breaking news
Medak
-
హడావుడే.. ఆచరణేది?
● నామమాత్రంగా 100 రోజుల ప్రణాళిక ● ఆర్భాటాలకే పరిమితమైన అధికారులు ● ఇబ్బంది పడుతున్న పట్టణ ప్రజలు వర్షాకాలంలో పట్టణాలను పరిశుభ్రంగా ఉంచాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీల్లో వంద రోజుల ప్రణాళిక అమలుకు శ్రీకారం చుట్టింది. ఈనెల 2 నుంచి సెప్టెంబర్ 10వ తేదీ వరకు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో మాత్రం నామమాత్రంగా ప్రణాళిక కొనసాగుతోంది. కేవలం ఫొటోలు, ఆర్భాటాలకే అధికారులు పరిమితం అయ్యారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. – రామాయంపేట(మెదక్)పట్టణంలో ఇళ్ల మధ్య నిలిచిన మురుగు నీరురామాయంపేట పట్టణంలోని కొన్ని వార్డుల్లో ఇళ్ల మధ్య, ఖాళీ స్థలాల్లో నిలిచిన మురుగు నీటితో స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. దోమలు విపరీతంగా పెరిగిపోగా, నివారణకు ఫాగింగ్ కూడా సక్రమంగా చేపట్టడం లేదు. ఉన్న రెండు ఫాగింగ్ యంత్రాల్లో ఒకటి చెడిపోవడంతో సమస్య తలెత్తింది. మున్సిపాలిటీ పరిధిలో పూర్తిస్థాయిలో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టి దోమల నివారణ మందు మురుగు కాలువల్లో పిచికారీ చేయించాలి. ఇందుకోసం వార్డుల వారీగా అధికారులకు ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది. పారిశుద్ధ్య సిబ్బంది, అధికారులు మాత్రం బ్యానర్ల ఎదుట ఫొటోలు తీసుకొని అధికారులకు పంపిస్తున్నారు. 100 రోజుల ప్రణాళిక ఈనెల 2వ తేదీన ప్రారంభం కాగా, సెప్టెంబర్ 10 వరకు కొనసాగనుంది. ఇందులో భాగంగా తడి, పొడి చెత్త విషయమై స్థానికులకు అవగాహన కల్పించడంతో పాటు మొక్కలు నాటాల్సి ఉంటుంది. ఎక్కువ సమస్యలు ఉన్న వార్డుల్లో ముందుగా ప్రణాళిక అమలు చేయాలనే ఆదేశాలను ఎవరూ పట్టించుకోవడం లేదు. కార్యక్రమం ప్రారంభమై ఇప్పటికీ 20 రోజులు అవుతున్నా, కేవలం నాలుగు వార్డుల్లో మాత్రమే పారిశుద్ధ్య పనులు జరుగుతున్నాయి. -
లక్ష్యం చేరని రుణం!
మొండిచేయి చూపుతున్న బ్యాంకర్లువడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్న రైతులు ● ఈ సారైనా లక్ష్యం చేరుకునేనా?జిల్లాలో వార్షిక రుణ ప్రణాళిక లక్ష్యాన్ని చేరుకోవడం లేదు. ఏటేటా కేటాయింపులు పెంచుతూ ప్రణాళిక ఖరారు చేస్తున్నా.. రుణ పంపిణీ మాత్రం 70 శాతం మించడం లేదు. ఫలితంగా రైతులు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించి అప్పుల పాలవుతున్నారు. జిల్లాలో 2025– 26 వార్షిక రుణ ప్రణాళిక రూ. 6,517.51 కోట్లుగా ఖరారు చేశారు. – మెదక్జోన్ జిల్లాలో నాలుగు లక్షల ఎకరాల వ్యవసాయ సాగు భూములు ఉండగా, 2.96 లక్షల మంది రైతులు ఉన్నారు. కాగా ఏటా రైతులకు పంట రుణాలతో పాటు వ్యవసాయ అనుబంధ రుణాలు ఇచ్చేందుకు బ్యాంకర్లు ముందుకు వచ్చి వార్షిక రుణ ప్రణాళికను ప్రకటిస్తున్నాయి. అయితే అందులో 70 శాతం రుణాలను మాత్రమే పంపిణీ చేస్తున్నారు. జిల్లాలో 2024– 25లో వార్షిక రుణ ప్రణాళిక వివిధ రంగాలకు రూ. 5,857 కోట్లు కేటాయించారు. కానీ ఇచ్చింది మాత్రం రూ. 4,366.84 కోట్లు మాత్రమే. ఇందులో వ్యవసాయం, అనుబంధ రుణాలు రూ. 3,647.75 కోట్లు కాగా, ఇచ్చింది మాత్రం రూ. 2,857.75 కోట్లు. అలాగే పంట రుణాల లక్ష్యం రూ. 2,267.25 కోట్లు కాగా, ఇచ్చింది రూ. 1,603.80 కోట్లు. అంటే కేవలం 70 శాతం రుణాలు మాత్రమే ఇచ్చి చేతులు దుపులుకున్నారు. గతం కంటే ఎక్కువగా.. రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) నిబంధనల ప్రకారం ఏటా 10 శాతం పెంచుతూ వార్షిక రుణ ప్రణాళికను తయారు చేస్తారు. ఈ క్రమంలో ఈ ఏడాది 2025–26 రుణ ప్రణాళిక రూ. 6,517.51 కోట్లుగా ఖరారు చేశారు. గతేడాదితో పోలిస్తే రూ. 660.51 కోట్లు అదనంగా కేటాయించారు. ఇందులో పంట రుణాలు రూ. 1,977.46 కోట్లు కాగా, వ్యవసాయ అనుబంధ రుణాలు రూ. 3,971.05 కోట్లు, ప్రాధాన్యత రంగానికి రూ. 5,481.60 కోట్ల చొప్పున కేటాయించారు.చర్యలు తీసుకుంటాం జిల్లాలో వార్షిక రుణాలు లక్ష్యం మేర ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటాం. బ్యాంకుల వారీగా కేటాయించిన రుణాలు అందించే విధ ంగా ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తాం. ఈ విషయంపై ప్రతి మూడు నెలలకోసారి కలెక్టర్ సమక్షంలో బ్యాంకర్లతో సమావేశం నిర్వహిస్తాం. – నర్సింహమూర్తి, లీడ్ బ్యాంక్ మేనేజర్ మెదక్ -
నూనె గింజల ఉత్పత్తికి ఊతం
కొత్త పథకానికి శ్రీకారం● ఈ ఖరీఫ్ నుంచే ఎన్ఎంఈఓ అమలు ● రైతులకు ఉచితంగా కొత్త విత్తన రకాల సరఫరా ● లబ్ధిదారుల ఎంపికకు వ్యవసాయశాఖ సన్నాహాలు పంటల వారీగా ఎంపిక చేసిన జిల్లాలు సోయాబీన్ : సంగారెడ్డి, ఆదిలాబాద్, నిర్మల్, కామారెడ్డి, నిజామాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్ పొద్దుతిరుగుడు : సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, కామారెడ్డి, నిజామాబాద్, భద్రాద్రి, రంగారెడ్డి, రాజన్న సిరిసిల్ల, మహబూబాబాద్, కరీంనగర్, నిర్మల్, పెద్దపల్లి వేరుశనగ : నల్లగొండ, నాగర్కర్నూల్, వనపర్తి, జోగుళాంబ, మహబూబ్నగర్, వికారాబాద్, నారాయణపేట కుసుమ : సంగారెడ్డి, రంగారెడ్డి, వికారాబాద్ నువ్వులు : జగిత్యాల, నిర్మల్, నిజామాబాద్ సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: వంట నూనె గింజల పంటల విస్తీర్ణం ఉత్పత్తి పెంచడమే లక్ష్యంగా ప్రభు త్వం సరికొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. ఎన్ఎంఈఓ (నేషనల్ మిషన్ ఆన్ ఈడబుల్ ఆయిల్) పథకం కింద సోయా, పొద్దుతిరుగుడు, వేరుశనగ, నువ్వులు, కుసుమ పంటలు సాగు చేసే రైతులకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా రైతులు సాంప్రదాయ పంటలకు స్వస్తి చెప్పేలా..అధిక దిగుబడులు ఇచ్చే కొత్త రకాల విత్తనాలను ఉచితంగా సరఫరా చేయనుంది. అలాగే సంబంధిత వ్యవసాయ శాస్త్రవేత్తలతో సాంకేతిక సహాయాన్ని అందించనుంది. ఈ ఖరీఫ్ సీజన్ నుంచే ఈ పథకాన్ని అమలు చేయనుంది. 2030 వరకు ఈ పథకాన్ని కొనసాగించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాయి. ఈ మేరకు లబ్ధిదారుల గుర్తింపుకు సన్నాహాలు చేస్తున్నారు. అధిక దిగుబడిని ఇచ్చే విత్తనాల సరఫరా.. ఈ పథకం కింద ఎంపికై న రైతులకు ఉచితంగా నూనె గింజల విత్తనాలను ప్రభుత్వమే సరఫరా చేయనుంది. ఒక్కో రైతుకు రెండున్నర ఎకరాలు (ఒక హెక్టారు)కు పరిమితి విధించారు. ఉదాహరణకు సోయా సాగు చేస్తున్న రైతులు 1994లో విడుదల చేసిన జే.ఎస్.–335 వైరెటీనే ఎక్కువగా విత్తుకుంటున్నారు. ఈ వైరెటీతో ఆశించిన దిగుబడి రావడం లేదు. వీటి స్థానంలో 2021లో రిలీజైన డీఎస్బీ–34, ఎంఏసీఎస్–1460 వైరెటీ సోయా విత్తనాలను సరఫరా చేస్తారు. అలాగే రైతు ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది. పంటలను ఎప్పటికప్పుడు పరిశీలించి, తగిన సూచనలు చేసేందుకు వ్యవసాయ శాస్త్రవేత్తలతో సాంకేతిక సహాయాన్ని అందిస్తారు. పాత వైరెటీలతో 60 శాతం తక్కువ దిగుబడి కొత్తగా వచ్చిన నూనెగింజల విత్తన రకాలకు, ప్రస్తుతం రైతులు వాడుతున్న విత్తనాలకు వచ్చే దిగుబడిలో 60 శాతం తక్కువగా ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. సోయా పంటనే ఉదాహరణగా తీసుకుంటే కొత్త వైరెటీలు (2021లో రిలీజైన డీఎస్బీ–34, ఎంఏసీఎస్–1460 వైరెటీ) తో ఎకరానికి 12 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. రైతులు మొగ్గు చూపేలా.. ప్రస్తుతం రాష్ట్రంలో వరి, పత్తి, మొక్కజొన్న వంటి పంటలనే ఎక్కువగా సాగు చేస్తున్నారు. ఈ రైతులు నూనెగింజల సాగు వైపు మొగ్గు చూపేలా చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోంది. మరోవైపు దేశంలో నూనెగింజల ఉత్తత్తి చాలా తక్కువగా ఉంది. వివిధ దేశాల నుంచి నూనెగింజలను దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ నూనెగింజల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ పథకానికి శ్రీకారం చుట్టింది. -
నాణ్యమైన భోజనం అందించాలి
అల్లాదుర్గం(మెదక్): విద్యార్థులకు మెనూ ప్రకారం, నాణ్యమైన భోజనం అందించాలని కలెక్టర్ రాహుల్రాజ్ సిబ్బందిని అదేశించారు. ఆదివారం అల్లాదుర్గంలోని ఎస్సీ బాలుర వసతి గృహం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యలపై ఆరా తీశారు. బాత్రూంలు అధ్వానంగా ఉండటంతో వెంటనే నిధులు మంజూరు చేస్తానని, పనులు ప్రారంభించాలని వార్డెన్కు సూచించారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లి రోగుల వివరాలు తెలుసుకున్నారు. సీజన్ల్ వ్యాధులకు సంబంధించి మందులు అందుబాటులో ఉన్నాయా..? అని డాక్టర్ను అడిగి తెలుసుకున్నారు. వానాకాలం సీజనల్లో వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. అల్లాదుర్గం కేజీబీవీలో సిబ్బంది, విద్యార్థినులు లేకపోవడంతో వెనుదిరిగారు. అర్హులందరికీ రైతుభరోసా టేక్మాల్(మెదక్): అర్హుందరికీ రైతు భరోసా డబ్బు లు జమ చేస్తామని కలెక్టర్ తెలిపారు. ఆదివారం మండలంలోని ఎల్లంపల్లి తండాలో పత్తి పంటను పరిశీలించారు. జిల్లాలో సరిపడా విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచామని తెలిపారు. జిల్లాలో 2,54,504 మంది రైతుల ఖాతాల్లో రూ. 207.14 కోట్లు జమ చేసినట్లు తెలిపారు. కలెక్టర్ రాహుల్రాజ్ -
కొనసాగుతున్న నిరసన
జిన్నారం (పటాన్చెరు): గుమ్మడిదల మండలం నల్లవల్లి గ్రామపంచాయతీ పరిధిలోని ప్యారానగర్ డంపింగ్ యార్డ్ ఏర్పాటుకు వ్యతిరేకంగా జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసనలు 138వ రోజుకు చేరుకున్నాయి. నల్లవల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన రిలే నిరాహార దీక్షలో స్థానిక మహిళలు పాల్గొని సంఘీభావం తెలిపారు. పచ్చని అడవిలో డంపింగ్ యార్డ్ ఏర్పాటుచేస్తే పర్యావరణానికి విఘాతం కలుగుతుందని, స్థానిక ప్రజల జీవనంపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. డంపింగ్యార్డ్ నిర్మాణ పనులు నిలిపేవరకు తమ ఆందోళనలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. కార్యక్రమంలో గ్రామస్తులు, మహిళలు, తదితరులు పాల్గొన్నారు. -
నిరాకరిస్తున్న బ్యాంకులు
వార్షిక రుణ ప్రణాళికలో వ్యవసాయం, దాని అనుబంధ రుణాలకు మాత్రమే ప్రాధాన్యం ఉంటుంది. కానీ రైతులకు ప్రకటించిన దాంట్లో 70 శాతం మేరకే రుణాలు ఇస్తున్నారు. దీంతో రైతులు చేసేదిలేక వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తూ అప్పుల పాలవుతున్నారు. జిల్లాలో 19 రకాల బ్యాంకులు ఉండగా, వాటికి అనుబంధంగా 99 బ్రాంచ్లు ఉన్నాయి. ప్రతి బ్యాంకు రైతులకు పంట రుణాలు ఇవ్వాలనే నిబంధన ఉంది. కానీ కొన్ని బ్యాంకులు రైతులకు పంట రుణాలు ఇచ్చేందుకు నిరాకరిస్తున్నారు. వీరిపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో జిల్లాలో వార్షిక రుణ ప్రణాళిక లక్ష్యాన్ని చేరుకోవడం లేదు. ● -
హోరాహోరీగా ఫుట్బాల్ పోటీలు
రాష్ట్రస్థాయికి ఎంపికై న క్రీడాకారులు వీరే..మెదక్జోన్: ఉమ్మడి మెదక్ జిల్లా ఫుట్బాల్ ఎంపిక పోటీలను జిల్లా కేంద్రంలోని సాయి స్టేడియంలో ఆదివారం నిర్వహించారు. రాష్ట్రస్థాయి పుట్బాల్ జట్టుకు 18 మంది క్రీడాకారులను ఎంపిక చేశారు. ఫుట్బాల్ అకాడమి ఆధ్వర్యంలో నిర్వహించిన క్రీడాకారుల ఎంపిక పోటీలలో ఉమ్మడి జిల్లా నుంచి 95 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఎంపికై న క్రీడాకారులు నిజామాబాద్లో ఈనెల 27 నుంచి జూలై 1వ తేదీ వరకు జరిగే రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొంటారని ఉమ్మడి మెదక్ జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ కార్యదర్శి నాగరాజు తెలిపారు. కార్యక్రమంలో సంయుక్త కార్యదర్శి నగేష్, సత్యనారాయణ, మెదక్ ఫుట్బాల్ అకాడమి కార్యదర్శి వినయ్ పాల్గొన్నారు. -
‘ఈ–పాస్’తోనే ఎరువుల విక్రయాలు
మెదక్మున్సిపాలిటీ: ఫర్టిలైజర్ దుకాణదారులంతా ఈ–పాస్ యంత్రాల ద్వారానే ఎరువులు విక్రయించాలని జిల్లా వ్యవసాయ అధికారి వినయ్ సూచించారు. శనివారం మెదక్ రైతు వేదికలో ఇండియన్ పొటాష్ లిమిటెడ్ కంపెనీ నిర్వాహకులు సుమారు 150 ఫర్టిలైజర్ షాపు యజమానులకు ఉచితంగా ఈ–పాస్ యంత్రాలను పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎరువుల విక్రయాల్లో పారదర్శకత పాటించేందుకు 2018 నుంచి మిషన్లను వినియోగంలోకి తెచ్చినట్లు తెలిపారు. ఈపద్ధతితో ఎరువులు నేరుగా రైతుకు చేరుతాయన్నారు. బ్లాక్ దందాకు చెక్ పెట్టవచ్చన్నారు. ఐపీఎల్ డిప్యూటీ మేనేజర్ మురళి మాట్లాడుతూ.. ప్రభుత్వ సబ్సిడీలను రైతులకు అందించాలన్న లక్ష్యంతో ఈ–పాస్ విధానాన్ని ప్రోత్సహించేలా తమ కంపెనీ, ఉచితంగా మిషన్లు పంపిణీ చేసిందన్నారు. మెదక్, రామాయంపేట డివిజన్లలోని సుమారు 150 షాపులకు అందచేశామని, వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఏడీఏ విజయనిర్మల, టెక్నికల్ ఫర్టిలైజర్ అధికారి హర్ష, మండల వ్యవసాయ అధికారులు నాగమాధురి, బాల్రెడ్డి, హరిప్రసాద్, శ్రీనివాస్, రామలింగారెడ్డి, రాజ్నారాయణ, ఫర్టిలైజర్ షాపు యజమానులు పాల్గొన్నారు.జిల్లా వ్యవసాయాధికారి వినయ్ -
‘కూత’ వేటు దూరంలో..
● తుది దశకు కొమురవెల్లిరైల్వే స్టేషన్ పనులు ● దసరాకు ప్రారంభిస్తామనికేంద్ర మంత్రి కిషన్రెడ్డి ప్రకటనకొమురవెల్లి(సిద్దిపేట): కొమురవెల్లి రైల్వే స్టేషన్ ప్రారంభం ఎప్పుడు ఎప్పుడాని ఎదురు చూస్తున్న భక్తులకు త్వరలోనే అందుబాటులోకి రానుంది. ప్రతి యేటా మల్లన్న స్వామిని దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్నాటక, తమిళనాడు, ఒడిశా, మహారాష్ట్ర, ఛత్తీస్ఘడ్ నుంచి భక్తులు వస్తుంటారు. కొత్తపల్లి నుంచి మనోహరాబాద్ వరకు నూతనంగా నిర్మాణం చేపడుతున్న రైల్వే లైన్లో కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయ వద్ద రైల్వేస్టేషన్ ఏర్పాటు చేయా లని చాలా కాలంగా డిమాండ్ ఉంది. దీంతో రైల్వేశాఖ స్పందించి స్టేషన్ మంజూరు చేయగా.. కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్యాదవ్తో కలసి 2024 ఫిబ్రవరి 15న భూమి పూజచేసి పనులను ప్రారంభించారు. స్టేషన్, ప్లాట్ఫాం నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. దసరాకు కొమురవెల్లి రైల్వే స్టేషన్ ప్రారంభిస్తామని ఇటీవల కిషన్రెడ్డి ప్రకటించారు. -
ప్రధాని మోదీ రైతు పక్షపాతి
మెదక్జోన్: ప్రధాని నరేంద్ర మోదీ రైతు పక్షపాతి అని కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్రెడ్డి అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన రైతు సదస్సుకు ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. మోదీ పగ్గాలు చేపట్టిన తర్వాత క్వింటాల్ ధాన్యానికి రూ. 2,300 మద్ద తు ధర వస్తుందన్నారు. అంతకుముందు కేవలం రూ. 1,300 మాత్రమే లభించేదన్నారు. పెట్టుబడి సాయం కోసం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా ఒక్కో రైతుకు ఏడాదికి రూ. 6 వేల చొప్పున ఖాతాల్లో జమచేస్తున్నామన్నారు. రాష్ట్రంలో నేటికీ 20 శాతం మంది రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీ కాలేదన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ సత్తాచాటుతుందన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లేశంగౌడ్, మాజీ అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, నాయకులు అంజయ్య, వె ంకట్రెడ్డి, ఎంఎల్ఎన్రెడ్డి, ప్రసాద్ పాల్గొన్నారు.కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీధర్రెడ్డి -
ట్రాక్ తప్పకుండా..
రైల్వే ప్రభావిత చెరువులకు మరమ్మతులు● జిల్లాలో 37 చెరువు, కుంటల గుర్తింపు ● కట్టల బలోపేతానికిరూ. 2 కోట్లు విడుదలమరమ్మతులు చేస్తున్నాం జిల్లాలో 37 రైల్వే ప్రభావిత ట్యాంకులను గుర్తించాం. అందులో 30 ట్యాంకుల కట్టల బలోపేతానికి రూ. 2 కోట్లు మంజూరు కాగా, 27 నీటి వనరులకు మరమ్మతులు చేస్తున్నాం. అలాగే గతేడాది దెబ్బతిన్న 26 చెరువు, కుంటల పనలు పూర్తి చేశాం. – శ్రీనివాస్రావు, మెదక్ ఇరిగేషన్ ఈఈరైలు మార్గంలో ట్రాక్ను ప్రభావితం చేసే చెరువులు, కుంటల బలోపేతానికి రైల్వే, ఇరిగేషన్ శాఖల అధికారులు శ్రీకారం చుట్టారు. జిల్లాలో ఈ ఏడాది 30 నీటి వనరులకు మరమ్మతులు చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం రూ. 2 కోట్లు మంజూరు కాగా, ముమ్మరంగా మరమ్మతులు చేపడుతున్నారు. ఇప్పటివరకు 27 చెరువు, కుంటల పనులు కొనసాగుతుండగా, మరో 3 నీటి వనరులు టెండర్ దశలో ఉన్నాయి. నిర్మాణాల్లో ఎలాంటి లోటుపాట్లు జరగకుండా ఇరిగేషన్ ఉన్నతాధికారులు దగ్గరుండి పనులు చేయిస్తున్నారు. – మెదక్జోన్ జిల్లాలోని పలు మండలాల పరిధిలో రైల్వేట్రాక్ పైభాగంలో 37 చెరువులు, కుంటలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వర్షాకాలంలో ఇవి ప్రమాదవశాత్తు తెగిపోతే దిగువ భాగంలో ఉన్న రైల్వేట్రాక్ (పట్టాలు) కొట్టుకుపోయి తీవ్ర నష్టం జరిగే ప్రమాదం ఉంటుంది. దీంతో ముందుగానే గుర్తించి తగు చర్యలు తీసుకుంటున్నారు. ఈ ఏడాది 37 నీటి వనరులను గుర్తించి, అందులో 30 చెరువు, కుంటల కట్టలను బలోపేతం చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం రూ. 2 కోట్లు మంజూరు కాగా, ఇరిగేషన్ అధికారులు టెండర్ పిలిచి కాంట్రాక్టర్లకు పనులు అప్పగించారు. 27 చెరువు, కుంటల పనులు కొనసాగుతుండగా, మరో 3 నీటి వనరులు టెండర్ దశలో ఉన్నట్లు సంబంధిత అధికారి ఒకరు చెప్పారు. నిర్మాణాల్లో ఎలాంటి లోటుపాట్లు జరగకుండా ఇరిగేషన్ ఉన్నతాధికారులు దగ్గరుండి పనులు చేయిస్తున్నారు. గతేడాది దెబ్బతిన్న చెరువులకు సైతం.. గతేడాది ఆగస్టు, సెప్టెంబర్లో కురిసిన భారీ వర్షాలకు జిల్లావ్యాప్తంగా 27 చెరువు, కుంటలు దెబ్బతిన్నాయి. కాగా అప్పట్లో ఇరిగేషన్ అధికారులు వెంటనే తాత్కాలిక మరమ్మతులు చేపట్టినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. దీంతో హవేళిఘణాపూర్ పెద్ద చెరువు తూము దెబ్బతిని, ఆయకట్టు వెనకాల సాగు చేసిన పంటలు కొంతమేర కొట్టుకుపోయాయి. ఆ చెరువులకు సైతం రూ. 40 లక్షలు వెచ్చించి మరమ్మతులు చేశారు. కలెక్టర్ ఫండ్ నుంచి సైతం రూ. 25 లక్షలు మంజూరయ్యాయి. -
అర్హులందరికీ రేషన్ బియ్యం పంపిణీ
నర్సాపూర్: రేషన్కార్డులు కలిగి ఉన్న లబ్ధిదారులందరికీ సన్న బియ్యం పంపిణీ చేయాలని డీఎస్ఓ నిత్యానంద ఆదేశించారు. శనివారం పట్టణంలోని ఎంఎల్ఎస్ పాయింట్ గోదాంతో పాటు పలు రేషన్ దుకాణాలను తనిఖీ చేసి బియ్యం నాణ్యత, రికార్డులను పరిశీలించారు. స్టాక్ అయిపోతే తన దృష్టికి తెస్తే బియ్యం సరఫరా చేస్తామన్నారు. నాణ్యతగా లేకపోతే, మార్పు చేయించి నాణ్యమైన బియ్యం అందేలా చర్యలు తీసుకుంటానని చెప్పారు. ఆయ న వెంట రేషన్ డీలర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు ఆనంద్కుమార్, పలువురు డీలర్లు, గోదాం సిబ్బంది ఉన్నారు. అరుణాచలానికి ప్రత్యేక బస్సు చిన్నశంకరంపేట(మెదక్): మెదక్ ఆర్టీసీ డిపో నుంచి అరుణాచలం గిరి ప్రదక్షణకు ప్రత్యేక బస్సును నడుపుతున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. శనివారం నార్సింగి మండలం శేరిపల్లిలో వారు మాట్లాడుతూ.. ఈనెల 24న సాయంత్రం 6 గంటలకు మెదక్ డిపో నుంచి బస్సు బయలుదేరి కాణిపాకం, గోల్డెన్ టెంపుల్, కంచి మీదుగా అరుణాచలం చేరుకుంటుందన్నారు. గిరి ప్రదక్షణ అనంతరం బస్సు తిరిగి మెదక్ బయలుదేరుతుందన్నారు. ఒక్కరికి రూ. 4 వేలు టికెట్ కాగా, హాఫ్ టికెట్ రూ. 2,600 ఉందన్నారు. మెదక్ పరిసర ప్రాంతాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఒకే గ్రామం నుంచి టీంగా వెళ్లాలనుకునే వారి కోసం ప్రత్యేక బస్సును అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు. ఇతర వివరాలకు 7382830420, 9494825746 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని కోరారు. దరఖాస్తులతో బారులు శివ్వంపేట(నర్సాపూర్): గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు ముగిసినప్పటికీ శనివారం తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తులు ఇచ్చేందుకు రైతులు భారీగా తరలివచ్చారు. దీంతో పోలీసులు క్యూలైన్ ఏర్పాటు చేశారు. ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి అర్జీలు స్వీకరించినట్లు తహసీల్దార్ కమలాద్రి, ఉప తహసీల్దార్ షఫీయోద్దీన్, ఆర్ఐ కిషన్ తెలిపారు. శనివారం 188 దరఖాస్తులు వచ్చినట్లు చెప్పారు. రైతు భరోసా రూ. 201 కోట్లు జమ మెదక్ కలెక్టరేట్: రైతు భరోసా కింద ఇప్పటివరకు జిల్లాలోని 2,53,020 మంది రైతుల ఖాతాల్లో రూ. 201 కోట్లు నేరుగా జమ అయినట్లు కలెక్టర్ రాహుల్రాజ్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ పథకం కింద అర్హులైన రైతులకు ఎకరానికి ఏడాదికి రూ. 12,000 పంట పెట్టుబడి సాయం (రెండు విడతల్లో) ప్రభుత్వం వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తుందని తెలిపారు.గోదాంలో స్టాక్ రిజిస్టర్ను పరిశీలిస్తున్న డీఎస్ఓ నిత్యానంద -
అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు
కొల్చారం(నర్సాపూర్): అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని కలెక్టర్ రాహుల్రాజ్ అన్నారు. శనివారం మండలంలోని సంగాయిపేటలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి భూమి పూజ చేశారు. కొందరు తమ పేరు జాబితాలో వచ్చినప్పటికీ మంజూరు పత్రాలు ఇవ్వలేదని కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. సాంకేతిక కారణాల వల్ల ఇబ్బంది ఏర్పడిందని, సర్వే జరిపి నిజమైన అర్హులందరికీ మంజూరు పత్రాలను అందజేస్తామని హామీ ఇచ్చారు. నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, ప్రభుత్వ నిబంధనల ప్రకారం విడతల వారీగా లబ్ధిదారుల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు జమ చేస్తామన్నారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, నిర్మాణ పనుల సమయంలో లబ్ధిదారులకు ఇబ్బందులు తలెత్తకుండా సంబంధిత అధికారులు పనిచేయాలని ఆదేశించారు. అనంతరం గ్రామంలోని ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేశారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు పట్టికను పరిశీలించారు. బడి బయట ఉన్న వారు ప్రభుత్వ పాఠశాలలో చేరేలా తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ రఫీక్ ఉన్నిసా, ఎంపీడీఓ కృష్ణవేణి, పంచాయతీ కార్యదర్శి సదాశివుడు, హెచ్ఎం దుర్గయ్య తదితరులు పాల్గొన్నారు.కలెక్టర్ రాహుల్రాజ్ -
అధిక మోతాదుకు చెల్లు
ఖేడ్లో మట్టి పరీక్ష కేంద్రం ఏర్పాటు ● ఉమ్మడి జిల్లాలో రెండో కేంద్రం ● ఉమ్మడి మెదక్ జిల్లా రైతులకు ప్రయోజనంనారాయణఖేడ్: ఎరువులు, రసాయన మందుల విచ్చలవిడి వాడకం ద్వారా నష్టపోతున్న రైతన్నలకు ఉపయోగపడేలా ఉమ్మడి జిల్లాకు మరో మట్టి నమూనా కేంద్రం మజూరైంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలోనే మట్టి నమూనా పరీక్షా కేంద్రం కొనసాగుతోంది. ఉమ్మడి జిల్లాలోని ఏ ప్రాంతం రైతులైనా తమ మట్టి నమూనాలను ఇక్కడే పరీక్షించుకోవాల్సి వస్తుంది. కాగా, ప్రభుత్వం తాజాగా నారాయణఖేడ్కు మట్టి పరీక్షా కేంద్రాన్ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకుగాను రూ.1.95కోట్లను విడుదల చేసింది. రూ.1కోటి ద్వారా భవన నిర్మాణం పనులు చేపట్టగా, రూ.95క్షలతో పరికరాలు, గాజు సామగ్రి, రసాయనాలు, ఫర్నీచర్, మౌలిక సదుపాయాలు, ఇతర వస్తువుల కొనుగోలుకు వినియోగించనున్నారు. ఈ కేంద్రం పరిధిలో జిల్లాతోపాటు మెదక్ జిల్లా పరిధిలోని మండలాల రైతులకు ప్రయోజనం చేకూరనుంది. ఖేడ్, అందోల్, జహీరాబాద్ నియోజకవర్గాలతోపాటు, మెదక్ జిల్లాలోని పెద్దశంకరంపేట, రేగోడ్, టేక్మాల్ తదితర మండలాల రైతులకు అనువుగా ఉండనుంది. ఖేడ్ పట్టణ శివారులోని జూకల్ శివారులో స్థలాన్ని ఇదివరకే ఎంపిక చేసి ప్రభుత్వానికి ప్రతిపాదించారు. ఆ స్థలంలో భవన నిర్మాణం పనులు చేపట్టనున్నారు. ఈ కేంద్రంలో ఒక ఏడీఏ, ఏవో, ఏఈవోలు, ల్యాబ్ టెక్నీషియన్స్ను నియమించనున్నారు. భారీగా ఎరువుల వినియోగం రాష్ట్రంలో భారీ స్థాయిలో ఎరువుల వినియోగం జరుగుతుందని, ప్రధానంగా యూరియా వినియోగాన్ని తగ్గించేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎరువుల, రసాయనాల మంత్రిత్వ శాఖ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి సూచన చేసింది. యూరియా వినియోగం ఎక్కువవుతోందని, దాని ప్రభావం సాగు భూములపై చూపుతోందని ఆందోళన వ్యక్తం చేసింది. పంజాబ్ తర్వాత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో రసాయన ఎరువులు, క్రిమిసంహారక పురుగు మందుల వినియోగం మోతాదుకు మించి ఉందని వెల్లడించింది. మట్టి పరీక్షల ద్వారా ఈ సమస్యలను అధిగమించే అవకాశం ఉంది. ఇవీ ప్రయోజనాలు.. మట్టి పరీక్ష అనేది మట్టిలోని పోషక పదార్థాల స్థాయిలు, పీహెచ్ విలువ, ఉప్పు సమతుల్యత, సూక్ష్మపదార్థాల ఉనికి తెలుసుకోవడం వ్యవసాయంలో చాలా కీలకమైన అంశం. మట్టి పరీక్ష పంటకు సరిపోయే ఎరువుల ఎంపికకు సహాయ పడుతుంది. మట్టిలో పోషకాలు ఎక్కువగా ఉన్నాయా, ఏవి కొరతగా ఉన్నాయో తెలుసుకుని అందుకు అవసరమైన ఎరువులను సరిగ్గా వినియోగించుకునే వీలుంది. అనవసర ఎరువుల వినియోగం తగ్గించుకోవచ్చు. ఫలితంగా అవసరానికి మించి ఎరువుల వాడకం వల్ల కలిగే హానిని నివారించుకునే వీలుంది. సమతుల్య పోషకాల నిచ్చెన వల్ల పంట ఆరోగ్యంగా పెరిగి దిగుబడి వస్తుంది. అవసరమైన వాటినే వినియోగించడం వల్ల ఖర్చూ తగ్గుతుంది. మట్టిలో మార్పులను గమనించి భవిష్యత్తులో తగిన పంటలు వేసే అవకాశం కలుగుతుంది. అధిక రసాయనాల వాడకాన్ని నియంత్రించి నేల, నీటి, పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించవచ్చు. కొత్త భూమిలో పంట సాగు ప్రారంభించే ముందు, ప్రతీ రెండు మూడేళ్లకు ఒకసారి, పంట దిగుబడులు తగ్గిన సందర్భాలు, భూమి మార్పు జరిగిన సందర్భాల్లో మట్టి నమూనా పరీక్షలు నిర్వహించుకోవాలి. -
8,229 దరఖాస్తులు
తూప్రాన్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెవెన్యూ సదస్సులు శనివారంతో ముగిసినట్లు ఆర్డీఓ జయచంద్రారెడ్డి పేర్కొన్నారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. డివిజన్ పరిధిలోని ఆయా మండలాల్లో భూ సమస్యలపై 8,229 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. ఇందులో మిస్సింగ్ సర్వే నంబర్లు, విస్తీర్ణం, పేరు సవరణ, పెండింగ్ మ్యుటేషన్, ఫౌతి (విరాసత్), డిజిటల్ సంతకం పెండింగ్, సాదాబైనామా, పీఓటీ, కుటుంబ తగాదాలతో పాటు ఇతర భూ సమస్యలకు దరఖాస్తులు వచ్చాయని వివరించారు. వాటిని పరిశీలించి భూ సమస్యలకు పరిష్కారం చూపుతామన్నారు. సాదాబైనామా, పీఓటీ దరఖాస్తులను ప్రభుత్వం ఇచ్చే సూచనల మేరకు పరిష్కరిస్తామన్నారు. దరఖాస్తుదారులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. రైతులు, గ్రామ ప్రజల సహకారంతోనే రెవెన్యూ సదస్సులు సజావుగా, ప్రశాంతంగా ముగిసినట్లు తెలిపారు.ఆర్డీఓ జయచంద్రారెడ్డి -
జిల్లాలో 25 వేల దరఖాస్తులు: కలెక్టర్
చిన్నశంకరంపేట(మెదక్): గ్రామసభల ద్వారా స్వీకరించిన దరఖాస్తులను పరిశీలించి, రెండు నెలల్లో భూ సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని కలెక్టర్ రాహుల్రాజ్ అన్నారు. శుక్రవారం మండలంలోని మడూర్లో నిర్వహించిన రెవెన్యూ సదస్సును పరిశీలించారు. ఈసందర్భంగా రైతులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా 25 వేల దరఖాస్తులు వచ్చినట్లు చెప్పారు. సమస్యను పరిష్కరించలేని సమయంలో వారికి లిఖిత పూర్వకంగా సమా ధానం ఇస్తామన్నారు. శనివారం సైతం మ డూర్లో గ్రామ సభను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. అనంతరం జెడ్పీ పాఠశాలను తనిఖీ చేసి విద్యార్థులతో మాట్లాడారు. యూనిఫాం, పుస్తకాలు అందాయా అని ఆరా తీశారు. మధ్యాహ్న భోజనం పరిశీలించి ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. యోగాతో మానసిక ఒత్తిడి దూరం మెదక్జోన్: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం నిర్వహించే యోగా వేడుకల్లో ప్రజలు పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ఈ మేరకు శుక్రవారం ఇందిరాగాంధీ స్టేడియంలో ఏర్పాట్లను పరిశీలించారు. మానసిక ఒత్తిడిని అధిగమించడానికి యోగా చక్కటి ఔషదం అన్నారు. -
గీత దాటితే వేటు తప్పదు
డీఈఓ రాధాకిషన్హవేళిఘణాపూర్(మెదక్)/కౌడిపల్లి(నర్సాపూర్): ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాలు ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని డీఈఓ రాధాకిషన్ హెచ్చరించారు. శుక్రవారం మండల వనరుల కేంద్రంలో వారితో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రైవేట్ పాఠశాలల యజమానులు ఫీజుల వివరాలను నోటీస్ బోర్డుపై ప్రదర్శించాలని సూచించారు. పాఠ్య పుస్తకాలు అమ్మాలంటే విధిగా అనుమతి తీసుకోవాలని ఆదేశించారు. కొన్ని పాఠశాలల్లో విచ్చలవిడిగా ఫీజులు వసూలు చేసినట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. అలాంటి పాఠశాలల గుర్తింపు రద్దు చేస్తామని హెచ్చరించారు. అలాగే కౌడిపల్లి మండలంలోని వెల్మకన్న ఉన్నత పాఠశాలలో టచ్ఫర్ చేంజ్ ట్రస్ట్, పెగా సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో సుమారు రూ. 12 లక్షలతో వాటర్ ప్లాంట్, బాల బాలికల కోసం వేర్వేరుగా నిర్మించిన టాయిలెట్స్తో పాటు బాలికల ఉన్నత పాఠశాలలో ఎస్బీఐ కార్పొరేట్ రెస్పాన్స్ స్కీం ఆధ్వర్యంలో నిర్మించిన టాయిలెట్స్ను ప్రారంభించారు. -
‘తాగునీటి సమస్య రానివ్వం’
మెదక్జోన్: మెదక్ మున్సిపాలిటీకి సరఫరా అయ్యే మిషన్ భగీరథ పైపు పగిలిపోవటంతో ఇతర నీటి వనరులను ఉపయోగించి ప్రజలకు తాగునీటిని అందిస్తున్నామని అదనపు కలెక్టర్ నగేశ్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పట్టణానికి ర్యాలమడుగు శివారు నుంచి తాగునీరు నీరు సరఫరా అవుతుందని, అది పగిలిపోవటంతో మరమ్మతులు జరుగుతున్నా యని తెలిపారు. కాగా ప్రజలకు నీటి ఎద్దడి రానివ్వకుండా పట్టణంలోని పంపు సెట్లను ఉపయోగిస్తూ పట్టణ ప్రజలకు నీరుి సరఫరా చేస్తున్నామని చెప్పారు. నీటి సమస్య తీవ్రంగా ఉన్న వార్డుల్లో ట్యాంకర్ల ద్వారా నీటిని అందిస్తామని చెప్పారు. బస్సుల కోసం ఆందోళననర్సాపూర్ రూరల్: రద్దు చేసిన బస్సులను వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ మండలంలోని నత్నయ్యపల్లి, కాగజ్ మద్దూర్, కొండాపూర్ గ్రామస్తులు శుక్రవారం నర్సాపూర్–హైదరాబాద్ 765డీ జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించారు. గతంలో గంటకు ఒక బస్సు నడిపేవారని, ప్రస్తుతం ఒక బస్సు కూడా నడపడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆటోలను ఆశ్రయించి ప్రమాదాలకు గురవుతున్నట్లు వాపోయారు. అనంతరం డిపో అధికారులకు వినతిపత్రం అందజేశారు. ధర్నాకు బీజేపీ ఓబీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చిన్న రమేష్ గౌడ్, మండల అధ్యక్షుడు నగేశ్, రాజు మద్దతు తెలిపారు. సైబర్ నేరాలపై అవగాహన అవసరం మెదక్ డీఎస్పీ ప్రసన్నకుమార్ పెద్దశంకరంపేట(మెదక్): ప్రజలు సైబర్ నేరాలపై అవగాహన పెంచుకోవాలని మెదక్ డీఎస్పీ ప్రసన్నకుమార్ అన్నారు. శుక్రవారం పెద్దశంకరంపేట పోలీస్స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా రికార్డులను పరిశీలించారు. అనంతరం అల్లాదుర్గం సీఐ రేణుకారెడ్డి, సిబ్బందితో కలిసి సైబర్నేరాల పోస్టర్ను ఆవిష్కరించారు. పోలీస్స్టేషన్కు వివిధ సమస్యలపై వచ్చే ప్రజలకు భరోసా కల్పించాలని, జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని, మద్యం సేవించి వాహనాలు నడపకుండా అవగాహన కల్పించాలని సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో ఎస్ఐ ప్రవీణ్రెడ్డి, అల్లాదుర్గం ఎస్ఐ శంకర్, ఏఎస్ఐ చంద్రమోహన్ పాల్గొన్నారు. 49 మంది గిరిజన విద్యార్థుల ఎంపిక మెదక్ కలెక్టరేట్: బెస్ట్ అవైలబుల్ పాఠశాలల ద్వారా గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్య అవకాశాలు మెండుగా ఉన్నాయని కలెక్టర్ రాహుల్రాజ్ అన్నారు. జిల్లాలో 3, 5, 8వ తరగతుల్లో చేరేందుకు మొత్తం 78 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా.. శుక్రవారం కలెక్టరేట్లో లక్కీడ్రా ద్వారా 49 మందిని ఎంపిక చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్, గిరిజన సంక్షేమ అధికారి నీలిమ తదితరులు పాల్గొన్నారు. -
అధికారులకు ప్రజల గోస పట్టదా?
● నాలుగు రోజులుగా నీరు రాకుంటేపట్టించుకోరా? ● బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మారెడ్డిమెదక్ కలెక్టరేట్: మెదక్ పట్టణంలో గత 4 రోజులుగా మిషన్ భగీరథ నీరు రాక ప్రజలు తాగునీటికి నానా ఇబ్బందులు పడుతున్నారు. ప్రజల తాగునీటి గోస అధికారులకు పట్టదా? రేపటిలోగా సమస్య పరిష్కరించకుంటే పెద్దఎత్తున ధర్నా చేపడుతామని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మారెడ్డి హెచ్చరించారు. శుక్రవారం కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ నగేష్ను కలిసి వినతిపత్రం అందజేసి సమస్యను వివరించారు. పైప్లైన్ మరమ్మతు పనులు 4 రోజులుగా పూర్తి చేయకపోవడంపై అధికారుల సమన్వయ లోపం కనిపిస్తుందన్నారు. కనీసం ట్యాంకర్ల ద్వారా కూడా ప్రజలకు నీరు అందించలేకపోతున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో ము న్సిపల్ మాజీ చైర్మన్ మల్లికార్జున్గౌడ్, పట్టణ పార్టీ కన్వీనర్ ఆంజనేయులు, తదితరులు పాల్గొన్నారు. -
కష్టపడి చ దివితేనే భవిష్యత్తు
నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డిపాపన్నపేట(మెదక్)/నర్సాపూర్ రూరల్: కష్టపడి చదువుకుంటే మంచి భవిష్యత్తు ఉంటుందని ఎమ్మెల్యే సునీతారెడ్డి విద్యార్థులకు సూచించారు. శుక్రవారం మండలంలోని జక్కపల్లి మోడల్ స్కూల్ను సందర్శించారు. ఈసందర్భంగా విద్యార్థులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం పేద, మధ్య తరగతి పిల్లల కోసం మోడల్ స్కూల్స్, గురుకులాలు ఏర్పాటు చేసిందన్నారు. పాఠశాలలో తాగునీటి సమస్య, ఆర్ఓ ప్లాంట్, బస్సుల సౌకర్యం వంటి సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో శేఖర్, సత్యంగౌడ్, భిక్షపతి, జితేందర్రెడ్డి, ఆంజనేయగౌడ్, శ్రీనివాస్రెడ్డి, జగన్, హుస్సేన్, ప్రసాద్, ప్రిన్సిపాల్ ఫర్హాన తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే ఏడుపాయల వన దుర్గమ్మను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. -
సీజనల్.. పరేషాన్!
జిల్లాలో 21 మండలాల పరిధిలో 693 గ్రామాలు ఉండగా, 7.67 లక్షల జనాభా ఉన్నారు. అలాగే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు 19, అర్బన్ హెల్త్సెంటర్ 1, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు 2, ఏరియా ఆస్పత్రి 1, జిల్లా కేంద్ర ఆస్పత్రి 1, ఎంసీహెచ్ 1, చొప్పున మొత్తం 25 ఆస్పత్రులు ఉన్నాయి. కాగా వానాకాలం సీజన్లో వచ్చే వ్యాధులను ముందస్తుగా గుర్తించి ప్రాణనష్టం జరగకుండా వైద్యారోగ్యశాఖ అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా ఈనెల 1 నుంచి ముందస్తు జర్వ సర్వేను ప్రారంభించారు. జిల్లాలో ఒక్కో ఆశవర్కర్ 20 ఇళ్లను సర్వే చేసి ఎప్పటికప్పుడు సంబంధిత ఏఎన్ఎం దృష్టికి తీసుకెళ్తున్నారు. జ్వర పీడితులను గుర్తించి వారికి చికిత్స ప్రారంభించటంతో పాటు వారి పేరు, ఊరు ఆన్లైన్లో పొందుపరుస్తున్నారు. అనుమానితుల నుంచి రక్త నమూనాలు సేకరిస్తున్నారు. అంతేకాకుండా ప్రతి శుక్రవారం డ్రైడే, ఫ్రైడే కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి తిరిగి దోమల నివారణ, పారిశుద్ధ్య చర్యల గురించి వివరిస్తున్నారు. కాగా గతేడాది వానాకాలం సీజన్ మొత్తంలో 16 వేల మంది జ్వర పీడితులు ఉంటే, కేవలం ఈ 20 రోజుల్లోనే 9,231 మంది జ్వర పీడితులను గుర్తించటం గమనార్హం.పెద్దశంకరంపేటలో జ్వర సర్వే నిర్వహిస్తున్న సిబ్బందివర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో వైద్యారోగ్యశాఖ అధికారులు అప్రమత్తం అయ్యారు. ఈనెల 1 నుంచి జిల్లాలోముందస్తు జ్వర సర్వేను ప్రారంభించారు. కేవలం 20 రోజుల వ్యవధిలో 9 వేల పైచిలుకు జ్వర పీడితులను గుర్తించారు. వారికి వెంటనే వైద్య చికిత్స ప్రారంభించారు. అలాగే వ్యాధులు బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. – మెదక్జోన్పరిశుభ్రతే ప్రధానం ఈ ఏడాది సీజనల్ వ్యాధుల నుంచి ప్రజలను కాపాడటం వైద్యారోగ్యశాఖ అధికారులకు కత్తిమీద సాములాంటిదనే చెప్పాలి. గత 16 నెలలుగా పాలకవర్గాలు లేక పల్లెలో పాలన గాడితప్పింది. పంచాయతీ కార్యదర్శలు చెత్త ట్రాక్టర్లకు డీజిల్ పోయలేమంటూ చేతులెత్తేశారు. ఇప్పటికే చాలా గ్రామాల్లో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా మారింది. ఈక్రమంలో జిల్లా అధికారులు గ్రామాల్లో పర్యటించి పారిశుద్ధ్య చర్యలు చేపట్టడంతో పాటు ప్రజలు వ్యాధుల బారిన పడకుండా అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
పంచాయతా.. పరిషత్తా?
‘స్థానిక’ ఎన్నికలపై జోరుగా చర్చ ● పల్లెల్లో మొదలైన పోరు సందడి ● స్థానిక సంస్థలకు నిలిచిన ఆర్థికసంఘం నిధులు ● పలు చోట్ల అభివృద్ధి పనులకు బ్రేక్ ● ఉమ్మడి మెదక్ జిల్లాలో 1,531 జీపీలు, ఎంపీటీసీలు 690, జెడ్పీటీసీలు 72ఉమ్మడి మెదక్ జిల్లాలో 19,62,458 మంది పల్లె ఓటర్లుండగా 1,531 గ్రామ పంచాయతీలు, 690 ఎంపీటీసీలు, 72 జెడ్పీటీసీలు ఉన్నాయి. గతేడాది జూలై 4వ తేదీతో మండల పరిషత్ ప్రాదేశిక సభ్యుడు(ఎంపీటీసీ), జిల్లా పరిషత్ ప్రాదేశిక సభ్యుడు (జెడ్పీటీసీ) పదవీకాలం, గతేడాది ఫిబ్రవరి 2తో సర్పంచ్ల పదవీకాలం ముగిశాయి. అప్పటి నుంచి గ్రామ పంచాయతీలు, మండల పరిషత్, జిల్లా పరిషత్లు ప్రత్యేక అధికారుల పాలనలో కొనసాగుతున్నాయి. సర్పంచ్ ఎన్నికల్లో పార్టీ సింబల్ ఉండదు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపాలిటీ ఎన్నికలు పార్టీ గుర్తుతో జరుగుతాయి. ఈ నేపథ్యంలో ఏ ఎన్నికలు ముందు నిర్వహిస్తే అధికార పార్టీకి లాభం అనే చర్చ కాంగ్రెస్ నేతల్లో జరుగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర పూర్తి కావడంతో ప్రభుత్వ పాలన రెఫరండంగా భావించే అవకాశం ఉంది. ఆశల్లో కాంగ్రెస్ నాయకులు రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను 42శాతానికి పెంచుతూ అసెంబ్లీలో ఆమోదించి పంపిన బిల్లు రాష్ట్రపతి దగ్గరనే ఇంకా పెండింగ్లో ఉంది. బిల్లు ఆమోదం తర్వాతనే నిర్వహిస్తారా? పాత రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలు నిర్వహిస్తారో.. వేచి చూడాలి. కాంగ్రెస్ పార్టీ పదేళ్ల తర్వాత అధికారంలోకి రావడంతో గ్రామాల్లోని పార్టీ కార్యకర్తలు స్థానిక పదవుల పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఎక్కువ మంది లేకపోవడంతో కొంత వెనుకబడి ఉంది. దీంతో ముఖ్యంగా సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ లాంటి పదవులు దక్కితే పార్టీ కొంత బలపడుతుందని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు.గ్రామ పంచాయతీ ఎన్నికలు ముందు జరుగుతాయా.. లేక ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరుగుతాయా? అని పల్లెల్లో జోరుగా చర్చ జరుగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికలపై మంత్రుల ప్రకటనతో పల్లెల్లో ఎన్నికల సందడి మొదలైంది. అలాగే ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలు చేసేందుకు ప్రభుత్వం వేగం పెంచింది. రైతు భరోసా కింద ఎకరానికి రూ. 6వేలు చొప్పున బ్యాంక్ ఖాతాల్లో జమ చేయడంతో స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చే నెలలో జరుగుతాయని సర్వత్రా చర్చించుకుంటున్నారు. ఆశావహులు సైతం పోటీకి రెడీ అవుతున్నారు. సాక్షి, సిద్దిపేట: నిలిచిన ఆర్థిక సంఘం నిధులు స్థానిక సంస్థలకు పాలకవర్గాలు లేకపోవడంతో గ్రామ పంచాయతీలకు కేంద్రం నుంచి వచ్చే 15వ ఆర్థిక సంఘం నిధులు ఆగిపోయాయి. అదే పాలక వర్గాలుంటే ప్రతీ ఏడాది కేంద్రం నుంచి ప్రత్యేక నిధులను కేటాయించేవారు. ఆర్థిక సంఘం నుంచి నిధులు రాకపోవడంతో పల్లెల్లో అభివృద్ధి పనులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. -
సీసీ సస్పెన్షన్
● డ్వాక్రా రుణాల గోల్మాల్పై వేటు ● బ్యాంకు అధికారులపై చర్యలు కరువుపాపన్నపేట(మెదక్): ‘సంఘాల నిధులు స్వాహా’ శీర్షికన గత నెల 15న సాక్షిలో ప్రచురితమైన కథనానికి స్పందించిన డీఆర్డీఏ అధికారులు నెల రోజులకు పైగా విచారణ జరిపారు. మహిళా సంఘాలకు సంబంధించి రూ. 39,92,141 నిధులను వీఓఏ పద్మ స్వాహా చేసినట్లు తేల్చారు. ఈ మేరకు విధుల్లో నిర్లక్ష్యం వహించిన సీసీ సాయిలును సస్పెండ్ చేస్తూ డీఆర్డీఓ శ్రీనివాస్ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా ఈ గోల్మాల్లో బ్యాంకు అధికారుల పాత్ర సైతం ఉన్నట్లు తెలుస్తోంది. అయినప్పటికీ ఇప్పటివరకు వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. పాపన్నపేట మండలం పొడిచన్పల్లిలో జరిగిన సంఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామంలో 39 డ్వాక్రా గ్రూపులు ఉండగా, వీరికి యూకో బ్యాంకు ద్వారా రుణాలు ఇస్తున్నారు. ఇందులో గ్రామ సంఘం నిధులతో పాటు, బ్యాంకు ద్వారా రెండు రకాల రుణాలు పొందవచ్చు. అయితే గ్రామ సంఘం నుంచి తీసుకునే రుణాలకు అధ్యక్షురాలు, కార్యదర్శి, కోశాధికారి సంతకాలతో తీర్మానం చేయాలి. ఇవి మొదట గ్రూపు అకౌంట్లో జమ చేసి తర్వాత సభ్యులకు పంపిణీ చేయాలి. కానీ వారి సంతకాలను ఫోర్జరీ చేసి సభ్యులకు తెలియకుండా గ్రామ వీఓఏ పద్మ సుమారు రూ. 26.50 లక్షలు సొంత అకౌంట్లోకి మళ్లించుకున్నట్లు డీపీఎం ప్రకాశ్ తెలిపారు. అయితే ఇందులో అప్పటి బ్యాంకు అధికారుల పాత్ర ఉన్నట్లు తెలిసింది. అలాగే బ్యాంకు నుంచి మహిళా సంఘాల సభ్యులకు ఇచ్చే రుణాలు సైతం సభ్యుల అకౌంట్లలోకి వెళ్లకుండా, నేరుగా వీఓఏ అకౌంట్లో జమ అయినట్లు తెలిసింది. ఇవి సుమారు రూ.13.40 లక్షల వరకు ఉన్నట్లు తేలింది. అయితే వీఓఏ ఈ విషయాలు బయట పడకుండా దొంగ రసీదులు, తీర్మానాలు, సంతకాల ఫోర్జరీ చేసి, అధికారులకు అనుమానం రాకుండా రికార్డులు నిర్వహించినట్లు సమాచారం. సీసీ నిర్లక్ష్యంతో అవినీతి భాగోతం సకాలంలో బయట పడలేదని భావించిన అధికారులు ఆయనపై సస్పెన్షన్ వేటు వేశారు. కాగా మహిళా సభ్యుల వ్యక్తిగత అకౌంట్లోకి వేయాల్సిన రుణాలను అప్పటి బ్యాంకు అధికారి వీఓఏతో కుమ్మకై ఆమె సొంత అకౌంట్లోకి మళ్లించారన్న ఆరోపణలున్నాయి. ఈ విషయమై బ్యాంకు అధికారులు సైతం శాఖాపరమైన విచారణ జరుపుతున్నట్లు సమాచారం. అయితే సుమారు 35 రోజుల దాటినా వారి విచారణ కొలిక్కి రాకపోవడం గమనార్హం. వీఓఏ మాత్రం తాను సీసీతో పాటు ఏపీఎంలకు లంచాలు ఇచ్చినట్లు ఆరోపించారు. -
OòܺƊḥæ¯ólÆ>ËOò³ A{ç³Ð]l$™èl¢…V> E…yéÍ
ఎస్పీ డీవీ శ్రీనివాసరావు మెదక్ మున్సిపాలిటీ: ఆశ, అత్యాశలే సైబర్ నేరగాళ్ల ఆయుధాలని, తక్కువ సమయంలో ఎక్కువ లాభం అంటే మోసమని గ్రహించి అవగాహనతో వ్యవహరించాలని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు సూచించారు. గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో వాల్పోస్టర్ను ఆవిష్కరించి మాట్లాడారు. అపరిచిత వ్యక్తులు ఫోన్ చేసి బ్యాంకు నుంచి మాట్లాడుతున్నామని చెప్పి అకౌంట్ వివరాలు అడిగితే చెప్పకూడదన్నారు. బ్యాంకు అధికారులు ఎప్పుడు సమాచారాన్ని కాల్ చేసి అడగరని తెలిపారు. సైబర్ నేరగాళ్లు నకిలీ ట్రేడింగ్ వెబ్సైట్, యాప్ సృష్టించి ఎక్కువ లాభాలు చూపించి మోసం చేస్తారని, అలాంటివి నమ్మి మోసపోవద్దని చెప్పారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ మహేందర్, సైబర్ క్రైం డీఎస్పీ సుభాష్ చంద్రబోస్, డీఎస్పీ ప్రసన్నకుమార్, మెదక్టౌన్ సీఐ మహేష్ తదితరులు పాల్గొన్నారు. -
పేదల సొంతింటి కల సాకారం
నర్సాపూర్: మాది పేదల ప్రభుత్వమని డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్ అన్నారు. గురువారం నర్సాపూర్లోని పలు వార్డులకు చెందిన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇంటితో పేదల సొంతింటి కలను నెరవేరుస్తున్నామని తెలిపారు. పదేళ్ల బీఆర్ఎస్ కాలంలో పేదలకు ఒక్కరికి ఇల్లు ఇవ్వలేదని ఆరోపించారు. ఎమ్మెల్యే సునీతారెడ్డికి ప్రొటోకాల్పై ఉన్న ధ్యాస పేదలకు సేవ చేయడంలో లేదని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో భూ ఆక్రమణలు జరిగాయని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి మాట్లాడుతూ.. ఇళ్లు రాని వారు ఆందోళన చెందొద్దని, ఇంకా మూడు పర్యాయాలు కేటాయిస్తామని వివరించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ సుహాసినిరెడ్డి, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ రాజుయాదవ్, నాయకులు మల్లేష్, చిన్న ఆంజిగౌడ్ తదితరులు పాల్గొన్నారు. డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్ -
భూ సమస్యల పరిష్కారానికి చర్యలు
శివ్వంపేట(నర్సాపూర్)/పెద్దశంకరంపేట(మెదక్): భూ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని అదనపు కలెక్టర్ నగేశ్ తెలిపారు. మండల పరిధిలోని నవాబుపేటలో గురువారం నిర్వహించిన రెవెన్యూ సదస్సును సందర్శించారు. 30 ఏళ్లుగా గ్రామంలో పొలాలు సాగు చేసుకుంటున్నప్పటికీ పట్టాదార్ పాస్ పుస్తకాలు లేక తీవ్ర ఇబ్బంది పడుతున్నామని రైతులు విన్నవించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అటవీ, రెవెన్యూ భూములకు సంబంధించి తలెత్తిన సమస్యను ఇరుశాఖలతో కమిటీ ఏర్పాటు చేసి త్వరలోనే అర్హులైన రైతులందరికీ పట్టాదార్ పాస్ పుస్తకాలు వచ్చేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం చాకరిమెట్ల ఆంజనేయస్వామిని దర్శించుకున్నారు. ఆయన వెంట ఆర్డీఓ మహిపాల్రెడ్డి, తహసీల్దార్ కమలాద్రి, సిబ్బంది ఉన్నారు. అనంతరం పెద్దశంకరంపేట మండలం కట్టెల వెంకటాపూర్లో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సును పరిశీలించారు. రైతులు భూ సమస్యలపై అందించిన దరఖాస్తులను ఆన్లైన్లో నమోదు చేస్తున్నట్లు చెప్పారు.అదనపు కలెక్టర్ నగేశ్ -
మోదీతోనే దేశంలో సుపరిపాలన
నర్సాపూర్: ప్రధాని నరేంద్రమోదీ ఆధ్వర్యంలో దేశంలో సుపరిపాలన అందుతుందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లేష్గౌడ్ అన్నారు. గురువారం పట్టణంలోని పిల్లల పార్కులో నిర్వహించిన రచ్చబండలో పాల్గొని మాట్లాడారు. మోదీ 11 ఏళ్ల పాలనలో పేదలు, రైతుల సంక్షేమం కోసం వివిధ పథకాలు అమలు చేశారని కొనియాడారు. అలాగే పర్యావరణవేత్త డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివస్ను పురస్కరించుకొని ఈనెల 23 నుంచి జూలై 6వ తేదీ వరకు తమ పార్టీ ఆధ్వర్యంలో గ్రామాల్లో మొక్కలు నాటే కార్యక్రమం చేపడుతున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఓబీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చిన్న రమేష్గౌడ్, నాయకులు రమేష్గౌడ్, చంద్రయ్య, రాంరెడ్డి, నారాయణరెడ్డి, శంకర్ తదితరులు పాల్గొన్నారు. కాటేజీలు మంజూరు చేయండి మాజీ ఎమ్మెల్యే శశిధర్రెడ్డి పాపన్నపేట(మెదక్): తెలంగాణలో ప్రసిద్ధి చెందిన ఏడుపాయలకు 30 కాటేజీలు మంజూరు చేయాలని రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్రెడ్డికి వినతిపత్రం ఇచ్చినట్లు మెదక్ మాజీ ఎమ్మెల్యే శశిధర్రెడ్డి తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. ఏడుపాయలకు నిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారని తెలిపారు. 2008లో అప్పటి మంత్రి గీతారెడ్డి రూ. 1.50 కోట్లు మంజూరు చేసి కాటేజీలు ఏర్పాటు చేశారని చెప్పా రు. ప్రస్తుతం భక్తులకు సరిపడా సత్రాలు లేక ఇబ్బంది పడుతున్నారని వాపోయారు. ఇప్పటికై నా కాటేజీలు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టం ఏర్పాటు చేయాలని కోరినట్లు పేర్కొన్నారు. దరఖాస్తుల ఆహ్వానం రామాయంపేట(మెదక్): రామాయంపేటలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల డిగ్రీ కళాశాలలో ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపాల్ శిరీష సూచించారు. గురువారం ఆమె మాట్లాడుతూ.. ప్రస్తుతం కళాశాలలో బీకాం, బీజెడ్సీ, ఎంజెడ్సీ, ఎంఎస్సీఎస్, ఎంపీసీఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు అవకాశం ఉందన్నారు. ఆసక్తి గల విద్యార్థినులు ఈనెల 23వ తేదీలోగా నేరుగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇంటర్లో ఉత్తీర్ణత సాధించిన ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థినులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. మహిళలు ధైర్యంగాముందుకు సాగాలి చిలప్చెడ్(నర్సాపూర్): మహిళలు ధైర్యంగా ముందుకు సాగుతూ, ఎలాంటి సమస్యనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని జిల్లా మహిళా సాధికారిత టీం మిషన్ సమన్వయకర్త సంతోషి అన్నారు. మండల పరిధిలోని గౌతాపూర్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులతో కలిసి బేటీ బచావో, బేటీ పడావో దశాబ్ది ఉత్సవాల పోస్టర్ను ఆవిష్కరించారు. ఈసందర్భంగా విద్యార్థులకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్, బాల్య వివాహాలు, సైబర్ క్రైం, తదితర విషయాలపై అవగాహన కల్పించారు. తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ, ఉన్నతస్థాయికి ఎదగాలన్నారు. మహిళల సంరక్షణకు తమ బృందం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో మహిళా సాధికారిత సిబ్బంది కవిత, నాగమణి, పాఠశాల హెచ్ఎం కృష్ణ, ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు. -
శుక్రవారం శ్రీ 20 శ్రీ జూన్ శ్రీ 2025
బారులు తీరి.. అర్జీలు ఇచ్చిరాయిలాపూర్లో గురువారం నిర్వహించిన భూ భారతి రెవెన్యూ సదస్సుకు రైతులు పోటెత్తారు. బారులు తీరి దరఖాస్తులు అందజేశారు. తాము 50 ఏళ్లుగా కాస్తులో ఉన్నా, పాస్ పుస్తకాలు ఇవ్వడం లేదని తహసీల్దార్ రజనికుమారికి వినతిపత్రం అందజేశారు. మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ మెదక్ వచ్చినప్పుడు గ్రామ శివారులోని 881 సర్వే నంబర్లో పట్టాలిచ్చారని గుర్తుచేశారు. పాస్ పుస్తకాల కోసం పలుమార్లు దరఖాస్తు చేసినా రాలేదని, న్యాయం చేయాలని కోరారు. ఈ విషయమై తహసీల్దార్ మాట్లాడుతూ.. బాధిత రైతులకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. – రామాయంపేట(మెదక్) -
90 శాతం రెవెన్యూ సదస్సులు పూర్తి
కలెక్టర్ రాహుల్రాజ్టేక్మాల్(మెదక్): భూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా జిల్లాలో నిర్వహిస్తున్న భూ భారతి రెవెన్యూ సదస్సులు 90 శాతం పూర్తయినట్లు కలెక్టర్ రాహుల్రాజ్ తెలిపారు. గురువారం మండలంలోని ఎల్లంపల్లిలో రెవెన్యూ సదస్సును పరిశీలించి మాట్లాడారు. ఈనెల 3 నుంచి 20వ తేదీ వరకు చేపట్టిన భూ భారతి రెవెన్యూ సదస్సులు సత్ఫలితాలు ఇస్తున్నాయన్నారు. రైతులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండా తహసీల్దార్ నేతృత్వంలో బృందాలు గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించి రైతుల నుంచి దరఖాస్తుల స్వీకరిస్తుందన్నారు. రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులను వెంటనే సంబంధిత వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని సిబ్బందిని ఆదేశించారు. రెవెన్యూ రికార్డుల వివరాలతో సరిపోల్చుకొని, క్షేత్రస్థాయి విచారణను పకడ్బందీగా జరపాలన్నారు. అనంతరం ప్రభుత్వ పాఠశాలను సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. సమస్యలు అడిగి తెలుసుకొని వారి సామర్థ్యాలను పరిక్షించారు. అలాగే ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో మాట్లాడి త్వరగా ఇళ్ల నిర్మాణం చేపట్టాలన్నారు. ఆయన వెంట తహసీల్దార్ తులసీరామ్, ఆర్ఐ సాయిశ్రీకాంత్, ఎంపీఓ రియాజొద్దీన్, కార్యదర్శి గొల్లసత్యం, నాయకులు కిష్టయ్య, రాజేశ్వర్గౌడ్, సాయిబాబ ఉన్నారు. -
వైద్య విద్య.. మెరుగుపడేనా?
మెదక్జోన్: ప్రభుత్వ వైద్య కళాశాల ఏడాదిగా అద్దె భవనంలోనే కొనసాగుతోంది. నూతన భవన నిర్మాణానికి ఏడాది క్రితం నిధులు మంజూరైనా ఇప్పటివరకు పనులు ప్రారంభం కాలేదు. దీంతో సరైన వసతులు లేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. మరోవైపు అధ్యాపకుల కొరత వేధిస్తోంది. ఇదిలాఉండగా ప్రయోగశాలలు, క్లినికల్ పారామీటర్లు లేవని నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) ఇటీవల ఆక్షేపించిన విషయం తెలిసిందే. నూతన భవన నిర్మాణం ఎప్పుడో..? గతేడాది జిల్లాకు మెడికల్ కళాశాల మంజూరు అయింది. దీంతో అద్దె భవనంలో తాత్కాలికంగా తరగతులు కొనసాగిస్తున్నారు. కళాశాల పక్కనే గల చిన్నపాటి గదుల్లో బాలురు ఒక వైపు, బాలికలు మరో పక్కన హాస్టళ్లలో ఉంటున్నారు. వసతి గృహాలను ఆనుకొని పిచ్చిమొక్కలు, గడ్డి, చెట్లు ఏపుగా పెరిగాయి. నిత్యం పాములు, విష పురుగులు వస్తున్నాయని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. కాగా నూతన భవన నిర్మాణం కోసం ఏడాది క్రితం రూ. 180 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. ఇందులో రూ. 150 కోట్లు భవన నిర్మాణానికి కాగా, మరో రూ. 30 కోట్లు మౌలిక వసతుల కోసం కేటాయించింది. విశాలమైన ప్రయోగశాలలు, ల్యాబ్లు, తరగతి గదులు, బాలురు, బాలికలకు వేర్వేరుగా వసతి గృహాలు తదితర భవన నిర్మాణాల కోసం 20 ఎకరాల స్థలం అవసరం అవుతుందని భావించారు. అందుకనుగుణంగా జిల్లా కేంద్రంలోని ఎంసీహెచ్ ఆస్పత్రి పక్కన 11 ఎకరాల స్థలాన్ని గుర్తించిన రెవెన్యూ అధికారులు మెడికల్ కళాశాలకు అప్పగించారు. ఈ స్థలంలో మూడు, లేదా నాలుగు అంతస్తుల భవనం నిర్మించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. నిర్మాణం కోసం త్వరలో టెండర్ పిలుస్తామని సంబంధిత అధికారి తెలిపారు. ఏడాదిగా అద్దె భవనంలో కొనసాగింపు నిధులు మంజూరైనాప్రారంభం కాని పనులు అరకొర వసతులతో విద్యార్థుల అవస్థలు మరో 50 మంది విద్యార్థులు గతేడాది జిల్లాకు మెడికల్ కళాశాల మంజూరు కాగా, 50 మంది విద్యార్థులతో మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభం అయ్యాయి. ఈ ఏడాది సైతం విద్యార్థులను చేర్చుకోవాలని నేషనల్ మెడికల్ కౌన్సిల్ (ఎన్ఎంసీ) నుంచి ఆదేశాలు వచ్చాయి. దీంతో ఆగస్టులో మరో 50 మంది విద్యార్థులు రానున్నారు. దీంతో ప్రస్తుతం కొనసాగుతున్న అద్దె భవనంలో మరిన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. -
ఆయిల్పామ్ సాగుతో లాభాలు
మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ చిన్నశంకరంపేట(మెదక్): రైతులు ఆయిల్పామ్ సాగును సద్వినియోగం చేసుకోవాలని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ అన్నారు. గురువారం మండల కేంద్రంలో రైతు కిష్టయ్య వ్యవసాయ పొ లంలో ఆయిల్పామ్ మొక్కలు నాటారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ సహకారం అందిస్తున్న ఆయిల్పామ్ సాగుకు రైతులు మొగ్గుచూపాలన్నారు. కార్యక్రమంలో జిల్లా హార్టికల్చర్ అధికారి ప్రతాప్సింగ్, ఏఓ ప్రవీణ్, ఏఈఓ మధులిక, ఫీల్డ్ ఆఫీసర్ సుజాత, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు సత్యనారాయణ, మాజీ సర్పంచ్ రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. వైద్యానికి ప్రభుత్వం పెద్దపీట మెదక్జోన్: వైద్యానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు అన్నారు. గురువారం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో 12 ఐసోలేషన్ పడకలతో కూడిన వార్డును ప్రారంభించి మాట్లాడారు. కోవిడ్ సంబంధిత కేసులను ఎదుర్కొవడానికి ముందు జాగ్రత్త చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. కార్యక్రమంలో ఆస్పత్రి సూపరింటెండెంట్ సునీతాదేవి, ప్రొఫెసర్ లోకేష్తో పాటు ఇతర వైద్యాధికారులు పాల్గొన్నారు. -
ఆ ఐదున్నర కిలోమీటర్లు
(765 డీజీ) ఎన్హెచ్ విస్తరణకు ఆటంకాలుత్వరలో అనుమతులు మెదక్, రామాయంపేట మధ్య అటవీ ప్రాంతంలో ఆ శాఖ అనుమతులు రాకపోవడంతో జాతీయ రహదారి నిర్మాణ పనులు నిలిచిపోయాయి. ఈవిషయమై అటవీ అధికారుల దృష్టికి తీసుకెళ్లా. త్వరలో అనుమతులు వచ్చే అవకాశం ఉంది. అక్కన్నపేట వద్ద ఇద్దరు రైతులు కోర్టులో కేసు వేయడంతో ఆటంకం ఏర్పడింది. – రఘునందన్రావు, ఎంపీ, మెదక్రామాయంపేట(మెదక్): మూడు జిల్లా కేంద్రాలను కలుపుతూ కేంద్రం మంజూరు చేసిన జాతీయ రహదారి (765 డీజీ) నిర్మాణానికి అటవీశాఖ అనుమతులు, కోర్టు కేసులు అడ్డంకిగా మారాయి. దీంతో మెదక్– రామాయంపేట మధ్య అటవీ ప్రాంతంలో నాలుగున్నర కిలోమీటర్లు, అక్కన్నపేట రైల్వేస్టేషన్ వద్ద కిలోమీటర్ మేర రహదారి విస్తరణ పనులు గత మూడేళ్లుగా నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. రెండుసార్లు ప్రతిపాదనలు మెదక్, సిద్దిపేట, వరంగల్ జిల్లా కేంద్రాలను కలుపుతూ జాతీయ రహదారి నిర్మాణానికి కేంద్రం గతంలో నిధులు మంజూరు చేసింది. మెదక్ నుంచి సిద్దిపేట వరకు ఒక బిట్టు, సిద్దిపేట నుంచి వరంగల్ జిల్లా ఎల్కతుర్తి వరకు మరో బిట్టుగా జాతీయ రహదారి నిర్మాణానికి టెండర్లు పిలిచారు. మెదక్, సిద్దిపేట మధ్య రూ. 882 కోట్లు మంజూరు కాగా, అటవీ ప్రాంతంలో అక్కన్నపేట వద్ద మినహా మిగితా చోట్ల పనులు ముమ్మరంగా సాగుతున్నా యి. మెదక్, రామాయంపేట మధ్య నాలుగున్నర కిలోమీటర్ల మేర అటవీ విస్తరించి ఉంది. అనుమతుల కోసం జాతీయ రహదారుల శాఖ అధికారులు అటవీశాఖ కేంద్ర విభాగానికి ప్రతిపాదనలు పంపారు. ఈమేరకు అధికారులు రోడ్డు విస్తరణలో కోల్పోయే చెట్ల వివరాల కొలతలు సేకరించారు. వారి సూచనల మేరకు అటవీ ప్రాంతం గుండా రహదారికి ఇరువైపులా రోడ్డు విస్తరణ పరిధి తగ్గిస్తూ ఎన్హెచ్ అధికారులు రెండోసారి ప్రతిపాదనలు పంపారు. అయితే రెండున్నర ఏళ్లు గడుస్తున్నా ఇప్పటివరకు అనుమతులు రాకపోవడంతో రోడ్డు విస్తరణ పనులు నిలిచిపోయాయి. అక్కన్నపేట వద్ద రైల్వేలైన్ కింది భాగంలో బ్రిడ్జి నిర్మాణంతో పాటు సుమారు కిలోమీటర్ మేర భూమి లోపలి భాగం నుంచి రోడ్డు నిర్మించాల్సి ఉంది. రైల్వేశాఖ నుంచి అనుమతులు వచ్చినా గ్రామానికి చెందిన ఇద్దరు రైతులు కోర్టులో కేసు వేయడంతో పనులు నిలిచిపోయాయి.అటవీ ప్రాంతంలో నిలిచిన రోడ్డు విస్తరణ అడ్డంకిగా మారిన అటవీశాఖఅనుమతులు మూడేళ్లుగా నిలిచిన పనులుబైపాస్ రోడ్డు సర్వే పూర్తి రామాయంపేట బైపాస్ రోడ్డు నిర్మాణంతో భూములు కోల్పోతున్న రైతులు ఏడాదిగా సర్వే పనులు అడ్డుకున్నారు. బైపాస్ రోడ్డు కాకుండా ప్రస్తుతం ఉన్న మార్గంలోనే రహదారి నిర్మించాలని పట్టుపట్టారు. దీంతో పలుమార్లు ఎంపీ రఘునందన్రావు వారిని సముదాయించి, అందరికీ న్యాయమైన నష్టపరిహారం ఇప్పిస్తామని నచ్చజెప్పి సమస్య పరిష్కరించారు. -
మత్తు పదార్థాల విక్రయాలపై నిఘా
ఎస్పీ డీవీ శ్రీనివాసరావుమెదక్ మున్సిపాలిటీ: విద్యా సంస్థలకు సమీపంలో ఎక్కడా పొగాకు విక్రయాలు జరగకుండా చర్యలు చేపట్టాలని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు ఆదేశించారు. బుధవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో వాల్పోస్టర్ను ఆవిష్కరించి మాట్లాడారు. విద్యా సంస్థలకు చుట్టుపక్కల దొంగచాటుగా పొగాకు, అనధికారంగా మద్యం, డ్రగ్స్ విక్రయించే వారిపై విద్యాసంస్థల యాజమాన్యాలు నిఘా ఏర్పాటు చేసుకొని పోలీస్లకు సమాచారం అందించాలని సూచించారు. అలాగే విద్యార్థులకు డ్రగ్స్ అనర్థాలపై అవగాహన కల్పించాలన్నారు. విద్యాసంస్థల ప్రవేశ సరిహద్దు గోడకు పొగాకు రహిత విద్య సంస్థ అనే సంకేతాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ మహేందర్, సైబర్ క్రైమ్ డీఎస్పీ సుభాష్ చంద్రబోస్ తదితరులు పాల్గొన్నారు. -
భూ భారతితో సమస్యలు పరిష్కారం
సదాశివపేటరూరల్(సంగారెడ్డి): ప్రభుత్వం తెచ్చిన భూ భారతి చట్టంతో రెవెన్యూ సమస్యలు పరిష్కారమవుతాయని టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మలారెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని వెల్టూర్, నందికంది గ్రామాల్లో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో ఆమె పాల్గొని మాట్లాడారు. భూము లపై పూర్తి హక్కులను కల్పిచేందుకు ప్రభుత్వం భూ భారతి చట్టాన్ని అమలు చేస్తోందన్నారు. రైతులు రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం నందికందిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను అధికారులతో కలిసి ప్రారంభించారు. కార్యక్రమంలో తహసీల్దార్ సరస్వతి, నాయబ్ తహసీల్దార్ బాలరాజ్, ఆర్ఐ గంగాధర్, పీఏసీఎస్ చైర్మన్ రత్నాకర్రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కృష్ణ, మాజీ సర్పంచ్ లక్ష్మారెడ్డి, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు సిద్దన్న, నాయకులు పాల్గొన్నారు.టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మలారెడ్డి -
నిబంధనలు ఇవీ..
● 15 ఏళ్లు నిండిన వాహనాలను రవాణాకు ఉపయోగించకూడదు. స్కూల్ బస్సు పూర్తి కండిషన్లోఉండాలి. ● విద్యాసంస్థ పేరు, ఫోన్ నంబర్, పూర్తి అడ్రస్ బస్సు ఎడమ వైపు, ముందుభాగంలో స్పష్టంగా కనిపించేలా రాయాలి. ● బస్సు నడిపే డ్రైవర్ వయసు 60 ఏళ్లకు మించకూడదు. బీపీ, షుగర్, కంటి జబ్బులు ఉండకూడదు. ● అతడికి పాఠశాల యాజమాన్యం ప్రతి 3 నెలలకోసారి ఆరోగ్య పరీక్షలు చేయించాలి. ● డ్రైవర్కు కనీసం 5 సంవత్సరాల అనుభవంతో పాటు సీనియర్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. ● ఏటా బస్సు ఫిట్నెస్ తప్పకుండా చేయించాలి. ఆర్టీఏ అధికారులు బస్సును పూర్తిగా చెక్ చేసి సర్టిఫికెట్ ఇచ్చాకే విద్యార్థులను తరలించాలి. ● ప్రతీ బస్సుల్లో ఒక అటెండర్ తప్పకుండా ఉండాలి. ప్రమాదావశాత్తుమంటలు చెలరేగితే ఆర్పే యంత్రం ఉంచాలి. ● సీట్ల పరిమితికి మించి విద్యార్థులను తరలించకూడదు. ● రోడ్డు భద్రతపై ఆర్టీఏ, పోలీస్శాఖలు ఏడాదికోసారి విద్యార్థులకు అవగాహన కల్పించాలి. -
ప్రతి దరఖాస్తు ఆన్లైన్ చేయాలి
మనోహరాబాద్(తూప్రాన్): భూ భారతి రెవెన్యూ సదస్సులో వచ్చిన ప్రతి దరఖాస్తును ఆన్లైన్లో నమోదు చేయాలని అదనపు కలెక్టర్ నగేశ్ అధికారులకు సూచించారు. బుధవారం మండలంలోని దండుపల్లిలో చేపట్టిన రెవెన్యూ సదస్సును సందర్శించి అధికారుల నుంచి వివరాలు సేకరించారు. రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. పీఓటి, సాదా బైనామాల గురించి రైతులకు అవగాహన కల్పించారు. తహసీల్దార్ చంద్రశేఖర్రెడ్డి మాట్లాడుతూ.. మనోహరాబాద్, దండుపల్లిలో నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో 39 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. కార్యక్రమంలో డీటీ కౌషిక, ఆర్ఐ దీక్షిత్, సంపత్ పాల్గొన్నారు. అదనపు కలెక్టర్ నగేశ్ -
బడి బస్.. ఫిట్లెస్!
చిరు వ్యాపారులకు చేయూత చిరు వ్యాపారులకు చేయూతనిచ్చేందుకు మెప్మా రూ.50 వేల వరకు వడ్డీలేని రుణాలను అందజేస్తోంది. వివరాలు 8లో uగురువారం శ్రీ 19 శ్రీ జూన్ శ్రీ 2025నూతన విద్యా సంవత్సరం ప్రారంభమై వారం రోజులు గడిచిపోయింది. రోడ్లపై బడి బస్సులు రయ్ రయ్మని విద్యార్థులతో తిరిగేస్తున్నాయి. అయితే వాటిలో ఎన్ని బస్సులు నిబంధనలు పాటిస్తున్నాయనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇంకా ఫిట్నెస్ చేయించుకోని బస్సులు ఉన్నాయనే విషయం ఆందోళన కలిగిస్తోంది. ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్న అధికారులు, ఇప్పటికే 15 బస్సులను సీజ్ చేశారు. – మెదక్జోన్/తూప్రాన్ జిల్లావ్యాప్తంగా 105 ప్రైవేట్ పాఠశాలలు ఉండగా, వాటిలో 45 వేల పైచిలుకు విద్యార్థులు చదువుకుంటున్నారు. ఇందులో హాస్టళ్లలో ఉంటూ 20 వేల మంది చదువుకుంటుండగా, మరో 25 వేల మంది గ్రామీణ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు నిత్యం ఇంటి నుంచి బస్సులు, ఇతర వాహనాల్లో బడులకు వెళ్తున్నారు. వీరికోసం వివిధ పాఠశాలలకు చెందిన యాజమాన్యాలు 313 బస్సులను వినియోగిస్తున్నాయి. ఏటా బస్సుల ఫిట్నెస్ తప్పనిసరిగా చూడాల్సిన బాధ్యత ఆర్టీఏ అధికారులపై ఉంటుంది. దీంతో వారు 99 బస్సులు కాలం చెల్లినవిగా గుర్తించి, వాటిలో పిల్లలను తరలించవద్దని ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా ఫిట్నెస్ లేనివి మరో 15 బస్సులను సీజ్ చేశారు. పాఠశాలలు ప్రారంభం కాకముందే వాటిని సరిచేసుకోవాల్సిన యాజమాన్యాలు నిర్లక్ష్యం వహించాయి. దీంతో అధికారులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తూ చర్యలు తీసు కుంటున్నారు. బడి బస్సు రోడ్డెక్కాలంటే 32 నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. అందులో ఫిట్నెస్, టైర్లు, సాంకేతిక సామర్థ్యం వంటి అంశాలపై అధికారులు పరిశీలించి సర్టిఫికెట్ జారీ చేస్తారు. చర్యలు తప్పవు పాఠశాల బస్సులను నిబంధనల ప్రకారం నడపాలి. జిల్లావ్యాప్తంగా 313 బస్సులు ఉండగా, ఇప్పటివరకు 15 బస్సులను సీజ్ చేశాం. అలాగే 99 బస్సులు కాలం చెల్లినవిగా గుర్తించాం. ఫిట్నెస్ చేయని పాఠశాలల వాహనాలను వెంటనే చేయించాలి. లేనిచో చట్టప్రకారం చర్యలు తీసుకుంటాం. – వెంకటస్వామి, ఆర్టీఏ, మెదక్న్యూస్రీల్జిల్లాలో 99 కాలం చెల్లిన బస్సులు ఇప్పటివరకు 15 సీజ్.. ముమ్మరంగా కొనసాగుతున్న తనిఖీలు -
విద్యాభివృద్ధికి పరిశ్రమల చేయూత
ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి జిన్నారం(పటాన్చెరు): ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి పరిశ్రమలు పెద్దపీట వేస్తున్నాయని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. బుధవారం గుమ్మడిదల మండలంలో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్సీ అంజిరెడ్డితో కలిసి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన చేశారు. గుమ్మడిదలలో హానర్ ల్యాబ్ పరిశ్రమ సహకారంతో సీసీ రోడ్లు, అంతర్గత మురికి కాలువలు, అన్నారం మోల్డ్ టెక్ పరిశ్రమ సహకారంతో నిర్మించిన జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాల, వావిలాలలో నిర్మించిన భవనాలను ప్రారంభించారు. గ్రామాల అభివృద్ధికి పరిశ్రమలు సహకారం అభినందనీయమన్నారు. ఈసందర్బంగా విద్యార్థులతో అక్షరాభ్యాసం చేయించారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ మాజీ వైస్ చెర్మన్ ప్రభాకర్, సీజీఆర్ ట్రస్ట్ చైర్మన్ గోవర్ధన్రెడ్డి, జెడ్పీటీసీ కుమార్ గౌడ్, మాజీ ఎంపీపీ రవీందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
ఇక డుమ్మాలకు చెక్
సాక్షి, సిద్దిపేట: జిల్లా ప్రజా పరిషత్లు, మండల పరిషత్ కార్యాలయాల్లో ఉద్యోగులకు బయోమెట్రిక్, ఫేస్ రికగ్నిషన్ హాజరును అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో మూడు జిల్లా ప్రజా పరిషత్లు,73 మండల ప్రజా పరిషత్ కార్యాలయాల్లో బయోమెట్రిక్, ఫేస్ రికగ్నిషన్ సంబంధిత మెషీన్లు ఏర్పాటు చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. జిల్లా పరిషత్, మండల పరిషత్ల పాలక వర్గాల గడువు గతేడాది జూలై 4వ తేదీతో ముగిసింది. అప్పటి నుంచి ప్రభుత్వం ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతుంది. జిల్లా కలెక్టర్లు జిల్లా పరిషత్ ప్రత్యేక అధికారులుగా, మండల పరిషత్ ప్రత్యేక అధికారులుగా పలువురు జిల్లా అధికారులు వ్యవహరిస్తున్నారు. మండల పరిషత్లలో పలువురు అధికారులు సమయ పాలన పాటించడం లేదని గ్రామీణాభివృద్ధి శాఖకు ఫిర్యాదులు అందాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా బయోమెట్రిక్, ఫేస్ రికగ్నిషన్ మెషీన్లు బిగించి సమయ పాలన పాటించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. గతంలో ఆఫ్లైన్ గతంలో పలు కార్యాలయాల్లో బయోమెట్రిక్ హాజరు ఆఫ్లైన్లో ఉండేది. అది సక్రమంగా పనిచేయకపోవడంతో పరికరాలు మూలన పడ్డాయి. దీంతో చాలామంది కార్యాలయ సిబ్బంది విధుల పట్ల జాప్యం వహించడం, తరచుగా డుమ్మా కొట్టడం, ఇంటికి వెళ్లడం, విధులకు రాకపోయినా వచ్చినట్లు నమోదు చేసుకుంటున్నారు. పలువురు ఉద్యోగులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుండటంతో ప్రజలకు మెరుగైన సేవలు అందడం లేదు. వీటికి చెక్ పెట్టేందుకు ప్రభుత్వం ఆన్లైన్ బయోమెట్రిక్, ఫేస్ రికగ్నిషన్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది.సిద్దిపేట జిల్లా పరిషత్లో ఏర్పాటు చేసిన బయోమెట్రిక్, ఫేస్ రికగ్నిషన్ మెషీన్లో హాజరు నమోదు చేసుకుంటున్న సిబ్బంది జిల్లా మండల పరిషత్లు సిద్దిపేట 26 సంగారెడ్డి 26 మెదక్ 21 ఉద్యోగుల నుంచి ఆధార్ నంబర్,హోదా వివరాల సేకరణ ఉమ్మడి మెదక్ జిల్లాలో మూడు జిల్లా పరిషత్లు, 73 మండల పరిషత్లుఉద్యోగుల వివరాల సేకరణ బయోమెట్రిక్, ఫేస్ రికగ్నిషన్ మెషీన్లో ఉద్యోగులను గుర్తించేందుకు వారి నుంచి వివరాలు సేకరిస్తున్నారు. ఉద్యోగుల హోదా, ఆధార్ నంబర్, ఉద్యోగుల క్రమసంఖ్య తదితర వివరాలను బయోమెట్రిక్లో నమోదు చేస్తున్నారు. బయోమెట్రిక్ హాజరుతో ఉద్యోగులు ఏ సమయానికి వస్తున్నారు? ఎప్పుడు వెళ్తున్నారు? ఎంతమంది సిబ్బంది హాజరయ్యారు? అనే విషయాలను ఎప్పటికప్పుడు రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ కార్యాలయంకు తెలియనుంది. -
లక్ష్యం మేర రుణాలు ఇవ్వాలి
మెదక్జోన్: బ్యాంకర్లు ఈ వార్షిక సంవత్సరానికి కేటాయించిన రూ. 6,517.51 కోట్ల రుణాలను రైతులతో పాటు ఇతర రంగాలకు అందించి లక్ష్యా న్ని చేరుకోవాలని కలెక్టర్ రాహుల్రాజ్ అన్నారు. బుధవారం కలెక్టరేట్లో సంబంధిత శాఖల అధికారులతో కలిసి రుణ ప్రణాళికను ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బ్యాంకర్లు నిర్దేశించిన రుణాలను అందిస్తేనే రైతులతో పాటు ఇతర రుణ గ్రహితలు అభివృద్ధి చెందే అవకాశం ఉంటుందన్నారు. అలాగే రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా స్వయం ఉపాధి రంగాలలో లక్ష్యాలను నిర్దేశించుకొని రుణాలు అందించాలన్నారు. గతేడాది వార్షిక రుణ ప్రణాళిక రూ. 5,857 కోట్ల రుణాల లక్ష్యం ఉండగా, ఇచ్చింది మాత్రం రూ. 4,366.84 కోట్లేనని తెలిపారు. ఈసారి అలా కాకుండా నిర్దేశించిన రుణాలు వందశాతం అందించేందుకు కృషి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్, ఇరిగేషన్ ఈఈ శ్రీనివాస్, ఎల్డీఎం నరసింహమూర్తి, నాబార్డ్ డీడీఎం కృష్ణతేజ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ భూముల పరిశీలన హవేళిఘణాపూర్(మెదక్)/మెదక్ కలెక్టరేట్: హవేళిఘణాపూర్ శివారులో ఉన్న ప్రభుత్వ భూములను కలెక్టర్ రాహుల్రాజ్ బుధవారం పరిశీలించారు. స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ, జిల్లా ఎలక్ట్రిసిటీ స్టోర్, అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్ తదితర నిర్మాణాలకు సంబంధించి ప్రభుత్వ పరిశీలించి పూర్తి వివరాలను మ్యాప్ను తయారు చేసి అందజేయాలని తహసీల్దార్ను ఆదేశించారు. అనంతరం జిల్లా కేంద్రంలోని నర్సింగ్ కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లాకు నూతన నర్సింగ్ కాలేజ్ భవన నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని, త్వరలోనే పనులు ప్రారంభం అవుతాయని తెలిపారు.కలెక్టర్ రాహుల్రాజ్ -
ఆటపాటల అంగన్వాడీ బోధన
నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి నారాయణఖేడ్: చిన్నారులకు సులభంగా అర్థమయ్యేలా అంగన్వాడీలో ఆటపాటల ద్వారా బోధన అందించాలని నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి అన్నారు. బుధవారం పట్టణంలోని శాసీ్త్రనగర్ అంగన్వాడీ కేంద్రంలో అమ్మమాట –అంగన్వాడీ బాట కార్యక్రమంలో పాల్గొని చిన్నారులతో సామూహిక అక్షరాభ్యాసం చేయించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేనివిధంగా అంగన్వాడీ చిన్నారులకు సైతం ఏకరూప దుస్తులు, ప్రతీ బుధవారం ఎగ్ బిర్యాని అందిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ ప్రాజెక్టు సీడీపీఓ సుజాత, మున్సిపల్ మాజీ చైర్మన్ ఆనంద్ స్వరూప్ షెట్కార్, మాజీ వైస్ చైర్మన్ దారం శంకర్, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఖేడ్ మున్సిపాలిటీ ఆవరణలో ఏర్పాటు చేసిన భూ భారతి రెవెన్యూ సదస్సును ఆర్డీఓ అశోకచక్రవర్తితో కలిసి ప్రారంభించారు. గత ప్రభుత్వం వేల ఎకరాల ప్రభుత్వ భూమిని నాయకులకు పట్టాలుగా మార్పిడి చేసిందన్నారు. అలాగే ఒక్కో ఇందిరమ్మ ఇంటికి ఎనిమిది ట్రాక్టర్ల ఉచిత ఇసుకను సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. అలాగే ర్యాలమడుగు సబ్స్టేషన్కు ప్రత్యేక ఫీడర్ను ఏర్పాటు చేసి ప్రారంభించారు. -
కార్మికశాఖ సహాయ అధికారి ఘెరావ్
నారాయణఖేడ్: ఖేడ్ కార్మికశాఖ సహాయ అధికారి గిరిరాజును బుధవారం వివిధ గ్రామాల బాధితులు నిలదీశారు. కార్మికశాఖ కార్డులు కలిగి ఉన్న మహిళా కార్మికుల మొదటి, రెండవ కాన్పులకు ప్రభుత్వం రూ. 30 వేల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తుందని, దరఖాస్తు చేసుకొని ఏడాది దాటినా ప్రక్రియ ప్రారంభించకపోగా, నిర్లక్ష్యంగా సమాధానమిస్తున్నారంటూ వాగ్వాదానికి దిగా రు. కొత్తగా కార్డులు కావాల్సిన వారికి సైతం ముడుపులు డిమాండ్ చేస్తున్నారని వాపోయారు. బాధితులకు కాంగ్రెస్ నాయకులు సంఘీభావం తెలిపారు. తడి, పొడి చెత్తపైఅవగాహన అవసరం జోగిపేట(అందోల్): తడి, పొడి చెత్త వినియోగంపై విద్యార్థులకు అవగాహన అవసరమని మున్సిపల్ కమిషనర్ తిరుపతి అ న్నారు. బుధవారం జోగిపేటలోని ఓ పాఠశాలలో వంద రోజుల ప్రణాళికలో భాగంగా వ్యర్థాల నిర్వహణ, ఎరువుల తయారీపై వ్యా సరచన పోటీలు నిర్వహించారు. ఈసందర్భంగా కమిషనర్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ.. భవిష్యత్ తరాలకు మంచి ప్రకృతిని అందించాలన్నారు. -
ధరణిలో అనేక అవకతవకలు
నర్సాపూర్ రూరల్: భూ సమస్యల పరిష్కారం కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం భూ భారతి రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తుందని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్ అన్నారు. బుధవారం మండలంలోని రెడ్డిపల్లిలో జరిగిన రెవెన్యూ సదస్సులో పాల్గొని మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన ధరణిలో అనేక అవకతవకలు జరగడంతో అనేక మంది రైతులు తమ భూ ములను కోల్పోయారని విమర్శించారు. పేద రైతులను మోసం చేసి కొంతమంది భూస్వాములు ధరణిలో భూములను సొంతం చేసుకున్నారని ఆరోపించారు. గతంలో అక్రమాలకు గురైన భూములను సరిచేసేందుకే మా ప్రభుత్వం భూ భారతిని తీసుకొచ్చిందన్నారు. భూ సమస్యలు ఉన్న ప్రతి ఒక్కరూ రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్, రెడ్డిపల్లి మాజీ ఉప సర్పంచ్ అశోక్గౌడ్, శివప్రసాద్గౌడ్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్ -
ప్రేమను పెద్దలు అంగీకరించలేదని..
వర్గల్(గజ్వేల్): తమ ప్రేమను పెద్దలు అంగీకరించడం లేదన్న మనస్తాపంతో ప్రేమ జంట బలవన్మరణం చెందారు. ఈ విషాదకర ఘటన మంగళవారం వర్గల్ మండలం అవుసులోనిపల్లిలో చోటుచేసుకున్నది. గౌరారం ఎస్ఐ కరుణాకర్రెడ్డి వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన చెక్కల ఆంజనేయులు, మణెమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు, కూతురు కల్పన(18) ఉంది. కల్పన ఇంటర్మీడియట్ చదివి ఇంటి వద్దే ఉంటోంది. అదే గ్రామానికి చెందిన ఉప్పరి మల్లేశం, మంజుల దంపతులది వ్యవసాయ కుటుంబం. వీరికి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు శివకుమార్ (21) ఉన్నారు. ఒకే గ్రామానికి చెందిన కల్పన, శివకుమార్ కొంతకాలం నుంచి ప్రేమించుకుంటున్నారు. కుటుంబీకులు వారి ప్రేమను అంగీకరించలేదు. మరోవైపు కూతురు వివాహం కోసం సంబంధం కుదుర్చుకునే పనిలో నిమగ్నమయ్యాడు. ఈ నేపథ్యంలో తమ ప్రేమ విఫలమైందని కల్పన, శివకుమార్ మనస్తాపానికి గురయ్యారు. మంగళవారం ఉదయం శివకుమార్ తన వ్యవసాయ క్షేత్రంలో చెట్టుకు ఉరి వేసుకుని బలవన్మరణం చెందాడు. ఈ విషయం తెలిసిన కొద్ది వ్యవధిలోనే కల్పన తన ఇంట్లో పైకప్పు పైపునకు చున్నీతో ఉరివేసుకుంది. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇరు కుటుంబాలు దుఃఖసాగరంలో మునిగిపోయాయి. మృతుల కుటుంబీకుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గజ్వేల్ ఆస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను కుటుంబీకులకు అప్పగించారు. -
చిల్లి గవ్వలేదు.. ఇల్లు కట్టేదెట్టా?
కొల్చారం(నర్సాపూర్): కట్టెల పొరకను నాటి..దాని చుట్టూ దాపుగా చీరలను కట్టుకుని నివాసముంటున్న ఈ ఫొటోలో కన్పిస్తున్న మహిళ పేరు అల్లం లక్ష్మమ్మ. మండలంలోని రంగంపేట గ్రామానికి చెందిన ఈమె పేరులో లక్ష్మి ఉన్నా బతుకులో మాత్రం దుర్భిణీతో వెదికినా లక్ష్మి కానరావడం లేదు. ఇటీవల ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద కొత్త ఇంటిని నిర్మించుకునేందుకు ప్రభుత్వం ద్వారా మంజూరు పత్రాన్ని అందుకుంది. ఇంటి నిర్మాణానికి సంబంధించి వివిధ విడతల్లో, మొత్తంగా ఐదు విడతల్లో డబ్బులు అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో మొదటి విడతగా పూర్తిస్థాయి బేస్మెంట్ నిర్మించిన తర్వాత రూ.1 లక్ష చెల్లించేలా నిబంధన. అయితే ప్రస్తుతం లక్ష్మమ్మ కాళ్ల నొప్పులతో బాధపడుతూ ఉండటం, పనిచేయని పరిస్థితుల్లో చేతుల్లో చిల్లి గవ్వ లేదు. అప్పు పుట్టని పరిస్థితి. పెట్టుబడి లేకుండా ఇంటిని ఎలా నిర్మించాలని ఆవేదన చెందుతుంది. ప్రభుత్వమే ముందుకు వచ్చి ఉండేందుకు ఇంటిని నిర్మించి ఇవ్వాలని కోరుతుంది. -
ఉపాధి పథకాలకు వంద శాతం సబ్సిడీ
పీడీ శ్రీనివాస్రావు శివ్వంపేట(నర్సాపూర్): జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా అందిస్తున్న పథకాలను సన్న, చిన్నకారు రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శ్రీనివాస్రావు అన్నారు. మంగళవారం మండల పరిధిలోని పెద్దగొట్టిముక్లల్లో ఉపాధి హామీ నిధులతో నిర్మించతలపెట్టిన పశువుల షెడ్డు, ఫిష్ పాండ్, ఉపాధి పనులను ఆయన పరిశీలించారు. కూలీలతో చర్చించారు. ఈ సందర్భంగా పీడీ మాట్లాడుతూ ఉపాధి కూలీలకు వంద శాతం సబ్సిడీపై పశువుల షెడ్డు, షిష్ పాండ్లు నిర్మించుకోవచ్చని తెలిపారు. జాబ్కార్డు కలిగి, ఏడాదిలో ఇరవై రోజులు ఉపాధి కూలి పనులు చేసిన సన్న, చిన్నకారు రైతులు ఈ పథకాలకు అర్హులన్నారు. పాడి ౖరైతులకు పశువుల షెడ్డుకు 90 వేలు, మత్స్యకారుల సహకార సంఘానికి చేపల చెరువులు నిర్మించుకునేందుకు రూ.10 లక్షలు నిధులతో ఫిష్ పాండ్లు నిర్మిస్తామన్నారు. -
సీఏం రేవంత్రెడ్డి చిత్ర పటానికి పాలభిషేకం
కల్హేర్(నారాయణఖేడ్): రైతు భరోసా డబ్బులు జమచేయడంతో కల్హేర్లో మంగళవారం కాంగ్రెస్ నాయకులు సీఏం రేవంత్రెడ్డి, ఎంపీ సురేశ్ షెట్కార్, ఎమ్మెల్యే పి.సంజీవరెడ్డి చిత్ర పటాలకు పాలభిషేకం చేశారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పోచయ్య, నాయకులు దేవదాస్, రవీందర్రెడ్డి, శ్రీనివాస్గౌడ్, వెంకట్రెడ్డి పాల్గొన్నారు. పదోన్నతితో మరింత బాధ్యతఅదనపు ఎస్పీ సంజీవరావు సంగారెడ్డి జోన్: పదోన్నతితో విధి నిర్వహణలో మరింత బాధ్యత పెరుగుతుందని జిల్లా అదనపు ఎస్పీ సంజీవరావు పేర్కొన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వహించిన చైతన్య సీనియర్ అసిస్టెంట్గా పదోన్నతి పొంది సైబరాబాద్ కార్యాలయానికి బదిలీ అయ్యారు. ఈ మేరకు మంగళవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఆయనను ఘనంగా సన్మించారు. కార్యక్రమంలో అడ్మినిస్ట్రేటివ్ అధికారి ఇ.కల్యాణి, అధికారులు అశోక్, వెంకటేశం, సిబ్బంది తదితరులు ఉన్నారు. నిరంతర విద్యుత్ సేవలు అందిస్తాం: ఎస్ఇ శంకర్ పాపన్నపేట(మెదక్): జిల్లాలో వినియోగదారులకు నిరంతర విద్యుత్ సేవలు అందిస్తామని విద్యుత్ శాఖ ఎస్ఇ శంకర్ తెలిపారు. పాపన్నపేటలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. జిల్లాలో 125 విద్యుత్ సబ్ స్టేషన్లున్నాయన్నారు. అభివృద్ధి పనుల కోసం జిల్లాకు రూ.50 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు.జిల్లాలో విద్యుత్ పరికరాలు సత్వరం అందించేందుకు ప్రభుత్వం 5 ఎకరాల భూమి కేటాయించిందన్నారు. లైన్మెన్లు నిరంతర సేవలు అందించేందుకు వారికి సెల్ఫోన్లు అందజేసినట్లు చెప్పారు. ప్రతీరోజు 587 మెగావాట్ల విద్యుత్ సరఫరా చేస్తున్నామని తెలిపారు. 2021 నుంచి 2024 వరకు 13,440 వ్యవసాయ బోర్లకు రూ.77.88 కోట్లతో విద్యుత్ కనెక్షన్లు అందించామన్నారు.మహిళా సంఘాల సేవలు భేష్సంగారెడ్డి టౌన్: జిల్లాలో మహిళా స్వయం సహాయక సంఘాల శిక్షణలో జిల్లాలోని సంఘాలకు విశేష గుర్తింపు ఉంటుందని రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన జెండర్ అధికారులు పేర్కొన్నారు. సంగారెడ్డి మండలంలోని ఇస్మాయిల్ ఖాన్ పేటలో మంగళవారం రాజస్థాన్ అధికారులు సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...మహిళా సంఘాల సభ్యులు ఆర్థికంగా స్థిరపడేందుకు వివిధ పథకాలతో లబ్ధి పొందుతున్నారని మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో గ్రామీణ మహిళలు ఉపాధి పొందుతూ ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు. మహిళలు చట్టాలపై అవగాహన కలిగి ఉండి సామాజిక అవగాహన కలిగి ఉండాలన్నారు. అనంతరం పలు ప్రదేశాలలో పర్యటించారు. కార్యక్రమంలో రాష్ట్ర సామాజిక సంఘ సేవకురాలు దేవి, డీఆర్డీఏ అధికారులు, మహిళా సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ న్యాయవాదులకు ఉచిత శిక్షణ మెదక్ కలెక్టరేట్: న్యాయశాస్త్ర పట్టభద్రులైన జిల్లాకు చెందిన ఎస్సీ యువతీ, యువకులకు ప్రభుత్వం స్టయిఫండ్తో పాటు ఉచిత శిక్షణ ఇస్తామని ఎస్సీ కార్పొరేషన్ అధికారి విజయలక్ష్మి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పథకంలో భాగంగా ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన అభ్యర్థులకు స్థానికంగా ఉండే పబ్లిక్ ప్రాసిక్యూటర్ వద్ద జూనియర్ చేరే అవకాశం కల్పిస్తామన్నారు. మూడేళ్లపాటు శిక్షణ సమయంలో స్టయిఫండ్ కూడా ఇవ్వనున్నట్లు తెలిపారు. ఉమ్మడి జిల్లాకు చెందిన అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా జూలై 31 వరకు దరఖాస్తు చేసుకోవాలని ఆమె కోరారు. -
క్రమశిక్షణ చాలా ముఖ్యం
● మనం చేసే పనులను బట్టి విలువ పెరుగుతుంది ● జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు మెదక్ మున్సిపాలిటీ/హవేళిఘణాపూర్(మెదక్): మనం చేసే పనులను బట్టి విలువ పెరుగుతుందని, యూనిఫాం వేసుకున్న ప్రతి ఒక్కరికి క్రమశిక్షణ చాలా ముఖ్యమని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం పోలీ సు ప్రధాన కార్యాలయంలో జిల్లాలోని అర్మర్డ్ రిజర్వ్ సిబ్బంది, హోంగార్డు సిబ్బందికి జిల్లా దర్బార్ నిర్వహించారు. అనంతరం మెదక్రూరల్, హవేళిఘణాపూర్ పోలీస్స్టేషన్లను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఈ సందర్భంగా రికార్డులను పరిశీలించారు. అనంతరం క్షేత్రస్థాయిలో ఉన్న వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సిబ్బందికి ఏవైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. చిన్న పొరపాట్లతో జీవితం నాశనం చేసుకోవద్దని హితవు పలికారు. ఎవరు కూడా చెప్పకుండా గైర్హాజరు కావొద్దని సూచించారు. ప్రతీ శుక్రవారం మీకోసం ప్రతీ శుక్రవారం సిబ్బంది కోసం కేటాయిస్తానని ఎస్పీ చెప్పారు. క్లిష్ట పరిస్థితులలో కూడా సమర్థవంతంగా విధులు నిర్వహిస్తారని, ఇక ముందు కూడా ఇదే స్ఫూర్తి కొనసాగించాలని సూచించారు. పోలీస్స్టేషన్లకు వచ్చే బాధితులకు అండగా ఉండాలని, వారి సమస్యలు పరిష్కరించే దిశగా పని చేయాలని ఎస్పీ శ్రీని వాస్రావు అన్నారు. బాధితులకు న్యాయం జరుగుతుందనే నమ్మకాన్ని ప్రజలకు కలిగించాలని సూచించారు. -
బుధవారం శ్రీ 18 శ్రీ జూన్ శ్రీ 2025
ముందు మురిపించిన వానలు పక్షం రోజులుగా ముఖం చాటేశాయి. మే నెలలో కురిసిన అకాల వర్షాలకు దుక్కులు దున్నిన రైతులు వర్షాధార పంటలను సాగు చేశారు. తీరా వర్షాకాలం ప్రారంభమయ్యాక విత్తనం విత్తాక చినుకు పడకపోవటంతో అన్నదాతలు ఆకాశం వైపు ఆశగా ఎదురు చూస్తున్నారు. మెదక్జోన్: మెదక్ జిల్లాలో మే నెలలో అకాల వర్షాలు దంచికొట్టాయి. యాసంగి ధాన్యాన్ని అమ్ముకోనివ్వకుండా నిత్యం వర్షంతో ధాన్యం తడిసిముద్దయింది. ఫలితంగా నానా తంటాలు పడి ధాన్యం అమ్ముకున్నారు. వానలకు భూములు తడవటంతో రైతులు దుక్కులు దున్ని వర్షాధార పంటలైన పత్తి, కూరగాయలసాగు, కంది, పెసర లాంటి ఆరుతడి పంటలతో పాటు పచ్చిరొట్ట విత్తనాలను సైతం సాగు చేశారు. జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది 3.50 లక్షల ఎకరాలలో వివిద రకాల పంటలను సాగుచేస్తుండగా ఇందులో అత్యధికంగా వరిసాగు కాగా రెండవ అత్యధికంగా పత్తి పంట సాగు చేస్తున్నార. వరిసాగు 3.5 లక్షల ఎకరాలలో సాగవుతుండగా పత్తి పంట 37 వేల ఎకరాలలో సాగు కానున్నట్లు అధికారులు అంచనా వేశారు. కాగా ఇప్పటివరకు కేవలం 10 వేల ఎకరాలకు పైగా పత్తిసాగు చేసినట్లు సమాచారం. పత్తితోపాటు కూరగాయలు, కందులు, పెసర్లు, పచ్చిరొట్ట విత్తనాల సాగు సైతం మరో వెయ్యి ఎకరాల వరకుసాగైనట్లు సబంధిత అధికారులు చెబుతున్నారు. నాలుగు మండలాల్లో అత్యధికం..! జిల్లాలో రేగోడు, టేక్మాల్, పెద్దశంకరంపేట, అల్లాదుర్గ్ మండలాల్లో అత్యధికంగా పత్తిసాగు చేస్తారు. ఈ పంటను పూర్తిగా వర్షాధారంగా సాగు చేస్తారు. ఆ మండలాల్లో సాగు నీరు అంతంత మాత్రంగానే ఉండటంతో ప్రతీఏటా వానాకాలంలో పత్తిపంటను సాగు చేస్తారు. కాగా పత్తిసాగు చేశాక కనీసం 10 రోజులకొకసారైనా వర్షం కురిస్తేనే విత్తిన విత్తు మొలకెత్తుతుంది. లేకపోతే ఎండ వేడిమికి విత్తు మొలకెత్తక పోగా భూమిలో విత్తిన విత్తును చెదలతో పాటు ఇతర చీమలు తినేసే అవకాశముంటుందని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. ఆకాశంలో మేఘాలు కమ్ముకుని వర్షం వచ్చిన వాతావరణం కనిపించినా ఆ తర్వాత గాలి మొదలై మేఘాలు కాస్తా తేలిపోతున్నాయి. మరో వారం పాటు ఇలాగే వర్షం కురవకుంటే వర్షాధారంగా సాగు చేసిన ఆరు తడి పంటలను మళ్లీ సాగు చేయాల్సి వస్తుందేమోనని రైతులు ఆందోళన చెందుతున్నారు.జిల్లా వ్యవసాయ శాఖ అధికారి విన్సెంట్ వినయ్కుమార్ న్యూస్రీల్ నమోదు ప్రక్రియలో లోపాలను గుర్తించాలి కలెక్టర్ రాహుల్రాజ్ యోగా డే పోస్టర్ ఆవిష్కరణ ముందస్తుగా కురిసిన వర్షాలు ఇప్పటికే వర్షాధార పంటలను విత్తుకున్న రైతులు పక్షం రోజులుగా ముఖం చాటేసిన వర్షాలు ఆందోళనలో రైతులు -
అందరికా.. కొందరికా?
ఖాతాల్లోకి రైతు భరోసా ● మొదటి విడతగా మూడెకరాల లోపు వారికి జమ ● ఉమ్మడి జిల్లాలో 8.38లక్షల ఎకరాలకు రూ.502 కోట్లు ● గత యాసంగిలో 2.27లక్షల మంది దూరం ● ఈ సారైనా పూర్తి స్థాయిలో అందేనా? ప్రభుత్వం అందిస్తున్న పెట్టుబడి సాయం ‘రైతు భరోసా’ కొందరికా? లేక అందరికా? అన్న చర్చ జోరుగా సాగుతోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉమ్మడి మెదక్ జిల్లాలో 17,18,981 ఎకరాలకు రూ.859 కోట్లకుపైగా రైతు బంధును అందించేవారు. కాంగ్రెస్ ప్రభుత్వం గత యాసంగిలో 4ఎకరాలలోపు వారికే రైతు భరోసా జమ చేసింది. దీంతో 40శాతం మంది రైతులు పెట్టుబడి సాయానికి దూరమయ్యారు. ఈసారి వానాకాలంలోనైనా అందరికీ జమ చేయాలని రైతులు కోరుతున్నారు. – సాక్షి, సిద్దిపేటప్రస్తుతం అందిన రైతు భరోసా ఇలా.. జిల్లా రైతులు ఎకరాలు రూ.కోట్లల్లో సిద్దిపేట 2,54,711 3,02,418 181,45,13,296 మెదక్ 2,25,764 2,24,319 134,59,15,589 సంగారెడ్డి 2,65,400 3,11,292 186,77,56,219గత యాసంగిలో రైతు భరోసా ఇలా.. జిల్లా రైతులు ఎకరాలు రూ.కోట్లల్లోసిద్దిపేట 2,62,238 3,33,238 199,94,28,372 మెదక్ 2,26,970 2,34,500 140,70,00,000 సంగారెడ్డి 2,67,236 3,33,416 200,05,00,000 -
సర్కార్ బడిలో టీచర్ కొడుకు
పాపన్నపేట(మెదక్)/తూప్రాన్: చాలామంది ప్రభుత్వ టీచర్లు తమ పిల్లలను ప్రైవేట్ బడికి పంపుతూ గ్రామస్తుల పిల్లలను మాత్రం సర్కార్ బడికి పంపాల్సిందిగా కోరుతారనే ప్రచారం ఉంది. అయితే ఆదర్శాలను ఆచరిస్తూ మిగతావారికి స్ఫూర్తి కలిగించాలని చెబుతుంటారు పెద్దలు. అలాంటి పనినే చేశాడో టీచర్. అందరూ ప్రైవేటు స్కూళ్ల మోజులో పడి తమ పిల్లల్ని అందుల్లో చేర్పిస్తుంటే ఓ టీచర్ మాత్రం సర్కారు బడిపై నమ్మకముంచి తన కుమారుడిని అందులోనే చేర్పించాడు. పాపన్నపేట మండలం పొడిచన్పల్లిలో మంగళవారం జరిగిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. పొడిచన్పల్లి గ్రామానికి చెందిన శ్రవణ్కుమార్ నాగ్సాన్పల్లి ప్రాథమిక పాఠశాలలో టీచర్గా పని చేస్తున్నాడు. మెదక్లో నివాసం ఉంటున్నాడు. తన కొడుకు కల్యాణ్వర్ధన్ను తను పనిచేస్తున్న పాఠశాలలోనే చేర్పించి స్కూలుకు వచ్చేటప్పుడు తన వెంట తీసుకొస్తున్నాడు. టీచర్లు తమ పిల్లలను సర్కార్ బడిలో చేర్పిస్తే, సామాన్యులకు ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం పెరుగుతుందని ఎంఇఓ ప్రతాప్రెడ్డి అన్నారు. గ్రామస్తులు కూడా టీచర్ శ్రవణ్ కుమార్ను అభినందించారు. వెల్దుర్తి మండలం కొప్పులపల్లి ప్రభుత్వ పాఠశాలలో హిందీ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న మహేశ్గౌడ్ కూడా తన కుమారుడు అభిషేక్గౌడ్ను తూప్రాన్లోని ప్రభుత్వ బాలుర ఉన్నతపాఠశాలలో 8వ తరగతిలో చేర్పించి ఆదర్శంగా నిలిచారు. దీంతో మహేశ్ గౌడ్ను కూడా ఎంఈఓ సత్యనారాయణతోపాటు పలువురు ఉపాధ్యాయులు అభినందించారు. -
బస్సులు నడపాలని ఆందోళన
నర్సాపూర్: పాఠశాలలు ప్రారంభమైనా ఆర్టీసీ అధికారులు జక్కపల్లి మార్గంలో బస్సులు నడపడం లేదని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు సోమవారం బస్టాండ్ వద్ద జాతీయ రహదారిపై ఆందోళనకు దిగారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా మూడు బస్సులు సరిపోవడం లేదని, గత విద్యా సంవత్సరం మరో బస్సు నడపాలని ఆర్టీసీ అధికారులను కోరగా, నడుపుతామని హామీ ఇచ్చి విస్మరించారని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా ఎస్ఐ జగన్నాథం ఆర్టీసీ అధికారులతో మాట్లాడుతానని హామీ ఇవ్వడంతో రాస్తారోకో విరమించారు. అనంతరం ఎస్సై డిపో ఇన్చార్జితో చర్చించారు. మంగళవారం నుంచి బస్సులు నడుపుతామని తెలిపారు. రాస్తారోకోతో హైదరాబాద్, మెదక్ మార్గంలో రోడ్డుపై పెద్దఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. -
రైతుల జీవితాల్లో వెలుగులు నింపుతాం
పాపన్నపేట(మెదక్): రైతు సంక్షేమమే ఊపిరిగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు అన్నారు. సోమవారం మండలంలోని పొడిచన్పల్లి రైతు వేదికలో సీఎం రేవంత్రెడ్డి రైతు నేస్తం వీడియో కాన్ఫరెన్స్కు కలెక్టర్ రాహుల్రాజ్తో కలిసి పాల్గొన్నారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ప్రతి మంగళవారం శాస్త్రవేత్తలతో 57 రైతు వేదికల్లో సుస్థిర వ్యవసాయంపై సలహాలు అందిస్తున్నామని చెప్పారు. కలెక్టర్ రాహుల్రాజ్ మాట్లాడుతూ.. సుమారు రూ. 2 కోట్ల వ్యయంతో రైతు వేదికల్లో వీడియో కాన్పరెన్స్ సౌకర్యం కల్పించామన్నారు. జిల్లాలో రైతు భరోసా కింద 2.26 లక్షల మందికి రూ.140 కోట్లు వారి ఖాతాల్లో జమ చేయడం ప్రారంభించినట్లు తెలిపారు. మిగిలిన 35 వేల మంది రైతులకు రాబోయే 9 రోజుల్లో జమ చేస్తామన్నారు. అలాగే సన్న వడ్లకు రూ. 500 బోనస్ వస్తుందన్నారు. కార్యక్రమంలో డీఏఓ వినయ్, ఉద్యావన అధికారి ప్రతాప్సింగ్, ఏఓ నాగమాధురి, ప్రభాకర్రెడ్డి, శ్రీకాంత్, గోవింద్, రైతులు పాల్గొన్నారు.మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ -
ప్రజావాణి అర్జీలను పరిష్కరించండి
కలెక్టర్ రాహుల్రాజ్ మెదక్ కలెక్టరేట్: ప్రజావాణి అర్జీలకు పరిష్కారం చూపాలని కలెక్టర్ రాహుల్రాజ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి హాజరై ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వివిధ శాఖలలో పెండింగ్లో ఉన్న దరఖాస్తులు త్వరితగతిన పరిష్కరించాలన్నారు. ప్రజావాణికి మొత్తం 85 అర్జీలు రాగా, అత్యధికంగా భూ సమస్యలు, ఇందిరమ్మ ఇళ్ల కోసం ఇచ్చారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్, డీఆర్డీఓ పీడీ శ్రీనివాస్రావుతో పాటు జిల్లాలోని ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. అనంతరం పీఎం దర్తి అభజన్ భాగీధారి అభయాన్ పథకంపై అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహంచారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ పథకానికి జిల్లాలోని 10 మండలాలను ఎంపిక చేసినట్లు తెలిపారు. ఆధార్, రేషన్ కార్డ్, కుల సర్టిఫికెట్, కిసాన్ క్రెడిట్ కార్డ్, ఆయుష్మాన్ భవ తదితర ఫథకాలు పొందలేని వారిని గుర్తించనున్నట్లు వివరించారు. వీరికి ప్రభుత్వ పథకాలు వర్తింపజేసేలా చర్యలు చేపట్టనున్నట్లు చెప్పారు. అధికారులు ఈ పథకంపై ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. -
పెండింగ్ కేసుల పరిష్కారానికి చర్యలు
ఎస్పీ శ్రీనివాస్రావుపెద్దశంకరంపేట(మెదక్)/అల్లాదుర్గం/రేగోడ్: జిల్లాలో పెండింగ్ కేసుల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ డాక్టర్ శ్రీనివాస్రావు తెలిపారు. సోమవారం పెద్దశంకరంపేట పోలీస్స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా పోలీస్ సిబ్బందికి పలు సూచనలిచ్చారు. జాతీయ రహదారి కావడంతో ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, దొంగతనాల నివారణకు గస్తీని పెంచాలని, రహదారి నిబంధనలు, సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. అనంతరం అల్లాదుర్గం, రేగోడ్ పోలీస్స్టేషన్లను తనిఖీ చేశారు. పాత కేసుల వివరాలు, రికార్డులు పరిశీలించారు. రోడ్డు ప్రమాదాల నివారణపై దృష్టి పెట్టాలన్నారు. వాహనాలు తనిఖీ చేస్తూ మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆయన వెంట అల్లాదుర్గం సీఐ రేణుకారెడ్డి, ఎస్ఐలు ప్రవీణ్రెడ్డి, శంకర్, సందీప్రెడ్డి సిబ్బంది ఉన్నారు.సమస్యలపై నేరుగా సంప్రదించండి మెదక్ మున్సిపాలిటీ: ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నామని, నేరుగా వచ్చి సమస్యలు పరిష్కరించుకోవాలని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు అన్నారు. సోమవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జరిగిన జిల్లాస్థాయి ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈసందర్భంగా ఫిర్యాదుదారుల సమస్యలపై సంబంధిత పోలీస్స్టేషన్ల అధికారులతో ఫోన్లో మాట్లాడారు. చట్టప్రకారం న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. ప్రజలు మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా స్వచ్ఛందంగా పోలీస్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రజలకు మరింత దగ్గరయ్యేలా, శాంతి భద్రతలు పరిరక్షిస్తూ ముందుకు సాగడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. -
పంటల సాగులో మెలకువలు అవసరం
నర్సాపూర్ రూరల్/కౌడిపల్లి: రైతుల అభివృద్ధి కోసం ఏర్పాటు చేస్తున్న రైతు నేస్తం కార్యక్రమాన్ని ప్రతి రైతు సద్వినియోగం చేసుకోవాలని అదనపు కలెక్టర్ నగేష్ అన్నారు. సోమవారం మండలంలోని అవంచ, లింగాపూర్ రైతు వేదికలలో రైతు నేస్తం వీడియో కాన్ఫరెన్స్ను ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు ప్రవేశపెట్టి అమలు చేస్తుందన్నారు. రైతు నేస్తం కార్యక్రమంలో తప్పకుండా పాల్గొని శాస్త్రవేత్తలు చెప్పే విషయాలను విని పంటలు సాగు చేయాలన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ మహిపాల్, ఏఓ దీపిక, ఏఈఓలు చంద్రవేణి, దుర్గాప్రసాద్, రైతులు పాల్గొన్నారు. అలాగే కౌడిపల్లి మండలంలోని తునికి రైతు వేదికలో నిర్వహించిన రైతు నేస్తం కార్యక్రమానికి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ సుహాసినిరెడ్డి హాజరయ్యారు. ఈసందర్భంగా రైతులతో కలిసి సీఎం రేవంత్రెడ్డి ప్రసంగాన్ని విన్నారు. అదనపు కలెక్టర్ నగేష్ -
ప్రైవేట్ పాఠశాలలదోపిడీని అరికట్టాలి
నిజాంపేట(మెదక్): ప్రైవేట్ పాఠశాలల దోపిడీని ప్రభుత్వం అరికట్టాలని యూఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు జగన్ సోమవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. కనీస వసతులు లేని ప్రైవేట్ స్కూళ్ల గుర్తింపు రద్దు చేయాలన్నారు. ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా స్కూళ్లు నడుస్తున్నాయని అన్నారు. పుస్తకాల పేరిట వ్యాపారం చేస్తున్న యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే ఫిట్నెస్ లేని బస్సులను అధికారులు వెంటనే సీజ్ చేయాలన్నారు. అనుమతి లేకుండా నోట్బుక్స్ విక్రయిస్తున్న ప్రైవేట్ పాఠశాలపై అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఒకే దేశం.. ఒకే ఎన్నికతో మేలు వెల్దుర్తి (తూప్రాన్): ఒకే దేశం.. ఒకే ఎన్నికతో ఆర్థిక భారం తగ్గి, తద్వారా దేశం మరింత అభివృద్ధి సాధిస్తుందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లేష్గౌడ్ అన్నారు. సోమవారం మండలంలోని బస్వాపూర్లో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. దేశ ప్రజలంతా ఒకే దేశం, ఒకే ఎన్నిక కార్యక్రమానికి మద్దతు తెలిపాలని సూచించారు. రాష్ట్రంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలతో కలిపి జరిపేందుకు ప్రధాని మోదీ కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు బాలకిషన్, వెంకటేశం, నవీన్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. పంట మార్పిడితో అధిక దిగుబడి రామాయంపేట(మెదక్): పంట మార్పిడితో చీడ పీడల ఉధృతి తగ్గి పంట దిగుబడి పెరుగుతుందని ఏడీఏ రాజ్నారాయణ అన్నారు. సోమవారం రైతులకు 50 శాతం సబ్సిడీపై జీలుగ విత్తనాలు అందజేసి మాట్లాడారు. మోతాదుకు మించి రసాయన ఎరువుల వినియోగంతో నేలలో భూసారం తగ్గి పంట దిగుబడిపై ప్రభావం చూపుతుందన్నారు. ఆగ్రో రైతు సేవా కేంద్రంతో పాటు సహకార సంఘం కార్యాలయంలో జీలుగ విత్తనాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఆ స్కూళ్ల గుర్తింపురద్దు చేయాలి: ఎస్ఎఫ్ఐ మెదక్ కలెక్టరేట్: అక్రమంగా పాఠ్య పుస్తకాలు విక్రయిస్తున్న పాఠశాలల గుర్తింపును రద్దు చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అజయ్ కుమార్ డిమాండ్ చేశారు. సోమవారం మెదక్లో ఆయన మాట్లాడుతూ.. ఈ విషయమై ప్రజావాణిలో కలెక్టర్కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఓ స్కూల్లో పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు, బెల్టులు, బ్యాగులు అమ్ముతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు భానుప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. భూ సమస్యలు పరిష్కరిస్తాం మెదక్ ఆర్డీఓ రమాదేవి పాపన్నపేట(మెదక్): అసైన్మెంట్ భూముల సమస్యల పరిష్కారానికి రైతులు దరఖాస్తు చేసుకోవాలని మెదక్ ఆర్డీఓ రమాదేవి సూచించారు. సోమవారం మండలంలోని కొత్తపల్లిలో జరిగిన రెవెన్యూ సదస్సుకు హాజరై మాట్లాడారు. పీఓటి, సాదాబైనామా, అసైన్మెంట్ భూముల విషయంపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. అందుకనుగుణంగా రైతులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. భూ రికార్డులకు సంబంధించిన ఆధారాలను జత పర్చాలన్నారు. కార్యక్రమంలో ఎమ్మార్వో సతీష్ కుమార్, గ్రామస్తులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ బడుల్లోనే నాణ్యమైన విద్య
ఎమ్మెల్సీ మల్క కొమరయ్య తూప్రాన్: ప్రభుత్వ బడుల్లోనే విద్యార్థులకు నాణ్యమైన విద్య లభిస్తుందని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మల్క కొమరయ్య అన్నారు. సోమవారం బడిబాటలో భాగంగా పట్టణంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. ప్రతి పాఠశాలలో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెంచాలని, అప్పుడే ఉపాధ్యాయులకు మంచి గుర్తింపు లభిస్తుందన్నారు. అక్షరాస్యతలో ప్రపంచంలో నాలుగో స్థానంలో ఉన్నామని, మొదటి స్థానానికి తేవడానికి ప్రధాని మోదీ ఆధ్వర్యంలో కార్యాచరణ ప్రణాళిక అమలవుతుందని తెలిపారు. అనంతరం క్విజ్ పోటీల్లో ప్రతిభ కనిబరిచిన వారికి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో డీఈఓ రాధాకిషన్, ఎంఈఓ సత్యనారాయణ, బీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లేష్గౌడ్, నాయకులు భూమన్నగారి జానకిరామ్ గౌడ్, మండల పార్టీ అధ్యక్షుడు పోచయ్య తదితరులు పాల్గొన్నారు. -
అర్హత లేని వైద్యం!
అదను దాటుతోంది సాగులో అదను దాటితే దిగుబడులపై ప్రభావం చూపుతుందని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. వివరాలు 8లో uజొన్నల డబ్బులేవీ..? జొన్నలు విక్రయించినా ఇంకా డబ్బులు రాలేదని రైతులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. వివరాలు 9లో uమంగళవారం శ్రీ 17 శ్రీ జూన్ శ్రీ 2025రామాయంపేట(మెదక్): వైద్యుడంటే ప్రాణాలు కాపాడే నారాయణుడిగా భావిస్తారు. అందుకే అంతా వైద్యో నారాయణో హరి అంటారు. అలాంటి వైద్య వృత్తికే కళంకం తెస్తున్నారు కొందరు నకిలీలు. ఎలాంటి అర్హత లేకున్నా మిడి మిడి జ్ఞానంతో వైద్యం చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. తాజాగా రామాయంపేటలో జరిగిన సంఘటన ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. గతంలో కంపౌండర్గా పనిచేసిన అనుభవంతో ఓ వ్యక్తి పట్టణం నడిబొడ్డున ఎలాంటి విద్యార్హత లేకున్నా గణపతి క్లినిక్ను ప్రారంభించాడు. రోగులు అతడి వద్దకు క్యూ కట్టారు. ఇటీవల ఓ మహిళకు వైద్యం వికటించి ప్రాణాలమీదికొచ్చింది. దీంతో ఆమెను మరో ఆస్పత్రికి తరలించి వైద్య ఖర్చులు భరించి బయటపడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేయడంతో క్లినిక్ను మూసి పారిపోయాడు. ఇటీవల జిల్లా పరిధిలో 10 మంది నకిలీ వైద్యులకు వైద్యశాఖ అధికారులు నోటీసులు జారీ చేశారు. అనుమతి లేకుండా ఆస్పత్రుల నిర్వహ ణ అమాయక ప్రజలే లక్ష్యంగా జిల్లాలో నకిలీ వైద్యులు చలామణి అవుతున్నారు. అర్హత లేకున్నా వైద్యం చేస్తూ రోగుల ప్రాణాలమీదికి తెస్తున్నారు. అయితే వైద్యం వికటించి రోగి ప్రాణాల మీదకు వస్తే తప్ప నకిలీల బండారం బయటపడటం లేదు. అలాంటి ఆస్పత్రులపై ఫిర్యాదులు వస్తే తప్ప సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. వైద్యశాఖ అనుమతులు లేకుండానే జిల్లాలో కనీసం 30 వరకు ప్రైవేట్ ఆస్పత్రులు అక్రమంగా కొనసాగుతున్నాయని సమాచారం. రాజకీయ ప్రోద్బలంతో వైద్యశాఖ అధికారులు వీరిపై చర్యలకు వెనుకాడుతున్నట్లు తెలుస్తోంది. ఆర్ఎంపీల ఇష్టారాజ్యం జిల్లా పరిధిలో సుమారు 2,500 పైగా ఆర్ఎంపీలు గ్రామాల్లో ప్రాథమిక చికిత్స కేంద్రాలను నడుపుతున్నారు. వారి వద్దకు వస్తున్న రోగులకు వైద్య సలహాలు మాత్రమే ఇవ్వాల్సి ఉండగా, సైలెన్ పెట్టడం,మందుల చీటి రాయడం వంటివి చేస్తున్నారు. ప్రిస్కిప్షన్ రాయడం చట్టప్రకారం నేరం. అలాగే తమ పేర్లకు ముందు డాక్టర్ అని రాసుకోకూడదు. కానీ కొందరు యథేచ్ఛగా నిబంధనలు అతిక్రమిస్తున్నారు. న్యూస్రీల్ప్రాణాలతో చెలగాటం పుట్టగొడుగుల్లా.. నకిలీ వైద్యులు జిల్లావ్యాప్తంగా 10 మందికి నోటీసులునకిలీలపై కఠిన చర్యలు ఎలాంటి అర్హత లేకపోయినా వైద్యం చేస్తున్న నకిలీ డాక్టర్లపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఇటీవలే జిల్లా పరిధిలో కొందరికి నోటీసులు జారీ చేశాం.నిబంధనల మేరకు ఆర్ఎంపీలు సైలెన్ పెట్టొద్దు. మందులకు సంబంధించి ప్రిస్కిప్షన్ రాయొద్దు. తెలంగాణ క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారం నకిలీలపై చర్యలు తీసుకుంటాం. – శ్రీరాం, డీఎంహెచ్ఓ -
అన్నదాతకు ‘భరోసా’
సకాలంలో పెట్టుబడి సాయం విడుదల చేసిన ప్రభుత్వం ● జిల్లాలో కొత్తగా 6,558 మంది రైతులువానాకాలం సీజన్ ప్రారంభంలోనే పెట్టుబడి సాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సోమవారండబ్బులు విడుదల చేసింది. ఈనెలాఖరులోగా అందరి రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయనున్నట్లు తెలిిపింది. గత యాసంగిలో ఆలస్యంగా రైతు భరోసా ఇవ్వడంతో పెట్టుబడి కోసం అన్నదాతలు ఇబ్బంది పడ్డారు. – మెదక్జోన్ జిల్లావ్యాప్తంగా 2,96,983 మంది రైతులు ఉండగా, సుమారు 4 లక్షల ఎకరాల సాగు భూములు ఉన్నాయి. వాటిలో ఏటా 3.90 లక్షల ఎకరాల వరకు వివిధ రకాల పంటలను సాగుచేస్తున్నారు. కాగా ఈ వానాకాలం సీజన్లో 3.50 లక్షల ఎక రాల్లో పంటలు సాగవుతాయని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు. గత యాసంగి సీజన్లో 2,65,629 మంది రైతులకు ప్రభుత్వం రూ. 213.63 కోట్ల పెట్టుబడి సాయం అందించింది. గత రబీతో పోల్చుకుంటే జిల్లాలో 6,558 మంది రైతులకు కొత్తగా పట్టాలు వచ్చాయని, వారికి సైతం ఈ సీజన్లో రైతు భరోసా అందిస్తామని అధికారులు చెబుతున్నారు. కాగా గత ప్రభుత్వ హయాంలో వెంచర్లు, గుట్టలు, సాగుకు యోగ్యం కాని భూములకు సైతం రైతుబంధు కింద పెట్టుబడి సాయం అందించారని కాంగ్రెస్ ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు ఎన్ని ఎకరాలకు పెట్టుబడి సాయం ఇెస్తే బాగుంటుందని గతంలో జిల్లావ్యాప్తంగా రైతులతో సమావేశాలు నిర్వహించింది. దీంతో మెజార్టీ రైతులు 10 ఎకరాల వరకు పెట్టుబడి సాయం ఇవ్వాలని పేర్కొన్నారు. పట్టాలు ఉన్నప్పటికీ సాగుకు యోగ్యం కాని భూములను గుర్తించి వాటికి పెట్టుబడి సాయం నిలిపివేసింది. అలాంటి భూములు జిల్లావ్యాప్తంగా 6,870 ఎకరాలు ఉన్నట్లు సంబంధిత ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. 2.72 లక్షల మంది రైతులకు సాయం ఈ వానాకాలం సీజన్లో 2,72,187 మంది రైతులకు రైతు భరోసా కింద పెట్టుబడి సాయం అందనుంది. గత రబీసీజన్లో 2,65,629 మంది రైతులకు గానూ రూ. 213.63 కోట్ల పెట్టుబడి సాయం అందించారు. కాగా అప్పటితో పోలిస్తే కొత్తగా 6,558 మంది రైతులకు పాస్ పుస్తకాలు వచ్చాయి. దీంతో ఈ సంఖ్య 2.72 లక్షలకు చేరుకుంది. ఇదిలాఉండగా జిల్లావ్యాప్తంగా 2,96,983 మంది రైతులు ఉండగా, రైతు భరోసా అందేది మాత్రం 2,72,187 మందికి మాత్రమే. మిగితా 24,796 మందికి భరోసా లేదు. వీరిలో చాలా మంది భూ స్వాములతో పాటు సాగుకు యోగ్యం కాని భూములు గల రైతులు ఉన్నట్లు తెలిసింది. -
పేదల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట
పెద్దశంకరంపేట(మెదక్): సీఎం రేవంత్రెడ్డి పేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారని నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి అన్నారు. ఆదివారం పెద్దశంకరంపేట మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మొదటి విడతలో మంజూరైన లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని, బిల్లులు త్వరితగతిన అందజేస్తామన్నారు. ఉచిత ఇసుక ఇవ్వడంతో పాటు ఇంటి నిర్మాణానికి మహిళా సంఘాల ద్వారా రూ. 1 లక్ష వరకు రుణం అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు భవాని, నాయకులు సురేందర్రెడ్డి, మధు, నారాగౌడ్, ఆర్ఎన్.సంతోష్, దాచ సంగమేశ్వర్, రాజేందర్గౌడ్, రాములు, శ్రీను, గంగారెడ్డి, అంజిరెడ్డి, ఇన్చార్జి ఎంపీడీఓ షాకీర్అలీ పాల్గొన్నారు.నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి -
అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు
హత్నూర(సంగారెడ్డి): అర్హులైన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇచ్చేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని మెదక్ డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఆవుల రాజిరెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని నస్తీపూర్ సాదులనగర్లో ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆరు గ్యారంటీల అమలుకు కట్టుబడి ఉన్నామన్నారు. బడుగు, బలహీనవర్గాలకు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే సంక్షేమ పథకాలు అందుతాయని పేర్కొన్నారు. ప్రతిపక్షాలు ప్రజలను తప్పుదోవ పట్టించడం మానుకోవాలని హితవు పలికారు. పదేళ్ల కేసీఆర్ పాలనలో రాష్ట్రం అధోగతి పాలైందని విమర్శించారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ దుర్గారెడ్డి, ఆత్మ కమిటీ డైరెక్టర్ సురేందర్రెడ్డి, కాంగ్రెస్ రాష్ట్ర మైనార్టీ విభాగం కార్యదర్శి హకీం, పార్టీ మండల శాఖ అధ్యక్షుడు కృష్ణ, మాజీ ఎంపీపీ ఉపాధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి, ఎంపీటీసీల ఫోరం మాజీ మండల అధ్యక్షుడు రాజేందర్, నాయకులు శ్రీనివాస్రెడ్డి, విఠల్రెడ్డి, వెంకటేశం, సత్యం, సతీష్, కృష్ణతో పాటు మండలంలోని ఆయా గ్రామాల నాయకులు పాల్గొన్నారు.డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్ -
జనారణ్యంలోకి జాతీయ పక్షి
చిన్నశంకరంపేట(మెదక్): వనంలో ఉండాల్సిన జాతీయ పక్షి నెమలి జనారణ్యంలోకి వచ్చింది. శనివారం రాత్రి నార్సింగి మండల కేంద్రంలోని రైతు వెంకట్రెడ్డి పశువుల పాకలోకి వచ్చి అరవడంతో గమనించిన రైతు పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో పోలీసులు వల్లూర్ అటవీశాఖ అధికారులను పిలిపించి నెమలిని అప్పగించగా.. వారు వల్లూర్ అడవిలో వదిలిలారు. దివ్యాంగులకు మరింత ప్రోత్సాహం మెదక్ కలెక్టరేట్: ప్రభుత్వం దివ్యాంగులకు మరింత ప్రోత్సాహం అందజేస్తుందని డీడ బ్ల్యూఓ హైమావతి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇద్దరు దివ్యాంగులు పెళ్లి చేసుకుంటే కల్యాణలక్ష్మితో పాటు రూ. లక్ష వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నట్లు చెప్పారు. గతంలో ఇద్దరు దివ్యాంగులు పెళ్లి చేసుకుంటే ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రోత్సాహం ఉండేది కాదన్నారు. ఇక నుంచి పెళ్లి చేసుకున్న జంటలో ఇద్దరూ దివ్యాంగులైనా, ఒకరు అయినా కల్యాణలక్ష్మితో పాటు రూ. లక్ష మంజూరు చేయనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం నుంచి జారీ చేసిన ధ్రువీకరణ పత్రం కలిగి ఉండాలన్నారు. వధువు 18, వరుడు 21 ఏళ్లు నిండి ఉండాలని పేర్కొన్నారు.నూతన పోస్టాఫీస్ భవనాన్ని నిర్మించండి జోగిపేట(అందోల్): నూతన పోస్టాఫీస్ భవనం నిర్మించాలని జోగిపేట ఏఎంసీ మాజీ చైర్మన్ గంగ జోగినాథ్ కేంద్ర మంత్రి కిషన్రెడ్డిని కోరారు. ఈ మేరకు ఆదివారం హైదరాబాద్లో ఆయనను కలిసి వినతిపత్రం అందజేశారు. పట్టణంలోని పోస్టాఫీస్ భవనం నిర్మి ంచి చాలా ఏళ్లు కావడంతో శిథిలావస్థకు చేరిందన్నారు. నూతన భవన నిర్మాణానికి అవసరమైన నిధులు మంజూరు చేయించాలని విజ్ఞప్తి చేశారు. నూతన భవన నిర్మాణం కోసం సంబంధిత మంత్రికి సిఫారసు చేయించి నిధులు విడుదల చేయిస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు. నిరుద్యోగులకు ఉచిత శిక్షణ సంగారెడ్డి టౌన్: నిరుద్యోగులకు సీసీ కెమెరా సర్వీసింగ్పై ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు స్టేట్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ డైరెక్టర్ వంగ రాజేంద్రప్రసాద్ ఆదివారం ఒక ప్రకటనలో చెప్పారు. సంగారెడ్డి, మెదక్ జిల్లాలోని 18 నుంచి 45 ఏళ్ల పురుషులకు ఈనెల 24వ తేదీ నుంచి 13 రోజుల పాటు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఆసక్తి ఉన్నవారు 9490103390, 9490129839 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. శిక్షణ కాలంలో పూర్తిగా ఉచిత భోజనంతో పాటు వసతి కల్పిస్తామన్నారు. శిక్షణ అనంతరం సర్టిఫికెట్లను అందజేస్తామని పేర్కొన్నారు. ఆయిల్పామ్ సాగుతో అధిక లాభాలు వెల్దుర్తి(తూప్రాన్): రైతులు ఆయిల్పామ్ సాగు చేసి అధిక లాభాలు పొందవచ్చని రాష్ట్ర ఆయిల్పామ్ టెక్నికల్ అడ్వైజర్ రంగనాయకులు అన్నారు. ఆదివారం మండలంలోని ఎలుకపల్లి శివారులో రైతు సత్యనారాయణగౌడ్ వ్యవసాయ క్షేత్రంలోని తోటలను పరిశీలించి మాట్లాడారు. ఆయిల్పామ్ సాగుతో నీటి ఆదాతో పాటు అంతర్గత పంటలు సాగు చేసుకొని అధిక లాభాలు పొందవచ్చన్నారు. దేశవ్యాప్తంగా 259 లక్షల టన్నుల ఆయిల్పామ్ వాడకం జరుగుతుంటే, కేవలం 97 లక్షల టన్నుల ఉత్పాదన మాత్రమే జరుగుతుందన్నారు. దీంతో కేంద్ర ప్రభుత్వం ఆయిల్పామ్ సాగుకు అత్యధికంగా సబ్సిడీ ఇస్తుందని, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా మేనేజర్ కృష్ణారావు, డిప్యూటీ మేనేజర్ అశోక్ కుమార్, రైతులు తదితరులు పాల్గొన్నారు. -
ప్రైవేట్ బడి.. ఆరా తప్పనిసరి!
ఆకట్టుకునే ప్రచారాలు నమ్మి మోసపోవద్దు ● పాఠశాల గురించి తెలుసుకున్నాకే చిన్నారులను చేర్పించాలి ● రిజిస్ట్రేషన్ గుర్తింపుపై ఆరా తీయాలి ● అర్హులైన టీచర్లు ఉన్నారో లేదో పరిశీలించాలి ● నిపుణుల సూచనలుసదాశివపేట(సంగారెడ్డి): విద్యాసంవత్సరం ప్రారంభానికి ముందే ప్రైవేట్ విద్యాసంస్థలు అడ్మిషన్ల వేట ప్రారంభించాయి. తల్లిదండ్రులను ఆకర్షించేందుకు ఇంటింటా ప్రచారాలు నిర్వహించారు. ప్రస్తుతం బడులు ప్రారంభించినా ఆపడం లేదు. అయితే పాఠశాల గురించి పూర్తిగా తెలుసుకున్నాకే చిన్నారులను చేర్పించాలని నిపుణులు సూచిస్తు న్నారు, పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న పాఠశాలలు జిల్లాలో ఇప్పటికే 454 పైగా ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలుండగా ఈ విద్యాసంవత్సరంలో మరో 15 వరకు కొత్తగా ఏర్పాటైనట్లు తెలుస్తోంది. జిల్లా కేంద్రమైన సంగారెడ్డి నియోజవర్గంతోపాటు జహీరాబాద్, నారాయణఖేడ్, అందోల్, పటాన్చెరు, జిల్లాలోని 12 మున్సిపాలిటీల, 26 మండలాల పరిధిలోనూ ఏటా కొత్త పాఠశాలలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. వీటిలో చాలా వాటికి అనుమతులు లేవని సమాచారం. విద్యాశాఖ అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తుండటంతో ఆయా విద్యాసంస్థలు యథేచ్చగా కొనసాగుతున్నాయి. ఫీజుల రూపంలో పిల్లల తల్లిదండ్రులను దోచుకుంటున్నాయి. మరికొన్ని విద్యాసంస్థలు ముందుగా అడ్మిషన్ తీసుకుంటే ఫీజులో రాయితీ ఉంటుందని మభ్యపెట్టి ముందుగా అడ్మిషన్లు చేశారు. వాస్తవానికి విద్యాశాఖ అనుమతి తీసుకున్న తర్వాతే విద్యార్థులను చేర్చుకోవాలి. తర్వాత పూర్తిస్థాయి అనుమతి తీసుకోవాలి. ప్రాథమిక స్థాయికి జిల్లా విద్యాశాఖ అధికారి నుంచి, ఉన్నత తరగతులు ప్రారంభించాలంటే పాఠశాల విద్యాశాఖ రీజినల్ జాయింట్ డైరెక్టర్ (ఆర్జేడీ) ద్వారా పాఠశాల విద్యాకమిషన్ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. సీబీఎస్ఈ సిలబస్ బోధించేందుకు కేంద్ర విద్యామండలి అనుమతులు కావాలని నిబంధనలు స్పష్టంగా చెబుతున్నా ప్రైవేటు విద్యాసంస్థలు ఇలాంటి అనుమతులేవీ తీసుకోకుండానే తమ సంస్థల్లో విద్యార్థులను చేర్పించుకుని అనుమతులు లభించకపోతే పిల్లల్ని నట్టేట ముంచుతున్నాయి. గుర్తింపు తప్పనిసరి గుర్తింపు పొందిన విద్యాసంస్థల్లోనే తల్లిదండ్రులు తమ పిల్లలను చేర్పించాలి. ఎటువంటి అనుమతులు తీసుకోకుండా కొన్ని పాఠశాలలు ఇతర విద్యాసంస్థల తరఫున పరీక్షలు రాయిస్తుంటారు. అలా పరీక్ష రాసిన విద్యార్థులను ప్రభుత్వం ప్రైవేట్ విద్యార్థులుగా పరిగణిస్తుంది. ఇలాంటి విషయల్లో తల్లిదండ్రుల జాగురత అవసరం. అనుమతులు లేకుంటే ఫిర్యాదు చేయండి ప్రైవేట్ యాజమాన్యం ప్రారంభించే ప్రతీ పాఠశాల కూ ప్రభుత్వ గుర్తింపు తప్పనిసరి. ప్రభుత్వ గుర్తింపు లేని పాఠశాలలుంటే జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి ఫిర్యాదు చేయవచ్చు. అటువంటి విద్యా సంస్థలపై చర్యలు తీసుకుంటాం. కొత్తగా పాఠశాలలు ప్రారంభిస్తే పూర్తి అనుమతి తీసుకున్న తర్వాత మాత్రమే అడ్మిషన్లు చేపట్టాలి. –వెంకటేశ్వర్లు, డీఈఓ, సంగారెడ్డి -
సరికొత్త హంగులతో పోలీస్స్టేషన్
పీహెచ్సీల్లో ప్రసవాల సంఖ్య పెంచాలి కలెక్టర్ రాహుల్రాజ్ కొల్చారం(నర్సాపూర్): జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సంస్థాగత ప్రసవాలను పెంచేందుకు వైద్యాధికారులు, సిబ్బంది కృషిచేయాలని కలెక్టర్ రాహుల్రాజ్ అన్నారు. ఆదివారం మండలంలోని పీహెచ్సీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బంది, స్టాక్ రిజిస్టర్, మందుల నిల్వలు, ఓపీ రిజిస్టర్ను పరిశీలించి రోగులకు అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. అలాగే సాధారణ ప్రసవాలు, ఆరోగ్య మహిళా కార్యక్రమం గురించి ఆరా తీశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఖచ్చితంగా డెలివరీల సంఖ్య పెంచాలన్నారు. రిస్క్ ఉన్న కేసులను జిల్లా, ఏరియా ఆస్పత్రులకు పంపాలని సూచించారు. ఫ్రైడే డ్రై డే కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో తప్పనిసరిగా చేపట్టాలన్నారు. జ్వర బాధితులకు టెస్ట్ల సంఖ్యను పెంచాలన్నారు. సీజనల్ వ్యాధులను అరికట్టాలని ఆదేశించారు. కార్యక్రమంలో వైద్యాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. పండగ వాతావరణంలో నిర్వహించాలి హవేళిఘణాపూర్(మెదక్): రైతునేస్తం కార్యక్రమాన్ని సోమవారం పండగ వాతావరణంలో నిర్వహించాలని కలెక్టర్ రాహుల్రాజ్ అన్నారు. ఆదివారం హవేళిఘణాపూర్ రైతు వేదికలో ఏర్పాట్లను పరిశీలించారు. సీఎం రేవంత్రెడ్డి జిల్లాలోని 57 రైతు వేదికల్లో రైతులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖాముఖి మాట్లాడుతారని తెలిపారు. జిన్నారం(పటాన్చెరు): సీఎస్ఆర్ నిధులతో అత్యాధునిక వసతులతో మోడల్ పోలీస్స్టేషన్ నిర్మించడం అభినందనీయమని మల్టీజోన్–2 ఐజీ సత్యనారాయణ అన్నారు. ఆదివారం బొల్లారం మున్సిపాలిటీ పరిధిలో నూతన పోలీస్స్టేషన్ భవన నిర్మాణానికి ఎంపీ రఘునందన్రావు, ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, హెటిరో పరిశ్రమ ప్లాంట్ డైరెక్టర్ మోహన్రెడ్డితో కలిసి భూమి పూజ చేశారు. ఈసందర్భంగా ఐజీ మాట్లాడుతూ.. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకే అత్యాధునిక పోలీస్స్టేషన్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. హెటిరో పరిశ్రమ సహకారంతో రూ. 3.50 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఎస్పీ పరితోష్ పంకజ్, డీఎస్పీ ప్రభాకర్, సీఐ రవీందర్రెడ్డి, నరేష్, లాలునాయక్, కమిషనర్ మధుసూదన్రెడ్డి, మాజీ జెడ్పీటీసీ కొలన్ బాల్రెడ్డి, మాజీ ఎంపీపీ రవీందర్రెడ్డి, నాయకులు చంద్రారెడ్డి, హన్మంత్రెడ్డి, ఆనంద్, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.ఐజీ సత్యనారాయణ -
పాలన చేతకాకే కక్ష సాధింపు
బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మారెడ్డి రామాయంపేట(మెదక్): సీఎం రేవంత్రెడ్డికి పరిపాలన చేతకాక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని బీఆర్ఎస్ జిల్లా అద్యక్షురాలు పద్మారెడ్డి ఆరోపించారు. ఇటీవల మృతిచెందిన పార్టీ కార్యకర్త నర్సింలు కుటుంబానికి శనివారం రూ. 2 లక్షల బీమా చెక్కును అందజేసి మాట్లాడారు. రైతు భరోసా, సన్నరకం ధాన్యానికి బోనస్ విషయంలో ప్రభుత్వం రైతులను మోసగించిందని మండిపడ్డారు. కక్షసాధింపు చర్యలకు పాల్పడుతూ కేటీఆర్కు రెండుసార్లు నోటీసులు జారీ చేశారన్నారు. మళ్లీ కేసీఆర్ సీఎం కావడం ఖాయమని జోస్యం చెప్పారు. ఇప్పటికే ప్రజలు కాంగ్రెస్ పాలన పట్ల విముఖత వ్యక్తం చేస్తున్నారని ఎద్దేవాచేశారు. ఆర్థిక వ్యవస్థపై రేవంత్రెడ్డికి పట్టులేకపోవడంతో పరిపాలన అస్తవ్యస్తంగా మారిందన్నారు. రైతుల శ్రేయస్సు గురించి ఎంతమాత్రం పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అంతకుముందు ముంబైలో మృతిచెందిన రాము కుటుంబసభ్యులను పరామర్శించారు. ఆమె వెంట సహకార సంఘం చైర్మన్ బాదె చంద్రం, మున్సిపల్ మాజీ చైర్మన్ జితేందర్గౌడ్, పార్టీ నిజాంపేట మండలశాఖ అధ్యక్షుడు సుధాకర్రెడ్డి, యూత్ విభాగం అధ్యక్షుడు జలంధర్ తదితరులు పాల్గొన్నారు. -
మరోసారి పొడిగించండి
● పదవీకాలం పొడిగింపుపై సర్కారును కోరేందుకు డీసీసీబీ పాలకవర్గం ● ఇటీవల సర్వసభ్య సమావేశంలో తీర్మానం! ● రూ. ఐదు వేల కోట్ల టర్నోవర్ లక్ష్యం సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: తమ పదవీకాలాన్ని మరోసారి పొడిగించేలా ప్రభుత్వాన్ని కోరాలని జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) పాలకవర్గం భావిస్తోంది. ఈ మేరకు సర్వ సభ్య సమావేశంలో ఈ అంశంపై పాలకవర్గం నేతలు ప్రత్యేకంగా చర్చించారు. ఈ పాలకవర్గం పొడిగించిన పదవీ కాలం గడువు ఆగస్టు 14తో ముగుస్తుంది. ప్రతి ఆరు నెలలకు ఒకసారి జరిగే డీసీసీబీ జనరల్ బాడీ మీటింగ్ మంగళవారం జరిగింది. ఈ సమావేశంలో తమ పదవీకాలం పొడిగింపు అంశాన్ని ప్రత్యేకంగా చర్చించారు. ఈ మేరకు తీర్మానం చేసినట్లు తెలు స్తోంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 105 సహకార సంఘాలు (పీఏసీఎస్) ఉన్నాయి. ఈ సంఘాల నుంచి చైర్మన్, వైస్చైర్మన్లతోపాటు మరో 21 మంది డైరెక్టర్లు ఈ డీసీసీబీ పాలకవర్గంలో ఉన్నారు. అయితే వీరి పదవీ కాలం ఫిబ్రవరి 14తో ముగిసింది. అన్ని జిల్లాల డీసీసీబీల పాలకవర్గాల విజ్ఞప్తుల మేరకు ప్రభుత్వం వీరి పదవీకాలాన్ని మరో ఆరు నెలలు పొడిగించింది. అంటే ఆగస్టు 14 వరకు వీరు పదవిలో కొనసాగుతారు. దీంతో మరో ఆరు నెలలు పొడిగించుకునేందుకు ఇప్పట్నుంచే ప్రయత్నాలు చేస్తున్నారు. వ్యవసాయ శాఖ మంత్రి ద్వారా సీఎంకు వినతిపత్రం ఇవ్వాలని పాలకవర్గం నేతలు భావిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో.. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం మళ్లీ సన్నాహాలు చేస్తోంది. గ్రామపంచాయతీలు, మండల, జిల్లా పరిషత్ ఎన్నికలను రెండు నెలల్లో నిర్వహించాలనే యోచనలో సర్కారు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఎన్నికలు నిర్వహించాలంటే కనీసం మూడు నెలలైనా పడుతుంది. ఈ నేపథ్యంలో తమ పదవీకాలం పొడిగింపు ఉంటుందని పాలకవర్గం నేతలు భావిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాతే..సహకార ఎన్నికలు నిర్వహించే అవకాశాలున్నట్లు సంబంధిత వర్గాలు చర్చించుకుంటున్నాయి.రూ. ఐదు వేల కోట్ల టర్నోవర్ లక్ష్యం రైతులకు పంట రుణాల మంజూరుతోపాటు, దీర్ఘకాలిక రుణాలు, వ్యవసాయ అనుబంధ బ్యాంకింగ్ సేవలు అందించడంతో డీసీసీబీది కీలక పాత్ర. ఇప్పటికే ఈ సహకార బ్యాంకు రూ.2,500 కోట్ల టర్నోవర్ లక్ష్యాన్ని చేరుకున్న విషయం విదితమే. ఈ వార్షిక టర్నోవర్ను రూ.ఐదు వేల కోట్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పాలకవర్గం నేతలు చెబుతున్నారు. ఈ ఆర్థిక ఏడాదిలో కొత్త రైతులకు రూ.50 కోట్ల మేరకు పంట రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బ్యాంకు లావాదేవీల ఆడిట్ రిపోర్టుకు ఈ సమావేశంలో పాలకవర్గం ఆమోదం తెలిపింది. మరోవైపు నష్టాల్లో ఉన్న పీఏసీఎస్లు తమ కార్యాచరణను పెంచుకుని లాభాల బాట పట్టేలా పనిచేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. -
రాజీయే రాజమార్గం
నర్సాపూర్: కేసులతో కోర్టుల చుట్టూ తిరుగుతూ విలువైన సమయం వృథా చేసుకోవడం కంటే ఇరువర్గాలు రాజీపడి కలిసిమెలిసి జీవించాలని జూనియర్ సివిల్ జడ్జి హేమలత హితవు పలికారు. శనివారం స్థానిక కోర్టు ఆవరణలో ఏర్పాటు చేసిన జాతీయ లోక్ అదాలత్లో పాల్గొని మాట్లాడారు. రాజీ చేసుకో తగిన కేసుల్లో ఇరువర్గాలు కోప తాపాలు మర్చిపోయి రాజీ కుదుర్చుకోవడం ఉత్తమమని చెప్పారు. అనంతరం పలు కేసులను పరిష్క రించారు. కార్యక్రమంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాఘవేందర్, ప్రభుత్వ సహాయ న్యాయవాది సుధాకర్ న్యాయవాదులు శ్రీనివాస్గౌడ్, మధుశ్రీ, సీఐ జాన్రెడ్డి, ఎస్ఐ లింగం తదితరులు పాల్గొన్నారు. 55 సార్లు రక్తదానం రామాయంపేట(మెదక్): అంతర్జాతీయ రక్తదాన దినోత్సవాన్ని పురస్కరించుకొని రాజ్భవన్లో ఏర్పాటు చేసిన శిబిరంలో శనివారం జిల్లా రెడ్క్రాస్ సొసైటీ చైర్మన్ ఏలేటి రాజశేఖర్రెడ్డి 55వసారి రక్తదానం చేశారు. ఈసందర్భంగా గవర్నర్ జిష్ణుదేవ్వర్మ ప్రశంసించి సర్టిఫికెట్ అందజేశారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రతినిధులతో పాటు జిల్లాకు చెందిన రెడ్క్రాస్ సొసైటీ ప్రతినిధులు పాల్గొన్నారు. ‘ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలి’ మెదక్ కలెక్టరేట్: సీఎం రేవంత్రెడ్డి ఇచ్చిన మాటకు కట్టుబడి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చాకే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని తెలంగాణ జాగృతి రాష్ట్ర నాయకుడు కొట్టాల యాదగిరి డిమాండ్ చేశారు. శనివారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ అతిథి గృహంలో తెలంగాణ జాగృతి, యునైటెడ్ పూలే ఫ్రంట్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈనెల 17న జిల్లా కేంద్రంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమానికి తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితతో పాటు పలువురు రాష్ట్ర నాయకులు హాజరుకానున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో నా యకులు విజయేంద్రసాగర్, కుమారస్వామి, నర్సింలు, రమేష్గౌడ్, బండి గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. 19న వానాకాలంసాగుపై సెమినార్ మెదక్ కలెక్టరేట్: ఈనెల 19న జరిగే వానాకాలం సాగుపై సెమినార్లో రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి శోభన్ పిలుపునిచ్చారు. ఇందుకు సంబంధించిన పోస్టర్ను శనివారం కేవల్ కిషన్ భవన్లో ఆవిష్కరించి మాట్లాడారు. వ్యవసాయ రంగం.. ఎదుర్కొంటున్న సవాళ్లు అంశంపై అఖిల భారత కిసాన్ సభ జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ విజూ కృష్ణన్ ప్రసంగిస్తారని తెలిపారు. అలాగే అరిబండి ప్రసాద్రావు రచించిన ‘నేను మన భూమి.. ఒక జీవన స్మతి’ పుస్తకాని ఆవిష్కరించనున్నట్లు చెప్పారు. అనంతరం వానాకాలం సాగు– తీసుకోవాల్సిన చర్యలు అనే అంశంపై సెమినార్ జరుగుతుందన్నారు. సెమినార్కు శాస్త్రవేత్తలు, వ్యవసాయశాఖ అదనపు సంచాలకులు డాక్టర్ విజయకుమార్, రైతు సంఘం నాయకుడు సారంపల్లి మల్లారెడ్డి, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి తదితరులు హాజరవుతారని తెలిపారు. -
సామాజిక భద్రత కార్మికుల హక్కు
మెదక్ కలెక్టరేట్: సామాజిక భద్రత కార్మికుల హక్కు అని, రోజుకు రూ. 178తో కూలీలు బతికేదెట్లా అని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్క రాములు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. శనివారం జిల్లా కేంద్రంలోని కేవల్ కిషన్ భవన్లో నిర్వహించిన సీఐటీయూ జిల్లా విస్తృతస్థాయి సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్స్ తీసుకువచ్చిందన్నారు. పెట్టుబడిదారులు, కాంట్రాక్టర్ల లాభాల కోసం కార్మికులను బానిసలుగా మార్చే ప్రయత్నం చేస్తుందన్నారు. కార్మికుల హక్కులపై పాలకులు దాడి చేస్తూనే ఉన్నారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన లేబర్ కోడ్స్తో 74 శాతం మందికి ఉద్యోగ భద్రత లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికులు, సాధారణ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం జూలై 9న దేశవ్యాప్త చేపట్టనున్నట్లు తెలిపారు. సమ్మెలో కార్మికులతో పాటు ప్రజలు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో సీఐటీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బాలమణి, మల్లేశం, ఉపాధ్యక్షులు కడారి నాగరాజు, మహేందర్రెడ్డి, సహాయ కార్యదర్శులు నాగేందర్ రెడ్డి, సంతోష్, ఆసిఫ్, కోశాధికారి నర్సమ్మ పాల్గొన్నారు.సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్క రాములు -
లోక్ అదాలత్తో సత్వర న్యాయం: ఎస్పీ
మెదక్ మున్సిపాలిటీ: జిల్లాలో శనివారం నిర్వహించిన జాతీయ మెగా లోక్ అదాలత్లో మొత్తం 5,277 కేసులు పరిష్కరించినట్లు ఎస్పీ డీవీ శ్రీనివాస్రావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పలు పోలీస్స్టేషన్లలో నమోదైన అండర్ ఇన్వెస్టిగేషన్, కోర్టు విచారణలో ఉన్న ఐపీసీ కేసులు 313, డ్రంకెన్ డ్రైవ్, ఎంవీఐ యాక్ట్, ట్రాఫిక్ నిబంధనలు ఉల్ల ంఘించిన కేసులు 4,429, ఈ–పెట్టి కేసులు, బహిరంగ ప్రదేశంలో మద్యం సేవించిన, తదితర కేసులు 535 పరిష్కారం అయినట్లు తెలిపారు. అలాగే సైబర్ క్రైమ్కు సంబంధించి 65 కేసులు నమోదు కాగా, 60 కేసుల్లో రూ. 12,43,343 బాధితులకు అందజేసినట్లు వివరించారు. కేసుల పరిష్కారానికి కృషి చేసిన అధికారులు, సిబ్బందిని అభినందించారు. -
6,039 కేసుల పరిష్కారం
● రూ. 55,90,281 రికవరీ ● జిల్లా ప్రధాన న్యాయమూర్తి నీలిమ ● లోక్ అదాలత్కు విశేష స్పందనమెదక్ కలెక్టరేట్: కోర్టు కేసుల్లో రాజీయే రాజ మార్గమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి నీలిమ అన్నారు. శనివారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లా కోర్టు, నర్సాపూర్, అల్లాదుర్గు కోర్టులలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా అన్నిరకాల కేసులు 6,039 పరిష్కరించినట్లు తెలిపారు. మొత్తం కేసుల్లో రూ. 55,90,281 రికవరీ చేసినట్లు వివరించారు. రాజీ పడడంతో ఇరువురికి న్యాయం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఆర్ఎం శుభవల్లి, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి సిరిసౌజన్య, స్పెషల్ మొబైల్ కోర్టు మేజిస్ట్రేట్ సాయి ప్రభాకర్, న్యాయవాదులు, అన్నికోర్టుల సిబ్బంది, కక్షిదారులు తదితరులు పాల్గొన్నారు. -
స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలి
ఎంపీ రఘునందన్రావుశివ్వంపేట(నర్సాపూర్): రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలని మెదక్ ఎంపీ రఘునందన్రావు అన్నారు. మండలంలోని పెద్దగొట్టిముక్లలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు బీజేపీలో చేరగా, వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈసందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్రమోదీ సారథ్యంలో దేశం అన్నిరంగాల్లో అభివృద్ధి చెందుతుందని అన్నారు. పదేళ్ల బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో ప్రజలకు ఒరిగిందేమి లేదన్నారు. గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల ప్రహరి నిర్మాణానికి రూ. 10 లక్షలు, హైమాస్ట్ లైట్ల ఏర్పాటుకు నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. శివ్వంపేటలో కేంద్ర ప్రభుత్వ స్థలం ఉన్నందున తపాలా కార్యాలయ నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని బీజేపీ నాయకుడు వినోద్ వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లేష్గౌడ్, మాజీ అధ్యక్షుడు శ్రీనివాస్గుప్తా, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు కొండల్రావు, మాజీ కౌన్సిలర్ సురేష్, మండల అధ్యక్షుడు రవి, నాయకులు నారాయణరెడ్డి, అంజనేయులుగౌడ్, భిక్షపతి, అశోక్, ఆంజనేయులు, నర్సింహారెడ్డి, నర్సింలు పాల్గొన్నారు. -
వారంలో ఒక రోజు వస్తా
కార్మికశాఖ మంత్రి వివేక్ ప్రశాంత్నగర్(సిద్దిపేట): సిద్దిపేటకు వారంలో ఒక రోజు వస్తానని, కార్యకర్తలకు అండగా నిలుస్తానని, కార్మికశాఖ మంత్రి, ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్ అన్నారు. శనివారం హైద్రాబాద్ నుంచి చెన్నూరు వెళుతూ.. మార్గమధ్యలో సిద్దిపేటలోని అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. పార్టీ బలోపేతానికి అందరం కలిసి కృషి చేద్దామని పిలుపునిచ్చారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన గ్యారంటీలను అమలు చేస్తామన్నారు. ఇప్పటికే ఇందిరమ్మ ఇళ్లు, సన్నబియ్యం తదితర పథకాలు ప్రజల్లోకి వెళ్లాయన్నారు. అన్ని సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించే విధంగా, అందరం కలిసికట్టుగా కృషి చేయాలని కోరారు. తన తండ్రి వెంకటస్వామి ఎంపీగా ఉన్నప్పుడు సిద్దిపేటతో మంచి సంబంధాలు ఉండేవన్నారు. మళ్లీ సిద్దిపేటకు ఇన్చార్జ్జిగా రావడం సంతోషంగా ఉందని అన్నారు. -
సర్కారు కాలేజీ పిలుస్తోంది..!
కౌడిపల్లి(నర్సాపూర్): ‘ప్రభుత్వ కళాశాలలో ఇంటర్మీడియెట్ చదివితే ఇంజనీరింగ్ ఉచితంగా చదవొచ్చు. ఇక్కడ పేద విద్యార్థులు మాత్రమే చదువుతారన్న భావన మీలో ఉండొద్దు. అనుభవం ఉన్న అధ్యాపకులతో నాణ్యమైన విద్యా బోధనతో పాటు ఉచిత పాఠ్య పుస్తకాలు అందిస్తున్నాం. క్రీడలు, ఎన్ఎస్ఎస్, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం’. అని ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకులు అడ్మిషన్ల కోసం ఇంటింటి ప్రచారంనిర్వహిస్తున్నారు. అన్ని గ్రూపులు.. సరిపడా అధ్యాపకులు కౌడిపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ, హెచ్ఈసీ గ్రూపులు ఉన్నాయి. అన్ని సబ్జెక్టులకు కలిపి 11 మంది లెక్చరర్లు ఉండగా, ఇంగ్లీష్, తెలుగు మీడియంలో విద్యాబోధన చేస్తున్నారు. గతేడాది 320 మంది విద్యార్థులు విద్యనభ్యసించారు. ప్రస్తుతం ప్రథమ సంవత్సరం అడ్మిషన్లు జరుగుతున్నాయి. అయితే ప్రభుత్వ కళాశాలలో ఇంటర్మీడియెట్ చదివి ఎప్సెట్ కన్వీనర్ కోటాలో సీటు వచ్చిన విద్యార్థులకు వందశాతం ఫీజు రీయింబర్స్మెంట్తో బీటెక్ ఉచితంగా చదువుకునే అవకాశం ప్రభుత్వం కల్పించింది. మిగితా వారికి అయితే కళాశాల స్థాయిని బట్టి కన్వీనర్ కోటాలో సీట్లు వచ్చిన విద్యార్థులకు రూ. 1 లక్ష నుంచి రూ. 2 లక్షలకు పైగా ఫీజు ఉంటుంది. కాగా ఫీజు రీయింబర్స్మెంట్ పథకంలో వివిధ ఇంజనీరింగ్ కళాశాలలో సీట్లు పొందిన విద్యార్థులకు ప్రభుత్వం కేవలం రూ. 35 వేలు మాత్రమే ఇస్తుంది. మిగితా డబ్బులు చెల్లించా ల్సి ఉంటుంది.ప్రభుత్వ కళాశాలలోచదివితే బీటెక్ ఉచితం గ్రామాల్లో అధ్యాపకుల విస్తృత ప్రచారం నాణ్యమైన బోధన అందిస్తున్నాం ప్రైవేట్ కంటే ప్రభుత్వ కళాశాలల్లో నాణ్యమైన విద్యా బోధన అందుతుంది. ప్రభుత్వ కాలేజీలో చదివిన విద్యార్థులు బీటెక్ ఫ్రీగా చదవొచ్చు. ఈ విషయం చాలా మందికి తెలియక బీటెక్ కోసం రూ. లక్షల్లో ఖర్చు చేస్తున్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు, తల్లిదండ్రులు వినియోగించుకోవాలి. ఈఏడాది అడ్మిషన్లు జరుగుతున్నాయి. – వెంకటసుబ్బయ్య, ప్రిన్సిపాల్ -
వేగవంతంగా బియ్యం పంపిణీ
కలెక్టర్ రాహుల్రాజ్ మెదక్ మున్సిపాలిటీ: మూడు నెలల రేషన్ బియ్యం ఒకేసారి పంపిణీ చేస్తుండటంతో ప్రతి ఇంట్లో పండగ వాతావరణం నెలకొంటుందని కలెక్టర్ రాహుల్రాజ్ అన్నారు. శనివారం మెదక్ మున్సిపాలిటీలోని 1వ వార్డు ఔరంగాబాద్ రేషన్షాపును పరిశీలించి మాట్లాడారు. సన్న బియ్యం పంపిణీని వేగవంతం చేయాలన్నారు. జిల్లాలో మొత్తం 2,16,716 రేషన్ కార్డులు ఉన్నాయని తెలిపారు. వీటి ద్వారా నెలకు సుమారు 4,522 మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ చేస్తున్నట్లు వివరించారు. మూడు నెలల కోటా కలిపి మొత్తం 13,922 మెట్రిక్ టన్నులు అవసరం కాగా, ఇందులో 8,800 మెట్రిక్ టన్నులను ఇప్పటికే 520 రేషన్ దుకాణాలకు తరలించినట్లు చెప్పారు. ఈనెల 30 బియ్యం పంపిణీ కొనసాగుతుందన్నారు. పేదల ఇబ్బందులను గుర్తించిన ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ చేయ డం గొప్ప విషయమని కొనియాడారు. సంబంధిత అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ‘రైతు నేస్తం’ ఏర్పాట్ల పరిశీలన హవేళిఘణాపూర్(మెదక్): ఈనెల 16న మండల కేంద్రంలోని రైతువేదికలో జరిగే రైతు నేస్తం కార్యక్రమ ఏర్పాట్లను శనివారం కలెక్టర్ రాహుల్రాజ్ పరిశీలించారు. ఈసందర్భంగా వ్యవసాయ అధికారులతో మాట్లాడారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం రేవంత్రెడ్డి రైతులతో మాట్లాడుతారని తెలిపారు. అన్ని రైతు నేస్తం కేంద్రాల్లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారని, ప్రజాప్రతినిధులు, రైతులు హాజరయ్యేలా చూడాలని సూచించారు. కలెక్టర్ వెంట జిల్లా వ్యవసాయ అధికారి వినయ్ తదితరులు ఉన్నారు. -
మార్పు వెనుక మతలబేమిటో!
దుకాణాలు ఎప్పుడు అప్పగిస్తారో?నర్సాపూర్లో దుకాణ సముదాయంనిర్మించి రెండున్నరేళ్లు కావొస్తున్నా అద్దెకు ఇవ్వడం లేదు. వివరాలు 9లో uశనివారం శ్రీ 14 శ్రీ జూన్ శ్రీ 2025ముప్పును ముందే చెబుతాయి వాతావరణానికి సంబంధించిన వివరాలు అందించే ప్రత్యేక యాప్లు అందుబాటులోకి వచ్చాయి. వివరాలు 8లో uసాక్షిప్రతినిధి, సంగారెడ్డి: ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్చార్జి మంత్రి మార్పుపై రాజకీయ, అధికార వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ బాధ్యతల నుంచి కొండా సురేఖను తప్పించి కొత్తగా మంత్రిగా బాధ్యతలు తీసుకున్న గడ్డం వివేక్ వెంకటస్వామిని ఇన్చార్జి మంత్రిగా నియమిస్తూ గురువారం ప్రభు త్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు దీరిన వెంటనే కొండా సురేఖ ఉమ్మడి మెదక్ జిల్లాకు ఇన్చార్జి మంత్రిగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలుతోపాటు, ఇటు జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతినిధులు, ఆయా నియోజకవర్గాల ముఖ్యనేతలను సమన్వయం చేయడంలో ఇన్చార్జి మంత్రిది కీలక బాధ్యత ఉంటుంది. ఉమ్మడి జిల్లాలో ప్రతిపక్ష బీఆర్ఎస్ బలంగా ఉంది. మొత్తం 11 నియోజకవర్గాల్లో కేవలం నాలుగు చోట్ల మాత్రమే కాంగ్రెస్ ఎమ్మెల్యేలున్నారు. మిగిలిన ఏడు చోట్ల ప్రతిపక్ష బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇలాంటి రాజకీయ పరిస్థితులు నెలకొన్న జిల్లాలో ఇన్చార్జి మంత్రి పాత్ర మరింత కీలకం. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ కీలక నేతలను, కేడర్ను సమన్వయం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎంతో కీలకమైన ఇన్చార్జి మంత్రిగా కొండా సురేఖను మార్చడం వెనుక కారణమేమై ఉంటుందోననే దానిపై చర్చ జరుగుతోంది. కలకలం రేపిన వేర్వేరు సమీక్షలు.. జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి దామోదర రాజనర్సింహ, ఇన్చార్జి మంత్రి కొండా సురేఖలు ఒకే అంశాలపై ఒక్క రోజు వ్యవధిలోనే వేర్వేరుగా సమావేశాలు నిర్వహించడం అధికార వర్గాల్లో చర్చోపచర్చలకు దారితీసింది. ధాన్యం సేకరణ, ఇందిరమ్మ ఇళ్లు, ఖరీఫ్ పనుల సమాయత్తం వంటి అంశాలపై ఆయా ఉమ్మడి జిల్లాల ఇన్చార్జి మంత్రులు సమీక్ష నిర్వహించాలని సీఎం రేవంత్రెడ్డి ఆదేశించిన విషయం విదితమే. ఈ ఆదేశాల మేరకు పక్షం రోజుల క్రితం ఉమ్మడి జిల్లాల కలెక్టర్లతో సమీక్ష సంగారెడ్డిలో జరిగింది. మీడియాను అనుమతించకుండా నిర్వహించిన ఈ సమీక్ష సమావేశానికి ఇద్దరు మంత్రులు హాజరైనప్పటికీ.. కేవలం కొండా సురేఖ మాత్రమే సమీక్షలో మాట్లాడారని తెలిసింది. ఈ సమీక్ష జరిగిన 24 గంటలు గడవకముందే దామోదర రాజనర్సింహ ఇవే అంశాలపై జిల్లా పరిషత్లో మరోసారి సమీక్షలు నిర్వహించారు. ఇలా కొండా సురేఖ సమీక్షించిన అంశాలనే ఒక్క రోజు కూడా గడవక ముందే దామోదర సమీక్షించడం అధికార వర్గాల్లో ఆసక్తికరమైన చర్చకు దారితీసింది. ఇలా జిల్లా మంత్రితో పొసగక పోవడంతోనే ఇన్చార్జి మంత్రి మారారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరోవైపు ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించేందుకు సన్నద్ధమవుతోంది. జీహెచ్ఎంసీ తర్వాత రాష్ట్రంలోనే అతిపెద్దదైన గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ను కై వసం చేసుకోవాలంటే పకడ్బందీగా కార్యాచరణ అవసరం ఉంటుంది. ఇన్చార్జిగా బాధ్యతల్లో ఉంటే ఈ ఎన్నికలకు పూర్తి స్థాయిలో సమయం కేటాయించడం కుదరకపోవచ్చనే కారణంగానే ఈ బాధ్యతల నుంచి తప్పించారనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది.న్యూస్రీల్ఆ నియోజకవర్గాల్లో కీలకం.. ఇన్చార్జి మంత్రిగా నియమితులైన వివేక్కు ఒకవిధంగా ఈ బాధ్యతలు సవాలుగానే కనిపిస్తోంది. ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలే అధికంగా ఉండడంతో పార్టీ కేడర్ను సమన్వయం చేయాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో సమన్వయం కీలకం. చర్చనీయాంశంగా మారిన ఇన్చార్జి మంత్రి మార్పు నిర్ణయం కొండా సురేఖను తప్పించి వివేక్ నియామకం ఆ నియోజకవర్గాల్లో కేడర్ సమన్వయంవివేక్కు సవాలే -
ప్రభుత్వ బడుల బలోపేతానికి చర్యలు
పెద్దశంకరంపేట(మెదక్): ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రభుత్వం చర్యలు చేపడుతుందని నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి అన్నా రు. శుక్రవారం పెద్దశంకరంపేట, మల్కాపూర్ పాఠశాలలో నిర్వహించిన సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈసందర్భంగా విద్యార్థులకు నూతన దుస్తులు, పుస్తకాలు అందజేశారు. ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. బడీడు పిల్లలు బడిలో ఉండే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని అన్నారు. కార్యక్రమంలో కాంప్లెక్స్ హెచ్ఎంలు విజయ్కుమార్, మారుతి, విఠల్, సత్యకుమార్ ఉపాధ్యాయులు రామకృష్ణాగౌడ్, సిద్దిరాములు, నాయకులు సురేందర్రెడ్డి, మధు, నారాగౌడ్, ఆర్ఎన్.సంతోష్, సంగమేశ్వర్, సుభాష్గౌడ్, గంగారెడ్డి, సాయిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి -
డీఈఓ రాధాకిషన్
కార్పొరేట్కు దీటుగా బోధన నిజాంపేట(మెదక్): ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య లభిస్తుందని డీఈఓ రాధాకిషన్ అన్నారు. శుక్రవారం మండలంలోని పలు గ్రామా ల్లో ప్రభుత్వ పాఠశాలలను సందర్శించారు. చల్మెడలో సామూహిక అక్షరాభ్యాసంలో పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. కార్పొరేట్కు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య లభిస్తుందన్నారు. విద్యార్థులకు చదువుతో పాటు క్రీడల్లో ప్రోత్సాహం లభిస్తుందని అన్నారు. పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను పెంచాలని ఉపాధ్యాయులకు సూచించారు. కార్యక్రమంలో ఎంఈఓ యాదగిరి, మాజీ ఎంపీటీసీ బాల్రెడ్డి, మాజీ ఉపసర్పంచ్ రమే ష్, గ్రామ కార్యదర్శి వెంకట నరసింహారెడ్డి, హెచ్ఎం సతీష్ కుమార్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. -
పల్లె పాలన!
పడకేసినకార్మికులకు జీతాలు కరువు రెండు నెలలుగా పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు రాకపోవడంతో వారు సైతం పనులు చేసేందుకు నిరాకరిస్తున్నారు. దీంతో పంచాయతీల పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. అయితే పల్లెల్లో వివిధ రకాల పన్నులు వసూలు అయినప్పటికీ వాటిని నేరుగా ఉపయోగించేందుకు వీలు లేదు. పంచాయతీ అకౌంట్లో జమ చేసి డ్రా చేయాల్సి ఉంటుంది. అలా అకౌంట్లో జమచేసిన మరుక్షణమే ఫ్రీజింగ్లోకి వెళ్లిపోతున్నాయని, దీంతో ఆ డబ్బులను వాడుకునే అవకాశం లేకుండా పోయిందని పంచాయతీ సెక్రటరీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.జిల్లావ్యాప్తంగా 21 మండలాల పరిధిలో 493 గ్రామాలు ఉండగా, 7 లక్షల పైచిలుకు జనాభా ఉన్నారు. గతేడాది ఫిబ్రవరిలో సర్పంచ్ల పదవీకాలం ముగిసింది. ఆ వెంటనే ప్రభుత్వం ప్రత్యేకాధికారులను నియమించింది. పాలకవర్గాలు లేకపోవడంతో 16 నెలలుగా పంచాయతీలకు కేంద్రం నుంచి పైసా విడుదల కాలేదు. స్పెషలాఫీసర్లు జీపీల ముఖం చూడటం మానేశారు. దీంతో భారమంతా కార్యదర్శులపైనే పడింది. గ్రామాల్లో చెత్త సేకరణ కోసం ఉపయోగించే ట్రాక్టర్లలో డీజిల్, వీధి దీపాలు, మోటార్ల రిపేర్లు, మురికి కాలువల వెంట గడ్డి మందు పిచికారీ, దోమలకు ఫాగింగ్, పారిశుద్ధ్య కార్యక్రమాలు, గ్రామసభల నిర్వహణ, ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలకు అయ్యే ఖర్చులు సైతం భరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈక్రమంలో చెత్త ట్రాక్టర్ల నిర్వహణ మాతో కాదంటూ తాళాలను ఆయా మండలాల ఎంపీడీఓలకు అప్పగించారు. ప్రభుత్వం నిధులు విడుదల చేస్తే తప్ప గ్రామాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలతో పాటు ఏ ఇతర పనులు చేపట్టబోమంటూ తేల్చిచెప్పారు. ఇదిలాఉండగా గతేడాది సెప్టెంబర్లో పచ్చదనం.. స్వచ్ఛదనం కింద 2 వేల జనాభాకుపైగా ఉన్న జీపీలకు రూ. 75 వేలు, అంతకంటే తక్కువ ఉన్న పంచాయతీలకు రూ. 50 వేల చొప్పున ప్రభుత్వం నిధులు విడుదల చేస్తున్నట్లు ప్రకటించినా, అవి నేటికీ విడుదల కాకపోవటం గమనార్హం. పొంచి ఉన్న సీజనల్ వ్యాధుల ముప్పుప్రస్తుతం వానాకాలం ప్రారంభం కావటంతో పారిశుద్ధ్య నిర్వహణపై ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా సీజనల్ వ్యాధులు విజృంభించే అవకాశం ఉంది. తాగునీటి నల్లాల లీకేజీలను అరికట్టకపోయినా, మురికి కాలువల వెంట చెత్తా చెదారం తొలగించకపోయినా, ఈగలు, దోమలకు ఆవాసం ఏర్పడి మలేరియా, డయేరియా లాంటి వ్యాధులు సోకే ప్రమాదం ఉంది. 16 నెలలుగా నిధులు లేకనీరసించిన గ్రామాలు ప్రత్యేకాధికారుల పర్యవేక్షణ కరువు పనిభారంతో చేతులెత్తేసిన పంచాయతీ కార్యదర్శులు ఎంపీడీఓలకు చెత్త సేకరణట్రాక్టర్ల తాళాలు అప్పగింత -
బడీడు పిల్లలు బడిలోనే ఉండాలి
చిన్నారులతో మాట్లాడుతున్న కలెక్టర్ రాహుల్రాజ్ హవేళిఘణాపూర్(మెదక్): గ్రామీణ ప్రాంతంలో బడీడు పిల్లలను పాఠశాలల్లో చేర్పించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని కలెక్టర్ రాహుల్రాజ్ అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని కూచన్పల్లిలో విద్యార్థులకు యూనిఫాం, పుస్తకాలను పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల నమోదు శాతం పెరిగేలా చూడాలని సూచించారు. అనంతరం మండల పరిధిలోని కూచన్పల్లిలో భూభారతి రెవెన్యూ సదస్సును సందర్శించారు. దరఖాస్తులను పరిశీలించి రైతులతో మాట్లాడారు. భూ సమస్యల పరిష్కారం కోసమే ప్రభుత్వం రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తుందన్నారు. రైతుల నుంచి అవసరమైన అర్జీలు స్వీకరించి సమస్యను పరిష్కరించేందుకు అవసరమైన ధ్రువపత్రాలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. ఆయన వెంట తహసీల్దార్ సింధూరేణుక, గిర్దావర్ ఆబేద్, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు. ఇందిరమ్మ ఇళ్లకు ఉచితంగా ఇసుక మెదక్ కలెక్టరేట్: జిల్లాలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు అవసరమయ్యే ఇసుకను ఉచితంగా అందించాలని కలెక్టర్ రాహుల్రాజ్ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్లో మైనింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ నిర్మాణాలకు జీరో పర్మిట్ సిస్టంతో కాంట్రాక్టర్లకు అవసరమైన ఇసుక, కంకర, మినరల్స్ను ఆన్లైన్ ద్వారా కొనుగోలుకు అవకాశం కల్పి ంచాలని అధికారులను ఆదేశించారు. అక్రమ ఇసుక రవాణాను అరికట్టడానికి ప్రతి మండలంలో ఏర్పాటు చేసిన ఎన్ఫోర్స్మెంట్ బృందాలు క్రియాశీలకంగా పనిచేసి ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలన్నారు. అనంతరం సీఎస్ రామకృష్ణారావు హైదరాబాద్ నుంచి నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. ఈనెల 16న వ్యవసాయ విశ్వవిద్యాలయంలో జరగనున్న రైతునేస్తం కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. కలెక్టర్ రాహుల్రాజ్ -
భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం
కొల్చారం(నర్సాపూర్): భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకే ప్రభుత్వం భూభారతి రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తుందని అదనపు కలెక్టర్ నగేష్ తెలిపారు. శుక్రవారం మండలంలోని ఎనగండ్లలో నిర్వహించిన రెవెన్యూ సదస్సును సందర్శించారు. ఈసందర్భంగా గ్రామంలో చాలా ఏళ్లుగా పరిష్కారం కాకుండా ఉన్న సాదా బైనామాలను వెంటనే పరిష్కరించాలని రైతులు అదనపు కలెక్టర్ను కోరారు. ఆయన వెంట తహసీల్దార్ శ్రీనివాసచారి, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం గ్రామంలోని ప్రాథమిక పాఠశాలను సందర్శించి విద్యార్థులతో ముచ్చటించారు. అవసరమైన మరుగుదొడ్లు, పరిసరాల పరిశుభ్రత, స్వచ్ఛమైన తాగునీటిని అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. విద్యా ప్రమాణాలు పెంపొందించే విధంగా బోధనను అందించాలని సూచించారు. -
భూభారతికి దరఖాస్తుల వెల్లువ
8 రోజులు.. ● 216 సదస్సులు.. ● 13,693 అర్జీలుమెదక్ కలెక్టరేట్: భూ భారతి రెవెన్యూ సదస్సులకు జిల్లాలో రోజు రోజుకు ఆదరణ పెరుగుతోంది. ఏళ్ల తరబడి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగి అలసిపోయిన రైతులు కొండంత నమ్మకంతో తరలివస్తున్నారు. జిల్లాలోని 216 గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించగా, రైతులు తమ సమస్యలపై ఇప్పటివరకు 13,693 అర్జీలు సమర్పించారు. అయితే అత్యధికంగా అసైన్డ్ భూముల సమస్యలు, సర్వే నంబర్ మిస్సింగ్, సాదాబైనామాలు, పాస్పుస్తకంలో తప్పులు వంటి సమస్యలపై అత్యధికంగా దరఖాస్తులు అందజేస్తున్నారు. ఇదిలాఉండగా రెవెన్యూ సదస్సులను కలెక్టర్ రాహుల్రాజ్, అదనపు కలెక్టర్ నగేష్తో పాటు ఆర్డీఓలు సందర్శించి దరఖాస్తులు పరిశీలిస్తున్నారు. రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకుంటూ భరోసా కల్పిస్తున్నారు. ఆరుగురు అధికారుల బృందం జిల్లాలో జరుగుతున్న రెవెన్యూ సదస్సుల్లో ఆరుగురు అధికారుల బృందం పాల్గొంటున్నారు. ఈ బృందంలో తహసీల్దార్, డిప్యుటీ తహసీల్దార్, డేటా ఎంట్రీ ఆపరేటర్, సీనియర్, జూనియర్ అసిస్టెంట్ స్థాయి అధికారులు బృందంగా ఏర్పడి రైతుల నుంచి అర్జీలు స్వీకరిస్తున్నారు. రైతుల నుంచి వినతులు స్వీకరించి కేటగిరీల వారీగా విభజిస్తున్నారు. హెల్ప్డెస్క్ల ఏర్పాటు గ్రామాల్లో చాలా వరకు రైతులు నిరక్షరాస్యులుగా ఉండటంతో వారికి ఉపయోగపడేలా హెల్ప్డెస్క్లు ఏర్పాటు చేస్తున్నారు. ఉచితంగా దరఖాస్తు పత్రాలు ఇవ్వడంతో వారి సమస్యను అక్కడే హెల్ప్డెస్క్ అధికారులు రాసిస్తున్నారు. అంశాలు అర్జీలు అసైన్డ్ భూ సమస్యలు 2,639 సర్వే నంబర్ మిస్సింగ్ 2,624 సాదాబైనామాలు 2,429 పీఓటీలు 2,014 పాస్పుస్తకంలో తప్పులు 964 ఓఆర్సీ 412 సక్సెషన్ 435 మ్యూటేషన్ పెండింగ్ 307 కొత్త అసైన్డ్ భూములు 246 ఫారెస్ట్, రెవెన్యూ సర్వే కోసం 164 ఇతర సమస్యలపై 1,459 -
బడిగంట మోగింది
మెదక్జోన్: బడిగంటలు గణగణ మోగాయి. వేసవి సెలవుల అనంతరం గురువారం పాఠశా లలు తెరుచుకున్నాయి. కొత్త విద్యా సంవత్సరం ఆరంభం అయింది. ఇంటి వద్ద ఆటాపాటలతో గడిపిన పిల్లలు బడిబాట పట్టారు. బడిలో అడుగుపెట్టగానే ఉపాధ్యాయులు పూలు అందించి ఘన స్వాగతం పలికారు. కాగా తొలిరోజు విద్యార్థులు అంతంత మాత్రంగానే పాఠశాలలకు వచ్చారు. చాలా చోట్ల ఉదయం ప్రార్థనలో ఉపాధ్యాయులే దర్శనం ఇచ్చారు. ఇదిలా ఉండగా విద్యాశాఖ అధికారులు చెప్పినట్టుగానే విద్యార్థులకు మొదటి రోజే పుస్తకాలు, యూనిఫాంలు అందించారు. విద్యాభివృద్ధికి ప్రభుత్వం కృషి కౌడిపల్లి(నర్సాపూర్): పాఠశాల ప్రారంభమైన మొదటి రోజే విద్యార్థులకు పుస్తకాలు, యునిఫాంలు అందజేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కిందని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ సుహాసినిరెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రమైన కౌడిపల్లి ఉన్నత, బాలికల ఉన్నత, ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫాంలు పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వం విద్యాభివృద్ధికి కృిషి చేస్తుందన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని కోరారు. పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు తనవంతుగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించి సొంతభవనం ఏర్పాటుకు కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో ఎంఈఓ బాలరాజు, హెచ్ఎంలు సాజిద్అలీ, పద్మజ, ఓంప్రకాష్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. సర్కారు బడులపై నమ్మకం పెరిగింది పాపన్నపేట(మెదక్)/అల్లాదుర్గం/టేక్మాల్: ప్రభుత్వ పాఠశాలకు ప్రైవేట్ బడి నుంచి విద్యార్థులు రావడం కొత్త మార్పుకు నిదర్శనమని డీఈఓ రాధాకిషన్ అన్నారు. గురువారం పాపన్నపేట మండలం గాజులగూడెం ప్రాథమికోన్నత పాఠశాలలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రభుత్వ బడులన్నీ ప్రజలయే అన్న విషయాన్ని గుర్తించి, ప్రతి ఒక్కరు తమ పిల్లలను ప్రభుత్వ బడికి పంపాలని కోరారు. అధునాతన విద్యావిధానంతో పాటు చిన్నప్పటి నుంచే పూర్వ ప్రాథమిక విద్య అందిస్తున్నామని తెలిపారు. ఆంగ్ల మాధ్యమం, డిజిటల్ విద్య అందిస్తున్నామని, కృత్రిమ విద్య సైతం అందుబాటులోకి వచ్చిందన్నారు. కార్యక్రమంలో ఎంఈఓ ప్రతాప్రెడ్డి, ఏడుపాయల మాజీ చైర్మన్ బాలాగౌడ్, సొసైటీ చైర్మన్ మల్లేశం, హెచ్ ఎం సాయికుమార్, టీచర్లు రవీందర్ రెడ్డి, సాయిలు, వేణుగోపాల్, గ్రామస్తులు పాల్గొన్నారు. అనంతరం టేక్మాల్ మండలంలోని బొడ్మమటిపల్లి ఉన్నత పాఠశాలను సందర్శించారు. అలాగే అల్లాదుర్గం మండల పరిధిలోని ముస్లాపూర్ పీఎంశ్రీ పాఠశాలలో తల్లిదండ్రుల సమావేశంలో పాల్గొన్నారు. తొలి రోజు హాజరు అంతంతే.. విద్యార్థులకు యూనిఫాం,పాఠ్యపుస్తకాలు పంపిణీ -
బల్దియాల్లో మాన్సూన్
కొనసాగుతున్న100 రోజుల యాక్షన్ప్లాన్ ● సెప్టెంబర్ 10 వరకు కొనసాగింపు ● జిల్లాలో నాలుగు మున్సిపాలిటీలు,75 వార్డులువానాకాలంలో ఎదురయ్యే సమస్యలను దృష్టిలో పెట్టుకొని మున్సిపాలిటీల్లో మాన్సూన్ పేరిట 100 రోజుల ప్రణాళికను ప్రభుత్వం రూపొందించింది. ఈనెల 2వ తేదీన యాక్షన్ప్లాన్ ప్రారంభం కాగా, సెప్టెంబరు 10వ తేదీ వరకు కొనసాగనుంది. ముందస్తుగా పారిశుద్ధ్యం, పరిసరాల పరిశుభ్రత, తడి, పొడి చెత్తపై వార్డుల వారీగా అధికారులు, సిబ్బంది ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. – మెదక్జోన్ జిల్లాలో మెదక్, రామాయంపేట, తూప్రాన్, నర్సాపూర్ మున్సిపాలిటీలు ఉన్నాయి. వీటిలో 75 వార్డులు ఉండగా, రెండు లక్షల పైచిలుకు జనాభా ఉన్నారు. ప్రస్తుతం వానాకాలం సీజన్ ప్రారంభం కావడంతో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. దీంతో ముందస్తుగా దోమల నివారణతో పాటు కలుషిత తాగునీటితో వచ్చే వ్యాధులపై అధికారులు రోజుకో వార్డులో పర్యటిస్తూ విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు. పట్టణాల్లో అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి ప్రజలను భాగస్వాములను చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన 62 రకాల అంశాలను 100 రోజుల్లో పూర్తి చేసేందుకు ప్రణాళికాబద్దంగా ముందుకు సాగుతున్నారు. పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి వంద రోజుల ప్రణాళికలో భాగంగా పారిశుధ్య నిర్వహణతో పాటు ప్రజారోగ్యంపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారు. వార్డుల్లో మురికి కాలువల పరిశుభ్రత, పిచ్చిమొక్కల తొలగింపు, తడి, పొడి చెత్తపై ప్రచారం, గుంతల్లో నీటి నిల్వ లేకుండా చూడటం, దోమలు వృద్ధి చెందకుండా యాంటీ లార్వా ద్రావణాన్ని పిచికారీ చేస్తున్నారు. మలేరియా, డెంగీ వ్యాధులు సోకకుండా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. వీధుల్లో రోడ్ల శుభ్రత, ఇళ్లలో పాత టైర్లు, కొబ్బరి చిప్పలు, కూలర్లలో నీటి నిల్వ లేకుండా చూడటం, పరిసరాల పరిశుభ్రతపై ముందుస్తుగా వివరిస్తున్నారు. 62 అంశాలపై కార్యాచరణ మున్సిపాలిటీల్లో 62 అంశాలపై వంద రోజుల యాక్షన్ ప్లాన్ రూపొందించి, ఆ దిశగా అధికారులు ముందుకు సాగుతున్నారు. ఆయా బల్దియాల పరిధిలో పెంచుతున్న నర్సరీల్లో మొక్కల వివరాలు సేకరించి వార్డుల్లో, చెరువు కట్టలు, రోడ్లకు ఇరువైపులా నాటడం, ఇంజనీరింగ్ అధికారులు అభివృద్ధి పనులపై దృష్టి సారించడం, అత్యవసరమైన పనులకు వెంటనే టెండర్లు పిలిచి నిర్దేశించిన పనులను తగిన సమయంలో చేయించడం, మున్సిపాలిటీల అభివృద్ధి కోసం వార్డు అధికారులు ఇంటితో పాటు వివిధ రకాల పన్నులను ఎప్పటికప్పుడు వసూలు చేయటం, కొత్తగా వ్యాపారులకు లైసెన్స్లు అందించడం, వీధి వ్యాపారులకు రుణాలు ఇప్పించటం, వికలాంగుల కోసం ఉచితంగా వైద్య శిబిరాలు ఏర్పాటు చేయటం, మహిళలను మహిళా సంఘాల్లో చేర్పించటం, అక్రమ నల్లా కనెక్షన్లను తొలగించి అవసరమైన వారికి కనెక్షన్ ఇవ్వటం లాంటి పనులు చేపట్టనున్నారు. పక్కాగా అమలుచేస్తాం ప్రభుత్వం నిర్దేశించిన 100 రోజుల యాక్షన్ ప్లాన్ పక్కాగా అమలు చేస్తాం. ఇప్పటికే వార్డుల్లో పలు కార్యక్రమాలు చేపడుతున్నాం. ముందుగా పారిశుద్ధ్య నిర్వహణపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. ఈ కార్యక్రమంలో ప్రజలను, మహిళా సంఘాల సభ్యులతో పాటు ఎన్జీఓలను సైతం భాగస్వాములను చేస్తున్నాం. – శ్రీనివాస్రెడ్డి, మెదక్ మున్సిపల్ కమిషనర్ -
ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్చార్జి మంత్రిగా వివేక్
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్చార్జి మంత్రిగా రాష్ట్ర కార్మిక, భూగర్భ గనులశాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి నియమితులయ్యారు. ఇప్పటివరకు జిల్లా ఇన్చార్జి మంత్రిగా వ్యవహరించిన కొండా సురేఖ స్థానంలో వివేక్ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల జరిగిన రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో ఆయనకు అమాత్య పదవి దక్కిన సంగతి తెలిసిందే. కేబినెట్లో బెర్త్ లభించిన వారంలోనే ఆయన జిల్లా ఇన్చార్జి మంత్రిగా నియమితులు కావడం గమనార్హం. -
త్వరితగతిన సమస్యలు పరిష్కారం
37 లక్షల మొక్కలు నాటడమే లక్ష్యంతూప్రాన్/మనోహరాబాద్(తూప్రాన్)/శివ్వంపేట(నర్సాపూర్): భూభారతి రెవెన్యూ చట్టంతో రైతుల సమస్యలు త్వరితగతిన పరిష్కారం అవుతాయని కలెక్టర్ రాహుల్రాజ్ అన్నారు. గు రువారం తూప్రాన్లోని రావెళ్లి, మనోహరాబాద్ మండలంలోని రంగాయపల్లిలో రెవెన్యూ సదస్సును సందర్శించారు. ప్రతి దరఖాస్తును స్వీకరించాలని, వాటిని వెంటవెంటనే ఆన్లైన్లో నమోదు చేయాలని అధికారులకు సూచించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ఇప్పటివరకు నిర్వహించిన రెవెన్యూ సదస్సులలో 13,693 దరఖాస్తులు వచ్చాయన్నారు. ఆయన వెంట ఆర్డీఓ జయచంద్రారెడ్డి, తహసీల్దార్లు కృష్ణ, చంద్రశేఖర్రెడ్డి, ఎంపీడీఓ కృష్ణమూర్తి, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు. అనంతరం శివ్వంపేట ప్రభు త్వ జూనియర్ కాలేజీకి తరగతి గదుల కొరత ఉండడంతో కలెక్టర్ పరిశీలించారు. కాలేజీకి సొంత భవనం లేకపోవడంతో ప్రస్తుతం శివ్వంపేట ఉన్నత పాఠశాలలో కొనసాగుతుంది. త్వరలోనే సమస్యను పరిష్కరించనున్నట్లు చెప్పారు. ఆయన వెంట జిల్లా ఇంటర్ విద్యాధికారి మాధవి, తహసీల్దార్ కమలాద్రి, ఎంఈఓ బుచ్చనాయక్, ప్రిన్సిపాల్ శైలజ, హెచ్ఎం బాలచంద్రం ఉన్నారు.కలెక్టర్ రాహుల్రాజ్ జిల్లాలో 37 లక్షల మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టామని కలెక్టర్ రాహుల్రాజ్ అన్నారు. గురువారం ఐటీసీ పరిశ్రమలో వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మొక్కలను నాటడమే కాకుండా సంరక్షించాలని సూచించారు. ఇందుకు ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. చెట్లను నరికితే పీడీయాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఆయన వెంట జిల్లా పరిశ్రమల శాఖ అధికారి ప్రకాశ్రావు, ఆర్డీఓ జయచంద్రారెడ్డి, తహసీల్దార్ చంద్రశేఖర్రెడ్డి, ఎంపీడీఓ కృష్ణమూర్తి, ఎంఈఓ మల్లేశం, ఎంపీఓ శ్రీనివాస్రెడ్డి, ఏపీఓ ఆదినారాయణ, ఐటీసీ ప్రతినిధులు, సిబ్బంది ఉన్నారు. -
పేదల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట
మెదక్ ఎమ్మెల్యే రోహిత్రావుమెదక్ కలెక్టరేట్/చిన్నశంకరంపేట(మెదక్): పేదల సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని, ఇందిరమ్మ ఇళ్ల పథకం పేదలకు వరమని మెదక్ ఎమ్మెల్యే రోహిత్రావు అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్హాల్లో 311 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్ పత్రాలు అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లా డుతూ.. గత పాలకులు పదేళ్లలో కుంటిసాకులతో కాలం వెళ్లదీశారే తప్ప ప్రజలకు చేసిందేమి లేదన్నారు. కాంగ్రెస ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 14 నెలల్లోనే నియోజకవర్గంలో ఎంతో అభివృద్ధి చేశామన్నారు. నియోజకవర్గ సమగ్రాభివృద్ధి దిశ గా ముందుకు సాగుతున్నామని తెలిపారు. విద్యా, వైద్యం ప్రధాన అంశాలుగా తీసుకున్నామని చెప్పారు. రామాయంపేటలో రూ. 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ నిర్మించనున్నట్లు వివరించారు. కార్యక్రమంలో జిల్లా హౌసింగ్ పీడీ మాణిక్యం, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. అలాగే చిన్నశంకరంపేట మండల కేంద్రంలో 420 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు అందించారు. -
సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలం
చేగుంట(తూప్రాన్): కాంగ్రెస్ పాలనలో ప్రజా సమస్యలను పట్టించుకునే వారే కరువయ్యారని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. గురువారం చేగుంటలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పటై ఏడాదిన్నర దాటినా పంచాయతీల పాలనను పట్టించుకోవడం లేదన్నారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో అవకతవకలు జరుగుతున్నా యని వాపోయారు. రామాయంపేటలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాలేదని బాధితుడు ఆత్మహత్యాయత్నం చేసుకున్నట్లు తెలిపారు. ప్రస్తుత సమయంలో పాఠశాలల నిర్వహణ, వర్షాకాలం సీజన్కు సంబంధించి సమీక్షలు నిర్వహించాల్సి ఉండగా, మంత్రులు జిల్లా వైపు తొంగిచూడకపోవడం విడ్డూరమన్నారు. ప్రొటోకాల్ పాటించకుండా, ఓడిపోయిన వారు గ్రామాల్లో పర్యటించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. సమావేశంలో నాయకులు శ్రీనివాస్, మాజీ జెడ్పీటీసీ శ్రీనివాస్, రాజిరెడ్డి, విశ్వేశ్వర్రావు, జర్నల్సింగ్, యాదగిరి పాల్గొన్నారు. -
విత్తనాల కొనుగోలులో జాగ్రత్తలు అవసరం
నర్సాపూర్ రూరల్: ప్రతి రైతు విత్తనాల కొనుగోలులో జాగ్రత్తగా ఉండాలని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు డాక్టర్ పద్మ, గీత, రంజిత, గాయత్రి రైతులకు సూచించారు. గురువారం మండలంలోని రుస్తుంపేట, అద్మాపూర్లో నిర్వహించిన రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమంలో పాల్గొని సాగు పద్ధతులపై అవగాహన కల్పించారు. రైతులు విత్తనాలు కొనుగోలు చేసే ముందు నాణ్యతా ప్రమాణాలు తెలుసుకోవాలన్నారు. రసీదు తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి సేంద్రియ ఎరువులు వాడాలని సూచించారు. పచ్చిరొట్ట ఎరువుల వాడకంతో మంచి దిగుబడి వస్తుందన్నారు. నర్సాపూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో వరి విత్తనాలు అందుబాటులో ఉన్నట్లు వ్యవసాయ అధికారి దీపిక తెలిపారు. -
రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోళ్లు
మెదక్ కలెక్టరేట్: జిల్లాలో ఈ ఏడాది యాసంగి సీజన్లో రికార్డుస్థాయి లో ధాన్యం కొను గోలు చేసినట్లు అదనపు కలెక్టర్ నగేష్ గురువారం తెలిపారు. జిల్లావ్యాప్తంగా 498 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా, ఇప్పటివరకు 488 కొనుగోలు కేంద్రాల్లో పూర్తయినట్లు తెలిపారు. ప్రస్తుతం మరో 10 కేంద్రాల్లో కొంతమేర ధాన్యం మిగిలిఉందన్నారు. 80,045 మంది రైతుల నుంచి 3,19,460,480 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించినట్లు చెప్పారు. ఇందుకుగానూ రూ.701 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు వివరించారు. మరో 10 కొనుగోలు సెంటర్లలో మాత్రమే కొనుగోలు ముగింపుస్థాయిలో ఉందన్నారు. ధాన్యం కొనుగోళ్లలో భాగస్వామ్యం అవుతున్న ప్రతి అధికారిని అభినందించారు. ప్రభుత్వ ఆదేశాలు అమలు చేస్తూ రైతులకు కనీస మద్దతు ధర కల్పిస్తూ, గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యధిక స్థాయిలో ధాన్యం సేకరించినట్లు పేర్కొన్నారు. సదస్సులు సద్వినియోగం చేసుకోండి చిన్నశంకరంపేట(మెదక్): భూ భారతి రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని అదనపు కలెక్టర్ నగేశ్ సూచించారు. గురువారం మండలంలోని గవ్వలపల్లిలో రెవెన్యూ సదస్సును పరిశీలించి రైతులతో మాట్లాడారు. ఈసందర్భంగా తహసీల్దార్ మన్నన్కు పలు సూచనలు చేశారు. అనంతరం నార్సింగి మండల కేంద్రంలోని రైతు సదస్సును పరిశీలించారు.అదనపు కలెక్టర్ నగేష్ -
బడికి వేళాయె..!
ఆటాపాటలతో వేసవి సెలవులను సరదాగా గడిపిన విద్యార్థులు గురువారం నుంచి బడిబాట పట్టనున్నారు. ఇందుకోసం విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. నూతన విద్యా సంవత్సరానికి సంబంధించిన పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్స్ తొలిరోజే అందించేందుకు సిద్ధం చేసింది. ఇక తల్లిదండ్రులు పొద్దున్నే పిల్లలను రెడీ చేయడం, పాఠశాలలకు వెళ్లబోమని మారం చేస్తే బుజ్జగించడం వంటివి మొదలుకానున్నాయి. – మెదక్జోన్నేటి నుంచి పునఃప్రారంభం ● ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు ● ప్రభుత్వ పాఠశాలలబలోపేతానికి బడిబాట ● జిల్లావ్యాప్తంగా 922 పాఠశాలలు, 87 వేల మంది విద్యార్థులుపుస్తకాలు, యూనిఫామ్స్ రెడీ తొలిరోజే విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫామ్స్ను అందించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. జిల్లాలో 4,60,408 పుస్తకాలు అవసరం ఉండగా, ఇప్పటికే ఆయా పాఠశాలలకు చేరాయి. అలాగే ఒక్కో విద్యార్థికి రెండు జతల చొప్పున యూనిఫాం అందించాల్సి ఉంది. ఇప్పటివరకు 80 శాతం మాత్రమే కుట్టడం పూర్తికావడంతో మొదటి రోజున ఒక్కో జత అందించేందుకు సిద్ధమయ్యారు. మరో వారం రోజుల్లో మరో జత యూనిఫాం అందజేస్తామని సంబంధిత అధికారులు చెబుతున్నారు. జిల్లావ్యాప్తంగా మొత్తం 922 పాఠశాలలు ఉండగా, వాటిలో 87 వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. కాగా గతేడాది ప్రభుత్వం అమ్మ ఆదర్శ పాఠశాల పథకం ద్వారా 562 పాఠశాలలను ఎంపిక చేసి మరమ్మతుల కోసం రూ. 20 కోట్లు విడుదల చేసింది. ఆ నిధులతో తాగునీటి సౌకర్యం, పాఠశాలల పైకప్పుల మరమ్మతులు, మరుగుదొడ్లు, కిచెన్షెడ్లు, పాఠశాలల చుట్టూ ప్రహరీ, కరెంట్ మరమ్మతులు, కిటికీలు, తలుపులకు రిపేర్లు చేయించి మౌలిక వసతులు కల్పించారు. బడిబాటలో 1,800 మంది గుర్తింపు జిల్లాలో బడిబాటను ఈనెల 6 నుంచి ఉపాధ్యాయులు ప్రారంభించారు. ఇది ఈనెల 19 వరకు కొనసాగించనున్నారు. అయితే ఇప్పటికే 1,800 విద్యార్థులను గుర్తించి వివిధ పాఠశాలల్లో చేర్పించేందుకు ఏర్పాట్లు చేశారు. కాగా వేసవి సెలవుల్లో ముందస్తు బడిబాటలో భాగంగా జిల్లాలో డ్రాపౌట్ విద్యార్థులను గుర్తించారు. ఇంటింటికీ తిరిగి సర్కారు బడిలో కల్పిస్తున్న సౌకర్యాలు, బోధన గురించి తల్లిదండ్రులకు వివరించారు. అలాగే వివిధ సంఘాలతో సమావేశాలు ఏర్పాటు చేసి చదువు ప్రాధాన్యతను చెప్పారు. ఇదిలా ఉండగా అంగన్వాడీ పాఠశాలల నుంచి 7 వేల పైచిలుకు విద్యార్థులు ప్రాథమిక పాఠశాలల్లో చేరనున్నారు. భవిత సెంటర్లకు రూ. 1.20 కోట్లు దివ్యాంగ విద్యార్థుల భవిష్యత్ కోసం జిల్లాలో 21 భవిత సెంటర్లను అధికారులు ఏర్పాటు చేశారు. కాగా వాటిలో ప్రస్తుతం నాలుగింటికి మాత్రమే సొంత భవనాలు ఉండగా, మండలానికో పాఠశాలను గుర్తించి వాటిలో భవిత సెంటర్లు కొనసాగిస్తున్నారు. విద్యార్థులకు నిత్యం వైద్య పరీక్షలు నిర్వహించి వినికిడి యంత్రాలతో పాటు చేతికర్రలు, ఇతర పరికరాలను అందుబాటులో ఉంచుతున్నారు. వీరికి ఆట వస్తువులను చూపుతూ చదువు చెబుతారు. అయితే ఆ సెంటర్లలో మరుగుదొడ్లు, తాగునీరు తదితర అవసరాల కోసం రూ. 1.20 కోట్ల నిధులు విడుదల కాగా, మరమ్మతులు చేపడుతున్నారు. ఉపాధ్యాయులకు శిక్షణ విద్యా ప్రమాణాల పెంపే లక్ష్యంగా జిల్లావ్యాప్తంగా 3,400 మంది ఉపాధ్యాయులకు గత నెలలో 19 రోజుల పాటు పలు అంశాలపై టీచర్లకు శిక్షణ ఇచ్చారు. ఇందులో ప్రధానంగా విద్యార్థుల స్థాయిని గుర్తించడం, వెనుకబడిన వారికి అర్థమయ్యేలా బోధించడం, మారుతున్న బోధనా విధానాలను అనుసరించడంతో పాటు ఏఐపై అవగాహన కల్పించారు. సర్కారు బడిలోనే సంపూర్ణ విద్య సర్కారు బడుల్లోనే నాణ్యమైన విద్య లభిస్తోంది. అన్ని అర్హతలు గల ఉపాధ్యాయులచే బోధన సాగుతుంది. అలాగే పాఠశాలలను అన్ని హంగులతో తీర్చిదిద్దాం. పుస్తకాలు, యూనిఫామ్స్ ఉచితంగా అందజేస్తాం. తల్లిదండ్రులు విద్యార్థులను సర్కారు బడుల్లోనే చేర్పించాలి. – రాధాకిషన్, డీఈఓ -
భూసేకరణ కొలిక్కి..!
పలు గ్రామాల అవార్డులకు ఎన్హెచ్ఏఐ ఆమోదముద్ర ● పరిహారం చెల్లించేందుకు రెవెన్యూశాఖ సన్నాహాలు సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: రీజనల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్) భూసేకరణ ప్రక్రియ కొలిక్కి వస్తోంది. భూములు కోల్పోతున్న నిర్వాసితులకు పరిహారం చెల్లించేందుకు రెవెన్యూ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. భూ సేకరణ ప్రక్రియలో భాగంగా ఇప్పటికే ప్రకటించిన అవార్డు (సేకరించే భూముల సర్వేనంబర్లు, పట్టాదారుల పూర్తి వివరాలు)లకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) ప్రాజెక్టు డైరెక్టర్ కార్యాలయం ఆమోదముద్ర వేసింది. మరికొన్నింటికి అప్రూవల్ రావాల్సి ఉంది. ఈ ఆమోదం వచ్చి న వెంటనే నిర్వాసిత రైతులకు పరిహారం చెల్లిస్తామని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. తెలంగాణ అభివృద్ధికి గేమ్ చేంజర్గా భావిస్తున్న ఈ రహదారి ఉత్తర భాగం 161 కి.మీలు సంగారెడ్డి, ఆందోల్, నర్సాపూర్, తూప్రాన్, గజ్వేల్ ఆర్డీఓలు భూసేకరణ ప్రక్రియను చేపట్టారు. ఈ ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. ఇదీ జరిగింది... మెదక్ జిల్లా నర్సాపూర్ ఆర్డీఓ పరిధిలో శివంపేట, నర్సాపూర్ మండలాల్లోని 17 గ్రామాల పరిధిలో 1,048 మంది రైతుల వద్ద మొత్తం 758 ఎకరాలు సేకరిస్తున్నారు. దీనికి సంబంధించి 28 అవార్డులను ప్రకటించారు. ఇందులో ఎన్హెచ్ఏఐ పీడీ కార్యాలయం నుంచి 13 అవార్డులకు ఇప్పటికే అనుమతి లభించింది. మరో 15 అవార్డులకు అప్రూవల్ వచ్చిన వెంటనే పరిహారం చెల్లిస్తామని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. సంగారెడ్డి రెవెన్యూ డివిజన్లోని 13 గ్రామాలు, ఆందోల్ డివిజన్లోని ఐదు గ్రామాలు కలిపి మొత్తం 824 ఎకరాలు సేకరిస్తున్నారు. సంగారెడ్డి డివిజన్కు సంబంధించి 24 అవార్డులకుగాను ఎన్హెచ్ఏఐ అధికారులు ఆరింటికి మాత్రమే అప్రూవల్ ఇచ్చారు. ఆందోల్కు సంబంధించిన భూసేకరణ అవార్డులకు అప్రూవల్ రావాల్సి ఉంది. తూప్రాన్ ఆర్డీఓ పరిధిలో 430 ఎకరాల భూములను సేకరిస్తున్నారు. ఎనిమిది గ్రామాల్లోని 482 మంది రైతులు నిర్వాసితులుగా మారుతున్నారు. ఆయా గ్రామాలకు సంబంధించిన అవార్డులకు అప్రూవల్ కోసం ఎన్హెచ్ఏఐకి పంపనున్నారు. ఈ అప్రూవల్ వచ్చిన వెంటనే రెవెన్యూ అధికారులు నిర్వాసిత రైతులకు పరిహారం పంపిణీ చేస్తారు. కనీసం రూ.70 లక్షలు చెల్లించాలంటున్న నిర్వాసితులు.. తప్పనిసరి పరిస్థితుల్లో తమ భూములు గుంజుకుంటే భూమికి బదులు భూమి ఇవ్వాలని నిర్వాసితులుకోరుతున్నారు. గతంలో పలుచోట్ల ఈ భూసేకరణకు సంబంధించిన సర్వే పనులను నిర్వాసిత రైతులు అడ్డుకున్న విషయం విదితమే. దీంతో రెవెన్యూ అధికారులు ఆయా గ్రామాల్లో రైతులతో సమావేశాలు నిర్వహించారు. అయితే పరిహారం కింద ఎకరానికి రూ.70 లక్షలు చెల్లించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ప్రధానంగా నర్సాపూర్ మ ండలం రెడ్డిపల్లి వంటి గ్రామాల నిర్వాసితులు ఈ భూసేకరణపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సర్వే పనులను కూడా అడ్డుకున్నారు.మూడేళ్లలో జరిగిన లావాదేవీలను బట్టి ధర భూములు కోల్పోతున్న రైతులకు పరిహారం చెల్లించేందుకు ధర నిర్ణయం చేయాల్సి ఉంది. ఈ ప్రాంతంలో మూడేళ్లుగా జరిగిన భూముల క్రయవిక్రయాలకు ధరను బట్టి...ఈ పరిహారం లెక్కిస్తారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం రైతులకు పరిహారం చెల్లించాలని రెవెన్యూ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఎకరానికి సుమారు రూ.40 లక్షల నుంచి రూ.45 లక్షల వరకు పరిహారం అందే అవకాశాలు ఉన్నాయని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. కనీసం రూ.70 లక్షలు చెల్లించాలని నిర్వాసితులు కోరుతున్నారు. -
డబ్బులు లేక.. పనులు ప్రారంభించక
రామాయంపేట(మెదక్): ‘ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది. చేతిలో చిల్లిగవ్వ లేదు. ముందు పనులు చేస్తే గాని ప్రభుత్వం నుంచి డబ్బులు విడుదల కావు. ఇప్పుడు ఇంటి నిర్మాణం ఎలా’ అని మండలంలోని ఝాన్సిలింగాపూర్ పంచాయతీ పరిధిలోని సదాశివనగర్ తండాకు చెందిన గిరిజన మహిళ రజిత ఆవేదన వ్యక్తం చేస్తుంది. గతంలో భర్త విద్యుత్షాక్తో మృతిచెందగా, కట్టెలు అమ్మి, కూలీ పనులు చేస్తూ పిల్లలను పెంచి పోషిస్తుంది. ప్రస్తుతం శిథిలమైన పూరి గుడిసెలో నివాసం ఉంటుంది. ఈ క్రమంలో తండాకు మూడు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా, అందులో రజిత పేరు ఉంది. అయితే చేతిలో డబ్బులు లేకపోవడంతో ఇంటి నిర్మాణానికి దూరంగా ఉంటుంది. బేస్మెంట్ వరకు నిర్మాణం పూర్తి చేస్తే మొదటి బిల్లు వస్తుందని అధికారులు చెబుతుండగా, డబ్బులు లేకపోవడంతో పనులు ప్రారంభించలేదు. దాత లు సహకరించాలని వేడుకొంటుంది. రజిత ఇళ్లు నిర్మించుకునేందుకు సహాయ సహకారాలు అందజేస్తామని ఎంపీడీఓ సజీలుద్దీన్ హామీ ఇచ్చారు. -
లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోండి
మెదక్ కలెక్టరేట్: ఈనెల 14న జరగనున్న జాతీయ లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాని జిల్లా ప్రధాన న్యాయమూర్తి నీలిమ పిలుపునిచ్చారు. బుధవారం జిల్లా కోర్టు ప్రాంగణంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా లోక్ అదాలత్కు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించి మాట్లాడారు. జిల్లా కోర్టు ప్రాంగణంలో లోక్ అదాలత్ను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆర్ఎం సుభవల్లి తదితరులు పాల్గొన్నారు. ఆ బాధ్యత ప్రభుత్వానిదే: పీఆర్టీయూ మెదక్ కలెక్టరేట్: ప్రభుత్వ పాఠశాలలను పరిరక్షించే బాధ్యత ప్రభుత్వానిదేనని పీఆర్టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు మల్లారెడ్డి అన్నారు. బుధవారం మెదక్లో ఆయన మాట్లాడుతూ.. నేటి నుంచి పాఠశాలల పునః ప్రారంభం అవుతున్నాయని, జిల్లాలోని చాలా వరకు బడుల్లో కనీస వసతులు లేవన్నారు. ఉపాధ్యాయుల సర్దుబాటు పేరుతో విద్యార్థులను నాణ్యమైన విద్యకు దూరం చేయొద్దన్నారు. ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉండే విధంగా ప్రభుత్వం మార్పులు చేయాలని డిమాండ్ చేశారు. అందులోని విద్యార్థులను ప్రాథమిక పాఠశాలల్లో చేర్చుకొనే అవకాశం ఉందన్నారు. దీంతో పాఠశాలల్లో ప్రవేశాల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుందన్నారు. 392 మందికిసీట్ల కేటాయింపు కౌడిపల్లి(నర్సాపూర్): ఎంజేపీ బీసీ గురుకుల పాఠశాలలో బ్యాక్లాగ్ సీట్ల భర్తీకి బుధవారం రెండో విడత కౌన్సెలింగ్ నిర్వహించినట్లు తునికి ఎంజేపీ బీసీ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్, జిల్లా కన్వీనర్ హరిబాబు తెలిపారు. జిల్లాలోని వివిధ ఎంజేపీ గురుకులాల్లో 6 నుంచి 9వ తరగతి వరకు ఖాళీగా ఉన్న 392 సీట్లు భర్తీ చేయగా, ఇందులో 217 మంది బాలికలు, 175 మంది బాలురు ఉన్నట్లు చెప్పారు. వీరికి గురుకుల పాఠశాలలో అడ్మిషన్ పొందేందుకు అలాట్మెంట్ ఆర్డర్ ఇచ్చినట్లు వివరించారు. దేశవ్యాప్త సమ్మెనుజయప్రదం చేద్దాం శివ్వంపేట(నర్సాపూర్): కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా జూలై 9వ తేదీన నిర్వహించ తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు మహేందర్రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం మండల పరిధిలోని దొంతిలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్ కోడ్స్ను రద్దు చేసే వరకు ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో వ్యవసాయ సంఘం జిల్లా కార్యదర్శి మల్లేష్, నాయకులు రవీంద్రప్రసాద్, శంకర్, ప్రభాకర్, లక్ష్మణ్, వసంత, శ్రీకాంత్, పాల్గొన్నారు. కొనసాగుతున్న ధ్రువపత్రాల పరిశీలన హవేళిఘణాపూర్(మెదక్): మండల కేంద్రంలోని డైట్ కళాశాలలో డీసెట్ అభ్యర్థుల ధ్రువ పత్రాల పరిశీలన కొనసాగుతోంది. 9వ తేదీ నుంచి ప్రక్రియ ప్రారంభం కాగా బుధవారం వరకు 900మంది సర్టిఫికెట్లను పరిశీలించినట్లు డీఈఓ రాధాకిషన్ తెలిపారు. మొత్తం 2,198 మందికి గాను నాలుగు కౌంటర్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మిగితా విద్యార్థులు 11వ తేదీ లోపు హాజరుకావొచ్చని సూచించారు. 13వ తేదీన అభ్యర్థుల ర్యాంకును బట్టి సీట్లు కేటాయించనున్నట్లు చెప్పారు. -
ప్రభుత్వ బడిలోనే బంగారు భవిష్యత్
మెదక్మున్సిపాలిటీ/హవేళిఘణాపూర్/నర్సాపూర్ రూరల్: తల్లిదండ్రులు పిల్లలను ప్రభుత్వ బడులకు పంపించి వారి భవిష్యత్కు బంగారు బాటలు వేయాలని కలెక్టర్ రాహుల్రాజ్ సూచించారు. బుధవారం మెదక్ మండలం మంభోజిపల్లి నుంచి అవుసులపల్లి వరకు 10కే రిలే వాకింగ్ను ప్రారంభించారు. అనంతరం అవుసులపల్లిలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మా రుతున్న కాలానుగుణంగా సరికొత్త సాంకేతిక విద్యా విధానాన్ని ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్నామని వివరించారు. కార్పొరేట్ పాఠశాలల కు ధీటుగా మౌలిక వసతులు కల్పిస్తున్నామన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్, అదనపు ఎస్పీ మహేందర్, మెదక్ ఆర్డీఓ రమాదేవి, డీఈఓ రాధాకిషన్, జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి, యువజన క్రీడల నిర్వహణ అధికారి, అకాడమిక్ మానిటరింగ్ అధికారి సుదర్శనమూర్తి, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం నర్సాపూర్ మండలం చిప్పల్తుర్తిలో భూ భారతి రెవెన్యూ సదస్సును పరిశీలించారు. ఈనెల 10 తేదీ వరకు జిల్లావ్యాప్తంగా 187 గ్రామాల్లో 10,933 దరఖాస్తులు స్వీకరించామన్నారు. అయిల్పాం సాగుకు ఆసక్తి చూపండి శివ్వంపేట(నర్సాపూర్): రైతులు అయిల్పాం సాగుకు ముందుకు రావాలని కలెక్టర్ రాహుల్రాజ్ అన్నారు. బుధవారం మండల పరిధిలోని సీతారం తండాలో ఆయిల్పాం మొక్కలు నాటి మాట్లాడా రు. రైతులు ఒకే పంట విధానం కాకుండా ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపాల్సిన అవసరం ఉందన్నారు. 2025– 26 సంవత్సరంలో 2,500 ఎకరాల్లో అయిల్పామ్ సాగు లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. అనంతరం రత్నాపూర్లో నిర్వహించిన రెవెన్యూ సదస్సును పరిశీలించారు. ఆయ న వెంట పలువురు అధికారులు ఉన్నారు. కలెక్టర్ రాహుల్రాజ్ -
గడువులోగా ఇళ్ల నిర్మాణం చేపట్టాలి
మెదక్ కలెక్టరేట్: ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్ పత్రాలు పొందిన లబ్ధిదారులు వెంటనే ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించాలని, నిర్లక్ష్యం వహిస్తే అర్హులైన ఇతరులకు అవకాశం కల్పిస్తామని జిల్లా హౌసింగ్ పీడీ మాణిక్యం తెలిపారు. బుధవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. నిరుపేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకానికి శ్రీకారం చుట్టిందన్నారు. జిల్లాను పైలెట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేసి మొదటి విడతలో 1,555, రెండో విడతలో 8,260 ఇళ్లు మంజూరు చేసిందన్నారు. కాగా జిల్లాలో మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాలతో పాటు సంగారెడ్డి జిల్లాలోని ఆందోల్, నారాయణఖేడ్, సిద్దిపేటలోని దుబ్బాక, గజ్వేల్, నియోజకవర్గాలకు సంబంధించిన మరో 8 మండలాలు మెదక్ జిల్లాలోనే ఉన్నాయని, వీటిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం మొత్తం 9,815 ఇళ్లను మంజూరు చేసిందని వివరించారు. రూ.1.80 కోట్ల బిల్లులు చెల్లించాం జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు చేపట్టిన 180 మంది లబ్ధిదారుల ఖాతాల్లో రూ.1.80 కోట్లు జమ చేశాం. జిల్లాలో 450 మంది ఇళ్ల నిర్మాణాలు చేపట్టగా.. మిగితా లబ్ధిదారులు ఇంకా ప్రారంభించలేదు. ఉచితంగా ఇసుక అందించడంతోపాటు నిర్మాణాలు ప్రారంభించగానే వారంవారం బిల్లులు మంజూరు చేస్తామని చెబుతున్నా, లబ్ధిదారుల్లో మార్పు రావడం లేదు. అలాంటి వారిని పక్కన పెట్టి వారి స్థానంలో ఇతరులకు అవకాశం కల్పిస్తాం. నిరుపేదలను ఆదుకుంటాం ఇళ్లు నిర్మించుకునే ఆర్థిక స్థోమత లేని నిరుపేదలను అన్ని విధాలుగా ఆదుకుంటాం. జిల్లాలో సుమారు 200 మంది వరకు సొంతిళ్లు నిర్మించుకోలేని నిరుపేదలు ఉన్నట్లు గుర్తించాం. వారికి స్వయం సహాయక సంఘాల ద్వారా రుణం ఇప్పించి ఇంటి నిర్మాణం చేపట్టేలా కృషి చేస్తున్నాం. వారి ఇంటి నిర్మాణం పూర్తయ్యే వరకు అన్ని విధాలుగా ఆదుకుంటాం. ఆర్థికంగా ఉండి ఇళ్ల నిర్మాణం చేపట్టకుంటే మూడు నెలల గడువు ఇస్తాం. అయినప్పటికీ నిర్మాణాలు చేపట్టకుంటే వారి స్థానంలో ఇతర అర్హులకు అవకాశం కల్పిస్తాం.మున్సిపాలిటీల్లో ప్రారంభిస్తున్నాం ఇటీవల మలి విడతలో భాగంగా ప్రభుత్వం 8,260 ఇళ్లు మంజూరు చేసింది. ఇందులో భాగంగా జిల్లాలోని 4 మున్సిపాలిటీల్లో ఇళ్ల నిర్మాణాలు ప్రారంభిస్తాం. జిల్లాలో మెదక్, రామాయంపేట, తూప్రాన్, నర్సాపూర్ నా లుగు మున్సిపాలిటీలు ఉన్నాయి. ఇప్పటికే లబ్ధిదారుల ఎంపిక పూర్తి కాగా మున్సిపల్ కమిషనర్లు ప్రొసీడింగ్ పత్రాలు అందజేస్తున్నారు. ఆ ప్రక్రియ పూర్తికాగానే నిర్మాణాలు ప్రారంభించేలా చర్యలు చేపడుతాం.నిర్లక్ష్యం వహిస్తేకొత్తవారికి అవకాశం జిల్లాకు 9,815 ఇందిరమ్మఇళ్లు మంజూరు ‘సాక్షి’తో హౌసింగ్ పీడీ మాణిక్యం -
పోషకాహార లోపాన్ని నివారిద్దాం
నర్సాపూర్ రూరల్: పేద, మధ్య తరగతి కుటుంబాల పిల్లల్లో పోషకాహార లోపాన్ని నివారించేందుకే ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల్లో ప్రతివారం ఎగ్ బిర్యానీ వంటకాన్ని ప్రవేశపెట్టిందని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ సుహాసినిరెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని రెడ్డిపల్లి అంగన్వాడీ కేంద్రంలో పిల్లలతో కలిసి ఎగ్ బిర్యానీ వంటకం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అంగన్వాడీ టీచర్లు పిల్లలకు పోషకాహారంతో పాటు ఆటపాటలతో కూడిన విద్యను నేర్పించి వారిలో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీయాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం మినీ అంగన్వాడీ కేంద్రాలను అప్గ్రేడ్ చేస్తూ వేతనాలు పెంచిందన్నారు. పిల్లలకు ఆట వస్తువులతో పాటు పుస్తకాలు, యూనిఫామ్ పంపిణీ చేస్తుందన్నారు. కార్యక్రమంలో సీడీపీఓ హేమభార్గవి, ఎంపీడీఓ మధులత, సూపర్వైజర్ సరళ, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ సుహాసినిరెడ్డి -
అమ్మ పేరు మీద మొక్క నాటండి
నర్సాపూర్ రూరల్: అమ్మ పేరు మీద మొక్కలు నాటి భావితరాలకు బాసటగా నిలవాలని జిల్లా గ్రామీణాభివద్ధి అధికారి సీహెచ్ శ్రీనివాస్ రావు పిలుపునిచ్చారు. మంగళవారం నర్సాపూర్ మండలం రామచంద్రాపూర్లో ఐకెపీ ఏపీఎం గౌరీ శంకర్ అధ్యక్షతన జరిగిన గ్రామైక్య మహిళా సంఘం సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుత వర్షాకాలంలో ప్రతి మహిళా బాధ్యతగా అమ్మ పేరు మీద ఒక మొక్క నాటి మూడేళ్లపాటు సంరక్షించాలని సూచించారు. ప్రతి సంవత్సరం రాఖీ కట్టి జాతికి అంకితం ఇవ్వాలని కోరారు. దీంతో మన భావితరాల పిల్లలకు స్వచ్ఛమైన గాలితో పాటు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వగలుగుతామని పేర్కొన్నారు. ఆర్థిక పారదర్శకతలో భాగంగా అన్ని సంఘాల సభ్యులు సామాజిక ఆర్థిక లావాదేవీలపై సమీక్షించుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీడీఓ మధులత, ఐకెపి సీసీ దేవిసింగ్, కార్యదర్శి సిఏ నీరజ, గ్రామ సంఘం అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు.జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శ్రీనివాస్ రావు -
రెవెన్యూ సదస్సులతో రైతులకు మేలు
రేగోడ్(మెదక్)/అల్లాదుర్గం(మెదక్): భూ సమస్యలు పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న భూ భారతి సదస్సులతో రైతులకు ఎంతో మేలు చేకూరుతుందని మెదక్ ఆర్డీఓ రమాదేవి తెలిపారు. రేగోడ్ మండలంలోని వెంకటాపూర్లో, అలాగే.. అల్లాదుర్గం మండలం ముస్లాపూర్లలో ఏర్పాటు చేసిన సదస్సులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతుల సమస్యల పరిష్కరించేందుకే భూభారతిని అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఏళ్ల తరబడి పరిష్కారం కాని సమస్యలను భూభారతితో మోక్ష లభించనుందని పేర్కొన్నారు.మెదక్ ఆర్టీఓ రమాదేవి -
భూసమస్యలు పరిష్కరిస్తాం
కౌడిపల్లి(నర్సాపూర్): భూభారతి రెవెన్యూ సదస్సులలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి పరిష్కరిస్తామని నర్సాపూర్ ఆర్డీఓ మహిపాల్రెడ్డి తెలిపారు. మంగళవారం మండలంలోని ధర్మాసాగర్లో రెవెన్యూ సదస్సును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సదస్సులలో ఎక్కువగా సాదాబైనామా, ప్రభుత్వ భూములను కొనుగోలు చేసిన రైతులు వాటికి పట్టాలు కావాలని దరఖాస్తులు చేస్తున్నారని చెప్పారు. దరఖాస్తులను పరిశీలించి సమస్య పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. నర్సాపూర్ ఆర్డీఓ మహిపాల్రెడ్డి -
భూసార పరీక్షలతో బహుళ ప్రయోజనాలు
పాపన్నపేట(మెదక్): భూసార పరీక్షలతో బహుళ ప్రయోజనాలు ఉన్నాయని వ్యవసాయ శాష్త్రవేత్తలు మహేంద్రకుమార్, అంబికా సోని సూచించారు. మంగళవారం మండల పరిధిలోని ఎల్లాపూర్లో జరిగిన వికసిత సంకల్ప అభియాన్ కార్యక్రమంలో వారు మాట్లాడారు. ప్రతి పంటకు ముందు మట్టి పరీక్షలు నిర్వహించడం ద్వారా ,భూమికి అవసరమైన పోషకాలను గుర్తించవచ్చన్నారు. ఇందుకనుగుణంగా ఏయే ఎరువులు వాడాలో తెలుస్తుందన్నారు. వ్యవసాయ అధికారుల సూచన మేరకే ఎరువులు వాడాలన్నారు. మోతాదుకు మించి ఎరువులు వాడితే.. దిగుబడి తగ్గడమే గాకుండా, పెట్టుబడి వ్యయం తడిసి మోపెడువుతుందని చెప్పారు. కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా రైతు సంఘం అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి, శాస్త్రవేత్తలు ప్రసాద్, సాయిప్రసాద్, చిన్నబాబు, రవికుమార్, ఆత్మడిప్యూటీ ప్రాజెక్టు మేనేజర్ అంబికా సోని, ఏడిఏ విజయ నిర్మల, ఏఓ నాగమాధురి, ఏఇఓలు అభిలాష్, జనార్ధన్, రజిత పాల్గొన్నారు.వ్యవసాయ శాస్త్రవేత్తలు మహేంద్రకుమార్అధిక దిగుబడులు సాధించాలి నర్సాపూర్: వ్యవసాయ శాస్త్రవేత్తల సలహాలు, సూచనలు పాటించి అధిగ దిగుబడులు సాధించాలని జిల్లా వ్యవసాయాధికారి వినయ్కుమార్ రైతులకు సూచించారు. మంగళవారం రైతు నేస్తం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సోయా చిక్కుడు సాగుపై శాస్త్రవేత్త రాజేందర్రెడ్డి, వానాకాలానికి అనువైన కూరగాయల విత్తనాలపై ఉద్యానవన కళాశాల అసిస్టెంటు ప్రొఫెసర్ శ్రీనివాస్, పశువుల వ్యాధులు, వాటి నివారణపై పశువైద్యురాలు లక్ష్మి సూచనలు ఇచ్చారన్నారు. శాస్త్రవేత్తల సూచనలు పాటిస్తే మంచి లాభాలు ఉంటాయని చెప్పారు. కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి దీపిక తదితరులు పాల్గొన్నారు. -
నిర్వహణ మరింత మెరుగుపడాలి
మెదక్ కలెక్టరేట్: జిల్లాలోని సంక్షేమ హాస్టళ్లు, కేజీబీవీలు, రెసిడెన్షియల్ పాఠశాలల నిర్వహణ మరింత మెరుగు పడాలని, ఎక్కడ కూడా నిర్లక్ష్యం చేయకూడదని కలెక్టర్ రాహుల్రాజ్ సూచించారు. మంగళవారం కలెక్టరేట్లో వివిధ సంక్షేమ హాస్టళ్లు, కేజీబీవీల ప్రత్యేక అధికారులు, వార్డెన్లకు 2025–26 విద్యా సంవత్సరంలో చేపట్టాల్సిన అంశాలపై కలెక్టర్ దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి హాస్టల్లో మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం అందించాలని సూచించారు. గత సంవత్సరం అనుభవాలను దృష్టిలో పెట్టుకుని అధికారులు సమర్థవంతంగా పనిచేయాలన్నారు. ప్రతి విద్యాసంస్థల్లో టీచింగ్, నాన్ టీచింగ్, ఉపాధ్యాయులు, కుక్, కమిటీలతో సమావేశాలు నిర్వహించాలని సూచించారు. హాస్టళ్లను ఎప్పటికప్పుడు ఆకస్మికంగా తనిఖీ చేస్తామని, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. సీసీ కెమెరాలతో నిరంతర నిఘా జిల్లాలోని అన్ని ప్రభుత్వ సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలలు, కేజీబీవీలను సీసీ కెమెరాల ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తామని కలెక్టర్ తెలిపారు. పిల్లలందరికీ వైద్య పరీక్షలు చేయించాలని కోరారు. మెదక్లో కలెక్టర్ పర్యటన మెదక్ మున్సిపాలిటీ: కలెక్టర్ రాహుల్రాజ్ మంగళవారం మెదక్ జిల్లా కేంద్రంలో విస్తృతంగా పర్యటించారు. ముందుగా పట్టణంలోని గాంధీనగర్ ఏరియాలో రూ.5 కోట్లతో నిర్మిస్తున్న ఇందిరా మహిళా శక్తి భవన్ నిర్మాణ పనులను పరిశీలించారు. మ్యాప్ను పరిశీలిస్తూ పంచాయతీరాజ్ డీఈ పాండురంగారావు, డీఆర్డీఓ పీడీ శ్రీనివాసరావులను పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు, నిర్దేశిత గడువు తేదీలోగా నిర్మాణం పూర్తి చేసి ఉపయోగంలోకి తీసుకురావాలన్నారు. అనంతరం ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో ఇందిరమ్మ మోడల్ హౌస్ను పరిశీలించారు. సంక్షేమ హాస్టళ్లలో మెనూ తప్పనిసరి కలెక్టర్ రాహుల్రాజ్ -
కొమ్మినేని అరెస్టు అప్రజాస్వామికం
మెదక్ కలెక్టరేట్: సాక్షి సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టును మంగళవారం పాత్రికేయులు నిరసించారు.ఈ మేరకు మంగళవారం అదనపు కలెక్టర్ నగేష్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పలువురు పాత్రికేయులు మాట్లాడుతూ పత్రికా స్వేచ్ఛపై దాడి ప్రజాస్వామ్యానికే గొడ్డలి పెట్టులాంటిదని పేర్కొన్నారు. ఈ దాడిని మేధావులతో పాటు అన్ని వర్గాల ప్రజలు ముక్తకంఠంతో ఖండించాల్సిన అవసరం ఉందన్నారు. దాడుల సంస్కృతిని ప్రోత్సహించే వారు ఎవరైనా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని వారు హెచ్చరించారు. -
సదస్సులను సద్వినియోగం చేసుకోండి
కౌడిపల్లి(నర్సాపూర్): భూభారతి రెవెన్యూ సదస్సులను రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ తెలిపారు. మంగళవారం మండలంలోని పాంపల్లి, ధర్మాసాగర్లో సదస్సులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భూసమస్యలు ఉన్న రైతులు దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. పరిశీలించి చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియో గం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ ఆంజనేయులు, డిప్యూటీ తహసీల్దార్ జహీర్, ఆర్ఐ శ్రీహరి, లక్ష్మణ్ పాల్గొన్నారు.సమస్యల పరిష్కారానికి చర్యలుజెడ్పీ సీఈఓ ఎల్లయ్యపెద్దశంకరంపేట(మెదక్): గ్రామాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారాన్ని చర్యలు తీసుకుంటున్నట్లు జెడ్పీ సీఈఓ ఎల్లయ్య తెలిపారు. మంగళవారం పెద్దశంకరంపేట మండల పరిషత్ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పలు రికార్డులు పరిశీలించారు. ఉపాధి హామీ పనుల లక్ష్యాన్ని చేరుకోవాలని ఇన్చార్జి ఎంపీడీఓ షాకీర్ అలీ, ఈ జీఎస్ ఏపీవో సంతోష్ కుమార్లను ఆదేశించారు. అన్ని గ్రామాలలో ఉపాధి పనులను నిర్దేశిత లక్ష్యం మేరకు పూర్తి చేయాలని సూచించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పారిశుద్ధ్య పనులు నిర్వహించాలని, మంచినీటి ట్యాంకులను శుభ్రపరచాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఈసీ నవాజుద్దీన్ తదితరులు ఉన్నారు.ఎంపీపీ కార్యాలయం తనిఖీఅల్లాదుర్గం(మెదక్): అల్లాదుర్గం మండల పరిషత్ కార్యాలయాన్ని జెడ్పీ సీఈఓ ఎల్లయ్య మంగళవారం తనిఖీ చేశారు. ప్రతి పంచాయ తీలో సామూహిక మరుగుదొడ్లు నిర్మించేందు కు చర్యలు తీసుకోవాలన్నారు. సిబ్బంది సమ య పాలన పాటించాలని సూచించారు. ఆయ న వెంట ఎంపీడీఓ చంద్రశేఖర్ పాల్గొన్నారు.హామీలను నెరవేర్చాలి తపస్ జిల్లా అధ్యక్షుడు ఎల్లంమెదక్జోన్: కాంగ్రెస్ సర్కార్ ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని తపస్ జిల్లా అధ్యక్షుడు ఎల్లం డిమాండ్ చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఉద్యోగుల బదిలీలు, పదోన్నతులు, సీపీఎస్ రద్దు, పెండింగ్ బిల్లుల విడుదల, జీవో 317 బాధితులందరికీ న్యాయం చేస్తామని ఇచ్చిన హామీలు నేటికీ అమలు కాకపోవడం బాధాకరమని చెప్పారు. ఐదు డీఏలు పెండింగ్లో ఉండగా రెండింటిని ప్రకటించి ఒకటి మాత్రమే అమలు చేయడం దారుణమని వాపోయారు. హామీలను నెరవేర్చకుంటే ఆందోళనమే శరణ్యమని హెచ్చరించారు. కార్యక్రమంలో తపస్ జిల్లా బాధ్యులు నర్సింలు, శ్రీధర్రెడ్డి, సిద్ధూ, నరేందర్, స్వామి తదితరులు పాల్గొన్నారు.మోదీ పాలనలో ఎంతో అభివృద్ధిబీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు రమేశ్హత్నూర(సంగారెడ్డి): ప్రధాని నరేంద్ర మోదీ 11 ఏళ్ల పాలనలో దేశం ఎంతగానో అభివృద్ధి జరిగిందని బీజేపీ ఓబీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రమేశ్గౌడ్ పేర్కొన్నారు. హత్నూర మండల బీజేపీ మండల అధ్యక్షులు నాగప్రభు ఆధ్వర్యంలో మోదీ ప్రభుత్వం 11 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా హత్నూర మండలం దౌల్తా బాద్లో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా రమేశ్గౌడ్ మాట్లాడుతూ.. మోదీ 11 ఏళ్ల పాలన అమృతకాలమని ఎన్నో అసాధ్యం కాని నిర్ణయాలు తీసుకుని సుసాఽ ద్యం చేసి దేశాన్ని ఎంతో అభివృద్ధి చేసిన ఘనత మోదీనేన్నారు. -
ఆర్టీసీ చార్జీల మోత
మెదక్జోన్: ఆర్టీసీ బస్పాస్ చార్జీల పెంపు విద్యార్థులు, ప్రయాణికులకు శరాఘాతంగా మారింది. అలాగే.. ప్రయాణికులకు టోల్గేట్ చార్జీలు కూడా అదనంగా భారం పడనుంది. పెరిగిన చార్జీలు సోమవారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చాయి. ఆర్టీసీ నిర్ణయం పట్ల తీవ్ర వ్యతిరేక వ్యక్తమవుతోంది. జిల్లాలోని మెదక్, నర్సాపూర్ బస్సు డిపోలలో 140 బస్సులు ఉన్నాయి. ప్రస్తుతం విద్యార్థుల బస్పాస్లపై 20 శాతం పెంచగా, టోల్గేడ్ దాటే ప్రతి ప్రయాణికులపై 8 శాతం పెరిగింది. దీంతో ప్రయాణికులపై నెలకు రూ.62.38 లక్షల అదనంగా భారం పడనుంది. టోల్ గేట్ చార్జీ టిక్కెట్కు అదనంగా రూ.10 పెరిగింది. కాగా, రెండు డిపోల పరిధిలో నిత్యం ఆర్టీసీకి రూ.20 లక్షల ఆదాయం వస్తుండగా.. 8శాతం బస్సు చార్జీలు పెరగటంతో ప్రయాణికులపై నిత్యం రూ.1.60 లక్షలు, నెలకు సుమారు రూ.48 లక్షలు అదనంగా భారం పడనుంది. విద్యార్థుల పాస్లపై 20 శాతం అదనం ఆర్టీసీ యజమాన్యం ప్రయాణికులతో పాటు విద్యార్థుల బస్సుపాస్లపై ఏకంగా 20 శాతం అదనంగా చార్జీ పెంచేసింది. మొన్నటి వరకు 20 కిలోమీటర్లు ఆర్డీనరి బస్సులో ప్రయాణించే విద్యార్థికి నెలకు రూ.450 చెల్లించగా.. పెరిగిన ధరతో రూ. 540 కానుంది. జిల్లా వ్యాప్తంగా 6,365 మంది బస్సు పాస్లు ఉన్నాయి. వీరి ద్వారా మొన్నటి వరకు నెలకు రూ.71.51 లక్షల ఆదాయం వస్తుండగా.. పెరిగిన 20 శాతం ధరతో నెలకు రూ. 14.30 లక్షలు అదనపు భారం పడుతుంది. దీంతో నెలకు రూ. 85.81 లక్షలు విద్యార్థులు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. పెంచిన చార్జీలను వెంటనే తగ్గించాలని విద్యార్థులు, ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థుల బస్పాస్లపై 20 శాతం.. టోల్గేట్ చార్జీలు 8 శాతం అదనం నెలకు రూ. 62.38 లక్షల భారం మండిపడుతున్న ప్రయాణికులు, విద్యార్థి సంఘాలుచదువుకు దూరం చేయటమే.. విద్యార్థుల బస్సుపాస్లపై ఏకంగా 20 శాతం చార్జీలు పెంచటం అంటే మారు మూల గ్రామాలకు చెందిన పేద విద్యార్థులను చదువులకు దూరం చేయటమే అవుతుంది. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే విద్య, వైద్యాన్ని పేదలకు ఉచితంగా అందించాలి. పాస్లపై పెంచిన ధరలను వెంటనే తగ్గించాలి. లేకుంటే ఏబీవీపీ ఆధ్వర్యంలో ఆందోళన తప్పదు. శ్రీనివాస్గౌడ్, ఏబీవీపీ మెదక్ ఉమ్మడి జిల్లా కన్వీనర్ -
కార్పొరేటు విద్య ఉచితం
మెదక్ కలెక్టరేట్: నిరుపేద ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి ఉచిత విద్యను అందించేందుకు ప్రభుత్వం బెస్ట్ అవైలబుల్ పథకం ప్రవేశ పెట్టింది. ఈ పథకానికి జిల్లాలో మెరుగైన వసతులు కలిగిన ఐదు ప్రైవేట్ పాఠశాలలను ఎంపిక చేశారు. ప్రతి ఏడాది లక్కీ డ్రా ద్వారా ప్రైవేట్ పాఠశాలల్లో చేరే అవకాశం కల్పించనున్నారు. ఇందుకోసం ఇప్పటికే ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈనెల 16వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకునేలా అవకాశం కల్పించారు. కలెక్టరేట్లోని ఎస్సీ అభివృద్ధి కార్యాలయంలో దరఖాస్తు పత్రాలు అందజేస్తున్నారు. ఎస్సీ విద్యార్థులకు 120 సీట్లు బెస్ట్ అవైలబుల్ పథకం కింద ఎస్సీ విద్యార్థులు చేరేందుకు ఒకటవ తరగతికి 59 సీట్లు, 5వ తరగతికి 61 సీట్లు ఖాళీగా ఉన్నాయి. దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల ఎంపిక కోసం ఈనెల 20న మెదక్ కలెక్టరేట్లో లక్కీ డ్రా తీసి విద్యార్థులను ఎంపిక చేస్తారు. ఇందులో ఎంపికై తే జిల్లాలోని పలు ప్రైవేట్, కార్పొరేట్ స్థాయి ఇంగ్లిష్ మీడియం పాఠశాలలో చేరే అవకాశం ఉంటుంది. ఎస్టీ విద్యార్థులకు 49 సీట్లు ఎస్టీ విద్యార్థులకు మొత్తం 49 సీట్లు ఖాళీగా ఉన్నాయి. అందులో 3వ తరగతి(25), 5వ తరగతి(12), 8వ తరగతి(12) సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి, అర్హత గల విద్యార్థులు ఈనెల 17వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలి. 20న కలెక్టరేట్లో లక్కీ డ్రా తీసి విద్యార్థులను ఎంపిక చేస్తారు. ఎంపికై న గిరిజన విద్యార్థులు సేయింట్ జోసెఫ్ హైస్కూల్, సంగారెడ్డి, శ్రీవిద్యారణ్య ఆవాస విద్యాలయం సిద్దిపేటలో విద్యాభ్యాసం చేసే అవకాశం దక్కుతుంది. ఎస్టీ బాలికలకు 33శాతం రిజర్వేషన్ ఎస్టీ బాలికలకు 33శాతం రిజర్వేషన్ కల్పించనున్నారు. విద్యార్థులు అంతకు ముందు చదివిన తరగతుల బోనఫైడ్లు కలిగి ఉండాలి. గ్రామీణ ప్రాంతంలోని విద్యార్థుల తల్లిదండ్రుల ఆదాయం రూ.1,50 లక్షలు, పట్టణ ప్రాంత విద్యార్థుల తల్లిదండ్రుల ఆదాయం రూ.2 లక్షల లోపు ఉండాలి. పూర్తిచేసిన దరఖాస్తు పత్రాలను ఈనెల 17వ తేదీ సాయంత్రంలోగా జిల్లా సమీకృత కలెక్టరేట్లోని ఎస్టీ అభివృద్ధి కార్యాలయంలో సమర్పించాలి. కావాల్సిన ధ్రువీకరణ పత్రాలు విద్యార్థులు దరఖాస్తు పత్రానికి సంబంధిత ధ్రువీకరణ పత్రాలు తప్పనిసరిగా జత చేయాలి. మీ సేవ ద్వారా 2025 జనవరి తర్వాత పొందిన జనన ధ్రువీకరణ, ఆదాయం, నివాస ధృవీకరణ పత్రాలు, ఆధార్కార్డు, రేషన్కార్డు, బోనఫైడ్, ప్రోగ్రెస్కార్డులు కలిగి ఉండాలి.బెస్ట్ అవైలబుల్ పథకం.. పేద విద్యార్థులకు వరం ఎస్టీ విద్యార్థులకు 49 సీట్లు ఈనెల 16 వరకు దరఖాస్తుల స్వీకరణఅర్హతలు బెస్ట్ అవైలబుల్ పథకం కింద దరఖాస్తు చేసుకునే ఎస్సీ విద్యార్థులు 1వ తరగతిలో చేరేందుకు యూకేజీ పూర్తి చేసి ఉండాలి. 1వ తరగతిలో చేరేందుకు 2019 జూన్ 01 నుంచి 2020 మే 31వ తేదీ మధ్య జన్మించి ఉండాలి. అలాగే 5వ తరగతిలో చేరేందుకు 4వ తరగతి పూర్తి చేసి ఉండాలి. 2024–25లో 4వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు 5వ తరగతిలో చేరేందుకు అవకాశం ఉంటుంది. గ్రామీణ ప్రాంతంలోని విద్యార్థుల తల్లిదండ్రుల ఆదాయం రూ.1,50 లక్షలు, పట్టణ ప్రాంత విద్యార్థుల తల్లిదండ్రుల ఆదాయం రూ.2 లక్షల లోపు ఉండాలి. పూర్తి చేసిన దరఖాస్తు పత్రాలను ఈనెల 16వ తేదీ సాయంత్రంలోగా మెదక్ సమీకృత కలెక్టరేట్లోని ఎస్సీ అభివృద్ధి కార్యాలయాల్లో సమర్పించాలి. -
అండర్– 14 క్రికెట్ క్యాంపునకు ఎంపిక
వెల్దుర్తి(తూప్రాన్): రాష్ట్ర అండర్–14 క్రికెట్ క్యాంపునకు వెల్దుర్తి ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థి శశ్రీత్ గౌడ్ ఎంపికయ్యాడని పాఠశాల హెచ్ఎం సాంబయ్య తెలిపారు. ఈసందర్భంగా విద్యార్థిని మండలంలోని చెర్లపల్లిలో ఆదివారం గ్రామస్తులు, ఉపాధ్యాయులు సత్కరించి అభినందించారు. యంగ్ స్టార్ క్రికెట్ లీగ్ నేషనల్ టోర్నమెంట్లో భాగంగా హైదరాబాద్లో గత నెలలో నిర్వహించిన పోటీల్లో శశ్రీత్గౌడ్ ప్రతిభ చాటారన్నారు. భవిష్యత్లో రాష్ట్ర, జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాలని ఆకాంక్షించారు. నల్లపోచమ్మకు ప్రత్యేక పూజలు కౌడిపల్లి(నర్సాపూర్): మండలంలోని తునికి నల్లపోచమ్మదేవి ఆలయంలో ఆదివారం భక్తు లు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. దేవాదాయశాఖ ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్స్పెక్టర్, ఆలయ ఇన్చార్జి ఈఓ రంగారావు ఆధ్వర్యంలో అర్చకులు అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం చేశారు. అలాగే మేడ్చల్ సెషన్ కోర్డు జడ్జి అర్జున్, ఎన్ఐఏ అధికారి విశాల్గౌతమ్ కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. జడ్జికి ఆలయ అధికారులు స్వాగతం పలికి సన్మానించారు. కార్యక్రమంలో జూనియర్ అసిస్టెంట్ వెంకట్రెడ్డి, ఆలయ సిబ్బంది, ధర్మకర్తలు పాల్గొన్నారు. రేషన్ కోసం పడిగాపులు కౌడిపల్లి(నర్సాపూర్): మండల కేంద్రంలో రేషన్ బియ్యం కోసం లబ్ధిదారులు పడిగాపులు కాస్తున్నారు. ప్రభుత్వం మూడు నెలలకు సంబంధించి ఒకేసారి బియ్యం పంపిణీ చేస్తుంది. దీంతో ఒక్కో లబ్ధిదారుడు ఈపీడీఎస్ మిషన్పై ఆరుసార్లు వేలిముద్రలు వేయా ల్సి వస్తుంది. దీంతో బియ్యం పంపిణీలో ఆలస్యం జరుగుతోంది. అర్హులందరికీ సంక్షేమ ఫలాలు తూప్రాన్: బీసీలకు కాంగ్రెస్తోనే సముచిత న్యాయం లభిస్తుందని శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్ అన్నారు. ఆదివారం మండలంలోని గుండ్రెడ్డిపల్లిలో నూతనంగా నిర్మించిన పెద్దమ్మగుడి ప్రారంభోత్సవానికి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు గడిచినా ఇప్పటివరకు బీసీలకు అన్యా యం జరుగుతూనే ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలను అర్హులందరికీ అందించడమే తమ ధ్యేయం అన్నారు. రాష్ట్రంలో గద్వాల్ నుంచి ఆదిలాబాద్ వరకు పెద్దఎత్తున పెద్దమ్మ తల్లి ఆలయాలు నిర్మాణాలు జరుగుతాయని వివరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి నర్సారెడ్డి, ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు భాస్కర్రెడ్డి, గ్రామస్తులు, నాయకులు పాల్గొన్నారు. -
రోగులకు మెరుగైన వైద్య సేవలు
కలెక్టర్ రాహుల్రాజ్ ఎంపీ నిధులతో బోర్ల తవ్వకాలు: ఎంపీ షెట్కార్రామాయంపేట(మెదక్): జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగులకు మెరుగైన వైద్యసేవలు అందుతున్నాయని కలెక్టర్ రాహుల్రాజ్ అన్నారు. ఆదివారం పట్టణంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను, ప్రగతి ధర్మారంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. పేదలకు అందుతున్న వైద్య సేవలను విస్తృత పర్చాలని, ఈ మేరకు ఆస్పత్రుల బలోపేతానికి కృషి చేస్తున్నామని తెలిపారు. జిల్లా పరిధిలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో డాక్టర్లు, సిబ్బంది పనితీరును సీసీ కెమెరాల ద్వారా నిత్యం మానిటరింగ్ చేస్తున్నామన్నారు. పూర్తిస్థాయిలో డాక్టర్లు, సిబ్బంది విధులకు హాజరవుతూ రోగులకు వైద్యసేవలు అందజేస్తున్నారని కొనియాడారు. రామాయంపేట, కౌడిపల్లి, ఇతర ఆస్పత్రుల్లో త్వరలో పూర్తిస్థాయిలో సిబ్బంది, డాక్టర్లను నియమిస్తామని వెల్లడించారు. తూప్రాన్, రామాయంపేట పరిధిలో జాతీయ రహదారిపై తరచూ రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని, త్వరలోనే ట్రామా కేంద్రం ఏర్పాటయ్యే అవకాశం ఉందని వెల్లడించారు. కలెక్టర్ డాక్టర్లు, ఇతర సిబ్బంది ఉన్నారు. బియ్యం సక్రమంగా ఇస్తున్నారా? మండలంలోని అక్కన్నపేటలో ఆదివారం రేషన్ దుకాణాన్ని కలెక్టర్ రాహుల్రాజ్ ఆదివారం పరిశీలించారు. ఈసందర్భంగా మూడు నెలల బియ్యాన్ని డీలర్ సక్రమంగా ఇస్తున్నారా..? అని వినియోగదారులను ప్రశ్నించారు. అనంతరం బియ్యం నాణ్యత విషయమై ఆరా తీశారు. ఈ–పాస్ డివైస్లో కొత్తగా ప్రవేశపెట్టిన సాఫ్ట్వేర్ పనితీరు గురించి తెలుసుకున్నారు. ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా బియ్యం పంపిణీ చేయాలని డీలర్ను ఆదేశించారు. నారాయణఖేడ్: తాగునీటి సమస్య పరిష్కారానికి పలు గ్రామాలు, తండాలకు బోర్ల తవ్వకం కోసం జహీరాబాద్ ఎంపీ సురేశ్ షెట్కార్ తనకోటా నిధుల ద్వారా ఒక్కోచోట బోరు తవ్వకం, మోటారు బిగించడం, పైపులైను ఏర్పాటు పనులకోసం రూ.3 లక్షల చొప్పున కేటాయించారు. ఆదివారం ఖేడ్ మండలం స్కూల్ తండా, హన్మాన్ తండాలతోపాటు మనూరు మండలం రాణాపూర్ గ్రామంలో బోర్ల తవ్వకాలను ఆయా తండాల పెద్దలు, గ్రామస్తులు పూజలు నిర్వహించి ప్రారంభించారు. ఆయా తండాల వాసులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు -
ప్లాస్టిక్ వ్యర్థాలకు చెక్
గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్యం మెరుగుపరిచేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించాయి. ఇందుకోసం ప్లాస్టిక్ వ్యర్థాలను పూర్తిగా నిర్మూలించేందుకు వేస్ట్ మేనేజ్మెంట్ యూనిట్లు నెలకొల్పనున్నారు. ఇందులో భాగంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో 1,633 గ్రామ పంచాయతీలకు స్వచ్ఛ భారత్ మిషన్– గ్రామీణ్ కింద రూ. 61.28కోట్లు మంజూరయ్యాయి. ఇందులో కేంద్రం 60శాతం, రాష్ట్రం వాటా 40శాతం ఉండనుంది. ఈ నిధులకు వివిధ టార్గెట్లను నిర్ణయించారు. ఆగస్టు చివరి వరకు పూర్తి చేయాలన్న లక్ష్యంతో డీఆర్డీఏ అధికారులు ముందుకు సాగుతున్నారు. – సాక్షి, సిద్దిపేటప్రతిపాదనలు రూపొందిస్తున్నాం ఎస్బీఎంలో మంజూరైన నిధులకు టార్గెట్కు అనుగుణంగా గ్రామాల వారీగా ప్రతిపాదనలు తెప్పిస్తున్నాం. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఎంపికలు కాగానే వ్యక్తిగత మరుగుదొడ్లు మంజూరు చేస్తాం. ఆగస్టులోగా పనులు పూర్తి అయ్యేలా ముందుకు సాగుతున్నాం. అలాగే కొత్తగా ఏర్పాటైన గ్రామాలను ఓడీఎఫ్గా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందించాం. – జయదేవ్ ఆర్యా, డీఆర్డీఓ, సిద్దిపేట పల్లెల్లో తొలిసారిగా ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ యూనిట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అందులో భాగంగా ఉమ్మడి మెదక్ జిల్లాకు 11 మంజూరు చేశారు. ఒక్కోదానికి రూ.64లక్షల చొప్పున రూ.7.04కోట్లను కేటాయించారు. రోడ్డు కనెక్టివిటీ, విద్యుత్, నీటి సౌకర్యం ఉన్న ప్రాంతంలో ఈ యూనిట్లను ఏర్పాటు చేయనున్నారు. వివిధ ప్రాంతాల నుంచి సేకరించిన ప్లాస్టిక్ వ్యర్థాల నుంచి వివిధ రకాల వస్తువులను తయారు చేయనున్నారు. ప్రాసెస్ చేసిన ప్లాస్టిక్ వ్యర్థాలను రీసైక్లింగ్, రికవరీ ప్రక్రియల ద్వారా వివిధ ఉత్పత్తులను తయారు చేస్తారు. పునర్వినియోగానికి పనికిరాని ప్లాస్టిక్ వ్యర్థాలను దహనం చేయడం కానీ, ల్యాండ్ ఫిల్లింగ్ చేయడం చేయనున్నారు. కాలుష్యంను తగ్గించి పర్యావరణ పరిరక్షణకు దోహదపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. 19వేల మరుగుదొడ్లు మంజూరు ఈ ఏడాది గ్రామీణ ప్రాంతాల్లో స్వచ్ఛ భారత్ నిధులతో వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించనున్నారు. ఒక్కో మరుగుదొడ్డి కోసం రూ.12వేల చొప్పున కేటాయించారు. ఉమ్మడి మెదక్ జిల్లాకు 19,806 వ్యక్తిగత మరుగుదొడ్ల కోసం రూ.23.76 కోట్లను మంజూరు చేశారు. పర్యాటక ప్రాంతాలు, పాఠశాలలు, మార్కెట్ స్థలాలు, ఆస్పత్రులు, బస్టాండ్లు అవసరమైన చోట్ల 53 శానిటేషన్ కాంప్లెక్స్లను రూ.1.59కోట్లతో నిర్మించనున్నారు. ● కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్లు ఉమ్మడి మెదక్ జిల్లాకు 53 కేటాయించారు. ఒక్కోదానికి రూ.3లక్షల నిధులు మంజూరు చేశారు. ఇందులో నిధులు ఎస్బీఎం నుంచి 70శాతం, 15వ ఆర్థిక సంఘం నిధులు 30శాతం మంజూరు చేయనున్నారు. 50 నూతన పంచాయతీల్లో.. ఉమ్మడి మెదక్ జిల్లాలో 1,633 గ్రామ పంచాయతీలలో నూతనంగా 50 గ్రామ పంచాయతీలు ఏర్పాటయ్యాయి. నూతనంగా మెదక్లో 24, సంగారెడ్డిలో 11, సిద్దిపేటలో 15 గ్రామ పంచాయతీలను బహిరంగ మలమూత్రవిసర్జన రహిత గ్రామా లుగా తయారు చేయడానికి అధికారులు కార్యాచరణ రూపొందించారు.పల్లెల్లో రీసైక్లింగ్ ఉమ్మడి మెదక్ జిల్లాలో 1,633 జీపీలకు రూ.61 కోట్లు 11 ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ యూనిట్లు మంజూరు ఓడీఎఫ్ దిశగా నూతన పంచాయతీలు జిల్లాల వారీగా చేపట్టే పనులు యూనిట్లు మెదక్ సంగారెడ్డి సిద్దిపేట మొత్తం నిధులు వ్యక్తిగత మరుగుదొడ్లు 1,200 15,606 3,000 రూ. 23.76కోట్లు ఇంకుడు గుంతలు 5,744 7,390 5,931 రూ. 12.39కోట్లు సామూహిక ఇంకుడు గుంతలు 898 1,091 876 రూ. 15.70కోట్లు సిగ్రిగేషన్ షెడ్లు 24 11 15 రూ. 80లక్షలు మేనేజ్మెంట్ ప్లాస్టిక్ వేస్ట్ 03 04 04 రూ. 7.04కోట్లు పారిశుద్ధ్య సమూహాలు 15 19 19 రూ. 1.59కోట్లు -
కంది రైతుకు.. కరెంటు రంది
కొల్చారం(నర్సాపూర్): మండలంలోని ఎనగండ్లలో బోర్ల కింద డ్రిప్ ఇరిగేషన్తో రైతులు ఆరుతడి పంట అయిన కంది సాగు చేస్తున్నారు. ప్రస్తుతం మొక్క పిలకదశకు వచ్చింది. ఈక్రమంలో విద్యుత్ సరఫరాలో తరచూ అంతరాయం ఏర్పడుతోంది. దీంతో నీరు సరిగా అందక పంట దెబ్బతినే పరిస్థితి ఏర్పడింది. మరోవైపు వరి సాగు కోసం తుకం పోసే పనుల్లో రైతులు బిజీగా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో అప్రకటిత విద్యుత్ కోతలు ఏంటని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈవిషయమై దుంపలకుంట సబ్స్టేషన్ సిబ్బందిని అడిగితే సరైన సమాధానం చెప్పడం లేదని వాపోతున్నారు. అధికారులు వెంటనే స్పందించి విద్యుత్ సరఫరాలో అంతరా యం లేకుండా చూడాలని డిమాండ్ చేస్తున్నారు. -
తెగని ఢీఎస్ఆర్!
ఇబ్బందులు పెట్టడం సరికాదు ఫే్స రికగ్నైజేషన్తో హాజరు వేసే క్రమంలో సైబర్ నేరగాళ్ల వలలో పడే అవకాశం లేకపోలేదు. అంతేకాకుండా 18 నెలలుగా పాలకవర్గాల లేక ఇప్పటికే లక్షలాది రూపాయలు అప్పు చేసి గ్రామాలను నెట్టుకొస్తున్నాం. ఈక్రమంలో కొత్త నిబంధన పేరుతో ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేయడం సరికాదు. వెంటనే ఆ నిర్ణయాన్ని విరమించుకోవాలి. – నగేష్, పంచాయితీ కార్యదర్శుల ఫోరం జిల్లా అధ్యక్షుడు క్రమశిక్షణా చర్యలు తప్పవు నేటి నుంచి డీఎస్ఆర్ యాప్ను వినియోగించి, దాని ద్వారానే పంచాయతీ కార్యదర్శులు హాజరువేయాలి. దీంతో పాటు రోజువారీ కార్యక్రమాలను యాప్లో పొందుపర్చాలి. యాప్ అందుబాటులోకి వచ్చి 15 రోజులు కావొస్తుంది. విస్మరించిన వారిపై క్రమశిక్షణా చర్యలు తప్పవు – యాదయ్య, డీపీఓ యాప్ను బహిష్కరించిన పంచాయతీ కార్యదర్శులు ● రెండు వారాలుగా అటెండెన్స్ వేయని తీరు ● నేటి నుంచి తప్పనిసరి అంటూ ఉన్నతాధికారుల అల్టిమేటం ● జిల్లాలో 469 మంది కార్యదర్శులు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ రూపొందించిన రోజువారీ పారిశుద్ధ్య నివేదిక (డీఎస్ఆర్) యాప్ పంచాయతీ ఎటూ తెగడం లేదు. కొత్త మార్గదర్శకాలు మరింత ఇబ్బందికరంగా మారాయని పంచాయతీ కార్యదర్శులు రెండు వారాలుగా యాప్ను బహిష్కరించారు. ఈక్రమంలో సోమవారం నుంచి యాప్ను తప్పనిసరిగా వినియోగించాలని ఉన్నతాధికారులు అల్టిమేటం జారీ చేశారు. మాట వినకుంటే క్రమశిక్షణ చర్యలు తప్పవంటూ హెచ్చరిస్తున్నారు. – మెదక్జోన్ జిల్లావ్యాప్తంగా 493 గ్రామ పంచాయతీలు ఉండగా, 469 మంది పంచాయతీ కార్యదర్శులు విధులు నిర్వర్తిస్తున్నారు. ఈక్రమంలో గ్రామాల్లో మెరుగైన పాలన కోసం రాష్ట్ర ప్రభుత్వం గత నెల 24వ తేదీన రోజువారీ పారిశుద్ధ్య నివేదిక (డీఎస్ఆర్) యాప్ను అందుబాటులోకి తెచ్చింది. ప్రతిరోజు ఉదయం 11 గంటలలోపు కార్యదర్శులు ఫేస్ రికగ్నైజేషన్తో అటెండెన్స్ వేయాలని, పంచాయతీలో జరిగే శానిటేషన్, ఇతర పనులకు సంబంధించిన ప్రక్రియ ఫొటోలు అప్లోడ్ చేయాలని చెప్పింది. రోజువారీగా ఇళ్ల నుంచి సేకరించే చెత్త ఎన్ని కిలోలన్న దానిపై వివరాలను చేర్చాలని నిర్ణయించారు. అందులో తడి, పొడి చెత్త ఎంత సేకరిస్తున్నారు.. దాని నుంచి వర్మీ కంపోస్టు ఎరువులు తయారు చేస్తున్నారా..? గ్రామంలోని పల్లె పకృతి వనాల నిర్వహణ, డంప్యార్డులు, శ్మశానవాటికలు, మురికి కాలువలు.. ఇలా అన్నిరకాల కార్యక్రమాలను యాప్లో అప్లోడ్ చేయాలని ఆదేశించింది. ససేమిరా అంటున్న సెక్రటరీలు ఏ ఉద్యోగులకు లేని విధంగా ప్రభుత్వం తమకు అనేక నిబంధనలు పెడుతూ ఇబ్బందులకు గురిచేస్తుందని పంచాయతీ సెక్రటరీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాలకవర్గాలు లేక 18 నెలలు అవుతుందని, గ్రామాల్లో చిన్నా చితక పనులతో పాటు చెత్త సేకరణ కోసం ప్రతి రోజు ట్రాక్టర్ను ఇంటింటికీ పంపుతున్నామని, డీజిల్ కోసం అప్పులు చేయాల్సి వస్తోందని వాపోతున్నారు. ఇప్పటికే అనేక ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించి ఒత్తిడికి గురవుతున్నామని.. కొత్తగా వచ్చిన డీఎస్ఆర్ యా ప్ మరింత ఇబ్బందికరంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
సమ్మెను జయప్రదం చేద్దాం
మెదక్ కలెక్టరేట్: జూలై 9న నిర్వహించే దేశవ్యాప్త సమ్మెలో కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్క రాములు పిలుపునిచ్చారు. శనివారం జిల్లా కేంద్రంలోని కేవల్ కిషన్ భవన్లో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను నిర్వీర్యం చేస్తూ కొత్త చట్టాలు తెచ్చి ఏళ్లుగా పోరాడి సాధించుకున్న హక్కులను కాలరాస్తుందన్నారు. లేబర్ కోడ్స్ అమలు కావడం వల్ల మహిళా కార్మికులకు రక్షణ లేకుండా పోతుందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం 8 గంటల పనిని, 12 గంటలకు పెంచిందన్నారు. దేశవ్యాప్త సమ్మెతో కేంద్రం కళ్లు తెరిపించాలని కోరారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బాలమణి, మల్లేశం, జిల్లా కోశాధికారి నర్సమ్మ, ఉపాధ్యక్షులు మహేందర్రెడ్డి, నాగరాజు, బస్వరాజు, సహాయ కార్యదర్శులు సంతోష్, నాగేందర్రెడ్డి, అన్నపూర్ణ, గౌరయ్య తదితరులు పాల్గొన్నారు.సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్క రాములు -
‘ఉపాధి’ని సద్వినియోగం చేసుకోండి
కలెక్టర్ రాహుల్రాజ్చిన్నశంకరంపేట(మెదక్): ఉపాధి హామీ పథకం ద్వారా చేపడుతున్న పనులను కూలీలు సద్వినియో గం చేసుకోవాలని కలెక్టర్ రాహుల్రాజ్ సూచించారు. శనివారం మండలంలోని మడూర్ గ్రామ శివారులో నిర్వహిస్తున్న ఉపాధి పనులను ప రిశీలించారు. ఈసందర్భంగా కూలీలతో మాట్లాడి ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై ఆరా తీశారు. జాబ్కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి వంద రోజుల పని కల్పించనున్నట్లు తెలిపారు. చేపల చెరువుల తవ్వకంతో మత్స్యకారులు లబ్ధిపొందనున్నారని, అ లాగే గ్రామంలో ఎంత ఎక్కువ సంఖ్యలో పనులు నిర్వహిస్తే అదే స్థాయిలో ప్రత్యేక నిధులు అందనున్నాయన్నారు. భూమి లేని కూలీలు కనీసం 25 రోజుల పనిచేస్తేనే ఆత్మీయ భరోసా లభించనున్నట్లు చెప్పారు. త్వరలోనే దివ్యాంగులకు అవసరమైన పరికరాలు అందించనున్నట్లు పేర్కొన్నారు. ఆయన వెంట ఎంపీడీఓ దామోదర్, ఏపీఓ రాజ్కుమార్, గ్రామ కార్యదర్శి ప్రతిభ ఉన్నారు. అనంతరం చిన్నశంకరంపేట పీహెచ్సీని ఆకస్మికంగా తనిఖీ చేసీ రికార్డులు పరిశీలించారు. ప్రజారోగ్యంపై దృష్టిసారించాలని, అంకితభావంతో విధులు నిర్వర్తించాలని వైద్య సిబ్బందికి సూచించారు. -
విద్యలో సమూల మార్పులు రావాలి
మెదక్ కలెక్టరేట్: ప్రభుత్వ బడులు నిలబడాలి– చదువులో అంతరాలు పోవాలి అని తెలంగాణ పౌర స్పందన వేదిక రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన ప్రచార జాతా కార్యక్రమంలో మాట్లాడారు. పేద, ధనిక బేధం లేకుండా అందరి పిల్లలు ఒకే చోట చదువుకోవాలనే లక్ష్యంతో పౌర స్పందన వేదిక పని చేస్తుందన్నారు. రాష్ట్రంలో ప్రైవేట్ రంగంలో పాఠశాలలు, కళాశాలు ఎంత డబ్బు పెడితే అంతా చదువు అన్నచందంగా మారిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యా విధానంలో మార్పులు తీసుకొచ్చి పేద ప్రజలకు నాణ్యమైన విద్యనందించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో టీపీఎస్వీ ఉపాధ్యక్షుడు మంగ దక్షణమూర్తి, టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి, జిల్లా అధ్యక్షుడు పద్మారావు తదితరులు పాల్గొన్నారు. -
పరిసరాల పరిశుభ్రత తప్పనిసరి
మెదక్ మున్సిపాలిటీ: పట్టణంలోని 4వ వార్డులో శనివారం మున్సిపల్ సిబ్బంది 100 రోజుల యాక్షన్ ప్లాన్లో భాగంగా పారిశుద్ధ్య కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ఇంటింటికీ తిరిగి తడి, పొడి, హానికరమైన చెత్తను వేరుచేసి మున్సిపల్ వాహనానికి ఇవ్వాలని ప్రజలకు అవగాహన కల్పించారు. చెత్తను ఎట్టి పరిస్థితుల్లో ఇంటి పరిసరాల్లో వేయకూడదని, అలా వేస్తే దోమలు పెరుగుతాయని హెచ్చరించారు. వార్డులో రోడ్డుకు ఇరువైపులా పిచ్చి మొక్కలను తొలగించనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్రెడ్డి, ఇన్చార్జి శానిటరీ ఇన్స్పెక్టర్ నాగరాజు, వార్డు అధికారులు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
సేద్యంలో రైతే శాస్త్రవేత్త
● త్వరలో ఆదర్శ రైతు వ్యవస్థ,విత్తన చట్టం ● రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డిహుస్నాబాద్: వ్యవసాయ సేద్యంలో రైతే పెద్ద శాస్త్రవేత్త అని రాష్ట్ర రైతు కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి అన్నారు. హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో రెండో రోజు శనివారం నిర్వహించిన కిసాన్ మేళా కార్యక్రమానికి ఆయన ముఖ్య అతి థిగా హాజరయ్యారు. పలు స్టాళ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కోదండ రెడ్డి మాట్లాడుతూ ధరణితో లక్షలాది మంది రైతులు ఇబ్బంది పడ్డారన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం భూ భారతి తెచ్చి రైతుల ఇక్కట్లను దూరం చేస్తున్నారన్నారు. అలాగే నకిలీ విత్తనాల పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ములుగులో కొన్ని మల్టీనేషనల్ కంపెనీలు మొక్కజొన్న విత్తనోత్పత్తి చేసి రైతులను ఆగం చేశాయన్నారు. త్వరలో రైతుకు విత్తన హక్కు కల్పి ంచే విధంగా విత్తన చట్టం తీసుకువచ్చేందుకు కమిటీలు వేశామని తెలిపారు. పసుపు రైతులు యాంత్రీకరణ దిశగా ఆలోచించాలన్నారు. రైతులు సంప్రదాయ పంటలు వేసి ఆదాయాన్ని పెంచుకోవాలని కోదండరెడ్డి సూచించారు. త్వరలో ఆదర్శ రైతు వ్యవస్థను ప్రభుత్వం ప్రకటిస్తుందని వెల్లడించారు. ఎక్కడెక్కడ ఎలాంటి పంటలు పండుతాయో అక్కడ ఆయా మార్కెట్లు ఉండాలని రైతు కమిషన్ సూచించిందన్నారు. -
సింగూరు చేపకు గిరాకి
పుల్కల్(అందోల్): మృగశిర కార్తె ఆరంభం రోజే చేపలు తింటే ఆస్తమా, ఉబ్బసం వంటి వ్యాధులు రావని చాలామంది నమ్ముతుంటారు. ఆదివారం మృగశిర ప్రారంభం కావడంతో చేపలకు మంచి గిరాకీ లభిస్తుంది. ఇక జిల్లాలో సింగూరు చేపకున్న డిమాండ్ అయితే చెప్పనవసరం లేదు. పసందుగా చేప.. జిల్లాలో ఉన్న ఏకై క భారీ నీటిపారుదల సింగూరు బహుళార్థసాధక ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు జిల్లా ప్రజలకు, జంట నగరాల ప్రజలకు తాగునీటిని, స్థానికంగా సాగునీటిని అందిస్తుంది. జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది. అంతేకాకుండా మత్స్యకారులకు ఉపాధిని కల్పించి వారి జీవితాల్లో సిరులు పూయిస్తుంది. ఈ ప్రాజెక్టులో చేపలు పట్టుకుని వందల కుటుంబాలు జీవిస్తున్నాయి. సింగూరు డ్యాంలో పెరిగే చేపలు రుచికరంగా ఉంటాయని చేప ప్రియులు చెబుతుంటారు. ఇక్కడ పెరిగిన చేపలు హైదారాబాద్తోపాటు, జిల్లాలో పలు ప్రాంతాల ప్రజలు ఇష్టంగా తింటారు. ప్రాజెక్టుకు వచ్చిన పర్యాటకులు చాలామంది చేపలు కొని తీసుకెళ్తారంటే అతిశయోక్తి కాదు. ప్రభుత్వమే చేప పిల్లల విడుదల.. సింగూరు భారీ నీటి పారుదల ప్రాజెక్టు కావడంతో ప్రభుత్వమే చేప పిల్లలను విడుదల చేస్తుంది. ఏటా 60 నుంచి 70 లక్షల చేప పిల్లలను, రొయ్య పిల్లలను విడుదల చేస్తుంది. దీంతో ప్రాజెక్టు పరిసర గ్రామాల ప్రజలు చాలామంది చేపల వృత్తిని ఎన్నుకుని ఉపాధి పొందుతున్నారు. జోరుగా విక్రయాలు మత్స్యకారులు పట్టిన చేపలను కొందరు వ్యాపారులు ఆటోల్లో తరలించి సమీప పట్టణాల్లో విక్రయిస్తారు. స్థానికులు మాత్రం అక్కడే ప్రాజెక్టు సమీపంలో షెడ్లు వేసుకుని విక్రయాలు చేపడతారు. మృగశిర నాడు ప్రత్యేక కౌంటర్లు పెట్టి విక్రయాలు చేపడతారు. ప్రస్తుతం డ్యాంలో 18 టీఎంసీల వరకు నీరు ఉండటంతో చేపల సంపద వృద్ధి చెందుతుంది. మత్స్యకారులకు ఉపాధి గ్రామాల్లో చెరువుల్ని మత్స్యకారులకే ప్రభుత్వం అప్పగించి, చేప పిల్లలు సరఫరా చేయడంతో ఊరూరా చేపల విక్రయాలు జరుగుతున్నాయి. దీంతో గ్రామాల్లో జీవించే మత్స్యకారులకు ఉపాధి లభిస్తుంది. సాధారణ చేపలు కిలో రూ.150, కొర్రమీను కిలో రూ. 350కు విక్రయిస్తారు. మృగశిర నాడు మాత్రం రెట్టింపు ధరలకు అమ్ముతారు. మృగశిర కార్తె ఆరంభం నుంచే విక్రయాల సందడి ఆస్తమా, ఉబ్బసం వ్యాధులు దరిచేరవని ప్రజల నమ్మకం -
రేపటి నుంచి డీసెట్ ధ్రువపత్రాల పరిశీలన
మెదక్ కలెక్టరేట్: ఈనెల 9వ తేదీ నుంచి 13వ తేదీ వరకు డీసెట్ ధ్రువపత్రాల పరిశీలన చేపట్టనున్నట్లు మెదక్ డైట్ కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ రాధాకిషన్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. డీసెట్ – 2025లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు మెదక్ డైట్ కళాశాలలో జరిగే పరిశీలనకు సకాలంలో హాజరుకావాలని సూచించారు. ర్యాంక్ కార్డు, హాల్టికెట్, పదో తరగతి, ఇంటర్ మెమోలు, 1 నుంచి ఇంటర్ వరకు బోనాఫైడ్, కులం, ఆదాయం వంటి పూర్తి ధ్రువపత్రాలతో హాజరుకావాలని తెలిపారు. 9న 1 నుంచి 500 ర్యాంకు వరకు, 10న 501 నుంచి 1,000, 11న 1,001 నుంచి 1,500, 12న 1,501 నుంచి 2,000, 13న 2,001 నుంచి 2,198 వరకు రావాలని వివరించారు. సందేహాలకు 9949993717, 939 7682345, 9701767857 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. వైద్య సేవలపై కాయకల్ప బృందం ఆరారామాయంపేట(మెదక్): రామాయంపేట ప్రభుత్వ ఆస్పత్రిని శనివారం కాయకల్ప రాష్ట్ర ప్రతినిధుల బృందం సభ్యులు సందర్శించారు. ఈసందర్భంగా రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. టీం హెడ్ డాక్టర్ హరిప్రియ ఆధ్వర్యంలో సభ్యులు ఆస్పత్రి పరిసరాలను పరిశీలించి పలు సూచనలు చేశారు. రోగుల వెంట వచ్చే వారికి ఇస్తున్న భోజనం, బయో మెడికల్ వినియోగం తీరును పరిశీలించారు. ఆస్పత్రిలో డెలివరీలు ఎందుకు కావడం లేదని సూపరింటెండెంట్ లింబాద్రిని ప్రశ్నించారు. మార్చురీలో ఫ్రీజర్ల పనితీరును పరిశీలించారు. ఆస్పత్రిలో ఇన్, అవుట్ పేషెంట్ల వివరాలతో పాటు ఆస్పత్రికి సంబంధించి పూర్తి వివరాలు ఆన్లైన్లో నమోదు చేసే విధానాన్ని పరిశీలించారు. డాక్టర్లతో పాటు సిబ్బంది విధిగా డ్రెస్ కోడ్ పాటించాలని ఆదేశించారు. రోగులకు సకాలంలో వైద్య సేవలు అందించాలని సూచించారు. ఒకే దేశం, ఒకే ఎన్నికపై అవగాహన నర్సాపూర్: ఒకే దేశం.. ఒకే ఎన్నిక అంశంపై పార్టీలకతీతంగా కుల, యువజన సంఘాలకు అవగాహన కల్పిస్తున్నట్లు బీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లేష్గౌడ్ చెప్పారు. శనివారం పట్టణంలోని వీరభద్రీయ కులసంఘ సభ్యులకు అవగాహన కల్పించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తమ పార్టీ అధిష్టానం మేరకు ఆయా సంఘాలకు ఒకే దేశం, ఒకే ఎన్నికపై విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. ఆయన వెంట పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. సేంద్రియ సాగుతో రైతులకు మేలు శివ్వంపేట(నర్సాపూర్): రైతులు సేంద్రియ సాగుకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు శరవణన్, పాపారావు, శ్రీనివాస్ అన్నారు. వికసిత కృషి సంకల్ప అభియాన్లో భాగంగా కృషి విజ్ఞాన కేంద్రం తునికి ఆధ్వర్యంలో మండల పరిధి గోమారంలో శనివారం రైతులకు అవగాహన కల్పించారు. ఈసందర్భంగా శాస్త్రవేత్తలు మాట్లాడుతూ.. ప్రతి రైతు భూసార పరీక్షలు నిర్వహించి అందుకనుగుణంగా అధిక దిగుబడిని ఇచ్చే విత్తనాల ఎంపిక చేసుకోవాలన్నారు. రసాయన ఎరువుల వాడకం పూర్తిస్థాయిలో తగ్గించాలన్నారు. ప్రతి రైతు తన ఇంటికి సరిపడా అన్ని రకాల కూరగాయలు, ధాన్యం, ఇతర పంటలు సేంద్రియ పద్ధతిలో పండించేందుకు ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం ప్రభుత్వ వ్యవసాయ పథకాల గురించి వివరించారు. కార్యక్రమంలో ఏఓ లావణ్య, రైతులు తదితరులు పాల్గొన్నారు. -
మాట నిలబెట్టుకునే ప్రభుత్వం మాది
మెదక్ ఎమ్మెల్యే రోహిత్రావుమెదక్ కలెక్టరేట్: మాది మాట నిలబెట్టుకున్న ప్రభుత్వమని, ఎమ్మెల్యేగా గెలిచిన 14 నెలల్లోనే నియోజకవర్గ అభివృద్ధిని కాంక్షిస్తూ సంక్షేమ పథకాలు ప్రజలకు అందించామని ఎమ్మెల్యే రోహిత్రావు అన్నారు. గురువారం కలెక్టరేట్లో లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన నిరుపేదలందరికీ అండగా నిలబడి, వారికి నిలువ నీడ ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈ పథకానికి శ్రీకారం చుట్టిందన్నారు. దశలవారీగా లబ్ధిదారులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరవుతాయని తెలిపారు. నియోజకవర్గంలో విద్యా, వైద్యానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తూ ప్రజలలో మమేకమై పనిచేస్తున్నట్లు చెప్పారు. అనంతరం కలెక్టర్ రాహుల్రాజ్ మాట్లాడుతూ.. ప్రభుత్వ నిబంధనల ప్రకారం లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణం చేపట్టాలన్నారు. ఇసుకను ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్నందున నిర్మాణాలు వేగవంతం చేయాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్, హౌసింగ్ పీడీ మాణిక్యం, జెడ్పీ సీఈఓ ఎల్లయ్య, డీపీఓ యాదయ్య, అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. -
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత
మెదక్ కలెక్టరేట్: పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని, ప్రతి ఒక్కరూ తమవంతుగా ఒక మొక్క నాటి సంరక్షించాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి సుభవల్లి అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా గురువారం జిల్లా కోర్టు కార్యాలయ ఆవరణలో ఆమె మొక్కలు నాటారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. మొక్కలు నాటడంతో ఆక్సిజన్ శాతం పెరిగి మానవ జాతి మనుగడకు సాకారం అవుతుందన్నారు. అందుకోసం ప్రతి ఒక్కరూ తమ పరిసరాల్లో మొక్కలు నాటి పరిరక్షణ బాధ్యత కూడా తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి రుబీనా ఫాతిమా, జూనియర్ సివిల్ జడ్జి సిరి సౌజన్య, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. మొక్కలు నాటి సంరక్షించాలి నర్సాపూర్ రూరల్: మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడుదామని నర్సాపూర్ జూనియర్ సివిల్ కోర్టు జడ్జి హేమలత పిలుపునిచ్చారు. గురువారం కోర్టు ఆవరణలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కోర్టు సిబ్బంది, న్యాయవాదులతో కలిసి మొక్కలు నాటారు. ఈసందర్భంగా ఆమె మా ట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలన్నారు. పిల్లల పుట్టినరోజు సందర్భంగా చెట్లు నాటించి సంరక్షించే విధానాన్ని అలవాటు చేయా లని తల్లిదండ్రులకు సూచించారు. ఆరోగ్యవంతమైన జీవితం కోసం పచ్చదనాన్ని కాపాడుకోవాల్సి న అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో నర్సాపూర్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అరవింద్, న్యాయవాదులు ఎగ్బాల్ అలీ జాఫర్, స్వరూప రాణి, మధుశ్రీ శర్మ, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి సుభవల్లి -
మల్లన్నా.. కోడెలకు దిక్కెవరూ?
తెలంగాణలోనే ప్రముఖ పుణ్యక్షేత్రాలలో కొమురవెల్లి మల్లికార్జున స్వామి దేవాలయం ఒకటి. భక్తుల కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా విరాజిల్లుతోంది. స్వామివారికి ఎక్కువగా పట్నాలు, బోనాలు, అభిషేకాలు, కల్యాణోత్సవంతో మొక్కులు తీర్చుకుంటారు. అలాగే పలువురు భక్తులు కోడెలను దేవాలయానికి సమర్పిస్తుంటారు. అయితే వీటి సంరక్షణ ఆలయ నిర్వాహకులకు కష్టంగా మారుతోంది. ఇందుకు కారణం ప్రత్యేక గోశాల లేకపోవడమే. – సాక్షి, సిద్దిపేట తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశా, ఛత్తీస్గఢ్, కర్ణాటక నుంచి కొమురవెల్లికి భక్తులు భారీగా తరలివస్తారు. దేవుడి మొక్కుల కింద కోడెలను ఆలయానికి సమర్పించడం ఏళ్లుగా కొనసాగుతోంది. అలాగే కొందరు కోడెలు కడతామని మొక్కుతారు. దేవాలయానికి రూ.200 చెల్లించి టోకెన్ తీసుకుని అక్కడే ఉన్న కోడెను గుడికి సమీపంలో కట్టేస్తారు. ట్రస్ట్కు కోడెలు దేవాలయాలనికి కోడెల నిర్వహణ భారంగా ఉండటంతో ఓ ప్రైవేట్ ట్రస్ట్కు అప్పగిస్తూ చేతులు దులుపుకొంటున్నారు. కోడెలను ఓ ప్రైవేట్ గోశాలకు ఇస్తుండటంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భక్తులు ఇచ్చిన కోడెలను నిర్వహణ చేయకపోతే ఎలా అని అంటున్నారు. దేవాలయానికి గత మూడేళ్లలో 100 కోడెలు భక్తులు సమర్పిస్తే వాటిలో 81 కోడెలు ఓ ప్రైవేట్ ట్రస్ట్కు అప్పగించడం గమనార్హం. మూడేళ్లలో నాలుగు కోడెలు మృతిచెందాయి. దేవాలయానికి సమీపంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక షెడ్లో 15 కోడెలను సంరక్షిస్తున్నారు. వేములవాడలో కోడెలు మృతిచెందుతుండటంతో కొమురవెల్లిలో అందజేసిన కోడెలు ఎలా ఉన్నాయో అని భక్తులు ఆందోళన చెందుతున్నారు. షెడ్లో నిర్వహణ దేవాలయం సమీపంలోని ఒక షెడ్లో కోడెలను సంరక్షిస్తున్నారు. తక్కువ స్థలంలో షెడ్ ఉండటంతో కొన్నింటినే ఉంచుతున్నారు. దేవాలయానికి ఏటా రూ. కోట్ల ఆదాయం వస్తుంది. అలాగే దాదాపు 150 ఎకరాలకు పైగా స్థలం ఉంది. ఆ స్థలాల్లో కొంత భాగం గోశాల నిర్మాణం చేయాలని భక్తులు కోరుతున్నారు. అలాగే ఆలయ సమీపంలో గోపూజ చేసుకునేందుకు మండపం ఏర్పాటు చేయాలన్న విన్నపాలు వస్తున్నాయి. ఇప్పటకై నా దేవాదాయ శాఖ, ప్రజాప్రతినిధులు స్పందించి ప్రత్యేక గోశాలను నిర్మించాలని భక్తులు కోరుతున్నారు. కొమురవెల్లి ఆలయంలో ‘గోశాల’ లేక అవస్థలు మూడేళ్లలో 100 కోడెలనుఅందజేసిన భక్తులు చేసేదిలేక ప్రైవేట్కు 81 కోడెలు తాత్కాలిక షెడ్లో 15 పశువుల సంరక్షణ ప్రత్యేక గోశాల ఏర్పాటు చేయాలంటున్న భక్తులు -
మద్యం అమ్మకాలపై నిషేధం
కిషన్తండా వాసుల ఏకగ్రీవ తీర్మానంరామాయంపేట(మెదక్): మండలంలోని కిషన్తండా పంచాయతీ పరిధిలో సంపూర్ణ మద్యపాన నిషేధం కోసం తండా వాసులు ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఎవరైనా మద్యం విక్రయాలు కొనసాగిస్తే రూ. లక్ష జరిమానా చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈమేరకు గ్రామస్తులు గురువారం సమావేశమై చర్చించారు. తండాలో ఉన్న రెండు బెల్ట్షాపుల్లో మద్యం అమ్మకాలతో యువత చెడు మార్గం పడుతుందని, మద్యం సేవించిన వారు తరచూ రో డ్డు ప్రమాదాలకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేవారు. తాము ఎన్నిసార్లు చెప్పినా బెల్ట్షాపు నిర్వాహకులు ఖాతరు చేయకుండా మద్యం అమ్మకాలు కొనసాగిస్తున్నారని, ఇక నుంచి కొనసాగిస్తే ఊరుకోమని హెచ్చరించారు. ఈ మేరకు తీర్మాన ప్రతులను ఎకై ్సజ్, స్థానిక పోలీస్స్టేషన్లలో అందజేశారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సుభాష్ తదితరులు పాల్గొన్నారు. -
ఎరువులు, విత్తనాల జాడేది?
వానాకాలం సాగు ప్రణాళికను వ్యవసాయ శాఖ అధికారులు ఇప్పటికే ఖరారు చేశారు. జిల్లావ్యాప్తంగా అన్నిరకాల పంటలు కలిపి 3,50,164 ఎకరాల్లో సాగు కానున్నట్లు అంచనా వేశారు. కానీ అందుకు కావాల్సిన విత్తనాలు, ఎరువులను మాత్రం అందుబాటులో ఉంచలేదు. ఇప్పటికే రైతులు దుక్కులు సిద్ధం చేసి నారు పోసుకునేందుకు సన్నద్ధం అవుతున్నారు. ఒక్క వర్షం పడితే సాగు పనులు మొదలు పెట్టేందుకు ఎదురు చూస్తున్నారు. సరిపడా విత్తనాలు అందుబాటులో లేకపోవడంతో ఇబ్బందులు తప్పేలా లేవు.. మొదట్లోనే ఈ పరిస్థితి ఉంటే, సాగు మొదలైతే పరిస్థితి ఏంటని రైతులు వాపోతున్నారు. – మెదక్ కలెక్టరేట్ భూసారం పెంచేందుకు రైతులు పచ్చిరొట్ట (జీలుగా, జనుము) విత్తనాలు సాగు చేసి నేలలో దున్నుతారు. జిల్లాకు 30 వేల క్వింటాళ్ల జీలుగా విత్తనాలు అవసరం ఉండగా, కేవలం 2 వేల క్వింటాళ్లు మాత్రమే వచ్చాయి. అలాగే జనుము 15 వేల క్వింటాళ్లు అవసరం కాగా, ఒక్క క్వింటాల్ కూడా అందుబాటులో లేవు. వచ్చిన విత్తనాలు కొంతమంది రైతులకే దొరికాయి. మిగితా వారు విత్తనాల కోసం ఇబ్బంది పడుతున్నారు. అలాగే జిల్లాకు మొత్తం 91,500 క్వింటాళ్ల వరి విత్తనాలు అవసరం ఉండగా, ప్రస్తుతం 13,500 క్వింటాళ్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఖరీఫ్ సీజన్లో సన్నాల సాగు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేశారు. అలాగే వర్షాధారంగా సాగు చేసే పంటల్లో పత్తి పంట ఒకటి. ఈ సీజన్లో జిల్లాకు పత్తి విత్తనాలు 74,400 ప్యాకెట్లు (ఒక్కో ప్యాకెట్లో 450 గ్రాములు) అవసరం కానున్నాయి. కాగా ప్రస్తుతం 65,200 ప్యాకెట్లు అందుబాటులో ఉన్నాయి. మొక్కజొన్న ఆరు, జొన్న విత్తనాలు ఒక క్వింటాల్ అందుబాటులో ఉన్నాయి. ఈ పంటలు జిల్లాలోని టేక్మాల్, పెద్దశంకరంపేట, రేగోడ్, అల్లాదుర్గం మండలాల్లో అధికంగా సాగు చేస్తారు. చాలా వరకు ఈ రెండు రకాల విత్తనాలు రైతులు తమ సొంతంగా పండించిన పంట నుంచే తయారు చేసుకుంటారు. పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంచని అధికారులు వానాకాలం సాగుకు సన్నద్ధమవుతున్న రైతులు జిల్లాలో 3.50 ఎకరాల్లో సాగు అంచనా 58 వేల మెట్రిక్ టన్నులు అవసరం వానాకాలం సీజన్లో రైతులు సాగు చేసే పంటలకు సుమారు అన్నిరకాల ఎరువులు 58 వేల మెట్రిక్ టన్నులు అవసరం అవుతాయని అంచనా. ఇందులో అత్యధికంగా యూరియా 25 వేల మెట్రిక్ టన్నులు, డీఏపీ 19 వేలు, ఎంఓపీ 2 వేలు, కాంప్లెక్స్ ఎరువులు 28 వేలు, ఎస్ఎస్పీ 615 మెట్రిక్ టన్నులు కావాలి. కాని అన్ని ఎరువులు కలిపి కేవలం 13 వేల మెట్రిక్ టన్నులు మాత్రమే ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. త్వరలోనే అందుబాటులోకి.. ప్రతిపాదన మేరకు ప్రభుత్వం నుంచి విత్తనాలు, ఎరువులు సరఫరా కాలేదు. రైతులు సాగు పనులు ప్రారంభించేలోగా అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకుంటాం. – విన్సెంట్ వినయ్, జిల్లా వ్యవసాయ అధికారి -
నేటి నుంచి ‘బడిబాట’
సమస్యల పరిష్కారానికే సదస్సులుఅదనపు కలెక్టర్ నగేష్ భక్తిమార్గంలో పయనించాలి విశ్వయోగి విశ్వంజి మహారాజ్మెదక్ కలెక్టరేట్: ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే లక్ష్యంగా శుక్రవారం నుంచి బడిబాట కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈమేరకు గురువారం కలెక్టర్ రాహుల్రాజ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈనెల 19 వరకు జిల్లాలో కొనసాగే బడిబాట కార్యక్రమంలో సమాజంలోని అందరిని భాగస్వామ్యం చేయాలని ఆదేశించారు. పంచాయతీ కార్యదర్శి, ఉపాధ్యాయుల సమన్వయంతో గ్రామసభలు నిర్వహించి తల్లిదండ్రులకు ప్రభుత్వ విద్య ప్రాముఖ్యతపై అవగాహన కల్పించాలన్నారు. అమ్మ ఆదర్శ కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు గ్రామసభలో పాలు పంచుకునేలా చూడాలన్నారు. డ్రాపౌట్ నియంత్రణ, బాలికల నమోదు శాతం పెంచాలన్నారు. ప్రతి ఇంటిని సందర్శించి పిల్లలంతా తప్పనిసరిగా ప్రభుత్వ పాఠశాలల్లో చేరేలా చూడాలని సూచించారు. కార్యక్రమంలో డీఈఓ రాధాకిషన్, అకాడమిక్ మానిటరింగ్ అధికారి సుదర్శనమూర్తి, డీఐఈఓ మాధవి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ శాఖల అధికారులు పాల్గొన్నారు. సదస్సులను సద్వినియోగం చేసుకోండి కొల్చారం(నర్సాపూర్): భూభారతి గ్రామ సభల ద్వారా వచ్చే ప్రతి దరఖాస్తును పరిశీలించి, న్యాయం చేస్తామని కలెక్టర్ రాహుల్రాజ్ అన్నారు. గురువారం మండలంలోని రంగంపేటలో జరిగిన గ్రామ సభను పరిశీలించారు. రైతులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఏళ్ల తరబడి అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరిస్తామని వారికి హామీ ఇచ్చారు. గ్రామ సదస్సుకు 70 దరఖాస్తులు రాగా, వీటిలో సాదా బైనామాలు 15 వరకు ఉన్నాయి. కొంగోడులో జరిగిన సదస్సుకు 37 దరఖాస్తులు వచ్చాయి. కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాసచారి, ఆర్ఐ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. రేగోడ్(మెదక్)/అల్లాదుర్గం: రైతుల భూ సమస్యలను పరిష్కరించేందుకే ప్రభుత్వం భూ భారతి రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తుందని అదనపు కలెక్టర్ నగేష్ అన్నారు. గురువారం మండలంలోని జగిర్యాల గ్రామంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సును సందర్శించారు. రైతులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్ దత్తరెడ్డి, ఆర్ఐ ఫెరోజ్ తదితరులు పాల్గొన్నారు. అలాగే అల్లాదుర్గం మండల పరిధిలోని సీతానగర్లో నిర్వహించిన రెవెన్యూ సదస్సును పరిశీలించారు. ఈసందర్భంగా రైతులు పలు సమస్యలను అధికారుల దృష్టి తీసుకొచ్చారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎలాంటి సమస్యలను అయినా భూ భారతిలో పరిష్కరిస్తామని తెలిపారు. కా ర్యక్రమంలో తహసీల్దార్ మల్లయ్య, ఆర్ఐ సందీప్ తదితరులు పాల్గొన్నారు.శివ్వంపేట(నర్సాపూర్): ప్రతి ఒక్కరూ భక్తిమార్గంలో నడుచుకోవాల్సిన అవసరం ఉందని గుంటూరు విశ్వ గురుపీఠం విశ్వయోగి విశ్వంజి మహారాజ్ అన్నారు. మండల పరిధిలోని గూడూర్లో నిర్మించిన శ్రీ గురుపీఠంలో దత్తా త్రేయ, సాయిబాబా విగ్రహాల ప్రతిష్ఠ మహోత్సవం గురువారం ముగిసింది. అఖరి రోజు విశ్వయోగి విశ్వంజి మహారాజ్ ఆధ్వర్యంలో దేవతామూర్తుల విగ్రహాల ప్రతిష్ఠ, యంత్ర స్థాపనలు, మహా పూర్ణాహుతి నిర్వహించారు. ఆగమ శాస్త్ర పండితుడు పుల్లెటి కుర్తి గణపతిశర్మ, వేద పండితుడు శాస్త్రుల వామనశర్మ పూజా కార్యక్రమాలు చేపట్టారు. విగ్రహాల ప్రతిష్ఠ మహోత్సవంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు వేణుగోపాల్రావు, మాజీ సీఎంఓ కార్యదర్శి నర్సింగరావు, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్ పర్సన్ సుహాసినిరెడ్డి, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి, డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్, ఆర్డీఓ మహిపాల్, తహసీల్దార్ కమలాద్రి, వివిధ పార్టీలకు చెందిన నాయకులు, భక్తులు పాల్గొన్నారు. -
భూ భారతితో సమస్యలు పరిష్కారం
అదనపు కలెక్టర్ నగేష్ వెల్దుర్తి(తూప్రాన్)/చేగుంట: అపరిష్కృతంగా ఉన్న భూ సమస్యల పరిష్కారం కోసమే ప్రభుత్వం గ్రామాల్లో భూ భారతి రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేసిందని అదనపు కలెక్టర్ నగేష్ అన్నారు. ఈ మేరకు మాసాయిపేట మండలం రామంతాపూర్ పంచాయతీ పరిధి లింగారెడ్డిపల్లిలో ఏర్పాటు చేసిన రెవెన్యూ సదస్సును పరిశీలించారు. రైతుల నుంచి స్వీకరించిన దరఖాస్తులను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. అనంతరం చేగుంట మండలంలోని వల్లభాపూర్లో పర్యటించారు. ప్రభుత్వ భూముల కొనుగోలు, అమ్మకాలకు సంబంధించిన దరఖాస్తులను గ్రామస్తులు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ భూములు అమ్మడం, కొనడం నిషేధం అన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీకాంత్, డిప్యూటీ తహసీల్దార్ స్వప్న, ప్రత్యేక అధికారి భూమేష్ రైతులు పాలొన్నారు. -
గిరిజనులకు వాహనాలు
● మత్స్యశాఖ ఆధ్వర్యంలో పంపిణీ ●● జిల్లాలో 15 తండాల ఎంపిక ● 90 శాతం సబ్సిడీపైఅందించేందుకు చర్యలు మెదక్ కలెక్టరేట్: కేంద్ర ప్రభుత్వం మత్స్యశాఖ ఆధ్వర్యంలో గిరిజనుల అభివృద్ధికి ధర్తీ ఆబా జన జాతీయ గ్రామ్ ఉత్కర్ష్ పథకానికి శ్రీకారం చుట్టింది. ఈ పథకం కింద మారుమూల తండాలలో నివసిస్తున్న నిరుపేద గిరిజనులను గుర్తించి వారిని ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసింది. గిరిజనులు మత్స్యకారుల మాదిరిగా తండాల్లో చేపలు పెంపకానికి ప్రోత్సాహం అందించే ఏర్పాట్లు చేస్తుంది. అలాగే వాటిని విక్రయించుకునేందుకు విక్రయ కేంద్రాలు, ఇతర ప్రాంతాలకు చేపలను తరలించేందుకు ద్విచక్ర వాహనాలు, ఆటో లను 90 శాతం సబ్సిడీపై అందిస్తుంది. ఈ పథకం కింద జిల్లావ్యాప్తంగా 9 మండలాల నుంచి 15 గిరిజన తండాలను ఎంపిక చేశారు. ఈ తండాలకు చెందిన గిరిజన ప్రజలు వారి ఆసక్తికనుగుణంగా దర ఖాస్తు చేసుకుంటే అవసరమైన వాహనాలు అందించడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. వసతులు కరువు జిల్లాలోని ఎంపిక తండాల్లో ఎక్కడా చేపల చెరువుల ఏర్పాటుకు అవకాశం లేదు. చేపల చెరువులు ఉండాలంటే వర్షాధారంగా నదులు, వాగులు, కాల్వల ద్వారా నీటి సరఫరా జరగాలి. అలాంటి అవకాశం లేకపోవడంతో తండాల్లో చెరువుల ఏర్పాటును ప్రభుత్వం వ్యతిరేకిస్తుంది. గిరిజనులు స్వయం ఉపాధితో ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి మత్స్యశాఖకు చెందిన వాహనాలు మాత్రమే అందిస్తున్నారు. ప్రస్తుతం దరఖాస్తులు మాత్రమే స్వీకరిస్తున్నారు. ఈ తండాల్లోని గిరిజనులు దరఖాస్తులు చేసుకునేలా చర్యలు చేపట్టాలని మత్స్యశాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అలాగే సంబంధిత గ్రామాల కార్యదర్శులకు బాధ్యతలను అప్పగించారు. వాహనాలు చేపలను శీతలీకరించిన వాహనాలు, ఇన్సులేటెడ్ వాహనాలు, ఐస్బాక్స్తో కూడిన మోటార్ సైకిల్, ఐస్ బాక్స్లతో కూడిన సైకిల్, చేపల అమ్మకం కోసం ఈ– రిక్షాలు, సహా ఐస్బాక్స్తో కూడిన త్రిచక్ర వాహనాలు, ప్రత్యక్ష చేపల విక్రయ కేంద్రాలు, రోజుకు 2 టన్నుల ఉత్పత్తి సామర్థ్యం గల చేపల మిల్లులు, అక్వేరియం, అలంకార చేపల కియోస్క్లతో సహా చేపల కియోస్క్ల నిర్మాణం, సాంప్రదాయ మత్స్యకారులకు పడవలు, వలలు అందించడం, ఫిష్ వాల్యూయాడ్ ఎంటర్ప్రైజెస్ యూనిట్లు ఏర్పాటుకు అవకాశం కల్పిస్తుంది. -
ప్రతి దరఖాస్తును పరిశీలిస్తాం
విధుల్లో నైతిక విలువలు పాటించాలి ● భూ భారతితో న్యాయం చేస్తాం ● కలెక్టర్ రాహుల్రాజ్ చిన్నశంకరంపేట(మెదక్)/మెదక్ కలెక్టరేట్: భూ భారతి గ్రామ సభల్లో వచ్చిన ప్రతి దరఖాస్తును పరిశీలించి రైతులకు న్యాయం చేస్తామని కలెక్టర్ రాహుల్రాజ్ అన్నారు. బుధవారం మండలంలోని కొర్విపల్లిలో నిర్వహించిన భూ భారతి గ్రామసభను పరిశీలించారు. రైతులు అందించిన దరఖాస్తులను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. గ్రామ సభలను సద్వినియోగం చేసుకోవాలని.. కలెక్టరేట్కు ఎవరూ రావొద్దని సూచించారు. అనంతరం గవ్వలపల్లిలోని విత్తన దుకాణాన్ని పరిశీలించా రు. రైతులకు నాణ్యమైన విత్తనాలను మాత్రమే అందించాలని డీలర్కు సూచించారు. అలాగే చిన్నశంకరంపేటలోని స్టీల్ అండ్ సిమెంట్ దుకాణాన్ని తనిఖీ చేసి ధరల వివరాలను తెలుసుకున్నారు. సిమెంట్ను ఎక్కు ధరను అమ్ముతున్నట్లు గుర్తించారు. స్టీల్, సిమెంట్ను అధిక ధరలకు అమ్మవద్దని హెచ్చరించారు. అలాగే రేషన్ దుకాణాన్ని పరిశీలించి సన్న బియ్యం పంపిణీలో ఎదురవుతున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.ఆయన వెంట తహసీల్దార్ మన్నన్ ఉన్నారు. అలాగే మెదక్ జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యా ర్డులో ప్యాడీ క్లీనర్ యంత్రాలను ప్రారంభించా రు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వచ్చే సీజన్ నుంచి ఈ యంత్రాలు అందుబాటులో ఉంచుతామన్నారు. ఇన్చార్జి ఎస్పీ రాజేష్చంద్ర ఎస్ఐ విధులకు ఆటంకంకలిగించిన కానిస్టేబుల్పై వేటు మెదక్ మున్సిపాలిటీ: పోలీసులు విధుల్లో నైతిక విలువలు పాటించాలని ఇన్చార్జి ఎస్పీ రాజేష్ చంద్ర అన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. మెదక్ మ ండలం తిమ్మక్కపల్లి సమీపంలో రెండు టిప్పర్ల ద్వారా అక్రమంగా ఇసుక రవాణా జరుగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం మేరకు అక్కడికి వెళ్లిన మెదక్ రూరల్ ఎస్ఐ మురళి విధులకు కొల్చారం పోలీస్స్టేషన్కు చెందిన కానిస్టేబుల్ రాజ్కుమార్ అడ్డుపడటమే కాకుండా అక్రమ ఇసుక రవాణాదారులకు మద్దతుగా వ్యవహరించాడని.. ఈమేరకు అతడిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు చెప్పారు. అలాగే పశువుల అక్రమ రవాణా నియంత్రణకు జిల్లాలో నిరంతర పర్యవేక్షణ ఏర్పాటు చేశా మన్నారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాట్లు చేశామన్నారు. -
వైభవంగా విగ్రహ ప్రతిష్ఠాపన
శివ్వంపేట(నర్సాపూర్): మండల పరిధిలోని గూడూర్లో నిర్మించిన శ్రీ గురుపీఠంలో దేవతామూర్తులు విగ్రహాల ప్రతిష్ఠాపన మహోత్సవాన్ని బుధవారం వైభవంగా నిర్వహించారు. రెండో రోజు వాస్తుపూజ, హోమం, లక్ష గోధారణ, క్షీరాధివాసం, మంత్ర పుష్పం తదితర పూజా కార్యక్రమాలు చేపట్టారు. నేడు, రేపు కూడా పూజా కార్యక్రమాలు కొనసాగుతాయని ట్రస్ట్ సభ్యులు తెలిపారు. విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవానికి ఎమ్మెల్యేలు హరీశ్రావు, సునీతారెడ్డి, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, రాష్ట్ర నాయకులు ప్రతాప్రెడ్డి, దేవేందర్రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రమణగౌడ్, నాయకులు తదితరులు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. -
రైతు మహోత్సవానికి రారండీ..
రేపటి నుంచి హుస్నాబాద్లో కిసాన్ మేళా● వ్యవసాయ మార్కెట్ యార్డులో భారీ ఏర్పాట్లు ● ఆధునిక వ్యవసాయ పరికరాలు, విత్తనాలపై అవగాహన ● మేళాను ప్రారంభించనున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ● హాజరు కానున్న మంత్రులు పొన్నం, ఉత్తమ్, పొంగులేటి, కొండా సురేఖ ● వేలాదిగా తరలిరానున్న రైతులుహుస్నాబాద్: రైతు మహోత్సవం సందర్భంగా కిసాన్ మేళాను హుస్నాబాద్ పట్టణంలో పెద్ద ఎత్తు న నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేశారు. ఈ నెల 6, 7, 8వ తేదీల్లో వ్యవసాయ మార్కెట్ యార్డులో మేళా నిర్వహించనున్నారు. వివిధ రకాల వ్య వసాయ యంత్రాలపై అవగాహన కోసం స్టాళ్లను ఏర్పాటు చేశారు. మొదటి రోజు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్లు కలిసి మేళాను ప్రారంభించనున్నారు. వీరితో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్చార్జి మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి, మెదక్ ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి కొండా సురేఖ, ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డిలు హాజరుకానున్నారు. 108 స్టాళ్లు.. కిసాన్ మేళాలో వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్ధక, మత్స్య శాఖ విభాగాలు, బ్యాంకులు, ఎఫ్పీఓలు, స్టార్టప్ కంపెనీలు, వ్యవసాయ అనుబంధ రంగాల ప్రైవేట్ కంపెనీలకు సంబంధించిన 108 స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నారు. కార్యక్రమంలో ఆధునిక వ్యవసాయ పరికరాలు, డ్రోన్లు, రోబొటిక్ యంత్రాలు, సేంద్రియ ఎరువులు, ఫెస్టిసైడ్, హార్టికల్చర్, సెరికల్చర్, ఆయిల్పామ్, వివిధ రకాల పంటల విత్తనాలను ప్రదర్శిస్తారు. కొత్త పద్ధతులు, సాగు ఖర్చు తగ్గించే విధానాలు, వివిధ పంటలల్లో అధిక దిగుబడులకు పాటించాల్సిన మెలకువలపై వ్యవసాయ శాస్త్రవేత్తలు అవగాహన కల్పిస్తారు. అలాగే అభ్యుదయ రైతుల సక్సెస్ స్టోరీలను వివరించనున్నారు. 10వేల మంది రైతుల తరలింపు కిసాన్ మేళా కార్యక్రమానికి జిల్లా నుంచి 10 వేల మంది రైతులను తరలించనున్నట్లు అధికారులు తెలిపారు. 6న హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి, 7న సిద్దిపేట, చేర్యాల డివిజన్ల నుంచి, 8న దుబ్బాక, గజ్వేల్, ములుగు డివిజన్ల నుంచి రైతులను కిసాన్ మేళాకు తరలించనున్నట్లు వ్యవసాయ అధికారులు తెలిపారు. సద్వినియోగం చేసుకోండి మూడు రోజుల పాటు జరిగే కిసాన్ మేళా కార్యక్రమాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలి. వివిధ రకాల విత్తనాలు, ఆధునిక పరికరాల ప్రదర్శన ఉంటుంది. రోజూ వివిధ శాఖల అధికారులతో వర్క్షాపుతోపాటు శాస్త్రవేత్తల ద్వారా ముఖాముఖి నిర్వహిస్తున్నాం. ఆధునిక పద్ధతులపై అవగాహన కల్పిస్తాం. రైతులను తరలించడానికి ప్రత్యేక రవాణా సౌకర్యం కల్పించాం. – రాధిక, జిల్లా వ్యవసాయ అధికారి -
మానవ అక్రమ రవాణా నేరం
మెదక్ కలెక్టరేట్: మానవ అక్రమ రవాణా అతిపెద్ద నేరమని డీఈఓ రాధాకిషన్ అన్నారు. బుధవారం మెదక్ ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో మనుషుల అక్రమ రవాణాను అరికట్టే అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి డీఈఓ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామంటూ మహిళలను కిడ్నాప్ చేసి అక్రమ రవాణాకు పాల్పడుతున్నట్లు ఆరోపణలున్నాయని తెలిపారు. ఈ విషయంలో ప్రతి మహిళ అప్రమత్తంగా ఉండాలని, తోటి మహిళలను సైతం అక్రమ రవాణాపై అవగాహన కల్పించాలన్నారు. హైదరాబాద్కు చెందిన ప్రజ్వల స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో కొనసాగిన ఈ కార్యక్రమంలో మహిళలకు లఘు చిత్రం ద్వారా అవగాహన కల్పించారు. అనంతరం స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ.. మొబైల్, ఇంటర్నెట్ ద్వారానే అధికంగా ట్రాఫికింగ్కు గురవుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో రిసోర్స్ పర్సన్లు, జిల్లాలోని పలు పాఠశాలలకు చెందిన 58 మంది ఉపాధ్యాయులు పాల్గొన్నారు. డీఈఓ రాధాకిషన్ -
మెదక్ ఎస్పీగా డీవీ శ్రీనివాసరావు
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: మెదక్ జిల్లా ఎస్పీగా డీవీ శ్రీనివాసరావు నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీగా పనిచేస్తున్న శ్రీనివాసరావును మెదక్కు బదిలీ చేశారు. రాష్ట్రంలో ఏడుగురు పోలీసు ఉన్నతాధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. శ్రీనివాసరావు 2013 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన అధికారి. మెదక్ ఎస్పీగా పనిచేసిన ఉదయ్కుమార్రెడ్డి ఇటీవల పదవీ విరమణ చేసిన సంగతి తెలిసిందే. కాగా, ఒకటి రెండు రోజుల్లో డీవీ శ్రీనివాసరావు బాధ్యతలు స్వీకరించే అవకాశాలు ఉన్నాయి.ప్రభుత్వ బడుల్లోనే నాణ్యమైన విద్య టేక్మాల్(మెదక్): ప్రభుత్వ బడుల్లోనే నాణ్యమైన విద్యా బోధన అందుతుందని, ప్రభుత్వ బడులను రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు పద్మారావు అన్నారు. బుధవారం మండలంలోని పలు గ్రామాల్లో బడిబాట ప్రచార జాత కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రైవేట్ పాఠశాలల్లో అధిక ఫీజులతో నిరుపేద కుటుంబాలు ఆర్థికంగా నష్టపోతున్నాయన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుతుందని, తల్లిదండ్రులందరూ పిల్లలను చేర్పించాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వంలో విద్యార్థుల పెంపునకు సహకరించాలని కోరారు. గంజాయి విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్ మనోహరాబాద్(తూప్రాన్): గంజాయి విక్రయిస్తున్నారనే విశ్వసనీయ సమాచారంతో ఒకరిని అరెస్ట్ చేసినట్లు నర్సాపూర్ ఎకై ్సజ్ అధికారులు బుధవారం తెలిపారు. ఈసందర్భంగా ఎకై ్సజ్ ఇన్స్పెక్టర్ గులాం ముస్తాఫా మాట్లాడుతూ.. మండలంలోని ముప్పిరెడ్డిపల్లిలో బీహార్కు చెందిన ఆదియ రాజు నివాసముంటున్నాడు. కాగా అతడు గంజాయి అమ్ముతున్నాడనే సమాచారం మేరకు దాడి చేయగా అతని వద్ద నుంచి 221 గ్రాముల ఎండు గంజాయి లభించిందన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు చెప్పారు. కూలీలకు గిట్టుబాటు అయ్యేలా చూడండి కౌడిపల్లి(నర్సాపూర్): కూలీలకు గిట్టుబాటు అయ్యే విధంగా కొలతల ప్రకారం ఉపాధి పనులు చేయాలని డీఆర్డీఓ శ్రీనివాస్ సిబ్బందికి సూచించారు. బుధవారం మండలంలోని మహమ్మద్నగర్లో ఉపాధి హామీ పనులను పరిశీలించారు. ఈసందర్భంగా కూలీల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గిట్టుబాటు కూలీ రూ. 300 వచ్చేలా ఫీల్డ్ అసిస్టెంట్ ఇచ్చిన కొలతల ప్రకారం పనులు చేయాలన్నారు. పని జరిగే చోట ఆన్లైన్లో హాజరు నమోదు చేయాలని ఆదేశించారు. రైతులకు ప్రభుత్వం ఉచితంగా పాంపండ్స్ నిర్మిస్తుందని తెలిపారు. కూలీలకు పనులు కల్పించడంలో నిర్లక్ష్యం వహించొద్దన్నారు. భూ సమస్యల పరిష్కారానికి చర్యలు తూప్రాన్: భూ భారతి ద్వారా ఎన్నో ఏళ్లుగా పరిష్కారం కాని భూ సమస్యలు పరిష్కారం అవుతాయని ఆర్డీఓ జయచంద్రారెడ్డి పేర్కొన్నారు. మండలంలోని వట్టూరు పడాలపల్లి గ్రామాల్లో బుధవారం నిర్వహించిన రెవెన్యూ సదస్సులను పర్యవేక్షించారు. ఈ గ్రామాల్లో 67 దరఖాస్తులు వచ్చాయన్నారు. ఇందులో ఎక్కువగా సాదా బైనామాలు ఉన్నాయని వివరించారు. ప్రతి ఒక్కరూ తమ సమస్యను రెవెన్యూ సదస్సు ద్వారా దరఖాస్తు చేసుకుంటే, వివిధ స్థాయిలలో పరిష్కారం అవుతాయని తెలిపారు. -
ప్రభుత్వంపై నమ్మకంతో సమ్మె విరమించాం
టీఎంయూ రాష్ట్ర నాయకుడు అశ్వత్థామరెడ్డి పాపన్నపేట(మెదక్): ప్రభుత్వంపై నమ్మకంతోనే ఆర్టీసీలో తలపెట్టిన సమ్మెను విరమించామని టీఎంయూ రాష్ట్ర నాయకుడు అశ్వత్థామరెడ్డి తెలిపారు. ఏడుపాయల్లో మంగళవారం జరిగిన ఆర్టీసీ కార్మికుల ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ...ఆర్టీసీ కార్మికులు అనేక సమస్యలతో సతమవుతున్నారని చెప్పారు. వీటి పరిష్కారం కోసం అనేక సార్లు ప్రభుత్వానికి విన్నవించుకున్నా, ఫలితం లేకుండా పోయిందన్నారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో సమ్మెకు సిద్ధమయ్యామని చెప్పారు. అయితే ప్రభుత్వం ఇచ్చిన హమీ మేరకు సమ్మె విరమించుకున్నామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తమ డిమాండ్లు నెరవేర్చాలని కోరారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు ఎంఆర్కే రావు, శాఖన్న, అశ్వక్, వెంకన్న, నర్సింహులు, ముత్యం,హన్మయ్య, క్రిష్ణారెడ్డి పాల్గొన్నారు. -
ఇక గ్రామాలే విత్తన బ్యాంకులు
నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డినారాయణఖేడ్: రైతుల సంక్షేమమే ప్రధానంగా ప్రభుత్వం కృషి చేస్తోందని, ఇక నుంచి గ్రామాలే విత్తన బ్యాంకులుగా పనిచేస్తాయని ఎమ్మెల్యే సంజీవరెడ్డి పేర్కొన్నారు. ఖేడ్ మండలం జూకల్ శివారులోని రైతువేదికలో మంగళవారం అభ్యుదయ రైతులకు నాణ్యమైన విత్తన బస్తాలను ఆయన పంపిణీ చేశారు. అంతకుముందు ఝరాసంగం ఆలయకమిటీ నూతన బోర్డుసభ్యులుగా నియమితులైన ఈశ్వరప్పను ఖేడ్లో ఎమ్మెల్యే సంజీవరెడ్డి, డీసీసీ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్రెడ్డి సన్మానించారు. అనంతరం బాణాపూర్ గ్రామంలో భూభారతిపై నిర్వహించిన అవగాహన సదస్సులో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంజీవరెడ్డి మాట్లాడుతూ... గతప్రభుత్వం విత్తనాలు, వ్యవసాయ పనిముట్లపై రాయితీని ఎత్తివేసి రైతులపై భారం మోపిందన్నారు. ప్రస్తుత ప్రజాపాలన ప్రభుత్వం నాణ్యమైన విత్తనాలను పంపిణీ చేసి గ్రామస్థాయిల్లోనే విత్తన బ్యాంకులు ఏర్పాటు జరిగేలా శ్రీకారం చుట్టిందన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ధరణి పేరిట లక్షలాదిమంది రైతులకు తీవ్ర అన్యాయం చేసిందని ఆరోపింఆరు. అన్యాయాన్ని సరిద్దిడానికి భూ భారతి చట్టం తీసుకువచ్చి రైతుల భూసమస్యలను పరిష్కరించడానికి తమ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. పేదలకు సొంతింటి కల నెరవేర్చేందకు పక్కా ఇండ్లను మంజూరు చేస్తుందని తెలిపారు. అనంతరం బాణాపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు భూమిపూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఏడీఏ నూతన్ కుమార్, ఏవో శంకర్, నాయకులు రమేశ్చౌహన్, తాహెర్ అలీ, పండరీరెడ్డి, శంకర్ ముదిరాజ్, నెహ్రూనాయక్, ఏఈఓలు తదితరులు పాల్గొన్నారు. -
బియ్యం కోసం బారులు
ప్రభుత్వం మూడు నెలల రేషన్ బియ్యం ఒకేసారి ఇస్తుండటంతో సంగారెడ్డిలో బియ్యం తీసుకోవడానికి జనం బారులు తీరారు. తమవంతు ఎప్పుడు వస్తుందోనని గంటల తరబడి క్యూలో వేచి ఉంటున్నారు. బియ్యం తీసుకోవడానికి వచ్చినవారు మూడుసార్లు వేలిముద్ర ఇవ్వాల్సి రావడంతో రోజంతా నిరీక్షించాల్సి వస్తోందని వాపోతున్నారు. మధ్యాహ్నం సమయంలో ఎండవేడి, ఉక్కపోత భరించలేక చిన్న పిల్లల తల్లులు, వృద్ధులు ఇబ్బందులు పడ్డారు. కొన్నిచోట్ల బియ్యం త్వరగా తీసుకోవాలనే ఆతృతలో ‘‘నేను ముందు వచ్చాను అంటే నేను ముందు వచ్చాను’’అని కొట్లాడుకున్నారు. కొన్ని రేషన్ దుకాణాల వద్ద మంగళవారం కనిపించిన దృశ్యాలను ‘సాక్షి’క్లిక్మనిపించింది. –సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్ , సంగారెడ్డి -
అర్హులందరికీ సంక్షేమ ఫలాలు
సంగారెడ్డి జోన్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేసే సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతీ ఒక్కరికి అందేవిధంగా చూడాలని మంత్రి దామోదర రాజనర్సింహ స్పష్టం చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలపై వివిధ శాఖల అధికారులతో మంగళ వారం జిల్లా పరిషత్తు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడు తూ..ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా చేపట్టాలన్నారు. రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గ్రామాలు ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు రహదారులు ముఖ్యం అని, రహదారులు అనుసంధానం చేస్తే విద్య ఉపాధి మార్గాలు పెరుగుతాయని చెప్పారు. ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలలో మందులు నిల్వ ఉంచాలని సూచించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల్లో ఇసుక కొరత లేదని తేల్చి చెప్పారు. సమీక్షలో అదనపు కలెక్టరు చంద్రశేఖర్, మాధురి, జెడ్పీసీఈఓ జానకి రెడ్డి పాల్గొన్నారు. మంత్రి దామోదర రాజనర్సింహ సంక్షేమ పథకాలపై అధికారులతో సమీక్ష -
భూ భారతితో శాశ్వత పరిష్కారం..
టేక్మాల్(మెదక్)/మెదక్ కలెక్టరేట్: భూ భారతితోనే భూ సమస్యల పరిష్కారమవుతాయని కలెక్టర్ రాహుల్రాజ్ పేర్కొన్నారు. మంగళవారం టేక్మాల్ మండలం షాబాద్ తాండలో నిర్వహించిన భూ భారతి రెవెన్యూ సదస్సులో ఆయన పాల్గొన్నారు. ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులను స్వీకరించి ప్రజల భూములకు సంబంధించిన సమస్యలను కలెక్టర్ స్వయంగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టరేట్లో జిల్లా ఇన్చార్జి ఎస్పీ రాజేశ్చంద్ర, అదనపు కలెక్టర్ నగేశ్లతో కలిసి కలెక్టర్ రాహుల్రాజ్ శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. భూ భారతి అమలుకు చిలప్చేడ్ మండలాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి అన్ని గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించి ప్రజల నుంచి దరఖాస్తులను తీసుకుమన్నారు. ఈ నెల 20వ తేదీ వరకు అన్ని గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామని తెలిపారు. మొదటిరోజు జిల్లావ్యాప్తంగా 31 గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించగా 929 దరఖాస్తులు వచ్చాయని చెప్పారు. వీటిని క్షేత్రస్థాయిలో విచారణ నిర్వహించి తదుపరి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. శాంతియుతంగా బక్రీద్... ప్రజలు మత సామరస్యంతో శాంతియుత వాతావరణంలో బక్రీద్ను జరుపుకోవాలని, సామాజిక మాధ్యమాల్లో వచ్చే వార్తల పట్ల అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ రాహుల్రాజ్ సూచించారు. ఏదైనా చిన్న సమస్య తలెత్తినా వెంటనే పోలీసులకు, అధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తులు ఏ వర్గానికి చెందిన వారైనా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అవసరమైతే పీడీ యాక్ట్ కూడా ప్రయోగిస్తామని తెలిపారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ మహేందర్, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి వెంకటయ్య, డీఎస్పీ ప్రసన్నకుమార్, జెడ్పీసీఈఓ ఎల్లయ్య, డీపీఓ యాదయ్య, మున్సిపల్ కమిషనర్, పశుసంవర్ధక శాఖ సిబ్బంది, పోలీస్ యంత్రాంగం, రవాణాశాఖ అధికారులు, మత పెద్దలు తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ రాహుల్రాజ్ ఈ నెల 20 వరకు రెవెన్యూ సదస్సులు షాబాద్ తాండ రెవెన్యూ సదస్సును పరిశీలించిన కలెక్టర్ జిల్లా వ్యాప్తంగా 929 దరఖాస్తులు -
చెరువు కట్టలు భద్రమేనా?
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి : వర్షాకాలంలో చెరువులు, కుంటల నిర్వహణపై నీటిపారుదల శాఖ దృష్టి సారించింది. భారీ వర్షాలతో వరద నీరు వచ్చి కట్టలు తెగిపోవడం, బుంగలు పడటం, కాలువలు ధ్వంసం కావడం వంటి జరిగే అవకాశాలుండటంతో ఆ శాఖ అప్రమత్తమైంది. గతేడాది వర్షాకాలంలో 75 శాతానికి మించి నిండిన చెరువులు, అలుగులు పారిన చెరువుల పరిస్థితిపై ఆరా తీస్తోంది. ఈ చెరువుల కట్టలు ఎక్కడైనా బలహీనంగా ఉన్నాయా? తూములు మరమ్మతులు అవసరం ఉంటాయా? అలుగుల పరిస్థితి ఎలా ఉంది? 75 శాతానికి మించి నీళ్లు చేరితే కట్టలు తెగే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అనేది పరిశీలించాలని క్షేత్రస్థాయి అధికారులను ఆదేశించింది. ఆయా మండలాల ఏఈఈలు, డీప్యూటీఈఈలు ఈ చెరువులను వెంటనే పరిశీలించాలని ఆదేశాలు వెళ్లాయి. ఎక్కడైనా బుంగలు పడితే తక్షణం మరమ్మతులు చేపట్టేందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. 75%కు మించి నిండిన చెరువులు 748 నీటిపారుదలశాఖ గణాంకాల ప్రకారం జిల్లాలో 1,769 చెరువులున్నాయి. ఇందులో 100 ఎకరాల లోపు ఆయకట్టు ఉన్న చిన్న చెరువులతోపాటు, వంద ఎకరాలకు మించి ఆయకట్టున్న చెరువులు కూడా ఉన్నాయి. గతేడాది వర్షాలు విస్తారంగా కురవడంతో సెప్టెంబర్లోనే సుమారు 748 చెరువులు నిండాయి. ఇందులో 218 చెరువులు అలుగు పారగా, 75 శాతానికి మించి నిండిన చెరువులు 530 వరకు ఉంటాయి. ఇలా 75% నిండిన చెరువుల్లోకి ఈ వర్షాకాలంలో కూడా వరదనీరు వచ్చి చేరే అవకాశాలుండటంతో ఈ చెరువులపై ఈ శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఎక్కడైనా చెరువుల కట్టలు ధ్వంసమైతే తక్షణం మరమ్మతులు చేసేందుకు అవసరమైన ప్రతిపాదనలు పంపాలని క్షేత్ర స్థాయి అధికారులను ఆ శాఖ ఆదేశించింది. అలాగే అలుగులు, తూములను మరమ్మతులు చేయాలని సూచించారు. వర్షాకాలంలో తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై నీటిపారుదలశాఖ అధికారులతో కలెక్టర్ వల్లూరు క్రాంతి ఇటీవల సమీక్ష నిర్వహించారు. ఈ మేరకు కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని ఆదేశించారు. నదీ పరీవాహక ప్రాంతాల్లో.. జిల్లాలో నదీ పరీవాహక ప్రాంతాల్లో గతంలో ఎప్పుడైనా ముంపునకు గురైతే ఆ ప్రాంతాల్లో ముందస్తుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దృష్టి సారించాలని అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. జిల్లాలో ప్రధానంగా మంజీర, నక్కవాగు వంటివి ఉన్నప్పటికీ..ఈ పరీవాహక ప్రాంతాల్లో ముంపు ముప్పు పెద్దగా ఉండదు. వర్షాకాలం నేపథ్యంలో నీటిపారుదలశాఖ అప్రమత్తం మరమ్మతులు చేపట్టాలి క్షేత్రస్థాయి అధికారులకు ఆదేశాలు -
హామీల అమలులో ప్రభుత్వం విఫలం
నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి హత్నూర(సంగారెడ్డి): ఎన్నికల హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఎమ్మెల్యే సునీతారెడ్డి విమర్శించారు. హత్నూర మండలం దౌల్తాబాద్ చౌరస్తాలో మంగళవారం కార్యకర్తలు ఏర్పాటు చేసిన మాజీమంత్రి హరీశ్రావు జన్మదిన వేడుకలను ఎమ్మెల్యే కేక్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సునీతారెడ్డి మాట్లాడుతూ...హరీశ్రావు నిత్యం ప్రజల సంక్షేమం కోసం పనిచేసే నాయకుడన్నారు. కాంగ్రెస్ నాయకులు ప్రజా సంక్షేమాన్ని విస్మరించి పరిపాలన కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. ఆరు గ్యారంటీల అమలులో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకత్వంపై విమర్శించడం తప్ప కాంగ్రెస్ నాయకులకు పనేమీ లేదని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం పాటుపడాలని భూభారతి ద్వారా భూ సమస్యలను వెంటనే 100% పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రామచంద్రారెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ దామోదర్రెడ్డి, మాజీ ఎంపీపీ నర్సింహులు, నాయకులు రవికుమార్, నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. పీఏసీఎస్ డైరెక్టర్ కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే హత్నూర మండలం గుండ్ల మాచనూర్ పీఏసీఎస్ డైరెక్టర్ బేగరి సాయిలు ఇటీవల మరణించడంతో వారి కుటుంబాన్ని సునీతారెడ్డి పరామర్శించి ఓదార్చారు. మండల కేంద్రంమైన హత్నూరలోని మాజీ జెడ్పీటీసీ ఆశయ్య అనే గ్రామపంచాయతీ కార్మికుడు గుండెపోటుతో ఇటీవల మరణించడంతో వారి కుటుంబాన్ని కూడా ఎమ్మెల్యే పరామర్శించి ఓదార్చారు. -
మావన అక్రమ రవాణాను అరికట్టాలి
మెదక్ కలెక్టరేట్: మనుషుల అక్రమ రవాణాను నిరోధించడం ప్రతీ ఒక్కరి బాధ్యతని విద్యాశాఖ అకడమిక్ మానిటరింగ్ అధికారి సుదర్శనమూర్తి పేర్కొన్నారు. మెదక్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో మంగళవారం స్వచ్ఛంద సంస్థ ప్రజ్జ్వల, విద్యా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మనుషుల అక్రమ రవాణాను అరికట్టే అంశంపై అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ అక్రమ రవాణా ప్రపంచంలోనే అతి పెద్ద నేరంగా ఉన్నట్లు చెప్పారు. ప్రతి రోజు ఎంతో మంది అమ్మాయిలు, మహిళలు అక్రమరవాణాకు బలైపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఉద్యోగం, సినిమా అవకాశాల ద్వారా మోసం చేసి విదేశాలకు అమ్ముతున్నట్లు తెలిపారు. ప్రతీ మహిళ తమ పరిధిలో ఉన్న వారికి అవగాహన కల్పించి రక్షించాలని చెప్పారు. ప్రజ్వల ఎన్జీఓ సంస్థ సీనియర్ ప్రాజెక్ట్ మేనేజర్ చంద్రయ్య మాట్లాడుతూ.. సీ్త్ర శిశు సంక్షేమ, పోలీస్, విద్యా, న్యాయ శాఖల సమన్వయంతో ఇప్పటివరకు 29,200 మంది మహిళలను కాపాడి పునరావాసం కల్పించినట్లు తెలిపారు. విపత్కర పరిస్థితుల్లో టోల్ ఫ్రీ నంబర్ 1930ను సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో ప్రజ్జ్వల సంస్థ ప్రతినిధులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అత్యధికంగా మహిళలే బాధితులు విద్యాశాఖ ఏఎంఓ సుదర్శనమూర్తి -
సదస్సులను సద్వినియోగం చేసుకోవాలి
అదనపు కలెక్టర్ నగేశ్ నర్సాపూర్ రూరల్/పాపన్నపేట(మెదక్)/హవే ళిఘనపూర్(మెదక్): భూ సమస్యలున్న ప్రతీ ఒక్కరు భూ భారతి రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని అదనపు కలెక్టర్ నగేశ్ సూచించారు. మండలంలోని మంతూర్, గొల్లపల్లి, పాపన్నపేట మండలం ముద్దాపూర్ , మెదక్ మండలం పేరూర్ గ్రామాల్లో మంగళవారం నిర్వహించిన భూభారతి రెవెన్యూ సదస్సులలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎవరికై నా భూ సమస్యలు ఉండే రెవెన్యూ సదస్సులో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం భూ సమస్యలతో ఇబ్బందులు పడుతున్న వారి కోసమే ఈ సదస్సులు ఏర్పాటు చేసిందని తెలిపారు. రైతులు తమ భూములకు సంబంధించి ఇచ్చిన ఫిర్యాదులపై తహసీల్దార్ విచారణ జరిపి,తగిన చర్యలు తీసుకుంటారని చెప్పారు. అక్కడ పరిష్కారం లభించక పోతే ఆర్డీఓకు, ఆపై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేయవచ్చన్నారు. మంతూర్లో 57, గొల్లపల్లిలో 47, ముద్దాపూర్, కొంపల్లి గ్రామాల్లో 68 భూ సమస్యలకు సంబంధించి దరఖాస్తులను అధికారులు స్వీకరించారు. -
శాంతియుతంగా పండగలు జరుపుకోవాలి
తూప్రాన్: కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ శాంతియుత వాతావరణంలో పండగలు జరుపుకోవాలని డీఎస్పీ నరేందర్గౌడ్ అన్నారు. సోమవారం పట్టణంలోని లింగారెడ్డి గార్డెన్లో తూప్రాన్ పోలీస్ సర్కిల్ పరిధిలోని శివ్వంపేట, మనోహరాబాద్, వెల్దుర్తి, తూప్రాన్ పోలీస్స్టేషన్ల పరిధిలోని ప్రముఖులతో పీస్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్నిమతాలకు చెందిన పండగలను గౌరవించాలని సూచించారు. సోదరభావంతో కులమతాలకు అతీతంగా కలిసి మెలిసి ఉండాలని తెలిపారు. అలాగే సోషల్ మీడియాలో వచ్చే విషయాలను నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో సీఐ రంగాకృష్ణ, ఎస్ఐలు, ప్రజలు పాల్గొన్నారు. కలెక్టరేట్లో మిల్లెట్ క్యాంటీన్ మెదక్ కలెక్టరేట్: కలెక్టరేట్లో సోమవారం ఇందిరా మహిళా శక్తి ఆధ్వర్యంలో మిల్లెట్ క్యాంటీన్ ఏర్పాటు చేశారు. 12 రకాల మిల్లెట్లతో ఆహార పదార్థాలు తయారు చేసి విక్రయిస్తున్నారు. ఉలవలు, జొన్నలు, రాగుల, అవస, ఇప్ప పువ్వు లడ్డులు, మునగాకు పౌడర్, కొర్రలు, అవసగింజలు, జొన్న ఉప్మా, ఊదలతో పొంగలి తదితర ఆహార పదార్థాలు లభించనున్నాయి. కేవలం రూ. 50కే ప్లేట్ విక్రయిస్తున్నట్లు ప్రతి సోమవారం క్యాంటీన్ ఉంటుందని పెద్దశంకరంపేట మండలానికి చెందిన ఎస్హెచ్జీ సభ్యురాలు అనిత తెలిపారు. అమరవీరులకు నివాళి చిన్నశంకరంపేట(మెదక్): రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సోమవారం మండల కేంద్రంలోని తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మారెడ్డి నివాళులర్పించారు. ఈసందర్భంగా అమరుల త్యాగాలను కొనియాడారు. ఆమె వెంట బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పట్లోరి రాజు, నాయకులు లక్ష్మారెడ్డి, శ్రీనివాస్రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ సత్యనారాయణగౌడ్ ఉన్నారు. అలాగే కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సాన సత్యనారాయణ, మాజీ ఎంపీపీ అరుణ, శ్రీమన్రెడ్డి, గోపాల్రెడ్డి, నాయకులు రాజిరెడ్డి, శివకుమార్ తదితరులు నివాళులర్పించారు. హామీలు అమలు చేయాలి పాపన్నపేట(మెదక్): రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఇచ్చి న హామీలను వెంటనే నెరవేర్చాలని టీజీ సీపీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మంగ నర్సింలు డిమాండ్ చేశారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. అధికారంలోకి రాగానే పీఆర్సీ ఇస్తామని, పెండింగ్ డీఏలు విడుదల చేస్తామని, హెల్త్కార్డులు ఇస్తామని ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని కోరారు. సీపీఎస్ విధానాన్ని రద్దు చేయడంతో పాటు పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలన్నారు. లేకుంటే ఉద్యమాలకు సిద్ధం అవుతామని హెచ్చరించారు. లక్ష్మణ్ బాపూజీని తెలంగాణ జాతిపితగా ప్రకటించాలి సదాశివపేట(సంగారెడ్డి): ఆచార్యా కొండా లక్ష్మణ్ బాపూజీని ప్రభుత్వం తెలంగాణ జాతిపితగా ప్రకటించాలని పద్మశాలి సేవా సంఘం డిమాండ్ చేసింది. సోమవారం సంఘం ఆధ్వర్యంలో పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ సరస్వతికి వినతి పత్రం అందజేశారు. మలిదళ పోరాటానికి లక్ష్మణ్ బాపూజీ స్ఫూర్తి ప్రదాత అని సంఘం అధ్యక్షులు మేకల జనార్ధన్, గౌరవ అధ్యక్షుడు విశ్వనాథం, ప్రధాన కార్యదర్శి మల్లేశం కొనియాడారు. రాష్ట్ర సాధన కోసం రాజీలేని పోరాటం చేశారని, అందుకే ఆయనకు జాతిపిత ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో చింత చంద్రశేఖర్, కోట రవీందర్, ఆనంద్కుమార్, వెంకటేశం, రవి పాల్గొన్నారు. -
మల్లన్న సాగర్ను సందర్శించిన ఏసీపీ
తొగుట(దుబ్బాక): మండలంలోని కొమురవెల్లి మల్లన్న సాగర్ను గజ్వేల్ ఏసీపీ నర్సింహు లు సోమవారం సందర్శించారు. పంప్హౌస్, రిజర్వాయర్ను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా రిజర్వాయర్ నిర్మాణం, సాగు నీరు, తాగునీటి వినియోగానికి సంబంధించి న సమాచారాన్ని డీఈ చెన్ను శ్రీనివాస్ ఏసీపీకి వివరించారు. అంతకు ముందు లింగాపూర్ శివారు లోని వైష్ణవి కన్స్ట్రక్షన్స్కు సంబంధించిన ఎక్స్ఫ్లోజీవ్ (డిటోనెటర్లు భద్రపరిచే) గోదాంను ఏసీపీ పరిశీలించారు. గోదాంకు సంబంధించిన అనుమతి పత్రాలు, స్టాక్ రికార్డులను ఆయన పరిశీలించారు. గోదాములో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని నిర్వాహకులను ఆదేశించారు. గోదాం వద్ద సెక్యూరి టీని ఏర్పాటు చేయాలని ఏసీపీ సూచించారు. -
ప్రగతి పరుగులు..
మంగళవారం శ్రీ 3 శ్రీ జూన్ శ్రీ 2025● సమగ్రాభివృద్ధి దిశగా అడుగులు ● అవతరణ వేడుకల్లో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కే. కేశవరావుమెదక్ కలెక్టరేట్: తెలంగాణను దేశంలోనే అగ్రస్థాన ంలో నిలిపేందుకు ప్రభుత్వం తెలంగాణ రైజింగ్– 2047 విజన్తో ముందుకు సాగుతోందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కే. కేశవరావు అన్నారు. రాష్ట్ర 12వ అవతరణ దినోత్సవం సందర్భంగా సోమ వారం కలెక్టరేట్లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ప్రజలనుద్దేశించి మాట్లాడారు. తెలంగాణ సమగ్ర అభివృద్ధికి, ఆర్థిక, సామాజిక, పరిపాలన రంగాల్లో ఆదర్శవంతమైన లక్ష్యాలను సీఎం రేవంత్రెడ్డి ఇటీవల నీతి అయోగ్ సమావేశంలో ప్రకటించారని తెలిపారు. ఈ విజన్ డాక్యుమెంట్ భవిష్యత్ తెలంగాణకు భగవధ్గీత లాంటిదని, ఇది రాష్ట్ర రూపురేఖలను మార్చేస్తుందని చెప్పారు. ఈసందర్భంగా జిల్లాలో అమలవుతున్న వివిధ సంక్షేమ పథకాల తీరును వివరించారు. ఆయన మాటల్లోనే.. 14,796 మందికి ఆపరేషన్లు జిల్లాలో ప్రభుత్వ మెడికల్, నర్సింగ్ కాలేజీ మంజురు చేసి తరగతులు ప్రారంభించాం. రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా జిల్లాలో 14,796 మంది పేదలు చికిత్సలు పొందగా, ఇందుకు గాను ప్రభుత్వం రూ. 38.04 కోట్లు ఖర్చు చేసింది. 13 వేల మెట్రిక్ టన్నుల సన్న బియ్యం ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా జిల్లాలో 2,16,716 కుటుంబాలకు రేషన్ దుకాణాల ద్వారా ఇప్పటివరకు 13,922 మెట్రిక్ టన్నుల సన్న బియ్యం ఉచితంగా పంపిణీ చేశాం. జిల్లాకు 3,800 కొత్త రేషన్ కార్డులు మంజురయ్యాయి. యాసంగిలో కొనుగోలు కేంద్రాల ద్వారా 2,95,703 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 70,815 మంది రైతుల నుంచి కొనుగోలు చేసి, వారి ఖాతాల్లో రూ. 573,60 కోట్లు జమ చేశాం. రూ. 5 కోట్లతో బడుల నిర్వహణ ఈ ఏడాది పదో తరగతి పరీక్ష ఫలితాల్లో జిల్లా 96.87 శాతం ఉత్తీర్ణత సాధించి రాష్ట్రంలో 12వ స్థానంలో నిలవడం అభినందనీయం. జిల్లాలోని 904 పాఠశాలల నిర్వహణకు సుమారు రూ. 5 కోట్లు ఖర్చు కేటాయించాం. సంక్షేమ హాస్టళ్లలో డైట్ చార్జీల కింద ప్రభుత్వం 40 శాతం, కాస్మోటిక్ చార్జీలు అందజేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో సమీకృత గురుకులాన్ని రూ. 200 కోట్లతో నిర్మించనున్నాం. 34 లక్షల మొక్కలు నాటడమే లక్ష్యం జిల్లాలో వన మహోత్సవం ద్వారా 34 లక్షల మొ క్కలు నాటడమే లక్ష్యంగా నిర్ణయించాం. శాంతిభద్రతల పరిరక్షణ, మత్తు పదార్థాలు, సైబర్ నేరాల నియంత్రణకు కృషి చేస్తున్న పోలీస్ యంత్రాంగానికి అభినందనలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు, కలెక్టర్ రాహుల్రాజ్, అదనపు కలెక్టర్ నగేష్, జిల్లా గ్రంథాలయ చైర్పర్సన్ సుహాసినిరెడ్డి, హౌసింగ్ పీడీ మాణిక్యం,జిల్లా వ్యవసాయ అధికారి వినయ్తో కలిసి రైతులకు, విత్తనాలు, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ అందజేశారు. కార్యక్రమంలో అధికా రులు, సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు. న్యూస్రీల్సంక్షేమ పథకాలకు పెద్దపీట మహాలక్ష్మి (ఉచిత బస్సు సౌకర్యం) పథకం కింద జిల్లాలో ఇప్పటివరకు మహిళలకు రూ. 69 కోట్ల లబ్ధి చేకూరింది. మహిళలంతా కలిసి 2. 38 కోట్ల ప్రయాణాలు ఉచితంగా చేశారు. గృహజ్యోతి కింద జిల్లాలో ఇప్పటివరకు 1,29,500 మంది వినియోగదారులకు జీరో బిల్లులు జారీ చేశాం. రూ. 54 కోట్ల 24 లక్షల సబ్సిడీని ప్రభుత్వం డిస్కంలకు చెల్లించింది. సబ్సిడీ గ్యాస్ పథకం ద్వారా జిల్లాలో 1,26,658 వినియోగదారులకు 4,68,195 గ్యాస్ సిలిండర్లు సబ్సిడీపై అందుకున్నారు. వీరికి రూ. 13.18 కోట్ల మేర లబ్ధి జరిగింది. రైతు రుణమాఫీ పథకం ద్వారా 87,491 మంది రైతన్నలకు రూ. 645 కోట్లు రుణమాఫీ జరిగింది. రైతు భరోసా పథకం కింద మొత్తం 2,26,970 మంది రైతుల ఖాతాల్లో రూ.140, 70 కోట్లు జమయ్యాయి. పంట నష్టపో యిన రైతులకు ఎకరాకు రూ.10 వేలు పరిహారం, భూమి లేని వ్యవసాయ కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద ఏడాదికి రూ.12 వేల ఆర్ధిక సహాయం అందుతోంది. అలాగే నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం జరుగుతోంది. నిర్మాణ దశలను బట్టి లబ్ధిదారుల ఖాతాల్లో నగదు అందజేస్తున్నాం. గిరిజనుల భూములకు సాగునీరు, విద్యుత్ సౌకర్యం అందుతోంది. అలాగే జిల్లాలో ఈనెల 3 నుంచి 20వ తేదీ వరకు ప్రతి రెవెన్యూ గ్రామంలో సదస్సులు నిర్వహించి రైతుల సమస్యలు పరిష్కరిస్తామని వివరించారు. -
మెలకువలు.. మెరుగులు
● 6న ముగియనున్న వేసవి శిక్షణ ● అథ్లెటిక్స్ పోటీలకు సన్నద్ధంచేగుంట(తూప్రాన్): అథ్లెటిక్స్ పోటీలకు నిష్ణాతులుగా తయారు చేసేందుకు ప్రభుత్వం యూత్ అండ్ స్పోర్ట్స్ ఆధ్వర్యంలో బాల బాలికలకు వేసవి శిక్షణ ఇస్తుంది. జిల్లాలో కేవలం చేగుంటలో మాత్రమే శిబిరం ఏర్పాటు చేశారు. మేలో ప్రారంభించిన శిక్షణ ఈనెల 6వ తేదీతో ముగియనుంది. అథ్లెటిక్స్ శిక్షణలో భాగంగా 6 నుంచి 14 సంవత్సరాల వయసు గల బాల, బాలికలలకు అవకాశం కల్పించారు. రన్నింగ్, షార్ట్పుట్, లాంగ్జంప్, డిస్కస్ త్రో, జావెలింగ్ త్రో వంటి వాటిలో మెలకువలతో పాటు శారీరక దృఢత్వం కోసం వ్యా యామం చేయిస్తున్నారు. వీటితో పాటు జీఎంఆర్ వరలక్ష్మీ ఫౌండేషన్ సౌజన్యంతో రగ్బీ క్రీడకు సంబంధించిన శిక్షణ సైతం అందిస్తున్నారు. మండల కేంద్రమైన చేగుంటలోని స్టేడియంలో ప్రతి రోజు సాయంత్రం 4 గంటల నుంచి రెండున్నర గంటల పాటు శిక్షణ నిర్వహిస్తున్నారు. వేసవి సెలవుల్లో బాల బాలికలకు శిక్షణ ఉపయోగరంగా మారింది. చేగుంట, వడియారం, రెడ్డిపల్లి, చిట్టోజిపల్లి గ్రామాల బాల బాలికలను తల్లిదండ్రులు శిబిరానికి పంపుతున్నారు. వీరితో పాటు సెలవుల్లో భాగంగా చేగుంటలోని బంధువుల ఇళ్లకు వచ్చిన వివిధ జిల్లాలకు చెందిన చిన్నారులు ఇక్కడ శిక్షణ పొందుతున్నారు. ఇక్కడ మెలకువలు నేర్చుకున్న వారు జిల్లా నుంచి రాష్ట్రస్థాయి వరకు నిర్వహించే పోటీల్లో పాల్గొననున్నారు. -
నేటి నుంచి ఊరూరా ‘భూ భారతి’
● 392 రెవెన్యూ గ్రామాల్లో సదస్సులు ● కలెక్టర్ రాహుల్రాజ్ మెదక్ కలెక్టరేట్/కొల్చారం: పటిష్ట ప్రణాళికతో మంగళవారం నుంచి ఈనెల 20వ తేదీ వరకు జిల్లాలో భూ భారతి రెవెన్యూ సదస్సులు ప్రారంభిస్తున్నట్లు కలెక్టర్ రాహుల్రాజ్ తెలిపారు. సోమవారం కలెక్టర్లో మాట్లాడుతూ.. ఇటీవల జిల్లాలోని చిలప్చెడ్ మండలాన్ని పైలెట్ ప్రాజెక్ట్గా ఎంపిక చేసుకొని మండలంలోని 16 గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించినట్లు పేర్కొన్నారు. మొత్తం 1,045 దరఖాస్తులు వచ్చాయని, వాటిని కేటగిరిల వారీగా విభజించి పరిష్కార చర్యలు చేపట్టినట్లు వివరించారు. ఇందులో 250 దరఖాస్తులు డిస్పోజ్ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. జిల్లావ్యాప్తంగా 392 రెవెన్యూ గ్రామాలు ఉన్నా యని, వాటిలో దశలవారీగా సదస్సులు నిర్వహిస్తామన్నారు. దరఖాస్తులను ఎటువంటి రుసుము లేకుండా పూర్తిగా ఉచితంగా అందజేస్తామన్నారు. సమస్యల పరిష్కార నిమిత్తం హెల్ప్డెస్క్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. రెవెన్యూ సదస్సుల్లో ఆరుగురు అధికారుల బృందం పాల్గొంటుందని వెల్లడించారు. అనంతరం హౌసింగ్ కార్యాలయాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్, డీఆర్ఓ భుజంగరావు, హౌసింగ్ పీడీ మాణిక్యం, డీఎంహెచ్ఓ శ్రీరామ్, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అలాగే కొల్చారం మండలంలోని కోనాపూర్లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. వాతావరణంలో నెలకొన్న మార్పుల దృష్ట్యా కొనుగోళ్లు పూర్తయ్యే వరకు అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికి, రైతులకు సూచించారు. -
ఘనంగా ఆవిర్భావ వేడుకలు
మెదక్ మున్సిపాలిటీ: జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో రాష్ట్ర అవతరణ వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. అదనపు ఎస్పీ మహేందర్ జాతీయ జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. పోలీస్ సిబ్బంది క్రమశిక్షణతో మరింత బాధ్యతగా పనిచేసి, రాష్ట్ర, జాతీయస్థాయిలో జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో డీఎస్పీ ప్రసన్నకుమార్తో పాటు ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అలాగే మెదక్ మున్సిపల్ కార్యాలయంలో అదనపు కలెక్టర్, ప్రత్యేక అధికారి నగేష్ జెండావిష్కరణ చేశారు. ఈసందర్భంగా పారిశుద్ధ్యంపై వంద రోజుల యాక్షన్ ప్లాన్పై ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో మున్సిపల్ శ్రీనివాస్రెడ్డితో పాటు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అలాగే జిల్లా బీఆర్ఎస్ కార్యాలయ ఆవరణలో మాజీ ఎమ్మెల్యే పద్మారెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ శేరి సుభాష్రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ బట్టి జగపతి, మాజీ కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. -
పార్టీలో కష్టపడిన వారికి గుర్తింపు
● నాయకులకు, కార్యకర్తలకు అండగా ఉంటాం: మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశాంత్నగర్(సిద్దిపేట): పార్టీలో కష్టపడిన వారిని గుర్తిస్తూ త్వరలోనే నామినేటెడ్ పదవులను భర్తీ చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. రాష్ట్ర అవతరణ దినోత్సవంలో భాగంగా సోమ వారం జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. అంతకు ముందు రంగధాంపల్లి అమరవీరుల స్తూపం వద్ద కలెక్టర్ మనుచౌదరి, సీపీ అనురాధ, అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్తో కలిసి నివాళులర్పించారు. అనంతరం జిల్లా కేంద్రంలోని ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పార్టీ కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో మంత్రి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎవరు కూడా అధైర్యపడవద్దని మీకు అండగా ఎప్పటికీ అందుబాటులో ఉంటామన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల్లోనే ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు హరికృష్ణ, అత్తు ఇమామ్, లక్ష్మి, బొమ్మల యాదగిరి, కలీమొద్దిన్, ఎల్లం యాదవ్, ఆనంద్, గోపీకృష్ణ, సతీష్, తదితరులు పాల్గొన్నారు. -
తాగునీటి కోసం ఆందోళన
ఆవిర్భావ వేడుకలను అడ్డుకున్న గ్రామస్తులువెల్దుర్తి(తూప్రాన్): మండలంలోని హస్తాల్పూర్లో తాగునీటి కోసం గ్రామస్తులు ఆందోళనకు దిగారు. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పంచాయతీ కార్యదర్శి జెండా ఎగురవేయడానికి ప్రయత్నించగా, మూకుమ్మడిగా అడ్డుకున్నారు. జెండా గద్దె చుట్టూ ఖాళీ బిందెలు పెట్టి అధికారులు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. వారం రోజులుగా నీటి సరఫరా నిలిచిపోయినా, పట్టించుకునే నాథుడు కరువయ్యాడని ఆవేదన వ్యక్తం చేశారు. మిషన్ భగీరథ ప్రారంభించి ఏళ్లు గడుస్తున్నా, తమ గ్రామానికి చుక్క నీరు సరఫరా చేయలేదని ఆరోపించారు. తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే వరకు జెండా ఎగురవేసేది లేదంటూ భీష్మించుకుకూర్చున్నారు. హల్దీవాగులోని బోరు మోటార్ చెడిపోయి రోజులు గడుస్తున్నా మరమ్మతులు చేపట్టడానికి సంబంధిత అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహించారు. పోలీసులు నచ్చజెప్పినా స్పందించలేదు. చివరికి కాంగ్రెస్ జిల్లా నాయకుడు నరేందర్రెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు అక్కడికి చేరుకొని 24 గంటల్లో సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో శాంతించి ఆందోళన విరమించారు. దీంతో రెండున్నర గంటలు ఆలస్యంగా సుమారు 11 గంటల ప్రాంతంలో పంచాయతీ కార్యదర్శి జెండా ఎగురవేశారు. -
భూమి కోల్పోయి.. అప్పులు పెరిగి..
సెల్ఫీ వీడియో తీసుకుంటూ ఆటోడ్రైవర్ ఆత్మహత్యాయత్నం శివ్వంపేట(నర్సాపూర్): సెల్ఫీ వీడియో తీసుకుంటూ ఆటో డ్రైవర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన శివ్వంపేట మండలం కొత్తపేటలో సోమవారం చోటు చేసుకుంది. బాధితుడి కథనం మేరకు.. కొత్తపేట గ్రామానికి చెందిన కంచన్పల్లి శేఖర్ ఉపాధి కోసం పట్నం వెళ్లి సూరారం, బాచుపల్లిలో ఆటో నడుపుకుంటూ జీవిస్తున్నాడు. ఫ్రీ బస్ వల్ల ఆటో గిరాకీ లేకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. సుమారు రూ. 20 లక్షల వరకు అప్పులు అయ్యాయి. ట్రిపుల్ఆర్లో 20 గుంటల భూమి కోల్పోగా ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వ లేదు. ఇటు ఆటో నడవక, అటు కోల్పోయిన భూమికి నష్టపరిహారం రాక అప్పులు తీర్చే మార్గం లేకుండా పోయింది. దీనికితోడు మూడు ఎకరాల సీలింగ్ భూమి ఇతరులు కబ్జా చేశారు. పలుమార్లు తహసీల్దార్కు ఫిర్యాదు చేసినా సమస్య పరిష్కారం కాలేదు. కేసీఆర్ సార్ మంచోడని కేసీఆర్ తనను ఆదుకోవాలని కోరాడు. సీఎం రేవంత్రెడ్డితో ఏమి కాదన్నాడు. అప్పు తీర్చే మార్గం లేక పురుగుల మందు తాగుతూ ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సెల్ఫీ వీడియో తీసి గ్రూపులలో షేర్ చేశారు. ఇది చూసిన గ్రామస్తులు, కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకొని బాధితుడిని నర్సాపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స నిమిత్త సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బాధితుడు ఆత్మహత్యాయత్నం చేయడం ఇది రెండోసారని తెలిసింది. -
బీఎండబ్ల్యూ కారు కొనివ్వలేదని యువకుడు ఆత్మహత్య
జగదేవ్పూర్(గజ్వేల్): నచ్చిన కారు తండ్రి కొనివ్వడం లేదని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలంలో చోటు చేసుకుంది. ఎస్ఐ చంద్రమోహన్, స్థానికుల కథనం మేరకు.. చాట్లపల్లి గ్రామానికి చెందిన బొమ్మ కనకయ్య దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడికి వివాహం కాగా చిన్న కుమారుడు జానీ(21)కి వివాహం కాలేదు. గ్రామంలో ఉంటూ వ్యవసాయం చేస్తున్నారు. కొద్ది రోజుల నుంచి జానీ తండ్రిని బీఎండబ్ల్యూ కారు కొనియాలని, లేకపోతే చనిపోతానని తరచూ గొడవ పడుతున్నాడు. మన ఆర్థిక పరిస్థితి సరిగా లేదని సముదాయించారు. అయినా జానీ ప్రవర్తనలో మార్పు రాలే దు. 30న సిద్దిపేటలో కారు షోరూమ్కు వెళ్లి మారుతీ స్విఫ్ట్ డిజైర్ కారును చూశారు. మారుతీ కారు తనకు వద్దని బీఎండబ్ల్యూ కారే కావాలని పట్టుబట్టి మనస్తాపానికి గురయ్యాడు. అదే రోజు సాయంత్రం వ్యవసాయ పొలం వద్ద పురుగు మందు తాగి అపస్మారకస్థితికి చేరుకున్నారు. వెంటనే కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఆర్వీఎం ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతి చెందాడు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ తెలిపారు.