Medak
-
క్రీడా సంరంభమే
వచ్చే నెలలో వేసవి శిక్షణ శిబిరాలు ● జిల్లావ్యాప్తంగా 10 క్యాంపులు ● 25 రకాల క్రీడలువేసవి సెలవుల్లో విద్యార్థులు సమయాన్ని వృథా చేసుకోకుండా ప్రభుత్వం ఏటా వేసవి శిక్షణ శిబిరాలు నిర్వహిస్తోంది. అందులో భాగంగా వచ్చే నెల నుంచి వివిధ క్రీడల్లో ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు జిల్లా యువజన, క్రీడలశాఖ సమాయత్తం అవుతోంది. ఇందుకోసం ఆయా మండలాల్లోని క్రీడాకారుల నుంచి మరో రెండు మూడు రోజుల్లో దరఖాస్తులు స్వీకరించనుంది. – మెదక్జోన్ జిల్లావ్యాప్తంగా 21 మండలాలు, 4 మున్సిపాలిటీలు ఉండగా.. 10 వేసవి క్యాంపులు ఏర్పాటు నిర్వహించేందుకు అనుమతులు వచ్చాయి. మే 1 నుంచి నెలాఖరు వరకు ఈ శిబిరాలను నిర్వహించనున్నారు. ఇందులో సుమారు 25 రకాల క్రీడలు నిర్వహించుకునే వీలు ఉండగా, ఒక్కో క్రీడా నిర్వహణ కోసం ప్రభుత్వం రూ. 6 వేల చొప్పున పదింటికి రూ. 60 వేలు మంజూరు చేసింది. అర్బన్లో నిర్వహించే క్రీడలకు ఫీజు జిల్లావ్యాప్తంగా 25 రకాల వేసవి శిక్షణ శిబిరాలు (కీడలను) నిర్వహించనుండగా, వాటిలో అర్బన్ ప్రాంతంలో సగం, గ్రామీణ ప్రాంతాల్లో మరో సగం చొప్పున నిర్వహించాల్సి ఉంది. కాగా ఇందులో అర్బన్ ప్రాంతాల్లో క్రీడాకారుల నుంచి ఒక్కో క్రీడకు ఒక్కో రకమైనా ఫీజు చెల్లించాల్సి ఉంది. అదే రూరల్ ఏరియాలో పాల్గొనే క్రీడాకారులకు ఎలాంటి ఫీజు లేకుండానే ఉచితంగా పాల్గొనే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. అర్బన్ క్రీడల్లో ముఖ్యంగా అథ్లెంటిక్స్ క్రీడాకారుడు రూ. 400 చొప్పున చెల్లించాలి, బాస్కెట్బాల్కు రూ.400, బ్యాడ్మింటన్ రూ. 1,000, క్రికెట్, టేబుల్ టెన్నిస్ రూ.700, స్కేటింగ్, స్విమ్మింగ్, టెన్నిస్లకు రూ.600 చొప్పున ఫీజు నిర్ణయించారు. వాడుకలో ఉన్న వాటికి ప్రాధాన్యం వేసవి శిక్షణ శిబిరంలో సుమారు 25 రకాల క్రీడలు ఉండగా, వాటిలో అర్బన్, రూరల్ ప్రాంతాల్లో ఎక్కువగా ప్రాచుర్యంలో ఉన్న క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఆయా ప్రాంతాల్లోని క్రీడాకారులు ఎక్కువగా ఏ క్రీడకు మొగ్గు చూపితే దానినే ఎంచుకునే అవకాశాలు ఉన్నాయి. క్రీడా నిర్వహణ కోసం ప్రభుత్వం ఒక్కోదానికి ముందుగా రూ. 1000 ఇస్తారు. వాటితో క్రీడా మైదానం చదును, క్రీడాకారులకు తాగునీరు, తదితర అవసరాలకు ఉపయోగిస్తారు. క్రీడలు ముగిశాక ఒక్కో శిక్షణ శిబిరానికి రెమ్యూనరేషన్ కింద ఒక్కోదానికి రూ. 5 వేల చొప్పున పదింటికి మొత్తం రూ. 60 వేలు ఖర్చు చేయనున్నారు.దరఖాస్తుల స్వీకరణవేసవి శిక్షణ శిబిరాలను మరో నాలుగైదు రోజుల్లో ప్రారంభించనున్న నేపథ్యంలో ఆయా మండలాల పరిధిలోని పీఈటీలు, పీడీలతో పాటు గతంలో రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రతిభ కనబర్చిన క్రీడాకారులు వీటిని ఏర్పాటు చేసే అర్హత ఉంటుంది. కాగా అలాంటి వారి నుంచి ఒకటి, రెండు రోజుల్లో సంబంధిత అధికారులు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిసింది.సద్వినియోగం చేసుకోండి మేలో నిర్వహించే వేసవి శిక్షణ శిబిరాలను క్రీడాకారులు సద్వినియో గం చేసుకోవాలి. జిల్లావ్యాప్తంగా అర్బన్లో 5, రూరల్లో 5 చొప్పున మొత్తం 10 క్యాంపులు నిర్వహిస్తున్నాం. ఒక్కో క్యాంపునకు రూ. 6 వేల చొప్పున ప్రభుత్వం మంజూరు చేసింది. – రమేశ్, డీవైఎస్ఓ -
వడగండ్లు.. కడగండ్లు
చేగుంట(తూప్రాన్): ఆరుగాలం శ్రమ అకాల వర్షానికి కరిగిపోయింది. వడగండ్ల వాన కడగండ్లు మిగిల్చింది. పంట చేతికొచ్చే వేళ అన్నదాతల ఆశలు గాలి వానకు నెలకొరిగాయి. వారం క్రితం మండలంలోని మక్కరాజీపేట, కర్నాల్పల్లి, గొల్లపల్లి, రాంపూర్, కరీంనగర్తో పాటు వల్లభాపూర్ గ్రామాల్లో వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది. ఈదురుగాలులతో కూడిన వర్షానికి వరి పైరు నేలవాలింది. వరి కంకుల నుంచి గింజలు రాలిపోయాయి. పంట నష్టపోయిన వారిలో సగం మంది కౌలు రైతులే ఉండటం గమనార్హం. ఎకరాకు రూ. 20 వేలకు పైగా పెట్టుబడి పెట్టి పంటలు వేసుకుంటే వడగండ్ల వాన తీవ్ర నష్టాన్ని మిగిల్చిందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలంలో సుమారు 5 వందల ఎకరాల వరకు పంటలు దెబ్బతిన్నట్లు అధికారులు అంచనా వేశారు. ప్రభుత్వం నుంచి పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని పలు గ్రామాల రైతులు కోరుతున్నారు. అపార నష్టం మిగిల్చిన అకాల వర్షాలు ప్రభుత్వం ఆదుకోవాలని అన్నదాతల వేడుకోలు -
దుర్గమ్మా.. దీవించమ్మా
పాపన్నపేట(మెదక్): ఏడుపాయల జనసంద్రంగా మారింది. ఆదివారం వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు బారులు తీరి అమ్మవారిని దర్శించుకున్నారు. అర్చకులు పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు. భక్తులు అమ్మవారికి ఒడి బియ్యం పోసి, బోనాలు తీసి మొక్కులు తీర్చుకున్నారు. ఇబ్బంది కలగకుండా ఆలయ సిబ్బంది, పోలీసులు చర్యలు చేపట్టారు. సత్రాలు దొరకక భక్తులు చెట్ల కింద టెంట్లు వేసుకొని విందు చేసుకున్నారు. సకాలంలో బిల్లులు అందించాలి ఫుట్బాల్ పోటీల్లో రాణించాలిగజ్వేల్రూరల్: రాష్ట్రస్థాయిలో జరుగుతున్న ఫుట్బాల్ పోటీల్లో రాణించి మంచి పేరు తీసుకురావాలని జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు గణేష్ అన్నారు. రాష్ట్రస్థాయి జూనియర్ బాలికల పోటీల్లో పాల్గొనే జిల్లా జట్టుకు ఆదివారం గజ్వేల్లో జెర్సీలను అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈనెల 27 నుంచి 29 వరకు మంచిర్యాల జిల్లా రామకిష్టాపూర్ టాగోర్ ఫుట్బాల్ స్టేడియంలో రాష్ట్రస్థాయి జూనియర్స్ గర్ల్స్ ఫుట్బాల్ పోటీలు జరుగనున్నాయని తెలిపారు. రాష్ట్రస్థాయి టోర్నమెంట్లో పాల్గొనే క్రీడాకారులు అద్భుతంగా రాణించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఎన్ఐఎస్ కోచ్ నరసింహ, జీఎఫ్సీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మహనీయులను మరవొద్దు ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ వెంకటయ్య మిరుదొడ్డి(దుబ్బాక): ఆర్థిక, స్వేచ్ఛా సమా నత్వం కోసం పోరాడిన మహనీయులను మరవొద్దని ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. ఈ నెల 30న దుబ్బాక మండలం చీకోడ్ గ్రామంలో నిర్వహించే మహనీయుల ఉత్సవ సభ కరపత్రాలను ఆదివారం అక్బర్పేట–భూంపల్లి మండల కేంద్రంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చిన మహనీయులను గుర్తు చేసుకోవడం శుభపరిణామమన్నారు. మహనీయులు కలలుగన్న ఆశయాలను నిజం చేయడానికి ప్రతి ఒక్కరూ పాటు పడాలని కోరారు. మహనీయుల జీవిత చరిత్రను తెలుసుకోవడానికి చీకోడ్లో చేపట్టిన బృహత్ కార్యక్రమానికి కవులు, కళాకారులు, మేధావులు, కార్మిక కర్షకులు అభిమానులు అధిక సంఖ్యలో హాజరు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో తిమ్మాపూర్ సర్పంచ్ శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్ ఆస యాదగిరి, మాజీ సర్పంచ్లు తదితరులు పాల్గొన్నారు. -
విద్యతో ఏదైనా సాధ్యమే
● అంబేడ్కర్ విగ్రహావిష్కరణలో మంత్రి వివేక్ ● హాజరైన ఎంపీ సురేశ్ షెట్కార్, మాజీమంత్రి చంద్రశేఖర్ న్యాల్కల్(జహీరాబాద్): క్రమశిక్షణ, పట్టుదలతోపాటు చదువుకుంటే ఏదైనా సాధ్యమవుతుందని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ నిరూపించారని మంత్రి వివేక్ అన్నారు. మండల పరిధిలోని రాంతీర్థ్ గ్రామంలో ఏర్పాటు చేసిన అంబేడ్కర్ విగ్రహాన్ని మంత్రి ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ శ్రీనివాస్రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ...నాడు అంబేడ్కర్కు జరిగిన వివక్షతవల్ల చదువుకు దూరమై ఉంటే నేడు రాజ్యాంగం నిర్మాతగా ఉండే వారు కాదన్నారు. అంతంతమాత్రంగానే ఉన్న ఆర్థికవ్యవస్థను గాడిలో పెట్టేందుకు నాడు ఆర్బీఐ స్థాపనలో కూడా ఆయన కృషి ఎంతో ఉందని కొనియాడారు. అంబేడ్కర్ రాజ్యాంగాన్ని రచించడంతోపాటు దళితులు, కార్మికుల హక్కులు, అంటరానితనం కోసం పోరాటం చేశారని మంత్రి గుర్తు చేశారు. దేశ నిర్మాణంలో కీలకపాత్ర పోషించిన అంబేడ్కర్ చూపిన మార్గంలో అందరూ నడుచుకోవాలని కోరారు. రాంతీర్థ్ నుంచి హద్నూర్ వరకు రోడ్డు బాగు చేయించాలని గ్రామ సర్పంచ్ శ్రీనివాస్రెడ్డి, నాయకులు నర్సింహులు మంత్రి దృష్టికి తీసుకురాగా..అవసరమైన నిధులను మంజూరు చేయిస్తానని హామీనిచ్చారు. ఎంపీ సురేశ్ కుమార్షెట్కార్ మాట్లాడుతూ..అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం వల్లే దేశంలోని 140 కోట్లమంది నడుచుకుంటున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు కాంగ్రెస్ పార్టీ నుంచి 11 మంది ఎంపీలం సోనియాగాంధీ వద్దకు వెళ్లినప్పుడు అందులో వివేక్ పాత్ర ఎంతో కీలకమైందని గుర్తు చేశారు. కార్యక్రమంలో మాజీమంత్రి చంద్రశేఖర్, సెట్విన్ చైర్మన్ గిరిధర్రెడ్డి, టీఎస్ఐడీసీ మాజీ చైర్మన్ మహ్మద్ తన్వీర్, జహీరాబాద్ మున్సిపల్ చైర్మన్ యూనూస్, జహీరాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తిరుపతిరెడ్డి, డీసీసీ ప్రధాన కార్యదర్శి భాస్కర్రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి, యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కిరణ్గౌడ్, సీనియర్ నాయకులు చంద్రప్ప, గౌని శివకుమార్, సిద్దిలింగయ్యస్వామి, వివిధ గ్రామాల సర్పంచ్లు, దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
కుప్పకూలుతున్న బతుకులు
రామాయంపేట(మెదక్): ఆరుగాలం కష్టపడి పండించిన పంటను ఆరబెట్టుకునేందుకు అన్నదాత లు నానా అవస్థలు పడుతున్నారు. తేమ శాతం ఎక్కువగా లేకుండా చేసుకోవడానికి ధాన్యం ఆరబోతకు రహదారులను ఆశ్రయిస్తున్నారు. అయితే ఆరబోసిన ధాన్యం కుప్పలు తరచూ ప్రమాదాలకు కారణమవుతున్నాయి. గతేడాది జిల్లాలోని పలు రహదార్లపై ఆరబోసిన ధాన్యం కుప్పలను ఢీకొని కనీసం నలుగురు మృతి చెందగా, పదుల సంఖ్యలో గాయపడ్డారు. సమస్యను అధిగమించేందుకు.. ఈ సమస్యను పరిష్కరించేందుకు కేంద్రం ముందుకు వచ్చింది. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా జాబ్ కార్డు కలిగిన సన్న, చిన్న కారు రైతులు తమ సొంత పొలాల్లో కల్లాల నిర్మాణం చేపట్టేందుకు గతంలో అవకాశం కల్పించింది. ఎస్సీ, ఎస్టీ రైతులకు ఉచితంగా, బీసీ, ఓసీ రైతులకు 90 శాతం రాయితీపై కల్లాల నిర్మాణం చేపట్టేలా ఆదేశాలు జారీ చేసింది. జిల్లాలో 1,600 మంది రైతులు కల్లాలు నిర్మించుకున్నారు. 250 మంది రైతులు నిర్మాణాలు ప్రారంభించినా, సకాలంలో నిధులు మ ంజూరు కాకపోవడంతో మధ్యలోనే నిలిపివేశారు. ఆ తర్వాత ఈ పథకం రద్దు కాగా, ఆశించిన స్థాయిలో అమలుకు నోచుకోలేదు.రామాయంపేట–మెదక్ రోడ్డుపై ఆరబోసిన ధాన్యం కల్లాలు లేక రైతుల అవస్థలు రహదారులపై ధాన్యం ఆరబోత రాత్రివేళ చోటుచేసుకుంటున్న ప్రమాదాలురైతులకు నోటీసులు ప్రస్తుతం వరి కోతల సీజన్ ప్రారంభం కావడంతో రైతులు తమ పంట ఉత్పత్తులను రహదారులపై ఆరబెట్టుకుంటున్నారు. ఎల్లవేళలా రద్దీగా ఉండే జాతీయ రహదారిపై సైతం ధాన్యం ఆరబోస్తున్నారు. దీంతో ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉందని హైవే అధికారులు, పోలీసులు చెబుతున్నారు. రహదారులపై ధాన్యం ఆరబోస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు. ఈమేరకు రోడ్డుపై ధాన్యం ఆరబెట్టుకుంటున్న రైతులకు పోలీసులు నోటీసులు జారీ చేస్తున్నారు. అయితే కొత్తగా కల్లాల నిర్మాణానికి కేంద్రం అనుమతులు మంజూరు చేయాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. కల్లాలు మంజూరు చేయాలి వడ్లు ఆరబోసుకోవడానికి వీలుగా తమకు వంద శాతం సబ్సిడీపై కల్లాలు మంజూరు చేయాలి. ఈ సదుపాయం లేకపోవడంతో ధాన్యాన్ని రహదారుల, బో రు బావుల వద్ద ఆరబోసుకుంటున్నాం. దీంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. – లాల్యనాయక్, చౌకత్పల్లి తండా -
బంధం చెరువు మరమ్మతులకు మోక్షం
వర్గల్(గజ్వేల్): ‘సాక్షి’ కథనానికి స్పందన లభించింది. అయిదేళ్ల నిరీక్షణకు తెరపడింది. భారీ జలాశయం ‘బంధం’ చెరువు మరమ్మతులకు మోక్షం లభించింది. రైతుల్లో ఆనందం వెల్లువెత్తుతోంది. కొండపోచమ్మ సాగర్ జలాలను హల్దీవాగులోకి తరలించే కీలక ఫీడర్ చానల్గా ప్రాధాన్యత కలిగిన చౌదరిపల్లి ‘బంధం’ చెరువు దుస్థితి వెల్లడిస్తూ ఈ నెల 21న ‘బంధం..బలహీనం’ శీర్షికతో ‘సాక్షి’లో ప్రత్యేక కథనం ప్రచురితమైన విషయం విదితమే. ఈ మేరకు స్పందించిన అధికారులు ఆదివారం చెరువు మరమ్మతులకు శ్రీకారం చుట్టారు. చెరువులో నీళ్లు అడుగంటిపోగా, కట్టవైపు మరమ్మతు పనులకు అవరోధం కలగకుండా మిగతా నీరు వెళ్లిపోయేలా ‘ట్రెంచ్’ (కాలువ) తవ్వారు. కట్టమీద చెట్ల తొలగింపు పనులు వేగవంతం చేశారు. -
సమన్వయంతో పనిచేయండి
మెదక్ కలెక్టరేట్: ‘ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక’లో భాగంగా నేటి నుంచి మే 2వ తేదీ వరకు జిల్లాలో నిర్వహించే బాలల భద్రత రక్షణ సంక్షేమ వారం కార్యక్రమాలను ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ ప్రతిమాసింగ్ అధికారులను ఆదేశించారు. ఆదివా రం క్యాంపు కార్యాలయం నుంచి వివిధశాఖల అధికారులతో గూగుల్ మీట్ నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పకడ్బందీగా కార్యక్రమాలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. ఇందుకు గాను ఆర్డీఓలు, ఎంపీడీఓలు, పోలీస్, మండల ప్రత్యేక అధికారులు సమన్వయంతో విజయవంతం చేయాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేశ్, ఆర్డీఓలు రమాదేవి, రామకృష్ణ, జయచంద్రారెడ్డి, జిల్లా సంక్షేమాధికారిణి హేమభార్గవి, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఘనంగా వాసవీ మాత జయంతి ఆర్యవైశ్యుల కులదేవతగా వాసవీ మాతకు ప్రత్యేక స్థానం ఉందని కలెక్టర్ ప్రతిమాసింగ్ అన్నారు. ఆదివారం కలెక్టరేట్లో వాసవీ మాత జయంతిని పురస్కరించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాటాడుతూ.. వాసవీమాత జయంతిని అధికారికంగా జరుపుకోవడం సంతోషకరంగా ఉందన్నారు. జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేశ్, డీవైఎస్ఓ రమేశ్, డీపీఆర్ఓ రామచంద్రరాజు, ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షుడు రవీందర్, ప్రధాన కార్యదర్శి అశోక్, ఉత్సవ కమిటీ చైర్మన్ నాగరాజు, నాయకులు చంద్రపాల్, మ్యాడం బాలకృష్ణ, అశోక్, వనజ, సుష్మ, పద్మ పాల్గొన్నారు.కలెక్టర్ ప్రతిమాసింగ్ -
మహిళా బిల్లును అడ్డుకోవడం సిగ్గుచేటు
రామాయంపేట(మెదక్): కాంగ్రెస్ పార్టీ మహిళా బిల్లును అడ్డుకోవడం సిగ్గుచేటని బీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లేశ్గౌడ్ అన్నారు. ఆదివారం ఆయన పట్టణంలోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. 33 శాతం రిజర్వేషన్ అమలైతే చాలా మంది మహిళలు రాజకీయాల్లో రాణించే అవకాశం ఉంటుందన్నారు. కుటుంబ పరిపాలన చేసుకుంటూ రాష్ట్రాలను దోచుకుంటుందని ఆరోపించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసగించిందని మండిపడ్డారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం తధ్యమన్నారు. నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా రామాయంపేటను అసెంబ్లీ సెంగ్మెంట్ చేయడానికి బీజేపీ కట్టుబడి ఉందన్నారు. వీహెచ్పీ జిల్లా అధ్యక్షుడు పబ్బ సత్యం, పార్టీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు రాగి రాములు, మండలశాఖ అధ్యక్షుడు నవీన్గౌడ్, కౌన్సిలర్ శంకర్గౌడ్, సర్పంచ్ యాదగిరి, మండల ప్రధాన కార్యదర్శి దిలీప్, కిసాన్ మోర్చా మండలశాఖ అధ్యక్షుడు సంగయ్య, నాయకులు రమణ, శంకర్ తదితరులు పాల్గొన్నారు.బీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లేశ్గౌడ్ -
కార్మిక చట్టాలను కాపాడుకుందాం
మెదక్ కలెక్టరేట్: మేడే వారోత్సవాలను జయప్రదం చేయాలని, పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను కాపాడుకునేందుకు ఉద్యమం చేపడతామని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్క రాములు అన్నారు. శనివారం మెదక్ కేవల్ కిషన్ భవనంలో జిల్లా అధ్యక్షురాలు బాలమణి అధ్యక్షతన నిర్వహించిన విస్తృతస్థాయి సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కార్మికుల ప్రాణత్యాగాలతో పోరాడి సాధించుకున్న పనిగంటలను పెంచాలని కేంద్రం నిర్ణయించిందని ఆరోపించారు. కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న 29 రకాల కార్మిక చట్టాలను తొలగించడం సిగ్గుచేటు అన్నారు. మే 1 నుంచి 7 వరకు మే డే వారోత్సవాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎన్పీఆర్డీ రాష్ట్ర కార్యదర్శి అడివయ్య, కార్యదర్శి మల్లేశం, కోశాధికారి నర్సమ్మ, జిల్లా ఉపాధ్యక్షుడు నాగరాజు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్క రాములు -
ధాన్యానికి గిట్టుబాటు ధర
రామాయంపేట(మెదక్): రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ సూచించారు. మండలంలోని దామరచెరువులో శనివారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి మాట్లాడారు. రైతులు పండించిన ధాన్యానికి సరైన గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. వ్యాపారులకు కాకుండా కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ గీతాంజలి, ఉపసర్పంచ్ పిట్ల నరేశ్, మాజీ సర్పంచ్ శివప్రసాదరావు, రామాయంపేట మున్సిపల్ వైస్ చైర్పర్సన్ పోచమ్మల నవనీత, కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు.ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ -
నియోజకవర్గానికో ‘ఏటీసీ’
నర్సాపూర్ రూరల్: ప్రతి నియోజకవర్గ కేంద్రంలో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ప్రారంభిస్తామని మంత్రి వివేక్ తెలిపారు. శనివారం మండలంలోని నారాయణపూర్లో ‘ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక’లో భాగంగా బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ బడుల్లో నాణ్యమైన విద్యను అందించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. విద్యార్థులు ప్రస్తుత పోటీ ప్రపంచంలో రాణించాలంటే స్కిల్స్ అవసరం అన్నారు. అందుకే ఏటీసీ సెంటర్లు ఏర్పాటుచేసి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. ప్రతి ఒక్కరిని బడిలో చేర్పించి చదివించాలని గ్రామస్తులకు సూచించారు. కార్యక్రమంలో కలెక్టర్ ప్రతిమాసింగ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ సుహాసినిరెడ్డి, డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్, నియోజకవర్గ ఇన్చార్జి రాజిరెడ్డి, మాజీ జెడ్పీటీసీ శ్రీనివాస్గుప్తా, సర్పంచ్ దేవిసింగ్, ఎంఈఓ తారాసింగ్, హెచ్ఎం రవి తదితరులు పాల్గొన్నారు. ఆరు గ్యారంటీలు అమలు నర్సాపూర్: తమ ప్రభుత్వం ఆరు గ్యారంటీలు అమలు చేస్తుందని మంత్రి వివేక్ చెప్పారు. శనివారం మున్సిపాలిటీ పరిధిలో నగరాభివృద్ధి పథకం కింద రూ. 15 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసి మాట్లాడారు. గత ప్రభుత్వం పదేళ్లలో రూ. 8 లక్షల కోట్ల అప్పు చేసిందని, వాటికి వడ్డీలు చెల్లించడం తమకు భారంగా తయారైందన్నారు. అనంతరం ఎమ్మెల్యే సునీతారెడ్డి మాట్లాడుతూ.. ఆడపిల్లల తల్లిదండ్రులకు భారం కావొద్దని మాజీ సీఎం కేసీఆర్ కళ్యాణలక్ష్మి పథకం అమలు చేసి అండగా నిలిచారని అన్నారు. పట్టణంలో పెండింగ్లో ఉన్న పలు పనులను నిధులు విడుదల చేయాలని మంత్రిని కోరారు. -
చిన్నారుల ఆరోగ్యంపై దృష్టి
దుబ్బాక: గర్భిణులు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. శనివారం దుబ్బాక ఐసీడీఎస్ కార్యాలయంలో ప్రాజెక్టు పరిధిలోని అంగన్వాడీ టీచర్లకు రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యతో కలిసి స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చిన్నారులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలపై ఎలాంటి లోటుపాట్లు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నియోజకవర్గంలోని చాలా గ్రామాల్లో అంగన్వాడీ కేంద్రాలకు భవనాలు లేవని వెంటనే స్థలాలు కేటాయించి నిర్మాణాలు చేపట్టాలన్నారు. ప్రభుత్వ పథకాలు అర్హులకు అందేలా చూడాలని సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ శ్రీరాం సంగీల, వైస్ చైర్పర్సన్ సులోచన, కౌన్సిలర్లు, సీడీపీఓ ఎల్లయ్య, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి -
స్వీయ గణనలో పాల్గొనండి
కలెక్టర్ ప్రతిమాసింగ్ మెదక్ కలెక్టరేట్: జనాభా లెక్కలు ఎవరికి వారు స్వయంగా చేసుకునేలా ప్రభుత్వం యాప్ తీసుకొచ్చిందని, ప్రజలు దీనిని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ప్రతిమాసింగ్ శనివారం తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రతి పదేళ్లకోసారి నిర్వహించే జాతీయ జనగణన కార్యక్రమం ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈనేపథ్యంలో ప్రజలు ఈసారి అందుబాటులోకి వచ్చిన డిజిటల్ సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఆన్లైన్ను సద్వినియోగం చేసుకోవాలన్నారు. డిజిటల్ ఇండియా కార్యక్రమంలో భాగంగా రూపొందించిన ఈ సౌకర్యం ద్వారా ప్రజలు తమ ఇంటి వివరాలు, కుటుంబ సభ్యుల సమాచారం వంటి అంశాలను ఆన్లైన్లో సులభంగా నమోదు చేసుకోవచ్చన్నారు. వెబ్ పోర్టల్ను https://se.censes.gov.in ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిందన్నారు. -
రోడ్డెక్కిన ప్రగతి చక్రాలు
ఆదివారం శ్రీ 26 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026ఆర్టీసీ కార్మికుల సమ్మె ముగియడంతో శనివారం ఉదయం ప్రగతి చక్రాలు రోడ్డెక్కాయి. చర్చలు సఫలం కావడంతో కార్మికులు మెదక్ ఎదుట టపాసులు కాల్చి, స్వీట్లు పంచుకొని సంబురాలు జరుపుకున్నారు. ఈసందర్భంగా తెలంగాణ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి మేడి రాధాకిషన్రావు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి నిర్ణయం తీసుకోవడం హర్షనీయం అన్నారు. సమ్మె విజయవంతానికి సహకరించిన అన్ని కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు, మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. – మెదక్ కలెక్టరేట్ -
కిచెన్ గార్డెన్లు తప్పనిసరి
రామాయంపేట(మెదక్): అంగన్వాడీల్లో కిచెన్ గార్డెన్లు తప్పనిసరని, ఏర్పాటు చేయని టీచర్లపై చర్యలు తీసుకుంటామని మెదక్ ఎంపీ రఘునందన్రావు హెచ్చరించారు. శనివారం పట్టణంలోని ఐసీడీఎస్ సెక్టార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పోషణ్ పక్వాడ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. అంగన్వాడీల్లో సాధ్యమైనంత మేర ప్లాస్టిక్ను నిషేధించాలని సూచించారు. చిన్నారులను సెల్ఫోన్లకు దూరంగా ఉంచాలన్నారు. ఈసందర్భంగా ఎంపీ అంగన్వాడీ టీచర్లకు సెల్ఫోన్లు అందజేశారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి ప్రశంసాపత్రాలు అందజేఽశారు. ఎంపీ వెళ్లిపోయిన అనంతరం మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ కార్యక్రమానికి హాజరయ్యారు. ఐసీడీఎస్ ఏర్పాటు చేసిన స్టాల్స్ను పరిశీలించారు. చిన్నారులకు గ్యాడ్యుయేషన్ సర్టిఫికెట్లు అందజేసి మోడల్స్ బహుకరించారు. కార్యక్రమంలో టీఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు నరేందర్, జిల్లా ప్రధాన కార్యదర్శి రాజ్కుమార్, సంఘం మండలశాఖ అధ్యక్షుడు ప్రభాకర్, సీడీపీఓ స్వరూప, ఆయా గ్రామాల సర్పంచ్లు, అధికారులు, అంగన్వాడీ కార్యకర్తలు, సూపర్వైజర్లు పాల్గొన్నారు.మెదక్ ఎంపీ రఘునందన్రావు -
ఉపాధి పనులకు రండి
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: ఉపాధిహామీ కూలీల హాజరు శాతం గణనీయంగా పెంచాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇందుకోసం ఆశాఖ అధికారులకు లక్ష్యాలను నిర్దేశించింది. ఉపాధిహామీ పథకంలో చేపట్టిన ఈ పనులకు ఎక్కువమందిని తీసుకురావాలని క్షేత్రస్థాయిలో పనిచేసే మేట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ దిశగా ప్రత్యేక దృష్టి సారించాలని ఎంపీడీఓలు, మండలస్థాయిలో పనిచేసే ఉపాధిహామీ ఏపీఎంలను ఆదేశించింది. దీంతో సంబంధిత అధికారులు గ్రామాల వారీగా సమీక్షలు చేస్తున్నారు. మేట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు వంటి క్షేత్రస్థాయి సిబ్బందితో టెలీకాన్ఫరెన్సులు నిర్వహిస్తున్నారు. చిన్న గ్రామమైతే కనీసం 100 మంది కూలీలు, పెద్ద గ్రామ పంచాయతీల్లో 200లకు మించి కూలీల హాజరు సంఖ్య ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు. కీలక మార్పుల నేపథ్యంలో.. నిరుపేద వ్యవసాయ కూలీల వలసలను నివారించేందుకు స్థానికంగా పని కల్పించాలనే లక్ష్యంతో అమలు చేస్తున్న ఈ పథకం పేరును వీబీజీరాంజీగా మార్చుతూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్న విషయం విదితమే. ఇందులోభాగంగా కీలక మార్పులు చేసింది. మరో రెండు, మూడు నెలల్లో కీలక మార్పులు అమల్లోకి రానున్న నేపథ్యంలో కూలీల సంఖ్యను వీలైనంత ఎక్కువగా పెంచి పనులు కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఎండల తీవ్రత, వ్యవసాయ పనులు.. కూలీల హాజరు తక్కువగా ఉండటానికి ప్రధానంగా ఎండల తీవ్రతే కారణం. గత పక్షం రోజులు ఎండలు మండిపోతున్నాయి. కొన్నిచోట్ల 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది. ఈ పనులు చేస్తున్న కూలీలు అల్లాడిపోతున్నారు. దీంతో కూలీల సంఖ్య తక్కువ నమోదవుతోంది. మరోవైపు వ్యవసాయ పనుల్లో కూలీలు నిమగ్నమయ్యారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్, మెదక్ జిల్లా పెద్ద శంకరంపేట వంటి ప్రాంతాల్లో జొన్న పంట కోతలు కొనసాగుతున్నాయి. మెదక్, సిద్దిపేట జిల్లాల్లో వరి కోత దశకు చేరుకుంటోంది. దీంతో కూలీలు వ్యవసాయ పనులకు వెళ్తుండటంతో హాజరు అనుకున్నంత మేరకు నమోదు కావడం లేదు.జిల్లాల వారీగా టార్గెట్లు ఇలా.. సంగారెడ్డి జిల్లాలో మొత్తం 3.75 లక్షలమంది ఉపాధిహామీ కూలీలున్నారు. వీరికి 2.09 లక్షల జాబ్కార్డులున్నాయి. ఇందులో 1.85 లక్షలమంది కూలీలు మాత్రమే పనులు చేస్తున్నారు. ప్రస్తుతం ప్రతీరోజు సుమారు 27,450 మంది కూలీలు ఈ పనులకు హాజరవుతున్నారు. ఈ సంఖ్యను ప్రతీరోజు 40 వేలకు పెంచాలని లక్ష్యంగా నిర్ణయించారు. సిద్దిపేట జిల్లాలో 3.84 లక్షలమంది కూలీలుండగా, 1.95 లక్షల జాబ్కార్డులున్నాయి. వీరిలో 1.86 లక్షలమంది కూలీలు ఉపాధిహామీ పనులు చేస్తారు. ఇందులో ప్రస్తుతం రోజుకు 32,790 మంది కూలీలు ఉపాధి పనులకు వస్తున్నారు. ఈ సంఖ్యను 47,500లకు పెంచాలని ఆదేశాలు జారీ అయ్యాయి. మెదక్ జిల్లాకు సంబంధించి 3.24 లక్షల మంది కూలీలుండగా, 1.63 లక్షల జాబ్కార్డులున్నాయి. ఇందులో 1.89 లక్షలమంది ఉపాధిహామీ పనులు చేస్తారు. ప్రస్తుతం రోజుకు 33,110 మంది కూలీలు పనులకు వస్తే..ఈ సంఖ్యను 42,800లకు పెంచాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందాయి.ఈజీఎస్ కూలీల హాజరు పెంచేందుకు టార్గెట్లు గ్రామాల వారీగా మేట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లతో సమీక్షలు వీబీజీరాంజీగా పేరు మార్పు నేపథ్యంలో కీలక నిర్ణయాలు -
పేదలు ఆత్మగౌరవంతో బతకాలి: మంత్రి దామోదర
రేగోడ్(మెదక్): పేదలు సొంతింటిలో ఆత్మగౌరవంతో బతకాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. శనివారం మండల కేంద్రంలో పోతులూరి వీర బ్రహ్మేంద్రస్వామి ఆరాధన ఉత్సవాల్లో ఆయన పాల్గొని పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం రేగోడ్లోని లబ్ధిదారుడు మహేశ్ నిర్మించిన ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించారు. అర్హులైన పేదలందరికీ దశలవారీగా ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. కార్యక్రమంలో పీసీసీ సభ్యుడు కిషన్, డీఎస్పీ ప్రసన్నకుమార్, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు దిగంబర్రావు, డీసీసీ ప్రధాన కార్యదర్శి రాజేందర్ పాటిల్, ఉపాధ్యక్షుడు భాస్కర్, కో అప్షన్ మా జీ సభ్యుడు చోటుమియా, వట్పల్లి ఏఎంసీ డైరెక్టర్ శ్రీధర్గుప్తా తదితరులు పాల్గొన్నారు. పకడ్బందీగా జనగణన వెల్దుర్తి(తూప్రాన్): జనగణన పకడ్బందీగా చేపట్టడానికి ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా అదనపు సెన్సెస్ అధికారి జోజి అన్నారు. శనివారం మండల కేంద్రంలో జనగణన టెస్టింగ్ ప్రక్రియను ఆకస్మికంగా సందర్శించి సిబ్బందికి సూచనలు చేశారు. రెండు దశల్లో చేపట్టనున్న జనగణన ప్రక్రియలో మొదటి దశలో ఇళ్ల జాబితా, గృహ గణన, మౌలిక వసతులు వంటి వాటిపై సాగుతుందన్నారు. పూర్తిగా డిజిటల్ విధానంలో చేపడుతున్న క్రమంలో ఎ న్యూమరేటర్లు, సూపర్వైజర్లు జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. ప్రజలు ఇచ్చే సమాచారాన్ని ఎలాంటి తప్పులకు ఆస్కారం లేకుండా ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. కార్యక్రమంలో సెన్సెస్ ఫీల్డ్ ట్రైనర్ నవీన్, తహసీల్దార్ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ శ్రీహరి, ఏఎస్ఓ సందీప్రెడ్డి, సెక్షన్ ఆఫీసర్లు అజీజ్, కలీం పాల్గొన్నారు. త్వరలోనే ఆర్వోబీ పనులు చేగుంట(తూప్రాన్): మండల కేంద్రంలోని రైల్వేగేట్ను శనివారం రైల్వే డిప్యూటీ ఇంజనీర్ నూరొద్దీన్ హబీబ్ సందర్శించారు. ఈసందర్భంగా రైల్వే గేటు వద్ద నిర్మించే ఆర్వోబీ గురించి కాంట్రాక్టర్తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. త్వరలోనే రైల్వే గేటును మూసివేసి ఆర్వోబీ పనులు నిర్వహిస్తామన్నారు. వాహనదారుల కోసం ప్రత్యామ్నాయ దారులను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఆయన వెంట ఇంజనీర్లు సమీర్, జగదీశ్తో పాటు రైల్వే సిబ్బంది, బీజేపీ నాయకులు ఉన్నారు. రేపు కో ఆప్షన్ ఎన్నికల సమావేశం మెదక్ కలెక్టరేట్: ఈనెల 27వ తేదీన ఉదయం 11 గంటలకు మెదక్ మున్సిపల్ కో ఆప్షన్ సభ్యుల ఎన్నికలపై ప్రత్యేక సమావేశం ఉంటుందని మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు పురపాలక సంఘ సాధారణ సర్వసభ్య సమావేశం ఉంటుందన్నారు. ఈ సమావేశాలకు ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు హాజరు కానున్నట్లు చెప్పారు. మల్లికార్జునుడికి హైకోర్జు జడ్జి పూజలు కొమురవెల్లి(సిద్దిపేట): కొమురవెల్లి మల్లికార్జున స్వామిని రాష్ట్ర హైకోర్టు జడ్జి నంద శనివారం దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు తీర్థ ప్రసా దం, శేషవస్త్రాలు, స్వామివారి చిత్రపటాన్ని అందించారు. కార్యక్రమంలో ఆలయ ప్రధానార్చకులు మహదేవుని మల్లికార్జున్, చేర్యాల న్యాయమూర్తి తరుణి, సీఐ రమేశ్ తదితరులు పాల్గొన్నారు. -
ముడుపులు!
మిల్లింగ్ చార్జీల చెల్లింపులోనూ సివిల్ సప్లై అధికారులు ముడుపులు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఐదేళ్లకోసారి వచ్చే మొక్కుబడి చార్జీల్లో మూడు శాతం కమీషన్ను అసోసియేషన్ ద్వారా వసూలు చేస్తున్నారన్నా ఆరోపణలున్నాయి. ఇటీవల రూ.27.55 కోట్ల మిల్లింగ్ చార్జీలు విడుదల కాగా, అందులో బకాయిదారులకు సంబంధించి రూ.7.01 కోట్లు నిలిపివేశారు. కాగా వాటిని పొందేందుకు మిల్లర్లు పైరవీలు చేస్తున్నారు. – మెదక్ అర్బన్ జిల్లాలో సుమారు 204 మిల్లులకు సీఎంఆర్ ధాన్యం కేటాయించారు. ఇందుకు గాను మిల్లింగ్ చార్జీల కింద క్వింటాల్ ధాన్యానికి బాయిల్డ్ మిల్లుకు రూ.20, రా మిల్లులకు రూ.10 చొప్పున ప్రభుత్వం చెల్లిస్తుంది. కాగా గత ఏడేళ్లుగా మిల్లింగ్ చార్జీలు రాలేదు. ఇటీవల జిల్లాకు 2019– 2024 సంవత్సరాలకు సంబంధించి వరకు రూ. 27.55 కోట్లు మంజూరయ్యాయి. వాటిలో క్లీన్చీట్ ఉన్న 114 మిల్లులకు రూ. 20.54 కో ట్లు చెల్లించారు. బకాయిలు, గ్యారంటీ ఇచ్చిన 90 మిల్లులకు సంబంధించి రూ.7.01 కోట్ల చెల్లింపులు నిలుపుదల చేశారు. కాగా కొంతమంది ఇతర మిల్లులకు గ్యారంటీ ఇవ్వడంతో వారికి రావాల్సిన మిల్లింగ్ చార్జీలు నిలిపివేసినట్లు సమాచారం. మిల్లింగ్ చార్జీలచెల్లింపులోనూ కమీషన్ జిల్లాలో పదిహేనేళ్ల కాలంలో మిల్లర్లు సుమారు రూ.228.40 కోట్లు బకాయిపడ్డారు. ఇందులో కొంత మంది మిల్లర్లపై ఆర్ఆర్యాక్ట్, క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో కొంత మంది కోర్టులను ఆశ్రయించారు. కానీ ఇప్పటివరకు వసూళ్లలో పెద్ద మార్పు కనిపించడం లేదని తెలుస్తోంది. మిల్లింగ్ చార్జీల నుంచి కొంతమేర నిలుపుదల చేసినా, అవి ఏ మూలకు సరిపోవు. కాగా తోటి మిల్లర్లకు గ్యారంటీగా సంతకం పెట్టిన వారి మిల్లింగ్ చార్జీలు నిలుపుదల చేయడంతో వారు లబోదిబోమంటున్నారు. ఈ విషయమై డీఎం జగదీశ్ను వివరణ కోరగా, బకాయిలు వసూలు చేయడానికి ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్లు చెప్పారు. -
నర్సాపూర్లో మంత్రి వివేక్ పర్యటనలో రచ్చ రచ్చ
సాక్షి, మెదక్ జిల్లా: నర్సాపూర్లో మంత్రి వివేక్ పర్యటనలో ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ హామీలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి నిలదీశారు. మహిళలకు నెలకు రూ. 2500 రూపాయలు ఇస్తామన్న హామీ ఏమైందంటూ ఆమె ప్రశ్నించారు. దీంతో కేసీఆర్ వేల కోట్ల రూపాయలు అప్పు చేశారంటూ వివేక్ బదులిచ్చారు.ఆర్టీసీ కార్మికుల సమ్మెకు కూడా గత ప్రభుత్వం, కేసీఆర్ చేసిన నిర్వాకమే కారణమని మంత్రి వివేక్ చెప్పడంతో ఇరువురి మధ్య మాటల యుద్ధం రచ్చరచ్చగా మారింది. జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ నచ్చజెప్పినా కూడా మంత్రి, ఎమ్మెల్యే పట్టించుకోలేదు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల నాయకులు పోటాపోటీగా నినాదాలు చేశారు. ఇరు పార్టీల నాయకులను అదుపుచేయలేక పోలీసులు నానా తంటాలు పడ్డారు. -
నేడు నర్సాపూర్లో మంత్రి పర్యటన
నర్సాపూర్: జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్ శనివారం నర్సాపూర్లో పర్యటిస్తారని తహసీల్దార్ శ్రీనివాస్, ఇన్చార్జ్ మున్సిపల్ కమిషనర్ తిరుపతి తెలిపారు. నగరాభివృద్ధి నిధులతో పట్టణంలోని 15 వార్డుల్లో చేపట్టే సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. పట్టణంలోని ఆరో వార్డులో ఇందిరమ్మ ఇల్లు ప్రారంభోత్సవం, మండలంలోని నారాయణపూర్లో ‘బడిబాట’ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేస్తారని వారు వివరించారు. -
అభివృద్ధిలో భాగస్వాములు కండి
చిన్నశంకరంపేట(మెదక్)/చేగుంట(తూప్రాన్): గ్రామాభివృద్ధిలో వార్డు సభ్యులు భాగస్వామ్యులు కావాలని డీపీఓ యాదయ్య సూచించారు. శుక్రవారం మండల కేంద్రంలో రెండో విడత వార్డు సభ్యులు శిక్షణ ముగింపులో పాల్గొన్న ఆయన వార్డు సభ్యులకు దిశానిర్దేశం చేశారు. గ్రామ అభివృద్ధికి సహకరించాలని, నిధులు సద్వినియోగం అయ్యోలా క్రియాశీలకంగా పనిచేయాలని ఆదేశించారు. అనంతరం పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు చేశారు. కార్యక్రమంలో ఎంపీడీఓ దామోదర్, ఏపీఓ వినోద్, గ్రామ కార్యదర్శులు పాల్గొన్నారు. అనంతరం చేగుంట పంచాయతీలో సర్పంచ్ స్రవంతితో పాటు పాలకవర్గ సభ్యులతో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. గ్రామంలో నీటి సమస్య లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నీటి సమస్యలను నివారించేందుకు ప్రత్యేకంగా బోరు బావులను తవ్వించుకోవచ్చని తెలిపారు.డీపీఓ యాదయ్య -
గిరిజనులకు వరం గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్య కోసం ప్రభుత్వం బెస్ట్ అవైలబుల్ పథకం ప్రారంభించింది. వివరాలు 8లో u
శనివారం శ్రీ 25 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026బదిలీలకు సై!మేలో పూర్తి కానున్న ప్రక్రియ మూడేళ్లు ఒకే చోట పనిచేసిన ఉద్యోగులకు స్థానచలనం అనువైన చోట పనిచేసేందుకు పైరవీలుప్రభుత్వ ఉద్యోగుల బదిలీల ప్రక్రియకు రాష్ట్ర సర్కారు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. మే 1వ తేదీ నుంచి 31 వరకు ఈ బదిలీల ప్రక్రియకొనసాగనుంది. మూడేళ్లు ఒకే చోట పనిచేసిన వారికి స్థానచలనం కలగనుంది. అదే సమయంలో 4 ఏళ్లు పని చేసిన ఉద్యోగులను తప్పనిసరిగా ట్రాన్స్ఫర్ చేయనున్నారు. దీంతో అనువైన చోటుకు వెళ్లేందుకు పైరవీలు షురూ చేశారు. కాగా ఇందులో ఆరు శాఖలకు మాత్రం బదిలీల నుంచి మినహాయింపు ఇచ్చారు. – మెదక్జోన్ జిల్లాలో సుమారు 7 వేల పైచిలుకు ప్రభుత్వ ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నారు. కాగా 2024లో నెల రోజులపాటు ఉద్యోగులకు బదిలీల ఛాన్స్ ఇచ్చిన ప్రభుత్వం.. రెండేళ్ల అనంతరం మళ్లీ అవకాశం ఇచ్చింది. కాగా ఇందులో మూడేళ్లు ఒకేచోట విధులు నిర్వహించిన ఉద్యోగులు బదిలీ కోసం దరఖాస్తు పెట్టుకునేందుకు అర్హులుగా నిర్ణయించింది. నాలుగేళ్ల పాటు ఒకే చోట పనిచేసిన ఉద్యోగులు మాత్రం తప్పనిసరిగా బదిలీపై వెళ్లాల్సిందే. కాగా రాష్ట్రస్థాయి మల్టీజోనల్, జోనల్ స్థాయితో పాటు జిల్లా పరిధిలోనూ ఈ బదిలీల ప్రక్రియ జరగనుండటంతో అనుకూలమైన పోస్టింగ్ల కోసం ఉద్యోగులు అధికార పార్టీ నేతల చుట్టూ తిరుగుతున్నట్లు తెలిసింది. 3 వేల పైచిలుకు.. జిల్లాలోని అన్నిశాఖల పరిధిలో పనిచేసే ఉద్యోగులు 7 వేల పైచిలుకు ఉండగా, వారిలో బదిలీ నుంచి మినహాయించిన ఆరు శాఖల ఉద్యోగులు పోనూ మిగితా 4,220 మంది ఉద్యోగులకు బదిలీకి అవకాశం ఉంది. వీరిలో మూడేళ్ల పాటు ఒకేచోట పనిచేసిన వారు సుమారు 3 వేల పైచిలుకు మంది ఉంటారని, ఇందులో 1,200 మంది నాలుగేళ్ల సర్వీసు నిండిన వారు ఉన్నట్లు తెలిసింది. వారికి ప్రత్యేక సడలింపు ఏదేనిశాఖలో గరిష్టంగా 40 శాతం మించకుండా బదిలీలు చేయాలి. అలాగే దివ్యాంగులు, స్పౌజ్, మరో ఏడాదిలో రిటైర్డ్ అయ్యే ఉద్యోగులతో పాటు అనారోగ్యంతో బాధపడే వారికి ఈ బదిలీల నుంచి ప్రత్యేక మినహాయింపు ఇచ్చారు.ఆరు శాఖలకు మినహాయింపు జిల్లాలో అన్నిశాఖలు కలిపి 35 నుంచి 40 వరకు ఉండగా, వాటిలో ప్రత్యేకించి ఆరు శాఖలకు ఈ బదిలీల నుంచి మినహాయింపు ఇచ్చారు. ఇందులో విద్యాశాఖ, రెవెన్యూ, కమర్షియల్, ఎక్సైజ్, రవాణా, ఫారెస్ట్ ఉన్నా యి. కాగా విద్యా, రెవెన్యూశాఖల ఉద్యోగులకు త్వరలో జరగబోయే జనగణన కారణంగా ఎన్యూమరేటర్లుగా గుర్తించి శిక్షణ ఇస్తున్నారు. అలాగే కమర్షియల్, ఎకై ్సజ్, రవాణశాఖలు ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చేవి కావటంతో వాటిని మినహాయించారు. ఇక అటవీశాఖ ప్రత్యేక జీఓ ప్రకారమే బదలా యింపులు ఉంటాయని, ఈ సాధారణ బదిలీలతో ఈ శాఖకు సంబంధం ఉండదని సంబంధిత ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. -
బిల్లు వీగిపోతే సంబరాలా?
సంగారెడ్డి ఎడ్యుకేషన్: పార్లమెంట్లో మహిళా బిల్లు వీగిపోయేలా చేసిన ప్రతిపక్షాలకు మహిళలపై ఉన్న ప్రేమ ఎలాంటిదో స్పష్టంగా అర్థమవుతుందని అదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ వ్యాఖ్యానించారు. కందిలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ...పార్లమెంట్లో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పిస్తూ తీసుకొచ్చిన బిల్లును ఇండియా కూటమి వ్యతిరేకించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బిల్లు వీగిపోతే గ్రామ గ్రామాల సంబరాలు జరుపుకోవడం ఏంటని ప్రశ్నించారు. మహిళా బిల్లును వ్యతిరేకించడమంటే దేశంలో ఉన్న మహిళలను అవమానించడమేనని తెలిపారు. దేశంలో డీలిమిటేషన్లో కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారన్నారు. పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో 7 లక్షల నుంచి 33 లక్షల వరకు ఓటర్లు ఉన్నారని అంత జనాభా ఉన్న నియోజకవర్గంలో కొత్తగా మరొకటి ఏర్పడితే వచ్చే నష్టమేమీ లేదని వివరించారు. మరో నియోజకవర్గం ఏర్పడటం వలన కొత్త రాజకీయ నాయకులు, యువకులు రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉంటుందన్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు రాజేశ్వర్రావ్ దేశ్పాండే, మీనాగౌడ్, విఠల్, వెంకటనర్సింహారెడ్డి, మాణిక్రావు, జ్యోష్ణ, తేజశ్రీ, అరుణ, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.ఎమ్మెల్యే పాయల్ శంకర్ -
రీసర్వేతో భూ సమస్యల పరిష్కారం
పెద్దశంకరంపేట(మెదక్): భూ సమస్యల పరిష్కారానికే ప్రభుత్వం భూభారతి చట్టాన్ని రూపొందించిందని నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని కమలాపూర్లో భూముల రీసర్వే కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. 1929లో భూముల సర్వే జరిగిందని, ప్రస్తుతం సీఎం రేవంత్రెడ్డి ఆధ్వర్యంలో పకడ్బందీగా సాగుతుందన్నారు. అనంతరం జిల్లా సర్వే ఏడీ కిషన్ మాట్లాడుతూ.. జిల్లాలో 25 మ్యాపులు లేని గ్రామాలను ముందుగా గుర్తించి సర్వే నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతీ కమతానికి శాటిలైట్ ద్వారా సర్వే చేపట్టి భూధార్ నంబర్ కేటాయిస్తామన్నారు. అలాగే ప్రభుత్వ, గ్రామకంఠం, శిఖం భూములు గుర్తిస్తామన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ ప్రభుదాస్, ఎంపీడీఓ క్రాంతికుమార్, సర్వే ఇన్స్పెక్టర్ అజీమ్, సర్పంచ్ సుజాత, నాయకులు మధు, నారాగౌడ్, మురళి, రాజేందర్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.ఎమ్మెల్యే సంజీవరెడ్డి -
గూడు లేని వారికే ప్రాధాన్యం
హవేళిఘణాపూర్(మెదక్): సొంత స్థలం ఉండి గూడు లేని వారికే మొదటి ప్రాధాన్యతనిస్తూ ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తున్నామని కలెక్టర్ ప్రతిమాసింగ్ అన్నారు. శుక్రవారం మెదక్ మండలం శివాయిపల్లిలో తోట లక్ష్మి ఇంటి గృహ ప్రవేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఇందిరమ్మ లబ్ధిదారులకు ప్రభుత్వం విడతల వారీగా నిధులు విడుదల చేస్తుందన్నారు. ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలను మంజూరు చేస్తుందన్నారు. జిల్లాలో ఇప్పటివరకు 750 ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయని వివరించారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ రమాదేవి, తహసీల్దార్ లక్ష్మణ్బాబు, హౌసింగ్ పీడీ మాణిక్యం, సర్పంచ్ వినిత ఉన్నారు. నైపుణ్యాలు మెరుగుపర్చుకోవాలి మెదక్ కలెక్టరేట్: నైపుణ్యాలను మెరుగుపర్చుకుంటేనే ఉద్యోగ అవకాశాలు సాధ్యపడతాయని కలెక్టర్ ప్రతిమాసింగ్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో స్వయం ఉపాధి పథకాల అమలుపై సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మారుతున్న కాలానుగుణంగా యువత చదువుతో పాటు ఎంచుకున్న రంగాల్లో నైపుణ్యాలను మెరుగుపర్చుకోవాలని, అప్పుడే ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. అంతకుముందు ఐటీసీ నిర్వహిస్తున్న కార్యకలాపాలపై ఆరా తీశారు.కలెక్టర్ ప్రతిమాసింగ్ -
మూడో రోజుకు ఆర్టీసీ సమ్మె
మెదక్ కలెక్టరేట్/నర్సాపూర్: ఆర్టీసీ కార్మికుల సమ్మె శుక్రవారం మూడో రోజు కొనసాగింది. జిల్లాలోని మెదక్, నర్సాపూర్ డిపోల పరిధిలో సిబ్బంది విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. ఆత్మబలిదానం చేసుకున్న డ్రైవర్ శంకర్గౌడ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మెదక్లో కార్మికులు రాందాస్ చౌరస్తా వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. వీరికి బీఆర్ఎస్ నేత, మాజీ మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున్గౌడ్, టీఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు నరేందర్, సీఐటీయూ తదితర సంఘాల నాయకులు మద్దతు ప్రకటించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికుల న్యాయ పోరాటానికి అండగా నిలబడతామన్నారు. వారి న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. నర్సాపూర్లో కార్మికులు ధర్నా నిర్వహించారు. వీరికి బీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లేశ్గౌడ్ పలువురు నాయకులు పాల్గొని సంఘీభావం ప్రకటించారు. అనంతరం కార్మికులు విధులు నిర్వహిస్తున్న తాత్కాలిక సిబ్బందిని పూలు ఇచ్చి వేడుకున్నారు. ‘మీ కాళ్లు మొక్కుతాం.. మీరు డ్యూటీలు చేస్తూ మా కడుపులు కొట్టొద్దని’ బతిమిలాడారు. అనంతరం ఎస్ఐ రంజిత్రెడ్డి కార్మికులను అక్కడి నుంచి పంపించి వేశారు.మెదక్: డ్రైవర్ శంకర్గౌడ్ చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న కార్మికులు నిరసన తెలిపిన కార్మికులు మద్దతు తెలిపిన పార్టీలు, సంఘాల నాయకులు -
పీఏసీఎస్లకు పాలకవర్గాలు
ముగ్గురు లేదా ఐదుగురు సభ్యుల నియామకం! ప్రత్యేకాధికారుల పాలనకు సెలవు ● జిల్లాలో 37 సొసైటీలుప్రాథమిక సహకార సంఘాలకు నామినేటెడ్ పాలకవర్గాలు ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఒక్కో పీఏసీఎస్కు ముగ్గురు లేదా ఐదుగురు సభ్యులతో కూడిన పాలకమండలి ఏర్పాటయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఆశావహుల్లో సందడి మొదలైంది. – మెదక్ అర్బన్జిల్లాలో 37 ప్రాథమిక సహకార సంఘాలు ఉన్నాయి. రైతు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం, అవసరం మేర వ్యవసాయ, రుణాలు, ఎరువులు అందించడం, ధాన్యం కొనుగోలు కేంద్రాలు నిర్వహించడం, ఇతర వినిమయ, ఆర్థిక సేవలు అందించడం సొసైటీల ముఖ్య లక్ష్యం. వచ్చిన లాభాలు కూడా రైతులకు పంచుతూ సహకార లక్ష్య సాధన దిశగా ఇవి కృషి చేస్తున్నాయి. సభ్య రైతులు తమ పాలకమండళ్లను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో 2020లో చివరిసారిగా ఎన్నికలు జరుగగా, వారి పదవీకాలం ఫిబ్రవరి 2025తో ముగిసింది. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ తిరిగి ఎన్నికలు నిర్వహించకుండా, ఆరునెలల చొప్పున రెండుసార్లు వారి పదవీకాలం పెంచింది. 2025 డిసెంబర్ 18 నుంచి సొసైటీలకు ప్రత్యేక అధికారులను నియిమించింది. కాగా జిల్లాలోని 37 సొసైటీలకు 20 మంది స్పెషల్ ఆఫీసర్లను నియమించారు. కొంతమందిలో ఒక్కొక్కరికి నాలుగు సొసైటీల బాధ్యతలను అప్పజెప్పారు. వీరు పని భారంతో అటు సొంత ఉద్యోగానికి, ఇటు సొసైటీ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించలేకపోతున్నారన్న ఆరోపణలున్నాయి. దీంతో పీఏసీఎస్లో పాలన గాడి తప్పింది. ముఖ్యంగా యూరియా కొరత సమయంలో కూడా సొసైటీలు నిర్ణయాత్మక బాధ్యతలు నిర్వహించలేక పోయాయని రైతులు ఆరోపించారు.నామినేటెడ్పై ఆశలు నామినేటెడ్ పాలకవర్గాల ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో సభ్యుల సంఖ్యపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి దాదాపు 30 నెలలు గడిచినా జిల్లాలో నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయలేదు. అవకాశం ఉన్న ఏడుపాయల పాలకమండలి, మార్కెట్ కమిటీల ఏర్పాటుపై ఊగిసలాట ధోరణి కనబరుస్తున్నారు. దీంతో కార్యకర్తలు తీవ్ర నిరుత్సాహంతో ఉన్నారు. ప్రస్తుతం పీఏసీఎస్ పాలకమండళ్లను ఏర్పాటు చేసేందుకు మంత్రి వర్గం ఆమోదం తెలపడంతో పలువురు నాయకులు పదవులపై ఆశలు పెంచుకుంటున్నారు. అయితే పాలక చైర్మన్తో పాటు 3 నుంచి 5 మంది సభ్యులు ఉంటారా..? లేక మొత్తం పాలకవర్గ సభ్యుల సంఖ్యకు అనుగుణంగా నామినేట్ చేస్తారా అనే విషయంపై స్పష్టత రాలేదు. -
నష్టపోయిన రైతులను ఆదుకోండి
సిద్దిపేటజోన్: అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలని మాజీ మంత్రి హరీశ్రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇప్పటివరకు ఐదు సార్లు వడగళ్ల వాన, ఒకసారి తుపాన్ వల్ల నష్టపోయిన రైతులకు నేటికీ ఒక్క రూపాయి ఇవ్వలేదని మండిపడ్డారు. పంట నివేదిక ఆధారంగా పరిహారం చెల్లించాలన్నారు. గురువారం కురిసిన అకాల వర్షాలకు వివిధ పంటలు దెబ్బతిన్నాయని, అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం కలెక్టర్, నియోజకవర్గ వ్యవసాయ శాఖ అధికారులతో హరీశ్రావు ఫోన్లో మాట్లాడారు. సిద్దిపేట అర్బన్ మండల పరిధిలో అధి కంగా పంట నష్టం వాటిల్లిందన్నారు. చేతికి వచ్చిన పంట అకాల వర్షాలతో దెబ్బతినడంతో రైతులు దిక్కుతోచనిస్థితిలో ఉన్నారని, వారిని ఆదుకోవాలన్నారు. మాజీ మంత్రి హరీశ్రావు -
ఎండలతో జాగ్రత్త
రామాయంపేట(మెదక్): రోజు రోజుకు తీవ్రమవుతున్న ఎండలతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని డీఎంహెచ్ఓ శ్రీరాం సూచించారు. శుక్రవారం మండలంలోని ప్రగతి ధర్మారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎవరికై నా వడదెబ్బ సోకితే వెంటనే సపర్యలు చేపట్టి వైద్యసేవలు అందజేయాలన్నారు. ‘ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమాన్ని షెడ్యూల్ ప్రకారం సక్రమంగా నిర్వహించాలని సిబ్బందిని ఆదేశించారు. ఆస్పత్రిలో నిల్వ ఉన్న ఓఆర్ఎస్ ప్యాకెట్లతో పాటు ఐవీ ఫ్లూడ్ బాటిళ్లు, రిజిస్టర్ను పరిశీలించారు. ఆస్పత్రి డాక్టర్ వైశాలి, సిబ్బంది పాల్గొన్నారు. ఆటపాటలతో విద్యాబోధననర్సాపూర్ రూరల్/ కౌడిపల్లి: అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు ఆటపాటలతో విద్యాబోధన చేస్తున్నామని డీడబ్ల్యూఓ హేమభార్గవి తెలిపారు. శుక్రవారం మండలంలోని రాయిలాపూ ర్ అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించిన గ్రాడ్యుయేషన్డేకు ముఖ్య అతిథిగా హాజరై మా ట్లాడారు. చెప్పారు. అలాగే నర్సాపూర్ మండలం చిప్పల్తుర్తి అంగన్వాడీ కేంద్రంలో ప్రీ స్కూల్ గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం పిల్లలకు సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్వైజర్ సుజా త, సర్పంచ్ స్వప్న, అంగన్వాడీ టీచర్లు గ్రామస్తులు పాల్గొన్నారు. అనుమతి లేని పాఠశాలలపై చర్యలు తీసుకోండిమెదక్ కలెక్టరేట్: అనుమతి లేని పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అజయ్కుమార్ డిమాండ్ చేశారు. ఈమేరకు శుక్రవారం డీఈఓ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పట్టణంలోని అవుసులపల్లిలో నిర్మాణంలో ఉన్న పాఠశాలలో గుట్టుచప్పుడు కాకుండా అడ్మిషన్ల పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నారని తెలిపారు. ఇప్పటికై నా జిల్లాలో అనుమతి లేకుండా పుట్టుకొస్తున్న ప్రైవేట్ పాఠశాలను వెంటనే రద్దు చేయాలని కోరారు. లేనిపక్షంలో పెద్దఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. రికార్డుల పరిశీలననర్సాపూర్: జెడ్పీ సీఈఓ ఎల్లయ్య శుక్రవారం మండల ప్రజా పరిషత్ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. ఈసందర్భంగా కార్యాలయంలోని పలు రికార్డులు పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఆయా విభాగాల సిబ్బందితో మాట్లాడి రికార్డులు సక్రమంగా నమోదు చేయాలని సూచించారు. కాగా ఇన్చార్జి ఎంపీడీఓ మహ్మద్ మోజం హుస్సేన్ కార్యాలయ వివరాలను సీఈఓకు వివరించారు. 62 బస్సులు.. 6 రూట్లుమూడో రోజు పెరిగిన సర్వీసులు మెదక్ కలెక్టరేట్: ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో ప్రజా రవాణకు ఇబ్బందులకు కలగకుండా అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఈమేరకు తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లతో బస్సు రూట్లను పెంచుతున్నారు. మూడో రోజు శుక్రవారం 55 మంది డ్రైవర్లు, కండక్టర్లతో సిద్దిపేట, ఎల్లారెడ్డి, బాన్సువాడ, బొడ్మట్పల్లి, పటాన్చెరువు, జేబీఎస్ (6) రూట్లలో మొత్తం 62 బస్సులను నడిపించారు. మొదటి, రెండోరోజు కొనసాగిన ఆర్టీసీ కార్మికుల వ్యతిరేకత మూడు రోజు కనిపించలేదు. మెదక్ ఆర్టీసీ బస్సు డిపో ఎదుట కార్మికులు ప్రశాంతంగా సమ్మె కొనసాగించారు. -
పంప్ హౌస్ ట్రయల్ రన్ సక్సెస్
నంగునూరు(సిద్దిపేట): మండలంలోని వాగవతలి గ్రామాలకు సాగు నీరందించేందుకు ఘణపూర్ వద్ద నిర్మించిన పంప్ హౌస్ పూర్తి కావడంతో శుక్రవారం ఇరిగేషన్ అధికారులు ట్రయల్ రన్ చేపట్టారు. రంగనాయకసాగర్ కుడి కాలువ ద్వారా ఖాతా, ఘణపూర్, అక్కేనపల్లి, గట్లమల్యాల గ్రామాల్లోని 13 చెరువులను నింపేందుకు ఘణపూర్ వద్ద పంప్ హౌస్ నిర్మాణం కోసం అప్పటి మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు నిధులు మంజూరు చేశారు. అసంపూర్తిగా మిగిలిన పనులు పనులు పూర్తి కావడంతో ఇరిగేషన్ అధికారులు ట్రయల్రన్ నిర్వహించారు. -
చిత్తశుద్ధితో పని చేయండి
మెదక్ కలెక్టరేట్: జనగణనలో తహసీల్దార్లు చిత్తశుద్ధితో పనిచేయాలని కలెక్టర్ ప్రతిమాసింగ్ అన్నారు. గురువారం జిల్లాలోని అధికారులతో గూగుల్ మీట్ నిర్వహించారు. ఈసందర్భంగా జనగణన, డ్రైలాండ్ వెట్ ల్యాండ్ సర్వే, ఆర్టీసీ సమ్మైపె సమీక్షించారు. వచ్చే ఖరీఫ్ సీజన్లో రైతులకు విత్తనాలు, పురుగు మందులు కొరత లేకుండా బఫర్ స్టాక్ ఏర్పాటు చేయాలన్నారు. జిల్లాలో 525 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అలాగే 11 కొనుగోలు కేంద్రాల ద్వారా 143 మంది రైతులు నుండి 887 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు వివరించారు. సాదాబైనామా పెండింగ్ దరఖాస్తులకు పరిష్కారం చూపాలన్నారు. జిల్లాలో 606 చెరువుల సంరక్షణలో భాగంగా డ్రైలాండ్ వెట్ ల్యాండ్ సర్వే వేగవంతం చేయాలన్నారు. జిల్లాలో డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్గా పనిచేస్తున్న జోజి 2019 బ్యాచ్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్కు ఎంపికయ్యారు. ఈసందర్భంగా ఆయన కలెక్టర్ను మర్యాదపూర్వకంగా కలవడంతో ప్రశంసించారు. జోజి అటవీ శాఖలో అలుపెరగని ఆణిముత్యంగా పనిచేస్తున్నారని కొనియాడారు. కార్యక్రమంలో డీఆర్డీఓ శ్రీనివాసరావు, డీఎస్ఓ నిత్యానంద్, డీఎం జగదీష్, డీపీఓ యాదయ్య, పరిశ్రమల అధికారి ప్రకాశ్రావు, సీపీఓ సురేశ్, డీటీఓ వెంకటస్వామి, ఆర్టీసీ డీఎం సురేఖ, డీఏఓ దేవకుమార్, తహసీల్దార్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ ప్రతిమాసింగ్ -
సెలవుల్లో పిల్లలు జాగ్రత్త
హవేళిఘణాపూర్(మెదక్): మండుతున్న ఎండలను దృష్టిలో పెట్టుకొని తల్లిదండ్రులు తమ పిల్లలను బయటకు పంపొద్దని డీఈఓ విజయ సూచించారు. గురువారం మండల పరిధిలోని కూచన్పల్లి జెడ్పీ హైస్కూల్లో ఏర్పాటు చేసిన పేరెంట్స్ మీటింగ్లో ఆమె మాట్లాడారు. విద్యార్థుల పట్ల తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. చదివించడంతో పాటు బయటకు వెళ్లకుండా చూసి వారి ఆరోగ్యాన్ని కాపాడాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో ఎంఈఓ మధుమోహన్, ఉపాధ్యాయులు మల్లారెడ్డి, శశికుమార్, కృష్ణవేణి, గంగమణి విద్యార్థుల తల్లిదండ్రులు, రమేశ్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. నిజాంపేట(మెదక్): మండల పరిధిలోని నగరం గ్రామంలో గురువారం డీఎల్పీఓ సురేశ్బాబు పర్యటించారు. పల్లె ప్రగతి పనులను అకస్మికంగా తనిఖీ చేశారు. ఈ మేరకు గ్రామంలోని నర్సరీ, సెగ్రిగేషన్ షెడ్, శ్మశానవాటిన, పల్లెప్రకృతి వనాన్ని పరిశీలించారు. అనంతరం పంచాయతీ కార్యాలయంలో రికార్డులను తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే అంగన్వాడీ కేంద్రంలో రికార్డులను పరిశీలించారు. ఆయన వెంట ఎంపీఓ రజనీకాంత్రెడ్డి, పంచాయతీ కార్యదర్శి మహ్మద్ ఆరీఫ్ హుస్సేన్, చల్మెడ పంచాయతీ కార్యదర్శి వెంకట నర్సింహరెడ్డి, సర్పంచ్ అంతంపల్లి సుశీల, ఉప సర్పంచ్ నాజం, పంచాయతీ సిబ్బంది ఉన్నారు. మెదక్ కలెక్టరేట్: ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో జిల్లా పోలీస్శాఖ అప్రమత్తం అయిందని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు తెలిపారు. గురువారం మెదక్ ఆర్టీసీ డిపోను ఆయన సందర్శించారు. బందోబస్తుపై డీఎస్పీ ప్రసన్నకుమార్, సీఐ మహేశ్లను అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రయాణికులకు రవాణ సేవలు నిరంతరంగా కొనసాగేందుకు భద్రతా చర్యలను బలోపేతం చేసినట్లు చెప్పారు. అనంతరం డిపో మేనేజర్ సురేఖతో మాట్లాడారు. ప్రస్తుతం నడుస్తున్న బస్సుల సంఖ్య, సేవల స్థితిగతులపై ఆరా తీశారు. ప్రైవేట్ డ్రైవర్లు, సిబ్బంది భయపడాల్సిన అవసరం లేదని, వారికి పూర్తి భద్రత కల్పిస్తామని భరోసా ఇచ్చారు. ప్రజా రవాణ కు ఆటంకం కలిగించే చర్యలు, బస్సులకు నష్టం, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తే సహించబోమని హెచ్చరించారు. కొల్చారం(నర్సాపూర్): పిచ్చికుక్క దాడిలో ఇద్దరు మహిళలు గాయపడిన సంఘటన మండలంలోని రంగంపేటలో గురువారం చోటుచేసుకుంది. గ్రామంలోని చాకలివాడలో ఇంటి ఎదుట పనిచేస్తున్న యాదమ్మ, సత్తమ్మపై పిచ్చికుక్క దాడి చేసి గాయపరిచింది. రక్తస్రావం కావడంతో స్థానికుల వారిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్య సిబ్బంది ప్రథమ చికిత్స అందించి, ముందస్తు రేబిస్ వ్యాక్సిన్ ఇచ్చారు. సర్పంచ్ స్వర్ణలత పిచ్చికుక్కను బంధించాలని పంచాయతీ కార్మికులను ఆదేశించారు. తూప్రాన్: మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించాలని నాబార్డ్ ఏజీఎం తేజ అన్నారు. గురువారం మండలంలోని మల్కాపూర్, ఘన పూర్లో నాబార్డ్ ఆధ్వర్యంలో బ్యూటీ అండ్ పర్సనల్ వెల్నెస్పై 20 రోజుల పాటు శిక్షణ పొందిన మహిళలకు సర్టిఫికెట్లను అందజేశారు. బ్యూటీ పార్లర్లు ఏర్పాటు చేసుకునే మహిళలకు బ్యాంకులు ఆర్థిక సహాయం అందజేయడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఎల్డీఎం బాపూజీ, మల్కాపూర్ సర్పంచ్ ఆంజనేయులుగౌడ్, ఎల్డీఓ శ్రావ్య, కోఆర్డినేటర్ టీజీ రెడ్డి, డీసీసీబీ మేనేజర్ ప్రవీణ్ గౌడ్, శిక్షకులు శ్రీవాణి, స్రవంతి పాల్గొన్నారు. -
బడి ఆస్తులు భద్రమేనా?
● గతంలో కంప్యూటర్లు, ఫ్యాన్లు ఎత్తుకెళ్లిన దుండగులు ● చర్యలు చేపట్టని అధికారులు ● గతేడాది వేసవి సెలవుల్లో నిజాంపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తలుపులు పగులగొట్టి దుండగులు టీవీని ఎత్తుకెళ్లారు. ఆ మరుసటి రోజు ఈ విషయాన్ని గమనించిన గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ● అదేవిధంగా కొల్చారం మండలం ఎనగండ్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 3, రంగంపేట ఉన్నత పాఠశాలలోని 3 ఫ్యాన్లను ఎత్తుకెళ్లారు. ఈ విషయమై ఉపాధ్యాయులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మెదక్జోన్: ప్రభుత్వ పాఠశాలలకు నేటి నుంచి వేసవి సెలవులు ఇచ్చారు. అయితే బడులు ఆస్తుల రక్షణ ప్రధాన సమస్యగా మారింది. సెలవు రోజుల్లో దుండగులు పాఠశాలల తాళాలు, తలుపులు పగులగొట్టి టీవీలు, కంప్యూటర్లు, ఫ్యాన్లు ఎత్తుకెళ్తున్నారు. కొందరు ఆకతా యిలు ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. పాఠశాలలు పునఃప్రారంభం అయిన తర్వాత విద్యార్థులకు డిజిటల్ పాఠాలు చెప్పాలంటే మళ్లీ టీవీలు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి. బడ్జెట్ లేక వాటిని తిరిగి కొనుగోలు చేయడం లేదు. దీంతో విద్యార్థులు డిజిటల్ విద్యకు దూరం అవుతున్నారన్నా విమర్శలున్నాయి. అలాగే ఫ్యాన్లు ఇతర సామగ్రిని తిరిగి కొనుగోలు చేయాలంటే నానా తంటాలు పడాల్సి వస్తోంది. కొన్ని పాఠశాలల్లో వాటిని తిరిగి కొనుగోలు చేయకుండా వదిలేస్తున్నారు. ఏటా వేసవి సెలవుల్లో ఇది సర్వసాధారణంగా మారింది. అధికారులు ఆ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడం లేదు. ప్రత్యేక నిఘా అవసరం వేసవి సెలవుల్లో ఇలాంటి ఘటనలకు అడ్డుకట్ట పడాలంటే ప్రత్యేక నిఘా అవసరం. ఇందుకోసం ఆయా గ్రామాల్లోని యువత సహాయం తీసుకోవాలి. అంతేకాకుండా పోలీసులు సైతం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. పాఠశాలలకు వచ్చే నిర్వహణ నిధుల నుంచి సీసీ కెమెరాలను కొనుగోలు చేయాల్సిన అవసరం ఉంది. జిల్లాలో 903 ప్రభుత్వ బడులు జిల్లావ్యాప్తంగా 903 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. వాటిలో 601 ప్రాథమిక, 132 ప్రాథమికోన్నత, 152 ఉన్నత పాఠశాలలతో పాటు మరో 18 పాఠశాలలు పదో తరగతి నుంచి ఇంటర్ వరకు కొనసాగుతోంది. వీటిలో 62 వేల పైచిలుకు విద్యార్థులు చదువుకుంటున్నారు. కాగా 561 పాఠశాలలకు ప్రహరీలు ఉండగా, మిగితా 342 పాఠశాలలకు రక్షణ కరువైంది. ఈ విషయాన్ని గత కలెక్టర్ దృష్టికి పలువురు తీసుకెళ్లగా 3 నెలల క్రితం 183 పాఠశాలలకు ఎన్ఆర్ఈజీఎస్ పథకం కింద ప్రహరీలకు నిధులు మంజూరు చేశారు. ప్రస్తుతం వాటిని పంచాయతీరాజ్శాఖ ఆధ్వర్యంలో పనులు కొనసాగుతున్నాయి. ఆ నిర్మాణాలు పూర్తయితే బడులకు కొంత మేర రక్షణ ఉండనుంది. -
పరిశ్రమలతో ఉపాధి అవకాశాలు
ములుగు(గజ్వేల్): పరిశ్రమల స్థాపనను ప్రోత్సహించడం ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. తునికిబొల్లారం ఇండస్ట్రియల్ పార్కులో ‘ది ఎక్స్క్లూజీవ్ లీన్ మాన్యుఫాక్చరింగ్ ఫెసిలిటీ ఫర్ బేకర్ హ్యూస్’ కంపెనీని గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పారిశ్రామికాభివృద్ధితోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. కంపెనీ ప్రతినిధులు మాట్లాడుతూ అమెరికాకు చెందిన గ్లోబల్ ఎనర్జీ టెక్నాలజీ బేకర్ హ్యూస్ కంపెనీ ఆయా రంగాలలో ప్రపంచ వ్యాప్తంగా 120 దేశాలలో కార్యకలాపాలను నిర్వహిస్తోందన్నారు. తాజాగా ప్రారంభమైన బేకర్ హ్యూస్ ఇండస్ట్రీయల్ ఎనర్జీ టెక్నాలజీ విభాగానికి అవసరమైన హై ప్రెసిషన్ ఉత్పత్తులు తయారవుతాయన్నారు. కొత్తగా 230 హై స్కిల్డ్ వర్క్ ఫోర్స్ కి ఉపాది లభిస్తుండగా తయారీ రంగంలో మేడ్ ఇన్ తెలంగాణ మరింత విశ్వవ్యాప్త మవుతుందన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ వెంకన్నగారి ముత్యంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మంత్రిని కలిసిన గ్రామస్తులు మంత్రి శ్రీధర్బాబును సర్పంచ్ ముత్యంరెడ్డితో పాటు గ్రామస్తులు కలసి సమస్యలపై వినతి పత్రం అందజేశారు. కొండపోచమ్మ సాగర్ భూనిర్వాసితుల కోసం ఆర్అండ్ఆర్ కాలనీ ఏర్పాటుకు, పరిశ్రమలు నెలకొల్పేందుకు గత ప్రభుత్వం తమ గ్రామస్తుల నుంచి 7 వందల ఎకరాల భూమిని సేకరించి పరిశ్రమలకు ఆర్అండ్ఆర్ కాలనీ ఏర్పాటుకు అప్పగించిందన్నారు. పరిహారంలో భాగంగా ఇంటి స్థలాలు కేటాయిస్తామని చెప్పి ఇప్పటివరకు కేటాయించలేదని వినతి పత్రంలో పేర్కొన్నారు. ఇప్పటికైనా భూములు కోల్పోయిన బాధితులకు న్యాయం చేయాలని, అలాగే యువతకు పరిశ్రమలలో ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరారు. అనంతరం మంత్రిని గ్రామ నాయకులు సత్కరించారు. -
భగీరథుడే మనకు స్ఫూర్తి
మెదక్ కలెక్టరేట్: స్వర్గం నుంచి గంగను భువికి తెచ్చిన భగీరథుడే మనకు స్ఫూర్తి అని కలెక్టర్ ప్రతిమాసింగ్ అన్నారు. గురువారం కలెక్టరేట్లో వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో భగీరథ మ హర్షి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి అదనపు కలెక్టర్ నగేశ్తో కలిసి ముఖ్య అతిథిగా కలెక్టర్ హాజరై మాట్లాడారు. భగీరథ మహర్షి పట్టుదల, సేవాభావం ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయమని కొనియాడారు. కార్యక్రమంలో వివిధశాఖల జిల్లా అధికారులు, కలెక్టరేట్ ఏఓ యూనస్, సహాయ వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి గంగా కిషన్, సంఘ నాయకులు పాల్గొన్నారు. -
ఆర్టీసీ సమ్మె తీవ్రం
● కార్మికులకు పార్టీలు, సంఘాల మద్దతు ● మెదక్లో తీవ్ర ఉద్రిక్తత.. పలువురి అరెస్ట్ మెదక్ కలెక్టరేట్/నర్సాపూర్: ఆర్టీసీ సమ్మె జిల్లాలో ఉధృతమైంది. రెండో రోజు గురువారం కార్మికులు డిపోల ఎదుట ఆందోళన నిర్వహించారు. మెదక్లో వారికి మద్దతుగా నిరసన ర్యాలీ చేపట్టిన బీజేపీ, సీఐటీయూ నాయకులను పోలీసులు అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుంది. బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, సీఐటీయూ జిల్లా కార్యదర్శి మల్లేశంతో పాటు పలువురు నాయకులు, కార్మికులను బలవంతంగా డీసీఎంలో ఎక్కించి వెల్దుర్తి పీఎస్కు తరలించారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మారెడ్డి సమ్మెలో కూర్చొని కార్మికులకు మద్దతు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం గుల్షన్ క్లబ్ నుంచి డిపో వరకు నిర్వహించిన నిరసన ర్యాలీలో పాల్గొన్నారు. తాత్కాలిక సిబ్బంది నియామకం రెండోరోజు జేబీఎస్, పటాన్చెరువు, సిద్దిపేట, బొడ్మట్పల్లి రూట్లలో 55 బస్సులు నడిపినట్లు మెదక్ డిపో మేనేజర్ సురేఖ తెలిపారు. మెదక్లో 50 మంది కండక్టర్లు, నర్సాపూర్లో ఆరుగురు కండక్టర్లు, ఆరుగురు డ్రైవర్లను నియమించినట్లు చెప్పా రు. తాత్కాలిక సిబ్బందితో 6 బస్సులను పలు మార్గాల్లో నడిపించారు. డిపో వద్ద భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆటో, ఇతర ప్రైవేట్ వాహనదారులు అధిక చార్జీలు వసూలు చేస్తున్నారని ప్రయాణికులు వాపోయారు. కార్మికులకు ఎమ్మెల్యే సునీతారెడ్డి మద్దతు ప్రకటించారు. కార్మికులకిచ్చిన హామీలు అమలు చేయకుండా సీఎం రేవంత్రెడ్డి వారిని మోసం చేస్తున్నారని విమర్శించారు. అనంతరం జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన ర్యాలీలో ఎమ్మెల్యేతో పాటు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. -
కల్లాలు దాటని ధాన్యం
యాసంగి వరి కోతలు మొదలైనా, ఆస్థాయిలో ధాన్యం కొనుగోళ్లు ముందుకు సాగడం లేదు. బిహారీ హమాలీలు రాక వడ్లు తూకాలకు నోచుకోవడం లేదు. ఓ వైపు అకాల వర్షాలు.. మరో వైపు ఆరబెట్టిన ధాన్యాన్ని చూస్తూ అన్నదాత గడియొక గండంగా కాలం వెళ్లదీస్తున్నాడు. జిల్లాలో 525 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా, అందులో ఇప్పటివరకు కేవలం 11 మాత్రమే ప్రారంభం కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. – మెదక్ అర్బన్జిల్లాలో యాసంగికి సంబంధించి 2,69,773 ఎకరాల్లో రైతులు పంటలు సాగు చేశారు. అందులో 3,75,976 మెట్రిక్ టన్నులు దొడ్డు రకం, 69,490 సన్న రకం కలిపి మొత్తం 4,45,466 మెట్రిక్ టన్ను ల ధాన్యం వచ్చే అవకాశం ఉంది. వీటి కొనుగోలు కోసం జిల్లావ్యాప్తంగా 525 కొనుగోళ్లు కేంద్రాలు ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఇందుకోసం మొత్తం 1,11,36,650 గన్నీ బ్యాగులు అవసరం ఉంది. అయితే ప్రస్తుతం 51 లక్షల గన్నీలు మాత్రమే అందుబాటులో ఉండగా, మరో 60,36,650 బస్తాలు తెప్పించడానికి అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. బిహారీ.. రావోయి కొన్నేళ్లుగా జిల్లాలో బిహారీ హమాలీలే కొనుగోలు కేంద్రాల్లో పని చేస్తున్నారు. స్థానికంగా కొంత మంది ఏజెంట్లు, అడ్వాన్స్లు చెల్లించి వారిని తీసుకొచ్చి హమాలీ పని చేయిస్తున్నారు. వీరికి క్వింటాల్కు రూ.40 చొప్పున ఇస్తూ, అందులో నుంచి రూ.2 కమిషన్గా తీసుకుంటారు. అయితే ఒక్కో సెంటర్లో సుమారు 20 నుంచి 30 మంది హమాలీలు పని చేస్తుంటారు. ఈసారి సీజన్ ప్రారంభమై దా దాపు 25 రోజుల కావొస్తున్నా, వారు రాలేదు. దీంతో ఎక్కడా కొనుగోళ్లు ప్రారంభం కాలేదు. అయితే తరచూ వాన మొగులు కావడం, వడగళ్ల వర్షాలు పడుతుండటంతో అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఇక్కడ హమాలీలుగా పని చేసిన స్థానికులు, ఇప్పుడు అటు వైపు తొంగి చూడటం లేదు. హమాలీలు లేక సాగని కొనుగోళ్లు జిల్లాలో కేవలం 10 సెంటర్లే ప్రారంభం వెంటాడుతున్న అకాల వర్షాలు యాసంగి లక్ష్యం 4.45 లక్షల మెట్రిక్ టన్నులు -
తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్ల నియామకం
మెదక్ కలెక్టరేట్: ఆర్టీసీ కార్మికుల సమ్మెతో ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా తాత్కాలిక ఏర్పాట్లు చేస్తున్నట్లు మెదక్ ఆర్టీసీ డీఎం సురేఖ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మెదక్ డిపోలో తాత్కాలిక డ్రైవర్లుగా నియమించుకోవడానికి 18 నెలల హెవీ లైసెన్స్ అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలన్నారు. అలాగే నర్సాపూర్ డిపోలో తాత్కాలిక కండక్టర్ పోస్టులకు ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలన్నారు. పదో తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలని, ఆధార్కార్డు, రెండు పాస్పోర్ట్ సైజు ఫొటోలు, విద్యార్హత బయోడేటాతో డిపోలలో సంప్రదించాలన్నారు. పాపన్నపేట(మెదక్): ప్రభుత్వ పాఠశాలలకు గురువారం చివరి దినం కావడంతో జనగణన శిక్షణ తరగతుల సమయాన్ని మరుసటి రోజుకు వాయిదా వేయాలని తపస్, టీపీటీఎఫ్, ఎస్టీయూ జిల్లా అధ్యక్షులు దుర్గాప్రసాద్, బాల్రాజ్, ఎల్లం కోరారు. ఈ మేరకు ఎమ్మార్వోకు వినతిపత్రం అందజేశారు. శిక్షణ తరగతుల సమయాన్ని ఉదయం 8 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. వారి వెంట టీఎస్యూటీఎఫ్ ప్రధాన కార్యదర్శి ఎండీ.రఫీ, సభ్యుడు శ్రవణ్ తదితరులు ఉన్నారు. డీఆర్డీఏ పీడీ శ్రీనివాస్ శివ్వంపేట(నర్సాపూర్): ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున ఉపాధి హామీ పనులను కూలీలు ఉదయం వేళలో మాత్రమే చేయాలని డీఆర్డీఏ పీడీ శ్రీనివాస్ సూచించారు. బుధవారం శివ్వంపేటలో నిర్వహిస్తున్న ఉపాధి పనులను పరిశీలించారు. ఈసందర్భంగా కూలీలతో మాట్లాడి పలు సూచనలు చేశారు. పనిచేసే చోట కూలీలకు నీడ ఏర్పాటుతో పాటు తాగు నీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలన్నారు. వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాల్సిన బాధ్యత సిబ్బందిపై ఉందన్నారు. నిర్ధేశించిన పనులు పూర్తి చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఏపీఓ అనిల్, కార్యదర్శి రమాదేవి, ఫీల్డ్ అసిస్టెంట్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. నర్సాపూర్: మున్సిపాలిటీలో కోఆప్షన్ పదవులకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు బుధవారం ఇన్చార్జి కమిషనర్ తిరుపతి తెలిపారు. మున్సిపల్ పరిపాలనలో ప్రత్యేక పరి/్ఞానం ఉన్న వారి కోసం రెండు, అల్పసంఖ్యాక వర్గాల కోసం రెండు కోఆప్షన్ పదవులు ఉంటాయని, రెండు వర్గాలలో ఒక పోస్టు మహిళకు కేటాయించినట్లు చెప్పారు. కాగా ఈనెల 23 నుంచి 29 వరకు తమ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు తమ కార్యాలయంలో సంప్రదించాలన్నారు. మెదక్జోన్: సమస్త జీవరాశులకు జీవనాధారమైన భూమికి హాని కలిగించొద్దని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ హుస్సేన్ తెలిపారు. ప్రపంచ ఎర్త్డేను పురస్కరించుకొని బుధవారం కళాశాలలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం పారిశ్రామికీకరణ, అధిక జనాభాతో భూమికి, పర్యావరణానికి నష్టం జరుగుతుందన్నారు. సరిదిద్దుకోకపోతే రేపటి తరాలు తీవ్రమైన సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. అంతకుముందు ఎకో క్లబ్ సభ్యులతో కలిసి పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ఐక్యూఏసీ కో–ఆర్డినేటర్ డాక్టర్ తిరుమలరెడ్డి, డాక్టర్ శ్రీలత, రమణ కుమార్, విశ్వనాథ్, రాజు పాల్గొన్నారు. -
ఫార్మర్ రిజిస్ట్రీపై అనాసక్తి
● జిల్లాలో ఇప్పటివరకు 62 శాతం నమోదు ● అవగాహన కల్పిస్తున్న అధికారులు ఫార్మర్ రిజిస్ట్రీ చేస్తున్న సమయంలో రైతుల సెల్ఫోన్కు ఓటీపీలు వస్తుంటాయి. వాటిని చెబితేనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతోంది. జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ భూములు కలిగిన రైతులు పట్టణాలు, ఇతర ప్రాంతాల్లో నివాసం ఉంటున్నారు. వారు అందుబాటులో లేకపోవడం, గ్రామీణ ప్రాంతాల్లో సెల్ఫోన్ సిగ్నల్స్ రాకపోవడంతో నమోదు ప్రక్రియ ఆలస్యమవుతుంది.మెదక్ కలెక్టరేట్: ప్రతి రైతు తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రీ చేసుకోవాలని, లేదంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే ప్రయోజనాలు కోల్పోతారని వ్యవసాయ అధికారులు పదే పదే చెబుతున్నా, జిల్లాలో చాలా మంది రైతులు ముందుకురావడం లేదు. ఆరునెలల్లో పూర్తి చేయాలని కేంద్రం గతేడాది ఆదేశాలు జారీ చేసింది. నెట్వర్క్ సమస్యలు, రైతులు ఇతర ప్రాంతాల్లో నివాసం ఉండటం వల్ల ఆలస్యం జరగుతుంది. తాము ఎన్నిసార్లు గ్రామాల్లోకి వెళ్లినా.. రైతులు అందుబాటులో లేకపోవడం ప్రధాన సమస్యగా మారుతుందని అధికారులు వాపోతున్నారు. గతేడాది ప్రారంభం జిల్లాలో పట్టాదార్ పాస్ పుస్తకాలు కలిగిన రైతులకు ప్రభుత్వ ప్రయోజనాల అందేలా ఆధార్ తరహాలో ప్రత్యేకంగా విశిష్ట గుర్తింపునిచ్చేందుకు ‘ఫార్మర్ రిజిస్ట్రీ’ నమోదును కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. జిల్లాలోని 21 మండలాల్లోని అన్ని గ్రామాల్లో ప్రభుత్వ ఆదేశాల మేరకు గతేడాది ఏప్రిల్ 15 నుంచి అధికారులు నమోదు కార్యక్రమం చేపట్టారు. జిల్లాలో 2,79,044 లక్షల మంది రైతులు పట్టాదార్ పాస్ పుస్తకాలు కలిగి ఉన్నారు. వీరిలో ఇప్పటివరకు 1,74,246 మంది ఫార్మర్ రిజిస్ట్రీలో నమెదు చేసుకొని విశిష్ట గుర్తింపు సంఖ్య పొందారు. మరో 1,04,798 మంది రైతులు నమోదు చేసుకోవాల్సి ఉంది. ఇప్పటివరకు జిల్లాలో ఫార్మర్ రిజిస్టీ 62 శాతం నమోదు కాగా. జిల్లాలోని 76 క్లస్టర్లలో 76 మంది ఏఈఓలు నమోదు కార్యక్రమం చేపడుతున్నారు. ప్రయోజనాలు పీఎం కిసాన్కు అర్హత పొందడంతో పాటు పంటల బీమా లభిస్తుంది. అలాగే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే పథకాలు, రుణాలు, సబ్సిడీలు ఇతర ప్రయోజనాలు పొందవచ్చు. నమోదు చేసుకోవడానికి ఆధార్, పొలం పట్టాదార్ పాస్బుక్, ఆధార్కు లింక్ అయన సెల్ఫోన్ అవసరమం. దీని ద్వారా రైతుల భూమి వివరాలు ఆధార్, సెల్ఫోన్ నంబర్తో లింక్ అవుతాయి. జిల్లాలోని ప్రతి రైతు తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రీ నమోదు చేసుకోవాలి. ఇందుకోసం గ్రామీణ ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు వ్యవసాయ అధికారుల ద్వారా రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. నెట్వర్క్ సమస్యతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రిజిస్ట్రీ చేసుకోకపోతే ప్రభుత్వ ప్రయోజనాలు అ అందవు. రైతులు నమోదు చేసుకుంటేనే సబ్సిడీ విత్తనాలు, ఎరువులు, ఇతర సంక్షేమ పథకాలు అందుతాయి. – దేవ్కుమార్, జిల్లా వ్యవసాయ అధికారి -
మీటర్లు గిర్రగిర్రా!
● వేసవిలో పెరుగుతున్న విద్యుత్ వాడకం ● తగ్గుతున్న ‘గృహజ్యోతి’ లబ్ధిదారులు ● మార్చిలో 3 వేల పైచిలుకు మంది అనర్హులు మెదక్జోన్: ఎండలు దంచికొడుతుండటంతో జిల్లాలో విద్యుత్ వాడకం పెరిగింది. ఉదయం 9 గంటల నుంచే భానుడు విశ్వరూపం ప్రదర్శిస్తుండటంతో వేడి, ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉపశమనం కోసం ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు వినియోగిస్తున్నారు. ఫలితంగా 200 యూనిట్లు దాటడంతో గృహజ్యోతి పథకానికి అనర్హులుగా మారుతున్నారు. జిల్లాలో ఫిబ్రవరి నెలలో గృహజ్యోతి లబ్ధిదారుల సంఖ్య 1,28,465 మంది కాగా, 200 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగించిన వారు 1,27,150 మంది. మిగితా 1,315 మంది 200 యూనిట్ల కన్నా ఎక్కువగా విద్యుత్ వినియోగించటంతో అనర్హులుగా మారారు. అలాగే మార్చిలో 1,28,584 మంది లబ్ధిదారులకు గానూ 200 యూనిట్ల విద్యుత్ వాడింది 1,23,930 మంది. మిగితా 4,654 మంది 200 యూనిట్ల కంటే ఎక్కువగా విద్యుత్ వినియోగించారు. కాగా కేవలం నెల రోజుల వ్యవధిలో 3,339 మంది గృహజ్యోతి పథకానికి అనర్హులుగా మారారు. మేలో మరింత మంది.. జిల్లాలో గృహజ్యోతి (ఉచిత) విద్యుత్ పథకానికి 1.28 లక్షల మంది అర్హులు ఉన్నారు. మార్చిలో 4,654 మంది అనర్హులుగా మిగిలారు. ఏప్రిల్, మేలో వీరి సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం జిల్లాలో 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుండగా, మున్ముందు ఎండలు మరింత పెరిగే అవకాశం ఉంది. దీంతో విద్యుత్ వినియోగం పెరిగి లబ్ధిదారుల సంఖ్య తగ్గే అవకాశం ఉంది. గృహజ్యోతి పథకం ద్వారా పేదలకు ప్రభుత్వం ప్రతీ నెల 200 యూనిట్ల విద్యుత్ ఉచితంగా ఇస్తోంది. కాగా 201 యూనిట్ల విద్యుత్ కాల్చి నా, రూ. 1,200 నుంచి రూ.1,300 వరకు బిల్లు చెల్లించాల్సిందే. ఈ విద్యుత్ వాడకంలో 50 యూనిట్ల వరకు ఒక్క లెక్క, 100 వరకు మరో లెక్క.. ఆపైనా మరో విధంగా యూనిట్లకు లెక్కలు కట్టాల్సి ఉంటుందని సంబంధిత ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. అవసరం మేరకే వాడాలి విద్యుత్ అవసరం మేరకు మాత్రమే వాడాలి. రాత్రి వేళల్లో అవసరం ఉన్నప్పుడు మాత్రమే బల్బులు, ఫ్యాన్లు, ఏసీలు, కూలర్లు ఆన్ చేయాలి. అవసరం లేకున్నా కొందరు బల్బులను బాతురూముల్లో వేసి ఉంచుతారు. దీంతో కరెంట్ వినియోగం పెరిగిపోయి ప్రభుత్వం ఇచ్చే సబ్సిడి నష్టపోవాల్సి వస్తోంది. ఫలితంగా నెలకు రూ. 1,200 నుండి రూ. 1,500 వరకు బిల్లులను చెల్లించాల్సి వస్తోంది – నారాయణ నాయక్, విద్యుత్ ఎస్ఈ -
ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నాం
కలెక్టర్ ప్రతిమాసింగ్ మెదక్ కలెక్టరేట్: ఆర్టీసీ ఉద్యోగుల సమ్మెతో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ ప్రతిమాసింగ్ అన్నారు. బుధవారం కలెక్టరేట్లో ఆమె విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. అన్నిశాఖల అధికారుల సమన్వయంతో సేవలు అందేలా కృషి చేస్తామన్నారు. అత్యవసర సేవల కోసం కంట్రోల్ రూం నంబర్ 9391942254 ఏర్పాటు చేశామని తెలిపారు. జిల్లాలోని మెదక్, నర్సాపూర్ డిపోల నుంచి బస్సులు నడిపేలా ఏర్పాట్లు చేశామన్నారు. మెదక్ డిపోలో 100, నర్సాపూర్ నుంచి 37 బస్సులు ఉన్నాయని, తాత్కాలిక కండక్టర్లను రిక్రూట్ చేసుకుంటున్నట్లు వివరించారు. అలాగే డ్రైవర్ల కోసం దరఖాస్తులు పరిశీలిస్తున్నామన్నారు. గతంలో ఆర్టీసీలో పోస్టుల కోసం దరఖాస్తు పెట్టుకున్న వారిని పిలిపిస్తామన్నారు. పోలీస్, రెవెన్యూ, రవాణతో పాటు జిల్లాలోని అన్నిశాఖల అధికారుల సమన్వయంతో ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకొని ప్రైవేట్ వాహనదారులు అధిక చార్జీలు వసూలు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం అక్రిడిటేషన్ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. నిజమైన జర్నలిస్టులకు కార్డులు అందేలా అందరూ కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేశ్, జెడ్పీ సీఈఓ ఎల్లయ్య, డీపీఆర్ఓ రామచంద్ర రాజు తదితరులు పాల్గొన్నారు. -
హైకోర్టు తీర్పు కాంగ్రెస్కు చెంపపెట్టు
ఎమ్మెల్యే సునీతారెడ్డి నర్సాపూర్: ఘోష్ కమిషన్పై బుధవా రం హైకోర్టు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్కు చెంపపెట్టు లాంటిదని ఎమ్మెల్యే సునీతారెడ్డి అన్నారు. బుధవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్పై విచారణ కోసం ప్రభుత్వం నియమించిన ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించడాన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు. కమిషన్ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను వేధించడాన్ని కక్షపూరిత చర్యగా ఆమె అభివర్ణించారు. హామీలు అమలు చేయకుండా కాళేశ్వరంపై కమిషన్, ఫార్ములా రేస్, ఫోన్ ట్యాపింగ్ అంటూ ప్రజల దృష్టిని మరల్చేందుకు ప్రభుత్వం కుట్రలు చేస్తుందని ఆరోపించారు. ప్రజలకిచ్చిన హామీల అమలు చేసే వరకు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. -
జూనియర్ కళాశాల ఏర్పాటు చేస్తా
● పుల్కుర్తిలో స్థలాన్ని పరిశీలించండి ● ఎమ్మెల్యే సంజీవరెడ్డి నారాయణఖేడ్: పుల్కుర్తిలో కస్తూర్బాగాంధీ జూనియర్ కళాశాల ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే సంజీవరెడ్డి తెలిపారు. మనూరు మండలం పుల్కుర్తిలోని కస్తూర్బాగాంధీ పాఠశాలను బుధవారం ఆయన సందర్శించారు. భవన నిర్మాణానికి సంబంధించిన పనులను పరిశీలించారు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని అధికారులను ఆదేశించారు. జూనియర్ కళాశాల ఏర్పాటు చేయడం అవసరమని, భవన నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని పరిశీలించాలని సబ్ కలెక్టర్ ఉమాహారతి, రెవెన్యూ అధికారులను కోరారు. కసూర్బాగాంధీ విద్యాలయంలో బోధనతీరు గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో సర్పంచ్లు దిగంబర్రెడ్డి, బిరాదర్ దత్తు, సిద్ధారెడ్డి, నర్సింహులు, పోతుల సంగారెడ్డి, నర్సింహులు పాల్గొన్నారు. త్వరగా ఇళ్ళను నిర్మించుకోండి లబ్ధిదారులు ఇందిరమ్మ ఇళ్ళను త్వరగా నిర్మించుకోవాలని ఎమ్మెల్యే సంజీవరెడ్డి కోరారు. పుల్కుర్తి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ళ గృహప్రవేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పేదల సొంతింటి కల నెరవేరేందుకు ఇందిరమ్మ ఇళ్ళ పథకం వరంలా మారిందన్నారు. గత బీఆర్ఎస్ హయాంలో ఒక్క ఇల్లుకూడా మంజూరు చేయలేదని, డబుల్బెడ్రూం ఇళ్ళ పేరుతో కాలయాపన చేశారని ఆరోపించారు. -
కిక్ బాక్సింగ్ పోటీలకు 32 మంది ఎంపిక
గ్రామాభివృద్ధికి సహకరించాలిడీఎల్పీఓ సురేష్బాబు పెద్దశంకరంపేట(మెదక్): గ్రామాభివృద్ధికి ప్రజాప్రతినిధులు సహకరించాలని డీఎల్పీఓ సురేష్బాబు అన్నారు. మంగళవారం స్థానిక గ్రామపంచాయతీలో సర్పంచ్, వార్డుసభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధి విషయంలో పరస్పర అంగీకారంతో పనులు చేపట్టాలన్నారు. అలాగే నిధుల ఖర్చులో జాగ్రత్తలు పాటించడంతో పాటు పనులు నాణ్యతతో చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ క్రాంతికుమార్, ఎంపీఓ జాకీర్హుస్సేన్, సర్పంచ్ జంగం రేణుక, ఉపసర్పంచ్ రాజుగౌడ్ తదితరులున్నారు. రూ.56 కోట్లు విడుదల రెండో విడత భరోసా నిధులు మెదక్జోన్: రబీ సీజన్కు సంబంధించి ఈ ఏడాది రైతు భరోసా రెండో విడత నిధులు మంగళవారం విడుదలయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 93 వేల ఎకరాలకు రూ. 56 కోట్లు రైతుల ఖాతాల్లో జమ అయినట్లు వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. మొదటి, రెండో విడతకు సంబంధించి ఇప్పటివరకు 2.76 లక్షల ఎకరాలకు రూ. 166 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశారని అధికారులు పేర్కొన్నా రు. మెదక్ జిల్లాలో 3.95 లక్షల ఎకరాల వ్యవ సాయ సాగు భూములు ఉండగా గతంలో రూ. 220 కోట్లు పైచిలుకు నిధులు విడుదలయ్యా యి. ఈయేడు కొత్తగా వేలాది పాస్ బుక్కులు సైతం వచ్చాయి. గతంలో పార్ట్– బీలో ఉన్నటువంటి భూములను పట్టాలు చేయటంతో వ్యవసాయ సాగుభూమి పెరుగుతుంది. ఇక మూడో విడతలో మిగిలిన నిధులు జమ అయ్యే అవకాశం ఉందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ మహిళా వ్యతిరేకి.. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ప్రవీణ్ మెదక్జోన్: మహిళా బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్ పార్టీ నిజస్వరూపం తెలిసిందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మెదక్ జిల్లా మీడియా ఇన్చార్జి ప్రవీణ్ పేర్కొన్నారు. మంగళవారం ఆయన మెదక్కు వచ్చిన సందర్భంగా మాట్లాడారు. బీజేపీ మహిళలకు 33 శాతం రిజర్వేషనన్ కల్పించాలని బిల్లు పెడితే దానిని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించిందని మండిపడ్డారు. రేవంత్రెడ్డివి కేవలం మాటలే తప్పా చేతల్లో అభివృద్ధి కానరావటం లేదన్నారు. హైడ్రా పేదోళ్ల ఇళ్లనే కూల్చుతున్నారు తప్పా పెద్దలవి ముట్టడం లేదని విమర్శించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లేశంగౌడ్, నేతలు గడ్డం శ్రీనివాస్, రంజిత్రెడ్డి, నాయిని ప్రసాద్, గడ్డం కాశినాథ్, సిద్దిరాములు, మహిళా నేతలు పాల్గొన్నారు. -
జనగణన పకడ్బందీగా చేపట్టాలి
● రాష్ట్ర సెన్సస్ డైరెక్టర్ భారతి హోళికేరి ● సూపర్ వైజర్లు, ఎన్యూమరేటర్లకు దిశానిర్దేశం మెదక్ కలెక్టరేట్: జనగణన–2027ను సూపర్ వైజర్లు, ఎన్యూమరేటర్లు బాధ్యతాయుతంగా, పకడ్బందీగా పూర్తి చేయాలని రాష్ట్ర సెన్సస్ డైరెక్టర్ భారతి హోళికేరి సూచించారు. మంగళవారం మెదక్ పట్టణంలో కలెక్టర్ ప్రతిమా సింగ్తో కలిసి జనగణన సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. సూపర్ వైజర్లు, ఎన్యూమరేటర్లకు కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా భారతి హొళికేరి మాట్లాడుతూ.. వివరాలు పక్కాగా సేకరించి యాప్లో నమోదు చేయాలని ఆదేశించారు. మొదటి దశలో మే 11 నుంచి జూన్ 9వ తేదీ వరకు ఇళ్ల గణన నిర్వహిస్తారని, రెండో దశ ఫిబ్రవరి 2027లో వ్యక్తుల వారీగా సమాచారం సేకరించాలన్నారు. అందరి వివరాలు గోప్యంగా ఉంచాలని స్పష్టం చేశారు. కార్యక్రమంలో మెదక్ ఆర్డీఓ రమాదేవి, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్రెడ్డి, ట్రైనర్లు తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధి ప్రణాళికలకు మార్గం చేగుంట(తూప్రాన్): జనగణనలో సేకరించే సమాచారంతో అభివృద్ధి ప్రణాళికలకు మార్గం ఏర్పడుతుందని భారతిహోళికేరి అన్నారు. మంగళవారం వడియారంలో నిర్వహించిన ఎన్యూమరేటర్ల శిక్షణ ముగింపు కార్యక్రమంలో భారతిహోళికేరి పాల్గొన్నారు. ఈసందర్భంగా మాట్లాడుతూ ఎన్యూమరేటర్లు నిర్వహించే సమాచార సేకరణ పారదర్శకంగా ఉండాలన్నారు. జన గణన నివేదికల ఆధారంగానే భవిషత్తులో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగించుకునే అవకాశం ఉంటుందన్నారు. జనగణనలో ప్రస్తావించే 33 అంశాలపై ఎన్యుమరేటర్లకు ఉన్న సందేహాలను భారతి హోళికేరి నివృత్తి చేశారు. -
పూడ్చిన మృతదేహానికి పోస్టుమార్టం
● గొంతుపై కమిలిన గుర్తులు ● అనుమానంతో కూతురు ఫిర్యాదు టేక్మాల్(మెదక్): తన తండ్రి మృతిపై అనుమానం ఉందని కూతురు పోలీసులకు ఫిర్యాదు చేయగా పూడ్చిన మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. ఈ సంఘటన మండలంలోని సాలోజిపల్లిలో మంగళవారం చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన వేముల పోచయ్య(76) చేతనైన పని చేస్తూ కుమారుడు శ్రీశైలం వద్ద ఉండేవాడు. ఈనెల 12న పోచయ్య అనారోగ్యంతో చనిపోయాడని బంధువులందరి సమక్షంలో పూడ్చిపెట్టారు. అంత్యక్రియలకు మృతుడి కూతురు టేక్మాల్ గ్రామానికి చెందిన ప్రమీల వచ్చి, పోచయ్య గొంతుపై కమిలిన గాయాలు కనిపించడంతో స్ఫృహతప్పి పడిపోయింది. కాగా ప్రమీలకు తన తండ్రి పోచయ్య భూమిలో కొద్ది భాగం ఇస్తానని గతంలో చెప్పడంతో పలుమార్లు తండ్రికొడుకుకు గొడవలవుతున్నాయి. తండ్రి మృతిపై అన్న శ్రీశైలంపై అనుమానం ఉందని ప్రమీల ఈనెల 18న పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. దర్యాప్తులో భాగంగా మంగళవారం అల్లాదుర్గం సీఐ రేణుక రెడ్డి, తహసీల్దార్ తులసీరామ్, అల్లాదుర్గం ఎస్ఐ శంకర్, హెడ్కానిస్టేబుల్ దేవిదాస్, సర్పంచ్ ఇర్షద్, గ్రామస్తుల సమక్షంలో ఫోరెన్సిక్ వైద్యులు జానిసేక్, చంద్రదీపక్ పోస్టుమార్టం నిర్వహించారు. కాగా ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. -
ఎంత మందికై నా పని కల్పిస్తాం
డీఆర్డీఏ పీడీ శ్రీనివాస్రావు చిన్నశంకరంపేట(మెదక్): ఉపాధిహామీ పథకం ద్వారా ఎంత మందికై న పని కల్పించేందుకు చర్యలు చేపట్టినట్లు డీఆర్డీఏ పీడీ శ్రీనివాస్రావు తెలిపారు. మంగళవారం మండలంలోని రుద్రారంలో ఉపాధిహామీ పథకం పనులు పరిశీలించారు. అలాగే, ఉపాధిహామీ కూలీలతో మాట్లాడి పని ప్రదేశంలో కల్పిస్తున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉపాధిహామీ పథకం ద్వారా గ్రామాల్లో ఎంతమంది పనికి వచ్చిన పనులు కల్పిస్తున్నట్లు తెలిపారు. పనులకు వచ్చేలా కూలీలను ప్రోత్సహించాలన్నారు. ఎండలను దృష్టిలో పెట్టుకుని ఉదయం సమయంలోనే పనులు ముగించుకోవాలని సూచించారు. పనులు చేసిన ఉపాధి కూలీలకు ఆన్లైన్ చేసిన వెంటనే డబ్బులు వచ్చేలా చర్యలు చేపట్టినట్లు చెప్పారు. ఈ మేరకు ఎన్ఆర్ఈజీఎస్ టీఏ సంపత్, సర్పంచ్ సంతోషకు పలు సూచనలు చేశారు. -
వర్గ పోరుంటే పార్టీకే నష్టం
సాక్షి ప్రతినిఽధి, సంగారెడ్డి: కాంగ్రెస్ పార్టీలో వర్గ పోరు ఉంటే పార్టీకే తీవ్ర నష్టమని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం మంగళవారం సంగారెడ్డిలో జరిగింది. ఈ సందర్భంగా రాజనర్సింహ మాట్లాడుతూ.. ప్రభుత్వం చేపట్టే ప్రతి సంక్షేమ పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత పార్టీ కార్యకర్తలదేనని చెప్పారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులు ఇప్పటి నుంచే సిద్ధంగా ఉండాలని సూచించారు. ఎన్నికల్లో శత్రువును తక్కువగా అంచనా వేయొద్దని వ్యాఖ్యా నించారు. ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలని కోరారు. సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఒడుదొడుకులు, గెలుపు ఓటములు సహజమేనన్నారు. కొన్ని విషయాల్లో భిన్నాభిప్రాయాలు ఉండవచ్చన్నారు. పాత, కొత్త అనే తేడా లేకుండా పార్టీ కార్యకర్తలను కాపాడుకోవడం మనందరి బాధ్యత అని మంత్రి పేర్కొన్నారు. మహిళా బిల్లుకు కాంగ్రెస్ వ్యతిరేకం కాదు మహిళా బిల్లుకు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం కాదని మంత్రి దామోదర స్పష్టం చేశారు. ప్రత్యేకంగా బిల్లు పెడితే మద్దతిస్తామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీకి గొప్ప చరిత్ర ఉందన్నారు. సీఎం రేవంత్రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో మరోసారి కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు. పాత, కొత్త అనే తేడాలు ఉండొద్దు ‘స్థానిక’ ఎన్నికలకు క్యాడర్ సిద్ధం కావాలి మంత్రి దామోదర వ్యాఖ్యలు సంగారెడ్డిలో కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం -
ఉద్యోగులు లేరయా!
నర్సాపూర్: నర్సాపూర్ మున్సిపాలిటీకి సొంత భవనం లేకపోవడంతో పాటు రెగ్యులర్ కమిషనర్ సైతం లేరు. కీలక పాత్ర పోషించే వార్డు ఆఫీసర్ల పోస్టులతో పాటు ఇతర పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో ప్రజలకు సేవలు అందడం లేదు. ప్రధానంగా పారిశుద్ధ్యం పనులపై పర్యవేక్షణ కొరవడిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. స్థానికంగా ఉండని అధికారులు నర్సాపూర్ మున్సిపల్ కమిషనర్గా పని చేసిన శ్రీరాంచరణ్ రెడ్డి గత నెల 31న బదిలీ అయ్యాడు. దీంతో సంగారెడ్డి జిల్లా జిన్నారం మున్సిపల్ కమిషనర్ తిరుపతికి నర్సాపూర్ మున్సిపాలిటీ అదనపు బాధ్యతలు అప్పగించారు. మున్సిపాలిటీలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగుల్లో చాలా మంది స్థానికంగా ఉండటం లేదు. దీంతో ఉదయం పర్యవేక్షించాల్సిన పారిశుద్ధ్యం, చెత్త సేకరణ, నీటి సరఫరా తదితర పనులపై పర్యవేక్షణ కరువైందని ప్రజలు ఆరోపిస్తున్నారు. 15 మందికి నలుగురే.. మున్సిపాలిటీలో శానిటేషన్ ఇన్స్పెక్టర్ పోస్టు, పారిశుద్ధ్య పనుల పర్యవేక్షణతో పాటు హోటళ్లు తదితర వ్యాపార సంస్థల తనిఖీ చేసే అధికారి పోస్టు ఖాళీ గా ఉంది. దీంతో తనిఖీల ఊసే లేకుండా పోయింది. కాగా మున్సిపాలిటీలో 15 వార్డులకు 15 మంది వార్డు ఆఫీసర్లు ఉండాలి. కానీ నలుగురే ఉండగా 11 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో ఒక్కొక్కరికి మూడు నుంచి నాల్గు వార్డులు కేటాయించారు. కాగా వార్డుల్లో పనులు, ఇతర సమస్యలపై పర్యవేక్షణ కొరవడింది. పలు వార్డుల్లో చెత్త సేకరించకపోవడంతో కూడళ్ల వద్ద చెత్త పేరుకుపోయి దుర్వాసన వస్తుందని ప్రజలు వాపోతున్నారు. కాగా మున్సిపాలిటీలో రెగ్యులర్ కమిషనర్తో పాటు ఇతర ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయాల్సిన అవసరం ఉంది. నర్సాపూర్ బల్దియాలో పోస్టులన్నీ ఖాళీలు త్వరలో భర్తీకి చర్యలు మున్సిపాలిటీకి రెగ్యులర్ కమిషనర్ త్వరలో రానున్నారు. ఇతర పోస్టుల్లో సైతం ఉద్యోగులను భర్తీ చేసేందుకు జిల్లా ఇన్చార్జ్ మంత్రి వివేక్, జిల్లా మంత్రులను కలిసి వినతిపత్రాలు ఇచ్చేందుకు ప్రణాళిక తయారు చేస్తున్నాం. గత ప్రభుత్వ హయాం నుంచి పలు పోస్టుల్లో ఇన్చార్జ్ ఉద్యోగులు ఉండి అలాగే కొనసాగుతున్నారు. ఆయా పోస్టులు భర్తీ అయ్యేలా కృషి చేస్తా. – ఎం.లక్ష్మి, మున్సిపల్ చైర్పర్సన్ -
కండక్టర్లు, డ్రైవర్ల నియామకం: మెదక్ డీఎం సురేఖ
మెదక్ కలెక్టరేట్/మెదక్ జోన్/నర్సాపూర్: తమ సమస్యలను పరిష్కరించాలనే పలు డిమాండ్లతో ఆర్టీసీ కార్మికులు సమ్మెకు సిద్ధమయ్యారు. మంగళవారం ఆర్టీసీ ఉన్నతాధికారులతో జేఏసీ నాయకులు జరిపిన చర్చలు విఫలం కావడంతో సమ్మె అనివార్యమైంది. దీంతో అర్ధరాత్రి నుంచే కార్మికులు సమ్మెలోకి దిగారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం సహా మొత్తం 32 డిమాండ్లను యాజమాన్యం ముందు పెట్టారు. జిల్లాలో మెదక్, నర్సాపూర్ రెండు ఆర్టీసీ డిపోలు ఉన్నాయి. ఈ రెండు డిపోల్లో 140 బస్సులు ఉన్నాయి. మెదక్ డిపోలో 70 మంది డ్రైవర్లు, 160 మంది కండక్టర్లు, అలాగే.. నర్సాపూర్ డిపోలో 35 మంది డ్రైవర్లు, 47 మంది కండక్టర్లు ఉన్నారు. వీరంతా సమ్మెకు సై అంటున్నారు. కాగా, ఎన్నికల సమయంలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని, కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిందని, ఇచ్చిన హామీ మేరకు సంస్థను వెంటనే ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. అలాగే.. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి, వేతనాలు ఇవ్వాలంటూ ఈ సమ్మెలో ప్రధాన డిమాండ్ వినిపిస్తోంది. డిపోకు చేరుకున్న బస్సులు సమ్మె అనివార్యం కావడంతో మంగళవారం రాత్రి ఆర్టీసీ బస్సులన్నీ నర్సాపూర్ డిపోకు చేరాయి. కార్మికులు సమ్మెలో పాల్గొనేందుకు సిద్ధమయ్యారు. మంగళవారం రాత్రి గేట్ మీటింగ్ నిర్వహించారు. సమ్మెను విజయవంతం చేయడానికి ప్రతి కార్మికుడు కంకణబద్దుడై ఉండాలని జేఏసీ నేతలు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కార్మికులు పలు నినాదాలు చేశారు. ఆర్టీసీ కార్మికులు సమ్మె చేపడుతున్న నేపథ్యంలో ప్రయాణికులకు ఎలాంటతి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు మెదక్ ఆర్టీసీ డిపో మేనేజర్ సురేఖ తెలిపారు. ఆర్టీసీలో సేవలు కొనసాగించేందుకు పదో తరగతి ఉత్తీర్ణత పొందిన అభ్యర్థులను తాత్కాలికంగా కండక్టర్లుగా నియమించడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. ఆసక్తిగల అభ్యర్థులు ఒరిజినల్ మెమో, ఆధార్కార్డు, రెండు పాస్పోర్ట్సైజు ఫొటోలు, పూర్తి బయోడెటా తీసుకొని బుధవారం మెదక్ ఆర్టీసీ డిపో కార్యాలయంలో సంప్రదించాలని కోరారు.డ్రైవర్ల నియామకం కోసం డీటీఓ ద్వారా హెవీ వెహికిల్ లైసెన్సు గల డ్రైవర్లను రిక్రూట్మెంట్ చేసుకోనున్నట్లు డీఎం తెలిపారు. -
గురుకులాల తనిఖీ
కౌడిపల్లి(నర్సాపూర్): ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక, సంక్షేమ వారోత్సవాల్లో భాగంగా సోమవారం మండలంలోని తునికి ఎంజేపీ బీసీ గురుకుల పాఠశాలను తహసీల్దార్ కృష్ణ, కౌడిపల్లి ఎస్టీ గురుకుల ఆశ్రమ పాఠశాలను ఎంపీడీఓ శ్రీనివాస్, గిరిజన బాలికల మినీ పాఠశాలను ఏఓ స్వప్న, జిల్లా సర్పంచ్ల ఫోరం ఉపాధ్యక్షుడు చంద్రం కృష్ణాగౌడ్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మధ్యాహ్న భోజనం, కిచెన్, డైనింగ్, హాస్టల్ గదులతో పాటు పరిసరాలు, పరిశుభ్రతను పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపీఓ రామారావ్, ఆయా గురుకుల ప్రిన్సిపాల్స్ హరిబాబు, ఫణికుమార్, మరోని, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉన్నారు. అటవీ సంరక్షణ అందరి బాధ్యతఎఫ్ఎస్ఓ కరీమొద్దీన్ కౌడిపల్లి(నర్సాపూర్): అడవులను రక్షించడం అందరి బాధ్యత అని ఎఫ్ఎస్ఓ (ఫారెస్ట్ సెక్షన్ అధికారి) కరీమొద్దీన్ తెలిపారు. సోమవారం మండల పరిధి వెంకటాపూర్(ఆర్)లో గ్రామస్తులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అడవుల రక్షణకు అందరు సహకరించాలన్నారు. గొర్రెలు, మేకల కాపర్లు జీవాల మేతకోసం చెట్లను నరకవద్దని హెచ్చరించారు. అడవులను ఆక్రమించుకోవడం, మొక్కలను నరికివేయడం సరికాదన్నారు. వేసవి సందర్భంగా అడవిలో ఆకులు రాలి ఉంటాయని నిప్పుపెడితే అడవికి నష్టం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో బీట్ అధికారి మౌనిక, గ్రామస్తులు కుమార్, మహేశ్, భాస్కర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడీలో సీమంతాలుఅల్లాదుర్గం(మెదక్): మండల పరిధి ముప్పారం అంగన్వాడీ కేంద్రంలో సోమవారం సీమంతాలు నిర్వహించారు. గర్భిణులకు కావాల్సిన పౌష్టికాహారం అందిస్తున్నట్లు తెలిపారు. పిల్లలకు గుడ్లు, బాలామృతంతో పాలు ఇస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం నాగలక్ష్మి, కార్యదర్శి గణేశ్, అంగన్వాడీ టీచర్లు సుభద్ర, రమాదేవి పాల్గొన్నారు. పీఎంశ్రీ పాఠశాలలో చేర్చండికౌడిపల్లి(నర్సాపూర్): మండల కేంద్రం కౌడిపల్లిలోని పీఎంశ్రీ ఉన్నత పాఠశాలలో విద్యార్థులను చేర్చాలని ఉపాధ్యాయులు మండలంలోని పలు గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. సోమవారం జిల్లా అధికారుల ఆదేశాల మేరకు పీడీ విజయ్కృష్ణ, ఉపాధ్యాయులు లక్ష్మన్రాజు, సీఆర్పీ అంజయ్య, ప్రశాంత్ తది తరులు మండలంలోని ధర్మాసాగర్, సదాశివపల్లి, బూరుగడ్డ, పాంపల్లి, మహమ్మద్నగర్ గేట్తండా పాఠశాలలో ఉపాధ్యాయులు, విద్యార్థులు గ్రామస్తులతో చర్చించి కౌడిపల్లిలోని పీఎంశ్రీ పాఠశాలలో చేర్పించాలని కోరారు. పాఠశాలలో మెరుగైన వసతులు, ఉత్తమ ఉపాధ్యాయులతో విద్యబోధన సాగుతుందని చెప్పారు. రేషన్ బియ్యం లారీ పట్టివేతతూప్రాన్: పేదలకు పంపిణీ చేయాల్సిన రేషన్ బియ్యం పక్కదారి పడుతున్నాయి. 44వ జాతీయ రహదారిపై 338 టన్నుల రేషన్ బియ్యంతో వెళ్తున్న లారీని పోలీసులకు పట్టుకున్నారు. హైదరాబాద్ నుంచి గుజరాత్కు తరలిస్తున్న లారీని నమ్మదగిన సమాచారంతో టోల్ప్లాజా వద్ద పోలీసులు సీజ్ చేశారు. సీజ్ చేసిన లారీని సివిల్ సప్లై అధికారులకు అప్పగించినట్లు ఎస్ఐ గంగరాజు తెలిపారు. లారీ డ్రైవర్ రాజును అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు. -
పరిహారం కోసం రాస్తారోకో..
చేగుంట(తూప్రాన్): వడగండ్ల వానతో నష్టపోయిన రైతులకు ప్రభుత్వం పరిహారం అందించాలని మక్కరాజీపేట గ్రామంలో సోమవారం రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. మక్కరాజీపేట గ్రామంలో దాదాపు 70శాతం రైతుల వరి పంటలు వడగండ్ల వానకు దెబ్బతిన్ననాయని అన్నారు. వరి కోతదశలో ఉండటంతో ధాన్యం రాలిపోయిందని వాపోయారు. అధికారులు పర్యటించి రైతుల వివరాలను సేకరించి పరిహారం అందించాలని కోరారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ శివప్రసాద్ గ్రామానికి చేరుకొని రైతులందరికీ న్యాయం చేసేలా ప్రభుత్వానికి నివేదించనున్నట్లు హామీ ఇవ్వడంతో రాస్తారోకో విరమించారు. -
సొంతింటి కల కాంగ్రెస్తోనే సాకారం
రేగోడ్(మెదక్): పేదల సొంతింటి కల కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమవుతోందని ఆ పార్టీ మండల అధ్యక్షుడు ఎస్.దిగంబర్రావు అన్నారు. మండలంలోని సంగమేశ్వర తండాలో లబ్ధిదారు వందన నిర్మించిన ఇందిరమ్మ ఇంటిని ఎంపీడీఓ సీతారావమ్మ, సర్పంచ్ సక్కూబాయితో కలిసి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వ హయా ంలో ఒక్క ఇట్లు కూడా ఇవ్వలేదని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే అర్హులందరికీ ఇండ్లు మంజూరు చేస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో ఎస్టీసెల్ జిల్లా అధ్యక్షుడు పీర్యానాయక్, హౌసింగ్ ఏఈ ప్రియ తదితరులు పాల్గొన్నారు. కౌడిపల్లి మండలంలో.. చిన్నశంకరంపేట మండలంలో..చిన్నశంకరంపేట(మెదక్): చిన్నశంకరంపేట మండలంలోని రుద్రారం గ్రామంలో ఇందిరమ్మ ఇంటిని ఎంపీడీఓ దామోదర్, హౌజింగ్ డీఈ యాదగిరి ప్రారంభించారు. సోమవారం ప్రజాపాలన– ప్రగతి ప్రణాళికలో భాగంగా సంక్షేమ పథకాల అమలు కార్యక్రమం నిర్వహించారు. రుద్రారంలో ఇందిరమ్మ ఇంటిని లబ్ధిదారు హేమలతతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇంటి నిర్మాణంతో నిరుపేదల సొంతింటి కళ నెరవేరిందన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ సంతోష, ఉపసర్పంచ్ నర్సింహులు, ఏఈ లోకేష్, కాంగ్రెస్ నాయకులు నవీన్కుమార్ పాల్గొన్నారు. -
విద్యార్థులు క్రీడల్లో రాణించాలి
నర్సాపూర్: చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని స్థానిక అల్లూరి సీతారామరాజు గిరిజన గురుకుల ఎక్స్లెన్స్ కాలేజీ ప్రిన్సిపాల్ బలరాం పేర్కొన్నారు. గురుకుల ఆవరణలో మెదక్ రీజియన్ పరిధిలోని బాలుర గురుకుల పాఠశాలలకు చెందిన 50 మంది విద్యార్థుల సాప్ట్బాల్ శిక్షణ కార్యక్రమాన్ని సోమవారం ప్రారంభించి ఆయన మాట్లాడారు. ప్రభుత్వ శిక్షణ శిబిరాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. శిబిరం వారం రోజుల పాటు కొనసాగుతుందని చెప్పారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ బసవరాజ్ తదితరులు పాల్గొన్నారు. -
గ్రామంలో పారిశుద్ధ్య చర్యలు
శివ్వంపేట(నర్సాపూర్): మండల పరిధి గుండ్లపల్లి గ్రామంలో డెంగ్యూ కలకలంపై సాక్షి దినపత్రికలో ఆదివారం కథనం ప్రచురితమైంది. అందుకు స్పందించిన సర్పంచ్ మమత సోమవారం గ్రామంలో పరిశుద్ధ్య చర్యలు చేపట్టారు. పలు వార్డులో బ్లీచింగ్ పౌండర్ చల్లడంతో పాటు మురికికాల్వలు శుభ్రం చేశారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ గ్రామ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సర్పంచ్ మమత సూచించారు. ఎంపీఓగా వినోద్కుమార్ చిన్నశంకరంపేట(మెదక్): చిన్నశంకరంపేట మండల నూతన ఎంపీఓగా వినోద్కుమార్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. నిజామాబాద్ జిల్లాలో పని చేస్తున్న వినోద్కుమార్ పదోన్నతిపై చిన్నశంకరంపేటకు బదిలీపై వచ్చారు. ఇక్కడ పని చేసిన గిరిజారాణి గతంలోనే నిజామాబాద్ జిల్లాకు బదిలీపై వెళ్లారు. గత కొన్ని రోజులుగా చిన్నశంకరంపేట ఈఓ ప్రదీప్ అదనపు బాధ్యతలు నిర్వహించగా, తాజాగా వినోద్కుమార్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ దామోదర్, గ్రామ కార్యదర్శులు అభినందించారు. పీఏసీఎస్ సొసైటీ యూనియన్ అధ్యక్షుడిగా రవీందర్పెద్దశంకరంపేట(మెదక్): మెదక్ జిల్లా పీఏసీఎస్ సొసైటీ యూనియన్ అధ్యక్షుడిగా పెద్దశంకరంపేటకు చెందిన సీఈఓ రవీందర్ సోమవారం ఏకగ్రీవంగాఎన్నికయ్యారు. ఉపాధ్యక్షుడిగా మధు, కృష్ణ, ప్రధానకార్యదర్శిగా నవీన్, ట్రెజరర్గా అమీర్అలీ, ఆర్గనైజింగ్ సెక్రటరీగా నవీన్, జాయింట్ సెక్రటరీగా సాయికిరణ్, సభ్యుడిగా వెంకటస్వామి, దినేష్, రమేష్, శ్రీనివాస్, స్వా మి, శోభారాణి, వేణుగోపాల్ ఎన్నికయ్యారు. నాణ్యమైన విద్య అందించాలినర్సాపూర్: ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించాలని స్థానిక మున్సిపల్ చైర్పర్సన్ లక్ష్మి పేర్కొన్నారు. సోమవారం పట్టణంలోని ప్రభుత్వ బాలికల వసతి గృహం, ప్రభుత్వ పాఠశాలలు తనిఖీ చేసి పారిశుద్ధ్య పనులు చేపట్టారు. ఆమె విద్యార్థులతో మాట్లా డి సమస్యలపై ఆరా తీశారు. ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం భోజనం అందించాలని సిబ్బందిని ఆదేశించారు. -
దిశ, దశ చూపిన నాయకుడు అంబేడ్కర్
మెదక్ కలెక్టరేట్: దేశానికే దశ దిశలను సూచించిన మహనీయుడు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అని మెదక్ మున్సిపల్ వైస్ చైర్మన్ దొంతి నరేష్ గౌడ్ పేర్కొన్నారు. ఆదివారం రాత్రి మెదక్ పట్టణంలోని ఆజంపురలో చైతన్య అంబేడ్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో 135వ జయంతి ఉత్సవాలు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా మున్సిపల్ వైస్ చైర్మన్ నరేష్గౌడ్ హాజరై అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజలందరూ రాజ్యాంగ విలువలకు కట్టుబడి పని చేయాలని, అప్పుడే నిజమైన ప్రజాస్వామ్యం నిలుస్తుందన్నారు. ప్రతి ఒక్కరూ అంబేడ్కర్ చూపిన మార్గాన్ని ఎంచుకోవాలని సూచించారు. అనంతరం చైతన్య అంబేడ్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో మెదక్ మున్సిపల్ వైస్ చైర్మన్, కౌన్సిలర్లను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు దీపక్కుమార్. పల్లెరాణి బాలరాజ్, సంపత్, శశికాంత్, ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం నాయకులు చెదల భాస్కర్, చైతన్య అంబేడ్కర్ యువజన సంఘం నాయకులు పాల్గొన్నారు.మున్సిపల్ వైస్ చైర్మన్ నరేష్గౌడ్ -
ఘనంగా బసవ జయంతి వేడుకలు
అల్లాదుర్గం(మెదక్): వీరశైవ లింగాయత్ల ఆరాధ్యదైవం విశ్వగురువు బసవేశ్వరుడి జయంతి వేడుకలు సోమవారం అల్లాదుర్గం మండలంలో భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. మండల పరిధి గడిపెద్దాపూర్, ముస్తాపూర్, చిల్వెర, బహిరన్దిబ్బ , చేవెళ్ల , అల్లాదుర్గం గ్రామాల్లో బసవేశ్వరుడి విగ్రహానికి పూలమాలలు వేసి ప్రత్యేక పూజలు చేశారు. యువత బసవేశ్వరుడి అడుగుజాడల్లో నడవాలని కోరారు. నర్సాపూర్లో..నర్సాపూర్: మహాత్మా బసవేశ్వర జయంతి నర్సాపూర్లో ఘనంగా నిర్వహించారు. పట్టణానికి చెందిన వీరశైవ లింగాయత్ సమాజం ఆధ్వర్యంలో బసవేశ్వరుని విగ్రహానికి, ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి పూజలు చేశారు. కార్యక్రమంలో వీరప్పగురూజీ, బసప్ప, సంగమేశ్వర, వినోద్, సిదిరాంలు, ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు. టేక్మాల్ మండలంలో.. టేక్మాల్(మెదక్): మండలంలోని ఆయా గ్రామాల్లో సోమవారం బసవ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రం టేక్మాల్లోని మండల పరిషత్ కార్యాలయం ఎదుట ఉన్న బసవేశ్వర విగ్రహానికి లింగాయత్ సంఘం ఆధ్వర్యంలో నాయకులు, యువకులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ప్రతి ఒక్కరూ బసవేశ్వర అడుగుజాడల్లో నడవాలని కోరారు. ఘనంగా బసవేశ్వరుని జయంతి -
కొనుగోలు కేంద్రాలతో ప్రయోజనం
కొల్చారం(నర్సాపూర్): రైతులు దళారుల నుంచి మోసపోకుండా.. ప్రభుత్వం ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి పేర్కొన్నారు. సోమవారం మండలంలోని వరిగుంతం, సంగాయిపేట, రంగంపేట, పైతర, కోనాపూర్ గ్రామాల్లో పర్యటించి.. వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. పైతర, కోనాపూర్ గ్రామాల్లో లబ్ధిదారులకు మంజూరయిన ఇందిరమ్మ ఇళ్లకు భూమిపూజ, నిర్మాణం పూర్తయిన ఇళ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నియోజకవర్గం అభివృద్ధికి ఎమ్మెల్యేకు రావాల్సిన నిధుల్లో ప్రభుత్వం కోత విధించడంతో ఆశించిన మేరకు అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లలేని పరిస్థితి నెలకొందన్నారు. జోగిపేట నుంచి మెదక్ వరకు రహదారి పునరుద్ధరణకు రూ.26 కోట్ల నిధులు మంజూరయ్యాయి. ముందస్తుగా ప్రభుత్వం 40 శాతం, కాంట్రాక్టర్ 60 శాతం నిధులతో చేపట్టాల్సిన పనులు టెండర్ దశలోనే ఉందని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీఓ రఫీక్ ఉన్నిసా, తహసీల్దార్ శ్రీనివాస్ చారి, ఆర్ఐ శ్రీలతపై గ్రామాల సర్పంచులు, ఎఫ్పీఓ చైర్మన్ వెంకట్రాంరెడ్డి, డీసీఎంఎస్ మాజీ వైస్ చైర్మన్ రమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.ఎమ్మెల్యే సునీతారెడ్డి -
పకడ్బందీగా జనగణన చేపట్టాలి
కౌడిపల్లి(నర్సాపూర్): జనగణనను జాగ్రత్తగా చేయాలని కలెక్టర్ ప్రతిమాసింగ్ సూచించారు. సోమవారం మండల కేంద్రం కౌడిపల్లి ఉన్నత పాఠశాలలో జనగణన ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్ల శిక్షణ కార్యక్రమాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గతంలో కాగితంపై జనగణన వివరాల రాసేవారని, ప్రస్తుతం 2027 జనగణన యాప్లో డిజిటల్ సర్వే జరుగుతుందని చెప్పారు. ఇండ్లు, జనగణన జాగ్రత్తగా చేయాలన్నారు. డిజిటల్ సర్వే చేసేటప్పుడు ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లు యాప్లో పొరపాటున తప్పులు నమోదు చేసిన సరిచేసుకోవాలన్నారు. ప్రతి ప్రశ్నకు సమాధానం నమోదు చేసి సర్వేను పకడ్బందీగా చేయాలని తెలిపారు. శిక్షణ సందర్భంగా ఏవైనా అనుమానాలు ఉంటే క్లియర్ చేసుకోవాలని చెప్పారు. కార్యక్రమంలో నర్సాపూర్ ఆర్డీఓ రామకృష్ణ, డిప్యూటీ తహసీల్దార్ జహీర్, ఆర్ఐ విజయలక్ష్మి, ట్రేనర్స్ మహిపాల్, రామక్రిష్ణ, తదితరులు పాల్గొన్నారు. సమగ్రంగా వివరాలు సేకరించాలి నిర్లక్ష్యానికి తావివ్వొద్దుచిన్నశంకరంపేట(మెదక్): జనగణనలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావివ్వవద్దని డీఎఫ్ఓ, ప్రత్యేక అధికారి జోజు పేర్కొన్నారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలో నిర్వహిస్తున్న జనగణన శిక్షణ కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న జనగణనలో ప్రతి ఇంటిని టచ్ చేయాలని కోరారు. కార్యక్రమలంలో తహసీల్దార్ మాలతి, ఎఫ్ఆర్ఓ విజయ్కుమార్ పాల్గొన్నారు. కలెక్టర్ ప్రతిమాసింగ్ -
దెబ్బతిన్న పంటల పరిశీలన
చిన్నశంకరంపేట(మెదక్): చిన్నశంకరంపేట మండలం శాలిపేట గ్రామ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు ప్రమోద్కుమార్ విద్యార్థులకు క్షేత్రస్థాయిలో రైతులు సాగు చేస్తున్న పంటలు, విపత్కర పరిస్థితి ఎదురైనప్పుడు పడుతున్న బాధలపై అవగాహన కల్పించారు. శాలతిపేట గ్రామ పాఠశాల సమీపంలో ఆదివారం కురిసిన ఆకాల వర్షంతో దెబ్బతిన్న పంటలను విద్యార్థులకు చూయించారు. ఐదు నెలల పాటు కష్టపడి సాగు చేసిన వరి పంట ఒక్క రోజులో జరిగే నష్టం గురించి వివరించారు. విద్యార్థులకు ఆంగ్ల బోధనతో పాటు క్షేత్రస్థాయి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్షేత్ర పర్యటనతో రైతు కష్టాలు తెలిస్తే కుటుంబంపై గౌరవం, ఆహారంపై శ్రద్ధ చూపుతారని వివరించారు. -
రైతులకు పరిహారం చెల్లించాలి
చిన్నశంకరంపేట(మెదక్)/చేగుంట(తూప్రాన్): వడగండ్ల వర్షాలకు నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఎకరాకు రూ.50 వేల పరిహారం అందించాలని మెదక్ ఎంపీ రఘునందన్రావు డిమాండ్ చేశారు. సోమవారం మండలంలోని మక్కరాజీపేట, రాంపూర్, కరీంనగర్, గొల్లపల్లి గ్రామాల్లో దెబ్బతిన్న వరి పంటలను ఆయన పరిశీలించి మాట్లాడారు. దాదాపు 1,700 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయన్నారు. ప్రధాన మంత్రి ఫసల్ బీమా పథకాన్ని రాష్ట్రంలో అమలు చేసి ఉంటే రైతులకు బీమా డబ్బులు వచ్చేవని తెలిపారు. గతేడాది రైతులు నష్టపోతే కొందరికీ ఇప్పటివరకు ప్రభుత్వం పరిహారం అందించలేదని ఆరోపించారు. ఆయన వెంట బీజేపీ మండల శాఖ అధ్యక్షుడు ఎల్లారెడ్డి, నాయకులు భూపాల్, కార్యకర్తలు, అధికారులు ఉన్నారు. అనంతరం నార్సింగి మండల కేంద్రంలో దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. నష్టపోయిన రైతులకు కంటితుడుపు పరిహారం కాకుండా కనీసం పెట్టుబడి అయినా అందేలా ప్రభుత్వం నష్ట పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట తహసీల్దార్ గ్రేసిబాయి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లేశంగౌడ్, నార్సింగి మండల నాయకులు చంద్రశేఖర్, లింగారెడ్డి, సత్యపాల్రెడ్డి, నర్సింహులు ఉన్నారు.ఎంపీ రఘునందన్రావు -
విద్యార్థులకు నాణ్యమైన భోజనం
మెదక్కలెక్టరేట్: పాఠశాలల్లో పారిశుద్ధ్యం, నాణ్యమై న భోజనంపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ ప్రతిమాసింగ్ అధికారులను ఆదేశించారు. ‘ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక’లో భాగంగా సోమవారం సంక్షేమ వారోత్సవాలను కలెక్టర్ ప్రారంభించారు. ఇందులో భాగంగా మెదక్ పట్టణంలోని మైనార్టీ బాలికల పాఠశాల, హాస్టల్ను ఆకస్మికంగా సందర్శించి తనిఖీ చేశారు. వంటకు ఉపయోగిస్తున్న పదార్థాల నాణ్యతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు. మరుగుదొడ్ల మరమ్మతులు త్వరగా పూర్తి చేయాలని సూచించారు. కలెక్టర్ వెంట మెదక్ మున్సిపల్ చైర్పర్సన్ రాధిక, కమిషనర్ శ్రీనివాస్రెడ్డి, ఉపాధ్యాయులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు కలెక్టరేట్లో బీసీ వెల్ఫేర్ ఆధ్వర్యంలో నిర్వహించిన బసవేశ్వరుని జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. బసవేశ్వరుడు సాంప్రదాయక సమాజంలో కుల, మత భేదాలకు వ్యతిరేకంగా పోరాడిన అభ్యుదయ వాదని కొనియాడారు. సాయంత్రం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారి సుదర్శన్రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ ఓటరు జాబితాలో మ్యాపింగ్ చేసుకునేలా రాజకీయ పార్టీల బూత్స్థాయి ఏజెంట్ల సమన్వయంతో స్పష్టమైన జాబితా రూపకల్పన చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.కలెక్టర్ ప్రతిమాసింగ్ -
వెంటాడుతున్న వాన!
పంట చేతికొచ్చే వేళ రైతన్న ఆగంపంట చేతికొచ్చే సమయంలో కురుస్తున్న అకాల వర్షాలు రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. జిల్లాలో గత నాలుగైదు రోజులుగా ఉదయం ఎండ ఉక్కిరిబిక్కిరి చేస్తుండగా.. సాయంత్రం వర్షం కురుస్తోంది. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దవుతోంది. దీంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. – మెదక్జోన్ జిల్లావ్యాప్తంగా ఈ యాసంగి సీజన్లో 3.4 లక్షల ఎకరాల్లో రైతులు వరి సాగు చేశారు. అందులో 2.52 లక్షల ఎకరాల్లో దొడ్డు, 50,476 ఎకరాల్లో సన్న రకం పంటలను సాగుచేశారు. ఇందుకు సంబంధించి 7.42 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. అందులో 2.97 లక్షల మెట్రిక్ టన్నులు రైతుల అవసరాలకు పోనూ, కొంత విత్తన కంపెనీలకు పోతుందని చెబుతున్నారు. మిగితా 4.45 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకోసం 518 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇందులో 100 సెంటర్ల ద్వారా సన్నధాన్యం, 418 సెంటర్ల ద్వారా దొడ్డురకం ధాన్యం సేకరణకు సన్నద్ధం అయ్యారు. ఇప్పటికే చాలా వరకు కేంద్రాలను ప్రారంభించారు. అయితే తూకం మాత్రం కొన్ని సెంటర్లలో మాత్రమే మొదలుపెట్టారు. చాలా సెంటర్లలో ఇంకా ప్రారంభించలేదు. అలాగే కొనుగోలు కేంద్రాలు సైతం పూర్తి స్థాయిలో ప్రారంభించలేదు. అకాల వర్షాలు భయపెడుతున్న నేపథ్యంలో వేగంగా తూకం వేయాలని రైతులు వేడుకుంటున్నారు. అలాగే అకాల వర్షాల నుంచి ధాన్యం తడిసిపోకుండా కాపాడుకునేందుకు సరిపడా టార్పాలిన్లు సరఫరా చేయాలని కోరుతున్నారు. పంటలకు తీవ్ర నష్టం వెల్దుర్తి(తూప్రాన్): కష్టాలకు ఎదురీది పంటలు సాగు చేసిన రైతులను అకాల వర్షాలు నట్టేట ముంచాయి. నోటి కాడి బుక్క నీటిపాలవడంతో దిక్కుతోచక తలలు పట్టుకుంటున్నారు. ఆదివారం రాత్రి ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడడంతో మండలంలోని పలు గ్రామాల్లో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. మామిడికాయలు రాలిపోగా, కోతకు వచ్చిన వరి నేలవాలింది. కళ్లాల్లో ఆరబోసిన వడ్లు తడిసి ముద్దయ్యాయి. ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు.వెల్దుర్తి: నేలరాలిన వరి ధాన్యం తడిసి ముద్దవుతున్న ధాన్యం త్వరగా తూకం చేయాలని వేడుకోలు -
దళారులకు విక్రయించొద్దు
నర్సాపూర్ రూరల్: దళారుల చేతుల్లో మోసపోకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించుకోవాలని ఎమ్మెల్యే సునీతారెడ్డి రైతులకు సూచించారు. సోమవారం మండలంలోని ఖాజీపేటలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి మాట్లాడారు. ఆరుగాలం కష్టపడి పండించిన ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వం కొనుగోలు చేసి, రైతులకు సకాలంలో డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతుల పట్ల నిర్వాహకులు మర్యాదగా వ్యవహరించాలని సూచించారు. కార్యక్రమంలో ఇన్చార్జి ఎంపీడీఓ సిద్ధిరాంరెడ్డి, ఏపీఎం సంగమేశ్వర్, వీఓ స్వప్న తదితరులు పాల్గొన్నారు. సంక్షేమానికి పెద్దపీట పెద్దశంకరంపేట(మెదక్): ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి అన్నారు. సోమవారం మండల పరిధిలోని మల్కాపూర్, మక్తలక్ష్మాపూర్ గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించి మాట్లాడారు. పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు సీఎం రేవంత్రెడ్డి కృషి చేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో హౌసింగ్ పీడీ మాణిక్యం, డీఈ ప్రసన్న, ఎంపీడీఓ క్రాంతికుమార్, నాయకులు నారాగౌడ్, సంగమేశ్వర్, సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు పెరుమాండ్లుగౌడ్, సర్పంచ్లు రాజేశ్వరి, రాజునాయక్, రవీందర్, శ్రీనివాస్, వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. బిల్లు వీగిపోవడానికి బీజేపే కారణం నర్సాపూర్: బీజేపీ కుట్ర పూరితంగా వ్యవహరించినందునే 131 రాజ్యాంగ సవరణ చట్టం బిల్లు వీగి పోయిందని డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ సుహాసినిరెడ్డి ఆరోపించారు. సోమవారం వారు విలేకరులతో మాట్లాడారు. మహిళా బిల్లు ముసుగులో డీలిమిటేషన్, కేంద్ర పాలిత ప్రాంతాల సవరణ చట్టం తీసుకురావడానికి ప్రధాని మోదీ కుట్ర చేశారని మండిపడ్డారు. మహిళలకు రిజర్వేషన్ తీసుకురావాలన్న ఉద్దేశం కేంద్రానికి లేదన్నారు. మహిళలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. తమ పార్టీ గతంలో మహిళలకు స్థానిక సంస్థల్లో 33 శాతం రిజర్వేషన్ తీసుకువచ్చిందని తెలిపారు. వారి వెంట నాయకులు గంగాధర్, సుదర్శన్గౌడ్, రవీందర్యాదవ్, నరేశ్ తదితరులు ఉన్నారు. రైతులను ఆదుకుంటాంచిన్నశంకరంపేట(మెదక్): నార్సింగి మండల కేంద్రంతో పాటు వల్లూర్, బీమ్రావుపల్లి గ్రా మాల్లో అకాల వర్షంతో తీవ్ర నష్టం జరిగిందని అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. మొత్తం 538 ఎకరాల్లో పంటలకు నష్టం జరిగినట్లు ఏఓ భరత్ కుమార్ తెలిపారు. విషయం తెలుసుకున్న జిల్లా వ్యవసాయ అధికారి దేవ్కుమార్ సోమవారం దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి రైతులకు నష్టపరిహరం అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. అలాగే దుబ్బాక కాంగ్రెస్ ఇన్చార్జి శ్రీనివాస్రెడ్డి నష్టపోయిన పంటలను పరిశీలించి రైతులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. -
చేతులు మారి.. పక్కదారి!
జోరుగా సన్న బియ్యం దందా!● డీలర్లు, మిల్లర్లే పాత్రధారులు ● అడుగడుగునా దోపిడీ.. రూ. లక్షల్లో రాబడి ● మామూళ్ల మత్తులో అధికారులు‘తిలా పాపం.. తలా పిడికెడు’ అన్నట్లు సాగుతోంది జిల్లాలో రేషన్ దందా. నిరుపేదలకు బుక్కెడు బువ్వ పెట్టాలన్న సర్కార్ సంకల్పం.. అక్రమార్కులకు వరంగా మారింది. డీలర్లు, కాంట్రాక్టర్లు, మిల్లర్లు, వ్యాపారులు కొక్కులుగా మారి సన్న బియ్యం బొక్కుతున్నారు. ఆటోలు, డీసీఎంలు, లారీల్లో రేషన్ బియ్యం రవాణ జరుగుతున్నా, అధికారులు మాత్రం మామూళ్ల మత్తులో మునిగి తేలుతున్నారన్న ఆరోపణలున్నాయి. – మెదక్ అర్బన్ రేషన్ బియ్యం పంపిణీలో అడుగడుగునా అవినీతి కనిపిస్తుంది. ఎంఎల్ఎస్ పాయింట్ నుంచి తూకం చేసి.. డీలర్లకు రేషన్ ఇవ్వాల్సిన అధికారులు.. సంచుల లెక్కన రేషన్ షాపులకు రవాణ చేస్తున్నారు. అయితే 50 కిలోల బస్తాలో సుమారు 2 నుంచి 4 కిలోల తరుగు ఉంటుందన్న ఆరోపణలున్నాయి. గత కొంత కాలంగా ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ చేస్తుంది. అయితే కొంతమంది రైతులు, ఇతర వర్గాల వారు, ముఖ్యంగా పట్టణవాసులు వాటిని తినడానికి ఆసక్తి చూపడం లేదు. దీంతో తమ కోటాను సంబంధిత రేషన్ డీలర్కు, ఇతర వ్యాపారులకు కిలో రూ. 20 చొప్పున అమ్ముకుంటున్నారు. అక్కడి నుంచి వీరు మిల్లర్లకు రూ. 26 నుంచి 28 వరకు విక్రయిస్తున్నారు. మిల్లర్లు సీఎంఆర్ కింద తమకు వచ్చిన సన్న వడ్లను, పెద్ద మిల్లులకు రూ.2,900 క్వింటాల్ చొప్పున అమ్ముకుంటున్నారు. వారు మిల్లింగ్ చేసి సూపర్ ఫైన్ బియ్యంగా మార్చి క్వింటాల్కు రూ. 4,600కు విక్రయిస్తున్నారు. అలాగే మిల్లింగ్ చేయడం ద్వారా క్వింటాల్ వడ్లకు సుమారు రూ.500కు పైగా ఉప ఉత్పత్తుల నుంచి లాభం వస్తున్నట్లు తెలుస్తుంది. వ్యాపారులు, రేషన్ డీలర్ల ద్వారా కొనుగోలు చేసిన రేషన్ బియ్యాన్ని రీ సైక్లింగ్ చేసి సీఎంఆర్ కింద ప్రభుత్వానికి ఇస్తున్నారు. ఈ క్రమంలో అన్నివర్గాల వారు లాభపడుతున్నారు.వరంగా మారిన 3 నెలల కోటా జిల్లాలో 520 రేషన్ షాపులు, 2,39,217 రేషన్ కార్డులు, 7,81,389 మంది లబ్ధిదారులు ఉన్నారు. ఈసారి మూడు నెలల కోటా కింద 14050.369 మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ చేశారు. దీంతో అక్రమ బియ్యం రవాణ జోరందుకుంది. ఇటీవల తూప్రాన్ సమీపంలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం లారీ, పాపన్నపేట శివారులో మరో లారీని పట్టుకొని, కేసులు నమోదు చేశారు. జనవరి నుంచి ఏప్రిల్ వరకు మొత్తం 11 కేసులు నమోదైనట్లు సమాచారం. అలాగే ఈనెల 15న తూప్రాన్ మండలం ఇస్లాంపూర్లోని రేషన్ షాపును విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ టీం, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారుల తనిఖీ చేయగా, 12.68 క్వింటాళ్ల బియ్యం అదనంగా ఉన్నట్లు గుర్తించి కేసు నమోదు చేశారు. -
ప్రజావాణికి 74 వినతులు
మెదక్ కలెక్టరేట్: ప్రజావాణి అర్జీలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ ప్రతిమాసింగ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజా సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు. అనంతరం కలెక్టర్ ఇతర కార్యక్రమాలకు వెళ్లగా, అదనపు కలెక్టర్ అర్జీలు స్వీకరించారు. కాగా వివిధ సమస్యలపై ప్రజలు 74 అర్జీలు అందజేశారు. మెదక్ పట్టణంలోని మల్లం చెరువు గుర్రపు డెక్క, మురికి నీటితో కంపు కొడుతుందని చర్యలు తీసుకోవాలని మెదక్ సీనియర్ సిటిజన్ ఫోరం నాయకుడు సత్యనారాయణ కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. అలాగే శివ్వంపేట మండలం చండి నుంచి గంగావాయిపల్లి, జగ్యాతండా వరకు ప్రభుత్వం రోడ్డు మంజూరు చేసిందని, మా తాతల తరం నుంచి ఇదే రోడ్డు గుండా వెళ్తున్నామని, ప్రస్తుతం ఫారెస్ట్ అధికారులు అడ్డుకుంటున్నారని గిరిజనులు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. -
బసవేశ్వరుడు గొప్ప సంఘ సంస్కర్త
జోగిపేట(అందోల్): విశ్వగురు, మహాత్మ బసవేశ్వర 893వ జయంతి సందర్భంగా జోగిపేట చౌరస్తాలో సోమవారం ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ.. బసవేశ్వరుడు గొప్ప సంఘ సంస్కర్త, దార్శనికుడు, కవి, రాజనీతిజ్ఞుడుగా అందరికీ ఆదర్శంగా నిలిచారన్నారు. వారి బోధనలు, ఆశయాలు ఆచరణీయమని పేర్కొన్నారు. ‘పనే ప్రత్యక్ష దైవం‘అని బోధించారన్నారు. ప్రతి వ్యక్తి తన కష్టార్జితంతో జీవించాలని, శ్రమకు గౌరవం ఇవ్వాలని చాటి చెప్పారన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ అర్డీ మాధురి, మున్సిపల్ చైర్మన్ కృష్ణారెడ్డి, వైస్ చైర్మన్ ఎ.చిట్టిబాబు, కౌన్సిలర్లు, వీరశైవ లింగాయత్ సమాజం అధ్యక్షుడు రవి, నాయకులు పట్లోళ్ల రవి, రమేశప్ప, రాజేందర్, జోగినాథ ఆలయ పూజారి భద్రప్ప, ఇతర ప్రజాప్రతినిధులు, లింగాయత్ సమాజం, సామాజికవేత్తలు పాల్గొన్నారు.మంత్రి దామోదర రాజనర్సింహ -
అదనపు ఎస్పీగా బాధ్యతల స్వీకరణ
మెదక్జోన్: మెదక్ అదనపు ఎస్పీగా విక్రాంత్ కుమార్ సింగ్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ అదనపు ఎస్పీగా పనిచేసిన మహేందర్ ఇటీవలే ఉద్యోగ విరమణ పొందిన విషయం విధితమే. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి బదిలీపై ఇక్కడికి రాగా, జిల్లా పోలీస్ అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆయన అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో శాంతిభద్రతలపై ఆరా తీశారు. ప్రజల భద్రత, చట్టసంరక్షణలో మరింత సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు. ప్రజలతో స్నేహపూర్వకంగా వ్యవహరించి సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో డీఎస్పీలు ప్రసన్న కుమార్, నరేందర్గౌడ్, సుభాష్ చంద్రబోస్ తదితరులు పాల్గొన్నారు. -
4 సీట్లు.. 12 నామినేషన్లు
మెదక్ కలెక్టరేట్: మెదక్ బల్దియాకు సంబంధించి కో ఆప్షన్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ సోమవారం ముగిసింది. చివరిరోజు బీఆర్ఎస్ నుంచి 4, కాంగ్రెస్ నుంచి 1 నామినేషన్ దాఖలు చేశారు. బల్దియాలో 4 సీట్లు ఖాళీ ఉండగా, మొత్తం 12 నామినేషన్లు దాఖలు అయ్యాయి. కాంగ్రెస్ నుంచి మున్సిపల్ చైర్పర్సన్ రాధిక ఆధ్వర్యంలో కౌన్సిలర్లు, నాయకులు తరలివచ్చి నామినేషన్ పత్రాలను కమిషనర్ శ్రీనివాస్రెడ్డికి అందజేశారు. మొదటి రోజు కాంగ్రెస్ నుంచి మూడు నామినేషన్లు దాఖలు చేశారు. కాంగ్రెస్ కౌన్సిలర్లంతా ఐక్యంగా ఉండి కో ఆప్షన్ పదవులు సాధించాలని చైర్పర్సన్ సూచించారు. అలాగే మున్సిపల్ మాజీ చైర్మన్ మల్లికార్జున్గౌడ్ ఆధ్వర్యంలో మాజీ కౌన్సిలర్లు, నాయకులు తరలివచ్చి 4 నామినేషన్లు కమిషనర్కు అందజేశారు. ఒక్కో సీటుకు 4 చొప్పున నామినేషన్లు వచ్చాయి. కో ఆప్షన్ పదవులకు నామినేషన్లు ముగిసిన స్వీకరణ గడువు -
సమ్మర్ క్యాంపు.. ఎంతో మేలు
నర్సాపూర్రూరల్: సమ్మర్ క్యాంపును సద్వినియోగం చేసుకోవాలని డీఈఓ విజయ విద్యార్థినులకు సూచించారు. మండలంలోని చిప్పల్తుర్తి కేజీబీవీలో సోమవారం యంగ్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆధ్వర్యంలో వివిధ అంశాలపై సమ్మర్ క్యాంపు ఏర్పాటు చేయగా, ప్రారంభించి మాట్లాడారు. క్యాంపులో స్కిల్స్ డెవలప్మెంట్, ఉన్నత విద్య కోసం ఎంట్రెన్స్కు సన్నద్ధంతో పాటు వివిధ అంశాలపై 10 రోజుల పాటు క్యాంపు కొనసాగుతుందని తెలిపారు. జిల్లాలోని ఆయా కేజీబీవీల విద్యార్థులు క్యాంపులో పాల్గొంటారని వివరించారు. ఆమె వెంట కేజీబీవీ ప్రత్యేక అధికారి శ్వేత, అధ్యాపకులు ఉన్నారు.డీఈఓ విజయ -
నేటి నుంచి సంక్షేమ వారం
మెదక్ కలెక్టరేట్: ‘ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక’లో భాగంగా జిల్లాలో నేటి నుంచి 26వ తేదీ వరకు సంక్షేమ వారం నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా సంక్షేమ హాస్టళ్లను సందర్శించి వాటిలో నెలకొన్న సమస్యలు పరిష్కరించనున్నారు. ఈమేరకు కలెక్టర్ ప్రతిమాసింగ్ ఇటీవల అధికారులతో సమావేశం నిర్వహించి దిశానిర్ధేశం చేశారు. ఏడు రోజులపాటు జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ హాస్టళ్లు, గురుకులాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈసందర్భంగా వసతి గృహాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడతారు. వంట గదులు, పరిసరాల పరిశుభ్రతతో పాటు ఏమైనా మరమ్మతులు ఉంటే వెంటనే చేయిస్తారు. విద్యార్థులకు పోటీలు విద్యార్థులకు వివిధ విభాగాల్లో పోటీలు నిర్వహిస్తారు. క్విజ్, విద్య విశ్లేషణ, చిత్రలేఖనం, పెయింటింగ్ పోటీలు నిర్వహించనున్నారు. అనంతరం స్కిల్ డెవలప్మెంట్ కల్పిస్తారు. అలాగే విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో సమావేశాలు ఏర్పాటు చేస్తారు. ఈసందర్భంగా విద్యార్థుల చదువు తదితర అంశాలపై చర్చిస్తారు. ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవాలు సంక్షేమ వారోత్సవాల్లో భాగంగా నేటి నుంచి ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశాలు చేపట్టనున్నారు. జిల్లాలో మొత్తం 235 ఇళ్లకు గృహ ప్రవేశాలు నిర్వహంచేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. జూన్ 2 వరకు మరో 1,500 ఇళ్లకు గృహ ప్రవేశాలు నిర్వహించే ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా గృహ నిర్మాణ శాఖ అధికారి మాణిక్యం తెలిపారు.ఏర్పాట్లు పూర్తి సంక్షేమ వారం కార్యక్రమానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ ప్రతిమాసింగ్ తెలిపారు. అధికారులంతా సమన్వయంతో పనిచేసి సంక్షేమ వారాన్ని సక్సెస్ చేయాలని సూచించారు. వారం రోజులపాటు సంక్షేమ హాస్టళ్లలో పర్యటించి సమస్యలు తెలుసుకొని పరిష్కరించాలని ఆదేశించారు. అలాగే వందశాతం ఫార్మర్ రిజిస్ట్రేషన్ వందశాతం పూర్తి చేయించాలన్నారు. ఈ మేరకు ఆదివారం సాయంత్రం అధికారులతో ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు. సంక్షేమ హాస్టళ్ల సమస్యల పరిష్కారం విద్యార్థులకు వివిధ పోటీలు ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశాలు -
అభివృద్ధి బాధ్యత నాదే..
● సిద్దిపేటను ప్రగతి బాటపట్టిస్తా ● అర్హులందరికీ సంక్షేమ పథకాలు ● త్వరలో రెండు లక్షల కొత్త పింఛన్లు ● కార్మిక శాఖ మంత్రి వివేక్ సిద్దిపేటజోన్: సిద్దిపేటను అభివృద్ధి బాటలో తీసుకెళ్లే బాధ్యత నాపై ఉందని, అందరూ ఐక్యంగా ముందుకు సాగాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ అన్నారు. సిద్దిపేట ప్రాంతంతో మా కుటుంబానికి ప్రత్యేక అనుబంధం ఉందని తెలిపారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఎనిమిదవ వార్డులో పలువురు బీఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాలన అంటే ప్రజాపాలనగా అభివర్ణించారు. అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలను అమలు చేస్తామని తెలిపారు. త్వరలోనే రెండు లక్షల కొత్త పింఛన్ల మంజూరుకు ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు. అదేవిధంగా సిద్దిపేట నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామని, మరో రెండు వేల ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. సిద్దిపేట మున్సిపాలిటీ పరిధిలోని ఆయా వార్డుల్లో డ్రైనేజీ నిర్మాణానికి త్వరలో ప్రత్యేకంగా నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో సిద్దిపేటలో కాంగ్రెస్ జెండా ఎగరాలని పిలుపునిచ్చారు. అందరూ కష్టపడి పని చేయాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ప్రజల్లో ఉంటూ వారి సమస్యలను గుర్తించి పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు. వార్డుల్లో కాంగ్రెస్ కమిటీలను బలోపేతం చేయాలని సూచించారు. కార్యక్రమంలో నియోజకవర్గ పార్టీ ఇన్చార్జి హరికృష్ణ, మార్కెట్ కమిటీ చైర్మన్లు యాదగిరి, మహేందర్లు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు అత్తు, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు. -
రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక
మెదక్జోన్: ఉమ్మడి మెదక్ జిల్లా చదరంగం పోటీలను ఆదివారం పట్టణంలోని అవుట్డోర్ స్టేడియంలో నిర్వహించినట్లు డీవైఎస్ఓ రమేశ్ తెలిపారు. ఇందులో ప్రతిభ కనబర్చిన క్రీడాకారులు త్వరలో రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని చెప్పారు. అండర్ 7– 11 బాలబాలికలు పాల్గొనగా, అండర్ –11 బాలికల విభాగంలో మొదటి బహుమతి సంగారెడ్డికి చెందిన జస్వంతిక, ద్వితీయ బహుమతి వేద కై వసం చేసుకున్నారు. అండర్ –11 బాలుర విభాగంలో మొదటి బహుమతి సంగారెడ్డికి చెందిన రిత్విక్, ద్వితీయ బహుమతి మెదక్ చెందిన ఇప్ప సాయి, తృతీయ బహుమతి సంగారెడ్డికి చెందిన విగ్నేశ్ పొందారు. అండర్–7 బాలుర విభాగంలో సంగారెడ్డికి చెందిన శ్రీవిశ్వ, ద్వితీ య బహుమతి రితీశ్ను వరించిందన్నారు. కార్యక్రమంలో జిల్లా చెస్ అసోసియేషన్ సెక్రటరీ ఇప్ప రాజేందర్, అసోసియేషన్ సభ్యులు శివకుమార్, సౌజన్య, నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ప్రశాంత్నగర్(సిద్దిపేట): రాష్ట్ర సారస్వత పరిష త్ బాలల కథల పోటీల్లో ‘అందరూ చేసిందే చే ద్దాం’ కథ ఉత్తమంగా ఎంపికై నట్లు బాలసాహితీవేత్త ఉండ్రాళ్ల రాజేశం ఆదివారం తెలిపారు. మొత్తం 180 కథలలో పది కథలు ఎంపిక కాగా, అందులో సిద్దిపేటకు చెందిన అనిశెట్టి సతీశ్కుమార్ రాసిన కథ ఉత్తమ బహుమతికి ఎంపికై ందన్నారు. ఈ మేరకు కవులు బస్వరాజ్ కుమార్, కోణం పరశురాములు, వర్కోలు లక్ష్మయ్య, బి. సుధాకర్, చిరంజీవి, తిరుపతి, కాల్వ రాజయ్య తదితరులు అభినందనలు తెలిపారన్నారు.బసవేశ్వరుడు అందరివాడు జహీరాబాద్ టౌన్: సమాజంలో అనేక మూఢాచారాలను పారద్రోలి కులమత రహిత సమాజాన్ని నిర్మించేందుకు కృషి చేసిన బసవేశ్వరుడు అందరివాడని ఎమ్మెల్యే కె.మాణిక్రావు అభిప్రాయపడ్డారు. బసవేశ్వరుడి జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని రాష్ట్రీయ బసవదళ్ ఆధ్వర్యంలో పట్టణంలో బసవ మండపంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలను ప్రారంభించి పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ...బసవేశ్వరుడు జగత్ గురువని, లింగాయత్ సమాజాభివృద్ధి కోసం ఎంతగానో కృషి చేసిన మహానుభావుడన్నారు. సమాజంలోని అన్ని వర్గాలు, కులాలు, మతాల ప్రజలు కలిసిమెలసి ఉంటూ గౌరవించుకోవాలని చెప్పారని ఉద్బోధించారు. నేటి తరానికి బసవేశ్వరుడి చరిత్ర తెలిసి ఉండాలన్నారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ ఉమ్మడి మెదక్ జిల్లా చైర్మన్ ఎం.శివకుమార్, రాష్ట్రీయ బసవదళ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు శంకర్పాటిల్, మాజీ చైర్మన్ నరోత్తం, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తట్టునారాయణ, లింగాయత్ సమాజ్ అధ్యక్ష కార్యదర్శులు రాజశేఖర్ షెట్కార్, ఆర్.సుభాష్ పాల్గొన్నారు. అర్హులకు ఇందిరమ్మ ఇళ్లునారాయణఖేడ్: ప్రభుత్వం అర్హులకే ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తుందని ఖేడ్ మున్సిపల్ చైర్మన్ నగేశ్ షెట్కార్ తెలిపారు. మున్సిపాలిటీ పరిధిలోని 7వ వార్డులో ఇందిరమ్మ ఇంటిని ఆదివారం ఆయన ప్రారంభించి గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
నేటి నుంచి ఓపెన్ పరీక్షలు
సంగారెడ్డి ఎడ్యుకేషన్: జిల్లాలో 2025–26 విద్యా సంవత్సరానికిగాను ఇంటర్, టెన్త్ ఓపెన్ విద్యార్థులకు సోమవారం నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. రెగ్యులర్ పరీక్షల మాదిరిగానే నిర్వహించేందుకు జిల్లా విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ఈ పరీక్షలు ఈ నెల 20వ నుంచి ప్రారంభమై 27వ తేదీ వరకు జరగనున్నాయి. పరీక్షలు రాసేందుకు జిల్లా వ్యాప్తంగా పదవ తరగతికి 10 పరీక్ష కేంద్రాలు, ఇంటర్మీడియెట్కు 18 కేంద్రాలను కేటాయించారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2:30 నిమిషాల నుంచి సాయంత్రం 5:30 నిమిషాల వరకు జరుగుతాయి. జిల్లా వ్యాప్తంగా 7,757 మంది అభ్యాసకులు ఈ పరీక్షలకు హాజరు కానున్నారు. వీరిలో ఇంటర్మీడియెట్ విద్యార్థులు 5,065, పదోతరగతి విద్యార్థులు 2,692 మంది ఉన్నారు. అన్ని పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుంది. ఉన్నత స్థాయి పర్యవేక్షణ కమిటీ, జిల్లా పరీక్ష కమిటీలతోపాటు 03 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు, మొబైల్ పోలీస్ స్క్వాడ్ బృందాలు, అదేవిధంగా ప్రతీ పరీక్ష కేంద్రం వద్ద సిట్టింగ్ స్క్వాడ్ బృందాలను నియమించారు. పరీక్షలను ప్రశాంతంగా వ్రాసేందుకు అభ్యర్థులకు అవసరమైన తాగునీటి, వైద్య చికిత్సల నిమిత్తం ఏఎన్ఎమ్లతోపాటు వెలుతురులేమి సమస్య తలెత్తకుండా వుండేందుకు అన్ని సౌకర్యాలను కల్పించారు. పరీక్ష కేంద్రాల సమీపంలో జిరాక్స్ సెంటర్లను మూసి ఉంచాలని ఆదేశించారు. పూర్తయిన ఏర్పాట్లు జిల్లా వ్యాప్తంగా ఇంటర్కు 18,పదికి 10 పరీక్ష కేంద్రాలు ఇవీ నిబంధనలు ఏర్పాట్లు పూర్తి చేశాం ఓపెన్ పరీక్షలను రెగ్యులర్ పరీక్షల మాదిరిగానే నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. ప్రతీ పరీక్ష కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలులో వుంటుంది. అభ్యాసకులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా మౌలిక వసతులు కల్పించాం. – వెంకటేశ్వర్లు, జిల్లా విద్యాధికారి -
కల్యాణలక్ష్మి ఏమాయె?
పేదింటి ఆడబిడ్డ పెళ్లి కానుకగా అందించే కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకానికి గ్రహణం పట్టింది. పెళ్లిళ్లయి ఏడాది గడుస్తున్నా ప్రభుత్వం నుంచి నయా పైసా రాకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. ఇంకా ఎప్పడిస్తారంటూ లబ్ధిదారులు ఆశగా ఎదురుచూస్తున్నారు. – మెదక్జోన్ జిల్లాలో మెదక్, తూప్రాన్, నర్సాపూర్ రెవెన్యూ డివిజన్ల పరిధిలో ఏడాది కాలంగా 1,434 కల్యాణలక్ష్మి షాదీముబారక్ దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. వీటిలో అత్యధికంగా మెదక్ డివిజన్లో 934 దరఖాస్తులు పెండింగ్లో ఉండగా, తూప్రాన్, నర్సాపూర్ డివిజన్లలో సుమారు 500 ఉన్నాయి. వీటిలో ఎమ్మెల్యే అనుమతితో పాటు ఆయా తహసీల్దార్ల పరిశీలనలో మరిన్ని పెండింగ్లో ఉన్నాయి. మరికొన్ని బిల్లులు కోసం ట్రెజరీలో ఉన్నట్లు తెలిసింది. కాగా ఏడాదిగా ఈ పథకానికి సంబంధించిన నిధులు విడుదల కాకపోవడంతో పేదింటి వధువుల తల్లిదండ్రులకు ఎదురుచూపులు తప్పటం లేదు. ఈపథకం ప్రారంభమైన పుష్కరకాలం నుంచి ఇప్పటివరకు ఏడాది పాటు దరఖాస్తులు ఎప్పడూ నిలిచిపోలేదని, ఆరు నెలల్లోపు లబ్ధిదారులకు పెళ్లి కానుకగా కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం నిధులు వధువు తల్లి ఖాతాల్లో జమయ్యేవని పలువురు పేర్కొంటున్నారు. కాగా పెళ్లి అంటేనే బంగారంతో ముడిపడి ఉంటుంది. మధ్య తరగతి వారు పెళ్లి చేస్తే వధువుకు కనీసం 3 నుంచి 5 తులాల బంగారు పుస్తెల తాడుతో పాటు ఇతర ఆభరణాలు వేస్తారు. ప్రస్తుతం తులం బంగారం ధర మార్కెట్లో రూ.1.52 లక్షల పైచిలుకు ఉంది. ఈనేపథ్యంలో ప్రభుత్వం అందించే సాయం కొంత వరకై నా ఉపయోగపడేదని లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. సాయం కోసం లబ్ధిదారుల ఎదురుచూపు ఏడాదిగా పెండింగ్ జిల్లాలో 1,400 పైచిలుకు దరఖాస్తులుఏడాది గడిచిపోయింది నాకూతురు పెళ్లి కోసం అప్పు చేశా. పెళ్లి అయిన వెంటనే కల్యాణలక్ష్మి పథకానికి దరఖాస్తు చేసుకున్నా. ఇప్పటివరకు సాయం మంజూరు కాలేదు. అధికారులను ఎన్నిసార్లు అడిగినా నిధులు రావడం లేదని చెబుతున్నారు. – ముండ్రాతి వెంకటి, చందంపేట -
వణికించిన వడగళ్లు
పలు మండలాల్లో అకాలవర్షం దెబ్బతిన్న పంటలు ● కొట్టుకుపోయిన ధాన్యంచిన్నశంకరంపేట(మెదక్)/చేగుంట(తూప్రాన్)/శివ్వంపేట(నర్సాపూర్): అకాల వర్షం జిల్లాను వణికించింది. ఆదివారం ఉదయం ఎండలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి కాగా, సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. చిన్నశంకరంపేట, నార్సింగి, చేగుంట, శివ్వంపేట మండలాల్లోని పలు గ్రామాల్లో ఈదురుగాలులతో కురిసిన వడగళ్ల వాన అతలాకుతలం చేసింది. దీంతో పంటలకు తీవ్ర నష్టం ఏర్పడింది. కొనుగోలు కేంద్రాల వద్ద ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దయింది. వర్షం నీటిలో వడ్లు కొట్టుకుపోయాయి. ఆరుగాలం శ్రమించి పడించిన పంట వర్షార్పణం అయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలుచోట్ల రోడ్లపై చెట్లు విరిగిపడగా, రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. -
దాతల సహకారం వెలకట్టలేనిది
నర్సాపూర్ రూరల్: గ్రామాల అభివృద్ధి కోసం దాతలు అందిస్తున్న సహాయం వెలకట్టలేనిదని ఎమ్మెల్యే సునీతారెడ్డి అన్నారు. అదివారం మండలపరిధి రుస్తుంపేటలో ఆర్సీటీ సొల్యూషన్ సహకారంతో ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ప్లాంట్ను ప్రారంభించి మాట్లాడారు. గ్రామాల్లో తాగునీటి ఎద్దడి నివారణకు శాశ్వత పరిష్కారం కల్పించేందుకు కేసీఆర్ మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ తాగు నీరు అందించిన విషయం గుర్తుచేశారు. వాటర్ప్లాంట్ ఏర్పాటుకు ముందుకు వచ్చిన సంస్థ నిర్వాహకులు శిల్పారెడ్డి సుకుమార్రెడ్డి దంపతులను అభినందించారు. అనంతరం సర్పంచ్ వర్ష, ఉపసర్పంచ్ వీరేశం సహకారంతో 100 మంది వాహనదారులకు హెల్మెట్లను పంపిణీ చేశారు. ప్రతి వాహనదారుడు రోడ్డు నిబంధనలు తప్పకుండా పాటించాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్ఐ రంజిత్రెడ్డి, మాజీ ఆత్మకమిటీ చైర్మన్ శివకుమార్ తదితరులు ఉన్నారు.ఎమ్మెల్యే సునీతారెడ్డి -
పసిడి పండుగకు స్వాగతం
సాక్షి, సిద్దిపేట: పసిడి పండుగ రానే వచ్చింది. ఏటా వైశాఖ మాసంలో వచ్చే అక్షయ తృతీయ నాడు బంగారం కొనుగోలు చేస్తే లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుందని విశ్వాసం. అందుకే ఈ రోజున ఎంతో కొంత బంగారం కొనుగోలు చేసేందుకు ప్రజలు ఉవ్విళ్లూరుతుంటారు. దీంతో జిల్లాలోని ప్రముఖ బంగారం షాప్లన్నీ కొత్త మోడళ్ల ఆభరణాలను అందుబాటులోకి తెచ్చారు. బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతుండటంతో తక్కువ బరువు ఉండే నగలను రూపొందించారు. వివాహ ముహూర్తాలు అధికంగా ఉండటంతో పనిలో పనిగా ఈ రోజు నగలు కొనుగోలు చేసేందుకు చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. ఆదివారం ఒక్క రోజే జిల్లా వ్యాప్తంగా రూ. 50 కోట్ల బంగారు నగల వ్యాపారం జరిగే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ మేరకు బంగారం షాపులు ప్రత్యేకంగా ముస్తాబయ్యాయి ధర ఎక్కువ ఉన్నా.. బంగారం ధరలు పెరిగినా కొనుగోలు చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. అక్షయ తృతీయను దృష్టిలో ఉంచుకుని గ్రాము నుంచి 5 గ్రాముల కాయిన్లను అందుబాటులో ఉంచారు. ఆదివారం షాపులన్నీ రద్దీగా ఉంటాయని భావించి కొంత మంది ఇప్పటికే నగలను ఎంపిక చేసుకుని అడ్వాన్స్లు సైతం ఇచ్చారు. అక్షయ తృతీయ రోజు అభరణాలు తీసుకెళ్లేలా ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు. కాగా పలు బంగారం షాపులు ఆఫర్లు ప్రకటించాయి. కొన్ని షాపుల నిర్వాహకులు తరుగులో తగ్గింపు, గోల్డ్, వెండి కాయిన్స్ అందజేయనున్నారు. వివిధ బ్యాంక్ల క్రెడిట్ కార్డులకు క్యాష్ బ్యాక్ను రూ. 1,000 నుంచి రూ.5 వేలు ప్రకటించారు. నేడే అక్షయ తృతీయ ప్రత్యేక ఆఫర్లతో హడావుడి జిల్లాలో రూ.50 కోట్ల వ్యాపారం జరిగే అవకాశం అందుబాటులోకి మోడల్స్ అక్షయ తృతీయను దృష్టిలో ఉంచుకొని అనేక మోడల్స్ ఆభరణాలను అందుబాటులో ఉంచాం. ఎంతో కొంత బంగారమైన కొనుగోలు చేయాలని ప్రజల భావిస్తారు. బంగారు ఆభరణాలపై ఆఫర్లు సైతం అందుబాటులో ఉన్నాయి. – రాజేశ్, సేల్స్ మేనేజర్, మలబార్ జ్యువెల్లర్స్, సిద్దిపేట -
విద్య, వైద్యానికే తొలి ప్రాధాన్యం
జోగిపేట(అందోల్): రాష్ట్ర ప్రభుత్వం వైద్య, విద్యారంగానికి అధిక ప్రాధాన్యతను ఇస్తుందని మంత్రి సి.దామోదర రాజనర్సింహ తెలిపారు. శనివారం చౌటకూర్, అందోలు మండలాల్లో పర్యటన సందర్భంగా పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని, బాలికలు ఉన్నత విద్యనభ్యసించాలని ఆయన సూచించారు. గ్రంథాలయాన్ని డిజిటల్ లైబ్రరీగా మారుస్తామన్నారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగకుండా ఉండేందుకు నూతనంగా సబ్స్టేషన్ను ఏర్పాటు చేశామన్నారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు అన్ని శాఖల అధికారులు అందుబాటులో ఉండేలా సమీకృత భవానాన్ని నిర్మిస్తామన్నారు. ఆయన వెంట జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంజయ్య, అదనపు కలెక్టర్ పాండు, మున్సిపల్ చైర్మన్ ఎస్.కృష్ణారెడ్డి, వైస్ చైర్మన్ ఆకుల చిట్టిబాబు, సంగమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.మంత్రి దామోదర రాజనర్సింహ -
ప్రభుత్వంతో పోరాడుతా
చిన్నకోడూరు(సిద్దిపేట): ప్రభుత్వంతో పోరాడి పొద్దు తిరుగుడు, మొక్కజొన్న రైతులకు న్యాయం చేసేందుకు ప్రయత్నం చేస్తానని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. శనివారం రాత్రి మండల పరిధిలోని పెద్దకోడూరులో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులు పండించిన పొద్దు తిరుగుడు, మొక్కజొన్నలు కొనడం లేదని, దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు పూర్తిగా విస్మరించిందన్నారు. ప్రభుత్వం కొత్త రోడ్లు ఇవ్వకపోయినా, కనీసం బీఆర్ఎస్ ప్రభుత్వం మంజూరు చేసిన రోడ్లనైనా పూర్తి చేయాలని అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీశానన్నారు. గ్రామాభివృద్ధికి అన్నిరకాల సహాయ సహకారాలు అందిస్తానన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ సామల సునీత, నాయకులు మాణిక్యరెడ్డి, శ్రీనివాస్, పాపయ్య, కనకరాజు, ఆయా గ్రామాల సర్పంచ్లు పాల్గొన్నారు.మాజీ మంత్రి హరీశ్రావు -
నిర్లక్ష్యం వల్లే రోడ్డు ప్రమాదాలు
కౌడిపల్లి(నర్సాపూర్): నిర్లక్ష్యం వల్లే వందశాతం రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు అన్నారు. శనివారం మండలంలోని రాయిలాపూర్లో ‘అరైవ్– అలైవ్’ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎస్పీ హాజరై మాట్లాడారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాల్లో 350 మంది చనిపోయారని తెలిపారు. వాహనాల తనిఖీ, డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు ముమ్మరం చేయడంతో ప్రమాదాలు తగ్గాయన్నారు. జీరో యాక్సిడెంట్, జీరో డెత్గా జిల్లాను మారుద్దామని పిలుపునిచ్చారు. ప్రమాదం జరిగిన గంటలోపు గోల్డెన్ అవర్లో బాధితులను ఆస్పత్రికి తరలించి ప్రాణాలు కాపాడిన వ్యక్తికి ‘రా వీర్’ (రహదారి వీరుడు)గా గుర్తించి ప్రభుత్వం రూ. 25 వేల నజరానా ఇస్తుందన్నారు. మైనర్లకు డ్రైవింగ్ ఇస్తే తల్లిదండ్రులపై కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. అంతకుముందు గ్రామ పంచాయతీ తరఫున హెల్మెట్ ధరిస్తాం.. జాగ్రత్తలు పాటిస్తామని తీర్మానం చేసి ప్రతిజ్ఞ చేశారు. అలాగే హెల్మెట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో డీడబ్ల్యూఓ హేమాభార్గవి, తూప్రాన్ డీఎస్పీ నరేందర్గౌడ్, సర్పంచ్ స్వప్న, సీఐ జాన్రెడ్డి, ఎంపీడీఓ శ్రీనివాస్, తహసీల్దార్ కృష్ణ, మాజీ సర్పంచ్ శేఖులు, ఉపసర్పంచ్ సంతోష్కుమార్, వార్డుసభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.ఎస్పీ డీవీ శ్రీనివాసరావు -
‘కో ఆప్షన్’ కోలాహలం
మెదక్ కలెక్టరేట్: మెదక్ బల్దియాలో కో–ఆప్షన్ ఎన్నికలకు సమయం ఆసన్నమైంది. కౌన్సిల్ ఎన్నికలు ముగిసినప్పటి నుంచి ఆశావహులు ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు శనివారం నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. అధికార కాంగ్రెస్ నుంచి మాజీ కౌన్సిలర్ రాగి వనజ, మాజీ సర్పంచ్ కొర్విరాములు, తాయర్ అలీ నామినేషన్ దాఖలు చేశారు. మున్సిపల్ చైర్పర్సన్ రాధిక, వైస్ చైర్మన్ దొంతి నరేశ్గౌడ్తో కలిసి నామినేషన్ పత్రాలను మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్రెడ్డికి అందజేశారు. కాగా మెదక్ బల్దియాలో 4 కో అప్షన్ సీట్లు ఉన్నాయి. ఇందులో రెండు జనరల్ (ఒకటి మహిళ, మరొకటి పురుషులకు), జనరల్ సీట్లకు మాజీ కౌన్సిలర్లు, మాజీ వార్డు మెంబర్లు, మాజీ సర్పంచ్లు పోటీ చేయవచ్చు. రెండు ముస్లిం మైనార్టీలకు కేటాయించారు. వారిలో ఒకరు మహిళ, మరొకటి పురుషులకు రిజర్వ్ చేశారు. అధికార పార్టీతో పాటు ఏ పార్టీకి చెందిన మాజీలు పోటీ చేయవచ్చు. ముస్లిం మైనార్టీల్లో పార్టీలకు సంబంధం లేకుండా ఎవరైన సరే పోటీ చేయడానికి అర్హులు. అధికార పార్టీకే అవకాశాలు అన్ని పార్టీల నుంచి అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసినప్పటికీ, అధికార పార్టీకి చెందిన అభ్యర్థులే కో ఆప్షన్ సభ్యులుగా గెలిచే అవకాశాలు అధికంగా ఉన్నాయి. ప్రస్తుతం పదవిలో ఉన్న కౌన్సిల్ సభ్యులు ఓటువేసి కో అప్షన్ సభ్యులను ఎన్నుకుంటారు. ఈనెల 20 వరకు నామినేషన్లు స్వీకరిస్తామని, మొదటి రోజు కాంగ్రెస్ నుంచి మూడు నామినేషన్లు వచ్చాయని మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్రెడ్డి తెలిపారు. ఎన్నికల తేదీని ప్రభుత్వం ఇంకా ప్రకటించలేదని, ఆదేశాలు రాగానే ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. మెదక్ బల్దియాలో నాలుగు సీట్లు మొదటిరోజు 3 నామినేషన్లు రేపే ఆఖరు -
‘కుస్తీ’మే సవాల్
నారాయణఖేడ్: ఖేడ్ మండలంలోని ర్యాకల్ గ్రామంలోని ఎల్లమ్మ జాతర ఉత్సవాలను పురస్కరించుకుని శనివారం కుస్తీపోటీలు నిర్వహి ంచారు. ఈ పోటీలు హోరాహోరీగా సాగాయి. ప్రాంతం నుంచే కాకుండా కర్ణాటక, మహరాష్ట్ర ప్రాంతాల నుంచి సైతం మల్లయోధులు తరలివచ్చారు. 500మంది వరకు మల్లయోధులు స్థాయిని బట్టి పోటీలు నిర్వహించి చివరి కుస్తీ విజేతకు రూ.5,100లు బహుమతిగా అందజేశారు. అటవీశాస్త్రంలో పీహెచ్డీములుగు(గజ్వేల్): ములుగు కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న అటవీ కళాశాల పరిశోధన కేంద్రంలో చదువుకుంటున్న విద్యార్థి బోచు జీవన్ అటవీ శాస్త్రంలో పీహెచ్డీ సాధించారు. ఏటూరు నాగారం వన్యప్రాణి అభయారణ్యంలో ఫైటోసోసియాలజీ, కార్బన్ నిల్వలు మరియు ప్రధాన మట్టి పోషకాలపై అధ్యయనం పూర్తి చేశారు. -
రేపటి నుంచి సంక్షేమ వారోత్సవాలు
మెదక్ కలెక్టరేట్: రేపటి నుంచి 26వ తేదీ వరకు జిల్లాలో ఏడురోజుల పాటు సంక్షేమ వారోత్సవాలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ ప్రతిమాసింగ్ తెలిపారు. శనివారం హైదరాబాద్ నుంచి సీఎస్ రామకృష్ణారావు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్కు అదనపు కలెక్టర్ నగేశ్, ఇతర అధికారులతో కలిసి హాజరయ్యారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకులాలు, వసతి గృహాల్లో పారిశుద్ధ్య పనులు, మరమ్మతులు చేపడుతామని తెలిపారు. అలాగే విద్యార్థులకు వివిధ విభాగాల్లో పోటీలతో పాటు స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. అంతకుముందు వివిధశాఖల అధికారులతో కలెక్టర్ సమన్వయ సమావేశం నిర్వహించారు. భూగర్భ లైన్లు దెబ్బతినకుండా కాపాడటమే సీబీయూడీ యాప్ లక్ష్యమని తెలిపారు. తవ్వకాలు జరిపేటప్పుడు చట్టపరమైన నిబంధనలను పాటించడం, ప్రజల భద్రతను (ప్రభుత్వ ఆస్తులతో సహా) కాపాడడం మన కర్తవ్యమని వివరించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేశ్, డీపీఓ యాదయ్య, డీఎఫ్ఓ జోజీ, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.కలెక్టర్ ప్రతిమాసింగ్ -
స్థానిక పోరుకు సన్నద్ధం!
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు ఏర్పాట్లు ● 23 వరకు ఓటరు జాబితా సిద్ధం చేయాలని ఎన్నికల సంఘం ఆదేశం ● జిల్లాలో 21 జెడ్పీటీసీ, 190 ఎంపీటీసీ స్థానాలు మెదక్ అర్బన్: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల దిశగా అడుగులు పడుతున్నాయి. ఈనెల 23 వరకు ఓటరు జాబితాను సిద్ధం చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో బీసీ రిజర్వేషన్ల అమలు నేపథ్యంలో ఏర్పడిన వివాదం ఫలితంగా ఆగిన ఎన్నికలను కోర్టు తీర్పునకు లోబడి నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో 21 జెడ్పీటీసీ, 21 ఎంపీపీ, 190 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది.సెప్టెంబర్లో ప్రక్రియ చేపట్టినా.. రెండు దశల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించాలని భావించి గత సెప్టెంబర్లో నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈమేరకు నామినేషన్ల స్వీకరణ ప్రారంభించారు. కానీ బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు ఇచ్చిన తీర్పుతో అప్పట్లో ఎన్నికలు ఆగిపోయాయి. ప్రస్తుతం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియను ప్రారంభించారు. ఈక్రమంలో 10 జూలై 2025 నుంచి 5 ఫిబ్రవరి 2026 వరకు టీపోల్లో నమోదైన ఓటర్ల జాబితాను పరిగణనలోకి తీసుకొని అదనపు ఓటర్ల వివరాలను మండలాల వారీగా గుర్తించాలి. వాటిని సంబంధిత పంచాయతీ, పోలింగ్ కేంద్రాల వారీగా ఉన్న జాబితాలకు జత చేయాలి. ఈ మేరకు చివరి లిస్టు తయారు చేసి, ఈనెల 23 వరకు ఎన్నికల కమిషన్కు పంపాలని సర్కులర్ జారీ అయింది. వాటిని ఆమోదించిన తర్వాత ముసాయిదా జాబితాలను గ్రామాల వారీగా విడుదల చేస్తారు. ఇందులో ఏమైనా అభ్యంతరాలు, సలహాలు, సూచనలు ఉంటే వాటిని పరిగణనలోకి తీసుకొని తుది జాబితా విడుదల అవుతుంది. దీంతో జిల్లా అధికారులు ఓటర్ల జాబితాలను తయారు చేసే పనిలో పడ్డారు.జూన్లో ఎన్నికలు!మండుతున్న ఎండలు, జనగణను దృష్టిలో పెట్టుకొని జూన్, జూలైలో ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో 2019లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరగగా జూన్ 2025తో వారి పదవీకాలం ముగిసింది. అప్పటినుంచి ప్రత్యేకాధికారుల పాలన కొనసాగుతోంది. కాగా కోర్టు తీర్పునకు అనుగుణంగా నిర్వహించిన పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ మెజార్టీ స్థానాలు గెలిచిన నేపథ్యంలో త్వరలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. గత డిసెంబర్ నాటికి జిల్లాలో 5,24,451 ఓటర్లు ఉండేవారు. ప్రస్తుతం ఈ సంఖ్య మారే అవకాశం ఉంది. -
రైల్వేగేటు దాటని కష్టాలు
ఆర్వోబీ నిర్మాణానికి రూ.47 కోట్లు మంజూరు టెండర్ ప్రక్రియ పూర్తయినా ప్రారంభం కాని పనులు ప్రయాణికులకు తప్పని తిప్పలుచేగుంట: రైల్వేగేటు పడటంతో నిలిచిన వాహనాలుఆ రెండు శాఖలకు రూ. 2 కోట్లు! రైల్వేగేట్ వద్ద ఆర్వోబీ నిర్మించేందుకు విద్యుత్ స్తంభాలు ట్రాన్స్ఫార్మర్లు, లైన్లు తొలగించాల్సి ఉంది. అలాగే భూమిలో నుంచి వేసిన మిషన్ భగీరథ పైపులైన్లును సైతం తొలగించి మరో చోటు నుంచి వేయాల్సి ఉంటుంది. ఈ రెండు శాఖలకు సంబంధించి సుమారు రూ. 2 కోట్ల వరకు రైల్వేశాఖ చెల్లించాల్సి ఉందని తెలిసింది. ఇప్పటివరకు డబ్బులు చెల్లించకపోవడంతోనే పనులు ప్రారంభించలేదని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. అలాగే రోడ్డుకు ఇరువైపులా నాటిన మొక్కలు సైతం పెరిగి వృక్షాలుగా మారాయి. వాటిని అటవీశాఖ అధికారులు తొలగించాల్సి ఉంది. ఇదిలా ఉండగా ఆర్వోబీ పనులు ప్రారంభం అయితే ఆర్అండ్బీ అధికారులు రహదారి మళ్లింపు చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. ఇందుకోసం తాత్కాలిక బోర్డులు సైతం ఏర్పాటు చేయాలి.దశాబ్ద కాలంగా మెదక్ నుంచి చేగుంటకు వెళ్లే ప్రయాణికులకు రైల్వేగేటు కష్టాలు తప్పడం లేదు. రైలు వచ్చిన ప్రతీసారి 10 నిమిషాల పాటు గేటు వేయడం పరిపాటిగా మారింది. ఈమార్గంలో నిత్యం 25 నుంచి 30 రైళ్లు తిరగుతుంటాయి. ఇక క్రాసింగ్ ఉందంటే అరగంటకు పైగా వేచి చూడాల్సిందే. కాగా ఈ ప్రాంతంలో ఆర్వోబీ నిర్మాణానికి నిధులు మంజూరై ఏడాది అవుతోంది. అయినా పనులు నేటికీ ప్రారంభం కాకపోవడంతో ప్రయాణికులకు తిప్పలు తప్పటం లేదు. – మెదక్జోన్జిల్లా కేంద్రంతో పాటు చుట్టు పక్కల మండలాలు, గ్రామాల నుంచి నిత్యం వేలాది మంది హై దరాబాద్ వెళ్తుంటారు. జాతీయ రహదారి 44 కలపటంతో ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. కాగా చేగుంట రైల్వేగేట్ వద్ద రోజూ 5 నుంచి 8 గంటలు గేటు మూయాల్సిన పరిస్థితి. ఫలితంగా ప్రయాణికులకు తిప్పలు తప్పడం లేదు. చాలాసార్లు అంబులెన్స్లు నిలిచిపోయిన సందర్భాలు ఉన్నాయి. రైల్వేగేటు వద్ద ఆర్వోబీ నిర్మాణానికి రూ. 42 కోట్లు మంజూరయ్యాయి. దీనికి సంబంధించిన టెండర్ పూర్తయి ఏడాది కావొస్తోంది. పనులు త్వరగా పూర్తి చేయా లని ఎంపీ రఘునందన్రావు వివిధశాఖల ఉన్నతాధికారులను ఆదేశించారు. అయినప్పటికీ ఇప్పటివరకు పనులు ప్రారంభం కాలేదు. -
క్రమశిక్షణ తప్పనిసరి
మెదక్జోన్: పోలీసులు క్రమశిక్షణ, సమయపాలన తప్పనిసరిగా పాటించాలని ఏఆర్ డీఎస్పీ రంగనాథ్ అన్నారు. శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన పరేడ్కు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పోలీసులు శరీర దారుఢ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, ప్రతిరోజూ వ్యాయామం చేయాలన్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహించొద్దని ఆదేశించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొనే వారికి ఎలాంటి మినహాయింపులు ఉండవని హెచ్చరించారు. చెడు అలవాట్లకు దూరంగా ఉండి, ప్రజలకు సమర్థవంతమైన సేవలు అందించాలని సూచించారు. కార్యక్రమంలో మెదక్ రూరల్ సీఐ జార్జ్, ఆర్ఐలు శైలేందర్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. పకడ్బందీగా జనగణన కౌడిపల్లి(నర్సాపూర్): జనగణన పకడ్బందీగా చేయాలని అదనపు కలెక్టర్ నగేశ్ తెలిపారు. శనివారం మండల కేంద్రంలో ఎన్యూమరేటర్ల శిక్షణ కార్యక్రమాన్ని సందర్శించి మాట్లాడారు. జనగణనపై ఆర్థిక, సామాజిక, విద్య తదితర అంశాలు ఆధారపడి ఉంటాయన్నారు. కరోనాతో 2021లో జనగణన జరగలేదని, ఎలాంటి పొరపాట్లు లేకుండా ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు. ప్రతి కుటుంబాన్ని లెక్కించాలని చెప్పారు. కొన్ని గ్రామాల్లో ఎక్కువ ఇళ్లు ఉండి, తక్కువ జనాభా ఉంటారని, మరికొన్ని చోట్ల తక్కువ జనాభా ఉండి ఎక్కువ ఇళ్లు ఉంటాయని తెలిపారు. దీంతో జాగ్రత్తగా గణన చేయాలన్నారు. కార్యక్రమంలో ట్రైనర్లు మహిపాల్, రామకృష్ణ, తహసీల్దార్ కృష్ణ, ఎన్యూమరేటర్లు పాల్గొన్నారు. సర్కారు బడిలో సకల వసతులు హవేళిఘణాపూర్(మెదక్): బడీడు పిల్లలు బడిలోనే ఉండేలా తల్లిదండ్రులు చూడాలని డీఈఓ విజయ అన్నారు. శనివారం మండల పరిధిలోని కూచన్పల్లిలో 99 రోజుల ప్రణాళికలో భాగంగా విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. పాఠశాల విద్యార్థులకు అవసరమైన అన్ని మౌలిక వసతులు కల్పించి, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులచే విద్యాబోధన అందిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు మల్లారెడ్డి, శివరాజ్, శశికుమార్, కృష్ణవేణి, విద్యార్థులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు చిన్నశంకరంపేట(మెదక్): వైద్యారోగ్యంపై ప్రజలకు అవసరమైన అవగాహన కల్పించేందుకు గ్రామసభలు నిర్వహించాలని డీఎంహెచ్ఓ శ్రీరామ్ సిబ్బందికి సూచించారు. శనివారం చిన్నశంకరంపేట ప్రభుత్వ ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్టులు, ల్యాబ్, ఫార్మసీని పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక’లో భాగంగా ప్రతి గ్రామంలో వైద్య శిబిరాలు నిర్వహించాలని ఆదేశించారు. మే 15 వరకు ఈ ప్రక్రియ పూర్తిచేయాలన్నారు. కార్యక్రమంలో సీహెచ్ఓ యాదగిరిరావు, ఎంఎల్హెచ్పీ కుమారి, సూపర్వైజర్ బుజ్జి, అనిత, నర్సింహులు పాల్గొన్నారు. -
రోడ్డు భద్రతపై అవగాహన
చిన్నశంకరంపేట(మెదక్): ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని మెదక్ అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ సూచించారు. శుక్రవారం స్థానిక మండల కేంద్రంలో ఆటో డ్రైవర్లకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మట్లాడుతూ వాహనాలకు సంబంధించిన అన్ని రకాల పత్రాలను అందుబాటులో ఉంచుకోవాలని కోరారు. ప్రమాదాల నివారణకు హెచ్చరిక రేడియం స్టిక్కర్లను వినియోగించాలని కోరారు. అనంతరం ట్రాఫిక్ రూల్స్ పాటిస్తామని ఆటో డ్రైవర్లతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ నారాయణగౌడ్, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సాయిసింధు పాల్గొన్నారు.ఎంవీఐ శ్రీనివాస్రావు -
నిబంధనలకు లోబడి ఇంటి నిర్మాణం
వెల్దుర్తి(తూప్రాన్): ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు ప్రభుత్వ నిబంధనలకు లోబడి ఇంటి నిర్మాణం చేపట్టాలని ఎమ్మెల్యే సునీతారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని ఉప్పులింగాపూర్లో ఎమ్మెల్యే కోటా కింద మంజూరైన వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నిబంధనల ప్రకారం ఇంటి నిర్మాణానికి లబ్ధిదారులు ముందుకు రావడం లేదన్నారు. అధికారుల సమక్షంలో ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించాలని చెప్పారు. అలాగే, వెల్దుర్తి– మెదక్ రహదారి గురించి అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని .. త్వరలో డబుల్ రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎంపీడీఓ ఉమాదేవి, ఎంపీఓ నవీన్, గృహ నిర్మాణశాఖ అధికారులు, సర్పంచ్లు పాల్గొన్నారు. ఇందిరమ్మ లబ్ధిదారులకు రూ:127 కోట్లు చెల్లింపుఅల్లాదుర్గం(మెదక్): ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు రూ.127 కోట్ల బిల్లులు చెల్లింపులు పూర్తయ్యాయని హౌసింగ్ పీడీ మాణిక్యం తెలిపారు. అల్లాదుర్గంలో శుక్రవారం ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 9,098 గృహాలను మంజూరయ్యాయని తెలిపారు. అందులో 6,768 గ్రౌండింగ్ కాగా, 691 ఇళ్లు పూర్తిస్థాయిలో నిర్మించారన్నారు. పునాది లెవల్లో 1,537, రెంటల్ లెవల్ 821 ఇళ్లు ఉన్నాయన్నారు. మంజూరైన ఇళ్లను లబ్ధిదారులు ప్రారంభించకపోతే వాటిని రద్దుచేసి, అర్హులైన వారికి మంజూరు చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో హౌసింగ్ డీఈఈ ప్రసన్న, ఏఈ అక్రమ్, ఎంపీడీఓ చంద్రశేఖర్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు శేషారెడ్డి, నాయకులు బల్రాం, మహేశ్, బాలకిషన్ తదితరులు పాల్గొన్నారు. మైనార్టీ కళాశాల లెక్చరర్కు డాక్టరేట్నర్సాపూర్: నర్సాపూర్లోని తెలంగాణ ప్రభుత్వ మైనార్టీ బాలుర గురుకుల కళాశాలకు చెందిన లెక్చరర్ కె.భిక్షపతికి డాక్టరేట్ వచ్చింది. స్థానిక కాలేజీలో వృక్షశాస్త్ర జూనియర్ లెక్చరర్గా పని చేస్తున్న భిక్షపతి ఉస్మానియా యూనివర్సిటీ వృక్షశాస్త్ర విభాగం ప్రొఫెసర్ కమలాకర్ ఆధ్వర్యంలో పరిశోధనలు చేసి డాక్టరేట్ సాధించారు. కాగా తనకు డాక్టరేట్ రావడం పట్ల ఆనందంగా ఉందని ఆయన చెప్పారు. కాలేజీ ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ మురళీ ఇతర సిబ్బంది డాక్టరేట్ సాధించిన భిక్షపతిని అభినందించారు. ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలిటీజీఈజేఏసీ నేత లక్ష్మణ్ మెదక్జోన్: ఉపాధ్యాయుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ (టీజీఈజేఏసీ) నాయకుడు చల్లా లక్ష్మణ్ హెచ్చరించారు. శుక్రవారం పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఆ సంఘం నేతలతో కలిసి తహసీల్దార్కు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రిటైర్మెంట్ అయిన ఉద్యోగులకు వెంటనే బిల్లుల విడుదల చేయాలన్నారు. సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ విధానం అమలు చేయాలని కోరారు. అలాగే ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు సంబంధించిన సాధారణ బదిలీలు చేపట్టాలని కోరారు. కార్యక్రమంలో టీజీఈ జేఏసీ జిల్లా నాయకులు స్వరూప రాణి, బాల్శెట్టి , మాధవరెడ్డి, నరేందర్, సత్యనారాయణ పాల్గొన్నారు. -
నీటి ఎద్దడి నివారణకు కార్యాచరణ
మెదక్ కలెక్టరేట్: వేసవి నేపథ్యంలో గ్రామాల్లో తాగునీటి ఎద్దడి సమస్య తలెత్తకుండా సమ్మర్ యాక్షన్ ప్లాన్ రూపొందించాలని, ప్రతి సర్పంచ్ గ్రామానికి లీడర్గా వ్యవహరించి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కలెక్టర్ ప్రతిమాసింగ్ పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో 15వ ఆర్థిక సంఘం నిధుల వినియోగంపై సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులకు వర్క్ షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పంచాయతీరాజ్ చట్టంలోని నిబంధనలకు లోబడి గ్రామ పాలన సాగాలని, ప్రత్యేక అధికారి, పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్ సమన్వయంతో గ్రామంలో సుపరిపాలన అందించాలని కోరారు. జిల్లాలోని గ్రామ పంచాయతీలు మోడల్గా తీర్చిదిద్దాలని, గ్రామాలలో అన్ని రకాల మౌలిక వసతులపై దృష్టి సారించాలన్నారు, అంగన్వాడీ, గ్రామ పంచాయతీ భవనాలు లేని గ్రామాలకు నూతన భవనాల ఏర్పాటు చేసుకునేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.. ప్రత్యేక అధికారి, పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్ల సమన్వయంతో గ్రామ పంచాయతీలో పాలన సవ్యంగా నడవాలన్నారు. గ్రామాల్లో సమస్యలు లేకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని, 15 ఆర్ధిక సంఘం నిధులను అన్ని గ్రామాలకు ప్రభుత్వం అందించిందని తెలిపారు. వాటితో గ్రామాల్లో సమస్యలు లేకుండా ఇతర శాఖల అధికారుల సమన్వయంతో పని చేయాలన్నారు. నిధుల వినియోగంలో అక్రమాలకు తావులేదన్నారు. నిధులు సక్రమంగా వినియోగించకపోతే అక్రమాలు జరిగితే సర్పంచ్ , కార్యదర్శులపై చర్యలకు వెనకాడబోమని హెచ్చరించారు. సమావేశంలో జిల్లా పంచాయతీ అధికారి యాదయ్య, మిషన్ భగీరథ ఈఈ సంపత్ కుమార్, గ్రిడ్ డీఈ నాగభూషణం, డీఎల్పీఓలు సాయిబాబు, తిరుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. సర్పంచులు, కార్యదర్శులకు కలెక్టర్ ఆదేశం నిధులు దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు -
రూ.13వేల కోట్ల బకాయిలు
మెదక్ కలెక్టరేట్: ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యలను సత్వరమే పరిష్కరించాలని మెదక్ జిల్లా ఉద్యోగ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ దొంత నరేందర్ డిమాండ్ చేశారు. శుక్రవారం సమస్యల పరిష్కారం కోసం కలెక్టరేట్ ఎదు ట బైఠాయించి నిరసన తెలిపారు. భోజన విరామ సమయంలో భాగస్వామ్య సంఘాలతో కలసి నిర్వహించిన కార్యక్రమంలో నరేందర్ మాట్లాడా రు. గత ప్రభుత్వం పెండింగ్ పెట్టిన మూడు విడతల కరువు భత్యాలు మాత్రమే విడుదల చేశారని తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వంలో పెండింగ్లో ఉన్న ఐదు విడతల కరువు భత్యం విడుదల చేయక పోవడం అన్యాయం అని పేర్కొన్నారు. అలాగే ఐదు శాతం మధ్యంతర భృతితో పీఆర్సీ కమిషన్ వేసిందన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు రెండున్నర సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటి వరకు పే రివిజన్ కమిషన్పై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం సత్వరమే కమిటీ నివేదిక తెప్పించుకొని వెంటనే 51 శాతం ఫిట్మెంట్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. అలాగే ఉద్యోగుల విశ్రాంత ఉద్యోగుల ప్రభుత్వం వద్ద పెండింగ్లో ఉన్న 13వేల కోట్ల బకాయిలు యుద్ధ ప్రాతిపాదికన విడుదల చేయాలన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు పాత పెన్షన్ విధానాన్ని ప్రవేశ పెట్టే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టర్ ప్రతిమాసింగ్ను కలసి సమస్యలతో కూడిన వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ ప్రధాన కార్యదర్శి విట్టల్, టీఎన్జీవో జిల్లా కార్యదర్శి రాజ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. యుద్ధ ప్రాతిపదికన విడుదల చేయాలి 51 శాతం ఫిట్మెంట్ వెంటనే ప్రకటించాలి జిల్లా జేఏసీ చైర్మన్ దొంత నరేందర్ డిమాండ్ కలెక్టరేట్ ఎదుట ఉద్యోగుల నిరసన -
పైసలు రాక.. పస్తులు
ఉపాధి కూలీల వెతలుదాదాపు రూ.6వేలు రావాలి ఉపాధి పనులు చేస్తున్నా డబ్బులు రావడంలేదు. దాదాపు రూ. 6వేలు రావాలి. కూలి డబ్బుల కోసం రోజూ బ్యాంకు చుట్టూ తిరుగుతున్నా. అధికారులను అడిగితే ఇంకా పడలేదు అని చెబుతున్నారు. ఇప్పటికై నా ఉన్నత అధికారులు స్పందించి కూలి డబ్బులు త్వరగా చెల్లించాలి. – ముత్యాలు, ఉపాధి హామీ కూలి,లింగుపల్లి, మిరుదొడ్డి త్వరలో జమ అవుతాయి పెండింగ్లో ఉన్న కూలీల డబ్బులు వారం రోజుల్లో బ్యాంక్ ఖాతాల్లో జమఅవుతాయి. రోజు పనులకు వచ్చిన వారి వివరాలు ఆన్లైన్లో అప్లోడ్ చేస్తున్నాం. కూలి పని కి వచ్చిన వారందరికీ తప్పకుండా డబ్బులు చెల్లించడం జరుగుతుంది. – జయదేవ్ ఆర్యా, డీఆర్డీవో, సిద్దిపేటమహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్ఆర్ఈజీఎస్) కూలీలు డబ్బులు కోసం ఎదురుచూస్తున్నారు. కూలీలకు సకాలంలో డబ్బులు చెల్లించకపోవడంతో పథకం లక్ష్యం నీరుగారుతోంది. చెమటోడ్చి పనిచేసిన కూలీలకు సకాలంలో కూలి డబ్బులు ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారు. రెక్కాడితేగానీ డొక్కాడని నిరుపేదలు, చెమట చిందించి చేసిన పనికి పైసా రాకపోవడంతో పస్తులతో అల్లాడిపోతున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా రూ.2.95కోట్లు పెండింగ్లో ఉన్నాయి. డబ్బుల చెల్లింపు ఆలస్యమవుతుండటంతో ఉపాధి పనులకు కూలీలు వచ్చేందుకు మొగ్గు చూపడం లేదు. – సాక్షి, సిద్దిపేట గ్రామాల్లో రైతులకు, కూలీలకు ఉపాధి పనుల ద్వారా ఆర్థికంగా చేయూతను అందించేందుకు ఎన్ఆర్ఈజీఎస్ ను కేంద్ర ప్రభుత్వం తీసుకవచ్చింది. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా 5,69,156 జాబ్ కార్డులుండగా 10,84,409 మంది ఉపాధి కార్మికులున్నారు. అందులో 5,59,118 మంది యాక్టివ్ కూలీలున్నారు. ప్రస్తుతం వ్యవసాయ పనులు అంతగా లేకపోవడంతో జాబ్ కార్డు ఉన్న ప్రతి కుటుంబం నుంచి కనీసం ఒక్కరైనా ఉపాధి పనులకు వెళ్తున్నారు. పనిలోకి వచ్చిన కూలీ పేరు, చేసిన పరిమాణాన్ని రోజూ ఫీల్డు అసిస్టెంట్లు ఆన్లైన్లో నమోదు చేస్తారు. ఉదయం 8గంటలకు ఒక సారి ఫొటో దిగితే , మళ్లీ మధ్యాహ్నం 12గంటలకు (కనీసం 4గంటలు గ్యాప్) ఫొటో దిగాలి. అప్పుడే ఉపాధి కూలీకి డబ్బులు అకౌంట్లో జమ అవుతాయి. కేవైసీ కొర్రీలతో.. ప్రతి 15 రోజులకు ఒక సారి కూలి డబ్బులు కార్మికుల బ్యాంక్ ఖాతాలో జమకావాలి. కానీ ఫిబ్రవరి 6వ తేదీ నుంచి డబ్బులు జమ కావడం లేదు. గత రెండు నెలలుగా కూలి డబ్బులు అందక, ఈ కేవైసీ కొర్రీలతో కూలీలు పనులకు వెళ్లడమే మానేస్తున్న దుస్థితి దాపురించింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రూ. 2,95,49,000లు పెండింగ్లో ఉన్నాయి. చట్టం ప్రకారం 15 రోజుల్లోగా కూలి డబ్బులు జమవ్వకపోతే రోజువారీగా పరిహారాన్ని అందించాలి. ఉపాధి కూలీలకు డబ్బులు వెంటవెంటనే అందిస్తే ఉపాధి పనులకు ఎక్కువ మంది కూలీలు పనులకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పటికై నా ఉన్నత అధికారులు స్పందించి త్వరగా కూలి డబ్బులు చెల్లించాలని ఉపాధి కూలీలు కోరుతున్నారు. రెండు నెలలుగా నిలిచినడబ్బుల చెల్లింపులు పెండింగ్లో రూ.2.95కోట్లు ఎదురుచూస్తున్న కూలీలు ఉమ్మడి మెదక్ జిల్లాలోజాబ్ కార్డులు 5.69లక్షలు -
నీటి సమస్యల పరిష్కారానికి చర్యలు
పెద్దశంకరంపేట(మెదక్): వేసవిలో నీటి సమస్యలు రాకుండా పరిష్కరించేందుకు చర్యలు చేపడుతున్నట్లు జెడ్పీ సీఈఓ ఎల్లయ్య తెలిపారు. శుక్రవారం మండల పరిషత్ కార్యాలయాన్ని ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులు, ఉద్యోగుల హాజరుశాతాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బోరంచ నుంచి మండలానికి వచ్చే నీటి సరఫరా తగ్గిపోవడంతో సమస్య ఏర్పడుతుందన్నారు. ఈ సమస్య పరిష్కారానికి ఆయా గ్రామపంచాయతీల్లోని నిధులను ఉపయోగించి బోర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ క్రాంతికుమార్, సూపరిండెంట్ షాకీర్అలీ తదితరులున్నారు. తాగునీటి సమస్య రానివ్వం.. రేగోడ్(మెదక్): తాగునీటి సమస్య రానివ్వమని జెడ్పీ సీఈఓ ఎల్లయ్య ప్రజలకు సూచించారు. మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయాన్ని శుక్రవారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ మేరకు పలు రికార్డులను పరిశీలించి ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక అంశాలపై ఎంపీడీఓ సీతారావమ్మతో చర్చించారు.జెడ్పీ సీఈఓ ఎల్లయ్య -
రసాయన మందులు వాడకం తగ్గించాలి
కౌడిపల్లి(నర్సాపూర్): రైతులు పంటసాగులో మోతాదుకు మించి రసాయన ఎరువులు వాడటంవల్ల భూసార తగ్గడంతోపాటు దిగుబడి తగ్గుతోందని తునికి కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే) శాస్త్రవేత్త డాక్టర్ రవికుమార్ తెలిపారు. శుక్రవారం మండలంలోని ధర్మాసాగర్లో సమతుల్య ఎరువులు వినియోగం, భూపోషణపై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. రైతులు పంటమార్పిడి చేయాలన్నారు. పంటదిగుబడి ఎక్కువ రావాలని, మోతాదుకు మించి యూరియా, డీఏపీ వాడుతున్నారని, దీంతో భూసారం తగ్గుతోందన్నారు. పంటకు తెగులు, పురుగులు సోకుతున్నాయని చెప్పారు. భూసారం కోసం పచ్చారొట్ట ఎరువులు జీలుగు, జనుము సాగు చేయాలన్నారు. బయోఫర్టిలైజర్ (జీవన ఎరువులు) వాడాలని దీంతో నేల బాగుంటుందని తెలిపారు. వేసవిలో లోతు దుక్కులు దున్నడంవల్ల సూక్ష్మజీవులు నశిస్తాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శివారెడ్డి, ఏఓ స్వప్న, ఉపసర్పంచ్ అశోక్గౌడ్, నాయకులు సంతోష్గౌడ్, శ్రీనివాస్, రాజాగౌడ్, రైతులు పాల్గొన్నారు. పచ్చిరొట్ట, జీవన ఎరువులు వాడాలి కేవీకే శాస్త్రవేత్త డాక్టర్ రవికుమార్ -
అతివేగం.. అజాగ్రత్త వద్దు
కలెక్టర్ ప్రతిమాసింగ్మెదక్జోన్ : జీరో యాక్సిడెంట్ జోన్గా జిల్లాను తీర్చిదిద్దాలని కలెక్టర్ ప్రతిమాసింగ్ పిలుపునిచ్చారు. ‘ప్రజాపాలన, ప్రగతి ప్రణాళిక’లో భాగంగా గురువారం జిల్లా కేంద్రంలోని ఓ గార్డెన్స్లో అరైవ్–అలైవ్ కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పోలీస్, రవాణాశాఖ సమన్వయంతో నిర్వహించిన రోడ్డు ప్రమాదాల నివారణ, వాహనదారులు హెల్మెట్, సీటు బెల్ట్ పెట్టుకోకపోవడం వల్ల జరిగే ప్రాణనష్టాల గురించి వివరించారు. అనంతరం ఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. అతివేగం, అజాగ్రత్త వల్ల తరచు మరణాలు సంభవిస్తున్నట్లు చెప్పారు. ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠినంగా వ్యవహరిస్తున్నామన్నారు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా పటిష్ట చర్యలు తీసుకోవడమే పోలీస్ శాఖ ప్రధాన కర్తవ్యంగా ముందుకెళ్తున్నట్లు వివరించారు. ఈసందర్భంగా వాహన డ్రైవర్ల వైద్య శిబిరాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేశ్, డీఎంహెచ్ఓ శ్రీరామ్, జిల్లా రవాణా అధికారి వెంకటస్వామి, డీఎస్పీ ప్రసన్న కుమార్, మున్సిపల్ చైర్పర్సన్ రాధిక, వైస్ చైర్మన్ దొంతి నరేశ్గౌడ్, ఇతర అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
‘మీ సేవ’లు.. భారమే!
● జిల్లాలో 65 సెంటర్లు ● ప్రజలపై అదనపు వ్యయంప్రస్తుతం ఏ ధ్రువపత్రం కావాలన్నా మీ సేవ కేంద్రమే ఆధారం. ఇదే తరుణంలో సర్వీస్ చార్జీలను ప్రభుత్వం ఒక్కసారిగా 50 శాతం పెంచింది. ఇప్పటికే జీవన వ్యయం పెరిగిన నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో సాధారణ, మధ్య తరగతి ప్రజలపై అధిక భారం పడుతుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. – మెదక్ కలెక్టరేట్ జిల్లావ్యాప్తంగా మొత్తం 65 మీ సేవ కేంద్రాలు ఉన్నాయి. జిల్లా కేంద్రంలో ఒక ప్రభుత్వ ఈ–సేవ సెంటర్ ఉంది. మొత్తం సుమారు 200 మంది ఆపరేటర్లు నిత్యం వేలాది మందికి ప్రభుత్వ సేవలను అందిస్తున్నారు. 15 ఏళ్ల తర్వాత ప్రభుత్వం సర్వీస్ చార్జీలను పెంచింది. ఈ నిర్ణయం సామాన్యులకు మరింత భారంగా మారగా, కాగా నిర్వాహకుల్లో మాత్రం ఆనందం వ్యక్తమవుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలు, సేవలను ప్రజలకు సులభంగా, వేగంగా అందించే లక్ష్యంతో 2011లో ప్రభుత్వం మీ సేవ కేంద్రాలను ప్రారంభించింది. ఈ కేంద్రాల ద్వారా 36 డిపార్ట్మెంట్లు, 314 సర్వీస్లను ప్రజలకు అందిస్తున్నారు. రోడ్డు రవాణాశాఖ, పోలీస్, రెవెన్యూ, రిజిస్ట్రేషన్, టీవాలెట్, విద్యుత్శాఖ, దేవాదాయశాఖ, వ్యవసాయశాఖ, సీడీఎంఏ వంటి ఇతర సర్వీసులు అందజేస్తున్నారు. రెండింతలు పెరిగిన సర్వీస్ చార్జీలు పేద ప్రజలపైనే భారం పేద విద్యార్థులు పై చదువులు, హాస్టళ్లలో చేరడానికి, సంక్షేమ పథకాలు పొందడానికి అత్యధికంగా రేషన్ కార్డులు, కులం, ఆదాయం, స్థానిక, జనన, మరణ ధ్రువీకరణ పత్రాలకు దరఖాస్తు చేసుకుంటారు. ప్రస్తుతం పెంచిన చార్జీలతో వీరిపై అదనపు భారం పడుతుంది. పెంచిన చార్జీలను ప్రభుత్వం సవరించాలి. – బాల్రాజ్, జిల్లా ఎమ్మార్పీఎస్ నాయకులు పెంచిన చార్జీలు ఇలా.. మీ సేవల ద్వారా కులం, ఆదాయం, స్థానిక పత్రాలు పొందాలంటే ఒక్కో సర్టిఫికెట్కు గతంలో రూ.45 ఉండగా 50 శాతం చార్జీలతో పాటు 18 శాతం జీఎస్టీ కలుపుకొని రూ. 80 రౌండ్ ఫిగర్ చేశారు. అలాగే జనన, మరణ ధ్రువీకరణ పత్రాలకు గతంలో రూ.85 ఉండగా, ప్రస్తుతం రూ.130కు పెంచారు. -
నో హెల్మెట్.. నో ఎంట్రీ
శివాయపల్లిలో వినూత్న కార్యక్రమంరామాయంపేట(మెదక్): హెల్మెట్ పెట్టుకోనిదే గ్రామంలోకి రావొద్దని మండలంలోని శివాయపల్లి గ్రామస్తులు నినదించారు. ‘ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక’లో భాగంగా గురువారం పోలీస్శాఖ ఆధ్వర్యంలో గ్రామంలో జరిగిన అలైవ్– అరైవ్ కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా తూప్రాన్ డీఎస్పీ నరేందర్గౌడ్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ విధిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని పిలుపునిచ్చారు. హెల్మెట్ లేనిదే ఎవరూ ద్వి చక్రవాహనాలు నడపొద్దని సూచించారు. తాము గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నామని, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని డీఎస్పీ హామీ ఇచ్చారు. సీఐ వెంకట్రాజాగౌడ్ మాట్లాడుతూ గ్రామంలో వందశాతం హెల్మెట్లు ధరించడంతో పాటు వంద శాతం డ్రైవింగ్ లైసెన్స్లు, ఇన్సూరెన్స్ కలిగి ఉండాలని సూచించారు. గ్రామంలో మద్యం అమ్మకాలు నిషేధించామని, బెల్ట్షాపులు మూసి వేయిస్తామని గ్రామస్తులు తెలిపారు. అంతకుముందు పోలీస్ అధికారులతో కలిసి ప్రతిజ్ఞ నిర్వహించారు. కార్యక్రమంలో ఏఎంవీఐ శ్రీనివాసరావు, తహసీల్దార్ రజని, ఎస్ఐ బాల్రాజు తదితరులు పాల్గొన్నారు. -
సమస్యల పరిష్కారానికే ‘ప్రజాపాలన’
కౌడిపల్లి(నర్సాపూర్): గ్రామాల్లో సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తుందని డీఎల్పీఓ సాయిబాబ అన్నారు. గురువారం కౌడిపల్లి రైతువేదికలో ‘ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో భాగంగా అధికారులు, సర్పంచ్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. నూతనంగా ఎన్నికై న సర్పంచ్లు సమస్యలుంటే రాత పూర్వకంగా ఇవ్వాలని, వాటిని మినిట్స్బుక్లో నమోదు చేసి కలెక్టర్కు తెలియజేస్తామన్నారు. ఈసందర్భంగా పలు గ్రామాల సర్పంచ్లు సమస్యలను ప్రస్తావించారు. ఎస్ఐ అమరేందర్రెడ్డి భద్రతపై వివరించి ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీనివాస్, తహసీల్దార్ కృష్ణ, ఏఓ స్వప్న, పీఆర్ డిప్యూటీ ఈఈ అమరేశ్వర్, ఎంఈఓ బాలరాజు, విద్యుత్శాఖ ఏఈ సాయికుమార్ ఇతర అధికారులు పాల్గొన్నారు. -
గ్రామాల అభివృద్ధే లక్ష్యం కావాలి
అదనపు కలెక్టర్ నగేశ్రామాయంపేట(మెదక్): ‘ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక’లో భాగంగా గురువారం స్థానిక రైతు వేదికలో మండలస్థాయి సమావేశం నిర్వహించారు. మండల ప్రత్యేక అధికారి సురేశ్కుమార్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేశ్, పలు గ్రామల సర్పంచ్లు పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా సర్పంచ్లు ముందుకెళ్లాలని సూచించా రు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు విషయమై చిత్తశుద్ధితో పని చేయాల్సి అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ సజీలుద్దీన్, పలుశాఖల అధికారులు పాల్గొన్నారు. -
తాగునీటి ఎద్దడి తలెత్తనివ్వొద్దు
● త్వరలో అందుబాటులోకి అర్బన్ పార్క్ ● ఎమ్మెల్యే సంజీవరెడ్డి నారాయణఖేడ్: వేసవిలో గ్రామాల్లో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శులు, ఆర్డబ్ల్యూఎస్, విద్యుత్ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే సంజీవరెడ్డి సూచించారు. ఖేడ్ పట్టణ శివారులోని కన్వెన్షన్ హాల్లో ప్రజాపాలన– ప్రగతి ప్రణాళికలో భాగంగా వివిధ శాఖల అధికారులు, సర్పంచ్లు, కార్యదర్శులతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఉన్న పథకాలను పునరుద్ధరించడం, బోర్ల మరమ్మతులు, అవసరం ఉన్న ప్రాంతాల్లో నూతన బోర్ల డ్రి ల్లింగ్, హైరింగ్ల ద్వారా నీటి సరఫరా చేయాలని సూచించారు. కలెక్టర్ నిధులతోపాటు, ఎంపీ సురేశ్ షెట్కార్, తన నిధులు సైతం తాగునీటి ఎద్దడి నివారణకు కేటాయించనున్నట్లు తెలిపారు. మంజీరా మరమ్మతు పనులు జరుగుతున్నందున నీటిని వదిలేశారని దీంతో తాగునీటి సరఫరాకు ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయని చెప్పా రు. సర్పంచ్లకు తెలియకుండా కార్యదర్శులు పలు ప్రాంతాల్లో నిధులు డ్రా చేస్తున్న విషయం తన దృష్టికి వచ్చిందని, సర్పంచ్లకు తెలియకుండా ఇలాంటి చర్యలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. తాగునీటి పథకాలకు విద్యుత్ పరంగా అవసరాలకు విద్యుత్ అధికారులు తీర్చాలని సూచించారు. సమీక్షలో నాయకులు వినోద్పాటిల్, రమేష్ చౌహన్, పండరీరెడ్డి, తహశీల్దార్ హసీనాబేగం, ఎంపీడీవో శ్రీనివాస్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అందుబాటులోకి అర్బన్ పార్కు పట్టణ శివారులో నిర్మాణంలో ఉన్న అర్బన్ పార్కు త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి రానుందని సంజీవరెడ్డి తెలిపారు. ఉదయం పార్కులో ఆయన మార్నింగ్ వాక్ నిర్వహించి పనులను, ఆయా ఏర్పాట్లను పరిశీలించారు. -
రోడ్డు ప్రమాదాలను నివారిద్దాం
తూప్రాన్: ప్రజల భద్రతే లక్ష్యంగా పోలీస్శాఖ పనిచేస్తుందని, ఇందుకు ప్రతి ఒక్కరూ తమవంతు సహకారం అందించాలని ఐజీ చంద్రశేఖర్రెడ్డి, కలెక్టర్ ప్రతిమాసింగ్, ఎస్పీ శ్రీనివాస్రావు పిలుపునిచ్చారు. ‘అరైవ్–అలైవ్’ కార్యక్రమంలో భాగంగా బుధవారం తూప్రాన్, నర్సాపూర్ చౌరస్తాతో పాటు మనోహరాబాద్ మండలం కాళ్లకల్లో నిర్వహించిన కార్యక్రమంలో వారు పాల్గొని పలు సలహాలు సూచనలు అందజేశారు. వాహన డ్రైవర్లకు కంటి పరీక్షలు నిర్వహించి రోడ్డు నిబంధనల గురించి వివరించారు. ఈసందర్భంగా మానవహారం చేపట్టి రోడ్డు నియమాలు పాటిస్తామంటూ ప్రతిజ్ఞ చేయించారు. ట్రాఫిక్ రూల్స్ తప్పనిసరిగా పాటించాలన్నారు. ప్రతి సంవత్సరం దాదాపు 7000 ప్రమాదాలు జరుగుతున్నాయని, రోడ్డు నియమాలు పాటిస్తే ప్రమాదాలను పూర్తిగా అరికట్టవచ్చన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ జయచంద్రారెడ్డి, డీఎస్పీ నరేందర్గౌడ్, సీఐలు రంగాకృష్ణ, జాన్రెడ్డి, వెంకటరాజుగౌడ్తో పాటు ఎస్ఐలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అంతకుముందు కలెక్టర్ తూప్రాన్ ఆర్డీఓ కార్యాలయంలో పదో తరగతి విద్యార్థులకు ధ్రువీకరణ పత్రాలను పంపిణీ చేశారు. -
రేపు ఉద్యోగుల సమస్యలపై నిరసన
మాట్లాడుతున్న జగదీష్సంగారెడ్డి: ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి రేపు నల్ల బ్యాడ్జీలతో నిరసన చేయనున్నట్లు టీఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్ తెలిపారు. జిల్లా టీఎన్జీవోస్ సంఘం ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికై న రాష్ట్ర టీఎన్జీవోస్ అధ్యక్షుడు, జనరల్ సెక్రెటరీ ముజీబ్, అసోసియేట్ అధ్యక్షుడు కస్తూరి వెంకటేశ్, కోశాధికారి ఉమాదేవికి సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు జగదీష్ మాట్లాడుతూ.. పీఆర్సీ, సీపీఎస్, డీఏ వంటి కీలక అంశాలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. రిటైర్డ్ ఉద్యోగులకు రావలసిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశా రు. ఈ నెల 17న టీజీఈ జేఏసీ పిలుపు మేరకు నల్ల బ్యాడ్జీలు ధరించి సామూహిక నిరసన చేపట్టనున్నట్లు ప్రకటించారు. కార్యక్రమంలో అసోసియేట్ అధ్యక్షుడు శ్రీకాంత్, వెంకట్ రెడ్డి, కోశాధికారి శ్రీనివాస్, రాష్ట్ర హెచ్డబ్ల్యూఓ సంఘం అధ్యక్షుడు భాస్కర్, పంచాయతీ కార్యదర్శుల అధ్యక్షుడు బలరాం, జిల్లా ఉద్యోగులు, సంఘ ప్రతినిధులు నాయకులకు అభినందనలు తెలిపారు.టీఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు జగదీష్ -
మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి
నర్సాపూర్: మహిళలకు 33 శాతం రిజర్వేషన్ బిల్లు త్వరలోనే ఆమోదం పొందుతుందని మెదక్ ఎంపీ రఘునందన్రావు అన్నారు. బుధవారం పట్టణంలోని ఐసీడీఎస్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో అంగన్వాడీ విద్యార్థుల గ్యాడ్యుయేషన్ డే కార్యక్రమానికి ఆయ న ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మహిళలు అన్నిరంగాల్లో ముందుకురావాలని పిలుపునిచ్చా రు. మూడు అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనాలు నిర్మించేందుకు ఎంపీ లాడ్స్ నుంచి నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం ఎమ్మెల్యే సునీతారెడ్డి మాట్లాడుతూ.. తాను సీ్త్ర, శిశు సంక్షేమశాఖ మంత్రిగా ఉన్నప్పుడు అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, పిల్లలకు కేంద్రాల ద్వారా పౌష్టికాహారం అందించామన్నారు. కార్య క్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ సుహాసినిరెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ లక్ష్మి, వైస్ చైర్మన్ బుచ్చెష్, సీడీపీఓ హేమభార్గవి, కౌన్సిలర్లు నర్సమ్మ, రాజు, సరళ, ప్రాజెక్టు సూపర్వైజర్లు శివకుమారి, సంతోషిమాత, మెహతాబేగం, సరళకుమారి, కవిత, వసుమతి, లక్ష్మి, నర్సమ్మ, సంతోష, కుమర్సుల్తానా, లక్ష్మి, సుజాత తదితరులు పాల్గొన్నారు.ఎంపీ రఘునందన్రావు -
నిర్వాసితుల్లో సంబురం
● ఎట్టకేలకు ఫలించిన న్యాయపోరాటం ● రూ.12.54లక్షల చొప్పున ప్యాకేజీ గజ్వేల్: గజ్వేల్– ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని మల్లన్నసాగర్ నిర్వాసిత గ్రామాలకు చెందిన ఒంటరి మహిళల న్యాయపోరాటం ఫలించింది. ప్యాకేజీ కోసం 2019 నుంచి పోరాటం సాగించారు. వేములఘాట్ గ్రామానికి చెందిన 24 మంది, ఏటిగడ్డ కిష్టాపూర్ గ్రామానికి చెందిన 21 మంది ఒంటరి మహిళలకు ఒక్కొక్కరికి రూ.12.54లక్షల చొప్పున ప్యాకేజీని వారి ఖాతాల్లో జమచేసినట్లు బుధవారం తెలిపారు. ఏడేళ్ల తర్వాత తమ న్యాయ పోరాటం ఫలించడంతో నిర్వాసితులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కేసును హైకోర్టులో సమర్ధవంతంగా వాదించి గెలిపించిన హైకోర్టు న్యాయవాది సీహెచ్. రవికుమార్కు బాధితులు కృతజ్ఞతలు తెలిపారు. స్థానికంగా సంబురాలు చేసుకున్నారు. -
పోక్సో చట్టం.. రక్షణ కవచం
మెదక్జోన్: పోక్సో చట్టం చిన్నారులకు రక్షణ కవచంలా నిలుస్తోంది. కేవలం రెండు నెలల వ్యవధిలో 8 మంది దోషులకు జైలు శిక్ష వేయగా, వారిలో ఆరుగురికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష పడింది. మరో ఇద్దరికి మూడేళ్ల జైలు శిక్ష విధించారు. దీంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఈ చట్టంపై మరింత విస్తృతంగా అవగాహన కల్పించాలని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు. 2021లో ప్రత్యేక కోర్టు ఏర్పాటు పోక్సో 2012లో ఆవిర్భవించగా జిల్లాలో 2021లో ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేశారు. కాగా గతేడాది వరకు ఇన్చార్జి పబ్లిక్ ప్రాసిక్యూటర్తో కొనసాగించగా, 2025 జూన్లో పోక్సో కోర్టుకు స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ను నియమించారు. కాగా గడిచిన 2 నెలల్లో 8 మంది నిందితులకు శిక్ష పడగా, అందులో ఆరుగురికి 20 ఏళ్ల చొప్పున కఠిన కారాగార శిక్షతో పాటు రూ. లక్ష చొప్పున జరిమానా విధించారు. మరో ఇద్దరికి మూడేళ్లజైలు శిక్షతో పాటు రూ. లక్ష చొప్పున జరిమానా విధించి ఆ మొత్తాన్ని బాధిత కుటుంబాలకు ఇవ్వాలని న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. కాగా ఎప్పుడూ లేని విధంగా పోక్సో కోర్టు ఇటీవల రెండు నెలల వ్యవధిలో 8 మంది దో షులకు శిక్షలు విధించటంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.పరువు ముసుగులో రాజీ ఏడాది కాలంగా జిల్లాలో 500 పైచిలుకు కేసులు నమోదు కాగా, గడిచిన పది నెలల్లో 350 పైచిలుకు పోక్సో కేసులు ట్రయల్కు వచ్చాయి. వాటిలో కేవలం 8 మందికి శిక్షలు పడగా, మిగితా వారు బాధితులతో రాజీపడి కేసుల నుంచి తప్పించుకోగలిగారు. ఇందులో ప్రధానంగా పరువు పోతుందనే భావనతో నింధితులు కోర్టుల్లో సాక్ష్యం చెప్పేందుకు ముందుకు రావటం లేదని తెలిసింది. మరికొంత మంది బాధితులకు డబ్బు ఎరవేసి కేసుల నుంచి తప్పించుకుంటున్నారు. 2 నెలల వ్యవధిలో 8 మందికి శిక్ష హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు చట్టంపై అవగాహన అవసరం : న్యాయ నిపుణులుఅవగాహన అవసరం మైనర్లపై అఘాయిత్యాల నేపథ్యంలో పోక్సో చట్టం ఏర్పాటు అయింది. ఈ చట్టం గురించి ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి. పరువు అంటూ కొందరు రాజీపడి కోర్టుల్లో సాక్ష్యాలు చెప్పకపోవడంతో దోషులు శిక్ష నుంచి తప్పించుకోగలుగుతున్నారు. ఇందుకు ప్రధాన కారణం చట్టంపై అవగాహన లేకపోవటమే. – బాలయ్య, పోక్సోకోర్టు స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్నిర్భయంగా చెప్పాలి బాలికలపై అఘాయిత్యాలు తగ్గాలంటే బాధితులు కోర్టులో నిర్భయంగా సాక్ష్యం చెప్పి దోషులకు శిక్షలు పడేలా చేయాలి. అప్పుడే బాలికలపై అఘాయిత్యాలు తగ్గే అవకాశం ఉంటుంది. – శ్రీనివాసరావు, ఎస్పీ -
అగ్నిమాపక నిబంధనలు పాటించాలి
మెదక్ కలెక్టరేట్: 14 నుంచి ఏప్రిల్ 21 వరకు అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహించనున్నట్లు అదనపు కలెక్టర్ నగేష్ తెలిపారు. మంగళవారం ఆయన ఛాంబర్లో అగ్నిమాపక వారోత్సవాల వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అగ్నిప్రమాదాల నివారణలో ప్రజల్లో అవగాహన చాలా ముఖ్యమని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ అగ్ని భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ఇళ్లు, కార్యాలయాల్లో, వాణిజ్య సముదాయాల్లో అగ్ని ప్రమాదాల నివారణకు అవసరమైన భద్రతా చర్యలు తీసుకోవాలని తెలిపారు. అనంతరం జిల్లా అగ్నిమాపక అధికారి వేణు మాట్లాడుతూ.. అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా జిల్లాలో వివిధ అవగాహన కార్యక్రమాలు, మాక్ డ్రిల్స్, భద్రతా ప్రదర్శనలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అగ్నిప్రమాదాల నివారణకు చర్యలు పెద్దశంకరంపేట(మెదక్): మండలంలో అగ్నిప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటున్నామని ఫైర్ ఆఫీసర్ శ్రీశైలం అన్నారు. మంగళవారం పెద్దశంకరంపేటలో సర్పంచ్ జంగం రేణుకతో కలిసి అగ్నిమాపక వాల్పోస్టర్ను ఆవిష్కరించారు. అత్యవసర సమయాల్లో ప్రజలు ఫైర్ స్టేషన్కు సమాచారం అందించాలని చెప్పారు. ప్రజలు వేసవిలో అగ్నిప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ జంగం శ్రీనివాస్, ఫైర్సిబ్బంది రాజేందర్, రాజశేఖర్, నర్సింహారెడ్డి, గోపాల్ తదితరులున్నారు. అగ్నిమాపక సిబ్బంది సేవలు ప్రశంసనీయం రామాయంపేట(మెదక్): అత్యవసర పరిస్థితుల్లో అగ్నిమాపక సిబ్బంది సేవలు ఎంతో గొప్పవని స్థానిక మున్సిపల్ చైర్మన్ గజవాడ లావణ్య పేర్కొన్నారు. మంగళవారం పట్టణంలోని అగ్నిమాపక కేంద్రంలో పోస్టర్ల ఆవిష్కరించి మాట్లాడారు. వేసవిలో అగ్ని ప్రమాదాల ఎక్కువగా జరిగే ఆస్కారం ఉండటంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఎక్కడైనా ప్రమాదాలు చోటు చేసుకుంటే వెంటనే సంబంధిత కేంద్రానికి సమాచారం అందజేయాలని తెలిపారు. మున్సిపల్ వైస్ చైర్మన్ నవనీత, కౌన్సిలర్లు నాగరాజు, రవినాయక్, బైరం స్వప్న, డాకి శ్యామల, ఇతర నాయకులు పాల్గొన్నారు. -
భక్తిశ్రద్ధలతో ఆలయ వార్షికోత్సవం
చిన్నశంకరంపేట(మెదక్): మండలంలోని అంబాజిపేట గ్రామంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రేణుకామాత ఆలయ ద్వితీయ వార్షికోత్సవ ఉత్సవాల్లో మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా హోమంలో పాల్గొని ఆమె అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి దయతో అంత సుభిక్షంగా ఉండాలని కోరారు. నర్సాపూర్: ప్రభుత్వం అందజేసే లెటర్ ఆఫ్ క్రెడిట్(ఎల్ఓసీ)తో మెరుగైన వైద్యం పొందే వీలుంటుందని కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి అన్నారు. మంగళవారం నియోజకవర్గంలోని చండూర్, కొన్యాల, వెల్దుర్తి గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు ఎనిమిది లక్షల 25వేల రూపాయల విలువ చేసే ఎల్ఓసీలు అందచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదలకు నిమ్స్లో వైద్యం పొందాల్సి వచ్చినప్పుడు ఎల్ఓసీలు ఉపయోగపడతాయని, వారిపై ఆర్థిక భారం పడదని వివరించారు. అవసరమైన పేదలకు ఎల్ఓసీలు ప్రభుత్వం నుంచి మంజూరు చేయించి అందచేస్తున్నట్లు చెప్పారు. తూప్రాన్: మండల కేంద్రం మనోహరబాద్లో నిర్వహించే హిందూ సమ్మేళన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఉత్సవ కమిటీ అధ్యక్షుడు సత్తిరెడ్డి తెలిపారు. మంగళవారం హిందూ సమ్మేళన ప్రచార వాహనానికి కాళ్లకల్ బంగారమ్మ ఆలయం వద్ద పూజలు నిర్వహించి ప్రచారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సత్తిరెడ్డి మాట్లాడుతూ.. హిందూ సమ్మేళనానికి హిందూ బంధువులంతా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో వెంకటేష్గౌడ్, గోపాల్, అనిల్, గణేష్ తదితరులు పాల్గొన్నారు. నిజాంపేట(మెదక్): మండల పరిధి జెడ్ చెరువు తండాకు వెళ్లే రహదారి పూర్తిగా గుంతలమయంగా మారింది. దీంతో తరచు ప్రమాదాలు జరుగుతున్నాయని ఎస్ఐ రాజేష్ ఆధ్వర్యంలో తాత్కాలిక మరమ్మతులు చేపట్టారు. ఈ మేరకు మంగళవారం గుంతలను గుర్తించి ఎస్ఐ, సర్పంచ్ బాబు వాటిని మట్టితో నింపారు. అలాగే, ఇతర గ్రామాలకు వేళ్లే రహదారిలో ఉన్న రోడ్లపై కూడా గుంతలను పూడ్చారు. కౌడిపల్లి(నర్సాపూర్): సెంట్రింగ్ కార్మికులకు కంపెనీ తరఫున గ్రూప్ ఇన్సూరెన్స్ చేయిస్తామని జైరాజ్ స్టీల్ తెలంగాణ డీజీఎం రవిశంకర్ తెలిపారు. మంగళవారం కౌడిపల్లిలో సెంట్రింగ్ కార్మికులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్మికుల భద్రత కోసం కంపెనీ యజమాన్యం కృషి చేస్తుందని కార్మికులకు గ్రూప్ ఇన్సూరెన్స్ చేయిస్తామని చెప్పారు. కార్యక్రమంలో డీలర్ పోల నవీన్కుమార్, కార్మికులు పాల్గొన్నారు. ములుగు(గజ్వేల్): వంటిమామిడిలోని కూరగాయల మార్కెట్ యార్డు పనులకు సంబంధించిన పనుల పునరుద్ధరణ, అలాగే రైతుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటా మని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు, ములుగు మాజీ వైస్ ఎంపీపీ వి.దేవేందర్రెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మార్కెట్ యార్డు కోసం భూ ములు కోల్పోయిన రైతులకిచ్చిన హామీ మేర కు 250 గజాల ఇళ్ల స్థలాలు అందజేసేందుకు మంత్రి పొన్నం ప్రభాకర్ను కలసి వివరించనున్నట్లు చెప్పారు. అలాగే ఇళ్ల నిర్మాణాలకు ఇందిరమ్మ పథకం ద్వారా నిధులు మంజూరు చే యించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. -
బలవంతంగా భూములు లాక్కున్నారు..
రామాయంపేట(మెదక్): రామాయంపేటలో నూతనంగా నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ స్కూల్ భవన నిర్మాణానికి విలువైన తమ భూములను బలవంతంగా లాక్కున్నారని బాధిత రైతులు వాపోయారు. ఈ మేరకు మంగళవారం బాధితులు స్థానిక మున్సిపల్ పాలకవర్గానికి వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడుతూ.. 1421 సర్వే నంబర్లో 30 ఏళ్ల క్రితమే తమకు పట్టాలు ఇచ్చారని, ప్రస్తుతం సదరు భూమిలో వ్యవసాయం చేసుకుంటున్నామని పేర్కొన్నారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్ భవన సముదాయం నిర్మాణం పేరిట అధికారులు ముందస్తుగా ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా తమ భూములను లాక్కున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మహబూబ్నగర్ జిల్లా మక్తల్లో స్కూల్ భవనాల నిర్మాణం కోసం అక్కడి అధికారులు రైతుల వద్ద భూములు సేకరించి, నష్టపరిహారం ఇప్పించారని, తమకు కూడా ఇప్పించాలని బాధి తులు విజ్ఞప్తి చేశారు. ఈ విషయమై మెదక్ ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి బాధితులకు న్యాయం చేస్తానని వైస్ చైర్మన్ నవనీత భరోసా ఇచ్చారు. నవనీతకు వినతిపత్రం అందజేస్తున్న రైతులు -
మలుపుల వద్ద హెచ్చరిక బోర్డుల ఏర్పాటు
అక్కన్నపేట(హుస్నాబాద్): అక్కన్నపేట మండలం కేంద్రంలోని విద్యుత్ సబ్స్టేషన్ సమీపంలోని మూలమలుపుల వద్ద మంగళవారం ఎస్ఐ చాతరాజు ప్రశాంత్ ఆధ్వర్యంలో ప్రమాద హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిత్యం వాహనదారుల రాకపోకలతో రద్దీగా ఉండే ఈ మూలమలుపుల వద్ద హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశామన్నారు. గతంలో ఈ మూలమలుపు వద్ద సూచిక బోర్డులు లేకపోవడంతో ప్రమాదాలు జరిగేవని, వాహనదారులకు కనిపించేలా సూచిక బోర్డులను ఏర్పాటు చేశామని చెప్పారు. వాహనదారులు తప్పనిసరిగా రోడ్డు నిబంధనలు పాటించాలని సూచించారు. కార్యక్రమంలో పోలీసులు సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు. -
18న జాబ్మేళా
రామాయంపేట(మెదక్): స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈ నెల 18న జాబ్మేళా నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ హిమజ్యోతి తెలిపారు. మంగళవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. ఎంఎస్ఎన్ కెమికల్ పరిశ్రమలో ఉద్యోగాల కోసం జాబ్మేళా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇంటర్లో బైపీసీ, ఎంపీసీ, ఒకేషనల్ కోర్సు పూర్తి చేసిన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కళాశాలలో ఉదయం పది నుంచి మధ్నాహం మూడు వరకు ఇంటర్వ్యూలు కొనసాగుతాయని, హాజరమ్యే విద్యార్థులు తమ ఒరిజనల్ సర్టిఫికెట్లతో రావాలని ప్రిన్సిపాల్ తెలిపారు. 17 నుంచి 21 ఏళ్ల లోపు వయస్సు గల విద్యార్థులు ఇందుకు అర్హులని స్పష్టం చేశారు. నంగునూరు(సిద్దిపేట): పాలమాకుల వేంకటేశ్వరాలయం 14వ వార్షికోత్సం మంగళవారం వేడుకగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్సవ విగ్రహాలను ఊరేగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం విశ్వక్సేనారాధన, అభిషేకం, గరుడపూజ, ప్రసాద వితరణ నిర్వహించారు. అనంతరం పద్మావతీ సమేత వేంకటేశ్వర కల్యాణం కనులపండువగా నిర్వహించారు. గరుడపూజ నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేసి అన్న సంతర్పణ నిర్వహించారు. -
స్ఫూర్తి ప్రదాతకు నివాళి
నర్సాపూర్: ప్రతిజ్ఞ చేస్తున్న కాంగ్రెస్ నాయకులు రామాయంపేట మున్సిపల్ కార్యాలయంలో.. చేగుంట: అంబేడ్కర్కు నివాళులర్పిస్తున్న నాయకులు పాపన్నపేట: అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన హన్మంత్ రావు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకొని మంగళవారం ఆయన చిత్రపటాలకు, విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. పలువురు మాట్లాడుతూ.. ప్రపంచానికే దిక్సూచి లాంటి రాజ్యాంగాన్ని రచించారని కొనియాడారు. యువత ఆయన చూపిన బాటలో నడిచి, దేశ ఔన్నత్యాన్ని చాటాలని పిలుపునిచ్చారు. పలు చోట్ల బైక్ ర్యాలీలు నిర్వహించారు. కౌడిపల్లిః సలాబత్పూర్లో అంబేడ్కర్ విగ్రహం ఆవిష్కరణ అల్లాదుర్గం: బహిరన్దిబ్బలో రేగోడ్: నివాళులర్పిస్తున్న పీసీసీ సభ్యుడు కిషన్ తదితరులు కొల్చారంలో అంబేద్కర్ జయంతి వేడుకలు మెదక్ కలెక్టరేట్: దళిత సంఘాల ఆధ్వర్యంలో మెదక్లో భారీ ర్యాలీ మెదక్ కలెక్టరేట్: బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో.. మెదక్ కలెక్టరేట్: బీజేపీ జిల్లా కార్యాలయంలో.. -
అవగాహనతోనే రోడ్డు ప్రమాదాల నివారణ
వెల్దుర్తి(తూప్రాన్): రోడ్డు ప్రమాదాలు జరగకుండా ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలని తూప్రాన్ డీఎస్పీ నరేందర్గౌడ్ అన్నారు. మంగళవారం మండల పరిధి శేరీల గ్రామంలో పర్యటించిన శ్రీఅలైవ్..అరైవ్శ్రీ కార్యక్రమంలో భాగంగా రోడ్డు భద్రత నియమాలపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా నిబంధనలు పాటిస్తామంటూ గ్రామస్తులచే ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రతి వాహనదారుడు సామాజిక బాధ్యతగా రోడ్డు భద్రత నియమాలు పాటించాలని సూచించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ పెట్టుకోవాలని, కార్లలో తప్పనిసరిగా సీట్బెల్ట్ పెట్టుకోవాలన్నారు. మైనర్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ వాహనాలు ఇవ్వొద్దని చెప్పారు. కార్యక్రమంలో సర్పంచ్ లావణ్య, తూప్రాన్ సీఐ రంగా కృష్ణ, ఎస్ఐ రాజు, పలువురు నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. వాహనదారులు జాగ్రత్తలు పాటించాలి కౌడిపల్లి(నర్సాపూర్): వాహనదారులు జాగ్రత్తలు పాటించాలని ఎస్ఐ అమరేందర్రెడ్డి తెలిపారు. మంగళవారం మండలంలోని సలాబత్పూర్లో గ్రామస్తులకు అరైవ్, అలైవ్ కార్యక్రమంలో భాగంగా రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని చెప్పారు. మద్యం సేవించి వాహనాలు నడపొద్దని.. మైనర్లు డ్రైవింగ్ చేయొద్దని సూచించారు. అనంతరం గ్రామస్తులతో ప్రతిజ్ఞ చేయించారు. బ్లాక్ స్పాట్లను గుర్తించి చర్యలు చిన్నశంకరంపేట(మెదక్): నార్సింగి జాతీయ రహదారిపై ప్రమాద బ్లాక్ స్పాట్లను గుర్తించి ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టారు. మంగళవారం నార్సింగి ఎస్ఐ సృజన, జీఎంఆర్, ఎన్హెచ్ఏఐ సంస్థ ప్రతినిధులతో కలిసి జాతీయ రహదారిపై తరుచుగా ప్రమాదాలు జరుగుతున్న ప్రదేశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా నార్సింగి 44వ నంబర్ జాతీయ రహదారిపై ప్రధానంగా వల్లూర్ యూటర్న్, కామారం యూటర్న్, వల్లాభాపూర్ యూటర్న్, ఖాస్లాపూర్ యూటర్న్లను గుర్తించారు. ఈ ప్రదేశంలో జీబ్రాక్రాసింగ్లు, సోలార్ బ్లింకర్లు, రంబుల్ స్ట్రిప్లు, సూచిక బోర్డుల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా ఈ ప్రదేశాల్లో సర్వీస్ రోడ్డు నిర్మాణం గురించి ఎన్హెచ్ఏఐ, జీఎంఆర్ సంస్థ అధికారులు చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. డీఎస్పీ నరేందర్గౌడ్ -
మందుబాబులకు అడ్డాగా ఓపెన్ జిమ్
● పగిలిన మద్యం బాటిళ్లు ● గాజు పెంకులు గుచ్చుకుని గాయపడిన చిన్నారి చేర్యాల(సిద్దిపేట): పట్టణ పరిధిలోని పెద్దచెరువు కట్టపై ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ మందుబాబులకు అడ్డా మారింది. స్థానికులు ప్రతిరోజు వాకింగ్ అనంతరం జిమ్ చేసేందుకు వీలుగా అధికారులు కట్టపై ఈ జిమ్ ఏర్పాటు చేశారు. కానీ అది కాస్తా అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారింది. జిమ్ ప్రాంతంలో కొందరు గుర్తుతెలియని వ్యక్తులు మద్యం తాగి ఆ బాటిళ్లను పగులగొట్టి పోయారు. ఇది గమనించని ఓ చిన్నారికి గుచ్చుకోవడంతో కాలికి గాయమైన ఘటన సోమవారం చోటు చేసుకుంది. ఇప్పటికై నా దీనిపై మున్సిపల్ అధికారులు, పోలీసులు స్పందించి మందుబాబుల ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని వాకర్స్ కోరుతున్నారు.. -
ఆ ఇద్దరు మావోలు ఎక్కడ?
సాక్షి, సిద్దిపేట: తెలంగాణ ఉద్యమం.. మావోయిస్టు ఉద్యమాల్లో మెతుకుసీమది కీలకపాత్ర. నక్సల్స్, పీపుల్స్వార్, జనశక్తి, మావోయిస్టు ఉద్యమాలతో సిద్దిపేట, దుబ్బాక, హుస్నాబాద్, చేర్యాల ప్రాంతాలకు విడదీయరాని బంధం ఉంది. దుబ్బాక, నర్సాపూర్, గిరాయిపల్లి, ఇందుప్రియాల్, భూపతి, పద్మక్క దళాలుగా ఇక్కడ పీపుల్స్వార్ పనిచేసింది. అదే విధంగా కూడవెల్లి, మంజీర దళాలతో జనశక్తి సైతం కొనసాగింది. డీజీపీ ఇటీవల ప్రకటించిన వారిలో రాష్ట్రానికి చెందిన ఐదుగురు మావోయిస్టులు మాత్రమే ఉన్నారని ప్రకటించారు. అందులో ప్రకటించిన రూపీ ఎన్కౌంటర్లో మృతిచెందారు. డీజీపీ ప్రకటించని మరో ఇద్దరు ఎక్కడ ఉన్నారోనని కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.కానరాని అరుణ, స్వరూపజిల్లా నుంచి ముగ్గురు మావోయిస్టులు ఉండగా అందులో ఒకరు మిరుదొడ్డి మండలం ధర్మారానికి చెందిన భాగ్య అలియాస్ రూపీ ఛత్తీస్గఢ్ మాచపల్లి అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో సోమవారం మృతి చెందినట్లు అక్కడి పోలీసులు ప్రకటించారు. పోలీసుల లెక్కల ప్రకారం ఎవరు అజ్ఞాతంలో లేనట్లే. అరుణ, స్వరూపలు అజ్ఞాతంలోకి వెళ్లి 25 ఏళ్లు దాటిపోయింది. అక్కన్నపేట మండల కేంద్రానికి చెందిన కాశబోయిన స్వరూప 25ఏళ్ల క్రితం అజ్ఞాతంలోకి వెళ్లారు. దండకారణ్యం సభ్యురాలిగా ఉన్న ఆమైపె రూ.3లక్షల వరకు రివార్డు ఉన్నట్లు గతంలో పోలీసులు పేర్కొన్నారు. తన చిన్ననాడే తల్లిదండ్రులు చనిపోతే నానమ్మ, తాత వద్ద పెరిగారు. పదో తరగతి చదువుతున్నప్పుడే ఉద్యమానికి ఆకర్షితురాలై అడవి బాట పట్టారు. ఆమె నానమ్మ, తాత చనిపోగా గ్రామస్తులే చందాలు వేసి అంత్యక్రియలు చేశారు. ప్రస్తుతం తనకు చెల్లె మాత్రమే ఉంది. ఇక నంగునూరు మండల కేంద్రానికి చెందిన రంగు అరుణ అలియాస్ పద్మక్క 20 ఏళ్లుగా మావోయిస్టుల్లో ఉన్నారు. ఛత్తీస్గఢ్లోని దండకారణ్యం స్పెషల్ జోన్ కమిటీలో యాక్షన్ టీం మెంబర్గా ఉన్న పద్మక్కపై రూ.3లక్షల రివార్డు ఉన్నట్లు అప్పట్లో పోలీసులు పేర్కొన్నారు. ఎక్కడ ఉందో ఎలా ఉందో ఇప్పటివరకు ఎలాంటి సమాచారం లేదని వారి కుటుంబ సభ్యులు చెబుతున్నారు.లొంగిపోయారా..? లేదా? అక్కన్నపేటకు చెందిన కాశబోయిన స్వరూప, నంగునూరుకు చెందిన రంగు అరుణల ఆచూకీ తెలియరావడం లేదు. పోలీసులు సైతం వీరి గురించి స్పష్టంగా చెప్పడం లేదు. వీరు అజ్ఞాతంలోనే ఉన్నారా? ఉంటే ఎక్కడ? లేక లొంగిపోయారా?.. లొంగిపోతే ఎక్కడ జీవనం గడుపుతున్నారు? లేకపోతే ఎప్పుడైనా ఎన్కౌంటర్లో తమ ప్రాణాలు కోల్పోయారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వీరి కుటుంబ సభ్యులకు కూడా ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం లేదు. అయితే తమ బిడ్డలు క్షేమంగా ఉన్నారా?.. లేదా? అనే ఆవేదనతో ఉన్నారు. -
ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి
డీటీఓ వెంకటస్వామి మెదక్ కలెక్టరేట్: ప్రతి ఒక్కరూ రోడ్డు నిబంధనలు పాటించడంతోనే ప్రమాదాలను నివారించవచ్చునని డీటీఓ వెంకటస్వామి అన్నారు. శనివారం మెదక్ ఆర్టీసీ డిపో మేనేజర్ సురేఖ ఆధ్వర్యంలో బస్సు డిపో నుంచి పట్టణంలోని హెడ్ పోస్టాఫీస్ వరకు రోడ్డు భద్రతా అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈసందర్భంగా డీటీఓ మాట్లాడుతూ.. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, కారులో ప్రయాణించే వారు సీట్ బెల్ట్ వినియోగించుకోవాలని సూచించారు. అదేవిధంగా ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను కచ్చితంగా పాటించాల్సిన అవసరాన్ని వివరించారు. బస్సు కదులుతున్న సమయంలో ఎక్కడం, దిగడం చేయకూడదని హెచ్చరించారు. అలాగే ప్రజలు ఆర్టీసీ సేవలను వినియోగించుకొని సంస్థను ఆదరించా లని కోరారు. అనంతరం రోడ్డు నిబంధనలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో మెదక్ ఆర్టీసీ డీఎం సురేఖ, ఎంఆర్కేరావు, అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ వీరబాబు, మెకానికల్ ఫోర్మెన్ సుగు ణాకర్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. -
రోడ్డు భద్రతా నియమాలు తప్పనిసరి
కలెక్టర్ ప్రతిమాసింగ్ నిజాంపేట(మెదక్): ‘ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక’లో భాగంగా జిల్లాలోని అన్ని గ్రామాల్లో ‘అరైవ్– అలైవ్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈమేరకు సోమవారం మండల పరిధిలోని నందగోకుల్లో నిర్వహించిన గ్రామసభలో ‘నో హెల్మెట్.. నో ఎంట్రీ’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ముఖ్య అతిథిగా కలెక్టర్ ప్రతిమాసింగ్, ఎస్పీ శ్రీనివాసరావు హాజరయ్యారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజలందరూ నందగోకుల్ గ్రామా న్ని ఆదర్శంగా తీసుకొని, నో హెల్మెట్– నో ఎంట్రీ కార్యక్రమన్ని చేపట్టాలని సూచించారు. ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన వ్యక్తి క్షేమంగా ఇంటికి తిరిగి రావాలంటే ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నియమాలు తప్పనిసరిగా పాటించాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణలో ప్రతి ఒక్కరి పాత్ర అత్యంత కీలకమన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మద్యం సేవించి వాహనం నడపకూడదని సూచించారు. ఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. జిల్లాలో హత్యలు, అత్యాచారాలు 30 జరిగితే.. రోడ్డు ప్రమాదాల ద్వారా 350 మరణాలు జరిగాయని అందోళన వ్యక్తం చేశాడు. రోడ్డు భద్రత నియమాలు పాటించకపోవడం, మద్యం సేవించి వాహనాలు నడపడం, సీటు బెల్టు పెట్టుకోకపోవడం తదితర కారణాల వల్ల చాలా మంది మృత్యువాత పడుతూ కుటుంబాలకు దూరమవుతున్నారని తెలిపారు. అనంతరం రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో డీఎస్పీ నరేందర్గౌడ్, తహసీల్దార్ శ్రీనివాస్, మండల ప్రత్యేక అధికారి దేవకుమార్, మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు పాతూరు భానుప్రసాద్రెడ్డి, ఎంపీడీఓ రాజిరెడ్డి, సీఐ వెంకటరాజాగౌడ్, పోలీస్ యంత్రాంగం తదితరులు పాల్గొన్నారు. -
పనుల్లో వేగం పెంచండి
● మంత్రి దామోదర రాజనర్సింహ ● సింగూరు మరమ్మతు పనుల పరిశీలన పుల్కల్(అందోల్): సింగూర్ ప్రాజెక్టు మరమ్మతు పనుల్లో వేగం పెంచాలని మంత్రి దామోదర రాజనర్సింహ ఇంజనీర్లను ఆదేశించారు. మండలంలోని సింగూర్ ప్రాజెక్టు మరమ్మతు పనులను సోమవారం నేషనల్ డ్యామ్ అధికారులతో కలిసి పరిశీలించారు. పనుల్లో జాప్యంపై అధికారుల నుంచి వివరణ తీసుకున్నారు. డ్యాం కట్ట రివిట్మెంట్ను, కాలువ సిమెంట్ లైనింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్లకు సూచించారు. అతిథిగృహంలో అధికారులతో ఇంజనీర్లతో జరుగుతున్న పనులపై సమీక్షించారు. ప్రస్తుతం డ్యామ్లో ఏడు టీఎంసీల నీళ్లు ఉండటంతో పనుల్లో ఆలస్యమవుతుందని అధికారులు, ఇసుక సమస్య ఉందని, కేటాయించిన క్వారీల్లో ఇసుక తక్కువగా ఉందని కాంట్రాక్టర్లు మంత్రి దృష్టికి తెచ్చారు. డ్యామ్లో నీళ్లు తగ్గుతున్న కొద్దీ పనుల్లో వేగం పెంచుతామని అధికారులు మంత్రికి వివరించారు. ఇసుక సమస్యలు పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని డీఆర్ఓ పాండుకు మంత్రి సూచించారు. నీటి పారుదల శాఖ ఎస్సీ కలిసి సింగూర్ ప్రాజెక్టు కట్ట పనులను, కాల్వ పనులను, సిమెంట్ లైనింగ్ను పరిశీలించారు. మరమ్మతు పనులు త్వరగా పూర్తి చేసి సాగు,తాగు నీటికి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సాగు, తాగుకు బసపూరం శివారులో నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ను మంత్రి పరిశీలించారు. కార్యక్రమంలో నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు దుర్గారెడ్డి, రామచంద్రారెడ్డి, లక్ష్మారెడ్డి, మంత్రి పీఏ హనుమంతుతోపాటు తదితరులు పాల్గొన్నారు. -
ఆధునిక వ్యవసాయం
బ్యాటరీ/మ్యాన్వల్ స్పైయర్లు 14, బుష్ కట్టర్ 31, కేజ్వీల్స్ 2, కల్టివేటర్స్ 112, డ్రోన్స్ 6, ఎంబీ ప్లవ్స్ 3, పవర్ స్పైయర్స్ 133, పవర్ టిల్లర్స్ 8, పవర్ వీడర్స్ 8, రోటోపుడ్లర్ 1, రోటోవేటర్స్ 50, స్ట్రా బెలర్ 54 కలిపి మొత్తం 422 యంత్రాలను రైతులకు అందజేశారు.మెదక్ కలెక్టరేట్: రోజు రోజుకు పెరుగుతున్న కూలీల కొరత, సాంకేతికత నేపథ్యంలో జిల్లాలోని రైతులు యాంత్రీకరణ వ్యవసాయం వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రభుత్వం సైతం ప్రోత్సహిస్తూ సబ్సిడీ యంత్రాలు అందజేస్తుంది. ఇందులో భాగంగా ఈ ఆర్థిక సంవత్సరం జిల్లాలోని 422 మంది రైతులకు రూ.1.80 కోట్ల విలువైన యంత్రాలను అందజేసింది. ప్రస్తుతం ‘ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక’లో భాగంగా రైతులను యాంత్రీకరణ వైపు మళ్లించేందుకు చైతన్య కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వ్యవసాయ అధికారులు తెలిపారు. నర్సాపూర్లో అత్యధికంగా.. జిల్లాలో మొత్తం 21 మండలాలు ఉండగా, నర్సాపూర్ మండలం నుంచి అత్యధికంగా 103 మంది రైతులు యంత్రాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. మెదక్ మండలం మొత్తం మీద ఒకే ఒక్క దరఖాస్తు రావడం గమనార్హం. కాగా రైతులను యాంత్రీకరణ వైపు ప్రోత్సహించడంలో భాగంగా ప్రభుత్వం అన్నివర్గాల రైతులకు సబ్సిడీ అందజేస్తుంది. అయితే ఇందులో ఎస్సీ, ఎస్టీ, మహిళా రైతులకు 50 శాతం, ఓసీ, పెద్ద రైతులకు 40 శాతం రాయితీపై యంత్రాలు అందజేస్తుంది. జిల్లాలోని 21 మండలాల నుంచి 422 మంది రైతులు వివిధ రకాల యంత్రాల కోసం దరఖాస్తు చేసుకోగా, వారికి రూ.1.80 కోట్ల విలువైన యంత్రాలను అందజేసింది. యాంత్రీకరణ వైపు రైతులు అవగాహన కల్పిస్తున్నాం పెరుగుతున్న సాంకేతికతతో పాటు రైతులంతా యాంత్రీకరణ ద్వారా అత్యధికంగా పంటలు పండించేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. మండల వ్యవసాయ, ఇతర అధికారుల ద్వారా ఎప్పటికప్పుడు రైతులతో సమావేశాలు నిర్వహించి ప్రోత్సహిస్తున్నాం. యంత్రాల కోసం దరఖాస్తు చేసుకున్న రైతులందరికీ సబ్సిడీపై అందజేస్తాం. – దేవ్కుమార్, డీఏఓ -
19న ‘మోడల్’ ప్రవేశ పరీక్ష
నర్సాపూర్ రూరల్: ఈనెల 19వ తేదీన మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్ష ఉంటుందని ప్రిన్సిపాల్ ఫర్హాన సోమవారం తెలిపారు. ఉదయం 10 నుంచి 12 గంటల వరకు 6వ తరగతిలో చేరే విద్యార్థులకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు 7, 8, 9, 10వ తరగతిలో చేరే విద్యార్థులకు ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు. ముందుగా దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు అన్లైన్లో హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలన్నారు. హాల్టికెట్లతో పాటు బాల్పెన్, పరీక్ష ప్యాడ్లతో 30 నిమిషాల ముందు పరీక్షకు హాజరుకావాలని సూచించారు. 26 నుంచి జనగణన మెదక్ కలెక్టరేట్: ఈనెల 26 నుంచి మే 10వ తేదీ వరకు జిల్లాలో నిర్వహించనున్న జనగణన కోసం ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్ల నియామకం పూర్తి చేసినట్లు కలెక్టర్ ప్రతిమాసింగ్ తెలిపారు. సోమవారం హైదరాబాద్ నుంచి కులగణన అధికారికి భారతి హోళికేరి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈనెల 26 నుంచి చేపట్టనున్న జన గణనపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు విస్తృత ప్రచార కార్యక్రమాలు చేపడతామన్నారు. జనగణన కోసం 1,406 మంది ఎన్యుమరేటర్లు, 248 మంది సూపర్ వైజర్లను నియమించామన్నారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని వివరించారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు రామాయంపేట(మెదక్): విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని డీఎంహెచ్ఓ శ్రీరామ్ హెచ్చరించారు. సోమ వారం మండలంలోని ప్రగతి ధర్మారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి రోగులతో మాట్లాడారు. ఈసందర్భంగా రికార్డులు పరిశీలించారు. వైద్య సిబ్బంది రోగుల పట్ల సత్ప్రవర్తన కలిగి ఉండాలని ఆదేశించారు. ఆయన వెంట ఆస్పత్రి వైద్యురాలు వైష్ణవి, ఇతర సిబ్బంది వెంట ఉన్నారు. ముగిసిన ‘పది’ పరీక్షలుమెదక్ కలెక్టరేట్: జిల్లాలో పదో తరగతి పరీక్షలు సోమవారంతో ముగిశాయి. జిల్లాలో మొత్తం 11,247 మంది విద్యార్థులకు గానూ 11,227 మంది హాజరు కాగా, మరో 20 మంది గైర్హాజరయ్యారు. దీంతో విద్యార్థుల హాజరు శాతం 99.82 శాతం నమోదైంది. జిల్లాలోని నర్సాపూ ర్, శివ్వంపేట మండలాల్లోని పలు పరీక్ష కేంద్రాలను డీఈఓ విజయ సందర్శించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వసతులు కల్పించినట్లు చెప్పారు. ఈనెల 15వ ఒకేషనల్కు సంబంధించి పరీక్ష ఉంటుందని తెలిపారు. సింగూరు నీటితో రైతులకు ఊరట నర్సాపూర్: సింగూరు నుంచి నీరు విడుదల చేయడంతో నియోజకవర్గంలోని రైతులకు ఎంతో ఊరట లభిస్తుందని ఎమ్మెల్యే సునీతారెడ్డి అన్నారు. సోమవారం రాత్రి సింగూరు నుంచి నీరు విడుదల చేసేందుకు సంబంధిత అధికారులు ఉత్తర్వులు జారీ చేసిన సందర్భంగా ఆమె మాట్లాడారు. ఘనపూర్ ఆనకట్టకు నీరు విడుదల చేయడానికి సహకరించిన వారందరికీ ఆమె ధన్యవాదాలు తెలిపారు. కాగా సింగూరు నుంచి నీటి విడుదల ప్రక్రియను రైతులు సాధించిన గొప్ప విజయంగా ఆమె అభివర్ణించారు. కాగా భవిష్యత్తులో రైతుల సంక్షేమం, వారి అవసరాలను తీర్చేందుకు తాను కట్టుబడి ఉంటానని హామీ ఇచ్చారు. కొనసాగుతున్న ఆర్టిజన్ల సమ్మె మెదక్ కలెక్టరేట్: సమస్యల పరిష్కారం కోసం జిల్లా విద్యుత్ కార్యాలయం ఎదుట ఆర్టిజన్లు చేపట్టిన సమ్మె సోమవారం 6వ రోజుకు చేరుకుంది. శిబిరాన్ని మెదక్ మాజీ ఎమ్మెల్యే శశిధర్రెడ్డి సందర్శించి కార్మికులకు సంఘీభా వం తెలిపారు. ఈసందర్భంగా ఆయన మాట్లా డుతూ.. ఆర్టిజెన్ కార్మికుల సమస్యలను ప్రభుత్వం, యాజమాన్యాలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఆరు రోజులుగా సమ్మె కొనసాగుతున్నప్పటికీ పట్టించుకోకపోవడం సరికాదన్నారు. -
మహిళలు రాజకీయాల్లోకి రావాలి
● మెదక్ ఎంపీ రఘునందన్రావు ● నారీ శక్తి వందన్ ర్యాలీలో పాల్గొన్న ఎంపీ సిద్దిపేటకమాన్: మహిళలు రాజకీయాల్లోకి రావాలని మెదక్ ఎంపీ రఘునందన్రావు అన్నారు. మహిళ అంటే ఒక శక్తి అని మీ నుంచే ఎంపీలు, ఎమ్మెల్యేలు కావాలన్నారు. సిద్దిపేట పట్టణంలో సోమవారం నిర్వహించిన నారీ శక్తి వందన్ ర్యాలీలో ఎంపీ పాల్గొన్నారు. పట్టణంలోని హైస్కూల్ నుంచి అంబేడ్కర్ చౌరస్తా వరకు నిర్వహించిన ర్యాలీలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మోడ్రన్ బస్టాండ్ చౌరస్తాలో ఎంపీ మాట్లాడుతూ.. సోనియా గాంధీ యూపీఏ చైర్మన్గా ఉన్నప్పటికీ మహిళా బిల్లు పాస్ చేయకపోవడం దురదృష్టకరమన్నారు. సీఎం రేవంత్రెడ్డిని సినిమా వాళ్లు కూడా గుర్తుపట్టడం లేదన్నారు. దేశంలో మహిళా ఎంపీల శాతం 15కంటే తక్కువగా ఉండటం బాధాకరమని అన్నారు. జమ్మూకాశ్మీర్లో ఉగ్రవాదులు దాడి చేసిన ఘటనపై ఆపరేషన్ సింధూరు విజయవంతంగా నిర్వహించింది కూడా ఒక మహిళేనని అన్నారు. 75సంవత్సరాల నుంచి మహిళలకు సరైన గౌరవం దక్కడం లేదని మహిళలకు ప్రధాని మోదీ పెద్దపీట వేస్తున్నారన్నారు. సునీతావిలియమ్స్ అంతరిక్షంలోకి వెళ్లివచ్చారన్నారు. ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ను గెలిచింది కూడా నిజామాబాద్ ఆడబిడ్డనే అన్నారు. దేశ ప్రథమ పౌరురాలు కూడా గిరిజన బిడ్డ అయిన ద్రౌపదిముర్ము అని చెప్పుకొచ్చారు. సుప్రీంకోర్టులో 32మంది న్యాయమూర్తులు ఉంటే ముగ్గురు మహిళా న్యాయమూర్తులు ఉన్నారన్నారు. హైదరాబాద్ మాజీ మేయర్ కార్తీకరెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని అన్నారు. -
సమస్యలతో సహవాసం
● నర్సింగ్ హాస్టల్లో సౌకర్యాలు నిల్ ● పట్టించుకోని అధికారులు ● ఆందోళనలో విద్యార్థినులు మెదక్జోన్: నర్సింగ్ విద్యార్థినులు ఏడాదిన్నరగా సమస్యలతో సతమతం అవుతున్నారు. 120 మంది ఉన్న ఆ వసతి గృహంలో కేవలం ఒకే ఒక్క మరుగుదొడ్డి ఉంది. దీంతో విద్యార్థినుల బాధ వర్ణణాతీతం. మెయింటెనెన్స్ పేరుతో ప్రిన్సిపాల్ నెలనెలా డబ్బులు వసూలు చేస్తున్నారని, అయినా కనీస సౌకర్యాలు కల్పించడం లేదని ఆవేదన చెందుతున్నారు. 120 మందికి ఒకే టాయిలెట్ జిల్లాకు ఏడాదిన్నర క్రితం మెడికల్తో పాటు నర్సింగ్ కళాశాల మంజూరు చేశారు. 120 మంది నర్సింగ్ విద్యార్థినుల కోసం పట్టణ పరిధిలోని పిల్లికొటాల్ సమీపంలో ఓ ప్రైవేట్ భవనాన్ని అద్దెకు తీసుకొని హాస్టల్ కొనసాగిస్తున్నారు. అయితే అందులో ఒకే ఒక్క టాయిలెట్ మాత్రమే ప్రస్తుతం అందుబాటులో ఉందని, మిగితావి పనిచేయటం లేదని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒంటికి.. రెంటికి వస్తే ఆ బాధ నరకమంటున్నారు. బెడ్లు సైతం సరిపడా లేకపోవడంతో ఒక్కోదానిపై ఇద్దరు, ముగ్గరు నిద్రపోవాల్సిన పరిస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భోజన ఫీజుతో పాటు మెయింటెనెన్స్ పేరుతో నెలనెలా డబ్బులు వసూలు చేస్తున్నారని, భోజనం సైతం సరిగా ఉండటం లేదని, పురుగులు పట్టిన కూరగాయలు, దొడ్డు బియ్యంతో భోజనం పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం ప్రిన్సిపాల్ దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు.మురికి కూపం.. వసతి గృహంలో డ్రైనేజీ పైపులైన్లు బ్లాక్ అయ్యాయి. వసతిగృహం ముందు నుంచే నీరంతా ప్రవహిస్తుండటంతో ఆ హాస్టల్ మురికి కూపంగా మారి దుర్గంధం వెదజల్లుతోంది. లోని కి వెళ్లాలంటే ముక్కు మూసుకొని వెళ్లాల్సిన పరిస్థితి. దీంతో ఈగలు, దోమలకు నిలయంగా మారి వ్యాధులు భారిన పడాల్సిన పరిస్థితి నెలకొందని విద్యార్థినులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏడాదిన్నరగా కనీస సౌకర్యాలు లేవని, ప్రిన్సిపాల్తో పాటు జిల్లాస్థాయి అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని విద్యార్థినులు ఇటీవల కలెక్టరేట్లో ఆందోళనకు దిగారు. -
నిర్లక్ష్యం వీడితే.. ప్రాణాలు పదిలం
అదనపు కలెక్టర్ నగేశ్ టేక్మాల్(మెదక్): వాహనదారులు నిర్లక్ష్యం వీడితే రోడ్డు ప్రమాదాలను అరికట్టవచ్చని అదనపు కలెక్టర్ నగేశ్ తెలిపారు. సోమవారం మండలంలోని బొడ్మట్పల్లిలో ‘అలైవ్– అరైవ్’ కార్యక్రమం నిర్వ హించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, కారు నడిపే వారు సీటుబెల్టు పెట్టుకోవాలని పలు ఉదాహరణలతో వివరించారు. అతివేగం ప్రమాదకరమని, మద్యం సేవించే ఏ వాహనాన్ని నడపరాదన్నారు. వాహనదారులు చేసే అశ్రద్ధతో ప్రమాదాలు జరిగి కుటుంబాలు రోడ్డున పడే దుస్థితి తెచ్చుకోవద్దన్నారు. ప్రతి ఒక్కరూ రోడ్డు నిబంధనలు పాటించాలని సూచించారు. సమావేశం అనంతరం గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో తహసీల్దార్ తులసీరాం, సర్పంచ్ అవినాశ్కుమార్, ఉపసర్పంచ్ మాధవి, ఆర్ఐ సాయిశ్రీకాంత్, వార్డు సభ్యులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
రోడ్ల అభివృద్ధికి రూ.300 కోట్లు
మంత్రి వివేక్ పటాన్చెరు: పటాన్చెరులో రోడ్ల అభివృద్దికి రూ.300 కోట్ల నిధులు మంజూరు చేశామని మంత్రి వివేక్ తెలిపారు. పటాన్చెరులో ఆదివారం జరిగిన మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. అన్ని విధాలుగా జిల్లా అభివృద్ధికి సహకరిస్తామని హామీనిచ్చారు.రైతులను ఆదుకోండి ఎమ్మెల్యే సునీతారెడ్డి నర్సాపూర్: సింగూరు ప్రాజెక్టు నుంచి నీటి విడుదలలో తలెత్తిన అనిశ్చితిని తొలగించి రైతులను ఆదుకోవాలని ఎమ్మెల్యే సునీతారెడ్డి ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డికి ఆదివారం లేఖ రాశారు. సింగూరు నుంచి నీరు విడుదల చేసినట్లు సమాచారం ఉన్నప్పటికీ, మంజీరా డ్యాం అధికారులకు సరైన ఆదేశాలు లేనందున క్షేత్రస్థాయిలో నీటి విడుదల జరగలేదన్నారు. ఈ విషయాన్ని గతంలో మంత్రి దృష్టికి తీసుకెళ్లడంతో పాటు అసెంబ్లీలో సైతం ప్రస్తావించానని గుర్తు చేశారు. మంత్రి మౌఖిక ఆదేశాల ఇచ్చినా, అధికారుల మధ్య సమన్వయ లోపంతో రైతులకు సాగు నీరు అందక నష్టం జరుగుతుందని వివరించారు. ఇప్పటికే 30 శాతం పంటలు ఎండిపోయాయని ఆమె విచారం వ్యక్తం చేశారు. ఘనపూర్ ఆనకట్టకు నీటిని విడుదల చేయకపోతే సుమారు 60 వేల ఎకరాల్లోని వరి పంట ఎండిపోయే ప్రమాదం ఉందన్నారు. తక్షణమే 0.3 టీఎంసీల నీటిని విడుదల చేసేందుకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని మంత్రిని కోరారు. అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు నర్సాపూర్: బియ్యం పంపిణీలో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని అదనపు కలెక్టర్ నగేశ్ హెచ్చరించారు. ఆదివారం ఆయన పట్టణంలోని రేషన్ దుకాణాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి మాట్లాడారు. రేషన్కార్డుదారులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా బియ్యం పంపిణీ చేయాలని ఆదేశించారు. పీడీఎస్ బియ్యంలో అక్రమాలు జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. డీలర్లు సమయపాలన పాటించాలని సూచించారు. ఈనెల 30 వరకు బియ్యం పంపిణీ చేస్తారని, లబ్ధిదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అసమానతలకు వ్యతిరేకంగా పోరాటం మెదక్ కలెక్టరేట్: సామాజిక అసమానతలకు వ్యతిరేకంగా పోరాడాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు అడివయ్య పిలుపునిచ్చారు. ఆదివారం పట్టణంలోని కేవల్ కిషన్ భవన్లో ‘రాజ్యాంగ పరిరక్షణ– సవాళ్లు’ అనే అంశంపై పార్టీ జిల్లా కార్యదర్శి నర్సమ్మ అధ్యక్షతన సెమినార్ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అడివయ్య హాజరై మాట్లాడారు. సమాఖ్య వ్యవస్థను మోదీ ప్రభుత్వం ధ్వంసం చేస్తోందని ఆరోపించారు. ప్రజలంతా రాజ్యాంగ పరిరక్షణకు ముందుకు రావాలని కోరారు. దేశంలో అసమానతలు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పేదల సంపదను సంపన్నులకు కట్టబెట్టుతున్నారని ఆరోపించారు. సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు మల్లేశం, జిల్లా కమిటీ సభ్యులు సంతోశ్ కుమార్, నాయకులు యశోద, కవిత, యాదగిరి, దుర్గ, స్వరూప, చంద్రం, కిష్టయ్య, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు -
ప్రథమ ఇంటర్లో 28, ద్వితీయంలో 26వ స్థానం
● ఫలితాల్లో బాలికలదే పైచేయి ● ఒకేషనల్ ఫస్ట్ ఇయర్లో రాష్ట్రంలోనే టాప్ ఇంటర్ ఫలితాలు ఈసారి కాస్త ఊరటనిచ్చినా.. రాష్ట్రవ్యాప్తంగా చూస్తే జిల్లా 26వ స్థానానికే పరిమితమైంది. ఈసారి సెకండ్ ఇయర్లో 68.59 శాతం ఫలితాలు సాధించింది. బాలికలు 75.34 శాతం ఉత్తీర్ణత సాధించి ముందుండగా, బాలురు 58.9 శాతంతో వెనుకబడ్డారు. అయితే ఇంటర్ ఫస్ట్ ఇయర్లో మాత్రం 55.27 శాతంతో 28వ స్థానంలో నిలిచింది. కాగా ఒకేషనల్ ఫస్ట్ ఇయర్లో 73.46 శాతంతో జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలవడం విశేషం. 70 శాతం సింగిల్ సబ్జెక్ట్లో ఫెయిల్ కావడం గమనార్హం. కాగా మెదక్ ప్రభుత్వ జూనియర్ కళాశాలకు చెందిన డి.శివసాయి 984 మార్కులు సాధించి జిల్లా టాపర్గా నిలిచారు. – మెదక్ అర్బన్ జిల్లావ్యాప్తంగా 58 ఇంటర్ కళాశాలలు ఉండగా, వాటిలో 16 ప్రభుత్వ, మిగిలినవి ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి. ఈ ఏడాది సెకండ్ ఇయర్ జనరల్ విభాగంలో 4,826 మంది పరీక్షలు రాయగా, 3,310 మంది ఉత్తీర్ణత సాధించారు. ఇందులో బాలురు 1,983 మందికి గాను 1,168 మంది పాసయ్యారు. బాలికలు 2,843 మందికి 2,142 ఉత్తీర్ణులయ్యారు. ఒకేషనల్లో 539 గాను 460 మంది పాస్ అయ్యారు. ఇక ఫస్ట్ ఇయర్ రెగ్యులర్ విభాగంలో 2,460 బాలురకు 1,156 మంది, 3,250 మంది బాలికలకు 2 వేల మంది ఉత్తీర్ణులయ్యారు. కాగా ఫస్ట్ ఇయర్ ఒకేషనల్లో 599 మందికి 440 మంది ఉత్తీర్ణులై 73.46 శాతం సాధించడంతో రాష్ట్రంలోనే జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. 70 శాతం సింగిల్ సబ్జెక్ట్ వారే..70 శాతం మంది సింగిల్ సబ్జెక్ట్లోనే ఫెయిల్ అయ్యారు. మే 13 నుంచి జరుగబోయే అడాన్స్ సప్లిమెంటరీ పరీక్షల కోసం ప్రతి కాలేజీలో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తాం. రాలేని వారికి జూమ్ క్లాసులు కొనసాగిస్తాం. ఈ ఏడాది విద్యార్థుల అటెండెన్స్ పెంచడానికి ఇంటింటికీ తిరిగాం. ఆన్లైన్ క్లాసులు నిర్వహించాం. తల్లిదండ్రులతో ఫోన్ మానిట రింగ్ చేశాం. ప్రత్యేక తరగతులు నిర్వహించాం. అందువల్ల కొంతమేర ఉత్తీర్ణతా శాతం పెరిగింది. – మాధవి, డీఐఈఓ -
మౌలిక వసతులు కల్పించాలి
బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మారెడ్డిమెదక్ కలెక్టరేట్: విద్యార్థులకు తక్షణం మౌలిక వసతులు కల్పించాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం మెదక్ నర్సింగ్ కళాశాలను సందర్శించారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం సమస్యల పరిష్కారానికి సంబంధించి డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ)కు వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. కళాశాలలో విద్యార్థులకు కనీస మౌలిక వసతులు కూడా లేవని ఆగ్రహం వ్యక్తం చేశా రు. విద్యార్థులకు నాణ్యత లేని ఆహారం అందిస్తున్నారని మండిపడ్డారు. కళాశాలలో డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేదన్నారు. ఆమె వెంట మాజీ మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున్గౌడ్, కృష్ణారెడ్డి, న్యాయవాది జీవన్రావు తదితరులు ఉన్నారు. -
రోడ్డు భద్రత అందరి బాధ్యత
● కలెక్టర్ ప్రతిమాసింగ్ ● నేటి నుంచి గ్రామాల్లో ‘అరైవ్– అలైవ్’మెదక్ కలెక్టరేట్: నేటి నుంచి జిల్లాలోని 492 పంచాయతీల్లో ‘అరైవ్– అలైవ్’ గ్రామ సభలు పటిష్టంగా నిర్వహించాలని కలెక్టర్ ప్రతిమాసింగ్ అధికారులను ఆదేశించారు. ఆదివారం రాత్రి కలెక్టరేట్ నుంచి అధికారులతో గూగుల్ మీట్ నిర్వహించి కార్యక్రమంపై దిశానిర్దేశం చేశారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రోడ్డు భద్రత మన అందరి బాధ్యత అన్నారు. రోడ్డు ప్రమాదాలను నివారించాలి, ప్రజలకు ప్రాణ రక్షణ కల్పించాలి అనే నినాదంతో అన్ని పంచాయతీలలో గ్రామసభలు నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. అన్ని అంశాల మీద గ్రామసభలు నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేశ్, జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
అన్నదాతకు ఊరట
జిల్లాకు రూ.6.48 కోట్ల పంట నష్ట పరిహారం ● ఎట్టకేలకు మంజూరు చేసిన ప్రభుత్వం ● ఎకరానికి 10,000 చొప్పున అందజేతరామాయంపేట(మెదక్): గతేడాది ఆగస్టులో కురిసిన భారీ వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఊరట కలిగించే విషయం చెప్పింది. జిల్లాకు రూ.6.48 కోట్ల పంట నష్టం పరిహారం మంజూరు చేసింది. గత ఎనిమిది నెలలుగా రైతులు కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు వారికి త్వరలో ఎకరానికి 10,000 చొప్పున పరిహారం అందనుంది. 6,500 ఎకరాల్లో దెబ్బతిన్న పంటలు జిల్లావ్యాప్తంగా 8,089 మంది రైతులకు సంబంధించి మొత్తం 6,480 ఎకరాల్లో వివిధ పంటలు దెబ్బతిన్నాయి. 1,060 ఎకరాల మేర పంట చేలల్లో ఇసుక మేటలు వేసింది. నెలల తరబడి పంట చేన్లు నీటిలోనే ఉండి రంగు మారి దెబ్బతిన్నాయి. వ్యవసాయ అధికారులు గ్రామాల్లో పర్యటించి నష్టపోయిన పంటల వివరాలను రెండు విడతలుగా సేకరించి ప్రభుత్వానికి నివేదించారు. ప్రధానంగా వరి తీవ్రంగా దెబ్బతిన్నట్లు అధికారుల సర్వేలో తేలింది. దీనికి తోడు పత్తి పంట కూడా దెబ్బతిని రైతులు పెట్టుబడులు సైతం నష్టపోయారు. మొక్కజొన్న చేతికి రాకుండా పోయింది. కోసి గూడు పెట్టిన కంకులు మొలకెత్తాయి. పంట రంగు మారి రైతులు తీవ్రంగా నష్టపోయారు. కాగా అప్పట్లో సీఎంతో పాటు మంత్రులు జిల్లాలో పర్యటించి దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. పంట నష్టం పరిహారం అందజేస్తామని ప్రకటించారు. కాగా ఇసుక మేటలను ఈ సీజన్లో తొలగించుకోవడం సాధ్యం కాదని భావించిన రైతులు వాయిదా వేసుకున్నారు. ఎనిమిది నెలలు గడిచినా ఇంకా ఇసుక మేటలు తొలగిపోలేదు. రామాయంపేట, నార్సింగి, హవేళిఘణాపూర్ మండలాల్లో మొదటి విడతగా 11 ఎకరాల్లో మాత్రమే ఇసుక మేటలు తొలగించారు. జిల్లాలో దెబ్బతిన్న పంటలు ఇలా.. పంట ఎకరాలు వరి 5,850 పత్తి 475 పెసర 69 మొక్కజొన్న 25 కూరగాయలు, ఇతర పంటలు 90 త్వరలో అందజేస్తాం గతేడాది ఆగస్టులో కురిసిన భారీ వర్షాలతో దెబ్బతిన్న పంటల వివరాలు ప్రభుత్వానికి నివేదించాం. నష్ట పరిహారానికి సంబంధించి ప్రభు త్వం నిధులు విడుదల చేసినట్లు తెలిసింది. ఇంకా జిల్లాకు అందలేదు. రాగానే బాధిత రైతుల ఖాతాల్లో జమ చేస్తాం. – దేవ్కుమార్, జిల్లా వ్యవసాయ అధికారి -
భూ పట్టా.. అక్రమాల చిట్టా!
● ఇంత జరిగినా ముందుకు సాగని దర్యాప్తు ● రెవెన్యూలో సూత్రధారులు ఎవరు? ● విచారణ వేగవంతం చేయాలని బాధితుల డిమాండ్ అల్లాదుర్గం(మెదక్): భూభారతి చట్టం అపహాస్యం అయింది. అధికారులు రాసిందే చట్టం, చేసిందే పట్టాగా మారింది. అధికారులు, సిబ్బంది చేయి తడిపితే చాలు చట్టం ఉండదు, నిబంధనలు అడ్డురావు. రూ. కోట్ల విలువ గల భూములు అక్రమార్కుల సొంతం అవుతున్నాయి. అల్లాదుర్గం తహసీల్దార్ కార్యాలయం అక్రమ పట్టా, పౌతిలకు నిలయంగా మారింది. ఇటీవల ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంతో తమకు న్యాయం జరుగుతుందని బాధితులు ఆశిస్తున్నారు. అయితే జిల్లా అధికారుల అండదండలు అక్రమార్కులకు ఉండటంతో విచారణను తప్పుదారి పట్టిస్తారేమోనని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగాఇప్పటికీ పలువురు పౌతి కోసం, తప్పుల రికార్డులు సరి చేసుకునేందుకు కార్యాలయం చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. భారీగా చేతులు మారిన డబ్బు గడిపెద్దాపూర్లో నాలుగెకరాల భూమిని ఎలాంటి రికార్డులు, అధారాలు లేకున్నా రెవెన్యూ అధికారులు మరొకరి పేరున అక్రమంగా పట్టా చేశారు. ఆర్డీఓ కార్యాలయ సిబ్బంది, అల్లాదుర్గం రెవెన్యూ అధికారులు పెద్దఎత్తున డబ్బులకు ఆశ పడి భూములను ఇతరులకు అంటగట్టారు. ఇందులో జిల్లాస్థాయి అధికారుల హస్తం ఉందనే ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. అలాగే అల్లాదుర్గం, కాయిదంపల్లి, అప్పాజీపల్లి గ్రామాల్లో అక్రమంగా ఇతరుల పేరిట పౌతి చేయడం కలకలం రేపింది. అల్లాదుర్గానికి చెందిన ఓ రాజకీయ నాయకుడు అధికారులతో మిలాఖత్ అయి పలు అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. బతికున్న వ్యక్తి మర ణించినట్లు రికార్డులు సృష్టించి భూములను మాయం చేశారు. తహసీల్దార్ కార్యాలయంలో సాదాబైనామా, పౌతి మార్పిడిలో పెద్దఎత్తున అక్ర మాలు జరిగాయి. రూ. లక్షలు చేతులు మారడంతో భూ అక్రమాలు చోటు చేసుకున్నాయి. కలెక్టర్ వీటిపై పూర్తిస్థాయి విచారణ చేపడితే అక్రమాలు వెలుగులోకి వస్తాయని బాధితులు చెబుతున్నారు. -
వన్యప్రాణుల దాహం కేక
ఎండలు మండుతుండటంతో తాగు నీటి కోసం వన్యప్రాణులు అలమటిస్తున్నాయి. అడవిలో గతంలో నిర్మించిన సాసర్పిట్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. దాహంతో జంతువులు గ్రామాల శివారులో ఉన్న పంట చేల వద్దకు వస్తూ ప్రమాదాల బారిన పడే అవకాశాలున్నాయి. అరణ్యంలో కొత్తగా బోర్లు తవ్వించి సోలార్ మోటార్లు బిగిస్తే కొంతమేర ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది. – రామాయంపేట(మెదక్)కుంటలో అడుగంటిన నీరు● ఖాళీగా దర్శనమిస్తున్న సాసర్పిట్లు ● ఇప్పటివరకు విడుదల కాని నిధులు ● జిల్లాలో 58 వేలకుపైగా హెక్టార్లలో అటవీజిల్లా పరిధిలో 58 వేలకు పైగా హెక్టార్లలో అటవీప్రాంతం విస్తరించి ఉంది. జంతువులకు తాగునీటి సదుపాయం కల్పించడానికి అడవిలో 520కి పైగా సాసర్పిట్లు, చెక్డ్యాంలు, కుంటలు ఉన్నాయి. ఏటా వేసవి ప్రారంభంలోనే ఆశాఖ అధికారులు సాసర్పిట్లు, కుంటల్లో నీరు నింపేవారు. దీంతో వన్యప్రాణులు అడవి దాటి బయటకు రాకుండానే దాహార్తి తీర్చుకునేవి. కాగా ఐదేళ్లుగా ప్రభుత్వం నిధులు మంజూరు చేయకపోవడంతో అధికారులు నిస్సహాయ స్థితిలో పడిపోయారు. దీంతో కొందరు అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు సొంత డబ్బులతో అక్కడక్కడ సాసర్పిట్లలో నీరు పోయిస్తున్నా, పెద్దగా ఫలితం ఉండటం లేదు. పనిచేయని సోలార్ మోటార్లు సాసర్పిట్లు నిరుపయోగంగా మారి చెత్తాచెదారంతో నిండిపోయాయి. ప్రస్తుతం వీటిని నీటితో నింపితే జంతువులకు తాగునీటి సదుపాయం కలుగుతుందని, దీంతో అవి గ్రామాల్లోకి రావని పలువురు అభిప్రాయపడుతున్నారు. కాగా జిల్లా పరిధిలోని అటవీ ప్రాంతంలో 12 సోలార్ మోటార్లు ఉండగా, వాటిలో 10 మాత్రమే పనిచేస్తున్నాయి. దంతేపల్లి అటవీప్రాంతంలో ఉన్న సోలార్ మోటార్ నడిస్తే ఆప్రాంతంలో చాలా వరకు నీటి ఎద్దడి తీరుతుంది. ఈప్రాంతంలో వేల సంఖ్యలో ఉన్న వన్య ప్రాణులకు తాగు నీటి సదుపాయం కలుగుతుంది. కాగా మూడేళ్లుగా అది పనిచేయడం లేదు. అధికారులు మరమ్మతులు చేయిస్తున్నా, తరచూ బోరు పూడుకుపోతుండటంతో ఈసమస్య తలెత్తింది. కొత్తగా బోర్లు తవ్వించి సోలార్ మోటార్లు బిగిస్తే చాలా వరకు జంతువులకు తాగునీటి సమస్య పరిష్కారమవుతుంది. ఇదిలా ఉండగా గతంలో జంతువులు నీటి కోసం గ్రామాల శివారులోకి వచ్చి మృత్యువాత పడిన సంఘటనలు ఉన్నాయి. -
నిప్పుల కుంపటి
మెదక్జోన్: మెతుకుసీమపై నిప్పుల వాన కురుస్తోంది. వారం రోజులుగా పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఉదయం 9 గంటల నుంచే భానుడు తన విశ్వరూపం చూపిస్తున్నాడు. సా యంత్రం వరకు ప్రజలు ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఫ్యాన్లు, ఏసీలు, కూలర్లతో ఉపశమనం పొందుతున్నారు. వివిధ పనులపై జిల్లా కేంద్రానికి వచ్చే ప్రజలు ఎండ నుంచి వేడిమికి తాళలేక తాత్కాలిక ఉపశమనం పొందేందుకు చల్లటి పానీయాలు, కూల్డ్రింక్లు, కొబ్బరినీళ్లు సేవిస్తున్నారు. అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని వైద్యులు చెబుతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో బయట కు వస్తే గొడుగులు, చేతిరుమాలు తలపై కప్పుకోవాలని సూచిస్తున్నారు. ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలంటున్నారు. కాగా మున్ముందు ఎండలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.ఐదు రోజుల ఉష్ణోగ్రతలు ఇలా.. తేదీ కనిష్ట గరిష్ట 7 22.3 39.9 8 18.4 39.8 9 19.9 39.3 10 20.1 40.6 11 20.9 41.4 జిల్లాలో 40 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు ఉదయం 9 గంటల నుంచే భానుడి విశ్వరూపం ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరి -
మార్కెట్కు వస్తే కదా బాధ తెలిసేది
● మీరు రారు.. ప్రభుత్వం పట్టించుకోదు ● అధికారులపై హరీశ్రావు ఆగ్రహం ● రెండు రోజుల్లో రైతుల సమస్యలు పరిష్కరించాలిసిద్దిపేటజోన్: అధికారులు కొనుగోలు కేంద్రాలకు రారు.. ప్రభుత్వమూ పట్టించుకోదు.. మరి రైతుల బాధ తీర్చేదెవరు అంటూ ఎమ్మెల్యే హరీశ్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొనుగోళ్లలో జాప్యం.. రైతుల పడిగాపులు, పేరుకుపోయిన పొద్దుతిరుగుడు రాశులపై ఈనెల10న సాక్షిలో ‘కొంటారా... కొనరా’అనే శీర్షికపై ప్రచురితమైన కథనానికి ఆయన స్పందించారు. శనివారం సిద్దిపేట పత్తి మార్కెట్ యార్డును పరిశీలించారు. పొద్దుతిరుగుడు, మొక్కజొన్న రైతులతో సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సంచులు, కోటా, లారీలు, హమాలీ సమస్యల పేరిట కొనుగోలు చేయడం లేదని రైతులు హరీశ్రావు దృషికి తీసుకొచ్చారు. స్పందించిన ఆయన వెంటనే జిల్లా మార్క్ఫెడ్ డీఎం సునీత, మార్కెట్ కమిటీ కార్యదర్శి వెంకటయ్యలకు ఫోన్ చేసి ఆగ్రహం వ్యక్తంచేశారు. యార్డులో రైతులు బాధ పడుతుంటే మీరేమి చేస్తున్నట్టు అని ఆగ్రహం వ్యక్తంచేశారు. మీరు మార్కెట్ యార్డుకు వస్తే కదా రైతుల బాధలు తెలిసేది అంటూ మండిపడ్డారు. కోటా పూర్తి అయిందని, లారీలు, హమాలీ సమస్య ఉందన్నారు. సోమవారం నాటికి మొక్కజొన్న, పొద్దుతిరుగుడు రైతుల సమస్యలను పరిష్కరించాలని, కొనుగోళ్లు వేగవంతం చేయాలని సూచించారు. యార్డులో ఐదు మిషన్లు ఉండగా.. రెండు మాత్రమే పని చేస్తున్నాయని, అవసరమైతే మరో రెండు మి షన్లు కొనుగోలు చేయాలన్నా రు. ఆయన వెంట మున్సిపల్ మాజీ చైర్మన్ రాజనర్సు. మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్లు వేణుగోపాల్ రెడ్డి, సాయిరాం, పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షుడు సంపత్, నాయకులు వరాల సురేష్, రెడ్డి ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మాదకద్రవ్యాలను అరికడదాం
మెదక్ కలెక్టరేట్: ‘హెల్త్ వీక్’ కార్యక్రమంలో భాగంగా శనివారం పట్టణంలో డ్రగ్స్ కంట్రోల్– రెగ్యులేటరీ స్ట్రెంథనింగ్ డే నిర్వహించారు. ఈసందర్భంగా జిల్లా కేంద్రంలోని రాందాస్ చౌరస్తా నుంచి టీఎన్జీఓ భవన్ వరకు అవగాహన ర్యాలీ నిర్వహించగా, డీఎంహెచ్ఓ శ్రీరామ్ ప్రారంభించారు. అనంతరం టీఎన్జీఓ భవన్లో నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి కలెక్టర్ ప్రతిమాసింగ్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మాదకద్రవ్యాల వినియోగాన్ని మూకుమ్మడిగా అరికట్టాలని పిలుపునిచ్చారు. మెడికల్ షాపుల్లో అమ్మే మందులకు డాక్టర్ పిస్క్రిప్షన్ తప్పనిసరిగా ఉండాలన్నారు. అదనపు కలెక్టర్ నగేశ్ మాట్లాడుతూ.. డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించాలన్నారు. ఈగల్ ఫోర్స్ ఏసీపీ శివనాయుడు మాట్లాడుతూ.. మాదకద్రవ్యాలు విక్రయిస్తే చట్టంలో కఠిన శిక్షలు ఉన్నాయని తెలిపారు. కార్యక్రమంలో డీఎస్పీ ప్రసన్నకుమార్, మున్సిపల్ చైర్పర్సన్ రాధిక, వైస్ చైర్మన్ నరేశ్గౌడ్, ఇతర అధికారులు, ఫార్మసీ విద్యార్థులు పాల్గొన్నారు. కనీస వసతులు కల్పించాలి మెదక్ కలెక్టరేట్: నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ను వెంటనే సస్పెండ్ చేసి, విద్యార్థులకు కనీస వసతులు, మంచి భోజనం అందించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అజయ్కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కళాశాలను సందర్శించి విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మెయింటెనెన్స్ పేరుతో విద్యార్థుల నుంచి డబ్బులు వసూలు చేయడం దారుణం అన్నారు. శిథిలావస్థలో ఉన్న హాస్టల్ భవనంలో విద్యార్థులు పడరాని పాట్లు పడుతున్నారని వాపోయారు. కలెక్టర్ తక్షణం స్పందించి విద్యార్థులకు కనీస వసతులు కల్పించాలని కోరారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు గణేష్, చింటూ తదితరులు పాల్గొన్నారు. వ్యక్తిగత పరిశుభ్రత తప్పనిసరి నర్సాపూర్ రూరల్: వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ వంటలు చేయాలని మెదక్ ఆర్సీఓ బలరాంనాయక్ వంట సిబ్బందికి సూచించా రు. శనివారం మండలంలోని నారాయణపూర్ గిరిజన గురుకుల బాలికల పాఠశాల, కళాశాలలో వంట సిబ్బందికి వర్క్షాప్ నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త మెనూ ఆధారంగా విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలన్నారు. వంట పాత్రలు, గదులు సై తం పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. వర్క్షాప్లో ఆయా రకాల వంటలు వండటంతో పాటు విద్యార్థులకు వడ్డించే విధానంపై వివరించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ లలితాదేవి, కౌడిపల్లి ప్రిన్సిపాల్ కల్యాణి, ఆయా పాఠశాలల వంట మనుషులు పాల్గొన్నారు. 18 మంది క్రీడాకారుల ఎంపికసంగారెడ్డి క్రైమ్: జిల్లా కేంద్రంలోని ఎంఎస్ క్రికెట్ అకాడమీలో శనివారం ఏర్పాటు చేసిన ఉమ్మడి మెదక్ జిల్లా అండర్–25 క్రికెట్ సెలక్షన్స్లో 18 మంది క్రీడాకారులు ఎంపికయ్యారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విశాఖ ఇండస్ట్రీస్ సౌజన్యంతో నిర్వహించిన ఉమ్మడి మెదక్ జిల్లాల నుంచి క్రికెట్ క్రీడాకారులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. డివిజన్ లీగ్ క్రికెట్ పోటీల విభాగంలో సెలక్షన్ చేయగా సంబంధిత క్రీడాకారులు తమ ప్రతిభతో రాణించారు. బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో ఉత్తమ ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. ఈ మేరకు ఉమ్మడి జిల్లా కార్యదర్శి రాజేందర్రెడ్డి శనివారం మీడియాకు వెల్లడించారు. -
మిల్లింగ్కు ససేమిరా!
మిల్లర్లకు ఇచ్చే ధాన్యంలో మొత్తంగా 90 శాతం రారైస్, 10 శాతం బాయిల్డ్ రైస్ ఇవ్వాలంటూ కేంద్రం ఈసారి కొత్త నిబంధన పెట్టింది. దీంతో ధాన్యం మిల్లింగ్కు మిల్లర్లు ససేమిరా అంటున్నారు. యాసంగిలో నూకల శాతం అధికంగా ఉంటుందని, రారైస్ ఇవ్వటం సాధ్యం కాదంటూ చేతులెత్తేస్తున్నారు. దీంతో ధాన్యం సేకరణలో సందిగ్ధం నెలకొంది. – మెదక్జోన్ జిల్లాలో మొత్తం 102 రైస్మిల్లులు ఉండగా, అందులో 38 బాయిల్డ్, 64 రారైస్ మిల్లులు ఉన్నాయి. ఏటా వానాకాలంలో సుమారు 6 లక్షల పైచిలుకు, యాసంగిలో 5 లక్షల మెట్రిక్ టన్నుల వరకు ధాన్యం దిగుబడి వస్తోంది. ఆ ధాన్యాన్ని మిల్లర్లు మరాడించి ఎఫ్సీఐకి అప్పగిస్తున్నారు. కాగా ఈ సంవత్సరం మిల్లులకు అప్పగించే ధాన్యంలో 90 శాతం రారైస్, 10 శాతం బాయిల్డ్ రైస్ ఇవ్వాలని కేంద్రం కొత్త నిబంధన పెట్టింది. యాసంగి ధాన్యాన్ని మిల్లింగ్ చేస్తే 50 శాతానికి పైగా నూకలు వస్తాయని, రారైస్ ఇవ్వటం సాధ్యం కాదని, బాయిల్డ్ రైస్ మాత్రమే ఇస్తామంటూ మిల్లర్స్ అసోసియేషన్ సభ్యులు చెబుతున్నారు. ధాన్యం తీసుకోం..! గతంలో మాదిరిగానే బాయిల్డ్ కొంత, రారైస్ కొంత చొప్పున ఇస్తామని పలువురు మిల్లర్లు చెబుతున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 100 కిలోల ధాన్యం మిల్లింగ్ చేస్తే రారైస్ 67 కిలోలు, బాయిల్డ్ రైస్ అయితే 68 కిలోల చొప్పున ఎఫ్సీఐకి అప్పగించాలి. ఇది వర్షాకాలంలో పండించిన ధాన్యాన్ని మరాడిస్తే మాత్రమే వస్తోంది. యాసంగిలో సాధ్యం కాదని మిల్లర్లు పేర్కొంటున్నారు. ప్రభుత్వ తీరు మార్చుకోకుంటే ధాన్యం తీసుకోలేమని స్పష్టం చేస్తున్నారు. అధికారులు మాత్రం ఈ విషయం బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నారు. కాగా ధాన్యాన్ని నేరుగా మిల్లింగ్ చేస్తే వచ్చేది రారైస్ (బియ్యం) కాస్త సన్నగా ఉంటుంది. అదే బాయిల్డ్ రైస్ అంటే వేడి నీటిలో ధాన్యాన్ని ఉడకబెడతారు. నూకలు రాకుండా అధికశాతం బియ్యం వస్తాయి. కానీ ఆ బియ్యం దొడ్డుగా ఉంటాయి. వాటిని తినేందుకు ఎక్కువగా ఇష్టపడరు.23 రకాల కొత్త నిబంధనలు ఎప్పుడూ లేని విధంగా ఈఏడాది 66 పేజీలలో 23 రకాల కొత్త నిబంధనలను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినట్లు సమాచారం. గతంలో మిల్లర్లకు ధాన్యం ఇచ్చే ముందు మరో ఇద్దరు మిల్లర్ల జామీన్గా తీసుకుని ధాన్యం కేటాయించే వారు. కానీ ఈసారి సదరు మిల్లర్లు అధికారులకు అఫిడవిట్ సమర్పించాలి. అగ్రిమెంట్పై సివిల్ సప్లై అధికారితో పాటు జాయింట్ కలెక్టర్ సంతకాలు సైతం చేసి ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంటుంది. ఈ నూతన నిబంధనతో ఇప్పటి వరకు మిల్లర్లు ముందుకు రావడం లేదు.90 శాతం రారైస్ ఇవ్వాలని కేంద్రం నిబంధన యాసంగిలో సాధ్యం కాదంటున్న మిల్లర్లు ధాన్యం కొనుగోలులో వీడని సందిగ్ధం -
ఘనపూర్కు సింగూరు నీరు
పుల్కల్(అందోల్): సింగూరు ప్రాజెక్టు నుంచి ఒక గేట్ను ఎత్తి దిగువన ఘనపూర్ ఆయకట్టుకు సాగు నీరు విడుదల చేశారు. ప్రాజెక్టుకు మరమ్మతుల దృష్ట్యా ఘనపూర్ ఆయకట్టుకు పంట విరామం ప్రకటించినా, కొందరు రైతులు యాసంగి సాగు వేశారు. దీంతో ఘనపూర్ ఆనకట్టకు నీటి కొరత ఏర్పడింది. పంట చివరి దశలో ఉండటంతో నీటి కొరత ఏర్పడింది. అధికారుల సూచన మేరకు శనివారం సింగూరు ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేశారు. 5వ నంబర్ గేట్ను మీటరున్నర ఎత్తి మంజీరాలోకి నీటిని వదిలారు. అక్కడి నుంచి ఘనపూర్కు నీరు చేరుకుంటుందని అధికారులు తెలిపారు. -
పూలే స్ఫూర్తితో సమాజాభివృద్ధి
మెదక్ కలెక్టరేట్: మహాత్మా జ్యోతిబా పూలే స్ఫూ ర్తితో ప్రతి ఒక్కరూ విద్యకు ప్రాధాన్యతనిస్తూ సమాజాభివృద్ధికి కృషి చేయాలని కలెక్టర్ ప్రతిమాసింగ్ పిలుపునిచ్చారు. పూలే జయంతిని పురస్కరించుకొని శనివారం జిల్లా కేంద్రంలోని బోధన్ చౌరస్తాలో ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కలెక్టరేట్లో వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జయంతి వేడుకలు నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పూలే సమాజంలో సమానత్వం, విద్యా విస్తరణ, మహిళా సాధికారత కోసం చేసిన కృషి చేశాడని కొనియాడారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన సేవలు ఆదర్శంగా నిలుస్తాయన్నారు. సమాజంలో వివక్ష లేకుండా అందరికీ సమాన అవకాశాలు కల్పించడమే పూలే ఆశయమని గుర్తుచేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేశ్, ఆర్డీఓ రమాదేవి, తహసీల్దార్ లక్ష్మణ్బాబు, డీఎస్పీ ప్రసన్నకుమార్,మెదక్ మున్సిపల్ చైర్ పర్సన్ రాధిక, వైస్ చైర్మన్ నరేష్గౌడ్, రామాయంపేట మున్సిపల్ చైర్పర్సన్ లావణ్య, టీఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు నరేందర్, కార్యదర్శి రాజ్కుమార్, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు దుబాసి సంజీవ్, బీసీ సంఘం నాయ కులు మెట్టు గంగారాం, నోముల శ్రీకాంత్, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.కలెక్టర్ ప్రతిమాసింగ్ -
మల్లయ్య తిన్న ముక్క.. మల్లయ్యనే ఇబ్బంది పెట్టింది!
మెదక్ జిల్లా: ఓ శుభకార్యానికి వెళ్లిన వ్యక్తికి భోజనం చేస్తున్న క్రమంలో గొంతులో చికెన్ ముక్క ఇరుక్కొని అస్వస్థతకు గురయ్యాడు. ఈ సంఘటన తూప్రాన్ పట్టణ కేంద్రంలో శుక్రవారం చోటు చేసుకుంది. సీహెచ్సీ సూపరింటెండెంట్ అమర్సింగ్ వివరాల ప్రకారం... మాసాయి పేట మండలం హాకీంపేట గ్రామానికి చెందిన పి.మల్లయ్య తూప్రాన్లో బంధువుల శుభకార్యానికి హాజరయ్యాడు. అక్కడ భోజన సమ యంలో చికెన్, చపాతి తింటున్న క్రమంలో గొంతులో చికెన్ ముక్క ఇరుక్కొని అస్వస్థతకు గురై కిందపడిపోయాడు. గమనించిన కుటుంబ స భ్యులు, బంధువులు వెంటనే పట్టణంలోని సీహెచ్సీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆస్పత్రి సూపరింటెండెంట్ అమర్సింగ్ వైద్య సిబ్బందితో కలిసి రెండు గంటలు శ్రమించి ‘హెంబ్లిక్ పద్ధతి’తో చికెన్ ముక్కను గొంతులో నుంచి బయటకు తీశారు. దీంతో మల్లయ్యకు ప్రాణాపాయం తప్పింది. వైద్యుల చేసిన కృషిని కుటుంబ సభ్యులు, బంధువులు అభినందించారు. -
పోషకాహారంపై అవగాహన అవసరం
ఎమ్మెల్యే సునీతారెడ్డి నర్సాపూర్ రూరల్: పౌష్టికాహారంపై విస్తృతంగా అవగాహన కల్పించాలని ఎమ్మెల్యే సునీతారెడ్డి అంగన్వాడీ సిబ్బందికి సూచించారు. శుక్రవారం మండలంలోని ఆవంచలో ‘ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక’లో భాగంగా ఐసీడీఎస్ ఆధ్వర్యంలో పోషణ్ పక్వాడ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరై మాట్లాడారు. వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతపై సిబ్బంది వివరించాలని సూచించారు. ప్రతి మంగళవారం మహిళలు, పిల్లలలో పోషణపై ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, సబ్ సెంటర్లలో ఆరోగ్య పరీక్షలు చేయించాలన్నారు. ప్రతి ఒక్కరూ సమతుల ఆహారం తీసుకునేలా చైతన్య పరచాలన్నారు. అనంతరం గర్భిణులకు సీమంతాలు చేపట్టారు. అలాగే అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమాధికారి హేమాభార్గవి, డీఆర్డీఏ పీడీ శ్రీనివాస్రావు, సర్పంచ్ స్రవంతి, కరుణాకర్, మెడికల్ ఆఫీసర్ రఘువరన్, ఐసీడీఎస్ సూపర్వైజర్లు సరళ కుమారి, కవిత, శివకుమారి, కార్యదర్శి మల్లేశ్, కవిత తదితరులు పాల్గొన్నారు. -
యోగాతో సంపూర్ణ ఆరోగ్యం
మెదక్జోన్: క్రమం తప్పకుండా యోగా చేయ డం వల్ల సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటామని కలెక్టర్ ప్రతిమాసింగ్ అన్నారు. ‘హెల్త్వీక్’ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం పట్టణంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో హోమియోపతి, ఆయుష్ ఆధ్వర్యంలో యోగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వయో, లింగ భేదం లేకుండా అందరూ యోగాను సాధన చేయాలన్నారు. పురాతన కాలం నుంచి యోగాసనాలకు ఎంతో ప్రాముఖ్యత ఉందన్నారు. శారీరక, మానసిక ఆధ్యాత్మిక ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరమైన సాధనంగా గుర్తించారన్నారు. యోగా సాధన ద్వారా జీవనశైలిలో మార్పు వస్తుందని, అనేక వ్యాధులను నివారించుకోవచ్చని వివరి ంచారు. అంతకుముందు కలెక్టర్ పలు యోగాసనాలు వేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేశ్, ఆర్డీఓ రమాదేవి, డీఎంహెచ్ఓ శ్రీరాం, డీఈఓ విజయ, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి, యోగా గురువులు రవి, మనోరంజని, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ ప్రతిమాసింగ్ -
రోడ్డెక్కిన నర్సింగ్ విద్యార్థినులు
మెదక్ కలెక్టరేట్: ‘హాస్టల్లో కనీస వసతులు లేవు.. కడుపునిండా తిండిలేక అల్లాడిపోతున్నామని’ నర్సింగ్ కళాశాల విద్యార్థినులు కన్నీటి పర్యంతమయ్యారు. తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం పట్టణంలోని కళాశాల నుంచి రాందాస్ చౌరస్తా వరకు మండుటెండలో నిరసన ర్యాలీ చేపట్టారు. విషయం తెలుసుకున్న అధికారులు విద్యార్థులను సముదాయించారు. కలెక్టర్కు మొర పెట్టుకుంటామని చెప్పడంతో బస్సు ఏర్పాటు చేసి కలెక్టరేట్కు తీసుకెళ్లారు. అనంతరం అక్కడ ఆందోళన చేపట్టారు. హాస్టల్లో 120 మందికి కేవలం ఒకటే టాయిలెట్ ఉందని, రెండు రోజులకోసారి స్నానం చేయాల్సిన దుస్థితి నెలకొందని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతీనెల ప్రిన్సిపాల్ మెయింటనెన్స్ కోసం డబ్బులు వసూలు చేస్తున్నా రని ఆరోపించారు. కలెక్టర్ ప్రతిమాసింగ్ను కలిసి సమస్యలను మొరపెట్టుకున్నారు. అనంతరం కలెక్టర్, డీఐఈఓ మాధవి నర్సింగ్ కళాశాలను సందర్శించారు. విద్యార్థులకు కనీస వసతులు లేని మాట వాస్తవమేనని, విద్యార్థులకు మంచి భోజనం పెట్టకుంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
కొడగు సైనిక్ స్కూల్కు మెదక్ విద్యార్థి
మెదక్ కలెక్టరేట్: దేశంలోని టాప్ 5 సైనిక్ స్కూల్స్లో ఒకటిగా గుర్తింపు పొందిన కొడగు సైనిక్ స్కూల్కు మెదక్కు చెందిన విద్యార్థి రిహాన్శౌర్య ఎంపికయ్యాడు. జనవరి 18న దేశవ్యాప్తంగా నిర్వహించిన ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్షలో రిహాన్ అద్భుత ప్రతిభ కనబర్చాడు. దేశ నలుమూలల నుంచి సుమారు 1,80,000 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈ కఠిన పోటీలో విద్యార్థి 300కు 275 మార్కులతో ఆల్ ఇండియా ర్యాంక్ 982 సాధించాడు. ఈ విషయమై విద్యార్థి తండ్రి, అగ్రికల్చర్ ఏఈఓ రాజశేఖర్ ఆనందం వ్యక్తం చేశారు. నర్సాపూర్: విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు శుక్రవారం పట్టణంలో పర్యటించా రు. నర్సాపూర్లోని ఎంఎల్ఎస్ గోదాంలో రికార్డులు పరిశీలించారు. అనంతరం పట్టణంలోని ఓ రేషన్ దుకాణంలో తనిఖీలు చేపట్టారు. బియ్యం స్టాక్, రికార్డులు తనిఖీలు చూశారు. -
మిల్లర్లతో మిలాఖత్
● కేంద్రాల నిర్వాహకులు, స్టేజ్ 1 కాంట్రాక్టర్ల మాయాజాలం ● జిల్లాలో 7 మిల్లులకే 2.69 లక్షల క్వింటాళ్ల సన్నధాన్యం కస్టమ్స్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్)లో నిబంధనలకు పాతరేస్తున్నారు. లాభదాయకంగా ఉండటంతో మిల్లర్లంతా సన్న వడ్ల కోసం ఎగబడుతున్నారు. ఇందులో కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, స్టేజ్ 1 కాంట్రాక్టర్లు, ట్రాన్స్పోర్టు డ్రైవర్లు చక్రం తిప్పుతున్నారు. మ్లిలర్లతో కుమ్మకై , కమీషన్లు ఇచ్చే వారికే సన్న వడ్లు పంపుతున్నారు. గత వానాకాలంలో జిల్లాలో 14,28,712 క్వింటాళ్ల సన్న వడ్లు సీఎంఆర్ కింద సేకరించగా, ఇందులో కేవలం 7 మిల్లులకే 2,68,839 క్వింటాళ్లు ఇచ్చారు. మిగితా 94 మిల్లులకు 11,59,873 క్వింటాళ్లు పంపిణీ అయ్యాయి. ప్రస్తుత యాసంగి సీజన్లోనైనా న్యాయంగా సన్నాల కేటాయింపులు జరపాలని మిల్లర్లు కోరుతున్నారు. – మెదక్ అర్బన్ గత వానాకాలం సీజన్లో జిల్లాలో మొత్తం 37,57,896 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించారు. అందులో 14,28,712 క్వింటాళ్ల సన్నాలు ఉన్నాయి. సీఎంఆర్ కోసం జిల్లాలోని 101 మిల్లులకు ధాన్యం కేటాయించారు. అయితే సన్న వడ్లు మ్లిలర్లకు లాభదాయకంగా ఉండటంతో డిమాండ్ ఏర్పడింది. దీంతో మిల్లర్లు కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు, స్టేజ్ 1 కాంట్రాక్ట్ ట్రాన్స్పోర్టర్లకు ప్రలోభాల ఆశ చూపారు. దీంతో కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు కమీషన్లకు ఆశపడి, తమకు అనుకూలమైన మిల్లర్లకు సన్న వడ్లు పంపిణీ చేశారు. అలాగే ట్రాన్స్పోర్టు డ్రైవర్లు, స్టేజ్ 1 కాంట్రాక్టర్లు సైతం తమతో అంటకాగిన మిల్లర్ల పంచన చేరారన్న విమర్శలున్నాయి. జిల్లాలో పెద్దశంకరంపేట, పాపన్నపేట, మెదక్, నర్సాపూర్ మండలాల్లోని ఏడు మిల్లులకు 2,68,839 క్వింటాళ్ల సన్న వడ్లు కేటాయించారు. కొంతమంది మిల్లర్లు సన్నాల కోసం రైతులకు క్వింటాల్కు రూ.50తో పాటు, హమాలీ చార్జీలు కూడా చెల్లించినట్లు తెలుస్తోంది. మరికొంత మంది మిల్లర్లు మరో అడుగు ముందుకేసి, తమ లారీలను కొనుగోలు కేంద్రాలకు పంపి సన్న వడ్లు తెప్పించుకున్నారు. అయితే స్టేజ్ 1 కాంట్రాక్టర్లు వీరికి, ట్రాన్స్పోర్టు చార్జీలు చెల్లించే అవకాశం లేకపోయినప్పటికీ, ఇరువర్గాలకు ఈ దందా లాభదాయకంగా మారింది. సిరులు కురిపిస్తున్న సన్నాలు సన్న వడ్ల ద్వారా క్వింటాల్కు నూకలతో కలిపి సుమారు 67 కిలోల బియ్యం వస్తున్నట్లు తెలుస్తుంది. దొడ్డు వడ్ల ద్వారా తక్కువ బియ్యం వస్తున్నాయి. అలాగే సన్నాలు మెదక్లోని సివిల్ సప్లై ద్వారా మామూళ్లు మాటున సులభంగా పాస్ అవుతాయన్న ఆరోపణలున్నాయి. ఇక దొడ్డు బియ్యం ఎఫ్సీఐ ద్వారా పాస్ కావాలి. అక్కడ మామూళ్లు తప్పకున్నా, క్వాలిటీ చూస్తారని, అందువల్ల మిల్లర్లు ఎక్కువగా సన్న వడ్ల కోసం ఎగబడుతున్నారు. గతేడాది సన్నాలు తీసుకున్న మిల్లర్లు క్వింటాల్కు రూ.25 చొప్పున అసోసియేషన్కు చెల్లించాలని, అన్ని మిల్లులకు సమానం వడ్లు కేటాయించాలని యూనియన్ తీర్మానించింది. ఈ విషయమై సివిల్ సప్లై డీఎం జగదీశ్ను వివరణ కోరగా.. సన్న, దొడ్డు వడ్లు అన్న వివరాలు తమ వద్ద ఉండవని, అవి మిల్లర్ అసోసియేషన్ చూసుకోవాలన్నారు. -
రోడ్డు ప్రమాదాల నివారణ అందరి బాధ్యత
ఎస్పీ శ్రీనివాసరావు మెదక్జోన్: రోడ్డు ప్రమాదాల నివారణలో ప్రజలందరి భాగస్వామ్యం అవసరమని ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. ఈనెల 13 నుంచి 18 వరకు నిర్వహించనున్న ‘అరైవ్– అలైవ్ వీక్’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. అన్నిశాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రతి ఏడాది రోడ్డు ప్రమాదాలతో అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారని, గ్రామీణ ప్రాంతాల్లో సైతం ట్రాఫిక్ నియమాలు, రోడ్డు భద్రతపై విస్తృత అవగాహన కల్పించాలన్నారు. సర్పంచ్ అధ్యక్షతన రోడ్ సేఫ్టీ కమిటీలను త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. అంబేడ్కర్ జయంతి సందర్భంగా ట్రాఫిక్ నిబంధనలు పాటించేందుకు ప్రతిజ్ఞ కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. పెద్దశంకరంపేట(మెదక్): పెద్దశంకరంపేట మండల పరిధిలోని రామోజీపల్లి, బూర్గుపల్లి సబ్స్టేషన్ పరిధిలో మరమ్మతుల కారణంగా శనివా రం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏఈ శ్యాంసుందర్ పేర్కొన్నారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని, ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు. నర్సాపూర్ రూరల్: మహిళా సంఘాలు తీసుకున్న రుణాలు వాయిదాల పద్ధతిలో నిర్ణీత గడువులోగా చెల్లించాలని డీఆర్డీఓ పీడీ శ్రీనివాస్రావు అన్నారు. శుక్రవారం మండలంలోని ఆవంచలో నిర్మిస్తున్న మహిళా సంఘం నూ తన భవన నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం మహిళా సంఘాలతో సమావేశమై పలు సలహాలు, సూచనలు ఇచ్చారు. ప్రభు త్వం మహిళల అభివృద్ధి కోసం అనేక పథకాలు ప్రవేశపెడుతుందన్నారు. గర్భిణులు, బా లింత లు, చిన్నపిల్లలు పౌష్టికాహారం తీసుకునే విధంగా మహిళా సంఘాల సభ్యులు అవగాహన కల్పించాలని సూచించారు. వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతపై కూడా అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఐకేపీ ఏపీఎం సంగమేశ్వర్, సీసీ రవీందర్, వీఓ మల్లేశ్వరి, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు. తూప్రాన్: పశువులకు గాలికుంటు వ్యాధి సోకకుండా నివారణ టీకాలు వేయించాలని జిల్లా పశువైద్యాధికారి వెంకటయ్య సూచించారు. 8వ విడత జాతీయ గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమాన్ని పట్టణంలో శుక్రవారం నిర్వహించారు. ఈసందర్భంగా 4 నెలలు పైబడిన పశువులకు ఉచితంగా టీకాలు వేశారు. గాలికుంటు వ్యాధి సోకడం వల్ల పశువుల్లో ఉత్పాదక శక్తి, పునరుత్పత్తి శక్తి సామర్థ్యం తగ్గుతుందన్నారు. పాడి రైతులకు ఎక్కువ నష్టం జరుగుతుందన్నారు. అందుకే ఏడాదికి రెండు సార్లు పశువులకు వ్యాధి నిరోధక టీకాలు కచ్చితంగా ఇప్పించాలని తెలిపారు. కార్యక్రమంలో మండల పశు వైద్యాధికారి లక్ష్మి, లైవ్ స్టాక్ అసిస్టెంట్ రమేశ్, రామకృష్ణ, కృష్ణ, శ్రీనివాస్, గోపాలమిత్ర, పశు పోషకులు తదితరులు పాల్గొన్నారు. పటాన్చెరు: పటాన్చెరులోని పాఠశాల కూల్చివేతపై ఎంపీ రఘునందన్రావు స్థానిక పోలీస్ స్టేషన్లో శుక్రవారం ఫిర్యాదు చేశారు. ఈ నెల 7వ తేదీ రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు పట్టణంలోని జాతీయ రహదారి పక్కన ఉన్న ప్రభుత్వ బాలుర పాఠశాల తరగతి గదుల నిర్మాణాలను కూల్చివేశారు. అదేరాత్రి ఎంపీ రఘునందన్కు స్థానికులు ఫిర్యాదు చేశారు. ఆయన వెంటనే స్పందించి జిల్లా కలెక్టర్కు, పోలీసు ఉన్నతాధికారులకు ఫోన్ చేసి కూల్చివేతను ఆపాలని ఆదేశించగా... అప్పటికే బడిని నేలమట్టం చేసేశారు. -
వ్యర్థాలతో ఇంధనం!
సాక్షి, సిద్దిపేట: పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం కారణంగా వంట గ్యాస్ కోసం వినియోగదారుల బాధలు వర్ణనాతీతం. విదేశాల నుంచి దిగుమతి చేసుకోవడంతోనే ఈ ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఇలా దిగుమతులను తగ్గించడానికి భారత ప్రభుత్వం బయోగ్యాస్ ప్లాంట్లను నిర్మించాలని నిర్ణయించింది. వ్యవసాయ, పౌల్ట్రీ వ్యర్థాలు, పశువుల పేడ నుంచి ఇంధనం తయారు చేయనున్నారు. సిద్దిపేట జిల్లా నర్మేటలో టీజీఐఐసీ సేకరించిన 20 ఎకరాల స్థలాన్ని బయోగ్యాస్ ప్లాంట్ కోసం కేటాయించారు.. అభివృద్ధి చెందుతున్న బయో ఎనర్జీ రంగంలో ప్రముఖ సంస్థ అయిన జూనో జౌల్ బయో ప్యూయల్స్ కంపెనీ వారు ఈ ప్లాంట్ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ నెల 12న నర్మెటలో మంత్రి శ్రీధర్ బాబు శంకుస్థాపన చేయనున్నారు. వ్యవసాయ వ్యర్థాలతో గ్యాస్ రాష్ట్రంలో అత్యధికంగా వరి పంటను సాగు చేస్తున్నారు. వరి కోతలు ముగిసిన తర్వాత గడ్డి, వివిధ పంటల మొదళ్లను తగులబెడుతుంటారు. దీంతో భూమి సారం కోల్పోవడంతో పాటు గ్రీన్హౌస్ వా యువు విడుదలవుతోంది. అదే వ్యవసాయ వ్యర్థాలు, వడ్లపొట్టు, పశువుల పేడ, పౌల్ట్రీ వ్యర్థాలతో స్వచ్ఛమైన ఇంధనంగా తయారు చేయనున్నారు. సేంద్రియ వ్యర్థాలను స్వచ్ఛమైన ఇంధనంగా మార్చడం ద్వారా పర్యావరణ పరిరక్షణ, గ్రామీణ అభివృద్ధికి తోడ్పాటు అందించనుంది. రాష్ట్రంలోనే తొలి ప్లాంట్ సిద్దిపేటలో రూ 250కోట్ల వ్యయంతో 10 సీబీజీ (కంప్రెషడ్ బయో గ్యాస్) ప్లాంట్లతో రాష్ట్రంలో ఇదే తొలి ప్రాజెక్టు. ఒక్కో ప్లాంట్ రోజుకు 10 టన్నుల టీపీడీ (టెన్స్ పర్ డే) సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. దీని ద్వారా మొత్తం వంద టీపీడీ ఉత్పత్తి సామర్థ్యం లభిస్తుంది. ఇది రాష్ట్రంలో బయో–ఎనర్జీ ఉత్పత్తికి కీలక కేంద్రంగా మారుతుంది. ఈ ప్రాజెక్టును మూడు దశల్లో అమలు చేయనున్నారు. మొదటి, రెండో దశల్లో మూడు ప్లాంట్లు చొప్పున, మూడో దశలో నాలుగు ప్లాంట్లను ప్రారంభిస్తారు. ఈ మొత్తం క్లస్టర్ 2029– 2030 నాటికి పూర్తి కానుంది. ఇది భారతదేశం తక్కు వ కార్బన్ ఉద్గారాల ఇంధన వ్యవస్థల వైపు సాగించే ప్రయాణానికి తోడ్పడుతుంది. అలాగే దాదాపు 500 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. రూ.250 కోట్లతో నర్మేటలో బయోగ్యాస్ ప్లాంట్ 12న మంత్రి శ్రీధర్బాబు శంకుస్థాపన పౌల్ట్రీ వ్యర్థాలు, పశువుల పేడతో ప్లాంట్ నిర్మాణం 10 ప్లాంట్లు.. ఒక్కో ప్లాంట్ 10 టన్నుల టీపీడీ సామర్థ్యం -
ఇళ్ల నిర్మాణంలో వేగం పెంచండి
అదనపు కలెక్టర్ నగేశ్ చిన్నశంకరంపేట(మెదక్): ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్ నగేశ్ అన్నారు. శుక్రవారం మండలంలోని జంగరాయిలో నిర్మాణంలో ఉన్న ఇళ్లను పరిశీలించారు. గ్రామంలో చాలా వరకు బేస్మెంట్ వరకు మాత్రమే పనులు జరిగాయని, వెంటనే పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలని హౌసింగ్ పీడీ మాణిక్యంను ఆదేశించారు. ఇందిరమ్మ బిల్లుల చెల్లింపులో నిర్లక్ష్యం వద్దని సూచించారు. లబ్ధిదారుల ఇబ్బందులు తెలుసుకొని పనులు పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు. అనంతరం ప్రాథమిక పాఠశాలను సందర్శించి ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. బడికి వచ్చిన తర్వాత మొబైల్ పక్కనపెట్టాలని, విద్యార్థులను తీర్చిదిద్దడంపైనే దృష్టి సారించాలన్నారు. అలాగే పంచాయతీ కార్యాలయంలో రికార్డులను పరిశీలించడంతో పాటు గవ్వలపల్లి ఫర్టిలైజర్ దుకాణంలో తనిఖీలు నిర్వహించారు. ఆయన వెంట తహసీల్దార్ మాలతి, ఎంపీడీఓ దామోదర్, ఆర్ఐ రాజు, గ్రామ కార్యదర్శి శైలజ ఉన్నారు. -
రైతులు ఇబ్బంది పడొద్దు
ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి చిన్నశంకరంపేట(మెదక్): కేసీఆర్ హయాంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా గో దాంలు నిర్మిస్తే ఇప్పుడున్న ప్రభుత్వం ఒక్క గోదాం కూడా నిర్మించలేదని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి విమర్శించారు. శుక్రవారం నార్సింగి మండల కేంద్రంలో ఐకేపీ, పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులపై సవతి తల్లి ప్రేమ చూపుతుందన్నారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ధాన్యం కొనుగోలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ ఆకుల సుజాతగౌడ్, తహసీల్దార్ గ్రేసిబాయి, ఐకేపీ సీసీ సృజన్కుమార్రెడ్డి, సీసీలు శ్రీనివాస్గౌడ్, శోభ, పీఏసీఎస్ సీఈఓ నర్సింహులు, మాజీ జెడ్పీటీసీ కృష్ణారెడ్డి, బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు బాబు తదితరులు పాల్గొన్నారు. -
అవినీతి రహితంగా పనిచేయండి
నారాయణఖేడ్: పార్టీలకతీతంగా, అవినీతి రహితంగా ప్రజలకు సేవలు అందించాలని ఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి అధికారులకు సూచించారు. ఖేడ్ క్యాంపు కార్యాలయంలో ఆర్డబ్ల్యూఎస్, విద్యుత్తుశాఖల అధికారులతో గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రైతుల ట్రాన్స్ఫార్మర్లకు సంబంధించి అధికారులు రైతుల వద్ద డబ్బులు తీసుకుని డీడీలు చెల్లించడం ఏమిటని, రైతులే నేరుగా బ్యాంకుల్లో చెల్లిస్తారు కదా అని ప్రశ్నించారు. విద్యుత్ కాంట్రాక్టర్ల ఇళ్ల వద్ద విద్యుత్ సామగ్రి డంప్లు ఉండటం పట్ల అసహనం వ్యక్తం చేశారు. కార్యాలయంలోనే సామగ్రి ఉంచి ఏడీఈ బాధ్యతగా రైతులకు అందించాలని ఆదేశించారు. డీడీలు కట్టిన రైతులకు కొన్ని స్తంభాలు వైర్లు ఇచ్చి ట్రాక్టర్లు మిగితావి అమ్ముకుంటున్నట్లు తన దృష్టికి వచ్చినట్లు తెలిపారు. ఇకనుంచి అలాంటివి జరగకుండా చూడాలన్నారు. వేసవి కాలం దృష్ట్యా ప్రజలకు తాగునీరు, రైతులకు విద్యుత్ సమస్యలు లేకుండా చూడాలన్నారు. సమీక్షలో విద్యుత్శాఖ ఎస్ఈ సుధీర్ కుమార్, డీఈ శ్రీనివాసులు, ఏడీఈ నాగిరెడ్డి, ఆర్ డబ్ల్యూఎస్ డీఈఈ ఫణివర్మ, ఆయాశాఖల ఏఈలు పాల్గొన్నారు.ఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి -
అంగన్వాడీ టీచర్పై దాడి ఘటనలో విచారణ
● తీవ్రంగా పరిగణించిన అధికారులు ● టీచర్ ప్రమేయం లేకపోయినా అన్యాయంగా దాడి చేసినట్లు నిర్ధారణ కంగ్టి(నారాయణఖేడ్): ఖేడ్ ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని కంగ్టి సెక్టార్ రాసోల్ గ్రామంలోని అంగన్వాడీ టీచర్ వసంతకుమారిపై గ్రామస్తుల దాడి ఘటనపై జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిణి లలితా కుమారి ఆదేశాల మేరకు గురువారం సీడీపీఓ సుజాత, సూపర్వైజర్ సుజాత ఘటనా స్థలంలో విచారణ చేపట్టారు. ఈ ఘటనతో టీచర్కు ప్రత్యక్ష సంబంధంలేదని తేలింది. ఘటనను తీవ్రంగా పరిగణించిన అధికారులు దాడికి పాల్పడిన వారిపై కంగ్టి పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. అన్యాయంగా టీచర్పై దాడి చేసినట్లు అధికారులు నిర్ధారించి ఉన్నతాధికారులకు విచారణ నివేదిక సమర్పించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఉద్యోగులపై, మహిళలపై దాడులు చేసిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. దాడిచేసిన వారిపై చర్యలు తీసుకోవాలి మండలంలోని రాసోల్ గ్రామంలో అంగన్వాడీ టీచర్పై దాడిచేసిన ఐదుగురిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బ్రాహ్మణ సంఘం సంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి వినోద్ పటేల్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఖేడ్ నియోజక వర్గం అధ్యక్షుడు బొజ్జి రమేశ్, కోశాధికారి చంద్రకాంత్, కంగ్టి అధ్యక్షులు వెంకట్రావు, పీఆర్ఓ సుదర్శన్రావు, సభ్యులు రాఘవేందర్రావు సీఐ వెంకట్రెడ్డికి గురువారం వినతి పత్రం అందజేశారు. -
నడక.. నరకమే!
● యథేచ్ఛగా ఫుట్పాత్ల ఆక్రమణ ● పాదచారులకు తప్పని తిప్పలు ● పట్టించుకోని పాలకవర్గం, అధికారులుమెదక్ కలెక్టరేట్: అసలే ఇరుకు రోడ్లు.. ఆపై ఉన్న కొద్దిపాటి ఫుట్పాత్లు యథేచ్ఛగా ఆక్రమణకు గురికావడంతో పాదచారులకు ఇబ్బందులు తప్పడం లేదు. రోడ్డుకు ఇరువైపులా ఉన్న దుకాణదారులు ఫుట్పాత్లను ఆక్రమించి వ్యాపారాలు కొనసాగిస్తున్నా, అధికారులు, పాలకవర్గం పట్టించుకోవడం లేదు. కొందరు తాత్కాలికంగా వ్యాపారాలు నిర్వహిస్తుండగా, మరికొందరు పర్మనెంట్గా నిర్మాణాలు చేసుకొని వినియోగించుకుంటున్నారు. ఏళ్ల తరబడి ఇదే తంతు జరుగుతున్నా, ఎవరూ పట్టించుకున్న పాపానపోలేదు. ప్రస్తుతం మెదక్ పట్టణంలో రోడ్ల మరమ్మతులు, కల్వర్టుల నిర్మాణాలు జరుగుతున్నాయి. దీంతో ఒకవైపు నుంచే వాహనాలను అనుమతిస్తున్నారు. దీంతో ట్రాఫిక్ తీవ్రంగా పెరిగింది. ఫలితంగా పాదచారులు రోడ్డు వెంట నడవాలంటే ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికై నా ఆక్రమణల నుంచి ఫుట్పాత్లను రక్షించి పాదచారులకు దారి కల్పించాలని ప్రజలు కోరుతున్నారు. -
కేసీఆర్ చొరవ.. రైతులకు ఊరట
ములుగు(గజ్వేల్): ఎండిపోతున్న పంట పొలాల సంరక్షణకు చర్యలు చేపట్టాలన్న రైతుల విజ్ఞప్తిపై మాజీ సీఎం కేసీఆర్ స్పందించారు. కొండపోచమ్మ కాలువ ద్వారా కర్కపట్ల, కొట్యాల, అల్లీనగర్, అడవిమజీద్, నర్సంపల్లి, క్షీరసాగర్, జప్తిసింగాయిపల్లి గ్రామాలకు నీటిని విడుదల చేసి సంరక్షించాలని ఇరిగేషన్ అధికారులను కేసీఆర్ ఆదేశించారు. ఉమ్మడి మెదక్ జిల్లా డీసీసీబీ మాజీ డైరెక్టర్ బట్టు అంజిరెడ్డి గురువారం రైతుల వేదనను కేసీఆర్ దృష్టికి తీసుకు వెళ్లిన వెంటనే ఆయన చొరవ తీసుకుని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఇరిగేషన్ ఈఈ శ్రీనివాస్, డీఈ అంజలి, ఎఈ లు మాజీ డీసీసీబీ డైరెక్టర్ అంజిరెడ్డితో కలిసి సుమారు 20 కిలోమీటర్ల మేర కాలువను పరిశీలించారు. శుక్రవారం ఆయా గ్రామాల పంట పొలాలకు సాగునీరందేలా నీటిని విడుదల చేస్తామని ఇరిగేషన్ అధికారులు పేర్కొన్నట్లు అంజిరెడ్డి తెలిపారు. సాగు నీటి విడుదలకు కేసీఆర్ చొరవ తీసుకుని సమస్య పరిష్కరించడంపై ఆయా గ్రామాల రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఎండుతున్న పంటల సంరక్షణకు ఆదేశం -
రైతులకు నాణ్యమైన విద్యుత్
కౌడిపల్లి(నర్సాపూర్): రైతులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసేందుకు విద్యుత్శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. గురువారం నర్సాపూర్ ఏడీ రమణారెడ్డి, ఏఈ సాయికుమార్ మండలంలోని వెంకట్రావుపేట, రాజిపేట సబ్స్టేషన్లను పరిశీలించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. సబ్స్టేషన్లో ట్రాన్స్ఫార్మర్ వద్ద లో ఓల్టేజీ కారణాలను పరిశీలించి ఎంఆర్టీంను పిలిపించి సరిచేశామన్నారు. రైతులు సమస్యలు ఏర్పడితే చెప్పాలన్నారు. కార్యక్రమంలో లైన్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, లైన్మెన్లు మహేశ్, పోచయ్య, ఎంఆర్టీ కల్యాణ్ తదితరులు పాల్గొన్నారు.


