుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. 2019 నుంచీ కోల్డ్వార్.. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 2014 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున గద్వాల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా డీకే అరుణ పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత 2018 ఎన్నికల్లో ఆమెకు పరాజయం ఎదురైంది. అనంతరం రాజకీయ పరిణామాల క్రమంలో ఆమె పార్లమెంట్ ఎన్నికలకు ముందు బీజేపీలో చేరారు. 2019 ఏప్రిల్లో జరిగిన ఎంపీ ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున మహబూబ్నగర్ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయితే ఈ ఎన్నికల్లో ఆమెతోపాటు శాంతికుమార్ టికెట్ ఆశించారు. బీజేపీని గెలిపించాలని పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆయన ఫొటోతో కూడిన ఫ్లెక్సీలు వెలిశాయి. పోటీగా డీకే అరుణ వర్గం కూడా ఫ్లెక్సీలు పెట్టారు. ఇలా అప్పటి నుంచే ఇద్దరు నేతల మధ్య కోల్డ్ వార్ మొదలైంది. ఇక 2024 ఎంపీ ఎన్నికల్లో సైతం ఇద్దరూ టికెట్ ఆశించారు. బీజేపీ అధిష్టానం డీకే అరుణ వైపు మొగ్గు చూపగా.. ఆమె పోటీ చేసి గెలుపొందారు. ఇలా రెండు పర్యాయాలు శాంతికుమార్కు టికెట్ చివరలో చేజారింది. అరుణ శాంతికుమార్బీసీ సంఘాల భగ్గు బీజేపీలో తాజా పరిణామాల క్రమంలో బీసీ వాదం తెరపైకి వచ్చింది. మున్నూరు కాపు వర్గానికి చెందిన శాంతికుమార్ను డీకే అరుణ అవమానించారని.. ఇది తగదంటూ పలు సంఘాలు భగ్గుమంటున్నాయి. బీసీ సమాజానికి ఆమె క్షమాపణ చెప్పేలా పార్టీ అధిష్టానం చర్యలు తీసుకోవాలని కోరుతున్నాయి. లేకుంటే రానున్న స్థానిక ఎన్నికల్లో బీజేపీకి తగిన గుణపాఠం చెబుతామని బీసీ సమాజ్, తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం, బీసీ మేధావుల సంఘం, మున్నూరు కాపు సంఘం నేతలు హెచ్చరిస్తున్నారు. -
సాగు.. సగమే!
3.21 లక్షల ఎకరాలకు.. 1.61 ఎకరాల్లోనే వ్యవసాయ పంటల సాగు వానాకాలం పంటల వివరాలిలా.. (ఎకరాల్లో) పంట సాగు అంచనా సాగు చేసింది పత్తి 1,42,410 1,27,884 వరి 95,762 5,644 కంది 42,585 15,224 మొక్కజొన్న 12,887 7,144 వేరుశనగ 11,180 2,495 పొగాకు 10,878 2,300 ఆముదాలు 1,031 201 మినుములు 1,160 132 సజ్జ 450 54 జొన్న 184 30 కొర్ర 503 15 చెరుకు 318 10 ఇతర పంటలు 1,454 0 గద్వాల వ్యవసాయం: నడిగడ్డ రైతులకు ఈ ఏడాది కలిసిరాలేదు. (2025–26) వానాకాలం సీజన్కు ముందు మే నెలలో వర్షాలు కురిశాయి. దీంతో అన్నదాతలు సీజన్ బాగుంటుందని ఆశించారు. అయితే ఆ తర్వాత వరుణుడు ఆశించిన స్థాయిలో కరుణించకపోవడంతో సాగుకు కష్టాలు వచ్చాయి. జిల్లాలో 3,21,305 ఎకరాల్లో వ్యవసాయ పంటలు సాగు అవుతుందని వ్యవసాయ శాఖ అంచనా వేయగా ఇప్పటివరకు సగమే సాగు కాగా, 45,906 ఎకరాల్లో ఉద్యాన పంటల సాగు అంచనా ఉండగా ఇప్పటి వరకు పది శాతం అయ్యింది. గడిచిన ఏడాది సాఫీగా సాగు గడిచిన ఏడాది (2024–25) వానాకాలం, యాసగి సీజన్లలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురిశాయి. జూన్, జులై, ఆగస్టు నెలల్లో వర్షాలు బాగా పడ్డాయి. దీనివల్ల బోర్లు, బావులు రిజార్జ్ అయ్యాయి. ఇదే సమయంలో ఎగువన కురిసిన వర్షాల వల్ల జూరాల జలాశయం నుంచి అనుకున్న సమయలో నీటి విడుదల జరిగింది. ఇలా అన్ని పరిస్థితులు అనుకూలించడం వల్ల గడిచినేడాది వానాకాలం సీజన్లో అన్ని పంటలు బాగా వచ్చి, దిగుబడులు సైతం బాగా వచ్చాయి. ఇంకా అవకాశం గత కొద్ది రోజుల నుంచి వర్షాలు కురుస్తున్నాయని పంటలు వేయడానికి ఇంకా అవకాశం ఉందని, అంచనా మేరకు సాగు అవుతుందని వ్యవసాయ అధికారులు పేర్కొంటున్నారు. జులై నెలాఖరు వరకు కంది, వేరుశనగ, ఆముదం, మొక్కజొన్న పంటలు వేయవచ్చునని అంటున్నారు. వరి పంటకు సంబంధించి ఆగస్టు వరకు సమయం ఉందని చెబుతున్నారు. అదేవిధంగా ఉధ్యాన పంటలకు సంబందించి కూరగాయలు, ఎండుమిర్చి, ఆయిల్పాం సాగుకు వచ్చే నెల వరకు గడువు ఉందన్నారు. ఎండుమిర్చి 30,305 2262 కూరగాయలు 7650 2543 ఆయిల్పాం 3936 0 ఇతర పంటలు 4045 0 ఉద్యానపంటలు 45,906 ఎకరాల్లో ఉద్యాన పంటల సాగు అంచనా.. నేటికీ 10 శాతం మాత్రమే చేరుకున్న వైనం ఆశించిన మేర కురవని వర్షాలు అంచనా మేరకు సాగుకు అవకాశం జూన్లో వర్షాలు లేకపోవడం, బోర్లు, బావులు రీచార్జ్ కాకపోవడం వల్ల వానాకాలం సీజన్ సాగుపై ప్రభావం చూపింది. అయితే చాలా ప్రాంతాల్లో వరి నారుమడులు రైతులు సిద్ధం చేసుకున్నారు. ఆగస్టు వరకు వరి, ఎండుమిర్చి వేయవచ్చు. ఈ నెలాఖరు వరకు పత్తి మినహా కొన్ని పంటలు వేస్తారు. ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు కాస్త అనుకూలంగా ఉన్నాయి. అంచనా మేరకు పంటలు సాగు అవుతాయని భావిస్తున్నాం. – సక్రియానాయక్, డీఏఓ -
ముగిసిన బాస్కెట్బాల్ పోటీలు
అయిజ: తెలంగాణ బాస్కెట్ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మండలంలోని ఉత్తనూరులో ధన్వంతరి వేంకటేశ్వర స్వామి ఆలయ కమిటీ నాలుగురోజులపాటు నిర్వహించిన జూనియర్ అంతర్ జిల్లా బాస్కెట్ బాల్ చాంపియన్ షిప్ పోటీలు సోమవారంతో ముగిశాయి. బాలిక విభాగంలో రంగారెడ్డి జట్టు విన్నర్ కాగా మేడ్చేల్ మల్కాజిగిరి జట్టు రన్నర్గా నిలిచింది. అదేవిధంగా బాలుర విభాగంలో హైదరాబాద్ జట్టు విన్నర్ కాగా.. మేడ్చల్ మల్కాజిగిరి జట్టు రన్నర్గా నిలిచింది. విజేతలకు నిర్వాహకులు షీల్డ్లు అందజేశారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు బహుమతులు అందజేశారు. హోరీహోరీగా తలపడుతున్న బాలికల జట్టు -
బడుల బలోపేతం దిశగా..
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తోంది. ఇందులో భాగంగా విద్యార్థుల తల్లిదండ్రుల ఆలోచనల మేరకు ప్రభుత్వ పాఠశాలల్లో సైతం ప్రీప్రైమరీ (పూర్వపు ప్రాథమిక విద్య)ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చర్యలు చేపడుతోంది. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ప్రైవేటు స్కూళ్లలో ప్రీ ప్రైమరీ విద్య అందిస్తున్నారు. ప్రభుత్వ ప్రీ ప్రైమరీ స్కూళ్లు అందుబాటులో లేకపోవడంతో తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేటులో చేర్పిస్తున్నారు. తద్వారా అన్ని స్థాయిల్లో ప్రైవేటు స్కూళ్లకు విద్యార్థులు అలవాటు పడుతున్నారు. ఈ లోపాన్ని సరిదిద్ది సర్కారు బడుల్లో అడ్మిషన్లు పెంచేందుకు ప్రభుత్వం పూర్వపు ప్రాథమిక విద్య అందించేందుకు చర్యలు చేపట్టింది. అందుకోసం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 90 ప్రీ ప్రైమరీ స్కూళ్లను నెలకొల్పాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ విద్యా సంవత్సరం నుంచి నూతనంగా ప్రారంభించిన పాఠశాలల్లో 4–5 ఏళ్ల పిల్లలను చేర్చుకోవాలని సూచించింది. ఇద్దరు చొప్పున నియామకం.. ప్రతి ప్రీ ప్రైమరీ పాఠశాలకు ఇద్దరు సిబ్బందిని నియమించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇందులో ఒక టీచర్ ఇంటర్మీడియట్తోపాటు ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్, ప్రైమరీ టీచింగ్లో అర్హులై ఉండాలి. విద్యార్థుల బాగోగులు చూసుకునేందుకు ఒక ఆయాను కూడా ని యమించాల్సి ఉంది. ఆమెకు కనీసం 7వ తరగతి అర్హత ఉండి స్థానికులై ఉండాలి. వీరిని జిల్లాస్థాయిలో కలెక్టర్ ఆధ్వర్యంలోని కమిటీ ఎంపిక చేస్తుంది. ప్రీ ప్రై మరీ విద్యార్థులకు ఎస్సీఆర్టీ జాతీయ స్థాయిలో అ మలుపరుస్తున్న సిలబస్ను బోధించాల్సి ఉంటుంది. ప్రైమరీ పాఠశాలల్లో.. నూతనంగా ప్రారంభించే ప్రీ ప్రైమరీ స్కూళ్లకు ప్రస్తుతం కొనసాగుతున్న ప్రైమరీ పాఠశాలల్లో ఒక తరగతి గదిని కేటాయించనున్నారు. అనంతరం అందుబాటులో ఉండే నిధుల ఆధారంగా కొత్త గదులను నిర్మించనున్నారు. వీటిలో వసతుల కల్పన కోసం ఒక్కో బడికి రూ.1.50 లక్షలను ప్రభుత్వం మంజూరు చేసింది. ఇందులో విద్యార్థులు ఇండోర్, అవుట్ డోర్ గేమ్స్ ఆడేందుకు బొమ్మలు, గోడలపై ఆకర్షణీయమైన చిత్రాలు వేయడం, బేంచీలు, బోర్డులు, కుర్చీల వంటివి ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. వీటి కొనుగోలు పూర్తిగా కలెక్టర్ ఆదేశాల మేరకు అమ్మ ఆదర్శ కమిటీల ఆధ్వర్యంలో చేపట్టాలి. వీటితోపాటు అన్ని పాఠశాలల మాదిరిగానే మధ్యాహ్న భోజనం, స్నాక్స్ వంటివి విద్యార్థులకు అందిస్తారు. ఏయే పాఠశాలల్లో అంటే.. ఎంపీపీఎస్ నారగ్దొడ్డి, చమన్ఖాన్దొడ్డి, కేశవరం, ఉలిగేపల్లి, ఈడిగోనిపల్లి, చింతలక్యాంప్, పరమల, ఇనుములోనిపల్లి, మరమునగాల–1 వడ్డేపల్లి, అలంపూర్ (బాలికల) చాగాపూర్, కరుపాకుల, ఇందువాసి, నందిన్నె, అరగిద్ద, ఆలూర్, చింతల్కుంట, బలిగెరలో ప్రీ ప్రైమరీ పాఠశాలలు ఏర్పాటు చేయనున్నారు. నారాయణపేట 10 మహబూబ్నగర్ 25 వనపర్తి 17 జోగుళాంబ గద్వాల 18 నాగర్కర్నూల్ 20 జిల్లాల వారీగా ప్రీ ప్రైమరీ స్కూళ్ల ఏర్పాటు ఇలా.. ప్రభుత్వ ప్రీ ప్రైమరీ స్కూళ్లు ఏర్పాటు ఉమ్మడి జిల్లాలో కొత్తగా ప్రారంభం కానున్న 90 పాఠశాలలు వసతుల కల్పనకు రూ.1.50 లక్షల చొప్పున మంజూరు ఈసారి నుంచే ఎల్కేజీ, యూకేజీ అడ్మిషన్లకు అనుమతి జాతీయ స్థాయి సిలబస్ బోధనకు చర్యలు అడ్మిషన్లు తీసుకుంటాం.. మహబూబ్నగర్ జిల్లాలో 26 ప్రీ ప్రైమరీ స్కూళ్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం కొనసాగుతున్న ప్రాథమిక పాఠశాలల్లోనే ఒక గదిలో ప్రీ ప్రైమరీ స్కూల్ ప్రారంభిస్తాం. ఇందుకోసం ఒక్కో పాఠశాలలో వసతుల కల్పన కోసం రూ.1.50 లక్షలను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ విద్యా సంవత్సరం నుంచి అడ్మిషన్లు తీసుకుంటాం. – ప్రవీణ్కుమార్, డీఈఓ, మహబూబ్నగర్ -
బీచుపల్లిని సందర్శించిన టాస్క్ఫోర్స్ ఎస్పీ
ఎర్రవల్లి: బీచుపల్లి పుణ్యక్షేత్రాన్ని ఆదివారం హైదరాబాద్ టాస్క్ఫోర్స్ ఎస్పీ శ్రీనివాస్ కుటుంబ సమేతంగా సందర్శించారు. ఈ సందర్భంగా అభయాంజనేయస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ఈఓ రామన్గౌడ్ ఆయనను శేషవస్త్రాలతో సత్కరించగా ఆలయ అర్చకులు మారుతిచారి తీర్థ ప్రసాదాలను అందించి ఆలయ వివిష్టత వివరించారు. ఆయన వెంట అర్చకులు అనిల్శర్మ, కుటుంబ సభ్యులు, సిబ్బంది, తదితరులు ఉన్నారు. పెన్షనర్ల సమస్యలుపరిష్కరించాలి గద్వాల: రాష్ట్ర ప్రభుత్వం పెన్షనర్ల సమస్యలను పరిష్కరించకుండా నిర్లక్ష్యం వహిస్తుందని పెన్షనర్ల అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఇక్బాల్ పాషా ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వం అవలంభిస్తున్న నిర్లక్ష్య వైఖరికి రాష్ట్ర జేఏసీ నోటీసులు ఇవ్వాలని తీర్మానం చేసినట్లు తెలిపారు. సీఎంతో జరిపిన చర్చల్లో ఒప్పుకున్న తీర్మానాలను అమలు చేయాలని, సత్వరమే పెండింగ్లో ఉన్న పెన్షన్ బెనిఫిట్లు, డీఏలు, పీఆర్సీలు, నగదురహిత ఆరోగ్య చికిత్స వంటి హామీలు అమలు చేయాలని కోరారు. రామన్పాడులో నిలకడగా నీటిమట్టం మదనాపురం: మండలంలోని రామన్పాడు జలాశయంలో ఆదివారం సముద్రమట్టానికి పైన 1,020 అడుగులు ఉన్నట్లు ఏఈ వరప్రసాద్ తెలిపారు. జూరాల ఎడమ కాల్వ నుంచి 550 క్యూసెక్కులు, సమాంతర కాల్వ నుంచి 200 క్యూసెక్కుల వరద జలాశయానికి చేరుతుండగా.. ఎన్టీఆర్ కాల్వకు 679 క్యూసెక్కులు, కుడి, ఎడమ కాల్వలకు 30 క్యూసెక్కులు, వివిధ ఎత్తిపోతల పథకాలకు 872 క్యూసెక్కులు, తాగునీటి అవసరాలకు 20 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నట్లు వివరించారు. -
నిరుద్యోగ సమస్యలపై నిరంతర పోరాటం
అమరచింత: నిరుద్యోగ సమస్యల పరిష్కారానికి డీవైఎఫ్ఐ నిరంతరం పోరాటం చేస్తోందని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కోట రమేష్ తెలిపారు. ఆదివారం మండల కేంద్రంలో నిర్వహించిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరుద్యోగ యువత జీవితాలతో చెలగాటమాడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. యువత మత్తు పదార్థాలకు బనిసై తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని తెలిపారు. ఆన్లైన్, ఆఫ్లైన్ గేమ్ల పేరిట తల్లిదండ్రులకు తెలియకుండా అప్పులు చేసి చివరికి ఆత్మహత్యలు చేసుకుంటున్న దుస్థితి యువతరం చేరుకోవడం శోచనీయమన్నారు. కళాశాల, పాఠశాలల వద్ద జరిగే మత్తు పదార్థాల ముఠాలను అడ్డుకోనేందుకు డీవైఎఫ్ఐ ప్రణాళికతో ముందుకు సాగుతుందని చెప్పారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు రాఘవేంద్ర, చంటి, తిరుపతి, అశోక్, మనోహర్ తదితరులు పాల్గొన్నారు. -
భూ సేకరణే అసలు సమస్య..
ముచ్చోనిపల్లె రిజర్వాయర్ అలుగు కాల్వవను రెండున్నర కిలోమీటర్ల మేర నిర్మించాల్సి ఉంది. అయితే ఇప్పటికే రెండు రిజర్వాయర్లలో భూములు కొల్పోయిన తప్పెట్లమొర్సు గ్రామ రైతులు మళ్లీ భూములను కాలువ కోసం అప్పగించడానికి సిద్ధంగా లేరు. తప్పెట్లమొర్సు గ్రామ శివారులో మొత్తం 3600 ఎకరాల భూములుండగా ఇందులో 600 ఎకరాలు సాగు పనికిరానివి ఉండగా, తాటికుంట రిజర్వాయర్లో 630 ఎకరాలు, ముచ్చోనిపల్లె రిజర్వాయర్లో 670 ఎకరాలు, కాలువల నిర్మాణం కోసం 200 ఎకరాలు సేకరించినట్లు రైతులు తెలిపారు. ఇది చాలదన్నట్లు ప్రస్తుతం భారత్మాల 6 వరుసల జాతీయ రహదారి నిర్మాణం కోసం భూ సేకరణ చేశారు. రెండు రిజర్వాయర్ల కారణంగా ఎక్కువగా భూములను కొల్పోయిన ఈ రైతులు ఉన్న కొద్ది పాటి భూములను సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో అయితే బహిరంగ మార్కెట్లో భూమి విలువకు అనుగుణంగా పరిహారం చెల్లిస్తే భూములను అప్పగించేందుకు రైతులు సముఖతను వ్యక్తం చేస్తున్నారు. ఇదిలాఉండగా, గొర్లఖాన్దొడ్డి–అయిజ రోడ్డు నుంచి ముచ్చోనిపల్లె రిజర్వాయర్ కట్ట కింద నుంచి బల్గెర–అయిజ రోడ్డుకు లింకు కలిపే కొత్త తారు రోడ్డును మాత్రం వేశారు. కొత్తగా తారు రోడ్డు వేసే అధికారులు రిజర్వాయర్ అలుగు కాల్వకు ఎందుకు పరిష్కారం చూపడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. -
తాగునీటి కోసం ఖాళీ బిందెలతో నిరసన
రాజోళి: వారం రోజులుగా నీరు రావడం లేదని కనీస అవసరాలకు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామంటూ ప్రజలు రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళితే వడ్డేపల్లి మున్సిపాలిటీ పరిదిలోని రామచంద్రానగర్ కాలనీలో గత వారం రోజులుగా మిషన్ భగీరథ ద్వారా నీరు అందడం లేదు. కనీసం తాగేందుకు, ఇతర అవసరాలకు కూడా నీరు లేదు. అధికారులను అడిగితే మోటార్లు రిపేరు చేస్తున్నామని చెప్పి మాట దాటేస్తుండటంతో విసిగిపోయిన కాలనీ వాసులు ఆదివారం కాలనీలోని రోడ్డెక్కి ఖాళీ బిందెలను ప్రదర్శిస్తూ, నిరసన తెలిపారు. అనంతరం కర్నూల్–రాయచూరు ప్రధాన రహదారిపైన ధర్నా చేసేందుకు సమాయత్తం అయ్యారు. గత వారం రోజులుగా నీరు లేక ఇళ్లలో బడికి వెళ్లే పిల్లలు, పనులకు వెళ్లే పెద్దలు స్నానాలు చేయడం లేదని కాలనీవాసులు వాపోయారు. మోటార్లు రిపేరు ఉన్నాయని తెలిసిన అధికారులు కనీసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసైనా ప్రజలకు నీరు అందించాలి కదా, ఆ పని కూడా చేయకపోతే నీటి అవసరాలు ఎలా తీరతాయని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి నెలలో రెండు మూడు సార్లు ఇలా జరుగుతూనే ఉంటుందని, దీనిపై అధికారులకు చెప్పినా ప్రయోజనం లేదని అన్నారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ధర్నాకు ఉపక్రమించారు.ఈ క్రమంలో విషయం తెలసుకున్న బీఆర్ఎస్ యువకులు బార్గవ్ యాదవ్, నాయకులు గడ్డం శ్రీను అక్కడకు చేరుకుని మున్సిపల్ అధికారులతో ఫోన్లో మాట్లాడి సమస్యను వివరించగా ట్యాంకర్ కాలనీకి చేరుకుంది. దీంతో కాలనీ వాసులు ధర్నా విరమించారు. కనీసం చేతిపంపులు కూడా లేవని, శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. -
ప్రశాంతంగా జీపీఓ, సర్వేయర్ల పరీక్ష
గద్వాల: గ్రామ పాలనఅధికారి, లైసెన్స్డ్ సర్వేయర్ పరీక్షను పకడ్బందీగా నిర్వహించినట్లు కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో ఉదయం జీపీవో, మధ్యాహ్నం లైసెన్స్డ్ సర్వేయర్ పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. జీపీవో పరీక్ష ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు, లైసెన్డ్స్ సర్వేయర్ పరీక్ష మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు జరిగినట్లు తెలిపారు. ఎలాంటి మాస్కాపీయింగ్ ఆస్కారం లేకుండా పకడ్బందీగా నిర్వహించినట్లు తెలిపారు. ఉదయం పరీక్షను అదనపు కలెక్టర్ వి.లక్ష్మీనారాయణ, మధ్యాహ్నం పరీక్షను కలెక్టర్ బీఎం సంతోష్ పర్యవేక్షించారు. కార్యక్రమంలో అధికారులు రాంచంద్రం, తహసీల్దార్ మల్లిఖార్జున్, ప్రియాంక, రేణుకాదేవి తదితరులు పాల్గొన్నారు. -
ముచ్చోనిపల్లికి ముప్పు..!
రిజర్వాయర్కు అలుగు కాల్వ లేక ఇబ్బందులు ●గట్టు: రూ.38.25 కోట్లు వెచ్చించి.. 1.5 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన ముచ్చోనిపల్లి రిజర్వాయర్ను ఏళ్లుగా సగం నీటితో నింపి సరిపెట్టాల్సిన దుస్థితి నెలకొంది. ప్రధానంగా ప్రతి రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటి మట్టంతో నిండిన తర్వాత ఎక్కువైన నీరు అలుగు కాల్వ ద్వారా బయటకు వెళ్లాల్సి ఉండగా.. ఈ రిజర్వాయర్కు అసలు అలుగు కాల్వనే నిర్మించకపోవవడం గమనార్హం. ఒకవేళ వరదొస్తే పరిస్థితి ఏంటి అనే ప్రశ్న రేకెత్తుతోంది. ఈ ముప్పును ఇప్పటికై నా అధికారులు గమనించాలని రైతులు కోరుతున్నారు. నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంలో 109 ప్యాకేజీలో భాగంగా ముచ్చోనిపల్లె గ్రామం వద్ద రూ.38.25 కోట్లతో 1.5 టీఎంసీ సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మాణానికి కాంట్రాక్టర్ 2007లో ఒప్పందం చేసుకోగా, 2015లో రిజర్వాయర్ పనులు పూర్తి చేశారు. పదేళ్ల క్రితమే రిజర్వాయర్ నిర్మాణం పూర్తయినప్పటికీ అలుగు కాలువ నిర్మాణం మాత్రం అసంపూర్తిగా వదిలేశారు. రిజర్వాయర్ను నిర్మించిన ఇంజినీరింగ్ అధికారులు కేవలం అలుగు కాల్వను నిర్మించలేక పోతున్నారు. అలుగు (సర్ప్లస్ చానల్) కాల్వవ ఉంటేనే రిజర్వాయర్ నిండిన తర్వాత ఎక్కువైన నీరు అలుగు ద్వారా బయటకు వెళ్లిపోతుంది. అలుగు కాల్వ నీరు పారేందుకు సుమారుగా 90 ఎకరాల మేరకు భూములు అవసరమున్నట్లు అధికారులు గుర్తించారు. ఇక్కడ మాత్రం అధికారులు ఏళ్లు గడుస్తున్నా అలుగు కాలువను మాత్రం ఏర్పాటు చేయలేక పోతున్నారు. తద్వారా ముచ్చోనిపల్లె రిజర్వాయర్లో పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేయలేక పోతున్నారు. మొక్కుబడిగా ఏటా కొద్ది పాటి నిటిని మాత్రమే నింపి చేతులు దులుపుకొంటున్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు. అలుగు ద్వారా పారే నీరు బయటకు వెళ్లడానికి వీలుగా కాలువ నిర్మాణం చేపట్టలేదు. 1.5 టీఎంసీల సామర్థ్యం కల్గిన ముచ్చోనిపల్లె రిజర్వాయర్ను సాగు నీటి శాఖ అధికారులు ఇప్పటి దాకా కేవలం 60 శాతం మేరకు మాత్రమే నీటిని నింపుతూ వచ్చారు. భారీ వర్షాలకు రిజర్వాయర్పై భాగంలోని గట్టు, మాచర్ల, బల్గెర, యల్లందొడ్డి, చింతలకుంట గ్రామాల నుంచి వరద నీరు పెద్ద ఎత్తున తరలివచ్చి ముచ్చోనిపల్లె రిజర్వాయర్లోకి చేరితే పరిస్థితి ఎంటనే ప్రశ్న రైతుల్లో నెలకొంది. భూములు అమ్మి ఎలా బతకాలి ఈ భూములను విడిచి ఎలా బతకాలి. సేద్యం తప్పా మరో పని చేతకాదు. కాల్వ కోసం సేకరించే భూములకు మార్కెట్ రేట్ ప్రకారం ఎకరాకు రూ.12లక్షలు చెల్లించాలి. బయట మార్కెట్లో రేటు ఇంకా ఎక్కువగానే ఉంది. ప్రభుత్వం చెల్లించే పరిహారంతో మరో చోట భూములను కొనలేం. తప్పెట్లమొర్సు రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. మాకు న్యాయమైన పరిహారం చెల్లిస్తేనే భూములను అప్పగిస్తాం. – పగిడాల నర్సింహులు, తప్పెట్లమొర్సు భూ సేకరణపై రైతులతో చర్చిస్తాం ముచ్చోనిపల్లె రిజర్వాయర్ అలుగు కాలువ నిర్మాణం విషయంలో రైతులతో సంప్రదింపులు చేస్తున్నాం. అడిషనల్ కలెక్టర్, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి ద్వారా తప్పెట్లమొర్సు గ్రామస్తులతో భూ సేకరణకు రైతులు సహకరించేలా చర్చలు జరిపాం. రైతులు అంగీకరించడం లేదు. అలైన్మెంట్ ప్రకారమే ముచ్చోనిపల్లె అలుగు కాలువను నిర్మించాల్సి ఉంటుంది. భూ సేకరణ సమస్య కారణంగా అలుగు కాలువ ఏర్పాటులో జాప్యం నెలకొంది. రైతులు సహకరిస్తే త్వరగా పూర్తి చేసి, రిజర్వాయర్ను పూర్తి స్థాయిలో నీటితో నింపి ఆయకట్టుకు నీరందిస్తాం. – నవీన, డీఈ వెంటాడుతున్న వరదల భయం ముచ్చోనిపల్లె రిజర్వాయర్కు వరద నీరు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అయితే ఈ రిజర్వాయర్ కింద ఉన్న ఎక్లాస్పూర్, అయిజ పట్టణాల ప్రజలను వరదల సమయంలో బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతుంటారు. 2009 వరదలు అయిజ పట్టణ ప్రజలను భయాందోళనకు గురి చేశాయి. అప్పట్లో వరదల సందర్భంలో అసంపూర్తిగా ఉన్న ముచ్చోనిపల్లె రిజర్వాయర్లోకి మాచర్ల, గట్టు ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరింది. దీంతో వాగు దగ్గర అసంపూర్తిగా ఉన్న మట్టి కట్ట వరద నీటి ఉధృతికి తెగిపోయింది. అప్పట్లో అర టీఎంసీ నీరు వృథాగా వాగు ద్వారా తుంగభద్ర నదికి చేరుకుంది. ప్రస్తుతం రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున వరదలు వస్తే రిజర్వాయర్ కింద ఉన్న గ్రామాల పరిస్థితి ఏంటని ఆయా గ్రామాల ప్రజలు అందోళన చెందుతున్నారు. వరదొస్తే నీరు బయటికి పారే దారే కరువు జఠిలంగా మారిన భూసేకరణ 1.5 టీఎంసీల సామర్థ్యం.. రూ.38.25 కోట్లతో రిజర్వాయర్ నిర్మాణం సగం నీటితోనే సరిపెట్టేస్తున్న అధికారులు -
కందనూలులో కలకలం
● ఉయ్యాలవాడలోని బీసీ గురుకుల పాఠశాలలో 64 మంది విద్యార్థినులకు అస్వస్థతత ● కడుపునొప్పి, వాంతులు, విరేచనాలతో ఆస్పత్రిలో చేరిక ● గడువుతీరిన పాలు, పెరుగు వల్లే ఘటన ● ఉడకని భోజనం, నాసిరకం సరుకుల వినియోగం ● జిల్లాలోని అన్నిచోట్ల ఇష్టారాజ్యంగా క్యాటరింగ్ నిర్వహణ? అమలుకాని మెనూ.. జిల్లాలోని ప్రభుత్వ సంక్షేమ గురుకుల హాస్టళ్లలో ఎక్కడా డైట్ మెనూ సరిగా అమలుకావడం లేదు. ఉదయం పూట టిఫిన్ కింద పూరి, ఇడ్లి, చపాతి, దోశ ఇవ్వాల్సి ఉండగా.. చాలాసార్లు లెమన్ రైస్, కిచిడీ, పులిహోరతో సరిపెడుతున్నారు. మధ్యాహ్నం భోజన సమయంలో మిక్స్డ్ వెజ్ బిర్యానీ, రెండేసి కూరలతో వడ్డించాల్సి ఉండగా.. పప్పులు, సాంబారుతో నెట్టుకొస్తున్నారు. వారంలో చికెన్, గుడ్డు, స్నాక్స్ విషయంలో కోత విధిస్తున్నారు. వంట గదుల్లో శుచి, శుభ్రత పాటించకపోవడం, శుభ్రమైన నీటిని వినియోగించకపోవడంతో తరుచుగా ఫుడ్ పాయిజన్ ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. గురుకుల హాస్టళ్ల నిర్వహణపై క్షేత్రస్థాయిలో సరైన పర్యవేక్షణ కొరవడటంతో నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సాక్షి, నాగర్కర్నూల్: జిల్లాకేంద్రం సమీపంలోని మహాత్మ జ్యోతిబాపూలే బీసీ గురుకుల పాఠశాలలో విద్యార్థులు ఫుడ్ పాయిజన్తో ఆస్పత్రిలో చేరిన ఘటన కలకలం సృష్టించింది. శనివారం రాత్రి భోజనం చేసిన తర్వాత అస్వస్థతతకు గురైన విద్యార్థినులు 64 మందిని జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలతో ఇబ్బంది పడుతున్న విద్యార్థినులకు ఆస్పత్రిలో చికిత్స అందించిన వైద్యులు ఆదివారం సాయంత్రానికి డిశ్చార్జి చేశారు. అయితే పాఠశాలలో వంట కోసం వినియోగించిన సరుకులు నాసిరకంగా ఉండటం, గడువు తీరిన పాలు, పెరుగు పదార్థాలను వినియోగించడం వల్లనే ఫుడ్ పాయిజన్ చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. పాఠశాలకు సంబంధించిన క్యాటరింగ్ కాంట్రాక్టర్ బయట నుంచి పాలు, పెరుగు డబ్బాలను కొనుగోలు చేసి విద్యార్థినులకు వడ్డిస్తున్నారు. ఈ క్రమంలో నిర్ణీత కాలం పాటు, రెండు, మూడు రోజుల్లోపే వినియోగించాల్సిన పాలు, పెరుగు డబ్బాలను ఎక్స్పైరీ తేదీ దాటినా వినియోగించడంతోపాటు ప్రధానంగా పెరుగన్నం తిన్న విద్యార్థినులు అస్వస్థతతకు గురైనట్లు తెలిసింది. భయంతో ఇంటిదారి.. ఫుడ్ పాయిజన్తో విద్యార్థినులు కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలతో ఆస్పత్రిలో చేరడంతో పాఠశాలలోని మిగతా విద్యార్థులు సైతం భయాందోళనకు గురయ్యారు. ఉయ్యాలవాడ బీసీ గురుకుల పాఠశాలలో 480 మంది విద్యార్థులతోపాటు మరో 360 మంది ఇంటర్మీడియట్ కళాశాల విద్యార్థులు చదువుతున్నారు. ఫుడ్ పాయిజన్తో 64 మంది ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకోగా, మరో 30 మంది వరకు భయాందోళనకు గురై జనరల్ ఆస్పత్రిలోని ఔట్ పేషెంట్ విభాగంలో చూయించుకున్నారు. విద్యార్థినులు ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన త ర్వాత కొంతమంది తల్లిదండ్రులతో కలిసి ఇంటికి వెళ్లిపోయారు.చాలామంది విద్యార్థులు భ యాందోళనలో ఉన్న కారణంగా వారి తల్లిదండ్రు లు తమ పిల్లలను ఇంటికి తీసుకెళ్లడం కనిపించింది. -
ఆరుగ్యారంటీలతో ప్రజలను వంచన చేశారు
గద్వాల: అధికారంలోకి రావటానికి అమలు సాధ్యపడని ఆరుగ్యారెంటీల పథకాల పేరుతో అధికారంలోకి వచ్చి తరువాత ప్రజలను వంచన చేశారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచంద్రరావు అన్నారు. ఆదివారం ఆయన గద్వాలలో పర్యటించారు. ముందుగా ఆయన ఉదయం పెద్ద అగ్రహారంలోని అహోబిలం నరసింహస్వామి దేవాలయంలో పూజలు చేసి అనంతరం ఎంపీ డీకేతో కలిసి ప్రైవేటు ఫంక్షన్ హాలులో జిల్లా కార్యకర్తల సమ్మేళనంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతుబంధు రూ.15వేలు ఇస్తామని రూ.6వేలకే సరిపెట్టారని, త్వరలో స్థానిక సంస్థలు రానున్నడంతో బీసీ రిజర్వేషన్, రైతుబంధు, రుణమాఫీ అంటూ మరోసారి ప్రజలను మోసం చేసేందుకు కాంగ్రెస్ నాయకులు యత్నిస్తున్నారన్నారు. నడిగడ్డ అభివృద్ధి చెందాలంటే అది బీజేపీతోనే సాధ్యమన్నారు. తెలంగాణలో డబుల్ఇంజిన్ సర్కార్ వస్తే అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందన్నారు. అన్ని వర్గాల సంక్షేమానికి కృషి : ఎంపీ డీకే అరుణ మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ మాట్లాడుతూ దేశంలో తిరుగులేని నాయకుడు భారత ప్రధాని నరేంద్రమోడీ అని కొనియాడారు. అన్ని వర్గాల సంక్షేమభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తూ ముందుకు వెళ్తున్నాడన్నారు. రైతులకు కిసాన్ సమ్మాన్ నిధులు, నిరుపేదలకు ఉచితంగా 6కిలోల బియ్యం, ఎరువులను సబ్సిడీ ధరలకు, రైతులకు గిట్టుబాటు ధరలు వంటి అనేక పథకాలు అమలు చేస్తుందన్నారు. ఈ విషయాలన్నింటినీ ప్రజల్లోకి తీసుకెళ్లి అవగాహన కల్పించాల్సిన అవసరముందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తుండడంతో నాయకులు, కార్యకర్తలు ప్రజల్లోకి వెళ్లి కేంద్రప్రభుత్వం చేస్తున్న సంక్షమాభివృద్ధి పథకాలు వివరించాలన్నారు. రాబోయే 2028లో రాష్ట్రంలో వచ్చేది ఖచ్చితంగా డబుల్ఇంజిన్ సర్కారు అని చెప్పారు. నడిగడ్డలో గడచిన పదకొండేళ్లల్లో అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందన్నారు. ఇప్పుడు అధికారంలో ఉన్న నాయకులు కేవలం కుర్చీలు, అధికారం కోసమే కొట్లాడుతున్నారని విమర్శించారు. అభివృద్ధిని పూర్తిగా గాలికొదిలేసి ఆదిపత్యం ప్రదర్శనలు చేస్తున్నారన్నారు. లోకల్బాడీ ఎన్నికల్లో సర్పంచులు, జట్పీటీసీలు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, మున్సిపాలిటీలను గెలుచుకుని బీజేపీ సత్తాచాటాలన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు డీకే ిస్నిగ్ధారెడ్డి, భరత్ప్రసాద్, అప్సర్పాషా, రామాంజనేయులు, బండల వెంకట్రాములు, రాంచంద్రారెడ్డి, అక్కలరమాదేవి, రజక జయశ్రీ, పద్మావతి, కృష్ణవేణి, శివారెడ్డి, రాజగోపాల్, జయలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచంద్రరావు -
కేసుల్లో పురోగతి సాధించాలి
● ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి ● జోగుళాంబ జోన్ డీఐజీ ఎల్ఎస్ చౌహాన్ గద్వాల క్రైం/ఎర్రవల్లి: కేసుల విచారణలో వీలైనంత త్వరగా పురోగతి సాధించి బాధితులకు న్యాయం అందేలా చర్యలు తీసుకోవాల్సిందిగా జోగుళాంబ జోన్ డీఐజీ ఎల్ఎస్ చౌహాన్ అన్నారు. శనివారం వార్షిక తనిఖీలో భాగంగా జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని, ఎర్రవల్లి మండలంలోని కోదండాపురం సిఐ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఎస్పీ శ్రీనివాసరావుతో శాంతిభద్రతల పరిరక్షణలో తీసుకున్న చర్యలు, సిబ్బంది పనితీరుపై, జిల్లాలోని అన్ని పోలీస్స్టేషన్లలో నమోదవుతున్న కేసులపై ఆరా తీశారు. ఎస్సీ, ఎస్టీ కేసులు, నిషేధిత మత్తు పదార్థాలు, నకిలీ విత్తనాలు తదితర వాటికి సంబంధించి వివరాలు వాకబు చేశారు. విధుల్లో సిబ్బంది ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా ఉపేక్షించేది లేదని, రెండు రాష్ట్రాల సరిహద్దుల వద్ద ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. జిల్లాకు ప్రవేశపెట్టిన బడ్జెట్ నుంచి ఇప్పటి వరకు చేసిన ఖర్చులు, వాటికి సంబంధించిన నివేదికలను పరిశీలించారు. అనంతరం జిల్లా సాయుధ బలగాల కార్యాలయం, గద్వాల రూరల్ పోలీసు స్టేషన్ డీఐజీ సందర్శించి స్టేషన్ సిబ్బందితో మాట్లాడారు. ● అదేవిధంగా కోదండాపురం సిఐ కార్యాలయం ఆవరణలో డీఐజీ, ఎస్పీ మొక్కలు నాటారు. ప్రతి పోలీస్శాఖ భూములలో, పోలీస్స్టేషన్ ఆవరణలో వనమహోత్సవంలో భాగంగా విరివిగా మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని డీఐజీ సూచించారు. సర్కిల్ పరిదిలోని అన్ని పీఎస్లలో డయల్ 100 కాల్ రాగానే వెంటనే ఆయా సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని సమస్యను పరిష్కరించేలా చూడాలన్నారు. అలాగే బ్లూకోర్ట్, పెట్రోల్ కార్ నిరంతరం గస్తీ నిర్వహించేలా ఆయా ఎస్ఐలు చర్యలు చేపట్టాలని సిఐ రవిబాబుకి సూచించారు. డీఐజీ వెంట ఎస్పీ శ్రీనివాసరావు, డీఎస్పీలు మొగిలయ్య, నరేందర్రావు, సీఐలు నాగేశ్వరెడ్డి, శ్రీను, టాటాబాబు, రవిబాబు, ఎస్ఐలు శ్రీకాంత్, కళ్యాణ్కుమార్ తదితరులు ఉన్నారు. జోగుళాంబ ఆలయ సన్నిధిలో డీఐజీ అలంపూర్: అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన అలంపూర్ జోగుళాంబ ఆలయాన్ని శనివారం డీఐజీ ఎల్ఎస్ చౌహాన్, ఎస్పీ శ్రీనివాస్రావు దర్శించుకున్నారు. ముందుగా ఆలయ అధికారులు, అర్చకులు వారికి ఘనస్వాగతం పలికారు. అనంతరం డీఐజీ, ఎస్పీ జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు వారికి తీర్థ ప్రసాదాలు అందజేసి వేద ఆశీర్వచనం పలికారు. వీరితోపాటు డీఎస్పీ మొగులయ్య, ఎస్ఐ వెంకటస్వామి తదితరులు ఉన్నారు. -
ప్రభుత్వ ఆదాయానికి గండి
అనమతులు లేకుండా భారీగా మట్టి తరలిస్తు అక్రమార్కులు ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నారు. ఒక టిప్పర్ వంటి వాహనాలకు ప్రభుత్వం నుంచి 19.5 మెట్రిక్ టన్నుల వరకు పాసింగ్ లోడ్ అనుమతులు ఉంటాయి. ఈ లెక్కన ఒక్కో టిప్పర్ మట్టి తరలింపునకు ప్రభుత్వానికి రూ.900 వరకు చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఇవేవి లేకుండానే మట్టి తరలింపులు చేస్తున్నారు. రోజుకు వందల సంఖ్యలో టిప్పర్ల ద్వార మట్టిని తరలిస్తుండటంతో ప్రభుత్వ ఖజానాకు చేరాల్సిన సొమ్ము అక్రమార్కుల జేబుల్లోకి వెళ్తుండటంతో స్థానికంగా ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. -
ఆగని మట్టి దందా..!
అనుమతుల్లేకుండానే ఎర్రమట్టి తరలింపు విజిలెన్స్ అధికారులు పరిశీలించినా.. ఎర్రమట్టి తరలింపుపై పత్రికల్లో వచ్చిన కథనాలకు స్పందించి ఇటీవల రాష్ట్ర విజిలెన్స్ అధికారులు ర్యాలంపాడు, సుల్తానాపురం గుట్టలను పరిశీలించారు. దీంతో కొన్ని రోజులు తాత్కాలికంగా నిలిచాయి. ఆ తర్వాత యథావిధిగానే మట్టి తరలింపులు కొనసాగిస్తున్నారు. గుట్టల నుంచి తరలిన మట్టి వివరాలు ఇవ్వాలని జిల్లా మైనింగ్ అధికారులను రాష్ట్ర విజిలెన్స్ అధికారులు కోరినట్లు సమాచారం. ఆ మేరకు జిల్లా మైనింగ్ అధికారులు 648 మెట్రిక్ టన్నుల మేర మట్టి తవ్వకాలు జరిగినట్లు విజిలెన్స్ అధికారులకు నివేదికలు ఇచ్చినట్లు తెలిసింది. కానీ స్థానికంగా మాత్రం ఈ నివేదికపై పలు విమర్శలు వినిపిస్తున్నాయి. 10 వేల మెట్రిక్ టన్నుల కంటే ఎక్కువగానే ఎర్రమట్టి తరలింపులు జరిగినట్లు స్థానికంగా చర్చకొనసాగుతుంది. అలంపూర్: ధనార్జనే ధ్యేయంగా అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. ప్రభుత్వ అనుమతులు లేకుండానే ప్రకృతి సంపదను కొల్లగొడుతున్నారు. అలంపూర్ మండలంలోని సుల్తానాపురం, ర్యాలంపాడులోని ప్రభుత్వ గుట్టలే లక్ష్యంగా గత కొన్ని నెలలుగా ఎర్ర మట్టి తరలింపులు కొనసాగుతున్నాయి. కనీస అనుమతులు లేకుండానే మట్టి తరలింపులు కొనసాగిస్తున్నారు. నియంత్రించాల్సిన మైనింగ్, రెవెన్యూ, పోలీస్శాఖల అధికారుల ముందే భారీ వాహనాల ద్వారా తరలింపులు జరుగుతున్నా కట్టడి చేయడానికి చేపట్టే చర్యలు శూన్యంగా కనిపిస్తున్నాయి. రాత్రింబవళ్లు మట్టి తరలింపులు సుల్తానాపురం గ్రామ శివారులోని 29/11 సర్వే నంబర్లోని గుట్టల నుంచి ఎర్రమట్టి తరలింపులు జోరుగా కొనసాగుతున్నాయి. ఎలాంటి అనుమతులు లేకుండానే రాత్రి పగలు అక్రమార్కులు ఎర్రమట్టిని తరలిస్తున్నారు. రోజుకు 50 నుంచి 60 టిప్పర్ల ద్వార మట్టిని ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. స్థానికంగా ఉన్న అధికారులు సైతం భారీ స్థాయిలో మట్టి తరలి వెళ్తున్నా.. చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. నియంత్రించాల్సిన అధికార యంత్రాంగం మిన్నకుండటంపై స్థానికులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్న అక్రమార్కులు మైనింగ్ అధికారుల నివేదికలపై స్థానికంగా చర్చ ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు అలంపూర్ మండలం ర్యాలంపాడు, సుల్తానాపురం గ్రామాల శివారు నుంచి ఎర్రమట్టి తరలింపునకు ఎలాంటి అనమతులు లేవు. అనుమతుల కోసం ఎవరూ మైనింగ్ శాఖను సంప్రదించలేదు. అక్రమంగా మట్టి తరలింపు చేస్తే చర్యలు తీసుకుంటాం. – సత్యనారాయణ, మైనింగ్ ఆర్ఐ -
సమయపాలన పాటించని వైద్యులకు నోటీసులు
గద్వాల: జిల్లాలోని పలు ఆస్పత్రుల్లో సమయపాలన పాటించని వైద్యులపై జిల్లా వైద్యాధికారి చర్యలకు ఉపక్రమించారు. జిల్లా ఆస్పత్రితోపాటు పలు పీహెచ్సీలను శుక్రవారం ‘సాక్షి’ విజిట్ చేయగా.. పలువురు వైద్యులు, సిబ్బంది విధులకు ఆలస్యంగా హాజరుకావడంతో రోగులు గంటల పాటు వైద్యం కోసం నిరీక్షించారు. దీనిపై ‘వైద్యం కోసం నిరీక్షణ’ శీర్షికన శనివారం ‘సాక్షిశ్రీలో కథనం ప్రచురితమైంది. దీంతో కథనానికి డీఎంహెచ్ఓ సిద్ధప్ప స్పందించారు. సమయపాలన పాటించని గట్టు, అయిజ, మల్దకల్, అలంపూర్, మానవపాడు, వడ్డేపల్లి, ఇటిక్యాల మండలాల పీహెచ్సీ మెడికల్ అధికారులకు నోటీసులు జారీ చేశారు. ఈమేరకు వివరణ కోరామని.. వారు ఇచ్చే వివరణల ఆధారంగా చర్యలు తీసుకుంటామని డీఎంహెచ్ఓ ‘సాక్షి’తో తెలిపారు. భారీ వర్షాలతో అప్రమత్తంగా ఉండాలి గద్వాల: జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నందున ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టి ఎలాంటి నష్టం వాటిల్లకుండా చూడాలని ఉమ్మడి జిల్లా ప్రత్యేక అధికారి జి.రవి అన్నారు. శనివారం కలెక్టర్ బీఎం సంతోష్తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ భారీ వర్షాలు కురుస్తున్నందున చెరువులు, కుంటలు, రిజర్వాయర్ల వద్ద ప్రత్యేక నిఘా ఉంచాలని, సీజనల్ వ్యాధులతోపాటు చికున్గున్యా, డెంగీ, మలేరియా వంటి వ్యాధులు ప్రబలకుండా అవసరమైన తక్షణ చర్యలు చేపట్టాలన్నారు. కలెక్టర్ బీఎం సంతోష్ మాట్లాడుతూ.. కృష్ణా, తుంగభద్ర నదీపరివాహారక ప్రాంతాల్లో ముందస్తు జాగ్రత్తలు చేపట్టామని, తాగునీరు కలుషితం కాకుండా పైప్లైన్ లీకేజీలను గుర్తించి వాటికి మరమ్మతులు చేపట్టామని, క్లోరినేషన్, పారిశుద్ధ్య పనులు చేపట్టడం జరిగిందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులు, జిల్లా ఆసుపత్రులను తనిఖీలు నిర్వహిస్తూ ప్రజలకు అవరమైన వైద్యసేవలు అందేలా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు వి.లక్ష్మీనారాయణ, నర్సింగ్రావు, డీఏవో సక్రియానాయక్, ఇరిగేషన్శాఖ ఈఈ శ్రీనివాస్రావు, ఆర్అండ్బీ ఈఈ ప్రగతి, డీపీవో నాగేంద్రం, డీఎస్వో స్వామికుమార్, ఉద్యావనశాఖ అధికారి అక్బర్, డీఎస్పీ మొగులయ్య తదితరులు పాల్గొన్నారు. జిల్లా ఆస్పత్రిలో అరుదైన శస్త్రచికిత్స గద్వాల క్రైం: జిల్లా ఆస్పత్రిలో అరుదైన శస్త్ర చికిత్స చేసినట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ ఇందిర తెలిపారు. జిల్లా కేంద్రానికి చెందిన ఓ మహిళ తీవ్ర కడుపునొప్పితో బాధపడుతూ రెండు రోజుల క్రితం ఆస్పత్రికి రాగా వైద్య పరీక్షలు నిర్వహించామని, వైద్యులు అన్ని పరీక్షు నిర్వహించగా హెర్నియా అని గుర్తించారన్నారు. సదరు మహిళ కొన్నేళ్లుగా దీని వల్ల బాధపడుతూ ఉన్నారన్నారు. ఈమేరకు శనివారం ఏడుగురితో కూడిన వైద్య బృందం నాలుగు గంటల పాటు శ్రమించి శస్త్ర చికిత్స చేశారన్నారు. ప్రస్తుతం మహిళ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందన్నారు. అలాగే, ప్రసవం కోసం వచ్చిన ఓ గర్భిణి ఆరోగ్య పరిస్థితి సైతం విషమంగా ఉండగా వైద్య బృందం శస్త్రచికిత్స చేశారని, తల్లీ బిడ్డ క్షేమంగా ఉన్నారన్నారు. శస్త్ర చికిత్సలో వైద్యులు విపంచి, కేచరి, విజయభాస్కర్, స్పందన, షఫి తదితరులు ఉన్నారన్నారు. -
‘నెట్టెంపాడు’ పెండింగ్ పనులు పూర్తిచేయాలి
సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు ఎర్రవల్లి: వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని కలెక్టర్ సంతోష్ అధికారులకు సూచించారు. శనివారం మండలంలోని కోండేర్ ఆరోగ్య ఉప కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి వైద్య సేవల గురించి ఆరా తీశారు. అనంతరం మాట్లాడుతూ.. సీజనల్ వ్యాధుల నియంత్రణ కొరకు గ్రామాల్లో నీరు నిలిచి ఉండే ప్రదేశాల్లో దోమలు పెరగకుండా కిరోసిన్ చల్లడం, దోమల మందు కొట్టడం, బ్లీచింగ్ పౌడర్, ఆయిల్ బాల్స్ వేయడం వంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. గతంలో అధిక కేసులు నమోదైన ప్రాంతాల్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. అత్యవసర పరిస్థితి ఏర్పడితే వెంటనే గర్భిణులను సురక్షితంగా జిల్లా ఆసుపత్రికి తరలించాలన్నారు. ప్రజలు కాచిన వేడి నీటిని తాగడంతో పాటు ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. అనంతరం గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల పురోగతిని క్షేత్రస్ధాయిలో పరిశీలించారు. కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శ్రీనివాస రావు, జిల్లా వైద్యాధికారి సిద్దప్ప, హౌసింగ్ డీఈ శ్రీనివాసులు, ఏఈ ప్రియాంక, ఎంపీడీఓ అజార్ మొహియుద్దీన్ పాల్గొన్నారు. గద్వాల: నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం పరిధిలో పెండింగ్లో ఉన్న భూసేకరణ ప్రక్రియ, నిలిచిన సివిల్వర్క్సను పూర్తి చేయాలని కలెక్టర్ బీఎం సంతోష్ ఇరిగేషన్ శాఖ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలులో పెండింగ్ పనులపై అధికారులతో సమీక్షించారు. నెట్టెంపాడు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కుడికాలువ పరిధిలో భూసేకరణ ప్రక్రియ చేయకపోవడంతో పనులు పెండింగ్లో ఉన్నాయన్నారు. 99బీ, 100 ప్యాకేజీల కింద చేయాల్సిన భూసేకరణ ప్రక్రియకు సంబంధించి ఆయా రైతులకు నోటీసులు ఇచ్చి వారి నుంచి భూసేకరణను పూర్తి చేయాలన్నారు. సేకరణ అనంతరం అక్కడ చేపట్టాల్సిన సివిల్వర్క్స్ పనులు వేగవంతంగా చేపట్టాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ వి.లక్ష్మీనారాయణ, ఎస్డీసీ శ్రీనివాస్రావు, ఇరిగేషన్శాఖ డీఈ, ఏఈలు, తహసీల్దార్ మల్లిఖార్జున్, నరేందర్ తదితరులు పాల్గొన్నారు. మాతృమరణాలు ఆపడమే లక్ష్యం.. ప్రభుత్వ ఆసుపత్రులలో మాతృమరణాలు సంభవించకుండా మెరుగైన వైద్యసేవలు అందించాలని.. వైద్యసిబ్బంది, ఆరోగ్య కార్యకర్తలు, ఆశాలు కలిసి సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ బీఎం సంతోస్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లో డీఎంహెచ్వో డాక్టర్ సిద్ధప్పతో కలిసి గట్టు, ఇటిక్యాల పీహెచ్సీల వైద్యులు, వైద్యసిబ్బందితో సమీక్షించారు. వైద్య సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని, ఆర్ఎంపీలు కేవలం ప్రాథమిక చికిత్సను మాత్రమే అందించాలన్నారు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు ఇవ్వరాదని ఒకవేళ ఇస్తే అలాంటి ఆర్ఎంపీలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. అయిజ మండలం బింగిదొడ్డి గ్రామంలో బాలింతకు ఆర్ఎంపీ డాక్టర్ ఎలాంటి జాగ్రత్తలు పాటించకుండా ఇంజక్షన్ చేయడంతో బాలింత మృతిచెందడం జరిగిందన్నారు. ఇందుకు సంబంధించిన ఆర్ఎంపీ డాక్టర్పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఆదేశించారు. సమావేశంలో ప్రోగ్రాం అధికారి డాక్టర్ ప్రసూనరాణి, డాక్టర్లు రమేష్, రాధిక, ఆరోగ్యశాఖ వైద్యసిబ్బంది తిరుమలేష్రెడ్డి, ఏఎస్వో నర్సయ్య హెల్త్అసిస్టెంట్లు, సూపర్వైజర్లు, ఆరోగ్యకార్యకర్తలు పాల్గొన్నారు. -
పెండింగ్ కేసుల పరిష్కారానికి కృషి
జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): వివిధ ప్రభుత్వ శాఖలలో పనిచేసి పదవీ విరమణ పొందిన ఉద్యోగుల పెండింగ్లో ఉన్న పెన్షన్, జీపీఎఫ్ ఫైనల్ విత్ డ్రాయల్ కేసుల సత్వర పరిష్కారానికి పెన్షన్ అదాలత్ నిర్వహించి పరిష్కరిస్తామని రాష్ట్ర ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ చందా పండిత్ అన్నారు. శుక్రవారం మహబూబ్నగర్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో అకౌంటెంట్ జనరల్ (ఏఅండ్ఈ), కలెక్టరేట్ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెన్షన్, జీపీఎఫ్ అదాలత్లో కలెక్టర్ విజయేందిరతో కలిసి ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు పెన్షన్లు, జీపీఎఫ్ అందజేతలో ఏమైనా సందేశాలు ఉంటే అదాలత్లో నివృత్తి చేసుకోవాలని సూచించారు. పదవీ విరమణ పొందిన ఉద్యోగుల పెన్షన్ పత్రాలు, సాధారణ భవిష్య నిధి పత్రాలు అందిన వెంటనే వాటిని పరిశీలించి మంజూరు ఉత్తర్వులు అందిస్తామన్నారు. ప్రభుత్వ శాఖలలో పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు పెన్షన్, జీపీఎఫ్ ఫైనల్ విత్ డ్రాయల్ ఉత్తర్వులు అందేలా ప్రత్యేక దృష్టిపెట్టామన్నారు. కలెక్టర్ విజయేందిర మాట్లాడుతూ పింఛన్ ప్రభుత్వ ఉద్యోగుల హక్కు, పదవీ విరమణ చేసిన రోజున ఉద్యోగులకు పెన్షన్ ఉత్తర్వులు అందేలా చూడాలన్నారు. అలాగే పెన్షన్ అదాలత్ ఏర్పాటు చేసి పెన్షన్ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కోరారు. కాగా.. పెన్షన్ అదాలత్లో 116 అధికారులు, 50 మంది పెన్షనర్లు, 28 మంది చందాదారులు పాల్గొన్నారు. మంజూరు పత్రాలు, ప్రొసీడింగ్స్ అందజేత.. ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్తో కలిసి కలెక్టర్ 20 మందికి పెన్షన్ మంజూరు పత్రాలు, 16 జీపీఎఫ్ ఆథరైజేషన్ ప్రొసీడింగ్స్లను రిటైర్డ్ ఉద్యోగులకు అందజేశారు. పదవీ విరమణ పొందనున్న ఉద్యోగులకు త్వరగా పేమెంట్ ఆర్డర్ అందజేతకు చర్యలు రాష్ట్ర ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ చందా పండిత్ -
వైద్యం కోసం నిరీక్షణ
ప్రభుత్వ ఆస్పత్రుల్లో సమయపాలన పాటించని వైద్యులు కలెక్టర్ హెచ్చరించినా.. రాష్ట్ర ప్రభుత్వం వైద్యారోగ్యశాఖపై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. ప్రధానంగా ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించాలని, అత్యవసర కేసులకు సంబంధించి వైద్యాన్ని సైతం అందుబాటులో ఉండి వైద్యసేవలు అందించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈక్రమంలోనే గురువారం కలెక్టర్ బీఎం సంతోష్ వైద్యారోగ్యశాఖ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఖచ్చితంగా సమయపాలన పాటించాలని లేనిపక్షంలో కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేశారు. అయితే హెచ్చరికలు జారీ చేసి 24గంటలు గడవకముందే కలెక్టర్ హెచ్చరికలు బేఖాతరు చేస్తూ తమకు అలవాటైన సమయంలో విధులకు హాజరు కావడం కొసమెరుపు. ప్రసవాలు, డయాలసిస్ సేవలు మెరుగు ఇదిలాఉండగా, జిల్లాలో అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలకు సంబంధించి రాష్ట్రంలోనే ఉత్తమ సేవలు అందిస్తున్నారు. 2024 ఏప్రిల్–2025 మార్చి వరకు 10 పీహెచ్సీలలో 2,540 సాధారణ ప్రసవాలు, జిల్లా ఆస్పత్రి, అలంపూర్, అలంపూర్ చౌరస్తాలోని ఆస్పత్రుల్లో 3,688 సాధారణ ప్రసవాలు చేసి రాష్ట్రంలోనే రెండవ స్థానంలో నిలిచారు. అదేవిధంగా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ రోగులకు ఉత్తమ సేవలందించడంతో రాష్ట్రంలోనే మూడో స్థానం సాధించారు.చిత్రంలో ఖాళీ కుర్చీ కనిపిస్తున్నది జిల్లా ఆస్పత్రిలోని సూపరింటెండెంట్ గది. ఉదయం 9 గంటలకు హాజరుకావాల్సిన అధికారి 9.48 గంటల వరకు హాజరుకాలేదు. జిల్లా ఆస్పత్రి వైద్యులు సైతం కొందరు 9.30 తర్వాత మరికొందరు 10 గంటల తర్వాత తీరిగ్గా రావడం కనిపించింది. ఆస్పత్రిలోని పరిసరాలు సైతం అపరిశుభ్రంగా దర్శనమిచ్చాయి. 150 పడకల సామర్థ్యం గల ఈ ఆస్పత్రికి జిల్లా నలుమూలల నుంచి పలువురు వైద్యం కోసం వచ్చారు. వైద్యులు సమయానికి రాకపోవడంతో వారికి ఎదురుచూపులు తప్పలేదు. ఇదిలాఉండగా, గతంలో వైద్యవిధానపరిషత్ కింద ఉన్న జిల్లా ఆస్పత్రి.. ప్రస్తుతం ప్రభుత్వ మెడికల్ కళాశాల వచ్చి మరింత మెరుగైన వసతులు కల్పించినప్పటికీ వైద్యులు, వైద్యసిబ్బంది తీరులో మాత్రం మార్పు రాలేదు. పాత ఆనవాయితీనే ఒంట పట్టించుకుని ఆలస్యంగా విధులు హాజరుకావడం కనిపించింది. రోగుల ఇబ్బందులు వైద్యం అందించాల్సిన వైద్యులు సమయపాలన పాటించకపోవడంవో వివిధ రకాల రోగాలతో వైద్యం కోసం వచ్చిన రోగులు ఆసుపత్రి ఆవరణలలో నిరీక్షిస్తూ కనిపించారు. ప్రధానంగా 24గంటల పాటు వైద్యసేవలు అందించే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలైన అయిజ, గట్టు, వడ్డేపల్లి, మానవపాడు, క్యాతూరు, ఉప్పేరు ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలలో వైద్యులు, వైద్య సిబ్బంది 10గంటలకు విధులకు హాజరు కావడం కనిపించింది. దీంతో ఆయా ఆసుపత్రులలో వైద్యం కోసం వచ్చిన రోగులు వైద్యుల కోసం పడిగాపులు కాస్తూ కనిపించారు. జిల్లా ఆస్పత్రిలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. గద్వాల/సాక్షి నెట్వర్క్: ‘వైద్యో నారాయణ హరి’.. వైద్యులు దేవుళ్లతో సమానమని అర్థం. కానీ, కొందరు ప్రభుత్వ ఆస్పత్రుల వైద్యుల నిర్వాకం వల్ల ఈ అర్థాన్నే పూర్తిగా మార్చేశారు. ఆలస్యంగా విధులకు హాజరుకావడం.. కలెక్టర్ ఆదేశాలు సైతం బేఖాతరు చేయడం పరిపాటిగా మారింది. ప్రభుత్వాలు వైద్యశాఖలో పలు సంస్కరణలు తీసుకొచ్చి ఎప్పటికప్పుడు రోగులకు మెరుగైన వైద్యం అందించే దిశగా చర్యలు చేపడుతున్నా.. అమలు చేయాల్సిన వైద్యులు మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. దీంతో ఎన్నో ఇబ్బందుల నడుమ వైద్యం కోసం వచ్చిన రోగులు గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. జిల్లాలోని అన్ని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, జిల్లా ఆస్పతిలో వైద్యులు, వైద్య సిబ్బంది ఉదయం 10 గంటల తర్వాతే విధులు హాజరుకావడం గమనార్హం. చాలా చోట్ల అత్యవసర వైద్యం కోసం జిల్లా కేంద్రం, అక్కడ కాకపోతే కర్నూల్, హైదరాబాద్కు పోవాల్సిన పరిస్థితి దాపురించింది. శుక్రవారం జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు, జిల్లా ఆస్పత్రిని ‘సాక్షి’ విజిట్ చేసినపుడు పలు విషయాలు వెలుగు చూశాయి. అందుకు సంబంధించిన పూర్తి వివరాలు.. 10 పీహెచ్సీలు, రెండు టీవీవీపీ, ఒక జీజీహెచ్.. జిల్లా వ్యాప్తంగా ప్రజలకు వైద్యం అందించేందుకు మొత్తం 10 ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలున్నాయి. జిల్లా కేంద్రంలో జిల్లా ఆస్పత్రి, అలంపూర్, అలంపూర్చౌరస్తాలో ప్రభుత్వ వైద్యవిధానపరిషత్ ఆస్పత్రులు ఉన్నాయి. జిల్లాలో మొత్తం జనాభా సుమారు 6లక్షల వరకు ఉండగా, అన్ని మండలాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ప్రతిరోజు వెయ్యికి పైగా వివిధ రోగాలకు సంబంధించి వైద్యం కోసం అవుట్ పేషంట్లుగా వెళ్తుంటారు. ఇందులో సుమారు 200మందికి పైగా ఇన్పేషంట్లు చేరుతుంటారు. అదేవిధంగా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రతిరోజు సుమారు 800మంది అవుట్పేషంట్లు వస్తుండగా.. 150మంది వరకు ఇన్పేషంట్లుగా చేరుతుంటారు. చిత్రంలో కనిపిస్తున్నది అయిజ పీహెచ్సీ. ఉదయం 10.30 గంటలు అయినా కూడా ఇద్దరు మెడికల్ ఆఫీసర్లు (డాక్టర్లు), ఫార్మసిస్టు విధులకు హాజరుకాలేదు. అయిజ మండలంతోపాటు గట్టు, మల్దకల్, వడ్డేపల్లి మండలాల నుంచి అధికంగా గర్భిణులు వైద్యం కోసం వచ్చారు. అలాగే, కుక్కకాటు వ్యాక్సిన్ నిమిత్తం మరో ఇద్దరు అక్కడికి చేరుకున్నారు. కానీ, 9 గంటలకు విధులు హాజరుకావాల్సిన వైద్యులు గంటన్నర ఆలస్యమైనా రాకపోవడంతో అటు గర్భిణులు, ఇటు ఇతర రోగులకు ఎదురుచూపులు తప్పలేదు. వైద్యులు సమయపాలన పాటించి మెరుగైన వైద్యం అందిస్తే బాగుంటుందని అక్కడికి వచ్చిన రోగులు, వారి బంధువులు పేర్కొన్నారు. 10 గంటల తర్వాతే విధులకు హాజరు రోగులకు తప్పని పడిగాపులు జిల్లా ఆస్పత్రిలోనూ అదేతీరు కలెక్టర్ హెచ్చరికలు సైతం బేఖాతరు ‘సాక్షి’ విజిట్లో వెలుగుచూసిన వైనం సమయపాలన పాటించకుంటే చర్యలు వైద్యులు సమయపాలన పాటించకపోతే వారిపై తప్పకుండా శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ సిద్దప్ప తెలిపారు. అదేవిధంగా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ ఇందిర మాట్లాడుతూ గతంలో పేషంట్లు ఉదయం 10గంటలకు ఓపీకి వస్తుండడంతో వైద్యులు కూడా అదే సమయంలో రావడం అలవాటైందని, ఇక మీదట ఉదయం 9గంటలకు ఖచ్చితంగా విధులకు హాజరయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు. -
మహిళా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
ధరూరు: మహిళా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇదిరా మహిళా శక్తి, రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యేతోపాటు కలెక్టర్ బీఎం సంతోష్ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం మహిళల ఆర్థిక, సామాజిక సాధికారతకే ప్రాధాన్యతనిస్తోందని, కోటి మందిని కోటీశ్వరులను చేయాలని ప్రభుత్వం లక్ష్యమన్నారు. ప్రమాద బీమా, రుణ బీమా కల్పనతో పాటు మహిళా స్వయం సహాయక సంఘాలకు ఆర్టీసీ బస్సులు, పాఠశాలల నిర్వహణ, పెట్రోలు బంకులు, స్కూల్ యూనిఫాం తయారీ, వరి ధాన్యం కొనుగోలు నిర్వహణ వంటి అనేక అవకాశాలను కల్పిస్తుందని, ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకుని ఆర్థికంగా రాణించాలన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ.. మండలంలో మొత్తం 632 సంఘాల్లో 7వేల మంది మహిళలు ఉన్నారని, ఇంకా అనేక మంది సభ్యులుగా చేరాలని అన్నారు. మండలానికి మంజూరైన 800 ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి త్వరగా నిర్మాణ పనులు పూర్తి చేసుకోవాలని సూచించారు. మండలానికి కొత్తగా 600లకు పైగా రేషన్ కార్డులు మంజూరి కావడం జరిగిందన్నారు. అనంతరం మహిళా సంఘాల సభ్యులకు రూ.4.70 కోట్ల బ్యాంకు రుణాల చెక్కులను, రూ.49.41 కోట్ల వడ్డీ లేని రుణాల చెక్కులను, కొత్త రేషన్ కార్డులను అందజేశారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ హనుమంతు, బండారి భాస్కర్, కృష్ణారెడ్డి, సుదర్శన్రెడ్డి పాల్గొన్నారు. గద్వాల మార్కెట్యార్డు అభివద్దికి కృషి గద్వాల వ్యవసాయం: గద్వాల మార్కెట్ యార్డు అభివృద్ధికి చిత్తశుద్దితో కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి అన్నారు. శుక్రవారం యార్డులో రూ.3 కోట్ల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్లు, డ్రైనేజీ, కాంపౌడ్వాల్ నిర్మాణాల పనులకు భూమిపూజ నిర్వహించి, పనులు ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. యార్డు రాష్ట్రంలోనే ప్రసిద్దిగాంచిందని, ఏడాదిపొడవున పంట ఉత్పత్తుల క్రయవిక్రయాలు జరుగుతుంటాయన్నారు. ఇక్కడికి వచ్చే రైతులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. అనంతరం దడవాయిలు, హమాలీలు, చాటకూలీలకు దుస్తులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో డీసీసీబీ ఉమ్మడి జిల్లా డైరెక్టర్ సుభాన్, జిల్లా మార్కెటింగ్ అధికారి పుష్ప. యార్డు కార్యదర్శి నర్సింహులు, యార్డు వైస్ చైర్మన్ శ్రీకాంత్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఉద్యాన పంటల సాగుతో అధిక లాభాలు
ఇటిక్యాల: రైతులు ఉద్యాన పంటలను సాగు చేసి అధిక లాభాలు పొందవచ్చునని జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ అధికారి అక్బర్ అన్నారు. శుక్రవారం మండలంలోని మునగాలలో రైతు కుర్వ మల్లేష్ సాగుచేస్తున్న కూరగాయల పంటలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు అధిక ఆదాయం ఇచ్చే కూరగాయలు, ఆయిల్పాం పంటలపై ప్రత్యేక దృష్టి సారించాలని, కూరగాయల సాగుకు ప్రభుత్వం వివిధ పధకాల నుంచి రాయితీని అందిస్తుందన్నారు. కలుపు సమస్య లేకుండా నీటిని ఆదా చేసుకుంటూ ప్లాస్టిక్ మల్చింగ్ పథకానికి 50 శాతం రాయితీ లభిస్తోందన్నారు. ఒక హెక్టార్కు రూ.20 వేల చొప్పున ఒక్కో రైతుకు రెండు హెక్టార్ల వరకు అందిస్తామని, అదే విధంగా తీగజాతి కూరగాయలు బీర, కాకర, సొరకాయ సాగు రైతులకు శాశ్వత పందిళ్ల నిర్మాణానికి అర ఎకరానికి రూ. 50 వేలు రాయితీని కల్పించబడుతుందని అన్నారు.కార్యక్రమంలో డివిజినల్ ఉద్వాన అధికారి రాజశేఖర్, సిబ్బంది ఇమ్రానా, మహేష్, రైతులు,తదితరులు పాల్గొన్నారు. రైతులకు ఇబ్బందులు కలిగిస్తే చర్యలు ధరూరు: మండల కేంద్రంతో పాటు మండల పరిదిలోని ఆయా గ్రామాల్లోని ఫర్టిలైజ్ దుకాణాలను జిల్లా యవసాయ శాఖ అధికారి సక్రియా నాయక్ తనిఖీ చేవారు. శుక్రవారం ఆయన చింతరేవుల, మాల్దొడ్డి, గుడ్డెందొడ్డి, నెట్టెంపాడు తదితర గ్రామాల్లో ఏఓ శ్రీలతతో కలిసి తనిఖీలు చేశారు. ఈసందర్భంగా మాట్లాడుతూ.. రైతుల ఆధార్కార్డులు తీసుకుని అవసరమైన మందులు ఇవ్వాలని, వారికి ఇబ్బందులు కలగకుండా యూరియాను అందించాలని, గట్టి మందులను అంటగట్టే ప్రయత్నం చేయొద్దని హెచ్చరించారు. నిర్ణీ త ధరలకే అమ్మకాలు జరపాలని, అధిక ధరలకు విక్రయించినట్లు రైతుల నుంచి ఫిర్యాదులు వస్తే చట్టరిత్యా చర్యలు తీసుకుంటామని, ప్రతి కొనుగోలుకు సంబంధించి రషీదు అందించాలన్నారు. స్టాక్, ధరల పట్టికకు సంబంధించి బ్లాక్ బోర్డులను ఏర్పాటు చేయాలని, రైతులకు ఏవైనా ఇబ్బందులు ఉంటే తమకు సమాచారం ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో పర్టిలైజర్ డీలర్లు, ఏఈఓలు పాల్గొన్నారు. -
జములమ్మ హుండీ ఆదాయం రూ.29 లక్షలు
గద్వాలన్యూటౌన్: గద్వాల ప్రాంతంలో ప్రసిద్ధిగాంచిన జములమ్మ ఆలయ హుండీని శుక్రవారం లెక్కించారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిశీలకురాలు వెంకటేశ్వరి, ఆలయ ఈఓ పురంధర్కుమార్, చైర్మన్ వెంకట్రాములు యూనియన్ బ్యాంక్ అధికారుల సమక్షంలో భక్తులు నాలుగు నెలలకుగాను హుండీ లెక్కింపు నిర్వహించారు. హుండీ ద్వారా నగదు రూ. 29.34లక్షలతో పాటు అర కేజీ మిశ్రమ వెండి ఆలయానికి ఆదాయంగా సమకూరింది. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. వేరుశనగ క్వింటా రూ.5560 గద్వాల వ్యవసాయం: గద్వాల మార్కెట్ యార్డ్కు శుక్రవారం 723 క్వింటాళ్ల వేరుశనగ వచ్చింది. ధరల విషయానికి వస్తే గరిష్టం రూ.5560, కనిష్టం రూ. 2270, సరాసరి రూ. 4910 ధర పలికాయి. అయిజలో మార్కెట్ యార్డు ఏర్పాటు చేయండి అలంపూర్: అయిజలో కొత్త మార్కెట్ యార్డు ఏర్పాటు చేయాలని వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డిని ఏఐసీసీ కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ కోరారు. హైదరాబాద్లో శుక్రవారం ఆయనను కలిసి కొత్త మార్కెట్ యార్డు ఏర్పాటు చేయాలని వినతి పత్రం అందజేసినట్లు తెలిపారు. నియోజకవర్గంలో ప్రస్తుతం ఒక మార్కెట్యార్డు మాత్రమే ఉందని, కొత్తగా వచ్చిన నిబంధనల మేరకు మరొక మార్కెట్ యార్డు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. అయిజ పెద్ద మండలం కావడంతో ఈ ప్రాంతంలో ఉన్న రైతులు ఏపీలోని కర్నూల్, ఎమ్మిగనూరు, కర్ణాటకలోని రాయచూరుకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొన్నట్లు తెలిపారు. ఈ ప్రాంత రైతులకు ప్రయోజనం జరిగే విధంగా కొత్త మార్కెట్ యార్డును అందుబాటులోకి తేవాలన్నారు. కొత్త మార్కెట్ యార్డు అందుబాటులోకి వస్తే రైతులకు ఎంతో ప్రయోజనం చేకురుతుందన్నారు. అనంతరం చైర్మన్ కోదండరెడ్డిని ఏఐసీసీ కార్యదర్శి శాలువాతో సత్కరించారు. వీరితోపాటు కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి షేక్షావలి ఆచారి, నాయకులు శ్రీరాంరెడ్డి, గోపాల్ రెడ్డి తదితరులు ఉన్నారు. రాష్ట్ర నీటి హక్కుల కోసం జంగ్ సైరన్ అలంపూర్: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాష్ట్ర నీటి హక్కుల కోసం జంగన్ సైరన్ మోగించారని బీఆర్ఎస్వి జిల్లా కో–ఆర్డీనేటర్ కుర్వ పుల్లయ్య అన్నారు. అలంపూర్, అలంపూర్ చౌరస్తా, మానవపాడులోని కళాశాలలో బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో శుక్రవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కో–ఆర్డినేటర్ మాట్లాడుతూ.. గోదావరి నదిలో జరుగుతున్న జల దోపిడీని అడ్డుకుందామని, ఏపీ సీఎం చంద్రబాబునాయుడుకు వత్తాసు పలుకుతున్న రేవంత్రెడ్డి కుట్రలను తిప్పికొడదామన్నారు. కేసీఆర్ సారథ్యంలో నీళ్లు, నిధులు, నియామకాలే ఏజెండాగా తెలంగాణ ఉద్యమం జరిగిందన్నారు. రాష్ట్ర సాధన సాకరమైన తర్వాత బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ పచ్చని మణిహారంగా మారిందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత జల దోపిడీ కొనసాగుతుందన్నారు. ఏపీ సీఎం గోదావరి నుంచి అక్రమంగా 200 టీఎంసీల నీటిని తరలించే కుట్ర జరుగుతుందని ఆరోపించారు. సీఎం రేవంత్రెడ్డి అడ్డుకోవడానికి బదులు సహకరించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. గోదావరి, కృష్ణా నదుల యాజమాన్య బోర్డులు, కేంద్ర జల సంఘం అనుమతులు లేకుండా, అపెక్స్ కౌన్సిల్లో చర్చ జరగకుండా ప్రాజెక్టులు నిర్మించరాదన్నారు. దీనికి వ్యతిరేకంగా విద్యార్థులు ఉద్యమించాలని కేసీఆర్ దిశానిర్ధేశం చేశారన్నారు. అలాగే, విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్వి నాయకులు మద్దిలేటి, బాలరాజు, మాధవ్, యువరాజ్, రేపల్లె చిన్న, రాజు పాల్గొన్నారు. -
కమనీయం.. రాములోరి కల్యాణం
ఎర్రవల్లి: శ్రీరాముడి జన్మనక్షత్రమైన పునర్వసు నక్షత్రాన్ని పురస్కరించుకొని బీచుపల్లి క్షేత్రంలోని కోదండరామస్వామి ఆలయంలో గురువారం సీతారాముల కల్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు భువనచంద్ర, దత్తుస్వాముల ఆధ్వర్యంలో సీతారాముల ఉత్సవమూర్తులను ముస్తాబుచేసి.. వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ కల్యాణం జరిపించారు. రాములోరి కల్యాణాన్ని భక్తులు కనులారా తిలకించి తన్మయం చెందారు. అదే విధంగా అమావాస్య సందర్భంగా బీచుపల్లి అభయాంజనేయస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. వివిధ ప్రాంతాల నుంచి కుటుంబ సమేతంగా తరలివచ్చిన భక్తులు కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించి అంజన్న దర్శనానికి క్యూ కట్టారు. ఆలయ పాలక మండలి ఆధ్వర్యంలో భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ రామన్గౌడ్, మేనేజర్ సురేందర్రాజు తదితరులు పాల్గొన్నారు. -
ప్రజలతో స్నేహపూర్వకంగా మెలగాలి : ఎస్పీ
గద్వాల క్రైం: వివిధ సమస్యలపై పోలీస్స్టేషన్కు వచ్చే ప్రజలతో సిబ్బంది స్నేహ పూర్వకంగా మెలగాలని ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని పట్టణ పోలీస్స్టేషన్లో ఎస్పీ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పోలీసు సిబ్బందికి ఆయన పలు సూచనలు చేశారు. .. బాధితుల ఫిర్యాదు మేరకు కేసుల నమోదులో నిర్లక్ష్యం చేయొద్దన్నారు. ఫిర్యాదులపై వేగవంతంగా విచారణ చేపట్టి బాధితులకు పోలీసుశాఖపై నమ్మకం పెంచాలని సూచించారు. పట్టణంలో నిత్యం గస్తీ, పెట్రోలింగ్ నిర్వహించాలని ఆదేశించారు. సైబర్ క్రైమ్స్, మహిళలపై వేధింపులు, లైంగిక దాడులు, మిస్సింగ్ కేసులపై ప్రత్యేక దృష్టిసారించాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. స్టేషన్ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. అనంతరం జిల్లా కేంద్రంలో సీసీ కెమెరాల పనితీరుపై ఆరా తీశారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించే సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎస్పీ వెంట సీఐ శ్రీను, ఎస్ఐ కళ్యాణ్కుమార్ ఉన్నారు. -
లక్ష్యం.. నిర్దేశం
ఆర్థికంగా చేయూత.. ప్రతి ఆర్థిక సంవత్సరంలో వివిధ రంగాల్లో అర్హులైన లబ్ధిదారులకు రుణాలు అందించి.. ఆర్థికంగా చేయూత అందించడంతో పాటు పరోక్షంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు జిల్లా లీడ్ బ్యాంక్ అధికారులు వార్షిక రుణ ప్రణాళిక రూపొందించారు. ఇటీవల కలెక్టర్ అధ్యక్షతన జరిగిన డీసీసీ సమావేశంలో 2025–26 ఆర్థిక సంవత్సర రుణ ప్రణాళికను ఖరారు చేశారు. అయితే 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వివిద రంగాల్లో లబ్ధిదారులకు దాదాపు రూ. 5వేల కోట్ల రుణాలు అందించాలని లక్ష్యంగా నిర్దేశించగా.. ఇందులో 90శాతం పైగా అందించారు. ● విద్య, వ్యవసాయం, వ్యాపారాలు, గృహనిర్మాణాలకు ఆర్థిక తోడ్పాటు ● జిల్లాలో 2,01,300 మందికి రూ. 6472.29 కోట్లు అందించేలా కార్యాచరణ ● లక్ష్యం మేరకు రుణాలు అందిస్తేనే ప్రయోజనం జిల్లాలో రుణ లక్ష్యం ఇలా.. ●టార్గెట్ మేరకు.. 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అర్హులైన లబ్ధిదారులకు లక్ష్యం మేరకు రుణాలు అందించాం. ఇటీవల జరిగిన డీసీసీ సమావేశంలో 2025–26 వార్షిక రుణ ప్రణాళికను ఆమోదించారు. ఆయా రంగాలకు ఉన్న అవసరం మేరకు రుణ లక్ష్యాలను నిర్దేశించాం. ఆయా రంగాల్లో అర్హులైన లబ్ధిదారులకు రుణాలు అందేలా చర్యలు తీసుకుంటాం. – శ్రీనివాసరావు, ఎల్డీఎం గద్వాలన్యూటౌన్: జిల్లాలో వివిధ రంగాలు, వాటి విభాగాలకు 2025–26 సంవత్సరం అందించాల్సిన రుణాలపై వార్షిక ప్రణాళిక ఖరారైంది. విద్య, వ్యవసాయం, అనుబంధ రంగాలు, గృహనిర్మాణాలు, వివిధ వ్యాపారాలు, సంస్థల నిర్వహణకు అవసరమైన రుణాలను బ్యాంకుల ద్వారా అందించేందుకు పక్కా ప్రణాళిక రూపొందించారు. ఆయా రంగాల్లోని విభాగాల్లో 2,01,300 మంది లబ్ధిదారులకు రూ. 6472.29 కోట్ల రుణాలు అందించాలని లక్ష్యంగా నిర్దేశించారు. ● జిల్లాలో గోదాములు, శీతలీకరణ కేంద్రాల ఏర్పాటు చేయాల్సిన అవసరముంది. వీటి నిర్మాణాల కోసం అవసరమైన వారికి రుణాలు అందించి.. ప్రోత్సహించాల్సిన బాధ్యత బ్యాంకర్లపై ఉంది. ఏళ్ల తరబడి పాడిని నమ్ముకొని జీవనం సాగిస్తున్న రైతులకు విరివిగా రుణాలు అందిస్తేనే జిల్లాలో పాలు, పాలపదార్థాల ఉత్పత్తి పెరిగి.. రైతుల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ● ఇక పౌల్ట్రీ రంగంపై ఎంతో మంది ఔత్సాహికులు ఉన్నప్పటికీ తగినంత పెట్టుబడి లేక ముందుకు రాలేకపోతున్నారు. ఇలాంటి వారికి రుణాలు అందించి.. పౌల్ట్రీ రంగాన్ని జిల్లాలో అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. ● జిల్లాకు చెందిన చాలా మంది విద్యార్థులు, యువత ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లాలని ఉన్నా.. ఆర్థిక పరిస్థితుల కారణంగా వెళ్లలేకపోతున్నారు. ఇలాంటి విద్యార్థులు, యువతకు బ్యాంకర్లు రుణాలు అందిస్తేనే వారు ఉన్నత చదువులు చదుకొని అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలుతారు. జిల్లాలో ఇదీ పరిస్థితి.. వ్యవసాయ ఆధారిత జిల్లా అయిన నడిగడ్డ రెండు జీవనదుల నడుమ ఉంది. జిల్లాలో మొత్తం 1,76,860 మంది రైతులు ఉండగా.. వీరిలో 90శాతం సన్న, చిన్నకారు రైతులే ఉన్నారు. రైతుభరోసా, కిసాన్ సమ్మాన్ యోజన లాంటి పెట్టుబడి సాయం పథకాలు ఉన్నప్పటికీ రైతులకు అన్ని అవసరాలు తీరడం లేదు. వారంతా బ్యాంకులు అందించే పంట రుణాలపైనే ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారు. రైతులకు సకాలంలో పంట రుణాలు అందిస్తేనే ప్రయోజనం చేకూరుతుంది. ● ఇక సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థల స్థాపనను ప్రోత్సహించాల్సిన ఆవశ్యకత ఉంది. స్థానికంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేక చాలా మంది నిరుద్యోగ యువత ఇతర ప్రాంతాలకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో సంస్థల స్థాపనకు ముందుకొచ్చే వారికి రుణాలు అందించడం వల్ల నిరుద్యోగ సమస్య కాస్త తగ్గుతుంది. పునరుత్పాదక రంగానికి రుణాలు అందించి చేయూతనివ్వాలి. ● మధ్యతరగతి కుటుంబాలకు సొంతింటి కల నెరవేర్చుకోవాలని ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో గృహనిర్మాణానికి అవసరమైన వస్తువుల ధరలు బాగా పెరిగాయి. గృహనిర్మాణానికి చేతినిండా డబ్బు ఉంటేనే సాధ్యపడుతుంది. ఈ నేపథ్యంలో బ్యాంకుల ద్వారా రుణాలు పొంది గృహాలు నిర్మించుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే చాలా మందికి గృహనిర్మాణ రుణాలు పొందడంలో ఇక్కట్లు పడుతున్నారు. అర్హులైన వారికి రుణాలు అందించాల్సిన అవసరం ఉంది. వార్షిక రుణ ప్రణాళిక ఖరారు -
ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యం
గద్వాల: ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే ప్రజలకు వైద్యులు అందుబాటులో ఉండి మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్ బీఎం సంతోష్ ఆదేశించారు. గురువారం ఐడీఓసీ కాన్ఫరెన్స్ హాలులో సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం వైద్యరంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటుందన్నారు. ముఖ్యంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఓపీ శాతం ఎక్కువగా ఉండేలా సేవలు అందించాలని సూచించారు. వైద్యులతో పాటు సిబ్బంది సమయపాలన పాటిస్తూ.. బయోమెట్రిక్ విధానాన్ని తప్పనిసరిగా అమలు చేయాలన్నారు. జిల్లా ఆస్పత్రితో సహా సీహెచ్సీలు, పీహెచ్సీల్లో ప్రసవాల సంఖ్య పెంచేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. సాధారణ ప్రసవాలకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ప్రస్తుతం సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. టీబీ ముక్త్భారత్లో భాగంగా క్షయవ్యాధి నిర్మూలనకు చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు. సమావేశంలో డీఎంహెచ్ఓ డా.సిద్ధప్ప, ప్రోగ్రాం అధికారులు హెల్త్ సూపర్వైజర్లు ఉన్నారు. ఉన్నతస్థాయిలో నిలిపేది చదువే.. గద్వాలటౌన్: జీవితంలో ఉన్నత స్థితికి చేరాలంటే చదువు ఎంతో ముఖ్యమని.. క్రమశిక్షణ, జిజ్ఞాసతో కూడిన విద్య నేర్చుకున్నప్పుడే సమాజాభివృద్ధి సాధ్యమవుతుందని కలెక్టర్ సంతోష్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థులకు హెల్పింగ్ హ్యాండ్స్ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో ఉచితంగా స్టడీ మెటీరియల్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. చదువును కష్టంగా భావించకుండా ఇష్టంగా చదివితేనే అద్భుతాలు సృష్టిస్తారన్నారు. ప్రతి విద్యార్థి వ్యక్తిత్వాన్ని వికసింపజేసుకోవాలని సూచించారు. విద్యార్థులను లక్ష్యసాధన దిశగా ప్రోత్సహించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదేనని అన్నారు. పదో తరగతి విద్యార్థులు పాఠ్యాంశాలపై పట్టు సాధించి ఉత్తమ ఫలితాలు సాధించాలన్నారు. కాగా, కామన్వెల్త్ ఆఫ్ నేషన్స్, హార్ట్ఫుల్ నెస్ ఎడ్యుకేషన్ ట్రస్టు నుంచి ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలకు ప్రశంసలు రావడంపై ఉపాధ్యాయ బృందాన్ని కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో ట్రస్టు వ్యవస్థాపకురాలు మమత, రత్నసింహారెడ్డి, ఎంఈఓ శ్రీనివాస్గౌడ్, హెచ్ఎం రేణుకాదేవి, కృష్ణకుమార్, మహేశ్వర్రెడ్డి, కృష్ణవర్ధన్రెడ్డి పాల్గొన్నారు. వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించాలి సాధారణ ప్రసవాల సంఖ్య పెంచాలి కలెక్టర్ బీఎం సంతోష్ -
పాలమూరులో పోకిరీలు
మహమ్మదాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన 15 ఏళ్ల బాలికపై జీలకరపురం కృష్ణయ్య లైంగిక దాడి చేయడంతో 376(2) ఐపీసీతో పాటు పోక్సో యాక్ట్ కింద కేసులు నమోదయ్యాయి. దీనిపై చార్జీషీట్ దాఖలు చేసి కోర్టులో హాజరుపరచగా ఈ నెల 17న ప్రత్యేక సెషన్స్ కోర్టు న్యాయమూర్తి నిందితుడు కృష్ణయ్యకు జీవితఖైదుతోపాటు రూ.10 వేల జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చారు. ●అవగాహన కల్పిస్తున్నాం.. జిల్లాలో షీటీం బృందాలు విద్యార్థినులు, అమ్మాయిలను వేధిస్తున్న ఆకతాయిలను అదుపులోకి తీసుకుని వారి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు. ఘటనలు తీవ్రంగా ఉంటే కేసులు నమోదు చేస్తున్నాం. అన్ని రకాల పాఠశాలల్లో పోక్సో, అమ్మాయిల రక్షణ, గుడ్ టచ్– బ్యాడ్ టచ్, ఈవ్ టీజింగ్ వంటి వాటిపై అవగాహన కల్పిస్తున్నాం. అమ్మాయిలు సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ డిఫెన్స్ వంటివి మెరుగుపరుచుకోవాలి. సోషల్ మీడియా వల్ల జరుగుతున్న నష్టాలపై చైతన్యం చేస్తున్నాం. – జానకి, ఎస్పీ, మహబూబ్నగర్ అండగా సఖి కేంద్రం.. వివిధ రూపాల్లో దాడులకు గురైన మహిళలకు సఖి కేంద్రం అండగా ఉంటుంది. మైనర్లపై అత్యాచారాలు, లైంగిక దాడులు, పరువు హత్యలు, యాసిడ్ దాడులు, వరకట్నం వంటి అన్ని రకాల వేధింపుల నుంచి రక్షించడానికి కృషి చేస్తోంది. 18 ఏళ్ల లోపు బాలికలతో పాటు మహిళలకు ఏదైనా సమస్య వస్తే సఖి కేంద్రాన్ని ఆశ్రయిస్తారు. అలాగే టోల్ఫ్రీ నం.181కు ఫోన్ చేసి సమస్యను చెప్పవచ్చు. – సౌజన్య, సఖి కేంద్రం కో–ఆర్డినేటర్, మహబూబ్నగర్ 2022 నుంచి ఉమ్మడి జిల్లాలో నమోదైన పోక్సో కేసులు జిల్లా నమోదైన కేసులు 2022 2023 2024 2025 (జూన్) మహబూబ్నగర్ 133 116 133 69 వనపర్తి 47 46 54 42 జోగుళాంబ గద్వాల 74 73 51 36 నాగర్కర్నూల్ 86 91 105 45 నారాయణపేట 50 42 80 39 -
అధిక ధరలకు ఎరువులు విక్రయిస్తే చర్యలు
అలంపూర్: ఎరువులను అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తప్పవని జిల్లా వ్యవసాయశాఖ అధికారి సక్రియా నాయక్ అన్నారు. అలంపూర్ చౌరస్తాలోని ఎరువుల విక్రయ కేంద్రాల్లో గురువారం ఆయన ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పలు రికార్డులతో పాటు ఎరువుల స్టాక్ను పరిశీలించారు. అనంతరం డీఏఓ మాట్లాడుతూ.. అన్ని ఫర్టిలైజర్ దుకాణాల్లో రైతులకు కావాల్సిన ఎరువులు అందుబాటులో ఉన్నాయన్నారు. యూరియా 5052.52 మెట్రిక్ టన్నులు, డీఏపీ 1330.23, ఎంఓపీ 935.58, ఎస్ఎస్పీ 807.56, కాంప్లెక్స్ ఎరువులు 17734.92 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉన్నట్లు వివరించారు. రైతులకు ఎరువుల స్టాక్, ధరల వివరాలు తెలిసే విధంగా దుకాణాల్లో బోర్డు ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. అదే విధంగా కొనుగోలు చేసిన ఎరువులకు తప్పనిసరిగా రశీదులు ఇవ్వాలన్నారు. ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా అధిక ధరలకు ఎరువులు విక్రయిస్తే చట్టప్రకారం కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. డీఏఓ వెంట ఏఓ సీహెచ్ అనిత తదితరులు ఉన్నారు. -
పరిహారం కోసం రైతుల ఆందోళన
గట్టు: భారత్మాల రహదారి నిర్మాణంలో భూములు కోల్పోయిన వారికి రెండో విడత పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ గురువారం రైతులు ఆందోళనకు దిగారు. గంగిమాన్దొడ్డి వద్ద నిర్మాణంలో ఉన్న భారత్మాల రహదారిపై గట్టు, గంగిమాన్దొడ్డి గ్రామాల రైతులు బైఠాయించి పనులను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ.. కొత్తగా చేపట్టిన ఆరు వరుసల భారత్మాల రహదారి నిర్మాణంలో భూములను కోల్పోయిన తమకు ప్రభుత్వం చాలీచాలని పరిహారం అందించి చేతులు దులుపుకొందన్నారు. తమకు న్యాయమైన పరిహారం అందించి ఆదుకోవాలని ఆందోళన కార్యక్రమాలు చేపట్టడంతో పాటు అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని వాపోయారు. తమకు రెండో విడత పరిహారం అందించే వరకు ఆందోళన విరమించేది లేదని భీష్మించారు. రోడ్డు నిర్మాణం చేపడుతున్న సైట్ ఇన్చార్జి అఫ్జల్తో పాటు పోలీసులు అక్కడికి చేరుకొని రైతులకు నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు. రైతుల ఆందోళనకు ఎమ్మార్పీఎస్ మండ ల అధ్యక్షుడు ఏసన్న, కాంగ్రెస్ పార్టీ మండల అ ధ్యక్షుడు మహబూబ్ పాషా, రైతులు సంతోష్, వెంకట్రాములు, నర్సింహులు, తిమ్మప్ప పాల్గొన్నారు. -
ఎరువులు అందుబాటులో ఉంచాలి
మల్దకల్: ఎరువులు, విత్తనాలు రైతులకు అందుబాటులో ఉంచడంతో పాటు అధిక ధరలకు విక్రయించే ప్రైవేటు డీలర్లపై కఠన చర్యలు తప్పవని కలెక్టర్ బీఎం. సంతోష్ హెచ్చరించారు. బుధవారం మల్దకల్లోని సింగిల్విండో కార్యాలయాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. గోదాంలో నిల్వ ఉన్న 35 బస్తాల యూరియాను పరిశీలించి ఎరువుల పంపిణీ ఎలా నిర్వహిస్తున్నారని సీఈఓ కిరణ్కుమార్రెడ్డిని ఆరా తీశారు. ప్రభుత్వ ధరకే ఎరువులు విక్రయించాలన్నారు. రైతులు సింగిల్విండో ద్వారా తీసుకున్న రుణాలను సకాలంలో తిరిగి చెల్లిస్తున్నారా లేదా అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రామంలోని వివిధ ఎరువుల దుకాణాలను తనిఖీ చేసి ప్రతి కొనుగోలుకు రషీదులు ఇవ్వాలని, ఈ –పాస్ మెషిన్ ద్వారానే పంపిణీ చేయాలని, స్టాక్ వివరాలను ఎప్పటికప్పడు రికార్డులలో పొందుపరచాలన్నారు. అనుమతులు లేని ఎరువులు, విత్తనాలు విక్రయిస్తే లైసెన్సులను రద్దు చేస్తామని హెచ్చరించారు. వ్యవసాయ శాఖ అధికారులు ఎప్పటికప్పడు ఎరువులు దుకాణాలను తనిఖీలు చేయాలన్నారు. ప్రభుత్వ ఆస్పత్రులలో ప్రసవాల సంఖ్య పెంచాలి ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవాల సంఖ్య పెంచాలని కలెక్టర్ వైద్య సిబ్బందిని ఆదేశించారు. మల్దకల్ పీహెచ్సీని తనిఖీ చేసి వైద్య సిబ్బంది హాజరు రిజిస్టార్ రికార్డులను పరిశీలించారు. గర్భిణులకు, బాలింతలకు అందిస్తున్న వైద్య సేవలపై ఆరా తీశారు. పోషకాలు ఎక్కువగా ఉండే ఆహారాన్ని విధిగా తీసుకునేలా అవగాహన కల్పించాలని, ప్రజలకు వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలన్నారు. కార్యక్రమంలో సింగిల్విండో అధ్యక్షుడు తిమ్మారెడ్డి, జిల్లా కో ఆపరేరిటివ్ అధికారి శ్రీనివాసులు, డీఎంహెచ్ఓ సిద్దప్ప, ఇన్చార్జి డీఏఓ సక్రియనాయక్, ఏడీఏ సంగీతలక్ష్మీ, తహసీల్దార్ ఝూన్సీరాణి, ఎంపీడీఓ సాయిప్రకాష్, ఎంపీఓ రాజ శేఖర్, డాక్టర్ స్వరూపరాణి పాల్గొన్నారు. అధిక ధరలకు విక్రయిస్తే ప్రైవేట్ డీలర్లపై చర్యలు స్టాక్ వివరాలు ఎప్పటికప్పుడు రికార్డుల్లో పొందుపర్చాలి కలెక్టర్ బీఎం సంతోష్ -
స్వర్ణ మల్లికను ఆదర్శంగా తీసుకోవాలి
గద్వాల క్రైం: గట్టుకి చెందిన సంఘం స్వర్ణ మల్లికను ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకోవాలని జిల్లా జడ్జి ప్రేమలత అన్నారు. బుధవారం జిల్లా బార్ అసోషియేషన్ సమావేశంలో ఇటీవల జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికై న మల్లికను బార్ అసోషియేషన్ సభ్యులు ఘనంగా సత్కరించారు.కార్యక్రమానికి జిల్లా జడ్జి హాజరై మాట్లాడారు. తండ్రి గట్టు సురేష్ గద్వాల కోర్టులోనే సీనియర్ న్యాయవాదిగా ఉండడం ఎంతో అభినందనీయమన్నారు. జిల్లా చరిత్రలో మహిళ న్యాయమూర్తిగా ఎంపిక కావడం మొదటిసారన్నారు. అక్షరాభ్యాసంలో వెనుకబడిన గట్టు మండలం నుంచి మల్లిక అత్యన్నత స్థానంలో ఉండడం బార్ అసోషియేషన్కు ఎంతో గర్వించదగ విషయమని, జిల్లాకు మంచి పేరు తీసుకురావల్సిందిగా ఆమెకు సూచించారు. న్యాయమూర్తిగా ఎంపికై న మల్లికను న్యాయమూర్తులు రవికుమార్, లక్ష్మీ, ఎన్విహెచ్ పూజిత, ఉదయ్నాయక్, బార్ అసోషియేషన్ సభ్యులు, సిబ్బంది శాలువ, పూలమాలతో ఘనంగా సంత్కరించారు. -
అప్పుడే.. లోకల్ ఫైట్!
స్థానిక ఎన్నికల వేళ వేడెక్కిన రాజకీయం ● ముఖ్య నేతల మధ్య పేలుతున్న మాటల తూటాలు ● షెడ్యూల్ విడుదలకు ముందుగానే చేరికలకు తెరలేపిన పార్టీలు ● గెలుపే లక్ష్యంగా ప్రధాన రాజకీయ పక్షాల కసరత్తు ● సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలతో ‘హస్తం’ ముందడుగు● ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేలా ‘కారు’ కార్యాచరణ ● పట్టు సాధించాలనే తపనతో ‘కమలం’ జడ్చర్లలో 100 పడకల ఆస్పత్రి వద్ద మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి కుటుంబసభ్యులు అక్రమంగా తీసుకున్న అసైన్డ్ ల్యాండ్ను ప్రభుత్వానికి అప్పగించాలి. సిగ్నల్గడ్డ రోడ్డు విస్తరణకు సంబంధించి పాత బస్టాండ్ వైపు నేరుగా వాహనాలు వెళ్లేందుకు మార్గం లేదు. డిజైన్ లోపంతో ఇబ్బందులు వస్తాయి. – జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి సొంత ఊరు రంగారెడ్డిగూడ దేవాలయం భూములపై శ్వేతపత్రం విడుదల చేయాలి. సిగ్నల్గడ్డ రోడ్డు విస్తరణ పనుల డిజైన్లో ఎలాంటి లోపాలు లేవు. పోలేపల్లి సెజ్ నుంచి నా ఖాతాకు డబ్బులు వచ్చాయని ఆరోపణలను రుజువు చేయాలి. లేకపోతే క్షమాపణలు చెప్పాలి. – లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. ముందుగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు.. ఆ తర్వాత మున్సిపల్, కార్పొరేషన్, సర్పంచ్ ఎన్నికలు నిర్వహించేలా ఎలక్షన్ కమిషన్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు ఉమ్మడి పాలమూరులోని ప్రధాన రాజకీయ పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ తగిన కసరత్తు ప్రారంభించాయి. గెలుపే లక్ష్యంగా రూపొందించుకున్న ప్రణాళికకు అనుగుణంగా ఆయా పార్టీల ముఖ్యనేతలు పావులు కదుపుతున్నారు. తమ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో అధికార పార్టీ నేతలు క్షేత్రస్థాయిలో ప్రచారం ప్రారంభించగా.. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలలను ఎండగట్టే కార్యాచరణతో ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ నాయకులు ముందుకుసాగుతున్నారు. మరో రెండు రోజులు లేదంటే ఈ నెలాఖరులోపు ఎన్నికల షెడ్యూల్ వెలువడుతుందనే అంచనాతో పార్టీల్లో చేరికలు ఊపందుకోగా.. స్థానికంగా సందడి నెలకొంది. చేరికల పరంపర స్థానిక ఎన్నికల వేళ ఉమ్మడి పాలమూరులోని పలు నియోజకవర్గాల పరిధిలో వివిధ పార్టీల్లో చేరికలు ఊపందుకున్నాయి. ఇటీవల నాగర్కర్నూల్, గద్వాల, వనపర్తి జిల్లాల్లో కాంగ్రెస్ నుంచి పలువురు బీఆర్ఎస్లో చేరారు. ఈ నెల 18న బీఆర్ఎస్కు చెందిన జడ్చర్ల తాజా మాజీ మున్సిపల్ చైర్పర్సన్ కోనేటి పుష్పలత సీఎం రేవంత్రెడ్డి, ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. ఇటీవల నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గం నర్వ మండలానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్తలు బీజేపీలో చేరారు. తాజాగా మహబూబ్నగర్ చెందిన రైతుబంధు జిల్లా సమితి మాజీ చైర్మన్ గోపాల్యాదవ్, మాజీ కౌన్సిలర్ పద్మజ బీఆర్ఎస్కు రా జీనామా చేశారు. వా రు కాంగ్రెస్లో చేరే అవ కాశం ఉన్నట్లు ప్రచా రం జరుగుతోంది. బీజేపీ సైతం.. స్థానిక ఎన్నికల్లో ఈ సారి పట్టు సాధించాలనే లక్ష్యంతో బీజేపీ ముందుకు సాగుతోంది. మహబూనగర్ ఎంపీ డీకే అరుణ పార్లమెంట్ పరిధిలోని పలు నియోజకవర్గాల్లో క్రమం తప్పకుండా పర్యటిస్తున్నారు. షాద్నగర్, జడ్చర్ల, మహబూబ్నగర్, మక్తల్, నారాయణపేట, దేవరకద్ర నియోజకవర్గ పరిధిలో పలు మండలాల్లో సమావేశాలు నిర్వహిస్తూ.. కేడర్లో జోష్ నింపుతున్నారు. ఇటు కాంగ్రెస్.. అటు బీఆర్ఎస్ స్థానిక సంస్థల ఎన్నికలను కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ మేరకు ఆయా నియోజకవర్గాలకు చెందిన ముఖ్య నాయకులు క్షేత్రస్థాయిలో సమావేశాలు నిర్వహిస్తూ కేడర్లో జోష్ నింపుతున్నారు. ప్రధానంగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు సంబంధించి క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ గెలుపు గుర్రాల వడబోత చేపట్టినట్లు తెలుస్తోంది. వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి మార్నింగ్వాక్ పేరిట వార్డుల్లో పర్యటిస్తుండగా.. ఆయన ముఖ్య అనుచరులు మండలాల వారీ సమావేశాలు నిర్వహిస్తూ కేడర్లో జోష్ నింపుతున్నారు. నాగర్కర్నూల్, నారాయణపేట జిల్లాల్లో ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన ముఖ్య నేతలు, ప్రధాన అనుచరులు మండలాలు, పట్టణాల వారీగా నిత్యం పర్యటిస్తూ.. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. కాంగ్రెస్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు వివరిస్తూ.. ప్రజలకు తెలియజేసేలా ప్రచారం చేపట్టాలని శ్రేణులకు సూచిస్తున్నారు. బీఆర్ఎస్ నేతలు సైతం పోటాపోటీగా నియోజకవర్గాల వారీగా కార్యకర్తలతో సన్నాహక సమావేశాలు నిర్వహిస్తూ.. ప్రచారం మొదలుపెట్టారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ ప్రజల్లోకి వెళ్లేలా గ్రామ, మండలస్థాయి కీలక నాయకులను సమాయత్తం చేస్తున్నారు. కాగా, జోగుళాంబ గద్వాల జిల్లాకు సంబంధించి పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. ప్రధానంగా గద్వాల నియోజకవర్గంలో అధికార కాంగ్రెస్తో పాటు ప్రతిపక్ష బీఆర్ఎస్లో అంతర్గత పోరు కొనసాగుతుండడంతో ఆయా పార్టీల శ్రేణుల్లో గందరగోళం నెలకొంది. దేవరకద్ర, జడ్చర్లలో మాటల తూటాలు దేవరకద్ర నియోజకవర్గంలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో, ఆ తర్వాత ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి మధ్య విమర్శల పర్వం నామమాత్రంగా కొనసాగింది. నిన్న, మొన్నటి వరకు రాజకీయ వాతావరణం స్తబ్దుగా ఉండగా.. స్థానిక ఎన్నికలు వస్తాయనే క్రమంలో ప్రస్తుత, మాజీ ఎమ్మెల్యేల మధ్య మాటల తూటాలు మంటలు రేపాయి. ఆరోపణలు, ప్రత్యారోపణలతో పాటు వ్యక్తిగత విమర్శలతో ప్రస్తు తం రాజకీయ సెగ రాజుకుంది. జడ్చర్ల నియోజకవర్గంలో సైతం ఇదే పరిస్థితి నెలకొంది. ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మధ్య నిత్యం మాటల తూటాలు పేలుతుండగా.. రాజకీయం రసవత్తరంగా మారింది. -
మావాడే వదిలెయ్..!
మావాడే వదిలేయ్..! అద్దె బకాయి వసూళ్లలో మోకాలడ్డుతున్న నాయకులు దూకుడు పెంచిన అధికారులు గద్వాల మున్సిపాలిటీ పరిధిలో 236 దుకాణాలు ఉన్నాయి. వీటి ద్వారా ఏటా రూ.1.13 కోట్లు ఆదాయం అద్దె రూపంలో రావాల్సి ఉంది. అయితే కొంత మంది దుకాణాదారులు నెలలు, ఏళ్ల తరబడి అద్దెలు చెల్లించకుండా వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. సుమారు రూ.3 కోట్ల వరకు అద్దె బకాయిలు ఉన్నాయి. దీనిపై ఈ నెల 19న ‘పేరుకుపోయిన బకాయిలు అనే శీర్షికతో ‘సాక్షిశ్రీలో కథనం ప్రచరితం అయింది. ఈ కథనానికి ఉన్నతాధికారులు స్పందించి బకాయిలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. అందులో భాగంగా గత నాలుగు రోజుల నుంచి అద్దె బకాయిల లిస్టు చేత పట్టి వసూళ్లపై దూకుడు పెంచారు.. బకాయిలు చెల్లించని దుకాణాలకు తాళాలు వేశారు. దుకాణ అద్దె బకాయి చెల్లించే వరకు మున్సిపల్ సిబ్బంది కట్టు కదలడం లేదు. ఈ క్రమంలో దుకాణాదారులు మున్సిపల్ అధికారులు, సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. మాజీ కౌన్సిలర్లు, రాజకీయ నాయకుల అధికారులు, సిబ్బందిపై హెచ్చరికలు జారీ చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఉన్నతాధికారులు రోజువారి లక్ష్యాలు నిర్దేశిస్తుండటం.. నాయకులు భయబ్రాంతులకు గురిచేస్తుండటంతో మున్సిపల్ సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. గద్వాలటౌన్: కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం.. అన్న చందంగా తయారైంది మున్సిపల్ అధికారుల పరిస్థితి. పట్టణంలో మున్సిపల్ దుకాణాల అద్దె బకాయి వసూళ్లకు ఉన్నతాధికారులు లక్ష్యాలు విధించారు. రోజువారి వసూళ్లకు రాజకీయ నేతలు మోకాలడ్డుతున్నారు. ఎవరి దగ్గరకు వెళ్లినా మాజీ కౌన్సిలర్లు, లేదా పెద్ద రాజకీయ నాయకులతో సిఫార్సులు చేయిస్తున్నారు. లేదా చెల్లించమని బెదిరిస్తున్నారు. దీంతో దుకాణాల అద్దెలు వసూలు కాక ఉన్నతాధికారులకు సమాధానాలు చెప్పలేక నలిగిపోతున్నారు. ఇదీ జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రమైన మున్సిపాలిటీలో అధికారుల పరిస్థితి. ఇరువైపులా ఒత్తిళ్లు ఇలా పన్నుల వసూలు చేసే అధికారులకు, సిబ్బందికి మున్సిపల్ దుకాణదారులు అద్దె బకాయి చెల్లింపుల్లో మున్సిపాలిటీ అధికారులకు చుక్కలు చూపిస్తున్నారు. మరోవైపు రోజుకు ఎన్ని లక్షలు వసూలు చేశారని పుర ఉన్నతాధికారుల నుంచి ఒత్తిళ్లు వస్తున్నాయి. దుకాణాల అద్దె వసూళ్ల రూపంలో వచ్చే ఆదాయమే ప్రధానం. పట్టణంలో ఏ అభివృద్ధి పనులు చేయాలన్నా... పారిశుద్ధ్యం, తాగునీరు సరాఫరా వంటి సేవలు అందించాలన్నా పన్నులు, దుకాణాల అద్దె వసూళ్లు బాగుంటేనే సాధ్యమవుతుంది. కానీ భవన నిర్మాణదారులు ఆస్తిపన్ను ఎలాగోలా చెల్లించేందుకు ముందుకు వస్తున్నారు. కొందరు దుకాణదారులు మాత్రం అద్దె బకాయిలు చెల్లించడానికి ససేమిరా అంటున్నారు. చెల్లింపుల్లో రాజకీయ నాయకులు, మాజీ కౌన్సిలర్లతో సిఫార్సులు చేయిస్తున్నారు. దీంతో అద్దె బకాయి వసూళ్లకు అడ్డంకులు ఏర్పడుతున్నాయి. గద్వాలలో దాదాపు రూ.కోటికిపైగా పెండింగ్.. ‘సాక్షి’ కథనంతో దూకుడు పెంచిన అధికారులు -
వైద్య సేవలు ప్రారంభం
● వంద పడకల ఆస్పత్రిలో కాంగ్రెస్ నాయకుల సంబరాలు బీజేపీ పోరాటంతోనే.. బీజేపీ పోరాట ఫలితంగానే అలంపూర్ చౌరస్తాలోని వంద పడకల ఆస్పత్రిలో వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయని బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు రామచంద్రారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. వంద పడకల ఆస్పత్రి కోసం గతంలో అనేక ఉద్యమాలు, అందోళనలు చేసినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో గత నెల జూన్లో హైకోర్టులో రిట్ పిటిషన్ వేసి అధికారులపై తీవ్ర ఒత్తిడికి తెచ్చినట్లు తెలిపారు. దీంతో అధికారులు వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చారని వివరించారు. అలంపూర్: రెండేళ్ల నిరీక్షణ తర్వాత ఎట్టకేలకు అలంపూర్ చౌరస్తాలోని వంద పడకల ఆస్పత్రిలో బుధవారం వైద్య సేవలు ప్రారంభమయ్యాయి. ముందుగా ఓపీ సేవలను ప్రారంభించారు. ఈమేరకు ఆస్పత్రికి ఏడుగురు వైద్యులు, 12 మంది నర్సులు, వార్డు బాయ్స్, ఇతర సిబ్బందిని నియమించారు. వైద్య విధాన పరిషత్ ఉమ్మడి జిల్లా అధికారి రమేష్ చంద్ర ఆస్పత్రిని సందర్శించారు. ఆస్పత్రిలోని ఓపీ సేవలను ఆయన పరిశీలించారు. ఇదిలాఉండగా, గద్వాల ఆస్పత్రి నుంచి ఏడుగురు వైద్యులు వచ్చారని, ప్రస్తుతం ఓపీ సేవలు కొనసాగుతాయని సివిల్ సర్జన్ డాక్టర్ ప్రవీణ్ తెలిపారు. గైనకాలజిస్టు, కంటి, చిన్న పిల్లల, జనరల్ వంటి సేవలు అందించేందుకు ఉదయం నుంచి సాయంత్రం వరకు వైద్యులు అందుబాటులో ఉంటారని తెలిపారు. పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందించడానికి మరో రెండు మూడు నెలలు పట్టనుందని, పూర్తి స్థాయి వైద్యులు, నర్సులు, సిబ్బంది నియామకానికి ప్రభుత్వం నుంచి అనుమతులు రావాల్సి ఉందన్నారు. ఎమర్జన్సీ సేవలు సైతం త్వరలో అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో వైద్యులు అమీర్, జెమ్స్, శ్యామ్, సిస్టర్స్, వైద్య సిబ్బంది తదితరులు ఉన్నారు. ప్రజా పాలనలోనే అందుబాటులోకి వైద్య సేవలు కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా పాలనలోనే వంద పడకల ఆస్పత్రిలో వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయని జిల్లా గ్రంథాలయ చైర్మన్ నీలి శ్రీనివాసులు, మార్కెట్ యార్డు కమిటీ చైర్మన్ దొడ్డెన్న, మండల అధ్యక్షుడు గోపాల్ అన్నారు. ఆస్పత్రిలో ఓపీ సేవలు ప్రారంభం కావడంతో సంబరాలు నిర్వహించారు. అనంతరం వైద్య పరీక్షలు చేయించుకొని, వైద్యులను, వైద్య సిబ్బందిని సత్కరించి మిఠాయిలను పంపిణీ చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం సార్వత్రిక ఎన్నికల్లో ఓట్లు దండుకోవడానికి ఆస్పత్రిని హడావుడిగా ప్రారంభించి తర్వాత వదిలేసిందన్నారు. వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ఎంతో కృషి చేశారన్నారు. కార్యక్రమంలో మార్కెట్ యార్డు వైస్ చైర్మన్ పచ్చర్ల కుమార్, మాజీ జడ్పీటీసీ మద్దిలేటి, కాంగ్రెస్ పార్టీ మండలాల అధ్యక్షుడు గోపాల్, జగన్మోహన్ నాయుడు, అడ్డాకుల రాము, భైరాపురం రమణ, నాయకులు నర్సన్ గౌడు, నగేష్, శంకర్, శ్రీకాంత్, కృష్ణ, మక్బుల్, మోక్తార్ బాష తదితరులు ఉన్నారు. -
‘కోచింగ్ సెంటర్’ లవ్ స్టోరీ.. చివరికి బిగ్ ట్విస్ట్
గద్వాల: ప్రేమించి పెళ్లి చేసుకుంటానంటూ ఓ కానిస్టేబుల్ తనను మోసం చేశాడని.. చట్టరీత్యా చర్యలు తీసుకోవాలంటూ ఓ యువతి మంగళవారం గద్వాల డీఎస్పీ మొగిలయ్యను ఆశ్రయించింది. బాధితురాలి కథనం మేరకు.. భద్రాది కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం బోరంతపల్లెకు చెందిన ప్రియాంక 2023లో ఉద్యోగ పోటీ పరీక్షల శిక్షణకు హైదరాబాద్కు రాగా.. గట్టు మండలం చిన్నోనిపల్లికి చెందిన రఘునాథ్గౌడ్ సైతం శిక్షణ కోసం హైదరాబాద్కు చేరుకున్నారు.ఈ క్రమంలో వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. వివాహం చేసుకుందామంటూ రఘునాథ్గౌడ్ యువతి తల్లిదండ్రులను ఒప్పించడంతో పాటు ప్రభుత్వ ఉద్యోగం వచ్చిన తర్వాత తమ తల్లిదండ్రులతో మాట్లాడి వివాహం చేసుకుందామని నమ్మించారు. ఇటీవల కానిస్టేబుల్ ఉద్యోగం రాగా వివాహం చేసుకుందామని ఫోన్లో సంప్రదించగా దాటవేస్తూ వచ్చారని బాధితురాలు చెప్పారు. ఈ నెల 17న రఘునాథ్గౌడ్ ఇంటికి వెళ్లి వివాహ విషయం మాట్లాడగా కుటుంబ సభ్యులు నిరాకరించడంతో పాటు తనపై చేయి చేసుకున్నట్లు డీఎస్పీకి వివరించింది.తీవ్ర మనస్తాపానికి గురై వారి ఇంటి ముందే నిద్రమాత్రలు మింగగా స్థానికులు గుర్తించి 108 వాహనంలో జిల్లా ఆస్పత్రికి తరలించడంతో ప్రాణాప్రాయం తప్పిందని తెలిపింది. మంగళవారం ఉదయం కూడా మరోమారు వారి తల్లిదండ్రులతో మాట్లాడేందుకు కుటుంబంతో కలిసి వెళ్లగా నిరాకరించారన్నారు. ప్రస్తుతం శాంతినగర్ పోలీస్స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్న రఘునాథ్గౌడ్, దాడి చేసిన కుటుంబ సభ్యులౖపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ బాధిత యువతి, తల్లిదండ్రులు డీఎస్పీకి ఫిర్యాదు చేశారు.కేసు నమోదు చేశాం.. బాధితురాలి ఫిర్యాదు మేరకు కానిస్టేబుల్ రఘునాథ్గౌడ్పై గట్టు పోలీస్స్టేషన్లో ఇప్పటికే కేసు నమోదైందని డీఎస్పీ మొగిలయ్య తెలిపారు. కానిస్టేబుల్ను విచారించి తగిన చర్యలు తీసుకుంటామని.. మోసం చేసిన వ్యక్తి ఎవరైనా సరే చట్టపరమైన చర్యలు ఉంటాయన్నారు. బాధితురాలికి అన్నివిధాలా న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. -
పీయూలో ఏం జరుగుతోంది?
బదిలీల పరంపర.. ●నాన్ టీచింగ్ సిబ్బందిపై వేధింపుల పర్వం ● ఇటీవల పలువురిపై సస్పెన్షన్ వేటు ● చిన్నపాటి తప్పిదాలకే విచారణ కమిటీల ఏర్పాటు ● వేతనాలపై ప్రశ్నిస్తున్నందుకే ఇదంతా చేస్తున్నారని ఆరోపణలు ● టీచింగ్ సిబ్బందిలో సైతం అధికారుల తీరుపై తీవ్ర అసహనం సిబ్బంది తరఫున పోరాడతాం.. సిబ్బంది చిన్నచిన్న తప్పిదాలు చేస్తే వారిని విచారణ చేయాలి.. నోటీసులు ఇవ్వాలి.. కానీ, నేరుగా సస్పెండ్ చేయడం అనేది సిబ్బందిని వేధింపులకు గురిచేయడమే. బాధిత సిబ్బంది తరఫున మే ము పోరాటం చేస్తాం. అధికారులు అణచివేత ధోరణి అవలంబించడం సరైంది కాదు. గతంలో ఎప్పుడూ లేని విధంగా అధికారుల వ్యవహారశైలిని ఖండిస్తున్నాం. వేతనాలు పెంచకుండా సిబ్బందిని ఇబ్బందులకు గురిచేయవద్దు. – రాము, పీయూ ఎస్ఎఫ్ఐ నాయకులు అందరినీ సమానంగా చూస్తాం.. పీజీ కళాశాలలో సిబ్బంది నేరుగా సంతకం పెట్టి వెళ్లిపోతున్నట్లు తెలిసింది. అప్పటికే సంతకం పెట్టి బయటికి వెళ్తున్న ఓ సిబ్బందిని ఎక్కడికి వెళ్తున్నావని అడిగా.. సంతకం పెట్టి బయటికి పోతే ఎలా అని సస్పెండ్ చేశాం. సిబ్బంది పైనా మాకు కోపం లేదు. అందరినీ సమానంగా చూస్తాం. వేతనాల పెంపునకు కృషి చేస్తున్నాం. వేసవి సెలవుల్లో నాన్ టీచింగ్ సిబ్బందికి సెలవులు ఉండవు. గతంలో ఎలా ఇచ్చారో నాకు తెలియదు. – రమేష్బాబు, రిజిస్ట్రార్, పీయూ మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీలో ఉన్నతస్థాయి అధికారులు కిందిస్థాయి సిబ్బందిపై వేధింపుల పర్వానికి తెరలేపారు. గత కొన్నిరోజుల వ్యవధిలోనే ముగ్గురు సిబ్బందిపై సస్పెషన్ వేటు వేసి తమలోని అక్కసును బయటపెట్టుకున్నారు. దీంతో పాటు నాన్టీచింగ్ సిబ్బంది చేసే చిన్నపాటి తప్పిదాలకే విచారణ కమిటీలు వేసి భయాందోళనకు గురిస్తున్నారు. వేసవిలో యూనివర్సిటీకి సెలవులు ప్రకటించిన అధికారులు.. నాన్టీచింగ్ సిబ్బందికి మాత్రం ఒక్క సెలవు ఇవ్వలేదు. సమస్యలు చెప్పుకోవడానికి వెళ్లిన సిబ్బందిని కనీసం అధికారులు వారి చాంబర్లోకి కూడా రానివ్వలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే కేవలం తమకు వేతనాలు పెంచమని కోరినందుకే అణచివేత ధోరణికి పాల్పడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పీయూలో తాత్కాలిక పద్ధతిలో పనిచేస్తున్న నాన్టీచింగ్ సిబ్బందిలో కిందిస్థాయి వారికి రూ.6 వేల నుంచి మధ్యస్థాయి వరకు రూ.15 వేల వరకు వేతనాలు ఇస్తున్నారు. ఏం మాట్లాడితే ఏం చేస్తారో.. మూడు రోజుల క్రితం విధుల్లో ఉన్న పీయూ పీజీ కళాశాల ఓ మహిళా నాన్టీచింగ్ సిబ్బంది తన కొడుకుకు ఆరోగ్యం బాగోలేకపోవడంతో ఆస్పత్రికి వెళ్తుండగా.. రిజిస్ట్రార్ అడ్డుకుని సదరు మహిళను సస్పెండ్ చేస్తున్నట్లు చెప్పారు. రిజిస్ట్రార్ తీరుతో నాన్టీచింగ్ సిబ్బందిలో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఎలాంటి విచారణ, హెచ్చరిక, నోటీస్ లేకుండా సస్పెన్షన్ వేటు వేయడమేమిటని ప్రశ్నిస్తున్నారు. దీంతోపాటు గతంలో ఓ టీచింగ్, ఓ నాన్టీచింగ్ గొడవపడిన వ్యవహారంపై ముగ్గురు సభ్యులతో కమిటీ వేసిన అధికారులు నేరుగా నెల రోజుల పాటు సస్పెండ్ చేసినట్లు సమాచారం. మరో ఇద్దరు సిబ్బంది చిన్నచిన్న తప్పిదాలు చేశారన్న ఆరోపణలతో వారిపై ముగ్గురు సభ్యులతో విచారణ కమిటీలు వేశారు. దీంతో ఏం మాట్లాడితే.. ఏం చేస్తారోనన్న భయాందోళన నాన్ టీచింగ్ సిబ్బందిలో నెలకొంది. నాన్టీచింగ్లో రెగ్యులర్ ప్రతిపాదిక పనిచేస్తున్న అసిస్టెంట్ రిజిస్ట్రార్కు సైతం వేధింపులు తప్పలేదు. తమకు అనుకూలంగా వ్యవహరించడం లేదని అడ్మినిస్ట్రేషన్ విభాగంలో కొన్నేళ్లుగా పనిచేస్తున్న ఆయనను ఎలాంటి కారణం చెప్పకుండా నేరుగా ఎగ్జామినేషన్ విభాగానికి బదిలీ చేశారు. అంతేకాకుండా మరో నాన్టీచింగ్ సిబ్బందిని సరిగా విధులకు రావడం లేదన్న కారణంతో ఫార్మసీ కళాశాలకు బదిలీ చేసి.. అక్కడి నుంచి గద్వాల పీజీ కళాశాలకు బదిలీ చేసి అక్కడి వెళ్లాలని సూచించారు. చాలా రోజులుగా వైస్ చాన్స్లర్ను కలిసి సమస్యను చెప్పుకోవడానికి ప్రయత్నిస్తే కనీసం చాంబర్లోకి సైతం రానివ్వలేదని తెలిసింది. అంతేకాకుండా మరో మహిళా సిబ్బందిని ఎలాంటి కారణం లేకుండా నేరుగా ఎగ్జామినేషన్ బ్రాంచ్కు బదిలీ చేశారు. గతంలో తప్పిదాలు చేసి బదిలీపై వెళ్లిన వారిని ప్రస్తుత అధికారులు పైరవీలు చేసి తిరిగి అడ్మినిస్ట్రేషన్ బ్రాంచ్కు రప్పించుకుంటున్నట్లు సమాచారం. మరో ఇద్దరిపై విచారణ కోసం కమిటీలు వేసి, వారి వివరణ సైతం తీసుకుంటున్నారు. ఇలాంటి ధోరణితో సిబ్బంది భయాందోళనకు గురవుతున్నారు. ఇటీవల అన్ని హాస్టళ్లకు కలిపి ఒక రెగ్యులర్ అధ్యాపకుడిని చీఫ్ వార్డెన్గా నియమించారు. ఇందులో రెండు బాలికల హాస్టళ్లు సైతం ఉన్నాయి. ఈ క్రమంలో బాలికల హాస్టల్కు గతంలో ఉన్న చీఫ్ వార్డెన్ (మహిళ)ను తప్పించి పురుష అధికారిని నియమించారు. బాలికల హాస్టల్లో సమస్యలు, ఇబ్బందులు వస్తే వారు ఆయనకు ఎలా చెప్పుకుంటారనే ప్రశ్న తలెత్తుతోంది. టీచింగ్ సిబ్బందిలోనూ అసంతృప్తి.. పీయూలో ప్రొఫెసర్ స్థాయి లెక్చరర్లు ఉన్నప్పటికీ రిజిస్ట్రార్ను ఉస్మానియా యూనివర్సిటీ నుంచి తీసుకోవడంపై రెగ్యులర్ టీచింగ్ సిబ్బంది తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అంతేకాకుండా గతంలో అడ్మినిస్ట్రేషన్లో పనిచేసిన వారికి ఎలాంటి పదవులు ఇవ్వకుండా వారిని దూరంగా పెట్టడం, సమస్యలు చెప్పుకోవడానికి వెళ్తే పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. -
హాస్టల్ విద్యార్థులకు నాణ్యమైన భోజనం
గద్వాల: డైట్ చార్జీలు పెంచిన నేపథ్యంలో అందుకు అనుగుణంగా హాస్టల్ విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందిస్తున్నట్లు కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. మంగళవారం హైదరాబాద్లోని సచివాలయం నుంచి రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, లక్ష్మణ్కుమార్, సీఎస్ రామకృష్ణారావు నిర్వహించిన వీడియోకా న్ఫరెన్స్లో పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ హాస్టళ్ల నిర్వహణపై ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. హాస్టల్ ప్రాంగణాల్లో పచ్చదనం, పరిశుభ్రత వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం నిబంధనల మేరకు అర్హులైన ప్రతిపేవాడికి ఇళ్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. ఇండ్ల నిర్మాణాలు త్వరితగతిన పూర్తయ్యేందుకు ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ పర్యవేక్షణ చేస్తున్నామన్నారు. భూభారతిలో నమోదైన దరఖాస్తులను నిబంధనల మేరకు వెంటనే పరిష్కరించడం జరిగిందన్నారు. వనమహోత్సవం నిర్వహించి క్షేత్రస్థాయిలో విరివిరిగా మొక్కలు నాటేందుకు ప్రణాళిక రూపొందించడం జరిగిందన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్ వి.లక్ష్మీనారాయణ, నర్సింగ్రావు, భూసేకరణ అధికారి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
పకడ్బందీగా విధులు నిర్వర్తించాలి
గద్వాల: శిక్షణా కాలంలో నేర్చుకున్న నైపుణ్యాలను విధుల నిర్వహణలో పకడ్బందీగా నిర్వర్తించి మంచి పేరు సంపాదించాలని అడిషనల్ కలెక్టర్ వి.లక్ష్మీనారాయణ అన్నారు. మంగళవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలులో లైసెన్స్డ్ సర్వేయర్ శిక్షణ పొందిన అభ్యర్థులకు నిర్వహించిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. భూపరిపాలన వ్యవస్థను మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా తీర్చిదిద్దేలా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపడుతుందని, రెవెన్యూ, సర్వే విభాగాలు పరస్పరంగా అనుసంధానమై ఉన్నాయన్నాన్నారు. సర్వే విభాగం బలోపేతంతోనే రెవెన్యూ వ్యవస్థలో సమర్థవంతమైన సేవలందించగలమన్నారు. భూభారతి సాఫ్ట్వేర్ ద్వారా భూమికి సంబంధించిన సర్వేలు, మ్యాపింగ్, డాటా ప్రాసెసింగ్ వంటి సేవలను మరింత ఖచ్చితంగా వేగంగా ప్రజలకు చేరువగా అందించగలుతున్నామని చెప్పారు. జిల్లాలో లైసెన్స్డ్ సర్వేయర్ శిక్షణ పొందిన 151మంది అభ్యర్థులకు హాల్టికెట్లు మెయిల్ నుంచి డౌన్లోడ్ చేసి అందజేయాలని అధికారులను ఆదేశించారు. శిక్షణ పొందిన అభ్యర్థులకు తుదిరాత పరీక్షలు జూలై 27న నిర్వహించనున్నట్లు, జూలై 28–29తేదీన ల్యాబ్ ప్రాక్టికల్ పరీక్షలు జరుగుతాయన్నారు. అంతకు ముందు సర్వే ఏడీ రాంచందర్ సాఫ్ట్వేర్పై అవగాహన కల్పించేందుకు అభ్యర్థులకు పీపీటీ విధానం ద్వారా వివరంగా వివరించారు. కార్యక్రమంలో మండలాలకు చెందిన సర్వేయర్లు, శిక్షణపొందుతున్న అభ్యర్థులు పాల్గొన్నారు. -
జోగుళాంబ ఆలయంలో మాజీ ఎంపీ పూజలు
అలంపూర్: అష్టాదశ శక్తిపీఠాల్లో ఐదో శక్తిపీఠమైన జోగుళాంబ ఆలయాలను మాజీ ఎంపీ బీ. వినోద్ కుమార్ సతీసమేతంగా మంగళవారం దర్శించుకున్నట్లు కార్యనిర్వహణ అధికారి పురేందర్ కుమార్ తెలిపారు. ముందుగా అర్చకులు మాజీ ఎంపీకి ఘన స్వాగతం పలికారు. అనంతరం వారు జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వర ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అర్చకులు వారికి తీర్చ ప్రసాదాలను అందజేశారు. ప్రజారోగ్యంపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి అలంపూర్: ప్రజారోగ్యంపై రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందని.. అందుకే వంద పడకల ఆస్పత్రిలో వైద్య సేవలు ప్రారంభిస్తున్నామని మాజీ ఎమ్మెల్యే సంపత్కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. గత బీఆర్ఎస్ హయాంలో కేవలం ఓట్ల కోసమే ఆస్పత్రిని వాడుకున్నారని పేర్కొన్నారు. ఆస్పత్రిలో వైద్య సేవల ప్రారంభంతో నియోజకవర్గ ప్రజల ఇబ్బందులు తీరతాయని తెలిపారు. చైతన్య సారథి..‘దాశరథి’ గద్వాలటౌన్: దాశరథి కృష్ణమాచార్యులు ఉద్యమ కవి అని, ఆయన కవితలతో ప్రజలను చైతన్యం చేశారని డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ షేక్ కళాందర్బాషా పేర్కొన్నారు. మంగళవారం స్థానిక ఎంఏఎల్డీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో దాశరథి జయంతిని ఘనంగా నిర్వహించారు. దాశరథి చిత్రపటానికి ప్రిన్సిపల్ షేక్ కళాందర్ బాషా పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. దాశరథి కవిగానే కాదు జాతీయ ఉద్యమంలో పాల్గొన గొప్ప విప్లవకారుడు అన్నారు. కలానికి పదునుపెట్టి దొరతనానికి వ్యతిరేకంగా పోరాడిన దైర్యశాలి అని కొనియాడారు. దాశరథి రచనలకు ప్రభావితం అయిన ప్రజలు నిజాం నవాబులకు వ్యతిరేకంగా పోరాడారని వివరించారు. చంద్రమోహన్, నాగభూషణం, రాధిక, శంకర్ పాల్గొన్నారు. ట్రాన్స్జెండర్లకు ఉచిత నైపుణ్య శిక్షణ గద్వాల: జిల్లాలోని నిరుద్యోగులైన ట్రాన్స్జెండర్లకు ప్రైవేటు సంస్థలలో ఉపాధి అవకాశాల కోసం వివిధ రంగాల్లో ఉచిత నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా సంక్షేమ శాఖ అధికారి సునంద ప్రకటనలో తెలిపారు. అర్హులైన వారు ఈనెల 23వ తేదీలోపు wdsc.telangana. gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అదేవిధంగా ట్రాన్స్జెండర్ల కోసం గరిమా గే షెల్టర్ హోమ్ల స్థాపన కోసం నేషనల్స్మైల్ ప్రాజెక్టు కింద దరఖాస్తు చేసకోవటానికి సీబీవో లేదా ఎన్జీవో సంస్థల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు తెలిపారు. ఆసక్తి ఉన్నవారు https.grants-msje.gov.in వెబ్సైట్లో ఆగస్టు 31వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని అందుకు సంబంధించిన ధ్రువపత్రాలను కలెక్టరేట్లోని రూమ్–జి33లో సమర్పించాలని, వివరాలకు 040–24559050 నంబర్ను సంప్రదించాలని తెలిపారు. దరఖాస్తు గడువు పొడిగింపు గద్వాల: అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం దరఖాస్తు తేదీని ఆగస్టు 31వ తేదీవరకు పొడిగించినట్లు జిల్లా ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారి నుషిత ప్రకటనలో తెలిపారు. అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకంలో ఈ విద్యా సంవత్సరం నుంచి 210 సీట్ల నుంచి 500 సీట్ల వరకు పెంచినందున ఆసక్తి గల ఎస్సీ అభ్యర్థులు www.epass.cgg.gov.in వెబ్సైట్లో ఆగస్టు 31వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పాత కమిటీని పురుద్ధరించాలి అలంపూర్ రూరల్: మండలంలోని హరిహర ఎత్తిపోతల పథకం క్యాతూర్ –2 పాత బెనిఫిట్ కమిటీని పునరుద్ధరించాలని క్యాతూర్, భీమవరం రైతులు ఎస్ఈ రహీముద్దీన్, ఈఈ శ్రీనివాస్కు మంగళవారం వినతిపత్రాలు అందించారు. ఇదే విషయాన్ని కలెక్టర్కు కూడా విన్నవించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. ఎటువంటి రైతుల మద్దతు లేకుండా ఆగస్టు 2019లో తమకు తాము ఎన్నుకున్న రిజిస్టర్ లేని బెనిఫిషర్ కమిటీని పూర్తిగా రద్దు చేయాలన్నారు. ఆరేళ్ల నుంచి లిఫ్ట్ నిర్వహణ లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు వివరించారు. రిజిష్టర్ ఆఫ్ సొసైటీ వద్ద రిజిష్టర్ పొందిన –786ఆఫ్ 2013 ఆయకట్టు దారుల సంఘాన్ని పునరుద్దించాలని కోరారు. -
ఆయిల్పాం సాగుతో నిరంతర ఆదాయం
ఎర్రవల్లి: ఆయిల్పాం సాగు ద్వారా రైతులకు నిరంతర ఆదాయం సమకూరుతుందని జిల్లా ఉద్యానశాఖ అధికారి అక్బర్ అన్నారు. మంగళవారం ఎర్రవల్లి మండల పరిదిలోని బీచుపల్లి ఆయిల్ ఫెడ్ నర్సరీలో ఉద్యానశాఖ, తెలంగాణ ఆయిల్ఫెడ్ సహకారంతో జిల్లా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలోని వివిద క్షేత్ర స్థాయి అధికారులకు ఆయిల్పాం సాగుపై అవగాహన, శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జిల్లాకు 3500 ఎకరాల ఆయిల్పాం పంట సాగు లక్ష్యాన్ని కేటాయించడం జరిగిందన్నారు. జిల్లా ఉద్యానశాఖ, తెలంగాణ ఆయిల్ఫెడ్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలోని వివిధశాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి లక్ష్యాన్ని పూర్తి చేయాలని సూచించారు. ఆయిల్పాం పంట అనేది ఒకసారి వేసుకుంటే దాదాపు 30 సంవత్సరాల వరకు రైతులకు స్థిరమైన ఆదాయం వస్తుందన్నారు. చీడపీడల బెడద తక్కువగా ఉండి అకాల వర్షాలకు, వడగండ్లకు ఈ పంటకు ఎలాంటి నష్టం జరగకుండా సుస్థిర దిగుబడులకు అవకాశం ఉంటుందన్నారు. రైతుల నుంచి నేరుగా కంపెనీ కొనుగోలు చేస్తారని, నాణ్యమైన మొక్కలను ప్రభుత్వ పరంగా రైతులకు కేవలం రూ.20 లకే ఇస్తామన్నారు. ఎస్సీ, ఎస్టీ రైతులకు 100శాతం డ్రిప్ సదుపాయంతో సన్న, చిన్న కారు రైతులకు 90శాతం, పెద్దకారు రైతులకు 80శాతం సబ్సిడీపై అందజేయనున్నట్లు వివరించారు. అలాగే పంట నిర్వహణకు రూ.2100, అంతర పంటల సాగుకు రూ.2100.. ఇలా ఎకరానికి రూ. 4200 చొప్పున ఏటా రైతు ఖాతాలో జమ చేస్తామన్నారు. నాలుగేళ్లకుగాను రూ.16,800 రైతులు సబ్సిడీ ద్వారా పొందవచ్చునని, రైతులకు ఎలాంటి మార్కెటింగ్ ఇబ్బందులు కూడా లేకుండా ఉంటుందన్నారు. రైతులు ఈ ఆయిల్పాం సాగువైపు మొగ్గు చూపేలా అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. శివనాగిరెడ్డి, రాజశేఖర్, ఎపీఓలు, ఈసీలు, టీఏలు, ఎఫ్ఏలు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. -
శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు
గద్వాల క్రైం: శాంతి భద్రతల విషయంలో అప్రమత్తంగా ఉండాలని.. అనుమానాస్పద కేసులపై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం ఎస్పీ కార్యాలయంలో నేర సమీక్ష సమావేశం నిర్వహించి మాట్లాడారు. సమస్యలపై వచ్చే బాధితులకు న్యాయం అందేలా చూడాలని, అనుమతి లేకుండా ఇసుక, మట్టి, రేషన్ బియ్యం, నిషేధిత మత్తు పదార్ధాలు, గంజాయిని కట్టడి చేయాలని ఆదేశించారు. ఈమేరకు సరిహద్దు ప్రాంతాల్లో పట్టిష్ట నిఘా ఉంచాలని, స్టేషన్ పరిధిలో సిబ్బంది ఎవరైన ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసిన అనర్హత వేటు తప్పదన్నారు. నమోదైన కేసుల విషయంలో నిర్లక్ష్యం లేకుండా వీలైనంత త్వరగా కోర్టులో చార్జ్షీట్ దాఖలు చేసి నిందితులకు శిక్ష పడేలా చూడాలన్నారు. అనంతరం ఆయా స్టేషన్లో నమోదైన కేసులపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో డీఎస్పీ మొగిలయ్య, సీఐ టాటాబాబు, శ్రీను, రవిబాబు, ఎస్ఐలు, కళ్యాణ్కుమార్, శ్రీకాంత్, వెంకటేష్, శ్రీనివాసులు, నాగశేఖర్రెడ్డి పాల్గొన్నారు. -
ఎట్టకేలకు..! నేటి నుంచి వంద పడకల ఆస్పత్రిలో వైద్య సేవలు
అలంపూర్: ఎట్టకేలకు వంద పడకల ఆస్పత్రిలో వైద్య సేవలు ప్రారంభం కానున్నాయి. ఆస్పత్రి ప్రారంభించిన దాదాపు రెండేళ్ల తర్వాత సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ నెల 23వ తేదీ బుధవారం ఆస్పత్రిలో ఓపీ సేవలు ప్రారంభిస్తున్నట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ సయ్యద్ బాష తెలిపారు. వైద్యుల సమక్షంలో ఓపీ ప్రారంభించనున్నట్లు తెలిపారు. మొదట తాత్కాలిక వైద్య సేవలు అందించాలని వైద్య శాఖ అధికారులు నిర్ణయించినట్లు సమాచారం. ఈ మేరకు ఏర్పాట్లు చేశారు.ఇదిలాఉండగా, వంద పడకల ఆస్పత్రిలో వైద్య సేవలపై అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య సోషల్ మీడియా వేదికగా నిరంతరం వార్ కొనసాగుతుంది. దీంతో అధికార యంత్రంగా ఓపీ సేవలతో ఆస్పత్రిలో వైద్యం అందించడానికి సిద్ధమయ్యారు. అలంపూర్ ప్రజల వైద్య కష్టాలు దూరం చేయడానికి 2018 ఫిబ్రవరిలో ఆస్పత్రి నిర్మాణానికి పాలన అనుమతులు వచ్చాయి. అలంపూర్ చౌరస్తాలో రూ.23.38 కోట్లతో వంద ఆస్పత్రి నిర్మాణానికి నిధులు వెచ్చించారు. వంద పడకలలో 50 పడకలు మాతా శిశు వైద్యానికి మరో 50 పడకలు సాధారణ వైద్య సేవలకు కేటాయించారు. అందుకు సంబంధించిన నిధులను సైతం పాలన అనుమతుల్లో పొందుపర్చడం జరిగింది. ఆ మేరకు ఆస్పత్రి నిర్మాణానికి బీజం పడింది.ఇబ్బందులు తప్పుతాయి..వంద పడకల ఆసుపత్రిలో వైద్యసేవలు ప్రారంభం కావడం హర్షనీయం. ఇన్నాళ్లు వైద్య సేవల కోసం ఎక్కడికెక్కడికో వెళ్లే వాళ్లం. వ్యాధుల భారిన పడితే చాలు అటు కర్నూల్ అయినా జిల్లా కేంద్రం, మహబూబ్నగర్ ఆస్పత్రులకు వెళ్లే వాళ్లం. అలంపూర్లో ఆస్పత్రిలో వైద్యసేవలు అందుబాటులోకి వస్తే నియోజకవర్గ ప్రజలకు ఎంతో ఊరట కలగనుంది.– జెమిని మద్దిలేటి, అయిజఎన్నాళ్లుగానో ఎదురుచూశాంఅలంపూర్ చౌరస్తాలో 100 పడకల ఆసుపత్రిలో వైద్యసేవలు అందించడంతో పేద ప్రజలకు ఎంతో మేలు జరగనుంది. ఎంతోకాలంగా వైద్యం కోసం తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి. ఆసుపత్రిలో సేవలు అందుబాటులోకి వస్తే ఆ కష్టాలు తీరుతాయి. జాతీయ రహదారి, రాష్ట్రానికి సరిహద్దు కావడంతో అత్యవసర సేవలు పొందే అవకాశం ఉంటుంది.– అడ్డాకుల రాము, లింగనవాయిమొదట ఓపీ సేవలు..వంద పడకల ఆస్పత్రిలో బుధవారం నుంచి వైద్యసేవలు ప్రారంభించనున్నాం. మొదట ఓపీ సేవలు అందించనున్నాం. అనంతరం విడతల వారీగా అప్గ్రేడ్ చేస్తాం.– సయ్యద్పాషా, వంద పడకల ఆస్పత్రి సూపరింటెండ్, అలంపూర్ -
మరో నాలుగు..!
ఉమ్మడి పాలమూరులో పెరగనున్న అసెంబ్లీ స్థానాలు కోస్గి లేదా అయిజ.. ప్రస్తుత నారాయణపేట జిల్లా, కొడంగల్ నియోజకవర్గ పరిధిలోని కోస్గి, మద్దూరు, కొత్తపల్లి, గుండుమాల్, పరిగి నియోజకవర్గంలోని గండేడ్ కలుపుకొని కోస్గి అసెంబ్లీ నియోజకవర్గంగా ఆవిర్భవించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అవసరమైతే నారాయణపేట నియోజకవర్గంలోని దామరగిద్ద మండలాన్ని కూడా కలిపే చాన్స్ ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇది సాధ్యం కాని పక్షంలో జోగుళాంబ గద్వాల జిల్లాలోని కర్ణాటక సరిహద్దులో ఉన్న అయిజకు చాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అలంపూర్ నియోజకవర్గంలోని అయిజ, వడ్డేపల్లి, రాజోళి, గద్వాల నియోజకవర్గంలోని గట్టు కలిపి అయిజ నియోజకవర్గంగా ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. పెబ్బేరు వనపర్తి జిల్లా, ఆ నియోజకవర్గంలో ఉన్న పెబ్బేరు కేంద్రంగా కొత్త నియోజకవర్గం ఏర్పాటయ్యే అవకాశం ఉంది. వనపర్తి, కొల్లాపూర్, దేవరకద్ర నియోజకవర్గాల పరిధిలో రెండేసి మండలాలను దీని పరిధిలో చేరుస్తారని అంచనా. 2011 లెక్కల ప్రకారం పరిశీలిస్తే ఆయా మండలాలు/పట్టణంలో జనాభా 2,12,253. సగటు జనాభా 2,30,064లో పదిశాతం తీసేసి పోలిస్తే.. జనాభా కొంత ఎక్కువగానే ఉంది. దీంతో పాటు పెబ్బేరు, కొత్తకోట జాతీయ రహదారి 44ను ఆనుకుని ఉండడడంతో ఈ నియోజకవర్గ ఏర్పాటు ఖాయమనే వాదనలు విన్పిస్తున్నాయి. మండలం జనాభా పెబ్బేరు (వనపర్తి) 48,749 కొత్తకోట (దేవరకద్ర) 59,331 శ్రీరంగాపూర్ (వనపర్తి) 19,941 వీపనగండ్ల (కొల్లాపూర్) 27,378 చిన్నంబావి (కొల్లాపూర్) 28,949 మదనాపురం (దేవరకద్ర) 27,905 మొత్తం 2,12,253 సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: దేశవ్యాప్తంగా అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. 2027 మార్చిలో కొత్త జనాభా లెక్కలు పూర్తి చేసి.. డీలిమిటేషన్ ప్రక్రియ మొదలుపెట్టనున్నట్లు ఇటీవలే స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో 2009లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనను నెమరువేసుకుంటూ.. ప్రస్తుతం ఎలాంటి మార్పులు, చేర్పులు చోటుచేసుకుంటాయోననే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఈ మేరకు ప్రధాన పార్టీల ముఖ్య నేతలు, ఎమ్మెల్యే ఆశావహులు ఎవరికి వారు అంచనాల్లో మునిగిపోయారు. ఈ క్రమంలో పెరగనున్న అసెంబ్లీ స్థానాలు.. మారనున్న నియోజకవర్గాల భౌగోళిక సరిహద్దులపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.. రాష్ట్రం మొత్తం జనాభాను పరిగణనలోకి తీసుకుని.. నియోజకవర్గంలో ఉండాల్సిన సగటు జనాభాను నిర్ణయిస్తారు. అందుబాటులో ఉన్న 2011 జనాభా లెక్కల ఆధారంగా రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో సగటు జనాభా 2,30,064 (పది శాతం జనాభా తక్కువ లేదా ఎక్కువ ఉండొచ్చు). దీని ప్రకారం తెలంగాణలో ఉన్న 119 అసెంబ్లీ స్థానాలు 153కు చేరుకోనున్నాయి. ఈ లెక్కన 34 నియోజకవర్గాలు కొత్తగా ఆవిర్భవించే అవకాశం ఉంది. అదేవిధంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో జనాభా 40,53,028 (2011 లెక్కల ప్రకారం) ఉండగా.. 14 అసెంబ్లీ స్థానాలు 18కి చేరుకోనున్నాయి. ● ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ప్రస్తుతం 14 అసెంబ్లీ సెగ్మెంట్లు (షాద్నగర్, జడ్చర్ల, మహబూబ్నగర్. దేవరకద్ర, వనపర్తి, నారాయణపేట, మక్తల్, కొడంగల్, గద్వాల, అలంపూర్, నాగర్కర్నూల్, కల్వకుర్తి, కొల్లాపూర్, అచ్చంపేట) ఉన్నాయి. పునర్విభజన చేపడితే మరో నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలు కొత్తగా ఆవిర్భవించనున్నాయి. ఇందులో పెబ్బేరు/కొత్తకోట, ఆమనగల్, మహబూబ్నగర్ రూరల్ ఖాయమని.. కోస్గి, అయిజలో ఏదైనా ఒకటి కొత్త నియోజకవర్గంగా ఏర్పడే అవకాశం ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాగా, ఉమ్మడి మహబూబ్నగర్ ఐదు జిల్లాలుగా (మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగుళాంబ గద్వాల) విడిపోగా.. పలు నియోజకవర్గాలు, మండలాలు రెండు, మూడు జిల్లాల పరిధిలో ఉన్నాయి. వాటిని ఒకే జిల్లా పరిధిలోకి తీసుకురానున్నారు. మండలం జనాభా ఆమనగల్ (కల్వకుర్తి) 62,034 మాడ్గుల (కల్వకుర్తి) 49,133 తలకొండపల్లి (కల్వకుర్తి) 52,835 కడ్తాల్ (కల్వకుర్తి) 36,406 వెల్దండ (కల్వకుర్తి) 46,006 మొత్తం 2,46,414 ఆమనగల్ ఉమ్మడి మహబూబ్నగర్లో కల్వకుర్తి నియోజకవర్గ పరిధిలో ఉన్న ఆమనగల్, మాడ్గుల, తలకొండపల్లి, కడ్తాల్ మండలాలు జిల్లాల పునర్విభజనలో రంగారెడ్డికి వెళ్లాయి. నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ఈ మండలాలతో పాటు కల్వకుర్తి నియోజకవర్గంలోని వెల్దండ మండలం కలిసి ఆమనగల్ అసెంబ్లీ నియోజకవర్గంగా ఏర్పాటయ్యే అవకాశం ఉంది. 2011 సగటు జనాభాతో పాటు భౌగోళికంగా సరిపోనుండడంతో కొత్తగా ఈ నియోజకవర్గం ఏర్పాటయ్యే అవకాశాలు ఎక్కువనే అభిప్రాయం రాజకీయవర్గాల్లో వ్యక్తమవుతోంది. ఇక కల్వకుర్తి నియోజకవర్గంలో కల్వకుర్తి మండలం మిగలగా.. ఈ నియోజకవర్గంలో అచ్చంపేట నుంచి వంగూరు, చారకొండ.. జడ్చర్ల నుంచి ఊర్కొండ, నాగర్కర్నూల్ నుంచి తాడూరు మండలాలను చేర్చే అవకాశం ఉంది. ముఖ్యనేతల నజర్ 2027 మార్చి నాటికి దేశవ్యాప్తంగా జనగణన పూర్తి చేసి.. ఆ తర్వాత ఆరు నెలల్లో నియోజకవర్గాల డీలిమిటేషన్ తతంగం ముగించేలా కేంద్రం ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు 2028 నవంబర్ లేదా డిసెంబర్లో తెలంగాణ శాసనసభకు ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. నియోజకవర్గాల పునర్విభజన జరిగిన పక్షంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 9 స్థానాలు పెరిగే అవకాశం ఉంది. ఈ లెక్కన ఆ జిల్లా మొత్తం అసెంబ్లీ స్థానాలు 23కు చేరుకుంటాయి. దీని తర్వాత మహబూబ్నగర్ జిల్లా 18 నియోజకవర్గాలతో రాష్ట్రంలోనే ద్వితీయ స్థానంలో నిలవనుంది. పునర్విభజనతో రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉండడంతో వివిధ పార్టీల ముఖ్య నేతలు, ఆశావహులు కొత్తగా ఏర్పాటయ్యే నియోజకవర్గాలపై దృష్టి సారించారు. తమ కుటుంబసభ్యులను రాజకీయారంగేట్రం చేసేలా పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. నూతనంగా పెబ్బేరు, ఆమనగల్, మహబూబ్నగర్ రూరల్ ఖాయం కోస్గి లేదా అయిజలో ఏదైనా ఒక్కటి.. రాష్ట్రంలో రంగారెడ్డి తర్వాత 18 సీట్లతో రెండోస్థానంలో జిల్లా.. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత మారనున్న భౌగోళిక సరిహద్దులు 2027 మార్చిలో కొత్త జ నాభా లెక్కలు రాగానే డీలిమిటేషన్ ప్రక్రియ షురూ -
తనిఖీలు నిర్వస్తాం
అయిజకు చెందిన గర్భిణి అంశంపై రెండు డయాగ్నోస్టిక్ సెంటర్ నిర్వాహకులకు నోటీసులు జారీ చేశాం. నిర్వాహకుల నివేదికలను త్రీ మెన్ కమిటీ విచారణ చేపడుతుంది. వారి నివేదికల ఆధారంగా తగు చర్యలు తీసుకుటాం. గర్భిణికి జిల్లా ప్రభుత్వాసుపత్రిలో ఈ నెల 15వ తేదిన శస్త్ర చికిత్స ద్వారా ప్రసవం చేశాం. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు. అనుమతి లేకుండా ఆస్పత్రులు, ల్యాబ్లు నిర్వహించినా.. వ్యాధి నిర్ధారణ పరీక్షల పేరుతో అధికంగా డబ్బు వసూలు చేసినా తనిఖీలు నిర్వహించి చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. – సిద్దప్ప, జిల్లా ఇన్చార్జ్ వైద్యాధికారి ● -
ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలపై పోరాటం
గద్వాలటౌన్: ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని, సమస్యల సాధన కోసం దశల వారీగా పోరాటం సాగిస్తామని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యూఎస్పీసీ) నాయకులు అన్నారు. సోమవారం కమిటీ నాయకులు సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిటీ నాయకులు గోపాల్, ప్రభాకర్శాస్త్రి, ఉదయ్కిరణ్, హరిబాబు మాట్లాడారు. బదిలీలు, పదోన్నతుల ప్రక్రియను ఈ నెలాఖరులోపు పూర్తి చేయాలని, పీఆర్సీని ప్రకటించి పెండింగ్ డీఏలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు తన మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా సీపీఎస్ను రద్దుచేసి, ఓపీఎస్ను అమలు చేయాలన్నారు. ఉపాధ్యాయుల సర్దుబాటు జీఓ 25ను సవరించాలని, 317 జీఓ వల్ల నష్టపోయిన ఉపాధ్యాయులందరినీ, వారి సొంత జిల్లాలకు పంపాలని కోరారు. ఎస్ఎస్ఏ ఉద్యోగుల 29 రోజుల సమ్మె కాలానికి పూర్తి వేతనం చెల్లించాలని, టైం స్కేల్ను ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ విరమణ పొందిన ఉపాధ్యాయులందరికి పెండింగ్ బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. సమస్యల సాధన కోసం ఈ నెల 23, 24వ తేదీలలో తహశీల్దార్లకు వినతి పత్రాలు ఇవ్వాలన్నారు. ఆగస్టు 1న జిల్లా కేంద్రాలలో ధర్నా చేపట్టి, ఆగస్టు 23న హైదరాబాద్లో చేపట్టే మహాధర్నాకు తరలివెళ్లాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో యూఎస్పీసీ నాయకులు ప్రభాకర్, వెంకటరమణ, హనుమంతు, చంద్రకాంత్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలి గట్టు: బీజేపీ నాయకులు, కార్యకర్తలు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం కావాలని బీజేపీ పార్టీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్ సంజీవ్భరద్వాజ్ అన్నారు. సోమవారం సాయంత్రం గట్టులో బీజేపీ పార్టీ నాయకులు సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ఓటర్లు బీజేపీ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారని, నాయకులు, కార్యకర్తలు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించే దిశగా కలిసికట్టుగా పని చేయాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం నేరుగా పంచాయతీలకు నిధులను అందిస్తోందని, రైతు వేదికల నిర్మాణాలు, ఉచిత బియ్యం, పల్లెప్రకృతి వనాలు, వైకుంఠధామాల నిర్మాణాలు, ఎరువుల రాయితీ, పీఎం విశ్వకర్మ, ముద్రలోన్స్, అంగన్వాడీ కేంద్రాల్లోని చిన్నారులకు అందించే పౌష్టికాహారం వరకు కేంద్ర ప్రభుత్వం నిధులను సమకూర్చుతున్నట్లు తెలిపారు. కేంద్రంలోని నరేంద్రమోడీదీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను క్షేత్ర స్థాయిలో ఓటర్లకు వివరించాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను అమలు చేయడంలో విఫలమైనట్లు ఆరోపించారు. కార్యక్రమంలో బీజేపీ పార్టీ నాయకులు బల్గెర శివారెడ్డి, గట్టు మధుసూదన్రావు, మాచర్ల సురేష్,నాగప్ప, గోవిందు, కిట్టుస్వామి,సంజీవనాయుడు, నర్సింహులు, వెంకటేష్, రాఘవేంద్ర, జనేయగౌడు,శ్రీరాములు,గౌడురమేష్గౌడు,బెల్లంనర్సింహులు, లింగన్న పాల్గొన్నారు. రైతులే నడుం బిగించి.. జమ్ము తొలగించి పాన్గల్: కల్వకుర్తి ఎత్తిపోతల పథకం డీ–1 కాల్వలో నీటి పారుదలకు అడ్డంకిగా మారిన జమ్ము, పిచ్చిమొక్కల తొలగింపునకు ఆయకట్టు రైతులు నడుం బిగించారు. కాల్వలో పూడిక తీయించడంతోపాటు జమ్ము, పిచ్చిమొక్కలను తొలగించాలని అధికారులకు ఎన్నిమార్లు విన్నవించినా ఫలితం లేకపోవడంతో రైతులే స్వయంగా రంగంలోకి దిగారు. రోజుకు కొంతమంది చొప్పున మూడు రోజులుగా కాల్వలో పెరిగిన జమ్ము, పిచ్చిమొక్కలు తొలగిస్తున్నారు. అయితే సంబంధిత అధికారులు స్పందించి కేఎల్ఐ డీ–1 కాల్వకు మరమ్మతు చేయించడంతోపాటు పూడిక, జమ్మును పూర్తిగా తొలగించాలని కోరుతున్నారు. -
మహబూబ్నగర్ రూరల్
మహబూబ్నగర్ జిల్లాలో ప్రస్తుతం మూడు అసెంబ్లీ నియోజకవర్గాలు (మహబూబ్నగర్, జడ్చర్ల, దేవరకద్ర) ఉన్నాయి. మరో నియోజకవర్గంగా మహబూబ్నగర్ రూరల్ ఏర్పాటయ్యే అవకాశం ఉంది. మహబూబ్నగర్ పరిధిలోని మహబూబ్నగర్ రూరల్ మండలం, హన్వాడ, పరిగి నియోజకవర్గంలోని మహమ్మదాబాద్, నారాయణపేట సెగ్మెంట్లోని కోయిల్కొండ, జడ్చర్ల పరిధిలోని నవాబుపేట మండలాలతో కలిపి మహబూబ్నగర్ రూరల్ నియోజకవర్గం ఏర్పాటు చేసే అవకాశం ఉంది. మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి (2011 లెక్కల ప్రకారం జనాభా 2,17,942)ని మహబూబ్నగర్ అర్బన్ నియోజకవర్గం చేసే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మండలం జనాభా మహబూబ్నగర్ రూరల్ 42,523 హన్వాడ (మహబూబ్నగర్) 55,044 మహమ్మదాబాద్ (పరిగి) 34,087 కోయిల్కొండ (నారాయణపేట) 66,721 నవాబుపేట (జడ్చర్ల) 52,061 మొత్తం 2,50,436 -
రెఫర్ చేస్తే కమీషన్లు
జిల్లాలోని కొన్ని డయాగ్నోసి్ట్క్ ల్యాబ్ నిర్వాహకులు నిబంధనలు పాటించడంలేదన్న ఆరోపణలు వినవస్తున్నాయి. ఒక వ్యక్తి జబ్బు పడితే.. డయాగ్నోస్టిక్ సెంటర్లలో రక్త పరీక్ష చేసి పాథాలజీ, బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ నిపుణులు వ్యాధి నిర్ధారణ చేస్తారు. కానీ అర్హతలేని వారు పరీక్షలు చేస్తూ తప్పుడు రిపోర్టులు ఇస్తుండడంతో ప్రజల నుంచి ఆందోళన వ్యక్తమవుతుంది. తాజాగా ఈ నెల 13వ తేదీన జిల్లాలోని అయిజకు చెందిన ఓ గర్భిణికి తప్పుడు రిపోర్టు ఇవ్వడం కలకలంగా మారింది. ప్రసవం కోసం ఓ గర్భిణిని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా ఉమ్మనీరు ఎంత ఉందనే విషయం కోసం వైద్యులు స్కానింగ్ సీఫార్సు చేశారు. దగ్గరలోని డయాగ్నోస్టిక్ ల్యాబ్లో పరీక్షలు చేయగా ఉమ్మనీరు (ఏఎఫ్ఐ 3.4 సీ.ఎం) ఉన్నట్లు రిపోర్టు ఇచ్చారు. వైద్యులు గర్భిణికి సాధారణ కాన్పు సాధ్యం కాదని.. శస్త్ర చికిత్స చేయాల్సి ఉంటుందని గుర్తించి జిల్లా ప్రభుత్వాసుపత్రికి రెఫర్ చేశారు. ఆ రిపోర్టుపై అనుమానం కలగడంతో వైద్యులు గద్వాల జిల్లా కేంద్రంలోని మరో డయాగ్నోస్టిక్ సెంటర్లో పరీక్షలు చేయించగా.. ఉమ్మనీరు (ఏఎఫ్ఐ 11.12 సీ.ఎం) ఉన్నట్లు రిపోర్టు రావడంతో వైద్యులు శస్త్ర చికిత్సను ఉపసంహరించారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా.. చివరికి ఈ నెల 15వ తేదీన ఆ గర్భిణికి జిల్లా ప్రభుత్వాసుపత్రిలో ఉమ్మనీరు తక్కువగా ఉందని శస్త్ర చికిత్స ద్వారా ప్రసవం చేశారు. గద్వాల – అలంపూర్ సెగ్మెంట్లలో ప్రైవెటు వైద్యులు, డయాగ్నోస్టిక్ కేంద్రాలు, ల్యాబ్ల నిర్వాహకులు, రోగుల నుంచి అందినంత దోచేస్తున్నారు. మరోవైపు వైరల్ జ్వరంతో ఆసుపత్రికి వెళ్లిన బాధితులకు మలేరియా, డెంగీ, టైఫాయిడ్ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు చెబుతున్నారు. అవసరం లేకున్నా నిర్ధారణ పరీక్షలు ప్రస్తుతం ప్రజలు వైరల్ జ్వరాల భారినపడుతుండగా..కొంతమంది వైద్యులు మలేరియా, డెంగీ, టైఫాయిడ్ నిర్ధారణతో పాటు షుగర్, మూత్ర పరీక్షలు కూడా చేయించుకోవాలని సూచిస్తున్నారు. ల్యాబ్లలో రెట్టింపు చార్జీలు వసూలు చేస్తున్నారు. జిల్లాలోని గద్వాల – అలంపూర్ సెగ్మెంట్లో డయాగ్నోస్టిక్ సెంటర్లు 5, ప్రైవేటు ఆసుపత్రులు 45, క్లినిక్లు 19, డెంటల్ 18, రక్త పరీక్షలు (ల్యాబ్) 138, ఫిజియోథెరపీ సెంటర్లు 6, కంటి ఆస్పత్రులు 5 ఇలా మొత్తం 236 వైద్యశాఖ అనుమతితో ఉన్నాయి. మరోవైపు అనుమతి లేకుండా కొందరు వివిధ పేర్లతో ల్యాబ్లు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో వైద్యులు, ల్యాబ్ల నిర్వాహకులు కుమ్మకై ్క అవసరం లేని వైద్య పరీక్షలు చేయిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. బాధితులు జబ్బుపడి ఆస్పత్రికి వెళ్లిన తరుణంలో ఫలానా ల్యాబ్కు వెళ్లాలని సిఫార్సు చేస్తున్నారు. ల్యాబ్ నిర్వాహకులు పరీక్షల రూపంలో వసూలు చేసే సోమ్ములో 20 నుంచి 40 శాతం వరకు సంబంధిత వైద్యులకు కమీషన్గా అందజేస్తున్న విషయం బహిరంగ రహస్యమే. జిల్లాలోని ప్రధాన ప్రభుత్వాసుపత్రుల ఎదురుగా కొందరు రక్త పరీక్షల సెంటర్లను ఏర్పాటు చేసుకున్నారు. వీరికి ఆయా ఆసుపత్రులలో పనిచేసే కొందరితో సంబంధాలు.. ప్రభుత్వాసుపత్రిలో చేయలేని పరీక్షలు బయటకు సిఫార్సు చేస్తున్నారు. ప్రతిఫలంగా ల్యాబ్ నిర్వాహకులు కొంత నజరానా అందజేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల మేరకు ప్రతి వైద్య పరీక్షలకు అయ్యే ఖర్చులకు సంబంధించిన ధరల పట్టికను ఏర్పాటు చేయాలి. జిల్లాలో వైద్యులు, ఆర్ఎంపీలు, ల్యాబ్ నిర్వాహకులు, మె డికల్ దుకాణ యాజమానులు తదితర వ్యక్తులు అందరూ కలిసి దందా నిర్వహిస్తున్నారు. జ్వరం వచ్చినా మలేరియా, డెంగీ పరీక్షలు.. రోగి జేబుకి చిల్లు అర్హత లేని వారు సైతం ల్యాబ్లు నిర్వహిస్తున్న వైనం ఇటీవల ఓ గర్భిణికి తప్పుడు రిపోర్టుతో వెలుగులోకి.. -
కార్యకర్తలను విస్మరిస్తే గాంధీభవన్ను ముట్టడిస్తాం
గద్వాల: పార్టీ కార్యకర్తలను విస్మరిస్తే గాంధీభవన్ను ముట్టడిస్తామని మాజీ మున్సిపల్ చైర్మన్ బీఎస్ కేశవ్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన నాయకులు, కార్యకర్తలతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా మున్సిపల్ చైర్మన్ కేశవ్ మాట్లాడుతూ.. గద్వాలలో బీసీ నాయకత్వానికి తీరని అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. గల్లీ నుంచి ఢిల్లీ ద్వారా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల ప్రజలు కృషి చేశారన్నారు. రాష్ట్రంలో ప్రజాపాలన ప్రభుత్వం ఏర్పడిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన కొనసాగుతుంటే గద్వాలలో మాత్రం పరిస్థితులు పూర్తి భిన్నంగా మారాయన్నారు. పార్టీ కోసం శ్రమించిన కార్యకర్తలకు నామినేటెడ్ పదువులు గాని సంక్షేమ ఫలాలు గాని ఏమాత్రం పొందడం లేదన్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీసీ బిడ్డ అయిన సరిత స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయినప్పటికీ గద్వాలలో పార్టీ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. కానీ, బీసీ నాయకత్వంపై అధిష్టానం వివక్షపూరితంగా వ్యవహరిస్తుందని, గద్వాలలో కాంగ్రెస్ పార్టీ పటిష్టంగా ఉండాలంటే సరిత వర్గీయులకే ఇందిరమ్మ కమిటీలు, ఇందిరమ్మ ఇళ్ల పంిపిణీలో అవకాశం కల్పించాలన్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన ఎమ్మెల్యే తాను ఏ పార్టీలో ఉన్న విషయం కూడా స్పష్టం చేయకుండా ప్రభుత్వ సంక్షేమ పథకాలు, పార్టీ సమావేశాల్లో ఏవిధంగా పాల్గొంటారని ప్రశ్నించారు. మొదటి నుంచి పార్టీకోసం కష్టించి పనిచేసిన వారికి కాకుండా దొడ్డిదారిలో వచ్చిన వారికి స్థానిక సంస్థల ఎన్నికలో బీ–ఫామ్లు అందజేస్తే గద్వాల నుంచి పాదయాత్రగా వచ్చి గాంధీభవన్ను ముట్టిడిస్తామని హెచ్చరించారు. మధుసూదన్బాబు, బలిగేర నారాయణరెడ్డి, శంకర్, ప్రముఖ న్యాయవాదిషఫిఉల్లా, ఇసాక్, వెంకటస్వామిగౌడ్, గోనుపాడు శ్రీనివాస్గౌడ్, పెద్దపల్లి రాజశేఖర్రెడ్డి, తిరుమలేష్, పులిపాటి వెంకటేష్, డీఆర్ శ్రీధర్, కోటేష్, వాకిటి సంజీవులు పాల్గొన్నారు. -
నెత్తిన బోనం.. భక్తిభావంతో జనం
గద్వాలటౌన్: తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టి పడేలా బోనాలు వేడుకలు నిర్వహించారు. డప్పు చప్పుళ్లు.. శివసత్తుల పూనకాలు.. పోతరాజుల విన్యాసాలతో సందడి నెలకొంది. ఆషాడమాసం చివరి సోమవారం సందర్భంగా జిల్లా కేంద్రంలోని వివిధ కాలనీలలో నిర్వహించిన బోనాల పండగను అత్యంత వైభవంగా నిర్వహించారు. మహిళలు, చిన్నారులు బోనాలు తలపై పెట్టుకుని ఊరేగింపుగా బయల్దేరారు. అనంతరం మహిళలు ఆలయాలకు చేరుకుని అమ్మవారికి నైవేద్యం సమర్పించారు. ఉదయం నుంచే గ్రామ దేవతల ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. పట్టణ రహదారులు ఆధ్యాత్మిక సందడి నెలకొంది. వివిధ పార్టీల నాయకులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. జిల్లా కేంద్రంలో వైభవంగా బోనాలు -
మరో నాలుగు..!
ఉమ్మడి పాలమూరులో పెరగనున్న అసెంబ్లీ స్థానాలు కోస్గి లేదా అయిజ.. ప్రస్తుత నారాయణపేట జిల్లా, కొడంగల్ నియోజకవర్గ పరిధిలోని కోస్గి, మద్దూరు, కొత్తపల్లి, గుండుమాల్, పరిగి నియోజకవర్గంలోని గండేడ్ కలుపుకొని కోస్గి అసెంబ్లీ నియోజకవర్గంగా ఆవిర్భవించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అవసరమైతే నారాయణపేట నియోజకవర్గంలోని దామరగిద్ద మండలాన్ని కూడా కలిపే చాన్స్ ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇది సాధ్యం కాని పక్షంలో జోగుళాంబ గద్వాల జిల్లాలోని కర్ణాటక సరిహద్దులో ఉన్న అయిజకు చాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అలంపూర్ నియోజకవర్గంలోని అయిజ, వడ్డేపల్లి, రాజోళి, గద్వాల నియోజకవర్గంలోని గట్టు కలిపి అయిజ నియోజకవర్గంగా ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. పెబ్బేరు వనపర్తి జిల్లా, ఆ నియోజకవర్గంలో ఉన్న పెబ్బేరు కేంద్రంగా కొత్త నియోజకవర్గం ఏర్పాటయ్యే అవకాశం ఉంది. వనపర్తి, కొల్లాపూర్, దేవరకద్ర నియోజకవర్గాల పరిధిలో రెండేసి మండలాలను దీని పరిధిలో చేరుస్తారని అంచనా. 2011 లెక్కల ప్రకారం పరిశీలిస్తే ఆయా మండలాలు/పట్టణంలో జనాభా 2,12,253. సగటు జనాభా 2,30,064లో పదిశాతం తీసేసి పోలిస్తే.. జనాభా కొంత ఎక్కువగానే ఉంది. దీంతో పాటు పెబ్బేరు, కొత్తకోట జాతీయ రహదారి 44ను ఆనుకుని ఉండడడంతో ఈ నియోజకవర్గ ఏర్పాటు ఖాయమనే వాదనలు విన్పిస్తున్నాయి. మండలం జనాభా పెబ్బేరు (వనపర్తి) 48,749 కొత్తకోట (దేవరకద్ర) 59,331 శ్రీరంగాపూర్ (వనపర్తి) 19,941 వీపనగండ్ల (కొల్లాపూర్) 27,378 చిన్నంబావి (కొల్లాపూర్) 28,949 మదనాపురం (దేవరకద్ర) 27,905 మొత్తం 2,12,253 సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: దేశవ్యాప్తంగా అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. 2027 మార్చిలో కొత్త జనాభా లెక్కలు పూర్తి చేసి.. డీలిమిటేషన్ ప్రక్రియ మొదలుపెట్టనున్నట్లు ఇటీవలే స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో 2009లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనను నెమరువేసుకుంటూ.. ప్రస్తుతం ఎలాంటి మార్పులు, చేర్పులు చోటుచేసుకుంటాయోననే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఈ మేరకు ప్రధాన పార్టీల ముఖ్య నేతలు, ఎమ్మెల్యే ఆశావహులు ఎవరికి వారు అంచనాల్లో మునిగిపోయారు. ఈ క్రమంలో పెరగనున్న అసెంబ్లీ స్థానాలు.. మారనున్న నియోజకవర్గాల భౌగోళిక సరిహద్దులపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.. రాష్ట్రం మొత్తం జనాభాను పరిగణనలోకి తీసుకుని.. నియోజకవర్గంలో ఉండాల్సిన సగటు జనాభాను నిర్ణయిస్తారు. అందుబాటులో ఉన్న 2011 జనాభా లెక్కల ఆధారంగా రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో సగటు జనాభా 2,30,064 (పది శాతం జనాభా తక్కువ లేదా ఎక్కువ ఉండొచ్చు). దీని ప్రకారం తెలంగాణలో ఉన్న 119 అసెంబ్లీ స్థానాలు 153కు చేరుకోనున్నాయి. ఈ లెక్కన 34 నియోజకవర్గాలు కొత్తగా ఆవిర్భవించే అవకాశం ఉంది. అదేవిధంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో జనాభా 40,53,028 (2011 లెక్కల ప్రకారం) ఉండగా.. 14 అసెంబ్లీ స్థానాలు 18కి చేరుకోనున్నాయి. ● ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ప్రస్తుతం 14 అసెంబ్లీ సెగ్మెంట్లు (షాద్నగర్, జడ్చర్ల, మహబూబ్నగర్. దేవరకద్ర, వనపర్తి, నారాయణపేట, మక్తల్, కొడంగల్, గద్వాల, అలంపూర్, నాగర్కర్నూల్, కల్వకుర్తి, కొల్లాపూర్, అచ్చంపేట) ఉన్నాయి. పునర్విభజన చేపడితే మరో నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలు కొత్తగా ఆవిర్భవించనున్నాయి. ఇందులో పెబ్బేరు/కొత్తకోట, ఆమనగల్, మహబూబ్నగర్ రూరల్ ఖాయమని.. కోస్గి, అయిజలో ఏదైనా ఒకటి కొత్త నియోజకవర్గంగా ఏర్పడే అవకాశం ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాగా, ఉమ్మడి మహబూబ్నగర్ ఐదు జిల్లాలుగా (మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగుళాంబ గద్వాల) విడిపోగా.. పలు నియోజకవర్గాలు, మండలాలు రెండు, మూడు జిల్లాల పరిధిలో ఉన్నాయి. వాటిని ఒకే జిల్లా పరిధిలోకి తీసుకురానున్నారు. ఆమనగల్ ఉమ్మడి మహబూబ్నగర్లో కల్వకుర్తి నియోజకవర్గ పరిధిలో ఉన్న ఆమనగల్, మాడ్గుల, తలకొండపల్లి, కడ్తాల్ మండలాలు జిల్లాల పునర్విభజనలో రంగారెడ్డికి వెళ్లాయి. నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ఈ మండలాలతో పాటు కల్వకుర్తి నియోజకవర్గంలోని వెల్దండ మండలం కలిసి ఆమనగల్ అసెంబ్లీ నియోజకవర్గంగా ఏర్పాటయ్యే అవకాశం ఉంది. 2011 సగటు జనాభాతో పాటు భౌగోళికంగా సరిపోనుండడంతో కొత్తగా ఈ నియోజకవర్గం ఏర్పాటయ్యే అవకాశాలు ఎక్కువనే అభిప్రాయం రాజకీయవర్గాల్లో వ్యక్తమవుతోంది. ఇక కల్వకుర్తి నియోజకవర్గంలో కల్వకుర్తి మండలం మిగలగా.. ఈ నియోజకవర్గంలో అచ్చంపేట నుంచి వంగూరు, చారకొండ.. జడ్చర్ల నుంచి ఊర్కొండ, నాగర్కర్నూల్ నుంచి తాడూరు మండలాలను చేర్చే అవకాశం ఉంది. మండలం జనాభా ఆమనగల్ (కల్వకుర్తి) 62,034 మాడ్గుల (కల్వకుర్తి) 49,133 తలకొండపల్లి (కల్వకుర్తి) 52,835 కడ్తాల్ (కల్వకుర్తి) 36,406 వెల్దండ (కల్వకుర్తి) 46,006 మొత్తం 2,46,414 ముఖ్యనేతల నజర్ 2027 మార్చి నాటికి దేశవ్యాప్తంగా జనగణన పూర్తి చేసి.. ఆ తర్వాత ఆరు నెలల్లో నియోజకవర్గాల డీలిమిటేషన్ తతంగం ముగించేలా కేంద్రం ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు 2028 నవంబర్ లేదా డిసెంబర్లో తెలంగాణ శాసనసభకు ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. నియోజకవర్గాల పునర్విభజన జరిగిన పక్షంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 9 స్థానాలు పెరిగే అవకాశం ఉంది. ఈ లెక్కన ఆ జిల్లా మొత్తం అసెంబ్లీ స్థానాలు 23కు చేరుకుంటాయి. దీని తర్వాత మహబూబ్నగర్ జిల్లా 18 నియోజకవర్గాలతో రాష్ట్రంలోనే ద్వితీయ స్థానంలో నిలవనుంది. పునర్విభజనతో రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉండడంతో వివిధ పార్టీల ముఖ్య నేతలు, ఆశావహులు కొత్తగా ఏర్పాటయ్యే నియోజకవర్గాలపై దృష్టి సారించారు. తమ కుటుంబసభ్యులను రాజకీయారంగేట్రం చేసేలా పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. నూతనంగా పెబ్బేరు, ఆమనగల్, మహబూబ్నగర్ రూరల్ ఖాయం కోస్గి లేదా అయిజలో ఏదైనా ఒక్కటి.. రాష్ట్రంలో రంగారెడ్డి తర్వాత 18 సీట్లతో రెండోస్థానంలో జిల్లా.. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత మారనున్న భౌగోళిక సరిహద్దులు 2027 మార్చిలో కొత్త జ నాభా లెక్కలు రాగానే డీలిమిటేషన్ ప్రక్రియ షురూ -
జూరాల: కారు ఢీ.. ఎగిరిపడి డ్యామ్లో గల్లంతు
సాక్షి, గద్వాల జిల్లా: జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్ మండలంలోని జూరాల డ్యామ్ వద్ద ఆదివారం రాత్రి ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో తమపై కారు దూసుకురావడంతో ఒక యువకుడు ప్రాణభయంతో డ్యామ్లోకి దూకి గల్లంతయ్యాడు. మరో యువకుడు తీవ్రంగా గాయపడగా, ఇద్దరు యువకులు మాత్రం ప్రమాదం నుంచి తప్పించుకోగలిగారు. వివరాల్లోకి వెళితే, మానవపాడు మండలం బూడిదపాడు గ్రామానికి చెందిన మహేష్ (21), జానకిరాములు, ఇంకా ఇద్దరు స్నేహితులు కలిసి జూరాల డ్యామ్ సందర్శనకు వచ్చారు. రాత్రి సుమారు 7:30 గంటల సమయంలో వారు డ్యామ్ బ్రిడ్జిపై నుంచి గద్వాల వైపు వెళ్తుండగా, కర్ణాటకకు చెందిన ఓ వ్యక్తి డ్రైవింగ్ చేస్తున్న కారు అజాగ్రత్తగా, సెల్ఫోన్ చూస్తూ మోటారు సైకిళ్లను ఢీకొట్టేందుకు దూసుకొచ్చింది. తప్పించుకొనే ప్రయత్నంలో ప్రాజెక్టుపై నుంచి 53 వ గెట్ నదిలోకి పడి గల్లంతయిన యువకుడు మహేష్.. మరొక్క యువకునికి గాయాలయ్యాయి. జానకిరాములు తీవ్రంగా గాయపడ్డాడు. మిగతా ఇద్దరు యువకులు దూరంగా ఉండడంతో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. గాయపడిన యువకుడిని హుటాహుటిన హైదరాబాద్కు తరలించి వైద్యం అందిస్తున్నారు. ఈ ప్రమాదంతో డ్యామ్ పరిసరాల్లో అలజడి నెలకొంది. గల్లంతైన మహేష్ ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. -
ఆవిష్కరించండి
ఆలోచించండి.. నూతన ఆవిష్కరణలకు ‘ఇన్నోవేషన్ ఇన్స్పైర్ మనక్’ వేదిక ● విద్యార్థుల్లో సైన్స్పై ఆసక్తి.. నైపుణ్యం పెంపొందించడమే లక్ష్యం ● సెప్టెంబర్ 15 వరకు దరఖాస్తుల స్వీకరణ ● ప్రతి పాఠశాల నుంచి ప్రాజెక్టులకు ఆహ్వానం ● ఉమ్మడి జిల్లాలో గతేడాది 3,658 దరఖాస్తులు నారాయణపేట రూరల్: విద్యార్థి ఆలోచనలకు సృజనాత్మకత జోడించి.. కొత్త ఆవిష్కరణలు రూపకల్పన చేసేలా ప్రోత్సహిస్తోంది ఇన్నోవేషన్ ఇన్స్పైర్ మనక్ వేదిక. ఈ ఏడాది నుంచి వేడుకల్లో ప్రదర్శించే అంశాల్లో నాణ్యతపై దృష్టిపెట్టింది. మూస విధానాలు, ఒకరిని చూసి మరొకరు కొద్దిపాటి మార్పులతో ప్రయోగాలు అనుకరించకుండా ఉండేందుకు కొత్త ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టింది. కోవిడ్ సమయంలో విద్యార్థులకు నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ రాష్ట్ర సాంకేతిక మండలి సహకారంతో పాఠశాల విద్యార్థుల కోసం ఒక వేదికను తయారు చేసింది. ఇందులో అన్ని ప్రభుత్వ, అనుబంధ విద్యా సంస్థల్లో చదువుతున్న ఆరు నుంచి ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులు, వారికి బోధించే ఉపాధ్యాయులతో కలిసి పాల్గొనే అవకాశం కల్పించింది. ఇందుకోసం ఇద్దరు విద్యార్థులతో కూడిన జట్టుతో ప్రతి పాఠశాల నుంచి ఐదు ప్రాజెక్టులకు మించకుండా దరఖాస్తులు స్వీకరించనున్నారు. నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ స్కిల్ ఇండియా, మేకింగ్ ఇండియా, స్వచ్ఛ భారత్, మరి కొన్ని అనే నాలుగు విభాగాల్లో దరఖాస్తులు తీసుకుంటుంది. అయితే వివిధ రకాలైన ప్రయోగాల్లో రెగ్యులర్గా అనుకరణలు వస్తున్నాయని గుర్తించారు. విద్యార్థులు, సంబంధిత సైన్స్ టీచర్లు ఇవి కొత్తగా కనిపించినా సంస్థ మాత్రం చాలా సులువుగా గుర్తిస్తుంది. దీనికితోడు గతంలో ప్రదర్శించిన వాటికి అనుమతి ఉండదని చెబుతోంది. ఇప్పటి వరకు గుర్తించిన వాటిలో.. నిరుపయోగంగా ఉన్న బ్యాటరీల ద్వారా విద్యుత్, శక్తి ఉత్పతి, వర్షపునీటి వినియోగం, నీటి నిల్వ స్థితి– హెచ్చరిక యంత్రాలు, వంటగ్యాస్, అగ్నిప్రమాదాలు– అప్రమత్తం చేసే యంత్రాలు, వర్మీ కంపోస్టు, లెటర్బాక్స్, అలారం, బిందుసేద్యం, సెన్సార్ ఆధారిత ప్రదర్శనలు, అప్రయత్నంగా వీధిదీపాల నిర్వహణ, ఆహార పదార్థాల కల్తీ గుర్తింపు, కార్బన్ సైకిల్, ఆహార గొలుసు, మానవ శరీర అవయవాల ప్రదర్శన, నక్షత్ర మండలం, జలశుద్ధి వంటి పాఠ్యపుస్తకాలు, యూట్యూబ్లలో చూసిన ప్రదర్శనలు అనుమతించరు. ముఖ్యంగా ప్లాస్టిక్ రహిత ప్రయోగాలు ఉండాలని నిబంధన ఉంది. మెరు గైన కొత్త వాటికి మాత్రమే అర్హత ఉంటుంది. 2024– 25 దరఖాస్తుల వివరాలిలా.. జిల్లా దరఖాస్తులు ఎంపికై నవి వనపర్తి 1,250 123 నాగర్కర్నూల్ 890 90 మహబూబ్నగర్ 560 65 జో.గద్వాల 550 52 నారాయణపేట 320 19 ఆ ప్రయోగాలకు నోచాన్స్ పాల్గొనేందుకు అర్హతలు ప్రభుత్వ, ప్రైవేటు, జెడ్పీ, ఎయిడెడ్, కేజీబీవీ, మోడల్, మైనార్టీ, గురుకులాల్లో 6 నుంచి 12వ తరగతి చదువుతున్న విద్యార్థులు యూపీఎస్ నుంచి రెండు, హైస్కూల్ నుంచి ఐదు, కళాశాల నుంచి రెండు చొప్పున ప్రాజెక్టులు గరిష్ఠంగా ఆన్లైన్ చేయవచ్చు ప్రతి తరగతి ఒక సబ్జెక్ట్ ఎంపిక చేసుకోవాలి దరఖాస్తు పద్ధతి ఇలా.. www.inspireawards.gov.in వెబ్సైట్లో స్కూల్ కోడ్ ద్వారా లాగిన్ అవ్వాలి. యూడైస్, పాస్వర్డ్ కొడితే వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. విద్యార్థి పేరు, తండ్రి పేరు, తరగతి నమోదు చేయాలి. విద్యార్థికి సంబంధించిన బ్యాంకు అకౌంట్ నంబర్ (జాతీయ బ్యాంకుల్లో), ఆధార్ నంబర్ నమోదు చేయాలి. విద్యార్థి ప్రాజెక్టు సంక్షిప్తంగా రాతపూర్వకంగా పొందుపరిచి, సంబంధిత రైటప్ వెబ్సైట్లో నమోదు చేయాలి. ప్రాజెక్టు పేరు, శాస్త్ర సాంకేతికతకు సంబంధించిన అంశాలు ఉండేలా చూసుకోవాలి. ప్రాజెక్టు ఎంపిక రెండు నెలల్లో పూర్తి చేసి జిల్లాస్థాయిలో ప్రకటిస్తారు. వాటిని రాష్ట్ర స్థాయికి పంపిస్తారు. ఎంపికై న ప్రాజెక్టుకు రూ.10 వేల నగదు ప్రయోగ నిమిత్తం బ్యాంకు అకౌంట్లో జమచేస్తారు. సెప్టెంబర్ 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రతి పాఠశాలలో ఐడియా బాక్స్లను ఏర్పాటు చేయాలి. -
సూచనలు, సలహాలు అందిస్తున్నారు
గర్భిణిగా ఉన్న నాకు అంగన్వాడీ టీచర్, ఏఎన్ఎం, ఆశా వర్కర్లు క్రమం తప్పక నా ఆరోగ్యం పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి సూచనలు, సలహాలను అందిస్తున్నారు. అంగన్వాడీ కేంద్రంలో భోజనం, గుడ్లు, పాలు అందిస్తున్నారు. ఏఎన్ఎం, ఆశా వర్కర్లు ప్రతి నెలా వైద్య పరీక్షలు చేయించుకునే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. గర్భిణిగా ఉన్న సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆహారం గురించి నిత్యం అవగాహన కల్పిస్తున్నారు. – తిరుమలమ్మ, గర్భిణి, గట్టు పోషణ లోపాలు అధిగమించేందుకు.. తీవ్ర లోప పోషణ, అతి తీవ్ర లోప పోషణ, సాధారణ స్థితిలో గల పిల్లల విషయాన్ని ఎప్పటికప్పుడు గమనిస్తూ, పోషణ లోపం నుంచి బయట పడేందుకు చిన్నారులకు బాలామృతం ప్లస్ అందిస్తున్నాం. తల్లిదండ్రులకు, గర్భిణులు, బాలింతలకు అవగాహన సమావేశాలను నిర్వహించి, తగిన సూచనలు, సలహాలు ఇస్తున్నాం. క్షేత్ర స్థాయిలో ప్రతి అంగన్వాడీ టీచర్ గర్భిణులు, బాలింతలపై నిరంతరం పర్యవేక్షించేలా ఆదేశిస్తున్నాం. – హేమలత, సీడీపీఓ, మల్దకల్ ప్రాజెక్టు సేవలు వినియోగించుకోవాలి అంగన్వాడీ కేంద్రాల్లో ఆట పాటలతో పాటుగా సిలబస్ ప్రకారం పూర్వప్రాథమిక విద్యను అందించి, పాఠశాల విద్యకు పిల్లలను సిద్ధం చేస్తాం. పిల్లల్లో పోషణ లోపాలను గుర్తించి, సాధారణ స్థితికి తీసుకు రావడం జరుగుతుంది. వ్యాధి నిరోధక టీకాలను అందించే విధంగా చర్యలు తీసుకుంటాం. జిల్లాలోని అన్నీ అంగన్వాడి కేంద్రాల్లో తక్కువ బరువు, పోషణ లోపం కలిగిన చిన్నారులను మెరుగు పరచేందుకు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నాం. అంగన్వాడీ సేవలను వినియోగించుకోవాలి. – సునంద, డీడబ్ల్యూఓ, గద్వాల ● -
‘కాలగమనం’ పుస్తకావిష్కరణ
అచ్చంపేట: ప్రముఖ కవి ఎంఏ గఫార్ రచించిన కాలగమనం పుస్తకాన్ని ఆదివారం పట్టణంలోని గురుకుల పాఠశాలలో తెలంగాణ ప్రముఖ కవి, వక్త, సాహితీవేత్త నాగేశ్వరం శంకరం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎంఏ గఫార్ మాతృభాష ఉర్దూ అయినప్పటికీ తెలుగులో కవిగా రాణించడం గొప్ప విషయమన్నారు. తెలుగు భాషపై ఉన్న మక్కువతో నల్లమల రత్నాలు, ప్రజాప్రస్థానం, మేలుకొలుపు తదితర రచనలు చేసినట్లు ఆయన గుర్తు చేశారు. మకట శతకంలో వచన కవిత్వాన్ని రచించడం చాలా అరుదు అని.. అలాంటి వారిలో ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి ఆయన ముందు వరుసలో ఉంటారన్నారు. ఇలాంటి కవులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం పుస్తకావిష్కరణ సభలో పాల్గొన్న కవులను డాక్టర్ బాలనారాయణ శాలువాలతో సన్మానించారు. కార్యక్రమంలో కవులు వల్లభాపురం జనార్దన్, కర్నాటి రఘురాములుగౌడ్, ముచ్చర్ల దినకర్, వనపట్ల సుబ్బయ్య, సాయిజ్యోతి, కాటమరాజు నరసింహులు, ఎదురవల్లి కాశన్న, ఖాజా మైనొద్దీన్, కందికొండ మోహన్ పాల్గొన్నారు దరఖాస్తుల ఆహ్వానం కందనూలు/మన్ననూర్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో 2025–26 విద్యా సంవత్సరానికి గాను అతిథి అధ్యాపక పోస్టుల భర్తీ నిమిత్తం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ మదన్మోహన్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలుగు, ఇంగ్లిష్, కెమిస్ట్రీ, జు వాలజీ, డైరీ సైన్స్, కంప్యూటర్ అప్లికేషన్ సబ్జెక్టుల్లో బోధించేందుకు ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ నెల 23వ తేదీ మధ్యాహ్నం 12గంటలలోగా కళాశాలలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. నెట్, సెట్, పీహెచ్డి అర్హత కలిగిన వారికి ప్రాధాన్యత ఉంటుందన్నారు. ● అమ్రాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలుగు–1, కామర్స్–2, ఇంగ్లిష్–1, హిస్టరీ–1, ఎకనామిక్స్–1, పొలిటికల్ సైన్స్–1, జువాలజీ–1, కంప్యూటర్ సైన్స్–1 ఖాళీల భర్తీకి అతిథి అధ్యాపకుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ గోపాల్ తెలిపారు. ఆయా సబ్జెక్టులకు సంబంధించి పీజీలో 55 శాతం మార్కులు కలిగి ఉండాలన్నారు. సెట్, నెట్, స్లేట్, పీహెచ్డీ కలిగి ఉన్న వారికి మొదటి ప్రాధాన్యత ఉంటుందన్నారు. ఆసక్తి, అర్హతగల అభ్యర్థులు ఈ నెల 22వ తేదీలోగా కళాశాలలో నేరుగా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. మరింత సమాచారం కోసం 85228 73729, 83319 58940 నంబర్లను సంప్రదించాలని సూచించారు. లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయం దామరగిద్ద: లయన్స్ క్లబ్ సేవలను మరింత విస్తృతం చేయాలని, సామాజిక సేవే పరమావధిగా ముందుకు సాగాలని రాష్ట్ర పోలీస్, హౌసింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గుర్నాథ్రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని గడిమున్కన్పల్లి గ్రామంలో లయన్స్ క్లబ్ అధ్యక్షుడు భీమయ్యగౌడ్ అద్యక్షత ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అథితిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. లయన్స్ క్లబ్ సేవలను గ్రామీణ ప్రాంతాలకు విస్తృతం చేయాలని సూచించారు. అనంతరం దామరగిద్ద మండల నూతన లయన్స్క్లబ్ అధ్యక్షుడిగా బసిరెడ్డి, కార్యదర్శి గా ఎం.అశోక్, ట్రెజరర్గా తిప్పణ్ణ లను ఎన్నుకున్నారు. సేవల్లో భాగంగా దామరగిద్ద జీపీఎస్, కాన్కుర్తి పాఠశాలకు వాటర్ ట్యాంకును, బాపన్పల్లి కి పలువురి పేదలకు దుప్పట్లు, గడిమున్కన్పల్లి గ్రామ విద్యార్థులకు బ్యాగ్లను పంపిణీ చేశారు. స్వామినాథన్ కమిటీ సిఫార్సులు అమలు చేయాలిమద్దూరు: రైతులకు మద్దతు ధర తదితర ఆంశాలపై స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను వెంటనే కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలని అఖిలభారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.రాము డిమాండ్ చేశారు. ఆదివారం మద్దూరులో ఏఐయూకేఎస్ సంఘం డివిజన్ స్థాయి ప్రథమ మహాసభకు హాజరై ప్రసంగించారు. స్వామినాథన్ సిఫార్సులను అమలు చేస్తామని 2014లో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం ఇన్నేళ్లు గడుస్తున్నా వాటిని అమలు చేయకపోగా నల్లచట్టాలను అమలు చేస్తోందన్నారు. వీటిపై పోరాటానికి రైతులను సంఘటితం చేయాలని సూచించారు. -
సృజనాత్మకత వెలికితీయాలి
విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించేందుకు ఇలాంటి సైన్స్ఫేర్లు ఎంతో ఉపకరిస్తాయి. కొత్త ఆవిష్కరణలు ప్రోత్సహిస్తున్న ఇన్నోవేషన్ ఇన్స్పైర్ మనక్ ముఖ్యంగా నాణ్యత, సైన్స్ అభివృద్ధికి దోహదపడుతుంది. పూర్తిగా కొత్త వాటిని పరిచయం చేసేందుకు విద్యార్థులను సిద్ధం చేయాలి. గణితం, సామాన్యంపై దృష్టిపెట్టేలా సంబంధిత టీచర్లు చొరవ చూపాలి. ప్రతి పాఠశాలలో ఐడియా బాక్స్ ఏర్పాటు చేసి పిల్లల ఇన్నోవేషన్లను స్వీకరించాలి. – భానుప్రకాష్, జిల్లా సైన్స్ అధికారి, నారాయణపేట -
రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి
స్టేషన్ మహబూబ్నగర్: ముఖ్యమంత్రి గతంలో ప్రకటించిన విధంగా పేద రెడ్ల అభ్యున్నతి కోసం రెడ్డి కార్పొరేషన్కు చట్టబద్ధత కల్పించి కార్యవర్గాన్ని ఏర్పాటు చేయాలని పాలమూరు రెడ్డి సేవా సమితి ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు ఇంద్రసేనారెడ్డి అన్నారు. జిల్లాకేంద్రంలో ఆదివారం జరిగిన కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రెడ్డి కార్పొరేషన్కు రూ.2 వేల కోట్ల నిధులు కేటాయించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కేంద్రం, రాష్ట్రస్థాయిలో నిర్వహించే అన్ని విద్య, ఉద్యోగ నియామకాల్లో ఈడబ్ల్యూఎస్ పథకాన్ని సంపూర్ణంగా అమలు చేయాలని కోరారు. తమ సంస్థ ద్వారా చదువులో ముందంజలో ఉన్న పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం అందజేస్తున్నామన్నారు. అలాగే పలు ప్రమాదాల్లో గాయపడిన పేద రెడ్లకు వైద్య సహాయం కోసం ఆర్థిక సహాయం అందజేస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో రెడ్డి సేవా సమితి ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేందర్రెడ్డి, కోశాధికారి నర్సింహారెడ్డి, సహధ్యక్షుడు ధనుంజయరెడ్డి, ఉపాధ్యక్షుడు వెంకట్రామరెడ్డి, ప్రచార కార్యదర్శి సురేందర్రెడ్డి, కార్యదర్శి కోటేశ్వర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సాగునీరు అందించడమే లక్ష్యం
అలంపూర్: జోగుళాంబదేవి ఎత్తిపోతల పథకం ఆయకుట్టుదారులకు సక్రమంగా సాగు నీటిని అందించడమే లక్ష్యంగా వేలం పాట నిర్వహించడం జరుగుతుందని ఎత్తిపోతల పథకం కమిటీ అధ్యక్షుడు విజయ్కుమార్రెడ్డి అన్నారు. ఆదివారం అలంపూర్లోని రైతు సంఘం భవనంలో జోగుళాంబదేవి ఎత్తిపోతల పథకం వేలం పాటను నిర్వహించారు. ఎత్తిపోతల పథకం నిర్వహణలో భాగంగా నిర్వహించే వేలం పాటలో 9 మంది పోటీ పడ్డారు. ఈమేరకు శ్రీనివాసులు అనే వ్యక్తి రూ.46.70 లక్షలకు పాడి వేలం దక్కించుకున్నట్లు తెలిపారు. గతేడాది రూ.21.20 లక్షలకు వేలం దక్కించుకోగా.. ఈ ఈ ఏడాది ఏకంగా రూ. 25.50 లక్షలు పెరిగినట్లు తెలిపారు. వేలం పాట ద్వార వచ్చిన ఆదాయాన్ని ఎత్తిపోతల పథకం మోటార్ల మరమ్మతు, పైప్లైన్ ఇతర నిర్వహణ వంటి పనులు చేపట్టడం జరుగుతుంది. సమావేశంలో ఎత్తిపోతల పథకం కమిటి సభ్యులు బ్రహ్మేశ్వర్ రెడ్డి, రజిని బాబు, పెద్దబాబు, విశ్వనాథం, చెంచయ్య, జయన్న, హరినాథ్ రెడ్డి, రమేష్, నాగరాజు యాదవ్, గ్రామ పెద్దలు ధర్మరాజు, ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు. -
కోయిల్సాగర్లోపెరుగుతున్న నీటిమట్టం
దేవరకద్ర/ చిన్నచింతకుంట: కోయిల్సాగర్లో నీటిమట్టం ఆదివారం సాయంత్రం వరకు 24.6 అడుగులకు చేరింది. జూరాల నుంచి కేవలం ఒక పంపును రన్ చేసి 315 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. రెండు పంపులు రన్ చేస్తే 630 క్యూసెక్కుల నీరు ప్రాజెక్టులోకి చేరే అవకాశం ఉంది. దీంతో కాల్వల ద్వారా నీటిని వదిలిన ప్రాజెక్టు నీటిమట్టం వేగంగా పెరిగే అవకాశం ఉంటుంది. ఇదిలా ఉండగా.. స్థానికంగా కురుస్తున్న వర్షాలతో బండర్పల్లి చెక్డ్యాం నుంచి ఆదివారం అలుగు పారింది. చెక్డ్యాం వల్ల చుట్టు పక్కల ఉండే గ్రామాల్లో భూగర్భజలాలు పెరుగుతాయని రైతులు ఆనందం వ్యక్తం చేశారు. -
గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుదాం
గద్వాలటౌన్: వచ్చే నెలలో స్థానిక సంస్థల ఎన్నికలు రానున్నాయని, పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు ముందుకుసాగాలని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కొల్లు మాధవి పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో శనివారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యశాలకు ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. మండలాల వారీగా కార్యశాలలు నిర్వహించి జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సన్నద్దం కావాలని దిశానిర్ధేశం చేశారు. ఆగస్టు 1 నుంచి 5వ తేదీ వరకు మండలాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారం కోరతూ బైక్ ర్యాలీ నిర్వహించి కలెక్టర్కు వినతి పత్రాలు ఇవ్వాలన్నారు. బీఆర్ఎస్ పాలనలో జరిగిన అక్రమాలు, అన్యాయాలతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయని హామీలను బీజేపీ కార్యకర్తలు గ్రామాల్లోని ప్రజలకు వివరించాలన్నారు. బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి డీకే స్నిగ్ధారెడ్డి మాట్లాడుతూ గత పార్లమెంట్ ఎన్నికలలో జిల్లాలోని 13 మండలాలలో పది మండాలలో బీజేపీ మెజార్టీ సాధించిందని చెప్పారు. ఈసారి అదే స్ఫూర్తితో జిల్లా పరిషత్లో బీజేపీ జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ ప్రభుత్వం పేదల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. అర్హులందరకీ పథకాలు అందేలా చూడాలన్నారు. ఈ సమావేశంలో బీజేపీ నాయకులు రామంజనేయులు, రామచంద్రారెడ్డి, బండల వెంకట్రాములు, రమాదేవి, జయశ్రీ, శివారెడ్డి, రాజగోపాల్, వెంకటేశ్వర్రెడ్డి, దేవదాసు, మాలీం ఇసాక్, అనిల్, చిత్తారికిరణ్, నర్సింహా తదితరులు పాల్గొన్నారు. -
బస్సులు ఆపడంలేదని రోడ్డెక్కిన విద్యార్థులు
గద్వాల:గద్వాల మండలం గోనుపాడు వద్ద ఉన్న ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ వద్ద ఆర్టీసీ బస్సులు ఆపాలని ఏబీవీపీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో శనివారం రాస్తారోకో చేశారు. ఈసందర్భంగా విద్యార్థి సంఘం నాయకుడు రఘువంశీ మాట్లాడుతూ గద్వాల జిల్లాలో ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కాలేజీలో రాష్ట్రం నలుమూలల నుంచి విద్యార్థులు ఇక్కడికొచ్చి చదువుతున్నారని, కాలేజీ వద్ద ఆర్టీసీ బస్సులు ఆపడం లేదని దీనివల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే ఇక్కడకి రావాలంటే ఇబ్బందులు పడతారని దీనివల్ల అడ్మిషన్లు పూర్తిగా నిలిచిపోతే కాలేజీ మూతపడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై పలుమార్లు అధికారులకు తెలియజేసినా పట్టించుకోవడం లేదన్నారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని పాలిటెక్నిక్ కాలేజీ వద్ద ఆర్టీసీ బస్సు ఆపేలా చర్యలు తీసుకోవాలన్నారు. దీంతో గద్వాల–రాయచూరు ప్రధానరహదారిపై వాహనాలు నిలిచిపోయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు విద్యార్థిసంఘం నాయకులు అదుపులోకి తీసుకుని రహదారిపై నిలిచిపోయిన వాహనాలకు క్లియరెన్స్ చేశారు. ఈకార్యక్రమంలో నరేష్, తేజ, సాయిహర్ష, నితిన్, గణేష్, రమేష్, అంజి, సునీల్, కిషోర్ తదితరులు పాల్గొన్నారు. -
మహిళలు కోటీశ్వర్లుగా ఎదగాలనేదే ఆకాంక్ష
గట్టు: ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను మహిళలు సద్వినియోగం చేసుకొని, మహిళలు కోటీశ్వర్లుగా ఎదగాలని ఆకాంక్షిస్తున్నట్లు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి తెలిపారు. శనివారం గట్టులో గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఇందిరా మహిళా శక్తి సంబరాలను నిర్వహించారు. ముఖ్య అథితులుగా ఎమ్మెల్యే, కలెక్టర్ బీఎం సంతోష్, అదనపు కలెక్టర్లు లక్ష్మీనారాయణ, నర్సింగరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళలను కోటీశ్వర్లు చేయడమే లక్ష్యంగా మహిళా సంఘాలకు ప్రత్యేక పథకాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందినప్పుడే నియోజక వర్గం అన్ని రంగాల్లో ముందుకు వెళుతుందని తెలిపారు. గట్టు మండలానికి ఇందిరమ్మ ఇళ్లు 780 మంజూరు చేసినట్లు తెలిపారు. వ్యవసాయానికి సాగు నీటిని అందించడం ద్వారా గట్టు ప్రాంతం వలస నుంచి గట్టేక్కి, ఇక్కడికే ఇతర ప్రాంతాల నుంచి వలసలు వచ్చే విధంగా మారిందని తెలిపారు. ప్రభుత్వ పథకాలు అర్హులైనవారందరికి అందించే విధంగా కృషి చేస్తానని తెలిపారు. మహిళలందరూ చదువుకోవాలి : కలెక్టర్ మహిళలందరూ తప్పనిసరిగా చదువుకోవాలని, అప్పుడే ఆ కుటుంబం అభివృద్ది చెందుతుందని కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. గట్టు మండలంలో కేవలం మహిళా అక్షరాస్యత 50 శాతం మాత్రమే ఉందని, రాబోయే రోజుల్లో ఇది 100 శాతానికి చేరుకోవాలని కోరారు. ముఖ్యంగా అమ్మాయిలకు 18 ఏళ్లు నిండకుండానే పెళ్లిళ్లు చేస్తున్నారని, ఇది చాలా పెద్ద తప్పు అని అన్నారు. అమ్మాయిలను కూడా చదివించాలని, మహిళలను కోటీశ్వర్లు చేయడమే లక్ష్యంగా మహిళా సంఘాలకు ప్రత్యేక పథకాలు అమలు చేస్తున్నట్లు వివరించారు. మహిళల ఆర్థిక అభివృద్ధి కోసం ప్రభుత్వం సోలార్ విద్యుత్ ప్లాంటు,పెట్రోల్ బంకులు, మహిళా శక్తి క్యాంటీన్లు,బస్సులకు యజమానులుగా చేస్తుందని, గోనుపాడు, అలంపూర్లో సోలార్ విద్యుత్ ప్లాంటు, పెట్రోల్ బంకు ఏర్పాటుకు ప్రభుత్వం స్థలం కేటాయించేందుకు చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. ప్రభుత్వం కొత్తగా 1700 రేషన్ కార్డులను, రూ.2030 కోట్ల రుణాలను మహిళా సంఘాలకు మంజూరు చేసిందన్నారు. మహిళా సంఘాల సభ్యులు ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.10లక్షల బీమాను ఆ కుటుంబ సభ్యులకు అందజేయడం జరుగుతుందని, గట్టు అభివృద్ధికి రూ.కోటి కేటాయించినట్లు కలెక్టర్ తెలిపారు. అనంతరం గట్టు మండలంలోని మహిళా సంఘాల సభ్యులకు 7.25 కోట్ల రుణాలకు సంబందించిన చెక్కును అందజేశారు. సెర్ప్ డైరెక్టర్ జమున, మార్కెట్ కమిటి చైర్మన్ హనుమంతు, నాయకులు జంబురామన్గౌడు, గట్టు తిమ్మప్ప, బండారి భాస్కర్, విజయ్కుమార్, తహసీల్దార్ విజయ్కుమార్, ఎంపీడీఓ చెన్నయ్య, ఏపీఎం జయాకర్, తదితరులు పాల్గొన్నారు. -
దరఖాస్తుల ఆహ్వానం
గద్వాల: జిల్లాలో మత్తు పదార్థాల వ్యసన నివారణ కేంద్రం (డీఅడిక్షన్ సెంటర్) ఏర్పాటు చేయుటకు అర్హత గల స్వచ్ఛంద సంస్థల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు మహిళా శిశు సంక్షేమ శాఖ జిల్లా అధికారి సునంద శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ప్రభుత్వ రవాణాకు అనుకూలంగా ఉంటూ పునరావాసం, చికిత్స, సమావేశం మొదలైన వసతులు కలిగిన 333 గజాల సొంత లేదా ఉచిత భవన సౌకర్యాలు ఉండాలని తెలిపారు. ఆసక్తి గల సంస్థలు eanudaan(grants-msje.gov.in)పోర్టల్ నందు దరఖాస్తు చేసుకోవాలని జూన్ 30 నుంచి జూలై 31 తేదీ వరకు గడువు పొడిగించినట్లు తెలిపారు. దరఖాస్తుతో పాటు ధ్రువపత్రాలను జతపర్చి జిల్లా సంక్షేమ శాఖ కార్యాలయంలో రూం నంబర్ 33లో సమర్పించాలని పేర్కొన్నారు. ఆర్టీసీలో అప్రెంటిస్ శిక్షణకు దరఖాస్తుల స్వీకరణ మహబూబ్నగర్ మున్సిపాలిటీ: మహబూబ్నగర్ రీజియన్ పరిధిలోని వివిధ ఆర్టీసీ డిపోలలో ఇంజినీరింగ్, నాన్ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ విభాగాల్లో మూడేళ్ల అప్రెంటిస్ శిక్షణకు ఆసక్తి గల ఉమ్మడి జిల్లాకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని ఆర్ఎం సంతోష్కుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. నాగర్కర్నూల్, జోగుళాంబ గద్వాల, వనపర్తి, మహబూబ్నగర్, నారాయణపేటకు చెందిన వారు గ్రాడ్యుయేషన్ ఇంజినీరింగ్ ఇన్ ఐటీ/ కంప్యూటర్ సైన్స్/ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ/ గణితం కోర్సులలో లేదా డిప్లొమా 2021 నుంచి పాసై ఉండాలన్నారు. ఇక నాన్ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్కు బీఏ, బీకాం, బీబీఏ, బీసీఏలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు అర్హులన్నారు. దరఖాస్తులను నాట్స్ (నేషనల్ అప్రెంటిస్ ట్రైనింగ్ స్కీం) httpr://natr. education.gov.in వెబ్పోర్టల్లో ఈ నెల 21 నుంచి 27 వరకు రిజిస్టర్ చేసుకోవాలన్నారు. మెరిట్ ప్రాతిపదికన అభ్యర్థుల ఎంపిక ఉంటుందని, శిక్షణ కాలంలో ప్రతినెలా స్టైఫండ్ ఇస్తామని తెలిపారు. 23 నుంచి నిరంతర వైద్య సేవలు అలంపూర్: అలంపూర్ చౌరస్తాలోని 100 పడకల ఆసుపత్రిని ఈ నెల 23 నుంచి 24 గంటల నిరంతర వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని వైద్య విధాన పరిషత్ ఉమ్మడి జిల్లా ఇన్చార్జ్ రమేష్చంద్ర అన్నారు. శనివారం 100 పడకల ఆసుపత్రిని పరిశీలించి, సిబ్బందితో మాట్లాడారు. ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందించాలని వైద్య సిబ్బందికి సూచించారు. అత్యవసర సర్జరీలకు సంబంధించి వైద్యం ఓపి ప్రారంభమైన మరో వారం రోజుల తర్వాత అందుతాయని పేర్కొన్నారు. ఆసుపత్రిలో జరిగే వివిధ అభివృద్ధి, మరమ్మతు పనులను పరిశీలించారు. వైద్య సిబ్బందికి పలు సూచనలు, సలహాలు అందజేశారు. డా.అమీర్, సిబ్బంది పాల్గొన్నారు. గెస్ట్ లెక్చరర్ల భర్తీకి చర్యలు బిజినేపల్లి: పాలెం శ్రీవేంకటేశ్వర ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల (అటానమస్)లో 2025– 26 విద్యా సంవత్సరానికి గాను డిగ్రీ విద్యార్థులకు తరగతులు బోధించేందుకు ఆయా సబ్జెక్టుల్లో అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ రాములు ఒక ప్రకటనలో తెలిపారు. తెలుగు, పొలిటికల్ సైన్స్, కామర్స్, కంప్యూటర్ సైన్స్ సబ్జెక్టులకు గాను మంగళవారం వరకు దరఖాస్తు చేసుకోవచ్చని, సెల్ నం.9848466603ను సంప్రదించాలని కోరారు. -
టీ–గేట్ కమిటీ జిల్లా చైర్మన్గా మహేష్కుమార్
గద్వాల: తెలంగాణ గేట్వే ఫర్ అడాప్టివ్ ట్రైనింగ్ అండ్ ఎంప్లాయిమెంట్ కమిటీ జిల్లా చైర్మన్గా మహేష్కుమార్ నియమితులైనట్లు ఐటీఐ కాలేజీ ప్రిన్సిపల్ ఎస్వీవీ సత్యనారాయణ తెలిపారు. ఈమేరకు మహేష్కుమార్కు నియామక ప్రతిని అందజేశారు. కమిటీ కన్వీనర్గా ప్రిన్సిపల్ ఎస్వీవీ సత్యనారాయణ, కమిటీ సభ్యులుగా ఎంప్లాయిమెంట్ జిల్లా అధికారి డాక్టర్ ప్రియాంక, ఐటీఐ ట్రైనింగ్ అధికారి మహ్మాద్ కలీమ్ వ్యవహరించనున్నట్లు తెలిపారు. పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా యువతకు నైపుణ్యాభివృద్ధి కల్పించేందుకు కమిటీ పనిచేయనున్నట్లు కన్వీనర్ తెలిపారు. -
స్వచ్ఛతలో వెనుకడుగే..!
స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకుల విడుదల ●గద్వాల టౌన్: కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా గత ఏడేళ్లుగా ‘స్వచ్ఛ సర్వేక్షణ్’ పోటీలను నిర్వహిస్తోంది. పరిశుభ్ర పట్టణాలే దీని లక్ష్యం. మొదటి నుంచి జిల్లాలోని గద్వాల, అయిజ మున్సిపాలిటీలు పోటీని ఎదుర్కొంటున్నాయి. గత రెండేళ్ల నుంచి అలంపూర్, వడ్డేపల్లి మున్సిపాలిటీలు పోటీలో ఉన్నాయి. పారిశుద్ధ్య నిర్వహణతో పాటు నిర్ధేశిత అంశాల్లో ప్రాధాన్యం కల్పించే స్వచ్ఛత కార్యక్రమాలపై అధికారుల్లో ఆసక్తి పూర్తిగా తగ్గిపోయింది. ఏటికేడు పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా స్వచ్ఛత కార్యక్రమాలు చేపట్టాల్సిన అధికారులు మొక్కుబడి చర్యలతో మమ అనిపిస్తున్నారు. క్షేత్రస్థాయిలో మార్పులు లేకపోవడంతో దాని ప్రభావం రాష్ట్ర, జాతీయ స్థాయి ర్యాంకులపై పడింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి ర్యాంకులో పూర్తిగా దిగజారిపోయింది. స్వచ్ఛ ప్రమాణాల ఆధారంగా 2024–25 ర్యాంకులను కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ గురువారం విడుదల చేసింది. ఈ ఏడాది మంచి ర్యాంకు సాధిస్తాం పారిశుద్ధ్యం, స్వచ్ఛతకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నాం. ఇంటింటా చెత్త సేకరణ చేపడుతున్నాం. డంపింగ్ యార్డులో బయోమైనింగ్ ప్రక్రియకు, ఎరువుల తయారీకి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. వాటిని పూర్తిస్థాయిలో అధికమిస్తాం. కేంద్ర కార్యక్రమాలు విధిగా చేపట్టి, వచ్చే ఏడాది మెరుగైన ప్రదర్శనతో మంచి స్థానం సాధిస్తాం. – దశరథ్, మున్సిపల్ కమిషనర్, గద్వాల కనీస పురోగతి లేని మున్సిపాలిటీలు తూతూ మంత్రంగా పారిశుద్ధ్య నిర్వహణ బోర్డులకే పరిమితమైన చెత్త రహిత రహదారులు -
ఇళ్ల నిర్మాణానికి ఇసుక, మట్టి కొరత ఉండొద్దు
గద్వాల: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి అవసరమైన ఇసుక, మట్టి కొరత లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఐడీవోసీ కాన్ఫరెన్స్ హాలులో జిల్లా స్టాండింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇందిరమ్మ గృహాల నిర్మాణం కొరకు కావాల్సిన ఇసుక, మట్టి లభ్యతపై కమిటీ సభ్యులతో చర్చించడం జరిగిందని, ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇందిరమ్మ గృహాల లబ్ధిదారులకు అవసరమైన ఎనిమిది ట్రాక్టర్ల ఇసుకను, ఎనిమిది ట్రాక్టర్ల మట్టిని అందించి పనులు వేగవంతంగా పూర్తి అయ్యేలా చూడాలన్నారు. ట్రాక్టర్ ఇసుకకు రూ.100, మట్టికి రూ.400 చొప్పున వసూలు చేయాలన్నారు. వినియోగదారులు సంబంధిత తహసీల్దార్ ద్వారా దరఖాస్తు చేసుకున్నట్లయితే పరిశీలించి మంజూరు చేయాలన్నారు. ఇసుక తవ్వకాలు పూర్తి పారదర్శకంగా జరగాల్సిందిగా ప్రతి ట్రాక్టర్ పంపిణీకి సంబంధించిన సమాచారం ఖచ్చితంగా నమోదు చేసి తగిన రికార్డులను సమగ్రంగా నిర్వహించాలన్నారు. ప్రభుత్వం అవసరమైన ఇసుక, మట్టి వంటి నిర్మాణ సామగ్రిని లబ్ధిదారులకు కనిష్ట ధరలకు అందజేస్తుందన్నారు. ఇందిరమ్మ గృహాల లబ్ధిదారులు ఈ వనరులను వినియోగించుకుని త్వరితగతిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయాలన్నారు. అధికారులు సైతం ప్రత్యేంగా దృష్టి సారించాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర వి.లక్ష్మీనారాయణ, మైనింగ్ ఏడీ వెంకటరమణ, డీపీవో నాగేంద్రం, ఇరిగేషన్ ఈఈ శ్రీనివాస్, మిషన్భగీరథ ఈఈ శ్రీధర్రెడ్డి, భూగర్భ జల ఏడీ మోహన్, ఉద్యానవన శాఖ అధికారి అక్బర్ తదితరులు పాల్గొన్నారు. -
రెండేళ్లలో పూర్తి చేస్తాం
సాక్షి, నాగర్కర్నూల్/కొల్లాపూర్: పాలమూరులోని పెండింగ్ ప్రాజెక్టులన్నింటినీ పూర్తిచేసే బాధ్యత తాను తీసుకుంటున్నానని, రెండేళ్లలో సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హామీ ఇచ్చారు. శుక్రవారం నాగర్కర్నూల్ జిల్లా పెంట్లవెల్లి మండలం జటప్రోలులో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. పురాతన మదనగోపాలస్వామి ఆలయాన్ని సందర్శించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నిర్వహించిన బహిరంగసభలో ప్రసంగించారు. ‘కొల్లాపూర్ ప్రాంతం.. ఒకవైపు కృష్ణానది, మరోవైపు నల్లమల అటవీ ప్రాంతం.. ఒకప్పుడు కౌన్ పూచ్తా కొల్లాపూర్ అనుకున్న ప్రాంతాన్ని, హమ్ జాదా లేనా కొల్లాపూర్ అంటూ అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాం’ అని అన్నారు. దేశంలో ఎక్కడ ప్రాజెక్టులు కట్టినా, తట్ట, పార పని చేసినా పాలమూరు బిడ్డలే ఉంటారని చెప్పారు. ఇక్కడి మట్టిలో పుట్టిన బిడ్డగా ఈ ప్రాంత అభివృద్ధి కోసం బాధ్యతను తీసుకుంటానని అన్నారు. డిసెంబర్ 9 నాటికి అన్ని ప్రాజెక్టుల భూ నిర్వాసితులకు పెండింగ్ పరిహారాన్ని చెల్లిస్తామని, భూసేకరణ పూర్తి చేస్తామని తెలిపారు. రెండేళ్ల కాలంలో పాలమూరు పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి తీరుతామని పేర్కొన్నారు. ‘పాలమూరు బిడ్డగా ఇక్కడి పరిస్థితులు, కష్టాలు నాకు తెలుసు. గత ప్రభుత్వం పాలమూరు–రంగారెడ్డి, కేఎల్ఐ, జూరాల, నెట్టెంపాడు, బీమా, కోయిల్సాగర్, ఎస్ఎల్బీసీ ప్రాజెక్టులు కట్టకుండా నిర్లక్ష్యం చేసింది. రైతుల పొలాల్లోకి నీళ్లు రాలేదు. ఉమ్మడి రాష్ట్రంలో కన్నా బీఆర్ఎస్ పాలనలోనే పాలమూరుకు తీవ్ర అన్యాయం జరిగింది. ఈ జిల్లాకు చెందిన వ్యక్తి సీఎం కావడం వల్ల మొన్న జూరాలకు నిమిషాలలో రూ.120 కోట్లు మంజూరు చేశాం. ఇక్కడి నుంచి గత ప్రభుత్వంలో మంత్రులుగా పని చేసిన వాళ్లు దొంగలకు సద్దులు మోశారు. మొన్నటి ఎన్నికల్లో ఇంకో రెండు సీట్లు వచ్చుంటే.. ఈ జిల్లాకు మరో మంత్రి పదవి వస్తుండే.’ అని పేర్కొన్నారు. పాలమూరు ప్రాజెక్టులో ఒక్క మోటార్ను ప్రారంభించి చేతులు దులుపుకున్న కేసీఆర్.. ఈ గడ్డకు చేసిందేమీ లేదన్నారు. జిల్లాకు చెందిన మాజీ మంత్రులు నిరంజన్రెడ్డి, శ్రీనివాస్గౌడ్లు తెచ్చింది ఏమీ లేదు. 98 జీఓ ద్వారా ఉద్యోగాలు ఇవ్వాలని శ్రీశైలం నిర్వాసితులు ఏళ్ల తరబడి అడుగుతూ వస్తున్నా.. వారిని గత ప్రభుత్వం ఎందుకు ఆదుకోలేదో చెప్పాలని సీఎం రేవంత్ ప్రశ్నించారు. కొల్లాపూర్ అభివృద్ధికి సంబంధించి పలు అంశాలను మంత్రి జూపల్లి కృష్ణారావు తన దృష్టికి తెచ్చారని పేర్కొన్నారు. జిల్లా ఇన్చార్జి మంత్రి దామోదర రాజనర్సింహ నేతృత్వంలో ప్రత్యేక సమీక్ష నిర్వహించి, కొల్లాపూర్ అభివృద్ధికి అవసరమై సహకారం అందిస్తామని వివరించారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణాలు ఏడాదిన్నర లోపు పూర్తి చేసి, దాని ప్రారంభానికి మళ్లీ ఇక్కడికి వస్తా సీఎం అన్నారు. మహిళా సంఘాలకు చెక్కులు పంపిణీ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 3,52,635 స్వయం సహాయక సంఘాలకు రూ.334 కోట్ల వడ్డీ లేని రుణాలను ఇస్తున్నట్లు సీఎం రేవంత్రెడ్డి వెల్లడించారు. దీనికి సంబంధించిన చెక్కును మహిళా సంఘం సభ్యులకు అందజేశారు. కొల్లాపూర్ నియోజకవర్గంలోని 2,671 స్వయం సహాయక సంఘాలకు రూ.6.33 కోట్ల చెక్కులను అందజేశారు. అలాగే బ్యాంక్ లింకేజీ రుణాలు, ప్రమాధ బీమా తదితర వాటిక సంబంధించి చెక్కులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్రెడ్డి, ఉమ్మడి జిల్లాలోని ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, రాజేష్రెడ్డి, వీర్లపల్లి శంకర్, అనిరుధ్రెడ్డి, యెన్నం శ్రీనివాసరెడ్డి, పర్ణికారెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, మేఘారెడ్డి, మధుసూదన్రెడ్డి, నాయకులు బెల్లయ్యనాయక్, సరిత, జగదీశ్వర్రావు, శివసేనారెడ్డి, శ్రీనివాసరెడ్డి, ఒబేదుల్లా కొత్వాల్, తదితరులు పాల్గొన్నారు. సాధికారత దిశగా పయనం: మంత్రి దామోదర రాజనర్సింహ మహిళలు ఆర్థిక సాధికారత సాధించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. బీసీ రిజర్వేషన్లు చారిత్రాత్మకం: మల్లురవి బీసీ రిజర్వేషన్ల అమలు చారిత్రాత్మక నిర్ణయమని, ఈ ఘ నత సీఎం రేవంత్రెడ్డికే దక్కు తుందని ఎంపీ మల్లు రవి అన్నారు. రేషన్ లబ్ధిదారులకు సన్నబియ్యం పంపిణీ చేపట్టామని, విద్యార్థులకు కాస్మొటిక్, మెస్ చార్జీలు పెంచామన్నారు.కొల్లాపూర్ అభివృద్ధికిసహకరించాలి: మంత్రి జూపల్లి కొల్లాపూర్ నియోజకవర్గానికి అదనంగా మరో 3 వేల ఇళ్లు కేటాయించాలని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సీఎం రేవంత్రెడ్డిని కోరారు. కొల్లాపూర్ అభివృద్ధికి రూ.500 కోట్ల నిధులు మంజూరు చేయాలని, శ్రీశైలం నిర్వాసితులకు జీఓ 98 ప్రకారం ఉద్యోగాలు ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని, వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలని, మాదాసి కురువలకు ఎస్సీ కుల ధ్రువపత్రాలు ఇప్పించాలని, నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి రూ.15 లక్షలు, కొల్లాపూర్ మున్సిపాలిటీకి రూ.50 కోట్లు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. మొలచింతలపల్లి శివారులో ఉన్న 1,600 ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రపంచ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని, పెంట్లవెల్లి సింగిల్ విండో సొసైటీలోని 409 మంది రైతులకు రుణమాఫీ వర్తింపజేయాలని, సోమశిల– సిద్దేశ్వరం వంతెన నిర్మాణానికి త్వరగా అటవీశాఖ అనుమతులు ఇప్పించాలని సీఎం దృష్టికి తెచ్చారు. సంక్షేమానికి ప్రాధాన్యం: మంత్రి వాకిటి సీఎం రేవంత్రెడ్డి ఆలోచనా విధానంలో విద్య, ఉపాధి, రైతు, మహిళా సంక్షేమానికి అధిక ప్రాధాన్యం లభిస్తోందని రాష్ట్ర పాడి పరిశ్రమ, మత్య్సశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. గతంలో ఏ ప్రభుత్వం చేపట్టని విధంగా రూ.200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మించడం అభినందనీయమన్నారు. సాగునీటి ప్రాజెక్ట్ల బాధ్యత నాదే: సీఎం రేవంత్డ్డి డిసెంబర్ 9 నాటికి భూసేకరణ పూర్తి చేస్తాం.. పరిహారం చెల్లిస్తాం బీఆర్ఎస్ పాలనలోనే పాలమూరుకు తీవ్ర అన్యాయం గత ప్రభుత్వంలో జిల్లా మంత్రులుతెచ్చింది ఏమీలేదు శ్రీశైలం నిర్వాసితులనుఎందుకు ఆదుకోలేదు జటప్రోలులో యంగ్ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్కు శంకుస్థాపన -
పేరుకుపోయిన బకాయిలు
గద్వాలటౌన్: గద్వాల మున్సిపాలిటీకి ఆదాయం సమకూర్చే మనరులుగా రూ.లక్షలు వెచ్చించి నిర్మించిన వ్యాపార సముదాయాలు పరుల పాలవుతున్నాయి. దుకాణాలను పొందిన వ్యక్తులు వాటిని ఇతరులకు అద్దెకించి డబ్బులు వెనకేసుకుంటుండగా.. మున్సిపాలిటీకి మాత్రం అద్దె చెల్లించకుండా ఆదాయానికి గండి కొడుతున్నారు. మున్సిపాలిటీ పరిధిలోని వ్యాపార సముదాయాల్లో నిబంధన ఉల్లంఘన అడుగడుగునా చోటుచేసుకుంటున్నా అద్దె వసూలు చేయాలనే సాహసం ఒక్క అధికారి చేయకపోవడం గమనార్హం. రాజకీయ జోక్యంతో సొంత ఆస్తులపై రాబడిని ఆర్జించలేని స్థితి మున్సిపాలిటీలో నెలకొంది. ఇదీ పరిస్థితి జిల్లాలో గద్వాలతో పాటు అయిజ, అలంపూర్, వడ్డేపల్లి మున్సిపాలిటీలు ఉన్నాయి. అయితే మూడు దశాబ్దాల క్రితం ఐడీఎస్ఎంటీ పథకం కింద కేంద్ర ప్రభుత్వ రుణంతో గద్వాల మున్సిపల్ పరిధిలో 236 దుకాణాలను చేపట్టారు. ఏ నుంచి హెచ్ బ్లాక్ వరకూ.. స్టోర్స్ అకాడమీ, నల్లకుంట కాలనీ, కూరగాయల మార్కెట్ దగ్గర, పాత బస్టాండ్, మున్సిపల్ కార్యాలయం పక్కన, కళాశాల మార్గంలో ఉన్న ప్రధాన రహదారుల పక్కన దుకాణాలను నిర్మించారు. కొన్ని దుకాణ సముదాయాలకు 30 ఏళ్లు లీజు అగ్రిమెంట్ పూర్తయింది. కేటాయించిన దుకాణాల అద్దెలను ప్రతి మూడేళ్లకు రెన్యూవల్ చేయాలి. కానీ అద్దెలను మాత్రం ప్రతి మూడు సంవత్సరాలకు పెంచకుండా తక్కువ మొత్తంలో అద్దెలు చెల్లిస్తూ మున్సిపాలిటీ ఆదాయానికి గండికొడుతున్నారు. ప్రస్తుతం మున్సిపాలిటీలో దుకాణాల అద్దె బకాయి రూ.95 లక్షలకు చేరుకుంది. బకాయిలు వసూలు చేస్తాం మున్సిపాలిటీకి సంబంధించిన దుకాణాల అద్దె బకాయిలను వసూలు చేయడానికి ప్రత్యేక కార్యాచరణ చేపడతాం. ఇప్పటికే బకాయిలు ఎక్కువగా ఉన్న దుకాణాలకు సంబంధించి జాబితా తయారు చేశాం. వారందరికి నోటీసులు జారీ చేస్తున్నాం. అప్పటికీ స్పందించకుంటే దుకాణాలకు తాళాలు వేస్తాం. దుకాణా ల అద్దె విషయంలో కఠిన చర్యలు తప్పవు. – దశరథ్, మున్సిపల్ కమిషనర్, గద్వాల వ్యాపార సముదాయాలపై కొరవడిన పర్యవేక్షణ రూ.95 లక్షల అద్దె బకాయిలు మున్సిపల్ ఆదాయానికి గండి -
‘డీట్’ ను సద్వినియోగం చేసుకోవాలి
గట్టు: నిరుద్యోగ యువత ఉపాధి అవకాశాల కోసం ప్రభుత్వం రూపొందించిన డీట్ (డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్స్ఛేంజ్ తెలంగాణ) యాప్ను సద్వినియోగం చేసుకోవాలని డీఆర్డీఓ శ్రీనివాసులు కోరారు. శుక్రవారం గట్టులోని ఐకేపీ దగ్గర డీట్ యాప్కు సంబందించిన పోస్టర్లను పీడీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పీడీ శ్రీనివాసులు మాట్లాడుతూ డీట్ యాప్ ద్వారా నిరుద్యోగ యువకులు ఎక్కడికి వెళ్లకుండా ఉన్న చోటనే తమ అర్హతకు సరిపోయే ఉద్యోగాన్ని ఎంపిక చేసుకోవచ్చునని తెలిపారు. ఇందులో 944 కంపెనీలు భాగస్వాములు అయినట్లు తెలిపారు. ఆయా కంపెనీల్లో 8843 ఉద్యోగాలు ఉన్నట్లు తెలిపారు. ఇందులో పుల్ టైం,పార్టు టైం,వర్క్ ప్రం హోం వంటి ఉద్యోగాలు ఇందులో ఉన్నట్లు తెలిపారు. నైపుణ్యవంతులైన నిరీక్షల నుంచి ఎంఫీల్, పీహెచ్డీ వరకు విద్యార్హత కలిగిన 15 ఏళ్లపైబడిన వారు, పని చేయడానికి ఆసక్తి ఉన్న వికలాంగులతో సహా అన్నీ సామాజిక వర్గాల అభ్యర్థులు ఇందులో ఉద్యోగాలు పొందే అ వకాశం ఉన్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈడీ సీ అసిస్టెంట్ మేనేజర్ శ్యామల, ఎంపీడీఓ చెన్న య్య, డీఆర్డీఏ డీపీఎం రూతమ్మ, సలోమి, యల్లప్ప, ఇన్చార్జ్ ఏపీఎం జయాకర్, సీసీలు పాల్గొన్నారు. -
ఉపాధ్యాయుల శిక్షణతో విద్యార్థులకు మేలు
వనపర్తిటౌన్: జిల్లాలోని 15 పీఎంశ్రీ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులు సైన్స్ ప్రాజెక్టులు నిర్వహించేందుకు హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కోర్స్ డైరెక్టర్ ఏఎంఓ మహానంది తెలిపారు. శుక్రవారం జిల్లాకేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలలో కొనసాగిన శిక్షణకు ఆయన హాజరై మాట్లాడారు. ఒక్కో పాఠశాల నుంచి ఒక గణితం, ఇద్దరు భౌతికశాస్త్రం బోధించే ఉపాధ్యాయులు మొత్తం 45 మంది శిక్షణకు హాజరయ్యారని చెప్పారు. ఉపాధ్యాయుల శిక్షణతో విద్యార్థులకు మేలు చేకూరనుందని, అర్థమయ్యే రీతిలో పాఠాలు బోధించి వారితో ప్రాజెక్టులు చేయించడానికి శిక్షణ ఉపయోగపడుతుందని చెప్పారు. కార్యక్రమంలో కోర్స్ ఇన్చార్జ్, డీఎస్ఓ శ్రీనివాసులు, పీఎంశ్రీ స్కూల్స్ జిల్లా కో–ఆర్డినేటర్ ఎస్ఓ–1 శేఖర్, పీఎంశ్రీ డీఆర్పీ బలరాముడు, ఐఎఫ్పీ ప్యానెల్స్ జిల్లా ఇన్చార్జ్ శేఖర్, పాఠశాల ఇన్చార్జ్ సువర్ణాదేవి తదితరులు పాల్గొన్నారు. -
వంద పడకల ఆస్పత్రిని అందుబాటులోకి తెస్తాం
అలంపూర్: ప్రజారోగ్య పరిరక్షణే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని.. అలంపూర్ చౌరస్తాలోని వంద పడకల ఆస్పత్రిలో సరిపడా వైద్య సిబ్బందిని నియమించడంతోపాటు అత్యాధునిక పరికరాలు ఏర్పాటుచేసి త్వరలో అందుబాటులోకి తెస్తామని ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే సంపత్కుమార్ అన్నారు. శుక్రవారం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశాల మేరకు వైద్య బృందంతో ఆస్పత్రిలోని ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, సమావేశ, ఇతర గదులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గ ప్రజల యోగక్షేమాల నిమిత్తం 2018లో ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో వంద పడకల ఆస్పత్రి మంజూరు చేయించానని అన్నారు. కానీ పనులు నత్తనడకన సాగిస్తూ ఈ ప్రాంత ప్రజల యోగక్షేమాలకు కాకుండా.. ఓట్లు సీట్ల కోసం గత ప్రభుత్వం వైద్యులు, పరికరాలు లేకుండానే ప్రారంభం చేసిందన్నారు. ప్రస్తుతం ఆస్పత్రి శిథిలావస్థకు చేరిందని, మంత్రి దామోదర రాజనర్సింహ చొరవతో ఆసుపత్రిలో సరిపడా సిబ్బందిని నియమించడంతోపాటు పరికరాలు ఏర్పాటుచేయనున్నట్లు, ఇందుకు జిల్లా వైద్య బృందం సహకరించడం సంతోషమన్నారు. పనులు యుద్దప్రాతిపదికన పూర్తి చేసి త్వరలో ప్రారంభిస్తామని సంపత్ కుమార్ అన్నారు. కార్యక్రమంలో ఆస్పత్రి ఇన్చార్జ్ సూపరింటెండెంట్ సయ్యద్, జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ వినోద్, జిల్లా వైద్యులు అమీర్, దివ్యతోపాటు నాయకులు గోపాల్, రాములు, రవి, ఆలయ చైర్మన్ నాగేశ్వర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నేడు సీఎం రేవంత్రెడ్డి రాక
సాక్షి, నాగర్కర్నూల్: నాగర్కర్నూల్ జిల్లాలో శుక్రవారం సీఎం రేవంత్రెడ్డి పర్యటించనున్నారు. పెంట్లవెల్లి మండలం జటప్రోల్లో రూ.150 కోట్లతో నిర్మించనున్న యంగ్ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ భవన నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేయనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, కలెక్టర్ బదావత్ సంతోష్ సీఎం పర్యటన ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. జటప్రోల్ సమీపంలో 22 ఎకరాల సువిశాల స్థలంలో యంగ్ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ సముదాయం నిర్మించనున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన విద్యార్థులు ఒకేచోట ఉండి అంతర్జాతీయ ప్రమాణాలతో నాణ్యమైన విద్య అభ్యసించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. మహిళలకు వడ్డీ లేని రుణాలు.. యంగ్ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ భవన నిర్మాణం కోసం శంకుస్థాపన అనంతరం జటప్రోలులో నిర్వహించే భారీ బహిరంగ సభలో సీఎం ప్రసంగిస్తారు. బహిరంగ సభకు జనసమీకరణతో పాటు ఏర్పాట్లను అధికారులు పూర్తిచేశారు. ఇందిరా మహిళాశక్తి కింద స్వయం సహాయక సంఘాల సభ్యులకు వడ్డీలేని రుణాలను ముఖ్యమంత్రి చేతులమీదుగా పంపిణీ చేయనున్నారు. మదనగోపాలస్వామి ఆలయంలో పూజలు.. సీఎం రేవంత్రెడ్డి జటప్రోల్లోని పురాతన మదనగోపాలస్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో మదనగోపాలస్వామి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. గురువారం కలెక్టర్ సంతోష్ సైతం ఆలయాన్ని సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. మొదటిసారిగా కొల్లాపూర్కు.. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారిగా రేవంత్రెడ్డి కొల్లాపూర్ నియోజకవర్గానికి రానున్నారు. కృష్ణాతీరంలో మారుమూల ప్రాంతంగా ఉన్న నియోజకవర్గంలో అభివృద్ధికి ఇతోధికంగా నిధులు మంజూరు చేయనున్నారన్న అంచనాలు నెలకొన్నాయి. ప్రధానంగా నల్లమల అటవీ ప్రాంతం, కృష్ణాతీర ప్రాంతాల్లో పర్యాటక అభివృద్ధికి నిధులు ప్రత్యేకంగా విడుదల చేసే అవకాశాలున్నాయి. పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పెండింగ్, కల్వకుర్తి ఎత్తిపోతల పథకం విస్తరణ పనులపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. జిల్లాలో రోడ్ల విస్తరణ, అభివృద్ధి పనుల కోసం పెద్దఎత్తున నిధులు మంజూరు చేస్తారని జిల్లావాసులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. జటప్రోల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి శంకుస్థాపన భారీ బహిరంగ సభలో ప్రసంగించనున్న ముఖ్యమంత్రి ఏర్పాట్లు పూర్తిచేసిన అధికార యంత్రాంగం -
రైతులకు అన్యాయం చేస్తే సహించం
గద్వాల: సీడుపత్తి సాగుచేస్తున్న రైతులకు అన్యాయం జరిగితే సహించేది లేదని ప్రత్యక్ష ఆందోళనకు పూనుకుంటామని ప్రతిపక్షపార్టీ బీజేపీ, బీఆర్ఎస్, నడిగడ్డహక్కుల పోరాటసమితి, తెలంగాణ రైతుసంఘం పార్టీలకు చెందిన నాయకులు అన్నారు. గురువారం కలెక్టరేట్ ఎదుట సీడు పత్తిరైతులతో కలిసి ధర్నా చేపట్టారు. ఈసందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఈ ఏడాది కంపెనీలు ఇచ్చిన విత్తనాలతో పంట సాగు చేశారని, రెండు నెలల తర్వాత ఒక్కోరైతు నుంచి కేవలం 2 క్వింటాళ్ల పత్తి విత్తనాలు మాత్రమే కొనుగోలు చేస్తామని సీడ్ కంపెనీలు, సీడ్ ఆర్గనైజర్లు చెప్పడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారన్నారు. రూ.లక్షలు పెట్టుబడి పెట్టి నష్టపోయారని, రైతులు పండించిన పూర్తి పంటను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కలెక్టర్ హామీతో ధర్నా విరమణ రైతుల చేపట్టిన ధర్నా వద్దకు కలెక్టర్ బీఎం సంతోష్ వచ్చి సీడుపత్తి రైతులు పండించిన పంటల దిగుబడులు మొత్తాన్ని సీడ్కంపెనీలు, సీడ్ఆర్గనైజర్లు తీసుకునేందుకు ఒప్పుకున్నారని, ఇందుకు సంబంధించి వారు లిఖితపూర్వకంగా హామీ ఇచ్చినట్లు చెప్పడంతో ధర్నాను విరమించారు. కార్యక్రమంలో నాయకులు, నాగర్దొడ్డి వెంకట్రాములు, ఇక్బాల్పాష, రామాంజనేయులు, బండల వెంకట్రాములు, వివి నర్సింహా, కుర్వపల్లయ్య, రంజిత్కుమార్, బుచ్చిబాబు,లవన్న తదితరులు పాల్గొన్నారు. -
అధికారి కనుసన్నల్లోనే దందా..
సివిల్సప్లై శాఖలో అవినీతికి కేరాఫ్ అడ్రస్గా మారిన ఓ అధికారి కనుసన్నల్లోనే ధాన్యం దందా కొనసాగుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల రబీసీజన్లో రికార్డుస్థాయిలో జిల్లాలో ధాన్యం కొనుగోలు జరిపారు. అయితే మిల్లర్ల సామర్థ్యం పెంచి ఏకంగా ఈ ఒక్క సీజన్లోనే సుమారు రూ.50 లక్షల వరకు మిల్లర్ల నుంచి వసూలు చేసి వెనకేసుకున్నాడన్న ఆరోపణలు సదరు అధికారిపై వినిపిస్తున్నాయి. అంతేకాకుండా సీఎమ్మార్ బియ్యానికి బదులుగా పీడీఎస్ బియ్యం అందిస్తే వాటిని పాస్ చేయటానికి లారీకి రూ.50వేల నుంచి రూ.60వేల చొప్పున వసూలు చేసినట్లు తెలిసింది. ఈక్రమంలో గత ఏడాది అక్టోబర్లో జింకలపల్లి రైస్మిల్లు నుంచి వెళ్లిన పీడీఎస్ బియ్యం ఎలాంటి పరీక్షలు చేయకుండానే గోదాంకు పంపకుండా నేరుగా అయిజ ఎంఎల్ఎస్ పాయింట్కు పంపడం హాట్టాపిక్గా మారింది. జింకలపల్లి రైస్మిల్లులో పీడీఎస్ బియ్యం పట్టుబడగా పోలీసు కేసు నమోదు చేస్తే సదరు మిల్లు ఓనర్ జైలుకు సైతం వెళ్లొచ్చారు. -
గుడిబండ వద్ద ‘డ్రై పోర్ట్’
అడ్డాకుల: మహబూబ్నగర్ జిల్లా అడ్డాకుల మండలంలోని గుడిబండ సమీపంలో డ్రై పోర్ట్(రోడ్డు మార్గం ద్వారా ఓడరేవుకు అనుసంధానించబడిన ఇన్ల్యాండ్ టెర్మినల్) నిర్మాణానికి అధికారులతో కలిసి ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డి మంగళవారం స్థలాన్ని పరిశీలించారు. గుడిబండ శివారులోని సర్వే నంబర్ 118లో ఉన్న ప్రభుత్వ స్థలాన్ని తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక, మౌలిక సదుపాయాల సంస్థ, లాజిస్టిక్స్ డైరెక్టర్ అపర్ణ, ఇతర అధికారులు స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. డ్రై పోర్ట్ ఏర్పాటు చేయడానికి ఉన్న సాధ్యాసాధ్యాలను అంచనా వేశారు. ఇటీవల దేవరకద్ర వద్ద ప్రతిష్టాత్మకమైన బ్రహ్మోస్ మిస్సైల్ తయారీ యూనిట్ ఏర్పాటుకు ప్రభుత్వం సానుకూలత వ్యక్తం చేయగా.. తాజాగా గుడిబండ వద్ద డ్రై పోర్ట్ నిర్మాణం కోసం స్థల పరిశీలన చేయడం శుభ పరిణామమని ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డి పేర్కొన్నారు. దేవరకద్ర నియోజకవర్గంలో 68 కిలోమీటర్ల మేర జాతీయ రహదారి విస్తరించి ఉన్నందున పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేయాలని సీఎం రేవంత్రెడ్డి, మంత్రి శ్రీధర్బాబును కోరడంతో పాటు డ్రై పోర్ట్ ఏర్పాటు చేయాలని అసెంబ్లీలో ప్రస్తావించినట్లు చెప్పారు. దీనికి వారు సానుకూలంగా స్పందించి డ్రై పోర్ట్ ఏర్పాటు కోసం స్థలాన్ని పరిశీలించడానికి అధికారులను గుడిబండకు పంపినట్లు తెలిపారు. హైదరాబాద్, కర్నూలు, రాయచూర్ ప్రాంతాలకు సులభమైన కనెక్టివిటీ ఉండటం కూడా డ్రై పోర్ట్ నిర్మాణానికి కలిసి వస్తుందని చెప్పారు. నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఉపాధి కల్పినకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. -
మెరుగైన ఫలితాల సాధనకు ప్రత్యేక కార్యాచరణ
గద్వాలటౌన్: జిల్లాలో 2025–26 విద్యా సంవత్సరానికి గాను మెరుగైన ఫలితాలు సాధించడానికి తగిన కార్యాచరణ రూపొందించాలని డీఈఓ అబ్దుల్ ఘనీ సూచించారు. మంగళవారం స్థానిక ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన జిల్లా ఉమ్మడి పరీక్ష బోర్డు ( డీసీఈబీ) సమావేశం నిర్వ హించారు. గతేడాది పరీక్షల నిర్వహణ, ఫలితాలపై సమీక్షించారు. అనంతరం ప్రస్తుత ఏడాదిలో తీసుకుంటున్న చర్యలపై చర్చించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ.. ఈ ఏడాది పదో తరగతిలో వందశాతం ఉత్తీర్ణత సాధించాలన్నారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో వంద శాతం ముఖ ఆధారిత హాజరు నమోదు చేయాలన్నారు. మెనూ ప్రకారం విద్యార్థులు మెరుగైన పౌష్టికాహారం అందించాలన్నారు. ఉపాధ్యాయులు సమయపాలన పాటించేలే చూడాలని, ఎల్ఐపీ, ఎఫ్ఎల్ఎన్ ఫలితాలు వంద శాతం ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. పాఠశాలలపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని చూచించారు. సమావేశంలో డీసీఈబీ సెక్రటరీ ప్రతాప్రెడ్డి, అసిస్టెంట్ సెక్రటరీ జహురుద్దీన్, ఏసీజీఈ శ్రీనివాస్, ఎంఈఓ అశోక్కుమార్ పాల్గొన్నారు. -
నిరుద్యోగ యువతకు ఉచిత కోచింగ్
గద్వాల: జిల్లాలోని డిగ్రీ పూర్తి చేసిన బీసీ నిరుద్యోగ యువతకు గ్రూప్స్, ఆర్ఆర్బీ, ఎస్ఎస్సీతోపాటు బ్యాంకింగ్ సర్వీసులకు టీజీ బీసీ స్టడీ సర్కిల్ ద్వారా ఉచిత కోచింగ్ ఇవ్వనున్నట్లు టీజీ బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ రాములు ఒక ప్రకటనలో తెలిపారు. అనుభవజ్ఞులైన అధ్యాపకులచే 5 నెలలు కోచింగ్ ఇవ్వబడుతుందని, అర్హత గల బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ అభ్యర్ధులు ఆన్లైన్ వెబ్సైట్ www.tsbcstudycirc e.gov.in నందు ఈ నెల 16 నుంచి ఆగస్టు 11వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. శిక్షణ తరగతులు ఆగస్టు 25 నుంచి ప్రారంభమవుతాయని, కోచించ్ సమయంలో నెలకు రూ.వెయ్యి స్టైఫండ్ ఇవ్వబడునని తెలిపారు. అభ్యర్థుల తల్లిదండ్రుల వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాలలో రూ.1.50 లక్షలలోపు పట్టణ ప్రాంతం వారికి రూ.2 లక్షల లోపు ఉండాలని, నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం మానవత్వం గద్వాల క్రైం: జిల్లా పోలీసు శాఖలో ఏఆర్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ రాజశేఖర్కు తోటి సిబ్బంది రూ. 80వేల ఆర్థిక సహాయని ఎస్పీ శ్రీనివాసరావు చేతుల మీదుగా మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. సహ ఉద్యోగి కుటుంబం ఆపదలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు చేయూత ఇవ్వడం స్పూర్తిదాయకంగా ఉంటుందన్నారు. సమస్యలలో ఉన్నప్పుడు మనోఽధైర్యం ఇవ్వడంతో పాటు ఆర్థికంగా సహాయం అందజేయడంపై ఎస్పీ సిబ్బందిని అభినందించారు. ఆర్థిక సహాయం అందజేసిన వారిలో సహ ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. ఆవాజ్ రాష్ట్ర కమిటీ ఎన్నిక గద్వాలటౌన్: ఆవాజ్ రాష్ట్ర మహాసభల సందర్భంగా రాష్ట్ర కమిటీని మంగళవారం ఏకగీవ్రంగా ఎన్నుకున్నారు. నూతన అధ్యక్ష, కార్యదర్శులను, 39 మందితో రాష్ట్ర కమిటీని ఏర్పాటు చేశారు. ఆవాజ్ రాష్ట్ర కమిటీ నూతన అధ్యక్షుడిగా ఎండీ జబ్బార్, ప్రధాన కార్యదర్శిగా మహమ్మద్ అబ్బాస్, కోశాధికారిగా షేక్ అబ్దుల్ సత్తార్, సీనియర్ ఉపాధ్యక్షులుగా అతిఖుర్ రెహమాన్, ఉపాధ్యాక్షులుగా అజీజ్ అహ్మద్ ఖాన్, సయ్యద్ హాషం, అబ్దుల్ నబీ, సహయ కార్యదర్శులుగా ఎంఏ జజ్బార్, ఎంఏ ఇక్బాల్లతో పాటు 30 మందిని కమిటీ సభ్యులుగా నియమించారు. అమరచింత చేనేత సంఘానికి అవార్డు అమరచింత: అమరచింత చేనేత ఉత్పత్తుల సంఘాన్ని ఉత్తమ సంఘంగా ఎంపిక చేసి జౌళిశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు చేతుల మీదుగా కంపెనీ సీఈఓ చంద్రశేఖర్కు అవార్డును అందించారు. నాబార్డు ఏర్పడి నేటికి 44 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా హైదరాబాద్లో మంగళవారం నాబార్డ్ ఆధ్వర్యంలో అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అమరచింత చేనేత ఉత్పత్తుల సంఘం సీఈఓ చంద్రశేఖర్ మాట్లాడుతూ ఆరేళ్లుగా సంఘాన్ని కొనసాగిస్తూ చేనేత కార్మికులే కంపెనీ షేర్ హోల్డర్స్గా నియమించడంతో పాటు వచ్చిన లాభాల్లో అందరికీ సమాన వాటా ఇస్తున్నామని తెలిపారు. తమ కృషిని గుర్తించి నాబార్డు రాష్ట్ర స్థాయిలో ఉత్తమ సంఘంగా ఎంపిక చేసి అవార్డు ఇవ్వడం సంతోషకరమన్నారు. కార్యక్రమంలో నాబార్డ్ సీజీఎం ఉదయభాస్కర్, టీజీ క్యాబ్ చైర్మన్ రవీందర్ తదితరులు పాల్గొన్నారు. -
వ్యవసాయ అధికారుల సలహాలు పాటించాలి
మల్దకల్: రైతులు వ్యవసాయ అధికారుల సలహాలు సూచనలు తప్పనిసరి పాటించాలని ఏడీఎ సంగీతలక్ష్మి అన్నారు. మంగళవారం మల్దకల్ రైతు వేదికలో వ్యవసాయ, జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ వీసీ ద్వారా అధికారులు నేరుగా రైతులు, మండల వ్యవసాయ అధికారులతో మాట్లాడారు. పంటల సాగు విధనంపై అవగహన కల్పించారు. పంటలకు అశించే చీడపిడల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేశారు. రసాయనిక ఎరువుల వాడకం తగ్గించి సేంద్రియ ఎరువుల వాడకం ద్వారానే భూమి సారవంతంగా ఉంటుందని, తక్కువ పెట్టుబడులతో ఎక్కువ లాభాలు వచ్చే పంటలు సాగు చేసుకోవాలని పేర్కొన్నారు. వ్యవసాయ అధికారుల సలహాలు సూచనలు తప్పనిసరిగా రైతులు పాటించాలన్నారు. కార్యక్రమంలో ఏఓ రాజశేఖర్, ఏఈఓలు ఖాజాపాష, భాస్కర్, కిశో ర్, రాహుల్పైలెట్, పల్లవి, సుజాత పాల్గొన్నారు. -
ఆయిల్పాం సాగుపై అవగాహన కల్పించాలి
ఎర్రవల్లి: తక్కువ పెట్టుబడులతో అధిక ఆదాయాన్ని ఇచ్చే ఆయిల్పాం సాగు విషయంలో ప్రభుత్వం చేపడుతున్న ప్రత్యేక చర్యల గురించి గ్రామాల్లో రైతులకు అవగాహన కల్పించాలని టీఎస్ ఆయిల్ఫెడ్ జి.ఎం సుధాకర్రెడ్డి అధికారులకు సూచించారు. మంగళవారం ఎర్రవల్లి మండల పరిదిలోని కొండేరులో మహిళా రైతు శిరీష పొలంలో ఏర్పాటు చేసిన మెగా ప్లాంటేషన్ కార్యక్రమానికి ఆయన హాజరై జిల్లా ఉధ్యానవన శాఖ అధికారి అక్బర్తో కలిసి మొక్కలు నాటి నీరు పోశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మెగా ప్లాంటేషన్ కార్యక్రమంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా 51 ఎకరాల్లో 22మంది రైతుల పొలాల్లో 2907 ఆయిల్పాం మొక్కలను ఒకే రోజు నాటడం జరిగిందన్నారు. అధిక ఆదాయానిచ్చే ఆయిల్పాం సాగుపై అవగాహన కల్పించి రైతులను ప్రోత్సహించాలని సూచించారు. ఆయిల్పాం మొక్కలు నాటిన నాలుగో సంవత్సరం నుంచి దిగుబడులు ప్రారంభం అవుతాయని దాదాపు 30 సంవత్సరాల వరకు ఈ మొక్కలు దిగుబడిని ఇస్తూ రైతులకు ఆదాయాన్ని ఇస్తాయన్నారు. ఆయిల్పాం సాగుతో పాటుగా వాటిలో వివిధ రకాల అంతర పంటలను కూడా సాగుచేసి అదనపు ఆదాయం కూడా పొందవచ్చునని తెలిపారు. ప్రభుత్వం కూడా ఆయిల్పాం సాగును పోత్సహిస్తూ పెద్ద ఎత్తున రాయితీలను ఇస్తుందన్నారు. రైతులు ఆయిల్పాం సాగు చేసుకునేలా వ్యవసాయశాఖ అధికారులు గ్రామాల్లో ప్రచారం చేసి రైతులకు అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో ఆయిల్ఫెడ్ జిల్లా ఇంచార్జి శివనాగిరెడ్డి, డివిజనల్ ఉధ్యావవన అధికారి ఇమ్రాన్, రాజశేఖర్, మహేష్, ఏరియా అధికారి రామకృష్ణ, రైతులు శేఖర్రెడ్డి, చింపరయ్య, రాజు, విజయ్ మోహన్రెడ్డి, మహీంద్రారెడ్డి పాల్గొన్నారు. -
నిర్లక్ష్యంగా వాహనాలు నడిపితే చర్యలు
గద్వాల క్రైం: జిల్లా వ్యాప్తంగా నిర్లక్ష్యంగా వాహనాలు నడిపే డ్రైవర్లపై చర్యలతో పాటు లైసెన్స్లు సీజ్ చేయడంతోపాటు, కేసులు నమోదు చేస్తామని జిల్లా రవాణా శాఖ అధికారి వెంకటేశ్వర్రావు స్పష్టం చేశారు. మంగళవారం జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడాతూ.. గద్వాల – అలంపూర్ సెగ్మెంట్లో ప్రభుత్వ, ప్రైవేటు బస్సులు, లారీలు, గూడ్స్ వాహనాలు, ట్రాక్టర్లు, ట్రాలీ తదితర వాహనాల డ్రైవర్లు ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ ప్రమాదాలకు నిలయంగా మానారన్నారు. తాజాగా ప్రైవేటు పాఠశాల బస్సులు నడిపే డ్రైవర్ల తీరు సమస్యాత్మకంగా మారిందని, ఇప్పటికే వారిపై నిఘా ఉంచామని, త్వరలో వారిపై చర్యలతో పాటు కేసులు నమోదు చేస్తామన్నారు. సామర్థ్యానికి మించి ప్రయాణికులను తీసుకెళ్లడం, గూడ్స్ వాహనాల్లో ఓవర్లోడ్తో సరుకులు తరలించడం వల్లే రోడ్డు ప్రమాదాలకు కారణమవుతుందన్నారు.ఇక నుంచి జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక డ్రైవ్ చేపట్టనున్నట్లు తెలిపారు. 2,313 వాహనాలకు రూ.3.95 కోట్లు జరిమానా రాష్ట్ర ప్రభుత్వం 2025 – 2026 సంవత్సరానికి జిల్లాకు రూ.9.36 కోట్ల లక్ష్యాన్ని నిర్దేశించిందని, అయితే ఏప్రిల్ నుంచి ప్రస్తుత మాసం వరకు 2,313 వాహనాలకు రూ.3.95 కోట్లు జారిమానాల రూపేణ ట్యాక్స్లు వసూలు చేశామన్నారు. ఇందుల్లో ట్యాక్స్లు చెల్లించని వాహనాలు, సరైన ధృపత్రాలు లేకుండా తనిఖీలో పట్టుబడిన పలు వాహనాలకు జరిమానా వేశామన్నారు. అంతర్రాష్ట్ర చెక్ పోస్టు వద్ద అనుమతి లేని వాహనాలపై చర్యలు చేపడుతున్నామన్నారు. వివిధ సర్వీసుల కోసం వచ్చే వారు ఏజెంట్లను నమ్మి మోసపోవద్దన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని సర్వీస్సులను ఆన్లైన్ చేయడం జరిగిందన్నారు. వాహన యాజమానులు, డ్రైవర్లు నేరుగా కార్యాలయంలోని అధికారులను సంప్రదించి సేవలను పొందాలన్నారు. ఇప్పటి వరకు రూ.3.95 కోట్ల జరిమానాలు వసూలు జిల్లా రవాణా శాఖ అధికారి వెంకటేశ్వర్రావు -
పెండింగ్ విద్యుత్ బిల్లులు చెల్లించాలి
అయిజ: వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ను నిరంతరాయంగా సరఫరా చేస్తామని, పెండింగ్ లేకుండా ప్రతి నెలా బిల్లులు చెల్లించాలని ట్రాన్స్కో ఎస్ఈ శ్రీనివాసరెడ్డి అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో అసిస్టెంట్ అకౌంట్ ఆఫీసర్ రాజు, జూనియర్ అకౌంట్ ఆఫీసర్ మదన్, ఏఈ నరేందర్రెడ్డితో కలిసి ఎస్ఈ పెండింగ్ బిల్లులు వసూలు చేసే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో పెండింగ్ బిల్లులు ఎక్కువగా ఉన్నాయని, నిర్ణీత సమయంలో చెల్లించని వారి కనెక్షన్లు కట్ చేస్తామన్నారు. అదేవిధంగా విద్యుత్ సిబ్బందికి పెండింగ్ బిల్లుల వసూళ్లపై సలహాలు, సూచనలు చేశారు. అయిజ, మల్దకల్, గద్వాలలో పర్యటించినట్లు పేర్కొన్నారు. -
ప్రజలకు నమ్మకం కలిగేలా పనిచేయండి
ధరూరు: రపభుత్వ ఆసుపత్రులపై ప్రజలకు మరింత నమ్మకం కలిగేలా ప్రతి ఒక్కరు పని చేయాలని కలెక్టర్ బీఎం సంతోష్ వైద్య సిబ్బందిని ఆదేశించారు. మంగళవారం ఆయన మండలంలోని ఉప్పేరు గ్రామంలోని ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆసుపత్రిలో ఆరోగ్య సిబ్బంది హాజరు, ప్రసవాలు, స్టాక్, తదితర రికార్డులను పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ఆసుపత్రికి వచ్చే రోగుల పూర్తి వివరాలు నమోదు చేయాలని, విధుల్లో నిర్లక్ష్యం వహించవద్దని సూచించారు. పీహెచ్సీలో ఎల్లవేళలా వైద్య సిబ్బంది అందుబాటులో ఉండి మెరుగైన వైద్య సేవలందించాలని, ప్రభుత్వ ఆసుపత్రులపై మరింత అవగాహన కల్పించాలన్నారు. ముఖ్యంగా గర్భిణులకు సంబంధించి సాధారణ ప్రసవాలు చేయాలని, ప్రైవేట్తో పోల్చితే ప్రభుత్వ ఆస్పత్రుల్లో సంఖ్యను గణనీయంగా పెంచాల్సిన అవసరం ఉందన్నారు. డెలివరీ క్యాలెండర్ను రూపొందించి అవసరమైన వైద్య సదుపాయాలు కల్పించాలన్నారు. అత్యవసర సేవలిందించేందుకు ఈ ప్రాంతానికి ఒక అంబులెన్స్ను త్వరలోనే కేటాయిస్తామన్నారు. వర్షాకాలంలో సీజనల్గా వచ్చే రోగాల పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ముందస్తు జాగ్రత్తలపై అవసరమైతే గ్రామాల్లో చాటింపులు చేయించాలన్నారు. పిల్లలకు షెడ్యూల్ ప్రకారం టీకాలు వేయాలని, ఆరోగ్య సేవల నాణ్యతను మెరుగు పరచాలని, ప్రతి ఒక్కరు బాధ్యతగా విధులు నిర్వర్థించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా వైద్య అధికారి సిద్దప్ప, డాక్టర్లు రాజు, కృష్ణవేణి, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
సరిహద్దు దాటిస్తున్నారు!
కర్ణాటకలోని బ్లాక్ మార్కెట్కు మిల్లర్ల ధాన్యం తరలింపు కేసు లేకుండా చేసేందుకు రూ.10 లక్షలతో భేరం కేటీ.దొడ్డిలోని రైస్మిల్లు ఓనర్కు రాజకీయ పలుకుబడి ఉంది. సదరు మిల్లర్ ఎవరు అధికారంలో ఉంటే వారిపంచన చేరి తన అక్రమ దందాను నిరాటకంగా కొనసాగిస్తుంటారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈక్రమంలోనే సివిల్సప్లై శాఖలో ఓ అధికారి ఆశ్రయం కోరాడు. మంగళవారం సదరు మిల్లు ఓనర్ కలెక్టరేట్లోని సివిల్సప్లై కార్యాయలంలో తిష్ట వేశాడు. కేసు లేకుండా, ధాన్యం లారీని వదిలిపెడితే ఏకంగా రూ.10లక్షల వరకు లంచం ఇస్తానని సదరు అధికారితో ఒప్పందం చేసుకున్నట్లు తెలిసింది. ఇదిలాఉండా, సాధారణంగా పది బస్తాల పీడీఎస్ బియ్యం అక్రమంగా ఎవరైనా తరలిస్తూ పట్టుబడితే వెంటనే కేసు నమోదు చేస్తారు. కానీ సుమారు రూ.12లక్షల విలువ గల ధాన్యం లారీ పట్టుకుని పోలీసులకు అప్పగిస్తే 24గంటలు దాటినా ఇంకా కేసు నమోదు కాలేదంటే సదరు మిల్లు ఓనర్ ఏ స్థాయిలో అధికారులను మ్యానేజ్ చేశారో స్పష్టమవుతుంది. ధాన్యం లారీని వదిలేసి.. బియ్యం లారీని కర్ణాటకకు తరలించిన మిల్లు ఓనర్ కుమారుడు ధాన్యం లారీని సైతం దౌర్జన్యంగా తరలించే ప్రయత్నం చేయగా గ్రామస్తులు తిరగబడ్డారు. అప్పటికే అక్కడికి పోలీసులు రావడంతో చేసేది లేక ధాన్యం లోడు లారీని అక్కడే వదిలేసి వెళ్లారు. గద్వాల: రైతుల నుంచి నేరుగా రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసి.. ఆ ధాన్యాన్ని బియ్యంగా మార్చి ఇవ్వాలని మిల్లర్లకు కేటాయిస్తుండగా.. కొందరు మిల్లర్లు ఇదే అదనుగా అవినీతికి తెరలేపుతున్నారు. యథేచ్ఛగా ధాన్యాన్ని బ్లాక్ మార్కెట్కు, పక్క రాష్ట్రానికి తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. మంగళవారం తెల్లవారుజామున కేటి.దొడ్డిలో ప్రభుత్వం సీఎమ్మార్ నిమిత్తం మిల్లుకు కేటాయించిన ధాన్యాన్ని ఓ మిల్లర్ దొంగచాటుకు బ్లాక్ మార్కెట్కు తరలించే యత్నం చేసిన ఘటన నిజమనే చెబుతుంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలిలా.. కేటీదొడ్డి మండంలోని ఓ రైస్ మిల్లు యజమాని ప్రభుత్వం వద్ద తీసుకున్న ధాన్యాన్ని బ్లాక్ మార్కెట్కు తరలించేందుకు పథకం రచించాడు. ఇందుకోసం 12 టైర్ల సామర్థ్యం ఉన్న ఓ లారీని మంగళవారం తెల్లవారుజామున మిల్లు వద్దకు రప్పించి అందులో సుమారు 400 క్వింటాళ్ల (535 బస్తాలు) ధాన్యం లోడ్ చేశారు. అక్కడి నుంచి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న కర్ణాటక బార్డర్ దాటించి రాయచూర్ జిల్లా బ్లాక్ మార్కెట్లో విక్రయించి సొమ్ము చేసుకోవాలని పథకం వేశారు. అయితే విషయం తెలుసుకున్న కొంతమంది గ్రామస్తులు నందిన్నె చెక్పోస్టు వద్ద ధాన్యం లోడుతో వెళ్తున్న లారీని అడ్డుకున్నారు. అయితే అదే మిల్లు నుంచి బియ్యం లోడుతో ఉన్న మరో లారీ కూడా అక్కడికి రావడం గమనించిన గ్రామస్తులు బియ్యం లారీని సైతం అడ్డుకుని నిలిపేశారు. ఈక్రమంలో మిల్లు ఓనర్ కుమారుడు దౌర్జన్యంగా లారీని స్టార్ట్ చేసి గ్రామస్తులపై ఎక్కించే ప్రయత్నం చేశారు. దీంతో గ్రామస్తులు పక్కకు తప్పుకోగా.. అదే అదనుగా భావించి బియ్యం లోడు లారీని కర్ణాటకలోని రాయచూరుకు తరలించినట్లు గ్రామస్తులు తెలిపారు. పదుల సంఖ్యలో కేసులు పేదల ఆకలి తీర్చాల్సిన పీడీఎస్ బియ్యం బ్లాక్ మార్కెట్కు తరలిస్తూ అవినీతిపరులు సొమ్ము చేసుకుంటున్నారు. ఈక్రమంలోనే జిల్లా వ్యాప్తంగా స్టేషన్లలో పదుల సంఖ్యలో కేసులు నమోదు కావడం పీడీఎస్ బియ్యం అక్రమ రవాణ ఏ స్థాయిలో జరుగుతుందో స్పష్టమవుతుంది. ఫిర్యాదు ఇస్తే కేసు ధాన్యం లారీ పట్టుకున్న వ్యవహారంపై కెటి.దొడ్డి ఎస్ఐ శ్రీనివాసులను వివరణ కోరగా.. ధాన్యం లారీని గ్రామస్తులు పట్టుకుని తమకు సమాచారం ఇస్తే వెళ్లి స్వాధీనం చేసుకున్నాం. అయితే ధాన్యం లోడుతో ఉన్న లారీ అక్రమంగా వెళ్తుందా.. అన్న విషయాన్ని సివిల్సప్లై శాఖ అధికారులు తేల్చాల్సి ఉంది. వారు ఫిర్యాదు ఇస్తే చట్ట ప్రకారం కేసు నమోదు చేస్తాం. ఇప్పటి వరకు ధాన్యం లారీపై ఎలాంటి కేసు నమోదు చేయలేదు. భద్రతాకారణాల దృష్ట్యా ధాన్యం లారీని చింతలకుంట రైస్మిల్లులో భద్రపర్చామని ఎస్ఐ తెలిపారు. తాజాగా ధాన్యం, బియ్యం లారీలు రాయచూరు తరలింపునకు యత్నం గ్రామస్తుల పట్టివేత.. మిల్లు యజమాని కుమారుడి దౌర్జన్యంతో వెనక్కి తగ్గిన గ్రామస్తులు రూ.12 లక్షల విలువైన ధాన్యం దొరికినా కేసు నమోదు కాని వైనం కేసు లేకుండా చేసేందుకు సివిల్ సప్లై అధికారితో రూ.లక్షల్లో ఒప్పందం? సమగ్ర విచారణకు ఆదేశం కేటీదొడ్డి మండలంలో పట్టుబడిన ధాన్యం లారీ వ్యవహారంపై సమగ్ర విచారణకు ఆదేశించాం. లారీలో ఉన్న ధాన్యం ఎక్కడి నుంచి వచ్చింది. ప్రభుత్వం వద్ద తీసుకున్న ధాన్యమా కాదా.. అన్న వివరాలు సేకరిస్తాం. అలాగే, ప్రభుత్వం వద్ద తీసుకున్న ధాన్యం వివరాలు మిల్లులో ఉన్న స్టాక్ వివరాలు పరిశీలించి వ్యత్యాసం ఉన్నట్టు తేలితే బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఇందులో ఎవరైన అఽధికారుల పాత్ర ఉంటే వారిపై శాఖపరమైన చర్యలు తీసుకుంటాం. పూర్తి వివరాలు తేలే వరకు ధాన్యంలారీని సీజ్ చేసి చింతలకుంటలోని రైస్మిల్లులో ఉంచాం. – వి.లక్ష్మీనారాయణ, అదనపు కలెక్టర్ -
తేజేశ్వర్ కేసులో మరో ట్విస్ట్
సాక్షి, జోగుళాంబ గద్వాల జిల్లా: ప్రైవేట్ సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసులో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. హత్య కేసులో ప్రధాన నిందితులైన తిరుమలరావు ఏ–1, కుమ్మరి నాగేష్ ఏ–3, చాకలి పరశురాముడు ఏ–4, చాకలి రాజు ఏ–5లను ఈ నెల 10న విచారణాధికారి శ్రీను.. కోర్టు అనుమతితో 3 రోజుల పాటు కస్టడీలోకి తీసుకుని వివరాలు సేకరించారు.వాయిస్ మెసెంజర్తో గొంతు మార్చి మాట్లాడినట్లు ఇది వరకే బయటపడగా.. తాజాగా మరో ట్విస్ట్ బయటపడింది. తేజేశ్వర్-సహస్రల మధ్య ఎలాంటి కలయిక ఉండరాదనే ఉద్దేశంతో స్పై కెమెరాను కొనుగోలు చేసి తేజేశ్వర్ బెడ్రూంలో ఏర్పాటు చేశారు.తిరుమలరావు నిత్యం వారి కదలికలను కెమెరా ద్వారా గమనించాడు. కొత్త ట్విస్టు వెలుగులోకి రావడంతో.. సహస్రను కస్టడీలోకి తీసుకునేందుకు పోలీసులు పీటీ వా రెంట్ను కోర్టుకు సమర్పించారు. ఏ–2 సహస్రను కస్టడీలోకి తీసుకుంటే పూర్తి వివరాలు తెలుస్తాయని గద్వాల సీఐ శ్రీను వెల్లడించారు. -
ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి
అలంపూర్: నియోజకవర్గ ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు నిరంతరం కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే విజయుడు అన్నారు. అలంపూర్ చౌరస్తాలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకం లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కల్యాణలక్ష్మి పథకంతో పేదింటి ఆడబిడ్డల పెళ్లికి చేయూత అందిస్తున్నట్లు తెలిపారు. పేదల సంక్షేమానికి ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలను అర్హులందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కాగా, అలంపూర్, మానవపాడు, వడ్డేపల్లి మండలాలకు చెందిన 94 మంది లబ్ధిదారులకు రూ. 94,10,904 విలువగల చెక్కులను అందజేసినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్లు మంజుల, జోషి శ్రీనివాస శర్మ, భద్రప్ప, ఆలయ కమిటీ మాజీ చైర్మన్ నారాయణరెడ్డి, మాజీ ఎంపీపీ సుదర్శన్గౌడ్, నాయకులు శ్రీనివాస్రెడ్డి, నాగేశ్వర్రెడ్డి, కరుణసింహారెడ్డి, శ్రీనివాసులు, రవి, మురళీధర్గౌడ్ పాల్గొన్నారు. -
18న సీఎం రేవంత్రెడ్డి పర్యటన
పెంట్లవెల్లి: నాగర్కర్నూల్ జిల్లాలో ఈ నెల 18వ తేదీన సీఎం రేవంత్రెడ్డి పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పెంట్లవెల్లి మండలం జటప్రోల్ గ్రామంలో 22 ఎకరాలలో నిర్మించనున్న రెసిడెన్షియల్ స్కూల్ను ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. అనంతరం అక్కడే బహిరంగసభ నిర్వహించనున్నారు. కాగా.. సోమవారం నాగర్కర్నూల్ కలెక్టర్ బదావత్ సంతోష్ హెలీప్యాడ్, సభావేదిక, పార్కింగ్ వంటి స్థలాలను పరిశీలించి.. అధికారులతో సమీక్షించారు. సమయం లేనందున అధికారులు క్షేత్రస్థాయిలో దగ్గరుండి మూడు రోజుల్లో పనులు వేగవంతంగా పూర్తి చేయా లని ఆదేశించారు. అసంపూర్తి పనులు మరింత ముమ్మరం చేయాలని జిల్లాస్థాయి అధికారుల కు సూచించారు. మంగళవారం మంత్రి జూ పల్లి కృష్ణారావు స్థల పరిశీలన చేస్తారని, ఆలో గా పనులు కొలిక్కి వచ్చేలా చూడాలన్నారు. సభావేదిక ఏర్పాట్లు, ఇతర పనుల్లో ఎలాంటి అలసత్యం వహించరాదని చెప్పారు. -
అధునాతన సాంకేతికతతో భూ సర్వేల్లో కచ్చితత్వం
గద్వాల: లైసెన్స్డ్ సర్వేయర్లు అధునాతన సాంకేతికతను క్షేత్రస్థాయిలో అమలు చేసినప్పుడే భూ సర్వేల్లో కచ్చితత్వం ఉంటుందని కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన లైసెన్స్డ్ సర్వేయర్ల శిక్షణ కార్యక్రమానికి కలెక్టర్ హాజరై మాట్లాడారు. భూ భారతి చట్టం–2025 మేరకు భూముల రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ తదితర ప్రక్రియల్లో తప్పనిసరిగా సర్వే చేసి.. మ్యాప్ జత చేయాల్సి ఉంటుందన్నారు. ఇందుకోసం లైసెన్స్డ్ సర్వేయర్లకు ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. గత మే 26న పార్రంభమైన లైసెన్స్డ్ సర్వేయర్ల శిక్షణ ప్రస్తుతం కీలక దశలో ఉందన్నారు. కార్యక్రమంలో సర్వే ల్యాండ్ అండ్ రికార్డు ఏడీ రాంచందర్ పాల్గొన్నారు. ఫిర్యాదులు త్వరగా పరిష్కరించాలి.. వివిధ సమస్యలపై ప్రజావాణికి వచ్చే ఫిర్యాదులను త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకొని ఫిర్యాదులు స్వీకరించారు. మొత్తం 71 ఫిర్యాదులు అందగా.. పరిష్కారం నిమిత్తం సంబంధిత అధికారులకు పంపించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు లక్ష్మీనారాయణ, నర్సింగ్రావు పాల్గొన్నారు. ● కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాలు, జూనియర్ కళాశాలల్లో అందుబాటులో ఉన్న మౌలిక వసతులకు అనుగుణంగా పరిమితి లోపు ప్రవేశాలు కల్పించాలని కలెక్టర్ ఆదేశించారు. ఐడీఓసీ కార్యాలయంలో సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. పరిమితికి మించి అడ్మిషన్లు ఇవ్వడం వల్ల విద్యార్థులు ఇబ్బందులకు గురవుతారని తెలిపారు. కేజీబీవీల్లో ప్రవేశాలకు సంబంధించి తల్లిదండ్రులను కోల్పోయిన విద్యార్థులకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. -
పక్కా ఫోర్జరీనే..
●● పచ్చర్లలో నకిలీ ఓనర్షిప్ సర్టిఫికెట్పై క్షేత్రస్థాయి విచారణ ● పంచాయతీ కార్యదర్శి సంతకం ఫోర్జరీ చేసినట్లు తేల్చిన అధికారులు ● ఎస్పీ కార్యాలయంలో బాధితుల ఫిర్యాదు కలెక్టర్కు నివేదిస్తాం.. పచ్చర్ల గ్రామపంచాయతీ కార్యదర్శి సంతకం ఫోర్జరీకి సంబంధించి ఎంపీడీఓ ఖాజా మొయినుద్దీన్ విచారణ అధికారి. ఆయన ఇచ్చిన నివేదికలో ఫోర్జరీ జరిగినట్లు స్పష్టం చేశారు. విచారణ సమయంలో సదరు పంచా యతీ కార్యదర్శిని సైతం విచారించినట్లు నివేదికలో పేర్కొన్నారు. పూర్తి నివేదికను కలెక్టర్కు సమర్పించి.. తదుపరి చర్యలు చేపడతాం. – నాగేంద్రం, ఏడీపీఓ రాజోళి: మండలంలోని పచ్చర్ల గ్రామంలో పంచాయతీ కార్యదర్శి సంతకాన్ని ఫోర్జరీ చేసి ఓ ఇంటిని మరొకరికి విక్రయించిన వైనం నిజమని తేలింది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టిన ఎంపీడీఓ ఖాజామొయినుద్దీన్ నివేదిక సమర్పించారు. ఆ నివేదిక ఆధారంగా అది పక్కా ఫోర్జరీ అని అధికారులు తేల్చేశారు. పంచాయతీ కార్యదర్శి సంతకాన్ని ఫోర్జరీ చేసి.. తమ ఇంటిని ఇతరులకు విక్రయించినట్లు తేలడంతో బాధిత కుటుంబ సభ్యులు సోమవారం ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. అసలేం జరిగిందంటే.. రాజోళి మండలం పచ్చర్ల గ్రామానికి చెందిన తామేశ్గౌడ్కు వారసత్వ ఆస్తిగా ఇంటిని ఇస్తున్నట్టుగా కుటుంబ సభ్యులు ఒప్పందం చేసుకున్నారు. అయితే జీవనోపాధి నిమిత్తం ఆయన తన కుటుంబంతో కలిసి ఇటిక్యాల మండలం ధర్మవరంలో ఉంటున్నారు. ఈ క్రమంలోనే ఆయనకు దక్కాల్సిన ఇంటిని తన సోదరుడు కుటుంబ సభ్యులతో కలిసి 2025 జనవరి 1న ఇతరులకు విక్రయించి రిజిస్ట్రేషన్ చేశారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తిచేసేందుకు గాను గ్రామపంచాయతీ కార్యదర్శి నుంచి తీసుకోవాల్సిన ధ్రువపత్రాల కోసం ఫోర్జరీ సంతకాలకు తెరలేపారు. అందులో భాగంగా 2021లో తమ పేరుపై గ్రామపంచాయతీ కార్యదర్శి ఓనర్షిప్ సర్టిఫికెట్ జారీ చేసినట్లు సృష్టించి.. రిజిస్ట్రేషన్ చేయించారు. ఇందుకోసం అవసరమైన సాక్షులను రిజిస్ట్రేషన్ కార్యాలయానికి తీసుకెళ్లినప్పటికీ.. వారికి విషయం తెలుసుకుండా రిజిస్ట్రేషన్ తతంగం ముగించేశారు. విషయం తెలుసుకున్న బాధితుడు ఫోర్జరీ సంతకాలతో తన ఇంటిని అమ్ముకున్నారని తెలుసుకొని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అయినప్పటికీ ఎలాంటి స్పందన లేకపోవడంతో ‘సాక్షి’ ద్వారా విషయాన్ని బయటకు తీసుకొచ్చారు. ‘సాక్షి’ వరుస కథనాలతో కదలిక.. పంచాయతీ కార్యదర్శి ఫోర్జరీ సంతకంపై గత నెల 24న ‘ఫోర్జరీ పెట్టు.. ఆస్తి కొట్టు’ శీర్షికతో కథనం ప్రచురితమైంది. అయితే జిల్లాలో ఫోర్జరీ సంతకాలతో మోసపోయిన మరికొందరు బాధితులు ‘సాక్షి’ని సంప్రదించడంతో పాటు ఫోర్జరీలకు సంబంధించిన ఆధారాలను సామాజిక మాధ్యమాల ద్వారా బయటపెట్టారు. ఈ నేపథ్యంలో గతనెల 27న ‘చర్యలు తీసుకోరా?’ శీర్షికతో మరో కథనం ప్రచురితం కావడంతో అధికారులు విచారణ చేపట్టారు. పచ్చర్లలో తప్పుడు ధ్రువపత్రం మంజూరైన సమయంలో ఉన్న పంచాయతీ కార్యదర్శి ధనుంజయరెడ్డిని సైతం విచారించారు. ఆ సమయంలో తాను ఎలాంటి ఓనర్షిప్ సర్టిఫికెట్లు ఇవ్వలేదని.. అందులో ఉన్న సంతకం కూడా తనది కాదని నిర్ధారిస్తూ నివేదిక అందించారు. దీంతో తమ విచారణలో అది తప్పుడు ధ్రువపత్రం అని తేలిందని మండలస్థాయి అధికారులు జిల్లా అధికారులకు నివేదిక సమర్పించారు. -
జూనియర్ కళాశాలల్లో వసతుల కల్పనకు నిధులు
నిధుల మంజూరు ఇలా.. కళాశాల నిధులు (రూ.లలో) గద్వాల 12.5 లక్షలు ధరూర్ 11.5 లక్షలు అలంపూర్ 11.5 లక్షలు గట్టు 10.1 లక్షలు మానవపాడు 15 లక్షలు మల్దకల్ 15 లక్షలు అయిజ 14.5 లక్షలు గద్వాలటౌన్: ప్రభుత్వ జూనియర్ కళాశాలల బలోపేతానికి సర్కారు చర్యలు చేపట్టింది. విద్యార్థులకు మౌలిక వసతులతో పాటు భవనాల మరమ్మతు, బోధనకు వీలుగా సౌకర్యాల కల్పనకు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తెలంగాణ స్టేట్ ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా కళాశాలల్లో గుర్తించిన అవసరాలను తీర్చేందుకు నిధులు మంజూరు చూసింది. జిల్లాలో మొత్తం ఎనిమిది జూనియర్ కళాశాలలు ఉండగా.. ఏడు కళాశాలలకు రూ. 90.1 లక్షలు మంజూరు చేస్తూ పరిపాలనా అనుమతులు వచ్చాయి. ఈ నిధులతో కళాశాల భవనాలకు రంగులు వేయడం, విద్యుత్ మరమ్మతు, నీటి సౌకర్యం, గ్రీన్ బోర్డు తదితర మౌలిక సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి. కళాశాలల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని.. కలెక్టర్ ఆదేశాలతో తదుపరి చర్యలు తీసుకుంటామని డీఐఈఓ హృదయరాజు తెలిపారు. -
ఎత్తిపోతలకు గ్రహణం
ఉమ్మడి జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల్లో మరమ్మతుల పరంపర ●నీటిని పంపింగ్ చేస్తున్నాం.. నెట్టెంపాడు ఎత్తిపోతల స్టేజీ–1, 2లలో మొత్తం 7 మోటార్లు ఉన్నాయి. వీటిలో ఒకసారి మాత్రమే 6 పంపులతో నీటిని పంపింగ్ చేశాం. మోటార్లలో ఎలాంటి సమస్య లేదు. అయితే పంపుహౌస్లో గ్రిడ్ను రన్ చేసేందుకు ఎస్ఎఫ్సీ రన్ చేయాల్సి ఉంటుంది. ఒక్కసారి రిపేరు వస్తే సరిచేశాం. ప్రస్తుతం రెండు పంపుల ద్వారా నీటిని పంపింగ్ చేస్తున్నాం. దీనిపై బీహెచ్ఈఎల్ వారికి తెలియజేశాం. అయితే ఇతర ప్రాజెక్టులలో వారికి రావాల్సిన బిల్లులు బకాయిలు ఉండడంతో రిపేరు చేసేందుకు రావడం లేదు. ఇప్పటి వరకై తే రూ.2 కోట్ల బకాయిలు చెల్లించాం. – రహీముద్దీన్, ఎస్ఈ ఇరిగేషన్ శాఖ రెండు పంటలకు నీరివ్వాలి.. నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం మోటార్లలో సాంకేతిక సమస్యపై ఇరిగేషన్శాఖ మంత్రి, కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లాను. నీటి పంపింగ్ కోసం అవసరమైన మోటార్లను పూర్తిస్థాయిలో సిద్ధం చేసి ఈ వానాకాలంలో లక్ష్యం మేర పంపింగ్ చేసుకుని పూర్తిస్థాయిలో ఆయకట్టు రైతులకు రెండు పంటలకు నీరివ్వాలని కోరాను. – కృష్ణమోహన్రెడ్డి, ఎమ్మెల్యే, గద్వాల గద్వాల: పాలమూరు బీడు భూములకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో అప్పటి ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి జలయజ్ఞంలో భాగంగా పెద్దఎత్తున సాగునీటి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా ఉమ్మడి జిల్లావ్యాప్తంగా కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిల్సాగర్ ప్రాజెక్టులను నిర్మాణం చేపట్టి వాటి కింద సుమారు 6 లక్షలకు పైగా ఎకరాలకు సాగునీరు అందిస్తున్నారు. అయితే.. ఆయా ఎత్తిపోతల పథకాల్లో మోటార్లు తరచుగా మరమ్మతుకు గురవుతుండటంతో నీటి పంపింగ్కు అడ్డంకిగా మారుతోంది. పాలకుల నిర్లక్ష్యం.. అధికారుల అలసత్వం కారణంగా ఎత్తిపోతలకు గ్రహణం పట్టినట్లయింది. నీటిని ఎత్తిపోసే పంపులకు సంబంధించి మోటార్లకు గత కొన్నేళ్లు సరైన మరమ్మతు చేయకపోవడం, మెయింటెనెన్స్ డబ్బులు సంబంధిత కంపెనీలకు చెల్లించకపోవడంతో సరైన నిర్వహణకు నోచుకోకపోవడంతో ఎత్తిపోతల ప్రాజెక్టులకు శాపంగా మారింది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఎత్తిపోతల పరిధిలోని లక్షలాది ఎకరాల ఆయకట్టు రెండో పంటకు సాగునీరు అందించడం ప్రశ్నార్థకంగా మారుతుంది. జోగుళాంబ గద్వాల జిల్లావ్యాప్తంగా 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో నిర్మించిన నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంలో మొత్తం ఏడు మోటార్లను ఏర్పాటు చేశారు. వీటిలో కేవలం రెండు మోటార్లు మాత్రమే పని చేస్తుండగా.. మిగిలిన ఐదు మోటార్లు మరమ్మతుకు గురయ్యాయి. ఈ మోటార్ల మెయింటెనెన్స్ బీహెచ్ఈఎల్ నిర్వహిస్తుండగా.. ప్రభుత్వం నుంచి బకాయిలు రాకపోవడంతో మెయింటెనెన్స్ పనులు ఆపేశారు. గతేడాది ఆగస్టులో సైతం గుడ్డెందొడ్డి లిఫ్టు వద్ద మోటార్లు కాలిపోగా.. నిర్వాహకులు చేతులెత్తెయడంతో అప్పటి సీఈ రఘునాథ్రావు ఆధ్వర్యంలో ఇంజినీర్ల బృందం గుడ్డెందొడ్డి లిఫ్టు వద్దకు చేరుకుని మోటార్లలో తలెత్తిన సాంకేతిక సమస్యను బీహెచ్ఈఎల్ వారిని ఫోన్ ద్వారా సంప్రదించి మరమ్మతు చేసిన దుస్థితి నెలకొంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు పరిధిలో 2 లక్షల ఎకరాల ఆయకట్టుకు గాను ర్యాలంపాడు జలాశయం ద్వారా 1.42 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీటిని అందిస్తున్నారు. ● నాగర్కర్నూల్, వనపర్తి, మహబూబ్నగర్ జిల్లా పరిధిలో 4.50 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో చేపట్టిన కేఎల్ఐ నేటికీ పనులు అసంపూర్తిగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు కింద కేవలం 2.50 లక్షల ఎకరాలకు మాత్రమే సాగునీరు అందుతోంది. ఈ ప్రాజెక్టులో మొత్తం 5 పంపులు ఏర్పాటు చేయగా.. రెండు పంపులు సాంకేతిక కారణాలతో మూలకు పడ్డాయి. మూడు మోటార్లు ఉన్నా.. రెండింటితోనే నీటి ఎత్తిపోతలు చేపడుతున్నారు. గతేడాది గుడ్డెందొడ్డి లిఫ్టును పరిశీలిస్తున్న అప్పటి సీఈ రఘునాథ్రావు, ఎస్ఈ శ్రీధర్, ప్రస్తుత ఎస్ఈ రహీముద్దీన్ (ఫైల్) తరుచుగా సాంకేతిక సమస్యలతో నీటి సరఫరాకు ఆటంకం ప్రస్తుతం నెట్టెంపాడులో రెండు, కల్వకుర్తి రెండు, కోయిల్సాగర్లో ఒక పంపుతోనే నీటి పంపింగ్ బకాయిలు చెల్లిస్తేనే పూర్తిస్థాయిలో మరమ్మతు చేస్తామంటూఏజెన్సీల కొర్రీ వరద సమయంలోనే హడావుడి చేస్తున్న వైనం ఒక్క మోటారుతో కోయిల్సాగర్.. మరికల్, ధన్వాడ, చిన్నచింతకుంట, దేవరకద్ర మండలాల పరిధిలో రెండు పంటలకు 50 వేల ఎకరాలకు సాగునీటిని అందించే లక్ష్యంతో కోయిల్సాగర్ నిర్మించారు. ఈ ప్రాజెక్టుకు ఆది నుంచి సమస్యలే ఎదురవుతున్నాయి. తాజాగా జూరాల ప్రాజెక్టుకు భారీ వరద వస్తుంది. ఈ క్రమంలో నీటిని ఎత్తిపోయాల్సిన పంపుహౌస్లోని రెండు మోటార్లు నిరంతరాయంగా పనిచేస్తే 630 క్యూసెక్కుల చొప్పున 70 రోజులపాటు నడిస్తే 50 వేల ఎకరాలకు సాగునీరు అందించవచ్చు. కానీ, రెండు మోటార్లలో ఒకటి సాంకేతిక సమస్యతో ఏడాదిగా పనిచేయడం లేదు. దీంతో ఒక్క మోటారుతోనే నీటిని ఎత్తిపోస్తున్నారు. -
కమ్యూనిస్టులతోనే సమస్యలు పరిష్కారం
ఉండవెల్లి: కమ్యూనిస్టుల పోరాటాలతోనే ప్రజా సమస్యలు పరిష్కారమవుతున్నాయని సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ సురవరం సుధాకర్రెడ్డి అన్నారు. సోమవారం ఉండవెల్లి మండలం కంచుపాడులోని తన నివాసంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సమాజంలో అన్యాయాలు, దోపిడీని అరికట్టేందుకు కమ్యూనిజమే ఏకై క మార్గమన్నారు. కమ్యూనిజానికి మించిన సిద్ధాంతం లేదన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం సీపీఐ నిరంతరం పోరాడుతుందన్నారు. దేశంలోని 80 శాతం హిందువులకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. కేవలం ఓట్ల కోసమే హిందువులను ఏకం చేస్తున్నారన్నారు. పాలకులు మతవిద్వేషాలను రెచ్చగొట్టే విధానాలను మానుకోవాలని హితవు పలికారు. అనంతరం మండల కమిటీ సభ్యులు ఆయనను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో సీపీఐ జాతీయ నాయకురాలు విజయలక్ష్మి, జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు, ఆశన్న, రంగన్న పాల్గొన్నారు. -
స్వాతంత్రోద్యమంలో మైనార్టీల పాత్ర మరవలేనిది
గద్వాలటౌన్: దేశ స్వాతంత్రోద్యమం, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ముస్లిం మైనార్టీల పాత్ర మరవలేనిదని ఆవాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండీ అబ్బాస్ అన్నారు. జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న ఆవాజ్ రాష్ట్ర మహాసభల్లో భాగంగా రెండో రోజు సోమవారం ‘భారత స్వాతంత్య్ర ఉద్యమం– మైనార్టీల పాత్ర’ అనే అంశంపై నిర్వహించిన సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు. ముస్లిం మైనార్టీలు ఎంతో మంది బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా పోరాడారని గుర్తుచేశారు. స్వాతంత్య్రోద్యమంలో పాల్గొనని బీజేపీ, ఆర్ఎస్ఎస్లు చారిత్రక పోరాటాలకు మతంరంగు పులిమితే దేశ ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక ఆకలి, పేదరికం, నిరుద్యోగం పెరిగిందని ఆందోళన వ్యక్తంచేశారు. తమ ఆర్థిక రాజకీయ దోపిడీని కప్పిపుచ్చుకోవడానికి విద్వేష రాజకీయాలకు ఆజ్యం పోస్తుందని ధ్వజమెత్తారు. ప్రజలు జాగృతమై సంఘటిత పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. అనంతరం మైనార్టీ హక్కుల పరిరక్షణ కోసం తీర్మానాలు చేశారు. కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు అతికూర్ రెహమాన్, నాగర్దొడ్డి వెంకట్రాములు, వెంకటస్వామి, ఆంజనేయులు, ఇక్బాల్పాషా, పల్లయ్య, జలీల్, తాహేర్, రంగు మద్దిలేటి, ఆంజనేయులు, సునందం, వీవీ నర్సింహ, రహీమతుల్లా, ఉప్పేర్ నర్సింహ పాల్గొన్నారు. -
రేపు ఉద్యోగ మేళా
గద్వాల: జిల్లాలోని నిరుద్యోగ యువతకు పలు ప్రైవేటు కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఈ నెల 16న ఐడీఓసీలోని జిల్లా ఉపాధి కల్పనాధికారిణి ప్రియాంక సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కేంద్రంతో పాటు అయిజ, కర్నూలు, మహబూబ్నగర్ ప్రాంతాల్లోని కంపెనీల్లో శిక్షణ అనంతరం ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు పేర్కొన్నారు. 18–35 ఏళ్ల వయసు ఉండి, ఎస్ఎస్సీ, ఇంటర్ ఏదైనా డిగ్రీ, ఎంబీఓ విద్యార్హత కలిగిన వారు అర్హులని తెలిపారు. ఐడీఓసీలోని ఉపాధి కల్పనశాఖ కార్యాలయంలో నిర్వహించే ఉద్యోగ మేళాను యువత సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. దరఖాస్తుల ఆహ్వానం గద్వాల: జిల్లాలోని దివ్యాంగులకు ఆర్థిక పునరావాస పథకం ద్వారా 2025–26 సంవత్సరం అందించే సబ్సిడీ రుణాల కోసం అర్హుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీడబ్ల్యూ ఓ సునంద సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. స్వయం ఉపాధి, చేతివృత్తుల, కుటీర పరిశ్రమల ఏర్పాటు చేసుకునేందుకు గాను మండలానికి ,మున్సిపాలిటీకి ఒకటి చొప్పున రూ. 50వేల నాన్ బ్యాంక్ లింకేజీతో, జిల్లాకు ఒక లింకేజీ యూనిట్ కోసం ఈ నెల 31వ తేదీలోగా https.tgobmms. cgg.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. సర్టిఫికెట్ల పరిశీలన.. జిల్లాలో దివ్యాంగుల ఉపకరణాల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు సదరం సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరు కావాలని డీడబ్ల్యూఓ తెలిపారు. ఐడీఓసీ భవనంలో ఈ నెల 15, 16 తేదీల్లో సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుందన్నారు. అభ్యర్థులు ఆన్లైన్ ఆప్లికేషన్ ఫాంతో పాటు సదరం ఒరిజినల్ సర్టిఫికెట్, ఆధార్కార్డు, కులం, ఆదాయం ధ్రువపత్రం ఒక సెట్ జిరాక్స్తో హాజరు కావాలని సూచించారు. 15న బ్యాటరీ మినీ ట్రేడింగ్ ఆటో వెహికిల్, 16న మొబైల్ బిజినెస్ బ్యాటరీ ట్రైసైకిల్ ఇతర ఉపకరణాల కోసం దరఖాస్తు చేసుకున్న వారు హాజరు కావాలని సూచించారు. డిగ్రీ ఫలితాలు విడుదల మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీ పరిధిలోని వివిధ ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కళాశాలల్లో చదువుతున్న సెమిస్టర్– 2, 4, 6కు సంబంధించి ఫలితాలను పీయూ వీసీ శ్రీనివాస్ సోమవారం విడుదల చేశారు. ఈ మేరకు రెగ్యులర్ పరీక్షలకు సంబంధించి సెమిస్టర్–2 బీఏలో 31.45 శాతం, బీకాంలో 36.86, బీఎస్సీ 29.74 శాతం ఉత్తీర్ణత సాధించారు. అలాగే సెమిస్టర్–4 బీఏలో 51.36, బీకాంలో 43.57, బీఎస్సీలో 37.63 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. సెమిస్టర్–6 బీఏలో 52.27, బీకాం 54.57, బీఎస్సీ 55.58 శాతం ఉత్తీర్ణత నమోదు చేశారు. బ్యాక్లాగ్ సెమిస్టర్–5 బీఏలో 52.88 శాతం, బీకాంలో 54.44, బీఎస్సీలో 46.51 శాతం ఉత్తీర్ణత నమోదైంది. కార్యక్రమంలో రిజిస్ట్రార్ రమేష్బాబు, ఆడిట్ సెల్ డైరెక్టర్ చంద్రకిరణ్, కంట్రోలర్ ప్రవీణ, శాంతిప్రియ, అనురాధరెడ్డి, అరుంధతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సీపీఐ చరిత్ర మొత్తం పోరాటాలమయం
ఉండవెల్లి: ఓట్లు, సీట్ల కోసం కాకుండా ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడేది సీపీఐ మాత్రమేనని, చరిత్ర మొత్తం పోరాటాలమయమని సీపీఐ జాతీయ నాయకురాలు సురవరం విజయలక్ష్మి అన్నారు. ఆదివారం మండలంలోని కంచుపాడులో సీపీఐ మహాసభను సురవరం వెంకట్రామిరెడ్డి విజ్ఞాన కేంద్రంలో నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఆమె హాజరై మాట్లాడారు. 100 ఏళ్లుగా దేశంలో పేదల కోసం సీపీఐ అవిశ్రాంత పోరాటాలు సాగిస్తుందన్నారు. దున్నే వాడికే భూమి కావాలని మొట్ట మొదట నినదించిన పార్టీ సీపీఐ అని, ప్రజా సంఘాలను ఏర్పాటు చేసి పేదల కోసం పోరాటాలు చేసిందని కొనియాడారు. ఆగస్టు 4న నిర్వహించే సీపీఐ జిల్లా మహాసభలను విజయవంతం చేయాలని ఆమె పిలుపునిచ్చారు. అనంతరం కంచుపాడులో సీపీఐ నాయకుల ఆధ్వర్యంలో జెండాను ఎగురవేశారు. కార్యక్రమంలో నాయకులు సురవరం కపిల్, జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు, రవి, రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు. -
కాలుష్యపు కోరల్లో.. ‘కృష్ణమ్మ’
జీవనది కృష్ణమ్మ ఉమ్మడి పాలమూరు జిల్లాలో సుమారు వంద కి.మీ., మేర పారుతూ.. కోట్లాది మందికి తాగునీరు, లక్షలాది ఎకరాలకు సాగునీరు అందిస్తోంది. అలాగే లెక్కకు మించి జీవరాశులు, వన్యప్రాణులు, మత్స్య సంపదకు జీవనాధారమైంది. ఇంతటి ప్రాముఖ్యత గల కృష్ణానది క్రమంగా కాలుష్యపు కోరల్లో చిక్కుకుంటోంది. ఎగువనున్న కొన్ని పరిశ్రమల నుంచి కాలుష్యపు నీటిని గుట్టుచప్పుడు కాకుండా కృష్ణానదిలోకి వదిలేస్తున్నారు. ఫలితంగా కృష్ణాజలాలు పచ్చరంగులోకి మారుతూ విషపూరితమవుతున్నాయి. ఈ పరిస్థితిని అడ్డుకోవాల్సిన కాలుష్య నియంత్రణ మండలి అధికారులు దరిదాపుల్లో లేకపోగా.. ఇతరత్రా అధికార యంత్రాంగం తమ పరిధిలో లేదంటూ చేతులు దులుపుకొంటోంది. కొల్లాపూర్: ఉమ్మడి పాలమూరు జిల్లా మీదుగా కృష్ణానది దిగువకు ప్రవహిస్తుంటుంది. అయితే కృష్ణానది తీరం వెంట పలు రసాయన, ఔషధ, ఆల్కహాల్ పరిశ్రమలు నెలకొల్పారు. వాటి వ్యర్థాలను నది తీరంలోకి వదిలిపెడుతున్నారు. కాలుష్య నియంత్రణ మండలి నిబంధనలను పరిశ్రమలు పట్టించుకోవడం లేదు. అలాగే నది తీర గ్రామాల్లోని చెత్తాచెదారాన్ని కూడా తీరం ఒడ్డునే పారబోస్తున్నారు. దీంతో ఎగువ నుంచి వరద జలాలు వదిలిపెట్టినప్పుడు కలుషితాలన్నీ నీటిలో కలిసి దిగువకు ప్రవహిస్తున్నాయి. కృష్ణానదికి ఉపనదులుగా ఉన్న తుంగభద్ర, మలప్రభ, ఘటప్రభ వంటి నదుల నుంచి కూడా కాలుష్య కారకాలు వచ్చి కృష్ణానదిలో కలుస్తున్నాయి. కొల్లాపూర్ నియోజకవర్గ సరిహద్దులోనే ఆయా నదులు సంగమం అవుతుంటాయి. కాలుష్య కారకాల వల్ల జటప్రోల్, మంచాలకట్ట, మల్లేశ్వరం, సంగమేశ్వరం, సోమశిల, అమరగిరి పరిసర ప్రాంతాల్లో నది నీళ్లు పచ్చగా మారుతున్నాయి. గత మూడేళ్లుగా నీళ్లు ఈ విధంగా కనిపిస్తున్నాయి. తీర ప్రాంతాల్లో కిలోమీటర్ల పొడవునా ఇలా నీటిపై పచ్చని రంగులో తెట్టెలు దర్శనమిస్తున్నాయి. నీటిమట్టం తగ్గేకొద్దీ కలుషిత నీరు అంతా దిగువకు ప్రవహిస్తూ పోతుంది. కేఎల్ఐ ప్రాజెక్టు ద్వారా.. ఉమ్మడి మహబూబ్నగర్– రంగారెడ్డి జిల్లాలకు కొల్లాపూర్ మండలం ఎల్లూరు సమీపంలోని మిషన్ భగీరథ స్కీం నుంచే నీటిని సరఫరా చేస్తున్నారు. ఈ స్కీంకు కృష్ణానది నీటినే వినియోగిస్తున్నారు. కేఎల్ఐ ప్రాజెక్టు ద్వారా ఎత్తిపోసే కృష్ణానీటిని ఫిల్టర్ చేసి ప్రజలకు సరఫరా చేస్తున్నారు. కాలుష్య కాటుకు గురవుతున్న నీటిని సక్రమంగా శుద్ధి చేయకుంటే ప్రజలు రోగాల బారిన పడే ప్రమాదం కూడా ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రజల ఆరోగ్యం, మత్స్యసంపద వృద్ధికి ఇబ్బందికరంగా నీటి కాలుష్యం మారకముందే అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. మత్స్య సంపదకూ ముప్పే.. నీటి కాలుష్యంతోపాటు గుర్రపు డెక్క కూడా కృష్ణానదిలో విస్తరిస్తోంది. ఎగువ నుంచి కిందకి నీళ్లు వచ్చినప్పుడు తీరప్రాంతాల్లోని చెత్తాచెదారంతోపాటు గుర్రపు డెక్క కూడా వస్తోంది. ఇది శ్రీశైలం డ్యాం వరకు నిదానంగా చేరుతోంది. కాలుష్యం, గుర్రపుడెక్క కారణంగా నదిలోని మత్స్య సంపదకు ప్రమాదం పొంచి ఉంది. ఇప్పటికే అలివి వలల కారణంగా నదిలో చేపలు పెరగడం లేదు. కాలుష్యం కూడా దీనికి తోడైతే మత్స్యకారుల జీవనోపాధికి ఇక్కట్లు తప్పవు. కృష్ణానదిలో కలుస్తున్న పరిశ్రమల వ్యర్థాలు పలు ప్రాంతాల్లో ఆకుపచ్చ రంగులోకి నది నీళ్లు మూడేళ్లుగా అధికమవుతున్న నీటి కాలుష్యం వరదలతో దిగువకు పారుతున్న కలుషిత జలాలు దరిదాపుల్లో కానరాని కాలుష్య నియంత్రణ మండలి అధికారులు -
ఉద్యోగాలు సాధించే వరకు పోరాటం
అలంపూర్: ఉద్యోగాలు సాధించే వరకు పోరాడుదామని శ్రీశైలం ప్రాజెక్టు ముంపు నిర్వాసితుల సంఘం రాష్ట్ర నాయకులు ధారసింగ్ అన్నారు. ఆదివారం అలంపూర్ చౌరస్తాలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో శ్రీశైలం ప్రాజెక్టు ముంపు నిర్వాసితుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి అలంపూర్, వనపర్తి, కొల్లాపూర్ నిర్వాసితులు దాదాపు 200 వరకు హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ.. శ్రీశైలం ప్రాజెక్టు ముంపు నిర్వాసితులం అందరూ ఐక్యతగా పోరాటం చేద్దామన్నారు. కోర్టులను ఆశ్రయించడం ద్వారానే మనకు న్యాయం జరుగుతుందన్నారు. రాష్ట్ర సంఘం నాయకులు అందరూ నిర్వాసితులకు అండగా ఉంటామని, న్యాయస్థానానికి వెళ్లడానికి అన్ని విధాలుగా సహకరిస్తామన్నారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఉమ్మడి జిల్లా వాసి కావడంతో ఆయన సహకారం అందిస్తే మనకు న్యాయం జరుగుతుందన్నారు. ఈ ప్రాంతానికి చెందిన మంత్రి జూపల్లి కృష్ణరావు స్పందించాలన్నారు.కార్యక్రమంలో శ్రీశైలం ప్రాజెక్టు ముంపు నిర్వాసితుల సంఘం రాష్ట్ర నాయకులు దాగోజీరావు, గోవిందు, రంగస్వామి, వెంకటేశ్వర్లు, కృష్ణ, దామోదర్, విజయభాస్కర్, నిర్వాసితులు పాల్గొన్నారు. -
మైనార్టీల హక్కులు కాలరాస్తున్న కేంద్రం
గద్వాలటౌన్: ముస్లిం మైనార్టీల హక్కులను కాలరాసే విధంగా బీజేపీ వ్యవహరిస్తుందని, ఆ దిశగా కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంతో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాలలో పాలన సాగుతుందని మాజీ ఎంపీ సుభాషిణి అలీ విమర్శించారు. ఆవాజ్ రాష్ట్ర మూడో మహాసభ ఆదివారం ప్రారంభమైంది. అంతకుముందు పట్టణంలో ముస్లిం మైనార్టీలు, వివిధ రాజకీయ పార్టీలతో పాటు ప్రజా సంఘాల నాయకులు ర్యాలీ చేపట్టారు. అనంతరం స్థానిక తేరుమైదానంలో జరిగిన సభలో ఆమె మాట్లాడారు. బీజేపీకి భారత రాజ్యాంగంపై నమ్మకం లేదని ధ్వజమెత్తారు. అందుకోసమే రాజ్యాంగం అమలులో నిర్లక్ష్యం కనిపిస్తుందని దుయ్యబట్టారు. బీజేపీ రాజ్యాంగం స్థానంలో మనుస్మృతిని అమల్లోకి తీసుకొచ్చే కుట్ర చేస్తుందని ఆరోపించారు. సీఏఏ, ఎన్ఆర్సీ చట్టం వల్ల మైనార్టీ హక్కులకు భంగం కలిగిందని, అందుకే పరదచాటున ఉన్న ముస్లిం మహిళలు తమ హక్కుల కోసం రోడ్లపైకి వచ్చి ఉద్యమాలు చేస్తున్నారని వివరించారు. మైనార్టీల దేశభక్తిని ఎవరు గుర్తుంచాల్సిన అవసరం లేదన్నారు. రాజ్యాంగం కల్పించిన ప్రజాతంత్ర హక్కులను హరిస్తే తిరగబడుతామని హెచ్చరించారు. బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్ తదితర రాష్ట్రాలలో ఆడ పిల్లలపై జరుగుతున్న అరాచకాలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కులాలు, మతాలు, జాతుల మధ్య విభజన వాదాన్ని స్పష్టించి తద్వారా రాజకీయ ప్రయోజనం పొందుతున్న బీజేపీ ఆలోచన విధానాలను ప్రజలు తెలుసుకోవాలన్నారు. ముస్లింలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నారు.. ఆవాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అబ్బాస్ మాట్లాడుతూ ప్రతి రాజకీయ పార్టీ ముస్లింలను ఓటు బ్యాంకుగా వాడుకుంటుందని ఆరోపించారు. ముస్లిం మైనార్టీలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందడం లేదన్నారు. వక్ఫ్బోర్డు ఆస్తులను పరిరక్షించాలని డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల ఐక్యతను దెబ్బతీయాలని చూస్తున్న బీజేపీకి వ్యతిరేకంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ సరిత మాట్లాడుతూ ముస్లిం మైనార్టీలను విద్య, ఆర్థిక, రాజకీయ రంగాలలో ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. ముస్లిం మైనార్టీ రిజరేషన్లపై కాంగ్రెస్ ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు. రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ రియాజ్ మాట్లాడుతూ దేశంలో లౌకిక విలువల పరిరక్షణకు, ప్రజల మధ్య ఐక్యత పెంచడం కోసం ఆవాజ్ రాష్ట్ర మహాసభలు జరగాలని ఆకాక్షించారు. కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు జబ్బార్, అతికూర్ రెహమాన్, నీలి శ్రీనివాసులు, వెంకటస్వామి, మధుసూదన్బాబు, నాగర్దొడ్డి వెంకట్రాములు, ప్రభాకర్, ఇసాక్, ఇక్బాల్పాష, పల్లయ్య, గంజిపేటరాజు, నర్సింహా, తాహేర్, మోహన్, రహీమతుల్లా తదితరులు పాల్గొన్నారు. మాజీ ఎంపీ సుభాషిణి అలీ ఆవాజ్ రాష్ట్ర మూడో మహాసభలు ప్రారంభం -
గ్రామాల అభివృద్ధికి కేంద్రం పెద్దపీట
రాజోళి: బీజేపీ ప్రభుత్వ హయాంలోనే గ్రామ పంచాయతీలకు ప్రత్యేక నిధులను కేటాయించి గ్రామాలను అభివృద్ధి చేసిందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు టి. రామాంజనేయులు అన్నారు. శనివారం స్థానిక సంస్థల సన్నాహక సమావేశంలో భాగంగా వడ్డేపల్లి మండలం రామాపురం గ్రామంలో మండల అధ్యక్షుడు బోయ నాగరాజు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు గ్రామ పంచాయతీల అభివృద్ధిని తుంగలో తొక్కారని అన్నారు. బీజేపి ప్రభుత్వంలో గ్రామాల్లో వైకుంఠధామాలు, సీసీ రోడ్లు, పల్లె ప్రకృతి వనాలు అంగన్ వాడీల ఆధునీకరణ కోసం గ్రామ పంచాయతీలకు ప్రత్యేక నిధులను నేరుగా కేటాయించిందని అన్నారు. ఇంత అభివృద్ధి చేసిన బీజేపి పార్టీకి మాత్రమే స్థానిక సంస్థల్లో ఓటు అడిగే అర్హత ఉందని అన్నారు. 42 శాతం రిజర్వేషన్లను తెరపైకి తెచ్చి మళ్లీ ప్రజలను మోసం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తుందని అన్నారు. రానున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో బీజేపీ చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచించారు. కార్యక్రమంలో జిల్లా మాజీ అధ్యక్షుడు రామచంద్రా రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి రవి కుమార్, జిల్లా ఉపాధ్యక్షుడు కేకే రెడ్డి,రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ జయలక్ష్మీ, సీనియర్ నాయకులు రాజగోపాల్, సంజీవ రెడ్డి తదిదరులు పాల్గొన్నారు. -
‘శత’క్కొట్టిన కేతన్కుమార్
జడ్చర్లకు చెందిన కేతన్కుమార్ యాదవ్ బ్యాటింగ్లో సంచలనం సృష్టించాడు. రెండేళ్లుగా క్రికెట్లో శిక్షణ తీసుకుంటున్న కేతన్ అండర్–23 లీగ్లో మూడు సెంచరీలు కొట్టి 474 పరుగులు చేసి బెస్ట్ బ్యాటర్గా నిలిచాడు. వనపర్తితో జరిగిన టూ డే లీగ్ మ్యాచ్లో రెండు ఇన్నింగ్స్ల్లోనూ శతకొట్టి 221 పరుగులు చేశాడు. మొదటి ఇన్నింగ్స్లో 113, రెండో ఇన్నింగ్స్లో 108 పరుగులు చేశాడు. మహబూబ్నగర్పై మరో సెంచరీ (101 పరుగులు) చేశాడు. రంజీ జ ట్టులో చోటు దక్కించుకోవడమే ప్రస్తుత లక్ష్యమంటున్నాడు కేతన్కుమార్. -
మధ్యాహ్నం వ(మ)ంట
పెరిగిన ధరలతో వంట ఏజెన్సీల అవస్థలు రూ.32 లక్షల బిల్లులు బకాయి పాఠశాలల్లో గత విద్యా సవంత్సరం ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నుంచి ఈ విద్యా సంవత్సరం జూన్ నెలకు సంబందించిన మొత్తం 4 నెలల బిల్లులు సుమారుగా రూ.32 లక్షల దాకా బకాయి పడడంతో వంట ఏజెన్సీలు లబోదిబోమంటున్నారు. ప్రస్తుతం మార్కెట్లో నిత్యావర వస్తువుల ధరలు ఆకాశన్నంటిన తరుణంలో ఏం కొనాలన్నా ఒకటికి రెండు పర్యాయాలు ఆలోచించి తీసుకునే పరిస్థితి ఏర్పడింది. ఆకుకూరలు, కూరగాయల పరిస్థితి వేరే చెప్పనవసరం లేదు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్నం అందిస్తున్న భోజనంలో ఆకు కూరలు, కూరగాయలను ప్రతి రోజు అందించలేక వంట ఏజెన్సీ నిర్వాహకులు అవస్థలు పడుతున్నారు. మార్కెట్లొ స్థిరంగా లేని థరల కారణంగా వీరిపై అదనపు భారం పడుతోంది. బిల్లులు చేతికందిన తర్వాత అప్పులను తీర్చుకుంటున్నట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 275 ప్రాథమిక, 94 ప్రాథమికోన్నత, 83 ఉన్నత పాఠశాలలు మొత్తం 452 పాఠశాలలు ఉన్నాయి. వీటిలో మొత్తం 56,594 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ప్రతి పాఠశాలలో వంట ఏజెన్సీలు కొనసాగుతున్నాయి. ప్రాథమిక పాఠశాలలో వంట సహాయకులు 661, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో 528 మంది మొత్తం 1,189 మంది వంట సహాయకులు పని చేస్తున్నారు. 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ప్రతి విద్యార్థికి రోజుకి రూ.6.19, 6వ తరగతి నుంచి 8వ తరగతి వరకు ప్రతి విద్యార్థికి రూ.9.29, 9, 10వ తరగతి విద్యార్థికి రూ.11.17 లను ప్రభుత్వం వంట ఏజెన్సీలకు చెల్లిస్తోంది. గట్టు: మెనూ తప్పనిసరిగా పాటించాలని.. ఆహార పదార్థాల్లో నాణ్యత ఏమాత్రం తగ్గకూడదని.. వారంలో మూడు రోజులు గుడ్లు ఉండాలని అధికారులు ఆదేశిస్తున్నా.. అందుకు తగ్గట్లుగా ప్రభుత్వం బిల్లులు విడుదల చేయకపోవడం, ధరల్లో తేడాలు ఉండడంతో మధ్యాహ్న భోజన నిర్వాహకులు భోజనం వండేందుకు, నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసేందుకు అప్పుల పాలవుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం తయారు చేసి అందించే బాధ్యత వంట ఏజెన్సీలకు అప్పగించిన విషయం తెలిసిందే. నాలుగు నెలలుగా బిల్లులు విడుదల కాకపోవడంతో నిర్వాహకులు అప్పులు చేసి విద్యార్థులకు వండి పెడుతున్నారు. ఒకవేళ వంట ఏజెన్సీని కాదనుకుంటే బిల్లుల బకాయిలను వదులుకోవాల్సి వస్తుండడంతో చేసేదేమి లేక వంట ఏజెన్సీలను కొనసాగిస్తున్నారు. గుడ్డు పరిస్థితి కాస్త మెరుగు 4 నెలల మధ్యాహ్న భోజనంబిల్లుల పెండింగ్.. అప్పు చేసి మరీ విద్యార్థులకు వండి పెడుతున్న వైనం బయటి ధరలకు అనుగుణంగా బిల్లులు ఇవ్వకపోవడంతో అనాసక్తి -
అట్టహాసంగా ముగిసిన కబడ్డీ పోటీలు
గద్వాలటౌన్: గద్వాల ఆతిథ్యంతో స్థానిక ఎస్ఆర్ విద్యానికేతన్ వేదికగా గత మూడు రోజుల పాటు జరిగిన ఉమ్మడి రాష్ట్రాల క్లస్టర్ సీబీఎస్ఈ పాఠశాలల అండర్ –14, 17, 19 బాలికల కబడ్డీ పోటీలు శనివారం అట్టహాసంగా ముగిశాయి. సెమీ ఫైనల్, ఫైనల్ మ్యాచ్లు హోరాహోరీగా సాగాయి. అండర్–14 విజేతగా హైదరాబాద్కు మాతృశ్రీ విద్యానికేతన్ జట్టు, రన్నర్గా గద్వాలకు చెందిన ఎస్ఆర్ విద్యానికేతన్ జట్లు నిలిచాయి. అండర్–17 విజేతగా తిరుపతికు చెందిన వెరిటాస్ సైనిక్ స్కూల్ జట్టు, రన్నర్గా హైదరాబాద్ శాంతినికేతన్ జట్టు నిలిచాయి. అండర్–19 విజేతగా హైదరాబాద్ ఓబుల్రెడ్డి జట్టు, రన్నర్గా తూర్పు గోదావరికి చెందిన సిస్టర్ నివేధిత జట్టు నిలిచింది. ఇరుజట్ల క్రీడాకారులు ఒక వైపు క్రీడాస్పూర్తిని కనబరుస్తూనే మరోవైపు క్రీడాకారులు గెలుపునకు చివరిదాకా కృషి చేశారు. చదువుతోపాటు క్రీడల్లో రాణించాలి ప్రతి క్రీడాకారుడికి క్రీడా స్ఫూర్తి ముఖ్యమని, దీని వల్లే భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు చేరుకుంటారని డీఎస్పీ మొగలయ్య అన్నారు. శనివారం సాయంత్రం జరిగిన పోటీల ముగింపు వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. క్రీడల పట్టణంగా గద్వాల అభివృద్ధి చెందుతుందన్నారు. భవిష్యత్లో మరిన్ని రాష్ట్ర స్థాయి పోటీల నిర్వహణకు అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. క్రీడలు జీవితానికి గొప్ప స్పూర్తినిస్తాయని, అందువల్ల వాటిని తప్పని సరిగా ప్రోత్సహించాలని సూచించారు. చదువుతోపాటు క్రీడలలోనూ రాణించాలని సూచించారు. అనంతరం గెలుపొందిన విజేతలకు మెమోంటోలు, మెడల్స్ను అందజేశారు. కార్యక్రమంలో ఎంఈఓ శ్రీనివాస్గౌడ్, పాఠశాల డైరెక్టర్ రాముడు, ప్రిన్సిపల్ సునిత గోన తదితరులు పాల్గొన్నారు. దరఖాస్తుల స్వీకరణ మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ పరిధిలో ఎంబీఏ హెల్త్ కేర్ మేనేజ్మెంట్ ప్రవేశ పరీక్ష రాసేందుకు ఆసక్తి గలవారు ఈ నెల 15 వరకు దరఖాస్తు చేసుకోవాలని ఓపెన్ యూనివర్సిటీ సేవా విభాగం డైరెక్టర్ వెంకటేశ్వర్లు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన వారికి అపోలో, కిమ్స్, డెక్కన్ మెడికల్ కళాశాల తదితర వాటిలో అడ్మిషన్లు పొందేందుకు అవకాశం ఉందన్నారు. వివరాలకు అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ వెబ్సైట్ను సందర్శించాలని సూచించారు. నేడు రాష్ట్రస్థాయి నెట్బాల్ సెలక్షన్స్ మహబూబ్నగర్ క్రీడలు: జిల్లాకేంద్రంలోని ఇండోర్ స్టేడియంలో ఆదివారం రాష్ట్రస్థాయి నెట్బాల్ సెలక్షన్స్ ట్రయల్స్ నిర్వహిస్తున్నట్లు నెట్బాల్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ అధ్యక్షుడు విక్రమ్ ఆదిత్యరెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. రానున్న జాతీయస్థాయి నెట్బాల్ టోర్నమెంట్లకు సంబంధించి రాష్ట్ర జట్ల ఎంపికలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. తమిళనాడు రాష్ట్రం నమక్కల్లో ఈ నెల 17, 18 తేదీల్లో జరిగే 17వ సౌత్జోన్ నేషనల్ నెట్బాల్, ఇదే వేదికలో 18, 19 తేదీల్లో జరిగే 2వ ఫాస్ట్5 సౌత్జోన్ నెట్బాల్ చాంపియన్షిప్, 19, 20 తేదీల్లో జరిగే మొదటి సౌత్జోన్ నేషనల్ మిక్స్డ్ పోటీలు, హర్యానా రాష్ట్రం పల్వాల్లో వచ్చే నెల 28 నుంచి 31 వరకు నెట్బాల్ పురుష, మహిళా జట్ల సెలక్షన్స్ ట్రయల్స్ ఉంటాయన్నారు. సెల్ .8883800699ను సంప్రదించాలని కోరారు. -
బంతితో తిప్పేసిన ముఖితుద్దీన్
మహబూబ్నగర్కు చెందిన ముఖితుద్దీన్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్. ఇంట్రా డిస్ట్రిక్ట్ అండర్–23 టూ డే లీగ్లో బంతిని గింగిరాలు తిరిగేలా బ్యాట్స్మెన్లను బోల్తా కొట్టించారు. తన స్పిన్ మాయాజాలంతో టోర్నీలో అత్యధికంగా 34 వికెట్లు తీశాడు. రెండు ఇన్నింగ్స్లలో వనపర్తి, నారాయణపేట జట్లపై 10 చొప్పున వికెట్లు, జడ్చర్లపై 5, గద్వాలపై 5, నాగర్కర్నూల్పై 4 వికెట్లు తీసి రాణించాడు. గతంలో పలుసార్లు హెచ్సీఏ టోర్నీల్లో ఎండీసీఏ తరఫున ఆడి ప్రతిభ చాటాడు. 2024లో వరంగల్లో జరిగిన హెచ్సీఏ అండర్–19 టోర్నీలో 5 మ్యాచుల్లో 14 వికెట్లు తీసి ఉత్తమ బౌలర్గా నిలిచాడు. ఈ ఏడాది చైన్నెలో జరిగిన ఆలిండియా యూనివర్సిటీ క్రికెట్ టోర్నీలో నాలుగు ఇన్నింగ్స్లో 8 వికెట్లు తీశాడు. గతేడాది త్రీ డే లీగ్లో 8 వికెట్లు తీశాడు. భవిష్యత్లో రంజీ, భారత జట్టుకు ఆడడమే తన లక్ష్యమంటున్నాడు ముఖితుద్దీన్. -
తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం
గద్వాల: జిల్లా కేంద్రంలోని ప్రజలకు మరో 30, 40ఏళ్ల పాటు తాగునీటి సమస్య తలెత్తకుండా శాశ్వత పరిష్కారం కోసం రూ.2కోట్లతో 10లక్షల లీటర్ల వాటర్ట్యాంకు నిర్మాణం చేపడుతున్నట్లు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి అన్నారు. శనివారం ఆయన జిల్లా కేంద్రంలోని దౌదర్పల్లి సమీపంలో నూతన వాటర్ట్యాంకు నిర్మాణానికి భూమి పూజ చేశారు. అనంతరం మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమృత్ పథకంలో భాగంగా నూతన వాటర్ట్యాంకును మంజూరు చేసిందని, వేసవిలో గద్వాల పట్టణవాసులకు తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించినట్లు వివరించారు. కార్యక్రమంలో నాయకులు బండారి భాస్కర్, రామన్గౌడ, వెంకట్రాములు, శ్రీకాంత్రెడ్డి, దౌలు, శ్రీమాన్నారయణ, కృష్ణ, నాగులు, సోమన్న, ధర్మనాయుడు, అన్వర్, మధు, ప్రవీణ్, ఓంప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. -
కెప్టెన్గా రాణించిన అనిత
నారాయణపేట జిల్లా కోస్గి మండలం హన్మాన్పల్లికి చెందిన అనిత ఇంట్రా డిస్ట్రిక్ట్ వుమెన్ లీగ్లో రెడ్ జట్టుకు కెప్టెన్గా వ్యవహరించి జట్టును ముందుకు నడిపించి చాంపియన్గా నిలవడంలో తన వంతు పాత్ర పోషించారు. రెండు మ్యాచుల్లో 59 పరుగులు చేయడంతో పాటు 4 వికెట్లు తీసింది. వనపర్తిలోని గిరిజన సొసైటీ క్రికెట్ అకాడమీలో శిక్షణ పొందుతూ ఆల్రౌండర్గా రాణిస్తోంది. ఎస్జీఎఫ్ జాతీయస్థాయి క్రికెట్ టోర్నీలో రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించింది. 2021లో హెచ్సీఏ మహిళా జట్టుకు ఎంపికై సూరత్ టోర్నీలో ఆడింది. హెచ్సీఏ టోర్నీల్లో రాణించి భారత జట్టుకు ఎంపికకవుతానని ధీమా వ్యక్తం చేస్తోంది అనిత. -
బ్యాటింగ్లో ‘ప్రతీక’ ప్రతిభ
మహహ్మదాబాద్ మండలం మంగంపేటకు చెందిన ప్రతీక తాండూరులో తొమ్మిదో తరగతి చదువుతోంది. జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఇంట్రా డిస్ట్రిక్ట్ వుమెన్స్ క్రికెట్ లీగ్లో పాల్గొని ప్రతిభచాటింది. వికెట్ కీపర్గా, బ్యాటింగ్లో రాణిస్తోంది. హైదరాబాద్లోని కేఎస్ఎం క్లబ్లో రెండేళ్లుగా శిక్షణ తీసుకుంటున్న ప్రతీక గత ఏడాది అండర్–15 టోర్నీలో హెచ్సీఏ జట్టు తరఫున తమిళనాడు, ఆంధ్ర జట్లతో మ్యాచ్లు ఆడింది. మొదటిసారిగా ఉమ్మడి జిల్లాలో వుమెన్ క్రికెట్ లీగ్ నిర్వహించడం సంతోషంగా ఉందని, క్రికెట్లో ప్రతిభ కనబరిచి భారత జట్టు ఆడాలన్నదే తన లక్ష్యమంటోంది ప్రతీక. -
ఆల్రౌండర్గా రాణిస్తున్న అబ్దుల్ రాఫే
మహబూబ్నగర్కి చెందిన అబ్దుల్ రాఫే బ్యాటింగ్తో పాటు కీపర్గా రాణిస్తున్నాడు. ఇటీవల జరిగిన ఇంట్రా డిస్టిక్ట్ అండర్–19 వన్డే క్రికెట్లో బ్యాటింగ్లో తన నైపుణ్యాన్ని ప్రదర్శించాడు. గద్వాలపై అబ్దుల్ రాఫే అద్భుతమైన బ్యాటింగ్తో అజేయ డబుల్ సెంచరీ చేశాడు. 173 బంతుల్లో 6 సిక్స్లు, 31 ఫోర్లతో 243 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. నారాయణపేటపై 127 బంతుల్లో 3 సిక్స్లు, 25 ఫోర్లతో 165 పరుగులు చేశాడు. లీగ్లో 495 పరుగులు చేసి బెస్ట్ బ్యాట్స్మెన్గా నిలిచాడు. 2023లో టుడే లీగ్లో రెండు సెంచరీలు, మూడు అర్థసెంచరీలు చేశాడు. ఈ ఏడాది చైన్నెలో జరిగిన ఆలిండియా యూనివర్సిటీ క్రికెట్ టోర్నీలో పీయూ తరఫున ఆడి రాణించాడు. క్రికెట్ అంటే చాలా ఇష్టమని, టీమిండియాకు ఆడాలన్నదే తన కల అని పే అంటున్నాడు అబ్దుల్ రాఫే. -
కష్టపడిన ప్రతి కార్యకర్తకు న్యాయం చేస్తాం
గద్వాలటౌన్: కాంగ్రెస్ పార్టీ పటిష్టానికి కృషి చేసిన ప్రతి కార్యకర్తకు న్యాయం చేస్తామని, పార్టీ అధిష్టానం సముచిత స్థానం కల్పిస్తుందని కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి జిల్లా ఇన్చార్జ్ కుసుమ కుమార్ అన్నారు. శనివారం స్థానిక హారిత టూరిజం హాల్లో నిర్వహించిన పార్టీ జిల్లా స్థాయి విస్తృతస్థాయి సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ విజయానికి, గత ప్రభుత్వంపై పోరాటం చేసిన కార్యకర్తలకు పార్టీ పదవుల్లో, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశాలు దక్కుతాయన్నారు. కొత్తగా చేరిన వారికి పదవులిచ్చే ప్రసక్తి లేదన్నారు. కార్యకర్తల శ్రమ ఫలితమంగానే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, గ్రామ స్థాయి నుంచి పార్టీని సంస్థాగతంగా పటిష్టం చేసేందుకు ముమ్మర ప్రయత్నం జరుగుతుందన్నారు. కాంగ్రెస్కు కంచుకోటగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఉందన్నారు. ఏడాదిన్నర కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. వంద శాతం రుణమాఫీ జరిగిందని, బీఆర్ఎస్, బీజేపీ అసత్య ప్రచారాన్ని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. అనంతరం పార్టీ సంస్థాగత అంశాలపై నాయకులకు మార్గనిర్ధేశం చేశారు. సంఘటితంగా పనిచేయాలి : సంపత్కుమార్ ఏఐసీసీ కార్యదర్శి సంపత్కుమార్ మాట్లాడుతూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపునకు సంఘటితంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. మండల, పట్టణ, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ పదవులకు ఆశావహులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కాంగ్రెస్తోనే సామాజిక న్యాయమన్నారు. అయితే ఎమ్మెల్యేతోపాటు ఆయన వర్గీయులు ఎవురూ కూడా సమావేశానికి హాజరు కాలేదు. గైర్హాజరుపై భిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. సమావేశంలో పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి సరిత, జిల్లా గ్రంథాలయ చైర్మన్ శ్రీనివాసులు, మున్సిపల్ మాజీ చైర్మన్ బీఎస్ కేశవ్. జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు తిరుమలేష్, నాయకులు దొడ్డెప్ప, నల్లారెడ్డి, ఇసాక్, నారాయణరెడ్డి, సుకన్య, నాగశిరోమణి, గట్టు క్రిష్ణ, గౌస్, డీఆర్ శ్రీధర్, రాజశేఖర్రెడ్డి, శ్రీనివాస్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. జోగుళాంబ ఆలయంలో ప్రత్యేక పూజలు అలంపూర్: దక్షిణ కాశీ అలంపూర్ క్షేత్ర ఆలయాలను కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి జిల్లా ఇన్చార్జి కుసుమ కుమార్, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ శనివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వారికి స్వాగతం పలికారు. అనంతరం వారు బాలబ్రహ్మేశ్వర స్వామి, జోగుళాంబ అమ్మవారి ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు వారికి తీర్ధ ప్రసాదాలను అందజేసి అశీర్వచనం పలికారు. ఆలయ అర్చకులు వారిని శేషవస్త్రాలతో సత్కరించారు.