Medak
-
ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి
మెదక్ మున్సిపాలిటీ: ఉద్యోగ విరమణ అనంతరం ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ కుటుంబంతో సంతోషంగా గడపాలని ఎస్పీ ఉదయ్కుమార్రెడ్డి అన్నారు. ఉద్యోగ విరమణ పొందుతున్న ఆర్ఎస్ఐ యశ్వంత్రావును శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో సన్మానించి పోలీస్ వ్యవస్థకు చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ మహేందర్, ఏఆర్ డీఎస్పీ రంగానాయక్, ఎస్బీ ఇన్స్పెక్టర్ సందీప్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు పెద్దశంకరంపేట(మెదక్): అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు అందజేస్తామని నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి అన్నారు. శుక్రవారం పెద్దశంకరంపేట, ముసాపేట గ్రామాల్లో ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలకు సంబంధించి భూమి పూజలో పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదలకు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే సొంతింటి కల నెరువేరుతుందన్నారు. అన్నివర్గాలకు సంక్షేమ పథకాలను అందించేలా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. లబ్ధిదారులకు బిల్లులు వెంటవెంటనే వచ్చేలా చూస్తామన్నారు. కార్యక్రమంలో ఇన్చార్జి ఎంపీడీఓ షాకీర్అలీ, నాయకులు సంతోష్, అంజిరెడ్డి, బక్కారెడ్డి, సాయిరెడ్డి, శశిధర్రెడ్డి, సంగమేశ్వర్, రోమాల సాయిలు, గోవింద్రావు, విఠల్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. నిరుద్యోగులకు ఉచిత శిక్షణ వెల్దుర్తి(తూప్రాన్): గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువతీ, యువకులకు ఎస్జీఆర్ సొసైటీ ఆధ్వర్యంలో మేడ్చల్లో జూన్ 15 నుంచి ఉచిత ఉద్యోగ శిక్షణ ఇవ్వనున్నట్లు ట్రస్ట్ ఎండీ మధు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. శిక్షణ సమయంలో భోజన వసతి, హాస్టల్ సౌకర్యం ఉచితంగా అందించడమే కాకుండా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. ఆసక్తి ఉన్న వారు జూన్ 15లోపు ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఇతర వివరాలకు 9441348569, 7287080612 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని సూచించారు. నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు చేగుంట(తూప్రాన్): నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా వ్యవ సాయ అధికారి వినయ్కుమార్ అన్నారు. శుక్రవారం చేగుంటలోని పలు ఫర్టిలైజర్ దుకాణాలను తనిఖీ చేశారు. రికార్డులతో పాటు విత్తనాలను పరిశీలించారు. నాణ్యమైన విత్తనాలను విక్రయించాలని నిర్వాహకులను ఆదేశించారు. స్టాక్కు సంబంధించిన రికార్డులను ఖచ్చితంగా రాయాలని సూచించారు. వానాకాలం సీజన్లో నిత్యం టాస్క్ఫోర్స్ అధికారులు దుకాణాలను తనిఖీ చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి హరిప్రసాద్, సిబ్బంది పాల్గొన్నారు. అంగన్వాడీ కేంద్రాలను పర్యవేక్షించాలి: డీడబ్ల్యూఓ నర్సాపూర్: అంగన్వాడీ కేంద్రాలను నిరంతరం పర్యవేక్షించాలని డీడబ్ల్యూఓ హైమావతి ఆదేశించారు. శుక్రవారం నర్సాపూర్ ఐసీడీఎస్ ప్రాజెక్టులోని సూపర్వైజర్లతో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పోషణలోపంతో ఉన్న పిల్లలను గుర్తించి, వారి తల్లిదండ్రులకు పిల్లల ఎదుగుదల స్థితిని వివరించాలని సూచించారు. బాల్య వివాహాలు జరగకుండా ప్రజల్లో చైతన్యం తేవడానికి కృషి చేయాలన్నారు. అనంతరం పట్టణంలోని రీహాబిలిటేషన్ సెంటర్ను తనిఖీ చేశారు. ఆమె వెంట సీడీపీఓ హేమాభార్గవి పలువురు సూపర్వైజర్లు ఉన్నారు. -
ప్రభుత్వ వైఫల్యంతోనే ఇబ్బందులు
నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి నర్సాపూర్: ప్రభుత్వ వైఫల్యంతోనే రైతులు ఇబ్బంది పడుతున్నారని ఎమ్మెల్యే సునీతారెడ్డి ఆరోపించారు. శుక్రవారం ఆమె మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలు ప్రక్రియ సక్రమంగా జరగడం లేదన్నారు. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. హమాలీలను సమకూర్చడంలో, వడ్ల రవాణాకు అవసరమైన లారీలు సమకూర్చడంలో అధికారులు విఫలమయ్యారని అన్నారు. వానాకాలం సీజన్కు కావాల్సిన విత్తనాలు సైతం అందుబాటులో లేవన్నారు. ఈ విషయమై వ్యవసాయశాఖ ఉన్నతాధికారులతో మాట్లాడినట్లు వివరించారు. అనంతరం నర్సాపూర్, శివ్వంపేట, కౌడిపల్లి మండలాలకు చెందిన పలువురికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. ఆమె వెంట పలువురు బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు, -
యోగమెప్పుడు?
మల్లన్నా.. డిజిటల్సాంకేతికతకు దూరంగా కొమురవెల్లి ఆలయం●ఆన్లైన్ చెల్లింపులు లేక భక్తుల అవస్థలు ●ఏటా కోటి మంది దర్శనం ●స్వామి వారి వార్షిక ఆదాయం రూ. 20 కోట్లపైనే.. రాష్ట్రంలోని ప్రముఖ పుణ్య క్షేత్రాలలో కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయం ఒకటి. స్వామి వారిని ఏటా కోటి మందికి పైగా భక్తులు దర్శించుకుంటారు. ఆలయానికి సుమారు రూ.20 కోట్లకు పైగా వార్షిక ఆదాయం సమకూరుతున్నా సాంకేతికతకు దూరంగా ఉంది. ఇప్పటి వరకు ఆన్లైన్ సేవలు అమలు కాకపోవడంతో భక్తులకు ఇబ్బందులు తప్పడంలేదు. ఆర్థిక వ్యవహారాలలో పారదర్శకతతో పాటు భక్తులు సులువుగా సేవలను పొందేందుకు ఆస్కారం లేకుండా పోయింది. కొమురవెల్లి(సిద్దిపేట): మల్లన్న ఆలయానికి వచ్చే భక్తులు.. వసతి గదులు, దర్శనం, నిత్యకల్యాణం, రుద్రాభిషేకం, అర్చన, పట్నం వేయడం, తలనీలాలు, ఒడిబియ్యం, బోనం తదితర ఆర్జిత సేవల కోసం రుసుం చెల్లించి టికెట్లు తీసుకోవాలి. రద్దీ ఎక్కువగా లేకపోతే పది పదిహేను నిమిషాలలో టికెట్లు లభిస్తాయి. రద్దీ ఎక్కువగా ఉంటే మాత్రం గంటల తరబడి క్యూలైన్లో నిరీక్షించాల్సి వస్తోంది. స్వామి వారి దర్శనానికి తెలుగు రాష్ట్రాలనుంచే కాకుండా ఛత్తీస్గఢ్, కర్ణాటక, ఒడిశా, మహారాష్ట్ర నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. ఏటా సుమారు మూడు నుంచి నాలుగు లక్షల వరకు పట్నాలు, బోనాల టికెట్లను ఆలయం విక్రయిస్తోంది. భక్తుల్లో అసహనం.. భక్తులు స్వామి వారి దర్శనానికి వచ్చినప్పుడే నిత్యాన్నసత్రానికి, కాటేజీల నిర్మాణాలకు విరాళాలు చెల్లిస్తుంటారు. ఆలయంలో ఆన్లైన్ సేవలు లేకపోవడంతో భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. భక్తుల సౌకర్యార్థం ఆన్లైన్ వ్యవస్థను తీసుకురావడానికి ఆలయ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ అవి కార్యరూపం దాల్చడం లేదు. మూడేళ్ల క్రితమే హుస్నాబాద్ మండలం పొట్లపల్లి స్వయంభూ రాజేశ్వరాలయం, మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరలో కూడా సాంకేతికత సాయంతో డిజిటల్ హుండీలను ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోనే ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మల్లన్న ఆలయం సాంకేతికతలో వెనుకబడి ఉందని చెప్పవచ్చు. -
రైతు సంక్షేమానికి బీజేపీ పెద్దపీట
మెదక్ కలెక్టరేట్: రైతు సంక్షేమానికి బీజేపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని, అందులో భాగంగానే గత పదేళ్లలో 14 రకాల పంటలపై పలుమార్లు మద్దతు ధర పెంచిందని బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు బైండ్ల సత్యనారాయణ తెలిపారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని రాందాస్ చౌరస్తాలో ప్రధాని మోదీ చిత్రపటానికి క్షీరాభి షేకం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పంటలకు మద్దతు ధర పెంచడంతో దేశవ్యాప్తంగా రైతుల్లో ఆనందం నెలకొందన్నారు. అనంతరం జిల్లా మాజీ అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ మాట్లాడుతూ.. రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని యూరియా కొరత నివారించినట్లు వివరించారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఎంఎల్ఎన్ రెడ్డి, కిసాన్ మోర్చా నాయకులు ఈశ్వర్రెడ్డి, లింగారెడ్డి, శంకర్, ఓబీసీ నాయకులు గడ్డం కాశీనాథ్, రాగి రాములు తదితరులు పాల్గొన్నారు. -
పెండింగ్ బకాయిలు చెల్లించండి
మెదక్ కలెక్టరేట్: ఉపాధి హామీ పథకంలో కూలీలకు రావాల్సిన బకాయిలతో పాటు పార్టీ(బీ) భూముల సమస్యలు పరిష్కరించాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పద్మ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ను ముట్టడించారు. అనంతరం అదనపు కలెక్టర్ నగేష్కు వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో 30 వేల ఎకరాల భూములు పార్ట్బీలో ఉన్నాయని తెలిపారు. ఫారెస్ట్, రెవెన్యూ మధ్యలో ఉన్న భూ సమస్యను పరిష్కరించాలన్నారు. పోడు పట్టాలు ఇవ్వాలని, గత ప్రభుత్వం ఇచ్చిన పట్టాలను భూ భారతి పోర్టల్లో పొందుపరిచి పథకాలు అమలు చేయాలని కోరారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
కొనుగోళ్లలో వేగం పెంచండి
కలెక్టర్ రాహుల్రాజ్ ముదిరాజ్ల సంక్షేమానికి కృషి పాపన్నపేట/మెదక్ కలెక్టరేట్: వర్షాకాలం ప్రారంభం కానున్న నేపథ్యంలో ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని కలెక్టర్ రాహుల్రాజ్ అన్నారు. శుక్రవారం ఆయన మిన్పూర్ కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. ఈ ఏడాది రుతుపవనాలు త్వరగా వచ్చినందున వర్షాలు పడే అవకాశముందన్నారు. ఎలాంటి పొరపాట్లు జరగకుండా ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయాలని ఆదేశించారు. జూన్ 2 నుంచి మంజూరు పత్రాలు జూన్ 2వ తేదీ నుంచి రాజీవ్ యువ వికాసం పథకం మొదటి విడత రూ. 1 లక్షలోపు రు ణాల లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేయనున్నట్లు కలెక్టర్ రాహుల్రాజ్ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్ నుంచి జిల్లాలోని ఆయా శాఖల అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పారదర్శకంగా ఇందిరమ్మ లబ్ధిదారుల ఎంపిక జరగాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్, జెడ్పీ సీఈఓ ఎల్లయ్య, డీఆర్డీఓ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అన్లోడింగ్ త్వరగా పూర్తి చేయండి శివ్వంపేట(నర్సాపూర్): ధాన్యం అన్లోడింగ్ త్వరగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ నగేష్ అన్నారు. శుక్రవారం దొంతిలోని మీనాక్షి రైస్మిల్లో ధాన్యం అన్లోడింగ్ను పరిశీలించా రు. వర్షాలు పడుతున్నందున ధాన్యం త్వరగా అన్లోడింగ్ చేసి పంపించాలని యాజమానులకు సూచించారు. రామాయంపేట(మెదక్): ముదిరాజ్లు చదువుతో పాటు ఆర్థికంగా వెనుకబడి ఉన్నారని శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్ అన్నారు. శుక్రవారం మండలంలోని ఝాన్సిలింగాపూర్లో జరుగుతున్న పెద్దమ్మ ఆలయ ఉత్సవాల్లో పాల్గొని పూజలు నిర్వహించారు. ఈసందర్భంగా ఆ యన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ చదువుకొని ఉన్నతస్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ముదిరాజ్ల సంక్షేమానికై తాను కట్టుబడి ఉన్నానని తెలిపారు. ఆలయాల నిర్మాణానికి సహకారం అందజేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం జిల్లా అధ్యక్షుడు రామకిష్టయ్య, తహసీల్దార్ రజనికుమారి తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు భద్రత.. జీవితానికి రక్షణ
కలెక్టర్ రాహుల్రాజ్, ఎస్పీ ఉదయ్కుమార్రెడ్డిఐదు రోజుల్లో కొనుగోళ్లు పూర్తి నర్సాపూర్ ఆర్డీఓ మహిపాల్ నెల రోజులైనా ధాన్యం కొనరా?మెదక్ కలెక్టరేట్: రోడ్డు భద్రతను మెరుగుపరిచి ప్రజల ప్రాణాలను కాపాడవచ్చునని కలెక్టర్ రాహుల్రాజ్ అన్నారు. గురువారం కలెక్టరేట్లో ఎస్పీ ఉదయ్కుమార్రెడ్డితో కలిసి జిల్లాలోని వివిధశాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ముందుగా రహదారి భద్రత, ప్రమాదాలు జరిగే బ్లాక్ స్పాట్స్, నేషనల్ హైవే ద్వారా చేపట్టే ప్రణాళికలను చర్చించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి తీసుకోవాల్సిన చర్యలను పక్కా ప్రణాళికతో క్షేత్రస్థాయిలో అమలు చేయాలన్నారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. రోడ్డు భద్రతా నియమాలను కఠినంగా అమలు చేస్తున్నామని తెలిపారు. ఎప్పటికప్పుడు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. అనంతరం జిల్లాస్థాయి యాంటీ డ్రగ్ కమిటీ సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యార్థులు, యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని, చదువుపైనే దృష్టి సారించాలన్నారు. మాదక ద్రవ్యాల విని యోగం లేకుండా పోలీసులు పటిష్ట చర్యలు చేపట్టాలన్నారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. నిరంతర తనిఖీలు నిర్వహించి గంజాయి, మత్తు పదార్థాల రవాణాను అరికడుతున్నట్లు వివరించారు. కార్యక్రమంలో ఆర్అండ్బీ ఈఈ సర్దార్సింగ్, జెడ్పీ సీఈఓ ఎల్లయ్య, డీఎంహెచ్ఓ శ్రీరాం, మెదక్ డీఎస్పీ ప్రసన్న కుమార్, నేషనల్ హైవే, పోలీస్, రెవెన్యూ, రవాణా, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. చిలప్చెడ్(నర్సాపూర్): మరో ఐదు రోజుల్లో మండలంలో ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేస్తామని నర్సాపూర్ ఆర్డీఓ మహిపాల్ అన్నా రు. గురువారం చిలప్చెడ్ రెవెన్యూ కార్యాలయంలో భూభారతి దరఖాస్తులను పరిశీలించడంతో పాటు చిట్కుల్లో కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి రైతులతో మాట్లాడారు. భూభారతి రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన సమస్యలను రెండు బృందాలు పరిష్కరిస్తున్నాయని తెలిపారు. రైతులు దిగులు చెందాల్సిన అవసరం లేదని, లారీల కొరత లేకుండా చేసి మరో ఐదు రోజుల్లో పూర్తిస్థాయిలో ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేస్తామన్నారు. రైతులు తేమశాతం తక్కువ ఉండేలా చూసుకుంటూ కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు సహకరించాలని సూచించారు. ఆయన వెంట తహసీల్దార్ సహదేవ్, డిప్యూటీ తహసీల్దార్ సింధూజ, రెవెన్యూ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. గడిపెద్దాపూర్ రైతుల ఆందోళనఅల్లాదుర్గం(మెదక్): ధాన్యం కొనుగోలు చేయాలంటూ అన్నదాతలు ఆందోళనకు దిగారు. నెలరోజులుగా ధాన్యం బస్తాల వద్ద కాపలా ఉండాల్సి వస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ గురువారం గడిపెద్దాపూర్ 161 జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. ధాన్యం తూకం వేసినా తామే కాపలా ఉంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడడంతో విషయం తెలుసుకున్న సీఐ రేణుకారెడ్డి, తహసీల్దార్ మల్లయ్య సంఘటన స్థలికి చేరుకొని రైతులకు నచ్చజెప్పి అందోళన విరమింపజేశారు. ఇదిలాఉండగా అల్లాదుర్గం, గడిపెద్దాపూర్ కొనుగోలు కేంద్రాలను డీఎస్ఓ సురేశ్రెడ్డి, సివిల్ సప్లై మేనేజర్ జగదీశ్వర్ తనిఖీ చేశారు. రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోలు చేస్తామని, రెండు రోజుల్లో తూకం వేసిన ధాన్యం తరలిస్తామని చెప్పారు. గడిపెద్దాపూర్లో రెండు లారీల ధాన్యం వెంటనే తరలిస్తున్నట్లు తెలిపారు. వర్షాలతో మ్యాచర్ రాక మిల్లర్లు కొనడం లేదని అన్నారు. -
ప్రయాణం.. ప్రమాదకరం
అసలే ప్రమాదకరంగా మలుపులు.. దీనికి తోడు ఏపుగా పెరిగిన చెట్లు, ముళ్లపొదలతో మండలంలోని రంగంపేట– పైతర, తుక్కాపూర్ రహదారి నిత్యం ప్రమాదాలకు నిలయంగా మారింది. నిత్యం వందల సంఖ్యలో వాహనాలు ఈ రహదారిపై రాకపోకలు సాగిస్తుంటాయి. 3 కిలోమీటర్ల పరిధిలో పదికి పైగా మలుపులు ఉన్నాయి. ఏపుగా పెరిగిన చెట్లు, ముళ్ల పొదలతో ముందు నుంచి వచ్చే వాహనం కనిపించని పరిస్థితి ఏర్పడింది. దీంతో ఎదురెదురుగా వాహనాలు ఢీకొన్న సంఘటనలు ఉన్నాయి. ఇప్పటికై నా అధికారులు స్పందించి చెట్లను తొలగించాలని వాహనదారులు కోరుతున్నారు. –కొల్చారం(నర్సాపూర్) -
బాసర ట్రిపుల్ఐటీ పిలుస్తోంది
పాపన్నపేట(మెదక్): సర్కార్ బడిలో చదివిన విద్యార్థులకు ప్రభుత్వం గుడ్న్యూస్ ప్రకటించింది. ఈ ఏడాది పదో తరగతిలో జీపీఏ విధానాన్ని తొలగించి, మార్కుల విధానం ప్రవేశపెట్టింది. దీనికి అనుగుణంగా బాసరలోని రాజీవ్గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ అడ్మిషన్లలో మార్పులు తీసుకొచ్చింది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు అదనంగా 24 మార్కులు కలపనుంది. ఈ మేరకు 2025– 26కు సంబంధించి ట్రిపుల్ఐటీ దరఖాస్తులు ఈనెల 31 నుంచి జూన్ 21వ తేదీ వరకు స్వీకరించనుంది. ఈసారి జిల్లాలో 10,370 మంది విద్యార్థులు పది పరీక్షలు రాయగా, 10,045 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. అందుబాటులో 1,500 సీట్లు నిరుపేద గ్రామీణ విద్యార్థులకు పదో తరగతి అనంతరం ఇంజనీరింగ్ విద్యను అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి 2008లో ఆరేళ్ల ఇంటిగ్రేటేడ్ ట్రిపుల్ఐటీలు ఏర్పాటు చేశారు. అందులో భాగంగా తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బాసరలో ట్రిపుల్ఐటీ కాలేజీని నిర్మించారు. ఇందులో 1,500 సీట్లు ఉన్నాయి. ఇక్కడ చదువుకున్న విద్యార్థులకు మంచి ప్యాకేజీతో క్యాంపస్ ఉద్యోగాలు వస్తున్నాయి. పదో తరగతిలో సాధించిన మార్కులు, రిజర్వేషన్ల ఆధారంగా ట్రిపుల్ ఐటీలో అడ్మిషన్లు లభిస్తాయి. ప్రభుత్వ విద్యార్థులకు ప్రోత్సాహం ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థులను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం డిప్రివేషన్ స్కోర్ విధానం అమల్లోకి తెచ్చింది. గతేడాది వరకు పదో తరగతిలో గ్రేడింగ్ విధానం అమల్లో ఉన్నందున ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు 0.4 గ్రేడింగ్ పాయింట్లు కలిపేవారు. ఈ విద్యా సంవత్సరం మళ్లీ మార్కుల విధానం ప్రవేశపెట్టడంతో ఆరు సబ్జెక్టులలో ఒక్కో దానికి 4 మార్కుల చొప్పున మొత్తం 24 మార్కులు కలుపనున్నారు. ప్రభుత్వ, జిల్లా పరిషత్, మున్సిపల్, ఆదర్శ (నాన్ రెసిడెన్షియల్ ) విద్యార్థులకు ఇవి వర్తిస్తాయి. రేపటి నుంచి దరఖాస్తులు ప్రారంభం సర్కార్ బడిలో చదివితే24 మార్కులు అదనం జిల్లాలో పదో తరగతి ఉత్తీర్ణులు 10,045 మంది పది విద్యార్థులకు గుడ్ న్యూస్ ప్రభుత్వ పాఠశాలల్లో పది పాసైన విద్యార్థులకు ఇది గుడ్ న్యూస్. సాధారణంగా ప్రభుత్వ పాఠశాలల్లో నిరుపేద విద్యార్థులు మాత్రమే చదువుతారు. ఈ క్రమంలో కార్పోరేట్ పాఠశాలల విద్యార్థుల నుంచి పోటీ తట్టుకోవడం ఇబ్బందికరమే. అయినా నేను 542 మార్కులు తెచ్చుకున్నా. ఇప్పుడు 24 మార్కులు కలిపితే 566 అవుతాయి. ట్రిపుల్ఐటీలో సీటు వచ్చే అవకాశం మెరుగవుతుంది. – దీక్షిత, విద్యార్థిని, కుర్తివాడ -
చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడొద్దు
మెదక్ మున్సిపాలిటీ: ప్రజలంతా శాంతియుత వాతావరణంలో పండగలు జరుపుకోవాలని మెదక్ డీఎస్పీ ప్రసన్నకుమార్ అన్నారు. బక్రీద్ సందర్భంగా గురువారం పట్టణంలోని ఓ గార్డెన్లో పీస్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. హిందూ, ముస్లింలు ఎలాంటి ఘర్షణలకు వెళ్లకుండా శాంతియుతంగా పండుగలను జరుపుకోవాలన్నారు. గతేడాది జరిగిన ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలన్నారు. హిందువులు గోవులను దేవతగా పూజిస్తారు కాబట్టి, వారికి ప్రత్యేక శ్రద్ధ ఉంటుందన్నారు. ముస్లింలు ఏదైనా చట్టపరంగా, నియమ నిబంధనలకు అనుగుణంగా చేస్తే ఎవరికీ ఎలాంటి అభ్యంతరం ఉండదన్నారు. చట్టానికి వ్యతిరేకంగా చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో పట్టణ సీఐ నాగరాజు, ఎస్సై అమర్, మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ విజయలక్ష్మి, వెటర్నరీ డాక్టర్ లక్ష్మణ్, పోలీసు సిబ్బంది, హిందూ, ముస్లింలు పాల్గొన్నారు. మెదక్ డీఎస్పీ ప్రసన్నకుమార్ -
ల్యాబ్ల.. చీటింగ్!
నిర్ధారణకు వెళితే నిలువు దోపిడీ! ● జిల్లావ్యాప్తంగా 52 ల్యాబ్లు ● అనుమతిలేనివి డబుల్ ● నిబంధనలకు పాతర ● పట్టించుకోని వైద్యాధికారులు ప్రజారోగ్యంతో పరీక్ష కేంద్రాల (ల్యాబ్) నిర్వాహకులు చెలగాటం ఆడుతున్నారు. వ్యాధి నిర్ధారణకు వెళితే నిలువు దోపిడీ చేస్తున్నారు. నిబంధనలు విస్మరించి అనుమతి లేకుండానే యథేచ్ఛగా నడుపుతున్నారు. అర్హత లేకున్నా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఒక్కో ల్యాబ్లో ఒక్కో రకం ఫలితాలు వస్తుండడంతో రోగులు ఏది నమ్మాలో తెలియక అయోమయానికి గురవుతున్నారు. ఇంత జరుగుతున్నా వైద్యారోగ్యశాఖ అధికారులు పట్టించుకోవడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. – మెదక్ మున్సిపాలిటీ వాస్తవానికి ఒక ల్యాబ్ ఏర్పాటు చేయాలంటే వైద్యశాఖ నుంచి అనుమతి తప్పనిసరి. అన్నిరకాల చికిత్సలకు సంబంధించిన పరికరాలు ఉండాలి. ఎంబీబీఎస్ డాక్టర్తో పాటు పాథలాజిస్ట్, టెక్నీషియన్, మైక్రో బయాలజిస్ట్ ఉండాల్సి ఉంటుంది. కానీ జిల్లాలో ఇవేమీ లేకుండానే యథేచ్ఛగా ల్యాబ్లు నిర్వహిస్తున్నారు. రోగుల అవసరాలను ఆసరాగా చేసుకొని ల్యాబ్ నిర్వాహకులు వివిధ రకాల పరీక్షల పేరుతో ఆర్థికంగా దోపిడీ చేస్తున్నారు. జిల్లా కేంద్రంతో పాటు జిల్లాలో అనుమతి పొందిన 52 (ల్యాబ్) డయాగ్నొస్టిక్ సెంటర్లు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. కాని అంతకు రెట్టింపు స్థాయిలో అనుమతిలేనివి కొనసాగుతున్నట్లు సమాచారం. సీజన్లో జోరుగా దందా! వర్షాకాల సీజన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశాలు ఉంటాయి. ఈ సమయంలో ఆస్పత్రుల్లో ఎక్కువగా రోగులు చేరుతుంటారు. ఇదే సమయంలో కొన్ని అస్పత్రులకు అనుసంధానంగా ల్యాబ్లు లేకపోవడంతో వైద్యులు సూచించిన ల్యాబ్లకు పరీక్షలకు వెళ్తుంటారు. ఇదే అదనుగా కొందరు ఎక్కువ వసూలు చేస్తున్నారు. రూ. 100కు నిర్వహించే పరీక్షకు రూ. 500 వరకు బిల్లులు వేస్తున్నారు. నిబంధనల ప్రకారం అన్ని అనుమతులు ఉన్న ల్యాబ్లో పరీక్ష చేయించుకోవాల్సి ఉంటుంది. కాని కొందరు వైద్యులు తమకు కమీషన్లు ఇచ్చే ల్యాబ్లకు వైద్య పరీక్షల కోసం రోగులను పంపుతున్నారు. కానరాని ఫీజు బోర్డులు మెడికల్ ల్యాబ్లలో ఆయా వైద్య పరీక్షలకు సంబంధించి ధరల పట్టికలు ఏర్పాటు చేయాలి. జిల్లాలో కొనసాగుతున్న ల్యాబ్లలో అధికశాతం వాటిల్లో ధరల పట్టికలు కనిపించడం లేదు. ఒకవేళ ధరల పట్టికలు పెడుతున్నా.. వాటిని రోగులకు కానరాకుండా ఏర్పాటు చేస్తున్నారు. ఒకే రకమైన టెస్ట్లకు ఒక ల్యాబ్కు మరో ల్యాబ్కు ధరల విషయంలో చాలా వ్యత్యాసం ఉంటుంది. పెద్ద ల్యాబ్ల నిర్వాహకులు రాయితీలను ప్రకటిస్తున్నారంటే.. ఏ స్థాయిలో దోపిడీ జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. నియంత్రణ కరువు సాధారణంగా ల్యాబ్లు ఐదేళ్ల కోసారి లైసెన్స్లు రెన్యూవల్ చేసుకోవాలి. లైసెన్స్ ఇచ్చిన తర్వాత ఐదేళ్ల పాటు ల్యాబ్ దరిదాపుల్లోకి అధికారులు వెళ్లడం లేదు. దీంతో సదుపాయలు, అవసరమైన యంత్ర పరికరాలు లేకపోయినా నిర్వాహకులు అలాగే నడిపించేస్తున్నారు. అయితే తనిఖీలు చేయకుండా ఉండేందుకు నిర్వాహకులు అధికారులను మచ్చిక చేసుకుంటున్నట్లు బహిరంగ ఆరోపణలు ఉన్నాయి. తనిఖీలు నిర్వహిస్తున్నాం జిల్లాలో ప్రైవేట్గా 52 ల్యాబ్లు ఉన్నాయి. వీటిలో ఎప్పటికప్పుడు తని ఖీలు నిర్వహిస్తున్నాం. ఎవరైనా నిబంధనలు పాటించకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నాం. ఆస్పత్రిని బట్టి ధరలు ఉంటాయి. అధిక ధరలు వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికి రాలేదు. వచ్చే నెలలో ప్రైవేట్ ఆస్పత్రుల యజమానుల తో సమావేశం నిర్వహించి తగిన ఆదేశాలు జారీ చేస్తాం. – శ్రీరాం, డీఎంహెచ్ఓ -
భూసార పరీక్షలతో రైతులకు మేలు
నర్సాపూర్ రూరల్: రైతులు నూతన సాంకేతిక పద్ధతులను అందిపుచ్చుకొని వ్యవసాయం చే యాలని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు డాక్టర్ గీత, పద్మశ్రీ, గాయత్రి, శ్రీలత సూచించారు. బుధ వారం మండలంలోని నత్నయ్యపల్లి, అహ్మద్నగర్ గ్రామా ల్లో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమంలో పాల్గొని సాగు పద్ధతులపై అవగాహన కల్పించారు. రైతులు పంటలు సాగు చేసే ము ందు తమ భూముల్లో భూసార పరీక్షలు చేయించుకొని రిపోర్టు ఆధారంగా అనువైన పంటలను సాగు చేసుకోవాలన్నారు. రసాయన ఎరువులకు దూ రంగా ఉండి సేంద్రియ ఎరువులతో పంటలు సాగు చేసుకోవాలని తెలిపారు. ప్రతి రైతు తమ వివరాలు అందించి ఐడీ కార్డు పొందాలన్నారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారిని దీపిక, ఏఈఓలు చంద్రవేణి, తేజస్విని, రైతులు పాల్గొన్నారు. -
కొండపోచమ్మ బాగుంది
మర్కూక్(గజ్వేల్): మర్కూక్ మండల కేంద్రంలోని కొండపోచమ్మ సాగర్ను బుధవారం కోల్ ఇండి యా ఉద్యోగుల బృందం సందర్శించింది. ప్రాజెక్టు నిర్మాణం, అమలు చేసిన సాంకేతికత, ప్రాజెక్టు వల్ల రైతులకు కలిగే ప్రయోజనాల గురించి ఏఈఏలు శ్రీనివాస్, శుశాంత్.. బృందం సభ్యులకు వివరించారు. ప్రాజెక్టు నిర్మాణం జరిగిన తీరును, ప్రస్తుతం రైతుల పంట పొలాలకు కాల్వల ద్వారా నీటిని ఏ విధంగా వదులుతున్నామనే విషయాలను వారికి తెలిపారు. కొండపోచమ్మ సాగర్ నిర్మాణం బాగుందని వారు కితాబిచ్చారు.కోల్ ఇండియా ఉద్యోగుల బృందం కితాబు -
మసక చీకట్లో ఇసుక దోపిడీ!
పాటిగడ్డ కేంద్రంగా ఆగని దందారాత్రి 3 గంటల నుంచి ఉదయం 10 గంటల వరకు రవాణా గాడిద కష్టం.. దళారుల అదృష్టం! ● సీజ్ చేసిన ఇసుక కుప్పలు మాయంపొలాల్లో ఇసుక కుప్పల నిల్వలుపాపన్నపేట(మెదక్): గాడిద కష్టం.. దళారుల అదృష్టం అన్నట్లుంది ఇసుకాసురుల తిరకాసు దందా. జల వనరులను పరిరక్షించాల్సిన ఖద్దరు నాయకులే మంజీరా పాలిట జలగల్లా మారారన్న ఆరోపణలున్నాయి. స్థలం మార్చి.. అధికారులను ఏమార్చి మంజీరా నదిని ఎడారిగా మార్చే యత్నం చేస్తున్నారు. రాత్రి 3 గంటల నుంచి ఉదయం 10 గంటల వరకు దర్జాగా దందాను కొనసాగిస్తున్నారు. యూసుఫ్పేట శివారులోని పాటిగడ్డ కేంద్రంగా గాడిదలపై సాగుతున్న ఇసుక రవాణా దళారులకు కాసుల వర్షం కురిపిస్తుంది. ఖద్దరు బట్టల చాటున వ్యాపారం వేసేది తెల్లబట్టలు.. చేసేది చీకటి వ్యాపారం అన్నట్లుంది ఇసుక అక్రమ దందా తీరు. పాపన్నపేట మండలం చుట్టూ మంజీరా నది ఉండటంతో వర్షాకాలంలో భారీగా ఇసుక మేటలు పెడతాయి. దీంతో వేసవి రాగానే అక్రమార్కులు ఇసుక దందాకు తెరలేపుతారు. గతంలో ట్రాక్టర్లపై ఇసుక రవాణా చేసేవారు. రెవెన్యూ, పోలీస్ అధికారులు కేసులు నమోదు చేస్తుండడంతో ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ ప్రస్తుతం గాడిదలపై ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారు. ఒక్కో ట్రాక్టర్కు రూ. 6 వేలు వస్తుండటంతో ప్రధాన పార్టీల నాయకులు ఇసుక దందాలో పాలుపంచుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అధికారుల మొక్కుబడి దాడులు పత్రికల్లో వార్తలు వచ్చినప్పుడు మాత్రమే పోలీస్, రెవెన్యూ అధికారులు దాడులు చేసి డంపులు సీజ్ చేసి చేతులు దులుపుకుంటున్నారు. సీజ్ చేసిన ఇసుక కుప్పలకు ఓపెన్ టెండర్ నిర్వహించి, డబ్బులను డిపాజిట్ చేయాలి. కాని అవేవి చేయకపోవడంతో గతంలో సీజ్ చేసిన ఇసుక కుప్పలను అక్రమార్కులు యథేచ్ఛగా కొల్లగొట్టారన్న ఆరోపణలున్నాయి. ఒక వేళ టెండర్లు నిర్వహించినా, లోలోపల తతంగం అయిందనిపించి దళారులే వాటిని మొక్కబడి ధరలకు సొంతం చేసుకుంటున్నారు. ప్రస్తుతం పాటిగడ్డ ఇసుక దిబ్బగా మారిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల అధికారులు గాడిదల యజమానులను అక్కడి నుంచి కుర్తివాడకు తరలించగా, యూసుఫ్పేట వ్యాపారులు తిరిగి వారిని రప్పించుకున్నట్లు తెలుస్తుంది. ఈ విషయమై తహసీల్దార్ సతీష్ కుమార్ను వివరణ కోరగా.. పాటిగడ్డపై నిఘా పెట్టి ఇసుక అక్రమ రవాణా అడ్డుకొని, కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు.స్థలం మార్చి.. అధికారులను ఏమార్చియూసుఫ్పేట శివారులోని పాటిగడ్డ ప్రాంతంలో అక్రమ ఇసుక రవాణాపై ఇటీవల ‘సాక్షి’లో కథనాలు రావడంతో రెవెన్యూ, పోలీస్ అధికారులు దాడులు చేసి ఇసుక కుప్పలను సీజ్ చేశారు. దీంతో దళారుల కన్ను సంగమేశ్వర్రెడ్డి పొలం దగ్గర గల పాటిగడ్డపై పడింది. అక్కడ నాణ్యమైన ఇసుక ఉండటంతో నదిలోకి ప్రత్యేక రోడ్డు వేశారు. గ్రామీణ స్థాయి నుంచి మండల స్థాయి వరకు గల కొందరు ప్రధాన రాజకీయ పార్టీల నాయకులు గాడిదలపై ఒడ్డు వరకు ఇసుక తరలిస్తున్నారు. అక్కడి నుంచి సమీప పొలాల వరకు ట్రాక్టర్లపై రవాణా చేసి, అక్కడ నిల్వ చేస్తున్నారు. ఇందుకు గాను గాడిదల యజమానులకు రూ. 1,500, ట్రాక్టర్లో ఇసుక లోడ్ చేసే లేబర్కు రూ. 500 చెల్లిస్తున్నారు. ఒక్కో ట్రాక్టర్కు రూ. 5,500 నుంచి రూ. 6 వేల వరకు బయట అమ్ముకుంటున్నారు. -
బోధనలో సాంకేతికతను జోడించాలి
డీఈఓ రాధాకిషన్మెదక్ కలెక్టరేట్: విద్యార్థులకు చదువు పట్ల ఆసక్తి పెంచేలా బోధనలో సాంకేతికతను జోడించాలని డీఈఓ రాధాకిషన్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో రెండో విడత భౌతిక, రసాయనశాస్త్ర ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా డీఈఓ ఆకస్మికంగా సందర్శించి పలు సూచనలు చేశారు. అన్ని పాఠశాలల్లో ఐఎఫ్టీ ప్యానల్స్ అందుబాటులో ఉన్నందున, ఏఐ సాంకేతికతను ఉపయోగించి బోధించాలని సూచించారు. రిసోర్స్పర్సన్ సొంతంగా తయారు చేసిన బోధన అభ్యసన సామగ్రిని పరిశీలించారు. ఉపాధ్యాయులు కూడా ఇదే విధమైన బోధన అభ్యసన సామగ్రిని రూపొందించుకొని బోధించాలన్నారు. ప్రయోగాలు, కృత్యాలను వీడియో ద్వారా చిత్రీకరిస్తూ నేరుగా ఐఎఫ్టీ ప్యానల్స్లో వీక్షించే విధంగా సాఫ్ట్వేర్ అందుబాటులో ఉందన్నారు. ఉపాధ్యాయులంతా దీనిపై అవగాహన కలిగి ఉండాలన్నారు. అంతకుముందు డైట్ కళాశాలలో నిర్వహిస్తున్న జీవశాస్త్ర ఉపాధ్యాయుల శిక్షణ శిబిరాన్ని సందర్శించారు. కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి, కోర్స్ కోఆర్డినేటర్ రేఖ, రిసోర్స్ పర్సన్లు రాజ్కుమార్, మహేందర్, వెంకటరమణ పాల్గొన్నారు. -
ఐటీఐకి అడుగులు పడేనా?
మనోహరాబాద్(తూప్రాన్): మండలంలోని కాళ్లకల్, కూచారం, జీడిపల్లి, ముప్పిరెడ్డిపల్లి, కొండాపూర్ గ్రామాల్లో పరిశ్రమల వాడలు ఏర్పాటయ్యాయి. కాగా ఇక్కడి యువతకు ఉపాధి కల్పించే దిశగా ప్రజాప్రతినిధులు, అధికారులు దృష్టి సారించడం లేదు. ఉన్నత విద్యే కాకుండా సాంకేతిక విద్య కలిగిన వారికి పరిశ్రమల్లో ఎన్నో అవకాశాలు లభిస్తున్నాయి. అయితే అందుబాటులో ఐటీఐ కళాశాల లేకపోవడంతో స్థానిక విద్యార్థులు సాంకేతిక విద్యకు దూరమవుతున్నారు. ఇప్పటికై నా అధికారులు ప్రత్యేక దృష్టి సారించి ఐటీఐ ఏర్పాటుకు బాటలు వేయాలని పలువురు కోరుతున్నారు. కాగా పరిశ్రమల వాడ ఏర్పాటుకు రైతుల నుంచి భూములు సేకరించే సమయం (2007)లో అప్పటి భారీ పరిశ్రమల శాఖ మంత్రి గీతారెడ్డి ఇంటికి ఒకరి చొప్పున ఉపాధి కల్పిస్తామని, ఐటీఐ కళాశాల ఏర్పాటు చేయించి స్థానికులకు సాంకేతిక విద్యనందేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కానీ పరిశ్రమల ఏర్పాటుపై పెట్టిన దృష్టి యువత ఉపాధిపై పెట్టలేదని స్థానికులు వాపోతున్నారు. అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మనోహరాబాద్ మండల నేత ర్యాకల హేమలత జెడ్పీ చైర్పర్సన్గా ఎన్నికయ్యారు. ఆమె సైతం ఐటీఐ కళాశాల ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ ఇచ్చి ఏర్పాటు చేయలేకపోయారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో స్థానికుల్లో ఆశలు చిగురించాయి. ప్రజాప్రతినిధులు దృష్టి సారించి యువతకు ఉపాధి కల్పించేలా ప్రణాళికలు రచించి అందుబాటులో ఐటీఐ కళాశాల ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.పారిశ్రామికవాడలో ఏర్పాటుకు గతంలోనే హామీస్థల సేకరణకు కృషి చేశాం ముప్పిరెడ్డిపల్లి శివారులో గల పరిశ్రమల వాడలో కళాశాల ఏర్పాటుకు ప్రభుత్వ భూమి గురించి అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. ఫైల్ పైస్థాయిలో ఉండగా, ప్రభుత్వం మారింది. దీంతో ఐటీఐ ఏర్పాటుకు బ్రేక్ పడింది. – హేమలత, మాజీ జెడ్పీ చైర్పర్సన్ -
జూన్ 3 నుంచి రెవెన్యూ సదస్సులు
నర్సాపూర్: భూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా నిర్వహించే భూ భారతి రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని ఆర్డీఓ మహిపాల్ రైతులకు సూచించారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. జూన్ 3 నుంచి 20వ తేదీ వరకు డివిజన్ పరిధిలో భూ భారతి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తామని తెలిపారు. సదస్సులకు తహసీల్దార్లు హాజరై అర్జీలు స్వీకరిస్తారని చెప్పారు. రైతులు తమ భూములకు సంబంధించిన సమస్యలను సదస్సుల్లో అధికారుల దృష్టికి తేవాలని సూచించారు. నాణ్యమైన విత్తనాలు అమ్మాలి కౌడిపల్లి(నర్సాపూర్): రైతులకు నాణ్యమైన విత్తనాలు మాత్రమే అమ్మాలని ఏడీఏ పుణ్య వతి అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని మన గ్రోమోర్, ఆగ్రోస్ రైతుసేవా కేంద్రంతో పాటు పలు ఎరువుల దుకాణాల్లో ఏఓ స్వప్న, ఎస్ఐ రంజిత్రెడ్డితో కలిసి తనిఖీలు నిర్వహించారు. విత్తనాలు, ఎరువులతో పాటు కంపెనీ, లాట్ నంబర్, స్టాక్ పరిశీలించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రైతులకు నాణ్యమైన విత్తనాలు మాత్రమే విక్రయించాలని నిర్వాహకులను ఆదేశించారు. ప్రభు త్వం నిషేధించిన విత్తనాలు, పురుగు, గడ్డి మందు అమ్మవద్దని చెప్పారు. రైతులు కొనుగోలు చేసిన వాటికి బ్యాచ్, లాట్ నంబర్ ఉన్న రసీదు ఇవ్వాలన్నారు. కల్తీ విత్తనాలు అమ్మి రైతులను మోసం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అర్హత ఆధారంగా లబ్ధిదారుల ఎంపిక మెదక్ కలెక్టరేట్: అర్హత ఆధారంగా రాజీవ్ యువ వికాసం పథకానికి లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నట్లు కలెక్టర్ రాహుల్రాజ్ తెలిపారు. బుధవారం హైదరాబాద్ నుంచి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, బీసీ, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. పథకం కింద వచ్చే సహాయంతో యువత వ్యాపారం చేసి ఉపాధి పొందేలా ఎంపిక చేస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్, జెడ్పీ సీఈఓ ఎల్లయ్య, డీపీఓ యాదయ్య, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. బ్యూటీషియన్ కోర్సులో ఉచిత శిక్షణ నర్సాపూర్: నాబార్డు ఆధ్వర్యంలో మహిళలకు బ్యూటీషియన్ కోర్సులో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ రామకృష్ణారావు తెలిపారు. బుధవారం పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ సిబ్బందితో ఆయన ఉచిత శిక్షణపై సమీక్ష నిర్వహించారు. 18 సంవత్సరాలు నిండి 45 ఏళ్లలోపు ఉన్న మహిళలకు ఉచితంగా శిక్షణ ఇస్తారని చెప్పారు. ఆసక్తి ఉన్న మహిళలు ఈనెల 30వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాల ని సూచించారు. జూన్ మొదటివారంలో శిక్షణ ప్రారంభమయ్యే అవకాశం ఉంటుందని కమిషనర్ వివరించారు. అభ్యర్థులు పదో తరగతి చదివి ఉండాలని, ఆధార్ కార్డు జిరాక్స్, పాస్పోర్ట్ సైజ్ ఫొటోను తమ కార్యాలయంలోని మెప్మా సిబ్బందికి అందజేయాలన్నారు. సమావేశంలో జిల్లా మెప్మా పీడీ ఇందిర, కోఆర్డినేటర్ దేవపాల తదితరులు పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలిరామాయంపేట(మెదక్): ప్రపంచ పర్యావరణ వారోత్సవాల్లో భాగంగా బుధవారం రోడ్ల పక్కన పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలను అటవీ సిబ్బంది తొలగించారు. అక్కక్కన్నపేట బీట్ పరిధిలోని రోడ్డు పక్కన బాటసారులు వేసిన ప్లాస్టిక్ సీసాలను తొలగించి అవగాహన కల్పించారు. ఈసందర్భంగా రేంజ్ అధికారి విద్యాసాగర్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డిప్యూటీ రేంజ్ అధికారి శ్రీనివాస్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
చివరి గింజ వరకు కొంటాం
కలెక్టర్ రాహుల్రాజ్రామాయంపేట(మెదక్)/తూప్రాన్/మనోహరాబాద్/చేగుంట: కలెక్టర్ రాహుల్రాజ్ బుధవారం జిల్లాలో విస్తృతంగా పర్యటించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించడంతో పాటు ఎరువులు, విత్తన దుకాణాలను తనిఖీ చేశారు. ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలను పరిశీలించారు. మనోహరాబాద్ మండలంలోని దండుపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. కొనుగోళ్లు పూర్తి చేసేలా చొరవ చూపించాలని నిర్వాహకులను ఆదేశించారు. ముందస్తు వర్షాలతో ధాన్యం సేకరణలో ఇబ్బందులు తలెత్తున్నాయని తెలిపారు. తడిసిన ధాన్యం కొను గోలు చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం తూప్రాన్ ఎంపీడీఓ కార్యాలయం వద్ద నిర్మించిన ఇందిరమ్మ ఇంటి నమూనాను పరిశీలించారు. జిల్లాలో 9 వేల మంది ఇళ్లు లేని నిరుపేదలను గుర్తించామన్నారు. ఎంపీడీఓ భవనం కోర్టు నిర్వహణకు అనుకూలంగా ఉందని, ఎంపీడీఓ కార్యాలయాన్ని ఇంటిగ్రేటేడ్ మార్కెట్లో కొనసాగించేందుకు ఉన్నతాధికారులతో చర్చించి త్వరలోనే చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే చేగంటలో ఓ ఫర్టిలైజర్ దుకాణాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. రైతులకు వానాకాలం సీజన్కు సంబంధించి ఎరువులు, విత్తనాలకు ఎలాంటి కొరత లేకుండా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. వ్యవసాయ, పోలీస్శాఖల సమన్వయంతో టాస్క్ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. అనంతరం రామాయంపేటలో పర్యటించారు. మల్లె చెరువులోకి మురుగు నీరు రాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అసంపూర్తిగా నిలిచిపోయిన మినీ ట్యాంక్బండ్ పనులను పరిశీలించారు. చెరువు సుందరీకరణకు మంచి అవకాశం ఉందని, ఈమేరకు అధికారులు ప్రతిపాదనలు తయారు చేయాలని సూచించారు. ఆయన వెంట వివిధశాఖల అధికారులు, నాయకులు ఉన్నారు. -
ఇన్చార్జీల పాలన ఇంకెన్నాళ్లు?
● అదనపు కలెక్టర్ నుంచి అంతా ఇన్చార్జీ అధికారులే ● రెగ్యులర్ అధికారుల నియామకం ఎప్పుడు? ● అవస్థలు పడుతున్న ప్రజలు మెదక్ కలెక్టరేట్: ఇన్చార్జీల పాలనతో జనం సతమతమవుతున్నారు. సకాలంలో సమస్యలు పరిష్కారానికి నోచుకోక కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. మెదక్ జిల్లా కేంద్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇన్చార్జీ అధికారులతోనే నెట్టుకొస్తున్నారు. ఇతర జిల్లాలో విధులు నిర్వహిస్తున్న అధికారులకు అదనపు బాధ్యతలను అప్పగిస్తున్నారు. దీంతో ఎడ్కడా న్యాయం చేయలేక పోతున్నారు. సమస్యలు కూడా పేరుకుపోతున్నాయి. ముఖ్యంగా కార్మికశాఖ అధికారిగా సంగారెడ్డికి చెందిన యాదయ్యను అదనపు బాధ్యతలు అప్పగించారు. ఆయన ఇప్పటి వరకు ప్రజలకు కనిపించిన దాఖలాలు లేవు. ప్రస్తుతం జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్గా ఎవరు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారో ఎవరికి అర్థంకాని పరిస్థితి. స్థానిక సంస్థల అధికారిగా నగేష్ జిల్లాలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, రెవెన్యూశాఖ అదనపు కలెక్టర్ రెండు పోస్టులు ఉన్నాయి. ఇందులో ప్రస్తుతం రెవెన్యూశాఖ అదనపు కలెక్టర్గా నగేష్ విధులు నిర్వహిస్తుండగా, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పోస్టు ఖాళీగా ఉంది. దీంతో ఆ బాధ్యతలు కూడా నగేష్ నిర్వర్తిస్తున్నారు. అలాగే.. గత డిసెంబర్లో ఆహార భద్రత అధికారి స్వాదీప్కుమార్ బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి శిక్షణలోనే ఉన్నారు. సంగారెడ్డి జిల్లాకు చెందిన అధికారి యాదయ్యకు అదనపు బాధ్యతలు ఇచ్చారు. జిల్లా ప్రజలకు దర్శనమిచ్చిన దాఖలాలేవనే చెప్పాలి. కాగా ప్రస్తుతం ఆయన ఇన్చార్జీ బాధ్యతల నుంచి తప్పుకున్నట్లు సమాచారం. దీంతో ప్రస్తుతం శాఖకు అధికారి లేరు. లేబర్కార్డుతోపాటు సంక్షేమ పథకాలపై దరఖాస్తులు చేసుకున్న కార్మికులు అధికారి రాక సమస్యలు పరిష్కారానికి నోచుకోక కార్యాలయానికి తిరుగుతున్నారు. మెదక్ వ్యవసాయ అధికారి గోవింద్ నాలుగు నెలల క్రితం వ్యక్తిగత కారణాలతో దీర్ఘకాలిక సెలవుపై వెళ్లారు. దీంతో వ్యవసాయ శాఖ టెక్నికల్ అధికారి వినయ్కుమార్కు అదనపు వ్యవసాయ అధికారిగా బాధ్యతలు అప్పగించారు. ఇంకా కొన్ని శాఖలు జిల్లా మైనింగ్, ఎకై ్సజ్, ఎంప్లాయిమెంట్, పశు సంవర్ధక, బీసీ సంక్షేమశాఖ అధికారి, జిల్లా ఇంటర్మీడియెట్ అధికారి, లీగల్ మెట్రాలజీ, భూగర్భ జలశాఖ, విజయ డెయిరీ, వయోజన విద్యాశాఖ, డీఎల్పీఆర్ఓ, కో ఆపరేటీవ్ శాఖ, మార్కెటింగ్ ఏడీ, మార్క్ఫెడ్, హ్యండ్లూమ్, డీఎం సోలార్, ఆరోగ్యశ్రీ శాఖలు ఇన్చార్జీలతోనే కొనసాగుతున్నాయి. -
విత్తనాలు, ఎరువుల కొనుగోళ్లలో అప్రమత్తం అవసరం
మెదక్ మున్సిపాలిటీ: మరికొద్ది రోజుల్లో వానాకాలం సాగు ప్రారంభం కానుంది. విత్తనాలు, ఎరువులు సమకూర్చుకునే సమయం ఆసన్నమైంది. ఈ సమయంలో పలు విత్తన కంపెనీల ప్రచారం ఊపందుకుంది. పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నా.. ప్రైవేట్ కంపెనీలు ఆకర్షణీయమైన ప్రకటనలతో ప్రచార ఆర్భాటాలు సాగిస్తున్నాయి. విత్తనాలకు సంబంధించిన కంపెనీలు పట్టణాల్లో, గ్రామాల్లో రైతులను ఆకట్టుకునేలా కరపత్రాలు, వాల్ పోస్టర్లు, బ్యానర్లు ఏర్పాటు చేస్తున్నాయి. మైక్ సెట్ల ద్వారా ప్రచారం చేస్తున్నారు. ఆయా కంపెనీల ప్రచారాలతో రైతులు మోస పోకుండా అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. జిల్లాలో సీడ్స్, ఫర్టిలైజర్, ఫెస్టిసైడ్ లైసెన్స్ కలిగిన మొత్తం 312 దుకాణాలు ఉన్నాయి. జిల్లాలో మొత్తం 3.05 లక్షల ఎకరాల్లో వరి పంట సాగు కానుంది. ఇందుకోసం 91.530 మెట్రిక్ టన్నుల విత్తనాలు అవసరం అవుతాయి. అలాగే 25 వేల మెట్రిక్ టన్నుల యూరియా, 1.912 డీఏపీ, కాంప్లెక్స్ ఎరువులు, 28,400 మెట్రిక్ టన్నులు అవసరం అవుతాయి. ప్రకటనలు చూసి మోస పోవద్దు పలు కంపెనీలు చేసే ప్రచారాలు, ప్రకటనలు చూసి విత్తనాలు కొనుగోలు చేసి మోసపోవద్దు. ఆకర్షణీయమైన ప్యాకింగ్తో గుర్తింపులేని లేబుళ్లతో కొన్ని కంపెనీలు రైతులకు నకిలీ విత్తనాలు అంటగడుతున్నాయి. కంపెనీలపై అప్రమత్తంగా ఉండాలి. అన్ని సరి చూసుకున్నాకే నమ్మకం కలిగితేనే కొనుగోలు చేయాలి. విత్తన కంపెనీపై ప్రభుత్వ నిబంధనల వివరాలు ఉన్నాయో లేదా? అన్న విషయాలను జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. ముఖ్యంగా విత్తనాలను ఉత్పత్తి చేసే కంపెనీపై నమ్మకం ఉండాలి. కంపెనీల ప్రకటనలతో మోసపోవద్దు గుర్తింపు పొందిన విత్తనాలే మేలు వ్యవసాయం అధికారుల సూచనలునకిలీ విత్తనాలు అరికట్టేందుకు టాస్క్ఫోర్స్ బృందం జిల్లాలో నకిలీ విత్తనాలు అరికట్టేందుకు ఇటీవల కలెక్టర్ రాహుల్రాజ్ ప్రత్యేకంగా వ్యవసాయ అధికారులు, పోలీసులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా టాస్క్పోర్స్ బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ బృందం జిల్లాలో విస్తృతంగా పర్యటించి అన్ని ఎరువులు, విత్తనాల దుకాణాలను తనిఖీ చేయనుంది. ప్రస్తుతం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో గ్రామాల్లో రైతులతో సమావేశాలు నిర్వహించి నకిలీ విత్తనాలు, ఎరువులపై అవగాహన కల్పిస్తున్నారు. ఇటీవల ఎస్పీ ఉదయ్కుమార్రెడ్డి సైతం జిల్లాలో నకిలీ విత్తనాల అమ్మకాన్ని అరికట్టేందుకు కఠిన చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. –విన్సెంట్ వినయ్, జిల్లా వ్యవసాయ అధికారిఎరువులు కొనే ముందు: లైసెన్స్ కలిగిన డీలర్ నుంచే ఎరువులు కొనుగోలు చేయాలి మిషన్ కుట్టుతో ఉన్న ఎరువుల బస్తాలనే కొనుగోలు చేయాలి. ఎరువుల బస్తాకు చేతికుట్టు ఉంటే సీలు ఉందో లేదో చూసుకోవాలి చిల్లులు పడిన, చిరిగిన ఎరువుల బస్తాలను కొనవద్దు అన్య పదార్థాలు కలిస్తే ఎరువును కల్తీగా గుర్తించాలి కొనుగోలు చేసే సమయంలో డీలర్ రికార్డులో రైతు విధిగా సంతకం చేయాలి ఎరువుల నాణ్యతపై అనుమానం ఉంటే వెంటనే వ్యవసాయ అధికారి సహకారంతో ఎరువులను పరీక్షలకు పంపించాలి. లైసెన్స్ కలిగిన వాటిల్లో కొనాలి లైసెన్స్ పొందిన డీలర్ల నుంచే విత్తనాలు కొనుగోలు చేయాలి కొనుగోలు చేసిన సమయంలో బిల్లులను సరిచూసుకోవాలి బిల్లుపై దుకాణం పేరు, కేంద్ర, రాష్ట్ర, అమ్మకపు పన్ను నంబర్, రైతు, గ్రామం పేరు విక్రయదారుడి సంతకం, తేదీలు, విత్తన రకం పేరు, బ్యాచ్ నంబర్, గడువు తేదీలు, నికర తూకం, నికర ధర, కంపెనీ పేరు ఉన్నాయో లేదో సరిచూసుకోవాలి. పగిలిన ప్యాకెట్లు, తెరిచిన డబ్బాల నుండి విత్తనాలు కొనుగోలు చేయ్యేద్దు. విత్తన ప్యాకెట్, సీసా, బస్తా, డబ్బాలకు సీలు ఉందో లేదో నిర్ధారించుకోవాలి. కొనుగోలు చేసిన విత్తనాలను డీలర్ వద్దనే తూకం వేసి సరిచూసుకోవాలి. విత్తనాలు కొనుగోలు చేసిన బిల్లులను పంటకాలం పూర్తయ్యే వరకు భద్రపర్చాలి. విత్తనాలు మొలకెత్తే దశ, పూత దశలో పంటలో లోపం కనిపిస్తే వెంటనే వ్యవసాయ శాఖ అధికారిని సంప్రదించాలి. -
విస్తరిస్తున్న మైక్రో ఫైనాన్స్లు గతంలో అమాయక ప్రజల ప్రాణాలు బలి గొన్న మైక్రో ఫైనాన్స్లు జిల్లాలో చాపకింద నీరులా మళ్లీ విస్తరిస్తున్నాయి. వివరాలు 9లోu
చివరి గింజ వరకు కొంటాం● రైతులు అధైర్య పడొద్దు ● కలెక్టర్ రాహుల్రాజ్ మెదక్ కలెక్టరేట్: రైతులు అఽధైర్య పడొద్దని, చివరి గింజ వరకు పూర్తి స్థాయిలో వరిధాన్యం కొనుగోలు చేస్తామని కలెక్టర్ రాహుల్రాజ్ తెలిపారు. జిల్లాలో ఇప్పటి వరకు 2,75,392 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని, ఇది గత ఏడాది కంటే ఎక్కువ మొత్తమని పేర్కొన్నారు. ఈ ధాన్యాన్ని సంబంధించి 66,133 మంది రైతులకు రూ.501 కోట్లు వారి ఖాతాల్లో జమ చేశామని తెలిపారు. గత సంవత్సరం ఇదే సమయానికి 2,48,374 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసి 57,657 మంది రైతులకు రూ.423.73 కోట్లు చెల్లించినట్లు చెప్పారు. ఈ ఏడాది గతంలో కంటే మెరుగ్గా కొనుగోలు ప్రక్రియ నిర్వహించినట్లు వివరించారు. కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తామని రైతులు ఎవరూ అధైర్య పడవద్దని భరోసా కల్పించారు. క్షేత్రస్థాయిలో అధికారులు పర్యటించి ధాన్యం కొనుగోలులో ఎటువంటి అసౌకర్యం కలుగకుండా రైతులకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నిర్వహించిన జిల్లా కలెక్టర్ల సమావేశంలో మేడ్చల్ నుంచి కలెక్టర్ రాహుల్రాజ్ పాల్గొనగా.. మెదక్ కలెక్టరేట్ నుంచి అదనపు కలెక్టర్ నగేష్, ఆర్డీఓ రమాదేవి, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
సీజనల్ వ్యాధులపై ప్రత్యేక దృష్టి
సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని మున్సిపల్ ప్రత్యేక అధికారిణి, మెదక్ ఆర్డీవో రమాదేవి ఆదేశించారు. మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. వర్షాకాలం సమీపిస్తుండటంతో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. దీంతో పారిశుద్ధ్య కార్యక్రమం పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. తడి, పొడి చెత్త సేకరణతోపాటు పట్టణంలోని ఇళ్లలో పాత టైర్లు, కూలర్లు, ఇతర ప్రదేశాల్లో నీరు నిల్వ లేకుండా చూడాలన్నారు. నీరు నిలిస్తే దోమలు వ్యాప్తి చెందుతాయని పేర్కొన్నారు. ప్రతి వారం అన్ని వార్డుల్లో ఫాగింగ్ చేయాలని, మురుగు కాలువలు శుభ్రపర్చాలని ఆమె ఆదేశించారు. పారిశుద్ద్య కార్యక్రమాలకు సంబంధించి ప్రతి రోజూ వివరాలు రిజిస్టర్లో నమోదు చేయాలన్నారు. చెత్త సేకరణ సక్రమంగా కొనసాగాలని ఆర్డీవో ఆదేశించారు. -
ప్రజారోగ్యానికి పెద్దపీట
ఎమ్మెల్యే రోహిత్రావు మెదక్ కలెక్టరేట్: నియోజకవర్గ అభివృద్ధి, ప్రజారోగ్య పరిరక్షణకు పెద్దపీట వేశామని ఎమ్మెల్యే రోహిత్ రావు అన్నారు. మెదక్, రామాయంపేట మున్సిపాలిటీల ప్రత్యేక అధికారిగా మెదక్ ఆర్డీఓ రమాదేవికి బాధ్యతలు అప్పగించామని తెలిపారు. రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని శానిటేషన్పై స్పెషల్ డ్రైవ్లు చేపట్టామన్నారు. ప్రజలకు జ్వరాలు సోకకుండా ఉండేందుకు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి నర్సాపూర్: ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని స్థానిక బీవీ రాజు ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ సంజయ్దూబె కోరారు. మంగళవారం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఐఈఈఈ ఎస్బీ అండ్ పీఈఎస్ సొసైటీ భాగస్వామ్యంతో బీవీ రాజు ఇంజనీరింగ్ కాలేజీలోని ఈఈఈ బ్రాంచ్ ఆధ్వర్యంలో సమాజ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఐటీఐ, డిగ్రీ విద్యార్థులకు వారం రోజుల పాటు ఈ శిక్షణ నిర్వహించనున్నామని చెప్పారు. సౌర విద్యుత్ ఉత్పత్తి, వినియోగం, సౌర వ్యవస్థల నిర్వహణ, విద్యుత్ భద్రతా చర్యలు, విద్యుత్ వాహన సాంకేతికత తదితర అంశాలపై ఉచిత శిక్షణ కార్యక్రమంలో విద్యార్థులకు అవగాహన కల్పిస్తారని ఆయన వివరించారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఈఈఈ హెచ్ఓడీ రాయుడును ప్రిన్సిపాల్ సంజయ్దూబె అభినందించారు. కార్యక్రమంలో మేనేజర్ బాపిరాజు, ఏఏఓ సురేష్ తదితరులు పాల్గొన్నారు. 166 మంది గైర్హాజరు ఇంటర్ నోడల్ ఆధికారి మాధవి మెదక్ కలెక్టరేట్: జిల్లాలో ఇంటర్ సప్లమెంటరీ పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. మంగళవారం ఉదయం మొదటి సంవత్సర విద్యార్థులకు కెమిస్ట్రీ, కామర్స్ పరీక్షలు జరిగాయి. మొత్తం 2,332 మంది విద్యార్థులకు గానూ 122 మంది గైర్హాజరయ్యారు. అలాగే మధ్యాహ్నం ద్వితీయ సంవత్సర విద్యార్థులకు జరిగిన పరీక్షలకు మొత్తం 761 మంది హాజరు కావాల్సి ఉండగా 44 మంది గైర్హాజయ్యారు. ఉదయం, మధ్యాహ్నం జరిగిన పరీక్షల్లో మొత్తం 166 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు జిల్లా ఇంటర్ నోడల్ ఆధికారి మాధవి తెలిపారు. తీర్ధ యాత్రలకు ప్రత్యేక రైళ్లు ● జూన్ 14 నుంచి ప్రారంభం ● ఐఆర్సీటీసీ జనరల్ మేనేజర్ కిశోర్ మెదక్ కలెక్టరేట్: తీర్థయాత్రలకు వెళ్లే వారికోసం రైల్వేశాఖ ప్రత్యేక రైళ్లను నడిపిస్తుందని ఐఆర్సీటీసీ జనరల్ మేనేజర్ కిశోర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జూన్ 14 నుంచి జూలై 13వ తేదీ వరకు తెలుగు రాష్ట్రాల ప్రజల కోసం రెండు ప్యాకేజీలుగా ప్రత్యేక రైళ్లను హైదరాబాద్ నుంచి ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ప్రయాణ బీమా, అలాగే రైల్వే స్టేషన్ నుంచి దేవాలయాలకు ప్రయాణం పూర్తిగా ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపారు. ప్రతి రైలులో 718 మంది ప్రయాణికులు ఉంటారని, ప్రతి 70 మందికి ఇద్దరు కోఆర్డినేటర్లు అందుబాటులో ఉండి అన్ని సౌకర్యాలు అందజేస్తారని తెలిపారు. రైలులో సీసీ కెమెరాలతో కూడిన భద్రతా ఉంటుందని చెప్పారు. పూర్తి వివరాలకు, టికెట్ బుకింగ్ కోసం 97013 60701, 92810 30712, 92814 95845, 92810 30749, 92810 30750లకు సంప్రదించాలని కోరారు. క్రీడల హాస్టళ్లకు విద్యార్థుల ఎంపిక మెదక్ కలెక్టరేట్: రాష్ట్రంలోని రీజినల్ స్పోర్స్ హాస్టళ్లలో చేరడానికిగాను ఆసక్తి గల క్రీడాకారు లు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా యువజన క్రీడల అధికారి దామోదర్రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. జూన్ ఒకటి నుంచి 13వ తేదీ వరకు ఎంపిక పోటీలు ఉంటాయని తెలిపారు. వాలీబాల్, సైక్లింగ్, జిమ్నాస్టిక్, స్విమ్మింగ్, అథ్లెటి క్స్, హ్యాండ్బాల్, హాకీ క్రీడల్లో పోటీలు ఉంటా యని పేర్కొన్నారు. 10 నుంచి 12 ఏళ్లలోపు వా రికి జిమ్నాస్టిక్, స్విమ్మింగ్ 12 నుంచి 16 లోపు వారికి అథ్లెటిక్స్, సైక్లింగ్, హ్యాండ్బాల్, హాకీ, వాలీబాల్, కుస్తీ పోటీలు ఉంటాయని తెలిపా రు. సమాచారం కోసం జిల్లా యువజన కార్యా లయంలో సంప్రదించాలని సూచించారు. -
స్పాట్ రిజిస్ట్రేషన్లు
స్లాట్ లేకున్నాసాక్షిప్రతినిధి, సంగారెడ్డి: స్లాట్ బుకింగ్ విధానం అమలవుతున్న సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ప్ర యోగాత్మకంగా వాక్–ఇన్ రిజిస్ట్రేషన్లకు కూడా అవకాశం కల్పించారు సదాశివపేట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం అధికారులు. దీంతో స్లాట్ బుక్ చేసుకోని వారు కూడా వాక్ – ఇన్ రిజిస్ట్రేషన్లు చేసుకుంటున్నారు. సోమవారం మొత్తం 19 స్లాట్లు బుక్ కాగా, ఇందులో 20 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఇలా స్లాట్ బుక్ చేసుకోకుండా..వాక్ – ఇన్ పద్ధతిలో ఐదు డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్లు జరిగాయి. అలాగే గజ్వేల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో కూడా వాక్–ఇన్ రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు. వివిధ రకాల స్థిరాస్తుల రిజిస్ట్రేషన్ల ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు ప్రభుత్వం కొత్తగా స్లాట్ బుకింగ్ విధానాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ప్రయోగాత్మకంగా సదాశివపేట, గజ్వేల్, సిద్దిపేట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల (ఎస్ఆర్ఓ)ల్లో ఈ విధానాన్ని అమలు చేస్తోంది. తప్పిన పడిగాపులు ఏదైనా డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే సంబంధిత వ్యక్తులు ముందుగా ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ స్లాట్లో కేటాయించిన సమయానికి ఎస్ఆర్ఓ కార్యాలయానికి వెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. దీంతో రిజిస్ట్రేషన్ల కోసం ఉదయం నుంచి సాయంత్రం వరకు గంటల తరబడి కార్యాలయంలో పడిగాపులు కాయాల్సిన అవసరం ఉండదు. అలాగే ఈ రిజిస్ట్రేషన్ ఉంటే రోజంతా పనులు మానుకోవాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఈ సమస్యలకు చెక్ పెట్టేందుకు ఈ స్లాట్ బుకింగ్ విధానం అమలు చేస్తున్నారు. వాక్ – ఇన్ రిజిస్ట్రేషన్లు అంటే.. రిజిస్ట్రేషన్ల కోసం స్లాట్ బుక్ చేసుకోని వారు ఈ వాక్ – ఇన్ విధానాన్ని వినియోగించుకోవచ్చు. ప్రతీరోజు సాయంత్రం 5 గంటల నుంచి ఆరు గంటల వరకు ఈ విధానంలో రిజిస్ట్రేషన్లు చేస్తారు. స్లాట్ బుక్ చేసుకోనివారు నేరుగా సాయంత్రం 5 గంటలకు కార్యాలయానికి వెళితే ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేస్తారు. అయితే వాక్ – ఇన్ విధానంలో రోజుకు ఐదు రిజిస్ట్రేషన్లకు మాత్రమే ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని ఆశాఖ ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. ఇలా వాక్ – ఇన్ విధానంలో ఎక్కువగా బ్యాంకు లోన్లకు సంబంధించిన మార్ట్గేజ్ డాక్యుమెంట్లు, రిలీజ్ డీడ్లు రిజిస్ట్రేషన్ అవుతున్నాయని ఆశాఖ వర్గాలు చెబుతున్నాయి. ఒక్కో రోజు 48 స్లాట్లు.. స్లాట్ బుకింగ్ విధానంలో ఒక్కో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రోజుకు 48 స్లాట్లు బుక్ చేసుకునే అవకాశం కల్పించారు. 48కి మించి స్లాట్లు బుక్ చేయడానికి వీలు లేదు. అయితే ప్రస్తుతం రియల్ ఎస్టేట్ వ్యాపారం కుదేలవడంతో డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్లు చాలా మట్టుకు పడిపోయాయి. ప్రస్తుతానికి 48 డాక్యుమెంట్లకు మించి అవసరం పడటం లేదని ఆశాఖ వర్గాలు చెబుతున్నాయి. అయితే ప్రభుత్వం జూన్ 2 నుంచి అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఈ స్లాట్ విధానాన్ని అమలు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.మంచి ఫలితాలనిస్తోంది ఉమ్మడి జిల్లాలో ప్రస్తుతం సదాశివపేట, గజ్వేల్, సిద్దిపేట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఈ స్లాట్ బుకింగ్ విధానం అమలవుతోంది. అయితే ఈ విధానం మంచి ఫలితాలినిస్తోంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ తొందరగా జరుగుతోంది. దీంతో రిజిస్ట్రేషన్ కోసం వచ్చే వారికి ఎంతో సౌకర్యంగా ఉంటోంది. స్లాట్లో పేర్కొన్న నిర్ణీత సమయానికి వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకుని వెళుతున్నారు. లైన్లో నిలబడటం, గంటల తరబడి వేచి ఉండటం వంటి తిప్పలు తప్పుతున్నాయి. –ఐ.వి.సుబ్బలక్ష్మి, జిల్లా రిజిస్ట్రార్, ఉమ్మడి మెదక్ జిల్లా అత్యవసరమైన వారి కోసమే ఈ సేవలంటున్న అధికారులు రోజుకు ఐదు చొప్పున డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్కు అవకాశం -
పొంచి ఉన్న సీజనల్ గండం
రామాయంపేట(మెదక్): మున్సిపాలిటీ పరిధిలో పారిశుద్ధ్య సమస్య ప్రధాన సమస్యగా మారింది. దీంతో పట్టణ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పట్టణంలో ఎక్కడిక్కడ చెత్తా చెదారం పేరుకుపోవడం, ఫాగింగ్ చేపట్టకపోవడంతో దోమల బెడద ఎక్కువైంది. వర్షాకాలం ప్రారంభం కావడంతో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నా.. మున్సిపల్ అధికారులు ఏ మాత్రం ముందస్తు చర్యలు చేపట్టడం లేదని విమర్శలు వినవస్తున్నాయి. ఇటీవల నిర్వహించిన సమీక్ష సమావేశంలో మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ అస్తవ్యస్త పారిశుద్ధ్యం నిర్వహణపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే మునిసిపల్ ప్రత్యేక స్పెషల్ అధికారిగా మెదక్ ఆర్డీవో రమాదేవిని నియమించారు. రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో ప్రతి రోజూ ఏడు మెట్రిక్ టన్నుల మేర చెత్తను సేకరిస్తున్నారు. 40 మంది పారిశుద్ధ్య సిబ్బంది, రెండు ట్రాక్టర్లు, మూడు ఆటోల్లో చెత్తను సేకరిస్తున్నారు. వారు సేకరించిన చెత్తను పట్టణానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఎక్కలదేవి బండపై ఉన్న డంపు యార్డులో వేస్తున్నారు. కొత్తగా మురుగు కాల్వల నిర్మాణం చేపట్టకపోవడంతో గతంలో నిర్మించినవి పాక్షికంగా దెబ్బతిన్నాయి. వాటిలో చెత్త పేరుకుపోవడంతో స్థానికులు ఇబ్బందుల పాలవుతున్నారు. మురుగు కాలువల్లో క్రిమి సంహారక మందు చల్లడానికిగాను రూ.లక్షల వ్యయం చేసి రెండు ఫాగింగ్ యంత్రాలు కొనుగోలు చేశారు. వీటితోపాటు గడ్డి కత్తిరించే యంత్రాలు ఉన్నా ఏవీ పనిచేయడంలేదు. కాగా, వర్షాకాలం సమీపిస్తుండటంతో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పారిశుద్ద్యం విషయమై ఎందుకు చర్యలు తీసుకోవడంలేదని,..? వెంటనే తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పడకేసిన పారిశుద్ధ్యం ఎక్కడి చెత్త అక్కడే.. ఫాగింగ్ యంత్రాలు నిరుపయోగం పట్టించుకోని మున్సిపల్ అధికారులు కార్యాచరణ రూపొందించాం రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో పారిశుద్ధ్యం విషయమై ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. ఇందుకుగాను కార్యాచరణ రూపొందించాం. మురుగు కాలువల్లో ఫాగింగ్ చేయడంతో పాటు ఆయిల్ బాల్స్ వేయిస్తున్నాం. ఎక్కడా నీరు నిల్వ ఉండకుండా చర్యలు చేపట్టాం. –దేవేందర్, మున్సిపల్ కమిషనర్ -
● ధాన్యం కొనండి.. మహాప్రభో..
అల్లాదుర్గం(మెదక్): ఆరుగాలం అష్టకష్టాలు పడి పండించిన ధాన్యాన్ని అమ్ముకునేందుకు రైతన్నలు కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. 10 రోజుల క్రితం కాంటా చేసినా ధాన్యం తరలించకపోవడంతో కేంద్రం వద్దే జాగారం చేస్తున్నారు. మరికొంత మంది రైతుల ధాన్యం తూకం కాకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు వర్షాలు పడుతుండటంతో ఎక్కడ నష్టపోవాల్సి వస్తుందేమోనని ఆందోళన చెందుతున్నారు. ఈక్రమంలో సోమవారం అల్లాదుర్గం రైతులు కొనుగోలు కేంద్రం వద్ద ఆందోళన చేపట్టారు. ఎన్ని రోజులు ఊరి బయటపడుకోవాలని తహసీల్దార్ మల్లయ్యను కలిసి మొరపెట్టుకున్నారు. ఈసందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ.. మ్యాచర్ వచ్చిన ధాన్యం కొనుగోలు చేస్తామని చెప్పారు. కొల్చారం(నర్సాపూర్): యాసంగి పంటను అమ్ముకునేందుకు రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. ఆరబెట్టిన ధాన్యం ఎండకు ఎండుతూ.. వానకు తడుస్తుండటంతో ఆందోళన చెందుతున్నారు. మండలంలోని తుక్కాపూర్, కోనాపూర్, ఏటిగడ్డ మాందాపూర్ గ్రామాల్లో ఆలస్యంగా వరి కోతలు అయ్యాయి. ధాన్యాన్ని ఆరబెడుతున్న క్రమంలో వర్షాలతో ఇబ్బందులు పడుతున్నారు. తడిసిన వడ్లు కొన్నిచోట్ల మొలకెత్తుతుండగా, మరికొన్ని చోట్ల ముక్కిపోయి ముద్దలుగా మారుతున్నాయి. గతంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితిని చూడలేదని రైతులు వాపోతున్నారు. ఇంకెన్ని రోజులు కల్లాల వద్ద గడపాలని, అధికారులు స్పందించి తడిసిన ధాన్యాన్ని వెంటనే తూకం వేసి రవాణా చేయాలని కోరుతున్నారు. -
సత్వర పరిష్కారం చూపండి
మెదక్ కలెక్టరేట్: ప్రజావాణి అర్జీలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అదనపు కలెక్టర్ నగేష్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమ వారం కలెక్టరేట్లో జిల్లాస్థాయి ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజావాణి వినతులను పెండింగ్లో పెట్టవద్దని సూచించారు. భూ సమస్యలపై 19, పెన్షన్ల కోసం 3, డబుల్ బెడ్రూం ఇళ్లకు సంబంధించి 1, ఇతర సమస్యలపై 29 కలిపి మొత్తం 52 అర్జీలు వచ్చాయి. కార్యక్రమంలో జెడ్పీసీఈఓ ఎల్లయ్య, డీఆర్డీఓ శ్రీనివాస్రావు, ఏఓ యూనస్తో పాటు ఆయాశాఖల అధికారులు పాల్గొన్నారు. అదనపు కలెక్టర్ నగేష్ ప్రజావాణికి 52 వినతులు -
సర్వేయర్ల శిక్షణ ప్రారంభం
మెదక్ కలెక్టరేట్: భూ లావాదేవీల్లో పారదర్శకత కోసమే లైసెన్స్డ్ సర్వేయర్లకు శిక్షణ ఇస్తున్నట్లు అదనపు కలెక్టర్ నగేష్ తెలిపారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఐటీఐ పరిధిలో గల ఆర్ట్స్ క్యాంపస్లో మొదటి విడత శిక్షణ కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించి మాట్లాడారు. తెలంగాణ అకాడమీ ఆఫ్ ల్యాండ్ ఇన్ఫర్మేషన్ అండ్ మేనేజ్మెంట్ (తాలిమ్) నుంచి లైసెన్స్ సర్వేయర్ శిక్షణకు అర్హత కలిగిన అభ్యర్థులు జిల్లా నుంచి మొదటి విడతలో మొత్తం 116 మంది దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. వీరికి రెండు నెలల శిక్షణ ఉంటుందన్నారు. శిక్షణ అనంతరం అభ్యర్థులు క్షేత్రస్థాయిలో పక్కా ప్రణాళికతో ప్రభుత్వం తరఫున విధులు నిర్వర్తించాల్సి ఉంటుందన్నారు. భూ భారతి కార్యక్రమంలో దరఖాస్తు చేసుకున్న పట్టాదారుని భూములకు సంబంధించిన కొలతలు, మ్యాప్లు ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సి ఉంటుందన్నారు. శిక్షణ అనంతరం పరీక్ష ఉంటుందని, శిక్షకులు అన్ని అంశాలను బోధించాలని సూచించారు. నూతన సర్వేయర్ల నియామకంతో రైతులకు మేలు జరుగుతుందన్నారు. ఈసందర్భంగా సర్వేయర్లకు శిక్షణ సామగ్రిని అందజేశారు. కార్యక్రమంలో భూ కొలతల సహాయ సంచాలకులు శ్రీనివాస్, డిప్యూటీ సర్వేయర్లు, తదితరులు పాల్గొన్నారు. -
కవిత లేఖపై కేసీఆర్ స్పందించాలి
వెల్దుర్తి(తూప్రాన్): ఎమ్మెల్సీ కవిత రాసిన లేఖపై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించాలని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి డిమాండ్ చేశారు. మండలంలోని ఓ ఫంక్షన్హాల్లో పలు గ్రామాలకు చెందిన వారికి సోమవారం సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీసీ, ఎస్సీ వర్గాలకు కాంగ్రెస్తోనే న్యా యం జరుగుతుందని ఎమ్మెల్సీ కవిత రాసిన లేఖ ద్వారా స్పష్టం అయిందన్నారు. బీఆర్ఎస్, బీజేపీ లు ఒక్కటే అనడానికి ఆమె చేసిన ఆరోపణలు బలాన్ని ఇస్తున్నాయన్నారు. మిషన్ కాకతీయ, భగీరథ రూపంలో రూ. వేల కోట్లు కాజేసిన హరీశ్రావు, ఫార్ములా వన్ రేస్, ఐటీ పేరుతో ఓఆర్ఆర్ చుట్టూ భూములు కాజేసిన కేటీఆర్, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అడ్డగోలుగా ప్రభుత్వ భూములు అప్పజెప్పి రూ. కోట్లు గడించిన రాజ్యసభ సభ్యుడు సంతోష్రావులో దయ్యం ఎవరో బహిర్గతం చేయాల్సిన అవసరం కేసీఆర్పై ఎంతైనా ఉందని అన్నారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు మేహేహశ్రెడ్డి, నాయకులు నరేందర్రెడ్డి, సుధాకర్గౌడ్, నర్సింహారెడ్డి, మల్లేశం, శంకరయ్యగౌడ్ తదితరులు పాల్గొన్నారు.టీపీసీసీ ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి -
మొక్కల సంరక్షణ అందరి బాధ్యత
పెద్దశంకరంపేట(మెదక్): మొక్కల సంరక్షణ అందరి బాధ్యత అని జిల్లా హార్టికల్చర్ ప్లాంటేషన్ మేనేజర్ శ్రావణ్ అన్నారు. సోమవారం మండల పరిధిలోని గొట్టిముక్కుల, మ ల్కాపూర్ తదితర గ్రామాల్లో నర్సరీలు, హార్టికల్చర్ ప్లాంటేషన్ పనులను పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రా మాల వారీగా అవసరమైన మొక్కలను పెంచడంతో పాటు వాటి సంరక్షణ చేపట్టాలన్నారు. రైతులకు మొక్కల పెంపకంపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఈజీఎస్ ఈసీ నవాజుద్దీన్, ఎఫ్ఏలు నర్సింలు, వెంకటేశం తదితరులు పాల్గొన్నారు. తాగు నీటి వసతి కల్పిస్తాం కౌడిపల్లి(నర్సాపూర్): మండలంలోని కూకుట్లపల్లిలో నూతనంగా నిర్మించిన పాఠశాల వద్ద తాగు నీటి సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని డీఎల్పీఓ సాయిబాబ తెలిపారు. సోమవారం పాఠశాల వద్ద పైపులైన్ ను పరిశీలించి మిషన్ భగీరథ అధికారులతో ఫోన్లో మాట్లాడారు. భగీరథ ద్వారా నల్లా కనెక్షన్ ఇప్పించి తాగునీటి సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. అనంతరం గ్రామంలో పర్యటించారు. వర్షాకాలంలో మురికి నీరు నిలవకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య పనులు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో ఎంపీఓ కలీముల్ల, హెచ్ఎం రాంచందర్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్లో చేరికలు నర్సాపూర్: మండలంలోని పెద్దచింతకుంట, చిన్నచింతకుంట గ్రామాలకు చెందిన పలు వురు సోమవారం బీఆర్ఎస్కు రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరారు. వారికి డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్, నియోజకవర్గ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి కండువా కప్పి పార్టీలోకి అహ్వానించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ సుహాసినిరెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు మల్లేష్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు చిన్న ఆంజిగౌడ్, నాయకులు శ్రీనివాస్గౌడ్, శ్రీనివాస్ గుప్తా, హర్షవర్దన్ తదితరులు పాల్గొన్నారు. సకాలంలో సర్టిఫికెట్లు అందించాలి మెదక్ కలెక్టరేట్: తమ పిల్లల భవిష్యత్ను దృష్టిలో పెట్టుకొని సకాలంలో కుల ధ్రువీకరణ పత్రాలు అందించాలని ఎస్సీ మన్నె కుల సంఘం జిల్లా అధ్యక్షుడు సుధాకర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈమేరకు సోమవారం సంఘం నాయకులతో కలిసి అదనపు కలెక్టర్ నగేష్ను వినతిపత్రం అందజేశారు. రసీదులు తప్పనిసరిగా తీసుకోవాలి నర్సాపూర్: ప్రభుత్వ లైసెన్స్ కలిగిన డీలర్ల వద్దే రైతులు విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేయాలని ఏడీఏ సంధ్యారాణి సూచించారు. సోమవారం ఆమె నర్సాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని హన్మంతాపూర్లో రైతులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసినప్పుడు తప్పనిసరిగా అన్ని వివరాలతో కూడిన రసీదులు తీసుకోవాలన్నారు. రసీదులు ఇవ్వని పక్షంలో తమ దృష్టికి తేవాలని పేర్కొన్నారు. ఆమె వెంట మండల వ్యవసాయాధికారి దీపిక, ఏఈఓ చంద్రవేణి ఉన్నారు. -
ముందస్తుగానే రుతుపవనాలు
ఈసారి రుతుపవనాలు ముందస్తుగా ప్రవేశిస్తున్నట్లు వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. బంగాళాఖాతం, అరేబియా సముద్రాల్లో ఏర్పడుతున్న అల్పపీడన ద్రోణి వల్ల ఈ వర్షాలు కురుస్తున్నట్లు అంచనా. దీనికి తోడు రావాల్సిన నైరుతి ముందే కూసింది. సహజంగా జూన్ మొదటి వారంలో వచ్చే నైరుతి ఈసారి మే మధ్యస్తంలోనే పలకరించింది. జూన్ 24నాటికే కేరళను రుతుపవనాలు తాకాయని వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఇలాంటి అకాల వర్షాల కారణంగా భూసారంలో తేడా వచ్చే అవకాశం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు గమనిస్తే సాధారణం కంటే ముందుగా వర్షాకాలం ప్రారంభమైంది. ఈ పరిస్థితుల్లో ముందుగా వర్షాలు పడి సరైన సమయంలో వర్షాలు కురియకపోతే పరిస్థితి ఏ విధంగా ఉంటుందోనని రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. వానాకాలం సాగు చేసేవారు వాతావరణ మార్పులు ఎలా ఉన్నా వారి జాగ్రత్తల్లో వారు ఉండటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. మూడు రోజుల్లో రాష్ట్రంలోని కొన్ని బాగాలకు రుతుపవనాలు విస్తరించనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. 16 ఏళ్ల తర్వాత నైరుతి రుతుపవనాలు అంచనాల కంటే ముందుగా వచ్చేశాయి. -
దరఖాస్తుల ఆహ్వానం
జీలుగ సాగుతో లాభాలెన్నో.. జీలుగ విత్తనాలు వేసుకుంటే పొలంలో సేంద్రియ ఎరువును తయారు చేసుకునే అవకాశం ఉంది. వివరాలు 9లో uమెదక్ కలెక్టరేట్: జిల్లాలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాల (బాలికలు)లో బోధనకు జూనియర్ లెక్చరర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు జిల్లా సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాలల కో–ఆర్డినేటర్ సువర్ణలత తెలిపారు. సోమవారం ఆమె మాట్లాడుతూ.. జిల్లాలోని మెదక్, తూప్రాన్, రామయంపేట, కొల్చారంలోని పాఠశాలలు, కళాశాలల్లో తెలుగు, హిందీ, ఆంగ్లం, పీఈటీ, పీడీ, పౌర, కామర్స్, భౌతిక, రసాయన, జువాలజీ, జీవశాస్త్రం, గణితం తదితర సబ్జెక్టుల్లో టీజీటీ, పీజీటీ, ఉపాధ్యాయ, జూనియర్ లెక్చరర్ల పోస్టులు ఖాళీగా ఉన్నట్లు చెప్పారు. పార్ట్టైం ప్రాతిపదికన భర్తీ చేసేందుకు ఆసక్తి, అర్హత గల వారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈనెల 29వ తేదీ వరకు జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాలలో దరఖాస్తులు సమర్పించాలన్నారు. అభ్యర్థులను మెరిట్, డెమో ప్రాతిపదికన ఎంపిక చేస్తామని, ఈనెల 31న ఉదయం 10 గంటలకు డెమో నిర్వహించనున్నట్లు తెలిపారు. -
సీఈఐఆర్ పోర్టల్తో మేలు
మెదక్ మున్సిపాలిటీ: పట్టణ పరిధిలో 35 మొబైల్స్ రికవరీ చేసి బాధితులకు అప్పగించినట్లు ఎస్పీ ఉదయ్కుమార్రెడ్డి తెలిపారు. సోమవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో బాధితులకు మొబైల్స్ అందజేసి మాట్లాడారు. ప్రస్తుత రోజుల్లో మొబైల్ ఫోన్ ప్రతి ఒక్కరికీ నిత్యావసరంగా మా రిందన్నారు. ఎవరైనా ఫోన్ పోగొట్టుకుంటే, లేదా గుర్తుతెలియని వ్యక్తులు చోరీ చేసిన వెంటనే కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన సీఈఐఆర్ పోర్టల్లో నమోదు చేసుకోవాలని సూచించారు. దీంతో పోగొట్టుకున్న ఫోన్ను నేరుగా బ్లాక్ చేయవచ్చని, ఒక వేల పోగొట్టుకున్న వ్యక్తులకు కంప్యూటర్ పరిజ్ఞానం లేకపోతే పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయాలన్నారు. అంతకు ముందు జిల్లాస్థాయి ప్రజావాణి నిర్వహించి ప్రజల నుంచి వివిధ సమస్యలపై ఫిర్యాదులు స్వీకరించారు. ఫిర్యాదుదారులకు చట్టపరంగా న్యాయం జరిగేలా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ మహేందర్, పట్టణ సీఐ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.ఎస్పీ ఉదయ్కుమార్రెడ్డి -
మెరుగైన వైద్యం అందించండి
మనోహరాబాద్(తూప్రాన్): ఆస్పత్రికి వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని కలెక్టర్ రాహుల్రాజ్ సిబ్బందిని ఆదేశించారు. ఆదివారం మండల కేంద్రంలోని పీహెచ్సీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బంది హాజరు రిజిస్టర్ను పరిశీలించి రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. రోజువారీగా ఓపీ ఎలా ఉంటుందని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రిలో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. ఆయన వెంట వైద్యులు వినోద, సూపర్వైజర్ పల్లవి, ఫార్మసిస్ట్ సురేష్కుమార్, ఏఎన్ఎం మాధవి, శ్రవణ్ ఉన్నారు.కలెక్టర్ రాహుల్రాజ్ -
‘బడిబాట’కు సన్నద్ధం
పాపన్నపేట(మెదక్): జూన్ 6 నుంచి 19వ తేదీ వరకు కొనసాగనున్న ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కోసం విద్యాశాఖ సన్నద్ధం అవుతుంది. పండగ వాతావరణంలో నిర్వహించే ఈ కార్యక్రమంలో ప్రైవేట్, బడిబయట పిల్లలే లక్ష్యంగా నమోదు కార్యక్రమం చేపట్టనుంది. ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం పెంచేలా.. తల్లిదండ్రులను ఆకట్టుకునేలా చదువుల పండగ కొనసాగనుంది. ఇప్పటికే అన్ని పాఠశాలలను ఆధునీకరించే దిశగా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. డిజిటల్ బోధనలకు అనుకూలంగా క్లాస్ రూంలు తీర్చిదిద్దుతున్నారు. జిల్లాలో 876 ప్రభుత్వ పాఠశాలలుండగా, 61,533 మంది విద్యార్థులు చదువుతున్నారు. కాగా కొన్ని గ్రామాల్లో టీచర్లు ముందస్తు బడిబాట ప్రారంభించారు. ప్రభుత్వ బడుల బలోపేతం ప్రభుత్వ బడిని బతికించుకునే దిశగా విద్యాశాఖ భగీరథ ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికే పభుత్వ బడులను పరిపూర్ణ వికాస కేంద్రాలుగా తీర్చిదిద్దుతోంది. ప్రైవేట్కు ధీటుగా డిజిటల్ క్లాసులు ప్రారంభించింది. 50 మంది విద్యార్థులు ఉన్న ప్రాథమిక పాఠశాలలో కృత్రిమ మేధ, ఏఎక్స్ఎల్ ల్యాబ్లు ఆరంభించింది. డిజిటల్ పాఠాల కోసం ఇప్పటికే 176 పాఠశాలల్లో బీఎస్ఎన్ఎల్ బ్రాడ్బాండ్ సర్వీసుల సౌకర్యం కల్పించగా, మరో 300 పాఠశాలల కోసం ప్రతిపాదనలు పంపారు. ఐఎఫ్పీ (ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్) బోర్డులతో బోధన కొనసాగిస్తున్నారు. ఈఏడాది ఖాన్ అకాడమీ ఆధ్వర్యంలో ప్రత్యేక సాఫ్ట్వేర్తో సైన్స్, గణితం పాఠాలు బోధించడానికి చర్యలు తీసుకుంటున్నారు. అన్ని బడులకు కలర్లు వేశారు. ప్రతి పాఠశాలకు ఫర్నీచర్, గ్రీన్ బోర్డులు పంపిణీ చేశారు. కనీస సామర్థ్యాల సాధన దిశగా ఉపాధ్యాయులకు వేసవి సెలవుల్లో శిక్షణ ఇచ్చారు.కార్యక్రమాలు ఇలా.. జూన్ 6న స్థానిక ప్రజాప్రతినిధులు, తల్లిదండ్రులను భాగస్వామ్యం చేయడం. 7న టీచర్లు ప్రతి ఇంటికి వెళ్లి బడీడు పిల్లలను గుర్తించడం. 8, 9, 10 తేదీల్లో కరపత్రాల పంపిణీ, డ్రాపౌట్ పిల్లల గుర్తింపు. 11న అప్పటివరకు నిర్వహించిన కార్యక్రమాలపై సమీక్ష. 12న పాఠ్య, నోట్ పుస్తకాలు, ఏకరూప దుస్తుల పంపిణీ 13న సామూహిక అక్షరాభ్యాసం, బాలసభ నిర్వహణ 16న తరగతి గదుల్లో అభ్యసన సామర్థ్యాలకు సంబంధించిన పోస్టర్లు వేసి, పిల్లలు తయారు చేసిన చార్టులు ప్రదర్శించాలి. ఎఫ్ఎల్ఎన్ క్విజ్ పోటీలు పెట్టాలి. 17న సమీకృత విద్య, బాలికా విద్యా దినోత్సవం నిర్వహణ 18న తల్లిదండ్రులకు తరగతి గదుల డిజిటలీకరణ, ఆధునిక సౌకర్యాలు చూపాలి 19న బడిబాట ముగింపు, విద్యార్థులకు క్రీడా పోటీల నిర్వహణ జూన్ 6 నుంచి 19 వరకు నిర్వహణ కార్యాచరణ రూపొందించిన విద్యాశాఖ జిల్లాలో 876 పాఠశాలలు, 61,533 విద్యార్థులుసర్కారు బడికి పంపండి రూ. వేలు పోసి చదువులు కొంటారా..! ఉచితంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటారా !! తల్లిదండ్రులు నిర్ణయించుకోవాలి. సర్కార్ బడికి పంపండి మీ పిల్లల భవిష్యత్, బాధ్యత మాది. ఆధునిక పద్ధతుల్లో డిజిటల్ విద్యను, ఏఐ టెక్నాలజీతో జోడించి, విలువలు గల చదువులు నేర్పి, బంగారు భవిష్యత్ను ఇస్తాం. స్థాయికి తగిన సామర్థ్యాలను నేర్పుతాం. 1 నుంచి 10 వరకు ఇంగ్లీష్ మీడియం అందుబాటులో ఉంది. క్వాలిఫైడ్ టీచర్లతో ఉత్తమ బోధన అందిస్తాం. – రాధాకిషన్, డీఈఓ -
కొనుగోళ్లలో కొర్రీలు రైతన్న వెతలు
అల్లాదుర్గం(మెదక్): అన్నదాతలు దగా పడుతున్నారు. యాసంగి ధాన్యం విక్రయించేందుకు నానాపాట్లు పడుతున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట విక్రయంలో కొర్రీలు పెడుతుండడంతో ఆందోళన చెందుతున్నారు. లారీ లోడ్ ధాన్యం లేదని.. రైస్మిల్లు టార్గెట్ అయిపోయిందని.. మ్యాచర్ రాలేదని.. ఇలా రకరకాల సాకులు చెబుతుండటంతో లబోదిబోమంటున్నారు. అల్లాదుర్గం మండలం ముస్లాపూర్ కొనుగోలు కేంద్రంలో పీఏసీఎస్ అధికారుల తీరుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిత్యం వర్షాలతో మ్యాచర్ రాక అవస్థలు పడుతుంటే, మరో వైపు మ్యాచర్ వచ్చినా, లారీ ధాన్యం లేదంటూ కొనుగోలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయాధికారి మ్యాచర్ చెక్ చేసి వచ్చిందని చెప్పి 10 రోజులు గడిచినా.. ధాన్యం కొనుగోలు చేయడం లేదని వాపోతున్నారు. కొనుగోలు చేయమని అధికారులు, పీఏసీఎస్ చైర్మన్ను వేడుకున్నా పట్టించుకోవడం లేదన్నారు. కలెక్టర్ స్పందించి నిర్వాహకులపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇదే విషయమై పీఎసీఎస్ సిబ్బందిని వివరణ కోరగా.. కేంద్రంలో 100 బస్తాలు మాత్రమే ఉన్నాయని, లారీ లోడ్ లేదని, అందుకే కొనుగోలు చేయడం లేదని తెలిపారు. స్థానిక రైస్మిల్లు వారు టార్గెట్ అయిపోయిందని ధాన్యం బస్తాలు దించుకొవడం లేదన్నారు. సిద్దిపేట మిల్లుకు బస్తాలు తీసుకెళ్లలేని పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. లారీ లోడ్ ఉంటేనే కొంటామని షరతు మ్యాచర్ రాలేదని మెలిక లబోదిబోమంటున్న అన్నదాత -
రైతులను మోసం చేస్తే చర్యలు
మెదక్ మున్సిపాలిటీ: నకిలీ విత్తనాలతో రైతులు నష్టపోకుండా అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్పీ ఉదయ్కుమార్రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సంబంధిత అధికారులు సమన్వయంగా పని చేసి రైతులకు నకిలీ విత్తనాలు సరఫరా జరగకుండా చూడాలన్నారు. ఆరుగాలం కష్టపడే రైతు నష్టపోకుండా చూడాల్సిన బాధ్యత విత్తన సంస్థలు, డీలర్లు, వ్యాపారులపై ఉందన్నారు. రైతులకు నష్టం కలిగేలా నకిలీ విత్తనాలు అమ్మితే చట్టపరంగా కేసులు నమోదు చేస్తా మని హెచ్చరించారు. ముందస్తుగా రైతులతో సమావేశాలు నిర్వహించి చైతన్య పర్చాలన్నారు. గతంలో నకిలీ విత్తనాల కేసుల్లో స ంబంధం ఉన్నవారిపై నిఘా ఉంచాలని ఆదేశించా రు. రైతులు అత్యంత అప్రమత్తంగా ఉండి నాణ్యమైన కంపెనీ విత్తనాలు ఎంచుకోవాలన్నారు. లేబుళ్లు, ప్యాకింగ్ లేని విత్తనాలు కొనుగోలు చేయవద్దని సూచించారు. ప్రభుత్వ గుర్తింపు పొందిన డీలర్ల నుంచి విత్తనాలు కొనుగోలు చేయాలన్నారు. నకిలీ విత్తనాల గురించి, అనుమానిత బ్రోకర్లు, డీలర్ల గురించి పోలీస్, వ్యవసాయ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు.ఎస్పీ ఉదయ్ కుమార్రెడ్డి -
అందుబాటులో కేఎన్ఎం 1638 వరి విత్తనం
కౌడిపల్లి(నర్సాపూర్): మండలంలోని తునికి వద్ద గల కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే)లో కేఎన్ఎం 1638 సన్నరకం వరి విత్తనాలు అందుబాటులో ఉన్నాయని కేవీకే హెడ్ అండ్ సైంటిస్ట్ శంభాజీ దత్తాత్రేయ నల్కర్, శాస్త్రవేత్తలు రవికుమార్, డాక్టర్ ప్రతాప్రెడ్డి తెలిపారు. 20 కిలోల బస్తా రూ. 1,060 లభిస్తుందన్నారు. ఎన్ఎం 1638 సన్నరకం వరి విత్తనాల పంటకాలం 135 రోజులు కాగా, అగ్గితెగులు, ఉల్లికోడును సమర్థవంతంగా తట్టుకుంటుందని చెప్పారు. ఎకరాకు 28 నుంచి 30 క్వింటాళ్లు దిగుబడి వస్తుందన్నారు. వానాకాలం, యాసంగి రెండు పంటలకు అనుకూలమని వివరించారు. జూన్ 2 నుంచి రైతులకు విత్తనాలను విక్రయించనున్నట్లు పేర్కొన్నారు. ‘భూభారతి’పై అవగాహన అవసరం పాపన్నపేట(మెదక్): గ్రామీణ రైతాంగం భూ భారతి చట్టంపై అవగాహన పెంచుకోవాలని హైకోర్టు న్యాయవాది శ్రీకాంత్ సూచించారు. ఆదివారం మండల పరిధిలోని పొడిచన్పల్లి తండాలో రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈసందర్భంగా రెవెన్యూ గ్రామ పరిధిలో సర్వే నంబర్ 1168, కొత్తపల్లి పరిధిలోని సర్వే నంబర్ 342లో కొంతమంది రైతులు పాత పాస్ పుస్తకాలు కలిగి ఉండి, భూములు సాగు చేసుకుంటున్నప్పటికీ రైతు భరోసా, బీమా వంటి పథకాలు అందడం లేదని చెప్పారు. ఈ సమస్యలను ప్రో బోనోగా స్వీకరించి న్యాయపరంగా పరిష్కారం చూపేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం ద్వారా నిరుపేదలకు న్యాయం జరుగుతుందని వివరించారు. కార్యక్రమంలో హైకోర్టు న్యాయవాదులు నల్లపు మణిదీప్, చంద్రకుమార్, గణే ష్, పలువురు రైతులు, గ్రామస్తులు త దితరులు పాల్గొన్నారు. ప్రశాంతంగా గ్రామ పాలన అధికారి పరీక్ష మెదక్ కలెక్టరేట్: జిల్లాలో ఆదివారం నిర్వహించిన గ్రామ పాలన అధికారి పరీక్ష ప్రశాంతంగా ముగిసిందని డీఆర్ఓ భుజంగరావు తెలిపారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాన్ని సందర్శించి పరీక్ష నిర్వహణ తీరును పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పరీక్షకు 104 మంది దరఖాస్తు చేసుకోగా, 79 మంది హాజరైనట్లు చెప్పారు. మరో 25 మంది గైర్హాజరయ్యారని పేర్కొన్నారు. ఆయన వెంట ఆర్డీఓ రమాదేవి, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ హుస్సేన్, తహసీల్దార్ లక్ష్మణ్బాబు, పోలీస్ అధికారులు ఉన్నారు. ‘వారిపై చర్యలు తీసుకోండి’ కొమురవెల్లి(సిద్దిపేట): దళితబంధు పేరుతో గత ప్రభుత్వంలో డబ్బులు వసూలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు అందె అశోక్ డిమాండ్ చేశారు. ఆదివారం లెనిన్నగర్లో దళితబంధు పథకం కోసం బీఆర్ఎస్ నాయకుడికి డబ్బులు ఇచ్చి మోసపోయిన దాసరి హరిబాబును పరామర్శించారు. -
హైవే నిర్మాణం..
భూసార పరీక్ష.. పంటకు రక్ష సాగుకు ముందు భూసార పరీక్షలు చేసుకుంటే అధిక దిగుబడులు సాధించే అవకాశం ఉంది. వివరాలు 9లో uచెట్లు మాయంరామాయంపేట(మెదక్): మెదక్– రామాయంపేట మధ్య 20 కిలోమీటర్ల మేర రోడ్డుకు ఇరువైపులా వేల సంఖ్యలో ఏళ్ల క్రితం నాటిన చెట్లు ఉండేవి. ఈదారిలో ప్రయాణం అత్యంత ఆహ్లాదకరంగా ఉండేది. ఈక్రమంలో మెదక్ నుంచి సిద్దిపేట వరకు జాతీయ రహదారి (765 డీజీ) నిర్మాణానికి మూడేళ్ల క్రితం కేంద్రం రూ. 882 కోట్లు మంజూరు చేసింది. పనులు సైతం ముమ్మరంగా సాగుతున్నాయి. అ యితే రోడ్డు పక్కన ఏళ్ల క్రితం నాటిన పెద్ద పెద్ద చెట్లను నిర్మాణంలో భాగంగా తొలగించారు. కూకటివేళ్లతో సహా పెకిలించి మరో చోట నాటడానికి ఆధునిక పద్ధతులు అందుబాటులో ఉన్నా అధికారులు ఆదిశగా చర్యలు తీసుకోలేదు. రామాయంపేట మండల పరిధిలోని అటవీప్రాంతంలో నాలుగున్నర కిలోమీటర్లు తప్పించి, ఇతర చోట్ల చెట్ల తొలగింపు ప్రక్రియ దాదాపు పూర్తి అయింది. అనుమతులు వస్తే అటవీ ప్రాంతంలో చెట్లను కూడా పూర్తిస్థాయిలో తొలగించి పనులు ప్రారంభిస్తామని ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఇప్పటికే మెదక్, రామాయంపేట, సిద్దిపేట మధ్య రోడ్డు పక్కన చెట్లను నరికివేయగా, రహదారి బోసిపోయింది. అటవీలో పరుచుకున్న పచ్చదనం సైతం త్వరలో కనుమరుగు కానుందని పర్యావరణ ప్రేమికులు తల్లడిల్లుతున్నారు. -
మల్లన్న క్షేత్రం.. భక్తజన సంద్రం
కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయం భక్తజన సంద్రంగా మారింది. ఆదివారం భక్తులు భారీగా తరలిరావడంతో ఆలయ పరిసరాలన్నీ మల్లన్న నామస్మరణతో మారుమోగాయి. స్వామివారిని దర్శించుకున్న అనంతరం గంగిరేణి చెట్టుకు ముడుపులు కట్టి మొక్కులు చెల్లించుకున్నారు. విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ హైదరాబాద్ ఎస్పీ అన్నపూర్ణ.. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. కాటేజీల నిర్మాణానికి మంచిర్యాలకు చెందిన దాతలు మహేందర్, రవీందర్లు రూ.15లక్షలు చెక్కురూపంలో ఈఓ అన్నపూర్ణకు అందించారు. – కొమురవెల్లి(సిద్దిపేట) -
పచ్చిరొట్టతో నాణ్యమైన దిగుబడి
మెదక్ కలెక్టరేట్: పచ్చిరొట్ట ఎరువులు వాడటంతో భూసారం పెరిగి నాణ్యమైన దిగుబడులు వస్తాయని జిల్లా ఇన్చార్జి వ్యవసాయ అధికారి వినయ్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలో ప్రస్తుతం జిల్లాలో 15,000 క్వింటాళ్ల జనుము, 30,000 క్వింటాళ్ల జీలుగా విత్తనాలు అందుబాటులో ఉన్నాయని, రైతులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. వరి నాట్లు ఎక్కడైతే ముందు జరుగుతాయో ఆ మండలాల్లో ప్రాథమిక సహకార సంఘాలు, రైతు ఆగ్రోస్ కేంద్రాల వద్ద పచ్చిరొట్ట విత్తనాలు అందుబాటులో ఉన్నాయన్నారు. మిగితా మండలాలకు నా లుగు రోజుల్లో అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. నేలకు, పంటకు మేలు చేసే పచ్చిరొట్ట ఎరువును తయారు చేసేందుకు ప్రభుత్వం జీలుగ విత్తనాలను రైతులకు సబ్సిడీపై అందజేస్తుందన్నారు. పట్టాదారు పుస్తకం, ఆధార్ కార్డు ఉన్న రైతుకు మాత్రం 50 శాతం వరకు సబ్సిడీపై అందుతుందన్నారు. రైతులు రసాయన ఎరువులు వాడకాన్ని తగ్గించి, సేంద్రియ పద్ధతిలో భూసారం పెంచే దిశగా పచ్చిరొట్ట విత్తనాలు పంపిణీ చేస్తున్నట్లు వివరించారు. అందుబాటులో జనుము, జీలుగ విత్తనాలు జిల్లా ఇన్చార్జి వ్యవసాయ అధికారి వినయ్ -
నిబంధనల పట్టింపు ఏది?
రాయికోడ్(అందోల్): జాతీయ ఉపాధి హామీ పథకం పనులపై నిబంధనల పట్టింపులేకుండా వ్యవహరించడమేమిటని కేంద్ర తనిఖీ బృందం పంచాయతీ రాజ్ శాఖ అధికారులను నిలదీశారు. దీంతో సంబంధిత అధికారులు సమాధానం చెప్పలేక నీళ్లునమిలారు. జాతీయ ఉపాధి హామీ పథకం నిధులతో నిర్వహించిన పనులను తనిఖీ చేసేందుకు ఆదివారం రాయికోడ్కు గ్రామీణాభివృద్ధి శాఖ జాతీయ అధికారులు సంజయ్కుమార్ తదితరులు వచ్చారు. గ్రామంలోని ఉన్నత పాఠశాలలో నిర్మించిన టాయిలెట్స్, వంట గది, ప్రహరీలను, పలు మెటల్, ఫార్మేషన్ రోడ్లను పరిశీలించారు. ఎక్కడా నిబంధనలు పాటించకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్ర బృందం పర్యటిస్తుంటే రాష్ట్ర, జిల్లా అధికారులు పీఆర్డీఈ తదితరులు హాజరు కాకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. ఈజీఎస్ నిధుల వినియోగంలో కనీస నిబంధనలు పాటించకపోవడంపై వివరాలు నమో దు చేసుకున్నారు. నివేదికను తమ శాఖకు నివేదించనున్నట్లు తెలిపారు. ఉపాధి పనులపై కేంద్రం బృందం నిలదీత -
కేతకీలో కోటి జపయజ్ఞం
ఝరాసంగం(జహీరాబాద్): శ్రీ కేతకీ సంగమేశ్వరాలయంలో ఆలయ ఆవరణలో విశ్వ మానవ ధర్మ ప్రచారం పరిషత్ ఆధ్వర్యంలో ఆదివారం శివ మంత్ర కోటి జపయజ్ఞం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ ఆవరణలో ‘దేశ రక్షణ–ధర్మ శిక్షణ’సంకల్పంతో యజ్ఞం, పూర్ణాహుతి, మహా మంగళ హారతి తదితర పూజా కార్యక్రమాలు చేశారు. అనంతరం భక్తులకు స్వామివారి తీర్థప్రసాదాలు అందించారు. కార్యక్రమంలో దత్తగిరి మహరాజ్ ఆశ్రమ పీఠాధిపతి గిరి మహారాజ్, ధనసిరి పీఠాధిపతి వీరేశ్వర శివాచార్య మహాస్వామి, రంజోల్ రాజయోగ ఆశ్రమ పీఠాధిపతి రాజయ్య స్వామి, కేతకీ ఆలయ పాలకమండలి చైర్మన్ చంద్రశేఖర్ పాటిల్, ఆలయ ఈఓ శివ రుద్రప్ప, మాజీ చైర్మన్ నీల వెంకటేశం, పాలకమండలి సభ్యులు పాల్గొన్నారు. -
మిగిలిన సీట్ల భర్తీకి 27న కౌన్సెలింగ్
నర్సాపూర్: నర్సాపూర్లోని అల్లూరి సీతారామరాజు గిరిజన గురుకుల కాలేజీలో మిగిలిన సీట్ల భర్తీకి ఈనెల 27న కౌన్సెలింగ్ నిర్వహిస్తామని ప్రిన్సిపాల్ శ్రీనివాస్రాయ్ తెలిపారు. మెరిట్ ఆధారంగా సీట్లను భర్తీ చేస్తామని, ఆసక్తి ఉన్న విద్యార్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లు వెంట తీసుకొని రావాలన్నారు. ఇతర వివరాలకు 8790724953, 8639898246 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. గోహత్యలను అరికట్టండి మెదక్జోన్: గోవుల అక్రమ రవాణాను అరికట్టి గోహత్యలు జరగకుండా చూడాలని బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు సతీష్ అన్నారు. ఈ మేరకు శనివారం పలువురు కార్యకర్తలతో కలిసి కలెక్టరేట్, మెదక్ పట్టణ పోలీస్స్టేషన్లో వినతిపత్రాలు అందించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా చుట్టూ చెక్పోస్ట్లు ఏర్పాటు చేసి గో అక్రమ రవాణాను అడ్డుకోవాలని కోరారు. కార్యక్రమంలో బీజేవైఎం నేతలు బబ్బులు, సాయి, రాహుల్, ప్రశాంత్, పండరి, నర్సింగ్ తదితరులు పాల్గొన్నారు. మహిళా సమాఖ్యల బలోపేతానికి చర్యలు రామాయంపేట(మెదక్): మహిళా సమాఖ్యల బలోపేతానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని డీపీఎం జాన్ కెన్నడీ అన్నారు. శనివారం రామాయంపేటలోని ఐకేపీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మహిళా సంఘాల అభ్యున్నతికి ప్రభుత్వం మంజూరు చేస్తున్న నిధులను సద్వినియోగం చేసుకోవాలని సూచి ంచారు. అనంతరం మండల సమాఖ్య నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షురాలిగా రేణుక, కార్యదర్శిగా హారిక, కోశాధికారిగా రచన ఎన్నికయ్యారు. కార్యక్రమంలో ఏపీఎం రాములు, సీసీలు వెంకట్రాములు, అమృత, చెన్నమ్మ, అకౌంటెంట్ స్వాతి తదితరులు పాల్గొన్నారు. కేవీకేలో ఫార్మర్ హాస్టల్ కౌడిపల్లి(నర్సాపూర్): మండలంలోని తునికి కేవీకేలో రూ. 84 లక్షలతో నిర్మిస్తున్న ఫార్మర్ హాస్టల్ పనులను శనివారం ఏకలవ్య గ్రామీణ వికాస ఫౌండేషన్ కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే) చైర్మన్ డాక్టర్ పీవీరావు పరిశీలించారు. ఎక్సాన్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఆధ్వర్యంలో నిర్మాణ పనులు జరుగుతున్నాయి. పనుల నాణ్యతలో రాజీపడొద్దని సూచించారు. కార్యక్రమంలో కేవీకే కోషాధికారి రాఘవరావు, కేవీకే హెడ్ అండ్ సైంటిస్ట్ శంభాజీ దత్తాత్రేయ నల్కర్, శాస్త్రవేత్తలు రవికుమార్, శ్రీనివాస్, ప్రతాప్రెడ్డి, ఉదయ్కుమార్, సైట్ ఇంజనీర్ జానకీరాం తదితరులు పాల్గొన్నారు. అన్నదాత ‘వరి’ గోస హవేళిఘణాపూర్(మెదక్): ధాన్యం కొనాలని మాచవరం గ్రామానికి చెందిన అన్నదాతలు రోడ్డెక్కారు. శనివారం మెదక్– నర్సాపూర్ జాతీయ రహదారిపై ధర్నాకు దిగారు. ధాన్యం కుప్పలు పోసి రోజుల తరబడి ఎదురుచూస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వర్షానికి వడ్లు తడిసి మొలకెత్తితే ఎవరు బాధ్యత వహిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పకడ్బందీగా నిర్వహించాలి మెదక్జోన్: గ్రామపాలన అధికారి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని సీసీఎల్ఏ కమిషనర్ నవీన్ మిట్టల్ సూచించారు. ఇదే విష యమై శనివారం హైదరాబాద్ నుంచి జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సమావేశంలో ఆర్డీఓ రమాదేవి, కలెక్టరేట్ ఏఓ యూనస్, తహసీల్దార్ లక్ష్మణ్బాబు, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ హుస్సేన్, డీఆర్వో భుజంగరావు తదితరులుపాల్గొన్నారు. -
బేస్మెంట్ పూర్తికాగానే డబ్బులు
కౌడిపల్లి(నర్సాపూర్)/కొల్చారం: ఇందిరమ్మ ఇల్లు మంజూరు అయిన లబ్ధిదారులకు బేస్మెంట్ పూర్తి అయిన వెంటనే మొదటి బిల్లు అందజేస్తున్నామని జిల్లా హౌసింగ్ పీడీ మాణిక్యం తెలిపారు. శనివారం కౌడిపల్లిలో మోడల్ ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులను పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ఇప్పటివరకు 120 ఇళ్లకు మొదటి విడత రూ. 1 లక్ష చొప్పున లబ్ధిదారుల ఖాతాలో జమచేసినట్లు చెప్పారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 400 నుంచి 600 ఫీట్లలోపు ఇల్లును నిర్మించుకోవాలని సూచించారు. కాగా ఎక్కువ విస్తీర్ణంలో బేస్మెంట్ నిర్మించిన వారికి సైతం ప్రభుత్వం మరో అవకాశం కల్పించిందన్నారు. బేస్మెంట్ పరిధి ఎక్కువగా ఉన్న గోడలు 600 ఫీట్లలోపు నిర్మించే విధంగా అంగీకార పత్రం రాసిస్తే మొదటి విడత బిల్లు మంజూరు చేస్తామని వివరించారు. ఆయన వెంట సీనియర్ అసిస్టెంట్ బలరాం ఉన్నారు. అనంతరం కొల్చారం మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో నిర్మిస్తున్న ఇందిరమ్మ మోడల్ హౌస్ నిర్మాణ పనులను పరిశీలించారు.జిల్లా హౌసింగ్ పీడీ మాణిక్యం -
అడ్మిషన్ ప్లీజ్
కిక్కిరిసిన తునికి ఎంజేపీకౌడిపల్లి(నర్సాపూర్): బ్యాక్లాగ్ సీట్ల భర్తీ కోసం మండలంలోని తునికి ఎంజేపీ (మహాత్మ జ్యోతిబా పూలే) బీసీ గురుకులంలో శనివారం నిర్వహించిన కౌన్సెలింగ్కు విద్యార్థులు భారీగా తరలివచ్చారు. ప్రవేశ పరీక్షలో మెరిట్ సాధించిన 6 నుంచి 9వ తరగతి విద్యార్థులకు ఉమ్మడి మెదక్ జిల్లా ఆర్సీఓ గౌతంకుమార్రెడ్డి, గురుకుల ప్రిన్సిపాల్ హరిబాబు ఆధ్వర్యంలో కౌన్సెలింగ్ నిర్వహించారు. జిల్లాలో మొత్తం 979 బ్యాక్లాగ్ సీట్లు ఉండగా, ఉమ్మడి జిల్లా నుంచి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కౌన్సెలింగ్ కోసం వచ్చిన వారి వాహనాలు జాతీయ రహదారికి ఇరువైపులా నిలపడంతో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ఎస్ఐ రంజిత్రెడ్డి ఆధ్వర్యంలో చర్యలు చేపట్టారు. -
అనాథలకు ఆర్థిక సహాయం
పాపన్నపేట(మెదక్): ‘బడికి సెలవులంటేనే భయం’ శీర్షికన గతంలో ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి టీచర్లు స్పందించారు. శనివారం కుర్తివాడలోని పిల్లలు లావణ్య, అనురాధ, నవీన్ వద్దకు వెళ్లి రూ. 26 వేల ఆర్థిక సహాయం అందజేశారు. పీఆర్టీయూ పాపన్నపేట శాఖ పిలుపు మేరకు మండల ఉపాధ్యాయులంతా తలా కొంత పోగు చేసి ఆర్థిక సహాయం చేశారు. పిల్లల కనీస అవసరాల కోసం ఉపయోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మండల పీఆర్టీయూ అధ్యక్షుడు రాజు, కార్యదర్శి సురేష్, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు అంజనాచారి, ఉపాధ్యక్షుడు రవీందర్రెడ్డి, కార్యదర్శి జనార్దన్, జిల్లా కార్యదర్శి స్వామి, మండల అసోసియేట్ అధ్యక్షుడు సంతోష్ కుమార్, మండల కార్యదర్శి నాగేశ్వర్, సాయిలు, మధుసూదన్, సీఆర్పీ దేవయ్య పాల్గొన్నారు. -
పట్టుకుంటే బంగారమే!
సాంప్రదాయ వ్యవసాయంతో నష్టాలు చవిచూస్తున్న రైతులు మల్బరీ సాగు, పట్టుపురుగుల పెంపకంతో ప్రతి నెల ఆదాయం ఆర్జించవచ్చు. తక్కువ సమయంలోనే అధికంగా లాభాలు పొందవచ్చు. అయితే జిల్లాలో కేవలం మల్బరీ సాగు 95 ఎకరాల్లో ఉండగా, పట్టు పురుగుల పెంపకానికి 20 షెడ్లు మాత్రమే ఉన్నాయి. ఇప్పటికై నా చిన్న, సన్నకారు రైతులు సబ్సిడీలతో పాటు, తక్కువ పనితో ఎక్కువ ఆదాయం ఆర్జించే పట్టు పురుగుల పెంపకంపై ఆసక్తి చూపాలని ఉద్యాన అధికారులు సూచిస్తున్నారు. – చిలప్చెడ్(నర్సాపూర్) చిన్న, సన్నకారు రైతులకు పట్టు పురుగుల పెంపకం సులభమైనది. ఒక్కసారి పెట్టుబడితో కొన్నేళ్ల వరకు లాభాలు ఆర్జించవచ్చు. కేంద్ర ప్రభుత్వం షెడ్డు నిర్మాణానికి రూ. 2.4 లక్షల సబ్సిడీతో పాటు, ఎకరా మల్బరీ మొక్కలకు రూ. 30 వేల రాయితీ ఇస్తుంది. మొక్కల ఎదుగులకు అనువైన నేలలు ఉండి, పట్టు పురుగుల పెంపకానికి అనుకూలమైన వాతావరణం ఉంటే నాణ్యమైన కకూన్స్ (పట్టు పురుగులు అల్లుకున్న గూళ్లు) వస్తాయి. దీంతో అధిక లాభాలు పొందవచ్చు. పట్టు పురుగుల గుడ్లు తెచ్చిన నాటి నుంచి 30 రోజుల్లో బ్యాచ్ పూర్తవుతుంది. రెండెకరాల మల్బరీ సాగుతో బ్యాచ్కు రూ. లక్ష వరకు అదాయం వస్తుంది. చాకి పెంపకం (పట్టు పురుగుల గుడ్ల నుంచి వచ్చే పిల్లల)తో మరింత ఆదాయం సంపాదించవచ్చు. ప్రస్తుతం మార్కెట్లో 30 వేల డీఎఫ్ఎల్ చాకీ పెంపకం పిల్ల పురుగుల ధర రూ. 3,500 ఉంటే, మాములు గుడ్లు రూ. 1,300 ఉంది. ప్రస్తుతం మార్కెట్లో నాణ్యమైన కకూన్స్ ధర క్వింటాల్కు రూ. 50 వేలు ఉంది. ప్రభుత్వం కిలోకు రూ. 75 అదనంగా చెల్లిస్తుంది. అయితే నాలుగేళ్లుగా అదనపు డబ్బులు చెల్లించడం లేదు. రాష్ట్రంలో హైదరాబాద్లోని తిరుమలగిరి, జనగాంలో పట్టు పరుగుల కకూన్స్ కొనుగోలుకు మార్కెట్లు ఉన్నాయి. నాణ్యతను బట్టి వాటికి ధర ఉంటుంది. మేలు రకం కకూన్స్కు వందశాతం డబ్బులు చెల్లిస్తారు.జిల్లాలో 95 ఎకరాల్లోమల్బరీ సాగు సబ్సిడీ, ఆదాయం ఉన్నాఆసక్తి చూపని రైతులు ముందుకు రావాలని అధికారుల సూచన రైతులకు మంచి అవకాశం జిల్లాలో పట్టు పురుగుల పెంపకం చాలా తక్కువ. రైతులు ఆసక్తి చూపకపోవడమే ఇందుకు కారణం. పట్టు పురుగుల పెంపకంతో అధిక లాభాలు గడించవచ్చు. చిన్న, సన్నకారు రైతులకు సెరికల్చర్ మంచి అవకాశం. పైగా ప్రభుత్వం సబ్సిడీ సైతం ఇస్తుంది. ఒక్కసారి పెట్టుబడితో ఎన్నో ఏళ్లుగా లాభాలు గడించవచ్చు. ఇప్పటికై నా రైతులు ముందుకు రావాలి. – ప్రతాప్సింగ్, జిల్లా ఉద్యాన అధికారిప్రతీ నెల డబ్బులు సేంద్రియ ఎరువులతో మల్బరీ సాగు చేస్తున్నా. పట్టు పురుగులకు లేత మల్బరీ ఆకులు మేతగా వేస్తే నాణ్యమైన కకూన్స్ వస్తాయి. పట్టు పురుగుల పెంపకంతో నెల నెల రాబడి వస్తుంది. సంవత్సరంలో తొమ్మిది బ్యాచ్లు పూర్తయ్యాయి. ఏది ఏమైనా రెండెకరాలు మల్బరీ సాగుతో తయారైన బ్యాచ్తో ఖర్చులు అన్నీ పోనూ. రూ. 80 వేలు మిగులుతుంది. – జూపల్లి జ్యోతిర్మయి, రైతు, చిలప్చెడ్ -
ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలి
నర్సాపూర్: మండల లీగల్ సర్వీస్ కమిటీ నుంచి వచ్చే ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించాలని జూనియర్ సివిల్ జడ్జిహేమలత ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. శనివారం కోర్టు పరిధిలోని ఆయా మండలాలకు చెందిన తహసీల్దార్లు, ఎంపీడీఓలతో పాటు పలుశాఖల అధికారులతో కోర్టులో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంత ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం మండల లీగల్ సర్వీస్ కమిటీని ఆశ్రయిస్తున్నారని తెలిపారు. వాటిని లీగల్ సర్వీస్ కమిటీ ఫ్రీ లిటిగేషన్ కేసుగా నమోదు చేసి సంబంధిత మండలస్థాయి అధికారులకు, వ్యక్తులకు నోటీసులు జారీ చేసి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. అధికారులు సకాలంలో స్పందించకపోతే చట్టపరంగా తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో ఆయా శాఖల అధికారులు, న్యాయవాదులు పాల్గొన్నారు.జూనియర్ సివిల్ జడ్జి హేమలత -
స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలి
తూప్రాన్: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి కార్యకర్త సమష్టిగా పనిచేయాలని ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్, మాజీ జాతీయ యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి వరప్రసాద్ పిలుపునిచ్చారు. శనివారం పట్టణ కేంద్రంలో నిర్వహించిన సంవిధాన్ బచావో ర్యాలీకి ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. పార్టీ మార్గదర్శకాలకు అనుగుణంగా నిబద్ధతతో పనిచేయాలని సూచించారు. అనంతరం గ్రామ, మండల స్థాయి కమిటీల కోసం అభ్యర్థుల నుంచి నామినేషన్ పత్రాలను స్వీకరించారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్, గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి నర్సారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ సుహాసినిరెడ్డి తదితరులు హాజరయ్యారు.ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ సాయికుమార్ -
జిల్లాలో మందకొడిగా ధాన్యం సేకరణ
జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు మందకొడిగా సాగుతున్నాయి. సెంటర్లు ప్రారంభించి రెండు నెలలు కావొస్తున్నా వడ్ల సేకరణ పూర్తి కాకపోవడంతో రైతులు రోజుల తరబడి కల్లాల వద్దే జాగారం చేస్తున్నారు. అకాల వర్షాలతో ధాన్యం తడిసి మొలకెత్తుతుండటంతో అరిగోస పడుతున్నారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంటను అమ్ముకోవడానికి అష్టకష్టాలు పడుతున్నారు. – మెదక్జోన్● వెంటాడుతున్న అకాల వర్షాలు ● ఇంకా 1.20 లక్షల మెట్రిక్ టన్నులుకేంద్రాల్లోనే.. ● ఆందోళనలో అన్నదాతలుజిల్లావ్యాప్తంగా యాసంగిలో 2.95 లక్షల ఎకరాల్లో రైతులు వరి సాగు చేయగా, కొనుగోలు కేంద్రాలకు 3.89 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అధికారులు అంచనా వేశారు. అందుకనుగుణంగా జిల్లాలో 498 సెంటర్లను ఏప్రిల్ మొదటి వారంలో ప్రారంభించారు. అందులో 92 కేంద్రాలను ప్రత్యేకంగా సన్నధాన్యం సేకరణ కోసం, 406 సెంటర్లను దొడ్డు ధాన్యం కోసం ఏర్పాటు చేశారు. కాగా దొడ్డు రకం ధాన్యం కోసం ఏర్పాటు చేసిన 406 కొనుగోలు కేంద్రాల్లో ఇప్పటివరకు 155 కేంద్రాల్లో కొనుగోళ్లు పూర్తి చేశారు. సన్నాల సేకరణ కోసం ఏర్పాటు చేసిన 92 కేంద్రాలు అలాగే కొనసాగుతున్నాయి. సేకరించింది 2.60 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి నేటికీ 55 రోజులు అయింది. ఇప్పటివరకు రైతుల నుంచి 2.60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించారు. అందులో దొడ్డుకరం 2,14,634 మెట్రిక్ టన్నులు కాగా, సన్నాలు 46,110 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశారు. ఇందుకు సంబంధించి రూ. 426.52 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేశారు. బోనస్ డబ్బులు ఎప్పుడో..? కొనుగోలు కేంద్రాల్లో క్వింటాల్ ధాన్యానికి రూ. 2,320 చొప్పున మద్దతు ధర చెల్లిస్తుండగా, సన్నధాన్యం కోసం ప్రభుత్వం అదనంగా ఇచ్చే క్వింటాల్కు రూ. 500 బోనస్ డబ్బులు మాత్రం ఇప్పటివరకు రైతుల ఖాతాల్లో జమ కాలేదు. సన్నధాన్యం 46,110 మెట్రిక్ టన్నులు రైతులు కొనుగోలు కేంద్రాల ద్వారా విక్రయించారు. ఇందుకు సంబంధించి క్వింటాల్కు రూ. 2,320 చొప్పున మద్దతు ధరతో పాటు రూ. 500 బోనస్ కలిపితే క్వింటాల్కు రూ. 2,820 అవుతుంది. అయితే బోనస్ డబ్బులు ఇవ్వకుండా కేవలం మద్దతు ధరను మాత్రమే రైతు ఖాతాల్లో జమచేస్తున్నారు. ఇప్పటివరకు విక్రయించిన ధాన్యానికి రైతులకు చెల్లించాల్సిన బోనస్ డబ్బులు రూ. 23.6 కోట్లు పెండింగ్లో ఉన్నాయి. వాటిని ఎప్పుడు చెల్లిస్తారని రైతులు ప్రశ్నిస్తున్నారు. గత వానాకాలంలోనూ బోనస్ డబ్బుల చెల్లింపులో తీవ్ర జాప్యం జరగటంతో అన్నదాతలు ఇబ్బంది పడ్డారు. ఈసారి అలా కాకుండా సకాలంలో చెల్లించాలని కోరుతున్నారు.జిల్లా వివరాలు ఇప్పటివరకు సేకరించిన ధాన్యం 2.60 లక్షల మెట్రిక్ టన్నులు ఇంకా కొనాల్సింది 1.20 లక్షల మెట్రిక్ టన్నులు పూర్తయిన సెంటర్లు 155వారంలో పూర్తి చేస్తాం: కలెక్టర్ చిన్నశంకరంపేట(మెదక్): మరో వారం రోజుల్లో ధాన్యం కొనుగోళ్లు పూర్తిచేసేందుకు చర్యలు చేపట్టామని కలెక్టర్ రాహుల్రాజ్ తెలిపారు. శనివారం మండలంలోని అంబాజీపేటలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి మాట్లాడారు. అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, రైతులు ఆందోళన చెందవద్దని అన్నారు. రైతులకు వెంట వెంటనే డబ్బులు జమ చేస్తున్నట్లు చెప్పారు. సన్న వడ్ల బోనస్ కూడ త్వరలో అందనుందని వివరించారు. అదనంగా హమాలీలతో పాటు 150 లారీలను సమకూర్చినట్లు పేర్కొన్నారు. ఆయన వెంట తహసీల్దార్ మన్నన్ ఉన్నారు. -
చెక్కుల పంపిణీ రసాభాస
● ఎమ్మెల్సీ యాదవరెడ్డి ప్రసంగాన్ని అడ్డుకున్న కాంగ్రెస్ నాయకులు తూప్రాన్: పట్టణ కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో శనివారం ఏర్పాటుచేసిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో రసాభాస చోటు చేసుకుంది. ముందుగా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ సుహాసినిరెడ్డి, గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. అనంతరం ఎమ్మెల్సీ యాదవరెడ్డి మాట్లాడుతూ.. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను మాజీ సీఎం కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించారని తెలిపారు. దీంతో కేసీఆర్ విషయం ఈ సమావేశంలో చర్చించవద్దని కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్సీ ప్రసంగానికి అడ్డుపడ్డారు. దీంతో కాసేపు రసాభాస చోటు చేసుకుంది. దీంతో ఎమ్మెల్సీ తన ప్రసంగాన్ని అర్ధాంతరంగా అపేశారు. అనంతరం లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు ఎలక్షన్రెడ్డి, భూంరెడ్డి, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ మామిళ్ల జ్యోతి, నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
గుణాత్మక విద్యను అందించాలి
కలెక్టర్ రాహుల్రాజ్ తడిసిన ధాన్యం కొనుగోలు చేయండిబీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మారెడ్డిపాపన్నపేట(మెదక్): సామర్థ్యాలను పెంపొందించి విద్యార్థులకు గుణాత్మక విద్యను అందించేందుకే వేసవి సెలవుల్లో ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటుచేశామని కలెక్టర్ రాహుల్రాజ్ తెలిపారు. శుక్రవారం పాపన్నపేటలో నిర్వహిస్తున్న టీచర్ల శిక్షణను సందర్శించి మాట్లాడారు. ప్రతి విద్యార్థికి చదవడం, రాయడం, గణితం రావాలని చెప్పారు. మారుతున్న కాలానుగుణంగా బోధనా పద్ధతులను ఆధునీకరించాలని సూచించారు. ఇక్కడ నేర్చుకున్న ప్రతి అంశాన్ని తరగతి గదిలో విద్యార్థికి నేర్పినప్పుడే శిక్షణ అర్థవంతమవుతుందని వివరించారు. ఆయన వెంట డీఈఓ రాధాకిషన్, అకాడమిక్ మానిటరింగ్ అధికారి సుదర్శనమూర్తి, ఎంఈఓ ప్రతాప్రెడ్డి, ఆర్పీలు ఉన్నారు. అనంతరం ఆగ్రోస్ రైతు కేంద్రాన్ని సందర్శించారు. రైతులు అనధికారిక డీలర్ల వద్ద విత్తనాలు కొనుగోలు చేసి మోసపోవద్దని సూచించారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో సబ్సిడీపై విత్తనాలు దొరుకుతాయని చెప్పారు. విత్తనాలు కొనుగోలు చేసిన తర్వాత రసీదు తప్పకుండా పొందాలన్నారు. విత్తనాలను అధిక ధరకు విక్రయించరాదని హెచ్చరించారు. ఆయన వెంట వ్యవసాయ అధికారి నాగమాధురి ఉన్నారు. నకిలీ విత్తనాలపై ఉక్కుపాదం మెదక్ కలెక్టరేట్: జిల్లాలో నకిలీ విత్తనాల అమ్మకంపై ఉక్కుపాదం మోపేందుకు టాస్క్ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ రాహుల్రాజ్ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్లో పోలీస్, వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో టాస్క్ఫోర్స్ జాయింట్ సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రైతులు దళారులను నమ్మి నకిలీ విత్తనాలను కొని మోసపోకుండా చూడాల్సిన బాధ్యత పోలీస్, వ్యవసాయ శాఖల దేనిని స్పష్టం చేశారు. అదనపు ఎస్పీ మహేందర్ మాట్లాడుతూ.. నకిలీ విత్తనాలను అరికట్టేందుకు వ్యవసాయ శాఖ ద్వా రా సమన్వయంతో పని చేస్తామని తెలిపా రు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్, జిల్లా వ్యవసాయ అధికారి వినయ్, పోలీస్, వ్యవసాయశాఖ సిబ్బంది పాల్గొన్నారు. పాపన్నపేట(మెదక్): తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మారెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం ఆమె మండల పరిధిలోని నాగ్సాన్పల్లిలో ధాన్యాన్ని పరిశీలించారు. వెంటనే కలెక్టర్కు ఫోన్ చేసి తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కోరారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. అకాల వర్షాలతో ధాన్యం తడిసి మొలకలు రావడంతో రైతులు ఆందోళనకు గురువుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు స్పందించి మొదట తడిసిన ధాన్యాన్ని లారీలు, ట్రాక్టర్లలో తరలించాలన్నారు. నాగ్సాన్పల్లిలో రెండు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉన్నా పట్టించుకునే వారే లేరని వాపోయారు. ఒక్క అధికారి, ప్రజాప్రతినిధి కూడా చూసిన పాపాన పోలేదన్నారు. తాము అధికారంలో ఉన్నప్పుడు యుద్ధప్రాతిపదికన ధాన్యం కొనుగోలు చేశామని తెలిపారు. వెంటనే ధాన్యం కొనుగోలుకు చర్యలు తీసుకోకపోతే రైతు ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. ఆమె వెంట బీఆర్ఎస్ జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు సోములు, మండల పార్టీ అధ్యక్షుడు విష్ణువర్ధన్రెడ్డి, ఏడుపాయల మాజీ చైర్మన్ విష్ణువర్ధన్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకట్రాంరెడ్డి, ఇతర నాయకులు పాల్గొన్నారు. -
ఇళ్లు నిర్మించిన వెంటనే బిల్లులు ఇస్తాం
రేగోడ్(మెదక్): ఇళ్లు నిర్మించిన వెంటనే బిల్లులు చెల్లిస్తామని జిల్లా గృహ నిర్మాణ శాఖ పీడీ మాణిక్యం చౌహాన్ అన్నారు. మండల కేంద్రమైన రేగోడ్లో ఇందిరమ్మ మోడల్ గృహ నిర్మాణ పనులను శుక్రవారం సాయంత్రం పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోనే రేగోడ్లో మోడల్ గృహ నిర్మాణ పనులు చకచకా సాగుతున్నాయని చెప్పారు. ఇళ్లు మంజూరైన లబ్ధిదారులు నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. పేద ప్రజల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకాన్ని సద్వినియో గం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో హౌసింగ్ పీడీ యాదగిరి, ఏఈ ప్రియ, కాంట్రాక్టర్ శంకరప్ప తదితరులు పాల్గొన్నారు. నేడు భగీరథ నీటి సరఫరాలో అంతరాయం నర్సాపూర్: మిషన్ భగీరథ నీటి సరఫరాలో శనివారం అంతరాయం ఉంటుందని మున్సిపల్ కమిషనర్ రామకృష్ణారావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బోర్పట్ల సబ్స్టేషన్లో మరమ్మతులు నిర్వహించనున్న నేపథ్యంలో పంపింగ్ నిలిపివేస్తున్నట్లు చెప్పారు. దీంతో నల్లాల ద్వారా నీటి సరఫరా కావని, ప్రజలు సహకరించాలని కోరారు. మహిళా సమాఖ్యల బలోపేతం పెద్దశంకరంపేట(మెదక్): మహిళా సమాఖ్యల బలోపేతానికి చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా సెర్ప్ డీపీఎం మోహన్ అన్నారు. శుక్రవారం పెద్దశంకరంపేట సీ్త్రశక్తి భవన్లో మండల సమాఖ్య కార్యవర్గ ఎన్నికలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం మహిళల సంక్షేమానికి ప్రత్యేక నిధులు కేటాయిస్తుందని, వీటిని సద్వినియోగం చేసుకొని అర్థికంగా, సామాజిక రంగాల్లో అభివృద్ధి చెందాలని సూచించారు. మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలిగా జోడు మాధవి, కార్యదర్శిగా బాలమణి, కోశాధికారిగా పద్మ ఎన్నికయ్యారు. కార్యక్రమంలో ఏపీఎం గోపాల్, సీసీలు, మహిళా సమాఖ్య సభ్యులు పాల్గొన్నారు. పిల్లలకు పోషకాహారం అందించండి: డీడబ్ల్యూఓ కౌడిపల్లి(నర్సాపూర్): పిల్లల్లో పోషకాహారలోపం లేకుండా చూడాలని డీడబ్ల్యూఓ హైమా వతి అంగన్వాడీలకు సూచించారు. శుక్రవారం మండలంలోని దేవులపల్లి, భుజి రంపేట అంగన్వాడీ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా పిల్లల ఎత్తు, బరువు పరిశీలించారు. అనంతరం తల్లులతో మాట్లాడి పిల్లల ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. గర్భిణులు, బాలింతలు, పిల్లల్లో పోష కాహార లోపం లేకుండా చేసేందుకు ప్రభుత్వం అంగన్వాడీల ద్వారా పోషకాహారం పంపిణీ చేస్తుందని చెప్పారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ మండల సూపర్వైజర్ ఖమర్సుల్తానా, అంగన్వాడీ టీచర్లు అనురాధ, మహేశ్వరీ పాల్గొన్నారు. 91 మంది గైర్హాజరు మెదక్ కలెక్టరేట్: జిల్లాలో ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. శుక్రవారం రెండో రోజు 91 మంది విద్యార్థులు పరీక్షలకు గైర్హాజరయ్యారు. జిల్లాలో మొత్తం 22 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇంగ్లీష్కు పరీక్షకు 1,061 మంది హాజరుకావాల్సి ఉండగా, 970 మంది హాజరయ్యారు. పరీక్ష కేంద్రాల వద్ద పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. టైలరింగ్లో ఉచిత శిక్షణ సంగారెడ్డి టౌన్: పురుషులకు టైలరింగ్లో ఉచిత శిక్షణ కల్పించనున్నట్లు స్టేట్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ డైరెక్టర్ వంగ రాజేంద్రప్రసాద్ శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. సంగారెడ్డి, మెదక్ జిల్లాలోని 18 నుంచి 45 ఏళ్లు పురుషులు ఈ నెల 31 నుంచి నెల రోజులపాటు శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి ఉన్నవారు సంగారెడ్డి బైపాస్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ కేంద్రం, 97044 46956, 94901 29839 సంప్రదించాలని సూచించారు. -
పాపన్నపేటలో చిరుత కలకలం!
పాపన్నపేట(మెదక్): మండల కేంద్రమైన పాపన్నపేటలో శుక్రవారం చిరుత సంచారం కలకలం రేపింది. గ్రామ శివారులోని వెంకటేశ్వర గుట్ట పరిసర ప్రాంతంలో చిరుతను పోలిన పాదముద్రలు కనిపించడంతో రైతులు ఆందోళనకు గురయ్యారు. నెలరోజుల క్రితం ఇదే గుట్టకు ఆవతలి వైపున దౌలాపూర్ శివారులో సైతం చిరుత కనిపించింది. అయితే శుక్రవారం కనిపించిన రెండు పాదముద్రలను బట్టి, ఒకటి తల్లి, మరొకటి పిల్ల చిరుతగా స్థానికులు భావిస్తున్నారు. దీంతో అటువైపు పొలాల్లోకి వెళ్లేందుకు రైతులు జంకుతున్నారు. ఈ విషయమై డీఎఫ్ఓ జోజిని వివరణ కోరగా తమ సిబ్బందిని పంపుతామని తెలిపారు. అయితే సెక్షన్ ఆఫీసర్ శ్రీనివాస్ పరిశీలించి పాదముద్రలు చిరుతలా కనిపించడం లేదన్నారు. పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు. -
సిబిల్.. గుబుల్!
రాజీవ్ యువ వికాసం దరఖాస్తుదారులకు సిబిల్ గుబులు పట్టుకుంది. సిబిల్ స్కోర్తో సంబంధం లేదని ఇటీవల డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించినా.. ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి ఆదేశాలు రాలేదని బ్యాంకర్లు చెబుతున్నారు. దరఖాస్తులను సిబిల్ స్కోర్తో ముడిపెడుతూ అర్హుల ఎంపిక చేపడుతున్నారు. దీంతో అసలు రుణం వస్తుందా? లేదా? అనే అనుమానం నిరుద్యోగుల్లో వ్యక్తమవుతోంది. – మెదక్జోన్ జిల్లావ్యాప్తంగా రాజీవ్ యువ వికాసం పథకం కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు కలిపి మొత్తం 32 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ పథకంలో రూ. లక్ష నుంచి రూ. 4 లక్షల వరకు సబ్సిడీ రుణాలను ప్రభుత్వం ప్రకటించింది. దీంతో నచ్చి న యూనిట్ను ఎంపిక చేసుకొని ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. అనంతరం ఆయా మండలాల ఎంపీడీఓలతో పాటు మున్సిపల్ కార్యాలయాల్లో సంబంధిత పత్రాలను అందజేశారు. వాటిని స్వీకరించిన అధికారులు బ్యాంకర్లకు పంపించారు. ప్రస్తుతం వారు లబ్ధిదారుల సిబిల్ స్కోర్ను పరిశీలిస్తున్నారు. దాని ఆధారంగానే అర్హులను ఎంపిక చేసే ప్రక్రియలో నిమగ్నమైనట్లు తెలిసింది. అయితే ఇటీవల డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క రాజీవ్ యువ వికాసానికి సిబిల్ స్కోర్ తో సంబంధం లేదని ప్రకటింటినా, బ్యాంకర్లు అవేం పట్టించుకోవడం లేదు. అనర్హులుగా తేలే అవకాశం! బ్యాంకు లావాదేవీలు చేసే ప్రతి ఒక్కరికీ సిబిల్ స్కోర్ అనేది చాలా ముఖ్యం. రుణం తీసుకునే సమయంలో దీన్ని ప్రామాణికంగా పరిగణించి.. సదరు వ్యక్తి అర్హతను నిర్ధారిస్తారు. బ్యాంకులో తీసుకున్న రుణం సకాలంలో చెల్లించకపోయినా.. పాతబకాయి కోసం వన్ టైం సెటిల్మెంట్ చేసుకున్నా.. ఇలా అనేక రకాల పద్ధతులపై సిబిల్ స్కోర్ ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం రాజీవ్ యువవికాసం కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో మెజార్టీ ప్రజలు సిబిల్ స్కోర్కు అర్హత సాధించే అవకాశం లేదని చర్చ జరుగుతోంది. చాలా మంది బ్యాంకుల ద్వా రా పంట రుణం తీసుకున్న వారు ఉన్నారు. రుణమాఫీ అవుతుందని సకాలంలో చెల్లించని వారు ఉన్నారు. దీంతో వారు అర్హత కోల్పోయే అవకాశం ఉంది. అదే జరిగితే జిల్లావ్యాప్తంగా దరఖాస్తు చేసుకున్న 32 వేల మందిలో కేవలం 8 వేల మంది మాత్రమే అర్హులుగా తేలే అవకాశం ఉందని తెలుస్తోంది.గందరగోళంగా‘రాజీవ్ యువ వికాసం’ ఎలాంటి ఆదేశాలు రాలేదంటున్న బ్యాంకర్లు అయోమయంలో దరఖాస్తుదారులు జిల్లావ్యాప్తంగా 32 వేల దరఖాస్తులు స్కోర్ ప్రామాణికంగానే రుణాలు రాజీవ్ యువ వికాసానికి సంబంధించిన దరఖాస్తులను క్షుణంగా పరిశీలిస్తున్నాం. ముఖ్యంగా దరఖాస్తుదారుడి సిబిల్ స్కోర్ను పరిగణలోకి తీసుకుంటున్నాం. సిబిల్ స్కోర్ ను పరిగణలోకి తీసుకోవద్దని ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎలాంటి ఆదేశాలు రాలేదు. – మూర్తి, లీడ్ బ్యాంక్ మేనేజర్, మెదక్ -
బస్సులు నడపండి.. బాధలు తీర్చండి
మెదక్ మున్సిపాలిటీ: పలు రూట్లలో బస్సులు నడపాలని కోరుతూ పలువురు ప్రయాణికులు శుక్రవారం నిర్వహించిన డయల్ యువర్ డీఎంకు విన్నవించారు. మెదక్ నుంచి వెల్పుగొండ మీదుగా రేగోడ్కు, మెదక్ నుంచి టేక్మాల్, బొడ్మట్పల్లి మీదుగా జోగిపేట, సంగారెడ్డి. పటాన్చెరుకు, అలాగే ఉదయం 6 గంటలకు మాచారం మీదుగా జేబీఎస్ వరకు, టేక్మాల్ నుంచి నర్సాపూర్కు బస్సు నడపాలని కోరారు. ఈసందర్భంగా డిపో మేనేజర్ సురేఖ ప్రయాణికుల ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. అధికారుల దృష్టికి సమస్యలను తీసుకెళ్లి పరిష్కారం దిశగా ముందుకు వెళ్తామని తెలిపారు. -
ఇందిరమ్మ ఇళ్లు
నిమ్జ్ నిర్వాసితులకుసభావేదికపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి. చిత్రంలో కలెక్టర్ క్రాంతి, మంత్రులు కొండా సురేఖ, దామోదర రాజనర్సింహ, ఎంపీ సురేశ్ షెట్కార్, షబ్బీర్ అలీ, ఎమ్మెల్యే మాణిక్రావు తదితరులుమహిళలను కోటీశ్వరుల్ని చేస్తాం మంత్రి కొండా సురేఖ సంగారెడ్డి జోన్: ప్రతీ మహిళను కోటీశ్వరుల్ని చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కొండా సురేఖ అన్నారు. ప్రభుత్వం చేపట్టి ప్రతీ కార్యక్రమంలో మహిళలను భాగస్వామ్యం చేస్తూ ముందుకు వెళ్తున్నామని తెలిపారు. వివిధ రంగాల్లో అభివృద్ధి సాధించి, ఆర్థిక అభివృద్ధి సాధించే దిశగా మహిళా సంఘాలకు రుణాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. త్వరలో పెట్రోల్ బంక్ల నిర్వహణ కూడా వారే నిర్వహించబోతున్నారని వెల్లడించారు. సమస్యల పరిష్కారానికే భూభారతి మంత్రి దామోదర రాజనర్సింహ గత ప్రభుత్వం తీసుకువచ్చిన ధరణితో రైతులు అనేక భూ సమస్యలు ఎదుర్కొన్నారని, వాటిని పరిష్కరించేందుకే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భూ భారతి చట్టాన్ని తీసుకువచ్చి పరిష్కారం దిశగా కృషి చేస్తోందని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. రాష్ట్రంలో కులగణన ప్రక్రియ చేపట్టి చరిత్రలో నిలిచిపోయిందన్నారు. అప్పటి కాంగ్రెస్ హయాంలో మైనార్టీలకు నాలుగు శాతం రిజర్వేషన్ కల్పించిన ఘనత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికే దక్కిందన్నారు. హైదరాబాద్ తర్వాత అభివృద్ధి జరిగేది జహీరాబాద్ ప్రాంతమేనని వెల్లడించారు. పారిశ్రామిక అభివృద్ధి దిశగా ఎంపీ సురేశ్ కుమార్ షెట్కార్ జహీరాబాద్ నియోజకవర్గ పారిశ్రామిక అభివృద్ధి రంగంలో దూసుకుపోతోందని ఎంపీ సురేశ్ కుమార్ షెట్కార్ అన్నారు. గతంలో కాంగ్రెస్ హయాంలో జహీరాబాద్ ప్రాంతానికి నిమ్జ్ వచ్చిందని గుర్తు చేశారు. ప్రారంభంలో మూడు వేల ఎకరాలు సేకరిస్తే, పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో భూ సేకరణ ప్రక్రియ ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉందని వి మ ర్శించారు. త్వరలోనే పూర్తిస్థాయిలో భూ సేకరణ పూర్తి చేయడం జరుగుతుందన్నారు. రూ. 250 కోట్లతో 100 ఎకరాల విస్తీర్ణంలో చెరుకు రైతుల సమస్య పరిష్కారానికి పరిశ్రమ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. పట్టాలిచ్చే ప్రత్యేక బాధ్యతలు జగ్గారెడ్డికి అప్పగిస్తున్నా సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: నిమ్జ్లో భూములు కోల్పోతున్న 5,612 నిర్వాసిత కుటుంబాలందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని రేవంత్రెడ్డి హామీనిచ్చారు. ఈ నిర్వాసితులకు పట్టాలు అందించే బాధ్యతను టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అప్పగిస్తున్నానన్నారు. ఇందుకు అవసరమైన కార్యాచరణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. జహీరాబాద్ నియోజకవర్గంలో శుక్రవారం రూ.494 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు రేవంత్రెడ్డి ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా జహీరాబాద్లో ఏర్పాటు చేసిన బహిరంగసభలో సీఎం ప్రసంగించారు. 2014 తర్వాత మెదక్ జిల్లాతో పాటు, నిమ్జ్ అభివృద్ధి కుంటుపడిందని విమర్శించారు. నిమ్జ్ నిర్వాసితుల సమస్యలను మంత్రి దామోదర రాజనర్సింహ తన దృష్టికి తెచ్చారని, వెంటనే అధికారులను పిలిచి నిర్వాసితులకు న్యాయం చేసేలా నష్టపరిహారం పెంచాలని ఆదేశించామన్నారు. జంట నగరాలకు తాగునీరు, ఉమ్మడి మెదక్ జిల్లాకు సాగునీరు అందిస్తున్న సింగూరు ప్రాజెక్టును ఎకో టూరిజం స్పాట్గా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటామని వివరించారు. బసవేశ్వర, సంగమేశ్వర ఎత్తిపోతల పథకాలను ప్రస్తావించిన రేవంత్రెడ్డి వీటికి నిధులు కేటాయిస్తామని చెప్పారు. చెరుకు రైతుల సమస్య పరిష్కరిస్తాం జహీరాబాద్ ప్రాంతంలో చెరుకు రైతుల సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని రేవంత్రెడ్డి హామీ ఇచ్చారు. సహకార రంగంలో చక్కెర కర్మాగారం ఏర్పాటుకు అవసరమైన పదెకరాల భూమిని నిమ్జ్లో కేటాయించే బాధ్యత తీసుకుంటానన్నారు. ఇక్కడ పది లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన చక్కెర కర్మాగారం ఏర్పాటు చేస్తామని హామీనిచ్చారు. ప్రముఖ కార్ల తయారీ కంపెనీ హుందాయ్ ఇదే నిమ్జ్లో తన యూనిట్ స్థాపన పనులను త్వరలోనే ప్రారంభిస్తుందని తెలిపారు. ఈ కంపెనీకి 450 ఎకరాలు భూమిని కేటాయించామన్నారు. జిల్లాలోని రెండు జాతీయ రహదారులపై జరుగుతున్న రోడ్డు ప్రమాదాల నివారణకు అవసరమైన అండర్ పాస్ల నిర్మాణానికి కేంద్రం ప్రభుత్వంతో మాట్లాడి నిధులు తీసుకువస్తానని స్పష్టం చేశారు. ఆదర్శనీయుడు బసవేశ్వరుడు గౌతమ బుద్ధుని తర్వాత బసవేశ్వరుడు ఆదర్శనీయుడని సీఎం రేవంత్రెడ్డి పేర్కొన్నారు. ఆ రోజుల్లో అనుభవ మండపాలను ఏర్పాటు చేసి అన్ని సామాజికవర్గాల ప్రజలకు న్యాయం జరగేలా చేసిన విశ్వగురువు బసవేశ్వరుడన్నారు. అప్పటి అనుభవ మండపాల మాదిరిగానే ఇప్పుడు అసెంబ్లీ.. పార్లమెంట్లను నిర్వహించుకుంటున్నామన్నారు. మున్సిపాలిటీల అభివృద్ధిపై త్వరలో సమీక్ష జిల్లాలోని జహీరాబాద్ మున్సిపాలిటీ అభివృద్ధి పనులపై త్వరలో సమీక్ష నిర్వహిస్తామని సీఎం పేర్కొన్నారు. పట్టణంలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, తాగునీటి సమస్యను పరిష్కరించి ఈ పనులకు అవసరమైన నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలని ఎన్నికలయ్యాక అందర్నీ కలుపుకుని పోతామన్నారు. నారాయణఖేడ్ మున్సిపాలిటీకి అవసరమైన నిధులు మంజూరు చేస్తామని చెప్పారు. 150 ఎకరాల భూమిని కేటాయించి పరిశ్రమల స్థాపనకు కృషి చేస్తామన్నారు. చెక్డ్యాంల నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామన్నారు. ఎమ్మెల్సీ అంజిరెడ్డి ఇచ్చిన విజ్ఞప్తులను పరిశీలించి అవసరమైన నిధులు మంజూరు చేయిస్తానని, జుక్కల్, ఎల్లారెడ్డి నియోజకవర్గాల అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. సభలో మాట్లాడుతున్న సీఎం రేవంత్రెడ్డిఇందిరమ్మకు మెదక్తో విడదీయలేని అనుబంధం.. మెదక్ ప్రాంతానికి ఇందిరమ్మకు విడదీయలేని అనుబంధం ఉందని రేవంత్ పేర్కొన్నారు. ఇందిరమ్మ తన చివరి శ్వాస వదిలేవరకు మెదక్ ఎంపీగా కొనసాగారని గుర్తు చేసుకున్నారు. మాజీ ఎంపీ భాగారెడ్డి, ఈశ్వరీబాయిలను ఈ ప్రాంత ప్రజలు గుర్తు చేసుకుంటారు. గీతారెడ్డి హయాంలోనే జహీరాబాద్కు నిమ్జ్ మంజూరు చేయించారని పేర్కొన్నారు. మినీ ఇండియాగా పేరున్న పటాన్చెరు ప్రాంతంలో బీడీఎల్, బీహెచ్ఈఎల్, ఇక్రిశాట్, నిమ్జ్ ఇవన్నీ కాంగ్రెస్ అధికారంలో వచ్చినవేనని గుర్తు చేశారు. ఈ అభివృద్ధిని భవిష్యత్తులో ముందుకు తీసుకెళ్లే బాధ్యత తీసుకుంటామన్నారు. మెదక్ సాగు, తాగునీరు, పరిశ్రమల అభివృద్ధికి నిధులు మంజూరు చేయిస్తానని చెప్పారు. కో–ఆపరేటివ్ సెక్టార్లో చక్కెర పరిశ్రమ త్వరలో హుందాయ్ కార్ల పరిశ్రమ పనులు ప్రారంభం సింగూరు ప్రాజెక్టును ఎకో టూరిజం స్పాట్గా అభివృద్ధి సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతలకు నిధులు బహిరంగసభలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి -
క్యూఆర్కోడ్ సిటిజన్ లో ప్రథమం
ఉత్తమ పోలీస్స్టేషన్లుగా నర్సాపూర్, తూప్రాన్మెదక్ మున్సిపాలిటీ: పోలీసుల పనితీరు, ప్రజల్లో ఉన్న అభిప్రాయాలు తెలుసుకునేందుకు రాష్ట్ర పోలీస్శాఖ ఈ ఏడాది నిర్వహించిన క్యూఆర్ కోడ్ ఆఫ్ సిటిజన్ సర్వేలో జిల్లా మొదటిస్థానంలో నిలిచినట్లు ఎస్పీ ఉదయ్కుమార్రెడ్డి తెలిపారు. బుధవారం హైదరాబాద్లోని డీజీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సర్టిఫికేషన్ కార్యక్రమంలో జిల్లా నుంచి అదనపు ఎస్పీ మహేందర్ హాజరై సర్టిఫికెట్ అందుకున్నట్లు చెప్పారు. సిటిజన్ ఫీడ్ బ్యాక్లో రాష్ట్రంలోనే 10 ఉత్తమ పోలీస్స్టేషన్లలో నర్సాపూర్కు 1వ స్థానం,తూప్రాన్కు 4వ స్థానం వచ్చినట్లు వివరించారు. ఆయా పోలీస్స్టేషన్ల ఎస్హెచ్ఓలు, ఎస్ఐలు డీజీపీ చేతుల మీదగా సర్టిఫికెట్లు అందుకున్నట్లు చెప్పారు. అదేవిధంగా పోక్సో కేసుల్లో 60 రోజుల్లోపే ఎక్కువగా చార్జిషీట్లు వేసినందుకు తూప్రాన్ డీఎస్పీ వెంకట్రెడ్డి రాష్ట్రంలోనే రెండో స్థానం పొంది అదనపు డీజీపీ అనిల్కుమార్ చేతుల మీదుగా సర్టిఫికెట్ అందుకున్నట్లు పేర్కొన్నారు. -
లారీలు రావు.. బస్తాలు పోవు
ఆగ్రహించి రోడ్డెక్కిన రైతులుకొల్చారం(నర్సాపూర్): వారం రోజులుగా కొనుగోలు కేంద్రాలకు లారీలు రాకపోవడం, అకాల వర్షాలకు ధాన్యం బస్తాలు తడిసి మొలకలు రావడంతో ఆగ్రహించిన పైతర గ్రామానికి చెందిన రైతులు బుధవారం ఆందోళన దిగారు. రంగంపేట పీఏసీఎస్ ఎదురుగా మెదక్– జోగిపేట ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టారు. మొలకెత్తిన ధాన్యాన్ని రోడ్డుపై పోసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కొనుగోలు కేంద్రంలో ఇప్పటికే తూకం వేసిన 5 వేల ధాన్యం బస్తాలు తరలించేందుకు లారీలు రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అకాల వర్షాలకు బస్తాల్లోని ధాన్యం మొలకెత్తుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. గంట పాటు సాగిన రాస్తారోకోతో ఇరువైపులా పెద్దఎత్తున వాహనాలు నిలిచిపోయి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విషయం తెలుసుకున్న తహసీల్దార్ శ్రీనివాస్చారి, ఎస్ఐ మహమ్మద్ గౌస్ రైతుల వద్దకు చేరుకొని లారీలు వచ్చేలా చూస్తామని నచ్చజెప్పడంతో రాస్తారోకో విరమించారు. -
ఆదర్శనీయుడు అంబేడ్కర్
చిన్నశంకరంపేట(మెదక్): డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ దేశ గమనాన్ని మార్చిన గొప్ప నాయకుడని, ఆయన మార్గదర్శనం ఆదర్శనీయమని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. బుధవారం మండలంలోని గజగట్లపల్లిలో దళిత సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంబేడ్కర్ విగ్రహాన్ని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మారెడ్డితో కలిసి ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ అభ్యున్నతిలో అంబేడ్కర్ పాత్ర గొప్పదన్నారు. ఆయన ముందుచూపు వల్లే నేడు దేశం అన్ని రంగాల్లో ముందుకు సాగుతుందని తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ శేరి సుభాష్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే శశిధర్రెడ్డి, నాయకులు తిరుపతిరెడ్డి, లక్ష్మారెడ్డి, పట్లోరి రాజు, బండారు స్వామి, మాజీ మున్సిపల్ చైర్మన్లు జితేందర్గౌడ్, మల్లికార్జున్గౌడ్, మాజీ సర్పంచ్లు రవీందర్, కుమార్గౌడ్, యాదగిరి, లక్ష్మణ్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. కల్తీ విత్తనాలు విక్రయిస్తే చర్యలు నర్సాపూర్ రూరల్: కల్తీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని నర్సాపూర్ జూనియర్ సివిల్ కోర్టు న్యాయమూర్తి హేమలత హె చ్చరించారు. బుధవారం మండలంలోని చిప్పల్తుర్తిలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. దేశానికి వెన్నముక లాంటి రైతులను మోసం చేస్తే చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకుంటామన్నారు. రైతులు విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసే ముందు నాణ్యత ప్రమాణాలు చూసుకోవాలని సూచించారు. ప్రతి రైతు సేంద్రియ ఎరువులను వాడి పంటలు సాగు చేస్తే ప్రజల ఆరోగ్యంతో పాటు మంచి లాభాలు ఉంటాయన్నారు. రైతులు పంట సాగులో వచ్చే సమస్యలతో పాటు ఆర్థిక కారణాలతో ఆత్మహత్యలకు పాల్పడొద్దని అన్నారు. పేద రైతులకు చట్టపరమైన సమస్యలు ఉంటే ఉచితంగా న్యాయ సహాయం అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో వ్యవసాయ అధికారులు, రైతులు పాల్గొన్నారు. సాంకేతికతను జోడిస్తూ బోధించాలి మెదక్ కలెక్టరేట్: బోధనలో అత్యాధునిక సాంకేతికతను జోడించి బోధన చేయాలని రాష్ట్ర విద్యాశాఖ పరిశీలకుడు భాస్కర్దేశ్ సూచించారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల పాఠశాలలో భౌతిక, రసాయనశాస్త్ర ఉపాధ్యాయుల శిక్షణ శిబిరాన్ని సందర్శించి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించేందుకు సన్న ద్ధం అయినట్లు తెలిపారు. అందులో భాగంగానే ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పాఠశాలల్లో విద్యార్థులకు ఆసక్తి కలిగేలా అత్యాధునిక సాంకేతిక పద్ధతులను బోధనలో వినియోగించాలని వివరించారు. కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి, కోర్స్ కో ఆర్డినేటర్, హెచ్ఎం రేఖ, రిసోర్స్ పర్సన్లు మహేందర్, రాజ్కుమార్, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. నేటి నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ మెదక్ కలెక్టరేట్: ఇంటర్మీడియెట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు గురువారం నుంచి జరగనున్నాయి. ఇందుకోసం జిల్లావ్యాప్తంగా 22 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. 130 మంది ఇన్విజిలెటర్లను కేటాయించారు.ఫస్ట్ ఇయర్లో 3,626 మంది, సెకండ్ ఇయర్లో 2,214 మంది కలిపి మొత్తం 5,840 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. సీసీ కెమెరాల నిఘాలో కట్టుదిట్టంగా పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు ఫస్ట్ ఇయర్, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 5.30 గంటల వరకు ద్వితీయ సంవత్సర విద్యార్థులకు పరీక్షలు నిర్వహించనున్నారు. జూన్ 1వ తేదీ వరకు పరీక్షలు కొనసాగనున్నాయి. -
తగ్గిన శిశు మరణాలు
ఉమ్మడి మెదక్ జిల్లాలో శిశు మరణాలు తగ్గాయి. 2020లో 541 మంది చిన్నారులు మృతి చెందితే అందులో మగవాళ్లు 285, ఆడవాళ్లు 256 మంది ఉన్నారు. 2021లో 427 మంది చిన్నారులు మృతి చెందగా అందులో మగ వారు 234, ఆడ శిశువులు 193 మంది ఉన్నారు. రెండేళ్లలో ఆడ శిశువులు తక్కువగానే మృతి చెందారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో శిశు మరణాలు తగ్గాయని చెప్పవచ్చు. 2021లో శిశు మరణాలు జిల్లా మగ ఆడ మొత్తం మెదక్ 148 119 267 సిద్దిపేట 20 19 39 సంగారెడ్డి 66 55 121 -
మెతుకుసీమపై ప్రత్యేక ముద్ర
హైదరాబాద్ సిటీ సౌత్ వెస్ట్జోన్ డీసీపీగా విధులు నిర్వర్తిస్తున్న క్రమంలోనే 2024 జూలైలో మెదక్ జిల్లాకు ఎస్పీగా బదిలీపై వచ్చారు. ఉదయ్కుమార్కు వ్యవసాయం అంటే ఎంతో ఇష్టం. నెలకోసారి సొంత గ్రా మంలోని పొలాలను సందర్శిస్తారు. ఆ మక్కువతోనే జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం చుట్టూ 60 ఎకరాలకు ఫెన్సింగ్ వేయించి అందులో రకరకాల మొక్కలు నాటి పెంచుతున్నారు. ఇప్పటివరకు 1,000 మొక్కలు నాటించి వాటికి డ్రిప్ ఇరిగేషన్ వేయించారు. అలాగే జిల్లాలో ఫైరింగ్ రేంజ్ను, జిల్లా పోలీస్ కార్యాలయ పరిధిలోనే సిబ్బందికి అవసరమయ్యే పరేడ్ ఏర్పాటు చేయించారు. ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి నూతనంగా మెదక్ టౌన్లో ట్రాఫిక్ వింగ్ను కొత్తగా ఏర్పాటు చేశారు. జిల్లాలో పనిచేసే పోలీసులు, హోంగార్డ్ సిబ్బంది కుటుంబాల సంక్షేమానికి పోస్టల్ ఎన్ఐసీని తీసుకునే విధంగా చొరవ చూ పారు. తన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం సొంత గ్రామం రామచంద్రాపురంలో గ్రంథాలయం ఏర్పాటు చేశారు. -
స్వస్థలం.. చదువు.. కుటుంబ నేపథ్యం
కమ్యూనిటీ పోలీసింగ్ అవార్డు అందుకుంటూ..ఉదయ్కుమార్ది ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం రాంచంద్రాపురం గ్రామం. తల్లిదండ్రులు దేవరపల్లి సామ్రాజ్యం– సుబ్బారెడ్డి. వీరిది వ్యవసాయ కుటుంబం. ఆయనకు సోదరి అరుణ ఉన్నారు. సొంత గ్రామంలో 1 నుంచి 5వ తరగతి వరకు, 6, 7 తరగతులు సమీప గ్రామమైన సుర్దెపల్లికి కాలినడకన వెళ్లి చదువుకున్నారు. 8, 9 నేలకొండపల్లి.. పదో తరగతి నల్గొండ జిల్లా కోదాడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పూర్తి చేశారు. ఇంటర్ నేలకొండపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల, డిగ్రీ (బీఏ) కేఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుంచి పట్టా పొందారు. ఈక్రమంలో 1986లో అరుణతో వివాహం జరిగింది. విద్యాభ్యాసం పూర్తయ్యాక టీచర్ కావాలని అనుకున్నారు. ఉద్యోగ వేటలో భాగంగా 1991లో ఎస్సైగా మొదటి ప్రయత్నంలో ఎంపికయ్యారు. ఉమ్మడి ఏపీ 1991 బ్యాచ్లో షూటింగ్లో ప్రథమస్థానం సాధించి అప్పటి హోం మంత్రి మైసూరారెడ్డి చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. వీరికి కూతురు, కుమారుడు ఉన్నారు. కూతురు సాధన ప్రస్తుతం అమెరికాలో స్థిరపడగా, కుమారుడు సంతోష్రెడ్డి సివిల్ ఇంజినీర్గా హైదరాబాద్లో విధులు నిర్వర్తిస్తున్నారు. -
చిరస్మరణీయుడు రాజీవ్గాంధీ
నర్సాపూర్ రూరల్: రాజీవ్గాంధీ చిరస్మరణీయుడని, ఆయన ఆశయ సాధనకు యువత కృషి చేయా లని డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్, నియోజకవర్గ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి అన్నారు. బుధవారం పార్టీ క్యాంపు కార్యాలయంలో రాజీవ్గాంధీ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆధునిక భారత నిర్మాణానికి రాజీవ్గాంధీ ఎంతో కృషి చేశారని కొనియాడారు. యువత రాజకీయాల్లోకి రావాలని అనేక కార్యక్రమాలు చేపట్టి ఆదర్శంగా నిలిచారన్నారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు మల్లేష్, మాజీ జెడ్పీటీసీ శ్రీనివాస్గుప్తా, నాయకులు శ్రీనివాస్గౌడ్, లలిత, నగేష్, సురేందర్, శ్రీశైలం యాదవ్, మల్లేష్ యాదవ్, రషీద్, రవి, సురేష్, అజ్మత్, కార్యకర్తలు పాల్గొన్నారు. డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్ -
24న కన్వెన్షన్ సెంటర్ లీజు వేలం
రామాయంపేట(మెదక్): మండలంలోని ప్రగతి ధర్మారం గ్రామంలో ప్రభుత్వం నిర్మించిన కన్వెన్షన్ సెంటర్ (ఫంక్షన్ హాలు) లీజు ఇవ్వడానికి ఈనెల 24న బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు గ్రామ పంచాయతీ కార్యదర్శి మహేందర్ పేర్కొన్నారు. నెలవారీ అద్దె ప్రతిపాదికన వేలం నిర్వహిస్తామని, ఇందులో పాల్గొనేవారు ముందస్తుగా రూ.3వేలు దరఖాస్తు రుసుము చెల్లించాలన్నారు. పంచాయతీ కార్యాలయం వద్ద నిర్వహించే వేలం పాటలో పాల్గొనే వారు ఈనెల 21 నుంచి 23 లోపు రూ. 60 వేలు డిపాజిట్ చేయాలని సూచించారు. వేలంలో పాల్గొనే వారు పంచాయతీకి ఎలాంటి బాకీ ఉండరాదని, నెగ్గినవారు వారం రోజుల్లో ఆరు నెలల అద్దె ముందస్తుగా చెల్లించాలని కార్యదర్శి పేర్కొన్నారు. వివరాలకు 99513 37591 నంబర్లో సంప్రదించాలని సూచించారు. చాకరిమెట్ల ఆలయం వద్ద వేలంశివ్వంపేట(నర్సాపూర్): మండల పరిధిలోని చిన్నగొట్టిముక్ల అరణ్యంలో కొలువైన చాకరిమెట్ల శ్రీ సహకార ఆంజనేయస్వామి ఆలయం వద్ద కొబ్బరికాయలు, పూజ సామగ్రి అమ్మకాల కోసం మంగళవారం వేలంపాట నిర్వహించారు. దేవాదాయశాఖ ఇన్స్పెక్టర్ రంగారావు, ఈఓ శ్రీనివాస్ సమక్షంలో వేలం పాట నిర్వహించగా ఐదుగురు పాల్గొని.. 10 లక్షల 50 వేల వరకు పాడారు. గత ఏడాది 12 లక్షల 60 వేల వరకు వేలం ద్వారా ఆలయానికి ఆదాయం వచ్చిందన్నారు. సరైన ధర రాకపోవడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ నెల 27న బహిరంగ వేలం పాట నిర్వహిస్తామని చెప్పారు. కార్యక్రమంలో ఆలయ పౌండర్, చైర్మన్ ఆంజనేయశర్మ, సిబ్బంది రామకృష్ణ, వెంకట్రెడ్డి, గ్రామస్తులు నర్సింగరావు, నరేందర్, వెంకటేష్, దశరఽఽథ్, పాపయ్యచారి, వీరాస్వామి, హరిసింగ్, శంకర్గౌడ్, మహేష్ తదితరులు ఉన్నారు. ఎరువుల దుకాణం తనిఖీరామాయంపేట(మెదక్): డీలర్లు ప్రభుత్వ నిబంధనలకు లోబడి వ్యాపారం నిర్వహించాలని, నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని ఇన్చార్జి వ్యవసాయ సహాయ సంచాలకుడు రాజ్నారాయణ హెచ్చరించారు. మంగళవారం పట్టణంలోని పలు ఫర్టిలైజర్ దుకాణాలను తనిఖీ చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. గ్రామాల్లో కొందరు విత్తనాలు, ఎరువులు అమ్ముతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. లైసెన్సు ఉన్న వ్యాపారులవద్ద మాత్రమే కొనుగోలు చేయాలని, వెంటనే రసీదు తీసుకోవాలన్నారు. వర్షాకాలం సమీపిస్తుండటంతో డీలర్లు ఎరువులు, విత్తనాలు సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. వెనువెంటనే అన్లోడింగ్..శివ్వంపేట(నర్సాపూర్): కొనుగోలు కేంద్రాల నుంచి రైస్మిల్స్కు వస్తున్న ధాన్యాన్ని వెనువెంటనే అన్లోడింగ్ చేయాలని డీసీఎస్ఓ సురేష్రెడ్డి, డీఎం జగదీశ్కుమార్ అన్నారు. మండలంలోని దొంతిలోని కామాక్షి రైస్మిల్కు ఇతర మండలాల నుంచి 30 లారీల ధాన్యం రావడంతో ఇబ్బందులు తలెత్తడంతో ఉప తహసీల్దార్ షఫీయోద్దీన్, ఆర్ఐ కిషన్ జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. డీసీఎస్ఓ సురేష్రెడ్డి, డీఎం జగదీశ్కుమార్ దొంతి రైస్మిల్ను మంగళవారం పరిశీలించారు. ధాన్యం వెంటనే అన్లోడింగ్ అయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. -
సిందూర్ను విమర్శించేవారు మూర్ఖులు
మెదక్జోన్: ఆపరేషన్ సిందూర్ను విమర్శించే మూర్ఖులకు ప్రజలే బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని ఎంపీ రఘునందన్రావు అన్నారు. పహల్గాం ఉగ్రదాడిని నిరసిస్తూ మంగళవారం బీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లేశంగౌడ్ ఆధ్వర్యంలో పట్టణంలోని గుల్షన్ క్లబ్ నుంచి రాందాస్ చౌరస్తా వరకు త్రివర్ణ జెండాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ హాజరై మాట్లాడారు. హిందువులను టార్గెట్ చేస్తూ భర్తలను చంపి వారి భార్యల నొదుట సిందూరం తుడిచిన ముష్కరులకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన సమాధానమే ఆపరేషన్ సిందూర్ అని పేర్కొన్నారు. భారతదేశం ఎవరిపై ఆధారపడకుండా స్వశక్తితో ప్రపంచానికి మన సైన్యం సత్తా ఏంటో సిందూర్ ద్వారా చూపించిందన్నారు.ఎంపీ రఘునందన్రావు -
పెండింగ్ కేసులపై దృష్టి సారించాలి
మెదక్ మున్సిపాలిటీ: పెండింగ్లో ఉన్న కేసులపై ప్రత్యేక దృష్టి సారించి వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఎస్పీ ఉదయ్కుమార్రెడ్డి పోలీస్ సిబ్బందికి సూచించారు. మంగళవారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో పెండింగ్ కేసులపై పోలీసు అధికారులు, సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ... సమస్యలతో స్టేషన్కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, బాధితులకు న్యాయం జరుగుతుందన్న భరోసా కల్పించాలన్నారు. కేసు నమోదు నుంచి చార్జిషీట్ వరకు ప్రతి విషయాన్ని కూలంకశంగా పరిశోధన చేసి ఫైనల్ చేయాలన్నారు. గ్రామాల్లో సీసీటీవీల ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పిస్తూ ఏర్పాటుకు కృషి చేయాలని సూచించారు. సైబర్ క్రైమ్, డయల్ 100 వినియోగంపై విద్యార్థులు, ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ మహేందర్, డీఎస్పీలు ప్రసన్నకుమార్, వెంకట్రెడ్డి, సైబర్ క్రైమ్ డీఎస్పీ సుభాష్ చంద్రబోస్, ఎఆర్ డీఎస్పీ రంగానాయక్,టౌన్ సీఐ నాగరాజు, సీఐ రేణుక, ఎస్బీ ఇన్స్పెక్టర్ సందీప్ రెడ్డి పాల్గొన్నారు.జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి -
లబ్ధిదారులకు ఇబ్బందులు కలుగొద్దు
హౌసింగ్ పీడీ మాణిక్యం మెదక్జోన్: ఇందిరమ్మ పథకంలో ఇళ్లు నిర్మించుకునే లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా బిల్లులు అందించే విధంగా చర్యలు చేపట్టాలని హౌసింగ్ పీడీ మాణిక్యం అధికారులను ఆదేశించారు. ఇళ్ల నిర్మాణాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఔట్సోర్సింగ్(ఓటీఎస్) ద్వారా రాష్ట్ర ఉన్నతాధికారులు ఎంపిక చేసిన ఏఈలు జిల్లాకు 11 మందిని కేటాయించారు. మంగళవారం వారితో ఆయన సమావేశం నిర్వహించి పలు మండలాలను కేటాయించారు. ఈ సందర్భంగా వారికి పలు సూచనలు చేశారు. నిబంధనల ప్రకారం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు కొనసాగించడంతో పాటు సకాలంలో బిల్లులు చెల్లించేలా ఎంబీ రికార్డులు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఈ యాదగిరి పాల్గొన్నారు. -
ఉపాధిపై సామాజిక తనిఖీ
చిన్నశంకరంపేట(మెదక్): మండలంలోని తొమ్మిది గ్రామ పంచాయతీల పరిధిలోని జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులపై నార్సింగి మండల పరిషత్ కార్యాలయంలో సామాజిక తనిఖీ నిర్వహించారు. మంగళవారం నార్సింగి ఎంపీడీఓ ఆనంద్ అధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో డీఆర్డీఏ పీడీ శ్రీనివాస్రావు, డీవీఓ శ్రీహరిగౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సామాజిక తనిఖీ బృందం సభ్యులు గ్రామాల వారీగా పనుల వివరాలతో పాటు అవకతవకలు వివరించారు. బీమ్రావుపల్లిలో సీనియర్ మెట్ నిబంధనలకు విరుద్ధంగా కుటుంబ సభ్యుల పేరుతో పనిచేసినట్లు మస్టర్లో రాశారని, జప్తిశివనూర్లో ఆదివారం కూడా పనిదినాలు కల్పించినట్లు రికార్డు చేసినట్లు వివరించారు. వల్లూర్లో పనిచేసిన వారికి డబ్బులు చెల్లించలేదని, నార్సింగిలో ఏడు రోజులు పనిచేసిన 162 మందికి డబ్బులు చెల్లించకపోవడంతో ఉపాధి కూలీలు నష్టపోయారని పేర్కొన్నారు. ఈ సందర్బంగా డీఆర్డీఏ పీడీ మాట్లాడుతూ సిబ్బంది నుంచి రూ.21,911 రికవరి పెట్టామని, రూ.20 వేలు జరిమానా విధించినట్లు తెలిపారు. కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి దామోదర్రెడ్డి, ఈజీఎస్ ఏపీఓ రాజేశ్వర్, సామాజిక తనిఖీ బృందం ఎస్ఆర్పీ తిరుపతి,హెచ్ఆర్ రాజేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రూ.21,911 రికవరి, రూ.20 వేల జరిమానా డీఆర్డీఏ పీడీ శ్రీనివాస్రావు వెల్లడి -
బోధనలో మెలకువలు తప్పనిసరి
మెదక్ కలెక్టరేట్: ఉపాధ్యాయులు శిక్షణ సమయంలో బోధనలో మెలకువలు నేర్చుకోవాలని డీఈఓ రాధాకిషన్ సూచించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో ఎఫ్ఎల్ఎన్ కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రాం ఫర్ ప్రైమరీ టీచర్స్కు 5 రోజుల శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. మెదక్ మండలంలోని ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు ఎడ్యుకేషనల్ సెక్రటరీ అధికారి జూమ్ మీటింగ్లో పలు సూచనలు చేశారు. జిల్లా విద్యాధికారి రాధా కిషన్ శిక్షణ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి, ఎంఈఓ శంకర్, ఆర్పీలు, మండలంలోని ఎల్ఎఫ్ఎల హెచ్ఎంలు, ఎస్జీటీలు, ఉపాధ్యాయులు, సీఆర్పీలు పాల్గొన్నారు.డీఈఓ రాధాకిషన్ -
అసంఘటిత కార్మికులు బీమా పొందాలి
నర్సాపూర్ : అసంఘటిత కార్మికులు ప్రభుత్వ కార్మిక శాఖ ఆధ్వర్యంలో లభించే బీమాను పొందాలని స్థానిక జూనియర్ సివిల్ జడ్జి, మండల లీగల్ సర్వీస్ కమిటీ చైర్మన్ ఎం.హేమలత అన్నారు. మంగళవారం స్థానిక కోర్టులో ఏర్పాటు చేసిన న్యాయ విజ్ఞాన సదస్సులో ఆమె పాల్గొని మాట్లాడారు. గ్రామీణ ప్రజలు దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న పేద వారు న్యాయ సహాయం అవసరమైతే మండల లీగల్ సర్వీస్ కమిటీ ద్వారా సహాయం పొందవచ్చని సూచించారు. లీగల్ సర్వీస్ ఆధ్వర్యంలో భూ సమస్యను పరిష్కరించిన అనంతరం తాజాగా రెవెన్యూ శాఖ నుంచి వచ్చిన పట్టాదార్ పాస్ పుస్తకాన్ని రైతు అశోక్కు ఆమె అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు న్యాయవాదులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.జూనియర్ సివిల్ జడ్జి ఎం.హేమలత -
ప్రమాదాల నివారణ ఇలా..
మెదక్ కలెక్టరేట్: రోడ్డు భద్రత నిబంధనలు పాటించి, ప్రమాదాలను నివారించవచ్చని జిల్లా కలెక్టర్ రాహుల్రాజ్ పేర్కొన్నారు. రోడ్డు భద్రత– ప్రమాదాల నివారణపై ఢిల్లీలో మంగళవారం కేంద్ర ప్రభుత్వ రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో దేశంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, ఇంజినీరింగ్ అధికారులతో చర్చా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ హాజరై మాట్లాడారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాలు తగ్గించడానికి తీసుకున్న చర్యల గురించి ఆయన వివరించారు. కలెక్టర్, ఎస్పీ ఆధ్వర్యంలో సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించాలన్నారు. ఈ సమావేశంలో చర్చించిన అంశాలను పరిగణలోకి తీసుకొని ఇంజినీరింగ్ అధికారులు పాటించేలా రాష్ట్ర, జాతీయ స్థాయిలో మానిటరింగ్ కమిటీ ఏర్పాటు చేస్తే ప్రమాదాలను నివారించవచ్చని కలెక్టర్ సూచించారు.ఢిల్లీ సదస్సులో కలెక్టర్ -
లేబర్ కోడ్లను రద్దు చేయాలి
మెదక్ కలెక్టరేట్: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి మల్లేశం డిమాండ్ చేశారు. మంగళవారం మెదక్లో అసంఘటిత రంగ కార్మికులతో కలిసి ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను అమలు చేస్తోందని ఆరోపించారు. కార్పొరేట్ల ప్రయోజనాల కోసం లేబర్ కోడ్లను అమల్లోకి తెస్తున్నారని, 12 గంటల పనిని చట్టబద్ధం చేస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి సంతోష్, నాయకులు బాలనర్సు, సాయిలు, శౌకత్ అలీ, హలీమ్, రాజు, కృష్ణ, కుమార్, కొమరయ్య, గట్టయ్య, రెడ్డి, అమృత, బాలమ్మ, రాజు, మల్లేశం, యాదగిరి, కృష్ణ, మైపాల్, షాకీర్ పాల్గొన్నారు.సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికుల ధర్నా -
పార్టీ కోసం పనిచేసే వారికి గుర్తింపు
కొల్చారం(నర్సాపూర్)/కౌడిపల్లి(నర్సాపూర్): పార్టీ కోసం పనిచేసే వారికి కాంగ్రెస్లో ఎప్పుడూ గుర్తింపు ఉంటుందని జిల్లా సంస్థ గత ఎన్నికల ఇన్చార్జి వరప్రసాద్ పేర్కొన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో మండలంలోని గ్రామశాఖ అధ్యక్షుల ఎన్నికల కోసం చేపట్టిన నామినేషన్ల కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. గ్రామస్థాయిలో పార్టీని బలోపేతం చేయాలన్న లక్ష్యంతో గ్రామ, మండల స్థాయి కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల సమయంలో మతతత్వాన్ని ముందుకు తీసుకువచ్చి అధికారం దక్కించుకోవాలనే నైజం బీజేపీదని, ప్రాంతీయ వాదం పేరిట భావోద్వేగాలు రెచ్చగొట్టే మరో పార్టీ బీఆర్ఎస్ అని ఆరోపించారు. అంతకుముందు స్థానిక బస్టాండ్ నుంచి ఫంక్షన్ హాల్ వరకు సంవిధాన్ బచావో ర్యాలీ నిర్వహించారు. అనంతరం వరప్రసాద్తోపాటు జిల్లా పార్టీ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్, టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, నియోజకవర్గ ఇన్చార్జి రాజిరెడ్డి నాయకుల నుంచి నామినేషన్ పత్రాలను స్వీకరించారు. కాగా కౌడిపల్లి మండల కేంద్రంలో పార్టీ సంస్థాగత ఎన్నికల ఇన్చార్జి వరప్రసాద్తోపాటు టీపీసీసీ కార్యదర్శి రాజిరెడ్డి, డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ సుహాసినిరెడ్డి తదితరులు ర్యాలీ నిర్వహించి అంబేడ్కర్ చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు మల్లేశం గౌడ్, మాజీ ఎంపీపీ మల్లారెడ్డి, ఉపాధ్యక్షుడు గోవర్ధన్, నాయకులు శేషసాయి రెడ్డి, రవీందర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, అనిల్, సావిత్రి రెడ్డి, కౌడిపల్లి మండల పార్టీ అధ్యక్షుడు శ్రీనివాసరావ్, ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ రెడ్డి, యూత్ అధ్యక్షుడు ధన్సింగ్, నాయ కుడు క్రిష్ణాగౌడ్, పీఏసీఎస్ చైర్మన్ గోవర్ధన్రెడ్డి, వెస్చైర్మన్ చిన్నంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.జిల్లా కాంగ్రెస్ సంస్థాగత ఎన్నికల ఇన్చార్జి వరప్రసాద్ -
ఖరీఫ్ ప్రణాళిక ఖరారు
వానాకాలం సీజన్లో 3.50 లక్షల ఎకరాల్లో సాగు ● 3 లక్షల పైచిలుకు ఎకరాల్లో వరి ● ఈసారి సన్నాలు పెరిగే అవకాశం? ● ఉన్నతాధికారులకు నివేదిక అందజేతమెదక్జోన్: వానాకాలం సాగు ప్రణాళికను వ్యవసాయ శాఖ అధికారులు ఖరారు చేశారు. ఈనెల 19న సాక్షి దినపత్రికలో ‘ఖరారు కానీ ఖరీఫ్ ప్రణాళిక‘ అనే కథనం ప్రచురితం కావటంతో స్పందించిన అధికారులు పంటల ప్రణాళికను సిద్ధం చేశారు. సరిపడ ఎరువులు, విత్తనాలపై ఉన్నతాధికారులకు సైతం నివేదిక అందజేశారు. ఈ ఖరీఫ్ సీజన్లో జిల్లా వ్యాప్తంగా అన్నిరకాల పంటలు 3,50,164 ఎకరాల్లో సాగు కానున్నట్లు అధికారులు పేర్కొన్నారు. అందులో సింహాభాగం వరి ఏకంగా 3,05,100 ఎకరాల్లో సాగు కానుంది. 2వ స్థానంలో పత్తి 37,200 ఎకరాల్లో సాగు అవుతుందని అధికారులు అంచనా వేశారు. వరి, పత్తి పంటలు 3,42,300 ఎకరాల్లో సాగు అవుతుండగా మిగతా 7,864 ఎకరాల్లో మాత్రమే ఇతర పంటలు సాగవనున్నాయి. కాగా గత 2024 వానాకాలం సీజన్లో వరి, పత్తితో పాటు అన్ని రకాల పంటలు 3,43,399 ఎకరాల్లో సాగు కాగా ఈ ఏడు 6,765 ఎకరాల్లో అధికంగా సాగవుతుంది. పంటల సాగుకు అవసరమయ్యే ఎరువులు, విత్తనాల ప్రణాళికను ఉన్నతాధికారులకు నివేదించారు. గణనీయంగా పెరగనున్న సన్నాలు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2024 వానాకాలం సీజన్ నుంచి సన్నాలు సాగు చేసిన రైతులకు అదనంగా క్వింటాల్కు రూ. 500 బోనస్ ఇస్తోంది. దీంతో రైతులు సన్నాల సాగువైపు మొగ్గు చూపుతున్నారు. ఈ సీజన్లో వరి 3,05,100 ఎకరాల్లో సాగు కానుండగా అందులో 40శాతం సన్నాలను వేసే అవకాశం ఉంది. అంటే 1.20 లక్షల ఎకరాల్లో సన్నాలు సాగు చేసేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారు. అంతే కాకుండా మరో 50 వేల ఎకరాలకు పైగా వరి విత్తనాలను సాగు చేసే అవకాశం లేకపోలేదు. కొంత కాలంగా జిల్లాలో పలు రకాల వరి విత్తన కంపెనీలు రైతులతో సాగు చేయిస్తున్నారు. ఒక్కో ఎకరాకు రూ. 70 వేల నుంచి రూ.లక్ష వరకు సదరు కంపెనీలు రైతుకు ఇచ్చి సాగు విత్తనాలను పండిస్తున్నారు. దీంతో రైతులు విత్తనాల సాగుకు మొగ్గు చూపుతున్నారు. ఒకవేళ ప్రకృతి వైపరీత్యాలు, అతివృష్టి, అనావృష్టితో కానీ పంటలు దెబ్బతింటే సదరు కంపెనీ రైతుతో ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం పరిహారం అందజేస్తారు. దీంతో రైతులు వరి విత్తన సాగును విరివిగా పండిస్తున్నారు. వర్షాధారంగానే పత్తి సాగు వానాకాలం అత్యధికంగా సాగయ్యే పంటల్లో పత్తి పంట రెండవది. జిల్లా వ్యాప్తంగా 37,200 ఎకరాల్లో సాగు అవుతున్నట్లు అధికారులు అంచనా వేశారు. ఇది ఎక్కువగా జిల్లాలోని పెద్దశంకరంపేట, రేగోడు, అల్లాదుర్గ్, టేక్మాల్ మండలాల్లో సాగవుతుంది. ఈ పంటను పూర్తిగా వర్షాధారంగా సాగు చేయటం గమనార్హం. సాగు చేసే రైతులకు పంట చేతికందే వరకు నమ్మకం ఉండదు. అతివృష్టి , అనావృష్టితో పాటు పంట చేతికందే దశలోనూ వర్షం కురిస్తే పత్తి నల్లబడి పోయే ప్రమాదం ఉంది. ఈ పంట సాగు చేయటానికి ప్రధాన కారణం సరైనా సాగునీటి సౌకర్యం లేక పోవడమేనని రైతులు చెబుతున్నారు.పంటల సాగు ఎకరాల్లో.. వరి 3,05,100 పత్తి 37,200 మొక్కజొన్న 2,640 కందులు 1,500 పెసర్లు 1,500 మినుములు 550 జొన్నలు 100 రాగులు 40 ఆముదం 120 సోయాబీన్ 140 చెరుకు 50 నల్లజొన్నలు 60 కూరగాయలు 708 ఆయిల్ పామ్ 456విత్తనాలు క్వింటాళ్లు వరి 91,530 పత్తి (ప్యాకెట్స్) 74,400 కందులు 90 మొక్కజొన్న 264 జొన్నలు 6 మినుములు 33 పెసర్లు 90 ఎరువులు మెట్రిక్ టన్నుల్లో యూరియా 25,000 డీఏపీ 1,912 ఎంఓపీ 2,118 కాంప్లెక్స్ 28,400 ఎస్ఎస్పీ 615 -
ప్రణాళికలు సిద్ధం చేయండి
మెదక్ కలెక్టరేట్: జిల్లాలో వన మహోత్సవం సందర్భంగా మొక్కలు నాటేందుకు ప్రణాళిక సిద్ధం చేయాలని కలెక్టర్ రాహుల్రాజ్ అధికారులు ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో డీఎఫ్ఓ జోజి ఆధ్వర్యంలో శాఖల వారీగా సమీక్షించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో శాఖల వారీగా 37 లక్షల మొక్కలు నాటేందుకు ప్రభుత్వ లక్ష్యాలను నిర్ధేశించినట్లు తెలిపారు. వర్షాలు మొదలు కాగానే మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రా రంభించాలన్నారు. జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ, అటవీశాఖ సమన్వయంతో వ్యవహరించాలని సూ చించారు. ఏరియాల వారీగా నర్సరీలోని మొక్కలను సంబంధిత శాఖలకు అందజేయాలని డీఆర్డీఓ శ్రీనివాస్ను ఆదేశించారు. గతేడాది నాటిన మొక్కలు చనిపోతే వాటిస్థానంలో కొత్త మొక్కలు నాటేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం ఈనెల 22 నుంచి ప్రారంభంకానున్న ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలపై కలెక్టర్ సమీక్షించారు. జిల్లాలో మొత్తం 5,840 మంది పరీక్ష రాయనున్నారని, ఇందు కోసం జిల్లావ్యాప్తంగా 22 సెంటర్లు ఏర్పాటుచేశామన్నారు. అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అంతకుముందు మైనార్టీ వెల్ఫేర్ కళాశాలలకు సంబంధించిన వాల్పోస్టర్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఇన్చార్జి అదనపు కలెక్టర్ భుజంగరావు, డీఆర్డీఓ శ్రీనివాసరావు, జెడ్పీ సీఈఓ ఎల్లయ్య, అదనపు ఎస్పీ మహేందర్, ఇంటర్మీడియేట్ అధికారి మా ధవి, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. ప్రజావాణి అర్జీలు పరిష్కరించండి మెదక్ కలెక్టరేట్: ప్రజావాణి పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్ రాహుల్రాజ్ అధికారులు ఆదేశించారు. సోమవా రం కలెక్టరేట్లో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అధికంగా రెవెన్యూ, భూ సమస్యలు, పెన్షన్ల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని, వాటిని పరిష్కరించేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని సూచించారు. మొత్తం 62 అర్జీలు రాగా, అందులో ఇందిరమ్మ ఇళ్ల కోసం 13, భూ సమస్యలపై 12, రేషన్కార్డులు 03, ఇతర సమస్యలపై 34 వచ్చాయి.వన మహోత్సవంపై కలెక్టర్ సమీక్ష -
ధాన్యం తరలింపులో విఫలం
శివ్వంపేట(నర్సాపూర్): కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యం తరలించడంలో ప్రభుత్వం విఫలం అయిందని ఎమ్మెల్యే సునీతారెడ్డి ఆరోపించారు. సోమవారం శివ్వంపేటలో కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి రైతులతో మాట్లాడారు. కేంద్రాలకు వచ్చిన ధాన్యం సకాలంలో తూకం వేసి తరలించకపోవడంతో ఎండిన వడ్లు సైతం తడుస్తున్నాయని తెలిపారు. వర్షాభావ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని తక్షణమే కొనుగోళ్లలో వేగం పెంచాలన్నారు. ఇప్పటివరకు సన్నరకం ధాన్యానికి సంబంధించి రైతులకు రూ. 500 బోనస్ ఇవ్వలేదన్నారు. లారీలు, హమాలీల కొరత ఉందని, అందుకనుగుణంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. కేంద్రాల్లో నుంచి ధాన్యం తరలింపు ఇబ్బందులు గురించి సివిల్ సప్లై డీఎంతో మాట్లాడారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రమణాగౌడ్, నాయకులు మన్సూర్, వెంకట్రెడ్డి, లక్ష్మీనర్సయ్య, శ్రీనివాస్గుప్తా, మహేందర్రెడ్డి, కల్లూరి రాజు, నర్సింలు, తదితరులు పాల్గొన్నారు.నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి -
టీచర్లు విధిగా శిక్షణకు హాజరుకావాలి
నర్సాపూర్/నర్సాపూర్ రూరల్: ఉపాధ్యాయుల శిక్షణను విజయవంతం చేయాలని డీఈఓ రాధాకిషన్ సూచించారు. సోమవారం ఎంఆర్సీ భవనంలో ఉపాధ్యాయ సంఘాలతో మాట్లాడారు. ఈనెల 20 నుంచి 25 వరకు ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించేందుకు సహకరించాలని కోరారు. మండల స్థాయిలో ఎస్జీటీలకు, జిల్లాస్థాయిలో స్కూల్ అసిస్టెంట్లకు శిక్షణ కార్యక్రమాలు కొనసాగనున్నాయని చెప్పారు. కాగా ఉపాధ్యాయులు విధిగా శిక్షణలో పాల్గొనాలని సూచించారు. సమావేశంలో ఎంఈఓ తారాసింగ్, జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి, పలు ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం అచ్చంపేట ప్రాథమికోన్నత పాఠశాలలో వేసవి శిబిరం ముగింపు కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. హెచ్ఎం లక్ష్మీనారాయణ సొంత నిధులతో వేసవి శిబిరం ప్రారంభించి శిక్షణ ఇప్పించడం అభినందనీయమని కొనియాడారు.డీఈఓ రాధాకిషన్ -
అధైర్యపడొద్దు.. వచ్చేది మన ప్రభుత్వమే
పాపన్నపేట(మెదక్): కార్యకర్తల సమస్యలు తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే శశిధర్రెడ్డి సోమవారం చిట్చాట్ నిర్వహించారు. బాచారం వెళ్తూ వారు పాపన్నపేటలో ఆగిన విషయాన్ని తెలుసుకున్న పలువురు కార్యకర్తలు టీకొట్టు వద్దకు చేరుకున్నారు. ఈసందర్భంగా మండలంలోని రాజకీయ పరిస్థితులతో పాటు వారి సమస్యలు ఏ కరువు పెట్టారు. వచ్చే ఎన్నికల్లో అధికారం బీఆర్ఎస్దేనని, అప్పటివరకు ఓపిక పట్టాలని వారు సూచించారు. పాలకుల వైఫల్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే ప్రభుత్వ వ్యతిరేకత ప్రతి పల్లెలో కనిపిస్తుందన్నారు. అనంతరం మండల పరిధిలోని బాచారంలో రేణుకా ఎల్లమ్మ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా రైతు నాయకులు సోములు, మాజీ ఎంపీపీ పవిత్ర, దుర్గయ్య, ఏడుపాయల మాజీ చైర్మన్ బాలాగౌడ్, నాయకులు శ్రీనివాస్రెడ్డి, గురుమూర్తిగౌడ్, లింగారెడ్డి, బాబాగౌడ్, వెంకటేశం, రాము, సాయిరెడ్డి, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
పలువురు డీఎస్పీల బదిలీ
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ఉమ్మడి మెదక్ జిల్లాలో పలువురు డీఎస్పీలను బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా 77 మంది డీఎస్పీలకు స్థాన చలనం కలిగిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా ఉమ్మడి జిల్లాలో కూడా బదిలీలు జరిగాయి. ● జహీరాబాద్ డీఎస్పీ కె.రామ్మోహన్రెడ్డిని డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. నల్లగొండ జిల్లా డీసీఆర్బీ డీఎస్పీగా పనిచేస్తున్న బి.సైదాను జహీరాబాద్ డీఎస్పీగా నియమించింది. ● పటాన్చెరు డీఎస్పీ పి.రవీందర్రెడ్డి డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలి. హైదరాబాద్ కమాండ్ కంట్రోల్రూంలో డీఎస్పీగా పనిచేస్తున్న ఎస్.ప్రభాకర్కు పటాన్చెరు డీఎస్పీగా పోస్టింగ్ ఇచ్చారు. ● మెదక్ జిల్లా తూప్రాన్ డీఎస్పీ సోమ వెంకటరెడ్డిని సైదాబాద్ ఏసీపీగా నియమితులయ్యారు. హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ రూం ఏసీపీగా ఉన్న జే.నరేందర్గౌడ్కు తూప్రాన్ డీఎస్పీగా పోస్టింగ్ ఇచ్చారు. ● సిద్దిపేట జిల్లా గజ్వేల్ డీఎస్పీగా పనిచేస్తున్న పురుషోత్తంరెడ్డి డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలి. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం డీఎస్పీగా పనిచేస్తున్న కె.నర్సింలుకు గజ్వేల్ డీఎస్పీగా నియమితులయ్యారు. ● సిద్దిపేట ఏసీపీ జి.మధును డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశించారు. ఆయన స్థానంలో ఇంటెలిజెన్స్ డీఎస్పీగా పనిచేస్తున్న రవీందర్రెడ్డి నియమించారు. ● సిద్దిపేట డీసీఆర్బీ ఏసీపీ శంకర్రెడ్డిని మేడ్చల్ ఏసీపీగా నియమించారు. ● హుస్నాబాద్ డీఎస్పీ వి.సతీష్కు జీడీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఆయన స్థానంలో ఇంటెలిజెన్స్ విభాగంలో పనిచేస్తున్న ఎస్.సదానందంను నియమించారు. తక్షణం ఈ ఉత్తర్వులు అమలులోకి వస్తాయని ప్రభుత్వం పేర్కొంది. -
మొదటి రోజే పుస్తకాలు
పాఠశాలల పునఃప్రారంభం రోజే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పాఠశాల విద్యను మరింత బలోపేతం చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తుంది. ఇందులో భాగంగా వేసవి సెలవుల్లోనే ఆయా జిల్లాలకు పుస్తకాలు పంపిస్తోంది. జిల్లాకు ఇప్పటికే పార్ట్–(1)లో భాగంగా 84 శాతం చేరుకోగా, త్వరలోనే పూర్తిస్థాయిలో పుస్తకాలు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం వచ్చిన వాటిని ఆయా మండలాల ఎమ్మార్సీలకు తరలించే పనిలో సిబ్బంది నిమగ్నమయ్యారు. – మెదక్జోన్ జిల్లావ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలలు కలిపి 955 ఉన్నాయి. వాటిలో ఇప్పటివరకు 84,387 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తుండగా, బడులు తెరిచే నాటికి ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. కాగా కొన్నేళ్లుగా పుస్తకాలను పార్ట్– 1, పార్ట్– 2 విభజించి విద్యార్థులకు పంపిణీ చేస్తున్నారు. మొదటి పార్ట్లో సగం చాప్టర్లు, రెండో పార్ట్లో మిగితా చాప్టర్లను ముద్రించి ఇస్తున్నారు. జిల్లాకు 4,60,450 పుస్తకాలు అవసరం ఉండగా, ఇప్పటివరకు 3,85,248 వచ్చాయి. ఈ లెక్కన ఇంకా 75,202 రావాల్సి ఉంది. మిగితా వాటిని పాఠశాలలు తెరిచే సమయానికి అందించనున్నారు. అలాగే పార్ట్– 2 పుస్తకాలు మాత్రం సెప్టెంబర్లో వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం వచ్చిన పుస్తకాలకు ఆయా మండలాల ఎంఆర్సీలకు సరఫరా చేస్తున్నారు. ప్రభుత్వ బడుల్లో చదువుకునే విద్యార్థులు పేద వారు కావటంతో వారికి సకాలంలో పుస్తకాలు, నోట్బుక్స్తో పాటు స్కూల్ యూనిఫాంలు అందించాలనే లక్ష్యంతో విద్యాశాఖ అధికారులు ముందుకు సాగుతున్నారు. అలాగే అమ్మ ఆదర్శ పాఠశాలల్లో చాలా వరకు మరమ్మతులు పూర్తి చేశారు.కొత్త బుక్స్తో విద్యార్థులు తరగతులకు వెళ్లేలా చర్యలు జిల్లాకు చేరుతున్న పాఠ్య పుస్తకాలు ఇప్పటివరకు 84 శాతం చేరిక త్వరలోనే పూర్తి స్థాయిలో..ఎమ్మార్సీలకు పంపిస్తున్నాం జిల్లాకు ఇప్పటివరకు 84 శాతం పాఠ్యపుస్తకాలు రాగా, వాటిని ఆయా మండలాల్లోని ఎంఆర్సీలకు పంపిస్తున్నాం. పాఠశాలలు తెరి చే సమయానికి విద్యార్థులకు బుక్స్ అందిస్తాం. అలాగే ముందస్తు బడిబాట కొనసాగుతుంది. ప్రతి శుక్రవారం ఉపాధ్యాయులతో విద్యార్థుల సంఖ్యను పెంచే విషయమై సమీక్ష కొనసాగిస్తున్నాం. – రాధాకిషన్, డీఈఓరండి.. ప్రభుత్వ బడుల్లో చేరండి ప్రభుత్వ బడుల్లో అన్నిరకాల మౌలిక వసతుల కల్పనతో పాటు మధ్యాహ్న భోజనం అందిస్తున్నామని, ఉపాధ్యాయులు విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. విద్యా ర్థుల తల్లిదండ్రులను కలిసి సర్కారు బడులపై అవగాహన కల్పిస్తున్నారు. ముందస్తు బడిబాట మే మొదటి వారం నుంచే ప్రారంభం కాగా, అధికారికంగా జూన్ 6వ తేదీ నుంచి నిర్వహించనున్నారు. గతేడాది కలెక్టర్ రాహుల్రాజ్ బడిబాట కార్యక్రమాన్ని వినూత్నంగా నిర్వహించారు. దీంతో ఎప్పు డూ లేని విధంగా విద్యార్థుల నమోదు గణనీయంగా పెరిగింది. -
‘క్యూఆర్టీ’ పనితీరు భేష్
మెదక్ మున్సిపాలిటీ: ఏడుపాయల్లోని మంజీరా నదిలో స్నానం చేస్తూ నీటిలో మునిగిన యువతిని కాపాడిన క్యూఆర్టీ సిబ్బందికి ఎస్పీ ఉదయ్కుమార్రెడ్డి రివార్డు ప్రకటించారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో సంఘటనపై ప్రత్యక్ష సాక్షులను అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా క్యూఆర్టీ–1 సిబ్బందిని అభినందించి రివార్డు జారీ చేశారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ ఇదే విధంగా విధుల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ మహేందర్, డీఎస్పీ రంగనాయక్, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
ప్రతీ కుటుంబానికి సంక్షేమ పథకాలు
పెద్దశంకరంపేట(మెదక్): ప్రతీ కుటుంబానికి సంక్షేమ పథకాలు అందించేలా కృషి చేస్తానని నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి అన్నారు. సోమవారం పెద్దశంకరంపేటలో 53 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్, 25 మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆరోగ్య శ్రీ ద్వారా పేదలకు వైద్య సేవలు అందిస్తున్నామని వివరించారు. కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షు డు మధు, సీనియర్ నాయకులు నారాగౌడ్, ఆర్ఎన్. సంతోష్, సంగమేశ్వర్, సుభాష్గౌడ్, రాములు, రవీందర్, గోవింద్రావు, సాయిలు, అంజిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. రసాయనాల వాడకం తగ్గించాలి టేక్మాల్(మెదక్): రైతులు రసాయన ఎరువుల వాడకం తగ్గించి, సహజ ఎరువులను వాడితే అధిక దిగుబడి పొందవచ్చని నత్నాయిపల్లి వ్యవసాయ శాస్త్రవేత్త శోభారాణి అన్నారు. సోమవారం మండలంలోని కుసంగిలో ఏఓ రాం ప్రసాద్ ఆధ్వర్యంలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. పంటలో ఎక్కువ మొత్తంలో యూరియా వేయడం వల్ల చీడపీడల ఉధృతి పెరుగుతుందన్నారు. పంట మార్పిడి తప్పనిసరి అన్నారు. వరి సాగుకు ముందు పచ్చిరొట్ట వేసి కలియదున్నాలన్నారు. అధికారుల సూచన మేరకే ఎరువుల వాడి దిగుబడి పొందాలన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ శాస్త్రవేత్త లక్ష్మణ్, మాజీ జిల్లా కోఆప్షన్ సభ్యుడు యూసూఫ్, రైతులు తదితరులు పాల్గొన్నారు. ధాన్యాన్ని త్వరగా అన్లోడ్ చేసుకోవాలి కౌడిపల్లి(నర్సాపూర్): రైస్మిల్లర్లు లారీలలోని ధాన్యాన్ని త్వరగా అన్లోడ్ చేసుకోవాలని ఆర్డీఓ మహిపాల్రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని మహమ్మద్నగర్ మొండితండా సమీపంలోని రైస్మిల్లును తనిఖీ చేశారు. రైస్మిల్లులో ధాన్యం, బియ్యం లోడింగ్, అన్లోడింగ్ పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అకాల వర్షాలతో కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఎక్కువ రోజులు లారీలను రైస్మిల్ వద్ద ఉంచవద్దని, హమాలీల సమస్య లేకుండా చూసి త్వరగా ఖాళీ చేయాలని సూచించారు. ఎప్పటికప్పడు స్టాక్ నమోదు చేయాలని చెప్పారు. కార్యక్రమంలో తహసీల్దార్ ఆంజనేయులు, ఆర్ఐ శ్రీహరి, రైస్మిల్ యజమాని తదితరులు పాల్గొన్నారు.పోరాటయోధుడు ‘పుచ్చలపల్లి’ మెదక్ కలెక్టరేట్: జీవితాంతం పీడిత ప్రజల కోసం పోరాడిన ఆదర్శ నేత పుచ్చలపల్లి సుందరయ్య అని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు అజ్జమర్రి మల్లేశం అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని రాందాస్ చౌరస్తా, కేవల్ కిషన్భవన్లో సుందరయ్య వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళలర్పించారు. ఈసందర్భంగా మల్లేశం మాట్లాడుతూ.. నిజాంకు వ్యతిరేకంగా పోరాడి 10 లక్షల ఎకరాలను పేదలకు పంపిణీ చేసిన యోధుడు సుందరయ్య అని కొనియాడారు. -
రోడ్డెక్కిన రైతన్న
కొనుగోళ్లలో ఆలస్యంపై ఆగ్రహం ధాన్యం బస్తాకు నిప్పు పెట్టి ఆందోళనచిలప్చెడ్(నర్సాపూర్)/శివ్వంపేట: ధాన్యం కొనుగోళ్లలో ఆలస్యంపై రైతులు భగ్గుమన్నారు. సోమవారం మండలంలోని చిట్కుల్లో మెదక్–సంగారెడ్డి ప్రధాన రహదారిపై బైఠాయించారు. ధాన్యం బస్తాకు నిప్పు పెట్టి ఆందోళన చేపట్టారు. దీంతో ఎక్కడివాహనాలు అక్కడే నిలిచిపోగా.. సుమారు గంట వరకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈసందర్భంగా రైతులు మాట్లాడుతూ.. గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో సక్రమంగా కొనుగోళ్లు జరగడం లేదని మండిపడ్డారు. తూకం జరిగి రోజులు గడుస్తున్నా లారీలు రాకపోవడంతో ధాన్యం అలాగే ఉంటుందని వాపోయారు. అకాల వర్షాలతో ధాన్యం బస్తాలు తడుస్తున్నాయని, మరోవైపు టార్పాలిన్ల అద్దె పెరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఏపీఎం ప్రేమలతతో ఫోన్లో మాట్లాడించారు. లారీల కొరత తీరుస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. 24 గంటల్లో సమస్య పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని హెచ్చరించారు.అలాగే శివ్వంపేట మండల కేంద్రంలో రైతులు ఆందోళనకు దిగారు. పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో సకాలంలో ధాన్యం తరలించకపోవడంతో ఇబ్బంది పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు తూప్రాన్– నర్సాపూర్ జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తరుగు పేరిట అదనంగా తూకం వేస్తున్నా రని మండిపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు ధాన్యం తరలింపునకు సంబంధిత అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. -
రాజ్యాంగాన్ని పరిరక్షించుకుందాం
నర్సాపూర్/శివ్వంపేట/వెల్దుర్తి(తూప్రాన్): రాజ్యాంగ పరిరక్షణ కోసమే దేశవ్యాప్తంగా సంవిధాన్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు టీపీసీసీ పరిశీలకుడు వరప్రసాద్, మత్స్యశాఖ కార్పొరేషన్ చైర్మన్ సాయికుమార్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి, డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ సుహాసినిరెడ్డి అన్నారు. సోమవారం వెల్దుర్తి మండల కేంద్రం, నర్సాపూర్, శివ్వంపేట మండల పరిధిలోని గోమారంలో సంవిధాన్ బచావో కార్యక్రమంలో అంబేడ్కర్ విగ్రహాలకు నివాళులర్పించి ర్యాలీ నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య పరిరక్షణకు కాంగ్రెస్ నడుం కట్టిందని తెలిపారు. అనంతరం స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో గ్రామ అధ్యక్షుల నియామకానికి సంబంధించి ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు కోసం తీసుకోవాల్సిన చర్యలపై వివరించారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వివిధ మండలాల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
రంగనాయక సాగర్కు హైకోర్టు న్యాయమూర్తి
న్యాయమూర్తి శ్రీసుధాను సన్మానిస్తున్న కలెక్టర్ మనుచౌదరిచిన్నకోడూరు(సిద్దిపేట): రాష్ట్ర హైకో ర్టు న్యాయమూర్తి పి.శ్రీసుధా ఆదివారం మండలంలోని రంగనాయక సాగర్ రిజర్వాయర్ వద్ద గల అతిథి గృహానికి విశ్రాంతి కోసం వచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ మనుచౌదరి మర్యాద పూర్వకంగా కలిసి సన్మానించారు. కాళేశ్వరం సరస్వతీ పుష్కరాలకు వెళ్లిన న్యాయయూర్తి శ్రీసుధా తిరుగు ప్రయాణంలో రంగనాయక సాగర్ అతిథి గృహంలో భోజనం చేసి విశ్రాంతి తీసుకున్నారు. ముందుగా పోలీస్ గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జిల్లాలో న్యాయ విషయాల గురించి కాసేపు చర్చించారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయి రమాదేవి, ఆర్డీఓ సదానందం, ఏసీపీ మధు, న్యాయవాదులు, రెవెన్యూ అధికారులు, పోలీస్ అధికారులు పాల్గొన్నారు. -
రైతులు ఇబ్బంది పడొద్దు
కలెక్టర్ రాహుల్రాజ్23న జహీరాబాద్కు సీఎం రాక!నిమ్జ్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు‘మెపా’ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా యాదగిరికౌడిపల్లి(నర్సాపూర్): రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని కలెక్టర్ రాహుల్రాజ్ నిర్వాహకులను ఆదేశించారు. ఆదివారం మండలంలోని వెంకట్రావుపేట గేట్ వద్ద ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అకాల వర్షాలు కురుస్తున్నందున కొనుగోలు కేంద్రాల వద్ద జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. వాలు ప్రాంతంలో ఉన్న ధాన్యం ఎత్తు ప్రదేశానికి తరలించాలన్నారు. కొనుగోళ్లు త్వరగా పూర్తి చేయాలని, తూకం వేసిన ధాన్యం వెంటనే లారీల్లో తరలించాలన్నారు. ఆన్లైన్లో సైతం త్వరగా నమోదు చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఏపీ ఎం సంగమేశ్వర్, ఆర్ఐ శ్రీహరి, సీసీ నర్సింలు, కౌడిపల్లి ఎఫ్పీసీఎల్ అధ్యక్షురాలు రాజేశ్వరీ, నిర్వాహకులు, రైతులు పాల్గొన్నారు. మెరుగైన వైద్యం అందించాలి కొల్చారం(నర్సాపూర్): వైద్యం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ రాహుల్రాజ్ వైద్య సిబ్బందికి సూచించారు. ఆదివారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఈసందర్భంగా రోగుల వార్డులు, వైద్య విభాగం గదులను పరిశీలించారు. ఓపీ రిజిస్టర్, సిబ్బంది హాజరు పట్టికను తనిఖీ చేసి బాలింతలతో మాట్లాడారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని ప్రజలందరికీ ప్రభుత్వ ఆస్పత్రుల ద్వారా మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నామని తెలిపారు.సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఈ వారంలో సంగారెడ్డి జిల్లాలో పర్యటించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. జహీరాబాద్ నియో జకవర్గంలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల కోసం ఈనెల 23న సాయంత్రం 4 గంటలకు జిల్లాకు వస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రేవంత్రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక జిల్లాలో తొలిసారి అధికారికంగా పర్యటించనున్నారు. ఇటీవల సంగారెడ్డిలోని రాంమందిర్ వద్ద జరిగిన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కూతురు వివాహ నిశ్చితార్థానికి రేవంత్రెడ్డి హజరైన విషయం విదితమే. నిమ్జ్ (జాతీయ ఉత్పాదక, పెట్టుబడుల మండలి)లో నిర్మించిన రోడ్డును సీఎం ప్రారంభించనున్నారు. అలాగే జహీరాబాద్లో ఏర్పాటు చేసిన బసవేశ్వర విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఇతర అభివృద్ధి పనులను కూడా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారని అధికారులు చెబుతున్నారు. 30 వేల మందితో సభ! సీఎం జిల్లా పర్యటన సందర్భంగా జహీరాబాద్ లో బహిరంగ సభను నిర్వహించాలని యోచిస్తున్నారు. ఈ సభకు సుమారు 30 వేల మందిని తరలించాలని భావిస్తున్నారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. సీఎం పర్యటన షెడ్యూల్ త్వరలో అధికారికంగా ఖరారయ్యే అవకాశాలున్నాయని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. సీఎం పర్యటన నేపథ్యంలో ఒకటీ రెండు రోజుల్లో జిల్లా ఉన్నతాధికారులు ఏర్పాట్లను ప్రారంభించేందుకు జహీరాబాద్ వెళ్లనున్నారు.వర్గల్(గజ్వేల్): ముదిరాజ్ ఎంప్లాయీస్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ (మెపా) రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా వర్గల్ మండలం మీనాజీపేటకు చెందిన దుండిగల్ యాదగిరి నియమితులయ్యారు. మండలంలో సీఆర్పీగా పనిచేస్తున్న యాదగిరి ప్రస్తుతం సమగ్రశిక్షా అభియాన్ ఉద్యోగుల సంఘ రాష్ట్ర అధ్యక్షునిగా కూడా కొనసాగుతున్నారు. ఇటీవల హైదరాబాద్లో జరిగిన అసోసియేషన్ రాష్ట్ర స్థాయి సమావేశంలో తనను ‘మెపా’ రాష్ట్ర ఉపాధ్యక్షునిగా నియామకం చేసినట్లు యాదగిరి తెలిపారు. ఈసందర్భంగా ఆయన మా ట్లాడుతూ.. రాష్ట్రంలో ముదిరాజ్ల ఐక్యత, అభివృద్ధి కోసం శక్తివంచనలేకుండా కృషి చేస్తానని అన్నారు. -
ఉపాధిలో పశువుల పాకలు
● జాబ్ కార్డులు ఉన్నవారికి అవకాశం ● పాడి అభివృద్ధిని ప్రోత్సహించేందుకు చర్యలు టేక్మాల్(మెదక్): జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా ప్రభుత్వం వ్యవసాయ పొలాల్లో పశువుల కొట్టాలతో పాటు మేకలు, గొర్రెలు షెడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. పాడి పశువులు, గొర్రెల, మేకల పెంపకందారులకు ఆర్థిక తోడ్పాటు అందిస్తుంది. అదేవిధంగా పశువులు, జీవాల పోషణకు పచ్చిగడ్డి పెంపకం, నీటితొట్ల నిర్మాణాలకు ఆర్థికంగా చేయూత అందించేలా ప్రణాళిక సిద్ధం చేసింది. ఉపాధి హామీలో జాబ్కార్డు ఉన్న వారిని అర్హులుగా గుర్తించింది. పశువుల కొట్టాల నిర్మాణానికి రూ. 50 వేల నుంచి రూ. లక్ష వరకు మంజూరు చేస్తుంది. మేకలు, గొర్రెల సంఖ్య ఆధారంగా షెడ్ల నిర్మాణానికి నిధులు కేటాయిస్తోంది. వేసవిలో జీవాల దాహం తీర్చేందుకు గాను నీటి తొట్ల నిర్మాణానికి నిధులు కేటాయిస్తుండగా.. జీవాల సంఖ్య ఆధారంగా నీటి తొట్ల నిర్మాణానికి రూ. 15 వేల నుంచి రూ. 20 వేల వరకు మంజూరు చేస్తున్నారు. దరఖాస్తు చేసుకునే విధానం పశువుల కొట్టాలు, గొర్రెల, మేకల షెడ్ల నిర్మాణానికి ముందుగా సంబంధిత గ్రామ పంచాయతీ తీర్మాణం అవసరం. అనంతరం ఉపాధి హామీ జాబ్కార్డు, ఆధార్ కార్డు, సంబంధిత పశుసంవర్ధకశాఖ అధికారి నుంచి జీవాలు ఉన్నట్లు ధ్రువీకరణ పత్రం తీసుకోవాలి. పెంపకందారుడికి వ్యవసాయ భూమి ఉన్నట్లుగా తహసీల్దార్ నుంచి ధ్రువీకరణ పత్రం తీసుకొని మండల పరిషత్ కార్యాలయ అధికారికి దరఖాస్తు అందించాలి. పరిశీలన అనంతరం ఉపాధి హామీ నుంచి జీవాల సంఖ్య ఆధారంగా యూనిట్ కేటాయించి నిధులు మంజూరు చేస్తారు. టేక్మాల్ మండలంలో ఇప్పటివరకు పల్వంచ, వెల్పుగొండ, షాబాద్తండా, కమ్మరికత్త, బొడ్మట్పల్లి, టేక్మాల్లో ఒక్కొక్కటి చొప్పున, సీఎం తండా, సంగ్యాతండా, చంద్రుతండా, బొడగట్టు గ్రామాల్లో 2 చొప్పున, హెచ్ఎంపల్లిలో 4 పూర్తి అయినట్లు అధికారులు తెలిపారు. సద్వినియోగం చేసుకోవాలి ప్రభుత్వ పథకాలపై అన్ని గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. అర్హులు ఆ గ్రామానికి సంబంధించిన ఉపాధి హామీ సిబ్బంది ద్వారా పూర్తి వివరాలు తీసుకోవాలి. పశువుల కొట్టాలు, గొర్రెలు, మేకలు షెడ్ల మంజూరులో గొల్ల కురుమలతో పాటు ఎస్సీ, ఎస్టీలకు ప్రాధాన్యం ఇస్తున్నాం. ఈ అవకాశాన్ని అర్హులు సద్వినియోగం చేసుకోవాలి. – పౌల్, ఏపీఓ, టేక్మాల్ -
అధిక తరుగు తీస్తే చర్యలు తప్పవు
కల్హేర్(నారాయణఖేడ్): రైతులకు ఇబ్బంది లేకుండా జొన్నలు కొనుగోలు చేయాలని ఎమ్మెల్యే పి.సంజీవరెడ్డి సూచించారు. కల్హేర్లో ఆదివారం జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ఆయన తనిఖీ చేశారు. రైతులతో మాట్లడి సమస్యలు తెలుసుకున్నారు. కొనుగోలు చేసిన వెంటనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని నిర్వాహకులకు ఆదేశించారు. అధికంగా తరుగు తీసుకుంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎమ్మెల్యే వెంట మాజీ సీడీసీ చైర్మన్ నర్సింహారెడ్డి, మాజీ పీఎసీఏస్ చైర్మన్ వీర్షెట్టి, కాంగ్రెస్ నాయకులు దేవదాస్, తుకరాం, జితేందర్రెడ్డి ఉన్నారు. -
‘సమీకృతం’ కోసం స్థల పరిశీలన
రామాయంపేట(మెదక్): రామాయంపేటలో సమీకృత గురుకుల నిర్మాణానికి కేటాయించిన స్థలాన్ని ఆదివారం పలు శాఖలకు చెందిన ఉన్నతాధికారులు సందర్శించారు. స్కూల్ కాంప్లెక్స్ నిర్మాణానికి ఇప్పటికే రూ. 200 కోట్ల నిధులు మంజూరయ్యాయి. 1421 సర్వే నంబర్లో జాతీయ రహదారిని అనుకొని ఉన్న 20 ఎకరాల స్థలాన్ని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రముఖ ఆర్కిటెక్చర్ ప్రభాకరన్, క్వాలిటీ సర్వేయర్ ఓబుల్రెడ్డి, స్ట్రక్చరల్ ఇంజనీర్ ఫైజాన్ అహ్మద్, ఎలక్ట్రికల్ ఇంజనీర్లు, ఇతర అధికారులు స్థలాన్ని సందర్శించిన వారిలో ఉన్నారు. దళిత, గిరిజనులపై దాడులు ఆపాలి మెదక్జోన్: దేశంలో దళిత, గిరిజన, వెనుకబడిన వర్గాల మీద జరుగుతున్న దాడులను తక్షణం ఆపాలని రాష్ట్ర యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి తరుణ్ డిమాండ్ చేశారు. బీజేపీ, జేడీయూ, ఆర్ఎస్ఎస్ల సంకీర్ణ భావజాలాన్ని ఖండిస్తూ, దళిత విద్యార్థులను కలవడానికి బీహార్ వెళ్లిన రాహుల్గాంధీపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఆదివారం జిల్లా కేంద్రంలో ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో నాయకులు పరశురాం, శ్రీకాంత్, రమేష్, రితికేష్ తదితరులు పాల్గొన్నారు. కొప్పోల్లో భక్తుల సందడి పెద్దశంకరంపేట(మెదక్): మండల పరిధిలోని కొప్పోల్ ఉమా సంగమేశ్వర దేవాలయ ఆవరణలో ఆదివారం సామూహిక సత్యనారాయణస్వామి వ్రతాలను వైభవంగా నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో వివిధ గ్రామాలకు చెందిన 108 మంది దంపతులు పూజలో పాల్గొన్నారు. ఈసందర్భంగా భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. భక్తజన సంద్రం.. కొమురవెల్లి క్షేత్రం కొమురవెల్లి(సిద్దిపేట): కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయానికి ఆదివారం భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. తెల్లవారుజామునుంచే పుష్కరిణిలో స్నానమాచరించి స్వామి వారిని దర్శించుకున్నారు. కొందరు భక్తులు అభిషేకాలు, పట్నాలు, అర్చన, ప్రత్యేకపూజ లు, ఒడిబియ్యం, కేశఖండన, గంగిరేణి చెట్టుకు ముడుపులు కట్టి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం కొండపైన ఉన్న రేణుక ఎల్లమ్మకు బోనాలు సమర్పించారు. అలాగే కోడెల స్తంభం వద్ద కోడెలను కట్టి పూజలు చేశారు. కొండగట్టుకు పాదయాత్ర చిన్నకోడూరు(సిద్దిపేట): మండల పరిధిలోని చంద్లాపూర్కు చెందిన హనుమాన్ మాలధారులు ఆదివారం కొండగట్టు హనుమాన్ దేవాలయం వరకు పాదయాత్రగా బయలుదేరారు. వంద మంది హనుమాన్ భక్తులు ముందుగా రంగనాయక స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం జగి త్యాల జిల్లాలోని కొండగట్టు హనుమాన్ దేవాలయానికి పాదయత్రగా తరలివెళ్లారు. గ్రామస్తులు వారికి స్వాగతం పలికారు. -
బండ్ల జోరు.. జాతర హోరు
బొడ్మట్పల్లి గుట్టపై వెలసిన భద్రకాళీ సమేత వీరభద్రుడి ఉత్సవాలు కనుల పండువగా సాగుతున్నాయి. శుక్రవారం ఎడ్ల బండ్ల ఊరేగింపు వైభవంగా సాగింది. రంగురంగుల పూలతో బండ్లను అలంకరించారు. డప్పు చప్పుళ్ల మధ్య యువకుల నృత్యాలు అందరిని అలరించాయి. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. జాతరలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఇబ్బందులు తలెత్తకుండా చర్య లు చేపట్టారు. – టేక్మాల్(మెదక్) -
నేత్రపర్వం.. మూల మహోత్సవం
వర్గల్(గజ్వేల్): సుప్రసిద్ధమైన వర్గల్ విద్యాసరస్వతి క్షేత్రం శుక్రవారం మూల మహోత్సవ వైభవంతో అలరారింది. చదువుల తల్లికి భక్తజన సామూహిక లక్షపుష్పార్చన నేత్రపర్వం చేసింది. ఆలయ వ్యవస్థాపక చైర్మన్ చంద్రశేఖర సిద్ధాంతి నేతృత్వంలో వేదపండితులు తెల్లవారుజామున అమ్మవారి మూలవిరాట్టుకు విశేష పంచామృతాభిషేకం నిర్వహించారు. పట్టువస్త్రాలు, పూలమాలికలు, ఆభరణాలతో అలంకరించారు. సామూహిక లక్షపుష్పార్చన చేశారు. చండీ హోమం నిర్వహించారు. పలువురు చిన్నారులు అమ్మవారి సన్నిధిలో అక్షరాభ్యాసాలు చేశారు. భక్తులు వేడుకలు తిలకించి తరించారు. తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. -
అప్పులు ఆరగించిందెవరు?
ఎఫెక్ట్పాపన్నపేట(మెదక్): ‘సంఘాల రుణాల స్వాహా’ పేరిట శుక్రవారం ‘సాక్షి’లో ప్రచురించిన కథనానికి అధికారులు స్పందించారు. డీఎంజీ సీబీఓ ఆడిటర్ నాగరాజు, శ్రీనిధి అసిస్టెంట్ మేనేజర్ రజిత పాపన్నపేటకు చేరుకొని ఏపీఎం సాయిలుతో కలిసి పొడిచన్పల్లి యూకో బ్యాంకు నుంచి స్టేట్మెంట్లు సేకరించారు. ఈమేరకు లావాదేవిలపై క్షుణ్ణంగా పరిశీలన జరుపుతున్నారు. మరోవైపు హైదరాబాద్ జోనల్ ఆఫీస్ నుంచి బ్యాంకు అధికారులు శనివారం విచారణ నిమిత్తం పొడిచన్పల్లి రానున్నట్లు మేనేజర్ అజహరుద్దీన్ తెలిపారు. పోలీస్ స్పెషల్ బ్రాంచ్ అధికారులు ఈ విషయమై ఆరా తీస్తున్నారు. రెండేళ్లలో రూ. 14.86 లక్షలు మళ్లింపు స్వయం సహాయక సంఘాల అకౌంట్ నుంచి నేరుగా వీఓఏ వ్యక్తిగత అకౌంట్లోకి రెండేళ్లలో రూ. 14.86 లక్షల బ్యాంకు రుణాలు మళ్లినట్లు తెలుస్తుంది. ఆగస్టు 14, 2023న గంగపుత్ర స్వయం సహాయక గ్రూపు నుంచి రూ. 6,69,000 వీఓఏ వ్యక్తిగత ఖాతాలోకి మళ్లించినట్లు సమాచారం. అలాగే మే 4, 2023 నాడు విజయ గ్రూపు నుంచి రూ. 1,42,000, 10 ఏప్రిల్ 2024 నాడు పోచమ్మ గ్రూపు నుంచి రూ. 6,75,000 మళ్లించినట్లు తెలుస్తుంది. ఇంకా ఏమైనా నిధులు నేరుగా మళ్లించారా? అనే విషయమై అధికారులు అన్ని స్వయం సహాయక గ్రూపుల ఖాతాలను పరిశీలిస్తున్నారు. ఇవి గాక గ్రూపుల పేరిట తీసుకున్న బ్యాంకు రుణాలను సభ్యులకు ఇవ్వకుండా నేరుగా డ్రా చేసుకున్నారా, ఇతర సీ్త్రనిధి, గ్రామ సంఘం నిధులు ఏవైనా మళ్లించారా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. ప్రస్తుతం యూకో బ్యాంకులో నాలుగైదు గ్రూపులు తమ రుణాలను సమయానుకూలంగా చెల్లించడం లేదని తెలుస్తుంది. ఇంతకు ఈ రుణాలు నిజమైన సభ్యులు తీసుకున్నారా? లేక వారికి తెలియకుండా ఎవరైనా మధ్యవర్తులు కాజేశారా..? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అధికారులపై అనుమానాలు మహిళా సంఘాల రుణాల స్వాహాపై ప్రారంభమైన విచారణ యూకో బ్యాంకు నుంచి స్టేట్మెంట్ల సేకరణ పోలీస్ స్పెషల్ బ్రాంచ్ అధికారుల ఆరాఅందరు కలిసి ముంచారు ఈ రుణాల స్వాహా వ్యవహారంలో అందరు కలిసి నన్ను ముంచేశారు. బ్యాంకు నుంచి వచ్చిన డబ్బులను బ్యాంకు అధికారులు, మహిళా సమైఖ్య మండల, గ్రామస్థాయి అధికారులకు పంచి ఇచ్చాను. ఈ తతంగంలో అందరు బాధ్యులే, అయి నా నన్ను బలి పశువును చేస్తున్నారు. తీసుకుంటే అందరిపై చర్యలు తీసుకోవాలి. – పద్మ, వీఓఏ ఈ కుంభకోణం వెనుక బ్యాంకు, ఇతర అధికారులు, వీఓఏ పాత్రపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. నిజానికి మహిళా సంఘాలకు మంజూరయ్యే బ్యాంకు రుణాలను మొదట ఎస్హెచ్జీ అకౌంట్లో వేయాలి. అనంతరం ఎంసీపీ వివరాల ప్రకారం, ఆ గ్రూపులో ఉన్న సభ్యుల వ్యక్తిగత అకౌంట్లలో డబ్బులు జమచేయాలి. కాని ఇక్కడ బ్యాంకు అధికారులు ఎస్హెచ్జీ అకౌంట్ నుంచి నేరుగా వీఓఏ వ్యక్తిగత ఖాతాలోకి వేయడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మహిళా సమైక్య అధికారులు కూడా రుణాల పంపిణీ, చెల్లింపులపై దృష్టి పెట్టాలి. కానీ ఇవేవి లేకపోవడం వల్లే మోసం జరిగినట్లు తెలుస్తుంది. -
ముగిసిన శిబిరం.. చిన్నారుల ఉత్సాహం
విద్యాశాఖ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వేసవి శిక్షణ శిబిరం విజయవంతంగా ముగిసింది. చిన్నారులకు యోగా, కరాటే, చిత్రలేఖనంలో ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఆయా అంశాల్లో ప్రతిభ కనబర్చిన వారికి ప్రశంసాపత్రాలు అందజేశారు. పీఎంశ్రీ జెడ్పీ ఉన్నత పాఠశాలలో శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎంఈఓ తారాసింగ్ పాల్గొని మాట్లాడారు. విద్యార్థులు చదువుతో పాటు ఆసక్తి ఉన్న అంశాలపై నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. ముగింపు కార్యక్రమంలో విద్యార్థుల నృత్య ప్రదర్శన అందరిని ఆకట్టుకుంది. – నర్సాపూర్ -
ధాన్యం కొనుగోలులో నిర్లక్ష్యం
కొల్చారం(నర్సాపూర్): ప్రభుత్వ నిర్లక్ష్యంతో రైతు లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి ఆరోపించారు. శుక్రవారం మండలంలోని పోతంశెట్టిపల్లి ఐకేపీ కేంద్రంలో వర్షానికి తడిసి, మొలకలు వచ్చిన ధాన్యాన్ని పరిశీలించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తమ ఒత్తిడి కారణంగానే ప్రభు త్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిందని తెలిపారు. కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని సకాలంలో తూకం వేయకపోవడం, తూకం వేసిన ధాన్యం బస్తాలను రవాణా చేయడంలో ఆలస్యం కారణంగా వర్షానికి ధాన్యం తడిసిపోయిందన్నారు. రంగు మారిన ధాన్యాన్ని రైస్ మిల్లర్లు కొనుగోలు చేయకపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారని వాపోయారు. ఒక్క పోతంశెట్టిపల్లి కేంద్రంలోనే సకాలంలో లారీలు రాక తూకం వేసిన 9 లారీలకు సంబంధించి సన్న వడ్లు, 19 లారీల దొడ్డు వడ్లు వర్షానికి తడిసి బస్తాల్లోనే మొలకెత్తాయన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తూకం వేసిన ధాన్యాన్ని వెనువెంటనే రైస్ మిల్లులకు తరలించేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే వెంట బీఆర్ఎస్ నాయకులు నరేందర్ రెడ్డి, సంతోష్ కుమార్, యాదయ్య, యాదగౌడ్, ప్రవీణ్, గౌరీశంకర్ ఉన్నారు. ఎమ్మెల్యే సునీతారెడ్డి -
డెంగీపై అవగాహన కల్పించాలి
సజావుగా సభ నిర్వహించండిమెదక్ కలెక్టరేట్: ప్రజలను చైతన్య పరుస్తూ డెంగీ నివారణకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ రాహుల్రాజ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం జాతీయ డెంగీ దినోత్సవాన్ని పురస్కరించుకొని కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వర్షాకాలంలో ప్రజలకు డెంగీ ప్రబలే ఆస్కారం ఉన్నందున ముందస్తు చర్యల్లో భాగంగా ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించాలని తెలిపారు. జూన్ నుంచి ప్రణాళికలు సిద్ధం చేసుకొని క్షేత్రస్థాయిలో ఆశా కార్యకర్తలు, వైద్య సిబ్బంది పనిచేయాలన్నారు. డెంగీ లక్షణాలు ఉన్నటైతే దగ్గరలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి, జిల్లా ఆస్పత్రికి వెళ్లి తగిన వైద్య పరీక్షలు చేసుకుని చికిత్స చేయించుకునేలా అవగాహన కల్పించాలన్నారు. ప్రతి మంగళ, శుక్రవారం డ్రైడే గా పాటించి నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలన్నారు. మాతా శిశు మరణాలు తగ్గించేందుకు విశేష కృషి చేయాలని ఆదేశించారు. అనంతరం జాతీయ డెంగీ నివారణ దినోత్సవ వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం ధాన్యం కొనుగోలు, ఇతర సంక్షేమ పథకాలపై మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ శ్రీరామ్, జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ సునీత, జిల్లా ఇంటర్మీడియెట్ అధికారి మాధవి, డిప్యూటీ డీఎంహెచ్ఓలు సృజన, జ్ఞానేశ్వర్, డీసీహెచ్ఓలు డాక్టర్ శివ దయాల్తో పాటు సిబ్బంది పాల్గొన్నారు. చిలప్చెడ్(నర్సాపూర్): చిలప్చెడ్ రైతు వేదికలో నేడు నిర్వహించనున్న సభను సజావుగా నిర్వహించే విధంగా చర్యలు చేపట్టాలని నర్సాపూర్ ఆర్డీఓ మహిపాల్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం పీసీసీ ప్రధాన కార్యదర్శి ఆవుల రాజిరెడ్డితో కలిసి సభాస్థలిని పరిశీలించారు. ఈసందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ.. జిల్లాలో పైలెట్ ప్రాజెక్ట్గా ఎంపికై న చిలప్చెడ్ మండలంలో భూభారతి, రెవెన్యూ సదస్సులు విజయవంతంగా ముగిశాయని తెలిపారు. భూ భారతి చట్టంపై మరింత అవగాహన కల్పి ంచేందుకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి శనివారం రానున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్ సహదేవ్, మండల వ్యవసాయాధికారి రాజశేఖర్గౌడ్, ఆర్ఐ సునీల్సింగ్, ఇన్చార్జి ఎంపీఓ తిరుపతి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.కలెక్టర్ రాహుల్రాజ్ -
భూ భారతి ఎన్నో ఆశలు
‘చిలప్చెడ్’లో ముగిసిన రెవెన్యూ సదస్సులు ● మొత్తం 953 దరఖాస్తుల స్వీకరణ ● భూ సమస్యల పరిష్కారం దిశగా అడుగులు రాష్ట్ర ప్రభుత్వం ధరణి స్థానంలో తీసుకొచ్చిన భూ భారతి ఆర్ఓఆర్ చట్టంపై రైతులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఏళ్ల తరబడి పేరుకుపోయిన భూ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జిల్లాలో పైలెట్ ప్రాజెక్టుగా ఎంపికై న చిలప్చెడ్ మండలంలో ఇటీవల రెవెన్యూ సదస్సులు నిర్వహించి రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. మొత్తం 953 అర్జీలు రాగా, వాటిని పరిష్కరించే దిశగా అధికారులు అడుగులు వేస్తున్నారు. – మెదక్జోన్ జిల్లాలో భూ భారతి చట్టం పైలెట్ ప్రాజెక్టుగా ప్రభుత్వం చిలప్చెడ్ మండలాన్ని ఎంపిక చేసింది. ఈనెల 5వ తేదీ నుంచి 14 వరకు రెండు బృందాలుగా ఏర్పడి 10 రోజుల పాటు రైతుల నుంచి అధికారులు దరఖాస్తులు స్వీకరించారు. ఇందులో 953 దరఖాస్తులు రాగా, ప్రధానంగా 301 సర్వే నంబర్లు మిస్ అయ్యాయని, సాదా బైనామాల కోసం 229, భూ విస్తీర్ణం సరిచేసేందుకు 148, పేరు మార్పిడి 122, కోర్టులో ఉన్న భూ సమస్యలపై 153 దరఖాస్తులు వచ్చాయి. అలాగే మండలంలోని గౌతంపూర్ శివారులో గల గన్యాతాండాలో 204 సర్వే నంబర్లో 148 ఎకరాల భూమిని 106 మంది రైతులు చాలా కాలంగా సాగు చేసుకొని జీవనం సాగిస్తున్నారు. ఆ భూమికి పట్టా లు లేకపోవడంతో ప్రభుత్వ పథకాలకు దూరం అవుతున్నారు. పట్టా చేయాలని చాలా కాలంగా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. అయినా ఫలితం లేకుండా పోయింది. కొత్త ఆర్ఓఆర్ చట్టంతో ఆ సమస్యకు పరిష్కారం లభించనుందని రెవెన్యూ ఉన్నతాధికారి ఒకరు చెప్పడంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. కాగా ఇలాంటి సమస్యలు జిల్లాలో వేలాదిగా ఉన్నాయి. జూన్ 2 నుంచి అన్ని గ్రామాల్లో అమలు రాష్ట్ర అవరతణ దినోత్సవం జూన్ 2 నుంచి భూ భారతి చట్టం అమలు కానున్న నేపథ్యంలో అన్ని గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. భూములకు సంబంధించిన సమస్యలపై రైతులు సంబంధిత ధ్రువపత్రాలను జోడించి దరఖాస్తు ఫాంతో కలిపి అధికారులకు అందించాలని సూచించారు. ఇందుకోసం రెవెన్యూ సిబ్బందిని టీంలుగా విడదీసి సమస్యలు పరిష్కరించనున్నట్లు తెలిసింది. ఈక్రమంలో పైలెట్ ప్రాజెక్టు చిలప్చెడ్ మండలంలో స్వీకరించిన దరఖాస్తులను సైతం పరిశీలించనున్నారు. వాటిలో తక్షణం పరిష్కరించాల్సిన వాటిపై నిర్ణయం తీసుకోనున్నారు. గత ప్రభుత్వ హయాంలో చిన్నపాటి సమస్యలు ఉన్న భూములను సైతం పార్ట్–బీలో పెట్టి చేతులు దులుపుకుంది. జిల్లావ్యాప్తంగా సుమారు 30 వేల ఎకరాలు పార్ట్బీలో ఉన్నట్లు సమాచారం. నూతన భూ భారతి చట్టంలో వాటిని పరిష్కరించే ఆస్కారం ఉంది. సర్వేయర్ల భర్తీ.. ప్రత్యేక శిక్షణ భూ భారతి చట్టం ద్వారా అన్నిరకాల భూ సమస్యలను పరిష్కరించే విధంగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. అందుకు సర్వేయర్లు అవసరం ఉంటుందని భావించింది. ఇందుకోసం ఈనెల 5వ తేదీ నుంచి 17 వరకు లైసెన్స్ కలిగి ఉన్న సర్వేయర్లు మీసేవ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఇంటర్ గణితంలో 60 శాతం మార్కులు కలిగి ఉండాలని, వారికి 50 రోజుల పాటు ప్రత్యేక శిక్షణ ఇచ్చి సర్వేయర్గా చేర్చుకుంటామని స్పష్టం చేసింది. నేడు మంత్రులపర్యటన జిల్లాలో భూ భారతి పైలెట్ ప్రాజెక్టుగా ఎంపికై న చిలప్చెడ్ మండలంలో శనివారం మధ్యాహ్నం నిర్వహించే సమావేశానికి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, జిల్లా మంత్రి దామోదర రాజనర్సింహ, ఇన్చార్జి మంత్రి కొండా సురేఖ హాజరవుతారని కలెక్టర్ రాహుల్రాజ్ తెలిపారు. -
యాంత్రీకరణపై పట్టింపేది?
సబ్సిడీ యంత్రాలు, పరికరాలు అందక రైతుల ఇబ్బందులు2024– 25 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం జిల్లాకు కేవలం రూ. 68 లక్షల నిధులు మంజూరు చేసింది. మార్చి 21వ తేదీన పథకానికి సంబంధించి రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని అధికారులకు ఉత్తర్వులు జారీ చేసింది. 31వ తేదీన కార్యక్రమం ముగించింది. కేవలం వారం రోజుల సమయం ఉండటంతో అధికారులు రైతులకు పథకంపై ప్రచారం కల్పించలేకపోయారు. వ్యవసాయ అధికారులు దరఖాస్తులు స్వీకరణ పూర్తి చేసేలోగానే ప్రభుత్వం పథకాన్ని నిలిపివేసింది. దీంతో ఏ ఒక్క లబ్ధిదారుడికి పథకం అందలేదు. అయితే ఈ వానాకాలం సీజన్లోనైనా పథకం ద్వారా అర్హులైన వారికి చేయూతనిస్తారో..? లేదో తెలియక రైతులు ఆందోళన చెందుతున్నారు. అందించే పరికరాలు ఇవే.. వ్యవసాయ యాంత్రీకరణ పథకం కింద రైతులకు ఎక్కువగా ఉపయోగపడే వాటికి ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారు. నియోజకవర్గానికి ఒక ట్రాక్టర్తో పాటు చేతి పంపులు, తైవాన్ పంపులు, డ్రోన్లు, రొటోవేటర్లు, విత్తనాలు నాటే మిషన్లు, కేజ్వీల్స్, కలుపుతీత, గడ్డికోసే యంత్రాలు, పవర్ ట్రిల్లర్లు, ట్రాక్టర్లు, పత్తిని మూటకట్టే పరికరాలు ఇవ్వనున్నారు. ఎంపికై న రైతులు సంబంధిత కంపెనీలకు రాయితీ పోనూ మిగితా డబ్బులు డీడీ ద్వారా చెల్లించాల్సి ఉంటుంది. మళ్లీ ప్రారంభించే అవకాశం ఉంది ఈ ఏడాది మార్చి నెలాఖరులో వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. కొంతమంది రైతులు దరఖాస్తు చేసుకున్నారు. వాటిని పరిశీలించేలోగానే ఆర్థిక సంవత్సరం ముగియడంతో పథకాన్ని క్లోజ్ చేసింది. ఒక్క రైతుకు కూడా పథకం అందకుండా పోయింది. ఈ వానాకాలంలో మళ్లీ పథకాన్ని ప్రారంభించే అవకాశం ఉంది. – వినయ్కుమార్, డీఏఓ వ్యవసాయ యాంత్రీకరణ పథకంలో భాగమైన రాష్ట్రీయ కృషి వికాస్ యోజన తొమ్మిదేళ్లుగా అటకెక్కింది. 2016లో తొలి విడత నిధులు కేటాయించగా.. తదుపరి కార్యాచరణ కరువైంది. ఏళ్లుగా పథకంపై ఊసే లేకపోవడంతో అన్నదాతలు వ్యవసాయ పనులకు కూలీలు దొరకక, యంత్రాలను అద్దెకు తీసుకుంటూ ఆర్థికంగా ఇబ్బంది పడాల్సి వస్తోంది. ఇదే క్రమంలో ఈ ఏడాది పథకాన్ని ప్రారంభించిన ప్రభుత్వం ఒక్క రైతుకు కూడా ప్రయోజనం అందించకుండానే వారం రోజుల్లోనే ముగించింది. – మెదక్ కలెక్టరేట్ -
మైనార్టీల సంక్షేమానికి పెద్దపీట
మెదక్ కలెక్టరేట్: మైనార్టీల సంక్షేమం, విద్యా ప్రగతికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని రాష్ట్ర మైనార్టీ కమిషన్ చైర్మన్ తారిఖ్ అన్సారీ సాహబ్ తెలిపారు. గురువారం కలెక్టరేట్లో మైనారిటీల సంక్షేమం, విద్యా ప్రగతి గురించి కలెక్టర్ రాహుల్రాజ్ను అడిగి తెలుసుకున్నారు. అలాగే మైనారిటీ సంక్షేమ శాఖ కళాశాలలు, పాఠశాలల్లో పదో తరగతి, ఇంటర్మీడియెట్లో ఉత్తమ ఫలితాలు సాధించిన వారి పోస్టర్లను ఆవిష్కరించారు. ఆయన వెంట మైనార్టీ సంక్షేమ అధికారి జమ్లా నాయక్ ఉన్నారు. అనంతరం ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణపై కలెక్టర్ అధికారులతో సమీక్షించారు. ధాన్యం ఎగుమతిలో లారీల సంఖ్య పెంచి రైతులకు సహకరించాలని లారీ కాంట్రాక్టర్లను ఆదేశించారు. కార్యక్రమంలో డీఆర్డీఓ పీడీ శ్రీనివాస్రావు, జిల్లా పౌరసరఫరాల అధికారి సురేష్ రెడ్డి, మేనేజర్ జగదీష్ తదితరులు పాల్గొన్నారు. నిరుపేదలకే ఇందిరమ్మ ఇళ్లు చిలప్చెడ్(నర్సాపూర్): అర్హులైన నిరుపేదలకే ఇందిరమ్మ ఇళ్లు అందుతాయని కలెక్టర్ రాహుల్రాజ్ అన్నారు. గురువారం పైలెట్ ప్రాజెక్ట్గా ఎంపికై న చిలప్చెడ్లో ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలను పరిశీలించారు. అనంతరం ఈనెల 17న చిలప్చెడ్లో ఏర్పాటచేసే రైతు సభకు మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, దామోదర రాజనర్సింహ, కొండా సురేఖ రానుండడంతో రైతువేదిక వద్ద ఏర్పాట్లను పరిశీలించారు. బేస్మెంట్ పూర్తయిన వారికి మొదటి విడత డబ్బులు వస్తాయన్నారు. అదేవిధంగా ఇళ్లు మంజూరైన లబ్ధిదారులు పనులు ప్రారంభించాలని సూచించారు.రాష్ట్ర కమిషన్ చైర్మన్ తారిఖ్ అన్సారీ -
సంఘాల రుణాలు స్వాహా!
మహిళా సాధికారత కోసం ప్రారంభించిన స్వయం సహకార సంఘం రుణాలు పక్కదారి పడుతున్నాయి. గ్రామస్థాయి స్వయం సహాయక సంఘం నాయకురాలు సుమారు రూ. 75 లక్షలు స్వాహా చేసినట్లు తెలిసింది. ఇందులో బ్యాంకు అధికారుల పాత్ర ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా సమస్య పరిష్కారం కోసం గ్రామస్థాయిలో గుట్టుగా పంచాయితీలు నిర్వహించినప్పటికీ పరిష్కారం దొరకలేదు. – పాపన్నపేట(మెదక్) పాపన్నపేట మండలం పొడిచన్పల్లిలో 39 మ హిళా స్యయం సహాయక గ్రూపులు ఉన్నాయి. వీరికి స్థానిక యూకో బ్యాంకు రుణాలు ఇస్తుంటుంది. బ్యాంకు లోన్, సీ్త్రనిధి, గ్రామ సంఘం ద్వారా రుణాలు అందుతున్నాయి. ఇందులో భాగంగా ఓ గ్రామ సంఘం నాయకురాలు గ్రూపు సభ్యులకు అందాల్సిన రుణాలను తన సొంతానికి వాడుకున్నట్లు తెలిసింది. అప్పట్లో ఉన్న బ్యాంకు మేనేజర్ ఈ తతంగంలో తన వంతు పాత్ర నిర్వహించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయం గ్రూపు సభ్యుల ద్వారా బయటపడటంతో గ్రామ స్థాయిలో పంచాయితీలు పెట్టినట్లు తెలిసింది. అయితే వాటిని చెల్లించడానికి సదరు నాయకురాలు గడువు కోరినట్లు సమాచారం. రుణాలు ఎలా బదిలీ చేశారు? స్వయం సహాయక గ్రూపులకు రుణాలు మంజూరు కాగానే, బ్యాంకు మేనేజర్లు మైక్రో క్రెడిట్ ప్లాన్ ద్వారా అందులో సభ్యుల పేర్లు రాసి నేరుగా వారి అకౌంట్లలోకి నిధులు బదిలీ చేయాలి. కానీ ఇక్కడ సభ్యులకు తెలియకుండానే వారి రుణాలు, ఓ గ్రామ స్థాయి నాయకురాలి అకౌంట్లోకి బదిలీ అయ్యాయన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. లేకుంటే సభ్యులకు తెలియకుండా వారి పేరిట రుణాలు తీసుకునే అవకాశం లేదని తెలుస్తుంది. అయితే అప్పట్లో రుణాలు ఇచ్చినప్పుడు ఇక్కడ పని చేసిన బ్యాంకు మేనేజర్, ప్రస్తుతం పనిచేస్తున్న మేనేజర్కు ఇటీవల ఫోన్ చేసి, ఫలాన గ్రూపునకు సంబంధించిన రూ. 5 లక్షలు వెంటనే కట్టించుకోవాలని, లేకుంటే వారి అకౌంట్ ఎన్పీఏ (నాన్ పర్ఫార్మెన్స్ అసెట్)గా మారుతుందని హెచ్చరించినట్లు సమాచారం. దీంతో అనుమానం వచ్చిన ప్రస్తుత మేనేజర్ లోతుగా దర్యాప్తు ప్రారంభించినట్లు సమాచారం. ఈ విషయం మహిళా సమాఖ్య అధికారుల దృష్టికి రావడంతో వెంటనే వారు రంగంలోకి దిగి, బ్యాంకు స్టేట్మెంట్లు సేకరించే పనిలో పడ్డారు. అలాగే గ్రూపు సభ్యులతో మాట్లాడి వివరాలు రాబడుతున్నారు. విచారణ ప్రారంభించాం పొడిచన్పల్లి స్వయం సహాయక గ్రూపులకు సంబంధించిన రుణాలు పక్కదారి పట్టినట్లు సమాచారం అందింది. వెంటనే జిల్లా అధికారులకు తెలియజేశాం. బ్యాంకు స్టేట్మె ంట్లు తీసుకుంటున్నాం. సభ్యులతో మాట్లాడి వివరాలు తెలుసుకుంటున్నాం. – సాయిలు, ఏపీఎం, పాపన్నపేటరూ. 75 లక్షలు పక్కదారి గ్రామస్థాయి నాయకురాలు,బ్యాంకు అధికారులపై అనుమానం పాపన్నపేట మండలంపొడిచన్పల్లిలో ఘటన గుట్టు చప్పడు కాకుండా పంచాయితీలు -
పిల్లల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి
టేక్మాల్(మెదక్): అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా సంక్షేమశాఖ అధికారిణి హైమావతి అన్నారు. గురువారం టేక్మాల్, కాద్లూర్ గ్రామాల్లోని అంగన్వాడీ కేంద్రాలను సందర్శించి పలు రికార్డులను పరిశీలించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. చిన్నారుల ఎదుగుదలకు పౌష్టికాహారం అందించాలని సిబ్బందికి సూచించారు. వారి బరువును చూసి రక్తహీనత వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా పలు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. అంగన్వాడీ కేంద్రం ద్వారా వచ్చే పౌష్టికాహారాన్ని తల్లులు తింటూనే పిల్లలకు తినిపించాలన్నారు. గర్భిణులు, బాలింతలకు ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఆడపిల్లలను అర్ధాంతరంగా చదువులు మాన్పించరాదని, వారి భవితకు ప్రతి ఒక్కరూ సహకరించాలని చెప్పారు. ఆడపిల్లల పట్ల ఎవరైనా అశ్రద్ధ వహిస్తే తమ దృష్టికి తీసుకురావాలని ఆదేశించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించొద్దన్నారు. ఆమె వెంట సీడీపీఓ పద్మలత, సూపర్వైజర్ కృష్ణవేణి, పోషణ్ అభియాన్ కో–ఆర్డినేటర్ వెంకట్, ఆయా కేంద్రాల అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు. డీడబ్ల్యూఓ హైమావతి -
రమణీయం.. రథోత్సవం
కనుల పండువగా దొంతి జాతరశివ్వంపేట(నర్సాపూర్): మండల పరిధిలోని దొంతి గ్రామంలో కొలువైన వేణుగోపాలస్వామి ఉత్సవా లు అంగరంగ వైభ వంగా సాగుతున్నాయి. గురు వారం రథోత్సవం కనుల పండువగా నిర్వహించారు. గురువారం తెల్లవారుజామున అర్చకుడు గోపాలకృష్ణ స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయం నుంచి గాంధీ చౌరస్తా వరకు పల్లకీ సేవ నిర్వహించారు. అక్కడి నుంచి మహంకాళీ ఆలయం వరకు రథోత్సవం చేపట్టారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ధర్మకర్తలు అమరేందర్రెడ్డి, సంజయ్రెడ్డి, శ్రావణ్కుమార్రెడ్డి, పవన్కుమార్రెడ్డి ఆధ్వర్యంలో ఉత్సవాలు కొనసాగుతున్నాయి. చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నా యి. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అల్పాహారం, మాజీ జెడ్పీటీసీ పబ్బ మహేష్గుప్తా భక్తులకు వా టర్ బాటిల్స్ పంపిణీ చేశారు. ఎమ్మెల్యే సునీతారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ సుహాసినిరెడ్డి, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి రాజిరెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లేష్గౌడ్, వివిధ పార్టీల నాయకులు ఉత్సవాల్లో పాల్గొన్నారు.ఉత్సవాలకు హాజరైన భక్తజనం -
ప్రగతి బాటలో కీలక అడుగు
ప్రగతి బాటలో మరో కీలక అడుగు పడింది. ట్రిపుల్ఆర్, జాతీయ రహదారుల సమాహారం, రైల్వేలైన్ ఇతర సానుకూల అంశాల వల్ల ఉమ్మడి మెదక్ జిల్లాలో మరో భారీ ప్రాజెక్ట్ నిర్మాణానికి రంగం సిద్ధమైంది. గజ్వేల్ నియోజకవర్గంలోని మనోహరాబాద్ మండలం పరికిబండ శివారులో రూ.996కోట్ల వ్యయంతో మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కు నిర్మాణానికి కేంద్రం టెండర్లను పిలిచింది. ఇందుకోసం సుమారు 350ఎకరాల భూసేకరణ కూడా పూర్తయ్యింది. గజ్వేల్: మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కు(బహుళవిధ సరుకు రవాణా సేవల సముదాయం) నిర్మాణానికి మార్గం సుగమమైంది. కేంద్ర ప్రభుత్వం రెండున్నరేళ్ల క్రితం 16 లాజిస్టిక్ పార్కులను మంజూరు చేసింది. అందులో గజ్వేల్ నియోజకవర్గం మనోహరాబాద్ మండలం పరికిబండ శివారులో నిర్మించనున్న పార్కు ఒకటి. రూ.996కోట్ల అంచనాల వ్యయంతో ఎన్హెచ్ఏఐ అనుబంధ సంస్థ అయిన నేషనల్ హైవేస్ మేనేజ్మెంట్ లిమిటెడ్ (ఎన్హెచ్ఎల్ఎమ్ఎల్) టెండర్లను పిలిచింది. ఈమేరకు పత్రికల్లో ప్రకటనలు సైతం వెలువడ్డాయి. ఈ పనులను ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో చేపట్టడానికి నిర్ణయించారు. వేల కోట్ల పెట్టుబడుల సమీకరణే లక్ష్యంగా ఈ పార్కు ఏర్పాటు చేయాల్సి ఉన్నది. ప్రత్యక్షంగా లక్ష, పరోక్షంగా మరో రెండు లక్షల మందికి ఉపాధి కల్పనే లక్ష్యంగా ఈ లాజిస్టిక్ పార్కును ఏర్పాటు చేస్తున్నారు. ఎన్నో అనుకూలతలు.. ఎన్నో అనుకూలతల కారణంగా మల్టీమోడల్ లాజిస్టిక్ పార్కు నిర్మాణానికి పరికిబండ శివారు ప్రాంతాన్ని ఎంచుకున్నారు. ఇక్కడ లాజిస్టిక్ పార్కు ఏర్పాటైతే.. ఈ ప్రాంతానికి 44వ నంబర్ ఆరువరుసల జాతీయ రహదారి, కొత్తగా నిర్మాణం కానున్న ట్రిపుల్ఆర్కు సమీపంలో ఉండటం, ఇక్కడి నుంచి హైదరాబాద్, కొత్తపల్లి రైల్వేలైన్లు అనుసంధానం కావడం, హైదరాబాద్లోని శంషాబాద్ అంతర్జాతీయ విమనాశ్రయం కూడా చేరువలో ఉండటం కలిసి వచ్చింది. మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కునిర్మాణానికి సన్నాహాలు పరికిబండ శివారులో 350 ఎకరాల భూసేకరణ -
మెదక్ టు తిరుపతి రైలు నడపండి
మెదక్జోన్: ప్రజల కోరిక మేరకు మెదక్ నుంచి తిరుపతి, నిజామాబాద్, నాందెడ్ లాంటి దూర ప్రాంతాలకు రైళ్లు నడపాలని మెదక్ ఎంపీ రఘునందన్రావు రైల్వే జీఎంను ఫోన్ ద్వారా కోరారు. బుధవారం ఆయన మెదక్ రైల్వేస్టేషన్ను సందర్శించి రైల్వే అధికారులతో చర్చించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మెదక్– మీర్జాపల్లి లింక్ రైల్వేలైన్ ప్రణాళికలకు సంబంధించి ప్రజలు కోరుతున్నారని, ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలన్నారు. ప్రస్తుతం మెదక్కు నడుస్తున్న రెండు రైళ్లలో మార్పులపై చర్చించి, మరింత మెరుగుగా ప్రయాణికులను అనుగుణంగా రైళ్లను నడపాలన్నారు. అదేవిధంగా స్టేషన్లో జరుగుతున్న అభివృద్ధి పనులను స్వయంగా పరిశీలించారు. ద్యాన్చంద్ చౌరస్తా నుంచి రైల్వేస్టేషన్ వరకు వీధి దీపాలు వేస్తే ప్రయాణికులకు రాత్రి వేళల్లో వెళుతురు ఉంటుందని చెప్పారు. అంతకుముందు ఎంపీకి బీజేపీ నేతలు మెదక్– మీర్జాపల్లి వరకు లింక్ కలపాలని మ్యాప్ను అందజేశారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు మల్లేశంగౌడ్, మాజీ అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, నాయకులు ఎంఎల్ఎన్ రెడ్డి, శివ, నాయిని ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.రైల్వే జీఎంను కోరిన ఎంపీ రఘునందన్ -
విద్యా, వైద్యమే ప్రధాన ఎజెండా
మెదక్ కలెక్టరేట్: విద్యా, వైద్యమే ప్రభుత్వ ప్రధాన ఎజెండాగా పనిచేస్తున్నామని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు అన్నారు. ఇంటర్ ఫలితాల్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను బుధవారం కలెక్టరేట్లో సన్మానించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు.. 14 నెలల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి అన్ని పాఠశాలల్లో మరుగుదొడ్లు వసతి కల్పించినట్లు తెలిపారు. విద్యాశాఖలో సమూల మార్పుల కోసం కృషి చేస్తున్నట్లు చెప్పా రు. ఇందులో భాగంగా రామాయంపేటలో రూ. 200 కోట్లతో 20 ఎకరాల్లో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ పాఠశాలను మంజూరు చేసినట్లు వివరించారు. మెదక్లో ఇంటర్ మూల్యాంకన సెంటర్ మంజూరు చేయించిన ఘనత మాదేనని స్పష్టం చేశారు. అలాగే రూ. 3 కోట్ల స్కాలర్షిప్లు మంజూరు చేయించామన్నారు. అనంతరం కలెక్టర్ రాహుల్రాజ్ మాట్లాడుతూ.. ప్రభుత్వ కళాశాలల్లో చదివి ఇంటర్మీడియెట్ విద్యను అభ్యసిస్తూ ఉత్తమ ఫలితాలు సాధించడం గర్వించదగిన విషయమని కొనియాడారు. కార్యక్రమంలో ఇంటర్మీడియెట్ జిల్లా అధికారిణి మాధవి, వివిధ కళాశాలల ప్రిన్సిపాల్స్ తదితరులు పాల్గొన్నారు.మెదక్ ఎమ్మెల్యే రోహిత్రావు -
భూముల సర్వే అడ్డగింత
చిన్నశంకరంపేట(మెదక్): వివాదంలో ఉన్న భూములను సర్వే చేసేందుకు వచ్చిన అధికారులను గిరిజనులు అడ్డుకున్నారు. ఈ సంఘటన మండలంలోని కామారంతండాలో బుధవారం జరిగింది. తమకు కనీసం నోటీసులు ఇవ్వకుండా సర్వే ఎలా చేస్తారని గిరిజనులు ప్రశ్నించారు. తమకు తెలియకుండానే ఓ రియల్టర్ తప్పుడు పత్రాలు సృష్టించి రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, ఈ వివాదం కోర్టులో ఉందని తెలిపారు. పట్టాదారును అని చెప్పుకొనే వ్యక్తి సర్వే వద్దకు ఎందుకు రాలేదని మండిపడ్డారు. సర్వే చేసేందుకు తీసుకువచ్చిన డిజిటల్ మిషన్ను గిరిజనులు లాక్కునేందుకు ప్రయత్నించగా అధికారులు సర్వేను మధ్యలోనే నిలిపివేసి వెనక్కి తిరిగారు. ఈసందర్భంగా గిరిజనులు మాట్లాడుతూ.. వివాదంలో ఉన్న భూమి విషయంలో పోలీస్లు సైతం బడా వ్యక్తులకు అండగా నిలుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నశంకరంపేట ఎస్ఐ నారాయణగౌడ్, తూప్రాన్ సీఐ కృష్ణ ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో పోలీస్ బందోబస్తు నిర్వహించారు. సర్వే ఏడీ శ్రీకాంత్ మాట్లాడుతూ.. కోర్టులో కేసు ఉన్నప్పటికీ పట్టదారు దరఖాస్తు చేయడంతోనే తాము సర్వే చేసేందుకు వచ్చామని తెలిపారు. గతంలో సర్వేను అడ్డకోవడంతోనే పోలీస్ బందోబస్తు కోరామని చెప్పారు. నోటీసులు ఇవ్వకుండా సర్వే చేయడంపై గిరిజనుల ఆగ్రహ ం -
ఏఐపై విద్యార్థులకు ఇంటర్న్షిప్
మెదక్జోన్: మెదక్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల కంప్యూటర్ సైన్స్ విభాగం ఆధ్వర్యంలో 10 రోజుల పాటు నిర్వహించిన ఇంటర్న్షిప్ విజయవంతంగా కొనసాగినట్లు కళాశాల ప్రిన్సిపాల్ హుస్సేన్ తెలిపారు. శిక్షణ కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్న విద్యార్థులకు బుధవారం కళాశాలలో సర్టిఫికెట్లు అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్ సహకారంతో డిగ్రీ తృతీయ సంవత్సరం విద్యార్థులకు సాఫ్ట్ స్కిల్స్, కృత్రిమ మేధ అనువర్తనాలపై 10 రోజుల ఇంటర్న్షిప్ను విజయవంతంగా నిర్వహించినట్లు చెప్పారు. అలాగే కళాశాలలో ఏర్పాటు చేసిన జాబ్ మేళాను ప్రారంభించారు. తగిన అవకాశాలు లభిస్తే విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించగలరని పేర్కొన్నారు. ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో హెచ్ఆర్ ప్రతినిధులు కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో అధ్యాపకులు ప్రవీణ్ కుమార్, సురేందర్రావు, కాశీ విశ్వనాథ్, డాక్టర్ కిరణ్ కుమార్, విద్యార్థులు పాల్గొన్నారు.మెదక్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ హుస్సేన్ -
ఉద్యాన పంటలకు చేయూత
రామాయంపేట(మెదక్): రామాయంపేటలో సాగవుతున్న ఖర్జూర తోటను బుధవారం జిల్లా అధికారుల బృందం సందర్శించింది. జిల్లా హార్టికల్చర్ అధికారి ప్రతాప్సింగ్, మెదక్ డివిజన్ అధికారిణి రచన, పట్టు పరిశ్రమల శాఖ జిల్లా అధికారి నర్సింహాచారి, జిల్లా సహాయ అధికారి లింగయ్య తోటను సందర్శించి రైతు సత్యనారాయణకు పలు సూచనలు చేశారు. ఈసందర్భంగా హార్టికల్చర్ జిల్లా అధికారి ప్రతాప్సింగ్ మాట్లాడుతూ.. రైతులు ఉద్యాన పంటలపై దృష్టి సారించాలని సూచించారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఖర్జూర, అయిల్పాం, జామ, నిమ్మ, అరటి, బొప్పాయి వంటి పంటలు సాగు చేస్తే అధిక లాభాలు ఆర్జించే అవకాశం ఉందని వివరించారు. ఉద్యాన పంటలకు డ్రిప్ ఏర్పాటు కోసం ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుందని, ఎస్సీ, ఎస్టీ రైతులకు వందశాతం, బీసీ సన్నకారు, చిన్నకారు రైతులకు 90 శాతం,ఇతర రైతులకు 80 శాతం సబ్సిడీ ఇస్తుందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో వరిసాగుతో అంతగా లాభాలు ఆర్జించే అవకాశం లేదని, ఉద్యాన పంటలతో మంచి లాభాలుంటాయని తెలిపారు. కార్యక్రమంలో రైతులు త దితరులు పాల్గొన్నారు. -
రైతుల ఖాతాల్లో ధాన్యం డబ్బులు
తూప్రాన్: డివిజన్ పరిధిలో 5,557 మంది రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసిన వారిలో 2,801 మంది రైతుల ఖాతాలో రూ. 25.32 కోట్లను ప్రభుత్వం జమ చేసిందని ఆర్డీఓ జయచంద్రారెడ్డి తెలిపారు. మండలంలోని ఆయా కొనుగోలు కేంద్రాలను బుధవారం సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. చేగుంట మండలంలో 1,214 మంది రైతులకు రూ. 10.64 కోట్లు, వెల్దుర్తిలో 685 మంది రైతులకు రూ. 6.44 కోట్లు, నార్సింగిలో 609 మంది రైతులకు రూ. 5.53 కోట్లు, మాసాయిపేట మండలంలో 226 మంది రైతులకు రూ. 1.80 కోట్లు, తూప్రాన్ మండలంలో 58 మంది రైతులకు రూ. 57 లక్షలు, మనోహరాబాద్ మండలంలో 29 మంది రైతులకు రూ. 33 లక్షలు జమ చేసినట్లు వివరించారు. మిగిలిన రైతుల ఖాతాల్లో త్వరగా డబ్బులు జమ అవుతాయని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. ఆర్డీఓ జయచంద్రారెడ్డి -
వీరభద్రుడికి మంత్రి ప్రత్యేక పూజలు
టేక్మాల్(మెదక్): మండలంలోని బొడ్మట్పల్లి గుట్టపై వెలసిన భద్రకాళీ సమేత వీరభద్రుడి కల్యాణోత్సవం బుధవారం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. మంత్రి దామోదర రాజనర్సింహ ఉత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం రాష్ట్ర మాజీ ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్ మఠం భిక్షపతి, మాజీ ఎమ్మెల్యే క్రాంతికిరణ్ వీరభద్రుడికి పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకుడు వీరన్నస్వామి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు. సాయంత్రం స్వామి వారి ఉత్సవ విగ్రహాలతో భక్తులు ఊరేగింపు నిర్వహించారు. మెదక్ ఆర్డీఓ రమాదేవి, డీఎస్పి ప్రసన్నకుమార్, డీఎంహెచ్ఓ శ్రీరాం, జోగిపే ట మార్కెట్ కమిటీ చైర్మన్ జగన్మోహన్రెడ్డి, నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.ఇసుక రవాణా చేస్తే కేసులుపాపన్నపేట(మెదక్): మంజీరా నది నుంచి ఇసుకను ఏ రూపాన రవాణా చేసినా కేసులు నమోదు చేస్తామని పాపన్నపేట తహసీల్దార్ సతీ ష్కుమార్ హెచ్చరించారు. బుధవారం ‘సాక్షిలో ’ఇసుకా సురుల తిరకాసు దందా’ శీర్షికన ప్రచురితమైన కథనానికి స్పందించారు. రెవెన్యూ, పోలీస్ సిబ్బందిని తనిఖీల కోసం యూ సుఫ్పేట శివారులోని మంజీరా తీర ప్రాంతానికి పంపించారు. అయితే గాడిదలపై ఇసుక రవాణా చేసే వారు అక్కడి నుంచి వెళ్లిపోయారని తెలిపారు. వారి కుటుంబీకులు అక్కడ ఉండగా, మంజీరా నుంచి ఇసుక తీయొద్దని హెచ్చరించినట్లు చెప్పారు. ట్రాక్ట ర్లు, లారీలు, గాడిదలపై ఏ రూపాన ఇసుక రవాణా చేసినా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించినట్లు వివరించారు.భూ సమస్యలకు పరిష్కారంచిలప్చెడ్(నర్సాపూర్): భూ సమస్యలు ఉన్న రైతులకు భూ భారతి చట్టంతో సులభ పరిష్కారం దొరుకుతుందని నర్సాపూర్ ఆర్డీఓ మహిపాల్ అన్నారు. బుధవారం చిలప్చెడ్ రైతువేదికలో నిర్వహించిన రెవెన్యూ సదస్సును పరిశీలించి మాట్లాడారు. పైలెట్ ప్రాజెక్ట్గా ఎంపికై న చిలప్చెడ్లో రెవెన్యూ సదస్సులు ముగిశాయని తెలిపారు. మండలంలోని 15 రెవెన్యూ గ్రామాల్లో పది రోజుల్లో జరిగిన సదస్సుల్లో సుమారు 900 దరఖాస్తులు వచ్చాయని, అందులో ఎక్కువగా సాదాబైనామలు, పేరు మార్పిడిలు ఉన్నాయన్నారు. త్వరలోనే దరఖాస్తులను పరిశీలించి, విచారణ జరిపి, సమస్యలు పరిష్కరించే విధంగా చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ సహదేవ్, డిప్యూటీ తహసీల్దార్ సింధూజ, ఆర్ఐలు సునీల్ సింగ్, వెంకటేశ్వర్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.ఆకట్టుకున్న కుస్తీ పోటీలుపెద్దశంకరంపేట(మెదక్): మండల పరిధిలోని చీలాపల్లి దుర్గమ్మ జాతరలో భాగంగా నిర్వహించిన కుస్తీ పోటీలు ఆకట్టుకున్నాయి. బుధవారం ఆలయ ఆవరణలో నిర్వహించిన పోటీల్లో వివిధ ప్రాంతాలకు చెందిన మల్లయోధులు పాల్గొన్నారు. విజేతలకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో బహుమతులు అందజేశారు.కోతి డాడిలో బాలుడికి గాయాలుచేగుంట(తూప్రాన్): కోతి దాడిలో బాలుడు గాయపడిన సంఘటన మండల కేంద్రంలోని ఎన్జీఓ కాలనీలో బుధవారం సాయంత్రం చోటు చేసుకుంది. కాలనీలోని ఓ భవనంలో అద్దెకు ఉన్న దంపతుల మూడు సంవత్సరాల బాలుడు ఆడుకుంటుండగా కోతుల గుంపు వచ్చింది. అందులోని ఓ కోతి బాలుడిని కరిచింది. దీంతో స్థానికులు బాలుడిని ఆస్పత్రికి తరలించి వైద్యం అందించారు. -
బెనిఫిట్స్ అందక బేజారు
ఈ చిత్రంలో కనిపిస్తున్న మహిళ పేరు కొలుపుల పద్మ. మెదక్ మండలం మక్తభూపతీపూర్ గ్రామం. రెక్కాడితే కానీ డొక్కాడని బతుకు ఆమెది. పద్మ లేబర్ కార్మికురాలిగా రిజిస్టేషన్ చేయించుకున్నారు. ఆమె కూతురు పెళ్లి జరిగి.. ఇద్దరు పిల్లలు పుట్టినా కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రసవం కోసం అందాల్సిన రూ.30 వేలు అందటం లేదు. నిత్యం కార్మికశాఖ కార్యాలయం చుట్టూ తిరుగుతోంది. ఇలా పద్మలాంటి మరో పది మంది బాధితులు మంగళవారం లేబర్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. మెదక్జోన్: జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు లేక పోవటంతో ఎక్కువ శాతం మంది వర్షాకాలంలో వ్యవసాయ కూలీలుగా, తర్వాత భవన నిర్మాణ కార్మికులుగా, లేదా అడ్డామీద కూలీలుగా పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ కార్మికులకు కేంద్రం నుంచి అనేక రాయితీలు, ప్రయోజనాలు కల్గించే పథకాలు ఉన్నాయి. కానీ.. అవగాహన లోపంతో పలురకాల ప్రయోజనాలను వీరు పొందలేక పోతున్నారు. ఈ క్రమంలోనే కేంద్రం ప్రవేశపెట్టిన లేబర్ కార్డు కలిగిన అర్హులకు అందాల్సిన బెన్ఫిట్స్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా అందని ద్రాక్షగా మిగిలింది. కార్మికుల బెన్ఫిట్స్ ఇలా.. ● భవన నిర్మాణంతో పాటు ఇతర రంగాల్లో పనిచేసే కార్మికుల జీవితం ఎప్పుడు ప్రమాదం అంచునే ఉంటుంది. ఇలాంటి వారి కోసం కేంద్రం ప్రవేశపెట్టిన పథకాలతో కార్మికులకు ఈ విధంగా లబ్ధి చేకూరనుంది. ● కార్మికుడిగా పనులు చేస్తూ ఆ శాఖలో రూ.110 చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించుకుంటే ఆ కార్మికుడు, లేదా కార్మికురాలు సాధారణ మరణం చెందితే రూ.1.30 లక్షలు, అదే ప్రమాదావశాత్తు మరణిస్తే బాధిత కుటుంబానికి రూ.6 లక్షల ఆర్థిక సాయం అందుతుంది. ● కార్మిక కుటుంబాల్లోని యువతులకు పెళ్లిళ్లు, లేదా ప్రసవాలు జరిగినా రూ.30 వేల ఆర్థిక సాయం అందిస్తారు. రెండేళ్లుగా ఇన్చార్జిలే.. మెదక్ జిల్లాలో లేబర్ ఆఫీసు ఉన్నప్పటికీ రెండేళ్లుగా అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ ఇన్చార్జిలే కొనసాగుతున్నారు. వారు నెలకోసారి కూడా ఇటు వైపు కన్నెత్తి చూడటం లేదు. ఈ కార్యాలయంలో విధులు నిర్వర్తించే ఓ అవుట్ సోర్సింగ్ ఉద్యోగి నెట్టుకొస్తున్నాడు. నిబంధనల ప్రకారం కార్మికులకు అందాల్సిన బెన్ఫిట్స్ ఏళ్ల తరబడి అందటంలేదు. కార్మికుల కూతుళ్లకు ప్రసవం డబ్బులు రాక కొందరు. భర్త చనిపోయిన వారికి రావాల్సిన లబ్ధికోసం మరికొందరు, ప్రమాదంలో మృతి చెందిన కుటుంబీకులు.. ఇలా పది మంది బాధితులు మంగళవారం లేబర్ కార్యాలయానికి వచ్చారు. ఏళ్ల తరబడి తమను కార్యాలయం చుట్టూ తిప్పుకుంటున్నారని, బెన్ఫిట్స్ కోసం డాక్యుమెంట్స్ను అందించినా ఏదో కుంటుసాకుతో కార్యాలయం చుట్టూ తిప్పుకుంటున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆలస్యం మాట వాస్తవమేసాంకేతిక కారణాల వల్ల కొన్ని రోజులపాటు ఆలస్యమైన వాస్తవమే. దీంతో కొంత మందికి అందించాల్సిన బెన్ఫిట్స్ అందించడంలో జాప్యం జరుగుతోంది. ప్రస్తుతం తాను వికారాబాద్కు బదిలీ అయ్యాను. మెదక్ ఇన్చార్జీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాను. త్వరలోనే ఈ సమస్యను పరిష్కరిస్తాం. – యాదయ్య, ఇన్చార్జి లేబర్ అధికారి ఏళ్ల తరబడి లేబర్ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు రెండేళ్లుగా ఇన్చార్జి అధికారులే దిక్కు ఆందోళన చెందుతున్న బాధితులు -
డిగ్రీ దోస్త్ షురువైంది
● ఈ నెల 21 వరకు రిజిస్ట్రేషన్లకు అవకాశం ● మూడు విడతల్లో అడ్మిషన్ల ప్రక్రియ ● ఉమ్మడి మెదక్ జిల్లాలో 18,150 సీట్లు జహీరాబాద్ టౌన్: ఇంటర్ ఫలితాలు వచ్చాయి. డిగ్రీ ప్రవేశాలకు ఉన్నత విద్యా మండలి నోటిఫికేషన్ జారీ చేసింది. మూడు విడతలుగా సీట్లు భర్తీ చేయనున్నారు. ఈ నెల 3 నుంచి ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైంది. తొలి విడత రిజిస్ట్రేషన్లు ఈ నెల 21 వరకు కొనసాగుతాయి. జూన్ నెలాఖరు వరకు అడ్మిషన్లు పూర్తి చేసి 30 నుంచి మొదటి సెమిస్టర్ తరగతులు ప్రారంభమవుతాయి. డిగ్రీ కళాశాలలో అడ్మిషన్లలో పారదర్శకతకు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ(దోస్త్)ను రాష్ట్ర ఉన్నత విద్యా మండలి అందుబాటులోకి తెచ్చింది. దీనికి సంబంధించి 2025–26 విద్యా ఏడాదికి నోటిఫికేషన్ ఉన్న విద్యామండలి చైర్మన్ బాలకృష్ణరెడ్డి ప్రకటించారు. మూడు విడతల్లో ప్రవేశాలకు అవకాశం కల్పించారు. ఈ నెల 21 వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఈనెల 10 నుంచి 20 వరకు వెబ్ఆప్షన్లు ఇవ్వాలి. 28తో అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి కాగా 29న సీట్ల కేటాయింపు ఉంటుంది. 30 నుంచి జూలై 6వ తేదీ వరకు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. రెండవ విడతలో మే 30 నుంచి జూన్ 8 వరకు రిజిస్ట్రేషన్, జూన్ 13న సీట్ల కేటాయింపు, 18 వరకు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. మూడవ విడతలో జూన్ 13 నుంచి 19 వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. జూన్ 23న సీట్ల కేటాయింపు, 28 వరకు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. జిల్లాల వారీగా సీట్లు ఉమ్మడి మెదక్ జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్,సాంఘిక, గిరిజన సంక్షేమ కళాశాలల్లో 18,150 సీట్లు ఉన్నాయి. సంగారెడ్డి జిల్లాలో 8,150, మెదక్ జిల్లాలో 4,800, సిద్దిపేట జిల్లాలో 7,400 సీట్లున్నాయి. డిగ్రీ కోర్సులను అవగాహనతో ఎంచుకోవాలి. డిగ్రీ కోర్సు పూర్తి చేసిన వారికి సైతం సత్వర ఉద్యోగ అవకాశాలున్నాయి. కంప్యూటర్ సైన్స్కు మంచి అవకాశాలు ఉన్నాయి, బీకాంలో కంప్యూటర్ సైన్స్ తీసుకుంటే కంప్యూటర్ ఆపరేటర్లు,అకౌంటెంట్లుగా చేసుకునేందుకు వీలు ఉంటుంది. బీఎస్సీ పూర్తి చేసిన వారికి ఫార్మా కంపెనీలో కెరీర్ ఉంటుంది. మ్యాథ్స్ సబ్జెక్టుకు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. డిగ్రీ చదివిన వారు ఎంబీఏ, ఎంసీఏ కూడా చేయవచ్చు. ఆర్ట్స్ కోర్సులు చేసే వారి సంఖ్య రోజు రోజుకు తగ్గుతోంది. డిగ్రీ, పీజీ కోర్సులు చేసినా ఉపాధి అవకాశాలు ఉండటంలేదని ఇంటర్ నుంచే ఆర్ట్స్ గ్రూపులో చేరడం లేదు. ప్రైవేట్ కళాశాలలో దాదాపు ఈ గ్రూపు ఉండటం లేదు. -
ఇసుకాసురుల తిరకాసు దందా!
పాపన్నపేట(మెదక్): ఓ ఐడియా మీ జీవితాన్నే మార్చేస్తుందని అప్పట్లో ఓ ప్రైవేట్ సంస్థ చేసిన ప్రకటన చర్చనీయాంశమైంది. అలాంటి ఐడియా అక్రమార్కులకు వస్తే.. జేబులు నిండా కాసులే. ఇసుక అక్రమ రవాణాపై నిషేధం ఉండడంతో ఇదిగో అక్రమార్కులకు ఒక కొత్త ఆలోచన తట్టింది. అదేమిటంటే.. మంజీర నదిలో ఇసుక రవాణాపై నిషేధం ఉంది. పాపన్నపేట మండలం యూసుఫ్పేట, రేగోడ్ మండలం సింధోల్ పరిసర ప్రాంతాల్లో గాడిదలను ఎక్కువగా పెంచుతుంటారు. యూసుఫ్పేటకు ఎనిమిది కుటుంబాలు వలస వచ్చాయి. మొత్తం 40 మంది ఉన్నారు. ఒక్కో కుటుంబానికి 55 గాడిదలు ఉన్నాయి.. ఒక్కో కుటుంబం రోజుకు మూడు ట్రిప్పుల ఇసుక రవాణా చేస్తాయి. అంటే 24 ట్రాక్టర్లు అన్నమాట. నది నుంచి ఒడ్డుకు ఇసుక రవాణా చేస్తే (55 గాడిదలకు కలసి) ఒక్కో ట్రిప్కు రూ.1400 ఇస్తారు. గ్రామంలోనికి రవాణా చేస్తే 55 గాడిదలకు రూ.3,500 చెల్లిస్తారు. ఒక వేళ ట్రాక్టర్ యజమానులు నది ఒడ్డు నుంచి గ్రామం లోనికి రవాణా చేస్తే, గాడిదల యజమానులకు రూ.1900 ఇస్తారు. రూ.900 ట్రాక్టర్ కిరాయి రూ.300 మామూళ్లు తీసుకుంటారు. పాపన్నపేట మండలం చుట్టూర మంజీర నది ఉండటంతో ఏటా ఇక్కడి వ్యాపారులు వారికి అడ్వాన్సుగా డబ్బులిచ్చి గాడిదలను పిలుపించుకుంటారు. లారీలు, ట్రాక్టర్లపై ఇసుక రవాణా చేస్తే కేసులు నమోదయ్యే అవకాశం ఉండటంతో వీటిపై ఇసుక రవాణా చేస్తున్నారు. 55 గాడిదలు సుమారు ట్రాక్టర్ ఇసుకను రవాణా చేయగలవు. ఒక వేళ నది నుంచి ఇసుక తీసి ఒడ్డున పోస్తే రూ.1,950, ఇంటి వరకు ఇసుక రవాణ చేస్తే రూ.3,500 తీసుకుంటున్నారు. గతంలో కొడుపాక, గాజులగూడెంలలో కూడా గాడిదలపై ఇసుక రవాణా కొనసాగించేవారు. అధికారులు స్పందించి ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలని మండలవాసులు కోరుతున్నారు. మంజీర నదిలో ఇసుక రవాణాపై నిషేధం అక్రమార్కుల కొత్త ఎత్తుగడ గాడిదలపై ఇసుక రవాణా 55 గాడిదల ఇసుకకు రూ.3,500 -
ప్లాస్టిక్ భూతం!
బాబోయ్..ప్రజల్లో మార్పు రావాలి ప్లాస్టిక్ నిర్మూలనపై ప్రజ ల్లో విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నాం. పాలిథీన్ కవర్లకు బదులు ఇతర సంచులు వాడాలి. తద్వారా ప్లాస్టిక్ నిర్మూలన సాధ్యమవుతుందని చెబుతున్నాం. ప్రజల్లో మార్పు వచ్చినప్పుడే వంద శాతం ప్లాస్టిక్ నిర్మూలన సాధ్యమవుతుంది. –శ్రీనివాస్రెడ్డి, మున్సిపల్ కమిషనర్, మెదక్● అడ్డగోలుగా వినియోగం ● పొంచి ఉన్న పెను ప్రమాదం ● నిషేధం అమలయ్యేనా? ● ఆచరణలో కానరాని ఫలితం మెదక్ మున్సిపాలిటీ: ఉదయం నుంచి నిద్రించే వరకు ప్లాస్టిక్తో మానవ జీవితం ముడిపడి ఉంటోంది. అంతలా కలిసిపోయిన ప్లాస్టిక్ వల్ల పర్యావరణంతో పాటు మానవాళికి పెను ముప్పు పొంచి ఉంది. ఇది తెలిసినా ప్లాస్టిక్ను అడ్డగోలుగా వినియోగిస్తూనే ఉన్నాం. పర్యావరణ వేత్తలు, ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నా.. కొద్దిగానైనా మార్పు రావడం లేదు. నియంత్రించాల్సిన అధికార యంత్రాంగం పట్టనట్లుగా వ్యవహరిస్తోంది. ఫలితంగా వీటి వినియోగం అంతకంతకూ పెరుగుతోంది. పట్టణంలోని వీధుల్లో, రోడ్ల పక్కన, నివాస గృహల సమీపంలో ఎక్కడ చూసినా ప్లాస్టిక్ వ్యర్ధాలే కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు 50 మైక్రాన్ల కంటే తక్కువ మందం ఉన్న తక్కువ ఉన్న ప్లాస్టిక్పై నిషేధం ఉండేది. ప్రస్తుతం 120 మైక్రాన్ల కన్నా తక్కువ మందం ఉన్న ప్లాస్టిక్పై నిషేధం విధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సమస్యలను అధిగమించాలంటే వ్యక్తిగతంగా, సమష్టిగా ముందడుగు వేయాల్సిన అవసరం ఉందని.. అప్పుడే పర్యావరణ ప్రయోజనం చేకూరుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రోజుకు 3 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు మెదక్ మున్సిపాలిటీ పరిధిలో సుమారు 20 వేల నివాస గృహాలు, దుకాణాలు ఉన్నాయి. 10 ఆటో లు, ఏడు ట్రాక్టర్లతో పట్టణంలో చెత్త సేకరణ చేస్తున్నారు. ప్రతిరోజు 18 టన్నుల చెత్త పోగవుతోంది. అందులో 3 టన్నుల వరకు ప్లాస్టిక్ వ్యర్థాలే ఉంటున్నాయి. అడపా దడపా ఫాస్ట్ఫుడ్ సెంటర్లు, హోట ళ్లు, దుకాణాలపై దాడులు నిర్వహిస్తున్నారు. రూ. 5000 నుంచి రూ.20వేల వరకు జరిమానా సైతం విధిస్తున్నారు. తదనంతరం అధికారుల పర్యవేక్షణ సరిగా లేకపోవడం.. రాజకీయ ఒత్తిళ్ల కారణంగా తిరిగి వాటి విక్రయాలను కొనసాగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఏళ్ల తరబడి ప్రణాళిక రూపొందిస్తున్నా.. కౌన్సిల్లో తీర్మానాలు చేస్తున్నా.. అమలులో క్షేత్రస్థాయి లోపాలతో అడ్డుకట్ట పడటం లేదు. ముమ్మరంగా తనిఖీలు ప్రస్తుతం ప్లాస్టిక్ నిషేధానికి అధికారులు మళ్లీ నడుం బిగించారు. గడిచిన కొన్ని రోజులుగా మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. ముఖ్యంగా జిల్లా కేంద్రమైన మెదక్లో ప్లాస్టిక్ విక్రయాలు, వినియోగంపై ప్రత్యేకంగా దృష్టిసారించారు. నిత్యం ఉదయం, సాయంత్రం వేళలో దుకాణాలపై దాడులు చేసి చర్యలు తీసుకుంటున్నారు. కూరగాయల మార్కెట్తోపాటు హోల్సెల్, రిటేల్ దుకాణాలు, వైన్స్లు, పర్మిట్ రూంలలో, స్వీట్హౌస్లు, హోటళ్లలో వినియోగిస్తున్న ప్లాస్టిక్ కవర్లను వాడకుండా కఠినంగా చర్యలు చేపడుతున్నారు. ఆయా పార్టీల నుంచి రాజకీయ ఒత్తిళ్లు వచ్చినా ఎక్కడా తగ్గకుండా దాడులు కొనసాగిస్తూ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇందులో భాగంగా మంగళవారం మెదక్ పట్టణంలోని ఆటోనగర్, వెల్కంబోర్డు ప్రాంతంలోని హోటళ్లు, స్వీట్హౌజ్లలో తనిఖిలు నిర్వహించగా హోటల్కు రూ.10వేల జరిమాన విధించారు. -
చివరి గింజ వరకు కొంటాం
చిన్నశంకరంపేట(మెదక్): ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతులను ఇబ్బందులకు గురిచేస్తే సహించేదిలేదని కలెక్టర్ రాహుల్రాజ్ హెచ్చరించారు. మంగళవారం చిన్నశంకరంపేట మండలం ఎస్.కొండాపూర్, గవ్వలపల్లి గ్రామాలలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కాంటా చేస్తున్న తీరు, ధాన్యం తేమ శాతం పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాలలో అవకతవకలు పాల్పడినా, ధాన్యం ఎక్కువ కాంటా చేసే వారిపై కఠిన చర్యలు తప్పవన్నారు. చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని, రైతులు ఎవరూ ఆందోళన చెందాల్సిన లేదని స్పష్టం చేశారు. జిల్లాలో ఇప్పటి వరకు 1లక్ష 80 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని, 71 రైస్మిల్లులకు ధాన్యం పంపించామని ఆయన వివరించారు. ధాన్యం నిల్వలకు అవసరమైతే ప్రభుత్వం గోదాంలను కేటాయిస్తుందని చెప్పారు. రైస్మిల్లుల వద్ద ఆన్లోడ్ కోసం రెవెన్యూ అధికారిని కేటాయించామని చెప్పారు. ధాన్యం రైస్మిల్లుకు చేరిన 48 గంటలలో రైతుల ఖాతాలలో డబ్బులు జయ చేస్తున్నామని చెప్పారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ మన్నన్, ఐకేపీ ఏపీఎం లక్ష్మినారాయణ ఉన్నారు. లబ్ధిదారుల ఎంపికలో వేగం పెంచండి మెదక్ కలెక్టరేట్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేట్టిన సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపికలో వేగం పెంచాలని కలెక్టర్ రాహుల్రాజ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం రాత్రి తన చాంబర్ నుంచి జెడ్పీ సీఈఓ ఎల్లయ్య, ఎస్సీ ఎస్టీ బీసీ, మైనారిటీ సంక్షేమ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలతో జూమ్ మీటింగ్ నిర్వహించారు. రాజీవ్ యువ వికాసం, ఇందిరమ్మ ఇళ్లు, తాగునీటి ఎద్దడి నివారణపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాజీవ్ యువ వికాసానికి సంబంధించి బీసీ, ఎస్సీ, మైనార్టీ, ట్రైబల్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ అధికారులతో వెరిఫికేషన్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇందిరమ్మ ఇళ్లను త్వరలో అర్హత గల లబ్ధిదారులకు మంజూరు చేస్తామన్నారు. అలాగే జిల్లాలోని ఏ ఒక్క గ్రామంలోనూ తాగునీటి ఎద్దడి రాకుండా పటిష్ట ప్రణాళిక ద్వారా చర్యలు తీసుకోవాలని, క్షేత్రస్థాయిలో అధికారులు పర్యటించి సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. రైతులను ఇబ్బందులకు గురి చేస్తే సహించం కలెక్టర్ రాహుల్రాజ్ -
తూకంలో మోసంపై విచారణ
నిజాంపేట(మెదక్): మండలంలోని బచ్చురాజ్పల్లిలో ఐకేపీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ధా న్యం కొనుగోలు కేంద్రంలో పెద్దఎత్తున అవినీతి చోటు చేసుకోవడంతో అధికారులు విచారణ ప్రారంభించారు. కేంద్రం నిర్వాహకులు, హ మాలీలు కుమ్మకై తమను మోసగించారని రైతులు నిరసన వ్యక్తం చేశారు. దీంతో సోమవారం డీపీఎం మోహన్, డీసీఎస్ఓ సురేశ్రెడ్డి, పౌర సరఫరాల శాఖ డీఎం జగదీశ్, తహసీల్దార్ శ్రీనివాస్ గ్రామంలో బహిరంగ విచారణ చేపట్టారు. 42 కిలోలకు బదులు 44 కిలోలు తూకం వేసి తమకు మోసగించారని రైతులు ఫిర్యాదు చేశారు. ఇందుకు బాధ్యురాలిగా కేంద్రం ఇన్చార్జి మంజులను గుర్తించిన అధికారులు వెంటనే సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. సక్రమంగా ధాన్యం తూకం నిర్వహించాలని, ఎలాంటి అవకతవకలు చోటు చేసుకున్నా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.కొనుగోలు కేంద్రం ఇన్చార్జి సస్పెండ్ -
రసాయనాల వాడకం తగ్గించాలి
సీఎం సహకారంతో అభివృద్ధి చేస్తా మెదక్ ఎమ్మెల్యే రోహిత్రావుక్రీడల్లో రాణించి ఉన్నతస్థాయికి ఎదగాలిఎస్పీ ఉదయ్కుమార్రెడ్డి చిన్నశంకరంపేట(మెదక్): సీఎం రేవంత్రెడ్డి సహకారంతో నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తానని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు అన్నారు. సోమవారం మండల పరిషత్ కార్యాలయంలో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేశా రు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ప్రత్యేక చొరవ తీసుకుంటానన్నారు. ప్రతి పాఠశాలలో ముందుగా మరుగుదొడ్లు నిర్మాణం చేపట్టడంతో పాటు మౌలిక సౌకర్యాల క ల్పనకు కృషి చేస్తానన్నారు. మెదక్ నియోజకవర్గాన్ని ఎడ్యుకేషన్ హబ్గా తీర్చిదిద్దుతానని తెలిపారు. అనంతరం పదో తరగతిలో మండల టాపర్గా నిలిచిన మడూర్ జెడ్పీ పాఠశాల విద్యార్థిని రాజేశ్వరిని సన్మానించారు. అలాగే మండలంలోని ధరిపల్లిలో జరుగుతున్న బీరప్ప జాతరలో పా ల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో తహసీల్దార్ మన్నన్, ఎంపీడీఓ దామోదర్, డీఎస్పీ వెంకట్రెడ్డి, ఎంఈఓ పుష్పవేణి, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. మెదక్ మున్సిపాలిటీ: పోలీస్ సిబ్బంది పిల్లలు క్రీడల్లో రాణించి ఉన్నతస్థాయికి ఎదగాలని ఎస్పీ ఉదయ్కుమార్రెడ్డి ఆకాంక్షించారు. సో మవారం జిల్లా కేంద్రంలోని అవుట్డోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన టర్మ్ క్రికెట్ కోచింగ్ క్యాంపును ప్రారంభించి మాట్లాడారు. జాతీయ క్రీడాకారుడు కానిస్టేబుల్ సాయి ఆధ్వర్యంలో కోచింగ్ క్యాంపు నడుస్తుందని తెలిపారు. పేద పిల్లలు, పోలీస్ సిబ్బంది పిల్లలు ఈ కోచింగ్ క్యాంపును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అంతకుముందు జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. కార్యక్రమంలో మెదక్ డీఎస్పీ ప్రసన్నకుమార్, ఏఆర్ డీఎస్పీ రంగానాయక్, మెదక్ టౌన్ సీఐ నాగరాజు, ఆర్ఐ శైలందర్ సిబ్బంది త దితరులు పాల్గొన్నారు. తూప్రాన్: రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమంలో భాగంగా మండలంలోని రావెళ్లి గ్రామంలో ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ కీటక శాస్త్రవేత రాజశేఖర్ రైతులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. వానాకాలం సీజన్కు సంబంధించి యాజమాన్య పద్ధతుల గురించి చెప్పారు. ముఖ్యంగా తక్కువ యూరియా వాడకం, రసాయన పురుగు మందులు వాడటంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సమర్థ నీటి వినియోగం, విత్తన, నేల శుద్ధి, పంట మార్పిడి వంటి వాటి వల్ల కలిగే ఉపయోగాల గురించి క్షుణ్ణంగా వివరించారు. రైతులు కొనుగోలు చేసిన వాటికి సంబంధించిన రసీదులు జాగ్రత్త పర్చుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి గంగమల్లు, వ్యవసాయ విస్తరణ అధికారి సంతోష్, కౌన్సిలర్ రాజు, నవీన్, రైతులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం తప్పకుండా ఒక బస్తా యూరియా తక్కువ వాడుతాం అని రైతులతో ప్రతిజ్ఞ చేయించారు. రైతులకు వ్యవసాయ శాస్త్రవేత్త సూచన -
సత్వర పరిష్కారం చూపండి
మెదక్ కలెక్టరేట్: కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి జిల్లా నలుమూలల నుంచి 74 అర్జీలు వచ్చాయి. కలెక్టర్ రాహుల్రాజ్ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. అత్యధికంగా భూ సమస్యలపై 23, ఇందిరమ్మ ఇళ్ల కోసం 9, పెన్షన్లు, ఇతర సమస్యలపై 37, ఉద్యోగ ఉపాధి కోసం 1 చొప్పున ఉన్నాయి. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజా సమస్యలపై తక్షణం స్పందించి పరిష్కారం చూపాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో త్వరగా విచారణ చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఇన్చార్జి అదనపు కలెక్టర్ భుజంగరావు, జెడ్పీ సీఈఓ ఎల్లయ్య సిబ్బంది పాల్గొన్నారు. కాగా వ్యవసాయ పొలాల్లోకి వెళ్లే దారిని కొందరు కబ్జా చేశారని, దీంతో తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోందని అక్కన్నపేట గ్రామ రైతులు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. భవిత కేంద్రం సందర్శన మెదక్జోన్: దివ్యాంగ విద్యార్థుల బంగారు భవిష్యత్ కోసం భవిత కేంద్రాలు ఎంతగానో ఉపయోగపడతాయని కలెక్టర్ అన్నారు. సోమవారం పట్టణంలోని భవిత కేంద్రాన్ని సందర్శించారు. మౌలిక వసతుల కల్పనకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణాలు వదిలిన అమరవీరుల స్థూపం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఇందుకోసం సోమవారం పట్టణంలోని టీచర్స్ కాలనీలో స్థలాన్ని పరిశీలించారు. భూ సమస్యల పరిష్కారానికి చర్యలు చిలప్చెడ్(నర్సాపూర్): భూ భారతి పైలెట్ ప్రాజెక్ట్గా ఎంపికై న చిలప్చెడ్ మండలంలో 16 గ్రా మాల్లో సోమవారంతో 13 గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు పూర్తయ్యాయని, వచ్చిన దరఖాస్తులు సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ రాహుల్రాజ్ అధికారులను ఆదేశించారు. సోమవారం మండలంలోని గౌతాపూర్, సోమక్కపేట్లో రెవెన్యూ సదస్సులను కలెక్టర్ పరిశీలించి రైతులతో మాట్లాడారు. అనంతరం గౌతాపూర్లో క్షేత్రస్థాయిలో ఇందిరమ్మ ఇళ్ల సర్వేను పరిశీలించారు. ఎస్సీ కాలనీలో తాగునీటి సమస్య తలెత్తడంతో పరిష్కరించాలని, వనరులు లేకపోతే ట్యాంకర్తో నీటిని సరఫరా చేయాలని పంచాయతీ కార్యదర్శిని ఆదేశించారు. కలెక్టర్ రాహుల్రాజ్ ప్రజావాణికి 74 వినతులు -
వడ్ల కుప్పలు.. రైతు తిప్పలు
మంచి దిగుబడి వచ్చిందని రైతు పొందిన ఆనందం, కొనుగోలు కేంద్రాల వద్దకు వచ్చేసరికే ఆవిరవుతోంది. 15 రోజులుగా పగలంతా ధాన్యం ఆరబెట్టి.. రాత్రయ్యేసరికి కుప్పగా పోయడమే నిత్యం పనవుతోంది. పైగా పగలూ రాత్రీ కాపలా కాయాల్సి వస్తోంది. కంటినిండా నిద్రలేక రోజుల తరబడి జాగారం చేయాల్సి వస్తోంది. విష పురుగులతో ప్రాణాలు ఆరచేతిలో పెట్టుకొని గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. అల్లాదుర్గం మండలం ముస్లాపూర్లో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాన్ని సోమవారం ‘సాక్షి’ విజిట్ చేయగా పలు అంశాలు వెలుగుచూశాయి. మ్యాచర్ వచ్చినా ధాన్యం కొనుగోలు చేయడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. చేయి తడిపిన వారి ధాన్యం మాత్రం వెంటవెంటనే కొంటున్నారని ఆరోపించారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు విచారణ జరిపి అక్రమాలకు పాల్పడుతున్న సిబ్బందిపై చర్యలు తీసుకొని న్యాయం చేయాలని రైతులు వేడుకున్నారు. – అల్లాదుర్గం(మెదక్)రోడ్డుపైన ధాన్యం కుప్పలు -
వన దుర్గమ్మకు పల్లకీ సేవ
పాపన్నపేట(మెదక్): పౌర్ణమిని పురస్కరించుకొని సోమవారం ఏడుపాయల వన దు ర్గమ్మకు పల్లకీ సేవ నిర్వహించారు. అర్చకులు శంకరశర్మ, పార్థివశర్మ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఉత్సవ విగ్రహాన్ని పల్లకీపై ఊరేగించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు దుర్గమ్మకు జై అంటూ పల్లకీ సేవలో పాల్గొన్నారు. ఆలయం నుంచి గోకుల్షెడ్డు వరకు ఊరేగింపు కొనసాగింది. ఆ ఘనత మోడీదే.. కౌడిపల్లి(నర్సాపూర్): పాక్ ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసిన ఘనత ప్రధాని నరేంద్ర మోడీదేనని బీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లేష్గౌడ్ అన్నారు. సోమవారం కౌడిపల్లిలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆపరేషన్ సిందూర్లో భాగంగా ఉగ్ర శిబిరాలతో పాటు పాకిస్తాన్లోని పలు ఆర్మీ రక్షణ వ్యవస్థలను మన దేశ త్రివిధ దళాలు ధ్వంసం చేశాయని కొనియాడారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్తాన్లో ఉగ్ర మూకలను తుదముట్టించి ప్రతీకారం తీర్చుకుందన్నారు. అనంతరం బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు రాజేందర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్తోనే కశ్మీర్ సమస్య తలెత్తిందని విమర్శించారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు రాకేష్, నాయకులు శంకర్, నగేష్ గౌడ్, నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఫీల్డ్ అసిస్టెంట్లుగా ప్రమోట్ చేయండి మెదక్ కలెక్టరేట్: తమను ఫీల్డ్ అసిస్టెంట్లుగా ప్రమోట్ చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం కలెక్టరేట్ ఎదుట మేట్లు నిరసన తెలిపారు. అనంతరం కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా మేట్ల సంఘం జిల్లా అధ్యక్షుడు గోపాల్ మాట్లాడుతూ.. జిల్లాలోని 493 గ్రామాల్లో సుమారుగా 200 గ్రామాల్లో మాత్రమే ఫీల్డ్ అసిస్టెంట్లు పనిలో ఉన్నట్లు తెలిపారు. మిగితా 293 గ్రామాల్లో సీనియర్ మేట్లతో ఉపాధి హామీ పథకం నడుస్తుందన్నారు. పనిభారం పెరుగుతున్నందున సీనియర్ మేట్లను ఫీల్డ్ అసిస్టెంట్గా ప్రమోట్ చేయాలని కోరారు. వీరికి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి మల్లేశం సంపూర్ణ మద్దతు ప్రకటించారు. కార్యక్రమంలో నాయ కులు దుర్గేష్, యాదగిరి, రోహిత్, నాగమణి, శ్రీకాంత్, మహేష్, నరేష్, రవి, గోపాల్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. కొనుగోళ్లు త్వరగా పూర్తి చేయాలి చిలప్చెడ్(నర్సాపూర్): ధాన్యాన్ని త్వరగా కొనుగోలు చేసి, రైస్ మిల్లులకు పంపించాలని నర్సాపూర్ ఆర్డీఓ మహిపాల్ ఆదేశించారు. సోమవారం మండల పరిధిలోని శీలాంపల్లిలో ధాన్యం కొనుగోళ్లను పరిశీలించి మాట్లాడారు. నిర్వాహకులు త్వరితగతిన కొనుగోళ్లు చేపట్టి, తూకం అయిన ధాన్యాన్ని వెంటనే మిల్లుకు తరలించాలన్నారు. లారీల కొరత, లేబర్ తదితర సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కొనుగోళ్లు సజావుగా జరపాలన్నారు. వారం రోజుల్లో వందశాతం ధాన్యం కొనుగోళ్లు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. -
అర్హులైన వారికి ఇందిరమ్మ ఇళ్లు
ఎంపీ సురేశ్కుమార్ షెట్కార్న్యాల్కల్(జహీరాబాద్)/జహీరాబాద్ టౌన్: అర్హులైన నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరవుతాయని ఎంపీ సురేశ్ కుమార్ షెట్కార్ స్పష్టం చేశారు. న్యాల్కల్లో సోమవారం ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించి లబ్ధిదారులతో మాట్లాడారు. అంతకుముందు జహీరాబాద్ మండలంలోని బూచినెల్లి గ్రామంలో బుద్ధ విహార్ను ప్రారంభించడంతో పాటు గౌతమ బుద్ధుడి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ... గౌతమ బుద్ధుడు చూపిన మార్గంలో నడుస్తూ మహనీయుడి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలన్నారు. న్యాల్కల్ మండలంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పనులు చురుగ్గా కొనసాగుతున్నాయని ఎంపీ తెలిపారు. ఇళ్లు కట్టుకుంటున్న వారికి ఇటీవల రూ.1లక్ష చొప్పున అందించడం జరిగిందన్నారు. లబ్ధిదారులకు దశలవారీగా బిల్లులు చెల్లించడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. అనంతరం రేజింతల్ శివారులో గల శ్రీసిద్ధివినాయక ఆలయంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు చేసి దైవదర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా అర్చకులు, ఆలయ కమిటీ సభ్యులు ఎంపీని సన్మానించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. గౌతమ బుద్ధుడు చూపిన మార్గంలో నడుస్తూ మహనీయుడి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని ఎంపీ పిలుపునిచ్చారు. -
బడి బాట.. లెక్కల మూట!
ప్రభుత్వ పాఠశాలలపై కుదరని గురి ● మధ్య తరగతి వారు సైతం ప్రైవేటుకే.. ● జిల్లాలో 27 జీరో నమోదు స్కూళ్లు ● భరోసా కల్పిస్తే పెరగనున్న ప్రవేశాలుప్రీ ప్రైమరీతో నమోదు పెరిగే అవకాశం ప్రభుత్వ బడుల్లో ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ లేకపోవడంతో చాలా మంది పోషకులు వారి పిల్లలను ప్రైవేట్లో చేర్పించి, అక్కడే పైచదువులు కొనసాగిస్తున్నారు. అందుకే విడతల వారీగా ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటుంది. అంగన్వాడీలను ప్రభుత్వ పాఠశాలలకు అనుసంధానం చేయాలని నిర్ణయించింది. ఎల్కేజీ స్థాయి నుంచి ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. పాపన్నపేట(మెదక్): ప్రభుత్వ పాఠశాలల్లో ఫలి తాలు ఘనంగా ఉన్నా.. ప్రవేశాలు మాత్రం అధ్వానంగా ఉంటున్నాయి. ఏటా ప్రభుత్వం ఆర్భాటంగా నిర్వహిస్తున్న బడి బాట.. లెక్కల మూటగానే మారుతుంది. 5వ తరగతి చదివే విద్యార్థులను.. ఆరో తరగతిలో చేర్పించి.. మేం ఇంత మంది ని నమోదు చేశామని టీచర్లు గొప్పలు చెప్పుకుంటున్నారు. కానీ ప్రైవేట్ బడిలో చదివే విద్యార్థులు, బడి బయట ఉన్న వారు ప్రభుత్వ బడిలో చేరుతు న్న దాఖలాలు లేవు. జిల్లాలో 876 ప్రభుత్వ నాన్ రెసిడెన్షియల్ పాఠశాలలుండగా, అందులో 61,533 విద్యార్థులున్నారు. కాగా కేవలం 103 ప్రైవేట్ పాఠశాలల్లో 39,872 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇప్పటికే 27 ప్రభుత్వ పాఠశాల లు జీరో నమోదుగా ముద్రపడ్డాయి. పరిస్థితి ఇలా గే కొనసాగితే మరో 15 ఏళ్లలో ప్రభుత్వ పాఠశాలలు కనుమరుగయ్యే ప్రమాదం ముంచుకొస్తుంది. ఫలితాలు ఘనం.. ప్రవేశాలు అధ్వానం ఇటీవల ప్రకటించిన పదో తరగతి పరీక్షక్ష ఫలితాల్లో జిల్లా 96.87 శాతం ఫలితాలు సాధించి రాష్ట్రంలో 12వ స్థానంలో నిలిచింది. కానీ ఏటా ప్రభుత్వ పాఠశాలల్లో నమోదు శాతం పెరగడం లేదు. గత మూడేళ్లలో విద్యార్థుల నమోదు 74.99 శాతం నుంచి 67.53 శాతానికి తగ్గింది. ప్రైవేట్ పాఠశాలలు మాత్రం 25.01 నుంచి 32.47 శాతానికి పెరిగింది. గురుకులాలు, ఆదర్శ పాఠశాలలు, కేజీవీవీల్లో విద్యార్థుల నమోదు పర్వాలేదనిపిస్తుంది. గణాంకాల మూట.. ఏటా విద్యాశాఖ ఆర్భాటంగా నిర్వహిస్తున్న బడిబాట గణాంకాల మూటగానే మారుతుందన్న విమర్శలున్నాయి. జూన్ మొదటి వారంలో ప్రభుత్వ పాఠశాలల్లో బడిబాట నిర్వహిస్తున్నారు. ర్యాలీలు నిర్వహించడం, కరపత్రాలు పంచడం, పదో తరగతి ఫలితాలు చూపడం, మధ్యాహ్న భోజనం, ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు ప్రచార అస్త్రాలుగా ఉపయోగిస్తున్నారు. పాఠశాల తెరవగానే అంగన్వాడీ నుంచి 1వ తరగతిలో, సీపీఎస్ నుంచి 6వ తరగతిలో చేరే విద్యార్థులను బడిబాటలో కొత్తగా చేరినట్లు లెక్కలు చూపుతున్నారు.ఇంటింటి సర్వేకు కలెక్టర్ ఆదేశం జూన్ 6 నుంచి జరిగే బడిబాటలో ఇంటింటి సర్వే జరపాలని ఇటీవల జరిగిన విద్యాశాఖ అధికారుల సమావేశంలో కలెక్టర్ రాహుల్రాజ్ ఆదేశించారు. ఇంట్లో బడీడు కలిగిన విద్యార్థులు ఎంత మంది ఉన్నారు. ఎక్కడ చదువుతున్నారు, చదువుకోని వారు ఎంత మంది అన్న వివరాలు నమోదు చేయాలని ఆదేశించారు. దీన్ని నిర్ధారణ చేసుకోవడానికి థర్డ్ పార్టీ సర్వే కూడా చేయిస్తామని తెలిపారు. అర్హతను అనుసరించి ప్రతి ఒక్కరూ చదువుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ బడిలో చదువుతున్న విద్యార్థులు పైతరగతి కోసం మరో ప్రభుత్వ బడిలో చేరితే వారిని కొత్తగా నమోదు చేసినట్లు బడిబాట కార్యక్రమంలో చూపడం సరికాదన్నారు. చదువు మానేసిన వారిని, అసలు చదువుకోని వారిని గుర్తించి, వారి అర్హతలను బట్టి చదువుకునే అవకాశాలను కల్పించాలన్నారు. ఇతర పాఠశాలల నుంచి ప్రభుత్వ బడిలో చేర్పించే వారిని మాత్రమే బడిబాటలో చూపాలని ఆదేశించారు.నమ్మకం పెంచుతాం సర్కార్ బడుల్లో వినూత్న మార్పులు రాబోతున్నాయి. 30కిపైగా విద్యార్థులున్న బడిలో ఏఐ ల్యాబ్లు ఏర్పాటు చేస్తాం. కంప్యూటర్ బోధనకు ప్రాధాన్యమిస్తాం. తరచుగా పాఠశాలల మానిటరింగ్ చేస్తాం. ఐఎఫ్పీ ప్యానల్ బోర్డులతో అర్థమయ్యేలా బోధన కొనసాగిస్తాం. ఒత్తిడి లేని చదువులు అందిస్తాం. విద్యార్థులో క్రియేటివిటి పెంపొందిస్తాం. ఆటపాటల్లో ఆరితేరేలా తీర్చిదిద్దుతాం – రాధాకిషన్, డీఈఓ, మెదక్ -
దేవుడా.. ఎన్నాళ్లీ వెతలు
ఇన్చార్జి ఈఓలతో ఆలయాల నిర్వహణ ● సమస్యలతో భక్తులు సతమతం ● 30 పోస్టులు ఖాళీ.. గ్రూప్– 2 పైనే ఆశలు సంగారెడ్డి జోన్: రాష్ట్రంలోనే ప్రసిద్ధి చెందిన ప్రముఖ దేవాలయాలు ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్నాయి. ఆయా దేవాలయాలకు రెగ్యులర్ ఈఓలు లేకపోవడంతో ఏళ్లుగా సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు. ఫలితంగా ఆలయానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు తప్పడం లేదు. అదేవిధంగా ఇన్చార్జిలుగా వ్యవహరిస్తున్న ఆలయ అధికారులకు సైతం పలు రకా ల ఇబ్బందులు తప్పడం లేదు. ఉమ్మడి మెదక్ జిల్లాలో 36 ప్రముఖ దేవాలయాలున్నాయి. అదేవిధంగా ధూప దీప నైవేద్యం పథకం ద్వారా గుర్తింపు పొందినవి 939 దేవాలయాలు న్నాయి. ఆలయాలకు వచ్చే ఆదాయాన్ని బట్టి నాలుగు కేటగిరీల వారీగా విభజించారు. 6(ఏ) కేటగిరీలో 13, 6(బీ) కేటగిరీలో 12, 6(సీ) కేటగిరీలో 10, 6 (డీ) కేటగిరీలో 1 చొప్పున ఆలయాలున్నాయి. సంగారెడ్డి జిల్లాలో ఝరాసంగం కేతకీ సంగమేశ్వర ఆలయం, రుద్రారం గణేశ్గడ్డ, బొంతపల్లి శ్రీ భద్రకాళి సహిత వీరభద్రేశ్వర, మెదక్లోని ఏడుపాయల శ్రీ దుర్గ భవాని ఆలయం, సిద్దిపేటలోని కోటిలింగాల, వెంకటేశ్వర తదితర ఆలయాలున్నాయి. ఒక్కో అధికారికి పదికి పైగా బాధ్యతలు ఉమ్మడి మెదక్ జిల్లాలో 36 ఈఓ పోస్టులు మంజూరు ఉండగా కేవలం 6 పోస్టులు మాత్రమే భర్తీ ఉన్నాయి. ఒక్కో ఈఓకు సుమారు 10కి పైగా ఆలయాలకు అధికారులుగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఆలయ అధికారులకు అదనపు బాధ్యతలు ఉండటంతో ఆలయ అభివృద్ధి జరగకపోవటంతోపాటు భక్తుల సమస్యలు పరిష్కారం కావడం లేదు. ఆలయాల అభివృద్ధికి, సమస్యల పరిష్కారానికి ప్రణాళికలు రూపొందించాల్సి ఉన్న తమ పరిధిలో ఉన్న ఆలయాల సందర్శనకు మాత్రమే సమయం సరిపోతుందని అధికారులు చెబుతున్నా రు. అదనపు బాధ్యతలతో ఆలయ అధికారులకు బాధ్యతలు, నిర్వహణ భారంగా మారాయి. అధికారులకు కేటాయించిన ఆలయాలు కొన్ని కిలోమీటర్ల మేర దూరం ఉండటంతో అధికారులకు దూరాభారంతోపాటు సమయం వృథా అవుతోంది. ఆలయాలకు కోర్టు తగాదా లు ఉండటంతో అక్కడికి హాజరు అవుతుండటంతో ఆలయ అధికారులకు ఆలయ నిర్వహణ భారంగా మారింది. నియామకం కానీ రెగ్యులర్ అధికారులు ఆలయ అధికారులే కాకుండా దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న వారికి సైతం ఆలయాల నిర్వహణ బాధ్యతలను అప్పగిస్తున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్కు ఏడుపాయల దుర్గా భవాని ఆలయ ఈఓగా బాధ్యత లు నిర్వహిస్తున్నారు. సుమారు పదేళ్ల నుంచి దేవదాయ శాఖలో ఈఓ పోస్టులు భర్తీ చేసినప్పటికీ పూర్తిస్థాయిలో చేపట్టలేకపోయారు. ఇటీవల గ్రూప్–2 ఫలితాలు విడుదల కావడంతో వాటి ద్వారా నియామకం చేపట్టే అవకాశాలున్నాయని సంబంధిత శాఖ అధికారులు వెల్లడించారు. -
ఉద్యాన పంటలకు ఊతం
● ప్రస్తుతం జిల్లాలో 9 వేల ఎకరాల్లో సాగు ● వానాకాలం 2,850 ఎకరాలు లక్ష్యం ● భారీ సబ్సిడీలతో రైతులకు ప్రోత్సాహంమెదక్ కలెక్టరేట్: రైతులు కేవలం వరికే పరిమితం కావడంతో ఆర్థికంగా ఆశించిన అభివృద్ధి సాధించలేకపోతున్నారు. దీనిని గుర్తించిన ప్రభుత్వం ప్రతి రైతు వాణిజ్య పంటలు సాగు చేసి ఆర్థికాభివృద్ధి సాధించడమే కాకుండా, జాతీయ స్థాయిలో ఎదిగేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ప్రస్తుతం జిల్లాలో 9 వేల ఎకరాల్లో ఆయిల్పాం, పండ్ల తోటలు, కూరగాయలు, పూల తోటలు సాగవుతున్నాయి. ఈ సాగు విస్తీర్ణాన్ని మరింత పెంచేందుకు పెద్ద ఎత్తున సబ్సిడీలు అందజేస్తుంది. అయితే 2025– 26 వానాకాలం సీజన్లో జిల్లాలో 2,850 ఎకరాల్లో పంటల సాగు జరగాలని ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్ణయించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా ఉద్యానవన శాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. ఇందుకోసం ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీలను రైతులకు తెలియజేస్తూ పెద్దఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఆయిల్పాం, బిందు, తుంపర సేద్యానికి లక్ష్యాలను కేటాయించింది. జాతీయ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ ఈ పథకం ద్వారా జిల్లాలో ఆయిల్పాం సాగు విస్తీర్ణాన్ని పెంచేందుకు జిల్లాకు 2025– 26 సంవత్సరానికి గాను 2,500 ఎకరాల లక్ష్యం కేటాయించారు. ఆయిల్పామ్ తోటలు సాగు చేసే రైతులకు గతంలో మాదిరిగానే ఎకరానికి ఏడాదికి రూ. 4,200 చొప్పున మొత్తం 4 సంవత్సరాలకు 16,800 మొక్కలపై 11,001 రాయితీ కల్పిస్తున్నారు. మైక్రో ఇరిగేషన్ ఈ పథకం ద్వారా బిందు, తుంపర సేద్యం ద్వారా వాణిజ్య పంటల సాగుకు లక్ష్యాన్ని కేటాయించారు. ఇందులో ఆయిల్పాం సాగుకు 2,500 ఎకరాలు, కూరగాయలు, మిరప, మొక్కజొన్న తదితర పంటలకు 1,470 ఎకరాలు, పండ్ల తోటలకు గాను 368 ఎకరాలు, తుంపర సేద్యానికి గాను 80 ఎకరాల లక్ష్యం కేటాయించారు. వంద శాతం సబ్సిడీ జిల్లాలో ఆయిల్పాం తోటలు సాగు చేసే ఎస్సీ, ఎస్టీ రైతులకు వందశాతం బీసీ, చిన్న, సన్నకారు రైతులకు 90 శాతం, ఇతరులకు 80 శాతం చొప్పున ప్రభుత్వం సబ్సిడీ అందజేస్తూ ప్రోత్సహిస్తుంది. అలాగే పండ్ల తోటలు, ప్లాస్టిక్ మల్చింగ్, పూల తోటల సాగు, హైబ్రిడ్ కూరగాయల నారు పండించే రైతులను ప్రోత్సహించేందుకు పెద్ద ఎత్తున సబ్సిడీలు అందజేస్తుంది. రాష్ట్రీయ ఉద్యాన మిషన్ ఈ పథకం ద్వారా వివిధ పండ్ల తోటలు సాగు చేసేందుకు, హైబ్రిడ్ కూరగాయల నారు సరఫరా, పూల తోటల సాగు, ప్లాస్టిక్ మల్చింగ్ వేసుకునే రైతులకు రాయితీ సదుపాయం క ల్పిస్తున్నారు. పండ్లతోటల సాగుకు సంబంధించి బొప్పాయి, మామిడి, జామ, డ్రాగన్ ఫ్రూట్, అవకాడో సాగు చేయదలచిన రైతులకు రాయితీ సదుపాయం లభిస్తుంది. కూరగాయలు సాగు చేసే రైతులకు సిద్దిపేట జిల్లా ములుగులోని సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ నర్సరీ నుంచి సబ్సిడీపై హైబ్రిడ్ కూరగాయల నారు సరఫరా చేస్తున్నారు.ఉద్యాన పంటలపై దృష్టి సారించాలి రైతులు లాభాలు వచ్చే ఉద్యానవన పంటలపై దృష్టి సారించాలి. ఆయిల్పాం, మామిడి, జామ, నిమ్మ, డ్రాగన్ ఫ్రూట్స్, అవకాడో వంటి వాణిజ్య పంటలు సాగు చేయాలి. ప్రభుత్వం పెద్దఎత్తున సబ్సిడీలు అందిస్తుంది. వాటిని సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి సాధించాలి. – ప్రతాప్సింగ్, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి -
ఎస్టీ గురుకులాల్లో ఇంటర్ అడ్మిషన్లు
కౌడిపల్లి(నర్సాపూర్): ఈనెల 15, 16వ తేదీల్లో ఎస్టీ గురుకులాల్లో ఇంటర్మీడియెట్ అడ్మిషన్లు జరుగుతాయని కౌడిపల్లి ఎస్టీ గురుకుల కళాశాల ప్రిన్సిపాల్ ఫణికుమార్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మెదక్, నిజామాబాద్, కామారెడ్డిలోని గిరిజన సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాలలో 2025– 26 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు జరుగుతున్నాయని చెప్పారు. ఇందులో భాగంగా ఈనెల 15న కామరెడ్డిలో బాలురకు, 16న చేగుంటలో బాలికలకు కౌన్సిలింగ్ నిర్వహించి మెరిట్ ఆధారంగా అడ్మిషన్లు ఇస్తామన్నారు. పదో తరగతి ఉత్తీర్ణులు అయిన విద్యార్థులు సర్టిఫికెట్లతో కౌన్సిలింగ్కు హాజరుకావాలని సూచించారు. ధాన్యం తూకంలో మోసం నిజాంపేట(మెదక్): మండల పరిధిలోని బచ్చురాజ్పల్లి ఐకేపీ కొనుగోలు కేంద్రంలో 44 కిలోలు తూకం వేస్తున్నారని ఆదివారం రైతు లు అందోళన నిర్వహించారు. ఈసంద ర్భంగా వారు మాట్లాడుతూ.. తూకం వేసేటప్పుడు ఒక బస్తాకు 4 కిలోల వరకు అదనంగా పెడుతున్నారని వాపోయారు. అధికారులు వెంటనే స్పందించి న్యాయం చేయాలని కోరారు. మెగా ఉచిత వైద్య శిబిరం నిజాంపేట(మెదక్): మండల పరిధిలోని చల్మెడలో ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఆదివారం ఎస్పీ ఉదయ్కుమార్రెడ్డి, రాచకొండ కమిషనరేట్ అడిషనల్ డీసీపీ నంద్యాల నరసింహారెడ్డి ప్రారంభించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామాల్లో నిరుపేదలకు వైద్య సేవలు అందించడం గొప్ప విషయమన్నారు. శిబిరంలో సుమారు 300 మంది మంది వైద్య పరీక్షలు చేయించుకున్నారు. కార్యక్రమంలో ఇన్చార్జి ఎస్ఐలు సృజన, నారాయణ, ఏఎస్ఐ జైపాల్రెడ్డి, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. సైన్యానికి మద్దతుగా నిలుద్దాంఎంపీ రఘునందన్రావు దుబ్బాక: ఆపరేషన్ సిందూర్తో మనదేశ శక్తి సామర్థ్యాన్ని ప్రపంచానికి తెలపామని మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్రావు అన్నారు. ఆదివారం దుబ్బాక పట్టణంలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పహల్గాంలో ఉగ్రదాడికి ఆపరేషన్ సిందూర్తో మన సైనికులు పాక్కు తగిన గుణపాఠం చెప్పారన్నారు. భారత్–పాక్ల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో దేశమంతా మన సైన్యానికి మద్దతుగా నిలవాలన్నారు. దేశరక్షణ కోసం ప్రధానమంత్రి నరేంద్రమోదీ విరామం లేకుండా పనిచేస్తున్నారన్నారు. దేశరక్షణ కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టి పోరాడుతున్న సైన్యానికి మనమంతా అండగా ఉందామన్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు సుభాష్రెడ్డి, ప్రవీణ్కుమార్ తదితరులు ఉన్నారు. నేత్రపర్వంగా ధ్వజారోహణంవర్గల్(గజ్వేల్): పురాతన ప్రాశస్త్యం కలిగిన వర్గల్ వేణుగోపాలుని కోవెల బ్రహ్మోత్సవ శోభను సంతరించుకుంది. ఆదివారం గరుడ ధ్వజారోహణ మహోత్సవం నేత్రపర్వం చేసింది. సకల దేవతలకు నవాహ్నిక బ్రహ్మోత్సవ ఆహ్వానం చేరింది. మొదట విష్ణుమూర్తికి అత్యంత ప్రీతిపాత్రుడైన గరుడాళ్వారు చిత్రంతో కూడిన పతాకానికి అర్చకస్వాములు విశేష పూజలు నిర్వహించారు. -
‘ఉపాధి హామీ’ని నిర్వీర్యం చేసే కుట్ర
హవేళిఘణాపూర్(మెదక్): పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసి నిర్వీర్యం చేయాలని చూస్తుందని వ్యవసాయ కార్మిక జిల్లా కార్యదర్శి మల్లేశం శనివారం ఆరోపించారు. మండల పరిధిలోని లింగ్సాన్పల్లిలో ఉపాధి హామీ పనులు చేపడుతున్న కూలీలతో మాట్లాడారు. ఉపాధి హామీ కూలీలకు కనీస వసతులు కల్పించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. కార్యక్రమంలో కవిత, శంకర్, బన్సీ, రమేశ్, కిషన్, పంజి తదితరులు ఉన్నారు. వ్యవసాయ కార్మిక జిల్లా కార్యదర్శి మల్లేశం -
మహిళలకు ఉపాధి
టంకర్ల తయారీ.. నిజాంపేట(మెదక్): సీజనల్ పనులతో సంచార జీవులు ఉపాధి పొందుతున్నారు. ఉత్పత్తులను పొరుగు జిల్లాలకు ఎగుమతి చేస్తూ ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారు. నిజాంపేట మండలం కల్వకుంటలో మామిడి టంకర్లతో ఉపాధి పొందేవారు వందల సంఖ్యలో ఉన్నారు. ముఖ్యంగా సంచార జీవులతో పాటు ఇతర సామాజిక వర్గం వారు టంకర్ల ఎగుమతి చేస్తూ స్వయం ఉపాధి పొందుతున్నారు. కల్వకుంట గ్రామానికి చెందిన కొందరు వ్యాపారులు పరిసర గ్రామాల నుంచి మామిడి కాయలు పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్నారు. చెట్లకు పూత దశల్లో ఉన్నప్పుడు మండలంతో పాటు చుట్టూ పక్కల ఉన్న మండలంలోని మామిడి తోటలు తిరిగి చెట్లకు కాసిన కాయలను అంచనా వేసి కొనుగోలు చేస్తుంటారు. మే మాసంలో చెట్లకు కాసిన కాయలు తీసి గ్రామానికి తీసుకొస్తుంటారు. దాదాపుగా 20 నుంచి 30 మంది ఇలా వ్యాపారం చేస్తుంటారు. ఇలా ఒక్కో వ్యాపారి వద్ద 10 నుంచి 20 మంది వరకు వ్యాపారులు మామిడి టంకర్ల (వరుగు) తయారీ చేస్తుంటారు. దీన్ని ఔషధాలు, తినుబండారాలతో పాటు ఇతర పదార్థాలలో వాడుతారు. చెట్ల కింద టంకర్ల తయారీ చెట్ల నీడలో మామిడికాయలు పొట్లు తీసి, ముక్కలు కోసి ఎండలో ఎండబెడ్తారు. ఈ టంకర్ల తయారీలో చాలా మంది మహిళ కూలీలు ఉపాధి పొందుతున్నారు. రెండు నెలల పాటు పని దొరుకుతుందని కూలీలు చెబుతున్నారు. తయారైన టంకర్లను పొరుగున్న ఉన్న నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మార్కెట్కు తరలిస్తారు. కూలీలకు వంద కాయలు తరిగితే రూ.50 ఇస్తున్నారు. ఒక్కో మహిళా కూలీ ఒక రోజుకు 1,000 మామిడి కాయలు తరిగితే రూ. 500 మాత్రమే గిట్టుబాటు అవుతోంది. క్వింటాలు ధర రూ రూ.23 వేల వరకు పెరిగితే తప్ప తమ కష్టానికి తగిన ఫలితం ఉంటుందని చెబుతున్నారు. మామిడి తోటల రైతులకు మార్కెట్ సదుపాయం అందుబాటులో లేకపోవడంతో రైతులు మామిడి టంకర్ల వ్యాపారం చేసి వ్యాపారం చేసే వారికి కాయలు అమ్ముకుంటున్నారు. వెయ్యి మామిడి కాయలు తరిగితే రూ.500 స్థానికులకు రెండు నెలలు ఉపాధి అకాల వర్షాలతో తీరని నష్టం -
విద్యుత్ షాక్తో పాడిగేదె మృతి
వెల్దుర్తి(తూప్రాన్): మేతకు వెళ్లిన పాడిగేదె ప్రమాదవశాత్తు విద్యుత్షాక్కు గురై అక్కడికక్కడే మృతిచెందింది. ఈ సంఘటన మండలంలోని ఉప్పులింగాపూర్ శివారులో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన గుత్తి ప్రభాకర్ వ్యవసాయంతో పాటు పాడి గేదెల ద్వారా వచ్చే ఆదాయంతో కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో రోజూ మాదిరిగానే శనివారం గేదెలను మేతకు తీసుకెళ్లగా గ్రామ శివారులోని ఓ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ వద్ద ఎర్త్ తీగలకు విద్యుత్ సరఫరా కావడంతో పాడి గేదె మృత్యువాత పడింది. విద్యుత్ అధికారులు నష్టపరిహారం అందించి ఆదుకోవాలని బాధిత రైతు వేడుకున్నాడు. -
కార్మిక వ్యతిరేక విధానాలపై ఆందోళన
శివ్వంపేట(నర్సాపూర్): కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న సుగుణ ఫుడ్స్ లిమిటెడ్ పరిశ్రమపై ఆందోళన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు సీఐటీయూ యూనియన్ అధ్యక్షుడు మల్లేష్ అన్నారు. శనివారం పరిశ్రమ ఫీడ్మిల్ ఎదుట పలువురు కార్మికులతో కలిసి నిరసన తెలిపారు. పరిశ్రమలోని పర్మినెంట్ డ్రెవర్లకు డ్యూటీ వేయకుండా ప్రైవేటు వారి కి ఇస్తుండటం వల్ల ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా కార్మికులను ఇక్కడ నుంచి ఇతర చోట్లకు బదిలీ చేస్తుండడం పట్ల సోమవారం కలెక్టర్ కార్యాలయం ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో పరిశ్రమ కార్మికులు మల్లగౌడ్, సుదర్శన్, యాద గిరి, ఖాసీం, ప్రతాప్, పోచయ్య, తదితరులు ఉన్నారు. -
సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేత
నర్సాపూర్: సీఎం రిలీఫ్ పథకంతో పేదలకు ఆర్థిక సహాయం అందుతుందని స్థానిక ఎమ్మెల్యే సునీతారెడ్డి చెప్పారు. శనవారం తన నివాసంలో నర్సాపూర్, కౌడిపల్లి మండలాలకు చెందిన పలువురు లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేశారు. పథకం నుంచి పేదలకు ఆర్థిక సహాయం అందించేందుకు తన వంతు కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే చెప్పారు. ఆమె వెంట బీఆర్ఎస్ నాయకులు సుధాకర్రెడ్డి, ఎల్లం తదితరులు ఉన్నారు. వీర జవాన్ మురళీనాయక్కు నివాళులు చిన్నశంకరంపేట(మెదక్): దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన వీర జవాన్ మురళి నాయక్కు నార్సింగి మండలం నర్సంపల్లి పెద్దతండా గిరిజన నాయకులు ఘనంగా నివాళులర్పించారు. శనివారం నార్సింగి మండల కేంద్రంలో నర్సంపల్లి పెద్ద తండా గిరిజన నాయకులు జాతీయ జెండానే చేతపట్టుకుని నివాళిగా ర్యాలీ నిర్వహించారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన సైనికుడికి జోహర్లు అంటు నినాదించారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ డైరెక్టర్ బిక్యానాయక్, మాజీ సర్పంచ్ ఛత్రియానాయక్, బాషానాయక్, శంకర్నాయక్ పాల్గోన్నారు. శ్రీ రేణుక ఎల్లమ్మదేవి పంచమ వార్షికోత్సవం కొల్చారం(నర్సాపూర్): మండల కేంద్రంలోని శ్రీ రేణుక ఎల్లమ్మ దేవి ఆలయ పంచమ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వేడుకల్లో భాగంగా శనివారం అమ్మవారికి గంగ బోనం ఊరేగించారు. అంతకుముందు అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సిద్దిపేట ఒగ్గు కళాకారులచే సాంస్కృతిక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. పద్మశాలీల బండ్ల ఊరేగింపు కొల్చారం(నర్సాపూర్): మండలంలోని రంగంపేటలో కొలువైన శ్రీ రంగనాయక స్వామి పంచాహ్నిక కల్యాణ బ్రహ్మోత్సవాలు మూడు రోజుల నుంచి వైభవంగా కొనసాగుతూ వస్తున్నాయి. శనివారం తెల్లవారుజామున స్వామివారిని అశ్వ వాహనంపై ఊరేగించారు. సాయంత్రం గ్రామ పద్మశాలీల సంఘం ఆధ్వర్యంలో ఆనవాయితీ ప్రకారం స్వామివారికి బండ్ల ఊరేగింపు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం భక్తి శ్రద్ధల మధ్య ఉత్సాహంగా కొనసాగింది. కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. స్వామివారిని దర్శించుకున్న భక్తులు తీర్థప్రసాదాలను స్వీకరించారు. అమ్మవారికి ఒడిబియ్యం నర్సాపూర్: నర్సాపూర్లో నూతనంగా నిర్మించిన శ్రీకన్యకా పరమేశ్వరీ మాతకు శనివారం మహిళలు ఒడిబియ్యం సమర్పించారు. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నిర్మించిన ఆలయంలో శుక్రవారం అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. కాగా శనివారం మహిళలు పెద్ద ఎత్తున ఆలయానికి వచ్చి అమ్మ వారికి ఒడిబియ్యం సమర్పించి సహస్ర పారాయణం చేశారు. -
మత్తు పదార్థాలపై గిరిజనులకు అవగాహన
నర్సాపూర్: మత్తు పదార్థాలపై గిరిజనులకు అవగాహన కల్పించినట్లు స్థానిక ఇన్చార్జి ఎకై ్సజ్ సీఐ గోపాల్ చెప్పారు. శనివారం ఉదయం నర్సాపూర్ సంగారెడ్డి మార్గంలో పలు వాహనాలు తనిఖీ చేశామని తెలిపారు. అనంతరం మండలంలోని సూర్యతండా, హరియా తండా, మాడాపూర్ తండాలకు చెందిన గిరిజనులకు పలు అంశాలపై అవగాహన కల్పించామని చెప్పారు. నాటుసారా తయారు చేయడం, గంజాయి, డ్రగ్స్, కల్లులో కలిపే మత్తు పధార్థాలు కల్గి ఉండటం అమ్మడం నేరమని వారికి అవగాహన కల్పించామని, ఎవరైనా వాటిని అమ్మినట్లు తెలిస్తే తమకు సమాచారం ఇవ్వాలన్నారు. అలాంటి వారి సమాచారం రహస్యంగా ఉంచుతామని వారికి వివరించినట్లు గోపాల్ చెప్పారు. తనతో పాటు తమ సిబ్బంది పాల్గొన్నారని ఆయన వివరించారు. -
వీర జవాన్లకు ఘన నివాళి
వెల్దుర్తి(తూప్రాన్): దేశ రక్షణ కోసం ప్రాణాలు అర్పించిన వీర జవాన్ మురళీ నాయక్ మృతికి సంతాపంగా మండల కేంద్రం వెల్దుర్తిలో శనివారం రాత్రి యువకులు కొవ్వొత్తు ర్యాలీ నిర్వహించారు. బస్టాండ్ చౌరస్తా నుంచి మొదలైన ర్యాలీ అంబేడ్కర్ చౌరస్తా వరకు కొనసాగింది. దారి పొడవునా పాకిస్థాన్కు వ్యతిరేకంగా యువకులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మనోహరాబాద్(తూప్రాన్): ఆపరేషన్ సిందూర్లో భాగంగా పాక్తో జరుగుతున్న యుద్ధంలో అమరులైన జవాన్లకు మనోహరాబాద్ మండలంలోని కూచారం గ్రామస్తులు నివాళులర్పించారు. శనివా రం గ్రామంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. -
చదువుతో పాటు క్రీడలూ ముఖ్యం
హవేళిఘణాపూర్(మెదక్): విద్యార్థులు చదువులతోనే కాకుడా క్రీడల పట్ల కూడా ఆసక్తి చూపి ఉన్నత స్థాయిలో రాణించాలని మెదక్ రూరల్ సీఐ రాజశేఖర్రెడ్డి అన్నారు. శనివారం మెదక్ మండల పరిధిలోని మక్తభూపతిపూర్లో క్రికెట్ టోర్నీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదపడుతాయని అన్నారు. వేసవి సెలవుల్లో పిల్లలు మొబైల్ ఫోన్లలో చెడు వ్యసనాలకు బానిస కాకుండా క్రీడలపై దృష్టి సారించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నారు. గెలుపు ఓటములు సహజమని పేర్కొన్నారు. క్రీడాకారులతో కరచాలనం చేసిన సీఐ టోర్నీని ప్రారంభించారు. ఈ టోర్నీలో పాల్గొంటున్న క్రీడాకారులకు మల్లేశం సహకారంతో అందజేశారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ నర్సింలు, ఘట్టయ్య, అశోక్, కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షుడు గట్టాగౌడ్, కాంగ్రెస్ పార్టీ మండల యూత్ ప్రెసిడెంట్ కొమ్ము పవన్, మాజీ వార్డు సభ్యుడు గట్టయ్య, నిర్వాహకులు మహమ్మద్ ఖుర్షీద్, బక్కన్నగారి శ్రీహరి, రవీందర్, ప్రభాకర్, దుర్గారాములు తదితరుల ఉన్నారు.మెదక్ రూరల్ సీఐ రాజశేఖర్ రెడ్డి -
కనుల పండువగా బ్రహ్మోత్సవాలు
శివ్వంపేట(నర్సాపూర్): మండల పరిధిలోని దొంతి వేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవాలు కనుల పండువగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శనివారం స్వామివారికి ఆలయ పూజారి గోపాలకృష్ణ ప్రత్యేక పూజల నిర్వహించారు. అనంతరం గ్రామ ప్రధాన వీధుల గుండా పల్లకిసేవ ఊరేగింపు చేపట్టారు. భక్తులు హారతులు ఇచ్చి పూజలు చేపట్టారు. నేడు విద్యుత్ సరాఫరాలో అంతరాయం చిన్నశంకరంపేట(మెదక్): చిన్నశంకరంపేట మండలం సూరారం, భగిరథపల్లిలో ఆదివారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరాఫరా నిలిపివేస్తున్నట్లు ఏఈ దినకర్, ఏడీఈ మోహన్బాబు తెలిపారు. లైన్ల మరమ్మతులలో భాగంగా సబ్స్టేషన్ మరమ్మతులు, చెట్ల నరికివేత నిర్వహిస్తున్నందున విద్యుత్ సరాఫరాకు అంతరాయం ఏర్పడనుందన్నారు. విద్యుత్ వినియోగదారులుఫీ విషయం గమనించి సహకరించాలని ఆయన కోరారు. కెమికల్ పరిశ్రమలో చోరీ తూప్రాన్: పట్టణ పరిధిలోని రావెల్లి సమీపంలోని ఓ ప్రైవేట్ పరిశ్రమలో చోరీ జరిగింది. ఎస్ఐ శివానందం కథనం ప్రకారం.. గ్రామ సమీపంలోని సంక్షేన్ కెమికల్ పరిశ్రమలో ఈనెల 7న విలువైన సామగ్రితో పాటు రూ. లక్ష విలువైన వ్యవసాయ పనిముట్లను ఆటోలో అపహరించుకెళ్లినట్లు పరిశ్రమ సెక్యూరిటీ గార్డు వెంకటేశ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ తెలిపారు. -
40 ఏళ్లుగా అన్నీ తానై..
పటాన్చెరు టౌన్: దివ్యాంగులైన ఇద్దరు కుమారులను 40 ఏళ్లుగా కంటికి రెప్పలా చూసుకుంటోంది ఓ మాతృమూర్తి. లేచింది మొదలు వారి సేవలోనే జీవితం గడుపుతోంది. ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని శివాలయం రోడ్డులో వృద్ధురాలైన చంద్రకళ నివిస్తోంది. భర్త మడపతి చంద్రయ్య 2009 లో మృతి చెందాడు. నలుగురు కుమారులు. ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఒక కొడుకు రాజశేఖర్, కూతురు భాగ్యలక్ష్మి బాగానే ఉన్నారు. మిగతా నలుగురిలో కూతురు ఉమరాణి పుట్టుకతోనే మూగ. మిగతా ముగ్గురు కుమారులు సిద్ధప్ప, మహేశ్వర్, రవికుమార్లకు చిన్నప్పుడే కాళ్లు, చేతులు పడిపోయాయి. మాటలు రాని ఉషారాణి సైతం ప్రస్తుతం తల్లి మీదే ఆధారపడింది. మూడేళ్ల క్రితం రెండో కుమారుడైన మహేశ్వర్ మృతి చెందాడు. ఉన్న ఇద్దరు కుమారులకు, కూతురుకు ఉదయం లేచిన మొదలు.. రాత్రి పడుకునే వరకు సేవలు చేస్తూ కాలం గడుపుతోంది వృద్ధురాలు.పెన్షనే ఆధారం.. అయితే వీరి జీవనాధారం.. తల్లి తోపాటు ఇద్దరు కుమారులకు వచ్చే పెన్షన్ మొత్తం రూ.10 వేల తోనే నెల మొత్తం గడపాల్సి వస్తోంది. అప్పుడప్పుడు దాతలు వచ్చి నిత్యావసర సరుకులు ఇచ్చి వెళ్తారని ఆ తల్లి తెలిపారు. తమ తల్లి 40 ఏళ్లకు పైగా తమను చూసుకుంటుందని, చిన్నపిల్లలను చూసుకునే విధంగా రోజూ స్నానం చేయించి, భోజనం తినిపించి ప్రేమగా చూసుకునే తల్లి దొరకడం అదృష్టంగా భావిస్తున్నామని కుమారులు సిద్దప్ప, రవికుమారులు అంటున్నారు. -
సీహెచ్సీలో ప్రసవానికి నిరాకరణ
● వైద్య అధికారుల నిర్లక్ష్యం ● గాంధీకి తరలించాలంటూఉచిత సలహాతూప్రాన్: ప్రసవం చేయడం తమవల్ల కాదని వైద్యులు చేతులెత్తేశారు. పైగా గర్భిణిని గాంధీకి తీసుకెళ్లాలని సలహా ఇచ్చారు. అంబులెన్స్లో తీసుకెళ్తుండగా మార్గమధ్యలోనే ఆమె ప్రసవించింది. తూప్రాన్ మున్సిపాలిటీ పరిధిలోని పోతరాజుపల్లికి చెందిన కృప రెండవ కాన్పు కోసం పట్టణంలోని సీహెచ్సీకి భర్త క్రాంతి కుమార్ శుక్రవారం తీసుకొచ్చారు. వైద్య సిబ్బంది పరీక్షలు నిర్వహించి కాన్పు కావడం కష్టం అవుతుందన్నారు. ఆస్పత్రిలో వైద్యులు, పరికరాలు లేవని తేల్చి చెప్పారు. వెంటనే గాంధీకి తీసుకెళ్లాలని సూచించారు. అసలే పేదవారు కావడంతో గాంధీకి వెళ్లేందుకు ఇబ్బందులు పడ్డారు. తీరా 108లో తరలిస్తున్న క్రమంలో మార్గమధ్యలో పురిటి నొప్పులు ఎక్కువ కావడంతో ఈఎంటీ శ్రీనివాస్ అంబులెన్స్లోనే కాన్పు చేశాడు. పండంటి మగ బిడ్డకు కృప జన్మనించింది. అనంతరం గాంధీ ఆస్పత్రిలో చేర్చగా తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నారు. కాగా ప్రభుత్వ ఆస్పత్రిలో పేదలకు నాణ్యమైన వైద్యం అందుతుందని వస్తే వైద్యులు లేరని తిప్పి పంపడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
దరఖాస్తుల ఆహ్వానం
మెదక్ కలెక్టరేట్: అర్హత కలిగిన అభ్యర్థులకు లైసెన్స్ సర్వేయర్ శిక్షణ ఇవ్వనున్నట్లు కలెక్టర్ రాహుల్రాజ్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అభ్యర్థులు ఇంటర్మీడియెట్ (గణిత శాస్త్రం ఒక అంశంగా ఉండాలి) కనీసం 60 శాతం మార్కులతో పాసై ఉండాలన్నారు. అలాగే ఐటీఐలో డ్రాఫ్ట్మెన్ సివిల్, డిప్లొమా, సివిల్, బీటెక్ సివిల్ లేదా ఇతర సమానమైన అర్హత కలిగి ఉండాలన్నారు. జిల్లాలోని ఆసక్తి గల అర్హులైన అభ్యర్థులు తెలంగాణలోని అన్ని మీ సేవ కేంద్రాల్లో ఈనెల 17వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎంపికై న అభ్యర్థులకు జిల్లా ప్రధాన కేంద్రాలలో మొత్తం 50 పని దినాల శిక్షణ ఉంటుందన్నారు. శిక్షణ కాలానికి ఓసీ అభ్యర్థులకు రూ. 10 వేలు, బీసీ అభ్యర్థులకు రూ. 5 వేలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ. 2,500 ఫీజు చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. మరిన్ని వివరాలకు 9704443476, 9398987337 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. చెక్బౌన్స్ కేసులు పరిష్కరిస్తాం న్యాయసేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి సుభవల్లీ మెదక్జోన్: రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ ఆదేశాల మేరకు చెక్బౌన్స్ కేసులను పరిష్కరిస్తామని, అర్హులైన వారు సద్వినియోగం చేసుకో వాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి సుభవల్లీ తెలిపారు. శుక్రవారం జిల్లా కోర్టు ప్రాంగణంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి నీలిమ సూచనల మేరకు ఈనెల 19 వరకు ప్రత్యేకంగా చెక్బౌన్స్కు సంబంధించిన కేసులను పరిష్కరించనున్నట్లు చెప్పారు. అలాగే జూన్ 14న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకొని రాజీ పడాలని వివరించారు. చిన్నచిన్న గొడవలతో కోర్టులు, పోలీస్స్టేషన్ల చుట్టూ తిరిగి విలువైన సమయం, డబ్బును వృథా చేసుకోవద్దని సూచించారు. -
చట్టాలపై ప్రజలకు అవగాహన అవసరం
నర్సాపూర్: గ్రామీణ ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పించాలని జూనియర్ సివిల్ జడ్జి హేమలత సూచించారు. శుక్రవారం కోర్టులో లీగల్ సర్వీస్ కమిటీ న్యాయవాదులతో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వచ్చే నెల 14న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్లో చెక్ బౌన్స్ కేసులలో ఇరువర్గాలు రాజీ కుదుర్చుకొని కేసులను పరిష్కరించుకునే అవకాశం ఉందన్నారు. న్యాయవాదిని నియమించుకునేందుకు ఆర్థిక స్థోమత లేని పేద వారికి ఉచితంగా లీగల్ ఎయిడ్ ద్వారా న్యాయవాదిని నియమించేందుకు లీగల్ సర్వీస్ సహకరిస్తుందని చెప్పారు. సైన్యానికి మద్దతుగా పూజలు పాపన్నపేట(మెదక్): పాకిస్తాన్తో భారత సైన్యాల పోరాటానికి మద్దతుగా దేవాదాయ శాఖ ఉద్యోగులు శుక్రవారం ఏడుపాయల దుర్గమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. భారత సైన్యం విజయాన్ని కాంక్షిస్తూ, తీవ్రవాద నాశనాన్ని ఆశిస్తూ అమ్మవారికి పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో జూనియర్ అసిస్టెంట్ ప్రతాప్రెడ్డి, అర్చకులు శంకరశర్మ, పార్థివశర్మ, సిబ్బంది పాల్గొన్నారు. ధాన్యాన్ని త్వరగాఅన్లోడ్ చేయాలి హవేళిఘణాపూర్(మెదక్): కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చిన ధాన్యం లారీలను సరైన సమయంలో అన్లోడ్ చేసి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మెదక్ ఆర్డీఓ రమాదేవి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని గాయత్రి రైస్మిల్ను తనిఖీ చేశారు. మూడు లారీలు అన్లోడ్ కోసం వేచి ఉన్నట్లు తమ దృష్టికి వచ్చిందని చెప్పారు. అన్లోడ్ చేసి వీలైనంత త్వరగా కొనుగోలు కేంద్రాలకు తరలిస్తే ఇబ్బందులు ఉండవని తెలిపారు. ఆమె వెంట రెవెన్యూ సిబ్బంది ఉన్నారు. డివిజన్ కేంద్రాల్లో శిక్షణ ఏర్పాటు చేయాలి మెదక్ కలెక్టరేట్: ప్రభుత్వం ఉపాధ్యాయుల శిక్షణ తరగతులను డివిజన్ కేంద్రాల్లోనూ ఏర్పాటు చేయాలని పీఆర్టీయూటీఎస్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సుంకరి కృష్ణ, సామ్యనాయక్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వేసవి సెలవుల్లో ఇస్తున్న శిక్షణ తరగతులను జిల్లా కేంద్రంలో కాకుండా డివిజనల్ కేంద్రాల్లో ఏర్పాటు చేయాలన్నారు. రవాణా సౌకర్యాలు, వేసవి తీవ్రత దృష్ట్యా రెండు, మూడు మండలాలను కలిపి ఒకే దగ్గర శిక్షణ తరగతులు ఏర్పాటు చేయాలన్నారు. కొందరు ఉపాధ్యాయులు అత్యవసర పనుల దృష్ట్యా ఒక స్పెల్కు హాజరుకాలేకపోతే రెండవ స్పెల్కు అనుమతించాలని డీఈఓను కోరారు. అదనపు కలెక్టర్కు పరామర్శ మెదక్ కలెక్టరేట్: మాతృమూర్తిని కోల్పోయిన అదనపు కలెక్టర్ మెంచు నగేష్ను సూర్యాపేట జిల్లా మిర్యాల గ్రామంలో శుక్రవారం జిల్లా అధికారులు పరామర్శించారు. అనంతరం మరణించిన సత్తమ్మ చిత్రపటానికి నివాళులరిప్పంచారు. అదనపు కలెక్టర్ను పరామర్శించిన వారిలో డీఆర్ఓ భుజంగరావు, తూప్రాన్, నర్సాపూర్ ఆర్డీఓలు జయచంద్రారెడ్డి, మహిపాల్రెడ్డి, డీఆర్డీఓ పీడీ శ్రీనివాస్రావు, డీఈఓ రాధాకిషన్, నర్సాపూర్ తహసీల్దార్ శ్రీనివాస్, జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డితో పాటు పలువురు ఉన్నారు. -
జీరో.. డౌన్!
ఎండలు మండుతున్నాయి. వడగాలులు, ఉక్కపోతతో జనం బెంబేలెత్తుతున్నారు. ఉపశమనం కోసం ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు వినియోగిస్తున్నారు. దీంతో విద్యుత్ వినియోగం భారీగా పెరిగింది. దీని ప్రభావం గృహజ్యోతి పథకంపై పడింది. ఫలితంగా చాలా మంది లబ్ధిదారులు పథకానికి అనర్హులుగా తేలారు. – మెదక్జోన్ ‘గృహజ్యోతి’ అర్హుల సంఖ్య 1,31,950పెరిగిన అనర్హుల సంఖ్య ఇలా.. ఫిబ్రవరి 1,418 మార్చి 1,457 ఏప్రిల్ 3,807 మే 4,557జిల్లావ్యాప్తంగా 7 లక్షల పైచిలుకు జనాభా ఉండగా, 1,31,950 ఇళ్లకు విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. వీరంతా తెల్లరేషన్ కార్డు కలిగి ఉండటంతో గృహజ్యోతి పథకం ద్వారా 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ పొందుతున్నారు. ఎండల తీవ్రతతో ఫిబ్రవరి నుంచి క్రమంగా పథకానికి లబ్ధిదారులు దూరం అవుతూ వస్తున్నారు. జిల్లాలో 1,31,950 మంది గృహజ్యోతి పథకానికి అర్హులు కాగా, ఫిబ్రవరిలో 1,418 మంది మార్చిలో 1,457, ఏప్రిల్లో 3,807, ఈ నెలలో 4,557 మంది అనర్హులుగా తేలారు. వేసవి ఎండల ప్రభావంతో.. రాష్ట్రవ్యాప్తంగా అత్యధికంగా పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యే జిల్లాలలో మెదక్ 4వ స్థానంలో ఉంది. కాగా ఫిబ్రవరిలో 35 డిగ్రీలు నమోదు కాగా, మార్చిలో 40 డిగ్రీలకు పెరిగింది. ఏప్రిల్, మేలో 42 నుంచి 43 డిగ్రీలకు చేరుకుంది. అంతేకాకుండా ఏప్రిల్ 24 నుంచి పాఠశాలలకు వేసవి సెలవులు ప్రకటించడంతో విద్యార్థులు ఇళ్లలోనే ఉంటున్నారు. ఎండల తీవ్రతకు ఏసీలు, ఫ్యాన్లు, కూలర్లు, టీవీ వినియోగం గణనీయంగా పెరిగింది. దీంతో విద్యుత్ మీటర్లు గిర్రున తిరగటంతో ఈనెలలో 4,557 మంది గృహజ్యోతి లబ్ధిదారులు 200 యూనిట్ల విద్యుత్ కన్నా ఎక్కువగా వాడటంతో అనర్హులుగా మారారు. కాగా విద్యుత్ యూనిట్ల వినియోగం పెరిగినా కొద్ది ధరలో మార్పు వస్తోంది. ఇందులో భాగంగా 1 నుంచి 50 యూనిట్ల విద్యుత్ వాడితే రూ. 1.95 పైసలు, 50 నుంచి 100 యూనిట్ల వరకు యూనిట్ ధర రూ. 3.10, అలాగే 101 నుంచి 200 యూనిట్ల వరకు రూ. 4.80 యూనిట్ ధర ఉండగా, 200 యూనిట్లు దాటితే ఒక్కో యూనిట్కు ఏకంగా రూ. 5.10 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. కాగా ఈ లెక్కన 200 యూనిట్ల కంటే ఎక్కువగా విద్యుత్ వాడిన గృహాజ్యోతి లబ్ధిదారులు ఈ పథకానికి దూరం అవటంతో పాటు నెలకు రూ. వెయ్యి కంటే ఎక్కువగా విద్యుత్ బిల్లులు చెల్లిస్తున్నారు. 200 యూనిట్లు దాటితే వర్తించదు నెలకు 200 యూనిట్లలోపు విద్యుత్ వాడిన వారికి మాత్రమే గృహజ్యోతి పథకం వర్తిస్తోంది. అంతకు మించి వాడితే వర్తించదు. ఎండల తీవ్రత కారణంగా విద్యుత్ వాడకం పెరిగి ఈ పథకానికి నెలనెల లబ్ధిదారుల సంఖ్య తగ్గుతుంది. – శంకర్, ట్రాన్స్కో ఎస్ఈ, మెదక్ఎండ సురసుర.. మీటర్ గిరగిర తగ్గుతున్న ‘గృహజ్యోతి’ లబ్ధిదారులు జిల్లాలో పెరిగిన విద్యుత్ వినియోగం -
ఉన్నత చదువులకు ‘దూరం’
తూప్రాన్లో కలగా మిగిలిన డిగ్రీ కళాశాల అందరికీ అనుకూలం ప్రభుత్వ కళాశాలలో విద్యార్థుల సంఖ్య చాలా తక్కువగా ఉంది. ప్రభు త్వం స్పందించి డిగ్రీ కళా శాల ఏర్పాటు చేస్తే ఇంటర్తో పాటు డిగ్రీలో విద్యార్థుల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లోని పేద విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుంది. ఇందుకు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి. – ప్రభావతి, ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ మధ్యలోనే చదువు ఆపేస్తున్నారు డిరగీ కళాశాల లేక అనేక మంది విద్యార్థులు చదువులు మధ్యలోనే ఆపేస్తు న్నారు. కళాశాల ఏర్పాటు చేయాలని పలుమార్లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. కలెక్టరేట్ సైతం ముట్టడించాం. అయినా అధికారులు చర్యలు చేపట్టడం లేదు. ఇప్పటికై నా ప్రభు త్వం పేద విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలి. – అజయ్, ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకుడుతూప్రాన్: పేద విద్యార్థులకు ఉన్న త చదువులు కలగానే మారాయి. డివిజన్ కేంద్రంలో డిగ్రీ కళాశాల ఏర్పాటుచేయాలని ఏళ్లుగా ఇక్కడి ప్రజలు కోరుతున్నా ఆ దిశగా అడుగు పడడం లేదు. పై చదువుల కోసం విద్యార్థులు మేడ్చల్, గజ్వేల్, రంగారెడ్డి జిల్లాలోని కార్పొరేట్ కళాశాలల్లో చేరేందుకు తరలివెళ్తున్నారు. పేద, మధ్య తరగతి విద్యార్థులు మాత్రం ఫీజులు చెల్లించలేక చదువులకు స్వస్తి చెబుతున్నారు. అమ్మాయిలు ఇంటి వద్దే ఉంటుండగా.. మగ పిల్లలు పరిశ్రమల్లో కాంట్రాక్ట్ కార్మికులుగా చేరుతున్నారు. మరికొందరు జులాయిగా తిరుగుతూ చెడు వ్యసనాలకు బానిసలుగా మారి ఉజ్వల భవిష్యత్ను నాశనం చేసుకుంటున్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరం ప్రారంభం అవుతున్న తరుణంలో అధికారులు, ప్రజాప్రతినిధులు చొరవ తీసుకొని డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తే డివిజన్ చుట్టుపక్కల మండలాలైన శివ్వంపేట, వెల్దుర్తి, చేగుంట, దౌల్తాబాద్, వర్గల్, మనోహరాబాద్ మండలాలకు చెందిన విద్యార్థులకు ప్రయోజనంచేకూరుతుంది. స్థలం కేటాయించినా.. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ మేరకు అప్పట్లో రెవెన్యూ అధికారులు సివిల్ సప్లై గోడౌన్ల సమీపంలో ప్రభుత్వ స్థలం గుర్తించి ఉన్నతాధికారులకు నివేదిక అందజేశారు. కానీ విద్యాశాఖ అధికారుల నుంచి ఎలాంటి ఉత్తర్వులు వెలువడలేదు. దీంతో డిగ్రీ కళాశాల ఏర్పాటు కలగానే మిగిలిపోయింది. -
రవిరాజు.. బోధనలో రారాజు
● యూట్యూబ్ ఛానల్ ద్వారా గుర్తింపు ● ప్రపంచ స్థాయిలో ప్రశంసలునర్సాపూర్ రూరల్: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే పేద, మధ్య తరగతి విద్యార్థులకు వినూత్న రీతిలో నాణ్యమైన విద్యను అందించాలని సంకల్పించాడు మండలంలోని ఆద్మాపూర్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు రవిరాజు. అనుకున్నదే తడువుగా ఆట పాటలతో కూడిన విద్యను బోధిస్తూ ఆకట్టుకున్నాడు. దానిని తన యూట్యూబ్ ఛానల్ ద్వారా తెరపైకి ఎక్కించి ఎప్పటికప్పుడు ప్రసారమాధ్యమాల్లో చేరుస్తున్నాడు. ప్రపంచస్థాయిలో అతని విద్యా విధానం చాలా మందికి నచ్చింది. యూట్యూబ్ ఛానల్కు ప్రశంసలు వచ్చాయి. కేంద్ర విద్యాశాఖ అధికారులు రవిరాజు ఏ పాఠశాలకు చెందిన ఉపాధ్యాయుడో గుర్తించాలని రాష్ట్ర అధికారులను ఆదేశించారు. దీంతో రాష్ట్ర విద్యాశాఖ అధికారులు రవిరాజును సచివాలయానికి రావాల్సిందిగా సూచించారు. విద్యాశాఖ ప్రభుత్వ కార్యదర్శి డాక్టర్ యోగితారాణా, డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ నరసింహారెడ్డి ఇతర అధికారులు సన్మానించి ప్రశంసించారు. నూతన భ వనం.. సకల వసతులు అనంతరం మీరు పనిచేస్తున్న పాఠశాలకు ఏమి కావాలని రాష్ట్ర అధికారులు ఉపాధ్యాయుడు రవిరాజును అడిగారు. నూతన భవనం, మరికొన్ని సదుపాయాలు కల్పించాలని కోరారు. దీంతో వెంటనే కలెక్టర్ రాహుల్రాజ్కు ఫోన్ చేసి రవిరాజు పనిచేస్తున్న ఆద్మాపూర్ ప్రాథమిక పాఠశాలకు కావాల్సిన వసతులు కల్పించాలని, భవన నిర్మాణానికి కావాల్సిన అంచనా వివరాలను పంపించాలని ఆదేశించారు. ఇటీవల కలెక్టర్ రాహుల్రాజ్ స్వయంగా పాఠశాలకు వచ్చి పరిశీలించి రవిరాజును అభినందించారు. ఈసందర్భంగా ఉపాధ్యాయుడు మాట్లాడుతూ.. ప్రతి విద్యార్థి కష్టంతో కాకుండా ఇష్టంతో చదివించాలన్నదే తన లక్ష్యమన్నారు. ప్రాథమిక స్థాయిలో విద్యార్థులకు తెలియకుండానే చదువుపై ఆసక్తి పెరిగేలా వినూత్న రీతిలో నాణ్యమైన విద్యా బోధనను ప్రారంభించానని చెప్పాడు. విద్యార్థులకు బోధించే తీరుపై యూ ట్యూబ్ ఛానల్ ద్వారా ప్రపంచస్థాయిలో ప్రశంసలు రావడం ఆనందంగా ఉందని అన్నారు. -
విద్యా ప్రమాణాలు మెరుగుపడాలి
కలెక్టర్ రాహుల్రాజ్ మెదక్ కలెక్టర్: విద్యాపరంగా జిల్లాను రాష్ట్రస్థాయి లో ప్రథమ స్థానంలో నిలపాలని కలెక్టర్ రాహుల్రాజ్ ఎంఈఓలు, హెచ్ఎంలను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్కు దీటుగా విద్యా ప్రమాణాలు మెరుగుపడాలనే ఉద్దేశంతో పటిష్ట చర్యలు చేపడుతుందని తెలిపారు. అందుకనుగుణంగా విద్యాధికారులు పనిచేయాలని సూచించారు. పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించడంపై అభినందించారు. ఇదే స్ఫూర్తితో బడిబాటను విజయవంతం చేయాలన్నారు. 15 ఏళ్లు నిండిన నిరక్షరాస్యులైన విద్యార్థులను గుర్తించి వారిని ‘ఉల్లాస్’ ద్వారా అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలన్నారు. పదో తరగతిలో ఉత్తీర్ణులైన విద్యార్థులందరూ తప్పనిసరిగా జూనియర్ కళాశాలలో నమోదు చేసుకునే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. బాల్యవివాహాలు జరగకుండా చూసే బాధ్యత అంగన్వాడీ సిబ్బంది దేనని స్పష్టం చేశారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి హైమావతి, డీఈఓ రాధాకిషన్, మానిటరింగ్ ఆఫీసర్ సుదర్శనమూర్తి, ప్రభుత్వ పరీక్షల సహాయ కమిషనర్ రామేశ్వరప్రసాద్, జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి, అధికారులు పాల్గొన్నారు. సత్వరమే పరిష్కరించండి నర్సాపూర్/చిలప్చెడ్(నర్సాపూర్): రెవెన్యూ సదస్సులలో రైతుల నుంచి వచ్చిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ రాహుల్రాజ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం మండల పరిధిలోని చండూర్లో నిర్వహించిన భూ భారతి రెవెన్యూ సదస్సును సందర్శించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చిలప్చెడ్ మండలంలోని పది గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు పూర్తయ్యాయని తెలిపారు. రైతుల నుంచి ఇప్పటివరకు సుమారు 357 దరఖాస్తులు వచ్చినట్లు చెప్పారు. విచారణ ప్రక్రియ వేగవంతం చేసి ప్రజలకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం నర్సాపూర్ అర్బన్ పార్కులో చేపట్టిన కాటేజీల నిర్మాణ పనులను డీఎఫ్ఓ జోజితో కలిసి పరిశీలించారు. మరో 20 రోజుల్లో కాటేజీలను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పా రు. ఆయన వెంట ప్రాజెక్టు మేనేజర్ జగన్మోహన్రెడ్డి, అటవీశాఖ అధికారులు ఉన్నారు. -
2.50 లక్షల క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు: ఆర్డీఓ
తూప్రాన్: డివిజన్ పరిధిలోని ఆరు మండలాల్లో 2.50 లక్షల క్వింటాళ్ల ధాన్యం కొనుగోళ్లు జరిగాయని ఆర్డీఓ జయచంద్రారెడ్డి తెలిపారు. శుక్రవారం తూప్రాన్లో ఓ రైస్మిల్లును పరిశీలించి ధాన్యం సేకరణ వివరాలు అడిగి తెలుసుకున్నారు. మనోహరాబాద్ మండలంలోని పోతారంలో వరి కోతలు ఇంకా మొదలుకాలేదని చెప్పారు. చేగుంట మండలంలో అత్యధికంగా సుమారు లక్ష క్వింటాళ్ల ధాన్యం సేకరించామన్నారు. వెల్దుర్తి మండలంలో 65 వేల క్వింటాళ్లు, నార్సింగిలో 44,267, మాసాయిపేటలో 16,351, తూప్రాన్లో 17,112 క్వింటాళ్ల ధాన్యం కొనుగోళ్లు పూర్తయినట్లు వివరించారు. డివిజన్లోని రెవెన్యూ సిబ్బంది ఎప్పటికప్పుడు సమస్యలను పరిష్కరిస్తూ వడ్ల కొనుగోలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. రైతుల ఖాతాల్లో ఎప్పటికప్పుడు డబ్బులు జమ అయ్యే విధంగా ప్రత్యేక శ్రద్ధ తీసుకొంటున్నట్లు తెలిపారు. -
భూ సమస్యలకుసత్వర పరిష్కారం
కలెక్టర్ రాహుల్రాజ్ చిలప్చెడ్(నర్సాపూర్): భూ సమస్యలు ఉన్న రైతులకు భూ భారతి చట్టంతో మేలు జరుగుతుందని, సత్వరమే పరిష్కారం లభిస్తుందని కలెక్టర్ రాహుల్రాజ్ అన్నారు. పైలెట్ ప్రాజెక్ట్గా ఎంపికై న చిలప్చెడ్ మండలంలోని గంగారం, శేరి ఫైజాబాద్ గ్రామాల్లో గురువారం నిర్వహించిన భూ భారతి రెవెన్యూ సదస్సులను పరిశీలించారు. రైతుల భూసమస్యల గురించి అడిగి తెలుసుకొని, వారికి పలు సూచనలు ఇచ్చారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భూ సమస్యలున్న ప్రతి ఒక్కరూ రూపాయి ఖర్చు లేకుండా, ఉచితంగా రెవె న్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. సరైన ఆధారాలతో దరఖాస్తులు సమర్పించాలన్నారు. సత్వరమే పరిష్కారమయ్యే సమస్యలు తహసీల్దార్ పరిధిలోనే, కీలకంగా ఉన్న సమస్యలు 80 శాతం వరకు ఆర్డీఓ స్థాయిలో పరిష్కారమవుతాయని తెలిపారు. మరీ కీలకంగా ఉంటే కలెక్టర్ స్థాయిలో పరిష్కరించనున్నట్లు వెల్లడించారు. ధరణిలో పరిష్కారం కాని ప్రతి సమస్యకు భూ భారతిలో ఆప్షన్ ఉందన్నారు. మండలంలో ఈనెల 14 వరకు రెవెన్యూ సదస్సులు జరుగుతాయని వివరించారు. కార్యక్రమంలో ఆర్డీఓ మహిపాల్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయండి రామాయంపేట(మెదక్): ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ వేగవంతం చేయాలని మెదక్ ఆర్డీవో రమాదేవి ఆదేశించారు. గురువారం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులతో తహసీల్దార్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అకాల వర్షాలు కురుస్తున్నందున తూకం వేసిన వెంటనే ధాన్యం బస్తాలు రైస్ మిల్లులకు తరలించాలని సూచించారు. ధాన్యం బస్తాలు లోడ్ చేసిన అనంతరం విధిగా టాల్పాలిన్ కప్పిన తర్వాతే పంపించాలని ఆదేశించారు. లారీలో రైస్ మిల్లులకు చేరిన ఆరు గంటల్లోపే అన్లోడ్ చేయించాలని, కేంద్రాల్లో సక్రమంగా రికార్డులు రాయాలని తెలిపారు. సమావేశంలో తహసీల్దార్ రజనికుమారి, సహకార సంఘాల సీఈఓలు పాల్గొన్నారు. ఐకేపీ సిబ్బందికి అవార్డు శివ్వంపేట(నర్సాపూర్): బ్యాంకు లింకేజీ ద్వారా లక్ష్యానికి మించి రుణాలు ఇప్పించినందుకు గాను మండలంలోని గూడూర్ గ్రామానికి చెందిన ఐకేపీ సిబ్బంది అవార్డు అందుకున్నారు. గురువారం హైదరాబాద్లో నిర్వహించిన కార్యక్రమంలో వీఓ సుజాత, వీఏఓ చోటేబిలకు మంత్రి సీతక్క అవార్డు అందజేశారు. జిల్లాస్థాయిలో స్థానిక ఇండియన్ బ్యాంకు ద్వారా 210 శాతం మహిళా సంఘాలకు రుణాలు ఇప్పించినందుకు గాను అవార్డు వరించినట్లు ఐకేపీ ఏపీఎం వెంకటేశ్వర్లు తెలిపారు. తడిసిన ధాన్యం కొంటాం చేగుంట(తూప్రాన్): ఈనెల 15లోగా ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయాలని తూప్రాన్ ఆర్డీఓ జయచంద్రారెడ్డి ఆదేశించారు. గురువారం సాయంత్రం చేగుంట తహసీల్దార్ కార్యాలయంలో కొనుగోలు కేంద్రాల ఇన్చార్జిలతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం తడిసిన ధా న్యం సైతం కొనుగోలు చేయాలని నిర్ణయించినందున రైతులు దిగులు చెందాల్సిన అవసరం లేదన్నారు. సహకార సంఘాల సీఈఓలు కొనుగోలు కేంద్రాల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీకాంత్, డిప్యూటీ తహసీల్దార్ స్వప్న, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. -
రెండేళ్లుగా ఇదే గోస
మెదక్ మండలం రాయిన్పల్లి శివారులో 21 గుంటల పట్టా భూమి ఉంది. ఆ భూమిని మా నాన్న నుంచి నాకు వారసత్వంగా వచ్చింది. సాగు చేసుకుంటూ కాస్తులో ఉన్నాం. పాత పట్టాదార్ పాస్ పుస్తకంలో పట్టా అని ఉంది. 2018లో ఇచ్చిన కొత్త పాస్ పుస్తకంలో పట్టా భూమిని లావణి పట్టా అని పడింది. పాస్ పుస్తకాన్ని అప్పట్లో గమనించలేదు. రెండేళ్ల క్రితం అప్పుకోసం బ్యాంకుకు వెళ్లగా అక్కడ అధికారులు చెప్పారు. నాటి నుంచి ప్రతి ప్రజావాణిలో వినతులు అందజేస్తున్నా, ఇప్పటివరకు అధికారులు సరైన సమాధానం చెప్పడం లేదు. గణపురం భిక్షపతి, మక్తభూపతిపూర్, మెదక్ -
హడలెత్తిస్తున్న హైవే!
● ప్రమాదాలకు నిలయంగా 161 జాతీయ రహదారి ● కిలోమీటర్ వ్యవధిలోనే యాక్సిడెంట్లుటేక్మాల్ (మెదక్): సంగారెడ్డి– నాందేడ్ అకోల ప్రధాన రహదారి ప్రమాదాలకు నిలయంగా మా రింది. ఆ రోడ్డుపై వెళ్లాలంటేనే ప్రయాణికులు జంకుతున్నారు. టేక్మాల్ మండలం బొడ్మట్పల్లికి ఆనుకొని ఉన్న 161 హైవే కిలోమీటర్ పరిధిలోనే ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇంత జరుగుతున్నా హైవే అధికారులు తమకేమి పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. ప్రమాదాలు కోకొల్లలు ● ఈనెల 5వ తేదీన నారాయణఖేడ్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న వాహనం అధిక వేగంతో టైరు పగిలి బోల్తా పడింది. దీంతో కారు ధ్వంసం కావడంతో పాటు అందులో ప్రయాణిస్తున్న దంపతులకు తీవ్ర గాయాలయ్యాయి. ● గతేడాది నవంబర్ 16వ తేదీన బొడ్మట్పల్లికి చెందిన ఓ మహిళ వ్యవసాయ పనులు ముగించుకొని రోడ్డు దాటుతుండగా అధిక వేగంతో వచ్చిన కారు ఢీకొనడంతో మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. ● గతేడాది జులై 7వ తేదీన మండలంలోని కడిలాబాయితాండకు చెందిన మహిళా కూలీ పని ముగించుకొని రోడ్డు దాటుతుండగా వేగంతో వచ్చిన కారు ఢీకొని మృతి చెందింది. ● గతేడాది మే 5వ తేదీన సంగారెడ్డి నుంచి ఖేడ్ వైపు వెళుతున్న కారు బొడ్మట్పల్లి శివారులో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి పూర్తిగా తగలబడిపోయింది. అందులో ప్రయాణిస్తున్న ఐదుగురికి తృటిలో ప్రమాదం తప్పింది. ● గతేడాది మే 4వ తేదీన చెందిన అనిల్ అనే వ్యక్తి హైదరాబాద్ వెళుతుండగా బొడ్మట్పల్లి వద్ద డివైడర్కు ఢీకొని కారు బోల్తా కొట్టింది. యువకుడు స్వల్పగాయాలతో బయటపడ్డాడు. ● 2023 అక్టోబర్ 15న హైదరాబాద్ నుంచి కామారెడ్డికి వెళుతున్న టవేరా అధిక వేగంతో అదుపుతప్పి ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. అందులో ప్రయాణిస్తున్న బాలుడు అక్కడికక్కడే మృతి చెందగా, మరో వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. కుటుంబ సభ్యులు తీవ్రంగా గాయపడ్డారు. ఇలా హైవేపై నిత్యం ఏదో ఒక రూపంలో ఇలాంటి సంఘటనలు కొకొల్లాలుగా జరుగుతున్నాయి. బొడ్మట్పల్లి వద్ద హైవేపై బోల్తాపడిన కారు (పైల్ )నివారణ చర్యలు శూన్యం నిత్యం ప్రమాదాలు జరుగుతున్నా హైవే అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ప్రయా ణికులు ఆరోపిస్తున్నారు. గ్రామానికి ఆనుకొని ఉన్న హైవే డివైడర్ మధ్యలో విద్యుత్ బల్బులు లేకపోవడంతో రాత్రి వేళల్లో ప్రమాదాలు జరుగుతున్నాయి. బొడ్మట్పల్లి వద్ద అండర్పాస్ బ్రిడ్జి ఏర్పాటు చేయాలని, హైవేపై సూచిక బోర్డులు, విద్యుత్ బల్బులు, వేగ నియంత్రణ బోర్డులతో పాటు లైనింగ్లు ఏర్పాటు చేయాలని స్థానికులు అధికారులను కోరారు. పలుమార్లు వినతిపత్రం రూపంలో అందించారు. వినతులను పై అధికారులకు పంపిస్తున్నామని, నివారణ చర్యలు చేపడతామని చెబుతూ పనులు మాత్రం చేపట్టడం లేదు. -
నిబంధనల మేరకే పరిహారం
నర్సాపూర్: సంగారెడ్డి కాలువ రీచ్– 2 కోసం ప్రభుత్వం తీసుకుంటున్న భూములకు చట్ట పరిధిలో పరిహారం అందజేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆర్డీఓ మహిపాల్ తెలిపారు. గురువారం స్థానిక రైతు వేదికలో మండలంలోని లింగాపూర్ గ్రామ రైతులతో అవార్డు సమావేశం ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులకు నష్టం కలగకుండా చూస్తామని హామీ ఇచ్చారు. భూముల విస్తీర్ణం, ఆయా భూములలో చెట్లు, వ్యవసాయ బోర్లు ఇతర ఆస్తులు ఉంటే వాటి వివరాలు నమోదు చేయించి, వాటి విలువ మేరకు భూముల పరిహారంతో కలిపి అందజేస్తామని చెప్పారు. ఏమైనా అభ్యంతరాలు ఉంటే తమతో చెప్పాలని రైతులకు సూచించారు. భూమికి భూమి పరిహారం కింద ఇవ్వాలని పలువురు రైతులు కోరారు. కాగా రైతుల అభిప్రాయాలను ప్రభుత్వ ఉన్నతాధికారులకు పంపుతామని ఆర్డీఓ చెప్పారు. శుక్రవారం శివ్వంపేట మండలం సికింద్లాపూర్ గ్రామ రైతులతో సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సమావేశంలో తహసీల్దార్ శ్రీనివాస్, ఆర్ఐ ఫైజల్, సాగునీటి పారుదల శాఖ(కెనాల్) డీఈ కవిత, ఏఈఈ శ్రీనివాస్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.ఆర్డీఓ మహిపాల్ -
ప్రజావాణిపై పట్టింపేది?
● అర్జీలు ఎక్కువ.. పరిష్కారం తక్కువ ● రెండేళ్లలో 19,667 వినతులు ● అధికారికంగా పెండింగ్లో 1,454 ● కాలయాపనతో నెలల తరబడిఫిర్యాదుదారుల నిరీక్షణమెదక్ కలెక్టరేట్: ప్రజావాణి వినతులు పరిష్కారానికి నోచుకోవడం లేదు. వేల సంఖ్యలో ఫిర్యాదులు వస్తుంటే పదుల సంఖ్యలో మాత్రమే అధికారులు పరిష్కరిస్తున్నారు. దీంతో ఫిర్యాదుదారులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. ఏళ్ల తరబడి తిరుగుతున్నా సమస్యలు పరిష్కరించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో కలెక్టర్ స్పందించి తక్షణ చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. భూ సమస్యలే అత్యధికం కలెక్టరేట్లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణిలో అత్యధికంగా భూ సమస్యలపైనే ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నాయి. పహణిలో తప్పుందని, పొలం పాస్ పుస్తకంలో ఎక్కాల్సి ఉందని, పట్టాదార్ పాస్ పుస్తకం రావడం లేదని, ఆన్లైన్లో భూమి కనిపించడం లేదని అర్జీలు అందజేస్తున్నారు. వీటితో పాటు తమ ఇంటి స్థలం, పొలం ఆక్రమించారని, దాయాదులు భూమిని కబ్జా చేస్తున్నారని ప్రజావాణిలో ఫిర్యాదు చేస్తున్నారు. ప్రస్తుతం ఇందిరమ్మ ఇళ్లు, పింఛన్ల కోసం వినతులు అందజేస్తున్నారు. అయితే ప్రజావాణి దరఖాస్తులు ఒక్కటి కూడా పెండింగ్లో లేకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించి ఫిర్యాదుదారులకు సమాధానం ఇవ్వాలని కలెక్టర్ రాహుల్రాజ్ పదే పదే ఆదేశాలు జారీ చేస్తున్నారు. అయినప్పటికీ పరిష్కారం కాక బాధితులు కలెక్టరేట్ చుట్టూ తిరిగి తిరిగి మనోవేదనకు గురవుతున్నారు. ఆత్మహత్యాయత్నం చేసిన రైతు ఇటీవల మెదక్ మండలం శమ్నాపూర్కు చెందిన యువరైతు పట్నం సురేందర్ కలెక్టరేట్ భవనం ఎక్కి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఎన్నిసార్లు ఫిర్యాదు ఇచ్చినా అధికారులు సమస్య పరిష్కరించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏళ్ల తరబడి తిరుగుతున్నా భూ సమస్య పరిష్కరించక పోగా అధికారులు నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారని వాపోయాడు. కాగా అదనపు కలెక్టర్ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించాడు. సంఘటన జరిగి నెలరోజులవుతున్నా.. ఇప్పటికీ సమస్య పరిష్కారానికి నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. (అధికారంగా కేవలం 1,454 అర్జీలు పెండింగ్లో ఉన్నట్లు చూపుతుండగా, భూముల సమస్యలు అత్యధికంగా ఉన్నట్లు సమాచారం)ప్రజావాణి ఫిర్యాదులు ఇలా.. (అధికారికంగా రెండేళ్లలో) కార్యాలయం అర్జీలు పరిష్కరించినవి పెండింగ్ కలెక్టరేట్లో 3,801 3,426 375 ఆర్డీఓ 999 951 48 తహసీల్దార్ 8,310 8,125 185 ఎంపీడీఓ 698 566 132 జిల్లా అధికారులకు 5,859 5,145 714 -
కల్లాల్లో ధాన్యం.. కళ్లలో దైన్యం
ఆరుగాలం పడించిన ధాన్యాన్ని అమ్ముకోవడానికి అన్నదాతలు అష్టకష్టాలు పడుతున్నారు. మండల పరిధిలోని నత్తయ్యపల్లిలో కొన్ని రోజుల క్రితం ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసినప్పటికీ, కొనుగోళ్లు ప్రారంభించలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారం రోజులుగా రోజూ సాయంత్రం వర్షం పడడంతో ధాన్యం తడిసి ముద్దవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికి రాకుండా పోతుందేమోనని ఆందోళన చెందుతున్నారు. – నర్సాపూర్ రూరల్