breaking news
Medak
-
మక్కరైతు విలవిల
● జిల్లాలో ఒక కొనుగోలు కేంద్రమే దిక్కు ● నాణ్యత ఉంటేనే కొంటామని షరతు ● ఇదే అదనుగా వ్యాపారుల దోపిడీ మక్క రైతులకు తీరని కష్టమొచ్చింది. అధిక వర్షాలతో పంట దిగుబడి పూర్తిగా తగ్గిపోయింది. ఉన్న పంటను అమ్ముకోవడానికి అష్టకష్టాలు పడాల్సి వస్తోంది. ఈక్రమంలోనే మార్క్ఫెడ్ వైఖరి గోటి మీద రోకటి పోటులా మారింది. వర్షాలతో రంగు మారిన మొక్కజొన్నలను తీసుకోకపోవడంతో తక్కువ ధరకే దళారులకు విక్రయించాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇదే అదనుగా వ్యాపారులు రైతులను నిండా ముంచుతున్నారు. – రామాయంపేట(మెదక్) జిల్లా పరిధిలో మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో రామాయంపేట, నర్సాపూర్, తూప్రాన్లో మూ డు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు మొదట్లో ప్రకటించిన అధికారులు, తర్వాత మాట మార్చారు. వారం రోజుల క్రితం రామాయంపేటలో మాత్రమే కొనుగోలు కేంద్రం ప్రారంభించినా, ఇప్పటి వరకు గింజ కూడా కొనుగోలు చేయలేని పరిస్థితి నెలకొంది. వర్షాలకు పంట దెబ్బతిని రంగు మారి నాణ్యత దెబ్బతిన్న మక్కలను మార్క్ఫెడ్లో తీసుకోకపోడంతో రైతులు దళారులను ఆశ్రయిస్తూ నష్టపోతున్నారు. నాణ్యతగా ఉన్న మొక్కజొన్నలను మాత్రమే తీసుకుంటామని అధికారులు చెబుతుండగా, రైతులు మార్క్ఫెడ్కు విక్రయించలేని పరిస్థితి నెలకొంది. ఎకరాకు కనీసం 20 నుంచి 25 క్వింటాళ్ల దిగుబడి వస్తుండగా, అధికారులు కేవలం 18 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేస్తామని చెబుతున్నారు. మిగితా మక్కలు ఎక్కడ అమ్ము కోవాలో తెలియని పరిస్థితుల్లో రైతులు ఆందోళన చెందుతున్నారు. మొక్కజొన్నలకు ప్రభుత్వ మద్దతు ధర రూ. 2,400 ఉండగా, వ్యాపారులు కేవలం రూ. 1,800 వందల లోపే తీసుకుంటున్నారు. దీనికి తోడు క్వింటాల్కు 2 నుంచి 3 కిలోల మేర తరుగు తీస్తున్నా రు. విధిలేని పరిస్థితుల్లో రైతులు వారికి విక్రయిస్తున్నారు. గతంలో గ్రేడ్ల వారీగా కొనుగోలు ఐదారేళ్ల క్రితం వర్షాలతో మొక్కజొన్న పంట దెబ్బతిని మక్కలు రంగుమారగా, వాటిని తీసుకోవడానికి మార్క్ఫెడ్ అంగీకరించలేదు. దీంతో జిలాల్లో పెద్ద సంఖ్యలో రైతులు ఆందోళన చేపట్టారు. దిగొచ్చిన అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రేడ్ల వారీగా మక్కలను కొనుగోలు చేసింది. ప్రస్తుతం కూడా గ్రేడ్ల వారీగా కొనుగోలు చేయా లని రైతులు విజ్ఞప్తి చేశారు. తీవ్రంగా నష్టపోయాం భారీ వర్షాలతో మొక్కజొన్న పంట దెబ్బతింది. దీంతో మక్కులు రంగుమారాయి. పెట్టిన పెట్టుబడులు సైతం నష్టపోయాం. ఆదుకుంటామన్న అధికారులు పత్తాలేరు. విధిలేని పరిస్థితుల్లో దళారులకు తక్కువ ధరకు విక్రయించాం. – స్వామి, రైతు, శివాయపల్లి కొనుగోలు కేంద్రాలు పెంచాలి ప్రైవేట్ వ్యాపారులు మక్క రైతులను ముంచుతున్నారు. వడ్ల మాదిరిగా ప్రభుత్వమే మార్క్ఫెడ్ ద్వారా మండలాల వారీగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మక్కలను కొనుగోలు చేయాలి. ఈసారి పంట సాగు చేసి నష్టపోయాం. – నాగులు, రైతు, నర్సంపల్లి -
ప్రజలను వేధిస్తే ఊరుకోను
రామాయపేట(మెదక్): అభివృద్ధి పనుల విషయమై ఎవరూ అడ్డుకున్నా చర్యలు తీసుకుంటామని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ హెచ్చరించారు. మండలంలోని దంతేపల్లి సుభాశ్ తండాలో ఇటీవల మృతిచెందిన ప్రకా శ్ కుటుంబ సభ్యులను మంగళవారం పరామర్శించారు. అటవీ బీట్ అధికారి తప్పుడు కేసు లు నమోదు చేసి తమను వేధింపులకు గురిచేస్తున్నారని తండా వాసులతో పాటు కాట్రియాల గ్రామస్తులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఎమ్మెల్యే ఫోన్ చేసి సదరు అధికారిని తీవ్రస్థాయిలో మందలించారు. పద్ధతి మార్చుకోకపోతే ఊరుకోనని హెచ్చరించారు. ఎమ్మెల్యే వెంట పీసీసీ కార్యదర్శి సుప్రభాతరావు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రమేశ్రెడ్డి, తండావాసులు కంలియా, రాంచందర్, పాండు, రాజు తదితరులు ఉన్నారు. నర్సాపూర్ రూరల్: మండలంలోని నారాయణపూర్ గిరిజన గురుకుల పాఠశాల, కళాశాల విద్యార్థులు ఇటీవల మెదక్, తూప్రాన్లో జరిగిన జిల్లాస్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు ఎంపికయ్యారు. రాష్ట్రస్థాయి అండర్–14 వాలీబాల్ బాలికల జట్టుకు 9వ తరగతి విద్యార్థినులు అఖిల, శ్రీజ, వైష్ణవి సెలక్ట్ అయ్యారు. అండర్–17 రబ్బి జట్టుకు ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థిని ఎన్. వందన, 9వ తరగతి విద్యార్థులు నందిని, సారిక, జిమ్నాస్టిక్స్ రాష్ట్రస్థాయికి మొదటి సంవత్సరం విద్యార్థిని వందన ఎంపికై ంది. జిల్లాస్థాయి అండర్ 17 అథ్లెటిక్స్కు 9వ తరగతి విద్యార్థిని హర్షిని 1,500 మీటర్ల పోటీలో గెలుపొందింది. ఎంపికై న విద్యార్థులను మంగళవారం ప్రిన్సిపాల్ లలితాదేవి, పీడీ సాలి, అధ్యాపక బృందం విద్యార్థులు అభినందించారు. పాపన్నపేట(మెదక్): జిల్లాలో వినియోగదారులకు ఇబ్బంది కలుగకుండా నిరంతర విద్యుత్ సరఫరా చేస్తామని ఎస్ఈ నారాయణ నాయక్ అన్నారు. విద్యుత్ శాఖ ప్రజాబాట కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఆయన పాపన్నపేటలో పర్యటించారు. విద్యుత్ సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. గ్రామంలోని ట్రాన్స్ఫార్మర్లను పరిశీలించారు. వాటి వద్ద పెరిగిన పిచ్చి మొక్కలను తొలగింపజేశారు. వదులుగా ఉన్న విద్యుత్ లైన్లకు మరమ్మతులు చేయాలన్నారు. ఆయన వెంట ఎస్ఏఓ మార్తయ్య, ఏడీఈ మోహన్బాబు, ఏఈ నర్సింలు, సబ్ ఇంజనీర్ సాయికుమార్, సిబ్బంది ఉన్నారు. మెదక్ కలెక్టరేట్: బాలికలపై అత్యాచారాలను అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ పోక్సో చట్టంపై అవగాహన కలిగి ఉండాలని వైద్య విద్యాశాఖ అదనపు డైరెక్టర్ సునీతాదేవి పేర్కొన్నారు. మంగళవారం పిల్లికోటాల్లో గల మాతా శిశు ఆస్పత్రిలో పోక్సో చట్టంపై ప్లాన్ ఇండియా, మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లు సంయుక్తంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సునీతాదేవి హాజరై మాట్లాడారు. ప్లాన్ ఇండియా సహకారంతో నిర్వహిస్తున్న ఈ వర్క్షాప్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో పలు విభాగాల వైద్యులు పాల్గొన్నారు. -
15న లోక్ అదాలత్: ఎస్పీ
మెదక్ మున్సిపాలిటీ: పెండింగ్లో ఉన్న కేసులను వేగంగా పరిష్కరించేందుకు ప్రతి పోలీస్ అధికారి బాధ్యతతో వ్యవహరించాలని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు సూచించారు. మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా పోలీస్ అధికారులు, కోర్ట్ డ్యూటీ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెండింగ్ కేసులను పరిష్కరించేందుకు న్యాయవ్యవస్థతో సమన్వయం అవసరమన్నారు. అనంతరం జిల్లాలోని ఆయా పోలీస్స్టేషన్ల వారీగా పెండింగ్లో ఉన్న కేసుల వివరాలను సమీక్షించారు. ఇందులో రాజీ పడదగిన కేసులను గుర్తించి ఈనెల 15న నిర్వహించనున్న లోక్ అదాలత్లో పరిష్కారమయ్యేలా కృషి చేయాలని సూచించారు. సమావేశంలో అద నపు ఎస్పీ మహేందర్, డీఎస్పీలు ప్రసన్నకుమార్, నరేందర్గౌడ్, సిబ్బంది పాల్గొన్నారు. -
‘కపాస్ కిసాన్’పై అవగాహన కల్పించాలి
కలెక్టర్ రాహుల్రాజ్ టేక్మాల్(మెదక్): గ్రామాల్లోని రైతులకు కపాస్ కిసాన్ యాప్పై అవగాహన కల్పించాలని వ్యవసాయాధికారులను కలెక్టర్ రాహుల్రాజ్ ఆదేశించారు. మంగళవారం టేక్మాల్ రైతు వేదికలో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శంకరంపేట్ డివిజన్ పరిధిలో మొత్తం 21,193 మంది రైతులు 34,903 ఎకరాల్లో పత్తి పంట సాగు చేశారని తెలిపారు. ప్రతి గ్రామంలో రైతులకు వ్యవసాయ అధికారులు యాప్పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. దళారులకు పంటను అమ్మి మోసపోకుండా కపాస్ యాప్లో స్లాట్ బుక్ చేసుకొని జిన్నింగ్ మిల్లుకు తీసుకెళ్లి మద్దతు ధర పొందాలని సూచించారు. పత్తి కొనుగోలు కేంద్రాలను మానిటరింగ్ చేసేందుకు ఏఎంసీల వారీగా లోకల్ కమిటీలను నియమించాలన్నారు. లీగల్ మెట్రాలాజీ అధికారులు తేమ కొలిచే యంత్రాలను పరిశీలించాలన్నారు. సీసీఐ అధికారుల పర్యవేక్షణ ఉండాలని, అగ్ని ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అనంతరం కలెక్టర్ జాతీయ ఆహార భద్రత పథకం కింద జొన్న విత్తనాలని 100% రాయితీపై రైతులకి అందించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి దేవ్కుమార్, ఇన్చార్జి ఏడీఏ రాంప్రసాద్, తహసీల్దార్ తులసీరాం, ఏపీఎం గోపాల్, ఆయా మండలాల వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులు, రైతులు పాల్గొన్నారు. -
పౌష్టికాహారం ప్రభుత్వ పథకం కాదు
● ఆశ్రమ పాఠశాలల్లో మెనూపాటించడం లేదు ● అక్షయపాత్ర సంస్థ సమాధానం చెప్పాలి ● ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్రెడ్డి మెదక్ కలెక్టరేట్/నర్సాపూర్/నర్సాపూర్ రూరల్/కౌడిపల్లి: పౌష్టికాహారమనేది ప్రభుత్వ పథకం కాదు.. అది రాజ్యాంగ హక్కు అని ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్రెడ్డి అన్నారు. మంగళవారం జిల్లాలో ఫుడ్ కమిషన్ సభ్యులతో కలిసి విస్తృతంగా పర్యటించారు. మొదట నర్సాపూర్, కౌడిపల్లి మండలాల్లో పర్యటించి రేషన్ దుకాణాలు, హాస్టళ్లు, అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేశారు. అనంతరం ఏడుపాయల దుర్గమ్మను దర్శించుకున్నారు. అలాగే మెదక్ చర్చిని సందర్శించారు. అనంతరం కలెక్టరేట్లో కలెక్టర్ రాహుల్రాజ్, అదనపు కలెక్టర్ నగేష్, ఇతర జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అక్షయపాత్ర నుంచి వచ్చే మధ్యాహ్న భోజనం పాఠశాలలకు వచ్చే సరికి చల్లారిపోయి గడ్డలుగా మారుతుందన్నారు. ఆ ఆహారాన్ని విద్యార్థులు ఎవరూ సరిగా తినడం లేదని, దీనిపై అక్షయపాత్ర సంస్థ సమాధానం చెప్పాలన్నారు. ఆశ్రమ పాఠశాలలో మెనూ పాటించడం లేదని, నాన్వెజ్ పిల్లలకు అందడం లేదని ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపారు. జిల్లాలో ఉన్న దాదాపు లక్ష మంది విద్యార్థులకు అన్నిరకాల ఆరోగ్య పరీక్షలు చేసి రిపోర్ట్ అందించాలని ఆదేశించారు. రేషన్ షాపుల్లో ఫిర్యాదుల బాక్స్లతో పాటు అధికారుల ఫోన్ నంబర్లు నోటీస్ బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. అంత్యోదయ కా ర్డులకు చక్కెర ఇవ్వడం లేదని, తూకంలో తేడాలు ఉన్నాయని, ఎంఎల్ఎస్ పాయింట్లో సిబ్బంది సరిగా ప్రవర్తించడం లేదని రాతపూర్వక ఫిర్యా దులు అందాయన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు ఇచ్చే గుడ్డు సైజు చాలా చిన్నగా ఉందన్నారు. రెడ్డిపల్లి హైస్కూల్లో మధ్యాహ్న భోజనం సరిగా లేదని, నిర్వాహకులకు నోటీసులు ఇచ్చి రాతపూర్వక సమాధానం ఇవ్వాలన్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ఫుడ్ కమిషన్ చైర్మన్, సభ్యులు చేసిన ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తామని తెలిపారు. -
పొంచి ఉన్న నీటి గండం!
మెతుకుసీమ ప్రజలకు తాగునీటి వెతలు తప్పేటట్టు లేదు. వేలాది ఎకరాలకు సాగు నీటితో పాటు తాగునీరు అందించే సింగూరు ప్రాజెక్టుకు మరమ్మతులు చేపట్టాలని ప్రభుత్వ నిర్ణయించింది. ఈమేరకు డ్యాం సేఫ్టీ అధికారులు సైతం సూచించారు. దీంతో డ్యాం నుంచి నీటిని ఖాళీ చేసే పరిస్థితి నెలకొంది. ఫలితంగా జిల్లాకు తాగునీటి ఎద్దడి రాకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని పలువురు ఇటీవల కలెక్టర్ను కలిసి వినతిపత్రం అందించారు. – మెదక్జోన్ జిల్లా ప్రజలకు శ్వాశ్వతంగా తాగునీటిని అందించాలనే ఉద్దేశంతో 2018లో రూ. 330 కోట్లు వెచ్చించి సింగూరు నుంచి 943 కిలోమీటర్ల మేర పైప్లైన్, 16 హౌస్లు, 6 సంపులు, 10 ఓహెచ్ఆర్ ట్యాంకులు నిర్మించారు. అంతేకాకుండా మరో రూ. 9 కోట్లు వెచ్చించి పుల్కల్ మండలం పెద్దరెడ్డిపేట్ వద్ద నీటిశుద్ధి ప్లాంట్ను నిర్మించారు. అక్కడి నుంచి మెదక్, ఆందోల్, నర్సాపూర్ మూడు సెగ్మెంట్ల ద్వారా జిల్లాకు తాగునీటిని అందిస్తున్నారు. మెదక్ జిల్లాలోని 492 గ్రామాలతో పాటు మెదక్, నర్సాపూర్, రామాయంపేట, తూప్రాన్ మున్సిపాలిటీలకు సైతం ఈ ప్రాజెక్టు నుంచే తాగునీరు సరఫరా చేస్తున్నారు. తూప్రాన్, మనోహరాబాద్, చేగుంట మండలాలకు మాత్రం గజ్వేల్ సెగ్మెంట్ నుంచి తాగునీరు అందుతోంది. కాగా సింగూరు నుంచి ప్రతిరోజు జిల్లాకు 85– 90 ఎంఎల్డీ (మిలియన్ లీటర్స్ ఫర్డే) తాగు నీరు సరఫరా అవుతోంది. ఈ లెక్కన ఏడాదికి 1.7 టీఎంసీలతో జిల్లా ప్రజల దాహార్తిని తీరుస్తోంది. కాగా ప్రాజెక్టు సామర్థ్యం 29 టీఎంసీలు కాగా, అందులో 16 టీఎంసీలకు పైగా నీరు ఉంటేనే తాగునీరు విడుదల చేసే అవకాశం ఉంటుందని మిషన్ భగీరథ అధికారులు చెబుతున్నారు. దీంతో జిల్లాకు తాగునీటి సమస్య ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది. సింగూర్ ప్రాజెక్టుకు మరమ్మతులు చేస్తే జిల్లా ప్రజలకు తాగునీటి ఎద్దడి రాకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసేందుకు సంబంధిత అధికారులు అంతర్గతంగా ప్రయత్నాలు చేస్తునట్లు తెలిసింది. ప్రస్తుతం ఉన్నతాధికారుల నుంచి ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ఆదేశాలు రానప్పటికీ ప్రజలకు తాగునీటిని అందించే మార్గాలు అన్వేషిస్తున్నారు. 2019– 20లో సింగూరు ప్రాజెక్టులో నీటి నిల్వలు అడుగంటాయి. అప్పట్లో జిల్లా ప్రజల దాహం తీర్చేందుకు జిల్లాలోని హవేళిఘణాపూర్ మండలం సర్దన శివారులోని మంజీరా నదిలో ఏర్పాటు చేసిన సంప్హౌస్ (ఎల్ఎన్టీ), మెదక్ పట్టణ పరిధిలో గల సంప్హౌస్, పాపన్నపేట మండల పరిధిలో గల మంజీరాలో ఏర్పాటు చేసిన సంప్హౌస్లతో పాటు ఆయా గ్రామాల్లోని బోరుబావుల ఆధారంగా ప్రజలకు తాగునీటిని అందించారు. సింగూరుకు మరమ్మతులు ప్రారంభిస్తే అప్పటిలాగే తాగు నీటిని అందించాలనే దిశగా మిషన్ భగీరథ అధికారులు యోచిస్తున్నట్లు తెలిసింది. మెతుకుసీమ దాహార్తి తీరేదెలా? జిల్లాకు నిత్యం 85 ఎంఎల్డీ సరఫరా ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో అధికారులు -
కొనుగోళ్లు వేగవంతం చేయండి
కౌడిపల్లి(నర్సాపూర్)/చిలప్చెడ్: వాతావరణ మార్పుల నేపథ్యంలో రైతులకు నష్టం కలగకుండా ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్ నగేశ్ నిర్వాహకులను ఆదేశించారు. మంగళవారం మండలంలోని ముట్రాజ్పల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ధాన్యం తూకంతో పాటు రికార్డులు పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వర్షాలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని, ధాన్యం కొనుగోలు వేగవంతం చేసి త్వరగా రైస్మిల్కు తరలించాలని ఆదేశించారు. సమస్యలుంటే తెలియజేయాలని సూచించారు. అనంతరం చిట్కుల్ గ్రామ శివారులోని కేజీబీవీని సందర్శించారు. పాఠశాల ఆవరణ, విద్యార్థుల బోధనా నైపుణ్యాలను, వంటగదిని పరిశీలించారు. మౌలిక వసతుల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సరైన చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో కేజీబీవీ ప్రత్యేక అధికారి అంజలి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అదనపు కలెక్టర్ నగేశ్ -
అవినీతిని ఉపేక్షించేది లేదు
● అధికారులతో కలెక్టర్ రాహుల్రాజ్ ● ప్రజావాణిలో వినతుల స్వీకరణమెదక్ కలెక్టరేట్: ఎట్టి పరిస్థితిల్లో అవినీతిని ఉపేక్షించేది లేదని, ఆ ఆలోచన ఉంటే వెంటనే విరమించుకోవాలని కలెక్టర్ రాహుల్రాజ్ అధికారులను హెచ్చరించారు. సోమవారం కలెక్టరేట్లో జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల వద్ద నుంచి డబ్బులు తీసుకోవడం సరికాదన్నారు. అవినీతిని అంతమొందించకపోతే అది అందరిని ప్రభావితం చేస్తుందన్నారు. జిల్లాలోని అన్ని శాఖలపై ప్రత్యేక దృష్టి సారించానని, ఆరోపణలు ఎదుర్కొన్న వారిని ఉపేక్షించేది లేదన్నారు. అంతకుముందు ప్రజావాణిలో వినతులు స్వీకరించా రు. మొత్తం 77 అర్జీలు రాగా, భూభారతి 36, ఇందిరమ్మ ఇళ్లు 7, పెన్షన్లు 7, ఇతర సమస్యలపై 27 వినతులు వచ్చాయి. అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేశ్, జెడ్పీసీఈఓ ఎల్లయ్య, డీఆర్డీఏ పీడీ శ్రీనివాసరావు, డీఆర్ఓ భుజంగరావు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. కొనుగోలు కేంద్రం తనిఖీ కౌడిపల్లి(నర్సాపూర్)/మెదక్ కలెక్టరేట్: కొనుగోలు కేంద్రాల వద్ద టార్పాలీన్లు, ప్యాడీ క్లీనర్లు, తేమ యంత్రాలు అందుబాటులో ఉంచుకోవాలని కలెక్టర్ రాహుల్రాజ్ తెలిపారు. సోమవారం సాయంత్రం మండలంలోని నాగ్సాన్పల్లిలో డీసీఎంఎస్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా ధాన్యంలో తేమశాతం తనిఖీ చేశారు. ధాన్యం బస్తాలు డీసీఎంలో లోడింగ్ అవుతుండగా పరిశీలించారు. అలాగే పశుసంవర్ధక శాఖ మంత్రి వాకాటి శ్రీహరి హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. ఈనెల 20 నాటికి లక్ష్యం పూర్తయ్యేలా చేప పిల్లల విడుదల పూర్తి చేయాలని సూచించారు. చేప పిల్లలు చెరువులకు చేరేలా అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. -
సబ్సిడీపై మొక్కజొన్న విత్తనాలు
ఏడీఏ రాజ్నారాయణరామాయంపేట(మెదక్): రైతులకు సబ్సిడీపై మొక్కజొన్న విత్తనాలను పంపిణీ చేస్తున్నట్లు ఇన్చార్జి వ్యవసాయ సహాయ సంచాలకులు రాజ్నారాయణ తెలిపారు. సోమవారం మండలంలోని కోనాపూర్లో ఆయన మాట్లాడుతూ.. వరికి ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటలు సాగు చేయడాన్ని ప్రోత్సహిస్తూ.. మొక్కజొన్న సాగు విస్తరణకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. రైతులకు పంట విత్తనం దశ నుంచి కోత దశ వరకు అన్ని సాంకేతిక అంశాలపై అవగాహన కల్పించేందుకు సదస్సులు, శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. మొక్కజొన్న పంటపై అవగాహనతో పాటు సబ్సిడీపై విత్తనాల పంపిణీ చేస్తున్నామన్నారు. జాతీయ విత్తనాభివృద్ధి సంస్థ రూపొందించిన మొక్కజొన్న పంట కాలం 115– 120 రోజుల మధ్యలో పూర్తవుతుందన్నారు. యాసంగి సీజన్్కు అనుకూలంగా ఉండే చీడపీడలను తట్టుకొని అధిక దిగుబడి ఇస్తుందన్నారు. కార్యక్రమంలో వ్యవసా య విస్తరణ అధికారి ప్రవీణ్ కుమార్, రైతులు పాల్గొన్నారు. -
ఆ కంపెనీపై చర్యలు తీసుకోండి
మనోహరాబాద్ మండలం కాళ్లకల్లో గల టీఎం టైర్స్ సంస్థ చిన్న షెడ్డు నిర్మాణానికి అనుమతి తీసుకొని పెద్దఎత్తున నిర్మాణాలు చేపట్టి పన్నులు, విద్యుత్ బిల్లులు చెల్లించడం లేదని గ్రామస్తులు ప్రజావాణిలో కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే రిజిస్ట్రేషన్లు కొనసాగుతున్నాయని, ఆ భూములను ప్రొహిబిటెడ్ లిస్టులో పెట్టాలని, కంపెనీ డైరెక్టర్లపై చర్యలు తీసుకోవాలని కోరారు. కల్లు డిపో తొలగించండి పాపన్నపేట మండలం కొడుపాక హనుమాన్ ఆలయం పక్కన ఏర్పాటుచేసిన కల్లు డిపోను వెంటనే తొలగించాలని గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. ఆలయానికి వచ్చే భక్తులకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఆలయ పరిసరాలను అపరిశుభ్రం చేస్తున్నారని వాపోయారు. మరోవైపు మురికి కాల్వను సైతం పూడ్చారన్నారు. -
15 రోజుల్లో సమస్యలన్నీ పరిష్కరిస్తాం
● వినియోగదారుల సదస్సుకు విశేష స్పందన ● ఎస్ఈ నారాయణ నాయక్ మెదక్ కలెక్టరేట్: జిల్లాలో సోమవారం నిర్వహించిన విద్యుత్ వినియోగదారుల సదస్సుకు విశేష స్పందన లభించిందని, సమస్యలన్నీ 15 రోజుల్లో పరిష్కరిస్తామని విద్యుత్ శాఖ ఎస్ఈ నారాయణనాయక్ పేర్కొన్నారు. మెదక్ సబ్ డివిజన్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన సదస్సులో ఆయన పాల్గొని దరఖాస్తులు స్వీకరించారు. ఈసందర్భంగా ఎస్ఈ మాట్లాడుతూ.. జిల్లావ్యాప్తంగా 102 ఆర్జీలను స్వీకరించినట్లు తెలిపారు. ఇందులో మెదక్ సబ్ డివిజన్ పరిధిలో 28, నర్సాపూర్లో 16, పాపన్నపేటలో 20, తూప్రాన్లో 23, రామాయంపేటలో 15 అర్జీలు వచ్చాని చెప్పారు. సదస్సులో వచ్చిన సమస్యలన్నీ పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామన్నారు. వీటిల్లో అత్యధికంగా ఇళ్లపై విద్యుత్ తీగలు ఉండటం, కేటగిరీల్లో మార్పులు, విద్యుత్ స్తంభాలు ప్రమాదకరంగా ఉండటంతో పాటు తీగలను మార్చాలని, మీటర్ రీడింగ్ బిల్లులు తప్పుగా వస్తున్నాయని, మీటర్లు కాలిపోయాయని ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. ఫిర్యాదులలో 15 అక్కడికక్కడే పరిష్కరించామన్నారు. కార్యక్రమంలో మెదక్ ఇన్చార్జి డీఈ శ్రీనివాస్ విజయ్, ఏడీఈ మోహన్ బాబు, ఎంఆర్టీ డీఈ సోమేశ్వరరావు, విజిలెన్స్ డీఈ శ్రీనివాస్రెడ్డి, మెదక్ టౌన్ ఏఈ నవీన్, రూరల్ ఏఈ రాజ్కుమార్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
ఖేడ్ సమగ్రాభివృద్ధికి చర్యలు
ఎమ్మెల్యే సంజీవరెడ్డినారాయణఖేడ్: ఖేడ్ నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడుతున్నట్లు ఎమ్మెల్యే సంజీవరెడ్డి తెలిపా రు. సోమవారం రూ.40 లక్షల ఎండీఎఫ్ నిధులతో నిర్మించనున్న ఆరు కల్వర్టుల నిర్మాణాలకు భూమి పూజ నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఖేడ్లో సీసీతో రోడ్ల విస్తరణ, విశాలమైన మురుగు కాల్వలు, రోడ్ల మధ్యలో డివైడర్లు, మూడు చౌరస్తాల సుందరీకరణకు రూ. 16.38 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. మొదటి విడత హ్యామ్ కింద రోడ్లకు సంబంధించిన పలురోడ్ల విస్తరణ, బలోపేతానికి రూ.120 కోట్లు, పంచాయతీరాజ్ రోడ్లకు రూ. 56 కోట్లు, ఎస్డీఎఫ్ కింద పలు తండాలకు రోడ్ల కోసం రూ. 5 కోట్లు, అర్బన్ పార్కు కోసం రూ. 3.09 కోట్లు, డంప్యార్డులో ప్లాస్టిక్ రీసైక్లింగ్ యూనిట్ కోసం రూ. 40 లక్షలు మంజూరైనట్లు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జగ్జీవన్, మాజీ చైర్మన్ ఆనంద్ షెట్కార్, నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలి
మెదక్ ఎంపీ రఘునందన్ నర్సాపూర్: రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల నివారణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఎంపీ రఘునందన్రావు డిమాండ్ చేశారు. సోమ వారం పట్టణంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. మిర్జాగూడ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం దురదృష్టకరమన్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలన్నారు. మృతుల కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం, ఆర్టీసీ బాధ్యత తీసుకోవాలని కోరారు. పదేళ్లలో రాష్ట్రంలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో సుమారు 86 వేల మంది మృతి చెందారని, లక్ష మంది క్షతగాత్రులైనట్లు ఓ సర్వేలో వెల్లడైందని వివరించారు. రోడ్డు సేఫ్టీ అథారిటీకి చైర్మన్ను నియమించాలన్నారు. సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లేశ్గౌడ్, ఓబీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రమేశ్గౌడ్, నాయకులు బుచ్చెశ్యాదవ్, ఆంజనేయులుగౌడ్, నారాయణరెడ్డి, సతీష్యాదవ్, చంద్రయ్య, రాజు, రాంరెడ్డి పాల్గొన్నారు. పీఆర్టీయూ రాష్ట్ర అధికార ప్రతినిధిగా మహేందర్రెడ్డి మెదక్జోన్: పీఆర్టీయూ రాష్ట్ర అధికార ప్రతినిధిగా వంగ మహేందర్రెడ్డి నియామకయ్యారు. ఈమేరకు సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మేడి సతీశ్రావు, సౌమ్యానాయక్ హర్షం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా పోటీ చేసిన మహేందర్రెడ్డి యూనియన్ అభివృద్ధి కోసం చేసిన కృషి అభినందనీయమన్నారు. ఆయనను రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమించడం హర్షణీయం అన్నారు. 15న జాతీయ లోక్ అదాలత్ సంగారెడ్డి టౌన్: ఈనెల 15న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని, పెండింగ్ ఉన్న కేసులు పరిష్కరించుకోవడానికి న్యాయవాదులు సహకరించాల ని జిల్లా ప్రధాన న్యాయమూర్తి భవానిచంద్ర అన్నారు. సోమవారం జిల్లా కోర్టులో న్యాయవాదులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాజీ మార్గంతో కేసులను పరిష్కరించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా న్యాయవాదులు, కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నష్టపోయిన రైతులను ఆదుకోవాలి సంగారెడ్డి టౌన్: ఇటీవల కురిసిన వర్షాలకు నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని భారతీయ కిసాన్ సంఘ్ జిల్లా అధ్యక్షుడు నరసింహారెడ్డి అన్నారు. సోమవారం జిల్లా కార్యాలయంలో రైతులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వర్షాలతో పత్తి పంట పూర్తిగా దెబ్బతిందని, రైతులకు పెట్టుబడి రాక తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఎకరానికి రూ. 30 వేల నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే చెరుకు టన్నుకు రూ. 4,500 ప్రకటించాలన్నారు. సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రామకృష్టారెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కృష్ణారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. తాగునీటికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయండి మెదక్ కలెక్టరేట్: సింగూర్ ప్రాజెక్ట్ మరమ్మతులు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించినందు న సాగు, తాగునీటికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని మెదక్ సిటిజన్ ఫోరం నాయకులు సోమవారం కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. నీటిని పూర్తిగా తొలగిస్తారు కాబట్టి మెదక్, సంగారెడ్డి, హైదరాబాద్, కామారెడ్డి జిల్లాల్లో తాగు, సాగు నీటికి తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతాయని తెలిపారు. కావున ప్రత్యామ్నయ ఏర్పాటు చేయాలని విన్నవించారు. -
పాఠశాల విద్యార్థులకు పోటీలు
నారాయణఖేడ్: విద్యార్థుల్లో విద్యా నైపుణ్యం, సృజనాత్మకత, ఆరోగ్యకరమైన పోటీని ప్రొత్సహించేందుకు గాను ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలల్లోని విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ, క్విజ్ పోటీలను నిర్వహించనున్నారు. రాష్ట్ర సమాచార సాంకేతిక పరిజ్ఞానం, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ల విభాగం (సాఫ్ట్నెట్), టీ–శాట్ల సహకారంతో ఈ పోటీలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేపట్టారు. ఈనెల 13వ తేదీ వరకు వివిధ స్థాయిల్లో ఈ పోటీలు కొనసాగనున్నాయి. ఈనెల 1 నుంచి 4వ తేదీ వరకు మండల స్థాయిల్లో పాఠశాలల్లో పోటీలు నిర్వహించాలని పాఠశాలల విద్యా డైరెక్టర్ నుంచి ఆదేశాలు వచ్చాయి. ఈ ఉత్తర్వులు ఆలస్యంగా అందడంతో పాఠశాలల స్థాయిలో మంగళ వారం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేపట్టారు. వ్యాసరచన, వక్తృత్వం, క్విజ్ పోటీలకు అర్హత ప్రమాణాలు, ఎంపిక ప్రక్రియతో పాటు పోటీల వివరాలను విద్యాశాఖ అధికారులకు పంపించారు. విద్యాశాఖ నుంచి పాఠశాలల స్థాయికి ఆలస్యంగా ఈ ఉత్తర్వులు వెళ్లాయి. జిల్లా విద్యాశాఖ పరిధిలోని అన్ని ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో పోటీలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పోటీల్లో ఎక్కువ సంఖ్యలో విద్యార్థులు పాల్గొనేలా చూడాలని ఎంఈఓలు, పాఠశాలల హెచ్ఎంలను ఆదేశించారు. జిల్లాలో ప్రాథమికోన్నత పాఠశాలలు 191, ఉన్నత పాఠశాలలు 211 కొనసాగుతున్నాయి. వీటిల్లో 6 నుంచి పై తరగతుల విద్యార్థులకు ఈ పోటీలు నిర్వహించనున్నారు. వివిధ విభాగాల్లో.. పోటీలు మండల, జిల్లా, జోనల్, రాష్ట్ర స్థాయిలో వివిధ విగాల్లో నిర్వహించనున్నారు. ఈనెల 4వ తేదీ వరకు మండల స్థాయి పాఠశాలల్లో. 5వ తేదీ నుంచి 8 వరకు జిల్లా, 9, 10 తేదీల్లో జోనల్ స్థాయి (ఆన్లైన్లో)లో నిర్వహించనున్నారు. రాష్ట్ర స్థాయి ల్లో ఫైనల్స్ను ఈనెల 12, 13 తేదీల్లో హై దరాబాద్లోని టీ–శాట్ ప్రాంగణంలో నిర్వహించను న్నారు. వ్యాసరచన పోటీతో విద్యార్థుల్లో విషయం పట్ల సృజనాత్మకత పెరుగుతుంది. -
మంగళవారం శ్రీ 4 శ్రీ నవంబర్ శ్రీ 2025
● ఆకట్టుకున్న మాక్ పోలింగ్ చిన్నశంకరంపేట జెడ్పీ పాఠశాలలో సోమవారం నిర్వహించిన మాక్ పోలింగ్ ఆకట్టుకుంది. విద్యార్థులు ఓటర్లుగా.. ఎన్నికల సిబ్బందిగా.. పోలీసులుగా విధులు నిర్వర్తించి అలరించారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎన్నికలు నిర్వహించి ఫలితాలు ప్రకటించారు. 324 మంది విద్యార్థులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈసందర్భంగా హెచ్ఎం దీప్లారాథోడ్ మాట్లాడుతూ.. విద్యార్థులకు ఓటింగ్ ప్రక్రియపై అవగాహన కల్పించేందుకు మాక్ పోలింగ్ నిర్వహించినట్లు తెలిపారు. – చిన్నశంకరంపేట(మెదక్) -
విద్య, వైద్యానికి ప్రాధాన్యం
మంత్రులు దామోదర రాజనర్సింహ, పొంగులేటి శ్రీనివాస్రెడ్డిరామచంద్రాపురం(పటాన్చెరు): విద్య, వైద్యానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తుందని మంత్రులు దామోదర రాజనర్సింహ, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అన్నారు. సోమవారం తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని కొల్లూరు డబుల్ బెడ్రూం కాలనీలో వీఎస్టీ సంస్థ రూ.8 కోట్ల సీఎస్ఆర్ నిధులతో నిర్మిస్తున్న 60 గదుల పాఠశాల నిర్మాణం, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. కొల్లూరు ప్రభుత్వ డబుల్ బెడ్రూం కాలనీ రాష్ట్రానికే ఆదర్శంగా నిలుస్తుందన్నారు. కాలనీ వాసులు తెలిపిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులకు అప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేశారు. కాలనీ అభివృద్ధికి ఒక పటిష్టమైన ప్రణాళికతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. సంక్రాంతి వరకు కాలనీలో ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంతో పాటు రెండు 108 అంబులెన్స్లు ఇస్తున్నట్లు ప్రకటించారు. కాలనీలో పోలీస్ ఔట్పోస్ట్ ఏర్పాటుకు ఆదేశించినట్లు వివరించారు. ఈనెల 10 నుంచి ఇళ్ల వద్దకే రేషన్ బియ్యం అందిస్తామని పేర్కొన్నారు. -
వడ్లు ఎక్కువ..మిల్లులు తక్కువ
సీఎంఆర్ ఇవ్వని మిల్లులకు ధాన్యం కేటాయించని అధికారులుజిల్లాలో ధాన్యం సేకరణ నత్తనడకన సాగుతోంది. ఒక్కోరైతు 15 నుంచి 20 రోజుల పాటు కొనుగోలు కేంద్రాల్లో పడిగాపులు కాస్తున్నారు. తూకం అయినప్పటికీ మిల్లులకు వెళ్లిన లారీలు త్వరగా అన్లోడ్ కావటం లేదు. ఒకవైపు అకాలవర్షాలు వెంటాడుతుండటంతో ధాన్యం తడిసి ముద్దవుతోంది. వడ్లను మళ్లీ ఆరబెట్టడం రైతులకు భారంగా మారింది. అయితే దీనంతటికి కారణం తక్కువ మిల్లులకు సీఎంఆర్ ఇవ్వటమేనని తెలిసింది. – మెదక్జోన్ జిల్లావ్యాప్తంగా 112 రైస్మిల్లులు ఉండగా, ఈ ఖరీఫ్లో కేవలం 45 మిల్లులకు మాత్రమే కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) కోసం కేటాయించారు. 15 రైస్ మిల్లులకు సంబంధించి రూ. 280 కోట్లు విలువ చేసే బియ్యాన్ని రైస్ మిల్లర్స్ ఎగ్గొట్టటంతో వారిపై కేసులు నమోదు చేసి బ్లాక్లిస్టులో పెట్టారు. రికవరీ కోసం ఆర్ఆర్యాక్టు ప్రయోగించారు. మరో 40 రైస్మిల్లర్స్ గత 2024 ఖరీఫ్ ధాన్యానికి సంబంధించి 15 వేల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సివిల్ సప్లైకి ఇవ్వాల్సి ఉంది. బ్యాలెన్స్ బియ్యం ఇసే్త్ తప్ప వారికి ధాన్యం అలాట్ చేసే ప్రసక్తి లేదు. మరో 12 మిల్లర్స్ గతేడాది ఇచ్చిన సీఎంఆర్ను తిరిగి ఇచ్చినప్పటికీ, ఆలస్యంగా ఇచ్చారనే నెపంతో వారికి సైతం ధాన్యం కేటాయించలేదు. కాగా వారు సోమవారం కలెక్టర్ను కలిసి తాము సకాలంలో ఇచ్చినప్పటికీ, అప్పటి అధికారులు తప్పుడు ఆరోపణలు చేశారని విన్నవించారు. తమకు ధాన్యం కేటాయించాలని వినతిపత్రం అందజేశారు. రాష్ట్ర ఉన్నతాధికారులతో మాట్లాడి ధాన్యం కేటాయింపు చేస్తానని కలెక్టర్ స్పష్టం చేసినట్లు తెలిసింది. జిల్లాలో 3.5 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయగా, అందుకు సంబంధించి 4.20 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందని అధి కారులు అంచనా వేశారు. ఇందుకోసం 518 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యం సేకరిస్తున్నారు. కానీ కేవలం 45 మిల్లర్లకే ధాన్యం కేటాయించటంతో వాటిలో ధాన్యం బస్తాలను నిల్వ చేసేందుకు స్థలం సరిపోవడం లేదు. దీంతో అన్లోడింగ్ త్వరగా కాకపోవటంతో కేంద్రాల్లో తూకం వేసిన బస్తాలను త్వరితగతిన తరలించలేకపోతున్నారు. దీంతో కొనుగోళ్లు నత్తనడకన సాగుతున్నాయి. ఇప్పటివరకు 26,400 మెట్రిక్ టన్నులు మాత్రమే సేకరించారు. ఇదేవిధంగా ధాన్యం సేకరణ సాగితే డిసెంబర్ చివరి వరకు కొనుగోళ్లు సాగే అవకాశం ఉందని తెలిసింది. ఆలస్యంగా ఇచ్చారనే.. 12 మంది రైస్ మిల్లర్స్కు కేటాయించిన ధాన్యాన్ని మరాడించి బియ్యం ఇచ్చారు. ఆలస్యంగా ఇచ్చారని గతంలో ఇక్కడ పనిచేసిన అధికారులు రికార్డులో పొందుపర్చటంతో వారికి ధాన్యం ఇవ్వలేకపోయాం. ఈవిషయంపై 12 మంది మిల్లర్లు కలెక్టర్ను కలిశారు. కమిషనర్తో మాట్లాడి తగు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చాకే తగు నిర్ణయం తీసుకుంటాం. – జగదీశ్కుమార్, డీఎం, సివిల్ సప్లై -
చెరుకు క్రషింగ్పై నీలినీడలు
● బురదమయంగా పంట పొలాలు ● గోదావరి–గంగా, గణపతి ఫ్యాక్టరీల్లో 5, 7 తేదీల్లో ముహూర్తంజహీరాబాద్: మొన్నటివరకు భారీ వర్షాలు కురవడంతో ఈ ఏడాది చెరుకు క్రషింగ్ సకాలంలో జరుగుతుందో లేదోననే అనుమానాలు మొదలయ్యా యి. ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల 15రోజుల నుంచి 20 రోజుల వరకు పొలాల్లోకి వా హనాలు వెళ్లే పరిస్థితి కనిపించడం లేదు. లోతట్టు ప్రాంతాల్లో అయితే నెల రోజుల అయినా పొలాల్లోకి వా హనాలు, చెరకు కోత యంత్రాలు వెళ్లలేని పరిస్థితి నెలకొందంటున్నారు. దీంతో అనుకున్న సమాయానికి క్రషింగ్ జరపడం సాధ్యం కాదని రైతులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. క్రషింగ్కు సిద్ధమైనా... జిల్లాలోని రాయికోడ్ మండలంలోని మాటూర్ గ్రామంలో గల గోదావరి గంగా, సంగారెడ్డిలోని గణపతి చక్కెర కర్మాగారాలు క్రషింగ్ను ప్రారంభించేందుకు పూర్తిస్థాయిలో సిద్ధం చేసి ఉంచారు. మాటూర్లోని గోదావరిగంగా కర్మాగారంలో ఈ నెల 5న, సంగారెడ్డిలోని గణపతి కార్మగారంలో 7వ తేదీ నుంచి క్రషింగ్ను ప్రారంభించాలని నిర్ణయించారు. అయితే తుపాను కారణంగా ముందుగా అనుకున్న తేదీల్లో క్రషింగ్ చేయలేని పరిస్థితి ఏర్పడింది. పక్షం రోజుల వరకు పూర్తిస్థాయిలో క్రషింగ్కు అవసరం మేరకు చెరుకు సరఫరా కావడం అనుమానంగానే ఉందని రైతులు చెబుతున్నారు. జిల్లాలో సుమారు 12 లక్షల టన్నుల చెరు కు ఉత్పత్తి కానుంది. ఒక్క జహీరాబాద్ నియోజకవర్గంలోనే 9 లక్షల టన్నుల పంట ఉత్పత్తి కానుందని అధికారులు అంచనా వేస్తున్నారు. -
స్పెషల్ డ్రైవ్తో సత్ఫలితాలు
మెదక్ కలెక్టరేట్: భూభారతి దరఖాస్తుల పరిష్కారం కోసం చేపట్టిన పది రోజుల స్పెషల్ డ్రైవ్తో సత్ఫలితాలు సాధించామని కలెక్టర్ రాహుల్రాజ్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వేగవంతంగా దరఖాస్తులను పరిష్కరించడానికి జిల్లాలో అక్టోబర్ 22 నుంచి ఈనెల 1వ తేదీ వరకు 10 రోజుల పాటు స్పెషల్ డ్రైవ్ నిర్వహించినట్లు తెలిపారు. గడిచిన 10 రోజుల్లో తహసీల్దార్ల పరిధిలో 183, ఆర్డీఓల పరిధిలో 661, కలెక్టర్ స్వయంగా 168 దరఖాస్తులు క్లియర్ చేసినట్లు చెప్పారు. జిల్లాలో మొత్తం 1,012 దరఖాస్తులను శాశ్వతంగా పరిష్కరించినట్లు వివరించారు. ఇదే సమయంలో 1,424 ఫైల్స్ తహసీల్దార్ల వద్ద నుంచి కలెక్టరేట్కు చేరుకున్నట్లు పేర్కొన్నారు. అదేవిధంగా 1,561 దరఖాస్తులను పై లెవెల్కు పంపించామన్నారు. స్పెషల్ డ్రైవ్లో మొత్తం 2,573 ఫైల్స్ వివిధ స్థాయిలో పరిష్కరించామని వెల్లడించారు. ఇదే స్ఫూర్తితో మిగితా ఫైళ్లను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ఈసందర్భంగా జిల్లాలోని రెవెన్యూ సిబ్బందిని కలెక్టర్ అభినందించారు. కలెక్టర్ రాహుల్రాజ్ 1,012 భూభారతి దరఖాస్తులకు మోక్షం పరిష్కారం దిశగా మరో 1,424 అప్లికేషన్లు -
ఐత చంద్రయ్య రచనలు అమోఘం
ప్రశాంత్నగర్(సిద్దిపేట): ప్రముఖ కవి ఐత చంద్రయ్య రచనలు అమోఘమని, జాతీయ సాహిత్య పరిషత్ (జాసాప) అధ్యక్షుడు ఎన్నవెళ్లి రాజమౌళి అన్నారు. స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన (అటానమస్) సిద్దిపేట డిగ్రీ కళాశాల పాఠ్య పుస్తకాలలో ఐతా చంద్రయ్య రచించిన ‘మంచుముద్ద’ కథకు చోటు దక్కింది. జాసాప కార్యవర్గం ఆదివారం సిద్దిపేట శాఖ గ్రంథాలయంలో ఐత చంద్రయ్యను అభినందించారు. ఈ సందర్భంగా ఎన్నవెళ్ళి రాజమౌళి, ప్రధాన కార్యదర్శి ఉండ్రాళ్ళ రాజేశంలు మాట్లాడుతూ కథా సాహిత్యంలో ఐతా చంద్రయ్య రచనలు అద్భుతమన్నారు. జాతీయ స్థాయి అవార్డులు సైతం ఐతా చంద్రయ్యకు లభించాలని ఆకాంక్షించారు. కథాశిల్పి ఐతా చంద్రయ్య మాట్లాడుతూ తన రచన మంచుముద్ద కథ 1995లో రాసినట్లు తెలిపారు. మంచుముద్ద కథ డిగ్రీ కళాశాల తెలుగు పాఠంగా ఎంపిక చేయడంపై కళాశాల ప్రిన్సిపాల్, తెలుగు శాఖ విభాగానికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కవులు పెందోట వెంకటేశ్వర్లు, వరుకోలు లక్ష్మయ్య, బస్వ రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
మల్లన్న క్షేత్రంలో కార్తీక శోభ
కొమురవెల్లి(సిద్దిపేట): ప్రముఖ పుణ్యక్షేత్రం కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయానికి భక్తులు ఆదివారం భారీ సంఖ్యలో తరలివచ్చారు. కార్తీక మాసం కావడంతో భక్తుల రద్దీ పెరిగింది. పుష్కరిణిలో స్నానమాచరించి స్వా మి వారిని దర్శించుకున్నారు. పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ఉద్యోగులు, అర్చకులు, ఒగ్గుపూజారులు భక్తు లకు సేవలందించారు. ఆలయ పర్యవేక్షకుడిగా చంద్రశేఖర్ ఆలయ పర్యవేక్షకుడు సురేందర్రెడ్డి ఇటీవల బదిలీపై వెళ్లగా, మరో పర్యవేక్షకుడు శుక్రవా రం పదవీ విరమణ పొందారు. దీంతో దేవాదాయ శాఖ కొండగట్టు ఆంజనేయ స్వా మి ఆలయంలో పర్యవేక్షకుడిగా పని చేస్తున్న చంద్రశేఖర్ను మల్లన్న ఆలయానికి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయగా ఆదివారం బాధ్యతలు చేపట్టారు. -
ఈసారైనా మెరుగుపడేనా?
మెదక్జోన్: గత రెండేళ్లుగా ఇంటర్మీడియెట్ ఫలితాల్లో మెతుకుసీమ అట్టడుగు స్థానానికే పరిమితం అయింది. విద్యార్థులను గాడిలో పెట్టి ఉత్తమ ఫలితాల సాధనకు కృషి చేయాల్సిన అధికారులు, ఆదిశగా ప్రయత్నాలు చేయడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఈసారైనా తగు చర్యలు తీసుకొని ఉత్తమ ఫలితాల కోసం ప్రత్యేక చొరవ చూపాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. జిల్లావ్యాప్తంగా అన్ని ఇంటర్మీడియెట్ కళాశాలలు కలిపి మొత్తం 61 ఉన్నాయి. వీటిలో మొదటి సంవత్సరం జనరల్, ఒకేషనల్ కలిపి 7,077 మంది, సెకండియర్లో 6,149 కలిపి మొత్తం 13,226 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. కాగా గడిచిన కొన్నేళ్లుగా ఇంటర్మీడియెట్ ఫలితాలను పరిశీలిస్తే రాష్ట్రస్థాయిలో జిల్లా అట్టడుగు స్థానానికే పరిమితం అవుతోంది. గత విద్యా సంవత్సరానికి సంబంధించి 2025 ఏప్రిల్ 23న వెలువడిన ఫలితాల్లో ఉత్తీర్ణత దారుణంగా పడిపోయింది. ఫస్టియర్, సెకండియర్ విద్యార్థులు 11,725 మంది పరీక్షలు రాయగా, అందులో 6,456 మంది మాత్రమే పాసయ్యారు. అంటే సగం మంది కూడా ఉత్తీర్ణత సాధించలేకపోయారు. మెదటి సంవత్సరంలో రాష్ట్రస్థాయిలో 33వ స్థానానికి జిల్లా పరిమితం కాగా, సెకండ్ ఇయర్లో 29వ స్థానంలో నిలిచింది. అలాగే 2022, 2023 ఫలితాలు నిరాశే మిగిల్చాయి. ఇదిలాఉండగా ఫెయిల్ అయిన విద్యార్థులపై ప్రత్యేక చొరవ చూపడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ఇంటర్ ఫలితాల్లో జిల్లా వెరీ పూర్! రెండేళ్లుగా అట్టడుగు స్థానానికే పరిమితం దారుణంగా పడిపోతున్న ఉత్తీర్ణత ఫిబ్రవరి 25 నుంచి వార్షిక పరీక్షలుమంచి ఫలితాలు సాధిస్తాం ఈసారి ఇంటర్మీడియెట్లో మెరుగైనా ఫలితాల సాధనకు కృషి చేస్తున్నాం. ఫిబ్రవరి 25 నుంచి పరీక్షలు ఉండటంతో డిసెంబర్ వరకు సిలబస్ పూర్తి చేస్తాం. మిగిలిన రెండునెలల గడువులో ప్రాక్టికల్స్ నిర్వహించి, చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారిస్తాం. – మాధవి, డీఐఈఓ -
కాలం కలిసిరాలె..
పొలాలనన్నీ హలాల దున్నీ.. ఇలా తలంలో హేమం పిండే రైతన్నలకు గడ్డు రోజులు దాపురించాయి. అప్పుల కుంపటి నెత్తిమీద ఉన్నప్పటికీ, ఈసారైనా రాత మారదా అన్న ఆశతో ఏటా అదృష్టాన్ని పరీక్షించుకుంటూ వస్తున్నారు. ఈ ఏడాది ఖరీఫ్పై ఎన్నో ఆశలు పెట్టుకుంటే వరుణుడు శీతకన్ను వేశాడు. జిల్లాలో అతివృష్టితో పెద్ద మొత్తంలో పంటలు నీటి పాలు కావడంతో దిక్కుతోచని స్థితిలో ఆందోళనకు లోనయ్యారు. ప్రకృతి ప్రకోపానికి, పాలకుల చిన్నచూపునకు గురై మెతుకుసీమ రైతు విలవిలలాడుతున్నారు. – రామాయంపేట(మెదక్) అన్నదాతకు ఖరీఫ్ సాగు కలిసి రాలేదు. ముందస్తుగా మురిపించిన వరుణుడు.. ఆ తర్వాత ముఖం చాటేశాడు. దీంతో మొలకదశలో పంటలు ఎండుముఖం పట్టాయి. ఆ తర్వాత కురిసిన వర్షాలు ఉపశమనం కలిగించాయి. దీంతో ఎంతో ఆశతో రైతులు సాగుకు సన్నద్ధమయ్యారు. ఈక్రమంలో రెండు నెలల క్రితం కురిసిన భారీ వర్షాలు కోలుకోలేని దెబ్బతిశాయి. జిల్లా రైతాంగానికి తీవ్ర నష్టం మిగిల్చాయి. జిల్లా పరిధిలో వేలాది ఎకరాల్లో పంటలు దెబ్బతినడంతో పాటు వందలాది ఎకరాల మేర పంట చేలల్లో ఇసుక మేటలు వేసింది. ముఖ్యంగా వరిపంట 6,000 ఎకరాల్లో దెబ్బతిన్నట్లు అధికారుల సర్వేలో తేలింది. పత్తి 475, మొక్కజొన్న 50, పెసర 70, కూరగాయలు ఇతర పంటలు కలిపి 150 ఎకరాల్లో దెబతిన్నట్లు నిర్ధారించారు. నష్టపోయిన రైతులను ఆదుకుంటామని పలుమార్లు ప్రభుత్వం ప్రకటించినా, ఇప్పటివరకు నష్టపరిహారం విడుదల చేయకపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వానాకాలం సీజన్ సైతం ముగుస్తుండటంతో ఇంకెప్పుడు ఇస్తారని ఆశతో ఎదురుచూస్తున్నారు. 50 ఎకరాలు మాత్రమే గుర్తింపు భారీ వర్షాలతో జిల్లా పరిధిలో చెరువులు, కుంటలు, రహదారుల పక్కనే ఉన్న బ్రిడ్జిలు, కల్వర్టులు వరద నీటితో పొంగి పొర్లాయి. వీటి కింద ఉన్న వ్యవసాయ భూముల్లో 1,500 ఎకరాల మేర పంట చేలల్లో ఇసుక మేటలు వేసింది. ఈమేరకు వ్యవసాయ అధికారులు సర్వే నిర్వహించి ప్రభుత్వానికి నివేదించారు. ఉపాధి హామీ పథకంలో ఇసుక మేటలు తొలగిస్తామని ప్రకటించినా, ఇందుకు సంబంధించిన కార్యాచరణ ముందుకు సాగడం లేదు. తమ సొంత ఖర్చుతో ఇసుకమేటలు తొలగించుకోవాలంటే రూ. లక్షలు ఖర్చు పెట్టుకునే స్థోమత లేదని రైతులు వాపోతున్నారు. కాగా ఎన్ఆర్ఈజీఎస్ అధికారులు మాత్రం జిల్లా పరిధిలో కేవలం 50 ఎకరాల్లో మాత్రమే ఈసారి ఇసుక మేటలు తొలగిస్తామంటున్నారు. రైతుల వి నతుల మేరకే తాము ఈనిర్ణయం తీసుకున్నామని చెబుతున్నారు. చి‘వరి’కి ముంచిన మోంథా జిల్లావ్యాప్తంగా ఈ ఏడాది 3.5 లక్షల ఎకరాల్లో రైతులు వరి సాగు చేశారు. కొనుగోలు కేంద్రాలకు 4.20 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అంచనా వేసిన అధికారులు, సుమారు 500 పైచిలుకు కేంద్రాలను ప్రారంభించారు. చాలా సెంటర్లకు ధాన్యం రావడంతో 15 రోజులుగా కొనుగోళ్లు ప్రారంభించారు. కాగా మోంథా తుఫాన్ ప్రభావంతో చాలా చోట్ల కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దయింది. మొక్క జొన్న మొలకెత్తి రంగు మారింది. పత్తి నీరు గారింది. మొలకెత్తిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు వేడుకుంటున్నారు. మొ త్తానికి వానాకాలం సీజన్ రైతులకు కష్టాలు, నష్టాలనే మిగిల్చింది. నష్టపరిహారం అందించాలిరెండు నెలల క్రితం కురిసిన భారీ వర్షాలతో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నా యి. దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం చెల్లిస్తామని అధికారులు ప్రకటించినా, ఇప్పటివరకు తమకు అందలేదు. ప్రస్తుతం కురిసిన వర్షాలతోనూ తీవ్రంగా నష్టపోయాం. ఇప్పటికై నా ప్రభుత్వం రైతులను ఆదుకోవాలి. – లాలు, చౌకత్పల్లి ప్రభుత్వానికి నివేదించాంగత ఆగస్టు నెలలో కురిసిన భారీ వర్షాలతో జరిగిన ప ంట నష్టం తాలూకు వివరాలు ప్రభుత్వానికి నివేదించాం. ప్రభుత్వం నిధులు విడుదల చేస్తే నేరుగా రైతుల ఖాతాల్లో జమ అవుతాయి. – రాజ్నారాయణ, ఏడీఏరైతన్న ఆగమాయె.. అనుకూలించని ‘ఖరీఫ్’ సీజన్ అతివృష్టితో దెబ్బతిన్న పంటలు పరిహాసంగా మారిన ప్రభుత్వ సాయం మెతుకుసీమ రైతు కన్నీటి వ్యథ -
వామ్మో వానరం
జనాల్లో కలవరం ● ఇళ్లలోకి చొరబడి బీభత్సం బాటసారులపై తరచూ దాడులు ● పట్టించుకోని మున్సిపల్ అధికారులుఈ చిత్రంలోని వ్యక్తి పేరు సంతోష్. మెదక్ పట్టణంలోని కుమ్మరిగడ్డ. ఇటీవల బైక్పై వెళ్తుండగా ఒక్కసారిగా కోతులు మీద పడి దాడి చేయడంతో బైక్పై నుంచి కిందపడ్డాడు. దీంతో అతడి చేయి విరిగింది. ఫలితంగా మూడు నెలల పాటు ఎలాంటి పనులు చేసుకోలేని పరిస్థితి ఏర్పడింది. మరోవైపు ఆర్థికంగా నష్టపోవాల్సి వచ్చింది. ఇలా పట్టణంలో చాలా మంది కోతుల బాధితులు ఉన్నారు. నివారణ చర్యలు చేపట్టాలని ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. మెదక్ మున్సిపాలిటీ: వానరాలతో జనం పడరాని పాట్లు పడుతున్నారు. ఇంటి తలుపులు తెరిచి ఉంచితే చాలు లోపలికి చొరబడి బీభత్సం సృష్టిస్తున్నా యి. దొరికిన వాటిని పట్టుకెళ్తున్నాయి. ఇక రోడ్లపై వెళ్లాలంటే ప్రజలు జంకుతున్నారు. ఒకప్పుడు అట వీ ప్రాంతానికే పరిమితమైన కోతులు, ఇప్పుడు మైదాన ప్రాంతాల్లో గుంపులుగా సంచరిస్తున్నాయి. వాటికి ఆహారం, నీరు లభించకపోవడంతో జనావాసాల్లోకి వస్తున్నాయి. ఎవరైనా అడ్డుకునేందుకు ప్రయత్నిస్తే వారిపై విచక్షణ రహితంగా దాడి చేస్తున్నాయి. కొండముచ్చు ఫ్లెక్సీతో ప్రయోగం జిల్లా కేంద్రంలో విచ్చలవిడిగా కోతులు సంచరిస్తున్నాయి. వాటిని నివారించేందుకు బల్దియా అధికారులు వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. కోతులు ఎక్కువగా సంచరించే మున్సిపల్ కార్యాలయం, అజంపురా, బ్రహ్మణవీధి తదితర ప్రాంతాల్లో సుమారు 50 వరకు ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. అయితే కోతులు ఫ్లెక్సీలకు భయపడటం లేదు. కోతులను పట్టించడంతోనే సమస్యకు పరిష్కారమని పట్టణ ప్రజలు వాపోతున్నారు. ప్రాణం పోతుందనుకున్నా.. ఆరబెట్టిన బట్టలు తీసుకొచ్చేందుకు డాబాపైకి వెళ్లాను. ఒక్కసారిగా కోతుల గుంపు మీద పడి దాడిచేశాయి. నా కేకలు విని కింద నుంచి మా కుటుంబీకులు కర్రలతో వచ్చి వాటిని వెళ్లగొట్టారు. అప్పటికే కాళ్లు, చేతులు, తలపై తీవ్రంగా గాయపర్చాయి. అధికారులు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే కోతులను తరిమిలేయాలి. – హైమద్ హుస్సేన్, మెదక్ బల్దియా భరించే పరిస్థితి లేదు జిల్లా కేంద్రంలో కోతుల బెడద తీవ్రంగా ఉన్న మాట వాస్తవమే. కోతులు పట్టే వారిని పిలిపించాం. వారు ఒక్కో కోతిని పట్టేందుకు రూ. 600 అడుగుతున్నారు. అంత భారం భరించే పరిస్థితిలో మున్సిపాలిటీ లేదు. కొండముచ్చును చూస్తే కోతులు భయపడతాయి. అందుకే వార్డుల్లో ఫ్లెక్సీ లను ఏర్పాటు చేశాం. – శ్రీనివాసరెడ్డి, మెదక్ మున్సిపల్ కమిషనర్ మెదక్ పట్టణంలో గుంపులుగా సంచరిస్తున్న కోతులు -
చితిలోనుంచి శవాన్ని బయటకులాగి..
మెదక్ జిల్లా (తూప్రాన్): సగం కాలిన శవాన్ని గుర్తు తెలియని వ్యక్తులు చితి నుంచి బయటపడేశారు. ఈ ఘటన మెదక్ జిల్లా చేగుంటలో శనివారం వెలుగు చూసింది. గ్రామస్తుల వివరాల ప్రకారం.. చేగుంటకు చెందిన కర్రె నాగమణి (70) శుక్రవారం మృతి చెందగా అదే రోజు అంత్యక్రియలు నిర్వహించారు. రెండో రోజు కార్యక్రమం నిర్వహించేందుకు శనివారం కుటుంబీకులు శ్మశానానికి వెళ్లి చూడగా సగం కాలిన నాగమణి మృతదేహం చల్లార్చి చితి పక్కకు పడేసి కనిపించింది. ఈ విషయం తెలుసుకున్న మురాడి నర్సమ్మ కుటుంబీకులు సైతం శ్మశానానికి చేరుకొని చూడగా నర్సమ్మ చితికి సంబంధించిన బూడిదను గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఇటీవల మృతి చెందిన పోచమ్మ, మల్లయ్యకు సంబంధించిన పుర్రెతో పాటు ఎముకలను కూడా ఎత్తుకెళ్లినట్లు స్థానికులు చెప్పారు. అయితే ఎముకలు, పుర్రెలను మృతదేహం నోటిలో ఉంచే బంగారం కోసమా? అసలు ఎందుకు ఎత్తుకెళుతున్నారో తెలియడం లేదు. విచారణ జరుపుతామని ఎస్ఐ చైతన్యకుమార్రెడ్డి పేర్కొన్నారు. -
బాల్య వివాహాలు నిర్మూలిద్దాం
శివ్వంపేట(నర్సాపూర్): బాల్య వివాహాల రహిత జిల్లాగా మార్చేందుకు సిబ్బంది కృషి చేయాల్సిన అవసరం ఉందని కలెక్టర్ రాహుల్రాజ్ అన్నారు. శుక్రవారం శివ్వంపేటలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో బాల్య వివాహాల నిర్మూలన చట్టం, బాలల సంరక్షణపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పుట్టిన ప్రతి బిడ్డకు వ్యాక్సినేషన్ చేయించాలని, దీని వల్ల బిడ్డకు రోగనిరోధక శక్తి పెరుగుతుందన్నారు. చిన్నారులకు ఏదైన అనారోగ్య సమస్యలు తలెత్తితే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యుల వద్దకు తీసుకెళ్లాలని సూచించారు. ఆర్ఎంపీల వద్దకు వెళ్లకూడదన్నారు. జిల్లాలో ఎక్కడైనా బాల్య వివాహాలు జరిగితే అంగన్వాడీ, ఆశ, గ్రామ కార్యదర్శులపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు. కార్యక్రమంలో ఆర్డీఓ మహిపాల్రెడ్డి, ఇన్చార్జి డీడబ్ల్యూఓ హేమభార్గవి, తహసీల్దార్ కమలాద్రి, ఎంపీడీఓ వెంకట వరలక్ష్మి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యురాలు సాయిసౌమ్య, వివిధ శాఖల సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ధాన్యం తూకం వేసిన అనంతరం కేటాయించిన రైస్మిల్స్కు తరలించి అన్లోడ్ జరిగేలా చర్యలు చేపట్టాలని సూచించారు. దేశ సమగ్రతకు పాటు పడాలి మెదక్ కలెక్టరేట్: ప్రతి ఒక్కరూ సర్ధార్ వల్లభాయ్ పటేల్ను ఆదర్శంగా తీసుకొని దేశ సమగ్రతను కాపాడేందుకు కృషి చేయాలని కలెక్టర్ రాహుల్రాజ్ తెలిపారు. శుక్రవారం వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని జాతీయ ఐక్యత దినోత్సవం నిర్వహించారు. ఇందులో భాగంగా మెదక్ పట్టణంలోని ధ్యాన్చంద్ చౌరస్తా నుంచి కలెక్టరేట్ వరకు రన్ ఫర్ యూనిటీ నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. భారత యూనియన్లో ఉన్న అనేక సంస్థానాలు దేశంలో కలిసేందుకు వల్లభాయ్ పటేల్ చేసిన పాత్ర గొప్పదని కొనియాడారు. అంతకు ముందు కలెక్టరేట్లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.కలెక్టర్ రాహుల్రాజ్ -
జాతీయస్థాయి అడ్వెంచర్ క్యాంపునకు డిగ్రీ విద్యార్థి
నర్సాపూర్ రూరల్: జాతీయస్థాయి అడ్వెంచర్ క్యాంపునకు నర్సాపూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల బీఎస్సీ సెకండ్ ఇయర్ విద్యార్థి జరుపుల ప్రభాకర్ ఎంపికై నట్లు ప్రిన్సిపాల్ హుస్సేన్ శుక్రవారం తెలిపారు. ఈనెల 10 నుంచి 19వ తేదీ వరకు హిమాచల్ప్రదేశ్లోని మనాలిలో జరిగే క్యాంపులో పాల్గొననున్నట్లు చెప్పారు. ఈసందర్భంగా విద్యార్థిని ప్రిన్సిపాల్తో పాటు ప్రోగ్రాం అధికారి డాక్టర్ సురేశ్ కుమార్, అధ్యాపకులు, మురళి, శ్రీలత, సిబ్బంది అభినందించారు. కళాశాలకు, రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని అకాంక్షించారు. నేడు కాటేజీలు ప్రారంభం నర్సాపూర్: అర్బన్పార్కులో అటవీశాఖ నిర్మించిన కాటేజీలు ప్రారంభానికి సిద్ధమయ్యాయి. శనివారం మంత్రులు కొండా సురేఖ, వివేక్, మంత్రి దామోదర రాజనర్సింహ, మెదక్ ఎంపీ రఘునందన్రావు, ఎమ్మెల్యే సునీతారెడ్డి, కలెక్టర్ రాహుల్రాజ్తో పాటు పలువురు అటవీశాఖ అధికారులు ప్రారంభించనున్నారు. ఇదిలాఉండగా మంత్రుల పర్యటన నేపథ్యంలో పోలీస్, ఆయా శాఖల అధికారులు శుక్రవారం అర్బన్పార్కులో నిర్వహించే ఏరియాను పరిశీలించారు. ప్రైవేటీకరణ విరమించుకోవాలి తూప్రాన్: కేంద్ర ప్రభుత్వం విద్యుత్ పంపిణీ సంస్థల (డిస్క్లు) ప్రైవేటీకరణకు తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే విరమించుకోవాలని తె లంగాణ స్టేట్ యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు మహేందర్రెడ్డి అన్నారు. శుక్రవారం యూనియన్ నాయకులతో కలిసి మాట్లాడారు. అప్పుల్లో కూరుకుపోయిన విద్యుత్ పంపిణీ సంస్థల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రూ. 1 లక్ష కోట్ల బెయిలౌట్ ప్యాకేజీను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. అమలు చేయని రా ష్ట్రాలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని వాపోయారు. సమావేశంలో యూనియన్ సలహాదారులు స్వామి, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు. కొనుగోళ్లు వేగవంతం చేయండి: ఆర్డీఓ చిన్నశంకరంపేట(మెదక్): ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని మెదక్ ఆర్డీఓ రమాదేవి ఆదేశించారు. శుక్రవారం మండలంలోని అంబాజిపేట, మడూర్లో కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్త్తకుండా ధాన్యాన్ని వెంట వెంటనే కాంటా చేసి రైస్ మిల్లులకు తరలించాలని నిర్వాహకులకు సూచించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేసి భూ భారతి, సాదాబైనామా దరఖాస్తులను పరిష్కరించాలని తెలిపారు. అనంతరం రిజిస్ట్రేషన్ ప్రక్రియను పరిశీలించి తహసీల్దార్ మాలతికి పలు సూచనలు చేశారు. నిండుకున్న ఇసుక నిల్వలు నర్సాపూర్: శాండ్ బజార్లో ఇసుక నిల్వలు ని ండుకున్నాయి. మైనింగ్శాఖ అధికారుల నిర్వహణ లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. నిరంతరం ఇసుక అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు కోరుతున్నారు. ఈవిషయమై ఇసుక బజార్ ఇన్చార్జి రాకేశ్ను వివరణ కోరగా.. శనివారం నుంచి అందుబాటులో ఉంచు తామని చెప్పారు. -
బడిలో పాము కలకలం
అల్లాదుర్గం(మెదక్): పాఠశాలలో నాగుపాము కలకలం సృష్టించింది. భయంతో విద్యార్థులు బయటకు పరుగు తీశారు. ఈఘటన శుక్రవారం మండల పరిధిలో గడిపెద్దాపూర్ జెడ్పీ పాఠశాలలో జరిగింది. పదో తరగతి గదిలో పాఠాలు బోధిస్తుండగా పాము రావడంతో ఉపాధ్యాయుడు చూసి అరిచాడు. దీంతో విద్యార్థులు భయంతో బయటకు పరుగు తీశా రు. అప్రమత్తమైన ఉపాధ్యాయులు పామును చంపి వేయడంతో ఊపిరిపీల్చుకున్నారు. పాఠశాల చుట్టూ పొలాలు ఉండటంతో పాములు సంచరిస్తున్నాయని విద్యార్థులు చెబుతున్నారు. చట్టాలపై అవగాహన ఉండాలినారాయణఖేడ్: చట్టాలపై ప్రతీ ఒక్కరికీ అవగాహన ఉండాలని ఖేడ్ జూనియర్ సివిల్ కోర్టు న్యాయమూర్తి శ్రీధర్ మంథాని పేర్కొ న్నారు. ఖేడ్ మండలం జూకల్ శివారులోని సా ంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల, కళాశాలలో శుక్రవారం న్యాయ విజ్ఞాన సదస్సును నిర్వహించారు. సదస్సులో ఆయన మాట్లాడుతూ.. విద్యార్థి దశ నుంచే చట్టాలపై అవగాహన ఉంటే నేరాలు చేయడానికి భయం కలిగి నేరాలు తగ్గుతాయన్నారు. మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, అధ్యాపకులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. -
ఆయిల్పామ్ సాగుపై ఆసక్తి పెంచాలి
హవేళిఘణాపూర్(మెదక్): రైతులకు సుస్థిర ఆదాయానిచ్చే ఆయిల్పామ్ సాగుపై రైతులకు అవగాహన కల్పించి సాగు విస్తరణ పెంచేలా చూడాలని అదనపు కలెక్టర్ నగేశ్ అన్నారు. శుక్ర వారం హవేళిఘణాపూర్ రైతువేదికలో జిల్లాలోని సహకార సంఘాల సీఈఓలు, ఏఓలు, ఏఈఓలకు అవగాహన కల్పించారు. జిల్లాకు కేటాయించిన 2,500 ఎకరాల సాగు లక్ష్యం మేరకు అందరూ సమన్వయంతో పని చేయాలన్నారు. జిల్లాలో ఉద్యానవన శాఖ అధికారుల కొరత ఉన్నందున క్లస్టర్ పరిధిలో 30 ఎకరాలు సాగు చేసేలా చూడాలన్నారు. రైతులకు లాభం చేకూర్చాలన్న ప్రభుత్వ లక్ష్యం మేరకు కృషి చేయాల్సిన బాధ్యత వ్యవసాయ అధికారులపై ఉందన్నారు. రైతులు వరినే కాకుండా ఇతర పంటల వైపు మొగ్గు చూపాలని సూచించారు. కార్య క్రమంలో డీఏఓ దేవ్కుమార్, ఉద్యానవన శాఖ అధికారులు పాల్గొన్నారు.అదనపు కలెక్టర్ నగేశ్ -
ఉత్సాహంగా ‘రన్ఫర్ యూనిటీ’
బస్సులు రావు.. బడికి ఎలా వెళ్లేది?నర్సాపూర్: ఆర్టీసీ బస్సులు సకాలంలో రాకపోవడంతో పాఠశాలకు వెళ్లలేకపోతున్నామని మండలంలోని జక్కపల్లి ప్రభుత్వ మోడల్ స్కూల్ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మోడల్ స్కూల్కు నర్సాపూర్తో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి సుమారు 200 మంది విద్యార్థులు రోజూ బస్సుల్లో వెళ్లి చదువులు కొనసాగిస్తున్నారు. కాగా నర్సాపూర్ నుంచి వెళ్లే విద్యార్థుల కోసం ఆర్టీసీ అధికారులు నాలుగు బస్సులు నడుపుతామని చెప్పినా, ఒక్కో రోజు మూడు బస్సులే వస్తున్నాయని విద్యార్థులు చెబుతున్నారు. సమయపాలన పాటించకపోవడంతో సకాలంలో బడికి వెళ్లలేక పోతున్నామని వాపోతున్నారు. ఆటోల్లో పంపాలంటే భయమేస్తుందని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.మెదక్ మున్సిపాలిటీ: సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకొని శుక్రవారం పోలీస్శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘రన్ ఫర్ యూనిటీ’ ఉత్సాహంగా సాగింది. మెదక్లో ఉదయం నిర్వహించిన 2కే రన్లో యువత, విద్యార్థులు, పోలీస్ సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని అదనపు ఎస్పీ మహేందర్ ప్రారంభించారు. బోధన్ చౌరస్తా నుంచి ప్రారంభమై పట్టణంలోని రాందాస్ చౌరస్తా వద్ద ముగిసింది. అలాగే పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా పట్టణంలోని పీఎన్ఆర్ స్టేడియంలో జిల్లాస్థాయి బ్యాడ్మింటన్ ఓపెన్ టోర్నమెంట్ నిర్వహించారు. కార్యక్రమంలో మెదక్ డీఎస్పీ ప్రసన్నకుమార్, ఏఆర్ డీఎస్పీ రంగనాయక్ క్రీడాకారులు పాల్గొన్నారు. -
మక్క రైతుకు తప్పని కష్టాలు
● కొనుగోలు కేంద్రాలు లేక అవస్థలు ● విక్రయించాలంటే 80 కిలోమీటర్లు వెళ్లాల్సిందే..అల్లాదుర్గం(మెదక్): మక్క రైతులకు తిప్పలు తప్ప డం లేదు. ఆరుగాలం శ్రమించి పండించిన పంటను అమ్ముకోవడానికి ఇబ్బందులపాలవుతున్నారు. అందుబాటులో కొనుగోలు కేంద్రాలు లేక అరిగోస పడుతున్నారు. మక్కలు విక్రయించాలంటే 80 కిలో మీటర్లు వెళ్లాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో మక్కల కొనుగోలు కేంద్రాలను మార్కెటింగ్శాఖ రామాయంపేట, నర్సాపూర్, తుప్రాన్లో మాత్రమే ఏర్పాటు చేసింది. అల్లాదుర్గం, పెద్దశంకరంపేట, టేక్మాల్, రేగోడ్ మండల ప్రజలు మక్కలను విక్రయించాలంటే సుమారు 80, 90 కిలోమీటర్లు వెళ్లాల్సి వస్తోంది. దీంతో అంతదూరం వెళ్ల లేక, రవాణా ఖర్చులు భరించలేక అవస్థలు పడుతున్నారు. కల్లాలు చేసినప్పటి నుంచి వర్షంతో ఆందోళన చెందుతున్నారు. టార్పాలిన్లు కప్పి ఉంచడంతో మక్కల రంగు మారుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అల్లాదుర్గంలో మక్కల కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. పెద్దశంకరంపేట, రేగోడ్, టేక్మాల్ మండలాలకు అల్లాదుర్గం కేంద్రంగా ఉంటుందని చెబుతున్నారు. ఇప్పటికై న ప్రభుత్వం, మార్కెటింగ్శాఖ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
ఎట్టకేలకు అనుమతి
రామాయంపేట(మెదక్): మూడు జిల్లా కేంద్రాలను కలుపుతూ కేంద్రం మంజూరు చేసిన జాతీయ రహదారి (765 డీజీ) నిర్మాణానికి అటవీశాఖ అనుమతులు అడ్డంకిగా మారగా, ఎట్టకేలకు అటవీశాఖ స్టేజ్ వన్ కింద అనుమతులు మంజూరు చేసింది. మూడేళ్లుగా అటవీప్రాంతంలో నాలుగు కిలోమీటర్ల మేర రోడ్డు విస్తరణకు నోచుకోలేదు. జిల్లా పరిధిలోని మెదక్ నుంచి రామాయంపేట, సిద్దిపేట మీదుగా వరంగల్ జిల్లా ఎల్కతుర్తి వరకు జాతీయ రహదారి నిర్మాణానికి గాను గతంలో కేంద్రం నిధులు మంజూరు చేసింది. ఈమేరకు మెదక్ నుంచి సిద్దిపేట వరకు మొదటి బిట్టు కింద 70 కిలోమీటర్ల మేర జాతీయ రహదారి నిర్మాణానికి కేంద్రం రూ.882 కోట్లు మంజూరు చేసింది. మెదక్, సిద్దిపేట, వరంగల్ జిల్లాల్లోని గ్రామాలను కలుపుతూ ఈరోడ్డు నిర్మించనున్నారు. మూడేళ్ల క్రితమే పనులు ప్రారంభం కాగా, మెదక్, రామాయంపేట మధ్యలోని అటవీప్రాంతంలో నాలుగు కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణానికి కేంద్ర అటవీశాఖ అనుమతులు అవసరం కాగా, గతంలోనే ప్రతిపాదనలు పంపారు. సుమారు మూడు వేలకు పైగా చెట్లను తొలగించాల్సి ఉండగా, వాటి నష్టం విలువను రూ. 3.60 కోట్లుగా తేల్చారు. అయితే అనుమతులు రాకపోవడంతో పనులు ప్రారంభం కాలేదు. ఎట్టకేలకు కేంద్ర అటవీశాఖ నుంచి స్టేజ్ వన్ కింద అనుమతులు వచ్చాయి.అనుమతులు వచ్చాయి మెదక్, రామాయంపేట మధ్య అటవీప్రా ంతంలో రోడ్డు నిర్మాణానికి స్టేజ్ వన్ కింద అనుమతులు వచ్చాయి. ఈమేరకు తమశాఖ నుంచి నిధులు చెల్లించాలని ఆర్అండ్బీకి నోటీస్ ఇచ్చాం. డబ్బు చెల్లించిన తర్వాత క్లియరెన్స్ వస్తుంది. తర్వాత పనులు ప్రారంభించుకోవచ్చు. – జోజి, జిల్లా అటవీశాఖ అధికారి -
బల్దియా.. నిధులు ఆగయా
మున్సిపాలిటీలకు మంచి రోజులొచ్చాయి. నిన్న మొన్నటి వరకు నిధులు లేక నిరసించిన పురపాలికలు ప్రగతి వైపు వడివడిగా అడుగులు వేయనున్నాయి. సమస్యలతో సతమతమవుతున్న జనం సరికొత్త పనులతో ఉపశ మనం లభించనుంది. జిల్లాలోని తూప్రాన్, నర్సాపూర్, రామాయంపేట మున్సిపాలిటీలకు దాదాపు రూ. 50 కోట్ల నిధులు మంజూరయ్యాయి. – తూప్రాన్మున్సిపాలిటీల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ క్రమంలోనే పుర అభివృద్ధికి నిధులు కేటాయించింది. వాటితో వార్డుల్లో మౌలిక సదుపాయాల కల్పనకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకు సంబంధించి టెండర్ల ప్రక్రియ సైతం ప్రారంభమైంది. త్వరలోనే అర్హులకు పనులు అప్పగించనున్నారు. ప్రభుత్వం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ (బడ్జెట్) డిపార్ట్మెంట్, (సీడీఎంఏ) ద్వారా జిల్లాలోని తూప్రాన్, నర్సాపూర్, రామాయంపేట మున్సిపాలిటీలకు రూ. 15 కోట్ల చొప్పున నిధులు మంజూరు చేసింది. ప్రధానంగా అంతర్గత రహదారులు, మురుగు కాలువలు నిర్మించి పారిశుద్ధ్య వ్యవస్థను మెరుగు పరుచనుంది. జిల్లాలో నూతనంగా ఏర్పడిన ఈ మున్సిపాలిటీల్లో నూతనంగా అనేక కాలనీలు ఏర్పడ్డాయి. వాటిలో కనీస సౌకర్యాలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇతర వార్డుల్లో గతంలో నిర్మించిన మురికి కాలువలు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు అధ్వానంగా నిర్మించారని చెబుతున్నారు. ప్రస్తుతం చేపట్టే పనులైన నాణ్యతగా చేపట్టాలని కోరుతున్నారు.టెండర్ల ప్రక్రియ ప్రారంభం తూప్రాన్ పట్టణంలోని రూ. 15 కోట్ల నిధులతో నల్లాల బావి వద్ద రూ. కోటితో షాపింగ్ కాంప్లెక్స్, 16 వార్డుల్లో సీసీ రోడ్లు, మురికి కాలువల నిర్మాణం, చిల్డ్రన్స్ పార్కులు, డివైడర్లు, సెంట్రల్ లైటింగ్, విద్యుత్ స్తంభాల ఏర్పాటు, చెరువు కట్టపై విద్యుత్ దీపాలు, తదితర మౌలిక వసతుల కల్పనకు టెండర్ల ప్రక్రియ ప్రారంభమైంది. అలాగే రామాయంపేట, నర్సాపూర్ మున్సిపాలిటీల్లో మౌలిక వసతుల కల్పినకు రంగం సిద్ధమైంది. కాగా మెదక్ మున్సిపాలిటీకి ప్రభుత్వం ఇంకా నిధులు మంజూరు చేయలేదు. ఇక్కడ జనాభా 70 వేలకుపైగా ఉండటంతో పాటు వార్డుల సంఖ్య ఎక్కువగా ఉంది. కాగా ప్రభుత్వం 50 వేల కంటే తక్కువ జనాభా ఉన్న మున్సిపాలిటీలకు మాత్రమే నిధులు విడుదల చేసింది. అయితే ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ ప్రభుత్వ పెద్దలతో చర్చించి నిధులు రాబట్టేందుకు కృషి చేస్తున్నట్లు తెలిసింది. మున్సిపాలిటీ జనాభా వార్డులు మంజూరైన నిధులు రామాయంపేట 18,000 12 రూ. 15 కోట్లు నర్సాపూర్ 25,000 15 రూ. 15 కోట్లు తూప్రాన్ 23,000 16 రూ. 15 కోట్లు మెదక్ 71,000 32 –15 రోజుల్లో పనులు ప్రారంభిస్తాం తూప్రాన్ మున్సిపాలిటీకి ప్రభుత్వం మంజూరు చేసిన రూ. 15 కోట్ల నిధులకు సంబంధించి ఆన్లైన్ టెండర్లు పిలిచాం. ఇందులో సగం టెండర్లు వచ్చాయి. మిగితా సగం పనులకు టెండర్లు రాగానే, రానున్న 15 రోజుల్లో అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతాం. – గణేశ్రెడ్డి, తూప్రాన్ మున్సిపల్ కమిషనర్ -
Siddipeta: బస్సు కిందకు దూకి వ్యక్తి ఆత్మహత్య
సిద్దిపేటఅర్బన్: రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తి ఆర్టీసీ బస్సును ఎక్కేందుకు ఆపి బస్సు ఎక్కకుండా ముందు టైరు కిందకు దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శుక్రవారం సిద్దిపేట అర్బన్ మండలం పొన్నాల శివారులోని దాబాల వద్ద జరిగింది. త్రీటౌన్ పోలీసులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల మేరకు... మద్దూరు మండలం వల్లంపట్ల గ్రామానికి చెందిన నారదాసు బాలరాజు (47) హైదరాబాద్లోని తన బావ ఇంటికి వెళ్లి శుక్రవారం తిరిగి స్వగ్రామానికి వెళ్తున్నాడు. దుద్దెడ చౌరస్తా వద్ద దిగాల్సి ఉండగా అక్కడ దిగకుండా పొన్నాల శివారులోని ఫ్లైఓవర్ వద్ద దిగాడు. జనగామ బస్సు ఎక్కేందుకుగాను హైదరాబాద్ వైపు రోడ్డు మధ్యలో నుంచి నడుచుకుంటూ వెళ్తుండగా వెనుక నుంచి సిద్దిపేట నుంచి సికింద్రాబాద్ వెళ్లే ఆర్టీసీ బస్సు రావడంతో దానిని ఆపాడు. బస్సు ఆగగానే బస్సు ఎక్కుతున్నట్లు ప్రయత్నించి బస్సెక్కకుండా ఒక్క సారిగా ముందు టైరు కిందకు దూకేశాడు. అయితే ఇది గమనించని డ్రైవర్ బస్సును ముందుకు కదిలించగా అదే సమయంలో పక్క నుంచి బైక్పై వెళ్తున్న ఓ వ్యక్తి డ్రైవర్కు చెప్పడంతో బస్సును ఆపి చూడగా బాలరాజు ఛాతీపై తీవ్ర గాయాలయ్యాయి. కాగా చికిత్స నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించగా అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి ఆత్మహత్యకు గల కారణాలేంటనే విషయాలు ఇంకా తెలియరాలేదు. మృతుడి కొడుకు రాజేందర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఐ చంద్రయ్య కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. -
తెరిపిచ్చిన వాన
ఊపిరి పీల్చుకున్న రైతన్నమోంథా తుపాన్ ప్రభావంతో మూడు రోజులుగా జిల్లావ్యాప్తంగా ముసురు పెట్టింది. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దయింది. గురువారం వాన తెరిపివ్వడంతో వడ్లను ఆరబెట్టే పనిలో రైతులు నిమగ్నమయ్యారు. – మెదక్జోన్ జిల్లాలో ఈ ఏడాది 3.5 లక్షల ఎకరాల్లో రైతులు వరి సాగు చేశారు. గత నెల రోజులుగా వరి కోతలు ప్రారంభించారు. కొనుగోలు కేంద్రాలకు 4.20 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అంచనా వేసిన అధికారులు, 518 సెంటర్లను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. అందులో భాగంగా ఇప్పటివరకు 500 పైచిలుకు కేంద్రాలను ప్రారంభించారు. చాలా సెంటర్లకు ధాన్యం రావటంతో 15 రోజులుగా కొనుగోళ్లు ప్రారంభించారు. కాగా మోంథా తుఫాన్ కారణంగా మూడు రోజులుగా ఎడతెరిపిలేకుండా ముసురు పెట్టింది. అధికారుల సూచన మేరకు రైతులు వరికోతలను నిలిపివేశారు. కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని తడవకుండా అన్నదాతలు జాగ్రత్తలు పడినప్పటికీ చాలా చోట్ల ధాన్యం తడిసి ముద్దయింది. వర్షం తగ్గుముఖం పట్టడంతో గురువారం ఉదయం నుంచి తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టే పనిలో నిమగ్నమయ్యారు. కేంద్రాల్లో మొలకెత్తిన ధాన్యం వరి కోతలు కోసిన రైతులు ధాన్యాన్ని ఆరబెట్టి మ్యాచర్ వచ్చాక కొనుగోలు కేంద్రాలకు తరలించారు. వర్షాలకు ధాన్యం రాశుల అడుగుభాగం తడిసి కొంతమేర వడ్లు మొలకొచ్చాయి. పైభాగంలోని ధాన్యాన్ని మరోచోట పోసి అడుగుభాగంలో మొలకెత్తిన ధాన్యాన్ని ఎండలో ఆరబెడుతున్నారు. మరో పక్క తేమశాతం వచ్చిన ధాన్యాన్ని కొనుగోళ్లు చేస్తున్నారు. గురువారం సుమారు 200 కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని తూకం వేస్తున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. వర్షంతో చాలా సెంటర్లలో కొనుగోళ్లు నిలిపి వేయగా, ప్రస్తుతం 200 కేంద్రాల్లోనే ధాన్యం విక్రయాలు ప్రారంభించారు. కాగా ఆరబెట్టిన ధాన్యాన్ని త్వరతగతిన కొనుగోలు చేసి వర్షం నుంచి కాపాడాలని రైతులు కోరుతున్నారు.15 రోజులు అవుతోంది నాకున్న 5 ఎకరాల్లో వరి పంట పండించి 15 రోజుల క్రితం మెదక్ మార్కెట్లో ఏర్పా టు చేసిన కొనుగోలు కేంద్రానికి తరలించాను. కాగా వర్షానికి కొంతమేర ధాన్యం తడిసి మొలకెత్తింది. దీంతో మళ్లీ ఆరబెట్టాను. త్వరగా కొనుగోలు చేసి ఆదుకోవాలి. – హన్మంతు, రైతు, నవాబుపేట -
ఆహార తనిఖీలేవీ..?
● జోరుగా కల్తీ పదార్థాల విక్రయాలు ● ప్రజారోగ్యానికి పొంచి ఉన్న ముప్పు ● పట్టించుకోని అధికారులు మెదక్ మున్సిపాలిటీ: ఉరుకుల, పరుగుల జీవితంలో అందరు బిజీ అయిపోయారు. ఇంట్లో వంట తయారు చేసుకునే సమయం లేక కొందరు, ఓపిక లేక మరికొందరు ఆహార పదార్థాలను బయట కొనుగోలు చేసి తెచ్చుకుంటున్నారు. ఇది జిల్లాలోని కొందరు వ్యాపారులకు వరంగా మారింది. సంబంధిత అధికారులు తనిఖీలు చేయకపోవడంతో ఇష్టారాజ్యంగా కల్తీ చేసి వ్యాపారం సాగిస్తున్నారు. ఆరోగ్యానికి హాని కలిగించే రంగులు, టెస్టింగ్ సాల్ట్ను ఇష్టానుసారం వాడుతున్నారు. పుడ్ సేఫ్టీ అధికారులు ప్రతి నెల ఆయా హోటళ్లు, దాబాలు, కిరాణ దుకాణాల్లో తరచూ తనిఖీలు నిర్వహించాలి. నమూనాలు సేకరించి నాణ్యత పరీక్షల నిమిత్తం ప్రయోగశాలకు పంపాలి. అయితే జిల్లాలో తనిఖీలు మొక్కుబడి తంతుగా మారాయి. ఎవరైనా ఫిర్యాదు చేస్తే తప్ప తనిఖీలు చేపట్టడం లేదన్న ఆరోపణలు బహిరంగంగానే వినిపిస్తున్నా యి. దీంతో దాబాలు, హోటళ్లు, ఇతర వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. జిల్లా కేంద్రం ఏర్పడి తొమ్మిదేళ్లు అవుతున్నా.. ఇప్పటివరకు రెగ్యులర్ ఫుడ్ సేఫ్టీ అధికారి లేరు. సంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాలకు చెందిన అధికారులే ఇన్చార్జిలుగా వ్యవహరిస్తున్నారు. దీంతో జిల్లాలో నామమాత్రపు తనిఖీలు కొనసాగాయి. ఫలితంగా ఆహార పదార్థాలు విక్రయించే వ్యాపారులు ఆడిందే ఆట.. పాడిందే పాటగా మారింది. కుళ్లిన, నిల్వ చేసిన పదార్థాలు విక్రయించి ప్రజారోగ్యంతో చెలగాటం ఆడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు కార్యాలయానికి ఎప్పుడూ తాళమే ఆరునెలల క్రితం జిల్లా సమీకృత కలెక్టరేట్లో ఫుడ్ సేఫ్టీ కార్యాలయానికి ఒక గదిని కేటాయించారు. కానీ దానికి ఎప్పుడు చూసినా తాళమే దర్శనమిస్తోంది. అధికారికి ఎప్పుడు ఫోన్ చేసినా ఫీల్డ్లో ఉన్నానని చెబుతున్నారు. ఫిర్యాదు చేసేందుకు వచ్చిన ప్రజలు గదికి తా ళం వేసి ఉండటంతో వెనుదిరుగుతున్నారు. ఉపేక్షించేది లేదుఇటీవలే రెగ్యులర్ పోస్ట్పై జిల్లాకు వచ్చాను. ఫుడ్ సెంటర్లు, హోటళ్లు, ఫాస్ట్ఫుడ్ సెంటర్లు, దాబాలలో విస్తృతంగా తనిఖీలు చేస్తున్నాం. కల్తీ పదార్థాలపై ఉపేక్షించేది లేదు. రోజువారీగా తనిఖీలు నిర్వహిస్తున్నాం. నిర్లక్ష్యంగా వ్యవహరించే ఫుడ్ సెంటర్లను సీజ్ చేస్తాం. ఇప్పటివరకు 11 శాంపిల్స్ సేకరించాం. – స్వదీప్, జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి -
హైవేలపై క్యూఆర్ కోడ్లు
● స్కాన్ చేయగానే పూర్తి వివరాలు ● నవంబర్ నెలాఖరులోగా ఏర్పాటు ● భద్రత మెరుగు, అందుబాటులో సమాచారంరామాయంపేట(మెదక్): జాతీయ రహదారులపై ప్రయాణాన్ని మరింత సులభతరం చేయడంతో పాటు భద్రత మెరుగు పర్చడం, ప్రయాణికులకు అత్యవసర సేవలందించడానికి త్వరలో క్యూఆర్ కోడ్లతో కూడిన సమాచార బోర్డులను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం నేషనల్ హైవే ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) సమాయత్తం అవుతోంది. జిల్లా మీదుగా 44వ జాతీయ రహదారి 55 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. ఈరహదారి పరిధిలో సమీప ఆస్పత్రులు, అత్యవసర నంబర్లు, పెట్రోల్ బంక్లు, హైవే పెట్రోలింగ్, పోలీస్స్టేషన్లు, రెస్టారెంట్లు ఏ ప్రాంతంలో ఉన్నాయో తె లియని పరిస్థితుల్లో ప్రయాణికులు తరచూ ఇబ్బందులపాలవుతున్నారు. ఈక్రమంలో ఇబ్బందులను అధిగమించేందుకు క్యూఆర్ కోడ్తో పూర్తి సమాచారం అందజేసే విధంగా జాతీయ రహదారుల శాఖ సిద్ధమైంది. వీటిని టోల్ ప్లాజాలు, ట్రక్ లేబై ప్రాంతాలు, ప్రధాన పట్టణాలు, నగరాల ఎంట్రీ రోడ్లు, బస్టాండ్లు, హైవే ప్రారంభం, ముగింపు ప్రాంతాలు, ప్రధాన కూడళ్లు, సర్వీస్ కేంద్రాలు, పెట్రోల్ బంక్లు, ఇతర ప్రధాన రహదారుపై ఏర్పాటు చేయనున్నారు. మూడు భాషల్లో వివరాలు నవంబర్ నెలాఖరులోగా జాతీయ రహదారి పరిధిలో సదరు బోర్డులు ఏర్పాటు చేయనున్నారు. ఎంపిక చేసిన ప్రదేశాల్లో, వాహనచోదకులకు సులువుగా అర్థం అయ్యే రీతిలో మూడు భాషల్లో వీటిని ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. దీనిని ఫోన్తో స్కాన్ చేయగానే సంబంధిత రహదారికి సంబంధించిన పూర్తి వివరాలు ఫోన్లో ప్రత్యక్షమవుతాయి. ఇది అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణికులకు ఎంతగానో తోడ్పడనుంది. దీంతో ప్రయా ణం సాఫీగా కొనసాగే అవకాశం ఉంటుంది. లభించే సమాచారం -
మొలకెత్తిన ధాన్యం ఆరబెట్టాలి
జిల్లా వ్యవసాయ అధికారి దేవ్కుమార్కొల్చారం(నర్సాపూర్)/తూప్రాన్: వరి కోతలు కోసే విషయంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని, తొందరపాటుగా వ్యవహరించొద్దని జిల్లా వ్య వసాయ అధికారి దేవ్కుమార్ సూచించారు. గురువారం మండలంలోని రంగంపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి తేమశాతం పరిశీలించారు. తడిసిన ధాన్యం మొలకెత్తిందని, ఈ పరిస్థితుల్లో తమను ఆదుకోవాలని రైతు లు కోరారు. స్పందించిన డీఏఓ వ్యవసాయ అధికారుల సూచనలు పాటిస్తూ మొలకెత్తిన ధాన్యాన్ని ఆరబెట్టాలన్నారు. మరో రెండు, మూడు రోజుల తర్వాత మాత్రమే వరి కోతలు ప్రారంభించాలని తెలిపారు. అక్కడి నుంచి గ్రామంలోని ఎరువుల దుకాణాలను తనిఖీ చేశారు. ఆయన వెంట ఏఓ శ్వేతకుమారి ఉన్నారు. అనంతరం తూప్రాన్ మండలంలోని జెండాపల్లిలో రైతులతో కలిసి పంట పొలాలను సందర్శించారు. ఈసందర్భంగా విత్తనాల ఎంపికలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. -
ట్రాన్స్ఫార్మర్ కోసం లంచం
ఏసీబీకి చిక్కిన ట్రాన్స్కో డీఈ మెదక్ కలెక్టరేట్: ఏసీబీకి మరో ప్రభుత్వ ఉద్యోగి చిక్కాడు. పౌల్ట్రీ రైతు నుంచి లంచం తీసుకుంటుండగా మెదక్ ట్రాన్స్కో డీఈ షేక్ చాంద్ షరీఫ్ భాషను గురువారం రెడ్హ్యండేడ్గా పట్టుకున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ కథనం ప్రకారం.. పాపన్నపేట మండలం సీతానగరం గ్రామానికి చెందిన పాపగారి భాస్కర్ బ్యాంకు నుంచి రూ. 18 లక్షల లోన్ తీసుకొని గ్రామంలో నూతనంగా పౌల్ట్రీఫాం ఏర్పాటు చేస్తున్నాడు. కరెంట్ కోసం సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ కావాలని ట్రాన్స్కో డీఈని సంప్రదించాడు. ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటుకు రూ. 2.19 లక్షలకు పైగా ఖర్చు అవు తుందని అంచనా వేసి ఇచ్చారు. రూ. 30 వేలు లంచం ఇస్తే రూ. 1.10 లక్షలకే ట్రాన్స్ఫార్మర్ ఇస్తా మని తెలిపారు. డీఈ సూచన మేరకు రూ. 9 వేలు నాగారం బాల్రాజ్ అనే వ్యక్తికి ఫోన్పే ద్వారా పంపించాడు. మిగితా రూ. 21 వేలు ఇస్తేనే పనులు ప్రారంభమవుతాయని డిమాండ్ చేయగా, ఏసీబీని ఆశ్రయించాడు. గురువారం ట్రాన్స్కో డీఈ కార్యాలయంలో డీఈకి రైతు భాస్కర్ రూ. 21 వేల లంచం ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యండేడ్గా పట్టుకున్నారు. ఈసందర్భంగా బాధితు రైతు మాట్లాడుతూ.. ట్రాన్స్ఫార్మర్ కోసం మెదక్ ఎమ్మెల్యే రోహిత్రావు పీఏ ద్వారా ఫోన్ చేయించానని, ఎమ్మెల్యే వచ్చి ఇక్కడ పనిచేస్తాడా? ఎవరు చెప్పిన వినేది లేదని డీఈ దురుసుగా మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేశారు. -
కొనుగోళ్లు వేగవంతం చేయండి
హవేళిఘణాపూర్(మెదక్): ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా రైతులు పండించిన ధాన్యాన్ని వెంటవెంటనే తరలించే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాహుల్రాజ్ అధికారులను ఆదేశించారు. గురువారం మండల పరిధిలోని శాలిపేట కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ఇప్పటివరకు 10,530 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని తెలిపారు. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటను కొనుగోలు చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. అవసరమైన టార్పాలిన్లు అందజేసి ధాన్యం ఆరబెట్టుకునేలా చూడాలన్నారు. స్పెషల్ ఆఫీసర్లు ఎప్పటికనప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. ధాన్యం కొనుగోలు విషయంలో అలసత్వం వహించే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ సింధూరేణుక, కొనుగోలు కేంద్రం నిర్వాహకులు ఉన్నారు. తాగునీరు పునరుద్ధరించండి తాత్కాలిక మోటార్లు ఏర్పాటు చేసి శుక్రవారం సాయంత్రంలోపు హవేళిఘణాపూర్ మండలంలోని 32 గ్రామాలకు తాగు నీటి సరఫరాను పునరుద్ధరించాలని కలెక్టర్ రాహుల్రాజ్ ఆదేశించారు. గురువారం మండల పరిధిలోని జక్కన్నపేట పంప్హౌస్ను పరిశీలించారు. ఈసందర్భంగా మిషన్ భగీరథ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. రెండు మోటార్లు కాలిపోవడంతో వారం రోజులుగా నీటి సరఫరా నిలిచిపోయిందని వారు తెలిపారు. భవిష్యత్లో ఇబ్బందులు లేకుండా చర్య లు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. -
రైతుల తిప్పలు కనిపించవా?
దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డిచిన్నశంకరంపేట(మెదక్): మోంథా తుపాన్తో రైతుల ధాన్యం తడిసి ఇబ్బందులు పడుతుంటే ఇన్చార్జి మంత్రికి సోయిలేదని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి ఫైర్ అయ్యారు. గురువారం నార్సింగి మండల కేంద్రంలో తడిసిన ధాన్యాన్ని పరిశీలించి రైతులతో మాట్లాడారు. 15 రోజుల క్రితం ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించినా, ఇప్పటివరకు ఒక్క క్వింటా కొనుగోలు చేయలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై పడిందని, ప్రజలను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ధాన్యం తడిసి, పంటలు దెబ్బతింటే కనీసం క్షేత్రస్థాయి పరిశీలన చేయలేదని వాపోయారు. జిల్లాపై కనీస అవగాహన లేకుండా ఇన్చార్జి మంత్రి వివేక్ వ్యవహరించడం సిగ్గుచేటన్నారు. జిల్లాలోని అధికారులు తక్షణం స్పందించి ధాన్యం కొనుగోలు చేయాలని, లేకుంటే ఇళ్లు ముట్టడిస్తామని హెచ్చరించారు. ఆయన వెంట మాజీ జెడ్పీటీసీ కృష్ణారెడ్డి, రణం శ్రీనివాస్, మాజీ వైస్ ఎంపీపీ మల్లేశంగౌడ్, బీఆర్ఎస్ మండల అధ్యక్ష, కార్యదర్శులు మైలారం బాబు, భూపతిరాజ్, రాజశేఖర్ ఉన్నారు. -
సంత.. సమస్యల చింత
రామాయంపేట(మెదక్): వారంతపు సంతలో సౌకర్యాలు కొరవడ్డాయి. దీంతో వ్యాపారులు, ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. గత ప్రభుత్వ హయాంలో రామాయంపేటలో రూ. రెండున్నర కోట్ల వ్యయంతో నిర్మించ తలపెట్టిన సమీకృత మార్కెట్ భవన సముదాయ నిర్మాణం మధ్యలోనే నిలిచిపోయింది. పనులు కొనసాగుతాయా..? లేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కనీస సదుపాయాలు కరువు ప్రతి బుధవారం రామాయంపేట పట్టణంలోని గాంధీ విగ్రహం వద్ద ఇరుకు రోడ్డుపై సంత కొనసాగుతోంది. సుమారు 30 గ్రామాల ప్రజలు, వ్యాపారులు పెద్దసంఖ్యలో పాల్గొంటారు. దీంతో సంతలో అత్యంత రద్దీ నెలకొంటుంది. రెండు కిలోమీటర్ల మేర కనీసం కాలినడకన వెళ్లడానికి సైతం వీలులేకుండా ఉంటుంది. అలాగే ప్రతి రోజూ కొనసాగుతున్న మార్కెట్ను ఇప్పటికే నాలుగు స్థలాలకు మార్చారు. మొదట్లో రోడ్డుపై కొనసాగిన మార్కెట్ కేవలం కొన్ని నెలల పాటు రైతుబజార్లో కొనసాగింది. అక్కడ వ్యాపారం సక్రమంగా కొనసాగకపోవడంతో మిషన్ కంపౌండ్ ఆవరణలోకి మార్చారు. చర్చి ప్రతినిధుల అభ్యంతరాలతో అక్కడి నుంచి ఎత్తివేసి తాత్కాలికంగా పోలీస్స్టేషన్ సమీపంలో మెదక్ రోడ్డులోకి మార్చారు. ప్రస్తుతం ఇక్కడే మార్కెట్ కొనసాగుతుండగా, వ్యాపారులు, కూ రగాయల కొనుగోలు నిమిత్తం వచ్చే వారి కోసం ఎలాంటి సదుపాయాలు కల్పించలేదు. మూత్రశాలలు సైతం లేకపోవడంతో వారు ఇబ్బందులపాలవుతున్నారు. సమీకృత మార్కెట్ భవన సముదాయం నిర్మాణం పూర్తయితే ఈ ఇబ్బందులు తప్పే అవకాశం ఉంది. ఎంపీపీ కార్యాలయం ఆవరణలో నిర్మిస్తున్న భవన సముదాయాల నిర్మాణం పిల్లర్ల స్థాయిలో నిలిచి మూడేళ్లు అవుతోంది. అసలు పనులు కొనసాగుతాయా..? లేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇక్కడ మార్కెట్ నిర్మాణాన్ని రద్దు చేసి ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించి భవనాల నిర్మాణం చేపట్టే ఆలోచనతో యంత్రాంగం ఉన్నట్లు సమాచారం. అలాగే కాట్రియాల గ్రామంలో ఉపాధి నిధులతో నిర్మించ తలపెట్టిన మార్కెట్ సముదాయం అసంపూర్తిగా వదిలేశారు. గోడలు నిర్మించి, రేకులు బిగించి అసంపూర్తిగా ఉంది. సుమారు రూ. పది లక్షల మేర ఖర్చుకాగా, మళ్లీ నిధులు మంజూరైతే తప్ప పనులు సాగని పరిస్థితి నెలకొంది.రామాయంపేట సంతలో రద్దీనిలిచిన సమీకృత మార్కెట్ భవనాల నిర్మాణం ఇబ్బంది పడుతున్న ప్రజలు పట్టించుకోని అధికారులు -
ఆయిల్పామ్ సాగుకు రాయితీ
నిజాంపేట(మెదక్): ఆయిల్పామ్ సాగుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున రాయితీ ఇస్తూ రైతులను ప్రోత్సహిస్తుందని జిల్లా వ్యవసాయ అధికారి దేవ్కుమార్, జిల్లా ఉద్యాన అధికారి ప్రతాప్సింగ్ అన్నారు. బుధవారం మండల పరిధిలోని చల్మెడలో లీవ్పామ్ రిసోర్స్, జిల్లా ఉద్యానశాఖ ఆధ్వర్యంలో ఆయిల్పామ్ నర్సరీని ప్రారంభించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. జిల్లా 2,500 ఎకరాల్లో ఆయిల్పామ్ సాగు చేయాలని లక్ష్యంగా ఉందన్నారు. ఇప్పటివరకు 600 ఎకరాల్లో రైతులు సాగు చేసినట్లు తెలిపారు. జిల్లాలో 4 లక్షల మొక్కలు పెంచడానికి ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలిపారు. ఇప్పటికే 20 వేలు మొక్కలు అందు బాటులో ఉన్నాయని చెప్పారు. వచ్చే సంవత్సరం రైతులు నాటుకోవడానికి మరో 1.5 లక్షల మొక్కలు సిద్ధం చేస్తామన్నారు. జిల్లా రైతులు వరికి బదులు ఆయిల్పామ్ పంట సాగు చేయాలని కోరారు. కార్యక్రమంలో వ్యవసాయ ఉప సంచాలకులు వినయ్ విన్సెంట్, రామాయంపేట డివిజన్ ఉప సంచాలకులు రాజ్నారాయణ, టెక్నికల్ వ్యవసాయ అధికారులు వందన, నాగమాధురి, నిజాంపేట వ్యవసాయ అధికారి సోమలింగంరెడ్డి, ఉద్యాన అధికారి రచన, సిబ్బంది పాల్గొన్నారు.జిల్లా వ్యవసాయ, ఉద్యాన అధికారులు దేవ్కుమార్, ప్రతాప్సింగ్ -
ఏడుపాయల ఆలయం మూసివేత
పాపన్నపేట(మెదక్): సింగూరు నీటి విడుదలతో మంజీరాకు వరదలు పోటెత్తాయి. దీంతో ఏడుపాయల ఆలయాన్ని బుధవారం మూసివేశారు. రాజగోపురంలో దుర్గమ్మ ఉత్సవ విగ్రహాన్ని ఉంచి పూజలు చేస్తున్నారు. ఎగువన కురుస్తున్న వర్షాలతో సింగూరు ప్రాజెక్టు 14వ గేటు ఎత్తి 12,082 క్యూసెక్కుల నీరు దిగువకు వదిలారు. దీంతో ఘనపురం ఆనకట్ట పొంగిపొర్లుతోంది. ఆలయం ఎదుట నుంచి నీరు భారీగా ప్రవహిస్తోంది. ముందు జాగ్రత్త చర్య గా ఆలయాన్ని మూసివేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు. తడిసిన వడ్లు కొనుగోలు చేయాలి ఎమ్మెల్యే సునీతారెడ్డి నర్సాపూర్: తడిసిన వడ్లను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని ఎమ్మెల్యే సునీతారెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం ఆమె మాట్లాడుతూ.. మొంథా తుఫాన్ ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురిసి వడ్లు తడుస్తున్నాయని విచారం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ధాన్యం తడిసి ముద్దయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయా మండలాల పరిధిలోని పాంబండ, ఖాజీపేట, సంగాయిపేట, రంగంపేట, చిన్న ఘనపూర్, వరిగుంతం, చిలప్చెడ్ తదితర గ్రామాల్లో రైతులు వరి కోతలు కోయడంతో ధాన్యం తడిసిందని తెలిపారు. కాగా అవసరం ఉన్న రైతులకు టార్పాలిన్లు అందజేయాలని కోరారు. ఇదే విషయం కలెక్టర్ రాహుల్రాజ్ దృష్టికి తీసుకెళ్లగా, సానుకూలంగా స్పందించారని తెలిపారు. వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. భోజనం ఎలా ఉంది? రామాయంపేట(మెదక్): మున్సిపాలిటీ పరిధి కోమటిపల్లి శివారులోని కేజీబీవీ పాఠశాలను బుధవారం మెదక్ ఆర్డీఓ రమాదేవి సందర్శించారు. ఇటీవల స్కూల్లో ప్రమాదవశాత్తు కిందపడి గాయపడిని విద్యార్థిని ప్రియాంకను పరామర్శించారు. అనంతరం విద్యార్థినులతో కలిసి భోజనం చేశారు. పాఠశాలలో భోజనం ఎలా పెడుతున్నారని అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి సిబ్బందితో మాట్లాడారు. పెండింగ్లో ఉన్న ప్రజావాణి దరఖాస్తులతో పాటు జాతీయ రహదారి (765 డీజీ) నిర్మాణానికి సంబంధించి భూములు కోల్పోయిన రైతుల వివరాల గురించి తెలుసుకున్నారు. ఆమె వెంట తహసీల్దార్ రజని, ఆర్ఐలు, ఇతర సిబ్బంది ఉన్నారు. దరఖాస్తుల ఆహ్వానం పాపన్నపేట(మెదక్): రాష్ట్రస్థాయి బాలమిత్ర అవార్డులకు దరఖాస్తు చేసుకోవాలని బాలల హక్కుల ప్రజా వేదిక అధ్యక్షుడు సుభాష్ చంద్రబోస్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నవంబర్ 14న బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని 14 ఏళ్ల వయస్సు గల పిల్లలు, 33 రంగాల్లో ప్రతిభ కలిగిన వారికి బాలమిత్ర అవార్డులు ఇస్తున్నట్లు తెలిపారు. దేశభక్తి పాటలు, భరత నాట్యం, గిటార్, కీబోర్డు ప్లేయింగ్, యోగా, చిత్రలేఖనం, జానపద గీతాలు, తదితర అంశాల్లో నైపుణ్యం గలవారు వచ్చేనెల 5వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇంటి నంబర్ 2–92, గ్రామం కూరెల్ల, మండలం కోహెడ, జిల్లా సిద్దిపేట, పిన్ నంబర్ 505473కు పంపాలని కోరారు. క్వారీ లీజులు రెన్యువల్ చేసుకోవాలి మెదక్ కలెక్టరేట్: జిల్లాలోని మైనింగ్, క్వారీ లీజులు రెన్యువల్, నూతన క్వారీల కోసం తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలని కలెక్టర్ రాహుల్రాజ్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నిర్వాహకులు రాష్ట్రస్థాయి పర్యావరణ ప్రభావ అధ్యాయన సంస్థ (సీయా) జారీ చేసే పర్యావరణం అనుమతి కూడా తీసుకోవాలన్నారు. ఇందుకోసం అత్యంత కీలకమైన జిల్లా సర్వే నివేదికను సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం రూపొందించినట్లు తెలిపారు. -
వందశాతం ఉత్తీర్ణత సాధించాలి
రామాయంపేట(మెదక్): ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఆయా సబ్జెక్టుల్లో విద్యార్థుల ఉత్తీర్ణత శాతం తక్కువగా ఉంటే సంబంధిత లెక్చరర్లపై చర్యలు తప్పవని జిల్లా ఇంటర్ విద్యాశాఖ అధికారి మాధవి హెచ్చరించారు. బుధవారం ఆమె స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలను సందర్శించి మాట్లాడారు. విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించే దిశగా అఽ ద్యాపకులు కృషి చేయాలన్నారు. అన్ని కళాశాలల్లో విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణత సాధించాల్సిందేనని స్పష్టం చేశారు. మూడు కేటగిరీలుగా విభజించి విద్యాబోధన చేయాలని, ప్రతి సబ్జెక్టుపై విద్యార్థులు పట్టు సాధించేలా చర్యలు తీసుకోవాలన్నారు. అంతకుముందు కళాశాల రికార్డులు పరిశీలించి లెక్చరర్లతో మాట్లాడారు. ఆమె వెంట ప్రిన్సిపాల్ హిమజ్యోతి, సిబ్బంది ఉన్నారు.డీఐఈఓ మాధవి -
ప్రభుత్వ బడులకు అండగా నిలుద్దాం
మనోహరాబాద్(తూప్రాన్): ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు అండగా ఉండటానికి దాతలు ముందుకు రావడం అభినందనీయమని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ సుహాసినిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. బుధవారం మండలంలోని దండుపల్లి శివారులోని ఓ గార్డెన్లో రాష్ట్ర సర్పంచ్ల ఫోరం మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహిపాల్రెడ్డి తన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం మనోహరాబాద్ ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ విద్యార్థులకు రూ. 1.50 లక్షల విలువైన క్రీడా వస్తువులను అందజేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ తమకు తోచిన విధంగా ప్రభుత్వ పాఠశాలలకు అండగా నిలవాల ని కోరారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్, ఎంఈఓ మల్లేశ్, నాయకులు వెంకట్రెడ్డి, జావీద్పాషా తదితరులు పాల్గొన్నారు.జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ సుహాసినిరెడ్డి -
తెల్లబోతున్నారు..!
కొల్చారంలో వర్షానికి దెబ్బతిన్న పత్తి చేనుమెతుకుసీమలో వరి తర్వాత అత్యధికంగా రైతులు పత్తి పంట పండిస్తారు. ఈ ఏడాది జిల్లాలో 35,087 ఎకరాల్లో సాగు చేశారు. పెద్దశంకరంపేట, రేగోడు, అల్లాదుర్గం, టేక్మాల్ మండలాలతో పాటు చేగుంట మండలంలోనూ కొంతమేర పంట సాగు చేశారు. కాగా ఈ వానాకాలం సీజన్ ప్రారంభం నుంచి అనావృష్టి, అతివృష్టి రైతులను వెంటాడుతూనే ఉంది. ముందస్తు వర్షాలతో విత్తనాలు నాటిన తర్వాత వర్షాలు ముఖం చాటేశాయి. అనంతరం ఆగస్టు చివరివారంలో కురిసిన భారీ వర్షాలకు సుమారు ఆరు వేల పైచిలుకు ఎకరాల్లో వివిధ పంటలు దెబ్బతినగా, అందులో వెయ్యి ఎకరాల్లో పత్తి పంటకు నష్టం వాటిల్లింది. ప్రస్తుతం మిగిలిన పంట చేతికందే సమయంలో మోంథా తుఫాన్ ప్రభావంతో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పత్తి పంటకు తీవ్ర నష్టం వాటిళ్లే పరిస్థితి ఉందని రైతులు ఆవేదన చెందుతున్నారు.తేమశాతం 12 మించకూడదు ఈఏడాది పత్తి సాగు చేసిన రైతులకు పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితులు లేవు. సక్రమంగా పంటపండితే ఎకరాకు 12 క్వింటాళ్ల దిగుబడి వస్తోంది. కానీ ఈసారి అతివృష్టితో ఎకరాకు 6 నుంచి 8 క్వింటాళ్ల దిగుబడి మాత్రమే వస్తుందని చెబుతున్నారు. పత్తిని ప్రభుత్వం కొనుగోలు చేయాలంటే తేమ శాతం 8 మించకూడదు. అలా ఉంటేనే ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర రూ. క్వింటాల్కు రూ. 8,110 అందిస్తారు. అదే 12 శాతం తేమ ఉంటే క్వింటాల్కు రూ. 8 వేల వరకు కొనుగోలు చేస్తారు. అంతకుమించి తేమశాతం ఉన్నా, నల్లబడినా కొనుగోలు చేయటం లేదు. వరుస వర్షాలతో పత్తికి తీవ్ర నష్టం నల్లబారి, కుళ్లిపోతున్న కాయ ఆందోళన చెందుతున్న రైతులు జిల్లాలో 35,087 ఎకరాల్లో సాగుపత్తి రైతు కుదేలవుతున్నాడు. వరుసగా కురుస్తున్న వర్షాలు కంటిమీద కనుకు లేకుండా చేస్తున్నాయి. రంగు మారి, కాయ మురిగిపోతుండటంతో ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే అతివృష్టితో వేలాది ఎకరాల్లో పంట నష్టపోయారు. మిగిలిన పంట చేతికందే సమయంలో ‘మోంథా’ తుఫాన్ రూపంలో మరో ఉపద్రవం ముంచుకొచ్చింది. వర్షాలు ఇలాగే కొనసాగితే కనీసం పెట్టుబడి సైతం వచ్చే పరిస్థితి లేదని దిగాలు చెందుతున్నారు. జిల్లాలో 35,087 ఎకరాల్లో రైతులు తెల్లబంగారాన్ని సాగు చేశారు. – మెదక్జోన్ ప్రభుత్వమే ఆదుకోవాలి నాకున్న 6 ఎకరాలతో పాటు మరో 10 ఎకరాలు కౌలుకు తీసుకొని పత్తి సాగు చేశాను. ఎకరాకు రూ. 50 వేల చొప్పున రూ. 8 లక్షల పెట్టుబడి పెట్టి పెట్టా. ఆగస్టులో కురిసిన వ ర్షాలకు కొంత మేర నష్టం జరిగింది. ఇప్పుడు పత్తి తీసే సమయంలో వర్షంతో నల్లబారుతోంది. ఈసారి పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదు. ప్రభుత్వమే ఆదుకోవాలి. – శివరాములు, గొల్లకుంటతండా, అల్లాదుర్గం -
టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలి
చేగుంట(తూప్రాన్): ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని కలెక్టర్ రాహుల్రాజ్ నిర్వాహకులకు సూచించారు. బుధవారం మండలంలోని కర్నాల్పల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించారు. తుఫాన్ ప్రభావంతో రైతులకు నష్టం వాటిల్లకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రానున్న మూడు రోజుల పాటు రైతులు వరి కోతలు చేపట్టకుండా గ్రామ స్థాయిలో అవగాహన కల్పించాలని తెలిపారు. మిల్లులకు ధాన్యం పంపిన వెంటనే అన్లోడ్ చేసుకొని ట్యాబ్ ఎంట్రీ పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ శివప్రసాద్, ఐకేపీ ఏపీఎం దుర్గాప్రసాద్, సీసీ స్వేత, రైతులు, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు. మెనూ ప్రకారం భోజనం అందించాలి తూప్రాన్: విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని కలెక్టర్ రాహుల్రాజ్ అధికారులను ఆదేశించారు. బుధవారం మండలంలోని రావెల్లి మహాత్మ జ్యోతిబాపూలే బాలికల పాఠశాల, కళాశాలలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించడంతో పాటు విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు మెనూ ప్రకా రం నాణ్యమైన భోజనం అందించడంతో పాటు అసౌకర్యాలకు గురికాకుండా చూడాల్సిన బాధ్యత సిబ్బందిపై ఉందన్నారు. అనంతరం నూతన పీహెచ్సీ భవన నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు.కలెక్టర్ రాహుల్రాజ్ -
త్వరలో ఎకో పార్కు ప్రారంభం
● కలెక్టర్ రాహుల్రాజ్ ● అర్బన్పార్కులో కాటేజీల పరిశీలన నర్సాపూర్: నర్సాపూర్లో ఎకో పార్కును త్వరలో ప్రారంభిస్తామని కలెక్టర్ రాహుల్రాజ్ తెలిపారు. మంగళవారం అటవీ శాఖ అధికారులతో కలిసి నర్సాపూర్ అర్బన్పార్కులో నిర్మించిన కాటేజీల ప్రారంభోత్సవ ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎకో పార్కులో ప్రైవేట్ సంస్థ సహకారంతో అటవీ శాఖ 42 కాటేజీలను నిర్మించిందని చెప్పారు. కాగా వాటిని మంత్రి కొండా సురేఖ చేత ప్రారంభించేందుకు అటవీశాఖ ఏర్పాట్లు చేస్లోందని తెలిపారు. త్వరలోనే ప్రారంభోత్సవ కార్యక్రమం ఉంటుందన్నారు. కాటేజీలు అందుబాటులోకి వస్తే ఎకో పార్కు ప్రకృతి ప్రేమికులను బాగా ఆకట్టుకుటుందని చెప్పారు. ఎకో పార్కులో ఆహ్లాదకరమైన వాతావరణంలో కుటుంబ సభ్యులతో సంతోషంగా గడిపే అవకాశం ఉంటుందన్నారు. కాగా కాటేజీలతో పాటు నిర్మించిన స్విమ్మింగ్ పూల్, పార్కు, రెస్టారెంట్, డైనింగ్ హాలు ఇతర భవనాలను కలెక్టర్ పరిశీలించారు. కలెక్టర్ వెంట డీఎఫ్ఓ జోజి, ఆర్డీఓ మహిపాల్, తహసీల్దార్ శ్రీనివాస్, రేంజ్ అధికారి అరవింద్ తదితరులు ఉన్నారు. -
పొంచిన మరో ముప్పు
మొంథా హెచ్చరికలతో.. వరికోతలు వద్దంటూ అధికారుల సూచన వరుస తుపానులతో రైతులు అతలాకుతలమవుతున్నారు. ఆగస్టులో మొదలైన వానలు అన్నదాతలను వెంటాడుతూనే ఉన్నాయి. తాజాగా మొంథా తుఫాన్ కారణంగా మళ్లీ భారీవర్షాలు కురుసే అవకాశాలున్నాయని, నాలుగు రోజులపాటు వరికోతలు నిలిపి వేయాలని జిల్లా యంత్రాంగం రైతులకు సూచించింది. ఇప్పటికే వరద ఉధృతితో వేలాది ఎకరాల్లో పంటలు ధ్వంసం కాగా తాజాగా మొంథా రూపంలో మళ్లీవానలు కురుస్తుండటంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. –మెదక్జోన్ జిల్లా వ్యాప్తంగా ఈ సీజన్లో 3.5లక్షల ఎకరాలలో వరిపంటలను సాగు చేశారు. దీంతో 4.20 లక్షల మెట్రిక్టన్నుల ధాన్యం దిగుబడులు వస్తాయని అంచనా వేసిన అధికారులు 518 కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం సేకరిస్తామని భావించిన అధికారులు ఇప్పటికే 513 కేంద్రాలను ఏర్పాటు చేశారు. పదిహేను రోజులుగా ధాన్యం సేకరణ ప్రారంభించారు. ఇప్పటివరకు 5,705 మెట్రిక్టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. కాగా ప్రస్తుతం కొనుగోలు కేంద్రాల్లో పదివేల మెట్రిక్ టన్నుల ధాన్యం వరకు సిద్ధంగా ఉంది. నాలుగైదు రోజులుగా జిల్లాలో అక్కడక్కడా వర్షం కురుస్తుండటంతో ధాన్యం తడిసిపోతోంది. తడిసిన ధాన్యాన్ని కూలీల సహకారంతో మళ్లీ, మళ్లీ ఆరబెడుతూ అదనపు భారాన్ని భరిస్తున్నారు. కాగా, తాజాగా జిల్లాకు భారీ నుంచి అతిభారీ వర్షాలున్నాయని వాతావరణశాఖ హెచ్చరికతో అధికారులు వరికోతలు నాలుగు రోజులపాటు వాయిదా వేయాలని హెచ్చరికలు జారీచేసింది. జిల్లాలో కొన్నేళ్లుగా అకాల వర్షాల కారణంగా ఆరబెట్టిన ధాన్యం తడిసిపోయి రైతులు నరకయాతన పడుతున్నారు. కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని వర్షం నుంచి కాపాడుకునేందుకు అద్దెకు టార్పాలిన్లు తెచ్చుకుంటున్నారు. ఇందుకోసం ఒక్కో రైతు రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు ఖర్చు చేస్తున్నారు. కాగా, ప్రభుత్వం ఎప్పుడు సరిపడా టార్పాలిన్లు ఇచ్చిన దాఖలాల్లేవు. ఈసారి కేవలం 9,227 టార్పాలిన్లు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకుంది. వరి కోతలు వద్దు మొంథా తుపాను కారణంగా జిల్లాలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున 4 రోజుల పాటు వరికోతలను వాయిదా వేయాలని చెప్పాం. ప్రస్తుతం కొనుగోలు కేంద్రాల్లో ఆరబెట్టిన ధాన్యం తడవకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. జగదీశ్కుమార్, డీఎం, పౌరసరఫరాల శాఖ అధికారి -
వరి కోతలొద్దు
ఆర్డీఓ జయచంద్రారెడ్డివెల్ధుర్తి(తూప్రాన్): వర్షాల నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని, వరి కోతలు ఆపాలని తూప్రాన్ ఆర్డీఓ జయచంద్రారెడ్డి పేర్కొన్నారు. మంగళవారం మాసాయిపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు తమ ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వర్షాలు తగ్గే వరకు తూకం వాయిదా వేయాలన్నారు. ధాన్యంను దళారులకు, ప్రైవేట్ వ్యాపారుల వద్దకు ఆశ్రయించవద్దని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కోనగోలు కేంద్రాల్లోనే విక్రయించేలా చూడాలన్నారు. రైతులకు ఇబ్బంది కాకుండా కొనగోలు కేంద్రాలలో తగు జాగ్రత్తలు చేపట్టేలా అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ సమావేశంలో మాసాయిపేట తహసీల్ధార్ జ్ఞానజ్యోతి, ఎంపీడీఓ విఘ్నేశ్వర్, ఏవో కవిత పాల్గొన్నారు. -
ధాన్యం.. దైన్యం
బుధవారం శ్రీ 29 శ్రీ అక్టోబర్ శ్రీ 2025శివ్వంపేట(నర్సాపూర్)/కౌడిపల్లి(నర్సాపూర్)/కొల్చారం(నర్సాపూర్)/చిలప్చెడ్(నర్సాపూర్)/చేగుంట(తూప్రాన్)/నర్సాపూర్ /నర్సాపూర్ రూరల్: జిల్లావ్యాప్తంగా రైతులు వరికోతలు ప్రారంభించి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తరలిస్తున్న నేపథ్యంలో అకాల వర్షాలు వారిపాలిట శాపంగా మారాయి. కల్లాల్లో, కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం కాస్తా భారీ వర్షాల కారణంగా తడిసి ముద్దయింది. చేతికందొచ్చిన పంట కాస్తా చేజారిపోయే పరిస్థితులేర్పడటంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. శివ్వంపేట మండలం భీమ్లా తండా, కౌడిపల్లి మండలంలోని ధర్మాసాగర్, వెల్మకన్న, మహమ్మద్నగర్గేట్తండా, కూకుట్లపల్లి, చిలప్చెడ్ మండలంలో జగ్గంపేట, గంగారం, శీలాంపల్లి, బండపోతుగల్, అగజ్జమర్రి గ్రామాల్లో, చేగుంట మండలంలోని పలు గ్రామాల్లో, నర్సాపూర్, మూసాపేట తదితర గ్రామాల్లో రైతులు తమ ధాన్యాన్ని ఆరోబెట్టగా సోమవారం నుంచి కురుస్తున్న వర్షాలకు ధాన్యం కొన్ని చోట్ల తడిసిపోయింది. మరికొన్ని చోట్ల వర్షపునీటికి కొట్టుకుపోయింది. అధికారులు స్పందించి తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని కోరుతున్నారు. నర్సాపూర్ మండలంలో ఖాజీపేట, బ్రాహ్మణపల్లి, తుజాల్ పూర్, బ్రాహ్మణపల్లి తదితర గ్రామాలలో కొనుగోలు కేంద్రాల వద్ద ఆరబోసిన ధాన్యం వర్షానికి తడిసి ముద్దయ్యాయి. ఐజేపి ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి 15 రోజులు గడుస్తున్నా తూకం మాత్రం వేయడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. -
నిజాయితీగా పనిచేయాలి: కలెక్టర్
మెదక్ కలెక్టరేట్/కౌడిపల్లి(నర్సాపూర్): జిల్లాలో అవినీతికి తావులేకుండా పారదర్శక పాలనే లక్ష్యంగా ముందు సాగుతున్నామని, అధికారులు ప్రతి ఒక్కరూ స్వార్థాన్ని వీడి నిజాయితీగా పనిచేయాలని కలెక్టర్ రాహుల్రాజ్ తెలిపారు. విజిలెన్స్ అవగాహన వారోత్సవాలలో భాగంగా మంగళవారం మెదక్ సమీకృత కలెక్టరేట్లో జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించా రు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈనెల 27 నుంచి నవంబర్ 2వ తేదీ వరకు జిల్లాలో ‘కల్చర్ ఆఫ్ ఇంటెగ్రిటీ ఫర్ నేషన్స్ ప్రాస్పర్టీ’అనే థీమ్తో విజిలెన్స్ అవగాహన వారోత్సవాలు జరుగుతాయన్నారు. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఆదేశా ల మేరకు స్టేట్ విజిలెన్స్ అవగాహన వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలి పారు. ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి నిర్మూలనపై క్విజ్ పోటీలు, వాక్థాన్లు, మార థాన్ లు, వీధి నాటకాలు, గ్రామసభలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం విజిలెన్స్ పోస్టర్స్ను ఆవిష్కరించారు. రైతులు అప్రమత్తంగా ఉండాలి తుపాను ప్రభావంతో రైతులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ స్పష్టం చేశారు. కౌడిపల్లి మండలంలోని మహమ్మద్నగర్లోని పీఏసీఎస్ వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆర్డీఓ మహిపాల్రెడ్డి, డీఎస్ఓ నిత్యానంద్, డీఎంసీఎస్ జగదీశ్తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... మొంథా తుపాను నేపథ్యంలో రైతులు వరికోతలు వాయిదా వేసుకోవాలన్నారు. -
తూప్రాన్లో 2కే రన్
తూప్రాన్: దేశం కోసం ప్రాణాలు అర్పించిన పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని డీఎస్పీ నరేందర్గౌడ్ పేర్కొన్నారు. పోలీస్ అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా పట్టణ కేంద్రంలో పోలీసు సబ్ డివిజన్ పరిధిలో మంగళవారం 2కే రన్ నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ జెండా ఊపి రన్ ప్రారంభించారు. పట్టణంలోని నర్సాపూర్ చౌరస్తా నుంచి పెద్ద చెరువు కట్ట వరకు టూకే రన్ కొనసాగింది. విద్యార్థులు, యువకులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం విజేతలను ప్రకటించి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సీఐ రంగాకృష్ణ, ఎస్ఐలు శివానందం, యాదగిరి, జ్యోతి తదితరులు పాల్గొన్నారు. -
కౌమార దశ కీలకం
● పిల్లల పట్ల తల్లిదండ్రులు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ● సఖీ సెంటర్ నిర్వాహకురాలు రేణుక మెదక్ కలెక్టరేట్: పిల్లల్లో కౌమార దశ చాలా కీలకమని, ఈ వయస్సులో తల్లిదండ్రులు చాలా జాగ్రత్తలు తీసుకోవాలని సఖీ సెంటర్ నిర్వాహకురాలు రేణుక తెలిపారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని సఖీ సెంటర్లో ‘నాషా ముక్త్ భారత్ అభియాన్– మాదకద్రవ్య దుర్వినియోగంపై మిషన్ పరివర్తన’పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ జిల్లా ఇన్చార్జి అధికారి హేమభార్గవి, మిషన్ పరివర్తన కమ్యూనిటీ ఎడ్యుకేటర్ ఫిర్దౌస్ నహేదాల ఆధ్వర్యంలో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. అనంతరం రేణుక మాట్లాడుతూ.. మాదక ద్రవ్యాల వైపు యువత మొగ్గు చూపకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. ఆరోగ్యం, కుటుంబాన్ని, సమాజాన్ని రక్షించడానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. వివిధ వ్యవస్థలు కుటుంబం, పాఠశాల, కమ్యూనిటీ, మీడియాతో నిర్వహించే కార్యక్రమాలు, జ్ఞానాన్ని పెంపొందించనున్నట్లు పేర్కొన్నారు. అనంతరం మిషన్ పరివర్తన కమ్యూనిటీ ఎడ్యుకేటర్ ఫిర్దౌస్ నహేదా మాట్లాడుతూ అవసరమైన సహాయం అందించడం ద్వారా మనం డ్రగ్స్ వినియోగాన్ని తగ్గించవచ్చని పేర్కొన్నారు. అవసరమైన వారు 1098, 100, 14446 టోల్ ఫ్రీ నంబర్లకు ఫోన్ చేయాలని కోరారు. -
మళ్లీ సాగునీటి సంఘాలు..!
ఈ దిశగా సర్కార్ అడుగులు ● జిల్లాలో 1,617 చెరువులు ● రైతులదే కీలక పాత్ర ● నాయకులకు రాజకీయ పదవులు పెద్దశంకరంపేట(మెదక్): ప్రభుత్వం మరోసారి సాగునీటి సంఘాల ఏర్పాటు దిశగా చర్యలు ప్రారంభించింది. సాగునీటి ప్రాజెక్టులపై మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాజకీయ నిరుద్యోగం కొంత మేర తగ్గించడంలో భాగంగా సాగునీటి సంఘాలను ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందని ప్రభుత్వ ఈ దిశగా ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలిసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2006లో ఈ పథకాన్ని ప్రారంభించారు. 2008 వరకు ఉమ్మడి రాష్ట్రంలో 10,748 సాగునీటి సంఘాలు ఏర్పాటయ్యాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత 2014లో రధ్దు చేశారు. అప్పటి నుంచి సాగునీటి సంఘాల ఊసేలేదు. జిల్లా వ్యాప్తంగా 1,617 చెరువులు, 105 చెక్డ్యాంలతో పాటు శాశ్వత నీటి వనరులు వనదుర్గ (ఘనాపూర్), కొంటూరు, రాయిన్చెరువు, మధ్యతరహా ప్రాజెక్టులు పోచారం, హల్దీలు ఉన్నాయి. ఆయా చెరువుల కింద 2,67,648 ఎకరాలలో వరి పంటను రైతులు సాగు చేస్తున్నారు. ఆయా చెరువుల సంరక్షణ ఇప్పటి వరకు నీటి పారుదల (ఇరిగేషన్)ను అధికారులు పర్యవేక్షిస్తున్నారు. రైతులదే కీలక పాత్ర సాగునీటి సంఘాల్లో రైతులదే కీలక పాత్ర పోషిస్తారు. కాల్వలు, తూములు, షెట్టర్ల మరమ్మతులు, నీటి వనరుల నిర్వహణ, నీటి వినియోగం, మరమ్మతుల వంటి సంరక్షణకు సాగునీటి సంఘాలు ఉపయోగకరంగా ఉంటాయి. ప్రస్తుతం సాగునీటి సంఘాల ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటుండటంతో ఆయకట్టు రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రైతులు సంఘాలుగా ఏర్పడి చెరువుల అభివృధ్ధి జరిగేందుకు ఎంతో దోహదపడుతుందని వారు భావిస్తున్నారు. ఈ సంఘాల ఏర్పాటు ద్వారా నాయకులు, రైతులకు ఉపయోగం జరగనుంది. దీనిపై ప్రభుత్వం త్వరలో ఉత్తర్వులను జారీ చేయనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. -
పెండింగ్ సమస్యలపై దృష్టి పెట్టండి: మెదక్ ఆర్డీఓ
అల్లాదుర్గం(మెదక్): పెండింగ్ రెవెన్యూ దరఖాస్తులపై దృష్టి పెట్టాలని మెదక్ ఆర్డీఓ రమాదేవి అన్నారు. మంగళవారం అల్లాదుర్గం తహసీల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. కార్యాలయంలో సిబ్బందితో పలు అంశాలపై సమీక్షా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పెండింగ్లో ఉన్న రెవెన్యూ, ప్రజావాణి మీసేవా సమస్యలపై చర్యలు తీసుకొవాలన్నారు. రైతులకు ఇబ్బంది లేకుండా వరిధాన్యం కొనుగోలు చేయాలన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. కార్యక్రమంలో తహసీల్దార్ మల్లయ్య పాల్గొన్నారు. పెట్రోల్ పంపు స్థలం పరిశీలన రేగోడ్(మెదక్): మండలంలోని తాటిపల్లి సమీపంలో నిర్మించతలపెట్టిన పెట్రోల్ పంపు స్థలాన్ని మెదక్ ఆర్డీఓ రమాదేవి మంగళవారం సందర్శించారు. తాటిపల్లి వద్ద బసవేశ్వర ఎత్తిపోతల పథకం కాంట్రాక్టర్ పెట్రోల్ పంపు ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు పంపు ఏర్పాటు చేసే స్థలం, సంబంధిత రికార్డులను ఆర్టీఓ పరిశీలించారు. కార్యక్రమంలో స్థానిక తహసీల్దార్ దత్తారెడ్డి, ఆర్ఐ విజయలక్ష్మి తదితరులు ఉన్నారు. ఉపాధి కూలీల ఈ–కేవైసీ పూర్తి చేయాలి జెడ్పీ సీఈఓ ఎల్లయ్య చిలప్చెడ్(నర్సాపూర్): ఉపాధి కూలీల ఈ–కేవైసీ త్వరితగతిన పూర్తి చేయాలని జెడ్పీ సీఈఓ ఎల్లయ్య అన్నారు. మంగళవారం ఆయన చిలప్చెడ్లో ఎంపీడీఓ కార్యాలయాన్ని సందర్శించారు. కొత్తగా విధుల్లోకి చేరిన ఎంపీడీఓ బానోత్ ప్రవీణ్కు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీల అభివృద్ధికి, పంచాయతీ కార్యదర్శులకు తగిన సూచనలు ఇస్తూ, కార్యకలాపాలు సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్రామా ల్లో పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. మౌలిక సదుపాయాలపై ఎలాంటి లోటుపాట్లు జరగకుండా చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కార్యనిర్వహణ అధికారి రంగాచార్యులు పాల్గొన్నారు. కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించండిఅదనపు కలెక్టర్కు రైతుల వినతి మెదక్ కలెక్టరేట్: తమ గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వెంటనే ప్రారంభించాలని, వెల్దుర్తి మండలం పెద్దాపురం గ్రామ రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం మెదక్ కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ నగేశ్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ఐకేపీ కేంద్రం ఉండేదన్నారు. గత పంట కాలం నుంచి ఐఓపీ కేంద్రాన్ని పెట్టడం లేదని తెలిపారు. పెద్దాపూర్ గ్రామం నుంచి 5 కిలోమీటర్ల లోపు ఒక్క కేంద్రం కూడా తమకు అందుబాటులో లేదన్నారు. దీంతో గ్రామంలోని రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే ట్రాక్టర్, టాపర్ల కిరాయిలు కట్టలేక, ధాన్యాన్ని తరలించడంలో ఆలస్యమై ధాన్యం తడిసిపోయి పెట్టుబడి కూడా మిగలడం లేదన్నారు. కొనుగోళ్లను పరిశీలించిన డీఆర్డీఓ పీడీహవేళిఘణాపూర్(మెదక్): మెదక్ మండలం రాజ్పల్లి గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కొనుగోలు కేంద్రాన్ని డీఆర్డీఓ పీడీ శ్రీనివాస్ మంగళవారం పరిశీలించారు. అనంతరం ఆయన తూకం, తేమశాతం గురించి అడిగి తెలుసుకున్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వసతుల కల్పించి ధాన్యం కొనుగోలు చేయాలని నిర్వాహకులకు సూచించారు. ఆయన వెంట ఐకేపీ ఏపీఎం నాగరాజు, సీసీ సత్యం, నిర్వాహకులు, వీఓఏ నవనీత ఉన్నారు. -
బాధ్యతగా విధులు నిర్వర్తించండి
కలెక్టర్ రాహుల్రాజ్మెదక్ కలెక్టరేట్: క్రమశిక్షణతో పాటు బాధ్యతగా విధులు నిర్వర్తించాలని కలెక్టర్ రాహుల్రాజ్ అధికారులకు సూచించారు. జిల్లాకు నూతనంగా ఏడుగురు ఎంపీడీఓలు వచ్చారు. సోమవారం జెడ్పీ కార్యాలయంలో నిర్వహించిన బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి కలెక్టర్ హాజరై మాట్లాడారు. ఈసందర్భంగా వారికి సూచనలు, సలహాలు అందించారు. మండలాల అభివృద్ధిలో ఎంపీడీఓల పాత్ర కీలకంగా ఉంటుందని తెలిపారు. పారదర్శకపాలనే లక్ష్యంగా ముందుకు వెళ్లి ప్రభుత్వ ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తూ విధులు నిర్వర్తించాలన్నారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఎంపీడీఓలు శాలిక (తూప్రాన్), ప్రీతిరెడ్డి (నార్సింగి), వలుస శ్రేయంత్(హవేళిఘణాపూర్), బానోత్ ప్రవీణ్ (చిలప్చెడ్), వేద ప్రకాశ్రెడ్డి (అల్లాదుర్గ్)లు కలెక్టర్ చేతుల మీదుగా అపాయింట్మెంట్ ఆర్డర్ అందుకున్నారు. కొనుగోళ్లలో లోటుపాట్లు రావొద్దు హవేళిఘణాపూర్(మెదక్): ధాన్యం కొనుగోలులో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు పర్యవేక్షించాలని కలెక్టర్ రాహుల్రాజ్ అన్నా రు. సోమవారం మెదక్ మండలం రాయిన్పల్లిలో ఐకేపీ కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. రైతులకు మద్దతు ధర కల్పించేందుకు సమన్వయంతో పని చేయాలన్నారు. జిల్లాలో 498 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. కలెక్టర్ వెంట ఐకేపీ సిబ్బంది, కొనుగోలు కేంద్రం నిర్వాహకులు, రైతులు ఉన్నారు. -
అర్జీలు పెండింగ్లో ఉంచొద్దు
● అదనపు కలెక్టర్ నగేశ్ ● ప్రజావాణికి 99 వినతులుమెదక్ కలెక్టరేట్: ప్రజావాణికి ప్రాధాన్యం ఇస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ నగేశ్ అధికారులకు సూచించారు. సో మ వారం కలెక్టరేట్లో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అర్జీలను పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలించి పరిష్కరించాలన్నారు. కాగా మూడు వారాల విరామం తర్వాత నిర్వహించిన ప్రజావాణికి జిల్లా నలుమూలల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అయితే అదనపు కలెక్టర్ ఒక్కరే వినతులు స్వీకరించారు. దీంతో ఫిర్యాదుదారులతో కలెక్టరేట్ కిటకిటలాడింది. మొత్తం 99 అర్జీలు వచ్చాయి. కాగా నర్సాపూర్లోని ఆయాశాఖల అధికారులు సమాచా ర హక్కు చట్టాన్ని గౌరవించడం లేదని, ఆయాశాఖల వివరాల కోసం ఎంఈఓ, మున్సిపల్ కమిషనర్కు 40 రోజుల క్రితం వినతిపత్రం ఇచ్చినా స్పందించడం లేదని పలువురు ప్రజావాణిలో ఫిర్యా దు చేశారు. అయితే తమకు కమీషన్లు కాకుండా వేతనాలు ఇవ్వాలని ఇటీవల నూతనంగా విధుల్లో చేరిన సర్వేయర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 5 నెలల శిక్షణ సమయంలోనూ తమకు ఎలాంటి టీఏ, డీఏలు ఇవ్వలేదన్నారు. ఇప్పుడైనా తమకు వేతనాలు ఇవ్వాలని కలెక్టరేట్లో నిరసన తెలిపి ప్రజావాణిలో వినతిపత్రం అందజేశారు. -
కళాశాలలో మౌలిక వసతులు ఏవీ?
రాస్తారోకో నిర్వహిస్తున్న విద్యార్థులు రామాయంపేట(మెదక్): ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు పట్టణంలో రాస్తారోకో నిర్వహించారు. ఈసందర్భంగా సంఘం రాష్ట్ర నాయకుడు బండారి ప్రశాంత్ మాట్లాడుతూ.. కళాశాల ప్రారంభమై మూడేళ్లు గడుస్తున్నా, ఇప్పటివరకు సొంత భవనం లేదన్నారు. తాత్కాలికంగా ఆర్డీఓ కార్యాలయంలో కొనసాగుతుందని వాపోయారు. ఆ భవనంలో ఎలాంటి వసతులు లేకపోవడంతో విద్యార్థులు సరిగా చదువుకోలేకపోతున్నారని తెలిపారు. ఈవిషయమై పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదన్నారు. టాయిలెట్ల సదుపాయం సక్రమంగా లేకపోవడంతో విద్యార్థినులు ఇబ్బందులపాలవుతున్నారని చెప్పారు. తాగునీటి సదుపాయం కల్పించకపోవడంతో విద్యార్థులు బస్టాండ్ వద్ద హోటళ్లను ఆశ్రయిస్తున్నారని పేర్కొన్నారు. ఇప్పటికై నా కళాశాలలో సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమాన్ని తీవ్ర తరం చేస్తామని హెచ్చరించారు. ఎస్ఐ బాలరాజు వారికి నచ్చజెప్పి ఆందోళన విరమింపజేశారు. -
డీసీసీపై ఉత్కంఠ
14కు చేరిన ఆశావహుల సంఖ్య జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడి ఎన్నిక అంశం ఉత్కంఠ రేపుతోంది. అధికార పార్టీలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి కొత్త నిబంధనలతో పాటు ఎంపిక విధానం తీరు మారింది. సిఫార్సులు, రాజకీయ ఒత్తిళ్లకు తావివ్వకుండా, సామాజిక న్యాయం పాటిస్తూ.. సమర్థుడికి పట్టం కట్టాలని అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. అయితే తమ అనుచరులకు పీఠం కట్ట బెట్టుకోవాలనే తపనతో మెదక్, అందోల్, గజ్వేల్ ప్రాంతాలకు చెందిన కాంగ్రెస్ పెద్దలు పావులు కదుపుతున్నట్లు తెలిసింది. – మెదక్ అర్బన్ జిల్లాకు అందోల్, గజ్వేల్, మెదక్, నర్సాపూర్ అసెంబ్లీ నియోజకవర్గాలతో సంబంధం ఉంది. దీంతో ఆయా ప్రాంతాలకు చెందిన ముగ్గురు కాంగ్రెస్ పెద్దలు డీసీసీ పదవిని తమ అనుచరులకు కట్టబెట్టుకోవాలనే ఆశతో ఉన్నారు. మెదక్కు చెందిన పెద్దాయన నర్సాపూర్ నియోజకవర్గానికి చెందిన తన ప్రధాన అనుచరుడి పేరును ప్రతిపాదించారు. తన పరిధిలోని కార్యకర్తలు కూడా అతని పేరునే బలపరిచారు. పోటీ పెరగకుండా జాగ్రత్తలు సైతం తీసుకున్నారు. కాగా అదే నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి సైతం డీసీసీ పదవిని ఆశిస్తూ నామినేషన్ దాఖలు చేశారు. ఆయనకు జోగిపేట ప్రాంతానికి చెందిన అమాత్యుల మద్దతు ఉందనే ప్రచారం ఉంది. రామాయంపేట నుంచి మరో బీసీ నాయకుడు నామినేషన్ దాఖలు చేసినా, నామమాత్రంగా మిగిలిపోయింది. అయితే తక్కువ సంఖ్యలో దరఖాస్తులు రావడంతో ఏఐసీసీ ప్రతినిధులు ఆరా తీశారు. సమర్థులైన నాయకులకు స్వయంగా ఫోన్లు చేసి నామినేషన్లు దాఖలు చేయాలని సూచించినట్లు తెలిసింది. దీంతో పాపన్నపేట నుంచి పబ్బతి ప్రభాకర్రెడ్డి, రామాయంపేట నుంచి సుప్రభాత్రావు, రమేశ్రెడ్డి, తూప్రాన్ నుంచి జింక మల్లేశం, నాగరాజు, బల్వంత్రెడ్డి, అజయ్, అమీద్, శ్రీకాంత్రెడ్డి, విశ్వరాజ్, రవి సైతం నామినేషన్ దాఖలు చేసినట్లు సమాచారం. దీంతో ఆశావహుల సంఖ్య 14కు చేరింది. అయితే వీరి గురించి గజ్వేల్ నియోజకవర్గానికి చెందిన సిద్దిపేట కాంగ్రెస్ అధి నాయకులు ప్రయత్నిస్తున్నట్లు తెలు స్తోంది. అనుచరుల కోసం పావులు కదుపుతున్న పెద్దలు ఈనెలాఖరుకు ఖరారయ్యే అవకాశం ముగ్గురు నాయకులకు ప్రతిష్టాత్మకంసమర్థుడికే సారథ్యం ఏఐసీసీ ప్రతినిధులు ఇప్పటికే అధిష్టానానికి జాబితా సమర్పించారు. వీరి కి వచ్చిన ర్యాంకింగ్తో పాటు, అభ్యర్థి సమర్థత ఆధారంగా డీసీసీ పద వి లభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో అటు అభ్యర్థులు.. ఇటు వారిని ప్రతిపాదించిన నాయకుల్లో ఉత్కంఠ నెలకొంది. -
రైతులకు కుచ్చుటోపీ!
ముప్పుతిప్పలు పెడుతున్న సీడ్ కంపెనీలు గత రబీ సీజన్లో పోటీపడి రైతులతో వేలాది ఎకరాల్లో విత్తన వరి సాగు చేయించారు. పంట నూర్పిళ్లు చేసి సదరు కంపెనీలకు విత్తనాలను అప్పగించి ఏడాది అవుతున్నా, నేటికీ డబ్బులు చెల్లించడం లేదు. ఆర్గనైజర్ల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోవడంతో చేసేది లేక ఇటీవల అన్నదాతలు పోలీసులను ఆశ్రయించారు. – మెదక్జోన్మధ్యవర్తుల తప్పుడు లెక్కలు జిల్లాలో కొంతకాలంగా అనేక విత్తన కంపెనీలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. సదరు కంపెనీ యాజమాన్యాలు ఆర్గనైజర్లను మధ్యవర్తులుగా ఏర్పాటు చేసుకున్నాయి. వారికి కమీషన్ ఇస్తామని ఒప్పందం చేసుకొని రైతుల వద్దకు పంపుతున్నాయి. ఎకరాకు రూ. 75 వేలు ఇస్తామని ఒక కంపెనీ ఆర్గనైజర్ అంటే, మరో కంపెనీ ప్రతినిధి రూ. 80 వేలని, ఇంకొకరు రూ. లక్ష ఇస్తామంటూ రైతులను నమ్మించారు. పకృతి వైపరీత్యాలకు పంట దెబ్బతిన్నా, ఒప్పందం మేరకు నష్టపరిహారం ఇస్తామని నమ్మబలికారు. గత రబీ సీజన్లో జిల్లాలో 2.71 లక్షల ఎకరాల్లో వరి పంటలు సాగు చేయగా, అందులో 6,678 ఎకరాల్లో సుమారు 30 విత్తన కంపెనీలకు చెందిన ఆర్గనైజర్లు రైతులతో విత్తన వరి సాగు చేయించారు. అందులో సుమారు 5 వేల ఎకరాలకు సంబంధించిన డబ్బులు రైతులకు ఇవ్వగా, ఇంకా 1,600 పైచిలుకు ఎకరాలకు సంబంధించి సుమారు రూ. 10 కోట్ల పైచిలుకు డబ్బులు రైతులకు పలు కంపెనీలు బకాయిపడ్డాయి. ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ పంట సైతం చేతికందుతోంది. ఏడాది అవుతున్నా డబ్బులు ఇవ్వకపోవడంతో అన్నదాతలు ఇటీవల పోలీసులను ఆశ్రయించి గోడు వెల్లబోసుకున్నారు. అయితే అటు విత్తన కంపెనీలను.. ఇటు రైతులను మోసం చేసింది మధ్యవర్తులేనని తెలిసింది. క్షేత్రస్థాయిలో ఓ కంపెనీకి చెందిన మధ్యవర్తి 150 ఎకరాల విత్తన (సీడ్)ను సాగు చేయించి సదరు కంపెనీ రికార్డుల్లో మాత్రం 200 ఎకరాలు సాగు చేయించినట్లు తప్పుడు లెక్కలు చూపించినట్లు సమాచారం. ఈ విషయాన్ని పసిగట్టిన సదరు కంపెనీల యజమాన్యాలు క్షేత్రస్థాయిలో సర్వే చేయించాయి. అయితే ఆర్గనైజర్లకు, కంపెనీల యాజమాన్యాలకు మధ్య జరుగుతున్న గొడవ కారణంగా ఇంకా 1,600 పైచిలుకు ఎకరాలకు సంబంధించిన డబ్బులు రైతులకుచెల్లించడం లేదు. గత రబీకి సంబంధించినడబ్బులు నేటికీ ఇవ్వని వైనం జిల్లాలో 6 వేల ఎకరాల్లోవిత్తన వరి సాగు -
మెరుగైన బోధన అందించాలి
చిన్నశంకరంపేట(మెదక్): విద్యార్థులు ఏకాగ్రతతో పరీక్షలు రాసి తమ సామర్థ్యం పరీక్షించుకోవాలని డీఈఓ రాధాకిషన్ అన్నారు. సోమవారం మండలంలోని చందంపేట ప్రాథమిక పాఠశాలలో జరుగుతున్న ఎస్ఏ 1 పరీక్షతీరును పర్యవేక్షించారు. ఈసందర్భంగా ఆయ న మాట్లాడుతూ.. విద్యార్థుల ప్రతిభను పరిశీలించేందుకు ఈ పరీక్షలు కీలకమన్నారు. విద్యార్థులకు మెరుగైన బోధన అందించడంతో పాటు వారి అభ్యసన ప్రతిభను ఎప్పకప్పుడు గ్రహించాలని ఉపాధ్యాయులకు సూచించారు. అనంతరం హెచ్ఎం శ్రీనివాస్రెడ్డి సహకారంతో పాఠశాలలో ఏర్పాటు చేసిన ఆర్ఓ నీటిశుద్ధి యంత్రాన్ని ప్రారంభించారు. కాంప్లెక్స్ హెచ్ఎం సాయిరెడ్డి, ఉపాధ్యాయు లు శ్రీధర్, శివప్రసాద్, సంతోష్కుమార్ పాల్గొన్నారు. రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం సేకరించాలి చేగుంట(తూప్రాన్): రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం సేకరించాలని తూప్రాన్ ఆర్డీఓ జ యచంద్రారెడ్డి అన్నారు. సోమవారం చేగుంట ఎంపీడీఓ కార్యాలయంలో కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు అవగాహన కల్పించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జాప్యం లేకుండా ధాన్యం సేకరించి అందుబా టులో ఉన్న లారీల్లో ధాన్యం తరలించాలని ఆదేశించారు. ఏమైనా ఇబ్బందులు ఉంటే వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించి సమస్యను పరిష్కరించుకోవాలని సూచించా రు. కార్యక్రమంలో తహసీల్దార్ శివప్రసాద్, ఎంపీడీఓ చిన్నారెడ్డి, ఐకేపీ ఏపీఎం దుర్గాప్రసాద్, వ్వయసాయ అధికారి హరిప్రసాద్, సహకార సంఘాల, ఐకేపీ సిబ్బంది పాల్గొన్నారు. ఉత్తమ ఫలితాలు సాధించాలి వెల్దుర్తి(తూప్రాన్): విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలని జిల్లా ఇంటర్మీడియెట్ అధికారిణి మాధవి సూచించారు. సోమవారం వెల్దుర్తిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా రికార్డులు, పరిసరాలు, తరగతులను పరిశీలించి విద్యార్థులతో మాట్లాడారు. ఫిబ్రవరిలో వార్షిక పరీక్షలు జరగనున్నందున విద్యార్థులందరూ ఇప్పటి నుంచే కష్టపడి చదివి పరీక్షలకు సిద్ధం కావాలన్నారు. పాఠ్యాంశాలకు సంబంధించి ఏవైనా అనుమానాలుంటే అధ్యాపకుల వద్ద వెంటనే నివృత్తి చేసుకోవాలన్నారు. ఈసారి ఉత్తీర్ణత శాతం పెంచేందుకు రోజూ ఉదయం, సాయంత్రం స్టడీ అవర్ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆమె వెంట ప్రిన్సిపాల్ శ్రీనివాసులు, అధ్యాపకులు, నాన్ టీచింగ్ సిబ్బంది ఉన్నారు. గురుకులంలో మళ్లీ ఎలుకల కలకలం నర్సాపూర్ రూరల్: మండలంలోని నారాయణపూర్ గిరిజన గురుకుల బాలికల పాఠశాల, కళాశాలలో ఆదివారం రాత్రి మరో ఇద్దరు వి ద్యార్థులను ఎలుకల కరిచాయి. దీంతో సిబ్బంది అప్రమత్తమై ఎలుకలను గది నుంచి బయటకు వెళ్లగొట్టారు. సోమవారం ఉదయం ఎలుకలు కరి చిన ఇద్దరు విద్యార్థినులను నర్సాపూర్ ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. మూడు రోజుల క్రితం ఎనిమిది మంది విద్యార్థినులను ఎలకలు కరిచిన విషయం తెలిసిందే. కాగా ప్రిన్సిపాల్ లలితాదేవి, సిబ్బంది కలిసి ఎలుకలు గదుల్లోకి రాకుండా చర్యలు చేపట్టారు. చుట్టూ పంట పొలాలు ఉండటంతో ఎలుకలు సంచరిస్తున్నాయని తెలిపారు. వెల్దుర్తి(తూప్రాన్): మండలంలోని పెద్దాపూర్ గ్రామస్తులు తహసీల్దార్ కార్యాలయం ఎదుట సోమవారం నిరసన చేపట్టారు. గ్రామంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. పంట చేతికందే దశలో వర్షాలతో ధాన్యం తడిసి రైతులు ఇబ్బందులు పడుతుంటే కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయకపోవడం దారుణమన్నారు. ఈ విషయంలో జిల్లా ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. -
పోలీస్ కుటుంబాలకు అండగా ఉంటాం
అదనపు ఎస్పీ మహేందర్ మెదక్ మున్సిపాలిటీ: పోలీస్ కుటుబాలకు శాఖ అండగా ఉంటుందని అదనపు ఎస్పీ మహేందర్ అన్నారు. పోలీస్ అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా ఆదివారం అమరవీరుడు హెడ్ కానిస్టేబుల్ పెంటయ్య కుటుంబాన్ని పరామర్శించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎస్పీ ఆదేశాల మేరకు కుటుంబాన్ని పరామర్శించినట్లు తెలిపారు. అనంతరం కుటుంబ సభ్యులతో మా ట్లాడి ఆరోగ్యం, జీవన పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. పోలీసులు ఎల్లప్పు డూ అమరవీరుల కుటుంబాలకు అండగా ఉంటారని భరోసా ఇచ్చారు. ఎలాంటి సమస్యలు ఉన్నా పోలీస్ అధికారులను సంప్రదించాలని వారికి సూచించారు. కార్యక్రమంలో డీఎస్పీ ప్రసన్నకుమార్, మెదక్ టౌన్ ఇన్స్పెక్టర్ మహేశ్, సిబ్బంది పాల్గొన్నారు. -
మృతదేహాలు అప్పగింత
హవేళిఘణాపూర్(మెదక్): కర్నూలు వద్ద శుక్రవారం తెల్లవారుజామున జరిగిన బస్సు దుర్ఘటనలో మరణించిన తల్లీబిడ్డల మృతదేహా లను ఆదివారం సాయంత్రం కుటుంబ సభ్యులకు అప్పగించారు. సంధ్యారాణి, చందన మృతదేహాలను డీఎన్ఏ పరీక్షల ద్వారా గుర్తించారు. ఈ మేరకు అంబులెన్స్లో బయలు దేరినట్లు కుటుంబీకులు తెలిపారు. సోమవారం శివ్వాయపల్లిలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు చెప్పారు. నర్సాపూర్: ప్రధాని మోదీ 127వ మన్కీ బాత్ కార్యక్రమాన్ని ఆదివారం బీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లేశ్గౌడ్ పలువురి నాయకులతో కలిసి నర్సాపూర్లో వీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కార్యక్రమంలో ప్రధాని సూచనలు పాటిస్తామన్నారు. పార్టీ అభివృద్ధితో పాటు కేంద్ర ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయిలో ప్రజలకు వివరిస్తామని చెప్పారు. కార్యక్రమంలో ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు రమేశ్గౌడ్, నాయకులు నగేశ్, బాల్రాజ్, చంద్రయ్య, శంకర్, రాజు, రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మెదక్ మున్సిపాలిటీ: పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా ఈనెల 31న భారీ బ్యాడ్మింటన్ డబుల్స్ టోర్నమెంట్ నిర్వహించనున్నట్లు మెదక్ డీఎస్పీ ప్రసన్నకుమార్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని ఇండోర్ స్టేడియంలో పోటీలు నిర్వహిస్తామన్నారు. ఆసక్తి గల క్రీడాకారులు ఈనెల 30వ తేదీ సాయంత్రంలోగా ఆర్ఎస్ఐ నంబర్ (8712657954)లో సంప్రదించి నమోదు చేసుకోవాలని సూచించారు. కొమురవెల్లిలో భక్తుల సందడి కొమురవెల్లి (సిద్దిపేట): మల్లన్న ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. క్షేత్రానికి చేరుకున్న భక్తులు మొదట స్వామివారి పుష్కరిణిలో స్నానమాచరించారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొంత మంది గంగిరేణు చెట్టు ప్రాంగణంలో పట్నాలు వేసి, ముడుపులు కట్టారు. మరికొంత మంది అభిషేకాలు, కళ్యాణం జరిపించి మొక్కులు తీర్చుకున్నారు. ఏర్పాట్లను ఆలయ ఈఓ వెంకటేశ్, ఏఈఓ బుద్ధి శ్రీనివాస్ పర్యవేక్షించారు. చివరి గింజ వరకు కొంటాండీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్రెడ్డి కొండపాక(గజ్వేల్): ధాన్యాన్ని దళారులకు అమ్ముకొని మోసపోవద్దని ఉమ్మడి మెదక్ జిల్లా డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి అన్నారు. మండల కేంద్రమైన కుకునూరుపల్లిలో ఆదివారం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రతీ గింజకు మద్దతు ధర దక్కేలా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఏ గ్రేడ్ క్వింటాల్ ధర రూ.2,389, కామన్ గ్రేడ్ ధర రూ. 2369లకు ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నదన్నారు. మార్కెట్కు ధాన్యాన్ని తెచ్చేటప్పుడు తాలు, తేమ శాతం లేకుండా చూసుకొని తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి. పీఏసీఎస్ వైస్ చైర్మన్ అమరేందర్, నాయకులు పాల్గొన్నారు. -
కిక్కులక్కు ఎవరికో?
● దరఖాస్తుదారుల్లో టెన్షన్ ● నేడే మద్యం దుకాణాల లక్కీ డ్రా ● జిల్లాలోని 49 వైన్స్లకు 1,420 అప్లికేషన్లు జిల్లాలో మద్యం దుకాణాల ఏర్పాటుకు దరఖాస్తు చేసుకున్న వారిలో ఉత్కంఠ నెలకొంది. కిక్కు, లక్కు తమను వరిస్తుందా..? లేదా అని సోమవారం తీసే లక్కీ డ్రాపై గంపెడాశలతో ఎదురుచూస్తున్నారు. డ్రాను పారదర్శకంగా నిర్వహించేందుకు ఎకై ్సజ్ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. – మెదక్జోన్ జిల్లావ్యాప్తంగా 49 వైన్స్లు ఉండగా, రెండు విడతల అవకాశం.. నెల రోజుల సమయం ఇచ్చినా 1,420 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. గతంలో కంటే 485 అప్లికేషన్లు తగ్గాయి. అయితే దరఖాస్తు ఫీజు రూ. 3 లక్షలకు పెంచడంతో రూ. 42.60 కోట్ల ఆదాయం సమకూరింది. గతంలో కంటే రూ. 4.50 కోట్లు ఎక్కువగా వచ్చింది. జిల్లాలోనే పోతం్శెట్టిపల్లి వైన్స్కు అత్యధికంగా 54 దరఖాస్తులు వచ్చాయి. ఏడుపాయల దేవస్థానం సమీపంలో ఉండటంతో ఇక్కడ పెద్దఎత్తున మద్యం విక్రయాలు జరుగుతాయి. ఆది, మంగళవారం సుమారు రూ. 25 నుంచి రూ. 30 లక్షల లిక్కర్ వ్యాపారం సాగుతోంది. అంతే కాకుండా ఈ వైన్స్ నుంచి ఏడుపాయల సమీపంలో గల బెల్ట్షాపుల నిర్వాహకులు లిక్కర్ కొనుగోలు చేస్తారు. దీంతో మిగితా దుకాణాలతో పోలిస్తే అత్యధికంగా గిరాకీ ఉండటంతో భారీ డిమాండ్ ఏర్పడింది. అలాగే అతి తక్కువగా నిజాంపేట వైన్స్కు కేవలం 15 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. ఇక్కడ రెండు మద్యం దుకాణాలు ఉండగా, ఒకదానికి 19 వచ్చాయి. మద్యం విక్రయాలు సైతం అంతంత మాత్రంగానే జరుగుతాయి. నిజాంపేట నుంచి ఐదు కిలోమీటర్ల వ్యవధిలోనే 6 మద్యం దుకాణాలు ఉండటంతో లిక్కర్ వ్యాపారం పెద్దగా జరగదనే వాదన ఉంది. దీంతో ఇక్కడ టెండర్ వేసేందుకు దరఖాస్తుదారులు పెద్దగా ఆసక్తి చూపలేదని తెలిసింది. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న లక్కీ డ్రాను పారదర్శకంగా నిర్వహించేందుకు ఎకై ్సజ్ అధికారులు ఏర్పా ట్లు పూర్తి చేశారు. పాస్ ఉన్న వారిని మాత్రమే అధికారులు లోపలికి అనుమతించనున్నారు. లక్కీ డ్రా మొత్తం వీడియో రికార్డు చేయనున్నారు. ఇదిలా ఉండగా తమకే మద్యం దుకా ణాలు దక్కాలని ఆలయాల్లో దరఖాస్తుదారులు ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. -
ఆడపిల్లను ఆదరిద్దాం
బాలికలు.. భవిష్యత్ దీపికలు ● ఉమ్మడి జిల్లాలో తగ్గిన జనన రేటు ● 2022తో పోలిస్తే 2023లో తగ్గిన జననాలు ● సీఆర్ఎస్ తాజా నివేదికలో వెల్లడి అవకాశాలు అందిపుచ్చుకుని ఆడపిల్లలు ఎన్నో రంగాల్లో దూసుకుపోతున్నారు. పురుషులకు దీటుగా రాణిస్తున్నారు. అయినా ఇంకా కొంతమంది వదిలించుకోవాలన్న దురాలోచన చేస్తున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో బాలికల జనన రేటు దారుణంగా పడిపోయింది. కేంద్ర జనగణన విభాగం ఇటీవల విడుదల చేసి సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టం(సీఆర్ఎస్) నివేదిక–2023లో పలు అంశాలు వెల్లడయ్యాయి. ఇదిలా ఉంటే.. ఉమ్మడి జిల్లాలో ఇద్దరు మహిళా కలెక్టర్లుగా అత్యున్నత స్థాయిలో ఉండి పురుషులకు దీటుగా పాలన కొనసాగిస్తున్నారు. –సాక్షి, సిద్దిపేట ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా మొత్తం జననాలు 72,545, మరణాలు 17,392 జరిగాయి. 2023లో ప్రభుత్వ ఆస్పత్రుల్లో మరింత మెరుగైన సేవలు అందించడంతో 2022తో పోలిస్తే శిశుమరణాలు బాగా తగ్గాయి. సీఆర్ఎస్ నివేదిక ప్రకారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 2022లో 74,862 మంది, 2023లో 72,545 మంది జన్మించారు. ఈ నివేదిక ప్రకారం చూస్తే జననాలు 2,317 తగ్గాయి. 2022లో మగ శిశువులు 38,928, 2023లో 37,928 మంది పుట్టారు. 2022లో ఆడపిల్లలు 35,934, 2023లో 34,617 మంది జన్మించారు. పెరిగిన శిశు మరణాలు ఉమ్మడి మెదక్ జిల్లాలో శిశు మరణాలు పెరిగాయి. 2023లో 471 మంది చిన్నారులు మృతి చెందితే అందులో 273మంది మగపిల్లలు, 198మంది ఆడ పిల్లలు మృతి చెందారు. 2022లో ఈ మొత్తం 447 మందిగా ఉంది. 2023లో నాటి ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు కృషితో సిద్దిపేట, గజ్వేల్ ప్రభుత్వాస్పత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందాయి. దీంతో శిశు మరణాలు తగ్గుముఖం పట్టాయి. తగ్గిన మరణాలు 2022లో 22,014మంది, 2023లో 17,392 మంది మృతిచెందారు. మెరుగైన వైద్య సేవలు అందడంతో పాటు, ఆరోగ్యంపై అందరూ ప్రత్యేక దృష్టి సారిస్తుండటంతో గతంతో పోలిస్తే మరణాలు తగ్గాయి. -
ఎప్పుడు దారి కొచ్చేనో?
రామాయంపేట(మెదక్): ఆగస్టు చివరి వారంలో కురిసిన భారీ వర్షాలకు పంచాయతీరాజ్, ఆర్అండ్బీ రహదారులు, చెరువు కట్టలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇవి శిథిలమై రెండు నెలలు గడుస్తున్నా, ఇప్పటివరకు మరమ్మతులకు నోచుకోలేదు. ఫలితంగా ఆయా గ్రామాల ప్రజలు, రైతులు ఇబ్బందులపాలవుతున్నారు. ● లక్ష్మాపూర్ నుంచి దంతేపల్లి వరకు ఉన్న అంతర్ జిల్లా రహదారి పూర్తిగా దెబ్బతింది. దీంతో ఈ రహదారిపై ప్రయాణం ప్రమాదకరంగా మారింది. అలాగే లక్ష్మాపూర్ రైల్వేస్టేషన్కు వెళ్లే తారురోడ్డు మధ్యలో తెగిపోయింది. రెండు నెలలు గడిచినా, ఇప్పటివరకు మరమ్మతులకు నోచుకోలేదు. దీంతో రైల్వేస్టేషన్కు వెళ్లే ప్రయాణికులు అతి కష్టం మీద పంట చేల గుండా దాటుతున్నారు. ● నిజాంపేట మండల కేంద్రం నుంచి చల్మెడకు వెళ్లే రహదారిలో ఉన్న కల్వర్టు వర్షాలకు దెబ్బతింది. దీంతో కొన్ని రోజుల పాటు ఈదారిలో ప్రయాణాలు నిలిచిపోయాయి. కల్వర్టు ఒకవైపు దెబ్బతినగా, అడ్డంగా బోర్డు పెట్టారు. దీంతో ఆటోలు, బైక్లు మాత్రమే వెలుతున్నాయి. ● నిజాంపేట, నస్కల్ మధ్య రోడ్డు మరమ్మతులు పూర్తికాగా, కల్వర్టు నిర్మాణం చేపట్టకపోవడంతో వర్షాలకు ధ్వంసమైంది. పెద్ద వాహనాలు వెళ్లకుండా కల్వర్టుపై రోడ్డును కొంతమేర బ్లాక్ చేశారు. దంతేపల్లి, కాట్రియాల వద్ద చెరువు కట్టలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. యుద్ధ ప్రాతిపదికన వీటికి మరమ్మతులు చేయించాల్సి ఉండగా, ఇరిగేషన్ అధికారులు ఆదిశగా చర్యలు చేపట్టడం లేదు. మళ్లీ భారీ వర్షాలు కురిస్తే కట్టలు తెగే ప్రమాదం ఉండటంతో ఆయా గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ● వర్షాలకు జిల్లా పరిధిలో పంచాయతీరాజ్కు చెందిన 70 కిలోమీటర్ల మేర రోడ్డు దెబ్బతినగా, రోడ్డు భవనాల శాఖ పరిధిలో 40 కిలోమీటర్ల మేర రోడ్డు పాక్షికంగా ధ్వంసమైంది. కొన్ని రహదారులకు మాత్రమే తాత్కాలికంగా మరమ్మతులు చేయించిన అధికారులు నిధులు మంజూరు కాకపోవడంతో పర్మనెంట్ పనులకు ముందుకు రావడం లేదు. ● వరద నీరు పోటెత్తడంతో జాతీయ రహదారి 765 డీజీపై నందిగామ వద్ద ఏకంగా బ్రిడ్జి కుంగిపోయి పగుళ్లు వ్యాపించాయి. దీంతో 20 రోజుల పాటు ఈదారిలో ప్రయాణాలు నిలిచిపోయి మెదక్, సిద్దిపేట జిల్లాలకు చెందిన ప్రజలు తీవ్ర ఇబ్బంది పడ్డారు. దెబ్బతిన్న బ్రిడ్జి పక్క నుంచి తాత్కాలికంగా మట్టి రోడ్డు నిర్మించి 20 రోజుల తర్వాత ప్రయాణాలకు అనుమతించారు. హవేళిఘణాపూర్ మండలంలో దెబ్బతిన్న రహదారులకు తాత్కాలిక మరమ్మతులు నిర్వహించారు. చౌట్లపల్లి వద్ద లోలెవర్ కల్వర్టు దెబ్బతింది. ఇదే విషయమై ఆయా శాఖల అధికారుల వివరణ కోరగా.. నిధులు మంజూరైతే తప్ప ఏమి చేయలేమని నిస్సహాయత వ్యక్తం చేశారు. చల్మెడ వద్ద దెబ్బతిన్న కల్వర్టుకు అడ్డంగా బోర్డు ఏర్పాటుకోతకు గురైన లక్ష్మాపూర్– దంతేపల్లి రోడ్డు దెబ్బతిన్న రోడ్లు, చెరువు కట్టలకు మరమ్మతులేవీ? రెండు నెలలు గడిచినా చర్యలు శూన్యం ఇబ్బంది పడుతున్న ప్రజలు పట్టించుకోని అధికారులు -
దళారులను నమ్మి మోసపోవద్దు
కలెక్టర్ రాహుల్రాజ్హవేళిఘణాపూర్(మెదక్): మద్దతు ధర కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ రాహుల్రాజ్ సూ చించారు. ఆదివారం మెదక్ మండల పరిధిలోని రాజ్పల్లిలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి తేమ శాతం పరిశీలించారు. రైతుల వద్ద నుంచి ధాన్యం కొనుగోలు, ఏర్పాట్ల గురించి నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లావ్యాప్తంగా 498 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. తేమశాతం వచ్చిన తర్వాతే తూకం చేయాలని అన్నారు. రైతులకు టోకెన్లు అందించాలని సూచించారు. ధాన్యం తరలింపునకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాహనాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు. -
ప్రమాదాలు జరిగితేనే తనిఖీలు చేస్తారా?
మెదక్జోన్: బస్సు ప్రమాదాలు జరిగితేనే తనిఖీలు గుర్తుకువస్తాయా..? అని ఎంపీ రఘునందన్రావు ప్రశ్నించారు. శనివారం మెదక్ ఐబీలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రమాదాలు చోటు చేసుకోగానే హడావుడిగా తనిఖీలు చేసే అధికారులు ఆ తర్వాత మరిచిపోవటం ఎంతవరకు సమంజసం అన్నారు. కర్నూలు బస్సు ప్రమాదం దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. ప్రైవేట్ వాహనాలపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సర్దార్ వల్లబాయ్ పటేల్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు, వ్యాసరచన పోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 2047 వరకు వికసిత్ భారత్ మోదీ లక్ష్యమని గుర్తు చేశారు. సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లేశంగౌడ్, నాయకులు నందారెడ్డి సిద్దిరాములు, శ్రీపాల్ తదితరులు పాల్గొన్నారు. ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనాలి: ఎమ్మెల్యే హత్నూర(సంగారెడ్డి): రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోళ్లు చేయాలని ఎమ్మెల్యే సునీతారెడ్డి అన్నారు. శనివారం మండలంలోని పలు గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి మాట్లాడారు. ఇప్పటికే అకాల వర్షాలతో రైతులు నష్టపోయారని తెలిపారు. గన్నీ బ్యాగులతో పాటు హమాలీలను కేంద్రాల వద్ద అందుబాటులో ఉంచాలన్నారు. రైతులు ఆరబెట్టి తెచ్చిన ధాన్యాన్ని తూకం వేసి వెంటనే రైస్ మిల్లులకు పంపించాలని నిర్వాహకులకు సూచించారు. కార్యక్రమంలో ఐకేపీ డీపీఎం రమేశ్, తహసీల్దార్ పర్వీన్ షేక్, పీఏసీఎస్ చైర్మన్ దుర్గారెడ్డి, అసంఘటిత కార్మిక సంక్షేమ బోర్డు రాష్ట్ర మాజీ చైర్మన్ దేవేందర్రెడ్డి, మాజీ ఎంపీపీ నర్సింలు, ఏపీఎం రాజశేఖర్, సొసైటీ డైరెక్టర్ రాములు, బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు రామచంద్రారెడ్డి, నాయకులు తదితరులు పాల్గొన్నారు. వైద్యానికి మూలం ఆయుర్వేదం సంగారెడ్డి టౌన్: ఆరోగ్య సమస్యల పరిష్కారానికి భారతీయ ఆయుర్వేదం సంపూర్ణ పరిష్కారాలు సూచిస్తుందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సౌజన్య అన్నారు. శనివారం ధన్వంతరి జయంతి ఉత్సవాల్లో భాగంగా సంగారెడ్డి విద్యానగర్ కమ్యూనిటీ హాల్లో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడారు. అనారోగ్య సమస్యలతో ఇతర దేశాల నుంచి మన దేశంలోని ఆయుర్వేద ప్రకృతి వైద్యశాలలకు వస్తున్న ప్రజలే ఇందుకు నిదర్శనమని తెలిపారు. ఎంఎన్ఆర్ ఆసుపత్రి సిబ్బంది వైద్య సేవలను అభినందించారు. సమాజంలోని ప్రతి వ్యక్తికి న్యాయసేవలను అందించడం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ప్రధాన లక్ష్యం అని పేర్కొన్నారు. అనంతరం అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సంగారెడ్డి నాయీ బ్రాహ్మణ సేవా సంఘం పట్టణ కమిటీ గౌరవ అధ్యక్షుడు దత్తాత్రి, వర్కింగ్ ప్రెసిడెంట్ సాయినాథ్, ఎంఎన్ఆర్ ఆస్పత్రి వైద్యులు తదితరులు పాల్గొన్నారు. ఒకే సంస్థలో రెండు నిబంధనలా..? టీవీఏఈజేఏసీ చైర్మన్ సతీష్రెడ్డి మెదక్ కలెక్టరేట్: విద్యుత్ సంస్థలో ఎక్కడా లేని విధంగా రెండు నిబంధనలు అమలు చేసి ఆర్టిజన్ కార్మికులకు తీవ్ర అన్యా యం చేశారని టీవీఏఈజేఏసీ రాష్ట్ర చైర్మన్ సతీష్రెడ్డి పేర్కొన్నారు. శనివారం మెదక్లోని తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయిస్ జా యింట్ యాక్షన్ కమిటీ (టీవీఏఈజేఏసీ) ఆధ్వర్యంలో ఆర్టిజన్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇప్పటికై నా ప్రభుత్వం ఆర్టిజన్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలన్నారు. లేనిపక్షంలో త్వరలో మరో ఉద్యమానికి సిద్ధమవుతామని హెచ్చరించారు. అనంతరం ఉమ్మడి మెదక్ జిల్లా కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. -
దాచుకున్న మా డబ్బులు ఇవ్వరా..?
● టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు నరేందర్ ● తక్షణమే పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని డిమాండ్మెదక్ కలెక్టరేట్: ప్రభుత్వం వద్ద తాము దాచుకున్న సొంత డబ్బులు రాక ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు అనేక ఇబ్బందులు పడుతున్నారని టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు దొంత నరేందర్ ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం స్థానిక టీఎన్జీవో భవన్లో ఏర్పాటు చేసిన కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉద్యోగుల పెండింగ్ బిల్లులు, బకాయి పడ్డ ఐదు విడతల కరువు భత్యం విడుదల చేయడం పట్ల రాష్ట్ర ప్రభుత్వం తాత్సారం చేస్తోందని మండిపడ్డారు. తక్షణమే పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విశ్రాంత ఉద్యోగులు పదవీ విరమణ పొంది 19 నెలలు గడుస్తున్నా ఇప్పటికీ వారు దాచుకున్న పీఎఫ్ డబ్బులు వారికి రావాల్సిన ప్రయోజనాలు ఈరోజు వరకు చేకూరలేదని అన్నారు. విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేస్తున్న ఉద్యోగుల పరిస్థితి దయనీయంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా ప్రభుత్వం ఉద్యోగుల పట్ల నిర్లక్ష్య వైఖరి విడనాడాలని, ఉద్యోగులు దాచుకున్న సొమ్ము తక్షణమే విడుదల చేయాలని కోరారు. సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి అనురాధ, ఇక్బాల్ పాషా, ఫణి రాజ్, ఫజులుద్దీన్, రఘునాథరావు, శివాజీ, గోపాల్ తదితరులు పాల్గొన్నారు. -
ఆదివారం శ్రీ 26 శ్రీ అక్టోబర్ శ్రీ 2025
ఆహుతయ్యాక అలర్ట్!మామూళ్ల మత్తులో రవాణాశాఖ అధికారులుపటాన్చెరు కేంద్రంగానే ప్రైవేట్ ట్రావెల్స్ కార్యకలాపాలుసాక్షిప్రతినిధి, సంగారెడ్డి: ప్రయాణికుల ప్రాణాలను బుగ్గిపాలు చేస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్నప్పటికీ రవాణాశాఖ అధికారులు ఇన్నాళ్లు కళ్లు మూసుకున్నారు. కర్నూలులో వేమూరి కావేరి బస్సు దుర్ఘటన జరిగి 19 మంది ప్రాణాలు పోయాక, ఇప్పుడు తనిఖీల పేరుతో హడావుడి చేస్తుండటం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. శనివారం ముత్తంగి టోల్ప్లాజా సమీపంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను తనిఖీలు చేశారు. కాగా పటాన్చెరు కేంద్రంగానే ట్రావెల్స్ బస్సులు నడుస్తాయి. వందల సంఖ్యలో నిత్యం ఇక్కడి నుంచే బెంగుళూరు, ముంబై, ఏపీలోని వివిధ ప్రాంతాలకు బయలుదేరుతుంటాయి. కర్నూలులో ప్ర మాదానికి గురైన బస్సు కూడా పటాన్చెరు నుంచే ప్రారంభమైన విషయం విధితమే. పటాన్చెరుతో పాటు, బీరంగూడ, లింగంపల్లి వద్ద ప్రయాణికులను ఎక్కించుకుని వెళ్తుంటాయి. రవాణాశాఖ కార్యాలయం ఉన్నప్పటికీ.. రవాణా శాఖకు సంబంధించి పటాన్చెరులోనే రవాణాశాఖ కార్యాలయం ఉంది. మో టార్ వెహికిల్ ఇన్స్పెక్టర్తో పాటు, పలువురు సహాయ అధికారులు ఈ కార్యాలయంలో పనిచేస్తుంటారు. వీరు నిత్యం రూట్ చెక్లో భాగంగా రోడ్డుపై వాహనాలను తనిఖీలు చేయాలి. కానీ ఈ ఏనాడు ఈ బస్సుల వైపు కన్నెత్తి చూసిన దాఖలాల్లేవనే ఆరోపణలు ఉన్నాయి. కర్నూలు వద్ద ప్రమాదానికి గురైన వేమూరు కావేరి ట్రావెల్స్ బస్సునే ఉదాహరణగా తీసుకుంటే.. ఈ బస్సు కూర్చుని ప్రయాణించే సీట్లతో మాత్రమే అనుమతి ఉంది. కానీ స్లీపర్ సీట్లు ఏర్పాటు చేసి నడుపుతున్నట్లు అధికారుల పరిశీలనలో తేలింది. దీన్ని బట్టి చూస్తే ఎన్ని బస్సులు నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నాయనేది ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఎన్నో భధ్రతా పరమైన లోపాలతో యథేచ్ఛగా తిరుగుతున్నాయి. ఆయా ట్రావెల్స్ యాజమాన్యాలు రాజకీయంగా, ఆర్థికంగా పలుకుబడి ఉండటంతో పాటు, రవాణాశాఖ అధికారులకు ప్రతినెలా మామూళ్లు ముట్టజెపుతుంటారనేది బహిరంగ రహస్యం. దీంతో ఈశాఖ అధికారులు చూసీ చూడనట్లు వదిలేస్తున్నారనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. కాగా శనివారం జరిగిన తనిఖీల్లో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పాల్గొనట్లు తెలిసింది. తమ విధుల్లో భాగంగా ఈ తనిఖీలు చేసినట్లు ఆశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి.నిబంధనలకు విరుద్ధంగా బస్సులు నడుస్తున్నా కన్నెత్తి చూడని వైనం -
మహిళల ఆర్థిక అభివృద్ధికి తోడ్పాటు
సంగారెడ్డి: కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు పేదింటి ఆడబిడ్డల పెళ్లికి తోడ్పాటును అందిస్తాయని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. శనివారం పట్టణంలోని ఓ గార్డెన్లో లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేసి మాట్లాడారు. రాష్ట్రంలోని ప్రజాప్రభుత్వం పేద, మధ్య తరగతి కుటుంబాల ఆర్థిక అభివృద్ధికి తోడ్పాటును అందిస్తూ వారి జీవితాల్లో వెలుగులు నింపుతుందన్నారు. ప్రతి లబ్ధిదారుడికి ప్రభుత్వ పథకాలు చేరేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మల, ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, సంగారెడ్డి ఆర్డీఓ రాజేందర్, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. అక్షయపాత్ర సేవలు అమోఘం కంది(సంగారెడ్డి): విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించడంతో పాటు ఆధ్యాత్మికతను పంచుతున్న అక్షయపాత్ర సేవలు అమోఘమని మంత్రి దామోదర కొనియాడారు. శనివారం మండల కేంద్రంలోని హరేకృష్ణ కల్చరల్ సెంటర్లో చేపట్టిన మహా నరసింహ హోమం, ఆలయం గర్భాలయ యంత్ర స్థాపనలో పాల్గొన్నారు. ఈసందర్భంగా అక్షయ పాత్రలో విద్యార్థులకు తయారు చేస్తున్న భోజనం, వా టిలో వినియోగిస్తున్న బియ్యం తదితర వస్తువు లు, కిచెన్ షెడ్డును పరిశీలించారు. విద్యార్థులకు భోజనం సరఫరా చేయనున్న రెండు వాహనాలకు జెండా ఊపి ప్రారంభించారు.మంత్రి దామోదర రాజనర్సింహ -
డీసీసీబీ మేనేజర్కు పదోన్నతి
నారాయణఖేడ్: జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) ఖేడ్ బ్రాంచి మేనేజర్గా విధులు నిర్వర్తిస్తున్న వెంకటేశంకు ఏజీఎంగా పదోన్నతి కల్పిస్తూ సీఈఓ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. వెంకటేశం ఖేడ్ బ్యాంకు మేనేజర్గా బ్యాంకు అభివృద్ధికి విశేషంగా కృషి చేశారు. అయన స్థానంలో పాపన్నపేట మేనేజర్గా విధులు నిర్వర్తిస్తున్న కిషన్ను నియమించారు. వరద నష్టానికి రూ.1.50 కోట్లు మంజూరు చేయండి మంత్రి సురేఖకు ఎమ్మెల్యే విజ్ఞప్తి పాపన్నపేట(మెదక్): మంజీరా వరదల వల్ల ఏడుపాయల్లో దెబ్బతిన్న ప్రాంతాలను మరమ్మతు చేయడానికి రూ.1.50 కోట్లు మంజూరు చేయాలని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖకు మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో ప్రసిద్ధి చెందిన పుణ్య క్షేత్రం కావడంతో లక్షలాది మంది భక్తులు దుర్గమ్మ దర్శనానికి తరలి వస్తుంటారని చెప్పారు. భక్తులకు ఇబ్బంది కలుగకుండా వెంటనే మరమ్మతులు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. కాగా, ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన రామతీర్థం గ్రామానికి చెందిన కన్నె బోయిన గంగారాంకు రూ.లక్ష ఆర్థిక సాయం అందజేశారు. చాకరిమెట్లకు కార్తీక శోభ శివ్వంపేట(నర్సాపూర్): మండల పరిధిలోని చాకరిమెట్ల సహకార ఆంజనేయస్వామి ఆలయంలో కార్తీక శోభ సంతరించుకుంది. కార్తీక మాసం మొదటి శనివారం కావడంతో భక్తులు భారీగా తరలివచ్చి మొక్కులు తీర్చుకున్నారు. అర్చకులు స్వామివారికి అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దంపతులు సత్యనారాయణస్వామి వ్రతాలు ఆచరించారు. భక్తులు రాజుయాదవ్, రవీందర్, శంకర్ నిత్యాన్నదానానికి రూ. 45 వేల విరాళం అందజేశారు. -
అమరుల త్యాగాలు వృథా కావు
మెదక్మున్సిపాలిటీ: పోలీస్ అమరవీరుల త్యాగాలు వృథా కావని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు అన్నారు. అమరవీరుల వారోత్సవాల సందర్భంగా శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడారు. పోలీసులు కేవలం శాంతి భద్రతల పరిరక్షణకే పరిమితం కాకుండా, సేవా కార్యక్రమాల్లో కూడా ముందుంటారని తెలిపారు. రక్తదానంపై ఉన్న అపొహలను నమ్మకుండా ప్రతి ఒక్కరూ ముందుకు రావాలన్నారు. పోలీస్ సిబ్బ ంది ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని సూచించారు. అనంతరం రక్తదానం చేసిన వారిని అభినందించి వారికి పండ్లు, సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ మహేందర్, మెదక్ డీఎస్పీ ప్రసన్నకుమార్, ఏఆర్ డీఎస్పీ రంగనాయక్, పోలీస్ అధికారులు, సిబ్బంది త దితరులు పాల్గొన్నారు. 99 యూనిట్ల రక్తం సేకరణ పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా శనివారం నిర్వహించిన రక్తదాన శిబిరంలో మొత్తం 99 యూనిట్ల రక్తం సేకరించినట్లు అదనపు ఎస్పీ మహేందర్ తెలిపారు. ఇందులో 80 యూనిట్ల రక్తం నిలోఫర్ ఆస్పత్రికి, 19 యూనిట్లు మెదక్ బ్లడ్ బ్యాంక్కు ఇస్తామన్నారు. ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ పోలీసు అమరవీరుల త్యాగాలకు స్మారకంగా నిర్వహించిన ఈ రక్తదాన శిబిరం సామాజిక సేవకు ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. అలాగే ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన నిలోఫర్ వైద్య సిబ్బంది, రెడ్ క్రాస్ సిబ్బంది, రక్తదాతలను ఆయన అభినందించారు. కార్య క్రమంలో పోలీస్ అధికారులు పాల్గొన్నారు. -
ఉద్యోగం ఇవ్వరు.. ఉపాధి చూపరు
‘డీఈఈటీ’ని పట్టించుకోని పరిశ్రమలు రిజిస్ట్రేషన్ తప్పనిసరి ప్రతి పరిశ్రమ తప్పనిసరిగా డీఈఈటీ యాప్లో రిజిస్ట్రేషన్ చేసుకొని ఉండాలి. ఇందులో నమోదు చేసుకుంటూనే రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహకారాలు అందిస్తామని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. కంపెనీల పరిశీలనకు వెళ్లినప్పుడు డీఈఈటీలో తప్పనిసరి నమోదు చేసుకోవా లని యజమానులకు సూచిస్తాం. అలాగే ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో విద్యార్థులకు అవగాహన సమావేశాలు నిర్వహించి వివరిస్తాం. – ప్రకాశ్, జీఎం, జిల్లా పరిశ్రమల శాఖమెదక్ కలెక్టరేట్: నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తూ.. వారిని శక్తివంతులుగా తీర్చిదిద్దడానికి డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణ (డీఈఈటీ) యాప్ను ప్రభుత్వం ప్రారంభించింది. నిరుద్యోగులు ఈ యాప్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే కంపెనీల చుట్టూ తిరిగే పనిలేకుండా జాబ్ పొందే అవ కాశం లభిస్తుంది. రాష్ట్రంలోని అన్ని పరిశ్రమలు ఈ యాప్లో రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేసుకునేలా నిబంధనలు పెట్టింది. అయితే జిల్లాలో కొన్ని పరిశ్రమలు మాత్రమే నమోదు చేసుకున్నాయి. ఆసక్తి చూపని పరిశ్రమల నిర్వాహకులు జిల్లాలో సుమారు 500 వరకు వివిధ రకాల పరిశ్రమలు ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా ఐరన్, ఫోం, సీడ్, ఫుడ్ ప్రాసెసింగ్, ప్లాస్టిక్ రీసైక్లింగ్ వంటివి ఉన్నాయి. అయితే అన్నీ కంపెనీలు తప్పనిసరిగా డీఈఈటీలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ప్రభుత్వం నిబంధనలు పెట్టింది. అయినప్పటికీ ఇప్పటివరకు కేవలం 67 కంపెనీలు మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకోవడం గమనార్హం. ప్రభుత్వం యాప్ తీసుకొచ్చి ఏడాది కావొస్తున్నా.. ఇంకా 90 శాతం పరిశ్రమలు యాప్లో రిజిస్ట్రేషన్ చేసుకోలేదు. వలసపోతున్న యువత జిల్లాలో వందలాది పరిశ్రమలు ఉన్నా.. ఇక్కడి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడంలో పరిశ్రమలు నిర్లక్ష్యం చేస్తున్నాయి. వారికి కావాల్సిన ఉద్యోగులను ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చుకుంటున్నాయి. డీఈఈటీ యాప్లో జిల్లాకు చెందిన 1,951 మంది నిరుద్యోగులు రిజిస్ట్రేషన్ చేసుకుంటే కేవలం 10 మందికి మాత్రమే అవకాశం కల్పించాయి. జిల్లాకు చెందిన నిరుద్యోగులు హైదరాబాద్కు వలస వెళ్లి చాలీచాలని వేతనాలతో నానాఅవస్థలు పడుతున్నారు. నీరుగారుతున్న ప్రభుత్వ లక్ష్యం 1,951 మంది నిరుద్యోగులరిజిస్ట్రేషన్ కేవలం పది మందికే ఉద్యోగం -
ఎలాంటి పొరపాట్లకు తావివ్వం
మెదక్ కలెక్టరేట్: ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పూర్తి చేయనున్నట్లు కలెక్టర్ రాహుల్రాజ్ తెలిపారు. శనివారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్రెడ్డి, అదనపు అధికారి లోకేష్ కుమార్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్కు జిల్లా అధికారులతో కలిసి పాల్గొన్నారు. ఈసందర్భంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పురోగతిపై సమీక్షించారు. ఈ ప్రక్రియను ఏఈఆర్ఓలు, బీఎల్ఓలు, ఇతర ఎన్నికల సిబ్బందితో కలిసి పూర్తి చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్, ఆర్డీఓలు రమాదేవి, మహిపాల్రెడ్డి, తహసీల్దార్లు, కలెక్టరేట్ సూపరింటెండెంట్లు పాల్గొన్నారు. భూభారతి రెవెన్యూ సమస్యలపై సమీక్ష నిర్వహించారు. పదిరోజుల్లో 1,000 దరఖాస్తులను పరిష్కరించాలని ఆదేశించారు.కలెక్టర్ రాహుల్రాజ్ -
సమస్యలు పరిష్కరించాలి
నర్సాపూర్ రూరల్: నారాయణపూర్ గిరిజన గురుకుల బాలికల పాఠశాల, కళాశాలను జూనియర్ సివిల్ జడ్జి హేమలత శనివారం సందర్శించారు. బాధిత విద్యార్థులను పరామర్శించారు. ఎలుకలతో పాటు పాములు, ఇతర కీటకాలులోనికి రాకుండా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. విద్యార్థులతో పాటు బోధన సిబ్బందిని సమస్యలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రిన్సిపాల్ లలితాదేవికి సూచించారు. అనంతరం విద్యార్థులకు వడ్డించే భోజనాన్ని పరిశీలించారు. నాణ్యమైన, రుచికరంగా ఉండే భోజనం అందజేయాలని సూచించారు. ఇదిలాఉండగా రెడ్డిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి రఘువరణ్ ఆధ్వర్యంలో గురుకులంలో హెల్త్క్యాంప్ నిర్వహించి విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. -
కర్నూలు బస్సు ప్రమాదంలో తల్లీ కూతుళ్ల మృతి
సాక్షి, మెదక్: కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో మెదక్ జిల్లాకు చెందిన తల్లి కూతుళ్లు మృతి చెందారు. మెదక్ మండలం శివాయిపల్లికి చెందిన తల్లి సంధ్యారాణి కూతురు చందన మృతి చెందారు. సంధ్యారాణి తన కూతురు చందనను బెంగుళూరులో డ్రాప్ చేయడానికి వెళ్తుండగా ఘటన చోటు చేసుకుంది. సంధ్యారాణి భర్త ఆనంద్ గౌడ్ దుబాయ్లో ఓ ప్రైవేటు కంపనీలో ఉద్యోగం చేస్తుండగా.. సంధారాణి భర్తతో కలిసి దుబాయ్లో ఉంటున్నారు.కూతురు చందన బెంగళూర్ లోని ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. దీపావళీ పండగకు ముందు తల్లి సంధ్యారాణి దుబాయ్ నుండి రావడంతో కూతురు చందన కూడా తల్లి వద్దకు వచ్చి పండగకు పెద్దమ్మ ఇంటి వద్ద ఉన్నారు. నిన్న కూతురు చందన తిరిగి బెంగళూరు వెళ్తుండగా తల్లి సంధ్యారాణి కూడా వెళ్లారు. నిన్న సాయంత్రం 6 గంటలకు కావేరీ ట్రావెల్స్ బస్సులో సీట్ నెంబర్ L-14 , l-15 సీట్లు బుక్ చేసుకున్నారు. మూసాపేట్ బోర్డింగ్ పాయింట్లో తల్లి కూతుళ్లు బస్ ఎక్కినట్టుగా బంధువులు చెబుతున్నారు. -
కార్మికులకు కేంద్రం అన్యాయం
నర్సాపూర్: కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలు రద్దు చేస్తూ అన్యాయం చేస్తుందని సీఐటీయూ జిల్లా కార్యదర్శి మల్లేశం ఆరోపించారు. బుధవారం నర్సాపూర్లో సీఐటీయూ రాష్ట్ర మహాసభలకు సంబంధించిన వాల్పోస్టర్ను ఆవిష్కరించి మాట్లాడారు. కార్మికులకు రూ. 26 వేల కనీస వేతనం అమలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగ భద్రత, ఈఎస్ఐ, పీఎఫ్, కనీస సౌకర్యాలు కల్పనలో ప్రభుత్వాలు విఫలం చెందాయని మండిపడ్డారు. కార్మికుల సంక్షేమం కోసం సీఐటీయూ నిరంతరం పోరాటం చేస్తుందన్నారు. కాగా డిసెంబర్ 7 నుంచి 9 వరకు మెదక్లో జరిగే రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు నాగరాజు, అసిఫ్, చంద్రయ్య, నర్సింలు, లక్ష్మయ్య, అనిల్, శంకరయ్య, మల్లేశం తదితరులు పాల్గొన్నారు. -
ఎఫెక్ట్
కొల్చారం(నర్సాపూర్): ఇందిరమ్మ ఇళ్ల పేరిట అక్రమంగా మంజీరా నుంచి ఇసుక రవాణా చేస్తూ సొ మ్ము చేసుకుంటున్న విషయమై ఇటీవల ‘సాక్షి’లో ప్రచురితమైన ‘ఇసుకాసురులు’ కథనానికి రెవె న్యూ అధికారులు ఎట్టకేలకు స్పందించారు. బుధవారం మండలంలోని పైతర శివారు మంజీరా నది నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న మూడు ఇసుక ట్రాక్టర్లను తహసీల్దార్ శ్రీనివాస్చారి ఆధ్వర్యంలో పట్టుకున్నారు. పట్టుబడిన ట్రాక్టర్లను పంచాయతీ ఆధీనంలో ఉంచారు. గురువారం పూర్తిస్థాయి విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ తెలిపారు. చిన్నశంకరంపేట(మెదక్): భూ భారతి దరఖాస్తులను వెంటనే పరిశీలించి పరిష్కరించాలని మెదక్ ఆర్డీఓ రమాదేవి అధికారులను ఆదేశించారు. బుధవారం చిన్నశంకరంపేట తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. భూ భారతి రెవెన్యూ సదస్సు లో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి పరిష్కరించాలన్నారు. రైతులు కార్యాలయం చుట్టూ తిరగకుండా అధికారులు చొరవ చూపాలన్నారు. అనంతరం మండలంలోని చందంపేట ఎంఎస్ఎన్ పరిశ్రమపై గ్రామస్తులు ఫిర్యాదు చేయగా, కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో కలిసి పరిశ్రమ పరిసరాలను పరిశీలించారు. ఆమె వెంట కాలుష్య నియంత్రణ మండలి ఈఈ పఠాన్, తహసీల్దార్ మాలతి, ఆర్ఐ రాజు ఉన్నారు. నర్సాపూర్ రూరల్: నర్సాపూర్ మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్కు చెందిన ఇద్దరు విద్యార్థులు మంగళవారం పారిపోయిన విషయం తెలిసిందే. విద్యార్థుల తల్లిదండ్రుల మధ్య జరిగిన గొడవల కారణంగా వేర్వేరుగా ఉంటున్నట్లు తెలిసింది. తండ్రి హైదరాబాద్లో ఉండగా, పిల్లలు వెతుక్కుంటూ తండ్రి వద్దకు వెళ్లినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. దీంతో పోలీసు లు పారిపోయిన విద్యార్థులు మహ్మద్ ఆమెర్, మహ్మద్ నవాజ్ అలీని బుధవారం స్కూల్లో అప్పగించారు. దీంతో పాఠశాల సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.గజ్వేల్: పట్టణంలో బుధవారం రాత్రి జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్ చేతుల మీదుగా జరిగిన కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం సెల్ఫోన్ లైట్ల వెలుతురులో సాగింది. రాత్రి 7:20 గంటల ప్రాంతంలో మంత్రి వివేక్, కలెక్టర్ హైమావతి, ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డిలతో కలిసి పట్టణంలోని ఐవోసీ సమావేశ మందిరానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి కొద్దిసేపు ప్రసంగించారు. ఇంతలోనే కరెంటు సరఫరా నిలిచిపోయింది. దీంతో మంత్రితో పాటు వేదికపైన ఉన్న వారు ఇబ్బంది పడ్డారు. కొద్దిసేపు వేచి ఉన్నా కరెంటు రాకపోవడంతో మంత్రి వివేక్ చివరకు సెల్ఫోన్ లైట్ల వెలుతురుతో పాటు వీడియో కెమెరాల లైటింగ్లోనే కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. నియోజకవర్గంలోని 204 మంది లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేయాల్సి ఉండగా, కొందరికే సెల్ఫోన్ లైట్ల వెలుతురులో మంత్రి అందించారు. సుమారు 10 నిమిషాలకుపైగా కార్యక్రమం సాగింది. ఆ తర్వాత కరెంటు సరఫరా రావడంతో మంత్రి మరోసారి వేదికపై ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ తన ప్రసంగాన్ని కొనసాగించారు. కొద్దిసేపు ప్రసంగించి కార్యక్రమాన్ని ముగించుకొని వెళ్లిపోయారు. కాగా విద్యుత్ సరఫరా నిలిచిపోవడానికి గల కారణాలను జిల్లా ఉన్నతాధికారులు ఆరా తీశారు. స్థానిక విద్యుత్శాఖ ఏఈ మారుతిని అక్కడికి పిలిపించి వివరణ అడిగారు. ఈ సందర్భంగా ముట్రాజ్పల్లిలోని ట్రాన్స్ఫార్మర్ ఇన్సులేటర్పై బల్లి పడటంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని ఏఈ వివరణ ఇచ్చినట్లు తెలిసింది. చాలా సేపటి వరకు ఆ ఫీడర్లైన్ పునరుద్ధరణ కాకపోవడంతో ఐవోసీ వెనుకభాగంలో ఉన్న మరో ఫీడర్తో విద్యుత్ సరఫరాను పునరుద్ధరించినట్లు సమాచారం. -
వాహన బీమా.. భవితకు ధీమా
● ఆపద సమయంలో అండ ● విస్మరిస్తున్న వాహనదారులు ● జిల్లాలో 1.88 లక్షలకు పైగా వెహికిల్స్ మెదక్ మున్సిపాలిటీ: మనం ఉపయోగించే వాహనాలకు తప్పనిసరిగా బీమా చేయించాలి. కానీ ఈ విషయాన్ని చాలా మంది వివిధ కారణాలతో విస్మరిస్తున్నారు. జిల్లాలో దాదాపు 1.88 లక్షలకు పైగా వాహనాలు ఉన్నాయి. వీటిలో సగాని కంటే ఎక్కువ వాటికి బీమా లేనట్లు అధికారులు గుర్తించారు. మోటార్ వాహన చట్టం ప్రకారం ప్రతి వాహనానికి బీమా తప్పనిసరి. వాహనానికి అనుకొని ప్రమాదం జరిగితే.. బీమాతో తగిన పరిహారం పొందే అవకాశం ఉంటుంది. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్తో ప్రమాదం జరిగితే డ్రైవర్కు లేదా ప్రయాణికులకు, ప్రమాదానికి గురైన వ్యక్తులకు నష్ట పరిహారం వర్తిస్తుంది. అయితే వాహనాన్ని బట్టి ప్రతి ఏడాది బీమా చెల్లించాలి. గతంలో లైసెన్స్ లేకపోయినా.. హెల్మెట్ లేకపోయినా జరిమానాలు విధించేవారు.. ఇప్పుడు వాహనానికి బీమా లేకుండా నడిపితే జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. జరగరాని నష్టం ఏం జరిగినా సదరు యజమానే నష్ట పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. ఎలా నిర్ణయిస్తారు? వాహనం చోరీకి గురైనా.. ప్రమాదంలో నుజ్జునుజ్జయినా ఐడీవీని పాలసీదారుడికి చెల్లిస్తారు. వాహన కాల పరిమితి ఆధారంగా ఈ ఐడీవీని చెల్లించాల్సి ఉంటుంది. వాహనం కొనుగోలు చేసిన నెలలోపు అయితే 5 శాతం, ఏడాదిలోపు 15 శాతం, ఏడాది తర్వాత 20 శాతం, రెండేళ్లు దాటితే 30 శాతం, మూడేళ్లు దాటితే 40 శాతం, నాలుగేళ్లకు పైబడితే 5 శాతం తరుగుదల తీసేస్తారు. వాహన ప్రమాదానికి కారణమైన పాలసీదారుడు లేదా బాధితుడు, వారి తరఫున మరొకరు ప్రమాద సమాచారాన్ని వెంటనే బీమా కంపెనీకి, పోలీసులకు తెలియజేయాల్సి ఉంటుంది. థర్డ్ పార్టీ కింద నష్టపరిహారం పొందడానికి బాధితులు మోటార్ వాహనాలకు సంబంధించిన ట్రిబ్యునల్ను ఆశ్రయించాలి. సొంత వాహనానికి ఏదైనా ప్రమాదం జరిగి నష్టం వాటిల్లితే వెంటనే బీమా కంపెనీకి సమాచారం ఇవ్వాలి. కంపెనీ ప్రతినిధులు వచ్చే వరకు వాహనాన్ని ప్రమాద స్థలంలోనే ఉంచాలి. వాహనానికి సహజంగా జరిగే నష్టానికి బీమా కంపెనీలు పరిహారం చెల్లించవు. ఇబ్బందులు తప్పవు వాహనదారులు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా బీమా చేయించుకోవాలి. అనుకొని ప్రమాదం జరిగినప్పుడు బీమా ఉంటే 90 శాతం ప్రయోజనం చేకూరుతుంది. లేదంటే సర్వం కోల్పోవాల్సి వస్తుంది. వాహనదారులు నిర్లక్ష్యం వహించొద్దు. తనిఖీ సమయంలో బీమా లేని వాహనాలకు జరిమానా విధిస్తూ అవగాహన కల్పిస్తున్నాం. – మహేందర్, అదనపు ఎస్పీ -
చివరి గింజ వరకు కొంటాం
నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డినారాయణఖేడ్: ప్రభుత్వం చివరిగింజ వరకూ ధాన్యం కొనుగోలు చేస్తుందని ఎమ్మెల్యే సంజీవరెడ్డి స్పష్టం చేశారు. బుధవారం ఖేడ్, నిజాంపేట్, కల్హేర్ మండల్లాలోని పలు గ్రామాల్లో ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి మాట్లాడారు. రైతులు పంట ఉత్పత్తులను దళారులకు విక్రయించి నష్టపోకుండా కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలన్నారు. గతంలో క్వింటాల్కు 7 కిలోల వరకు తరుగు పేరిట తీసేవారని, ఇప్పుడు అలా జరగకూడదని ఆదేశించామని చెప్పారు. మద్దతు ధరతో పాటు సన్నవడ్లకు రూ.500 చొప్పున ప్రభుత్వం బోనస్ అందిస్తుందని తెలిపారు. రైతుల వద్ద ధాన్యం కొనుగోలు చేసిన మూడు రోజుల్లోగా డబ్బులు జమ అవుతాయని వివరించారు. బీఆర్ఎస్ పాలనలో రైస్మిల్లర్ల వద్ద కమీషన్లు తీసుకొని పనిచేశారని ఆరోపించారు. ధాన్యం తూకంలో అధికంగా తరుగు తీసుకుంటే మిల్లర్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ధాన్యం విక్రయించేందుకు ఎవరికీ డబ్బులు ఇవ్వొద్దని సూచించారు. కార్యక్రమంలో ఏడీఏ నూతన్ కుమార్, ఏవో శంకర్, నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
దళారులను నమ్మి మోసపోవద్దు
కలెక్టర్ రాహుల్రాజ్ కౌడిపల్లి(నర్సాపూర్): రైతులు ధాన్యం అమ్ముకునేందుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని కలెక్టర్ రాహుల్రాజ్ తెలిపారు. బుధవారం మండలంలోని వెల్మకన్నలో సుడిగాలి పర్యటన నిర్వహించారు. ధాన్యం కొనుగోలు కేంద్రం, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, పాఠశాల, అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేశారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో 498 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించామని చెప్పారు. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు. అనంతరం పాఠశాలను సందర్శించి విద్యార్థులతో బోర్డుపైన లెక్కలు చేయించారు. ప్రతి ఒక్కరూ శ్రద్ధగా చదవాలన్నారు. విద్యార్థుల అభివృద్ధికి ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. అలాగే రెండో అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేసి మధ్యాహ్న భోజనం, విద్యా ర్థుల పూర్వ ప్రాథమిక విద్యను పరిశీలించారు. గ్రామంలో ఇందరిమ్మ ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించి, ఇప్పటివరకు ఎంతమందికి బి ల్లులు వచ్చాయని అధికారులను అడిగి తెలుసుకున్నారు. త్వరగా నిర్మాణ పనులు పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ కృష్ణ, ఎంపీడీఓ శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శి ప్రవీణ్రెడ్డి, ఉపాధ్యాయులు, గ్రామస్తులు త దితరులు పాల్గొన్నారు. -
మట్టి.. కొల్లగొట్టి
పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా పట్టణ విస్తీర్ణం రోజురోజుకు పెరుగుతోంది. ఇబ్బడి ముబ్బడిగా వెంచర్లు వెలుస్తుండగా, పోటీ పడి ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నారు. కాగా ఇంటి నిర్మాణాలకు మట్టి అవసరం ఉండగా, అధికారుల అనుమతితో తవ్వకాలు చేపట్టాల్సి ఉంది. అయితే కొందరు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా మట్టి తవ్వకాలు చేపడుతూ అడ్డదారిలో రూ. కోట్లు సంపాదిస్తున్నారు. – మెదక్జోన్ జిల్లా కేంద్రంలో లక్షకు చేరువలో జనాభా ఉండగా, 18 వేల నివాస గృహాలు ఉన్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఇందులో 30 శాతానికి పైగా వలస వచ్చిన ప్రజలతో పాటు ఉద్యోగులు అద్దెకు ఉంటున్నారు. దీంతో పట్టణంలో నూతనంగా ఇళ్ల నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. మెదక్ మండల పరిధిలోని మంబోజిపల్లి మెదక్– నర్సాపూర్ జాతీయ రహదారిని ఆనుకొని ఉంది. దీ ంతో రోజురోజుకు అభివృద్ధి చెందుతుంది. రోడ్డుకు ఇరువైపులా పెద్ద ఎత్తున భవనాలు నిర్మిస్తున్నారు. కాగా మెదక్ పక్కనే గల చేగుంట రహదారిని ఆనుకొని పిల్లికొటాల్ శివారు, మంబోజిపల్లిని ఆనుకొని సహజ సిద్ధంగా వెలిసిన గుట్టలు ఉన్నాయి. ఈ గుట్టల నుంచి అక్రమార్కులు పగ లు, రాత్రి తేడా లేకుండా మట్టిని ఇష్టానుసారంగా తవ్వి నూతనంగా నిర్మిస్తున్న భవనాలకు తరలిస్తున్నారు. ఇందుకోసం ఒక్కో టిప్పర్కు రూ. 4 నుంచి రూ. 5 వేల చొప్పున తీసుకుంటున్నారు. ఒక్కో ఇంటి ని ర్మాణానికి రూ. 3 నుంచి రూ. 5 లక్షల వరకు గుంపగుత్తగా మాట్లాడుకొని టిప్పర్ల ద్వారా మట్టిని సరఫరా చేస్తున్నారు. పట్టణానికి చెందిన పలువురు మట్టి వ్యాపారులుగా అవతారమెత్తారు. నిబ ంధనల ప్రకారం ప్రభుత్వానికి చలాన్ చెల్లించాల్సి ఉంటుంది. అనంతరం అధికారుల అనుమతి మేరకు మట్టిని ఎక్కడి నుంచి తరలించాలనేది నిర్ధారించుకోవాలి. కానీ జిల్లాలో అలాంటేవి జరగటం లేదు. మట్టి అవసరం వచ్చిందంటే చాలు అధికారులకు బదులు అక్రమార్కులను సంప్రదిస్తున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం. అనుమతి లేకుండా ఇష్టారీతిన తరలింపు ప్రభుత్వ ఆదాయానికి గండి చోద్యం చూస్తున్న అధికారులు అక్కరకు రాని కుమ్మరికుంట పిల్లికొటాల్ను ఆనుకొని రోడ్డు పక్కనే ఉన్న కుమ్మరికుంట నుంచి కొంతకాలంగా అక్రమార్కులు సుమారు 5 మీటర్ల లోతు వరకు మట్టిని తవ్వారు. దీంతో పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం వర్షాలకు నిండుకుండలా మారింది. అయితే ఆయకట్టు భూములు ఎత్తుగా ఉండటంతో కుంట నుంచి నీరు సాగు భూములకు వెళ్లే పరిస్థితి లేకుండా పోయింది. ఫలితంగా కొంతకాలంగా 50 ఎకరాలకు పైగా ఆయకట్టు భూములు బీడుగా మారింది. దీంతో చేసేది లేక రైతులు ఆ భూములను విక్రయానికి పెట్టారు. అలాగే కుంటలో ఏర్పడిన గుంతల్లో పడి ఇద్దరు పశువుల కాపరులు ప్రమాదవశాత్తు మరణించిన సంఘటనలు ఉన్నాయి. -
దుకాణ సముదాయానికి తాళం
● టెండర్లకు నోచుకోని వైనం ● తూప్రాన్ మున్సిపాలిటీలో అధికారుల నిర్వాకం తూప్రాన్: మున్సిపాలిటీకి రూ. లక్షల ఆదాయం సమకూర్చే దుకాణ సముదాయం టెండర్లకు నోచుకోవడం లేదు. పట్టణంలోని కూరగాయల మార్కెట్ పక్కన ఎనిమిది దుకాణాల అగ్రిమెంట్ అయిపోయి ఏళ్లు గడుస్తుంది. టెండర్లు పిలువకుండా అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. దుకాణాలు ఉన్న ప్రాంతం నిత్యం ప్రజలతో రద్దీగా ఉంటుంది. ఈ దుకాణాల అద్దె సుమారు రూ. 30 నుంచి రూ. 50 వేల వరకు ఉంటుంది. కానీ అధికారులు కేవలం రూ. 6 వేల వరకు నామమాత్రంగా అద్దె వసూలు చేశారన్న విమర్శలు ఉన్నాయి. దీని వెనుక అధికారుల పాత్ర ఉన్నట్లు వ్యాపారులు, ప్రజాప్రతినిధులు ఆరోపిస్తున్నారు. గతంలో టెండర్ల ద్వారా దుకాణాలను దక్కించుకున్న వ్యాపారులు ఇతరులకు అధికంగా అద్దెకు ఇచ్చి వసూలు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. గతంలో మేజర్ పంచాయతీగా ఉన్న కాలంలోనే దుకాణాల సముదాయం ఏర్పాటు చేశారు. టెండర్ల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రెండు చొప్పున ఎనిమిది దుకాణాలను కేటాయించారు. వాటికి అప్పట్లో నామమాత్రంగా కేవలం రూ. 550 నుంచి రూ.1,200 వరకు వసూలు చేశారు. మేజర్ పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా ఏర్పడిన తర్వాత దుకాణాల సముదాయానికి రూ. 2,500 వరకు వసూలు చేశారు. తీరా అగ్రిమెంట్ పూర్తి కాగానే తిరిగి టెండర్లకు ఆహ్వానించారు. అయితే లక్ష్యానికి అనుగుణంగా టెండర్లు రాకపోవడంతో కొన్నాళ్లుగా దుకాణాల సముదాయానికి తాళం వేశారు. ప్రస్తుతం దుకాణాలు మూతపడి ఉండడంతో శిథిలావస్థకు చేరాయి. ఇప్పటికై నా అధికారులు స్పందించి దుకాణాలకు టెండర్లు పిలిచి దళారి వ్యవస్థ లేకుండా అర్హులైన వారికి కేటాయించాలని వ్యాపారులు కోరుతున్నారు. -
మంటగలుస్తున్న మానవత్వం
వర్గల్(గజ్వేల్): ఆస్తుల ఆశలో బంధాలు బలహీనమవుతున్నాయి. మానవత్వం మంట కలుస్తున్నది. ఆత్మీయ అనురాగాలు మసకబారుతున్నాయి. కంటికి రెప్పలా కాపాడాల్సిన సంతానమే కాలయములవుతున్నారు. వర్గల్ మండలం మీనాజీపేట హత్యోదంతం ఘటన తల్లీకూతుళ్ల అనుబంధానికి మచ్చగా మారింది. ఆస్తి కోసం ఓ కూతురు తల్లినే కడతేర్చిన తీరు నివ్వెరపరుస్తున్నది. నీడనిస్తున్న చెట్టునే నరికినట్లు, కుటుంబానికి అండగా నిలిచిన తల్లిని హతమార్చి, భర్తతో సహా ఆ కూతురు కటకటాల పాలైంది. అమాయకులైన ఆమె పిల్లలను, తండ్రిని దిక్కుతోచని స్థితిలోకి నెట్టేసింది. పచ్చని సంసారం.. కకావికలంవర్గల్ మండలం మీనాజీపేటకు చెందిన మంకని బాల్నర్సయ్య, బాలమణి(55) దంపతులకు కొద్దిపాటి వ్యవసాయ భూమి ఉంది. కుమారుడు గిరి చేతికందే తరుణంలో మృతిచెందాడు. కాగా పెద్దకూతురు లావణ్యకు తునికి బొల్లారం భిక్షపతితో పెళ్లి చేశారు. తమకు మగదిక్కు లేకపోవడంతో చిన్నకూతురు నవనీత, మధు దంపతులు, వారి ముగ్గురు పిల్లలతో సహా ఇక్కడే ఉంటున్నారు. పొలం పనులను తండ్రి చూసుకుంటుండగా, తల్లి బాలమణి దినసరి కూలీగా ఆ కుటుంబానికి చేదోడుగా నిలుస్తున్నది. ఈ క్రమంలో ఆస్తిలో కొంత భూమి పెద్ద కూతురు లావణ్యకు ఇవ్వాలనే తల్లిదండ్రుల ఆలోచన పచ్చని కాపురంలో చిచ్చుగా మార్చింది. మృత్యురూపమెత్తిన చిన్న కూతురుఅన్నీ తానై తల్లిదండ్రులను చూసుకుంటుంటే, ఆస్తిలో కొంత భూమిని అక్కకు ఎలా ఇస్తారంటూ చిన్న కూతురు నవనీత గొడవపడింది. ఈ క్రమంలో అసలు అమ్మనే లేకుండా చేస్తే ఆస్తి తనకే మిగులుతుందని పథకం రచించింది. తన భర్త మధు, తూప్రాన్ మండలం యావాపూర్కు చెందిన వరుసకు సోదరుడైన రామని గౌరయ్యతో కలిసి ఈ నెల 10న ఇంట్లోనే తల్లిని ఊపిరాడకుండా చేసి హత్యచేసింది. మృతదేహాన్ని తునికి బొల్లారం అయ్యప్ప చెరువులో పడేసి వెళ్లిపోయారు. తరువాత అమ్మ కనపడటం లేదంటూ నాటకానికి తెరలేపింది. ఈ క్రమంలో బాలమణి మృతదేహం లభ్యమవడంతో గుట్టురట్టయింది. కూతురే ఆస్తి కోసం భర్త, మరొకరితో కలిసి ఈ అఘాయిత్యానికి ఒడిగట్టిందని తెలిసింది. చివరకు భర్తతో సహా కటకటాలపాలైంది.పసిపిల్లలతో.. బాల్నర్సయ్య కూతురు, అల్లుడు కలిసి చేసిన దారుణానికి తన భార్య బాలమణి కానరాని తీరాలకు చేరడంతో బాల్నర్సయ్య తల్లడిల్లిపోతున్నాడు. పట్టుమని ఏడేండ్ల వయసు కూడా లేని మహనీత(7), రాంచరణ్(4)ల తల్లిదండ్రులు కటకటాల పాలవడంతో, అమ్మమ్మకు ఏమైందో, తల్లిదండ్రులకు ఏమి జరిగిందో తెలియని అమాయకత్వంలో తాత పంచన ఒంటరిగా మిగిలిపోయారు. ఆస్తి కోసం కన్నతల్లిని హత్య చేసి నా కూతురు పుట్టెడు దుఃఖం మిగిలి్చందని బాల్నర్సయ్య ఆవేదన వ్యక్తం చేశాడు. పాలు తాగే ప్రాయంలో ఉన్న యేడాదిన్నర చిన్న కొడుకును తల్లి వెంటే పంపించారు. -
కేసీఆర్తో కేటీఆర్, హరీష్ కీలక భేటీ
సాక్షి, ఎర్రవల్లి: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో(KCR) పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో(Jubilee Hills By poll) ప్రచారం, ఎన్నికల వ్యూహంపై చర్చిస్తున్నట్టు సమాచారం. తాజా భేటీపై ప్రాధాన్యత సంతరించుకుంది.మాజీ మంత్రులు కేటీఆర్(KTR), హరీష్ రావు(Harish Rao) బుధవారం ఉదయం ఎర్రవెల్లి ఫాంహౌస్కు చేరుకున్నారు. అనంతరం, మాజీ సీఎం కేసీఆర్తో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల కోసం రోడ్ షోలు, ప్రచార వ్యూహంపై నేతలు చర్చిస్తున్నట్టు సమాచారం. అలాగే, తాజా రాజకీయ అంశాలపై కూడా చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు.. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశం కూడా చర్చించనున్నట్లు సమాచారం. ఇక, రేపు(గురువారం) కేసీఆర్.. జూబ్లీహిల్స్ ఇన్చార్జ్లతో సమావేశం కానున్నారు. ఈ క్రమంలో జూబ్లీహిల్స్ ప్రచార వ్యూహాలపై వారికి కేసీఆర్ దిశా నిర్దేశం చేయనున్నారు. -
సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య
భూ సేకరణ వేగవంతం చేయాలి సంగారెడ్డి జోన్: జిల్లాలో ఏర్పాటు కానున్న నిమ్జ్, టీజీఐఐసీ కోసం భూ సేకరణ పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ పి.ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. సంగారెడ్డి, జహీరాబాద్ డివిజన్లలో జరుగుతున్న టీజీఐఐసీ, నిమ్జ్ భూసేకరణ పనుల పురోగతిపై ఆర్డీఓలు, రెవెన్యూ అధికారులు, టీజీఐఐసీ, నిమ్జ్ అధికారులతో కలెక్టరేట్లో మంగళవారం కలెక్టర్ సమీక్షించారు. నిమ్జ్ ప్రాజెక్టు మొదటి దశ ఏర్పాటుకు ఇప్పటివరకు 1,501 ఎకరాల భూసేకరణ పూర్తి చేసినట్లు రెవెన్యూ అధికారులు కలెక్టర్కు వివరించారు. మిగిలిన భూమిని సైతం త్వరలోనే సేకరించి అప్పగించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ...భూసేకరణకు అవసరమైన నిధులు టీజీఐఐసీ తక్షణం చెల్లించేలా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. భూసేకరణకు నిధుల కొరత లేదని తెలిపారు. ఇప్పటివరకు టీజీఐఐసీ, నిమ్జ్ ప్రాజెక్టులకు భూములు ఇచ్చిన రైతులకు ప్యాకేజీల ప్రకారం పరిహారం అందించినట్లు వివరించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మాధురి, నిమ్జ్ ప్రత్యేకాధికారి విశాలాక్షి, సంగారెడ్డి, జహీరాబాద్ ఆర్డీఓలు, టీజీఐఐసీ ప్రతినిధులు, నిమ్జ్ ప్రతినిధులు పాల్గొన్నారు. -
శతశాతం ఉత్తీర్ణత దిశగా..
పదవ తరగతిలో శతశాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా రాష్ట్ర విద్యాశాఖ కార్యాచరణ ప్రారంభించింది. ఇందుకు సంబంధించి ప్రత్యేకంగా తయారు చేసిన అభ్యాసదీపికలు జిల్లాకు చేరుకోగా విద్యార్థులకు వాటిని పంపిణీ చేశారు. ఈ నెల 8నుంచి ప్రత్యేక తరగతులను సైతం ప్రారంభించారు. డిసెంబర్ నాటికి సిలబస్ పూర్తిచేసి జనవరి నుంచి రోజుకు 2 గంటలపాటు అదనంగా ప్రత్యేక తరగతులను నిర్వహించేందుకు అధికారులు కార్యాచరణ సిద్ధం చేశారు. మెదక్జోన్: మెదక్ జిల్లా వ్యాప్తంగా 146 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు ఉండగా మోడల్స్కూల్, సోషల్ వెల్ఫేర్, కేజీవీబీ, బీసీవెల్ఫేర్, ప్రైవేట్ తదితర ఉన్నత పాఠశాలతోపాటు మొత్తం 231 ఉన్నాయి. వాటిలో 10వ తరగతి విద్యార్థులు 11,721 చదువుకుంటున్నారు. ఇందులో బాలురు 5,923 కాగా బాలికలు 5,798 మంది విద్యార్థులున్నారు. శతశాతం ఉత్తీర్ణత సాధించే దిశగా ఈ నెల 8 నుంచి పాఠశాల ముగిసిన అనంతరం ఒక గంటపాటు అదనంగా ప్రత్యేక తరగతులను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. కాగా డిసెంబర్ నాటికి సిలబస్ను పూర్తి చేసి జనవరి నుంచి ఉదయం, సాయంత్రం గంట చొప్పున రోజుకు 2 గంటల పాటు అదనంగా ప్రత్యేక తరగతులు నిర్వహించనున్నారు. ఇప్పటికే ప్రభుత్వం ప్రత్యేకంగా ముద్రించిన అభ్యాసదీపికల్లో ప్రత్యేకంగా తయారు చేయించిన ప్రశ్నలపై ఉపాధ్యాయులు దృష్టి సారించి విద్యార్థులు ప్రతీ ప్రశ్నకు సమాధానం నేర్చుకునే విధంగా బోధిస్తున్నారు. గతేడాది 12వ స్థానంలో! గతేడాది పదిలో ఉత్తమ ఫలితాలు సాధించాలని కలెక్టర్ రాహుల్రాజ్ ప్రత్యేక చొరవ చూపించారు. సబ్జెక్టుల వారీగా ఉపాధ్యాయులతో ప్రత్యేకంగా పది విద్యార్థులకు అదనపు తరగతులు చెప్పించారు. కాగా, 2023లో రాష్ట్రంలో 18వ, స్థానంలో నిలిచిన మెదక్ జిల్లా గతేడాది 2024లో ఉత్తీర్ణతలో 12వ స్థానంలో నిలిచింది. అయితే ఈసారి వందశాతం ఉత్తీర్ణత సాధించి మొదటిస్థానంలో నిలిచేందుకు అధికారులు, ఉపాధ్యాయులు పకడ్బందీ కార్యాచరణను అమలు చేస్తున్నారు. అల్పాహారం ఎప్పట్నుంచో? పది విద్యార్థులకు ఇప్పటికే ప్రత్యేక తరగతులు ప్రారంభం కాగా జనవరి నుంచి రోజుకు 2 గంటల పాటు అదనంగా ప్రత్యేక తరగతులు ప్రారంభం కానున్నాయి. గతేడాది ఫిబ్రవరి 1నుంచి మార్చి 15 వరకు విద్యార్థులకు అల్పాహారం అందించారు. ఈసారి కూడా గతేడాది మాదిరిగానే సాయంత్రం వేళలో విద్యార్థులకు అల్పాహారం అందించవచ్చని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే అభ్యాసదీపికల పంపిణీ ఈ నెల 8నుంచి ప్రారంభమైన ప్రత్యేక తరగతులు డిసెంబర్ నాటికి పూర్తికానున్న సిలబస్ జనవరి నుంచి రోజు అదనపు తరగతులు వందశాతం ఉత్తీర్ణత సాధిస్తాం గతేడాది రాష్ట్రస్థాయిలో పోల్చుకుంటే మెదక్ జిల్లా 12వ స్థానానికి పరిమితమైంది. ఈసారి వందశాతం ఉత్తీర్ణత సాధిస్తాం. అందుకు అనుగుణంగా ఇప్పటికే కార్యాచరణ రూపొందించాం. సబ్జెక్టుల వారీగా ప్రత్యేక తరగతులను కొనసాగిస్తున్నాం. –రాధాకిషన్, డీఈఓ మెదక్ -
పంట ఆరబోసేదెలా?
● టార్పాలిన్లు లేక ఇబ్బందులపాలవుతున్న రైతులు ● అద్దెకు తెచ్చుకుంటున్న రైతులపై అదనపు భారం గతంలో మాదిరిగా ప్రభుత్వం రాయితీపై టార్పాలిన్లు ఇవ్వకపోడంతో రైతులపై అదనపు భారం పడుతోంది. ఈ సీజన్లో ఒక్కొక్కరిపై కనీసం రూ.రెండు వేల నుంచి మూడున్నర వేలవరకు భారం పడుతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. రామాయంపేట(మెదక్): పంట ఉత్పత్తులను ఆరబెట్టుకోవడానికిగాను ప్రస్తుత పరిస్థితుల్లో టార్పాలిన్లు అత్యవసరం. గతంలో ప్రభుత్వం 50% రాయితీపై వాటిని సరఫరా చేసింది. గత నాలుగైదేళ్లుగా ప్రభుత్వం ఈ పథకాన్ని రద్దు చేయడంతో రైతులపై అదనపు భారం పడుతోంది. టార్పాలిన్లు లేకపోవడంతో రోడ్డుపై ఎక్కడపడితే అక్కడ ధాన్యం ఆరబోస్తున్న రైతులు ఇబ్బందులపాలవుతున్నారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో అద్దైపె టార్పాలిన్లు అందించే వారిని ఆశ్రయిస్తున్నారు. గత ప్రభుత్వ హాయాంలో రైతులకు 50% సబ్సిడీపై వ్యవసాయశాఖ ద్వారా టార్పాలిన్లు సరఫరా చేసింది. ఎనిమిది అడుగుల పొడవు, ఆరడుగుల వెడల్పు ఉన్న టార్పాలిన్ల అసలు ధర రూ.2,500 కాగా, రైతులకు రూ.1,250 కే అందజేసింది. రెండు, మూడేళ్లపాటు ఈ పథకం కొనసాగగా, పెద్ద సంఖ్యలో రైతులు వాటిని కొనుగోలు చేశారు. జిల్లావ్యాప్తంగా వేల సంఖ్యలో టార్పాలిన్లను సబ్సిడీపై అందజేయగా, గత నాలుగేళ్ల క్రితం ఈ పథకం రద్దయింది. రైతన్నలకు అదనపు ఖర్చు ఆంధ్రప్రదేశ్నుంచి వచ్చిన వ్యాపారులు కొందరు జిల్లాలోని పెద్ద గ్రామాలు, పట్టణాల పరిధిలో టార్పాలిన్లు అద్దెకు ఇచ్చే దుకాణాలు ప్రారంభించారు. ఈ మేరకు జిల్లా పరిధిలో 80 వరకు తాత్కాలిక దుకాణాలు ఏర్పాటు చేసుకుని అద్దెకు ఇస్తున్నారు. రైతుల ఆధార్ కార్డులు తనఖా పెట్టుకుని టార్పాలిన్లు ఇస్తూ ఒక్కోదానికి రోజూ రూ.25 నుంచి రూ.30 వరకు అద్దె వసూలు చేస్తున్నారు. ధాన్యం ఆరబెట్టుకోవడానికిగాను సాధారణంగా ప్రతీ రైతుకు కనీసం ఆరు నుంచి పది టార్పాలిన్లు అవసరం అవుతుండగా, వాటిపై ప్రతీ రోజు రూ.300 వరకు భారం పడుతోంది. పంట నూర్పిడి చేయడం, ఆరబెట్టడం, సంచుల్లో నింపి కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తరలించడానికి రైతులకు కనీసం 15 నుంచి 20 రోజుల సమయం పడుతుంది. ఈ లెక్కన రైతులపై టార్పాలిన్ల అద్దె కోసం రూ.ఆరు వేల వరకు ఖర్చవుతుంది. ఇకనైనా ప్రభుత్వం స్పందించి సబ్సిడీపై టార్పాలిన్లు అందజేయాలని రైతులు కోరుతున్నారు. -
నూనె గింజల ఉత్పత్తిని పెంచాలి
కలెక్టర్ రాహుల్రాజ్రేగోడ్(మెదక్)/పాపన్నపేట(మెదక్): నూనె గింజల ఉత్పత్తులను పెంచాలని కలెక్టర్ రాహుల్రాజ్ పేర్కొన్నారు. మండల కేంద్రమైన రేగోడ్లోని రైతువేదిక కార్యాలయంలో మంగళవారం నేషనల్ మిషన్ ఆఫ్ ఎడిబుల్ ఆయిల్స్ అమలుపై కలెక్టర్ అధ్యక్షతన జిల్లా వ్యవసాయ అధికారి, రైతుల ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి కలెక్టర్ హాజరయ్యారు. పొద్దుతిరుగుడు 93%, శనగ విత్తనాలు 50% రాయితీతో ఎంపిక చేసిన రైతులకు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... దేశీయంగా నూనె గింజల ఉత్పత్తిని ప్రోత్సహించడం ద్వారా అధిక దిగుబడి సాధించడమే కాకుండా పెట్టుబడి ఖర్చులు తగ్గించుకోవచ్చన్నారు. ప్రతీ రైతు ఈ పథకాలను సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు. నూనెగింజల ఉత్పత్తి ద్వారా స్థానిక సాధికారతను సాధించి దిగుమతులను తగ్గించుకోవచ్చని తెలిపారు. అనంతరం స్థానిక పశు వైద్యశాలను, పాపన్నపేట మండల పరిధిలోని పొడిచన్పల్లి ప్రాథమిక ఆస్పత్రిని ఆకస్మిక తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. ప్రభుత్వాస్పత్రుల్లో పేదలకు మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో పీసీసీ సభ్యుడు కిషన్, ఏడీఏ రాంప్రసాద్, ఏఓ జావీద్ తదితరులు పాల్గొన్నారు. 1,500 హెక్టార్లలో వేరుశనగ ఆయా మండలాల్లో రైతు సంఘాల సహకారంతో సుమారు 1,500 హెక్టార్లలో వేరుశనగ సాగును ప్రోత్సహిస్తున్నట్లు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి దేవ్కుమార్ తెలిపారు. నాణ్యమైన విత్తనాల సరఫరా, ఉత్పాదకత పెంపునకు శిక్షణా కార్యక్రమాలు, విజ్ఞాన కేంద్రాల ద్వారా రైతు పొలంబడులను నిర్వహించనున్నట్లు వివరించారు. అలాగే బిందు సేద్యం ఏర్పాటు కోసం ఉద్యానవన శాఖ సహకారం అవసరమని అన్నారు. పంట అవశేషాలు తగుల బెట్టకండి: వ్యవసాయ శాఖ అధికారి దేవకుమార్ పాపన్నపేట(మెదక్): వరి పంట అవశేషాలు తగుల బెట్టవద్దని జిల్లా వ్యవసాయ అధికారి దేవ కుమార్ స్పష్టం చేశారు. మంగళవారం పాపన్నపేట మండలం ఆరెపల్లిలో వ్యవసాయ క్షేత్రాలను పరిశీలించారు. తగులబెట్టడం వల్ల భూమిలో ఉన్న సేంద్రియ కర్బనం, భూమి భౌతికస్థితి దెబ్బతినడంతోపాటు కాలుష్యం కూడా పెరుగుతుందన్నారు. సర్వేలో అందరూ పాల్గొనాలిమెదక్ కలెక్టరేట్: తెలంగాణ రైజింగ్–2047 సిటిజన్ సర్వేలో అందరూ పాల్గొనాలని కలెక్టర్ రాహుల్ రాజ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. దేశ స్వాతంత్య్రానికి వందేళ్లు పూర్తవుతున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ‘తెలంగాణ రైజింగ్–2047’సిటిజన్ సర్వేను చేపట్టిందని పేర్కొన్నారు. ఈ సర్వేకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని తెలిపారు. గతవారం ప్రారంభించిన ఈ సర్వే ఈ నెల 25తో ముగుస్తుందని, https://www.telangana.gov.in/ telanganarisingను సందర్శించి సలహాలు, సూచనలు అందించాల్సింది కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. -
సంక్షేమ పథకాలు సద్వినియోగం చేసుకోండి
ఎమ్మెల్యే సంజీవరెడ్డి నారాయణఖేడ్: పేద వర్గాల అభ్యున్నతి కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సంజీవరెడ్డి కోరారు. వివిధ గ్రామాలకు చెందిన పలువురికి ఆస్పత్రి ఖర్చుల కోసం ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరైన ఆర్థిక సహాయానికి సంబంధించిన చెక్కులను మంగళవారం ఆయన అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ...పేదల కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. సంక్షేమంతోపాటు అభివృద్ధి పట్ల కాంగ్రెస్ చిత్తశుద్ధితో పనిచేస్తుందని గుర్తు చేశారు. బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు భోజిరెడ్డి, మాజీ సీడీసీ చైర్మన్ నర్సింహ్మారెడ్డి నాయకులు అవుటి శంకర్ పాల్గొన్నారు. ఖేడ్ ఆర్టీసీ డీఎంగా బాధ్యతలు చేపట్టిన సుబ్రహ్మణ్యం ఎమ్మెల్యే సంజీవరెడ్డిని ఆయన స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఖేడ్ ప్రాంతంలో ఆయా రూట్లలో పలు బస్సులు నడపాల్సిన గ్రామాలను గురించి వారు చర్చించారు. ఖేడ్ క్యాంపు కార్యాలయంలో దీపావళిని పురస్కరించుకుని ఎమ్మెల్యే సంజీవరెడ్డి, అనుపమారెడ్డి దంపతులు లక్ష్మిపూజ నిర్వహించారు. నర్సాపూర్: విద్యుత్ సమస్యలను గుర్తించేందుకే తమ శాఖ ప్రజాబాట కార్యక్రమం చేపట్టిందని మెదక్ డీఈ బాషా, ఏడీఈ రమణరెడ్డి చెప్పారు. మంగళవారం పట్టణంలో ప్రజా బాట కార్యక్రమాన్ని డీఈ ప్రారంభించారు. ప్రజాబాటలో పలు సమస్యలను గుర్తించామని, వాటిని రెండు విభాగాలు విభజించామని చెప్పారు. బడ్జెట్తో కూడుకున్న సమస్యలకు నిధులు రాగానే పరిష్కరిస్తామన్నారు. బడ్జేతర సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని రమణరెడ్డి తెలిపారు. పలు వీధుల్లో కండక్టర్ వైరు పాతబడిందని, దానిని మార్చాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో ఏఈ రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు. జహీరాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తిరుపతిరెడ్డి న్యాల్కల్(జహీరాబాద్): రైతులకు సకాలంలో విత్తనాలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని జహీరాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తిరుపతిరెడ్డి శ్రీనివాస్రెడ్డి తెలిపారు. జాతీయ ఆహార భద్రత పథకంలో భాగంగా మండలానికి 350 బస్తాలు శనగ విత్తనాలు, 5 క్వింటాళ్ల కుసుమ విత్తనాలు వచ్చాయని వెల్లడించారు. విత్తనాలు వచ్చిన విషయాన్ని తెలుసుకున్న రైతులు పట్టా పాస్ పుస్తకాలు, ఆధార్ కార్డులతో రైతు వేదిక వద్దకు మంగళవారం పెద్ద ఎత్తున తరలి వచ్చారు. విత్తనాలను న్యాల్కల్లోని రైతు వేదికల్లో రైతులకు తిరుపతిరెడ్డి, శ్రీనివాస్రెడ్డి తదితరులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ శాఖ అధికారి అభినాష్ వర్మ, ఏఈఓలు సాయిలు, హీనా, రైతులు పాల్గొన్నారు. మెదక్ కలెక్టరేట్: జిల్లాకేంద్రంలోని ప్రభుత్వాస్పత్రిలో 12మంది వైద్యుల పోస్టులు ఖాళీగా ఉన్నాయని వీటి భర్తీకి ఈ నెల 28న ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు డీసీహెచ్ డాక్టర్ శివదయాల్ మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ఆస్పత్రిలో సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్టులు 11, అసిస్టెంట్ సర్జన్ జీడీఎంఓస్ (01) పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. ఈనెల 28న ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 03 గంటల వరకు కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లోఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నామని తెలిపారు. పూర్తి సమాచారం కోసం 93945 14999కు సంప్రదించాలన్నారు. -
శాంతిభద్రతల్లో పోలీస్ కీలకం
అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో కలెక్టర్ రాహుల్రాజ్ మెదక్ మున్సిపాలిటీ: శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసుల కీలకమని, వారి ధైర్య సాహసాలకు ప్రజలు అండగా ఉండాలని కలెక్టర్ రాహుల్రాజ్ పేర్కొన్నారు. మంగళవారం మెదక్జిల్లా కేంద్రంలోని జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయ ప్రాంగణంలో పోలీసు అమర వీరుల సంస్మరణ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో కలెక్టర్ రాహుల్ రాజ్ హాజరై పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం అమరుల కుటుంబ సభ్యులతో టిఫిన్ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ...శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసు ధైర్యసాహసాలే ప్రధానమన్నారు. మెదక్ జిల్లాలో కూడా గత 20 ఏళ్లలో చాలామంది పోలీసులు చనిపోవడం బాధాకరమన్నారు. అమరుల త్యాగాలు మరువలేనివని, వారు చూపించిన ఆశయాల కొనసాగింపే వారికి నిజమైన నివాళి అని తెలిపారు. జిల్లా అదనపు ఎస్పీ మహేందర్ మాట్లాడుతూ..అమరవీరుల త్యాగాలు చాలా గొప్పవని, ప్రతీ ఏటా అమరవీరుల త్యాగాలు స్మరించుకుంటూ ధైర్యసాహసాలతో పోలీసు డిపార్ట్మెంట్ మరింత ముందుకెళ్లాలన్నారు. కార్యక్రమంలో మెదక్ డీఎస్పీ ప్రసన్నకుమార్, జిల్లా పోలీసు అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
రూ.వేలు ఖర్చవుతున్నాయి
ప్రతీ ఏటా పంటల సీజన్లో టార్పాలిన్ల అద్దెకోసం రూ.ఆరు వేల వరకు వేలు ఖర్చవుతున్నాయి. గతంలో మాదిరిగా ప్రభుత్వమే సబ్సిడీపై సరఫరా చేయాలి. ఇప్పటికే సమస్యల్లో కూరుకుపోయిన తమకు అదనపు భారంగా మారింది. –లాల్య నాయక్, చౌకత్పల్లి తండా ఉచితంగా సరఫరా చేయాలి ప్రతీ రైతుకు ప్రభుత్వమే ఉచితంగా టార్పాలిన్లు సరఫరా చేయాలి. ఇవి అందుబాటులో లేకపోవడంతో ఇతర ప్రాంతాలనుంచి అద్దెకు తెచ్చుకుంటున్నాం. ఈ భారాన్ని తమపై మోపకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. – కంలియా నాయక్, దంతేపల్లి తండా గతంలోనే రద్దయిందిరైతులకు సబ్సిడీపై టార్పాలిన్ల పంపిణీ పథకం నాలుగేళ్ల క్రితమే రద్దయింది. పథకాన్ని పునరుద్ధరించాలని చాలామంది రైతులు కోరుతున్నారు. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. ప్రభుత్వం నుంచి మంజూరైతే ఇస్తాం. –రాజ్నారాయణ, ఏడీఏ, రామాయంపేట -
‘మద్యం’ దరఖాస్తుల గడువు పెంపు
మెదక్ అర్బన్: లేదు.. లేదంటూనే మద్యం దుకాణాల దరఖాస్తు గడువును పెంచుతూ ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ కమిషనర్ శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ఈనెల 23 వరకు అవకాశం కల్పించగా, లక్కీ డ్రా 27న నిర్వహించనున్నారు. అయితే టార్గెట్ కోసం గడువు పెంచారని వ్యాపారులు ఆరోపిస్తున్నారు. జిల్లాలో 49 వైన్ షాపులుండగా, గతేడాది 1,905 దరఖాస్తులు రాగా, ఈసారి 1,369 మాత్రమే వచ్చాయి. గతంలో రూ. 38.10 కోట్ల ఆదాయం రాగా, ఈసారి రూ. 41.07 కోట్లు సమాకూరాయి. ఆదాయం పెరిగినా దరఖాస్తుల వారీగా చూస్తే తక్కువగా వచ్చాయి. అయితే గతేడాది కంటే దరఖాస్తులు ఎక్కువగా వచ్చేందుకు ఎకై ్సజ్ అధికారుల నానా ప్రయత్నాలు చేశారు. వైన్ బిజినెస్తో సంబంధం ఉన్న వారికి ఫోన్లు చేసి మరీ టెండర్లు వేయించినా, గత టార్గెట్ చేరలేకపోయారు. అయితే దరఖాస్తు రుసుము రూ. 3 లక్షలకు పెంచడం.. వైన్స్ దందాలో ఆశించిన లా భాలు రాకపోవడంతో దరఖాస్తులు తగ్గాయని.. దీంతో ఎకై ్సజ్ అధికారుల టార్గెట్ ఫలించలేదని తెలుస్తోంది. అయితే గడువు పెంపుతో టెండర్దారులకు కొత్త పోటీ ఎదురయ్యే పరిస్థితులు నెలకొన్నాయి. ఈనెల 23 వరకు అవకాశం జిల్లాలో గతేడాది 1,905, ఈసారి 1,369 దరఖాస్తులు టార్గెట్ కోసమే అంటున్న టెండర్దారులు 18న బీసీ బంద్ ఉంటుందని సమాచారం ఉండటంతో టెండర్దారులంతా ముందే బ్యాంకు డీడీలు తీసి ఉంచారు. అయితే చివరి రోజు సాయంత్రం వరకు ఏ షాపుకు ఎన్ని దరఖాస్తులు వచ్చాయి. వాటి ఆఫ్ టెక్ ఎంత? లాభాల అవకాశాన్ని బేరీజు వేసుకొని షాపు దక్కే అవకాశాలను పరిశీలించి, చివరి సమయంలో షాపులను ఎంపిక చేసుకొని దరఖాస్తు చేశారు. శనివారం రాత్రి దాదాపు 12 గంటల వరకు ఈ ప్రక్రియ కొనసాగింది. జిల్లాలో అత్యధికంగా పోతంషెట్పల్లి వైన్స్కు 54 దరఖాస్తులు రాగా, అత్యల్పంగా మెదక్ (గెజిట్ 45), నిజాంపేట (కల్వకుంట) షాపులకు 14 చొప్పు న దరఖాస్తులు అందాయి. అయితే చివరి సమయంలో శనివారం రాత్రి టెండర్ షెడ్యూల్ గడువును పెంచుతూ ఉత్తర్వులు జారీ చేయ డంతో ఇప్పటికే టెండర్ వేసిన వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
కొనుగోళ్ల జాడేది?
రెక్కలు ముక్కలు చేసుకొని మొక్కజొన్న పండించిన రైతులు పంటను అమ్ముకునేందుకు అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో ఇదే అదనుగా దళారులు నిండా ముంచుతున్నారు. దీనికి తోడు తూకంలో మోసాలకు పాల్పడుతున్నారు. వ్యాపారస్తులు సిండికేట్గా మారి మద్దతు ధర అమాంతం తగ్గించడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. – రామాయంపేట(మెదక్) జిల్లావ్యాప్తంగా సుమారుగా 3 వేల ఎకరాల్లో మొక్కజొన్న పంట సాగవుతోంది. గత ఆగస్టులో కురిసిన భారీ వర్షాలకు పంట తీవ్రంగా దెబ్బతింది. పంట దిగుబడి 30 శాతం మేర తగ్గడంతో పాటు చేలల్లో నీరు నిలిచి మొక్కజొన్నలు మొలకలెత్తి రంగు మారాయి. అష్టకష్టాల మీద రైతులు పంటను కోసి జూడు తీశారు. రంగు మారిన కంకులు మొలకలెత్తడంతో మార్కెట్లో తక్కువ ధరకే వ్యాపారస్తులు తీసుకుంటున్నారు. మార్క్ఫెడ్ జాడ ఎక్కడ..? పంట దెబ్బతిని నష్టపోయిన బాధిత రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం పట్టనట్లు వ్యవహరించిందనే ఆరోపణలున్నాయి. జిల్లా పరిధిలో మొక్కజొన్నల కొనుగోలు నిమిత్తం మార్క్ఫెడ్ సంస్థ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో విధిలేని పరిస్థితుల్లో రైతులు దళారులను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదనుగా వారు మోసాలకు పాల్పడుతున్నారు. మొక్కజొన్నలకు ప్రభుత్వ మద్దతు ధర రూ. 2,400 ప్రకటించగా, దళారులు కుమ్మకై రూ. 1,800 కొనుగోలు చేస్తున్నారు. డీసీఎంలో తూకం యంత్రంతో పాటు హమాలీలను తీసుకొని గ్రామాలకు వస్తున్న దళారులు రైతులను మోసం చేస్తున్నారు. క్వింటాల్కు కేజీ నుంచి కేజీన్నర తరుగు తీస్తూ దోపిడీ చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు ఎంతమాత్రం పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. మెదక్జోన్: అతివృష్టితో వేలాది ఎకరా ల పంటలు ధ్వంసం కాగా, చేతికందిన కొద్దిపాటి పంట ఉత్పత్తులను సకాలంలో అమ్ముకోవడానికి రైతులు అష్టకష్టా లు పడుతున్నారు. కొనుగోలు చేయాల్సిన యంత్రాంగం పట్టించుకోవడం లేదు. ఫలితంగా రైతులు ప్రైవేట్ వ్యా పారులను ఆశ్రయిస్తున్నారు. వచ్చిన కాడికి అమ్ముకొని తీవ్ర నష్టాలను చవిచూస్తున్నారు. 37,200 ఎకరాల్లో పత్తి సాగు జిల్లాలో వరి తర్వాత అత్యధికంగా పత్తి సాగవుతోంది. ముఖ్యంగా ఈ పంటను నల్లరేగడి భూముల్లో వర్షాధారంగా సాగుచేస్తారు. టేక్మాల్, అల్లాదుర్గం, రే గోడ్, పెద్దశంకరంపేట మండలాలతో పాటు కొంత మేర చేగుంట మండలంలోనూ రైతులు సాగు చేశారు. ఈ సీజన్లో 37,200 ఎకరాల్లో పత్తి సాగు కాగా, అతివృష్టితో చాలా వరకు పంట దెబ్బతింది. మిగిలిన పంట చేతికందటంతో ప్రస్తుతం పత్తి ఏరుతున్నారు. కాగా జిన్నింగ్ మిల్లుల ద్వారా కొనుగోలు చేయాల్సి ఉండగా, ఇప్పటివరకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు కాలేదు. ప్రభుత్వ మద్దతు ధర క్వింటాల్కు రూ. 8,100 ఉండగా, ప్రైవేట్ వ్యాపారులు రూ. 6 వేల చొప్పున కొనుగోలు చేస్తున్నట్లు తెలిసింది. త్వరగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని రైతు లు డిమాండ్ చేస్తున్నారు. ప్రారంభం కాని తూకంఈ ఖరీఫ్ సీజన్లో వరి 3.5 లక్షల ఎకరాల్లో వరి సాగు కాగా, 4.20 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. ఇందుకోసం 498 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. అందులో 98 కేంద్రాల ద్వారా సన్నరకం ధాన్యం, 400 సెంటర్ల ద్వారా దొడ్డురకం ధాన్యం కొంటామని చెప్పారు. ఇందులో భాగంగా ఇప్పటివరకు 476 సెంటర్లను జిల్లావ్యాప్తంగా ప్రారంభించారు. కానీ తూకం (కాంటాలు) ఎప్పుడు ప్రారంభించలేదు. దీంతో రైతులు పంటలు కోసి ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే 100 సెంటర్లకుపైగా రైతులు ధాన్యం తరలించి ఆరబెట్టారు. గత రెండు, మూడు రోజులుగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. చల్లటి గాలులు వీయటం, మబ్బులు పడుతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. త్వరగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రభుత్వ ప్రకటించిన మద్దతు ధరకు పంటలను కొనుగోలు చేయాలని కోరుతున్నారు. ఇదే విషయమై సివిల్ సప్లై జిల్లా మేనేజర్ జగదీశ్ కుమార్ను వివరణ కోరగా.. వరి ధాన్యాన్ని దీపావళి తర్వాత తూకం వేస్తామని తెలిపారు. రైతులు తొందర పడొద్దు తొందరపడి రైతులు తక్కువ ధరకు మొక్కజొన్నలు విక్రయించొద్దు. ప్రభుత్వ మద్దతు ధర రూ. 2,400 ఉంది. ఈరెండు, మూడు రోజుల్లో రామాయంపేట, తూప్రాన్, నర్సాపూర్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తాం. – క్రాంతి, డీఎం, మార్క్ఫెడ్ భారీ వర్షాలతో నష్టపోయాం భారీ వర్షాలతో మొక్కజొన్న పంట దెబ్బతింది. మక్కులు రంగుమారాయి. పెట్టిన పెట్టుబడులు సైతం నష్టపోయాం. ఆదుకుంటామన్న అధికారులు పత్తాలేరు. విధిలేని పరిస్థితుల్లో దళారులకు తక్కువ ధరకు విక్రయించాం. – స్వామి, రైతు, శివాయపల్లి పత్తా లేని పత్తి, ధాన్యం కొనుగోలు కేంద్రాలు భయపెడుతున్న వాతావరణ మార్పులు పట్టించుకోని అధికారులు -
మా సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లండి
మెదక్జోన్: ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు మైనంపల్లి హన్మంతరావును పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు మేడి సతీశ్రావు కోరారు. ఆదివారం పీఆర్టీయూ ఆధ్వర్యంలో ఆయనను కలిసి పలు డిమాండ్లపై వినతిపత్రం అందించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాను చార్మినార్ జోన్లో విలీనం చేయాలని, ఉపాధ్యాయుల పెండింగ్ బిల్లులను త్వరగా మంజూరు చేయటంతో పాటు జిల్లా కేంద్రంలో పీఆర్టీయూ భవన నిర్మాణం కోసం నిధులు మంజూరు చేయించాలని కోరారు. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని ఆయన హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సంఘం బాధ్యులు సామ్యానాయక్, సబ్బని శ్రీనివాస్తో పాటు జిల్లాలోని పలు మండలాలకు చెందిన ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మెదక్ కలెక్టరేట్: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు పీఆర్సీని డిసెంబర్లోగా ప్రకటించాలని పీఆర్టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు మల్లారెడ్డి ప్రభుత్వాన్ని ఆదివారం ఒక ప్రకటనలో కోరారు. గత ప్రభుత్వం విస్మరించిన ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ హామీ ఇచ్చిందని గుర్తుచేశారు. సీపీఎస్ రద్దు, మంచి ఫిట్మెంట్, పీఆర్సీ పెండింగ్లో ఉన్న డీఏలు, పెండింగ్ బిల్లులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. రెండేళ్లు అయినా ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం సరికాదన్నారు. మనోహరాబాద్(తూప్రాన్): మండలంలోని కాళ్లకల్కు చెందిన సన్షైన్ షోటోకాన్ కరాటే క్లబ్ సభ్యులు హీరో సుమన్ను ఆదివారం కలిశారు. ఈసందర్భంగా కరాటే అసోసియేషన్, పోటీలకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. తమ క్లబ్ ఆధ్వర్యంలో జరిగే నేషనల్ లెవల్ టోర్నమెంట్ గురించి సలహాలు తీసుకున్నట్లు క్లబ్ ఫౌండర్, అధ్యక్షుడు మల్లేశ్ తెలిపారు. వీరి వెంట మాస్టర్లు మహేశ్, శ్రీకాంత్, అభిలాశ్, తరుణ్, బాబి, అంజలి, తనుజ, స్పందన, నందిని తదితరులు ఉన్నారు. పెద్దశంకరంపేట(మెదక్): ఓపెన్ స్కూల్లో ఇంటర్, పదో తరగతిలో చేరేందుకు ఈనెల 23వ తేదీ ఆఖరని ఓపెన్ స్కూల్ కో ఆర్డినేటర్ విఠల్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఓపెన్ స్కూల్లో చేరే అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. నర్సాపూర్: ప్రభుత్వం పీఆర్సీని వెంటనే ప్రకటించాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎల్లం, లక్ష్మణ్ డిమాండ్ చేశారు. ఇటీవల తపస్ నర్సాపూర్ మండల శాఖ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శిగా ఎంపికై న శివకుమార్, రవికుమార్ను ఆదివారం సన్మానించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలని, పెండింగ్ డీఏలను ఇవ్వాలని కోరారు. 317 జీఓ ద్వారా అన్యాయం జరిగిన ఉపాధ్యాయులకు న్యాయం చేయాలన్నారు. కార్యక్రమంలో యూనియన్ ప్రతినిధులు కొండల్, రాజు తదితరులు పాల్గొన్నారు. రాయికోడ్(అందోల్): సీసీఐ కేంద్రాల్లో పత్తిని అమ్మాలంటే రైతులు తప్పనిసరిగా కపాస్ కిసాన్ యాప్లో స్లాట్బుక్ చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి సారిక స్పష్టం చేశారు. -
చెక్పోస్టులో ఏసీబీ సోదాలు
● లెక్కకు రాని రూ. 42,300నగదు స్వాధీనం ● రికార్డులను సీజ్ చేసి తీసుకెళ్లిన అధికారులు జహీరాబాద్: రాష్ట్ర సరిహద్దులోని మొగుడంపల్లి మండలం మాడ్గి శివారులోని రవాణశాఖ అంతర్రాష్ట్ర చెక్పోస్టు వద్ద ఆదివారం తెల్లవారు జామున ఏసీబీ అధికారులు ఆకస్మిక సోదాలు నిర్వహించారు. ఉమ్మడి మెదక్ జిల్లా ఏసీబీ, డీఎస్పీ సుదర్శన్ ఆధ్వర్యంలో సిబ్బందితో తనిఖీల్లో పాల్గొన్నారు. శనివారం అర్ధరాత్రి దాటాక రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సరిహద్దు రవాణ శాఖ చెక్పోస్టుల్లో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఏక కాలంలో సోదాలు నిర్వహించారు. అందులో భాగంగా జహీరాబాద్ సమీపంలోని 65వ జాతీయ రహదారిపై గల చెక్పోస్టులో ఆదివారం ఉదయం వరకు సోదాలు చేపట్టారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చెక్పోస్టులో అక్రమాలు జరుగుతున్నట్లు ఫిర్యా దులు రావడంతో ఆకస్మిక తనిఖీలు చేపట్టామన్నారు. ఈ తనిఖీల్లో రూ. 42,300 నగదు దొరికిందని వివరించారు. ఇందుకు సంబంధించి ఏ ఎంవీఐ కిరణ్కుమార్ సరైన సమాధానం చెప్పకపోవడంతో నగదు, రికార్డులను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. ఏఎంవీఐ ప్రైవేటు వ్యక్తిని డ్రైవర్గా పెట్టుకొని డబ్బులు వసూలు చేస్తున్నట్లు గుర్తించామని తెలిపారు. -
అప్రమత్తంగా ఉండాలి
రామాయంపేట(మెదక్): అగ్ని ప్రమాదాల పట్ల ఫైర్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ రాహుల్రాజ్ హెచ్చరించారు. ఆదివారం ఆయన స్థానిక ఫైర్స్టేషన్ను తనిఖీ చేసి మా ట్లాడారు. జిల్లాలో ఫైర్స్టేషన్ల సేవలు అమోఘమని, ఎక్కడ అగ్నిప్రమా దం సంభవించినా క్షణాల్లో అక్కడికి వెళ్లి మంటలు ఆర్పుతున్నారని పేర్కొన్నారు. ఈసందర్భంగా ఫైర్కు సంబంధించిన పరికరాలను పరిశీలించి పనితీరును అడిగి తెలుసుకున్నారు. ఆపద సమయాల్లో ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులకు వెంటనే స్పందించాలని ఆదేశించారు. సిబ్బంది హాజరు పట్టికను పరిశీలించి ఏమైనా సమస్యలున్నాయా..? అని ఆరా తీశారు. ఈసందర్భంగా జిల్లా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా హవేళిఘణాపూర్(మెదక్): విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని కలెక్టర్ రాహుల్రాజ్ అన్నారు. ఆదివారం మెదక్ మండలం పాతూర్ సబ్స్టేషన్లోని రికార్డులను పరిశీలించి సరఫరా తీరును అడిగి తెలుసుకున్నారు. విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకు ండా నిరంతరంగా విద్యుత్ సరఫరా కొనసాగించాలన్నారు. సిబ్బంది సమన్వయంతో పని చేయా లని సూచించారు. కలెక్టర్ రాహుల్రాజ్ -
దళారులను నమ్మి మోసపోవద్దు
టేక్మాల్(మెదక్): రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని కలెక్టర్ రాహుల్రాజ్ సూచించారు. శనివారం మండలంలోని బర్దిపూర్లో పత్తి పంటను పరిశీలించారు. వర్షాలకు పంటలు దెబ్బతిని దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపుతుందని రైతులు ఆయనకు వివరించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో మొత్తం 25,939 మంది రైతులు 34,903 ఎకరాల్లో పత్తి సాగు చేస్తున్నారని తెలిపారు. జిల్లాలోని పాపన్నపేట సిద్ధార్థ జిన్నింగ్ మిల్లో పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. కొనుగోలు కేంద్రాలను మానిటరింగ్ చేసేందుకు లోకల్ కమిటీలను నియమించామన్నారు. ఎప్పటికప్పుడు రైతులు మద్దతు ధర పొందేలా అధికారులు కృషి చేయాలన్నారు. లీగల్ మెట్రాలజీ అధికారులు తేమ కొలిచే యంత్రాలను పరిశీలించాలన్నారు. సీసీఐ అధికారుల పర్యవేక్షణ ఉండాలని, అగ్ని ప్రమాదాలు జరగకుండా జిన్నింగ్ మిల్లు యాజమాన్యం తగు జాగ్రత్తలు తీసుకోవాలని వివరించారు. ఆయన వెంట మండల వ్యవసాయ అధికారి రాంప్రసాద్, రైతులు ఉన్నారు.కలెక్టర్ రాహుల్రాజ్ -
పత్రికా స్వేచ్ఛను హరించడమే
మెదక్ మున్సిపాలిటీ: సాక్షి పత్రిక ఎడిటర్ ధనంజయరెడ్డిపై అక్రమ కేసులు నమోదు చేయడం సరికాదని, ఇది పత్రికా స్వేచ్ఛను హరించడమేనని ఆయా సంఘాల నాయకులు, పార్టీల ప్రతినిధులు అన్నా రు. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జర్నలిస్టులపై పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్నాయన్నారు. ఇప్పటికై నా అక్రమ కేసులు, వేధింపులు ఆపాలని డిమాండ్ చేశారు. సాక్షి ఎడిటర్ ధనంజయరెడ్డిపై అక్రమ కేసులను ఉపసంహరించుకోవాలి పలు పార్టీలు, ప్రజాసంఘాల నేతల డిమాండ్ -
సమస్యల పరిష్కారానికి కృషి
చేగుంట(తూప్రాన్): మండల కేంద్రంలోని బాలికల ఎస్టీ గురుకుల పాఠశాలను శనివారం ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య సందర్శించారు. గణితం బోధించే లెక్చరర్ లేకపోవడంతో ఇటీవల ఇంటర్ విద్యార్థినులు ధర్నా చేసిన విషయం గురించి అడిగి తెలుసుకున్నారు. సీఎం రేవంత్రెడ్డితో మాట్లాడి సమస్యను పరిష్కరించేలా కృషి చేస్తానని విద్యార్థులకు హామీ ఇచ్చారు. అనంతరం గురుకులంలోని వంటగది, తరగతి గదులను పరిశీలించారు. గురుకులం నిర్వహణ గురించి ప్రిన్సిపాల్ సుమతిని అడిగి తెలుసుకున్నారు. దారిలో వీధి దీపాలు లేకపోవడంతో గురుకుల సిబ్బంది ఇబ్బంది పడుతున్నారని, అలాగే మెరుగైన రోడ్డు లేదని ప్రిన్సిపాల్ ఆయన వివరించారు. అనంతరం విద్యార్థినులతో కలిసి భోజనం చేశారు. కార్యక్రమంలో ఎఎస్డబ్ల్యూఓ లింగేశ్వర్, తహసీల్దార్ శివప్రసాద్, ఎస్ఐ చైతన్యకుమార్రెడ్డి, హాస్టల్ వార్డెన్ రమేశ్, సిబ్బంది ఉన్నారు.ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య -
కబడ్డీలో మెదక్ జట్టు విజయం
ముగిసిన ఎస్జీఎఫ్ క్రీడలుపటాన్చెరు: మూడు రోజులుగా పటాన్చెరులోని మైత్రి మైదానం వేదికగా నిర్వహించిన 69వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్జీఎఫ్) రాష్ట్రస్థాయి క్రీడలు శనివారం ముగిశాయి. సాయంత్రం అండర్ 14 బాలుర కబడ్డీ ఫైనల్ మ్యాచ్లో నల్లగొండ జిల్లా జట్టుపై మెదక్ జట్టు ఘన విజయం సాధించింది. అండర్ 14 బాలికల కబడ్డీ ఫైనల్ మ్యాచ్లో మహబూబ్నగర్ జిల్లా జట్టుపై ఖమ్మం జట్టు ఘన విజయం సాధించింది. అండర్ 17 బాలుర వాలీబాల్ ఫైనల్ మ్యాచ్లో వరంగల్ జిల్లా జట్టుపై ఖమ్మం జిల్లా జట్టు ఘన విజయం సాధించింది. క్రీడలకు, క్రీడాకారులకు కేంద్రంగా పటాన్చెరు నియోజకవర్గాన్ని తీర్చిదిద్దుతున్నామని.. రాబోయే రోజుల్లో రాష్ట్ర, జాతీయస్థాయి పోటీలకు ఆతిథ్యం ఇవ్వబోతున్నామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. ఈసందర్భంగా వాలీబాల్ జాతీయ స్థాయి క్రీడాకారుడు కృష్ణం రాజుతోపాటు రిటైర్డ్ వ్యాయామ ఉపాధ్యాయులు, సీనియర్ కబడ్డీ అసోసియేషన్ ప్రతినిధులను ఎమ్మెల్యే ఘనంగా సన్మానించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సమష్టికృషితో రాష్ట్రస్థాయి క్రీడలను విజయవంతం చేశామన్నారు. జాతీయ పోటీలకు ఎంపికై న క్రీడాకారులకు ఆర్థిక సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. కబడ్డీ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని వీరేశ్ మాట్లాడుతూ.. క్రీడల పట్ల ఆసక్తి కలిగిన ఎమ్మెల్యే లభించడం పటాన్చెరు నియోజకవర్గ ప్రజల అదృష్టం అన్నారు. రాబోయే రోజుల్లో జాతీయస్థాయి కబడ్డీ జట్టులో తెలంగాణ క్రీడాకారుల ప్రాతినిధ్యం పెరగాలని ఆకాంక్షించారు. కబడ్డీ అసోసియేషన్ జాతీయ ప్రధాన కార్యదర్శి జగదీశ్ యాదవ్ మాట్లాడుతూ.. కబడ్డీ క్రీడలో జాతీయస్థాయిలో మెదక్ జిల్లా క్రీడాకారులు ప్రాతినిధ్యం వహించడం ప్రశంసనీయమన్నారు. రాబోయే రోజుల్లో నియోజకవర్గం నుండి కబడ్డీ క్రీడాకారులు సైతం జాతీయ స్థాయి జట్టుకు ఎంపిక కావాలని అభిలాషించారు. -
ప్రజల గొంతు నొక్కడమే
వార్తలు రాసే మీడియా సంస్థలపై ఏపీ ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టడం భావ్యం కాదు. ప్రభు త్వానికి వ్యతిరేకంగా వార్తలు రాశారన్న కారణంతో ‘సాక్షి’ ఎడిటర్, రిపోర్టర్లపై కేసులు పెట్టి వేధించడం సరికాదు. వార్తలు రాసే విషయంలో పత్రికలకు స్వేచ్ఛ ఉంటుంది. ఈ విషయంలో ఏపీ ప్రభుత్వం మొండిగా వ్యవహరించడం సరికాదు. – మల్లేశం, సీపీఎం జిల్లా కార్యదర్శి ‘సాక్షి’పై దాడులు ఆపాలి సాక్షి మీడియాపై పోలీసుల దాడులు తక్ష ణం ఆపాలి. ప్రజాస్వా మ్యానికి నాల్గవ స్తంభంగా ఉన్న మీడియాకు సంకెళ్లు వేయ డం మంచిది కాదు. సాక్షి కార్యాలయాల్లో సోదాలు చేయటం, ఎడిటర్, రిపోర్టర్లకు నోటీసులు ఇచ్చి భయభ్రాంతులకు గురి చేయడం పత్రిక స్వేచ్ఛను హరించడమే. – సురేందర్రెడ్డి, టీయూడబ్ల్యూజే జిల్లా కన్వీనర్ -
కూలీలకు ఉపాధి కల్పించాలి
రేగోడ్(మెదక్): జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కూలీలందరికీ పని కల్పించాలని అదనపు డీఆర్డీఓ రంగాచారి తెలిపారు. మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయం వద్ద శనివారం ప్రజావేదిక నిర్వహించారు. మండలంలోని 18 గ్రామ పంచాయతీల్లో ఉపాధి హామీ పథకం ద్వారా రూ. 3.18 కోట్ల నిధులతో ఆయా పనులు చేపట్టారు. దీనిపై సోషల్ ఆడిట్ అనంతరం ప్రజా వేదిక ఏర్పాటు చేశారు. ఒక్కో గ్రామ పంచాయతీల్లో చేపట్టిన పనులపై సభలో ఆడిట్ ఆధికారులు చదివి వినిపించారు. ఆయా పంచాయతీల్లో రూ. 70 వేలు రికవరీ చేసి రూ. 3 వేలు జరిమానా విధించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవన్నారు. చిన్న చిన్న తప్పులు జరగకుండా, రికార్డులను సైతం సక్రమంగా ఉంచేందుకు జాగ్రత్త వహించాలన్నారు. ఇందిరమ్మ గృహాలకు ఆ ఇంటి యజమానులు పని చేస్తే రూ. 28,280 చెల్లిస్తామన్నారు. అదే విధంగా మరుగుదొడ్డి నిర్మాణానికి రూ. 12 వేలు ఇస్తామని తెలిపారు. కార్యక్రమంలో హెచ్ఆర్ మేనేజర్ రాజేందర్రెడ్డి, సోషల్ ఆడిట్ పీఈ సంపత్ కుమార్ ఆచార్య, ఎస్ఆర్పీ నాగరాజ్, ఏపీఓ జగన్మోహన్సింగ్, టీఏలు, ఫీల్డ్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు.అదనపు డీఆర్డీఓ రంగాచారి -
మీడియా పాత్ర కీలకం
ప్రజాస్వామ్య దేశంలో వార్తా పత్రి కల పాత్ర కీలకం. అలాంటి మీడియాపై దాడులు చేయ టం సరికాదు. వాస్తవాలను ప్రచురితం చేసే ‘సాక్షి’ దినపత్రికపై ఏపీ ప్రభుత్వం అవలంభిస్తున్న చర్యలు గర్హనీయం. వార్తలు రాసిన విలేకరులు, ఎడిటర్ను నోటీసుల పేరుతో వేధింపులకు గురి చేయటం మంచిది కాదు. – జనార్దన్రెడ్డి, లయన్స్ క్లబ్ మాజీ గవర్నర్, సీనియర్ న్యాయవాదిరాజ్యాంగాన్ని ఉల్లంఘించడమే కల్తీ మద్యం తయారు చేసి ప్రజల ప్రాణాలు తీసిన వారిపై చర్యలు తీసుకోవాల్సింది పోయి, వాస్తవాలను వెలుగులోకి తెచ్చిన సాక్షిపై దాడులు చేయటం సరికాదు. ఏపీలోని కూటమి ప్రభుత్వానిది హేయమైన చర్య. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాం. నిజాలు నిర్భయంగా రాసే పత్రిక గొంతు నొక్కితే అది రాజ్యాంగాన్ని ఉల్లంఘించటమే. మీడియా జోలికి వస్తే సహించేది లేదు. – నోముల శ్రీకాంత్, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు -
‘జాగ్రత్తలు తప్పనిసరి’
మెదక్ కలెక్టరేట్: జిల్లా ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకుంటూ సురక్షితంగా దీపావళి జరుపుకోవాలని కలెక్టర్ రాహుల్రాజ్ శనివారం ఒక ప్రకటనలో సూచించారు. అగ్ని ప్రమాదాలు జరుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. బాణాసంచా విక్రయించే వారు అనుమతులు తీసుకోవాలన్నారు. వినియోగదారులకు సరళమైన ధరలకే అమ్మాలన్నారు. పటాకులు కాల్చేటప్పుడు పిల్లలు, పెద్దల పర్యవేక్షణలో మాత్రమే పాల్గొనాలన్నారు. ప్రభుత్వ అనుమతి పొందిన నాణ్యమైన పటాకులనే వినియోగించాలన్నారు. పర్యావరణహిత పటాకులను ఉపయోగించడం ద్వారా వాయు కాలుష్యాన్ని తగ్గించవచ్చని చెప్పారు. అగ్ని ప్రమాదాలు, గాయాలు సంభవించినప్పుడు వెంటనే సమీప వైద్య కేంద్రాన్ని సంప్రదించడంతో పాటు వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 101 లేదా 8712699263కు తెలియజేయాలనివివరించారు.మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి నర్సాపూర్: మహిళలు అన్నిరంగాల్లో రాణించాలని ఇన్చార్జి డీడబ్ల్యూఓ హేమభార్గవి అన్నారు. మండల లీగల్ సర్వీస్ కమిటీ ఆధ్వర్యంలో శనివారం మున్సిపాలిటీలోని హన్మంతాపూర్లో అంతర్జాతీయ పేదరిక నిర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకొని స్వయం సహాయక సంఘాల మహిళలతో ఏర్పాటు చేసిన న్యాయ విజ్ఞాన సదస్సులో ఆమె పాల్గొని మాట్లాడారు. మహిళలు ఆర్థిక, సామాజిక పరిస్థితులను మెరుగు పర్చుకోవడానికి పొదుపు చేయడం అలవాటు చేసుకోవాలని హితవు పలికారు. చదువుకొని విజ్ఞాన వంతులు కావాలన్నారు. సమావేశంలో లీగల్ సర్వీస్ కమిటీ సభ్యురాలు స్వరూపరాణి, జిల్లా ఉమెన్ అండ్ చైల్డ్ కోఆర్డినేటర్ సంతోష, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. సఖీ, భరోసా కేంద్రాలతో రక్షణ మెదక్జోన్: ప్రభుత్వం ఏర్పాటు చేసిన సఖీ, భరోసా కేంద్రాలు ఎంతోమంది బాధిత మహిళలకు రక్షణ వేదికలని సీనియర్ సివిల్ జడ్జి రుబీనా ఫాతిమా అన్నారు. శనివారం ఆమె పట్టణంలోని సఖీ, భరోసా కేంద్రాలను సందర్శించి మాట్లాడారు. ఈ వేదికల ద్వారా ఎంతో మంది బాధిత మహిళలకు వైద్య సహాయం, కౌన్సెలింగ్, న్యాయ సహాయం, తాత్కాలిక ఆశ్రయం వంటి సేవలు అందుతాయని తెలిపారు. బాలసదన్లో చిన్నారులతో మాట్లాడి, వారి సమస్యల ను అడిగి తెలుసుకున్నారు. ఆమె వెంట సిబ్బంది సుచిత, శ్వేత, అడ్వకేట్ బాల నరసింహులు తదితరులు ఉన్నారు. నూతన నియామకం మెదక్జోన్: Æ>çÙ‰ {糿¶æ$™èlÓ ÇOsñæÆŠḥz E§øÅ-VýS$ÌS çÜ…çœ$… hÌêÏ A«§ýlÅ-„ýS$-yìlV> Ô>Å…çÜ$…-§ýl-ÆŠ‡¯]l$ HMýS-{X-Ð]l…V> G¯]l$²-MýS$-¯é²Æý‡$. Ôèæ°-ÐéÆý‡… ç³rt׿ …ÌZ° ÇOsñæÆŠ‡z E§øÅ-VýS$ÌS ¿ýæÐ]l-¯]l…ÌZ HÆ>µr$ ^ólíܯ]l D çÜÐ]l*Ðól-Ô>°MìS çÜ…çœ$… Æ>çÙ‰ A«§ýlÅ-„ýS$yýl$ _ÍÐólÇ ^èl…{§ýl-Ôóæ-QÆŠ‡ Ð]l¬QÅ A†¤V> àf-Æý‡Ä¶æ*ÅÆý‡$. DçÜ…-§ýlÆý‡Â…V> BĶæ$¯]l Ð]l* sêÏ-yýl$-™èl*.. ÇOsñæÆŠ‡z E§øÅ-VýS$ÌS çÜÐ]l$-çÜÅÌS ç³Ç-ÚëPÆý‡… MøçÜ… °Æý‡…-™èl-Æý‡…V> MýS–íÙ ^ólÝë¢-Ð]l$-¯é²Æý‡$. M>Æý‡Å-{MýS-Ð]l$…ÌZ Ð]l*i A«§ýlÅ-„ýS$yýl$ fVýS©‹Ù^èl…{§ýl, {糫§é¯]l M>Æý‡Å-§ýlÇØ çÜ™èlÅ-¯é-Æ>-Ķæ$׿, MøÔ>-«¨M>Ç VøÍ MýS$Ð]l*ÆŠæ, AÝùíÜÄôæ$sŒæ {ò³íÜyðl…sŒæ Æ>Ð]l¬Ë$, E´ë-«§ýlÅ„ýS$Ë$ ´ù^èlĶæ$Å, Ððl*çßæ-¯ŒSÆ>gŒæ, çÜ$ÖÌS ™èl¨-™èl-Æý‡$Ë$ ´ëÌŸY-¯é²Æý‡$. బీజేపీది రెండు నాల్కల వైఖరి: సీపీఎం మెదక్ కలెక్టరేట్: కేంద్రంలోని బీజేపీ తీరు రెండు నాల్కల వైఖరిగా ఉందని సీపీఎం జిల్లా కార్యదర్శి నర్సమ్మ మండిపడ్డారు. శనివారం జిల్లాలో నిర్వహించిన బంద్కు మద్దతుగా మెదక్లో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఇప్పటికై నా కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో బీసీ బిల్లుకు ఆమోదం తెలపాలని డిమాండ్ చేశారు. -
49 షాపులు.. 1,350 దరఖాస్తులు
మెదక్జోన్: జిల్లాలో మద్యం షాపుల కేటాయింపు కోసం ఎకై ్సజ్శాఖ నిర్వహించిన దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ముగిసింది. ఈసారి దరఖాస్తుల సంఖ్య తగ్గింది. జిల్లాలోని 49 మద్యం షాపులకు శనివారం రాత్రి వరకు అప్లికేషన్లు తీసుకున్నారు. రాత్రి 10 గంటల వరకు 1,350 దరఖాస్తులు వచ్చినట్లు ఈఎస్ శ్రీనివాస్రెడ్డి తెలిపారు. గతంతో పోల్చితే ఈసారి దరఖాస్తుల సంఖ్య తగ్గింది. 2023లో 1,905 దరఖాస్తులు, రూ. 38.10 కోట్ల ఆదాయం రాగా, ఈసారి పెరిగిన దరఖాస్తు ఫీజుతో రూ. 40.5 కోట్ల ఆదాయం వచ్చింది. రూ. 2.5 కోట్లు అదనంగా ఎకై ్సజ్శాఖకు సమకూరింది. ఆఖరు రోజు శనివారం రాత్రి 10 గంటల వరకు 517 దరఖాస్తులు రావటం గమనార్హం. ఈ నెల 23న కలెక్టరేట్లో లక్కీ డ్రా తీసి షాపులు కేటాయించనున్నారు. రూ.3 లక్షలకు పెంచడమే కారణమా! ప్రభుత్వం ఈసారి మద్యం షాపుల దరఖాస్తు ఫీజును భారీగా పెంచింది. 2023లో రూ. రెండు లక్షలు ఉన్న ఈ ఫీజును ఈసారి ఏకంగా రూ.3 లక్షలకు పెంచింది. దీంతో మద్యం వ్యాపారులు ఆచితూచి దరఖాస్తులు చేసుకున్నారు. గతంలో ఒక్కో షాపునకు ఆరు ఏడు దరఖాస్తులు చేసుకున్న సిండికేట్ వ్యాపారులు ఈసారి నాలుగైదుతో సరిపెడుతున్నారు. గతంతో పోలిస్తే 555 తక్కువ పెరిగిన ధరతో రూ. 2 కోట్లు అదనం మద్యం షాపులకు ముగిసిన అప్లికేషన్ల ప్రక్రియ -
లెక్క ఎంచక్కా..
భూ కొలతలు పక్కా..నెల రోజుల నిరీక్షణకు తెర..జిల్లాకు లైసెన్స్డ్ సర్వేయర్లు వచ్చేస్తున్నారు ● మొదటి విడతలో 106 మందికి శిక్షణ.. 77 మంది అర్హత ● రెండో విడతలో 78 మందికి ట్రైనింగ్ ● నేడు సీఎం చేతుల మీదుగా లైసెన్స్లుమెదక్ అర్బన్: ఆధునిక పరికరాలతో సర్వే చేసి.. భూ కొలతలను పక్కాగా నిర్ధారించడానికి లైసెన్స్డ్ సర్వేయర్లు రంగంలోకి దిగుతున్నారు. జిల్లాలో శిక్షణ పొంది అర్హత సాధించిన 77 మంది సర్వేయర్లకు ఆదివారం హైదరాబాద్లో సీఎం రేవంత్రెడ్డి లైసెన్స్లు అందజేయనున్నారు. అనంతరం జిల్లా అధికారులు మండలానికి నలుగురు నుంచి ఆరుగురు సర్వేయర్లను కేటాయించనున్నారు. తీరనున్న ఇబ్బందులు ప్రజలకు సులభంగా భూ సేవలు అందించేందుకు ప్రభుత్వం లైసెన్స్డ్ సర్వేయర్లు అందుబాటులోకి తీసుకొస్తుంది. జిల్లాలో 21 మండలాలు ఉండగా, కేవలం 10 మంది రెగ్యులర్ సర్వేయర్లు ఉన్నారు. దీంతో అర్హత గల వ్యక్తుల నుంచి దరఖాస్తులు కోరగా, మొదటి విడతలో 106 మంది ఎంపికయ్యారు. వీరికి 50 రోజుల శిక్షణ అనంతరం పరీక్ష పెట్టారు. అందులో అర్హత సాధించిన వారికి సీనియర్ సర్వేయర్ వద్ద 40 రోజుల క్షేత్రస్థాయి శిక్షణ ఇస్తారు. అనంతరం నిర్వహించిన పరీక్షలో ఉత్తీర్ణత పొందితే, వారికి సర్వేయర్ లెసెన్స్ ఇస్తారు. ఈ క్రమంలో జిల్లాలో మొదటి విడతలో 106 మందిని ఎంపిక చేసి మే 26 నుంచి శిక్షణ ఇచ్చారు. అందులో నుంచి 77 మంది చివరి పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. వీరికి సీఎం చేతుల మీదుగా లైసెన్స్లు ఇవ్వనున్నారు. అనంతరం మండలానికి నలుగురు నుంచి ఆరుగురిని లైసెన్స్డ్ సర్వేయర్లనుగా నియమించనున్నారు. కాగా ఆగస్టు 18 నుంచి రెండో విడత శిక్షణ ప్రారంభం కాగా, జిల్లాలో 103 మంది దరఖాస్తు చేసుకున్నారు. అందులో 78 మంది మాత్రమే శిక్షణకు హాజరవుతున్నట్లు అధికారులు తెలిపారు. కాగా ఎంపికై న సర్వేయర్లకు ప్రభుత్వం అధునాతన డీజీపీఎస్ మిషన్లు ఇవ్వనున్నారు. వీటితో ఖచ్చితమైన కొలతలు వస్తాయని అధికారులు చెబుతున్నారు. అయితే తమకు జీతాల విషయంలో స్పష్టత లేదని, ప్రభుత్వం తరఫున నెల నెలా జీతాలు ఇచ్చి నిరుద్యోగ సమస్యను తీర్చాలని అభ్యర్థులు కోరుతున్నారు.లైసెన్స్డ్ సర్వేయర్లుగా ఉత్తీర్ణులైన వారు నెల రోజులుగా మండలాల కేటాయింపు కోసం ఎదురుచూస్తున్నారు. శిక్షణ ఇచ్చారు.. పరీక్ష నిర్వహించి ఫలితాలు ప్రకటించినప్పటికీ ఎలాంటి నిర్ణయం తీసుకపోవడంతో కొంత నిరాశ చెందారు. నెల రోజుల నిరీక్షణకు నేటితో తెరపడనుంది. ప్రస్తుతం శిక్షణ తీసుకుంటున్న రెండో బ్యాచ్కు వివిధ పరీక్షలను నిర్వహించిన తర్వాత లైసెన్స్లను జారీ చేయనున్నారు. -
పల్లెప్రగతి ఎలా..?
కొత్త ఎంపీడీఓల ఆరా ఉపాధి, గ్రామాభివృద్ధి పనుల పరిశీలన చేగుంట(తూప్రాన్): ఇటీవల గ్రూప్ పరీక్షల్లో ఉద్యోగం పొందిన ఎంపీడీఓలు క్షేత్ర స్థాయి పరిశీలనలో భాగంగా శుక్రవారం చేగుంట మండలంలోని పలు గ్రామాలను సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా, మండల పరిషత్ల ఆధ్వర్యంలో గ్రామాల్లో నిర్వహించే ఉపాధిహామీ పనులతో పాటు గ్రామాభివృద్ధి విషయాల గురించి తెలుసుకున్నారు. ఉపాధి హామీ ద్వారా ఇంకుడు గుంతల నిర్మాణం, సెగ్రిగేషన్ షెడ్ల నిర్మాణం, వ్యవసాయ సంబంధిత పనులు, రోడ్ల నిర్మాణం, నర్సరీల నిర్వహణ తదితర అంశాలను పరిశీలించారు. వాటి వివరాలను నమోదు చేసుకున్నారు. సీనియర్ ఫ్యాకల్టీ అనిల్కుమార్ వివిధ పనులపై వారికి అవగాహన కల్పించారు. గ్రామ పంచాయతీల ద్వారా నిర్వహించే గ్రామాభివృద్ధి కార్యక్రమాలను గురించి చిన్నశివునూర్ గ్రామంలో పరిశీలన జరిపారు. అనంతరం కొత్తగా విధుల్లో చేరుతున్న ఎంపీడీఓలకు జెడ్పీ సీఈఓ ఎల్లయ్య, డీఆర్డీఓ పీడీ శ్రీనివాస్రావులు గ్రామాల్లో అభివృద్ధిలో ఎంపీడీఓల బాధ్యతల గురించి తెలియజేశారు. గాలికుంటు నివారణ టీకాలు తప్పనిసరిజిల్లా పశువైద్యాధికారి వెంకటయ్య నర్సాపూర్ రూరల్: పశువులకు గాలికుంటు నివారణ టీకాలు తప్పనిసరిగా వేయించాలని జిల్లా పశువైద్యాధికారి వెంకటయ్య రైతులకు సూచించారు. నర్సాపూర్ మండలంలోని చిన్నచింతకుంటలో గాలికుంటు నివారణ టీకాల శిబిరంలో శుక్రవారం పాల్గొని మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా పశు వైద్య సిబ్బంది ప్రతీ గ్రామానికి వెళ్లి పశువులకు గాలికుంటు నివారణ టీకాలు వేస్తున్నారని తెలిపారు. -
ప్రభుత్వాల వైఖరి మారాలి
మెదక్ కలెక్టరేట్: కార్మికులు, ఉద్యోగుల రంగాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలు మార్చుకోవాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వీరయ్య డిమాండ్ చేశారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై సీఐటీయూ ఆధ్వర్యంలో మెదక్లోని టీఎన్జీఓ భవన్లో జిల్లా సెమినార్ నిర్వహించారు. జిల్లా సహాయ కార్యదర్శి గౌరీ అధ్యక్షతన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలు – ఉద్యోగులు, కార్మికులపై ప్రభావం అనే అంశంపై సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వీరయ్య మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాల ఫలితంగా ఉద్యోగులు, కార్మికులకు రక్షణ లేకుండా పోతుందన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నుముకగా నిలబడిన బ్యాంకింగ్, ఇన్సూరెన్న్స్ రంగాలలోకి విదేశీ ప్రైవేట్ పెట్టుబడులను ఆహ్వానిస్తున్నారని మండిపడ్డారు. పోస్టల్, టెలికంలోనూ ఇదే స్థితిలో కొనసాగుతుందని చెప్పారు. నూతన విద్యా విధానం పేరుతో ప్రభుత్వ విద్యను ప్రైవేటుపరం చేస్తున్నారని ఆరోపించారు. కార్మికుల, ఉద్యోగుల సమస్యలపై సీఐటీయూ సమరశీల పోరాటాలు నిర్వహిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి మల్లేశం, జిల్లా సహాయ కార్యదర్శి గౌరీ, సంతోష్, జిల్లా కోశాధికారి నర్సమ్మ, అడివయ్య, మల్లేశం, అజయ్, యాదగిరి, దుర్గ, కవిత, వివిధ రంగాల కార్మికులు పాల్గొన్నారు. కార్మికులు, ఉద్యోగుల రంగంపై విధానాలు మార్చుకోవాలి సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వీరయ్య -
బోనస్ బొనాంజా
సన్నాలకు సర్కార్ బోనస్ బొనాంజా ప్రకటించింది. ధాన్యం కొనుగోళ్లు చేసిన 48 గంటల్లోనే కనీస మద్దతు ధరతో కలిపి బోనస్ కూడా చెల్లిస్తామని స్పష్టం చేసింది. ఈసారి దొడ్డు వడ్లకు మద్దతు ధర క్వింటాలుకు రూ.2,389కి పెరిగింది. ఈ లెక్కన బోనస్తో కలిపి సన్న వడ్లకు రూ.2,889 చెల్లించనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల వేళ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం నెలకొంది. ఇదిలా ఉంటే గత యాసంగి బోనస్ బకాయిలూ కూడా చెల్లించాలని రైతన్నలు డిమాండ్ చేస్తున్నారు. – మెదక్ అర్బన్ వానాకాలం సీజన్ సన్నాలకు అనుకూలం కావడం.. బోనస్ ధరపై ఆశతో రైతులు 1,00,464 ఎకరాల్లో సన్న వడ్లు సాగు చేశారు. ముఖ్యంగా మంజీరా తీర ప్రాంతాలు, బోరు ఆధారిత వ్యవసాయం చేసే పాపన్నపేట, కొల్చారం, మెదక్ , హవేలిఘనపూర్, నర్సాపూర్, కౌడిపల్లి, రామాయంపేట, నిజాంేపేట, తూప్రాన్ తదితర మండలాలలో సన్న రకం వరి సాగు చేశారు. గతంలో దొడ్డు ధాన్యం మద్దతు ధర రూ.2,320 ఉండగా, ఈసారి రూ.2,389కి పెంచారు. ఈ లెక్కన చూస్తే సన్నాలకు బోనస్తో కలిపి క్వింటాలుకు రూ.2,889 వస్తుంది. సాగు పరంగా పెట్టుబడి చూస్తే.. సన్న వడ్లకు ఎకరాకు రూ.25 వేలు, దొడ్డు రకం వడ్లకు రూ.20 వేలు అవుతుంది. అలాగే దిగుబడిని బేరీజు వేస్తే సన్నాలు 22 క్వింటాళ్లు, దొడ్డువి 25 క్వింటాళ్లు వచ్చే అవకాశం ఉంది. బోనస్పై ఆశతో కొంత మంది సన్న వడ్లకు ప్రాధాన్యత ఇచ్చారు.యాసంగి బోనస్ ఏదీ? గత యాసంగి బోనస్ కు సంబంధించి ప్రభుత్వం ప్రకటన చేయక పోవడంతో అన్నదాతలో అనుమానాలు కలుగుతున్నాయి. అసలు ఈ యేడు బోనస్ మద్దతు ధరతో కలిపి 24 గంటల్లోనే చెల్లిస్తామని ప్రకటించినా, బోనస్ బకాయీల ఊసే లేక పోవడంతో ఆందోళన వ్యక్త మవుతోంది. గత యాసంగిలో 14,994 మంది రైతులు 62,747 క్వింటాళ్ల సన్న ధాన్యాన్ని విక్రయించారు. వీరికి బోనస్ రూపంలో రూ.31.37 కోట్లు రావాల్సి ఉంది. వీటి కోసం నాలుగు నెలలుగా ఎదురు చూస్తున్నారు.సన్నాలు కొనుగోళ్లు చేసిన 48 గంటల్లోనే చెల్లింపులు జిల్లాలో వానాకాలం సాగు లక్షా 464 ఎకరాలు దొడ్డురకం వడ్లకు మద్దతు ధర రూ.2,389కి పెంపు సన్నాలకు బోనస్తో కలిపి రూ.2,889 -
పత్రికా స్వేచ్ఛను హరించడమే..
మెదక్జోన్: నకిలీ మద్యంపై కథనాలు ప్రచురించిన సాక్షి విలేకరులతో పాటు ఎడిటర్ ధనంజయరెడ్డిపై అక్రమ కేసులు బనాయించి ఇబ్బందులకు గురిచేస్తున్న ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం చర్యలను జర్నలిస్టులు ఖండించారు. ఈ దమనకాండను నిరసిస్తూ శుక్రవారం మెదక్ జిల్లా కేంద్రంలోని బస్డిపో సమీపంలో రాస్తారోకో నిర్వహించారు. అనంతరం కలెక్టర్ రాహుల్రాజ్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పలువురు జర్నలిస్టులు మాట్లాడుతూ.. కొన్ని నెలలుగా ఏపీలో సాక్షి పత్రికపై కక్ష గట్టి పత్రికా స్వేచ్ఛను హరిస్తూ రాజ్యాంగాన్ని కాలరాస్తుందన్నారు. ప్రజాస్వామ్యంలో పత్రికా స్వేచ్ఛను హరించడమంటే ప్రజల భావ ప్రకటన స్వేచ్ఛను హరించినట్లేనని పేర్కొన్నారు. ఏపీలో సాక్షి టీవీ ప్రసారాలను ఆపటంపై సర్వోన్నత న్యాయస్థానం కూటమి ప్రభుత్వానికి చీవాట్లు పెట్టినా, సాక్షి ప్రధాన కార్యాలయంపై మూడు రోజులుగా దాడులు చేస్తూ సంపాదకుడికి నోటీసులు ఇవ్వటం, రాజ్యాంగ విరుద్ధమైనా ప్రశ్నలు సంధించటం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికై నా దాడులు నిలిపివేసి, అకారణంగా పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేకుటే యాజమాన్యాలకు అతీతంగా జర్నలిస్టుల సత్తా ఏమిటో చూపిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ప్రెస్క్లబ్ అధ్యక్షుడు నరేశ్గౌడ్, సాక్షి జిల్లా ఇన్చార్జి నీలయ్య, ఐ న్యూస్ బ్యూరో ఇన్చార్జి క్రాంతి, సీనియర్ పాత్రికేయులు నాగరాజు, గోపాల్గౌడ్, వెంకట్గౌడ్, సురేందర్రెడ్డి, మురళి, శ్రీనివాస్, లక్ష్మణ్, కృష్ణమూర్తి, మల్లేశం, ఊశయ్య, తదితరులు ఉన్నారు. సాక్షిపై ఏపీ ప్రభుత్వం కుట్ర: మాజీ ఎమ్మెల్యే శశిధర్రెడ్డి చిన్నశంకరంపేట(మెదక్): పత్రికా స్వేచ్ఛకు విఘాతం కలిగించేల సాక్షి దినపత్రిక ఎడిటర్ ఆర్.ధనంజయ రెడ్డిపై టీడీపీ కూటమి ప్రభుత్వం అక్రమ కేసులను పెట్టడం సరికాదని మెదక్ మాజీ ఎమ్మెల్యే శశిధర్రెడ్డి ఖండించారు. ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కుట్రపూరితమైన చర్యలకు పాల్పడటం అప్రజాస్వామికమని పేర్కొన్నారు. ‘సాక్షి’పై ఏపీ సర్కార్ దాడులు హేయం కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలి జర్నలిస్టుల డిమాండ్ మెదక్లో ధర్నా, కలెక్టర్కు వినతి -
విద్యాసామర్థ్యాలు పెంచండి
హవేళిఘణాపూర్(మెదక్): ప్రభుత్వ పాఠశాలలో ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమర్సీ (ఎఫ్ఎల్ఎన్) అమలులో ఆయా మండలాల ఎంఈఓలు, స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులదే కీలక బాధ్యత అని కలెక్టర్ రాహుల్రాజ్ అన్నారు. హవేళిఘణాపూర్ డైట్ కళాశాలలో శుక్రవారం ఎఫ్ఎల్ఎన్ అమలులో భాగంగా ఆయా మండలాల ఎంఈఓలు, స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎఫ్ఎల్ఎన్ పట్టిషంగా అమలు చేసి విద్యార్థులు విద్యాసామర్థ్యాలు సాధించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రాథమిక స్థాయి నుంచే విద్యార్థుల్లో కనీస సామర్థ్యాలు పెంచి గుణాత్మక విద్యా బోధన ద్వారా భావిభారత పౌరులుగా తీర్చిదిద్దాలన్నారు. నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన గుణాత్మక అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తోందని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి రాధాకిషన్, అసిస్టెంట్ మానిటరింగ్ అధికారి సుదర్శన్మూర్తి, స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాధికారులు పాల్గొన్నారు. పోషణ లోపం పిల్లలను గుర్తించాలిమెదక్ కలెక్టరేట్: చిన్నారులు వ్యాధుల బారిన పడకుండా, ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దే బాధ్యత డీడబ్ల్యుఓ సిబ్బందిపై ఉందని కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. శుక్రవారం తన కార్యాలయంలో సీ్త్ర, శిశు సంక్షేమశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పుట్టిన బిడ్డ ఆరోగ్యంపై తల్లి, బిడ్డలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. పోషణ లోపం ఉన్న చిన్నారులను గుర్తించి, వారిని పరిపూర్ణ ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. పిల్లల ఎత్తు, బరువును ఎప్పటికప్పుడు పరిశీలించి ఆన్లైన్లో నమోదు చేయాలని ఆదేశించారు. గర్భిణిలు ఆరోగ్యవంతంగా ఉండేందుకు తగిన ఆహారం, పోషకాహారం గురించి విస్తృత ప్రచారం చేయాలన్నారు. విద్యార్థులకు మెరుగైన విద్య అందించాలి ఎఫ్ఎల్ఎన్ పటిష్టంగా అమలు చేయాలి ఎంఈఓలు, ప్రధానోపాధ్యాయులదే బాధ్యత కలెక్టర్ రాహుల్రాజ్ -
చెల్లిస్తామనడం సంతోషం
వడ్లు తూకం చేసిన 48 గంటల్లోనే మద్దతు ధరతో పాటు సన్న వడ్లకు బోనస్ చెల్లిస్తామని ప్రకటించడం సంతోషం. ఈసారి భారీ వానలతో, పొంగి పొర్లిన వరదలతో అనేక చోట్ల పంటలు దెబ్బ తిన్నాయి. రైతులు అనేక విధాలుగా నష్టపోయారు. కనీసం బోనస్ డబ్బులు ఇస్తే సకాలంలో అప్పులు తీర్చగలం. – పోచయ్య, రైతు పాపన్నపేట బకాయిలూ చెల్లించండి గత యాసంగికి సంబంధించి సన్న వడ్లకు బోనస్ ఇంత వరకు రాలేదు. సుమారు రూ.40 వేలు రావాలి. బకాయీల చెల్లింపుపై నిర్ణయం తీసుకోక పోవడం శోచనీయం. ప్రభుత్వాన్ని నమ్మి, బోనస్ ఆశకు చాలా మంది రైతులు సన్న వరి వేశారు. రైతులను ఇబ్బంది పెట్టడం తగదు. – మహిపాల్, రైతు, పాపన్నపేట -
వన దుర్గమ్మ దర్శనాలు ప్రారంభం
62 రోజుల అనంతరం ఆలయ ప్రవేశం పాపన్నపేట(మెదక్): ఏడుపాయల వన దుర్గమ్మ దర్శనం ఎట్టకేలకు 62 రోజుల అనంతరం శుక్రవారం ప్రారంభమైంది. రెండు నెలలుగా, ఆగస్టు 14 నుంచి మంజీరా నదికి వరదలు రావడంతో దుర్గమ్మ ఆలయం జల దిగ్బంధంలో చిక్కుకుపోయింది. మధ్యలో రెండు రోజుల దర్శనం ప్రారంభించినప్పటికీ, తిరిగి వరదలు రావడంతో ఆలయాన్ని మూసి వేశారు. ఫలితంగా ఆలయానికి సుమారు రూ.1.50 కోట్ల నష్టం జరిగింది. ఇటీవల సింగూరు నుంచి వరద తగ్గడంతో ఆలయాన్ని శుభ్రం చేసి, భక్తుల దర్శనానికి అనుకూలంగా తీర్చిదిద్దారు. అర్చకులు దుర్గమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేసి, భక్తులకు దర్శనం అవకాశం కల్పించారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్ కల్పించాల్సిందేసీపీఎం డిమాండ్ మెదక్ కలెక్టరేట్: బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో స్థానిక పోస్టాఫీసు వద్ద నిరసన తెలిపారు. అనంతరం జిల్లా కేంద్రంలోని కేవల్ కిషన్ భవన్లో సీపీఎం జిల్లా కార్యదర్శి నర్సమ్మ, సీపీఐ జిల్లా కార్యదర్శి మల్లేశం విలేకరులతో మాట్లాడారు. బీసీల రిజర్వేషన్ వ్యవహారంపై బీజేపీ ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని విమర్శించారు. రాష్ట్ర బంద్ తమ సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు. కార్యక్రమంలో సీపీఎం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు మల్లేశం, నాయకులు కిరణ్, అజయ్, సత్యం, అజయ్, తదితరులు పాల్గొన్నారు. మత్తుకు బానిస కావొద్దున్యాయమూర్తి శుభావల్లి మెదక్జోన్: ఎట్టిపరిస్థితుల్లో మత్తుకు బానిస కావద్దని మెదక్ జిల్లా సీనియర్ సివిల్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆర్ఎం శుభావల్లి సూచించారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డ్రగ్స్, మత్తుపై శుక్రవారం ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. డ్రగ్స్ తీసుకునే వారి మానసిక స్థితి గురించి విద్యార్థులకు వివరించారు. ప్రాథమిక హక్కులపై అవగాహన కలిగి ఉండాలన్నారు. మద్యపానం వలన కలిగే నష్టాల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ హుస్సేన్ డ్రగ్స్ నిర్మూలన కమిటీ కో–ఆర్డినేటర్ డాక్టర్ రమణ కుమార్, ప్లాన్ ఇండియా ప్రాజెక్ట్ ఆఫీసర్ జే.వెంకటేశ్వర్లు, లీగల్ అడ్వైజర్ ఎల్.సిద్ధాగౌడ్ తదితరులు పాల్గొన్నారు. అతిథి అధ్యాపక పోస్టులకు దరఖాస్తులుమెదక్ కలెక్టరేట్: మెదక్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అతిథి అధ్యాపక పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్, ప్రొఫెసర్ హుస్సేన్ ఒక ప్రకటనలో తెలిపారు. కళాశాలలో రసాయన శాస్త్రం(1), కంప్యూటర్ సైన్న్స్ అప్లికేషన్న్ (1) పోస్టులు ఖాళీగా ఉన్నట్లు పేర్కొన్నారు. సంబంధిత సబ్జెక్టులో కనీసం 55శాతం మార్కులతో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారు అర్హులని, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు కనీసం 50శాతం మార్కులుంటే అర్హులని తెలిపారు. సంబంధిత సబ్జెక్టులలో పీహెచ్డీ లేదా నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్, స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఉత్తీర్ణులైన వారికి, అలాగే బోధనా అనుభవం గల అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది. అభ్యర్థులు ఈనెల 22న సాయంత్రం 4గంటలలోపు కళాశాలలో నేరుగా దరఖాస్తులు అందజేయాలని సూచించారు. 23న కళాశాల ప్రాంగణంలో డెమో క్లాస్తోపాటు ఇంటర్వ్యూ ఉంటుందని తెలిపారు. పంట వివరాలు నమోదు చేసుకోవాలిజిల్లా వ్యవసాయ అధికారి దేవ్కుమార్ పెద్దశంకరంపేట(మెదక్): మండలంలోని రైతులు తమ పంటల వివరాలను వ్యవసాయ అధికారుల వద్ద నమోదు చేసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి దేవ్ కుమార్ శుక్రవారం తెలిపారు. మండల పరిధిలోని శివాయిపల్లి గ్రామంలో రైతులకు కాటన్ కపాస్ యాప్పై అవగాహన కల్పించారు. రైతులు తమ పత్తి పంటను అమ్ముకోవాలంటే ఈ యాప్లో స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత అమ్ముకునే అవకాశం ఉందన్నారు. -
క్రీడలతో స్నేహభావం: డీఎం సురేఖ
మెదక్ కలెక్టరేట్: మెదక్ జిల్లా కేంద్రంలోని ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో శుక్రవారం జిల్లాస్థాయి అండర్ 17, అండర్ 14 బాలికల ఖోఖో పోటీలు అట్టహాసంగా జరిగాయి. ఎస్జిఎఫ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ జిల్లాస్థాయి పోటీల్లో 21 మండలాల నుంచి 420 మంది బాలికలు పాల్గొన్నారు. సాయంత్రం జరిగిన ముగింపు కార్యక్రమానికి ఆర్టీసీ డిపో మేనేజర్ సురేఖ హాజరై విజేతలకు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ క్రీడలతో స్నేహభావం పెంపొందిచుకోవచ్చన్నారు. ఈ పోటీల్లో అండర్ 17 విభాగంలో హవేళిఘనాపూర్ జట్టు మొదటి బహుమతి, , పాపన్నపేట ద్వితీయ బహుమతి, రామాయంపేట తృతీయ బహుమతి అండర్–14విభాగంలో ఫస్ట్ ఫ్రైజ్ పాపన్నపేట, సెకండ్ ఫ్రైజ్ మెదక్, థర్డ్ఫ్రైజ్ చేగుంట జట్లు సాధించాయి. ఈ కార్యక్రమంలో ఎస్జీఎఫ్ కార్యదర్శి నాగరాజు మాట్లాడుతూ ఈ పోటీల్లో గెలుపొందిన జట్లు ఈనెల చివరి వారంలో మెదక్లో జరిగే ఉమ్మడి మెదక్ జిల్లా ఖో ఖో పోటీలలో పాల్గొంటాయని తెలిపారు. జిల్లాస్థాయి బాలికల ఖోఖో పోటీలు ప్రారంభం విజేతలకు బహుమతులు అందజేసిన డీఎం సురేఖ -
బీసీ రిజర్వేషన్లకే అడ్డంకులెందుకు?
● నేటి బంద్ను విజయవంతం చేద్దాం ● బీసీ సంఘం నేత సురేందర్గౌడ్మెదక్జోన్: ఎకనామికల్ వీకర్ సెక్షన్(ఈడబ్ల్యూఎస్) రిజర్వేషన్లకు లేని అడ్డంకులు బీసీ రిజర్వేషన్లకే ఎందుకు అని బీసీ నేత కొండన్ సురేందర్గౌడ్ ప్రశ్నించారు. వెనుకబడిన కులాలకు రిజర్వేషన్ ఫలాలు అందాలనే డిమాండ్తో తలపెట్టిన రాష్ట్రబంద్ను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా శనివారం పట్టణంలోని టీఎన్జీఓ భవన్లో వివిధ బీసీ నేతలతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. విద్య, ఉద్యోగాలు, రాజకీయంగా ఏళ్లతరబడి అన్యాయానికి గురవుతున్న బీసీలందరూ పోరాటం సాగించాలని అన్నారు. బీసీ రిజర్వేషన్లను రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చి చట్టబద్దమైన రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీసీ సంఘాల నాయకులు చింతల నర్సింహులు, శంకర్ గౌడ్, మామిళ్ల అంజనేయులు, రామస్వామి, కృష్ణ, మంగ మోహన్ గౌడ్, ఎండీ హఫీజ్, గౌస్ ఖురేషి, మానవ హక్కుల వేదిక నేత షేక్ అహ్మద్ పాల్గొన్నారు. -
ప్రజలతో సత్సంబంధాలు అవసరం
చిన్నశంకరంపేట(మెదక్): ప్రజలతో పోలీసులు సత్సంబంధాలు కలిగి ఉండాలని ఎస్పీ శ్రీనివాస్రా వు అన్నారు. గురువారం నార్సింగి పోలీస్స్టేషన్ను తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలీస్లు నమోదు చేసిన కేసులపై క్షేత్రస్థాయి పరిశీలనతో పాటు న్యాయమైన దర్యాప్తు చేపట్టాలన్నారు. ప్రతి కేసును ఆన్లైన్లో నమోదు చేయాలని ఆదేశించారు. విలేజ్ పోలీస్ వ్యవస్థను క్రీయాశీలంగా నిర్వహించాలన్నారు. కేసులు పెండింగ్ లేకుండా చూసుకోవాలని ఎస్ఐ సృజనకు సూచించారు. సైబర్ నేరాలపై ప్రజలను అప్రమత్తం చేసేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ప్రతి రోజు వాహనాల తనిఖీ చేపట్టడంతో పాటు అనుమానాస్పద వాహనాలను అదుపులోకి తీసుకోవాలని చెప్పారు. సిబ్బందికి ఎలాంటి సమస్యలున్నా తనతో నేరుగా మాట్లాడాలని సూచించారు. అనంతరం నార్సింగి మల్లన్నగుట్ట వద్ద ఉన్న పోలీస్ ఫైరింగ్ రేంజ్ను పరిశీలించారు. ఆయన వెంట డీఎస్పీ నరేందర్రెడ్డి, సీఐ వెంకటరాజంగౌడ్, ఎస్ఐ సృజన ఉన్నారు. సైబర్ మోసగాళ్ల వలలో చిక్కొద్దు మెదక్ మున్సిపాలిటీ: ఆఫర్ల మోజులో పడి సైబర్ మోసగాళ్ల వలలో చిక్కుకోవద్దని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు ప్రజలకు సూచించారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. దీపావళి సందర్భంగా స్పెషల్ ఆఫర్ల పేరుతో సైబర్ మోసగాళ్లు సోషల్ మీడియా, వాట్సాప్ ద్వారా నకిలీ వెబ్సైట్లు, లింకులు పంపి ప్రజలను మోసం చేస్తుంటారని తెలిపారు. ఆ లింక్ల ద్వారా షాపింగ్ ఆఫర్లు, లాటరీలు, గిఫ్ట్ కూపన్లు వంటి ప్రలోభాలు చూపి డబ్బులు వసూలు చేస్తారన్నారు. ఇలాంటి ఫేక్ లింక్లు, వెబ్సైట్లకు వ్యక్తిగత, బ్యాంక్ వివరాలు ఇవ్వకూడదని పేర్కొన్నారు. ఎస్పీ డీవీ శ్రీనివాసరావు -
నాణ్యతా ప్రమాణాలు తప్పనిసరి
పాపన్నపేట(మెదక్)/మెదక్ కలెక్టరేట్: ధాన్యం కొనుగోళ్లలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని కలెక్టర్ రాహుల్రాజ్ అన్నారు. గురువారం మండల పరిధిలోని పొడిచన్పల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు, ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించారు. ఈసందర్భంగా రైతులు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులతో మాట్లాడారు. ధాన్యం తేమ శాతాన్ని సరిగా నిర్ధారించాలని, తాలు లేకుండా చూడాలని సూచించారు. కొనుగోళ్లలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా తమ దృష్టికి తీసుకురావాలన్నారు. ఎప్పటికప్పుడు ధాన్యం తూకం వేసి తరలించాలని నిర్వాహకులను ఆదేశించారు. గన్నీ బ్యాగులు, రికార్డులు, ఆన్లైన్ ప్రక్రియను పరిశీలించారు. ఆయన వెంట వివిధ శాఖల అధికారులు ఉన్నారు. అనంతరం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ముఖ్య ఎలక్ట్రోరల్ అధికారి సుదర్శన్రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్కు కలెక్టర్ హాజరయ్యారు. నూతన ఓటర్లకు గుర్తింపు కార్డులను తపాల శాఖ ద్వారా పంపిణీ చేయాలని అధికారులకు సూచించారు. అలాగే ఓటరు జాబితాలో వందేళ్ల వయసు కలిగిన ఓటర్లను గుర్తించి తగిన ఆధారాలు సమర్పించాలని తెలిపారు. బూత్స్థాయి అధికారులకు గుర్తింపు కార్డులు పంపిణీ చేయాలని, ఫారం 6, 7, 8 దరఖాస్తులను వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ నగేశ్, ఆర్డీఓలు రమాదేవి, మహిపాల్రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.కలెక్టర్ రాహుల్రాజ్ -
రంగంలోకి సిండికేట్లు
జిల్లాలో మద్యం టెండర్లు మందకొడిగా సాగుతున్నాయి. గత నెల 26న నోటిఫికేషన్ వెలువడగా, గురువారం సాయంత్రం వరకు 373 దరఖాస్తులు అందినట్లు ఈఎస్ శ్రీనివాస్రెడ్డి తెలిపారు. జిల్లాలో 49 వైన్షాపులు ఉండగా, గతేడాది 1,905 దరఖాస్తులు వచ్చాయి. కాగా ఏపీ, హైదరాబాద్ సిండికేట్లు రంగంలోకి దిగడంతో ఈనెల 18 చివరి రోజు దరఖాస్తులు భారీగా పెరిగే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. – మెదక్ అర్బన్ లాభాల్లో 30 శాతం మామూళ్లకే గతేడాది టార్గెట్ చేరేనా! మద్యం దుకాణాల కోసం ఏకం -
ఇసుకాసురులు!
మంజీరా నుంచి అక్రమంగా రవాణా ● ఇందిరమ్మ ఇళ్ల కంటూ దబాయింపు ● కన్నెత్తి చూడని రెవెన్యూ అధికారులుకొల్చారం(నర్సాపూర్): ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు. మండలంలోని పోతంశెట్టిపల్లి శివా రు మంజీరా నది నుంచి వారం రోజులుగా అక్రమంగా రవాణా చేస్తున్నారు. రెవెన్యూ, పోలీస్ అధికారులకు సమాచారం ఉన్నా అటువైపు కన్నెత్తి చూడటం లేదు. ఇదే అదునుగా భావించిన కొందరు అక్రమా ర్కులు అధికారులను మచ్చగా చేసుకొని మధ్యవర్తులుగా వ్యవహరిస్తూ దందాను కొనసాగిస్తున్నార ని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఎవరైనా అడ్డుకుంటే ఇందిరమ్మ ఇళ్ల కంటూ దబాయిస్తున్నారు. సొమ్ము చేసుకుంటున్న దళారులు పోతంశెట్టిపల్లి, అప్పాజీపల్లి గ్రామాలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయి. వీటి నిర్మాణానికి ప్రభుత్వం ఉచితంగా ఇసుక రవాణా చేస్తామని చెప్పింది. దీనిని తమకు అనుకూలంగా మార్చుకున్న దళారులు మధ్యవర్తిత్వం వహిస్తూ ఎలాంటి అనుమతులు లేకుండా ట్రాక్టర్ ఇసుకకు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల నుంచి రూ. 8 వేలు వసూలు చేస్తున్నారు. బరితెగించి ఇతర ప్రాంతాలకు ఇసుకను రవాణా చేసి సొమ్ము చేసుకుంటున్నారు. ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. నది నుంచి ఇసుకను తీసేందుకు రెవెన్యూ, మైనింగ్ అధికారుల అనుమతి తప్పనిసరి. పైగా ఇందిరమ్మ ఇల్లు నిర్మించే లబ్ధిదారుడు ఇసుక కోసం అనుమతి పత్రం అందజేయాల్సిన రెవెన్యూ అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. తప్పనిసరి పరిస్థితుల్లో లబ్ధిదారులు అధిక మొత్తానికి ఇసుకను కొనుగోలు చేస్తూ ఆర్థికంగా నష్టపోతున్నారు. బుధవారం పైతరలో పోలీసులు పట్టుకున్న ఇసుక ట్రాక్టర్లను రెవెన్యూ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకుండా వదిలిపెట్టడం విమర్శలకు తావిస్తోంది. కఠిన చర్యలు తీసుకుంటాం ఇందిరమ్మ లబ్ధిదారులకు ప్రభుత్వం ద్వారా ఉచితంగా ఇసుకను రవాణా చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. ఇంటి నిర్మాణ ధ్రువీకరణ పత్రాన్ని రెవెన్యూ కార్యాలయానికి తీసుకొచ్చి అనుమతి తీసుకోవాలి. అందుబాటులో ఉన్న చోటు నుంచి ఇసుకను రవాణా చేసుకోవచ్చు. కేవలం రవాణా ఖర్చులు మాత్రమే లబ్ధిదారుడు భరించాల్సి ఉంటుంది. అక్రమ ఇసుక రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. – శ్రీనివాస్చారి, తహసీల్దార్, కొల్చారం -
హెచ్ఎంతో పాటు ఇద్దరు ఉపాధ్యాయుల సస్పెన్షన్
నర్సాపూర్ రూరల్: హెచ్ఎంతో పాటు మరో ఇద్దరు ఉపాధ్యాయులను సస్పెండ్ చేసినట్లు డీఈఓ రాధాకిషన్ గురువారం తెలిపారు. పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన హెచ్ఎం రాజప్ప నిధుల దుర్వినియోగానికి పాల్పడగా, మరో ఇద్దరు ఉపాధ్యాయులు అశోక్, లక్ష్మయ్య తరచూ విధులకు గైర్హాజరవుతున్నట్లు తెలిసింది. అయితే వారి నుంచి హెచ్ఎం లంచాలు తీసుకొని వేతనాలు చెల్లిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో పాటు స్కావెంజర్ వేతనంలోనూ కోతల విధిస్తూ నిధులు కాజేస్తున్నట్లు తెలిసింది. విద్యార్థుల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఉన్నతస్థాయి అధికారులు ఇటీవల తనిఖీలు చేపట్టి విచారణ చేయగా నిధుల దుర్వినియోగం, ఉపాధ్యాయుల గైర్హాజరు, తరచూ గొడవలు జరుగుతున్నట్లు తేలింది. ఈ మేరకు వారిని సస్పెండ్ చేసినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ ఆస్పత్రి సందర్శన రామాయంపేట(మెదక్): డిప్యూటీ డీఎంహెచ్ఓ, ఇమ్యూనైజేషన్ అధికారిణి మాధురి గురువారం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిని సందర్శించారు. ఈసందర్భగా హెల్త్ వర్కర్లకు ఇచ్చే హెపటైటీస్ బీ వాక్సిన్ కార్యక్రమాన్ని పరిశీలించారు. ఆమె వెంట ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ లింబాద్రి, ప్రగతి ధర్మారం ప్రా థమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు హరిప్రియ, నర్సులు, ఇతర సిబ్బంది ఉన్నారు. -
జాతీయస్థాయి సైన్స్ ఫెయిర్కు ఎంపిక
పాపన్నపేట(మెదక్): మండలంలోని లింగాయపల్లి చీకోడ్ ఉన్నత పాఠశాల విద్యార్థి రూపొందించిన ప్రాజెక్ట్ జాతీయస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనకు ఎంపికై ంది. పదో తరగతి విద్యార్థి శివ చైతన్య రూపొందించిన ఆధునిక మల్టీ పర్పస్ అడ్వాన్స్ హైడ్రాలిక్ జేసీబీ అండ్ ఆల్ ఇన్ వెహికల్ ఎగ్జిబిట్ జిల్లా, రాష్ట్ర, దక్షిణ భారత స్థాయిలో కీర్తి పతాకాన్ని ఎగురవేసి జాతీయ విద్యా పరిశోధనా సంస్థ ఆధ్వర్యంలో జాతీయస్థాయికి ఎంపికై ంది. భోపాల్లో జరుగనున్న జాతీయస్థాయి పోటీల్లో విద్యార్థి పాల్గొననున్నారు. కాగా విద్యార్థికి గైడ్గా రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికై న కిషన్ ప్రసాద్వ్యవహరించారు. -
కంపు.. భరించలేకపోతున్నాం
నర్సాపూర్ రూరల్: మండలంలోని కాగ జ్మద్దూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు అవస్థలు పడుతున్నారు. పాఠశాల ఎదుట ఉన్న పౌల్ట్రీఫాం నుంచి వెదజల్లే దుర్వాసనతో తీవ్ర అనారోగ్యాలకు గురవుతున్నారు. ఇటీవల పలువురు విద్యార్థులు వాంతులు, విరోచనాలు, కడుపునొప్పితో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందా రు. దుర్వాసనతో ఉపాధ్యాయులు చెప్పే పాఠాలు మెదడుకు ఎక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏడో తరగతి విద్యార్థి నికిత్సాయి ఇటీవలే ఆస్పత్రిలో చేరగా, సుందరయ్య అనే ఉపాధ్యాయుడు అనారోగ్యానికి గురయ్యాడు. ఈ క్రమంలో పాఠశాల అంటేనే విద్యార్థులు, ఉపాధ్యాయులు జంకుతున్నారు. పలుమార్లు అధికారులకు, ప్రజాప్రతినిధులకు విన్నవించిచా ఎవరూ పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. -
టికెట్ నాకే.. ఎమ్మెల్యే నేనే
మెదక్ అర్బన్: ‘వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వందశాతం నేనే ఎమ్మెల్యే. కేసీఆర్, కేటీఆర్, హరీశ్రావుపై నమ్మకం ఉంది. పార్టీ టికెట్ ఎలాగైనా ఇస్తారు. అమ్మవారి దయతో 2029 ఎన్నికల్లో నిజాంపేట బిడ్డగా.. ఎమ్మెల్యేగా మీ ముందుకొస్తానంటూ..’ నిజాంపేటలో ఆదివారం జరిగిన ‘కాంగ్రెస్ బాకీ కార్డు’ పంపిణీ కార్యక్రమంలో కంఠారెడ్డి తిరుపతిరెడ్డి చేసిన వ్యాఖ్యలు గులాబీ దళంలో కాక రేపుతున్నాయి. మెతుకుసీమ రాజకీయాల్లో ఉద్యమ నేతగా పేరొందిన పద్మక్క.. ద్వితీయ శ్రేణి నాయకుడి ధిక్కార స్వరంతో కలవరపడుతోంది. ఇంతకాలం నివురుగప్పిన నిప్పు లా ఉన్న ఆశలు.. ఒక్కసారిగా భగ్గుమనడంతో బీ ఆర్ఎస్లో అలజడి మొదలైంది. అయితే ఈ వ్యా ఖ్యల పరిణామాలను ట్రబుల్ షూటర్ నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.అప్పుడు నెయ్యం.. ఇప్పుడు కయ్యంగత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ టికెట్ తనదేనన్న ధీమాతో ఉన్న కంఠారెడ్డి తిరుపతిరెడ్డికి మైనంపల్లి రోహిత్రావు రూపంలో పార్టీ షాకిచ్చింది. అనూహ్య పరిణామంతో తీవ్ర ఆందోళనకులోనైన కంఠారెడ్డి డీసీసీ పదవికి రాజీనామా చేసి బీఆర్ఎస్లో చేరారు. మోసం చేసిన కాంగ్రెస్పై ప్రతీకారం తీర్చుకోవాలన్న కసితో హస్తం పార్టీలో ఉన్న తనవర్గాన్ని బీఆర్ఎస్లోకి తిప్పుకోవడానికి పడరాని పాట్లు పడ్డారు. కొంతమేర కృతకృత్యుడయ్యాడు. అప్పట్లో బీఆర్ఎస్ అభ్యర్థి పద్మారెడ్డి విజయం కోసం కృషి చేశారు. కాలం గడుస్తున్నా కొద్ది బీఆర్ఎస్లో కొంతమందిని తన వైపు తిప్పుకున్నాడు. విందులు, వినోదాలతో మరికొంత మందిని ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా గత ఎన్నికల అనంతరం మాజీ ఎమ్మెల్యే కొంతకాలం నియో జకవర్గానికి దూరంగా ఉన్న సమయాన్ని వినియోగించుకొని కొంతమేర పట్టు పెంచుకున్నాడు. ఆర్థిక సహాయాలు, ప్రజోపయోగ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ పార్టీలో పరపతిని పెంచుకున్నాడు.ముందుగానే పసిగట్టిన పద్మారెడ్డిమెతుకుసీమ రాజకీయాల్లో ఎదురులేని ఏలికగా నిలిచిన బీఆర్ఎస్ అధ్యక్షురాలు పద్మారెడ్డి, పార్టీలో ముంచుకొస్తున్న ప్రమాదాన్ని ముందుగానే పసి గట్టారు. ఎమ్మెల్యే పదవిపై ఆశలు పెంచుకుంటున్న కంఠారెడ్డి తిరుపతిరెడ్డి కదలికలపై కన్నేసి, కౌంటర్ చర్యలు ప్రారంభించారు. పైకి సఖ్యతగా ఉన్నట్లు కనిపించినా, కంఠారెడ్డితో కలిసి ఉన్న సందర్భాల్లో పద్మారెడ్డి అసౌకర్యంగానే ఉన్నట్లు కనిపించేవారని కార్యకర్తలు వ్యాఖ్యానిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల వేళ తిరుపతిరెడ్డి తన స్వస్థలమైన నిజాంపేటలో చేసిన వ్యాఖ్యలు పార్టీలో నెలకొన్న వర్గ విబేధాలను ప్రస్పుటం చేసేవిగా ఉండటంతో.. రెండు, మూడు రోజుల్లో మాజీ మంత్రి బీఆర్ఎస్ నాయకులతో సమావేశం నిర్వహించి, సమస్యను పరిష్కరించే అవకాశం ఉందని పాపన్నపేటకు చెందిన బీఆర్ఎస్ ముఖ్యనాయకుడు ఒకరు తెలిపారు.గులాబీ దళంలో పెరిగిన కంఠ స్వరంమెతుకుసీమ బీఆర్ఎస్లోవర్గపోరు కొనసాగుతోంది. తాజాగా కంఠారెడ్డి తిరుపతిరెడ్డి వ్యాఖ్యలతో అలజడి మొదలైంది. ఈ పరిణామాలను పార్టీ నిశితంగా పరిశీలిస్తున్నట్లుతెలుస్తోంది. -
గంజాయి సాగు చేస్తే పథకాలు కట్
మెదక్ కలెక్టరేట్: గంజాయి సాగు చేసే రైతులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ వెంటనే నిలిపివేస్తామని, జిల్లాలో డ్రగ్స్ను అరికట్టేందుకు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ రాహుల్రాజ్ అధికారులకు సూచించారు. బుధవారం కలెక్టరేట్లో ఎస్పీ డీవీ శ్రీనివాసరావుతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రామాల్లో డ్రగ్స్ వ్యతిరేక కమిటీలు వేయాలని ఆదేశించారు. గంజాయి సాగు చేస్తే జరిగే పరిణామాలపై రైతులకు వివరించాలన్నారు. ప్రతి పాఠశాల, కళాశాలలో విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు. ఎస్పీ డీవీ మాట్లాడుతూ.. దాబాలతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి పరిశ్రమలకు ఉపాధి కోసం వచ్చే వారిని క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. అనంతరం జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణపై సమావేశం నిర్వహించారు. జిల్లాలో బ్లాక్ స్పాట్లు గుర్తించి ప్రమాదాల నివారణకు సమగ్ర చర్యలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు. ఎక్కువగా ప్రమాదాలు జరిగే చోట సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లో వసతులు కల్పించాలి జిల్లాలో పూర్తిస్థాయిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ రాహుల్రాజ్ ఆదేశించారు. ప్రతి కొనుగోలు కేంద్రంలో కనీస మౌలిక వసతులతో పాటు సరిపడా గన్నీ బ్యాగ్లు, టార్పాలిన్లు, తేమశాతం కొలిచే యంత్రాలు అందుబాటులో పెట్టుకోవాలన్నారు. ఇదే విషయమై మంత్రులు తుమ్మల నాగేశ్వర్రావు, ఉత్తమకుమార్రెడ్డి హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో అధికారులతో కలిసి పాల్గొన్నారు. అనంతరం బాల్య వివాహాల నివారణ గోడ పత్రికను ఆవిష్కరించారు. అలాగే చేయూత పథకంపై అధికారులతో సమావేశం నిర్వహించారు. వివిధ పింఛన్లకు గల అర్హతలను వాటి విధి విధానాలను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా అధికారులకు వివరించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ నగేశ్తో పాటు జిల్లా అధికారులు పాల్గొన్నారు. డ్రగ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దుదాం అధికారులతో కలెక్టర్ రాహుల్రాజ్ -
పోషకాహార లోపాన్ని నివారిద్దాం
రామాయంపేట(మెదక్): మెదక్ను పోషకాహారలోపం లేని జిల్లాగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నామని డీడబ్ల్యూఓ హేమభార్గవి అన్నారు. ఐడీసీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోషణమాస వారోత్సవాల ముగింపు సందర్భంగా బుధవారం స్థానిక రైతు వేదికలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. బాల్య వివాహాల విషయమై బాలికలు, వారి తల్లిదండ్రులను చైతన్యపరుస్తున్నామని తెలిపారు. పోషణలోపం, బాల్య వివాహాలను అరికట్టడానికి ముందుకెళ్తున్నామని వివరించారు. మనం ఆరోగ్యంగా ఉండాలంటే స్థానికంగా లభ్యమవుతున్న పండ్లు, ఆకుకూరలను తినాలని సూచించారు. ముఖ్యంగా ఆకుకూరలతో ఎన్నో ప్రయోజనాలున్నాయని, వీటిలో పోషణ విలువలు అధికంగా ఉంటాయని వివరించారు. పోషణ వారో త్సవాలకు సంబంధించి గురుకుల పాఠశాల విద్యార్థినులు ఆలపించిన పాటలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో సీడీపీఓ స్వరూప, పలు మండలాలకు చెందిన అంగన్వాడీ కార్యకర్తలు, సూపర్వైజర్లు పాల్గొన్నారు.డీడబ్ల్యూఓ హేమభార్గవి -
గాలికుంటు నివారణకు టీకాలు
నర్సాపూర్ రూరల్: పశువులకు గాలికుంటు నివారణ టీకాలు తప్పనిసరిగా వేయించాలని నర్సాపూర్ డివిజన్ పశువైద్యాధికారి జనార్దన్ రైతులకు సూచించారు. బుధవారం మండలంలోని కొండాపూర్, పెద్దచింతకుంటతో పాటు నర్సాపూర్లో పశువులకు గాలికుంటు నివారణ టీకాలు వేసినట్లు తెలిపారు. మూడు గ్రామాల్లో కలిపి 186 పశువులకు టీకాలు వేసినట్లు చెప్పారు. ప్రతి ముందు జాగ్రత్తగా పశువులకు టీకాలు వేయించాలన్నారు. ఇందుకోసం అన్ని గ్రామాల్లో క్యాంపులు ఏర్పాటు చేస్తామన్నారు. రైతులు పశు వైద్య సిబ్బందికి సహకరించాలని కోరా రు. కార్యక్రమంలో పశువైద్యాధికారులు సౌమిత్ కుమార్, స్వప్న, ఆంజనేయులు, వీరేశం, వెంకటేశ్, ఏసుప్రభు పాల్గొన్నారు.నర్సాపూర్ డివిజన్ పశువైద్యాధికారి జనార్దన్ -
రిజర్వేషన్ల అమలుకు పోరాడుదాం
రామాయంపేట(మెదక్)): బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలు కోసం అలుపెరుగని పోరాటం చేస్తామని బీసీ సంక్షేమ సంఘం జిల్లా గౌరవాధ్యక్షుడు మెట్టు గంగారాం అన్నారు. బుధవారం పట్టణంలో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. తాము ఏ కులానికి వ్యతిరేకం కాదని, తమకు అన్యాయం తలపెట్టిన వారికి వ్యతిరేకంగా పోరాడుతామని హెచ్చరించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల దక్కకుండా కొందరు కుట్రలు పన్నుతున్నారని, వారి ఆటలు సాగబోవన్నారు. ఈనెల 18న నిర్వహించనున్న బంద్ను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం బంద్నకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో మెదక్ బీసీ జేఏసీ చైర్మన్ చంద్రశేఖర్, కోశాధికారి దామోదర్, ప్రధాన కార్యదర్శి భూమ కిషన్, సంఘం నియోజకవర్గ అధ్యక్షుడు సిద్దరాంలు, మండలాధ్యక్షుడు రాజేశ్ తదితరులు పాల్గొన్నారు.బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు గంగారాం -
సేవాభావం అలవర్చుకోవాలి
ఏఎస్పీ మహేందర్ హవేళిఘణాపూర్(మెదక్): చదువుతో పాటు సేవాభావం పెంపొందించుకోవాలని ఏఎస్పీ మహేందర్ విద్యార్థులకు సూచించారు. మండల పరిధిలోని ముత్తాయికోటలో జరిగిన ఎన్ఎస్ఎస్ ముగింపు సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. తాను కూడా ఎన్ఎస్ఎస్ వలంటీర్నేనని, కష్టపడే అలవాటు అప్పటి నుంచే ఏర్పడిందన్నారు. రాబోయే రోజుల్లో మంచి ఉద్యోగావకాశాలు పొంది ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు మంచి పేరు తీసుకురావాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ చైర్మన్, ప్రిన్సిపాల్ హుస్సేన్, పంచాయతీ సెక్రటరీ హేమంత్, కిరణ్గౌడ్, రఘుబాబు, ప్రోగ్రాం ఆఫీసర్ మురళి, ఎన్ఎస్ఎస్ వలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. క్రీడలతో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి కౌడిపల్లి(నర్సాపూర్): విద్యార్థులు క్రీడల్లో ప్రతిభ కనబర్చి ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చని ఉమ్మడి మెదక్ జిల్లా ఎంజేపీ బీసీ గురుకుల సొసైటీ ఆర్సీఓ గౌతంకుమార్రెడ్డి తెలిపారు. బుధవారం మండలంలోని తునికి ఎంజేపీ గురుకుల పాఠశాలలో అండర్–17 కబడ్డీలో పరుశురాం, వాలీబాల్లో హేమంత్ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక కావడంతో అభినందించారు. ఈసందర్భంగా ఆర్సీఓ మాట్లాడుతూ.. విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు అవసరమని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ హరిబాబు, పీడీ అంజలి, పీఈటీలు కార్తీక్, శేఖర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఇదిలాఉండగా కౌడిపల్లిలోని ఎస్టీ గురుకుల పాఠశాలకు చెందిన సిద్దార్థ్ అండర్– 14 ట్రిపుల్ జంప్లో ప్రథమస్థానం, ఇంటర్ విద్యార్థి నరేందర్ నాయక్ షాట్పుట్లో ద్వితీయ స్థానంతో రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారు. అనుమానితులు కన్పిస్తే సమాచారం ఇవ్వాలి నర్సాపూర్: అనుమానితులు కనిపిస్తే తమకు సమాచారం ఇవ్వాలని తూప్రాన్ డీఎస్పీ నరేందర్గౌడ్ ప్రజలను కోరారు. బుధవారం ఉదయం పట్టణంలోని చైతన్యపురి కాలనీలో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సైబర్ నేరాల పట్ల అందరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. సోషల్ మీడియాలో వచ్చే లింకులు ఓపెన్ చేయొద్దని హితవు పలికారు. యువకులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. కాగా సరైన డాక్యుమెంట్లు లేని 59 ద్విచక్ర వాహనాలు, ఏడు ఆటోలను స్వాధీనం చేసుకున్నామని సీఐ జాన్రెడ్డి చెప్పారు. వాటికి సంబంధించిన డాక్యుమెంట్లు అందజేస్తే అప్పగిస్తామన్నారు. కార్యక్రమంలో సీఐ రంగకృష్ణ, వెంకటరాజాగౌడ్, ఎస్ఐ రంజిత్రెడ్డితో పాటు ఏడుగురు ఎస్ఐలు సుమారు వంద మంది పోలీసులు పాల్గొన్నారు. దుర్గమ్మ దర్శనానికి వేళాయే పాపన్నపేట(మెదక్): ప్రసిద్ధి చెందిన ఏడుపాయల దుర్గమ్మ ఆలయం భక్తుల దర్శనానికి ముస్తాబవుతోంది. 60 రోజులుగా మంజీరా వరదల్లో మునిగిన ఆలయాన్ని సిబ్బంది శుభ్రం చేశారు. లక్షలాది క్యూసెక్కుల ప్రవాహ ంతో ఆలయం పూర్తిగా దెబ్బతింది. క్యూలైన్లు, రేకులు, ఫ్లోరింగ్, గ్రానైట్ దెబ్బతిన్నాయి. లడ్డు ప్రసాదం కౌంటర్ కొట్టుకుపోయింది. సుమా రు రూ. కోటిన్నర నష్టం వాటిల్లినట్లు సమాచారం. ప్రస్తుతానికి ఆలయాన్ని సిబ్బంది శుభ్రం చేశారు. కాగా విద్యుత్ సరఫరా ఇంకా పునరుద్ధరించలేదు. రెండు రోజుల్లో దర్శనాలు ప్రారంభం కావొచ్చని ఆలయ వర్గాలుతెలిపాయి. -
అక్రమ నిర్మాణాలపై కొరడా
మెదక్ బల్దియా అధికారులు మాస్టర్ప్లాన్ను పక్కాగా అమలు చేస్తున్నారు. ఇటీవల నిబంధనలు అతిక్రమించి నిర్మించిన రెండు భవనాలను కూల్చివేశారు. అందులో ఓ భవనం గ్రీన్జోన్ పరిధిలో ఉండగా, మరో భవనం అనుమతిని మించి నిర్మించడంతో కఠినంగా వ్యవహరించారు. ఈ రెండు సంఘటనలతో మున్సిపాలిటీ పరిధిలో అనుమతి లేకుండా ఇళ్లు నిర్మించాలంటేనే పలువురు జంకుతున్నారు. – మెదక్జోన్ మెదక్ మున్సిపాలిటీ 1952లో ఆవిర్భవించింది. 18 వేల పైచిలుకు ఇళ్లు ఉండగా, సుమారు 80 వేల మంది ఇక్కడ నివసిస్తున్నారు. జనాభాతో పోటీపడి పట్టణ విస్తీర్ణం రోజురోజుకు పెరుగుతోంది. ఈ నేపథ్యంలో 1992లో దీనికి మాస్టర్ప్లాన్ అమలు చేయగా, ఇది అమల్లోకి వచ్చి 33 ఏళ్లు అవుతోంది. అయితే దీనిని ఇప్పటివరకు పక్కాగా అమలు చేసిన దాఖలాలు లేవు. దీంతో పట్టణంలో ఇష్టానుసారంగా అక్రమ నిర్మాణాలు కొనసాగించారు. అయినా అడ్డుచెప్పిన వారు లేరు. దీంతో అనేక రకాలుగా ప్రభుత్వ స్థలాలు ఆక్రమణకు గురైనట్లు పలువురు బహిరంగంగానే విమర్శిస్తుంటారు. భారీ వర్షాలు కురిసినప్పుడల్లా పట్టణం అంతా జలమయంగా మారుతోంది. ఇటీవల రెండు భవనాల కూల్చివేత పట్టణంలో ఇటీవల అక్రమంగా నిర్మించిన రెండు భవనాలను మున్సిపల్ అధికారులు కూల్చివేశారు. మిలటరీ కాలనీలో రోడ్డు పక్కన జీప్లస్ వన్ నిర్మాణం కోసం స్లాబువేశాడు. కాగా గ్రీన్జోన్లో ఇళ్లు నిర్మించటం నిషేధమని అధికారులు గుర్తించి నిర్మాణాన్ని నిలిపి వేయించారు. అలాగే అజంపుర ప్రాంతంలో గల ఏదులచెరువుకు సంబంధించి కొంత స్థలం ఉండగా, అందులో మహిళా జూని యర్ కళాశాలతో పాటు షాదీఖానాను ప్రభుత్వం నిర్మించింది. గతంలో పట్టణంలో రోడ్డు విస్తరణలో భాగంగా పట్టణానికి చెందిన ఓ వ్యక్తి ఇల్లు కూల్చివేయగా, అతడికి ఏదుల చెరువులో కొంత స్థలం కేటాయించారు. సదరు వ్యక్తి ఆ స్థలాన్ని ఇతరులకు విక్రయించాడు. దానిని కొనుగోలు చేసిన వ్యక్తి ఇటీవల ఆ ప్రదేశంలో షాపింగ్ (కమర్శియల్) భవనాన్ని నిర్మించాడు. కాగా కేటాయించిన దాని కన్నా ఎక్కువ స్థలంలో నిర్మించాడని గుర్తించిన అధికారులు కొంతభాగాన్ని కూల్చివేశారు. ఈ రెండు సంఘటనలతో మెదక్ బల్దియాలో అనుమతులు లేకుండా ఇళ్లు నిర్మించాలంటేనే పలువురు జంకుతున్నారు. అన్నిరకాల అనుమతులు ఉంటే తప్ప ఇళ్ల నిర్మాణాల జోలికి వెళ్లటం లేదు. నిబంధనలు అతిక్రమించినకట్టడాల కూల్చివేత మాస్టర్ప్లాన్ అమలులో భాగంగా కఠిన నిర్ణయాలు అక్రమ నిర్మాణాలంటేనేజంకుతున్న వైనం -
కొనుగోలు కోలాహలం
జిల్లాలో ఖరీఫ్ సీజన్కు సంబంధించి వరి కోతలు మొదలయ్యాయి. కొన్ని చోట్ల ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈసారి 423 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం దిగుబడులు వచ్చే అవకాశం ఉండగా, కొనుగోలు కేంద్రాలకు 3.80 లక్షల మెట్రిక్ టన్నుల ఽధాన్యం రానున్నట్లు అధికారులు అంచనా వేశారు. –మెదక్ అర్బన్ మునుపెన్నడూ లేని విధంగా ఈ సారి కురిసిన వర్షాలు.. పోటెత్తిన వరదల్లో పంటలు మునిగి తేలాయి. దిన దిన గండంగా ఎవుసం చేసిన అన్నదాత ఎట్టకేలకు గట్టెక్కాడు. కొన్ని చోట్ల ఇంకా పంటలు చేతికి రాలేదు. జిల్లాలో సుమారు 3.80 లక్షల మెట్రిక్ టన్నుల వరి పంట ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందని భావిస్తున్నారు. ఇందులో 3.30 లక్షల మెట్రిక్ టన్నులు రైస్ మిల్లుల్లో దించుకుంటామని, మరో 60 వేల మెట్రిక్ టన్నులు సమీప జిల్లాలకు పంపించే అవకాశం ఉందని డీఎం జగదీశ్వర్ తెలిపారు. కాగా గత ఖరీఫ్కు సంబంధించి 90 శాతం, యాసంగికి సంబంధించి 50 శాతం సీఎంఆర్ పూర్తి చేశారు. ప్రస్తుతం మొత్తం 493 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఇందులో ఐకేపీ 176, పీఏసీఎస్ 317 కేంద్రాలు ధాన్యాన్ని కొనుగోలు చేస్తాయి. కాగా ఈసారి 38 పారా, 47 రా రైస్ మిల్లులకు ధాన్యం కేటాయించనున్నారు. ఎంపిక చేసిన మిల్లులు బ్యాంక్ గ్యారంటీ విధిగా ఇవ్వాల్సి ఉంటుంది. కోతలు ప్రారంభం కొల్చారం, రామాయంపేట, పాపన్నపేట మండలాల్లో ఇప్పటికే వరి కోతలు ప్రారంభమయ్యాయి. కాగా కొల్చారం మండలంలోని వరిగొంతం, అప్పాజిపల్లి, అంసాన్పల్లి, పోతంశెట్టిపల్లి, కొంగోడ్, నాయిని జలాల్పూర్ , వెంకటాపూర్, కొల్చారం గ్రామాల్లో నర్సాపూర్ ఎమ్మెల్యే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు. పాపన్నపేట మండలంలోని చీకోడ్, లింగాయపల్లి, లక్ష్మీనగర్లో వరి కోతలు కోస్తున్నారు. రామాయంపేట మండలంలోని కోనాపూర్, వెంకటాపూర్, ప్రగతి ధర్మారం, నిజాంపేట మండలం నస్కల్, నందిగామ, కల్వకుంట తదితర గ్రామాల్లో వరి కోతలు ప్రారంభమైనా... ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించలేదు. ఏర్పాట్లు పూర్తి చేశాం ధాన్యం కొనుగోలుకు ఇబ్బందులు కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేశాం. కోటి గన్నీ బ్యాగులు అవసరం ఉండగా, ప్రస్తుతం 50 లక్షలు నిల్వ ఉన్నాయి. మిగతావి త్వరలో వస్తాయి. 13 వేల టార్పాలిన్లు అందుబాటులో ఉన్నాయి. మరో 7 వేలు అవసరం అవుతాయి. అవసరమైనన్నీ మాయిశ్చర్ మీటర్లు, ఎలక్ట్రానిక్ కాంటాలు అందుబాటులో ఉన్నాయి. ఈసారి కొత్తగా 100 ఆటోమెటిక్ ప్యాడీ క్లీనర్లను ఉపయోగిస్తాం. – జగదీశ్ కుమార్, డీఎం, సివిల్ సప్లయిస్ 3.80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అంచనా 426 కొనుగోలు కేంద్రాలుప్రారంభం 7 వేల టార్పాలిన్లు.. 50 లక్షల గన్నీ బ్యాగులు అందుబాటులో గోదాంలు -
తాగునీటి కోసం తండ్లాట
మండల పరిధిలోని కామారం తండా వాసులు తాగునీటి కోసం నానా ఇబ్బందులు పడుతున్నారు. మిషన్ భగీరథ నీరు సరఫరా కాకపోవడంతో వ్యవసాయ బోరుమోటార్లను ఆశ్రయించాల్సి వస్తుంది. తాగునీరు సరిగా సరఫరా కావడం లేదని, ప్రత్యామ్నాయం ఏర్పాట్లు చేయాలని ఎన్నిసార్లు కోరినా గ్రామపంచాయతీ కార్యదర్శి పట్టించుకోవడం లేదని మహిళలు విమర్శించారు. వరి కోతలు మొదలైతే వ్యవసాయ రైతులు కూడా బోరుమోటార్లు బంద్ చేస్తారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి తమకు తాగు నీరు అందించేందుకు చర్యలు చేపట్టాలని కోరారు. – చిన్నశంకరంపేట(మెదక్) -
498 ధాన్యం కొనుగోలు కేంద్రాలు
● కలెక్టర్ రాహుల్రాజ్ ● అవినీతికి పాల్పడితే కేసులే.. రామాయంపేట(మెదక్): ధాన్యం కొనుగోలులో అవినీతికి పాల్పడితే కేసులు తప్పవని కలెక్టర్ రాహుల్రాజ్ హెచ్చరించారు. మండలంలోని కోనాపూర్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అకాల వర్షాలతో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోకుండా టార్ఫాలిన్లు, గన్నీ బ్యాగులు అందుబాటులో ఉంచామన్నారు. జిల్లాలో 498 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధం చేశామని, ఇందులో 430 కేంద్రాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయని చెప్పారు. పది కేంద్రాలకు రైతులు ధాన్యం తరలించారని, దీపావళి అనంతరం కేంద్రాలకు అధిక మొత్తంలో ధాన్యం వచ్చే అవకాశం ఉందని, తూకం యంత్రాలతోపాటు తేమ శాతాన్ని కొలిచే పరికరాలు అందుబాటులో ఉంచాలని నిర్వాహకులకు సూచించారు. అనంతరం గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్ల ప్రగతిని పరిశీలించారు. ఆయన వెంట ఎంపీడీఓ సజీలుద్దీన్ తదితరులున్నారు. విద్యార్థులను ఇబ్బందులు పెట్టొద్దు మెదక్ కలెక్టరేట్: బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పథకం కింద ప్రైవేట్ పాఠశాలల్లో చదివే విద్యార్థులను బకాయిల కోసం గది బయటకు పంపితే కఠిన చర్యలు ఉంటాయని కలెక్టర్ రాహుల్రాజ్ పేర్కొన్నారు. ప్రైవేట్ విద్యాసంస్థలు విద్యార్థులను ఇబ్బందులు పెట్టొద్దని చెప్పారు. విద్యార్థులకు సంబంధించిన ఫీజు ప్రభుత్వం చెల్లిస్తుందని, తల్లిదండ్రులను ఫీజు కట్టమని అడగటం లేదా విద్యార్థులను బయటకు పంపడం వంటి వాటికి పాల్పడితే తీవ్రంగా పరిగణిస్తామన్నారు. అనంతరం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కంట్రోల్రూంను కలెక్టర్ ప్రారంభించారు. -
పోషక ఆహారంతో సంపూర్ణ ఆరోగ్యం
ప్రతిజ్ఞ చేస్తున్న విద్యార్థులుతూప్రాన్: సమతుల్య ఆహారంతో సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చునాని ఐసీడీఎస్ సూపర్ వైజర్ శివ కుమారి పేర్కొన్నారు. మంగళవారం పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో పోషక ఆహారంపై 9, 10వ తరగతి విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వ్యాసరచన, డ్రాయింగ్, స్పీచ్ కాంపిటీషన్ నిర్వహించారు. పోటీ పరీక్షలో గెలుపొందిన విద్యార్థులను అభినందించా రు. కిశోర బాలికలు తీసుకునే ఆహారంలో అన్ని రకా ల సమతుల్య ఆహారం తీసుకుంటేనే సరైన పోషణ లభిస్తుందని తెలిపారు. దీనితో పాటు వ్యక్తిగత పరి శుభ్రత, నిత్యం సుమారు 4లీటర్లకు అధికంగా మంచినీరు తాగాలని సూచించారు. అనంతరం విద్యార్థులతో పోషణకు సంబంధించిన ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురా లు ఫ్లోరిన్, అంగన్వాడీ టీచర్లు శ్రీలత, ఉమా పాల్గొన్నారు. ఐసీడీఎస్ సూపర్ వైజర్ శివకుమారి -
రూ.8 కోట్లతో పర్యాటక సొబగులు
● దంతేపల్లి శివారులో 80 ఎకరాలలో ఏర్పాటు ● జిల్లా అటవీ అధికారి జోజి ● పర్యాటక ప్రదేశం సందర్శన రామాయంపేట(మెదక్): రామాయంపేట అటవీశాఖ రేంజ్ పరిధిలో పర్యాటక ప్రాంతం ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం మండలంలోని దంతేపల్లి శివారులో 80 ఎకరాల అటవీప్రాంతాన్ని గుర్తించారు. రూ.8 కోట్ల వ్యయంతో ఇది ఏర్పాటు కానుంది. పర్యాటకులు రాత్రివేళ బస చేయడానికి వీలుగా గుడారాలు, గుట్టల చుట్టూ రహదారి సదుపాయం, లోపలిభాగంలో తిరుగడానికి వీలుగా సఫారి వాహనం, ఇతర వసతులు సమకూరనున్నాయి. మట్టిరోడ్డు వెంట పర్యాటకులు కూర్చోడానికి వీలుగా కుర్చీలు, బల్లలు, తాగునీటి సదుపాయం, మూత్రశాలలతో నిర్మించనున్నారు. కుంటలు, చెక్డ్యాంల నిర్మాణం, రెండు వాచ్ టవర్లు ఏర్పాటు, సోలార్ బోర్వెల్, వాటర్ ట్యాంక్, రహదారికి రెండువైపులా ఫెన్సింగ్ లాంటివి ఏర్పాటు చేయనున్నారు. మెదక్, కామారెడ్డి జిల్లాలను కలుపుతున్న అంతర్ జిల్లా రహదారిని ఆనుకునే పది కిలోమీటర్ల మేర వైశాల్యంలో దీనిని ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. దీనితో పర్యాటకులకు వణ్యప్రాణులతోపాటు జలపాతాలు, అటవీ సొబగులు, గుట్టలు, కుంటలు వీక్షించే అవకాశం కలుగుతుంది. ఈకో నిధులతో.. వణ్యప్రాణి సంరక్షణ విభాగం పరిధిలో ఈకో నిధులతో పర్యాటక ప్రాంతం ఏర్పాటు చేయనున్నారు. దంతేపల్లి అటవీప్రాంతం పరిధిలో ఇందుకోసం ఆశాఖ అధికారులు ప్రతిపాదనలు రూపొందిస్తున్నారు. పర్యాటకుల కోసం దంతేపల్లి శివారులోని కాకుల గండి, లొంక ప్రాంతాల్లో దీనిని ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు జిల్లా అటవీ అధికారి జోజి, ఇతర అధికారులు అటవీప్రాంతాన్ని సందర్శించారు. -
దర్జాగా దగా
సీఎంఆర్ బియ్యం ఇవ్వడంలో మిల్లర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాలను సైతం ఖాతరు చేయడంలేదు. ఇప్పటికే పలుమార్లు గడువు పొడిగించినప్పటికీ మిల్లర్లు మొండికేస్తున్నారు. రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని మరాడించి సివిల్సప్లైకి అప్పగించాల్సిన కస్టమ్ మిల్లింగ్ రైస్(సీఎంఆర్) బియ్యాన్ని కాజేస్తున్నారు. తొమ్మిదేళ్లుగా 13 మంది మిల్లర్ల యాజమాన్యాలు 61వేలకుపైగా మెట్రిక్టన్నుల బియ్యం ఎగ్గొట్టారు. వీటి విలువ రూ. 214 కోట్లు. రికవరీ కోసం ఆర్ఆర్యాక్టు ప్రయోగించినా వసూళ్లు కాకపోవడం గమనార్హం. – మెదక్జోన్ మెదక్ జిల్లాలో గత తొమ్మిదేళ్లు(వానాకాలం, రబీ)గా 13 రైస్ మిల్లర్లు 61,786.193 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సివిల్సప్లైయ్కి బకాయి పడ్డారు. వీటికి సంబంధించి జరిమానా, వడ్డీ కలిపి మొత్తం రూ.214.15 కోట్లు ఉంటుందని సంబంధిత అధికారులు చెబుతున్నారు. వీటి రికవరీ కోసం ఆర్ఆర్ యాక్టు ప్రయోగించినా పెద్దగా ఫలితం లేదని తెలిపారు. రికవరీ చేయకుండానే కేటాయింపులు బకాయి పడిన మిల్లర్ల నుంచి పూర్తిగా బియ్యం రికవరీ చేశాకే మళ్లీ ధాన్యాం కేటాయించాల్సి ఉంది. కానీ అవేం నిబంధనలు పట్టించుకోకుండా తొమ్మిదేళ్ల పాటు వానాకాలం, రబీ సీజన్లలో 18 సార్లు బకాయిపడిన మిల్లులకు ధాన్యం కేటాయించడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అప్పట్లో ఉన్న నేతల ఒత్తిడి ఏమైనా ఉందా? లేకా మరేకారణాలు ఉన్నాయో తెలియదుకానీ వందల కోట్ల విలువైన బియ్యాన్ని 13 మంది మిల్లర్లు బొక్కడం గమనార్హం. ఒకే మిల్లు వద్ద రూ.4 కోట్ల బియ్యం బకాయి పాపన్నపేటకు చెందిన ఒక రైస్ మిల్లు.. 2012 నుంచి 2016 వరకు వానాకాలం, యాసంగిలో 70.128 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సివిల్సప్లైయ్కి బకాయి పడింది. ఇందుకు సంబంధించి జరిమానా, వడ్డి కలిపి ఆ బియ్యం విలువ రూ.4 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. సదరు మిల్లర్ యజమాని ఆ బియ్యాన్ని బహిరంగ మార్కెట్లో దర్జాగా విక్రయించి రూ.కోట్లు సొమ్ము చేసుసుకున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆర్ఆర్యాక్టు ప్రయోగం తొమ్మిదేళ్లుగా 61,786 మెట్రిక్ టన్నుల సీఎంఆర్ బియ్యం బకాయి పడిన 13 మంది మిల్లర్లకు నోటీసులు ఇచ్చాం. అయినా స్పందించక పోవటంతో వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేశాం. ఆర్ఆర్యాక్టు ప్రయోగించాం. రికవరీకి చేర్యలు చేపడుతున్నాం. – జగదీశ్కుమార్, డీఎం సివిల్సప్లై తొమ్మిదేళ్లుగా సీఎంఆర్ బియ్యం ఎగవేత రైస్ మిల్లర్ల ఇష్టారాజ్యం 61,786 మెట్రిక్ టన్నుల రైస్ బకాయి పెనాల్టీతో వీటివిలువ రూ.214 కోట్లు క్రిమినల్ కేసులు నమోదు -
అప్పులు తీర్చేందుకే రెండేళ్లు
మాజీ ఎమ్మెల్యే హనుమంతరావు నిజాంపేట(మెదక్): గత ప్రభుత్వంలో చేసిన అప్పులు తీర్చడంతోనే రెండేళ్ల పాలన సరిపోయిందని మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే హనుమ ంతరావు అన్నారు. మంగళవారం మండల పరిధిలోని రాంపూర్ గ్రామంలో లీలా గ్రూప్ చైర్మన్, కాంగ్రెస్ నాయకుడు డా.మోహన్ నాయక్ సహకారంతో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పులు చేసినా ఎలాంటి అభివృద్ధి చేయలేదని విమర్శించారు. దళితులను ముఖ్యమంత్రిని చేస్తానని, మూడెకరాల భూమి ఇస్తామని చెప్పి మోసం చేశారన్నారు. వచ్చే మూడేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందన్నారు. అనంతరం మహిళలు గ్రామానికి బస్సులు నడపాలని విజ్ఞప్తి చేయడంతో డిపో మేనేజర్తో ఫోన్లో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆంజనేయులు, మహేందర్, సత్యనారాయణ, వెంకట్గౌడ్ పాల్గొన్నారు. హవేళిఘణాపూర్(మెదక్): మెదక్ మండలం సంగాయిగూడతండాకు చెందిన కమలను హత్యచేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని, ఆమె కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని తెలంగాణ జాగృతి మహిళా విభాగం అధ్యక్షురాలు మాధవి డిమాండ్ చేశారు. మంగళవారం ఆమె డీఎస్పీ ప్రసన్నకుమార్, మెదక్రూరల్ సీఐ జార్జ్కు వినతిపత్రాలు అందజేశారు. అనంతరం కమల నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. మహిళలపై జరుగుతున్న హత్యలపై రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, రాష్ట్ర మహిళా మంత్రి కొండా సురేఖ, సీతక్క ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఆమె వెంట జాగృతి జిల్లా నాయకుడు వీరప్ప గారి రమేశ్గౌడ్, రాజేశ్వరి తదితరులు ఉన్నారు. టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు ప్రణీద్ కుమార్ నిజాంపేట(మెదక్): 317 జీఓ కారణంగా స్థానిక జిల్లాను కోల్పోయిన ఉపాధ్యాయులందరికీ శాశ్వతంగా వారి సొంత జిల్లాలకు కేటాయించేలా చూడాలని టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు ప్రణీద్ కుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు టీపీటీఎఫ్ జిల్లా సభ్యత్వ నమోదు కార్యక్రమం నిజాంపేట మండలంలోని పలు ప్రభుత్వ ఉన్నత, ప్రాథమిక పాఠశాలలో నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి బైతి ఐలయ్య మాట్లాడుతూ.. తాత్కాలిక డిప్యుటేషన్ కోసం ఇచ్చిన జీఓ 190 సీనియర్ ఉపాధ్యాయులకు అన్యాయం చేసే లా ఉందన్నారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు నవీన్ రత్నాకర్, ప్రధాన కార్యదర్శి మహేశ్వర్, జిల్లా బాధ్యులు మోహన్, పరమేశ్వర్, శ్రీకాంత్రెడ్డి, వినయ్కుమార్ పాల్గొన్నారు. నర్సాపూర్: రాజ్యాంగం ద్వారా సంక్రమించే హక్కులను బాలికలు సంపూర్ణంగా పొందాలని ఇన్చార్జి డీడబ్ల్యూఓ హేమ భార్గవి పేర్కొన్నారు. అంతర్జాతీయ బాలికల దినోత్సవాన్ని పురస్కరించుకుని మండల లీగల్ సర్వీస్ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. దేశంలో బాలికల రక్షణ కోసం రాజ్యాంగంలో పలు చట్టాలు ఉన్నాయని, ఆయా చట్టాలను బాలికలు తమ రక్షణకు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పోకిరిల నుంచి రక్షణ పొందడానికి 100 కు ఫోన్ చేసి సహాయం పొందాలన్నారు. కార్యక్రమంలో స్థానిక ఎస్ఐ రంజిత్రెడ్డి, కోర్టు ఏజీపీ సుధాకర్, ఎంఈఓ తారాసింగ్, లీగల్ సర్వీస్ కమిటీ న్యాయవాదులు మధుశ్రీ, రాజునాయక్, సాయికుమార్, ఐసీడీఎస్ సూపర్వైజర్లు సంతోష, జెండర్ కోఆర్డినేటర్ కవిత పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
ఎలాగూ శిక్ష పడుతుందని.. ఘోరానికి పాల్పడ్డాడు
మెదక్ మున్సిపాలిటీ: హత్య కేసులో తనకు ఎలాగైనా శిక్ష పడుతుందని భావించిన ఓ నిందితుడు మరో ఘాతు కానికి పాల్పడ్డాడు. గిరిజన మహిళకు మాయమాటలు చెప్పి తీసుకెళ్లి హత్యాచారం చేశాడు. సంచలనం సృష్టించిన మెదక్ జిల్లా కొల్చారం మండలం పొతంశెట్టిపల్లి వద్ద జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. హత్యకు గల కారణాలు తెలుసుకొని పోలీసులు సైతం నివ్వెరపోయారు. మంగళవారం మెదక్ జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు ఈ కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు. నిజామాబాద్ జిల్లా వర్ని మండలం సేవాలాల్ తండాకు చెందిన ఫకీరానాయక్.. ప్రస్తుతం సంగారెడ్డి జిల్లా వట్పల్లి మండలం అంబోజిగూడ తండాలో ఉంటున్నాడు. ఈనెల 11న మెదక్లో అడ్డాపైకి వచి్చన సంగాయిగూడ తండాకు చెందిన గిరిజన మహిళను పనికోసమని చెప్పి బస్సులో కొల్చారం మండలం ఏడుపాయల కమాన్ వద్ద ఉన్న అటవీ ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ ఆమెను చెట్టుకు కట్టేసి అత్యాచారం చేసి, బండ రాయితో కొట్టి వెళ్లిపోయాడు. కొనఊపిరితో ఉన్న ఆమెను పోలీసులు ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ కేసును సీరియస్గా తీసుకున్న పోలీసులు మెదక్లోని పాత బస్టాండ్ వద్ద గల ఓ వైన్స్ వద్ద ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించారు. పాత నేరస్తుడు ఫకీరానాయక్ను అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించారు. నిందితుడిపై ఇది వరకే ఏడు కేసులు ఉన్నాయి. మహిళ హత్య కేసుకు సంబంధించిన కేసులో శిక్ష పడుతుందన్న ఉద్దేశంతో తన కామవాంఛ తీర్చుకోవాలనుకున్నాడు. ఆమె నిరాకరించడంతో పైశాచికంగా వ్యవహరించాడు. ఆమె ఒంటిపై ఉన్న బట్టలు తీసి చెట్టుకు కట్టేసి అత్యాచారం చేసి, అక్కడే ఉన్న రాయితో కొట్టి చంపాడు. మహిళను హత్యచేసిన సమయంలో ఎత్తుకెళ్లిన ముక్కు పుడక, హత్యకు ఉపయోగించిన రాయి, కట్టె, చర్చి వద్ద వదిలేసిన దుస్తులను పోలీసులు స్వాదీనం చేసుకున్నారు. 2020లో జరిగిన హత్య కేసులో సోమవారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి నీలిమ నిందితుడు ఫకీరానాయక్కు జీవిత ఖైదుతోపాటు రూ.15వేల జరిమానా విధించారు. -
పార్టీ కోసం పని చేసే వారికి గుర్తింపు
నర్సాపూర్/కౌడిపల్లి(నర్సాపూర్): పార్టీ కోసం పని చేసే వారికి తగిన గుర్తింపు ఉంటుందని ఏఐసీసీ పరీశీలకురాలు జ్యోతి రౌతేలా అన్నారు. సోమవారం పట్టణంలోని ఓ ఫంక్షన్హాల్లో డీసీసీ అధ్యక్ష పదవి కోసం నర్సాపూర్, శివ్వంపేట మండలాలకు చెందిన పార్టీ నాయకుల అభిప్రాయ సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతి థిగా ఆమె హాజరై మాట్లాడారు. పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా అగ్రనేత రాహుల్గాంధీ పలు కార్యక్రమాలు చేపడుతున్నారని వివరించారు. పార్టీ పదవుల కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళ, మైనార్టీ వర్గాల కార్యకర్తలు పోటీ పడవచ్చన్నారు. పార్టీ కోసం పనిచేసే వారిని గుర్తించి పార్టీ పదవుల భర్తీ సమయంలో తగిన ప్రాధాన్యం ఇస్తారని తెలిపారు. కార్యక్రమంలో పీసీసీ అ బ్జర్వర్లు నసీర్ అహ్మద్, జగదీశ్వర్, వరలక్ష్మి, డీసీసీ అద్యక్షుడు ఆంజనేయులుగౌడ్, నియోజకవర్గ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే మదన్రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ సుహాసినిరెడ్డి, నాయకులు పాల్గొన్నారు. అనంతరం కౌడిపల్లి మండలం తిమ్మాపూర్లో కౌడిపల్లి, కొల్చారం, వెల్దుర్తి, మాసాయిపేట, చిలప్చెడ్ మండలాలకు చెందిన కాంగ్రెస్ నాయకులతో సమావేశం నిర్వహించి అభిప్రాయ సేకరణ నిర్వహించారు. 18న ఏఐసీసీ కార్యాలయానికి దర ఖాస్తుల జాబితా పంపుతామని చెప్పారు.ఏఐసీసీ పరిశీలకురాలు జ్యోతి రౌతేలా -
ఎవరి చేతికో పగ్గాలు!
● నామినేషన్ వేసిన ఆంజనేయులుగౌడ్, రాజిరెడ్డి, రాంచందర్గౌడ్ ● అందరి అభిప్రాయాలతో నివేదిక సా్థనిక సంస్థల ఎన్నికల వేళ.. కాంగ్రెస్ పార్టీని గ్రామీణస్థాయి నుంచి బలోపేతం చేయాలన్న లక్ష్యంతో ప్రజామోద యోగ్యమైన నాయకుడికి డీసీసీ పదవి కట్టబెట్టాలని, ఏకంగా ఏఐసీసీ నాయకులే రంగంలోకి దిగారు. సామాన్య కార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతినిధుల అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కేవలం నామినేషన్లనే కాకుండా, పార్టీకోసం కష్టపడిన, సేవాభావం గల నాయకుల వివరాలు సైతం సేకరిస్తున్నట్లు తెలిసింది. సమావేశానికి రాలేకపోయిన వారు ఫోన్ల ద్వారా తమ అభిప్రాయాన్ని తెలపవచ్చని సూచించినట్లు సమాచారం. నాయకత్వ ఒత్తిడి, పరపతికి ప్రాధాన్యం ఇవ్వడం లేదని కార్యకర్తలు అంటున్నారు. అయితే ప్రస్తుతం ప్రధానంగా డీసీసీ అధ్యక్ష రేసులో ఉన్న ఇద్దరు నాయకులు, ఒకే నియోజకవర్గానికి చెందిన వారు కావడంతో పోటీ తీవ్రంగానే ఉన్నట్లు కనపడుతుంది. రెండు జిల్లాలకు చెందిన ఇద్దరు ప్రజాప్రతినిధులు, చెరో అభ్యర్థి వైపు మొగ్గు చూపుతున్నట్లు పార్టీవర్గాలు గుసగుసలాడుతున్నాయి. చివరికి ఎవరు జిల్లా కాంగ్రెస్ బాద్షా అవుతారో వేచి చూడాల్సిందే. డీసీసీ అధ్యక్షుడిని నియమించి పార్టీని బలోపేతం చేసేందుకు అధిష్టానం ప్రత్యేక దృష్టి సారించింది. అందులో భాగంగా ఎంపిక కోసం కసరత్తు ప్రారంభించింది. ఈ మేరకు పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకుల అభిప్రాయాలను సేకరించినట్లు తెలిసింది. డీసీసీ పదవికి ముగ్గురు నామినేషన్లు వేసినా, ప్రధాన పోటీ ఇద్దరి మధ్యే ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. – మెదక్ అర్బన్ డీసీసీ అధ్యక్షుడి ఎంపిక కోసం ఏఐసీసీ నుంచి జ్యోతి రౌతేలా, పీసీసీ నుంచి ఎన్నికల పరిశీలకులు జగదీశ్వర్రావు, నాసిర్ అహ్మద్, వరలక్ష్మిని నియమించారు. ఆదివారం మెదక్, రామాయంపేట బ్లాక్ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు అధ్వర్యంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకుల అభిప్రాయాలను సేకరించినట్లు తెలిసింది. మెదక్ నియోజకవర్గంలోని రెండు బ్లాకుల ముఖ్య నాయకులు, కార్యకర్తలు ఒక అభ్యర్థి పేరును ప్రతిపాదించగా, టేక్మాల్, అల్లాదుర్గం, రేగోడ్ ప్రాంతానికి చెందిన కొంతమంది ముఖ్య నాయకులు, సంగారెడ్డి జిల్లాకు చెందిన అమాత్యుల నిర్ణయమే తమ అభిప్రాయంగా భావించాలని స్పష్టం చేసినట్లు సమాచారం. అయితే మెదక్ ప్రాంతానికి చెందిన నాయకులు కలిసికట్టుగా పరిశీలకుల ముందుకు వెళ్లి, తమ అభిప్రాయాన్ని ఏకకంఠంతో తెలిపినట్లు తెలుస్తోంది. మూడో అభ్యర్థి మాత్రం తాను నామమాత్రంగా పోటీలో ఉన్నట్లు స్పష్టం చేశారు. ఒకవేళ ఏఐసీసీ పరిశీలకులు అవకాశం ఇస్తే స్వీకరిస్తానని తెలిపారు. సోమవారం నర్సాపూర్, కౌడిపల్లిలో జరిగిన సమావేశానికి నర్సాపూర్, శివ్వంపేట, కౌడిపల్లి, వెల్దుర్తి, కొల్చారం, మాసాయిపేట మండలాలకు చెందిన కార్యకర్తలు హాజరయ్యారు. ఇక్కడ ఇద్దరు అభ్యర్థులకు మద్ధతు లభించినట్లు తెలుస్తోంది. -
హత్య కేసు దర్యాప్తు వేగవంతం: ఎస్పీ
కొల్చారం(నర్సాపూర్)/మెదక్మున్సిపాలిటీ: పోతంశెట్టిపల్లి శివారులో శనివారం గుర్తుతెలియని వ్యక్తుల చేతిలో హత్యాచారం, హత్యకు గురైన మహిళ కేసును ఛేదించేందుకు దర్యాప్తు వేగవంతం చేసినట్లు ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. సోమ వారం ఘటనాస్థలిని సందర్శించి మాట్లాడారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు. ఇప్పటికే సంబంధిత పోలీసులకు ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. ఎస్పీ వెంట మెదక్ డీఎస్పీ ప్రసన్నకుమార్, సీసీఎస్ ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి, ఎస్ఐ మోహినొద్దీన్, సిబ్బంది ఉన్నారు. అనంతరం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించిన ఎస్పీ ప్రజల నుంచి ఫిర్యాదులను నేరుగా స్వీకరించారు. ప్రజలు తమ సమస్యలపై 11 ఫిర్యాదులను అందజేయగా, వాటిని స్వయంగా స్వీకరించి పరిష్కారం కోసం సంబంధిత అధికారులకు తక్షణ ఆదేశాలు జారీ చేశారు. కొన్నింటిపై సంబంధిత పోలీస్స్టేషన్ల సీఐలు, ఎస్ఐలతో నేరుగా మాట్లాడి సమస్యల పరిష్కారానికి సూచనలు చేశారు. -
సమస్యల పరిష్కారానికే ప్రజావాణి
కలెక్టర్ రాహుల్రాజ్మెదక్ కలెక్టరేట్: ప్రజా సమస్యలను పరిష్కరించడానికే ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని కలెక్టర్ రాహుల్రాజ్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు సమస్యలపై కలెక్టర్కు వినతులు సమర్పించారు. మొత్తం 58 అర్జీలు అందజేయగా, ఇందులో భూ సమస్యలు 24, పెన్షన్లు 10, ఇందిరమ్మ ఇళ్ల కోసం 6, ఇతర సమస్యలపై 18 వచ్చాయి. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజల అభ్యర్థనలు గౌరవిస్తూ, పారదర్శకత, సమయపాలనతో సేవలందించాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్, డీఆర్డీఓ పీడీ శ్రీనివాసరావు, ట్రైనీ డీఆర్ఓ అహ్మద్, ఆయాశాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. కాగా మార్కెట్ విలువకనుగుణంగా ట్రిపుల్ఆర్ పరిహారం ఇవ్వాలని నర్సాపూర్ మండలం రెడ్డిపల్లి గ్రామస్తులు నిరసన తెలిపారు. అనంతరం కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. పాత జీఓ ప్రకారమే వేతనాలివ్వాలని డిమాండ్ చేస్తూ గిరిజన సంక్షేమ హాస్టళ్లలో పనిచేసే రోజువారీ కార్మికులు కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు. ఇసుక కొరత లేకుండా చూడండి నర్సాపూర్: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఇసుక కొరత లేకుండా చూడాలని కలెక్టర్ రాహుల్రాజ్ మైనింగ్ అధికారులను ఆదేశించారు. సోమవారం నర్సాపూర్ ఇసుక బజార్ను ఆకస్మికంగా తనిఖీ చేసి విక్రయాలకు సంబంధించిన పలు రికార్డులను పరీశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఉచితంగా ఇసుక అందిస్తున్నామని, నల్గొండ నుంచి తీసుకురావడానికి అయ్యే రవాణా చార్జీలను లబ్ధిదారుల నుంచి తీసుకుంటున్నట్లు చెప్పారు. పంచాయతీ కార్యదర్శి నుంచి టోకెన్ తీసుకొని వస్తే ఇసుక అందచేస్తారని వివరించారు. ఇసుక మాఫియాను తొలగించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశం అన్నారు. జిల్లాలో తొమ్మిది వేల పైచిలుకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయని, వాటి నిర్మాణ పనులు వివిధ దశల్లో ఉన్నాయని తెలిపారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ మహిపాల్, తహసీల్దార్ శ్రీనివాస్, మైనింగ్ శాఖ అధికారులు ఉన్నారు. -
తడి లేదు.. పొడి లేదు
● అలంకారప్రాయంగా షెడ్లు ● రూ. 40 లక్షల నిధులు వృథా ● నీరుగారుతున్న ప్రభుత్వ లక్ష్యం రామాయంపేట(మెదక్): మున్సిపాలిటీ పరిధిలో చెత్త సేకరణ అపహాస్యమవుతోంది. పట్టణానికి దూరంగా ఏర్పాటు చేసిన డంప్యార్డులో తడి, పొడి చెత్తను వేరు చేయడానికి, వాటిని రిసైక్లింగ్ చేయడానికి గాను రూ. 40 లక్షల నిధులతో నిర్మి ంచిన రెండు షెడ్లు నిరుపయోగంగా మారాయి. వీటి కోసం ఖర్చు చేసిన 40 లక్షల నిధులు వృథాగా మారాయి. ఆరు బయటే చెత్త పారబోత పట్టణంలో ప్రతి రోజూ ట్రాక్టర్లు, ఆటోల్లో 12 వార్డుల నుంచి సేకరిస్తున్న తడి, పొడి చెత్తను డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. వేర్వేరుగా చెత్తను ఇవ్వడానికి గాను పట్టణంలోని అన్ని గృహాలకు బుట్టలు సరఫరా చేశారు. అయినా వేర్వేరుగా ఇవ్వకుండా ఒకే చోట ఇస్తున్నారు. డంపింగ్యార్డులో తడి చెత్త, కుళ్లిపోయిన కూరగాయలు, ఇతర వస్తువులను సెగ్రిగేషన్ షెడ్డులో వేసి సేంద్రియ ఎరువు తయారు చేయాలి. పొడి చెత్తతో పాటు ప్లాస్టిక్, బాటిళ్లు, ఇతర వస్తువులను డీఆర్సీసీ (డ్రై రిసోర్స్ కలెక్షన్ సెంటర్)కు తరలించి వేరు చేస్తారు. ఇందుకోసం ప్రత్యేకంగా రెండు షెడ్లను వేర్వేరుగా నిర్మించారు. తయారు చేసిన సేంద్రియ ఎరువును మున్సిపాలిటీ పరిధిలో మొక్కలకు, నర్సరీల్లో వినియోగించి మిగితాది విక్రయిస్తారు. డీఆర్సీసీలో వేర్వేరు చేసిన చెత్త, ఇతర సామగ్రిని స్వచ్ఛంద సంస్థకు విక్రయించి చెత్త నుంచి సంపద సృష్టించాలి. దీంతో మున్సిపాలిటీకి ఆర్థికంగా చేయూత లభించడంతో పాటు చెత్త రహిత పట్టణంగా రూపొందుతుంది. కాగా పట్టణం మున్సిపాలిటీగా అవతరించి ఏడేళ్లు గడుస్తున్నా, ఇప్పటివరకు తడి, పొడి చెత్తను వేరు చేసే ప్రక్రియను ప్రారంభించలేదు. ట్రాక్టర్లు, ఆటోల్లో తరలిస్తున్న తడి, పొడి చెత్తతో పాటు ఇతర సామగ్రిని షెడ్లలో వేయకుండా ఆరు బయటనే వేస్తున్నారు. దీంతో ఆ ప్రాంతం అంతా దుర్వాసన వెదజల్లుతోంది. ఈప్రాంతంలో పంటలు చేస్తున్న రైతులు దోమలు, దుర్వాసనతో ఇబ్బంది పడుతున్నారు. సెగ్రిగేషన్ షెడ్డు, డీఆర్సీసీ సెంటర్ నిర్మాణం పూర్తయి ఏళ్లు గడుస్తున్నా, ఇప్పటివరకు వినియోగంలోకి తీసుకురాలేదు. ప్రభుత్వం రూ. లక్షలు ఖర్చు చేసినా ఫలితం దక్కడం లేదు. -
బస్సుల కోసం రోడ్డెక్కిన విద్యార్థులు
చిన్నశంకరంపేట(మెదక్): పాఠశాలల సమయానికి బస్సులు రాకపోవడంతో ఆగ్రహానికి గురైన విద్యార్థులు రోడ్డెక్కారు. సోమవారం మండలంలోని అంబాజిపేట ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టా రు. చిన్నశంకరంపేటలోని జెడ్పీ పాఠశాల, మోడల్ స్కూల్కు వెళ్లేందుకు రోడ్డుపై గంటపాటు వేచి ఉన్న బస్సు రా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాల సమయానికి బస్సులు నడపాలని డిమాండ్ చేశారు. రోడ్డుకు ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులకు గు రయ్యారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ నారాయణగౌడ్ పోలీస్ సిబ్బందితో వచ్చి విద్యార్థులు, వారి తల్లిదండ్రులను సముదాయించి రాస్తారోకో విరమింపజేశారు. -
లక్ష్యం.. నిర్లక్ష్యం
పచ్చదనం పెంచడం, పర్యావరణాన్ని పరిరక్షించడమే లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన వన మహోత్సవం జిల్లాలో మందకొడిగా సాగుతోంది. కొన్నిశాఖల నిర్లక్ష్యంతో లక్ష్యం నెరవేరడం లేదు. పథకం ప్రారంభమై మూడు నెలలు కావొస్తున్నా, జిల్లాలోని 4 మున్సిపాలిటీల్లో ఆశించిన స్థాయిలో ముందుకు సాగడం లేదు. ఇక జిల్లా పోలీస్శాఖ ఈ పథకాన్ని పట్టించుకోకపోవడం గమనార్హం. – మెదక్ కలెక్టరేట్ జూలై 17న కలెక్టరేట్లో ఇన్చార్జి మంత్రి వివేక్ మొక్కలు నాటి వన మహోత్సవం పథకాన్ని ప్రారంభించారు. జిల్లావ్యాప్తంగా 37 లక్షల మొక్కలు నాటే లక్ష్యాన్ని నిర్ణయించారు. జిల్లాలోని 21 మండలాలు, 492 గ్రామాలు, 4 మున్సిపాలిటీలు ఉన్నాయి. మండలాలు, గ్రామాల్లో ఎక్కడికక్కడే నర్సరీలు ఉన్నాయి. వీటిని డీఆర్డీఏ ఆధ్వర్యంలో పర్యవేక్షిస్తారు. అలాగే అటవీశాఖ ప్రత్యేకంగా నర్సరీలు ఏర్పాటు చేసింది. వీటితో పాటు జిల్లాలోని మెదక్, రామాయంపేట, తూప్రాన్, నర్సాపూర్ నాలుగు మున్సిపాలిటీల్లో ఇప్పటికే శాశ్వత నర్సరీలు ఉన్నాయి. వీటిలో నీడనిచ్చే వాటితో పాటు పండ్లు, పూలనిచ్చే 30 రకాల మొక్కలు పెంచుతున్నారు. ఆసక్తి చూపని మున్సిపాలిటీలు జిల్లా అటవీశాఖ ఆధ్వర్యంలో చేపట్టిన వన మహోత్సవంలో శాఖల వారీగా మొక్కలు నాటే లక్ష్యాన్ని కేటాయించారు. ఇందులో గ్రామీణ ప్రాంతాలు లక్ష్యానికి దాదాపు దగ్గర ఉన్నాయి. కానీ మున్సిపాలిటీల్లో మాత్రం పథకం ముందుకు సాగడం లేదు. 4 మున్సిపాలిటీలకు 2.60 లక్షలు లక్ష్యంగా కేటాయించగా, ఇప్పటివరకు 1,87,520 నాటడం పూర్తయ్యింది. మరో 72,480 లక్షలు పూర్తిచేయాల్సి ఉంది. అలాగే అగ్రికల్చర్ శాఖకు 30 వేలు కేటాయించగా 1,373 మాత్రమే నాటగా, పోలీస్శాఖకు 18 వేలు కేటాయించగా, ఒక్క మొక్క కూడా నాటకపోవడం గమనార్హం. ముందుకు సాగనివన మహోత్సవం పట్టించుకోని పోలీస్శాఖ అగ్రికల్చర్ అంతంతే.. 87 శాతం పూర్తి జిల్లాలో వన మహోత్సవం 87 శాతం పూర్తయ్యింది. కొన్ని శాఖలతో పాటు నాలుగు మున్సిపాలిటీల్లో వన మహోత్సవం ఆశించిన స్థాయిలో ముందుకు సాగడం లేదు. అందువల్లే లక్ష్యం పూర్తి కావడం లేదు. – జోజీ, డీఎఫ్ఓ -
రెవెన్యూ చట్టాలపై అవగాహన: ఆర్డీఓ
తూప్రాన్: రెవెన్యూ పాలన, భూ చట్టాలపై డివిజన్ పరిధిలో నూతనంగా నియమితులైన గ్రామపాలన అధికారులకు సోమవారం మున్సిపల్ కార్యాలయంలో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ఆర్డీఓ జయచంద్రారెడ్డి మాట్లాడుతూ.. వివిధ భూ సంబంధిత చట్టాలు, ప్రభుత్వ పథకాలు, గ్రామపాలన విధానాలపై అవగాహన కల్పించారు. ప్రత్యేకంగా భూభారతి చట్టం గురించి వివరించి, గ్రామస్థాయిలో భూముల రికార్డుల డిజిటల్ నిర్వహణ, ప్రజలకు సులభంగా భూమి వివరాలు అందుబాటులో ఉంచడం, భూములపై అనధికార ఆక్రమణలు నివారించడం వంటి అంశాల గురించి వివరించారు. ప్రభుత్వ భూములు, దేవాదాయ భూములు, వక్ఫ్, భూదాన్ భూములకు సంబంధించి చట్టపరమైన విధానాలు, వాటి రక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై పూర్తి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో తహసీల్దార్లు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. హవేళిఘణాపూర్(మెదక్): ప్రభుత్వ పాఠశాలల్లో హైస్కూల్ స్థాయి విద్యార్థులకు డిజిటల్ లెర్నింగ్ పుస్తకం తూచా తప్పకుండా అమలు చేయాలని జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి అన్నారు. సోమవారం హవేళిఘణాపూర్ డైట్లో ఏర్పాటు చేసిన మూడు రోజుల శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈసందర్భంగా విద్యార్థుల్లో కోడింగ్ డేటా సైన్స్, ఏఐ అంశాలలో నైపుణ్యం పెంపొందించేందుకు ఈ శిక్షణ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమంలో రిసోర్స్ పర్సన్లు శ్రీకాంత్, నాగరాజు, రవికాంత్త్, భౌతిక రసాయన శాస్త్ర ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మెదక్ కలెక్టరేట్: జిల్లా కేంద్రంలోని అవుట్డోర్ స్టేడియంలో ఉమ్మడి మెదక్ జిల్లా అథ్లెటిక్స్ పోటీలు సోమవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. అండర్– 14, అండర్– 17 బాలుర పోటీల్లో సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల నుండి 350 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. కార్యక్రమానికి ఇన్చార్జి యువజన క్రీడలశాఖ అధికారి, డీఈఓ రాధాకిషన్ హాజరై ప్రతిభ కనబర్చిన క్రీడాకారులకు మెడల్స్ అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబరిచి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. అనంతరం ఎస్జీఎఫ్ కార్యనిర్వాహక కార్యదర్శి నాగరాజు మాట్లాడుతూ.. అండర్–17లో 36 మంది అండర్–14లో 22 మంది మొత్తం 58 మంది ఉమ్మడి జిల్లా జట్టును రాష్ట్రస్థాయి పోటీలకు పంపించనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో పీడీలు శ్రీధర్రెడ్డి, మాధవరెడ్డి, మధుసూదన్, సత్యనారాయణ, శ్రీనివాసరావు, దేవేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆర్టీసీ ఎండీకి ఎంపీ రఘునందన్ విజ్ఞప్తి దుబ్బాక: స్థానిక బస్డిపోను పూర్తిస్థాయిలో పునరుద్ధరించాలని ఎంపీ రఘునందన్రావు కోరారు. ఈ మేరకు సోమవారం హైదరాబాద్ లోని బస్ భవన్లో ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డిని కలిసి ఎంపీ విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1998లో 54 బస్లతో డిపో ప్రారంభించారని 134 మంది సిబ్బంది ప్రతిరోజు 14,014 కి,మీటర్ల ప్రయాణంతో రూ.8 లక్షల దినసరి ఆదాయం సాధించిందన్నారు. నష్టాల సాకుతో 2006లో దుబ్బాక డిపోను మూసి వేయడంతో పెద్ద ఎత్తున ప్రజలు, ప్రజాప్రతినిధుల నిరసనలతో వారం రోజుల్లోనే 10 బస్లతో మళ్లీ పునః ప్రారంభించారన్నారు. ప్రస్తుతం 35 బస్లతో రాష్ట్రంలో ఆదాయపరంగా ముందున్న డిపోలలో దుబ్బాక ఒకటన్నారు. డిపోకు డీఎం ను నియమించి 60 బస్లను కేటాయించి పూర్తిస్థాయి డిపోగా మార్చాలని ఎండీకి విన్నవించారు. -
ముందస్తు అనుమతి తప్పనిసరి
మెదక్ మున్సిపాలిటీ: దీపావళి సందర్భంగా జిల్లా పరిధిలో తాత్కాలిక టపాకాయల దుకాణాలు ఏర్పాటు చేసే వ్యాపారులు తప్పనిసరిగా ముందస్తు అనుమతులు తీసుకోవాలని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు సూచించారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. ఇందుకు సంబంధించిన ఇతర వివరాలు, మార్గదర్శకాల కోసం సంబంధిత సబ్ డివిజనల్ పోలీస్ అధికారిని సంప్రదించాలన్నారు. అనుమతి లేకుండా దుకాణాలు ఏర్పాటు చేస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే సైబర్ నేరాల విషయంలో ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలన్నారు. ఇటీవల జరుగుతున్న నేరాల గురించి ప్రస్తావించారు. లోన్యాప్ మోసాలు, జాబ్ ఫ్రాడ్స్, బిట్కాయిన్, క్రిఫ్టో కరెన్సీ ఇన్వెస్ట్మెంట్ మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయని తెలిపారు. తక్కువ వడ్డీతో వెంటనే లోన్ ఇస్తామని చెప్పి కొన్ని యాప్లను ఉపయోగించి బ్లాక్ మెయిల్ చేస్తున్నట్లు చెప్పారు. సైబర్ మోసాలకు గురైన వారు వెంటనే హెల్ప్లైన్ 1930 నంబర్కు కాల్ చేయాలన్నారు.ఎస్పీ డీవీ శ్రీనివాసరావు


