breaking news
Medak
-
హస్తంలో నిస్తేజం
మెదక్ అర్బన్: ఈనెల 5వ తేదీకల్లా జెడ్పీటీసీ సభ్యులుగా పోటీ చేసేందుకు అర్హులను గుర్తించి, ఒక్కోస్థానం నుంచి ముగ్గురు అభ్యర్థుల పేర్లను గాంధీ భవన్కు పంపాలని పీసీసీ ఆదేశించినా.. మెదక్ నియోజకవర్గంలో ఇప్పటివరకు ఎన్నికల సందడి కనిపించడం లేదు. స్థానిక నాయకులతో సమావేశాలు ఏర్పాటు చేసి, అభ్యర్థుల పేర్లు గుర్తిస్తే బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇటీవల గాంధీభవన్ వర్గాలు మాత్రం కొంతమంది కాంగ్రెస్ మండల శాఖ అధ్యక్షులకు ఫోన్ చేసి ఆశావహుల వివరాలు అడిగినట్లు సమాచారం. ఆశావహుల్లో ఆందోళన జిల్లాలో 21 జెడ్పీటీసీ స్థానాలు ఉండగా, మెదక్ నియోజకవర్గంలో ఆరు మండలాలు ఉన్నాయి. విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు ఈనెల 9 నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. అయితే ఈనెల 5 కల్లా జెడ్పీటీసీ స్థానాలకు ఆశావహులను గుర్తించి, ఒక్కో ప్రాదేశిక నియోజకవర్గం నుంచి ముగ్గురు అభ్యర్థుల పేర్లు పంపాలని జిల్లా పార్టీ కమిటీలను పీసీసీ ఆదేశించింది. జిల్లాకు చెందిన, ఇన్చార్జి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నాయకుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. కానీ ఇప్పటివరకు అలాంటి సమావేశాలు ఏర్పాటు కాలేదని మండల కార్యవర్గాలు అంటున్నాయి. ఓ వైపు ముగ్గురేసి అభ్యర్థుల పేర్లను ఖరారు చేసి పీసీసీకి పంపాలనే సూచనలు ఉన్నాయి. కాగా రెండు, మూడు రోజుల కింద పీసీసీ వర్గాలు, కొంతమంది మండల కాంగ్రెస్ శాఖ అధ్యక్షులకు ఫోన్లు చేసి, జెడ్పీటీసీ స్థానాల్లో పోటీకి ఆసక్తి చూపుతున్న వారి వివరాలు అడిగినట్లు తెలుస్తుంది. అయితే వారు తమకు తెలిసిన కొన్ని పేర్లు చెప్పినట్లు సమాచారం. మెదక్ నియోజకవర్గంలో పోటాపోటీ మెదక్ నియోజకవర్గంలోని పాపన్నపేట మండలంలో కాంగ్రెస్ నుంచి పంతుల భూమన్న, శ్రీకాంతప్ప, రమేశ్గౌడ్, రాజశేఖర్, భరత్గౌడ్, సూఫీ, మెదక్ మండలం జెడ్పీటీసీకి శంకర్, నాగరాజు, మురళి, హవేళిఘణాపూర్ మండలం నుంచి శ్రీనివాస్, పరుశురాంగౌడ్, చిన్నశంకరంపేట నుంచి సాన సత్యనారాయణ, భిక్షపతి, ప్రభాకర్, పడాల సిద్దిరాములు, రామాయంపేట నుంచి మహేందర్ రెడ్డి, మోహన్నాయక్, శివప్రసాద్రావు, నిజాంపేట నుంచి వెంకటేశంతో పాటు ఇంకా కొంతమంది నాయకులు జెడ్పీటీసీ టికెట్ ఆశిస్తున్నట్లు సమాచారం. పేర్లు పంపిస్తాం పీసీసీ సూచన మేరకు ఆదివారం సాయంత్రానికల్లా ఒక్కో ప్రాదేశిక నియోజకవర్గం నుంచి ముగ్గురు అభ్యర్థుల పేర్లు పంపిస్తాం. ఇప్పటికే మండలాల వారీగా సమాచారం సేకరించాం. కొన్ని మండలాల్లో సమావేశాలు ఏర్పాటు చేయలేదు. కానీ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఉత్సాహం చూపుతున్న వారి పేర్లు తీసుకున్నాం. – ఆంజనేయులు గౌడ్, డీసీసీ అధ్యక్షుడు కాంగ్రెస్లో ఖరారు కాని ఆశావహుల పేర్లు మండల సమావేశాలు నిర్వహించని వైనం 5 వరకు జెడ్పీటీసీ అభ్యర్థుల జాబితా పంపాలని కోరిన అధిష్టానం రాజకీయాల్లో అనాధిగా అగ్రవర్ణ నాయకుల అధిపత్యం కొనసాగుతుంది. బీసీ రిజర్వేషన్ల నేపథ్యంలో ఓసీలకు చాలా చోట్ల రిజర్వేషన్లు ప్రతికూలంగా వచ్చాయి. దీంతో వారు స్థానిక సంస్థల ఎన్నికల్లో క్రియాశీలకంగా కనిపించడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రిజర్వేషన్లపై కోర్టు తీర్పు ఎలా ఉండబోతుందోనన్న ఆందోళన కూడా రాజకీయ వాతావరణాన్ని రగిలించడం లేదు. దీంతో చాలా చోట్ల ఎన్నికల సన్నాహక సమావేశాలు జరుగలేదని తెలుస్తోంది. -
అన్నదాతకు వరుణ గండం
మెదక్జోన్: ప్రకృతి వైపరీత్యాలు వ్యవసాయ రంగాన్ని కుదేలు చేస్తున్నాయి. ఆరుగాలం కష్టపడి సాగు చేసిన రైతన్నకు పంటలు చేతికొచ్చే సమయంలో వర్షాలు కంటిమీద కునుకు లేకుండా చేస్తునాయి. ఆదివారం జిల్లాలోని పలు మండలాల్లో 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వరికోత దశలో వర్షాలు కురుస్తుండటంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. మరో పక్క ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు జిల్లా యంత్రాంగం సమాయత్తం అవుతోంది. ఈ నేపథ్యంలో వదలని వానతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో కర్షకులు కొట్టుమిట్టాడుతున్నారు. 503 కొనుగోలు కేంద్రాల ఏర్పాటు ఈ ఖరీఫ్ సీజన్లో జిల్లావ్యాప్తంగా 3.5 లక్షల ఎకరాల్లో రైతులు వరి సాగు చేశారు. ఇందులో దొడ్డు రకం 2.28 లక్షలు, సన్నాలు 77 వేల ఎకరాల్లో సాగు చేశారు. ఇందుకోసం 7.62 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. అందులో 3.39 లక్షల మెట్రిక్ టన్నులు రైతులు ఆహారం కోసం నిల్వ ఉంచుకుంటారు. విత్తన కంపెనీలకు కొంతమేర పోనూ, మరికొంత బయట వ్యాపారులకు విక్రయిస్తారని భావిస్తున్నారు. అదిపోను కొనుగోలు కేంద్రాలకు 4.23 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అంచనా వేశారు. ఇందుకోసం జిల్లావ్యాప్తంగా 503 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నారు. 3 గంటలు.. 12 సెంటీమీటర్లు ఆదివారం ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు సుమారు 3 గంటల పాటు వర్షం దంచికొట్టింది. జిల్లాలోని చిన్నశంకరంపేట, చేగుంట, మెదక్, హవేళిఘణాపూర్, నార్సింగి, కౌడిపల్లి, కొల్చారం, నర్సాపూర్, పాపన్నపేట, టేక్మాల్, చిలప్చెడ్ తదితర మండలాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో పంట పొలాల్లోకి భారీగా వరద నీరు చేరింది. ఇప్పటికే మొక్క జొన్న పంటను కోసి ఆరబెట్టగా, 40 శాతం వరి పంటలు కోతకు వచ్చాయి. కానీ వర్షాల కారణంగా పంట చేతికందుతుందా..? లేదా అని రైతు లు ఆందోళన చెందుతున్నారు. కోత కోయలేరు.. ఆరబెట్టలేరు ఈ ఏడాది భారీ వర్షాలతో ఇప్పటికే వేలాది ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. కాగా మిగిలిన పంటనైనా కోసి అమ్ముకుందామంటే వర్షాలు వెంటాడుతున్నాయి. చైన్ మిషన్లతో వరి పంటను కోసినా, ధాన్యాన్ని ఆయబెట్టలేని దుస్థితి ఏర్పడిందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరికోతల వేళ వెంటాడుతున్న వర్షాలు ధాన్యం కొనుగోళ్లకు అధికారుల ఏర్పాట్లు జిల్లాలో 4.23 లక్షల మెట్రిక్ టన్నుల అంచనా -
ఓట్లడిగే హక్కు ఆ పార్టీలకు లేదు
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావుజోగిపేట(అందోల్): స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్టీ సీట్లను గెలుచుకొని ప్రధాని మోదీకి గిఫ్ట్గా ఇస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు ప్రకటించారు. ఆదివారం అందోలులో నిర్వహించిన అలయ్– బలయ్ కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు ఎన్నికల్లో ఓట్లు అడిగే నైతిక హక్కు లేదన్నారు. ప్రజల్లో బీజేపీ పార్టీకి ఆదరణ ఉందన్నారు. ఎక్కడికి వెళ్లినా తమ పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారన్నారు. కార్యకర్తల ఉత్సా హం చూస్తుంటే సంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్్ పదవిని బీజేపీ కై వసం చేసుకోవడం ఖాయమని అన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కార్యకర్తలు, నాయకులు సిద్ధంగా ఉండాలన్నారు. కాంగ్రెస్ మోసపూరిత విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు. గత పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ పనితీరును కూడా ఎండగట్టాలని పిలుపునిచ్చారు. కార్యకర్తలంతా ఐకమత్యంగా ఉండి స్థానిక సంస్థల ఎన్నికలను ఎదుర్కోవాలన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ అంజిరెడ్డి, జిల్లా అధ్యక్షురాలు గోదావరి, సంగారెడ్డి, నారాయణఖేడ్ అసెంబ్లీ ఇన్చార్జిలు దేశ్పాండే, సంగప్ప, నాయకులు అనంతరావు కులకర్ణి, ప్రభాకర్గౌడ్, లక్ష్మినర్సింహ రెడ్డి, వివిధ మండల శాఖల అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
స్థానికంగానే నామినేషన్లు
● ఎంపీడీఓ కార్యాలయాల్లోనే కౌంటర్లు ● 21 ఏళ్లు నిండిన వారే పోటీకి అర్హులు నారాయణఖేడ్: జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థుల నామినేషన్ల స్వీకరణకు స్థానికంగా మండల పరిషత్తు కార్యాలయాలు (ఎంపీడీఓ)ల్లోనే ఏర్పాట్లు చేస్తున్నారు. ఎంపీటీసీ స్థానానికి గానీ, జెడ్పీటీసీ స్థానానికి గాను ఆయా మండలాలకు సంబంధించిన వారు సదరు ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసే కౌంటర్లో ఆర్వోలకు తమ నామినేషన్ పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. ఎంపీటీసీ స్థానం ఎన్నికల నిర్వహణకు గాను గెజిటెడ్ హోదా ఉన్న హెడ్మాస్టర్లు, లెక్చరర్లు, ఇతర అధికారులను రిటర్నింగ్ అధికారిగా నియమించనున్నారు. సదరు అధికారి తాను పనిచేసే మండలం, సొంత మండలం రెండు అంశాలను పరిగణలోకి తీసుకుని ఇతర మండలాల వారిని ఎన్నికల బాధ్యతలు అప్పగిస్తున్నారు. జెడ్పీటీసీ,ఎంపీటీసీ స్థానానికి నామినేషన్ దాఖలు చేసేందుకు వచ్చే అభ్యర్థులకు ఆ క్లస్టర్ పరిధిలో వచ్చే ఎంపీటీసీ స్థానాల వివరాలను సంబంధిత ఆర్వోల వద్ద ప్రదర్శిస్తారు. తొలివిడత పరిషత్ ఎన్నికల కోసం ఈ నెల 9న నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుండటంతో అందుకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు చేపట్టారు. పోటీ చేసే అభ్యర్థితోపాటు ముగ్గురికి మాత్రమే నామినేషన్ కేంద్రాల్లోకి అనుమతి ఉంటుంది. నామినేషన్ కేంద్రాలకు 100 మీటర్ల పరిధిలో ఎలాంటి ర్యాలీలు, ప్రచారాలకు అనుమతులు లేవు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే అభ్యర్థి వయస్సు నామినేషన్ల స్వీకరణ నాటికి 21 సంవత్సరాలు నిండి ఉండాలి. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల కేటగిరీని బట్టి డిపాజిట్ చెల్లించాలి. ఎంపీటీసీగా పోటీ చేసే జనరల్ అభ్యర్థులు రూ.2,500, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు రూ.1,250, జెడ్పీటీసీ జనరల్ అభ్యర్థులు రూ.5,000, ఎస్సీ, ఎస్టీ, బీసీలు రూ.2,500, గ్రామ పంచాయతీ సర్పంచ్గా పోటీ చేసే జనరల్ అభ్యర్థి రూ.2వేలు, ఎస్సీ, ఎస్టీ, బీసీలు రూ.1000, వార్డు సభ్యుడు జనరల్ అభ్యర్థి రూ.500, ఎస్సీ, ఎస్టీ, బీసీలు రూ.250లు చెల్లించాలి. పోటీ చేసే అభ్యర్థులు పంచాయతీకి పన్ను బకాయి, కరెంటు బిల్లులు క్లియర్ చేసి ఆ రశీదును తీసుకోవాల్సి ఉంటుంది. తమ నామిషన్ల సందర్భంగా కులధ్రువీకరణ పత్రాలను కూడా సమర్పించాల్సి ఉంటుంది. -
అమానుషం.. యువకుడిపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన గ్రామస్తులు
సాక్షి,హైదరాబాద్: మెదక్ జిల్లాలో అమానుషం చోటు చేసుకుంది. బైక్లను దొంగిలించాడనే నెపంతో ఓ దొంగను చెట్టుకు కట్టేసిన గ్రామస్తులు అతడిపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టారు. ఈ దుర్ఘటనలో 90 శాతం కాలిన గాయాలతో బాధితుడు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు.పోలీసుల వివరాల మేరకు.. మెదక్ జిల్లా చేగుంట మండలం వడియారం గ్రామంలో దారుణం జరిగింది. బైక్ దొంగతనం చేయబోయిన ఇద్దరు యువకుల్లో ఒకరిపై గ్రామస్తులు పెట్రోల్ పోసి నిప్పంటించడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.చిన్నశంకరంపేట మండలం జంగరాయి గ్రామానికి చెందిన మహిపాల్, యవాన్ అనే ఇద్దరు యువకులు. పార్క్ చేసిన బైక్లను చోరీ చేసి మార్కెట్లో అమ్ముకుని జీవనం కొనసాగిస్తుంటారు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి వడియారం గ్రామంలో ఓ బైక్ను దొంగతనం చేశారు. దొంగతనానికి వస్తూ వస్తూ..అక్కరకొస్తుందని ఓ బాటిల్ పెట్రోల్ను వెంట తెచ్చుకున్నారు.అయితే దొంగిలించిన బైక్లో పెట్రోల్ లేకపోవడంతో నిర్మానుష్య పప్రాంతానికి తీసుకెళ్లి బండిలో పెట్రోల్ నింపాలని అనుకున్నారు. అనుకున్నదే తడవుగా బండిని కొంతదూరం నెట్టుకుని వెళ్లారు. సరిగ్గా అదే సమయంలో దుర్గామాత నిమజ్జనోత్సవానికి వెళుతున్న యువకులు బైక్ చోరీ చేసిన నిందితుల్ని గుర్తించారు. యువకులు దాడి చేసేందుకు ప్రయత్నించగా.. మహిపాల్ పరారయ్యాడు. యవాన్ను స్తంభానికి కట్టారు. అతని జేబులో ఉన్న పెట్రోల్ను తీసుకుని తగలబెట్టారు. యవాన్ 90 శాతం కాలిన గాయాలతో తీవ్రంగా గాయపడ్డారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు బాధితుణ్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు.అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.కేసు నమోదు చేసుకున్న పోలీసులు మహిపాల్ను అదుపులోకి తీసుకున్నారు. యవాన్పై దారుణానికి తెగబడ్డ గ్రామస్తులపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోనున్నారు. -
ఆదివారం శ్రీ 5 శ్రీ అక్టోబర్ శ్రీ 2025
పాత చిక్కులు..కొత్త ముడులుసాక్షిప్రతినిధి, సంగారెడ్డి: స్థానిక సంస్థల ఎన్నికల వేళ అధికార కాంగ్రెస్ పార్టీలో గ్రూపుల లొల్లి తెరపైకి వస్తోంది. పలు నియోజకవర్గాల్లో రెండు, మూడు గ్రూపులు తయారైన నేపథ్యంలో ఈ ఎన్నికల టికెట్లు ఎవరికి దక్కుతాయనే దానిపై ఆసక్తి నెలకొంది. ఇప్పటికే అభ్యర్థుల ఎంపికపై అధికార పార్టీ దృష్టి సారించింది. ప్రధానంగా జెడ్పీటీసీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను ప్రారంభించింది. ఒక్కో మండలానికి ముగ్గురు చొప్పున పేర్లతో నియోజకవర్గాల వారీగా జాబితాను రూపొందిస్తోంది. గ్రూపు విభేదాలు ఉన్న నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపిక అనేది ఆ పార్టీలో ప్రహసనంగా మారనుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. జహీరాబాద్లో గ్రూపుల లొల్లి.. జహీరాబాద్ నియోజకవర్గంలో గ్రూపు తగాదాలు బహిర్గతమయ్యాయి. ఇక్కడ పార్టీ మూడు వర్గాలుగా విడిపోయింది. నియోజకవర్గం ఇన్చార్జిగా ఉన్న మాజీ మంత్రి చంద్రశేఖర్, సెట్విన్ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ గిరిధర్రెడ్డి వర్గాలు ఎవరికి వారే అన్నచందంగా తయారయ్యాయి. ఈ గ్రూపులకు తోడుగా ఎంపీ సురేశ్ షెట్కార్ అనుచరవర్గం కూడా మరో వర్గంగా వ్యహరిస్తోంది. అప్పట్లో ముగ్గురు వేర్వేరుగా కార్యాలయాలు ఏర్పాటు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ అనుచరులకు టికెట్ ఇప్పించుకునేందుకు ఆయా వర్గాల నేతలు పట్టుబట్టే అవకాశాలున్నాయి. దీంతో ఇక్కడ ఎవరి అనుచరులకు టికెట్లు దక్కుతాయనేది చర్చనీయాంశంగా మారింది. ఖేడ్లోనూ అంతర్గతంగా ఆధిపత్య పోరు నారాయణఖేడ్లోనూ కాంగ్రెస్ కేడర్ రెండు వర్గాలుగా కొనసాగుతోంది. ఎమ్మెల్యే సంజీవరెడ్డి, ఎంపీ సురేశ్ షెట్కార్ అనుచరుల మధ్య ఆధిపత్య పోరు ఈ అసెంబ్లీ ఎన్నికల తర్వాత బయట పడకపోయినా..అంతర్గతంగా మాత్రం కొనసాగుతోంది. ఇప్పుడు ఇక్కడ కూడా అభ్యర్థుల ఎంపిక అంత సులభం కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. నర్సాపూర్లోనూ అదే తీరు మెదక్ జిల్లా నర్సాపూర్లోనూ హస్తం పార్టీ కేడర్ రెండు గ్రూపులుగా తయారైంది. నియోజకవర్గం ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి వర్గంతోపాటు, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు సన్నిహితంగా వ్యవహరిస్తున్న మాజీ ఎమ్మెల్యే మదన్రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్, గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ సుహాసినీరెడ్డి వేర్వేరుగా పార్టీ కార్యాకలాపాలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ కూడా అభ్యర్థుల ఎంపిక అనేది కత్తి మీద సాముగానే మారింది. ఎవరికి వారే తమ అనుచరులకు టికెట్ ఇప్పించుకునేందుకు ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది.గ్రూపులున్న చోట్ల ప్రత్యేక కమిటీలు గ్రూపుల లొల్లి తీవ్రంగా ఉన్న నియోజకవర్గాల్లో సమన్వయం కోసం ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేయాలని పార్టీ పరిశీలిస్తోంది. ఆయా వర్గాల్లో టికెట్లు ఆశిస్తున్న వారిలో వడపోత కార్యక్రమం చేపట్టే యోచనలో కాంగ్రెస్ పార్టీ ఉంది. గెలుపు గుర్రాలను ఎంపిక చేస్తామని ఆ పార్టీ నేతలు అభిప్రాయ పడుతున్నారు. అవసరమైతే సర్వే నిర్వహించి టికెట్లు కేటాయింపులు ఉంటాయని చెబుతున్నారు. మొత్తం మీద స్థానిక సంస్థల ఎన్నికల వేళ ఆయా నియోజకవర్గాల్లో అంతర్గత విభేదాలు ఆ పార్టీకి తలనొప్పిగా మారినట్లు తెలుస్తోంది.ఒక్కో నియోజకవర్గంలో రెండు, మూడు గ్రూపులు ఏ గ్రూపునకు ‘స్థానిక’ టికె ట్లు దక్కుతాయనే దానిపై ఆసక్తి తమ అనుచరులకు టికెట్లు ఇప్పించుకునేందుకు నేతల పట్టు పలు నియోజకవర్గాల్లో హస్తం పార్టీలో ఇదీ పరిస్థితి ఇప్పటికీ పలుచోట్ల బయటపడుతున్న విభేదాలు సమన్వయం కోసం ప్రత్యేక కమిటీలు వేసే యోచనలో పార్టీ నాయకత్వం! -
ఎన్నికల వేళ.. జంపింగ్ల మేళా
జోరుగా రాజకీయ వలసలు మెదక్జోన్: Ý린MýS çÜ…çܦÌS G°²-MýSË$ çÜÒ$í³-çÜ$¢¯]l² Ðólâýæ hÌêÏÌZ f…í³…VŠæ ´ëÍ-sìæMŠSÞ gZÆý‡…-§ýl$-MýS$¯é²Æ‡$$. Æð‡…yýl$ ¯ðlÌS-Ë$V> D ç³Æý‡…ç³Æý‡ ÝëVýS$-™èl*¯ól E…¨. Ýë«§é-Æý‡×æ M>Æý‡Å-MýS-Æý‡¢Ë$ Ððl¬§ýl-Ë$-Mö° °Äñæ*-f-MýS-Ð]lÆý‡Y, Ð]l$…yýl-ÌSÝë¦Æ‡$$ ¯éĶæ$-MýS$ÌS Ð]lÆý‡MýS$ ´ëÈ-tË$ Ð]l*Æý‡$-™èl$-¯é²Æý‡$. D Ð]lÅÐ]làÆý‡…ÌZ ½BÆŠḥG‹Ü, M>…{VðS‹ÜË$ §ýl*MýS$yýl$V> Ð]lÅÐ]lçß ÇçÜ$¢¯é²Æ‡¬. VýS™èl AòÜ…½Ï G°²-MýSÌS çÜÐ]l$-Ķæ$…ÌZ Ððl$§ýlMŠS GÐðl$ÃÌôæÅ Æøíßæ-™Œæ-Æ>Ð]l# Ððl¯]l²…sìæ E¯]l² Ķæ¬Ð]l-¯ól™èl iÐ]l-¯ŒS-Æ>Ð]l#, Æ>Ð]l*-Ķæ$…õ³r Ð]l*i Ð]l*Æð‡PsŒæ MýSÑ$sîæ O^ðlÆý‡Ã¯ŒS VýS…V> ¯]lÆó‡…-§ýlÆŠ‡ ĶæÊrÆŠ‡² ¡çÜ$-Mö° Æð‡…yýl$ ¯ðlÌSÌS {MìS™èl… ½B-ÆŠ‡-G‹Ü ¡Æý‡¦… ç³#^èl$a-MýS$-¯é²Æý‡$. Aç³µsZÏ hÌêÏÌZ C¨ àsŒæ-sê-í³MŠSV> Ð]l*Ç…-¨. ©°MìS Mú…r-ÆŠ‡V> GÐðl$ÃÌôæÅ Æøíßæ-™Œæ-Æ>Ð]l#, M>…{VðS‹Ü Æ>çÙ‰ ¯ól™èl OÐðl$¯]l…ç³-ÍÏ çßæ¯]lÃ…-™èl-Æ>Ð]l# hÌêÏÌZ ¿êÈ ºíßæ-Æý‡…VýS çÜ¿ýæ¯]l$ HÆ>µ-r$-^ólÔ>Æý‡$. ï³ïÜïÜ `‹œ Ð]l$õßæ-ÔŒæ-MýS$-Ð]l*-ÆŠ‡VúyŠæ, hÌêÏ C¯ŒS-^é-Çj Ð]l$…{† ÑÐól-MŠS¯]l$ Bà-Ó-°…-^éÆý‡$. D çÜ¿ýæÌZ °Äñæ*-f-MýS-Ð]lÆý‡Y…ÌZ° ç³Ë$ Ð]l$…yýl-ÌêË$, {V>Ð]l*-ÌSMýS$ ^ðl…¨¯]l Ð]l*i çÜÆý‡µ…-^Œl-ÌS™ø ´ër$ ½B-ÆŠ‡-G‹Ü, ½gôæ-ï³ÌS ¯]l$…_ M>Æý‡Å-MýSÆý‡¢Ë$, ¯ól™èlË$ ò³§ýlª-G-™èl$¢¯]l M>…{VðS‹Ü ¡Æý‡¦… ç³#^èl$a-MýS$-¯é²Æý‡$. ÐéÇ™ø ´ër$ {ç³Ð]l¬Q çÜ…çœ$ õÜÐ]lMýS$yýl$ ÎÌê {VýS*‹³ O^ðlÆý‡Ã¯ŒS Ððl*çßæ-¯ŒS-¯éĶæ$-MŠS¯]l$ M>…{VðS-‹Ü-ÌZMìS Bà-Ó-°…-^éÆý‡$. అటోళ్లు ఇటు.. ఇటోళ్లు అటు కౌడిపల్లి మండలం దేవులపల్లికి చెందిన సుమారు 30 మంది కాంగ్రెస్ కార్యకర్తలు, రైతులు రెండు రోజుల క్రితం అధికార పార్టీకి గుడ్బై చెప్పి ఎమ్మె ల్యే సునీతారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. వీరు పార్టీ మారడానికి ప్రధాన కారణం ఇటీవల యూరియా కొరతతో పాటు స్థానికంగా ఉన్న నేతలతో పొసగకపోవటమేనని తెలుస్తోంది. పెద్దశంకరంపేట బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు సీనియర్ నేత మురళి (పంతులు) ఇటీవల ఆ పార్టీని వీడారు. ఎమ్మెల్యే సంజీవరెడ్డి సమక్షంలో ఆయనతో పాటు మరో 200 మంది కార్యకర్తలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. పెద్దశంకరంపేట మేజర్ పంచాయతీతో పాటు ఆ మండల ఎంపీపీ, జెడ్పీటీసీ స్థానాలు సైతం జనరల్ మహిళాకు రిజర్వేషన్ కావటంతో ఆయన అధికార పార్టీ నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. తాజాగా శనివారం పాపన్నపేట మండల పరిధిలోని పలు పార్టీలకు చెందిన నాయకులు హైదరాబాద్లో మాజీ మంత్రి హరీశ్రావు స మక్షంలో బీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పద్మారెడ్డి, జిల్లా నాయకులు కంఠారెడ్డి తిరుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఏది ఏమైనా స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో పార్టీల వలసల పరంపర కొనసాగుతుండటం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. మళ్లీ బీజేపీ వైపు పంజా చూపు! రామాయంపేట(మెదక్): స్థానిక సంస్థల ఎన్నికల వేళ జిల్లాలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో మెదక్ నుంచి బీజేపీ తరఫున పోటీ చేసిన నిజాంపేట మాజీ జెడ్పీటీసీ సభ్యుడు పంజా విజయకుమార్ జూలై 20న కాంగ్రెస్లో చేరారు. కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు మైనంపల్లి హన్మంతరావు, డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్ పంజా ఇంటికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానించారు. కాగా కాంగ్రెస్లో చేరినప్పటి నుంచి పంజా పార్టీ కార్యకలాపాలకు దూరంగానే ఉన్నారు. కార్యకర్తలతో సైతం అంటి ముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఆయన కాంగ్రెస్లో చేరిన 75 రోజుల్లోనే మనసు మార్చుకొని బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఈవిషయమై బీజేపీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. కాగా తన రాజీనామాను బీజేపీ అధిష్టానం ఆమోదించలేదని ‘పంజా‘ సాక్షితో పేర్కొన్నారు. ప్రస్తుతం తాను కాషాయ పార్టీలోనే ఉన్నట్లు పేర్కొన్నారు. ముదిరాజ్ కుల ంలో బలమైన నాయకుడిగా గుర్తింపు పొందిన విజయకుమార్ తిరిగి బీజేపీలో చేరితే కొన్ని మండలాల్లో రాజకీయ సమీకరణాలు మారే అవకాశం ఉంది. -
డీజీపీని కలిసిన ఎస్పీ
మెదక్ మున్సిపాలిటీ: నూతన డీజీపీగా బాధ్యతలు చేపట్టిన శివధర్రెడ్డిని జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈసందర్భంగా పూల మొక్క అందించి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో శాంతి భద్రతలు, నేర నియంత్రణ, నేర నిరోధక చర్య లు, పోలీస్ విభాగం పనితీరుపై ఆయనతో చర్చించారు. జోరు తగ్గిన మంజీరా పాపన్నపేట(మెదక్): ఏడుపాయల్లో శనివారం మంజీరా నది జోరు తగ్గింది. సింగూరు నుంచి 38,467 క్యూసెక్కుల నీరు వదలగా, గతంలో పోలిస్తే ప్రవాహం తక్కువగా కనిపిస్తోంది. అయినప్పటికీ రాజగోపురంలోనే దుర్గమ్మ తల్లికి పూజలు నిర్వహిస్తున్నారు. వైద్య సేవలపై ఆరా చిన్నశంకరంపేట(మెదక్): నార్సింగి మండల కేంద్రంలోని పల్లె దవాఖానను దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి శనివారం ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులు పరిశీలించారు. స్టాఫ్నర్స్ రేణుకతో మాట్లాడి మందుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. వైద్య సేవలపై ఆరా తీశారు. ఆయన వెంట ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, మాజీ జెడ్పీటీసీ కృష్ణారెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బాబు, పట్టణ అధ్యక్షుడు విష్ణువర్ధన్రెడ్డి తదితరులు ఉన్నారు. అనంతరం బాధిత కుటుంబాలను పరామర్శించారు. విద్యా సామర్థ్యాలు పెంచాలి వెల్దుర్తి(తూప్రాన్): ప్రాథమిక దశ నుంచే విద్యా సామర్థ్యాలు పెంచడానికి ఉపాధ్యాయులు కృషి చేయాలని డీఈఓ రాధాకిషన్ సూచించారు. శనివారం మండలంలోని శంశిరెడ్డిపల్లితండా, చెర్లపల్లి ప్రాథమిక పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల నిర్వహణ, మధ్యా హ్న భోజన పథకం, పరిసరాలు, రికార్డులు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థుల రీడింగ్ సామర్థ్యాలను పరిశీలించి సిబ్బంది పనితీరును అభినందించారు. అదేవిధంగా ఎంఆర్సీ కార్యాలయాన్ని సందర్శించి రికార్డులు పరిశీలించారు. పాఠశాలల వారీగా సమీక్ష నిర్వహించి, ప్రభుత్వ బడుల్లో విద్యా ప్రమాణాల మెరుగకు తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. ఆయన వెంట ఎంఈఓ సీతారాం ఉన్నారు. బీజేపీకే ప్రజాదరణ నర్సాపూర్: జిల్లాలో బీజేపీకే ప్రజాదరణ ఉందని ఆపార్టీ జిల్లా అధ్యక్షుడు మల్లేశ్గౌడ్ అన్నారు. శనివారం పార్టీ కార్యాలయంలో మండల శాఖ అధ్యక్షుడు నగేశ్ అధ్యక్షతన నిర్వహించిన స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీ చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలకు ప్రజలు ఆకర్షితులవుతున్నారని తెలిపారు. స్థానిక ఎన్నికల్లో వార్డు మెంబర్ నుంచి జెడ్పీటీసీ వరకు అన్ని స్థానాలను కై వసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ప్రజలను మోసం చేశాయని, వారి మోసాలను ప్రజలకు వివరించాలని కార్యకర్తలకు సూచించారు. సమావేశంలో పార్టీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు రమేశ్గౌడ్, నాయకులు నారాయణరెడ్డి, రాములునాయక్, రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
స్థానిక ఎన్నికల విధుల్లో టీచర్లు
● పరిషత్ పోరుకు 3,500 మంది ● పంచాయతీకి 3,800 మంది ● ఇప్పటికే రెండు విడతల్లో శిక్షణ పూర్తి మెదక్ కలెక్టరేట్: జిల్లాలో జరగనున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ, పంచాయతీ ఎన్నికల విధుల్లో అత్యధికంగా ఉపాధ్యాయులు పనిచేయనున్నారు. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే ఎంపిక చేసి వారికి ఎన్నికల నిర్వహణపై రెండు విడతల్లో శిక్షణ సైతం ఇచ్చారు. కాగా పరిషత్ పోరుకు 3,500 మంది, పంచాయతీ ఎన్నికలకు 3,800 మంది ఉపాధ్యాయులు విధులు నిర్వర్తించనున్నారు. ఇందులో సీనియర్ ఉపాధ్యాయులు ఎన్నికల రిటర్నింగ్ అధికారులుగా, సూపర్వైజర్లుగా, ప్రిసైడింగ్, స్టేజ్–1, స్టేజ్– 2 అధికారులుగా పనిచేయనున్నారు. అలాగే డీఈఓ రాధాకిషన్తో పాటు మరో 11 మంది అధికారులు జిల్లా ఎన్నికల నోడల్ ఆఫీసర్లుగా నియమితులయ్యారు. వీరితో పాటు పంచాయతీ సెక్రటరీలకు పోలింగ్ కేంద్రాల నిర్వహణ బాధ్యతలు అప్పగించారు. కాగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు రెండు విడతల్లో పోలింగ్ నిర్వహించనున్నారు. మొదటి దశలో మెదక్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని 10 మండలాల్లోని 99 ఎంపీటీసీ, 10 జెడ్పీటీసీ స్థానాలకు ఈనెల 23న పోలింగ్ జరగనుంది. రెండో దశలో నర్సాపూర్ డివిజన్లోని 5 మండలాలు, తూప్రాన్ డివిజన్లోని 6 మండలాల పరిధిలో గల 11 జెడ్పీటీసీ, 91 ఎంపీటీసీ స్థానాలకు 27న పోలింగ్ నిర్వహించనున్నారు. పంచాయతీ ఎన్నికలు సైతం రెండు దశల్లో జరుగనున్నాయి. మొదటి దశలో మెదక్ డివిజన్ పరిధిలోని 10 మండలాల్లో 244 పంచాయతీ, 2124 వార్డులకు వచ్చే నెల 4న పోలింగ్ నిర్వహించనున్నారు. రెండో విడతలో నర్సాపూర్, తూప్రాన్ డివిజన్లోని 11 మండలాల్లోని 248 పంచాయతీలకు, 2,096 వార్డులకు ఎన్నికలు జరుగనున్నాయి. వీటికి నవంబర్ 8న పోలింగ్, అదే రోజున ఫలితాలు వెల్లడిస్తారు. -
నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి
కలెక్టర్ రాహుల్రాజ్మెదక్ కలెక్టరేట్: స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎంసీఎంసీ (మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ) నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి రాహుల్రాజ్ అన్నారు. శనివారం కలెక్టరేట్లో జిల్లా సమాచార, పౌర సంబంధాల శాఖ కార్యాలయంలో ఎంసీఎంసీ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈసందర్భంగా ఎంసీఎంసీ ద్వారా చేపడుతున్న పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పలు రికార్డులను తనిఖీ చేశారు. కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ఎన్నికల కంట్రోల్ రూంను పరిశీలించారు. అభ్యర్థులు తమ ఎన్నికల ప్రకటనల కోసం ఎంసీఎంసీ ద్వారా అనుమతి పొందాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేశ్, జెడ్పీ సీఈఓ ఎల్లయ్య, జిల్లా పంచా యతీ అధికారి యాదయ్య, జిల్లా పౌర సంబంధాల అధికారి రామచంద్రరాజు తదితరులు పాల్గొన్నారు. మరమ్మతులు త్వరగా పూర్తి చేయాలి రామాయంపేట/నిజాంపేట(మెదక్): ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న రోడ్డు వంతెనలు, చెరువుల తాత్కాలిక మరమ్మతు పనులు త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ రాహుల్రాజ్ అధికారులను ఆదేశించారు. శనివారం రామాయంపేట, నిజాంపేట మండలాల్లో పర్యటించారు. మెదక్ కలెక్టరేట్: స్థానిక ఎన్నికల నేపథ్యంలో కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణి హెల్ప్డెస్క్ ద్వారా నిర్వహించనున్నట్లు కలెక్టర్ రాహుల్రాజ్ పేర్కొన్నారు. -
పేటలో పోటీ.. జెడ్పీ పీఠంపై గురి
రామాయంపేట(మెదక్): జిల్లా పరిషత్ చైర్మన్ స్థానం జనరల్కు కేటాయించడంతో ఈ స్థానాన్ని కై వసం చేసుకోవడానికి ప్రధాన పా ర్టీలు తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నాయి. జిల్లాలోని 21 జెడ్పీటీసీ స్థానాల్లో రామాయంపేట, కొల్చారం,తూప్రాన్ స్థానాలు జనరల్, నిజాంపేట, పెద్దశంకరంపేట, మనోహరాబాద్ జెడ్పీటీసీ స్థానాలు జనరల్ మహిళలకు కేటాయించారు. మూడు ప్రధాన పార్టీల్లో మాజీ ఎమ్మెల్యేలు, ప్రస్తుత, మాజీ జిల్లా అధ్యక్షులు, గుర్తింపు పొందిన నేతలు ఇప్పటినుంచే ప్రయత్నాలు ప్రారంభించారు. జెడ్పీటీసీగా గెలిస్తే చాలు ఎలాగైనా జెడ్పీ పీఠం కై వసం చేసుకోవచ్చనే ఆలోచనలో ఉన్న నాయకులు తమ వంతు ప్రయత్నాలు ప్రారంభించారు. రామాయంపేటలో పోటీ చేయడానికి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మ భర్త దేవేందర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే శశిధర్రెడ్డి, మెదక్ నియోజవర్గ ఇన్చార్జి కంఠారెడ్డి తిరుపతిరెడ్డి మాజీ మంత్రి హరీశ్రావు ద్వారా ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్లు సమాచారం. కాంగ్రెస్లో ఆర్ వెంకటాపూర్ మాజీ సర్పంచ్ మహేందర్రెడ్డి, ఇటీవల పార్టీలో చేరిన మోహన్నాయక్, దామరచెరువు మాజీ సర్పంచ్ శివప్రసాదరావు ప్రయత్నాలు చేస్తున్నారు. బీజేపీ నుంచి పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రాగి రాములుతో పాటు మరికొందరు టికెట్ ఆశి స్తున్నారు. తమ మండలాల్లో రిజర్వేషన్లతో పోటీ చేయడానికి అవకా శం లేని నాయకులు పక్క మండలాలపై దృష్టి సారిస్తున్నారు. కాగా జెడ్పీటీసీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న ప్రధాన పార్టీ ల అభ్యర్థుల ఎంపిక విషయమై జాగ్రత్త పడుతున్నట్లు తెలిసింది. -
పండుగ కిక్కు
కొల్చారం(నర్సాపూర్): ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా దసరాకు ‘కిక్కు’ అదిరింది. ఈనెల 2న దసరా రావడం అదే రోజు గాంధీ జయంతి ఉండడంతో ముందస్తుగానే మద్యం దుకాణాదారులు అమ్మకాలు చేపట్టారు. జిల్లాలోని కొల్చారం మండలం చిన్నఘనాపూర్ శివారులోని మద్యం ఆధారిత నిల్వ కేంద్రం (ఐఎంఎల్ డిపో) ద్వారా పండగకు ముందు గత నెల 29, 30 ఈనెల 1 (ఈ మూడు రోజుల్లో) ఏకంగా రూ. 22.17 కోట్ల మద్యం అమ్మకాలు జరిగినట్లు డిపో వర్గాలు తెలిపాయి. వీటిలో 23,714 కేసుల లిక్కర్, 18,988 కేసుల బీర్ అమ్మకాలు జరిగాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది రూ. 3.57 కోట్ల అధిక మద్యం అమ్ముడైంది. -
పరిషత్ పోరుకు కసరత్తు
సంగారెడ్డి జోన్: పరిషత్ పోరుకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేయడంతో ఎన్నికల నిర్వహణకు అధికారులు ముమ్మరంగా ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో ఓటరు, పోలింగ్ కేంద్రాల జాబితాను సైతం విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తూ తాజాగా పరిషత్తు స్థానాల వారీగా రిజర్వేషన్లు ఖరారు చేసింది. ఎన్నికలలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఇప్పటికే కలెక్టర్ ప్రావీణ్య వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎన్నికల పర్యవేక్షణలో భాగంగా జిల్లాలోని వివిధ శాఖలకు చెందిన 12 మందిని నోడల్ అధికారులుగా నియమించారు. ఒక్కో అంశంపై ఒక్కో అధికారిని పర్యవేక్షించే విధంగా బాధ్యతలను అప్పగించారు. 261 ఎంపీటీసీ.. 25 జెడ్పీటీసీ స్థానాలు జిల్లాలో 25 మండలాల పరిధిలో 613 గ్రామాలు ఉన్నాయి. ఇందులో 261 ఎంపీటీసీ, 25 జెడ్పీటీసీ స్థానాలకు పోరు జరగనుంది. రెండు విడతలలో పరిషత్ ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. మొదటి విడతలో జహీరాబాద్తో పాటు నారాయణఖేడ్, అందోల్ నియోజకవర్గంలోని రాయికోడ్ మండలాల్లో ఉన్న 141 ఎంపీటీసీ స్థానాలు, 13 జెడ్పీటీసీ స్థానాలకు, రెండో విడతలో అందోల్, సంగారెడ్డి, పటాన్చెరు, నర్సాపూర్ నియోజకవర్గంలోని 12 జెడ్పీటీసీ, 120 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. పోలింగ్ కోసం ఇప్పటికే 1,458 కేంద్రాలను గుర్తించారు. జిల్లాలో 1,748 బ్యాలెట్ బాక్సులు అందుబాటులో ఉన్నట్లు సంబంధిత శాఖ అధికారులు చెబుతున్నారు.పేరు అధికారి హోదా అంశం వెంకటేశ్వర్లు విద్యాశాఖ సిబ్బంది నియామకం అభిలాష్రెడ్డి సాంఘిక సంక్షేమ బ్యాలెట్ బాక్సులు అరుణ జిల్లా రవాణాశాఖ రవాణా రామాచారి ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శిక్షణ కార్యక్రమాలు స్వప్న డిప్యూటీ సీఈఓ సామగ్రి పంపిణీ జగదీష్ బీసీ సంక్షేమశాఖ ఎన్నికల ప్రవర్తన, నియమావళి బలరాం ఆడిట్ అధికారి వ్యయ పరిశీలన సూర్యారావు అదనపు డీఆర్డీఓ రిపోర్టులు సమర్పణ బాలరాజ్ అదనపు డీఆర్డీఓ బ్యాలెట్, పోస్టల్ పేపర్ ముద్రణ ఏడుకొండలు డీపీఆర్ఓ మీడియా కమ్యూనికేషన్ సాయిబాబా డీపీఓ హెల్ప్లైన్, ఫిర్యాదుల కేంద్రం చలపతిరావు హౌసింగ్, పీడీ అబ్జర్వర్ 12 మంది నోడల్ అధికారులను నియమిస్తూ ఉత్తర్వులు బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికల నిర్వహణ ఇప్పటికే ఓటరు, పోలింగ్ కేంద్రాల జాబితా -
కొల్చారం వైపు పెద్దాయన చూపు
● హాట్టాపిక్గా జెడ్పీటీసీ స్థానం ● అన్రిజర్వ్డ్ కావడంతో పోటీకి పలువురు సై..కొల్చారం(నర్సాపూర్): జిల్లాలో కొల్చారం జెడ్పీటీసీ స్థానం ఇప్పుడు హాట్టాపిక్గా మారింది. బీసీ రిజర్వేషన్తో ఇక్కడి జెడ్పీటీసీ స్థానం అన్ రిజర్వ్డ్ కావడంతో అందరి దృష్టి దీనిపై పడింది. గత ప్రభుత్వంలో రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఓ పెద్దాయన ఎన్నికల సమయంలో అధికార కాంగ్రెస్లో చేరారు. జిల్లా పరిషత్ చైర్మన్ పదవిపై ముందస్తు హామీ పొందినట్లు సమాచారం. అయితే ఆయన సొంత మండల జెడ్పీటీసీ స్థానం బీసీ జనరల్ కావడంతో పోటీ చేయలేని పరిస్థితి. దీంతో తనకు అనుకూలంగా ఉన్న కొల్చారం స్థానంపై పూర్తిస్థాయిలో దృష్టి సారించారు. ఇక్కడి నాయకులతో మంతనాలు జరపడం, గత అనుభవాన్ని రంగరిస్తూ తనకు పూర్తి మద్ధతు ఇవ్వాలంటూ కోరినట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. అయితే కాంగ్రెస్, బీఆర్ఎస్లకు చెందిన యువ నాయకులు సైతం నేతలను ప్రసన్నం చేసుకోవడంలో నిమగ్నమయ్యారు. తాము బరిలో ఉన్నామన్న సంకేతాన్ని సోషల్ మీడియా ద్వారా బహిర్గతం చేసుకుంటున్నారు. ఇటు ప్రతిపక్ష బీఆర్ఎస్ సైతం యువ నాయకులకు కాకుండా స్థానికంగా ఉన్న సీనియర్లు, మరో బయటి వ్యక్తిని పోటీగా తీసుకువస్తారని సమాచారం. స్థానిక ఎన్నికలపై కోర్టు తీర్పు ఈనెల 8న ఉండటంతో అప్పటికీ బరిలో ఎవరు ఉంటారన్నది అధికారికంగా స్పష్టత రానుంది. -
రాజరాజేశ్వరిదేవిగా వర్గల్ అమ్మవారు
వర్గల్(గజ్వేల్): అమ్మ విజయదర్శనం..శ్రీరాజరాజేశ్వరిదేవిగా సాక్షాత్కారం..వర్గల్ శ్రీవిద్యాసరస్వతి క్షేత్రంలో ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లిన దసరాశరన్నవరాత్రోత్సవాలు గురువారం విజయ దశమి వేడుకలతో ముగిశాయి. దసరా పర్వదిన వేళ జయములిచ్చే జగన్మాత శ్రీరాజరాజేశ్వరిదేవిగా అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ వ్యవస్థాపకులు యాయవరం చంద్రశేఖరశర్మ సిద్ధాంతి పర్యవేక్షణలో అమ్మవారికి విశేషాభిషేకం జరిపారు. శమీపూజ అనంతరం ఉదయం 8.30 గంటల నుంచి భక్తులకు అమ్మవారి విజయదర్శనం లభించింది. శ్రవణ నక్షత్రం సందర్భంగా శ్రీవెంకటేశ్వరునికి లక్ష తులసి దళార్చన నిర్వహించారు.విజయదశమి రోజున శ్రీరాజరాజేశ్వరిదేవిగా వర్గల్ అమ్మవారు -
ఇసుక నోస్టాక్..!
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఇసుకను అందుబాటులో ఉంచేందుకు జిల్లాలో అందోలు, నారాయణఖేడ్ ప్రాంతాల్లో ప్రభుత్వం శాండ్ బజార్లు ఏర్పాటు చేసింది. డిజిటల్ మానిటరింగ్ సిస్టం ద్వారా విక్రయించేందుకు ఆర్భాటంగా కేంద్రాలను ప్రారంభించింది. అయితే అనుకున్నస్థాయిలో లబ్ధిదారులకు ఇసుకను అందించడంలో నిర్లక్ష్యం వహిస్తోంది. శాండ్ బజార్ నిర్వాహకులు విఫలం చెందారనే విమర్శలున్నాయి. – జోగిపేట(అందోల్) జిల్లాలోని ప్రతి నియోజకవర్గానికి 1,350 ఇందిరమ్మ ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేసింది. లబ్ధిదారులకు ఇసుక భారం కాకుండా ఉండేందుకు జిల్లాలో అందోలు, నారాయణఖేడ్ ప్రాంతాల్లో శాండ్ బజార్లు ఏర్పాటు చేసింది. టన్నుకు రూ. 1,200 చొప్పున విక్రయించాలని నిర్ణయించింది. ప్రస్తుతం శాండ్ బజార్లో ఇసుక అందుబాటులో లేకపోవడంతో ప్రైవేట్ వ్యక్తుల వద్ద టన్నుకు రూ. 2,800 చొప్పున లబ్ధిదారులు కొనుగోలు చేయా ల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎప్పుడు వస్తుందో చెప్పడానికి కేంద్రం వద్ద ఎవరూ అందుబాటులో లేరు. ఇసుక రావొచ్చునన్న ఆశతో టేక్మాల్, పుల్కల్, అందోలు మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులు నిత్యం శాండ్ బజార్ల వద్దకు వచ్చి పోతున్నారు.ఇబ్బంది పడుతున్నాం ప్రభుత్వం ఏర్పాటు చేసిన శాండ్ బజార్లో 15 రోజులు గా ఇసుక నిల్వలు లేవు. గత్యంతరంలేక టన్నుకు రూ. 2,800 చెల్లించి బయట కొనుగోలు చేస్తున్నాం. సెంటర్ వద్ద లబ్ధిదారులకు సమాచారం ఇచ్చే వారు లేరు. టన్నుకు రూ. 1,200 అయితే తమకు గిట్టుబాటు అవుతుంది. లేదంటే తలకు మించిన భారం అవుతుంది. – నాగరాజు, లబ్ధిదారుడు, జోగిపేట ఆందోళన చెందొద్దు నల్గొండ, కొండపాక ప్రాంతాల నుంచి ఇసుక తీసుకువస్తాం. ప్రస్తుతం వర్షాల కారణంగా తీసుకురాలేకపోయాం. ఇప్పటివరకు అందోలులో 1,200 మెట్రిక్ టన్నులు, ఖేడ్లో 480 మెట్రిక్ టన్నుల ఇసుకను ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు విక్రయించాం. త్వరలో ఇసుకను తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నాం. లబ్ధిదారులు ఆందోళన చెందవద్దు. – శ్రీకాంత్, పీఓ, శాండ్ బజార్ ఇందిరమ్మ లబ్ధిదారుల పరేషాన్ 15 రోజులుగా తప్పని తిప్పలు టన్నుకు రూ. 2,800 వెచ్చించి బయట కొనుగోలు జిల్లాలో రెండు చోట్ల శాండ్ బజార్ల ఏర్పాటు -
దసరా సంబురం
దహనమవుతున్న రావణుడి ప్రతిమమెదక్జోన్/మెదక్మున్సిపాలిటీ: జిల్లావ్యాప్తంగా దసరా పండుగను గురువారం ప్రజలు వైభవంగా జరుపుకొన్నారు. ఉదయమే ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వాహనాలకు సైతం పూజలు చేయించారు. సాయంత్రం వేళ ఊరంతా ఒకచోట చేరి పాలపిట్టను దర్శనం చేసుకున్నారు. జమ్మిచెట్టుకు శమీ పూజలు నిర్వహించి పెద్దల ఆశీర్వాదం తీసుకున్నారు. మెదక్ పట్టణంలోని జూనియర్ కాలేజీ గ్రౌండ్లో ఏర్పా టు చేసిన రావణవధ కార్యక్రమానికి ఎమ్మెల్యే రోహిత్రావు హాజరయ్యారు. రావణుడి ప్రతిమకు నిప్పుపెట్టి వేడుకలను ప్రారంభించారు. నియోజకవర్గ ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ చంద్రపాల్, మల్లికార్జున్గౌడ్, నాయకులు ఆంజనేయులు, మ్యాడం బా లకృష్ణ, గంగాధర్, బీజేపీ నేత గడ్డం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కోదండ రామా లయంలో జరిగిన ప్రత్యేక పూజలో కలెక్టర్ రాహుల్రాజ్ కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. అనంతరం పట్టణంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులు పరిశీలించారు. అంతకుముందు రాందాస్ చౌరస్తాలో గాంధీజీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. -
నిలిచిన రేషన్ సంచుల పంపిణీ
● ఎన్నికల కోడ్ ఎఫెక్ట్ ● జిల్లాకు 2.36 లక్షల పర్యావరణ హిత బ్యాగులు సరఫరారామాయంపేట(మెదక్): ఎన్నికల కోడ్ మూలంగా జిల్లాలోని తెల్లరేషన్ కార్డుదారులకు పర్యావరణ హిత సంచుల పంపిణీ నిలిచిపోయింది. జిల్లాలో ఉన్న 520 రేషన్ దుకాణాల్లో 2,32,579 తెల్లరేషన్ కార్డుదారులు ఉన్నారు. రేషన్ వినియోగదారులకు సరఫరా చేయడానికి గాను జిల్లాకు మొత్తం 2.36 లక్షల సంచులు సరఫరా అయ్యాయి. అక్టోబర్ నెల కోటాతో పాటు సంచులు వినియోగదారులకు అందజేయాలని మొదట్లో పౌర సరఫరాలశాఖ ఆదేశాలు జారీ చేసింది. సదరు సంచిపై ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో పాటు అభయహస్తం చక్రం, మాజీ ప్రధాని ఇందిరాగాంధీ, సీఎం రేవంత్రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్ర మార్క, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి చిత్రాలు ముద్రించారు. ఇప్పటికే జిల్లాలోని ఎంఎల్ఎస్ పాయింట్లకు, కొన్ని రేషన్ దుకాణాలకు సంచులు సరఫరా చేశారు. ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో లబ్ధిదారులకు సంచులు పంపిణీ చేయవద్దని తాజాగా పౌర సరఫరాలశాఖ ఆదేశాలు జారీ చేసింది.కోడ్ ముగిసిన తర్వాతే.. ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో రేషన్ విని యోగదారులకు పర్యావరణ హిత సంచుల సరఫరా నిలిపివేశాం. ఈమేరకు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. కోడ్ ముగిసిన తరువాత లబ్ధిదారులకు అందజేస్తాం. – జగదీశ్, డీఎం, పౌరసరఫరాలశాఖ -
వరికి తెగుళ్ల బెడద
మెదక్జోన్: ఖరీఫ్లో వరి సాగు కలిసి వస్తుందనుకున్న రైతులకు నిరాశే ఎదురవుతోంది. వరి పంట చేతికందే సమయంలో తెగుళ్లు ఆందోళనకు గురిచేస్తోంది. పురుగు మందులు పిచికారీ చేసినా ఫలితం లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భారీ వర్షాలే కారణమని అధికారులు పేర్కొంటున్నారు. జిల్లాలో ఈఏడాది అన్నిరకాల పంటలు కలిపి 3.29 లక్షల ఎకరాలు సాగు కాగా, అందులో 3.5 లక్షల ఎకరాల్లో రైతులు వరి వేశారు. అందులో 2.28 లక్షల ఎకరాల్లో దొడ్డురకం, 77 వేల ఎకరాల్లో సన్నా లు సాగు చేశారు. కాగా ఈ ఏడాది జిల్లాలో భారీ వర్షాల కారణంగా వేలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. గొలకాటు, మెడవిరుపు, కాటుక తెగుళ్లు సోకి పాలుపోసే దశలో గింజలు పొల్లుపోతున్నాయి. అధికారులు సూచించిన పురుగు మందులు ఒకటికి, రెండుసార్లు పిచికారీ చేసినా ఫలితం లేకుండా పోతోందని రైతులు వాపోతున్నారు. జిల్లాలో అత్యధికంగా కొల్చారం, పాపన్నపేట, హవేళిఘణాపూర్, మెదక్, చిన్నశంకరంపేట, వెల్దుర్తి, రామాయంపేట, నిజాంపేట, నర్సాపూర్, శివ్వంపేట, తూప్రాన్ తదితర మండలాల్లో అధికంగా వరి సాగు చేశారు. టేక్మాల్, అల్లాదుర్గం, రేగోడు, పెద్దశంకరంపేట మండలాల్లో పత్తి సాగు చేశారు. పత్తికి సైతం కాయకుళ్లు, ఎండుతెగులు సోకి తీవ్ర నష్టం జరిగింది. చిరుపొట్ట దశలో భారీ వర్షాలు కురవడంతోనే పంటలకు తెగుళ్లు ఆశించినట్లు వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు.పంటంతా దెబ్బతింటుంది నాకున్న రెండెకరాల్లో దొడ్డురకం వరి సాగు చేశాను. భారీ వర్షాలతో గొలకాటు వచ్చింది. ప్రస్తుతం వరి గింజలు పాలు పోసుకొనే దశలో పంటంతా దెబ్బతింటుంది. ఇప్పటికీ రెండుసార్లు పురుగు మందులు పిచికారీ చేశారు. వర్షాలతో పనిచేయకుండా పోయింది. ఇది మూడోసారి పిచికారీ చేస్తున్నాను. – ఆంజనేయులు, రైతు చందాపూర్ -
‘జమ్మి’వనం..
ప్రత్యేకత చాటుకుంటున్న తున్కిఖాల్సా పల్లెప్రకృతి వనంవర్గల్(గజ్వేల్): అడవిలో ‘జమ్మి’ వనం ఊరందరికి చేరువైంది. పల్లె ప్రకృతికి శోభనిస్తోంది. పూజనీయమైన జమ్మి వృక్షాలతో వర్గల్ మండలం తున్కిఖాల్సా పల్లె ప్రకృతి వనం ప్రత్యేకత చాటుకుంటున్నది. గ్రామానికి అర కిలోమీటరు దూరంలో 5 జమ్మి వృక్షాలు ఒకేచోట సముదాయంగా పెరిగాయి. అక్కడే దసరా జమ్మీ పూజ నిర్వహించుకునేవారు. 2019లో పల్లెప్రకృతివనం ఆలోచన తెరపైకి వచ్చింది. ఆ వెంటనే రెండెకరాల విస్తీర్ణంలో జమ్మిచెట్లు మధ్యలో ఉండేలా పచ్చనిలాన్, చుట్టూరా వృత్తాకారంలో గద్దె, అక్కడే భారతమాత విగ్రహం, దేశభక్తికి చిహ్నంగా ఎత్తయిన జాతీయ జెండా, కూర్చునేందుకు సిమెంట్ బెంచీలు, తెలంగాణ సంస్కృతికి చిహ్మంగా బతుకమ్మ..ఇలా అన్ని కలగలసి పల్లెప్రకృతి వనం శోభాయమానంగా రూపుదిద్దుకున్నది. ఆహ్లాదతకు నెలవుగా, ఊరందరూ దసరా వేళ జమ్మి వృక్షాలు పూజించే ఆధ్యాత్మికతల కొలువుగా ప్రత్యేకత చాటుకుంటున్నది. -
మంజీరా వరదలతో అప్రమత్తం
పాపన్నపేట(మెదక్): పోటెత్తుతున్న మంజీరా వరదలతో అప్రమత్తంగా ఉండాలని డీఎస్పీ ప్రసన్నకుమార్ సూచించారు. ఏడుపాయల ఆలయం ముందు బుధవారం ఆయన మంజీర వరదను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..ఘనపురం ఆనకట్టపై నుంచి 1.09 లక్షల నీరు వెళ్తుందన్నారు. వరదలు ఉధృతంగా ఉండటంతో ఎల్లాపూర్ బ్రిడ్జిని తాకుతూ నీరు ప్రవహిస్తోందన్నారు. ప్రవాహం పెరిగితే రాకపోకలు బంద్ అయ్యే అవకాశం ఉన్నందున, అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా నది వైపు ఎవరు వెళ్లొద్దని చెప్పారు.ఎల్లాపూర్ బ్రిడ్జిని తాకుతూ ప్రవహిస్తున్న మంజీరా -
గెలుపు గుర్రాల వేటలో పార్టీలు
మెదక్జోన్/పాపన్నపేట (మెదక్): స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపేలక్ష్యంగా ఆయా పార్టీలు పావులు కదుపుతున్నాయి. ఒక్కోజెడ్పీ స్థానానికి ముగ్గురు అభ్యర్థుల చొప్పున గుర్తించి జాబితాను పంపాలని కాంగ్రెస్పార్టీ సూచించగా ఆ దిశగా అభ్యర్థులను గుర్తించే ప్రక్రియ కొనసాగుతోంది. ఇక ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ నేతలు ముఖ్య కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించి ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్ల జాబితాను ఇవ్వాలని ముఖ్యకార్యకర్తలకు సూచించింది. ఈ నెల 5 నాటికి పీసీసీకి జాబితా కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానాలను హస్తగతం చేసుకోవాలని భావించి ఒక్కో జెడ్పీటీసీ స్థానానికి ముగ్గురు అభ్యర్థులను గుర్తించి ఈనెల 5వరకు వారి జాబితాను పీసీసీకి పంపించాలని సీఎం రేవంత్రెడ్డి ఆదేశించటంతో ఆ పార్టీ నేతలు ఆగమేఘాల మీద గెలుపుగుర్రాల కోసం జల్లెడపడుతున్నారు. ప్రభుత్వ వైఫల్యాలే అస్త్రంగా బీఆర్ఎస్ రెండేళ్లల్లోనే ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వచ్చిందని దీనినే అస్త్రంగా చేసుకుని స్థానిక ఎన్నికల బరిలో దిగాలని బీఆర్ఎస్ భావిస్తోంది. బీఆర్ఎస్ రాష్ట్రనాయకుడు దేవేందర్రెడ్డి బుధవారం జిల్లా కేంద్రంలోగల ఆ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గంలోని ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఇదే విషయాన్ని వెల్లడించారు. పోటీ చేయాలనుకునే వారి జాబితాను ఇవ్వాలని వారికి సూచించారు. ఒక్కో జెడ్పీటీసీ స్థానానికి ముగ్గురిని గుర్తిస్తున్న కాంగ్రెస్ ముఖ్యకార్యకర్తల సమావేశాల్లో నిమగ్నమైన బీఆర్ఎస్, బీజేపీజీఎస్టీ తగ్గింపుతో బీజేపీ ప్రధాని మోదీ పాలనలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు, జీఎస్టీ తగ్గింపుతో దేశ ప్రజలకు కలిగే లాభాలను ప్రజల్లోకి తీసుకెళ్లి స్థానిక సంస్థలల్లో భారీగా లబ్ధి పొందాలని బీజేపీ యోచిస్తోంది. పాపన్నపేట మండలంలో బుధవారం ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు వాల్దాస్ మల్లేశంగౌడ్ నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఇదే విషయాన్ని పార్టీ శ్రేణులకు వివరించారు. యువతను లక్ష్యంగా చేసుకుని ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల పేర్లను ఖరారు చేసే పనిలో బీజేపీ నిమగ్నమైంది. -
అందరిచూపు కోర్టు తీర్పుపైనే
మెదక్ అర్బన్: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఆశావహులంతా అక్టోబర్ 8న కోర్టు వెలువరించే తీర్పు కోసం ఉత్కంఠతతో ఎదురు చూస్తున్నారు. 42% బీసి రిజర్వేషన్లు అమలు అవుతాయా? అసలు ఎన్నికలు జరుగుతాయా? లేదా? అనే గందరగోళంలో కొట్టు మిట్టాడుతున్నారు. ఈ నెల 9న ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కాబోతున్నప్పటికీ, ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే అభ్యర్థులు ఖర్చులు పెట్టుకోవడానికి వెనుకా ముందు ఆలోచిస్తున్నారు. ఈ నెల 5 వరకు జెడ్పీటీసీ ప్రాదేశిక నియోజక వర్గానికి ముగ్గురు ఆశావహుల చొప్పున పేర్లు పంపాలని పీసీసీ ఆదేశించడంతో, కాంగ్రెస్లో కొంత కదలిక మొదలైంది. అలాగే బీఆర్ఎస్ నాయకులు కూడా బుధవారం ఏడుపాయల్లో కలుసుకున్నారు. కాగా అధికారులు మాత్రం ఎన్నికల నిర్వాహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎవరి ధీమా వారిదే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ప్రధాన రాజకీయ పార్టీల నేతలు ఎవరి ధీమాను వారు వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్లు అమలవుతాయని కాంగ్రెస్ ఽరాష్ట్ర నాయకులు ధీమాగా ఉండగా అదే పార్టీకి చెందిన గ్రామస్థాయి నాయకుల్లో మాత్రం అనుమానాలు లేవనెత్తుతున్నారు. రిజర్వేషన్లు అనుకూలంగా రాని వారు కూడా స్థానిక ఎన్నికలపై ఆసక్తి చూపడం లేదు. ముఖ్యంగా పార్టీలో ముఖ్యులుగా చలామణి అవుతున్న ఓసీ వర్గాలు రిజర్వేషన్లు అనుకూలించక పోవడంతో నిర్లిప్తంగా కనిపిస్తున్నట్లు తెలుస్తుంది. ఇక బీఆర్ఎస్, బీజేపీ నాయకులు రిజర్వేషన్ల అమలుపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. షెడ్యూల్కు అనుగుణంగా కొంత మేర సంసిద్ధత ప్రయత్నాలు ప్రారంభించినప్పటికీ, ఈ నెల 8 న కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అని వేచి చూస్తున్నారు. చాలామంది ఆశావహులు ఈ నెల 8 తర్వాతే ,ఆర్థిక పరమైన ఖర్చులు చేయాలని భావిస్తున్నారు. పండుగల సమయంలో కూడా వృథా ఖర్చులు చేయడం లేదు. సందిగ్ధత నడుమ ఎన్నికలకు సంసిద్ధులవుతున్నారు.బీసీ రిజర్వేషన్లు అమలవుతాయా! మెదక్ జిల్లాలో 21 జెడ్పీటీసీలు,190 ఎంపీటీసీలు, 492 గ్రామపంచాయతీలు,5,23,327 ఓటర్లు ఉన్నారు. స్థానిక ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్లు అమలు చేసే ప్రక్రియలో భాగంగా, ప్రభుత్వం జీవో నంబర్ 09 విడుదల చేసింది. ఈ మేరకు గ్రామ పంచాయతీ ఎన్నికలు 3 దశల్లో, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు రెండు దశల్లో నిర్వహించేందుకు ప్రభుత్వం షెడ్యూల్ జారీ చేసింది. అయితే బీసీ రిజర్వేషన్లను సవాల్ చేస్తూ సెప్టెంబర్ 27న కొంతమంది హైకోర్టుకు వెళ్లారు. ఈ విషయంలో ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు, 42% రిజర్వేషన్లు కల్పించడంపై ప్రభుత్వానికి,ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది. విచారణను అక్టోబర్ 8కి వాయిదా వేసింది. 42% బీసీ రిజర్వేషన్లపై 8న తీర్పు వెలువరించనున్న కోర్టు ఎన్నికలు జరుగుతాయా లేదా అనే దానిపై నెలకొన్న సందిగ్ధత తీర్పు వచ్చాకే ఎన్నికల క్షేత్రంలోకి దూకాలనుకుంటున్న నేతలు స్థానిక ఎన్నికల తీరిది -
నేడు విజయదశమి ఉమ్మడి జిల్లాలో వైవిధ్యభరితం
ఉమ్మడి మెదక్ జిల్లా విభిన్న జీవన సంస్కృతుల సమ్మేళనం. అనేక ఆచారాలు, అలవాట్లతో కూడిన వైవిధ్యమైన ఉమ్మడి జిల్లా. వివిధ వర్గాల ప్రజలు దసరా ఉత్సవాలను ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు. దసరా అంటే సరదాలకు, సందళ్లకు మరొక పదం. ఆట పాటలకు ఆలవాలం. ఇంటిల్లిపాదీ నూతన దుస్తులు ధరించి రకరకాల పిండి వంటలు, నాన్వెజ్ వంటకాలతో ఆనందంగా గడిపేస్తారు. అంతా కలిసి బ్యాండు మేళాలతో వెళ్లి పాలపిట్టను చూసి విజయోత్సాహంతో కేరింతలు కొడతారు. అక్కడి నుంచి నేరుగా జమ్మి చెట్టు దగ్గరకు వెళ్లి పూజలు చేస్తారు. పాపాలన్నీ తొలగిపోవాలని కోరుకుంటారు. మనుషుల మధ్య కల్మషాలన్నింటినీ కడిగి పారేసి ప్రేమ, ఆత్మీయత, అనురాగాలను పంచిపెట్టే పండుగ దసరా. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో వైవిధ్యభరితంగా జరిగే వేడుకల కథనాలు కొన్ని.. -
ఊరంతా ఏకమై.. సంప్రదాయం వేడుకై
బతుకమ్మ, దాండియా ఆటలతో దుమ్మురేపే ఆడపడుచులుయువకుల అలయ్– బలయ్ దుబ్బాకలో ప్రత్యేకందుబ్బాక/దుబ్బాకటౌన్: పట్టణంలో దసరా ఉత్సవాలు ప్రతీ ఏటా ప్రత్యేకంగా నిలుస్తాయి. దాదాపు ఇరవై ఏళ్ల నుంచి ఈ వేడుకలు జరుగుతున్నాయి. పండుగ రోజు సాయంత్రం ఊరి ప్రజలంతా గాంధీ విగ్రహం వద్ద ఏకమై రావణ దహనం చేస్తారు. అనంతరం ఆడపడుచుల బతుకమ్మ, దాండియా ఆటలతో అలరిస్తారు. యువకులు, పెద్దలు అలయ్ – బలయ్ కార్యాక్రమాలు, యువకుల డ్యాన్సులు ప్రత్యేకతను సంతరించుకుంటాయి. పట్టణాలను నుంచి వచ్చిన ఉద్యోగస్తులు, కాలేజీల నుంచి వచ్చిన విద్యార్థులు చిన్ననాటి స్నేహితులను కలుసుకుని మధుర జ్ఞాపకాలను గుర్తుచేస్తుకుంటారు. దసరా రోజే కాకుండా దేవి శరన్నావరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారి మండల పాల వద్ద వారం పాటు ఆడపడుచుల దాండియా, బతుకమ్మ ఆటపాటలు కొత్త ట్రెండ్ను సృష్టిస్తున్నాయి. అలాగే దసరారోజున పట్టణంలోని చెల్లాపూర్రోడ్డులో ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద జమ్మిచెట్టు వద్దకు డప్పుచప్పుళ్లతో వెళ్లి పూజలు చేయడం ఆనవాయితీ. -
సంగారెడ్డిలో సందడే..
సంగారెడ్డిలోని అంబేడ్కర్ స్టేడియంలో ఉత్సవాల ఏర్పాట్లు..సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా కేంద్రం దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. పండగను పురస్కరించుకుని పాతబస్టాండ్ రాంమందిర్ నుంచి శావ శోభాయత్ర నిర్వహిస్తారు. భక్తిశ్రద్ధలతో భజన కీర్తలతో ఈ శోభయాత్ర ఉంటుంది. రాంమందిర్ నుంచి అంబేడ్కర్ స్టేడియం వరకు ఈ శోభాయాత్ర జరుగుతుంది. అంబేద్కర్ స్టేడియంలో రావణ దహణ కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తారు. భారీ స్థాయిలో బాణాసంచ కాల్చుతారు. పట్టణ వాసులతో పాటు, పరిసర గ్రామాల ప్రజలు ఈ వేడుకలకు హాజరవుతుంటారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడి దాదాపు రెండున్నర దశాబ్దాలుగా ప్రతి ఏటా ఈ వేడుకలను తన సొంత ఖర్చులతో నిర్వహిస్తున్నారు. తాను మున్సిపల్ చైర్మన్గా పనిచేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి ఏటా ఈ వేడుకలను స్వయంగా పర్యవేక్షిస్తారు. వేడుకల్లో భాగంగా ప్రముఖ సినీ నేపథ్య గాయకుల బృందాలు పాడే భక్తిగీతాలు వేడుకకు హాజరైన వారిలో ఆధ్మాత్మిక భావాన్ని పెంపొందిస్తుంటాయి. -
‘జెడ్పీ’ పీఠానికే గురి
స్థానిక సంస్థల ఎన్నికలను ప్రధాన రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. పట్టు కోసం కాంగ్రెస్..పునర్వైభవం కోసం బీఆర్ఎస్..ఉనికి కోసం బీజేపీ ప్రయత్నాలు ప్రారంభించాయి. అయితే జెడ్పీ పీఠాన్ని చేజిక్కించుకోవాలని అటు అధికార పార్టీ కాంగ్రెస్ ఇటు ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ సర్వశక్తుల్ని కూడదీసుకుంటున్నాయి. – మెదక్ అర్బన్: గత స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతిన్న కాంగ్రెస్ ఈ సారి పట్టు సాధించేందుకు కృషి సర్వశక్తులు ఒడ్డుతోంది. ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను ప్రధానాస్త్రంగా ప్రయోగించే యత్నాల్లో ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఓట్లు అడగాలని భావిస్తోంది. ఆ దిశగా మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు, ఆయన తండ్రి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంత్రావు పార్టీ కేడర్ను బలోపేతం చేస్తున్నారు. గెలుపు అవకాశాలున్నవారికి, పార్టీ కోసం కష్టించిన వారికే టికెట్లు ఇవ్వాలని అధిష్ఠానం సూచించినట్లు సమాచారం. అలాగే సర్పంచ్ అభ్యర్థులను సైతం ఎంపిక చేయాలనే ఆలోచనతో ఉన్నారు. ఇక సొంత గ్రామాల్లో రిజర్వేషన్లు అనుకూలించకపోవడంతో కాంగ్రెస్ నుంచి జెడ్పీ పీఠాన్ని ఆశిస్తున్న ఓ పెద్దాయన, పక్క మండలం నుంచి బరిలోకి దిగేందుకు ప్రయత్నాలు ఆరంభించినట్లు తెలుస్తోంది. కమలం వికసించేనా! గత పార్లమెంటరీ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించిన బీజేపీని స్థానిక ఎన్నికల్లో సైతం వికసించేలా ప్రచార పర్వం కొనసాగించాలని ఆ పార్టీ భావిస్తోంది. ప్రధాని మోదీ పేరుతో యువతను, సామాన్య ప్రజానీకాన్ని ఆకట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు.యువకులు, విద్యాధికులపై పార్టీ ఆశలు పెట్టుకుంది. ఆర్ఎస్ఎస్ మూలాలున్న గ్రామాలపై దృష్టి పెట్టింది. గెలుపు అవకాశాలున్న అన్ని చోట్ల, గెలుపోటములను ప్రభావితం చేసే గ్రామాల్లో పోటీ చేయాలని భావిస్తోంది. ఇప్పటికే జిల్లాలో ‘సేవా పక్షం’పేరిట ఎంపీ రఘునందన్రావు స్థానిక సంస్థల ఎన్నికల శంఖాన్ని పూరించారు. ఆయన ఎంపీగా ఎన్నికై న అనంతరం పలు రోడ్లు, సోలార్ దీపాలను మంజూరు చేయించారు. నియోజక వర్గంలో తరచూ పర్యటనలు చేస్తూ, ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు.పట్టు చేజారినివ్వకుండా బీఆర్ఎస్ గత స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ను ఊడ్చేసిన బీఆర్ఎస్ తిరిగి పునర్వైభవం దిశగా ప్రయత్నాలు ప్రారంభించింది. గత ఎన్నికల్లో 20 జెడ్పీటీసీ స్థానాలకు 18 స్థానాల్లో విజయం సాధించడంతోపాటు సుమారు 15 ఎంపీపీ స్థానాల్లో గులాబీ జెండా రెపరెపలాడింది. అదే పట్టును కొనసాగించేందుకు ‘ఇంటింటికీ బాకీ కార్డు’ను విస్తృతంగా ప్రచారంలోకి తీసుకెళ్లాలని ఆపార్టీ భావిస్తోంది. కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తామన్న ఆరు గ్యారంటీలను ఎండగట్టే విధంగా ప్రచార సరళి నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందిస్తోంది. గ్రామీణులను ఆకట్టుకునేలా డాక్యుమెంటరీలు రూపొందించినట్లు తెలుస్తోంది. రైతులకు యూరియ కష్టాలు, మహిళలకు రూ.2,500 ఫించన్, రూ.4 వేల నిరుద్యోగ భృతిని వంటి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీఆర్ఎస్ కార్యాచరణ రూపొందించింది. జిల్లాలో బీఆర్ఎస్ శ్రేణుల్ని ఇతర పార్టీల్లోకి వెళ్లకుండా మాజీ ఎమ్మెల్యే పద్మారెడ్డి కాపాడుకోగలిగారు. ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలపై తరచూ ఆందోళనలు నిర్వహిస్తూ నిత్యం ప్రజల్లోనే ఉంటున్నారు. అదే బలంతో ఎన్నికల పోరాటంలో నిలిచి విజయం సాధిస్తామన్న ధీమా వారిలో వ్యక్తమవుతోంది. ఇక బీఆర్ఎస్ నుంచి ఓ ప్రధాన నాయకుడికి సొంత ప్రాదేశిక నియోజక వర్గంలో జెడ్పీటీసీ రిజర్వేషన్ అనుకూలంగా వచ్చింది. ఆయన అక్కడి నుంచి పోటీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పట్టు కోసం కాంగ్రెస్.. పునర్వైభవం కోసం బీఆర్ఎస్.. ఉనికి కోసం బీజేపీ జెడ్పీ చైర్మన్ కోసం వలస వెళ్లనున్న పెద్దాయన స్థానిక సంస్థల్లో పట్టుకోసం సర్వశక్తుల్ని కూడదీసుకుంటున్న పార్టీలు -
ప్రతిభావంతులకు ప్రోత్సాహం
మెదక్ మున్సిపాలిటీ: శిక్షణా కార్యక్రమాల్లో ప్రతిభ కనబరిచే సిబ్బందిని జిల్లా పోలీస్ శాఖ ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తుందని జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు పేర్కొన్నారు. రాష్ట్రస్థాయిలో ఫైరింగ్, పీపీటీలో ఉత్తమ ప్రతిభ కనబర్చి పతకాలు సాధించిన కానిస్టేబుల్ నరేశ్ను మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ఇలాంటి యువ సిబ్బంది కృషి భవిష్యత్తులో మరింత ఉన్నతస్థాయికి తీసుకువెళ్తుందన్నారు. ఈ సందర్బంగా నరేశ్కు రివార్డు మంజూరు చేశారు. అనంతరం ఉద్యోగ విరమణ పొందుతున్న హెడ్ కానిస్టేబుల్ రవీందర్, సీనియర్ అసిస్టెంట్ అల్తాఫ్ హుస్సేన్లను ఎస్పీ ఘనంగా సన్మానించారు. భవిష్యత్తులో మీకు ఏవైనా సమస్యలు ఎదురైనా, పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ రంగా నాయక్, శైలేందర్, ఎసైలు నరేశ్ భవానీ కుమార్, మణి పాల్గొన్నారు.కానిస్టేబుల్ నరేశ్ను అభినందించిన ఎస్పీ -
కోడ్ ఉల్లంఘిస్తే చర్యలే
మెదక్జోన్: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేశామని ఎవరైనా ఎన్నికల కోడ్ను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ రాజ్ స్పష్టం చేశారు. కలెక్టరేట్లో మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సెప్టెంబర్ 29 నుంచే జిల్లాలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిందని అయితే మెదక్, తూప్రాన్, రామాయంపేట, నర్సాపూర్, మున్సిపల్ల్లో కోడ్ ఉండదని తెలిపారు. ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు ప్రచారానికి 3 రోజులు ముందుగానే అనుమతులు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఎన్నికల కోడ్ పక్కాగా అమలయ్యేలా ఫ్లయింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎక్కడైనా ఎవరైనా కోడ్ ఉల్లంఘించినట్లు, డబ్బులు పంచినట్లు సమాచారముంటే కంట్రోల్ రూమ్కు ఫిర్యాదు చేయవచ్చన్నారు. ఎవరూ రూ.50 వేల కంటే ఎక్కువ డబ్బులు వెంట తీసుకెళ్లకూడదని, పెళ్లిల్లు, ఆస్పత్రి ఖర్చులు, పిల్లల కాలేజీ ఫీజులు చెల్లించేందుకు అంతకుమించి డబ్బు తీసుకెళ్లి పట్టుబడితే సరైన ఆధారాలు సమర్పించాల్సి ఉంటుందని తెలిపారు. పేపర్, టీవీ, సోషల్ మీడియా యాడ్స్ విషయంలో పార్టీలు, అభ్యర్థులు ఎంసీఎంసీ కమిటీ నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలని సూచించారు. ఎన్నికల నేపథ్యంలో లైసెన్స్డ్ ఆయుధాలు కలిగి ఉన్నవారు వాటిని డిపాజిట్ చేయాలని చెప్పారు. సమావేశంలో అదనపు కలెక్టర్ నగేశ్, జెడ్పీ సీఈఓ ఎల్లయ్య, డీపీఓ యాదయ్య పాల్గొన్నారు. ర్యాలీలు, సభలకు అనుమతులు తప్పనిసరి జిల్లా కలెక్టర్ రాహుల్రాజ్ -
సాయుధ కారాగారంలో ఆయుధపూజ
సంగారెడ్డి జోన్: జిల్లా పోలీస్ సాయుధ కారాగారంలో ఆయుధ పూజను మంగళవారం ఘనంగా నిర్వహించారు. దుర్గాష్టమి పురస్కరించుకుని జిల్లా ఎస్పీ పరితోశ్ పంకజ్ ఆధ్వర్యంలో వేదమంత్రోచ్ఛరణల మధ్య ఆయుధాలతోపాటు వాహనాలకు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ...జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాలు నియంత్రణలో విజయవంతం కావాలని అమ్మవారిని వేడుకున్నామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలను విజయవంతం అయ్యేందుకు దుర్గామాత కరుణ, కటాక్షాలు పోలీసులపై ఉండాలని ఆకాంక్షిస్తూ పూజలు చేశారు. జిల్లాలో శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకుని నెల రోజుల పాటు (అక్టోబరు 1వ తేదీ నుంచి 31 వరకు) 30, 30(ఎ) పోలీసు యాక్ట్–1861 అమలులో ఉంటుందని చెప్పారు. ముందస్తు అనుమతి లేనిదే ప్రజలు, ప్రజా ప్రతినిధులు, ప్రజా సంఘాలు ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, బహిరంగసభలు, సమావేశాలు నిర్వహించకూడదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ రఘునందన్ రావు, తదితరులు పాల్గొన్నారు.పూజలో పాల్గొన్న జిల్లా ఎస్పీ పరితోశ్ పంకజ్ -
బాసరలో పూజలు చేసిన కాంగ్రెస్ నేతలు
నర్సాపూర్: బాసరలోని శ్రీ జ్ఞాన సరస్వతీమాత ఆలయాన్ని పలువురు కాంగ్రెస్ నాయకులు మంగళవారం సందర్శించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ సుహాసినిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే మదన్రెడ్డి, చిలప్చెడ్ మాజీ జెడ్పీటీసీ శేషసాయిరెడ్డితోపాటు పలువురు నాయకులు అమ్మ వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. నల్లపోచమ్మదేవి ఆలయంలో ఎమ్మెల్యే పూజలుకౌడిపల్లి(నర్సాపూర్): మండలంలో తునికి శ్రీనల్లపోచమ్మదేవి ఆలయంలో ఎమ్మెల్యే సునీతారెడ్డి మంగళవారం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయానికి ఎమ్మెల్యే రావడంతో ఆలయ అధికారులు, పూజారులు స్వాగతం పలికారు. అనంతరం నల్లపోచమ్మదేవికి ఎమ్మెల్యే కుంకుమార్చన చేశారు. పూజలు అనంతరం ఎమ్మెల్యేను శాలువాతో సన్మానించి తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు సారరామాగౌడ్, నాయకులు సాయాగౌడ్, ఎల్లం, ప్రవీణ్కుమార్, కిశోర్గౌడ్, అమర్సింగ్, సంజీవ్, చంద్రయ్య, రామానుజం తదితరులు పాల్గొన్నారు. పూర్తయిన రైల్వే బ్రిడ్జి మరమ్మతులునేటి నుంచి పునఃప్రారంభం హవేళిఘణాపూర్(మెదక్): మండల పరిధిలోని శమ్నాపూర్ శివారులో ఆగస్టు 28న కురిసిన భారీ వర్షాలకు రైల్వేబ్రిడ్జి కొట్టుకుపోయిన విషయం తెల్సిందే. దీంతో గత కొంత కాలంగా బ్రిడ్జి మరమ్మతులు చేసేందుకు భారీ వర్షాలు కురుస్తుండటంతో పనులకు అంతరాయం ఏర్పడగా ఎట్టకేలకు పనులు పూర్తి చేసి బుధవారం నుంచి మెదక్ రైల్వే రాకపోకలు కొనసాగించనున్నారు. ఈ మేరకు రైల్వే అధికారులు మంగళవారం విలేకరులకు తెలిపారు. అగ్నిప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలిసదాశివపేట(సంగారెడ్డి): సదాశివపేట ప్రాంతం పారిశ్రామిక ప్రాంతంగా అభివృద్ధి చెందుతోందని అగ్ని ప్రమాదాలపట్ల సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫైర్ సర్వీసెస్ ఎమర్జెన్సీ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ సివిల్ డిఫెన్స్ డైరెక్టర్ నారాయణరావు పేర్కొన్నారు. ఎంఆర్ఎఫ్ పరిశ్రమ సీఆర్ఎస్ నిధులతో సదాశివపేట అగ్నిమాపక కేంద్రం ఆవరణలో నిర్మించిన అగ్నిమాపక కేంద్రం నూతన భవనాన్ని మంగళవారం ఆయన ప్రారంభించారు. అనంతరం అగ్నిమాపక కేంద్రం ఆవరణలో మొక్కలు నాటి నీళ్లు పోశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...అగ్నిమాపక కేంద్రం పరిధిలో 552 అగ్ని ప్రమాదాలు జరిగాయని 28 అత్యవసర రక్షణ చర్యలు చేపట్టారన్నారు. అగ్నిప్రమాద రక్షణ చర్యల్లో భాగంగా రూ.80.74 కోట్ల విలువైన ఆస్తులను కాపాడినట్లు తెలిపారు. -
రాజుకున్న ఎన్నికల వేడి
స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ విడుదలవడంతో రిజర్వేషన్ కలిసొచ్చిన పల్లెల్లో ఎన్నికల వేడి రాజుకుంది. ఆశావహులు ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు దసరా రోజున మద్యం, మటన్ పంపిణీ చేసేందుకు సన్నాహాలు మొదలెట్టారు. రిజర్వేషన్ కలిసిరాని బడానేతలు పక్కమండలం నుంచి పోటీచేసేందుకు పావులు కదుపుతున్నారు. – మెదక్జోన్: జిల్లాలో 21 మండలాలు, 492 పంచాయితీలు, 21 ఎంపీటీసీ స్థానాలు, 21 జెడ్పీటీసీ స్థానాలున్నాయి. ముందు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు పార్టీ గుర్తుతో ఎన్నికలు జరుగనున్నాయి. ఆశావహులకు రిజర్వేషన్ కలిసొచ్చిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచులకు పోటీ చేయదలచుకున్న నేతలు గ్రామాల్లో అప్పుడే మందు, విందులతో ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఇప్పటికే మద్యం కొనుగోలు! ఎన్నడూలేనివిధంగా చిన్నా, చితక పనులుంటే మాకు చెప్పండి చేసి పెడతాం అంటూ వరుసలు పెట్టి మరీ పలుకరిస్తూ ఓటర్ దేవుళ్లను ఆశావహులు మచ్చిక చేసుకుంటున్నారు. గాంధీ జయంతి రోజున మద్యంషాపులు మూసిఉంటాయని ముందుగానే భారీగా మద్యం కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. దసరా రోజు తెల్లవారు జామునే ఇంటికి కిలో చొప్పున మటన్, ఆఫ్ బాటిల్ చొప్పున మద్యం పంపిణీ చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నారు. పక్క మండలాలకు వలస మెదక్ ప్రత్యేక జిల్లా ఏర్పాటు అయ్యాక 2019లో మొదటిసారి జరిగిన జెడ్పీటీసీ ఎన్నికల్లో జిల్లా పరిషత్ చైర్మన్ బీసీ మహిళకు రిజర్వేషన్ ఖరారైంది. ప్రస్తుతం ఆ సీటు జనరల్కు కేటాయించింది. జిల్లాలో పలువురు బడా నేతలు జెడ్పీ చైర్మన్ పదవిపై ఆశలు పెట్టుకున్నారు. అయితే వారి సొంత ప్రాదేశిక స్థానాల్లో రిజర్వేషన్ అనుకూలించలేదు. దీంతో ఎలాగైనా జెడ్పీ పీఠాన్ని చేజిక్కించుకునేందుకు సదరు నేతలు పక్కమండలం నుంచి జెడ్పీటీసీగా గెలిచేందుకు పావులు కదుపుతున్నారు.ఆశలు అడియాశలైన వేళ ఇందులో ప్రధానంగా నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే మధన్రెడ్డి (ఓసీ) వర్గానికి చెందిన వ్యక్తి గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ను వీడి రేవంత్రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో అప్పట్లో ఆయనకు జెడ్పీచైర్మన్ పదవి కట్టబెడతారని ప్రచారం జోరుగా సాగింది. కానీ అయితే ఆయన స్వగ్రామం కౌడిపల్లి సొంత జిల్లా పరిషత్ స్థానం బీసీ జనరల్కు కేటాయించడంతో కొల్చారం ఓసీ జెడ్పీటీసీ జనరల్ కావటంతో అక్కడి నుంచి పోటీచేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. అదే నియోజకవర్గం మాసాయిపేటకు చెందిన రాజిరెడ్డి గత అసెంబ్లీ ఎన్నికల్లో నర్సాపూర్ నుంచి కాంగ్రెస్ నుంచి పోటీచేసి ఓటమి పాలయ్యారు. ఆయన సైతం జెడ్పీ చైర్మన్ ఆశించినప్పటికీ ఆయన జిల్లా ప్రాదేశిక(జెడ్పీటీసీ)ఎస్సీలకు రిజర్వుడ్ అయింది. పాపన్నపేట మండలానికి చెందిన తాజా, మాజీ ఎంపీపీ చందన భర్త ప్రశాంత్రెడ్డి అదేమండలానికి చెందిన ప్రభాకర్రెడ్డి కూడా జెడ్పీ చైర్మన్ పదవిపై ఆశలు పెట్టుకున్నారు. ఆ మండలంలోని జిల్లాపరిషత్ బీసీకి రిజర్వుడ్ కావటంతో వారి ఆశలు సైతం అడియాశలైయ్యాయి. మొదటి నుంచి ఎన్నోఆశలు పెట్టుకుని రూ.లక్షలు ఖర్చులు పెట్టుకున్న బడానేతలు పక్కమండలాల నుంచి పోటీచేసి జెడ్పీపీఠాన్ని కై వసం చేసుకునేందుకు రాష్ట్రనేతల వద్దకు పరుగులు పెడుతున్నారు.రిజర్వేషన్ కలిసొచ్చిన గ్రామాల్లో పోటీకి సిద్ధమవుతున్న ఆశావహులు దసరారోజు మటన్, మద్యం పంపిణీకి సన్నాహాలు రాష్ట్ర నేతల ఆశీస్సులకోసం పరుగులు -
మాకు రిజర్వేషన్ ఉండదా?
మెదక్ కలెక్టరేట్/పాపన్నపేట(మెదక్): డభై ఐదేళ్లుగా ఒక్కసారి కూడా తమ గ్రామం ఎస్సీలకు రిజర్వుడు కాలేదని పాపన్నపేట మండలం కొత్త లింగాయపల్లి దళితులు ప్రభుత్వంపై మండిపడ్డారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయనివ్వకుండా కుట్రపూరితంగా రిజర్వేషన్లు ఖరారు చేశారని ఆరోపిస్తూ మంగళవారం మెదక్ కలెక్టరేట్లో సదరు గ్రామంలోని దళితులు నిరసన తెలిపారు. అనంతరం కలెక్టర్ రాహుల్రాజ్ను కలిసి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వం ఇటీవల కేటాయించిన రిజర్వేషన్లతో తాము పోటీ చేయలేని పరిస్థితి నెలకొందన్నారు. గ్రామంలో 25% ఎస్సీ జనాభా ఉండగా గతంలో రెండు వార్డులు ఎస్సీలకు రిజర్వేషన్ ఉండేవని తెలిపారు. ఈసారి ఆ రెండు కూడా లేకుండా కుట్రతో రిజర్వేషన్లు కేటాయించారని ఆరోపించారు. దళితులు కనీసం వార్డు మెంబర్గా కూడా ఎదగొద్దని కుట్రపూరితంగా రిజర్వేషన్లు కేటాయించినట్లు ఉందన్నారు. గ్రామంలో 8వార్డులు ఉండగా 4 వార్డుల్లో 90% ఎస్సీలు, 10% ఓసీ జనాభా ఉందని తెలిపారు. ఆ వార్డుల్లో బీసీ రిజర్వేషన్ చేయడంతో ఎస్సీలు పోటీ చేయలేని పరిస్థితి ఏర్పడిందని మరో 4 వార్డుల్లో ఓసీలు, బీసీలు లేరు, అక్కడ అన్రిజర్వ్ చేశారని ఆరోపించారు. ఈ రిజర్వేషన్ను పునఃపరిశీలించి తమకు న్యాయం చేయాలని కోరారు. కలెక్టర్ను కలసిన వారిలో గ్రామానికి చెందిన దళితులు దినకర్, ఆనంద్, కుమార్, అనంతి, దేవయ్య, సాయిబాబు, ఆగమయ్య, సామేల్, సాయికుమార్,భాగ్య, రత్నమ్మ తదితరులు ఉన్నారు. కలెక్టరేట్ వద్ద కొత్త లింగాయపల్లి దళితుల నిరసన ఎస్సీలున్న చోట బీసీలకు.. బీసీలున్న చోట ఎస్సీలకు రిజర్వేషన్! -
కోడ్ కూసింది
స్థానిక ఎన్నికల షెడ్యూల్ విడుదలస్థానిక సంస్థల ఎన్నికలకు నగారా మోగింది. రాష్ట్ర ఎన్నికల సంఘం సోమవారం షెడ్యూల్ విడుదల చేసింది. దీంతో జిల్లాలో కోడ్ అమల్లోకి వచ్చింది. ముందుగా ప్రాదేశిక, ఆ తర్వాత పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నారు. మొత్తంగా 37 రోజుల పాటు సాగే ఈ ప్రక్రియకు జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధం అయింది. – మెదక్జోన్ జిల్లాలో 21 మండలాలు ఉండగా, 21 ఎంపీపీ, 21 జెడ్పీటీసీ, 190 ఎంపీటీసీలు ఉన్నాయి. మొదటి విడతలో మెదక్ డివిజన్ పరిధిలోని రేగోడ్, అల్లాదుర్గం, టేక్మాల్, పాపన్నపేట, మెదక్, హవేళిఘణాపూర్, నిజాంపేట, రామాయంపేట, చిన్నశంకరంపేట, పెద్దశంకరంపేట మండలాలకు సంబంధించి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి అక్టోబర్ 9వ తేదీ నుంచి 11 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. 15న విత్డ్రాకు అవకాశం కల్పించి, 23న పోలింగ్ నిర్వహించనున్నారు. రెండో విడతలో తూప్రాన్, నర్సాపూర్ డివిజన్ల పరిధిలో గల 11 మండలాలకు ఎన్నికలు జరుగనున్నాయి. చేగుంట, నార్సింగి, మాసాయిపేట, వెల్దుర్తి, మనోహరాబాద్, తూప్రాన్, నర్సాపూర్, చిలప్చెడ్, కౌడిపల్లి, కొల్చారం, శివ్వంపేట మండలాల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. అక్టోబర్ 13వ తేదీ నుంచి 15 వరకు నామినేషన్ల ప్రక్రియ నిర్వహించి 16న స్క్రూ ట్నీ, 17న అప్పిల్ (ఫిర్యాదు), 18న వివరణ, 19న విత్డ్రాకు అవకాశం కల్పించి 27న ఎన్నికలు జరుపనున్నారు. మొదటి, రెండో దశలో జరిగిన పోలింగ్కు సంబంధించి నవంబర్ 11న కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు వెల్లడించనున్నారు. పంచాయతీ ఎన్నికలు ఇలా.. జిల్లాలో రెండు విడతల్లో పంచాయతీ ఎన్నికలు జరుగనున్నాయి. మొదటి విడతలో రేగోడ్, పెద్దశంకరంపేట, అల్లాదుర్గం, టేక్మాల్, పాపన్నపేట, మెదక్, హవేళిఘణాపూర్, చిన్నశంకరంపేట, రామాయంపేట, నిజాంపేట మండలాల పరిధిలో అక్టోబర్ 17 నుంచి 19 వరకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ చేపట్టనున్నారు. 31న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్ నిర్వహించి, అదేరోజు 2:30 గంటల నుంచి సాయంత్రం వరకు ఓట్ల లెక్కింపు చేట్టి ఫలితాల వెల్లడించనున్నారు. రెండో విడతలో నర్సాపూర్, చిలప్చెడ్, శివ్వంపేట, కౌడిపల్లి, కొల్చారం, తూప్రాన్, మనోహరాబాద్, మాసాయిపేట, వెల్దుర్తి, చేగుంట, నార్సింగి మండలాల పరిధిలో అక్టోబర్ 21 నుంచి 23 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. 27న విత్డ్రాకు అవకాశం కల్పించి, అదేరోజు పోటీలో ఉండే అభ్యర్థుల జాబితా ప్రకటించనున్నారు. నవంబర్ 4వ తేదీన ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 2:30 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి కౌంటింగ్ నిర్వహించి, అదేరోజు సాయంత్రం ఫలితాల వెల్లడించనున్నారు. అధికారులు సర్వం సిద్ధం ఎన్నికల నిర్వహణ కోసం అధికారులు సిద్ధంగా ఉన్నారు. కాగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి 1,052 పోలింగ్ బూత్లను సిద్ధం చేశారు. ప్రిసైడింగ్, రూట్ అధికారులతో పాటు సిబ్బందికి ఇప్పటికే శిక్షణ ఇచ్చారు. అలాగే పంచాయతీ ఎన్నికలకు సంబంధించి 4,220 పోలింగ్ బూత్లను ఏర్పాటు చేశారు. ఇందుకోసం 3,882 బ్యాలెట్ బాక్సులు అవసరం ఉండగా, గుజరాత్ నుంచి 1,036 బాక్సులను తెప్పించారు. జిల్లాలో 2,846 సిద్ధంగా ఉన్నాయి. ఇందుకు సంబంధించి మొత్తం 736 మంది అధికారులకు ఇప్పటికే శిక్షణ పూర్తి చేశారు. జిల్లాలో రెండు విడతల్లో ప్రాదేశిక, పంచాయతీ పోరు వచ్చేనెల 23, 27 తే దీల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నవంబర్ 11న ఓట్ల లెక్కింపు పోలింగ్ రోజునే సర్పంచ్ ఎన్నికల ఫలితాలుజిల్లాలో ఇలా.. గ్రామ పంచాయతీలు 492 వార్డు సభ్యులు 4,220 జెడ్పీటీసీల సంఖ్య 21 ఎంపీటీసీలు 190 ఎంపీపీలు 21 మొత్తం ఓటర్లు 5,23,327 మహిళలు 2,71,787 పురుషులు 2,51,532 ఇతరులు 8 -
పుస్తక రూపిణి.. వివేకధాత్రి
వర్గల్(గజ్వేల్): పుస్తక రూపిణి..వివేకధాత్రి.. విద్యాసరస్వతిదేవి నిజరూప దర్శనం భక్తజనావళిని మంత్రముగ్ధులను చేసింది. శంభుని కొండ అమ్మవారి స్మరణతో మార్మోగింది. విశేషాభరణాలు, నవరత్న మణిమయ స్వర్ణకిరీటంతో పుస్తకరూపిణి దివ్యదర్శనం..ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లిన ఈ అపూర్వఘట్టం సోమవారం వర్గల్ క్షేత్రంలో మూల మహోత్సవం సందర్భంగా ఆవిష్కృతమైంది. పీఠాధిపతులు విద్యాశంకరభారతి స్వామి, మాధవానందసరస్వతి స్వామి, ఆలయ వ్యవస్థాపక చైర్మన్ చంద్రశేఖరసిద్ధాంతి ఆధ్వర్యంలో మూల నక్షత్ర వేడుకలు కొనసాగాయి. వేదమంత్రోచ్ఛరణల మధ్య భక్తజన సామూహిక లక్ష పుష్పార్చ న, మహాపుస్తక పూజ నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు తెల్లవారుజామునుంచే వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పోటెత్తారు. పూర్ణకుంభస్వాగతం క్షేత్రం సందర్శించిన పుష్పగిరి, రంగంపేట పీఠాధిపతులు విద్యాశంకర భారతి స్వామి, మాధవానంద సరస్వతి స్వామిలకు ఆలయ వేదపండితులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అభి షేకాది పూజలు నిర్వహించి అమ్మవారి సేవలో త రించారు. భక్తులకు అనుగ్రహ భాషణం చేశారు. డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి తది తరులు అమ్మవారిని దర్శించుకున్నారు.వర్గల్ సరస్వతిదేవి నిజరూపదర్శనం 3,000 పైగా అక్షర స్వీకారాలు మూల మహోత్సవం సందర్భంగా సరస్వతిమాత సన్నిధిలో చిన్నారుల అక్షరాభ్యాసాల సందడి కొనసాగింది. 3000 పైగా చిన్నారులు అక్షరస్వీకారాలు చేశారని ఆలయ వర్గాలు తెలిపాయి. -
సద్దుల సంబురం
చిన్నశ ంకరంపేట: అంబాజీపేటలో బతుకమ్మలను నిమజ్జనానికి తీసుకెళ్తూ..శివ్వంపేట: బతుకమ్మ పేరుస్తున్న ఎమ్మెల్యే సునీతారెడ్డి● జిల్లాలో ఘనంగా పెద్ద బతుకమ్మ ● సంబురంగా ఆడిపాడిన మహిళలు ● ఊరూరా గౌరమ్మకు ఘన వీడ్కోలుసద్దుల సంబురాలు జిల్లాలో అంబరాన్నంటాయి. సోమవారం ఆడబిడ్డల ఆటపాటలతో ఊరూరూ పూలవనాల్లా మారాయి. ఉదయం నుంచే మహిళలు తీరొక్కపూలతో బతుకమ్మలను అందంగా పేర్చారు. సాయంత్రం కొత్త దుస్తులు ధరించి, గౌరమ్మకు పూజలు చేశారు. అనంతరం కూడళ్ల వద్ద బతుకమ్మలను ఉంచి ఆటాపాటలతో హోరెత్తించారు. అనంతరం స్థానిక చెరువుల్లో నిమజ్జనం చేశారు. ‘పోయిరా గౌరమ్మ.. పోయిరావమ్మా’ అంటూ వీడ్కోలు పలికారు. ఒకరికొకరు వాయినాలు ఇచ్చిపుచ్చుకున్నారు. కాగా కొన్ని మండలాల్లో సద్దుల బతుకమ్మ వేడుకలను మంగళవారం నిర్వహించనున్నారు. -
సమస్యలుంటే నేరుగా సంప్రదించాలి
మెదక్ మున్సిపాలిటీ: ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని ప్రజలు తమ సమస్యలు పరిష్కరించుకోవాలని అదనపు ఎస్పీ మహేందర్ సూచించారు. సోమవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ప్రజావాణి నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎస్పీ ఆదేశాల మేరకు కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈసందర్భంగా సంబంధిత పోలీస్ అధికారులు, సిబ్బందితో మాట్లాడి చట్టప్రకారం ఫిర్యాదుదారులకు న్యాయం జరిగేలా చూడాలని ఆదేశించారు. ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులు స్వీకరించి, సంబంధిత అధికారుల సహకారంతో వాటిని పరిష్కరిస్తున్నామని పేర్కొన్నారు. ప్రజల సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు జిల్లా పోలీస్ శాఖ ఎల్లప్పుడూ కట్టుబడి ఉందని తెలిపారు.అదనపు ఎస్పీ మహేందర్ -
ఆ పార్టీలకు గుణపాఠం చెప్పండి
నర్సాపూర్: ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కాంగ్రెస్, బీఆర్ఎస్లు ప్రజలను మోసం చేశాయని బీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లేశ్గౌడ్ ఆరోపించారు. సోమవారం పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ రెండు పా ర్టీలకు తగిన గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. ప్రధాని నరేంద్రమోదీ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలు ఆదరిస్తున్నారని తెలిపారు. అన్ని స్థానాల్లో పోటీ చేసి మెజారిటీ స్థానాలను ద క్కించుకోవడంతో పాటు జెడ్పీ చైర్మన్ పదవిని సైతం కై వసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. కాగా రిజర్వేషన్లలో పలు చోట్ల అవకతవకలు జరిగాయని ఆరోపించారు. నర్సాపూర్ మున్సిపాలిటీ అభివృద్ధిలో చాలా వెనుకబడిందన్నారు. డబుల్ బెడ్రూం ఇళ్లను పేదలకు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల వేళ రూ. 140 కోట్లు పంచాయతీ కార్యదర్శులకు విడుదల చేసి ప్రజలను మభ్యపెట్టారని అన్నారు. సమావేశంలో పార్టీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు చిన్న రమేశ్గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి సురేశ్, నాయకులు రమేశ్గౌడ్, ఆంజనేయులుగౌడ్, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. సన్నాలకు బోనస్ ఎప్పుడు? మెదక్ మాజీ ఎమ్మెల్యే శశిధర్రెడ్డి పాపన్నపేట(మెదక్): దసరా పండుగకై నా సన్న వడ్ల బోనస్ డబ్బులు విడుదల చేయాలని సీఎం రేవంత్రెడ్డికి మెదక్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నాయకుడు శశిధర్రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం పాపన్నపేటలో ఆయన విలేకరులతో మాట్లాడారు. భారీ వర్షాలతో జిల్లాలో చేతికొచ్చిన వేలాది ఎకరాల వరి పంట మునిగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. పండుగకు డబ్బులు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. యాసంగిలో సన్న వడ్లకు ఇస్తానన్న బోనస్ డబ్బులు ఇప్పటివర కు ఇవ్వలేదని వాపోయారు. కనీసం ఈ రెండు రోజుల్లో ఇస్తే, సంతోషంగా పండుగ జరుపుకుంటారన్నారు. ఆయన వెంట మాజీ ఉపసర్పంచ్ అనిల్రెడ్డి, చిట్యాల రవీందర్, సంజీవరెడ్డి, యువ నాయకుడు ప్రేమ్కుమార్ త దితరులు ఉన్నారు. గంగమ్మ ౖపైపెకి.. కౌడిపల్లి(నర్సాపూర్): విద్యుత్ మోటార్ సహాయం లేకుండానే బోరు బావి నుంచి నీరు పైకి వచ్చిన సంఘటన మండలంలోని ధర్మాసాగర్ గేట్ సమీపంలో సోమవారం జరిగింది. రైతు రాంరెడ్డి వ్యవసాయం పొలంలోని రెండు బోరు బావుల్లో మోటార్ వేయకుండానే కేసింగ్పైపు నుంచి నీరు పైకి వచ్చింది. భారీ వర్షాలతో చెరువులు, కుంటలు పూర్తిగా నిండటంతో భూగర్భజలాలు పెరిగి నీరు పైకి వస్తుందని పలువురు చర్చించుకుంటున్నారు. కవికి కీర్తి రత్న పురస్కారం ప్రశాంత్నగర్(సిద్దిపేట): జిల్లాకు చెందిన ప్రముఖ కవి వెంకటేశం కీర్తి రత్న పురస్కారం అందుకున్నట్లు, బాలసాహితీవేత్త ఉండ్రాళ్ల రాజేశం తెలిపారు. హైదరాబాద్లో జరిగిన కా ర్యక్రమంలో ‘అందమైనది నాదేశం’ గేయానికి గాను భ వాని సాహిత్య వేదిక నిర్వాహకులు కీర్తి రత్న పురస్కారంతో పాటుగా ఘనంగా సన్మానించారన్నారు. వెంకటేశంకు జిల్లా కవు లు బస్వరాజ్కుమార్, రాజయ్య, పర్శరాము లు, తదితరులు అభినందనలు తెలిపారు. 11 నుంచి ఇర్ఫానీ దర్గా ఉత్సవాలుసంగారెడ్డి టౌన్: ç³rt׿ ÕÐé-Æý‡$ÌZ° CÆ>¹± §ýlÆ>Y EÆý‡$Þ E™èlÞÐéË$ AMøt-ºÆŠḥæ 11 ¯]l$…_ fÆý‡$-VýS-¯]l$-¯é²Ä¶æ$° ï³u>-«¨ç³† çßæ{f™Œæ çßæMîSÐŒl$ JÐ]l$ÆŠæ ¼¯Œl AçßæÃ§Šæ çÜfj§Šæ Äôæ$ ¯]lïÙ-¯Œl »êÆý‡Y CÆ>¹± ™ðlÍ-´ëÆý‡$. D E™èlÞ-Ðé-ÌSMýS$ ò³§ýlª G™èl$¢¯]l ¿ýæMýS$¢Ë$ àfOÆð‡ Ððl¬MýS$PË$ ¡Æý‡$a-MýS$…-sêÆý‡° ™ðlÍ-´ëÆý‡$. Ððl¬ §ýlsìæ Æøk Ð]l$ïܧýl$ ¯]l$…_ ÝëĶæ$…{™èl… 5 VýS…r-ÌSMýS$ VýS…«§ýl… FÆó‡-W…ç³#, Æ>{† 8 VýS…r-ÌSMýS$ CÆ>¹± §ýlÆ>YÌZ VýS…«§é-Æ>-«§ýl¯]l, 9 VýS…rÌSMýS$ BÌŒæ C…yìlĶæ* Ð]l¬Úë-Ƈ$$Æ> E…r$…§ýl° ™ðlÍ-´ëÆý‡$. -
పకడ్బందీగా ఎన్నికల నిర్వహణ
కౌడిపల్లి(నర్సాపూర్): జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ రాహుల్రాజ్ తెలిపారు. సోమవారం మండలంలోని తునికి గేట్ సమీపంలోని ఎంజేపీ బీసీ గురుకుల పాఠశాలలో స్ట్రాంగ్రూం, కౌంటింగ్హాల్ ఏర్పాటు కోసం గదులు, పరిసరాలను పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్, వార్డుసభ్యుల ఎన్నికల రిజర్వేషన్లు పూర్తికాగా, ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిందన్నారు. దీంతో జిల్లాలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని చెప్పారు. ఎన్నికలు ప్రశాంత వాతవరణంలో పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. తునికి ఎంజేపీలో బ్యాలెట్ బాక్స్లు భద్రపరిచేందుకు, కౌటింగ్ కోసం పరిశీలించినట్లు వివరించారు. గురుకులానికి సంబంధించి పూర్తివివరాలు ప్రిన్సిపాల్ హరిబాబును అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో పటిష్టంగా కోడ్ మెదక్ కలెక్టరేట్: జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ను పటిష్టంగా అమలు చేయనున్నట్లు కలెక్టర్ రాహుల్రాజ్ తెలిపారు. శనివారం సాయంత్రం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణికుముది హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్లో నిర్వహించారు. ఎస్పీ డీవీ శ్రీనివాసరావు, అదనపు కలెక్టర్ నగేశ్, అదనపు ఎస్పీ మహేందర్, ఇతర శాఖల అధికారులతో కలిసి పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. కోడ్ ఉల్లంఘన జరిగితే తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు. ఎన్నికలు నిర్వహణకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉన్నట్లు వివరించారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ ఎల్లయ్య, జిల్లా పంచాయతీ అధికారి యాదయ్య, ఆర్డీఓ రమాదేవి, నోడల్ అధికారులు, ఎంపీడీఓలు తదితరులు పాల్గొన్నారు.కలెక్టర్ రాహుల్రాజ్ -
ఇక సమరమే..
పల్లెల్లో ‘స్థానిక’ సందడి ● ముగిసిన రిజర్వేషన్ల ప్రక్రియ ● 42 శాతంతో బీసీలకు డబుల్ ధమాకా పల్లెల్లో బతుకమ్మ, దసరా పండుగలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల సందడి కూడా కనిపిస్తోంది. మండల పరిషత్, జిల్లా పరిషత్ రిజర్వేషన్లు శనివారం సాయంత్రం ప్రకటించగా, ఎంపీటీసీ, సర్పంచ్, వార్డు సభ్యుల రిజర్వేషన్ల ప్రక్రియ అర్థరాత్రి వరకు కొనసాగింది. ఖరారు చేసిన రిజర్వేషన్లను జిల్లా యంత్రాంగం ప్రభుత్వానికి పంపించింది. బీసీలకు 42 శాతం అమలు చేయడంతో గతంతో పోలిస్తే సుమారు రెండింతల పాలకపక్షం పెరగనుంది. – మెదక్జోన్ జిల్లాలో 21 మండలాలతో పాటు 492 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 4,220 వార్డులు, 190 ఎంపీటీసీలు ఉండగా, 5,23,327 ఓటర్లు ఉన్నారు. జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు కల్పించడంతో బీసీవర్గాల నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నా రు. గతేడాది జిల్లాలో 469 గ్రామాలు ఉండగా, పరిపాలన సౌలభ్యం కోసం 23 పంచాయతీలను కొత్తగా ప్రకటించారు. దీంతో వాటి సంఖ్య 492 చేరుకుంది. అలాగే మాసాయిపేట మండలాన్ని నూతనంగా ఏర్పాటు చేయడంతో మండలాల సంఖ్య 21కి చేరింది. గతంలో 189 ఎంపీటీసీలు ఉండగా, నూతన మండలం మాసాయిపేటతో కలిపి 190కి చేరుకుంది.మారిన ముఖచిత్రం 2019లో జరిగిన సర్పంచ్ ఎన్నికలకు 2011 జనాభా లెక్కల ప్రకారం బీసీలకు 25 శాతం రిజర్వేషన్ అమలు చేశారు. అందులో భాగంగా 120 స్థానాలు ప్రకటించగా, ప్రస్తుతం 42 శాతం రిజర్వేషన్ అమలు చేస్తూ 179 స్థానాలను కేటాయించారు. ఈలెక్కన 59 స్థానాలు బీసీలకు అదనంగా పెరిగాయి. అలాగే ఎస్టీ 92 స్థానాలు, ఎస్సీ 77, అన్ రిజర్వుడ్(యూఆర్)కు 144 కేటాయించారు. వాటిలో మొత్తంగా మహిళకు 50 శాతం వాటా కల్పిస్తూ రిజర్వేషన్ ఫైనల్ చేశారు. అలాగే జిల్లావ్యాప్తంగా 190 ఎంపీటీసీలు ఉండగా, 2018లో జరిగిన ఎన్నికల్లో బీసీలకు 46 సీట్లు కేటాయించారు. ప్రస్తుతం 42 శాతం రిజర్వేషన్లో బీసీల వాటా కింద 79 సీట్లు కేటాయించారు. గతంలో పోలిస్తే 33 ఎంపీటీసీ స్థానాలు పెరిగాయి. అలాగే 2011 దమాషా ప్రకారం ఎస్టీకి 23, ఎస్సీ 34, అన్రిజర్వుడ్(యూర్)కు 54 చొప్పు న కేటాయించగా, అన్నివర్గాల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించారు. మిగితావి పురుషులకు కేటాయించారు. -
జోరుగా పూల విక్రయాలు
శివ్వంపేట(నర్సాపూర్): సోమవారం సద్దుల బతుకమ్మ కావడంతో పూల అమ్మకాలు జో రుగా సాగుతున్నాయి. కొనుగోలుదారులతో శివ్వంపేటలో సందడి నెలకొంది. కిలో బంతిపూలు రూ. 90 నుంచి 120 వరకు వ్యాపారులు విక్రయించారు. మహాసభల కరపత్రం ఆవిష్కరణ మెదక్ కలెక్టరేట్: మెదక్లోని కేవల్ కిషన్ భవన్లో ఆదివారం సీఐటీయూ మహాసభల సన్నాహక సమావేశం నిర్వహించారు. డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో జిల్లాలో నిర్వహించనున్న సీఐటీయూ రాష్ట్ర 5వ మహాసభల కరపత్రాలను రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చుక్క రాములు, పాలడుగు భాస్కర్ ఆవిష్కరించి మాట్లాడారు. మహాసభ లకు విస్తృత ఏర్పాట్లు చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో సీఐటీ యూ రాష్ట్ర ఉపాధ్యక్షులు వీరయ్య, మల్లికార్జున్, ఆహ్వాన సంఘం వైస్ చెర్మన్ అడివయ్య, సీఐటీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బాలమణి, మల్లేశం, జిల్లా కోశాధికారి నర్సమ్మ, మహేందర్రెడ్డి, నాగరాజు, బస్వరాజు, సంతోశ్, గౌరయ్య, మల్లేశం, అజయ్, ప్రవీణ్, బాబు తదితరులు పాల్గొన్నారు. -
మంజీరా ఉగ్రరూపం
● ఘనపురంపై నుంచి 1.24 లక్షల క్యూసెక్కుల నీరు ● నీట మునిగిన వెయ్యి ఎకరాలు ● మెదక్కు నిలిచిన రాకపోకలుపాపన్నపేట(మెదక్)/కొల్చారం(నర్సాపూర్): మంజీరా ఉధృతంగా ప్రవహిస్తోంది. ఆదివారం 1,24,598 క్యూసెక్కుల నీరు దిగువకు పయనిస్తుంది. ఘనపురం ప్రాజెక్టు దిగువన గల మొదటి బ్రిడ్జి, ఎల్లాపూర్ బ్రిడ్జి నీట మునిగాయి. రెండు రోడ్లను మూసివేయడంతో పాపన్నపేట, టేక్మాల్, పెద్దశంకరంపేట, అల్లాదుర్గం, రేగోడ్ మండలాల ప్రజలు జిల్లా కేంద్రానికి వెళ్లేందుకు అవకాశం లేకుండా పోయింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మంజీరా నది వైపు ఎవరూ వెళ్లకుండా పాపన్నపేట ఎస్సై శ్రీనివాస్గౌడ్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా మంజీరా వరదలు పోటెత్తడంతో తీర ప్రాంతాల్లో ఉన్న సుమారు వెయ్యి ఎకరాలకుపైగా వరి పంట నీట మునిగింది. మరికొన్ని రోజుల్లో ఇంటికి చేరాల్సిన పంట గంగ పాలయ్యిందని రైతులు వాపోతున్నారు. ఎంకెపల్లి, చిత్రియాల్, గాజులగూడెం, కొడుపాక, నాగ్సాన్పల్లి, ఎల్లాపూర్, గాంధారిపల్లి, కొత్తపల్లి, యూసుప్పేట, ఆరెపల్లి, మిన్పూర్, ముద్దాపూర్, రామతీర్థం, మల్లంపేట, కందిపల్లి, చీకోడ్, కొంపల్లి తదితర గ్రామాల్లో పంటలు నీట మునిగాయి. కొల్చారం మండలంలోని మంజీరా పరివాహక గ్రామాల్లో నదికి ఇరువైపులా పంటలు ఎక్కడికక్కడ నీట మునిగాయి. ఇప్పటికే ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పంట దెబ్బతిన్న రైతులకు, వరద ఉధృతి మరింత నష్టాన్ని తెచ్చిపెట్టింది. -
మా సమస్యలు పరిష్కరించండి
మెదక్ కలెక్టరేట్: తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆదివారం గిరిజన ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్లలో పనిచేస్తున్న డెయిలీ వైజ్, కాంటింజెంట్ వర్కర్లు ఆందోళనకు దిగారు. ఈసందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షుడు దొడ్ల శ్రీకాంత్ మాట్లాడుతూ.. 212 జీఓను సవరించి 2014 నాటికి ఐదేళ్ల సర్వీస్ ఉన్న వారందరినీ పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. కలెక్టర్ గెజిట్ ప్రకారం వేతనాలు చెల్లించాలన్నారు. పెండింగ్ వేతనాలు చెల్లించేందుకు ట్రెజరీలకు ఆదేశాలు ఇవ్వాలన్నారు. కొత్త మెనూ, పెరిగిన పనిభారానికి అనుగుణంగా కార్మికులను పెంచాలన్నారు. విద్యార్థులతో పాటు కార్మికులకు సైతం రెండు జతల యూనిఫాం, ఐడీ కార్డులు ఇవ్వాలన్నారు. కార్మికులకు రూ. 10 లక్షల ప్రమాద బీమా కల్పించాలని కోరారు. సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో యూనియన్ ప్రధాన కార్యదర్శి సునంద, కోశాధికారి మాధవి, శేఖర్, సువర్ణ తదితరులు పాల్గొన్నారు. -
పర్యాటక ప్రాంతంగా బోరంచ
● మొదటి విడతగా రూ. 2 కోట్లు మంజూరు ● మంజీరా నదిలో బోటింగ్, ఇతర ఏర్పాట్లు నారాయణఖేడ్: ఉమ్మడి జిల్లాలోనే ఏడుపాయల దుర్గామాత తర్వాత రెండో అతిపెద్ద పుణ్యక్షేత్రమైన మనూరు మండలంలోని బోరంచ నల్లపోచమ్మ ఆలయం పర్యాటక ప్రాంతంగా అవతరించనుంది. పర్యాటక ప్రాంతాల అభివృద్ధిలో భాగంగా ఎకో టూరిజంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా బోరంచ వద్ద పర్యాటక ప్రాంత అభివృద్ధి కోసం తొలి విడతగా రూ. 2 కోట్లను విడుదల చేయనుంది. ఈమేరకు ఆర్థికశాఖ అనుమతులిచ్చింది. మరో రూ. కోటిన్నర నిధులకు ప్రతిపాదించారు. మంజీరా నదీ తీరాన బోరంచ ఆలయం ఉండటంతో బోటింగ్, పర్యాటకుల విడిదితో పాటు ఆలయంలో దర్శనం, ఇతర సౌ కర్యాలు ఏర్పాట్లు చేయనున్నారు. సంగమేశ్వర ఆలయం, రాఘవపూర్ సరస్వతీ అమ్మవారు, సూర్యదేవాలయం వరకు టెంపుల్ సర్కిల్గా మార్చి బోటింగ్ ఏర్పాట్లు చేయనున్నారు. అతిపెద్ద పర్యాటక ప్రాంతంగా.. ఆందోల్ నియోజకవర్గంలోని రాయిపల్లి మండలంలోని ఇందూర్ వద్ద మంజీరా నది గుట్టపై రిసార్ట్స్ ఏర్పాటుకు మంత్రి దామోదర రాజనర్సింహ ప్రతిపాదించారు. 12 కిలోమీటర్లు బోటింగ్ ద్వారా ప్రయణిస్తూ ఆలయాలను దర్శించుకోవడంతో పాటు రిసార్ట్ను కూడా వినియోగించుకునే అవకాశం కల్పించనున్నారు. అటవీశాఖ ద్వారా ఎకో టూరిజంకు రూ. 5 కోట్లు వెచ్చించి ఏర్పాట్లు చేసేందకు ప్రతిపాదించారు. ఎకో టూరిజంలో కాంక్రీట్ నిర్మాణాలు కాకుండా ఎకో ఫ్రెండ్లీ కాటేజెస్ నిర్మించనున్నారు. బాంబోస్టిక్స్తో కాటేజెస్ నిర్మాణం, రెస్టారెంట్లు సైతం ఇదే తరహాలో నిర్మించనున్నారు. బోరంచ ఆలయానికి సీజీఎఫ్ కింద రూ. 50 లక్షలు మంజూరయ్యాయి. పీపీపీ మోడ్లో ఇతర ఏర్పాట్లు.. బోరంచలో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ (పీపీపీ) మోడ్లో వాటర్ ఫ్రంట్ హరిత రెస్టారెంట్ ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. థీమ్ పార్క్, చిల్డ్రన్స్ ఏరియా, బొటానికల్ గార్డెన్ తదితర ఏర్పాట్లు చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రసాద్ స్కీమ్ కింద ఆలయాభివృద్ధికి నిధులకు ప్రతిపాదించారు. ఈ నిధులతో సంగమేశ్వరాలయం వద్ద ఉన్న మంజీరా నదిలో స్నానాలఘాట్, రహదారు లు, సాంస్కృతిక కార్యక్రమాలు, పర్యావరణానికి లోబడి ఇతర నిర్మాణాలు, డీర్ పార్క్ లాంటి ఏర్పాట్లకు ప్రయత్నాలు చేపట్టారు. -
శోభాయమానం.. విద్యాధరి క్షేత్రం
● మహాచండీదేవిగా అమ్మవారు దర్శనం ● నేడు మూల మహోత్సవం వర్గల్(గజ్వేల్): శంభునికొండ దేదీప్యమానమైంది. విద్యుత్ దీపాలతో వర్గల్ క్షేత్రం కాంతు లీనుతోంది. దసరాశరన్నవరాత్రి ఉత్సవాలో భాగంగా ఆదివారం అమ్మవారు మహాచండీదేవి అలంకారంలో భక్తజనావళికి దర్శనమిచ్చారు. ఆలయ వ్యవస్థాపక చైర్మన్ చంద్రశేఖరసిద్ధాంతి నేతృత్వంలో అమ్మవారికి మహాభిషేకం, రాజోపచార, షష్ట్యుపచార పూజలు నిర్వహించారు. భక్తజనులు అమ్మవారిని దర్శించుకుని తరించారు. నేడు విశేషపూజలు, అక్షరస్వీకారాలు ఉత్సవాలలో అత్యంత ప్రధానమైన మూల మహోత్సవానికి వర్గల్ క్షేత్రం సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకుంది. సోమవారం అమ్మవారు సరస్వతీదేవిగా నిజరూప దర్శనమిస్తారు. రంగంపేట, పుష్పగిరి పీఠాధిపతులు మాధవానంద సరస్వతి, శ్రీవిద్యాశంకర భారతి స్వామి తదితర ప్రముఖులు హాజరు కానున్నారు. రోజంతా విశేష పూజా కార్యక్రమాలు జరుగుతాయి. రాష్ట్ర నలుమూలల నుంచి వేలాదిగా భక్తులు పోటెత్తనున్నారు. భారీసంఖ్యలో చిన్నారుల అక్షరాభ్యాసాలు జరుగుతాయి. ఇందుకు అనుగుణంగా అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. -
మహాచండిగా దుర్గమ్మ
సోమవారం శ్రీ 29 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం ఏడుపాయల వన దుర్గమ్మ మహాచండి (కాళరాత్రి) అలంకారం, నారింజ రంగు వస్త్రాలతో భక్తులకు దర్శనమిచ్చారు. మంజీరా వరదలతో దారులు మూసేయడంతో భక్తుల సంఖ్య తక్కువగా కనిపించింది. అర్చకులు శంకరశర్మ, పార్థివశర్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. – పాపన్నపేట(మెదక్)బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. ఆదివారం మహిళలు తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి ఒక చోట చేరారు. ‘చిత్తూ చిత్తుల బొమ్మ శివునీ ముద్దుల గుమ్మ.. బంగారు బొమ్మ దొరికేనమ్మా.. ఈ వాడలోనా’.. ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మా.. ఏమేమి కాయొప్పునే గౌరమ్మా..! శ్రీ.. అంటూ ఆడిపాడారు. అనంతరం స్థానిక చెరువుల్లో నిమజ్జనం చేసి వాయినాలు ఇచ్చిపుచ్చుకున్నారు. – కౌడిపల్లి(నర్సాపూర్) బతుకమ్మ.. బతుకమ్మ ఉయ్యాలో.. -
నష్టపరిహారం ఎప్పుడో?
గత నెల చివరివారంలో కురిసిన భారీ వర్షాలు రైతులను అతలాకుతలం చేశాయి. స్పందించిన సర్కార్ పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటామని చెప్పింది. ఆ మేరకు అధికారులు సర్వే చేసి పంట నష్టం వివరాలను సేకరించి రాష్ట్ర ప్రభుత్వనికి నివేదించారు. నెల రోజులు గడుస్తున్నా.. ఇప్పటివరకు పరిహారం అందకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. – రామాయంపేట(మెదక్) జిల్లా పరిధిలో భారీ వర్షాలకు 6,500 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. 1,060 ఎకరాల్లో ఇసుక మేటలు వేసింది. నెల రోజులుగా ఇంకా కొన్ని పంటచేన్లు నీటిలోనే ఉన్నాయి. రంగుమారి పూర్తిగా దెబ్బతిన్నాయి. అయితే నష్టపోయిన రైతా ంగాన్ని ఆదుకుంటామని ప్రభుత్వం ఇచ్చిన హామీ ఇప్పటివరకు నెరవేరలేదు. అధికారులు గ్రామాల్లో పర్యటించి దెబ్బతిన్న పంటల వివరాలు ప్రభుత్వానికి నివేదించారు. నెల రోజులుగా నష్టపరిహారం కోసం ఎదురుచూస్తున్న రైతులు వ్యవసాయ, రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. వర్షాలతో ప్రధానంగా వరి పంట తీవ్రంగా దెబ్బతింది. 5,850 ఎకరాల్లో నష్టం జరిగిందని అధికారుల సర్వేలో తేలింది. దీనికి తోడూ పత్తి, మొక్కజొన్న పంటలకు నష్టం జరిగింది. 11 ఎకరాలు మాత్రమే గుర్తింపు భారీ వర్షాలతో జిల్లా పరిధిలో 1,060 ఎకరాలకు పైగా పంట చేలల్లో ఇసుకమేటలు వేసింది. ఈసీజన్లో తొలగించుకోవడం సాధ్యం కాదని భావిస్తున్న రైతులు కొందరు వాయిదా వేసుకుంటున్నారు. ఇప్పటికిప్పుడు ఇసుకమేటలు తొలగించాలంటే రూ. లక్షలు ఖర్చవుతాయని, ఈ పరిస్థితుల్లో తాము అంత డబ్బు ఖర్చుపెట్టే పరిస్థితుల్లో లేమని చెబుతున్నారు. విధిలేని పరిస్థితుల్లో పంటలను అలాగే వదులుకుంటున్నామని వాపోతున్నారు. కాగా రామాయంపేట, నార్సింగి, హవేళిఘణాపూర్ మండలాల్లో మొదటి విడతగా 11 ఎకరాలను మాత్రమే గుర్తించిన అధికారులు, సదరు భూముల్లో నుంచి ఇసుకమేటలు తొలగిస్తామని పేర్కొన్నారు.ప్రభుత్వానికి నివేదించాం దెబ్బతిన్న పంటల వివ రాలు సర్వే చేసి ప్రభుత్వా నికి నివేదించాం. నష్టపరిహారం విషయం తమ పరిధిలో లేదు. ఇసుకమేటలు వేసిన భూములను గుర్తించాం. పైఅధికారుల ఆదేశాల మేరకు ముందుకెలుతాం. – దేవ్కుమార్, జిల్లా వ్యవసాయ అధికారితీవ్రంగా నష్టపోయాం గత నెలలో కురిసిన భారీ వర్షాలకు పంటలు కొట్టుకుపోయి తీవ్రంగా నష్టపోయాం. పంట చేన్లు ఇసుకమేటలు, రాళ్లుతో నిండిపోయాయి. వీటి కి తొలగించుకోవడం తమతో సాధ్యం కాదు. ప్రభుత్వమే ఆదుకోవాలి. – దేవ్జా, రైతు, కోనాపూర్ తండా -
వరద ఎఫెక్ట్.. కొట్టుకుపోయిన ఏడుపాయల గర్భగుడి షెడ్డు
సాక్షి, మెదక్: తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేని వర్షాల కారణంగా నదులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. మెదక్ జిల్లాలోని ఏడుపాయల వన దుర్గమ్మ ఆలయం వద్ద మంజీరా ఉగ్ర రూపం దాల్చింది. ఎగువ ప్రాంతాల వరద పోటెత్తడంతో దుర్గమ్మ ఆలయం వద్ద మంజీరా నదీపాయ పొంగిపొర్లుతోంది. దీంతో, గత 15 రోజులుగా ఆలయం వరదల్లోనే ఉంది.వివరాల ప్రకారం.. సింగూరు ప్రాజెక్టు నుండి ఒక లక్షా 20 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసిన నేపథ్యంలో మంజీరా నదికి వరద నీరు పోటెత్తింది. దీంతో, గర్భగుడి మండపం పూర్తిగా వరదల్లో కొట్టుకుపోయింది. ఏడుపాయల వద్ద పదేళ్ల తర్వాత మళ్లీ ఇంత వరద వచ్చినట్టు స్థానికులు చెబుతున్నారు. ప్రమాదకర స్థాయిలో మంజీరా నది ప్రవహిస్తోంది.వరద తీవ్రతతో కొట్టుకుపోయిన ప్రసాదాల పంపిణీ కేంద్రం షెడ్డు సైతం కొట్టుకుపోయింది. ఇప్పటికే ఆలయానికి వెళ్లే మూడు దారులను పోలీసులు మూసివేశారు. అమ్మవారి దర్శనానికి ఎవరు రావొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. కొల్చారం మండలం పోతంశెట్టిపల్లి నుంచి ఏడుపాయలకు వెళ్లే మొదటి బ్రిడ్జి వద్ద అధికారులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులు పాపన్నపేట మండలం నాగ్సాన్ పల్లి నుంచి వెళ్లాలని కొల్చారం పోలీసులు సూచిస్తున్నారు. *Q Line రేకులు ఏడుపాయల లో గంట గంట కు పెరుగుతున్న వరద ఉధృతి* pic.twitter.com/TcxI0aAp1P— Bandaram kanakaraju Bjp (@B68037Bjp) September 27, 2025 -
నిబంధనల ప్రకారం రిజర్వేషన్లు
మెదక్ కలెక్టరేట్: జిల్లాలోని జెడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలకు ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం రిజర్వేషన్లు ఖరారు చేసినట్లు కలెక్టర్ రాహుల్రాజ్ తెలిపారు. కలెక్టరేట్లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో రిజర్వేషన్ల కేటాయింపు ప్రక్రియ నిర్వహించారు. జిల్లాలో 21 జెడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్, మహిళా రిజర్వేషన్లను ఖరారు చేశారు. జిల్లాలో మొత్తం 21 జెడ్పీటీసీ స్థానాలకు ఎస్సీ (4 ఇందులో 2 మహిళలకు), ఎస్టీ (2 ఇందులో ఒకటి మహిళ) కేటాయించడినట్లు చెప్పారు. బీసీలకు 9 స్థానాలు రిజర్వ్ కాగా, 4 మహిళలకు కేటాయించినట్లు తెలిపారు. మిగితా 6 మండలాలు జనరల్ కేటగిరిలో ఉండగా, వీటిలో 3 స్థానాలు మహిళలకు కేటాయించామని వివరించారు. రిజర్వేషన్ల వివరాలను ప్రభుత్వానికి, ఎన్నికల కమిషన్కు నివేదిస్తామని తెలిపారు. అంతకుముందు కలెక్టరేట్లో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. -
తెగులు.. దిగులు
●వర్షాలతో పంటలపై తీవ్ర ప్రభావం ●దిగుబడిపై ఆందోళన చెందుతున్న రైతన్నలు కొల్చారం(నర్సాపూర్): అల్పపీడన ప్రభావంతో జిల్లాలోని పలు మండలాల్లో గురువారం రాత్రి నుంచి తేలికపాటి వర్షం కురుస్తోంది. రైతులకు కంటిమీద కునుకు లేకుండా పోతోంది. దీంతో చేతికొచ్చే దశలో పంటలు దెబ్బతింటున్నాయి. నెల రోజులుగా కురుస్తున్న వర్షాలు వరి, పత్తి పంటలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. పత్తి ప్రస్తుతం పూత, పిందె దశలో.. వరి పొట్ట దశలో ఉంది. ఈ సమయంలో వరుసగా వర్షాలు కురుస్తుండడంతో తెగుళ్లు సోకుతున్నాయి. ముందస్తుగా నాట్లు వేసిన వరి పొలాలు గింజ తొడుగుతున్న దశలో కంకులు నల్లగా మారి తాలు కనిపిస్తుందని రైతులు చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్న వ్యవసాయ అధికారులు వర్షం నుంచి పంటను కాపాడుకునేందుకు సూచనలు చేస్తున్నప్పటికీ, ఎడతెరిపి లేని వర్షం సత్ఫలితాలు ఇవ్వడం లేదని వారు వాపోతున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే ఈసారి దిగుబడి తగ్గడమే కాకుండా కనీసం పెట్టుబడి కూడా చేతికొచ్చే పరిస్థితి కనిపించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
నేతల జాతకాలు తారుమారు
బీసీ రిజర్వేషన్లతో ఆశ లు ఆవిరి మెదక్అర్బన్: ‘దేవుడు వరమిచ్చినా పూజారి కనికరించలేదన్నట్లుంది’ రాజకీయ నాయకుల పరిస్థితి. మెదక్ జెడ్పీ చైర్మన్ పదవిపై ఆశలు పెంచుకున్న పలువురు కాంగ్రెస్ నాయకులకు వారి సొంత ప్రాదేశిక స్థానాల్లో రిజర్వేషన్లు అనుకూలించలేదని తెలుస్తోంది. బీసీ రిజర్వేషన్ల నేపథ్యంలో నేతల జాతకాలు తారుమారయ్యాయి. అనాదిగా పార్టీ కోసం అహర్నిశలు కృషి చేసిన వారు, పదవులపై ఆశలు పెంచుకొని పార్టీలో చేరిన వారికి రిజర్వేషన్లు ప్రతికూలంగా వచ్చాయి. కాగా ఖచ్చితంగా పార్టీ ఎవరినైనా చైర్మన్ అభ్యర్థిగా భావిస్తే, అతడు తనకు అనుకూలమైన మరో స్థానం నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. జెడ్పీ చైర్మన్ పదవి అందని ద్రాక్షేనా! నర్సాపూర్ నియోజకవర్గంలోని ఓసీ వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్లో చేరారు. అయితే అప్పట్లో సదరు నాయకునికి వచ్చే ఎన్నికల్లో జెడ్పీ చెర్మన్ పదవి ఇస్తారన్న ప్రచారం జరిగింది. కాగా ప్రస్తుతం ప్రకటించిన రిజర్వేషన్లలో ఆయన సొంత జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గం బీసీ జనరల్కు కేటాయించారు. అలాగే అదే నియోజకవర్గం నుంచి ఇటీవల కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఓసీ నాయకుడు ఎన్నికల్లో ఓడిపోయారు. అయితే ఆయన పేరు కూడా జెడ్పీ చైర్మన్ పదవి రేసులో వినిపిస్తుంది. కాగా ఆయన సొంత జెడ్పీటీసీ స్థానం ఎస్సీ మహిళకు అలాట్ అయ్యింది. మనోహరాబాద్ మండలానికి చెందిన ఓ కాంగ్రెస్ నాయకుడు మైనంపల్లి ముఖ్య అనుచరుడిగా కొనసాగుతున్నారు. గతంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ పదవిని ఆశించి సఫలీకృతం కాలేకపోయారు. ప్రస్తుతం ఓసీ వర్గానికి చెందిన ఆయన పేరు కూడా చైర్మన్ రేసులో వినిపిస్తుంది. కాగా ఆయన సొంత ప్రాదేశిక నియోజకవర్గం ఓసీ మహిళకు అలాట్ అయ్యింది. పాపన్నపేట మండలంలోని ఓసీ వర్గానికి చెందిన సీనియర్ నాయకుడు కరడు గట్టిన కాంగ్రెస్ వాది. ఆయన కూడ జెడ్పీ చైర్మన్ పదవిపై ఆశలు పెట్టుకున్నారు. కానీ పాపన్నపేట జెడ్పీటీసీ స్థానం బీసీ జనరల్కు కేటాయించారు. శంకరంపేట(ఆర్)కు చెందిన ఓసీ నాయకుడు కూడా చైర్మన్ పదవిపై ఆశతో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఆ స్థానం బీసీ జనరల్కు అలాట్ అయ్యింది.అంచనాలు తలకిందులు కేవలం జెడ్సీటీసీ చైర్మన్ పదవే కాకుండా, ఎంపీపీ పదవులపై ఆశలు పెట్టుకున్న పలువురు నాయకులకు సొంత ప్రాదేశిక నియోజకవర్గాల్లో ప్రతికూల రిజర్వేషన్లు వచ్చాయి. అర్కెల గ్రామ పంచాయతీలోని 9, 10 వార్డులు ఎస్టీ వర్గానికి కేటాయించారు. కాగా అక్కడ ఒక్క ఎస్టీ కుటుంబం లేదని గ్రామస్తులు వాపోతున్నారు. -
ఒక్కేసి పువ్వేసి చందమామ
● కలెక్టరేట్లో అంబరాన్నంటిన బతుకమ్మ సంబురాలు ● పాల్గొన కలెక్టర్, కుటుంబ సభ్యులు ● ఆడిపాడిన అధికారులు, సిబ్బంది మెదక్ కలెక్టరేట్: కలెక్టరేట్లో శనివారం బతుకమ్మ సంబురాలు అంబరాన్నంటాయి. రంగు రంగుల పూలతో అందంగా అలంకరించిన బతుకమ్మలను ఒక చోట చేర్చి వర్షాన్ని సైతం లెక్కచేయకుండా మహిళా సిబ్బంది ఆడిపాడారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా జిల్లా యంత్రాంగం ఆధ్వ ర్యంలో బతుకమ్మ సంబరాలు నిర్వహించడం హర్షణీయమన్నారు. అదనపు కలెక్టర్ నగేశ్, డీఆర్ ఓ భుజంగరావు, జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి, ఆయాశాఖల మహిళ అధికారులు, సిబ్బందితో కలిసి నృత్యాలు చేశారు. సంబురాలకు కలెక్టర్ తల్లి తో పాటు ఆయన భార్యాపిల్లలు హాజరయ్యారు. -
ఉత్కంఠకు తెర
జెడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీల రిజర్వేషన్లు ఖరారుమెదక్జోన్: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేస్తూ జీఓ విడుదల అయిన నేపథ్యంలో శనివారం మండల పరిషత్, జిల్లా పరిషత్ రిజర్వేషన్లు ఖరారు చేస్తూ జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రాహుల్రాజ్ జాబితాను విడుదల చేశారు. జిల్లాలో 21 మండలాలు ఉండగా, 21 ఎంపీపీలు, 21 జెడ్పీటీసీలకు రిజర్వేషన్ పక్రియను పూర్తిచేశారు. బీసీలకు గతంతో పోలిస్తే ఈసారి 2 జెడ్పీటీసీ స్థానాలు, 2 ఎంపీపీ స్థానాలు పెరిగాయి. 2019– 2024 జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికల్లో జిల్లాలో 20 మండలాలు మాత్రమే ఉండగా, పరిపాలన సౌలభ్య కోసం గతేడాది నూతనంగా మాసా యిపేట మండలాన్ని ఏర్పాటు చేశారు. దీంతో మండలాల సంఖ్య 21కి చేరింది. కాగా గతంలో జరిగిన ఎన్నికల్లో బీసీలకు 27 శాతం రిజర్వేషన్లో భాగంగా 7 జెడ్పీటీసీ, 7 ఎంపీపీ స్థానాలను కేటాయించారు. ప్రస్తుతం 42 శాతం అమలు కావటంతో 21 మండలాలకు 9 జెడ్పీటీసీ, 9 ఎంపీపీ స్థానాలను బీసీలకు రిజర్వుడ్ చేస్తూ జాబితాను విడుదల చేశారు. ప్రత్యేక జిల్లా ఏర్పాటు అయ్యాక మెదటగా జిల్లా పరిషత్ పీఠాన్ని బీసీ మహిళకు ఎన్నికల కమిషన్ రిజర్వుడ్ చేసింది. ఈసారి అన్రిజర్వ్డ్ (జనరల్)కు కేటాయించారు. ఓసీ జనరల్ కు కేటాయించే అవకాశాలు ఉన్నాయంటూ జిల్లాలో జోరుగా ప్రచారం సాగింది. జిల్లాలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ రిజర్వేషన్లు ఇలా -
సకాలంలో వైద్యసేవలు అందించాలి
రామాయంపేట(మెదక్): పట్టణంలోని ప్రభు త్వ ఆస్పత్రిని శనివారం వైద్య విధాన పరిషత్ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ శివదయాల్ సంద ర్శించారు. ఈసందర్భంగా ఆయన రోగులను పరీక్షించారు. ఆస్పత్రికి వచ్చే రోగుల పట్ల మర్యాదగా ప్రవర్తించాలని, సకాలంలో వైద్య సేవలు అందజేయాలని సూచించారు. ఆస్పత్రి లో రిజిస్టర్లు, మందులను పరిశీలించి డాక్టర్లకు సూచనలు చేశారు. ఆయన వెంట ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ లింబాద్రి, వైద్యులు, సిబ్బంది ఉన్నారు. అప్రమత్తంగా ఉండాలి మెదక్ కలెక్టరేట్: జిల్లాలో రానున్న మూడు రోజులు భారీ వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ రాహుల్రాజ్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని అన్నిశాఖల అధికారులు క్షేత్రస్థాయిలో విధుల్లో నిమగ్నమై ఉంటారని, సోమవారం నిర్వహించే ప్రజావాణి తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. చెరువులు తెగే పరిస్థితి ఉంటే వెంటనే చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్ అధికారులకు సూచించారు. గ్రామస్థాయి నుంచి జిల్లాస్థాయి వరకు అధికారులు హెడ్ క్వార్టర్లోనే ఉండాలన్నారు. కరెంట్ స్తంభాలు, రహదారుల వద్ద నీరు నిల్వ ఉంటే వెంటనే స్పందించాలన్నారు. శిథిలావస్థ ఇళ్లలో నివసించే వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. అవసరమైన చోట పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు. వాగులు, చెరువుల వద్ద ఎవరూ వెళ్లకుండా చూడాలన్నారు. వర్షాల వల్ల వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. భూసేకరణ శాసీ్త్రయంగా జరగాలి మెదక్ కలెక్టరేట్: రీజినల్ రింగ్ రోడ్డు నిర్మా ణానికి భూసేకరణ శాసీ్త్రయంగా జరగాలని సీ పీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు అజ్జమర్రి మల్లేశం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం అదనపు కలెక్టర్ నగేశ్ను కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భూములు కోల్పోతున్న రైతులకు చట్టం ప్రకారం పరిహా రం ఇవ్వాలని, లేదంటే కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు, కొందరు పెద్దల కోసం అలైన్మెంట్ మార్చుతున్నట్లు ఆరోపించారు. తప్పనిసరి పరిస్థితుల్లో రైతులు భూము లు కోల్పోవాల్సిన పరిస్థితి వస్తుందన్నారు. రైతుల నుంచి బలవంతపు భూసేకరణ చేస్తే పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతా మని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి నర్సమ్మ, మల్లేశం, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. టెక్నాలజీని అందిపుచ్చుకోవాలిహత్నూర(సంగారెడ్డి): సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ ఉపాధి అవకాశాలు పొందాలని ఎమ్మెల్యే సునీతారెడ్డి తెలిపారు. హత్నూర ఐటీఐ ప్రాంగణంలో నిర్మించిన అ డ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ను ఆమె శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ...గతంలో ఐటీఐలో శిక్షణ పొంది ఎంతో మంది విద్యార్థులు ప్రైవేటు, ప్రభు త్వ పరిశ్రమలలో ఉపాధి అవకాశాలు పొందారన్నారు. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ ఉద్యోగ అవకాశాలతోపాటు స్వయం ఉపాధి పొందాలని సూచించారు. రూ. కోట్లతో నిర్మించిన ఏటీసీ సెంటర్ ద్వారా ఎంతోమంది విద్యార్థులకు అధునాతన యంత్ర పరికరాల ద్వారా శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. కాగా, హత్నూర ఐటీఐ భవనం శిథిలావస్థకు చేరగా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి నిధుల మంజూరుకు కృషి చేయనున్నట్లు సూచించారు. -
పండుగకు చుక్క, ముక్క లేనట్లే.!
దసరా పండుగంటే అందరికి సంబరమే. అయితే ఈ సంవత్సరం అక్టోబర్ 2వ తేదీన వస్తుంది. దీంతో మద్యం, మాంసాహార ప్రియులు ఆలోచనలో పడ్డారు. తెలంగాణలో వివిధ శుభకార్యాలు, పండుగలు, ఫంక్షన్లు ఏదైనా.. మాంసం, మద్యం లేనిదే కిక్కు ఉండదు. ముఖ్యంగా రాష్ట్రంలో ఇది ఓ ఆనవాయితీగా వస్తోంది. ఇక దసరా అంటేనే ఏ పండుగకి లేనంత జోష్ ఉంటుంది. ఇదే రోజు చుక్క, ముక్క ఉండాల్సిందే. మద్యంతో పాటు మటన్, చికెన్ కావాల్సిందే.జోగిపేట(అందోల్): అక్టోబర్ 2న గాంధీ జయంతి, అదే రోజు దసరా పండుగ కూడా వస్తోంది. ఈ నేపథ్యంలో మద్యం, మాంసం విక్రయాలపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. సాధారణంగా గాంధీ జయంతి రోజు మద్యం, మాంసం దుకాణాలు మూసి వేయడం ఆనవాయితీ. అయితే అన్ని పండుగల మాదిరిగా దసరా ఉండదు. ఆ రోజున చాలామందికి చుక్క లేనిదే ముద్ద దిగదు. అందుకోసం పండుగ రోజు ఎట్లా అని మద్యం, మాంసం విక్రయాలపై తర్జన భర్జన పడుతున్నారు.విక్రయాలపై సందిగ్ధం..దసరాకి మాంసాహారులైన ప్రతి ఇంట్లో ముక్క ఉండాల్సిందే. పండుగ వేళ గొర్రె పొట్టేళ్లు, మేక పోతుల మంసానికి డిమాండ్ ఉంటుంది. నాటు, పారం కోళ్లు, చేపలకు కూడా మస్తు గిరాకీ ఉంటుంది.ప్రతి రోజు కోట్లలో.. ఉమ్మడి జిల్లాలో ప్రతిరోజు రూ.10 కోట్ల వరకు, నెలకు సుమారుగా రూ.275 కోట్ల వరకు లిక్కర్ అమ్మకాలు జరుగుతాయి. అయితే ఒక్క దసరా రోజే ప్రతి యేట సుమారు రూ.20 కోట్లకు పైగా అమ్మకాలు జరిగి భారీగా ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతోంది. అయితే ఈ సారి దసరా, గాంధీ జయంతి ఒకే రోజు రావడం, మద్యం దుకాణాలను మూసివేస్తున్నట్లు ఎక్సైజ్ అధికారులు ప్రకటించారు. దీంతో మద్యం అమ్మకాలపై, రాష్ట్ర ఖజానాపై ప్రభావం పడే అవకాశం లేకపోలేదు.మటన్షాపులకు అనుమతివ్వండి ప్రతి సంవత్సరం దసరా రోజు మటన్, చికెన్ షాపుల్లో గిరాకీ ’ఉంటుంది. పండుగ రోజు విక్రయాలు జరగకపోతే ఆర్థికంగా నష్టపోతాం. అధికారులు స్పందించి అనుమతులివ్వాలి. పండుగ రోజు వందలాది మంది మార్కెట్కు మాంసం కోసం వస్తుంటారు. – శేఖర్, మాంసం వ్యాపారిమద్యం విక్రయాలు జరగవు దసరా, గాంధీ జయంతి ఒకేసారి రావడంతో వైన్స్, బార్ షాపులు ప్రభుత్వ ఆదేశాల మేరకు బంద్ ఉంటాయి. బెల్ట్ షాపుల నిర్వాహకులు విక్రయాలు జరిపితే చర్యలు తీసుకుంటాం. ఎక్సైజ్ సీఐలు, ఎస్ఐలు, సిబ్బంది అప్రమత్తంగా ఉండి మద్యం అమ్మకాలు జరగకుండా చూడాలి. – హరికిషన్, ప్రొహిబిషన్, ఎక్సైజ్శాఖ డిప్యూటీ కమిషనర్ -
నియోజకవర్గ అభివృద్ధికి కృషి
చిన్నశంకరంపేట(మెదక్): దుర్గామాత ఆశీస్సులతో స్థానిక నియోజవర్గ అభివృద్ధికి కృషిచేస్తానని కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. శుక్రవారం మండలంలోని కొర్విపల్లిలో వెలసిన దుర్గామాత ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన వెంట డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సత్యనారాయణ, రాజిరెడ్డి, యాదవరావు, శ్రీనివాస్రెడ్డి ఉన్నారు. మెరుగైన సేవలు అందించాలి పాపన్నపేట(మెదక్): పెట్రోల్ బంకు యజమానులు వినియోగదారులకు మెరుగైన సేవలు అందించాలని జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంత్రావు అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని పాపన్నపేటలో హెచ్పీ పెట్రోల్ బంక్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బంకు యజమానులు రాజశేఖర్, మహేందర్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గోవింద్ నాయక్, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి, శ్రీకాంతప్ప, ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు.మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు -
మున్సిపల్ వర్కర్లకు వైద్య పరీక్షలు
మెదక్ మున్సిపాలిటీ: స్వచ్ఛత హీ సేవ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ పరిధిలో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులు, సిబ్బందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం అవసరమైన వారికి మందులు అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మహేష్, టౌన్ ప్లానింగ్ అధికారి భూపతి, టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ ప్రభాకర్, ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ వెంకటేష్, ప్రభుత్వ వైద్యులు వంశీ చారి, ప్రభుత్వ ఆస్పత్రి వైద్య సిబ్బంది పాల్గొన్నారు. -
కుండపోత వర్షం
కౌడిపల్లి(నర్సాపూర్): మండలంలో 65.6మిల్లీ మీటర్ల కుండపోత వర్షం నమోదైంది. దీం కౌడిపల్లి, రాయిలాపూర్, మహమ్మద్నగర్, రాజిపేట, సదాశివపల్లి తదితర గ్రామాలలోని పెద్ద చెరువులు, కుంటలు అలుగు పారుతున్నాయి. నిలిచిన రాకపోకలు టేక్మాల్(మెదక్): మండలంలో గురువారం రాత్రి కురిసిన భారీ వర్షానికి గుండువాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో టేక్మాల్–జోగిపేట, ఎలకుర్తి–కోరంపల్లి ప్రధాన రహదారుల్లో రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షం పెద్దశంకరంపేట(మెదక్): మండలంలో కురిసిన భారీ వర్షానికి చెరువులు, కుంటలలో నీరు సమృద్ధిగా చేరి అలుగులు ప్రవహిస్తున్నాయి. అయితే ఈ వర్షాలకు పంటలు దెబ్బతింటున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతరాయం.. హవేళిఘణాపూర్(మెదక్): మండల పరిధిలోని ఆయా గ్రామాల్లో కురిసిన వర్షాలతో చెరువు, కుంటలు పొంగిపొర్లుతున్నాయి. గంగమ్మవాగు ఉధృతి పెరగడంతో దూప్సింగ్ తండాకు రాకపోకలు నిలిచిపోయాయి. అలాగే మెదక్ మండలంలోని కోంటూర్ చెరువు పొంగిపొర్లుతుండడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. నర్సాపూర్: మండలంలో 74 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ వర్షాలకు రాయరావు చెరువు మళ్లీ అలుగు పారింది. దీంతో పాటు ఆయా గ్రామాల చెరువులు సైతం అలుగులు పారుతున్నాయి. ● అలుగు పారుతున్న చెరువులు, కుంటలు ● పలు ప్రాంతాల్లో రాకపోకలకు అంతరాయం -
‘స్థానిక’ విధుల్లో అవకాశం కల్పించాలి
మెదక్ కలెక్టరేట్: స్థానిక సంస్థల ఎన్నికల విధుల్లో సీనియర్ టీచర్లకు అవకాశం ఇవ్వాలని పీఆర్టీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు తాళ్ల శ్రీనివాస్, సామ్యనాయక్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు పీఆర్టీయూ ఆధ్వర్యంలో శుక్రవారం అదనపు కలెక్టర్ నగేష్ను కలిసి వినతి పత్రం అందజేశారు. అనంతరం పీఆర్టీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మాట్లాడుతూ ఎన్నికల శిక్షణకు హాజరుకాని టీచర్లకు దసరా సెలవుల అనంతరం మరోసారి శిక్షణ ఇవ్వాలన్నారు. అలాగే స్థానిక సంస్థల ఎన్నికల విధుల్లో సీనియర్ టీచర్లకు అవకాశం కల్పించాలన్నారు. దివ్యాంగులకు, మెడికల్ గ్రౌండ్లో ఉన్న టీచర్లకు ఎలక్షన్ విధుల నుంచి మినహాయించాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ అధ్యక్షులు సుంకరి కృష్ణ, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు వెంకటరామ్ రెడ్డి, మల్లారెడ్డి, మహేష్, సతీష్ రావు, పంతులు రాజు, అమీరుద్దీన్, సహదేవ్, జనార్దన్ తదితరులు పాల్గొన్నారు. -
గొప్ప మనసు చాటుకున్న మాజీ ఎమ్మెల్యే
కౌడిపల్లి(నర్సాపూర్): పట్టణంలోని డిగ్రీ కళాశాలకు రెండేళ్లపాటు కిరాయి లేకుండా సొంతభవనం ఇస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే మదన్రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం మంజూరు చేసిన డిగ్రీ కళాశాల నర్సాపూర్లో కొనసాగుతుందన్నారు. అయితే కౌడిపల్లిలోని తన సొంతభవనం రెండేళ్లపాటు కిరాయి లేకుండా డిగ్రీ కళాశాలకు ఇస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఈ ప్రాంత విద్యార్థులు నర్సాపూర్ వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. రెండు నెలల క్రితం ఉన్నత విద్యాశాఖకు లేఖ రాయగా ప్రస్తుతం అనుమతి మంజూరైనట్లు చెప్పారు. ప్రస్తుతం నర్సాపూర్లో కొనసాగుతున్న డిగ్రీ కళాశాల దసరా ముగిసిన అనంతరం ఇక్కడే ప్రారంభించనున్నట్లు వివరించారు. త్వరలోనే సీఎం రేవంత్రెడ్డి సహకారంతో సొంతభవనం నిర్మించేందుకు కృషి చేస్తామన్నారు. దీంతోపాటు నూతనంగా నిర్మిస్తున్న సీహెచ్సీని త్వరలోనే ప్రారంభించనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ వెంకటేశ్వర్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్లు గోవర్ధన్రెడ్డి, రాజుయాదవ్, వైస్చైర్మన్ చిన్నంరెడ్డి, నాయకులు కృష్ణాగౌడ్, దుర్గాగౌడ్, శాఖయ్య, శెట్టయ్య, మోతిలాల్గౌడ్, పుండరీకంగౌడ్ తదితరులు పాల్గొన్నారు. రెండేళ్లపాటు కిరాయి లేకుండా కళాశాలకు సొంతభవనం మాజీ ఎమ్మెల్యే మదన్రెడ్డి -
కనీస వేతనం రూ.26 వేలు అందించాలి
చిన్నశంకరంపేట(మెదక్): అసంఘటిత కార్మికులకు కనీస వేతనం అందించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి మల్లేశం డిమాండ్ చేశారు. శుక్రవారం మండల కేంద్రంలో అసంఘటిత కార్మికుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కిందిస్థాయి ఉద్యోగులతో వెట్టిచాకిరి చేయించుకునే శ్రద్ధ వేతనాలు అందించడంలో పెట్టడం లేదన్నారు. గ్రామాల్లో అంగన్వాడీ, ఆశావర్కర్లు, ఐకేపీ వీఓలు, ఉపాధిహామీ ఫీల్డ్ అసిస్టెంట్లు, ఏఎన్ఎంలు కీలక సేవలు అందిస్తున్నా ప్రభుత్వం వేతనాలు అందించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు. అసంఘటిత కార్మికులను రెగ్యూలర్ చేయడంతో పాటు కనీస వేతనం రూ.26 వేలు అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జీపీ వర్కర్స్ యూనియన్ నాయకులు రాములు, సత్యనారాయణ, రాజు, యాదమ్మ, ఆశ యూనియన్ నాయకులు రేణుక, విద్యుత్ కార్మిక సంఘం నాయకులు నర్సింహులు, ఈజీఎస్ ఎఫ్ఏల సంఘం నాయకులు నర్సింహులు ఉన్నారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి మల్లేశం -
ఆర్టీసీ ప్రయాణికులకు బహుమతులు
నర్సాపూర్: ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికులకు డ్రా పద్ధతిలో తమ సంస్థ బహుమతులు అందించనున్నట్లు డిపో మేనేజర్ సురేఖ చెప్పారు. ఈనెల 27నుంచి అక్టోబర్ 6వ తేదీ వరకు మెదక్ నుంచి సికింద్రాబాద్ మార్గంలో ఆర్టీసీకి చెందిన డీలక్స్ బస్సుల్లో ప్రయాణించే వారికి అవకాశం ఉంటుందన్నారు. డీలక్స్ బస్సుల్లో ప్రయాణం ముగిసిన అనంతరం వారి టికెట్ వెనకాల అడ్రస్ రాసి జేబీఎస్, మెదక్, నర్సాపూర్ బస్టాండ్లలో ఏర్పాటు చేసిన గిఫ్ట్ బాక్సుల్లో టికెట్లు వేయాలని ఆమె సూచించారు. ఆ తర్వాత ఇందులోని టికెట్లను డ్రా తీసి మొదటి బహుమతిగా రూ.25వేలు, రెండవ బహుమతిగా రూ.15వేలు, మూడవ బహుమతిగా రూ.10 వేలు అందజేయనున్నట్లు ఆమె చెప్పారు. పౌష్టికాహారంతోనే ఆరోగ్యం ఐసీడీఎస్ సూపర్వైజర్ శ్రీశైల టేక్మాల్(మెదక్): గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యమని ఐసీడీఎస్ సూపర్వైజర్ శ్రీశైల తెలిపారు. శుక్రవారం మండలంలోని ఎల్లుపేట అంగన్వాడీలో పోషకాహార మాసోత్సవంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ సరిత, పంచాయతీ కార్యదర్శి మహేష్ కుమార్, ఏఎన్ఎం కృష్ణవేణి, ఆశావర్కర్ రాణి తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థులు సెల్ఫోన్కు దూరంగా ఉండాలి
నర్సాపూర్ రూరల్: విద్యార్థులు సెల్ఫోన్కు దూరంగా ఉండాలని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ శేషాచారి సూచించారు. శుక్రవారం పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పేరెంట్స్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, తల్లిదండ్రులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. విద్యార్థులు చెడు స్నేహం చేయకుండా లక్ష్యంతో చదువుకోవాలన్నారు. డ్రగ్స్, మత్తు పానీయాలకు దూరంగా ఉండి ఎలాంటి వ్యసనాలకు లోను కాకుండా చదువుపై దృష్టి సారించాలని సూచించారు. తల్లిదండ్రులు తమ పిల్లలపై శ్రద్ధ తీసుకోవాలని తెలిపారు. అనంతరం విద్యార్థినులు బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు, అధ్యాపకులు జోత్స్న దేవి, నాగరాజు, రామ్ రెడ్డి, హరీష్, భాగ్యలక్ష్మి, అనిల్, కళింగ రెడ్డి, రమాదేవి, అతిక్ ఫాతిమా, అభినవ్, రాజేశ్వర్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ శేషాచారి -
మెరుగైన వైద్యం అందించండి
కలెక్టర్ రాహుల్రాజ్టేక్మాల్(మెదక్): ‘స్వస్త్ నారి సశక్తి పరివార్ అభియాన్’ కార్యక్రమంలో భాగంగా వైద్య శిబిరాలు నిర్వహించి ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలని కలెక్టర్ రాహుల్రాజ్ సిబ్బందిని ఆదేశించారు. గురువారం మండలంలోని పీహెచ్సీ, మో డల్ స్కూల్, హాస్టల్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పీహెచ్సీ ద్వారా అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. ప్రత్యేక ఆరోగ్య శిబిరంలో పిల్లల వైద్య నిపుణులు, ఇతర స్పెషలిస్టులు అందు బాటులో ఉన్నారా..? అని అడిగి తెలుసుకున్నారు. వైద్య శిబిరాల గురించి ముందుగానే అన్ని గ్రామాల్లో విస్తృత ప్రచారం చేయాలని ఆదేశించారు. మెరుగైన ఆరోగ్య సేవలు అవసరం ఉన్న వారిని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి రెఫర్ చేయాలన్నారు. అనంతరం మోడల్ స్కూల్, కేజీబీవీలను పరిశీలించి పాఠశాల అభివృద్ధి పనులకు సంబంధించి మౌలిక వసతులపై ఆరా తీశారు. మెరుగైన వసతులు కల్పించి విద్యార్థులకు గుణాత్మక విద్య అందించే దిశగా ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ తులసీరాం, వైద్యురాలు హర్షిత, మో డల్ స్కూల్ ప్రిన్సిపాల్ సాయిలు, ఆర్ఐ సాయిశ్రీకాంత్ తదితరులు ఉన్నారు. -
సైబర్ మోసాలపై జాగ్రత్త
మెదక్ డీఎస్పీ ప్రసన్నకుమార్పాపన్నపేట(మెదక్): అత్యాశ అనేక అనర్థాలకు దారి తీస్తుందని మెదక్ డీఎస్పీ ప్రసన్నకుమార్ అన్నారు. గురువారం మండల పరిధిలోని నార్సింగిలో మెదక్, అల్లాదుర్గం సర్కిల్ పరిధిలోని పోలీసులు శాంతి భద్రతల పరిరక్షణ కోసం కమ్యూనిటీ కనెక్టివిటీ కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా గ్రామంలో సాయుధ పోలీసులు కవాతు నిర్వహించి తనిఖీలు చేపట్టారు. అనుమానిత వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం డీఎస్పీ మాట్లాడుతూ.. సెల్ఫోన్లో వచ్చే అనుమానిత మెసేజ్లకు స్పందించవద్దని సూచించారు. ఇతరులతో వ్యక్తిగతమైన సమాచారాన్ని పంచుకోవద్దన్నారు. సైబర్ నేరాలు జరిగితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. ఆన్లైన్ బెట్టింగ్ల జోలికిపోవద్దని సూచించారు. యువతీ, యువకు లు మత్తు పదార్థాలకు అలవాటుపడొద్దని హితవు పలికారు. కార్యక్రమంలో ఎస్సైలు, స్నెషల్ పార్టీ పోలీసులు, సిబ్బంది పాల్గొన్నారు. -
పురాభివృద్ధికి నిధులు
● నర్సాపూర్ మున్సిపాలిటీకి రూ. 15 కోట్లు మంజూరు ● తీరనున్న ప్రధాన సమస్యలు నర్సాపూర్: నర్సాపూర్ మున్సిపాలిటీకి నగరాభివృద్ధి పథకం కింద ప్రభుత్వం రూ. 15 కోట్లు మంజూరు చేసింది. పలు ప్రత్యేక పనులతో పాటు సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మా ణాలకు ప్రాధాన్యం ఇచ్చింది. దీంతో పట్టణంలోని అన్ని వార్డుల్లో అభివృద్ధి పనులు చేపట్టేందుకు అవకాశం ఏర్పడింది. త్వరలో టెండర్లు వేసి నిబంధనల మేరకు పనులు చేపట్టే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. చెరువుల సుందరీకరణ నిధుల కేటాయింపులో భాగంగా పట్టణానికి చెందిన రాయరావు చెరువు, కోమటికుంట సుందరీకరణ పనులకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చింది. రాయరావు చెరువుకు రూ. 1.20 కోట్లు, కోమటి కుంటకు రూ. 1.20 కోట్లు కేటాయించింది. కాగా నర్సాపూర్– మెదక్ జాతీయ రహదారి నుంచి డంపింగ్ యార్డు వరకు సీసీ రోడ్డు నిర్మించేందుకు రూ. కోటి 80 లక్షలు కేటాయించింది. ఈ మార్గంలో సీసీ రోడ్డు నిర్మిస్తే చాలా మంది రైతులకు మేలు జరుగనుంది. కాగా మున్సిపాలిటీ కార్యాలయ ఆవరణలో వ్యాపార షాపింగ్ కాంప్లెక్స్ నిర్మా ణానికి రూ. కోటి 20 లక్షలు మంజూరు కాగా, మున్సిపాలిటీకి శాశ్వత ఆదా యం వచ్చే అవకాశం ఉంటుంది. పట్టణంలోని ఎన్జీఓస్ కాలనీలోని కొంత ఏరియా నుంచి మురికి నీరు చెరువులోకి వెళ్లడంతో కలుషి తం అవుతుతోంది. దీంతో మురికి నీటి శుద్ధి కేంద్రం నిర్మాణానికి రూ. 70 లక్షలు కేటాయించింది. అలాగే మున్సిపాలిటీ పరిధిలోని పిల్లల పార్కు వసతుల లేమితో నిరుపయోగంగా ఉన్నందున పార్కు అభివృద్ధికి తాజాగా ప్రభుత్వం రూ. 30 లక్షలు కేటాయించింది. సీసీ రోడ్లు, మురికి కాలువల నిర్మాణం మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డుల్లో సీసీ రోడ్లు, మురికి కాలువల నిర్మాణం చేపట్టేందుకు ప్రభుత్వం రూ. 10.40 కోట్లు కేటాయించింది. ఆయా వార్డులలో చేపట్టాల్సిన పనుల ప్రాధాన్యత మేరకు ఒక్కో వార్డుకు రూ. 30 నుంచి రూ. 60 లక్షల వరకు నిధులు కేటాయించారు. సీసీ రోడ్లు, మురికి కాలువలు నిర్మాణం పూర్తయితే చాలా వార్డులలో ప్రజల ఇబ్బందులు కొంత మేర తీరనున్నాయి. నిబంధనల మేరకు పనులు ప్రభుత్వం మున్సిపాలిటీ నగరాభివృద్ధి కింద మంజూరు చేసిన రూ. 15 కోట్లతో నిబంధనల మేరకు అభివృద్ధి పనులు చేపడతాం. నిధులలో అన్ని వార్డులతో పాటు ప్రత్యేకంగా పలు పనులకు నిధులు కేటాయించారు. వీటితో పట్టణంలో చాలా సమస్యలు పరిష్కారం కానున్నాయి. – శ్రీరాంచరణ్రెడ్డి, మున్సిపల్ కమిషనర్ -
డ్యాం వద్దకు ఎవరినీ రానీయొద్దు
హవేళిఘణాపూర్(మెదక్): మండల కేంద్రంలోని పోలీస్స్టేషన్ను ఎస్పీ శ్రీనివాసరావు గురువారం సందర్శించారు. రికార్డులు పరిశీలించి పెండింగ్ కేసులపై ఎస్ఐ నరేశ్ను అడిగి తెలుసుకున్నారు. అ నంతరం మండల పరిధిలోని పోచారం డ్యాం వద్ద వరద ఉధృతిని పరిశీలించి, అక్కడి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ప్రజలు ఎవరూ డ్యాం వద్దకు రాకుండా చూడాలన్నారు. మరోవైపు వాతావరణ శాఖ జిల్లాకు ఎల్లో అలర్ట్ ప్రకటించిన నేపథ్యంలో పోచారం ప్రాజెక్టు వద్ద నీటి ఉధృతిని పరిశీలించా రు. డ్యాం వద్ద ఏర్పాటు చేసిన పోలీసు పికెటింగ్లో ఉన్న సిబ్బందికి అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సూచించారు. -
పోటెత్తిన మంజీరా
పాపన్నపేట(మెదక్): సింగూరు నుంచి గురువారం భారీ స్థాయిలో నీరు విడుదల చేయడంతో మంజీరా పరవళ్లు తొక్కుతోంది. ఎగువ నుంచి నీరు ఎక్కువగా వస్తుండటంతో సింగూరు ప్రాజెక్టు తొమ్మిది గేట్లు ఎత్తి 77,821 క్యూసెక్కులు దిగువకు వదిలారు. దీంతో మంజీరా నుంచి వస్తున్న భారీ వరద ఘనపురం మీదుగా ప్రవహిస్తూ ఏడుపాయల దుర్గమ్మ ఆలయాన్ని చుట్టుముట్టి నిజాంసాగర్ వైపు పయనిస్తుంది. ఎల్లాపూర్ బ్రిడ్జి వద్ద భారీగా నీరు ప్రవహిస్తుంది. మంజీరా నది వైపు ఎవరు వెళ్లొద్దని పాపన్నపేట ఎస్సై శ్రీనివాస్గౌడ్ సూచించారు. అత్యవసర పరిస్థితిలో 8712657920 ఫోన్ నంబర్కు సమాచారం ఇవ్వాలని కోరారు. -
మద్యం టెండర్లకు వేళాయె..
నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ2025– 27 కొత్త మద్యం పాలసీని అమలు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. మద్యం దుకాణాల కేటాయింపు.. షెడ్యూల్ను గురువారం విడుదల చేసింది. నేటి నుంచి మద్యం షాపులకు సంబంధించి దరఖాస్తులను స్వీకరించనుంది. 2023– 25 మద్యం పాలసీ ఈ ఏడాది నవంబర్ 30తో ముగియనుంది. – మెదక్ అర్బన్ జిల్లావ్యాప్తంగా ఉన్న 49 వైన్ షాపులకు శుక్రవారం నుంచి అక్టోబర్ 18 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. అక్టోబర్ 23న లక్కీ డ్రా తీయనున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా కౌంటర్లను ఏర్పా టు చేయనున్నారు. ఇందులో షాపు దక్కించుకున్న వ్యాపారులు అదే రోజు, మరునాడు లైసెన్స్ ఫీజుకు సంబంధించి మొదటి వాయిదా డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. డిసెంబర్ 1 నుంచి కొత్త వైన్స్ షాపులు ప్రారంభం కానున్నాయి. ఈసారి దర ఖాస్తు ధరను రూ. 2 లక్షల నుంచి రూ. 3 లక్షలకు పెంచారు. ఐదు వేల నుంచి 50 వేల జనాభా ఉన్న షాపులకు రూ. 55 లక్షలు, 50 వేల నుంచి లక్ష వరకు రూ. 60 లక్షలు, లక్ష నుంచి ఐదు లక్షల జనాభా వరకు రూ. 65 లక్షల ఫీజును వసూలు చేయనున్నారు. కాగా ఈసారి ఏడుపాయల కమాన్ (చిత్రియాల్) వద్ద ఉన్న వైన్ షాపును కొల్చారం మండలం పోతంషెట్పల్లి– అప్పాజిపల్లి శివారులోకి మార్చారు. కాగా మద్యం సిండికేట్ సభ్యులు వైన్స్ టెండర్లలో ఎక్కువగా పాల్గొనే అవకాశం ఉంది. దరఖాస్తు ఫీజు ఎక్కువగా ఉండటంతో కొంతమంది సిండికేట్గా ఏర్పడి టెండర్లు వేస్తూ వ్యాపారం చేస్తుంటారు. ఒక్కో వ్యాపారి 20 నుంచి 60 దరఖాస్తులు సమర్పిస్తారు. మరింత ఆదాయం సమకూరే అవకాశం జిల్లాల్లో ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికల సందడి మొదలు కావడంతో వైన్స్ షాపుల టెండర్లకు భా రీగా దరఖాస్తులు వచ్చే అవకాఽశం ఉందని భావిస్తున్నారు. 2021లో జిల్లాలో 832 దరఖాస్తులు రాగా, 2023లో 1,905 దరఖాస్తులు వచ్చాయి. జిల్లాలో అత్యధికంగా పోతంషెట్పల్లి వైన్ షాపుకు 111 దరఖాస్తులు వచ్చాయి. కాగా ఆ దుకాణం, వైన్షాపులో పని చేస్తున్న వర్కర్కు దక్కడం విశేషం. గతేడాది కేవలం అప్లికేషన్ రుసుం ద్వారా రూ. 38.10 కోట్ల ఆదాయం వచ్చింది. ఈసారి దరఖాస్తు ఽఫీజు రూ. 3 లక్షలకు పెంచడంతో మరింత ఆదాయం సమకూరే అవకాశం ఉంది. గతేడాది ద రఖాస్తు గడువు 12 రోజులు ఇవ్వగా, ఈసారి రెట్టింపు వ్యవధిగా 24 రోజులు ఇచ్చారు. జిల్లాలో మొత్తం 49 వైన్ షాపులు ఉన్నాయి. ఇందులో 16 వివిధ కేటగిరి వ్యక్తుల కు రిజర్వు చేయగా, 33 ఓపెన్లో మిగిలాయి. గురువారం సాయంత్రం రిజర్వేషన్లు ఖరారు చేసినట్లు జిల్లా ఎకై ్సజ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్రెడ్డి తెలిపారు. జిల్లాలో ఎస్టీ కేటగిరికి 1, ఎస్సీ వర్గానికి 6, బీసీలకు 9 షాపులు కేటాయించామని, మిగితా 33 షాపులు ఓపెన్ కేటగిరిలో ఉంటాయని చెప్పారు. రిజర్వేషన్ కేటగిరిలో అలాట్ అయిన వైన్ షాపుల వివరాలు, గెజిట్లో ప్రచురిస్తామని వివరించారు. వచ్చే నెల 18 వరకు గడువు 23న లక్కీ డ్రా జిల్లావ్యాప్తంగా 49 వైన్ షాపులు -
సర్కారు వైద్యం.. దైవాదీనం!
● నిండుకున్న మందుల నిల్వలు ● మూడేళ్లుగా బిల్లుల పెండింగ్ ● వేధిస్తున్న సిబ్బంది కొరత ● పేదలకు అరకొరగా వైద్యసేవలు ఈ చిత్రంలో కనిపిస్తున్న మహిళ పేరు లక్ష్మి. చిన్నశంకరంపేట మండలం జంగారాయి. ఈనెల 20న గేదె పొడవటంతో తలకు తీవ్ర గాయం అయింది. అదే రోజు సాయంత్రం జిల్లా కేంద్ర ఆస్పత్రికి వెళ్లగా, పరీక్షించిన వైద్యులు సిటీస్కాన్ తీయాలని, టెక్నీషియన్ అందుబాటులో లేడని చెప్పి అడ్మిట్ చేసుకున్నారు. అలాగే ఆస్పత్రిలో మందులు లేవని, బయటి నుంచి తెచ్చుకోవాలని చీటీరాసి ఇచ్చారు. దీంతో చేసేది లేక ఆమె కుటుంబీకులు బయట కొనుగోలు చేసి తీసుకొచ్చారు. సిటీస్కాన్ కోసం రెండు రోజులు ఎదురుచూసిన బాధితురాలు చేసేది లేక ఆస్పత్రి నుంచి వెళ్లిపోయింది. మెదక్జోన్: జిల్లా కేంద్రంలో గత నాలుగు దశాబ్దాల క్రితం ఏరియా ఆస్పత్రిని నిర్మించారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత దానిని జిల్లా ఆస్పత్రిగా మార్చారు. కాగా మెడికల్ కళాశాల మంజూరు కావటంతో ఇక్కడ అన్ని రకాల వైద్యం అందుబాటులోకి వస్తుందని ఆశపడిన ప్రజలకు నిరాశే మిగులుతోంది. ఆరోగ్యశ్రీలో భాగంగా రావాల్సిన నిధులు సుమారు రూ. 1.50 కోట్లు నిలి చిపోయాయి. ఇవి సకాలంలో వస్తే ఆస్పత్రి నిర్వహణ, మందుల కొనుగోలుతో పాటు వైద్యు లు, సిబ్బందికి రావాల్సిన వాటా సైతం ఇవ్వాల్సి ఉంటుంది. కానీ మూడేళ్లుగా ఆరోగ్యశ్రీ నిధులు నిలిచిపోవటంతో ప్రస్తుతం ఆస్పత్రిలో మందుల కొరత వేధిస్తోంది. అంతేకాకుండా రూ. 14 లక్షల విలువ చేసే అత్యవసర మందులు ప్రైవేట్ వ్యక్తుల వద్ద అరువుగా తెచ్చినట్లు సంబంధిత వైద్యాధికారులు చెబుతున్నారు. సిటీస్కాన్ ఉన్నా టెక్నీషియన్ లేడు! జిల్లా కేంద్ర ఆస్పత్రిలో 15 రోజుల క్రితం సిటీస్కాన్ ఏర్పాటు చేశారు. ఇది ప్రధానంగా తలకు గాయం అయినప్పుడు తీవ్రతను గుర్తించేందుకు ఉపయోగిస్తారు. దీనిని ప్రైవేట్లో తీయాలంటే ఒక్కో పేషెంట్కు రూ. 2,500 వరకు అవుతుంది. ఆస్పత్రిలో ఏర్పాటు చేయటంతో సంతోషించా రు. కానీ టెక్నీషియన్ ఒక్కరే ఉండటంతో అతను విధుల్లో ఉన్నప్పుడు మాత్రమే దానిని ఉపయోగిస్తున్నారు. సాయంత్రం 5 గంటలు అయిందంటే గదికి తాళం వేస్తున్నారు. దీంతో ప్రజలకు వైద్యం అందని ద్రాక్షలా మారింది. నిధుల కొరత ఉంది ఆస్పత్రికి రావాల్సిన ఆరోగ్యశ్రీ నిధులు గత మూడేళ్లుగా నిలిచిపోయాయి. దీంతో అత్యవసర మందులను బయట అరువుకు తేవాల్సి వస్తోంది. సిటీస్కాన్ టెక్నీషియన్లు నలుగురు ఉండాల్సి ఉండగా, ఒక్కరే ఉన్నారు. త్వరలో మరో ముగ్గురిని నియమిస్తాం. కొన్ని పరికరాలు లేనందున వైద్యానికి కొంత ఆటంకం కలుగుతోంది. – సునీత, జిల్లా కేంద్ర ఆస్పత్రి సూపరింటెండెంట్ -
రెవెన్యూ సమస్యలు పరిష్కరించండి
ఆర్డీఓ జయచంద్రారెడ్డి మనోహరాబాద్(తూప్రాన్): రెవెన్యూ సమస్యలను త్వరగా పరిష్కరించాలని తూప్రాన్ ఆర్డీఓ జయచంద్రారెడ్డి అధికారులకు సూచించారు. బుధవారం తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ అధికారులు, నూతనంగా బాధ్యతలు చేపట్టిన జీపీఓలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా వారికి పలు అంశాలపై సూచనలు చేశారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ దరఖాస్తులను వెంట వెంటనే పరిశీలించాలన్నారు. అలాగే సాదాబైనామా, నిషేధిత భూములు, భూభారతి రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులను పరిష్కరించాలన్నారు. సాదాబైనామా, అసైన్డ్ భూముల కోసం రెండు కమిటీలు వేశామని తెలిపారు. సమావేశంలో తహసీల్దార్ ఆంజనేయులు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. -
స్థానిక ఎన్నికలకు కాంగ్రెస్ వెనుకడుగు
మెదక్ ఎంపీ రఘునందన్రావురామాయంపేట(మెదక్): స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ విషయమై కాంగ్రెస్ ప్రభుత్వం వెనుకడుగు వేస్తుందని ఎంపీ రఘునందన్రావు విమర్శించారు. బుధవారం రామాయంపేట పట్టణంలో జీఎస్టీ తగ్గింపు విషయమై వ్యాపారులు, ప్రజలకు అవగాహన కల్పించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వానికి ఎన్నికలు జరిపే ఆలోచన లేదని, ప్రజలు కాంగ్రెస్కు ఓటు వేసే అవకాశం లేదన్నారు. ఒకవేళ ఎన్నికల నిర్వహణకు సిద్ధమైతే ముందుగా పంచాయతీ వర్కర్లకు వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. కేంద్రం పేద, మధ్య తరగతి ప్రజలను దృష్టిలో ఉంచుకొని జీఎస్టీ తగ్గించిందన్నారు. దీంతో అన్నివర్గాల ప్రజలకు లాభం చేకూరుతుందని వివరించారు. నిధుల కొరతతో పంచాయతీలు నీరసించి పోయాయని ఆరోపించారు. అంతకుముందు ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా పట్టణంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు వాల్దాస్ మల్లేశ్గౌడ్, మాజీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, మండల శాఖ అధ్యక్షుడు నవీన్గౌడ్, పట్టణ శాఖ అధ్యక్షుడు అవినాష్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. డిగ్రీ కళాశాల లేకపోవడం దారుణం తూప్రాన్: కేసీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న తూప్రాన్లో ఒక్క డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయకపోవడం దారుణమని ఎంపీ రఘునందన్రావు విమర్శించారు. సేవా పక్వాడ్లో భాగంగా తూప్రాన్ ఏరియా ఆస్పత్రిని సందర్శించి మొక్కలు నాటారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనకు, కాంగ్రెస్కు మధ్య కొన్ని యూట్యూబ్ ఛానల్స్ సంబంధాలు అంటగడుతూ అసత్య ప్రచారాలు చేస్తున్నాయని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చి 20 నెలలు అయినా విద్యార్థుల చదువులపై కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టింపులేదని ఆరోపించారు. ఉమ్మడి -
విద్యతో పాటూ సేవాభావం ఉండాలి
కొల్చారం(నర్సాపూర్): ప్రతి విద్యార్థి సామాజిక సేవాగుణం, నాయకత్వ లక్షణాలు కలిగి ఉండాలని అదనపు ఎస్పీ మహేందర్ సూచించారు. మండలంలోని పోతంశెట్టిపల్లిలో గత ఆరు రోజులుగా మెదక్ డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ వలంటీర్లు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. యోగాతో పాటు గ్రామంలోని ప్రధాని కూడళ్ల వద్ద ఉన్న మురికి కాలువలను శుభ్రం చేస్తున్నారు. గ్రామంలో ఉద్యోగ, విద్య సర్వే నిర్వహించారు. బుధవారం ఉన్నత పాఠశాలలో ముగింపు సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా అదనపు ఎస్పీ మాట్లాడుతూ.. సమష్టిగా ముందుకు సాగుతూ సేవా కార్యక్రమాల నిర్వహించడం హర్షించదగిన విషయమన్నారు. ఎన్ఎస్ఎస్ కార్యక్రమాలను మరింత విస్తృత పరచాలని సూచించారు. కార్యక్రమంలో హెచ్ఎం ఉమారాణి, అధ్యాపకుడు ప్రవీణ్ కు మార్, ప్రోగ్రాం అధికారి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.అదనపు ఎస్పీ మహేందర్ -
మార్కెట్లకు దసరా జోష్
జిల్లా కేంద్రంలోని మార్కెట్లలో బుధవారం దసరా సందడి నెలకొంది. బతుకమ్మ, దసరా పండుగలను పురస్కరించుకొని నూతన దుస్తులు, ఇతర సామగ్రి కొనుగోళ్లకు ప్రజలు తరలివస్తున్నారు. వారం రోజులుగా పట్టణంలోని రాందాస్ చౌరస్తా, జేఎన్ రోడ్డు వరకు ప్రధాన రహదారులన్నీ కిటకిటలాడుతున్నాయి. కూరగాయల మార్కెట్, పెద్ద బజార్ ప్రాంతాల్లో ట్రాఫిక్ నియంత్రణ లేకపోవడంతో ఇష్టారీతిగా వాహనాలు వస్తున్నాయి. దీంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ సమస్య ఏర్పడుతోంది. – మెదక్మున్సిపాలిటీ -
కేసుల ఛేదనపై దృష్టి సారించండి
ఎస్పీ డీవీ శ్రీనివాసరావుమెదక్ మున్సిపాలిటీ: పోక్సో కేసులను అత్యంత ప్రాధాన్యంతో విచారించి నిందితులకు కఠిన శిక్షలు పడేవిధంగా కృషి చేయాలని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు పోలీస్, ఇతరశాఖల అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో పా ల్గొని మాట్లాడారు. చిన్న వయసులో వేధింపులు, ప్రేమ వ్యవహారాలు వంటి చర్యలు భవిష్యత్తును శాశ్వతంగా దెబ్బతీస్తాయని హెచ్చరించారు. అవగాహన ద్వారానే నివారణ సాధ్యమన్నారు. భరోసా సెంటర్ 24 గంటల పాటు ఎలాంటి ఆటంకం లేకుండా పని చేయడానికి నిరంతర పర్యవేక్షణ ఉంటుందని స్పష్టం చేశారు. సమావేశంలో జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యదర్శి శుభావళి, అదనపు ఎస్పీ మహేందర్, హై దరాబాద్ ఉమెన్ సేఫ్టీ వింగ్ ఏసీపీ శ్రీధర్, భరోసా బృందం, జిల్లా సంక్షేమ, విద్య, వైద్య శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
ధాన్యం సేకరణకు పక్కా ప్రణాళిక
మెదక్ కలెక్టరేట్: ఈ ఏడాది ఖరీఫ్ ధాన్యం సేకరణకు ప్రణాళిక సిద్ధం చేయాలని కలెక్టర్ రాహుల్రాజ్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో అన్నిశాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అక్టోబర్ మొదటి వారం నుంచి ధాన్యాన్ని సేకరించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని కొనుగోలులో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా పటిష్ట ప్రణాళిక అమలు చేయాలని సూచించారు. ఏ గ్రేడ్ రకం క్వింటాల్కు రూ. 2,389, సాధారణ రకానికి రూ.2,369 చొప్పున కనీస మద్దతు ధరగా నిర్ణయించినట్లు చెప్పారు. వ్యవసాయశాఖ అంచనా ప్రకారం ఖరీఫ్లో 4.23 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి కానుందని చెప్పారు. ధాన్యం తరలించే వాహనాలన్నింటికీ జీపీఎస్ తప్పనిసరిగా ఉండాలన్నారు. లారీల కొరత లేకుండా చర్యలు చేపట్టాలన్నారు. త్వరితగతిన సీఎంఆర్ బియ్యం రికవరీ చేయాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ నగేశ్, డీఏఓ దేవ్కుమార్, లీగల్ మెట్రాలజీ అధికారి, సుధాకర్, రవాణాశాఖ అధికారి వెంకన్న కో–ఆపరేటివ్ అధికారి కరుణాకర్, జిల్లా పౌర సరఫరాల అధికారి నిత్యానంద్, సివిల్ సప్లై డీఎం జగదీష్, అదనపు డీఆర్డీఓ సరస్వతి, మెదక్ డీఎస్పీ ప్రసన్నకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
రోడ్లు ఛిద్రం.. ప్రయాణం నరకం
టేక్మాల్(మెదక్): ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మండలంలోని రోడ్లు భారీగా కోతకు గురయ్యాయి. మరమ్మతులు చేయాల్సిన ఆర్అండ్బీ అధికారులు పట్టించుకోవడం లేదు. మండలంలోని వెంకటాపూర్, చంద్రుతండా, టేక్మాల్, ఎల్లుపేట, బొడ్మట్పల్లి, చల్లపల్లి, బర్దిపూర్, ఎలకుర్తి గ్రామాలకు వెళ్లే తారు రోడ్లతో పాటు, వ్యవసాయ పొలాలకు వెళ్లే మట్టి రోడ్లు భారీగా వరదలకు కోతకు గురయ్యాయి. ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని వెళ్లాల్సి వస్తోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం తాత్కాలిక మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు. టేక్మాల్ శివారులో కోతకు గురైన కల్వర్టు -
ఆలయ భూమిని కబ్జా చేస్తే ఊరుకోం
● అంబాజీపేట గ్రామస్తుల రాస్తారోకో ● పనులు చేయించేందుకు వచ్చిన వ్యక్తిని చితకబాదిన వైనం చిన్నశంకరంపేట(మెదక్): దుర్గామాత ఆలయానికి సంబంధించిన స్థలాన్ని కబ్జా చేస్తే ఊరుకునేది లేదని చిన్నశంకరంపేట మండలంలోని అంబాజీపేట గ్రామస్తులు తేల్చి చెప్పారు. కబ్జా చేసిన స్థలంలో ప్రహరీ గోడ నిర్మించేందుకు రియల్టర్ తరఫు మనిషి పనులు చేయించేందుకు రాగా అతడిని గ్రామస్తులు చితకబాది వెనక్కి పంపించారు. ఆలయ భూమి కాపాడాలంటూ మెదక్–చేగుంట ప్రధాన రహదారిపై రెండు గంటల పాటు రాస్తారోకో నిర్వహించారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. గ్రామంలో వెలసిన దుర్గామాత ఆలయం ముందు ఖాళీ స్థలాన్ని హైదరాబాద్కు చెందిన ఓ రియల్టర్ కబ్జా చేయగా ఈ విషయమై అప్పటి నుంచి సదరు గ్రామస్తులకు అతడికి మధ్య వివాదం నడుస్తోంది. తాజాగా సదరు రియల్టర్ అక్కడ ప్రహరీ నిర్మించేందుకు అతడి తరఫున ఓ వ్యక్తిని పనుల నిమిత్తం అక్కడకు పంపించాడు. అయితే పునాదులు తవ్వుతుండగా విషయం తెలుసుకున్న గ్రామస్తులు పనులు నిలిపివేయించి అతడిని చితకబాదారు. అనంతరం ఆలయ భూమిని కాపాడాలంటూ రోడ్డుపై రాస్తారోకో చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని గ్రామస్తులకు నచ్చజెప్పి ఆందోళనను విరమింపచేశారు. అనంతరం డీఎస్పీ నరేందర్గౌడ్, సీఐ వెంకటరాజంగౌడ్ దుర్గామాతను దర్శించుకుని మొక్కుకున్నారు. -
ఆగం చేశారు..!
ఆశ పెట్టారు..రాజీవ్ యువ వికాసంపై నిరుద్యోగుల ఆవేదన● నెలాఖరులోగా ‘స్థానిక’ నోటిఫికేషన్ ● మరింత వాయిదా పడే అవకాశం ● ఆందోళనలో లబ్ధిదారులు జిల్లాలో యూనిట్ల వివరాలు మొత్తం యూనిట్లు 10,687 లింకేజీ లేకుండా 3,498 యూనిట్లు రూ.లక్షలోపు రుణాలు 2,632 యూనిట్లు రూ. 2లక్షల వరకు 2261 యూనిట్లు రూ.4 లక్షల వరకు 2,205 యూనిట్లు మైనర్ ఇరిగేషన్కు అదనంగా మరో 51 యూనిట్లు దరఖాస్తులు : 32,638మెదక్ కలెక్టరేట్: రాజీవ్ యువ వికాసం పథకం సరిగా అమలు కావడం లేదు. ఆశావహులు దరఖాస్తులు చేసుకొని నెలలు గడుస్తున్నా.. పురోగతి కనిపిండం లేదు. దీంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడిస్తాం... అప్పడిస్తామంటూ ఆశ పెట్టి తమను ఆగం చేశారని లబ్ధిదారులు వాపోతున్నారు. డబ్బులొస్తే ఉన్న ఉపాధి అవకాశాలు మెరుగు పరుచుకుందామమన్న ఆశలు అడియాశలయ్యాయి. పైగా నెలాఖరులోగా స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతుందని ప్రచారం నేపథ్యంలో లబ్ధిదారుల్లో మరింత గుబులు రేకెత్తిస్తోంది. అప్పటిలోగా రుణాలిస్తారా? లేక ఆశ చూపి ఆగం చేస్తారోనన్న వారిని పట్టి పీడిస్తోంది. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేలోగా రుణాలిచ్చి స్వయం ఉపాధికి మార్గం చూపాలని మెదక్ పట్టణంలోని గోల్కొండ వీధికి చెందిన నిరుద్యోగ యువకుడు దానోల్ల క్రాంతి ఆవేదన వ్యక్తం చేశాడు. ఎన్నో ఆశలతో.. ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకాన్ని మే నెలలో ప్రారంభించి 18 నుంచి 55 యేళ్లలోపు నిరుద్యోగులు దరఖాస్తులు చేసుకోవాలని ప్రకటన చేసింది. దీంతో జిల్లాలోని నిరుద్యోగ యువతీ, యువకులంతా ఉద్యోగం లేనందున ప్రభుత్వం స్వయం ఉపాధికి దారి చూపుతుందని ఎంతో ఆశ పడ్డారు. దీంతో నిరుద్యోగులంతా పెద్ద ఎత్తున దరఖాస్తులు చేసుకున్నారు. అర్హత ఆధారంగా రూ.50 నుంచి రూ.4లక్షల వరకు రుణాలు ఇచ్చేందుకు ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చింది. జిల్లా వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ, ఓబీసీలు కలిపి మొత్తం 32,638 మంది లబ్ధిదారులు దరఖాస్తులు చేసుకున్నారు. ఇందులో ఎస్సీలు 6,711, ఎస్టీలు 3,461, బీసీలు 19,686, ఈబీసీలు 550, మైనార్టీలు 2,175, క్రిస్టియన్లు 55 దరఖాస్తు చేసుకున్న వారిలో ఉన్నారు. వీటిని పూర్తిస్థాయిలో పరిశీలన చేసిన అధికారులు 29,855 దరఖాస్తులను బ్యాంకులకు పంపించారు. సరైన ధ్రువ పత్రాలు లేకపోవడంతో వాటిని తొలగించినట్లు సమాచారం. ముందుగా రూ.50వేల వరకు రుణాలు ఇస్తామని తెలిపి తేదీని ప్రకటించిన ప్రభుత్వం చివరకు వాయిదా వేయడంతో లబ్ధిదారులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఇప్పటి వరకు రాజీవ్ యువ వికాసం పథకంపై అధికారుల నుంచి ఎలాంటి సమాచారం లేక పోవడంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. రూ.50వేల వరకు రుణం తీసుకునే నిరుద్యోగులకు పూర్తి స్థాయిలో సబ్సిడీ ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఆపై రుణాలకు బ్యాంకు లింకేజీల ద్వారా ఇస్తూ యూనిట్ విలువ ఆధారంగా సబ్సిడీ ఇవ్వనున్నట్లు తెలిపారు. నిరుద్యోగ యువతీ, యువకులు స్వయం ఉపాధి పొందడానికి ప్రభుత్వం 81 యూనిట్లు పెట్టుకునేందుకు అవకాశం కల్పించింది. -
గొర్రెల పెంపకంతో అధిక ఆదాయం
● పశుసంవర్థకశాఖ ఏడీఏ జనార్ధన్ ● కేవీకేలో పెంపకందారుకు శిక్షణ కౌడిపల్లి(నర్సాపూర్): గొర్రెలు, మేకల పెంపకంతో అధిక ఆదాయం పొందవచ్చని నర్సాపూర్ పశుసంవర్థకశాఖ ఏడీఏ జనార్థన్ తెలిపారు. మంగళవారం మండలంలోని తునికి కేవీకేలో నేషనల్ మీట్ రిసర్చ్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో గొర్లు, మేకల పెంపకందారులకు ఒక్కరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో గొర్రెలు, మేకల మాంసానికి మంచి డిమాండ్ ఉందన్నారు. ప్రభుత్వం సైతం పెంపకందారులకు సబ్సిడీ అందచేస్తుందన్నారు. జిల్లాలో 5లక్షల గొర్రెలు, 4.5లక్షలు మేకలు ఉన్నాయన్నారు. మేలు జాతిని పెంచడంతో ఆదాయం బాగుంటుందన్నారు. వ్యాధులు సోకితే పశువైద్య సిబ్బంది అందుబాటులో ఉండి వైద్యం చేస్తారని, వాక్సిన్స్ సైతం ఇస్తారని చెప్పారు. అనంతరం డాక్టర్ యేగేష్ మాట్లాడుతూ దేశంలో 77శాతం మాంసాహారులు ఉన్నారని, గొర్రెలను పెంచడంతో వాటిని అమ్మగా వచ్చిన ఆదాయంతోపాటు వారి ఎరువుకు సైతం ఆదాయం వస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో కేవీకే హెడ్ శంభాజీ దత్తాత్రేయ నల్కర్, శాస్త్రవేత్త శ్రీకాంత్ వివిధ గ్రామాల పెంపకందారులు పాల్గొన్నారు. -
జీఓ12ను వెంటనే సవరించాలి
భవన నిర్మాణ రంగ కార్మికుల యూనియన్ నేతల డిమాండ్మెదక్ కలెక్టరేట్: భవన నిర్మాణ సంక్షేమ పథకాలను ప్రైవేట్ ఇన్సూరెన్న్స్ కంపెనీలకు అప్పగించే జీఓ నంబర్ 12ను వెంటనే సవరించాలని తెలంగాణ భవన నిర్మాణ రంగ కార్మికుల యూనియన్ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం మెదక్ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి చింతల గౌరయ్య మాట్లాడుతూ కార్మికులకు వెల్ఫేర్ బోర్డు ద్వారానే సంక్షేమ పథకాలు అందించాలని, అక్రమంగా ప్రైవేట్ బీమా కంపెనీలకు ఇచ్చిన రూ.346 కోట్లు తిరిగి వెల్ఫేర్ బోర్డులోనే జమ చేయాలని డిమాండ్ చేశారు. భవన నిర్మాణ కార్మికుల కేంద్ర చట్టం ప్రకారం వెల్ఫేర్ బోర్డు అడ్వైజరీ కమిటీ నియమించి, వారి నిర్ణయం ప్రకారం వెల్ఫేర్ బోర్డు నిధులను ఖర్చు చేయాలన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి సంతోష్, తెలంగాణ బిల్డింగ్ ఇతర నిర్మాణ సంఘాల నాయకులు అప్జల్, స్వామి, భిక్షపతి, చందు, పవన్ కళ్యాణ్, తదితరులు పాల్గొన్నారు. -
పారదర్శకత విజయ ప్రత్యేకత
● నాణ్యమైన పాల సరఫరాయే లక్ష్యం ● జీఎం మధుసూదన్ రావు మెదక్ కలెక్టరేట్: పారదర్శకత విజయ డెయిరీ ప్రత్యేకత అని రాష్ట్ర డెయిరీ డెవలప్మెంట్ కో ఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ జనరల్ మేనేజర్ మధుసూదన్రావు తెలిపారు. మంగళవారం మెదక్ జిల్లా కేంద్రంలోని విజయ డెయిరీని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా అధికారులతో సమీక్ష చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పాల ఉత్పత్తిదారులకు అనేక రకాల ప్రోత్సాహకాలు అందిస్తున్నామన్నారు. స్వచ్ఛమైన పాల సేకరణ, సరఫరాపై ప్రధానంగా దృష్టి సారించినట్లు చెప్పారు. రైతుల నుంచి పాలు సేకరించే సమయంలోనే ఎనలైజర్లతో పరీక్షించి కొనుగోలు చేస్తున్నామన్నారు. విజయ డెయిరీపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని నిలబెడుతున్నట్లు తెలిపారు. పలు రకాల పరీక్షలు చేసిన తర్వాతే వినియోగదారులకు నాణ్యతా ప్రమాణాలతో కూడిన పాల పదార్థాలు అందిస్తున్నామన్నారు. జిల్లాలో పలు రద్దీ ప్రాంతాల్లో విక్రయ కేంద్రాలను గుర్తిస్తామని, ఇందుకోసం ప్రత్యేక బృందాలతో సర్వే చేయిస్తామని చెప్పారు. సమావేశంలో అధికారులు, ప్రసన్న, కల్యాణి, విజయ్, అవినాష్, రమేష్, మెదక్ , జహీరాబాద్, నారాయణఖేడ్ కేంద్రాల మేనేజర్లు, సిబ్బంది పాల్గొన్నారు. -
పోషకాహరంతోనే సంపూర్ణ ఆరోగ్యం
టేక్మాల్(మెదక్): గర్భిణులు, బాలింతలు పోషకారం తీసుకుంటేనే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యపడుతుందని సీడీపీఓ పద్మలత అన్నారు. మండలంలోని బొడ్మట్పల్లిలో అంగన్వాడీ కేంద్రంలో మంగళవారం పోషణ మాసం సంబురాలు ఘనంగా నిర్వహించారు. చిన్నారులకు అందిస్తున్న పోషక పదార్థాలను ప్రదర్శించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ మునగాకులో విటమిన్లు, ఖనిజాలు యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయని, అవి రోగనిరోధక శక్తిని పెంచుతాయన్నారు. రక్తంలో చక్కెర స్థాయిలను నియత్రించి, 340 రకాల ఆరోగ్య సమస్యలకు పరిష్కారం ఉంటుందని చెప్పా రు. అనంతరం బతుకమ్మ సంబురాలు నిర్వహించారు. సూపర్వైజర్ కలాలి కృష్ణవేణి, అంగన్వాడీ టీచర్లు దీపిక, లక్ష్మి, ఏఎన్ఎం జయప్రద, సావిత్రి, అంగన్వాడీ హెల్పర్లు గడ్డం అమల, దుర్గరాణి తదితరులు పాల్గొన్నారు. వ్యవసాయ ఏడీఏ రాజ్నారాయణ రామాయంపేట(మెదక్): వరి సాగులో వివిధ దశల్లో చేపట్టాల్సిన సస్యరక్షణ, సమగ్ర పోషక యజమాన్య పద్ధతులపై రైతులకు అవగాహన కల్పిస్తున్నామని వ్యవసాయ సహాయ సంచాలకులు రాజ్నారాయణ పేర్కొన్నారు. మంగళవారం మండలంలోని ఆర్ వెంకటాపూర్లో పలు వ్యవసాయ క్షేత్రాలను పరిశీలించి మాట్లాడారు. ప్రతి గ్రామానికి చెందిన ఇద్దరు రైతులకు ఎంటీయు 1010 రకం వరి విత్తనాలను అందజేశామన్నారు. వారు పండించిన ఉత్పత్తులను ఇతర రైతులకు అందజేస్తామని తెలిపారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్త నిర్మల మాట్లాడుతూ.. చిరు పొట్ట దశలో చీడపీడలు సోకకుండా పంటలకు వాడాల్సిన మందులను పిచికారీ చేయాలని సూచించారు. పంటచేలకు మోతాదుకు మించి యూరియా వాడితే దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. వ్యవసాయ విస్తరణ అధికారులు, రైతులు పాల్గొన్నారు. కౌడిపల్లి(నర్సాపూర్): వరి, పత్తి పంటల్లో సస్యరక్షణ చర్యలు చేపట్టాలని, తెగుళ్లను నివారించాలని తునికి కేవీకే శాస్త్రవేత్త డాక్టర్ రవికుమార్ తెలిపారు. మంగళవారం మండలంలోని రాయిలాపూర్లో వరి, పత్తి పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా వరిలో కాండంతొలుచు, కంకినల్లి పురుగుల ఉధృతిని గమనించామన్నారు. కాండంతొలుచు పురుగు నివారణకు ఐసోసైక్లోసిరమ్120మి.లీ, లేదా క్లోరానిట్రిలిప్రోల్ 60మి.లీ, ఎకరాకు పిచికారీ చేయాలని తెలిపారు. కంకినల్లి నివారణకు స్పైరోమెసిఫిన్ 200మి.లీ, ప్రోజికొనజోల్ 200మి.లీ, ఎకరాకు పిచికారీ చేయాలని సూచించారు. రైతులు రోజు పంటను పరిశీలించి సస్యరక్షణ చర్యలు చేపట్టాలని చెప్పారు. తూప్రాన్: రీజినల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ఆర్) కోసం భూములు కోల్పోతున్న రైతులు పరిహారం కోసం వెంటనే బ్యాంకు అకౌంట్లను అందజేయాలని ఆర్డీఓ జయచంద్రారెడ్డి పేర్కొన్నారు. మంగళవారం తన కార్యాలయంలో రెవెన్యూ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ట్రిపుల్ఆర్ కోసం భూసేకరణ పరిహారం చెల్లింపు ప్రక్రియను వేగవంతం చేశామని, భూములు కోల్పోయిన రైతులకు న్యాయమైన పరిహారం అందిస్తామన్నారు. ఇప్పటి వరకు 630 మంది రైతులకు గాను 505 మాత్రమే బ్యాంకు అకౌంట్లు అందజేశారని తెలిపారు. మెదక్ కలెక్టరేట్: ముస్లిం మైనార్టీల్లో ఆర్థికంగా వెనకబడిన వర్గాల బలోపేతానికి ప్రభుత్వం ఇందిరమ్మ మైనార్టీ మహిళా యోజన పథకం తెచ్చి నట్లు జిల్లా ఇన్చార్జి మైనార్టీ వెల్ఫేర్ అధికారి విజయలక్ష్మి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పథకం మహిళలకు రూ.50 వేల వరకు రుణాలు అందిస్తున్నట్లు తెలిపారు. అభ్యర్థులు 21 నుంచి 55 యేళ్ల మధ్య వయస్సు కలిగిన ఫకీర్, దూదెకుల, దుర్బాల వర్గానికి చెంది ఉండాలన్నారు. ఐదేళ్లలో ప్రభుత్వం నుండి ఎలాంటి లబ్ధి పొందలేదని డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ఆసక్తి, అర్హత గల మహిళలు అక్టోబర్ 6వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. మరింత సమాచారం కోసం 8142741976 నెంబర్లో సంప్రదించాలన్నారు. -
పైసలున్నా పనులేవీ..?
● పెచ్చులూడి.. వర్షపునీరు వచ్చి.. ● అందులోనే తరగతుల నిర్వహణ ● భయాందోళనలో విద్యార్థులు నర్సాపూర్: పెచ్చులూడిన గదుల్లోనే ఉపాధ్యాయు లు తరగతులు నిర్వహిస్తున్నారు. ఎప్పడేం జరుగుతుందోనని భయబ్రాంతులకు గురవుతున్నారు. భవనాల మరమ్మతులకు నిధులు మంజూరు కావ డంతో పనులు చేపట్టిన కాంట్రాక్టరు కొన్ని పనులు చేపట్టి అర్ధంతరంగా ఏడాది క్రితం నిలిపివేశాడు. సదరు కాంట్రాక్టర్పై గిరిజన గురుకుల సంస్థ అధికారులు అవసరమైన చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. నర్సాపూర్లోని అల్లూ రి సీతారామరాజు గిరిజన గురుకుల పాఠశాలకు మరమ్మతులు చేపట్టేందుకు గత ఏడాది ప్రభుత్వం రూ. 2కోట్లు మంజూరు చేసింది. అప్పట్లోనే మరమ్మతు పనులను ఓ కాంట్రాక్టరు చేపట్టి కొన్ని పనులు చేశాడు. కాగా గత ఏడాది అక్టోబరులో పనులు ఆపివేశాడు. ఇంత వరకు మిగిలిన పను లను అధికారులు చేయించకపోవడంతో విద్యార్థు లు, ఉపాధ్యాయులు ఇబ్బందులు పడుతున్నారు. పాఠశాలలోని పలు తరగతి గదుల పైకప్పుల పెచ్చులు ఇప్పటికే ఊడిపోయి వర్షం వచ్చినప్పుడు నీరు కిందికి కారుతోంది. భయపడుతూ ఆ గదుల్లోనే తరగతులు కొనసాగిస్తున్నారు. గదుల పైకప్పు పాడై వర్షానికి ఎక్కువగా నీరు కారుతున్న కొన్ని గదులకు తాళం వేసి వాడటం లేదు. దీంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కాగా బాలుర టాయిలెట్స్కు మరమ్మతులు చేపట్టి అసంపూర్తిగా వదిలేశారు. దీంతో విద్యార్థులు అత్యవసరమైనప్పుడు బయటకు వెళుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా పాఠశాల భవనంతో పాటు హాస్టల్ భవనం కిటికీలకు తలుపులు బిగించకపోవడంతో రాత్రి ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు వాపోయారు. భవనాల గోడలు పాకురు పట్టి చాలా అధ్వాన్నంగా కనిపిస్తున్నాయి. అలాగే మీటింగ్ హాలుకు మరమ్మతులు చేసేందుకు కిటికీలు తొలగించి వదిలేశారు. ఏదైనా సమావేశం ఏర్పాటు చేయాల్సి వస్తే ఏడాది నుంచి చిన్న గదుల్లోనే నిర్వహిస్తూ ఇబ్బందులు పడుతున్నారు. ఉన్నతాధికారులకు చెప్పాం.. పాఠశాలలో నెలకొన్న సమస్యలు, మరమ్మతులు నిలిచిపోయిన విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. మరమ్మతులు చేయకపోవడంతో ఉపాధ్యాయులతోపాటు విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారని వివరించాం. – కృష్ణ కిశోర్, ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ -
త్వరితగతిన ఏటీసీ భవన నిర్మాణ పనులు
కలెక్టర్ రాహుల్రాజ్హవేళిఘణాపూర్(మెదక్): మండల కేంద్రమైన హవేళిఘణాపూర్ శివారులో నిర్మిస్తున్న అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ (ఏటీసీ) భవన నిర్మాణ పనులను కలెక్టర్ రాహుల్రాజ్ మంగళవారం పరిశీలించారు. భవన నిర్మాణంలో పాటిస్తున్న నాణ్యత ప్రమాణాలు, మిగిలిపోయిన పనులను గురించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. అత్యాధునిక సాంకేతిక విద్యనందించి ఉపాధి అవకాశాలు పెంచాలనే ఉద్దేశంతో ఈ సెంటర్ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. త్వరగా పనులు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొచ్చేలా చూడాలన్నారు. కలెక్టర్ వెంట ఐటీఐ ప్రిన్సిపాల్ శ్రీనివాస్, ఇంటస్ట్రీయల్ ఇన్ఫారస్ట్టక్చర్ కార్పొరేషన్ జోనల్ మేనేజర్ అనురాధ, డీఈ రాందాస్, వాణిలత పాల్గొన్నారు. -
గాయత్రీదేవిగా.. వన దుర్గమ్మ
దసరా శరన్నవ రాత్రోత్సవాల్లో భాగంగా ఏడుపాయల వన దుర్గమ్మ మంగళవారం శ్రీ గాయత్రీ దేవి అలంకారంతో భక్తులకు దర్శనమిచ్చారు. గోకుల్ షెడ్డులో కొలువు దీరిన దుర్గమ్మ తల్లిని తెల్లవారు జామున వేద బ్రాహ్మణులు గులాబీ రంగు వస్త్రాలతో అలంకరించారు. అర్చకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వనదుర్గా అన్నదాన సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు. కాగా, మూడో రోజైన బుధవారం అమ్మవారు అన్నపూర్ణా దేవి అలంకారంతో దర్శనమిస్తారు. – పాపన్నపేట(మెదక్)శ్రీ గాయత్రీ దేవి అలంకారంతో వన దుర్గమ్మ -
సత్వరమే అర్జీలు పరిష్కరించాలి
● అదనపు కలెక్టర్ నగేశ్ ● ప్రజావాణికి 65 వినతులు మెదక్ కలెక్టరేట్: ప్రజావాణి అర్జీలను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ నగేశ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. మొత్తం 65 వినతు లు రాగా, అందులో అత్యధికంగా భూ సమస్య లు ఉన్నాయి. ఈసందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. వినతులను పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరిపి పరిష్కరించాలని అధికాసూచించారు. కార్యక్రమంలో డీఆర్ఓ భుజంగరావు, జెడ్పీ సీఈఓ ఎల్లయ్య, అధికారులు పా ల్గొన్నారు. అంతకుముందు జిల్లా శిశు సంక్షేమ శాఖ అధ్వర్యంలో అదనపు కలెక్టర్, అధికారులకు పీహెచ్సీ సిబ్బంది వైద్య పరీక్షలు నిర్వహించారు. -
అవే బారులు.. తప్పని అవస్థలు
చేగుంట(తూప్రాన్)/శివ్వంపేట(నర్సాపూర్)/నిజాంపేట(మెదక్): యూరియా కోసం రైతులకు అవస్థలు తప్పడం లేదు. సోమవారం పలు మండలాల్లో బారులు తీరారు. చేగుంట మండల కేంద్రంలోని రైతుసేవా కేంద్రం వద్దకు పెద్ద ఎత్తున రైతులు చేరుకున్నారు. మండల వ్యవసాయ అధికారి హరిప్రసాద్ 1,120 బస్తాల యూరియాను రైతులకు అందించేందుకు చర్యలు చేపట్టారు. గొడవలు జరగకుండా పోలీసులు పర్యవేక్షించారు. శివ్వంపేట ప్రాథమిక సహకార సంఘం వద్ద రైతులు బారులు తీరారు. 540 బస్తాల యూరియా రావడంతో రైతులకు పంపిణీ చేశారు. అలాగే నిజాంపేట మండలం చల్మెడలో పెద్ద సంఖ్యలో రైతులు తరలివచ్చారు. -
సమస్యల పరిష్కారానికే ప్రజావాణి: అదనపు ఎస్పీ
మెదక్ మున్సిపాలిటీ: ప్రజావాణిని సద్వినియోగం చేసుకొని ప్రజలు తమ తమ సమస్యలను పరిష్కరించుకోవాలని అదనపు ఎస్పీ మహేందర్ సూచించారు. సోమవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నా రు. ఈసందర్భంగా ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ప్రజలు ఇతరుల ప్రమేయం లే కుండా నేరుగా సంప్రదించాలన్నారు. మొత్తం 13 ఫిర్యాదులు రాగా, వాటిని పరిశీలించి చట్టప్రకారం బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు చేపట్టాలని సంబంధిత పోలీస్ అధికారులను ఆదేశించారు. ప్రజల సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు జిల్లా పోలీస్ శాఖ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని తెలిపారు. కౌడిపల్లి(నర్సాపూర్)/నర్సాపూర్: ఏ పంట లు సాగు చేశారు.. ఎన్ని దఫాలు యూరియా చల్లారు అంటూ రైతులను జిల్లా వ్యవసాయ అధికారి దేవ్కుమార్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. సోమవారం కౌడిపల్లి ఆగ్రోస్ రైతు సేవా కేంద్రానికి లారీ యూరియా లోడ్ రాగా, డీఏఓ తనిఖీ చేసి రైతులతో మాట్లాడారు. ఎకరాకు ఎన్ని బస్తాల యూరియా చల్లుతున్నారని ప్రశ్ని ంచారు. కాగా రైతులు వరి, పత్తి వేశామని రెండు, మూడో దఫా యూరియా చల్లుతున్నట్లు చెప్పారు. ఈసందర్భంగా డీఏఓ మాట్లాడుతూ.. యూరియా మోతాదుకు మించి వాడొవద్దని చెప్పారు. అధికంగా వాడటం వల్ల పంటలకు తెగులు సోకుతుందని చెప్పారు. సందేహాలకు వ్యవసాయ అధికారులను సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో ఏడీఏ పుణ్యవతి, టెక్నికల్ ఏడీఏ విన్సెంట్ వినయ్కుమార్, టెక్నికల్ ఏఓ వందన, ఏఈఓ నరేందర్, ఆగ్రోస్ యజమాని వెంకటేశంగుప్తా తదితరులు పాల్గొన్నారు. అనంతరం నర్సాపూర్ ఆగ్రోస్ కేంద్రంలో యూరియా అమ్మకాలు, రికార్డులను పరిశీలించారు. చిన్నశంకరంపేట(మెదక్): ఫార్మా పరిశ్రమ మాకొద్దని మండలంలోని మిర్జాపల్లి గ్రామస్తులు ఆందోళనకు దిగారు. సోమవారం గ్రామ శివారులో నిర్మిస్తున్న పరిశ్రమ వద్దకు చేరుకొని పనులను నిలిపివేయించారు. ఎలాంటి గ్రామ సభ నిర్వహించకుండానే నిర్మాణ పనులు చేపట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడి నుంచే పీసీబీ అధికారులకు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేశారు. గ్రామ సభలో చర్చించే వరకు పరిశ్రమ పనులు చేపట్టవద్దని నిర్వాహకులను హెచ్చరించారు. కార్యక్రమంలో గ్రామ నాయకులు ప్రభా కర్, యాదగిరి, మనోజ్ పాల్గొన్నారు. మెదక్ మున్సిపాలిటీ: దేవీశరన్నవరాత్రి ఉత్స వాల సందర్భంగా సోమవారం దుర్గామాత అమ్మవారి విగ్రహాల ఊరేగింపు కోలాహలంగా సాగింది. అమ్మవారి విగ్రహాలను డీజే, బ్యాండ్ మేళాలు, భజనలతో ఊరేగింపుగా తరలించా రు. దీంతో పట్టణంలో ఆధ్యాత్మిక సందడి నెలకొంది. ఓ వైపు వర్షం కురుస్తున్నా.. ఉత్సవ విగ్రహాల ఊరేగింపు భారీ ఎత్తున కొనసాగింది. -
పండుగ పూట పస్తులుండాలా?
మెదక్ కలెక్టరేట్: పండుగ పూట పస్తులుండాలా..? ఐదు నెలలుగా వేతనాలు ఇవ్వకుంటే కుటుంబాలను ఎలా పోషించుకోవాలని పంచాయతీ కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం సీఐటీయూ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షురాలు నర్సమ్మ మాట్లాడుతూ.. పంచాయతీ కార్మికులకు ప్రభు త్వం ఐదు నెలలుగా వేతనాలు చెల్లించడం లేదన్నారు. బతుకమ్మ, దసరా పండుగలను వారు ఏ విధంగా జరుపుకుంటారని ప్రశ్నించారు. బయట అప్పులు అడిగినా ఎవరూ ఇచ్చే పరిస్థితిలో లేరన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి వెంటనే కార్మికుల పెండింగ్ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. అనంతరం అదనపు కలెక్టర్ నగేశ్ను కలిసి డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి సంతోశ్, నాయకులు మల్లేశం, దుర్గ, పంచాయతీ యూనియన్ జిల్లా అధ్యక్షుడు మహేందర్, జిల్లా కార్యదర్శి ఆసీఫ్, నాయకులు పద్మారావు, రాములు, పోచయ్య, శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు. పంచాయతీ కార్మికుల ఆవేదన -
హాజరు మెరుగు కోసమే ‘ఎఫ్ఆర్ఎస్’
డీఐఈఓ మాధవిరామాయంపేట(మెదక్): ప్రభుత్వ కళాశాలల్లో ముఖ గుర్తింపు వ్యవస్థ ద్వారానే విద్యార్థుల హాజరు ప్రక్రియ కొనసాగుతుందని జిల్లా ఇంటర్ విద్యాశాఖ అధికారి మాధవి అన్నారు. సోమవారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలను సందర్శించి రికార్డు లు పరిశీలించారు. ఈసందర్బంగా ఆమె మాట్లా డుతూ.. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఉత్తీర్ణత శాతం పెంచే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. విద్యార్థులు రెగ్యులర్గా కళాశాలలకు హాజరు కావాలని, ఈమేరకు లెక్చరర్లు, ప్రిన్సిపాల్ దృష్టి సారించాలన్నారు. విద్యార్థుల అడ్మిషన్ ప్రక్రియ పూర్తయినందున వారికి స్టడీ అవర్స్ తీసుకోవాలని, సైన్స్ విద్యార్థులకు ప్రాక్టికల్స్ నిర్వహించాలని ఆదేశించారు. ఆమె వెంట అధ్యాపకులు ఉన్నారు. -
ఏ స్థానం ఎవరికో?
మెదక్ అర్బన్: స్థానిక సంస్థల స్థానాల రిజర్వేషన్లు కొలిక్కి వచ్చాయి. ఏ స్థానం ఎవరికి రిజర్వు చేయాలనే అంశంపై సంబంధిత అధికార యంత్రాంగం కసరత్తు పూర్తి చేస్తోంది. ఆయా స్థానాల రిజర్వేషన్ల జాబితాలను రూపొందించి పంపాలని ఇప్పటికే పంచాయతీరాజ్ కమిషనరేట్ నుంచి ఆదేశాలు అందాయి. ఈ మేరకు మండల స్థాయిలో ఎంపీఓలు, ఎంపీడీఓలు ఈ ప్రక్రియలో నిమగ్నమయ్యారు. జిల్లా స్థాయిలో జెడ్పీ సీఈఓ, డీపీఓ, సంబంధిత అధికారులు సోమవారం విస్తృతంగా కసరత్తు చేశా రు. అయితే ఈ రిజర్వేషన్ల ప్రక్రియ కొలిక్కి వస్తుండటంతో ఆశావహుల్లో ఉత్కంఠ పెరుగుతోంది. ఆయా స్థానాల నుంచి బరిలోకి దిగాలని భావిస్తున్న నాయకులు తమకు ఈ రిజర్వేషన్లు అనుకూలిస్తాయా? లేదో? నని ఆందోళనలో ఉన్నారు. కులగణన ఆధారంగా.. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన కుల గణన సర్వే డేటా ఆధారంగా బీసీ రిజర్వేషన్లను ఖరారు చేస్తున్నారు. 2011 జనాభా లెక్కల ఆధారంగా ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను కేటాయిస్తున్నారు. ఈ డేటా అంతా ప్రభుత్వమే జిల్లాకు పంపింది. మహిళా రిజర్వేషన్ల ఖరారుకు లాటరీ పద్ధతిని వాడాలని జిల్లా అధికారులకు ఆదేశాలు అందాయి. ఆయా రాజకీయ పార్టీల సమక్షంలో ఈ ప్రక్రియ చేపట్టనున్నారు. ఆయా స్థాయిల్లో అధికారాలు రిజర్వేషన్ల ఖరారు చేసే అధికారాన్ని ఆయా స్థానా న్ని బట్టి సంబంధిత అధికారులకు అప్పగించారు. వార్డు సభ్యుల రిజర్వేషన్లు ప్రకటించే అధికారం ఎంపీడీఓలకు ఇవ్వగా, సర్పంచ్లు, ఎంపీటీసీ స్థానాల రిజర్వేషన్లను ఆర్డీఓలు ఖరారు చేయనున్నారు. జెడ్పీటీసీ, ఎంపీపీల రిజర్వేషన్లు అదనపు కలెక్టర్ ప్రకటించే అవకాశాలున్నట్లు సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు. పదవులపై ఆశతో జేబులు గుల్ల స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ పదవులకు పోటీ చేయాలనుకుంటున్న అభ్యర్థులు విందులు.. చందాలు, పలకరింపులు.. చేయూతలతో జేబులు గుల్ల చేసుకుంటున్నారు. కొన్ని చోట్ల ఇప్పటికే రూ.లక్షలు ఖర్చు చేస్తున్నారు. పాపన్నపేట, హవేళిఘణాపూర్ మండలాల్లోని రెండు గ్రామాల్లో సర్పంచ్ పదవిని ఆశిస్తున్న అభ్యర్థులు తమ అనుచరులతో కలిసి ఇటీవల వినోద యాత్రలకు తరలివెళ్లినట్లు తెలిసింది. పాపన్నపేట, కొత్తపల్లి గ్రామాల్లో పదవిపై ఆశలు పెట్టుకున్న నాయకులు ఏడాది కాలంగా డబ్బులు నీళ్లలా ఖర్చు చేస్తున్నారు. కొంతమంది గ్రూపులను ఏర్పాటు చేసుకుంటున్నారు. అనుచరులకు మందు, విందులతో ఖుషీ చేస్తున్నారు. ఆటల పోటీలకు బహుమానాలు, అన్నదానాలు, చందాలు ఇస్తూ, పంచాయతీలను తెంపుతూ, ఓటర్లను ఆకట్టుకోవడానికి పడరాని పాట్లు పడుతున్నారు. చిన్నశంకరంపేట, ఖాజాపూర్, చందంపేట, కామారం, మిర్జాపల్లి, రామాయంపేట మండలం కాట్రియాల్, ప్రగతి ధర్మారం, లక్ష్మాపూర్, జాన్సిలింగాపూర్, హవేళిఘణాపూర్, కూచన్పల్లి, సర్ధెన గ్రామాల్లో సైతం పదవులపై ఆశలు పెంచుకున్న నాయకులు ఓటర్లకు ఆర్థిక, వినిమయ, ఆరోగ్య సేవలు అందిస్తున్నారు. ఇంత చేసినా రిజర్వేషన్లు అనుకూలిస్తాయా..? లేదా అనే అనుమానాలు వారిలో ఆందోళన కలిగిస్తున్నాయి. ఆయా స్థానిక సంస్థల స్థానాల రిజర్వేషన్లను ఖరారు చేసి.. సంబంధిత జాబితాలను నేడు (మంగళవారం) పంచాయతీరాజ్ శాఖ కమిషనరేట్కు పంపనున్నట్లు తెలిసింది. ఈ రిజర్వేషన్ల ఖరారుకు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సంబంధిత అధికారులకు సూచనలు చేసింది. ఈ మేరకు రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియను పూర్తి చేస్తున్నారు. కసరత్తు పూర్తి చేసిన అధికార యంత్రాంగం నేడు కమిషనరేట్కు స్థానాల వారీగా జాబితా ఆశావహుల్లో ఉత్కంఠ -
ఈ నెలాఖరులోగా భూసేకరణ పూర్తి
● అధికారులు అలసత్వం వహించొద్దు ● కలెక్టర్ రాహుల్రాజ్ మెదక్ కలెక్టరేట్: ఈ నెలాఖరులోగా జాతీయ రహదారుల నిర్మాణానికి అవసరమైన భూ సేకరణ ప్రక్రియ పూర్తి చేయాలని కలెక్టర్ రాహుల్రాజ్ అధికారులను ఆదేశించారు. జాతీయ రహదారుల నిర్మాణం, విస్తరణకు అవసరమైన స్థల సేకరణపై సీఎం రేవంత్రెడ్డి సోమవారం సచివాలయం నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్కు జిల్లా ఫారెస్ట్ అధికారి జోజి, ఆర్డీఓలు రమాదేవి, మహిపాల్రెడ్డి, జయచంద్రారెడ్డితో కలిసి హాజరయ్యారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. సీఎం ఆదేశాల మేరకు దసరాకు ముందే అన్ని పనులు పూర్తి కావాలని స్పష్టం చేశారు. కోర్టు కేసులు ఉన్న భూములకు సంబంధించిన పూర్తి వివరాలను వెంటనే ప్రభుత్వానికి పంపాలని ఆదేశించారు. టైటిల్ సమస్యలు ఉన్న భూముల విషయంలో పరిహారం మొత్తాన్ని డిపాజిట్ చేసి, భూములను సేకరి ంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. రహదారి నిర్మాణ పనుల్లో జాప్యం జరగకుండా ప్రతి కేసును అత్యంత ప్రాధాన్యతగా పరిగణించాలని అధికారులను ఆదేశించారు. భూసేకరణలో ఎలాంటి ఆలస్యం జరుగకూడదని తెలిపారు. -
మెరుగైన వైద్య సేవలందించాలి
కలెక్టర్ రాహుల్రాజ్ రామాయంపేట(మెదక్): ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగులకు సకాలంలో సరైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ రాహుల్రాజ్ సిబ్బందిని ఆదేశించారు. ఆదివారం మండలంలోని ప్రగతి ధర్మారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సర్కారు వైద్యంపై ప్రజలకు విశ్వాసం కలిగించాలన్నారు. వైద్యులు అందుబాటులో ఉండి మెరుగైన సేవలు అందించినప్పుడే ఇది సాధ్యపడుతుందన్నారు. ఆస్పత్రుల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తామని, ప్రభుత్వం వైద్య రంగానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తుందన్నారు. అంతకుముందు రికార్డులు పరిశీలించారు. రక్త పరీక్ష, ఎక్స్రే గదులను పరిశీలించి రోగులతో మాట్లాడారు. సాధారణ ప్రసవాలు, మలేరి యా, చికెన్ గున్యా, టైఫాయిడ్, డెంగీ కేసులపై ఆరా తీశారు. ఆయన వెంట వైద్యులు, ఆస్పత్రి సిబ్బంది ఉన్నారు. -
చివరికి నీరెలా?
భారీ వర్షాలు మిగిల్చిన నష్టం నుంచి మెతుకుసీమ ఇంకా తేరుకోలేదు. ఫతేనహర్ కెనాల్కు గండి పడి 70 మీటర్ల మేర కట్ట కొట్టుకుపోయినా, ఇప్పటివరకు మరమ్మతులకు నోచుకోలేదు. మరో వారం రోజులు వర్షం పడకపోతే కెనాల్పై ఆధారపడిన సుమారు 2 వేల ఎకరాల పంటలు ఎండిపోయే పరిస్థితి ఉంది. – పాపన్నపేట(మెదక్) ఆగస్టు చివరి వారంలో కురిసిన భారీ వర్షాలకు అన్నారం– కొత్తపల్లి మధ్య అటవీ ప్రాంతంలోని కుంటలు తెగిపోయాయి. భారీ వరదలతో ఫతేనహర్ కెనాల్ కట్ట తెగిపోయింది. సుమారు 70 మీటర్ల మేర కొట్టుకుపోవడంతో దిగువన కొత్తపల్లి శివారులో ఉన్న పొలాల్లో ఇసుక మేటలు పెట్టాయి. దీంతో కొత్తపల్లి, లక్ష్మీనగర్, పొడిచన్పల్లి, పొడిచన్పల్లి తండా, శానాయపల్లి, తుమ్మలపల్లి, గాంధారిపల్లి, ఎల్లాపూర్ పొలాలకు ఘనపురం ఆనకట్ట నీరు అందని పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం వర్షాలు కురుస్తుండటంతో వరి పంటలకు ఊపిరి అందుతోంది. మరో నాలుగు తడులు అవసరం కానున్నాయి. ఒక వేళ వర్షాలు పడకపోతే సుమారు 2 వేల ఎకరాల పంటల పరిస్థితి ప్రమాదకరంగా మారుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. రైతుల విజ్ఞప్తితో ఇరిగేషన్ ఎస్ఈ, ఈఈలు పరిశీలించి వెళ్లారు. అయితే మరమ్మతులకు లక్ష్మీనగర్కు చెందిన ఓ నాయకుడు ముందుకొచ్చాడు. కట్టకు కావాల్సిన మట్టిని, అటవీప్రాంతం నుంచి తీసుకురావడంతో ఫారెస్ట్ అధికారులు అడ్డుకున్నారు. దీంతో పనులు నిలిచిపోయాయి. భారీ వర్షాలతో ఫతేనహర్ కెనాల్కు గండి 70 మీటర్ల మేర కొట్టుకుపోయిన కాలువ 25 రోజుల కావొస్తున్నా మరమ్మతులు శూన్యం -
త్వరలో ట్రిపుల్ఆర్ పరిహారం
కసరత్తు చేస్తున్న రెవెన్యూ అధికారులుతూప్రాన్: రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్)గా వాడుకలో ఉన్న గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవేకు సంబంధించి భూసేకరణ పనులు చివరి దశకు చేరాయి. రైతులకు పరిహారం అందించేందుకు రెవెన్యూ అధికారులు కసరత్తు చేస్తున్నారు. భూసేకరణలో అన్ని ప్రక్రియలు ముగిసి, నష్ట పరిహారం నిర్ణయించే అవార్డు దశలో ఉన్నట్లు తెలుస్తోంది. రైతులకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్లు, ఇతర వివరాలను రెవెన్యూ సిబ్బంది సేకరించి నేషనల్ హైవే అథారిటీ వెబ్సైట్ భూమి రాశి పోర్టల్లో నమోదు చేస్తున్నారు. ఈ నమోదు ప్రక్రియ సాంకేతికంగా సంక్లిష్టంగా ఉండడంతో ఆలస్యం అవుతున్నట్టు సంబంధిత అధికారి ఒకరు పేర్కొన్నారు. భూసేకరణ నోటిఫికేషన్ వచ్చిన 2022 నాటి సబ్ రిజిస్టార్ ప్రాథమిక విలువల ఆధారంగానే నష్టపరిహారం చెల్లించే పరిమితి ఉన్నట్లుగా తెలిసింది. అంతకుమించి ఎక్కువ రేటుకు ఆర్డీఓ నిర్ణయించడం చట్ట ప్రకారం చెల్లదని, కేంద్ర ప్రభుత్వం నిరాకరిస్తున్నట్లుగా అధికారులు చెబుతున్నారు. అయితే రైతులకు వీలైనంత మంచి ధరను పరిహారంగా చెల్లించాలని సీఎం రేవంత్రెడ్డి స్వయంగా చొరవ తీసుకున్నారు. నేషనల్ హైవే చట్టంలోని ఆర్బిట్రేషన్ అనే ప్రక్రియను ఉపయోగించి రైతులకు న్యాయం చేయవచ్చు అని, ఆ బాధ్యతను కలెక్టర్కు అప్పగించినట్లు తెలిసింది. దానికి అనుగుణంగా రెవెన్యూ సిబ్బంది ముమ్మరంగా పనుల్లో నిమగ్నమవుతున్నారు. రైతులకు ఈ ప్రక్రియ మీదున్న సందేహాలను నివృత్తి చేస్తున్నారు. గ్రామ పంచాయతీలో కూర్చొని నోటీసులు ఇవ్వకుండా, రైతుల ఇంటి వద్దకే వెళ్లి నోటీసులు ఇస్తూ, వారికి భరోసాను కల్పిస్తున్నారు. మొత్తం మీద నెల రోజుల్లో వారికి ఆర్డీఓ, కలెక్టర్ నిర్ణయించే ధర ప్రకారం రైతుల అకౌంట్లో డబ్బులు పడే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. -
ఇబ్బందుల్లేకుండా నీరు సరఫరా చేయండి
నారాయణఖేడ్: గ్రామాలు, తండాలకు తాగునీటి ఇబ్బందులు ఏర్పడకుండా తగు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సంజీవరెడ్డి అధికారులకు సూ చించారు. నాగల్గిద్ద మండలం గుడూరు గ్రామంలో మంజీరా నదిపై ఉన్న 4 ఎంఎల్డీ నీటిశుద్ధి ప్లాంట్ను, పంప్హౌస్ను ఆదివారం ఎమ్మెల్యే సందర్శించారు. పంప్హౌజ్లో మోటార్ల పనితీరును పరిశీలించి నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడకుండా చూడాలని సూచించారు. నెల రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కొన్ని చోట్ల మిషన్ భగీరథ పైపులు, పంపు మోటారు చెడిపోయి నీటి సరఫరాకు అంతరాయమేర్పడిందని అధికారులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. వాటికి మరమ్మతులు చేపట్టామని, ఇక ముందు నీటి సరఫరాలో ఇబ్బందులు లేకుండా చూస్తామని తెలిపారు. సమస్యలు ఉన్న పక్షంలో తన దృష్టికి తీసుకురావాలని అధికారులకు ఎమ్మెల్యే సూచించారు. -
ఆమెకు పౌష్టికాహారం
● వచ్చేనెల 16 వరకు పోషణ మాసం ● బతుకమ్మ సంబరాల్లో వినూత్న ప్రయత్నం ● 40 రకాల ఆకుకూరలతో ప్రసాదాలు మెదక్ కలెక్టరేట్: మహిళల్లో అనారోగ్య సమస్యలు, రక్తహీనత నివారణకు ప్రభుత్వం నడుం బిగించింది. ఇందులో భాగంగా ఈనెల 17వ తేదీ నుంచి అక్టోబర్ 16 వరకు పోషణమాసం నిర్వహణకు శ్రీకారం చుట్టింది. విజయవంతానికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించింది. లోకల్ ఫర్ వోకల్ నినాదంతో స్థానికంగా గ్రామీణ ప్రాంతాల్లో లభించే 40 ఆకుకూరలను అధికారులు గుర్తించారు. వీటిని బతుకమ్మ సంబురాల్లో మహిళలు ప్రసాదంగా ఉపయోగించుకునేలా సంఘాల సభ్యులకు అవగాహన కల్పిస్తున్నారు. జిల్లాలో మొత్తం 1,300 వేల పైచిలుకు మహిళా సంఘాలు ఉండగా, 1.37 లక్షలకు పైగా సభ్యులు ఉన్నారు. జిల్లాలోని పట్టణాలతో పాటు ప్రతి గ్రామంలోని మహిళా సంఘాల సభ్యులతో సమావేశాలు నిర్వహించి వారిలో పోషకాహార లోపం, రక్తహీనత నివారణపై ఛాలెంజ్ పోటీలు నిర్వహిస్తున్నారు. పోషకాహార ప్రదర్శన జిల్లాలోని అన్ని అంగన్వాడీ కేంద్రాలు, బస్టాండ్లు, చౌరస్తాలలో పోషకాహార ప్రదర్శన నిర్వహిస్తున్నారు. ఈసందర్భంగా గర్భిణులు, బాలింత మహిళలతో పాటు కిశోర బాలికలు తీసుకోవాల్సిన సమతుల ఆహారం, ప్రోటీన్లు ఉన్న పప్పు దినుసులు, ఆకుకూరలు ఆహారంలో తీసుకునేలా అవగాహన కల్పిస్తున్నారు. పెద్దవారి కోసం బీఎంఐ పరీక్షలు, పిల్లల కోసం ఎత్తు, బరువు, కొలతలు తీయడం, ఆహారంలో చక్కెర, నూనె వినియోగాన్ని తగ్గించే విషయంపై అవగాహన కల్పించనున్నారు. ప్రతి ఇంటికీ పోషణ సందేశం చిన్నారులు, మహిళల ఆరోగ్యం, పోషకాహా రాన్ని మెరుగు పర్చే లక్ష్యంతో ప్రభుత్వం ఈ మహోత్సవాన్ని కేంద్ర ప్రభుత్వ సహకారంతో నిర్వహిస్తోంది. అంగన్వాడీ సిబ్బంది ద్వారా ప్రతి ఇంటికి పోషణ సందేశం చేరేలా కార్యాచరణ సిద్ధం చేశారు. పోషణ మాసంలో ప్రజాప్రతిధులను సైతం భాగస్వామ్యం చేస్తున్నారు. గ్రామస్థాయి నుంచి జిల్లాస్థాయి వరకు పోషణపై చైతన్య కార్యక్రమాలు, అవగాహన శిబిరాలు, ఆరోగ్య పరీక్షల క్యాంపులు నిర్వహిస్తున్నారు. ఆరోగ్యవంతులను చేస్తాం మహిళలు, గర్భిణులు, బాలింతలు, కిశోర బాలికలు, చిన్నారుల్లో పోషకాహా ర లోపం, రక్తహీనత నివారణకు బతుకమ్మ సంబరాలను సద్వినియోగం చేసుకుంటాం. 40 రకాల ఆకుకూరలు ప్రసాదాలుగా పెట్టి ఆరగించేలా మహిళలకు అవగాహన కల్పిస్తున్నాం. – హేమభార్గవి, ఇన్చార్జి డీడబ్ల్యూఓ -
బగలాముఖీ శక్తిపీఠంలో విశేష పూజలు
శివ్వంపేట(నర్సాపూర్): బగలాముఖీ శక్తిపీఠంలో అమావాస్య సందర్భంగా ఆదివారం విశేష పూజలు నిర్వహించారు. వేద పండితుడు శాస్త్రుల వెంకటేశ్వరశర్మ ఆధ్వర్యంలో మహామంత్ర హవనం, హరిద్వార్చన పూజలు చేపట్టారు. మాజీ ఎంపీ సంతోష్రావు, మాజీ ఎమ్మెల్సీ శేరి సుభాశ్రెడ్డి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. శివ్వంపేటకు చెందిన రమేష్గుప్తా భక్తులకు అన్నదానం నిర్వహించారు. ఆలయ అభివృద్ధికి రూ. 54 వేలను ఆలయ నిర్వాహకులకు అందజేశారు. మెదక్ కలెక్టరేట్: బతుకమ్మ సంబురాలను జిల్లాలోని మహిళలు సంతోషంగా జరుపుకోవాలని, నిమజ్జన వేళ జాగ్రత్తలు పాటించాలని కలెక్టర్ రాహుల్రాజ్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పూలను పూజించి ప్రకృతిని ఆరాధించే బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయానికి ప్రతీక అన్నారు. ప్రజలందరూ కుటుంబ సమేతంగా ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరూ ఐకమత్యంతో, సోదరభావంతో పండుగను దిగ్విజయంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఝరాసంగం(జహీరాబాద్): దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన శ్రీ కేతకీ సంగమేశ్వరాలయంలో భక్తులు అమావాస్య పూజలు నిర్వహించారు. ఆదివారానికి తోడు అమావాస్య కలిసి రావడంతో తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తు లు అధిక సంఖ్యలో తరలివచ్చారు. గర్భగుడిలోని పార్వతీ పరమేశ్వరులకు ప్రాతఃకాలం ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు దర్శన సౌకర్యం కల్పించారు. వేకువ జాము నుంచే ఆలయానికి భక్తుల తాకిడి పెరిగింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఆల య ఆవరణలోని అమృతగుండంలో పవిత్ర పుణ్యస్నానాలు ఆచరించి గుండంలోని జల లింగానికి పూజలు చేశారు. అనంతరం గర్భగుడిలోని స్వామివారిని క్యూలైన్ల ద్వారా దర్శించుకున్నా రు. అనంతరం ఆలయ అర్చకులు స్వామివారి తీర్థప్రసాదాలు అందించి, ఆశీర్వదించారు. నారాయణఖేడ్: విజయవంతంగా వైద్యవిద్య ను పూర్తి చేసి పేదలకు సేవలందించాలని ఇటీవల ఎంబీబీఎస్లో సీటు సాధించిన రాథోడ్ దినేశ్ నాయక్కు మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు సూచించారు. ఖేడ్ మండలం పలుగు తండాకు చెందిన రాథోడ్ దినేశ్ నాయక్ సిద్దిపేట మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ సీటును సాధించాడు. తండ్రి రాథోడ్ పండిత్నాయక్ ఆటో నడుపుతుండగా తల్లి ధూ రిబాయి వ్యవసాయ కూలిపనులు చేస్తుంది. ఆదివారం దినేశ్ నాయక్ ఖేడ్ తాజా మాజీ జెడ్పీటీసీ రవీందర్ నాయక్, ర్యాకల్, పలుగు తండాలకు చెందిన నాయకులు గోపాల్రెడ్డి, శ్రీధర్రెడ్డి, నెహ్రునాయక్, నితిన్ నాయక్లతో కలిసి హైదరాబాద్లోని మాజీమంత్రి హరీశ్రావు నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా దినేష్ నాయక్ను హరీశ్రావు ఘనంగా సన్మానించారు. రవీందర్ నాయక్ భవానీమాత దీక్ష చేపట్టి కాశీ, అయోధ్య, పౌరాదేవీ యాత్రలు ముగించుకుని వచ్చిన నేపథ్యంలో మహాప్రసాదాన్ని హరీశ్రావుకు అందజేశారు. ప్రశాంత్నగర్(సిద్దిపేట): కురుమలు కేవలం ఉద్యోగాల్లోనే కాకుండా వ్యాపారం, రాజకీయాలలో రాణించాలని కురుమ ఉద్యోగులు సంఘం జిల్లా అధ్యక్షుడు పోతుగంటి రవికాంత్ అన్నారు. సంఘం కార్యవర్గ సమావేశం ఆది వారం జిల్లా కేంద్రంలో నిర్వహించారు. నూతన కార్యవర్గాన్ని వ్యవస్థాపక అధ్యక్షుడు రాములు ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు. -
ఇసుక.. ఇక చవక
● నర్సాపూర్లో శాండ్ బజార్ ఏర్పాటు ● ఇందిరమ్మ లబ్ధిదారులకు ఊరట ● టన్నుకు 1,100 ఆదా అయ్యే అవకాశం నర్సాపూర్లో సిద్ధంగా ఉన్న ఇసుకనర్సాపూర్: C…¨-Æý‡Ð]l$à CâýæÏ ÌS¼-®-§é-Æý‡$ÌS BǦMýS ¿êÆ> °² ™èlWY…-^èl-yé-°MìS {糿¶æ$™èlÓ… ^èlÆý‡ÅË$ ^ólç³-sìæt…-¨. D Ðól$Æý‡MýS$ Ô>…yŠæ ºgêÆŠ‡ §éÓÆ> ™èlMýS$PÐ]l «§ýlÆý‡MýS$ CçÜ$MýS çÜÆý‡-çœÆ> ^ólĶæ$-¯]l$…-¨. OÐðl$°…VŠæ Ô>Q B«§ýlÓ-Æý‡Å…ÌZ hÌêÏÌZ Ððl¬§ýl-rV> ¯]lÆ>Þç³N-ÆŠ‡ÌZ CçÜ$MýS ºgêÆŠ‡ HÆ>µr$ ^ólíÜ…-¨. CMýSPyýl {ç³çÜ$¢™èl… çÜ$Ð]l*Æý‡$ 11 Ð]l…§ýlÌS r¯]l$²ÌS CçÜ$MýS íܧýl®…V> E…¨. ¯]lÌŸY…yýl ¯]l$…_ ™ðl_a A…§ýl$-»ê-r$ÌZ E…^éÆý‡$. AMýSPyìl ¯]l$…_ ™ólÐ]l-yé-°MìS r¯]l$²MýS$ Æý‡*.1,200 Ð]lÅĶæ$… AƇ$$-¯]lr$Ï A«¨-M>-Æý‡$Ë$ °Æ>®-Ç…-^éÆý‡$. B Ý÷Ð]l¬Ã™ø ´ër$ ¯éÐ]l$-Ð]l*-{™èlç³# çÜÈ-Ó‹Ü ^éÈjÌS¯]l$ MýSÍí³ «§ýlÆý‡¯]l$ °Æý‡~-Ƈ$$…-^éÆý‡$. CçÜ$MýS M>ÐéÍÞ¯]l ÌS¼-®-§é-Æý‡$Ë$ JMýS {sêMýSt-ÆŠ‡ÌZ ¯éË$VýS$ r¯]l$²ÌS CçÜ$MýS ¡çÜ$MýS$ ÐðlâôæÏ AÐ]lM>Ôèæ… E…¨. AƇ¬™ól CçÜ$MýS ™ólÐ]lyé-°MìS AƇ$$¯]l Æý‡Ðé-×ê QÆý‡$aÌS (Æý‡*. 4,800)™ø ´ër$ ¯éË$VýS$ r¯]l$²ÌSMýS$ Æý‡*. 288 çÜÈ-Ó‹Ü ^éÈj MìS…§ýl ÐéÆý‡$ ^ðlÍÏ…-^éÍÞ E…r$…-¨. {sêMýStÆŠḥæ CçÜ$MýS MøçÜ… Æý‡*. 5,088 B¯ŒS-OÌñæ-¯ŒSÌZ ^ðlÍÏ…_ C¯ŒSÐé-Ƈ$$‹Ü {í³…sŒæ ¡çÜ$-MýS$-Ð]lõÜ¢ Ô>…yŠæ ºgêÆŠ‡ÌZ ÌS¼-®-§é-Æý‡$ÌSMýS$ CçÜ$MýS A…§ýlgôæÝë¢Æý‡$. C¨Ìê E…yýlV> {ç³çÜ$¢™èl… Ð]l*Æð‡P-sŒæÌZ r¯]l$² CçÜ$MýS «§ýlÆý‡ çÜ$Ð]l*Æý‡$ Æý‡*. 2,300 ¯]l$…_ Æý‡*. 2,500 Ð]lÆý‡MýS$ E…¨. Ð]l*Æð‡PsŒæ «§ýlÆý‡¯]l$ ç³ÇÖ-ÍõÜ¢ ÌS¼-®§é-Æý‡$-ÌSMýS$ r¯]l$² CçÜ$-MýSOò³ çÜ$Ð]l*Æý‡$ Æý‡*. 1,100 B§é AÄôæ$Å AÐ]l-M>Ôèæ… E…¨. 7 మండలాలు.. 2,574 ఇళ్లు నియోజకవర్గంలోని ఏడు మండలాలతో పాటు మున్సిపాలిటీ కలిపి 2,574 ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయి. వాటిలో 1,632 ఇళ్ల నిర్మాణానికి హౌసింగ్ శాఖ అధికారులు ముగ్గు పోయగా, 710 ఇళ్లు బేస్మెంట్ స్థాయిలో ఉన్నాయి. 75 రూఫ్స్థాయి, 27 స్లాబ్స్థాయికి చేరుకున్నాయి. నిబంధనల మేరకు అందజేస్తాం మార్కెట్లో ఇసుక ధర చాలా ఎక్కువగా ఉన్నందున ఇందిరమ్మ లబ్ధిదారులను ఆదుకోవాలని ప్రభుత్వం ఇసుక బజార్ను ప్రారంభించింది. ఇసుక కావాల్సిన లబ్ధిదారులు తప్పనిసరిగా ఆన్లైన్లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. నిబంధనల మేరకు ఇసుకను అందజేస్తాం. – మహిపాల్, ఆర్డీఓ -
దసరా తర్వాతే కానుక
● ఎస్హెచ్జీ సభ్యులకు బతుకమ్మ చీరలా..? డ్రెస్కోడా..? ● స్పష్టత ఇవ్వని అధికారులు ● గతేడాది సైతం మహిళలకు అందని వైనంమహిళలు ఎంతో సంబురంగా జరుపుకొనే బతుకమ్మ పండుగకు ప్రభుత్వం షాకిచ్చింది. ఉచిత చీరలు పంపిణీ చేస్తారని ఆశించిన వారికి నిరాశే మిగిలింది. అక్టోబర్ తర్వాత చీరలు వస్తాయని, స్వయం సహాయక సంఘాల (ఎస్హెచ్జీ) సభ్యులకు మాత్రమే అందజేస్తామని అధికారులు చెబుతున్నారు. అవి కూడా ఒకే కలర్ (డ్రెస్ కోడ్)లో ఉంటాయని తెలిసింది. – మెదక్జోన్ జిల్లావ్యాప్తంగా 21 మండలాలు, నాలుగు మున్సిపాలిటీల్లో 15,232 స్వయం సహాయక గ్రూపులు ఉన్నాయి. ఒక్కో గ్రూపులో 10 నుంచి 15 మంది వరకు సభ్యులు కలిపి మొత్తం 1,58,239 మంది ఉన్నారు. కాగా వీరందరికీ బతుకమ్మ పండుగకు ‘రేవంతన్న కానుక’ పేరుతో ఉచితంగా చీరలు పంపిణీ చేస్తామని ప్రభుత్వం పేర్కొంది. వీరి వివరాలను డీఆర్డీఓ శాఖ ఉన్నతాధికారులకు పంపించింది. గ్రూపు సభ్యులకు ఒక్కో చీర చొప్పున పంపిణీ చేస్తారని, అవి ఈనెల 15 వరకు జిల్లాకు చేరు కుంటాయని అధికారులు ముందుగా ప్రకటించారు. తాజాగా అక్టోబర్ మొదటి వారంలో చీరలు రానున్నాయని, అవి కూడా ఒకే కలర్లో ఉంటాయని చెబుతున్నారు. పెదవి విరుస్తున్న మహిళలు మహిళలందరికీ బతుకమ్మ పండుగకు ఉచితంగా చీరలు పంపిణీ చేస్తామని అప్పట్లో సీఎం రేవంత్రెడ్డి స్వయంగా ప్రకటించారు. కాగా గతేడాది సైతం మహిళలకు చీరలు పంపిణీ చేయలేదు. ఈ పండుగకు అయినా అందజేస్తారని మహిళా సంఘాల సభ్యులు ఎంతో సంతోషంగా ఎదురుచూశారు. కానీ ఈసారి సైతం ఇవ్వకపోగా, దసరా అనంతరం ఇస్తామని చెప్పడంతో నిరాశకు గురయ్యారు. అవి కూడా డ్రెస్కోడ్ అని తెలియడంతో పెదవి విరుస్తున్నారు. కాగా గత ప్రభుత్వం 18 ఏళ్లు నిండిన మహిళలందరికీ ఒక్కో చీర చొప్పున పంపిణీ చేసింది. జిల్లాలో 18 ఏళ్లు నిండిన వారు 2,71,787 మంది ఉండగా, వారిలో మహిళా సంఘం గ్రూపులో ఉన్నవారు 1,58,239 మంది, గ్రూప్ సభ్యులు కాని వారు 1,13,548 మంది ఉన్నారు. ఈ లెక్కన కేవలం 60 శాతం మంది మహిళలు మాత్రమే సంఘ సభ్యులుగా ఉన్నారు.పండుగ తర్వాత పంపిణీ చేస్తాంజిల్లాకు ఈనెల 15 వరకు చీరలు వస్తా యని మొదట్లో ఉన్నతాధికారులు చెప్పారు. మళ్లీ అక్టోబర్ 2 తర్వాత వస్తాయని చెబుతున్నారు. ఎస్హెచ్జీ గ్రూపు సభ్యులకు మాత్రమే ఈ చీరల పంపిణీ కార్యక్రమం ఉంటుంది. అవి కూడా ఒకే రకం కలర్లో ఉంటాయని ఉన్నతాధికారులు పేర్కొన్నారు. – సరస్వతి, అదనపు డీఆర్డీఓ -
పండుగల వేళ అప్రమత్తత అవసరం
ఎస్పీ శ్రీనివాసరావుమెదక్ మున్సిపాలిటీ: దసరా, బతుకమ్మ పండుగల వేళ ప్రజలు అప్ర మత్తంగా ఉండాలని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు సూచించారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. సెలవులు రావడంతో అనేక మంది ఊర్లకు ప్రయాణిస్తున్నారని, బంగారు నగలు, విలువైన వస్తువులను బ్యాంకు లాకర్లో భద్రపరుచుకోవాలని సూచించారు. ఊర్లకు బయలుదేరే ముందు పక్కింటి వారు, నమ్మదగిన వ్యక్తులకు సమాచారం ఇవ్వాలన్నారు. సుదూర ప్రాంతాలకు వెళ్లే వారు తమ ఫోన్ నంబర్లు, వివరాలు సమీప పోలీస్స్టేషన్్లో నమోదు చేసుకోవాలని తెలిపారు. పరేడ్తో ఫిట్నెస్, క్రమశిక్షణఅదనపు ఎస్పీ మహేందర్ మెదక్ మున్సిపాలిటీ: పరేడ్తో సిబ్బందిలో ఫిట్నెస్, క్రమశిక్షణ పెరుగుతుందని అదనపు ఎస్పీ మహేందర్ అన్నారు. శనివారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో పరేడ్ నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలీస్ సిబ్బంది ప్రజలతో మర్యాద, వినయంతో వ్యవహరించాలన్నారు. నేర నివారణ, శాంతిభద్రతల పరిరక్షణలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. పరేడ్ అనంతరం సిబ్బందితో సమావేశమై వారి సంక్షేమానికి సంబంధించిన అంశాల గురించి చర్చించారు. తాగునీటి కోసం తండ్లాట కౌడిపల్లి(నర్సాపూర్): మండలంలోని రాయిలాపూర్లో తాగునీటి సమస్య నెలకొంది. దీంతో గ్రామస్తులు శనివారం పంట పొలాల్లోని బోరు బావుల వద్ద నుంచి నీటిని తెచ్చుకుంటున్నారు. సమస్యను ఎవరూ పరిష్కరించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయమై పంచాయతీ కార్యదర్శి సలీం మాట్లాడుతూ.. నాలుగు బోర్లతో గ్రామానికి తాగునీరు సరఫరా చేస్తున్నామని, కొన్ని నల్లాలకు చెర్రాలు తొలగించడంతో సమస్య ఉత్పన్నమై నీరు రావడం లేదన్నారు. ట్యాంకర్ ద్వారా నీటిని సరఫరా చేస్తున్నామని చెప్పారు. జీఎస్టీ తగ్గింపుతో మేలు నర్సాపూర్: ప్రధాని నరేంద్రమోదీ జీఎస్టీని తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయంతో పేద, మధ్య తరగతి ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లేశ్గౌడ్ అన్నారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. మోదీ 11 ఏళ్ల పరిపాలనలో పేద ప్రజలతో పాటు రైతులకు మేలు చేసే అనేక సంస్కరణలు తెచ్చారని కొనియాడారు. తాజాగా జీఎస్టీ తగ్గించి మరో సంస్కరణ అందుబాటులోకి తెచ్చారన్నారు. దసరా, దీపావళి పండుగల వేళ పన్ను తగ్గించడంతో ప్రజలు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ఇళ్ల నిర్మాణాలకు కేంద్రం నిధులు ఇస్తున్నా, రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రాకపోవడం విచారకరమని అన్నారు. సమావేశంలో ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు చిన్న రమేష్గౌడ్, నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
పథకాలకు యువకులే ప్రచారకర్తలు
యువజన సర్వీసుల శాఖ ఉమ్మడి జిల్లా కో ఆర్డినేటర్ రంజిత్రెడ్డిరామాయంపేట(మెదక్): యువత కేంద్ర పథకాలను సద్వినియోగం చేసుకోవాలని యువజన సర్వీసుల శాఖ ఉమ్మడి జిల్లా కో ఆర్డినేటర్ రంజిత్రెడ్డి సూచించారు. శనివారం ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన యువ సమ్మేళనంలో పాల్గొని మాట్లాడారు. సరైన ప్రచారం లేకపోవడంతో కేంద్ర ప్రభు త్వ పథకాలు చాలా వరకు ప్రజలకు తెలియడం లేదన్నారు. దీంతో ప్రజలు నష్టపోతున్నారని వాపోయారు. రిసోర్స్ పర్సన్, పోస్టల్ అధికారి నగేశ్ మాట్లాడుతూ.. ప్రపంచంలో అత్యధికంగా యువత ఉన్న దేశం భారతదేశం మాత్రమేనన్నారు. పోస్టల్ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో యువజన సర్వీసులశాఖ అధికారి కిరణ్, సహాయ అధికారి రాజు, డిగ్రీ కళాశాల అధ్యాపకుడు రవీందర్, వివిద కళాశాలల విద్యా ర్థులు పాల్గొన్నారు. -
ప్రణాళికలు సిద్ధం చేయండి
● జిల్లాలో 4.23 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం ● అధికారులతో అదనపు కలెక్టర్ నగేశ్ సమీక్షమెదక్ కలెక్టరేట్: ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లకు అవసరమైన ప్రణాళికను పటిష్టంగా సిద్ధం చేయాలని అదనపు కలెక్టర్ నగేశ్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లో ధాన్యం కొనుగోలు కార్యాచరణ ప్రణాళిక రూపకల్పనపై వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈసీజన్లో జిల్లావ్యాప్తంగా 503 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి 4.23 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయ డం లక్ష్యంగా నిర్ధారించినట్లు తెలిపారు. రైతులు నాణ్యత ప్రమాణాలతో కూడిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి మద్దతు ధర పొందాలని సూచించారు. మిల్లర్లు సమయానికి ధాన్యం దిగుమతి చేసుకోవాలన్నారు. ధాన్యం దిగుమతికి అవసరమైన 10 శాతం బ్యాంకు గ్యారంటీని, అగ్రిమెంట్ను వెంటనే సమర్పించాలన్నారు. 2024– 25 ఖరీఫ్, రబీ సీజన్లకు సంబంధించిన సీఎంఆర్ను ఎఫ్సీఐకి ప్రభుత్వం ఇచ్చిన గడువులోగా అందించాలన్నారు. పంట పక్వానికి రాకముందే కోతలు కోయవద్దని రైతులకు సూచించారు. సమావేశంలో జిల్లా పౌర సరఫరాల అధికారి నిత్యానందం, డీఎం జగదీశ్, వ్యవసాయ అధికారులు, రైస్ మిల్లర్లు పాల్గొన్నారు. -
ఉపాధ్యాయుడికి పురస్కారం
నర్సాపూర్ రూరల్: మండలంలోని కాగజ్మద్దూర్ పాఠశాలలో విధులు నిర్వర్తిస్తున్న ఉపాధ్యాయుడు, సాహితీవేత్త డాక్టర్ రాయరావు సూర్యప్రకాశ్రావు ఇటీవల హైదరాబాద్లో ఎర్రంరెడ్డి రంగనాయకమ్మ ధర్మనిధి పురస్కారం అందుకున్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కవి, రచయిత గా, పరిశోధకుడిగా, విమర్శకుడిగా, అనువాదకుడిగా సాహిత్య సంస్థల నిర్వాహకుడిగా, మన్కీబాత్ ప్రసంగాలను ఆకాశవాణి కోసం తెలుగులో అనువదించడం వంటి సేవలు అందిస్తున్నందుకు గాను గుర్తించి ఎంపిక చేశారని తెలిపారు. పురస్కారంతో మరింత ఉత్సాహంగా తన వంతు సేవలను అందిస్తానని పేర్కొన్నారు. -
తుట్టెలు కట్టి.. పురుగు పట్టి
● జిల్లాలో దొడ్డు బియ్యం నిల్వల పరిస్థితి ● ప్రభుత్వానికి రూ. 11 కోట్ల మేర నష్టం! ● పట్టించుకోని అధికార యంత్రాంగంరామాయంపేట(మెదక్): జిల్లాలో మిగిలిపోయిన 3,044 మెట్రిక్ టన్నుల దొడ్డు బియ్యం పురుగుల మయమైంది. నిల్వలను కాపాడాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పాడైపోయాయి. దీంతో ప్రభుత్వానికి రూ. 11 కోట్ల మేర నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి రేషన్ దుకాణాల ద్వారా ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ చేస్తోంది. అంతకుముందు జిల్లాకు సరఫరా చేసిన దొడ్డు బియ్యం స్టాక్ అలాగే ఉండిపోయింది. వీటిని తరలించే విషయమై సివిల్ సప్లై శాఖ తాత్సారం చేస్తుండటంతో నిల్వ ఉన్న బియ్యం తుట్టెలు కట్టి.. పురుగులు పట్టింది. చర్యలు తీసుకోకపోతే మరింత నష్టం జిల్లాలో 520 రేషన్ దుకాణాలున్నాయి. వీటి ద్వారా పేదలకు గత ఏప్రిల్ నుంచి సన్న బియ్యం సరఫరా చేస్తున్నారు. అంతకుముందు సరఫరా చేసిన దొడ్డు బియ్యం నిల్వలను పక్కన పెట్టాలని ఆదేశాలు జారీ కావడంతో జిల్లాలో రేషన్ దుకాణాలు, ఎంఎల్ఎస్ పాయింట్లు, బఫర్ గోదాముల్లో ఓ మూలన పెట్టారు. దాదాపు ఆరు నెలలు గడుసున్నా, అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. వీటిని భద్రపర్చడం డీలర్లకు సమస్యగా మారింది. పురుగులు పట్టడంతో నెలవారీ కోటా సన్న బియ్యానికి సైతం పారుతున్నాయని, ఎలుకల సమస్య పెరిగిందని ఆ ందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా జిల్లా పరిధిలోని రేషన్ దుకాణాలు, ఎంఎల్ఎస్ పాయింట్లు, బఫర్ గోదాంల్లో నిల్వ ఉన్న 3,044 మెట్రిక్ టన్నుల బియ్యం విలువ సుమారు రూ. 11 కోట్ల పైమాటే. పౌర సరఫరాల శాఖ అధికారులు త్వరితగతిన చర్యలు తీసుకోకపోతే నష్టం మరింత పెరిగే అవకాశం ఉంది. జిల్లాలో ఇలా.. దొడ్డు బియ్యం నిల్వలు మెట్రిక్ టన్నుల్లో.. గోదాంల్లో 259.254 రేషన్ దుకాణాల్లో 503.116 బఫర్ గోదాంల్లో 2,281.675 ఉన్నతాధికారులకు నివే దించాం జిల్లావ్యాప్తంగా నిల్వ ఉంచిన దొడ్డు బియ్యం స్టాక్కు పురుగులు పడుతున్నట్లు తమ దృష్టికి వచ్చింది. ఈవిషయమై ఉన్నతా ధికారుల దృష్టికి తీసుకెళ్లాం. అతి త్వరలో రాష్ట్రస్థాయిలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. – జగదీశ్, డీఎం, సివిల్ సప్లై -
అవి చైతన్య సూచికలు
ఎస్ఈఆర్టీ తయారు చేసిన అభ్యాస దీపికలు విద్యార్థులకు చైతన్య సూచికలుగా ఉపయోగపడుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ఉత్తీర్ణత శాతాన్ని ప్రభావితం చేస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తీర్ణతే లక్ష్యంగా రూపొందించిన ఈ పుస్తకాలు, మధ్య తరగతి విద్యార్థులు పాస్ కావడానికి తోడ్పడుతున్నాయి. – వెంకట్రాంరెడ్డి, స్కూల్ అసిస్టెంట్, కుర్తివాడ విద్యార్థులకు మేలు అక్టోబర్ 10 నుంచి పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు ప్రారంభిస్తాం. శతశాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా, అభ్యాస దీపికలు ఉపయోగపడుతున్నాయి. ముఖ్యంగా సాధారణ స్థాయి విద్యార్థి కూడా పాస్ అయ్యే విధంగా, వ్యాసరూప, లఘు, బహులైచ్చిక ప్రశ్న జవాబులు తయారు చేశారు. – రాధాకిషన్, డీఈఓ -
అభ్యాస దీపిక.. విజ్ఞాన దిక్సూచిక
● పది విద్యార్థుల కోసం రూపకల్పన ● అక్టోబర్ 10 నుంచి ప్రత్యేక తరగతులు మెదక్ అర్బన్: పదో తరగతిలో శతశాతం ఫలితా ల కోసం విద్యాశాఖ అధికారులు ప్రణాళికను సిద్ధం చేశారు. అక్టోబర్ 10 నుంచి ప్రత్యేక తరగతులు ప్రారంభించబోతున్నారు. మెరుగైన ఫలితాల సాధనలో భాగంగా ఈసారి కూడా అభ్యాసన దీపికలు పంపిణీ చేయనున్నారు. జిల్లాలో 2025–26 సంవత్సరానికి సంబంధించి మొత్తం 38,040 అభ్యాస దీపికలు మెదక్ పాఠ్య పుస్తక డిపోకు చేరుకున్నాయి. దసరా సెలవుల అనంతరం పాఠశాలలకు పంపిణీ చేయనున్నట్లు తెలిసింది. శతశాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా.. ఈ ఏడాది మార్చిలో జరగబోయే పదో తరగతి పరీక్షల్లో శతశాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా ఎస్ఈఆర్టీ ఆధ్వర్యంలో విషయ నిపుణులతో తయారు చేసిన అభ్యాస దీపికలు పంపిణీ చేస్తున్నారు. జీవశాస్త్రం, భౌతిక, గణితం, సాంఘీక శాస్త్రాలకు సంబంధించి దీపికలు ముద్రించారు. జిల్లాకు మొత్తం 38,040 అభ్యాస దీపికలు చేరుకున్నాయి. పుస్తకంలో లఘు, వ్యాసరూప, బహుళైచ్చిక ప్రశ్నలకు జవాబులతో తయారు చేశారు. వార్షిక పరీక్షలను దృష్టిలో పెట్టుకొని, అందులో ఎలాంటి ప్రశ్నలు వస్తాయి, వాటికి జవాబులు ఎలా రాయాల్లో వివరించారు. పాఠాల వారీగా ఎలాంటి ప్రశ్నలు, బిట్లు వస్తాయనే విషయాలను పొందుపరిచారు. చదు వులో వెనుకబడిన విద్యార్థులకు ఇవి ఎంతో ఉపయుక్తంగా ఉంటాయని టీచర్లు చెబుతున్నారు. జిల్లాలో 146 మండల పరిషత్, 15 కేజీబీవీ, 2 మైనార్టీ వెల్ఫేర్, 6 ఎంజేపీ, 7 మోడల్, 11 టీఎస్డబ్ల్యూఆర్ఈఐ రెసిడెన్షియల్ స్కూళ్లు, ఒక ఆశ్రమ పాఠశాల ఉండగా, 9,883 విద్యార్థులు ఉన్నారు. అలాగే 3, 4, 5 తరగతులకు సంబంధించి పార్ట్ బీ గణితం, ఈవీఎస్ టైటిల్స్ రావాల్సి ఉందని సమాచారం. -
నిధులు లేకున్నా.. పనులు
● కార్యదర్శుల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావిస్తా ● నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి వెల్దుర్తి(తూప్రాన్)/నర్సాపూర్: పంచాయతీల్లో నిధులు లేకున్నా కార్యదర్శులు సొంత డబ్బులు ఖర్చుపెట్టి గ్రామాల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించడం అభినందనీయమని ఎమ్మెల్యే సునీతారెడ్డి అన్నారు. శుక్రవారం మాసాయిపేట రైతు వేదికలో బతుకమ్మ పండుగ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా పారిశుద్ధ్య నిర్వహణ, తడి, పొడి చెత్త సేకరణ, తాగునీటి సరఫరా వంటి పనులను ప్రజలకు ఇబ్బందులు కలగకుండా కొనసాగిస్తున్నట్లు పంచాయతీ కార్యదర్శులు తెలిపారు. పంచాయతీ వర్కర్లకు నెలనెలా జీతాలు రాకపోవడంతో తమ సొంత డబ్బులు వారికి చెల్లించి పనులు చేయించుకోవాల్సి వస్తుందని వాపోయారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సకాలంలో ఎన్నికలు నిర్వహిస్తే పంచాయతీలకు నిధులు సమకూరేవని అన్నారు. కార్యదర్శులు లేవనెత్తిన సమస్యలను అసెంబ్లీ ప్రస్తావిస్తానని పేర్కొన్నారు. అకాలవర్షాలతో దెబ్బతిన్న చెరువులు, కుంటలు, కల్వర్టులు, రోడ్లు మరమ్మతులకు నిధులు మంజూరు చేయాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లానన్నారు. పంట నష్టపోయిన బాధిత రైతులకు ఎకరాకు రూ. 25 వేలు చొప్పున నష్ట పరిహారం అందించాలని డిమా ండ్ చేశారు. సమావేశంలో డీఎల్పీఓ యాదయ్య, ఎంపీడీఓ విఘ్నేశ్వర్, తహసీల్దార్ జ్ఞానజ్యోతి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. అనంతరం క్యాంపు కార్యాలయంలో కౌడిపల్లి మండలం దేవులపల్లికి పలువురు నాయకులు కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్లో చేరగా ఆహ్వానించారు. తెలంగాణకు కేసీఆర్ పాలనే శ్రీరామ రక్ష అని అన్నారు. అలాగే పలువురికి సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. -
పని చేసే వారి వివరాలు తప్పనిసరి
తూప్రాన్ డీఎస్పీ నరేందర్గౌడ్మనోహరాబాద్(తూప్రాన్): పరిశ్రమల్లో పని చేసే వారి వివరాలను సేకరించాలని, కార్మికుల భద్రత చూడాల్సిన బాధ్యత పరిశ్రమ ప్రతినిధులపై ఉందని తూప్రాన్ డీఎస్పీ నరేందర్గౌడ్ అన్నారు. శుక్రవారం మండలంలోని కొండాపూర్లో పరిశ్రమల ప్రతినిధులు ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కొంత మంది అభివృద్ధి పనులకు ఆటంకాలు కలిగిస్తున్నారని తమ దృష్టికి వచ్చిందన్నారు. శాంతి భద్రతల సమస్యలుంటే పోలీసుల దృష్టికి తేవాలన్నారు. పరిశ్రమల ప్రాంతంలో పోలీస్ అవుట్ పోస్ట్ ఏర్పాటు చేయాలని డీఎస్పీని పరిశ్రమ ప్రతినిధులు కోరారు. కార్యక్రమంలో తూప్రాన్ సీఐ రంగాకృష్ణ, ఎస్ఐ సుభాశ్గౌడ్, పరిశ్రమల అసోసియేషన్ అధ్యక్షుడు శ్రవణ్, ప్రధాన కార్యదర్శి సుబ్రమణ్యం, ఉపాధ్యక్షుడు శ్రీకాంత్, కార్యదర్శి సాంబశివరావు, ప్రతినిధులు పాల్గొన్నారు. -
బాల్య వివాహాలను అరికడదాం
మెదక్ కలెక్టరేట్: బాల్య వివాహాలతో ఆడపిల్లల భవిష్యత్ అంధకారం అవుతుందని, వాటిని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని జిల్లా బాలల సంరక్షణ అధికారి కరుణశీల అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లోని సంక్షేమ శాఖ కార్యాలయంలో బాల్య వివాహాల బారి నుంచి విముక్తులైన పిల్లలు, వారి తల్లిదండ్రులకు అవగాహన కార్యక్రమం నిర్వ హించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బాల్య వివాహాలతో జరిగే అనర్థాలను వివరించారు. కార్యక్రమంలో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు ఉప్పలయ్య, విజన్ సంస్థ డైరెక్టర్ కై లాష్, ప్లాన్ ఇండియా అధికారులు సుజాత, రాహుల్, రాజు, కమ్యూనిటీ ఆర్గనైజర్లు పాల్గొన్నారు. -
మెరుగైన వసతులు కల్పిస్తాం
కలెక్టర్ రాహుల్రాజ్ చేగుంట(తూప్రాన్): వసతి గృహాల్లో మెరుగైన వసతుల కల్పనకు కృషి చేస్తామని కలెక్టర్ రాహుల్రాజ్ అన్నారు. మండల కేంద్రంలోని ఎస్సీ, బీసీ బాలుర వసతి గృహాలను శుక్రవారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేసారు. ఈసందర్భంగా నీరు, హాస్టల్ పైకప్పుల నాణ్యత, మెరుగైన విద్యుత్ సౌకర్యం వంటి అంశాలను పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యలపై ఆరా తీశారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా హాస్టల్ భవనాల నాణ్యతను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ఆయన వెంట రెవెన్యూ అధికారులు, హాస్టల్ వార్డెన్లు ఉన్నారు. 24 వరకు స్పెషల్ ఇన్సెంటీవ్ రివిజన్ మెదక్ కలెక్టరేట్: ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈనెల 24 వరకు స్పెషల్ ఇన్సెంటీవ్ రివిజన్ పూర్తి చేయాలని కలెక్టర్ రాహుల్రాజ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్రెడ్డి, అదనపు సీఈఓ లోకేష్ కుమార్తో కలిసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి దిశా నిర్దేశం చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా స్పెషల్ ఇన్సెంటీవ్ రివిజన్ పూర్తి చేస్తామని తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్ నగేశ్, ఆర్డీఓలు రమాదేవి, మహిపాల్రెడ్డి, ఎన్నికల విభాగం పర్యవేక్షకులు, సిబ్బంది పాల్గొన్నారు. -
ఇందిరమ్మ ఇళ్ల తనిఖీ
నిజాంపేట(మెదక్): మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇళ్లను జెడ్పీ సీఈఓ ఎల్లయ్య శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇళ్ల పురోగతిని పరిశీలించి మాట్లాడారు. ప్రభుత్వ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం నిరుపేదలకు వరం లాంటిదన్నారు. సొంత స్థలంలో ఇల్లు కట్టుకునే అవకాశం ఇవ్వడం గొప్ప విషయమని కొనియాడారు. కార్యక్రమంలో ఎంపీడీఒ రాజిరెడ్డి, పంచాయతీ కార్యదర్శి నర్సింలు తదితరులు పాల్గొన్నారు. మనోహరాబాద్(తూప్రాన్): మహిళలు అన్ని రంగాల్లో రాణించి ఆదర్శంగా నిలవాలని జిల్లా అదనపు డీఆర్డీఓ సరస్వతి అన్నారు. శుక్ర వారం మండల కేంద్రంలో ఇందిరా శక్తి సంబరాల్లో భాగంగా నగదు రహిత లావాదేవీలపై మహిళలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహిళలు వ్యాపారం నిర్వహించడానికి ముందుకు వస్తున్నారని, అందులో ఎంతోమంది అభివృద్ధి బాటలో పయనిస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో డీపీఎం బీఎల్ వెంకటేశం, ఏపీఎం సత్యనారాయణ, సీసీలు కిషన్, మమత, శోభారాణి తదితరులు పాల్గొన్నారు. నర్సాపూర్: విద్యార్థులు ప్రణాళికాబద్ధంగా చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలని జిల్లా ఇంటర్మీడియెట్ అధికారిణి మాధవి సూచించారు. శుక్రవారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఏర్పాటు చేసిన స్వాగతోత్సవం కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రభుత్వ విద్యా సంస్థల్లో నాణ్యమైన బోధన అందిస్తున్నట్లు చెప్పారు. ఈసందర్భంగా విద్యార్థులకు పలు రకాల ఆటల పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ శేషాచారి, లెక్చరర్లు సిబ్బంది పాల్గొన్నారు. నిజాంపేట(మెదక్): మండల పరిధిలోని నస్కల్ రైతు వేదిక వద్ద యూరియా కోసం శుక్రవారం రైతులు బారులు తీరారు. గురువారం రాత్రి నుంచే చెప్పులు లైన్లో పెట్టి అక్కడే నిద్రించారు. కాగా గ్రామానికి 480 బస్తాల యూరియా రాగా అందజేశారు. అధికారులు స్పందించి అందుబాటులో యూరియా ఉంచాలని రైతులు వేడుకున్నారు. కౌడిపల్లి(నర్సాపూర్): జిల్లాలో ఇప్పటివరకు 2,581 ఇందిరమ్మ ఇళ్లకు బిల్లులు చెల్లించినట్లు హౌసింగ్ పీడీ మాణిక్యం చౌహాన్ తెలిపారు. శుక్రవారం మండలంలోని ముట్రాజ్పల్లిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంతో పాటు ఇటీవల గ్యాస్ సిలిండర్ పేలి ధ్వంసమైన ఆకుల శ్రీనివాస్ ఇంటిని పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విడతల వారీగా బిల్లులు చెల్లిస్తున్నామని, ఈ వారం 281 ఇళ్లకు రూ. 2.91 కోట్లు చెల్లించినట్లు చెప్పారు. కార్యక్రమంలో హౌసింగ్ ఏఈ సుష్మ, పంచాయతీ కార్యదర్శి చంద్రశేఖర్రెడ్డి పాల్గొన్నారు. పంటకోత ప్రయోగాలపై అవగాహన మెదక్ కలెక్టరేట్: జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్లో పంట కోత ప్రయోగాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి ఇందిర, డీఏఓ దేవ్కుమార్ పాల్గొని వ్యవసాయ విస్తరణ అధికారులకు అవగాహన కల్పించారు. -
ధాన్యం సేకరణకు సన్నద్ధం
ఖరీఫ్ ధాన్యం సేకరణకు అధికారులు సన్నద్ధమయ్యారు. అక్టోబర్ 1 నుంచి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించేందుకు చర్యలు చేపట్టారు. కాగా గతేడాది కంటే ఈసారి ధాన్యం ఎక్కువగా వస్తుందని అంచనా వేస్తున్నారు. అందుకనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు. – మెదక్జోన్ జిల్లాలో ఈ వానాకాలం సీజన్లో 3.5 లక్షల ఎకరాల్లో రైతులు వరి సాగు చేశారు. అందులో దొడ్డురకం 2.28 లక్షలు, సన్న రకం 77 వేల ఎకరాల్లో సాగైంది. కాగా దొడ్డు రకం ఎకరాకు 25 క్వింటాళ్ల దిగుబడి రాగా, సన్నరకం మాత్రం ఎకరాకు 20 క్వింటాళ్లు మాత్రమే వస్తుందని వ్యవసాయశాఖ అంచనా వేస్తోంది. ఈలెక్కన మొత్తం 7.1 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుండగా, అందులో 3.41 లక్షల మెట్రిక్ టన్నులు బయట వ్యాపారులకు విక్రయించగా, కొనుగోలు కేంద్రాలకు 3.60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని భావిస్తున్నారు. ఇందుకోసం జిల్లావ్యాప్తంగా 480 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తుండగా, వాటిలో 90 సెంటర్లలో ప్రత్యేకంగా సన్న ధాన్యం సేకరించనున్నారు. కాగా గతేడాది మాదిరిగా సన్న ధాన్యం బస్తాలను గుర్తించేందుకు పచ్చధారంతో కుట్టు వేయనున్నారు. కాగా ఈ ఏడాది నుంచి కొనుగోలు కేంద్రాల్లో ఆటోమేటిక్ ప్యాడీ క్లీనర్లను అందుబాటులో ఉంచనున్నట్లు సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. ప్రస్తుతం 8 మిషన్లు అందుబాటులో ఉన్నాయని, మరో 200 ప్యాడీ క్లీనర్లను కొనుగోలు చేసి తెప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. లక్ష మెట్రిక్ టన్నులు అదనం! కాగా గతేడాది ఖరీఫ్ సీజన్లో 2.60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 480 కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించారు. ఈ ఏడాది 3.60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అంచనా వేశారు. ఈ లెక్కన గత సీజన్తో పోలిస్తే లక్ష మెట్రిక్ టన్నుల ధాన్యం ఎక్కువగా రానుంది. కాగా ఈ ధాన్యాన్ని మరాడించేందుకు 91 రైస్ మిల్లులకు ధాన్యాన్ని ఇచ్చే అవకాశం ఉంది. ముందుగానే బ్యాంకు గ్యారంటీలతో పాటు మిల్లింగ్ అగ్రిమెంట్లు చేస్తున్నట్లు తెలిసింది. అక్టోబర్ 1 నుంచి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించేలా చర్యలు జిల్లావ్యాప్తంగా 480 సెంటర్ల ఏర్పాటు సన్న ధాన్యం సేకరణకు 90 ప్రత్యేక కేంద్రాలు 3.60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అంచనా 50 లక్షల గన్నీ బ్యాగులు సిద్ధం 3.60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణకు 90 లక్షల గన్నీ బ్యాగులు అవసరం. కానీ ప్రస్తుతం 50 లక్షల బ్యాగులు మాత్రమే అందుబాటులో ఉన్న ట్లు తెలుస్తోంది. మరో 40 లక్షలను అవసరం మేరకు విడతల వారీగా తెప్పించనున్నట్లు సమాచారం.ఏర్పాట్లు చేస్తున్నాం ఈ ఖరీఫ్ సీజన్లో సాగు చేసిన ధాన్యాన్ని కొను గోలు చేసేందుకు అక్టోబర్ 1 నుంచి సెంటర్లను ఏర్పాటు చేస్తున్నాం. మొదటి వారంలోనే కొనుగోళ్లు ప్రారంభిస్తాం. రైతులు తక్కు వ ధరకు దళారులకు విక్రయించి మోసపోకుండా కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించాలి. – జగదీష్కుమార్, జిల్లా సివిల్ సప్లై అధికారి -
నేడు ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ రాక
చేగుంట(తూప్రాన్): మండలంలోని పొలంపల్లికి శుక్రవారం ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య రానున్నట్లు దళిత బహుజన ఫ్రంట్ జాతీయ కార్యదర్శి శంకర్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇటీవల ఆత్మహత్య చేసుకున్న దళిత మహిళ లక్ష్మి కుటుంబీకులను పరామర్శిస్తారని తెలిపారు. మృతికి గల కారణాలను అడిగి తెలుసుకుంటారని చెప్పారు. మెదక్ కలెక్టరేట్: తమకు రావాల్సిన వేతనాల్లో కోత పెట్టడం అన్యాయమని మెదక్ మైనార్టీ బాలికల హాస్టల్, కళాశాల ఔట్సోర్సింగ్ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం కలెక్టరేట్లో నిరసన తెలిపి కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. రెండు నెలలుగా వేతనాలు రాకపోవడంతో ఇబ్బంది పడ్డామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల వేతనాలు అందజేసిన ప్రభుత్వం కోతపెట్టిందని వాపోయారు. ఎక్కడైన వేతనాలు పెంచుతారు కానీ, తగ్గించడం ఏంటని ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో హాస్టల్, కళాశాల ఉద్యోగినులు రాజేశ్వరీ, చైతన్య, జయశ్రీ, లలిత, స్వప్న తదితరులు పాల్గొన్నారు. చేగుంట(తూప్రాన్): మండల కేంద్రంలోని వడియారం రైల్వేస్టేషన్లో రిజర్వేషన్ కౌంటర్ ఏర్పాటు చేశారు. దీంతో వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల ఇబ్బందులు తీరనున్నాయి. చేగుంట సమీపంలోని డివిజన్ కేంద్రాలైన రామాయంపేట, తూప్రాన్తో పాటు వెల్దుర్తి, చిన్నశంకరంపేట, మాసాయిపేట, నార్సింగి, దౌల్తాబాద్ తదితర మండలాల్లోని పరిశ్రమల్లో వివిధ రాష్ట్రాల కార్మికులు పని చేస్తున్నారు. వీరితో పాటు స్థానికులు వివిధ ప్రాంతాలకు రైలు ప్రయాణం చేయాలంటే సికింద్రాబాద్, హైదరాబాద్లో టికెట్లు బుకింగ్ చేసుకునేవారు. లేదంటే ప్రైవేట్ ఆన్లైన్ సెంటర్లలో ఎక్కువ డబ్బులు చెల్లించేవారు. వడియారం రైల్వేస్టేషన్కు రిజర్వేషన్ కౌంటర్ మంజూరు కాగా, ఈనెల 22న ఎంపీ రఘునందన్రావుతో పాటు రైల్వే అధికారులు ప్రారంభించనున్నారు. నాణ్యమైన విత్తనాలు ఎంచుకోవాలి నర్సాపూర్ రూరల్: రైతులు పంటలు సాగు చేసే ముందు నాణ్యమైన విత్తనాలను ఎంచుకోవాలని నత్నయ్యపల్లిలోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త లక్ష్మణ్ రైతులకు సూచించారు. గురువారం మండలంలోని రెడ్డిపల్లిలో వ్యవసాయశాఖ పంపిణీ చేసిన ఎంటీయూ 1010 వరి విత్తనాలతో పంట సాగు చేసిన రైతు పెంటేశ్ పొలా న్ని సందర్శించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు పంటలు సా గు చేసే ముందు భూసార పరీక్షలు చేయించుకోవాలన్నారు. వాటి ఫలితాల అనుగుణంగా పంటలు వేయాలని తెలిపారు. అనంతరం పంటల రకాలు, సాగులో మెలకువలపై అవగాహన కల్పించారు. నానో యూరియాతో మంచి లాభాలు ఉంటాయని మండల వ్యవసాయ అధికారి దీపిక వివరించారు. కార్యక్రమంలో ఏఈఓలు లక్ష్మి, తేజస్విని, ఆత్మ బీటీఎం హరిత, రైతులు పాల్గొన్నారు. నిజాంపేట(మెదక్): మండల కేంద్రంలో గురువారం పోలీస్స్టేషన్ను ఎస్పీ శ్రీనివాసరావు తనిఖీ చేసి రికార్డులు పరిశీలించారు. స్టేషన్కు వచ్చే ప్రతి ఫిర్యాదును ఆన్లైన్లో నమోదు చేయాలని సిబ్బందికి సూచించారు. పోలీస్ అధికారులకు తాము కేటాయించిన గ్రామాలపై పూర్తి అవగాహన ఉండాలని సూ చించారు. సీసీ కెమెరాల ఏర్పాటు కోసం కృషి చేయాలన్నారు. ప్రతి రోజు వాహనాల తనిఖీ నిర్వహించాలని ఆదేశించారు. ఆయన వెంట డీఎస్పీ నరేందర్గౌడ్, రామాయంపేట సీఐ వెంకటరాజాగౌడ్, ఎస్ఐ రాజేష్ ఉన్నారు. -
విచ్చలవిడిగా జూదం!
● జిల్లాలో 8 నెలల్లో 481 కేసులు నమోదు ● దాడులకు వెరవని పేకాటరాయుళ్లు ● ఇటీవల పట్టుబడిన ఇద్దరు పోలీసులు పేకాట సరదాగా మొదలై.. ఆ తర్వాత బానిసై జేబులను గుల్లచేస్తోంది. జిల్లాలో వాణిజ్య వ్యాపారులు, ఉద్యోగులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు జోరుగా ఆడుతున్నట్లు తెలిసింది. కట్టడి చేసేందుకు పోలీస్ యంత్రాంగం శాయశక్తులా కృషి చేస్తున్నా.. పేకాటరాయుళ్లు అడ్డాలు మారుస్తూ ఆటను మాత్రం వదలటం లేదు. కొందరు పోలీసులు సైతం ఈ బాటలోనే పయనిస్తుండటం గమనార్హం. – మెదక్జోన్జిల్లాలో గతేడాది పేకాట ఆడేవారిపై పోలీసులు 39 కేసులు నమోదు చేసి, 276 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 10,19,272 నగదును స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఈ ఏడాది గడిచిన ఎనిమిది నెలల్లో 481 మందిపై కేసులు నమోదు చేశారు. వారి నుంచి 8,39,467 నగదును స్వాధీనం చేసుకొని సీజ్ చేసినట్లు పోలీసుల రికార్డులు చెబుతున్నాయి. కాగా గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది కేవలం 8 మాసాల్లోనే పేకాట ఆడి అరెస్ట్ అయిన వారి సంఖ్య 205కు పెరిగింది. ఈలెక్కన సుమారు రెండింతలు అయింది. గత నెలలో పట్టణంలోని ఓ ఇంట్లో పేకాట ఆడుతుండగా పట్టుబడిన వారిలో ఇద్దరు పోలీసులు సైతం ఉండటం గమనార్హం. ఉక్కుపాదం మోపుతున్నా.. పేకాట ఆడేవారు ఎంతటి వారైనా వదిలేది లేదని ఎస్పీ ఇప్పటికే క్షేత్రస్థాయి సిబ్బందికి ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. గత నెలలో మెదక్లో పేకాట ఆడేవారిలో ఇద్దరు పోలీసులు సైతం చిక్కారు. విషయం తెలుసుకున్న ఎస్సీ వారిద్దరిని వెంటనే సస్పెండ్ చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకున్నారు. కాగా గతేడాదితో పోలిస్తే పేకాట ఆడుతున్న వారి సంఖ్య పెరగటం ఆందోళన కలిగిస్తోంది. ఛిద్రమవుతున్న కుటుంబాలు పేకాటకు అలవాటు పడిన వారు రూ. లక్షలు పోగొట్టుకుంటున్నారు. డబ్బులు పోయిన వారు తిరిగి అందులోనే సంపాదించాలనే ఉద్దే శంతో అప్పులు చేసి ఆస్తులు అమ్ముకుంటున్నా రు. జూదంలో డబ్బులు వచ్చిన వారు మరింత సంపాదించాలనే అత్యాశకు పోయి జేబులు గుళ్ల చేసుకుంటున్నారు. అప్పులు చేసి స్థిరాస్తులు విక్రయించిన వారు లేకపోలేదు. పేకాట ఆడేవారు పలు రకాల అడ్డాలను ఎంచుకుంటున్నారు. బడాబాబులు ఏకంగా జిల్లా కేంద్రంలోని పలువురి ఇళ్లలో ఆడుతుండగా, మరికొందరు ఇళ్లను అద్దెకు తీసుకొని వాటినే అడ్డాలుగా మార్చుకుంటున్నారు. మరికొందరు ఫాంహౌస్లు, ఇంకొందరు నిర్మాణాల్లో ఉన్న ఇళ్లు, మండల కేంద్రాలు, గ్రామాల్లో అయితే ఏకంగా పంట పొలాలను స్థావరాలుగా చేసుకున్నట్లు సమాచారం. -
విద్యార్థుల్లో ప్రతిభను వెలికితీయాలి
కలెక్టర్ రాహుల్రాజ్ హవేళిఘణాపూర్(మెదక్)/పాపన్నపేట: విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయాలని కలెక్టర్ రాహుల్రాజ్ అన్నారు. గురువారం మండల పరిధిలోని ఉన్నత పాఠశాలను పరిశీలించారు. విద్యార్థుల తరగతి గదుల చుట్టూ పరిశుభ్రత, నీటి సౌకర్యం గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం పాపన్నపేట పీహెచ్సీలో కొనసాగుతున్న స్వస్థ్ నారీ, సశక్త్ పరివార్ కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇంటికి దీపమైన ఇల్లాలు ఆరోగ్యంగా ఉంటే, కుటుంబం ఆనందంగా ఉంటుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళా సంక్షేమంపై దృష్టి పెట్టి, యాక్షన్ ప్లాన్ రూపొందించాయన్నారు. 15 రో జులు ప్రతి వైద్య కేంద్రంలో నిరంతర వైద్య సేవలు అందిస్తామని వివరించారు. -
అక్షరాస్యత వైపు అతివలు
● ‘ఉల్లాస్’ పేరిట ప్రత్యేక కార్యక్రమం ● జిల్లాలో నిరక్షరాస్యుల గుర్తింపు ● మొదటి విడతలో 33,750 మంది అక్షరాలు నేర్వని అతివలకు కనీసం చదవడం, రాయడం, అంకెలు గుర్తించడం, లెక్కలు నేర్పించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈమేరకు జిల్లా పరిధిలోని మహిళా సంఘాల్లో ఉన్న నిరక్ష్యరాసులను గుర్తించి ఉల్లాస్ యాప్లో నమోదు చేస్తున్నారు. మహిళా సంఘాల సభ్యులు విద్యావంతులైతే సంఘాలు మరింత పటిష్టంగా కొనసాగి, నిధుల దుర్వినియోగానికి అడ్డుకట్ట పడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. – రామాయంపేట(మెదక్) జిల్లా పరిధిలోని 13,078 సంఘాల్లో మొత్తం 1,37,255 మంది సభ్యులున్నారు. వీరిలో సుమారు 50 శాతం మేర నిరక్ష్యరాసులన్నారని సమాచారం. వీరిలో అక్షరజ్ఞానం లేని 33,750 మందిని మొదటి విడతలో గుర్తించిన అధికారులు, ఉల్లాస్ యాప్లో నమోదు చేశారు. వీరికి విద్యాబుద్దులు నేర్పడానికి గాను ప్రతి 10 మందికి ఒకరి చొప్పున 4,000 మందికి పైగా వలంటీర్లను నియమించారు. ఈమేరకు మండలాల పరిధిలో ఎంపిక చేసిన సభ్యులకు అక్షర వికాసం అనే పుస్తకాలను అందజేశారు. త్వరలో 100 రోజుల పాటు శిక్షణ ఇచ్చి, వచ్చే మార్చిలో పరీక్షలు నిర్వహించనున్నారు. మహిళా సంఘాల సభ్యులకు చదవడం, రాయడం, సంఖ్యా పరిజ్ఞానం నేర్పనున్నారు. జిల్లా విద్యాశాఖ, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ సంయుక్త భాగస్వామ్యంతో కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఓపెన్ స్కూల్లో పది, ఇంటర్ మహిళా సంఘాల్లో జిల్లా పరిధిలో కనీస పరిజ్ఞానం ఉండి పది, ఇంటర్ పూర్తి చేయని 1,500 మందిని ఎంపిక చేశారు. వీరు పదో తరగతి చదవడానికి గాను రూ. 1,150, ఇంటర్ కోసం రూ. 1,500 రుసుం చెల్లించాల్సి ఉంటుంది. వీరికి ఓపెన్ స్కూళ్లలో చదువు చెప్పనున్నారు. ఇందుకోసం జిల్లా పరిధిలో మొత్తం 19 స్కూళ్లను ఎంపిక చేశారు. జిల్లాలో కనీసం రెండు వేల మందిని పది, ఇంటర్ పూర్తి చే యించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని సంబంధిత అధికారులు తెలిపారు. అక్షరాస్యులుగా తీర్చిదిద్దుతాం మహిళా సంఘాల్లో ఉన్న సభ్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం. ఇందుకోసం తాము మొదటి విడతగా గుర్తించిన వారిని ఉల్లాస్ యాప్లో నమోదు చేశాం. త్వరలో వారికి శిక్షణ ప్రారంభిస్తాం. పదో తరగతి, ఇంటర్ పూర్తి చేయని వారిని సైతం ఓపెన్ స్కూల్లో చేర్పించి చదువు నేర్పిస్తాం. – మురళిమోహన్, జిల్లా వయోజన విద్య సమన్వయ అధికారి -
22 నుంచి శరన్నవరాత్రి ఉత్సవాలు
వివిధ రూపాల్లో దర్శనమివ్వనున్న వన దుర్గమ్మపాపన్నపేట(మెదక్): ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయలలో ఈనెల 22 నుంచి దేవి శరన్నవరాత్రోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈమేరకు ఆల య సిబ్బంది గురువారం మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్కు ఆహ్వానపత్రిక అందజేశారు. మొ దటి రోజు సోమవారం దుర్గమ్మ తల్లి బాలత్రిపుర సుందరి దేవి అలంకారంతో దర్శనమిస్తారు. మంగళవారం గాయత్రీదేవి, బుధవారం అన్నపూర్ణ, గురువారం వనదుర్గాదేవి, శుక్రవారం మహాలక్ష్మిదేవి, శనివారం లలిత త్రిపుర సుందరీదేవి, ఆదివారం మహాచండి, సోమవారం సరస్వతీ దేవి, మంగళవారం దుర్గాదేవి, బుధవారం మహిషాసుర మర్దిని, గురువారం రాజరాజేశ్వరిదేవి అలంకారంతో భక్తులకు దర్శనమిస్తారు. కాగా ఈనెల 29న అమ్మవారికి బోనాలు, అక్టోబర్ 1న సువా సిని పూజ, చండీహోమం ఉంటుంది. వనదుర్గా సేవా సమితి ఆధ్వర్యంలో ప్రతి రోజు అన్నదానం నిర్వహిస్తారు. -
రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపిక
పాపన్నపేట(మెదక్): మండల కేంద్రంలో బుధవారం రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికలు నిర్వహించారు. ఈ పోటీల్లో జిల్లాలోని వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థినీవిద్యార్థులు పాల్గొన్నారు. ఇందులో 12మంది బాలురు, 12 మంది బాలికలను ఎంపిక చేశారు. వీరంతా ఈ నెల 25న నిజామాబాద్లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారు. కార్యక్రమంలో జిల్లా కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి రమేష్, ఉపాధ్యక్షుడు కుమార్, జాయింట్ సెక్రటరీ శ్రీకాంత్, రాజగౌడ్, శశికుమార్, కోశాధికారి రవి, మధు, ఆంజనేయులు, శ్రీను, రేణుక, లాజర్, గీత, మీనా పాల్గొన్నారు. -
రైతు ముంగిట్లో వ్యవసాయ శాస్త్రవేత్తలు
కౌడిపల్లి(నర్సాపూర్): మండలంలోని తునికి కేవీకే ఆధ్వర్యం ఆరుగురు వ్యవసాయ యువ శాస్త్రవేత్తలు బుధవారం తునికిలో పర్యటించారు. కేవీకే హెడ్అండ్ సైంటిస్ట్ శంభాజీ దత్తాత్రేయ నల్కర్, సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ రవికుమార్ ఆధ్వర్యంలో 115వ ఫౌండేషన్ కోర్స్ ఫర్ అగ్రికల్చర్ సర్వీసెస్లో భాగంగా కొత్తగా నియామకమైన వివిధ రాష్ట్రాలకు చెందిన యువ శాస్త్రవేత్తలు వచ్చారు. ఇందులో సందీప్ (ఆంధ్రప్రదేశ్), రణబీర్ (పశ్చిమబెంగాల్), గోపాల కృష్ణ (తమిళనాడు), లావణ్య (తెలంగాణ), రవిప్రకాష్ (ఉత్తరప్రదేశ్), రుచిత(కర్ణాటక) ఉన్నారు. వీరంతా గ్రామంలో నెలరోజులపాటు పర్యటించి వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించిన సమాచారం సేకరించి రైతులతో చర్చించనున్నట్లు కేవీకే శాస్త్రవేత్త రవికుమార్ తెలిపారు. అనంతరం యువ శాస్త్రవేత్తలను గ్రామస్తులకు పరిచయం చేసి సన్మానించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి సౌజన్య, మాజీ సర్పంచ్ సాయిలు, మానిక్యరెడ్డి, గ్రామస్తులు పాల్గొన్నారు. -
తెలంగాణ తల్లి పాత ఫొటోతో!
చిన్నశంకరంపేట(మెదక్): ప్రభుత్వం తెలంగాణ తల్లి ముఖచిత్రం మార్చినా అధికారులు మాత్రం నేటికీ తెలంగాణ తల్లి పాత ఫొటోలనే ఉపయోగిస్తున్నారు. బుధవారం తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా మండల కేంద్రంలోని విద్యా వనరుల కేంద్రం వద్ద తెలంగాణ తల్లి చిత్రపటం పాతదే పెట్టారు. దీంతో జాతీయ జెండా ఆవిష్కరణకు వచ్చిన నాయకులు విస్మయం వ్యక్తం చేశారు. అలాగే చిన్నశంకరంపేట ఎంపీడీఓ కార్యాలయంతో పాటు ప్రభుత్వ కార్యాలయాల్లో 9 గంటలకు జాతీయ జెండాను ఆవిష్కరించగా.. తహసీల్దార్ కార్యాలయంలో మాత్రం తహసీల్దార్ సమయానికి రాకపోవడంతో జాతీయ జెండాను సమయానికి ఆవిష్కరించలేదు. దాదాపు 9:15 నిముషాల వరకు వేచి చూసిన ఇతర శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు వచ్చి వెళ్లిపోగా.. ఆ తర్వాత తహసీల్దార్ మాలతి వచ్చి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అయితే ఈ విషయంపై కలెక్టర్కు ఫిర్యాదు చేయనున్నట్లు మాజీ సర్పంచ్ రాజిరెడ్డి తెలిపారు. -
విప్లవాత్మక అభివృద్ధి
● ముమ్మరంగా ఆరుగ్యారంటీల అమలు ● సమస్యల పరిష్కారంలో ముందంజ ● ప్రజాపాలన దినోత్సవంలో మంత్రి వివేక్ వెంకటస్వామి మెదక్జోన్: ఎందరో మహానుబావుల త్యాగఫలితమే నేటి తెలంగాణ అభివృద్ధికి నాంది పలికిందని జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి పేర్కొన్నారు. ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం కలెక్టరేట్లో ఆయన జాతీయజెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సెప్టెంబర్ 17 రాష్ట్రంలో కీలకమైందని, ఈ ప్రాంతం దేశంలో విలీనమై 77 ఏళ్లు గడుస్తుందన్నారు. స్వేచ్ఛ, స్వాతంత్య్రం, ప్రజాస్వామ్యం సొంతం కావడానకి ఎంతో మంది ప్రాణత్యాగం చేశారన్నారు. రాచరిక వ్యవస్థకు వ్యతిరేకంగా దొడ్డి కొమురయ్య, చాకలి ఐలమ్మ, మల్లుస్వరాజ్యం, ఆరుట్ల కమలాదేవి పోరాటం చేశారన్నారు. అప్పటి ప్రధాని నెహ్రూ, హోంమంత్రి వల్లబాయ్ పటేల్ కృషితో 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ సంస్థానం దేశంలో విలీనమైందన్నారు. హామీల అమలుకు కృషి రాష్ట్ర ప్రభుత్వం ఆరుగ్యారంటీల అమలుతో పాటు ప్రజా సమస్యల పరిష్కారంలో ముందంజలో ఉందని మంత్రి వివేక్ అన్నారు. అధికారంలోకి వచ్చిన 48 గంటల నుంచి హామీల అమలుకు కృషి చేస్తుందన్నారు. ఊరూరా ఇందిరమ్మ గ్రామసభలను నిర్వహించి ప్రజలనుంచి దరఖాస్తులు స్వీకరించి పథకాలను అమలు చేస్తుందన్నారు. మహాలక్ష్మి పథకం ద్వారా జిల్లా వ్యాప్తంగా 3.55కోట్ల మంది మహిళలు ప్రయాణించగా.. ఆర్టీసీకి రూ. 87.81 కోట్లు ఆదా అయిందని మంత్రి వివరించారు. అలాగే గృహాజ్యోతి పథకంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా 1,27,381 విద్యుత్ వినియోగదారులకు 200 యూనిట్లలోపు జీరో బిల్లు జారీచేసింది. తద్వారా లబ్ధిదారులకు రూ 69.19 కోట్ల సబ్సిడీని ప్రభుత్వం చెల్లించిందన్నారు. అభివృద్ధికి పెద్దపీట రుణమాఫీ పథకంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా 87,491 మంది రైతులకు గానూ రూ.645.41 కోట్ల రుణమాఫీ చేసిందని మంత్రి వివేక్ అన్నారు. అలాగే రైతు భరోసా పథకంలో భాగంగా 2025 ఏడాదికి గానూ 2,62,043 మంది రైతులకు రూ 220.84 కోట్లు రైతుల ఖాతాల్లో జమచేసిందన్నారు. అదే విధంగా రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకంలో భాగంగా రూ. 5 లక్షల నుంచి రూ 10 లక్షలకు పెంచిందన్నారు. దీంతో జిల్లాలో 25,826 మంది పేదలు చికిత్స పొందగా.. రూ.68.84 లక్షలు ప్రభుత్వం ఖర్చు చేసిందన్నారు. అంతే కాకుండా జిల్లాకు మెడికల్ కళాశాల మంజూరు చేసి నూతన భవన నిర్మాణం కోసం రూ. 180 కోట్లు, నార్సింగ్ కాలేజీ బిల్డింగ్ కోసం రూ. 26 కోట్లు మంజూరు చేసిందన్నారు. జిల్లాలో 1,26,796 మంది వినియోగదారులకు 4,68,195 గ్యాస్ సిలిండర్లను రూ. 500 చొప్పున అందించినట్లు తెలిపారు. అలాగే జిల్లాలో 18,130 కొత్త కార్డులను అందించి వారికి సెప్టెంబర్లో 598 మెట్రిక్ టన్నుల బియ్యం సరఫరా చేసిందన్నారు. విద్యాశాఖ అభివృద్ధికి కృషి చేసిందన్నారు. 74,265 వేల మంది విద్యార్థులకు 2 జతల స్కూల్ యూనిఫాం, ప్రభుత్వ జూనియర్ కాలేజీలకు మరమ్మతుకు రూ. 3.26 కోట్లు, కొత్తగా యంగ్ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణానికి రూ. 200 కోట్లు మంజూరు చేశామన్నారు. ఇందిరమ్మ ఇళ్ల మొదటి విడతలో భాగంగా జిల్లా వ్యాప్తంగా 9,154 ఇళ్లు మంజూరు చేయగా.. రూ. 457.70 కోట్లు విడుదల చేసిందన్నారు. అలాగే మహిళాశక్తి భవననిర్మాణానికి రూ. 5 కోట్లు కేటాయించి పనులు చేపట్టామన్నారు. అలాగే వడ్డీలేని రుణాల కింద 10,574 మంది మహిళా సంఘాలను రూ. 21.69 కోట్ల వడ్డీరాయితీ అందించామన్నారు. పంచాయతీరాజ్ శాఖ ద్వార ఏడుపాయల వనదుర్గా మాత ఆలయ అభివృద్ధికి రూ. 35 కోట్లు, మెదక్ చర్చి అభివృద్ధికి రూ. 29.18 కోట్లు కేటాయించినట్లు మంత్రి వివేక్ పేర్కొన్నారు. అంతకు ముందు తెలంగాణపై కళాకారులు ఆలపించిన పాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రోహిత్రావు, కలెక్టర్ రాహుల్రాజ్, అదనపు కలెక్టర్ నగేష్, ఎస్పీ డీవీ శ్రీనివాస్రావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ సుహాసినిరెడ్డి, అదనపు ఎస్పీ మహేందర్, ఆర్డీఓ రమాదేవి, మాజీ మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్ తదితరులు పాల్గొన్నారు. తాత్కాలిక మరమ్మతులకు రూ.10కోట్లు మెదక్ కలెక్టరేట్: ఇటీవల జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు జరిగిన నష్టానికి శాశ్వతంగా చేపట్టే పనులపై రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. బుధవారం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్న్స్ హాల్లో ఇరిగేషన్, పంచాయతీరాజ్, ఆర్అండ్బీ, విద్యుత్, విద్యాశాఖ, మెడికల్ అండ్ హెల్త్, వ్యవసాయం, మత్స్యశాఖ, పశుసంవర్ధక శాఖ, మిషన్ భగీరథ, జిల్లా పంచాయతీ, మున్సిపల్ కమిషనర్ వివిధ శాఖల అధికారులతో వరద నష్టం అంచనాలపై సమీక్షించారు. మెదక్ జిల్లాను వరద నష్టాల నుంచి సాధారణ స్థితికి వచ్చే విధంగా చర్యలు చేపడతామన్నారు. తక్షణ సహాయం కింద రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు రూ.10 కోట్లు మంజూరు చేసిందన్నారు. అంతకు ముందు కలెక్టరేట్లో విశ్వకర్మ మహర్షి చిత్రపటానికి మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎమ్మెల్యే రోహిత్ రావు, కలెక్టర్ రాహుల్ రాజ్, అదనపు కలెక్టర్ నగేష్, ఎస్పీ డీవీ శ్రీనివాసరావు, అదనపు ఎస్పీ మహేందర్, డీఆర్ఓ భుజంగరావు, ఇతర శాఖల జిల్లా అధికారులు నివాళులర్పించారు. ఇసుక మాఫియా అంతానికే ఇసుక బజార్లు నర్సాపూర్: రాష్ట్రంలో ఇసుక మాఫియాను అంతం చేయడానికే ప్రభుత్వం ఇసుక బజార్లు ఏర్పాటు చేస్తుందని జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి చెప్పారు. బుధవారం నర్సాపూర్లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇసుక బజారుతో పాటు రూ. కోటితో నిర్మించిన వైకుంఠధామం ఇందిరమ్మ మోడల్ హౌజ్ వంటి అభివృద్ధి పనులను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ నాయకులు ఇసుక మాఫియా అవతారమెత్తారని ఆరోపించారు. కానీ సీఎం రేవంత్రెడ్డి పదవి చేపట్టిన తర్వాత ఇసుక మాఫియాను అంతం చేయాలన్న లక్ష్యంతో నియోజకవర్గాల స్థాయిలో ఇసుక బజార్లు ఏర్పాటు చేస్తున్నామని మంత్రి చెప్పారు. కాగా, ఇటీవల కురిసిన వర్షాలకు పాడైన రోడ్లు, కల్వర్టులు వివరాలు సీఎం రేవంత్రెడ్డి దృష్టికి తీసుకెళ్లి అధిక నిధులు మంజూరు చేయించేందుకు తన వంతు కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. జిల్లాలోని పేద, మధ్య తరగతికి చెందిన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఇసుకను అందచేసేందుకు ఇసుక బజార్లు ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ రాహుల్రాజ్ చెప్పారు. ఈ కార్యక్రమాల్లో కలెక్టర్ రాహుల్రాజ్, అదనపు కలెక్టర్ నగేష్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ సుహాసినిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే మదన్రెడ్డి, ఆర్డీఓ మహిపాల్, డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్, నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జ్ ఆవుల రాజిరెడ్డి, తహసీల్దార్ శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ శ్రీరాంచరన్రెడ్డి, సొసైటీ చైర్మన్ రాజుయాదవ్, మైనింగ్ ప్రాజెక్టు మేనేజర్ శ్రీకాంత్, ఇసుక బజార్ ఇన్చార్జ్ రాకేష్, ఆయా శాఖల అధికారులు, నాయకులు పాల్గొన్నారు. ప్రసంగిస్తున్న మంత్రి వివేక్ -
యూరియా తిప్పలు ఇంకెన్నాళ్లు!
యూరియా కోసం రైతులకు తిప్పలు తప్పడం లేదు. నర్సాపూర్లో బుధవారం యూరియా కోసం వచ్చిన రైతులకు అధికారులు టోకెన్లు ఇచ్చి పంపించారు. రైతు వేదికకు 400 యూరియా బస్తాలు వచ్చాయని, రైతులకు టోకెన్లు ఇచ్చినట్లు వ్యవసాయాధికారి దీపిక తెలిపారు. అలాగే వెల్దుర్తి మండల కేంద్రంలోని రైతు వేదిక వద్ద యూరియా కోసం రైతులు బారులు తీరారు. ఉదయం 4 గంటల నుంచే రైతు వేదిక వద్ద యూరియా బస్తా కోసం క్యూలో నిల్చున్నారు. నిత్యం యూరియా కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నామని వాపోయారు. ప్రభుత్వం రైతులకు సరిపడా యూరియా సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. – నర్సాపూర్/వెల్దుర్తి(తూప్రాన్)వెల్దుర్తిలో యూరియా కోసం బారులు తీరిన రైతులు -
ఎందరో త్యాగఫలితమే..
బీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లేశంగౌడ్ మెదక్జోన్: నిరంకుశ, రాచరిక నిజాంపాలన విముక్తికోసం ఎంతోమంది మహానుభావుల త్యాగఫలితమే సెప్టెంబర్ 17 విమోచన దినోత్సవమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లేశంగౌడ్ పేర్కొన్నారు. బుధవారం పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో జాతీయజెండాను ఆవిష్కరించారు. అలాగే ప్రధాని నరేంద్రమోదీ జన్మదినం సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో పలువురు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రాగి రాములు, సుభాష్ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శులు శ్రీనివాస్, రంజిత్ రెడ్డి, నాయిని ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అల్లాదుర్గం(మెదక్): ప్రభుత్వం ప్రజా పాలనా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని, ప్రభుత్వ కార్యాలయాలపై బుధవారం జాతీయ జెండాలను సూచించింది. అయితే జాతీయ జెండాను ఎగురవేయాల్సి ఉండగా ఇరిగేషన్ అధికారులు దూరంగా ఉన్నారు. ఈ సంఘటన అల్లాదుర్గంలో చోటుచేసుకుంది. కాగా, ఇరిగేషన్ కార్యాలయం పట్టణానికి దూరంగా ఉండటంతో విధుల నిర్వహణపై తెలియని పరిస్థితి నెలకొందని స్థానికులు చెబుతున్నారు. మరోవైపు ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఎగరవేయకుండా అధికారులు దూరంగా ఉండటం గమనార్హం. ఈ కార్యాలయంలో ఇరిగేషన్ డీఈ, ఏఈ, జూనియర్ అసిస్టెంట్, మరో ముగ్గురు లష్కరులు విధులు నిర్వహిస్తున్నారు. ఇంతమంది ఉన్న కార్యాలయం వద్ద జాతీయ జెండాను ఎగురవేయకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డీఈఓ రాధా కిషన్ మెదక్ కలెక్టరేట్: ఇన్స్పైర్ అవార్డుల కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 30 వరకు గడువు పొడిగించినట్లు డీఈఓ ప్రొఫెసర్ రాధాకిషన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటి వరకు జిల్లాలో వివిధ పాఠశాలల నుంచి 695 నామినేషన్లు ఆన్లైన్లో దరఖాస్తు చేసినట్లు తెలిపారు. నేటికీ నమోదు చేయని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు గైడ్ టీచర్లు ప్రత్యేక చొరవ చూపి త్వరగా నామినేషన్లను ఆన్లైన్లో దరఖాస్తు చేయాలన్నారు ఇతర వివరాలకు జిల్లా సైన్న్స్ అధికారి రాజిరెడ్డి నంబర్. 8328 599157ను సంప్రదించాలని సూచించారు. తూప్రాన్:ఎంపీడీఓ కార్యాలయంలో త్వరలోనే కోర్టు సేవలు అందుబాటులోకి రానున్నాయని ఆర్డీఓ జయచంద్రారెడ్డి బుధవారం పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ మండలానికి నూతనంగా మంజూరైన కోర్టుకు సరైన భవన సముదాయం లేకపోవడంతో కొంతకాలం జాప్యం నెలకొందన్నారు. ఇందులో భాగంగానే నూతనంగా నిర్మాణంలో ఉన్న సమీకృత సముదాయ భవనంలో ఎంపీడీఓ కార్యాలయం కొనసాగుతుందన్నారు. ఇందుకోసం ఈ నెల 25న కోర్టు కొనసాగేందుకు ఎంపీడీఓ కార్యాలయాన్ని మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశాలు, జిల్లా కలెక్టర్ సూచన మేరకు అప్పగిస్తున్నట్లు తెలిపారు. అలాగే నూతన సమీకృత భవనంలో త్వరలో తహసీల్దార్, ఆర్డీఓ కార్యాలయం సైతం అందుబాటులోకి రానుందని తెలిపారు. చిన్నశంకరంపేట(మెదక్): నార్సింగి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో స్పెషలిస్ట్ వైద్యులతో కంటి పరీక్షలు నిర్వహించనున్నట్లు మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రేఖ తెలిపారు. ఈ సందర్భంగా ఈనెల 18 నుంచి అక్టోబర్ 2 వరకు స్వస్థనారీ స్వశక్తి అభియన్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా రేపటి నుంచి కంటి వైద్య నిపుణులు అందుబాటులో ఉంటారని తెలిపారు. కావున మండలంలోని ప్రజలు కంటి పరీక్షల కోసం నార్సింగి ఆస్పత్రికి వచ్చి వైద్య పరీక్షలు చేయించుకోవాలని కోరారు. -
ఉద్యోగులపై నిర్లక్ష్య వైఖరి తగదు
టీఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు నరేందర్మెదక్ కలెక్టరేట్: ఉద్యోగులపై నిర్లక్ష్య వైఖరి తగదని టీఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు దొంత నరేందర్ పేర్కొన్నారు. బుధవారం స్థానిక టీఎన్జీఓ భవన్లో ఏర్పాటు చేసిన కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉద్యోగుల పెండింగ్ బిల్లులు, కరువు భత్యం, నూతన పీఆర్సీ, ఆరోగ్య కార్డుల అమలుపై ప్రభుత్వం 18 నెలలుగా తాత్సారం చేస్తుందన్నారు. ఉద్యోగుల హక్కులను కాపాడే బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఉద్యోగుల పాత పెన్షన్ విధానం ప్రవేశపెట్టే విధంగా అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలన్నారు. చార్మినార్ జోన్ సాధనకు త్వరలో అన్ని వర్గాల ఉద్యోగులతో ఏర్పాటు చేయనున్న భారీ బహిరంగ సభ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం సంఘపరంగా వృత్తిపరంగా పదోన్నతులు పొందిన సభ్యులను శాలువాతో సన్మానించారు. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి మీనికి రాజ్ కుమార్ పలు తీర్మానాలు ప్రవేశపెట్టి ఆమోదించారు. అలాగే పంచాయతీ కార్యదర్శుల ఫోరం జిల్లా కార్యదర్శిగా కాయితి సంతోష్ను నియమించారు. ఈ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి గాండ్ల అనురాధ, జిల్లా సహా అధ్యక్షుడు ఎండీ ఇక్బాల్ పాషా, కోశాధికారి చంద్రశేఖర్, ఉపాధ్యక్షులు ఫజులుద్దీన్, రఘునాథరావు, లీల, సంయుక్త కార్యదర్శులు శివాజీ, కిరణ్ కుమార్, రాధ, ఆర్గనైజింగ్ కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి, క్రీడల కార్యదర్శి గోపాల్, కార్యవర్గ సభ్యులు మరియా, సతీష్, సలావుద్దీన్, నర్సాపూర్ యూనిట్ అధ్యక్షుడు శేషాచారి, ఏడుపాయల వనదుర్గ యూనిట్ కార్యదర్శి ప్రశాంత్, పంచాయతీ కార్యదర్శుల ఫోరం జిల్లా అధ్యక్షుడు జంగం నగేష్, ఇరిగేషన్ ఫోరం కార్యదర్శి శ్రీ హర్ష, హెచ్డబ్ల్యూఓ ఫోరం కార్యదర్శి శేఖర్, ఏఈఓ ఫోరం కార్యదర్శి రాజశేఖర్, మెడికల్ ఫోరం కార్యదర్శి మంజుల, ఉద్యోగులు పాల్గొన్నారు. -
గ్రామాల్లో యూపీ అధికారుల సందడి
నర్సాపూర్ రూరల్: మండలంలోని అవంచ, రెడ్డిపల్లి గ్రామాల్లో బుధవారం ఉత్తరప్రదేశ్కు చెందిన పంచాయతీ శాఖ అధికారులు, సర్పంచ్లు పర్యటించారు. తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ సీడీపీఏ అనిల్ కుమార్ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ పాలన, అభివృద్ధి పనులపై అధ్యయనం చేశారు. గ్రామపంచాయతీలో జరుగుతున్న పారిశుద్ధ నిర్వహణ, తడి, పొడి చెత్త, నిధుల సమీకరణ, వాటర్ హార్వెస్టింగ్, నర్సరీలు, ఫారం ఫండ్, అంగన్ వాడీ కేంద్రాలు, పాఠశాలలు, స్వయం సహాయక సంఘాల నిర్వహణ తీరును తెలుసుకున్నారు. ఈ మేరకు డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్, అవంచ, రెడ్డిపల్లి గ్రామాలకు చెందిన మాజీ సర్పంచ్లు, రాజకీయ నాయకులు వారికి ఘన స్వాగతం పలికారు. అనంతరం తెలంగాణ సంస్కతి సాంప్రదాయాలను తెలియజేసేందుకు బతుకమ్మ ఆటాపాటలు, ఆయా రకాల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ మధులత, డీఎల్పీఓ సాయిబాబా, ఎంపీఓ శ్రీనివాస్, ఏపీఓ అంజిరెడ్డి, ఏపీఎం సంగమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. -
అతివలకు ఆరోగ్య భరోసా
● నేటి నుంచి స్వస్త్ నారీ, సశక్త్ పరివార్ అభియాన్ ● జిల్లా కేంద్ర ఆస్పత్రిలో మెగా హెల్త్ క్యాంపు మెదక్ కలెక్టరేట్: మహిళలు, పిల్లలకు సంపూర్ణ ఆరోగ్యం కల్పించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం స్వస్త్ నారి సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. బుధవారం నుంచి జిల్లా కేంద్రంలోని ఆస్పత్రిలో మెగా హెల్త్ క్యాంపు ద్వారా ప్రారంభించనున్నారు. జిల్లావ్యాప్తంగా అన్ని పీహెచ్సీలు, సీహెచ్సీలలో అక్టోబర్ 2 వరకు ప్రతిరోజు 5 చొప్పున మొత్తం 65 శిబిరాలు నిర్వహించనున్నారు. అలాగే జిల్లాలోని అన్ని అంగన్వాడీలలో పోషణ్ మాహ్ వేడుకలతో పాటు ఆరోగ్య సంరక్షణ సేవలను అందించనున్నారు. అందించే సేవలు ఇవే.. అధిక రక్తపోటు, మధుమేహం, రక్తహీనత, టీబీ, నోటి, రొమ్ము, గర్భాశయ కేన్సర్ వంటి వాటిని గుర్తిస్తారు. గిరిజన ప్రాంతాల్లో తలసేమియా పరీక్ష నిర్వహిస్తారు. ప్రత్యేకంగా గైనే, కన్ను, చెవి, ముక్కు, చర్మం, మానసిక ఆరోగ్యం, దంతవైద్యం వంటి పరీక్షలు చేస్తారు. తల్లి, పిల్లల సంరక్షణ కోసం తనిఖీలు చేపట్టి అవసరమైన వారికి ఎంసీపీ కార్డులు పంపిణీ చేస్తారు. మహిళల కోసం ఋతు పరిశుభ్రత, కౌమారదశ– తల్లి పోషణ, వంట నూనె వినియోగం, న్యూట్రిషన్ కౌన్సెలింగ్, కమ్యూనిటీ స్థాయిలో తదితర కార్యక్రమాలు నిర్వహిస్తారు. టీబీ రోగులను దత్తత తీసుకోవడాన్ని ప్రోత్సహించే కార్యక్రమం చేపట్టనున్నారు. అలాగే అక్టోబర్ 1వ తేదీన మెగా రక్తదాన శిబిరం ఏర్పాటుచేశారు. ఇందులో ప్రైవేట్ ఆస్పత్రులు, క్లినిక్లు, ల్యాబ్లను భాగస్వామ్యం చేయనున్నారు. -
మౌలిక వసతుల కల్పనకు కృషి
నర్సాపూర్ రూరల్/కౌడిపల్లి: అసంపూర్తి భవనాన్ని పూర్తి చేయించి విద్యార్థులకు మెరుగైన విద్యాబోధనలా చర్యలు తీసుకుంటామని తెలంగాణ ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్ పురుషోత్తం తెలిపారు. మంగళవారం నర్సాపూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలను సందర్శించి ల్యాబ్, తరగతి గదులు, పరిసరాలను స్వయంగా పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డిగ్రీ కళాశాల భవనం అసంపూర్తిగా ఉండడంతో తరగతుల నిర్వహణకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నట్లు గుర్తించామన్నారు. త్వరలో భవనాన్ని పూర్తి చేయించి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ప్రిన్సిపాల్ హుస్సేన్ కళాశా ల సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. కార్యక్రమంలో అధ్యాపకులు అదెప్ప, రమేశ్, ఖాజా ఆరీఫ్, రవికుమార్, హేమంత్, మహేందర్రెడ్డి పాల్గొన్నారు. అనంతరం కౌడిపల్లి మండలంలోని రాయిలాపూర్ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో ఎన్ఎస్ఎస్ యూనిట్ శిబిరానికి ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులు ఇష్టంతో చదివితే ఉన్నత శిఖరాలను చేరుకోవచ్చన్నారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్ పురుషోత్తం -
పదేళ్లలో బీఆర్ఎస్ చేసిందేమిటి?
ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావుచిన్నశంకరంపేట(మెదక్): బీఆర్ఎస్ పదేళ్లు అధికారంలో ఉండి ప్రజలకు చేసింది ఏమి లేదని ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు విమర్శించారు. మండలంలోని కామారం తండాలో మంగళవారం పర్యటించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతిపక్షంలో ప్రజల సమస్యలు విస్మరించి, దోచుకున్నది పంచుకునే పంచాయతీతో గడుపుతున్నారని మండిపడ్డారు. గ్రామాలను పట్టించుకోలేదని, పేదలకు కనీసం ఇళ్లు కూడ ఇవ్వలేదన్నారు. కేసీఆర్ నుంచి మొదలుకొని ఎమ్మెల్యేల వరకు దోచుకున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చిందన్నారు. సన్న బియ్యం, ఇందిరమ్మ ఇళ్లు అందిస్తుందన్నారు. తండాలో నెలకొన్న తాగునీటి సమస్యను తీరుస్తామన్నారు. సీసీ రోడ్లు, కమ్యూనిటీ హాల్, పంచాయతీ భవనం కోసం నిధులు అందించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మా జీ ఎంపీపీ పండరిగౌడ్, శ్రీమన్రెడ్డి, గోపాల్రెడ్డి, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు సాన సత్యనారాయణ, నాయకులు రాజిరెడ్డి, మోహన్నాయక్, తౌరియా, మంగ్యనాయక్ పాల్గొన్నారు. -
ఇక సౌర వెలుగులు
● పైలెట్ ప్రాజెక్టుగా పాపన్నపేట ఎంపిక! ● ప్రత్యేక కమిటీ వేసి చర్చించిన అధికారులు సోలార్ విద్యుత్ వినియోగం పెంచడమే లక్ష్యంగా పీఎం సూర్యఘర్ పథకాన్ని కేంద్రం తెరపైకి తెచ్చింది. మెతుకుసీమలో అమలు దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే ఏడు గ్రామాలను గుర్తించిన అధికారులు ప్రత్యేక కమిటీ వేసి చర్చించారు. ఇందులో ఒక గ్రామాన్ని ఎంపిక చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. – మెదక్జోన్ ఈ పథకం విధివిధానాల ప్రకారం సెమీ అర్బన్ గ్రామాన్ని ఎంపిక చేయనున్నారు. ఆ గ్రామంలో 2011 జనాభా లెక్కల ప్రకారం 5 వేల జనాభా ఉండాలనేది ముఖ్య ఉద్దేశం. జిల్లాలో ఇలాంటివి 7 గ్రామాలను గుర్తించారు. అందులో టేక్మాల్, చేగుంట, నార్సింగి, వెల్దుర్తి, పెద్దశంకరంపేట, పాపన్న పేట గ్రామాలను ఎంపిక చేశారు. వీటిలో ఈ పథకానికి అనువైన గ్రామాన్ని ఎంపిక చేసేందుకు ప్రత్యేకంగా ఒక కమిటీని వేశారు. కలెక్టర్ చైర్మన్గా, అదనపు కలెక్టర్ వైస్ చైర్మన్గా, సభ్యులుగా డీపీఓ, ట్రాన్స్కో ఎస్ఈ, జెడ్పీ సీఈఓ, రెడ్కో డీఎం ఉన్నారు. ఈనెల 15న సమావేశమైన కమిటీ, ముందుగా ఎంపిక చేసిన 7 గ్రామాలను పరిగణలోకి తీసుకున్నారు. వీటిలో అనువైన గ్రామంగా పాపన్నపేటను ఎంపిక చేసినట్లు తెలిసింది. ఇది ఫైనల్ అయితే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపనున్నారు. అనంతరం నిధులు మంజూరవుతాయని సంబంధిత అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వ కార్యాలయాలపై ఏర్పాటు ఈ పథకంలో భాగంగా ఎంపిక చేసిన గ్రామానికి రూ. కోటి మంజూరు కానుంది. అనంతరం టెండర్ పిలిచి పనులను సదరు కాంట్రాక్టర్కు అప్పగిస్తారు. వీటితో గ్రామంలోని ప్రభుత్వ భవనాలను ఎంపిక చేస్తారు. పాఠశాలలు, పంచాయతీ భవనం, అంగన్వాడీ, హెల్త్సెంటర్ భవనాలపై సోలార్ పలకలను ఏర్పాటు చేస్తారు. వీటితో పూర్తిస్థాయిలో సోలార్ పవర్ ఉత్పత్తి చేసి వినియోగిస్తారు. దీని ఆధారంగా తదుపరి జిల్లాలోని ప్రజలందరికీ సబ్సిడీపై సోలార్ పలకలను అందించనున్నారు. కాగా ఇప్పటికే పీఎం సూర్యఘర్ పథకంలో భాగంగా కిలో వాట్ విద్యుత్ నుంచి 3 కిలోవాట్స్ విద్యుత్ ఉత్పత్తి చేసే సోలార్ పలకలను సబ్సిడీపై వినియోగదారులకు అందిస్తున్నారు. ఇందులో 3 కిలోవాట్స్ విద్యుత్ తయారు చేసే పలకలకు రూ. 2.10 లక్షల ఖర్చు అవుతుండగా, అందులో రూ. 78 వేల సబ్సిడీని కేంద్రం సదరు లబ్ధిదారుడికి అందజేస్తుంది. ఇదిలాఉండగా దేశంలో జరిగే అనేక విపత్తులకు కారణం థర్మల్ విద్యుత్ వినియోగం పెరగటమే అని నిపుణులు చెబుతున్నారు. బొగ్గును భారీగా తవ్వడంతో వాతావరణ సమతుల్యత దెబ్బతిని క్లౌడ్ బరస్ట్లకు కారణమవుతందని చెబుతున్నారు. అందుకే సోలార్ విద్యుత్ను వాడాల్సిన అవసరం ఎంతైనా ఉందంటున్నారు. ముందుగా జిల్లాను ఎంచుకున్నాం పీఎం సూర్యఘర్ పథకంలో భాగంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో ముందుగా మెదక్ను ఎంచుకున్నాం. జిల్లాలో ఏడు గ్రామాలను గుర్తించాం. కమిటీలో చర్చించి అన్నివిధాలుగా అనువైనదిగా పాపన్నపేటను ఎంపిక చేశాం. కమిటీ చైర్మన్ కలెక్టర్ ఫైనల్ చేయాల్సి ఉంది. – రవీందర్ చౌహాన్, రెడ్కో డీఎం -
మెరుగైన వైద్యం అందించాలి
కలెక్టర్ రాహుల్రాజ్నర్సాపూర్: ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్ రాహుల్రాజ్ వైద్యులకు సూచించారు. మంగళవారం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిని తనిఖీ చేశారు. రోగులను కలిసి వైద్య సేవలు, వసతులపై ఆరా తీశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రజలకు నాణ్యతతో కూడిన ఆరోగ్య సంరక్షణ సేవలు అందించడంపై దృష్టి పెట్టిందన్నారు. రోగులకు నిరంతరాయంగా వైద్య సేవలు అందించాలన్నారు. కాగా రోగులకు అందిస్తున్న సేవలపై ఆస్పత్రి సూపరింటెండెంట్ పావని కలెక్టర్కు వివరించారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ మహిపాల్, తహసీల్దార్ శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ శ్రీరాంచరణ్రెడ్డి తదితరులు ఉన్నారు. అనంతరం పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో ఏర్పాటు చేసిన ఇసుక బజారును, ప్రారంభానికి సిద్ధంగా ఉన్న వైకుంఠధామాన్ని పరిశీలించారు. మున్సిపాలిటీ పరిధిలో పలు అభివృద్ధి పనులను జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్ ప్రారంభించే అవకాశం ఉందన్నారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు తక్కువ ధరలకు నాణ్యమైన ఇసుక అందచేయాలన్న ఉద్దేశంతో ఇసుక బజార్ ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. వైకుంఠధామంలో వసతుల గురించి కమిషనర్ను అడిగి తెలుసుకున్నారు. -
చార్మినార్ జోన్లో కలపండి
నర్సాపూర్: జిల్లాను చార్మినార్ జోన్లో కలపాలని జిల్లా నాయకులు సీఎం రేవంత్రెడ్డిని కోరారు. ఈమేరకు డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, సిద్దిపేట నియోజకవర్గ ఇన్చార్జి హరికృష్ణ మంగళవారం సీఎంను ఆయన నివాసంలో కలిసి వివరించారు. రాజన్న సిరిసిల్ల జోన్లో ఉన్నందున నిరుద్యోగులు, విద్యార్థులు నష్టపోతున్నారని వివరించారు. దీనిపై సీఎం సానుకూలంగా స్పందించారని వారు వివరించారు. ఐక్యతగా పార్టీని బలోపేతం చేసి రా బోయే స్థానిక ఎన్నికల్లో సత్తా చాటడంతో పాటు జెడ్పీ చైర్మన్ స్థానాన్ని కై వసం చేసుకోవాలని సూచించారని తెలిపారు. చిలప్చెడ్(నర్సాపూర్): గ్రామాల్లో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తగిన చర్యలు చేపట్టాలని డీఎల్పీఓ సాయిబాబా సిబ్బందిని ఆదేశించారు. మంగళవారం మండల పరిధిలోని అజ్జమర్రి, ఫైజాబాద్ గ్రామ పంచాయతీలను సందర్శించి రికార్డులు పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలన్నారు. ప్రజల నివాస పరిసరాల్లో నీటి నిల్వ లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. దోమల నివారణకు ఫాగింగ్ చేయాలని, మురికి గుంటల్లో ఆయిల్ బాల్స్ వేయాలని సూచించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు నాగరాజు, ప్రశాంతి పాల్గొన్నారు. కౌడిపల్లి(నర్సాపూర్)/హవేళిఘణాపూర్(మెదక్): విద్యార్థులు శ్రద్ధగా చదువుకోవాలని డీఈఓ రాధాకిషన్ అన్నారు. మండలంలోని కన్నారం ఉన్నత పాఠశాలను మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరును పరిశీలించారు. తొమ్మిదో తరగతిలో కూర్చొని బోధనను పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడారు. ఉపాధ్యాయులు చెబుతున్న పాఠాలు అర్థమవుతున్నాయా..? మీ అనుమానాలు నివృత్తి చేస్తున్నారా..? అని ఆరా తీశారు. చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఉపాధ్యాయులకు సూచించారు. డీఈఓ వెంట హెచ్ఎం శేషాద్రికుమార్, ఉపాధ్యాయులు ఉన్నారు. అనంతరం హవేళిఘణాపూర్ డైట్ కళాశాలలో ఆడ పిల్లల రక్షణ– మన అందరి బాధ్యత అనే అంశంపై నిర్వహించిన కార్యక్రమానికి డీఈఓ ముఖ్య అతిఽథిగా హాజరై మాట్లాడారు. నేటి సమాజంలో ఆడ పిల్లల అక్రమ రవాణా అతి పెద్ద సమస్యగా మారిందన్నారు. విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ వారు భవిష్యత్ను మంచి బాటలో వెళ్లేలా చూడాలన్నారు. చేగుంట(తూప్రాన్): చేగుంటతో పాటు ఇబ్రహీంపూర్ సహకార సంఘాలకు పాలకవర్గం స్థానంలో పర్సన్ ఇన్చార్జిలను నియమించారు. చేగుంట సహకార సంఘం పర్సన్ ఇన్చార్జిగా సంఘంలోని సీనియర్ డైరెక్టర్ రఘురాములు, ఇబ్రహీంపూర్కు సహకార సంఘం జిల్లా కార్యాలయంలోని అధికారి సాయిలును పర్సన్ ఇన్చార్జిగా నియమిస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేయగా, వారు మంగళవారం బాధ్యతలను స్వీకరించారు. కాగా చేగుంట సహకార సంఘంలోని పది మంది డైరెక్టర్లలో నలుగురిని తొలగించగా, ఇబ్రహీంపూర్ సహకార సంఘంలో చైర్మన్తో సహా డైరెక్టర్లందరినీ తొలగిస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. బ్యాంకుల రుణాలు, ఎరువుల అమ్మకాలు, పాలనాపరమైన ఇతర అంశాల పర్యవేక్షణ పర్సన్ ఇన్చార్జిల పర్యవేక్షణలోనే జరుగుతాయని చేగుంట డీసీసీబీ బ్యాంకు మేనేజర్ శశికాంత్రెడ్డి తెలిపారు. -
జోరు వాన.. జనం హైరానా
● రేగోడ్లో అత్యధికంగా12.5 సె.మీ నమోదు ● పలుచోట్ల నిలిచిన రాకపోకలు ● కూలిన ఇళ్లు.. దెబ్బతిన్న పంటలు రేగోడ్(మెదక్)/టేక్మాల్/కొల్చారం(నర్సాపూర్)/నర్సాపూర్: జిల్లాలోని పలు మండలాల్లో సోమవా రం రాత్రి నుంచి మంగళవారం తెల్లవారుజాము వరకు భారీ వర్షం కురిసింది. రేగోడ్లో అత్యధికంగా 12.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. పలువురి ఇళ్లలోకి వరద చేరి నానా తంటాలు పడ్డా రు. ప్యారారం గ్రామస్తులు ఖేడ్ మార్కెట్ వెళ్లి, తిరిగి ఇంటికి చేరుకొనే సమయంలో పోచారం– ప్యారారం రోడ్డుపై వరద ఉధృతంగా ప్రవహించింది. దీంతో జేసీబీ సహాయంతో వారిని వాగు దాటించారు. తిమ్మాపూర్లో ట్రాక్టర్ సాయంతో ప్రజలను సురక్షితంగా వాగు దాటించారు. కొల్చారం మండలంలో 102. 8 మి.మీ వర్షం కురిసింది. వరి, పత్తి చేలకు నష్టం వాటిల్లింది. శిథిలావస్థలో ఉన్న ఇళ్లు కూలిపోయాయి. టేక్మాల్ మండలంలో వర్షం దంచికొట్టడంతో మల్కాపూర్ నుంచి కుసంగి, దనూర గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మండలం మీదుగా గుండువా గు ఉధృతంగా ప్రవహించడంతో టేక్మాల్– జోగిపేట, ఎలకుర్తి– దనూరకు రాకపోకలు నిలిచిపోయాయి. వరి పొలాలు నీటమునిగా యి. నర్సాపూర్లో మంగళవారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. సంత జరిగే సమయంలోనే వర్షం కురువడంతో వ్యాపారం సాగలేదని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు. -
మేకులు మింగిన ఖైదీలు.. వైద్యానికి సహకరించకుండా హల్చల్
చోరీ కేసుల్లో అరెస్టై సంగారెడ్డి కారాగారాంలో ఉన్న ఇద్దరు ఖైదీలు.. మేకులు,బ్యాటరీలు మింగి హల్చల్ చేసిన ఉదంతం ఇది. వివరాల్లోకి వెళితే.. చోరీ కేసులో జైలుకొచ్చిన ఛావుస్,మధు ట్రబుల్ మేకర్లుగా ఉన్నారు. రెండురోజుల క్రితం అందుబాటులో ఉన్న మేకులు, టీవీరిమోట్కు ఉండే బ్యాటరీలు మింగి గుడ్లు తేలేశారు. అప్రమత్తమైన సిబ్బంది వారిని సికింద్రాబాద్ గాంధీ ఆస్పతత్రికి తరలించారు. ఇద్దరూ రెండ్రోజులుగా వైద్యానికి సహకరించడం లేదని దగ్గరకు వచ్చేవారిపై ఉన్మాదుల్లా ప్రవర్తిస్తున్నారని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. వారి కడుపులో ఉన్న బ్యాటరీలు,మేకులను శస్త్ర చికిత్స ద్వారా తొలగించాలని లేదంటే సెప్టిక్ సమస్య తలెత్తుతుందని వైద్యులు చెబుతున్నారు. కడుపులో ఉంటే బ్యాటరీలు పగిలితే పరిస్థితి ప్రమాదకరంగా మారుతుందని ఆస్పత్రి వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ విషయమై జైలు సూపరిటెండెంట్ కళాసాగర్ను వివరణ కోరేందుకు సాక్షి ప్రయత్నించగా ఆయన ఫోన్లో అందుబాటులో లేరు. -
దంచికొట్టిన వాన
మెదక్ మున్సిపాలిటీ: పట్టణంలో సోమవారం రాత్రి వర్షం దంచికొట్టింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. పట్టణంలోని రాందాస్ చౌరస్తా నుంచి మున్సిపల్ కార్యాలయం, పాత బస్టాండ్ వరకు, బస్డిపో వెళ్లే రోడ్డు, చమన్ చౌరస్తా నుంచి ముత్తాయికోట వెళ్లే రోడ్డు, ఫత్తేనగర్ ప్రధాన దారి వర్షం నీరుతో చెరువులను తలపించాయి. దీంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయి ప్రజలు ఇబ్బంది పడ్డారు. ప్రజల హైరానా.. తూప్రాన్: తూప్రాన్లో ఆదివారం రాత్రి భారీ వర్షం కురిసింది. ఈసందర్భంగా లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. మండలంలో 91.3 మీల్లిమీటర్ల వర్షపాతం నమోదు కాగా, పట్టణంలోని గా యత్రీనగర్ మళ్లీ జలమయం అయింది. ఏబీ కాలనీ, కిష్టాపూర్కు వెళ్లే రహదారిపై హల్దీవాగు పొంగిపొర్లి రాకపోకలు నిలిచిపోయాయి. మండలంలోని వెంకటరత్నాపూర్లో ఇళ్లలోకి నీరు చేరింది. రెండు గంటలకుపైగా కురిసిన వర్షంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కాగా మున్సిపల్ కమిషనర్ గణేశ్రెడ్డి ఆధ్వర్యంలో సిబ్బంది రాత్రి చర్యలు చేపట్టారు. జలమయమైన మెదక్ ప్రధాన రహదారి -
టీచర్లకు టెట్ మినహాయింపు ఇవ్వాలి
మెదక్ కలెక్టరేట్: టెట్లో ఉపాధ్యాయులకు మినహాయింపు ఇవ్వాలని తపస్ ఆధ్వర్యంలో అదనపు కలెక్టర్ నగేశ్కు సోమవారం వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చల్లా లక్ష్మణ్ మాట్లాడుతూ.. ఉపాధ్యాయులకు టెట్ నుంచి ఉపశమనం కలిగేలా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో తపస్ జిల్లా నాయకులు సుమతి, రేఖ, రాజేశ్వర్, నర్సింలు, శ్రీధర్రెడ్డి, పోచయ్య తదితరులు పాల్గొన్నారు. సింగూరు నీరు విడుదలపుల్కల్(అందోల్): సింగూరు ప్రాజెక్టుకు వరద పోటెత్తడంతో మూడు గేట్లను ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. ప్రాజెక్టుకు ఎగువన భారీ వర్షాలు కురవడంతో భారీ వరదలు వస్తోంది. దీంతో 8,9,10 నంబర్ గేట్లను మీటరున్నర పైకి ఎత్తి 23,230 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. జలవిద్యుత్ కేంద్రం ద్వారా రెండు టర్బయిన్లను రన్చేసి 2,500 క్యూసెక్కుల నీటిని వినియోగించి విద్యుదుత్పత్తి చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజె క్టులో 17,500 టీఎంసీల నీటిని ఉంచి మిగతా నీటిని దిగువకు వదులుతున్నట్లు అధికారులు వెల్లడించారు. పాపన్నపేట(మెదక్): ఏడుపాయల్లో మంజీరా వరద కొనసాగుతోంది. సోమవారం సింగూరు నుంచి నీరు దిగువకు వదిలారు. దీంతో ఘనపురం ఆనకట్ట పొంగి పొర్లి దుర్గమ్మ ఆలయాన్ని చుట్టముట్టింది. భక్తులు రాజగోపురంలో అమ్మవారి ఉత్సవ విగ్రహానికి పూజలు చేస్తున్నారు. వరదల వైపు వెళ్లకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. మెదక్ కలెక్టరేట్: ఈనెల 22 నుంచి 28వ తేదీ వరకు జరిగే ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షల నిర్వహణకు పక్కా ప్రణాళిక సిద్ధం చేసినట్లు కలెక్టర్ రాహుల్రాజ్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్లో డీఈఓ రాధాకిషన్ ఆధ్వర్యంలో పరీక్షల నిర్వహణపై సమీక్షించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లా కేంద్రంలోని బాలికల హై స్కూల్లో పరీక్ష కేంద్రం ఏర్పాటు చేశామని తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్ నగేశ్, డీఎంహెచ్ఓ శ్రీరామ్, జెడ్పీ సీఈఓ ఎల్లయ్య, డీఆర్డీఓ పీడీ శ్రీనివాసరావు, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు. వెల్దుర్తి(తూప్రాన్): ఎన్నికలకు ముందు ఆసరా, వికలాంగుల పింఛన్ పెంపుపై హామీ ఇచ్చిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పూర్తిగా విస్మరించిందని ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు యాదగిరి ఆరోపించారు. ఈ మేరకు తహసీల్దార్ కార్యాలయం ఎదుట సోమవారం ధర్నా చేపట్టారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని తహసీల్దార్ బాలలక్ష్మికి అందజేశారు. మెదక్ కలెక్టరేట్: క్వాంటం యుగం సరికొత్త సాంకేతిక విప్లవానికి నాంది పలుకుతుందని డీఈఓ రాధాకిషన్ అన్నారు. ఈనెల 12న మెదక్లో క్వాంటం యుగం ప్రారంభం అవకాశాలు– సవాళ్లు అనే అంశంపై పోటీలు నిర్వహించారు. సోమవారం డీఈఓ కార్యాలయంలో విజేతలకు డీఈఓ ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మెదక్ జిల్లా కేంద్రంలోని సిద్ధార్థ మోడల్ హై స్కూల్ విద్యార్థి ధనుష్ ప్రథమస్థానంలో నిలవగా, మంభోజిపల్లి గీతా హై స్కూల్ విద్యార్థిని యశస్విని ద్వితీయస్థానం, హవేళిఘణాపూర్ మండలం కూచన్పల్లి జెడ్పీహెచ్ఎస్ విద్యార్థిని అభినయ తృతీయస్థానంలో నిలిచారు. కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి, గైడ్ టీచర్లు పాల్గొన్నారు. -
తాగు నీటి ఎద్దడి రాకుండా చూడండి
నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డినర్సాపూర్: నియోజకవర్గంలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సునీతారెడ్డి మిషన్ భగీరథ అధికారులను ఆదేశించారు. సోమవారం క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా నియోజకవర్గంలోని నర్సాపూర్, శివ్వంపేట, కొల్చారం, హత్నూర మండలాల్లోని పలు గ్రామాలకు నీటి సరఫరా సరిగా కావడం లేదని, ప్రజలకు నల్లాల ద్వారా సరిపడా నీటి సరఫరా జరిగే విధంగా చూడాలని సూచించారు. అవసరమైన చోట పైపులైన్ ఏర్పాటు చేయాలని, లీకేజీలు ఏర్పడితే వెంటనే మరమ్మతులు చేపట్టాలన్నారు. నీరు కలుషితం కాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. మేజర్ సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని తెలిపారు. సమావేశంలో మిషన్ భగీరథ ఎస్ఈ రఘువీర్, డీఈఈలు ప్రవీన్కుమార్, శ్రీనివాస్తో పాటు పలువురు ఏఈలు, నర్సాపూర్ మున్సిపాలిటీ కమిషనర్ శ్రీరాంచరణ్రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
దారి కల్పిస్తేనే భూములిస్తాం
చిన్నశంకరంపేట(మెదక్): మిర్జాపల్లికి దారి కల్పించేందుకు నూతన అండర్పాస్ రైల్వే బ్రిడ్జిని నిర్మి స్తేనే తాము డబుల్లైన్ కోసం భూములిస్తామని గ్రామస్తులు రైల్వే ఇంజనీర్ విష్ణుదేవ్కు తేల్చిచెప్పారు. సోమవారం మండలంలోని మిర్జాపల్లి రైల్వేస్టేషన్ సమీపంలో రైల్వే డబుల్లైన్ కోసం అవసరమైన భూములను పరిశీలించారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు రైల్వే అధికారులకు తమ సమస్యను వివరించారు. ఇప్పుడున్న అండర్పాస్ బ్రిడ్జిలోకి చెరువు బ్యాక్ వాటర్ వచ్చి రాకపోకలకు ఇబ్బంది పడుతున్నామని, డబుల్లైన్ తర్వాత ఈ సమస్య మరింత జటిలం అవుతుందని వివరించారు. ఇదే విషయమై సోమవారం ప్రజావాణిలో గ్రామస్తులు కలెక్టర్కు వినతిపత్రం అందించారు. -
సత్వర పరిష్కారం చూపండి
● కలెక్టరేట్ రాహుల్రాజ్ ● ప్రజావాణికి 96 వినతులు మెదక్ కలెక్టరేట్: ప్రజావాణిలో వచ్చే దరఖాస్తుల సత్వర పరిష్కారానికి చొరవ చూపాలని కలెక్టర్ రాహుల్రాజ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 96 వినతులు రాగా స్వీకరించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతి దరఖాస్తు పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. పరిష్కారంలో జాప్యం చేయొద్దని సంబంధిత శాఖల అధికారులకు సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేశ్, డీఆర్ఓ భుజంగరావు, జెడ్పీ సీఈఓ ఎల్లయ్య, డీఆర్డీఓ పీడీ శ్రీనివాసరావు, అన్నిశాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. 17న మెగా హెల్త్క్యాంపు జిల్లాలో స్వస్త్ నారీ, సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలని అధికారులను కలెక్టర్ రాహుల్రాజ్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో జిల్లాస్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈనెల 17 నుంచి అక్టోబర్ 2 వరకు హెల్త్ క్యాంపులు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేసి మహిళలు, పిల్లల ఆరోగ్య సంరక్షణ సేవలను అందించనున్నట్లు చెప్పారు. త్వరగా మరమ్మతులు చేపట్టాలి హవేళిఘణాపూర్(మెదక్): మండల పరిధిలోని మక్తభూపతిపూర్ వెళ్లే రోడ్డు వర్షాలతో దెబ్బతిందని, బ్రిడ్జి వద్ద వెంటనే మరమ్మతులు చేసి రవాణా సదుపాయం పునరుద్ధరించాలని కలెక్టర్ రాహుల్రాజ్ అన్నారు. సోమవారం బ్రిడ్జి పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట పీఆర్ ఈఈ నర్సింలు, డీఈ మహేశ్, ఏఈ నితిన్, శానిటరీ ఇన్స్పెక్టర్ నాగరాజు ఉన్నారు. -
సమస్యలుంటే నేరుగా సంప్రదించాలి
ఎస్పీ డీవీ శ్రీనివాసరావు మెదక్ మున్సిపాలిటీ: ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు సూచించారు. సోమవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ప్రజావాణికి మొత్తం 19 అర్జీలు వచ్చాయి. ఈసందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ప్రజలు ఎలాంటి పైరవీలు, మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా నేరుగా పోలీస్ అధికారులను సంప్రదించాలని తెలిపారు. చట్టబద్ధ పరిష్కారం ద్వారానే ప్రజలకు న్యా యం జరిగే అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. శాంతి భద్రతలను కాపాడుతూ ప్రజలకు మరింత దగ్గరగా కావడం పో లీస్శాఖ ప్రధాన లక్ష్యమని వివరించారు. నేరుగా ఫిర్యాదులను స్వీకరించి, పరిష్కరిస్తున్నామని ఎస్పీ తెలిపారు. -
ఆగిన రైలు కూత..!
● 20 రోజులైనా పూర్తికాని రైల్వేట్రాక్ పునరుద్ధరణ ● నిలిచిన రాకపోకలు.. ప్రయాణికుల ఇబ్బందులు రామాయంపేట/హవేళిఘణాపూర్(మెదక్): మెదక్ – అక్కన్నపేట మార్గంలో రైల్వేట్రాక్ దెబ్బ తిని 20 రోజులు కావొస్తోంది. అయినా ఇప్పటివరకు మరమ్మతులకు నోచుకోలేదు. దీంతో ఈ మార్గంలో రైళ్ల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయి గత నెల చివరివారంలో కురిసిన భారీ వర్షాలకు అక్కన్నపేట– మెదక్ మార్గంలోని హవేళిఘణాపూర్ మండలం శమ్నాపూర్ వద్ద రెండు చోట్ల ట్రా క్ దెబ్బతింది. యుద్ధప్రాతిపదికన మరమ్మతులు నిర్వహించి రైళ్లను పునరుద్ధరించాల్సిన ఆ శాఖ అధికారులు తాత్సారం చేస్తున్నారు. అదే సమయంలో కామారెడ్డి జిల్లా తలమడ్ల వద్ద వరదలతో దెబ్బతిన్న ట్రాక్కు రెండు రోజుల్లో మరమ్మతులు పూర్తి చేశారు. 10 రోజులు పట్టే అవకాశం ప్రభుత్వ ఉద్యోగులు వందలాది మంది ప్రతి రోజు రైలులో సికింద్రాబాద్– మెదక్ మార్గంలో ప్రయాణాలు కొనసాగిస్తారు. రైళ్ల రద్దుతో వారు ప్రత్యామ్నాయ మార్గాలను అనుసరిస్తున్నారు. వారం రోజుల క్రితం బ్రిడ్జి మరమ్మతులు ప్రారంభించిన అధికారులు ఒక చోట గండిని పూడ్చి వేయించారు. మరో పెద్ద బ్రిడ్జి వద్ద చేపట్టిన పనులకు వరద నీరు ఆటంకం కలిగిస్తోంది. ఇసుక బస్తాలను వరదకు అడ్డుగా వేసి పనులు కొనసాగిస్తున్నారు. ఈ లెక్కన ట్రాక్ మరమ్మతులకు ఇంకా కనీసం 10 రోజులు పట్టే అవకాశం ఉంది. పెద్ద ఎత్తున వస్తున్న వరదతో పనులు సరిగా సాగడం లేదని రైల్వేశాఖ అధికారులు పేర్కొంటున్నారు. ట్రాక్ పునరుద్ధరణ, ఉన్నతాధికారులు పరిశీలన, ట్రయల్ రన్ పూర్తయిన తర్వాతే రైళ్ల రాకపోకలు ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి. -
సమస్యలు పరిష్కరించండి
మెదక్ కలెక్టరేట్: ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్లో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి అజ్జమర్రి మల్లేశం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం ఉద్యోగులతో కలిసి కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టర్ రాహుల్రాజ్కు వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జీఓ 64ను నిలిపివేసి, పాత పద్ధతిలోనే వేతనాలు చెల్లించాలన్నారు. పెండింగ్లో ఉన్న వేతనాలను సైతం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మెదక్ జిల్లాలో మాత్రమే అధికారులు ఉద్యోగుల వేతనాలు తొలగించడం దారుణం అన్నారు. ఇప్పటికై నా ఉద్యో గుల సమస్యలు పరిష్కరించాలని, లేని పక్షంలో నిరవధిక సమ్మెను మరింత ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. -
పండుగకు పస్తులేనా..?
నెలల తరబడి వేతనాలు అందక.. అప్పులు చేయలేక.. పస్తులు ఉండలేక.. దయనీయ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు జిల్లాలోని పారిశుద్ధ్య కార్మికులు. పండుగ రోజుల్లోనూ కుటుంబంతో పస్తులుండాల్సిన పరిస్థితి ఎదురవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మెదక్జోన్: ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు పనిచేస్తూ గ్రామాలను అద్దంలా ఉంచడంలో పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న కృషి వెలకట్టలేనిది. పల్లెలను నిత్యం పరిశుభ్రంగా ఉంచే కార్మికులకు రెండు నెలలుగా వేతనాలు రాక ఇక్కట్లకు గురవుతున్నారు. మరికొన్ని గ్రామాల్లోని కార్మికులకు 3 నుంచి 4 నెలలుగా వేతనాలు అందలేదు. అసలే చాలీచాలని జీతాలతో కుటుంబాలను నెట్టుకొస్తున్నామని, సమయానికి జీతం రాక మరిన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోతున్నారు. 492 జీపీలు.. 1,673 మంది కార్మికులు జిల్లావ్యాప్తంగా 21 మండలాలు 492 పంచాయతీ లు ఉండగా, 7.24 లక్షల మంది జనాభా ఉన్నారు. కాగా గత ప్రభుత్వం పారిశుద్ధ్య నిర్వహణ, ఇంటింటి చెత్త సేకరణ కోసం గ్రామానికో ట్రాక్టర్ను కేటాయించింది. గ్రామాల్లో ఉన్న జనాభా ప్రాతిపదికన ఒక్కో గ్రామానికి 3 నుంచి 5 మంది చొప్పున మొత్తం 1,673 మంది పారిశుద్ధ్య కార్మికులను నియమించింది. ఒక్కో కార్మికుడికి నెలకు రూ. 9,500 చొప్పున వేతనాలు చెల్లించింది. కాగా కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వంలో మెజార్టీ గ్రామాల్లో కార్మికులకు గత రెండు మాసాలుగా వేతనాలు రావటం లేదు. మరికొన్ని గ్రామాల కార్మికులకు 3 నుంచి 4 నెలలుగా అందటం లేదు. దీంతో బతుకమ్మ, దసరా పండుగకు కుటుంబాలు పస్తులుండే పరిస్థితి నెలకొందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇబ్బంది పడుతున్నాం మాకు నాలుగు నెలల నుంచి జీతం రావడం లేదు. దసరా పండుగకు కుటుంబ సభ్యులకు కనీసం బ ట్టలు కొనలేని దుస్థితి నెలకొంది. ఇప్పటికై నా అధికారులు జీతాలు ఇప్పించి ఆదుకోవాలి. – పద్మయ్య, పారిశుద్ధ్య కార్మికుడు ● రెండు నెలలుగా తప్పని ఎదురుచూపులు భారంగా మారిన కుటుంబ పోషణ గ్రామాల్లో సర్పంచ్ల పదవీకాలం ముగిసి సుమారు రెండు సంవత్సరాలు కావొస్తోంది. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రావాల్సిన నిధులు పూర్తిగా నిలిచిపోయాయి. చెత్త సేకరణ కోసం ఉపయోగించే ట్రాక్టర్లలో కొంతకాలం పాటు పంచాయతీ కార్యదర్శులు అప్పులు చేసి డీజిల్ పొయించారు. తలకు మించిన అప్పులు కావడంతో ఇక మాతో చెత్త సేకరణ కాదని చేతులెత్తేశారు. దీంతో జిల్లాలోని అనేక గ్రామాల్లో చెత్త సేకరణ నిలిచిపోయి దుర్గంధం వెదజల్లుతోంది. చెత్త సేకరణ నిలిచిపోవటంతో పల్లెల్లో వ్యాధులు ముసురుతున్నాయి. ఇప్పటివరకు జిల్లాలో 20 డెంగీ కేసులు నమోదు కాగా, టైఫాయిడ్ 46, డయేరియా 71 కేసులు నమోదయ్యాయి. 18,426 మంది విషజ్వరాల బారినపడ్డారు. -
పీఎం కిసాన్.. కొందరికే సాయం
మెదక్ కలెక్టరేట్: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పీఎం కిసాన్ పథకం జిల్లాలో కొంతమంది రైతులకే అందుతోంది. చాలా మంది రైతులకు సాయం అందక ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పథకంలో 2019 జనవరి 31 వరకు పట్టాదారు పాస్పుస్తకాలు ఉన్నవారినే అర్హులుగా గుర్తించి సాయం అందిస్తున్నారు. వారికి ఏటా పెట్టుబడి సాయంగా మూడు విడతల్లో రూ. 2 వేల చొప్పున రూ. 6 వేలు ఖాతాల్లో జమ చేస్తున్నారు. ఆ తర్వాత పట్టాదారు పుస్తకాలు పొందిన వారికి ఈ పథకంలో నమోదుకు అవకాశం ఇవ్వడం లేదు. దీంతో చాలా మంది పీఎం కిసాన్ పథకానికి దూరం అవుతున్నారు. జిల్లాలో సాధారణ పట్టాలు కలిగిన రైతులు 1,64,151 ఉన్నారు. ఇందులో కొత్త పట్టాదార్ పుస్తకాలు 12 వేలు ఉన్నాయి. పీఎం కిసాన్ డబ్బులు వచ్చిన రైతులు ఎవరైనా చనిపోతే వారి ద్వారా వారసత్వపు పాస్బుక్లు పొందిన వారికి మాత్రమే పథకంలో చేరే అవకాశం కల్పిస్తున్నారు. ఆరేళ్లుగా అవకాశం లేదు.. ఆరేళ్లుగా కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకంలో చేరేందుకు రైతులకు అవకాశం కల్పించడం లేదు. ఆరేళ్ల క్రితం పీఎం కిసాన్ పథకంలో 1,22,347 మంది రైతులు ఉన్నారు. ఇందులో ఇప్పటివరకు కొంతమంది తమ పొలాలు అమ్ముకోగా, ఇంకొంత మంది రైతులు చనిపోగా, మరికొంతమంది కుమారులకు గిఫ్ట్డీడ్ చేశారు. జిల్లాలో సుమారు 6 వేల వరకు రైతులు పీఎం కిసాన్లో తగ్గిపోయినట్లు సమాచారం. ఈ ఏడాది పీఎం కిసాన్తో సహా కేంద్ర ప్రభుత్వ పథకాలను వర్తింపజేసేందుకు మేలో రైతులకు విశిష్ట గుర్తింపు కార్డుల జారీ విధానాన్ని కేంద్రం చేపట్టింది. కానీ కొత్తగా వ్యవసాయ పొలాలు కొనుగోలు చేసి పట్టాదార్ పాస్పుస్తకాలు పొందిన వారికి పీఎం కిసాన్ పథకంలో లబ్ధి పొందే అవకాశం లేకుండా పోయింది. దీంతో సుమారు 40 వేల మంది అర్హులైన రైతులు పీఎం కిసాన్ కోసం ఎదురు చూస్తున్నారు. -
వన దుర్గమ్మకు పూజలు
పాపన్నపేట(మెదక్): ఏడుపాయల వన దుర్గమ్మను ఆదివారం పెద్ద సంఖ్యలో భక్తులు దర్శి ంచుకున్నారు. రాజగోపురంలో ఉత్సవ విగ్రహానికి పూజలు చేసి తీర్థప్రసాదాలు స్వీకరించారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ సిబ్బంది చర్యలు చేపట్టారు. పార్టీ బలోపేతమే లక్ష్యం పాపన్నపేట(మెదక్): బీజేపీ బలోపేతమే లక్ష్యంగా పనిచేస్తామని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కరణం పరిణిత అన్నారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికై న అనంతరం ఆదివారం మొదటిసారి ఏడుపాయల దుర్గమ్మను దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆమె తన స్వగ్రామమైన కొత్తపల్లి రాగా, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు స్వాగతం పలికి సన్మానించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. స్థానిక ఎన్నికల్లో అత్యధిక స్థానాలు కై వసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు సోమశేఖర్రావు, బైండ్ల సత్యనారాయణ, రాములు, సాయినాధ్రావు, తదితరులు పాల్గొన్నారు. 2,446 కేసుల రాజీ: ఎస్పీ మెదక్ మున్సిపాలిటీ: జాతీయ మెగా లోక్ అదాలత్లో భాగంగా జిల్లాలోని వివిధ పోలీస్స్టేషన్ల పరిధిలో 2,446 కేసులు రాజీ చేసినట్లు ఎస్పీ డీవీ శ్రీనివాసరావు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇందులో ఐపీసీ కేసులు 482, సైబర్ క్రైం 106, ఈ–పెట్టి కేసులు 193, డీడీఎంవీ యాక్ట్ 1,665 కేసులను రాజీపర్చినట్లు తెలిపారు. సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయిన 106 మంది బాధితులకు రూ. 24,19,680 మొత్తాన్ని తిరిగి వారి ఖాతాల్లో జమ చేసేలా చర్యలు చేపట్టామన్నారు. చిన్న చిన్న గొడవలు, వివాదాలు కోర్టుల్లో సంవత్సరాల తరబడి నిలవకుండా, ఇరువర్గాలు రాజీ మార్గం ద్వారా సమస్యలను పరిష్కరించుకోవడం సమాజానికి ఎంతో మేలు చేస్తుందన్నారు. ఈసందర్భంగా పోలీస్ అధికారులు, సైబర్ క్రైం యూనిట్, సిబ్బందిని ఎస్పీ అభినందించారు. సమస్యలు పరిష్కరించండి వెల్దుర్తి(తూప్రాన్): మాసాయిపేట మండలంలో నెలకొన్న ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఆదివారం నాయకులు ఎంపీ రఘునందన్రావును కలిసి వినతిపత్రం అందజేశారు. అండర్ గ్రౌండ్ బ్రిడ్జి వద్ద నీరు నిల్వ ఉండడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయని ఎంపీకి విన్నవించగా, రైల్వే జీఎంతో ఫోన్లో మాట్లాడి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే చెట్ల తిమ్మాయిపల్లి జాతీయ రహదారి వద్ద జంక్షన్ నిర్మాణం, సర్వీస్ రోడ్ల అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని కోరగా, సానుకూలంగా స్పందించారు. ఎంపీని కలిసిన వారిలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మధుసూదన్రెడ్డి, బీజేపీ మండల అధ్యక్షుడు నాగేందర్రెడ్డి, ఉపాధ్యక్షుడు శ్రీకాంత్, ప్రధాన కార్యదర్శి నవీన్యాదవ్, శ్రీకాంత్గౌడ్, సీనియర్ నాయకులు గుండ్ల రాజు ఉన్నారు. బీజేపీ నాయకుడికి షోకాజ్ నోటీసు గజ్వేల్: పట్టణానికి చెందిన బీజేపీ క్రీయాశీలక నాయకుడు కాశమైన నవీన్కు షోకాజ్ నోటీసులు ఇచ్చినట్లు పార్టీ ప్రధాన కార్యదర్శి నరసింహ ముదిరాజ్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈనెల 12న పట్టణంలోని అయ్యప్ప ఫంక్షన్ హాలు వద్ద పార్టీ నేతలు ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలను చించివేసి, అసభ్యపదజాలంతో దుర్భాషలాడినందువల్ల ఈ చర్య తీసుకున్నట్లు పేర్కొన్నారు. -
కేంద్రంలో ఉండే సదుపాయాలు
● వృద్ధులు ఆడుకోవడానికి వీలుగా క్యారం, చెస్తో పాటు ఇతర సదుపాయాలు ● సేదతీరడానికి ఆహ్లాదరక వాతావారణం, గార్డెనింగ్, మొక్కల పెంపకం ● వంట గది, గ్రంథాలయంతో పాటు ఇతర మౌలిక వసతులు ● తరచూ కేంద్రంలో ఆరోగ్య శిబిరాల నిర్వహణ ● వీల్ చైర్స్తో పాటు ర్యాంప్ల నిర్మాణం ● అత్యవసర పరిస్థితుల్లో అలారం సిస్టమ్ ఏర్పాటు ● మానసిక వేధన, భావోద్వేగానికి గురయ్యే వారికి కౌన్సెలింగ్ -
బాధ్యతగా పనిచేస్తా
గతంలో కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం శెట్పల్లిలో వీఆర్ఏగా పనిచేశాను. 2023లో సికింద్రాబాద్ మండలానికి బదిలీ చేశారు. ఇటీవల పాపన్నపేట మండలం మల్లంపేట జీపీఓగా నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. భూభారతి చట్టాన్ని పటిష్టంగా అమలు చేయడానికి కృషి చేస్తా. – రాజశేఖర్, జీపీఓ, మల్లంపేట దూరభారంతో ఇబ్బంది పడ్డా మా స్వగ్రామం కౌడిపల్లి మండలం వెల్మకన్నె. అప్పట్లో కౌడిపల్లిలో వీఆర్ఏగా పని చేశాను. అనంతరం జనగాం జిల్లా కలెక్టరేట్లో రికార్డు విభాగానికి బదిలీ చేశారు. సుమారు 150 కి.మీ దూరంలో విధులు నిర్వర్తించడం ఇబ్బందిగా ఉండేది. ప్రస్తుతం పాపన్నపేట జీపీఓగా నియామకమయ్యాను. – కృష్ణ, జీపీఓ, పాపన్నపేట -
సాయుధ పోరాటాన్ని వక్రీకరిస్తున్న బీజేపీ
మెదక్ కలెక్టరేట్: తెలంగాణ సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించి, ప్రజల మధ్య చీలికలు తేస్తున్న బీజేపీ విధానాలను తిప్పికొడతామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు చుక్క రాములు అన్నారు. ఆదివారం మెదక్లోని కేవల్ కిషన్ భవన్లో తెలంగాణ రైతంగా సాయుధ పోరాట వాస్తవాలు– వక్రీకరణాలు అనే అంశంపై సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సాయుధ పోరాటంలో ఏనాడు పాల్గొనని బీజేపీ చరిత్రను వక్రీకరించేందు ప్రయత్నాలు చేస్తుందని విమర్శించారు. రాజ్యాంగంలోని మౌలిక సూత్రాలను మార్చేందుకు కుట్రలు చేస్తుందన్నారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యురాలు బాలమణి, రాష్ట్ర కమిటీ సభ్యుడు అడివయ్య, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మల్లేశం పాల్గొన్నారు.సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు చుక్క రాములు -
సవాలక్ష ఆంక్షలు
ప్రస్తుతం పాత దరఖాస్తులకే మోక్షం ● కొత్త వాటిపై స్పష్టత కరువు● జిల్లాలో 6,500 మంది రైతులకు మేలుజిల్లాలో 2014 కంటే ముందు సాదాబైనామా ద్వారా వేలాది మంది సన్న, చిన్నకారు రైతులు భూముల క్రయవిక్రయాలు చేసుకున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెవెన్యూశాఖ ప్రక్షాళన పేరుతో నూతనంగా ధరణి చట్టాన్ని తెచ్చింది. సాదాబైనామాలో భూముల క్రయవిక్రయాలు చేసుకున్న రైతులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈమేరకు 2020 అక్టోబర్ 12 నుంచి నవంబర్ 10 వరకు గడువు ఇచ్చింది. దీంతో జిల్లావ్యాప్తంగా 6,500 మంది రైతులు దరఖాస్తు చేసుకున్నారు. వీరందరికీ ప్రస్తుతం పట్టాలు అయ్యే అవకాశం ఉంది. కొత్త వారికి ఎప్పుడో..? కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ధరణిని రద్దు చేసి భూ భారతి చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టం ద్వారా సాదాబైనామాలతో క్రయవిక్రయాలు జరిపిన రైతులకు పట్టాలు చేస్తామని చెప్పింది. ఈమేరకు ఈ ఏడాది జూన్ 2 నుంచి 20వ తేదీ వరకు గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేసి దరఖాస్తులు స్వీకరించింది. జిల్లావ్యాప్తంగా సుమారు 8 వేల మంది రైతులు వినతులు సమర్పించారు. కాగా వీటిని ఎప్పుడు పరిష్కరిస్తామనేది ప్రభుత్వం ఇప్పటివరకు ప్రకటించలేదు. అంతేకాకుండా ఐదెకరాలలోపు సాదా బైనామాలపై క్రయవిక్రయాలు జరిపిన రైతులకు మాత్రమే పట్టాలు చేస్తామని, పాత దరఖాస్తులను మాత్రమే పరిగణలోకి తీసుకుంటామని చెప్పి సవాలక్ష ఆంక్షలు విధించింది. క్షేత్రస్థాయిలోకి సర్వేయర్లు పేరుకుపోయిన భూ సమస్యలను పరిష్కరించేందుకు క్షేత్రస్థాయిలో సర్వేయర్లు కావాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం లైసెన్స్డ్ సర్వేయర్ల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. జిల్లాలో 219 మంది దరఖాస్తు చేసుకోగా, మొదటి విడతలో 116 మందిని ఎంపిక చేసింది. వారికి 50 రోజుల పాటు శిక్షణ ఇచ్చింది. రెండవ బ్యాచ్లో మరో 103 మంది సర్వేయర్లకు గత నెల 18 నుంచి శిక్షణ ఇస్తున్నారు.తెల్ల కాగితాలపై రాసుకున్న భూ కొనుగోళ్ల ఒప్పందాల (సాదా బైనామాల) క్రమబద్ధీకరణకు సవాలక్ష ఆంక్షలు విధిస్తున్నారు. భూ భారతి చట్టం ప్రకారం పట్టాలు చేసుకునే వెసులుబాటు ఉందని గతనెల హైకోర్టు తీర్పునిచ్చింది. అయితే పాత దరఖాస్తులను మాత్రమే ముందుగా పరిగణలోకి తీసుకొని పట్టాలు చేయాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు వచ్చాయి. కాగా ఈ ఏడాది జూన్లో కొత్తగా స్వీకరించిన దరఖాస్తులను ఎప్పుడు పరిష్కరిస్తారనేది స్పష్టత కరువైంది. – మెదక్జోన్పాత దరఖాస్తులకే పట్టాలు 2014 జూన్ 2 కంటే ముందు 5 ఎకరాలలోపు సన్న, చిన్నకారు రైతులు సా దా బైనామాలపై భూముల క్రయవిక్రయాలు చేసుకున్న వారు, 2020 అక్టోబర్ 12 నుంచి 2020 నవంబర్ 12వ తేదీ వరకు ఆన్లైన్లో ద్వారా దరఖాస్తు చేసుకున్న వారి భూములకు మాత్రమే పట్టాలు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. – నగేశ్, అదనపు కలెక్టర్