breaking news
Medak
-
ముమ్మాటికీ కక్షసాధింపే
సాక్షి ఎడిటర్ ధనంజయరెడ్డి, జర్నలిస్టులపై అక్రమంగా కేసులు బనాయించడమేకాకుండా, కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తున్న ఏపీ ప్రభుత్వంపై వివిధ సంఘాల నేతలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో పత్రికా స్వేచ్ఛ రాజ్యాంగం కల్పించిన హక్కు అని, అక్రమాలను, ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం మీడియా కర్తవ్యమని అన్నారు. ఏకపక్షంగా వ్యవహరించడాన్ని ఏపీ ప్రభుత్వం తక్షణం మానుకోవాలని వారు హెచ్చరించారు. ఏపీ ప్రభుత్వ నిర్బంధ చర్యలపై పలువురి నేతల అభిప్రాయాలు.. వారి మాటల్లోనే.. తప్పుడు కేసులు సరికాదు ప్రజాస్వామ్యంలో పత్రికలపై దాడులు సరికాదు. ఏపీలో సాక్షి కార్యాలయాలపై దాడులు చేయటం, వార్తలు రాస్తే ఎడిటర్ నుంచి మొదలుకొని విలేకరులపై తప్పుడు కేసులు పెట్టి భయబ్రాంతులకు గురిచేయడం సహించరాని నేరం. – కిరణ్గౌడ్, అడ్వకేట్ మీడియా జోలికొస్తే ఖబడ్దార్ ప్రజాస్వామ్యంలో పత్రికలే ప్రతిపక్ష పాత్ర పోషిస్తాయి. ప్రజల సమస్యలను వెలికితీసి వాస్తవాలను ప్రజలకు చేరవేస్తాయి. ఏపీలో కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు సరికాదు. నిజాలను నిర్భయంగా రాస్తున్న జర్నలిస్టులపై అక్రమ కేసులు బనాయించడం అత్యంత హేయమైన చర్య. – సురేందర్రెడ్డి, టీయూడబ్ల్యూజే జిల్లా కన్వీనర్ అధికారం శాశ్వతం కాదు అధికారం ఎవరికి శాశ్వతం కాదు. దానిని అడ్డుపెట్టుకొని పత్రికా స్వేచ్ఛను హరించడం సరికాదు. ఏపీలో సాక్షి కార్యాలయాలపై దాడులు వెంటనే ఆపడంతో పాటు విలేకరులపై పెట్టిన అక్రమ కేసులు వెంటనే ఉపసంహరించుకోవాలి. – నరేందర్, టీఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు దుర్మార్గమైన వైఖరి ఏపీలో కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ఎండగడుతున్న సాక్షిపై తప్పుడు కేసులు బనాయించడం దారుణం. ప్రజా ఉద్యమాలకు మొదటి నుంచి ఊపిరిపోస్తున్న సాక్షిపై చంద్రబాబు సర్కార్ చేస్తున్న దుర్మార్గమైన వైఖరిని మాలమహానాడు తీవ్రంగా ఖండిస్తోంది. సాక్షి ఎడిటర్ ధనంజయరెడ్డితో పాటు జర్నలిస్టులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలి. – ర్యాకం శ్రీరాములు, జాతీయ మాలమహానాడు రాష్ట్ర పొలిట్బ్యూరో చైర్మన్ పత్రికా స్వేచ్ఛను హరించడమే ప్రజాస్వామ్య పరిరక్షణలో పత్రికలు మూల స్తంభం లాంటివి. పత్రికా స్వేచ్ఛను హరిస్తూ ఏపీలో సాక్షి కార్యాలయాలపై దాడులు చేయటం, రిపోర్టర్లపై కేసులు పెట్టి భయబ్రాంతులకు గురిచేయడం సరికాదు. ప్రశ్నించే వారిని ఇబ్బందులకు గురి చేయడం మంచి పద్ధతి కాదు. – రోహిత్రావు, మెదక్ ఎమ్మెల్యే హేయమైన చర్య నిజాలను నిర్భయంగా రాస్తున్న సాక్షిపై ఏపీ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించడం దారుణం. ప్రజాస్వామ్య వ్యవస్థలో పత్రికల పాత్ర విస్మరించలేనిది. చంద్రబాబు సర్కార్ భావప్రకటన స్వేచ్ఛకు సంకెళ్లు వేయడం హేయమైన చర్య. పత్రికల్లో పబ్లిష్ అయిన వార్తలు నచ్చకుంటే ఖండించుకోవాలే తప్ప, కేసులు పెట్టి భయభ్రాంతులకు గురిచేయడం తగదు. ప్రజాస్వామ్యానికి పత్రికలే ప్రాణవాయువు. సాక్షి ఎడిటర్ ధనంజయరెడ్డి, జర్నలిస్టులపై పెట్టిన తప్పుడు కేసులు నిలబడేవికావు. – అమ్మన రాంచంద్రారెడ్డి, సీనియర్ న్యాయవాది దేశంలోనే పెద్ద నియంత చంద్రబాబు దేశంలోనే పెద్ద నియంత చంద్రబాబు. ప్రశ్నించే గొంతుకలను అణగదొక్కాలని చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలు అక్రమాలను నిర్భయంగా రాస్తున్న సాక్షిపై కక్షసాధించడం తగదు. సాక్షి ఎడిటర్ ధనంజయరెడ్డి, జర్నలిస్టులపై పెట్టిన అక్రమ కేసులను దళిత, ప్రజా సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. – కేఆర్ భీమసేన, భీమ్ జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు -
విద్యా ప్రమాణాలు పెంపొందించాలి
టేక్మాల్(మెదక్)/పాపన్నపేట: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పెంపొందించాలని డీఈఓ రాధాకిషన్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో నిర్వహించిన కాంప్లెక్స్ సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న నిరుపేద విద్యార్థులకు గుణాత్మక విద్యను అందించాలని సూచించారు. వారికి అర్థమయ్యే రీతిలో పాఠాలు బోధించాలన్నారు. అనంతరం పాపన్నపేట మండల పరిధిలోని నామాపూర్ ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించేలా బోధించాలని సూచించారు. ఉపాధ్యాయులు ఖచ్చితంగా సమయపాలన పాటించాలన్నారు. ఆయన వెంట ఎంఈఓ ప్రతాప్రెడ్డి, ఉపాధ్యాయులు, ఏఎస్ఓ నవీన్, కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు శ్రీనివాస్, అమరేందర్రెడ్డి, అజీజ్, మండల రిసోర్స్ పర్సన్ కృష్ణ తదితరులు ఉన్నారు.డీఈఓ రాధాకిషన్ -
ఉత్తమ ఫలితాలు సాధించాలి
శివ్వంపేట(నర్సాపూర్): విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేందుకు అధ్యాపకులు కృషి చేయాలని జిల్లా ఇంటర్మీడియెట్ అధికారి మాధవి అన్నారు. శుక్రవారం శివ్వంపేట జూనియర్ కాలేజీని తనిఖీ చేశారు. ఈసందర్భంగా విద్యార్థులకు అందుతున్న బోధన, తదితర సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రతిరోజు విద్యార్థులు కాలేజీకి వచ్చే విధంగా చూ డాల్సిన బాధ్యత సిబ్బందిపై ఉందన్నారు. చదువులో వెనుకబడిన వారి పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. భవన నిర్మాణ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. ఆమె వెంట ఇన్చార్జి ప్రిన్సిపాల్ నాగమణి, సిబ్బంది ఉన్నారు. భూ భారతి దరఖాస్తులు పరిష్కరించాలి నర్సాపూర్: భూ భారతి రెవెన్యూ సదస్సుల్లో రైతుల నుంచి వచ్చిన దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని అదనపు కలెక్టర్ నగేశ్ అధికారులకు సూచించారు. శుక్రవారం ఆర్డీఓ కార్యాలయాన్ని తనిఖీ చేసి మాట్లాడారు. విధుల పట్ల సిబ్బంది అంకితభావంతో పని చేయాలన్నారు. అధిక వర్షాల పట్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. కాగా భూ భారతి దరఖాస్తుల పరిష్కారం కోసం చేపడుతున్న కార్యక్రమాలను ఆర్డీఓ అదనపు కలెక్టర్కు వివరించారు. ఆయన వెంట తహసీల్దార్ శ్రీనివాస్, ఆర్ఐ ఫైజల్ తదితరులు ఉన్నారు. వర్షంతో నిలిచిన పనులు హవేళిఘణాపూర్(మెదక్): మండల పరిధిలోని శమ్నాపూర్ వద్ద కొట్టుకుపోయిన రైల్వేలైన్ బ్రిడ్జి మరమ్మతు పనులకు వర్షం అడ్డంకిగా మారింది. గత నెల చివరి వారంలో కురిసిన భారీ వర్షాలకు రైల్వేలైన్ కట్ట కొట్టుకుపోయి పెద్ద గొయ్యి ఏర్పడింది. ఎగువ నుంచి వస్తున్న వదరతో కొంత ఆలస్యంగా పనులు చేపట్టారు. మట్టి సంచులను అడ్డుగా వేసినప్పటికీ గురువారం మళ్లీ వర్షం పడడంతో వరద వచ్చి పనులు కొనసాగలేదని రైల్వే అధికారులు తెలిపారు. దాదాపు 15 రోజుల పాటు పనులు కొనసాగే అవకాశం ఉందన్నారు. నానో యూరియాతో మంచి దిగుబడి డీఏఓ దేవ్కుమార్ నర్సాపూర్ రూరల్: నానో యూరియాతో మంచి దిగుబడులు వస్తాయని జిల్లా వ్యవసాయాధికారి దేవ్కుమార్ రైతులకు సూచించారు. శుక్రవారం మండలంలోని అవంచలో ఓ రైతు సాగు చేస్తున్న 13 ఎకరాల వరిలో నానో యూరియా పిచికారీతో ఎదుగుతున్న పంటను పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు నానో యూరియాను సద్వినియోగం చేసుకోవాలన్నారు. రసాయన ఎరువుల వాడకాన్ని పూర్తిగా తగ్గించి సేంద్రియ ఎరువులను వాడాలన్నారు. రైతులు పంట మార్పిడి తప్పక అలవర్చుకొని అమలు చేయాలని తెలిపారు. భూసార పరీక్షలు చేయించుకొని ఫలితాలకు అనుగుణంగా పంటలు సాగు చేసుకోవాలన్నారు. అనంతరం అవంచ రైతు వేదికలో యూరియా పంపిణీని పరిశీలించారు. ప్రతి రైతుకు యూరియా అందేలా చూడాలని సిబ్బందికి సూచించారు. ఆయన వెంట ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రొఫెసర్ లక్ష్మణ్, మండల వ్యవసాయ అధికారి దీపిక, సిబ్బంది ఉన్నారు.రాష్ట్రస్థాయికి 11 మంది విద్యార్థులు మెదక్ కలెక్టరేట్: ఇటీవల మెదక్లో నిర్వహించిన కళా ఉత్సవ్ పోటీల్లో జిల్లాలోని వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు 11 మంది రాష్ట్రస్థాయికి ఎంపికై నట్లు డీఈఓ రాధాకిషన్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్రస్థాయిలో మంచి ప్రతిభ చూపాలని సూచించారు. -
ప్రజల సమస్యలపై దృష్టి పెట్టండి
మెదక్ కలెక్టరేట్: అధికారులు కాంట్రాక్టర్లపై కాకుండా ప్రజల సమస్యలపై దృష్టి పెట్టాలని ఎమ్మెల్యే రోహిత్రావు అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో వివిధశాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. భారీ వరదలతో జిల్లాలో పంచాయతీరాజ్, ఇరిగేషన్, ఆర్అండ్బీ శాఖలకు సంబంధించిన రోడ్లు కల్వర్టులు, కాజ్వేలు, చెరువులకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లిందన్నారు. తాత్కాలిక మరమ్మతులకు ఎస్డీఆర్ఎఫ్లో రూ. 10 కోట్లు ఉన్నట్లు చెప్పారు. పాపన్నపేట మండలంలోని కొత్తపల్లి బ్రిడ్జి నిర్మాణం ఎన్నిసార్లు చెప్పినా.. ఎందుకు పూర్తి చేయడం లేదని ఆర్అండ్బీ ఈఈ సర్ధార్సింగ్ను ప్రశ్నించారు. కేవలం రూ. 60 లక్షల కోసం పనులు నిలిపివేస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్ను తొలగించి కొత్త వారికి పనులు అప్పగించి త్వరితగిన పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే మెదక్, రామాయంపేట రైతు బజార్లు వెంటనే రద్దు చేయాలని మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. అలాగే మెదక్ కూరగాయల మార్కెట్లో గిరిజన మహిళ పట్ల దురుసుగా వ్యవహరించిన కాంట్రాక్టర్పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డీఎస్పీకి సూచించారు. మెదక్ సుందరీకరణ పనుల్లో వేగం పెంచి త్వరిగతిన పనులు పూర్తి చేయాలని మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్రెడ్డికి సూచించారు. సమావేశంలో కలెక్టర్ రాహుల్రాజ్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు తాత్కాలిక మరమ్మతులకు రూ. 10 కోట్లు -
వరద ముప్పు.. ఎవరిదీ తప్పు!
డ్రైనేజీ నిర్మాణంలో ముందుచూపు కరువు చినుకు పడితే చాలు.. పట్టణ ప్రజలు చిగురుటాకుల్లా వణికిపోతున్నారు. జిల్లా కేంద్రంలోని రోడ్లు చెరువులను తలపిస్తుండగా, ఇళ్లు, షాపులు జలమయం అవుతున్నాయి. డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. పూర్తిస్థాయిలో మురికి నీరు బయటకు వెళ్లే మార్గం కరువైంది. దీనికి తోడు అధికారుల సమన్వయ లోపం కొట్టిచ్చినట్లు కనిపిస్తోంది. వెరసి కొద్దిపాటి వర్షం కురిసినా లోతట్టు ప్రాంతాల ప్రజలకు కంటిమీద కునుకు కరువవుతోంది. – మెదక్జోన్ మెదక్లో 32 వార్డులు ఉండగా, అనేక వార్డుల్లో డ్రైనేజీ సమస్య వేధిస్తోంది. ప్రధానంగా రాందాస్ చౌరస్తా, గాంధీనగర్, ఆటోనగర్, శాంతినగర్, వెంకట్రావునగర్, అంబేడ్కర్ కాలనీ, కోర్టు రోడ్డు, బాలుర జూనియర్ కాలేజీ, ఇందిరాగాంధీ స్టేడియం ప్రాంతం.. వర్షం పడితే జలమయం అవుతున్నాయి. డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో వర్షం నీరు రోడ్లపైకి చేరుతోంది. పట్టణ ప్రధాన రహదారి పొడవు సుమారు 3 కిలోమీటర్లకు పైగా ఉండగా, ప్రధాన రోడ్డుకు ఇరువైపులా నిర్మించిన మురికి కాలువలు చాలా చోట్ల అసంపూర్తిగా, అధ్వానంగా మారాయి. ముఖ్యంగా మురికి కాలువలకు ఔట్లెట్ లేకుండానే అర్ధంతరంగా వదిలేయడంతో వర్షంతో కాలువలు నిండి నీరు రోడ్లపైకి ప్రవహిస్తోంది. మరికొన్ని చోట్ల డ్రైనేజీలు చిన్నగా ఉండటంతో వరదనీరు ఎక్కువై రోడ్లపైకి చేరుతోంది. పట్టణంలోని సాయిదత్త సినిమా థియేటర్ వద్ద ఔట్ లెట్ లేకుండానే మురికి కాలువును నిర్మించి వదిలేశారు. అలాగే గాంధీనగర్లో సైతం డ్రైనేజీకి నిర్మాణానికి అడ్డంగా పలు ఇళ్లు రాగా అర్ధంతరంగా వదిలేశారు. పెద్దబజార్, జేఎన్ రోడ్డు నుంచి వర్షం నీరు సరాసరి రాందాస్ చౌరస్తాకు వస్తోంది. అక్కడ సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో నీరు మీటర్పైకి చేరి పలు షాపుల్లోకి చేరుతోంది. మధ్యలో డివైడర్ నిర్మించడంతో సమస్య మరింత ఉత్పన్నం అవుతోంది. గతంలో నీరు కింది భాగంలో గల అజంపుర వైపు వెళ్లేది. డివైడర్ అడ్డుగా ఉండటం, మురికి కాలువలు చిన్నగా ఉండటంతో రాందాస్ చౌరస్తా చెరువును తలపిస్తోంది. మురికి కాలువల నిర్మాణాలకు అడ్డుగా ఇళ్లుపట్టణంలో అనేక చోట్ల డ్రైనేజీ నిర్మాణానికి ఇళ్లు అడ్డుగా ఉన్నాయి. దీంతో అధికారులు వాటిని కూల్చకుండా కాలువల నిర్మాణాలను అక్కడికే వదిలేశారు. దీంతో వర్షం నీరు వెళ్లే మార్గం లేక పట్టణం అస్తవ్యస్తంగా మారుతోంది. రాజధానికే పరిమితమైన హైడ్రా లాంటి వ్యవస్థ జిల్లాలో ఏర్పాటు చేస్తే సమస్య తీరుతుందని పట్టణ ప్రజలు అభిప్రాయపడుతున్నారు.మెదక్ పట్టణంలో వరద ప్రహహం జలమయం అవుతున్న రోడ్లు ఇళ్లు, షాపుల్లోకి చేరుతున్న నీరు మెదక్ పట్టణంలో దుస్థితి -
పకడ్బందీగా పారిశుద్ధ్య పనులు
తూప్రాన్/చేగుంట/శివ్వంపేట(నర్సాపూర్): వర్షాల నేపథ్యంలో గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు పకడ్బందీగా చేపట్టాలని జెడ్పీ సీఈఓ ఎల్లయ్య అన్నారు. శుక్రవారం మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో సీజనల్ వ్యాధులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ఇందుకోసం శానిటేషన్ పనులు సక్రమంగా జరిగే విధంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఓటరు జాబితా విషయంలో కార్యదర్శులు సమర్థవంతంగా పని చేశారని కొనియడారు. సమావేశంలో ఎంపీడీఓ సతీశ్, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. అనంతరం చేగుంట మండలంలోని చందాయిపేటలో ఉపయోగంలో లేని ప్రభుత్వ ఉన్నత పాఠశాల భవనాన్ని పరిశీలించారు. మాసాయిపేట మండలానికి చెందిన కస్తూర్బా పాఠశాల నిర్వహణకు వీలుగా ఉంటుందేమో పరిశీలించాలని పంచాయతీ రాజ్ ఏఈ అభినవ్కు సూచించారు. అలాగే చేగుంట ప్రభుత్వ ఉన్నత పాఠశాలను పరిశీలించి పాఠశాల నిర్వహణ గురించి ఎంఈఓ నీరజను అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు శివ్వంపేట ఎంపీడీఓ కార్యాలయాన్ని తనిఖీ చేసి పలు రికార్డులు, ఓటరు తుది జాబితా వివరాల గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. స్ధానిక సంస్థల ఎన్నికలకు ఎప్పుడైన నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉన్నందున, సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు.జెడ్పీ సీఈఓ ఎల్లయ్య -
నాణ్యమైన భోజనం అందించాలి
కౌడిపల్లి(నర్సాపూర్): విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని కలెక్టర్ రాహుల్రాజ్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని ఎస్టీ బాలుర ఆశ్రమ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. కిచెన్, డైనింగ్హాల్, తరగతి గదులు, పరిసరాలు, మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. వర్షాల నేపథ్యంతో అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికి సూచించారు. పాత, శిథిలమైన భవనాలు ఉంటే మరోచోట వసతి కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. విద్యార్థుల సౌకర్యం కోసం అన్ని వసతులు కల్పిస్తామన్నారు. ఆయన వెంట ఎంఈఓ బాలరాజు, వార్డెన్ జయరాజ్, ఉపాధ్యాయులు ఉన్నారు. అనంతరం ముట్రాజ్పల్లిలో ఇటీవల గ్యాస్ సిలిండర్ పేలడంతో ధ్వంసమైన అకుల శ్రీనివాస్ ఇంటిని పరిశీలించారు. బాధితుడితో మాట్లాడి ప్రమాద వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు, పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీనివాస్, తహసీల్దార్ కృష్ణ, ఆర్ఐ శ్రీహరి, గ్రామస్తులు పాల్గొన్నారు.కలెక్టర్ రాహుల్రాజ్ -
సేవాభావాన్ని అలవర్చుకోవాలి
కౌడిపల్లి(నర్సాపూర్): విద్యార్థులు విద్యార్థి దశ నుంచే సేవా భావాన్ని అలవాటు చేసుకోవాలని ఓయూ ఎన్ఎస్ఎస్ ప్రోగాం కోఆర్డినేటర్ ఆచార్య విద్యాసాగర్ తెలిపారు. శుక్రవారం మండలంలోని రాయిలాపూర్లో నర్సాపూర్ డిగ్రీ కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ హుస్సేన్ ఆధ్వర్యంలో యూనిట్–1 ఎన్ఎస్ఎస్ శిబిరం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వికసిత్ భారత్లో విద్యార్థులు, యువత భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. విద్యతో పాటు సేవా కార్యక్రమాలలో పాల్గొనాలని చెప్పారు. ప్రిన్సిపాల్ హుస్సేన్ మాట్లాడుతూ స్వామి వివేకానంద, జ్యోతిబాపూలే ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలన్నారు. గ్రామస్తులకు మూఢనమ్మకాలు, బాల్యవివాహాలు, వరకట్న దురాచారం గురించి అవగాహన కల్పించాలని చెప్పారు. కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ సురేష్కుమార్, ఉన్నత పాఠశాల ఇన్చార్జి హెచ్ఎం సరిత, రాజ్కుమార్, వాలంటీర్ కవిత తదితరులు పాల్గొన్నారు. ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ విద్యాసాగర్ రాయిలాపూర్లో శిబిరం ఏర్పాటు -
ట్రాన్స్ఫార్మర్లో మంటలు
అల్లాదుర్గం(మెదక్): విద్యుత్ ట్రాన్స్ఫార్మర్కు మంటలు చెలరేగి తృటిలో ప్రమాదం తప్పింది. ఈ సంఘటన అల్లాదుర్గం మండల కేంద్రంలో శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ చుట్టూ పిచ్చి మొక్కలు వెలిశాయి. ట్రాన్స్ఫార్మర్ పైకి తీగలు అల్లుకున్నాయి. వీటిని తొలగించేందుకు అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. ఆగస్టు 8న సాక్షి దినపత్రికలో శ్రీపొదల్లో ట్రాన్స్ఫార్మర్శ్రీఅనే శీర్షికన కథనం ప్రచురితమైంది. అయినా విద్యుత్ అధికారులు తమకేమీ పట్టనట్టు వ్యవహరించారు. స్థానికంగా అధికారులు ఎవరూ ఉండటం లేదని, ప్రతీసారి ప్రమాదాలు చోటు చేసుకుంటే గంటల తరబడి వారి కోసం వేచి చూడాల్సిన దుస్థితి నెలకొందని స్థానికులు మండిపడుతున్నారు. ట్రాన్స్ఫార్మర్ చుట్టూ పొదలు వెలిసి ప్రమాదకరంగా మారితే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. పొదలతో ట్రాన్స్ఫార్మర్ కనిపించలేని పరిస్థితి నెలకొనడంతో మూగజీవాలు విద్యుత్ షాక్కు గురై మృతి చెందిన ఘటనలు ఎన్నో ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ● తప్పిన ప్రమాదం ● అధికారుల నిర్లక్ష్యమే కారణం -
ఏచూరి ఆశయాలను సాధిస్తాం
మెదక్ కలెక్టరేట్: దివంగత సీపీఎం నేత సీతారాం ఏచూరి ఆశయాలను సాధిస్తామని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి కడారి నర్సమ్మ పేర్కొన్నారు. శుక్రవారం సీతారాం ఏచూరి ప్రథమ వర్ధంతి సంధర్భంగా మెదక్ కేవల్ కిషన్ భవనంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నర్సమ్మ మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా ఏచూరి ఎనలేని కృషి చేశారని కొనియాడారు. ప్రజల హక్కుల కోసం ఏచూరి చేసిన అనేక పోరాటాల స్ఫూర్తితో రాజ్యాంగాన్ని కాపాడుకోవడం కోసం ప్రజలను ఐక్యం చేసి భవిష్యత్లో పోరాటాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మల్లేశం, నాయకులు సంతోష్, వెంకట్, చౌకత్, సత్యం, రాణి, తదితరులు పాల్గొన్నారు. ఏచూరికి ఘన నివాళి వెల్దుర్తి(తూప్రాన్): మండల కేంద్రం వెల్దుర్తిలో సీపీఎం ఆధ్వర్యంలో సీతారాం ఏచూరీ మొదటి వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఫొటోకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ప్రపంచ, దేశ రాజకీయాల్లో సీతారాం ఏచూరి ప్రత్యేక ముద్ర వేసుకున్న రాజకీయ నాయకుడిగాను, మంచి పార్లమెంటేరియన్గా పేరు పొందారని పలువురు నాయకులు కొనియాడారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు గౌరి, సాయిలు, అశోక్, రాజు తదితరులు పాల్గొన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి నర్సమ్మ -
అసిస్టెంట్ ప్రొఫెసర్కు డాక్టరేట్
నర్సాపూర్: తమ కళాశాలలోని ఏఐడీఎస్ బ్రాంచ్లో అసిస్టెంటు ప్రొఫెసర్గా పని చేస్తున్న అమరేందర్రెడ్డికి డాక్టరేట్ వచ్చిందని బీవీఆర్ఐటీ ప్రిన్సిపాల్ సంజయ్దూబె తెలిపారు. అమరేందర్రెడ్డి విజయవాడకు చెందిన కేఎల్ఈఎఫ్ విశ్వవిద్యాలయం నుంచి సీఎస్ఈ విబాగంలో మెటీ–హ్యూరిస్టిక్ విధానాల ఆధారంగా శక్తి సమర్థవంతమైన మేఘ గణన అంశంపై డాక్టరేట్ పొందారని ఆయన వివరించారు. కాగా అమరేందర్రెడ్డిని ప్రిన్సిపాల్ సంజయ్దూబె, డైరెక్టర్ లక్ష్మిప్రసాద్, హెచ్ఓడీ దశరథరామయ్య తదితరులు అభినందించారు. భాష, యాసను మరవొద్దు జెడ్పీ పాఠశాల హెచ్ఎం దీప్లారాథోడ్ చిన్నశంకరంపేట(మెదక్): తెలంగాణ భాషా యాసను మరిచిపోవద్దని చిన్నశంకరంపేట జెడ్పీ పాఠశాల హెచ్ఎం దీప్లారాథోడ్ అన్నారు. శుక్రవారం చిన్నశంకరంపేట జెడ్పీ పాఠశాలలో తెలంగాణ భాషా తెలుగుపై టీఎల్ఎం మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా కాళోజి నారాయణరావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం తెలగు పండిత్లు వసుందదేవి, మంజుల, కిషన్లను శాలువతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుడు పోచయ్య పాల్గొన్నారు. ముమ్మరంగా ఓపెన్ స్కూల్లో ప్రవేశాలు శివ్వంపేట(నర్సాపూర్): పది, ఇంటర్లో ఓపెన్ స్కూల్ ప్రవేశాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. శివ్వంపేట ఉన్నత పాఠశాల ఓపెన్ స్కూల్కు సంబంధించి పదిలో 25, ఇంటర్లో 35 మంది ప్రవేశాలు పొందినట్లు ఓపెన్ స్కూల్ మండల కో ఆర్డినేటర్ బాలచంద్రం తెలిపారు. గ్రామాల్లో చదువు మానేసిన వారిని గుర్తించేందుకు ఐకేపీ సిబ్బంది ప్రత్యేక చొరవ తీసుకోవడం వల్ల ప్రవేశాలు పెరిగాయని బాలచంద్రం చెప్పారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్, ఐకేపి సీసీ సరిత, తదితరులు ఉన్నారు. -
విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకోవాలి
చేగుంట(తూప్రాన్): విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకొని ఉన్నతంగా ఎదగాలని కాంగ్రెస్ పార్టీ దుబ్బాక నియోకవర్గ ఇన్చార్జి శ్రీనివాస్రెడ్డి అన్నారు. చేగుంట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇటీవల చేరిన విద్యార్థులకు స్వాగత కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్రెడ్డి విద్యార్థులనుద్దేశించి మాట్లాడారు. కొత్త విద్యార్థులు సీనియర్ విద్యార్థులు కలిసిమెలిసి చదువుకోవాలని పేర్కొన్నారు. కళాశాలకు అదనపు గదులు, ప్రహరీ, నిర్మించడంతో కళాశాల సమస్యలు తీర్చేందుకు కృషి చేయాలని శ్రీనివాస్రెడ్డిని ప్రిన్సిపాల్ కృష్ణారెడ్డి కోరారు. ఇన్చార్జి మంత్రితో మాట్లాడి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. కాంగ్రెస్ నేత శ్రీనివాస్రెడ్డి ఉద్బోధ -
తప్పని యూరియా తిప్పలు
యూరియా కోసం రైతులు నానా అవస్థలు పడుతున్నారు. శుక్రవారం వెల్దుర్తి మండల కేంద్రంలోని రైతు వేదిక వద్ద యూరియా కోసం రైతులు బారులు తీరారు. ఉదయం 4 గంటల నుంచి లైన్లో నిలబడ్డారు. వారం రోజులుగా యూరియా లేక ఇబ్బంది పడుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నశంకరంపేట మండలం జంగరాయి సహకార సంఘం వద్దకు యూరియా వచ్చిందని తెలుసుకున్న రైతులు ఉదయమే చేరుకొని క్యూలైన్లో చెప్పులు పెట్టారు. చిన్నశంకరంపేట సహకార సంఘం వద్ద బారుతీరిన రైతులు గంటల కొద్ది వేచిచూశారు. అయితే మహిళల మధ్య మాటామాటా పెరిగి ఒకరిపై ఒకరు చేయి చేసుకున్నారు. ఒక మహిళ రెండుసార్లు లైన్లో నిలబడి ఎక్కువ బస్తాలు తీసుకుందని మరో మహిళ ఆమైపె చేయి చేసుకుంది. పక్కన ఉన్న మహిళలు సర్దిచెప్పి అక్కడి నుంచి పంపించి వేశారు. కొల్చారం మండలంలోని రంగంపేట రైతు ఆగ్రో సేవా కేంద్రానికి 400 బస్తాల యూరియా వచ్చింది. రైతు వేదిక వద్ద టోకెన్లు ఇవ్వడంతో రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. – వెల్దుర్తి(తూప్రాన్)/కొల్చారం(నర్సాపూర్)/చిన్నశంకరంపేట(మెదక్) -
తాగి వాహనాలు నడిపితే జైలుకే..
ఎస్ఐ శంకర్ హెచ్చరిక అల్లాదుర్గం(మెదక్): మద్యం సేవించి వాహనాలు నడిపితే జైలు శిక్ష తప్పదని ఎస్ఐ శంకర్ హెచ్చరించారు. గురువారం రాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడిన వారికి శుక్రవారం అల్లాదుర్గం పోలీస్ స్టేషన్లో కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మద్యం సేవించి వాహనాలు నడిపి పట్టుబడితే మొదటిసారి జరిమానా విధిస్తామన్నారు. మళ్లీ పట్టుబడితే జైలు శిక్ష తప్పదన్నారు. మద్యం తాగి వాహనాలు నడపడంతో ఎన్నో ప్రమాదాలు చోటు చేసుకుని కుటుంబాలు వీధిన పడుతున్నాయని చెప్పారు. వాహనదారులు మద్యానికి దూరంగా ఉండాలని సూచించారు. పీఏపీఎస్ చైర్మన్గా నరసింహారెడ్డి టేక్మాల్ (మెదక్): టేక్మాల్ పీఏపీఎస్ చైర్మన్గా ధనూర గ్రామానికి చెందిన బి.నరసింహారెడ్డి ఎన్నికయ్యారు. శుక్రవారం టేక్మాల్ పీఏపీఎస్ కార్యాలయంలో సీఈఓ సాయిలు సమక్షంలో డైరెక్టర్లు నరసింహారెడ్డిని చైర్మన్గా ఎన్నుకున్నారు. ఇదివరకు పీఏపీఎస్ చైర్మన్ యశ్వంత్ రెడ్డిపై వేసిన విచారణలో అవినీతి చేసినట్లు నిర్ధారణ కావడంతో ఆయనను తొలగించారు. దీంతో నూతన చైర్మన్గా నరసింహారెడ్డిని ఎన్నుకున్నారు. పుస్తకాలు సమకూరుస్తా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ సుహాసినిరెడ్డి నర్సాపూర్: పోటీ పరీక్షలకు చదివేందుకు అవసరమయ్యే పుస్తకాలు సమకూరుస్తానని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ సుహాసినిరెడ్డి చెప్పారు. శుక్రవారం అల్లూరి సీతారామరాజు గిరిజన బాలుర ఫైన్ ఆర్ట్స్ కాలేజీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. వంటశాలను పరిశీలించారు. నాణ్యత ప్రమాణాలు పాటించాలని సూచించారు. విద్యార్థులు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు అవసరమయ్యే పుస్తకాలు సమకూరుస్తానని సుహాసినిరెడ్డి చెప్పారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ సిబ్బంది సుహాసినిరెడ్డిని శాలువతో సన్మానించారు. ఉపాధ్యాయులకు సన్మానం హవేళిఘణాపూర్(మెదక్): జిల్లా స్థాయిలో జరిగిన టీఎల్ఎం మేళాలో అద్భుతమైన టీఎల్ఎం తయారు చేసి రాష్ట్ర స్థాయికి ఎంపికై న ఉపాధ్యాయులను ఎంఈఓ మధుమోహన్ శాలువా కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ మండలంలో పని చేస్తున్న రవీందర్రెడ్డి, బాలశేఖర్, జిల్లా స్థాయి ఉత్తమ అవార్డు పొందిన నర్సింలును అభినందించారు. విద్యార్థులకు మంచి బోధన చేసి ప్రతిభ కనబర్చి ఎంపిక కావడం శుభపరిణామని చెప్పారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు మల్లారెడ్డి, తదితరులు ఉన్నారు. అనుమతి లేకుండా చెట్లు నరికివేస్తే చర్యలు తూప్రాన్: మున్సిపాలిటీ పరిధిలో అనుమతి లేకుండా చెట్టు కొమ్మలు నరికిన వ్యాపార సంస్థకు శుక్రవారం మున్సిపల్ అధికారులు జరిమానా విధించారు. పట్టణంలోని మోర్ వ్యాపార సంస్థ ఎదుట చెట్టు కొమ్మలు అడ్డుగా ఉన్నాయని నిర్వాహకులు నరికివేశారు. గుర్తించిన మున్సిపల్ అధికారులు ఆ వ్యాపార సంస్థకు రూ. 5 వేల జరిమానా విధించారు. అనుమతి లేకుండా చెట్లు నరికివేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. -
దెబ్బతిన్న పంటల పరిశీలన
పెద్దశంకరంపేట(మెదక్): ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మండలంలోని ఆయా గ్రామాలలో పంటలు దెబ్బతిన్నాయని ఎంపీడీఓ షాకీర్అలీ అన్నారు. శుక్రవారం బద్దారం, ఉత్తులూర్ తదితర గ్రామాలలో ఈజీఎస్ అధికారులతో కలిసి పంట పొలాలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పంటలలో ఇసుక మేటలను తొలగించుకునేందుకు ఉపాధిహామీ ద్వారా ప్రభుత్వం అవకాశం కల్పించిందని, ఈ అవకాశాన్ని రైతులు వినియోగించుకోవాలని కోరారు. ఆయా గ్రామాలలో డ్రై డే సందర్భంగా ప్రజలకు నీటి నిల్వ, రోగాలు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ వినీత్, ఈసి.నవాజుద్దీన్, టేఏ వినోద, అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు తదితరులు ఉన్నారు. -
17 నుంచి సేవా కార్యక్రమాలు
నర్సాపూర్: ఈనెల 17నుంచి పక్షం రోజుల పాటు సేవా కార్యక్రమాలు చేపట్టాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లేష్గౌడ్ పిలుపునిచ్చారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రధాని పుట్టిన రోజు నుంచి అక్టోబరు రెండవ తేదీ వరకు సేవా కార్యక్రమాలు చేపట్టాలని చెప్పారు. రక్తదాన శిబిరాలు, అమ్మ పేరుతో మొక్కలు నాటడం, కుల వృత్తులు, రిటైర్డు ఉద్యోగులను సన్మానించడం, ప్రభుత్వ ఆసుపత్రులలో రోగులకు పండ్లు పంచడం తదితర సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఆయన వివరించారు. సమావేశంలో పార్టీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు రమేష్గౌడ్, పార్టీ మండల శాఖ అధ్యక్షుడు నగేష్, పార్టీ నాయకులు నారాయణరెడ్డి, బాల్రాజ్, రాములు నాయక్, నర్సింలు, మహెందర్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.బీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లేష్గౌడ్ -
ఇసుక మేటలు తొలగిస్తాం
చిన్నశంకరంపేట(మెదక్): పంట పొలాల్లో వేసిన ఇసుక మేటలను ఉపాధి హామీ పథకం కూలీల ద్వారా తొలగించేందుకు చర్యలు చేపట్టినట్లు నార్సింగి ఎంపీడీఓ ఆనంద్కుమార్ తెలిపారు. శుక్రవారం నార్సింగి మండలం జప్తిశివనూర్ గ్రామంలో భారీ వర్షాలతో పంట పొలాల్లో చేరిన ఇసుక మేటలను అధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ రైతుల పంట పొలాలను పరిశీలించి కూలీల అవసరాలపై ఒక అంచనాకు రానున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈజీఎస్ ఏపీఓ రాజేశ్వర్, ఏఈఓ దివ్య ఉన్నారు.నార్సింగి ఎంపీడీఓ ఆనంద్కుమార్ -
ఘనంగా మిలాద్ ఉన్ నబీ ఉత్సవాలు
తూప్రాన్: పట్టణంలో మైనార్టీ సోదరులు మిలాద్ ఉన్ నబీ ఉత్సవాలు శుక్రవారం ఘనంగా జరుపుకొన్నారు. ఈ సందర్భంగా ఆర్టీసీ బస్టాండ్ నుంచి పట్టణంలో మున్సిపల్ కార్యాలయం వరకు ప్రధాన రహదారిపై భారీ ర్యాలీ నిర్వహించారు. మైనార్టీలు ప్రతి ఏటా ఈ పండుగను సంతోషంగా జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉంటుందని, ఈ పండుగ విశిష్టతను మత పెద్దలు వివరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఎస్ఐ శివానందం బందోబస్తు చేపట్టారు. ముస్లింల ర్యాలీ మనోహరాబాద్(తూప్రాన్): మిలాద్–ఉన్–నబీ వేడుకలలో భాగంగా మనోహరాబాద్, కాళ్లకల్ ముప్పిరెడ్డిపల్లి, పర్కిబండ, లింగారెడ్డిపేట్లో ముస్లింలు శుక్రవారం ర్యాలీ నిర్వహించారు. అంతకు ముందు మజీద్లలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మనోహరాబాద్లో నిర్వహించిన ర్యాలీలో ఎస్ఐ సుభాష్గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మండల మైనార్టీ అధ్యక్షుడు జావీద్పాషా, కమిటీ అధ్యక్షుడు అజీజ్ఖాన్, సభ్యులు సమద్, నయిమ్, రజాక్, రఫీక్, షర్ఫుద్దీన్, మహ్మద్బేగ్, సంయుద్దీన్, గౌస్, ఫహీం, ఉస్మాన్, గులాం, జిలానీ, మోయిజ్, అప్సర్, ఇర్షాద్, అజ్జు, లాయ్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రియుడితో కలసి కన్నబిడ్డ హత్య
శివ్వంపేట (నర్సాపూర్): ప్రియుడితో కలసి రెండేళ్ల కన్నబిడ్డను హత్య చేసి పాతిపెట్టిందో తల్లి. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉంటుందని భావించి వారు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. నాలుగు నెలల క్రితం జరిగిన ఈ ఘటన శుక్రవారం మెదక్ జిల్లా శివ్వంపేట పోలీస్స్టేషన్ పరిధిలోని శభాష్పల్లిలో వెలుగు చూసింది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన బంటు మమతకు సిద్దిపేట జిల్లా రాయిపోల్ మండలం వడ్డేపల్లికి చెందిన భాస్కర్తో ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి నాలుగేళ్ల కుమారుడు, కూతురు తని్వసి (2) సంతానం. కాగా, మమత శభా‹Ùపల్లికి చెందిన ఫయాజ్తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. మార్చి నెలలో ఇద్దరూ కలసి పారిపోవడంతో పెద్దలు సర్ది చెప్పి అత్తగారింటికి పంపించారు. మేలో పిల్లలను తీసుకొని మమత తల్లిగారింటికి వచ్చింది. ఆమెలో ఎలాంటి మార్పు రాకపోగా.. రెండోసారి మే 21న కుమారుడిని తల్లిగారి ఇంట్లోనే వదిలేసి కూతురు తన్విసిని తీసుకుని ప్రియుడితో వెళ్లిపోయింది. దీంతో మమత తండ్రి రాజు ఫిర్యాదు మేరకు శివ్వంపేట పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గుంటూరులో దొరికిన మమత, ఫయాజ్ శివ్వంపేట పోలీసులు ఏపీలోని గుంటూరులో మమత, ఫయాజ్ను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. కూతురు తని్వసి విషయంలో స్పష్టత రాకపోవడంతో పోలీసులు తమదైన శైలిలో విచారించగా.. గొంతు పిసికి హత్య చేసి, పాతి పెట్టినట్లు చెప్పారు. దీంతో శుక్రవారం సాయంత్రం శభాష్ పల్లి గ్రామ శివారులో చిన్నారిని పాతిపెట్టిన ప్రదేశాన్ని కనుగొన్నారు. డీఎస్పీ నరేందర్గౌడ్, సీఐ రంగాకృష్ణ, తహసీల్దార్ కమలాద్రి, ఎస్ఐ మధుకర్రెడ్డి సమక్షంలో కుంట కట్టు కాల్వలో పూడ్చిన చిన్నారి మృతదేహాన్ని బయటకు తీశారు. కాగా, చిన్నారి మృతదేహాన్ని బయటకు తీసిన అనంతరం గ్రామస్తులు నిందితులకు దేహశుద్ధి చేసేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఫయాజ్పై ఇప్పటికే దొంగతనాలు ఇతర నేరాలకు సంబంధించి 30కి పైగా కేసులు ఉన్నాయని పోలీసులు చెప్పారు. -
జీఎస్టీ తగ్గింపుతో మేలు
మెదక్ ఎంపీ రఘునందన్రావుమెదక్జోన్/పాపన్నపేట: జీఎస్టీ తగ్గింపుతో కోట్లాది భారతీయులకు మేలు జరుగుతుందని ఎంపీ రఘునందన్రావు అన్నారు. జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్హాల్లో వాణిజ్య, వ్యాపారులకు నిర్వహించిన అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. జీఎస్టీ స్లాబ్ తగ్గింపుతో దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రతీ నెల రూ. 3,700 కోట్ల నష్టం వచ్చినా, పేద, మధ్య తరగతి ప్రజలకు మేలు జరగాలన్న లక్ష్యంతో ప్రధాని మోదీ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారని కొనియాడారు. స్వదేశి వస్తువులను విక్రయించి దేశ ఆర్థిక బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లేశంగౌడ్, మాజీ అధ్యక్షుడు శ్రీనివాస్, నేతలు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు పాపన్నపేట మండల పరిధిలోని కొత్తపల్లిలో జరిగిన సేవా పక్షం కార్యక్రమానికి ఎంపీ హాజరై మాట్లాడారు. మోదీ పుట్టినరోజును పురస్కరించుకొని సేవా కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. బంగారు తెలంగాణ పేరుతో కొందరు ఇళ్లంతా బంగారం నింపుకొని, ఆస్తుల కోసం కొట్లాడుకుంటున్నారని ఎద్దేవా చేశారు. -
పత్రికా స్వేచ్ఛపై దాడే..
ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరించడమే కాకుండా కలంపై కత్తి కట్టడాన్ని పలు రాజకీయ పార్టీల నేతలు, జర్నలిస్టు సంఘాల నేతలు ముక్తకంఠంతో ఖండించారు. పత్రికాస్వేచ్ఛకు విఘాతం కలిగేలా, ప్రజాస్వామ్య విలువలకు భంగం వాటిల్లేలా ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై మండిపడ్డారు. ‘సాక్షి’ ఎడిటర్ ధనంజయరెడ్డితో పాటు విలేకరులపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ అంశానికి సంబంధించి పలువురి నేతల అభిప్రాయాలు వారి మాటల్లోనే.. పత్రికా స్వేచ్ఛను హరించడమే మెదక్జోన్: పత్రికా స్వేచ్ఛను హరించడం అంటే ప్రజల స్వేచ్ఛను హరించడమే. పత్రికలు ప్రజలకు, ప్రభుత్వాలకు మధ్య వారధిగా ఉంటాయి. వాస్తవాలు రాస్తే దాడులు చేయటం మంచి సాంప్రదాయం కాదు. కూటమి ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడటం దుర్మార్గం. – పద్మారెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాల ఎడిటర్పై కేసులు దారుణం నర్సాపూర్: సాక్షి ఎడిటర్ ధనుంజయ్రెడ్డిపై కేసులు పెట్టడం దారుణం. జర్నలిస్టులు పార్టీలకతీతంగా పని చేస్తారు. వారికి తగిన స్వేచ్ఛ ఉన్నప్పుడే ప్రజల సమస్యలు, సమాజంలో జరుగుతున్న అన్యాయాలు ఎత్తి చూపగలుగుతారు. గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఎడిటర్పై కేసులు పెట్టడం సరికాదు. – ఆంజనేయులుగౌడ్, డీసీసీ అధ్యక్షుడు ు నియంతృత్వ పాలన సాగిస్తోంది పత్రికా స్వేచ్ఛను హరిస్తూ ఏపీలోని కూటమి సర్కారు నియంతృత్వ పాలన సాగిస్తోంది. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. తమను విమర్శించే వార్తలు ప్రచురితమైతే వివరణ ఇవ్వాలే కానీ, పాలకుల ప్రోద్బలంతో పత్రికలపై పోలీసులు కేసులు పెట్టడం సరికాదు. ప్రశ్నించే వారిని ఇబ్బందులకు గురి చేయడం సరికాదు. – మల్లేశం, సీఐటీయూ జిల్లా కార్యదర్శి హేయమైన చర్య చిన్నశంకరంపేట(మెదక్): పత్రికా స్వేచ్ఛను హరించేలా ఏపీ ప్రభుత్వం వ్యవహరించడం సిగ్గుచేటు. ప్రజా సమస్యలపై, ప్రజల హక్కులపై ప్రశ్నిస్తే కక్షసాధింపు చర్యలకు పాల్పడడం దారుణం. పత్రికల్లో వచ్చే కథనాలతో పనితీరును మార్చుకోవాల్సింది పోయి, విలేకరులను కేసుల పేరుతో వేధించడం హేయమైన చర్య. – పోచయ్య, ఎస్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ముక్తకంఠంతో ఖండించాలి మెదక్జోన్: ఏపీలో సాక్షి కార్యాలయాలపై దాడులు చేస్తూ ఎడిటర్ నుంచి మొదలుకొని జర్నలిస్టులపై కేసు లు పెట్టడం అన్యాయం. ఇది పత్రికా స్వేచ్ఛను హరించడమే. దీనిని ప్రతి ఒక్కరూ ముక్తకంఠంతో ఖండించాల్సిన అవసరం ఉంది. – శంకర్దయాళ్చారి, టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు తప్పుడు కేసులు సరికాదు నర్సాపూర్: జర్నలిస్టులపై తప్పుడు కేసులు నమోదు చేయడం సరికాదు. ప్రతిపక్ష నాయకులు ప్రెస్మీట్లో అధికార పక్షంపై ఆరోపణలు చేసినప్పుడు వాటిని జర్నలిస్టులు రాయాల్సి ఉంటుంది. అంతమాత్రానా విలేకరులను బాధ్యులను చేయడం సరికాదు. నిజాలను నిర్భయంగా రాసే వాతావరణం ఉన్నప్పుడే పత్రికా స్వేచ్ఛ ఉంటుంది. – సునీతారెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే కక్ష సాధింపు సిగ్గుచేటు దుబ్బాక: ఏపీలో నిజాలను నిర్భయంగా రాస్తున్న సాక్షిపై కూటమి ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతుండటం దుర్మార్గం. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలని ప్రజలకు మద్దతుగా కథనాలు రాస్తున్న సాక్షిపై అక్రమ కేసులు బనాయిస్తూ, కార్యాలయాలపై దాడులకు పాల్పడటం పత్రిక స్వేచ్ఛను హరించడమే. సాక్షి ఎడిటర్ ధనంజయరెడ్డి, జర్నలిస్టులపై అక్రమంగా కేసులు పెడుతూ ఇబ్బందులకు గురిచేయడం సిగ్గుచేటు. దాడులు, అక్రమ కేసులను ప్రజాస్వామ్యవాదులు అందరూ ఖండించడంతో పాటుగా సాక్షికి అండగా నిలవాల్సిన అవసరం ఉంది. – కొత్త ప్రభాకర్రెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే -
ప్రభుత్వ అసమర్థతతోనే కష్టాలు
ఎమ్మెల్యే సునీతారెడ్డికౌడిపల్లి(నర్సాపూర్): కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతతోనే రైతులు కష్టాలు పడుతున్నారని ఎమ్మెల్యే సునీతారెడ్డి విమర్శించారు. గురువారం మండల కేంద్రంలో లోఓల్టేజీ విద్యుత్, యూరియా కొరతపై జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కౌడిపల్లి సబ్స్టేషన్లోని 50 ఎంవీఏ పవర్ ట్రాన్స్ఫార్మర్ను వేరే చోటుకు తరలించి, ఇక్కడ కేవలం 16 ఎంవీఏ ట్రాన్స్ఫార్మర్ను పెట్టడంతో కౌడిపల్లి, కొల్చారం, చిలప్చెడ్ మండలాల్లో లోఓల్టేజీ సమస్య తలెత్తిందన్నారు. యూరియా కోసం రోజుల తరబడి రైతులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. రైతుబోనస్ ఇవ్వలేదని, మిషన్ భగీరథ నీరు రాక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. అనంతరం విద్యుత్ సమస్యను పరిష్కరించాలని విద్యుత్శాఖ ఏడీకి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సార రామాగౌడ్, నాయకులు మహిపాల్రెడ్డి, సంతోష్రావు, నవీన్గుప్త, దుర్గారెడ్డి, నవీన్, సాయాగౌడ్, గౌరీశంకర్, అశోక్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
అక్రమాలకు పాల్పడితే చర్యలు
చిలప్చెడ్(నర్సాపూర్): ఉపాధి పనులు చేయకుండానే కూలీలకు వేతన చెల్లింపులు జరిగా యని డీఅర్డీఓ శ్రీనివాస్ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో 2024– 25 సంవత్సరానికి సంబంధించి రూ. 3.78 కోట్ల ఉపాధి పనులు, నిధుల విషయమై సామాజిక తనిఖీ నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒకరికి బదులు, మరొకరు కూలీకి వస్తే డబ్బులు చెల్లించవద్దని సిబ్బందిని ఆదేశించారు. గ్రామీణ పేదలకు ఉపాధి కల్పించే పథకమని, దీనిలో కూడా అక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో సీనియర్ క్వాలిటీ కంట్రోలర్ అధికారి జ్యోతి, హెచ్ఆర్ మేనేజర్ రాజేందర్రెడ్డి, విజిలెన్స్ అధికారి శ్రీహరి, స్టేట్ టీం మేనేజర్ అంజాగ ౌడ్, ఎస్అర్పీ నర్సయ్య, ఏపీఓ శ్యాంకుమార్, ఎంపీడీఓ ప్రశాంత్, ఈసీ భగవాన్రెడ్డి, పీఆర్ఏఈ మారుతి, పంచాయతీ కార్యదర్శులు, డీఅర్పీలు, ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు. -
సమగ్ర వివరాలు అందించండి
కలెక్టర్ రాహుల్రాజ్ మెదక్ కలెక్టరేట్/కొల్చారం(నర్సాపూర్): జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న సంక్షేమ పాఠశాలలు, కళాశాలలు, వసతి గృహాల నివేదిక తయారు చేసి వెంటనే అందజేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ రాహుల్రాజ్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ నుంచి గూగుల్ మీట్ ద్వారా వారికి దిశానిర్దేశం చేశారు. వర్షాకాలన్నీ దృష్టిలో ఉంచుకొని మరమ్మతులకు అవసరమైన వాటిని వెంటనే గుర్తించాలన్నారు. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా క్షేత్రస్థాయిలో నివేదికలు తయారు చేసేటప్పుడు పారదర్శకత పాటించాలన్నారు. అలాగే పాఠశాలలకు వసతి గృహాలకు అవసరమైన మౌలిక వసతులపై ఆరా తీశారు. కార్యక్రమంలో అన్ని సంక్షేమశాఖల ఉన్నతాధికారులు ఇరిగేషన్ పంచాయతీరాజ్, అధికారులు పాల్గొన్నారు. అంతకుముందు కొల్చారం మండల కేంద్రంలోని పీహెచ్సీని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. గడువు తీరిన మందులను వెంటనే తొలగించాలన్నారు. రోగులకు పూర్తిస్థాయిలో వైద్య సేవలు అందించాలని సిబ్బందిని ఆదేశించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేసి భూ రికార్డులకు సంబంధించిన దస్త్రాలను పరిశీలించారు. వారిని సస్పెండ్ చేయండి డీఎంహెచ్ఓకు కలెక్టర్ ఆదేశం కొల్చారం(నర్సాపూర్): కొల్చారం ప్రా థమిక ఆరోగ్య కేంద్రంలో కిందిస్థాయిలో పనిచేస్తున్న సిబ్బంది విధులకు తరచూ గైర్హాజరవుతున్నారని, వారిని వెంటనే తొలగించాలని డీఎంహెచ్ఓ శ్రీరామ్ను కలెక్టర్ రాహుల్రాజ్ ఆదేశించారు. గురువారం ఆస్పత్రిని తనిఖీ చేసి హాజరు పట్టికను పరిశీలించారు. ఆ సమయంలో కిందిస్థాయి సిబ్బంది విధులకు హాజరవుతున్నట్లు గుర్తించారు. సంతకాలు పెట్టి డ్యూటీ చేయడం లేదంటూ కలెక్టర్ విచారణలో తేలింది. దీంతో సదరు సిబ్బందిపై విచారణ జరిపి విధుల నుంచి తక్షణ మే తొలగించాలని ఆదేశించారు. -
కుమ్మేసిన వాన
మెదక్లో అత్యధికంగా 17 సెం.మీ వర్షపాతం ● కొల్చారంలో 8 సెం.మీ నమోదు ● లోతట్టు ప్రాంతాలు జలమయం ● పలువురి ఇళ్లలోకి చేరిన వరద ● ఇబ్బంది పడిన వాహనదారులు మెదక్జోన్: భారీ వర్షంతో మెదక్ మరోసారి అతలాకుతలం అయింది. జిల్లా కేంద్రంలోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ముఖ్యంగా రాందాస్ చౌరస్తాలో సరైన డ్రైనేజీ వ్యవస్థ లేక వర్షం నీరు భారీగా నిలిచింది. దీంతో వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. పలు దుకాణాల్లోకి నీరు చేరింది. స్పందించిన మున్సిపల్ అధికారులు అడ్డుగా ఉన్న డివైడర్ను జేసీబీతో తొలగించారు. అలాగే పట్టణంలోని గాంధీనగర్లో పలువురి ఇళ్లలోకి నీరు చేరటంతో ప్రజలు అవస్థలు పడ్డారు. బృంధావన్నగర్, ఫతేనగర్, సాయినగర్, నర్సిఖేడ్ కాలనీలు జలమయం అయ్యాయి. అలాగే మెదక్ మండలంలోని పలు గ్రామాల్లో 17 సెంటీ మీటర్లు, కొల్చారం మండలంలో 8 సెం.మీ, హవేళిఘణాపూర్లో 6 సెం.మీ చొప్పున వర్షపాతం నమోదైనట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. మళ్లీ వణికిన మెతుకుసీమ గురువారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఏకధాటిగా 3 గంటల పాటు కురిసిన కుండపోత వర్షానికి మెదక్ పట్టణం అంతా జలమయం అయింది. పట్టణాన్ని ఆనుకొని ఉన్న పుష్పలవాగు ఉధృతి మళ్లీ ప్రారంభం కావటంతో సమీపంలోని విద్యుత్ సబ్స్టేషన్ మళ్లీ నీట మునుగుతుందా.. అంటూ జనం భయాందోళన వ్యక్తం చేశారు. వర్షం తగ్గటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కలెక్టర్ పరిశీలన జిల్లా కేంద్రంలో భారీగా వర్షం కురవడంతో కలెక్టర్ రాహుల్రాజ్ లోతట్టు ప్రాంతాలను సందర్శించారు. అధికారులకు తగు సూచనలు చేశా రు. ఇందులో భాగంగా ఎస్సీ బాలుర వసతి గృహం, బాలికల పాలిటెక్నిక్, బాలికల కళాశాలను స్వయంగా పరిశీలించారు. రెండు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పట్టణంలోని ప్రధాన రహదారిపై పోటెత్తిన వరద -
మెదక్లో క్లౌడ్ బరస్ట్.. చెరువుల్లా రోడ్లు, కాలనీలు
సాక్షి, మెదక్: అతిభారీ వర్షం దాటికి మెదక్ మరోసారి అతలాకుతలం అయ్యింది. గురువారం జిల్లా కేంద్రంలో కేవలం మూడున్నర గంటల వ్యవధిలో 13 సెం.మీ వర్షం (క్లౌడ్ బరస్ట్) కురిసింది. దీంతో రోడ్లు చెరువులను తలపించాయి. వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. రాజీపల్లి 9.2, పాతుర్ 8 సెం. మీ వర్షం కురిసింది. మెదక్ పట్టణంలో లోతట్టు ప్రాంతాలకు భారీగా నీరు చేరింది. గాంధీ నగర్ కాలనీని రోడ్డు ముంచెత్తింది. పలు ప్రాంతాల్లో ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. రామ్ దాస్ చౌరస్తా నుంచి కొత్త బస్టాండ్ వరకు రోడ్డుపై వరద పోటెత్తింది. మెదక్-హైదరాబాద్ హైవేపై భారీగా వరద నీరు చేరడంతో జేసీబీతో మధ్యలో ఉన్న డివైడర్ను అధికారులు తొలగించారు. ఇదిలా ఉంటే.. తెలంగాణలో రాబోయే నాలుగు రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతోంది. ఈ క్రమంలో మొన్నటి పరిస్థితుల దృష్ట్యా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. -
ఫలితమివ్వని ప్రణాళిక
‘ఒక మార్పు.. అభివృద్ధికి మలుపు’ అనే నినాదంతో మున్సిపాలిటీల్లో ప్రభుత్వం చేపట్టిన వంద రోజుల ప్రణాళిక మొక్కుబడిగా సాగింది. జూన్ 2 నుంచి సెప్టెంబర్ 10 వరకు రోజుకో కార్యక్రమం చేపట్టాల్సి ఉన్నా.. మొదట్లో హడావుడి చేసినా అధికారులు ఆ తర్వాత పట్టించుకోవడం మరిచారు. దీంతో ‘చెత్త కదలక.. మురుగు పారక’ బల్దియాలు అధ్వానంగా మారాయి. అంతర్గత రోడ్లకు మరమ్మతులు కరువయ్యాయి. బుధవారం ‘సాక్షి’ పరిశీలనలో ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. నిధులు రాక.. పనులు చేపట్టకనర్సాపూర్: ప్రత్యేక నిధులు రాకపోవడంతో మున్సిపాలిటీలో శాశ్వత పనులు చేపట్టలేదు. మురికి కాలువలను శుభ్రం చేశారే తప్ప, ఎక్కడా కొత్తవి నిర్మించలేదు. తాగు నీటి సరఫరా, చెత్త సేకరణ, దోమల నివారణకు ఫాగింగ్ తదితర పనులు కొంతమేర చేపట్టారు. రెండో వార్డులోని కొన్ని ఏరియాల్లో మురికి కాలువలు లేకపోవడంతో నీరు రాయరావు చెరువులోకి, పదో వార్డులో కొంత ఏరియా నుంచి కోమటికుంటలోకి చేరుతోంది. మురికి కాలువలకు ఇరువైపులా పిచ్చిమొక్కలు ఏపుగా పెరగడం, కాలువల్లో చెత్త నిండి దుర్వాసన రావడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.రోడ్లపైనే మురుగు.. తూప్రాన్: పట్టణంలో ఎక్కడా అశించినస్థాయిలో మార్పు కనిపించడం లేదు. ‘ఎక్కడ వేసిన గొంగళి అక్కడే’ అన్న చందంగా మారింది. చెత్త సేకరణకు ఆటోలు వచ్చినా, కొందరు వేయడం లేదు. వర్షం నీరు, మురుగు నీరు రోడ్లపై పారుతూనే ఉంది. పట్టణంలోని ఆరోవార్డు అంగన్వాడీ కేంద్రం వద్ద రోడ్డుపై మిషన్ భగీరథ పైపులైన్ లీకేజీ అయి నీరు వృథాగా రోడ్డుపై పారుతోంది. వంద రోజుల ప్రత్యేక పారిశుద్ధ్య పనులు ఎలాంటి సత్ఫలితాలు ఇవ్వలేదని ప్రజలు విమర్శిస్తున్నారు.ప్రజల్లో మార్పు రావడం లేదుమున్సిపాలిటీ పరిధిలో వంద రోజుల ప్రత్యేక కార్యక్రమం పక్కాగా నిర్వహించాం. ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రత్యేక నిధులు మంజూరు కాలేదు. మున్సిపల్ సిబ్బందితోనే పనులు చేపట్టాం. నిత్యం తడి, పొడి చెత్త వేరు విధానంతో పాటు పలు అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించాం. కాని వారిలో ఎలాంటి మార్పు రావడం లేదు. – గణేశ్రెడ్డి, మున్సిపల్ కమిషనర్శాశ్వత పనులు చేపట్టలేదువంద రోజుల ప్రణాళికలో ప్రభుత్వం సూచించిన అన్ని కార్యక్రమాలు చేపట్టాం. ప్రత్యేక నిధులు రాకపోవడంతో ఎలాంటి శాశ్వత పనులు చేపట్టలేదు. వర్షాలు బాగా కురిసినందున దోమలు వ్యాప్తి చెందకుండా అంతటా ఫాగింగ్ చేపట్టాం. – శ్రీరాంచరణ్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ మెరుగైన వైద్యం అందించాలిఫొటోలకే పరిమితంరామాయంపేట(మెదక్): మున్సిపాలిటీ పరిధిలో వంద రోజుల ప్రణాళిక తూతూమంత్రంగానే కొనసాగింది. పారిశుద్ధ్యానికి పెద్దపీట వేసినా, పనులు మాత్రం సరిగా కొనసాగలేదు. మున్సిపల్ అధికారులు, సిబ్బంది కేవలం ఫొటోలకే పరిమితమయ్యారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం పట్టణంలో పారిశుద్ధ్య సమస్య తీవ్రంగా ఉంది. మౌలిక సదుపాయాల కల్పన విషయమై ఎంతమాత్రం పట్టించుకోలేదు. పచ్చదనం విషయంలో పట్టనట్లు వ్యవహరించారు. తడి, పొడి చెత్తను వేరు చేయటం లేదు. మురుగు నీటిని మల్లె చెరువులోకి మళ్లించడంతో దుర్వాసన వెదజల్లుతోంది. నల్లా కనెక్షన్ల ఆన్లైన్ చేయలేదు. వీధి విక్రయదారుల సంఘాల ఏర్పాటు కాలేదు. కొత్తగా మహిళా సంఘాల ఏర్పాటు చేపట్టలేదు.అంశాల వారీగా నిర్వహించాంమున్సిపాలిటీ పరిధిలో వంద రోజుల ప్రణాళిక నిబంధనల మేరకు సాఫీగా నిర్వహించాం. ఈమేరకు ఉన్నతాధికారులు తనిఖీలు నిర్వహించారు. పారిశుద్ధ్యం విషయమై ప్రత్యేకంగా చర్యలు తీసుకున్నాం. జీఓలో పేర్కొన్న విధంగా అంశాల వారీగా పనులు నిర్వహించాం – దేవేందర్, మున్సిపల్ కమిషనర్అంతంతమాత్రమే..మెదక్ మున్సిపాలిటీ: మున్సిపాలిటీలో వంద రోజుల ప్రణాళిక పనులు అంతంత మాత్రమే జరిగాయి. వార్డుల్లో అధికారులు నామమాత్రపు పర్యటనలతోనే సరిపెట్టారు. డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండగా, దోమల నివారణను అరికట్టడంలో విఫలమయ్యా రు. వార్డుల్లో తడి, పొడి చెత్తపై ర్యాలీలు నిర్వహించిన అధికారులు, అమలుపర్చడంలో ప్రత్యేక శ్రద్ధ కనబరచలేదని పలువురు ఆరోపిస్తున్నారు.సక్రమంగా చేపట్టాంవంద రోజుల ప్రణాళికలో భువన్ సర్వే, ట్రెడ్ లైసెన్స్లు అమలు సక్రమంగా నిర్వహించాం. తడి, పొడి చెత్త సేకరణ విషయమై ప్రజలకు అవగాహన కల్పించాం. – శ్రీనివాస్రెడ్డి, మున్సిపల్ కమిషనర్ -
ఆడబిడ్డలకు సర్కారు కానుక
● ఎస్హెచ్జీ గ్రూపు సభ్యులకు బతుకమ్మ చీరలు ● ఈనెల 15 వరకు వచ్చే అవకాశం ● జిల్లాలో 1.58 లక్షల మంది సభ్యులు రాష్ట్రంలోనే అతిపెద్ద వేడుకగా ఆడబిడ్డలు జరుపుకొనే బతుకమ్మ పండుగకు ప్రభుత్వం కానుక సిద్ధం చేస్తుంది. ప్రజల సంస్కృతి, సంప్రదాయాలను గౌరవిస్తూ చీరల పంపిణీకి ఏర్పాట్లు చేస్తోంది. ‘రేవంతన్న కానుక’ పేరుతో స్వయం సహాయక గ్రూపు (ఎస్హెచ్జీ) మహిళలకు మాత్రమే అందజేయాలని నిర్ణయించింది. ఈ మేరకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లలో నిమగ్నమైంది. మెదక్జోన్: జిల్లాలో 21 మండలాలు, 4 మున్సిపాలిటీలు ఉన్నాయి. గ్రామాల్లో 13,257 ఎస్హెచ్జీ గ్రూపులు ఉండగా, 1,37,239 మంది సభ్యులు, అలాగే నాలుగు మున్సిపాలిటీల పరిధిలో 2 వేల గ్రూపులు, 21 వేల మంది సభ్యులు ఉన్నారు. దీంతో జిల్లావ్యాప్తంగా మొత్తం 15,257 ఎస్హెచ్జీ గ్రూపులకు గాను 1,58,239 మంది సభ్యులు ఉన్నారు. కాగా ఈనెల 21 నుంచి బతుకమ్మ పండుగ ప్రారంభం కానున్న నేపథ్యంలో గ్రూపు సభ్యులందరకీ ‘రేవంతన్న కానుక’ పేరుతో బతుకమ్మ చీరలను పంపిణీ ప్రభుత్వం నిర్ణయించింది. కాగా జిల్లాకు ఈనెల 15 వరకు చేరనున్నట్లు అధికారులు చెబుతున్నారు. 60 శాతం మహిళలకే.. జిల్లాలో 18 సంవత్సరాలు పైబడిన మహిళలు మొత్తం 2,71,787 మంది ఉన్నారు. వీరిలో ఎస్హెచ్జీ గ్రూపుల్లో ఉన్నది మాత్రం 1,58,239 మంది మాత్రమే. కాగా వీరికి మాత్రమే చీరలను పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మిగిలిన 1,13,548 మంది మహిళలకు నిరాశే మిగిలే . అవకాశం ఉంది. గత ప్రభుత్వం బతుకమ్మ చీరలను 18 ఏళ్లు పైబడిన మహిళలందరకీ రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ చేసింది. 2023లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలో ఎన్నికల కోడ్ అమలులో ఉండడంతో చీరలను పంపిణీ చేయలేదు. ఈసారి ఎస్హెచ్జీ గ్రూపు సభ్యులకు మాత్రమే చీరలను పంపిణీ చేయనుంది. నాలుగు గోదాంల గుర్తింపు మహిళలకు బతుకమ్మ చీరల పంపిణీ కోసం జిల్లాలో మెదక్, చేగుంట, అల్లాదుర్గం, నర్సాపూర్లో గోదాంలను గుర్తించారు. వాటిలో డంప్ చేసి అక్కడి నుంచి వివిధ గ్రామాలకు పంపించనున్నారు. గ్రామైఖ్య సంఘాల ద్వారా పల్లెల్లో, మెప్మా ద్వారా మున్సిపాలిటీల్లో సభ్యులకు పంపిణీ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జాబితా పంపించాం బతుకమ్మ చీరల పంపిణీ కోసం ఎస్హెచ్జీ గ్రూపు సభ్యుల వివరాలను ఉన్నతాధికారులకు పంపించాం. చీరలు రాగానే అధికారుల ఆదేశాల మేరకు పంపిణీ చేస్తాం. – శ్రీనివాస్రావు, డీఆర్డీఓ -
అన్నదాతకు ఊరట..!
హవేళిఘణాపూర్(మెదక్): వరదలతో పంట పొలాల్లో పేరుకుపోయిన ఇసుక మేటలను తొలగించే పనులు ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. జిల్లావ్యాప్తంగా 21 మండలాల్లో దాదాపు 2,294 మంది రైతుల పంట పొలాల్లో 1,060 ఎకరాల వరకు పంట పొలాల్లో ఇసుక మేటలు పెట్టినట్లు గుర్తించారు. ఇందులో అత్యధికంగా 9 మండలాల్లో తీవ్రత ఉందన్నారు. ఇప్పటికే వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేసి పూర్తి వివరాలను ఉన్నతాధికారులకు అందజేశారు. ఈ మేరకు గ్రామ సభలో తీర్మానం చేసిన పనులను వెంటనే నిర్వహించాలని ఆదేశించారు. అత్యధికంగా పంటలు దెబ్బతిన్న వాటిలో హవేళిఘణాపూర్, రామాయంపేట, చేగుంట, నార్సింగి, నిజాంపేట, కొల్చారం, వెల్దుర్తి, తూప్రాన్, శివ్వంపేట మండలాలు ఉన్నాయి. ఒక్కో రైతుకు చెందిన రెండెకరాల చొప్పున పొలాల్లో ఇసుక మేటలు తీసేందుకు వీలు కల్పించారు. ఈ పనులు చేసేందుకు గాను రైతు ఎన్ఆర్ఈజీఎస్ జాబ్కార్డు కలిగి ఉండాలి. గ్రామసభ తీర్మానం మేరకు ఉపాధి హామీ కూలీలతో పనులు చేయాలని నిర్ణయించారు. రైతు పొలంలో ఎకరాకు 600 క్యూబిక్ మీ టర్ల చొప్పున తీసి 10 మీటర్ల దూరంలో పోయనున్నారు. దీంతో ఇటీవల వరదలతో సాగుకు ఇబ్బందికరంగా ఉన్న రైతులకు ఈ పనుల ద్వారా లబ్ధి చేకూరునుంది. రైతులు నష్టపోయారు కౌడిపల్లి(నర్సాపూర్): పంట పొలాల్లో ఏర్పడ్డ ఇసుక మేటలను ఉపాధి కూలీల చేత తొలగించుకునే అవకాశం వచ్చిందని డీఆర్డీఓ శ్రీనివాస్ తెలిపారు. బుధవారం కౌడిపల్లిలో ఉపాధి హామీ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బంది హాజరు, ఇతర రికార్డులు పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారీ వర్షాలతో పంటపొలాల్లో ఇసుక మేటలు ఏర్పడి రైతులకు నష్టం కలిగిందన్నారు. దీంతో ప్రభుత్వం స్పందించి చర్యలు చేపట్టిందన్నారు. వన మహోత్సవంలొ మొక్కలు నాటే కార్యక్రమం పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీనివాస్, ఏపీఓ పుణ్యదాస్, ఈసీ ప్రేంకుమార్, సిబ్బంది పాల్గొన్నారు. ‘ఉపాధి’తో ఇసుక మేటలకు మోక్షం -
వీరనారి చాకలి ఐలమ్మ
మెదక్ కలెక్టరేట్: అన్యాయం, అణచివేతకు వ్యతిరేకంగా పోరాడిన వీరనారి చాకలి ఐలమ్మ జీవితం నేటి తరాలకు స్ఫూర్తిదాయకమని కలెక్టర్ రాహుల్రాజ్ అన్నారు. బుధవారం కలెక్టరేట్లో ఐలమ్మ వర్ధంతిని జిల్లా బీసీ అభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో నిర్వహించగా, ఆమె చిత్రపటానికి కలెక్టర్ నివాళులర్పించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సాయుధ పోరాటంలో ఐలమ్మ చూపిన ధైర్య సాహసాలు ఎనలేనివని కొనియాడారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేశ్, రజక సంఘం జిల్లా అధ్యక్షుడు సంగుస్వామి, బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు మెట్టు గంగారాం పాల్గొన్నారు. రాష్ట్రస్థాయిలో రాణించాలి మెదక్ కలెక్టరేట్: విద్యార్థుల్లో దాగి ఉన్న కళా నైపుణ్యాలను వెలికితీయాలనే ఉద్దేశంతోనే కళా ఉత్సవ్ పోటీలు నిర్వహిస్తున్నామని డీఈ ఓ రాధాకిషన్ తెలిపారు. బుధవారం పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలలో పోటీలను ప్రారంభించి మాట్లాడారు. జిల్లాలో ఉత్తమ ప్రదర్శన చేసి రాష్ట్రస్థాయిలో రాణించాలని విద్యార్థులకు సూచించారు. రెండు రోజుల పాటు పో టీలు జరుగుతాయని, మొదటి రోజు పాటలు, వాయిద్యాల పోటీలు, సంప్రదాయ కథల పోటీలు, రెండో రోజు సంప్రదాయ, జానపద నృత్యం, డ్రామా పోటీలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంఈఓ శంకర్, కళాఉత్సవ్ కమిటీ కన్వీ నర్ రామేశ్వర్ప్రసాద్, ప్రధానోపాధ్యాయులు రేఖ తదితరులు పాల్గొన్నారు. మలేరియా పరీక్షలు తప్పనిసరి చిన్నశంకరంపేట(మెదక్): జ్వరంతో అస్పత్రికి వచ్చే ప్రతి ఒక్కరికి మలేరియా రక్త పరీక్షలు తప్పనిసరిగా నిర్వహించాలని డీఎంహెచ్ఓ శ్రీరామ్ సిబ్బందిని ఆదేశించారు. బుధవారం నార్సింగి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. మందుల వివరాలు, ఓపీ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా వైద్యులతో సమావేశం నిర్వహించారు. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. గ్రామాల్లో ఫీవర్ సర్వే నిరంతరం కొనసాగించాలన్నారు. జ్వరంతో వచ్చేవారికి ధైర్యం కల్పించడంతో పాటు అవసరమైన మందులు అందించాలన్నారు. ఆయన వెంట వైద్యులు. సిబ్బంది ఉన్నారు. దరఖాస్తులు పరిష్కరించాలి నిజాంపేట(మెదక్): భూ భారతి సమస్యలను వెంటనే పరిష్కరించాలని మెదక్ ఆర్డీఓ రమా దేవి అధికారులను ఆదేశించారు. బుధవారం తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించారు. ఈసందర్భంగా మండలంలో యూరి యా కొరత గురించి అడిగి తెలుసుకున్నారు. అలాగే భూ భారతి సదస్సులో వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని సూచించారు. మండలంలో గత 100 ఏళ్ల నాటి ఓటర్ లిస్ట్ను సరిచేయాలన్నారు. సమావేశంలో తహసీల్దార్ శ్రీనివాస్, డిప్యూటీ తహసీల్దార్ రమ్యశ్రీ, ఆర్ఐ ఇమ్మాద్ పాల్గొన్నారు. ‘నిబంధనలు పాటించాలి’ మెదక్ కలెక్టరేట్: జాతీయ జెండాను ఎగురవేసే, సంరక్షించే విషయంలో కొన్ని నియమ, నిబంధనలు పాటించాలని జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ ఆర్ఎం శుభవల్లి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉల్లంఘనకు పాల్పడితే చట్ట ప్రకారం శిక్షార్హులు అవుతారని హెచ్చరించారు. వేడుకల అనంతరం జాతీయ జెండాలను కొంత మంది ఇష్టానుసారం పడేస్తున్నారని, ఇది చట్టరీత్యా నేరం అన్నారు. గణ తంత్ర వేడుకలకు ముందు కాగితపు జెండాల వినియోగానికి సంబంధించి కేంద్ర హోంశాఖ కొన్ని సూచనలు చేసిందన్నారు. -
రెండెకరాలు ఎండిపోతుంది
రాయినిపల్లి ప్రాజెక్టు కింద 2 ఎకరాల్లో వరి వేశాను. ఇందుకోసం రూ. 22 వేల పెట్టుబడి పెట్టాను. భారీ వర్షాలకు కాలువలు తెగిపోయాయి. ఇప్పటికే నీటి తడులు లేక 10 రోజులు అవుతుంది. పొలం ఎండిపోతుంది. – పోచయ్య, రైతు రాయినిపల్లి ప్రతిపాదనలు పంపుతాం కాలువల మరమ్మతుల కోసం ప్రభుత్వానికి రెండు రకాల ప్రతిపాదనలు పంపిస్తాం. ఒకటి వెంటనే తాత్కాలిక మరమ్మతులు చేపట్టి పంటలకు సాగునీరు అందించడానికి, మరోటి శాశ్వత మరమ్మతుల కోసం పంపిస్తాం. – రఘునాథ్రావు, ఎస్ఈ ఇరిగేషన్ -
అదే వరుస.. అదే గోస
బుధవారం శ్రీ 10 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025రైతులకు తప్పని యూరియా తిప్పలు చేగుంట(తూప్రాన్)/నర్సాపూర్/మనోహరాబాద్ (తూప్రాన్)/తూప్రాన్/శివ్వంపేట(నర్సాపూర్): ప్రభుత్వ వైఫల్యం.. అధికారుల నిర్లక్ష్యం కారణంగా యూరియా కోసం రైతులకు తిప్పలు తప్పడం లేదు. బస్తా యూరియా కోసం గంటల తరబడి నిరీక్షించినా ఫలితం లేకుండా పోతోంది. పొలాల్లో ఉండాల్సిన రైతులు.. యూరియా కోసం చక్కర్లు కొడుతున్నారు. మంగళవారం యూరియా వస్తుందని సమాచారం తెలుసుకున్న రైతులు.. చేగుంటలో భారీ క్యూ కట్టారు. వ్యవసాయ అధికారులు టోకె న్లు అందించి 890 బస్తాల యూరియాను అందించారు. నర్సాపూర్లో మంగళవారం తెల్లవారు జా ము నుంచే రైతు వేదిక వద్ద క్యూ కట్టారు. మనోహరాబాద్ మండల కేంద్రంలోని రైతు వేదిక వద్ద టోకెన్లు అందజేయడంతో రైతులు ఉదయం నుంచే బారులు తీరారు. 350 మందికి టోకెలు అందజేశా రు. వీరికి రెండు రోజుల్లో యూరియా బస్తాలను అందజేస్తామన్నారు. తూప్రాన్ పట్టణంలోని రైతు ఆగ్రో సేవా కేంద్రం వద్ధకు పెద్ద సంఖ్యలో రైతులు చేరుకున్నారు. యూరియా లేదని తెలియడంతో రోడ్డుపై భైఠాయించి రాస్తారోకో చేపట్టారు. దీంతో రోడ్డుకు ఇరువైపుల వాహనాలు నిలిచిపోయాయి. శివ్వంపేట ప్రాథమిక సహకార సంఘం వద్ద యూరియా కోసం సోమవారం అర్ధరాత్రి నిద్రపోతున్న వారికి పోలీసులు నచ్చజెప్పి ఇళ్లకు పంపించి వేశారు. మంగళవారం ఉదయం కూడా పలు గ్రామాల నుంచి రైతులు వచ్చినప్పటికి యూరియా రావడం లేదని చెప్పడంతో రైతులు వెనుతిరిగి వెళ్లారు. -
జిల్లాల్లో క్యాన్సర్ డే కేర్ కేంద్రాలు
సంగారెడ్డి: తెలంగాణ ప్రభుత్వం వైద్య ఆరోగ్య రంగంలో మరో ముందడుగు వేసిందని, క్యాన్సర్ వ్యాధి చికిత్సను ప్రజలకు చేరువ చేసేందుకు అన్ని జిల్లాల్లో క్యాన్సర్ డే కేర్ సెంటర్ల ప్రారంభం ద్వారా ఆ వ్యాధిపై పోరాటానికి శ్రీకారం చుట్టిందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు. సంగారెడ్డి వైద్య ఆరోగ్య కళాశాల నుంచి వర్చువల్ విధానంలో రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాలలో ఏర్పాటు చేసిన క్యాన్సర్ డే కేర్ సెంటర్లను మంత్రి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా దామోదర మాట్లాడుతూ...ప్రజలకు క్యాన్సర్పై అవగాహన లేకపోవడంతో వ్యాధి నిర్ధారణలోనూ, చికిత్స అందించడంలోనూ జరిగే జాప్యం కారణంగానే చాలామంది ప్రాణాలు కో ల్పోతున్నారన్నారు. ఇకమీదట అలా జరగకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం క్యాన్సర్ నిర్మూలన కార్యక్రమం చేపట్టిందని తెలిపారు. కార్యక్రమానికి అడ్వైజర్గా రాష్ట్రానికి చెందిన ప్రముఖ క్యాన్సర్ వ్యాధి నిపుణుడు డాక్టర్ నోరి దత్తాత్రేయను నియమించిందని వెల్లడించారు. క్యాన్సర్ వ్యాధి నియంత్రణలో ఆయన తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందన్న నమ్మకాన్ని మంత్రి ఈ సందర్భంగా వ్యక్తం చేశారు. క్యాన్సర్ డే కేర్ సెంటర్లలో రోగులకు సమయానుకూల స్క్రీనింగ్ పరీక్షలు, రేడియేషన్, పాలియేటివ్ కేర్ వంటి సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. త్వరలో అన్ని జిల్లాలలో మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ వాహనాలను సైతం అందుబాటులోకి వస్తాయని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో నిమ్స్, ఎన్ఎంజే ఆస్పత్రులలో 80 పడకల క్యాన్సర్ ప్రత్యేక విభాగాలు కొనసాగుతున్నాయని, త్వరలో వరంగల్, సంగారెడ్డి, ఖమ్మం, మహబూబ్నగర్ జిల్లాల్లో క్యాన్సర్ సెంటర్లు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. నర్సింగ్ విద్యార్థులకు విదేశీ భాషలపై శిక్షణకు ఒప్పందం రాష్ట్రంలో ప్రతి ఏటా 3,000 మంది నర్సింగ్ విద్యార్థులకు ప్రవేశాలు కల్పిస్తున్నట్లు మంత్రి దామోదర తెలిపారు. నర్సింగ్ విద్యార్థులకు జర్మన్, ఇంగ్లిష్లతోపాటు పలు విదేశీ భాషల్లో శిక్షణనివ్వడం కోసం ఇంగ్లిష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ (ఇఫ్లూ)తో వైద్య ఆరోగ్యశాఖ ఒప్పందం చేసుకుందన్నారు. ఈ ఒప్పందం వల్ల నర్సింగ్ విద్యార్థులకు విదేశీ భాషలపై ప ట్టు సాధించేలా ఇఫ్లూ అధ్యాపకులు శిక్షణనిస్తారని వెల్లడించారు. ఈ శిక్షణతో నర్సింగ్ విద్యార్థులకు విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయన్నారు. వైద్య ఆరోగ్య శాఖ ప్రధాన కార్యదర్శి క్రిస్టినా జడ్ చోగ్తూ, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ నరేంద్రకుమార్, డైరెక్టర్ ఆఫ్ హెల్త్ డాక్టర్ రవీంద్రకుమా ర్, అదనపు డీఎంఈ డాక్టర్ వాణి, డైరెక్టర్ ఆఫ్ ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్ డాక్టర్ శ్రీనివాసులు, జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య, టీజీఐఐసీ చైర్మన్ నిర్మలారెడ్డి, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, వైద్య కళాశాల అధ్యాపకులు, జీజీహెచ్ సూప రింటెండెంట్, వైద్యులు, నర్సింగ్ కళాశాల విద్యార్థులు, సంబంధితశాఖల అధికారులు పాల్గొన్నారు. డే కేర్ సెంటర్ల ప్రారంభోత్సవంలోమంత్రి దామోదర త్వరలో అందుబాటులోకి క్యాన్సర్స్క్రీనింగ్ టెస్ట్ వాహనాలు డాక్టర్ నోరి దత్తాత్రేయ అడ్వైజర్గా క్యాన్సర్ నిర్మూలన కార్యక్రమం నర్సింగ్ విద్యార్థులకు విదేశీ భాషల శిక్షణ కోసం ఇఫ్లూతో ఒప్పందం -
పీహెచ్సీకి స్థల ధ్రువీకరణ పత్రం అందజేత
నిజాంపేట(మెదక్): నిజాంపేట మండల కేంద్రంలో నూతనంగా నిర్మించబోయే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటుకు వైద్య అధికారులు, రెవెన్యూ సిబ్బంది స్థల పరిశీలన చేశారు. ఈ మేరకు మంగళవారం నిజాంపేట గ్రామ శివారులోని 629 సర్వే నంబర్లోని ఒక ఎకరం 20 గుంటల భూమిని మండల సర్వేయర్ ప్రశాంత్ సరిహద్దులు చేసి మండల వైద్య ఆరోగ్య శాఖ అదికారిని డాక్టర్ హరిప్రియకు అప్పగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నిజాంపేట మండలానికి వైద్య ఆసుపత్రి నిర్మించిన్నట్లయితే పేదల ప్రజలకు ఎంతో ఉపయోగం ఉంటుందన్నారు. కార్యక్రమంలో డాక్టర్ సాయికృష్ణ, ఎఎన్ఎమ్ బాలమణి తదితరులు పాల్గొన్నారు. కార్మిక వ్యతిరేక విధానాలను ఎండగడతాం సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లికార్జున్ నర్సాపూర్: కేంఽద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న లేబర్ కోడ్కు వ్యతిరేకంగా సీఐటీయూ ఆధ్వర్యంలో ఉద్యమాలు చేపడుతామని యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లికార్జున్ అన్నారు. మంగళవారం ‘కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు– ప్రభుత్వాల విధానాలు’అనే అంశంపై సెమినార్లో పాల్గొని మాట్లాడారు. కార్మిక వ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు ఎండగడుతున్నామని చెప్పారు. సీఐటీయూ రాష్ట్ర ఐదవ మహాసభలు డిసెంబరు 7నుంచి 9వరకు మెదక్ జిల్లా కేంధ్రంలో నిర్వహించనున్నట్లు ఆయన చెప్పారు. కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. పరిశ్రమల్లో కాంట్రాక్టు కార్మికులకు భద్రత లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. సెమినార్లో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు నాగరాజు, నాయకులు చంద్రయ్య, నర్సింలు, పెంటయ్య, రుబ్లీ, పుష్ప, అనిత తదితరులు పాల్గొన్నారు. ప్రతి గ్రామానికి నాణ్యమైన విత్తనాలురైతు విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త నిర్మల పెద్దశంకరంపేట(మెదక్): ప్రతీ గ్రామానికి క్యూఎస్ఈవీ ద్వారా నాణ్యమైన విత్తనాలు అందిస్తామని జోగిపేట తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ నిర్మల అన్నారు. మంగళవారం మండల పరిధిలోని బూర్గుపల్లి, ముసాపేట తదితర గ్రామాలలో క్యూఎస్ఈవీ (క్వాలిటీ సీడ్స్ ఎవ్రీ విలేజ్) పర్యటించి వరి పంటను పరిశీలించారు. ఈ పంట ద్వారా వచ్చిన వరి ధాన్యాన్ని ఆయా గ్రామాలలో రైతులకు విత్తనాల రూపంలో అందిస్తామని ఆమె పేర్కొన్నారు. కార్యక్రమలలో ఏఓ కృష్ణ, ఏఈఓలు అఖిల్, వినీత్, రైతులు నర్సింహాగౌడ్, అంజిరెడ్డి తదితరులున్నారు. పాన్బ్రోకర్లపై చర్యలుజిల్లా ఎస్పీ శ్రీనివాసరావు రామాయంపేట(మెదక్): నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న పాన్బ్రోకర్లపై చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఆయన మంగళవారంరాత్రి రామాయంపేట పోలీస్స్టేషన్కు వచ్చిన సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా అక్రమంగా కొనసాగుతున్న పాన్ బ్రోకర్ల వివరాలు సేకరిస్తున్నామన్నారు. పెండింగ్లో ఉన్న కేసులను సత్వరమే పరిష్కరించాలని, సైబర్ నేరాల నియంత్రణకు విస్తృత ప్రచారం నిర్వహించాలని ఆయన ఆదేశించారు. రాత్రి బీట్ల సంఖ్యను పెంచి చోరీలను నివారించాలని ఆదేశించారు. స్థానిక సీఐ వెంకట్రాజాగౌడ్, ఎస్బీ సీఐ సందీప్రెడ్డి , ఎస్ఐ బాల్రాజ్ ఆయన వెంట ఉన్నారు. -
తడి లేక వాడిపోతున్న వరి
గత నెల చివరి వారంలో కురిసిన భారీ వర్షాలకు రాయినిపల్లి ప్రాజెక్టుకు సంబంధించిన రెండు కాల్వలు తెగిపోయాయి. దీంతో 2,500 ఎకరాల ఆయకట్టు ప్రమాదంలో పడింది. 10 రోజులుగా నీటి తడులు లేక పొలాలు ఎండుముఖం పడుతున్నాయి. తెగిన కాలువలు మరమ్మతులకు నోచుకోవడం లేదు. ఆ దిశగా ఇరిగేషన్ అధికారులు చర్యలు చేపట్టడం లేదు. మరో నెల రోజుల్లో పంట చేతికొచ్చే సమయంలో సాగు నీరు లేక అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. – మెదక్జోన్ నిజాం పాలనలో మెదక్ మండల పరిధిలోని రాయినిపల్లి శివారులో ప్రాజెక్టును నిర్మించారు. దీని వాటర్ స్టోరేజ్ కెపాసిటీ 232 ఎంసీఎఫ్టీ. దీని పరిధిలో రాయినిపల్లి, తిమ్మనగర్, పాతూర్, మక్తభూపతీపూర్, గుట్టకిందిపల్లి, వెంకటాపూర్, కోంటూర్ గ్రామాల పరిధిలోని సుమారు 2,500 ఎకరాల ఆయకట్టు ఉంది. అదనంగా మరో 500 ఎకరాలకుపైగా ఉంది. కాగా రెండు కాలువల ద్వారా ఆయకట్టుకు సాగు నీటిని అందిస్తోంది. ఇందులో పైభా గంలో గల కాలువ మూడు కిలోమీటర్ల పొడవు ఉండగా, కింది భాగంలో నిర్మించినది రెండున్నర కిలో మీటర్లకుపైగా ఉంటుంది. గత నెల చివరి వారంలో కురిసిన భారీ వర్షాలకు ప్రాజెక్టు పొంగి పొర్లగా, సాగునీరు అందించే రెండు కాలువలు ధ్వంసం అయ్యాయి. అయితే ప్రాజెక్టు కట్టిన సమయంలో వీటిని నిర్మించగా, ఇప్పటివరకు చెక్కు చెదరకుండా ఉన్నాయని, భారీ వరదలకు తెగిపోయాయని పలువురు చెబుతున్నారు. ఇదిలా ఉండగా కొందరు రైతులు వాగులో మోటార్లు ఏర్పాటు చేసి పంటలను కాపాడుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎండిపోతున్న పొలాలు పంటలకు సాగునీరు అందించే కాలువలు ధ్వంసం కావడంతో ప్రాజెక్టు నిండా నీరు ఉన్నప్పటికీ, పది రోజులుగా నీటి తడులు అందించలేని దుస్థితి ఏర్పడింది. ఫలితంగా వరి పొలాలు ఎండు ముఖం పడుతున్నాయి. మరో వారం రోజులు ఇదే పరిస్థితి ఉంటే ఆశలు వదులుకోవాల్సిందేనని ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. శాశ్వత మరమ్మతులకు రూ. కోటి అవసరం భారీ వర్షాలతో తెగిపోయిన రాయినిపల్లి ప్రాజెక్టు ఆనకట్ట కాలువల శాశ్వత మరమ్మతులకు రూ. కోటి వరకు ఖర్చు అవుతుందని ఇరిగేషన్ అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. అయితే కాలువలకు ఎప్పుడు మరమ్మతులు చేస్తారు..?సాగునీరు ఎప్పుడు అందిస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది.భారీ వర్షాలకు తెగిన రాయినిపల్లి ప్రాజెక్టు కాల్వలు -
చిన్న కారణాలతో రోగులను బయటకు పంపొద్దు
● త్వరలో గైనకాలజిస్ట్ పోస్టు మంజూరు ● వీవీపీ కోఆర్డినేటర్ శివదయాల్ ● ప్రభుత్వ ఆసుపత్రి సందర్శనరామాయంపేట(మెదక్): విషజ్వరాలతో విలవిల’శీర్షికన సాక్షిలో ప్రచురితమైన కథనానికి ఆ శాఖ అధికారులు స్పందించారు. మంగళవారం వైద్య విధాన పరిషత్ జిల్లా కో ఆర్డినేటర్ డాక్టర్ శివదయాల్ స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి రోగులతో మాట్లాడారు. వైద్య సేవలపై ఆరా తీశారు. రికార్డులను పరిశీలించారు. ఆసుపత్రిలో ఉన్న మందుల స్టాక్ను పరిశీలించిన అయన సిబ్బందికి తగు సూచనలు చేశారు. ఎట్టి పరిస్థితుల్లో మందుల కోసం ప్రైవేట్ మెడికల్ స్టోర్లకు రాయవద్దని చెప్పారు. నిరుపయోగంగా ఉన్న ఎక్స్రే యంత్రాన్ని వినియోగంలోకి తీసుకొస్తామని హామీ ఇచ్చారు. ఆసుపత్రిలో ప్రసూతి వైద్య సేవలు అందడం లేదనే విషయమై ఆయన మాట్లాడుతూ.. త్వరలో గైనకాలజిస్ట్ పోస్టును మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. చిన్న చిన్న కారణాలతో రోగులకు బయటకు పంపవద్దని డాక్టర్ శివదయాల్ ఆదేశించారు. ఆసుపత్రిలో మందుల కొరత లేదన్నారు. ఆయనతో పాటు సూపరింటెండెంట్ డాక్టర్ లింబాద్రి తదిరులు ఉన్నారు. ‘గురు’తర బాధ్యత మీదే శివ్వంపేట(నర్సాపూర్): సమాజంలో ఉపాధ్యాయ వృత్తికి ప్రత్యేక గుర్తింపు ఉందని ఎమ్మెల్యే సునీతారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్ పర్సన్ సుహాసినిరెడ్డి అన్నారు. గురుపూజోత్సవ సందర్భంగా మండలంలోని ఉత్తమ ఉపాధ్యాయులను మంగళవారం ఎంపీడీఓ సమావేశ మందిరంలో సన్మానించి జ్ఞాపికలను అందజేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఉపాధ్యాయులు అంకిత భావంతో విధులు నిర్వహిస్తూ విద్యార్థులను భావిభారత పౌరులుగా తీర్చిదిద్దడంలో కీలక భూమిక వహించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి విద్యార్ధి పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరిచి ఉన్నత స్థాయికి ఎదిగే విధంగా పాటుపడాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ కమలాద్రి, ఎంపీ డీఓ వెంకటలక్ష్మమ్మ, ఎంఈఓ బుచ్చానాయక్, జీఎంఆర్ సంస్థ ప్రతినిధులు భారతికోడె, శ్రీనివాస్, వివిధ పార్టీల నాయకులు మన్సూర్, గంగాధర్,వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు, తదితరులు ఉన్నారు. -
గండ్లు పూడ్చరేం?
సింగూరు ఆయకట్టు రైతుల సాగు ఇక్కట్లు పుల్కల్(అందోల్): ఇటీవల భారీ వర్షాల కారణంగా తెగిపడ్డ పంటకాలువలు, యూరియా కొరతతో రైతులు కష్టాలనెదుర్కొంటున్నారు. ఈ కష్టాలకు తోడు ఈ ఏడు వానాకాలం నుంచి సింగూరు సాగునీరు వస్తాయా లేదోనని ఎదురుచూసిన రైతులకు మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టుగా సింగూరు కాలువకు పడ్డ గండ్లు రైతుల్ని మరింత కుంగదీస్తున్నాయి. రైతులకు ఊహించని షాక్ ఇటీవల కురిసిన భారీ వర్షాలకు బస్వాపూర్ చెరువు అలుగు పారి నీరు కాలువలోకి రావడం, మిన్పూర్ వద్ద కాలువకు బుంగపడి ఆ నీరంతా చెరువులోకి వెళ్లి అలుగు పారడంతో దిగువన వరిచేలు మునిగిపోయాయి. ఇసోజిపేట వద్ద ఫారెస్టు నీళ్లు కాలువలోకి చేరి ప్రవాహ ఒత్తిడి పెరగడంతో అక్కడ మరో గండి పడి నీరంతా ఫారెస్టు నుంచి మంజీరా నదికి చేరాయి. దీంతో సాగునీటిని నిలిపివేయడంతో రైతులకు ఊహించని షాక్ తగిలింది. ఆది నుంచి అంతే వానాకాలం ప్రారంభం నుంచి సింగూరు కాలువలకు సిమెంట్ లైనింగ్ పేరుతో కాలయాపన చేశారు. వానాకాలం ప్రారంభమై రెండు నెలలైనా సిమెంట్ లైనింగ్ ప్రారంభం కాలేదు. అలాగే సాగునీరు విడుదల చేయలేదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో స్థానిక నాయకత్వానికి ఇబ్బంది కలుగుతుందని భావించి కాంగ్రెస్ నాయకులు మంత్రి దామోదరను సంప్రదించి సిమెంట్ లైనింగ్ పనులు ఆపించి వరినాట్లకు నీటిని వదిలారు.ట్రాక్టర్పై వెళ్లి గండ్లను పరిశీలించి.. భారీ వర్షాలు కురుస్తున్నప్పుడే మంత్రి దామోదర రాజనర్సింహ రహదారులు బాగోలేకపోయినా ట్రాక్టర్పై జిల్లా కలెక్టర్ ప్రావీ ణ్య, జిల్లా ఎస్పీ పంకజ్ పరితోశ్, నీటి పారుదల శాఖ అధికారులతో కలిసి వెళ్లి మరీ తెగిపడ్డ గండ్లను పరిశీలించారు. అక్కడే గండ్లను పూడ్చాలని ఆదేశించారు. ఈ ఘటన జరిగి 25 రోజులు కావొస్తున్నా గండ్లను పూడ్చలేకపోయారు. స్వయంగా మంత్రే ఆదేశించినా సమస్య పరిష్కారం కాకపోవడంతో రైతులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు గండ్లను పూడ్చి సాగునీటిని సరఫరా చేయాలని రైతులు కోరారు. -
లబ్ధిదారులకు ఊరట!
మెదక్జోన్: జీఎస్టీ తగ్గింపుతో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు కొంత ఊరట కలగనుంది. ఇంటి నిర్మాణాలకు ఉపయోగించే స్టీలు, సిమెంట్ తగ్గింపుతో ఖర్చులు తగ్గనున్నాయి. ఇప్పటివరకు వీటిపై 28 శాతం జీఎస్టీ స్లాబ్ ఉండగా, కేంద్రం 18 శాతానికి తగ్గించింది. ఒక్కో ఇంటి నిర్మాణానికి 180 సిమెంట్ బస్తాలతో పాటు, 1,500 కిలోల స్టీలు అవసరం పడుతుంది. ప్రస్తుతం సిమెంట్ బస్తా ధర మార్కెట్లో రూ. 350 ఉండగా, ఒక్కో బస్తాపై సుమారు రూ. 30 తగ్గే అవకాశం ఉంది. ఈ లెక్కన రూ. 5 వేల నుంచి రూ. 6 వేల వరకు ఆదా కానుంది. అలాగే స్టీలు టన్ను రూ. 5,500 నుంచి 5,800 వరకు ఉంది. దీనిపై రూ. 8 వేల నుంచి రూ. 9 వేల వరకు ఆదా కానుంది. మొత్తంగా తగ్గిన జీఎస్టీతో ఒక్కో లబ్ధిదారుడికి రూ. 10 నుంచి రూ. 15 వేల వరకు డబ్బులు ఆదా అవుతాయని సమాచారం. తగ్గిన ధరలు ఈనెల 22 నుంచి అమలులోకి రానున్నాయి. ఇసుక కోసం తప్పని ఎదురుచూపులు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు ఇసుకను ఉచితంగా సరఫరా చేస్తామని ప్రభుత్వం తెలిపింది. కానీ ఇప్పటివరకు ఎక్కడా ఉచితంగా ఇవ్వలేదు. ఒక్కో ఇంటికి 10 ట్రాక్టర్ల ఇసుక అవసరం ఉంది. ట్రాక్టర్ ఇసుక రూ. 3,500 నుంచి రూ. 4 వేల వరకు వెచ్చించి లబ్ధిదారులు కొనుగోలు చేస్తున్నారు. ఈ లెక్కన కేవలం ఇసుకకే రూ. 35 వేలు నుంచి రూ. 40 వేల వరకు వెచ్చించాల్సి వస్తోందని లబ్ధిదారులు వాపోతున్నారు. త్వరలో ఇసుక సరఫరా జిల్లాలో ఇసుక క్వారీలు లేకపోవడంతో ఇతర జిల్లాల నుంచి తెప్పించి మెదక్, నర్సాపూర్లో డంప్ చేయాలని నిర్ణయించాం. ఇప్పటికే నర్సాపూర్కు కొంత ఇసుకను తెప్పించాం. త్వరలో మెదక్కు తెప్పించి ప్రజాప్రతినిధులకు అందిస్తాం. సిమెంట్, స్టీలుపై జీఎస్టీ తగ్గింపుతో లబ్ధిదారులకు కొంతమేర ఉపశమనం కలిగే అవకాశం ఉంది. – మాణిక్యం, హౌసింగ్ పీడీ మంజూరైన ఇళ్లు ప్రారంభించినవి బేస్మెంట్ వరకు గోడలు, స్లాబులు పూర్తి బిల్లుల చెల్లింపు 9,000 6,000 2,000 285 రూ. 20 కోట్లు సిమెంట్, స్టీలుపై తగ్గనున్న జీఎస్టీ ఇందిరమ్మ ఇంటి నిర్మాణ ఖర్చు ఆదా రూ. 10 నుంచి 15 వేల వరకు మిగులు -
ప్రజావాణిని సద్వినియోగం చేసుకోండి
మెదక్ మున్సిపాలిటీ: ప్రజావాణిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు సూచించారు. సోమవారం ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈసందర్భంగా 13 మంది తమ తమ సమస్యలపై ఫిర్యాదులు అందజేయగా, వాటిని చట్ట ప్రకారం పరిష్కరించి బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అలాగే పలు ఉత్సవ కమిటీలపై కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. వినాయక నిమజ్జన ఉత్సవం సందర్భంగా కానిస్టేబుల్తో దురుసుగా ప్రవర్తించిన పెద్దబజార్కు చెందిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. -
ప్రతీ ఓటు అమూల్యమైనదే
కలెక్టర్ రాహుల్రాజ్మెదక్ కలెక్టరేట్/టేక్మాల్(మెదక్): ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్క ఓటు అమూల్యమైందని కలెక్టర్ రాహుల్రాజ్ అన్నారు. సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో 21 జెడ్పీటీసీ, 190 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు సజావుగా జరిగేలా 1,052 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఓటరు జాబితా, పోలింగ్ కేంద్రాల ముసాయిదా తదితర విషయాలపై చర్చించారు. జిల్లాలో పురుష ఓటర్లు 2,51,532, మహిళా ఓటర్లు 2,71,787, ఇతరులు 08, మొత్తం 5,23,327 మంది ఓటర్లున్నారని తెలిపారు. అర్హులైన ప్రతి ఓటరు పేరు జాబితాలో ఖచ్చితంగా ఉండాలని తెలిపారు. అభ్యంతరాలు పరిశీలించిన తర్వాత తుది జాబితాను ఈనెల 10న ప్రకటిస్తామని స్పష్టం చేశారు. సమావేశంలో అదనపు కలెక్టర్ నగేశ్, జెడ్పీ సీఈఓ, ఎల్లయ్య, డీపీఓ యాదయ్య, ఆయా రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. అంతకుముందు టేక్మాల్ మండలంలోని దనూర ప్రాథమిక పాఠశాలను సందర్శించి విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. నాణ్యతలో రాజీపడకుండా మెనూ అందించాలన్నారు. అనంతరం ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించారు. -
సత్వరమే పరిష్కరించాలి
అదనపు కలెక్టర్ నగేశ్ మెదక్ కలెక్టరేట్: ప్రజావాణి అర్జీలను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ నగేశ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో జరిగిన జిల్లాస్థాయి ప్రజావాణిలో పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈసందర్భంగా వివిధ సమస్యలపై ప్రజలు 56 అర్జీలు అందజేశారు. ఈసందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజలకు ప్రజావాణిపై నమ్మకాన్ని పెంచాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ ఎల్లయ్య, డీఆర్డీఓ పీడీ శ్రీనివాసరావు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. ● ఇందిరమ్మ పథకంలో ఇల్లు మంజూరైందని, కట్టుకోనివ్వకుండా పాలివాళ్లు అడ్డుకుంటున్నారు. న్యాయం చేయాలని హవేళిఘణాపూర్ మండలం సర్దన గ్రామానికి సాయిలు ప్రజావాణిలో మొరపెట్టుకున్నాడు. ● మూడేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో రెండు కాళ్లు, ఒక చేయి కోల్పోయాను. ప్రభుత్వం నుంచి పెన్షన్ అందడం లేదని రామాయంపేట పట్టణానికి చెందిన గట్ల శ్రీనివాస్ ప్రజావాణిలో వాపోయారు. మెదక్ కలెక్టరేట్: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం పెన్షన్లు పెంచాలని ఎమ్మార్పీఎస్, వీహెచ్పీఎస్ నాయకులు యాదగిరి, పాండు, సైదులు డిమాండ్ చేశారు. దివ్యాంగులు, వృద్ధులు, బీడీ కార్మికులు, ఒంటరి మహిళలతో కలిసి సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. కలెక్టర్ వచ్చి సమాధానం ఇచ్చే వరకు ధర్నా విరమించేది లేదంటూ బైఠాయించారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అదనపు కలెక్టర్ నగేశ్కు అందజేశారు. నర్సాపూర్ రూరల్: అటవీశాఖ ఆధ్వర్యంలో నాటిన మొక్కలను లెక్కించడానికి అధికారులు సోమవారం అడవిబాట పట్టారు. మండలంలోని బ్రాహ్మణపల్లి, కాగజ్మద్దూర్, గొల్లపల్లి, పెద్ద చింతకుంట, నారాయణపూర్, అచ్చంపేట, ఖాజీపేట, నత్నయ్యపల్లి గ్రామాల అడవుల్లో మొక్కలను పరిశీలించి లెక్కిస్తున్నారు. నర్సాపూర్ అటవీశాఖ ఆధ్వర్యంలో మొక్కలు నాటకుండానే సుమారు రూ. 19 లక్షల బిల్లులు డ్రా చేసుకున్నట్లు సామాజిక తనిఖీ సిబ్బంది అధికారుల దృష్టికి తీసుకొచ్చా రు. దీనిపై అటవీశాఖ అధికారులు మొక్కలు నాటినట్లు ఉన్నతాధికారులకు విన్నవించారు. పూర్తి విచారణ చేసి న్యాయం చేయాలని కోరారు. దీంతో జిల్లాలోని పలు మండలాల ఎ ంపీడీఓలు, ఏపీఓల బృందం మొక్కలు లెక్కించే పనిలో పడ్డారు. ప్రమాదం అంచున చిన్నచెరువు రామాయంపేట(మెదక్): ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మండలంలోని కాట్రియాల గ్రామాన్ని ఆనుకొని ఉన్న చిన్నచెరువు కట్ట తీవ్రంగా దెబ్బతింది. నాలుగు చోట్ల కోతకు గురై మట్టి కొట్టుకుపోయింది. కలెక్టర్ రాహుల్రాజ్తో పాటు ఇతర ఉన్నతాధికారులు దెబ్బతిన్న కట్టను పరిశీలించారు. కట్ట తెగితే పన్యాతండాకు ప్రమాదం పొంచి ఉండటంతో తండా వాసులను అక్కడి నుంచి పునరావాస కేంద్రానికి తరలించారు. నీటి పారుదలశాఖ అధి కారులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మళ్లీ వర్షం కురిస్తే కట్ట తెగే ప్రమాదం ఉందని గిరిజనులు ఆందోళన చెందుతున్నారు. నీటి పారుదల శాఖ ఏఈ సూర్యకాంత్ను వివరణ కోరగా, రెండు రోజుల్లో కట్ట మరమ్మతులు ప్రారంభిస్తామని తెలిపారు. -
పల్లెల ప్రగతికి ప్రాధాన్యం
● మంత్రి దామోదర రాజనర్సింహ ● రూ. 28.45 కోట్ల రోడ్ల పనులకు శంకుస్థాపనటేక్మాల్(మెదక్): పల్లెల ప్రగతికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తూ కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు చేస్తున్నామని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. సోమవారం మండలంలో రూ. 28.45 కోట్లతో చేపట్టిన రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈసందర్భ ంగా మంత్రి మాట్లాడుతూ.. గ్రామాల్లోకి రవాణా సౌకర్యం బాగుంటేనే అభివృద్ధి వేగంగా జరుగుతుందన్నారు. అంతకుముందు కేజీబీవీ, మోడల్ స్కూల్ను సందర్శించి మౌలిక వసతులపై ఆరా తీశారు. విద్యార్థులకు కావాల్సిన అన్నిరకాల సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ఎల్లుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నా బొడ్మట్పల్లి, తంప్లూర్ సబ్ సెంటర్లను ఆస్పత్రిలో ఎందుకు కలిపారని వైద్యాధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫీవర్ సర్వే పటిష్టంగా అమలు చేయాలని, నాణ్యమైన వైద్య సేవలు అందించాలన్నారు. సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. నూతనంగా నిర్మిస్తున్న ఆస్పత్రి భవనం ప్రజలకు దూరంగా ఉందన్నారు. స్థల సేకరణలో ఇంత నిర్లక్ష్యం ఎందుకు చేశారని, రోడ్డుకు అనుకొని, ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా నిర్మించాలని సూచించారు. మంత్రి వెంట కలెక్టర్ రాహుల్రాజ్, జిల్లా వైద్యాధికారి శ్రీరామ్, ఆర్డీఓ రమాదేవి, తహసీల్దార్ తులసీరాం, నాయకులు తదితరులు ఉన్నారు. -
విష జ్వరాలతో విలవిల
జిల్లాను సీజనల్ వ్యాధులు వణికిస్తున్నాయి. జ్వర పీడితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. వాతావరణంలో చోటుచేసుకుంటున్న మార్పులతో పలువురు అనారోగ్యం బారిన పడుతున్నారు. ముఖ్యంగా వైరల్ ఫీవర్, టైఫాయిడ్, మలేరియా, డెంగీతో బాధపడుతున్నారు. దీంతో ఆస్పత్రులన్నీ రోగులతో కిటకిటలాడుతున్నాయి. ఓపీ కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారు. ఇదిలా ఉండగా అరకొర మందులు.. వైద్య సిబ్బంది కొరతతో అవస్థలు తప్పడం లేదు. వైద్య పరీక్షలకు రోగులు ప్రైవేట్ ల్యాబ్లను ఆశ్రయిస్తున్నారు. సోమవారం పట్టణ ఆస్పత్రులను ‘సాక్షి’ విజిట్ చేయగా పలు విషయాలు వెలుగుచూశాయి. రోగులకు పరీక్షేతూప్రాన్: పట్టణంలోని సీహెచ్సీకి నిత్యం 600పైగా రోగులు వస్తున్నారు. వీరిలో ఎక్కువగా విష జ్వరాలే బాధితులే ఎక్కువ. ఆస్పత్రిలో వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయడానికి కిట్లు కరువయ్యాయి. అలాగే మందులు కరువయ్యాయి. దీంతో కొంతమంది ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదనుగా రోగుల నుంచి డబ్బులు దండుకుంటున్నారు. ప్రభుత్వం స్పందించి ఆస్పత్రిలోనే అన్నిరకాల జబ్బులకు పరీక్షలు నిర్వహించే సదుపాయం కల్పించాలని బాధితులు కోరుతున్నారు. మందు గోలీల్లేవ్! రామాయంపేట(మెదక్): సీజనల్ వ్యాధులతో పట్టణంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు రోగుల తాకిడి పెరిగింది. సోమవారం ఇద్దరు డాక్టర్లు విధుల్లో ఉన్నారు. రోజూ ఆస్పత్రికి 200కు పైగా రోగులు వస్తుండగా, సోమవారం 9:30 గంటల నుంచి 12 వరకు 155 మంది వచ్చారు. కొన్ని మందులు అందుబాటులో లేవు. ఈ ఆస్పత్రిని వైద్య విధాన పరిషత్ పరిధిలో చేర్చి మూడేళ్లు కావొస్తుండగా, ఇది కాగితాలకే పరిమితమై సీహెచ్సీగానే కొనసాగుతోంది. నెలకు రెండు, మూడు కాన్పులు సైతం కావడం లేదు. ఎక్స్రే యంత్రం నిరూపయోగంగా ఉండగా, గైనకాలజిస్ట్ పోస్టు భర్తీ కాకపోవడం సమస్యగా మారింది. ఓపీక నశిస్తోంది నర్సాపూర్: పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి రోగులతో కిటకిటలాడుతుంది. సోమవారం 740 మంది ఆస్పత్రిలో అవుట్ పేషెంట్లుగా నమోదు చేసుకున్నారు. వారిలో సుమారు 80 మంది విష జ్వరాలతో బాధపడుతున్నారు. సుమారు 20 మంది ఇన్ పేషెంట్లుగా చేరి వైద్యం పొందుతున్నారు. మిగిలిన వారు మందులు తీసుకొని ఇళ్లకు వెళ్లారు. ఇదిలా ఉండగా రోజుకు 60 నుంచి 80 మంది జ్వర బాధితులు ఆస్పత్రికి వస్తున్నారని, వారిలో 20 నుంచి 25 మంది ఇన్ పేషెంట్లుగా చేరి వై ద్యం పొందుతున్నారని వైద్యులు తెలిపారు. అన్నీ.. సగం సగంమెదక్ మున్సిపాలిటీ: జిల్లా కేంద్ర ఆస్పత్రి రోగులతో కిక్కిరిసింది. ప్రతి రోజు సుమారు 500 నుంచి 1,000 మంది వరకు వస్తున్నారు. సరిపడా మందులు కరువయ్యాయి. రక్త పరీక్షలు కొన్నింటిని ప్రైవేట్లో చేయించుకోవాలని ఉచిత సలహా ఇస్తున్నారు. యూరిన్ ఇన్ఫెక్షన్, ప్రమాదాల్లో గాయపడిన వారికి మందులు కరువయ్యాయి. ఇప్పటికై నా అధికారులు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. ఓపీ కేంద్రాల వద్ద రోగుల బారులు గంటల తరబడి నిరీక్షణ అరకొర మందులు.. వైద్య పరీక్షలు కరువు ‘సాక్షి’ విజిట్లో వెలుగుచూసిన వాస్తవాలు -
లక్ష్యం చేరని సీఎంఆర్
గడువు ముంచుకొస్తున్నా.. కస్టమ్స్ మిల్లింగ్ రైస్ శతశాతం లక్ష్యాన్ని చేరుకోలేదు. గత ఖరీఫ్ గడువు ఈనెల 12తో ముగుస్తుంది. కానీ మిల్లర్లు ఇప్పటివరకు 74.64 శాతం బియ్యం మాత్రమే సివిల్ సప్లై శాఖకు ఇచ్చారు. అలాగే గత రబీకి సంబంధించి అక్టోబర్ 31 వరకు గడువు ఉండగా, ఇప్పటివరకు 32.83 శాతం బియ్యం మాత్రమే ఇచ్చారు. ఇక 15 ఏళ్లుగా పేరుకుపోయిన బియ్యం బకాయిలు తడిసి మోపెడయ్యాయి. ఏళ్లు గడుస్తున్నా రికవరీ కావడం లేదు. – మెదక్ అర్బన్ జిల్లాలో 37 బాయిల్డ్.. 68 రా రైస్ మిల్లులు ఉన్నాయి. ఖరీఫ్ 2024– 25కు సంబంధించి ఈనెల 12తో సీఎంఆర్ రైస్ గడువు ముగుస్తుంది. ఆ సీజన్కు సంబంధించి 2,67,953 మెట్రిక్ టన్నుల ధాన్యం మిల్లర్లకు ఇచ్చారు. వీరంతా ఈనెల 12 వరకు మొత్తం 1,80,453 మెట్రిక్ టన్నుల బియ్యం సివిల్ సప్లై శాఖకు ఇవ్వాలి. కానీ ఇప్పటివరకు 1,34,698 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని మాత్రమే ఇచ్చారు. ఇంకా 45,755 మెట్రిక్ టన్నుల బియ్యం రావాల్సి ఉంది. అలాగే గత రబీకి సంబంధించి 2,99,888 మెట్రిక్ టన్నుల ధాన్యం మిల్లర్లకు ఇవ్వగా, ఇందులో 2,03,923 మెట్రిక్ టన్నుల బియ్యం రావాలి. కానీ ఇప్పటివరకు 66,944 మెట్రిక్ టన్నుల బియ్యం మాత్రమే ఇచ్చారు. కాగా వీరికి అక్టోబర్ 31 వరకు గడువు ఉంది. అయితే అప్పట్లో ధాన్యం తడవడంతో కొంత మేర ఇబ్బంది ఏర్పడిందని, అందువల్ల గడువు పెంచాలని మిల్లర్లు కోరుతున్నారు. కాగా కొంత మంది మిల్లర్లు సీఎంఆర్ కోసం ఇచ్చిన ధాన్యం అమ్ముకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. పేరుకుపోయిన బకాయిలు 2010 నుంచి 2024 వరకు జిల్లాలోని 13 మిల్లర్ల నుంచి సీఎంఆర్ బకాయిల కింద రూ. సుమారు రూ. 214 కోట్లు రావాలి. బకాయిల వసూళ్ల కోసం అధికారులు ఆర్ఆర్యాక్ట్ కింద నోటీసులు ఇచ్చారు. కొన్ని మిల్లుల ఆస్తులు యాక్షన్ పెట్లారు. అయితే కొంతమంది కోర్టును ఆశ్రయించారు. వివిధ కారణాలతో బకాయిల వసూళ్లు ముందుకు సాగడం లేదని తెలుస్తోంది. ఇందులో కొంతమంది మిల్లర్లు సీఎంఆర్ కింద ఇచ్చిన ధాన్యాన్ని బయట అమ్ముకొని రూ. కోట్ల అక్రమార్జనకు పాల్పడ్డారన్న ఆరోపణలున్నాయి. గతేడాది కొన్ని బకాయిలు వసూలు అయినా, ఇంకా పెద్ద మొత్తంలో రావాలని అధికారులు చెబుతున్నారు. గడువు పెంచాలి గత ఖరీఫ్కు సంబంధించి అప్పట్లో అధికారులు 70 రోజుల గ్యాప్ ఇచ్చారు. ఈ సమయంలో బీహార్ హమాలీలు తమ స్వస్థలాలకు వెళ్లిపోయారు. దీంతో ధాన్యం మర ఆడించడంలో జాప్యం జరిగింది. అలాగే ఇటీవల కురిసిన వర్షాలతో తీవ్ర అంతరాయం ఏర్పడింది. కొన్ని చోట్ల గోదాంలు లేక ధాన్యం తడిసిపోయింది. అందువల్ల గడువు పెంచాలి. – వీరేశం, రా మిల్లర్ల సంఘం రాష్ట్ర కార్యదర్శి చర్యలు తీసుకుంటున్నాం 2010 నుంచి మిల్లర్ల దగ్గర సీఎంఆర్కు సంబంధించి పేరుకుపోయిన బకాయిల ను వసూలు చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం. దాదాపు బకాయిదారులందరికీ నోటీసులు ఇచ్చాం. కొంతమంది కోర్టుకు వెళ్లారు. ఆ విషయంలో రిట్ పిటిషన్లు వేస్తున్నాం. అవకాశమున్న రైస్ మిల్లులను యాక్షన్ పెడతాం, వారి ఆస్తుల ద్వారా బకాయిలు వసూలు చేస్తాం. – జగదీశ్ కుమార్, డీఎం, సివిల్ సప్లై ఈనెల 12తో ముగియనున్న సేకరణ గడువు గత ఖరీఫ్ 74.64 శాతం, రబీ 32.83 శాతమే పూర్తి మళ్లీ పొడిగించాలంటున్న మిల్లర్లు -
రేవంత్ ఇవ్వరు.. కేసీఆర్ అడగరు
● వీరికి నిరుపేదల కష్టాలు తెలియవు ● ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ రామచంద్రాపురం(పటాన్చెరు): భూస్వాములైన సీఎం రేవంత్రెడ్డి, ప్రతిపక్ష నేత కేసీఆర్కు నిరుపేదల కష్టాలు ఏం తెలుసని ఎమ్మార్పీఎస్ వ్యవ స్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. ఆదివారం తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని కొల్లూరులో పెన్షన్ పెంపు కోసం వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన మహాగర్జనకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పెన్షన్ కుటుంబం నుంచి వచ్చిన తనకు నిరుపేదల కష్టాలు తెలుసన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు పెన్షన్ వెంటనే పెంపు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇదే విషయం ప్రతిపక్ష నేత కేసీఆర్ అడగటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 30 ఏళ్లు వర్గీకరణపై పోరాటం చేసి విజయం సాధించామన్నారు. తమ పోరాల ద్వారా అన్నివర్గాల ప్రజలకు మేలు జరిగిందన్నారు. అర్హులైన వారందరికీ రూ. 6 వేల పెన్షన్ ఇచ్చే వరకు ఉద్యమిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో రాష్ట్ర ఎమ్మార్పీఎస్ నాయకులు రాజు, రామారావు, శ్రీనివాస్, జిల్లా అధ్యక్షుడు బుచ్చేంద్ర, నాయకులు ప్రమోద్, గీత, ఆశోక్ తదితరులు పాల్గొన్నారు. -
సేవలే చిరస్థాయిగా నిలుస్తాయి
ఎమ్మెల్యే సంజీవరెడ్డినారాయణఖేడ్: విధి నిర్వహణలో చేసిన సేవలు చిరస్థాయిగా నిలిచి ఉంటాయని ఎమ్మెల్యే సంజీవరెడ్డి అన్నారు. ఆదివారం పట్టణంలోని ఓ ఫంక్షన్హాల్లో నిర్వహించిన పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు గుండు లక్ష్మణ్ పదవీ విరమణ సభకు హాజరై మాట్లాడారు. లక్ష్మణ్ సాధారణ ఉపాధ్యాయుడి నుంచి రాష్ట్ర అధ్యక్షుడిగా ఎదిగారని కొనియాడారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఎంతగానో సేవ చేశారని గుర్తు చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ శ్రీపాల్రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ మోహన్రెడ్డి, మహేందర్రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దామోదర్రెడ్డి, మాజీ అధ్యక్షులు శేరి వెంకట్రెడ్డి, జిల్లా అధ్యక్షులు మాణయ్య, రాష్ట్రంలోని అన్ని జిల్లాల పీఆర్టీయూ అధ్యక్ష, కార్యదర్శులు, సంఘాల బాధ్యులు పాల్గొన్నారు. అనంతరం క్యాంపు కార్యాలయంలో పలువురికి సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. -
రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించండి
ఎమ్మెల్సీ శ్రీపాల్రెడ్డిపెద్దశంకరంపేట(మెదక్): ఉపాధ్యాయ, ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ వెంటనే చెల్లించాలని ఎమ్మెల్సీ శ్రీపాల్రెడ్డి అన్నారు. ఆదివారం పెద్దశంకరంపేటలో మాజీ ఎమ్మెల్సీ మోహన్రెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. 5 డీఏలను వెంటనే విడుదల చేయాలన్నారు. పీఆర్సీ అమలుతో పాటు ఏకీకృత సర్వీస్ నిబంధనలు అమలు చేసి ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించాలని కోరారు. ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ఇంటిగ్రేటెడ్ స్కూల్స్కు పీఆర్టీయూ వ్యతిరేకమన్నారు. అన్ని పాఠశాలల్లో ప్రీ ప్రైమరీని ప్రారంభించాలన్నారు. అన్ని పాఠశాలల్లో మెరుగైన వసతులు కల్పించి విద్యాభివృద్ధికి తోడ్పడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమావేశంలో పీఆర్టీయూ రాష్ట్ర నాయకులు దామోదర్రెడ్డి, వంగా మహేందర్రెడ్డి, రాష్ట్ర మాజీ అధ్యక్షుడు వెంకట్రెడ్డి, సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు శశిధర్శర్మ, మాజీ అధ్యక్షుడు సత్యనారాయణరెడ్డి, శ్రీనివాస్, వేమారెడ్డి, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు ఆశయ్య, రామచంద్రాచారి, ఉపాధ్యాయులు గోపి, ప్రసన్న, సంతోష్, కిషోర్చారి, పాండు తదితరులు పాల్గొన్నారు. -
సీజనల్పై అప్రమత్తంగా ఉండాలి
కలెక్టర్ రాహుల్రాజ్పాపన్నపేట(మెదక్): సీజనల్ వ్యాధులపై వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ రాహుల్రాజ్ అన్నారు. ఆదివారం పాపన్నపేట పీహెచ్సీ, ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ను సందర్శించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అవసరమైన మందులు అందుబాటులో ఉంచుకోవాలని సిబ్బందికి సూచించారు. ప్రతి ఒక్కరూ సమయపాలన పాటించాలని ఆదేశించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రజలను అప్రమత్తం చేయాలని, పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆస్పత్రికి వచ్చే ప్రతి ఒక్కరికి మెరుగైన సేవలు అందించాలని పేర్కొన్నారు. అనంతరం ఆస్పత్రి రికార్డులు పరిశీలించి వైద్య సేవలపై ఆరా తీశారు. ఆయన వెంట అధికారులు, సిబ్బంది ఉన్నారు. పనుల్లో వేగం పెంచండి మెదక్ మున్సిపాలిటీ: ఇందిరా మహిళా శక్తి భవన నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని కలెక్టర్ రాహుల్రాజ్ పంచాయతీరాజ్ ఇంజనీర్ను ఆదేశించారు. ఆదివారం పట్టణంలో భవన నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రూ. 5 కోట్లతో నిర్మిస్తున్న పనుల్లో వేగం కనిపించడం లేదన్నారు. నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని సూచించారు. -
ఉప్పొంగంగా..!
మెదక్జోన్: మెతుకుసీమలో సమృద్ధిగా వర్షాలు కురిశాయి. చెరువులు, కుంటలు నిండాయి. వాగులు జలకళను సంతరించుకున్నా యి. వెరసి జిల్లా అంతటా భూగర్భజలాలు గణనీయంగా పెరిగాయి. సాధారణం కంటే 90 శాతం అధిక వర్షపాతం నమోదు కావడంతో పాతాల గంగ ౖపైపెకి ఉబికివస్తోంది. జిల్లాలో సగటున 11.11 మీటర్ల లోతులో నీటిమట్టం ఉండగా, ఏడు మండలాల్లో ఏకంగా 5 మీటర్ల లోతులో ఉంది. గతేడాదితో పోలిస్తే 2.19 మీటర్లు పైకి.. జిల్లాలో జూన్, జూలైలో లోటు వర్షపాతం ఉండగా, ఆగస్టు చివరివారంలో కుంభవృష్టి వాన కురిసింది. అత్యధికంగా హవేళిఘణాపూర్ మండలంలో 31 సెంటీమీటర్లు నమోదు అయింది. అలాగే నిజాంపేట, రామాయంపేట, మెదక్, నార్సింగి, పెద్దశంకరంపేట, చిన్నశంకరంపేట, రేగోడ్, కొల్చారం, పాపన్నపేట, శివ్వంపేట మండలాల్లో సైతం భారీ వర్షాలు నమోదయ్యాయి. జిల్లాలో ఏకై క మధ్య తరహా ప్రాజెక్టు ఘనపూర్తో పాటు హల్దీ, మంజీరా, రాయినిపల్లి ప్రాజెక్టు, అతిపెద్ద చెరువు కోంటూర్తో పాటు 2,632 నీటి వనరులు నిండుకుండలా మారాయి. ఈ వర్షాకాలంలో గత మూడు నెలల వరకు సాధారణ వర్షపాతం 518.4 మి.మీ కాగా, 985.5 మి.మీ కురిసింది. ఈలెక్కన సాధారణం కంటే 467.1 మి.మీ వర్షం అధికంగా కురిసింది. దీంతో భూగర్భజలాలు కనీవినీ ఎరుగని రీతిలో పెరిగాయి. గతేడాది ఆగస్టులో జిల్లాలో సగ టున 13.30 మీటర్ల లోతులో జలం ఉండగా, ఈ ఏడాది 11.11 మీటర్లలో ఉన్నాయి. ఈ లెక్కన గతేడాదితో పోలిస్తే 2.19 మీటర్ల పైకి భూగర్భజలాలు పైకి వచ్చాయి.జిల్లాలోని ఏడు మండలాలతో పాటు జిల్లా కేంద్రంలోనూ కేవలం ఐదు మీటర్లలోతులో భూగర్భజలాలు ఉన్నాయి. శివ్వంపేట మండలం సికింద్లాపూర్లో 0.30 మీటర్లు, మె దక్ పట్టణ శివారులోని పిల్లికొటాల్లో 1.74, హవేళిఘణాపూర్ మండలం కూచన్పల్లిలో 2.85, పాపన్నపేట మండలం ఎల్లుపేటలో 2.99, మెదక్ మండలం పేరూర్లో 3.80, వెల్దుర్తి మండలం రామయిపల్లిలో 4.02, రామాయంపేటలో 4.90 మీటర్ల లోతులో నీటిమట్టం ఉంది. కాగా జిల్లాలో 4 లక్షల ఎకరాల మేర సాగుకు అనుకూలమైన భూములు ఉండగా, 3.95 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతున్నాయి. ఈ ఏడాది వర్షాకాలంలో 3.30 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగయ్యాయి. వాటిలో 2.80 లక్షల ఎకరాల్లో వరిసాగు చేయగా, 50 వేల ఎకరాల్లో ఆరుతడి పంటలు సాగు చేశారు. కాగా 80 శాతం బోరుబావుల ఆధారంగానే పంటలు సాగు చేయగా, కేవలం 20 శాతం మంది రైతులు మాత్రమే సాగునీటి వనరుల ఆధారంగా వ్యవసాయం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఖరీఫ్తో పాటు వచ్చే యాసంగి పంటల సాగుకు సైతం ఎలాంటి ఢోకా లేదని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో గణనీయంగా పెరిగిన భూగర్భజలాలు సగటున 11.11 మీటర్ల లోతులో నీటిమట్టం సాధారణం కంటే 90 శాతం అధిక వర్షపాతం బోర్ల ద్వారా సమృద్ధిగా పంటలకు నీరు -
అద్దింట్లో ఆర్టీఏ ఆఫీస్
● వాహనదారులకు తప్పని ఇబ్బందులు ● రూ. కోట్ల ఆదాయం ఉన్నా.. కనీస వసతులు కరువు రామాయంపేట(మెదక్): ఏటా ప్రభుత్వానికి రూ. కోట్ల ఆదాయం సమకూరుస్తున్న జిల్లా కేంద్రంలోని రవాణాశాఖ కార్యాలయంలో కనీస వసతులు కరువయ్యాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. మెదక్ పట్టణానికి మూడు కిలోమీటర్ల దూరంలో పురాతనమైన అద్దె భవనంలో కార్యాలయం కొనసాగుతోంది. ఇందులో ఎలాంటి వసతులు లేకపోగా, రిజిస్ట్రేషన్లు, ఫిట్నెస్, డ్రైవింగ్ టెస్టుల నిమిత్తం వచ్చే వాహనదారులతో పాటు కార్యాలయ సిబ్బంది అవస్థలు పడుతున్నారు. డ్రైవింగ్ టెస్ట్, ఫిట్నెస్ పరీక్షల కోసం ప్రత్యేకంగా ట్రాక్ సదుపాయం లేదు. నాలుగు చక్రాలు, ద్విచక్ర వాహనదారులకు వేర్వేరుగా ట్రాక్లు అవసరం కాగా, అది కూడా కరువైంది. నామమాత్రంగా హద్దులు పాతి పనులు కానిస్తున్నారు. దీంతో వాహనదారులు తమ డ్రైవింగ్ నైపుణ్యాలను ప్రదర్శించే అవకాశం లేకుండా పోయింది. చిన్నపాటి వర్షం కురిసినా కార్యాలయం ఆవరణ బుదరమయంగా మారి తరచూ సేవలకు ఆటంకం కలుగుతోంది. చెట్ల కిందే విశ్రాంతి.. మెదక్ పట్టణ శివారులో పాక్షికంగా శిథిలమైన భవనానికి తాత్కాలిక మరమ్మతులు చేయించిన ఆశాఖ అధికారులు, అందులోనే కార్యాలయం ఏర్పాటు చేసుకున్నారు. ఎల్లవేళలా రద్దీగా ఉండే ఈ కార్యాలయానికి నిత్యం ప్రజలు వస్తుంటారు. ఇందులో కనీసం కూర్చొడానికి సైతం సదుపాయాలు లేవు. తాగునీటి సదుపాయం, మూత్రశాలలు సక్రమంగా లేకపోవడం మరింత బాధాకరంగా మారింది. పనుల నిమిత్తం కార్యాలయానికి వస్తున్న వాహనదారులు చెట్ల కిందే విశ్రాంతి తీసుకుంటున్నారు. కార్యాలయ ఆవరణలో ఫిట్నెస్లు, వాహనాల రిజిస్ట్రేషన్లు, ఇతరత్ర కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉంటుంది. కార్యాలయం ముందున్న కొద్దిపాటి స్థలం మట్టి రోడ్డుతో కూడుకొని ఉంది. ఇందులో హద్దులు పాతి టెస్టింగ్ నిర్వహిస్తున్నారు. చిన్నపాటి చినుకులు కురిస్తే కార్యాలయం ఆవరణ మొత్తం బుదరమయం అవుతోంది. వర్షం పడినప్పుడల్లా పనులు వాయిదా పడుతున్నాయి. దీంతో వాహనదారులు మళ్లీ రావాల్సి వస్తోంది. పక్కా భవనానికి చర్యలు జిల్లా రవాణాశాఖ కార్యాలయం అద్దె భవనంలో కొనసాగుతోంది. పనుల నిమిత్తం కార్యాలయానికి వస్తున్న వాహనదారులు ఇబ్బందులకు గురికాకుండా చర్యలు తీసుకుంటున్నాం. పక్కా భవన నిర్మాణానికి గాను మెదక్ మండలం పాతూరు వద్ద గతంలోనే స్థల సేకరణ జరిగింది. నిర్మాణానికి తమవంతు ప్రయత్నం చేస్తున్నాం. – వెంకటస్వామి, జిల్లా రవాణా అధికారి -
యూరియా.. ఏదయా!
పంటలు ఎదిగే సమయంలో తీవ్ర కొరత● జిల్లాలో 3,39,117 ఎకరాల్లో సాగు ● లెక్కలోకి రాని శిఖం, అటవీ భూములు ● నీట మునిగిన 23,159 ఎకరాలు ● రికవరీ చేసుకునే అవకాశం కరువు తెల్లారితే చాలు.. బస్తా యూరియా కోసం అన్నదాతలు ఆగమవుతున్నారు. ఎరువుల దుకాణాల ఎదుట బారులు తీరుతున్నారు. చెప్పుల లైన్లు.. రాస్తారోకోలు.. ఆందోళనలు నిత్యకృత్యమవుతున్నాయి. అదనుదాటిపోతుంది.. ఎలాగైనా ఒక సంచి ఇవ్వండి సారూ.. అంటూ బరువెక్కిన గుండెలతో వేడుకుంటున్నారు. – మెదక్ అర్బన్ జిల్లాలో ఈ ఖరీఫ్ సీజన్లో 3,39,117 ఎకరాల్లో రైతులు పంటలు సాగు చేయగా.. సుమారు 26 వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరమవుతుందని అధికారులు అంచనా వేశారు. ఇప్పటివరకు 22,605 మెట్రిక్ టన్నులు సరఫరా చేసినట్లు చెబుతున్నారు. కాగా శిఖం, ఫారెస్ట్ భూముల్లో వేసిన పంటలను లెక్కలోకి తీసుకోకపోవడం.. కొంతమంది ఆందోళనతో యూరియా స్టాక్ పెట్టడం.. పక్క జిల్లాలకు తరలిపోవడం, సకాలంలో రాకపోవడం కొరతకు కారణంగా భావిస్తున్నారు. వ్యవసాయాధికారులు కేవలం రికార్డుల్లో ఉన్న భూములనే లెక్కిస్తారు. మంజీరా తీర ప్రదేశాలు, ఫారెస్ట్ భూములు, చెరువు శిఖంలో అక్రమంగా వేసిన పంటలు లెక్కించరు. జిల్లాలో రికార్డులకెక్కని భూముల్లో సాగు చేసిన పంటలు వేల ఎకరాల్లో ఉంటుందని సమాచారం. దీంతో యూరియా వినియోగం సైతం ఎక్కువగానే ఉంటుంది. కొరత నేపథ్యంలో కొంతమంది రైతులు సెప్టెంబర్ నెలకు అవసరమయ్యే ఎరువులను ఆగస్టులోనే తీసుకున్నారు. కాగా డిమాండ్కు అనుగుణంగా యూరియా సరఫరా కాలేదనే విమర్శలున్నాయి. ముడి సరుకుల దిగుమతి తగ్గడం కూడా కొరతకు కారణంగా విశ్లేషిస్తున్నారు. వర్షాలు ఆలస్యంగా ప్రారంభం కావడంతో చెరువుల కింద ఉన్న రైతులు ఒకేసారి పంటలు వేశారు. వీరందికీ ఒకేసారి యూరియా అవసరమవడం కొరతకు మరో కారణం అంటున్నారు. చెరువుల కింద జూలై చివరి, ఆగస్టు మొదటి వారంలో నాట్లు వేసిన రైతులకు యూరియా ఇప్పుడు అవసరమవుతోంది. కనుక అదను దాటిపోతుంది.. ఒక్క బస్తా ఇవ్వండి సారూ అంటూ రైతులు వేడుకుంటున్నారు. అలాగే చిరుపొట్ట దశలో పైరులకు యూరియా అవసరమవుతుంది. ఇప్పుడు ఎరువు వేయకపోతే పంట దిగుబడి సరిగా రాదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శివ్వంపేట మండలంలో 1,500 మెట్రిక్ టన్నుల యూరియా అవసరముండగా, ఇప్పటివరకు 800 మెట్రిక్ టన్నులు, హవేళిఘణాపూర్లో 1,710 మెట్రిక్ టన్నులకు 800, పాపన్నపేటలో 2,400 మెట్రిక్ టన్నులకు 2,100 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా అయినట్లు అధికారులు చెబుతున్నారు. చిన్నశంకరంపేటలో వారం రోజులుగా యూరియా రావడం లేదని రైతులు వాపోతున్నారు. ఇప్పటికే పంట ఎదుగుదల లోపించడం, తెగుళ్లు వ్యాపించడంతో వేలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. మరోవైపు అతివృష్టితో నీట మునిగిన పంటలను రికవరీ చేసుకునే అవకాశం కరువైంది. -
● కొసరు పనులకు నిధుల ఆటంకం ● రెండేళ్లుగా నిలిచిన నిర్మాణం ● తాజాగా కలెక్టర్ చొరవతో రూ. 7.5 లక్షలు విడుదల
తూప్రాన్: ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు గత ప్రభుత్వం అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఒకే చోట ఉండాలని చర్యలు చేపట్టింది. ఇందుకోసం మూడేళ్ల క్రితం రూ. 8 కోట్ల నిధులతో మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో సమీకృత భవన నిర్మా ణ పనులకు శ్రీకారం చుట్టింది. సుమారు 30 వేల చదరపు అడుగుల స్థలంలో విశాలమైన భవన నిర్మాణ పనులు జరుగుతున్నాయి. అయితే మండల పరిషత్ కార్యాలయ ఆవరణలోని ఐకేపీ, తహసీల్దార్, మండల వనరుల కేంద్రం భవనాలను కూల్చి వేసి సమీకృత భవన నిర్మాణ పనులకు నిధు లు మంజూరు చేశారు. ఏడాది వ్యవధిలో పనులు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ మూడేళ్లు గడుస్తున్నప్పటికీ పూర్తి కాలేదు. గతంలో గడా ప్రత్యేకాధికారి గా ఉన్న ముత్యంరెడ్డి పలుమార్లు సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించి పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. కానీ అంతలోనే ఎన్నికల కోడ్ రావడం, ప్రభుత్వం మారడంతో పట్టించుకునే వారు కరువయ్యారు. అద్దె భవనాల్లో అవస్థలు.. నిధుల విషయమై ఇటీవల అధికారులు కలెక్టర్ రాహుల్ రాజ్ దృష్టికి తీసుకెళ్లడంతో తన సొంత నిధుల నుంచి రూ. 7.5 లక్షలు విడుదల చేశారు. దీంతో విద్యుత్, తాగునీరు, డ్రైనేజీ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. మరో నెల రోజుల్లో పనులు పూర్తి కానున్నాయని పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులు పేర్కొంటున్నారు. ఆ వెంటనే ఆర్డీఓ, తహసీల్దార్, ఎంపీడీఓ కార్యాలయాలను సమీకృత సముదాయంలోకి రానున్నాయి. మిగితా కార్యాలయాలు విడతల వారీగా అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. కాగా డివిజన్ కేంద్రం ఏర్పడినప్పటికీ అద్దె భవనాలు, ఇరుకు గదుల్లో కార్యాల యాలు కొనసాగిస్తున్నారు. దీంతో ఆయా పనులపై వచ్చే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.నిధుల కొరతతోనే.. నిధుల కొరతతో పనుల్లో జాప్యం జరిగింది. ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాం. అయన స్పందించి రూ.7.5 లక్షలు విడుదల చేశారు. ఈ నిధులతో కొంత మేర పనులు పూర్తి చేస్తాం. మొదటగా ఆర్డీఓ, తహసీల్దార్, ఎంపీ డీఓ కార్యాలయాలు అందుబాటులోకి తెస్తాం. – ఎస్. మధుసూదన్, ఏఈ పంచాయతీరాజ్ -
కాలేజీకి డుమ్మా కుదరదిక
జిల్లాలో 16 ప్రభుత్వ, 36 గవర్నమెంట్ సెక్టార్, 10 ప్రైవేట్ జూనియర్ కళాశాలలు కలిపి మొత్తం 60 కళాశాలలు ఉన్నాయి. ఇంటర్ మొదటి సంవత్సరంలో 6,068, ద్వితీయ సంవత్సరంలో 7,055 కలిపి మొత్తం 13,123 మంది విద్యార్థులు చదువుతున్నారు. కళాశాలలు ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కొనసాగుతాయి. టీజీబీఐఈ ఎఫ్ఆర్ఎస్ యాప్ను ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత, రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులకు లాగిన్ ఐడీ, పాస్వర్డ్ అందజేశారు. లెక్చరర్లు యాప్ ఓపెన్ చేయగానే ఉదయం బోధించే తరగతి, విద్యార్థుల వివరాలు కనిపిస్తాయి. విద్యార్థి పేరుపై క్లిక్ చేయగానే, కెమెరా ఓపెన్ అవుతుంది. వెంటనే విద్యార్థి ముఖంపై క్లిక్ చేయగానే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుంది. ఇంటర్మీడియెట్ స్థాయిలో ముఖ గుర్తింపు విధానం ప్రారంభమైంది. పాఠశాల స్థాయిలో విద్యార్థులతో పాటు సిబ్బందికి ఈ విధానం అమలు పరుస్తుండడంతో మంచి ఫలితాలు వస్తున్నాయి. మొదట కొంతమంది టీచర్లు వ్యతిరేకించినప్పటికీ.. ఇటీవల ఎఫ్ఆర్ఎస్ విధానం అమల్లోకి వచ్చిన తర్వాత హాజరుశాతం.. సమయపాలన.. ఖచ్చితంగా అమలవుతోంది. – మెదక్ అర్బన్ త్వరలో లెక్చరర్లకు.. ఇంటర్ విద్యార్థులకు రోజుకు రెండుసార్లు ఎఫ్ఆర్ఎస్ విధానంతో అటెండెన్స్ తీసుకుంటున్నారు. ముఖ గుర్తింపు హాజరు ద్వారా విద్యార్థి కళాశాలకు హాజరు కాకుంటే, వారి తల్లిదండ్రుల ఫోన్లకు మెసేజ్ వెళ్తుంది. ఈ హాజరును సంబంధిత కళాశాల ప్రిన్సిపాల్, డీఐఈఓ, రాష్ట్ర అధికారులు సమీక్షిస్తున్నారు. అయితే విద్యార్థులకు ఎఫ్ఆర్ఎస్ విధానం అమల్లోకి వచ్చినా, లెక్చరర్లకు మాత్రం అమలు కావడం లేదు. గతంలో వారికి బయోమెట్రిక్ విధానం అమల్లో ఉండేది. ప్రస్తుతం అది పనిచేయడం లేదు. కాగా వీరికి కూడా త్వరలోనే ఎఫ్ఆర్ఎస్ అందుబాటులోకి వస్తుందని అధికారులు చెబుతున్నారు. -
ఆయిల్పామ్తో అధిక లాభం
● ఉద్యానశాఖ సంచాలకులు యాస్మిన్ బాషా ● చిన్నగొట్టిముక్లలో మెగా ఆయిల్ ప్లాంటేషన్శివ్వంపేట(నర్సాపూర్): ఆయిల్పామ్ సాగు రైతులకు అన్ని విధాలుగా లాభదాయకమని, ఈ పంట సాగు చేసేందుకు ముందుకు రావాలని రాష్ట్ర ఉద్యానశాఖ సంచాలకులు యాస్మిన్న్ బాషా అన్నారు. శనివారం మండల పరిధిలోని చిన్నగొట్టిముక్ల గ్రామ పరిధిలో మాజీ ఐఏఎస్ అధికారి సింగాయిపల్లి నర్సింగరావు వ్యవసాయ పొలంలో ఆయిల్పామ్ మెగా ప్లాంటేషన్ చేపట్టారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ రాహుల్రాజ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డిమాండ్ ఉన్న పంటల సాగుపై రైతులు ఆసక్తి కనబరిస్తే స్థిర ఆదాయం ఉంటుందన్నారు. ఆయిల్పామ్ పంటకు ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తుందన్నారు. ఈ పంటకు అటవీ జంతువులు, దొంగల బెడద ఉండదని, ఉద్యానవన శాఖ సబ్సిడీపై మొక్కలు అందిస్తుందన్నారు. ఈ సాగులో అంతర్ పంటలు వేసుకోవచ్చని, పంట చేతికి వచ్చిన తర్వాత మధ్యవర్తుల ప్రమేయం లేకుండా సంబంధిత కంపనీ కొనుగోలు చేస్తుందన్నారు. అనంతరం జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ అధికారి ప్రతాప్సింగ్, జిల్లా వ్యవసాయ అధికారి దేవ్కుమార్ మాట్లాడుతూ జిల్లాలో 2025–26 ఏడాదికి 2,500 ఎకరాల్లో ఆయిల్పామ్ సాగు చేసే విధంగా లక్ష్యం పెట్టుకున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో లివ్ పామ్ మేనేజింగ్ డైరెక్టర్ సాయి, ఆర్డీఓ మైపాల్రెడ్డి, తహసీల్దార్ కమలాద్రి, ఏఓ లావణ్య, ఆర్ఐ కిషన్, జిల్లా రైతు సమన్వయ సమితి గౌరవ అధ్యక్షుడు మైసయ్యయాదవ్, రైతులు, తదితరులు పాల్గొన్నారు. -
జ్వరమొచ్చింది
మెదక్జోన్: మెతకు సీమ మెదక్ మంచం పట్టింది. జిల్లాలో వైరల్ ఫీవర్, టైఫాయిడ్, డెంగీ కేసులు విజృంభిస్తున్నాయి. ప్రతీ పదిమందిలో ఒక్కరిద్దరు చొప్పున వైరల్ జ్వరం బారిన పడుతున్నారు. ఇప్పటికే జిల్లాలో జ్వరం బారిన పడి ఇద్దరు విద్యార్థులు మృత్యువాత పడ్డారు. భారీవర్షాలు, వాతావరణ మార్పులు, అపరిశుభ్రత కారణంగా దోమలు పెరిగి వ్యాధులు వ్యాప్తి చేస్తున్నాయి. కిక్కిరిసిన ఆస్పత్రులు జిల్లా కేంద్ర ఆస్పత్రి, ఏరియా, కమ్యూనిటీ ఆస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతోపాటు ప్రైవేటు హాస్పిటళ్లు రోగులతో కిక్కిరిసిపోతున్నాయి. వర్షాకాలం ప్రారంభం నుంచి ఇప్పటివరకు 20 డెంగీ, 84 టైఫాయిడ్, 18,424 వైరల్ ఫీవర్ కేసులు జిల్లాలో నమోదయ్యాయి. ఒక్క ఆగస్టు నెలలోనే 5,904 ఫీవర్ కేసులు నమోదు కావడం జిల్లాలో ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. శివ్వంపేట మండలం తునిఖి గ్రామానికి చెందిన 10వ తరగతి విద్యార్థి సుమన్, 5వ తరగతి విద్యార్థి సుశాంక్ జ్వరంబారిన పడ్డారు. వీరిని వివిధ ఆస్పత్రుల్లో చేర్పించినప్పటికీ చికిత్స పొందుతూ మృతి చెందడమే ఇందుకు నిదర్శనం. ప్రైవేట్ ఆస్పత్రుల్లో ప్లేట్లెట్ల దందా! వైరల్ ఫీవర్తోపాటు టైఫాయిడ్, డెంగీ కేసులు నమోదైన రోగుల్లో ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయి. దీన్ని ఆసరాగా తీసుకుని ప్రైవేటు ఆస్పత్రులు దందా సాగిస్తున్నాయి. అవసరం ఉన్నా లేకపోయినా రెండు నుంచి వారం రోజులపాటు రోగుల్ని ఆస్పత్రిలో చేర్చుకుని రూ.వేలకు వేలు వసూలు చేస్తున్నాయి. డెంగీ రోగికి ప్లేట్లెట్స్ ఎక్కించాల్సి వస్తే వెంటనే వైద్యులు హైదరాబాద్కు రిఫర్ చేస్తున్నారు. జిల్లాకు వైద్య కళాశాల వచ్చినా అన్నిరకాల ప్రత్యేక వైద్య నిపుణులు అందుబాటులో ఉన్నా సరైన పరికరాలు లేకపోవటంతో హైదరాబాద్కు రిఫర్ చేస్తున్నట్లు తెలుస్తోంది. వైరల్ ఫీవర్, టైఫాయిడ్, డెంగీ వచ్చి న వారిలో ప్లేట్లెట్స్ తగ్గడం మామూలే. ప్లేట్లెట్స్ తగ్గితే ఆందోళన అనవసరం. ఎవరైనా జిల్లా కేంద్ర ఆస్పత్రిలోనే వైద్య పరీక్షలు చేయించుకుని అక్కడే చికిత్సలు పొందవచ్చు. ప్లేట్లెట్స్ తగ్గాయని ప్రైవేట్ ఆస్పత్రుల్లో చేరి అనవసరంగా అప్పులపాలు కావొద్దు. – శ్రీరామ్, జిల్లా వైద్యాధికారి, మెదక్ అపరిశుభ్రతే కారణం భారీవర్షాల కారణంగా పల్లెల్లో అపరిశుభ్రత రాజ్యమేలుతుంది. ఫలితంగా దోమలు పెరిగి వ్యాధులకు ప్రధాన కారణం అవుతున్నాయి. పల్లెల్లో 2 ఏళ్లుగా ప్రజాప్రతినిధులు లేకపోవటం, ప్రత్యేకాధికారులు అటుగా తొంగి చూడకపోవటంతో పల్లెలో అపరిశుభ్రత కారణంగా ప్రజలు మంచం పడుతున్నారు. -
నేడు దుర్గమ్మ దర్శనం నిలిపివేత
పాపన్నపేట(మెదక్): సంపూర్ణ చంద్రగ్రహణా న్ని పురస్కరించుకొని ఆదివారం మధ్యాహ్నం 12 గంటల నుంచి వన దుర్గమ్మ దర్శనాన్ని నిలిపి వేస్తామని ఈఓ చంద్రశేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం నుంచి 12 గంటల వరకు రాజగోపురంలో పూజలు. దర్శనం కొనసాగుతాయని పేర్కొన్నారు. సోమవారం సంప్రోక్షణ అనంతరం ఉదయం.5.30 గంటల నుంచి తిరిగి అమ్మవారి దర్శనం ప్రారంభ మవుతుందని చెప్పారు. మంజీర వరదల వల్ల దుర్గమ్మ రాజగోపురం వద్ద పూజలు జరుగుతున్న విషయం విదితమే. వ్యాధులపై జాగ్రత్తలు పాటించాలిడీఎంహెచ్ఓ శ్రీరామ్ హవేళిఘణాపూర్(మెదక్): ప్రస్తుత సీజన్లో వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్యాధికారి శ్రీరామ్ పేర్కొన్నారు. శనివారం మండల పరిధి సర్ధన పీహెచ్సీని సందర్శించి సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వర్షాలు కురుస్తున్నందున ప్రజలు రోగాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అవసరమైన గ్రామాల్లో హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేసి వైద్య సేవలందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆస్పత్రికి వచ్చిన రోగులతో మాట్లాడి వైద్య సేవల గురించి తెలుసుకున్నారు. అనంతరం సర్ధన బాలుర వసతి గృహాన్ని సందర్శించారు. డీఎంహెచ్ఓ వెంట నారాయణ, హరిప్రసాద్, నవ్య, మండల వైద్యాధికారి వినయ్, సిబ్బంది ఉన్నారు. కార్మికుల హక్కులను కాల రాస్తున్న కేంద్రం సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్క రాములు మెదక్ కలెక్టరేట్: పెట్టుబడి దారుల కోసం కార్మికుల హక్కులను కేంద్రం కాలరాస్తుందని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్క రాములు ఆరోపించారు. శనివారం సీఐటీయూ జిల్లా అధ్యక్షురాలు బాలమణి అధ్యక్షతన జరిగిన జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. కొత్తగా అమలు చేస్తున్న లేబర్ కోడ్స్కు వ్యతిరేకంగా ఉద్యమం చేస్తామన్నారు. కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులను బీజేపీ ప్రభుత్వం తుంగలో తొక్కిందని ఆరోపించారు. కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయడంలేదన్నారు. అలాగే పరిశ్రమలలో కాంట్రాక్టు కార్మికులకు భద్రత లేకుండా పోయిందన్నారు. ప్రభుత్వ సంస్థల్లో పని చేస్తున్న కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయడం లేదన్నారు. జిల్లాలో మొదటి సారిగా సీఐటీయూ రాష్ట్ర మహాసభలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లికార్జున్, ఆడివయ్య సీఐటీయూ జిల్లా కార్యదర్శి మల్లేష్, జిల్లా ఉపాధ్యక్షులు మహేందర్ రెడ్డి, కోశాధికారి నర్సమ్మ, బస్వరాజు, గౌరీ, నాగరాజు, నాగేందర్ రెడ్డి, ప్రవీణ్ పాల్గొన్నారు. సరిపడా యూరియా అందించండి హుస్నాబాద్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు సరిపడా యూరియా అందించాలని గ్రామీణ పేదల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పడిగ ఎర్రయ్య, ప్రధాన కార్యదర్శి గన్నెబోయిన వెంకటాద్రి డిమాండ్ చేశారు. శనివారం మాట్లాడు తూ రాష్ట్రంలో సహకార సంఘాల వద్ద రైతులు యూరియా కోసం పడిగాపులు కాస్తున్నారని వాపోయారు. సకాలంలో యూరియా వేయకపోతే పంట దిగుబడి తగ్గి నష్టపోతారని, అవసరానికి తగ్గట్లుగా గోదాముల్లో యూరియా నిల్వ చేయకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. -
15 వరకు రేషన్ పంపిణీ
మెదక్ కలెక్టరేట్: జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రోడ్లు దెబ్బతిన్నప్పటికీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని గ్రామాల్లోని రేషన్ షాపులకు బియ్యం సరఫరా చేసినట్లు సివిల్ సప్లై జిల్లా మేనేజర్ జగదీశ్ తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో కొత్తగా 18,808 రేషన్ కార్డులు పెరిగాయని, అలాగే 80,130 మంది నూతనంగా కార్డుల్లో చేరారని వివరించారు. మెదక్ నియోజకవర్గంలో అత్యధికంగా 7,123 కొత్త కార్డులతో పాటు 29,087 మందిని కార్డుల్లో చేరారన్నారు. నర్సాపూర్లో 5,385 కార్డులతో పాటు నూతనంగా 24,709 మందిని చేర్చినట్లు చెప్పారు. జిల్లాలోని కొన్ని మండలాలు ఆందోల్, ఖేడ్, దుబ్బాక, గజ్వేల్ నియోజకవర్గాల్లోకి వెళ్లాయని, వాటిలో 6,300 కొత్త రేషన్కార్డులతో పాటు 26,334 మందిని నూతనంగా చేర్చినట్లు తెలిపారు. పాత కార్డులు 2,13,771 ఉండగా, కొత్తగా 18,808 కార్డులు రావడంతో మొత్తం 2,32,579 చేరిందన్నారు. అయితే హవేళిఘణాపూర్ మండలంలోని మూ డు గ్రామాలకు రోడ్లు పూర్తిగా ధ్వంసం కావడంతో వాటికి బియ్యం సరఫరా కాలేదని, త్వరలోనే పంపిణీ చేస్తామన్నారు. ఈనెల 15 వరకు జిల్లాలో రేషన్ పంపిణీ జరుగుతుందన్నారు. పేద ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం నాణ్యమైన సన్న బియ్యం సరఫరా చేస్తుందని, లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సివిల్ సప్లై డీఎం జగదీశ్ జిల్లాలో కొత్త కార్డులు 18,808 -
సిద్దిపేట అంటే ఎంతో ఇష్టం
సాక్షి, సిద్దిపేట: ‘సిద్దిపేట అంటే ఎంతో ఇష్టం. ఎక్కడా లేని విధంగా పచ్చని చెట్లు, పరిసరాల పరిశుభ్రత, పర్యాటకంగా ఎంతో అద్భుతంగా ఉంది’ అని ఇంటర్నేషనల్ మైమ్ కళాకారుడు మ ధు అన్నారు. పట్టణంలో ప్రియదర్శినీ నగర్లో గణపతి నవరాత్రి ఉత్సవాలలో మైమ్ మధు పాల్గొన్నారు. ఈ సందర్బంగా శుక్రవారం ‘సాక్షి’ పలకరించింది. ఆయన మాటల్లోనే... వేలాడే వంతెన అద్భుతం సిద్దిపేటలోని కోమటి చెరువు సూపర్.. వాటర్ షో అదుర్స్. చెరువుపై నిర్మించి వేలాడే వంతెన ప్రారంభోత్సవం సందర్భంగా ఇక్కడ షో చేసేందుకు వచ్చాను. తర్వాత సిద్దిపేట, మెదక్ జిల్లాలోని మోడల్ స్కూళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్లలో విద్యార్థులకు కమ్యూనికేషన్ స్కిల్స్పై మైమ్ షో ద్వారా అవగాహన కల్పించాను. డాక్టర్ కావాలనుకున్నా.. విద్యార్థి దశలో వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా విద్యార్థులందరం కలిసి సాంస్కృతిక ప్రదర్శనలిచ్చేవాళ్లం. నేను ముకాభినయం ప్రదర్శించాను. ప్రేక్షకుల నుంచి విశేష స్పందన రావడంతో డాక్టర్ కావాలన్న లక్ష్యం కాస్త మైమ్ కళాకారుడిగా స్థిరపడేలా చేసింది. 2 వేలకు పైగా షోలు ప్రపంచ వ్యాప్తంగా అమెరికా, జపాన్, దుబాయ్, ఆస్ట్రేలియా, మన దేశంలో ఇప్పటివరకు 2 వేలకు పైగా మైమ్ షోలు చేశాను. హైదరాబాద్లో ప్రపంచ స్థాయి మైమ్ షోను సైతం నిర్వహించాను. ఇండియన్ మైమ్ అకాడమీ స్థాపించి వందలాది మంది నటులకు మైమ్లో శిక్షణ ఇచ్చాను. కోమటి చెరువు సూపర్ వాటర్ షో అదుర్స్ మైమ్పై ఆసక్తి ఉన్న వారికి శిక్షణ ఇస్తా ‘సాక్షి’తో ఇంటర్నేషనల్ మైమ్ కళాకారుడు మధు -
కార్మిక నేత ఎల్లయ్య కన్నుమూత
రామాయంపేట(మెదక్): జాతీయ కార్మిక సంఘం నేత గాజుల ఎల్లయ్య గురువారం రాత్రి అనారోగ్యంతో మృతి చెందారు. మండలంలోని అక్కన్నపేటకు చెందిన ఎల్లయ్య పదో తరగతి వరకు గ్రామంలోని ఉన్నత పాఠశాలలో చదువుకున్నారు. ఉన్నత విద్య కోసం హైదరాబాద్ వెళ్లారు. అక్కడ చదువుతో పాటు రాజకీయంగా అంచెలంచెలుగా ఎదిగి బీహెచ్ఈఎల్ కార్మిక సంఘం నేతగా గుర్తింపు పొందారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం అలుపెరుగని పోరాటం చేశారు. సుమారు 40 ఏళ్లుగా కార్మిక సంఘం నేతగా పనిచేశారు. ప్రధానులు మొదలుకొని ముఖ్యమంత్రులు, మంత్రుల వరకు మంచి పేరు గడించిన ఆయన ఎందరో కార్మికులకు ఆరాధ్యుడిగా మారారు. తెలంగాణ ఉద్యమంలో ముందుండి పోరాడారు. ఎల్లయ్య మృతితో గ్రామంలో విషాదం నెలకొంది. మంజీరా వరదలతో జాగ్రత్త పాపన్నపేట(మెదక్): మంజీరా వరదల పట్ల జాగ్రత్తగా ఉండాలని అదనపు ఎస్పీ మహేందర్ అన్నారు. శుక్రవారం సాయంత్రం ఆయన ఏడుపాయలలో మంజీరా ప్రవాహాన్ని పరిశీలించారు. భక్తులు ఘనపురం ఆనకట్ట వైపు వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. అనంతరం వన దుర్గమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. జీఎస్టీ తగ్గింపుతో పేదలకు మేలు నర్సాపూర్: పలు వస్తువులపై ప్రధాని నరేంద్ర మోదీ జీఎస్టీ స్లాబ్ తగ్గించడంతో పేదలకు మేలు జరుగుతుందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లేశ్గౌడ్ అన్నారు. శుక్రవారం నాయకులతో కలిసి పట్టణంలోని చౌరస్తాలో ప్రధాని చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జీఎస్టీ తగ్గడంతో ప న్ను భారం తగ్గి వస్తువుల ధరలు తగ్గుతాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు. రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలి టేక్మాల్(మెదక్): రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సర్ధార్ గోపి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో ఆయన మాట్లాడుతూ.. 2016 డిసెంబర్ 26న అసెంబ్లీలో రజక కులస్తులను ఎస్సీ జాబితాలో చేర్చాలని ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మాట్లాడారని గుర్తు చేశారు. ఇందిరమ్మ కలలను సాకారం చేసే దిశగా అడుగులు వేయా లని కోరారు. అసెంబ్లీలో ఎమ్మెల్యేలు, పార్లమె ంట్లో ఎంపీలు ఈ అంశంపై మాట్లాడినా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని వాపోయారు. కార్యక్రమంలో రజక రిజర్వేషన్ సమితి మండల అధ్యక్షుడు రమేశ్, జిల్లా అధ్యక్షుడు కుమార్, ఉపాధ్యక్షుడు సాయి, జిల్లా యూత్ అధ్యక్షుడు ఉపేందర్ పాల్గొన్నారు. ‘ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి’ మెదక్ కలెక్టరేట్: భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఆ యూనియన్ రాష్ట కార్యదర్శి కాటం రాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం మెదక్లోని కేవల్ కిషన్ భవన్లో నిర్వహించిన జిల్లా మహాసభలో పాల్గొని మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులకు ఈఎస్ఐ, పీఎఫ్, ఉద్యోగ భద్రత, కనీస సౌకర్యాలు కల్పించడం లేదని మండిపడ్డారు. నాలుగు లేబర్ కోడ్లతో భవన నిర్మాణ కార్మికులకు తీరని అన్యాయం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో భవన నిర్మాణ రంగ కార్మికుల యూనియన్ జిల్లా కార్యదర్శి గౌరీ, నాయకులు నరేందర్, లాలు, శివయ్య, అఫ్జల్ దాసు తదితరులు పాల్గొన్నారు. -
చేపా చేపా ఎక్కడికెళ్లావ్!
● చేప పిల్లల పంపిణీపై నీలినీడలు ● నోటిఫికేషన్ ఇచ్చినా ముందుకు రాని కాంట్రాక్టర్లు ● మరోవారం గడువు పొడిగింపు పేరుకుపోయిన బకాయిలు ఆలస్యమైతే ఎదుగుదల కష్టమే! నిండుకండలా కోంటూరు చెరువుఉచిత చేప పిల్లల పంపిణీపై నీలినీడలు అలుముకున్నాయి. జిల్లాలో టెండర్ల ప్రక్రియ ప్రారంభం అయినా, కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. దీంతో మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరో వారం పొడిగించాం -
తీరని యూరియా కష్టాలు
చేగుంట(తూప్రాన్)/శివ్వంపేట(నర్సాపూర్): రోజులు గడుస్తున్నా రైతులకు యూరియా తిప్పలు తప్పడం లేదు. శుక్రవారం రైతులు భారీ సంఖ్యలో చేగుంట రైతు వేదిక, ఇబ్రహీంపూర్ సహకార సంఘం వద్దకు చేరుకున్నారు. చేగుంటలో 4 వందల బస్తాలు, ఇబ్రహీంపూర్లో లారీ లోడు మధ్యాహ్నం వరకు పంపిణీ చేశారు. అందని రైతులు అధికారులను నిలదీయగా రెండు రోజుల్లో యూరియా తెప్పిస్తామని హామీ ఇవ్వడంతో శాంతించారు. అలాగే శివ్వంపేట పీఏసీఎస్ కేంద్రంలో 450 బస్తాల యూరియా అందుబాటులో ఉండగా, పంపిణీ చేశారు. అయితే చాలా మంది రైతులు క్యూలో ఉన్నప్పటికీ యూరియా దొరకగా పోవడంతో నిరుత్సాహంగా వెనుతిరిగారు. -
యూరియా కోసం రోడ్డెక్కిన రైతులు
చేగుంట(తూప్రాన్): యూరియా కోసం రైతులు రోడ్డెక్కారు. చేగుంట– మెదక్ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. వ్యవసాయశాఖ అధికారులు యూరియా వస్తుందని తెలియజేయడంతో గురువారం ఉదయమే రైతువేదిక వద్దకు చేరుకున్నారు. తీరా స్టాక్ రాలేదని తెలపడంతో ఆగ్రహించి రోడ్డుపై బైఠాయించారు. ఈసందర్భంగా రైతులు మాట్లాడుతూ.. చేగుంటకు 2 లారీల యూ రియా వచ్చినట్లు సమాచారం ఉందని, వెంటనే అందించేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ చైతన్యకుమార్రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకొని టోకెన్లు ఇప్తిస్తానని, లోడ్ రాగానే యూరియా తీసుకెళ్లాలని సముదాయించడంతో రైతులు ఆందోళన విరమించారు. -
ఉత్తమ గురువులు 58 మంది
మెదక్జోన్: ఉత్తమ ఉపాధ్యాయులుగా ఈ ఏడాది జిల్లాలో 58 మందిని ఎంపిక చేశారు. వీరిలో గెజిటెడ్ ఉపాధ్యాయులు 2, స్కూల్ అసిస్టెంట్లు 23, ఎస్జీటీలు 25, ఫిజికల్ డైరెక్టర్ 1, ఉర్దూ ఉపాధ్యాయులు 2, కేజీబీవీ బోధకులు 2, మోడల్ స్కూల్స్ 2, ప్రైమరీ స్కూల్ హెచ్ఎం ఒకరు చొప్పున మొత్తం 58 మందిని ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక చేశారు. వీరికి ఈనెల 6న కలెక్టరేట్లో సన్మాన కార్యక్ర మం ఏర్పాటు చేశారు. ప్రజాప్రతినిధులతో పాటు కలెక్టర్, డీఈఓ పాల్గొని ఘనంగా సన్మానించనున్నారు.వీధి కుక్కల నివారణకు చర్యలు ● మున్సిపల్ కమిషనర్ గణేశ్రెడ్డి తూప్రాన్: వీధి కుక్కల బెడద నుంచి ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని మున్సిపల్ కమిషనర్ గణేశ్రెడ్డి తెలిపారు. 100 రోజుల ప్రణాళికలో భాగంగా గురువారం మున్సిపల్ కార్యాలయం వద్ద బ్లూక్రాస్ సంస్థ ద్వారా పెంపుడు, వీధి కుక్కలకు వ్యాక్సినేషన్ చేసినట్లు చెప్పారు. మున్సిపాలిటీ పరిధిలోని 16 వార్డుల్లో మూడు ప్రత్యేక వాహనాల ద్వారా 33 కుక్కలను పట్టుకొని ఏబీసీ సెంటర్కు తరలించామన్నారు. స్టెరిలైజ్ అయిన 250 కుక్కలకు యాంటీ రేబిస్ వ్యాక్సినేషన్ చేసినట్లు వివరించారు. విడతల వారీగా కుక్కల బెడద లేకుండా చర్యలు తీసు కుంటామని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. కార్యక్రమంలో పశువైద్యాధికారి లక్ష్మి, బ్లూక్రాస్ షెల్టర్ డైరెక్టర్ కుమారి, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. కేజీబీవీ తనిఖీ రామాయంపేట(మెదక్): స్థానిక కేజీబీవీ పా ఠశాలను గురువారం అదనపు కలెక్టర్ నగేశ్ తని ఖీ చేశారు. ఈసందర్భంగా విద్యార్థినులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఉత్తమ విద్యా ప్రమాణాల దిశగా కేజీబీవీలు ముందుకు సాగుతున్నాయన్నారు. విద్యార్థినులకు నాణ్యమైన భోజనం ఇవ్వాలని ఆదేశించారు. ఆయన వెంట స్కూల్ ప్రిన్సిపాల్, ఇతర ఉపాధ్యాయులు ఉన్నారు. సమస్యల పరిష్కారానికి కృషి హవేళిఘణాపూర్(మెదక్): ఇటీవల కురిసిన భారీ వర్షాలతో అతలాకుతలమైన ధూప్సింగ్ తండాను గురువారం రాత్రి ఎమ్మెల్యే రోహిత్ పరిశీలించారు. ఈసందర్భంగా తమ బాధలను ఎమ్మెల్యేతో తండావాసులు మొరపెట్టుకున్నారు. త్వరలోనే మీ సమస్యలు పరిష్కరిస్తానని వారికి హామీ ఇచ్చారు. అనంతరం ఎంఎస్ఎస్ఓ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకుల కిట్ను అందజేశారు. కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పరశురాం, నాయకులు శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు: ఎస్పీమెదక్ మున్సిపాలిటీ: జిల్లావ్యాప్తంగా గణేశ్ నిమజ్జనోత్సవాలు ప్రశాంతంగా నిర్వహించడానికి పటిష్ట బందోబస్తు ఏర్పాటుచేశామని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు అన్నారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో మొత్తం 2,963 గణపతి విగ్రహాలు నిమజ్జనం జరగనున్నాయని తెలిపారు. కార్యక్రమం సజావుగా జరిగేందుకు 546 మంది పోలీస్ సిబ్బందితో పాటు 4 క్విక్ రియాక్షన్ టీమ్స్ను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. అలాగే పట్టణంలో 204 మంది సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. చెరువులు, కుంటల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా క్రేన్లు, గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచామని వివరించారు. -
రవిరాజ్ బోధనకు ప్రపంచస్థాయి ప్రశంసలు
నర్సాపూర్ రూరల్: ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు రవిరాజ్ వినూత్న రీతిలో యూట్యూబ్ ఛానల్ ద్వారా విద్యాబోధన చేస్తూ ప్రపంచ స్థాయిలో ప్రశంసలు అందుకుంటున్నారు. నర్సాపూర్ మండలం అద్మాపూర్ ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయుడు రవిరాజ్ బోధనలో కొత్త ఒరవడి సృష్టిస్తున్నారు. 2008 డీఎస్సీలో ఉపాధ్యాయునిగా ఎంపికై ఉమ్మడి మెదక్ జిల్లా కంగిటి మండలం చౌకన్ పల్లి ప్రాథమిక పాఠశాలలో బాధ్యతలు చేపట్టారు. 43 మంది విద్యార్థులతో కొనసాగుతున్న పాఠశాలలో 104 మంది విద్యార్థుల సంఖ్యను పెంచి మండల స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయుని అవార్డు పొందారు. 2004లో అద్మాపూర్ ప్రాథమికోన్నత పాఠశాలకు బదిలీపై వచ్చినప్పుడు 53 మంది విద్యార్థులు ఉండగా ప్రస్తుతం 70కి పైగా విద్యార్థుల సంఖ్యను పెంచి తన ప్రత్యేకతను చాటారు. నెల రోజుల క్రితం సొంతంగా లక్ష రూపాయలతో విద్యార్థులకు స్పోర్ట్స్ డ్రెస్సులు, టై బెల్టులు, ఆట వస్తువులు డీఈఓ రాధాకిషన్ చేతుల మీదుగా అందజేశారు. -
సార్ సేవలకు ఇరవై ఏళ్లు
శుక్రవారం శ్రీ 5 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025పిల్లల మధ్యే విశ్రాంత జీవితం జగదేవ్పూర్(గజ్వేల్): పదవీ విరమణ పొందిన చాలా మంది శేష జీవితం పొందుతారు. కానీ రిటైర్డు ఉపాధ్యాయుడు బాల్రెడ్డి మాత్రం పిల్లల మధ్యే జీవితం సాగిస్తూ అందరి చేత శభాష్ అనిపించుకుంటున్నారు. జగదేవ్పూర్ మండలం తిగుల్ గ్రామానికి చెందిన తొందూరు బాల్రెడ్డి ఉపాధ్యాయుడిగా 34 ఏళ్లు పనిచేశారు. 2004లో రిటైర్డు అయ్యారు. అయినా ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకు ఉచితంగా విద్యాబోధన చేస్తున్నారు. ఏడేళ్ల పాటు ప్రయివేట్ పాఠశాలలో పనిచేశారు. అనంతరం గజ్వేల్ మండలం దాచారం ప్రభుత్వ ప్రాఽథమిక పాఠశాలలో మూడేళ్లు, క్యాసారం పాఠశాలలో రెండేళ్లు, ప్రజ్ఞాపూర్ పాఠశాలలో ఏడాది, తిగుల్ ప్రాఽథమిక పాఠశాలలో ఏడేళ్లుగా పనిచేస్తున్నారు. తెలుగు, గణితం పిల్లలకు బోధిస్తున్నారు. బాల్రెడ్డి సేవలకు జిల్లా విద్యాశాఖ అధికారులు, మాజీ మంత్రి హరీశ్రావు శాలువాతో సత్కరించి అభినందించారు. ఆరోగ్యం సహకరించినన్ని రోజులు పిల్లలకు పాఠాలు చెబుతానని తెలిపారు. -
ఆటో ఏర్పాటు చేసి.. హంగులు కల్పించి..
కొండపాక(గజ్వేల్): సిర్సనగండ్లలోని ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు ప్రధానోపాధ్యాయుడు జయప్రకాశ్రెడ్డి విశేష కృషి చేస్తున్నారు. మరోవైపు తన సొంత ఖర్చులతో పాఠశాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. అంతేకాకుండా విద్యార్థుల రవాణా సౌలభ్యం కోసం ఆటో ఏర్పాటు చేశారు. క్రీడా దుస్తులు, స్వచ్ఛమైన తాగు నీటి ఆర్వో ప్లాంట్, చదువు అర్థం అయ్యేలా ఐఎఫ్బి స్క్రీన్ ఎల్ఈడీ ప్యానల్, కంప్యూటర్, తరగతి గదుల్లో కార్పెట్లు, పాఠశాలకు అందమైన రంగులు వేయడం వంటి వాటి కోసం సుమారు రూ. 9లక్షలు వెచ్చించారు. బడి బాట కార్యక్రమంలో భాగంగా సుమారు70 మంది విద్యార్థులను పాఠశాలలో చేర్పించారు. ప్రస్తుతం 210 మంది విద్యార్థులకు విద్యాభ్యాసం జరుగుతోంది. -
సృజనాత్మకంగా బోధిస్తూ.. ఉన్నతంగా తీర్చిదిద్దుతూ..
అందరి నేస్తం.. ఆపన్నహస్తం ఇటీవల వజ్ర అవార్డుతో ప్రశాంత్కు సన్మానం.. వర్గల్ (గజ్వేల్): ఆధునిక హంగులతో చదువులకు వన్నెలద్దడమేకాకుండా.. రక్తదానాలతో స్పందించే హృదయంగా పేరొందారు వర్గల్ మండలం చాంద్ఖాన్మక్త ప్రైమరీస్కూల్ ప్రధానోపాధ్యాయుడు వరాల ప్రశాంత్. 2002లో నాచారం స్కూల్ టీచర్గా, శాకారం హెచ్ఎంగా, ప్రస్తుతం చాంద్ఖాన్మక్త హెచ్ఎంగా కొనసాగుతున్న ప్రశాంత్ ఆయా పాఠశాలలపై తనదైన ముద్ర వేశారు. సొంతంగా డబ్బు వెచ్చిస్తూనే, మిత్రులు, దాతల సహకారంతో డిజిటల్ క్లాస్రూమ్స్, తరగతి గోడలకు బోధన సంబంధ అంశాలతో ఎనామిల్ పెయింటింగ్స్, ఆకట్టుకునే బొమ్మలతో బడి వాతావరణాన్ని చదువుల నెలవుగా తీర్చిదిద్దారు. విద్యార్థులలో సామాజిక స్పృహ పెంపొందింపజేస్తూ.. శాకారం స్కూల్ను నందనవనంగా తీర్చిదిద్దారు. ఆయన కృషిని అభినందిస్తూ 2020–21 ‘రైస్ అండ్ షైన్’ ఎన్సీఈఆర్టీ జాతీయస్థాయి మ్యాగజైన్లో శాకారం పాఠశాల సక్సెస్స్టోరీ ప్రచురితం చేశారు. రేడియో పాఠాల రూపకల్పన, ఉపాధ్యాయ శిక్షణ మాడ్యూల్స్ తయారీ, పాఠ్యపుస్తకాల రచనలోనూ ప్రశాంత్ భాగస్వామిగా నిలిచారు. పిల్లల మానసిక అభివృద్ధికి.. గత వేసవి సెలవులలో మొబైల్ ఫోన్లకు పిల్లలు అతుక్కుపోకుండా ఉండడానికి పిల్లల శారీరక మానసిక అభివృద్ధికి డిజిటల్ డీటాక్స్ పేరుతో 21రోజులు, 21 రకాల కార్యక్రమాలతో సమాజానికి సరికొత్త విధానం పరిచయం చేశారు. అతని సేవలకు గుర్తింపుగా 2021లో మండల స్థాయి, 2022లో జిల్లా స్థాయి, అదేసంవత్సరం రాష్ట్రస్థాయి గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ అవార్డు, 2023లో రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు వరించాయి. తాజాగా 2025 జూన్లో సేవారంగంలో వజ్ర పురస్కారం సొంతమైంది. కేవలం బోధనకే పరిమితం కాకుండా 74 సార్లు రక్తదానం, 3 సార్లు ప్లేట్లెట్లు దానం చేసి ఆపదలో స్పందించే హృదయంగా పేరొందారు. అటు చదువులకు, సమాజానికి ఉపయుక్తంగా నిలుస్తూ అందరి నేస్తంగా అభినందనలు చూరగొంటున్నారు. డిజిటల్ హంగులు కల్పించి.. 74సార్లు రక్తదానం చేసి పాఠశాలలపై ‘ప్రశాంత్’ ముద్ర సదాశివపేట రూరల్(సంగారెడ్డి): విద్యార్థులతో కలిసి ఆడుతారు పాడుతారు.. వారి పక్కనే నేలపై కూర్చుంటారు.. వారిని అక్కున చేర్చుకొని పాఠాలు చెబుతారు.. అందుకే ఆయనంటే విద్యార్థులకు చాలా ఇష్టం. విద్యార్థులంటే ఆయనకు ప్రాణం. ఆయనే సదాశివపేట మండలం మెలగిరిపేట్, అంకేనపల్లి, చందాపూర్ ప్రభుత్వ పాఠశాలల్లో 28 ఏళ్లుగా విధులు నిర్వహించిన హెచ్ఎం బి.అశోక్ కుమార్. మరోవైపు రోటరీ క్లబ్ కార్యదర్శిగా, వాసవీ క్లబ్ అధ్యక్షుడిగా సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రభుత్వ బడుల్లో మౌలిక వసతులు కల్పిస్తున్నారు. తాను పని చేసే పాఠశాలల్లో గ్రంథాలయాల ఏర్పాటు, విద్యార్థులకు స్పోర్ట్స్ డ్రెస్సులు, టై, బెల్ట్, గ్లాసులు, ప్లేట్స్తో పాటుగా నోట్ పుస్తకాలను పంపిణీ చేశారు. అదేవిధంగా తరగతి గదులను సొంత డబ్బుతో వాల్ పెయింటింగ్ తో అందంగా తీర్చిదిద్దారు. టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ ను వినియోగిస్తూ విద్యార్థులకు చదువు పట్ల ఆసక్తి కలిగేలా సృజనాత్మకంగా బోధిస్తున్నారు. హెచ్ఎం అశోక్ కుమార్ సేవలను గుర్తించిన ప్రభుత్వం ఆయనకు జిల్లా, మండల స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులను సైతం అందజేసింది. వచ్చే ఏడాది ఆగస్టులో అయన పదవీ విరమణ పొందనుండగా, ఇటీవల మునిపల్లికి బదిలీపై వెళ్లారు. -
కేంద్ర నిధులతోనే ఆర్వోబీ నిర్మాణం
చేగుంట(తూప్రాన్): వందశాతం కేంద్ర నిధులతో చేగుంట– మెదక్ రైల్వేగేటు వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం చేపడుతున్నట్లు ఎంపీ రఘునందన్రావు తెలిపారు. గురువారం నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి మాట్లాడారు. 2016లో ఆర్వోబీ మంజూరైనా, గత ప్రభుత్వం రాష్ట్ర వాటా నిధులు అందించలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే రాష్ట్ర వాటా అందిస్తే నిర్మాణం చేపడతామని కేంద్రం ప్రకటించిందన్నారు. డబ్బులు చెల్లించలేమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించడంతో కేంద్రంలోని పెద్దలను ఒప్పించి వందశాతం కేంద్ర నిధులు కేటాయించేలా కృషి చేసినట్లు వివరించారు. రూ. 48.77 కోట్లతో ఆర్వోబీ నిర్మాణం జరుగుతుందన్నారు. వడియారం రైల్వేస్టేషన్లో అదనపు ప్లాట్ఫాం నిర్మాణం, దేవగిరి, రామలసీమ ఎక్స్ప్రెస్ రైళ్ల నిలుపుదల, రిజర్వేషన్ కౌంటర్ ఏర్పాటు చేయాలని డివిజినల్ రైల్వే మేనేజర్ సంతోష్కుమార్వర్మను ఎంపీ కోరారు. కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీకాంత్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లేశ్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.ఎంపీ రఘునందన్రావు -
ఇళ్ల నిర్మాణాల్లో వేగం పెంచండి
నర్సాపూర్ రూరల్/నర్సాపూర్/హవేళిఘణాపూర్: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ రాహుల్రాజ్ లబ్ధిదారులకు సూచించారు. గురువారం మండలంలోని ఎరక్రుంట, రూప్సింగ్ తండాలో పర్యటించారు. ఇందిర మ్మ బిల్లులు త్వరగా అందేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. గ్రామాల్లో క్రమం తప్పకుండా పారిశుద్ధ్య పనులు చేపట్టాలని సిబ్బందిని ఆదేశించారు. అలాగే ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన వెంట ఆర్డీఓ మహిపాల్, ఎంపీఓ వైద్య శ్రీనివాస్, కార్యదర్శి స్వాతిప్రియ ఇతర అధికారులు ఉన్నారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయంలో రికార్డులు పరిశీలించారు. భూ భారతి దరఖాస్తులను వీలైనంత త్వరగా పరిష్కరించాలన్నారు. ట్రిపుల్ఆర్ భూసేకరణను వేగవంతం చేయాలని సూచించారు. రాయరావు చెరువు వద్ద నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం మెదక్ మండలం కోంటూర్ చెరువును సంద ర్శించారు. కలెక్టర్ రాహుల్రాజ్ -
కళాకారుడిగా రంగులద్ది.. గురువుగా మెరుగులు దిద్ది
పాపన్నపేట(మెదక్): ఆటపాటలతో విద్యార్థులను అక్కున చేర్చుకుంటూ.. వినూత్న బోధనలతో ఆకట్టుకుంటూ.. చిన్నారుల భవితకు బంగారు బాటలు వేస్తున్నారు ఉపాధ్యాయుడు ఆశన్నగారి మల్లేశం. ఇతను మెదక్ జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యాడు. సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలం బస్వాపూర్ పాఠశాలలో 2012లో టీచర్ వృత్తిలోకి ప్రవేశించారు. విద్యార్థుల సంఖ్యను పెంచే ఉద్దేఽశ్యంతో గ్రామ సర్పంచ్తో మాట్లాడి మీ పిల్లల బాధ్యత మాది అంటూ భరోసా ఇచ్చి వారి పిల్లలను సర్కార్ బడిలో చేర్పించారు. దీంతో వెలవెలబోయిన పాఠశాల కొద్ది రోజుల్లోనే కళకళ లాడింది. కుర్తివాడ బడి రూపురేఖలు మార్చి.. బదిలీపై కుర్తివాడ వచ్చిన ఆయన కొద్ది రోజుల్లోనే బడి రూపం మార్చారు. పాఠశాలకు పెయింటింగ్లతో కొత్త కళను తెచ్చారు. చాలా మంది తమ పిల్లలను సర్కార్ బడిలో చేర్పించారు. ఆటల్లో.. చదువుల్లో.. సాంస్కృతిక కార్యక్రమాల్లో.. మాకెవరు లేరు పోటీ అనేలా విద్యార్థులను తీర్చి దిద్దుతున్నారు మల్లేశం. -
ఫోన్ స్విచ్ ఆఫ్.. మానస ఎక్కడికి వెళ్ళింది..!
వర్గల్(గజ్వేల్): ఇంటి నుంచి వెళ్లిన యువతి అదృశ్యమైంది. గౌరారం ఎస్ఐ కరుణాకర్రెడ్డి వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన పసుల మానస(19) మంగళవారం సాయంత్రం ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది. తల్లిదండ్రులు చుట్టుపక్కల వెతికినప్పటికీ ఆచూకీ దొరకలేదు. దీంతో బుధవారం యువతి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.కాలేజీకి వెళ్లిన యువతి..పటాన్చెరు టౌన్: కాలేజీకి వెళ్లిన యువతి అదృశ్యమైంది. పోలీసుల వివరాల ప్రకారం.. అమీన్పూర్కు చెందిన లక్ష్మి కూతురు నవనీత (17) పటాన్చెరు డివిజన్ పరిధిలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతుంది. ఈ క్రమంలో మంగళవారం కాలేజీకి వెళ్లిన ఆమె తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ వచ్చింది. కూతురి కోసం తెలిసిన వారి వద్ద, స్థానికంగా వెతికినా ఆచూకీ లభించలేదు.అచ్చన్నపల్లిలో వ్యక్తి..టేక్మాల్(మెదక్): వ్యక్తి అదృశ్యమైన ఘటన మండలంలోని అచ్చన్నపల్లిలో చోటు చేసుకుంది. ఎస్ఐ రాజేశ్ వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన మడ్డె సురేశ్ (26) అల్లాదుర్గం సర్కిల్ 108లో పని చేస్తున్నాడు. వారం క్రితం డ్యూటీ నిమిత్తం వెళ్లిన అతడు ఏడు రోజుల తర్వాత ఇంటికి వచ్చాడు. మంగళవారం భార్య సునీత ఎక్కడికి వెళ్లావు, ఇంటికి ఎందుకు రాలేదని ప్రశ్నించడంతో గొడవపడి ఇంటినుంచి వెళ్లిపోయాడు. పరిసర ప్రాంతాలతో పాటు బంధువుల వద్ద వెతికినా ఆచూకీ లభించలేదు. -
ఏవండీ అతను లేకుండా ఉండలేను.. అతనే కావాలి..!
హవేళిఘణాపూర్(మెదక్): వివాహేతర సంబంధం వద్దని మందలించడంతో ఓ వివాహిత పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. చికిత్స పొందుతూ మృతి చెందిన ఈ ఘటన బుధవారం మండల పరిధిలోని నాగాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా... గ్రామానికి చెందిన ఓ మహిళ(28) అదే ఊరికి చెందిన వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుంది. ఈ క్రమంలో భర్తకు అనుమానం వచ్చి పలుమార్లు హెచ్చరించినా ఆమెలో మార్పు రాలేదు. దీంతో భర్త ఈ నెల 1న సాయంత్రం భార్య కుటుంబీకులను పిలిపించి పెద్దల సమక్షంలో మాట్లాడుతున్నాడు. ఈ క్రమంలో మనస్తాపానికి గురైన ఆమె ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసుకొని పురుగుల మందు తాగింది. వెంటనే కుటుంబీకులు తలుపులు తీసి చూడగా అప్ప టికే అపస్మారక స్థితికి చేరుకుంది. వెంటనే మెదక్ ఆస్పత్రికి, మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. మంగళవారం రాత్రి చికిత్స పొందుతూ మృతి చెందింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ నరేశ్ తెలిపారు. -
రైల్వేలైన్ విస్తరణకు స్థల పరిశీలన
రామాయంపేట(మెదక్): మేడ్చల్–ముద్కేడ్ రైల్వేలైన్ విస్తరణ కోసం అడుగులు పడుతున్నాయి. మండలంలోని అక్కన్నపేటవద్ద ఆశాఖ అధికారులు బుధవారం భూసేకరణలో భాగంగా స్థలాన్ని పరిశీలించారు. ట్రాక్తోపాటు స్టేష న్ ఆధునికీకరణ నిమిత్తం ఎంత భూమి అవసరమవుతుందనే విషయమై అధికారులు సమీక్షించారు. త్వరలో ఈ ప్రక్రియ ప్రారంభమవుతుందని వారు తెలిపారు. రైల్వే అధికారులతోపాటు మెదక్ ఆర్డీఓ రమాదేవి, స్థానిక తహసీల్దార్ రజని, ఇతర అధికారులు పాల్గొన్నారు. పాపన్నపేట(మెదక్): అత్యాశకు పోయి ఆన్లైన్ మోసాల ఉచ్చులో చిక్కుకోవద్దని మెదక్ అడిషనల్ ఎస్పీ మహేందర్ తెలిపారు. బుధవారం పాపన్నపేటలోని జూనియర్ కళాశాలలో ఆయన మాట్లాడుతూ.. గుర్తు తెలియని ఫోన్ నంబర్ల నుంచి లింకులు వస్తే ఓపెన్ చేయొద్దని సూచించారు. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించే వారిపై షీటీంలు కఠినంగా వ్యవహరిస్తున్నాయన్నారు. వారిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని, కేసులు నమోదు చేస్తున్నామని చెప్పారు. అనవసరంగా కేసుల్లో చిక్కుకొని జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు. కార్యక్రమంలో సైబర్ డీఎస్పీ సుభాశ్ చంద్రబోస్, ఎస్సై శ్రీనివాస్గౌడ్, షీటీం ఏఎస్ఐ వెంకట య్య, ప్రమీల, డ్రగ్స్ నిర్మూలన అధికారి సతీశ్, ప్రిన్సిపాల్ నర్సింలు, విద్యార్థులు పాల్గొన్నారు. భూసేకరణ ప్రక్రియ ప్రారంభం చిన్నశంకరంపేట(మెదక్): సికింద్రాబాద్–నిజామాబాద్ రైల్వేలైన్ డబుల్లైన్ విస్తరణ కోసం భూసేకరణ ప్రక్రియను మెదక్ ఆర్డీఓ రమా దేవి ప్రారంభించారు. బుధవారం చిన్నశంకరంపేట మండలం మిర్జాపల్లి రైల్వేస్టేషన్ సమీపంలోని భూములను రైల్వే అధికారులతో కలిసి ఆమె పరిశీలించారు. త్వరలోనే భూ సేకరణ ప్రక్రియ పూర్తి చేసేందుకు రైతులను గుర్తించనున్నట్లు తెలిపారు. ఇప్పటికే మేడ్చల్–మనోహరాబాద్ మధ్యన డబుల్లైన్ పను లు కొనసాగుతున్నాయని అన్నారు. మనోహరాబాద్–అక్కన్నపేట మధ్యన భూసేకరణ ప్రక్రియ పూర్తయిన వెంటనే డబుల్లైన్ పనులు ప్రారంభం కానున్నామని రైల్వే అధికారులు స్పష్టం చేశారు. కార్యక్రమంలో చిన్నశంకరంపేట తహసీల్దార్ మాలతి, ఆర్ఐ రాజు ఉన్నారు. 7వరకు అన్నీ గ్రామాల్లో స్పెషల్డ్రైవ్: డీపీఓ యాదయ్య కౌడిపల్లి(నర్సాపూర్): ఈ నెల 7వరకు అన్నీ గ్రామాల్లో పారిశుద్ధ్యంపై స్పెషల్డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు డీపీఓ యాదయ్య పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో బుధవారం పంచాయతీ కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. అనంతరం వెల్మకన్నలో పారిశుద్ధ్యం పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వర్షాల ప్రభావంతో దోమల వృద్ధి ఎక్కువగా ఉంటుందని నీరు నిల్వలేకుండా చూడాలన్నారు. వైద్య సిబ్బందితో డ్రైడే నిర్వహించాలని సూచించారు. మురికి కాల్వలు, పరిసరాల్లో చెత్త ఎప్పటికప్పడు శుభ్రం చేయాలన్నారు. పల్లెప్రకృతి వనం, వన నర్సరీల్లో పనులు చేపట్టాలన్నారు. గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. కార్యక్రమంలో డీఎల్పీఓ సాయిబాబా, ఎంపీడీఓ శ్రీనివాస్, ఎంపీఓ కలీముల్ల, ఏపీఓ పుణ్యదాస్, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. కొమురవెల్లి(సిద్దిపేట): మల్లికార్జున స్వామి ఆలయ ఈఓగా వెంకటేశ్ బుధవారం పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈఓ ఆలయానికి ఉద యం రావడంతో అర్చకులు స్వాగతం పలికి స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఈఓ తన చాంబర్లో ఏఈఓ బుద్ది శ్రీనివాస్ నుంచి బాధ్యతలు స్వీకరించారు. -
యూరియా కోసం రాస్తారోకో
తూప్రాన్: యూరియా కోసం రైతులకు ఇక్కట్లు తప్పడంలేదు. మండలంలోని యావపూర్లో గ్రామ పంచాయతీ వద్ధ వ్యవసాయాధికారులు సగం మందికి మాత్రమే టోకెన్లు ఇచ్చారని రైతులు ఆందోళనకు దిగారు. తూప్రాన్–గజ్వేల్ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. దీంతో ఇరువైపుల వాహనాలు నిలిచిపోయాయి. తహసీల్దార్ చంద్రశేఖర్రెడ్డి, ఎస్ఐ శివానందం రైతులతో సముదాయించి ఆందోళన విరమింపజేశారు. కాగా, దుకాణాల వద్ద రైతులు గూమికూడకుండా ఉండేందుకు క్లస్టర్ల వారీగా గ్రామాల్లోనే రైతుకు రెండు బస్తాల యూరియా చొప్పున వ్యవసాయాధికారులు టోకెన్లు పంపిణీ చేశారు. -
ఆశలపై కన్నీటి మేట
భారీ వర్షాలు తెచ్చిన నష్టం అంతా ఇంతా కాదు. ఇంకా వరద నీటిలోనే నానుతున్న పంటలు ఒకవైపు.. పంటంతా కొట్టుకుపోయి పొలాల్లో మేటలు వేయడం మరోవైపు.. శ్రమంతా వరద పాలు కావడంతో రైతన్న కంట కన్నీరే మిగిలింది. భారీ స్థాయిలో వచ్చిన వరదలతో వేలాది ఎకరాల్లో పంటలు ధ్వంసమయ్యాయి. జిల్లా పరిధిలోని సుమారు 18 వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. రెండు వేలకుపైగా ఎకరాల్లో ఇసుక మేటలు ఏర్పడ్డాయి. రామాయంపేట శివారులో పంటచేనులో మేట వేసిన ఇసుక, రాళ్లురామాయంపేట(మెదక్): జిల్లాలో భారీ వర్షాలు కురిసి పది రోజులైనా ఇంకా పంట పొలాలు నీటిముంపులోనే ఉన్నాయి. పంట చేలల్లో ఇసుకతోపాటు పెద్ద పెద్ద బండరాళ్లు, చెట్లు వరద నీటిలో కొట్టుకొచ్చి మేట వేశాయి. ఇప్పటికే తీవ్రంగా నష్టపోయిన రైతులకు.. చేలల్లో మేటలు వేసిన ఇసుక, బండరాళ్లు, చెట్లు తొలగించడం తలకుమించిన భారంగా మారింది. వరద నీటిలో మునిగిన పంట పొలాలు చెరువులను తలపిస్తున్నాయి. ఎక్కడ చూసినా నీరే కనిపిస్తోంది. ప్రధానంగా రామాయంపేట, హవేలీ ఘణపూర్, చేగుంట, నార్సింగి, నిజాంపేట, కుల్చారం, వెల్దుర్తి, తూప్రాన్, శివ్వంపేట మండలాల్లో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. పొలాల్లో వేసిన ఇసుక మేటలు రహదారిని తలపిస్తున్నాయి. వరద నీటిలో ఉన్న పంటలు కుళ్లిపోతున్నాయి. పంట నష్టంపై సర్వే ఇటీవల కురిసిన భారీ వర్షాలతో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. రెండు వేలకు పైగా ఎకరాల్లో ఇసుక మేటలు వేశాయి. పంట నష్టానికి సంబంధించి సర్వే కొనసాగుతోంది. రెండు, మూడు రోజుల్లో పూర్తి స్థాయి నివేదికను ప్రభుత్వానికి పంపిస్తాం. –దేవ్కుమార్, జిల్లా వ్యవసాయ అధికారి పొలమంతా ఇసుక మేటే కొత్తగా నిర్మించిన జాతీయ రహదారి పక్కనే నా వ్యవసాయ భూమి ఉంది. రెండెకరాల మేర వరి పంట వేశాను. బ్రిడ్జి నుంచి వరదతో పొలమంతా ఇసుక మేటలు ఏర్పడ్డాయి. దీనిని తొలగించుకోవాలంటే మరింత భారం. ఏం చేయాలో అర్థంకావడంలేదు. –కోరెంకల భీరయ్య, రైతు, శమ్నాపూర్ వరద నీటిలోనే పంట అప్పుచేసి నాలుగెకరాల మేర వరి సాగు చేశా. పంట మంచిగా పండితే ఈసారి కూతురి పెళ్లి చేయాలని ఆశపడ్డాను. నా ఆశలను వరుణదేవుడు ఛిద్రం చేశాడు. పొలంలో నీరు నిలిచి పంటంతా దెబ్బతిన్నది. ఇప్పటికీ పంట చేను నుంచే వరద పారుతోంది. ప్రభుత్వమే ఆదుకోవాలి. –కళ్ల భూమయ్య, రైతు, హవేళి ఘణపూర్ రెండు వేలకుపైగా ఎకరాల్లో ఇసుక మేటలు ఇంకా ముంపులోనే పొలాలు దిక్కుతోచని స్థితిలో జిల్లా రైతాంగం -
సహకారం.. పొడిగింపు
పీఏసీఎస్ల పనితీరు ఆధారంగా నిర్ణయం● ఉమ్మడి జిల్లాలోని 89 సొసైటీల్లో పాలకవర్గాల పదవీకాలం కొనసాగింపు ● 21 సొసైటీల్లో పెండింగ్ ● వారినే కొనసాగిస్తారా? లేదా అన్నది సందిగ్ధం 21 సంఘాలకు బ్రేక్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్) పాలకవర్గాల పనితీరు ఆధారంగా పదవీకాలాన్ని పొడిగించారు. ఆగస్టు 14వ తేదీతో పీఏసీఎస్ల పదవీకాలం ముగిసింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో 111 పీఏసీఎస్లు ఉండగా.. పాలకవర్గాల పనితీరు మేరకు 89 వాటికే పదవీకాలం పొడిగిస్తూ బుధవారం ఆయా జిల్లాల డీసీఓలు ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే మెదక్ జిల్లాలోని రాంపూర్ పీఏసీఎస్కు పర్సన్ ఇన్చార్జి కొనసాగుతుండగా మరో 21 సంఘాల పదవీకాలం పొడిగింపు సహకార శాఖ పెండింగ్లో పెట్టింది. సాక్షి, సిద్దిపేట: మండల స్థాయిలో రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలు, పంట రుణాలు అందజేస్తూ పీఏసీఎస్లు అండగా నిలుస్తున్నాయి. ఇలాంటి వాటికి ప్రతి ఐదేళ్లకోసారి ప్రభుత్వం ఎన్నికలు నిర్వహిస్తుంది. సంఘం పరిధిలోని రైతులు, డైరెక్టర్లు, చైర్మన్లతో కూడిన పాలకవర్గాన్ని ఎన్నుకుంటారు. 2020లో ఎన్నికై న పాలకవర్గం గడువు ఈ ఏడాది ఫిబ్రవరి 14తో ముగియగా మరో ఆరు నెలలు(ఆగస్టు 14వ తేదీ) వరకు ఇదివరకే పొడిగించారు. గత నెలలో మరో ఆరు నెలలు పదవీకాలం పొడిగించేందుకు సహకార శాఖ పలు నిబంధనలు పెట్టింది. పనితీరుపై ఆరా.. తాజా నిబంధనల ప్రకారం పనితీరు మెరుగ్గా ఉంటేనే వాటి పాలకవర్గాల గడువు పొడిగింపు ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇందుకోసం సంఘాల వారీగా పది అంశాలతో కూడిన సమాచారం అందించాల్సిందిగా జిల్లా సహకారశాఖను ఆదేశించింది. సొసైటీ పరిధిలో పాత బకాయిల పరిస్థితి రుణాల తిరిగి చెల్లింపులు సక్రమంగా ఉన్నాయా? నిధుల దుర్వినియోగం ఏమైనా జరిగిందా? జరిగితే వాటిపై ఎలాంటి విచారణ చేపట్టారు? దుర్వినియోగానికి పాల్పడిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకున్నారా? సొసైటీ కార్యకలాపాలపై ఆడిట్ చేశారా తదితర ఆంశాలను పరిగణనలోకి తీసుకున్నారు. -
తప్పుదోవ పట్టించొద్దు
హౌజింగ్ పీడీ మాణిక్యంమెదక్ కలెక్టరేట్: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు చేపట్టిన లబ్ధిదారులకు తప్పుదోవ పట్టించ వద్దని, వారికి బిల్లులు రాకుండా నష్టం జరిగే ప్రమాదం ఉందని హౌసింగ్ పీడీ మాణిక్యం పేర్కొన్నారు. హవేళిఘణాపూర్ మండలం తొగిట, సర్ధన గ్రామాల్లో పర్యటించి ఇళ్ల నిర్మాణాలు పరిశీలించినట్లు తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేస్తున్న లబ్ధిదారులకు వారం వారం బిల్లులు అందజేస్తున్నట్లు చెప్పారు. జిల్లాలో ఇప్పటి వరకు 2వేల మంది లబ్ధిదారులకు రూ.20కోట్లు వారి ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపారు. ఈ వారం 296 మంది లబ్ధిదారులకు రూ.2.96కోట్లు మంజూరు కాగా.. వారి వారి ఖాతాల్లో జమ చేసినట్లు చెప్పారు. ఇళ్ల నిర్మాణాలు చేపట్టిన తరువాత మేసీ్త్రలు అధికంగా కూలీలు పెంచారని, దీంతో లబ్ధిదారులకు ఆర్థిక భారంతో ఇబ్బందులు పడుతున్నట్లు వివరించారు. ఫీట్ల పద్ధతిలో ఇళ్ల నిర్మాణం చేస్తున్న మేసీ్త్రలు నిర్మాణం వ్యయం పెరిగేలా వారికి సలహాలు ఇస్తున్నారని, దీంతో లబ్ధిదారులకు అప్పులపాలయ్యే ప్రమాదం ఉందన్నారు. పెద్ద ఎత్తున పిల్లర్లు వేసి అప్పులపాలు కావొద్దని సూచించారు. ఆర్థిక స్థోమత లేని నిరుపేదలకు స్వయం సహాయక సంఘాల ద్వారా రుణాలు ఇప్పిస్తామన్నారు. -
మెతుకు సీమ జాగృతమవుతుందా?
మెదక్అర్బన్: అసెంబ్లీ ఎన్నికల పరాజయ భారం నుంచి తేరుకొని.. సమస్యలపై సమరం సాగిస్తున్న గులాబీ దళంపై ఇప్పుడు మరో పిడుగు పడింది. ఒక వైపు కాళేశ్వరం లొల్లి సాగుతుండగానే.. మరో వైపు కవిత పేల్చిన మాటల తూటాలు కాక రేకెత్తించాయి. ప్రతిఫలంగా తీసుకున్న సస్పెన్షన్ నిర్ణయాలు.. ఆపై ఎమ్మెల్సీ పదవికి, పార్టీ సభ్యత్వానికి సమర్పించిన రాజీనామాస్త్రం, తదనంతరం జోరు పెరిగిన విమర్శనాస్త్రాల వాడి, మెతుకు సీమలో చర్చనీయాంశంగా మారాయి. మెదక్లో అంతటా ఆసక్తి మాజీ సీఎం కేసీఆర్ కుటుంబానిది ఉమ్మడి మెదక్ జిల్లా కావడం, ఆయన కూతురు కవిత తన మనోభావాన్ని వెల్లడించటంతో మెతుకుసీమ ప్రజలు, రాజకీయ నేతల్లో ఉత్కంఠ రేగింది. కవితను మంగళవారం బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెన్షన్ నిర్ణయం తీసుకున్న తర్వాత బీఆర్ఎస్, జాగృతి వర్గాల నుంచి పెద్దగా ప్రతిస్పందనలు రాలేదు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మారెడ్డి మాత్రం మెదక్లో ప్రెస్మీట్ నిర్వహించి కాంగ్రెస్పై విమర్శనాస్త్రాలు గుప్పించారు. కానీ కవితపై తీసుకున్న చర్యలను మాత్రం స్వాగతిస్తున్నామని తెలిపారు. అయితే ‘ఎద్దు పుండు కాకికి ముద్దు’అన్నట్లు కాంగ్రెస్, బీజేపీ వర్గాలు మాత్రం గులాబీ పార్టీలో వేరు కుంపటి అంశాన్ని ఆశగా గమనిస్తున్నాయి. నాయకురాలి వెంటే.. మెదక్ జిల్లాలో తెలంగాణ జాగృతి కార్యక్రమాలు మొక్కుబడిగా కొనసాగుతున్నాయి. మహిళా జాగృతి, యువజన, విద్యార్థి, కార్మిక సంఘాలు ఏర్పాటు చేశారు. అప్పట్లో తెలంగాణ జాగృతి మహిళా సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షురాలిగా మల్లిక పనిచేసిన సమయంలో మహిళల సమస్యలపై అవగాహన సదస్సులు నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి, బతుకమ్మ సంబరాలు, బోనాల ఊరేగింపు తదితర కార్యక్రమాల ద్వారా జనాలను చైతన్యవంతం చేశారు. 2022లో ఏడుపాయల్లో జరిగిన బోనాల ఊరేగింపులో కవిత పాల్గొన్నారు. అలాగే మెదక్లో సైతం ఆమె వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అలాగే బ్లడ్ బ్యాంకులు, అవయవ దానాలు, కాలేజీల్లో ఫీజుల నియంత్రణ, పేద విద్యార్థులకు ఉచిత చదువులు, నిరుపేద యువతులకు పుస్తెచ మట్టెలు అందజేత; వరదల సమయంలో సరుకుల పంపిణీ తదితర సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. అయితే ప్రస్తుత విపత్కర సమయంలో జాగృతిలో పనిచేస్తున్న సంస్థల ప్రతినిధులు, కార్యకర్తలు నాయకురాలి వెంటే ఉంటామని స్పష్టం చేస్తున్నారు. అది ఎంతవరకు సాధ్యమవుతుందనే వేచి చూడాలి. కేసీఆర్ది ఉమ్మడి జిల్లా కావడంతో మెదక్లో ఆసక్తి వరద బాధితులకు జాగృతి కార్యకర్తల సేవలు రసవత్తరంగా మారిన రాజకీయాలు కవితక్క వెంటే ఉంటాం ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో జాగృతి నాయకురాలు కవితక్క వెంటే ఉంటాం. ఆమె సూచనలకు అనుగుణంగా సంస్థను బలోపేతం చేసి, సేవా కార్యక్రమాలు చేపడతాం. కేసీఆర్ ఆశయాలకు అనుగుణంగా, కవితక్క సారథ్యంలో ప్రజాసేవలో పాల్గొంటాం. త్వరలో జాగృతిని మరింత బలోపేతం చేసేందుకు కమిటీలు ఏర్పాటు చేస్తాం. – రమేశ్, తెలంగాణ జాగృతి జిల్లా నాయకుడు -
త్వరితగతిన నష్టం అంచనాలు
● అధికారులకు కలెక్టర్ ఆదేశం ● రైతులను ఆదుకుంటామని భరోసా ● దెబ్బతిన్న పంటల పరశీలన అల్లాదుర్గం(మెదక్)/టేక్మాల్(మెదక్)/మెదక్ కలెక్టరేట్: వరద నష్టం అంచనాలు యుద్ధ ప్రాతిపదికన జరగాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. బుధవారం రాత్రి తన చాంబర్లో ఇరిగేషన్, ఆర్అండ్బీ, పంచాయతీరాజ్, విద్యా ఆరోగ్యశాఖల అధికారులతో సమీక్షించారు. సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ నిబంధనలను అనుసరించి వరద నష్టం అంచనాలు ఉండాలని సూచించారు. త్వరితగతిన వరద నష్ట అంచనాలు పూర్తి చేయాలని ఆదేశించారు. అంతకుముందు అల్లాదుర్గం మండలం గడిపెద్దాపూర్లో దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. నష్టపోయిన రైతులకు పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే.. టేక్మాల్ మండలం బొడ్మట్పల్లిలో గుండువాగు వల్ల దెబ్బతిన్న పత్తి పంటను, పొలాలకు వెళ్లే రోడ్డును కలెక్టర్ పరిశీలించారు. భారీ వర్షాల కారణంగా జిల్లాలో అపార నష్టం వాటిల్లిందన్నారు. పంట నష్టాల అంచనాల అధికార యంత్రాంగం నిమగ్నమైందన్నారు. అధికారులు స్పష్టమైన నివేదిక రూపొందించాలని ఆదేశించారు. గుండువాగును విస్తరించాలని కోరగా.. ఆయన సానుకూలంగా స్పందించారు. -
కాళేశ్వరంపై ఆరోపణలు మానుకోవాలి
టేక్మాల్(మెదక్): కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరంపై అసత్య ఆరోపణలు చేయడం మానుకోవాలని బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు భక్తుల వీరప్ప అన్నారు. కాళేశ్వరంపై అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ కుట్ర చేసిందంటూ నిరసనగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పిలుపు మేరకు మంగళవారం మండల కేంద్రంలో ఆ పార్టీ నాయకులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా వీరప్ప మాట్లాడుతూ.. రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతుందని, ఎంతోమంది రైతులకు మేలు జరిగే కాళేశ్వరం ప్రాజెక్ట్ పేరుతో బీఆర్ఎస్ పార్టీని బదనాం చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల్లో ఇచ్చిన హీమీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమై అసత్య ప్రచారాలు చేస్తుందని మండిపడ్డారు. నాయకులు సిద్ధయ్య, భాస్కర్, రాజేందర్, సుధాకర్, ఈశ్వరప్ప, రాజుగౌడ్, సాయిబాబ, మహేందర్, మతిన్, సురేశ్, మల్లేశం, బసంత్రావ్, సంగయ్య, రజాక్ పాల్గొన్నారు. బీఆర్ఎస్ రాస్తారోకో అల్లాదుర్గం(మెదక్): కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారం చేస్తోందని బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆరోపించారు. బీఆర్ఎస్ నేతలపై అక్రమ కేసులు పెట్టేందుకు సీబీఐ విచారణకు అదేశించడంపై పార్టీ ఆదేశాల మేరకు అల్లాదుర్గంలో మంగళవారం బీఆర్ఎస్ పార్టీ నాయకులు రాస్తారోకో చేపట్టారు. ఆందోళన చేపడుతున్న బీఆర్ఎస్ నాయకులను ఎస్ఐ శంకర్ అడ్డుకుని స్టేషన్కు తరలించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు నర్సింలు, బేతయ్య, కృష్ణగౌడ్, పవన్, నర్సప్ప, నర్సింలు, అశోక్గౌడ్, శివరాం, రమేశ్ పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు వీరప్ప -
42 శాతం రిజర్వేషన్లు చరిత్రాత్మకం
నర్సాపూర్: బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ సీఎం రేవంత్రెడ్డి తీసుకున్న నిర్ణయం చరిత్రాత్మకమని పలువురు కాంగ్రెస్ నాయకులు అన్నారు. మంగళవారం పార్టీ చేపట్టిన సంబరాలలో భాగంగా స్థానిక పిల్లల పార్కులోని రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి చౌరస్తా వరకు ర్యాలీ చేపట్టారు. పీసీసీ సీనీయర్ ఉపాధ్యక్షుడు ముజాహిద్ ఆలంఖాన్, మాజీ ఎమ్మెల్యే మదన్రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జ్ ఆవుల రాజిరెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ సుహాసినిరెడ్డి పాల్గొని మాట్లాడారు. కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేసేందుకు కాంగ్రెస్ కట్టుబడి ఉందని చెప్పారు. తమ నేత రాహుల్గాంధీ సూచనల మేరకు సీఎం రేవంత్రెడ్డి బీసీలకు 42శాతం రిజర్వేషన్ల బిల్లును అసెంబ్లీలో ఆమోదింపజేశారని వారు అన్నారు. ఈ విషయంలో రాష్ట్రం దేశంలోనే రోల్మోడల్గా నిలిచిందన్నారు. సంబరాలలో భాగంగా మిఠాయిలు పంచిపెట్టారు. కార్యక్రమంలో నియోజకవర్గంలోని ఆయా మండలాలకు చెందిన నాయకులు పాల్గొన్నారు. ఇదిలా ఉంటే.. నర్సాపూర్ నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని మంగళవారం ఆ పార్టీ నాయకులు ప్రారంభించారు. -
ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం
డీఈఓ రాధాకిషన్వెల్దుర్తి(తూప్రాన్): ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రభుత్వం కృషి చేస్తుందని, దాతల సహకారం తోడైతే మరింత అభివృద్ధి చెందుతాయని జిల్లా విద్యాధికారి రాధాకిషన్ అన్నారు. మంగళవారం మండలంలోని ఎం.జలాల్పూర్ ప్రాథమికోన్నత పాఠశాలలో గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు రంగి కృష్ణ సుమారు వంద మంది విద్యార్థులకు స్పోర్ట్స్ డ్రెస్ పంపిణీ చేయగా, డీఈఓ ముఖ్య అతిధిగా హాజరై అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్యాబోధన కొనసాగుతుందని అన్నారు. కార్యక్రమంలో ఎంఈఓ సీతారాం, రిటైర్డ్ ఎంఈఓ యాదగిరి, హెచ్ఎం సురేశ్కుమార్, ఎస్జీటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేశం, ప్రణీత్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
విద్యతో పాటు క్రీడలూ ముఖ్యం
అల్లాదుర్గం(మెదక్): విద్యార్థులకు విద్యతో పాటు క్రీడలు అవసరమేనని అల్లాదుర్గం సీఐ రేణుకారెడ్డి అన్నారు. మంగళవారం ముస్లాపూర్ జెడ్పీ పాఠశాలలో మండల స్థాయి పాఠశాల క్రీడోత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులకు క్రీడలు ఎంతో ముఖ్యమన్నారు. పోటీల్లో గెలుపోటములు సహజమన్నారు. ఓటమితో కుంగిపోకుండా, ఓటమి గెలుపునకు నాంది కావాలన్నారు. గ్రామీణా ప్రాంతాలో ఎంతో మంది క్రీడాకారులు ఉన్నారని, వారికి తగిన ప్రోత్సాహం లేదన్నారు. కార్యక్రమంలో ఎంఈఓ ధనుంజయ్య, జెడ్పీ పాఠశాల హెచ్ఎంలు రమేశ్, లక్ష్మన్, నర్సింలు, రవి, కేజీబీవీ ప్రిన్సిపాల్ స్రవంతి, పీఆర్టీయూ నాయకులు జనార్దన్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.చదువుతోపాటు క్రీడలు అవసరం శివ్వంపేట(నర్సాపూర్): క్రీడలతో మానసిక ఉల్లాసం కలుగుతుందని పీఏసీఎస్ చైర్మన్ వెంకట్రామిరెడ్డి, ఎంఈఓ బుచ్చనాయక్, నర్సాపూర్ మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ మాధవరెడ్డి అన్నారు. మంగళవారం మండల పరిధిలోని గోమారం హై స్కూల్ ప్రాంగణంలో మండల స్థాయి క్రీడా పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. .చదువుతో పాటు ఆటల పట్ల విద్యార్థులు ఆసక్తి కనబరచాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లా స్థాయి పోటీల్లో పాల్గొనే క్రీడాకారులకు ప్రయాణ, ఇతర ఖర్చుల నిమిత్తం పీఏసీఎస్ చైర్మన్ వెంకట్రామిరెడ్డి రూ.20 వేల అందజేశారు. ఈ కార్యక్రమంలో మండలంలోని వివిధ పాఠశాలల క్రీడాకారులు పాల్గొన్నారు. నర్సాపూర్లో... నర్సాపూర్: మండల స్థాయి స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆటల పోటీలను మంగళవారం స్థానిక అల్లూరి సీతారామరాజు గిరిజన గురుకుల పాఠశాల ఆవరణలో ఎంఈఓ తారాసింగ్ ప్రారంభించారు. పోటీల్లో పలు పాఠశాలల నుంచి సుమారు ఐదు వందల మంది క్రీడాకారులు పాల్గొన్నారు. వర్షంతో నిలిచిన క్రీడలు పాపన్నపేట(మెదక్): మండల కేందరంలో మంగళవారం ఎస్జీఎఫ్ క్రీడలను యువనాయకుడు అహ్మద్ అలీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రీడలు చదువుల్లో భాగం కావాలన్నారు. అనంతరం వర్షం ప్రారంభం కావడంతో ఆటల పోటీలను వాయిదా వేశారు. హెచ్ఎం మహేశ్వర్ ,పీఈటీలు, విద్యార్థులు, టీచర్లు ,క్రీడాకారులు పాల్గొన్నారు. -
నూతన కార్యవర్గం ఎన్నిక
నిజాంపేట(మెదక్): నిజాంపేట మండల కేంద్రంలో మంగళవారం టీయూడబ్ల్యూజే ఐజేయూ జిల్లా ఆధ్యక్షుడు శంకర్ దయాళ్ చారి ఆదేశాల మేరకు జిల్లా ఉపాధ్యక్షుడు రమేష్ గౌడ్ ఆధ్వర్యంలో మండల నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ మేరకు మంగళవారం నిజాంపేట మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షుడుగా అజ్గర్, ఉపాధ్యక్షుడుగా నవీన్రెడ్డిని ఎన్నుకున్నారు. అలాగే ప్రధాన కార్యదర్శిగా జీడీ. చంద్రకాంత్గౌడ్, కోశాధికారి బండారి సిద్ధరాములు, సహాయ కార్యదర్శిలుగా బాలరాజ్, శ్రీకాంత్, సలహాదారులుగా భైరవరెడ్డి, భరత్ రెడ్డి, ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నిజాంపేట మండల ప్రెస్క్లబ్ అధ్యక్షుడుగా అజ్గర్ మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో జర్నలిస్టు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ముఖ్యంగా పాత్రికేయులకు డబుల్ బెడ్ రూమ్, ఇళ్ల స్థలాల విషయంలో అందరికీ న్యాయం చేసేలా ముందుకెళ్తామన్నారు. -
ఉన్నత లక్ష్యంతో చదవాలి
పెద్దశంకరంపేట(మెదక్): జీవితంలో ఉన్నతంగా ఎదగాలనే లక్ష్యంతో చదవాలని బంగారుతల్లి ప్రేరణ అంబాసిడర్, ట్రైనర్ సంతోష్కుమార్ అన్నారు. మంగళవారం పెద్దశంకరంపేటలోని బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు టైమ్ మేనేజ్మెంట్, లైఫ్స్కిల్స్, కేరియర్ గైడెన్స్, స్టడీ స్కిల్స్, ప్రభుత్వ పాఠశాల గొప్పతనాన్ని, జీవితంలో విజయం సాధించే అంశాలపై ఆయన విద్యార్థులకు వివరించారు. అనంతరం వారికి పలు క్విజ్ పోటీలను నిర్వహించి ఎంఈఓ వెంకటేశం చేతులమీదుగా బహుమతులు అందించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు సిద్ధిరాములు తదితరులున్నారు. నిజాంపేట(మెదక్): మండల పరిధిలోని నందిగామ గ్రామ శివారులో ఐదు రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు బ్రిడ్జి కుంగింది. దీంతో మెదక్ – సిద్దిపేట జాతీయ రహదారి 765 డి పనులు పనులు కొనసాగుతున్నాయి. పనులు పూర్తయితే వాహనాదారులకు, ప్రయాణికులకు ఇబ్బందులు తప్పనున్నాయి. నందిగామ గ్రామ శివారులో కుంగిన బ్రిడ్జికి ప్రక్కనే మరో మట్టి రోడ్డును నిర్మిస్తున్నారు. రామాయంపేట(మెదక్): భారీ వర్షాలతో నష్టపోయిన బాధితులకు మంగళవారం స్థానిక లయన్స్ క్లబ్ సభ్యులు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. క్లబ్ జిల్లా గవర్నర్ అమర్నాథ్, స్థానిక సీఐ వెంకట్ రాజాగౌడ్, ఎస్ఐ బాల్రాజు బాధితులకు అందజేశారు. క్లిష్ట పరిస్థితుల్లో బాధితులను ఆదుకోవడం గొప్ప విషయమని సీఐ పేర్కొన్నారు. క్లబ్ మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. క్లబ్ ప్రతినిధులు దీప్చంద్, దామోదర్రావు, శ్రీనివాసరావు, బాలరాజు, గురువయ్య, కృష్ణమూర్తి పాల్గొన్నారు. రేగోడ్(మెదక్): నంబర్ ప్లేట్ లేకుండా కనిపిస్తే వాహనాన్ని సీజ్ చేసి కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ పోచయ్య హెచ్చరించారు. మండలంలోని వెంకటాపూర్ చౌరస్తా వద్ద మంగళవారం వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలో నంబర్ ప్లేట్ లేని నాలుగు వాహనాలను పట్టుకుని వాహనాలకు నంబర్ వేయించి వదిలిపెట్టారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లా డు తూ వాహనదారులు సీట్ బెల్ట్, హెల్మెట్ పెట్టుకోవాలని సూచించారు. మధ్యం తాగి వాహనా లు నడిపితే చర్యలు తప్పవని హెచ్చరించారు. అల్లాదుర్గం(మెదక్): అల్లాదుర్గం మండలంలో 20 మందికి ప్రభుత్వం కల్యాణలక్ష్మి చెక్కులు మంజూరు చేసింది. మంగళవారం చెక్కులను వట్పల్లి మార్కెట్ కమిటీ చైర్పర్సన్ లక్ష్మి లబ్ధిదారులకు అందజేశారు. కొత్తగా మంజూరైన రేషన్ కార్డులు, సీఎంఆర్ఎఫ్ కింద మంజూరైన చెక్కులను తహసీల్దార్ కార్యాలయంలో పంపిణీ చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ మల్లయ్య, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు శేషారెడ్డి, నాయకులు బల్రాం, సుభాశ్రావ్, నర్సింహరెడ్డి, బాలకిషన్, బేతయ్య, పాల్గొన్నారు. జహీరాబాద్: మండలంలోని హుగ్గెల్లి గ్రామంలో ఆయిల్ పామ్ పంటసాగుపై వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు అవగాహన కల్పించారు. మంగళవారం హెచ్ఈఓ విఠల్ మాట్లాడుతూ.. ఆయిల్ పామ్ పంటను సాగు చేయడం ద్వారా దీర్ఘకాలికంగా లబ్ధి పొందవచ్చన్నారు. ఈ సందర్భంగా సాగు పద్ధతులు, ప్రభుత్వ సబ్సిడీల గురించి వివరించారు. ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని సద్వినియోగం చేసుకుని లబ్ధిపొందాలని హెచ్ఈఓ విఠల్ కోరారు. అవినీతిపరులకు శిక్ష తప్పదు చిన్నకోడూరు(సిద్దిపేట): కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతిపరులకు శిక్ష తప్పదని డీసీసీ కార్యదర్శి మీసం నాగరాజు అన్నారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై పీసీ ఘోష్ నివేదికను ప్రభుత్వం సీబీఐకి ఇచ్చిందన్నారు. త్వరలోనే అవినీతిపరులు జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. -
గణపతి మండపం వద్ద హోమం
వినాయక మండపంలో హస్నొద్దీన్, సీఐ, తదితరులుగణపతి మండపం వద్ద హోమం నిర్వహిస్తున్న పాపన్నపేట(మెదక్): మండల కేంద్రంలో నవయువ సేవా సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణపతి మండపం వద్ద మంగళవారం హోమం నిర్వహించారు. అర్చకులు దిగంబర శర్మ,శేషాద్రిశర్మల ఆధ్వర్యంలో వేద మంత్రాల మధ్య పూజా కార్యక్రమాలు చేశారు. అనంతరం అన్నదానం జరిగింది. నరేందర్గౌడ్, రాజేశ్వర్ కార్యక్రమానికి ఆర్థిక సహాయం అందించారు. మహిళలు, యువకులు, భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. మతసామర్యం వెల్లివిరిసే.. రామాయంపేట(మెదక్): మతసామరస్యం వెల్లివిరిసింది. ముస్లిం యువకుడు రామాయంపేటలోని వినాయకుని మండపంవద్ద అన్నదానం చేశారు. పట్టణంలోని మూడో వార్డులో ఎల్లమ్మ మందిరం వద్ద కాలనీవాసులు వినాయకుని విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అదే కాలనీకి చెందిన హస్నొద్దీన్ అనే యువకుడు మంటపం వద్ద అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా హస్నొద్దీన్ను కాలనీవాసులతోపాటు సీఐ, మున్సిపల్ మాజీ చైర్మన్ జితేందర్గౌడ్ తదితరులు సన్మానించి ప్రశంసించారు. సామూహిక కుంకుమార్చన పెద్దశంకరంపేట(మెదక్): మండలంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. మంగళవారం స్థానిక మాధవనగర్లో కుంకుమార్చన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. దీంతో పాటు ఆయా మండపాల వద్ద భక్తులు అన్నదాన కార్యక్రమాలను చేపట్టారు. -
నేలపైనే భోజనం!
● అటకెక్కిన మన ఊరు–మనబడి ● మధ్యలోనే నిలిచిన పనులు ● ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు తూప్రాన్: ప్రభుత్వ బడుల్లో మౌలిక వసతులు కల్పించే లక్ష్యంతో తీసుకొచ్చిన మన ఊరు–మన బడి పథకం అటకెక్కింది. ఈ పథకం కింద ఆయా పాఠశాలల్లో చేపట్టిన పనులు నిలిచిపోయాయి. ఇందులో డైనింగ్ హాల్ నిర్మాణాలకు నిధులు విడుదల కాకపోవడంతో పనులు ముందుకు సాగడం లేదు. దీంతో విద్యార్థులు నేలపైనే భోజనం చేయాల్సిన దుస్థితి నెలకొంది. ప్రధానంగా మెదక్ జిల్లాలో మన ఊరు–మన బడి పథకానికి నిధుల కొరత వేధిస్తుంది. ఈ మేరకు పలు పాఠశాలల్లో డైనింగ్ హాల్ నిర్మాణాలు పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయి. ఈ పథకం కింద మెదక్ జిల్లాలో 142 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 85 ఉన్నత పాఠశాలలకు డైనింగ్ హాల్స్ మంజూరయ్యాయి. వీటిలో 18 పాఠశాలల్లో మాత్రమే పూర్తయ్యాయి. మిగతా పాఠశాలల్లో పునాది, బెస్మెంట్, గోడలు పూర్తవ్వగా.. మిగతా పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయి. ఈ డైనింగ్ హాల్స్ నిర్మాణానికి 2022–23 విద్యా సంవత్సరంలో గత ప్రభుత్వం ప్రారంభించింది. మన ఊరు–మన బడి పథకం ద్వారా పాఠశాలలో మౌలిక వసతుల కల్పన కోసం ఒక్కో పాఠశాలకు రూ.50 లక్షల నుంచి రూ.కోటి వరకు కేటాయించింది. కానీ ఆ తర్వాత కొత్త ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పనులు నిలిచిపోయాయి. అయితే ప్రస్తుత ప్రభుత్వం కొత్తగా అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీ పేరుతో మరో పథకాన్ని తీసుకొచ్చింది. అయితే ఈ పథకంలో మన ఊరు–మన బడి కింది నియామకమైన పాఠశాలలు కాకుండా ఇతర పాఠశాలలను ఎంపిక చేయడంతో డైనింగ్ హాల్స్ పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయి. దీంతో విద్యార్థులు నేలపై కూర్చొని భోజనం చేయడంతో ఇబ్బందులు తప్పడంలేదు. డైనింగ్ హాల్స్ నిర్మాణాలు పూర్తయితే విద్యార్థులంతా ఒకే చోట బల్లలపై కూర్చోని క్రమశిక్షణతో భోజనాలు చేస్తారు. విద్యార్థులకు ఎంతో సౌలభ్యంగా ఉంటుందని విద్యార్థులు, ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు. ఇప్పటికై నా అధికారులు, నాయకులు స్పందించి పాఠశాలల్లో అసంపూర్తిగా ఉన్న డైనింగ్ హాల్స్ నిర్మాణ పనులు పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని కోరుతున్నారు. -
ఆ రెండు పార్టీలు కుమ్మక్కు
నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి నర్సాపూర్: కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణను సీబీఐకి అప్పగించాలని సీఎం ప్రకటించడాన్ని పరిశీలిస్తే బీజేపీ, కాంగ్రెస్లు కుమ్మక్కు అయినట్లు స్పష్టమవుతుందని ఎమ్మెల్యే సునీతారెడ్డి ఆరోపించారు. సోమవారం ఆమె మాట్లాడుతూ.. కాళేశ్వరం గొప్ప ప్రాజెక్టు అని సుప్రీంకోర్టు ప్రశంసించిందని గుర్తు చేశారు. స్థానిక ఎన్నికల కోసం కాంగ్రెస్ ఓట్ల రాజకీయం చేస్తుందని మండిపడ్డారు. శాసనసభలో మంత్రులందరికీ హరీశ్రావు ధీటుగా సమాధానం చెప్పారన్నారు. ఘోష్ నివేదికతో ఒరిగేదేమి లేదన్నారు. కాంగ్రెస్ ఎన్ని కుట్రలు చేసినా, ప్రజలు గమనిస్తున్నారని, రాబోయే స్థానిక ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. కేసీఆర్కు ప్రజల్లో ఉన్న ఆదరణ చూసి కాంగ్రెస్ భయపడుతుందని ఎద్దేవా చేశారు. సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు శేఖర్, అశోక్గౌడ్, మన్సూర్ పాల్గొన్నారు. -
నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు
ఎస్పీ డీవీ శ్రీనివాసరావు మెదక్ మున్సిపాలిటీ: గణపతి నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ డీవీ శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు సోమవారం జిల్లాలోని పోలీస్ అధికారులకు టెలీ కాన్ఫరెన్స్ ద్వారా స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు. ఎలాంటీ అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు తీసుకోవాలన్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటుతో పాటు పోలీస్ కంట్రోల్ రూమ్లో ప్రత్యేక మానిటరింగ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అంతకుముందు ప్రజావాణి కా ర్యక్రమంలో భాగంగా వినతులు స్వీకరించారు. అనంతరం జిల్లాలోని ప్రజలు పోగొ ట్టుకున్న 167 సెల్ఫోన్లను సిబ్బంది రికవరీ చేసి ఎస్పీ వారికి అందజేశారు. కార్యక్రమంలో పోలీస్ అధికారులు పాల్గొన్నారు. -
నష్టపోయిన రైతులను ఆదుకుంటాం
పాపన్నపేట(మెదక్): ఇటీవల కురిసిన భారీ వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటామని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ అన్నారు. సోమవారం మండల పరిధిలోని గాంధారిపల్లిలో నీట మునిగిన పంటలను పరిశీలించి మాట్లాడారు. మండలంలో సుమారు 40 శాతం పంట నష్టం జరిగినట్లు ప్రాథమిక అంచనాలు ఉన్నాయని చెప్పారు. అధికారుల సర్వే అనంతరం నష్టపోయిన రైతులందరికీ ప్రభుత్వం సహాయం అందిస్తుందన్నారు. అనంతరం కొంపల్లికి చెందిన పలువురు కాంగ్రెస్లో చేరగా ఆహ్వానించారు. అంతకుముందు నాగ్సాన్పల్లిలో బాధిత కుటుంబాలను పరిశీలించారు. ఎమ్మెల్యే వెంట జిల్లా కిసాన్సెల్ అధ్యక్షులు ప్రభాకర్రెడ్డి, అధికార ప్రతినిధి శ్రీకాంతప్ప, నాయకులు ప్రశాంత్రెడ్డి, నరేందర్గౌడ్, హఫీజ్ మొల్సాబ్, ప్రవీణ్, ఖలీం తదితరులు ఉన్నారు. -
ఎరువు..కునుకు కరువు
● అన్నదాతల పడిగాపులు ● పలుచోట్ల రాస్తారోకోలు.. ఆందోళనలు మెదక్ అర్బన్: పగలనకా.. రాత్రనకా.. రైతులు యూరియా కోసం పడిగాపులు కాస్తున్నారు. ఆపై రోడ్లెక్కి రాస్తారోకోలు నిర్వహిస్తున్నారు. పలు చోట్ల పోలీసులు రంగ ప్రవేశం చేసి సముదాయిస్తున్నా రు. అయినా ఆందోళనలు ఆగడం లేదు. కష్టాలు తీరడం లేదు. సోమవారం మనోహరాబాద్, నార్సి ంగి, రామాయంపేట, శివ్వంపేటలో రైతులు రాస్తారోకోకు దిగగా.. నర్సాపూర్, పెద్దశంకరంపేట, చిన్నశంకరంపేట, కౌడిపల్లిలో భారీఎత్తున బారులు తీరారు. జిల్లాలో 3,37,359 ఎకరాల్లో పంటలు సా గుచేయగా, ఇప్పటివరకు 20 వేల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేసినట్లు అధికారులు చెబుతున్నారు. త్వరలో మరో 6 వేల మెట్రిక్ టన్నులు జిల్లాకు వస్తుందని చెబుతున్నారు. అప్పడు లేని కొరత ఇప్పుడెందుకు..! గత ఖరీఫ్లో లేని యూరియా కొరత.. ప్రస్తుతం రైతన్నలను వేధిస్తుంది. అప్పట్లో జిల్లాలో 3.50 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేయగా, ఆగస్టు వరకు 22 వేల మెట్రిక్ టన్నులు సరిపోయింది. మొ త్తం సీజన్కు 26వేల మెట్రిక్ టన్నులు వినియోగం అయింది. కానీ ఈసారి పంటలు తక్కువగా వేసినప్పటికీ, ఆగస్టు వరకు 22 వేల మెట్రిక్ టన్నులు సరఫరా చేశామని, అయినా కొరత తీరడం లేదని అధికారులు చెబుతున్నారు. ఈసారి సమయానికి యూరియా రావడం లేదని, గోదాంలలో స్టాక్ లేకపోవడంతో రైతులు ఒకేసారి యూరియా కోసం ఎగబడుతున్నారని చెబుతున్నారు. జిల్లాలో 273 పాయింట్ల ద్వారా యూరియా సరఫరా చేస్తున్నారు. అయితే డిమాండ్కు అనుగుణంగా సరిపడా యూ రియా రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పడరాని పాట్లు పడుతున్నా.. నాకున్న ఆరు ఎకరాలకు తోడు, మరో నాలుగు ఎకరాలు కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నా. యూరియా కోసం ప్రతి రోజు పడరాని పాట్లు పడుతున్నా. ఎక్కడ యూరియా వచ్చిందంటే, అక్కడికి పరుగు తీస్తున్నా. సాయంత్రం వరకు పడిగాపులు కాసినా, సంచి దొరకడం లేదు. ప్రస్తుతం యూరియా వేసేందుకు అదను దాటిపోతుంది. – గొల్ల ఆంజనేయులు, రైతు, శివ్వంపేట అవసరం మేరకు అందిస్తాం యూరియా కోసం ఆందోళన వద్దు. అవసరానికి అనుగుణంగా మాత్రమే యూరియా తీసుకెళ్లాలి. రైతుల అవసరం మేరకు యూరియా సరఫరా చేస్తాం. త్వరలో మరో 6 వేల టన్నుల యూరియా వస్తుంది. వర్షాల నేపథ్యంలో కొంత జాప్యం జరుగుతుంది. – దేవకుమార్, జిల్లా వ్యవసాయాధికారి -
స్థానిక పోరుకు సన్నద్ధం
మెదక్జోన్: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు జిల్లా యంత్రాంగం సన్నద్ధమవుతోంది. గత నెల 29న పంచాయతీల వారీగా ముసాయిదాను విడుదల చేయగా, మంగళవారం తుది జాబితా ప్రకటించనున్నారు. అలాగే ఈనెల 6న ఎంపీటీసీ, జెడ్పీటీసీల ఓటరు ముసాయిదా విడుదల చేయనున్నారు. 8న జిల్లా, మండలస్థాయి రాజకీయ నాయకులతో సమావేశం నిర్వహించి, 9న అభ్యంతరాల స్వీకరణ, 10న తుది జాబితా ప్రచురించనున్నారు. కాగా ముందుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈనెలలోనే స్థానిక నోటిఫికేషన్..! సర్పంచ్ల పదవీకాలం ముగిసి 19 నెలలు కావొస్తుండగా, జెడ్పీటీసీ, ఎంపీటీసీల పదవీకాలం ముగిసి 13 నెలలు అవుతోంది. పాలనాపరమైనా ఇబ్బందులు రాకుండా ఉండేందుకు జిల్లా పరిషత్కు ప్రత్యేక అధికారిగా కలెక్టర్, ఆయా మండలాల పరిషత్ కార్యాలయాలకు ప్రత్యేక అధికారులు కొనసాగుతున్నారు. ఈనేపథ్యంలో సెప్టెంబర్ 30 వరకు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు గడువు విధించిన నేపథ్యంలో ఈనెలలోనే నోటిఫికేషన్ వెలువడనున్నట్లు తెలిసింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో పాటు 50 శాతం రిజర్వేషన్లు మించరాదనే నిబంధనను ఎత్తివేసింది. ఆగస్టు 31న అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన బిల్లుకు అన్ని పార్టీల మద్దతు లభించటంతో గ్రీన్ సిగ్నల్ లభించింది. కాగా రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ ప్రజాప్రతినిధుల సంఖ్య గతంతో పోలిస్తే రెండింతలు పెరగనుంది. అత్యధిక ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు బీసీల పరం కానుండగా, అధికంగా ఎంపీపీలతో పాటు జెడ్పీచైర్మన్ సైతం దక్కే అవకాశం ఉంది. కాగా జిల్లాలో 21 మండలాలు ఉండగా అందులో 42 శాతం బీసీల వాటాకు 8 మంది జెడ్పీటీసీలు, 8 ఎంపీపీలు, 190 ఎంపీటీసీలకు గానూ 79 ఎంపీటీసీలు దక్కే అవకాశం ఉంది. ఏర్పాట్లు చేస్తున్నాం ఎంపీటీసీ, జెడ్పీటీసీల వారీగా ఓటరు ముసాయిదా జాబితాలను సిద్ధం చేసి ఆయా గ్రామ పంచాయతీలు, ఎంపీడీఓ కార్యాలయా ల్లో ప్రదర్శించనున్నాం. 8వ తేదీ వరకు అభ్యంతరాలు స్వీకరించి వాటిని పరిష్కరించి తుది జాబితాను ఈనెల 10న విడుదల చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. – ఎల్లయ్య, జెడ్పీ సీఈఓ 6న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ముసాయిదా 9న అభ్యంతరాల స్వీకరణ 10న తుది జాబితా ప్రకటన -
వరద నష్టం నివేదిక అందించండి
కలెక్టర్ రాహుల్రాజ్ మెదక్కలెక్టరేట్/పెద్దశంకరంపేట/టేక్మాల్: జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలతో ఏర్పడిన నష్టం నివేదికలను అధికారులు త్వరితగతిన సిద్ధం చేయాలని కలెక్టర్ రాహుల్రాజ్ సూచించారు. సోమవారం హైదరాబాద్ నుంచి సీఎం రేవంత్రెడ్డి, మంత్రులు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్కు జిల్లా ఉన్నతాధికారులతో కలిసి హాజరయ్యారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. పంట నష్టం, రోడ్లు, మిషన్ భగీరథ పైప్లు, విద్యుత్ లైన్ల నష్టం వివరాలను ఈనెల 10లోగా అందజేయాలని ఆదేశించారు. అలాగే వరదల కారణంగా చనిపోయిన బాధితులకు ఒక్కొక్కరికి రూ. 5 లక్షల చొప్పున పరిహారం అందజేయనున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించిన చెక్కులను సిద్ధం చేయాలన్నారు. అంతకుముందు దెబ్బతిన్న నార్సింగ్– పెద్దశంకరంపేట రోడ్డును పరిశీలించారు. యుద్ధ ప్రాతిపదికన తాత్కాలిక మరమ్మతులు చేస్తున్నట్లు తెలిపారు. అలాగే టేక్మాల్ మండలం వెంకటాపూర్లో దెబ్బతిన్న రోడ్డు, పంట పొలాలను పరిశీలించారు. కలెక్టర్ వెంట వివిధశాఖల అధికారులు, సిబ్బంది ఉన్నారు. -
కాళేశ్వరంపై కాంగ్రెస్ కుట్ర
బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మారెడ్డిచిన్నశంకరంపేట(మెదక్): కాళేశ్వరం ప్రాజెక్టును అప్రతిష్టపాలు చేసి బనకచర్లకు నీటిని తరలించేందుకు సీఎం రేవంత్రెడ్డి కుట్ర చేస్తున్నారని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మారెడ్డి ఆరోపించారు. సోమవారం బీఆర్ఎస్ నాయకులతో కలిసి మెదక్– చేగుంట ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టి సీఎం రేవంత్రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం అమరవీరుల స్తూపానికి కాళేశ్వరం నీటితో జలాభిషేకం చేశారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. స్థానిక ఎన్నికల్లో గట్టెక్కాలని చూస్తున్న కాంగ్రెస్కు ప్రజలు తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. పోలీసులు పద్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే శశిధర్రెడ్డిని అరెస్ట్ చేసి పోలీస్స్టేషన్కు తరలించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు మల్లికార్జున్గౌడ్, అంజనేయులు, మాజీ ఏఎంసీ చైర్మన్ గంగా నరేందర్, పీఏసీఎస్ చైర్మన్ అంజిరెడ్డి, రామాయంపేట మాజీ మున్సిపల్ చైర్మన్ జితేందర్గౌడ్, మాజీ ఎంపీపీ విజయలక్ష్మి, పట్లోరి రాజు, నాయకులు భారీగా పాల్గొన్నారు. -
సీపీఎస్ను రద్దు చేయాల్సిందే
మెదక్ కలెక్టరేట్: ఉద్యోగులకు శాపంగా మారిన సీపీఎస్ను రద్దు చేసి, మెదక్ను చార్మినార్ జోన్లో చేర్చాలని ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీ జిల్లా అధ్యక్షుడు నరేందర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా సోమవారం మధ్యాహ్న భోజన విరామ సమయంలో ఉద్యోగ, ఉపాధ్యాయులతో కలిసి కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే సీపీఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ అమలు చేయాలన్నారు. కొత్త పెన్షన్ అమలు సమయంలో కేంద్రం ఉద్యోగులకు ఎన్నో ఆశలు చూపిందని వాపోయారు. రిటైర్మెంట్ తర్వాత ఉద్యోగి జీవితానికి ఆసరాగా ఉండే పెన్షన్ తొలగించి వారి జీవితాల్లో ఆనందం లేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. -
హెల్ప్డెస్క్కు 65 వినతులు
మెదక్ కలెక్టరేట్: కలెక్టరేట్లో సోమవారం హెల్ప్డెస్క్ ద్వారా ప్రజావాణి నిర్వహించగా, ఇన్వార్డు అధికారులు ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. జిల్లా నలుమూలల నుంచి తమ తమ సమస్యలపై 65 అర్జీలు అందజేశారు. ఈసందర్భంగా పలువురు సమస్యలపై నిరసన గళం విప్పారు. ఇటీవల జిల్లాలో కురిసిన వర్షాలతో నష్టపోయిన వారిని అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి సర్వే చేయాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు అడివయ్య పభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టరేట్ ఎదుట రైతులతో కలిసి నిరసన తెలిపారు. పాపన్నపేట మండలం నాగ్సాన్పల్లికి చెందిన వడ్డెరలు తమకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని నిరసన తెలిపారు. అనంతరం అదనపు కలెక్టర్ నగేశ్కు వినతిపత్రం అందజేశారు. తమకు ఆరు నెలలుగా వేతనాలు రావడం లేదని మోడల్ స్కూళ్లలో పని చేసే ఔట్ సోర్సింగ్ సిబ్బంది ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇతర దేశాలపై అడ్డగోలుగా విధిస్తున్న పన్నులను వెంటనే రద్దు చేయాలని నిరసిస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. -
కొందరికే యూరియా
చిన్నశంకరంపేట/మిరుదొడ్డి/దోమకొండ/కేసముద్రం: యూరియా కష్టాలు రైతులను అనేక ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. కొన్నిచోట్ల ఘర్షణలకు కూడా దారి తీస్తున్నాయి. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం జంగరాయి సహకార సంఘం వద్ద యూరియా కోసం ఆదివారం తెల్లవారుజాము నుంచే రైతులు క్యూలైన్లో చెప్పులు పెట్టి పడిగాపులు కాశారు. యూరియా పంపిణీ సందర్భంగా ఒక బస్తా నాదంటే నాదని ఇద్దరు రైతులు కొట్టుకున్నారు. ఈ క్రమంలో అక్కడే ఉన్న మరికొందరు రైతులు వారిని సముదాయించారు. చివరకు కొట్టుకున్న ఇద్దరు రైతులకు యూరియా దొరకలేదు. ⇒ సిద్దిపేట జిల్లా మిరుదొడ్డిలోని రైతువేదిక వద్దకు చుట్టు పక్క గ్రామాలకు చెందిన రైతులు శనివారం అర్ధరాత్రి నుంచే క్యూ కట్టి ఆదివారం తెల్లవారుజాము వరకు జాగారం చేశారు. అయితే యూరియా లారీ రాలేదని అధికారులు చెప్పడంతో రైతులు నిరాశతో వెనుదిరిగారు. ⇒ కామారెడ్డి జిల్లా దోమకొండలోని సింగిల్విండో కార్యాలయం వద్ద రైతులు యూరియా కోసం ఆందోళన చేశారు. కొందరికి యూరియా దొరకపోవడంతోవ్యవసాయాధికారులు, సింగిల్విండో కార్యాలయ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. ⇒ మహబూబాబాద్ జిల్లా కేసముద్రం రైతు వేదిక వద్ద ఆదివారం అర్ధరాత్రి యూరియా టోకెన్ల కోసం రైతులు బారులుదీరారు. సోమవారం యూరియా బస్తాలు పంపిణీ చేయనుండగా, అధికారులు ముందస్తుగా బారికేడ్లు ఏర్పాటు చేస్తున్న విషయం తెలుసుకున్న రైతులు భారీ సంఖ్యలో తరలివచ్చి క్యూలో నిల్చున్నారు. -
డెంగీ లేదు.. వైరల్ ఫీవరే
కౌడిపల్లి(నర్సాపూర్): మండలంలోని తునికి గ్రామంలో ఎవరికి డెంగీ నిర్ధారణ కాలేదని, వైరల్ ఫీవర్ మాత్రమేనని డీఎంహెచ్ఓ శ్రీరాం తెలిపారు. ఆదివారం గ్రామంలో మండల వైద్యాధికారి శ్రీకాంత్ ఆధ్వర్యంలో వైద్య శిబిరం ఏర్పాటు చేయగా, డిప్యూటీ డీఎంహెచ్ఓ సృజనతో కలిసి పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామంలో వైద్య సిబ్బంది నాలుగు టీంల ద్వారా ఫీవర్ సర్వే నిర్వహించినట్లు తెలిపారు. వైద్య శిబిరంలో 60 మందికి చికిత్స చేయగా ఆరుగురికి జ్వరం ఉందన్నారు. రక్త పరీక్షలు చేయించగా, వైరల్ ఫీవర్ ఉందని తేలిందన్నారు. వారం రోజుల పాటు గ్రామంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు చెప్పారు. ప్రజలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్ కృష్ణ, ఎంపీడీఓ శ్రీనివాస్, ఎంపీఓ కలీముల్ల, పంచాయతీ కార్యదర్శి సౌజన్య వైద్యసిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.డీఎంహెచ్ఓ శ్రీరాం -
ఏడుపాయలలో సందడి
ఏడుపాయలకు ఆదివారం తరలివచ్చిన భక్తులు రాజగోపురంలో అమ్మవారిని దర్శించుకొని పూజలు నిర్వహించారు. సింగూరు నుంచి 76,088 క్యూసెక్కుల నీరు విడుదల చేయడంతో, అమ్మవారి ఆలయం జలదిగ్బధంలో చిక్కుకుంది. దీంతో రాజగోపురంలో ఉత్సవ విగ్రహాన్ని ఉంచి పూజలు చేశారు. పరుగులు తీస్తున్న మంజీరా జలాలను చూస్తూ, భక్తులు ఆనందంగా గడిపారు. ఇబ్బందులు కలగకుండా ఆలయ సిబ్బంది, పోలీసులు చర్యలు తీసుకున్నారు. సింగూరు నుంచి ఎక్కువ నీరు విడుదల చేయడంతో ఎల్లాపూర్ వద్ద బ్రిడ్జికి దగ్గరగా మంజీరా ప్రవాహం కొనసాగుతుంది. – పాపన్నపేట(మెదక్) -
బడి పిల్లలకు రాగి జావ
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందజేస్తున్న ప్రభుత్వం.. మరింత పౌష్టికాహారం అందించాలన్న ఉద్దేశంతో రాగి జావను అందజేయాలని నిర్ణయించింది. దాదాపు రెండున్నర నెలల తర్వాత ఈ పథకాన్ని తిరిగి పునః ప్రారంభించింది. నేటి నుంచి 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులందరికీ రాగిజావ అందించనుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పాఠశాలల విద్యాశాఖకు ఆదేశాలు జారీ చేసింది. – రామాయంపేట(మెదక్) ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 3,186 పాఠశాలల్లో చదువుతున్న 2.51 లక్షల మంది విద్యార్థులకు రాగిజావ పంపిణీ ద్వారా ప్రయోజనం చేకూరనుంది. అయితే ఇంటి నుంచి ఉదయం ఖాళీ కడుపుతో పాఠశాలలకు బయలుదేరే చిన్నారులు తరగతి గదుల్లో అలసి పోతున్నారు. ఈ విషయాన్ని గమనించిన ప్రభుత్వం ఉదయం అల్పాహారంగా బెల్లంతో కూడిన రాగిజావ అందజేస్తే ప్రయోజనకరంగా ఉండడంతోపాటు విద్యార్థులు పౌష్టికాహారం అందుతుందని భావించింది. ఈ మేరకు ఈ పథకాన్ని అమలు చేసేందుకు నిర్ణయించింది. ఇందులో భాగంగానే జిల్లాలోని మక్త భూపతిపూర్ పాఠశాలలో సోమవారం ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు.ఉమ్మడి జిల్లాలో ఇలా.. జిల్లా పాఠశాలలు విద్యార్థులు మెదక్ 882 77,000 సంగారెడ్డి 1,265 1,02,000 సిద్దిపేట 941 72,000రెండున్నర నెలల తర్వాత.. ఈ ఏడాది జూన్ 12న కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమవ్వగా.. దాదాపు రెండున్నర నెలల తర్వాత ఈ పథకం అమలు కానుంది. గతంలో మాదిరిగా సత్యసాయి అన్నపూర్ణ ట్రస్టు సహకారంతో పథకాన్ని అమలు చేయనుంది. ట్రస్టు 60 శాతం వ్యయం భరిస్తుండగా.. 40 శాతం ప్రభుత్వం భరించి ఈ పథకాన్ని అమలు చేయనుంది. ప్రతీ గ్లాసుకు ప్రభుత్వం రూ. 25 పైసల చొప్పున చెల్లించనుండగా.. వారంలో మూడు రోజుల పాటు ప్రతీ విద్యార్థికి రోజుకు 10 గ్రాముల రాగిపొడి, 10 గ్రాముల బెల్లం పొడి ఇవ్వాలని ఆదేశించారు. ఇందులో భాగంగానే వారంలో మూడు రోజులు కోడిగుడ్లు ఇవ్వని రోజుల్లో రాగిజావ అందించనున్నారు. మిగితా మూడు రోజులు గుడ్డు అందించనున్నారు. అయితే విద్యాసంవత్సరం ప్రారంభం నుంచి రావిజావ పంపిణీ నిలిచిపోయింది. విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయ సంఘాల నేతలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగా.. ప్రభుత్వం సానుకూలత వ్యక్తం చేసింది. కాగా, జిల్లాలోని అన్ని మండలాలకు ఇప్పటికీ రాగి జావ, బెల్లం ప్యాకెట్లు చేరుకోలేదు. రెండు రోజుల్లో ఎమ్మార్సీలు, అక్కడి నుంచి పాఠశాలలకు వీటిని చేరవేయనున్నారు. నేటి నుంచి పంపిణీకి శ్రీకారం ఉమ్మడి జిల్లాలో 2.51 లక్షల మంది విద్యార్థులకు మేలు నేడు మక్త భూపతిపూర్ స్కూల్లో ప్రారంభం విద్యార్థులకు ప్రయోజనం ఆరోగ్యపరంగా విద్యార్థులకు రాగి జావ చాలా మంచిది. విద్యార్థులు చురుగ్గా ఉండి బాగా చదువుకోవడానికి ఈ పానీయం దోహదపడుతుంది. రెండు, మూడు రోజుల్లో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో అమలు పరుస్తాం. సోమవారం మక్త భూపతిపూర్ పాఠశాలలో పథకం ప్రారంభిస్తున్నాం. – రాధాకిషన్, జిల్లా విద్యాధికారి -
నష్టపోయిన రైతులను ఆదుకోండి
పాపన్నపేట(మెదక్): వర్షాలతో పంట నష్టపోయిన రైతుకు ఎకరారు రూ. 25 వేలు, మృతిచెందిన వారికి రూ. 25 లక్షల పరిహారం ఇవ్వాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మారెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం మాజీ ఎమ్మెల్యే శశిధర్రెడ్డితో కలిసి మండలంలోని ఎల్లాపూర్, ఆరెపల్లి, కుర్తివాడ, మిన్పూర్, ముద్దాపూర్, రామతీర్థం తదితర గ్రామాల్లో దెబ్బతిన్న పొలాలను పరిశీలించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఇటీవల వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు కనీసం హెలిక్యాప్టర్ పంపలేకపోయారని విమర్శించారు. వర్షాలతో పెద్దఎత్తున పంట నష్టం జరిగిందని, అయినా అధికా రులు, ప్రజాప్రతినిధులు పట్టించుకున్న దాఖాలా లు లేవన్నారు. యూరియా కోసం రైతులు పడరాని పాట్లు పడుతున్నారని వాపోయారు. ఆమె వెంట మండల పార్టీ అధ్యక్షుడు విష్ణువర్దన్రెడ్డి, నాయకులు సోములు, జగన్, లింగారెడ్డి, కుబేరుడు, బాబాగౌడ్, కిష్టాగౌడ్, సంజీవరెడ్డి ఉన్నారు.బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మారెడ్డి -
నష్టంపై అంచనాలు రూపొందిస్తాం
రామాయంపేట(మెదక్)/నిజాంపేట/హవేళిఘణాపూర్: భారీ వర్షాలతో జిల్లాకు తీవ్ర నష్టం వాటిల్లిందని కలెక్టర్ రాహుల్రాజ్ తెలిపారు. ఆదివారం మండలంలోని పర్వతాపూర్, నిజాంపేట మండలంలోని నందిగామ, చల్మెడ, నిజాంపేట, హవేళిఘణాపూర్ మండలం బాలానగర్లో పర్యటించారు. దెబ్బతిన్న రోడ్లు, బ్రిడ్జిలను పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వరద నష్టంపై ఆయా శాఖల అధికారులు సర్వే నిర్వహిస్తున్నారని తెలిపారు. తాత్కాలిక మరమ్మతులతో రవాణాను పునరుద్ధరించాలని ఆదేశించామన్నారు. తీవ్రస్థాయిలో పంట నష్టం జరిగి పొలాల్లో ఇసుక మేటలు వేసిందన్నారు. జిల్లావ్యాప్తంగా 130 గ్రామాలకు విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగిందన్నారు. కాట్రియాల చెరువు కట్ట ప్రమాదకరంగా మారడంతో ప్రజలను ముందు జాగ్రత్తగా పునరావాస కేంద్రాల్లో ఉంచామని వివరించారు. ఈమేరకు అన్నిశాఖల్లో ఉద్యోగుల సెలవులు రద్దు చేశామని, ఇంకా వరద ముప్పు తొలగిపోలేదని పేర్కొన్నారు. ఆయన వెంట సంబంధిత శాఖల అధికారులు ఉన్నారు.కలెక్టర్ రాహుల్రాజ్ -
అంధకారంలో పీహెచ్సీ
మనోహరాబాద్(తూప్రాన్): ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి మూడు రోజులుగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. భారీ వర్షాలకు పీహెచ్సీ ప్రాంగణంలోకి వరద నీరు చేరింది. దీంతో విద్యుత్ ప్రసారం అందించే కేబుల్ సమస్యతో విద్యుత్ సరఫరా కావడం లేదని సిబ్బంది చెబుతున్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం రాష్ట్ర వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ రవీందర్నాయక్ పీహెచ్సీని సందర్శించి రికార్డులు పరిశీలించారు. చికిత్స పొందుతున్న వారితో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కాగా విద్యుత్ అంతరాయం గురించి వైద్యులు ఆయన దృష్టికి తీసుకెళ్లలేదు. మూడు రోజులుగా విద్యుత్ లేకున్నా పట్టించుకోకపోవడంపై రోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా విద్యుత్ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. -
బిడ్డలను తీసుకొచ్చేందుకు వెళ్లి..
రాజ్పేటకు చెందిన బెస్త సత్యనారాయణ, దామరంచ యాదాగౌడ్ ప్రాణ స్నేహితులు. హాస్టల్లో ఉంటున్న తమ బిడ్డలను వినాయక చవితికి ఇంటికి తీసుకొచ్చేందుకు మెదక్ బయల్దేరారు. మార్గమధ్యలో వరద ముంచెత్తడంతో చిక్కుకున్నారు. కొద్దిసేపు ఆటోను అడ్డం పెట్టుకొని జీవన పోరాటం చేశారు. వరద ఉధృతికి అది కాస్తా కొట్టుకుపోగా, పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఆసరాగా చేసుకొని, కుటుంబీకులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న అధికారులు, ప్రజాప్రతినిధులు హెలిక్యాప్టర్ కోసం ప్రయత్నాలు చేశారు. కానీ వాతావారణ అనుకూలించకపోవడంతో సాధ్యం కాలేదు. చివరి క్షణం వరకు ప్రయత్నించిన స్నేహితులు చివరకు, అందరి కళ్లేదుటే ఒక్కసారిగా నీటిలో కొట్టుకుపోయారు. -
జలదిగ్బంధంలో తండాలు, కాలనీలు
నేలమట్టమైన గుడిసెలో సామగ్రిని తీసుకుంటున్న మహిళరామాయంపేట మండలంలో కేవలం 6 గంటల వ్యవధిలో 20 సెం.మీ. వర్షం కురిసింది. సదాశివనగర్ తండా నాలుగు రోజులుగా జల దిగ్బంధంలోనే చిక్కుకుంది. అటవీ ప్రాంతంలో ఉన్న తండాకు ఇతర ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. తండాలో ఇద్దరు గర్భిణు లు ఉన్నట్లు సమాచారం. రామాయంపేటలోని అక్కల బస్తీ, శ్రీనగర్కాలనీ వరద నీటిలో చిక్కుకున్నాయి. ఇళ్లలోకి నీరు చేరి బుర దమయంగా మారాయి. తిండి గింజలు తడిసిపోయాయి. పాపన్నపేట మండలం రాజ్యా, కశ్నా, రుగ్యా, జైరాం, పోంలా తండాల మధ్య ఉన్న కుంట కట్టకు గండి పెట్టడంతో, బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. పలు చోట్ల ఇళ్లుకూలి పోయాయి. పంటలు నీట మునిగాయి. చిన్నశంకరంపేట మండలం నార్సింగి నుంచి శేరిపల్లి వరకు గన్నేరు కుంట పొంగి పొర్లడంతో పంటలు నాశనమయ్యాయి. నార్సింగి వద్ద జాతీయ రహదారి ధ్వంసమైంది. టీ.మందాపూర్ వాసులను వరద భయంతో పండగ పూట సహాయక శిబిరంలో ఉంచారు. మెదక్ పట్టణంలోని గాంధీనగర్లో ఇళ్లలోకి నీళ్లు వచ్చాయి. పోచారం ప్రాజెక్టుకు ప్రమాదం పొంచి ఉందనే భయంతో అధికారులు సర్దన గ్రామస్తులను మెదక్లోని సహాయక శిబిరాలకు తరలించారు.ఇంకా ముంపులోనే రామాయంపేట శ్రీనగర్ కాలనీ -
ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే తిప్పలు
హవేళిఘణాపూర్(మెదక్): బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రూ. 3 కోట్లు మంజూరు చేసి రూ. 80 లక్షలతో 40 శాతం పూర్తి చేసిన పనులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ఓసీ ఇవ్వకపోవడంతో పనులు జరుగక తండా వాసులు ఇబ్బంది పడ్డారని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మారెడ్డి ఆరోపించారు. శని వారం మండల పరిధిలోని ధూప్సింగ్ తండాను పరిశీలించారు. తండావాసుల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వాలు మారినా ప్రజ ల ఇబ్బందులు తీర్చాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులపై ఉంటుందన్నారు. చేసిన పనులకు కాంట్రాక్టర్ కు ఎన్ఓసీ ఇవ్వడంలో తాత్సారం చేయడం వల్లే ఈ దయనీయ పరిస్థితి ఏర్పడిందన్నారు. బ్రిడ్జి పనులు పూర్తి చేయకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. అలాగే పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాడ్ చేశారు. ఆమె వెంట లావణ్యరెడ్డి, శ్రీనివాస్రెడ్డి, మాజీ సర్పంచ్ యామిరెడ్డి, మేకల సాయిలు, చెన్నాగౌడ్, సిద్దిరాంరెడ్డి, భిక్షపతి, సతీశ్రావు, బాల్రాజ్, రాంచంద్రారెడ్డి, రవీందర్గౌడ్, సాప సాయి లు, శ్రీనునాయక్, రంజిత్, తరుణ్ ఉన్నారు.బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మారెడ్డి -
అప్రమత్తంగా ఉండాలి
మెదక్ కలెక్టరేట్: మంజీరా నదికి వరద పోటెత్తనుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ రాహుల్రాజ్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మహారాష్ట్రలోని లాతూర్ కర్ణాటకలోని సాయిగాం నుంచి లక్ష క్యూసెక్కుల నీరు వదిలారని తెలిపారు. ఎవరూ చేపల వేటకు వెళ్లవద్దని సూచించారు. నిధులు మంజూరు చేయండి పాపన్నపేట(మెదక్): మెదక్– బొడ్మట్పల్లి రోడ్డుపై అనంతుని వాగు బ్రిడ్జికి ఇరువైపులా శిథిలమైన రోడ్డు మరమ్మతులకు నిధులు మంజూరు చేయాలని మెదక్ మాజీ ఎమ్మెల్యే శశిధర్రెడ్డి కోరారు. ఈమేరకు ఆర్అండ్బీ ముఖ్య అధికారి వికాస్రాజ్కు శనివారం వినతిపత్రం అందజేశారు. పాపన్నపేట మండలం కొత్తపల్లి వద్ద ఉన్న ఈ బ్రిడ్జికి ఇరువైపులా రోడ్డు పూర్తిగా ధ్వంసం అయిందని వివరించారు. ఈ రోడ్డు గుండా నిత్యం 500 వాహనాలు తిరుగుతాయని చెప్పారు. ఎన్నికలప్పుడే గుర్తొస్తరా.? హవేళిఘణాపూర్(మెదక్): ఎన్నికలప్పుడు తండాల చుట్టూ తిరిగి ఓట్లడిగే రాజకీయ నాయకులు ధూప్సింగ్ తండా ప్రజలను పట్టించుకోలేదని గిరిజన సంక్షేమ శాఖ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు జైపాల్నాయక్ అన్నారు. శనివారం తండాను పరిశీలించి గిరిజనుల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం నిత్యావసర సరుకులు అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మూడు రోజులుగా విద్యుత్, తాగునీరు, ఆహారం లేక అల్లాడుతుంటే ఏ అధికారి, ప్రజాప్రతినిధి గానీ పట్టించుకోలేదని మండిపడ్డారు. వెంటనే తండాకు విద్యుత్ సరఫరా పునరుద్ధరించి రవాణా సదుపాయం కల్పించాలని డిమాండ్ చేశా రు. కార్యక్రమంలో గోపాల్నాయక్, శినాయక్, కిషన్, రమేశ్, రంజిత్, బాబు, స్వామినాయక్, కుమార్, శేఖర్, రఘు పాల్గొన్నారు. దెబ్బతిన్న పంటల పరిశీలన పాపన్నపేట(మెదక్): మండలంలోని ఆరెపల్లి, ఎల్లాపూర్ గ్రామాల్లో ముంపునకు గురైన పంటలను ఏడీఏ విజయనిర్మల, వ్యవసాయాధికారి నాగమాధురి శనివారం పరిశీలించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో మంజీరా తీరంలోని పలు ప్రాంతాల్లో పంటలు మునిగాయని తెలిపారు. తమ సిబ్బందితో కలసి ఆయా గ్రామాల్లో నష్టపోయిన పంటల వివరాలు సేకరిస్తున్నట్లు చెప్పారు. నీరు నిల్వ ఉన్న పొలాల్లో తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ కిసాన్సెల్ అధ్యక్షుడు ప్రభాకర్రెడ్డి, ఏఈఓలు జనార్దన్, అభిలాష్, ఆసిఫ్, రైతులు పాల్గొన్నారు. పారిశుద్ధ్య పనులు చేపట్టాలి తూప్రాన్: మండల పరిషత్ కార్యాలయంలో ఆయా శాఖల అధికారులతో జెడ్పీ సీఈఓ ఎల్ల య్య శనివారం సమీక్ష నిర్వహించారు. భారీ వర్షాలతో దెబ్బతిన్న రోడ్లు, ఇండ్లు, విద్యుత్ తీగలు వంటి వాటికి సకాలంలో స్పందించి సహాయ సహకారాలు అందించినందుకు సంతృప్తి వ్యక్తం చేశారు. గ్రామాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు సక్రమంగా నిర్వహించే విధంగా చర్యలు చేపట్టాలని సూచించారు. అనంతరం నిర్మాణంలో ఉన్న సమీకృత భవనాన్ని పరిశీలించారు. సమావేశంలో ఆర్డీఓ జయచంద్రారెడ్డి, పాల్గొన్నారు. -
జాగ్రత్తలు తప్పనిసరి: ఎస్పీ
మెదక్ మున్సిపాలిటీ: జిల్లా కేంద్రంలో ఏర్పా టు చేసిన పలు వినాయక మండపాలను ఎస్పీ డీవీ శ్రీనివాసరావు శనివారం సందర్శించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిమజ్జనం, ఉత్సవాల సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, భద్రతా చర్యలపై వారికి సూచనలు అందించారు. ప్రజలు శాంతి, సోదరభావంతో పండుగలు జరుపుకోవాలని, పోలీస్శాఖ అన్నివిధాల సహకారం అందిస్తుందని తెలిపారు. అంతకుముందు మె దక్ మండలం కొంటూర్ చెరువులో నిమజ్జన ఏర్పాట్లను కలెక్టర్ రాహుల్రాజ్తో కలిసి పరిశీలించారు. ఆయన వెంట డీఎస్పీ ప్రసన్నకుమార్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్రెడ్డి, రూరల్ సీఐ రాజశేఖర్రెడ్డి తదితరులు ఉన్నారు. -
ఏమనాలా..!
రామాయంపేట(మెదక్): భారీ వర్షం కురిస్తే చాలు పట్టణ ప్రజలు వణికిపోతున్నారు. పలు కాలనీల్లో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. మున్సిపా లిటీ పరిధిలో కొందరు నాలాలపై అక్రమ నిర్మాణాలు చేపట్టడంతో వరద నీరు ఇళ్లు, దుకాణాల్లోకి చేరి అవస్థలు పడుతున్నారు. తీవ్ర నష్టాన్ని చవిచూస్తున్నారు. అక్రమ నిర్మాణాలతో వరద పలు కాలనీల్లో సెల్లార్లు, ఇళ్లలోకి ప్రవేశిస్తోంది. అటవీ ప్రాంతంతో పాటు ఎత్తయిన గుట్టలపై కురిసిన వర్షం నీరు నాలా ద్వారా మల్లె చెరువుతో పాటు ఇతర చెరువుల్లో కలిసేది. ప్రధాన నాలాకు అడ్డంగా ఏకంగా కొందరు అక్రమ నిర్మాణాలు చేపట్టగా, రెండు, మూడు రోజుల క్రితం భారీస్థాయిలో కురిసిన వర్షంతో వరద నీరు సాఫీగా వెళ్లకుండా దారి మళ్లి ఇళ్లు, దుకాణాల్లోకి చేరింది. దీంతో నాలా పక్కనే ఉన్న అపార్ట్మెంట్, దుకాణాలు, హోటళ్ల నిర్వాహకులకు తీవ్ర నష్టం వాటిల్లింది. దుకాణాలు, టెంట్ హౌస్లోని సామగ్రి, ఇతర వస్తువులు నీటిలో కొట్టుకుపోయాయి. వరద నీరు రెండు రోజల పాటు ప్రధాన రహదారిపై పారి రాకపోకలు స్తంభించా యి. గతంలో కొందరు నాలాపై అక్రమంగా పిల్లర్లు వేసి స్లాబ్ పోయగా, మరి కొందరు కాలువకు అడ్డంగా గది నిర్మించారు. కొందరు ప్రజాప్రతినిధులతో పాటు అధికారులు సైతం వారికి పరోక్షంగా సహకరించినట్లు ఆరోపణలున్నాయి. ఈవిషయమై స్థానికులు పలుమార్లు కలెక్టర్, ఇతర అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని తెలిసింది. ఇటీవల వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజానర్సింహ నాలాపై అక్రమ నిర్మాణాలను గమనించి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే అక్రమ నిర్మాణాలు తొలగించాలని ఆదేశించారు. కాగా మున్సిపల్ అధికారులు ఇంకా నాలాలపై అక్రమ నిర్మాణాలు పూర్తిస్థాయిలో తొలగించలేదు. మంత్రి ఆదేశాలను బేఖా తరు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నాలాలపై అక్రమ నిర్మాణాలు భారీ వర్షంతో తీవ్ర నష్టాలు మంత్రి ఆదేశించినా పట్టని అధికారులు -
పనిచేయని వారిని ఇంటికి పంపండి
మెదక్ కలెక్టరేట్: పనిచేయని వారికి మెమోలు జారీ చేసి ఇంటికి పంపించాలని కలెక్టర్ రాహుల్రాజ్ డీఆర్ఓ భుజంగరావును ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లోని అవుట్, ఇన్వార్డ్ సెక్షన్, ఖజానా శాఖ, ఎన్ఐసీ కార్యాలయాలను తనిఖీ చేసి హాజరు పట్టికను పరిశీలించారు. ఉదయం 11:30 అవు తున్నా కొంతమంది సిబ్బంది విధులకు రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమయానికి రాని వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. విధుల్లో ఉండాల్సిన ఎన్ఐసీ ఉద్యోగి సమాచారం ఇవ్వకుండా సెలవుపై వెళ్లడంపై అసహనం వ్యక్తం చేశారు. మెమో జారీ చేయాలని ఆదేశించారు. జిల్లాలోని అన్నిశాఖల అధికారులు వరద సహాయక చర్యల్లో నిమగ్నమై ఉన్నందున సోమవారం హెల్ప్డెస్క్ ద్వారా ప్రజావాణి ఉంటుందని కలెక్టర్ చెప్పారు. అలాగే వరదలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నందున ఆదివారం అన్నిశాఖల అధికారుల సెలవు రద్దు చేసినట్లు తెలిపారు. వరద ప్రాంతాల్లో పర్యటించి సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. అనంతరం రానున్న స్థానిక ఎన్నికల నేపథ్యంలో జిల్లాలోని ఆయా పార్టీల నాయకులతో సమీక్ష నిర్వహించారు. పంట నష్టం వివరాలు సేకరిస్తున్నాం హవేళిఘణాపూర్(మెదక్): అధికారులు పంట నష్టం వివరాలు సేకరిస్తున్నారని కలెక్టర్ రాహుల్రాజ్ తెలిపారు. శనివారం భారీ వర్షాలతో కొట్టుకుపోయిన రోడ్లు, నష్టపోయిన పంట పొలాలను పరిశీలించారు. మండల పరిధిలోని రాజ్పేట నుంచి కప్రాయిపల్లి బ్రిడ్జిని పరిశీలించేందుకు బైక్పై వెళ్లారు. త్వరలోనే తాత్కాలిక మరమ్మతులు చేసి గ్రామస్తులకు రవాణా సదుపాయం కల్పిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం దూప్సింగ్ తండా, బ్రిడ్జిని పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిమజ్జనం చేసే కొంటూర్ చెరువు వద్ద ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులు ఆదేశించారు.అధికారుల పనితీరుపై కలెక్టర్ ఆగ్రహం -
ట్రయల్ రన్ సక్సెస్.. రైళ్లు షురూ
చిన్నశంకరంపేట(మెదక్)/రామాయంపేట: భారీ వర్షాలతో కామారెడ్డి జిల్లా పరిధిలో ట్రాక్ దెబ్బతినడంతో సికింద్రాబాద్– నిజామాబాద్ మార్గంలో గత మూడు రోజులుగా రద్దయిన రైళ్లు శనివారం ప్రారంభమయ్యాయి. శనివారం ఉదయం గూడ్స్ రైలును ట్రయల్ రన్ చేశారు. అనంతరం ప్యాసింజర్ ప్రత్యేక రైలును నడిపారు. ఈ రైలుకు మెదక్ జిల్లాలోని మనోహరాబాద్, వడియారం, అక్కన్నపేటలో హాల్టింగ్ ఇచ్చారు. ఇది క్షేమంగా నిజామాబాద్ చేరుకోవడంతో మరిన్ని ఎక్స్ప్రెస్ రైళ్లను నడిపారు. విశాఖ, సంబల్పూర్ రైళ్లు మధ్యాహ్నం వరకు నిజామాబాద్ వైపు వెళ్లాయి. అలాగే కాచిగూడ– బోధన్, కాచిగూడ– నిజామాబాద్, కాచిగూడ– పూర్ణ రైళ్లు నడవనున్నాయి. ఈ మూడు రైళ్లను నిజామాబాద్ వరకు నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. కాగా మెదక్ వైపు వెళ్లే ట్రాక్కు ఇంకా మరమ్మతులు చేపట్టకపోవడంతో ఈమార్గంలో నడిచే రైళ్లు ప్రారంభం కాలేదు. -
వినాయకుడి పూజ కోసం పూజారి కిడ్నాప్ ..!
సిద్దిపేట జిల్లా (హుస్నాబాద్): గణపతి నవరాత్రులు వచ్చాయంటే పూజారులకు క్షణం తీరిక ఉండదు. పూజల కోసం ప్రజలు ముందుగానే పూజారులతో మాట్లాడుకుంటారు. ఒక్కో పూజారి నాలుగైదు మంటపాల వద్ద గణపతి పూజలు నిర్వహిస్తూ ఉంటారు. అయితే, తమ మంటపంలో పూజలు చేయటానికి పూజారి దొరక్కపోవటంతో కొందరు యువకులు ఓ పూజారిని ఎత్తుకెళ్లిన ఘటన సిద్దిపేట జిల్లా కోహెడలో చోటుచేసుకుంది. హుస్నాబాద్ మండల కేంద్రంలో పద్మశాలి సంఘం వద్ద ఏర్పాటు చేసిన వినాయక మంటపం వద్ద బుధవారం పూజ పూర్తయిన వెంటనే విశ్వబ్రాహ్మణ కాలనీ, పోచమ్మ కాలనీ, గ్రామ పంచాయతీ కాలనీ, ధర్మసాగర్పల్లి తదితర ప్రాంతాల యువకులు ఒకేసారి వచ్చి తమ పంటపం వద్ద పూజ చేయాలని పూజారి కనకయ్యను చుట్టుముట్టారు. పోటీ పెరగటంతో యువకుల మధ్య వాగ్వివాదం, తోపులాట జరిగింది. ఈ నేపథ్యంలో విశ్వబ్రాహ్మణ కాలనీకి చెందిన యువకులు పూజారిని బలవంతంగా బైక్పై ఎక్కించుకొని తీసుకెళ్లారు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ..… pic.twitter.com/uV4lsMUj3u— Telugu Reporter (@TeluguReporter_) August 29, 2025 -
వంతెన చిన్నది.. వాగు పెద్దది
చిన్నశంకరంపేట(మెదక్): కశ్మీర్ టూ కన్యాకుమారి వెళ్లే 44వ జాతీయ రహదారిపై వంతెనల నిర్మాణం చేపట్టకపోవడంతో నార్సింగి మండల కేంద్రంలో వరద ఉధృతికి ముప్పు ఏర్పడుతుంది. వల్లభాపూర్ ధర్మారం గుట్టల నుంచి జాతీయ రహదారి మీదుగా శేరిపల్లి గుండు చెరువుకు వెళ్లే గన్నేరువాగు వరదను అంచనా వేయడంలో హైవే అథారిటీ అధికారులు విఫలమయ్యారు. నాలుగు వరుసల జాతీ య రహదారి నిర్మాణ సమయంలో గన్నేరువాగు వరద ఉధృతికి అనువుగా వంతెనను నిర్మించకపోవడంతో భారీ వర్షం వచ్చినప్పుడల్లా 300 మీ టర్ల పొడవునా వరద ప్రవహిస్తోంది. పదేళ్ల క్రితం ఇదే స్థాయిలో గన్నేరువాగు పొంగిపొర్లడంతో వా హనాల రాకపోకలు నిలిచిపోయాయి. అధికారులు అప్పుడే అధికారులు స్పందించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని స్థానికులు చర్చించుకుంటున్నారు. -
తక్షణ సాయం అందజేయాలి
కొల్చారం(నర్సాపూర్): భారీ వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు, ఇళ్లు కూలిపోయిన బాధితులకు ప్రభుత్వం తక్షణ సహాయం అందించాలని ఎమ్మెల్యే సునీతారెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం మంజీరాలో గల్లంతైన టేక్మాల్ ప్రమీల కుటుంబ సభ్యులను పరామర్శించారు. అక్కడి నుంచి సంగాయిపేట, వరిగుంతం గ్రామాల్లో దెబ్బతిన్న పంట పొలాలు, చెరువులను పరిశీలించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రమీల కుటుంబ సభ్యులను ప్రభుత్వం అన్ని విధాల ఆదుకోవాలన్నారు. వర్షాలతో దెబ్బతిన్న పంటలకు ఎకరాకు రూ. 25 వేల చొప్పున నష్ట పరిహారం చెల్లించాలన్నారు. జిల్లాకు తక్షణ సహాయం కింద రూ. కోటి ప్రకటించారని, అవి ఏం సరిపోతాయని ప్రశ్నించారు. ఆమె వెంట డీసీఎంఎస్ వైస్ చైర్మన్ రమేశ్ కుమార్, మాజీ జెడ్పీటీసీ మేఘమాల, నాయకులు గౌరీశంకర్ తదితరులు ఉన్నారు.నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి -
చినుకు పడితే అంతే..
ప్రతీ వర్షాకాలం ఇబ్బందులే..● మూడు కాలనీలకు తప్పని ముంపు ● ఇళ్లలోకి వస్తున్న వరదతో పట్టణ వాసుల అవస్థలు ● పట్టించుకోని అధికారులురామాయంపేట(మెదక్): రామాయంపేట ము న్సిపాలిటీ పరిధిలో చిన్నపాటి వర్షం పడినా, మూడు కాలనీలకు ముంపు తప్పడం లేదు. రెండు రోజుల క్రితం కురిసిన భారీ వర్షంతో శ్రీనగర్కాలనీతో పాటు అక్కల బస్తీ, బీసీ కాలనీలు జలమయం అయ్యాయి. మురుగు నీరు నేరుగా ఇళ్లలోకి చేరడంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. దుస్తులు, ఫర్నిచర్, ఇతర సామగ్రి నీటితో తడిసిపోయాయి. ఈవిషయమై గతంలో తాము పలుమార్లు ఆందోళన నిర్వహించినా ఫలితం లేకుండా పోయిందని అక్కలబస్తీ వాసులు వాపోయారు. రెండు రోజల పాటు నిద్రలేకుండా గడిపామని ఆవేదన వ్యక్తం చేశారు. మల్లె చెరువును ఆనుకొని శ్రీనగర్ కాలనీలో ఇళ్లు నిర్మించుకోగా, చెరువు నిండినప్పుడల్లా వరద నీరు ఇళ్లలోకి చేరుతోంది. పాములు, పురుగులు ఇళ్లలోకి వస్తున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు ఇరుకుగా ఉండటంతో పాటు మురుగు కాలువల సదుపాయం సరిగా లేకపోవడంతో వరద నీరు నేరుగా ఇళ్లలోకే వస్తుందని చెబుతున్నారు.ఇంటిలోకి ప్రవేశించిన వరద నీరుఇళ్లలోకి మురుగు నీరు చిన్నపాటి వర్షం కురిసినా వరద నీరు నేరుగా ఇళ్లలోకే చేరుతోంది. కాలనీలో రోడ్లు, మురికి కాలువలు సక్రమంగా నిర్మించకపోవడంతో ప్రతీసారి ఈ సమస్యను ఎదుర్కొంటున్నాం. అధికారులు తమకు న్యాయం చేయాలి. – పుట్టి సత్తవ్వ, అక్కలగల్లీ వర్షం వస్తుందంటే భయం 1రద నీరు ఇళ్లలోకి రాకుండా అధికారులు సరైన చర్యలు తీసుకోవడం లేదు. వర్షం వస్తుందంటేనే తాము భయాందోళన చెందుతున్నాం. ఇప్పటికే చాలా ఇళ్లలోకి వరద నీరు చేరి తీవ్ర నష్టం వాటిల్లింది. ఇప్పటికై నా అధికారులు చర్యలు తీసుకోవాలి. – బీర అనసూయ, రామాయంపేటపాపన్నపేట: 16 రోజులుగా ఏడుపాయల వన దుర్గమ్మ ఆలయం జల దిగ్బంధంలోనే ఉంది. అమ్మవారి ఆలయంలోకి భక్తులు వెళ్లడానికి వీలు లేకపోవడంతో రాజగోపురంలో ఉత్సవ విగ్రహానికి పూజలు చేస్తున్నారు. -
ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు
కలెక్టర్ రాహుల్రాజ్ హవేళిఘణాపూర్(మెదక్)/మెదక్ కలెక్టరేట్: ముంపు ప్రాంతాల్లో ప్రజలకు సేవలందించేందకు చర్యలు ముమ్మరం చేసినట్లు కలెక్టర్ రాహుల్రాజ్ తెలిపారు. శుక్రవారం మండల పరిధిలోని సర్దన, పోచమ్మరాళ్, బూర్గుపల్లిలో ఆయన పర్యటించారు. కొట్టుకుపోయిన రోడ్డును పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే మండల పరిధిలోని సర్దన గ్రామస్తులతో మాట్లాడారు. ఎలాంటి ఇబ్బందులున్నా అధికారులు అందుబాటులో ఉండి సేవలందిస్తారని, భయాందోళన చెందాల్సిన అవసరం లేదని ధైర్యం చెప్పారు. బూర్గుపల్లిలో చెరువు వద్ద గల బ్రిడ్జి కొట్టుకుపోగా తాత్కాలికంగా మొరం పోసి రాకపోకలు సాగేలా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ సింధూరేణుక, విద్యుత్, ఆర్అండ్బీ శాఖ అధికారులు ఉన్నారు. భారీ వర్షాలతో జిల్లాలో అన్ని చెరువులు పొంగిపొర్లుతున్నాయని, వినాయక నిమజ్జనం సమయంలో భక్తులు జాగ్రత్తగా ఉండాలని కలెక్టర్ రాహుల్రాజ్ సూచించారు. బాధితులను ఆదుకోండి రామాయంపేట(మెదక్): జిల్లా కేంద్రంలో అధికారులు, ప్రజా ప్రతినిధులతో సమీక్ష నిర్వహించిన సీఎం రేవంత్రెడ్డి మృతుల కుటుంబాలను పరామర్శించకపోవడం బాధాకరమని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మారెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని కాట్రియాలతో పాటు పలు గిరిజన తండాల్లో పర్యటించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గిరిజన తండాల్లో తాగు నీటితో పాటు కరెంటు సరఫరా బంద్ కావడంతో ప్రజలు అల్లాడుతున్నారని వాపోయారు. బాధితులను ప్రభు త్వం ఎంతమాత్రం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఆమె వెంట సహకార సంఘం అధ్యక్షుడు బాదె చంద్రం, పార్టీ యూత్ విభాగం మండలాధ్యక్షుడు జలంధర్, మాజీ సర్పంచ్లు శ్యాం, సుభాశ్నాయక్, నాయకులు స్వామి, కిషన్, భిక్షపతి ఉన్నారు. యూరియా కోసం తప్పని తిప్పలు నర్సాపూర్: యూరియా కోసం రైతులకు తిప్పలు తప్పడం లేదు. తమ గ్రామాల నుంచి రోజూ నర్సాపూర్ వచ్చి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద టోకెన్ల కోసం బారులు తీరడం నిత్యకృత్యం అయింది. శుక్రవారం యూరియా వస్తుందని తెలిసి ఉదయం నుంచే సొసైటీ వద్ద బారులు తీరారు. మధ్యాహ్నం తర్వాత యూరియా రాగానే తలా ఒక బస్తా తీసుకొని వెళ్లారు. కౌడిపల్లి(నర్సాపూర్): భారీ వర్షాలతో గ్రామా ల్లో సంపూర్ణ పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని డీఎల్పీఓ సాయిబాబ తెలిపారు. శుక్రవారం కౌడిపల్లి ఎంపీడీఓ కార్యాలయాన్ని సందర్శించి రికార్డులు తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వర్షాల నేపథ్యంతో ప్రజలకు ఇబ్బందులు లేకుండా పారిశుద్ధ్య పనులు చేపడుతున్నామని తెలిపారు. ఎక్కడా సమస్య లేకుండా పంచాయతీ కార్యదర్శులు చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. మురికి కాలువ లు, రోడ్డు శుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. తాగునీటి సమస్య లేకుండా చూడాలన్నారు. ఆయన వెంట ఎంపీడీఓ శ్రీనివాస్ ఉన్నారు. నర్సాపూర్: మిషన్ భగీరథ నీరు శనివారం రావని ఏఈ రాజ్కుమార్ తెలిపారు. సంగారెడ్డి జిల్లా హత్నూర మండలంలోని బోర్పట్ల నీటి శుద్ధి కేంద్రంలోని విద్యుత్ సబ్స్టేషన్లో సాంకేతిక సమస్య తలెత్తడంతో నీటి శుద్ధి నిలిచిపోయిందని చెప్పారు. ప్రజలు సహకరించాలని కోరారు. -
వరద తెచ్చిన.. బురద కష్టాలు
మెదక్ మున్సిపాలిటీ: భారీ వర్షాలకు పట్టణంలోని ప లు ఇళ్లు, దుకాణాల్లోకి వర్షపు నీరు చేరింది. దీంతో ప్రజలు, వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడు తున్నారు. పట్టణంలోని ఫతేనగర్, సాయినగర్, వెంకట్రావునగర్ కాలనీల్లో మురికి కాల్వలు నిండి రోడ్లపైకి రావడంతో జలమయం అయ్యాయి. గాంధీనగర్ వీధిలో అక్కడక్కడ ఇళ్లలోకి వర్షం నీరు చేరింది. కాగా శుక్రవారం వర్షం తగ్గడంతో మెదక్లోని ప లు చోట్ల పునరావాసం పొందుతున్న ప్రజలను పోలీసులు తమ గ్రామాలకు బస్సుల్లో తరలించారు. దీంతో వారు ఇంట్లోకి చేరిన నీటిని బయటకు తోడుతూ శుభ్రం చేసుకుంటున్నారు. -
జిల్లాలో అపార నష్టం కలిగించిన వర్షాలు
గత మూడు రోజులుగా కురిసిన భారీ వర్షాలతో మెతుకుసీమకు అపారనష్టం జరిగింది. 77 కిలోమీటర్ల పొడవు పీఆర్, ఆర్అండ్బీ రోడ్లు ధ్వంసం కాగా, 92 చెరువులు, కుంటలు, కల్వర్టులు తెగిపోయాయి. వేలాది విద్యుత్ స్తంభాలు, వందలాది ట్రాన్స్ఫార్మర్లు ధ్వంసమయ్యాయి. ఈ నాలుగు శాఖల పరిధిలో రూ. 18.60 కోట్ల పైచిలుకు నష్టం జరిగినట్లు అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. ఇదిలాఉండగా వేలాది ఎకరాల్లో పంటలు నీట మునిగి దెబ్బతిన్నాయి. – మెదక్జోన్ వరుణుడి ప్రతాపానికి మెతుకుసీమ అతలాకుతలం అయింది. వరద ఉధృతితో చెరువులు, కుంటలు, బ్రిడ్జిలు, కల్వర్టులు, మొత్తం 92 ధ్వంసం అయ్యాయి. ఇందులో ప్రధానంగా లింగసాన్పల్లి ఊరచెరువు, అవుసులపల్లి ఖజానచెరువు, కొచ్చెరువుతో పాటు అనేక నీటి వనరులు తెగిపోయాయి. ఇరిగేషన్శాఖ ప్రాథమిక అంచనా ప్రకారం రూ. 2 కోట్ల నష్టం సంభవించింది. అలాగే పంచాయతీరాజ్శాఖ పరిధిలో 63 కిలోమీటర్ల మేర 14 రోడ్లు ధ్వంసం అయ్యాయి. 15 చోట్ల రోడ్లకు గండ్లు పడ్డాయి. పలు కల్వర్టులు తెగిపోయాయి. అత్యవసరంగా 29 చోట్ల మరమ్మతులు చేయాల్సి ఉంది. అధికంగా హవేళిఘణాపూర్ మండల పరిధిలోని బ్యాతోల్, ఫరీద్పూర్లో రోడ్లు ధ్వంసం అయ్యా యి. వీటికి సైతం మరమ్మతులు చేయాల్సిన అవసరం ఉంది. దీంతో సుమారు రూ. 4.40 కోట్ల ఆస్తి నష్టం జరిగినట్లు ఆ శాఖ అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. వాగులు పారి.. దారులు తెగి ఆర్అండ్బీశాఖ పరిధిలో 29 రోడ్లకు సంబంధించి 53 కిలోమీటర్ల మేర రోడ్లు ధ్వంసం అయ్యాయి. అత్యధికంగా మెదక్ సమీపంలోని పిల్లికొటాల్– వెల్దుర్తి రోడ్డు, చిన్నశంకరంపేట మండలం టీ. మాందాపూర్, శివ్వంపేట మండల పరిధిలోని చండి రోడ్లు దెబ్బతినగా, వీటికి వెంటనే మరమ్మతులు చేయాల్సిన అవసరం ఉంది. సుమారు రూ. 2.60 కోట్ల మేర ఆస్తి నష్టం జరిగినట్లు ఆశాఖ అధికారులు చెబుతున్నారు. అలాగే అత్యధికంగా నష్టం జరిగిన శాఖలో మొదటిది విద్యుత్శాఖ. దీని పరిధిలో 1,344 విద్యుత్ స్తంభాలు ధ్వంసం అయ్యా యి. 460 ట్రాన్స్ఫార్మర్లు నీట మునిగాయి. 3 పెద్ద ట్రాన్స్ఫార్మర్లు, 1 సబ్స్టేషన్తో పాటు 51 కిలోమీటర్ల పొడవునా విద్యుత్ లైన్లు దెబ్బతిన్నాయి. మొత్తంగా రూ. 10 కోట్ల నష్టం జరిగినట్లు ఆశాఖ అధికారులు అంచనా వేశారు. ఈ నష్టం మ రింతగా పెరిగే అవకాశం ఉంది. హవేళిఘణాపూర్ మండలం దూప్సింగ్ తండా వరద ముంపులోనే ఉంది. వరద తగ్గాక ఆ గ్రామంలో పడిపోయిన స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు ఎన్ని అనే విషయం తెలుస్తోందని అధికారులు చెబుతున్నారు. అలాగే జిల్లావ్యాప్తంగా 681 ఇళ్లు పాక్షికంగా దెబ్బతినగా, అందులో 4 ఇళ్లు నేలమట్టం అయినట్లు సంబంధిత అధికారులు పేర్కొన్నారు.ధూప్సింగ్ తండాలో నేలవాలిన చెరుకు పంట ప్రాథమిక అంచనా ప్రకారం రూ. 18.60 కోట్ల మేర నష్టం అత్యధికంగా విద్యుత్శాఖకు.. దెబ్బతిన్న 1,344 స్తంభాలు, 460 ట్రాన్స్ఫార్మర్లు 77 కిలోమీటర్ల మేర పీఆర్, ఆర్అండ్బీ రోడ్లు ధ్వంసం 92 చెరువులు, కుంటలకు గండ్లు, తెగిన కల్వర్టులు -
త్వరగా ‘ట్రాక్’లో పడేనా..!
రామాయంపేట(మెదక్): భారీ వర్షాలతో మెదక్, కామారెడ్డి జిల్లాల్లో రెండు చోట్ల రైల్వే ట్రాక్ దెబ్బతినడంతో మేడ్చల్– నిజామాబాద్, అక్కన్నపేట– మెదక్ రూట్లలో 38 రైళ్లను ఆశాఖ అధికారులు రద్దు చేశారు. అక్కన్నపేట– మెదక్ మార్గంలో ప్రతి రోజు ఉదయం, సాయంత్రం రైళ్లు నడుస్తాయి. వరద పోటెత్తడంతో హవేళిఘణాపూర్ మండలం శమ్నాపూర్ వద్ద ట్రాక్ కింద కంకర, మొరం లేచిపోయి పట్టాలు గాలిలో తేలాయి. మేడ్చల్– నిజామాబాద్ మార్గంలో తలమడ్ల వద్ద కూడా ఇదే పరిస్థితి ఎదురవడంతో రెండు మార్గాల్లో రైళ్లు పూర్తిగా రద్దయ్యాయి. దీంతో ఎల్లవేళలా రద్దీగా ఉండే పలు స్టేషన్లు నిర్మానుష్యంగా మారాయి. జిల్లా మీదుగా దూర ప్రాంతాలకు వెళ్లే అజంతా, దేవగిరి, కృష్ణ, జైపూర్, ఓకా, అమరావతి, నాగర్సోల్, రాజస్థాన్ వెళ్లే ఎక్స్ప్రెస్ రైళ్లను దారి మళ్లించారు. తలమడ్ల వద్ద వంద మంది రైల్వే సిబ్బంది, అధికారులు యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేయిస్తున్నారు. శనివారం లోపు రైళ్లు ప్రారంభం కావొచ్చని ఆశాఖ అధికారులు పేర్కొన్నారు. కాగా మెదక్ మార్గంలో ఇతర రైళ్లు నడువకపోవడంతో అధికారులు తాత్సా రం చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. శమ్నాపూర్ వద్ద ట్రాక్ మరమ్మతులకు కనీసం రెండు, మూడు రోజులు పట్టనున్నట్లు సమాచారం.శమ్నాపూర్ వద్ద ప్రారంభం కాని మరమ్మతులు -
16 వేల ఎకరాల్లో పంటలకు నష్టం
జిల్లావ్యాప్తంగా 16,230 ఎకరాల్లో వివిధ రకాల పంటలు ముంపునకు గురయ్యాయి. వాటిలో ఇసుక మేటలు పేరుకుపోగా, మరికొన్ని వరదలోనే ఉన్నాయి. ఇందులో ప్రధానంగా వరి 13,214 ఎకరాలు ఉండగా, పత్తి 2,284 ఎకరాలు.. మరో 732 ఎకరాల్లో ఆరుతడి పంటలు ఉన్నాయి. కాగా ఇందులో అత్యధికంగా హవేళిఘణాపూర్, నిజాంపేట, పాపన్నపేట మండలాల్లో వరి పంటలు దెబ్బతినగా, అల్లాదుర్గం, రేగోడ్, టేక్మాల్, పెద్దశంకరంపేట మండలాల్లో పత్తికి నష్టం జరిగింది. కాగా దెబ్బతిన్న పంటలకు పరిహారం విషయమై ప్రభుత్వం ఇప్పటివరకు చెప్పకపోవడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.శివ్వంపేట: నీటి మునిగిన వరి పంట -
కుంభవృష్టితో మెతుకుసీమ అతలాకుతలం
మెదక్జోన్/రామాయంపేట/హవేళిఘణాపూర్/చిన్నశంకరంపేట/పాపన్నపేట/మెదక్ మున్సిపాలి టీ: మెతుకుసీమను వర్షాలు ముంచెత్తాయి. అత్యధికంగా హవేళిఘణాపూర్ మండలం సర్దనలో 31.6 సెంటి మీటర్ల వర్షపాతం నమోదైంది. మంజీరా, హల్దీ, ఘనపూర్ ప్రాజెక్ట్లు పొంగిపొర్లాయి. రహదారులు ఎక్కడికక్కడ తెగిపోయాయి. అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోగా, జనజీవనం స్తంభించింది. వరదల్లో 12 మంది చిక్కుకోగా, 9 మందిని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కాపాడాయి. మరో ఇద్దరు గల్లంతు కాగా, ఒకరి మృతదేహం లభ్యమైంది. మెదక్– కామారెడ్డి జిల్లాల సరిహద్దులోని పోచారం ప్రాజెక్ట్కు గండిపడటంతో దాని దిగువ ప్రాంతంలోని సర్దన, పోచమ్మరాల్, జక్కన్నపేట గ్రామాలకు చెందిన 500 మందిని మెదక్ పట్టణంలోని పునరావాస కేంద్రాలకు తరలించారు. రాజిపేట తండాకు చెందిన మాలోత్ హరిత గురువారం పురిటినొప్పులతో బాధపడుతుండగా, ఎన్డీఆర్ఎఫ్ బృందం ఆమెను సురక్షితంగా మెదక్ ఎంసీహెచ్ ఆస్పత్రికి తరలించారు. జిల్లా కేంద్రంలోని పసుపులేరు ఒడ్డున గల సబ్స్టేషన్ నీటి మునగగా, విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మెదక్ పట్టణంలో ఓ ఇంటి ఆవరణలో బుధవారం పిడుగుపడింది. ఎవరికి ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోలేదు. సింగూర్ ప్రాజెక్టు నుంచి దిగువన గల ఘనపూర్కు 20 వేల క్యూసెక్కుల నీటిని వదలడంతో పాపన్నపేట మండలంలోని కుర్తివాడ, యూసుపేట మధ్య రోడ్డుపై వరద ఉధృతంగా ప్రవహించి రాకపోకలకు అంతరాయం కలిగింది. అలాగే మెదక్– బొడ్మట్పల్లి ప్రాంతంలోని పేరూరు బ్రిడ్జిపై నీరు ప్రవహించటంతో రాకపోకలు నిలిచిపోయాయి. వెల్దుర్తి– ఉప్పులింగాపూర్ మధ్య గల బ్రిడ్జిపై నుంచి నీరు ప్రవహించి రాకపోకలు స్తంభించాయి. మంజీరా పొంగి పొర్లుతుండటంతో దిగువన వేలాది ఎకరాల వరి నీట మునిగింది. నదిలో ఏర్పాటు చేసిన మోటార్లు కొట్టుకుపోయాయి. నార్సింగిలో గుండువాగు పొంగిపొర్లడంతో 44వ జాతీయ రహదారిపై నీరు భారీగా చేరింది. కొద్దిసేపు వాహనాలను ఎక్కడికక్కడే నిలిపివేశారు. రామాయంపేట పట్టణం జలదిగ్బంధంలో చిక్కుకుంది. పలు కాలనీలు నీట మునిగాయి. ఎస్సీ మహిళా డిగ్రీ కళాశాల, ఇంటర్ బాలికల హాస్టల్ చుట్టూ వరద చేరటంతో ఎన్డీఆర్ఎఫ్ బృందం విద్యార్థినులను సురక్షిత ప్రాంతానికి తరలించారు. చిన్నశంకరంపేట మండలం శాలిపేటలో నీటి కుంటతెగిపోయి పెద్ద ఎత్తున పంటలకు నష్టం జరిగింది. కొల్చారం మండలం తుక్కాపూర్కు చెందిన టేక్మాల్ ప్రమీల నదిలో గల్లంతు కాగా, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు నదిలో గాలిస్తున్నాయి. ఇదే మండలం సంగాయిపేట చెరువు గండిపడి రహదారిపై నీరు ప్రవహిస్తోంది. దీంతో శెట్టిపల్లి, వెంకటాపూర్, వరిగుంతం గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.వరుణుడి ప్రతాపానికి మెతుకుసీమ చిగురుటాకులా వణికింది. రెండు రోజులుగా కురుస్తున్న కుంభవృష్టితో అతలాకుతలం అయింది. వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తుండగా, లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. నివాసాలు నీట మునిగాయి. ఆస్తి, ప్రాణ నష్టం జరగగా, వేలాది ఎకరాల్లో 11 మండలాల్లో అత్యధికంరెండు రోజులుగా 11 మండలాల్లో అత్యధిక వర్షపాతం నమోదు అయినట్లు వాతావరణశాఖ అధికారులు పేర్కొన్నారు. చేగుంట మండలంలో 231.8 మి.మీ, రామాయంపేటలో మి.మీ నమోదు కాగా, మెదక్లో 196.8 మి.మీ, కొల్చారంలో 166.3 మి.మీ, వెల్దుర్తి 148 మి.మీ, నార్సింగి 142 ఎంఎం, నిజాంపేట 140 మి.మీ, తూప్రాన్ 130.3 మి.మీ, పెద్దశంకరంపేట 123.8 మి.మీ, టేక్మాల్ 120.5 మి.మీ నమోదు అయింది. -
పండుగ పూట ఆర్తనాదాలు
హవేళిఘణాపూర్ మండలం దూప్సింగ్ తండాను వరద నీరు చుట్టుముట్టింది. కామారెడ్డి జిల్లా నుంచి వచ్చిన గంగమ్మవాగు ఉధృతితో తండా చుట్టూ నీరు చేరింది. దీంతో తండావాసులు తమను ఆదుకోండి అంటూ ఆర్తనాదాలు పెట్టారు. ఆ తండాకు వెళ్లేందుకు దారి లేక ఇబ్బందులు పడ్డారు. అలాగే కామారెడ్డి– మెదక్ జిల్లా సరిహద్దులో ఉన్న పోచారం డ్యామ్ తెగిపోతుందన్న విషయం తెలుసుకున్న సర్దన గ్రామస్తులు బిక్కుబిక్కుమంటూ భయంగుప్పిట్లో గడిపారు. విషయం తెలుసుకున్న అధికారులు గ్రామస్తులను ప్రత్యేక బస్సుల్లో మెదక్ పట్టణంలోని వెంకటేశ్వర, జీకే ఆర్ గార్డెన్స్, ఫరీద్పూర్ రైతు వేదికలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి తరలించారు. కలెక్టర్ రాహుల్రాజ్, ఎస్పీ శ్రీనివాసరావు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ప్రజలకు ఎలాంటి ముప్పు లేకుండా చర్యలు చేపట్టారు. -
ఇప్పటికే రూ. కోటి కేటాయించాం
మెదక్ కలెక్టరేట్/హవేళిఘణాపూర్(మెదక్)/రామాయంపేట: వరద బాధితులను అన్ని విధాలుగా ఆ దుకుంటామని, ఇప్పటికే జిల్లాకు వరద సహాయం కింద రూ. కోటి కేటాయించామని జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్ తెలిపారు. గురువారం కలెక్టరేట్లో ఎమ్మెల్యే రోహిత్రావు, ప్రత్యేక అధికారి డాక్టర్ హరీశ్, కలెక్టర్ రాహుల్రాజ్, ఇతర శాఖల అధికారులతో భారీ వర్షాలు వరద సహాయక చర్యలపై సమీక్షించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దెబ్బతిన్న రోడ్లు, కల్వర్టులు, బ్రిడ్జిల తాత్కాలిక మరమ్మతులు చేపడుతామన్నారు. అనంతరం పునరావాస కేంద్రాలలో ప్రజల సౌకర్యాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం హవేళిఘణాపూర్ మండలం నాగాపూర్, బూర్గుపల్లి, వాడి, దూప్సింగ్ తండా, తిమ్మాయిపల్లిలో వరద తీరును పరిశీలించారు. అలాగే రామాయంపేట మ ండలంలోని పర్వతాపూర్ శివారులో కూలిన పుష్పాలవాగు బ్రిడ్జిని పరిశీలించారు. వర్షాలతో పంటలు నష్టపోయిన వారికి నష్టపరిహారం అందజేస్తామని, ఇళ్లు కూలిన వారికి ఇందిమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. వరద నీటిలో చేపలు పట్టడం అత్యంత ప్రమాదకరమన్నారు. -
నేడు విద్యా సంస్థలకు సెలవు: కలెక్టర్
మెదక్ కలెక్టరేట్: జిల్లాలో భారీ వర్షాల కారణంగా శుక్రవారం విద్యా సంస్థలకు సెలవు ప్రకటించినట్లు కలెక్టర్ రాహుల్రాజ్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసినట్లు తెలిపారు. జిల్లాలోని అన్ని విద్యాసంస్థలు విధిగా సెలవు పాటించాలని సూచించారు. వర్షాలతో జాగ్రత్త ఎమ్మెల్యే సునీతారెడ్డి నర్సాపూర్: భారీ వర్షా లు కురుస్తున్నందున ప్ర జలు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే సునీతారెడ్డి ప్రజలను కోరారు. గురువారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. మరిన్ని రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నందున ప్రజలందరూ అత్యవసర పనులు ఉంటేనే ఇళ్ల నుంచి బయటకు రా వాలని సూచించారు. ఖచ్చితంగా ప్రయాణం చేయాల్సి వస్తే వాగులు, బ్రిడ్జిలు దాటాల్సి వచ్చినప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. స్కాలర్షిప్లు విడుదల చేయాలి: ఏబీవీపీ నిజాంపేట(మెదక్): రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లను విడుదల చేయాలని ఏబీవీపీ రాష్ట్ర నాయకుడు బండారి ప్రశాంత్ డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం వినాయకుడికి వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వాలు మారిన విద్యార్థుల గోస తీరడం లేదన్నారు. విద్యారంగాన్ని పూర్తిగా విస్మరించారని, విద్యార్థులకు రావాల్సిన ఫీజులు రూ. 8,300 కోట్లను పెండింగ్లో పెట్టిందన్నారు. విద్యను వ్యాపారంగా మారుస్తున్న యాజమాన్యాలపై చర్యలు తీసుకొని గుర్తింపును రద్దు చేయాలని కోరారు. కార్యక్రమంలో జస్వంత్, రఘు, భాను, నవదీప్ తదితరులు పాల్గొన్నారు. పాక్షికంగా దెబ్బతిన్న 513 ఇళ్లు మెదక్ కలెక్టరేట్: మూడు రోజులుగా జిల్లాలో కురుస్తున్న వర్షాలతో జిల్లావ్యాప్తంగా 513 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయని డీఆర్ఓ భుజంగరావు తెలిపారు. అలాగే 40 వేల కోడి పిల్లలు మృతి చెందగా, 49 రోడ్లు, 21 బ్రిడ్జిలు దెబ్బతినగా, జిల్లావ్యాప్తంగా 20 కాలనీల్లోకి వరద నీరు చేరిందన్నారు. మరోవైపు పోచారం డ్యాంకు బుంగపడిన నేపథ్యంలో 658 పైగా కుటుంబాలను పునరావాసం కోసం జిల్లా కేంద్రానికి తరలించి సహాయక చర్యలు అందిస్తున్నామని తెలిపారు. గణనాథుడి సన్నిధిలో యాదాద్రి కలెక్టర్పటాన్చెరు టౌన్: వినాయక చవితి పురస్కరించుకుని పటాన్చెరు మండలం పరిధిలోని రుద్రారం గ్రామ సమీపంలో గణేశ్గడ్డ దేవస్థానంలో గణేశుడిని బుధవారం యాదాద్రి జిల్లా కలెక్టర్ హనుమంతరావు సందర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు సిబ్బంది తీర్థ ప్రసాదాలను అందజేసి, కలెక్టర్ను సన్మానించారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు, ఈవో లావణ్య, జూనియర్ అసిస్టెంట్ ఈశ్వర్ పాల్గొన్నారు. -
శేఖర్ .. సమయస్ఫూర్తి
● శమ్నాపూర్ బ్రిడ్జి కింది భాగంలో కొట్టుకుపోయిన మట్టి, కంకర ● అక్కన్నపేట– మెదక్ మధ్య ఘటన ● తప్పిన ప్రమాదం.. నిలిచిన రైళ్ల రాకపోకలు రామాయంపేట/హవేళిఘణాపూర్(మెదక్)/మెదక్జోన్: భారీ వర్షాలతో దెబ్బతిన్న రైల్వే ట్రాక్లతో సికింద్రాబాద్– నిజామాబాద్, అక్కన్నపేట– మెదక్ మధ్య రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. ట్రాక్లను ఆనుకొని ఉన్న చెరువులు, వాగుల్లో నీరు నిండి పెద్ద ఎత్తున వరద పోటెత్తింది. అక్కన్నపేట– మెదక్ మార్గంలో శమ్నాపూర్ బ్రిడ్జి కింది భాగంలో మట్టి, కంకర వరద నీటిలో కొట్టుకుపోయింది. దీంతో పట్టాలు గాలిలో తేలియాడాయి. సమాచారం అందించిన రైతు గ్రామానికి చెందిన శేఖర్ రైతు బుధవారం ఉద యం 11.15 గంటలకు రైల్వేకట్ట ప్రాంతంలోని తన వ్యవసాయ పొలాన్ని చూసేందుకు వెళ్లాడు. నీటి ఉధృతితో రైలు పట్టాల కింద మట్టి, కంకర కొట్టుకపోయిన విషయాన్ని గమనించాడు. ఈ విషయాన్ని ఫోన్లో పోలీసులకు సమాచారం అందించాడు. అప్పటికే ఉదయం 5.30 గంటల రైలు వెళ్లిపోయింది. విషయం తెలుసుకున్న రైల్వే(కీ) మెన్ ఘటన స్థలిని పరిశీలించి స్టేషన్ మాస్టర్కు వివరించారు. దీంతో రైళ్ల రాకపోకలను తాత్కాలికంగా రద్దు చేశా రు. ఒక వేళ దీనిని గమనించకుండా ఉంటే పెను ప్రమాదం జరిగేది. అప్పటికే వెళ్లిపోయిన రైళ్లను ఎక్కడికక్కడే సమీప స్టేషన్లలో నిలిపివేశారు. యుద్ధ ప్రాతిపదికన పనులు ప్రారంభించినా, కనీసం రెండు, మూడు రోజులైనా సమయం పట్టవచ్చని ఆ శాఖ అధికారులు పేర్కొన్నారు. -
ప్రాణాలకు తెగించి.. కాపాడి
మెదక్ మున్సిపాలిటీ: వరద నీటిలో కారుతో పాటు కొట్టుకుపోయిన ఓ వ్యక్తి ప్రాణాలను ఎన్డీఆర్ఎఫ్ బృందం తమ ప్రాణాలకు తెగించి కాపాడింది. కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం తాండూ రుకు చెందిన నరేందర్గౌడ్ కారులో బుధవారం మెదక్ వైపు వస్తున్నాడు. ఈ క్రమంలో హవేళిఘణాపూర్ మండలం నాగాపూర్ శివారులో నక్కవాగు వద్ద రోడ్డు తెగిపోయి వరద ఉధృతి అధికంగా ఉండటంతో కారుతో పాటు వాగులోకి కొట్టుకుపోయాడు. ఈ క్రమంలో వాగు మధ్యలో కారు చిక్కుకొని ఆగిపోగా, పైకి ఎక్కిన నరేందర్గౌడ్ తన కుటుంబ సభ్యులకు సెల్ఫోన్ ద్వారా సమాచారం అందించి లోకేషన్ పంపించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు రెస్క్యూటీంతో అక్కడికి చేరుకొని అతడిని కాపాడి ఒడ్డుకు తీసుకొచ్చి ప్రాణాలు కాపాడారు. ºÆŠḥ¢yólMýS$ JMýS Æøk Ð]l¬…§ýl$.. పుట్టిన రోజుకు ఒక రోజు ముందు వరద నీటిలో చిక్కుకున్న నరేందర్గౌడ్ 8 గంటల పాటు ప్రాణాలతో కొట్టుమిట్టాడు. ఎట్టకేలకు రెస్క్యూ టీం ప్రాణాలకు తెగించి ఒడ్డుకు చేర్చారు. ఈసందర్భంగా మెదక్ ఎమ్మెల్యే రోహిత్రావు, మాజీ ఎమ్మెల్యే హన్మంతరావు ఒకరోజు ముందుగానే నరేందర్కు కేక్ తినిపించి బర్త్ డే శుభాకాంక్షలు తెలిపారు. దేవుడు తనకు ప్రాణ భిక్షపెట్టి పునర్జన్మనిచ్చాడని నరేందర్గౌడ్ భావోద్వేగానికి లోనయ్యాడు. సకాలంలో స్పందించి తన ప్రాణాలు కాపాడిన పోలీసులకు కృతజ్ఞతలు తెలిపాడు. హవేళిఘణాపూర్ మండలం వాడి గ్రామానికి చెందిన ఓ గర్భిణి పురిటి నొప్పులతో బాధ పడుతుండగా, ఎస్డీఆర్ఎఫ్ బృందం ఆమెను మెదక్లోకి ఎంసీహెచ్కు క్షేమంగా తరలించారు. ఈసందర్భంగా కలెక్టర్ రాహుల్రాజ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాన్ని అభినందించారు. -
బాధితులను పట్టించుకోని సీఎం ఎందుకు?
హవేళిఘణాపూర్ (మెదక్): ప్రజలు వరదలతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని కొట్టుమిట్టాడు తుంటే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మాత్రం వారి కష్టాలు పట్టించుకోకుండా మూసీ నది, క్రీడ లపై సమీక్షలు చేయడం సిగ్గుచేటని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి టి.హరీశ్రావు ధ్వజ మెత్తారు.బాధితులను పట్టించుకోని సీఎం ఎందుకని ప్రశ్నించారు. గురువారం ఆయన వరద లతో ప్రభావితమైన మెదక్ జిల్లా హవేళిఘణాపూర్ మండలం ధూప్సింగ్ తండా, నాగా పూర్, వాడి గ్రామాలను సందర్శించారు. కొట్టు కుపోయిన బ్రిడ్జి, రోడ్లను పరిశీలించారు. -
యుద్ధప్రాతిపదికన మరమ్మతులు
సాక్షి, హైదరాబాద్/పెద్దపల్లి/మెదక్జోన్: భారీ వర్షాలు, వరదలతో దెబ్బతిన్న చెరువులు, కాల్వలు, రహదారులు, ఇతర మౌలిక సదుపాయాలకు యుద్ధప్రాతిపదికన మరమ్మతులు నిర్వహించాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆదేశించారు. తక్షణ మే అంచనాలు తయారు చేసి అత్యవసర నిధులతో పనులు చేపట్టాలని సూచించారు. వరదల్లో మృతిచెందిన వారి కుటుంబాలకు ఎక్స్గ్రేషియా చెల్లించడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్కుమార్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్తో కలిసి సీఎం రేవంత్రెడ్డి గురువారం వరదలతో అతలాకుతలమైన కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే నిర్వహించారు. భారీ వర్షాలతో బుధ, గురువారాల్లో పోటెత్తిన వరదలతో కామారెడ్డి, మెదక్ జిల్లాలో అపార నష్టం వాటిల్లిందని సీఎంకు రెండు జిల్లాల కలెక్టర్లు నివేదించారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్ద హెలికాప్టర్ దిగి వరదల పరిస్థితిపై సమీక్షించారు. అనంతరం నిజాంసాగర్, పోచారం ప్రాజెక్టులను ఏరియల్ సర్వే నిర్వహించారు. కామారెడ్డిలో హెలికాప్టర్ దిగి జిల్లా కలెక్టర్తో సమీక్షించాల్సి ఉండగా, వాతావరణం అనుకూలించకపోవటంతో సాధ్యం కాలేదు. దీంతో మెదక్ జిల్లా చేరుకుని వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం హెలికాప్టర్ను మెదక్ ఎస్పీ కార్యాలయంలో దించి జిల్లాలో వరదల పరిస్థితిపై అక్కడే సమీక్ష నిర్వహించారు. జిల్లాలో వరద పరిస్థితిని కలెక్టర్ సీఎంకు నివేదించారు. వరద సహాయక చర్యల్లో అధికార యంత్రాంగం బాగా పని చేసిందని సీఎం కితాబిచ్చారు. సమీక్షలో ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్, ఎంపీ రఘునందన్ రావు తదితరులు పాల్గొన్నారు. మెదక్ నుంచే సీఎం కామారెడ్డి జిల్లా కలెక్టర్కు ఫోన్ చేసి వరద పరిస్థితులపై ఆరా తీశారు. సత్వరం సహాయక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వరద నష్టంపై అత్యవసరంగా కేంద్రానికి ప్రాథమిక నివేదిక సమర్పిస్తామని మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. అప్రమత్తంగా ఉండాలిభారీ వర్షాల నేపథ్యలో అన్ని శాఖల అధికారులు, సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉంటూ ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవా లని సీఎం ఆదేశించారు. గురువారం ఉదయం తన నివాసంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు, మంత్రులు శ్రీధర్బాబు, సీతక్కతో కలిసి వరద పరిస్థితిపై సమీక్షించారు. హైదరాబాద్ నగరంతోపాటు అన్నిచోట్లా శిథిలావస్థకు చేరిన ఇళ్లలో ఉన్న వారిని ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. వినాయక మండపాల వద్ద విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లతో భక్తులకు ప్రమాదం వాటిల్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. హైదరాబాద్లో హైడ్రా, జీహెచ్ఎంసీ, ఎస్డీఆర్ఎఫ్, అగ్నిమాపక, పోలీసు సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. చెరువులు, కుంటలకు గండ్లు పడే ప్రమాదం ఉన్నందున నీటి పారుదల శాఖ అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. అంటువ్యాధులు ప్రబలకుండా పారిశుద్ధ్య సిబ్బంది జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. వైద్యారోగ్య శాఖ సిబ్బంది ఆస్పత్రుల్లో సరిపడా మందులు అందుబాటులో ఉంచుకోవడంతోపాటు అవసరమైన చోట వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్బృందాల సాయం తీసుకోవాలని సీఎస్ను ఆదేశించారు. మామ స్వాతిముత్యం.. అల్లుడు ఆణిముత్యంమామ స్వాతిముత్యం.. అల్లుడు ఆణిముత్యంలా రూ.లక్షల కోట్లు వెచ్చించి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో ఎన్నో లోపాలు ఉన్నాయని సీఎం రేవంత్రెడ్డి విమర్శించారు. గురువారం పెద్దపల్లి జిల్లా ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్ద ఆయన మాట్లాడుతూ, కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బరాజ్ కుంగిపోయిందని, ఏనాడో నిర్మించిన శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టే ప్రస్తుతం తెలంగాణకు వరప్రదాయినిగా మారిందని అన్నారు. మామ, అల్లుడు కాళేశ్వరం ప్రాజెక్టును గొప్పగా నిర్మించామని చెప్పుకుంటున్నారని, వాళ్లలా తాము 80 వేల పుస్తకాలు చదవలేదని మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్రావుపై సెటైర్ వేశారు. యూరియాపై ఎప్పటికప్పుడు బఫర్ స్టాక్ డిస్ప్లే చేస్తున్నామని సీఎం తెలిపారు. తదుపరి పంటలకు సైతం కొందరు రైతులు యూరియాను నిల్వ చేసుకోవడంతో కొరత ఏర్పడిందని చెప్పారు. సీఎం వెంట మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్, రామగుండం ఎమ్మెల్యే రాజ్ఠాకూర్ మక్కాన్సింగ్ ఉన్నారు. -
జేసీబీ, ట్రాక్టర్ సహాయంతో అంత్యక్రియలు
సాక్షి, మెదక్: కనీవినీ ఎరుగని రీతిలో మెతుకుసీమ చరిత్రలో లేనంతగా వరుణుడు వణికించేస్తున్నాడు. ఇప్పటికే పలు గ్రామాలు, తండాలు జలదిగ్బంధంలో ఉండిపోయాయి. మరో రెండు రోజులపాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని అధికారులు చెబుతున్నారు. ఫ్లాష్ఫ్లడ్స్ హెచ్చరికల నేపథ్యంలో నీటి ఉపద్రవం తమను ముంచెత్తుతుందో అని జనాలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. భారీ వర్షాలతో మెదక్ ప్రజల జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. రేగోడ్ (మం) మర్పల్లి గ్రామంలో హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది. అంత్యక్రియల కోసం ఓ కుటుంబం, గ్రామస్తులు తీవ్ర అవస్థలు పడ్డారు. గొల్ల వాగు వరద నీటి ప్రవాహా ఉదృతితో జేసీబీ, ట్రాక్టర్ సహాయంతో అంత్యక్రియలు నిర్వహించారు. సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.గత రెండు రోజులుగా మెదక్ జిల్లాలో తీవ్రమైన వర్షాలు నమోదయ్యాయి. గజ్వేల్, నారాయణఖేడ్, సిద్దిపేట ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదైంది. రోడ్లు దెబ్బ తినడంతో రాకపోకలు నిలిచిపోయాయి. వరి, మక్క, కందుల పంటలు నీట మునిగి రైతులు తీవ్రంగా నష్టపోయారు. కొన్ని మండలాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. ఇప్పటికే సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మరోవైపు.. రెవెన్యూ అధికారులు గ్రామాల్లో పర్యటించి నష్టం అంచనా వేస్తున్నారు. రాగల 48 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని జాగ్రత్తలు చెబుతోంది. -
భారీ వర్షాలు.. ఆ జిల్లాల్లో రేపు విద్యాసంస్థలకు సెలవు
సాక్షి, కామారెడ్డి: భారీ వర్షాలు నేపథ్యంలో కామారెడ్డి, మెదక్ జిల్లాలో రేపు(గురువారం) విద్యా సంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. జిల్లాల్లోని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలలు కళాశాలల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని ఆ జిల్లాల కలెక్టర్లు ఒక ప్రకటనలో తెలిపారు. కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తున్నారు.ఎడతెరిపి లేకుండా వానలు కురవడంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. కామారెడ్డిలో రికార్డు స్థాయిలో 41 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో కొన్ని ప్రాంతాల్లో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. పలుచోట్ల ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కామారెడ్డి-నిజామాబాద్ మధ్య రైల్వే ట్రాక్ కొట్టుకుపోయింది.నిజాంసాగర్ మండలం గోర్గల్ గ్రామంలోకి మంజీర వరద నీళ్లు చేరుతున్నాయి. గ్రామ శివారులో వందల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. వర్షాలు, వరదలు తగ్గించాలంటూ వేడుకొంటూ గంగమ్మ తల్లికి గ్రామస్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శాంతించాలని కోరుతూ మంజీర నదిలో తెప్ప పడవను గ్రామస్తులు వదిలారు. -
హవేలి ఘన్పూర్లో విషాదం.. వరదలో కొట్టుకుపోయిన కారు
సాక్షి, మెదక్: జిల్లాలో వరద బీభత్సం సృష్టిస్తోంది. వరద ప్రవాహంలో కారు కొట్టుకుపోయింది. హవేలి ఘన్పూర్ మండలం నక్కవాగులో ఘటన జరిగింది. భారీ వర్షాలు కారణంగా నక్కవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. వద్దని స్థానికులు వారించినా పట్టించుకోని కారు డ్రైవర్.. అత్యుత్సాహంతో వరద ప్రవాహంలో కారు నడిపారు. దీంతో వాగులో కారు కొట్టుకుపోయింది. కారులో ఉన్నవారి వివరాల కోసం అధికారులు ఆరా తీస్తున్నారు.కాగా, హైదరాబాద్ సహా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఎడతెరిపిలేని వర్షం కురుస్తోంది. ఉమ్మడి మెదక్ జిల్లావ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. తాజాగా జిల్లాలోని ధూప్సింగ్ తండా జలమయమైంది. తండాను వరద నీరు ముంచెత్తడంతో ఇళ్లలోకి నీరు చేరుకుంది. జల దిగ్భంధంలో తండా ఉండటంతో తమ కాపాడాలంటూ స్థానికులు బిల్డింగ్పైకి ఆర్తనాదాలు చేస్తున్నారు.మరోవైపు.. అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. రాబోయే 2 గంటల్లో 8 జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తాయని తెలిపింది. -
మెదక్ జిల్లాలో కుంభవృష్టి.. బిల్డింగ్ ఎక్కి కాపాడాలంటూ ఆర్తనాదాలు..
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ సహా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఎడతెరిపిలేని వర్షం కురుస్తోంది. ఉమ్మడి మెదక్ జిల్లావ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. తాజాగా జిల్లాలోని ధూప్సింగ్ తండా జలమయమైంది. తండాను వరద నీరు ముంచెత్తడంతో ఇళ్లలోకి నీరు చేరుకుంది. జల దిగ్భందంలో తండా ఉండటంతో తమ కాపాడాలంటూ స్థానికులు బిల్డింగ్పైకి ఆర్తనాదాలు చేస్తున్నారు. మరోవైపు.. అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. రాబోయే 2 గంటల్లో 8 జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తాయని తెలిపింది.🚨 EXTREME RAIN ALERT 🚨Kamareddy & Medak hit by 400+ mm rain in 12 hrs. Historic flooding risk ⚠️ More 100+ mm expected.📍 Danger zones: Kamareddy, Medak, Siddipet (next 4 hrs).👉 Stay indoors, avoid travel, follow admin alerts.#Telangana #FloodAlert #BreakingNews #rains pic.twitter.com/cM2UDeLieG— weatherman telugu (@RamRam888943524) August 27, 2025తెలంగాణలోని పలు జిల్లాలో మంగళవారం నుంచి ఎడతెరిపిలేని వర్షం కురుస్తోంది. హైదరాబాద్లోని మాదాపూర్, కొండాపూర్, రాయదుర్గం, జూబ్లీహిల్స్, అమీర్పేట, నాంపల్లి, దిల్సుఖ్నగర్, ఎల్బీనగర్, హయత్నగర్, మేడ్చల్, శామీర్పేట్, నగరంలోని లింగంపల్లి, మియాపూర్, గచ్చిబౌలి, తదితర ప్రాంతాల్లో మంగళవారం రాత్రి నుంచి వర్షం కురుస్తోంది.Telangana should be on High Alert 🚨 Argonda village in Kamareddy district recorded *287.8 mm* of rainfall in just four hours. Several other locations across the districts of Medak, Kamareddy, Siddipet, Sircilla, and Sangareddy also experienced heavy to extremely heavy… pic.twitter.com/Bp0SPfE24L— Naveen Reddy (@navin_ankampali) August 27, 2025ఉమ్మడి మెదక్లో కుండపోత.. మెదక్ జిల్లా టెక్మాల్లో అత్యధికంగా 19.1 సెం.మీ వర్షపాతం నమోదైంది. కామారెడ్డి జిల్లా నిజాంసాగర్లో 18 సెం.మీ, సంగారెడ్డి జిల్లా నిజాంపేట్లో 16.48 సెం.మీ, యాదాద్రి జిల్లా భువనగిరిలో 14.93 సెం.మీ, మహబూబ్నగర్లోని భూత్పూర్లో 9 సెం.మీ వర్షపాతం నమోదైంది. సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్, మిరుదొడ్డి, తొగుట, దుబ్బాక, దౌల్తాబాద్లో వర్షం కురుస్తోంది. ఉమ్మడి మెదక్ జిల్లాకు వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. మంజీరా నదికి భారీగా వరద రాబోతుందని అంచనా వేసింది.Flash floods 🌊🚨 in #TelanganaDue to very heavy rains lashed in Medak district more than 250mm rains last 12 hours record floods in Ramayampet 🌊🌊 pic.twitter.com/RPqeECAv3h— Warangal Weatherman (@tharun25_t) August 27, 2025ఉమ్మడి నల్గొండ జిల్లావ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. నల్గొండ, సూర్యాపేట, భువనగిరి, యాదగిరిగుట్ట, ఆలేరు, రాజపేట, మోటకొండూర్, తుర్కపల్లి, బొమ్మలరామారంలో వర్షం కురుస్తోంది. భువనగిరి మండలం నందనంలో భారీ వర్షం కురిసింది. సింగిరెడ్డిగూడెం రైల్వే అండర్ పాస్ బ్రిడ్జి వద్ద వర్షపు నీరు నిలిచింది.వికారాబాద్ జిల్లాలో మంగళవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేని వర్షం కురుస్తోంది. కోట్పల్లి ప్రాజెక్టు అలుగు పారడంతో భారీగా వరద ప్రవహిస్తోంది. దీంతో చుట్టుపక్కల గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కామారెడ్డి జిల్లాలో పలుచోట్ల వర్షం కురుస్తోంది. దోమకొండ, బీబీపేట, మాచారెడ్డి, బిక్కనూర్, పాల్వంచ, పిట్లం, నిజాంసాగర్, భిక్కనూరు, లింగంపేటలో వర్షం కురుస్తోంది. ఎల్లారెడ్డి మండలం లక్ష్మాపూర్ వద్ద కల్వర్టు తెగింది. దీంతో రోడ్డు దెబ్బతిని ట్రాఫిక్ స్తంభించిపోయింది.వాతావరణ శాఖ అలర్ట్.. హైదరాబాద్, కామారెడ్డి, మెదక్, మేడ్చల్, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్ధిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మిగతా 24 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆయా జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు ఇళ్లల్లో సురక్షితంగా ఉండాలని, ముఖ్యంగా పిల్లలు వినాయక మంటపాలకు వెళ్లేటపుడు తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలని అధికారులు సూచించారు. గణేష్ నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో లైటింగ్ సెట్లు, విద్యుత్ తీగలకు దూరంగా ఉండాలని హెచ్చరించారు. -
రోడ్డెక్కిన రైతన్న
నర్సాపూర్: యూరియా కోసం రైతులకు తిప్పలు తప్పడం లేదు. రాత్రనక.. పగలనక వారు పడుతున్న ఇబ్బందులు వర్ణానాతీతం. యూరియా కోసం స్థానిక ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్దకు మంగళవారం ఉదయమే ఆయా గ్రామాల రైతులు చేరుకున్నారు. తీరా యూరియా రాదని తెలియడంతో కోపోద్రిక్తులై రోడ్డెక్కారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో అన్ని మార్గాల్లో వాహనాలు నిలిచిపోయాయి. చౌరస్తా మీదుగా శివ్వంపేట మండలానికి వెళుతున్న ఎమ్మెల్యే సునీతారెడ్డి.. రైతులకు మద్దతుగా రోడ్డుపై బైఠాయించారు. ఎమ్మెల్యేతో పాటు బీఆర్ఎస్, బీజేపీ నాయకులు సైతం రైతులకు మద్దతుగా నిలిచారు. తహసీల్దార్ శ్రీనివాస్ వచ్చి రాస్తారోకో విరమించాలని కోరగా.. ఎమ్మెల్యే సునీతారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. యూరియా కొరత లేదని ప్రకటించిన విషయాన్ని ఆమె గుర్తు చేస్తూ నిలదీశారు. కాగా తూప్రాన్ డీఎస్పీ నరేందర్గౌడ్, స్థానిక సీఐ జాన్రెడ్డి, ఎస్ఐ లింగం సముదాయించడానికి చేసిన ప్రయత్నం విఫలమైంది. దీంతో పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్కు తరలించారు. రైతుల గోస పట్టదా..? రాష్ట్రంలో నికృష్ట పాలన కొనసాగుతోందని, రైతుల గోస పట్టడంలేదని ఎమ్మెల్యే సునీతారెడ్డి మండిపడ్డారు. మంగళవారం యూరియా కోసం జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టిన రైతులకు సంఘీభావం తెలిపారు. వారితో పాటు రోడ్డుపై బైఠాయించారు. ఆమెను పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించగా అక్కడ విలేకరులతో మాట్లా డారు. యూరియా కావాలని అడిగితే అరెస్టులు చేయడం తగదన్నారు. గత ప్రభుత్వ హయాంలో రైతుల అవసరం మేరకు కేసీఆర్ యూరియా సరఫరా చేశారని గుర్తు చేశారు. యూరియా సరఫరాలో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు. పాస్బుక్కులు, ఆధార్కార్డుల జిరాక్స్లు క్యూలో పెట్టి రోజుల తరబడి నిరీక్షిస్తున్నా ఎవరూ పట్టించుకోవడంలేదని మండిపడ్డారు. కొందరు యూరియాను బ్లాక్ మార్కెట్కు తరలించి అధిక ధరలకు అమ్ముతూ రైతులను మోసం చేస్తున్నారని ఆరోపించారు. ప్రతి మండలానికి మూడు లారీల యూరియాను వెంటనే సరఫరా చేయాలని ఆమె డిమాండ్ చేశారు. రైతుల సమస్యలు పరిష్కారమయ్యే వరకు వారికి అండగా ఉంటామన్నారు.యూరియా కోసం రాస్తారోకో సంఘీభావం తెలిపిన ఎమ్మెల్యే స్తంభించిన వాహనాల రాకపోకలు రాష్ట్రంలో నికృష్ట పాలన: సునీతారెడ్డి -
కళకళ
విలవిలకౌడిపల్లి(నర్సాపూర్): మండల కేంద్రంలోని పెద్దచెరువు, ధర్మాసాగర్ పటేల్ చెరువు కింద ఆయకట్టు వరి పంట పచ్చని రంగులతో కళకళలాడుతుంది. మండల వ్యాప్తంగా సుమారు వేల ఎకరాల్లో వరి సాగు చేయడంతో ఎటు చూసినా పచ్చని పొలాలతో కనువిందు చేస్తున్నాయి. ఇటీవల కురిసిన వర్షానికి చెరువు కుంటలు నిండటంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.హవేళిఘణాపూర్(మెదక్): మండల పరిధిలోని కూచన్పల్లి, సర్దన మంజీరా పరివాహక ప్రాంతంలో పంటలు నీట మునిగాయి. దీంతో పెట్టిన పెట్టుబడితో పాటు పంట నష్టపోయామని, ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. దాదాపు 30 ఎకరాల్లో సాగు చేసిన వరి పంటలు మంజీరా వరద ఉధృతితో మునిగిపోయాయన్నారు. దీంతో పూర్తిగా వరి కుళ్లి తీవ్ర నష్టం వాటిల్లిందని వాపోయారు. ప్రభుత్వం స్పందించి నష్టపరిహారం చెల్లించాలని రైతులు డిమాండ్ చేశారు. -
చదువుతో పాటు క్రీడలు ముఖ్యం
డీఈఓ రాధాకిషన్ పెద్దశంకరంపేట(మెదక్): విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు కూడా ముఖ్యమని డీఈఓ రాధాకాషన్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ పోటీల ముగింపు కార్యక్రమానికి హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గెలుపొందిన క్రీడాకారులకు జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ వెంకటేశం, హెచ్ఎంలు శేఖర్, శిరీష, శ్రీనివాస్, మారుతి, కుమార్, ప్రసన్నకుమార్, గోపి, నందయ్యగారి శ్రీను, ఆనంద్, అశోక్రెడ్డి తదితరులున్నారు. మహిళల ఆర్థికాభివృద్ధే లక్ష్యండీపీఎం మల్లేశం చిలప్చెడ్(నర్సాపూర్): గ్రామీణ మహిళల ఆర్థికాభివృద్ధే లక్ష్యమని డీపీఎం మల్లేశం అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని మహిళా సమాఖ్య కార్యాలయంలో 8వ వార్షిక మహాసభలో ఆయన మాట్లాడారు. మండలంలో మహిళా సమాఖ్య 387 గ్రూపులతో కొనసాగుతుందన్నారు. ప్రస్తుతం మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని, వారికి మరింత ప్రోత్సాహం అందిస్తే ఏదైనా సాధిస్తారన్నారు. మహిళల్లో పోటీతత్వం పెరిగిందన్నారు. బదిలీపై వెళ్లిన ఐకేపీ సిబ్బంది ప్రేమలత దంపతులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో డీపీఎం యాదయ్య, శ్రీనిధి ఆర్ఎం గంగారం, అసిస్టెంట్ మేనేజర్ పరమేశ్వరి, ఐపీఎం గౌరిశంకర్, మండల సమాఖ్య అధ్యక్షురాలు మమత, కార్యదర్శి మాధురి, కోశాధికారి అంజలి, సీసీలు పురుషోత్తం, వరలక్ష్మి, నర్మద, వెంకటలక్ష్మి, మహిళలు తదితరులు పాల్గొన్నారు. నేరుగా కాస్మొటిక్ చార్జీలుబీసీ సంక్షేమ అధికారి జగదీష్ మెదక్ కలెక్టరేట్: విద్యార్థులకు అందించాల్సిన కాస్మొటిక్ చార్జీలను ప్రతినెలా వారి ఖాతాల్లోనే జమ చేస్తున్నట్లు బీసీ సంక్షేమ శాఖ అధికారి జగదీష్ తెలిపారు. ఫ్రీ మెట్రిక్–17, పోస్ట్ మెట్రిక్–4 కలిపి మొత్తం 21 బీసీ సంక్షేమ హాస్టళ్లు ఉన్నాయన్నారు. పోస్ట్ మెట్రిక్ హాస్టళ్లు మెదక్–2, నర్సాపూర్లో 2 ఉండగా.. 517 మంది విద్యార్థులు ఉన్నారన్నారు. అలాగే బాలికలు–4, బాలురు–13 చొప్పున మొత్తం 17 ఫ్రీమెట్రిక్ హాస్టళ్లు ఉండగా.. 1,467 మంది విద్యార్థులు ఉన్నట్లు తెలిపారు. ఫ్రీమెట్రిక్ విద్యార్థులకు నెలకు రూ.175, ఫోస్ట్ మెట్రిక్ విద్యార్థులకు నెలకు రూ.200, బాలికలకు అదనంగా మరో రూ.75 జమవుతుందన్నారు. అలాగే ఫ్రీమెట్రిక్ విద్యార్థులకు నెలకు రూ.1,430, ఫోస్ట్ మెట్రిక్ విద్యార్థులకు రూ.1,540ల చొప్పున మెస్ చార్జీలు అందజేస్తున్నట్లు చెప్పారు. ఎస్జీటీ పోస్టులు భర్తీ చేయాలిపీఆర్టీయూటీఎస్ అసోసియేట్ అధ్యక్షుడు మల్లారెడ్డి మెదక్ కలెక్టరేట్: టీచర్ల ప్రమోషన్స్ ప్రక్రియతో భారీగా ఎస్జీటీ పోస్టులు ఖాళీ అయ్యాయని, వెంటనే డీఎస్సీ ప్రకటించి భర్తీ చేయాలని పీఆర్టీయూటీఎస్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు మల్లారెడ్డి డిమాండ్ చేశారు. స్కూల్ అసిస్టెంట్ ఎల్ఎఫ్ఎల్ ప్రమోషన్ల ప్రక్రియతో మెదక్ జిల్లాలో సుమారుగా 200 పోస్టులు ఖాళీ అయినట్లు పేర్కొన్నారు. అలాగే ప్రాథమిక పాఠశాలలో ఉన్న ఉపాధ్యాయుల కొరతను డీఎస్సీ ద్వారా భర్తీ చేయాలన్నారు. ప్రమోషన్స్ ద్వారా కొత్త ఖాళీలు ఏర్పడటంతో సర్దుబాటు చేసే అవకాశం లేకుండా పోయిందన్నారు. విద్యార్థుల ప్రవేశాలు పెరిగిన నేపథ్యంలో తక్షణమే డీఎస్సీపై నిర్ణయం తీసుకోవాలని కోరారు. -
నిబంధనలు పాటించాలి
మెదక్ మున్సిపాలిటీ: వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా ఉత్సవ కమిటీలు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు సూచించారు. మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నెలవారీ నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా నేరాల పరిస్థితి, శాంతిభద్రతల పర్యవేక్షణ, పెండింగ్ కేసుల పరిష్కారం వంటి అంశాలపై సమీక్షించారు. పోలీసు అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. గణేష్ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని శాంతిభద్రతల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఎస్పీ ఆదేశించారు. మండపాల వద్ద రాత్రి 10 గంటల తర్వాత లౌడ్ స్పీకర్లు వాడకూడదని, నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. విగ్రహాల ప్రతిష్ఠాపన నుంచి నిమజ్జనం వరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. నిమజ్జన ప్రాంతాల్లో భద్రతా ఏర్పాట్లు పూర్తి చేసి, ఉత్సవ కమిటీలతో సమన్వయం చేసుకుంటూ ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. గ్రేవ్ కేసులు వేగంగా, నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలని ఆదేశించారు. ఆధునిక సాంకేతిక పద్ధతులు ముఖ్యంగా మహిళలు, పిల్లలపై నేరాల దర్యాప్తు వేగవంతం చేసి, కోర్టుల్లో చార్జిషీట్లు సకాలంలో సమర్పించి కన్విక్షన్ రేట్ పెంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎస్సైలు, ఇనన్స్పెక్టర్లు తమ పరిధిలోని పోలీస్ స్టేషన్లను పరిశుభ్రంగా ఉంచాలని, కేసుల రికార్డులను సక్రమంగా నిర్వహించాలని ఆదేశించారు. నమోదైన అన్ని కేసులను సీసీటీఎన్ఎస్లో నమోదు చేయాలన్నారు. పెండింగ్లో ఉన్న కేసులను సమీక్షించి త్వరగా పరిష్కరించాలని, రౌడీ షీటర్లు, హిస్టరీ షీటర్లపై ప్రత్యేక నిఘా ఉంచాలని ఆదేశించారు. పాఠశాలలు, కళాశాలల్లో యాంటీ డ్రగ్ కమిటీలు ఏర్పాటు చేసి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, వాటి ద్వారా నేరాలను అరికట్టడం మరియు నేరస్తులను త్వరగా గుర్తించడం సాధ్యం అవుతుందన్నారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ మహేందర్, డీఎస్పీలు ప్రసన్న కుమార్ నరేందర్ గౌడ్ , సుభాష్ చంద్ర బోస్ తదితరులు పాల్గొన్నారు. డ్రగ్స్కు దూరంగా ఉంటాంనర్సాపూర్: డ్రగ్స్కు దూరంగా ఉండాలని జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాస్రావు విద్యార్థులకు హితవు పలికారు. మంగళవారం స్థానిక బీవీ రాజు ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థులకు డ్రగ్స్, సైబర్ క్రైం, ర్యాగింగ్ తదితర అంశాలపై ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ముఖ్యఅథితిగా పాల్గొని మాట్లాడారు. ఎస్పీ మాట్లాడుతూ.. డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాలతో ఆరోగ్యం పాడవడంతో పాటు కుటుంబమంతా సంక్షోభంలోకి వెళ్తుందన్నారు. సైబర్ నేరాలపై ప్రజలను చైతన్య వంతులను చేయాలని సూచించారు. తోటి విద్యార్థులను ర్యాగింగ్ చేయొద్దని సూచించారు. ర్యాగింగ్ చేస్తే కఠిన తీసుకుంటామని హెచ్చరించారు. ఈ క్రమంలో విద్యార్థులతో డ్రగ్స్, గంజాయికి దూరంగా ఉంటామని ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ మహేందర్, సైబర్ క్రైం డీఎస్పీ సుభాష్చంద్రబోస్, తూప్రాన్ డీఎస్పీ నరేందర్గౌడ్, స్థానిక సీఐ జాన్రెడ్డి, ఎస్ఐ లింగం, కాలేజీ ప్రతినిధులు పాల్గొన్నారు. రాత్రి 10 గంటల తర్వాత లౌడ్ స్పీకర్లు వాడకూడదు గణేశ్ మండపాల నిర్వాహకులకు ఎస్పీ శ్రీనివాసరావు సూచన ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరిక -
రూ.3 కోట్లకుపైగా బకాయిలు
మెదక్జోన్: రేషన్ బియ్యానికి సంబంధించిన కమీషన్ను ప్రభుత్వం డీలర్లకు ఇవ్వకపోవడంతో వారంతా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఐదు నెలలకు సంబంధించి డీలర్లకు రూ.3 కోట్లకు పైగా బకాయిలను ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. అయితే ఇప్పటివరకు రూపాయి కూడా విడుదల చేయకపోవడంతో రేషన్ దుకాణాలు నడపడంలోనూ, కుటుంబాలు పోషించుకోవడంలోనూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు. ఈ నెలాఖరుకల్లా కమీషన్ బకాయిలు చెల్లించకుంటే ఆందోళనబాట పడతామని డీలర్లు హెచ్చరిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 520 రేషన్ దుకాణాలు జిల్లావ్యాప్తంగా 520 రేషన్ దుకాణాలు ఉండగా ప్రతీ నెల 4,800 మెట్రిక్టన్నుల బియ్యాన్ని 490మంది డీలర్లు పంపిణీ చేస్తున్నారు. క్వింటాకు రూ.140 చొప్పున డీలర్కు కమీషన్ ఇస్తోంది. ఇందులో కేంద్రం రూ.90, రాష్ట్ర ప్రభుత్వం రూ.50 చొప్పున చెల్లిస్తున్నాయి. సకాలంలో కమీషన్ ఇవ్వకపోవడంతో రేషన్ దుకాణాల అద్దె, కరెంట్ బిల్లులు, స్కూల్ ఫీజులు కూడా చెల్లించలేని పరిస్థితి నెలకొందని డీలర్లు వాపోతున్నారు. రేషన్షాపులను డీలర్లు అద్దెకు తీసుకుని నిర్వహిస్తున్నారు. ప్రతీ నెల వీటికి అద్దె చెల్లించడంతోపాటు బియ్యం కోటా రాగానే వాహనాల్లోనుంచి బియ్యం దించేందుకు హమాలీలకు కూలీ చెల్లిస్తున్నారు. ఐదు నెలలుగా అందని కమీషన్ ఆందోళనబాటలో రేషన్ డీలర్లుగతంలో 9 రకాల సరుకులు గత బీఆర్ఎస్ ప్రభుత్వం కన్నా ముందు రేషన్షాపులకు బియ్యంతోపాటు కిరోసిన్, పప్పులు, పంచదార వంటి సరుకులను రేషన్ ఇచ్చేవారు. దీంతో సదరు డీలర్కు సైతం అన్ని రకాల వస్తువులపై కమీషన్ వచ్చేది. ప్రస్తుతం బియ్యం మాత్రమే సరఫరా చేస్తుండటంతో వచ్చే కమీషన్ కనీసం హమాలీల కూలీ కూడా రావడం లేదని వాపోతున్నారు. -
ముఖ గుర్తింపుతో పింఛన్లు
రామాయంపేట(మెదక్): పింఛన్ల పంపిణీలో అక్రమాలకు అడ్డుకట్ట పడనుంది. ఈ మేరకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుంది. ఇక నుంచి ముఖ గుర్తింపు (ఫేస్ రికగ్నైజేషన్ ) ఆధారంగా పింఛన్లు పంపిణీ చేయనున్నారు. దీంతో పంపిణీలో అక్రమాలు అరికట్టవచ్చని అధికారులు భావిస్తున్నారు. గత నెల నుంచే ఈ విధానంతో కొన్ని జిల్లాల్లో పింఛన్ల పంపిణీ ప్రారంభమైంది. మెదక్ జిల్లాలో సెప్టెంబర్ నుంచి మొదలు కానుంది. జిల్లాలో 1,11,808 పింఛన్దారులు ఉన్నారు. సింహ భాగం పింఛన్ల పంపిణీపోస్టాఫీసుల ద్వారానే జరుగుతుంది. ఈ మేరకు జిల్లాకు ప్రత్యేక సాఫ్ట్వేర్తో రూపొందించిన 111 సెల్ఫోన్లతోపాటు బయోమెట్రిక్ మిషన్లు, స్కానర్లు మంజూరయ్యాయి. వీటిని జిల్లా కేంద్రంలోని గ్రామీణాభివృద్ధి కార్యాలయంలో భద్రపర్చారు. వీటిని ఫోస్టాఫీసుల్లో పోస్టుమాస్టర్లకు అందజేయనున్నారు. వీటి సహాయంతో లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేయనున్నారు. జిల్లా పరిధిలో పింఛన్లను పోస్టాఫీసుల ద్వారానే లబ్ధిదారులకు అందిస్తుండగా, మిగతావి బ్యాంకు ఖాతాల్లో జమ అవుతున్నాయి. అంధులు, దివ్యాంగులు ఉంటే పంచాయతీ కార్యదర్శుల ద్వారానే వారికి పింఛన్లు అందనున్నాయి. అవినీతికి చెక్ పెట్టేందుకే.. జిల్లా కేంద్రానికి చేరిన సెల్ఫోన్లు, స్కానర్లుఇది మంచి పరిణామం ముఖ గుర్తింపు ద్వారా పింఛన్ల పంపిణీ మంచి పద్ధతి. దీంతో లబ్ధిదారుల కష్టాలు తీరునున్నాయి. ముఖ గుర్తింపుతో డబ్బులు నేరుగా అందుతాయి. అంధులుంటే పంచాయతీ కార్యదర్శుల సహాయంతో వారికి అందేలా ఏర్పాటు చేస్తున్నాం. – శ్రీనివాసు, డీఆర్డీవో, మెదక్ -
మట్టి ప్రతిమలు ప్రతిష్ఠించాలి
మెదక్ కలెక్టరేట్: వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఉత్సవ కమిటీలు, భక్తులు మట్టి గణనాథులను ప్రతిష్ఠించి పర్యావరణాన్ని కాపాడాలని కలెక్టర్ రాహుల్రాజ్ కోరారు. మంగళవారం కలెక్టరేట్ ప్రాంగణంలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మట్టి వినాయక ప్రతిమలను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ కాలుష్య రహిత వినాయక ప్రతిమలను ప్రతిష్ఠించి.. సాంప్రదాయ బద్ధంగా పూజా కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు. ఏదైనా సమస్యలుంటే వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 1912 లేదా స్థానిక లైన్మెన్ను సంప్రదించాలని కోరారు. అప్రమత్తంగా ఉండండి రానున్న రెండు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ పేర్కొన్నారు. అనంతరం జాతీయ స్థాయిలో కరాటే పోటీల్లో ప్రతిభ కనబర్చిన నితన్యసిరిని ఆయన అభినందించారు. పోస్టల్ సిబ్బంది ద్వారా పెన్షన్లు పంపిణీ కోసం మంజూరైన 111 సెల్ఫోన్లు, వేలిముద్ర యంత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్, జెడ్పీ సీఈఓ ఎల్లయ్య, బీసీ సంక్షేమ అధికారి జగదీష్ పాల్గొన్నారు. పకడ్బందీగా జ్వర సర్వే పాపన్నపేట(మెదక్): సీజనల్ వ్యాధుల పట్ల వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ రాహుల్రాజ్ ఆదేశించారు. మంగళవారం పాపన్నపేటలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి రికార్డులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. జ్వర సర్వే పకడ్బందీగా నిర్వహించాలని చెప్పారు. ప్రజారోగ్య పరిరక్షణ ధ్యేయంగా జిల్లాలోని ఆసుపత్రులు పనిచేయాలని కలెక్టర్ సూచించారు. సమయపాలన పాటిస్తూ రోగలకు సరైన వైద్యసేవలు అందజేయాలని చెప్పారు. కలెక్టర్ రాహుల్రాజ్ 2 వేల గణేశ్ ప్రతిమల పంపిణీ -
ఉమ్మడి జిల్లాలో 74 అంబులెన్సులు
ప్రోగ్రాం మేనేజర్ షేక్ జాన్ షాహిద్ మెదక్ మున్సిపాలిటీ: జీవీకే ఈఎంఆర్ఐ గ్రీన్ హెల్త్ సర్వీసెస్ ఆధ్వర్యంలో ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా 74 అంబులెన్స్లు (108 వాహనాలు) సేవలందిస్తున్నట్లు ప్రోగ్రాం మేనేజర్ షేక్ జాన్ షాహిద్ తెలిపారు. మొత్తం 170 మంది సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారని చెప్పారు. వీరికి ఆరు నెలలకోసారి శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. దీంతో వైద్య పద్ధతులపై శిక్షణ, మెలకువలు మాతా శిశు మరణాల రేటును తగ్గుతాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో మెదక్ జిల్లాలో మంజేర్ కిరణ్ కుమార్ పాల్గొన్నారు. సంగారెడ్డి టౌన్: మద్యం దుకాణాల టెండర్లలో కల్లు గీత కార్మికులకు 25% కేటాయించాలని ఆ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు ఆశన్నగౌడ్ డిమాండ్ చేశారు. సంగారెడ్డి పట్టణంలో కల్లుగీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. మద్యం దుకాణాల టెండర్ల వల్ల గీత కార్మికుల ఉపాధి కోల్పోతున్నారని 15% రిజర్వేషన్ జీవో నంబర్ 93ను సవరించి ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం 25% పెంచి కల్లుగీత సొసైటీలకు అందజేయాలని కోరారు. -
మహిళా సంఘాలు మార్కెటింగ్ చేయాలి
చేగుంట(తూప్రాన్): మహిళా సంఘాలు గ్రూపుగా ఏర్పడి మార్కెటింగ్ చేయాలని డీఆర్డీఏ అసిస్టెంట్ పీడీ సరస్వతి అన్నారు. చేగుంట ఐకేపీ కార్యాలయంలో 17వ వార్షిక సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహిళా సంఘాల సభ్యులు గ్రూపుగా ఏర్పడి పిండిమర, హోటల్, ఫుడ్ప్రాసెసింగ్, కోళ్ల పెంపకం వంటి యూనిట్లు ఏర్పాటు చేసుకొని వ్యాపారాలు నిర్వహించాలని తెలిపారు. జిల్లాలోని కొన్ని సంఘాల సభ్యులు గ్రూపు వ్యాపారాలను నిర్వహించి నెలకు రూ.50 వేల సంపాదిస్తున్నారని చెప్పారు. గ్రామాల్లోని అన్ని రకాల వయస్సు మహిళలతో సంఘాలను ఏర్పాటు చేసుకునేందుకు గ్రామ, మండల సంఘాలు పని చేయాలని సూచించారు. కార్యక్రమంలో డీపీఎం లాలు, ఏపీఎం దుర్గాప్రసాద్, ఎంపీడీఓ చిన్నారెడ్డి, సీసీలు స్వామి, అంజ్య, స్వేత సిబ్బంది పాల్గొన్నారు. సమైక్య సంఘాలను బలోపేతం చేయాలితూప్రాన్: గ్రామాల్లో సమైక్య సంఘాలను బలోపేతం చేయాలని డీఆర్డీఏ అసిస్టెంట్ పీడీ సరస్వతి పేర్కొన్నారు. మంగళవారం మండలం మహిళా సమైక్య 21వ వార్షిక మహాసభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సంఘాలు లేని వారిని సంఘంలో చేర్చుట, వృద్ధుల సంఘాలు, వికలాంగుల సంఘాలు, కిశోర బాలికల సంఘాలు ప్రతి గ్రామంలో ఏర్పాటు చేయాలని సూచించారు. ఆర్థికంగా ప్రతి మహిళ అభివృద్ధి చెందేలా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను వివరించారు. ఆ దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం వెంకటేశ్వర్లు, మండల సమైక్య అధ్యక్షురాలు రోజా, కోశాధికారి నర్మదా పాల్గొన్నారు.డీఆర్డీఏ అసిస్టెంట్ పీడీ సరస్వతి ఆదేశం -
ప్రజావాణి అర్జీలకు ప్రాధాన్యం
మెదక్ కలెక్టరేట్: ప్రజావాణి అర్జీలకు అధిక ప్రాధాన్యం ఇస్తూ తక్షణ పరిష్కారం చూపాలని కలెక్టర్ రాహుల్రాజ్ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి విన తులు స్వీకరించారు. మొత్తం 96 అర్జీలు రాగా, భూ సమస్యలపై అత్యధికంగా వచ్చాయి. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేశ్, డీఆర్డీఓ పీడీ శ్రీనివాసరావు, డీఆర్ఓ భుజంగరావు, జెడ్పీ సీఈఓ ఎల్లయ్యతో పాటు ఆయాశాఖల జిల్లా అధికారు లు పాల్గొన్నారు. అనంతరం జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. కారుణ్య నియామకాల భర్తీకి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఉపాధి హామీ పథకం కింద మంజూరైన 41 నూ తన అంగన్వాడీ భవన సముదాయాల నిర్మాణ ప్రక్రియను త్వరితగతిన ప్రారంభించేలా చూడాలన్నారు. మిషన్ వాత్సల్య కింద నిర్మాణం చేపట్టిన బాలల సదనం త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. కలెక్టర్ రాహుల్రాజ్ -
దరఖాస్తు చేసుకుంటే కనెక్షన్
మెదక్ కలెక్టరేట్: వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలను ప్రజలు సంతోషంగా జరుపుకోవాలని, ఉత్సవ కమిటీలు మండపాల వద్ద ఎలాంటి విద్యుత్ ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు పాటించాలని విద్యుత్శాఖ ఎస్ఈ నారాయణనాయక్ తెలిపారు. వినాయక విగ్రహాల ఊరేగింపు నేపథ్యంలో సోమవారం పట్టణంలోని విద్యుత్ స్తంభాలకు 15 ఫీట్ల కంటే తక్కువ ఎత్తులో ఉన్న కేబుల్ వైర్లను తొలగించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉత్సవ కమిటీలు విద్యుత్ కనెక్షన్ కోసం తప్పనిసరిగా ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని సూచించారు. విద్యుత్ లోడ్ లైటింగ్, సౌండ్ సిస్టమ్, అలంకరణ వివరాలు దరఖాస్తులో స్పష్టంగా ఇవ్వాలన్నారు. అనధికార కనెక్షన్లు తీసుకోవద్దని, తామే ఉచితంగా పోల్ నుంచి కనెక్షన్ ఇస్తామని తెలిపారు. మండపాల వద్ద ఏబీ స్విచ్లు, ఎర్తింగ్ ఏర్పాటు చేసుకుంటూ పూర్తి బాధ్యత తీసుకుంటూ కమిటీలు హామీ ఇవ్వాలన్నారు. అగ్నిమాపక పరికరాలు, ఇసుక బకెట్లు అందుబాటులో ఉంచాలని సూచించారు. ఎమర్జెన్సీ కాంటాక్ట్ నంబర్లు సైతం ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఎస్ఈ నారాయణనాయక్ ఉత్సవ కమిటీలు జాగ్రత్తలు పాటించాలని సూచన -
విద్యుత్ కోతలపై రైతన్న ఆగ్రహం
రేగోడ్(మెదక్): వ్యవసాయానికి సక్రమంగా విద్యుత్ సరఫరా చేయడం లేదంటూ మండల కేంద్రంలోని సబ్స్టేషన్ను సోమవారం రైతులు ముట్టడించారు. ఈసందర్భంగా చౌదర్పల్లి, కొత్వాన్పల్లి, మర్పల్లి గ్రామాలకు చెందిన రైతులు మాట్లాడుతూ.. కరెంట్ ఎప్పుడు ఉంటుందో.. ఎప్పుడు పోతుందో తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కరెంట్ కోసం రాత్రి సమయంలో పొలాల వద్దే ఉంటూ అవస్థలు పడాల్సిన దుస్థితి ఏర్పడిందని వాపోయారు. 15 రోజులుగా మోటార్లు కాలిపోతూ ఆర్థికంగా నష్టపోతున్నామన్నారు. 18 గంటల పాటు నిరంతరాయంగా త్రీఫేజ్ కరెంట్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ పోచయ్య ఏఈకి సమస్యను వివరించి రైతులను శాంతింపచేశారు. ఇదే విషయమై ట్రాన్స్కో ఏఈ యాసిన్అలీ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆదేశాలతోనే కరెంట్ సరఫరా చేస్తున్నామని, రైతుల సమస్యను ఉన్నతాధికారులకు తెలియజెస్తామని పేర్కొన్నారు. -
అవే బారులు.. అవే బాధలు
రామాయంపేట(మెదక్)/చిలప్చెడ్(నర్సాపూర్)/శివ్వంపేట/చేగుంట(తూప్రాన్): జిల్లాలో యూరి యా కోసం రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. నిద్ర లేచింది మొదలు అన్ని పనులు మానుకొని బారులు తీరుతున్నారు. టోకెన్ల కోసం నిరసనలు, తోపులాటకు దిగుతున్నారు. వందలాది మంది సహకార సంఘాల వద్ద బారులు తీరుతూ పాస్ పుస్తకాలు, పాదరక్షలను వరుసలో ఉంచుతున్నారు. వస్తున్న కొద్దిపాటి స్టాక్ను వ్యవసాయశాఖ అధికారులు పోలీసుల సహాయంతో రైతులకు పంపిణీ చేస్తున్నారు. దొరకని వారు అక్కడక్కడ రోడ్లపై ఆందోళనలు నిర్వహిస్తున్నారు. పొద్దంతా పడిగాపులు కాస్తే తమకు ఒక్క సంచి కూడా లభించడం లేదని వాపోతున్నారు. నర్సాపూర్, రామాయంపేట, శివ్వంపేట, కౌడిపల్లి, చిన్నశంకరంపేట, చిలప్చెడ్, చేగుంటలోని రైతు వేదిక వద్ద ఉదయం నుంచే వందలాది మంది రైతులు పాస్ పుస్తకాలతో బారులు తీరారు. ఓపిక నశించిన పలువురు నర్సాపూర్, రామాయంపేట మండలం కోనాపూర్లో రోడ్డుపై ఆందోళన నిర్వహించారు. పెద్ద సంఖ్యలో రైతులు రోడ్డుపైకి చేరుకొని నిరసన వ్యక్తం చేయడంతో పోలీసులు కల్పించుకొని వారికి నచ్చజెప్పి ఆందోళన విరమింపజేశారు. రామాయంపేటలోని ఆగ్రో రైతు సేవా కేంద్రంలో యూ రియా బస్తాలకు బదులుగా ఇతర మందులు లింక్ చేసి అమ్మడంతో రైతుల ఫిర్యాదు మేరకు వ్యవసాయ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఇటీవల రామాయంపేటలో మాజీ ఎమ్మెల్యే పద్మారెడ్డి ఆగ్రో సేవా కేంద్రం ఎదుట రైతులతో కలిసి ఆందోళన నిర్వహించారు. దుకాణంలో దాచి ఉంచిన యూరియా బస్తాలను అధికారుల సమక్షంలో రైతులకు పంచారు. తాజాగా సోమవారం సహకార సంఘానికి 900 వందల యూరియా బస్తాలు రాగా, తెల్లవారుజామునే వేలాది రైతులు తరలివచ్చారు. జిల్లా వ్యవసాయ అధికారి దేవ్కుమార్ ‘సాక్షి’తో మాట్లాడుతూ.. ఈనెలాఖరులోగా స్టాక్ వస్తుందని, రైతులు ముందస్తుగా యూరియా తీసుకొని స్టాక్ పెట్టుకోవద్దని సూచించారు.యూరియా కోసం అన్నదాతల పడిగాపులు పలుచోట్ల ఆందోళనలు, తోపులాటలు -
లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోండి
జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి శుభవల్లి మెదక్జోన్: వచ్చే నెల 13న నిర్వహించే జాతీ య లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఆర్ఎం శుభవల్లి కోరారు. సోమవారం మెదక్ కోర్టు ఆవరణలో ఆమె మాట్లాడారు. లోక్ అదాలత్లో సివిల్, క్రిమినల్, ఇన్సూరెన్స్, బ్యాంకు, చిట్ఫండ్ తదితర కేసుల్లో కోర్టులు, పోలీస్స్టేషన్ల చుట్టూ తిరిగే కక్షిదారులు లోక్ అదాలత్లో రాజీ చేసుకుంటే ఇరుపక్షాలకు ఎంతో మేలు జరుగుతుందని పేర్కొన్నారు. విఘ్నేశ్వర రైతుల బాధలు ఆలకించవయ్యా..హవేళిఘణాపూర్(మెదక్): యూరియా కోసం రైతులు నరకయాతన పడుతుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మారెడ్డి ఆరోపించారు. సోమవారం మండల కేంద్రంలో రైతులకు అవసరమైన యూరియా తెప్పించేలా చూడు స్వామి అంటూ వినాయకుడికి విజ్ఞాపనపత్రం అందజేశారు. రైతుల కోసం ఎన్నో చేస్తామంటూ ప్రగల్భాలు పలికి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నాయకులు సాగుకు అవసరమైన యూరియాను సరఫరా చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ మల్లికార్జున్గౌడ్, బట్టి జగపతి, అంజాగౌడ్, కిష్టయ్య, మేకల సాయిలు, సతీశ్రావు, జీవన్రావు, గంగా నరేందర్, లక్ష్మీనారాయణ, కిషోర్, హన్మంత్, స్వామినాయక్, రంజిత్నాయక్ తదితరులు పాల్గొన్నారు. రేషన్ కమీషన్ వెంటనే విడుదల చేయండి నర్సాపూర్: ప్రభుత్వం ఐదు నెలలుగా రేషన్ కమీషన్ విడుదల చేయలేదని రేషన్ డీలర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు ఆనంద్కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈమేరకు సోమవారం తహసీల్దార్ శ్రీనివాస్కు వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభు త్వం నుంచి కమీషన్ రాకపోవడంతో తాము ఆర్థికపరమైన ఇబ్బందులు పడుతున్నామని వివరించారు. ఇప్పటికై నా తమను ఆదుకోవాలని కోరారు. కార్యక్రమంలో మండల డీలర్ల సంఘం అధ్యక్షుడు సుధాకర్, ప్రధాన కార్యదర్శి రవిగౌడ్, నాయకులు జయపాల్, ఫయిమోద్దీన్, నర్సింలు, గోవర్దన్రెడ్డి, సర్దార్, రాజు, వంకరయ్య, శ్రీశైలం, అశోక్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు. నానో యూరియాతో మేలు కౌడిపల్లి(నర్సాపూర్): రైతులు యూరియాకు బదులుగా నానో ద్రవరూప యూరియా వడటం వల్ల ఖర్చు తగ్గడంతో పాటు పంటకు ప్రయోజనం, అధిక దిగుబడి పొందవచ్చని డీఏఓ దేవ్కుమార్ తెలిపారు. సోమవారం మండలంలోని మహమ్మద్నగర్లో రైతులకు అవగాహన కల్పించారు. ఈసందర్భంగా డీఏఓ మాట్లాడుతూ.. నానో యూరియా కాలుష్యాన్ని తగ్గించి పర్యవరణాన్ని కాపాడుతుందన్నారు. కార్యక్రమంలో ఏడీఏ పుణ్యవతి, ఏఓ స్వప్న, ఏఈఓలు సాహితి, స్రవంతి, రైతులు పాల్గొన్నారు. వైద్య సేవలపై ఆరా హవేళిఘణాపూర్(మెదక్): మండల పరిధిలోని సర్ధన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డీఎంహెచ్ఓ శ్రీరామ్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా రోగులకు అందిస్తున్న వైద్య సేవలు, పీహెచ్సీలో స్టాక్ ఉన్న మందుల వివరాలను గురించి అడిగి తెలుసుకున్నారు. అవసరమైన చోట వైద్య శిబిరం ఏర్పాటు చేసే విధంగా చూడాలన్నారు. డాక్టర్ వినయ్ను అభినందించారు. ఆయన వెంట పీహెచ్సీ వైద్య సిబ్బంది ఉన్నారు. -
అవసరమైన చోట ఫ్లైఓవర్లు
టేక్మాల్(మెదక్): జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదాలతో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని, అవసరమైన చోట అండర్పాస్లు, ఫ్లైఓవర్లు నిర్మిస్తామని మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. ఈమేరకు సోమవారం మండలంలోని బొడ్మట్పల్లి వద్ద సంగారెడ్డి– నాందేడ్ నేషనల్ హైవేపై అండర్పాస్ బ్రిడ్జి నిర్మాణం కోసం అధికారులతో కలిసి స్థల పరిశీలన చేశారు. ప్రమాదాల స్పాట్ లను స్వయంగా చూపించి, ఫై ఓవర్ల నిర్మాణ ఆవశ్యకతను ఎన్హెచ్ఏఐ అధికారులకు వివరించారు. దీంతో నిర్మాణానికి వారు అంగీకరించారు. గుండువాగు వర్షం నీరు గ్రామంలోకి రాకుండా పూడిక తీయాలని గ్రామస్తులు మంత్రికి వినతిపత్రం అందించారు. అనంతరం బొడ్మట్పల్లిలో పర్యటించి ఇటీవల వర్షాలకు జరిగిన నష్టాన్ని పరిశీలించారు. బాధితులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఆయన వెంట తహసీల్దార్ తులసీరాం, ఎంపీడీఓ రియాజొద్దీన్, ఆర్ఐ సాయి శ్రీకాంత్, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షు డు నిమ్మ రమేశ్, సీనియర్ నాయకులు మాన్కిషన్, యూసూఫ్, విష్ణువర్దర్రెడ్డి, మల్లారెడ్డి, సత్యనారాయణ, శ్రీధరాచారి, సత్యం ఉన్నారు.మంత్రి దామోదర రాజనర్సింహ -
జలసిరి.. సాగుకు ఊపిరి
చిన్నశంకరంపేట మండలంలో పచ్చని వరి పొలాలుఖరీఫ్ సీజన్ ప్రారంభంలో ముఖం చాటేసిన వరుణుడు.. చివరలో కరుణించాడు. గడిచిన రెండు నెలల్లో జిల్లాలో మైనస్ వర్షపాతం నమోదు కాగా, పంటల సాగు ఆశించిన మేర ముందుకు సాగలేదు. దీంతో అన్నదాతలు ఆందోళన చెందారు. ఈ నెలలో ఐదు రోజుల పాటు కురిసిన వర్షాలు పంటలకు ఊపిరిపోయగా, నీటి వనరులు నిండుకుండలా మారాయి. – మెదక్జోన్జిల్లాలో గడిచిన జూన్, జూలై మాసాల్లో అడపాదడపా కురిసిన వర్షం సాధారణం కంటే తక్కువగా నమోదు అయింది. దీంతో ఆరుతడి పంటలతో పాటు బోరుబావుల వద్ద మాత్రమే రైతులు వరి నాట్లు వేశారు. ఆశించిన మేర వ్యవసాయ పనులు సాగక అన్నదాతలు ఆందోళన చెందారు. నారు ముదిరిపోతుందని ఆవేదన చెందారు. ఈక్రమంలో ఈనెల 17 నుంచి 21 వరకు కేవలం ఐదు రోజుల పాటు జిల్లాలోని పలు మండలాల్లో వర్షం దంచికొట్టింది. దీంతో జిల్లాలోని 2,632 చెరువులు, కుంటలు నిండుకుండలా మారాయి. కొన్నిచోట్ల పంటలు నీట మునగగా, కొద్దికొద్దిగా తేరుకుంటున్నాయి. పంటలకు ఢోకా లేదిక ఇటీవల కురిసిన వర్షాలతో ఈ సీజన్తో పాటు రాబోయే రబీకి సైతం ఎలాంటి ఢోకా లేదని ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు. జిల్లాలో ఏకై క మధ్య తరగతి ప్రాజెక్టు ఘనపూర్తో పాటు హల్దీ, మంజీరా, రాయిపల్లి ప్రాజెక్టు, అతిపెద్ద చెరువు కొంటూర్, అంబాజీపేట లాంటి పెద్ద చెరువులు నిండుకుండలా మారాయి. జిల్లావ్యాప్తంగా 21 మండలాలు ఉండగా, 11 మండలాల్లో అధికంగా వర్షం కురిసింది. 5 మండలాల్లో అత్యధికంగా, మిగితా ఐదు మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైందని వాతావరణశాఖ లెక్కలు చెబుతున్నాయి. అత్యధిక వర్షపాతం నమోదు ఈఏడాది వర్షాకాలంలో జూన్, జూలైలో సాధారణం కన్నా 31 మిల్లీమీటర్ల వర్షపాతం తక్కువగా నమోదు అయింది. ఫలితంగా పంటల సాగుపై తీవ్ర ప్రభావం పడింది. ఈనెలలో రెండు వందలకు పైగా మిల్లీమీటర్ల వర్షం అధికంగా కురిసింది. ఫలితంగా పంటల సాగు ఊపందుకోగా, భూగర్భజలాలు సైతం గణనీయంగా పెరిగాయి. కొన్నిచోట్ల బోరుబావుల్లో నుంచి నీరు పైకి ఉబికిరావటంతో అన్నదాతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.జిల్లా వర్షపాతం వివరాలు (మి.మీ) నెల కురవాల్సింది కురిసింది జూన్ 112.4 81.7 జూలై 206.6 199.1ఆగస్టు 159.8 395.5కలిసొచ్చిన వర్షాలు నిండుకుండలా నీటి వనరులు జిల్లాలో 3.29 లక్షల ఎకరాలు సాగులోకి.. రెండు పంటలకు సమృద్ధిగా నీరు -
యూరియా సరఫరాలో విఫలం
శివ్వంపేట(నర్సాపూర్): రైతులకు యూరియా సరఫరా చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిందని ఎమ్మెల్యే సునీతారెడ్డి విమర్శించారు. ఆదివారం శివ్వంపేట సొసైటీలో యూరియా రావడంతో ఉదయం నుంచి రైతులు బారులు తీరారు. పోలీసుల పర్యవేక్షణలో పంపిణీ చేశారు. ఈసందర్భంగా రైతులతో కలిసి ఎమ్మెల్యే ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు. కేసీఆర్ హయాంలో యూరియా కొరత లేదన్నారు. ఈ ప్రభుత్వం రైతులను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలం అయిందన్నారు. రైతులకు కనీసం యూరియా సైతం ఇవ్వడం చేతకావడం లేదని విమర్శించారు. తక్షణం రైతులకు సరపడా యూరియాను సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ పబ్బ మహేశ్గుప్త, మాజీ ఎంపీపీ కల్లూరి హరికృష్ణ, మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రాగౌడ్, నాయకులు రమణగౌడ్, రమాకాంత్రెడ్డి, యాదాగౌడ్, శ్రీనివాస్గౌడ్, లక్ష్మీనరసయ్య తదితరులు పాల్గొన్నారు.ఎమ్మెల్యే సునీతారెడ్డి -
పల్లెలకు స్థానిక కళ
మెదక్ అర్బన్: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, బీసీ రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం మూడు, నాలుగు రోజుల్లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్న వార్తలతో పల్లెల్లో ఎన్నికల సందడి మొదలైంది. ఇప్పటికే ఆశావహులు తెరచాటు ప్రచారం ప్రారంభించారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీలతో పాటు సర్పంచ్గా పోటీ చేయాలనుకుంటున్న వారు ప్రజలతో మమేకమవుతున్నారు. ఉదయం నుంచి పల్లెల్లో పర్యటిస్తూ పలకరింపులతో ముందుకు సాగుతున్నారు. పల్లెల్లో స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చలు ప్రారంభమయ్యాయి. సెప్టెంబర్లోగా పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశించడంతో, ప్రభుత్వానికి కచ్చితంగా ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మొదట ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఆ తర్వాత పంచాయతీ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది. బరిలో నిలవాలనుకుంటున్న ఆశావహులు ఇప్పటికే యువ తను, కుల సంఘాల పెద్దలను మచ్చిక చేసుకునే పనుల్లో నిమగ్నమయ్యారు. ఎంత ఖర్చు చేయాలనే దానిపై లెక్కలు వెసుకుంటున్నారు. వినాయక చవితి సమీపిస్తుండటంతో భారీగా చందాలు ఇస్తున్నట్లు తెలుస్తోంది. మండపాల నిర్వాహకులను మచ్చిక చేసుకోవాలంటే ఖర్చుకు వెనకాడే పరిస్థితి లేదు. ఎవరికి వారు రిజర్వేషన్లు తమకు అనుకూలంగా వస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 5,24,471 మంది ఓటర్లు జిల్లాలో మొత్తం 5,24,471 మంది ఓటర్లుండగా, ఇందులో మహిళలు 2,72,143, పురుషులు 2,52,319, ఇతరులు 9 మంది ఉన్నారు. కాగా జెడ్పీటీసీ స్థానాలు 21, ఎంపీటీసీ 190, గ్రామ పంచాయతీలు 492, వార్డులు 4,220 ఉన్నాయి. గత పంచాయతీ ఎన్నికల అనంతరం జిల్లాలో ఒక మండలం కొత్తగా ఏర్పడింది. అలాగే 24 పంచాయతీలు ఆవిర్భవించాయి. వీటికి ఈసారి కొత్తగా సర్పంచ్లు ఎన్నిక కానున్నారు. సర్పంచ్ల పదవీ కాలం ఫిబ్రవరి 2024లో, ఎంపీటీసీ, జెడ్పీటీసీల పదవీకాలం జూలై 2024లో ముగిసింది. అప్పటి నుంచి స్పెషల్ ఆఫీసర్ల పాలన మొదలైంది. ప్రజాప్రతినిధులు లేకపోవడంతో గ్రామాల్లో పాలన కుంటుపడిందని, సమస్యలు రాజ్యమేలుతున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆదేశాలే ఆలస్యం.. స్థానిక ఎన్నికలు ఎప్పుడొచ్చినా నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. గత ఫిబ్రవరిలోనే ఎన్నికలు నిర్వహిస్తారన్న ప్రచారంతో అప్పట్లో ఎన్నికల నిర్వహణకు ప్రక్రియ ప్రారంభించారు. పంచాయతీల ఎన్నికలకు 2041 మంది ప్రిసైడింగ్ ఆఫీసర్లు, 3,738 మంది పోలింగ్ ఆఫీసర్లు అవసరమవుతారు. ఈ మేరకు ఏఆర్ఓలు, ఆర్ఓలకు శిక్షణ ఇచ్చారు. మొత్తం 4,220 పోలింగ్ స్టేషన్లను గుర్తించారు. ఎన్నికల సామగ్రి సైతం తెప్పించుకున్నారు. లోకల్ స్టేషనరీ కోసం టెండర్లు సైతం నిర్వహించారు. పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ప్రీ సింబల్ విధానం అమల్లో ఉన్నందున, బ్యాలెట్ పేపర్లు సైతం అందుబాటులో ఉంచుకున్నారు. గుజరాత్ నుంచి 1,020 బ్యాలెట్ బాక్స్లు తెప్పించారు. అర్హులైన వారందరికీ ఓటు హక్కు కల్పించేందుకు వార్డుల వారీగా టీపోల్ నమోదు కొనసాగిస్తున్నారు. కాగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు పార్టీ ప్రాతిపదికన కొనసాగుతున్నందున, బ్యాలెట్ పేపర్లు ప్రింట్ చేయించలేదని జెడ్పీ అధికారులు తెలిపారు.ఆశావహుల సందడి ఓటర్లకు పలకరింపులు, ఆర్థిక సహాయాలు రిజర్వేషన్లపై నేతల్లో ఉత్కంఠ ఎన్నికలకు సిద్ధం చేసిన అధికారులు