Medak
-
పంటలెండుతున్నా పట్టించుకోరా?
మెదక్ కలెక్టరేట్: పొట్టదశలో ఉన్న వరి పంటలు నీటి తడులు లేక ఎండిపోతున్నాయని, సింగూరు నుంచి నీరు విడుదల చేసి రైతులను ఆదుకోవాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈమేరకు సోమవారం కలెక్టర్ ప్రతిమాసింగ్ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని పలు మండలాల్లో వరి పొట్టదశలో ఉందని, నీరందక రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని తెలిపారు. సింగూర్ ప్రాజెక్టు నుంచి ఘనపూర్ ఆయకట్టకు అత్యవసరంగా 0.3 టీఎంసీల నీటిని విడుదల చేసి రైతులను ఆదుకోవాలని కోరారు. క్రాప్ హాలిడే ప్రకటించకముందే రైతులు పంటలు వేసుకున్నారని తెలిపారు. ఆలస్యంగా ప్రకటించడం వల్ల వారు తీవ్రంగా నష్టపోతున్నారని వాపోయారు. రైతుల పంటలు ఎండిపోతున్నా, ప్రభుత్వం స్పందించకపోవడం సరికాదన్నారు. రెండు రోజుల్లోగా చర్యలు తీసుకోవాలని, లేకపోతే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతులతో కలిసి పెద్దఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు లావణ్యరెడ్డి, కృష్ణారెడ్డి, లింగారెడ్డి, కౌన్సిలర్లు, రైతులు తదితరులు పాల్గొన్నారు. -
రైతు సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం
ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రామాయంపేట(మెదక్): మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు సూచించారు. సోమవారం రామాయంపేట మార్కెట్ యార్డులో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి మాట్లాడారు. జిల్లాలో ఏకై క కొనుగోలు కేంద్రం రామాయంపేటలోనే ఏర్పాటు చేశామన్నారు. ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందని, నిజాంపేటలో కూడా కేంద్రం ప్రారంభోత్సవానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ లావణ్య, కౌన్సిలర్లు నాగరాజు, రవి, రంజిత్, సందీప్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సరాపు యాదగిరి, మండల పార్టీ అధ్యక్షుడు మహేందర్రెడ్డి, కాంగ్రెస్ పట్టణాధ్యక్షుడు చింతల స్వామి, డీసీసీ ఉపాధ్యక్షుడు దేమె యాదగిరి, జిల్లా కార్యదర్శి పోచమ్మల గణేశ్, తహసీల్దార్ రజని, సహకార సంఘం సీఈఓ నర్సింలు, పలు గ్రామల సర్పంచ్లు పాల్గొన్నారు. -
‘పేట’ మాజీ మున్సిపల్ కమిషనర్ మృతి
రామాయంపేట(మెదక్): గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రామాయంపేట మాజీ మున్సిపల్ కమిషనర్ మామిడి దేవేందర్ ఆదివారం రాత్రి మృతి చెందారు. మున్సిపల్ ఎన్నికలకు ముందు వరకు రామాయంపేట కమిషనర్గా పనిచేసిన ఆయన, అనారోగ్యంతో సెలవుపై వెళ్లిపోయారు. హైదరాబాద్లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన మృతికి మున్సిపల్ చైర్పర్సన్ గజవాడ లావణ్య, వైస్ చైర్పర్సన్ నవనీత, కౌన్సిలర్లు, మున్సిపల్ మేనేజర్ రఘువరన్ సంతాపం వ్యక్తం చేశారు. నర్సాపూర్: రెండు రోజుల పాటు మిషన్ భగీరథ తాగు నీటి సరఫరాలో అంతరాయం ఉంటుందని డీఈ ప్రవీణ్కుమార్, ఏఈ సురేశ్ తెలిపారు. చెక్రియాల్ నుంచి వచ్చే మెయిన్ పైపులైన్కు లీకేజీ ఏర్పడిందని, మరమ్మతులు చేయించాల్సి ఉంటుందన్నారు. సోమవారం సాయంత్రం నుంచి నీటి పంపింగ్ నిలిచిపోతుందని వివరించారు. కాగా మంగళ, బుధవారం వరకు నీటి సరఫరా ఉండదన్నారు. నర్సాపూర్ నియోజకవర్గంలోని అన్ని గ్రామాలతో పాటు సంగారెడ్డి జిల్లా జిన్నారం, గుమ్మడిదల, గడ్డపోతారం మున్సిపాలిటీలకు నీటి సరఫరా నిలిచిపోతుందని పేర్కొన్నారు. స్థానికంగా నీటి సరఫరాకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. మెదక్ కలెక్టరేట్: ప్రభుత్వం పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యం సకాలంలో లబ్ధిదారులకు అందించాలని మెదక్ ఆర్టీఓ రమాదేవి సూచించారు. సోమవారం పట్టణంలోని పలు రేషన్ దుకాణాలను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. పేదల కోసం ప్రభుత్వం సరఫరా చేస్తున్న సన్న బియ్యాన్ని సకాలంలో అందించాలని డీలర్లకు సూచించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే డీలర్లపై, రేషన్ బియ్యం అక్రమ రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆమె వెంట మెదక్ తహసీల్దార్ లక్ష్మణ్బాబు తదితరులు ఉన్నారు. మెదక్జోన్: బీజేపీ 46వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు మల్లేశంగౌడ్ జెండాను ఎగరవేశారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రంజిత్రెడ్డి, సీనియర్ నేతలు సుభాశ్గౌడ్, పట్టణ అధ్యక్షుడు నాయిని ప్రసాద్, బీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు గడ్డం కాశీనాథ్, యువ మోర్చా అధ్యక్షుడు సతీశ్ తదితరులు పాల్గొన్నారు. పార్టీ కార్యవర్గ సభ్యుడు రఘువీరారెడ్డి హత్నూర(సంగారెడ్డి): దేశ అభివృద్ధి బీజేపీ పాలనలోనే సాధ్యమైందని ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రఘువీరారెడ్డి అన్నారు. సోమవారం బీజేపీ 47వ ఆవిర్భావ దినోత్సవంలో భాగంగా హత్నూర మండలం దేవులపల్లిలో పార్టీ జెండావిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచ దేశాలు ప్రధాని నరేంద్ర మోదీ వైపు చూస్తున్నాయని చెప్పారు. బీజేపీ పాలనలోనే దేశం పురోగతి సాధించిందన్నారు. గ్రామాలకు కూడా పార్టీ విస్తరిచిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల శాఖ అధ్యక్షులు నాగ ప్రభుగౌడ్, నాయకులు మల్లారెడ్డి, మహేష్, మల్లేశం, నాగరాజుగౌడ్, పాండు, ఇంద్రసేనారెడ్డి, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. సంగారెడ్డి టౌన్: విద్యార్థులకు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సౌజన్య అన్నా రు. సోమవారం సంగారెడ్డి మండలం ఇస్మాయిల్ ఖాన్ పేట పాఠశాలలో న్యాయ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పోక్సో, మహి ళల రక్షణకు సంబంధించిన చట్టాలపై అవగాహన కల్పించారు. అవసరమైన న్యాయ సహాయం అందిస్తామన్నారు. లైంగిక నేరాలకు పాల్పడే వారిపై కఠిన శిక్షలు ఉంటాయని హెచ్చరించారు. వారి సంరక్షణకు తగిన చర్యలు తీసుకోవాలని, వారి ఆరోగ్యం, సంక్షేమంపై దృష్టి పెట్టాలన్నారు. -
10 నుంచి ధాన్యం కొనుగోళ్లు
● జిల్లావ్యాప్తంగా 518 కేంద్రాల ఏర్పాటు ● అదనపు కలెక్టర్ నగేశ్ మెదక్ కలెక్టరేట్: ఈనెల 10 నుంచి జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభిస్తామని అదనపు కలెక్టర్ నగేశ్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులు, రైస్ మిల్లర్లతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లావ్యాప్తంగా మొత్తం 518 కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ధాన్యం కొనుగోలు సామగ్రిని ఏర్పాటు చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. గన్నీ బ్యాగులు, తూకం, టార్పాలిన్ కవర్లు, మొదలైన సామగ్రి అందుబాటులో ఉండాలన్నారు. రైస్ మిల్లుల యజమానులు హమాలీలను, రవాణా వాహనాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. అన్లోడింగ్ ప్రక్రియ త్వరగా జరిగేలా చర్యలు తీసుకోవాలని రైస్మిల్లర్లకు సూచించారు. యాసంగి సీజన్ సీఎంఆర్ను త్వరగా పూర్తి చేయాలన్నారు. తూనికలు, కొలతల అధికారులు ధాన్యం కొనుగోలు కేంద్రాలు, రైస్ మిల్లుల్లో ధాన్యం తూకం కొలతలను తనిఖీ చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో సివిల్ సప్లై అధికారి నిత్యానంద్, డీఎం జగదీష్, జిల్లా కోపరేటివ్ అధికారి కరుణాకర్, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు. -
సత్వర పరిష్కారం చూపండి
● కలెక్టర్ ప్రతిమాసింగ్ ● ప్రజావాణికి 98 వినతులు మెదక్ కలెక్టరేట్: ప్రజావాణిలో వచ్చిన వినతులకు సత్వర పరిష్కారం చూపాలని కలెక్టర్ ప్రతిమాసింగ్ సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జిల్లా కేంద్రంతో పాటు వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న ప్రజల సమస్యలను సత్వరం పరిష్కరించేందుకు అధికారులు కృషి చేయాలన్నారు. ఫిర్యాదులను శాఖల వారీగా స్వీకరించి వాటి పరిష్కారానికి ప్రాధా న్యం ఇవ్వాలన్నారు. అర్జీలను పెండింగ్లో ఉంచకూడదన్నారు. తిరస్కరించిన దరఖాస్తులకు కారణాలను అర్జీదారుడికి లిఖితపూర్వక వివ రణ ఇవ్వాలన్నారు. ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుండి వచ్చిన ప్రజల నుండి 98 వినతులు స్వీకరించారు. అనంతరం ‘ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక’లో భాగంగా అధికారులతో సమీక్ష నిర్వహించారు. 99 రోజుల కార్యక్రమాలను పక్కాగా అమలు చేయాలని ఆదేశించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేశ్, జెడ్పీ సీఈఓ ఎల్లయ్య, డీఆర్డీఓ శ్రీనివాసరావు, ఏఓ యూ నస్, జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
అభివృద్ధిపై చర్చకు సిద్ధం
● నేను చేసిన పనులఆధారాలు చూపుతా.. ● మీరేం చేశారో ఎమ్మెల్యే చెప్పాలి ● మాజీ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి నారాయణఖేడ్: రెండున్నరేళ్లలో ఖేడ్ నియోజకవర్గంలో అభివృద్ధి శూన్యమని, ఏ ఒక్క రోడ్డు పనులు చేపట్టలేదని మాజీ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి ఆరోపించారు. బీఆర్ఎస్ కార్యాలయంలో సోమవారం విలేకరులతో మాట్లాడారు. తాను చేసిన పనులకు ఆధారాలు ను చూపుతామని, దమ్ముంటే ఎమ్మెల్యే చూపాలని సవాల్ విసిరారు. తాను ఎమ్మెల్యేగా ఏడేళ్లలో రూ.350 కోట్లతో మండల కేంద్రాలకు, గ్రామాలకు రోడ్లు వేయించానని గుర్తు చేశారు. రెండు జాతీయ రహదారుల విస్తరణకు రూ.900 కోట్లు మంజూరు చేయించానని చెప్పారు. తాను మంజూరు చేసిన ఇతర పలు పనులకు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రద్దు చేయించారని ఆరోపించారు. ప్రస్తుతం ప్రతిపాదనలే తప్ప పనులు లేవన్నారు. హ్యామ్ కింద చేపట్టే రోడ్లకు ముందుగానే కాంట్రాక్టర్లకు అడ్వాన్సులు ఇవ్వడం కమీషన్ల కోసమేనని ఆరోపించారు. రూ.800 కోట్లతో మిషన్ భగీరథ ద్వారా తాము ఇంటింటికీ తాగునీటిని అందిస్తే నిర్వహణ చేతగాక పథకం ఫెయిల్యూర్ అంటున్నారని విమర్శించారు. ఖేడ్, మనూరు మండలాల పార్టీ అధ్యక్షులు పరమేష్, విఠల్రావు, పట్టణ అధ్యక్షులు నగేష్, సర్పంచ్లు వెంకటేశం సిద్దు, నాయకులు సంగప్ప, మల్గొండ పాల్గొన్నారు. -
బీఆర్ఎస్ బంద్.. గజ్వేల్లో ఉద్రిక్తత..
గజ్వేల్ బంద్ అప్డేట్స్..గజ్వేల్లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. డీసీసీ అధ్యక్షులు ఆంక్షా రెడ్డి ఇంటి ముట్టడికి బీఆర్ఎస్ నేతలు ప్రయత్నించారు. దీంతో, పోలీసులు.. వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో అక్కడ స్వల్ప వాగ్వాదం, తోపులాట జరిగింది. అక్కడ భారీగా పోలీసులు మోహరించారు. బీఆర్ఎస్ నేతలను చెదరగొట్టే ప్రయత్నం చేశారు.కాగా, గజ్వేల్లో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై దాడికి నిరసనగా బీఆర్ఎస్ నేడు బంద్కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. దీంతో గజ్వేల్-ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో దుకాణాలు మూతపడ్డాయి. మరోవైపు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు. గజ్వేల్-ప్రజ్ఞాపూర్ బస్ డిపో ముందు బైఠాయించి ఆందోళన చేపట్టిన బీఆర్ఎస్ నాయకులను అదుపులోకి తీసుకున్నారు. గజ్వేల్లోని కేసీఆర్ క్యాంపు కార్యాలయం వద్ద పోలీసులు భారీగా మోహరించారు.ఇక, రెండ్రోజుల క్రితం మాజీ సీఎం కేసీఆర్ క్యాంప్ కార్యాలయంలో కాంగ్రెస్ నాయకులు సీఎం రేవంత్ రెడ్డి ఫోటో పెట్టారు. అదే సమయంలో క్యాంప్ ఆఫీస్ కిటికీ అద్దాలు ధ్వంసం చేశారు. కాంగ్రెస్ నేతలే క్యాంప్ ఆఫీస్ పై దాడి చేశారని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. తాము సీఎం ఫోటో పెట్టడానికే వెళ్ళాం.. దాడి చేయలేదని కాంగ్రెస్ నాయకుల వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నేతల ఫిర్యాదుతో డీసీసీ ప్రెసిడెంట్ ఆంక్షా రెడ్డి సహా 42 మందిపై గజ్వేల్ పోలీసులు కేసు నమోదు చేశారు. -
జగ్జీవన్రామ్ సేవలు మరువలేనివి
కలెక్టర్ ప్రతిమాసింగ్మెదక్ కలెక్టరేట్: దేశం కోసం బాబు జగ్జీవన్రామ్ చేసిన సేవలు మరువలేనివని కలెక్టర్ ప్రతిమాసింగ్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని నర్సాపూర్ చౌరస్తాలో నిర్వహించిన జగ్జీవన్రామ్ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జగ్జీవన్రామ్ దేశ నిర్మాణంలో కీలకపాత్ర పోషించిన మహానేత అని కొనియాడారు. సామాజిక న్యాయం, సమానత్వం కోసం ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని అన్నారు. దళితుల అభ్యున్నతి కోసం ఆయన చేసిన త్యాగా లు, సేవలు దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేశ్, మున్సిపల్ చైర్పర్సన్ రాధిక, ఉత్సవ కమిటీ చైర్మన్ సంజీవ్, వైస్ చైర్మన్ శ్రీనివాస్, వివిధ సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. పారదర్శకంగా బియ్యం పంపిణీ మూడు నెలల రేషన్ బియ్యం పంపిణీలో పారదర్శకత పాటించాలని కలెక్టర్ ప్రతిమాసింగ్ నిర్వాహకులకు సూచించారు. ఆదివారం పట్టణంలోని పలు రేషన్ దుకాణాలను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులు పరిశీలించారు. బియ్యం లబ్ధిదారులకు చేరేలా పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఆమె వెంట సిబ్బంది ఉన్నారు. -
మల్లన్న సన్నిధిలో భక్తుల సందడి
కొమురవెల్లి(సిద్దిపేట): మల్లికార్జున స్వామి ఆల యం ఆదివారం భక్తులరాకతో సందడి నెలకొంది. ఆలయ పరిసరాలు మల్లన్న నామస్మరణతో మా ర్మోగాయి. శనివారమే క్షేత్రానికి చేరుకున్న భక్తులు వేకువజామున నిద్ర లేచి పుష్కరిణిలో స్నానమాచరించి స్వామి వారిని దర్శించుకున్నారు. కొంత మంది భక్తులు గంగరేణి చెట్టు వద్ద పట్నాలు వేసి, ముడుపులు కట్టి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు కావాల్సిన ఏర్పాట్లను ఆలయ అధికారులు పర్యవేక్షించారు. స్వామివారిని దర్శించుకున్న సైబరాబాద్ ఏసీపీ కొమురవెల్లి మల్లన్నను సైబరాబాద్ ఏసీపీ శ్రీనివాస్రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు స్వామివారి శేష వస్త్రాలు, తీర్థ ప్రసాదాన్ని అందించారు. -
శాంతిభద్రతలు క్షీణించాయి
ఎమ్మెల్యే సునీతారెడ్డినర్సాపూర్: రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిందని ఎమ్మెల్యే సునీతారెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో ఆరోపించారు. గజ్వేల్లోని మాజీ సీఎం కేసీఆర్ క్యాంపు కార్యాలయంపై కాంగ్రెస్ నాయకుల దాడిని ఆమె తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలాంటి ఘటనలు అత్యంత దురదృష్టకరమన్నారు. ప్రజల సమస్యలు తెలుసుకునే ప్రదే శాలపై దాడులు జరగడం సరికాదన్నారు. పదేళ్లు రాష్ట్రాన్ని పరిపాలించిన మాజీ సీఎం కేసీఆర్ క్యాంపు కార్యాలయానికే రక్షణ లేకపోవడంపై విచారం వ్యక్తం చేశారు. పోలీసులు వెంటనే స్పందించి దాడి చేసిన వారిపై కేసులు నమోదు చేసి, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసు కోవాలని డిమాండ్ చేశారు. -
ఊరూరా పరేషన్!
● ఇబ్బంది పడుతున్న డీలర్లు, వినియోగదారులు ● ఇంకా 90 షాపులకు చేరని స్టాక్ బియ్యం పంపిణీలో తీవ్ర జాప్యంకేంద్ర ప్రభుత్వం మూడు నెలల రేషన్ బియ్యం కోటా ఒకేసారి పంపిణీ చేయాలని ఆదేశాలు ఇవ్వడంతో జిల్లాలో రేషన్ దుకాణాల వద్ద రద్దీ పెరిగింది. దీంతో వినియోగదారులతో పాటు డీలర్లు ఇబ్బంది పడుతున్నారు. ఆన్లైన్లో వేలిముద్ర పెట్టి బియ్యం తీసుకునే ప్రక్రియ గతంలో రెండు, మూడు నిమిషాల వ్యవధిలోనే పూర్తికాగా, ప్రస్తుతం మూడు సార్లు వేలిముద్రలు తీసుకోవాల్సి వస్తోంది. అలాగే మూడు సార్లు బియ్యం తూకం వేయడం వల్ల పంపిణీలో జాప్యం జరుగుతోంది. పలు దుకాణాలకు మొదటి విడతగా పంపిణీ చేసిన బియ్యం స్టాక్ పూర్తి కావొచ్చింది. ఇదిలా ఉండగా ఇంకా 90 రేషన్ దుకాణాలకు బియ్యం సరఫరా కాకపోవడం గమనార్హం. – రామాయంపేట(మెదక్) జిల్లావ్యాప్తంగా ఈనెల 1వ తేదీ నుంచే సన్న బియ్యం పంపిణీ ప్రక్రియ ప్రారంభమైంది. రేషన్ దుకాణాల్లో మూడు నెలల కోటా బియ్యం స్టాక్ చేయడానికి తగినంతగా స్థలం లేకపోడంతో ఒకేసారి బియ్యం పంపిణీ చేయకుండా విడతల వారీగా సరఫరా చేస్తున్నారు. మొదటి విడతగా 430 దుకాణాలకు 50 శాతం స్టాక్ 7,600 మెట్రిక్ టన్నుల మేర బియ్యం సరఫరా చేశారు. దీంతో పెద్ద సంఖ్యలో రేషన్ షాపుల వద్ద వినియోగదారులు బారులు తీరుతున్నారు. ఈనెల 15లోగా అన్ని రేషన్ దుకాణాలకు పూర్తిస్థాయిలో బియ్యం పంపిణీ పూర్తవుతుందని, నెలాఖరువరకు డీలర్లు వినియోగదారులకు మూడు కోటాల బియ్యం పంపిణీ చేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశా రు. రేషన్ దుకాణాలకు బియ్యం సరఫరాతో మండలస్థాయిలో ఉన్న గోదాముల్లో బియ్యం స్టాక్ నిండుకుంది. ఈ– పాస్ మొరాయింపు గంటల తరబడి నిరీక్షించే ఓపికలేక లబ్ధిదారులు డీలర్లతో గొడవకు దిగుతున్నారు. కొందరి వేలిముద్రలు సరిగా పడకపోవడం సమస్యగా మారుతోంది. రేషన్ దుకాణాల్లో బియ్యం తీసుకునే వారిలో 70 శాతానికి పైగా వృద్ధులు, కూలీలు, వ్యవసాయ పనులు చేసుకునే వారు ఉండటంతో వారి వేలిముద్రలను ఈ–పాస్ యంత్రం సరిపోల్చడం లేదు. దీనికి తోడు మారుమూల గ్రామాలు, కొన్ని గిరిజన తండాల్లో నెట్వర్క్ సమస్యతో ఈ–పాస్ యంత్రాలు సరిగా పనిచేయడం లేదు. జిల్లాలో ఇలా ..రేషన్ దుకాణాలు 520 రేషన్ కార్డులు 2,16,716 బియ్యం కోటా 15 వేల ఎం.టీ నెలాఖరు వరకు పంపిణీ ఈనెల 15లోగా జిల్లా పరిధిలోని అన్ని రేషన్ దుకాణాలకు రేషన్ పంపిణీ పూర్తవుతుంది. ఇప్పటికే 430 దుకాణాలకు 50 శాతం మేర బియ్యం పంపిణీ చేశాం. ఈనెలాఖరులోగా వినియోగదారులకు రేషన్ పంపిణీ చేయాలని ఆదేశాలు ఇచ్చాం. – జగదీశ్, జిల్లా పౌరసరఫరాల అధికారి -
పనులు త్వరగా పూర్తి చేయండి
పీసీసీఎఫ్ రత్నాకర్ రామాయంపేట(మెదక్): మండలంలోని అక్కన్నపేట అటవీప్రాంతంలో నిర్మిస్తున్న నగర వన యోజన పార్కు నిర్మాణ పనులను ఆదివారం రాష్ట్ర అటవీశాఖ ప్రధాన సంరక్షణ అధికారి (పీసీసీఎఫ్) రత్నాకర్, చీఫ్ కన్జర్వేటర్ అధికారిణి అపర్ణ పరిశీలించారు. పార్క్లో కొనసాగుతున్న వాచ్టవర్, పగోడ, వన మూలికల మొక్కలు, ఇతర నిర్మాణాలను పరిశీలించి పలు సూచనలు చేశారు. నెలలోపు నిర్మాణ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. సఫారి నిర్మాణానికి సంబంధించి నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. పనులు నాణ్యతగా ఉండాలని సూచించారు. నిర్మాణాలకు సంబంధించి మ్యాపును చూశారు. అనంతరం జిల్లా అటవీశాఖ అధికారి జోజితో కలిసి వాచ్టవర్ పైకి ఎక్కి అటవీ అందాలను వీక్షించారు. వారి వెంట రేంజ్ అధికారి విద్యాసాగర్, డిప్యూటీ రేంజ్ అధికారులు శ్రీనివాస్, గీత, బీట్ అధికారి లక్ష్మణ్ ఉన్నారు. -
కేసీఆర్తో రేవంత్కు పోలికా!
దుబ్బాక: కేసీఆర్ లేకుంటే రాష్ట్రం వచ్చేదా.. రేవంత్రెడ్డి సీఎం అయ్యేవారా .. అసలు కేసీఆర్తో రేవంత్కు పోలికే లేదని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. ఆదివారం దుబ్బాకలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అభద్రతా భావంలో ఉందన్నారు. ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను కప్పి పుచ్చుకునేందుకే కాంగ్రెస్ డైవర్షన్ రాజకీయాలు చేస్తోందన్నారు. కాంగ్రెస్ నాయకులు అరాచకాలు ఎక్కువయ్యాయని విమర్శించారు. గజ్వేల్లో క్యాంపు కార్యాలయంపై దాడిచేసిన కాంగ్రెస్ నాయకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చెరువులను సుందరంగా తీర్చిదిద్దాలి చెరువులను సందరంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. చెరువుల సందరీకరణపై ఐఓసీలో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ను వీక్షించారు. అమృత్ పథకంలో దుబ్బాక పట్టణంలోని పెద్ద చెరువు, రామసముద్రం, ఏదుల్ల చెరువుల సుందరీకరణకు రూ.5 కోట్లు మంజూరు అయ్యాయన్నారు. నిధులతో చెరువులను సుందరంగా తీర్చి దిద్ది, పర్యాటకులను ఆకట్టుకునేలా నిర్మాణాలు చేపట్టాలన్నారు. ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి -
చిల్లర చేష్టలు సహించం
● చర్యకు ప్రతి చర్యకు తప్పదు ● మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మారెడ్డి గజ్వేల్: స్వరాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ క్యాంపు కార్యాలయంపైనే కాంగ్రెస్ నేతలు దాడులకు తెగబడటం సహించరానిదని, ఇప్పటికై నా చిల్లర చేష్టలను మానుకోకపోతే చర్యకు ప్రతి చర్య తప్పదని మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మారెడ్డి హెచ్చరించారు. ఆదివారం గజ్వేల్లో ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ వైఫల్యాల వల్ల రాష్ట్ర ప్రజలు కేసీఆర్ను తిరిగి సీఎం కావాలని కోరుకుంటున్నారన్నారు. ఇది మింగుడు పడక కాంగ్రెస్ నేతలు ఇష్టానుసారంగా గుండాయిజం ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ నేతలకు చేతనైతే..అభివృద్ధిలో పోటీ పడాలని డిమాండ్ చేశారు. వంటేరు ప్రతాప్రెడ్డి మాట్లాడుతూ ఎంపీగా రాహుల్గాంధీ తన కార్యాలయంలో ప్రధాని నరేంద్రమోదీ ఫొటోను పెట్టుకోగలరా? అంటూ ప్రశ్నించారు. ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాల్లో సీఎం ఫొటో పెట్టుకోవాలని జీఓ ఉందా? అని అన్నారు. కేసీఆర్ క్యాంపు కార్యాలయంపై దాడికి నిరసనగా గజ్వేల్లో సోమవారం తలపెట్టిన బంద్ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, మున్సిపల్ మాజీ చైర్మన్ ఎన్సీ రాజమౌళి, ఎంపీటీసీల ఫోరం మాజీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దేవీ రవీందర్, మాజీ జెడ్పీటీసీ మల్లేశం, బీఆర్ఎస్ పట్టణ శాఖ అధ్యక్షుడు నవాజ్మీరా, మండల శాఖ అధ్యక్షుడు బెండె మధు, నాయకులు ఊడెం కృష్ణారెడ్డి, నూనె కుమార్, రాంచంద్రం, పాండుగౌడ్, ఆహ్మద్, స్వామిచారి తదితరులు పాల్గొన్నారు. -
‘రాత్రి 11 లోపు దుకాణాలు మూసివేయాలి’
మెదక్జోన్: శాంతిభద్రతల పరిరక్షణ నేపథ్యంలో రాత్రి 11 గంటలలోపు డివిజన్ పరిధిలోని అన్ని దుకాణాలు, వ్యాపార సంస్థలను మూసివేయాలని మెదక్ డీఎస్పీ ప్రసన్నకుమార్ తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. భద్రతాపరమైన అంశాలను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. రాత్రి 11 గంటల అనంతరం ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తామన్నారు. ఆ సమయంలో తెరిచి ఉన్న దుకాణాలు, ఇతర వాణిజ్య సంస్థలపై శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేస్తామన్నారు. ఉపాధి కల్పనే లక్ష్యంగా జాబ్మేళా నర్సాపూర్: యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నానని, అందులో భాగంగానే జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి చెప్పారు. ఆదివారం పట్టణంలోని ఓ ఫంక్షన్హాల్లో ఏర్పాటు చేసిన జాబ్మేళా కార్యక్రమంలో పాల్గొని ఉద్యోగాలు పొందిన వారికి నియామకపత్రాలు అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జాబ్ మేళా కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతుందన్నారు. 200 మందికి ఉద్యోగ అవకాశం లభించిందని, మరో 150 మందికి త్వరలో ఉద్యోగాలు లభిస్తాయని తెలిపారు. కార్యక్రమంలో ప్యాక్స్ మాజీ చైర్మన్ రాజుయాదవ్, నవీన్గుప్తా, తరుణ్, సందీప్, మణిదీప్, హర్షవర్దన్ తదితరులు పాల్గొన్నారు. వర్సిటీల్లో ఖాళీలు భర్తీ చేయండి మాజీ ఎమ్మెల్యే శశిధర్రెడ్డి పాపన్నపేట(మెదక్): విశ్వ విద్యాలయాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయాలని కోరుతూ సీఎం రేవంత్రెడ్డికి బహిరంగ లేఖ రాసినట్లు మెదక్ మాజీ ఎమ్మెల్యే శశిధర్రెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. ఖాళీలు భర్తీ చేయకుండా కేవలం అభివృద్ధి ప్రణాళికను ముందుకు తీసుకురావడం శోచనీయమన్నా రు. మేనిఫెస్టోలో విద్య, వైద్యానికి ప్రాఽ దాన్యం ఇస్తున్నామని ప్రభుత్వం ప్రకటిస్తున్నప్పటికీ, తీరా బడ్జెట్ కేటాయింపుల్లో అది కనిపించడం లేదన్నారు. యూనివర్సిటీల్లో 72 శాతం ఖాళీ లు ఉన్నాయన్నారు. ఇప్పటికై నా ఓయూతో పాటు రాష్ట్రంలోని ఇతర వర్సిటీల్లో ఖాళీలను భర్తీ చేయాలని కోరారు. దరఖాస్తుల ఆహ్వానం నర్సాపూర్రూరల్: ‘నీట్’ శిక్షణ కోసం విద్యార్థులు ఆన్లైన్ ద్వారా ఈనెల 15వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని చిప్పల్తుర్తి కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ శ్వేత ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈఏడాది ఇంటర్మీడియెట్ నీట్ ప్రారంభం కానున్నట్లు తెలిపారు. మే 3న అర్హత పరీక్ష ఉంటుందన్నారు. పేట నియోజకవర్గ పునరుద్ధరణకు కృషి చేయండి రామాయంపేట(మెదక్): రామాయంపేట అసెంబ్లీ నియోజకవర్గం పునరుద్ధరించేలా కృషి చేయాలని మున్సిపల్ చైర్పర్సన్ గజవాడ లావణ్య ఎంపీ రఘునందన్రావును కలిసి విజ్ఞప్తి చేశారు. ఈమేరకు ఆమె పలువురు కౌన్సిలర్లతో కలిసి ఆదివారం ఎంపీని హైదరాబాద్లోని ఆయన స్వగృహంలో కలిసి వినతిపత్రం అందజేశారు. రామాయంపేట నియోజవర్గ కేంద్రంగా ఏర్పాటైతేనే అభివృద్ది సాధ్యపడుతుందని, ఈదిశగా కృషి చేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు. తన వంతు ప్రయత్నం చేస్తానని ఎంపీ హామీ ఇచ్చారు. ఆమె వెంట కౌ న్సిలర్లు నాగరాజు, రవి, రంజిత్, కాంగ్రెస్ పట్టణాధ్యక్షుడు చింతల స్వామి, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు యాదగిరి, నాయకులు దేమె యాదగిరి, గణేశ్, డాకి స్వామి, బైరం కుమార్, సాయితేజ, సుధీర్గౌడ్ ఉన్నారు. -
ఎట్టకేలకు..
ఈజీఎస్ మెటీరియల్నిధులు సద్వినియోగం ● 2025–26 ఆర్థిక సంవత్సరానికి రూ.45 కోట్లు మంజూరు ● కొనసాగుతున్న నిర్మాణ పనులుమెదక్జోన్: ఎన్ఆర్ఈజీఎస్ పథకంలో భాగంగా ఏటా ఆర్థిక సంవత్సరంలో జిల్లాకు మంజూరైన మెటీరియల్ పనులను సంవత్సరం ముగిసే ముందు హడావుడిగా ప్రారంభించి నిధులను సద్వినియోగం చేస్తున్నారు. కానీ ఏడాది పాటు సమయం ఉన్నా, వాటిని ఏ రకమైన అభివృద్ధికి ఉపయోగించాలని ఆలోచించకుండా, గడువు ముంచుకు రాగానే పనులను ప్రారంభించి నిధులు నిలిచినట్టే అన్న విధంగా చేస్తున్నారు. జిల్లా అభివృద్ధికి ఏటా కేంద్రం నుంచి ఎన్ఆర్ఈజీఎస్ కింద మెటీరియల్ పనుల కోసం కొన్ని నిధులు ఇస్తోంది. వాటిని మార్చి 31 వరకు పనులు ప్రారంభించాలి. లేనిచో అవి రద్దవుతాయి. అందులో భాగంగానే ఈ ఏడాది జిల్లా అభివృద్ధి కోసం రూ. 45 కోట్లు మంజూరయ్యాయి. వీటిని ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు తొమ్మిది మాసాల్లో కేవలం రూ.11 కోట్లకు సంబంధించిన పనులు మాత్రమే ప్రారంభించారు. గడువు ముంచుకు రాగానే జనవరి నుంచి మార్చి వరకు మూడు మాసాల్లో మిగిలిన రూ. 33 కోట్లకు సంబంధించిన పనులను ప్రారంభించారు. రూ.45 కోట్లు.. 496 పనులు ఉపాధి పథకంలో ఈ ఏడాది 496 మెటీరియల్ పనులకు గానూ రూ. 45 కోట్లు మంజూరయ్యాయి. ఇందులో 106 పనులు పాఠశాలల ప్రహరీలు, 130 మహిళా భవనాలు, 17 అంగన్వాడీ, 41 పంచాయతీ, 202 సీసీ రోడ్ల నిర్మాణాలతో మొత్తం 496 పనుల కోసం రూ.45 కోట్లు మంజూరయ్యాయి. వీటిలో పంచాయతీ భవనాల్లో ఇప్పటివరకు 17 పూర్తి కాగా, ఇంకా 24 వివిధ దశల నిర్మాణాల్లో ఉన్నాయి. కాగా జిల్లావ్యాప్తంగా స్వయం సహాయక గ్రూపులు 13,257 ఉండగా, వాటిలో 1.37 లక్షలకు పైగా సభ్యులు ఉన్నారు. వీరికి అనేక గ్రామాల్లో కనీసం సమావేశాలు నిర్వహించుకునేందుకు సొంత భవనాలు లేవు. కాగా 130 గ్రామాల్లో మహిళా భవనాలు మంజూరు కాగా, నిర్మాణాలు సాగుతున్నాయి. అలాగే జిల్లాలో 2014కు ముందు 420 గ్రామాలు మాత్రమే ఉండగా, బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక 500 గిరిజన తండాలు, మధిర గ్రామాలను కలిపి కొత్తగా 72 పంచాయతీలు ఏర్పాటు చేసింది. కాగా ఈజీఎస్లో 41 జీపీ భవనాలకు నిధులు మంజూరు కాగా, నిర్మాణ పనులు సాగుతున్నాయి. ముమ్మరంగా పనులు ఈజీఎస్ పథకంలో జిల్లాకు రూ.45 కోట్లు మంజూరు కాగా, వివిధ శాఖల పరిధిలో పనులను గుర్తించి ప్రారంభించాం. మంజూరైన నిధులను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేశాం. సకాలంలో పనులు పూర్తి చేసి ఆయాశాఖల అధికారులకు అప్పగిస్తాం. – నర్సింలు, మెదక్ ఈఈ పీఆర్ -
7న ఇసుక వేలం
పాపన్నపేట(మెదక్): మండల పరిధిలోని గాంధారిపల్లిలో అక్రమంగా నిల్వ చేసిన ఇసుకను ఈనెల 7న నిర్వహించే బహిరంగా వేలం ద్వారా విక్రయించనున్నట్లు తహసీల్దార్ సతీశ్ తెలిపారు. గ్రామ శివారులో 34 ట్రిప్పుల ఇసుక, సుమారు 102 క్యూబిక్ మీటర్లు సీజ్ చేసినట్లు చెప్పారు. ఏడీ మైనింగ్ సూచనల మేరకు మంగళవారం ఉదయం 11 గంటలకు బహిరంగ వేలం నిర్వహిస్తామన్నారు. ఆసక్తి గల వారు రూ.10 వేల డిపాజిట్ చెల్లించాలని సూచించారు. ఒక వేల 34 ట్రిప్పుల కన్నా ఎక్కువ ఇసుక ఉంటే దానికి సంబంధించి అదనపు రుసుము చెల్లించాల్సి ఉంటుందన్నారు. గిరి ప్రదక్షిణం.. ఆధ్యాత్మిక పరిమళంవర్గల్(గజ్వేల్): నాచగిరి భక్తులతో పోటెత్తింది. శ్రీలక్ష్మీనృసింహుని జన్మనక్షత్రం ‘స్వాతి’ నక్షత్ర మహోత్సవ వేళ శనివారం అశేష భక్తజన ‘గిరి’ ప్రదక్షిణతో ఆధ్యాత్మికత వెల్లివిరిసింది. గిరి ప్రదక్షిణ సంరంభం ఆద్యంతం ‘గోవింద’ నామంతో మార్మోగింది. హరి నామస్మరణతో మునిగితేలుతూ భక్తజనులు ప్రదక్షిణ పూర్తిచేశారు. -
నెలాఖరు వరకు రేషన్ పంపిణీ
మెదక్ కలెక్టరేట్: జిల్లాలో లబ్ధిదారులకు పంపిణీ చేస్తున్న మూడు నెలల రేషన్ బియ్యం తీరును డీఎస్ఓ నిత్యానంద్ శనివారం పరిశీలించారు. మొత్తం 520 రేషన్ దుకాణాలు సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు చెప్పారు. మూడు నెలలకు సంబంధించిన సన్న బియ్యం నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని తెలిపారు. అలాగే ఈనెలాఖరు వరకు బియ్యం పంపిణీ చేస్తామన్నారు. లబ్ధిదారులు ఆందోళన లేకుండా సమీపంలోని రేషన్ దుకాణానికి వెళ్లి బియ్యం తెచ్చుకోవాలని సూచించారు. డీలర్లు అక్రమాలకు పాల్ప డకుండా నిరంతరం పర్యవేక్షిస్తూ, పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామన్నారు. అనంతరం పట్టణంలోని పలు పెట్రోల్ బంక్లను సందర్శించి రికార్డులు పరిశీలించారు. జిల్లాలో ఎల్పీజీ గ్యాస్, పెట్రోల్, డీజిల్ నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలో ఇప్పటికే పలు హోటళ్లు, రెస్టారెంట్లలో విస్తృత తనిఖీలు నిర్వహించి 134 సిలిండర్లను సీజ్ చేశామన్నారు. 83 మంది మీద క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. గ్యాస్ విషయంలో సమస్యలు ఎదురైతే 9391942254 నంబర్లో సంప్రదించాలని సూచించారు. జిల్లాలో మొత్తం 87 పెట్రోల్ బ్యాంకులు, 16 ఎల్పీజీ గ్యాస్ ఏజెన్సీలు సక్రమంగా పనిచేస్తున్నట్లు వెల్లడించారు.డీఎస్ఓ నిత్యానంద్ -
బ్లాక్ బూట్లు
ఆదివారం శ్రీ 5 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026ట్రాక్ సూట్లు..గురుకుల విద్యార్థులకు ‘ఎడ్యుకేషన్ కిట్లు’జిల్లాలో 84 వేలమందికి ప్రయోజనం ఈవీఎంల భద్రత కీలకం కలెక్టర్ ప్రతిమాసింగ్ మెదక్ కలెక్టరేట్: ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతను కాపాడటానికి ఈవీఎంల భద్రత అత్యంత కీలకమని కలెక్టర్ ప్రతిమాసింగ్ అన్నారు. జిల్లాలో నిర్వహిస్తున్న నెలవారీ తనిఖీలలో భాగంగా శనివారం వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి ఈవీఎంల గోదాంను సందర్శించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గోదాంలో అమలు చేస్తున్న భద్రతా ప్రమాణాలు సంతృప్తికరంగా ఉన్నాయన్నారు. సీసీ కెమెరాల పనితీరు, అగ్ని ప్రమాద నివారణ చర్యలు, డబుల్ లాక్ సిస్టమ్ వంటి అంశాలను పరిశీలించారు. గోదాం వద్ద నియమించిన భద్రతా సిబ్బంది విధుల నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. కార్యక్రమంలో ఎన్నికల అధికారులు, సంబంధిత విభాగాల అధికారులు, భద్రతా సిబ్బంది, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. 6 నుంచి హెల్త్ వీక్ కార్యక్రమం ఈనెల 6 నుంచి 11 వరకు నిర్వహించే హెల్త్ వీక్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ ప్రతిమాసింగ్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లో వారితో సమావేశం నిర్వహించారు. ఎయిడ్స్, కేన్సర్, హైరిస్క్ ప్రెగ్నెన్సీ, ఎనీమియా, మత్తు పదార్థాల నిర్మూలన లాంటి అనేక వ్యాధుల పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. అనంతరం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా అధికారులతో కలిసి పాల్గొన్నారు. జిల్లాలో మ్యాపింగ్ ప్రక్రియను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పోలింగ్ కేంద్రాల వారీగా కనీసం 50 శాతం మ్యాపింగ్ అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు.వచ్చే విద్యాసంవత్సరం నుంచి అందజేత -
రహదారులు అనుసంధానిస్తాం
రోడ్డు పనులను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యేనారాయణఖేడ్: ఖేడ్ నియోజకవర్గంలో గ్రామీణ ప్రాంత రోడ్ల అనుసంధానంతోపాటు మౌలిక వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని ఎమ్మెల్యే సంజీవరెడ్డి స్పష్టం చేశారు. ఖేడ్ మండలం మూడుగుంటల్ జాతీయ రహదారి నుంచి సంజీవన్రావుపేట, కడ్పల్, సిర్గాపూర్ మీదుగా గౌడ్గాం వద్ద ఖేడ్–కంగి రోడ్డును అనుసంధానిస్తూ రూ.21 కోట్లతో నిర్మించనున్న రోడ్డు పనులను శుక్రవారం ఆయన ప్రారంభించారు. ప్రజలకు మెరుగైన రవాణ సౌకర్యాలు కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. హైదరాబాద్ నుంచి సిర్గాపూర్, కంగ్టిలకు వెళ్లడానికి దగ్గరి రోడ్డుగా ఉండి వ్యయప్రయాసలు తప్పుతాయన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు చంద్రశేఖర్రెడ్డి, ఆర్అండ్బీ శాఖ అధికారులు, ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. అంతకుముందు ఖేడ్ పట్టణం ఏఎస్ నగర్ కాలనీలోని రాజరాజేశ్వరి శివాలయ ప్రథమ వార్షికోత్సవంలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. -
కల్యాణలక్ష్మి రికార్డుల నిర్వహణలోపాలపై..
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: జహీరాబాద్లోని నిమ్జ్ (నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ జోన్) భూసేకరణ కోసం హడ్కో నుంచి తీసుకున్న రూ.725 కోట్ల రుణంలో రూ.317 కోట్లు ఇతర అవసరాలకు మళ్లించినట్లు కాగ్ గుర్తించింది. ఈ భూసేకరణ విషయంలో అధికారుల తీరుపై అక్షింతలు వేసింది. మొత్తం 12,635 ఎకరాలను సేకరించాల్సి ఉండగా, తీవ్ర జాప్యం జరుగుతోందని తన నివేదికలో పేర్కొంది. సిద్దిపేట పార్కుల నిర్వహణపై ప్రశంసలు సిద్దిపేటలోని రాజీవ్పార్కు, మైత్రివనం, కోమటిచెరువు, పార్కుల నిర్వహణ బాగుందని కాగ్ తన నివేదికలో ప్రశంసలు కురిపించింది. ఇదే సిద్దిపేటలో మురుగునీటి శుద్ధీకరణ ప్రాజెక్టు భాగంగా రూ.158.34 కోట్లతో నిర్మించిన మూడు సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు నీటిశుద్ధి చేయడంలో నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదని కాలుష్య నియంత్రణ మండలి ఇచ్చిన రిపోర్టులకు కాగ్ వంతపాడింది. తాగునీటి పథకానికి సంబంధించి మిషన్ భగీరథ నిధులు వినియోగించినప్పటికీ, కేంద్ర ప్రభుత్వానికి చెందిన అమృత్ పథకం నిధుల నుంచి రూ.1.50 కోట్లను మళ్లింపుపై కాగ్ తీవ్ర అభ్యంతరాలను వ్యక్తంచేసింది. ఇలా ఉమ్మడి మెదక్ జిల్లాలో పలు అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో జరిగిన లోపాలను తన నివేదికలో ప్రత్యేకంగా ప్రస్తావించడం గమనార్హం. అలాగే ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో ఉన్న ఉమ్మడి జిల్లాలో ఉన్న పలు ఉన్నత విద్యా సంస్థల్లో మౌలిక సదుపాయాల లోపాలను కాగ్ తన నివేదికలో ఎత్తిచూపింది. కల్యాణలక్ష్మి రికార్డుల నిర్వహణలో సంగారెడ్డి రెవెన్యూ అధికారుల తీరును తప్పుబట్టింది. లబ్ధిదారులకు సంబంధించిన హార్డు కాపీలను అందుబాటులో ఉంచలేదని తన నివేదికలో పేర్కొంది. నిబంధనలకు విరుద్ధంగా ఈ రికార్డుల నిర్వహణ ఉందని మొట్టికాయలు వేసింది. నారాయణఖేడ్లోని మినీస్టేడియం నిర్మాణం తీరుపై కూడా అభ్యంతరాలు వ్యక్తం చేసింది. రూ.2.65 కోట్లతో చేపట్టిన ఈ మినీస్టేడియం డిజైన్ ఖరారులో ఆలస్యం, పనుల్లో జాప్యం, సకాలంలో పనులు పూర్తి చేయకపోవడం వంటి కారణాలతో రూ.కోట్లలో నిధులు వృథా అయ్యాయని తన నివేదికలో పేర్కొంది. -
ఇదేం చెత్త పని ?
నర్సాపూర్: నర్సాపూర్– హైదరాబాద్ మార్గంలోని జాతీయ రహదారిపై ఉన్న కల్వర్టుకు ఇరువైపులా చెత్తను అడ్డగోలుగా వేయడంతో కుప్పలుగా పేరుకుపోయింది. దుర్వాసన వెదజల్లుతోందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోతులు వాటి కోసం గుంపులుగా రావడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని వాపోతున్నారు. ఇప్పటికై నా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మెదక్ కలెక్టరేట్: జిల్లాలోని గిరిజన నిరుద్యోగ యువతీ, యువకులకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు నైపుణ్య శిక్షణ ఇస్తున్నామని గిరిజన సంక్షేమ అధికారి నీలిమ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అమలు చేస్తున్నట్లు చెప్పారు. జిల్లాలోని ఆసక్తి, అర్హత గల నిరుద్యోగ యువతీ యువకులు ఈనెల 10లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కోర్సు వ్యవధి ఆరు నెలలు ఉంటుందని తెలిపారు. పూర్తి సమాచారం, ఆన్లైన్ దరఖాస్తు కోసం http:// dsapponine.com /sdr/form/register.php వెబ్ సైట్లో సంప్రదించాలన్నారు నర్సాపూర్: పీఆర్సీ నివేదికను వెంటనే అమలు చేయాలని యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్రావు డిమాండ్ చేశారు. గురువారం సంఘం మండల శాఖ అధ్యక్షుడు రవి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పీఆర్సీ అమలు చేయకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని ఆరోపించారు. ప్రభుత్వ పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని పలువురు వక్తలు డిమాండ్ చేశారు. సమావేశంలో యూనియన్ నాయకులు చంద్రశేఖర్, గంగాధర్ రావు, రమేశ్, అప్పలనాయుడు, సత్యనారాయణ, కళారాము లు, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. శివ్వంపేట(నర్సాపూర్): గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని పిల్లుట్లలో ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశంతో పాటు మహిళా సమాఖ్య భవనానికి భూమి పూజ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లా డుతూ.. గ్రామాలు పరిశుభ్రంగా ఉండాలనే సంకల్పంతో అంతర్గత మురికికాల్వలు, సీసీ రోడ్ల నిర్మాణాలకు ప్రభుత్వం అధిక నిధులు కేటాయిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ మురళిగౌడ్, కాంగ్రెస్ నాయకులు నవీన్గుప్తా, వెంకట్రామిరెడ్డి, రాఘవరెడ్డి, సతీశ్ తదితరులు ఉన్నారు. -
ఇతర అవసరాలకు నిర్ధారిత ఫీజు
మెతుకుసీమలో రాజకీయ అండతో పేట్రేగిపోయిన ఇసుక మాఫియా పీచమణిచి.. అక్రమార్కులకు చుక్కలు చూపుతున్నారు కలెక్టర్ ప్రతిమాసింగ్. నెల రోజుల వ్యవధిలో జిల్లావ్యాప్తంగా వందలాది అక్రమ ఇసుక డంపులను సీజ్ చేయించారు. ‘ఇందిరమ్మ ఇళ్లకు మన ఇసుక వాహనం’ పేరిట ప్రారంభించిన వినూత్న పథకంతో లబ్ధిదారులకు ఉచిత ఇసుక ఇస్తూ అండగా నిలుస్తున్నారు. జిల్లాలో మెదక్, హవేళిఘణాపూర్, కొల్చారం మండలాల్లోని వాగుల్లో మూడు ఇసుక పాయింట్లను గుర్తించి, ఆన్లైన్ బుకింగ్తో సరఫరా చేసేందుకు కొత్త పథకానికి రూపకల్పన చేశారు. – మెదక్ అర్బన్ ఇందిరమ్మ, సొంత ఇళ్లు, ప్రభుత్వ నిర్మాణాలకు ఇసుక సరఫరా చేసేందుకు ‘మన ఇసుక వాహనం’ అనే పథకానికి కలెక్టర్ శ్రీకారం చుట్టారు. అవసరమైన వారు ఫోన్ ద్వారా ఆన్లైన్లో ఇసుక బుకింగ్ చేసుకోవచ్చు. ముందుగా టీజీఎంఐవీ యాప్లోకి వెళ్లాలి. మొబైల్ నంబర్ రిజిస్ట్రేషన్ చేసుకోగానే ఓటీపీ వస్తుంది. అనంతరం వ్యక్తి గత వివరాలు, ఆధార్ నంబర్ అప్లోడ్ చేయాలి. ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులైతే వాటి వివరాలు ఎంట్రీ చేయాలి. అవసరమైన ఇసుకకు సంబంధించి నిబంధనలకనుగుణంగా ఫోన్పే ద్వారా డబ్బులు చెల్లించాలి. ఇది సంబంధిత పంచాయతీ కార్యదర్శి లాగిన్లోకి వెళ్తుంది. అక్కడ వివరాలు, నిర్ధారిత పత్రాలు సరి చూసుకొని అతడు తహసీల్దార్ లాగిన్లోకి ప్రతిపాదనలు పంపుతారు. అక్కడ ఎమ్మార్వో అన్ని ఆధారాలు సరి చూసుకొని, ఫైనల్ అప్రూవల్ ఇస్తాడు. అప్పుడు డిజిటల్ కూపన్ జనరేట్ అవుతుంది. దానిని తీసుకొని అలాట్ అయిన రీచ్కు వెళ్తే, అక్కడ ఉన్న సాండ్ రీచ్ ఆఫీసర్ సిటిజన్ డిజిటల్ కూపన్, టీపీల ను నిర్ధారించుకొని ఇసుక రవాణకు అనుమతి ఇస్తారు. ఇంటి నిర్మాణానికి అనుగుణంగా అవసరమైనంత ఇసుక సరఫరా చేస్తారు. ఇందిరమ్మకు మన ఇసుక వాహనం ఫోన్ ద్వారా ఉచితంగా బుకింగ్ జిల్లాలో మూడు చోట్ల పాయింట్లు అక్రమార్కుల పీచమణిచిన కలెక్టర్ ఇసుక రీచ్లలో ఇందిరమ్మ, సొంత ఇళ్లు, ప్రభుత్వ పనులకు ఇసుక సరఫరా చేస్తారు. అయితే ట్రాక్టర్ల లెక్కన ఇసుక విక్రయిస్తారు. ఇందిరమ్మ ఇళ్లకు దాదాపు ఉచిత ఇసుక పంపిణీ చేసే అవకాశం ఉందని, పూర్తి వివరాలు అందాల్సి ఉందని రెవెన్యూ అధికారులు తెలిపారు. సాధారణంగా ఇందిరమ్మ ఇళ్లకు ఆన్లైన్ చార్జి రూ.12, ఇసుక లోడింగ్ చార్జి రూ.400, సంబంధిత గ్రాామానికి విలేజ్ ఫండ్ రూ.200గా నిర్ధారించే అవకాశం ఉందన్నారు. లబ్ధిదారు సొంతగా ట్రాక్టర్, లేబర్ను తీసుకెళ్తే దాదాపు ఉచితంగా ఇసుక సరఫరా అయ్యే అవకాశం ఉంది. ఈ విషయమై రెండు, మూడు రోజుల్లో అధికారిక నిర్ణయం వెలువడే అవకాశం ఉందని పాపన్నపేట తహసీల్దార్ సతీష్ తెలిపారు. ఇక వ్యక్తిగత ఇళ్లు, ప్రభుత్వ పనులకై తే ట్రాక్టర్ ఇసుకకు రూ.1173 చెల్లించే అవకాశం ఉందన్నారు. -
లెక్కలు చెప్పరేం!
● మున్సిపల్ ఎన్నికల ఖర్చులు చెప్పని 22 మంది అభ్యర్థులు ● ఇప్పటికే ముగిసిన గడువు మెదక్ కలెక్టరేట్: ఎన్నికలు ముగిసిన 45 రోజుల్లో వ్యయానికి సంబంధించిన ఖర్చుల వివరాలు అధికారులకు అందజేయాలని ఎలక్షన్ కమిషన్ స్పష్టం చేసింది. నిబంధనలు ఉల్లంఘిస్తే ఎన్నిక రద్దు చేస్తామని ప్రకటించింది. ఇందుకు మార్చి 29 డెడ్లైన్ విధించింది. అయితే గడువు ముగిసి వారం రోజులవుతున్నా, మెదక్ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసిన 22 మంది అభ్యర్థులు వివరాలు సమర్పించలేదు. బల్దియా పరిధిలో మొత్తం 32 వార్డుల్లో 113 మంది అభ్యర్థులు పోటీ చేశారు. అందులో 91 మంది తమ ఎన్నికల ప్రచార ఖర్చుల వివరాలు అధికారులకు అందించారు. మిగితా వారు ఇవ్వమంటూ తెగేసి చెబుతున్నట్లు తెలిసింది. ‘ఏ లెక్కలు చెప్పాలి.. చెప్పకుంటే ఏమవుతుంది. మూడేళ్ల ఎన్నికల బహిష్కరణ ఉంటుందంటే.. ఇక ముందు మేం ఎలాంటి ఎన్నికల్లో పోటీ చేయం’. అంటూ నిర్లక్ష్యపు సమాధానం ఇస్తున్నారని అధికారులు చెబుతున్నారు. మరి వీరిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి. రూ. 50 వేల లోపే..! ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన వారు, ఓడిన వారు కొంతమంది ఎన్నికల ప్రచార లెక్కలు అధికారులకు సమర్పించారు. వీరు కేవలం రూ. 20 వేల నుంచి 50 వేల వరకు మాత్రమే ఖర్చు చేసినట్లు చూపించారు. మరి ఎన్నికల సమయంలో వార్డుల్లో ఏరులై పారిన మద్యం, డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. ఒక్కో అభ్యర్థి ప్రతిరోజు ఇంటింటి ప్రచారంలో కనీసం 50 మందికి తగ్గకుండా వెంట తిప్పుకున్నారు. రోజుకు ఒక్కొక్కరికి రూ.300లతో పాటు మధ్యాహ్న భోజనం, పురుషులకు సాయంత్రం మందు, బిర్యాని అందించారు. ఇలా ఒక అభ్యర్థి రోజుకు కనీసం రూ.50 వేలు ఖర్చు చేసినట్లు సమాచారం. -
పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య
మెదక్ కలెక్టరేట్: దొడ్డి కొమురయ్య పోరాట స్ఫూర్తి ప్రతి ఒక్కరికీ ఆదర్శమని కలెక్టర్ ప్రతిమాసింగ్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో ఆయన జయంతిని పురస్కరించుకొని చిత్రపటానికి అదనపు కలెక్టర్ నగేశ్తో కలిసి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. దొడ్డి కొమురయ్య తెలంగాణ సాయుధ పోరాటంలో కీలకపాత్ర పోషించిన మహానుభావుడని కొనియాడారు. అణచివేతకు వ్యతిరేకంగా ప్రజల హక్కుల కోసం ప్రాణత్యాగం చేసిన తొలి అమరుడిగా ఆయన చరిత్రలో నిలిచారన్నారు. కొమురయ్య చూపిన ధైర్యం, త్యాగం, పోరాట స్ఫూర్తి నేటి యువతకు మార్గదర్శకమని అన్నారు. ప్రజల హక్కులు, సమానత్వం కోసం చేసిన త్యా గాలను స్మరించుకుంటూ, ఆయన ఆశయాలను ఆచరణలో పెట్టాలని పిలుపునిచ్చారు. సమాజంలో న్యాయం, సమానత్వం నెలకొల్పేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో బీసీ సంఘాల ప్రతినిధులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.కలెక్టర్ ప్రతిమాసింగ్ -
జనగణన శిక్షణ వాయిదా వేయండి
మెదక్జోన్: జనగణన శిక్షణ వాయిదా వే యాలని తపస్ జిల్లా ప్రధాన కార్యదర్శి సిద్ధు అన్నారు. ఈమేరకు సంఘం నాయకులతో కలిసి కలెక్టర్ ప్రతిమాసింగ్ను గురువారం కలిసి వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పదో తరగతి పరీక్షలు, మూల్యాంకనంలో ఉపాధ్యాయులు పాల్గొంటున్నారని తెలిపారు. ఈనెల 10 నుంచి 18 వరకు ఎస్ఏ–2 పరీక్షలు ఉండడం, ఈనెలలోనే ఓపెన్ టెన్త్ పరీక్షలు ప్రారంభం కానున్నట్లు చెప్పారు. ఈఅంశాలను దృష్టిలో ఉంచుకొని జనగణనకు సంబంధించి విధులు నిర్వహించే ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వటం ఇబ్బ ందికరంగా మారుతుందన్నారు. బిజీ షెడ్యూల్ను దృష్టిలో పెట్టుకొని జనగణనకు సంబంధించి ఈనెల 23 తర్వాత శిక్షణ ఇవ్వాలని కోరారు. కలెక్టర్ను కలిసిన వారిలో జిల్లా కోశాధికారి మంగ నర్సింలు, జిల్లా ఉపాధ్యక్షుడు గడిల మాధవరెడ్డి, శ్రీధర్రెడ్డి ఉన్నారు. -
రాయితీ ఇచ్చినారు
ప్రజల అవసరాలకు అనుగుణంగా కూరగాయలు పండించే రైతులను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఎప్పుడూ లేని విధంగా పూర్తి సబ్సిడీతో నేషనల్ సీడ్స్ కార్పొరేషన్ ద్వారా కూరగాయల విత్తనాలతో పాటు నారుమళ్లను అందిస్తుంది. దీంతో జిల్లాలో రైతులు కూరగాయల సాగుకు మొగ్గు చూపుతున్నారు. – మెదక్జోన్ జిల్లావ్యాప్తంగా ఏటా 1,500 ఎకరాల నుంచి 2 వేల ఎకరాలు మాత్రమే కూరగాయల సాగు చేస్తారు. ఇందులో పండించిన పంట ఉత్పత్తులు జిల్లాకు సరిపడక ఇతర జిల్లాల నుంచి కూరగాయలను పెద్ద ఎత్తున దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి. దీంతో వ్యాపారులు ఇష్టారీతిగా ధరలను పెంచుతున్నారు. నాణ్యమైన కూరగాయలు దొరకని పరిస్థితి నెలకొంది. కాగా ప్రభుత్వం వందశాతం సబ్సిడీతో విత్తనాలతో పాటు నారును అందించి కూరగాయల సాగుకు పెద్దపీట వేస్తోంది. గత కొనేళ్లుగా ప్రభుత్వం సబ్సిడీ ఎత్తివేయడంతో జిల్లాలో సాగు విస్తీర్ణం తగ్గింది. కాగా ఈ ఏడాది జిల్లాలో 400 ఎకరాల్లో సాగు చేసేందుకు విత్తన కిట్లను రైతులకు అందిస్తున్నారు. ఒక్కో ప్యాకెట్లో 6 నుంచి 8 రకాల విత్తనాలు ఉన్నాయి. ఒక్కో ప్యాకెట్ విత్తనాలతో అర ఎకరంలో సాగు చేయవచ్చు. ఈ కిట్టులో టమాట, బీర, చిక్కుడు, పాలకూర, బెండ, కాకరకాయ లాంటి విత్తనాలు ఉన్నాయి. వీటిని గత పది రోజులుగా జిల్లాలో పంపిణీ చేస్తున్నారు. అ లాగే ములుగు విత్తన కేంద్రం ద్వారా జిల్లాకు 250 ఎకరాలకు సరిపడా కూరగాయల నారుమళ్లను సైతం పూర్తి సబ్సిడీపై అందిస్తున్నారు. 8 రకాల విత్తనాలకు సంబంధించిన కిట్లు పంపిణీ జిల్లాలో 650 ఎకరాల్లో సాగుకు యోగ్యం భారీగా పెరగనున్న సాగు! వందశాతం సబ్సిడీతో కూరగాయల విత్తనాలతో పాటు నారుమళ్లను అందిస్తుండటంతో కూరగాయల సాగు జిల్లాలో భారీగా పెరగనుంది. ఇప్పటికే జిల్లాలో సుమారు 2 వేల ఎకరాల్లో రైతులు కూరగాయల సాగు చేయగా, విత్తనాల రూపంలో 400 ఎకరాలకు సడిపడా కిట్లను అందిస్తున్నారు. నారుమళ్లు మరో 250 ఎకరాల వరకు ఇస్తుండగా జిల్లాకు మొత్తం సబ్సిడీ రూపంలో 650 ఎకరాల్లో కూరగాయల సాగుకానుంది. కాగా జిల్లాలో ఈఏడాది 2,650 ఎకరాల్లో కూరగాయల సాగు కానుందని సంబంధిత అధికారులు చెబుతున్నారు. -
ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం
ఎమ్మెల్యే రోహిత్రావుమెదక్ కలెక్టరేట్: ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే రోహిత్రావు పిలుపునిచ్చారు. గురువారం పట్టణంలోని 16, 17వ వార్డులో జరిగిన వార్డు సభలో పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు సంక్షేమ పథకాలు అందించేందుకే గ్రామ, వార్డు సభలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గత రెండేళ్లలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాల లబ్ధిని ప్రజలకు వివరిస్తూ ప్రజల సమస్యలు తీర్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఉచిత విద్యుత్, రూ. 500 సిలిండర్, సన్న బియ్యం వంటి ఆరు గ్యారంటీలను అమలు చేస్తున్నామన్నారు. కొత్త పథకాల్లో భాగంగా విద్యార్థులకు అల్పాహారం, అన్నివర్గాల ప్రజలకు జీవిత బీమా, దివ్యాంగులకు బ్యాటరీ సైకిళ్లు, రైతులకు మేలైన వంగడాలు అందజేస్తున్నామని వివరించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ రాధిక, వైస్ చైర్మన్ నరేశ్గౌడ్, వార్డు మెంబర్లు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. -
పకడ్బందీగా పథకాల అమలు
కలెక్టర్ ప్రతిమాసింగ్చేగుంట(తూప్రాన్): ప్రభుత్వ సంక్షేమ పథకాలు పకడ్బందీగా అమలు చేసేందుకు చర్యలు చేపట్టామని కలెక్టర్ ప్రతిమాసింగ్ తెలిపారు. మండలంలోని వడియారంలో గ్రామ సభకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మహిళలకు పలు అంశాల్లో శిక్షణ కల్పించి ఉపాధి పొందడానికి వడ్డీలేని రుణాలు అందిస్తున్నట్లు చెప్పారు. గ్రామంలోని ప్రధాన సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించే ఉద్దేశంతోనే ప్రజాపాలన గ్రామ సభలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. వేసవిని దృష్టిలో ఉంచుకొని విద్యుత్ అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నామన్నారు. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడం, పిల్లల విద్యపై దృష్టి పెట్టడంతో పాటు ఆరోగ్య పరిరక్షణకు ప్రజలు ప్రభుత్వంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ప్రత్యేక అధికారి హేమాభార్గవి, సర్పంచ్ సాయికుమార్గౌడ్, మెడికల్ ఆఫీసర్ అనిల్కుమార్రెడ్డి, ఉపసర్పంచ్ నాగరాజు, ఎంపీఓ విజయ్పాల్రెడ్డి ఆయా శాఖల అధికారులతో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు. -
మహిళలను కోటీశ్వరులను చేస్తాం
నర్సాపూర్ రూరల్: మహిళలను కోటీశ్వరులను చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్ అన్నారు. గురువారం మండలంలోని రెడ్డిపల్లిలో జరిగిన గ్రామ సభకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతు న్న ‘ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక’లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా గ్రామసభలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రేషన్ కార్డులు, రైతు భరోసా, బీమా, ఉచిత కరెంట్, కల్యాణలక్ష్మి, విద్యార్థులకు అల్పాహారంతో పాటు అనేక పథకాలను ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ పద్మ, అశోక్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. మెదక్ కలెక్టరేట్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఐటీఐ, ఏటీసీలో 15 రోజుల స్వల్పకాలిక వృత్తి నైపుణ్య కోర్సుల్లో ప్రవేశాలకు అవకాశం ఉందని ప్రిన్సిపాల్ శ్రీనివాసులు గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలోని నిరుద్యోగ యువతీ, యువకులు ఈనెల 4 వరకు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. అడ్వాన్స్ టెక్నాలజీతో ట్రైనింగ్ ఇవ్వనున్నట్లు చెప్పారు. పదో తరగతి, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా పాస్ లేదా ఫెయిల్ విద్యార్థులకు అవకాశం ఉంటుందన్నారు. శిక్షణ అనంతరం సర్టిఫికెట్తో పాటు పరిశ్రమల్లో ఉద్యోగావకాశాలు లభిస్తాయని తెలిపారు. రామాయంపేట(మెదక్): బల్దియా పరిధిలోని వార్డుల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరిస్తామని మున్సిపల్ చైర్పర్సన్ లావణ్య హామీ ఇచ్చారు. గురువారం జరిగిన వార్డు సభల్లో ఆమె పాల్గొని మాట్లాడారు. ఆయా వార్డుల్లో నీటి ఎద్దడి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకున్నామని తెలిపారు. ప్రజలు, అఽ దికారుల సహకారంతో సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామన్నారు. ఈసందర్భంగా లబ్ధిదారులు పలు సమస్యలపై వినతులు అందజేశారు. కార్యక్రమంలో అధికారులు, కౌన్సిలర్లు, ప్రజలు పాల్గొన్నారు. కొమురవెల్లి(సిద్దిపేట): మల్లన్న స్వామిని దేవాదాయ శాఖ ఆర్జేసీ రామకృష్ణారావు గురువారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు స్వామి వారి తీర్థప్రాదాన్ని , శేష వస్త్రాలు అందించారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ కృష్ణ ప్రసాద్, ఏఈఓ బుద్ది శ్రీనివాస్, ప్రధానార్చకులు మహదేవుని మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు. మాజీమంత్రి హరీశ్రావు సిద్దిపేటజోన్: ఉత్పత్తులను దళారులకు అమ్మి నష్టపోవద్దని మాజీ మంత్రి హరీష్రావు రైతులకు సూచించారు. ఈ విషయమై గురువారం ఆయన పత్రికా ముఖంగా పిలుపునిచ్చారు. సిద్దిపేట మార్కెట్లో మక్కల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం మక్కల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో రైతులు దళారులకు అమ్ముకొని నష్టపోతుండటంతో అసెంబ్లీలో కొట్లాడితే వెంటనే ప్రభుత్వం దిగొచ్చి కొనుగోలు కేంద్రాలు ప్రారంభం చేశారన్నారు. తక్కువ ధరకు ప్రైవేట్ కు అమ్ముకోని రైతులు నష్ట పోవద్దన్నారు.అసెంబ్లీలో మీ గురించి కొట్లాడి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు అయ్యేలా చూశామన్నారు. రైతులు కొనుగోలు కేంద్రాలరె సద్వినియోగం చేసుకోవాలన్నారు. -
పేదలందరికీ విద్య, వైద్యం
అదనపు కలెక్టర్ నగేశ్అల్లాదుర్గం(మెదక్): అర్హులైన పేదలకు విద్య, వైద్యం, సంక్షేమ ఫలాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని అదనపు కలెక్టర్ నగేశ్ అన్నారు. గురువారం మండలంలోని చిల్వెరలో నిర్వహించిన ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరికి విద్య అందినప్పుడే దేశం, కుటుంబాలు అభివృద్ధి చెందుతాయన్నారు. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా అధికారులు, ప్రజాప్రతినిధులు చర్యలు తీసుకోవాలన్నారు. సర్పంచ్, పంచాయతీ పాలకవర్గం యువత ఉండటంతో గ్రామాభివృద్ధి సాధించి, ఉత్తమ పంచాయతీకి పేరు ప్రతిష్టలు తేవాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ ముక్కెర శశిధర్రెడ్డి, ఉప సర్పంచ్ లక్ష్మి, వార్డు సభ్యులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. పాపన్నగౌడ్ పోరాటం చిరస్మరణీయం మెదక్ కలెక్టరేట్: కులం, సామాజిక సమానత్వం, న్యాయం కోసం పోరాడిన సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ జీవితం నేటి యువతకు స్ఫూర్తిదాయకమని అదనపు కలెక్టర్ నగేశ్ అన్నారు. గురువారం కలెక్టరేట్లో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పాపన్నగౌడ్ వర్ధంతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సమాజంలో అణచివేతకు వ్యతిరేకంగా పాపన్నగౌడ్ చేసిన పోరాటం చిరస్మరణీయమని కొనియాడారు. కార్యక్రమంలో గౌడ సంఘం అధ్యక్షుడు మంగ రమేశ్గౌడ్, రేణుక ఎల్లమ్మ ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ విద్యాధర్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
పల్లె వెలుగులే.. ఎక్స్ప్రెస్లు!
మెదక్ కలెక్టరేట్: ప్రభుత్వం ‘మహాలక్ష్మి’ పథకం ప్రారంభించిన తర్వాత ఆర్టీసీకి మహిళల తాకిడి విపరీతంగా పెరిగింది. అయితే వారి సంఖ్యకు అనుగుణంగా సర్వీసులు పెంచకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. మెదక్ డిపో నుంచి ప్రధాన పట్టణాలకు వెళ్లే బస్సుల్లో అధికంగా ఎక్స్ప్రెస్లు ఉన్నాయి. అయినప్పటికీ ప్రయాణికులకు సరిపోవడం లేదు. దీంతో రద్దీ ఎక్కువగా ఉండే రూట్లలో పల్లెవెలుగు బస్సులను నడిపిస్తున్నారు. వీటికి ముందు భాగంలో బ్లూ కలర్ రంగు వేసి ఎక్స్ప్రెస్ చార్జీలు వసూలు చేస్తున్నారు. మహిళలకు ఉచిత ప్రయాణం లభించినప్పటికీ, తమకు చార్జీల భారం పడుతుందని పురుషులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 39 రూట్లలో బస్సులు అసలే సీట్లు లభించక అవస్థలు పడుతూ ప్రయాణం చేస్తుంటే చార్జీల మోత మోగిస్తున్నారని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మెదక్ డిపో నుంచి సుమారు 39 రూట్లలో బస్సులు నడుస్తున్నాయి. ప్రతిరోజు సుమారు 40 వేల పైచిలుకు మహాలక్ష్మి (ఉచిత) టిక్కెట్లు వస్తున్నట్లు సమాచారం. మెదక్ నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొల్చారం మండల కేంద్రానికి ఆర్డీనరీ బస్సులో రూ. 20 ఉండగా, ఎక్స్ప్రెస్కు రూ. 40 వసూలు చేస్తున్నారు. పల్లె వెలుగు బస్సులకు రంగులేసి ఎక్స్ప్రెస్ చార్జీలు వసూలు చేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై డిపో మేనేజర్ సురేఖను వివరణ కోరగా.. ప్రయాణికులకు సరిపడా బస్సులు లేకపోవడంతో వారి సౌకర్యం కోసమే అలా నడిపించాల్సి వస్తుందని తెలిపారు. ఏదైనా వివరాలు కావాలంటే ఆర్టీసీ సీఐని సంప్రదించాలని సూచించారు. ఆయనను వివరణ కోరగా.. ఇతర డిపోలలో ఎక్కువగా ఉన్నాయని, మా డిపోలో మాత్రం కేవలం ఐదారు మాత్రమే ఉన్నాయన్నారు. ఉన్నతాధికారుల నుంచి అనుమతి ఉందా? అని ప్రశ్నించగా అలాంటిదేమి లేదని చెప్పడం గమనార్హం. బస్సులకు రంగులు వేసి చార్టీల వసూలు వీరికి ఉచితం.. వారికి భారం -
ధార లేని మంజీర!
● పొట్టదశలో వరిని కాపాడుకునేందుకు పాట్లు ● ఇసుక తిన్నెలను తవ్వి కిలోమీటర్ల మేర పైపులైన్లు కొల్చారం(నర్సాపూర్): ఎప్పటిలాగే యాసంగి సీజన్లో మంజీర పరివాహక గ్రామాల రైతులు పంటలు సాగు చేశారు. నీళ్లు వస్తాయన్న గంపెడాశతో నాట్లు వేశారు. తీరా సింగూరు మరమ్మతుల కారణంగా ఘనపురం ఆనకట్టకు నీటిని విడుదల చేయడం లేదంటూ అధికారులు క్రాఫ్ హాలిడే ప్రకటించారు. అయితే గతంలో లాగే సాగు నీరు విడుదల చేస్తారని భావించిన రైతులు ఉన్న నీటితో పంటలు సాగు చేశారు. ప్రస్తుతం వరి పొట్ట దశలో ఉండగా, నీటి గండం ఏర్పడింది. ఈక్రమంలో ఒక్క తడికి అయినా సాగు నీరు అందించాలని ఎమ్మెల్యే సునీతారెడ్డి అసెంబ్లీలో మాట్లాడారు. జీఓ సైతం విడుదల చేయించారు. అయితే అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టకపోవడంతో జీఓ కాస్త బుట్టదాఖలు అయింది. దీంతో చేసేది లేక రైతులు పొట్టదశలో ఉన్న పంటలను కాపాడుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. కొందరు బోర్లు వేసి నీటిని పంటకు అందిస్తున్నారు. మరికొందరు ఎడారిగా మారిన మంజీర నదిలో ఇసుక తిన్నెల కింద ఉన్న నీటిని వెతికే పనిలో పడ్డారు. జేసీబీల ద్వారా గుంతలు తీసి, సిమెంటు రింగులు వేసి మోటార్లను ఏర్పాటు చేసి పొలాలకు నీటిని మళ్లిస్తున్నారు. ఎంత ప్రయత్నించినా పంట చేతికొస్తుందా..? అన్న దిగులు రైతుల్లో కనిపిస్తుంది. ఇదే పరిస్థితుల్లో నీరు విడుదల చేయకపోరా..? అన్న చిన్నపాటి ఆశ ఇంకా కొట్టుమిట్టాడుతోంది. పొట్ట దశలో ఉన్న వరి పంట -
మీసేవ చార్జీల పెంపు
అదనపు కలెక్టర్ నగేశ్ మెదక్ కలెక్టరేట్: తమ కనీస చార్జీల పెంపు కోసం మీసేవ నిర్వాహకులు గత పదేళ్లుగా ఎదురు చూస్తున్న వేళ వారి కల నెరవేరింది. మీసేవ నిర్వాహకుల అభ్యర్థనను పరిగణలోకి తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం ధరల పెంచుతున్నట్లు ప్రకటన చేసింది. ఈ విషయమై బుధవారం రాత్రి అదనపు కలెక్టర్ నగేశ్వెల్లడించారు. ఇప్పటివరకు రూ. 35 ఉన్న కనీస చార్జీని రూ. 62కు పెంచినట్లు తెలిపారు. కేటగిరీల వారీగా చార్జీల పెంపు జరిగినట్లు చెప్పారు. మెయింటెనెన్స్ డేలో భాగంగా ఈనెల 3న మీ సేవ కేంద్రాలు పనిచేయవని పేర్కొన్నారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఎవరైన అధిక చార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. -
మార్జిన్ తగ్గింపుతో నష్టపోతున్నాం
మెదక్ కలెక్టరేట్: పౌల్ట్రీ యాజమాన్యాల సిండికెట్ పెత్తనం తగ్గించాలని చికెన్ సెంటర్ల నిర్వాహకులు డిమాండ్ చేశారు. ఈమేరకు దుకాణాలు మూసి వేసి పట్టణంలోని రాందాస్ చౌరస్తాలో నిరసన తెలిపారు. ఈసందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ.. గతంలో ఆయా కంపెనీలు మార్జిన్ ఇచ్చేవని, ప్రస్తుతం సిండికేట్గా ఏర్పడి రిటైల్ వ్యాపారులకు ఎలాంటి మార్జిన్ ఇవ్వడం లేదని వాపోయారు. ఇప్పటికే పలుమార్లు కంపెనీలతో చర్చలు జరిపినా.. ఫలితం లేకుండా పోయిందన్నారు. పేపర్ రేట్ ఇవ్వడంతో తాము రోజంతా కష్టపడి కంపెనీలకు లాభాలు అందించాల్సి వస్తుందన్నారు. కంపెనీల నిర్లక్ష్యాన్ని వ్యతిరేకిస్తూ రెండు రోజుల పాటు చికెన్ షాపులను బంద్ చేపట్టినట్లు తెలిపారు. కార్యక్రమంలో నర్సాగౌడ్, ఇంత్యాజ్అలీ, వేణు, సన్ను, షపీ తదితరులు పాల్గొన్నట్లు తెలిపారు. -
స్పోర్ట్స్ స్కూల్ జిల్లాస్థాయి ఎంపికలు
జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి రమేశ్ మెదక్జోన్: తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్ జిల్లా స్థాయి ఎంపికలు మంగళవారం జిల్లా కేంద్రంలోని అవుట్డోర్ స్టేడియంలో నిర్వహించారు. జిల్లాలోని వివిధ పాఠశాలల నుంచి మూడవ తరగతి చదువుతున్న 31 మంది విద్యార్థులు సెలక్షన్కు హాజరై పోటీల్లో పాల్గొన్నారు. ఈ మేరకు జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి రమేశ్ మీడియాకు వెల్లడించారు. ప్రతిభ కనబరిచిన 10 మంది విద్యార్థులను రాష్ట్ర స్థాయిక్రీడలకు ఎంపిక చేస్తారని, వారు ఏప్రిల్ 27 నుంచి హకీంపేటలో కొనసాగే రాష్ట్రస్థాయి క్రీడల్లో పాల్గొంటారని చెప్పారు. కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు శ్రీనివాస్రావు, మాధవరెడ్డి, మధుసూదన్, శ్యాం, దేవేందర్రెడ్డి, రవి, ప్రదీప్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
జిల్లాలో పోలీస్ యాక్ట్ అమలు
ఎస్పీ శ్రీనివాసరావు మెదక్జోన్: జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు ఏప్రిల్ నెలంతా పోలీసు యాక్ట్ అమల్లో ఉంటుందని ఎస్పీ శ్రీనివాసరావు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ముందుస్తుగా పోలీసుల అనుమతులు లేకుండా ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించడం నిషేధమని తెలిపారు. ప్రజల, ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించే చట్టవ్యతిరేక చర్యలు, అశాంతి సృష్టించే ప్రయత్నాలు ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని హెచ్చరించారు. ప్రజలు, ప్రజా ప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు. పటిష్ట బందోబస్తు హనుమాన్ జయంతి సందర్భంగా జిల్లాలో పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ పేర్కొన్నారు. పండుగను ప్రశాంతంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. అనుమానాస్పద వ్యక్తులను, వస్తువులు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. శాంతిభద్రతలకు భంగం కలిగించే చర్యలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చిన్నశంకరంపేట(మెదక్): నార్సింగి మండల కేంద్రంలో తైబజార్ వేలం పాట మరోసారి వాయిదా పడింది. మంగళవారం నార్సింగి గ్రామపంచాయతీ వద్ద ఈ వేలం పాట నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేయగా, పాటలో పాల్గొనేందుకు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో తైబజార్ వేలం పాటను వాయిదా వేస్తున్నట్లు ఈఓ నాగభూషణం తెలిపారు. కాగా నార్సింగి తైబజార్ వేలం పాట వాయిదా పడటంతో ఇది నాలుగోసారి కావడం విశేషం. నార్సింగిలో అంగడి (వారంతపు సంత) డిమాండ్ తగ్గినప్పటికి అధికారులు ప్రకటించిన కనీస ధరతో తమకు నష్టం జరుగుతుందని వేలం పాటకు ఎవరూ ముందుకు రావడం లేదని పలువురు అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. బీజేపీ రాష్ట్ర కార్యదర్శి పరిణిత నర్సాపూర్: జిల్లాలో ప్రశిక్షణ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి పరిణిత సూచించారు. స్థానిక పార్టీ కార్యాలయంలో మంగళవారం జరిగిన మండల పార్టీ అధ్యక్షులు, ముఖ్య నాయకుల సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. పార్టీ రాష్ట్ర కమిటీ ఆదేశాల ప్రకారం జిల్లాలో పండిత్ దీన్దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ కార్యక్రమాలను పకడ్బందీగా చేపట్టాలని సూచించారు. జిల్లాలో ప్రశిక్షణ నిర్వహించని మండలాల్లో త్వరలో నిర్వహించాలని మండల శాఖల అధ్యక్షులు, ఇన్చార్జ్లకు ఆదేశించారు. సమావేశంలో జిల్లా అధ్యక్షుడు మల్లేశ్గౌడ్, ప్రధానకార్యదర్శి సురేశ్, ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు రమేశ్గౌడ్ పాల్గొన్నారు. మెదక్ కలెక్టరేట్: జిల్లా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో జిల్లా హజ్ సొసైటీ సహకారంతో హజ్ యాత్రకు జిల్లా నుంచి ఎంపికై న 33 మందికి వైద్యాధికారులు టీకా వేశారు. మంగళవారం జిల్లా కేంద్ర ఆస్పత్రిలో హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ సునీతాదేవి, జిల్లా వ్యాక్సిన్ అధికారి మాధురి పర్యవేక్షణలో టీకా శిబిరం నిర్వహించారు. కార్యక్రమంలో వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బందితోపాటు జిల్లా హజ్ కో ఆర్డినేటర్ మహమ్మద్ ఎజాజుద్దీన్, మెదక్ జిల్లా హజ్ సొసైటీ సభ్యులు, ఎండీ రియాజుద్దీన్, సాబీర్, జైన్ ఉల్ అబేదీన్ పాలొని టీకా శిబిరాన్ని విజయవంతం చేశారు. -
గ్రామ సభలకు ఏర్పాట్లు చేయండి
● ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలి ● కలెక్టర్ ప్రతిమాసింగ్ మెదక్ కలెక్టరేట్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న ‘ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక’99 రోజుల కార్యక్రమంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో సభలకు ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ ప్రతిమాసింగ్ అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ నుంచి ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, వైద్య, పంచాయతీరాజ్, మున్సిపల్, మైనింగ్ కార్యదర్శులతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గ్రామ సభలను సమర్థవంతంగా నిర్వహించి, ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల గురించి ప్రజలకు వివరించాలన్నారు. రైతు భరోసా, రుణమాఫీ, రైతుబీమా వంటి పథకాల ద్వారా లబ్ధి పొందిన వారి వివరాలను పారదర్శకంగా ప్రదర్శించాలని సూచించారు. గ్రామ సభలు నిర్వహణకు ముందస్తుగానే షెడ్యూల్ తయారు చేసి పంచాయతి కార్యదర్శులకు సమాచారం ఇవ్వాలని స్పష్టం చేశారు. గ్రామ సభలకు వ్యవసాయ, విద్య, హౌసింగ్, నీటిపారుదల, విద్యుత్ శాఖల అధికారులతోపాటు తహసీల్దార్, ఎంపీడీఓలు తప్పనిసరిగా గ్రామ సభలకు హాజరు కావాలని చెప్పారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా టెంట్లు, కుర్చీలు, తాగునీరు ఇతర మౌలిక వసతులను ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాలకు దరఖాస్తు చేసుకునే వారి కోసం గ్రామ సభలో ప్రత్యేకంగా దరఖాస్తుల స్వీకరణ కేంద్రాన్ని ఏర్పాటు చేసి వారి నుంచి దరఖాస్తులను స్వీకరించాలని తెలిపారు. సమీక్షలో మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమాసింగ్, అదనపు కలెక్టర్ నగేశ్ తదితరులు పాల్గొన్నారు. -
అద్భుతమైన పథకం
● మహాలక్ష్మి పథకంతో మహిళలకు మేలు ● ఆర్టీసీ డిప్యూటీ రీజినల్ మేనేజర్ బీవీ రావు మెదక్ కలెక్టరేట్: మహాలక్ష్మి పథకంతో మహిళలు ఉచితంగా ప్రయాణం చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా రూ.10వేల కోట్లు ఆదా చేయడం హర్షణీయమని ఆర్టీసీ డిప్యూటీ రీజినల్ మేనేజర్ బీవీ రావు పేర్కొన్నారు. మంగళవారం మెదక్ బస్ స్టేషన్లో సాయంత్రం మహిళలకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీవీరావు, జిల్లా సీ్త్రశిశు సంక్షేమ శాఖ ఇన్చార్జి హేమభార్గవి హాజరయ్యారు. ఈ సందర్భంగా మహిళా ప్రయాణికులు పుష్పలత (టీచర్), యశోద(ఏఎన్ఎం), సిద్దేశ్వరి (టైలరింగ్ బిజినెస్), రమ్య (స్టూడెంట్)లను సన్మానించారు. అనంతరం బీవీరావు మాట్లాడుతూ ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం సురక్షితంగా, సుఖవంతంగా ఉంటుందన్నారు. ప్రజలంతా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించి సురక్షితంగా గమ్యానికి చేరుకోవాలని కోరారు. గురుకుల రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థినిలు ఉపన్యాసం, పాటలు అలరించారు. కార్యక్రమంలో డిపో మేనేజర్ సురేఖ, ఆర్టీసీ సీఐ, అధికారులు రాధకృష్ణ పాల్గొన్నారు. -
సాగునీటిని విడుదల చేయాలి
● ఎమ్మెల్యే సునీతారెడ్డి ● తుక్కాపూర్ మంజీరా నదిలో నిరసన కొల్చారం(నర్సాపూర్)/నర్సాపూర్/హత్నూర (సంగారెడ్డి): నియోజకవర్గంలో ఘణపురం ఆనకట్టకు సింగూర్ నుంచి ఒక్క తడికి సాగు నీటిని విడుదల చేయాలని ఎమ్మెల్యే సునీతారెడ్డి డిమాండ్ చేశారు. మండలంలోని తుక్కాపూర్ గ్రామానికి మంగళవారం వచ్చిన ఎమ్మెల్యే పక్కనే ఉన్న మంజీరా నదిని సందర్శించారు. నీటిని విడుదల చేయడంలో ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ, స్థానిక బీఆర్ఎస్ నాయకులతో కలిసి నదిలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. అంతకుముందు గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇండ్లను ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం సంగారెడ్డి జిల్లా హత్నూర మండలంలోని దౌల్తాబాద్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ...యాసంగిలో సింగూర్ నుంచి మంజీరా పరీవాహక ప్రాంతంలోని రైతులు పంటలు వేసిన తర్వాత ప్రభుత్వం క్రాప్ హాలిడే ప్రకటించిందని, అయితే రైతులు సాగు చేసిన ఆ పంటలు ప్రస్తుతం పొట్ట దశలో ఉన్నాయని ఈ దశలో నీటి తడులు లేకపోతే పంటలు ఎండిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. 0.3 టీఎంసీల నీటి విడుదలకు జీఓ జారీ చేసినా ప్రభుత్వ ఆదేశాలను నీటిపారుదల శాఖ అధికారులు పక్కన పెట్టడం సరికాదన్నారు. శిథిలావస్థకు చేరిన ప్రభుత్వ పాఠశాల భవనాన్ని పునర్నిర్మించేందుకు ఓ సెట్ స్వచ్ఛంద సంస్థ రూ.కోటి విరాళం ఇవ్వడం గొప్ప విషయమన్నారు. ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకున్న వారికి ఉపాధి హామీ పని కల్పించకుండా, ఇందిరమ్మ బిల్లుల చెల్లింపులోనే పని కల్పించినట్లు చూపడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎల్లమ్మకు పూజలు చేసిన ఎమ్మెల్యే నర్సాపూర్లోని శ్రీ ఎల్లమ్మ దేవి ఆలయ వార్షికోత్సవం సందర్భంగా భక్తులు ఘనంగా పూజలు చేశారు. పూజలలో స్థానిక ఎమ్మెల్యే సునీతారెడ్డి, కౌన్సిలర్లు సుధీర్గౌడ్, రాజు, మోహిజోద్దీన్లతోపాటు ఆయా పార్టీల నాయకులు పాల్గొని అమ్మవారికి పూజలు చేశారు. పూజల అనంతరం షేక్ హుస్సేన్ ఎమ్మెల్యే సునీతారెడ్డితోపాటు నాయకులను శాలువాలతో సన్మానించారు. ఎమ్మెల్యే వెంట మాజీ జెడ్పీటీసీ శ్రీనివాస్రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు గౌరీశంకర్, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు రవితేజరెడ్డి, తహసీల్దార్ పర్వీన్ షేక్, ఎంఈఓ వెంకట్ నరసింహగౌడ్ ఆయా గ్రామాల సర్పంచులు తదితరులు ఉన్నారు. -
స్వాధీనం బాట
డబుల్ బెడ్రూం ఇళ్లలోకి ప్రవేశించిన నిరుపేదలు ● జిల్లా కేంద్రంలో 60 మందికిపైగా ఇళ్లలోకి చేరిక ● అదేబాటలో మరికొంతమంది! మెదక్జోన్: నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుపేదల కోసం ప్రారంభించిన డబుల్ బెడ్రూం ఇళ్లను సకాలంలో అందజేయడంలో జాప్యం జరగ్గా...కనీసం కాంగ్రెస్ సర్కారైనా తమకు ఇళ్లు అందజేస్తుందోమోనని ఆశగా ఎదురుచూసిన వారికి ఇప్పుడు కూడా నిరాశే ఎదురైంది. దీంతో ఓపిక నశించిన సదరు నిరుపేదలు ప్రభుత్వం కట్టిన డబుల్ బెడ్రూం ఇళ్లను ఎవరికి వారే స్వాధీనం చేసుకున్నారు. మరికొంతమంది కూడా ఇదే బాటలో ఉన్నట్లు తెలుస్తోంది. పట్టణంలో డబుల్బెడ్రూం ఇళ్ల నిర్మాణాలు పూర్తయినా వాటిని పంపిణీ చేయకుండా అలాగే వదిలేశారు. ఇప్పట్లో పంపిణీ చేస్తారనే నమ్మకం, ఓపిక నశించిన కొందరు నేరుగా వాటిని స్వాధీనం చేసుకుని నివసిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 4వేలకుపైగా ఇళ్లు మంజూరు జిల్లావ్యాప్తంగా గత బీఆర్ఎస్ హాయాంలో నాలుగు వేల పైచిలుకు డబుల్డ్రూం ఇళ్లు మంజూరయ్యాయి. వాటిలో 2,500 పైచిలుకు ఇళ్లు పూర్తి చేసి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. సుమారు 15 వందల ఇళ్లు అలాగే మిగిలిపోయాయి. వాటిలో చాలావరకు నిర్మాణాలు పూర్తికాక అర్ధాంతరంగా ఆగిపోగా, మిగతావి పూర్తయినా వాటిని లబ్ధిదారులకు పంపిణీ చేయకుండా వృథాగా వదిలేశారు. మెదక్ జిల్లాకేంద్రంలో...! జిల్లావ్యాప్తంగా 2,500 ఇళ్లు మంజూరు కాగా మెదక్ మున్సిపాలిటీకి 1,055 ఇళ్లు మంజూరు చేశారు. వాటిలో 575 నిర్మాణాలు పూర్తి చేసి అప్పట్లోనే లబ్ధిదారులకు పంపిణీ చేశారు. మిగతా 480 ఇళ్లలో 247 ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. ఇంకా 233 ఇళ్ల నిర్మాణాలు బేస్మెంట్ లెవల్లో కొన్ని ఆగిపోగా, మరికొన్ని శ్లాబులు పూర్తయ్యి గోడలు నిర్మించకుండా వదిలేశారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం నిర్మాణాలు పూర్తి చేసుకున్న 247 ఇళ్లనైనా లబ్ధిదారులకు పంపిణీ చేయలేదు. దీంతో ఇళ్లు లేని నిరుపేదలు 60 మందికి పైగా ఇళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఆక్రమణకు సిద్ధంగా మరికొందరు! ఇళ్లు పూర్తయినా పంపిణీ చేయకపోగా ఇప్పటికే 60 మందికి పైగా నేరుగా ఇళ్లలోకి ప్రవేశించి నివాసం ఉంటుండగా, వారి బాటలోనే మరికొందరు ఇళ్లను ఆక్రమించుకునేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. ఇప్పటికై నా నేతలు, అధికారులు స్పందించి ఇళ్లులేని వారికి కేటాయించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు కోరుతున్నారు. జిల్లా కేంద్రానికి 1,055 ఇళ్ల మంజూరు కాగా వాటిలో 575 ఇళ్లు అప్పటి బీఆర్ఎస్ నేతలు పంపిణీ చేశారు. వాటిలో రాజకీయ నేతల జోక్యంతో 80 మందికిపైగా ఇళ్లను కార్లు వారికి, రాజకీయనాయకుల అనుచరులకు పంపిణీ చేసినట్లు ఆరోపణలున్నాయి. కాగా వారు ఆ ఇళ్లను పేదలకు అద్దెకిచ్చి నెలనెలా అద్దె వసూలు చేస్తున్నారు. ఇక అర్హులైన నిరుపేదలు మాత్రం అద్దె ఇళ్లలో ఉంటూ ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం ఎప్పటికై నా తమకు డబుల్ బెడ్రూం ఇళ్లను అందజేస్తుందని ఎదురుచూస్తూ వచ్చిన నిరుపేదలు తమకిక ఆ ఇళ్లు వచ్చే అవకాశం లేదని భావించి నేరుగా ఇళ్లను స్వాధీనం చేసుకున్నారు. -
అటకెక్కిన అటల్ టింకరింగ్
మెదక్ అర్బన్: విద్యార్థుల్లో ఉత్సుకత.. సృజనాత్మకత.. ఊహశక్తి ద్వారా ఆవిష్కరణలు సృష్టించడానికి ప్రారంభించిన అటల్ టింకరింగ్ ల్యాబ్ కార్యక్రమం నీరుగారి పోతుంది. జిల్లాలో ఒక్కో పాఠశాలకు పంపిణీ చేసిన రూ.10 లక్షల సామగ్రి నిరుపయోగంగా మారింది. పాపన్నపేట మండలంలోని ఓ పీఎంశ్రీ పాఠశాలలో డ్రోన్ మాయం కాగా, విద్యార్థులకు ఉపయోగపడాల్సిన ట్యాబ్లు పక్కదారి పడుతున్నాయి. ఓ ట్యాబ్ సైతం కనిపించకుండా పోవడంతో పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఏటీఎల్ సామగ్రి పంపిణీ చేసి ఏడాది కావొస్తున్నా, కొన్ని పాఠశాలల్లో ఇప్పటివరకు స్టాక్ రిజిస్టర్లో నమోదు చేయకపోవడం గమనార్హం. ఆవిష్కరణలతో అద్భుతం విద్యార్థి దశ నుంచే ఆవిష్కరణలు, విమర్శనాత్మక ఆలోచన, లెర్నింగ్ బై డూయింగ్ విధానాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్ యొక్క అటల్ ఇన్నోవేషన్ మిషన్ కింద ఏర్పాటు చేసిందే ‘అటల్ టింకరింగ్ ల్యాబ్’ కార్యక్రమం. జిల్లాలో 31 పీఎంశ్రీ స్కూల్స్ ఉన్నాయి. ఇందులో 28 పాఠశాలల్లో ఏటీఎల్ ల్యాబ్లు ఉండగా, ఏడాది క్రితం సుమారు రూ. 10 లక్షల విలువ గల సామగ్రి పంపిణీ చేశారు. ఇందులో రోబోటిక్స్ కిట్, ఎలక్ట్రానిక్ డెవలప్మెంట్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, రాపిడ్ ప్రోటో టైపింగ్ టూల్స్, మెకానికల్ అండ్ మెజర్మెంట్ టూల్స్, పవర్ సప్లై, ఆక్ససరీస్ అండ్ సేఫ్టీ ఎక్విప్మెంట్ కాంపోనెంట్ కింద 150 రకాల వస్తువులు పంపిణీ చేశారు. అయితే వీటిని వినియోగించేందుకు సంబంధిత టీచర్లకు రెండు రోజుల శిక్షణ సైతం ఏర్పాటు చేశారు. ఈ వస్తువులలో చాలా మట్టుకు ఇంజనీరింగ్ సిలబస్కు సంబంధించినవి ఉన్నట్లు టీచర్లు చెబుతున్నారు. ఒకటి రెండు రోజుల శిక్షణలో వాటిపై అవగాహన వచ్చే అవకాశం లేదని వాపోతున్నారు. ఇక ఇంతటి విలువైన వస్తువులను కొన్ని పాఠశాలల్లో హెచ్ఎంలు కనీసం ఇన్చార్జిలకు బాధ్యత అప్పజెప్పకపోవడంతో స్టాక్ రిజిస్టర్లో ఎంట్రీకి నోచకోలేక నిరుపయోగంగా మారాయి. కాగా వాటిపై ఎవరి అజమాయిషి లేకపోవడంతో ఎవరికి వారు విలువైవ వస్తువులను ఇంటికి తీసుకెళ్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఈ క్రమంలోనే ట్యాబ్లు, డ్రోన్లు మాయమవుతున్నట్లు తెలుస్తోంది.మాయమవుతున్న డ్రోన్లు.. పక్కదారి పడుతున్న ట్యాబ్లు రూ.10 లక్షల ల్యాబ్ సామగ్రి వృథా జిల్లాలో 33 పాఠశాలలకు పంపిణీపార్ట్ టైం ఇన్స్ట్రక్టర్లు అవసరం ఏటీఎల్ ల్యాబ్ కింద పంపిణీ చేసిన ల్యాబ్ సామగ్రి వినియోగంలోకి రావాలంటే నిరుద్యోగ ఇంజనీరింగ్ విద్యార్థులను పాఠశాలల్లో పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్లుగా నియమించాలని పలువురు టీచర్లు అభిప్రాయపడుతున్నారు. తమకు వాటిపై పూర్తి అవగాహన లేనందున ప్రోగ్రామింగ్ లాంటివి తయారు చేయడం కష్టమని అంటున్నారు. -
మోదీ చిత్రపటానికి క్షీరాభిషేకం
నర్సాపూర్ రూరల్: మండలంలోని పెద్దచింతకుంటలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు వాల్దాస్ మల్లేశ్గౌడ్ ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు ప్రధాని నరేంద్ర మోదీ చిత్రపటానికి ఆదివారం క్షీరాభిషేకం చేశారు. ఈసందర్భంగా మల్లేశ్గౌడ్ మాట్లాడుతూ.. పశ్చిమాసియా యుద్ధం కారణంగా ప్రపంచమంతా ఇంధన సంక్షోభంతో అల్లాడుతుంటే మోదీ సామాన్య ప్రజలపై భారం పడకుండా పెట్రోల్, డీజిల్పై ఎకై ్సజ్ సుంకాన్ని భారీగా తగ్గించారని కొనియాడారు. కార్యక్రమంలో ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు పాపగారి రమేశ్గౌడ్, మండల అధ్యక్షుడు నీలి నాగేశ్, నాయకులు నారాయణరెడ్డి, బాలు, యాదగిరి, నగేశ్గౌడ్, సంజీవులు సాయిచారి, బాలరాజ్ తదితరులు పాల్గొన్నారు. -
‘ఉల్లాస్’ పరీక్షలు
చిన్నశంకరంపేట(మెదక్): ఉల్లాస్ కార్యక్రమం ద్వారా నిర్వహిస్తున్న అమ్మకు అక్షరమాల మూ ల్యంకన పరీక్షలను కేంద్ర ప్రభుత్వ అక్షరాస్యత మంత్రిత్వశాఖ అధికారి భాను బోరా పరిశీలించారు. ఆదివారం విద్యాశాఖ డిప్యూటీ డైరెక్టర్ వెంకట్రెడ్డి, వయోజన విద్య జిల్లా అధికారి మురళీమోహన్తో కలిసి మండలంలోని అవబాజిపేటలో పర్యటించారు. మహిళా సంఘం సభ్యులను గుర్తించి వలంటీర్ల ద్వారా అక్షరాభ్యాసం చే యించినట్లు అధికారులు తెలిపారు. మహిళల అక్షరాభ్యాసన శక్తిని పరిశీలించేందుకే మూల్యంకన పరీక్షలు నిర్వహించామన్నారు. -
కూతురు పెళ్లికి అప్పు పుట్టక..
పాపన్నపేట (మెదక్): కూతురు పెళ్లి కోసం అప్పు పుట్టక ఓ తండ్రి మనోవేదనకు గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన ఆదివారం మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలో చోటుచేసుకుంది. ఎస్సై శ్రీనివాస్ గౌడ్ కథనం ప్రకారం... నార్సింగి గ్రామానికి చెందిన ఫిరంగి సత్యనారాయణ (50) కల్లు వ్యాపారం చేసుకుంటూ జీవనం కొన సాగిస్తున్నాడు. ఇతనికి ముగ్గురు కుమార్తెలు. వారం క్రితం ఆయన పెద్ద కూతురు నిశ్చితార్థం జరిగింది. ఆదివారం ఇంట్లో పెళ్లి పత్రిక పెట్టుకొని, సాయంత్రం పెద్దల పండుగ చేసుకోవాల్సి ఉంది. ఈ మేరకు చుట్టాలకు కబురందించారు. అయితే త్వరలో బిడ్డ పెళ్లి చేయాల్సి ఉండగా, డబ్బులు లేక, అప్పులు పుట్టక ఆందోళన చెందాడు. దిక్కుతోచని స్థితిలో శనివారం ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆయన సాయంత్రానికి కూడా ఇంటికి రాలేదు. దీంతో కుటుంబీకులు గ్రామ శివారులో వెతికారు. కాగా ఆదివారం ఉదయం గ్రామ సమీపంలోని మూతబడిన రైస్ మిల్లులో ఉరివేసుకున్నాడు. దీంతో శుభకార్యం జరగాల్సిన ఆ ఇంట రోదనలు మిన్నంటాయి. పెళ్లి పత్రిక కోసం రావాల్సిన బంధువులు, అంత్య క్రి యలకు రావాల్సి రావడంతో, ఊరంతా శోక సంద్రమైంది. కాగా, పెళ్లి కుమారుని తరపు వారు కట్నం ఆశించకుండానే పెళ్లికి ఒప్పుకున్నట్లు తెలిసింది. విషయం తెలిసి వారు కూడా కన్నీరు మున్నీరయ్యారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
ఘనంగా గ్రాడ్యుయేషన్ డే
నర్సాపూర్: నర్సాపూర్లోని విష్ణు ఉన్నత పాఠశాలలో శనివారం గ్రాడ్యుయేషన్ డే సంబరాలు ఘనంగా నిర్వహించారు. 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి విద్యార్థులు సాధించిన విజయాలు, నైపుణ్యాలను గుర్తించి వారిని ప్రోత్సహించేందుకు సంబరాలు నిర్వహిహించినట్లు పాఠశాల ప్రిన్సిపాల్ నాగజ్యోతి చెప్పారు. విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు అందరిని ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో బీవీ రాజు ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపాల్ సంజయ్దూబె, డైరెక్టర్ లక్ష్మీప్రసాద్, వైపర్ ప్రిన్సిపాల్ రమేష్, మేనేజర్ బాపిరాజు, ఏఓ సురేష్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు సర్టిఫికెట్లు, మెమోంటోలు అందచేశారు. -
ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ అండ
పెద్దశంకరంపేట(మెదక్): ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడు అండగా ఉంటుందని నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి అన్నారు. శనివారం పెద్దశంకరంపేట మండల కేంద్రంలో ముసాపేట, జూకల్, వీరోజిపల్లి, బద్దారం గ్రామాలకు చెందిన పలువురు లబ్ధిదారులకు మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలతో అధికారంలోనికి వచ్చిందని, రాష్ట్రంలో తిరిగి బీఆర్ఎస్పార్టీ అధికారంలోనికి వస్తుందన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు రోషన్రెడ్డి, మాజీ సర్పంచ్ సత్యనారాయణ, మండల రైతుబంధు మాజీ అధ్యక్షుడు సురేష్గౌడ్, బోండ్ల దత్తు, సర్పంచ్ విఠల్నాయక్, ఇతర నాయకులు పాల్గొన్నారు. -
భక్తిశ్రద్ధలతో కోదండ రామస్వామి ఉత్సవాలు
శివ్వంపేట(నర్సాపూర్): మండల కేంద్రం శివ్వంపేట లో కొలువైన పురాతన కోదండరామస్వామి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ప్రతి ఏటా శ్రీరామనవమి రోజున సీతారామచంద్రస్వామి కల్యాణం అనంతరం వారం రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. అనంతరం కోదండరామస్వామికి ప్రత్యేక పూజలు చేశా రు. సాయత్రం స్వామివారి పల్లకీ సేవ గ్రామంలోని ప్రధాన వీధులు గుండా చేపట్టారు. ఏప్రిల్ 2న గరుడసేవ నిర్వహించనున్నట్లు వేద పండితుడు శా స్త్రుల వామనశర్మ, సర్పంచ్ వెంకటేశ్వర్లు, ఆలయ పూజారి చందు తెలిపారు. -
నర్సాపూర్ బడ్జెట్ 19.36 కోట్లు
నర్సాపూర్: నర్సాపూర్ మున్సిపాలిటీ చైర్పర్సన్ లక్ష్మి అధ్యక్షతన శనివారం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ మేరకు 2026– 27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్కు సభ్యులు ఆమోదం తెలిపారు. మున్సిపాలిటీకి సాధారణ నిధులు, గ్రాంట్లు కలిపి రాబోయే ఆర్థిక సంవత్సరానికి 19కోట్ల 36లక్షల 95వేల రూపాయల ఆదాయం వస్తుందని అంచనా వేసినట్లు మున్సిపాలిటీ గణాంక అధికారి సంతోషిరాణి వివరించారు. అదే సంవత్సరానికి 19కోట్ల 31లక్షల 75వేల రూపాయల వ్యయం ఉంటుందని అంచనా వేసినట్లు చెప్పారు. 2026– 27 సంవత్సరానికి 10శాతం గ్రీన్ బడ్జెట్ కోసం 1కోటి 42లక్షల 90వేల రూపాయలు కేటాయించామని, మిగులు బడ్జెట్ 26లక్షల 51వేల రూపాయలని తెలపగా సభ్యులు ఆమోదించారు. పట్టణంలోని పలు సమస్యలపై సమావేశంలో చర్చించి వాటిని పరిష్కారానికి ప్రజా ప్రతినిధులు, మున్సిపల్ అధికారుల సమన్వయంలో కృషి చేయాలని సూచించారు. సమావేశంలో వైస్ చైర్మన్ బుచ్చెష్యాదవ్, కమిషనర్ శ్రీరాంచరణ్రెడ్డి, పలువురు కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. మిగులు బడ్జెట్ 26.51 లక్షలు సాధారణ నిధులు, గ్రాంట్లతో అభివృద్ధి -
ముగిసిన వార్డు సభ్యుల శిక్షణ
పెద్దశంకరంపేట(మెదక్): మండలంలో ఐదు రోజు లుగా కొనసాగుతున్న వార్డు సభ్యుల రెండో విడత శిక్షణ శిబిరం శనివారం ముగిసింది. ఈ సందర్భంగా ఎంపీడీఓ క్రాంతికుమార్ మాట్లాడుతూ.. గ్రామపాలనలో వార్డు సభ్యుల పాత్ర, బాధ్యతలు, గ్రామ అభివృద్ధి కార్యక్రమాల అమలు, పారదర్శకత, ప్రజ లతో సమన్వయం, పంచాయతీ రాజ్ చట్టాలపై అవగాహన పెంచుకొని, గ్రామాభివృద్ధికి సహకరించాలని సూచించారు. అనంతరం వారికి ధ్రువపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో ఎంపీఓ జాకీర్హుస్సేన్, మాస్టర్ ట్రైనర్లు తస్లీమ్ పాషా, లింగప్ప, ప్రవీణ్, సోమేశ్వర్ తదితరులున్నారు. వార్డు మెంబర్లకు సర్టిఫికెట్స్ అందజేత నిజాంపేట(మెదక్): మండలంలోని గ్రామ పంచాయతీలో నూతనంగా ఎంపికై న వార్డు సభ్యులకు నిజాంపేట మండల కేంద్రంలో ఐదు రోజుల శిక్షణ పూర్తి చేసుకున్న వార్డు సభ్యులకు సర్టిఫికెట్లను ఎంపీడీఓ రాజిరెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిజాంపేట మండలంలో మొదటి బ్యాచ్ వార్డు సభ్యులకు వార్డు అభివృద్ధి చేయాలంటే వార్డు సభ్యుల ముఖ్యపాత్ర పోషించాలని సూచించారు. గ్రామసభకు ప్రతి ఒక్కరు హాజరై వార్డుల్లోని సమస్యలపై చర్చించాలన్నారు. గ్రామాల అభివృద్ధికి మొదటి ప్రాధాన్యం వార్డు సభ్యులదేనని అన్నారు. కార్యక్రమంలో ఎంపీఓ నర్సింహారెడ్డి, ట్రైనర్లు కుమార్, శ్రీకాంత్, అశోక్, ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, వార్డు మెంబర్స్ తదితరులు పాల్గొన్నారు. -
నిబంధనలు తప్పనిసరి
పెద్దశంకరంపేట(మెదక్): వాహనదారులు రోడ్డు భద్రత నిబంధనలు తప్పకుండా పాటించాలని ఎస్ఐ.ప్రవీణ్రెడ్డి పేర్కొన్నారు. శనివారం పెద్దశంకరంపేటలో ప్రజలకు రోడ్డు రవాణా నిబంధనలు వివరించారు. ప్రభుత్వం ప్రజలు క్షేమంగా ఇంటికి చేరుకునేందుకు అరైవ్– అలైవ్ కార్యక్రమం ప్రారంభించిందన్నారు. ప్రయాణికులు హెల్మెట్ ధరించడంతో పాటు మద్యం సేవించి, సెల్ఫోన్ మాట్లాడుతూ.. వాహనాలు నడపరాదని, జాతీయ రహదారిపై రాంగ్రూట్లో ప్రయాణించవద్దని సూచించారు. కార్యక్రమంలో ఏఎస్ఐ. సంగమేశ్వర్, సిబ్బంది పాల్గొన్నారు. ఘనంగా పార్వతీ పరమేశ్వరుల కల్యాణం చిన్నశంక్రంపేట(మెదక్): మండల పరిధి గవ్వలపల్లి గ్రామంలో శ్రీరామలింగేశ్వరస్వామి ఆలయంలో శనివారం పార్వతీ పరమేశ్వరుల కల్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేద మంత్రోచ్ఛరణల మధ్య కల్యాణ మహోత్సవం అంగరంగా వైభవంగా సాగింది. మహిళలు పార్వతీపరమేశ్వరులకు ఓడిబియ్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేశారు. రాజీయే రాజమార్గం నర్సాపూర్ రూరల్: రాజీపడటం రాజమార్గమని న్యాయమూర్తి హేమలత కక్షిదారులకు సూచించారు. శనివారం నర్సాపూర్ మున్సిఫ్ కోర్టు ఆవరణలో లోక్ అదాలత్ నిర్వహించి పలు కేసుల్లో ఇరువర్గాల కక్షిదారులతో రాజీ కుదిర్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. క్షణికావేశంలో ఒకరిపై ఒకరు దూషించుకొని, కొన్ని సందర్భాల్లో దాడులు చేసుకొని పోలీస్స్టేషన్లలో కేసులు నమోదు చేసుకొని కోర్టుల చుట్టూ తిరుగుతూ డబ్బు, సమయం వృథా చేసుకుంటున్నారని అన్నారు. చాలా మంది ఇగోలతో కొట్లాడుకోవడం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరు చట్టాలపై అవగాహన పొందుతూ శాంతియుత వాతావరణంలో ఉండాలని చెప్పారు. కార్యక్రమంలో ప్రభుత్వ న్యాయవాది రాఘవేందర్, సీనియర్ న్యాయవాది అంజిరెడ్డి, ఏజీపీ శ్రీధర్రెడ్డి, న్యాయవాదులు శ్రీనివాస్ గౌడ్, మధుశ్రీ, స్వరూపరాణి, శ్రీనివాస్, సత్యనారాయణ, సుధాకర్, ఆనంద్ కుమార్ పాల్గొన్నారు. కొండగట్టుకు పాదయాత్ర చేగుంట(తూప్రాన్): మండలంలోని గోపాల్పురం నుంచి హనుమాన్ మాలధారణ భక్తులు కొండగట్టుకు శనివారం పాదయాత్రగా బయలుదేరారు. మాజీ వైస్ఎంపీపీ రాంచంద్రం ఆధ్వర్యంలో 12 మంది హనుమాన్ మాల ధరించి కొండగట్టుకు పాదయాత్రగా వెళ్లి దీక్షను విరమించనున్నట్లు తెలిపారు. నాలుగు రోజుల పాటు పాదయాత్రగా వెళ్లి మంగళ వారం కొండగట్టుకు చేరుకుంటారని చెప్పారు. ఆలయానికి విరాళం అందజేత అల్లాదుర్గం(మెదక్): తల్లికి గుండెపోటు రావడంతో పెద్దమ్మ తల్లికి మొక్కుకున్నారు. అమ్మ వారి దయతో క్షేమంగా కోలుకోవడంతో విరా ళం అందజేశారు. బీరంగూడకు చెందిన అనిల్రాజ్ తన తల్లికి గుండెపోటు రావడంతో అనారోగ్యం నుంచి కాపాడాలని, క్షేమంగా ఉంటే రూ.లక్ష ఆలయానికి విరాళం ఇస్తానని రాంపూ ర్ పెద్దమ్మ తల్లికి మొక్కుకున్నాడు. అనిల్ రాజ్ తల్లి కోలుకోవడంతో శనివారం రాంపూర్ పెద్ద మ్మ తల్లికి స్థానిక సర్పంచ్ గోపాల్రెడ్డి, మాజీ సర్పంచ్ వెంకట్రెడ్డి, బల్రాంరెడ్డి, వెంకటేశ్ సమక్షంలో రూ.లక్ష విరాళం అందజేశారు. -
గీతా స్కూల్కు విద్యా పురస్కారం
తూప్రాన్: విద్యా రంగంలో విశిష్ట సేవలందిస్తున్న పట్టణంలోని గీతా స్కూల్ యాజమాన్యానికి హన్స్ ఇండియా వారి ఆధ్వర్యంలో విద్యా పురస్కారం లభించిందని పాఠశాల కరస్పాండెంట్ రామాంజనేయులు శనివారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మూడు దశాబ్దాలుగా నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన మౌలిక సదుపాయాలు, నైపుణ్యం, విలువలతో కూడిన విద్య, వ్యక్తిగత వికాసం, క్రమశిక్షణ, సృజనాత్మకత లాంటి అంశాల్లో వేలాది విద్యార్థులను తీర్చిద్దినందునకు గీతా హైస్కూల్కు అవార్డు లభించినట్లు తెలిపారు. హైదరాబాద్లోని బాగ్ లింగంపల్లిలోని ఆర్టీసీ కళాభవన్లో నిర్వహించిన అవార్డుల కార్యక్రమంలో రాష్ట్ర రవాణా, సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేతుల మీదుగా పాఠశాల కరెస్పాండెంట్ రామాంజనేయులు, చైర్ పర్సన్ పి.ఉష, డైరెక్టర్ భరత్లు అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్లు రాఘవేందర్గౌడ్, నారాయణగుప్తా, మౌనిక, ఇన్చార్జి ప్రిన్సిపాల్ ప్రేమ్రాజ్, వైస్ ప్రిన్సిపాల్ రాజేశ్వర్, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు. -
ప్రత్యేక వైద్య శిబిరంతో లబ్ధి
చిన్నశంకరంపేట(మెదక్): చిన్నశంకరంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వైద్య శిబిరంలో 193 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. శనివారం ప్రత్యేక వైద్య శిబిరాన్ని వైద్యాధికారి డాక్టర్ సాయిసింధు, స్థానిక సర్పంచ్ చంద్రశేఖర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎముకలు, నేత్రవైద్యం, మహిళలు, చిన్నపిల్లలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ శిబిరంలో పలువురు వైద్యులు పాల్గొని సేవలు అందించారు. కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సాయిసింధు, పల్లె దవాఖాన డాక్టర్లు హృదయ్, హరిక, నందిని, కుమారి, సూపర్వైజర్లు నిర్మల, బుజ్జి, సిబ్బంది వనిత, అనిత, నర్సింహులు, యాదగిరావు, ఉపసర్పంచ్ భానుప్రసాద్, వార్డు సభ్యులు పాల్గొన్నారు. -
చేగుంట తైబజార్ వేలం
చేగుంట(తూప్రాన్): మండల కేంద్రం చేగుంట మార్కెట్కు సంబంధించిన వేలంపాట సర్పంచ్ స్రవంతి, ఎంపీఓ విజయ్పాల్రెడ్డి ఆధ్వర్యంలో శనివారం నిర్వహించారు. వేలంలో 24 లక్షల 5వేలకు చింతల భూపాల్ తైబజార్ను దక్కించుకున్నారు. నిబంధలన ప్రకారం గ్రామ పంచాయతీకి వేలం డబ్బు లు చెల్లించి ఒప్పంద పత్రం అందించి ఏప్రిల్ 1 నుంచి తైబజార్ డబ్బులను వసూలు చేయాలని ఎంపీఓ తెలిపారు. కార్యక్రమంలో ఈఓ వెంకటేశ్, ఉపసర్పంచ్ రఫీ, వార్డు మెంబర్లు రవి, ఆరీఫ్, గ్రామస్తులు పాల్గొన్నారు. సీఎంఆర్ఎఫ్ చెక్కుల అందజేత చిలప్చెడ్(నర్సాపూర్): నీరుపేదలకు సీఎంఆర్ఎఫ్ ఎంతో ఉపయోగకరంగా ఉందని అజ్జమర్రి మాజీ ఎంపీటీసీ మల్లయ్య అన్నారు. శనివారం ఆయన చిలప్చెడ్ మండల పరిధి అజ్జమర్రి గ్రామానికి చెందిన పలువురికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేశారు. కార్యక్రమంలో మాజీ ఆత్మకమిటీ డైరెక్టర్ సత్యం, బీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షుడు వీరాస్వామి పాల్గొన్నారు. -
ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్లేస్మెంట్ డ్రైవ్
నర్సాపూర్ రూరల్: నర్సాపూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శనివారం కెమిస్ట్రీ విభాగం, ప్లేస్మెంట్ సెల్ ఆధ్వర్యంలో ఎంఎస్ఎన్ ఫార్మా సంస్థకు సంబంధించి ప్లేస్ మెంట్డ్రైవ్ నిర్వహించారు. ప్లేస్ మెంట్ డ్రైవ్ లో ఔషధ పరిశ్రమలో ఉద్యోగ అవకాశాలు, నైపుణ్యాలు, కెరీర్ అభివృద్ధిపై అవగాహన కల్పించారు. కళాశాలకు చెందిన సుమారు పదిమందికి పైగా విద్యార్థులు ప్లేస్మెంట్ పొందారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ సమీరా నజ్మీన్, అధ్యాపకులు డాక్టర్ అదెప్ప, డాక్టర్ కే రమేష్, ఎండీ ఖాజా ఆరిఫ్, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ఎస్టీయూ అధ్యక్షుడుగా ఆదిత్యగౌడ్
రేగోడ్(మెదక్): ఎస్టీయూ మండల శాఖ అధ్యక్షుడుగా ఆదిత్యగౌడ్ను శనివారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షుడిగా రిషికాంత్, మహిళా ఉపాధ్యక్షురాలిగా అనూష, ప్రధాన కార్యదర్శిగా నరేశ్, కార్యదర్శులుగా మహేందర్, పుష్పలు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు ఆదిత్యగౌడ్ మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు. తనపై నమ్మకం ఉంచి ఉన్నతమైన బాధ్యతలను అప్పగించిన జిల్లా, రాష్ట్ర నాయకులకు కృతజ్ఞతలు తెలియజేశారు. నిరాహార దీక్షను విజయవంతం చేయండి నర్సాపూర్: కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయాలన్న డిమాండ్తో ఎమ్మార్పీఎస్ చేపట్టిన నిరాహార దీక్షను విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు కుమార్ కోరారు. ఈ నెల 30న ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మేడిపాపన్న ఆధ్వర్యంలో హైదరాబాద్లోని ఇందిరాపార్కు వద్ద చేపట్టే నిరాహార దీక్ష కరపత్రాలను కుమార్ తదితరులు ఆవిష్కరించి మాట్లాడారు. దళితులకు పలు హామీలు ఇచ్చిన కాంగ్రెస్ అమలు చేయకుండా జాప్యం చేస్తూ మోసం చేస్తుందని ఆరోపించారు. హామీల అమలుకు డిమాండ్తో చేపట్టిన నిరాహార దీక్షను విజయవంతం చేయాలని కుమార్ కోరారు. ఆయన వెంట నాయకులు నాగరాజు, విద్యాసాగర్, నరేష్ తదితరులు ఉన్నారు. ఇసుక కుప్పలు సీజ్ పాపన్నపేట(మెదక్): కొడుపాక గ్రామ శివారులో అక్రమంగా నిల్వ చేసిన 15 ట్రాక్టర్ల ఇసుకను శుక్రవారం రాత్రి సీజ్ చేసినట్లు తహసీల్దార్ సతీష్ తెలిపారు. మంజీరా నది నుంచి కొంతమంది అక్రమంగా ఇసుక తీస్తున్నట్లు వచ్చిన సమాచారం మేరకు కేసు నమోదు చేశామన్నారు. అక్రమంగా ఇసుక తీస్తే సీజ్ చేస్తామని హెచ్చరించారు. నేడు విద్యుత్ సరఫరా బంద్ పెద్దశంకరంపేట(మెదక్): పెద్దశంకరంపేట, బూర్గుపల్లి 33 కేవీ సబ్స్టేషన్ పరిధిలో మరమ్మతుల కారణంగా ఆదివారం విద్యుత్సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏఈ శ్యాంసుందర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉ.10 గంటల నుంచి సా.5 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదన్నారు. విద్యార్థులపై తేనెటీగల దాడి నిజాంపేట(మెదక్): నిజాంపేట మండల కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో శనివారం తేనెటీగలు ఒక్కసారిగా విద్యార్థులపై దాడి చేశాయి. ఈ మేరకు పాఠశాలకు పక్కనే ఉన్న చెట్లు మీద ఉన్న తేనేటీగల గుంపు ఒక్కసారి లేచి విద్యార్థి సాత్విక్పై దాడి చేయడంతో వెంటనే పాఠశాలలోకి పరుగెత్తుకుంటూ వెళ్లాడు. వెంటనే అప్రమత్తమైన ఉపాధ్యా యులు విద్యార్థులను గదుల్లోకి పంపి తలు పులు వేసి ప్రమాదం నుంచి తప్పించారు. ఈగలకు మంట పెట్టి దూరంగా పంపించారు. విద్యార్థికి స్వల్పంగా గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి సద్దుమణిగిన తర్వాత పాఠశాల కొనసాగింది. ఆశావర్కర్ల ముందస్తు అరెస్ట్ నిజాంపేట(మెదక్): మండల కేంద్రంలోని స్థానిక పోలీసులు శనివారం ఆశావర్కర్లను ముందస్తు అరెస్ట్ చేశారు. ఈ మేరకు వారు మాట్లాడుతూ.. తమ డిమాండ్లు పరిష్కరించాలంటూ చలో అసెంబీకి బయలుదేరిన ఆశావర్కర్లను అరెస్ట్ చేయడం అన్యాయమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రేపు కంటి వైద్యశిబిరం పెద్దశంకరంపేట(మెదక్): మండల కేంద్రంలో రిటైర్డు ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో సోమ వారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు రిటైర్డు ఉద్యోగుల సంఘం అధ్య క్షుడు ఎస్.నర్సింలు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ శిబిరంలో ఉద్యోగులతో పాటు రిటైర్డు ఉద్యోగులు, ఆరోగ్యశ్రీకార్డు ఉన్న వారు పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. -
ఘనంగా బండ్ల ఊరేగింపు
కౌడిపల్లి(నర్సాపల్లి): మండల కేంద్రం కౌడిపల్లిలోని శ్రీఅభయ సీతారామాలయం 33వ వార్షికోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా శనివారం బండ్లను ఊరేగించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ సుహాసినిరెడ్డి, జిల్లా సర్పంచ్ల ఫోరం ఉపాధ్యక్షుడు చంద్రం కృష్ణాగౌడ్, దేవులపల్లి సర్పంచ్ తిరుపతిరెడ్డి, దేవతామూర్తులతో పాటు బండ్ల వద్ద ప్రత్యేక పూజలు చేశారు. కౌడిపల్లి, దేవులపల్లిలోని వివిధ కులాల సంఘాల ఆధ్వర్యంలో ఎడ్లబండ్లను ఊరేగించారు. కార్యక్రమంలో సర్పంచ్ కృష్ణాగౌడ్, ఉపసర్పంచ్లు శ్వేత మల్లికార్జున్గౌడ్, శ్రీకాంత్, నాయకులు శ్రీనివాస్గుప్తా, దుర్గాగౌడ్, రాజు, మగ్బుల్, ప్రశాంత్, శాఖయ్య, పుండరీకంగౌడ్, లక్ష్మన్యాదవ్, భుమయ్య పాల్గొన్నారు. దుర్గమ్మకు బండ్ల ప్రదక్షిణలు అల్లాదుర్గం(మెదక్): మండల పరిధి ముస్లాపూర్ గ్రామంలో దుర్గమ్మ జాతర ఘనంగా కొనసాగుతున్నాయి. శనివారం ఉత్సవాల్లో భాగంగా బండ్ల ప్రదక్షిణలు చేశారు. గ్రామ స్తులు, చుట్టు పక్క గ్రామాలకు చెందిన భక్తులు మొక్కులు తీర్చుకునేందుకు బండ్లను కట్టి ఉరేగింపుతో ప్రదక్షిణలు చేశారు. బండ్ల ఎదుట శివసత్తుల నృత్యాలు, భక్తులు సందడి చేశారు. వందలాది మంది భక్తులు ఉత్సవాల్లో పాల్గొని కొబ్బరికాయలు కొట్టి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఉత్సవాల్లో ఎలాంటి ఆవాంఛనీయ సంఘటనలు జరగకుండా అల్లాదుర్గం సీఐ రేణుకారెడ్డి బందోబస్తుతో పర్యవేక్షించారు. ఇందులో అల్లాదుర్గం ఎస్ఐ శంకర్ , పెద్దశంకరంపేట ఎస్ఐ ప్రవీణ్రెడ్డిలు పాల్గొన్నారు. -
చాకరిమెట్లలో భక్తజన సందడి
శివ్వంపేట(నర్సాపూర్): మండల పరిధి చిన్నగొట్టిముక్ల అరణ్యంలో కొలువైన చాకరిమెట్ల సహకార ఆంజనేయస్వామి ఆలయంలో శనివారం భక్తజన సందడి నెలకొంది. స్వామివారికి మన్య సూక్త పారాయణం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దంపతులు అభిషేకం, సత్యనారాయణస్వామి మండపంలో సమూహిక వ్రతాలు ఆచరించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో ఈఓ శ్రీనివాస్, ఆలయ ఫౌండర్ చైర్మన్ ఆంజనేయశర్మ, సర్పంచ్ నారాయణరావు, ప్రధాన అర్చకుడు దేవదాత్తశర్మ, దేవిశ్రీ, ప్రభుశర్మ, సిబ్బంది ఉన్నారు. -
పట్టపగలే దోపిడీ పాడైన గ్యాస్పొయ్యిలు బాగుచేస్తామని నమ్మించి వృద్ధ మహిళ నుంచి బంగారం లాక్కొని పరారయ్యారు. వివరాలు 9లో u
గురువారం శ్రీ 26 శ్రీ మార్చి శ్రీ 2026ఇందిరమ్మ బిల్లులు వెంటనే చెల్లించాలిఅసెంబ్లీలో ఎమ్మెల్యే సునీతారెడ్డినర్సాపూర్: ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకుంటున్న పేదలకు బిల్లులను వెంటనే మంజూరు చేయాలని స్థానిక ఎమ్మెల్యే సునీతారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అసెంబ్లీలో బుధవారం ఎమ్మెల్యే మాట్లాడుతూ... ప్రభుత్వం పేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయడంతో వారు నిర్మాణ పనులు చేపట్టారని, పలువురు బేస్మెంట్స్థాయి వరకు పూర్తయినా బిల్లులు చెల్లించడం లేదని వివరించారు.దరఖాస్తు గడువు పొడిగింపు మెదక్ కలెక్టరేట్: షెడ్యూల్ట్ కులాలకు ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ స్వయం ఉపాధి పథకాల దరఖాస్తు గడువును ఏప్రిల్ 2వ తేదీ వరకు పొడిగించినట్లు కలెక్టర్ ప్రతిమాసింగ్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలోని 249 మంది లబ్ధిదారులకు స్వయం ఉపాధి కోసం సబ్సిడీ ద్వారా ఆర్థిక సహాయం అందించనున్నట్లు చెప్పారు. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్లో దర ఖాస్తు చేసి హార్డ్ కాపీలను సంబంధిత ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లకు అందజేయాలన్నారు. జిల్లాస్థాయి కమిటీ ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేస్తామన్నారు. నేడు అఖిలపక్ష సమావేశంరామాయంపేట(మెదక్): గతంలో రద్దయిన రామాయంపేట నియోజవర్గాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ దశలవారీగా ఆందోళనకు అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఈమేరకు నియోజకవర్గ సాధన సమితి పేరిట ఒక కమిటీని ఏర్పాటు చేశారు. గురువారం సాధన సమితి ప్రత్యేక సమావేశం ప్రగతి రిసార్ట్లో నిర్వహించనున్నట్లు సమితి సభ్యులు తెలిపారు. రామాయంపేట నియోజవర్గ పునరుద్ధరణ విషయమై సమావేశంలో చర్చిస్తామని, అన్ని పార్టీల నాయకులు హాజరుకావాలని కోరారు. ఈమేరకు సమితి సభ్యులు తహసీల్దార్ రజనికి వినతిపత్రం అందజేశారు. పనుల పురోగతిపై ఆరాహవేళిఘణాపూర్(మెదక్): మండలంలోని అవుసులపల్లి శివారులో పోలీస్శాఖ నిర్మిస్తున్న పెట్రోల్ బంక్ పనులను ఏఎస్పీ మహేందర్ పరిశీలించి పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. పెట్రోల్ బంక్ ఏర్పాటు చేయడం ద్వారా స్థానికులకు సౌకర్యవంతంగా ఉంటుందన్నారు. ఆయన వెంట ఏఆర్ డీఎస్పీ రంగానాయక్, ఆర్ఎస్ఐ మహిపాల్, సిబ్బంది ఉన్నారు. -
సక్రమంగా సన్న బియ్యం సరఫరా
తీపెక్కిన చెరుకు సీజన్ ఈసారి చెరుకు మరింత తీపెక్కింది.ఈ ఏడాది చెరుకు క్రషింగ్ సీజనుఆశాజనకంగా ముగిసింది. వివరాలు 8లో uకలెక్టర్ ప్రతిమాసింగ్మెదక్ కలెక్టరేట్/కౌడిపల్లి(నర్సాపూర్)/వెల్దుర్తి(తూప్రాన్): పేదలకు ప్రభుత్వం అందిస్తున్న నాణ్యమైన సన్న బియ్యం సరఫరాను సక్రమంగా పంపిణీ చేయాలని కలెక్టర్ ప్రతిమాసింగ్ అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డు సమీపంలో గల ఎంఎల్ఎస్ పాయింట్ను ఆమె ఆకస్మికంగా సందర్శించారు. ఈసందర్భంగా మూడు నెలల బియ్యం సరఫరా గురించి ఆరా తీశారు. అలాగే రికార్డులతో పాటు బియ్యం నిల్వలను పరిశీలించారు. పెండింగ్ ఉన్న రేషన్న్షాపులకు త్వరగా బియ్యం సరఫరా చేయాలని ఆదేశించారు. ఎలాంటి అక్రమాలు చోటు చేసుకోకుండా అధికారులు సక్రమంగా ప్రజలకు బియ్యం పంపిణీ చేయాలన్నారు. కలెక్టర్ వెంట జిల్లా పౌర సరఫరాల సంస్థ మేనేజర్ జగదీష్, తహసీల్దార్ లక్ష్మణ్ బాబు, సంబంధిత అధికారులు ఉన్నారు. అంతకుముందు కౌడిపల్లి మండలంలోని వెల్మకన్న, కొట్టాల గ్రామాల్లో రేషన్షాపులను తనిఖీ చేసి స్టాక్ను పరిశీలించారు. మూడు నెలలకు సంబంధించి ఒకేసారి బియ్యం పంపిణీ చేస్తున్నామన్నారు. అలాగే వెల్దుర్తి కేజీబీవీని ఆకస్మికంగా సందర్శించారు. మెస్ నిర్వహణ, ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించారు. -
జాబ్ మేళాలో 21 మంది ఎంపిక
ఇన్చార్జి ప్రిన్సిపాల్ సింహారెడ్డి మెదక్జోన్: మెదక్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో టీఎస్కేసీ, కెరీర్ గైడెన్స్ అండ్ ప్లేస్మెంట్ సెల్ ఆధ్వర్యంలో ఎంఎస్ఎన్ ఫార్మసీ, అమెజాన్, ఫ్లిప్కార్ట్ కంపెనీలు మంగళవారం నిర్వహించిన జాబ్మేళా 21మంది ఎంపికయ్యారు. ఈ మేరకు ఇన్చార్జి ప్రిన్సిపాల్ సింహారెడ్డి ఓ ప్రకటనలో వెల్లడించారు. ఈ జాబ్మేళాకు మొత్తం 42 మంది అభ్యర్థులు హాజరుకాగా, ఆరుగురు ఎంఎస్ఎన్ కంపెనీకి, 15 మంది అమెజాన్కు ఎంపికై నట్లు చెప్పారు. కార్యక్రమంలో శ్రీనివాస్, వేణుగోపాల్రావు, కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
వడగండ్ల బీభత్సం
నేల రాలిన పంటలునందిగామ గ్రామంలో నేలకొరిగిన మొక్కజొన్న పంటనిజాంపేట(మెదక్): మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో మంగళవారం గాలివాన బీభత్సం సృష్టించింది. వడగండ్లతో చాలా వరకు పంట నష్టం వాటిల్లింది. ఉదయం నుంచి ఎండ తీవ్రత ఎక్కువగా ఉండగా.. సాయంత్రం ఒక్కసారిగా ఆకాశం మేఘామృతమైంది. సాయంత్రం కాగానే గాలి వాన బీభత్సం సృష్టించింది. దీంతో ఈదురు గాలులు వీస్తూ రాళ్ల వర్షం కురిసింది. ఈ వర్షానికి రోడ్లపై ఆరబోసిన మొక్కజొన్న ధాన్యం తడిసిపోవడంతో రైతులు ఆందోళన చెందారు. అలాగే ఈదురు గాలులకు మామిడికాయలు నేల రాలిపోయాయి. పలు గ్రామాల్లో మొక్కజొన్న పంట నేలకొరిగింది. అలాగే వరి పంటలో గింజలు రాలిపోయాయని రైతులు వాపోయారు. ప్రభుత్వం పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని తెలిపారు. -
దరఖాస్తులు పరిష్కరించాలి
భూభారతిపై కలెక్టర్ ప్రతిమా సింగ్ మెదక్ కలెక్టరేట్: జిల్లాలోని భూభారతి దరఖాస్తులను తహసీల్దార్లు చిత్తశుద్ధితో పరిష్కరించాలని కలెక్టర్ ప్రతిమాసింగ్ ఆదేశించారు. కలెక్టరేట్లో భూభారతి, ప్రజావాణి పెండింగ్ దరఖాస్తులు, ఓటరు జాబితా తయారీపై రెవెన్యూ అధికారులతో మంగళవారం కలెక్టర్ వీడియో సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ...రెవెన్యూ శాఖలో పారదర్శకత పాలన కోసం అధికారులంతా పాటు పడాలన్నారు. ప్రజావాణి, భూభారతి పెండింగ్ దరఖాస్తులు పరిష్కరించడంలో అలసత్వం వహిస్తే చర్యలకు వెనకాడబోమని తహసీల్దార్లను హెచ్చరించారు. ఓటర్ జాబితా తయారీ అన్ని శాఖల సమన్వయం చేసుకుని త్వరితగతిన పూర్తి చేయాలని పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో సమస్యలు ఎదురైతే ఉన్నతాధికారుల దృష్టికి తేవాలని సొంత నిర్ణయాలకు తావు లేదన్నారు. సమ్మర్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయండి వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని సమ్మర్ యాక్షన్ ప్లాన్పై కలెక్టర్ సమీక్షించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లా వ్యాప్తంగా తాగునీటి ఎద్దడి తీర్చేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఇందుకోసం అధికారులంతా సమన్వయంతో వేసవి కార్యచరణను సిద్ధం చేయాలని ఆదేశించారు. ఎక్కడైనా నీటి ఎద్దడి తలెత్తిన వెంటనే ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలన్నారు. మిషన్ భగీరథ ఆర్డబ్ల్యూఎస్, మున్సిపల్ కమిషనర్ సమిష్టిగా పని చేయాలన్నారు. అటవీశాఖ ఆధ్వర్యంలో వన్య ప్రాణులకు దప్పిక తీర్చేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేశ్, డీఎఫ్ఓ జోజి, డీఆర్డీఓ పీడీ శ్రీనివాసరావు, డీపీఓ యాదయ్య, మిషన్ భగీరథ ఇంట్రాగ్రిడ్ ఈఈ సంపత్ కుమార్, గ్రిడ్ నాగభూషణం, సంబంధిత మున్సిపల్ కమిషనర్లు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
పునర్విభజనకు ముందడుగు
● కొత్తగా రెండు నుంచి మూడు అసెంబ్లీ స్థానాలు! ● అసెంబ్లీ, లోక్సభ స్థానాలను 50 శాతం పెంచుతూ కేంద్రం కీలక నిర్ణయం ● దీంతో జిల్లాలో అసెంబ్లీ స్థానాల సంఖ్య నాలుగు నుంచి ఐదుకు పెరిగే అవకాశం! మారనున్న నియోజకవర్గాల రూపురేఖలురాష్ట్రంలో లోక్సభ స్థానాలు 17 నుంచి 26కు పెరిగే అవకాశాలున్నాయి. దీంతో మెదక్ లోక్సభ స్థానం స్వరూపం కూడా సమూలంగా మారనున్నాయని రాజకీయవర్గాలు విశ్లేషించుకుంటున్నాయి. మెదక్ లోక్సభ నియోజకవర్గం పరిధిలో మెదక్, నర్సాపూర్, పటాన్చెరు, సంగారెడ్డి, సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. కాగా ఏయే అసెంబ్లీ స్థానాలు ఏ లోక్సభ స్థానం పరిధిలోకి వస్తాయనే దానిపై పునర్విభజన ప్రక్రియ పూర్తయిన తర్వాత స్పష్టత రానుంది.సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: మెదక్ జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాల రూపురేఖలు సమూలంగా మారనున్నాయి. ఆయా నియోజకవర్గాల పరిధి, స్వరూపంలో కూడా మార్పులు రానున్నాయి. వాటి పరిధిలో మండలాల్లోను మార్పుచేర్పులుండే అవకాశాలు కనిపిస్తున్నాయి. మెదక్ జిల్లాలో ప్రస్తుతం మెదక్, నర్సాపూర్ అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అలాగే అందోల్ నియోజకవర్గ పరిధిలో టేక్మాల్, అల్లాదుర్గం, రేగోడ్ మండలాలున్నాయి. పెద్దశంకరం పేట మండలం నారాయణఖేడ్ అసెంబ్లీ స్థానం పరిధిలో ఉంది. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత జిల్లాలో వీటి సంఖ్య నాలుగు నుంచి ఐదుకు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దేశంలో పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్యను 50% పెంచాలని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ దిశగా కేంద్రం వడివడిగా అడుగులు వేస్తోంది. దీంతో జిల్లాలో కనీసం రెండు నుంచి మూడు కొత్త అసెంబ్లీ నియోజకవర్గాలు పెరిగే అవకాశాలున్నట్లు రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు. జనాభాను బట్టి.. 2011 జనాభా లెక్కల ప్రకారం మెదక్ జిల్లా జనాభా 7.67 లక్షల జనాభా ఉంది. కాగా కేంద్ర ప్రభుత్వం మేలో జనగణన చేపట్టనుంది. 2027 మార్చి వరకు దేశవ్యాప్తంగా జనగణన పూర్తవుతుంది. ఆ తర్వాత నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశాలున్నట్లు భావిస్తున్నారు. 2027 జనాభా లెక్కల ప్రకారం ఎంత జనాభా పెరుగుతుంది? ఎంతమంది ఓటర్లుండే అవకాశాలున్నాయి? వీటి సంఖ్యను ఆధారంగా కొత్త నియోజకవర్గాలను ఖరారు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు కూడా ఆమోదించేందుకు అడుగులు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లాలో మహిళా రిజర్వుడు స్థానాలు కూడా ఉండే అవకాశాలు లేకపోలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
సమర్థవంతంగా జనగణన
అదనపు కలెక్టర్ నగేశ్మెదక్ కలెక్టరేట్: జనగణన–2027 తొలివిడతలో ప్రక్రియలో భాగంగా ఇళ్లలెక్కింపును ఎన్యూమరేటర్లు సమర్థవంతంగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ నగేశ్ స్పష్టం చేశారు. మెదక్ సమీకృత కలెక్టరేట్లో జనగణన అధికారులకు మంగళవారం నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ...జనగణన విధులను అధికారులు సక్రమంగా నిర్వహించాలన్నారు. జనగణనలో సాంకేతిక వినియోగంపై అవగాహన కలిగి ఉండాలన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాలకనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి యాప్ ద్వారా జనగణన చేయాలని తెలిపారు. తొలిసారిగా జనగణనను డిజిటల్ పద్ధతిలో చేస్తున్నట్లు వెల్లడించారు. మే 11 నుంచి జూన్ 9వ తేదీ వరకు ఇళ్లగణన కొనసాగుతుందని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
జిల్లా సమగ్రాభివృద్ధికి నిధులు పెంచాలి
సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా మెదక్ కలెక్టరేట్: జిల్లా సమగ్రాభివృద్ధికి బడ్జెట్లో నిధుల కోటా పెంచాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు అడివయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీపీఎం ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్ ధర్నాచౌక్ వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం ర్యాలీ చేసి కలెక్టరేట్లో ఏఓ యూనస్కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా అడివయ్య మాట్లాడుతూ...ఉద్యమాల ద్వారానే సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కారం విషయంలో అధికార యంత్రాంగం అలసత్వం వహిస్తుందని విమర్శించారు. భూ సమస్యలు, రోడ్ల మరమ్మతులు, నూతన రోడ్ల నిర్మాణం, డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కేటాయింపు, ఉపాధి హమీ సమస్యలు ఎక్కడికక్కడ పేరుకు పోయాయని ఆరోపించారు. భూ సమస్యలు పరిష్కారం కాక ప్రజలు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ విసిగి పోతున్నారన్నారు. ఘనపురం ఆనకట్ట ఎత్తు పెంపు పేరుతో పాపన్నపేట మండల పరిధిలోని నాగసానిపల్లి శివారులోని రైతుల భూమి బ్లాక్ లిస్టులో పెట్టారని మండిపడ్డారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి నర్సమ్మ, పద్మ, ఏ.మల్లేశం, కే.మల్లేశం, జిల్లా కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
సింగూరు ప్రాజెక్టు వద్ద ఆక్టోపస్ దళాలు
పుల్కల్(అందోల్): సింగూరు ప్రాజెక్టు వద్ద మంళవారం ఆక్టోపస్ దళాలు మార్చ్ ఫాస్టు నిర్వహించాయి. ఆపదకాలంలో ప్రాజెక్టును ఎలా సంరక్షించుకోవాలో సూచించారు. మూడేళ్ల క్రితం కూడా ప్రాజెక్టు వద్ద ఆక్టోపస్ దళాలు మార్చ్పాస్టు నిర్వహించారు. పాలిసెట్కు తుదిగడువు ఏప్రిల్ 20 జోగిపేట(అందోల్): పాలిసెట్ 2026 ప్రవేశ పరీక్షకు హాజరుకావాలనుకుంటున్న విద్యార్థుల ఏప్రిల్ 20వ తేదీ చివరి తేదీ అని జోగిపేట ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్ ఎం.వీణ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మే13న ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు. ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్లో డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ అనే మూడు బ్రాంచులు ఉన్నాయని తెలిపారు. ఈ పాలిటెక్నిక్ ప్రత్యేకంగా మహిళల కోసం మాత్రమేనని, ఇటీవల మా సంస్థకు చెందిన అధ్యాపకులు పాలిటెక్నిక్ చదువు గురించి అవగాహన పాఠశాలల్లో అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. -
ఏప్రిల్ 15 నుంచి ధాన్యం కొనుగోళ్లు
మంగళవారం శ్రీ 24 శ్రీ మార్చి శ్రీ 2026మెదక్ కలెక్టరేట్: జిల్లాలో యాసంగి సీజన్ ధాన్యం కొనుగోలుకు సన్నాహాలు చేయాలని కలెక్టర్ ప్రతి మాసింగ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో యాసంగి ధాన్యం సేకరణ కు ఏప్రిల్ 15 నుంచి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. ఈ ఏడాది యాసంగిలో 4,45,466 మెట్రిక్ టన్నుల లక్ష్యంగా నిర్ణయించినట్లు తెలిపారు. అలాగే వన మహోత్సవంలో జిల్లావ్యాప్తంగా 31.7 లక్షల మొ క్కలు నాటాలనే లక్ష్యాన్ని నిర్దేశించినట్లు చెప్పారు. అందుకనుగుణంగా అధికారులు పటిష్ట ప్రణాళికతో సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. అలాగే ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొన్నారు. వివిధ సమస్యలపై 73 అర్జీలు అందజేశారు. కలెక్టర్ ప్రతిమాసింగ్ -
రైతులకు పరిహారం చెల్లించండి: ఎమ్మెల్యే
నర్సాపూర్: సింగూర్ ప్రాజెక్టు కింద క్రాప్ హాలిడే ప్రకటించినందున ప్రభుత్వం రైతులకు పరిహారం ఇచ్చి ఆదుకోవాలని ఎమ్మెల్యే సునీతారెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం ఆమె అసెంబ్లీలో మాట్లాడారు. సింగూరు ప్రాజెక్టుకు మరమ్మతులు చేసేందుకు రెండేళ్ల పాటు క్రాప్ హాలిడే ప్రకటించారని తెలిపారు. ప్రాజెక్టు కింద చిన్న, సన్నకారు రైతులే ఉన్నారని, వారికి పరిహారం అందచేసి ఆదుకోవాలన్నారు. కాగా చిన్నఘనపూర్ ఆనకట్ట ఎత్తు పెంచడంతో పాటు మరమ్మతులు చేపట్టేందుకు గత ప్రభుత్వం నిధులు మంజూరు చేసినా, ఇప్పటివరకు పనులు చేపట్టలేదన్నారు. ఇప్పటికై నా పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. భూములు కోల్పోయిన రైతులకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. దరఖాస్తులకు నేడు ఆఖరు మెదక్ కలెక్టరేట్: స్వయం ఉపాధి సబ్సిడీ పథకాలను జిల్లాలోని అర్హులైన షెడ్యూల్డ్ కులాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎస్సీ అభివృద్ధి అధికారి విజయలక్ష్మి సోమ వారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆన్లైన్ దరఖాస్తులకు నేడే ఆఖరి రోజు అని తెలిపారు. జిల్లాలో 2025–26 వార్షిక ప్రణాళిక అమలు చేసేందుకు రూ.236.60 లక్షలతో 249 మంది లబ్ధిదారులకు ఆర్థిక సహాయం అందజేస్తున్నట్లు చెప్పారు. 119 ఈవీ ద్విచక్ర వాహ నాలు, 59 ఈవీ ఆటోలు, రైతులకు సోలార్ పంపులు అందజేయడం జరుగుతుందన్నారు. అర్హత, ఆసక్తి గల ఎస్సీ అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. -
సోమవారం శ్రీ 23 శ్రీ మార్చి శ్రీ 2026
రైతు భరోసా నిధులు విడుదల● మొదటి విడతలో రూ.110.45 కోట్లు విడుదల మెదక్జోన్: ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం రైతు భరో సా నిధులు విడుదల చేసింది. తొలుత ఎకరం వరకు ఉన్న రైతులకు నేటి నుంచి ఖాతాల్లో జమ కానుంది. జిల్లాలో 3.65 లక్షల ఎకరాల సాగు భూములు ఉండగా, ఈ ఏడాది కొత్తగా మరో 10,694 ఎకరాల పార్ట్(బీ) భూములకు పట్టాలు అందజేశారు. దీంతో మొత్తం 3,75,694 ఎకరాలకు చేరుకుంది. ఎకరాకు రూ.6000 చొప్పున, మొత్తం 225.41 కోట్లు అవసరం కానున్నాయి. మూడు విడతల్లో ఈ నిధులను కర్షకుల ఖాతాల్లో జమ చేయనున్నారు. మొదటి విడతలో 1,84,084 ఎకరాలకు గానూ రూ.110.45 కోట్లు విడుదలయ్యాయి. మిగితా 1,91,610 ఎకరాలకు మరో రెండు విడతల్లో నిధులు విడుదల చేయనున్నారు. కాగా యాసంగి పనులు జనవరి నుంచి ప్రారంభం కాగా, ప్రభుత్వం మూడు నెలల అనంతరం పెట్టుబడి సాయం విడుదల చేసింది. మిగితా రెండు విడతలు ఏప్రిల్లో అన్నదాతల ఖాతాల్లో జమ కానున్నాయి. ఇదిలా ఉండగా 2023 డిసెంబర్లో కాంగ్రెస్ అధికారంలోకి రాగా, అదే ఏడాది వానాకాలంలో ఎకరాకు రూ. 6 వేల చొప్పున ఇచ్చింది. 2024 వానాకాలంలో రైతు భరోసా ఇవ్వలేదు. ఈ ఏడాది యాసంగికి సంబంధించి ప్రస్తుతం నిధులు విడుదల చేసింది. ముక్క తగ్గనంటోంది.. ముద్ద దిగనంటోంది ● రూ.360కి చేరిన కిలో చికెన్పార్టీ బలోపేతానికి కృషి చేయాలి రామాయంపేట(మెదక్): బీజేపీ బలోపేతం దిశగా ప్రతి కార్యకర్త కృషి చేయా లని పార్టీ మూడు జిల్లాల ఇన్చార్జి రంజిత్ మోహన్ పిలుపునిచ్చారు. రామాయంపేటలో కొనసాగుతున్న పార్టీ కార్యకర్తల శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. సమస్యలపై ప్రజలతో కలిసి పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజ లకు వివరించి వారిని చైతన్యపర్చాలన్నారు. పదేళ్లలో మోదీ ఎన్నో సంస్కరణలు ప్రవేశపెట్టారని, యువతను పార్టీలోకి ఆహ్వానించాలని రంజిత్ మోహన్ సూచించారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రాగి రాములు, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, సీనియర్ నాయకులు వెల్ముల సిద్దరాంలు, నవాత్ రాజేంద్రప్రసాద్, ఆకుల రమేశ్, పోలీస్ దేవెందర్, పార్టీ మండలాధ్యక్షుడు నవీన్గౌడ్, పట్టణాద్యక్షుడు అవినాశ్రెడ్డి, వీహెచ్పీ జిల్లా అద్యక్షుడు సత్యం, అక్కన్నపేట సర్పంచ్ యాదగిరి పాల్గొన్నారు. -
మంత్రి పొన్నం కృతజ్ఞతలు
నంగునూరు(సిద్దిపేట): సీఎం రేవంత్రెడ్డి పర్యటన విజయవంతానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికీ మంత్రి పొన్నం ప్రభాకర్ పత్రికా ముఖంగా కృతజ్ఞతలు తెలిపారు. ఆయిల్పామ్ ఫ్యాక్టరీ ప్రారంభం, రైతు భరోసా నిధుల విడుదల, రిఫైనరీ యూనిట్, పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేసిన సీఎంకు జిల్లా ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలిపారు. పటాన్చెరుటౌన్: స్వాతంత్య్రం కోసం ప్రాణత్యాగం చేసిన భగత్సింగ్ ఆశయాల సాధన కోసం ప్రతీ ఒక్కరు కృషి చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు చుక్కా రాములు పిలుపునిచ్చారు. భగత్సింగ్ వర్ధంతిని పురస్కరించుకుని ఆదివారం పట్టణంలోని శ్రామిక్ భవన్ నుంచి బీరంగూడ కమాన్ వరకు తలపెట్టిన ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా చుక్కా రాములు మాట్లాడుతూ...భగత్సింగ్ తన 23 సంవత్స రాల కాలంలోనే దేశ స్వాతంత్రం కోసం పోరాడిన ధీరుడని గుర్తు చేశారు. 1907 లో జన్మి ంచి, 1931 మార్చి 23 న ఉరి తీయబడ్డారన్నారు. కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు -
మాయ‘దారి’ మృత్యుపాశం
కొల్చారం(నర్సాపూర్): మెదక్– నర్సాపూర్– హైదరాబాద్(బాలానగర్) 765డీ జాతీయ రహదారి ప్రమాదాలకు నిలయంగా మారింది. మండల పరిధిలో ఒకేలేన్గా ఉన్న ఈరోడ్డును విస్తరణలో భాగంగా 2021లో రెండు వరసల్లో జాతీయ రహదారిగా విస్తరించారు. మండల శివారులోని లోతు వాగు నుంచి రాంపూర్ వరకు మలుపులతో కూడి ఉన్న ఈ జాతీయ రహదారి ప్రస్తుతం వాహనదారుల పాలిట మృతిదారిగా తయారైంది. గడిచిన వారం రోజుల్లో ఆరుగురు ఈ రహదారిపై వివిధ ప్రమాదాల్లో ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఈనెల 14న రంగంపేటకు ఓ శుభకార్యానికి వచ్చిన హవేళిఘణాపూర్ వాసులు ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు బైక్పై వెళ్తుండగా ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. ఈనెల 18న పోతంశెట్టిపల్లి వద్ద మెదక్ వైపు నుంచి వస్తున్న ఆటోను వెనక నుంచి కారు ఢీకొట్టడంతో ఆటో డ్రైవర్తో పాటు ప్రయాణికుడు దుర్మరణం చెందారు. తాజాగా శనివారం బైక్పై వెళుతున్న వ్యక్తిని వెనుక నుంచి కారు ఢీకొట్టడంతో ఐఎంఎల్ డిపోకు చెందిన నగేశ్ మృత్యువాతపడ్డాడు.అతివేగమే ప్రమాదాలకు కారణం! అతివేగం, నిర్లక్ష్యం, మద్యం సేవించి వాహనాలు నడపడంతోనే ప్రమాదాలు చోట చేసుకుంటున్నాయని పోలీసుల విచారణలో తేలింది. దీనికి తోడు జాతీయ రహదారి మధ్యలో డివైడర్ లేకపోవడం, మలుపులు కూడా ఉండడం మరో కారణంగా తెలుస్తోంది. ఇదే విషయమై కొల్చారం ఎస్ఐ మహమ్మద్ మైనొద్దీన్ను ఆరా తీయగా.. రోడ్డుపైకి వచ్చే ముందు వాహనాలు నడిపే వ్యక్తులు జాగ్రత్తలు పాటించకపోవడంతోనే ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. వాహ నాల వేగాన్ని నియంత్రించేందుకు ఎప్పటికప్పుడు తనిఖీలు చేపడుతున్నామన్నారు. ఇదే సమయంలో ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించకపోవడంతో తలకు బలమైన గాయాలై చనిపోతున్నారు. వాహనదారులు జాగ్రత్తలు వహిస్తేనే ప్రమాదాలు తగ్గుతాయన్నారు. ప్రమాదాలకు నిలయంగాఎన్హెచ్– 765డీ వారంలో ఆరుగురు మృత్యువాత -
పోరాటాల ఫలితమే..
సిద్దిపేటజోన్: మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని అసెంబ్లీలో బీఆర్ఎస్ గట్టిగా వత్తిడి చేయడం వల్లే సర్కారు దిగివచ్చిందని, మా పోరాటాల ఫలితమే రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని పత్తి మార్కెట్ యార్డులో మొక్కజొన్న, పొద్దు తిరుగుడు కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మొక్కజొన్న క్వింటాల్కు రూ.2400 మద్దతు ధర ఉండగా, సకాలంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో చాలా మంది రైతులు దళారులకు రూ.1600 నుంచి రూ.1700 అమ్మి తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తంచేశారు. ఇప్పటికే 25శాతం మొక్కజొన్న దళారుల చేతుల్లోకి వెళ్లిపోయిందన్నారు. ఇప్పటికై నా రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సన్ఫ్లవర్ క్వింటాల్ రూ.7,721 మద్దతు ధర ఉందని, తక్కువ సమయంలో ఎక్కువ ఆదాయం వస్తుందన్నారు. ఒకప్పుడు సిద్దిపేట నియోజకవర్గంలో 8వేల ఎకరాల్లో యాసంగికి సాగు ఉండేదని, కాళేశ్వరం పుణ్యమా అని పదింతలు పెరిగి 80 వేల ఎకరాల్లో సాగు జరుగుతోందన్నారు. కాళేశ్వరం వచ్చాక కరువు అనే పదం లేదన్నారు. జిల్లా వ్యవసాయ రూపురేఖలు మార్చిన ఘనత కాళేశ్వరానికే దక్కుతుందన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వేణుగోపాల్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్స్, పట్టణ పార్టీ అధ్యక్షుడు సంపత్రెడ్డి, యువజన విభాగం అధ్యక్షుడు రెడ్డి ప్రభాకర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ ఒత్తిడి వల్లే కొనుగోలుకేంద్రాల ఏర్పాటు సర్కారు నిర్లక్ష్యంతో ఇప్పటికేదిగుబడులు దళారుల చేతుల్లోకి మాజీ మంత్రి హరీశ్రావు -
హత్యాయత్నం చేసిన వారికి బెయిలా?
మాట్లాడుతున్న ఎంపీ రఘునందన్రావుపాపన్నపేట(మెదక్): పోలీసులపై కాల్పులు జరిపిన డ్రగ్స్ ముఠాపై హత్యాయత్నం కేసు నమోదు చేసి, రిమాండ్కు తరలించాలని ఎంపీ రఘునందన్రావు డిమాండ్ చేశారు. శనివారం మండల పరిధిలోని లక్ష్మీనగర్లో పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ ప్రశిక్షణ్ అభియాన్ కార్యశాలకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పోలీసులపై తుపాకులతో కాల్పులు జరిపిన డ్రగ్స్ ముఠాకు స్టేషన్ బెయిల్ ఇచ్చింది తెలంగాణ పోలీసులే అన్నారు. డీజీపీ ఫాంహౌస్ సీసీ ఫుటేజీ చూసి నిష్పక్షపాత విచారణ జరపాలన్నారు. దోషులు ఎంతటి వారైన కఠిన శిక్ష పడేలా కేసులు నమోదు చేయాలని కోరారు. పైలెట్ రోహిత్రెడ్డిపై చర్యలు తీసుకోవాలన్నారు. ఈవిషయమై మాట్లాడవద్దని తనకు బీజేపీ పెద్దలెవరూ చెప్పలేదని స్పష్టం చేశారు. పశ్చిమాసియా యుద్ధంతో ప్రపంచమంతా అతలాకుతలమవుతుంటే, భారత ప్రజలు మాత్రం ప్రశాంతంగా ఉన్నారని చెప్పారు. ప్రజలందరూ సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఇందుకు ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుందన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు వాల్దాస్ మల్లేష్గౌడ్, జగిత్యాల జిల్లా ఇన్చార్జి గడ్డం శ్రీనివాస్, ప్రశిక్షణ జిల్లా కన్వీనర్ రంజిత్రెడ్డి, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు బైండ్ల సత్యనారాయణ, జనగామ జిల్లా ప్రచారి నందారెడ్డి, నాయకులు సు భాష్గౌడ్, సుధాకర్, ఎంఎల్ఎన్ రెడ్డి, మండల శాఖ అధ్యక్షుడు సంతోష్చారి తదితరులు పాల్గొన్నారు.మెదక్ ఎంపీ రఘునందన్రావు -
చేయూతనివ్వరూ!
బడ్జెట్లో కొత్త పింఛన్ల ప్రకటనపై వృద్ధుల్లో నిరాశ ‘పాపన్నపేట మండలం గాంధారిపల్లికిచెందిన అంకిడి మరియమ్మ భర్త నాలుగేళ్ల క్రితం చనిపోయాడు. మరుసటి ఏడాది ఒక్కగానొక్క కొడుకు ఆకస్మికంగా మృత్యువాత పడ్డాడు. ఇద్దరు ఆడపిల్లల పెళ్లిల్లు అయ్యాయి. ప్రస్తుతం ఉపాధిహామీ పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తుంది. నాలుగేళ్లుగా వృద్ధాప్య పింఛన్ కోసం ఎదురుచూస్తోంది. అయినా అతీగతి లేదు’ ఇలా జిల్లాలో వేలాది మంది పింఛన్ల కోసం కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. అయినా వారి వేదన అరణ్య రోదనే అవుతుంది. మెదక్ అర్బన్: పండుటాకుల ఆశలపై బడ్జెట్ నీళ్లు చల్లింది. సామాజిక పింఛన్లకు గతేడాది బడ్జెట్నే ప్రతిపాదించారు. అయితే అర్హులైన వారికి రెండు లక్షల కొత్త పింఛన్లు ఇస్తామని ప్రకటించారు. అంటే 2023 డిసెంబర్ చివరి నుంచి గత నెల చివరి వరకు వివిధ కేటగిరిల కింద పింఛన్ పొందుతున్న వారిలో మరణించిన వారు, అనర్హులు, ఇతర కారణాలతో పింఛన్లు కోల్పోయిన వారి స్థానంలో అర్హులైన కొత్తవారికి ఇచ్చే అవకాశం. ఈలెక్కన చూస్తే మండలానికి 10 పింఛన్లు వచ్చే అవకాశం ఉంది. అలాగే ఎన్నికల హామీలో ఇచ్చినట్లుగా వివిధ రకాల పింఛన్లు రూ. 2,016 నుంచి రూ.4 వేలకు, దివ్యాంగుల పింఛన్లు రూ.4,016 నుంచి రూ.6 వేలకు పెంచే అవకాశం కూడా కనిపించడం లేదని పలువురు వాపోతున్నారు. జిల్లాలో 1,09,116 పింఛన్ పొందుతున్న వారు ఉన్నారు. వీరికి నెల నెలా రూ.24,92,56,832 పంపిణీ చేస్తున్నారు. ఇందులో వృద్ధాప్య పింఛన్లు 35,846, వితంతు 43,515, దివ్యాంగ 7,997, గీత కార్మికులు 838, చేనేత 447, ఫైలే రియా 455, డయాలిసిస్ 160, బీడీ కార్మికులు 15,656, ఒంటరి మహి ళలు 4,102 మంది ఉన్నారు.నాలుగేళ్లుగా దరఖాస్తుల పెండింగ్ గతంలో 61 ఏళ్లు ఉన్న వృద్ధాప్య పింఛన్ వయస్సును 57 ఏళ్లకు తగ్గించారు. ఆగస్టు 2022లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం అర్హులకు కొత్త పింఛన్లు మంజూరు చేసింది. ఇప్పటివరకు డీఆర్డీఓ కార్యాలయంలో 1,287 మంది దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. సైట్ ఓపెన్ కాకపోవడంతో తీసుకున్న దరఖాస్తులు పంచాయతీ కార్యదర్శుల వద్ద, మండల పరిషత్ కార్యాలయాల్లో కుప్పలు, తెప్పలుగా పడి ఉన్నాయి. మొత్తం మీద జిల్లాలో సుమారు 10 వేలకు పైగా పింఛన్ దరఖాస్తులు పెండింగ్లో ఉన్నట్లు తెలుస్తోంది. మండలానికి 10 మందికి మాత్రమే వచ్చే అవకాశం! జిల్లాలో వేలాది మంది ఎదురుచూపు -
నేడు సిద్దిపేటకు సీఎం రాక
సాక్షి, సిద్దిపేట: సీఎం రేవంత్రెడ్డి ఆదివారం జిల్లాలో పర్యటించనున్నారు. సీఎం అయిన తర్వాత రెండో సారి సిద్దిపేట నియోజకవర్గానికి వస్తున్నారు. ఈ సందర్భంగా పలు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. మధ్యాహ్నం 2.30 గంటలకు నర్మేటలోని పామాయిల్ ఫ్యాక్టరీ ప్రారంభిస్తారు. అక్కడే వర్చువల్గా పలువాటికి శంకుస్థాపనలు చేయనున్నారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడనున్నారు. రూ.300 కోట్ల వ్యయంతో పామాయిల్ ఫ్యాక్టరీని అత్యాధునిక టెక్నాలజీతో నిర్మించారు. గంటకు 120 టన్నుల పామాయిల్ గెలలను క్రష్ చేసి నూనె తీయనుంది. ఉన్నతాధికారుల పర్యవేక్షణ ఈనెల 19న రైతు మహోత్సవ ప్రారంభం సందర్భంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల పోటాపోటీ నినాదాలతో కొంత ఉద్రిక్తత చోటు చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో ముందస్తు చర్యలలో భాగంగా ఐజీ చంద్రశశేఖర్ నేతృత్వంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రారంభ ఏర్పాట్లను ఆయిల్ ఫెడ్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి, వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్రమోహన్, కలెక్టర్ హైమావతి, ఐజీ చంద్రశేఖర్, సీపీ రష్మీ పెరుమాళ్ పర్యవేక్షించారు. 900 మంది పోలీస్ సిబ్బంది, అధికారులతో పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. స్థానిక బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను గుర్తించి ముందస్తుగా అరెస్ట్ చేసే అవకాశం ఉంది. పటిష్ట బందోబస్తు నంగునూరు(సిద్దిపేట): నర్మేటలోని ఆయిల్పామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవ నేపథ్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. శనివారం ఐజీ చంద్రశేఖర్రెడ్డి తోపాటు ఇంటెలిజెన్స్, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ అధికారులు ఫ్యాక్టరీని సందర్శించి భద్రతా ఏర్పాట్లపై ఆరా తీశారు. కలెక్టర్ హైమావతి, పోలీస్ కమిషనర్ రష్మీ పెరిమాళ్ తోపాటు భద్రతా సిబ్బంది, పోలీస్ అధికారులతో సమాలోచన చేశారు. సీఎం రేవంత్ హెలికాప్టర్లో వచ్చి.. తిరిగి రోడ్డు మార్గంలో వెళ్లే అవకాశం ఉండటంతో సిద్దిపేట నుంచి ఫ్యాక్టరీ వరకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దిశా నిర్దేశం చేశారు.ఏర్పాట్లపై మంత్రుల ఆరా మంత్రులు తుమ్మల నాగేశ్వర్రావు, పొన్నం ప్రభాకర్ సీఎం పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను ఐజీ, కలెక్టర్ను అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి గందరగోళ పరిస్థితులు ఏర్పడకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. జిల్లాలో పలు ప్రారంభోత్సవాలు,శంకుస్థాపనలు పోలీసుల పటిష్ట బందోబస్తు -
2,650 మంది రైతుల తరలింపు
కలెక్టర్ ప్రతిమాసింగ్ మెదక్ కలెక్టరేట్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘ప్రజాపాలన రైతు ఉత్సవాల’ కార్యక్రమంలో జిల్లా రైతులు ఉత్సాహంగా పాల్గొనాలని కలెక్టర్ ప్రతిమాసింగ్ శనివారం ఒక ప్రకటనలో సూచించారు. నేడు సిద్దిపేట జిల్లా నర్మెట్టలో సీఎం రేవంత్రెడ్డి ఆయిల్ఫామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు జిల్లా పరిధిలోని 21 మండలాలకు చెందిన 2,650 మంది రైతులను 53 బస్సుల ద్వారా తరలించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చెప్పారు.నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం పెద్దశంకరంపేట(మెదక్): మండలంలోని 33 కేవీ సబ్స్టేషన్ పరిధిలో నూతన ఫీడర్ విస్తరణలో భాగంగా ఆదివారం విద్యుతత్్ సరఫరా లో అంతరాయం ఉంటుందని ఏఈ శ్యాంసుందర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు చెట్ల తొలగింపు, మరమ్మతుల కారణంగా విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నట్లు చెప్పారు. ఈవిషయాన్ని ప్రజలు గమనించి, సహకరించాలని కోరారు. 24న కలెక్టరేట్ ఎదుట ధర్నా మెదక్ కలెక్టరేట్: ప్రజాసమస్యలపై ఈనెల 24న కలెక్టర్ ఎదుట ధర్నా నిర్వహించనున్నట్లు సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు అడివయ్య తెలిపారు. శనివారం మెదక్లోని కేవల్ కిషన్ భవన్లో జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. జిల్లాలో అనేక గ్రామాల్లో ఉపాధి పనులు ప్రారంభం కాలేదన్నారు. పని ప్రారంభించిన చోట కూలీలకు సరైన డబ్బులు రావడం లేదన్నారు. ధర్నాకు ప్రజలు పెద్దఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు నర్సమ్మ, మల్లేశం, బాలమణి, మల్లేశం, తదితరులు పాల్గొన్నారు. పార్టీ బలోపేతానికి కృషి డీసీసీ ఉపాధ్యక్షుడు యాదగిరి రామాయంపేట(మెదక్): కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేస్తానని డీసీసీ ఉపాధ్యక్షుడిగా నూతనంగా ఎన్నికై న చింతల యాదగిరి అన్నారు. శనివారం పట్టణంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. తనపై నమ్మకంతో పార్టీ పెద్దలు ఇచ్చిన పదవికి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. తన నియామకానికి సహకరించిన రాష్ట్ర నాయకుడు మైనంపల్లి హన్మంతరావు, ఎమ్మెల్యే రోహిత్, డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్, మున్సిపల్ చైర్పర్సన్ లావణ్య, కౌన్సిలర్ నాగరాజుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. బీహెచ్ఈఎల్ నుంచి గోవాకు బస్సు సర్వీసులుపటాన్చెరు: బీహెచ్ఈఎల్ డిపో నుంచి కుక్కే సుబ్రహ్మణ్యస్వామి, ఉడుపి, మురుడేశ్వర, గోకర్ణ మీదుగా 25వ తేదీన గోవాకు సర్వీస్ నడుపుతున్నట్లు డిపో మేనేజర్ మోహన్రావు శనివారం ఓ ప్రకటనలో వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...వీకెండ్లలో గోవాకు ఒక్కరి రూ.6,150 టికెట్ ఉంటుందన్నారు. అదేవిధంగా ఒక కాలనీలో కనీసం 30మంది విహారయాత్రలకు, పెళ్లిళ్లకు, శుభకార్యాలకు బీఓసీ కింద బస్సులు నడపనున్నట్లు వివరించారు. మరిన్ని వివరాలకోసం 9063401072 సంప్రదించాలని సూచించారు. -
ట్రామా కేర్ ఏదీ?
ఈనెల 4న రాత్రి చేగుంట మండలం నర్సంపల్లి తండాకు చెందిన సాయికుమార్ తన స్నేహితులతో కలిసి బైక్పై వెళ్తుండగా.. రామాయంపేట శివారులోని జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. వారిని చికిత్స నిమిత్తం హైదరాబాద్ తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ సాయికుమార్ మృతి చెందాడు. సకాలంలో వైద్యం అందితే ఆ యువకుడు బతికేవాడు. జనవరి 28న కామారెడ్డి జిల్లా బస్వాపూర్కు చెందిన బాలరాజు తన కుటుంబంతో కలిసి ఆటోలో పాతూర్ వెళ్తున్న క్రమంలో అక్కన్నపేట వద్ద ఆటోను ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అతడి భార్య సంఘటనా స్థలంలోనే దుర్మరణం చెందింది. బాల్రాజును హైదరాబాద్ తరలిస్తుండగా, మార్గమధ్యలోనే మృతి చెందాడు. ఇక్కడ ట్రామా కేర్ సెంటర్ ఉంటే అతడు బతికే అవకాశాలు ఉండేవని పలువురు పేర్కొంటున్నారు. రామాయంపేట(మెదక్): రామాయంపేట మీదుగా 44వ నంబర్ జాతీయ రహదారితో పాటు 765 డీజీ హైవే వెళ్తోంది. కాగా ఈ రెండు జాతీయ రహదారులపై నిత్యం ఎక్కడో ఒకచోట ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. క్షత్రగాత్రులను హైదరాబాద్ తరలిస్తున్న క్రమంలో చాలా మంది మార్గమధ్యలోనే మృత్యువాత పడుతున్నారు. ఇక్కడ ట్రామా కేర్ సెంటర్ ఉంటే చాలా మంది బతికే అవకాశాలుంటాయి. కాగా గత ప్రభుత్వం జిల్లాలో ప్రత్యేకంగా ట్రామా కేర్ సెంటర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. మెదక్తో పాటు పొరుగున ఉన్న కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రిలో ట్రామా కేర్ సెంటర్ ఏర్పాటు చేశారు. జిల్లా సరిహద్దులో ఉన్న రామాయంపేటకు సైతం గతంలో ట్రామా కేర్ సెంటర్ మంజూరైనా, అతీగతీ లేకుండా పోయింది. జిల్లాలో ఒక్క సెంటర్ లేదు ప్రమాదాల నివారణకు జాతీయ రహదారిపై ప్రతి 30 కిలోమీటర్లకు ఒక ట్రామా కేర్ సెంటర్ ఏర్పాటు చేస్తామని గతంలో మంత్రి దామోదర రాజనర్సింహ ప్రకటించారు. జిల్లాలో రామాయంపేట, చేగుంట, తూప్రాన్ మండలాల మీదుగా 56 కిలోమీటర్ల మేర 44వ జాతీయ రహదారి, 58 కిలోమీటర్ల మేర 765 డీజీ హైవే విస్తరించి ఉంది. ఈరెండు రహదారులపై ప్రతి రోజు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. క్షత్రగాత్రులను గోల్డెన్ అవర్లో సకాలంలో ఆస్పత్రికి తరలిస్తేనే బతికే అవకాశాలుంటాయి. ఏ మాత్రం ఆలస్యమైన ఫలితం ఉండదు. నూతనంగా నిర్మించిన స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో ట్రామా కేర్ సెంటర్కు సరిపడా స్థలం ఉంది. ప్రస్తుతం ఈ భవనంలో గ్రౌండ్ ఫ్లోర్ను మాత్రమే వినియోగిస్తున్నారు. మొదటి, రెండో అంతస్తులు నిరుపయోగంగా ఉన్నాయి. వీటిలో ట్రామాకేర్ సెంటర్ ఏర్పాటు చేస్తే ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుంది. ప్రతిపాదనలు పంపాం జిల్లాలో జాతీయ రహదారి వెంట ఉన్న రామాయంపేట, నర్సాపూర్లో ట్రామా కేర్ సెంటర్ల ఏర్పాటు కోసం తా ము ప్రతిపాదనలు పంపాం. ఇప్పటివరకు ఎలాంటి మంజూరు రాలేదు. త్వరలో మంజూరయ్యే అవకాశం ఉంది. – శ్రీరాం, డీఎంహెచ్ఓ -
గ్యాస్ కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు
పాపన్నపేట(మెదక్)/టేక్మాల్: గ్యాస్, యూరియా కృత్రిమ కొరత సృష్టిస్తే సంబంధిత డీలర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని అదనపు కలెక్టర్ నగేశ్ హెచ్చరించారు. శుక్రవారం పాపన్నపేటలోని రైతు ఆగ్రో సెంటర్, ప్యాక్స్ సెంటర్లను పరిశీలించారు. అందులో ఉన్న యూరియా, ఎరువుల నిల్వ రిజిస్టర్లను తనిఖీ చేశారు. అలాగే గ్యాస్ బుకింగ్ రికార్డులను చూశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వినియోగదారులకు ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బందులు కలుగకుండా సేవలు అందించాలని సూచించారు. అవకతవకలు చోటు చేసుకుంటే, సంబంధిత దుకాణదారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆయన వెంట తహసీల్దార్ సతీశ్, ఇతర అధికారులు ఉన్నారు. అలాగే టేక్మాల్ మండల కేంద్రంలో విస్తృతంగా పర్యటించారు. ఆగ్రో సేవా కేంద్రాన్ని, గ్యాస్ గోదాంను పరిశీలించారు. కేజీవీబీ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని సూచించారు. జిల్లాలో సరిపడా గ్యాస్ సిలిండర్లు ఉన్నాయన్నారు. ఆయన వెంట తహసీల్దార్ తులసీరామ్, వ్యవసాయ అధికారి రాంప్రసాద్, ఆర్ఐ సాయి శ్రీకాంత్ తదితరులు ఉన్నారు.అదనపు కలెక్టర్ నగేశ్ -
గ్యారంటీలకు నిధులేవి?
నర్సాపూర్: ప్రజలను మభ్యపెట్టే విధంగా రాష్ట్ర బడ్జెట్ ఉందని ఎమ్మెల్యే సునీతారెడ్డి ఆరోపించారు. శుక్రవారం పట్టణంలో విలేకరులతో మాట్లాడుతూ.. బడ్జెట్తో ప్రజలకు ఒరిగిందేమి లేదన్నారు. ఎన్నికలప్పుడు కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలను వంద రోజుల్లో అమలు చేస్తామని ఇప్పటివరకు పూర్తిస్థాయిలో అమలు చేయలేదన్నారు. ఇప్పటి వరకు మూడుసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ప్రభుత్వం ఆరు గ్యారంటీలకు నిధులు కేటాయించలేదన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎమ్మెల్యేలకు నిధులు సైతం ప్రభుత్వం కేటాయించడం లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకులవి మాటలే తప్ప చేతల్లో ఏమి ఉండటం లేదన్నారు. ఇప్పటికై నా ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. గజ్వేల్ మున్సిపాలిటీకి రూ.89 లక్షల ఆదాయంగజ్వేల్: మున్సిపాలిటీకి తెబజార్, పశువుల సంత వేలం ద్వారా రూ.89లక్షల ఆదాయం సమకూరింది. శుక్రవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో చైర్పర్సన్ గంగిశెట్టి చందన, కమిషనర్ వెంకటగోపాల్ ఆధ్వర్యంలో ముందుగా తైబజార్ వేలం జరిగింది. ఇందులో 21మంది పాల్గొనగా..ఈ భిక్షపతి అత్యధికంగా రూ.70లక్షలు పాట పాడి దక్కించుకున్నారు. -
మసీదుల వద్ద పటిష్ట భద్రత
మెదక్ కలెక్టరేట్: రంజాన్ను పురస్కరించుకుని నవాబ్పేట్లోని ఈద్గా వద్ద ఏర్పాటు చేసిన భద్రతా ఏర్పాట్లను అదనపు ఎస్పీ మహేందర్ శుక్రవారం సాయంత్రం పరిశీలించారు. ఈసందర్భంగా ఈద్గా పరిసరాల్లో భద్రతా చర్యలు, పార్కింగ్ ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు సూచనలు ఇచ్చారు. జిల్లా కేంద్ర పరిధిలోని మసీదుల వద్ద పటిష్ట భద్రత కల్పించినట్లు తెలిపారు. ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడాలని సిబ్బందిని ఆదేశించారు. ప్రధాన రహదారులు, చౌరస్తాల్లో ప్రత్యేక పోలీస్ పికెట్స్ ఏర్పాటు చేసి, రద్దీ ప్రాంతాల్లో అదనపు సిబ్బందిని మోహరించినట్లు వివరించారు. పండుగ రోజుల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిరంతర పెట్రోలింగ్ కొనసాగిస్తామన్నారు. ముస్లింలు పండుగను శాంతియుతంగా జరుపుకోవాలని కోరారు. ఆయన వెంట డీఎస్పీ ప్రసన్నకుమార్, పట్టణ సీఐ మహేష్, సిబ్బంది ఉన్నారు. అదనపు ఎస్పీ మహేందర్ -
ఆస్పత్రి కార్యాలయ అధికారి సరెండర్
పెండింగ్ మెడికల్ రీయింబర్స్మెంట్ బిల్లులకు మోక్షం మెదక్ అర్బన్: మెడికల్ రీయింబర్స్మెంట్ బిల్లుల మంజూరులో అవినీతికి, అలసత్వానికి పాల్పడిన సర్వజన ఆస్పత్రి కార్యాలయ సూపరింటెండెంట్ లతీఫొద్దీన్ ముజాహిద్దీన్ను తదుపరి చర్యల నిమిత్తం రాష్ట్ర ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ సంచాలకుడు సరెండర్ చేసినట్లు మెదక్ సూపరింటెండెంట్ సునీత తెలిపారు. మెడికల్ రీయింబర్స్మెంట్ బిల్లుల మంజూరులో ముజాహిద్దీన్పై ‘సాక్షి’లో ప్రచురితమైన కథనాలకు జిల్లా అధికారులు స్పందించారు. ఈనెల 13న ఏసీబీ డీఎస్పీ ఆధ్వర్యంలో సోదాలు నిర్వహించి, రికార్డులు పరిశీలించారు. అనంతరం సంబంధిత డిపార్డ్మెంట్కు నివేదిక అందజేసేందుకు అవసరమైన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఈలోగా సూపరింటెండెంట్ కార్యాలయం ఒక అంతర్గత కమిటీని ఏర్పాటు చేసి విచారణ చేపట్టింది. అతడిపై వచ్చిన ఆరోపణలు, ప్రవర్తన, ఫైళ్ల పరిష్కారంలో జాప్యం, తీవ్రమైన అక్రమాలను గుర్తించింది. ఈమేరకు ముజాహిద్దీన్ను సరెండర్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పెండింగ్ ఫైళ్లను సైత్తం క్లియర్ చేశారు. -
పండుగలా రైతు మహోత్సవం
భారీ సంఖ్యలో తరలివచ్చిన రైతులు నంగునూరు(సిద్దిపేట): నర్మేట ఆయిల్పామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవంలో భాగంగా ఏర్పాటు చేసిన స్టాళ్లు అన్నదాతలను ఆకట్టుకుంటున్నాయి. ఉద్యాన, ఇరిగేషన్, మార్క్ఫెడ్, వ్యయ సాయ, పట్టు పరిశ్రమ, పశుసంవర్ధక, మత్స్యశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను ఆసక్తిగా పరిశీలించారు. కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, వరంగల్, నల్లగొండ, జనగాం, కామారెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లాల నుంచి వచ్చిన రైతులు ఒక్కో స్టాల్ తిరుగుతూ పనిముట్లు, పంటసాగుపై ఆరా తీశారు. ఒక్కో స్టాల్ వద్ద ఆయా కంపెనీల ప్రతినిధులు రైతులకు అవగాహన కల్పిస్తూ ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీలను వివరించారు. ఆకట్టుకున్న పాల యంత్రం పీవీ నరసింహారావు తెలంగాణ యూనివర్సిటీ కాలేజీ విద్యార్థులు విద్యుత్తో నడిచే మీగడ తయారీ యంత్రంలో పాలు పోసి చేసే విధానాన్ని ప్రదర్శించారు. యంత్రంలో పోసిన పాలను వివిధ రూపాల్లో వేడి చేయడం ద్వారా గంటలో పెరుగు, నెయ్యి, పాలకోవ, మజ్జిగ, పన్నీర్, మిల్క్పౌడర్, జున్ను పాల ఉత్పత్తులను ఏలా తయారు చేయవచ్చో వివరించారు. చిన్న పరిశ్రమలు పెట్టుకునే వారికి ఎంతో ఉపయోగంగా ఉంటుందని కళాశాల విద్యార్థి రైతులకు వివరించారు. డ్రిప్ ద్వారా నీటి ఆదా ఆయిల్పామ్ సాగు తోపాటు బిందు సేద్యానికి ప్రాధాన్యత పెరగడంతో స్టాల్లో ఏర్పాటు చేసిన డ్రిప్ పరికరాలను అన్నదాతలు ఆసక్తిగా గమనించారు. -
సంక్షేమ పద్దు పొడుపు
అసెంబ్లీలో శుక్రవారం భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన పద్దు సంక్షేమ మంత్రం జపించింది. అన్నివర్గాలను లక్ష్యంగా చేసుకుని వరాల వాన కురిపించింది. విద్యార్థులను మురిపించి.. అన్నదాతలను మెప్పించి.. పేదలకు బీమా కల్పిస్తూ బడ్జెట్ పద్దు బహుబాగు అనిపించింది. అదే సమయంలో జిల్లాకు ప్రత్యేక కేటాయింపులు ఏమి జరగపోవడం నిరాశ కలిగించింది. – మెదక్జోన్ ఇందిరమ్మ బీమా పథకాన్ని బడ్జెట్లో కొత్తగా ప్రవేశపెట్టారు. కుటుంబ యజమాని ఏదేని కా రణంతో మరణిస్తే ఈ పథకం ద్వారా రూ. 5 లక్షల బీమా వర్తించనుంది. దీంతో జిల్లాలో 1,68,365 కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. అలాగే ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్మీడియెట్ వరకు చదివే విద్యార్థులకు వారంలో 3 రోజులు పాలు, మరో 3 రో జుల పాటు రాగిజావ అందించనున్నారు. జిల్లావ్యాప్తంగా 75,263 మంది విద్యార్థులు ఈపథకం ద్వారా మేలు చేకూరనుంది. ఇంటర్ విద్యార్థులకు సైతం మధ్యాహ్న భోజనం అందించనున్నారు. జిల్లాలోని 16 ప్రభుత్వ కళాశాలల్లో చదువుకునే 6,585 మంది విద్యార్థులకు లబ్ధి జరగనుంది. అంతేకాకుండా దివ్యాంగ విద్యార్థులకు ద్విచక్ర వాహనాలు అందనున్నాయి. కొత్త పెన్షన్లకు మోక్షం ఎన్నో ఏళ్లుగా చేయూత పెన్షన్ల కోసం ఎదురుచూస్తున్న వారికి ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. కొత్త పెన్షన్లకు బడ్జెట్లో నిధులు కేటాయించింది. దీంతో జిల్లాలో ఇప్పటివరకు 1,200 మంది ఆన్లైన్, మరో 6 వేల పైచిలుకు మంది ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. వీరికి త్వరలో కొత్త పింఛన్లు అందనున్నాయి. అలాగే రాజీవ్ యువ వికాసం కోసం బడ్జెట్లో రూ. 6 వేల కోట్లు కేటా యించారు. జిల్లాలో నిరుద్యోగ యువత సుమారు 19 వేల పైచిలుకు ఉన్నట్లు తెలిసింది. వారందరికీ ఈ పథకం ద్వారా ఉపాధి లభించనుంది. అలాగే అడ్వాన్స్ టెక్నాలజీ (ఏటీసీ) సెంటర్లలో శిక్షణ పొందుతున్న నిరుద్యోగులకు నెలకు రూ. 2 వేల చొప్పున స్కాలర్షిప్ అందిస్తామని చెప్పడంతో, జిల్లాలో 170 మందికి మేలు జరగనుంది. పెట్రోల్, డీజిల్తో నడిచే ఆటోలను ప్రభుత్వ ఖర్చుతో ఎలక్ట్రానిక్ వాహనాలుగా మారుస్తామన్నారు. జిల్లాలో 10,734 ఆటోవాలాలు ఉన్నారు. సన్నాలకు నిధులు.. అలాగే సన్న ధాన్యానికి బడ్జెట్లో రూ. 3,500 కోట్ల నిధులు కేటాయించారు. జిల్లాలో గత యాసంగిలో 40 వేల ఎకరాల్లో రైతులు సన్నాలు సాగు చేయగా, రూ.31.37 కోట్ల బకాయిలు నేటికీ చెల్లించలేదు. ప్రస్తుతం రైతుల ఖాతాల్లో నిధులు జమ కానున్నాయి. అలాగే ఉద్యోగులకు, పెన్షన్దారులకు నగదు రహిత వైద్యం అందించనున్నారు. ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.1.20 కోట్ల బీమా ఇస్తామని ప్రకటించారు. జిల్లాలో 5 వేల పైచిలుకు ఉద్యోగులు, పెన్షన్దారులు ఉన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో చదువుకునే చిన్నారులకు ఏడాదికి రెండు జతల యూనిఫాంలు ఇవ్వనున్నారు. జిల్లాలో 25,245 మంది చిన్నారులు చదువుకుంటున్నారు. అలాగే రైతు భరోసా కింద జిల్లాలోని 2.62 లక్షల మంది రైతులకు సుమారు రూ.220 కోట్ల పెట్టుబడి సాయం అందనుంది. ఈ‘సారీ’ నిరాశే మెతుకుసీమలో ఏకై క మధ్యతరహా ప్రాజెక్టు ఘనపూర్ స్థిరాయకట్టు కేవలం 25 వేల ఎకరాలు మాత్రమే. దాని ఎత్తు పెంపు కోసం చాలా కాలంగా రైతులు ఎదురుచూస్తుండగా, ఈసారి నిరాశే మిగిలింది. అలాగే కాళేశ్వరం కెనాళ్ల పనులకు నిధులు కేటాయించలేదు. మెదక్ బైపాస్ రోడ్డు ప్రస్తావనకు రాలేదు. బడ్జెట్లో అన్ని రంగాలకుకేటాయింపులు -
61 మందితో డీసీసీ కార్యవర్గం
మెదక్జోన్: జిల్లా కాంగ్రెస్ కమిటీలో 61 మందికి చోటు కల్పిస్తూ టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ గురువారం జాబితా విడుదల చేశారు. డీసీసీ అధ్యక్ష స్థానానికి ప్రధానంగా నలుగురు పోటీపడగా ఆంజనేయులుగౌడ్ను రెండోసారి నియమించిన విషయం తెలిసిందే. కాగా జిల్లా కార్యవర్గంలో 61 మంది సీనియర్ కాంగ్రెస్ కార్యకర్తలకు చోటు కల్పించారు. అందులో 14 మంది వైస్ ప్రెసిడెంట్లు, 20 మంది జనరల్ సెక్రటరీలు, ఆరుగురు అధికార ప్రతినిధులు, 20 మంది సెక్రటరీలు, ఒకరిని ట్రెజరీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అధికార ప్రతినిధులుగా జె. నర్సింహచారి, శెట్టి శ్రీకాంత్, బండారి గంగాధర్, లూనావత్ రాణినాయక్, శ్రీనివాస్రావు, మహేశ్వరరెడ్డి, ట్రెజరీగా శివరామకృష్ణ, జిల్లా ఉపాధ్యక్షులుగా మన్నె విజయభాస్కర్, నర్సింహారెడ్డి, గడప దేవేందర్, కొడకంటి హరిత, దేమ యాదగిరి, ప్రశాంత్రెడ్డి ఎరుకల నర్సింహా, శ్రీనివాస్రెడ్డి, ప్రవీణ్ కుమార్రెడ్డి, యాదగిరి, సిద్దిరాములు, నరేందర్రెడ్డి, అశోక్, పాషా, జనరల్ సెక్రటరీలుగా, అశోక్రెడ్డి, రాజేంద్ర పాటీల్, నవీన్ కుమార్, రాజాగౌడ్, ఎండీ అఫ్సర, శశిభూషణ్రెడ్డి, నర్సింగ్నాయక్, ప్రేమ్కుమార్, వినోద్కుమార్, విద్యాసాగర్, అమీరుద్దీన్, రమేష్, శేక్ సల్మాన్, కుమార్, రమేష్గౌడ్, గోపీనాయక్, శ్రవణ్కుమార్, మేఘమాల, సిద్దిరాములుగౌడ్, శేఖులుతో పాటు సెక్రటరీలుగా మరో 20 మందిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. -
గ్యాస్ కష్టాలు.. కళ్లకు కట్టెనట్టు
కౌడిపల్లి(నర్సాపూర్): మండలంలో గ్యాస్ కొరత గృహాలు, హోటళ్లకు తాకింది. దీంతో కట్టెల పొయ్యిపై వంటలు చేస్తున్నారు. హోటల్లో టిఫిన్ ధరలు అమాంతం పెంచారు. మండల కేంద్రంలోని కౌడిపల్లిలో గత వారం రోజులుగా గ్యాస్ సరఫరా నిలిచిపోయింది. బుక్ చేసినా స్టాక్ లేక సిలిండర్ దొరకడం లేదు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. కాగా హోటల్ యజమానులు గ్యాస్ అందుబాటులో లేకపోవడంతో కట్టెల పొయ్యిపై వంట చేస్తున్నారు. కాగా కౌడిపల్లిలో ఇన్నాళ్లు ప్లేట్ టిఫిన్ ధర రూ.30 ఉండగా, ప్రస్తుతం రూ. 40కు పెంచారు.కౌడిపల్లి: హోటల్లో కట్టెల పొయ్యిపై వంట చేస్తున్న నిర్వాహకులు -
ఊరూరా.. ఉగాది సందడి
● ‘పరాభవ’కు ఘన స్వాగతం పలికిన జిల్లా ప్రజలు ● ఆలయాల్లో పూజలు.. పంచాంగ శ్రవణం మెదక్ కలెక్టరేట్: తెలుగు నూతన సంవత్సరాది ఉగాది పర్వదినాన్ని గురువారం జిల్లా ప్రజలు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ఊరూవాడ పరాభవ నామ సంవత్సరానికి ఘనస్వాగతం పలికారు. దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతి ఇంటా నూతన మట్టికుండల్లో షడ్రుచులతో కూడిన ఉగాది పచ్చడి తయారు చేసి పిల్లలు, పెద్దలు పంచుకున్నారు. భక్షాలు తయారు చేసి కుటుంబ సభ్యులంతా ఆరగించారు. సాయంత్రం అన్ని గ్రామాల కూడళ్లు, దేవాలయాల్లో అర్చకులు, వేద పండితులు పంచాంగ శ్రవణం నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని వెంకటేశ్వర ఆలయం, రామాలయంలో పూజారి వైద్య శ్రీనివాసశర్మ పంచాంగ శ్రవణం చేశారు. ఈ నూతన సంవత్సరంలో అకాల వర్షాలతో కొంత నష్టం జరిగే అవకాశం ఉందన్నారు. వర్షాలు సమృద్ధిగా కురిసి ప్రాజెక్టులు, రిజర్వాయర్లు జలకళను సంతరించుకుంటాయన్నారు. అంతకుముందు మెదక్ మున్సిపల్ చైర్పర్సన్ రాధిక, వైస్ చైర్మన్ దొంతి నరేశ్గౌడ్ ప్రత్యేక పూజలు చేశారు. కాగా ఉగాది పండుగ వేళ మెదక్ కూరగాయల మార్కెట్ జనంతో కిటకిటలాడింది. మట్టి కుండలు, వేప పువ్వు, మామిడి కాయలు, ఆకులు విక్రయాలు పెద్ద ఎత్తున జరిగాయి. -
నేత్రపర్వం.. శతఘటాభిషేకం
వర్గల్(గజ్వేల్): ఉగాది పర్వదిన శుభవేళ దేవదేవుని అష్టోత్తర శతకలశ మహాభిషేకం నేత్రపర్వం చేసింది. నాచగిరీశుడు లక్ష్మీనృసింహుని దివ్యదర్శనంతో భక్తజనావళి తరించింది. సుప్రసిద్ధపుణ్యక్షేత్రం నాచగిరిలో ఆధ్యాత్మిక అనుభూతులు పంచిన బ్రహ్మోత్సవాలు గురువారం అష్టోత్తర శతఘటాభిషేకంతో ముగిశాయి. ఆలయ ఈఓ బెల్లంకొండ రంగాచారి, చైర్మన్ రవీందర్గుప్తా పర్యవేక్షణ, ధర్మకర్తలు, తీర్థజనుల సమక్షంలో ఉదయం అర్చకులు ఆలయ మండపంలో 108 కలశాలు స్థాపన చేశారు. కలశ పూజ నిర్వహించారు. హోమం జరిపారు. పూర్ణ కలశంతో ఆలయ ప్రదక్షిణ చేసి నృసింహ నామార్చనలు, మంత్రోచ్ఛారణల మధ్య గర్భగుడిలో మూలవిరాట్టులకు మహాభిషేకం జరిపారు. పట్టువస్త్రాలు, పూలమాలికలు, సర్వాభరణాలతో శ్రీ లక్ష్మీ సమేత నృసింహస్వామివారిని కమనీయంగా అలంకరించారు. భక్తులు నాచగిరీశుని దివ్యమంగళరూపం దర్శించుకుని తరించారు. షడ్రుచుల సమ్మేళనం ఉగాది పచ్చడి తీర్థం స్వీకరించారు. -
ఇంటి నిర్మాణాలకు వెనకడుగు
● జిల్లాలో మొదటి విడతలో 9,209 ఇళ్లు మంజూరు ● ప్రారంభించినవి 5,337 మాత్రమే పేదలకు సొంతింటి కలను నిజం చేయాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకానికి శ్రీకారం చుట్టింది. జిల్లాలో లబ్ధిదారులను ఎంపిక చేసి ఇళ్లు మంజూరు చేసింది. అయితే ఇళ్లు మంజూరై తొమ్మిది నెలలు గడిచినా, ఇప్పటివరకు 30 శాతం మంది నిర్మాణాలు ప్రారంభించలేదు. కాగా వారి పేర్లను జాబితా నుంచి తొలగించి అర్హులైన వారికి అధికారులు ఇళ్లు మంజూరు చేస్తున్నారు. – మెదక్జోన్ జిల్లావ్యాప్తంగా 21 మండలాలు ఉండగా, మొదటి విడతలో 9,209 ఇళ్లు మంజూరయ్యాయి. గడిచిన తొమ్మిది నెలల్లో ఇప్పటివరకు 5,337 మంది లబ్ధిదారులు మాత్రమే ఇళ్ల నిర్మాణాలు కొనసాగిస్తున్నారు. ఈ లెక్కన ఇంకా 3,827 మంది నిర్మాణాలు ప్రారంభించలేదు. దీంతో వారి పేర్లను తొలగించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఇలా ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా 500 మంది పైచిలుకు పేర్లను జాబితా నుంచి తొలగించారు. వారి స్థానంలో అర్హులైన 482 మంది లబ్ధిదారుల పేర్లను కొత్తగా జాబితాలో చేర్చారు. నిబంధనల ప్రకారం లబ్ధిదారుడు 45 రోజుల్లో ఇంటి నిర్మాణాన్ని ప్రారంభించాలి. లేనిచో ఆ ఇంటిని రద్దు చేసే అధికారం అధికారులకు ఉంటుంది. కాగా పూరిగుసెలో నివాసం ఉంటున్న వారు ఇంటి నిర్మాణం ప్రారంభించక పోయినా, వారి పేర్లు మాత్రం జాబితా నుంచి తొలగించలేదు. వారికి అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. ఒకవేళ ఆర్థికంగా వెనుకబడి, స్వయం సహాయక గ్రూపు సభ్యులై ఉంటే వారికి సదరు గ్రూపు నుంచి రూ.లక్ష వరకు అప్పు ఇప్పించి ఇంటి నిర్మాణాన్ని ప్రారంభించే విధంగా చర్యలు చేపడుతున్నారు. గ్రూపులో లేని వారిని గుర్తించి ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలిసింది. నేతల ప్రమేయంతోనే ఎంపిక ఇందిరమ్మ ఇళ్ల కోసం నిజమైన లబ్ధిదారులను ఎంపిక చేయాల్సి ఉండగా, రాజకీయ నాయకుల ప్రమేయంతోనే అధికారులు అర్హుల జాబితా తయారు చేసినట్లు తెలిసింది. దీంతో ఇళ్లు మంజూరైన వారికి ఉండేందుకు ఇళ్లు ఉండటంతోనే నిర్మాణాలు ప్రారంభించ లేదని తెలిసింది. ఇక రెండో విడత లబ్ధిదారుల ఎంపికలోనైనా రాజకీయ ప్రమేయం లేకుండా అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అర్హులకే ఇళ్లు మంజూరు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసి 9 నెలలు గడుస్తోంది. నేటికీ నిర్మాణాలు ప్రారంభించని వారి పేర్లు జాబితా నుంచి తొలగించి అర్హులైన వారి పేర్లను జాబితాలో చేర్చుతున్నాం. పూరి గుడిసెలో ఉండే వారి పేర్లు మాత్రం ప్రస్తుతానికి తొలగించటం లేదు. – మాణిక్యం, హౌసింగ్ పీడీ -
24 గంటల కరెంట్ ఇవ్వాల్సిందే
చిన్నశంకరంపేట(మెదక్): రాష్ట్ర ప్రభుత్వం రైతులకు 24 గంటల విద్యుత్ సరాఫరా చేయాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మారెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం మండలంలోని సూరారంలో ఆమె మాట్లాడుతూ.. పంటలకు విద్యుత్ సరిగా అందకపో వడంతో పంటలు ఎండిపోతున్నాయన్నారు. కనీసం 10 గంటలు కూడా అందించడం లేదని వా పోయారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించకుంటే రైతుల ఆగ్రహానికి గురికావాల్సి ఉంటుందని హెచ్చరించారు. రైతుభరోసా డబ్బులు అందరికీ ఒకేసారి విడుదల చేయాలన్నారు. ఆరు గ్యారంటీలను వెంటనే అమలు చేయాలన్నారు. ఆమె వెంట మాజీ జెడ్పీటీసీ పట్లోరి మాధవిరాజు, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాజు, నాయకులు లక్ష్మారెడ్డి, మహిపాల్రెడ్డి, సర్పంచ్ సావిత్రి, నాగరాజు ఉన్నారు. -
జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా భవాని
పెద్దశంకరంపేట(మెదక్): జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా మండల కేంద్రానికి చెందిన అవుసుల భవాని నియమితులయ్యారు. గతంలో కాంగ్రెస్కు రాజీనామా చేసి బీఆర్ఎస్లో చేరారు. ఈక్రమంలో ఏఐసీసీ మహిళా అధ్యక్షురాలు అలకలాంబ, పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ పిలుపు మేరకు తిరిగి ఆమె హస్తం పార్టీలో చేరారు. ఈమేరకు సోమవారం గాంధీభవన్లో నియామకపత్రం అందుకున్నారు. తనను తిరిగి జిల్లా అధ్యక్షురాలిగా నియమించిన కాంగ్రెస్ నాయకులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు. చేగుంట(తూప్రాన్): రైతులు ఆయిల్పామ్ పంటలు వేసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి దేవ్కుమార్ సూచించారు. సోమవారం మండలంలోని పెద్దశివునూర్లో ఆయిల్పాం పంటలు పరిశీలించి రైతులతో మాట్లాడారు. నీటి సౌకర్యం తక్కువగా ఉన్న పొలాల్లో ఆయిల్పాం వేసుకోవాలన్నారు. ఒకసారి పంట వేసుకుంటే నాలుగో సంవత్సరం నుంచి 25 ఏళ్ల వరకు దిగుబడి వస్తుందని తెలిపారు. కోతుల బెడద లేకుండా ఉండటంతో పాటు అంతర పంటలు వేసుకుంటే ప్రభుత్వం పెట్టుబడి సాయం కోసం ఎకరాకు రూ.4 వేలు అందిస్తుందన్నారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి హరిప్రసాద్, సర్పంచ్ సర్సింలు, వ్యవసాయ విస్తరణ అధికారి భువనేశ్వరీ తదితరులు పాల్గొన్నారు. మెదక్జోన్: సఖీ, భరోసా సెంటర్లు మహిళలకు రక్షణగా నిలుస్తున్నాయని లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ చీఫ్ కరుణాకర్ తెలిపారు. సోమవారం పట్టణంలోని సఖీ, భరోసా కేంద్రాలతో పాటు బాలసదన్ చిల్డ్రన్ హోమ్ను సందర్శించారు. చిన్నారులతో మాట్లాడి వారికి అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు. కార్యక్రమంలో అడ్వకేట్ బాలనర్సింలు, సఖీ సిబ్బంది రేణుక, భరోసా సెంటర్ కోఆర్డినేటర్ సౌమ్య తదితరులు పాల్గొన్నారు. రామాయంపేట(మెదక్): కాంగ్రెస్ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈమేరకు పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రాగి రాములు, మండలాధ్యక్షుడు నవీన్గౌడ్, పట్టణశాఖ అధ్యక్షుడు శీలం అనివాశ్రెడ్డి, వీహెచ్పీ జిల్లా అధ్యక్షుడు పబ్బ సత్యం సోమవారం మాట్లాడారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ నెరవేర్చలేదని, ఈప్రభుత్వం అన్నివర్గాల ప్రజలను మోసగించిందని ఆరోపించారు. అంతకుమందు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆర్ఐకి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో అక్కన్నపేట సర్పంచ్ యాదగిరి, పార్టీ జిల్లా నాయకులు రాజేంద్రప్రసాద్, చింతల శేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
ఆర్వో ప్లాంట్లు
అంగన్వాడీలకు●జిల్లాలో మొదటి విడతగా 268 కేంద్రాలకు మంజూరు ●వచ్చే నెలాఖరులోగా బిగింపుఅంగన్వాడీ కేంద్రాల్లో సురక్షిత తాగు నీరు అందుబాటులో ఉండేలా కేంద్ర ప్రభుత్వం ఆర్వో ప్లాంట్లను ఏర్పాటు చేస్తుంది. చిన్నారులు, గర్భిణులు కలుషిత నీటితో వ్యాధుల బారిన పడకుండా ఈ నిర్ణయం తీసుకుంది. ఈమేరకు సాక్షం అంగన్వాడీ పోషణ్ 2.0 పథకం కింద నిధులు మంజూరు చేసింది. ఇందుకు గాను మొదటి విడతగా జిల్లాలో 268 కేంద్రాలను ఎంపిక చేసింది. – రామాయంపేట(మెదక్) జిల్లాలో ఇలా.. అంగన్వాడీ కేంద్రాలు 1,076 సొంత భవనాలు 369 ఆర్వో ప్లాంట్ల మంజూరు 268 కేంద్రాల్లో చిన్నారులు 54 వేల పైచిలుకు జిల్లాకు మంజూరైన ఆర్వో ప్లాంట్లను ప్రాధాన్యత క్రమంలో సొంత భవనాలు, విద్యుత్ సదుపాయం ఉన్న కేంద్రాలను మొదటి విడతగా ఎంపిక చేశారు. తర్వాత మిగితా కేంద్రాలకు ప్లాంట్లు మంజూరవుతాయని సీ్త్ర, శిశు సంక్షేమశాఖ అధికారులు చెబుతున్నారు. దీంతో పాటు కేంద్రాలకు వచ్చే చిన్నారులకు పోషక విలువలున్న కూరగాయలు, ఆకుకూరలు పండించడానికి వీలుగా పోషణ్ వాటిక పథకం కింద కిచెన్ గార్డెన్లు నిర్వహిస్తున్నారు. ● -
వార్డుల్లో సమస్యలపై ఆరా
మెదక్ కలెక్టరేట్: ‘ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో భాగంగా పట్టణంలో పారిశుద్ధ్య కార్యక్రమాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా సోమవారం పట్టణంలోని 1, 16, 17 వార్డుల్లో మున్సిపల్ చైర్పర్సన్ రాధిక, వైస్ చైర్మన్ నరేశ్ గౌడ్ పర్యటించారు. ఈసందర్భంగా ప్రజలతో మాట్లాడి సమస్యలపై ఆరా తీశారు. అనంతరం సిబ్బందితో పారిశుద్ధ్య పనులు చేయించారు. కార్యక్రమంలో ఆయా వార్డుల కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. కౌడిపల్లి(నర్సాపూర్): ఉపాధ్యాయులు అ ంకితభావంతో పనిచేసి విద్యార్థుల అ భ్యున్నతికి కృషి చేయాలని డీఈఓ విజయ అన్నారు. సోమవారం మండలంలోని తునికి వద్ద గల ఎంజేపీ గురుకుల పాఠశాలను అకస్మికంగా తనిఖీ చేశారు. తరగతి గదులు, పరిసరాలు, పారిశుద్ధ్యం, కిచెన్రూంను పరిశీలించారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల సమస్యల గురించి ప్రిన్సిపాల్ హరిబాబును అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ఉపాధ్యాయులు విధులు పట్ల అంకిభావంతో పనిచేయాలన్నారు. -
అన్నదాతకు భరోసా
మెదక్ అర్బన్: అన్నదాతల ఎదురుచూ పులు ఫలించే వేళ ఆసన్నమైంది. ఈనెల 22న సిద్దిపేట జిల్లా నర్మెట్టలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మొదటి విడత రైతు భరోసా విడుదల చేయనున్నారు. మూడు విడతల్లో ఈ ప్రక్రియ కొనసాగనుంది. జిల్లాలో సుమారు 2,62,043 రైతులకు గానూ రూ.220.84 కోట్లకు పైగా నిధులు మంజూరయ్యే అవకాశం ఉంది. ఎకరానికి రూ.6 వేలు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పటివరకు మూడు సార్లు రైతులకు పెట్టుబడి సాయం అందించారు. 2023–24 యాసంగి సీజన్లో ఎకరానికి రూ. 5 వేలు, 2024–25 యాసంగిలో రూ. 5 వేలు, 2025–26లో వానాకాలం సీజన్లో ఎకరానికి రూ.6 వేల చొప్పున జమ చేశారు. ఈ ఏడాది యాసంగి సీజన్ ప్రారంభమై మూడు నెలలు కావొస్తున్నా, రైతు భరోసా నిధులు జమ చేయలేదు. గత వానాకాలంలో చాలా వరకు పంటలు దెబ్బతినడం, సకాలంలో పెట్టుబడి సాయం అందకపోవడంతో రైతులు తీవ్ర నిరాశలో ఉన్నారు. సాగులో 2,86,225 ఎకరాలు జిల్లాలో యాసంగికి సంబంధించి 2,86,225 ఎ కరాల్లో పంటలు వేశారు. సుమారు 2,62,043 రైతులు ఉన్నారు. గత వానాకాలం లెక్కలకు సంబంధించి అప్పట్లో రైతు భరోసా కింద రూ.220,84,32,452 నిధులు విడుదలయ్యాయి. ఈసారి నిధులు మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం మూడు విడతల్లో రైతుల ఖాతాల్లో నిధుల జమ చేసే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈనెల 22న ఎకరం విస్తీర్ణం ఉన్న రైతులకు, 20 రోజుల తర్వాత రెండో విడత, ఏప్రిల్ నెలాఖరు లోపు మూడో విడతగా మొత్తం మంది రైతులకు భరోసా నిధులు జమచేయనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై జిల్లా వ్యవసాయాధికారి దేవకుమార్ను వివరణ కోరగా తమకు ఎలాంటి అధికారిక ఉత్తర్వులు రాలేదని తెలిపారు. 22 నుంచి పెట్టుబడి సాయం మూడు విడతల్లో రైతుల ఖాతాల్లో జమ జిల్లాలో 2,62,043 రైతులు రూ.220.84 కోట్లు అవసరం -
ఆద్యంతం.. భ క్తి పారవశ ్యం
కొమురవెల్లి(సిద్దిపేట): కొమురవెల్లి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా అగ్నిగుండాల కార్యక్రమం అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం వేకువజామున వరకు ఈ కార్యక్రమం ఉత్కంఠ భరితంగా సాగింది. మల్లన్న నామస్మరణతో ఆ ప్రాంతం మారుమోగింది. భారీ సంఖ్యలో భక్తులు అగ్నిగుండాలను దాటారు. స్వామివారి కల్యాణ వేదిక ప్రాంగణంలో ఆదివారం రాత్రి 7.15 గంటలకు వీరభద్ర ప్రస్థానం, భద్రకాళి పూజ, 9 గంటలకు బియ్యం సుంకు పట్టుట. 12 గంటలకు అగ్నిగుండాల ప్రజ్వలన కార్యక్రమాలు నిర్వహించారు. సోమవారం తెల్లవారుజామున ఐదు గంటలకు గురుపూజ, బలిహరణ, అగ్నిగుండాల ప్రవేశం, విజయోత్సవం, 11 గంటలకు స్వామి అమ్మవార్లకు ఏకాదశ రుద్రాభిషేకం, మహామంగళహారతి, మంత్రపుష్పం.. అనంతరం తీర్థ ప్రసాద వితరణ కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. అగ్నిగుండాల కార్యక్రమం శివశంకర శివాచార్య మహాస్వామి సేడం పీఠాధీశుల ఆధ్వర్యంలో కొనసాగింది. కార్యక్రమంలో ఆలయ ఈఓ కృష్ణప్రసాద్, ఏఈఓలు సుదర్శనం, బుద్ధి శ్రీను తదితరులు పాల్గొన్నారు. కాగా, ఈ ఉత్సవాల్లో సుమారు 12లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని అంచనా. భక్తిశ్రద్ధలతో అగ్నిగుండాల ప్రవేశం మారుమోగిన మల్లన్న నామస్మరణం ముగిసిన కొమురవెల్లి బ్రహ్మోత్సవాలు -
మొగులు.. గుబులు
● భ యపెడుతున్న అకాల వర్షాలు ● వాతావరణ మార్పులతో రైతుల్లో కలవరం ● పాలు పోసుకునే దశలో వరిచేలు దుబ్బాక: రైతుల పరిస్థితి ముందు నుయ్యి.. వెనుక గొయ్యిలా మారింది. 20 రోజుల క్రితం గాలివాన, వడగళ్ల బీభత్సంతో జిల్లాలో పెద్దఎత్తున పంటలకు నష్టం వాటిల్లింది. ఈదెబ్బ నుంచి ఇంకా కోలుకోకముందే మళ్లీ వాతావరణంలో మార్పులు అన్నదాతలకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. ఈనెల 20 వరకు గాలివానతో కూడిన భారీ వర్షాలు, వడగళ్లు పడతాయని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో సోమవారం వడగళ్ల వాన కురిసింది. వాతావరణం ఒక్కసారిగా మారిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో 60 శాతానికి పైగా వరి పంటలు పాలు పోసుకునే దశలో ఉన్నాయి. ఇప్పుడు గాలివాన, వడగళ్లు పడితే తీవ్ర నష్టం వాటిళ్లే అవకాశం ఉంది. జిల్లాలో మల్లన్నసాగర్, రంగనాయకసాగర్, కొండపోచమ్మ సాగర్ జలశయాల్లో సంవృద్ధిగా నీరు ఉండడంతో పెద్ద ఎత్తున రైతులు వరి సాగు చేశారు. రైతులు రూ. లక్షలు పెట్టుబడి పెట్టి పంటలు వేసుకోగా, తీరా చేతికొచ్చే దశలో ప్రకృతి ఆగం జేస్తుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. -
కనీస వేతనాలు అమలు చేయాలి
మెదక్ కలెక్టరేట్: కనీస వేతనాలు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సమగ్ర శిక్షా ఉద్యోగులు సోమవారం కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు. అనంతరం టీఎస్యూటీఎఫ్ ఆధ్వర్యంలో కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పద్మారావు, శ్రీనివాసరావు మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు తీర్పుకనుగుణంగా సమగ్ర శిక్షాలో పనిచేస్తున్న ఉద్యోగులకు కనీస వేతనం అమలు చేయాలన్నారు. అలాగే సమాన పనికి సమాన వేతనం, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో టీఎస్ యూటీఎఫ్ జిల్లా కోశాధికారి అజయ్ కుమార్, కార్యదర్శులు నాగుల్ మీరా, శేఖర్, భీమ్లా నాయక్, నర్సింలు, తెలంగాణ సమగ్ర శిక్షా ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు రాజు, సీఆర్పీల జిల్లా అధ్యక్షుడు గట్టయ్య, కేజీబీవీల యూనియన్ రాష్ట్ర నాయకులు సుహాసిని, పూర్ణేశ్వర్ ఉమా, పద్మ తదితరులు పాల్గొన్నారు. -
గాలి వాన బీభత్సం
తూప్రాన్/పాపన్నపేట(మెదక్)/నర్సాపూర్/హవేళిఘణాపూర్: జిల్లాలోని పలు మండలాల్లో గాలివాన బీభత్సం సృష్టించింది. తూప్రాన్లో సోమవారం ఉదయం ఎండతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. సాయంత్రం సమయంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం దంచికొట్టింది. గుండ్రెడ్డిపల్లి– మల్కాపూర్ గ్రామానికి వెళ్లే రహదారిపై భారీ వృక్షం విరిగిపడింది. దీంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బంది ఏర్పడింది. సర్పంచ్ ఆంజనేయులుగౌడ్ స్థానికుల సహాయంతో రహదారిపై అడ్డంగా ఉన్న వృక్షాన్ని తొలగించా రు. అలాగే పాపన్నపేట, హవేళిఘణాపూర్ నర్సాపూర్, కొల్చారం మండలాల్లోని పలు గ్రామాల్లో వడగళ్ల వాన కురిసింది. -
బాధితులకు చట్టపరంగా న్యాయం
ఎస్పీ డీవీ శ్రీనివాసరావుమెదక్ కలెక్టరేట్: పోలీస్శాఖ ఎల్లప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటుందని, చట్టపరంగా అందరికీ న్యాయం చేస్తామని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు తెలిపారు. సోమవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో ఆయన పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ప్రతి ఫిర్యాదుదారునితో వ్యక్తిగతంగా మాట్లాడి వారి సమస్యలను సమగ్రంగా తెలుసుకున్నారు. చట్టపరంగా న్యాయం చేయాలని సంబంధిత పోలీస్ అధికారులకు సూచించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. పోలీస్శాఖ ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటుందన్నారు. ఎలాంటి పైరవీలు అవసరం లేకుండా నేరుగా పోలీస్ అధికారులను సంప్రదించాలని తెలిపారు. చట్టపరమైన మార్గంలో ప్రతి ఒక్కరికీ న్యాయం అందించడమే పోలీస్శాఖ ప్రధాన బాధ్యత అని స్పష్టం చేశారు. ప్రజావాణి ద్వారా ఇప్పటికే అనేక సమస్యలను పరిష్కరించామన్నారు. తద్వారా ప్రజల్లో పోలీస్శాఖపై నమ్మకం మరింత పెరిగిందన్నారు. -
అన్నదాతకు భరోసా
మెదక్ అర్బన్: అన్నదాతల ఎదురుచూ పులు ఫలించే వేళ ఆసన్నమైంది. ఈనెల 22న సిద్దిపేట జిల్లా నర్మెట్టలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మొదటి విడత రైతు భరోసా విడుదల చేయనున్నారు. మూడు విడతల్లో ఈ ప్రక్రియ కొనసాగనుంది. జిల్లాలో సుమా రు 2,62,043 రైతులకు గానూ రూ.220.84 కోట్లకు పైగా నిధులు మంజూరయ్యే అవకాశం ఉంది. ఎకరానికి రూ.6 వేలు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పటివరకు మూడు సార్లు రైతులకు పెట్టుబడి సాయం అందించారు. 2023–24 యాసంగి సీజన్లో ఎకరానికి రూ. 5 వేలు, 2024–25 యాసంగిలో రూ. 5 వేలు, 2025–26లో వానాకాలం సీజన్లో ఎకరానికి రూ.6 వేల చొప్పున జమ చేశారు. ఈ ఏడాది యాసంగి సీజన్ ప్రారంభమై మూడు నెలలు కావొస్తున్నా, రైతు భరోసా నిధులు జమ చేయలేదు. సాగులో 2,86,225 ఎకరాలు జిల్లాలో యాసంగికి సంబంధించి 2,86,225 ఎ కరాల్లో పంటలు వేశారు. సుమారు 2,62,043 రైతులు ఉన్నారు. గత వానాకాలం లెక్కలకు సంబంధించి అప్పట్లో రైతు భరోసా కింద రూ.220,84,32,452 నిధులు విడుదలయ్యాయి. ఈసారి నిధులు మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం మూడు విడతల్లో రైతుల ఖాతాల్లో నిధుల జమ చేసే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈనెల 22న ఎకరం విస్తీర్ణం ఉన్న రైతులకు, 20 రోజుల తర్వాత రెండో విడత, ఏప్రిల్ నెలాఖరు లోపు మూడో విడతగా మొత్తం మంది రైతులకు భరోసా నిధులు జమచేయనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై జిల్లా వ్యవసాయాధికారి దేవకుమార్ను వివరణ కోరగా తమకు ఎలాంటి అధికారిక ఉత్తర్వులు రాలేదని తెలిపారు. -
బీసీలను ఓటు బ్యాంక్గా చూస్తోంది
పటాన్చెరు టౌన్: కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను కేవలం ఓటు బ్యాంక్గా వాడుకుంటుందని, ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చిన రేవంత్రెడ్డి అధికారంలోకి వచ్చాక అన్ని వర్గాలను మోసం చేసినట్లే, బీసీలకు ద్రోహం చేశాడని మాజీమంత్రి హరీశ్రావు మండిపడ్డారు. హైదరాబాద్ కోకాపేట్లోని ఆదివారం హరీశ్రావు నివాసంలో పటాన్చెరు నియోజకవర్గ కో ఆర్డినేటర్ ఆదర్శ్రెడ్డి, పటాన్చెరు మండల ఇన్చార్జ్, జెడ్పీటీసీ మాజీసభ్యులు శ్రీకాంత్గౌడ్ ఆధ్వర్యంలో క్యాసారం గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు హరీశ్రావు సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. అనంతరం హరీశ్రావు మాట్లాడుతూ...ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన బీసీ డిక్లరేషన్కు అతీగతీలేకుండా పోయిందన్నారు. ఏటా 20 వేల కోట్ల చొప్పున 5 ఏళ్లలో లక్ష కోట్లు బీసీల కోసం ఖర్చు చేస్తామని మాట తప్పారని విమర్శించారు. బడ్జెట్లో నిధులు కేటాయించకపోవడం వల్ల బీసీ వర్గాల ప్రజల అభివృద్ధి ప్రశ్నార్థకంగా మారిందన్నారు. స్థానిక సంస్థల్లో బీసీలకు హామీ ఇచ్చిన రిజర్వేషన్లపై కూడా ప్రభుత్వం స్పష్టతనివ్వడం లేదని చురకలంటించారు. కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు మోసపోయారని, వారంతా ఇప్పుడు తిరగబడే కాలం వచ్చిందన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడాతామని తెలిపారు. పార్టీలో చేరిన వారిలో మల్లేశ్గౌడ్, ధనుంజయ్గౌడ్, పవన్గౌడ్, చరణ్గౌడ్, నక్క వికాస్గౌడ్, కాసా వినయ్గౌడ్, పట్లోళ్ల తిరుపతిరెడ్డి తదితరులున్నారు. కాంగ్రెస్పై మాజీమంత్రి హరీశ్రావు ధ్వజం -
పోటెత్తిన నల్లపోచమ్మ ఆలయం
కౌడిపల్లి(నర్సాపూర్): మండలంలోని తునికి శ్రీ నల్లపోచమ్మ దేవి ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. పలు జిల్లాల నుంచి వచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు. ఈ సందర్భంగా భక్తులు అమ్మవారికి కుంకుమార్చన చేసి, ఒడిబియ్యం పోసి, బోనాలు సమర్పించి, మొక్కులు తీర్చుకున్నారు. పలువురు భక్తులు తలనీలాలు సమర్పించి, వాహాన పూజలు జరిపించారు. »» -
సబ్సిడీ పథకాలు సద్వినియోగం చేసుకోండి
● స్వయం ఉపాధి పథకాలకు 24 వరకు ఆన్లైన్ చేసుకునే అవకాశం ● కలెక్టర్ ప్రతిమాసింగ్ వెల్లడి మెదక్ కలెక్టరేట్: స్వయం ఉపాధి ద్వారా జీవన ప్రమాణాలను పెంపొందించుకునేందుకు షెడ్యూల్డు కులాల సేవా సహకార సంస్థ సబ్సిడీ పథకాలు అందజేస్తోందని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ప్రతిమాసింగ్ ఆదివారం ఓ ప్రకటనలో వెల్లడించారు. జిల్లాలో 2025–26 వార్షిక ప్రణాళిక అమలు చేసేందుకు 236.60 లక్షలతో 249మంది లబ్ధిదారులకు ఆర్థిక సహాయం అందజేస్తున్నట్లు తెలిపారు. 119 ఈవీ ద్విచక్ర వాహనాలు, 59 ఈవీ ఆటోలు, రైతులకు సోలార్ పంపులు అందజేస్తున్నట్లు వివరించారు. అలాగే స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కింద 59 మందికి శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. రూ.లక్షలోపు యూనిట్లకు 90%, రూ.2లక్షల వరకు 80%, రూ.4లక్షల వరకు 70% రాయితీ ఉంటుందని వివరించారు. ఆసక్తి, అర్హత గల ఎస్సీ అభ్యర్థులు ఈనెల 24వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. వాటి హార్డ్ కాపీలను మున్సిపల్ కమిషనర్, ఎంపీడీఓలకు అందజేయాలన్నారు. జిల్లాస్థాయి కమిటీ ద్వారా లబ్ధిదారుల ఎంపిక ఉంటుందని తెలిపారు. ప్రజావాణి వాయిదామెదక్ సమీకృత కలెక్టరేట్తోపాటు ఆర్డీఓ కార్యాలయాల్లో సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేసినట్లు కలెక్టర్ ప్రతిమాసింగ్ ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ఆయా శాఖల అధికారులంతా జనగణన–2027 విధుల్లో ఉన్నందున కార్యక్రమాన్ని వాయిదా వేశామని, ప్రజలు విషయాన్ని గమనించి సహకరించాలన్నారు. -
జనగణన దేశాభివృద్ధికి కీలకం
● తొలిసారి డిజిటల్ పద్ధతిలో లెక్కింపు ● అదనపు కలెక్టర్ నగేశ్ మెదక్ కలెక్టరేట్: జనాభా లెక్కలు దేశాభివృద్ధికి కీలకమని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు రూపొందించడానికి దోహదపడతాయని అదనపు కలెక్టర్ నగేశ్ పేర్కొన్నారు. మెదక్ సమీకృత కలెక్టరేట్లో ఆదివారం జిల్లాలో జనగణన–2027 సమర్థవంతంగా నిర్వహించేందుకు జిల్లా, మండలస్థాయి అధికారులకు 3 రోజుల శిక్షణ కార్యక్రమాన్ని అదనపు కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, మౌలిక సదుపాయాల ప్రణాళికల తయారీకి జనగణన ఎంతో ఉపయోగపడుతుందన్నారు. జిల్లాస్థాయిలో జనగణనను సమర్థవంతంగా నిర్వహించేందుకు అవసరమైన విధానాలు, మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలన్నారు. దేశంలో తొలిసారిగా డిజిటల్ విధానంలో జనగణన నిర్వహించనున్నట్లు తెలిపారు. మొబైల్ యాప్లు, వెబ్ పోర్టల్ను ఉపయోగించి గణన ప్రక్రియను నిర్వహించనున్నట్లు తెలిపారు. అదేవిధంగా ప్రజలు తమ వివరాలను తామే స్వయంగా ఆన్లైన్ ద్వారా నమోదు చేసుకునేందుకు ప్రత్యేక పోర్టల్ను గణన ప్రారంభానికి సుమారు 15 రోజుల ముందు అందుబాటులో ఉంచనున్నట్లు స్పష్టం చేశారు. మే 11న నుంచి జూన్ 9వ తేదీ వరకు గృహాల గణన, రెండో దశలో జనగణన 2027 ఫిబ్రవరిలో జరుగుతుందని వివరించారు. మార్చి 1, 2027ను రిఫరెన్స్ తేదీగా పరిగణించడం జరుగుతుందన్నారు. మండలంలో తహశీల్దార్, మున్సిపాలిటీలో కమిషనర్ ఇంచార్జ్లుగా వ్యవహరిస్తారని తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీఓలు రమాదేవి, జయచంద్రారెడ్డి, రామకృష్ణ, జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి, డీఎఫ్ఓ జోజీ, వివిధ శాఖల అధికారులు, తహశీల్దార్లు, ఎంపీడీఓలు పాల్గొన్నారు. -
‘ఆ అధికారులను సస్పెండ్ చేయాలి’
మెదక్జోన్: జిల్లా కేంద్ర ఆస్పత్రి మెడికల్ బోర్డులో లంచాలు ఇచ్చిన వారి ఫైళ్లను మాత్రమే పరిష్కరిస్తున్న సదరు ఉద్యోగితో పాటు, అతడికి సహకరించిన వారందరిని వెంటనే సస్పెండ్ చేయాలని తపస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చల్లా లక్ష్మణ్ డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగ, ఉపాధ్యాయుల మెడికల్ బిల్లులు చాలా తక్కువ మొత్తంలో మంజూరు చేయడం, విడుదల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం వంటి అంశాలపై మెడికల్ బోర్డు ఏడీ విజయ్భాస్కర్కు ఫిర్యాదు చేసినా స్పందించలేదన్నారు. ప్రస్తుతం మెడికల్ బోర్డుపై ఏసీబీ దాడులు చేసిందని, ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో తపస్ జిల్లా ప్రధాన కార్యదర్శి జాల సిద్దు, కోశాధికారి మంగ నర్సింలు, సంతోష్, ప్రవీణ్, చేగుంట మండల అధ్యక్షులుడు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. మెదక్ కలెక్టరేట్: పారిశుద్ధ్య కార్మికులు యాప్రాన్, గ్లౌజ్లు ధరించాలని, వారు ఆరోగ్యంగా ఉంటేనే పట్టణం పరిశుభ్రంగా ఉంటుందని మున్సిపల్ చైర్మన్ కానుగు రాధిక, వైస్ చైర్మన్ నరేశ్గౌడ్ పేర్కొన్నారు. ప్రజాపాలనా–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఆదివారం పారిశుద్ధ్య కార్మికులకు యాప్రాన్, గ్లౌజ్లు, మాస్క్లు పంపిణీ చేశారు. అనంతరం వైస్ చైర్మన్ నరేశ్గౌడ్ పారిశుద్ధ్య సిబ్బందికి పలు సూచనలు చేశారు. రేడియంతో కూడిన యాప్రాన్లు ధరించడం వల్ల ప్రమాదాలు జరుగకుండా ఉంటాయని తెలిపారు. గతంలో జరిగిన ప్రమాదాలను దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలన్నారు. కార్యక్రమంలో శానిటేషన్ అధికారులు, జవాన్లు, శానిటేషన్ సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు మెదక్ కలెక్టరేట్: పిల్లల ఈత సరదా తల్లిదండ్రులకు విషాదంగా మారకూడదని జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఒంటిపూట బడులు ప్రారంభమవుతున్న నేపథ్యంలో తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తల్లిదండ్రుల పర్యవేక్షణలోనే పిల్లలకు ఈత నేర్పించాలని స్పష్టం చేశారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ఆదివారం ఆయన మాట్లాడుతూ...ఏదైనా ప్రమాదం జరగకముందే జాగ్రత్తలు తీసుకోవడం అత్యంత ముఖ్యమన్నారు. గ్రామాల్లోని బావులు, చెరువుల వద్ద భద్రతా నియమాలు పాటించడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని తెలిపారు. వీలైనంత వరకు పిల్లలను ఇంట్లోనే ఉంచుకుని చదువు లేదా ఇతర మంచి విషయాలు నేర్పించాలని ఆయన సూచించారు. న్యాల్కల్ (జహీరాబాద్): ఎండల తీవ్రత అధికమవుతుండడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. అధికశాతం పాఠశాలల్లో ఫ్యాన్లు పాడైపోవడంతో ఉక్కపోతకు విద్యార్థులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. దీంతో ప్రభుత్వం ఒంటిపూట బడులు నిర్వహించాలని నిర్ణయించింది. సోమవారం నుంచి ఏప్రిల్ 23వ తేదీ వరకు ఒంటిపూట బడులు నిర్వహించాలని రాష్ట్ర విద్యాశాఖ డైరెక్టర్ ఈనెల 12న ఉత్తర్వులు జారీ చేశారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పాఠశాలలు పని చేయాలని అనంతరం మధ్యాహ్నం భోజనం పెట్టి వదిలి పెట్టాలని సూచించింది. ప్రస్తుతం పదవ తరగతి పరీక్షలు కొనసాగుతున్న పాఠశాలల్లో మాత్రం మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు పాఠశాలలు పని చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. దీంతో విద్యార్థులకు ఎండల నుంచి కొంత మేర ఉపశమనం లభించింది. -
కదులుతున్న డొంక
116 బిల్లులు పంపకపోవడంలో ఆంతర్యం ఏంటి? ● మెడికల్ రీయింబర్స్మెంట్ శాఖ పర్యవేక్షకుడిపై చర్యలు! ● ముడుపుల కోసమే డైరెక్ట్గా ప్రొసీడింగులు ● ఏసీబీ తనిఖీలతో మెదక్లో కలకలంమెదక్ అర్బన్: ఈనెల 9న ‘మెడికల్ బిల్లులు ఏవీ? ముడుపులు ఇస్తేనే ముందుకు’ శీర్షికన ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంతో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. శుక్రవారం డీఎస్పీ సుదర్శన్ ఆధ్వర్యంలో మెడికల్ రీయింబర్స్ మెంట్ పర్యవేక్షకుడి కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. ఇందులో విస్తుగొలిపే విషయాలు బయట పడినట్లు తెలుస్తోంది. రీయింబర్స్మెంట్ కోసం కార్యాలయానికి వచ్చిన బిల్లుల్లో 116 పాస్ అయినప్పటికీ, వాటిని సంబంధిత కార్యాలయాలకు పంపకుండా, తమ వద్దే పెట్టుకోవడం, బిల్లులను ఔట్ వార్డులో నమోదు చేయకుండా, సంబంధికులకే ఇచ్చినట్లు నిర్ధారించారు. లంచాలకు ఆశపడే ఈ చర్యలకు పాల్పడిన ట్లు భావిస్తున్నారు. కార్యాలయంలో రిజిస్టర్ల నిర్వహణ కూడా లోప భూయిష్టంగా ఉన్నట్లు గుర్తించారు. పూర్తిస్థాయి విచారణ అనంతరం ఏసీబీ అధికారుల పూర్తిస్థాయి నివేదిక అనుగుణంగా బాధ్యులపై క్రమశిక్షణా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. జిల్లాలోని ఉద్యోగ, ఉపాధ్యాయ, విశ్రాంత ఉద్యోగుల మెడికల్ రీయింబర్స్మెంట్ బిల్లులు రూ. 50 వేల లోపు ఉంటే మంజూరు కోసం జిల్లా మెడికల్ సూపరింటెండెంట్ కార్యాలయానికి పంపుతారు. ఇవి సాధారణంగా 21 రోజుల్లో మంజూరు చేయాలి. కానీ ఇక్కడ ఓ పర్యవేక్షకుడు ముడుపులకు ఆశపడి, అన్నీ తానై వ్యవహరిస్తున్నాడనే ఆరోపణలు రావడంతో ఏసీబీ అధికారులు విచారణ చేశారు. గతేడాది సెప్టెంబర్ నుంచి ఉద్యోగులకు సంబంధించి 282 బిల్లులు వచ్చాయి. అందులో 116 బిల్లులు ఆమోదించారు. వీటిని ఔట్ వార్డులో నమోదు చేసి, సంబంధిత శాఖలకు పంపాలి. కానీ వాటిని నమోదు చేయకుండా, పర్యవేక్షకుడు తన వద్దే పెట్టుకున్నట్లు, డైరక్ట్గా వచ్చి అతడిని కలసిన వారికి ప్రొసీడింగులు ఇస్తున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో వారి నుంచి లంచాలు స్వీకరిస్తున్నాడనే ఆరోపణలున్నాయి. అసలు ఔట్ వార్డు రిజస్టర్ జనవరి 5 వరకు రాసినట్లు, ఆపై ఎంట్రీలు చేయలేదని గుర్తించారు. ఆ తర్వాత సుమారు 60 బిల్లులు వచ్చినట్లు తెలుస్తోంది.భారీగా పెండింగ్ బిల్లులు జిల్లా మెడికల్ బోర్డులో మెడికల్ రీయింబర్స్ మెంట్ బిల్లులు భారీగా పెండింగ్లో ఉన్నట్లు సమాచారం. 2025 మార్చి నుంచి ఈఏడాది మార్చి 5 వరకు 1,053 రీయింబర్స్మెంట్ బిల్లులు వచ్చాయి. అందులో 529 చెల్లించారని, మిగితావి పర్యవేక్షకుడి వద్దే పెండింగ్లో ఉన్నట్లు తేలింది. బిల్లులు పంపిన తర్వాత ఉద్యోగులు వచ్చి, సదరు పర్యవేక్షకుడిని కలిస్తే వాటికి మోక్షం లభిస్తుందని, లేకుంటే కొర్రీలు వేస్తాడన్న ఆరోపణలున్నాయి. ఒకేసారి వాటిని వెనక్కి పంపుతాడని బాధితులు అంటున్నారు. కార్యాలయంలో తాము రాసిందే రికార్డు అన్నట్లు తమ ఇష్టమొచ్చిన రీతిలో రికార్డులు రాస్తున్నారు. లేకుంటే వాటిని మూలన పడేస్తున్నారన్న విమర్శలున్నాయి. అలాగే మెడికో లీగల్ కేసుల ధ్రువపత్రాలకు సంబంధించిన రిజిస్టర్ కూడా అసంపూర్తిగా ఉన్నట్లు తేలింది. సుమారు 5 గంటల పాటు తనిఖీలు చేసిన ఏసీబీ అధికారులు త్వరలోనే ఉన్నతాధికారులకు నివేదిక ఇస్తా మని తెలిపారు.నివేదిక అనుగుణంగా చర్యలు తీసుకుంటాం మెడికల్ రీయింబర్స్మెంట్ విభాగంలో శుక్రవారం ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించి రికార్డులు పరిశీలించారు. అవసరమైన సమాచారాన్ని తమతో తీసుకెళ్లారు. వారు ఇచ్చి న నివేదిక అనుగుణంగా చర్యలు తీసుకుంటాం. – సునీత, మెదక్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ -
ఆందోళన వద్దు: కలెక్టర్ ప్రతిమాసింగ్
మెదక్ కలెక్టరేట్: జిల్లాలో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల సమస్య లేదని, ప్రజలు ఆందోళన చెందవద్దని కలెక్టర్ ప్రతిమాసింగ్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సూచన మేరకు మానిటరింగ్ కమిటీని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. జిల్లాలో గ్యాస్ సిలిండర్ల సరఫరా పరిస్థితిని, గోదాముల్లో నిల్వల స్థితిని రోజువారీగా కమిటీ పర్యవేక్షిస్తుందన్నారు. అలాగే సిలిండర్లు నిల్వ చేయడం, దారి మళ్లింపు, బ్లాక్ మార్కెటింగ్, గృహ వినియోగ సిలిండర్లను వాణిజ్య అవసరా లకు అక్రమంగా ఉపయోగించడం వంటి చర్యలను నివారించి కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. జిల్లాలో వినియోగదారులకు ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లు నిరంతరంగా అందుబాటులో ఉండేలా కమిటీ తరచుగా సమావేశాలు నిర్వహించి అవసరమైన చర్యలు తీసుకుంటుందని వివరించారు. -
రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపిక
మనోహరాబాద్(తూప్రాన్): మండలంలోని లింగారెడ్డిపేటకు చెందిన ఆ కుల సారిక రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపికై ంది. గతనెల 16 నుంచి 19 వరకు సిరిసిల్లలో జరిగిన పోటీలలో ప్రతిభ చూపింది. శనివారం బాలికను గ్రామస్తులు అభినందించారు. ఒడిషాలోని భువనేశ్వర్లో జరిగే రాష్ట్రస్థాయి పోటీలలో సైతం రాణించి జాతీయస్థాయికి ఎంపిక కావా లని వారు ఆకాంక్షించారు. ప్రజా సమస్యలు పరిష్కరిస్తాం మెదక్ కలెక్టరేట్: ప్రజల సమస్యలు తెలుసుకొని పరిష్కరించేందుకే ‘ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ చైర్పర్సన్ రాధిక, వైస్ చైర్మన్ నరేష్గౌడ్ తెలిపారు. శనివారం పట్టణంలోని 2, 3, 30, 31 వార్డుల్లో పర్యటించి సమస్యలు తెలుసుకున్నారు. రానున్న వేసవిని దృష్టిలో పెట్టుకొని తాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ఎమ్మెల్యేకు వినతి శివ్వంపేట(నర్సాపూర్): ఉపాధ్యాయుల సమస్యలపై అసెంబ్లీలో ప్రస్తావించాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) నాయకులు ఎమ్మెల్యే సునీతారెడ్డిని కోరారు. ఈ మే రకు శనివారం ఆమెను కలిసి వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన పెండింగ్ బిల్లులు, బకాయిలు, పీఆర్సీ తదితర సమస్యల గురించి వివరించారు. -
తొలిరోజు 99.83% హాజరు
ప్రారంభమైన ‘పది’ పరీక్షలుమెదక్ కలెక్టరేట్: పదో తరగతి వార్షిక పరీక్షలు జిల్లాలో శనివారం ప్రారంభమయ్యాయి. మొదటి రోజు తెలుగు పరీక్షకు 11,239 విద్యార్థులకు గానూ 11,220 మంది హాజరు కాగా 19 మంది గైర్హాజరయ్యారు. దీంతో 99.83 హాజరు శాతం నమోదైంది. డీఈఓ విజయ, అదనపు కలెక్టర్ నగేశ్, ఆర్డీఓ రమాదేవి, అదనపు ఎస్పీ మహేందర్ పలు సెంటర్లను సందర్శించారు. అలాగే ఇతర పరీక్ష కేంద్రాలను ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు పరిశీలించాయి. విద్యార్థులను గంట ముందే పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా పరీక్షకు పరీక్షకు మధ్య సెలవులు ఉండటంతో ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని డీఈఓ సూచించారు. సెలవుల దినాల్లో బాగా చదివి పరీక్షకు సిద్ధమై రావాలన్నారు. -
గ్యాస్ గోస
పశ్చిమాసియా దేశాల యుద్ధం కారణంగా వచ్చిన గ్యాస్ కొరతతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్యాస్ ఏజెన్సీల దగ్గర వినియోగదారులు పడిగాపులు కాస్తున్నారు. ఈకేవైసీ అడగటం, బుకింగ్ కాకపోవటం, సర్వర్ డౌన్ కారణంగా జనం గంటల తరబడి నిరీక్షిస్తున్నారు. అసలే ఇప్పుడు పరీక్షల సమయం.. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఇలా ఇబ్బందులు పెట్టడం సరికాదని ఏజెన్సీ నిర్వాహకులతో వినియోగదారులు గొడవ పడుతున్నారు. కాగా హాస్టళ్లు, హోటళ్లు, కర్రీపాయింట్ నిర్వాహకులు కట్టెల పొయ్యి మీదవంట చేస్తున్నారు. కోత్లాపూర్లో సిలిండర్ కోసం క్యూ లైన్లో నిలబడిన జనం -
మైనార్టీ స్కూల్ ప్రిన్సిపాల్ సస్పెన్షన్
నర్సాపూర్: నర్సాపూర్లోని ప్రభుత్వ మైనార్టీ బాలుర గురుకుల పాఠశాల, కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ నసీమాషేక్తో పాటు వార్డెన్ హజీ అలీపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇటీవల గురుకులంలో 11 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. కాగా ఈ ఘటనను సీరియస్గా తీసుకున్న ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. అందులో భాగంగా వారిని విధులనుంచి తొలగిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇన్చార్జి ప్రిన్సిపాల్గా లెక్చరర్ మురళీకి బాధ్యతలు అప్పగించారు. రూ.147 కోట్లతో ఏడుపాయల అభివృద్ధి పాపన్నపేట(మెదక్): ఏడుపాయల పరిపూర్ణ అభివృద్ధి కోసం రూ.147 కోట్లతో ప్రణాళిక రూపొందిస్తున్నట్లు ఈఓ వీరేశం తెలిపారు. శుక్రవారం హైదరాబాద్కు చెందిన తనికెళ్ల ఇంటిగ్రేటెడ్ కన్సల్టెన్సీ సభ్యులు స్థల పరిశీలన చేశారు. కాటేజీలు, అద్దాల మేడ, క్యూలైన్, ఒడిబియ్యం కౌంటర్, స్టార్ గదులు, బోనాల మంటపం తదితర నిర్మాణాలు చేపట్టేందుకు మాస్టర్ ప్లాన్ రూపొందించనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో సంస్థ ఎగ్టిక్యూటీవ్ డైరెక్టర్ మాధవి, ప్రాజెక్ట్ మేనేజర్ రవి పాల్గొన్నారు. వైద్య శిబిరాలతో మేలు రామాయంపేట(మెదక్): ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా శుక్రవారం మండలంలోని ప్రగతిధర్మారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని డీఎంహెచ్ఓ శ్రీరాం సందర్శించారు. ఈసందర్భంగా ఆయన రోగులతో మాట్లాడి వైద్య సేవలపై ఆరా తీశారు. జిల్లావ్యాప్తంగా కొనసాగుతున్న వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆయన వెంట సీహెచ్సీ సూపరింటెండెంట్ డాక్టర్ లింబాద్రి, ఇతర వైద్యులు పాల్గొన్నారు. నిల్వ నీటితో అనర్థాలు రామాయంపేట(మెదక్): మున్సిపల్ పాలకవర్గ సభ్యులు శుక్రవారం పట్టణంలో డ్రైడే– ఫ్రైడే కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా చైర్పర్సన్ లావణ్య ఆధ్వర్యంలో 11వ వార్డులో ఇంటింటికీ తిరిగి ప్రజలకు అవగాహన కల్పించారు. వార్డులో ఇళ్ల మధ్య మురుగు నీరు నిల్వ ఉంటే దోమల వ్యాప్తి పెరుగుతుందని వివరించారు. అనంతరం కుండీల్లో నిల్వ ఉంచిన నీటిని తొలగింపజేశారు. కార్యక్రమంలో వైస్ చైర్పర్సన్ నవనీత, కౌన్సి లర్లు నాగరాజు, రంజిత్, శ్యామల, ఆర్పీలు పాల్గొన్నారు. గ్యాస్ కొరత లేదు: ఆర్డీఓ నర్సాపూర్: నర్సాపూర్లో వంట గ్యాస్ సిలిండర్ల కొరత లేదని ఆర్డీఓ రామకృష్ణ తెలిపారు. శుక్రవారం పలువురు అధికారులతో కలిసి కంపెనీకి చెందిన గ్యాస్ గోదాం, పలు హోటళ్లలో తనిఖీలు చేసి మాట్లాడారు. ప్రజలకు కావాల్సిన మేర గ్యాస్ సిలిండర్లు అందుబాటులో ఉన్నాయని, ఎమర్జెన్సీ సర్వీసులకు అవసరం మేర సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను వ్యాపార సంస్థల్లో వాడితే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్యాస్ కొరత పుకార్లు నమ్మొద్దని ప్రజలకు సూచించారు. ఆయన వెంట తహసీల్దార్ శ్రీనివాస్, సీఐ జాన్రెడ్డి, ఎస్ఐ రంజిత్రెడ్డి, ఆర్ఐ ప్రభాకర్ తదితరులు ఉన్నారు. -
గ్యాస్ కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు
మెదక్ కలెక్టరేట్: జిల్లాలో గ్యాస్ సిలిండర్లకు ఎలాంటి కొరత లేదని, కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ప్రతిమాసింగ్ హెచ్చరించారు. శుక్రవారం కలెక్టరేట్లో ఎస్పీ డీవీ శ్రీనివాసరావు, అదనపు కలెక్టర్ నగేశ్తో కలిసి విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో 3,84373 కనెక్షన్లు ఉండగా, 16 ఏజెన్సీల ద్వారా గ్యాస్ సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలు గ్యాస్ కొరతపై వస్తున్న అపోహలను నమ్మకూడదని, జిల్లాలో గ్యాస్ నిల్వలు సమృద్ధిగా ఉన్నాయన్నారు. ప్రజలు అనవసరంగా ఆందోళన చెంది అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవద్దని సూచించారు. వంట గ్యాస్ సమస్యలపై కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ (9391942254) ఏర్పాటు చేసినట్లు చెప్పారు. నర్సాపూర్లోని హోటల్స్, రెస్టారెంట్లలో తనిఖీలు చేసి అక్రమంగా నిల్వ ఉంచిన 46 గ్యాస్ సిలిండర్లను సీజ్ చేసినట్లు వివరించారు. అనంతరం ఎస్పీ డీవీ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. అక్రమంగా గ్యాస్ నిల్వ చేయడం, అక్రమంగా దారి మళ్లించడం, బ్లాక్ మార్కెటింగ్కు పాల్పడడం వంటి చర్యలకు పాల్పడితే కేసులు నమోదు చేస్తామన్నారు. వినియోగదారులు గ్యాస్ బుకింగ్ విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. అనవసర లింకులు ఓపెన్ చేసి సైబర్ క్రైమ్కు గురి కావొద్దన్నారు. అంతకుముందు హైదరాబాద్ నుంచి మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. కాగా అదనపు కలెక్టర్ నగేష్ జిల్లాలో గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులతో సమావేశం ని ర్వహించి పలు సూచనలు చేశారు. సమావేశంలో జిల్లా సివిల్ సప్లై అధికారి నిత్యానంద, డీపీఆర్ఓ రామచంద్రరాజు తదితరులు పాల్గొన్నారు.కలెక్టర్ ప్రతిమాసింగ్ -
ఆమె ఆరోగ్యానికి భరోసా
జిల్లావ్యాప్తంగా 14,007 మహిళా స్వయం సహాయక (ఎస్హెచ్జీ) గ్రూపు సంఘాలు ఉండగా, వాటిలో 1.44 లక్షల మంది సభ్యులు ఉన్నా రు. వీరంతా సెర్ప్, డీఆర్డీఓ శాఖల ఆధ్వర్యంలో సీ్త్ర నిధితో పాటు పావలా వడ్డీ.. తదితర రుణాలు పొంది వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కాగా రాష్ట్ర ప్రభుత్వం ఈ సభ్యులందరికీ ఉచితంగా 32 రకాల వైద్య పరీక్షలు నిర్వహించి డిజిటల్ హెల్త్ కార్డులు అందించాలని నిర్ణయించింది. ఇందుకోసం ఆయా మండలాల్లో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్సీలు), కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ఏరియా ఆస్పత్రుల్లో రక్త నమూనా లు సేకరించి జిల్లా కేంద్రంలోని డయాగ్నోస్టిక్ సెంటర్కు పంపించనుంది. ఈ పరీక్షల్లో వ్యాధులు ఉన్న ట్లు తేలితే వారికి వెంటనే చికిత్స సైతం అందిస్తారు. కార్పొరేట్ ఆస్పత్రుల్లోనూ వైద్యం ! కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇప్పటివరకు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించింది. ‘ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక’లో భాగంగా 99 రోజుల పాటు పలు కార్యక్రమాలు చేపట్టనుంది. ఇందులో భాగంగానే ఎస్హెచ్జీ సభ్యులకు వైద్య పరీక్షలు చేసి ఆరోగ్య డిజిటల్ కార్డులు అందించేందుకు సిద్ధమైంది. ఈ కార్డులతో మహిళలకు ఆరోగ్య భద్రత లభించనుంది. ఏదేని జబ్బు చేస్తే కార్డు తీసుకొని కార్పొరేట్ ఆస్పత్రిలో చూపించినా ఉచితంగా వైద్యం అందుతుందని సంబంధిత ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.ఎస్హెచ్జీ మహిళలకు32 రకాల వైద్య పరీక్షలు అనంతరం డిజిటల్ హెల్త్కార్డుల పంపిణీ జిల్లావ్యాప్తంగా 1.44 లక్షలమందికి లబ్ధి రెండు, మూడు రోజుల్లో షెడ్యూల్ ఎస్హెచ్జీ మహిళా సభ్యులకు 32 రకాల వైద్య పరీక్షలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అనంతరం ప్రభుత్వం డిజిటల్ హెల్త్కార్డులను అందించనుంది. కాగా ఇందుకు సంబంధించిన షెడ్యూల్ మరో రెండు, మూడు రోజుల్లో రానుంది. షెడ్యూల్ వచ్చిన వెంటనే ప్రతి మండలంలో రోజుకు 50 నుంచి 100 మంది చొప్పున ఎస్హెచ్జీ సభ్యుల రక్త నమూనాలు సేకరిస్తాం. – శ్రీరాం, డీఎంహెచ్ఓ మహిళల ఆరోగ్య భద్రతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. ఇందులో భాగంగా స్వయం సహాయక గ్రూపు (ఎస్హెచ్జీ) సభ్యులకు పలు రకాల వైద్య పరీక్షలు చేయించాలని నిర్ణయించింది. అనంతరం డిజిటల్ హెల్త్ కార్డులు అందించేందుకు కసరత్తు ప్రారంభించింది. – మెదక్జోన్ -
● రండి.. డిగ్రీలో చేరండి
మెదక్జోన్: ఇంటర్మీడియెట్ పరీక్షలు ముగియడంతో ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకులు డిగ్రీ కళాశాలలో చేరాలంటూ శుక్రవారం ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ హుస్సేన్ మాట్లాడుతూ.. 2026– 27 విద్యా సంవత్సరానికి డిగ్రీ కళాశాలకు అటానమస్ హోదా లభించిందని తెలిపారు. జూనియర్ కళాశాలలో ద్వితీయ సంవత్సరం పరీక్షలు రాసిన విద్యార్థులను కలిసి డిగ్రీ దోస్త్ అడ్మిషన్ల గురించి వివరించారు. అనంతరం దోస్త్ అడ్మిషన్ల సమన్వయకర్త సురేందర్రావు అడ్మిషన్ల పెంపునకు అధ్యాపకులు చేస్తున్న కృషిని అభినందించారు. కాగా కొల్చారం, పాపన్నపేట, టేక్మాల్, రామాయంపేట, గోపాలేపేట, చేగుంట, మెదక్లోని అన్ని జూనియర్ కళాశాలల్లో ప్రచారం నిర్వహించినట్లు తెలిపారు. కార్యక్రమంలో అధ్యాపకులు పాల్గొన్నారు. -
పకడ్బందీగా మ్యాపింగ్ ప్రక్రియ
మెదక్ కలెక్టరేట్: రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు మ్యాపింగ్ ప్రక్రియ పకడ్బందీగా చేపడుతున్నట్లు అదనపు కలెక్టర్ నగేష్ తెలిపారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల సంఘం ఆదేశాల మేర కు త్వరితగతిన మ్యాపింగ్ ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు. బూత్స్థాయి అధికారులతో మ్యాపింగ్ ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించేలా పర్యవేక్షిస్తామన్నారు. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం డూప్లికేట్ ఓట్లు తొలగించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఫారం 6, 7, 8 ద్వారా అందిన దరఖాస్తులను పూర్తిస్థాయిలో పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటున్నా మని వివరించారు. కార్యక్రమంలో మెదక్, నర్సాపూర్, ఆర్డీఓలు, తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.అదనపు కలెక్టర్ నగేష్ -
ఆర్థిక సర్వేకు ప్రజలు సహకరించాలి
మెదక్ కలెక్టరేట్: సామాజిక ఆర్థిక సర్వేకు జిల్లాలోని ప్రజలంతా సహకరించాలని జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి సురేష్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లోని సీపీఓ కార్యాలయంలో మండల ప్రణాళిక, గణాంక అధికారులకు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జనవరి నుంచి ప్రారంభమైన సర్వే ఈ ఏడాది డిసెంబర్ వరకు కొనసాగుతుందని తెలిపారు. సామాజిక ఆర్థిక సర్వే ద్వారా దేశంలోని ఉపాధి, నిరుద్యోగుల స్థితిగతులు, కార్మిక శక్తి పరిస్థితులు, నమోదు కాని పారిశ్రామిక, వాణిజ్య సేవా రంగాల ఆర్థిక అంశాలకు సంబంధించిన సమాచారం సేకరిస్తామన్నారు. ఖచ్చితమైన గణాంకాలు సిద్ధం చేసేందుకు జిల్లాలోని ప్రజలంతా సహకరించాలని కోరారు. అంతకుముందు ఫీల్డ్ సిబ్బందికి ట్యాబ్స్ అందించా రు. కార్యక్రమంలో గణాంక అధికారి పద్మజ, ఉపగణాంక అధికారులు రవి, శ్రీనివాస్, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.ట్యాబ్స్తో ఫీల్డ్ సిబ్బంది, అధికారులు జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి సురేష్ -
పశు సంపద పెరగాలి
నర్సాపూర్ రూరల్: రైతులు పశు సంపదను పెంచుకొని అభివృద్ధి చెందాలని జిల్లా పశు వై ద్యాధికారి వెంకటయ్య సూచించారు. శుక్రవారం మండలంలోని ఖాజీపేటలో ఉచిత పశువైద్య శిబిరాన్ని సందర్శించి మాట్లాడారు. పాడి ఉత్పత్తిని పెంచి నాణ్యమైన పాలను నేటి తరానికి అందివ్వాలన్నారు. అనంతరం పశువులకు కావాల్సిన మందులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో నర్సా పూర్ పశుసంవర్ధక శాఖ ఏడీ జనార్దన్రావు, పశు వైద్యాధికారులు సౌమిత్, స్వప్న, ప్రియాంక, ఫరినా, సర్పంచ్ యాదగిరి గౌడ్, వెటర్నరీ సిబ్బంది ఆంజనేయులు, వెంకటేష్, ఏసుప్రభు రైతులు పాల్గొన్నారు. -
తడి, పొడి చెత్తను వేరు చేయండి
మెదక్ కలెక్టరేట్: ప్రజలు తడి, పొడి చెత్తపై అవగాహన కలిగి ఉండాలని మున్సిపల్ చైర్పర్సన్ రాధిక, వైస్ చైర్మన్ నరేష్గౌడ్ అన్నారు. ప్రజాపాలన– ప్రగతి ప్రణాళికలో భాగంగా శుక్రవారం పట్టణంలోని 1, 12, 18 వార్డుల్లో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించారు. ఈసందర్భంగా ఆయా వార్డుల్లోని ప్రజలకు అవగాహన కల్పించారు. తడి, పొడి చెత్తను వేరు చేసి మున్సిపల్ సిబ్బందికి ఇవ్వాలని సూచించారు. కార్యక్రమంలో కమిషనర్ శ్రీనివాస్రెడ్డి, ఆయా వార్డుల కౌన్సిలర్లు, శానిటేషన్ సిబ్బంది, ఆర్పీలు, వార్డుల ప్రజలు పాల్గొన్నారు. -
పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట భద్రత: ఎస్పీ
మెదక్ కలెక్టరేట్: నేటి నుంచి జిల్లాలో జరిగే పదో తరగతి పరీక్షా కేంద్రాల వద్ద సెక్షన్ 163 అమలులో ఉంటుంద ని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. ఏప్రిల్ 16 వరకు జరిగే ఈ పరీక్షలకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. పరీక్షా కేంద్రాల సమీపంలో ఎలాంటి సభలు, సమావేశాలు, ర్యాలీలు ఊరేగింపులు నిర్వహించరాదని స్పష్టం చేశారు. కేంద్రాల సమీపంలోని ఇంటర్నెట్ సెంటర్లు, జిరాక్స్ షాపులు, స్టేషనరీ దుకాణాలను తప్పనిసరిగా మూసివేయాలని సంబంధిత యజమానులను ఆదేశించారు. అనుమానాస్పద వ్యక్తులపై నిఘా ఉంచుతామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఎస్పీ ‘ఆల్ ది బెస్ట్’ తెలిపారు. -
మహిళలు ముందంజలో ఉండాలి
డీఆర్డీఓ అదనపు పీడీ సరస్వతి చేగుంట(తూప్రాన్): అన్ని రంగాల్లో మహిళలు ముందుండాలని డీఆర్డీఓ అదనపు పీడీ సరస్వతి అన్నారు. గురువారం చేగుంట ఐకేపీ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళ దినోత్సవ వేడుకల్లో భాగంగా మహిళా సంఘాల సభ్యులకు ఆటల పో టీలు నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహిళా సంఘాల సభ్యులు ఆర్థిక స్వావలంబనతో పాటు పిల్లలను బాగా చదివించడం, సామాజిక అంశాలను అవగాహన చేసుకొని స్థానికంగా సమస్యలు పరిష్కరించుకునేలా ఉండాలన్నారు. పిల్లలు ఫోన్ తక్కువగా వాడేలా జాగ్రత్త వహించాలన్నారు. ఆన్లైన్ గేమింగ్కు అలవాటు కాకుండా చూసుకోవాలన్నారు. అనంతరం గెలుపొందిన మహిళలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఏపీఎం దుర్గాప్రసాద్, సీసీలు రామస్వామి, శంకర్, స్వేతతో పాటు మహిళలు పాల్గొన్నారు. -
సమన్వయంతో పని చేయండి
మెదక్కలెక్టరేట్: ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పని చేసి ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికి అందించాలని కలెక్టర్ ప్రతిమాసింగ్ అన్నారు. గురువారం కలెక్టరేట్లో ‘ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు, సర్పంచ్లకు ప్రభుత్వ పథకాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వం చేపట్టిన ఈ బృహత్తర కార్యక్రమంలో అందరూ విధిగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. సర్పంచ్లు నాగ్రామం అనే స్వభావాన్ని కలిగి ఉండాలని, అప్పుడే అభివృద్ధికి అడుగులు పడతాయన్నారు. అనంతరం ఎమ్మె ల్యే రోహిత్రావు మాట్లాడుతూ.. ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ పథకాల కోసం నిరంతరం శ్రమిస్తుందన్నారు. అధికారులు ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. అనంతరం ఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. శాంతి భద్రతలను కాపాడటంలో పోలీస్లు ఎప్పుడూ ముందుంటారన్నారు. రోడ్డు ప్రమాదాలతో మరణాల సంఖ్య పెరుగుతుందని, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలన్నారు. కార్యక్రమంలో నోడల్ అధికారి శ్రీనివాస్రావు, అదనపు కలెక్టర్ నగేశ్, జెడ్పీ సీఈఓ ఎల్లయ్య, ఆర్డీఓ రమాదేవి, మెదక్ మున్సిపల్ చైర్పర్సన్ రాధిక, వైస్ చైర్మన్ నరేశ్గౌడ్, సర్పంచ్లు, అధికారులు పాల్గొన్నారు. అంతకుముందు సమాచార పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాల ఫొటోల ఎగ్జిబిషన్ను కలెక్టర్ జిల్లా అధికారులతో కలిసి తిలకించారు. ప్రజాప్రతినిధులకు అవగాహన కార్యక్రమం హాజరైన ఎమ్మెల్యే రోహిత్ -
చట్టాలపై అవగాహన అవసరం
వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ కంది(సంగారెడ్డి)/సంగారెడ్డి జోన్: నూతనంగా ఎన్నికై న ప్రజాప్రతినిధులు పంచాయతీరాజ్, మున్సిపల్ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని అప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. ‘ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక’కార్యక్రమంలో భాగంగా గురువారం జిల్లాలోని కందిలో కలెక్టర్ ప్రావీణ్య ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికై న మున్సిపల్ చైర్పర్సన్లు, గ్రామ సర్పంచులు కౌన్సిలర్లకు ‘ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక’99 రోజుల కార్యచరణ కార్యక్రమంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ముఖ్య అతిథిగా మంత్రి దామోదర పాల్గొన్నారు. అంతకుముందు కలెక్టరేట్ ఆవరణలో ఉద్యాన యాంత్రీకరణ పథకం ద్వారా రైతులకు మినీ ట్రాక్టర్లను పంపిణీ చేశారు. అనంతరం సీఎస్ఆర్ నిధులతో మెడికల్ కళాశాల విద్యార్థుల సౌకర్యార్థం బస్సులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ...99 రోజుల కార్యచరణను ఐదు దశలు, పది అంశాలుగా రూ పొందించామన్నారు. గ్రామాల్లో తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటుపై దృష్టి సారించాలని సూ చించారు. ఆరోగ్య శిబిరాలు, వైద్య పరీక్షలు, గర్భిణీలు, చిన్నారులకు పోషకాహార అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. తక్కువ ఖర్చుతో అధిక దిగుబడి.. రైతులు తక్కువ ఖర్చుతో అధిక దిగుబడి సాధించి ఆర్థికంగా బలోపేతం కావాలన్న లక్ష్యంతో ప్ర భు త్వం ఉద్యాన యాంత్రీకరణ పథకం ద్వారా ఆధునిక వ్యవసాయ యంత్రాలను సబ్సిడీపై అందిస్తున్నట్లు తెలిపారు. -
ఆరుతడి.. సాగండి
‘బియ్యం నిల్వలు పెద్దఎత్తున పేరుకుపోయాయి. ఆశించిన మేర ఎగుమతులు లేక గోదాముల్లో ముక్కిపోతున్నాయి. రైతులు ఏడాదికి రెండు పంటలు వరి సాగు చేయటంతోనే ఈ పరిస్థితి నెలకొంది. వారిని ఆరుతడి పంటల వైపు, ముఖ్యంగా ఆయిల్పాం సాగు వైపు మళ్లించండి. వచ్చే రబీ నాటికి కనీసం 30 శాతం పంటలు సాగు కావాలి’. ఇటీవల కలెక్టరేట్లో జరిగిన సమావేశంలో అధికారులతో జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్ చేసిన వ్యాఖ్యలు. – మెదక్జోన్ జిల్లాలో ఈ యాసంగి సీజన్లో మొత్తం 2.75 లక్షల ఎకరాల్లో రైతులు అన్నిరకాల పంటలు సాగు చేశారు. వాటిలో 2.33 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయగా, కేవలం 22 వేల ఎకరాల్లో మాత్రమే ఇతర ఆరుతడి పంటలు వేశారు. మొత్తంగా 11 శాతం మేర మాత్రమే సాగు చేశారు. వర్షాకాలం సీజన్లో సుమారు 6 లక్షల మెట్రిక్ టన్నులు, యాసంగిలో 4 లక్షల పైచిలుకు మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరిస్తున్నారు. ఫలితంగా బియ్యం నిల్వలు భారీగా పేరుకుపోతున్నాయి. వచ్చే రబీ సీజన్ నాటికి సాగులో కనీసం 30 శాతం ఆరుతడి పంటల వైపు రైతులను మళ్లించాలని, ప్రధానంగా ఆయిల్పామ్పై అవగాహన కల్పించాలని మంత్రి వివేక్ ఇటీవల ఉమ్మడి మెదక్ జిల్లా కలెక్టర్లు, అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కాగా ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా 2 వేల ఎకరాల్లో ఆయిల్పామ్ పంటలు సాగవుతున్నాయి. అందులో ఈఏడాది 978 ఎకరాల్లో సాగుకు రైతులు ముందుకొచ్చారు. కాగా మరింత సాగు పెరగాలని రైతులకు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు. అలాగే ఈనెల 16న జిల్లా నుంచి 50 మందికి పైగా రైతులను భద్రాచలం తీసుకెళ్లి ఆయిల్పామ్ సాగుపై అవగాహన కల్పించనున్నారు. వచ్చే రబీ నాటికి 30 శాతం పెరగాలని ఇటీవల మంత్రి వివేక్ ఆదేశం రైతులకు అవగాహన కల్పిస్తున్న అధికారులు ముమ్మర ప్రయత్నాలు మంత్రి ఆదేశాలతో ఆరుతడి పంటల సాగు వైపు రైతులను మళ్లించేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాం. వచ్చే రబీ సీజన్ నాటికి 30 శాతానికి పైగా పంట మార్పిడి చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. – దేవ్కుమార్, జిల్లా వ్యవసాయ అధికారి 7 రోజుల పాటు అవగాహన ‘ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో భాగంగా మే 4 నుంచి మే 10 వరకు వ్యవసాయ, హార్టికల్చర్ శాఖలు సంయుక్తంగా 7 రోజుల పాటు ఆరుతడి పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించనున్నారు. వాటిలో నానో యూరియా పనితీరు, ఆయిల్ పామ్ సాగు, తుంపరసేద్యం, పందిరి సాగు, పట్టు పురుగుల సాగు, కూరగాయలు, సబ్సిడీపై వ్యవసాయ పరికరాల పంపిణీ తదితర అంశాలపై అవగాహన కల్పిస్తారు. -
కేన్సర్ రహిత సమాజం నిర్మిద్దాం
మెదక్జోన్: కేన్సర్ రహిత సమాజం కోసం ప్రభుత్వం 15 ఏళ్ల లోపు బాలికలకు ఉచి తంగా అందిస్తున్న హెచ్ిపీవీ వ్యాక్సిన్ జిల్లా ఆస్పత్రిలో గురువారం కలెక్టర్ ప్రతిమాసింగ్ ప్రారంభించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా మహిళల్లో ఆరోగ్య సమస్యగా ఉన్న సర్వైక ల్ కేన్సర్ నివారణకు ఈ వ్యాక్సిన్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ద్వారా ఉచితంగా వ్యాక్సినేషన్ ఇస్తున్నట్లు వెల్లడించారు. బాలికల ఆరోగ్యం దృష్టిలో ఉంచుకొని తల్లిదండ్రుల సమక్షంలోనే టీకా పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ శ్రీరామ్ పాల్గొన్నారు. ప్రశాంత్నగర్(సిద్దిపేట): జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో శనివారం ఉదయం 10గంటలకు ఉగాది కవిసమ్మేళనం నిర్వహించనున్నట్లు వెన్నెల సాహితీ సంగమం అధ్యక్షుడు వంగర నరసింహారెడ్డి, ప్రధాన కార్యదర్శి పర్కపెల్లి యాదగిరిలు గురువారం తెలిపారు. కార్యక్రమానికి ప్రముఖ కవి, రచయిత కోడం పవన్కుమార్, విశిష్ట అతిథులుగా ప్రముఖకవి, రచయిత, తెరవే రాష్ట్ర అధ్యక్షులు కొండిమల్లారెడ్డి, ఆత్మీయ అతిథిగా సొప్పదండి విద్యాసాగర్లు హాజరవుతారన్నారు. కవి సమ్మేళనంలో పాల్గొన్న కవులకు అందెశ్రీ ఉగాది పురస్కారం, జ్ఞాపికలు అందించనున్నట్లు తెలిపారు. -
సమయం వృథా చేయొద్దు
డీఈఓ విజయపాపన్నపేట(మెదక్): విద్యార్థులు పరీక్షల మధ్య ఉన్న వ్యవధిని వినియోగించుకొని మంచి ఫలితాలు సాధించాలని డీఈఓ విజయ సూచించారు. గురువారం మండలంలోని నాగ్సాన్పల్లి ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థుల వీడ్కోలు సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సుమారు 34 రోజుల పాటు సాగే పరీక్షల్లో, ఒక్కో పరీక్షకు మధ్య చాలా విరామం దొరుకుతుందని తెలిపారు. ఈ సమయాన్ని వృథా చేయొద్దన్నారు. కష్టంతో కాకుండా ఇష్టంతో చదివినప్పుడే మంచి ఫలితాలు వస్తాయన్నారు. పక్కా ప్రణాళికతో చదివితే లక్ష్యం సాధించవచ్చని చెప్పారు. అనంతరం పాఠశాల అభివృద్ధి కోసం రూ.లక్ష విరాళమిచ్చిన గ్రామస్తుడు వట్టం సంగమేశ్వర్ను డీఈఓ ఘనంగా సన్మానించారు. మన ఊరు, మన బడికి ఎంత చేసినా తక్కువేనని అన్నారు. కార్యక్రమంలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ చంద్రమ్మ, సర్పంచ్ దండెం సుశీల, హెచ్ఎం నజీరొద్దీన్, ఏఎంఓ సుదర్శణమూర్తి, ఏఎస్ఓ నవీన్, సీఎంఓ రాజు, రిటైర్డ్ హెచ్ఎంలు మహిపాల్రెడ్డి, రాంకిషన్, సాయికృష్ణ, టీచర్లు శ్రీనివాస్, అశోక్ కుమార్, నర్సింలు, సిద్దేశ్వర్, రేఖ, ముజీబ్, విద్యార్థులు పాల్గొన్నారు. -
పరీక్షలకు పదిలమైన ఏర్పాట్లు
మెదక్ కలెక్టరేట్: పదో తరగతి విద్యార్థులు తమలోని భయాన్ని వీడి ఉత్తమ ఫలితాలు సాధించడానికి కృషి చేయాలని కలెక్టర్ ప్రతిమాసింగ్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రేపటి నుంచి పరీక్షలు రాయనున్న విద్యార్థులకు, విధులు నిర్వర్తించే అధికారులకు పలు సూచనలు చేశారు. పదో తరగతి విద్యార్థుల కోసం కలెక్టరేట్లోని విద్యాశాఖ కార్యాలయంలో ప్రత్యేకంగా కంట్రోల్ రూం (9848214166) ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పరీక్షల కోసం జిల్లాలోని 68 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పరీక్షలకు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల నుంచి మొత్తం 11,347 మంది విద్యార్థులు హాజరుకానున్నట్లు తెలిపారు. పరీక్షకు అరగంట ముందుగానే కేంద్రానికి చేరుకోవాలన్నారు. విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నట్లు చెప్పారు. విద్యార్థులు తమ హాల్టికెట్ను కండక్టర్కు చూపిస్తే సరిపోతుందన్నారు. మాల్ ప్రాక్టీస్కు పాల్పడితే అధికారులపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు. జిల్లా విద్యా శాఖ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ 24 గంటలు పనిచేస్తుందని, సందేహాలుంటే పరిష్కరించుకోవాలన్నారు. విద్యాశాఖ కార్యాలయంలో కంట్రోల్ రూం హాల్టికెట్ చూపిస్తే ఉచిత బస్సు ప్రయాణం విద్యార్థులు భయం వీడాలని కలెక్టర్ సూచన -
ఉపాధి కూలీల సమస్య పరిష్కారం
చిన్నశంకరంపేట(మెదక్): మండలంలోని సూరారంలో ఉపాధి హామీ కూలీల ఫొటో క్యాప్చర్ సమస్యను పరిష్కరించినట్లు ఏపీఓ రాజ్కుమార్ తెలిపారు. గురువారం ‘సాక్షి’లో ప్రచురితమైన ‘ఉపాధికి ఫొటో చిక్కులు’ కథనంతో సిబ్బంది స్పందించారు. ఉపాధి పనులు జరుగుతున్న ప్రదేశానికి టీఏలు సంపత్, లక్ష్మణ్, కంప్యూటర్ ఆపరేటర్ భానుప్రసాద్ చేరుకొని ఎన్ఎంఎంఎస్ యాప్లో తలెత్తిన సమస్యను పరిష్కరించారు. దీంతో పనులకు వచ్చిన అందరి ఫొటోలు క్యాప్చర్ అయ్యాయని, వందశాతం కూలీలు పనులకు హాజరైనట్లు పేర్కొన్నారు. అక్కడక్కడ యాప్లో సాంకేతిక సమస్య తతెత్తినప్పటికీ తమ సిబ్బంది వెంటనే పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి నాంపల్లి, ఫీల్డ్ ఆసిస్టెంట్ రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. -
బాలికలకు టీకా తప్పనిసరి
నర్సాపూర్: బాలికలకు హెచ్పీవీ టీకా తప్పనిసరిగా వేయించాలని ఎమ్మెల్యే సునీతారెడ్డి సూ చించారు. గురువారం పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో టీకా కేంద్రాన్ని ప్రారంభించి మాట్లాడారు. హెచ్పీవీ వైరస్తో గర్భాశయ కేన్సర్ వచ్చే ప్రమాదం ఉందని, టీకా తీసుకోవడంతో భవిష్యత్తులో ఆ వ్యాధిని తగ్గించుకోవచ్చని చెప్పారు. ప్రభుత్వం సూచించిన విధంగా 14 నుంచి 15 సంవత్సరాల బాలికలు టీకా తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఆస్పత్రి సూపరింటెండెంట్ పావని, మున్సిపల్ చైర్పర్సన్ లక్ష్మి, డిప్యూటీ డీఎంహెచ్ఓ సృజన, ఆర్ఎంఓ రాజేష్, రెడ్డిపల్లి పీహెచ్సీ మెడికల్ ఆఫీసర్ రఘువరన్, కౌన్సిలర్ నర్సమ్మ, ఆయా పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు. మనోహరాబాద్(తూప్రాన్): రైతులు పంట మార్పిడితో అధిక దిగుబడులు సాధించి లాభాలు పొందవచ్చని మండల వ్యవసాయ అధికారి స్రవంతి అన్నారు. గురువారం మండలంలోని రంగాయపల్లిలో రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. సీజన్ను బట్టి పంటలు వేయాలని సూచించారు. శుక్రవారం కూచారం రైతువేదికలో సాయంత్రం 5 గంటలకు జరిగే పీఎం కిసాన్ కార్యక్రమానికి హాజరుకావాలని సూచించారు. ఆమె వెంట ఏఈఓ సచిన్ ఉన్నారు. మనోహరాబాద్(తూప్రాన్): పీహెచ్సీలో వైద్యులు అందుబాటులో ఉండి రోగులకు వైద్యం అందించాలని తూప్రాన్ ఆర్డీఓ జయచంద్రారెడ్డి ఆదేశించారు. గురువారం మండల కేంద్రంలోని పీహెచ్సీ వద్ద పల్లె ప్రగతి పనుల్లో భాగంగా పలు కార్యక్రమాలు నిర్వహించారు. ఈసందర్భంగా ఆస్పత్రి పరిసరాలను శుభ్రం చేయించారు. వైద్యం కోసం వచ్చే వారికి ఇబ్బందులు రాకుండా చర్యలు చేపట్టాలని సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ ప్రీతిరెడ్డి, పీహెచ్సీ వైద్యురాలు జ్యోత్స్న దేవి, సర్పంచ్ చీర్ల అనూష, ఉపసర్పంచ్ వెంకట్రెడ్డి, వైద్య బృందం, పంచాయతీ కార్యదర్శి రూపాగౌడ్ తదితరులు పాల్గొన్నారు. మెదక్ కలెక్టరేట్: ఇంటర్ మొదటి సంవత్సర పరీక్షలు గురువారంతో ప్రశాంతంగా ముగిశాయని జిల్లా ఇంటర్మీడియెట్ విద్యాధికారి మాధవి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. చివరిరోజు జనరల్ విభాగంలో 6,085 గాను 5,895 మంది హాజరు కాగా, ఒకేషనల్ విభాగంలో 279 గాను 260 విద్యార్థులు పరీక్షకు హాజరైనట్లు తెలిపారు. దీంతో హాజరు శాతం 96.71 నమోదైనట్లు తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేయగా, సీసీ కెమెరాల ద్వారా పరీక్షలను పర్యవేక్షించినట్లు తెలిపారు. కౌడిపల్లి(నర్సాపూర్): విద్యార్థుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని డిప్యూటీ డీఎంహెచ్ఓ సృజన అన్నారు. గురువారం మండలంలోని తునికి వద్ద గల ఎంజేపీ బీసీ మత్స్యకారుల గురుకుల పాఠశాలలో విద్యార్థులకు ఆర్బీఎస్కే ఆధ్వర్యంలో వైద్య పరీక్షలు నిర్వహించి సీపీఆర్పై అవగాహన కల్పించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వం విద్యార్థులకు మెరుగైన విద్య, వైద్యం అందించేందుకు కృషి చేస్తుందన్నారు. అనారోగ్య సమస్యలుంటే ఉపాధ్యాయులకు, ఏఎన్ఎంకు చెప్పాలని సూచించారు. ఈసందర్భంగా పలువురు విద్యార్థులకు మందులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ హరిబాబు, వైద్యసిబ్బంది పాల్గొన్నారు. -
నల్లగున్నవ్.. నీకెందుకు చదువు..?
మెదక్ కలెక్టరేట్: ‘నల్లగున్నవు నీకు చదువెందుకు.. టీసీ ఇస్తాం వెళ్లిపో’.. అంటూ తమ కుమార్తెను పాఠశాలకు రానివ్వడం లేదని తల్లిదండ్రులు గురువారం కలెక్టర్ ప్రతిమాసింగ్కు మొర పెట్టుకున్నారు. మెదక్ జిల్లా కొల్చారం మండలం నాయిని జలాల్పూర్కు చెందిన బాధిత విద్యార్థిని మనస్విని, ఆమె తల్లిదండ్రులు ఎల్లం, జ్యోతి విలేకరులకు తెలిపిన వివరాలివి. మెదక్లోని తెలంగాణ రెసిడెన్షియల్ స్కూల్ (టీజీఆర్ఎస్)లో మనస్విని 7వ తరగతి చదువుతోంది. గత నెల 20న కడుపునొప్పి రావడంతో.. ప్రిన్సిపాల్కు సమాచారం అందించి విద్యార్థినిని ఆస్పత్రికి తీసుకెళ్లగా కిడ్నీలో స్వల్పంగా రాయి ఉన్నట్లు తేలింది. నీళ్లు తాగితే సరిపోతుందని వైద్యులు చెప్పడంతో పాఠశాలలో చేర్పించారు. ఈ క్రమంలో మళ్లీ అనారోగ్యానికి గురి కావడంతో తల్లిదండ్రులు వెళ్లి ఏఎన్ఎం ఆశాజ్యోతిని సంప్రదించగా దురుసుగా ప్రవర్తించింది. ‘ఏ అడివినుంచి వచ్చిండ్రు మీరు... ఆ పిల్లకు టీసీ ఇచ్చి పంపిస్తాం’.. అని అవమానించినట్లు విద్యార్థిని తల్లిదండ్రులు ఆరోపించారు. అనంతరం పాపకు ఆస్పత్రిలో చికిత్స చేయించి ఇటీవల పాఠశాలలో చేర్చుకోవాలని వెళ్తే ప్రిన్సిపాల్తో పాటు సిబ్బంది నోటికొచ్చినట్లు మాట్లాడి అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. కిడ్నీలో రాయి తగ్గినట్లు డాక్టర్ సర్టిఫికెట్ తెస్తేనే చేర్చుకుంటామని ప్రిన్సిపాల్ పాఠశాలలోకి రానివ్వడం లేదని వాపోయారు. ‘నల్లగా ఉన్న నీకు చదువెందుకు?.. టీసీ ఇచ్చి పంపిస్తాం.. వెళ్లిపో’.. అని నర్స్ ఆశాజ్యోతి, ప్రిన్సిపాల్ తారాసింగ్ పాఠశాలలోకి రానివ్వడం లేదని విద్యార్థిని బోరున విలపించింది. స్పందించిన కలెక్టర్ ప్రతిమాసింగ్ ప్రిన్సిపాల్ తారాసింగ్ వివరణ తీసుకొని విద్యార్థిని మనస్వినిని పాఠశాలకు పంపించినట్లు సమాచారం. -
హోరాహోరీగా పోలీస్ క్రీడలు
మెదక్జోన్: పోలీస్ వార్షిక క్రీడలు హోరాహోరీగా సాగుతున్నాయి. రెండో రోజు బుధవారం పట్టణంలోని సింథటిక్ ట్రాక్పై అథ్లెటిక్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో జిల్లా పోలీస్ అధికారులు, సిబ్బంది ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. పరుగు పందెం, లాంగ్ జంప్, షాట్పుట్ వంటి విభాగాల్లో పోటీలు నిర్వహించారు. క్రీడ లతో శారీరక దృఢత్వం పెరగడంతో పాటు విధుల్లో చురుకుదనం పెరుగుతుందని అధికారులు తెలిపారు. ఈసందర్భంగా విజేతలను అభినందించారు. కొల్చారం(నర్సాపూర్): గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ ఆస్పత్రుల ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని డీఎంహెచ్ఓ శ్రీరామ్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని పీహెచ్సీ ఆవరణలో ప్రజాపాలన– ప్రగతి ప్రణాళికలో భాగంగా ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి సిబ్బందికి సూచనలు చేశారు. కాగా వైద్య శిబిరంలో వైద్య పరీక్షలు నిర్వహించారు. సమస్య ఉన్న వారిని మెదక్ ప్రభుత్వ ఆస్పత్రికి రిఫర్ చేశారు. వివిధ గ్రామాల నుంచి 215 మంది వైద్య శిబిరానికి హాజరైనట్లు వైద్యాధికారి రమేష్ తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ శేఖర్, ఎంపీహెచ్ఓ మ దన్మోహన్, సూపర్వైజర్ మార్తా, యేసుమని, శాంతి కుమార్, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. రామాయంపేట(మెదక్): పట్టణంలోని పలు హోటళ్లలో నాసిరకం పదార్థాలు విక్రయిస్తున్నారనే ఆరోపణలతో బుధవారం మున్సిపల్ చైర్పర్సన్ గజవాడ లావణ్య, కమిషనర్ శ్రావణ్ తనిఖీలు నిర్వహించారు. కొన్ని హోటళ్లలో పాచిపోయి దుర్వాసన వెదజల్లుతున్న నాసిరకం పదార్థాలను గుర్తించి పారబోయించారు. ప్రజల ఆరోగ్యం దెబ్బతీస్తే ఊరుకోమని చైర్పర్సన్ హెచ్చరించారు. ఇది మొదటి తప్పుగా భావించి వదిలేస్తున్నామని, మరోసారి పునరావృతమైతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వారి వెంట వైస్ చైర్పర్సన్ నవనీత, కౌన్సిలర్లు వెంట ఉన్నారు. -
ఉపాధికి ఫొటో చిక్కులు
కుస్తీమే సవాల్చిన్నశంకరంపేట(మెదక్): ఉపాధి కూలీలకు కొత్త చిక్కు వచ్చి పడింది. ఫొటో క్యాప్చర్ కాలేదని పనులకు నిరాకరించడంతో కూలీలు నిరసన వ్యక్తం చేశారు. మండలంలోని సూరారంలో బుధవారం ఉపాధి హామీ పథకంలో భాగంగా కందకం తవ్వకం పనులు నిర్వహిస్తున్నారు. పనుల కోసం వచ్చిన కూలీల ఫొటోలను ఎన్ఎంఎంఎస్ యాప్లో ఫీల్డ్ ఆసిస్టెంట్ రామకృష్ణారెడ్డి క్యాప్చర్ చేయగా, చాలా వరకు కాలేదు. దీంతో పనులు చేసేందుకు నిరాకరించారు. దీంతో ఉపాధి పనులకు వచ్చిన కూలీలు ఆందోళన వ్యక్తం చేశారు. పాత పద్ధతిలోనే మస్టర్ హాజరు నిర్వహించాలని కోరారు. ఈవిషయమై ఏపీఓ రాజ్కుమార్ను ఆరా తీయగా, ఈ సమస్య కొన్ని చోట్ల మాత్రమే ఉత్పన్నం అవుతుందని, త్వరలోనే పరిష్కరిస్తామని చెప్పారు. తలపడుతున్న మల్లయోధులు టేక్మాల్(మెదక్): మండల కేంద్రంలో దుర్గమ్మ, పోచమ్మ ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా బుధవారం కుస్తీ పోటీలు నిర్వహించారు. పోటీలకు రాష్ట్రం నుంచే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర నుంచి మల్లయోధులు తరలివచ్చారు. కొబ్బరికాయ కుస్తీ మొదులుకొని కడి యం కుస్తీ వరకు పోటీలు హోరాహోరీగా సాగాయి. కర్ణాటకలోని లాతూర్కు చెందిన అభిషేక్ ఇద్దరిపై గెలుపొందడంతో సర్పంచ్ సుధాకర్ వెండి కడియాన్ని బహూకరించారు. -
మరో రెండు పంట విరామాలు!
పుల్కల్(అందోల్): సింగూరు మరమ్మతు పనులు ఈ జూన్ నాటికి పూర్తికావడం కష్టమేనని తెలుస్తోంది. రివిట్మెంట్ పనులు జూన్ నాటికి కూడా పూర్తి కావని ఇంజనీర్లు స్పష్టం చేస్తున్నారు. దీంతో మరో రెండు పంటలకు విరామం ప్రకటించాల్సి వస్తుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. సింగూరు మరమ్మతులను నేషనల్ డ్యామ్ సేఫ్టీ బృందం బుధవారం పర్యటించి పర్యవేక్షించింది. ఈ బృందం డ్యామ్ పటిష్టతపై నివేదిక ఇవ్వనుంది. గతేడాది ఈ బృందం డ్యామ్ లోపలి భాగంలో రాతికట్ట(రివిట్మెంట్) నీటి తొలుకులకు కుంగిందని నివేదిక సమర్పించింది. వెంటనే మరమ్మతులు చేయాలని సూచించింది. దీంతో ప్రభుత్వం రూ.16 కోట్లను మంజూరు చేసింది. ఈ రివిట్మెంట్ పనులను జరిపించేందుకు కమిటీ సూచనల మేర స్థానికంగా పంట విరామం ప్రకటించింది. డ్యామ్లో మిషన్ భగీరథకోసం 8 టీఎంసీల నీటిని నిల్వ ఉంచి మిగతా నీటిని దిగువకు వదిలారు. మొదట 800 మీటర్లు కుంగిందని నివేదికలో పేర్కొన్నారు. డ్యామ్ పటిష్టతకోసం లోపలిభాగంలో మొత్తం 8 కిలోమీటర్ల మేర రాతికట్టను నిర్మించాలని సూచించారు. ప్రస్తుతం కేటాయించిన రూ.16 కోట్లకు అదనంగా నిధులు అవసరమవుతాయని ఇంజినీర్ల బృందం సూచించింది. ఎన్డీఎస్ఏ బృందం డ్యామ్ను పటిష్టతను అంచనా వేశారు. డ్యామ్ మరమ్మతు పనులను పర్యవేక్షించిన బృందంలో కమిటీ చైర్మన్ విజయ్ ట్రింబక్ దేశాయ్ సారధ్యంలో మురళీధర్, సతీశ్కుమార్ రేగొండ, శ్రీకాంత్, రాజు, లక్ష్మణరావు ఉన్నారు. ఈ సీజన్లో పూర్తి కానట్లే... డ్యామ్ రివిట్మెంట్ పనులు జూన్లోగా పూర్తి చేసి వానాకాలం పంటకు సాగునీరు ఇవ్వాలని మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, దామోదర నీటిపారుదల శాఖ అధికారులకు సూచించిన సంగతి తెలిసిందే. డ్యామ్లో మరో 8 టీఎంసీల నీరు ఉందని ఆనీటిని తాగునీటికి వదులుతూ నీరు తగ్గిన కొద్దీ పనులు జరిపించాలని ఇంజినీర్లు చెబుతున్నారు. దీంతో మరో రెండు పంటల వరకు క్రాఫ్ హాలీడే ప్రకటించాల్సి రావచ్చని తెలిపారు. ఈ బృందం వెంట నీటిపారుదల శాఖ రాష్ట్రస్థాయి అధికారులున్నారు. జూన్లోగా సింగూరు రివిట్మెంట్ పనులు పూర్తికావడం కష్టమే డ్యామ్ పనుల పరిశీలన.. పటిష్టతపై నివేదిక ప్రాజెక్టును సందర్శించిన ఎన్డీఎస్ఏ బృందం -
పకడ్బందీగా ప్రజాపాలన
జెడ్పీ సీఈఓ ఎల్లయ్య అల్లాదుర్గం(మెదక్)/టేక్మాల్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక’ పనులను పకడ్బందీగా నిర్వహించాలని జెడ్పీ సీఈఓ ఎల్లయ్య అధికారులను ఆదేశించారు. బుధవారం మండల పరిధిలోని ముస్లాపూర్లో పనులను పర్యవేక్షించి మాట్లాడారు. పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. పరిసరాల పరిశుభ్రతతో వ్యాధులు దరిచేరవన్నారు. ప్రతి గ్రామంలో వాటర్ ట్యాంకులను శుభ్రం చేసి, లీకేజీలను అరికట్టాలని సిబ్బందికి సూచించారు. ఆయన వెంట తహసీల్దార్ మల్లయ్య, ఎంపీడీఓ చంద్రశేఖర్ ఉన్నారు. అనంతరం టేక్మాల్ మండల పరిధిలోని బొడ్మట్పల్లి పంచాయతీని ఆకస్మికంగా సందర్శించారు. పలు రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం గ్రామంలో తిరుగుతూ ప్రజాపాలనలో జరుగుతున్న పనులను పరిశీలించారు. గ్రామస్తులు వందశాతం ఇంటి పన్నులు చెల్లించి గ్రామాభివృద్ధికి సహకరించాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ అవినాష్ కుమార్, పంచాయతీ కార్యదర్శి మౌనిక, నాయకులు రాందాస్, రవిశంకర్, నర్సింలు, నాగభూషణం, తదితరులు పాల్గొన్నారు. -
మహిళలు ఆర్థికంగా బలపడాలి
మెదక్జోన్: మహిళలు ఆర్థిక అంశాలపై పట్టు సాధించటం అత్యంత అవసరమని కలెక్టర్ ప్రతిమాసింగ్ అన్నారు. బుధవారం కలెక్టరేట్లో మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సమాజాభివృద్ధిలో మహిళల పాత్ర ఎంతో ముఖ్యమని, మహిళలు ఆర్థికంగా బలపడితే కుటుంబం, దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. మహిళలు స్వయం ఉపాధి అవకాశాలను వినియోగించుకుని ఆర్థికంగా ఎదగాలని సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. నైపుణ్యాభివృద్ధి శిక్షణలు, రుణ సౌకర్యాలు, ఉపాధి అవకాశాలతో మహిళలు ఆర్థికంగా బలపడేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వివరించారు. కార్యక్రమంలో నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ రాధిక, జిల్లా అధికారులు పాల్గొన్నారు.కలెక్టర్ ప్రతిమాసింగ్ -
పేటకు 200 ఇందిరమ్మ ఇళ్లు
ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రామాయంపేట(మెదక్): రామాయంపేట మండలానికి రెండు వందల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నట్లు ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ ప్రకటించారు. బుధవారం మున్సిపల్ సర్వసభ్య సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గత ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలను మోసగించడానికి హడావిడిగా ఆర్డీఓ కార్యాలయాన్ని ప్రారంభించిందని ఆరోపించారు. ఈవిషయం సీఎం దృష్టికి తీసుకెళ్లామని, త్వరలో అధికారికంగా కార్యాలయాన్ని మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. ప్రభుత్వ ఆస్పత్రికి డయాలసిస్ సెంటర్తో పాటు ట్రామా కేర్ సెంటర్ మంజూరు చేయిస్తానన్నారు. పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. ప్రతి వార్డులో సీసీ కెమరాలు ఏర్పాటు చేయిస్తామని, వైకుంఠధామం మరమ్మతులకు రూ. 30 లక్షలు మంజూరు చేస్తానన్నారు. మున్సిపాలిటీ పరిధిలో నీటి ఎద్దడి సమస్య పరిష్కరిస్తానన్నారు. గత ప్రభుత్వంలో మిషన్ భగీరధ, కాళేశ్వరం పేరిట రూ. వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. ఎలాంటి అవినీతికి తావివ్వొద్దని పాలకవర్గానికి సూచించారు. పార్టీలకతీతంగా రామాయంపేటను అభివృద్ధికి కృషి చేస్తామని పేర్కొన్నారు. అంతకుముందు ఎమ్మెల్యే మహంకాళి ఆలయంలో పూజలు నిర్వహించి యాదాద్రి పార్కులో మొక్కలు నాటారు. మున్సిపల్ చైర్పర్సన్ గజవాడ లావణ్య పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో వైస్ చైర్పర్సన్ నవనీత, కమిషనర్ శ్రావణ్, మేనేజర్ రఘువరన్, కౌన్సిలర్లు, నాగరాజు, రంజిత్, సందీప్, రవినాయక్, ప్రవీణ్, స్వప్న, చరిత, శ్యామల, మాధవి, శంకర్గౌడ్ పాల్గొన్నారు. పెండింగ్ బిల్లులు ఇవ్వండినర్సాపూర్: గత ప్రభుత్వ హయాంలో గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులు మంజూరు చేయాలని కోరుతూ మాజీ బుధవారం ఎమ్మెల్యే హన్మంతరావు, డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్ మంత్రి సీతక్కను కలిశారు. జిల్లాలో గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులు రాక సర్పంచ్లు ఇబ్బందులకు గురవుతున్నారని వివరించారు. పార్టీలకతీతంగా పెండింగ్ బిల్లులు మంజూరు చేయాలని కోరినట్లు వారు చెప్పారు. కాగా జిల్లాలో అసంపూర్తిగా ఉన్న పంచాయతీ భవనాలు, రోడ్ల అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని కోరగా, మంత్రి సానుకూలంగా స్పందించారని తెలిపారు. మే నెలాఖరురు పెండింగ్ బిల్లులు చెల్లించడంతో పాటు ఆయా పనులకు అవసరమైన నిధులు మంజూరు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారని పేర్కొన్నారు. పరీక్షా కేంద్రాల్లో మౌలిక వసతులుకౌడిపల్లి(నర్సాపూర్): పదో తరగతి పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు ఎలాంటి సమస్యలు లేకుండా ఉండేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నామని డీఈఓ విజయ తెలిపారు. బుధవారం కౌడిపల్లిలో పదో తరగతి పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. డెస్కులు, విద్యుత్, వెలుతురు, ఫ్యాన్లు, తాగునీరు తదితర సౌకర్యాలను పరిశీలించారు. కేంద్రం చుట్టుపక్కల ఎలాంటి చిత్తు కాగితాలు, పేపర్లు ఉండకుండా శుభ్రం చేయాలని సిబ్బందికి సూచించారు. ఓ గదిలో నేలపై బండలు సరిగా లేకపోవడంతో ఫ్లోరింగ్ చేయాలని ఆదేశించారు. కాగా తనిఖీ సమయంలో ఉన్నత పా ఠశాలలో హెచ్ఎం లలితాదేవి లేకపోవడంతో ఉపాధ్యాయులను ప్రశ్నించారు. కాగా ప్రతిరోజు హెచ్ఎం ఆలస్యంగా వస్తారని గ్రామస్తులు డీఈఓ దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం బాలికల ఉన్నత పాఠశాలలో వార్డు సభ్యురాలు, వంటమనిషి బొంతమ్మ పదో తరగతి విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు, పెన్నులు ఇవ్వగా డీఈఓ అందజేశారు. కార్యక్రమంలో హెచ్ఎంలు సాజిద్అలి, ఓంప్రకాష్, పీడీ విజయ్కృష్ణ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. డీఈఓ విజయ -
వర్క్షాప్కు హాజరైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
జహీరాబాద్: గండిపేటలోని గోల్కొండ రిసార్ట్లో మంగళవారం ప్రారంభమైన ఎమ్మెల్యేల వర్క్షాప్కు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు హాజరయ్యారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు జిల్లాలోని జహీరాబాద్, సంగారెడ్డి, ఎమ్మెల్యేలు కె.మాణిక్రావు, చింతా ప్రభాకర్ వర్క్షాప్లో పాల్గొన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేయడంతోపాటు సభలో లేవనెత్తాల్సిన ప్రజా సమస్యలు, నియమ నిబంధనలు, రాజ్యాంగం అంశాలపై అవగాహన కల్పించేందుకు వర్క్షాప్ ఏర్పాటు చేశారు. -
లక్ష్యం.. కావాలి శతశాతం
పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు మెదక్ అర్బన్: పదో తరగతి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నెల 14వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. జిల్లాలో మొత్తం 11,247 మంది విద్యార్థులు పరీక్షలు రాయనుండగా, 68 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈసారి కొత్తగా హాల్ టికెట్లను వాట్సాప్ ద్వారా డౌన్లోడ్ చేసుకునే అవకాశం కల్పించారు. దానిపై క్యూఆర్ కోడ్ ముద్రించారు. దాన్ని స్కాన్ చేస్తే.. పరీక్ష కేంద్రం రూట్ మ్యాప్ కనిపిస్తుంది. ఉదయం 9.30 గంటలకు ప్రారంభమయ్యే పరీక్షల కోసం విద్యార్థులు అరగంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని డీఈఓ విజయ సూచించారు. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు ముగ్గురు ఫ్లయింగ్ స్క్వాడ్లు, ఐదుగురు రూట్ ఆఫీసర్లు, 16 కస్టోడియన్లు, 17 సిట్టింగ్ స్క్వాడ్లు, 563 ఇన్విజిలేటర్లను నియమించారు. జిల్లాలో 22ఏ, 27బి, 19 సీ కేటగిరి సెంటర్లు ఉన్నాయి. రాహుల్రాజ్ మార్క్ ఫలించేనా..! బదిలీపై వెళ్లిన జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ విద్యాశాఖపై తనదైన ముద్రవేశారు. ముఖ్యంగా పదో తరగతి విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపారు. ఈ విద్యా సంవత్సరం వందల కొద్ది స్కూల్ళ్లు, హాస్టళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్లను పర్యవేక్షించారు. శతశాతం ఉత్తీర్ణత సాధించాలన్న లక్ష్యాన్ని నిర్దేశించారు. ఈ క్రమంలో నవంబర్ నుంచి స్పెషల్ క్లాసులు ప్రారంభించారు. పీఎంశ్రీ స్కూల్ విద్యార్థులకు స్నాక్స్ మొదట్నుంచీ అందించగా, ఇతర పాఠశాలల్లో గత నెల 15 నుంచి ప్రారంభించారు. వెనుక బడిన విద్యార్థుల దత్తత కార్యక్రమాన్ని కొనసాగించారు. సీ గ్రేడ్ విద్యార్థుల కోసం ప్రత్యేక యాక్షన్ ప్లాన్ తయారు చేయించారు. ప్రీ ఫైనల్తో పాటు, గతేడాది సెకండ్ సెట్ పేపర్తో సమాయత్త పరీక్షలు నిర్వహించారు. డీఈఓ విజయ సైతం ప్రతి పాఠశాలను సందర్శిస్తూ.. ఉపాధ్యాయులు.విద్యార్థుల్లో స్ఫూర్తి రగిలించారు. 227 పాఠశాలలు.. 11,247 విద్యార్థులు 68 పరీక్ష కేంద్రాలు.. సీసీ కెమెరాల ఏర్పాటు 14 నుంచి పరీక్షలు ప్రారంభం సీసీ కెమెరాల నీడన పరీక్షలు పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు, ప్రతి సెంటర్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశాం. పరీక్ష కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు కల్పించాం. విద్యార్థులు అరగంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి. పరీక్షలను ప్రశాంతంగా, స్వేచ్ఛగా రాసేలా మానసిక సన్నద్ధత సాధించాలి. ఎలాంటి ఇబ్బందులు ఉన్నా, సూపరింటెండెంట్ల దృష్టికి తీసుకెళ్లాలి. –విజయ, డీఈఓ -
క్రీడలతో మానసికోల్లాసం
● ఎస్పీ డీవీ శ్రీనివాసరావు ● పోలీసు వార్షిక క్రీడోత్సవాలు ప్రారంభంమెదక్ కలెక్టరేట్: క్రీడలతో ఒత్తిడిని జయించవచ్చునని, శారీరక ధృడత్వానికి ఎంతో అవసరమని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయం ప్రాంగణంలో పోలీసు వార్షిక క్రీడోత్సవాలను నిర్వహించారు. క్రీడా జ్యోతిని వెలిగించి పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజల భద్రత కోసం పోలీసు సిబ్బంది నిరంతరం విధులు నిర్వహిస్తూ అనేక సవాళ్లను ఎదుర్కొంటారని తెలిపారు. అలాంటి పరిస్థితుల్లో శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండటం ఎంతో అవసరమని పేర్కొన్నారు. విధుల్లో ఎదురయ్యే ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయని చెప్పారు. క్రీడా పోటీలు సిబ్బందిలో ఐక్యత, జట్టు భావన, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలను పెంపొందించడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయన్నారు. ఈ క్రీడోత్సవాల్లో క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, బ్యాడ్మింటన్, పరుగుపందెం, లాంగ్ జంప్, షాట్పుట్ వంటి పలు క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ మహేందర్, డీఎస్పీలు ప్రసన్న కుమార్, నరేందర్ గౌడ్, సుభాష్ చంద్ర బోస్, సీఐలు మహేష్, రేణుక రెడ్డి, కృష్ణమూర్తి, జాన్ రెడ్డి, వెంకట రాజా గౌడ్, ఆర్ఐలు శైలేందర్, రామకృష్ణ, ఎస్ఐలు, పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. మెదక్ పట్టణంలో... మెదక్జోన్: మానసికోల్లాసానికి క్రీడలు ఎంతగానో ఉపయోగ పడుతాయని టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు నరేందర్ పేర్కొన్నాడు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని పట్టణంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో మహిళా ఉద్యోగులకు మంగళవారం ఆటల పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా టీఎన్జీవో అధ్యక్షుడు నరేందర్ మాట్లాడుతూ, నిత్యం విధుల్లో నిమగ్నమయ్యే మహిళా ఉద్యోగులకు ఈ క్రీడలు ఎంతగానో దోహదపడుతాయని పేర్కొన్నారు. ఇందులో జ్యూట్ బ్యాగ్, జంపింగ్, మ్యూజికల్ చైర్, త్రెడ్ అండ్ నీడిల్, లెమన్ అండ్ స్పూన్, క్యారమ్స్, స్పీడ్ వాక్, చెస్, టగ్ ఆఫ్ వార్ తదితర క్రీడలు నిర్వహించగా.. ఉద్యోగులు అసక్తితో పోటీలలో పాల్గొన్నారు. ప్రతిభ కనబర్చిన విజేతలకు బుధవారం కలెక్టర్ చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేస్తారని తెలిపారు. కార్యక్రమంలో డీడబ్ల్యూఓ హేమభార్గవి, అధికారులు రమేష్, టీఎన్జీవో జిల్లా కార్యదర్శి రాజ్కుమార్, సహ అధ్యక్షుడు ఇక్బాల్ పాషా, పంచాయతీ కార్యదర్శుల ఫోరం జిల్లా అధ్యక్షులు సంతోష్ పాల్గొన్నారు. -
24 గ్రామాల్లో భూముల రీ సర్వే
అదనపు కలెక్టర్ నగేశ్ రామాయంపేట(మెదక్): జిల్లాలోని 24 గ్రామాల్లో భూముల రీ సర్వే కొనసాగుతోందని అదనపు కలెక్టర్ నగేశ్ అన్నారు. మంగళవారం మండలంలోని అక్కన్నపేట గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద జరిగిన భూముల రీసర్వే కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సర్వే అనంతరం ప్రతి హక్కుదారుడికి తాజాగా సదరు స్థలాలపై పూర్తి హక్కులు ఏర్పడుతాయని చెప్పారు. కొన్ని గ్రామాల్లో భూములతోపాటు సమస్యలు పెరిగిపోయాయని, రీ సర్వేతో భూములకు సంబంధించి అన్ని సమస్యలు పరిష్కారమవుతాయని పేర్కొన్నారు. సర్వే విభాగం ఏడీ కిషన్ మాట్లాడుతూ.. సర్వే అనంతరం సంబంధిత రైతుకు భూదార్ కార్డు ఇస్తామన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో రమాదేవి, డీపీఆర్వో రామచంద్రరాజు, తహసీల్దార్ రజనీ, ఎంపీడీవో సజీలుద్దీన్ సర్పంచ్ యాదగిరి, ఉప సర్పంచ్ ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు. ప్రశాంతంగా ఇంటర్ పరీక్షలు మెదక్ కలెక్టరేట్: ఇంటర్మీడియెట్ పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించామని జిల్లా అదనపు కలెక్టర్ నగేశ్ పేర్కొన్నారు. మంగళవారం మెదక్ పట్టణంలోని అజంపురా వీధిలో ఇంటర్మీడియెట్ పరీక్ష కేంద్రాలను పరిశీలించారు. అనంతరం 26 వార్డులో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలంతా పరిశుభ్రత పాటించాలని, పిచ్చి మొక్కలను తొలగించాలన్నారు. అంతకు ముందుకు మున్సిపల్ ఆధ్వర్యంలో పట్టణంలోని 9వ వార్డులో పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ రాధిక, వైస్ చైర్మన్ దొంతి నరేష్గౌడ్, కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, కౌన్సిలర్లు దీపక్కుమార్, జుబేర్ పాల్గొన్నారు. పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ వెంకటయ్య చిలప్చెడ్(నర్సాపూర్): ముందస్తు జాగ్రత్తగా పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయాలని, దీంతో వ్యాధి నిరోధక శక్తి పెరుగి, పశువు ఆరోగ్యంగా, బలంగా తయారవుతుందని జిల్లా పశుసంవర్థక శాఖ అధికారి డాక్టర్ వెంకటయ్య అన్నారు. మంగళవారం ఆయన చిలప్చెడ్ మండలంలోని చిట్కుల్ గ్రామంలో గాలికుంటు నివారణ టీకాల కార్యక్రమాన్ని ప్రారంభించారు. వెంకటయ్య మాట్లాడుతూ.. పాడి రైతులు ప్రతి పశువుకు టీకా ఇప్పించాలన్నారు. పశువుల్లో గర్భకోశ వ్యాధి నివారణ చికిత్సలు చేయించి, సకాలంలో చూడికట్టేలా చూసుకోవాలన్నారు. కార్యక్రమంలో వెటర్నరీ సర్జన్ డాక్టర్ వినోద్, పశువైద్య సిబ్బంది గట్టయ్య, యాదయ్య, నర్సింలు, సతీష్ పాల్గొన్నారు. ఐకేపీ ఏపీఎం సంగమేశ్వర్ నర్సాపూర్: మహిళలు అన్ని రంగాల్లో రాణించినప్పుడే వ్యవస్థ బలోపేతం అవుతుందని ఐకేపీ ఏపీఎం సంగమేశ్వర్ చెప్పారు. మంగళవారం ఐకేపీ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మహిళలు ఆర్థికంగా రాజకీయంగా సామాజిక పరంగా రాణించినప్పుడే వ్యవస్థ బలోపేతం అవుతుందని చెప్పారు. ఈ సందర్భంగా మహిళలకు పలు రకాల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో సిబ్బంది మేఘన, షహనాజ్, ప్రవీణ, రవీందర్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. -
అంగన్వాడీ టీచర్గా కలెక్టరమ్మ
చిన్నశంకరంపేటలోని మూడవ అంగన్వాడీ కేంద్రాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్గా అవతారమెత్తారు. ఉదయం రాగనే టీచర్ను ఎలా విష్ చేస్తారు.. ఇప్పుడు ఎలా విష్ చేయాలని అడిగి చిన్నారులతో జవాబు రాబట్టారు. టేబుల్పై ఏర్పాటు చేసిన వస్తువులను చూపిస్తూ వాటి పేర్లను అడిగారు. ఉదయం గుడ్డు తిన్నారా అని ఆరా తీశారు. ఈ రోజు ఏం కూర వండారని అడిగి తెలుసుకున్నారు. బీఎల్ఓగా పనిచేస్తున్న అంగన్వాడీ టీచర్ నాగరాణికి ఎస్ఐఆర్పై పలు సూచనలు చేశారు. ఆమె వెంట తహసీల్దార్ మాలతి, ఆర్ఐలు రాజు, వినయ్ ఉన్నారు. -
మల్కాపూర్ అభివృద్ధిపై ఆరా
శ్రీలంక బృందం సందర్శనతూప్రాన్: మండలంలోని మల్కాపూర్ ఆదర్శ గ్రామాన్ని మంగళవారం శ్రీలంక దేశానికి చెందిన ప్రజా ప్రతినిధుల బృందం ఎన్ఐఆర్డీ ఆధ్వర్యంలో మంగళవారం సందర్శించారు. గ్రామంలో జరిగిన పలు అభివృద్ధి పనులను సర్పంచ్ ఆంజనేయులుగౌడ్ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రామంలో మరుగుదొడ్లు, ఇంకుడు గుంతలు, రాక్ గార్డెన్, డంపింగ్ యార్డ్లను పరిశీలించారు. అంగాన్వాడీల పనితీరు, జిల్లా పరిషత్ హైస్కూల్, ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ప్రభుత్వపరంగా అందుతున్న ప్రయోజనాలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. మల్కాపూర్ అంచలంచెలుగా అభివృద్ధి చెంది మోడల్ విలేజ్గా మారిన తీరుతెన్నులపై శ్రీలంక ప్రజా ప్రతినిధుల బృందం సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం మండల పరిషత్ కార్యాలయాన్ని బృందం సందర్శించి అధికారుల పనితీరుపై ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఆంజనేయులుగౌడ్, ఎన్ఐఆర్డీ ప్రతినిధి ఆశాలత, ఎంపీడీవో సతీష్, ఈజీఎస్ టెక్నికల్ అసిస్టెంట్ సురేష్, సత్యం, పంచాయతీ కార్యదర్శి మహేశ్వరి, పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు. -
పరిశుభ్రతే లక్ష్యంగా ‘ప్రణాళిక’
జిల్లా పౌర సరఫరాల అధికారి నిత్యానంద్ చిలప్చెడ్(నర్సాపూర్): గ్రామాల్లో పరిశుభ్రతే లక్ష్యంగా ప్రగతి ప్రణాళిక కార్యాచరణ కొనసాగుతోందని జిల్లా పౌర సరఫరాల అధికారి నిత్యానంద్ అన్నారు. మంగళవారం 99 రోజుల కార్యాచరణలో భాగంగా మండల పరిధిలోని ఫైజాబాద్ గ్రామాన్ని సందర్శించారు. గ్రామంలో జరుగుతున్న పారిశుద్ధ్య పనులతో పాటు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు. అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించారు. పాలకవర్గంతో చర్చించి, సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులు, పాలకులతో పాటు, ప్రజలు సైతం గ్రామాభివృద్ధికి కృషి చేయాలన్నారు. గ్రామాలలో సమస్యలు ఎదురైతే, వాటిని పరిష్కరించే విధంగా అధికారులు తమ వంతు కృషి చేస్తారన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ ప్రశాంత్, అర్డబ్య్లూస్ ఏఈ ఆన్వేష్రెడ్డి, కార్యదర్శి నాగరాజు, సర్పంచ్ రాములు, ఉప సర్పంచ్ శ్రీకాంత్రెడ్డి, గ్రామస్థులు పాల్గొన్నారు. -
రేపు సర్పంచ్, కౌన్సిలర్లకు శిక్షణ
● హాజరు కానున్న మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు ● కలెక్టర్ ప్రతిమాసింగ్ మెదక్ కలెక్టరేట్: సర్పంచ్లు, వార్డు సభ్యులు, కౌన్సిలర్లకు ఈనెల 12న ప్రత్యేక శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ ప్రతిమాసింగ్ తెలిపారు. మంగళవారం హైదరాబాద్ నుంచి సీఎస్ రామకృష్ణారావు అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం జిల్లాలోని అన్ని శాఖల అధికారులతో ప్రజాపాలనా– ప్రగతి ప్రణాళిక కార్యక్రమం గురువారం నిర్వహించనున్న శిక్షణా కార్యక్రమం నిర్వహణపై దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అభివృద్ధి కార్యక్రమాలను మరింత వేగవంతం చేయడానికి స్థానిక ప్రజాప్రతినిధులకు సమగ్ర అవగాహన కల్పించడం ముఖ్యమన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు పాల్గొంటారని చెప్పారు. అనంతరం ప్రగతి ప్రణాళిక అమలుపై సమీక్షించారు. ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించడం, గ్రామాలు, పట్టణాల్లో శుభ్రత, అభివృద్ధి కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయడంపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్ ఆదేశించారు. అనంతరం కలెక్టరేట్లోని పలు శాఖల్లో జరుగుతున్న ఫైళ్ల క్లియరెన్స్ను పరిశీలించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ నగేష్, అదనపు ఎస్పీ మహేందర్, ఆర్డీఓలు, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు. పెండింగ్ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి చిన్నశంకరంపేట(మెదక్): ప్రభుత్వ కార్యాలయాల్లో పెండింగ్లో ఉన్న దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ ప్రతిమాసింగ్ ఆదేశించారు. మంగళవారం చిన్నశంకరంపేట తహసీల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. పెండింగ్ దరఖాస్తులను ఇన్ని రోజులు ఎందుకు అలా వదిలేశారని అధికారులను ప్రశ్నించారు. వారం రోజుల్లో పెండింగ్లో ఉన్న దరఖాస్తులన్నింటిని పరిష్కరించాలని, లేకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. -
ప్రియుడు బెదిరించడంతో ప్రియురాలు ఆత్మహత్య
అల్లాదుర్గం (మెదక్): ప్రియుడు బెదిరించడంతో ప్రియురాలు చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం అప్పాజీపల్లి గ్రామానికి చెందిన రోళ్ల రూప (21) హైదరాబాద్లో ప్రైవేట్ సంస్థలో విధులు నిర్వహిస్తోంది. అక్కడ ఓ వ్యక్తితో పరిచయం ఏర్పడి ప్రేమించుకున్నారు. ఈ క్రమంలో రూపకు పెళ్లి చేసేందుకు తల్లిదండ్రులు టేక్మాల్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువకుడితో పది రోజుల కిందట నిశ్చితార్థం చేశారు. ఈ విషయం తెలుసుకున్న పేమ్రించిన యువ కుడు, రూపకు ఫోన్ చేసి తనను కాదని మరొకరిని వివాహం చేసుకుంటే అంతు చూస్తానని బెదిరించినట్లు కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. దీంతో భయాందోళనకు గురైన రూప సోమవారం సాయంత్రం స్థానిక చెరువులో దూకింది. వెంటనే గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను చెరువులోంచి బయటకు తీశారు. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను జోగిపేట ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. -
అభివృద్ధే మా ఎజెండా
మెదక్ కలెక్టరేట్: మెదక్ మున్సిపల్ సాధారణ సర్వ సభ్య సమావేశం సోమవారం కమిషనర్ శ్రీనివాస్రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే రోహిత్రావు, ఎమ్మెల్సీ అంజిరెడ్డి హాజరయ్యారు. ఈసందర్భంగా కౌన్సిలర్లు పట్టణంలో నెల కొన్న సమస్యలను సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. ముఖ్యంగా తాగునీరు, శానిటేషన్, కోతులు, కుక్కలు, అంతర్గత సీసీ రోడ్లు, ట్రాఫిక్ సమస్యలు తీవ్రంగా ఉన్నాయని వివరించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పార్టీలకతీతంగా నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో మిషన్ భగీరథ పేరిట రూ. కోట్లు కొల్లగొట్టారని విమర్శించారు. తమ సొంత నిధులతో బోర్లు వేయించామన్నారు. పార్టీల పేరుతో రాజకీయాలు చేయడం లేదన్నారు. పట్టణ ప్రజల దాహార్తిని తీర్చేందుకు అన్ని రకాల చర్యలు చేపడతామన్నారు. పట్టణ ప్రజలపై అడ్డగోలుగా పన్నుల భారం మోపితే సహించేది లేదని కమిషనర్ను హెచ్చరించారు. అనంతరం ఎమ్మెల్సీ అంజిరెడ్డి మాట్లాడుతూ.. రానున్న వేసవిని దృష్టిలో పెట్టుకొని పట్టణంలో తాగునీటి సమస్య లేకుండా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. 70 శాతం నూతన కౌన్సిలర్లు ఉన్నందున వారికి శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయాలన్నారు. అభివృద్ధి కోసం తాను ముందుంటానని, ఎలాంటి అవసరం ఉన్న తనకు ఫోన్ చేయాలని సభ్యులకు సూచించారు. మున్సిపల్ చైర్పర్సన్ కానుగు రాధిక మాట్లాడుతూ.. రాజకీయాలకతీతంగా పట్టణాభివృద్ధికి అందరం కలిసి పనిచేద్దామని పిలుపునిచ్చారు. పట్టణంలో నెలకొన్న తాగునీరు, సీసీ రోడ్లు, పారిశుద్ధ్య సమస్యలు పరిష్కరించుకుందామని తెలిపారు. వైస్ చైర్మన్ దొంతి నరేష్గౌడ్ మాట్లాడుతూ.. పార్టీలకతీతంగా పట్టణాభివృద్ధికి కృషి చేస్తామని అన్నారు. 99 రోజుల ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా అన్ని వార్డుల్లో పర్యటిస్తున్నామన్నారు. వార్డుల్లో నెలకొన్న సమస్యలు తెలుసుకొని పరిష్కారానికి చర్యలు చేపడుతామని వివరించారు. మున్సిపల్ సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే రోహిత్రావు -
సాధికారతతో సమాజాభివృద్ధి
మెదక్ కలెక్టరేట్: మహిళా సాధికారతే సమాజాభివృద్ధికి పునాది అని అదనపు ఎస్పీ మహేందర్ అన్నారు. సోమవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళలు సమాజ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. కు టుంబ వ్యవస్థను బలోపేతం చేయడంలోనే కాకుండా దేశ అభివృద్ధిలో వారి పాత్ర ఎంతో ముఖ్యమన్నారు. అన్ని రంగాల్లో ప్రతిభ చాటుతూ ముందుకు సాగుతున్నారని వివరించారు. పోలీస్శాఖలో మహిళా సిబ్బంది ధైర్యం, నిబద్ధతతో విధులు నిర్వహిస్తున్నారని కొనియాడారు. అనంతరం కేక్ కట్ చేసి మహిళా పోలీస్ సిబ్బందిని సన్మానించారు. కార్యక్రమంలో డీఎస్పీ ప్రసన్నకుమార్, ఆర్ఐ శైలందర్, సీఐలు, సిబ్బంది పాల్గొన్నారు.అదనపు ఎస్పీ మహేందర్ -
నిలకడగా విద్యార్థుల ఆరోగ్యం
నర్సాపూర్: నర్సాపూర్లోని ప్రభుత్వ మైనార్టీ పాఠశాల, కాలేజీలో అస్వస్థతకు గురైన విద్యార్థుల ఆరోగ్యం నిలకడగా ఉందని తహసీల్దార్ శ్రీనివాస్ తెలిపారు. సోమవారం పాఠశాలను సందర్శించి విద్యార్థుల ఆరోగ్యంపై ఆరా తీశా రు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 11 మంది విద్యార్థులు డీహైడ్రేషన్కు గురయ్యారని, వారికి ప్రిన్సిపాల్ నసీమా షేక్తో పాటు సిబ్బంది స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో సకాలంలో వైద్యం చేయించారన్నారు. ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగా ఉందని వివరించారు. వంటలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. పేదలకు మెరుగైన వైద్యం చేగుంట(తూప్రాన్): పేదలకు మెరుగైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని డీఎంహెచ్ఓ శ్రీరామ్ అన్నారు. సోమవారం మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మెగాహెల్త్ క్యాంపు నిర్వహించి ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈసందర్భంగా క్యాంపును డీఎంహెచ్ఓ సందర్శించి మాట్లాడారు. 205 మందికి వైద్య పరీక్షలు చేసినట్లు తెలిపారు. 57 మందిని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తరలించనున్నట్లు పేర్కొన్నారు. ఆయన వెంట వైద్యులు అనిల్కుమార్, అరుణ, శిరీష, శారద, కిరణ్, అక్షయ్తో పాటు సిబ్బంది ఉన్నారు. ‘నిర్భయంగా ఫిర్యాదు చేయండి’ మెదక్ కలెక్టరేట్: సమస్యలపై ప్రజలు నిర్భయంగా ఫిర్యాదు చేయాలని అదనపు ఎస్పీ మహేందర్ సూచించారు. సోమవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొని ఫిర్యాదులు స్వీకరించారు. ఫిర్యాదుదారులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత పోలీస్ అధికారులను ఆదేశించారు. అ నంతరం ఆయన మాట్లాడుతూ.. పోలీస్శాఖ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందన్నారు. ప్రజలు ఎలాంటి పైరవీల అవసరం లేకుండా నేరుగా సంప్రదించాలన్నారు. చట్టపరమైన మార్గంలో ప్రతి ఒక్కరికీ న్యాయం అందించడమే పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమన్నారు. పరిశుభ్రతే ముఖ్యం రామాయంపేట(మెదక్): పట్టణ పరిశుభ్రత విషయమై అందరూ సహకరించాలని మున్సి పల్ చైర్పర్సన్ గజవాడ లావణ్య అన్నారు. ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా సోమవారం రామాయంపేటలో 5 కే రన్ను ప్రారంభించి మాట్లాడారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలందరికీ చేరాలని సూచించారు. కార్యక్రమంలో వైస్ చైర్పర్సన్ నవనీత, కౌన్సిలర్లు నాగరాజు, రంజిత్, స్వప్న, ప్రవీణ్, శంకర్గౌడ్, రవినాయక్, మాధవి, కాంగ్రెస్ పట్టణ పార్టీ అధ్యక్షుడు స్వామి తదితరులు పాల్గొన్నారు. కొనసాగుతున్న ఇంటర్ పరీక్షలు మెదక్ కలెక్టరేట్: జిల్లాలో ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయని డీఐఈఓ మాధవి తెలిపారు. సోమవారం మొదటి సంవత్సరం ఫిజిక్స్–1, ఎకానమిక్స్–1 పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని చెప్పారు. జనరల్ విభాగంలో 6,401 విద్యార్థులకు గాను 6,198 మంది హాజరు కాగా, ఒకేషనల్ విభాగంలో 621 విద్యార్థులకు గాను 600 మంది పరీక్షకు హాజరైనట్లు చెప్పారు. దీంతో విద్యార్థుల హాజరు శాతం 96.80 శాతం నమోదైనట్లు వివరించారు. ఐదు నిమిషాల నిబంధన అమలులో ఉండటంతో విద్యార్థులందరూ సమయానికి పరీక్షా కేంద్రాలకు చేరుకుంటున్నట్లు పేర్కొన్నారు. -
మట్టి.. కొల్లగొట్టి
అక్రమార్కులు తరలించగా మిగిలిన మట్టి కుప్పలుఅర్ధరాత్రి గుట్టుగా తరలింపునర్సాపూర్ రూరల్: అక్రమార్కులకు మట్టే ఆహారంగా మారింది. అర్ధరాత్రి గుట్టుగా తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. మండలంలోని రెడ్డిపల్లి శివారులో కాళేశ్వరం 18వ ప్యాకేజీ కాలువ వెళ్తోంది. గత ప్రభుత్వ హయాంలో సుమారు నాలుగున్నర కిలోమీటర్ల మేర టన్నెల్ (సొరంగం) పనులు ప్రారంభించి సుమారు రెండున్నర కిలోమీటర్ల మేర పనులు చేపట్టి అర్ధంతరంగా నిలిపివేశారు. కాగా కాంట్రాక్టర్ టన్నెల్ కోసం తీసిన మట్టి గుట్టలుగా పేరుకుపోయింది. పనులు నిలిచిపోయి నెలలు గడవడంతో అక్రమార్కుల కన్ను మట్టి కుప్పలపై పడింది. పెద్దఎత్తున టిప్పర్లు, ట్రాక్టర్ల ద్వారా రాత్రి వేళల్లో తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. దీంతో పాటు సొరంగం నుంచి వెలువడిన రాళ్లను సైతం ఇంటి నిర్మాణాల కోసం తరలిస్తూ పెద్దఎత్తున అక్రమాలకు పాల్పడుతున్నారు. కాగా మట్టి కుప్పలు కరిగిపోతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. అక్రమ మట్టి వ్యాపారుల నుంచి అధికారులకు మాముళ్లు ముట్టడంతో చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. రూ. కోట్ల విలువ చేసే మట్టిని తరలించిన అక్రమార్కులను గుర్తించి వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. -
ఆట, పాట.. భవితకు బాట
చిన్నారులతో మాట్లాడుతున్న ఐసీడీఎస్ డైరెక్టర్ శృతి ఓజాబుడి బుడి అడుగులతో అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే పిల్లలకు ఆట, పాటలతో కూడిన విద్యను అందిస్తున్నారు. సోమవారం మండలంలోని రెడ్డిపల్లి అంగన్వాడీ కేంద్రాన్ని ఐసీడీఎస్ డైరెక్టర్ శృతి ఓజా సందర్శించారు. మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యం, విద్యుత్ సరఫరా తదితర వాటిని పరిశీలించారు. చిన్నారులకు అందిస్తున్న పోషకాహారాన్ని తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. ఆమె వెంట డీడబ్ల్యూఓ హేమాభార్గవి, ఐసీడీఎస్ సూపర్వైజర్లు పాల్గొన్నారు. – నర్సాపూర్ రూరల్ -
దరఖాస్తులు పెండింగ్లో ఉండొద్దు
మెదక్ కలెక్టరేట్: ప్రజావాణి అర్జీలపై ప్రత్యేక శ్రద్ధ అవసరమని, పెండింగ్ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ ప్రతిమాసింగ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గతవారం ప్రజల నుంచి స్వీకరించిన దరఖాస్తుల పరిష్కారానికి అధికారులు తీసుకున్న చర్యలపై శాఖల వారీగా అడిగి తెలుసుకున్నారు. సమస్యలను వెంటనే పరిశీలించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం ప్రజావాణి అర్జీలు, క్షేత్రస్థాయి పర్యటనలపై సమీక్షించారు. అధికారులందరూ క్షేత్రస్థాయి పర్యటన నిర్వహించాలని, అభివృద్ధి, సంక్షేమ పథకాలపై స్పష్టమైన నివేదికలు అందజేయాలని ఆదేశించారు. శాఖల వారీగా పనితీరు మరింత మెరుగుపడే దిశగా పటిష్ట కార్యాచరణతో ముందుకు వెళ్తామని తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేశ్, జెడ్పీ సీఈఓ ఎల్లయ్య, డీఆర్డీఓ పీడీ శ్రీనివాసరావు, ఆయా శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. కాగా ప్రజావాణికి వివిధ సమస్యలపై 80 వినతులు వచ్చాయి. పంట వివరాల నమోదు తప్పనిసరి కొల్చారం(నర్సాపూర్)/తూప్రాన్: రైతులకు ప్రభుత్వ పథకాలు అందాలంటే పంట వివరాలను కచ్చితంగా నమోదు చేయాలని, 10వ తేదీ వరకు పూర్తి చేయాలని కలెక్టర్ ప్రతిమాసింగ్ వ్యవసాయాధికారులకు సూచించారు. సోమవారం మండలంలోని అప్పాజిపల్లిలో పంట నమోదు యాప్ పనితీరును పరిశీలించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పంట నమోదు వివరాలను మొబైల్ యాప్ ద్వారా పక్కాగా నమోదు చేయాలన్నారు. జిల్లాలో 2,85,774 ఎకరాలకు గాను ఇప్పటివరకు 39,827 ఎకరాలు నమోదు చేసినట్లు తెలిపారు. అధిక ధరలకు యూరియా విక్రయించే వారి లైసెన్స్ రద్దు చేయాలని, రైతులకు అందుబాటులో ఉండని అధికారులపై శాఖా పరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి దేవకుమార్ను ఆదేశించారు. కలెక్టర్ వెంట ఏఓ శ్వేతా కుమారి, సర్పంచ్ వెంకట్గౌడ్, ఏఈఓలు ఉన్నారు. అనంతరం తూప్రాన్ మున్సిపాలిటీలో పర్యటించారు. పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు మున్సిపల్ సిబ్బందికి ప్రజలు సహకరించాలని సూచించారు. కలెక్టర్ ప్రతిమాసింగ్ క్షేత్రస్థాయిలో పర్యటించాలని అధికారులకు సూచన


