Medak
-
ధాన్యం సేకరణకు సన్నద్ధం
● ఏప్రిల్ మొదటి వారం నుంచి కొనుగోళ్లు ● జిల్లాలో 3.89 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి అంచనా ● పక్కాగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆదేశం దళారులకు విక్రయించొద్దు రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించి ప్రభుత్వ మద్దతు ధర పొందాలి. దళారులకు విక్రయిస్తే తూకంలో మోసంతో పాటు ధరలో వ్యత్యాసం ఉంటుంది. ఫలితంగా మోసపోయే పరిస్థితి ఏర్పడుతుంది. – జగదీష్కుమార్, సివిల్ సప్లై డీఎంమెదక్జోన్: ఆరుగాలం శ్రమించి రైతులు పండించిన ధాన్యాన్ని సేకరించేందుకు పౌర సరఫరాల శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఏప్రిల్ మొదటి వారంలో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించేందుకు సన్నద్ధమవుతున్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే ఆయాశాఖల అధికారులతో కలెక్టర్ రాహుల్రాజ్ సమావేశం నిర్వహించారు. ఎక్కడా ఇబ్బందులకు తావు లేకుండా కొనుగోళ్లు సక్రమంగా జరిగే విధంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. జిల్లాలో 2,46,136 ఎకరాల్లో వరి సాగు జిల్లావ్యాప్తంగా ఈ యాసంగి సీజన్లో 2,46,136 ఎకరాల్లో రైతులు వరి సాగు చేశారు. అందులో 2,02,550 ఎకరాల్లో దొడ్డు రకం, 43,586 ఎకరాల్లో సన్నాలను సాగు చేశారు. కాగా దొడ్డు రకం ధాన్యం దిగుబడి 4,75,624 మెట్రిక్ టన్నులు రానుందని అధికారులు అంచనా వేశారు. బయటి అవసరాలకు పోనూ కొనుగోలు కేంద్రాలకు 3,32,534 మెట్రిక్ టన్నులు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. అలాగే సన్నరకం ధాన్యం 91,760 మెట్రిక్ టన్నులు రాగా అందులో నుంచి 34,520 మెట్రిక్ టన్నులు ఇతర అవసరాలకు పోగా కొనుగోలు కేంద్రాలకు 57,240 మెట్రిక్ టన్నులు రావొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. 480 కొనుగోలు కేంద్రాలు జిల్లావ్యాప్తంగా 3.89 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం రానుందని, అందుకు గానూ 480 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు. వాటిలో 127 ఐకేపీ, 324 సహకార సంఘాలు (పీఏసీఎస్), డీసీఎంఎస్ 10, రైతు సంఘం (ఎఫ్పీఓ) పరిధిలో 19 కేంద్రాల చొప్పున మొత్తం 480 కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. అందులో 390 దొడ్డు ధాన్యం సేకరణకు కేటాయిస్తుండగా, సన్నధాన్యం సేకరణకు 90 కొనుగోలు కేంద్రాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నారు. కాగా గత 2023–24 యాసంగిలో 2.52 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించారు. ఈ లెక్కన గతేడాదితో పోలిస్తే ఈ యాసంగిలో 1,37,414 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని అధికంగా సేకరించనున్నట్లు అధికారులు చెబుతున్నారు. సన్నాలకు రూ. 500 బోనస్ కాంగ్రెస్ ప్రభుత్వం 2024 వానాకాలం సీజన్ నుంచి సన్నాలకు క్వింటాల్కు రూ. 500 అదనంగా బోనస్ అందజేస్తోంది. కాగా ఈ యాసంగిలో 43,586 ఎకరాల్లో రైతులు సన్న రకం ధాన్యం సాగు చేశారు. కొనుగోలు కేంద్రాలకు 57,240 మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. కాగా దొడ్డు రకం క్వింటాల్కు రూ. 2,320 కాగా, సన్నాలకు బోనస్తో కలుపుకుని క్వింటాల్ ధాన్యానికి రూ. 2,820 చొప్పున రైతుల ఖాతాల్లో జమ కానుంది. -
అందరికీ శుభాలు కలగాలి
హుస్నాబాద్: నూతన తెలుగు సంవత్సరాది నుంచి అందరికీ శుభాలు కలగాలని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆదివారం విశ్వావసు నామ సంవత్సర ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. పంచాంగ శ్రవణం కార్యక్రమంలో మంత్రి పొన్నం దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మున్సిపల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు. షడ్రుచుల పచ్చడి, బక్ష్యాలు పంపిణీ చేశారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ సమృద్ధిగా పాడి పంటలతో అందరూ సుఖంగా జీవించాలన్నారు. ప్ర జాపాలన ప్రభుత్వంలో ప్రజలందరికీ మేలు జరిగేలా భగవంతుడి ఆశీర్వాదం అందాలని కోరారు. ప్లాస్టిక్ను నివారిద్దాం.. ప్లాస్టిక్ను నివారిద్దామని, స్టీల్ గ్లాస్లు మేలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మున్సిపల్ కార్యాలయంలో ఆదివారం పట్టణంలోని హోటల్ యాజమానులకు స్టీల్ గ్లాస్లను పంపిణీ చేశారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ ప్లాస్టిక్ గ్లాస్లో చాయ్ తాగడం వల్ల అనారోగ్యాలకు గురవుతున్నామన్నారు. పట్టణంలో 50 హోటల్స్ ఉన్నాయని, ప్రతి హోటల్కు వంద గ్లాస్ల చొప్పున పంపిణీ చేశామన్నారు. ఉగాది వేడుకల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ -
దుర్గమ్మ సేవలో కలెక్టర్
పాపన్నపేట(మెదక్): ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని అదివారం కలెక్టర్ రాహుల్రాజ్, అదనపు కలెక్టర్ నగేష్ వేర్వేరుగా తమ కుటుంబ సభ్యులతో కలిసి దుర్గమ్మను దర్శించుకున్నారు. అర్చకులు ఆలయ మర్యాదల ప్రకారం వారికి స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు చేసి, తీర్థ ప్రసాదాలు అందజేసి సత్కరించారు. పాడి పంటలతో వర్థిల్లాలి శివ్వంపేట(నర్సాపూర్): విశ్వావసు నామ సంవత్సరంలో రైతులు, ప్రజలు పాడిపంటలు, సుఖ సంతోషాలతో వర్థిల్లాలని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి అన్నారు. అ దివారం ఉగాదిని ఆమె సొంత గ్రామం గోమారంలో కు టుంబ సభ్యులతో జరుపుకున్నారు. ఎమ్మెల్యే ప్రత్యేకంగా పచ్చడి తయారు చేసి పూజలు నిర్వహించారు. నియోజకవర్గంలోని నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యేను కలిసి ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. బండ్ల ఊరేగింపు నిజాంపేట(మెదక్): మండల పరిధిలోని చల్మెడలో మల్లన్న కమాన్ను మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు ఆదివారం ప్రారంభించారు. అనంతరం గ్రామంలో నిర్వహించిన బండ్ల ఊరేగింపులో పాల్గొన్నారు. ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, ప్రజలు పెద్దఎత్తున పాల్గొన్నారు. వెంకటేశ్వరశర్మకు ఉగాది విశిష్ట పురస్కారం శివ్వంపేట(నర్సాపూర్): మండల కేంద్రానికి చెందిన వేద పండితుడు, బగలాముఖీ ఉపాసకులు శాస్త్రుల వెంకటేశ్వరశర్మ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉగాది విశిష్ట పురస్కారం అందుకున్నారు. అదివారం రవీంద్రభారతిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి శైలజ, కమిషనర్ శ్రీధర్ పురస్కారం అందజేశారు. మల్లన్న ఆలయంలో భక్తుల సందడికొమురవెల్లి(సిద్దిపేట): కొమురవెల్లి మల్లన్న ఆలయంలో ఆదివారం ఉగాది పర్వదినం పురష్కరించుకుని భక్తులు భారీగా తరలివచ్చారు. మల్లన్న నామస్మరణతో ఆలయ పరిసరాలు మారుమోగాయి. స్వామి వారిని దర్శించుకున్న అనంతరం గంగిరేణి చెట్టు వద్ద పట్నాలు వేశారు. ముడుపులు కట్టి మొక్కులు చెల్లించుకున్నారు. అలరించిన కుస్తీ పోటీలుకల్హేర్(నారాయణఖేడ్): ఉగాది ఉత్సవాల నేపథ్యంలో మండలంలోని మార్డిగ్రామంలో, సిర్గాపూర్ మండల కేంద్రంలో ఆదివారం నిర్వహించిన కుస్తీ పోటీలు విశేషంగా అలరించాయి. విజేతలకు నిర్వాహకులు నగదు బహుమతి అందజేశారు. చివరి కుస్తీ పోటీ విజేతకు వెండి కడియం అందజేశారు. కార్యక్రమంలో గ్రామానికి చెందిన ప్రవాస భారతీయుడు గుర్రపు మశ్చేందర్, బీఆర్ఎస్ నాయకులు సంజీవరావు, మాజీ ఎంపీటీసీ రాజుకుమార్ సిగ్రె, తదితరులు పాల్గొన్నారు. -
ప్రణాళికాబద్ధంగా ధాన్యం కొనుగోళ్లు
కలెక్టర్ రాహుల్రాజ్ మెదక్జోన్: యాసంగి వరి కోతలు ప్రారంభం కాగానే ప్రణాళికాబద్ధంగా ధాన్యం సేకరించాలని కలెక్టర్ రాహుల్రాజ్ అన్నారు. గురువారం కలెక్టరేట్లో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాల్లో తాగు నీరు, విద్యుత్ వసతి కల్పించాలన్నారు. టార్పాలిన్లు, ప్యాడీ క్లీనర్లు, తూకం యంత్రాలు అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశించారు. ధాన్యం తూకంలో పారదర్శకంగా ఉండాలన్నారు. రైతులు తేమశాతం 17 ఉండేలా చూసుకుని, నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ కేంద్రాలకు ధాన్యం తరలించాలన్నారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర క్వింటాల్కు ఏ గ్రేడ్ రకం రూ. 2,320 కాగా సాధారణ రకానికి రూ. 2,300 నిర్ణయించినందని వెల్లడించారు. కాగా ఏప్రిల్ 1వ తేదీ నుంచి జిల్లావ్యాప్తంగా 480 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్, జిల్లా వ్యవసాయ అధికారి వినయ్, సివిల్ సప్లై డీఎం జగదీష్ కుమార్, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి సురేష్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అట్రాసిటీ చట్టాన్ని పక్కాగా అమలు చేయాలి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని పక్కాగా అమలు చేయాలని కలెక్టర్ రాహుల్రాజ్ అన్నారు. సివిల్ రైట్స్డే దినోత్సవం సందర్భంగా గురువారం కలెక్టరేట్లో ఎస్సీ, ఎస్టీ విజిలెనన్స్, మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో బాధితులకు సత్వర న్యాయం జరిగే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. అనంతరం ఎస్పీ ఉదయ్కుమార్రెడ్డి నమోదైన అట్రాసిటీ కేసులు, పరిష్కరించినవి, బాధితులకు అందిన పరిహారం వివరాలను వెల్లడించారు. -
నైపుణ్యం పెంపొందించుకోవాలి
ఓయూ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ విద్యాసాగర్ నర్సాపూర్ రూరల్: ప్రతి విద్యార్థి నైపుణ్యం పెంపొందించుకోవాలని ఉస్మానియా విశ్వవిద్యాలయం ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ విద్యాసాగర్ పిలుపునిచ్చారు. గురువారం మండలంలోని రెడ్డిపల్లిలో నర్సాపూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన ఎన్ఎస్ఎస్ విద్యార్థులు రక్తదాన శిబిరం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరై మాట్లాడారు. విద్యార్థులు సామాజిక మాధ్యమాలు, చెడు అలవాట్లతో సమయాన్ని వృథా చేయొద్దని సూచించారు. ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ అనుకున్న లక్ష్యాలను సాధించాలన్నారు. అనంతరం రెడ్క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఎన్ఎస్ఎస్ విద్యార్థులు రక్తదానం చేశారు. కార్యక్రమంలో డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ దామోదర్, రాష్ట్ర బ్లడ్ బ్యాంకు నిర్వహణ కమిటీ అడ్వైజర్ సింగం శ్రీనివాస్రావు, జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్, ప్రోగ్రాం అధికారి సురేష్ కుమార్, అధ్యాపకులు రమేష్, శ్రీనివాస్, హేమంత్ పాల్గొన్నారు. -
బెల్ట్షాపులను తొలగించండి
దుబ్బాక: పల్లెల్లో పచ్చని కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్న మద్యం బెల్ట్ షాపులను తొలగించాలని అసెంబ్లీలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి విన్నవించారు. గురువారం శాసనసభ ప్రశ్నోత్తరాల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తాను ఏ గ్రామానికి వెళ్లినా బెల్ట్ షాప్లను తొలగించాలంటూ మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయన్నారు. పల్లెల్లో విచ్చల విడిగా మద్యం అమ్మకాలు జరుగుతుండడంతో యువత పెడదారి పడుతోందన్నారు. రోడ్డు ప్రమాదాలు సైతం జరుగుతుండటంతో ప్రాణాలు కోల్పోతున్నారని అన్నారు. అలాగే ఆర్థికంగా బాధిత కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలను కోటీశ్వరులను చేస్తామంటున్న ప్రభుత్వం ముందుగా బెల్ట్షాపులను తొలగించి అండగా నిలవాలన్నారు.అసెంబ్లీలో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి -
క్రమబద్ధీకరణ కష్టాలు
● ఒక్కప్లాటు కోర్టు కేసులో ఉన్నా.. సర్వే నంబర్లోని అన్ని ప్లాట్లు నిషేధిత జాబితాలోకి ● ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల ప్రక్రియ తీరు.. అంతంతమాత్రంగానే స్పందనసాక్షిప్రతినిధి, సంగారెడ్డి: ఎల్ఆర్ఎస్ ప్రక్రియపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. మార్చి 31లోపు ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లిస్తే 25 శాతం డిస్కౌంట్ ఇస్తామని పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటుచేసి ప్రచారం చేస్తోంది. కానీ ఎల్ఆర్ఎస్ చెల్లించేందుకు క్షేత్రస్థాయిలో దరఖాస్తుదారులు ఇ బ్బందులు పడుతున్నారు. తమ సమస్య లెవల్–1 స్థాయి అధికారుల వద్ద పరిష్కారమవుతుందా.. లెవల్–2 అధికారుల పరిధిలోకి వస్తుందా..? లెవల్–3 అధికారుల వద్దకు వెళ్లాలా తెలియక తికమకపడుతున్నారు. ఆయా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. నిషేధిత జాబితా కష్టాలు.. ఒక లేఅవుట్లోని సర్వేనంబర్లో సుమారు 200 ప్లాట్లు ఉంటే.. అందులో ఒకటీ.. రెండు ప్లాట్లు కోర్టు కేసుల్లో ఉంటే.. ఆ సర్వే నంబర్లోని అన్ని ప్లాట్లను నిషేధిత (ప్రొహిబీటెడ్) జాబితాలో చూపిస్తోంది. దీంతో ఏం చేయాలో తెలియక చాలామంది దరఖాస్తుదారులు మున్సిపాలిటీ, రెవెన్యూ, రిజిస్ట్రేషన్ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోంది. సంబంధిత సబ్ రిజిస్ట్రార్ నుంచి ఎన్ఓసీ తీసుకుని ఎల్–1 స్థాయి అధికారులను క లిస్తే సమస్య పరిష్కారమవుతుందని అధికారులు చెబుతున్నారు. కనిపించని ఓపెన్ స్పేస్లు.. అనధికారిక వెంచర్లు వేసిన అక్రమార్కులు చాలా చోట్ల ప్రజా అవసరాల కోసం కేటాయించాల్సిన 10 శాతం స్థలాలను (టెన్ పర్సెంట్ ల్యాండ్)లను కూడా ప్లాట్లుగా చేసి సొమ్ము చేసుకున్నారు. ఆయా కాలనీల్లో బడి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, పార్కు వంటి వాటి నిర్మాణం కోసం ఈ స్థలాలను కేటాయించాలి. నిబంధనల ప్రకారం ఈ 10 శాతం భూమిని సంబంధిత మున్సిపాలిటీ గానీ, గ్రామపంచాయతీ తన అధీనంలోకి తీసుకోవాలి. కానీ సంబంధిత అధికారులు వెంచర్ నిర్వాహకులతో చేతులు కలపడంతో ఈ ప్రజావసరాల ల్యాండ్ కూడా పరాధీనమైపోయింది. కానీ, ఈ అనధికారిక లేఅవుట్లో ప్లాటు కొన్నందుకు లేని ఓపెన్ స్పేస్కు చార్జీలు చెల్లించాల్సిన పరిస్థితి దరఖాస్తుదారులకు ఏర్పడింది. డాక్యుమెంట్స్ షార్ట్ఫాల్ పేరుతో.. ఎల్ఆర్ఎస్ ప్రక్రియలో చాలామందికి డాక్యుమెంట్ షార్ట్ఫాల్ అని వెబ్సైట్లో చూపుతోంది. అయితే ఏ డాక్యుమెంట్ అవసరమో సాధారణ దరఖాస్తుదారులకు తెలియడం లేదు. సేల్డీడ్, ఈసీ, లింక్డాక్యుమెంట్లు, లేఅవుట్కాపీ డాక్యుమెంట్లు అవసరం ఉంటాయి. వీటిని నీర్ణీత సైజులో స్కాన్ చేసి వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి. అయితే అంతగా అవగాహన లేని వారికి ఈ సాకేంతిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. ఆయా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. హెల్ప్డెస్క్ల్లో సమాచారం అంతంతే.. ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారంలో ఎదురయ్యే ఇబ్బందులను పరిష్కరించేందుకు ప్రభుత్వం అన్ని మండలాల్లో ఎంపీడీఓ కార్యాలయాలు, మున్సిపాలిటీ కార్యాలయాల్లో హెల్ప్డెస్క్లు ఏర్పాటు చేశారు. ఈ డెస్క్ల్లో పనిచేస్తున్న సిబ్బందికి చాలామందికి ఎల్ఆర్ఎస్ వెబ్సైట్లో ఉన్న సాంకేతిక అంశాలపై పూర్తి స్థాయిలో అవగాహన ఉండటం లేదు. వీరికి శిక్షణ ఇచ్చినప్పటికీ.. చాలామందిలో అవగాహన అంతంత మాత్రంగానే ఉంటోంది. దీంతో ఆయా మున్సిపాలిటీల నుంచి, మండలాల నుంచి దరఖాస్తుదారులు కలెక్టరేట్లకు తరలివస్తున్నారు. -
నిబంధనల మేరకే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం
రామాయంపేట(మెదక్)/నిజాంపేట: ప్రభుత్వ నిబంధనల మేరకే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు కొనసాగాలని గృహ నిర్మాణ శాఖ పీడీ మాణిక్యం సూచించారు. మండలంలో పైలెట్ ప్రాజెక్టుగా ఎంపికై న దామరచెరువులో కొనసాగుతున్న ఇళ్ల నిర్మాణ పనులను గురువారం ఆయన పరిశీలించి మాట్లాడారు. గృహాల నిర్మాణ పనులు చురుగ్గా కొనసాగుతున్నాయని తెలిపారు. గ్రామానికి 97 గృహాలు మంజూరు కాగా 20 గృహాల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని వివరించారు. ఆయన వెంట ఎంపీడీఓ సజీలుద్దీన్, ఇతర అధికారులు ఉన్నారు. అనంతరం నిజాంపేట మండల పరిధిలోని పైలెట్ ప్రాజెక్టు గ్రామం నందగోకుల్లోనూ పర్యటించారు. ఎంఈఓపై చర్యలు తీసుకోవాలి మెదక్జోన్: అనుమతి లేకుండా పరీక్ష కేంద్రాల్లోకి వెళ్లి విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులను భయభ్రాంతులకు గురిచేసిన చిన్నశంకరంపేట ఎంఈఓ పుష్పవేణిపై చర్యలు తీసుకోవాలని తపస్, ఎస్టీయూ యూనియన్ల జిల్లా అధ్యక్షులు ఎల్లం, రాజ్గోపాల్గౌడ్ డిమాండ్ చేశారు. ఈమేరకు గురువారం డీఈఓ రాధాకిషన్కు వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఎంఈఓ చిన్నశంకరంపేట మండల పరిధిలోని మోడల్ స్కూల్తో పాటు మీర్జాపల్లి పరీక్షా కేంద్రాల్లోకి వెళ్లి చీఫ్ సూపరింటెండెంట్, డిప్యూటీ సూపరింటెండెంట్ల విధులకు ఆటకం కలిగించారని తెలిపారు. అలాగే విద్యార్థుల విలువైన పరీక్ష సమయాన్ని వృథా చేశారని వివరించారు. ఎంఈఓపై శాఖాపరమైనా చర్యలు తీసుకోవాలని కోరారు. మెదక్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రాములు మెదక్జోన్: మెదక్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా సీనియర్ న్యాయవాది మర్కంటి రాములు ఘన విజయం సాధించారు. గురువారం జరిగిన బార్ అసోసియేషన్ ఎన్నికల్లో మొత్తం 90 మంది న్యాయవాదులు పాల్గొనగా, అందులో 87 ఓట్లు పోలయ్యాయి. మర్కంటి రాములుకు 49 ఓట్లు రాగా, షేక్ ఫజల్ అహ్మద్కు 37 ఓట్లు వచ్చాయి. నోటాకు ఒక ఓటు పడింది. రాములు 12 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఎన్నికల అధికారిగా ప్రభాకర్ వ్యవహరించారు. ఈసందర్భంగా రాములును న్యాయవాదులు ఘనంగా సన్మానించారు. పీహెచ్సీ ఆకస్మిక తనిఖీ చిన్నశంకరంపేట(మెదక్): నార్సింగి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డీఎంహెచ్ఓ శ్రీరామ్ గురువారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా సిబ్బందికి పలు సూచనలు ఇచ్చారు. కలెక్టర్ ఆదేశాలతో ఆస్పత్రిని తనిఖీ చేసినట్లు తెలిపారు. సమర్థవంతంగా పనిచేసి మంచి గుర్తింపు పొందాలని సూచించారు. కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రేఖ, డాక్టర్ రవి కుమార్ తదితర సిబ్బంది ఉన్నారు. దరఖాస్తుల గడువు పెంపు ప్రశాంత్నగర్(సిద్దిపేట): స్కాలర్షిప్ దరఖాస్తుల గడువు పొడిగించారు. 2024– 25 విద్యా సంవత్సరానికి గాను పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ దరఖాస్తుల గడువును మే 31 వరకు పొడిగించినట్లు జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి హమీద్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అర్హులైన విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. కార్యకర్తలకు అండగా ఉండాలి నర్సాపూర్: కాంగ్రెస్ కార్యకర్తలకు అండగా ఉండాలని పార్టీ అధిష్టానం సూచించిందని డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్ తెలిపారు. గురువారం ఢిల్లీలో జరిగిన డీసీసీ అధ్యక్షుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, పార్టీ అగ్రనేత రాహుల్గాంధీతో పాటు పలువురు నాయకులు దిశానిర్దేశం చేశారు. -
రైతులకు పరిహారం చెల్లించండి
నర్సాపూర్: రూ. 7 కోట్ల నిధులు విడుదల చేసి రైతులకు పరిహారం అందజేయాలని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి గురువారం అసెంబ్లీలో ప్రభుత్వాన్ని కోరారు. నియోజకవర్గంలోని కొల్చారం మండలం ఘనపూర్ ఆనకట్ట సామర్థ్యాన్ని 0.3 టీఎంసీలకు పెంచాలని నిర్ణయించారని, అందుకు అనుగుణంగా పనులు సైతం ప్రారంభించారని చెప్పారు. ఇందుకోసం రైతుల నుంచి సుమారు ఎనిమిది వందల ఎకరాల భూములు సేకరించారని వివరించారు. భూములు సేకరించిన ప్రభుత్వం రైతులకు పరిహారం ఇవ్వలేదన్నారు. దీంతో పంటలు సాగు చేయలేక, పరిహారం అందక ఇబ్బందుల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా రైతులను పరిహారం అందజేసి ఆదుకోవాలని కోరారు.అసెంబ్లీలో నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి -
డంపింగ్ యార్డ్ రద్దు చేయాలి
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు చుక్కా రాములు సంగారెడ్డి ఎడ్యుకేషన్: ప్రజా వ్యతిరేకమైన ప్యారానగర్ డంపింగ్ యార్డ్ రద్దు చేయాల్సిందేనని, రేవంత్రెడ్డి సర్కార్ ప్రజా ప్రభుత్వం అంటూనే ప్రజల గోడు పట్టించుకోరా అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు చుక్కా రాములు ప్రశ్నించారు. ప్యారానగర్ డంపింగ్ యార్డు వ్యతిరేక పోరాటానికి మద్దతుగా గురువారం సీపీఎం సామూహిక నిరహార దీక్షలను ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు చుక్కా రాములు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ప్రజా ఉద్యమాలను నిర్బంధాలతో అణచివేయాలని చూస్తే ప్రజలు మరింత తిరగబడతారని హెచ్చరించారు. స్థానిక ప్రజల అభిప్రాయాలకు భిన్నంగా ఏకపక్షంగా డంపింగ్యార్డ్ పెట్టాలని నిర్ణయించడం సరైంది కాదన్నారు. డంపింగ్ యార్డ్ను రద్దు చేయాలని కోరుతూ ప్రజలు పోరాడుతున్నందున వాస్తవ పరిస్థితులను గమనించి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్పై ఉందన్నారు. ప్యారానగర్–నల్లవల్లిలో డంపింగ్యార్డ్ పెడితే ఆ ప్రాంతమంతా కాలుష్య కోరల్లో చిక్కి ప్రజలు జీవించే పరిస్థితి లేకుండా పోతుందన్నారు. ఇప్పటికే పరిశ్రమలు వెదజల్లే కాలుష్యం వల్ల జిన్నారం, బొంతపల్లి,పటాన్చెరు ప్రాంతమంతా పరిసరాలు, పర్యావరణం దెబ్బతినడం వల్ల అక్కడ ప్రజలు జీవించలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం డంపింగ్ యార్డును రద్దు చేయాలని కోరుతూ కలెక్టరేట్ ఏఓకు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి జయరాజు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు మల్లేశం, రాజయ్య, మాణిక్యం, సాయిలు, నర్సింహులు తదితరులు పాల్గొన్నారు. -
పౌల్ట్రీ.. పల్టీ!
జిల్లాలో మూడు వేల పైచిలుకు కోళ్ల ఫారాలు మూత ఈ చిత్రంలోని పౌల్ట్రీ రైతు పేరు ఆరె యాదగిరి. ఇతనిది చిన్నశంకరంపేట మండలం జంగరాయి. ఏడాది క్రితం తన వ్యవసాయ పొలంలో 7.5 వేల కెపాసిటీ గల కోళ్ల ఫారం నిర్మించాడు. ఇందుకు రూ. 15 లక్షలు ఖర్చు కాగా, రూ. 10 లక్షలు బ్యాంకులో అప్పు తీసుకున్నాడు. మిగితా రూ. 5 లక్షలు సొంత నిధులు వెచ్చించాడు. బ్యాంకులో తీసుకున్న అప్పును రెండు నెలలకు రూ. 73 వేల చొప్పున వాయిదాల రూపంలో చెల్లిస్తానని ఒప్పందం చేసుకున్నాడు. ఇప్పటికే ఐదు బ్యాచ్ల కోళ్లు పెంచి వచ్చిన కమీషన్ డబ్బులు బ్యాంకులో కట్టాడు. కాగా నెల రోజుల క్రితం 7,500 కోడి పిల్లలను పెంచగా, వాటిలో కేవలం 300 కోళ్లు మాత్రమే తీసుకెళ్లిన సదరు కంపెనీ నిర్వాహకులు, మిగితా వాటికి వ్యాధి సోకిందని వదిలేసి వెళ్లిపోయారు. దీంతో చేసేది లేక వాటిని గుంతలో పూడ్చి పెట్డాడు. ఈ క్రమంలో బ్యాంకు వాయిదా కట్టాలని అధికారులు ఒత్తిడి చేస్తున్నారు. ఎలా చెల్లించాలని రైతు ఆవేదన చెందుతున్నాడు. ఇది ఒక్క యాదగిరి పరిస్థితే కాదు. జిల్లాలోని వేలాది మంది పౌల్ట్రీ రైతులది. చిన్నశంకరంపేట: జంగరాయిలో మూత పడిన కోళ్ల ఫారంమెదక్జోన్: జిల్లాలో చెప్పుకోదగిన సాగునీటి వనరులు లేకపోవటంతో వ్యవసాయం సరిగా సాగక మూడు వేల పైచిలుకు రైతులు కోళ్ల ఫారాలు ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. వీరిలో 90 శాతానికి పైగా రైతులు బ్యాంకుల్లో అప్పు తీసుకున్నారు. కాగా ఒక్క బ్యాచ్ కోళ్లను పెంచేందుకు 45 నుంచి 50 రోజుల సమయం పడుతుంది. దీంతో బ్యాంకుల్లో రుణాలు తీసుకుని వాయిదాల రూపంలో చెల్లిస్తున్నారు. ఈక్రమంలో ఎప్పుడూ లేని విధంగా వింత వ్యాధితో వేలాది కోళ్లు మృత్యువాత పడ్డాయి. ఇదే సమయంలో బర్డ్ ఫ్లూ కలకలం రేపింది. దీంతో 95 శాతం ప్రజలు చికెన్ తినటం మానేశారు. ఫలితంగా సదరు కోళ్ల కంపెనీ నిర్వాహకులు పౌల్ట్రీ రైతులకు కోడి పిల్లలను ఇవ్వటం పూర్తిగా మానేశారు. ఫలితంగా వేలాది కోళ్ల ఫాంలకు తాళాలు పడ్డాయి. వాయిదాలు చెల్లించాలని ఒత్తిడి బ్యాంకులో తీసుకున్న రుణానికి సకాలంలో వాయిదాలు చెల్లించాలని, లేనిచో వడ్డీ, చక్ర వడ్డీ పడుతుందని బ్యాంకు అధికారులు పౌల్ట్రీ రైతులకు నోటీసులు జారీ చేస్తున్నారు. ప్రస్తుతం కంపెనీలు కోడి పిల్లలు ఇవ్వక పౌల్ట్రీలకు తాళాలు వేశామని, బ్యాంకు వాయిదాలు ఎలా చెల్లించేదంటూ రైతులు ఆవేదన చెందుతున్నారు. ఈ గండం నుంచి ప్రభుత్వం గట్టెక్కించాలని, బ్యాంకులో తీసుకున్న రుణానికి వడ్డీ పడకుండా రెన్యూవల్ చేసే విధంగా చర్యలు చేపట్టాలని వేడుకుంటున్నారు. వింత వ్యాధితో మృత్యువాత పడిన కోళ్లు వానాకాలం వరకు పెంపకంవద్దంటున్న అధికారులు వాయిదాలు కట్టాలనిబ్యాంకు అధికారుల నోటీసులుఇది అనువైన సమయం కాదు జిల్లాలో చనిపోయిన కోళ్ల రక్త నమూనాలను ఇప్పటికే రెండు సార్లు ల్యాబ్కు పంపించాం. బర్డ్ ఫ్లూ లేదని తేలింది. కానీ పెద్ద మొత్తంలో కోళ్లు ఎలా చనిపోయాయనేది నిర్ధారణ కాలేదు. ప్రస్తుతం ఎండలు దంచికొడుతున్నాయి. ఇది కోళ్ల పెంపకానికి అనువైన సమయం కాదు. వానాకాలం వచ్చే వరకు రైతులు కోళ్ల పెంపకం నిలిపివేస్తేనే మంచిది. – వెంకటయ్య, జిల్లా వెటర్నరీ అధికారి -
ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యం
చిన్నశంకరంపేట(మెదక్): ప్రభుత్వ ఆస్పత్రులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ రాహుల్రాజ్ సూచించారు. బుధవారం నార్సింగి ప్రభుత్వ ఆస్పత్రిని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఫార్మసిస్ట్ గది, ల్యాబ్, ఓపీ రికార్డులు, సిబ్బంది హాజరు పట్టికను పరిశీలించారు. ఇదే సమయంలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రేఖ అందుబాటులో లేకపోవడంపై ఆరా తీశారు. సబ్సెంటర్ పరిశీలనకు వెళ్లినట్లు సిబ్బంది చెప్పడంతో మూమెంట్ రిజిస్టర్ను తనిఖీ చేశారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. ఆరోగ్య కేంద్రాల్లో మౌలిక వసతులతో పాటు పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు. సీసీ కెమెరాల ద్వారా కంట్రోల్ రూం నుంచి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. ఆరోగ్య మహిళ కార్యక్రమంలో గ్రామీణ మహిళలను భాగస్వామ్యం చేసేందుకు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. ఈసందర్భంగా డాక్టర్ రవికుమార్కు పలు సూచనలు చేశారు. నిరుద్యోగులకు మంచి అవకాశం రామాయంపేట(మెదక్): మున్సిపాలిటీ పరిధిలోని మీ సేవ కేంద్రాన్ని కలెక్టర్ రాహుల్రాజ్ బుధవారం సందర్శించారు. రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించి అర్హులైన యువత తెలంగాణ ఓబీఎంఎంఎస్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసే ప్రక్రియను పరిశీలించారు. మీసేవ నిర్వాహకుడితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించి, తద్వారా ఆర్థిక పురోగతి పెంపొందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకానికి శ్రీకారం చుట్టిందన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ రజని, మీ సేవ నిర్వాహకులు పాల్గొన్నారు. కలెక్టర్ రాహుల్రాజ్ -
మెరుగైన వైద్యం అందించాలి
కొల్చారం(నర్సాపూర్): ఆస్పత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించాలని డీఎంహెచ్ఓ శ్రీరామ్ సిబ్బందికి సూచించారు. బుధవారం మండలంలోని రంగంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆస్పత్రిలోని వార్డులను పరిశీలించడంతో పాటు అవసరమైన మందుల లభ్యతపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్యం కేంద్రం పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచడంతో పాటు రోగులకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. ఆయన వెంట వైద్యాధికారి ప్రవీణ్ కుమార్, సిబ్బంది ఉన్నారు. 28న తైబజార్ వేలం రామాయంపేట(మెదక్): Ð]l¬°Þ-´ëÍsîæ ç³Ç-«¨ÌZ° O™ðlº-gêÆŠḥæ ÐólÌS… D¯ðlÌS 28Ð]l ™ól©¯]l Ð]l$«§éÅçßæ²… 12 VýS…r-ÌSMýS$ °Æý‡Ó-íßæ…-^èl-¯]l$-¯]l²r$Ï Ð]l¬°Þ-ç³ÌŒæ MýSÑ$-çÙ¯]lÆŠ‡ §ólÐól…-§ýlÆŠ‡ º$«§ýl-ÐéÆý‡… JMýS {ç³MýSr-¯]lÌZ õ³ÆöP-¯é²Æý‡$. D AÐ]l-M>-Ô>°² çܨ-Ó-°-Äñæ*VýS… ^ólçÜ$-MøÐéÌS° çÜ* _…-^éÆý‡$. సబ్సిడీపై వ్యవసాయ పరికరాలు నర్సాపూర్: రైతులకు సబ్సిడీపై వ్యవసాయ పరికరాలు అందజేస్తున్నట్లు ఏడీఏ సంధ్యరాణి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తన డివిజన్ పరిధిలోని నర్సాపూర్, శివ్వంపేట, మనోహరాబాద్, తూప్రాన్ మండలాల్లో ఆసక్తి ఉన్న రైతులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను రాయితీపై వ్యవసాయ పరికరాలు అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఆమె చెప్పారు. ఈనెల 29వ తేదీ లోపు దరఖాస్తులు అందజేయాలని, మరిన్ని వివరాలకు మండల వ్యవసాయ అధికారులు, ఏఈఓలను సంప్రదించాలని తెలిపారు. పకడ్బందీగా పది పరీక్షలు నర్సాపూర్/కౌడిపల్లి: పదో తరగతి పరీక్ష కేంద్రాలను అదనపు కలెక్టర్ నగేష్ బుధవారం పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈసందర్భంగా పాఠశాలలో పరీక్షల నిర్వహణ, సౌకర్యాలతో పాటు పరిసరాలను పరిశీలించారు. పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. ఆయన వెంట స్థానిక తహసీల్దార్ శ్రీనివాస్, ఆర్ఐ ఫైజల్, సీఎస్ శ్రీధర్రెడ్డిఉన్నారు. మీనాక్షి నటరాజన్ను కలిసిన కాంగ్రెస్ నేతలు నర్సాపూర్: రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ను బుధవారం ఢిల్లీలో పలువురు నేతలు కలిశారు. గురువారం డీసీసీ అధ్యక్షులతో ఏఐసీసీ అగ్రనేతలు సమావేశం కానున్నారు. ఇందులో భాగంగా ఢిల్లీ వెళ్లిన మెదక్, సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు ఆంజనేయులుగౌడ్, నిర్మలా జగ్గారెడ్డి మర్యాదపూర్వకంగా ఆమెను కలిశారు. రాష్ట్రంలో ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆమె సూచించారని వారు తెలిపారు. విధుల్లో నిర్లక్ష్యం వహించొద్దు కౌడిపల్లి(నర్సాపూర్): అంగన్వాడీ టీచర్లు విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని డీడబ్ల్యూఓ హైమావతి హెచ్చరించారు. బుధవారం కౌడిపల్లిలోని 2, 3, 5వ అంగన్వాడీ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. ఈసందర్భంగా పిల్లలు, బాలింతలు, గర్భి ణుల వివరాలను పరిశీలించారు. అనంతరం పిల్లలతో కలిసి భోజనం చేశారు. టీచర్లు సమయపాలన పాటించాలని, మెనూ ప్రకారం వంట చేయించాలని సూచించారు. ఆట పాటల ద్వారా పిల్లలకు విద్యా బోధన చేయాలన్నారు. అలాగే మండలంలోని తిమ్మాపూర్ అంగన్వాడీ కేంద్రాన్ని సీడీపీఓ హేమభార్గవి తనిఖీ చేశారు. కార్యక్రమంలో సూపర్వైజర్ లక్ష్మి, అంగన్వాడీ టీచర్లు, సిబ్బంది పాల్గొన్నారు. -
దొడ్డు బియ్యం మాటేంది? రేషన్ దుకాణాల్లో పేరుకుపోయిన దొడ్డు బియ్యం నిల్వలపై డీలర్లు ఆందోళనచెందుతున్నారు. వివరాలు 8లో u
మాజీ సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గంలో నూతనంగా ఏర్పడిన తూప్రాన్ మున్సిపాలిటీ సమస్యలతో సతమతమవుతోంది. మౌలిక వసతులు కొరవడి ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా మారింది. సీసీ రోడ్లు, విద్యుత్ దీపాలు కరువయ్యాయి. కాలనీల్లో ఎక్కడపడితే అక్కడ చెత్త దర్శనమిస్తోంది. రోడ్లపై మురుగు నీరు పారి దుర్వాసన వెదజల్లుతోంది. తాగునీటి సరఫరా అంతంత మాత్రంగానే ఉంది. పట్టణంలో ట్రాఫిక్ సమస్య నిత్యకృత్యంగా మారింది. – తూప్రాన్ తూప్రాన్ మున్సిపాలిటీలోమౌలిక వసతులు కరువు ● ‘సాక్షి’ పరిశీలనలోవెలుగుచూసిన వాస్తవాలుగురువారం శ్రీ 27 శ్రీ మార్చి శ్రీ 2025దశలవారీగా పరిష్కరిస్తాం తూప్రాన్ మున్సిపాలిటీలో సమస్యలను దశలవారీగా పరిష్కరించేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాం. పెండింగ్లో ఉన్న పనులను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తాం. వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా అవసరం ఉన్న కాలనీల్లో ట్యాంకర్ల ద్వారా తాగునీటిని సరఫరా చేస్తున్నాం. – గణేష్రెడ్డి, మున్సిపల్ కమిషనర్ అరకొరగా తాగునీటి సరఫరా కాలనీల్లో మిషన్ భగీరథ ద్వారా అరకొరగా నీటిని సరఫరా చేస్తున్నారు. మున్సిపల్ అధికారులు ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నారు. కానీ అవి అందరికి సరిపోవడం లేదు. ఇప్పటికై నా నల్లాల ద్వారా తాగు నీరు వచ్చే విధంగా చర్యలు చేపట్టాలి. – ఉపేందర్, తూప్రాన్ వృథాగా ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పట్టణ ప్రజలకు దూరంగా నర్సాపూర్ చౌరస్తా సమీపంలోని ప్రభుత్వ స్థలంలో రూ. 11 కోట్ల వ్యయంతో నిర్మించిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ప్రారంభించిన రెండు, మూడు నెలల పాటు క్రయవిక్రయాలు సజావుగా సాగాయి. అయితే మార్కెట్ దూరంగా ఉండడంతో సరుకులు, కూరగాయలు, చేపలు, మాంసం కొనేందుకు ప్రజలు ఇబ్బంది పడ్డారు. దీంతో ప్రజలు, వ్యాపారుల నుంచి వ్యతిరేకత వచ్చి తిరిగి పట్టణంలోని పాత మున్సిపల్ కార్యాలయం సమీపంలోనే వ్యాపారులు దుకాణాలను కొనసాగిస్తున్నారు. రహదారిపైనే చిరు వ్యాపారం పట్టణ సమీపంలోని టోల్ప్లాజా వద్ద 44వ జాతీయ రహదారి పక్కన చిరువ్యాపారుల సౌకర్యార్థం గత ప్రభుత్వం వే సైడ్ మార్కెట్ను రూ. 2.50 కోట్ల వ్యయంతో నిర్మించింది. అక్కడ వ్యాపారం సరిగా సాగక తిరిగి వ్యాపారులు రహదారి పక్కనే వ్యాపారం కొనసాగిస్తున్నారు. ఫలితంగా రూ. కోట్లు వెచ్చించి నిర్మించిన మార్కెట్ నేడు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. వ్యవసాయ మార్కెట్ అలంకారప్రాయంరైతుల సౌకార్యార్థం వ్యవసాయ మార్కెట్ను టోల్ ప్లాజా పక్కన సుమారు 22 ఎకరాల్లో రూ. 6 కోట్లతో నూతనంగా ఏర్పాటు చేశారు. ఇందుకు అనుగుణంగా గోడౌన్లు నిర్మించారు. కాని ఏర్పాటు చేసి నాలుగేళ్ల గడుస్తున్నా నేటికీ నూతన మార్కెట్ కమిటీని నియమించలేదు. రహదారి పక్కన అలంకారప్రాయంగా దర్శనమిస్తుంది. దీంతో రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. అసంపూర్తిగా సమీకృత భవనంమండలంలోని ప్రభుత్వ కార్యాయాలను ఒకే చోట ప్రజలకు అందుబాటులో ఉంచేందుకు గత ప్రభుత్వం రూ. 8 కోట్లతో సమీకృత భవన నిర్మాణం చేపట్టింది. ఇందుకోసం ఎంఈఓ, ఐకేపీ, ఈజీఎస్, భవనాలను కూల్చివేసి ఆ స్థలంలో నూతన భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటివరకు 80 శాతం మేర పనులు పూర్తి కాగా, మిగితా 20 శాతం పనులు నిధుల కొరతో నిలిచిపోయాయి. దీంతో ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లో ఇరుకు గదుల్లో ఐకేపీ, ఎంఈఓ, తహసీల్దార్, వ్యవసాయ, ఆర్డీఓ కార్యాలయాలు కొనసాగుతున్నాయి. జాడలేని సేంద్రియ ఎరువునాలుగు విలీన పంచాయతీలతో కలిపి నూతనంగా ఏర్పడిన మున్సిపాలిటీలో సిబ్బంది నిత్యం 10 మెట్రిక్ టన్నులకు పైగా చెత్తను సేకరిస్తున్నారు. సేకరించిన చెత్తను పట్టణ సమీపంలోని టాటా పరిశ్రమ వెనకాల గుట్టల్లో డంప్ చేస్తున్నారు. చెత్తతో (కంపోస్టు) సేంద్రియ ఎరువు తయారు చేస్తామని లక్షలు ఖర్చు చేశారు. కానీ ఇప్పటివరకు సేంద్రియ ఎరువు తయారీ ఊసే లేదు. సేకరించిన చెత్తను కాల్చివేసి బుగ్గిపాలు చేస్తున్నారు. ఫలితంగా చెత్త నుంచి వచ్చిన పొగతో సమీప గ్రామాలు, రావెల్లి, వెంకటాపూర్ గ్రామస్తులు ఇబ్బంది పడుతున్నారు. న్యూస్రీల్నిలిచిన సుందరీకరణ పనులుపట్టణ సమీపంలోని పెద్ద చెరువు కట్టను మిషన్ కాకతీయ పథకంలో భాగంగా రూ. 9 కోట్లతో మినీ ట్యాంక్బండ్గా మార్చేందుకు విస్తరణ పనులు చేపట్టారు. అదనంగా మరో రూ. 75 లక్షలతో సుందరీకరణ కోసం చెరువు కట్టపై వాకింగ్ ట్రాక్, పార్కు, చెరువులో బోటు సదుపాయం, తదితర మౌలిక వసతులు కల్పించి ప్రజలకు ఆహ్లాద వాతావరణం కల్పించాలన్న లక్ష్యంతో గత ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. చెరువు కట్ట విస్తరణ పనులు చేపట్టారు కానీ సుందరీకరణ చేయలేదు. చెరువులో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో గతంలో రెండు నెలల పాటు రెండు బోట్లు ఏర్పాటు చేశారు. అనంతరం వాటి వినియోగం భారంగా మారడంతో ఆపేశారు. తూప్రాన్ మున్సిపల్ స్వరూపం జనాభా 21,148 వార్డులు 16 రెవెన్యూ వార్డులు 18 ఇళ్లు 6,605 అవసరమైన తాగునీరు 3.60 ఎంఎల్డీ చెత్త సేకరణ వాహనాలు 10 ఆటోలు, 3 ట్రాక్టర్లు పబ్లిక్ టాయిలెట్లు 05 స్వయం సహాయక సంఘాలు 395 వీధి వ్యాపారులు 946 మందికొందరికే డబుల్ బెడ్రూంలు మున్సిపల్ కేంద్రంలో 2018లో రూ.25 కోట్ల నిధులతో 504 ఇళ్ల నిర్మాణాలు చేపట్టారు. ఇందులో కేవలం 422 ఇళ్లను మాత్రమే పూర్తి చేశారు. మిగితావి సగం పనులు జరగగా, మరికొన్ని ప్రారంభ దశలోనే నిలిచిపోయాయి. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో లబ్ధిదారులను లక్కీ డ్రా పద్ధతిలో ఎంపిక చేసి ఇళ్లు అప్పగించారు. అసంపూర్తిగా వదిలేసిన వాటిని సైతం కొందరికీ కేటాయించారు. దీంతో చేసేదేలేక అప్ప చేసి నిర్మాణాలు పూర్తిచేసుకున్నారు. మరికొందరు అలాగే వదిలేశారు. -
ిసీటీస్కాన్ సేవలు ఎప్పుడో..?
మెదక్ జోన్: జిల్లా ఆస్పత్రికి ిసీటీస్కాన్ యంత్రం తీసుకొచ్చి దాదాపు రెండు నెలలు కావొస్తుంది. అయినా ప్రారంభించడంలో అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే ఇన్స్టాలేషన్ అవుతుందంటూ సమాధానం చెబుతున్నారు. నూతనంగా సీటీస్కాన్ను ఏర్పాటు చేస్తే కేవలం వారం రోజుల్లో ప్రక్రియ అంతా పూర్తవుతుందని సాంకేతిక నిపుణులు చెబుతున్నారు. సేవలు అందుబాటులోకి రాకపోవడంతో ఎంతో మంది పేద రోగులు ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. అందుబాటులో లేని పరికరాలు జిల్లాకు మెడికల్ కళాశాల మంజూరు అయిందని ప్రజలు ఎంతో సంబురపడ్డారు. ఇక నుంచి అత్యవసర వైద్యం అందుబాటులోకి వస్తుందని భావించారు. అన్నిరకాల స్పెషలిస్టులతో పాటు ఎంఆర్ఐ, టూడీఎకో లాంటి పరికరాలు (ల్యాంబ్) అందుబాటులోకి రావాల్సి ఉంది. కానీ ఇప్పటివరకు అవేం అందుబాటులోకి రాలేదు. దీంతో నరాలకు సంబంధించిన సమస్య వస్తే రూ. 8 వేలు చెల్లించి ప్రైవేట్ ఆస్పత్రిలో ఎంఆర్ఐ చేయించుకోవాల్సి వస్తోంది. అలాగే గుండె సంబంధిత పరీక్ష (టూడీఏకో) రూ. 5 వేలు చెల్లించి పరీక్ష చేయించుకుంటున్నారు. రోడ్డు ప్రమాదాల్లో ఎముకలు విరిగితే పరీక్ష నిర్ధారణ చేసే యంత్రం (సీ–ఆర్మ్) జిల్లా కేంద్ర ఆస్పత్రిలో ఉన్నప్పటికీ అది చెడిపోయి చాలా కాలం అయింది. దానికి మరమ్మతులు చేయించే నాథుడే కరువయ్యారు. ఫలితంగా దీని పరీక్ష అవసరం వచ్చిందంటే ప్రైవేట్లో చేయించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. అందని ద్రాక్షగా సర్కారు వైద్యం జిల్లాలో 19 ప్రాథమిక వైద్యారోగ్య కేంద్రాలు, 3 సీహెచ్సీ ఆస్పత్రులు, 1 ఏరియా ఆస్పత్రి, 1 మాతాశిశు ఆస్పత్రితో పాటు జిల్లా జనరల్ ఆస్పత్రి ఉంది. వీటి పరిధిలో పెద్ద ఆరోగ్య సమస్య ఉత్పన్నమైతే జిల్లా జనరల్ ఆస్పత్రికి రెఫర్ చేస్తున్నారు. రోగ నిర్ధారణ తరువాతే వైద్యులు చికిత్స ప్రారంభించాల్సి ఉండగా.. అందుకు అవసరమయ్యే అనేక పరికరాలు అందుబాటులో లేవు. వెరసి పేద రోగులకు ప్రభుత్వం వైద్యం అందని ద్రాక్షగానే మిగిలింది. ఈ చిత్రంలోని వ్యక్తి పేరుయాదగిరి. ఇతనిది చిన్నశంకరంపేట మండలం సూరారం గ్రామం. ఇటీవల తలకు దెబ్బతగలటంతో కుటుంబ సభ్యులు జిల్లా కేంద్ర ఆస్పత్రికి తీసుకొచ్చారు. పరీక్షించిన వైద్యులు తలకు బలమైన గాయం అయినందున సీటీస్కాన్ చేయించాలని సూచించారు. ఆస్పత్రిలో సేవలు అందుబాటులో లేకపోవడంతో ప్రైవేట్లో రూ. 2,300 చెల్లించి రిపోర్టు తీసుకొచ్చారు. -
ఆయిల్పామ్తో అధిక లాభాలు
ఆయిల్పామ్ మొక్క నాటుతున్న అధికారులుచిన్నశంకరంపేట(మెదక్): వరికి ప్రత్యామ్నయంగా ఆయిల్పామ్ పంటను సాగుచేసి అధిక లాభాలు పొందాలని జిల్లా హార్టికల్చర్ జిల్లా అధికారి ప్రతాప్సింగ్ సూచించారు. బుధవారం మండలంలోని ధరిపల్లిలో ఆయిల్పామ్ సాగుపై రైతులకు అవగాహన కల్పించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సబ్సిడీతో పంటను సాగుచేయవచ్చని, అంతర పంట సాగుకు సైతం ప్రభుత్వ సాయం పొందవచ్చన్నారు. ఇప్పటికైనా ఆయిల్పామ్ పంటను సాగుచేసేందుకు రైతులు ముందుకు రావాలని కోరారు. హార్టికల్చర్ అధికారులు సంతోష్, రచన, సుజాత, ఆయిపామ్ మేనేజర్ కృష్ణ పాల్గొన్నారు.జిల్లా హార్టికల్చర్ అధికారి ప్రతాప్సింగ్ -
కూలీలందరికీ ఉపాధి: జెడ్పీ సీఈఓ
● పని చేసే చోట వసతులు కల్పించాలి ● తాగునీటి ఎద్దడికి ముందస్తు చర్యలు రేగోడ్(మెదక్): ఉపాధిహామీ పథకం ద్వారా కూలీలందరికీ పని కల్పిస్తామని మెదక్ జెడ్పీ సీఈఓ ఎల్లయ్య అన్నారు. రేగోడ్ మండల పరిషత్ కార్యాలయాన్ని మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యాలయం సమీపంలో నిర్మిస్తున్న ఇందిరమ్మ మోడల్ గృహాన్ని పరిశీలించి, ఉపాధిహామీ కూలీల సమస్యలు అడిగి తెలుసుకున్నారు.అనంతరం ఆయ న విలేకరులతో మాట్లాడుతూ ఉపాధిహామీ ద్వారా అడిగిన వారందరికీ పని కల్పిస్తున్నామని, పని చేసిన వెంటనే కూలీ డబ్బులు చెల్లిస్తున్నామని తెలిపారు. కూలీలు పని చేస్తున్న ప్రాంతంలో వసతులు కల్పించాలని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు. జిల్లాలో తాగునీటి ఎద్దడి రాకుండా మండలాల్లోని వార్డుల వారీగా సరఫరా సమస్యలను తెలుసుకొని ముందస్తుగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. కార్యక్రమంలో డీప్యూటీ సీఈఓ రంగాచారి, ఎంపీడీఓ సీతారావమ్మ, సూపరింటెండెంట్ రమేశ్, సిబ్బంది పాల్గొన్నారు. -
వ్యవసాయ రంగానికి పెద్దపీట
నర్సాపూర్: వ్యవసాయ రంగంతో పాటు దాని అనుబంధ రంగాలకు రుణాలు ఇవ్వడంలో పెద్ద పీట వేస్తున్నామని జిల్లా కేంద్ర సహకార బ్యాంకు(డీసీసీబీ) సీఈఓ శ్రీనివాస్ అన్నారు. మంగళవారం డీసీసీబీ శాఖలో రికవరీ, బ్యాంకు కార్యకలాపాలు పరిశీలించేందుకు వచ్చిన సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో 50 డీసీసీబీ శాఖల ద్వారా ఏడు వందల కోట్ల డిపాజిట్లు సేకరించామని, 18వందల కోట్ల రుణాలు అందజేశామని తెలిపారు. కాగా రుణాల రికవరీ 84శాతం వసూలు చేశారని చెప్పారు. రైతులకు వ్యవసాయానికే కాకుండా తదితర రుణాలిస్తున్నామని వివరించారు. సమావేశంలో స్థానిక బ్రాంచ్ మేనేజర్ అభినవ్, ఫీల్డ్ ఆఫీసర్ కృష్ణాకర్ రావు, ఐకేపీ ఏపీఎం గౌరీశంకర్ పాల్గొన్నారు. పాఠశాలకు సహాయం థాయిలాండ్ ప్రతినిధుల హామీ చిన్నశంకరంపేట(మెదక్): మండలంలోని జంగరాయి ప్రాథమికోన్నత పాఠశాలను థాయిలాండ్కు చెందిన సింజెంటా సీడ్ కంపెనీ ప్రతినిధులు మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా వారు పాఠశాల అవసరాలను అడిగి తెలుసుకున్నారు. తమ సంస్థ ద్వారా పాఠశాలకు అవసరమైన సహాయం అందించనున్నట్లు తెలిపారు. విద్యార్థులతో మాట్లాడి వారి ప్రతిభను పరిశీలించారు. పాఠశాలకు సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని కోరగా, అంగీకరించినట్లు హెచ్ఎం నాగసుజాత తెలిపారు. పశుపోషణపై అవగాహన పశుసంవర్ధక శాఖ అధికారి వెంకటయ్య నర్సాపూర్రూరల్: పశు పోషణపై ప్రతి రైతుకు అవగాహన అవసరమని జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ వెంకటయ్య అన్నారు. మంగళవారం మండలంలోని నత్నాయిపల్లిలో నేషనల్ ఆగ్రో ఫౌండేషన్, పశుసంవర్ధక శాఖల ఆధ్వర్యంలో ఉచిత పశువైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మేతలో మినరల్ మిక్చర్, ఖనిజ మిశ్రమం, కాల్షియం వంటివి ఉండేలా చూసుకోవాలన్నారు. పశువులకు కావాల్సిన మందులు, పశుగ్రాసం విత్తనాలు నేషనల్ ఆగ్రో ఫౌండేషన్ ఉచితంగా అందజేసింది. కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ ఏడీ జనార్దన్, పశువైద్యాధికారులు సౌమిత్, ప్రియాంక, స్వప్న, నేషనల్ ఆగ్రో ఫౌండేషన్ సభ్యులు గజేంద్రియన్, రాజకుమార్, రామకృష్ణ, వీరేశ్ పాల్గొన్నారు. మార్కెట్ ప్రకారమే పరిహారం నర్సాపూర్: సంగారెడ్డి కెనాల్లో భూములు కోల్పోతున్న రైతులు మార్కెట్ ప్రకారమే పరిహారం చెల్లించాలని ఆర్డీఓ మహిపాల్ను కోరారు. మంగళవారం శివ్వంపేట మండలంలోని చిన్నగొట్టిముక్కుల గ్రామ రైతులతో అవార్డు సమావేశం స్థానిక రైతు వేదికలో ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ఆర్డీవో హాజరై మాట్లాడుతూ గ్రామం మీదుగా కెనాల్ వెళ్తుందని, కాల్వ కోసం ప్రభుత్వం భూమి సేకరిస్తున్నామని చెప్పారు. తమ భూములకు మార్కెట్ ధరకు అనుగుణంగా పరిహారం వచ్చేలా చర్యలు తీసుకోవాలని కొందరూ, కాల్వ నిర్మాణానికి తమ భూములు తీసుకోవద్దని మరి కొంతమంది రైతులు ఆయనను కోరారు. రైతుల అభ్యర్థనలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తానని ఆర్డీఓ వివరించారు. సమావేశంలో తహసీల్దార్ కమలాద్రి, ఆర్ఐ కిషన్ తదితరులు పాల్గొన్నారు. సీల్డ్ టెండర్ల ఆహ్వానం ప్రశాంత్నగర్(సిద్దిపేట): జిల్లాలోని 27 పీఎంశ్రీ ప్రభుత్వ పాఠశాలల్లో శానిటరీ ప్యాడ్స్ సరఫరా చేయడానికి సీల్డ్ టెండర్లను ఆహ్వానిస్తున్నట్లు సిద్దిపేట డీఈఓ శ్రీనివాస్రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. టెండర్ ఫారం ధర రూ.2 వేలు, ఈఎండీ ధర రూ.50 వేలు ఉంటుందన్నారు. టెండర్ ఫారాలు ఈ నెల 28 వరకు విద్యాశాఖ కార్యాలయంలో పొందాలని, పూర్తి చేసిన ఫారాలను బాక్స్లో వేయాలన్నారు. సీల్డ్ టెండర్లను ఈ నెల 29న ఉదయం 11గంటలకు జేపీసీ కమిటీ ఆధ్వర్యంలో తెరుస్తామని తెలిపారు. -
పారిశుద్ధ్యంపై నిర్లక్ష్యం వద్దు
డీపీఓ యాదయ్య చిన్నశంకరంపేట(మెదక్): గ్రామాల్లో పారిశుద్ధ్యం నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని డీపీఓ యాదయ్య అధికారులకు సూచించారు. మండలంలోని రుద్రారం, చందంపేట గ్రామాల్లో మంగళవారం డీపీఓ ఆకస్మికంగా పర్యటించి పారిశుద్ధ్య నిర్వహణను పరిశీలించారు. గ్రామాల్లో పారిశుద్ధ్యం పై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సందర్భంగా పంచాయతీ రికార్డులు, పల్లె ప్రకృతి వనం, నర్సరీలను పరిశీలించారు. అనంతరం గ్రామ కార్యదర్శులు అనురాధ, పద్మలకు పలు సూచనలు చేశారు. -
నీళ్లు లేక నెర్రెలు బారి
నర్సాపూర్రూరల్: పంటలు ఎండుతుండటంతో రైతులు బోరున విలపిస్తున్నారు. వేల రూపాయలు పెట్టుబడి పెట్టి వరి సాగు చేస్తే చేతికందకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని అవంచ గ్రామానికి చెందిన చిగురు కృష్ణయ్య తనకున్న మూడెకరాల్లో వరి సాగు చేస్తున్నాడు. భూగర్భజలాలు అడుగంటిపోవడంతో బోరు బావితో వరికి నీరందించలేని పరిస్థితి నెలకొంది. రెండు లక్షలు ఖర్చు పెట్టి బోరు వేయించినా చుక్క నీరు పడలేదు. దీంతో పెట్టుబడితో పాటు బోరు అప్పులు మిగిలాయని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. అధికారులు సన్నకారు రైతులను ఆదుకోవాలని కోరాడు. ఎండుతున్న వరి పంటలు బోరున విలపిస్తున్న రైతులు -
సన్నబియ్యం సన్నద్ధం
బయట విక్ర యానికి బ్రేక్!మెదక్జోన్: ఆహార భద్రత కార్డులున్న పేదలకు సన్న బియ్యం పంపిణీ చేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఏప్రిల్ ఒకటి నుంచి చౌకధరల దుకాణాల ద్వారా సరఫరా చేయనున్నారు. కాగా ఇప్పటి వరకు పంపిణీ చేసిన దొడ్డు బియ్యాన్ని 80శాతం మంది తినలేదు. కేవలం 20 శాతం మాత్రమే తిన్నారు. రేషన్ షాపుల ద్వారా ఉచితంగా తీసుకొని బయట అమ్ముకున్నారు. కానీ ఇక నుంచి పంపిణీ చేసే సన్న బియ్యాన్ని లబ్ధిదారులందరూ తిననున్నారు. జిల్లాలో రెండు లక్షల పై చిలుకు రేషన్ కార్డులు మెదక్ జిల్లాలో 2,14,155 రేషన్ కార్డులు ఉన్నాయి. వాటిలో ఆహార భద్రత కార్డులు 2,00,229, అంత్యోదయ కార్డులు 13,860, అన్నపూర్ణ కార్డులు 66 ఉండగా వీటికీ నెలకు 4367.538 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని 520 రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ చేస్తున్నారు. కాగా ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని సన్న బియ్యం పథకాన్ని సంబంధిత శాఖ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఆ మరుసటి రోజు నుంచి చౌకధరల దుకాణం ద్వారా ఒక్కో వ్యక్తికి 6 కిలోల చొప్పున ఇవ్వనున్నట్లు సంబంధిత అధికారి తెలిపారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే ఆయా ఎంఎల్ఎస్ పాయింట్లలో బియ్యం సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు. వానాకాలంలో 1.5 లక్షల ఎకరాల్లో సాగు ఖరీఫ్లో జిల్లా వ్యాప్తంగా 2.73 లక్షల ఎకరాల్లో వరి సాగు కాగా అందులో 1.5 లక్షల ఎకరాల్లో సన్నాలను సాగు చేశారు. ఇందుకు ప్రధాన కారణం ప్రభుత్వం క్వింటాల్కు అదనంగా రూ.500 బోనస్ ఇవ్వడంతో ఎక్కువ మొత్తంలో సన్నాల సాగుకు రైతులు మొగ్గు చూపారు. కాగా ప్రత్యేకంగా జిల్లా వ్యాప్తంగా 93 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి 53,660 మెట్రిక్ టన్నుల సన్న ధాన్యం సేకరించారు. సీఎంఆర్ కోసం పలు రైస్మిల్లర్లకు ధాన్యం ఇవ్వగా ఇప్పటి వరకు 80 శాతం బియ్యాన్ని మిల్లర్లు ఇచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. మిగతా 20 శాతం 15 రోజుల్లో రానున్నట్లు అధికారులు పేర్కొన్నారు. కాగా గతంలో హుజురాబాద్ ఉప ఎన్నికల నేపథ్యంలో కొత్తవారు రేషన్కార్డులకు దరఖాస్తు చేసుకునేందుకు వారం పాటు సమయం ఇవ్వగా జిల్లా వ్యాప్తంగా 2,500 మంది దరఖాస్తు చేసుకున్నారు. ప్రస్తుతం 15 రోజుల నుంచి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తుండగా ఇప్పటి వరకు 4 వేల పైచిలుకు దరఖాస్తులు వచ్చాయి. కానీ ఈ ప్రక్రియ ఎప్పటి వరకు పూర్తవుతుందో అధికారులు కచ్చితమైనా డేట్ను నిర్ణయించలేదు. ఒకటి నుంచి చౌకధరల దుకాణాల ద్వారా పంపిణీ జిల్లా వ్యాప్తంగా 2.14 లక్షల కార్డులు ప్రతి నెల 4367.538 మెట్రిక్ టన్నులు ఇప్పటి వరకు చౌకధరల దుకాణాల ద్వారా అందించిన దొడ్డు బియ్యాన్ని నిరుపేదలైన 20 శాతం జనాలు మాత్రమే తినగా 80 శాతం మంది జనాలు వాటిని విక్రయించారు. రేషన్ బియ్యం ఇచ్చారని తెలియగానే టాటా ఏసీ వాహనాల ద్వారా పలువురు వ్యాపారులు గ్రామాల్లో గద్దల్లా వాలిపోయి ఇండ్లు తిరుగుతూ కిలోకు రూ.15 చొప్పున బియ్యాన్ని కొనుగోలు చేసేవారు. ఆ బియ్యాన్ని రైస్మిల్లర్స్ వారి దగ్గర కొనుగోలు చేసి వాటినే తిరిగి ప్రభుత్వానికి (ఎఫ్సీఐ)కి అప్పగించే వారు. ఇలా రొటీన్ పద్ధతిలో పీడీఎస్ రైస్ తిరిగేవి. ప్రస్తుతం సన్నబియ్యం పంపిణీ కాబోతుండటంతో వాటిని బయట విక్రయించకుండా ప్రతి కుటుంబం ఇక నుంచి సన్న బియ్యాన్ని తిననున్నారు. -
ఘనపురం ప్రాజెక్టుకు గ్రహణం
ఘనపురం ప్రాజెక్టు పాపన్నపేట(మెదక్): మెతుకు సీమ రైతన్నలకు బతుకునిచ్చే ఘనపురం ప్రాజెక్టుకు గ్రహణం వీడటం లేదు. ఏళ్లు గడుస్తున్నా ఎత్తు పెంపు, లైనింగ్ పనులు పూర్తి కావడం లేదు. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ఏరియల్ సర్వే నిర్వహించి, ఆనకట్ట ఎత్తు పెంపు కోసం మంజూరు చేసిన రూ.43.64 కోట్ల నిధులకు గాను రూ.23.50 కోట్లు మాత్రమే విడుదలయ్యాయి. దీంతో భూసేకరణ ఆగిపోయింది. ఎనిమిదేళ్లు గడిచినా పనులు ముందుకు సాగడం లేదు. ఎత్తు పెరిగితే నీటి నిల్వ సామర్థ్యం 0.3 టీంఎసీలకు చేరి మరో 10 వేల ఎకరాలకు సాగునీరు అందనుంది. ఫతే నహర్, మహబూబ్ నహర్ కెనాళ్ల లైనింగ్ కోసం 2022లో రూ.50.32 కోట్లు మంజూరయ్యాయి. కాని ఇంత వరకు 50 శాతం పనులే పూర్తయ్యాయి. 1905లో ప్రాజెక్టు నిర్మాణం కరువు నేలలో సిరులు పండించాలన్న ఆశయంతో 1905లో నిజాం ప్రభువు నిర్మించిన ఘనపురం ప్రాజెక్టు 120 ఏళ్లు దాటినా మరమ్మతులకు నోచుకోవడం లేదు. మంజీరా నదిపై 0.3 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో 21,165 ఎకరాల సాగు లక్ష్యంతో ప్రాజెక్టును నిర్మించారు. ఆనకట్ట పొడవు 725 మీటర్లు కాగా ఇరు వైపులా ఫతేనహర్, మహబూబ్ నహర్ కాలువలు ఉన్నాయి. మట్టి పూడిక తీయకపోవడంతో నీటి నిల్వ సామర్థ్యం 0.135కు పడిపోయింది. దీంతో సింగూరు నుంచి నీరు విడుదల చేసినప్పుడల్లా .. నీరు వృథా అవుతోంది. ఎత్తు పెంపునకు, లైనింగ్కు నిధులు మంజూరు 2014లో హెలికాప్టర్లో ఏరియల్ సర్వే నిర్వహించిన అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్, ఆనకట్ట ఎత్తు పెంపు కోసం రూ.43.64 కోట్లు మంజూరు చేశారు. ప్రస్తుతం 462.775 మీటర్ల ఎత్తు ఉన్న ఆనకట్టను 1.725 మీటర్లు పెంచాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఎత్తు పెంపు వల్ల కొల్చారం మండలంలోని చిన్న ఘనపూర్, పాపన్నపేట మండలంలోని నాగ్సాన్పల్లి, కొడుపాక, చిత్రియాల్ గ్రామాలకు చెందిన 191.14 ఎకరాల భూమి నీట మునుగుతోంది. వీరికి రూ.13.10 కోట్ల పరిహారం చెల్లించాల్సి ఉండగా, ఇందులో రూ.5 కోట్లు రైతులకు చెల్లించారు. మరో రూ.8.10 కోట్లు విడుదల కావాల్సి ఉంది. ఎత్తు పెంపులో భాగంగా ఆనకట్ట పొడవునా యాప్రాన్ పనులు చేశారు. ఈ మేరకు రూ.18.50 కోట్లు చెల్లించారు. 2017 చివరలో పనులు నిలిచిపోయాయి. అధికారులు ప్రతి ఏటా ప్రతిపాదనలు పంపుతున్నా, ఇప్పటి వరకు నిధులు మంజూరు కాలేదు. అలాగే మహబూబ్ నహర్, ఫతేనహర్ కెనాల్ల లైనింగ్ కోసం 2022లో రూ.50.32 కోట్లు మంజూరయ్యాయి. సుమారు 25 కి.మీ లైనింగ్ కావాలి. మూడేళ్లలో 50 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయి. ఏటా పంటలకు నీరు వదులుతుండటంతో పనులు ముందుకు సాగడం లేదు. ఎత్తు పెంపు, లైనింగ్ కోసం ప్రతిపాదనలు ఎనిమిదేళ్లయినా విడుదల కాని నిధులు ఆగిన భూసేకరణ..ముందుకెళ్లని పనులు రూ.43.64 కోట్లకు గాను సగం నిధులే విడుదల ఎత్తు పెరిగితే 10 వేల ఎకరాలకు ప్రయోజనం నిధుల కోసం ప్రతిపాదనలు పంపించాం ఘనపురం ఆనకట్ట ఎత్తు పెంపు కోసం నిధులు అవసరం. భూసేకరణలో భాగంగా రైతులకు పరిహారం చెల్లించేందుకు సుమారు రూ.8 కోట్లు కావాలి. అలాగే ఎఫ్ఎన్, ఎంఎన్ కెనాళ్ల లైనింగ్ పనులు కొనసాగుతున్నాయి. ఏటా రెండు పంటల కోసం కాలువల ద్వారా నీరు విడుదల చేయాల్సి వస్తున్నందున పనులు ఆగిపోతున్నాయి. పూర్తి కావడంలో జాప్యం జరుగుతోంది. –శివనాగరాజు, డీఈఈ, ఇరిగేషన్ -
రోగులకు మెరుగైన వైద్య సేవలు
శివ్వంపేట(నర్సాపూర్): ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు మెరుగైన వైద్య సేవలందించేందుకు సిబ్బంది పూర్తి స్థాయిలో కృషి చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్రాజ్ అన్నారు. మంగళవారం శివ్వంపేటలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆసుపత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. సిబ్బంది సమయ పాలన పాటిస్తూ, ప్రసవాల సంఖ్య పెంచాలని సూచించారు. అనంతరం గూడూరులోని కస్తూర్బా గాంధీ హాస్టల్ని కలెక్టర్ తనిఖీ చేశారు. వంటగది నిర్వహణ పరిశుభ్రంగా లేకపోవడంతో సిబ్బంది పై అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం పదవ తరగతి విద్యార్థులతో విద్యా సామర్థ్యాలకు సంబంధించిన ప్రశ్నలు అడిగి జవాబులు రాబట్టారు. పది అనంతరం ఉన్నత చదువులు చదువుకోవాలన్నారు. 18 ఏండ్లు నిండకుండా మైనర్లకు పెండ్లి చేస్తే వారి తల్లిదండ్రులతో పాటు భాగస్వాములైన వారందరిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ కస్తూర్బా గాంధీ హాస్టల్ తనిఖీ -
సబ్సిడీ పై సాగు పరికరాలు
● నూతన పద్ధతులలో ప్రోత్సహించేందుకు.. ● ఎస్సీ, ఎస్టీ రైతులకు 50 శాతం, జనరల్ రైతులకు 40 శాతం రాయితీ ● 27వరకు దరఖాస్తుకు అవకాశం ● మండల కమిటీ ద్వారా లబ్ధిదారుల ఎంపిక టేక్మాల్(మెదక్): ప్రభుత్వం రైతులకు అండగా నిలిచేందుకు సబ్సిడీపై పరికరాలను అందిస్తోంది. నూతన పద్ధతులతో వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు 2024–25 సంవత్సరానికి పరికరాలను అందించడానికి దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించారు. అర్హులైన వారిని ఎంపిక చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. సబ్సిడీకి అర్హులు.. ● పట్టా పాస్ పుస్తకం కలిగిన ఎస్సీ, ఎస్టీ, జనరల్ మహిళలు మాత్రమే అర్హులు ● ఎస్సీ, ఎస్టీ రైతులకు 50% రాయితీ, జనరల్ రైతులకు 40% రాయితీ ● లక్ష కన్నా ఎక్కువ లబ్ధి పొందే రైతు ఖచ్చితంగా ఒక ఎకరం భూమి కలిగి ఉండాలి యంత్ర పరికరాలు ఇవే.. రైతులకు అందజేయనున్న పరికరాల్లో బ్యాటరీ స్ప్రేయర్లు జనరల్ 2, ఎస్సీలకు1, పవర్ స్ప్రేయర్ జనరల్కు 3, ఎస్సీలకు 1, రోటవేటర్ జనరల్ 1, సీడ్ కమ్ ఫర్టీలైజర్ డ్రిల్ జనరల్ 1, డిస్క్ హ్యారో జనరల్ 2, ఎస్టీలకు 1, ట్రాక్టర్ ఎస్సీలకు 1 ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఎంపిక విధానం ఇలా.. రైతులు దరఖాస్తు చేసుకున్న అనంతరం మండల స్థాయిలో నియమించిన కమిటీ సమక్షంలో లబ్ధిదారుల ఎంపిక జరుగుతుంది. ఈ కమిటీకి కన్వీనర్గా మండల వ్యవసాయాధికారి, మెంబర్లుగా తహసీల్దార్, ఎంపీడీఓలు వ్యవహరిస్తారు. దరఖాస్తుకు కావాల్సినవి.. ఈ నెల 27వ తేదీలోపు దరఖాస్తు ఫారంతో పాటు పట్టాదారు పాసుపుస్తకం, ఆధార్ కార్డు, ట్రాక్టర్కు సంబంధించిన పరికరాలకు ఆర్సీ జిరాక్స్, పాస్ ఫొటో, బ్యాంక్ పాసు పుస్తకం కావాలి. భూమి సారానికి సంబంధించిన సాయిల్ హెల్త్ కార్డు తప్పనిసరి జతచేయాలి. సద్వినియోగం చేసుకోవాలి ప్రభుత్వం అందించే రాయితీ పథకాలను గ్రామాల్లోని రైతులు సద్వినియోగం చేసుకోవాలి. ఈ ఆర్థిక సంవత్సరం ముగుస్తున్నందున ఈ నెల 27వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలి. నిబంధనల ప్రకా రం లబ్ధిదారుల ఎంపిక జరుగుతుంది. రైతులు మరింత సమాచారం కోసం వ్యవసాయ కార్యాలయాన్ని సంప్రదించాలి. – రాంప్రసాద్, ఏఓ, టేక్మాల్ -
ఈ పాస్ మిషన్ల ద్వారా ఎరువులు
కౌడిపల్లి(నర్సాపూర్): డీలర్లు ఈ పాస్ మిషన్ల ద్వారా ఎరువులు విక్రయించాలని జిల్లా వ్యవసాయ అధికారి విన్సెంట్ వినయ్కుమార్ అన్నారు. మంగళవారం కౌడిపల్లిలోని భాగ్యలక్ష్మి ట్రేడర్స్, మహమ్మద్నగర్లోని పీఏసీఎస్ ఎరువుల దుకాణాలను ఆకస్మిక తనిఖీ చేసి స్టాక్, రిజిస్టర్, ధరల పట్టికను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డీలర్లు ప్రభుత్వం నిర్ణయించిన ధరకే ఎరువులు అమ్మాలని సూచించారు. మోతాదుకు మించి ఎరువులు చల్లవద్దని డీలర్లు రైతులకు చెప్పాలన్నారు. సీజన్కు అనుగుణంగా ఎరువులు అందుబా టులో ఉంచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏడీఏ పుణ్యవతి, ఏఓ స్వప్న, డీలర్ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. వ్యవసాయ అధికారి విన య్కుమార్పశుగ్రాసం, పండ్లతోటలపై రైతులకు అవగాహన నర్సాపూర్: రైతు నేస్తం కార్యక్రమం ద్వారా రైతులకు శాస్త్రవేత్తలు పలు అంశాలపై మంగళవారం అవగాహన కల్పించారు. స్థానిక రైతు వేదికలో జిల్లా వ్యవసాయాధికారి విన్సెంట్ వినయ్కుమార్ పలువురు రైతులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ను వీక్షించారు. రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్త బాలాజీనాయక్ వేసవిలో పశుగ్రాస యాజమాన్యం అంశంపై, అసిస్టెంట్ ప్రొఫెసర్ శంకర్ స్వామి పండ్ల తోటల అంశంపై, ఇప్కో రాష్ట్ర మార్కెటింగ్ మేనేజర్ కృపాశంకర్ మాట్లాడుతూ నానో ఎరువుల ప్రయోజనాలు, దిగుబడి పెంపు, నేల ఆరోగ్యం ప్రభావం అనే అంశాలపై వీడియో ద్వారా రైతులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారులు దీపిక, రాజశేఖర్, ఏఈఓలు చంద్రవేణి, రవివర్మ, నిరోష, తేజస్విని, దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
కంటి దీపాలకు కనుచూపెవరు?
సుగుణమ్మ ముగ్గురు కుమారులూ అంధులే● చిన్న కొడుకు నీటి గుంతలో పడి మృతి ● ఇంటి పెద్దను కాటేసిన కేన్సర్ ● అంధులైన కొడుకులకు పిల్లనివ్వని దైన్యం ● నేను కనుమూస్తే నా బిడ్డలకు దిక్కెవరు? ● తల్లడిల్లుతున్న మాతృమూర్తి మెదక్జోన్: ‘పెళ్లయిన మూడేళ్లకు మొదటి సంతానంలో కొడుకు పుట్టాడని ఆనందపడ్డాం. విశ్వనాథం అని కాశీ విశ్వనాథుడి పేరు పెట్టుకున్నాం. బుడిబుడి అడుగులు వేస్తుంటే సంబరపడ్డాం. కానీ.. మా సంతోషం ఎంతో కాలం నిలవలేదు. మా కుమారుడికి కళ్లు కనిపించవని వైద్యులు పిడుగులాంటి వార్త చెప్పారు. వరుసగా మరో ఇద్దరు కొడుకులకు సైతం అంధత్వం రావటంతో మా తలరాత ఇంతే అని సరిపెట్టుకున్నాం. చిన్నపాటి హోటల్ నడుపుకుంటూ పిల్లలను సాదుకుంటుండగా.. విధి పగ బట్టినట్లుగా కేన్సర్ మహమ్మారి నా భర్తను కాటేసింది. ఐదేళ్లకు చిన్నకొడుకు నీటి గుంతలో పడి మరణించాడు. దీంతో మా కుటుంబం చిన్నాభిన్నమైంది. ఉన్న ఇద్దరితో ఎలాగోలా నెట్టుకొస్తున్నా.. నేను పోయాక నా బిడ్డలను ఎవరు చూస్తారో..? తలుచుకుంటే కన్నీళ్లు ఆగడం లేదు’అని ఎనిమిది పదుల వయసులో సుగుణమ్మ ఆందోళన చెందుతుంది. ఎన్నో ఆస్పత్రులు తిరిగినా.. మెదక్ పట్టణానికి చెందిన కందుకూరి కృష్ణ, సుగుణమ్మ దంపతులకు ముగ్గురు మగ సంతానం. పెద్ద కొడుకు విశ్వనాథం, రెండో కొడుకు సంతో ష్, చిన్న కొడుకు రాము.. పుట్టిన ముగ్గురు అంధులే కావటంతో తమ బిడ్డల భవిష్యత్ కోసం ఎన్నో ఆస్పత్రులు తిరిగారు. హైదరాబాద్లోని ఎల్వీ ప్రసాద్, సరోజినిదేవి, చైన్నెలోని శంకర్ నేత్రాలయం లాంటి ప్రముఖ ఆస్పత్రుల్లో చికిత్స చేయించారు. అయినా ఫలితం లేకుండా పోయింది. దీంతో ఆశలు వదులుకొని పట్టణంలో చిన్నపాటి హోటల్ ఏర్పాటుచేసి జీవనం సాగించారు. కుటుంబం సాఫీగా సాగుతున్న తరుణంలో.. 2009లో ఇంటి పెద్ద కృష్ణకు కేన్సర్ సోకింది. ఎలాగైనా బతకాలని.. తనకేమైనా జరగరానిది జరిగితే అంధులైన తన బిడ్డల భవిష్యత్ ఏంటని ఎన్నో ఆస్పత్రులు తిరిగారు. అయినా ఫలితం లేకపోవటంతో కృష్ణ మరణించాడు. దీంతో కుటుంబ బాధ్యత పూర్తిగా సుగుణమ్మపై పడింది. ఉన్న హోటల్ను నడపలేని పరిస్థితి ఏర్పడింది. చిన్నపాటి కిరాణం నడుపుకుంటూ జీవిస్తుండగా.. 2014లో చిన్నకొడుకు రాము ఏడుపాయల దుర్గమ్మ దర్శనానికి స్నేహితుల సహాయంతో వెళ్లాడు. అక్కడ బహిర్భూమికి వెళ్లి నీటి గుంతలో పడి మరణించాడు. పింఛనే పెద్ద ఆసరా ఉన్న ఇద్దరు కొడుకులను ప్రభుత్వ పెన్షన్తో సాదుకుంటోంది సుగుణమ్మ. ప్రస్తుతం ఆమెకు వృద్ధాప్యం మీద పడుతోంది. వయసు 80 ఏళ్లు. శరీరం సహకరించకున్నా అతికష్టం మీద వారికి వంట చేసి పెడుతోంది. తన తదనంతరం బిడ్డల పరిస్థితి ఏంటని మనోవేదనకు గురవుతోంది. తన పెద్ద కొడుకు విశ్వనాథంకు 40 ఏళ్లు ఉండగా.. పెళ్లి చేయాలని ఎంతగానో ఆరాట పడుతోంది. కానీ అంధులైన ఆమె కొడుకులకు పిల్లను ఇచ్చేందుకు ఎవరూ ముందుకు రావటం లేదు. మా నాన్న అతికష్టం మీద పదో తరగతి వరకు చదివించారని.. ప్రస్తుతం జీవనోపాధి కష్టంగా మారింది.. చిన్నపాటి అటెండర్ ఉద్యోగం ఇప్పించి జీవనోపాధి కల్పించాలని కొడుకు విశ్వనాథం వేడుకుంటున్నాడు. -
ఏం చేశాం.. ఎంత ఇచ్చాం!
తాము అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అందుకు ఖర్చు చేసిన నిధుల వివరాలను రైతులకు తెలియజేయాలని సర్కారు నిర్ణయించింది. రుణమాఫీ, రైతు భరోసా లబ్ధిదారుల పేర్లను ఫ్లెక్సీల్లో ముద్రించి గ్రామాలు, ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేయడానికి సన్నద్ధమవుతోంది. గ్రామాల వారీగా ఎన్ని కోట్లు ఇచ్చాం.. ఏ రైతుకు ఎంతమేర లబ్ధి చేకూరింది అనే విషయాలను గ్రామస్తులు చర్చించుకునేలా చూడాలని ప్రణాళికలు రచిస్తోంది. ఉగాది నాటికి ఈ పక్రియను పూర్తి చేయాలని వ్యవసాయశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. – మెదక్జోన్ జిల్లావ్యాప్తంగా సుమారు 4 లక్షల ఎకరాల సాగుభూములు ఉండగా, వాటిలో ఏటా 3.95 లక్షల ఎకరాలను 2.91 లక్షల మంది రైతులు సాగు చేస్తున్నారు. ఒక్కో గ్రామంలో కనీసం 300 నుంచి 500 వందలకు తగ్గకుండా రైతులు ఉంటారు. వీరిలో రుణమాఫీ వర్తించిన వారు తక్కువ మంది ఉన్నా, రైతు భరోసా అందిన వారు 90 శాతానికి పైగా ఉంటారు. కాగా ఫ్లెక్సీల్లో రైతు పేరు, తండ్రి పేరు, భూమి, బ్యాంకు అకౌంట్, రుణమాఫీ ఎంత అయింది.. రైతు భరోసా కింద ఎంత జమ అయిందనే పూర్తి సమాచారం ఫ్లెక్సీల్లో ముద్రించనున్నట్లు సంబంధిత ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. కాగా ఒక్కో ఫ్లెక్సీ సైజు ఆరు అడుగుల పొడవు, మూడు అడుగుల వెడల్పుతో ఉండనుందని తెలిసింది. దీంతో 500 మంది రైతులు ఉన్న గ్రామంలో అందరి పేర్లు ముద్రించాలంటే కనీసం 5 ఫ్లెక్సీలు అవసరం పడనున్నాయి. అలాగే ప్రతి గ్రామంలోని మూడు ప్రధాన కూడళ్ల వద్ద వీటిని ప్రదర్శించాలంటే కనీసం 15 ఫ్లెక్సీలు కావాలి. ఈ లెక్కన జిల్లాలో 493 గ్రామాలకు గానూ 7,393 ఫ్లెక్సీలు అవసరం ఉంటాయి. ఒక్కో ఫ్లెక్సీకి ప్రభుత్వం రూ. 300 చొప్పున ఇవ్వనున్నట్లు సమాచారం. రుణమాఫీ రూ. 654.12 కోట్లు జిల్లాలో 2.91 లక్షల మంది రైతులు ఉండగా, రూ. 2 లక్షల లోపు అర్హులైన 88,683 మంది రైతులకు నాలుగు విడతల్లో కలిపి రూ. 654.12 కోట్ల నిధులు జమ చేసింది. అలాగే ప్రస్తుత యాసంగి సీజన్కు సంబంధించి 2,54,238 మంది రైతులకు రైతు భరోసా కింద ఒక్కో ఎకరాకు రూ. 6 వేల చొప్పున జిల్లాకు రూ. 193 కోట్ల నిధులు వచ్చాయి. రైతుల ఓట్లే కీలకం! రైతు భరోసా, రుణమాఫీ విషయంలో ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. తాము చేసిన పనులను ఊరూవాడా చర్చించుకోవాలనే ఈ ఆలోచనకు తెరతీసినట్లు తెలుస్తోంది. త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పైచేయి సాధించాలంటే రైతుల ఓట్లే కీలకమని భావిస్తోంది. రుణమాఫీ, రైతు భరోసాలబ్ధిదారుల పేర్లు ప్రదర్శన గ్రామాలు, ప్రధాన కూడళ్లలోఫ్లెక్సీల ఏర్పాటుకు నిర్ణయం వ్యవసాయశాఖ అధికారులకుఅందిన ఆదేశాలు ఉగాది నాటికి ఏర్పాటు చేసేలా చర్యలుఆదేశాలు వచ్చాయి జిల్లావ్యాప్తంగా రుణమాఫీ, రైతు భరోసా లబ్ధిదారుల పేర్లను ఫ్లెక్సీల్లో ముద్రించి గ్రామాల్లో ప్రదర్శించాలని తమకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి. ఇందుకు సంబంధించి కలెక్టర్ నుంచి అనుమతి తీసుకొని ఫ్లెక్సీల్లో లబ్ధిపొందిన రైతుల పేర్లను ముద్రణ చేపడతాం. – వినయ్, జిల్లా ఇన్చార్జి వ్యవసాయ అధికారి -
ప్రోత్సాహం ఏదీ?
పీఎం విశ్వకర్మలో మూడు పథకాలు అవుట్ ● మూడేళ్లుగా ఆగిన లబ్ధిదారుల ఎంపిక ● ఆందోళనలో వృత్తిదారులు ● జిల్లాలో 1,303 దరఖాస్తులువృత్తిపైనే ఆధారపడి ఉన్నం తాతల కాలం నుంచి వడ్రంగి వృత్తియే ఆధారం. దీనితోనే కుటుంబాన్ని పోషించుకుంటున్నాం. ప్రభుత్వ సాయంతో పనిముట్లు కొనుగోలు చేసుకుందామని రెండేళ్ల క్రితం పీఎం విశ్వకర్మ పథకానికి దరఖాస్తు చేసుకున్నా. ఇప్పటికీ ఎంపిక చేయడం లేదు. ఎంతో ఆశతో దరఖాస్తు చేసుకున్నా.. ప్రయోజనం లేకుండా పోయింది. – వడ్ల రవి, అక్కన్నపేట, రామాయంపేట పథకాలు అందించాలి పీఎం విశ్వకర్మలో వడ్రంగి, మేసన్, టైల ర్ వృత్తిదారులకు సంబంధించిన పథకాలు నిలిపివేయడం అన్యాయం. రెండేళ్ల క్రితం ఈ పథకాలకు సంబంధించి దరఖాస్తు చేసుకున్నా. ప్రభుత్వం వెంటనే లబ్ధిదారుల ఎంపిక చేపట్టి సంక్షేమ పథకాలు అందించాలి. – వడ్ల శ్రీనివాస్, అక్కన్నపేట, రామాయంపేటమెదక్ కలెక్టరేట్: అంతరించిపోతున్న సంప్రదాయ చేతి వృత్తులను ప్రోత్సహించేందుకు 2023లో కేంద్ర ప్రభుత్వం విశ్వకర్మ యోజన పథకానికి శ్రీకారం చుట్టింది. చేతి వృత్తులు, సంప్రదాయ సాధనాలపై ఆధారపడిన కళాకారులకు సమగ్ర సహాయం అందించాలనేది ఈ పథకం ముఖ్య ఉద్దేశం. పథకం ప్రారంభించిన సమయంలో 18 రకాల వృత్తిదారులను ఎంపిక చేసి దరఖాస్తు చేసుకోవాలని కేంద్రం సూచించింది. దీంతో 2023 నుంచి ఇప్పటివరకు జిల్లాలో వేలాది మంది వృత్తిదారులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో కొన్ని పథకాలకు లబ్ధిదారులను ఎంపిక చేసి శిక్షణ ఇవ్వడంతో పాటు సర్టిఫికెట్ అందజేశారు. అలాగే బ్యాంకు ద్వారా రూ. 1 లక్ష రుణం ఇచ్చారు. ఈ క్రమంలో ఏడాదిగా పథకంలో మేసన్, వడ్రంగి, టైలర్ పథకాలను కేంద్ర ప్రభుత్వం నిలిపివేసింది. జిల్లాలో 1,303 మంది లబ్ధిదారులు ఈ పథకాల కోసం దరఖాస్తు చేసుకొని ఆశగా ఎదుచూస్తున్నారు. ఈ విషయమై జిల్లా పరిశ్రమల అధికారి ప్రకాశ్ను వివరణ కోరగా మేసన్, వడ్రంగి, టైలర్ పథకాలను ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసినట్లు తెలిపారు. విశ్వకర్మ పథకంలో అత్యధికంగా ఈ మూడు వృత్తిదారుల దరఖాస్తులు వస్తున్నాయని, దీంతో మిగతా లబ్ధిదారులకు ఇబ్బందులు ఏర్పడుతున్నట్లు చెప్పారు. అందుకే వారి ఎంపిక తాత్కాలికంగా నిలిపివేశారని, తిరిగి ప్రభుత్వం ఎప్పుడు ప్రారంభిస్తుందో తెలియదని అన్నారు. -
నష్టపోయిన రైతులను ఆదుకోండి
సిద్దిపేటరూరల్: అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలకు తక్షణం నష్టపరిహారం అందజేయాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. ఆదివారం నారాయణరావుపేట మండలం లక్ష్మీదేవిపల్లిలో వడగళ్ల వర్షానికి దెబ్బతిన్న పంటలను పరిశీలించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దెబ్బతిన్న పంటలను అంచనా వేసి వెంటనే ఇన్పుట్ సబ్సిడీ కింద ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు. వరంగల్ డిక్లరేషన్లో ఎన్నో మాటలు చెప్పిన కాంగ్రెస్ నేటికీ అమలు చేయలేదన్నారు. రైతులకు రూ.2లక్షలు మాఫీ చేస్తానని చెప్పి పూర్తి స్థాయిలో మాఫీ చేయలేదన్నారు. రైతు భరోసా పేరిట ఇస్తానన్న డబ్బులు కూడా ఇవ్వలేదన్నారు. వెంటనే వర్షాకాలం, యాసంగి పంటల రైతు భరోసా రూ. 15 వేల చొప్పున అందించాలన్నారు. దెబ్బతిన్న పంటలను అంచనా వేయించి వెంటనే రైతులకు తగిన నష్టపరిహారం అందించాలని కోరారు. మాజీ మంత్రి హరీశ్రావు -
విద్యార్థులు కొత్త విషయాలు నేర్చుకోవాలి
నర్సాపూర్: మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా విద్యార్థులు నిరంతరం కొత్త విషయాలు నేర్చుకోవడం ఎంతో ముఖ్యమని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల ముఖ్య కార్యదర్శి జయేశ్రంజన్ అన్నారు. ఆదివారం కెంటెల్, రిస్క్గార్డ్, ఎస్– హాచ్ సంస్థలు స్థానిక బీవీ రాజు ఇంజనీరింగ్ కాలేజీతో కలిసి హైదరాబాద్ టీ– హబ్లో మెంటరెక్స్ కార్యక్రమం నిర్వహించాయి. కార్యక్రమానికి ముఖ్య అథితిగా జయేశ్రంజన్ హాజరై మాట్లాడారు. విద్యార్థులు నైపుణ్యాన్ని పెంపొందించుకోవడానికి కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో టీ–హబ్ మాజీ సీఈఓ మహంకాళీ శ్రీనివాస్రావు, విష్ణు ఎడ్యుకేషన్ సొసైటీ వైస్ చైర్మన్ రవిచంద్రన్ రాజగోపాల్, బీవీ ఆర్ఐటీ ప్రిన్సిపాల్ సంజయ్దూబె తదితరులు మాట్లాడారు. -
చివరి వారం .. పోటెత్తిన భక్తజనం
ముగిసిన కొమురవెల్లి బ్రహ్మోత్సవాలు కొమురవెల్లికి భక్తులు పోటెత్తారు. చివరి ఆదివారం మల్లన్న క్షేత్రానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. మూడు నెలలుగా కొనసాగిన మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు అర్ధరాత్రి నిర్వహించిన అగ్నిగుండాలతో వైభవంగా ముగిశాయి. అంతకుముందు పుష్కరిణిలో స్నానమాచరించిన భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. గంగిరేణు చెట్టువద్ద పట్నాలు వేసి, ముడుపులు కట్టి మొక్కులు తీర్చుకున్నారు. స్వామివారి దర్శనానికి సుమారు 4 గంటల సమయం పట్టినట్లు ఆలయ అధికారులు తెలిపారు. బ్రహ్మోత్సవాల్లో చివరి ఘట్టమైన అగ్నిగుండాలు అత్యంత వైభవంగా జరిగాయి. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. – కొమురవెల్లి(సిద్దిపేట) -
ఆస్పత్రులకు అంబులెన్స్లు
మెదక్జోన్: మెదక్ ఎంపీ రఘునందన్రావు తన జన్మదినాన్ని పురస్కరించుకొని సొంత నిధులతో కొనుగోలు చేసిన అంబులెన్స్లను ఆదివారం ఆస్పత్రులకు అందించి ఉదారత చాటుకున్నారు. మెదక్ పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా, నియోజకవర్గానికో అంబులెన్స్ చొప్పున ఏడింటిని హైదరాబాద్లోని తన నివాసంలో ఆయా జిల్లాల ప్రభుత్వాసుపత్రుల సూపరింటెండెట్లకు అందించారు. ప్రస్తుతం జిల్లా ఆస్పత్రికి అంబులెన్స్ లేనందున ఎంపీ అందించిన అంబులెన్స్ ఎంతగానో ఉపయోగపడనుంది. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు మల్లేశ్గౌడ్, మాజీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, నాయకులు తదితరులు పాల్గొన్నారు. హవేళిఘణాపూర్లో వర్షం హవేళిఘణాపూర్(మెదక్): మండల కేంద్రమైన హవేళిఘణాపూర్లో ఆదివారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వర్షం కురిసింది. చేతికొచ్చిన పంటలు ఏమవుతాయోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే శనివారం భారీ ఈదురు గాలులతో చెట్లు కిందపడిపోగా, వివిధ పంటలు దెబ్బతిన్నాయి. విద్యుత్ సిబ్బంది సేవలు భేష్ పాపన్నపేట(మెదక్): ఇటీవల గాలి, వానకు దెబ్బతిన్న విద్యుత్ స్తంభాలకు వెంటనే మరమ్మతులు చేసి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించిన విద్యుత్ అధికారులు, సిబ్బంది సేవలు ప్రశంసనీయమని రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి కమిషన్ సభ్యుడు పట్లోల్ల శశిధర్రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రెండు రోజుల క్రితం మెదక్ నియోజకవర్గంలో వీచిన భారీ గాలులు, వర్షానికి అనేక విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయని, వైర్లు తెగిపోయాయని చెప్పారు. అయినప్పటికీ విద్యుత్ శాఖ చీఫ్ ఇంజనీర్ బాలస్వామి, ఎస్ఈ శంకర్, ఇతర సిబ్బంది వెంటనే స్పందించి మరమ్మతులు చేశారని కొనియాడారు. నష్టపోయిన రైతులను ఆదుకోండి: సీపీఎం మెదక్ కలెక్టరేట్: ఎండిపోయిన, అకాలవర్షంతో దెబ్బతిన్న పంటలకు ప్రభుత్వం నష్ట పరిహారం ఇచ్చి రైతులను ఆదుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి నర్సమ్మ డిమాండ్ చేశారు. ఆదివారం పట్టణంలోని కేవల్ కిషన్ భవన్లో విలేకరులతో మాట్లాడారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మండుతున్న ఎండలతో బోర్లు సరిగా పోయక పంటలు ఎండుతుంటే, అకాల వర్షం కారణంగా వరి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. అలాగే జిల్లావ్యాప్తంగా గ్రామాల్లో ఇరుకు రోడ్లతో ప్రజలు అవస్థలు పడుతున్నారని తెలిపారు. వెంటనే రోడ్లుకు నిధులు కేటాయించి, డబుల్ రోడ్డు నిర్మించాలన్నారు. రాజీవ్ యువజన వికాస్ పథకానికి దరఖాస్తు సమయం తక్కువగా ఉందని, గడువు పొడిగించాలని కోరారు. విద్యార్థులు జీవన వైవిధ్యంపై దృష్టి సారించాలి నర్సాపూర్ రూరల్: విద్యార్థులు, యువత గ్రామీణ జీవన వైవిధ్యంపై దృష్టి పెట్టాలని ఎన్ఎస్ఎస్ రాష్ట్ర మాజీ లైజర్ అధికారి డాక్టర్ భాస్కర్ సూచించారు. ఆదివారం నర్సాపూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏడు రోజుల ఎన్ఎస్ఎస్ శిబిరం ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంత ప్రజలు వ్యవసాయంతో పాటు కులవృత్తులతో జీవనం కొనసాగిస్తారన్నారు. విద్యార్థులు, యువత వారిని గౌరవించాలన్నారు. ఎన్ఎస్ఎస్ శిబిరం సభ్యులు గ్రామీణ ప్రాంత ప్రజ లకు మూఢ నమ్మకాలు, బాల్య వివాహాలు, ప్రభుత్వ పథకాలు, మౌలిక వనరులపై అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ దామోదర్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి డాక్టర్ సురేష్ కు మార్, పీఆర్ఓ శ్రీనివాస్, అధ్యాపకులు మహేందర్రెడ్డి, రాజు, రాము, సుందర్ పాల్గొన్నారు. -
పాఠశాలల్లో పనులు పూర్తి చేయండి
కలెక్టర్ రాహుల్రాజ్ మెదక్ కలెక్టరేట్: సంక్షేమ పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను పూర్తిగా పరిష్కరించాలని కలెక్టర్ రాహుల్రాజ్ ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లో సంబంధిత అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాఠశాలల పునః ప్రారంభం నాటికి మరమ్మతులను వెంటనే పూర్తి చేయించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖను బలోపేతం చేసేందుకు కృషి చేస్తుందన్నారు. విద్యార్థులకు నాణ్యమైన, గుణాత్మక విద్య అందించే దిశగా చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. అందులో భాగంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయిలో వసతులు కల్పిస్తున్నట్లు చెప్పారు. వసతి గృహాలు, పాఠశాలల్లో సమస్యలుంటే వెంటనే సంబంధిత సీనియర్ అధికారికి వివరించాలని సూచించారు. మరుగుదొడ్లు, తాగునీటి సమస్య పరిష్కారానికి మొదటి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో మైనారిటీ సంక్షేమ అధికారి జమ్లా నాయక్, గిరిజన సంక్షేమ అధికారి నీలిమ, ఎస్సీ సంక్షేమ అధికారి చంద్రకళ, బీసీ సంక్షేమ అధికారి జగదీష్, సంబంధిత గురుకులాల ప్రిన్సిపాల్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. తొనిగండ్ల ఫారెస్ట్ బ్రిడ్జి పరిశీలన రామాయంపేట(మెదక్): మెదక్– సిద్దిపేట జాతీయ రహదారిలో తొనిగండ్ల ఫారెస్ట్ బ్రిడ్జి నాణ్యతను కలెక్టర్ రాహుల్రాజ్ శనివారం పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా తాత్కాలిక రోడ్డు త్వరగా ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. వర్షాకాలం రాకముందే పనులు పూర్తి చేయాలని సూచించారు. -
మల్లన్నా.. పూర్తి కమిటీ ఎప్పుడన్నా?
చైర్మన్ లేకుండానే కొనసాగుతున్న ఆలయ పాలకవర్గం సాక్షి, సిద్దిపేట: కొమురవెల్లి మల్లికార్జున స్వామి దేవాలయానికి యేడాదిన్నరగా పూర్తిస్థాయి పా లకవర్గం లేకుండానే కొనసాగుతోంది. తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో జిల్లాలోని కొమురవెల్లి మల్లికార్జునస్వామి దేవాలయం ఒకటి. చైర్మన్ లేకుండానే.. మల్లికార్జున దేవాలయం కమిటీని గతేడాది డిసెంబరు 3న.. ఎనిమిది మంది డైరెక్టర్లను, ఒక ఎక్స్ ఆఫీషియో సభ్యుడిని నియమించారు. అందులో సీహెచ్ కొమురయ్య, మోహన్ రెడ్డి, లింగంపల్లి శ్రీనివాస్, అల్లం శ్రీనివాస్, అనిరెడ్డి, మామిడ్ల లక్ష్మి, మహేందర్రెడ్డి, జయ ప్రకాశ్రెడ్డి ఉన్నారు. ఆలయ కమిటీతో 14 మంది డైరెక్టర్లతో పాటు ఎక్స్ ఆఫీషియో సభ్యులను నియమించాలి. అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడిని చైర్మన్ చేయాలనుకున్నారు. కానీ ఆ నాయకుడు దరఖాస్తు చేయకపోవడంతో మొదటగా వచ్చిన జాబితాలో డైరెక్టర్గా ఎంపిక కాలేదు. దీంతో చైర్మన్ను నియమించలేదు. మిగతా డైరెక్టర్ల నియామకం కోసం డిసెంబరు 3 నుంచి 20 రోజుల పాటు దరఖాస్తులను స్వీకరించారు. ఆరుగురు డైరెక్టర్ల కోసం 60 మంది దరఖాస్తు చేశారు. ఆశావహులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో కమిటీని ఏర్పాటు చేయలేదు. చైర్మన్ లేకుండానే నేటితో జాతర ముగుస్తోంది. కమిటీ ఏర్పాటయ్యేనా... డిసెంబరులో నియమించిన డైరెక్టర్ల పదవీకాలం మరో 9 నెలల్లో ముగుస్తుంది. అలాగే జాతర సైతం ముగిసింది. దీంతో పూర్తిస్థాయి కమిటీని ఏర్పాటు చేస్తారా? మళ్లీ జాతర ప్రారంభ సమయంలోనే నియమిస్తారా? అని జిల్లా వ్యాప్తంగా జోరుగా చర్చసాగుతోంది. దేవాలయానికి పూర్తిస్థాయి కమిటీ లేకపోవడంతో వీవీఐపీ పాస్లు ఇష్టారాజ్యంగా అధి కారులు జారీ చేశారని ప్రచారం జరుగు తోంది. ఆ పాస్లను ప్రైవేట్ వ్యక్తులు బయట విక్రయిస్తున్నారని తెలుస్తోంది. ఇప్పటికై నా దేవాదాయ ఉన్న త అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించి వీవీఐపీ పాస్లను అరికట్టాలని భక్తులు కోరుతున్నారు. డిసెంబరు 3న 8మంది డైరెక్టర్ల నియామకం అధికారులు ఇష్టారాజ్యంగా వీవీఐపీ పాసుల జారీ -
మత సామరస్యానికి ప్రతీక ఇఫ్తార్
మెదక్ మున్సిపాలిటీ: మత సామరస్యానికి ప్రతీక ఇఫ్తార్ అని మెదక్ ఆర్డీఓ రమాదేవి అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని ఓ గార్డెన్లో రాష్ట్ర ప్రభుత్వం తరఫున మైనార్టీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ముస్లింలకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు హాజరయ్యారు. ఈసందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ.. పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలో ఉండే ముస్లింల కోసం ఇఫ్తార్ ఏర్పాటుచేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి జెమ్లా నాయక్, తహసీల్దార్ లక్ష్మణ్, ఇతర మత పెద్దలు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు హఫీజ్, కాంగ్రెస్ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు మజర్ పాల్గొన్నారు. దరఖాస్తుల ఆహ్వానం ప్రశాంత్నగర్(సిద్దిపేట): విదేశి విశ్వవిద్యాలయాల్లో చదువుతున్న షెడ్యూల్ కులాల విద్యార్థులు అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం ద్వారా స్కాలర్షిప్లకు దరఖాస్తు చేసుకోవాలని షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి హమీద్ పేర్కొన్నారు. మే 19 వరకు దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. -
పెండింగ్ కేసులు పరిష్కరించాలి
ఎస్పీ ఉదయ్కుమార్రెడ్డి మెదక్ మున్సిపాలిటీ: దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న కేసులపై ప్రత్యేక దృష్టి సారించి వెంటనే వాటిని పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఎస్పీ ఉదయ్కుమార్రెడ్డి అధికారులను ఆదేశించా రు. శనివారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో నెలవారీ క్రైం సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెండింగ్ కేసుల విషయంలో నిరంతర పర్యవేక్షణ ఉంటుందని తెలిపారు. నేర నియంత్రణలో భాగంగా ప్రతి పట్టణం, గ్రామాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునేలా ప్రజలు, వ్యాపారులకు అవగాహన కల్పించాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు. దొంగతనాలు జరగకుండా రాత్రి పూట పెట్రోలింగ్ నిర్వహించాలని చెప్పారు. ప్రస్తుతం ఒంటి పూట బడులు కావడంతో విద్యార్థులు బావులు, వాగులు, వంకలలో ఈతకు వెళ్లి ప్రాణం మీదకు తెచ్చుకోవద్దని సూచించారు. ఈ విషయంలో తల్లిదండ్రులు పిల్లలను జాగ్రత్తగా గమనించాలన్నారు. లేదంటే ఈత సరదా ప్రమాదంగా మారే అవకాశం ఉందని తెలిపారు. సమావేశంలో అదనపు ఎస్పీ మహేందర్, మెదక్, తూప్రాన్ డీఎస్పీలు ప్రసన్నకుమార్, వెంకట్రెడ్డి ఇతర పోలీస్ అధికారులు పాల్గొన్నారు. -
నష్టం మిగిల్చిన వర్షం
విద్యుత్శాఖకు రూ. 65 లక్షల నష్టం ● విరిగిన 150 కరెంట్ స్తంభాలు ● 14 సబ్స్టేషన్లలో తలెత్తిన సమస్యలు ● పలు గ్రామాలకు నిలిచిన విద్యుత్ ● మరమ్మతులు చేస్తున్న ట్రాన్స్కో సిబ్బంది ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన అకాలవర్షం జిల్లాలో అపారనష్టాన్ని మిగిల్చింది. కరెంట్ స్తంభాలు విరిగిపడగా.. ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతిన్నాయి. 14 సబ్స్టేషన్లలో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. అనేక గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయి అంధకారం నెలకొంది. మొత్తంగా శుక్రవారం సాయంత్రం కురిసిన వర్షంతో జిల్లాలో విద్యుత్ శాఖకు రూ. 65 లక్షల మేర నష్టం వాటిల్లింది. – మెదక్జోన్ జిల్లాలోని పలు మండలాల పరిధిలో శుక్రవారం సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు గాలి, వాన బీభత్సం సృష్టించింది. మెదక్, చిన్నశంకరంపేట, కొల్చారం, పాపన్నపేట మండలాల్లో ఈదురుగాలులకు 150కి పైగా విద్యుత్ స్తంభాలు విరిగిపోయాయి. 200 వరకు డీపీఆర్లు పగిలిపోయాయి. గద్దెలపై నుంచి ట్రాన్స్ఫార్మర్లు కింద పడిపోయాయి. అనేక గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోగా.. రాత్రి పల్లెలు అంధకారంలో ఉన్నాయి. వందలాది చెట్లు నేలకొరగగా.. ఇళ్లపై రేకులు, పూరి గుడిసెలు ఎగిరిపోయాయి. కేవలం ట్రాన్స్కో శాఖకు ఏకంగా రూ. 65 లక్షల నష్టం వాటిల్లినట్లు ఆ శాఖ అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. ఇది మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సత్వర విద్యుత్ సేవలు పాపన్నపేట(మెదక్): గాలి, వాన బీభత్సంతో ఏర్పడిన విద్యుత్ అంతరాయాన్ని సకాలంలో పునరుద్ధరించామని జిల్లా చీఫ్ ఇంజనీర్ బాలస్వామి తెలిపారు. శనివారం మండలంలో ఆయన పర్యటించి మరమ్మతు చర్యలను పర్యవేక్షించారు. మండలంలో 35 విద్యుత్ స్తంభాలు విరిగిపడగా, అందులో 20 నూతన స్తంభాలు ఏర్పాటుచేసి విద్యుత్ సేవలు పునరుద్ధరించామని తెలిపారు. దాదాపు మండలంలోని అన్ని గ్రామాలకు విద్యుత్ సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. ఎస్ఈ శంకర్, డీఈ చాంద్భాషా, ఏడీఈ శ్రీనివాస్, ఏఈ నర్సింలు ఉన్నారు.కొత్త స్తంభం ఏర్పాటు చేస్తున్న సిబ్బంది131 ఎకరాల్లో దెబ్బతిన్న పంటలు జిల్లావ్యాప్తంగా 131 ఎకరాల్లో వివిధ రకాల పంటలు దెబ్బతిన్నాయి. అందులో అత్యధికంగా జొన్న పంట 78 ఎకరాల్లో దెబ్బతింది. పెద్దశంకరంపేట, రేగోడ్ మండలాల్లో వడగండ్ల వాన కురవటంతో ఎక్కువగా నష్టం వాటిల్లినట్లు సంబంధిత అధికారులు చెబుతున్నారు. అలాగే 28 ఎకరాల్లో మామిడి తోటలు, 18 ఎకరాల్లో మొక్కజొన్న, 7 ఎకరాల్లో వరి పంట చొప్పున మొత్తం 131 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. కాగా ప్రాథమిక పంటనష్టం అంచనా వేసిన అధికారులు రైతులకు పరిహారం ఇస్తారా..? లేదా అనేది తెలియాల్సి ఉంది. మరమ్మతులు చేస్తున్నాం ఈదురుగాలులకు విరిగిన విద్యుత్ స్తంభాలను తొలగించి నూతన స్తంభాలను ఏర్పాటుచేస్తున్నాం. అలాగే విరిగిపోయిన డీటీఆర్లు తొలగించి కొత్తవాటిని అమర్చుతున్నాం. సబ్స్టేషన్లలో తలెత్తిన సాంకేతిక సమస్యలను సరిచేస్తూ అన్ని గ్రామాలకు విద్యుత్ సరఫరాను పునరుద్ధరిస్తున్నాం. – శంకర్, ట్రాన్స్కో ఎస్ఈ మెదక్ -
జాతీయస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపిక
పాపన్నపేట(మెదక్): జాతీయస్థాయి జూనియర్స్ బాలుర కబడ్డీ పోటీలకు జిల్లా నుంచి నరేంద్రనాథ్ ఎన్నికై నట్లు జిల్లా కబడ్డీ అ సోసియేషన్ ప్రెసిడెంట్ మధుసూదన్రెడ్డి, సెక్రటరీ రమేష్ శనివారం తెలిపారు. ఈనెల 27వ తేదీ నుంచి 30 వరకు బీహార్లో పోటీలు జరుగుతాయని చెప్పారు. వికారాబాద్లో జరిగిన పోటీల్లో నరేంద్రనాథ్ ప్రతిభ చూపినట్లు తెలిపారు. ఈసందర్భంగా కబడ్డీ అసోసియేషన్ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ కేసుపై విచారణ వెల్దుర్తి(తూప్రాన్): ఎస్సీ, ఎస్టీ కేసును విచారించేందుకు తూప్రాన్ డీఎస్పీ వెంకటరెడ్డి శనివారం మండలంలోని మెల్లూర్ గ్రామాన్ని సందర్శించారు. గ్రామానికి చెందిన ఇద్దరు ఈనెల 20వ తేదీన కులం పేరుతో దూషించి దాడికి పాల్పడ్డారని శుక్రవారం వెల్దుర్తి పోలీస్స్టేషన్లో దాసరి బాబు ఫిర్యాదు చేశాడు. దీంతో శనివారం డీఎస్పీ వెంకటరెడ్డి సంఘటనా స్థలాన్ని సందర్శించారు. దాడి జరిగిన గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదురుగా ఉన్న గుడిసె వద్ద బాధితులు, సాక్షులను విచారించారు. విచారణ ప్రక్రియ మొత్తాన్ని వీడియో రికార్డ్ చేశారు. డీఎస్పీ వెంట వెల్దుర్తి ఎస్సై రాజు ఉన్నారు. 20 మంది గైర్హాజరు మెదక్ కలెక్టరేట్: పదో తరగతి పరీక్షలు రెండోరోజు శనివారం ప్రశాంతంగా జరిగాయి. జిల్లాలో మొత్తం 10,384 మంది విద్యార్థులకు గానూ 10,364 మంది హాజరుకాగా, మరో 20 మంది గైర్హాజరయ్యారు. జిల్లా కేంద్రంలోని పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్ రాహుల్రాజ్ పరిశీలించారు. డీఈఓ రాధాకిషన్, ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు పలు పరీక్ష కేంద్రాలను సందర్శించారు. తాగునీరు అందుబాటులో ఉంచాలని, ఎక్కడ మాస్ కాపీయింగ్కు ఆస్కారం లేకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సిబ్బందిని ఆదేశించారు. అక్రమ అరెస్టులు సరికాదు: సీఐటీయూ మెదక్ కలెక్టరేట్/నర్సాపూర్: అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని సీఐటీయూ జిల్లా కోశాధికారి కడారి నర్సమ్మ అన్నారు. శనివారం మెదక్ పట్టణంలోని పోస్టాఫీస్ చౌరస్తా వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అసంఘటిత రంగ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం చలో హైదరాబాద్ పిలుపునిచ్చామని తెలిపారు. జిల్లా నుంచి కార్యక్రమానికి వెళ్తున్న సీఐటీయూ నాయకులను ముందస్తుగానే ఎక్కడికక్కడ అరెస్టు చేయడాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయకుండా విస్మరిస్తుందన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ సంతోష్, అజయ్, నర్సింలు, సాయిలు, గట్టయ్య, రాజు, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు. అలాగే నర్సాపూర్లో ప్రభుత్వం దిష్టిబొమ్మను దహనం చేశారు. అక్రమ అరెస్టులు సరికాదని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు నాగరాజు అన్నారు. అసంఘటిత కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. -
నష్టపోయిన వారిని ఆదుకోండి
నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి నర్సాపూర్/కొల్చారం(నర్సాపూర్): అకాలవర్షంతో నష్టపోయిన బాధితులను ఆదుకోవాలని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. శనివారం ఆమె అసెంబ్లీలో మాట్లాడారు. శుక్రవారం రాత్రి ఈదురుగాలులతో కూడిన అకాల వర్షానికి చిరువ్యాపారులు నష్టపోయారని తెలిపారు. చాలా గ్రామాలకు కరెంట్ సరఫరా లేకుండా పోయిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గంలోని చిలప్చెడ్, కొల్చారం మండలాల్లో అకాలవర్షం చాలా ప్రభావం చూపిందన్నారు. పోతన్శెట్టిపల్లి, అప్పాజిపల్లి, ఘన్పూర్ గ్రామాలతో పాటు వాటి చుట్టుపక్కల గ్రామాల్లో ఈదురుగాలులతో వర్షాలు కురిశాయన్నారు. కరెంటు స్తంభాలు కూలిపోవడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని వివరించారు. కాగా చిన్నఘనపూర్ నుంచి ఏడుపాయలకు వెళ్లే మార్గంలో చిన్న హోటళ్లు, చిన్న చిన్న డబ్బాలు పెట్టుకుని చాలా మంది వ్యాపారం చేస్తూ బతుకుదెరువు పొందుతున్నారని. ఈదురుగాలులకు డబ్బాల ఆనవాళ్లు లేకుండా కొట్టుకుపోవడంతో బతుకుదెరువు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. వారికి ఆర్థిక సహాయం అందచేసి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. రాజీవ్ యువవికాస పథకం ద్వారా బాధితులకు బతుకు దెరువు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీ అనంతరం పోతంశెట్టిపల్లి శివారు టీ జంక్షన్ వద్దకు చేరుకొని బాధితులను పరామర్శించారు. ఫోన్లో కలెక్టర్తో మాట్లాడి బాధితులను ప్రభుత్వం ద్వారా ఆదుకోవాలని కోరారు. ఎమ్మెల్యే వెంట తహసీల్దార్ గఫార్మియా, ఎంపీఓ కృష్ణవేణి, ఆర్ఐ ప్రభాకర్, బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు గౌరీశంకర్గుప్తా తదితరులు ఉన్నారు. -
జిల్లాలో 496 కొనుగోలు కేంద్రాలు
అదనపు కలెక్టర్ నగేష్ మెదక్ కలెక్టరేట్: జిల్లాలో 496 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు అదనపు కలెక్టర్ నగేష్ తెలిపారు. శనివారం కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో కలిసి హార్వెస్టర్ల యజమానులతో వరి కోతలపై సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధికారులు సమన్వయంతో వ్యవహరించి కొనుగోలు ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహించాలని ఆదేశించారు. పొలం పూర్తిగా కోత దశకు వచ్చిన తర్వాతే యంత్రాలు వినియోగించి పంట కోయించాలని సూచించారు. హార్వెస్టర్ యజమానులు బ్లోయర్ ఆన్లో ఉంచాలన్నారు. పంట పూర్తిగా కోతకు వచ్చిన తర్వాత కోయడం ద్వారా తేమశాతం, తాలు, గడ్డి లేకుండా నాణ్యమైన పంట వచ్చే అవకాశం ఉందని చెప్పారు. రైతు నేస్తం ద్వారా వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. వ్యవసాయ శాఖ అధికారులు ప్రతి కొనుగోలు కేంద్రానికి వెళ్లి రైతులకు తగు సూచనలు ఇవ్వాలని సూచించారు. రైతులు ధాన్యం శుభ్రపరిచిన తర్వాతే కొనుగోలు కేంద్రాలకు తీసుకువెళ్లాలని చెప్పారు. -
సింగిల్గానే అధికారంలోకి వస్తాం: కేసీఆర్
హైదరాబాద్, సాక్షి: తెలంగాణలో మరోసారి బీఆర్ఎస్ అధికారం చేపట్టడం తథ్యమని బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు(Kalvakuntla Chandrasekar Rao) ఉద్ఘాటించారు. శనివారం ఎర్రవెల్లి ఫామ్హౌజ్లో జరిగిన రామగుండం నియోజకవర్గ బీఆర్ఎస్ నేతల సమావేశంలో ఆయన కీలక కామెంట్లు చేశారు.బెల్లం ఉన్న దగ్గర ఈగలు వస్తాయి. అలాగే సిరిసంపదలు ఉన్న తెలంగాణకు దోచుకోవడానికి కొందరు సిద్ధంగా ఉన్నారు. పదేళ్లు తెలంగాణలో ఎలాంటి ఇబ్బందులు లేవు. ఇప్పుడు సమస్యల వలయంలో చిక్కుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో రామగుండంలో గెలిచిన ఎమ్మెల్యే ఓ సన్నాసి అంటూ కామెంట్ చేశారు.ఆనాడు బలవంతంగా ఆంధ్రాలో కలిపారు. తెలంగాణను ఇందిరాగాంధీ మోసం చేశారు. మోదీ నా మెడపై కత్తి పెట్టినా.. నేను వెనకడుగు వేయలేదు. ఈ నేలపై ఎవరూ శాశ్వతం కాదు. అందరూ ఒక్కో కేసీఆర్(KCR)లా తయారు కావాలి. తెలంగాణ హక్కుల కోసం పోరాడాలి. ఏపీలో కూటమి లేకుంటే చంద్రబాబు(Chandrababu) గెలిచేవారు కాదు. కానీ, బీఆర్ఎస్ మాత్రం సింగిల్గానే అధికారంలోకి వస్తుంది.. ఇది ఖాయం అని కేసీఆర్ అన్నారు.కాంగ్రెస్ నోటికొచ్చిన హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది. కానీ ఒక్క హామీ కూడా నెరవేర్చడం లేదు. మేనిఫెస్టోలో పెట్టని హామీలు కూడా అమలు చేసిన ఘనత బీఆర్ఎస్దే. తెలంగాణ కోసం ఎప్పటికైనా పోరాడేది బీఆర్ఎస్ మాత్రమే అని కేసీఆర్ అన్నారు. -
ఆన్లైన్ బెట్టింగ్ల జోలికి వెళ్లొద్దు
మెదక్ మున్సిపాలిటీ: యువత ఆన్లైన్ బెట్టింగ్, గేమింగ్ యాప్లకు అలవాటు పడి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని ఎస్పీ ఉదయ్కుమార్రెడ్డి సూచించారు. శుక్రవారం ఎస్పీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. బెట్టింగ్లకు పాల్పడిన, గేమింగ్ యాప్లలో గేమ్స్ ఆడినా, ప్రోత్సహించిన వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చని విద్యార్థులు, యువత అక్రమ బెట్టింగ్ యాప్స్, గేమింగ్ యాప్స్లకు బానిసలుగా మారుతున్నారని తెలిపారు. వీటి కట్టడికి జిల్లా పోలీస్శాఖ ఆధునిక సాంకేతికతను వినియోగించుకొని ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసిందని వివరించారు. అక్రమ బెట్టింగ్ యాప్లను సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. జిల్లా ప్రజలు మీ చుట్టూ పక్కల ఇలాంటి కార్యకలాపాలు జరుగుతున్నట్లు గుర్తిస్తే వెంటనే 100కు సమాచారం అందించాలని సూచించారు. ఎస్పీ ఉదయ్కుమార్రెడ్డి -
16.80 కోట్లు
9రూ.రోజులు..ఉపాధి హామీ మెటీరియల్ కాంపొనెంట్ పనులకు గడువు ముంచుకొస్తుంది. కేవలం తొమ్మిది రోజుల్లో ఈ ఆర్థిక సంవత్సరం ముగియనుండటంతో రూ. 16.80 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంది. లేనిచో ఆ నిధులు వెనక్కి వెళ్లే పరిస్థితి నెలకొంది. దీంతో అధికారులు ఆగమేఘాల మీద సీసీ రోడ్ల నిర్మాణ పనులు చేపడుతున్నారు. – మెదక్జోన్ జిల్లాలో ఈ ఏడాది ఉపాధి హామీ పథకంలో కూలీలు చేసిన పని దినాలను బట్టి మెటీరియల్ కాంపోనెట్ నిధులు విడుదల అవుతాయి. ఈసారి జిల్లాకు రూ. 42 కోట్లు విడుదల కాగా, వాటిని ఈ ఆర్థిక సంవత్సరం (మార్చి 31) వరకు ఖర్చు చేయాల్సి ఉంది. ఈ నిధుల నుంచి 95 శాతం పల్లెల్లో సీసీ రోడ్లు నిర్మాణాలు చేపడుతుండగా, మరో ఐదు శాతం నిధులను పశువుల పాకల నిర్మాణాలకు ఉపయోగిస్తున్నారు. కాగా ఇప్పటివరకు కేవలం 60 శాతం.. అనగా రూ. 25.20 కోట్ల పనులు మాత్రమే అధికారులు చేశారు. ఈ లెక్కన ఇంకా రూ. 16.80 కోట్ల నిధులు ఖర్చు చేయాల్సి ఉంది. ఇందుకు కేవలం 9 రోజుల గడువు మాత్రమే ఉండటంతో ఆగమేఘాల మీద పనులు చేస్తున్నారు. నేతల ఇళ్ల ముంగిట సీసీ రోడ్లు! గతంలో గ్రామ పంచాయతీలకు పాలకవర్గాలు ఉండటంతో సర్పంచ్లు గ్రామ సభలు పెట్టి ఏ వీధిలో సీసీరోడ్లు, ఎక్కడ మురికి కాలువల నిర్మాణాలు చేపట్టాలని తీర్మాణం చేసి పనులు చేసే వారు. ప్రస్తుతం సర్పంచ్ల పదవీకాలం ముగిసి ఏడాది కావొస్తుండటంతో ప్రత్యేక అధికారులు, పంచాయతీ కార్యదర్శుల ఆధ్వర్యంలో పనులు కొనసాగుతున్నాయి. గ్రామాల్లో అధికార పార్టీ నాయకులు పనులు చేపడుతున్నారు. ఇదే అదునుగా వారి ఇళ్ల ఎదుట సీసీ రోడ్లు వేసుకుంటున్నారు. ప్రజాధనంతో పది మంది నడిచే బాటలో సీసీ రోడ్లు వేయాలి, కానీ ప్రజల సొమ్మతో ఇళ్ల ముందు రోడ్లు వేసుకోవటం ఏంటని పలువురు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. హడావుడి పనులు.. నాణ్యత లోపాలు నిధులు ల్యాప్స్ కావొద్దనే ఉద్దేశంతో పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో సీసీ రోడ్ల నిర్మాణ పనులు హడావుడిగా చేస్తున్నారు. చాలా చోట్ల ఇసుకకు బదులు రాతి ఫౌడర్ను మిక్స్ చేస్తున్నారు. ఇది చాలా కాలం మన్నికగా ఉండదని పలువురు పేర్కొంటున్నారు. అంతేకాకుండా సీసీ రోడ్డు నిర్మించిన అనంతరం కనీసం 28 రోజుల పాటు వాటర్ క్యూరింగ్ చేయాల్సి ఉండగా, కొన్ని చోట్ల వారం కూడా చేయటం లేదని తెలుస్తోంది. దీంతో నాణ్యతా లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది.నిధులు ఖర్చు చేయకపోతే వెనక్కే ఆగమేఘాలపై సీసీ రోడ్ల నిర్మాణాలు ఉపాధి హామీ మెటీరియల్కాంపోనెంట్ పనుల తీరునిధులు ల్యాప్స్ కాకుండా చర్యలు ఉపాధి హామీ పథకంలో మంజూరైన నిధులు ల్యాప్స్ కాకుండా చర్యలు చేపడుతున్నాం. జిల్లాకు రూ. 42 కోట్లు మంజూరు కాగా, ఇప్పటివరకు రూ. 25.20 కోట్ల పనులు పూర్తి చేశాం. మరో రూ. 16.80 కోట్ల పనులు చేయాల్సి ఉంది. – నర్సయ్య, పీఆర్ ఈఈ, మెదక్ -
తొలి రోజు ప్రశాంతం
శనివారం శ్రీ 22 శ్రీ మార్చి శ్రీ 2025ప్రారంభమైన ‘పది’ పరీక్షలు ● 99.72 శాతం హాజరునీడ లేదు.. వైద్యం జాడలేదు ఉపాధి కూలీలకు నిలువ నీడ కరువైంది. ప్రథమ చికిత్స కిట్లు కానరావడం లేదు. వివరాలు 8లో uమెదక్జోన్: పదో తరగతి పరీక్షలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. జిల్లాలోని 68 పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులు మొదటి పరీక్ష తెలుగు–1ను ప్రశాంతంగా రాశారు. నిర్దిష్ట సమయం 9.30 గంటల ముందే విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. తల్లిదండ్రులు బెస్ట్ ఆఫ్ లక్ చెప్పి లోనికి పంపించారు. పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు సౌకర్యాలు కల్పించారు. అయితే కొన్ని కేంద్రాల్లో ఫ్యాన్లు తిరగక విద్యార్థులు అవస్థలు పడ్డారు. జిల్లావ్యాప్తంగా 10,402 మంది విద్యార్థులు పరీక్ష రాయాల్సి ఉండగా, 10,373 మంది హాజరయ్యారు. వివిధ కారణాలతో 29 మంది గైర్హాజరు కాగా 99.72 హాజరుశాతం నమోదైంది. కొల్చారం మండల కేంద్రంలోని పరీక్షా కేంద్రాలను కలెక్టర్ రాహుల్రాజ్ పరిశీలించారు. వసతుల కల్పనపై సంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థులు ఒత్తిడికి గురికాకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలని సూచించారు. చిన్నశంకరంపేట, వెల్దుర్తి, శివ్వంపేటలో డీఈఓ రాధాకిషన్, మెదక్, హవేళిఘణాపూర్, తూప్రాన్, మనోహరాబాద్, పాపన్నపేట, టేక్మాల్, అల్లాదుర్గం, రేగోడ్లోని పలు పరీక్ష కేంద్రాలను ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు సందర్శించారు. పరీక్ష కేంద్రాల వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటుచేశారు. -
ఆన్లైన్ బెట్టింగ్ల జోలికి వెళ్లొద్దు
మెదక్ మున్సిపాలిటీ: యువత ఆన్లైన్ బెట్టింగ్, గేమింగ్ యాప్లకు అలవాటు పడి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని ఎస్పీ ఉదయ్కుమార్రెడ్డి సూచించారు. శుక్రవారం ఎస్పీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. బెట్టింగ్లకు పాల్పడిన, గేమింగ్ యాప్లలో గేమ్స్ ఆడినా, ప్రోత్సహించిన వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చని విద్యార్థులు, యువత అక్రమ బెట్టింగ్ యాప్స్, గేమింగ్ యాప్స్లకు బానిసలుగా మారుతున్నారని తెలిపారు. వీటి కట్టడికి జిల్లా పోలీస్శాఖ ఆధునిక సాంకేతికతను వినియోగించుకొని ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసిందని వివరించారు. అక్రమ బెట్టింగ్ యాప్లను సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. జిల్లా ప్రజలు మీ చుట్టూ పక్కల ఇలాంటి కార్యకలాపాలు జరుగుతున్నట్లు గుర్తిస్తే వెంటనే 100కు సమాచారం అందించాలని సూచించారు. ఎస్పీ ఉదయ్కుమార్రెడ్డి -
గాలి, వాన బీభత్సం
● 15 నిమిషాల పాటు అతలాకుతలం ● విరిగిపడిన విద్యుత్ స్తంభాలు ● నేలకొరిగిన చెట్లు, దెబ్బతిన్న వాహనాలు కొల్చారం(నర్సాపూర్): అప్పటివరకు ఉక్కపో తతో ఇబ్బందిపెట్టిన వాతావరణం అంతలోనే మారిపోయింది.. మండలంలోని పోతంశెట్టిపల్లి శివారులో శుక్రవారం సాయంత్రం గాలి, వాన బీభత్సం సృష్టించింది. 15 నిమిషాల పాటు అతలాకుతలం చేసింది. భారీ వృక్షాలు నేలకొరిగాయి.. విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. మెదక్– నర్సాపూర్ జాతీయ రహదారి, మెదక్– జోగిపేట రహదారిపై పలుచోట్ల చెట్లు విరిగి నిలిచి ఉన్న వాహనాలపై పడడంతో దెబ్బతిన్నాయి. రోడ్డుకు అడ్డంగా పడటంతో అరగంటపాటు వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. కరెంట్ స్తంభాలు విరిగి కిందపడటంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఏడుపాయల టీ జంక్షన్ ప్రాంతంలోని పలు హోటళ్లపై చెట్టు విరిగిపడింది. రేకుల గాలికి లేచిపోయి సమీప పొలాల్లో పడ్డాయి. సమీపంలోని జాతీయ రహదారి పక్కన పొలాల్లో తాత్కాలిక గుడారాలు వేసుకుని ఉన్న వలస కూలీలపై పడటంతో కొందరు స్వల్పంగా గాయపడ్డారు. ఎస్ఐ మహమ్మద్ గౌస్ సిబ్బందితో కలిసి జేసీబీ సహాయంతో రోడ్డుకు అడ్డంగా పడిన చెట్లను తొలగించి వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు. ఇంటిపై పడిన పిడుగు మెదక్జోన్: జిల్లా కేంద్రంతో పాటు పలు మండలాల్లో శుక్రవారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. మెదక్లోని భవానీనగర్ కాలనీలో రిటైర్డ్ ఉద్యోగి వడియారం యాదయ్య ఇంటిపై పిడుగు పడింది. దీంతో భవనం స్వల్పంగా దెబ్బతింది. పిడుగుపాటుకు అతడి మనమరాలు స్వల్పంగా గాయపడినట్లు తెలిసింది. కాగా గంటకు పైగా కురిసిన భారీ వర్షంతో కొంతమేర పంటలకు మేలు జరగగా, కోతకు వచ్చిన వరి పంటలకు నష్టం జరిగింది. -
అడవులను సంరక్షించుకుందాం
నర్సాపూర్ రూరల్: భావితరాల కోసం అటవీ సంపదను సంరక్షించుకుందామని నర్సాపూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ దామోదర్ పిలుపునిచ్చారు. శుక్రవారం కళాశాలలో ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ అటవీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ప్రిన్సిపాల్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రతి ఒక్కరూ ఖాళీ ప్రదేశంలో మొక్కలు నాటి వృక్ష సంపదను పెంచాల్సిన బాధ్యత ఉందన్నారు. ఫలితంగా జీవ వైవిద్యం పెరుగుతుందన్నారు. జంతుశాస్త్ర అధ్యాపకుడు డాక్టర్ సురేష్ కుమార్ మాట్లాడుతూ.. నర్సాపూర్ రిజర్వ్ ఫారెస్ట్లో అత్యధిక జీవ సంపద కలిగి ఉందన్నారు. అడవిలో ఒక్క మొక్కకు, జంతువులకు హాని కలిగిన ఇతర జీవుల మనుగడకు ప్రమాదం ఏర్పడుతుందన్నారు. దీని దృష్టిలో పెట్టుకొని అటవీ సంపదను కాపాడుకుని ఇతరులను చైతన్యం చేయాలని విద్యార్థులు సూచించారు. విద్యార్థులు కళాశాల ప్రాంగణంలోని వృక్షాలను ఆలింగనం చేసుకొని మొక్కలను నాటుదాం, సంరక్షిద్దాం, అడవిని కాపాడుదాం అని నినాదాలు చేశారు. కార్యక్రమంలో వృక్షశాస్త్ర అధ్యాపకురాలు రుక్ముణి, అధ్యాపకులు అదేప్ప, మహేందర్రెడ్డి, రాజు విద్యార్థులు పాల్గొన్నారు. -
ఒకే దేశం.. ఒకే ఎన్నికపై అవగాహన
నర్సాపూర్: ఒకే దేశం.. ఒకే ఎన్నిక విధానంతో దేశానికి చాలా మేలు జరుగుతుందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లేష్గౌడ్ అన్నారు. శుక్రవారం పట్టణంలోని ఓ ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు అవగాహన కల్పించారు. పలుమార్లు ఎన్నికలు నిర్వహించడంతో దేశంపై ఆర్థిక భారం పడడంతో పాటు సమయం వృథా అవుతుందన్నారు. వాటిని తగ్గించడానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఒకే దేశం, ఒకే ఎన్నిక విధానం తేవడానికి కృషి చేస్తున్నారని వివరించారు. సమావేశంలో బీజేపీ నాయకులు రమేష్గౌడ్, నారాయణరెడ్డి, శ్రీనివాస్, కాలేజీ ప్రిన్సిపాల్ అశోక్ పాల్గొన్నారు. ‘నాసిరకం పనులపై చర్యలు చేపట్టాలి’ పెద్దశంకరంపేట(మెదక్): పెద్దశంకరంపేటలో అంబేద్కర్ చౌరస్తా నుంచి గాంధీ చౌరస్తా వరకు చేపట్టిన సీసీ రోడ్డు పనులు నాసిరకంగా ఉన్నాయని, ఆర్అండ్బీ జిల్లా అధికారులు వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి కోరారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో రూ. 80 లక్షలతో రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల పనులు సరిగా చేయకపోవడంతో సీసీ రోడ్డు కుంగిపోయిందన్నారు. అయినప్పటికీ సంబంధిత అధి కారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. పెద్దశంకరంపేటలోని అన్ని వార్డుల్లో రహదారి పనుల వల్ల మిషన్ భగీరథ పైపులైన్ దెబ్బతిందన్నారు. తాగునీటి కోసం ప్రజలు ఇబ్బంది పడుతున్నారని వాపోయారు. వెంటనే పైపులైన్కు మరమ్మతులు చేయింది ప్రజలకు తాగునీటిని అందించాలని డిమాండ్ చేశారు. మోసాలకు పాల్పడితే కఠిన చర్యలు పాపన్నపేట(మెదక్): రేషన్ దుకాణాల్లో మోసాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా తూనికలు, కొలతల అధికారి సుధాకర్ హెచ్చరించారు. శుక్రవారం పాపన్నపేట, టేక్మాల్ మండలాల్లోని పలు రేషన్ దుకాణాలను తనిఖీ చేశారు. ఈసందర్భంగా తూకం యంత్రాలను పరిశీలించారు. తూకంలో డీలర్లు అవకతవకలకు పాల్పడితే ప్రజలు తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. పాపన్నపేటలో 30, టేక్మాల్లో 20 తూకం యంత్రాలకు స్టాంపింగ్ వేసినట్లు చెప్పారు. వ్యాపారులు తప్పనిసరిగా తూకం నిబంధనలు పాటించాలని ఆదేశించారు. ఆయన వెంట రేషన్ డీలర్లు ఉన్నారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి మనోహరాబాద్(తూప్రాన్): ప్రజలు తమ ఆరోగ్యాలను కాపాడుకోవాలని డిప్యూటీ డీఎంహెచ్ఓ జ్ఞానేశ్వర్ సూచించారు. శుక్రవారం మండలంలోని కొండాపూర్లో రెడ్క్రాస్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో వీఎస్టీ పరిశ్రమ సహకారంతో మల్లారెడ్డి ఆస్పత్రి సిబ్బంది ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం మందులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ చంద్రశేఖర్రెడ్డి, ఎంపీడీఓ కృష్ణమూర్తి, జిల్లా రెడ్క్రాస్ చైర్మన్ రాజశేఖర్రెడ్డి, రాష్ట్ర సభ్యులు సింగం శ్రీనివాస్రావు, పీహెచ్సీ వైద్యులు, అధికారులు పాల్గొన్నారు. -
ఏసీబీకి చిక్కిన జీఎస్టీ అధికారి
● లంచం తీసుకుంటుండగా పట్టివేత ● అరెస్ట్ చేసి నాంపల్లి సీబీఐ కోర్టుకు తరలింపు మెదక్జోన్: జిల్లా కేంద్రంలోని జీఎస్టీ (కేంద్ర) కార్యాలయ సూపరింటెండెంట్ రవిరంజన్ అగర్వాల్ ఏసీబీకి చిక్కారు. శుక్రవారం ఓ వ్యాపారి వద్ద లంచం తీసుకుంటుండగా సీబీఐ (ఏసీబీ) అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. సుమారు ఆరుగంటల పాటు విచారించి, సదరు అధికారిని హైదరాబాద్లోని నాంపల్లి సీబీఐ కోర్టుకు తరలించారు. వివరాల్లోకి వెళ్తే.. పెద్దశంకరంపేట మండలం గొట్టిముక్కుల గ్రామానికి చెందిన తలారి కృష్ణమూర్తి ఆరేళ్లుగా ఎలక్ట్రికల్స్, ఇంజనీర్ హార్డ్వేర్ షాపును కొనసాగిస్తున్నాడు. కాగా ఏటా జీఎస్టీ రిటర్న్ దా ఖలు చేయలేకపోయాడు. దీంతో జీఎస్టీ సూపరింటెండెంట్ రవిరంజన్ అగర్వాల్ సదరు వ్యాపారికి ఫోన్ చేసి జీఎస్టీ నంబర్ను వెంటనే పునరుద్ధరించుకోవాలని సూచించారు. దీంతో సదరు వ్యాపారి ఆన్లైన్లో రిటర్న్ చేశారు. కానీ దానిని ఓకే చేసేందుకు సదరు అధికారి రూ. 10 వేలు లంచం డిమాండ్ చేశాడు. దీంతో వ్యాపారి రూ. 8 వేలు ఇస్తానని ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఇదే విషయాన్ని ఏసీబీ అధికారులకు సమాచారం ఇచ్చాడు. దీంతో వారి సూచన మేరకు శుక్రవారం అధికారికి లంచం ఇస్తుండగా, అప్పటికే మాటు వేసిన ఏసీబీ అధికారి ధనుంజయ బృందం రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అధికారిని విచారించారు. అనంతరం అరెస్ట్ చేసి తీసుకెళ్తునట్లు పట్టణ పోలీసులకు లెటర్ ద్వారా సమాచారం ఇచ్చారు. అయితే మీడియాను అనుమతించకపోగా, కనీస సమాచారం ఇవ్వలేదు. -
ఎండిన పంటలకు పరిహారం ఇవ్వాలి
శివ్వంపేట(నర్సాపూర్): యాసంగి వరి పంటలు నీరందక ఎండిపోతున్నాయని, ప్రభుత్వం పరిహా రం ఇచ్చి ఆదుకోవాలని రైతు రక్షణ సమితి జిల్లా గౌరవ అధ్యక్షుడు మైసయ్యయాదవ్, ఉపాధ్యక్షుడు వెంకటేష్, ప్రధాన కార్యదర్శి నర్సారెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని పలు గ్రామాల్లో ఎండిపోయిన వరి పంటలను పరిశీలించి మాట్లాడారు. పంటలకు పలు చీడ పురుగులు సోకడంతో పాటు భూగర్భజలాలు అడుగంటిపోయి ఎండిపోయాయన్నారు. ఎండిన పంటల వివరాలు ప్రభుత్వం సేకరించి ఎకరాకు రూ. 30 వేల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అప్పులు తెచ్చి పంటలు సాగు చేస్తున్న రైతులకు పంట చేతికి రాకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రుణమాఫీ, రైతు భరోసా సైతం రాకపోవడంతో దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారన్నారు. ప్రభుత్వం స్పందించి రైతులను అన్ని విధాలుగా అదుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రైతు రక్షణ సమితి నాయకులు నర్సారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
అప్పు తీర్చేందుకు బ్యాంకు రుణాలు
సీనియర్ సివిల్ జడ్జి జితేందర్ మెదక్ కలెక్టరేట్: రైతుల ప్రైవేట్ అప్పులు తీర్చేందుకు బ్యాంకులు అదనపు రుణాలు అందిస్తున్నాయని సీనియర్ సివిల్ జడ్జి జితేందర్ తెలిపారు. బుధవారం హవేళిఘణాపూర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో రైతులు, బ్యాంకర్లు, రెవెన్యూ, వ్యవసాయ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం తెలంగాణ రైతు రక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు పాకాల శ్రీహరిరావు మాట్లాడుతూ.. జిల్లాలో ప్రైవేట్ అప్పుల బాధతో ఉన్న రైతులందరూ, వెంటనే బ్యాంకులలో దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. సమావేశంలో రైతు రక్షణ సమితి జిల్లా అధ్యక్షుడు మైసయ్య, నాయకులు యాదాగౌడ్, వెంకటేశం, చంద్రశేఖర్, లీడ్ బ్యాంకు మేనేజర్ నర్సింహా, బ్యాంకర్లు, వ్యవసాయ అధికారులు, రైతులు పాల్గొన్నారు. -
కదం తొక్కిన ఆశావర్కర్లు
మెదక్ కలెక్టరేట్: తమకు రాష్ట్ర బడ్జెట్లో ఫిక్స్డ్ వేతనం నిర్ణయించాలని డిమాండ్ చేస్తూ ఆశావర్కర్లు బుధవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం అదనపు కలెక్టర్ నగేష్కు వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా ఆశా వర్కర్ల జిల్లా కోశాధికారి కడారి నర్సమ్మ మాట్లాడుతూ.. ఆశావర్కర్లకు రూ. 18 వేలు ఫిక్స్డ్ వేతనం నిర్ణయించాలన్నారు. ప్రభుత్వం స్పందించే వరకు పోరాటం కొనసాగిస్తామన్నారు. అలాగే రూ. 50 లక్షల ఇన్సూరెన్స్ వర్తింపచేయాలన్నారు. అదనపు పనులకు అదనపు వేతనం ఇవ్వాలని, పారితోషకం లేని పనులను చేయించకూడదన్నారు. అధికారుల వేధింపులు ఆపాలని, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని కోరారు. ఆశావర్కర్ల జిల్లా నాయకురాళ్లు రాణి, పెంటమ్మ, దుర్గ, గీత, లక్ష్మి, సీఐటీయూ జిల్లా నాయకులు సంతోష్ పాల్గొన్నారు. -
ఆధ్యాత్మిక సంరంభం
వర్గల్(గజ్వేల్): వేద మంత్రోచ్ఛరణలు, మంగళవాయిద్యాలు, భక్తుల జయజయ ధ్వానాల మధ్య నాచగిరి శ్రీలక్ష్మీ నృసింహ క్షేత్రంలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. నాచగిరి శ్రీక్షేత్రం శ్రీమధుసూదనానంద సరస్వతి బుధవారం సాయంత్రం జ్యోతి ప్రజ్వలనచేసి శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేశారు. వేదపండితులు పాంచరాత్ర ఆగమ పద్ధతిలో ఉత్సవ పూజలకు శ్రీకారం చుట్టారు. కోనేరు ప్రాంతం నుంచి పుట్టమన్ను తెచ్చి ముఖమండపంలో విశ్వక్సేనారాధన, స్వస్తి పుణ్యహవాచనం, అంకురార్పణం, నీరాజనం, మంత్రపుష్పాది పూజలు నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం ధ్వజా రోహణ నిర్వహిస్తారు. ఈసందర్భంగా గరుడాళ్వారుకు మహా నివేదన చేసి బ్రహ్మోత్సవ బాధ్యతలను అప్పగిస్తారు. -
ప్రత్యామ్నాయ తడులు పెట్టాలి
నర్సాపూర్: ఎండ తీవ్రంగా ఉన్నందున నీటి ఎద్దడి ఉన్న పొలాలకు ప్రత్యామ్నాయ తడులు పెడుతూ వరి పంటను కాపాడుకోవాలని ఏడీఏ సంధ్యారాణి హితవు పలికారు. ఆమె బుధవారం మండలంలోని లింగాపూర్, సీతారాంపూర్ తదితర గ్రామాల్లో పర్యటించారు. పలువురు రైతుల వరి పంట పొలాలను పరిశీలించి సలహాలు ఇచ్చారు. వరి పంటకు అవసరం మేరకు నీరు పెట్టాలని సూచించారు. ఆమె వెంట ఏఈఓలు దుర్గాప్రసాద్, చంద్రవేణి తదితరులు ఉన్నారు. ఓటరు నమోదుకు అవకాశం నర్సాపూర్: 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరు నమోదు చేసుకునేందుకు అవకాశం ఉందని ఆర్డీఓ మహిపాల్ తెలిపారు. బుధవారం తన కార్యాలయంలో రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఓటరుగా అర్హులందరూ పేర్లు నమోదు చేసుకునే విధంగా పార్టీల నాయకులు చూడాలన్నారు. ఓటరు గుర్తింపు కార్డుకు ఆధార్ కార్డు సంధానం ప్రక్రియకు సహకరించాలని కోరారు. సమావేశంలో తహసీల్దార్ శ్రీనివాస్, ఎపిక్ సీనియర్ అసిస్టెంట్ నరేందర్రెడ్డి, ఆయా పార్టీల నాయకులు పాల్గొన్నారు. మల్లు స్వరాజ్యానికి నివాళి మెదక్ కలెక్టరేట్: తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం వర్ధంతిని బుధవారం కేవల్ కిషన్ భవన్లో నిర్వహించారు. ఈసందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి కడారి నర్సమ్మ మాట్లాడుతూ.. భూమి, భుక్తి, వెట్టిచాకిరి విముక్తి కోసం మల్లు స్వరాజ్యం ఎనలేని పోరాటం చేశారని కొనియాడారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో దొరలు, భూస్వాములు, రజాకారులకు వ్యతిరేకంగా గ్రామాలలో సంఘాలను ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. స్వరాజ్యం చూపిన పోరాట పటి మతో ముందుకుసాగాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మల్లేశం, మల్లేశం, జిల్లా కమిటీ సభ్యులు సంతోష్, అజయ్, నాయ కులు సత్యం, రాణి తదితరులు పాల్గొన్నారు. పరిశోధనకు సహకారం ములుగు(గజ్వేల్): కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం, హైదరాబాద్కు చెందిన వర్ష బయోసైన్స్ టెక్నాలజీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ల మధ్య బుధవారం పరస్పర సహకార అవగాహన ఒప్పందం కుదిరింది. ములుగు విశ్వవిద్యాలయ వైస్ చాన్స్లర్ డాక్టర్ రాజిరెడ్డి, వీబీటీఐపీఎల్ ప్రతినిధులు డాక్టర్ దేశాయ్, వెంకటేశ్వర్రావు ఒప్పందపత్రాలపై సంతకాలు చేశారు. ఈసందర్భంగా వీసీ మాట్లాడుతూ.. మాస్టర్స్, డాక్టోరల్ అధ్యయనాలను అభ్యసించే విద్యార్థుల కోసం సహకార పరిశోధనా వాతావరణాన్ని పెంపొందించడమే ముఖ్య ఉద్దేశమన్నారు. కార్యక్రమంలో విశ్వవిద్యాలయ అధికారులు భగవాన్, రాజశేఖర్, శ్రీనివాసన్, వీరాంజనేయులు, విజయ లక్ష్మీనారాయణ, సైదయ్య, వీణాజోషి, జాన్పీటర్ తదితరులు పాల్గొన్నారు. -
‘పది’ పరీక్షలకు పటిష్ట ఏర్పాట్లు
రేపటి నుంచి ప్రారంభం ● హాజరుకానున్న 10,388 మందివిద్యార్థులు ● ప్రశ్నాపత్రాలపై క్యూఆర్ కోడ్,సీరియల్ నంబర్ ● ఐదు నిమిషాలు ఆలస్యమైనా అనుమతిపాపన్నపేట(మెదక్): పదో తరగతి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈనెల 21 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. ఇందుకోసం జిల్లాలో 68 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా, 5,020 బాలురు, 5,368 బాలికలు కలిపి మొత్తం 10,388 మంది హాజరుకానున్నారు. వీరికి అదనంగా వన్స్ ఫెయిల్ విద్యార్థులు 174 మంది పరీక్షలు రాయనున్నారు. ఈసారి మొదటిసారిగా ప్రశ్నాపత్రాలపై క్యూర్ కోడ్తో పాటు సీరియల్ నంబర్ను ముద్రిస్తున్నారు. ఉదయం 9.30 గంటలకు పరీక్షలు ప్రారంభం కానున్నాయి. అయితే ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చినా అనుమతించనున్నారు. జిల్లాలో 68 పరీక్ష కేంద్రాలు జిల్లాలో మొత్తం 225 ఉన్నత పాఠశాలలు, 10,388 విద్యార్థులు ఉన్నారు. పరీక్షల నిర్వహణ కోసం మొత్తం 68 కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటిలో ఏ కేటగిరి 21, బీ 28, సీ కేటగిరిగా 19 కేంద్రాలుగా గుర్తించారు. పరీక్షల నిర్వహణ కోసం 68 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 68 మంది డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు, 500 మంది ఇన్విజిలేటర్లు, 19 మంది సిట్టింగ్ స్క్వాడ్, ముగ్గురు ఫ్లయింగ్ స్క్వాడ్లు పరీక్షక్షల నిర్వహణలో భాగం కానున్నారు. ఈసారి మొదటిసారిగా ప్రశ్నాపత్రాలపై క్యూఆర్ కోడ్, సీరియల్ నంబర్ ముద్రిస్తారు. దీని ద్వారా ప్రశ్నాపత్రం బయటకు వెళ్తే, వెంటనే గుర్తించడానికి వీలుంటుంది. ప్రశ్నాపత్రంలోని ప్రతి పేజీపై హాల్ టికెట్ నంబర్ రాయాల్సి ఉంటుంది. ఫిజికల్ సైన్స్, బయాలజీ పరీక్షలను వేర్వేరు రోజుల్లో నిర్వహిస్తారు. మొదట ఓఎంఆర్ పత్రాలను సరిచూసుకొని ఏవైనా పొరపాట్లు ఉంటే వెంటనే ఇన్విజిలేటర్ల దృష్టికి తీసుకెళ్లాలి. ప్రతి విద్యార్థికి 24 పేజీల ఆన్సర్ బుక్ అంజేస్తారు. దానిపై హాల్టికెట్ నంబర్, పేరు రాయాల్సిన అవసరం లేదు.పరీక్షలు రాస్తున్న విద్యార్థులు(ఫైల్) పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు: ఎస్పీ మెదక్ మున్సిపాలిటీ: రేపటి నుంచి జిల్లాలో ప్రారంభమయ్యే పదో తరగతి పరీక్ష కేంద్రాల వద్ద 163 సెక్షన్ అమలు చేస్తున్నట్లు ఎస్పీ ఉదయ్కుమార్రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పరీక్ష కేంద్రాలకు సమీపంలో ఉన్న అన్ని జిరాక్స్ సెంటర్లు మూసి వేయాలని సూచించారు. పరీక్షలకు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు ఏర్పాటు చేసిటన్లు వివరించారు. పోలీస్ అధికారులు పరీక్షల సమయంలో పెట్రోలింగ్ నిర్వహిస్తారని, పోలీస్స్టేషన్లో నుంచి పరీక్ష పత్రం కేంద్రానికి వెళ్లే సమయంలో కానిస్టేబుల్ తప్పనిసరిగా ఎస్కార్ట్ ఉండాలని ఆదేశించారు. ఆత్మవిశ్వాసంతో రాయాలి పరీక్ష హాల్కు ఉదయం 8.30 గంటల వరకు చేరుకోవాలి. ప్రశ్నాపత్రం ఇవ్వగానే ఆసాంతం చదవాలి. మొదట సులభంగా ఉన్న ప్రశ్నలకు జవాబులు రాయాలి. పరీక్షలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. ప్రతి కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. విద్యుత్, ఫ్యాన్లు, తాగునీరు, వైద్యం, ఫర్నిచర్ సౌకర్యాలు కల్పించాం. విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలి. – రాధాకిషన్, డీఈఓ -
గురువారం శ్రీ 20 శ్రీ మార్చి శ్రీ 2025
ప్రజలకు ఒరిగిందేమీ లేదు నర్సాపూర్: రాష్ట్ర బడ్జెట్తో ప్రజలకు ఒరిగేదేమి లేదు. ఆరు గ్యారంటీల అమలుకు బడ్జెట్లో సరైన నిధులు కేటాయించలేదు. రుణమాఫీ, రైతు భరోసా పథకాలకు తక్కువ నిధులు ఇచ్చారు. మహిళా జ్యోతి పథకానికి నిధులు కేటాయించకుండా మహిళలను కాంగ్రెస్ నాయకులు మోసం చేశారు. – సునీతారెడ్డి, ఎమ్మెల్యే, నర్సాపూర్ సముచితంగా ఉంది రాష్ట్ర బడ్జెట్ అన్నివర్గాల ప్రజలకు మేలు చేసేలా ఉంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సంక్షేమం కోసం అత్యధికంగా నిధులు కేటాయించారు. అలాగే ఆరు గ్యారంటీల అమలు కోసం కేటాయించిన నిధులు అందరిని మెప్పించే విధంగా ఉన్నాయి. – ఆంజనేయులుగౌడ్, డీసీసీ అధ్యక్షుడు మోసపూరిత బడ్జెట్ ఇది పూర్తిగా మోసపూరిత బడ్జెట్. వృద్ధులకు పింఛన్ల పెంపు, మహిళలకు రూ. 2,500, పూర్తిస్థాయిలో చేయని రుణమాఫీతో పాటు అనేక హామీలను తుంగలో తొక్కారు. సీఎం రేవంత్రెడ్డి ఏడుపాయల అభివృద్ధికి రూ. 35 కోట్ల నిధులు మంజూరు చేస్తామని చేయకపోవడం ఈ పాలన తీరుకు అద్దం పడుతుంది. – మల్లేశంగౌడ్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు మెదక్జోన్: ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క బుధవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో జిల్లాకు ప్రత్యేకంగా నిధుల కేటాయింపు జరగలేదు. దశాబ్దకాలంగా మూతపడిన ఎన్డీఎస్ఎల్ ఫ్యాక్టరీ ప్రస్తావన ఉంటుందని ఎదురుచూసిన కార్మికులు, రైతులకు నిరాశే మిగిలింది. మెదక్కు రింగ్రోడ్డు కావాలని చాలా కాలంగా ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు. ఈ బడ్జెట్లో నిధుల కేటాయింపులు జరుగుతా యని ఆశించారు. అయినా ప్రయోజనం లేకుండా పోయింది. అలాగే జిల్లాలో ఏకై క మధ్య తరహా సాగునీటి ప్రాజెక్టు ఘనపూర్ ఆయకట్టు 21 వేల ఎకరాలు ఉంది. ప్రాజెక్టు ఆనకట్ట పెంచితే అదనంగా మరో 10 వేల ఎకరాలు సాగులోకి వచ్చే అవకాశం ఉంది. కాగా ఆనకట్ట పెంపునకు సంబంధించి ప్రత్యేక నిధులు మంజూరు చేయిస్తామని చెప్పిన నేతల మాటలు నీటి మూటలు గానే మిగిలాయి. బడ్జెట్లో ఘనపూర్ ప్రాజెక్టుకు ప్రాధాన్యందక్కలేదు. అయితే ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాల లబ్ధిదారులకు మాత్రం ఫలాలు అందనున్నాయి. పర్యాటకంపై ఆశలు రాష్ట్ర బడ్జెట్లో పర్యాటక రంగానికి రూ. 775 కోట్లు కేటాయించారు. ఇందులో నుంచి జిల్లాకు నిధులు వస్తే పర్యాటకంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. ముఖ్యంగా రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన ఏడుపాయల దేవస్థానం, మెదక్ చర్చి, ప్రఖ్యాత ఖిల్లా, నిజాంపాలనలో నిర్మించిన పోచారం ప్రాజెక్టు, పోచారం అభయారణ్యంలో గల జింకల ప్రత్యు త్పత్తి కేంద్రం, కొల్చారం మండల కేంద్రంలోని జైన మందిరాలు జిల్లాలో చూడదగిన ప్రదేశాలు. హైదరాబాద్కు అతిసమీపంలో జిల్లా ఉండటంతో వీటిని పర్యాటకంగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. కాగా ఈ బడ్జెట్లో నుంచి జిల్లాకు నిధులు కేటాయింపులు జరిగితే ఈ ప్రాంతం పర్యాటకంగా మరింత అభివృద్ధి చెందుతుంది. ఏడుపాయలకు ఎస్డీఎఫ్ నిధులేవి? గతేడాది డిసెంబర్లో సీఎం రేవంత్రెడ్డి జిల్లా పర్యటనలో భాగంగా ఏడుపాయల, మెదక్ చర్చిని సందర్శించారు. ఏడుపాయల అభివృద్ధి కోసం స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ (ఎస్డీఎఫ్) కింద నాగ్సాన్పల్లి నుంచి ఏడుపాయల వరకు డబుల్రోడ్డు నిర్మాణం కోసం రూ. 35 కోట్లు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. కానీ ఇప్పటివరకు నిధులు కేటాయించలేదు. ప్రస్తుత బడ్జెట్లో దేవాదాయ, ధర్మాదాయశాఖకు రూ. 190 కోట్లు కేటాయించారు. వాటిలో జిల్లాకు వాటా ఉంటుందో లేదో తెలియాల్సి ఉంది. అడవుల అభివృద్ధికి ఊతం! అడవులు, పర్యావరణం కోసం బడ్జెట్లో రూ. 1,023 కోట్లు కేటాయించారు. కాగా జిల్లావ్యాప్తంగా 58 వేల హెక్టార్లలో అడవులు విస్తరించి ఉన్నాయి. కాగా అడవుల సంరక్షణకు అరకొరగానే నిధులు విడుదల అవుతున్నాయి. ఏటా వేసవిలో అడవులు దగ్ధం అవుతూనే ఉన్నాయి. కనీసం ఫైర్లైన్స్ ఏర్పాటు చేసేందుకు సైతం నిధులు లేక సంబంధిత అధికారులు చేతులు ఎత్తేస్తున్నారు. ప్రస్తుతం బడ్జెట్లో జరిగిన కేటాయింపులతో జిల్లా అడవుల భద్రతకు నిధులు వచ్చే అవకాశం ఉందని సంబంధిత అధికారి ఒకరు చెప్పారు. సంక్షేమానికి భ రోసా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆరు గ్యారంటీల అమలు కోసం బడ్జెట్లో రూ. 56,084 కోట్లను కేటాయించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు రూ. 22,500 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. కాగా జిల్లాలో మొదటి విడతగా 1,555 ఇళ్లు మంజూరయ్యాయి. బడ్జెట్ కేటాయింపులతో ఇక ఇళ్ల నిర్మాణాలు శరవేగంగా సాగనున్నాయి. ఇప్పటికే గృహజ్యోతి, ఉచిత బస్సు ప్రయాణం, రూ.500 గ్యాస్ సిలిండర్, సన్న ధాన్యానికి బోనస్, రాజీవ్ ఆరోగ్య శ్రీ తదితర పథకాలు కొనసాగుతున్నాయి.న్యూస్రీల్రాష్ట్ర బడ్జెట్లో జిల్లాకు మొండిచేయి! ప్రస్తావనకు రాని మెదక్ రింగ్రోడ్డు ఊసేలేని ఎన్డీఎస్ఎల్ ఫ్యాక్టరీ ఘనపూర్ ప్రాజెక్టుకు దక్కని ప్రాధాన్యంవిద్యకు అరకొర నిధులు సమాజాభివృద్ధిలో కీలక పాత్ర పోషించే విద్యాభివృద్ధికి బడ్జెట్లో అరకొర నిధులు కేటాయించారు. కేవలం 7.57 శాతం నిధులు కేటాయించడం సరికాదు. సరైన సౌకర్యాలు లేక ప్రభుత్వ పాఠశాలలు కునారిల్లుతున్నాయి. విద్యావ్యవస్థను నిర్లక్ష్యం చేయటం సరికాదు. – యాదగిరి, టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు గతంలో కంటే తగ్గాయి రాష్ట్ర బడ్జెట్లో విద్యాశాఖకు గతంలో కంటే కేటాయింపులు తగ్గాయి. విద్యాశాఖలో ఉన్న 26,607 పాఠశాలలను గాలికొదిలేశారు. సమీకృత గురుకులాలకు మాత్రం రూ. 11,600 కోట్లు కేటాయించారు. మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా ప్రభుత్వం విద్యకు 15 శాతం నిధులు కేటాయించాలి. – సురేష్, తపస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి -
సమయపాలన తప్పనిసరి
శివ్వంపేట(నర్సాపూర్)/నర్సాపూర్/పాపన్నపేట: ఉపాధ్యాయులు సమయపాలన పాటించకపోతే శాఖా పరమైన చర్యలు తప్పవని డీఈఓ రాధాకిషన్ హెచ్చరించారు. బుధవారం మండలంలోని పలు పాఠశాలలను సందర్శించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పలువురు ఉపాధ్యాయలు సమయపాలన పాటించడం లేదని ఫిర్యాదులు అందుతున్నాయని తెలిపారు. ప్రతి ఉపాధ్యాయుడు ప్రార్థనలో పాల్గొనాలని సూచించారు. విధుల పట్ల నిర్లక్ష్యం వారిపై కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుందన్నారు. పలు పాఠశాలల్లో నూతనంగా ప్రారంభించిన ఏఐ బోధన చదువులో వెనుకబడిన విద్యార్ధులకు ఎంతగానో ఉపయోగపడుతున్నారు. అనంతరం నర్సాపూర్ మండలంలోని పెద్దచింతకుంట జెడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు ఏర్పాటు చేసిన వీడ్కోలు సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు మంచి పేరు తేవాలని హితవు పలికారు. విద్యార్థులకు హాల్టికెట్లు, పరీక్ష ప్యాడ్స్ పంపిణీ చేశారు. ఆయన వెంట జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అలాగే పాపన్నపేట మండలం నాగ్సాన్పల్లి ప్రాథమిక పాఠశాలలో జరిగిన వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రతి ఒక్కరూ తమ పిల్లలను సర్కార్ బడులకు పంపాలని కోరారు. కార్యక్రమంలో విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. డీఈఓ రాధాకిషన్ -
పారదర్శక రెవెన్యూ పాలన అవసరం
కలెక్టర్ రాహుల్రాజ్మెదక్ కలెక్టరేట్: పారదర్శక రెవెన్యూ పాలనే లక్ష్యంగా తహసీల్దార్లు జవాబుదారితనంతో పనిచేయా లని కలెక్టర్ రాహుల్రాజ్ అన్నారు. బుధవారం కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ నగేష్, డీఆర్ఓ భుజంగరావుతో కలిసి అన్ని మండలాల తహసీల్దార్లతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ప్రజావాణి పెండింగ్ దరఖాస్తులు, ధరణి, ప్రభుత్వ భూములను పరిరక్షణ తదితర అంశాలపై సమీక్షించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న ప్రజలకు పారదర్శక రెవెన్యూ పాలన అందించాలనే లక్ష్యంతో పనిచేయాలని ఆదేశించారు. ధరణి స్పెషల్ డ్రైవ్ చేపట్టి సమస్యలను పరిష్కరించాలన్నారు. ప్రజావాణి పెండింగ్ దరఖాస్తులపై ప్రణాళిక బద్ధమైన చర్యలు తీసుకోవాలన్నారు. సమస్యలతో కార్యాలయానికి వచ్చిన ప్రజలను సముదాయించి సమాధానం ఇవ్వాలని సూచించారు. ప్రతి తహసీల్దార్ కార్యాలయంలో రికార్డులు భద్రపరిచేలా చర్యలు చేపట్టాలన్నారు. సమయపాలన తప్పనిసరిగా పాటించాలన్నారు. తహసీల్దార్ కార్యాలయాల్లో శ్రీనో హెల్మెట్ నో ఎంట్రీశ్రీ అమలు చేయాలని ఆదేశించారు. అలాగే ప్లాస్టిక్ నిషేధం పక్కాగా అమలు జరగాలని స్పష్టం చేశారు. భక్తులకు నీడ కల్పించండి పాపన్నపేట(మెదక్): వేసవి తాపాన్ని దృష్టిలో పెట్టుకొని ఏడుపాయల్లో చలువ పందిళ్లు వేసి భక్తులకు నీడ కల్పించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన ఏడుపాయల్లో పర్యటించారు. ఆది, మంగళ, శుక్రవారాల్లో భక్తుల సంఖ్య అధికంగా ఉంటుందన్నారు. రోజురోజుకు ఎండల తీవ్రత పెరుగుతున్నందున రాజగోపురం నుంచి అమ్మవారి ఆలయం వరకు చలవ పందిళ్లు వేయాలని సూచించారు. అదే విధంగా నేలపై మ్యాట్లు వేసి నీరు పోయాలని చెప్పారు. తాగునీటికి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. అనంతరం దేవాలయ ప్రాంగణంలో పరిస్థితులను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. -
డీఏలు వెంటనే చెల్లించాలి
టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు నరేందర్ మెదక్జోన్: రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు బకాయిపడిన డీఏలను తక్షణమే విడుదల చేయాలని టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు దొంత నరేందర్ డిమాండ్ చేశారు. మంగళవారం టీఎన్జీవో భవన్లో పంచాయతీ కార్యదర్శుల ఫోరం అధ్యక్షుడు సంతోష్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పెరిగిన నిత్యావసర ధరల కనుగుణంగా రావాల్సిన డీఏలను ఇవ్వా ల్సిందేనని చెప్పారు. ఫోరం రాష్ట్ర అధ్యక్షులు సందిల బలరాం మాట్లాడుతూ గ్రామాభివృద్ధి కోసం ఖర్చు చేసిన కార్యదర్శుల బిల్లులను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో టీఎన్జీవో తూప్రాన్ యూనిట్ అధ్యక్షులు శంకర్ గౌడ్, ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షులు భాస్కర్, రాకేష్, లింగప్ప, రవి, రజిత, రమేష్, నవీన్, శ్రీకాంత్, వెంకటరామిరెడ్డి, తదితర పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. -
ఏఐ టెక్నాలజీతో నిఘా నేత్రాలు
తూప్రాన్: ప్రధాన రహదారులపై ఏఐ కెమెరాలు నిఘా వేస్తున్నాయి. పోలీసుల పర్యవేక్షణలో ఆర్టీఫిషల్ ఇంటెలిజెన్స్ (కృత్రిమ మేధ) సాంకేతిక పరిజ్ఞాన్ని వినియోగిస్తున్నారు. సూక్ష్మంగా కనిపించే వాహనాల నంబర్లు సైతం అతి పెద్దగా చూపించడం ఈ కెమెరాల ప్రత్యేకత. అంతేకాకుండ పరిసరాల్లో వ్యక్తులను స్పష్టంగా చూపుతూ అక్కడ ఇతర వాహనాలను సైతం ఈ కెమెరాలు పసిగడుతాయి. రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు, దొంగతనాలకు పాల్పడిన వ్యక్తులు, వాహనాలపై పారిపోతున్నప్పుడు, నేరచరిత్ర కలిగిన అగంతకుల గుర్తింపులో ఈ కెమెరాలు కీలక భూమిక పోషిస్తాయి. ఒకే నంబరు మీద ఎన్ని వాహనాలు తిరుగుతున్నాయో గుర్తిస్తాయి. ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడి చలాన్లను ఎగవేస్తున్న వాహనదారులనూ గుర్తిస్తాయి. ట్రాఫిక్ నిబంధనలు అధిగమిస్తే దానిని సైతం పోలీసులకు చేరవేస్తుంది. వివిధ సందర్భాల్లో నేర సంబంధ అంశాలను సులువుగా గుర్తించేందుకు ఏఐ టెక్నాలజీతో సీసీ కెమెరాలను వినియోగంలోకి తీసుకొచ్చినట్లు ఎస్ఐ శివానందం తెలిపారు. వాటి పని తీరును వివరించారు. పోలీస్ స్టేషన్లో ఏఐ కంట్రోల్రూంను ఏర్పాటు చేశామని, వీటికి అనుసంధానంగా తూప్రాన్ ప్రధాన రహదారిపై నాగులపల్లి, నర్సాపూర్ చౌరస్తాలు, పోతరాజుపల్లి కమాన్వద్ధ మూడు కెమెరాలను ఏర్పాటు చేశామని తెలిపారు. ఒక్కో కెమెరా రూ.1.50 లక్షల విలువ ఉంటుందన్నారు. ఈ కెమెరాలు సీఎస్ఆర్(కార్పోరేట్ సోషల్ రేస్పాన్సిబిల్టి) కింద వివిధ పరిశ్రమల సహాకారంతో ఏర్పాటు చేశామన్నారు. ఇవే కాకుండ మరో ఐదు ఏఐ కెమరాలను త్వరలోనే ఏర్పాటు చేస్తామని తెలిపారు. కాగ మరో 110 సాధారణ సీసీ కెమరాలను పట్టణంలో నిఘా కోసం ఏర్పాటు చేసినట్లు వివరించారు. నేర నియంత్రణలో కీలక భూమిక సరికొత్త టెక్నాలజీని వినియోగిస్తున్న తూప్రాన్ పోలీసులు -
ప్యారానగర్ డంప్యార్డు అనుమతులు రద్దు చేయాలి
ఎంపీ రఘునందన్ వినతి నర్సాపూర్: ప్యారానగర్డంప్యార్డుకు ఇచ్చిన అనుమతులు రద్దు చేయాలని మెదక్ ఎంపీ రఘునందన్రావు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం ఢిల్లీలో కేంద్ర అటవీశాఖ డైరెక్టర్ జనరల్ సుశీల్కుమార్ అవస్తిని కలిసి వినతిపత్రం అందచేశారు. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల్ల మండలం ప్యారానగర్లో నిర్మిస్తున్న డంప్యార్డు అనుమతులను రద్దు చేయాలని ఎంపీ కోరారు. డంప్యార్డుకు సంబంధించిన పలు అంశాలను రఘునందన్ వివరించారు. ఎంపీ వెంట నర్సాపూర్ జేఏసీ నాయకుడు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మురళీయాదవ్, గుమ్మడిదల్ల మండలానికి చెందిన జేఏసీ నాయకులు గోవర్ధన్రెడ్డి, ప్రభాకర్రెడ్డి, బాల్రెడ్డి, ఉదయ్కుమార్ తదితరులు ఉన్నారు. జమిలి ఎన్నికలతో అనేక లాభాలు ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు రమేష్గౌడ్ నర్సాపూర్: ఒకే దేశం ఒకే ఎన్నిక విధానంతో అనేక లాభాలు ఉంటాయని బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు రమేష్గౌడ్ చెప్పారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఈ విధానంతో డబ్బుతో పాటు సమయం కలిసొస్తుందని చెప్పారు. ఎన్నికలు రాగానే ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో ఆయా ప్రాంతాల్లో అభివృద్ధి పనులు చేపట్టే అవకాశం లేకుండా పోతుందని, ఒకేసారి ఎన్నికలు జరిగితే కోడ్ ఒకేసారి ఉంటుందని పేర్కొన్నారు. జమిలి ఎన్నికలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. దేశం బాగు కోసం అందరూ కలిసి రావాలన్నారు. ఆయన వెంట బీజేపీ నాయకులు సురేష్, శంకర్, కరుణాకర్, చంద్రయ్య, రాంరెడ్డి తదితరులు ఉన్నారు. నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి నర్సాపూర్: సర్టిఫికేషన్ కోర్సులతో పాటు ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఫార్మాసిస్టులు నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని రాష్ట్ర డ్రగ్ కంట్రోలర్ అడ్మినిస్ట్రేషన్ అసిస్టెంట్ డైరెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. నర్సాపూర్లోని వైపర్ కాలేజీలో మంగళవారం ప్రారంభమైన రిజిస్టర్డ్ ఫార్మాసిస్టులకు నైపుణ్యాభివృధ్ది శిక్షణ శిబిరంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రిన్సిపాల్ రమేష్ మాట్లాడుతూ సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన పెంచే శిక్షణ కార్యక్రమాలు ఫార్మాసిస్టులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని చెప్పారు. శిక్షణ శిబిరం నాల్గు రోజుల పాటు కొనసాగుతుందని చెప్పారు. కార్యక్రమంలో ప్రోగ్రాం కోఆర్డినేటర్ రామాంజనేయులు పాల్గొన్నారు. మెరుగైన ఫలితాలు సాధించాలి డీఈఓ రాధాకిషన్ చిన్నశంకరంపేట(మెదక్): పదవ తరగతి విద్యా ర్థులు మెరుగైన ఫలితాలు సాధించాలని డీఈఓ రాధాకిషన్ కోరారు. మంగళవారం చిన్నశంకరంపేట మండలం సూరారం జెడ్పీ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు ఏర్పాటు చేసిన వీడ్కోలు సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏకాగ్రతతో ప్రశాంతగా పరీక్షలను రాయాలని కోరారు. ఎలాంటి ఒత్తిడికి గురికాకూడదన్నారు. ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాసి ఉత్తమమైన ఫలి తాలు సాధించాలని సూచించారు. కార్యక్రమంలో జెడ్పీ పాఠశాల హెచ్ఎం సాయిరెడ్డి, మాజీ సర్పంచ్ నీరజపవన్గౌడ్, నాగరాజు, గ్రామ నాయకులు మల్లారెడ్డి, గోవర్ధన్రెడ్డి ఉన్నారు. -
ప్రైవేటు అప్పునకు రుణమివ్వండి
మెదక్జోన్: రాష్ట్రంలోని ప్రతీ రైతుకు పంటరుణం కాకుండా అదనంగా రూ.లక్ష రుణం ఇచ్చేలా అన్ని జిల్లాల న్యాయమూర్తులు చొరవ చూపాలని హైకోర్టు ఆదేశించటంతో రైతుల సమక్షంలో బ్యాంకర్లతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే పలు జిల్లాలో సమావేశాలు జరగ్గా ఈ నెల 19న మెదక్ జిల్లాలో సమావేశం ఏర్పాటు చేయనున్నారు. పంటరుణాలతో సంబంధం లేకుండా రైతులు ప్రైవేటు అప్పులు తీర్చుకునేందుకు ప్రతీరైతుకు అదనంగా రూ.లక్ష చొప్పున బ్యాంకులు రుణాలు ఇచ్చి ఆదుకోవాలని 2015లో మెదక్కు చెందిన రైతుసంరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు శ్రీహరిరావు హైకోర్టును ఆశ్రయించారు. దీనికి స్పందించిన కోర్టు 2018లో పంటరుణాలతో సంబంధం లేకుండా ప్రతీరైతుకు ప్రైవేటు అప్పు చెల్లించుకునేందుకు అదనంగా రూ.లక్ష వరకు రుణాలు ఇవ్వాలని బ్యాంకర్లను ఆదేశించింది. ఈ తీర్పును గౌరవిస్తూ అప్పట్లో కొన్ని బ్యాంకులు మాత్రమే అతికొద్దిమంది రైతులకు రుణాలు ఇవ్వగా చాలా బ్యాంకులు మాత్రం రిజర్వు బ్యాంకు ఆదేశాలు లేవనే సాకుతో రుణాలివ్వలేదు. దీంతో గతేడాది శ్రీహరిరావు మళ్లీ కోర్టును ఆశ్రయించగా గత ఫిబ్రవరి 25న హైకోర్టు తాజాగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల న్యాయమూర్తులకు ఆదేశాలు జారీచేసింది. దీంతో న్యాయమూర్తుల సమక్షంలో రైతులు– బ్యాంకర్లతో సమావేశాలు ఏర్పాటు జరుగుతున్నాయి. ఇప్పటికే పూర్తయిన సమావేశాలు ఇప్పటికే రాష్ట్రంలోని సిద్దిపేట, సంగారెడ్డి, కరీంనగర్లలో ఆయా జిల్లాల న్యాయమూర్తుల సమక్షంలో సమావేశాలు నిర్వహించారు. కాగా, మెదక్ జిల్లాలోని హవేళిఘణపూర్ మండల పరిధిలోని రైతు వేదికలో ఈనెల 19న మెదక్ డిస్ట్రిక్ట్ లీగల్ సెల్ అథారిటీ సెక్రటరీ సీనియర్ జడ్జి జితేందర్ సమక్షంలో రైతులు, లీడ్బ్యాంకు మేనేజర్, వ్యవసాయశాఖ అధికారులతో సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి జిల్లా నలుమూలల నుంచి రైతులు అధిక సంఖ్యలో పాల్గొననున్నారు. 2012లో ఇలా... అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకున్న అన్నదాతల కుటుంబాలకు ప్రభుత్వాలు ఇచ్చే పరిహారంలో నిర్లక్ష్య ధోరణిని సవాల్ చేస్తూ శ్రీహరిరావు బాధిత రైతు కుటుంబాల తరఫున కోర్టును ఆశ్రయించాడు. మెదక్ ఉమ్మడి జిల్లాలో 300మంది రైతులకు ఒక్కోకుటుంబానికి రూ.1.50 లక్షల పరిహారం చొప్పున ప్రభుత్వం అందించాలని 2012లో కోర్టు ఆదేశించింది. రైతుసంరక్షణ సమితి అధ్యక్షుడి పిల్తో హైకోర్టు ఆదేశం జిల్లా న్యాయమూర్తులు చొరవ తీసుకోవాలి ఇప్పటికే పలుజిల్లాల్లో సమావేశాలు నేడు మెదక్ జిల్లా హవేళిఘణపూర్లో..ఇది రైతు విజయం ప్రైవేట్ అప్పుల్లో కూరుకుపోయిన రైతులకు ఇది మంచి సదావకాశం. ప్రతీ రైతుకు పంటరుణంతో సంబంధంలేకుండా అదనంగా రూ.లక్ష వరకు బ్యాంకులు అప్పులిస్తున్నాయి. వాటిని తీసుకుని ప్రైవేట్ అప్పులను తీర్చుకోవాలి. ఏళ్లతరబడి కోర్టులో కేసు కొనసాగించగా రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలతో యంత్రాంగం రైతుల వద్దకే కదిలింది ఇది రైతు విజయంగా భావిస్తున్నాను. –శ్రీహరిరావు, రైతు సంరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు -
22 వేల ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు
● కలెక్టర్ రాహుల్రాజ్ ● ‘పేట’లో నీటి సమస్య లేదని స్పష్టీకరణరామాయంపేట(మెదక్): జిల్లాలో ఎల్ఆర్ఎస్ పథకం కింద 22 వేల దరఖాస్తులు వచ్చాయని కలెక్టర్ రాహుల్రాజ్ పేర్కొన్నారు. మంగళవారం రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో పర్యటించారు. ఒకటో వార్డులో నీటి ఎద్దడి సమస్య గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎల్ఆర్ఎస్ దరఖాస్తులకు సంబంధించి డబ్బులు చెల్లించడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఈ నెలాఖరులోగా డబ్బులు చెల్లిస్తే 25 శాతం మేర రాయితీ లభిస్తుందని చెప్పారు. మున్సిపాలిటీ పరిధిలో తాగు నీటి ఎద్దడి సమస్య లేదని, ఎక్కడైనా ఉంటే వెంటనే అధికారుల దృష్టికి తీసుకరావాలని సూచించారు. రామాయంపేట పరిధిలో ఎక్కడ కూడా పంటలు ఎండిపోవడం లేదని, రైతులకు సూచనలు, సలహాలు ఇవ్వడానికి వ్యవసాయ అధికారులు అందుబాటులో ఉండాలన్నారు. జిల్లా పరిధిలో 2.61 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయని, ఇతర జిల్లాలతో పోలిస్తే పంట ఎండిపోయిన ఘటనలు తక్కువ అని పేర్కొన్నారు. కలెక్టర్ వెంట మున్సిపల్ కమిషనర్ దేవేందర్, మేనేజర్ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. -
కదం తొక్కిన అంగన్వాడీలు
మెదక్ కలెక్టరేట్: డిమాండ్ల సాధన కోసం అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు భారీగా నిరసన ప్రదర్శన నిర్వహించారు. సీఐటీయూ ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్ వద్ద గల ధర్నా చౌక్లో మహాధర్నా నిర్వహించారు. జిల్లా నలు మూలల నుంచి భారీగా తరలివచ్చిన అంగన్వాడీలు కలెక్టరేట్ను ముట్టడించారు. ప్రధాన గేటు ఎదుట బైఠాయించి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి మల్లేశం, అంగన్వాడీ యూనియన్ కార్యదర్శి నర్స మ్మ మాట్లాడుతూ ఐసీఐడీఎస్ను నిర్వీర్యం చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలో నూతన జాతీయ విద్యా విధానం అమలు చేయాలని చూస్తుందన్నారు. ఇవి అమలు జరిగితే క్రమంగా ఐసీడీఎస్ బలహీనపడి, శాశ్వతంగా మూతపడే ప్రమాదం ఉందన్నారు. అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్కు నష్టం కలిగించే ఈ నిర్ణయాలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కలెక్టరేట్లో అందజేశారు. డిమాండ్ల సాధన కోసం కలెక్టరేట్ ఎదుట ధర్నా -
నీ ఇష్టం వచ్చింది రాస్కోపో..!
● నా అనుమతి లేకుండా ఆఫీసులోకి ఎలా వచ్చావ్..? ● సాక్షి విలేకరిపై పీఆర్ సీనియర్ అసిస్టెంట్ దురుసు ప్రవర్తన ● కార్యాలయంలో ఒకే ఒక్కడు.. సమయపాలన పాటించని సిబ్బంది అల్లాదుర్గం(మెదక్): అల్లాదుర్గం సబ్ డివిజన్ కార్యాలయంలో అధికారులు తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఎవరు ఎప్పుడు కార్యాలయానికి వస్తారో.. ఎవరుంటారో తెలియడం లేదు. అసలే అవినీతి, ఆరోపణలతో అభాసుపాలవుతున్న ఈ కార్యాలయంపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ కరువైంది. దీంతో సంబంధిత అధికారులు ఆడింది ఆట.. పాడింది పాటగా తయారైంది. ప్రస్తుతం ఈ కార్యాలయంలో డీఈ, ఏఈ, సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, అటెండర్ ఉన్నారు. డీఈ సెలవుపై వెళ్లడంతో కార్యాలయంలో సిబ్బంది ఉండటం లేదు. మంగళవారం ఉదయం 11 గంటలు దాటినా ఒక్కరే కార్యాలయానికి వచ్చారు. ఈ విషయమై ‘సాక్షి’విలేకరి ఫొటోలు తీస్తుండగా.. సీనియర్ అసిస్టెంట్ అంజయ్య అభ్యంతరం తెలిపారు. ‘‘నా అనుమతి లేకుండా ఫొటోలు ఎలా తీస్తావ్..అసలు నువ్వెవరు..? పర్సంటేజీలు తీసుకుంటున్నారని వార్త రాశావ్ కదా.. నీ ఇష్టం వచ్చింది రాస్కో’’అంటూ దురుసుగా ప్రవర్తించారు. పంచాయతీరాజ్ సబ్ డివిజన్ కార్యాలయంలో జరుగుతున్న అవినీతి ఆరోపణల గురించి ఇటీవల సాక్షి వెలుగులోకి తేవడంతో అధికారులు, సిబ్బంది జీర్ణించుకోలేక పోతున్నారు. సీనియర్ అసిస్టెంట్ దురుసు ప్రవర్తనపై మెదక్ ఈఈ నర్సింలుకు ఫిర్యాదు చేయగా.. విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని చెప్పారు. -
ప్రగతిలో నర్సాపూర్
మంగళవారం శ్రీ 18 శ్రీ మార్చి శ్రీ 2025సకాలంలో సీఎంఆర్ అందించాలి మెదక్జోన్: బ్యాంకు గ్యారంటీలతో పాటు సీఎంఆర్ బియ్యాన్ని గడువులోగా పూర్తి చేసి అందించాలని అదనపు కలెక్టర్ నగేష్ అన్నారు. సోమవారం రైస్మిల్లర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 2024– 25 సంవత్సరానికి సంబంధించి వానాకాలం, యాసంగి ధాన్యం మరాడించేందుకు మిల్లర్లు ప్రభుత్వానికి ఇవ్వాల్సిన బ్యాంకు గ్యారంటీలు ఇప్పటివరకు ఇవ్వలేదన్నారు. జిల్లాలో 94 రైస్ మిల్లులు గడువులోగా సీఎంఆర్ అందించాలని, లేనిచో శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరాల అధికారి సురేష్రెడ్డి, సివిల్ సప్లై డీఎం జగదీష్, ఎల్ఎండీ నరసింహామూర్తి, బ్యాంకర్లు, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.పోడు హక్కు పత్రాలు ఇవ్వాలి మెదక్ కలెక్టరేట్: పోడు భూములకు హక్కు పత్రాలు ఇవ్వాలని, అలాగే భూదాన రెవెన్యూ సమస్యలు పరిష్కరించాలని వ్యవసాయకార్మిక సంఘం జిల్లా కార్యదర్శి మల్లేశం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కేవల్ కిషన్ భవన్లో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా మల్లేశం మాట్లాడుతూ.. జిల్లాలో భూ సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. జిల్లాలో ప్రతి సోమవారం గ్రీవెన్స్ సెల్లో భూ సమస్యలే అధికంగా వస్తున్నాయన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యల పరిష్కారం కోసం వచ్చే నెల 7న కలెక్టరేట్ ఎదుట వ్యవసాయ కార్మికుల సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా మహిళా కన్వీనర్ నాగమణి, నాయకులు నరేందర్, ఐలయ్య, రామస్వామి, వెంకటి తదితరులు పాల్గొన్నారు. రుణమాఫీ వర్తించని వారికి న్యాయం చేస్తాం రామాయంపేట(మెదక్): రుణమాఫీ జరగని రైతులకు న్యాయం చేస్తామని జిల్లా సహకార అధికారి కరుణాకర్ హామీ ఇచ్చారు. రుణమాఫీలో తమకు అన్యాయం జరిగిందని గ్రామానికి చెందిన కొందరు రైతులు ప్రజావాణిలో కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై ఆయన మండలంలోని కోనాపూర్ సంఘం కార్యాలయంలో సోమవారం విచారణ చేపట్టారు. ఈసందర్భంగా డైరెక్టర్లు సీఈఓపై ఫిర్యాదు చేశారు. ఈక్రమంలో కొందరు డైరెక్టర్ల మధ్య వాగ్వాదం జరిగింది. సహకార సంఘం సీఈఓ విధులు సక్రమంగా నిర్వర్తించాలని కరుణాకర్ ఆదేశించారు. సామాజిక తనిఖీ సాక్షిగా తప్పులు పాపన్నపేట(మెదక్): తప్పు లెన్ను వారు తమ తప్పు లెరుగరు.. అన్నట్లుంది 14వ సామాజిక తనిఖీ అధికారుల వ్యవహారం. ఉపాధి హామీ పథకం కింద ఏడాది పొడవునా జరిగిన పనులకు సంబంధించి ఏటా సామాజిక తనిఖీ నిర్వహిస్తారు. ఈ క్రమంలో తనిఖీకి అయిన ఖర్చులను ఫ్లెక్సీపై ముద్రించి వేదికపై ప్రదర్శిస్తారు. అయితే సోమవారం పాపన్నపేటలో ప్రదర్శించిన లెక్కల కూడికల్లో తప్పులు ఉండటాన్ని చూసి పలువురు ముక్కున వేలేసుకున్నారు. సామాజిక తనిఖీలో పాల్గొన్న తనిఖీ బృందం భోజనానికి రూ. 78,235, రవాణా ఖర్చులు రూ. 9,300, వీఆర్పీల గౌరవ వేతనాలు రూ. 49,050, స్టేషనరీ రూ. 2,950, ప్రజావేదిక వీడియో కవరేజి రూ. 6,500, బీఆర్పీల రవాణా ఖర్చులు రూ.1,845, డీఆర్డీఓ కాపీ రూ. 100, వీఆర్పీల ఎంపిక రవాణా ఖర్చులు రూ. 900 ఇవన్నీ కలిపి వాస్తవంగా రూ. 1,48,880 కావాలి, కాని అధికారులు ముద్రించిన ఫ్లెక్సీలో రూ. 14,880 ముద్రించారు. తమ ఖర్చును తామే తప్పుగా చూపిన అధికారులు ఇక ఫీల్డ్ అసిస్టెంట్లు, టీఏలు, ఇతర ఉద్యోగులు చేసిన తప్పులను ఎలా గుర్తిస్తారని పలువురు చర్చించుకున్నారు. ప్రత్యేక అధికారుల పాలనలో నర్సాపూర్ మున్సిపాలిటీ అస్తవ్యస్తంగా తయారైంది. ఆయా విభాగాల్లో అధికారుల పర్యవేక్షణ కొరవడింది. పట్టణంలోని పలు వార్డుల్లో నీటి ఎద్దడి సమస్య తీవ్రంగా నెలకొంది. పారిశుద్ధ్యం పడకేసింది. మురికి కాలువల నిర్వహణ ప్రహసనంగా మారింది. తడి, పొడి చెత్త సేకరణ నినాదంగానే మిగిలిపోయింది. నిధుల లేమితో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోగా.. ప్రజలు ఇబ్బందులతో సతమతం అవుతున్నారు. – నర్సాపూర్ చెత్త సేకరణ అస్తవ్యస్తం పట్టణంలో రోజూ సుమారు పది మెట్రిక్ టన్నుల చెత్తను సిబ్బంది సేకరిస్తున్నారు. ఇందుకోసం 8 ఆటోలు, రెండు ట్రాక్టర్లను వినియోగిస్తున్నారు. కాగా తడి, పొడి చెత్తను వేరు చేసి ఇవ్వాలని ప్రజలకు సూచిస్తున్నారు. కానీ ఆచరలో అమలు కావడం లేదు. డంప్యార్డులో సుమారు రూ. 33 లక్షలతో డ్రై రిసోర్స్ కలెక్షన్ సెంటర్ నిర్మించి సుమారు ఏడాది కావొస్తున్నా ప్రారంభానికి నోచుకోలేదు. కాగా సిబ్బంది పట్టణంలో సేకరించిన చెత్తను డంప్యార్డు ఆవరణలో వేసి నిప్పు పెడుతున్నారు. అంతేగాక పట్టణం నుంచి హైదరాబాద్ మార్గంలో జాతీయ రహదారి పక్కన, మెదక్ మార్గంలోని దేవాలయ భూములు, రాయరావు చెరువు పక్కన చెత్తను వేసి చేతులు దులుపుకుంటున్నారు. దీంతో వాహనదారులు ఇబ్బందుల పాలవుతున్నారు. చెరువు, కుంటలు మురికిమయం పట్టణంలో మురికి కాలువల వ్యవస్థ అస్తవ్యస్తంగా మారడంతో పలు కాలనీల మురికి నీరు చెరువు, కుంటలోకి చేరి మురికిమయం అవుతున్నాయి. పట్టణంలోని పలు పాత, కొత్త కాలనీలలో మురికి కాలువలు నిర్మించకపోవడం గమనార్హం. ఎన్జీఓస్ కాలనీ కింది ఏరియాలోని సుమారు 150 ఇండ్ల నుంచి మురికి నీరు రాయరావు చెరువులోకి వెల్లడంతో చెరువు కలుషితమవుతుంది. కాగా కుమ్మరికుంటలోకి శ్రీరాంనగర్ కాలనీలోని చాలా ఏరియాలోని ఇండ్ల మురికి నీటితో పాటు 11వ వార్డులోని కొంత ఏరియాలోని ఇండ్ల నుంచి వచ్చే మురికి నీరు కోమటి కుంటలోకి వెళ్లి కలువడంతో కుంట కలుషితమవుతోంది. శ్మశానవాటిక అధ్వానం పట్టణంలో పలు చోట్ల శ్మశాన వాటికలు ఉ న్నాయి. వాటిలో కనీసం నీటి సదుపాయం కల్పించకపోవడంతో అంత్యక్రియల సమయంలో ప్రజలు తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారు. ఎవరైనా చనిపోతే ట్యాంకర్ల ద్వారా నీటి సదుపాయం కల్పిస్తున్నారు. మృతుల కుటుంబీకులు, దగ్గరి బంధువులు స్నానాలు చేయడానికి అవస్థలు పడుతున్నారు. స్నానాల గదులు, దహన సంస్కార షెడ్డు నిర్మించడంతో పాటు ప్రహరీ నిర్మించి ఏడాది కావొస్తున్నా వాటిని వినియోగంలోకి తేనందున నిరుపయోగంగా ఉన్నాయి. కోతులు, కుక్కలతో భయం భయం పట్టణ ప్రజలు కోతులు, కుక్కలతో భయం భయంగా జీవిస్తున్నారు. చిన్న పిల్లలు బయట తిరగలేని, ఇంటి బయట ఆడుకోలేని పరిస్థితులు నెలకొన్నాయి. కాగా సుమారు రెండేళ్ల క్రితం పట్టణంలోని శివాలయం వీధిలో తొమ్మిదేళ్ల బాలుడు ఓ భవనంపై ఆడుకుంటుండగా అక్కడికి కోతుల గుంపు వచ్చింది. వాటి నుంచి తప్పించుకునేందుకు భయంతో కిందకు దూకడంతో తీవ్రంగా గాయపడి మృతిచెందాడు. పట్టణంలో రోజు 15 నుంచి 20 మంది ప్రజలు కోతులు, కుక్కల బారిన పడి గాయాలపాలవుతున్నారు. ప్రధాన రోడ్లు అధ్వానం పట్టణంలో ప్రధాన రోడ్లు అధ్వానంగా మారాయి. గత పాలక కమిటీ హయాంలో జనరల్ ఫండ్ నుంచి ప్రతి వార్డులో సీసీ రోడ్లు ఏర్పాటు చేసినప్పటికీ ప్రధాన రోడ్లను పట్టించుకోలేదు. కొత్తగా ఏర్పడిన పలు కాలనీల్లో ఇంకా మట్టి రోడ్లే ఉన్నాయి. లింకు రోడ్లు సైతం నిరుపయోగంగా మరాయి. ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ అసంపూర్తిగా ఉండడంతో ప్రతి శుక్రవారం సంత రోజు వ్యాపారులు రోడ్లపై కూరగాయలు విక్రయించాల్సి వస్తోంది. దీంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. అలాగే పట్టణం మీదుగా ఉన్న జాతీయ రహదారి పక్కన నిర్మించిన మురికి కాలువ, ఫుట్పాత్లను పక్కనే ఉన్న వ్యాపారులు ఆక్రమించినా ఆయా శాఖల అధికారులు చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. భగీరథ ఉన్నా దాహం దాహం మిషన్ భగీరథ పథకం అమలులో ఉన్నా పట్టణంలోని పలు కాలనీల్లో నీటికి కటకట తప్పడం లేదు. ఒక మనిషికి రోజుకు 135 లీటర్ల తాగు నీరు ప్రభుత్వం సరఫరా చేయాల్సి ఉంటుంది. ఈ లెక్కన ప్రజలకు రోజుకు 25 లక్షల 44 వేల లీటర్ల నీరు కావాల్సి ఉంది. అయితే అధికారులు 17 లక్షల లీటర్ల నీరు సరఫరా చేస్తున్నట్లు అధికారిక లెక్కలు చెప్తున్నాయి. అధికారులు సమస్యను అధిగమించేందుకు అవసరమైన చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. వేసవి సీజన్ వస్తున్నందున ప్రజలు నీటి కోసం ఇబ్బందులు పడాల్సి వస్తుందోనని భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.పబ్లిక్ టాయిలెట్స్ నిరుపయోగం పట్టణంలో మూడు చోట్ల పబ్లిక్ టాయిలెట్స్ నిర్మించారు. ఎస్బీఐ ఎదురుగా నిర్మించిన టాయిలెట్ సముదాయాన్ని వినియోగంలోకి తెచ్చిన మున్సిపల్ అధికారులు సుమారు రూ. 24 లక్షలతో ఆర్టీసీ బస్టాండ్ ఆవరణ, స్థానిక చౌరస్తాలో తూప్రాన్ రోడ్డు పక్కన నిర్మించిన రెండు సముదాయాలను వినియోగంలోకి తేకపోవడంతో అవి నిరుపయోగంగా మారాయి. వాటికి నీటి సదుపాయం లేనందునే వినియోగంలోకి తేవడం లేదని తెలిసింది. హరితహారం రికార్డులకే పరిమితం అధికారులు హరితహారం పథకాన్ని నీరుగారుస్తున్నారు. నర్సరీల నిర్వహణను పట్టించుకోవడం లేదు. రెండేళ్లుగా ఇతర ప్రాంతాల్లోని నర్సరీల నుంచి మొక్కుబడిగా మొక్కలు తెచ్చి పట్టణంలో పంపిణీ చేశారు. గతేడాది ప్రతి ఇంటికి ఐదు మొక్కలు ఇచ్చామని అధికారులు చెప్పినా.. పట్టణంలో వెయ్యి ఇళ్లకే మొక్కలు పంపిణీ చేశారు. రికార్డుల్లో మాత్రం ఎక్కువ రాసుకున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అలాగే జాతీయ రోడ్డు పక్కన నాటిన మొక్కలు ఎండిముఖం పట్టాయి. పార్కులులేక ఆహ్లాదం దూరం గతంలో మేజర్ పంచాయతీగా కొనసాగిన నర్సాపూర్ 2018లో మున్సిపాలిటీగా మారింది. కాగా పట్టణంలో ఒక్క పార్కు లేకపోవడం విచారకరం. పట్టణ ప్రజలు సాయంత్రం పూట ఆహ్లాదంగా గడపాలంటే పార్కు లేని లోటు కన్పిస్తుంది. గతంలో ఏర్పాటు చేసిన పిల్లల పార్కు నిరాదరణకు గురవుతుంది. అందులో పిల్లలకు అవసరమైన ఆట వస్తువులు కరువయ్యాయి. ప్రభుత్వ భవనాలు అసంపూర్ణం మున్సిపాలిటీ పరిధిలోని పలు ప్రభుత్వ భవనాల నిర్మాణాలు నిధుల లేమితో అసంపూర్తిగా మిగిలిపోయాయి. మున్సిపాలిటీ కార్యాలయం నిధులు లేక నాలుగున్నరేళ్లుగా నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. అలాగే ఇంటిగ్రేటేడ్ వెజ్ అండ్ నాన్వెజ్ మార్కెట్ యార్డు భవనం పనులు సైతం నిధులు లేక సుమారు పది నెలలుగా పనులు నిలిచిపోయాయి. గౌడ సంఘం భవనం, అధునాతన దోబిఘాట్, ఎస్సీ కమ్యూనిటీ భవన నిర్మాణ పనులు సైతం నిలిచిపోయాయి.చివరికి ఇలా.. చిన్నశంకరంపేట(మెదక్): వరి పంటను కాపాడుకునేందుకు ఓ రైతు భగీరథ య త్నం చేస్తున్నాడు. రోజూ ట్యాంకర్ల ద్వారా నీటిని వినియోగించి పంటను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాడు. నా ర్సింగి మండలంలోని నర్సంపల్లి పెద్దతండాకు రైతు భాషానాయక్ మూడెకరాల్లో వరి సాగు చేశాడు. మొదట్లో రెండు బోర్లు పుష్కలంగా నీరుపోస్తున్నాయని, వరి సాగుకు మొగ్గు చూపగా పంట ఏపుగా పెరిగింది. పంట చేతికొస్తుందనుకున్న సమ యంలో రెండు బోర్లలో నీరు తగ్గిపోయింది. పచ్చనిపంట కళ్లముందే ఎండిపోయి పశువులమేతకు పెట్టడం ఇష్టం లేక ట్యాంకర్ల ద్వారా నీరు తీసుకొచ్చి పంటను కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. కనీసం పెట్టుబడి అయినా మిగిలించుకోవాలనే తాపత్రయ పడుతున్నాడు.కలెక్టరేట్ ఎదుట ధర్నా చేస్తున్న అంగన్ వాడీ టీచర్లు, ఆయాలు మెదక్ కలెక్టరేట్: జాతీయ నూతన విద్యా విధానంతో ఐసీడీఎస్ను నిర్వీర్యం చేసే కుట్రలను కేంద్రం ప్రభుత్వం వెంటనే ఆపాలని అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు అన్నపూర్ణ, నర్సమ్మ డిమాండ్ చేశారు. అంగన్వాడీలు పలు డిమాండ్లతో మెదక్ కలెక్టరేట్ వద్ద సోమవారం 48 గంటల ధర్నాను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్, మినీ టీచర్స్ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలన్నారు. 50 యేళ్లుగా ఎన్నో సేవలతో అందరి మన్ననలు పొందుతున్న ఐసీడీఎస్ను నిర్వీర్యం చేసే పీఎం శ్రీ పథకాన్ని, మొబైల్ అంగన్వాడీ కేంద్రాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన జాతీయ నూతన విద్యా విధానం చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయకుండా ఆపాలని కో రారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్వాడీల సమస్యలు పరిష్కరించకపోగా ఐసీడీఎస్ను నిర్వీర్యం చేసే కుట్రలు చేస్తున్నాయని మండిపడ్డారు. అంగన్వాడీ వ్యతిరేక విధానాలను అమలు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చూడటం అన్యాయమన్నా రు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి మల్లేశం, సంతోష్, అంగన్వాడీ నాయకురాలు రాజ్యలక్ష్మి, స్వప్న విజయ, ఇందిరా, లక్ష్మి, రాణి, కల్పన, జ్యోతి, అరుణ, నాగరాణి అంగన్వాడీ టీచర్లు, ఆయాలు భారీగా పాల్గొన్నారు.ప్రభుత్వ ప్లీడర్గా శోభన్గౌడ్ మెదక్ కలెక్టరేట్: జిల్లా కోర్టులో ప్రభుత్వ ప్లీడర్గా మెదక్ పట్టణానికి చెందిన శివనూరి శోభన్గౌడ్ నియమితులయ్యారు. ఈమేరకు సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సీనియర్ సివిల్ కోర్టు, జూనియర్ సివిల్ కోర్టులో ప్రభుత్వం తరఫున ఆయన వాదించనున్నారు. ఈసందర్భంగా మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావును మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపినట్లు శోభన్ గౌడ్ తెలిపారు.న్యూస్రీల్కలగానే స్టేడియం నిర్మాణం నర్సాపూర్ మేజర్ పంచాయతీగా ఉన్నప్పుడే ఇండోర్, మిని స్టేడియం నిర్మాణానికి నిధులు మంజూరు కావడంతో 2013లో అప్పటి మంత్రులు శ్రీధర్బాబు, సునీతారెడ్డి పనులకు శంకుస్థాపన చేశారు. అయితే నిర్మాణ పనులు ప్రారంభం కాకపోవడంతో క్రీడాకారులు, వాకర్స్ తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో మున్సిపల్ అధికారులు మొక్కుబడిగా ఏర్పాటు చేసిన పట్టణ క్రీడా ప్రాంగణాలు కొన్ని నెలలకే కనుమరుగయ్యాయి. మున్సిపాలిటీ వివరాలు ఏర్పడిన సంవత్సరం 2018 ఇళ్లు 6,742 వార్డులు 15 రెవెన్యూ బ్లాకులు 20 జనాభా 18,845 వాటర్ ట్యాంకులు 31 పబ్లిక్ టాయిలెట్స్ 03 వీధి దీపాలు 2,800 బస్తీ దవాఖానాలు 03 -
స్టేడియం ఏర్పాటు చేయాలి
మున్సిపాలిటీలో ఇండోర్, మినీ స్టేడియాలు లేక ఇబ్బంది పడుతున్నాం. కాలేజీ మైదానంలో చిన్న చిన్న గుంతలున్నా వాకింగ్ చేస్తున్నాం. ఇప్పటికై నా స్టేడియం నిర్మించి క్రీడాకారులు, వాకర్స్ను ప్రోత్సహించాలి. – నర్సింగ్రావు, క్రీడాకారుడు, నర్సాపూర్ మార్కెట్ తరలించాలి జాతీయ రహదారి నుంచి షాదీఖానా వెళ్లే రోడ్డుకు ఇరువైపులా కూరగాయల దుకాణాలు పెట్టడంతో ఇరుకుగా మారి రాకపోకలకు ఇబ్బంది అవుతుంది. మార్కెట్ యార్డు పూర్తి చేసి కూరగాయల దుకాణాలను తరలించాలి. – బోడ చైతన్య, పట్టణ వాసుడు సరిపడా నీరు రావడం లేదు తమ ఏరియాలో ఒక్కో ఇంటికి ఐదు బిందెల నీరు మాత్రమే రావడంతో సరిపోవడం లేదు. బోర్ల ద్వారా నీరు తెచ్చుకుంటూ అవసరాలు తీర్చుకుంటున్నాం. ఇప్పటికై నా తాగు నీరు సరిపడా సరఫరా చేయాలి. – కళమ్మ, ఎన్జీఓస్ కాలనీ నిధులు రాగానే పూర్తి చేయిస్తాం నిఽదులు లేక కొత్త భవనాల నిర్మాణాలు నిలిచిపోయాయి. నిధులు రాగానే పనులు పూర్తి చేయిస్తాం. మిషన్ భగీరథ నీరు అంతటా వస్తున్నాయి. ఆయా వార్డులలో నీరు తక్కువగా వస్తున్నట్లు తనకు తెలియదు. అంతటా సక్రమంగా నీరు సరఫరా అయ్యే విధంగా చర్యలు తీసుకుంటా. మురికి నీరు చెరువులోకి, కుంటలోకి వెలుతున్న విషయం నా దృష్టికి రాలేదు. వాటిలోకి మురికి నీరు వెళ్లకుండా చర్యలు తీసుకుంటా. – రామకృష్ణరావు, కమిషనర్● -
ఒకేదేశం ఒకేఎన్నికతో ఎంతోమేలు
మెదక్జోన్: ఒకే దేశం ఒకే ఎన్నికతో కేంద్ర, రాష్ట్రాలకు ఎంతో మేలు జరుగుతుందని, ప్రజాధనం వృథా కాదని బీజేపీ జిల్లా అధ్యక్షుడు వాల్దార్ మల్లేశం గౌడ్ పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి పలువురి సలహాలు, సూచనలు తీసుకుంటూ జిల్లా అధ్యక్షుడి ఆధ్వర్యంలో వర్క్షాపు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...వన్ నేషన్, వన్ ఎలక్షన్ ఎన్నికల నిర్వహణలో సమూల మార్పులు వస్తాయని, లోక్సభ, అసెంబ్లీలకు కలిపి దేశం మొత్తం ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే భారీగా ప్రజాధనం ఆదా అవుతాయన్నారు. ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం వల్ల పోలింగ్ శాతం సైతం పెరుగుతుందని తెలిపారు. 2016లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జమిలి ఎన్నికల ఆలోచనలను ప్రతిపాదించగా, దీనిపై 2017లో నీతి ఆయోగ్ కసరత్తు చేసిందని వివరించారు. 2022 డిశంబర్లో జమిలి ఎన్నికలపై లా కమిషన్ వివిధ పార్టీలు, ఈసీ, అధికారులు, విద్యావేత్తలు, నిపు ణుల, అభిప్రాయాలను ఆహ్వానించిందని గుర్తు చేశారు. కార్యక్రమంలో మాజీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శులు శ్రీనివాస్, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.బీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లేశంగౌడ్ -
ప్రజావాణి అర్జీలకు అధిక ప్రాధాన్యం
మెదక్ కలెక్టరేట్: ప్రజావాణి అర్జీలకు అధిక ప్రాధాన్యం ఇస్తూ త్వరితగతిన పరిష్కారానికి చర్యలు చేపట్టాలని కలెక్టర్ రాహుల్రాజ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా అదనపు కలెక్టర్ నగేష్, జెడ్పీ సీఈఓ ఎల్లయ్యతో ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజావాణి పెండింగ్ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించేలా అధికారులు చొరవ చూపాలని సూచించారు. అయితే ప్రజావాణికి అధికంగా భూ సమస్యలపై 19, ఇందిరమ్మ ఇళ్ల కోసం 1, పెన్షన్ల కోసం 1, ఉద్యోగ ఉపాధిపై 2, ఇతర సమస్యలపై 33 అర్జీలు కలిపి మొత్తం 56 వినతులను ప్రజల నుంచి స్వీకరించారు. కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.కలెక్టర్ రాహుల్రాజ్ -
గురుకుల ప్రవేశ పరీక్షకు దరఖాస్తుల స్వీకరణ
జహీరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బీసీ గురుకుల పాఠశాలల్లో 2025–26 విద్యాసంవత్సరానికి సంబంధించి 6,7,8,9వ తరగతులలో మిగిలి ఉన్న ఖాళీల కోసం నిర్వహించే ప్రవేశ పరీక్ష కోసం అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని ఝరాసంగం, దిగ్వాల్ బాలుర గురుకుల పాఠశాల ప్రధానోపాధ్యాయుడు హరీశ్వర్రెడ్డి కోరారు. ఈ నెల 31వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తు చేసుకున్న వారికి ఏప్రిల్ 20న ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ప్రవేశ పరీక్షలో వచ్చిన ప్రతిభ ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుందని పేర్కొన్నారు. -
కొమురవెల్లికి పోటెత్తిన భక్తజనం
కొమురవెల్లి మల్లన్న బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. తొమ్మిదవ ఆదివారం ఆలయానికి భక్తులు పోటెత్తారు. వచ్చేవారం బ్రహ్మోత్సవాలు ముగియనుండటంతో భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. భక్తులు పుష్కరిణిలో స్నానమాచరించి స్వామివారిని దర్శించుకున్నారు. అభిషేకాలు, అర్చనలు, ప్రత్యేక పూజలు చేశారు. గంగిరేణు చెట్టు వద్ద పట్నాలు వేసి, ముడుపులు కట్టి మొక్కులు తీర్చుకున్నారు. కొండపైన ఉన్న రేణుక ఎల్లమ్మ తల్లికి బోనాలు సమర్పించారు. ఏర్పాట్లను ఆలయ సిబ్బంది పర్యవేక్షించారు. – కొమురవెల్లి(సిద్దిపేట) -
వృత్తి నైపుణ్యం.. ఉపాధికి మార్గం
ఈనెల 30 వరకు అడ్మిషన్లు ఇప్పటివరకు 11 బ్యాచ్లకు శిక్షణ ఇచ్చాం. ప్రస్తుతం 12వ బ్యాచ్కి శిక్షణ ఇచ్చేందుకు ఈనెల 30వ తేదీ వరకు అడ్మిషన్లకు అవకాశం ఉంది. మొక్కుబడి ఫీజుతో అనుభవజ్ఞులతో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నాం. జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. – మనిషా, మెదక్ శిక్షణ కేంద్రం ఇన్చార్జి మెదక్ కలెక్టరేట్: ఎలాంటి ఉద్యోగం లభించక, స్వయం ఉపాధి పొందడానికి మార్గం కానరాక ఎంతో మంది నిరుద్యోగులు నలిగిపోతున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం 7 నుంచి 10 తరగతి పూర్తి చేసిన నిరుద్యోగులకు వృత్తి నైపుణ్య కోర్సుల్లో శిక్షణ ఇచ్చేందుకు ప్రత్యేక శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసింది. జిల్లా కేంద్రంలో గత మూడేళ్లుగా నిరుద్యోగ యువతీ యువకులకు వయస్సుతో నిమిత్తం లేకుండా వృత్తి నైపుణ్య కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నారు. ఇప్పటివరకు 11 బ్యాచ్లు పూర్తి నిరుద్యోగ యువతకు వృత్తి నైపుణ్య కోర్సుల్లో శిక్షణ ఇచ్చేందుకు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలల్లో శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం, యువజన సర్వీసుల శాఖ, జిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కేంద్రంలో ఇప్పటి 11 బ్యాచ్లకు శిక్షణ ఇచ్చారు. ఇందులో శిక్షణ పొందిన వందలాది మంది యువతీ, యువకులు పలు ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాల్లో చేరారు. అలాగే మరికొంతమంది స్వయం ఉపాధి పొందుతున్నారు. మహిళలు బ్యూటీ పార్లర్, మగ్గం వర్క్, కంప్యూటర్ శిక్షణ, ఫ్యాషన్ డిజైనింగ్ నేర్సుకొని ఉపొధి పొందుతున్నారు. కొంతమంది పలు కార్యాలయాల్లో కంప్యూటర్ ఆపరేటర్లుగా పనిచేస్తున్నారు. పెళ్లి అయిన మహిళలు తమ కుటుంబాలకు అండగా నిలుస్తున్నారు. అలాగే యువకులు సీసీటీవీ, కంప్యూటర్ సాఫ్ట్వేర్, హార్డ్వేర్, ఎలక్ట్రిక్, మోబైల్ సర్వీసింగ్ నేర్చుకొని స్వయం పొందుతున్నారు. అనుభవజ్ఞులతో శిక్షణ ప్రస్తుత పోటీ ప్రపంచంలో నిలదొక్కుకునేలా అనుభవజ్ఞులతో శిక్షణ ఇస్తున్నారు. పరిమిత సంఖ్యలో ఉంటే ప్రతి ఒక్కరికిపై శ్రద్ధ చూపవచ్చునని, ప్రతి బ్యాచ్కు 30 మందికి మాత్రమే అడ్మిషన్కు అవకాశం కల్పిస్తున్నారు. మహిళలకు ప్రత్యేకంగా ఫ్యాషన్ డిజైనింగ్, బ్యూటీషియన్, జర్దోషి (మగ్గం వర్క్) కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నారు. అలాగే సీ్త్ర, పురుషులకు కంప్యూటర్ (ఎంఎస్ ఆఫీస్), సీసీ టీవీ ఫిట్టింగ్, రిపేర్, కంప్యూటర్ హార్డ్వేర్, ఎలక్ట్రికల్ (హౌస్ వైరింగ్), మోబైల్ సర్వీసింగ్, రిపేర్ కోర్సుల్లో 3 నెలల శిక్షణ ఇచ్చి ప్రభుత్వ ధృవీకరణ పత్రం అందజేస్తారు. ఒక్కో కోర్సుకు రూ. 1,500 ఫీజు మాత్రమే తీసుకుంటున్నారు. ఈ సర్టిఫికెట్ ఆధారంగా ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు పొందవచ్చు. లేదా బ్యాంకుల ద్వారా రుణాలు పొంది స్వయం ఉపాధి పొందవచ్చు.ఎనిమిది కోర్సుల్లో నిరుద్యోగులకు శిక్షణ -
ప్రజలను మోసం చేస్తున్న ప్రభుత్వం
పెద్దశంకరంపేట(మెదక్): అమలు కాని హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుందని నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి విమర్శించారు. ఆదివారం పెద్దశంకరంపేటలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో మండలంలోని పలు గ్రామాలకు బీటీ రోడ్లు మంజూరు చేయించానని, వాటిని పూర్తిగా ప్రస్తుత ప్రభుత్వం రద్దు చేసిందన్నారు. దళితబంధులో పలువురికి మంజూరైన నిధులు సైతం ఇవ్వడం లేదన్నారు. గతంలో ప్రభుత్వ పట్టాలు పొంది గృహలక్ష్మిలో మంజూరైన వారికి ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ జంగం శ్రీనివాస్, సీనియర్ నాయకులు మానిక్రెడ్డి, జంగం రాఘవులు, శంకర్గౌడ్, సుభాష్, రవీందర్, యాదుల్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. ‘పెండింగ్ బిల్లులు, జీతాలు విడుదల చేయాలి’ మెదక్ కలెక్టరేట్: మధ్యాహ్న భోజన కార్మికుల పెండింగ్ బిల్లులు, జీతాలను వెంటనే విడుదల చేయాలని యూనియన్ జిల్లా కార్యదర్శి కడారి నర్సమ్మ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం పట్టణంలోని కేవల్ కిషన్ భవన్లో ఆమె మాట్లాడుతూ.. మధ్యాహ్న భోజన కార్మికులకు 5 నెలలుగా జీతాలు, బిల్లులను చెల్లించకుండా ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తుందన్నారు. అప్పులు తెచ్చి పాఠశాలల్లో మధ్యాహ్నం భోజనం పెడుతూ కార్మికులు అప్పుల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతినెల ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీనే జీతాలు వేస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం, కార్మికులను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఇప్పటికై నా పెండింగ్ బిల్లులు, జీతాలు వెంటనే విడుదల చేయాలని.. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో లక్ష్మి, పద్మ, లావణ్య, నాగమణి, సక్కుబాయి, మౌనిక, నాగమణి తదితరులు పాల్గొన్నారు. నాచగిరి బ్రహ్మోత్సవాలకు ఆహ్వానం వర్గల్(గజ్వేల్): నాచగిరి లక్ష్మీనృసింహస్వామివారి బ్రహ్మోత్సవాలు పురస్కరించుకుని ఆదివారం ఆలయ ఈఓ పార్నంది విశ్వనాథశర్మ పలువురు.. ప్రముఖులకు బ్రహ్మోత్సవ ఆహ్వాన పత్రికలు అందజేశారు. ఎంపీ మాధవనేని రఘునందన్రావు, ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి, మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు, డీసీసీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డిలను వేర్వేరుగా కలిసి ఉత్సవాలకు హాజరుకావాలని కోరారు. 6,500 కోళ్లు మృత్యువాత చిన్నశంకరంపేట(మెదక్): అంతుచిక్కని వైరస్తో కోళ్లు మృత్యువాతపడిన సంఘటన మండలంలోని గవ్వలపల్లి గెరిల్లాతండాలో ఆదివారం చోటు చేసుకుంది. తండాకు చెందిన బానోత్ స్వామినాయక్ కోళ్లఫాంలో ఒక్కసారిగా 6,500 కోళ్లు మృతిచెందగా, పంట పొలంలో గోతి తీసి పాతిపెట్టారు. ఒక్కసారిగా లక్షల్లో నష్టం కలిగిందని, ప్రభుత్వం ఆదుకోవాలని బాధిత రైతు కోరారు. కార్మికుల కోసం నిరంతర పోరాటంపటాన్చెరు: కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా నిరంతర పోరాటం చేస్తామని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్కా రాములు అన్నారు. పటాన్చెరులోని శాండ్విక్ ఎంప్లాయీస్ యూ నియన్ సీఐటీయూ అనుబంధంగా 40 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా పోచారంలో క్రికెట్ పోటీలను నిర్వహించారు. -
అంతరాయం ఉండొద్దు
విద్యుత్ సరఫరాలోకలెక్టర్ రాహుల్రాజ్కాంగ్రెస్ ప్రభుత్వంలో కరెంట్ కష్టాలు దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి హవేళిఘణాపూర్(మెదక్): వేసవిలో విద్యుత్ వినియోగం పెరిగే అవకాశం ఉన్నందున, ముందస్తు జాగ్రత్తలతో అప్రమత్తంగా ఉండి అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేయాలని కలెక్టర్ రాహుల్రాజ్ అన్నారు. ఆదివారం మెదక్ మండలం మంభోజిపల్లి 33/11 కేవీ విద్యుత్ సబ్స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యుత్ సరఫరా ఇన్పుట్, అవుట్పుట్, ట్రాన్స్ఫార్మర్లు, ఫీడర్ల గురించి విద్యుత్ శాఖ ఎస్ఈ శంకర్ను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం ఇబ్బందులు లేకుండా నిరంతరాయంగా విద్యుత్ అందించడంపై కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. అయితే వేసవిలో విద్యుత్ వినియోగం పెరిగే అవకాశమున్నందున, ముందస్తు ప్రణాళికలతో సిద్ధంగా ఉండాలని అధికారులకు సూచించారు. ట్రాన్స్ఫార్మర్లు, లైన్లు, ఇతర సాంకేతిక పరంగా ఎదురయ్యే లోపాలుంటే సరిచేసుకోవాలన్నారు. అదనపు ట్రాన్స్ఫార్మర్లు సిద్ధంగా ఉంచడం, లోడ్ మేనేజ్మెంట్కు ప్రత్యేక ప్రణాళిక రూపొందించడం వంటి చర్యలను అమలు చేయాలని చెప్పారు. జిల్లాలో 33/11 కేవీ ఉప విద్యుత్ కేంద్రాలు 126 ఉన్నాయని, వాటి పరిధిలో ప్రతి రోజు విద్యుత్ వినియోగం నమోదు చేయాలని ఆదేశించారు. ముఖ్యంగా, వ్యవసాయ, పారిశ్రామిక, గృహ వినియోగదారులకు అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేయాలని సూచించారు. చిన్నశంకరంపేట(మెదక్): కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది.. కరెంట్ కష్టాలు తెచ్చిందని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి విమర్శించారు. ఆదివారం నార్సింగి మండల కేంద్రంలో సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు. అనంతరం సబ్స్టేషన్లో పవర్ ట్రాన్స్ఫార్మర్ బ్రేక్డౌన్ కాగా పరిశీలించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నూతన ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. యాసంగి పంటలకు కరెంట్ సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టాలన్నారు. బీఆర్ఎస్ హయాంలో ప్రాజెక్టులు నిర్మించి గోదావరి జలాలను తీసుకొస్తే కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం కాలువలు సైతం నిర్మించలేని పరిస్థితిలో ఉందన్నారు. మార్పు పేరుతో అధికారంలోకి వచ్చి ఆనాటి కరెంట్ కష్టాలను ప్రజలకు చూపిస్తున్నారని మండిపడ్డారు. మల్లన్నసాగర్ నీటిని పంటలకు అందించి రైతుల ఇబ్బందులు తొలగించాలని కోరారు. అధికారంలో ఉన్నా, లేకున్నా రైతుల పక్షాన బీఆర్ఎస్ పోరాటం చేస్తుందని తెలిపారు. ఎమ్మెల్యే వెంట మాజీ జెడ్పీటీసీ కృష్ణారెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ మల్లేశంగౌడ్, బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు బాబు, నాయకులు భూపతిరాజు, శ్రవన్కుమార్ తదితరులు ఉన్నారు. -
ఇష్టానుసారంగా మాట్లాడితే ఊరుకోం
మెదక్జోన్: ప్రభుత్వంపై ఇష్టానుసారంగా మాట్లాడితే బీఆర్ఎస్ నేతలను తిరగనివ్వమని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ హెచ్చరించారు. ఆదివారం పట్టణంలోని రాందాస్ చౌరస్తాలో కాంగ్రెస్ నాయకులతో కలిసి ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాజ్యాంగబద్ధమైన స్థానంలో ఉన్న స్పీకర్పై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. అధికారంలో ఉన్నప్పుడు అట్టడుగువర్గాలను అవమానించారని, ఇప్పుడు అధికారం కోల్పోయాక అలానే వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో అనేక కొత్త నిబంధనలు తీసుకురావడమే కాకుండా.. ఆనాటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలను పోడియం వద్దకు రానివ్వకుండా అడ్డుకున్నారని గుర్తుచేశారు. దళిత వర్గానికి చెందిన స్పీకర్ను టార్గెట్ చేయడం మంచిది కాదని హితవుపలికారు. జగదీశ్రెడ్డి సభ్యత్వాన్ని రద్దు చేసి రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడాలని కోరారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, మాజీ కౌన్సిలర్లు మధుసూదన్, రుక్మిణి, ప్రవీణ్గౌడ్, శేఖర్, లింగం, దుర్గాప్రసాద్, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ -
ప్రతి పైసా రికవరీ చేస్తాం
జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శ్రీనివాస్రావు నర్సాపూర్ రూరల్: జాతీయ ఉపాధి హామీ పథకం పనుల్లో అవకతవకలకు పాల్పడిన వారి నుంచి ప్రతి పైసా రికవరీ చేస్తామని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శ్రీనివాస్రావు తెలిపారు. శనివారం నర్సాపూర్ ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో ఉపాధి పనులకు సంబంధించి ప్రజావేదిక నిర్వహించారు. అటవీశాఖలో ఉపాధి హామీ పథకం ద్వారా కలిగిన మొక్కల పెంపకంలో అవకతవకలు జరిగినట్లు గుర్తించారు. మొక్కల పెంపకానికి బినామీ పేర్లతో నీటి ట్యాంకర్లు పెట్టినట్లు బిల్లులు తీసుకున్నట్లు తేలిందన్నారు. రూ. 8,91,610 చెల్లింపులు జరిగాయన్నారు. ఇట్టి డబ్బులను రికవరీ చేస్తామని చెప్పారు. అటవీశాఖ అధికారులు ప్రజాదర్బార్కు రాకుండా నిర్లక్ష్యం చేసినందుకు వారిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. మండలంలోని అహ్మద్నగర్, బ్రాహ్మణపల్లి, తిరుమలాపూర్, తుజాల్పూర్ తదితర గ్రామాల్లో అవకతవకలు జరిగినట్లు తెలిందన్నారు. ఫీల్డ్ అసిస్టెంట్ల నుంచి రూ. 60,610 రికవరీ చేస్తామని వివరించారు. వారం రోజులుగా మండలంలోని అన్ని గ్రామాల్లో సుమారు రూ. 9.18 లక్షల నిధులకు సంబంధించి సోషల్ ఆడిట్ జరిగిందన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ మధులత, ఏపీఓ వైద్య శ్రీనివాస్, ఏపీడీ బాలయ్య, జూనియర్ క్వాలిటీ కంట్రోల్ అధికారిణి అరుణ, ఏపీఓ అంజిరెడ్డి, సోషల్ ఆడిట్ సిబ్బంది, ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లు పాల్గొన్నారు. -
అవాంతరాలు అధిగమిస్తేనే అందలం
● పట్టు వీడని సంకల్పమే అసలైన పరీక్ష ● రోజుకు 12 గంటలు చదివా.. ● గ్రూప్–3 స్టేట్ టాపర్ అర్జున్రెడ్డిపాపన్నపేట(మెదక్): పోటీ పరీక్షల సన్నద్ధత ప్రారంభమైనప్పటి నుంచి ఎన్నో అవాంతరాలు ఏర్పడుతుంటాయి.. కాని పట్టు వీడని సంకల్పంతో ముందు కెళ్లడమే అసలైన పరీక్ష అని గ్రూప్– 3 స్టేట్ టాపర్ కుకునూరి అర్జున్రెడ్డి అన్నారు. శనివారం ఆయన ‘సాక్షి’తో పలు విషయాలు పంచుకున్నారు. ఇంజనీరింగ్ పూర్తి చేసి 2013 నుంచి పోటీ పరీక్షలకు సన్నద్ధత ప్రారంభించానని చెప్పారు. మొదటి ప్రయత్నంలోనే 2014లో వీఆర్ఓ పోస్టు సాధించానని.. ఆ పోస్టు తన లక్ష్యం కాకపోయినప్పటికీ ఉద్యోగంలో చేరానని తెలిపారు. అప్పటి నుంచి పోటీ పరీక్షలపై ఆశతో ఒక వైపు ఉద్యోగం, మరో వైపు ప్రిపరేషన్ కొనసాగించానని చెప్పారు. ఏళ్ల తరబడి ఎదురు చూపులు తన లక్ష్యాన్ని నీరు గార్చలేదన్నారు. సన్నద్ధతలో భాగంగా ఎంపిక చేసిన మెటీరియల్ చదువుకొని, సొంతంగా నోట్స్ తయారు చేసుకోవాలని సూచించారు. నోట్స్ను వర్తమాన అంశాలతో సమన్వయం చేసుకుంటూ ప్రిపేర్ కావాలన్నారు. తాను రోజుకు 12 గంటలు చదివినట్లు చెప్పారు. కుటుంబమే ప్రేరణ నా కుటుంబమే నాకు ప్రేరణ అని అర్జున్రెడ్డి అన్నారు. నాన్న నరేందర్రెడ్డి లైబ్రెరియన్, అమ్మ శోభ గృహిణి, తమ్ముడు అరుణ్రెడ్డి ఆర్అండ్బీ ఏఈ, పెద్ద చెల్లెలు అక్షిత సాఫ్ట్వేర్ ఇంజ నీర్, చిన్న చెల్లెలు హర్షిత మెడిసిన్, బాబాయి శ్రీనివాస్రెడ్డి హెడ్ కానిస్టేబుల్.. వీరంతా నా లక్ష్య సాధనకు ఊపిరిలూదారని తెలిపారు. గ్రూప్– 1 సాధించాలన్నదే నా లక్ష్యమని, ఉన్నతాధికారిగా ప్రజలకు బాధ్యతాయుతమైన సేవలు అందించాలన్నదే జీవిత ఆశయమన్నారు. పోటీ పరీక్షల ప్రిపరేషన్లో ప్రభుత్వ గ్రంథాలయాలు ఎంతగానో ఉపయోగపడుతాయని వివరించారు. ప్రస్తుతం గ్రూప్–3 టాపర్గా నిలిచినా, గ్రూప్– 2లో 18వ ర్యాంకు వచ్చింది కాబట్టి అదే ఉద్యోగంలో జాయిన్ అవుతానని వెల్లడించారు. -
ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలి
మెదక్ కలెక్టరేట్: దివ్యాంగులు అధైర్యపడొద్దని.. ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలని జిల్లా సీనియర్ సివిల్ జడ్జి జితేందర్ సూచించారు. శనివారం జిల్లా కేంద్రంలోని భవిత కేంద్రంలో ‘సమగ్ర శిక్ష– అలిమ్కో’ ఆధ్వర్యంలో దివ్యాంగ విద్యార్థులకు సహాయ ఉపకరణాలను ఉచితంగా అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ఇచ్చే ఉపకరణాలను వినియోగించుకొని ముందుకు సాగాలన్నారు. అలిమ్కో వైద్యులు విద్యార్థులను పరిశీలించి వారికి అవసరమైన ఉపకరణాలు, వీల్ చైర్స్, వినికిడి యంత్రాలు అందజేశారు. కార్యక్రమంలో డీఈఓ రాధాకిషన్, ఎంఈఓ నీలకంఠం, సమ్మిళిత విద్యా సెక్టోరియల్ అధికారి సతీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా సీనియర్ సివిల్ జడ్జి జితేందర్ -
హామీల అమలులో ప్రభుత్వం విఫలం
సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లికార్జున్మెదక్ కలెక్టరేట్: కార్మిక వర్గానికి ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లికార్జున్ ఆరోపించారు. శనివారం కేవల్ కిషన్ భవన్లో నిర్వహించిన ిసీఐటీయూ జిల్లా ఆఫీస్ బేరర్స్ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఎన్నికల సమయంలో అసంఘటిత కార్మికలకు ఇచ్చిన హామీలు ఇప్పటివరకు అమలు చేయలేదని మండిపడ్డారు. గత ప్రభుత్వంలో ఐదు రకాల జీఓలు ఇచ్చిన, గెజిట్ చేయలేదని హైకోర్టులో కేసు నడుస్తుందని గుర్తుచేశారు. ట్రాన్స్పోర్డు, హమాలీ రంగంలో సంక్షేమ బోర్డు లేదని, దీని మూలంగా వేలాది మంది తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలలో ఒక్క మహిళలకు ఉచిత బస్సు తప్ప, ఏ ఒక్క హామీ అమలు కాలేదన్నారు. వీటి పరిష్కారం కోసం ఈనెల 21వ తేదీన హైదరాబాద్ ధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అధిక సంఖ్యలో కార్మికులు హాజరుకావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు మల్లేశం, కడారి నర్సమ్మ, నాగరాజు, నాగేందర్ రెడ్డి, బాలమణి, సంతోష పాల్గొన్నారు. -
ఓవర్లోడ్.. ట్రాన్స్ఫార్మర్ ఫెయిల్
చిన్నశంకరంపేట(మెదక్): తీవ్రమైన ఎండలకు తోడు విద్యుత్ డిమాండ్ పెరగడంతో ఓవర్ లోడ్తో నార్సింగి సబ్స్టేషన్లోని 8 ఎంవీఏ పవర్ ట్రాన్స్ఫార్మర్ ఫెయిలైంది. దీంతో శుక్రవారం రాత్రి నుంచి మండల కేంద్రంతో పాటు గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. విషయం తెలుసుకున్న విద్యుత్ శాఖ డీడీ సోమేష్, ఏడీఏ యాదయ్య, ఏఈ స్వామి సబ్స్టేషన్ పరిశీలించారు. పవర్ ట్రాన్స్ఫార్మర్ను తిరిగి ఏర్పాటు చేసేందుకు మూడు రోజుల సమయం పడుతుందని ప్రకటించా రు. అప్పటివరకు మరోలైన్ ద్వారా విద్యుత్ అందించినప్పటికీ కోతలు తప్పవని తెలిపా రు. అవసరమైతే రైతులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. ఇదిలాఉండగా నార్సింగిలో రాత్రి నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో రైతులు శనివారం ఉదయం సబ్స్టేషన్ వద్దకు చేరుకొని ఆందోళన చేపట్టారు. పంట పొలాలకు సాగు నీటి ఇబ్బందులు ఏర్పడుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. -
అవాంతరాలు అధిగమిస్తేనే అందలం
● పట్టు వీడని సంకల్పమే అసలైన పరీక్ష ● రోజుకు 12 గంటలు చదివా.. ● గ్రూప్–3 స్టేట్ టాపర్ అర్జున్రెడ్డిపాపన్నపేట(మెదక్): పోటీ పరీక్షల సన్నద్ధత ప్రారంభమైనప్పటి నుంచి ఎన్నో అవాంతరాలు ఏర్పడుతుంటాయి.. కాని పట్టు వీడని సంకల్పంతో ముందు కెళ్లడమే అసలైన పరీక్ష అని గ్రూప్– 3 స్టేట్ టాపర్ కుకునూరి అర్జున్రెడ్డి అన్నారు. శనివారం ఆయన ‘సాక్షి’తో పలు విషయాలు పంచుకున్నారు. ఇంజనీరింగ్ పూర్తి చేసి 2013 నుంచి పోటీ పరీక్షలకు సన్నద్ధత ప్రారంభించానని చెప్పారు. మొదటి ప్రయత్నంలోనే 2014లో వీఆర్ఓ పోస్టు సాధించానని.. ఆ పోస్టు తన లక్ష్యం కాకపోయినప్పటికీ ఉద్యోగంలో చేరానని తెలిపారు. అప్పటి నుంచి పోటీ పరీక్షలపై ఆశతో ఒక వైపు ఉద్యోగం, మరో వైపు ప్రిపరేషన్ కొనసాగించానని చెప్పారు. ఏళ్ల తరబడి ఎదురు చూపులు తన లక్ష్యాన్ని నీరు గార్చలేదన్నారు. సన్నద్ధతలో భాగంగా ఎంపిక చేసిన మెటీరియల్ చదువుకొని, సొంతంగా నోట్స్ తయారు చేసుకోవాలని సూచించారు. నోట్స్ను వర్తమాన అంశాలతో సమన్వయం చేసుకుంటూ ప్రిపేర్ కావాలన్నారు. తాను రోజుకు 12 గంటలు చదివినట్లు చెప్పారు. కుటుంబమే ప్రేరణ నా కుటుంబమే నాకు ప్రేరణ అని అర్జున్రెడ్డి అన్నారు. నాన్న నరేందర్రెడ్డి లైబ్రెరియన్, అమ్మ శోభ గృహిణి, తమ్ముడు అరుణ్రెడ్డి ఆర్అండ్బీ ఏఈ, పెద్ద చెల్లెలు అక్షిత సాఫ్ట్వేర్ ఇంజ నీర్, చిన్న చెల్లెలు హర్షిత మెడిసిన్, బాబాయి శ్రీనివాస్రెడ్డి హెడ్ కానిస్టేబుల్.. వీరంతా నా లక్ష్య సాధనకు ఊపిరిలూదారని తెలిపారు. గ్రూప్– 1 సాధించాలన్నదే నా లక్ష్యమని, ఉన్నతాధికారిగా ప్రజలకు బాధ్యతాయుతమైన సేవలు అందించాలన్నదే జీవిత ఆశయమన్నారు. పోటీ పరీక్షల ప్రిపరేషన్లో ప్రభుత్వ గ్రంథాలయాలు ఎంతగానో ఉపయోగపడుతాయని వివరించారు. ప్రస్తుతం గ్రూప్–3 టాపర్గా నిలిచినా, గ్రూప్– 2లో 18వ ర్యాంకు వచ్చింది కాబట్టి అదే ఉద్యోగంలో జాయిన్ అవుతానని వెల్లడించారు. -
ప్రతి పైసా రికవరీ చేస్తాం
జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శ్రీనివాస్రావు నర్సాపూర్ రూరల్: జాతీయ ఉపాధి హామీ పథకం పనుల్లో అవకతవకలకు పాల్పడిన వారి నుంచి ప్రతి పైసా రికవరీ చేస్తామని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శ్రీనివాస్రావు తెలిపారు. శనివారం నర్సాపూర్ ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో ఉపాధి పనులకు సంబంధించి ప్రజావేదిక నిర్వహించారు. అటవీశాఖలో ఉపాధి హామీ పథకం ద్వారా కలిగిన మొక్కల పెంపకంలో అవకతవకలు జరిగినట్లు గుర్తించారు. మొక్కల పెంపకానికి బినామీ పేర్లతో నీటి ట్యాంకర్లు పెట్టినట్లు బిల్లులు తీసుకున్నట్లు తేలిందన్నారు. రూ. 8,91,610 చెల్లింపులు జరిగాయన్నారు. ఇట్టి డబ్బులను రికవరీ చేస్తామని చెప్పారు. అటవీశాఖ అధికారులు ప్రజాదర్బార్కు రాకుండా నిర్లక్ష్యం చేసినందుకు వారిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. మండలంలోని అహ్మద్నగర్, బ్రాహ్మణపల్లి, తిరుమలాపూర్, తుజాల్పూర్ తదితర గ్రామాల్లో అవకతవకలు జరిగినట్లు తెలిందన్నారు. ఫీల్డ్ అసిస్టెంట్ల నుంచి రూ. 60,610 రికవరీ చేస్తామని వివరించారు. వారం రోజులుగా మండలంలోని అన్ని గ్రామాల్లో సుమారు రూ. 9.18 లక్షల నిధులకు సంబంధించి సోషల్ ఆడిట్ జరిగిందన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ మధులత, ఏపీఓ వైద్య శ్రీనివాస్, ఏపీడీ బాలయ్య, జూనియర్ క్వాలిటీ కంట్రోల్ అధికారిణి అరుణ, ఏపీఓ అంజిరెడ్డి, సోషల్ ఆడిట్ సిబ్బంది, ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లు పాల్గొన్నారు. -
దరఖాస్తుల ఆహ్వానం
కౌడిపల్లి(నర్సాపూర్): జిల్లాలోని ఎంజేపీ (మహాత్మ జ్యోతిబాపూలే) బీసీ గురుకుల పాఠశాలల్లో 6, 7, 8, 9వ తరగతిలో బ్యాక్లాగ్ సీట్ల భర్తీ కోసం అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని ఎంజేపీ సొసైటీ డీసీఓ, తునికి ఎంజేపీ ప్రిన్సిపాల్ హరిబాబు తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని బాలురు, బాలికల ఎంజేపీ బీసీ గురుకుల పాఠశాలలో 2025– 26 సంవత్సరంలో మిగిలిపోయిన ఖాళీలను భర్తీ చేయనున్నట్లు తెలిపారు. అర్హులైన విద్యార్థులు ఈనెల 31వ తేదీలోపు అన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఏప్రిల్ 20వ తేదీన ప్రవేక్ష పరీక్ష ఉంటుందని, మెరిట్ ఆధారంగా ఎంపిక చేయనున్నట్లు చెప్పారు. ఈ అవకాశాన్ని అర్హులైన విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. -
కష్టపడి చదివితే బంగారు భవిష్యత్
డీఈఓ రాధాకిషన్చేగుంట(తూప్రాన్): బంగారు భవిష్యత్ కోసం కష్టపడి చదవాలని డీఈఓ రాధాకిషన్ విద్యార్థులకు సూచించారు. శనివారం చేగుంట ప్రభుత్వ ఉన్నత పాఠశాలను ఆయన సందర్శించారు. పదో తరగతి విద్యార్థుల ప్రత్యేక తరగతులను పరిశీలించి పలు సూచనలు చేశారు. ప్రణాళికబద్ధంగా చదివి మంచి మార్కులు సాధించాలని తెలిపారు. అనంతరం కంప్యూటర్ శిక్షణ గదిని పరిశీలించారు. మధ్యాహ్న భోజనం పరిశీలించి విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించేలా ఉపాధ్యాయులు ప్రత్యేక చొరవ చూ పించాలని ఆదేశించారు. ఏఐతో మెరుగైన బోధన చిన్నశంకరంపేట(మెదక్): ఏఐతో మెరుగైన బోధన అందుతుందని డీఈఓ అన్నారు. శనివారం నార్సింగి మండలంలోని శేరిపల్లి ప్రాథమిక పాఠశాలలో ఏఐ స్కూల్ ప్రోగ్రాంను ప్రారంభించి మాట్లాడారు. వారంలో రెండు రోజులు విద్యార్థులకు ఏఐ బోధన నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లాలోని 15 ప్రాథమిక పాఠశాలల్లో ఏఐ స్కూల్ ప్రోగ్రాంను ప్రారంభించినట్లు చెప్పారు. కార్యక్రమంలో ఏఎంఓ సుదర్శన మూర్తి, జెడ్పీహెచ్ఎం తిరుపతి, పీఎస్ హెచ్ఎం వీరేందర్ తదితరులు పాల్గొన్నారు. -
పనుల్లో వేగం పెంచండి
మెదక్జోన్: ఇందిరమ్మ ఇళ్లు మంజూరై రెండు నెలలు కావొస్తున్నా నిర్మాణాలు ముందుకు సాగడం లేదు. మండలానికో నమూనా ఇంటిని నిర్మించతలపెట్టిన అవి సైతం పూర్తి కావడం లేదు. ఈ విషయంపై శనివారం సాక్షిలో ‘నమూనా.. పూర్తయ్యేనా’ అనే కథనం ప్రచురితం అయింది. దీనికి స్పందించిన కలెక్టర్ రాహుల్రాజ్ మెదక్ మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో నిర్మిస్తున్న ఇందిరమ్మ నమూనా ఇంటిని పరిశీలించారు. జిల్లాలోని అన్ని మండలాల్లో నిర్మిస్తున్న మోడల్ ఇళ్లు 45 రోజుల్లో పూర్తి చేయాలని సిబ్బందిని ఆదేశించారు. పనుల్లో వేగం పెంచడంతో పాటు నాణ్యత పాటించాలని సూచించారు. కలెక్టర్ వెంట హౌసింగ్ పీడీ మాణిక్యం, పీఆర్ ఈఈ నర్సింలు, డీఈ యాదగిరి ఉన్నారు. దుర్గమ్మ సేవలో పాట్నా హైకోర్టు న్యాయమూర్తి పాపన్నపేట(మెదక్): పాట్నా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అనుపమ చక్రవర్తి శనివారం కుటుంబ సమేతంగా ఏడుపాయల వనదుర్గ మ్మను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు, ఈఓ చంద్రశేఖర్ ఆలయ మర్యాదల ప్రకారం పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అర్చకులు తీర్థప్రసాదాలు అందజేసి, ఆలయ విశిష్టతను వివరించారు. అదనపు కలెక్టర్ నగేష్, ఆర్డీఓ రమాదేవి న్యా యమూర్తిని సత్కరించారు. వారి వెంట పాపన్నపేట ఎమ్మార్వో సతీష్, ఎస్సై శ్రీనివాస్గౌడ్, సిబ్బంది ఉన్నారు. ఇంటి పన్ను చెల్లించని వారి ఆస్తులు జప్తు రామాయంపేట(మెదక్): ఇంటి పన్ను చెల్లించని వారి ఆస్తులు జప్తు చేయాలని మెప్మా పీడీ, రాష్ట్ర మున్సిపాలిటీల ప్రత్యేక అధికారి శ్రీపాద రామేశ్వర్ ఆదేశించారు. శనివారం రామాయంపేట మున్సిపాలిటీని ఆకస్మికంగా సందర్శించి పన్నుల వసూళ్ల విషయమై సమీక్షించారు. ఈమేరకు కమిషనర్, మేనేజర్, ఆయా వార్డుల అధికారులు, బిల్ కలెక్టర్లతో మాట్లాడారు. ఎట్టి పరిస్థితుల్లో 95 శాతానికి పైగా పన్నులు వసూలు చేయాలని, నిర్లక్ష్యం చూపే అధి కారులు, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. పన్నుల వసూళ్లలో అలక్ష్యం వహించే వారి వేతనాలు నిలిపివేస్తామని హెచ్చరించారు. నేడు దిష్టిబొమ్మల దహనం నర్సాపూర్: జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో ఆదివారం ఎమ్మెల్యేలు కేటీఆర్, జగదీశ్వర్రెడ్డి దిష్టిబొమ్మలు దహనం చేయాలని డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్ పిలుపునిచ్చారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. స్పీకర్ ప్రసాద్కుమార్ పట్ల జగదీశ్వర్రెడ్డి ఏకవచనంతో మాట్లాడి సభా మర్యాదలను అగౌరవపర్చారని ఆరోపించారు. దిష్టిబొమ్మల దహనం కార్యక్రమాన్ని కార్యకర్తలు, అనుబంధ సంస్థల నాయకులు విజయవంతం చేయాలని కోరారు. -
మాటలే తప్ప చేతలేవీ..?
● మైనార్టీలకు అన్యాయం చేసిన సర్కార్ ● కేబినెట్లో వారికి చోటేది..? ● హామీల అమలులో విఫలం ● ముఖ్యమంత్రి రేవంత్పై హరీశ్రావు ధ్వజం రామచంద్రాపురం(పటాన్చెరు): రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డివి మాటలు తప్ప చేతలు శూన్యమని మండిపడ్డారు. శనివారం సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని విద్యుత్నగర్లో మాజీ సర్పంచ్ మల్లెపల్లి సోమిరెడ్డి ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు హరీశ్రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు మైనార్టీల సంక్షేమానికి రూ. 4వేల కోట్లు ఇస్తానని హామీనిచ్చిందన్నారు. అయితే గత బడ్జెట్లో రూ.3వేల కోట్లు మాత్రమే కేటాయించి ఇప్పటివరకు కేవలం రూ.వెయ్యికోట్లే ఖర్చు చేసిందని విమర్శించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మైనార్టీ యువతకు, మహిళలకు కనీసం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని మండిపడ్డారు. గత కేసీఆర్ ప్రభుత్వం మైనార్టీల అభివృద్ధికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చిందని, దానితోపాటు సకాలంలో షాదీ ముబారక్ పథకం కింద ఆర్థిక సాయం అందించిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మత ఘర్షణలు పెచ్చుమీరాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్రెడ్డి కేబినెట్లో ఒక మైనార్టీ మంత్రి కూడా లేరని కనీసం వారికి ఎమ్మెల్సీ సీటు కూడా ఇవ్వలేదని విమర్శించారు. కాంగ్రెస్ లౌకికవాద పార్టీ అని చెప్పుకుంటూ అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్రెడ్డి ప్రధాని మోదీతో ఉన్న అనుబంధాన్ని వ్యక్త పరిచారని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వమే కారణం తెల్లాపూర్ మున్సిపాలిటీలో అభివృద్ధి కుంటుపడటానికి కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని హరీశ్రావు ఆరోపించారు. గత ప్రభుత్వ హాయాంలో తెల్లాపూర్ ప్రజల అవసరాల కోసం రూ.500 కోట్ల విలువైన ఐదు ఎకరాల భూమిని కేటాయించి అందులో కోట్లాది రూపాయలతో ఫంక్షన్ హాల్ను నిర్మించామని అయితే ఇప్పటికీ అది ప్రారంభోత్సవానికి నోచుకోవడం లేదని మండిపడ్డారు. పెండింగ్ నిధులను ఇచ్చి అభివృద్ధి పనులను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి, సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే క్రాంతి, రసమయి బాలకిషన్ తదితరులు పాల్గొన్నారు. -
మెరుగైన వైద్య సేవలు అందించాలి
కలెక్టర్ రాహుల్రాజ్వెల్దుర్తి(తూప్రాన్): ప్రభుత్వ ఆస్పత్రులకు వైద్యకోసం వచ్చే రోగుల పట్ల వైద్యులు, సిబ్బంది మర్యాదగా ప్రవర్తిస్తూ మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ రాహుల్రాజ్ సిబ్బందిని ఆదేశించారు. శనివారం వెల్దుర్తి ప్రభుత్వ ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులు పరిశీలించారు. మందులు అందుబాటులో ఉన్నాయా..? ఏమైనా కొరత ఉందా అని అడిగి తెలుసుకున్నారు. అదే విధంగా వార్డులు కలియతిరిగి రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరాతీశారు. ప్రభుత్వ ఆసుపత్రికి పేద ప్రజలే ఎక్కువగా వస్తారని, వారికి మెరుగైన వైద్యసేవలు అందించాలని సూచించారు. విద్యార్థులను తీర్చిదిద్దేది ఉపాధ్యాయులే మెదక్జోన్:విద్యార్థుల భవిష్యత్ ను తీర్చిదిద్దేది ఉపాధ్యాయులేనని కలెక్టర్ రాహుల్రాజ్ అన్నారు. శనివారం పట్టణంలోని గిరిజన మినీ గురుకుల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలని సిబ్బందికి సూచించారు. రాజకీయ ప్రతినిధులతో సమావేశం మెదక్ కలెక్టరేట్: నూతన ఓటరు దరఖాస్తు ఫారాలను పరిశీలించి పూర్తి చేయాలని కలెక్టర్ రాహుల్రాజ్ అన్నారు. శనివారం కలెక్టరేట్లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. గత ఎన్నికలలో పోటీ చేసిన అభ్యర్థులు ఖర్చులకు సంబంధించిన నివేదికలు వెంటనే అందజేయాలని సూచించారు. -
ఓటరు నమోదు నిరంతర ప్రక్రియ
మెదక్ కలెక్టరేట్: ఓటరు నమోదు నిరంతర ప్రక్రియగా చేపడుతున్నట్లు ఆర్డీఓ రమాదేవి తెలిపారు. శనివారం పలు రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఓటరు జాబితా నమోదు, బూత్స్థాయి ప్రతినిధుల నియామకంపై చర్చించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ఓటరు జాబితాకు సంబంధించి ఫారం 6, 7, 8ల గురించి రాజకీయ పార్టీ ప్రతినిధులకు అవగాహన కల్పించినట్లు చెప్పారు. పలువురు రాజకీయ పార్టీల ప్రతినిధులు లేవనెత్తిన సందేహాలకు సమాధానం ఇచ్చారు. నూతన ఓటర్ల నమోదు, ఓటు బదిలీ, మరణించిన వారి ఓటర్ల వివరాల తొలగింపు తదితర వివరాలను నమోదుకు సహకరించాలని సూచించారు. -
పెళ్లి కుదరడంలేదని యువకుడి బలవన్మరణం
చిన్నశంకరంపేట(మెదక్): ఉరేసుకొని యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చిన్నశంకరంపేట మండలం మడూర్ గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్ఐ నారాయణ గౌడ్ కథనం మేరకు.. మండలంలోని మడూర్ గ్రామానికి చెందిన శివరాజ్(24)కు కొద్ది రోజులుగా పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. కానీ ఎక్కడా సంబంధం కుదరడంలేదు. దీంతో మానోవేదనకు గురయ్యాడు. గురువారం రాత్రి పొలం వద్దకు వెళ్లి వస్తానని ఇంట్లో చెప్పి వెళ్లాడు. అర్థరాత్రి అవుతున్నా ఇంటికి రాకపోవడంతో తండ్రి యాదగిరి, మరో రైతు సత్యనారాయణతో కలిసి పొలం వద్దకు వెళ్లి చూశారు. అప్పటికే పొలం వద్ద చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో తండ్రి యాదగిరి శుక్రవారం పోలీస్లకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. భార్యతో గొడవపడి భర్త.. పటాన్చెరు టౌన్: భార్యతో గొడవపడి భర్త ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పటాన్చెరు పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సుభాష్ సాకేత్(27) బతుకుదెరువు కోసం పటాన్చెరుకు వచ్చాడు. మండల పరిధిలోని పెద్ద కంజర్ల గ్రామంలో గల అరబిందో వెంచర్లో మేస్త్రీ వద్ద కూలీగా పని చేస్తూ అక్కడే షెడ్లో ఉంటున్నాడు. గురువారం రాత్రి ఫోన్లో భార్యతో గొడవ పడ్డాడు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం లేచి చూసేసరికి వెంచర్లోనే ఓ చెట్టుకు ఉరేసుకొని కనిపించాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పటాన్చెరు ప్రభుత్వాస్పత్రికి తరలించి మృతుడి సోదరుడు విశాల్ ఇచి్చన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. -
ముంబై సిద్ధి వినాయకుడిని దర్శించుకున్న నీలం
పుట్టినరోజును పురస్కరించుకుని ప్రత్యేక పూజలుపటాన్చెరుటౌన్: తన జన్మదినాన్ని పురస్కరించుకుని ముంబైలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం సిద్ధి వినాయకుడిని శుక్రవారం కాంగ్రెస్ నేత నీలం మధుముదిరాజ్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నీలం మధు మాట్లాడుతూ... తమ కోరికలు తీర్చుకునేందుకు దేశవ్యాప్తంగా భక్తులు స్వామివారిని దర్శించుకుని స్వామి కృపకు పాత్రులవుతారన్నారు. ప్రతీ గణేశ్ దేవాలయాల్లో వినాయకుడికి తొండం ఎడమవైపు ఉంటుందని కానీ ఈ దేవాలయంలో మాత్రం తొండం కుడి వైపు ఉండటంతోపాటు తొండంలో మూడో కన్ను ఉంటుందన్నారు. ఇంతటి ప్రత్యేకతలు ఉన్న సిద్ధి వినాయకుడిని దర్శించుకుంటే శుభాలు కలుగుతాయన్నారు. సిద్ధి వినాయకుడిని దర్శించుకోవడం చాలా ఏళ్లుగా తనకు అలవాటని అందులో భాగంగా తన పుట్టినరోజు సందర్భంగా వినాయకుడిని దర్శించుకున్నానన్నారు. ఆ సిద్ధి వినాయకుడు ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా సుఖసంతోషాలు ఆయురారోగ్యాలతో వర్థిల్లాలని ఆకాంక్షించారు. -
చిరుత దాడిలో దూడలు హతం
రామాయంపేట(మెదక్): మండలంలోని దంతేపల్లి గ్రామ శివారులో గురువారం రాత్రి చిరుత దాడిలో రెండు దూడలు హతమయ్యాయి. గ్రామానికి చెందిన రైతు నక్కిర్తి స్వామి తన పశువులను రోజూ మాదిరిగానే వ్యవసాయ బావి వద్ద ఉంచగా, రాత్రి చిరుత దాడి చేసి హతమార్చింది. అక్కడికి సమీపంలో చిరుత పాద గుర్తులు గమనించిన రైతు శుక్రవారం ఉదయం అటవీశాఖ అధికారులకు సమాచారం అందజేశారు. అధికారులు మృతిచెందిన దూడల కళేబరాలను పరిశీలించారు. జాతీయ కబడ్డీ క్యాంపునకు ఎంపిక పాపన్నపేట(మెదక్): సబ్ జూనియర్ బాలికల, బాలుర విభాగంలో బాచుపల్లిలోని కాసాని జ్ఞానేశ్వర్ కబడ్డీ అకాడమీ క్యాంపునకు జిల్లా నుంచి ఇద్దరు ఎంపికయ్యారని శుక్ర వారం జిల్లా కబడ్డీ అసోసియేషన్ ప్రెసిడెంట్ మధుసూదన్రెడ్డి, సెక్రటరీ రమేష్ వెల్లడించారు. బాలికల విభాగంలో రాధిక, బాలుర వి భాగంలో నరేందర్ ఎంపికైనట్లు చెప్పారు. ఇటీవల వికారాబాద్లో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీలో పాల్గొని ప్రతిభ చూపారని తెలిపారు. 108 కిలోల గుండు ఎత్తుకుని ప్రదక్షిణలు నారాయణఖేడ్: ఖేడ్ మండలం తుర్కాపల్లిలో హోలీ పండుగ సందర్భంగా బండరాళ్ల గుండ్లు ఎత్తుకుని గ్రామదేవత ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేయడం తరతరాలుగా వస్తున్న ఆనవాయితీ. శుక్రవారం హోలీ పండుగను పురస్కరించుకుని గ్రామానికి చెందిన యువకుడు సాతిని జ్ఞానేశ్వర్ 108 కిలోల బరువున్న బండరాయి గుండును అవలీలగా ఎత్తుకుని గ్రామదేవత ఆలయం చుట్టూ అయిదు ప్రదక్షణలు చేసి ఔరా అనిపించాడు. గ్రామ పెద్దలు కరతాళధ్వనులతో అతడిని ఉత్సాహపరిచారు. అనంతరం రంగులు చల్లుకుంటూ హోలీ పండును నిర్వహించుకున్నారు. గొడవపడి.. గొంతుకోసి కౌడిపల్లి(నర్సాపూర్): కట్టుకున్న భార్యనే గొంతు కోసి కడతేర్చాలని చూశాడు ఓ భర్త. ఈసంఘటన మండల పరిధి తిమ్మాపూర్లో జరిగింది. ఎస్ఐ రంజిత్రెడ్డి కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన స్వాతిని బాలానగర్కు చెందిన రమేష్కు ఇచ్చి పదేళ్ల క్రితం పెళ్లి జరిపించారు. వీరికి ఇద్దరు కుమారులు జన్మించారు. అయితే కొన్నేళ్లుగా భార్యపై అనుమానం పెంచుకున్న రమేష్ నిత్యం గొడవపడేవాడు. అదనపు కట్నం కోసం వేధించేవాడు. ఈ క్రమంలో పలుమార్లు పెద్దలు కల్పించుకొని నచ్చచెప్పారు. అయినా అతడిలో మార్పురాలేదు. ఈనెల 6వ తేదీన సైతం స్వాతిని తీవ్రంగా కొట్టడంతో ఆమె తల్లిగారి ఊరు తిమ్మాపూర్కు వెళ్లింది. ఈక్రమంలో గురువారం సాయత్రం తిమ్మాపూర్ చేరుకున్న రమేష్ మాట్లాడేది ఉందని భార్యను గ్రామ శివారులోని హనుమాన్ ఆలయం వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ గొడవపడి తన వెంట తెచ్చుకున్న కత్తితో గొంతు కోసేందుకు ప్రయత్నించాడు. దీంతో చేయి అడ్డుపెట్టడంతో స్వాతి తీవ్రంగా గాయపడింది. అరుపులకు చుట్టుపక్కల ఉన్న వారు రావడంతో రమేష్ అక్కడి నుంచి పరారయ్యాడు. స్థానికులు గాయపడిన స్వాతిని చికిత్స నిమిత్తం నర్సాపూర్ ప్రభుత్వ అసుపత్రికి తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు శుక్రవారం భర్తపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
భద్రతా ప్రమాణాలు తప్పనిసరి
రాష్ట్ర పరిశ్రమల శాఖ డైరెక్టర్ రాజగోపాల్రావుమనోహరాబాద్(తూప్రాన్): భద్రతా ప్రమాణాలు పాటించినప్పుడే పరిశ్రమలు అభివృద్ధి బాటలో పయనిస్తాయని రాష్ట్ర పరిశ్రమల శాఖ డైరెక్టర్ రాజగోపాల్రావు అన్నారు. గురువారం మండలంలోని రంగాయపల్లి ఎంఎస్ అగర్వాల్ పరిశ్రమలో నిర్వహించిన జాతీయ భద్రతా వారోత్సవాల ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్కుమార్, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ లక్ష్మీకుమారితో కలిసి మొక్కలు నాటారు. అనంతరం కార్మికులు, పరిశ్రమల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. కార్మికుల రక్షణ బాధ్యత పరిశ్రమలపై ఉందన్నారు. భద్రత ముందు ఉత్పత్తి తర్వాత అనేది గుర్తుంచుకోవాలని సూచించారు. పరిశ్రమలతో స్థానికులకు ఉపాధితో పాటు, గ్రామాలు అభివృద్ధి చెందుతాయని వివరించారు. కార్యక్రమంలో పరిశ్రమల ప్రతినిధి వసంతకుమార్, చక్రవర్తి నర్సింహం పాల్గొన్నారు. -
ఒంటి పూట బడులు
శుక్రవారం శ్రీ 14 శ్రీ మార్చి శ్రీ 2025● రేపటి నుంచి అమలు ● ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ● యథావిధిగా మధ్యాహ్న భోజనం పాపన్నపేట(మెదక్): వేసవికాలం.. పైగా ఎండల తీవ్రత అధికంగా ఉన్న దృష్ట్యా ఒంటి పూట బడులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జిల్లా విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో శనివారం నుంచి ఏప్రిల్ 23 వరకు ఒంటి పూట బడులను నిర్వహించనున్నారు. ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు తరగతులు కొనసాగనున్నాయి. పదోతరగతి పరీక్షలు నిర్వహించనున్న పాఠశాలల్లో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనున్నాయి. అందుకు అను గుణంగా జిల్లా విద్యాశాఖ అధికారులకు ఉత్తర్వులు అందాయి. జిల్లావ్యాప్తంగా 1,067 ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు ఉండగా, వాటిలో 1. 23 లక్షల మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. కాగా ఒంటి పూట బడులు నిర్వహించనున్న నేపథ్యంలో యథావిధిగా మధ్యాహ్న భోజనం కొనసాగనుంది. అందుకు గాను విద్యాశాఖ అధికారులు నిర్వాహకులకు ఆదేశాలు జారీ చేశారు. తరగతులు పూర్తయిన తరువాత మధ్యాహ్న భోజనం అందించి విద్యార్థులను ఇంటికి పంపాలని సూచించారు. న్యూస్రీల్ -
చెక్డ్యాంలతో మేలు
వెల్దుర్తి(తూప్రాన్): చెక్డ్యాంలతో రైతులకు ఎంతో మేలు జరుగుతుందని టీపీసీసీ ప్ర ధాన కార్యదర్శి రాజిరెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ సుహాసినిరెడ్డి అన్నారు. మండలంలోని మానెపల్లి, మంగళపర్తి గ్రామ శివారులో వాగుపై సెహగల్ స్వచ్ఛంద సంస్థ సహకారంతో నిర్మించిన చెక్ డ్యాంను గురువారం వారు ప్రారంభించి మా ట్లాడారు. అన్నదాతల సంక్షేమానికి సెహగల్ స్వచ్ఛంద సంస్థ చేస్తున్న కృషిని కొనియా డారు. అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించడం అభినందనీయమని కొనియాడారు. చెక్ డ్యాంల నిర్మాణంతో భూగర్భజలాలు పెరుగుతాయన్నారు. కా ర్యక్రమంలో జిల్లా నాయకుడు నరేందర్రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మహేశ్రెడ్డి, తహసీల్దార్ కృష్ణ, ఇరిగేషన్ డీఈ రాజేందర్, మాజీ సర్పంచ్ రామకృష్ణారావు, సెహగల్ ఫౌండేషన్ అడ్మిన్ మేనేజర్ బాలరాజ్, సీనియర్ ఇంజనీర్ మల్లికార్జున్ పాల్గొన్నారు. -
వన దుర్గమ్మకు పల్లకీ సేవ
పాపన్నపేట(మెదక్): ఏడుపాయల వన దుర్గమ్మకు గురువారం పల్లకీ సేవ నిర్వహించారు. పౌర్ణమిని పురస్కరించుకొని ఉత్సవ విగ్రహానికి అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పూలతో అలంకరించి పల్లకీపై ఊరేగించారు. ఈఓ చంద్రశేఖర్, ఆలయ సిబ్బంది, భక్తులు పల్లకీ సేవలో పాల్గొన్నారు. ‘వర్గీకరణ తర్వాతే నోటిఫికేషన్లు ఇవ్వాలి’మెదక్ కలెక్టరేట్: ప్రతి ఉద్యోగ నోటిఫికేషన్ వర్తించేలా ఎస్సీ వర్గీకరణ చట్టం చేయాలని ఎమ్మార్పీఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం కలెక్టరేట్ ఎదుట రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈసందర్భంగా ఎమ్మార్పీఎస్ మెదక్ పార్లమెంట్ ఇన్చార్జి శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఉద్యోగ నియామకాల్లో మాదిగలకు ద్రోహం చేస్తున్న కాంగ్రెస్ రాజకీయ మూల్యం చెల్లించుకోకతప్పదన్నా రు. మంద కృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఈ రిలే దీక్షలు చేపట్టినట్లు తెలిపారు. ఎస్సీ వర్గీకరణ జరిగేంత వరకు ఉద్యోగ పరీక్షల ఫలితాలను నిలిపివేసి గత అసెంబ్లీలో సీఎం ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. మాదిగలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని ఎదుర్కోవడానికి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు మురళి, బాల్రాజ్, సంపత్కుమార్, గట్టయ్య, యాదగిరి, దేవేందర్, నాగరాజ్, లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు. -
మహిళల్లో అపారమైన శక్తి సంపద
మెదక్ మున్సిపాలిటీ: మహిళల్లో అపారమైన శక్తి సంపద ఉందని, అదే సమయంలో అప్రమత్తత అవసరమని ఎస్పీ ఉదయ్కుమార్రెడ్డి అన్నారు. గురువారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. తల్లిదండ్రులు మగ, ఆడపిల్లలను సమానంగా చూడాలని సూచించారు. సమాజంలో మహిళలకు సమాన అవకాశాలు కల్పించడం చాలా ముఖ్యమన్నారు. మహిళా సాధికారతకు చదువు చాలా ముఖ్యం అన్నారు. విద్య, ఉపాధి, రాజకీయ రంగాల్లో మహిళల భాగస్వామ్యం పెరగాలన్నారు. మగ పిల్లలకు మహిళలను గౌరవించే విధంగా విలువలు, క్రమశిక్షణ నేర్పించాల్సిన బాధ్యత తల్లిదండ్రులు, గురువులపై ఉందన్నారు. మహిళలు ఆపద సమయాల్లో అధైర్యపడకుండా వెంటనే డయల్ 100కు సమాచారం అందించాలని సూచించారు. అనంతరం విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన మహిళలకు ప్రశంసాపత్రాలు అందజేశారు. ఎస్పీ ఉదయ్కుమార్రెడ్డి -
విపత్తులను సమర్థంగా ఎదుర్కోవాలి
కలెక్టర్ రాహుల్రాజ్మెదక్జోన్/మెదక్ కలెక్టరేట్: విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కోవాలని కలెక్టర్ రాహుల్రాజ్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో ఆపద మిత్ర పథకం అమలుపై వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విపత్తు ప్రమాద తగ్గింపు, విపత్తు నిర్వహణ వ్యవస్థ, విద్యా సామర్థ్యాన్ని బలోపేతం, సాంకేతిక పురోగతి వంటి వాటిపై భారత ప్రభుత్వం దృష్టి పెట్టినట్లు తెలిపారు. జిల్లాలోని 18 నుంచి 40 సంవత్సరాల వయసు ఉన్న యువతీ యువకులు 200 మంది వలంటీర్లను ఎంపిక చేయాలన్నారు. ఈనెల 20 నుంచి 31వ తేదీ వరకు పక్కా ప్రణాళికతో అమలు చేయనున్నట్లు తెలిపారు. అనంతరం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ పాల్గొన్నారు. జిల్లాలో ప్రతి 3 నెలలకోసారి ఓటర్ల జాబితా నవీకరణ పకడ్బందీగా చేపట్టాలని, 18 ఏళ్లు పూర్తి చేసుకున్న ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించాలని సూచించారు. అలాగే రాష్ట్ర విద్యాశాఖ సెక్రటరీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్కు జిల్లా విద్యాశాఖ అధికారులతో కలిసి పాల్గొన్నారు. శనివారం నుంచి రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఏఐ ద్వారా విద్యాబోధన ప్రారంభించనున్నట్లు తెలిపారు. జిల్లాలో ఏఐ సమర్థవంతంగా అమలవుతున్నట్లు వివరించారు. -
సాగు నీటిని పొదుపుగా వాడుకోవాలి
కౌడిపల్లి(నర్సాపూర్): రైతులు సాగు నీటిని పొదుపుగా వాడుకోవాలని కలెక్టర్ రాహుల్రాజ్ తెలిపా రు. బుధవారం మండలంలోని మహమ్మద్నగర్ శివారులో వరి పొలాలను పరిశీలించారు. వరి పంటకు ఇంకా ఎన్ని నీటి తుడులు అవసరం, ఎన్నిరోజులకు కోతకు వస్తుంది. దిగుబడి అంచనా, బోరు బావుల్లో ప్రస్తుత నీటి లభ్యత.. తదితర విషయాల గురించి రైతులను అడిగి తెలుసుకున్నారు. ఈసంద్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు పంటల సాగులో జాగ్రత్తలు పాటించాలని సూచించారు. నీటి వనరులకు అనుగుణంగా పంటను సాగు చేయాలని చెప్పారు. వచ్చే యాసంగి సీజన్లో అయిన బోరుబావిలో నీటి లభ్యత ఆధారంగా రైతులు పంటలు సాగుచేసేలా అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో రికార్డులు తనిఖీ చేశా రు. రిజిస్ట్రేషన్లు సరిగా చేయాలని, రికార్డులు సక్రమంగా భద్రపరచాలని సిబ్బందికి సూచించారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ ఆంజనేయులు, ఆర్ఐ శ్రీహరి, సర్వేయర్ మొగులయ్య రైతులు ఉన్నారు. కలెక్టర్ రాహుల్రాజ్ -
నిమ్జ్ గ్రామసభలో స్వల్ప ఉద్రిక్తత
న్యాల్కల్(జహీరాబాద్): మండల పరిధిలోని మామిడ్గి గ్రామంలో నిర్వహించిన (నిమ్జ్) గ్రామ సభలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. నిమ్జ్ భూసేకరణకు సంబంధించి బుధవారం ఉదయం గ్రామ సమీపంలో గల రైతు వేదికలో పోలీస్ బందోబస్తు మధ్య గ్రామసభ నిర్వహించారు. సభకు నిమ్జ్ ప్రాజెక్ట్ డిప్యూటీ కలెక్టర్ రాజు, న్యాల్కల్ తహసీల్దార్ భూపాల్ హాజరయ్యారు. భూసేకరణకు సంబంధించి డిప్యూటీ కలెక్టర్ రాజు మాట్లాడుతూ... నిమ్జ్ ఏర్పాటు వల్ల ఈ ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయన్నారు. ఈ క్రమంలో కొందరు రైతులు కలుగజేసుకుని మావి సారవంతమైన మూడు పంటలు పండే భూములని, ప్రభుత్వం ఇచ్చే పరి హారం ఎంతమాత్రం సరిపోదని, మార్కెట్ రేటు ప్రకారం నష్టపరిహారం చెల్లించాలని కోరారు. అదేవిధంగా భూములు కోల్పోయిన రైతు కుటుంబాలకు ఉపాధి అవకాశాలు కూడా కల్పించాలని, లేదా భూమికి బదులుగా భూమి ఇవ్వాలని కోరారు. ఈ క్రమంలో ఒకరిద్దరు రైతులు అభ్యంతరం చెప్పడంతో వారిమధ్య మాటా మాటా పెరిగి స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. సభ నుంచి బయటకు వచ్చిన కొందరు రైతులు నిమ్జ్కు భూములు ఇచ్చేది లేదని నినాదాలు చేశారు. -
యువజన ఉత్సవాల్లో విద్యార్థుల ప్రతిభ
నర్సాపూర్ రూరల్: యువజన ఉత్సవాల్లో నర్సాపూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. మంగళవారం జిల్లా కేంద్రంలో కేంద్ర యువజన, వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో సాంస్కృతిక, పెయింటింగ్, ఫొటోగ్రఫీ, ఉపన్యాస, సైన్స్ పోటీలు నిర్వహించారు. పోటీల్లో కళాశాల విద్యార్థి వైష్ణవి బృందం నర్సాపూర్ ఫారెస్ట్ అర్బన్ పార్కులో సీతాకోక చిలుకల సంరక్షణ విధానంపై నిర్వహించిన ప్రాజెక్టు మొదటి బహుమతి సాధించింది. వారు రూ. 7 వేల నగదు బహుమతి అందుకున్నారు. జానపద నృత్య ప్రదర్శనలో విద్యార్థిని సంపూర్ణ బృందం తృతీయ బహుమతి, కవితా రచన పోటీల్లో విద్యార్థి మహేక్ తృతీయ బహుమతి గెలుచుకున్నారు. ఈసందర్భంగా ప్రిన్సిపాల్ డాక్టర్ దామోదర్, అధ్యాపకులు డాక్టర్ సురేష్ కుమార్ ఇతరులు విద్యార్థులను అభినందించారు. -
కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్
శివ్వంపేట(నర్సాపూర్): సీసీ రోడ్డు పనుల ప్రారంభం సందర్భంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. మండల పరిధి లచ్చిరెడ్డిగూడెంలో సిమెంట్ రోడ్ల నిర్మాణం కోసం ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా రూ. 15 లక్షల నిధులు మంజూరయ్యాయి. ఇందుకు సంబంధించిన పనులను ప్రారంభించడానికి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ సుహాసినిరెడ్డి, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి బుధవారం వచ్చారు. అయితే స్థానిక ఎమ్మెల్యే సునీతారెడ్డి లేకుండా ప్రొటోకాల్ విస్మరించి ఎలా పనులు ప్రారంభిస్తారని బీఆర్ఎస్ నాయకులు అడ్డుకున్నారు. దీంతో ఇరుపార్టీల నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది. జై రేవంత్రెడ్డి అంటూ కాంగ్రెస్ నాయకులు, జై కేసీఆర్ అంటూ బీఆర్ఎస్ నాయకులు నినాదాలతో హోరెత్తించారు. అనంతరం రాజిరెడ్డి పనులు ప్రారంభించి మాట్లాడారు. పార్టీలకతీతంగా గ్రామాల్లో అభివృద్ధి పనులు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. బీఆర్ఎస్ నాయకులు అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ వెంకట్రామిరెడ్డి, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
అ‘విశ్రాంత’ పోరాటం
గురువారం శ్రీ 13 శ్రీ మార్చి శ్రీ 2025● రిటైర్డ్ ఉద్యోగులకు అందని బెనిఫిట్స్ ● ఏడాదిగా తప్పని ఎదురుచూపులు D ¸÷sZÌZ° Ð]lÅMìS¢ fÒ$ÆŠ‡ çßæÒ$§Šæ. Ð]lÊyýl$ §ýlÔ>-»êªÌS ´ër$ E´ë-«§éÅ-Ķæ¬yìlV> Ñ«§ýl$Ë$ °Æý‡Ó-Ç¢…_ 2024 Ð]l*ÇaÌZ ÇOsñæÆŠḥz AĶæ*ÅÆý‡$. M>V> C™èl-°MìS {糿¶æ$™èlÓ… ¯]l$…_ Æý‡*. 50 ÌS„ýSÌS ÇOsñæÆð‡Ã…sŒæ »ñæ°íœsŒæÞ Æ>ÐéÍÞ E…¨. Ð]l^óla yýlº$¾ÌS™ø CË$Ï MýSr$t-Mø-ÐéÌS° MýSÌSÌS MýS¯é²yýl$. Hyé-O§ðl¯é yýlº$¾Ë$ ^ól†MìS Æ>MýS-´ù-Ð]l-yýl…™ø Cº¾…¨ ç³yýl$™èl$-¯é²Æý‡$. hÌêÏÌZ CÌê…sìæ ÐéÆý‡$ Ð]l$Æø 140 Ð]l$…¨ E§øÅVýS$Ë$ E¯é²Æý‡$. మెదక్జోన్: సుదీర్ఘకాలం ఉద్యోగ నిర్వహణ బాధ్యతలు పూర్తి చేసి, పదవీ విరమణ పొందిన ఉద్యోగులు.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం కండ్లు కాయలుకాసేలా ఎదురుచూస్తున్నారు. సర్వీస్లో దాచుకున్న డబ్బులు.. పదవీ విరమణతో అందే ఆర్థిక ప్రయోజనాలతో ఎన్నెన్నో కలలు కన్న వారి ఆశలు ఆడియాశలుగానే మారుతున్నాయి. బిడ్డ పెళ్లికి, సొంత ఇంటికి, పిల్లల చదువులకు ఢోకాలేదనుకుంటే సమయానికి ప్రభుత్వం నుంచి డబ్బులు రాక.. అప్పులు తెచ్చుకోవాల్సిన దుస్థితి నెలకొంది. జిల్లాలో 200 మంది ఉద్యోగులు జిల్లాలో 2024 మార్చిలో సుమారు 200 మంది ప్రభుత్వ ఉద్యోగులు వివిధ శాఖల్లో విధులు నిర్వర్తించి రిటైర్డ్ అయ్యారు. కాగా వారికి రావాల్సిన బెనిఫిట్స్ మాత్రం ప్రభుత్వం ఇవ్వలేదు. దీంతో కొందరు కోర్టు మెట్లు ఎక్కడంతో 60 మందికి అందజేశారు. మరో 140 మంది ఆశగా ఎదురుచూస్తున్నారు. డబ్బుల కోసం నిత్యం ట్రెజరీ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. వచ్చే డబ్బులతో కొందరు ఇల్లు కట్టుకుందామని చూస్తుంటే, మరికొంత మంది ప్లాట్లు కొనుగోలు చేయాలని, ఇంకొందరు పిల్లల పెళ్లిళ్లు చేయాలని అనుకున్నామని.. సకాలంలో డబ్బులు అందకపోవడంతో ఆలోచనలు తలకిందులయ్యాయని రిటైర్డ్ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వం ఉద్యోగుల పదవీ విరమణ వయసు మూడేళ్లు పొడిగిస్తే ప్రస్తుత ప్రభుత్వం రిటైర్డ్ అయి ఏడాది గడుస్తున్నా బెనిఫిట్స్ ఇవ్వడం లేదని వాపోతున్నారు. జిల్లాలో 2021లో వివిధ శాఖల్లో 200 మంది ఉద్యోగులు రిటైర్డ్ కావాల్సి ఉండగా, గత ప్రభుత్వం మూడేళ్లు పొడిగిస్తూ నిర్ణయం తీసుకోవడంతో 2024 మార్చిలో పదవీ విరమణ పొందారు. న్యూస్రీల్ -
యువికాతో యంగ్ సైంటిస్టులు
శాస్త్రవేత్తలుగా ఎదిగేందుకు ఇస్రో చక్కటి అవకాశం ● 9వ తరగతి విద్యార్థులకు మాత్రమే ● ఫిబ్రవరి 24నుంచి ఈనెల 23వరకు ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ ● కేంద్ర ప్రభుత్వ నిర్ణయం మెదక్జోన్: అంతరిక్ష పరిశోధన రంగంలో ఆసక్తి, భావి శాస్త్రవేత్తలు కావాలనుకుంటున్న విద్యార్థులకు భారత ప్రభుత్వం చక్కటి అవకాశాన్ని కల్పిస్తోంది. భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం (ఇస్రో) ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం భారత అంతరిక్ష పరిశోధన– యువవిజ్ఞాన్ కార్యక్రమం (ఐఎస్ఆర్డీ–యువికా) ద్వారా విద్యార్థులను యువశాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దే దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ప్రస్తుతం 9వ తరగతి చదువుతున్న విద్యార్థులకు యువికా కార్యక్రమంలో చేరేందుకు ఇస్రో అవకాశం కల్పించింది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆసక్తి, అభిరుచి ఉన్న విద్యార్థుల నుంచి ఫిబ్రవరి 23 నుంచి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తోంది. ఈ నెల 23 తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు ఇస్రో అవకాశం కల్పించింది. ఇందులో పాల్గొనాలనుకునే విద్యార్థులు http://jigyasa.iirs.gov.in/yuvika ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. జిల్లాలోని అన్ని పాఠశాలలకు సమాచారం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఐఎస్ఆర్డీ) పాఠశాల విద్యార్థుల కోసం యువ శాస్త్రవేత్తలను తయారు చేయాలనే ఉద్దేశంతో 2019 నుంచి ఈ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం కొనసాగిస్తోంది. పాఠశాల విద్యార్థులకు అంతరిక్ష సాంకేతికత, అంతరిక్షశాస్త్రంపై వాటిని నిజజీవితంలో ఉపయోగించుకోవడం వంటి ప్రాథమిక జ్ఞానం అందించడమే లక్ష్యంగా అవగాహన కల్పిస్తారు. మెదక్ జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ అన్ని పాఠశాలల యాజమాన్యాలకు ఈ సమాచారాన్ని విద్యాశాఖ అధికారులు చేరవేశారు. ఎంపికై న విద్యార్థులకు అవగాహన ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకున్న విద్యార్థులకు సంబంధించి ఏప్రిల్ 7న జాబితా విడుదల అవుతుంది. మే 19 నుంచి మే 30 వరకు ఇస్రోకు చెందిన 7 కేంద్రాలలో ఏదోఒక సెంటర్ను కేటాయిస్తారు. ఇందులోభాగంగా అహ్మదాబాద్, డెహ్రాడూన్, శ్రీహరికోట, తిరువనంతపురం, బెంగళూర్, షిల్లాంగ్తోపాటు హైదరాబాద్ తదితర కేంద్రాల్లో ఎంపికై న విద్యార్థులకు అవగాహన కల్పిస్తారు. ఇందులో ప్రధానంగా అంతరిక్షం, సాంకేతికత, అంతరిక్షశాస్త్రం (ఖగోళశాస్త్రం) (అస్ట్రానమీ)పై ప్రాథమికంగా అవగాహన కల్పించనున్నారు. అంతేకాకుండా అంతరిక్ష కేంద్రాల్లోని ప్రయోగశాలల సందర్శన అక్కడ ప్రముఖ శాస్త్రవేత్తలతో సమావేశం, ముఖాముఖి చర్చలు, రాకెట్ ప్రయోగాలకు సంబంధించిన అంశాలపై అవగాహన కల్పిస్తారు. సద్వినియోగం చేసుకోవాలి చిన్నారుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి భావిభారత శాస్త్రవేత్తలుగా తయారయ్యేందుకు ఇస్రో కల్పించిన ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి. ఈ విషయాన్ని అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ప్రత్యేక చొరవ చూపి ఆసక్తి ఉన్న విద్యార్థులు దరఖాస్తు చేసుకునే విధంగా ప్రోత్సహించాలి. –రాజిరెడ్డి, జిల్లా సైన్స్ అధికారి మెదక్ ఎంపిక విధానం ఇలా.. 8వ తరగతిలో సదరు విద్యార్థికి వచ్చిన మార్కులను 50 శాతంగా తీసుకుంటారు. ఆన్లైన్లో నిర్వహించే క్విజ్ ప్రతిభకు 10 శాతం, ఇంతకుముందు పాల్గొన్న జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయి సైన్స్ఫెయిర్లకు 10, ఒలంపియాడ్లో పాల్గొన్న వాటికి ఐదు, స్పోర్ట్స్లో పాల్గొన్న వారికి 5 , ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్లో పాల్గొన్న వారికి 5, గ్రామీణప్రాంతాల్లో చదువుతున్న విద్యార్థులకు 15 శాతం మార్కులను కలిపి ఎంపిక చేస్తారు. -
పాఠశాల నిర్వహణ ఇలాగేనా?
మెదక్జోన్: ‘పాఠశాల నిర్వహణ ఇలానే ఉంటుందా..? బాలికలు ఉపయోగించే మరుగుదొడ్లు అధ్వాన్నంగా ఉన్నాయి. కనీసం తలుపులు లేకపోవటం బాలల హక్కులను హరించటమే అవుతుంది’ అని సీనియర్ సివిల్ జడ్జి జితేందర్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం పట్టణంలోని వెస్లీ ఉన్నత పాఠశాలను ఎంఈఓ నీలకఠంతో కలిసి తనిఖీ చేశారు. పాఠశాల చుట్టూ అపరిశుభ్ర వాతావరణం ఉండడంపై మండిపడ్డారు. తక్షణమే చర్యలు తీసుకోవాలని, లేకపోతే శాఖాపరమై నా చర్యలు తప్పవని ఎంఈఓ హెచ్చరించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టాలి కౌడిపల్లి(నర్సాపూర్): పాఠశాలలకు ప్రభు త్వం పంపిణీ చేసిన వంట సామగ్రిని వినియోగించుకోవాలని జిల్లా సివిల్ సప్లై అధికారి సురేష్రెడ్డి సూచించారు. బుధవారం మండలంలోని వెంకట్రావుపేట, రాయిలాపూర్, తాళ్లగడ్డతండా పాఠశాలలను ఎంఈఓ బాలరాజుతో కలిసి తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం పాఠశాలల్లో మ ధ్యాహ్న భోజనం తయారుచేసేందుకు ఇటీవల సామగ్రిని పంపిణీ చేసిందన్నారు. వాటిని వినియోగించి పరిశుభ్రత పాటించాలని సూచించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం వండిపెట్టాలన్నారు. అనంతరం మధ్యాహ్న భోజనం, బియ్యం పరిశీలించారు. కార్యక్రమంలో ఆయా పాఠశాలల హెచ్ఎంలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. గ్రూప్– 2లో మెరిసిన అర్జున్రెడ్డి పాపన్నపేట(మెదక్): మండల కేంద్రమైన పాపన్నపేటకు చెందిన అర్జున్రెడ్డి గ్రూప్–2 పరీక్షలో స్టేట్ 18వ ర్యాంకు సాధించి సత్తా చాటాడు. హవేళిఘనాపూర్ మండల రెవెన్యూ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న అర్జున్రెడ్డి గ్రూప్–2లో 413.890 మార్కులు సాధించాడు. అతని తండ్రి నరేందర్రెడ్డి మెదక్లో లైబ్రేరియన్గా, తమ్ముడు అరుణ్రెడ్డి ఆర్అండ్బీలో ఏఈగా, బాబాయి శ్రీనివాస్రెడ్డి హెడ్ కానిస్టేబుల్గా పనిచేసున్నారు. కుటుంబ సభ్యులందరూ ప్రభుత్వ ఉద్యోగులు కావడం విశేషం. గ్రూప్–1 కొలువు కొట్టడమే తన లక్ష్యమని పేర్కొన్నాడు. మోతాదుకు మించి ఎరువులు వాడొద్దు పాపన్నపేట(మెదక్): రైతులు ఆధునిక సాగుకు సిద్ధం కావాలని జిల్లా వ్యవసాయ అధికారి వినయ్ పిలుపునిచ్చారు. బుధవారం మండల పరిధిలోని పాపన్నపేట, చిత్రియాల్ డీసీఎంఎస్ ఎరువుల దుకాణాల్లో రికార్డులు తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడు తూ.. అవసరానికి అనుగుణంగా వ్యవసాయ అధికారుల సలహా మేరకు ఎరువులు వాడా లని సూచించారు. దుకాణాదారులు నాణ్యమైన ఎరువులు విక్రయించాలని ఆదేశించారు. నిబంధనలకు అనుగుణంగా వ్యాపారం చేయాలన్నారు. రైతులకు ఏ సమస్యలు వచ్చినా అధికారులను సంప్రదించాలని తెలిపారు. ఆయన వెంట పాపన్నపేట మండల వ్యవసాయ అధికారి నాగమాధురి ఉన్నారు. డీసీసీబీ చైర్మన్కు పితృ వియోగం కొండపాక(గజ్వేల్): ఉమ్మడి మెదక్ జిల్లా డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్రెడ్డి తండ్రి రాంరెడ్డి(80) హైదరాబాద్లో మృతి చెందారు. స్వగ్రామమైన కొండపాకలో బుధవారం అంత్యక్రియలు నిర్వహించారు. డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి, ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి, అధికారులు, మాజీ ప్రజా ప్రతినిధులు డీసీసీబీ చైర్మన్ను పరామర్శించారు. -
డంప్యార్డును ఎత్తి వేయాలి
నర్సాపూర్: ప్యారానగర్లో ఏర్పాటు చేస్తున్న డంప్యార్డును ఎత్తి వేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లేశ్గౌడ్ డిమాండ్ చేశారు. నర్సాపూర్లో జేఏసీ ఆధ్వర్యంలో కొనసాగిస్తున్న రిలే నిరాహార దీక్షలకు మంగళవారం ఆయన సంఘీభావం తెలిపి మాట్లాడారు. డంప్యార్డుతో నర్సాపూర్ అడవులు, చెరువు కలుషితమవుతాయని ఆవేదన వ్యక్తం చేస్తూ డంప్ యార్డు ఏర్పాటును ప్రభుత్వం విరమించుకోవాలని కోరారు. దీక్షల్లో జేఏసీ నాయకులు శ్రీధర్గుప్తా, రాజేందర్, భిక్షపతి, జ్ఞానేశ్వర్, రమణరావు, మార్వాడి సంఘం నాయకులు మేఘరాజ్, రమేశ్, మోహన్ పాల్గొన్నారు. -
త్వరలో జూనియర్ సివిల్ కోర్టు ఏర్పాటు
కార్యాలయాన్ని పరిశీలించిన న్యాయమూర్తి తూప్రాన్: డివిజన్ కేంద్రంలో జూనియర్ సివిల్ కోర్టు సేవలు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు అధికారులు కార్యాచరణ మొదలెట్టారు. ఈ నేపథ్యంలో జూనియర్ సివిల్ కోర్టు ఏర్పాటు కోసం ఎంపీడీఓ కార్యాలయం భవనాన్ని రెవెన్యూ, పోలీసు అధికారులతో కలిసి జిల్లా సివిల్ కోర్టు న్యాయమూర్తి లక్ష్మీశారద మంగళవారం పరిశీలించారు. ఎస్సీ, ఎస్టీ వసతి గృహాలు, తహసీల్దార్ కార్యాలయం, వృథాగా ఉన్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్ను పరిశీలించారు. కాగా ఎంపీడీఓ కార్యాలయం అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్నట్లు అధికారులు ఒక అంచనాకు వచ్చినట్లు తెలిసింది. కాగా, తూప్రాన్లో జూనియర్ సివిల్ కోర్టు భవనం అందుబాటులోకి వస్తే ప్రజలకు దూరభారం తగ్గనుంది. -
మెనూ ప్రకారం భోజనం పెట్టాలి: డీఎల్పీఓ
కౌడిపల్లి(నర్సాపూర్): మండలంలోని వెల్మకన్నలోని ఎస్సీ బాలుర హాస్టల్ను డీఎల్పీఓ సాయిబాబా మంగళవారం ఆకస్మిక తనిఖీ చేశారు. హాస్టల్లో కిచెన్రూం, హాస్టల్ గదులు, టాయిలెట్స్, ఇతర పరిసరాలను పరిశీలించారు. విద్యార్థుల హాజరు రిజిస్టర్, మెనూ ప్రకారం భోజనం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ప్రతీరోజు మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన భోజనం వండి పెట్టాలన్నారు. హాస్టల్ విద్యార్థులకు ఉదయం, రాత్రి స్టడీ అవర్ నిర్వహించాలని, సమస్యలుంటే చెప్పాలన్నారు. కార్యక్రమంలో వసతి గృహ సంక్షేమ అధికారి జయరాజ్, వెల్మకన్న, కొట్టాల పంచాయతీ కార్యదర్శులు ప్రవీణ్రెడ్డి, మల్లేశం తదితరులు పాల్గొన్నారు.చదవడం, రాయడం రావాలిఎఫ్ఎల్ఎన్ జిల్లా కోఆర్డినేటర్ సిరికౌడిపల్లి(నర్సాపూర్): ప్రతీ విద్యార్థికి చదవడం, రాయడం రాయాలని ఎఫ్ఎల్ఎన్ (ఫండమెంటల్ లిటరసీ అండ్ న్యూమరసీ) జిల్లా కోఆర్డినేటర్ సిరి అన్నారు. మంగళవారం కౌడిపల్లి, దేవులపల్లి ప్రాథమిక పాఠశాలను ఎంఈఓ బాలరాజుతో కలిసి సందర్శించారు. ఆయా పాఠశాలలో మధ్యాహ్న భోజనం, పాఠశాల రికార్డులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు పరిశీలించారు. విద్యార్థుల సామర్థ్యాలను పరీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతీ విద్యార్థికి చతుర్విద ప్రక్రియలు చదవడం, రాయడం, కూడికలు, గుణితం కచ్చితంగా రావాలన్నారు. అనంతరం ఎంఈఓ బాలరాజు మాట్లాడుతూ.. ఉపాధ్యాయులు సమయపాలన పాటించి విద్యార్థులకు నాణ్యమైన విద్య, భోజనం అందించాలని తెలిపారు. పాఠశాల పరిసరాలు, బాత్రూంలు, మరగుదొడ్లు శుభ్రంగా ఉంచాలని చెప్పారు. సమస్యలుంటే చెప్పాలని, విధులపై నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవన్నారు.ఎమ్మెల్సీ సుభాష్రెడ్డి పూజలుపాపన్నపేట(మెదక్): ఎమ్మెల్సీ సుభాష్రెడ్డి మంగళవారం ఏడుపాయల దుర్గమ్మను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు శంకరశర్మ, పార్థివశర్మ ఆయనకు ఆలయ మర్యాదల ప్రకారం స్వాగతం పలికారు. అర్చన నిర్వహించి, తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఈఓ చంద్రశేఖర్ శాలువాతో సత్కరించారు.విజయసేనారెడ్డికి 259వ ర్యాంకుచేగుంట(తూప్రాన్): మండలంలోని బీకొండాపూర్కు చెందిన విజయసేనారెడ్డి గ్రూప్–2 ఫలితాల్లో 259వ ర్యాంకు సాధించారు. మండలంలోని మక్కరాజీపేట ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నారు. మంచి ర్యాంకు సాధించిన విజయసేనారెడ్డిని ఉపాధ్యాయ సంఘాల నాయకులు, స్నేహితులు అభినందించారు. ఐదేళ్ల కఠోర దీక్షకు తగిన ఫలితం వచ్చిందని విజయసేనారెడ్డి సంతోషం వ్యక్తం చేశారు.గ్రూప్ 2లో 103వ ర్యాంక్హుస్నాబాద్: పట్టణానికి చెందిన అయిలేని మణికంఠేశ్వర్ రెడ్డి గ్రూప్ 2లో స్టేట్ ర్యాంక్ సాధించారు. గ్రూప్ 2లో 392.5 మార్కులు వచ్చాయి. గతంలో గ్రూప్ 4లో 600 ర్యాంక్ సాధించిన మణికంఠేశ్వర్ రెడ్డి ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా ఎండోమెంట్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్నారు.ఆదర్శలో ప్రవేశానికి గడువు పెంపుచిన్నకోడూరు(సిద్దిపేట): ఆదర్శ పాఠశాలలో ఈ విద్యా సంవత్సరం ప్రవేశాలకు దరఖాస్తు గడువు ఈ నెల 20 వరకు పొడిగించినట్లు ఇబ్రహీంనగర్ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ సతీష్ తెలిపారు. 6వ తరగతిలో ప్రవేశం పొందే విద్యార్థులతో పాటు 7, 8, 9, 10 తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి ఏప్రిల్ 20న ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు. మరిన్ని వివరాలకు ఆదర్శ పాఠశాలలో సంప్రదించాలన్నారు. -
ప్రతిభను చాటేందుకు సదావకాశం
మెదక్ కలెక్టరేట్: యువత తమ ప్రతిభను చాటేందుకు మంచి అవకాశమని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డీఈఓ రాధాకిషన్ సూచించారు. మంగళవారం కేంద్ర యువజన వ్యవహారాల, క్రీడా మంత్రిత్వశాఖ, మేరా యువ భారత్ నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో జిల్లా స్థాయి యువజన ఉత్సవాలను నిర్వహించారు. మెదక్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా విద్యాధికారి రాధాకిషన్, డీవైఎస్ఓ దామోదర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా స్వామి వివేకానందుని చిత్ర పటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ యువ ఉత్సవం ద్వారా యువత తమ ప్రతిభను ప్రదర్శించడానికి ఒక మంచి వేదిక లభించిందన్నారు. శాస్త్ర సాంకేతిక ప్రదర్శనలు, కళా ప్రదర్శనలు, రచనా పోటీలు వంటి అనేక కార్యక్రమాలు జరుగుతున్నట్లు తెలిపారు. యువత ఈ కార్యక్రమాలలో పాల్గొని ప్రతిభను నిరూపించుకోవాలని సూచించారు. అనంతరం జిల్లాస్థాయి విజేతల వివరాలను జిల్లా యువజన అధికారి రంజిత్ రెడ్డి తెలిపారు. కాగా, విజేతలకు డీఈఓ బహుమతులు అందజేశారు. వీరు త్వరలో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి, ప్రోగ్రామ్ ఆఫీసర్ కిరణ్ కుమార్, సీనియర్ అధ్యాపకులు గణపతి, తిరుమలరెడ్డి, మురళి, దీపికా, సురేష్, వెంకటేశ్వ ర్లు, అధికం రాజు, యువజన సంఘాల అధ్యక్షులు, యువజన సంఘాల ప్రతినిధులు రాజు, 640 మందిపైగా యువతి యువకులు పాల్గొన్నారు. యువజనులు సద్వినియోగం చేసుకోవాలి డీఈఓ రాధాకిషన్ -
నీటిని తోడేస్తే కఠిన చర్యలు
నీటిపారుదల శాఖ ఏఈ హరీష్కొల్చారం(నర్సాపూర్): వేసవికాలం కావడం, చెరువుల్లో నీటి నిల్వలు తగ్గుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో అక్రమంగా నీటిని తోడేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని నీటిపారుదల శాఖ ఏఈ హరీష్ హెచ్చరించారు. మండలంలోని సంగాయిపేట పెద్ద చెరువులోని నీటిని కొందరు ముందస్తు అనుమతులు లేకుండా మోటార్ల ద్వారా నీటిని తోడేస్తున్నారని రెండు రోజుల క్రితం గ్రామానికి చెందిన మత్స్యకారులు నీటిపారుదల శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. శుక్రవారం చెరువును సందర్శించిన ఏఈలు హరీష్, మాధురి చెరువులో ఏర్పాటు చేసిన మోటార్లను వెంటనే తొలగించాలని సంబంధిత వ్యక్తులను ఆదేశించారు. లేదంటే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. చెరువులో పూర్తిస్థాయిలో నీటిమట్టం ఉన్నప్పుడు మాత్రమే అవసరం మేరకు అనుమతులు తీసుకొని నీటిని వాడుకునేందుకు అనుమతులు మాత్రమే ఉన్నాయన్నారు. అంతకుముందు గ్రామానికి చెందిన మత్స్యకారులు మాట్లాడుతూ.. మండుతున్న ఎండలతో చెరువులో నీటి నిల్వ రోజురోజుకు తగ్గిపోతున్నాయని, ఇప్పుడు మోటార్ల ద్వారా నీటిని తోడేస్తే నీటిమట్టం తగ్గిపోయి చెరువు ఎండిపోయే పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో చేప పిల్లలు చనిపోయి తాము ఆర్థికంగా దెబ్బ తినే పరిస్థితి వస్తుందని, మోటార్లను వెంటనే తొలగించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. -
మానవతా దృక్పథంతో పరిష్కరించాలి
దివ్యాంగుల సమస్యలపై కలెక్టర్ రాహుల్రాజ్ మెదక్ కలెక్టరేట్: దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను మానవతా దృక్పథంతో పరిష్కరించాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా సీ్త్ర శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో దివ్యాంగుల ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్.. స్వయంగా దివ్యాంగుల వద్దకు వెళ్లి సమస్యలను అడిగి తెలుసుకుంటూ ఫిర్యాదులు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా నిర్వహిస్తున్న ప్రజావాణికి విశేష స్పందన లభిస్తుందన్నారు. దివ్యాంగుల నుంచి ప్రజావాణిలో స్వీకరించిన దరఖాస్తులను సత్వర న్యాయం జరిగే దిశగా చర్యలు చేపడతామన్నారు. వివిధ సమస్యలపై 23 దరఖాస్తులు వచ్చాయని, వాటిని సత్వరంగా పరిష్కరించేలా కృషి చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ శ్రీరామ్ పాల్గొన్నారు. చివరి ఆయకట్టుకు నీరు పాపన్నపేట(మెదక్): ఫతే నహర్ కెనాల్ కింద చివరి ఆయకట్టుకు నీరు అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. మంగళవారం ఆయన పాపన్నపేట మండల పరిధిలోని శానాయపల్లి, పొడిచన్పల్లి గ్రామాల చివరి ఆయకట్టును పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడుతూ..నీటి లభ్యత, కరెంట్ సరఫరా తీరును అడిగి తెలుసుకున్నారు. ఘనపురం ఆనకట్ట నుంచి ఇంకా ఎన్ని తడులు అవసరమవుతాయని, సన్న వరి ఎన్ని ఎకరాలు వేశారని అధికారులను అడిగారు. ఆయన వెంట ఏఇ విజయ్ ఉన్నారు. -
అలసత్వం.. సమన్వయ లోపం..
నరేందర్రెడ్డి ఓటమికి కారణాలివే.. ● ఉమ్మడి మెదక్లోనే అతి తక్కువ ఓట్లు ● ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమిపై సుదీర్ఘ చర్చ ● ఉమ్మడి మెదక్ జిల్లా కాంగ్రెస్ నేతలతో సమావేశమైన జిల్లా మంత్రులుసాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి నరేందర్రెడ్డి ఓటమికి గల కారణాలపై ఉమ్మడి మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేతలు సుదీర్ఘంగా చర్చించారు. గెలిచే అవకాశాలున్న ఎమ్మెల్సీ సీటు చేజారి పోవడానికి దారితీసిన పరిస్థితులను సమీక్షించారు. ఈ ఓటమికి అభ్యర్థి నరేందర్రెడ్డి అలసత్వమే కారణమని పలువురు జిల్లా కాంగ్రెస్ ముఖ్యనేతలు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్యేలు, ఆయా నియోజకవర్గాల ఇన్చార్జిలు, కీలక నాయకులతో జిల్లా ఇన్చార్జి మంత్రి కొండా సురేఖ, జిల్లా మంత్రి దామోదర రాజనర్సింహలు మంగళవారం సమావేశమయ్యారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశాల మేరకు ఈ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఎన్నికల అంశంపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. అభ్యర్థి నరేందర్రెడ్డి అలసత్వం కారణంగానే జిల్లాలో ఆశించిన ఓట్లు పడలేదని పలు నియోజకవర్గాల నేతలు ఈ సమావేశంలో అభిప్రాయం వ్యక్తం చేసినట్లు సమాచారం. అలాగే అభ్యర్థి ఎంపిక కూడా మరోకారణమని, హరికృష్ణకు టికెట్ ఇస్తే ప్రయోజనం ఉండేదని, మరోవైపు టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి అభ్యర్థిని నిలపకపోవడం కూడా కారణమని పలువురు నేతలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈ సమావేశానికి చివరలో హాజరైన పీసీసీ చీఫ్ బి.మహేష్కుమార్గౌడ్తో కూడా ఈ అంశంపై జిల్లా నేతలు ప్రస్తావించినట్లు తెలిసింది. పాత బిల్లులు క్లియర్ చేయండి త్వరలో అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు ప్రత్యేక అభివృద్ధి నిధులు (ఎస్డీఎఫ్)లను కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించిన అంశంపైనా సమావేశంలో చర్చ జరిగింది. అయితే గతంలో మంజూరైన అభివృద్ధి పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు రాక పనులు అర్ధంతరంగా నిలిచిపోయాయని, ఒకరిద్దరు నాయకులు అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు తెలిసింది. అలాగే ఆందోల్, నారాయణఖేడ్ నియోజకవర్గాలకు మంజూరైన ఇంటిగ్రేటెడ్ పాఠశాలల అంశాన్ని కూడా సమావేశంలో చర్చించారు. ప్రజల్లో ప్రభుత్వంపై ఎందుకంత వ్యతిరేకత వస్తోందనే అంశం కూడా ఈ సమావేశంలో చర్చకొచ్చినట్లు తెలుస్తోంది. జిల్లాకు రూ.10 కోట్ల ఎస్డీఎఫ్ నిధులుమంత్రి కొండా సురేఖ హామీ మెదక్జోన్: జిల్లాకు త్వరలో రూ.10 కోట్ల ఎస్డీఎఫ్ నిధులు మంజూరు చేస్తానని జిల్లా ఇన్చార్జి మంత్రి కొండా సురేఖ అన్నారు. జిల్లా అభివృద్ధికి సంబంధించి పలుఅంశాలపై ఎమ్మెల్యే రోహిత్రావు, నర్సాపూర్ కాంగ్రెస్ ఇన్చార్జి రాజిరెడ్డి, డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్తో పాటు పలువురు నేతలు మంగళవారం హైదరాబాద్లో మంత్రి కొండా సురేఖ, వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర నర్సింహను కలిశారు. ఈ సందర్భంగా సురేఖ మాట్లాడుతూ.. పదేళ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక బిల్లులను పెండింగ్లో పెట్టిందని, వాటిని కూడా క్రమంగా నిధులను విడుదల చేస్తామన్నారు. గూడెం మహిపాల్రెడ్డి గైర్హాజరు బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ కండువా కప్పుకున్న పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి ఈ సమావేశానికి గైర్హాజరు కాగా., ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, పార్టీ నేతలు ఆవుల రాజిరెడ్డి, పూజల హరికృష్ణ, తూంకుంట నర్సారెడ్డి, నీలం మధు, కాటాశ్రీనివాస్గౌడ్, ఏ.చంద్రశేఖర్, ఎన్.గిరిధర్రెడ్డి, మెదక్ డీసీసీ అధ్యక్షులు ఆంజనేయులు తదితరులు హాజరయ్యారు. -
ఎంపీ రఘునందన్ రావుకు హైకోర్టులో ఊరట
హైదరాబాద్: మెదక్ ఎంపీ రఘునందన్ రావుకు హైకోర్టులో ఊరట లభించింది. నాగార్జున సాగర్ లో రఘునందన్ రావుపై నమోదైన కేసును హైకోర్టు కొట్టి వేసింది. 2021లో నాగార్జున సాగర్ ఉప ఎన్నిక సందర్భంగా రఘునందన్ రావుపై ఎప్ఐఆర్ నమోదైంది. మోడల్ కోడ్ అమల్లో ఉండగా అనుమతి లేకుండా ప్రచారం నిర్వహించారని ఫిర్యాదు చేశారు ఎంపీడీవో దుబ్బ సత్యం. రఘునందన్ రావు ఉట్లపల్లి, పులిచెర్ల గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారని ఫిర్యాదు చేశారు ఎంపీడీవో దుబ్బ సత్యం. ఆ కేసును హైకోర్టు కొట్టివేసింది. -
పకడ్బందీగా ‘పది’ పరీక్షలు
డీఈఓ రాధాకిషన్అల్లాదుర్గం(మెదక్)/పెద్దశంకరంపేట/చేగుంట(తూప్రాన్): జిల్లాలో పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహిస్తామని, ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాటు చేసినట్లు డీఈఓ రాధాకిషన్ తెలిపారు. సోమవారం అల్లాదుర్గం జెడ్పీ, ప్రాథమిక పాఠశాలను అకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వందశాతం ఉత్తీర్ణత సాధించేందుకు విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించినట్లు చెప్పారు. పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వసతులు కల్పించనున్నట్లు వివరించారు. ఆయన వెంట ఎంఈఓ ధనుంజయ్య ఉన్నారు. అనంతరం పెద్దశంకరంపేట మండల కేంద్రంలోని బాలుర ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేశారు. విద్యార్థులకు సులభ రీతిలో బోధన చేయడంతో పాటు వారిలో ఉన్న సృజనాత్మకతను వెలికితీసే బాధ్యత ఉపాధ్యాయులదేనని అన్నారు. ఈసందర్భంగా ఎఫ్ఎల్ఎన్ ద్వారా ఏ విధంగా బోధన చేపడుతున్నారో పరిశీలించారు. విద్యార్థులకు స్వయంగా ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు. అలాగే ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన మక్కరాజీపేటలో పనిచేసిన సీఆర్పీల కుటుంబాలకు ఆర్థికసాయం పత్రాలను అందజేశారు. -
చివరి ఆయకట్టుకూ నీరందించాలి
మెదక్ కలెక్టరేట్: రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చివరి ఆయకట్టు వరకు సాగునీరందించాలని భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. సోమవారం సచివా లయం నుంచి సాగు నీటి నిర్వహణ, సరఫరాపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా.. కలెక్టర్ రాహుల్రాజ్, అదనపు కలెక్టర్ నగేష్, అదనపు ఎస్పీ మహేందర్, జెడ్పీ సీఈఓ ఎల్లయ్య, డీపీఓ యాదయ్య, మున్సిపల్ కమిషనర్లు హాజరయ్యారు. ఈసందర్భంగా మంత్రులు మాట్లాడుతూ.. నీటి పారుదల, వ్యవసాయ, విద్యుత్ అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. సాగు నీటి సరఫరాలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం కలెక్టర్ ఇరిగేషన్, వ్యవసాయ అధికారులతో సమావేశమై తగు సూచనలు సలహాలు చేశారు. ఇరిగేషన్ అధికారులు, మండల వ్యవసాయ అధికారులు కచ్చితంగా క్షేత్రస్థాయిలో ఉండాలని ఆదేశించారు. వేసవిని దృష్టిలో పెట్టుకొని నీటి వృథా లేకుండా నిరంతరం పర్యవేక్షించాలన్నారు. నీటి పొదుపు విధానంపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. సమన్వయంతో పనిచేస్తూ నీటి కొరత రాకుండా చూడాలని వివరించారు. వీడియో కాన్ఫరెన్స్లో డీఏఓ వినయ్, నీటిపారుదల శాఖ ఈఈ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి: ఎస్ఎఫ్ఐ
మెదక్ కలెక్టరేట్: రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగ అభివృద్ధికి 30 శాతం నిధులు కేటాయించి, పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ను వెంటనే విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అజయ్కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం మెదక్ ఎమ్మెల్యే రోహిత్రావు క్యాంపు కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రభుత్వ విద్యారంగం సమస్యలతో సతమతమవుతుందన్నారు. ప్రధానంగా సంక్షేమ వసతి గృహాలు, గురుకులాలు, కేజీబీవీ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. ఏడాదిగా హాస్టల్, మెస్ బిల్లులు పెండింగ్ ఉన్నాయన్నారు. కార్యక్రమంలో నాయ కులు ని ఖిల్, విష్ణు సాంసన్, బాలరాజు పాల్గొన్నారు. కరస్పాండెంట్కు షోకాజ్ నోటీస్ వెల్దుర్తి(తూప్రాన్): మాసాయిపేట మండలం రా మంతాపూర్ గ్రామ శివారులో అనుమతులు రాకు ండానే అడ్మిషన్ల ప్రక్రియ చేపట్టిన తీరుపై సోమవారం సాక్షిలో ప్రచురితమైన ‘ప్రైవేట్ ఇష్టారాజ్యం’ కథనానికి అధికారులు స్పందించారు. యూకేజీ నుంచి పదో తరగతి వరకు అడ్మిషన్లకు సంబంధించి విద్యార్థులకు నిర్వహించిన టాలెంట్ టెస్ట్, పాఠశాలకు సంబంధించిన కరపత్రాల పంపిణీపై మూడు రోజుల్లో లిఖిత పూర్వక వివరణ ఇవ్వాలని ఎంఈఓ లీలావతి సోమవారం జాన్స్ అకాడమీ కరస్పాండెంట్కు షోకాజ్ నోటీస్ అందజేశారు. ప్రైవేట్ పాఠశాలల్లో ఏదైనా ప్రవేశ పరీక్షను నిర్వహించే ముందు సంబంధిత అధికారుల నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని, నిబంధనలు ఉల్లంఘించిన సొసైటీపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నారు. పాఠశాలకు సంబంధించి పూర్తి అనుమతులు వచ్చిన తర్వాతే అడ్మిషన్ల ప్రక్రియ చేపట్టాలని ఆదేశించారు. -
విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యం
మెదక్ ఎమ్మెల్యే రోహిత్రావుపాపన్నపేట(మెదక్)/చిన్నశంకరంపేట: రామాయంపేటలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయని ఎమ్మెల్యే రోహిత్రావు తెలిపారు. సోమవారం మండలంలోని ముద్దాపూర్లో ముత్యాల పోచమ్మ ఆలయంలో నిర్వహించిన విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విద్య, వైద్యరంగా లకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు. పాపన్నపేట మండలంలో అంతర్జాతీయ స్థాయిలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామన్నారు. ముద్దాపూర్ శివారులో రెండు బ్రిడ్జిలు, ఆలయం వరకు సీసీ రోడ్డు, బోరు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఆయన వెంట చిన్నశంకరంపేట నాయకులు ఆవుల గోపాల్రెడ్డి, జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి శ్రీకాంతప్ప, కొత్తపల్లి సొసైటీ చైర్మన్ రమేష్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గోవింద్ నాయక్, నాయకులు ప్రశాంత్రెడ్డి, ఆకుల శ్రీనివాస్, గౌస్, ఏడుపాయల మాజీ చైర్మన్ నర్సింలు తదితరులు ఉన్నారు. అనంతరం చిన్నశంకరంపేట మండలంలోని భగీరథపల్లిలో జరిగిన బీరప్ప ఉత్సవాల్లో పాల్గొని పూజలు నిర్వహించి మాట్లాడారు. పదేళ్లలో జరగని అభివృద్ధిని చేసి చూపిస్తున్నామని అన్నారు. గతంలో సొంత జిల్లాలోని ఏడుపాయలను దర్శించుకునే సమయం కూడా అప్పటి సీఎంకు లేకపోయిందని, నేడు సీఎం రేవంత్రెడ్డి దుర్గామాతను దర్శించుకొని అభివృద్ధికి నిధులు మంజూరు చేశారన్నారు. -
ఇంటిగ్రేటెడ్ స్కూల్కు నిధులు
● నిర్మాణానికి రూ. 200 కోట్లు మంజూరు ● ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం ● ఇప్పటికే 25 ఎకరాలు కేటాయింపురామాయంపేట(మెదక్): ప్రతిష్టాత్మక యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణానికి ప్రభుత్వం రూ. 200 కోట్లు మంజూరు చేసింది. ఈ మేరకు ప్రభుత్వం నుంచి ఇంజనీరింగ్ శాఖ అధికారులకు ఉత్వర్తులు అందాయి. అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించనున్న ఈ పాఠశాల భవన సముదాయం నిర్మాణానికి రామాయంపేట పట్టణ శివారులో జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న 25 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించారు. నియోజకవర్గానికి ఒకటి చొప్పున మొదటి విడతలో 14 నియోజకవర్గాకు ఈ స్కూళ్లు మంజూరయ్యాయి. ఐదో తరగతి నుంచి ఇంటర్ వరకు సామాజిక అంతరాలు లేని అన్నివర్గాలకు చెందిన 2,500 పైగా విద్యార్థులకు ఇందులో అవకాశం కల్పించనున్నారు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలు.. స్థానిక వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా స్కూల్ భవన నిర్మాణం జరపనున్నారు. ఈ స్కూల్లో అడ్మిషన్ పొందిన విద్యార్థులకు ఉచిత బోధనతో పాటు వసతి కల్పించనున్నారు. హాస్టళ్లు, కంప్యూటర్ల గదులు, ఆడిటోరియం, అవుట్ డోర్, ఇండోర్ జిమ్, క్రీడా మైదానాలు, టెన్నీస్ కోర్టు, వంటశాల, గ్రంథాలయాలు, క్రీడలకు సంబంధించి వేర్వేరుగా భవనాలు నిర్మించనున్నట్లు సమాచారం. క్రీడలతో పాటు కళలకు ఈ స్కూల్లో ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వనున్నారు. మూడు నెలల క్రితం జిల్లాలో పర్యటించిన సీఎం రేవంత్రెడ్డి స్కూల్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. -
రవాణా శాఖలో అవినీతిని అరికట్టాలి
మెదక్ కలెక్టరేట్: జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో ఏజెంట్ వ్యవస్థను రద్దు చేసి అవినీతిని అరికట్టాలని ఎమ్మార్పీఎస్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బాల్రాజ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపి కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మెదక్ రవాణా శాఖలో అనధికార వ్యక్తులు అన్నింటా పెత్తనం చెలాయిస్తూ చెలరేగిపోతున్నారని ఆరోపించారు. ఇప్పటికై నా కలెక్టర్ స్పందించి తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు. వాహనదారులు, అధికారులకు మధ్య ఏజెంట్లు మధ్యవర్తిత్వం చేస్తూ డబ్బు వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపించారు. అన్నీ తెలిసిన ఆర్టీఏ అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు సంజీవులు, సంపత్కుమార్, శ్రీనివాస్, ప్రభాకర్, సంజీవులు, కృష్ణ, నర్సింలు తదితరులు పాల్గొన్నారు. -
పైరవీలకు తావులేదు
మెదక్ మున్సిపాలిటీ: ప్రజలు మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా నేరుగా వచ్చి సంప్రదించాలని.. పైరవీలకు తావులేకుండా పోలీస్ సేవలను వినియోగించుకోవాలని అదనపు ఎస్పీ మహేందర్ అన్నారు. సోమవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ప్రజావాణి నిర్వహించారు. ఈసందర్భంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల నుంచి అర్జీలను స్వీకరించారు. తక్షణ పరిష్కారం కోసం సంబంధిత ఎస్ఐ, సీఐలకు ఫోన్ ద్వారా సూచనలు చేశారు. శాంతి భద్రతలను పరిరక్షిస్తూ ముందుకు సాగడమే లక్ష్యంగా జిల్లా పోలీస్శాఖ పని చేస్తుందని తెలిపారు. ఎల్ఆర్ఎస్ను వేగవంతం చేయండి మెదక్జోన్: ఎల్ఆర్ఎస్ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ రాహుల్రాజ్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని సందర్శించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈనెల 31లోగా ఎల్ఆర్ఎస్ దరఖాస్తు ఫీజు చెల్లించిన వారికి ప్రభుత్వం ప్రకటించిన 25 శాతం రాయితీ వర్తిస్తుందనే విషయాన్ని లబ్ధిదారులకు తెలియజేయాలని సూచించారు. గ్రామాలు, పట్టణాల్లో విస్తృత ప్రచారం నిర్వహించాలని అన్నారు. దుర్గమ్మ సేవలో ఎమ్మెల్సీ శ్రీపాల్రెడ్డి పాపన్నపేట(మెదక్): ఏడుపాయల వన దుర్గమ్మను ఉపాధ్యాయ ఎమ్మెల్సీ శ్రీపాల్రెడ్డి దర్శి ంచుకొని ప్రత్యేక పూజలు చేశారు. సోమవారం గాజులమ్మగా అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. అర్చకులు రంగు రంగుల గాజులతో అలంకరించారు. కార్యక్రమంలో పీఆర్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పులగం దామోదర్రెడ్డి, నాయకులు కృష్ణ, సామ్యానాయక్, వెంకట్రాంరెడ్డి, రాజు, సురేష్ తదితరులు పాల్గొన్నారు. 111 మంది గైర్హాజరు మెదక్ కలెక్టరేట్: జిల్లాలో ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. సోమవా రం ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం ఇంగ్లీష్ పరీక్ష నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా 5,640 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కావాల్సి ఉండగా.. 5,529 హాజరయ్యారు. మరో 111 మంది వివిధ కారణాలతో పరీక్షకు హాజరు కాలేదని జిల్లా ఇంటర్ నోడల్ అధికారి మాధవి తెలిపారు. జిల్లాలో ఎక్కడా మాల్ ప్రాక్టీస్, సమస్యలు ఉత్పన్నం కాలేదని చెప్పారు. ‘స్థానిక’ ఎన్నికల్లో ప్రాతినిధ్యం కల్పించండి మెదక్ కలెక్టరేట్: దివ్యాంగులకు త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రాతినిధ్యం కల్పించాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక అధ్యక్షురాలు యశోద ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా సోమవారం మెదక్లో సంతకాల సేకరణ చేపట్టారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రంలో 43 లక్షల మంది దివ్యాంగులు ఉన్నారని తెలిపారు. ఇప్పటికే రాజస్థాన్, ఛత్తీస్గడ్ లాంటి రాష్ట్రాలు చట్టాలు చేసి అమలు చేస్తున్నట్లు చెప్పారు. తాము అధికారంలోకి వస్తే చట్టంలో సవరణలు చేసి దివ్యాంగులకు రెండు పోస్టులు నామినేట్ చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చినట్లు గుర్తుచేశారు. దీని ద్వారా దివ్యాంగులకు రాజ్యాధికారం దక్కుతుందన్నారు. దీనిపై వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో చట్టం చేయాలని, లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో సంఘం సభ్యులు కవిత, స్వరూప తదితరులు పాల్గొన్నారు. -
‘పూలే’ అణగారిన వర్గాల ఆశాజ్యోతి
మెదక్ కలెక్టరేట్: అణగారిన వర్గాల అభివృద్ధి కోసం సావిత్రిబాయి పూలే కృషి చేశారని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు అజ్జమరి మల్లేశం అన్నారు. సోమవారం పట్టణంలోని కేవల్ కిషన్ భవన్లో సావిత్రిబాయి పూలే వర్ధంతిని నిర్వహించారు. ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిమ్న జాతులు, అణగారిన వర్గాల కోసం భర్త జ్యోతిరావు పూలేతో కలిసి పాఠశాలను ప్రారంభించినట్లు తెలిపారు. మహిళ విద్యాభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారని కొనియాడారు. మహిళలకు చాలా పరిశ్రమల్లో నేటికీ సమాన పనికి– సమాన వేతనం అందడం లేదన్నారు. వచ్చే అసెంబ్లీ, పార్లమెంట్ సమావేశాల్లో అయినా వారికి 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి మల్లేశం, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అజయ్, నా యకులు సత్యం, శ్యాంసన్, రాణి పాల్గొన్నారు. -
ఆధ్యాత్మికతను అలవర్చుకోవాలి
మాజీ స్పీకర్, ఎమ్మెల్సీ మధుసూదనాచారి చిన్నకోడూరు(సిద్దిపేట): ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక భావాన్ని అలవర్చుకోవాలని మాజీ స్పీకర్, ఎమ్మెల్సీ మధునూదనాచారి అన్నారు. ఆదివారం చిన్నకోడూరులో జరుగుతున్న వీరభద్ర స్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆధ్యాత్మికతతో వ్యవహరిస్తే అన్నింటా సత్ఫలితాలు ఉంటాయన్నారు. కాకతీయుల నాటి శివాలయాలు వరంగల్ జిల్లాలో చాలా అద్భుతంగా ఉన్నాయన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి రాధాకృష్ణ శర్మ, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కాముని శ్రీనివాస్, నాయకులు తదితరులు ఉన్నారు. -
విలీన గ్రామం.. ప్రగతికి దూరం
రామాయంపేట(మెదక్): రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలోని శివారు గ్రామాల్లో కనీస వసతులు కరువై ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. 2018లో ఆవిర్భవించిన మున్సిపాలిటీలో గుల్పర్తి, కోమటిపల్లి గ్రామాలతో పాటు రెండు తండాలను విలీనం చేశారు. మున్సిపాలిటీలో విలీనం అనంతరం నిబంధనల మేరకు పన్నులు పెరిగాయి. అయినా ఈ ఐదేళ్లలో ఒక్క అభివృద్ధి పని చేపట్టలేదని రెండు గ్రామాల ప్రజలు వాపోయారు. రెండు గ్రామాల్లో సీసీ రోడ్లు, మురుగు కాలువలు పాక్షికంగా ధ్వంసం కాగా, వాటి మరమ్మతు విషయమై ఎవరూ పట్టించుకోవడం లేదు. ఫలితంగా ప్రజలు సమస్యలతో సతమతమవుతున్నారు. ఈవిషయమై పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎంతమాత్రం పట్టించుకోలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండు గ్రామాల ప్రజలు, తండాల గిరిజనులకు ఉపాధి పనులు అత్యవసరం కాగా, మున్సిపాలిటీలో విలీనం అనంతరం ఈ పథకానికి నోచుకోకుండా పోయారు. గతంలో ప్రతి ఇంటి నుంచి ఇద్దరు, ముగ్గురు చొప్పున ఉపాధి పనులకు వెళ్లేవారు. ఇదే విషయమై మున్సిపల్ కమిషనర్ దేవేందర్ను వివరణ కోరగా.. మున్సిపాలిటీలో విలీనమైన గుల్పర్తి, కోమటిపల్లి, రెండు తండాల అబివృద్ధికి కట్టుబడి ఉన్నామని తెలిపారు. ఇప్పటికే కొన్ని అభివృద్ధి చేపట్టామని, నిధుల మంజూరును బట్టి మరిన్ని పనులు చేస్తామని పేర్కొన్నారు. -
‘ప్రైవేట్’ ఇష్టారాజ్యం!
● పుట్టగొడుగుల్లా వెలుస్తున్న బడులు ● విద్యా హక్కు చట్టానికి తూట్లు ● ఉదాసీన వైఖరిలో విద్యాశాఖాధికారులు మెదక్జోన్: ‘మాసాయిపేట మండలం రామంతాపూర్ గ్రామ శివారులో ఇటీవల నూ తనంగా ఓ ప్రైవేట్ పాఠశాలను నిర్మించారు. అందులో సీబీఎస్ఈ విధానంలో బోధన ఉంటుందని.. యూకేజీ నుంచి 10వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం కొనసాగుతుందని కరపత్రాల ద్వారా ప్రచారం చేపడుతున్నారు. సదరు పాఠశాల నిర్వాహకులు వచ్చే విద్యా సంవత్సరానికి ఇప్పటి నుంచే విద్యార్థులకు ప్రవేశ టెస్టులు నిర్వహించి ఫీజుల వసూళ్లు చేపడుతున్నారు. అయితే ఇప్పటివరకు ఆ పాఠశాలకు అనుమతులు రాకపోవటం గమనార్హం’. నిబంధనలకు తూట్లు జిల్లాలో 220 ప్రైవేట్ పాఠశాలలు కొనసాగుతుండగా, వాటిలో 45 వేల పైచిలుకు విద్యార్థులు చదువుకుంటున్నారు. అయితే వాటిలో 90 శాతానికి పైగా పాఠశాలల యాజమాన్యా లు విద్యాహక్కు చట్టాన్ని యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నాయి. ప్రైవేట్ పాఠశాలకు అనుమతి కావాలంటే విద్యార్థులకు పక్కా భవన సముదాయం, క్రీడా ప్రాంగణం, ఫిట్నెస్ ఉన్న బస్సులు, ఫైర్సేఫ్టీ అనుమతి పొంది ఉండాలి. కానీ నిబంధనలు, ప్రమాణాలకు విరుద్ధంగా అధికారులు అమ్యామ్యాలకు అలవాటు పడి ప్రైవేట్ పాఠశాలలు, వాహనాలకు అనుమతులు ఇస్తున్నారని బాహాంటంగానే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇదే అదనుగా యా జమాన్యాలు పాఠశాల భవన నిర్మాణం నుంచి మొదలుకుని ఫీజుల వసూళ్ల వరకు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. కనీస విద్యార్హత లేని వారితో చదువులు చెప్పిస్తున్నట్లు సమాచారం. విద్యాహక్కు చట్టం ప్రకారం విద్యార్థులకు 25 శాతం పేద విద్యార్థులకు ఉచితంగా బోధన అందించాలి. కానీ అలాంటివి జిల్లాలో ఎక్కడా అమలు కావడం లేదు. నూతన పాఠశాలలు మాత్రం పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తూనే ఉన్నా యి. అయితే ప్రైవేట్ పాఠశాలల నిర్వాహకులకు అధికార పార్టీ నేతల అండ ఉందని, దీంతో చేసేది లేక చూసీచూడనట్లు వ్యవహరించాల్సి వస్తోందని సంబంధిత ఉన్నతాధికారి ఒకరు ఆవేదన వ్యక్తం చేశారు. చర్యలు తీసుకుంటాం మాసాయిపేట మండలం రామంతాపూర్లో నూతనంగా నిర్మించిన పాఠశాలలో యూకేజీ నుంచి పదో తరగతి వరకు అనుమతులు అడిగారు. అనుమతుల కోసం రీజనల్ జాయింట్ డైరెక్టర్ (ఆర్జేడీ)కి పంపించాం. ఇప్పటివరకు ఎలాంటి అనుమతులు ఆ పాఠశాలకు రాలేదు. అలాగే నిబంధనలు ఉల్లంఘించే పాఠశాలలను తనిఖీ చేసి చర్యలు తీసుకుంటాం. – రాధాకిషన్, డీఈఓ -
మెనూ పక్కాగా అమలు చేయాలి
కలెక్టర్ రాహుల్రాజ్ హవేళిఘణాపూర్(మెదక్): విద్యార్థులకు నాణ్యతతో కూడిన విద్యనందించి, మెనూ ప్రకారం భోజనం పెట్టాలని కలెక్టర్ రాహుల్రాజ్ అన్నారు. ఆదివారం మండల కేంద్రమైన హవేళిఘణాపూర్ ఎంజేపీ బాలికల రెసిడెన్షియల్ పాఠశాలను తనిఖీ చేశారు. డైనింగ్ హాల్లో భోజనం చేస్తున్న విద్యార్థులను ఆహారం ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు. కూరగాయలు, వంట సరకులను నిల్వ చేసే గదిని పరిశీలించారు. నాణ్యత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని సిబ్బందికి సూచించారు. మరుగుదొడ్లు, మూత్రశాలలు, ప్రయోగశాలలు, తరగతి గదులను తనిఖీ చేశారు. నిత్యం పరిశుభ్రతా చర్యలు చేపట్టాలన్నారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడారు. ఎక్కడ నుంచి వచ్చారు..? ఎలా చదువుతున్నారు? ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం సమయానికి అందిస్తున్నారా? వంటి వివరాలను అడిగి తెలుసుకున్నారు. లక్ష్యాలను ఎంచుకొని బాగా చదివి ఉన్నతస్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. కలెక్టర్ వెంట ఏటీసీ సునీత, సిబ్బంది ఉన్నారు. -
సుందరంగా తీర్చిదిద్దుతాం
కొమురవెల్లి(సిద్దిపేట): మల్లన్నస్వామి క్షేత్రాన్ని అన్ని విధాల సుందరంగా తీర్చిదిద్దుతామని మంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్ అన్నారు. ఆదివారం కుటుంబ సమేతంగా స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. మల్లికార్జున స్వామి మా కుటుంబానికి ఇలవేల్పు అని, ప్రతి సంవత్సరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని, సకాలంలో వర్షాలు కురిసి పాడి పంటలు సమృద్ధిగా పండాలని స్వామి వారిని కోరుకున్నట్లు తెలిపారు. ఆలయ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వ కట్టుబడి ఉందని, భక్తులకు కావల్సిన సౌకర్యాలను కల్పిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహాదేవుని శ్రీనివాస్,ఽ దర్మకర్తలు లింగంపల్లి శ్రీనివాస్, జయప్రకాశ్ రెడ్డి, తురాయి నవీన్ తదితరులు పాల్గొన్నారు. ప్రతిపక్షాలు కావాలనే బద్నాం చేస్తున్నాయి..కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు కావాలనే బద్నాం చేస్తున్నాయని మంత్రి పొన్నం అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటినుంచి ఆరోగ్యశ్రీని రూ.5 లక్షలనుంచి రూ.10 లక్షలకు పెంచామన్నారు. మహిళలకు బస్సులో ఉచిత ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రూ.500 లకే గ్యాస్ సిలిండర్, రైతు భరోసా నిధుల విడుదల చేశామని అన్నారు. త్వరలోనే ఇందిరమ్మ ఇళ్లను సైతం ఇస్తామని, మహిళను కోటీశ్వరులను చేసేందుకు ప్రభత్వం అనేక పథకాలను తీసుకురానుందని తెలిపారు. వేసవిలో గ్రామాలలో తాగునీటి సమస్య ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. కొమురవెల్లి క్షేత్రంలో వసతులు కల్పిస్తాం మంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్ స్వామి సన్నిధిలో కుటుంబసమేతంగా పూజలు -
తక్షణమే రిజర్వేషన్లు అమలు చేయండి
మెదక్ కలెక్టరేట్: చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు తక్షణమే అమలు చేయాలని శ్రామిక మహిళా సంఘం జిల్లా కన్వీనర్ కడారి నర్సమ్మ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం పట్టణంలోని కేవల్ కిషన్ భవన్లో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం జిల్లా సదస్సును నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహిళలకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, పని ప్రదేశాల్లో రక్షణ కల్పించాలని కోరారు. ప్రభుత్వాలు మారిన మహిళల బతుకులు మారడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలకు ప్రోత్సహించి మరింత ముందుకు నడిపించాలన్నారు. దేశవ్యాప్తంగా మహిళలు, పిల్లలపై లైంగిక దాడులు, హింస పెరిగిపోయిందన్నారు. మహిళా కార్మికుల సమస్యలపై నిరంతరం పోరాడుతూనే ఉంటామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో వివిధ ప్రజా సంఘాల నాయకులు యశోద, కవిత, స్వరూప, కవిత, రేణుక, రాణి, వరలక్ష్మి, వీరమణి, రమాదేవి, మంజుల, లక్ష్మీసుజాత, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. మూల్యాంకన పారితోషికం ఏది: పీఆర్టీయూ మెదక్ కలెక్టరేట్: గతేడాది పదో తరగతి వార్షిక పరీక్షల మూల్యాంకనం బిల్లులు వెంటనే చెల్లించాలని పీఆర్టీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సుంకరి కృష్ణ, స్వామ్యనాయక్ డిమాండ్ చేశారు. ఆదివారం వారు మాట్లాడుతూ.. గత సంవత్సరం 10వ తరగతి వార్షిక పరీక్షల మూల్యాంకనం చేసిన ఉపాధ్యా యులకు ఇంతవరకు పారితోషికం చెల్లించకపోవడం శోచనీయమన్నారు. ఈసంవత్సరం మళ్లీ 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయని, అయినా ఇప్పటివరకు చెల్లించకపో వడం ఏమిటని ప్రశ్నించాడు. జిల్లా విద్యాశాఖ అధికారులు స్పందించి వెంటనే గత సంవత్సరం మూల్యాంకనం పారితోషికాన్ని వెంటనే విడుదల చేయాలని కోరారు. విద్య, వైద్యరంగాలకు ప్రాధాన్యం నారాయణఖేడ్: తమ ప్రభుత్వంలో విద్య, వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని ఎమ్మెల్యే సంజీవరెడ్డి స్పష్టం చేశారు. సిర్గాపూర్ మండలం సంగం గ్రామానికి చెందిన శ్రీనివాస్రావుకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా రూ.(60 వేలు మంజూరుకాగా అందుకు సంబంధించిన చెక్కును ఆదివారం ఆయన ఖేడ్లోని తననివాసంలో అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ...వైద్యరంగానికి ప్రాధాన్యతలో భాగంగా ఆరోగ్యశ్రీ పరిమితిని రాష్ట్ర ప్రభుత్వం రూ.10 లక్షలకు పెంచిందన్నారు. కాగా, మనూరు మండలం దన్వార్ గ్రామంలో నిర్వహించిన బీరప్ప జాతర మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యా యి. జాతర ఉత్సవాల్లో పాల్గొన్న సంజీవరెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు భోజిరెడ్డి, మాజీ సర్పంచ్ దిగంబర్రెడ్డి, వెంకట్రాంరెడ్డి, వెంకట్రెడ్డి పాల్గొన్నారు. సీఐటీయూతోనే కార్మికులకు న్యాయం సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్కా రాములు పటాన్చెరు టౌన్: కార్మికుల కష్ట సుఖాల్లో ఎరజ్రెండా అండగా ఉంటుందని, సీఐటీయూ అంటేనే కార్మికులకు ఒక భరోసా అని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు, కిర్బీ యూనియన్ అధ్యక్షుడు చుక్కా రాములు పేర్కొన్నారు. పటాన్చెరు పట్టణంలోని శ్రామిక భవన్లో ఆదివారం జరిగిన కార్యక్రమంలో వివిధ కార్మిక సంఘాలకు చెందిన కార్మికులు సీఐటీయూలో చుక్కా రాములు సమక్షంలో పెద్ద ఎత్తున చేరారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ... కార్మికులకు అండగా సీఐటీయూ ఉంటుందన్నారు. కిర్బీ పరిశ్రమలో కూడా కార్మికులకు అనేక చట్టపరమైన సౌకర్యాలు సీఐటీయూ సాధించిందని, భవిష్యత్తులో మరిన్ని సౌకర్యాలు సాధిస్తామని భరోసానిచ్చారు. కార్మికులందరూ ఐక్యంగా ఉంటేనే సమస్యలు పరిష్కారం అవుతాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాజయ్య, యూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
రాజుల కోటలో రత్నాల వేట
గుప్త నిధుల తవ్వకాలతో.. ● ఆనవాళ్లు కోల్పోతున్న రంగంపేట కోట ● పట్టించుకోని ప్రభుత్వాలు ● పరిరక్షించాలంటున్న ప్రజలు కొల్చారం(నర్సాపూర్): రాజులు పోయారు.. రాజ్యాలు పోయాయి.. కానీ ఆనాటి చరిత్రను తెలిపే కోటలు మాత్రం ఇప్పటికీ సజీవ సాక్ష్యాలుగా కనిపిస్తూనే ఉన్నాయి. అందులో వందల ఏళ్ల నాటి చారిత్రక నేపథ్యం కలిగిన రంగంపేట కోట ఒకటి. హైదరాబాద్ రాజ్యంలో ఉన్న 14 సంస్థానాల్లో ఒకటైన పాపన్నపేట సంస్థానం కింద నిజాం నవాబులచే రాయ్భాగన్ (ఆడ సింహం)గా బిరుదు పొందిన రాణి శంకరమ్మ దత్తపుత్రుడైన రాజా సదాశివరెడ్డి 1,700 సంవత్సర మధ్యకాలంలో ఈ కోటను నిర్మించారు. నిజాం పరిపాలనలో ఈ కోట ఆర్థిక భాండాగారంగా కొనసాగిందని చరిత్ర చెబుతుంది. అయితే ప్రస్తుతం ఆ కోట గుప్తనిధుల వేటగాళ్ల ధ్వంస రచనతో బీటలు వారింది. శిథిలావస్థకు చేరి అధ్వానంగా మారింది. ఎంతో చరిత్ర కలిగిన రంగంపేట కోట గురించి భావితరాలు తెలుసుకునేలా పురావస్తు శాఖ రక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అప్పుడే నిర్మాణానికి నాంది పాపన్నపేట సంస్థానం, ఆందోల్ సంస్థానాల మధ్య రాణి శంకరమ్మ పరిపాలన సాగిస్తూ తిరుగులేని రాణిగా కొనసాగింది. వృద్ధాప్యం వచ్చే క్రమంలో రాజ్యాన్ని కాపాడాలన్న లక్ష్యంతో బాలుడైన రాజా సదాశివరెడ్డిని దత్తత తీసుకొని రాజుగా ప్రకటించింది. ఆయన ఆందోల్ నుంచి రంగంపేట మీదుగా ఎడ్ల బండిలో పాపన్నపేటకు మంది మార్బలంతో ప్రయాణం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో ప్రస్తుతం కోట నిర్మించిన రంగంపేట శివారులోకి రాగానే వేట కుక్కలను తరుముతున్న కుందేలు కనిపించింది. ఈ విషయమై రాజ పురోహితులతో చర్చించారని, ఇక్కడి స్థల ప్రాముఖ్యతను గుర్తించి కోట నిర్మాణానికి నాంది పలికారన్నది చరిత్ర చెబుతోంది. దాదాపు పదెకరాల విస్తీర్ణంలో శత్రు దుర్భేద్యమైన కోటను నిర్మించారు. చుట్టూ నాలుగు బురుజులు.. రెండు ప్రధా న ద్వారాలతో నిర్మాణమైన కోటలో రాణిమహల్, తాగునీటి అవసరాలకు మెట్లబావి, గుర్రపు శాల, అంతర్గత డ్రైనేజీ నిర్మాణం, అద్దాలమేడ, గోడలపై నకశిల్పాలు ఇలా.. ఎన్నెన్నో కోటలో కనిపిస్తాయి. కోట బురుజుపై నుంచి చూస్తే మెదక్ ఖిల్లా కనిపించడం విశేషం. కోటలో నుంచి పాపన్నపేట కోట వరకు రహస్య గుహ ఉందని, దానికి నిదర్శనంగా లోపల నిర్మాణం కనిపించడం మరో విశేషం. అద్భుతమైన శైలిలో అనంతపద్మనాభుని మాదిరిగా దర్శనమిచ్చే రంగనాయక స్వామి విగ్రహంతో దర్శనమిచ్చే దేవాలయం, లింగ దారుడైన సంగమేశ్వర స్వామి దేవాలయం సైతం అప్పుడే నిర్మించబడ్డాయి. అయితే కోటను కొంతైనా రక్షించాలన్న లక్ష్యంతో అధికారులు కోట చుట్టూ ఫెన్సింగ్, పల్లె ప్రకృతి వనం నిర్మించారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా నిర్వహణ లోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. -
ప‘రేషన్’..!
ఆదివారం శ్రీ 9 శ్రీ మార్చి శ్రీ 2025నిండుకున్న బియ్యం నిల్వలు ● తెరుచుకోని రేషన్ దుకాణాలు ● జిల్లాలో 2,13,777 కార్డుదారులు ● 6,85,178 మంది లబ్ధిదారులు ● కావాల్సిన బియ్యం 35 వేల క్వింటాళ్లుఇంకెప్పుడిస్తారు? గతంలో ప్రతి నెల 1వ తేదీన బియ్యం వచ్చేవి. రెండు నెలలుగా సకాలంలో ఇస్తలేరు. ఇప్పటికే వారం గడిచిపోయింది. డీలర్ను అడిగితే గోదాం నుంచి బియ్యం రాలేవని చెబుతున్నాడు. ఇంట్లో బియ్యం లేవు. బయట కొందామంటే ధరలు మండిపోతున్నాయి. బతికేదెట్లా? – వెంకయ్య, వై. మాందాపూర్, కొల్చారంరెండు, మూడు రోజుల్లో సరఫరా బియ్యం సరఫరాకు ఆర్డర్ కాపీ వచ్చింది. రెండు, మూడు రోజుల్లో రేషన్ దుకాణాలకు బియ్యం సరఫరా చేస్తాం. ఉగాది నుంచి సన్న బియ్యం ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. సన్నబియ్యం వచ్చాక దొడ్డు బియ్యం వృథా అవుతాయని గోదాముల్లో స్టాక్ ఉంచడం లేదు. దీంతో బియ్యం సరఫరా ఆలస్యమవుతోంది. – జగదీష్, జిల్లా సివిల్ సప్లై మేనేజర్మెదక్ కలెక్టరేట్: ప్రతీ నెల 1వ తేదీ నుంచి రేషన్ షాపుల్లో లబ్ధిదారులకు బియ్యం అందించాల్సి ఉంటుంది. అయితే 8 రోజులు గడుస్తున్నా ఇంకా పంపిణీ చేయడం లేదు. పేదలు రేషన్ దుకాణాల చుట్టూ తిరుగుతుండగా, డీలర్లు గోదాముల వద్ద పడిగాపులు గాస్తున్నారు. అయితే బియ్యం నిల్వలు లేకపోవడంతో అధికారులు గోదాములు తెరవడం లేదని సమాచారం. ప్రతి నెల 20వ తేదీ నుంచి 30 వరకు మండల స్టాక్ పాయింట్ల నుంచి రేషన్ దుకాణాలకు బియ్యం సరఫరా జరుగుతుంది. వచ్చిన బియ్యాన్ని డీలర్లు ప్రతి నెల 1 నుంచి 15వ తేదీ వరకు లబ్ధిదారులకు రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ చేస్తారు. కాని మూడు నెలలుగా బియ్యం సరఫరాల్లో తీవ్ర జాప్యం జరుగుతుంది. దీంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. జిల్లావ్యాప్తంగా 522 రేషన్ షాపులు జిల్లాలోని మెదక్, రామాయంపేట, పాపన్నపేట, చేగుంట, తూప్రాన్, నర్సాపూర్, పెద్దశంకరంపేటలో మండలస్థాయి స్టాక్ పాయింట్లు ఉన్నాయి. వీటి నుంచి జిల్లాలోని 21 మండలాల్లో గల రేషన్ దుకాణాలకు బియ్యం సరఫరా జరుగుతుంది. ప్రస్తుతం వీటిలో ఏ ఒక్కదానిలో బియ్యం నిల్వలు లేనట్లు సమాచారం. జిల్లాలో మొత్తం 522 రేషన్ దుకాణాలు ఉండగా, 2,13,777 కార్డులు (కొత్తవి కాకుండా), 6,85,178 మంది లబ్ధిదారులు ఉన్నారు. వీరికి ప్రతినెల 35 వేల క్వింటాళ్ల బియ్యం సరఫరా చేయాల్సి ఉంటుంది. పట్టణ దుకాణాలకు సరఫరా పట్టణ ప్రజలు ఆందోళనలకు దిగుతారనే ఉద్దేశంతో ఉన్న కొద్దిపాటి నిల్వలు పట్టణంలోని 120 దుకాణాలకు సరఫరా చేసినట్లు సమాచారం. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో రేషన్ దుకాణాలకు సరఫరా చేసేందుకు గోదాముల్లో బియ్యం నిల్వలు కరువయ్యాయి. ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వస్తే గాని గోదాములకు, అక్కడి నుంచి రేషన్ దుకాణాలకు బియ్యం సరఫరా జరుగుతుంది. అయితే ఇప్పటికే వారం గడిచిపోయింది. అసలు బియ్యం సరఫరా చేస్తారా? లేదా అని ఇప్పటికే గ్రామాల్లో ఆందోళన మొదలైంది.న్యూస్రీల్ -
మెరుగైన వైద్యం అందించండి
కలెక్టర్ రాహుల్రాజ్ కొల్చారం(నర్సాపూర్): నిరుపేదలకు మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్ రాహుల్రాజ్ అన్నారు. శనివారం మండలంలోని రంగంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోగులకు అందిస్తున్న వైద్య సదుపాయాలు, వివరాలపై ఆరా తీశారు. ఆస్పత్రి సిబ్బంది హాజరు గురించి అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్య కేంద్రం పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని సిబ్బందిని ఆదేశించారు. రోగులకు అవసరమైన రక్త నమూనా పరీక్షలు సకాలంలో నిర్వహించి అవసరమైన మందులు అందించాలన్నారు. యాంటీబయోటిక్ మందులు, పాము కాటుకు సంబంధించిన వ్యాక్సిన్ అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం ఉచితంగా అందిస్తున్న వైద్య సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఆస్పత్రి వైద్యాధికారి శివకుమార్, సిబ్బంది ఉన్నారు. -
సమాజ సేవకు సమయం కేటాయించండి
జహీరాబాద్ టౌన్: ఉన్నతస్థాయిలో ఉన్నా సొంత ఊరిని మర్చిపోకుండా కొంత సమయం సమాజ సేవకు కేటాయించాలని టీబేస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తులసీరామ్ రాథోడ్ అన్నారు. జహీరాబాద్ డివిజన్ పరిధిలోని మల్చల్మ, విట్టు నాయక్ తండాలకు చెందిన తుకారాం రాథోడ్, శంకర్ చవాన్లు ప్రభుత్వ ఉద్యోగం సంపాదించగా.. పట్టణంలోని బంజారా భవన్లో శనివారం వారిని సన్మానించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గిరిజన విద్యార్థులు కష్టపడి చదివి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడం అభినందనీయమని కొనియాడారు. కష్టపడి చదివించిన తల్లిదండ్రులను, సొంత ఊరిని మర్చిపోవద్దని సూచించారు. సమస్యల పరిష్కారానికి కృషి పటాన్చెరు: సమస్యల పరిష్కారానికి ఎప్పటికప్పుడు కృషి చేస్తున్నానని మెదక్ ఎంపీ రఘునందన్రావు అన్నారు. శనివారం అమీన్పూర్ పీపుల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎంపీని కలిసి అమీన్పూర్లో నెలకొన్న సమస్యలపై వినతిపత్రం అందజేశారు. పట్టణంలో అంతర్గత రోడ్లు, పారిశుద్ధ్య సమస్య తీవ్రంగా ఉందని వివరించారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ... అమీన్పూర్ పరిధిలోని సమస్యలపై తాను ఎప్పటికప్పుడు సమాచారం తీసుకుంటున్నట్లు తెలిపారు. రోడ్డు నిర్మాణం పూర్తి చేసేలా తగిన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఎంపీని కలిసిన వారిలో పీపుల్స్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు తిరుమలరెడ్డి, కొండ లక్ష్మణ్, మహేశ్వర్రెడ్డి, ఉదయ్కుమార్, వెంకట పుల్లారెడ్డి, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. -
ఇది పట్టభద్రుల విజయం
నర్సాపూర్: తన విజయం పట్టభద్రులకు అంకితమని ఎమ్మెల్సీ అంజిరెడ్డి అన్నారు. శనివారం మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మురళీయాదవ్ మున్సిపల్ మహిళా ఉద్యోగులకు చీరల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయగా ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. పట్టభద్రుల సమస్యలపై పోరాటం చేస్తానని చెప్పారు. చీరల పంపిణీ అభినందనీయమని కొనియాడారు. అనంతరం మురళీయాదవ్తో పాటు పలువురు నాయకులు ఎమ్మెల్సీ అంజిరెడ్డి, సంగారెడ్డి బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరిని సన్మానించారు. విద్యుత్ సమస్యలుతలెత్తకుండా చర్యలు అల్లాదుర్గం(మెదక్): వేసవిలో గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నట్లు విద్యుత్ చీఫ్ ఇంజినీర్ బాలస్వామి తెలిపారు. శనివారం మండలంలోని గడిపెద్దాపూర్ విద్యుత్ సబ్స్టేషన్లో 5 మెగావాట్ల ట్రాన్స్ఫార్మర్ను ప్రారంభించి మాట్లాడారు. రైతులకు, వినియోగదారులకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయడమే తమ లక్ష్యమని అన్నారు. కార్యక్రమంలో మెదక్ విద్యుత్ శాఖ ఎస్ఈ శంకర్, డీఈ చాంద్పాషా, ఏడీ మోహన్బాబు, పాపన్నపేట ఏడీ శ్రీనివాస్, రేగోడ్ ఏఈ యాసిన్అలీ, అల్లాదుర్గం ఇన్చార్జి ఏఈ నవాజ్ పాల్గొన్నారు. రూ. 35 లక్షలతో కొత్త విద్యుత్ లైన్ పాపన్నపేట(మెదక్): మండలంలోని విద్యుత్ సమస్యలు తీర్చేందుకు రూ. 35 లక్షలతో విద్యుత్ లైన్ వేస్తున్నట్లు చీఫ్ ఇంజినీర్ బాలస్వామి తెలిపారు. పొడ్చన్పల్లి ఫీడర్లో ఎలాంటి ఇబ్బందులు ఏర్పడినా ఉపకేంద్రంలో అంతరాయం ఏర్పడుతుందన్నారు. ఈ సమస్య తీర్చడానికి రూ. 35 లక్షలతో కౌడిపల్లి నుంచి 33 కేవీ లైన్ ఏర్పాటు చేస్తున్నట్లు చె ప్పారు. ఆదివారం పాపన్నపేట మండలంలో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని చెప్పారు. ఎమ్మెల్యేకు సన్మానం నర్సాపూర్: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎమ్మెల్యే సునీతారెడ్డిని మాజీ మంత్రి హరీశ్రావు సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. శనివారం నర్సాపూర్లో జరిగిన ఓ ప్రైవేట్ కార్యక్రమంలో వారిద్దరు పాల్గొన్నారు. కార్మికులకు ‘ఎంఆర్ఎఫ్’ షాక్సదాశివపేట రూరల్(సంగారెడ్డి): ‘2021 మార్చి 29న ఏడాది పాటు శిక్షణ కోసం మిమ్మల్ని తీసుకున్నాం. ఆ కాలంలో మీరు పని నేర్చుకోలేదు. పరిశ్రమలో నెలకొన్న ఆర్థిక మాద్యం నేపథ్యంలో మిమ్మల్ని తొలగిస్తున్నాం. దేశంలోని ఇతర ప్లాంట్లలో అవసరమున్న చోట పని చేయడానికి ఆసక్తి ఉంటే వారం రోజుల్లో అభిప్రాయం తెలపండి’ అని మండలంలోని అంకేనపల్లి శివారులో గల ఎంఆర్ఎఫ్ (ఏపీఎల్) ప్లాంట్లో పనిచేస్తున్న 350 మందికిపైగా కార్మికులకు యాజమాన్యం ఈనెల 7న నోటీసులు అందజేసింది. దీంతో వారి భవితవ్యంపై నీలినీడలు కమ్ముకున్నాయి. దిక్కుతోచని స్థితిలో కార్మికులు మనోవేదనకు గురవుతున్నారు. రిక్రూట్మెంట్ సమయంలో చేసుకున్న ఒప్పందం మేరకు పర్మనెంట్ చేయాలని కోరిన పాపానికి ఉద్యోగంలో నుంచి తీసేసి పరిశ్రమ యాజమాన్యం నియంతృత్వం ప్రదర్శిస్తుందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా కార్మికులు న్యాయ పోరాటానికి సిద్ధం అవుతున్నట్లు సమాచారం. -
‘కేజీబీవీ’లో జీసీడీఓ విచారణ
కంగ్టి(నారాయణఖేడ్): మండల కేంద్రంలోని కేజీబీవీలో బాలికలను చితకబాదినట్లు తల్లిదండ్రులు చేసిన ఆందోళనతో శనివారం గర్ల్స్ చైల్డ్ డెవలప్మెంట్ ఆధికారి సుప్రియ విచారణ చేపట్టారు. విద్యాలయంలో గణితం టీచర్ సురేఖ బాలికలను పనులు చేయాలని బెదిరిస్తూ చితకబాదుతుందని తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థిని తల్లిదండ్రులు శుక్రవారం ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. అయితే మరికొందరు విద్యార్థినులను సైతం చితకబాదినట్లు తెలిసింది. విషయం తెలుసుకున్న జీసీడీఓ ఎంఈఓ రహీమోద్దీన్తో కలిసి విద్యాలయాన్ని సందర్శించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులతో వేర్వేరుగా మాట్లాడారు. విచారణ నివేదికను డీఈఓతో పాటు కలెక్టర్కు అందజేయనున్నట్లు తెలిపారు. కో ఆర్డినేటర్ మాధవి, ఎస్ఓ విజయలక్ష్మి పాల్గొన్నారు. -
మహిళ లేనిదే సమాజం లేదు
మెదక్జోన్: మహిళ లేనిదే సమాజం లేదని, ప్రస్తు త పోటీ ప్రపంచలో వంటింటి నుంచి అంతరిక్షం వరకు అన్ని రంగాల్లో ముందుకెళ్తున్నారని జిల్లా జడ్జి లక్ష్మీశారద అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం మెదక్లో కలం స్నేహం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘అతివ’ పాటల సీడీని ఆవిష్కరించి మాట్లాడారు. మహిళలు చదువులో రాణిస్తూ ఆర్థికంగా ఎదగాలని, అప్పడే మహిళా సాధికారత సాధ్య మవుతుందన్నారు. ప్రభుత్వం అన్ని పథకాలలో మహిళలకు సముచిత స్థానం ఇచ్చి గౌరవిస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో కలం స్నేహం వ్యవస్థాపకుడు, సినీ సంగీత దర్శకులు శ్రీమాన్ గోపాల్ ఆచార్య, జాతీయ ప్రధాన కార్యదర్శి గీతాశ్రీ స్వర్గం,కన్వీనర్ రాధిక, సంయుక్త కార్యదర్శి సరళ, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అన్నిరంగాల్లో రాణించాలి మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి లక్ష్మీశారద అన్నారు. మహి ళా దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం జిల్లా కేంద్రంలోని ఫుట్బాల్ అకాడమీ ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ స్టేడియంలో జాతీయస్థాయిలో రాణించిన క్రీడాకారులకు స్పోర్ట్స్ కిట్లను పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఈ క్రీడాకారులను స్ఫూర్తిగా తీసుకొని వచ్చేసారి మరింతమంది జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని సూచించారు. అంతకుముందు క్రీడాకారులతో కలిసి సరదాగా ఫుట్బాల్ ఆడారు. కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ కార్యదర్శి నాగరాజు జిల్లా యువజన, క్రీడలశాఖ అధికారి దామోదర్రెడ్డి, సీ్త్ర శిశు సంక్షేమశాఖ అధికారిణి సంతోష తదితరులు పాల్గొన్నారు.జిల్లా ప్రధాన న్యాయమూర్తి లక్ష్మీశారద -
1,500 కేసులు పరిష్కారం
షెడ్డులోని కుండలపై వివిధ రకాల పక్షులుఅతడికి పక్షులంటే ప్రాణం.. ఇష్టంతో రూ. వేలు ఖర్చు చేసి పక్షులను కొనుగోలు చేసి ప్రాణంగా పెంచుతున్నాడు. వృత్తివ్యవసాయం, ఉద్యోగం లైన్మెన్.. అయినా ఉదయం, సాయంత్రం పక్షులతోనే గడుపుతాడు. వాటి దాణా కోసం ప్రతి నెలా వేలు ఖర్చు చేస్తూ పక్షి ప్రేమికుడిగా మారాడు కౌడిపల్లి మండలం కంచన్పల్లి గ్రామానికి చెందిన మల్లాగౌడ్.– బొడ్డు పెంటయ్య, కౌడిపల్లి(నర్సాపూర్)మెదక్జోన్/నర్సాపూర్: జాతీయ లోక్ అదాలత్లో భాగంగా శనివారం జిల్లా కోర్టులో పలువురు కక్షిదారులు రాజీ అయ్యారు. జిల్లావ్యాప్తంగా పలుకోర్టుల్లో 1,500 కేసులు పరిష్కారం అయ్యాయి. అలాగే పలురకాల కేసులకు సంబంధించి బాధితులకు చెల్లించాల్సిన బీమా కంపెనీలతో పాటు ఇతర జరిమానాలు రూ. 46.32 లక్షలను కోర్టులో చెల్లించారు. ఈసందర్భంగా జిల్లా జడ్జి లక్ష్మీశారద మాట్లాడుతూ.. ఇరువురి మధ్య మనస్పర్ధలు వస్తే కూర్చొని పరిష్కరించుకోవటం మంచిదన్నారు. కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి జితేందర్ తదితరులు పాల్గొన్నారు. అలాగే నర్సాపూర్ కోర్టులో నిర్వహించిన కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి రుబీనా ఫాతిమా పాల్గొని మాట్లాడారు. కక్షిదారులు రాజీ పడడమే రాజమార్గమని అన్నారు. లోక్అదాలత్లో 137 కేసులు పరిష్కరించినట్లు తెలిపారు.8లో -
మహిళా సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం
మెదక్జోన్: మహిళలు అన్నిరంగాల్లో రాణిస్తున్నప్పటికీ మెదక్లో మాత్రం వెనుకబడి ఉన్నారని రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు అంజలి అన్నారు. శుక్రవారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికులు, స్టాఫ్నర్స్లను ఘనంగా సన్మానించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహిళా సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని సోషల్ సర్వీస్ చేయడంలోనూ ముందున్నారని తెలిపారు. త్వరలోనే జిల్లాలో మహిళా కాంగ్రెస్ కమిటీలు వేస్తామని చెప్పారు. కార్యక్రమంలో మహిళా నేతలు భవాని, అరుణ, బట్టి సులోచన, గోదల జ్యోతి, హరిత, స్వరూప తదితరులు పాల్గొన్నారు. -
విద్యుత్ అంతరాయం లేకుండా చర్యలు
హవేళిఘణాపూర్(మెదక్): వేసవిలో విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా ముందస్తుగా చర్యలు తీసుకుంటున్నామని విద్యుత్శాఖ చీఫ్ ఇంజినీర్ బాలస్వామి తెలిపారు. సమ్మర్ యాక్షన్ ప్లాన్లో భాగంగా శుక్రవారం మండల పరిధిలోని కూచన్పల్లి సబ్స్టేషన్లో 5 ఎంవీఏ ట్రాన్స్ఫార్మర్, నాగాపూర్ సబ్స్టేషన్ సుల్తాన్పూర్ ఫీడర్కు సంబంధించి 11 కేవీ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను ఆయన ప్రారంభించారు. వేసవిలో విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా ముందస్తు ప్రణాళికలో భాగంగా నూతన ట్రాన్స్ఫార్మర్లు బిగించినట్లు తెలిపారు. కార్యక్రమంలో విద్యుత్శాఖ ఎస్ఈ శంకర్, డీఈ చాంద్పాషా, ఏడీఈ మోహన్బాబు, ఏఈ వినోద్కుమార్ పాల్గొన్నారు. -
మహిళలకు ప్రత్యేక చట్టాలు
సంగారెడ్డి టౌన్ : సమాజంలో మహిళల పాత్ర గొప్పదని జిల్లా ప్రధాన న్యాయమూర్తి భవానీ చంద్ర పేర్కొన్నారు. శనివారం మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లా మహిళలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు నేడు అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా రాణిస్తున్నారన్నారు. సమాజంలో లైంగిక దాడులు, హత్యాచారాలు, లైంగిక దోపిడీ, వరకట్నం వంటి సమస్యలు వెంటాడుతుంటాయని, వీటిని పరిష్కరించేందుకు మహిళల రక్షణకు ప్రత్యేక చట్టాలు ఉన్నాయన్నారు. బాల్య వివాహల నిర్మూలపై అవగాహన కల్పిస్తున్నాం. మహిళలకు ఎటువంటి న్యాయం కావాలన్నా కోర్టులో ఉచితంగా న్యాయం పొందవచ్చన్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి భవానీ చంద్ర -
చిన్న వయసులో.. ‘నిర్మల’మైన మనసు
● కష్టాలు ఓరుస్తూ.. కుటుంబ భారం మోస్తూ ● కూరగాయలు అమ్ముతున్న విద్యార్థిని నారాయణఖేడ్: ఆ కుటుంబానికి కష్టాలు చుట్టముట్టాయి.. రెక్కాడితే కాని డొక్కాడని బతుకులు.. ఇంటినిండా ఆడపిల్లలు.. పెద్దల నుంచి వచ్చిన అర ఎకరం పొలం.. తండాలో చిన్నపాటి ఇల్లు.. ఆ దంపతులు పడరాన్ని పాట్లు పడుతూ కుటుంబాన్ని నెట్టుకొస్తూ పిల్లలను పెంచి పెద్ద చేశారు. ముగ్గురు ఆడపిల్లలను పెళ్లిళ్లు చేసి పంపేసరికి రూ.12 లక్షల అప్పు. ఆ కుటుంబం మరింత కష్టాల్లోకి నెట్టి వేయబడింది. ఈ కష్టాలను చూసిన నాలుగో కూతురు ఓ రాణి రుద్రమలా ధైర్యాన్నిస్తూ తల్ల్లిదండ్రుల వెన్ను తట్టింది.. నారాయణఖేడ్ మండలం చందర్నాయక్ తండాకు చెందిన చందర్, చాందీబాయికి ఆరుగురు సంతానంలో ఐదుగురు కూతుళ్లే. లత, బూలి, బుజ్జి, నిర్మల, వైశాలి తర్వాత పవన్ పుట్టాడు. లత, బూలి, బుజ్జిబాయిల వివాహమైంది. రూ.12 లక్షల వరకు అప్పులు అయ్యాయి. అర ఎకరం పొలంలో కూరగాయలు పండిస్తూ ఖేడ్ పట్టణంలో విక్రయిస్తున్నారు. నాలుగో కూతురు నిర్మల సిద్దిపేటలో హాస్టల్లో ఉంటూ 10వ తరగతిలో 9.8 జీపీఓ ఉత్తీర్ణత సాధించింది. ట్రిపుల్ ఐటీలో సీటు వచ్చినా తండ్రి అనారోగ్యానికి గురవ్వడం కుటుంబ భారం వల్ల వెళ్లలేదు. ఖేడ్ ప్రభుత్వ కళాశాలలో ఇంటర్లో అడ్మిషన్ అయ్యింది. డాక్టర్ కావాలన్న లక్ష్యంతో ఓ కానిస్టేబుల్ కొనిచ్చిన నీట్ ప్రిపరేషన్కు సంబంధించిన పుస్తకాలను పఠనం చేస్తుంది. తమ అర ఎకరం పొలంలో నిత్యం పండిన కూరగాయలను విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నారు. తెల్లవారు 3 గంటలకు వచ్చిన నిర్మల బీట్లో కూరగాయలు కొని దుకాణంలో సర్ది 8 గంటల వరకు వ్యాపారం.. అనంతరం తండాకు వెళ్లి 9 గంటలకు కళాశాలకు వెళ్తుంది. ఇలా కష్టపడుతున్న నిర్మల ఆ కుటుంబానికి ధైర్యం ఇస్తూ తన లక్ష్యం డాక్టర్ కావాలని.. మరో సోదరి, సోదరుణ్ణి జీవితంలో వారి కాళ్లపై వారు నిలబడేలా చేయాలని చెబుతుంది. చదువులో నిర్మల మంచి ప్రతిభ కనబరుస్తుందని ఉపాధ్యాయులూ చెబుతున్నారు. -
పేదల పాలిట పెళ్లి పెద్ద
నర్సాపూర్: పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు తన వంతుగా సహాయం చేస్తూ వారి కుటుంబాలకు అండగా నిలుస్తున్నారు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రఘువీరారెడ్డి. తన మిత్రుడు హకీం ఇచ్చిన సూచన మేరకు నియోజకవర్గంలో జరిగే ఆడపిల్లల పెళ్లిళ్లకు పుస్తె మెట్టెలు అందజేయాలని నిర్ణయించారు. సుమారు 12 ఏళ్ల క్రితం అమలులో పెట్టారు. అయితే వాటిని అందజేసే సమయంలో ప్రచారం కోసం ఆరాటపడటం లేదు. ఇప్పటివరకు సుమారు 2,500 మంది ఆడపిల్లలకు రఘువీరారెడ్డి పుస్తె మెట్టెలు అందజేశారు. శక్తి ఉన్నంత వరకు పేద కుటుంబాలకు అండగా నిలుస్తానని అన్నారు. గతంలో ఒక ఆడ కూతురుకు పుస్తె మెట్టెలు ఇవ్వడానికి రూ. 8 వేల వరకు ఖర్చు కాగా, ప్రస్తుతం రూ. పది వేలు అవుతున్నాయని చెప్పారు. కులమతాలకు అతీతంగా పేద వారికి సహాయం చేయడమే తన లక్ష్యమని రఘువీరారెడ్డి పేర్కొన్నారు. -
ముళ్లబాట దాటి.. పూలదారి చేరి
మెదక్జోన్: సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండలం బీబీపేటకు చెందిన నారాయణ మెదక్లో హెడ్కానిస్టేబుల్గా విధులు నిర్వర్తిస్తూ కుటుంబంతో పట్టణంలో స్థిరపడ్డారు. అంతాబాగానే ఉంది అని అను కుంటున్న సమయంలో అనూహ్య సంఘటనతో జీవితం తలకిందులైంది. 1998లో జరిగిన రోడ్డు ప్రమాదంలో నారాయణ మృత్యువాతపడ్డారు. అప్పటికీ ఆయనకు ముగ్గురు కూతుర్లు ఉన్నారు. అందులో పెద్దకూతురు గంగామణి 8వ తరగతి చదువుతుంది. ఆమె తల్లి మల్లమ్మకు అధికారులు స్వీపర్ ఉద్యోగం ఇచ్చారు. నిరక్షరాస్యురాలైన మల్ల మ్మ తన పెద్దకూతురు గంగామణికి పదో తరగతి పూర్తి కాగానే పెళ్లి చేసింది. ఇద్దరు పిల్లలు పుట్టిన అనంతరం వివిధ కారణాలతో దంపతులు విడిపోయారు. దీంతో ఇద్దరు పిల్లలతోపాటు చెల్లెళ్ల భారం ఆమైపె పడింది. చిన్నప్పటినుంచి పోలీస్ కావాలనే కోరిక బలపడింది. ఈక్రమంలో 2007లో హోంగార్డుగా హైదరాబాద్లో ఉద్యోగం సంపాదించింది. తన చెల్లెళ్లు, పిల్లలను మెదక్లో తల్లి వద్ద ఉంచి హోంగార్డుగా విధులు నిర్వర్తిస్తూనే డిస్టెన్స్లో ఇంటర్ పూర్తి చేసింది. 2013లో రెండో ప్రయత్నంలో కానిస్టేబుల్గా ఎంపికై ంది. తన ఇద్దరు చెల్లెళ్లను బీటెక్ చదివించింది. వారు 2019లో వారిద్దరూ పంచాయతీ కార్యదర్శులుగా ఎంపికయ్యారు. అలాగే ఆమె ఇద్దరు పిల్లలను ప్రయోజకులుగా తీర్చిదిద్దింది. కుమారుడు నవీన్చంద్ర ఎస్సైగా, కూతురు శ్రీజ 2023లో కానిస్టేబుల్గా ఉద్యోగాలు సాధించారు. ప్రస్తుతం కొడుకు కామారెడ్డి జిల్లా కేంద్రంలో ప్రొహిబిషనరీ ఎస్సైగా, కూతురు మెదక్ రూరల్ పోలీస్స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రస్తుతం గంగామణి చేగుంట పోలీస్స్టేషన్లో పనిచేస్తున్నారు. పురుషుల కన్నా తక్కువ అనే భావన మహిళల్లో ఉండొద్దని.. ఆత్మస్థైర్యంతో ముందుకు వెళితే అనుకున్న లక్ష్యం సాధించటం కష్టమేమి కాదని గంగామణి అభిప్రాయపడ్డారు.చిన్నతనంలో తండ్రి మరణం, ఇద్దరు పిల్లలు పుట్టిన అనంతరం భర్త దూరం.. ఇద్దరు చెల్లెళ్లు.. వృద్ధురాలైన తల్లి.. ఒకానొక దశలో ఆమె కుంగుబాటుకు గురైంది. ఆ ముళ్లబాటనే తొక్కుకుంటూ మణిగా మెరిసింది. ఆమె కాంతులీనుతూ కుటుంబసభ్యులకు పూలబాటను పరిచింది. నారీలోకానికి స్ఫూర్తిమంత్రం వినిపించింది. మహిళా దినోత్సవం సందర్భంగా ‘గంగామణి’ విజయగాథపై ప్రత్యేక కథనం.. -
ఆకాశవాణి.. మహిళా కేంద్రం
డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ(డీడీఎస్) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సంఘం రేడియో స్టేషన్లో కార్యక్రమాలన్నింటినీ మహిళలే నిర్వహిస్తున్నారు. అల్గోల్ నర్సమ్మ, జనరల్ నర్సమ్మ ప్రతి నిత్యం కార్యక్రమాలను రూపొందించుకొని ప్రసారంచేస్తున్నారు. జహీరాబాద్: గ్రామాలకు వెళ్లి సమాచారం సేకరణ ఝరాసంగం మండలంలోని మాచ్నూర్ గ్రామంలో 1998 సంవత్సరంలో సంఘం రేడియో స్టేషన్ను ఏర్పాటు చేశారు. ఈ స్టేషన్ నుంచి సుమారు 20 కిలోమీటర్ల మేర ప్రసారాలు అందుతున్నాయి. 90.4 ఫ్రీక్వెన్సీలో రాత్రి 7 నుంచి 9 గంటల వరకు కార్యక్రమాలను అందిస్తున్నారు. మండలంలోని అల్గోల్ గ్రామానికి చెందిన అల్గోల్ నర్సమ్మ, పస్తాపూర్ గ్రామానికి చెందిన జనరల్ నర్సమ్మ 1999 నుంచి రేడియో స్టేషన్ నిర్వహిస్తున్నారు. గ్రామాలకు వెళ్లి ప్రసారాలకు కావాల్సిన సమాచారాన్ని ఆడియో రికార్డింగ్ చేసుకుంటారు. డీడీఎస్కు సంబంధించి పలు కార్యక్రమాలను చూస్తున్న ఏడుగురు మహిళలు రేడియో ప్రసారాలకు సంబంధించిన కార్యక్రమాలను గ్రామాలకు వెళ్లినప్పుడు ఆడియో రికార్డింగ్ చేసుకొని స్టేషన్ నిర్వాహకులకు అందిస్తున్నారు. వాటిని ఎడిట్ చేసుకొని ప్రసారం చేస్తారు. ముఖ్యమైన ప్రసారాలు మన ఊరి పంటలు, ఆరోగ్యం, సంఘాలు, చావిడికట్ట, భాష, మన రుచులు, పండుగలు, పాటలు, పర్యావరణం, బాలానందం, యారండ్ల ముచ్చట్లు తదితర కార్యక్రమాలను రూపొందించి ప్రసారం చేస్తున్నారు. భాషకు సంబంధించి తెలుగు, ఉర్దూ, హిందీ, కన్నడ భాషల్లో పెద్ద మనుషులతో వినిపిస్తారు. పొలంలో పనిచేసే సమయంలో, పెళ్లి సందర్భంలో, పుట్టినరోజు వేడుకలు, యువతులు పుష్పవతి అయిన సమయంలో పాడే పాటలను పరిచయం చేస్తారు. చిన్న పిల్లలకు సంబంధించి బాలానందం కార్యక్రమం నిర్వహించి పాటలు, కథలు వినిపిస్తారు. సీజన్ వ్యాధులు, చిన్న పిల్లల సంరక్షణ తదితర అంశాలపై ముచ్చటిస్తారు. వ్యవసాయ విషయానికి వస్తే పంట వేసే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రతలు, ఏయే పంటలు వేయాలి, ఎరువులు, పశువుల పెంపకం, కోళ్ల పెంపకం గురించి సూచనలు చేస్తారు.వారే మిక్సింగ్, కంపోజింగ్.. అల్గోల్ నర్సమ్మ, జనరల్ నర్సమ్మ రేడియో స్టేషన్లో మిక్సింగ్, కంపోజింగ్, ట్రాన్స్మిషన్ నిర్వహణ, రికార్డు చేసిన కార్యక్రమాల ఎడిటింగ్ పనులను చూస్తారు. ప్రతీ నిత్యం కార్యక్రమాలను రూపొందించుకొని ప్రసారం చేసేంత వరకు వారే చూసుకుంటారు. ఇద్దరూ డీడీఎస్ డైరెక్టర్ దివంగత పీవీ సతీష్ వద్ద శిక్షణ పొందారు. అప్పటి నుంచి వారు ఈ కమ్యూనిటీ రేడియో స్టేషన్ను నిర్వహిస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు. మహిళల సంఘం రేడియో స్టేషన్ ప్రతీ నిత్యం రెండు గంటలపాటుకార్యక్రమాలు స్థానిక అంశాలే ప్రసారం -
మాదిగలకు రెండు మంత్రి పదవులివ్వాలి
మెదక్ మున్సిపాలిటీ: ఎస్సీ వర్గీకరణను మూడు గ్రూపులుగా కాకుండా ఏబీసీడీగా వర్గీకరించాలని, అలాగే మంత్రివర్గంలో మాదిగలకు రెండు పదవులు ఇవ్వాలని ఎమ్మార్పీఎస్ నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం జిల్లా కేంద్రం రాందాస్ చౌరస్తాలో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో మాదిగల డప్పుల ప్రదర్శన నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం చేసిన వర్గీకరణలో లోపాలు ఉన్నాయని వాటిని పునః సమీక్షించి శాసీ్త్రయంగా రిజర్వేషన్లు మాదిగ ఉపకులాలకు పంచాలని డిమాండ్ చేశారు. కార్యక్రమలో ఎమ్మార్పీఎస్ నాయకులు పాల్గొన్నారు. -
విధిగా ఇళ్లు నిర్మించుకోవాలి
రాయికోడ్(అందోల్): ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన ప్రతీ లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణం ప్రారంభించి ప్రభుత్వం అందించే సహకారాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ నాగారం గొల్ల అంజయ్య లబ్ధిదారులను కోరారు. మండలంలోని నాగ్వార్ గ్రామంలో మండల ప్రత్యేకాధికారి జగదీశ్తో కలసి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి హామీని మంత్రి దామోదర రాజనర్సింహ ఆధ్వర్యంలో త్వరిత గతిన పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం ఒక్కో లబ్ధిదారుకు రూ.5 లక్షల బిల్లులను అందించి పేద కుటుంబాల సొంతింటి కల నెరవేర్చేందుకు కృషి చేస్తోందన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో ఎంఎం షరీఫ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నర్సింలు, వివిధ శాఖల సిబ్బంది నాయకులు పాల్గొన్నారు.జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ నాగారం అంజయ్య -
మెరుగైన ఫలితాలు సాధించాలి
కలెక్టర్ రాహుల్రాజ్ మెదక్ కలెక్టరేట్: పదో తరగతి పరీక్షలు జీవితానికి టర్నింగ్ పాయింట్ అని.. విద్యార్థులు పట్టుదలతో చదివి మెరుగైన ఫలితాలు సాధించాలని కలెక్టర్ రాహుల్రాజ్ సూచించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని తెలంగాణ బాలికల గురుకుల కళాశాలను సందర్శించారు. అనంతరం కళాశాలలో మెనూ అమలు తీరును పరిశీలించి అభినందించారు. ఈసందర్భంగా బాలికలతో కలిసి భోజనం చేసి ప్రతి రోజు మెనూ ప్రకారం భోజనం పెడుతున్నారా..? అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ లక్ష్యసాధన కోసం శ్రమించాలని, భయం వీడి పట్టుదలతో చదవాలని పేర్కొన్నారు. అనంతరం మే 4న జరగనున్న నీట్ పరీక్ష కోసం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాలను సందర్శించారు. ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో 3 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. 1,000 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కానున్నట్లు తెలిపారు. అనంతరం కలెక్టరేట్లో జిల్లా వ్యవసాయ అధికారి వినయ్, వ్యవసాయ శాస్త్రవేత్తలతో సాగునీటి వినియోగంపై సమీక్షించారు. -
మహిళా ఉద్యోగులకు సన్మానం
మెదక్ కలెక్టరేట్: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం జెడ్పీ కార్యాలయంలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులను ఘనంగా సత్కరించారు. ఈసందర్భంగా జెడ్పీ సీఈఓ ఎల్లయ్య మాట్లాడుతూ.. సా మాజిక, ఆర్థిక, సాంస్కృతిక రంగాలతో సహా వివిధ రంగాల్లో మహిళామణులు సాధించిన విజయాలను గుర్తించి గౌరవించాలన్నారు. వారిని స్ఫూర్తిగా తీసుకొని మరింత మంది ముందడుగు వేసేలా ప్రోత్సహించేందుకు ఏటా అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ కార్యాలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అంగన్వాడీ సెంటర్ల తనిఖీ హవేళిఘణాపూర్(మెదక్): మండల పరిధిలోని పాతూర్, పాతూర్ తండా అంగన్వాడీ కేంద్రాలను డీడబ్ల్యూఓ హైమావతి శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థుల కోసం నూతనంగా నిర్మించిన మరుగుదొడ్లను పరిశీలించారు. అనంతరం వారికి పెడుతున్న భోజనం గురించి ఆరా తీశారు. ఆమె వెంట సీడీపీఓ వెంకటరమణమ్మ, అంగన్వాడీ టీచర్లు ఉన్నారు. 11న జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శన మెదక్ కలెక్టరేట్: ఈనెల 11న మెదక్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నట్లు డీఈఓ రాధాకిషన్, జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లా యువజన క్రీడలశాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న యువ ఉత్సవ్ కార్యక్రమంలో భాగంగా పాఠశాల స్థాయి విద్యార్థులకు జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో వ్యక్తిగత, గ్రూప్ విభాగాల్లో విద్యార్థులు వారి ఎగ్జిబిట్స్ను ప్రదర్శించవచ్చని చెప్పారు. ‘ఎల్ఆర్ఎస్’ రాయితీని వినియోగించుకోండి చేగుంట(తూప్రాన్): ఎల్ఆర్ఎస్ రాయితీని వినియోగించుకోవాలని జిల్లా పంచాయతీ అధికారి యాదగిరి అన్నారు. శుక్రవారం చేగుంట గ్రామ పంచాయతీని సందర్శించిన డీపీఓ ఎల్ఆర్ఎస్ రాయితీకి సంబంధించిన ఫ్లెక్సీని ఆవిష్కరించి మాట్లాడారు. ఎల్ఆర్ఎస్కు దరఖాస్తు చేసుకున్న ప్లాట్ల యజమానులకు మార్కెట్ రేటును అనుసరించి 25 శాతం రాయతీ కల్పించినట్లు తెలిపారు. అనంతరం ఎంపీడీఓ కార్యాలయం సందర్శించి డీపీఓ ప్రజాపాలన దరఖాస్తులకు సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు. చేగుంటతో పాటు అనంతసాగర్ గ్రామాల్లో పారిశుద్య పనులు, డంప్యార్డులను పరిశీలించి, ఇంటిపన్నులు, మంచినీటి సరఫరా గురించి సిబ్బందికిసూచనలు చేశారు. నేడు జాతీయ లోక్ అదాలత్: ఎస్పీ మెదక్ మున్సిపాలిటీ: నేడు జిల్లా కోర్టు ప్రాంగణంలో జరిగే జాతీయ లోక్ అదాలత్ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ ఉదయ్కుమార్రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కక్షిదారులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని, తమ కేసులను రాజీ చేసుకోవచ్చని తెలిపారు. తమ ఆధార్ కార్డు తీసుకుని, సంబంధిత కోర్ట్ లేదా నిర్ణీత ప్రదేశంలో హాజరు కావాలన్నారు. కోర్టులో హాజరైన వెంటనే రాజీ ప్రక్రియను పూర్తి చేసి కేసును పూర్తిగా ముగించుకునే అవకాశం ఉంటుందన్నారు. లోక్ అదాలత్తో కేసుల తక్షణ పరిష్కారం సంవత్సరాల తరబడి సాగే న్యాయపరమైన చికాకుల నుంచి విముక్తి లభిస్తుందని తెలిపారు. కేసులలో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని శాంతి, న్యాయం పొందాలని సూచించారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
మెదక్ మున్సిపాలిటీ: ఎదురెదురుగా రెండు బైక్లు ఢీకొన్న ఘటనలో యువకుడు మృతి చెందిన సంఘటన మెదక్ పట్టణంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద శుక్రవారం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. పట్టణంలోని పిట్లంబేస్కు చెందిన కిరణ్ (25) బైక్పై వెళ్తుండగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద ఎదురుగా వచ్చిన మరో బైక్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కిరణ్ తలకు తీవ్ర గాయమైంది. వెంటనే స్థానికులు అతడిని మెదక్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యుల సూచన మేరకు హైదరాబాద్కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్లు కుటుంబీకులు తెలిపారు. బాధిత కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తామని సీఐ నాగరాజు తెలిపారు. -
విద్యార్థులు ఇష్టంతో చదవాలి
కౌడిపల్లి(నర్సాపూర్): చదువుతోనే అభివృద్ధి సాధ్యమని, విద్యార్థులు సమయాన్ని వృథా చేయకుండా ఇష్టంతో చదవాలని అదనపు కలెక్టర్ నగేష్ తెలిపారు. గురువారం మండలంలోని తునికి ఎంజేపీ బీసీ గురుకుల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా కిచెన్, స్టోర్రూం, నిత్యావసర సరుకులు, విద్యార్థులకు పె ట్టిన భోజనం పరిశీలించారు. రికార్డులను తనిఖీ చేసి మాట్లాడారు. చదువుతోనే సమాజంలో మంచి గుర్తింపు, గౌరవం లభిస్తుందన్నారు. విద్యార్థుల అభివృద్ధికి ప్రభుత్వం ఎంతో ఖర్చు చేస్తుందని వివరించారు. పదో తరగతి విద్యార్థులు వార్షిక పరీక్షలకు భయపడవద్దని, శ్రద్ధగా చదవితే వందశాతం ఫలితాలు వస్తాయన్నారు. ఉపాధ్యాయులు ఎప్పటికప్పడు గమనించి సమస్యలు లేకుండా చూడాలని ఆదేశించారు. కార్యక్రమంలో డీఎల్పీఓ సాయిబాబా, ప్రిన్సిపాల్ హరిబాబు, ఏటీపీ సుష్మ, జయరాజ్, డిప్యూటీ వార్డెన్ లక్ష్మణ్, సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.అదనపు కలెక్టర్ నగేష్ -
అందుబాటులోని ఉండని వైద్యులు
● అత్యవసర పరిస్థితుల్లోహైదరాబాద్కు రెఫర్ ● నానా అవస్థలు పడుతున్న రోగులు ● పట్టించుకోని అధికారులుమెదక్జోన్: పేద, మధ్య తరగతి ప్రజలకు జబ్బు చేస్తే మొదటగా ప్రభుత్వ ధర్మాస్పత్రి వైపే చూ స్తారు. ఇక్కడ ఉచితంగా వైద్యం, మందులు, పెద్ద డాక్టర్లు ఉంటారనే నమ్మకంతో వస్తుంటారు. కానీ ఆస్పత్రిలో వైద్యులు అందుబాటులో లేకపోవడం పేదలకు శాపంగా మారుతోంది. జిల్లాకు మెడికల్ కళాశాల మంజూరు కావటంతో స్పెషలిస్టులతో పాటు వైద్య సిబ్బంది సంఖ్య గణనీయంగా పెరిగింది. జిల్లా కేంద్ర ఆస్పత్రిలో ప్రస్తుతం సుమారు 35 నుంచి 40 మంది వైద్యులు ఉన్నారు. వీరంతా ఉదయం 11 గంటల వరకు ఆస్పత్రికి రావడం లేదు. మధ్యాహ్నం పన్నెండు గంటలు అయిందంటే ఉండడం లేదని పలువురు రోగులు చెబుతున్నారు. అర్థరాత్రి రోడ్డు ప్రమాదాలు జరిగి గాయపడినా.. అత్యవసర వైద్యంతో ఆస్పత్రికి వచ్చినా.. హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి రెఫర్ చేస్తూ చేతులు దులుపుకుంటున్నారు. ఇంత పెద్దసంఖ్యలో ఉన్న వైద్యులు నిత్యం హైదరాబాద్ నుంచి రోజూ విధులకు హాజరవుతున్నారు. స్థానికంగా ఎవరూ ఉండటం లేదు. ఫలితంగా రోగులకు సరైన వైద్యం అందడం లేదు. వైద్య పరీక్షలకు బయటకే.. జిల్లా కేంద్ర ఆస్పత్రిలో కనీసం సిటీ స్కాన్ అందుబాటులో లేదు. ఎంఆర్ఐ, గుండెకు సంబంధించిన పరీక్షలు కావాలన్నా సిబ్బంది బయటకు పంపిస్తున్నారు. ఎక్స్రే తీస్తే ఫిలిం ఉండడం లేదు. అంతేకాకుండా 24 గంటల పాటు అందుబాటులో ఉండాల్సిన జనరల్ ఫిజిషియన్, జనరల్ సర్జన్లు సరిగా విధులు నిర్వర్తించడం లేదు. కొంతకాలంగా ఆస్పత్రి సూపరింటెండెంట్ లేకపోవటం.. ఇన్చార్జిగా కొనసాగుతున్న అధికారి చూసీచూడనట్లు వ్యవహరిస్తుండడంతో వైద్యులు, సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఈ విష యాన్ని పలుమార్లు పాలకుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకున్న నాథుడే కరువయ్యారని జిల్లా ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
వేసవిలో నిరంతర విద్యుత్ సేవలు
కలెక్టర్ రాహుల్రాజ్పాపన్నపేట(మెదక్): వేసవిలో నిరంతర విద్యుత్ సేవలు అందించడానికి అధికారులు సిద్ధంగా ఉండాలని కలెక్టర్ రాహుల్రాజ్ అన్నారు. గురువారం ఎస్ఈ శంకర్తో కలసి మిన్పూర్ 220/132 కేవీ సబ్స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా మొదట కుర్తివాడ గ్రామానికి వెళ్లారు. అక్కడ విద్యుత్ సరఫరా అవుతున్న తీరును రైతుల ద్వారా అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో రానున్న వేసవిలో డిమాండ్కు అనుగుణంగా విద్యుత్ సరఫరా చేయాలని సిబ్బందికి సూచించారు. విద్యుత్ ఉత్పత్తి చేయడంతో పాటు, సరఫరా చేయడంలో విద్యుత్ సంస్థలు ఎంతో ప్రగతిని సాధించాయని కొనియాడారు. మిన్పూర్ సబ్స్టేషన్ ద్వారా జిల్లాలో పద్దెనిమిది సబ్స్టేషన్లకు నిరంతర విద్యుత్ సరఫరా జరుగుతుందన్నారు. జిల్లాలో ఎలాంటి ఓవర్ లోడ్ లేకుండా నాణ్యమైన విద్యుత్ను సరఫరా చేయడానికి చర్యలు చేపట్టాలన్నారు. అనంతరం విద్యుత్ బ్రేకర్లు, రికార్డులు, విద్యుత్ యూనిట్ల వాడకాన్ని పరిశీలించారు. జిల్లాలో ఎక్కడ విద్యుత్ అంతరాయం ఏర్పడినా టోల్ప్రీ నంబర్ 1912కు ఫోన్ చేయాలని వినియోగదారులకు సూచించారు. ఆయన వెంట డీఈ భాషా, ఏఈ శ్రీనివాస్, ఇతర అధికారులు ఉన్నారు. తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు మెదక్జోన్/మెదక్ కలెక్టరేట్: వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ రాహుల్రాజ్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో సమ్మర్ యాక్షన్ ప్లాన్పై వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల వారీగా వివిధ శాఖల అధికారులు సమన్వయంతో తాగునీటిపై యాక్షన్ ప్లాన్ తయారు చేసి నీటి ఎద్దడి రాకుండా చర్యలు చేపట్టాలన్నారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు చేపట్టాలన్నారు. ధాన్యం కొనుగోళ్లపై ముందస్తుగా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలన్నారు. ఎండల తీవ్రత అధికంగా ఉందని, ఉపాధి కూలీలకు తాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలన్నారు. అనంతరం అనంతరం పీఎం విశ్వకర్మ పథకంపై అధికారులు, అమలు కమిటీ సభ్యులతో సమీక్ష నిర్వహించారు. టైలరింగ్, బార్బర్, భవన నిర్మాణ తదితర కులవృత్తుల లబ్ధిదారులకు లబ్ధి చేకూరే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. -
చిరుత.. భయం భయం
రైతులు జాగ్రత్తగా ఉండాలి చిరుత దాడుల నేపథ్యంలో రైతులు జాగ్రత్తగా ఉండాలి. తమ పశువులను సాధ్యమైనంత వరకు అటవీ ప్రాంతానికి దగ్గరగా ఉండే వ్యవసాయ క్షేత్రాల వద్ద ఉంచొద్దు. ఇళ్ల వద్దకు తీసుకెళ్లాలి. అలాగే రైతులు ఒంటరిగా వెళ్లవద్దు. కనీసం నలుగురు రైతులు కర్రలు పట్టుకొని వెళ్లాలి. ఎక్కడైనా చిరుత ఆనవాళ్లు ఉంటే వెంటనే తమకు సమాచారం అందజేయాలి. – విద్యాసాగర్, రామాయంపేట రేంజ్ అధికారిరామాయంపేట(మెదక్): చిరుతల భారీ నుంచి పశువులను రక్షించుకోవడానికి రైతులు నానా తంటాలు పడుతున్నారు. ఇటీవల అటవీ ప్రాంతానికి దగ్గరగా, గిరిజన తండాల్లో ఉన్న పశువులపై చిరుతల దాడులు పెరిగాయి. గత నాలుగైదేళ్లుగా వందలాది పశువులను హతమార్చాయి. రేంజీ పరిధిలోని రామాయంపేట మండలం అక్కన్నపేట, తొనిగండ్ల, కాట్రియాల, పర్వతాపూర్, దంతేపల్లి శివారులో దట్టమైన అటవీప్రాంతం విస్తరించి ఉంది. ఈ ప్రాంతంలో సుమారు ఆరు చిరుతలు ఉన్నట్లు సమాచారం. ఈవిషయాన్ని ఆశాఖ అధికారులు తెలపకపోయినా, రెండేళ్ల క్రితం చేపట్టిన వన్యప్రాణుల గణనలో ఈ విషయం తేలింది. చిరుతలతో పాటు ఎలుగుబంట్లు, రేసు కుక్కలు, జింకలు, నీల్గాయిలు ఇతర జంతువులు మనుగడ కొనసాగిస్తున్నాయి. నీటి కోసం పంట చేల వద్దకు.. వేసవిలో అటవీప్రాంతంలో తాగునీరు, అహారం లభించకపోవడంతో చిరుతలతో పాటు ఇతర జంతువులు గ్రామాలు, తండాల్లోకి వస్తున్నాయి. వన్యప్రాణులకు తాగు నీటి కోసం అటవీప్రాంతంలో సాసర్పిట్లతో పాటు చిన్న చిన్న కుంటలు, చెక్డ్యాంలు నిర్మించారు. వాటిలో నీరు నింపకపోవడంతో అవి గ్రామాల్లోకి వస్తూ ప్రమాదాల బారిన పడుతున్నాయి. ఇటీవల నార్సింగి సమీపంలోని అటవీ ప్రాంతంలో రోడ్డు దాటుతున్న చిరుత రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం విధితమే. అయితే ఈసారి కూడా నిధులు మంజూరు కాకపోవడంతో అధికారులు అటవీప్రాంతంలో వన్యప్రాణులకు తాగునీటి సదుపాయం కల్పించలేదు. దీనికి తోడు అడవిలో భూగర్భజలాలు ఇంకిపోయి తాగు నీరు లభించడం కష్టతరంగా మారింది. అయితే వేసవి వస్తుందంటే చాలు రైతులు భయందోళన చెందుతున్నారు. చిరుతను బంధించడానికి రామాయంపేట పట్టణ శివారులో సర్వయ్యకుంట వద్ద ఆశాఖ అధికారులు బోను ఏర్పాటు చేశారు. రైతులు తమ పశుసంపదను రక్షించుకోవడానికి పశువుల పాకల చుట్టూ ఇనున జాలీలను ఏర్పాటు చేసుకుంటున్నారు. అటవీ ప్రాంతాన్ని ఆనుకునే వ్యవసాయం చేసుకుంటున్న రైతులు ముందస్తుగా వీటిని ఏర్పాటుచేసుకొని తమ పశువులను అందులో ఉంచుతున్నారు. మరికొందరు రైతులు ముందు జాగ్రత్త చర్యగా తమ పశువులను రాత్రివేళ పంట చేల వద్ద ఉంచకుండా ఇళ్ల వద్దకు తీసుకెళ్తున్నారు. పశువుల రక్షణకు రైతుల తంటాలు పాకల చుట్టూ ఇనుప కంచెల ఏర్పాటు