Khammam
-
జమలాపురంలో నూతన ధ్వజస్తంభాలకు పూజలు
ఎర్రుపాలెం: జమలాపురంలోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో ఈనెల 29న మహా కుంభాభిషేకం ఉత్సవాలు మొదలుకానున్నాయి. ఇందులో భాగంగా ప్రతిష్ఠించనున్న ధ్వజ స్తంభాలకు ఆదివారం అర్చకులు, అధికారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఈఓ కె.జగన్మోహన్రావు మాట్లాడుతూ మహా కుంభాభిషేకం, ధ్వజ స్తంభాల ప్రతిష్ఠా పూజలకు గ్రామస్తులు, భక్తులు సహకరించాలని కోరారు. ఈకార్యక్రమంలో వ్యవస్థాపక ధర్మకర్త ఉప్పల విజయదేవశర్మ, ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాసశర్మ, జూనియర్ అసిస్టెంట్ కృష్ణప్రసాద్, దాత తుళ్లూరు కోటేశ్వరరావుతో పాటు అంకసాల శ్రీనివాసరావు, ఎల్.పీ.నారాయణరెడ్డి నన్నపనేని రామారావు, సుకవాసి రమేష్, వేమిరెడ్డి అంకిరెడ్డి, వీరమాచినేని జగదీష్ బాబు, భూక్యా బాలాజీ, చొప్పరపు శ్రీనివాసరావు, మిర్యాల శ్యామ్ప్రసాద్, మేడా భానుప్రతాప్ పాల్గొన్నారు. వసతిగృహాలు రెడీ.. ఖమ్మంమయూరిసెంటర్: వేసవి సెలవులు ముగియనుండడంతో సోమవారం కొత్త విద్యా సంవత్సరం ప్రారంభంకానుంది. ఈ సందర్భంగా జిల్లాలోని ప్రభుత్వ సంక్షేమ వసతిగృహాల్లో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గత రెండు రోజులుగా వంట గదులు, విద్యార్థులు బస చేసే గదులు, ఆవరణను శుభ్రం చేయిస్తున్నారు. అంతేకాక వంట సామగ్రి, టేబుళ్లు,, గదులను కడిగించారు. అయితే, సోమవారం, మంగళవారం కాకుండా ఎక్కువ మంది విద్యార్థులు బుధవారమే హాస్టళ్లకు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. -
అలా.. మొదలైంది!
పదో తరగతి వరకు నా చదువు ఐదు పాఠశాలల్లో కొనసాగింది. ఒకటో తరగతి ప్రకాశం జిల్లా మార్కాపురంలో, 2, 3వ తరగతులు కర్నూలు జిల్లా కోయిలకుంట్ల, 4, 5వ తరగతి నంద్యాల జిల్లా రేవనూరు, ఆరో తరగతి కడపలో పూర్తిచేయగా, 7 నుంచి 10వ తరగతి వరకు కర్నూలు జిల్లా నందికొట్కూరులో చదివా. ఏటా వేసవి సెలవుల్లో ఆనందంగా గడిపేది. మళ్లీ కొత్త తరగతిలో మొదటి రోజు వెళ్లాలంటే కాస్త బెరుకు కంటే స్నేహితులు కలుస్తారన్న ఆనందమే ఎక్కువగా ఉండేది. ఆ రోజులు తలుచుకుంటే ఇప్పటికీ సంతోషం అనిపిస్తుంది. స్నేహితులందరం కలిసి నడిచి స్కూల్కి వెళ్లేవాళ్లం. విద్యాభ్యాసమంతా బాలికల స్కూళ్లలోనే కొనసాగింది. స్కూల్లో చదివేటప్పుడు ఎన్సీసీలో ఉత్సాహంగా ఉండేదాన్ని. ఉపాధ్యాయులు చాలా శ్రద్ధ తీసుకుని చదువు చెప్పేవారు. – డాక్టర్ మట్టా రాగమయి, సత్తుపల్లి వేసవి సెలవుల అనంతరం సోమవారం నుంచి నూతన విద్యా సంవత్సరం మొదలవుతోంది. ఈ క్రమాన పిల్లలు పాఠశాలలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. కొందరు ఈసారే పాఠశాల బాట పట్టనుండగా.. ఇంకొందరు కొత్త తరగతిలోకి వెళ్లనున్నారు. ఈ క్రమాన ఉమ్మడి జిల్లాలోని పలు శాఖల ఉన్నతాధికారులను వారి ‘బడి’ జ్ఞాపకాలపై ఆరా తీయగా ఆ సంగతులన్నీ ఆసక్తిగా వివరించారు. –ఖమ్మంమయూరిసెంటర్ / ఖమ్మంవ్యవసాయం / సత్తుపల్లిటౌన్ / భద్రాచలంఅర్బన్ ‘బడి బాట’ జ్ఞాపకాల్లో అధికారులు -
పెద్దమ్మతల్లికి విశేషపూజలు
పాల్వంచరూరల్: శ్రీకనకదుర్గ(పెద్దమ్మతల్లి) అమ్మవారికి ఆదివారం అర్చకులు విశేష పూజ లు నిర్వహించారు. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. క్యూలైన్ ద్వారా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. అన్నప్రాసనలు, ఒడిబియ్యం, పసు పు కుంకుమలు, చీరలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈఓ ఎన్.రజనీకుమారి, అర్చకులు పద్మనాభశర్మ, రవికుమార్శర్మ పాల్గొన్నారు. వికాసం పాఠశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం భద్రాచలంటౌన్: భద్రాచలం ఐటీడీఏ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వికాసం పాఠశాలల్లో 1 నుంచి 9వ తరగతి వరకు ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పీఓ బి.రాహుల్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. చెవిటి, మూగ, దృష్టిలోపం, ఇతర వికలాంగత కలిగిన బాలబాలికలు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. పాఠశాలలో ఉచిత విద్య, వసతి, భోజనంతోపాటు హియరింగ్ ఎయిడ్, స్పీచ్ థెరపీ, కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ అందిస్తామని పేర్కొన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన 7 నుంచి 16 ఏళ్ల వయస్సు గల ప్రత్యేక అవసరాలున్న పిల్లలను చేర్పించాలని, వివరాలకు 93811 81407, 6303 947240 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. రాత పరీక్షకు 642 మంది హాజరురుద్రంపూర్: సింగరేణి సంస్థలో ఖాళీగా ఉన్న 17 జూనియర్ కెమిస్ట్ /టెక్నికల్ ఇన్స్పెక్టర్ ఇంటర్నల్ పోస్టులకు ఆదివారం కొత్తగూడెం సింగరేణి మహిళా కళాశాలలో రాత పరీక్ష నిర్వహించారు. పరీక్షకు 642 మంది అభ్యర్థులు హాజరుకాగా, కేంద్రాన్ని జీఎం పర్సనల్ (ఈఈ అండ్ రిక్రూట్మెంట్) జీఎం ఏజే మురళీధర్ పర్యవేక్షించారు. -
భద్రగిరి రామయ్యకు అభిషేకం
భద్రాచలంటౌన్: భద్రాచలం శ్రీసీతారామ చంద్రస్వామివారి అంతరాలయంలోని మూలమూర్తులకు ఆదివారం అభిషేకం, సువర్ణ పుష్పార్చ న జరిపారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన పూజలు చేశారు. అనంతరం స్వామి వారిని పల్లకీసేవగా చిత్రకూట మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు. భక్తులు నిత్య కల్యాణంలో అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గోదావరికి నదీ హారతిభద్రాచలంలోని గోదావరి స్నాన ఘట్టాల వద్ద అధిక జ్యేష్టమాస అమావాస్య సందర్భంగా ఆదివారం నదీహారతి భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. గణపతి పూజ, దీపోత్సవం, గోదావరి మాతకు అష్టోత్తర శతనామార్చనలు నిర్వహించారు. శాంతి మంత్ర పఠనంతో ముగించారు. అర్చకులు రామ వజ్జల రవికుమార్, సత్యప్రసాద్శర్మ, అశోక్కుమార్ శర్మ, సుబ్రహ్మణ్య ఆచార్యులు పాల్గొన్నారు. -
నాన్న సైకిల్పై నేను, చెల్లి, తమ్ముడు
మాది సింగరేణి మండలం గేటుకారేపల్లి. నాన్న భూక్యా చిట్టిబాబు పోస్టుమాస్టర్గా పనిచేస్తూనే వ్యవసాయం చేసేవారు. అమ్మానాన్న చిట్టిబాబు – రాధకు నేను మొదటి కుమార్తెను. ఆ తర్వాత చెల్లె సుజాత, తమ్ముడు అరుణ్ ఉన్నారు. చెల్లి, తమ్ముడితో కలిసి సిద్ధమయ్యాక నాన్న సైకిల్పై తీసుకెళ్లి స్కూల్లో దింపేవారు. శ్రద్ధగా చదువుతూ ఏ రోజు హోం వర్క్ ఆరోజు చేసేవాళ్లం. ఎనిమిదో తరగతికి వచ్చాక కారేపల్లి హైస్కూల్కు వెళ్లే మార్గంలో బుగ్గవాగు ఉండడంతో నాన్న భద్రాచలం ఏపీఆర్ఎస్లో చేర్పించారు. ఇంటర్ తర్వాత అశ్వారావుపేటలో ఏజీబీఎస్సీ, ఆపై ఎమ్మెస్సీ పూర్తిచేశా. నాన్న ఆశయం మేరకు దమ్మపేట ఏఓగా గెజిటెడ్ ర్యాంక్ ఉద్యోగం సాధించా. ప్రస్తుతం ఖమ్మం వ్యవసాయ సాంకేతిక సంస్థ (ఆత్మ) పీడీగా కొనసాగుతున్నా. – బి.సరిత, ఆత్మ ప్రాజెక్టు డైరెక్టర్, ఖమ్మం -
అటు బాధ.. ఇటు సంతోషం !
చిన్నతనంలో బడి తెరుస్తున్నారంటే రెండు రకాల భావనలు కలిగేవి. ఓ పక్క సెలవులు ముగిశాయన్న బాధ.. మరోపక్క కొత్త పుస్తకాలు, నోట్స్లు, బ్యాగ్ కొన్నారన్న సంతోషం ఉండేది. మా స్వస్థలమైన కోదాడలో చదువంతా కొనసాగింది. వేసవి సెలవుల్లో రెండు నెలల పాటు చదువు, పరీక్షలు లేకుండా ఇష్టం వచ్చినట్లు ఆడుతూ, బంధువుల ఇళ్లకు వెళ్లిరావడంతో గడిచిపోయేది. సెలవులు ముగిశాక ఆటపాటలు వదిలి బడి బాట పట్టడం కొద్దిగా కష్టంగా ఉండేది. అయినా అమ్మానాన్న ప్రోత్సాహంతో చదువు కొనసాగించాను. భవితకు బాటలు వేసేది చదువేనని గుర్తించి పిల్లలు శ్రద్ధగా విద్యనభ్యసించి మంచి స్థాయికి చేరాలని ఆకాంక్షిస్తున్నా. – కొండపల్లి శ్రీరామ్, డీఆర్డీఓ, ఖమ్మం -
ఆగుదామా.. ‘సాగు’దామా ?!
ఖమ్మంవ్యవసాయం: వానాకాలం పంటల సాగుపై అన్నదాతల్లో అయోమయం నెలకొంది. ఎల్నినో ప్రభావంతో వర్షాలు తక్కువగా ఉంటాయని వాతావరణ శాఖ ఇప్పటికే ప్రకటించింది. పంటలకు అవసరమైన ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో వర్షపాతం తక్కువగా నమోదవుతుందని వెల్లడించగా.. రాష్ట్ర ప్రభుత్వం రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగుచేసేలా వ్యవసాయ శాఖ ద్వారా విస్తృత అవగాహన కల్పిస్తోంది. ఇప్పటికే వానాకాలం సీజన్ మొదలైనందున అక్కడక్కడా వర్షాలు కురుస్తున్నా ఆశించిన స్థాయిలో లేకపోవడంతో రైతులు ఏం చేయాలో పాలుపోని పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ఏడు లక్షల ఎకరాల్లో సాగు అంచనా జిల్లాలో ఈ ఏడాది అన్ని పంటలు కలిపి 7 లక్షల ఎకరాల్లో సాగవుతాయని అధికారులు తొలుత అంచనా వేశారు. ఇందులో ప్రధాన పంటగా వరి దాదాపు 3.20 లక్షల ఎకరాల్లో, ఆ ఆర్వాత 2.69 లక్షల ఎకరాల్లో పత్తి, లక్ష ఎకరాల మేర మిర్చి సాగు చేస్తారని భావించారు. అయితే, ఎల్నినో ప్రభావంతో వర్షాలు తక్కువ కురవనున్న నేపథ్యాన నీటి వినియోగం అధికంగా ఉండే వరి, పత్తికి బదులు పెసర, మినుము, కంది, జొన్న, వేరుశనగ వంటి పంటలు సాగు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. నేల స్వభావం వరికి మాత్రమే అనుకూలంగా ఉంటే స్వల్పకాలిక రకాలను, వెదజల్లే సాగు చేసుకోవాలని చెబుతున్నారు. అంతేకాక పత్తిలో అధిక సాంద్రత విధానాన్ని అవలంబించాలని సూచిస్తున్నారు. వనరులపై ఆశలు అధికారులు అవగాహన కల్పిస్తున్నా రైతులు మాత్రం జిల్లాలోని నీటి వనరులపై ఆశగా ఉన్నారు. జిల్లాకు నాగార్జునసాగర్ ప్రాజెక్టు ప్రధాన నీటి వనరుగా ఉంది. ఈ ప్రాజెక్టు ద్వారా నీరు విడుదలైతే జిల్లాలోని జలాశయాల్లోకి సమృద్ధిగా నీరు చేరడమే కాక భూగర్భ జలాలు సైతం పెరుగుతాయి. రెండేళ్లుగా విస్తారంగా కురిసిన వర్షాలకు పలు జలాశయాల్లో ఇప్పటికే సమృద్ధిగా నీరు ఉంది. దీనికి తోడు అరకొరగా వర్షాలు కురిసినా పంటల సాగుకు నీరు సరిపోతుందని రైతులు భావిస్తున్నారు. కాగా, జిల్లాలో ఈ నెల 11 నాటికి సాధారణ వర్షపాతం 34.4 మి.మీలు కాగా అంతకు మించి 63.3 మి.మీ.లుగా నమోదైంది. కానీ ప్రస్తుతం ఆశించిన స్థాయిలో వర్షాలు లేక, పంటలకు అవసరమైన ఆగస్టు, సెప్టెంబర్లో పరిస్థితి ఎలా ఉంటుందో తెలియడం లేదు. పత్తి సాగుకు ప్రస్తుతమైతే దుక్కులు చేస్తున్నాం. కానీ వర్షాలు తక్కువగా ఉంటాయని చెబుతున్నారు. అదే జరిగితే నష్టపోతామని భయం ఉంది. మాగాణి భూముల్లో వానాకాలం ఆరుతడి పంటలు పండవు. జలాశయాల్లో నీరు చేరితే వరి సాగు చేస్తా. –సోమనబోయిన వెంకటేశ్వర్లు, రైతు, తెట్టెలపాడు ఎల్నినో ప్రభావం నేపథ్యాన ప్రత్యామ్నాయ పంటలకే ప్రాధాన్యత ఇవ్వాలి. వాతావరణం, నీటి వనరులకు అనుగుణంగా తక్కువ కాల పరిమితి కలిగిన పంటలు ఎంచుకుని, అపరాలు సాగు చేయడమే మంచిది. తొందరపడి పొడి దుక్కుల్లో పత్తి విత్తనాలు నాటొద్దు. – ధనసరి పుల్లయ్య, జిల్లా వ్యవసాయాధికారి నెల సాధారణం నమోదు జూన్ 131.2 123.9 జూలై 240.9 281.6 ఆగస్టు 240.0 389.7 సెప్టెంబర్ 179.0 241.1 జిల్లాలో అక్కడక్కడా వర్షాలు కురుస్తుండడంతో రైతులు దుక్కులు సిద్ధం చేశారు. కొందరు రైతులు పొడిదుక్కుల్లోనే పత్తి విత్తనాలు నాటారు. వరి సాగు చేసే భూముల్లో భూసారం పెంపునకు పచ్చి రొట్ట విత్తనాలను వేస్తున్నారు. అయినా వాతావరణ పరిస్థితులు, ప్రభుత్వ సూచనలతో రైతులు అయోమయానికి గురవుతున్నారు. మరోపక్క వానాకాలం ప్రారంభమైనా ఆశించిన స్థాయిలో వర్షాలు లేకపోవ డం, ఉష్ణోగ్రతలు కొనసాగుతుండడంతో వారిలో సందిగ్ధత నెలకొంది. అధికారుల సూచనలను కాదని జలాశయాల్లో నీటి ఆధారంగా వరి తదితర పంటలు సాగు చేస్తే పైరు దశలో నీటి సమస్య ఎదురై, నష్టపోతామనే భావనతో రైతులు డోలాయమానంలో పడిపోయారు. -
● రంగు మారింది..
గత ఏడాది పాఠశాలలు తెరిచిన రోజే విద్యార్థులకు యూనిఫామ్ పంపిణీ చేశారు. కానీ ఈసారి ఇప్పటివరకు యూనిఫామ్ క్లాత్ రాకపోవడంతో అస్పష్టత నెలకొది. అయితే, యూనిఫామ్ రంగులు, డిజైన్ మార్చాలనే ప్రభుత్వ ఆలోచనతో ఈ ఆలస్యం జరిగిందని తాజాగా వెల్లడించారు. ఇందులో భాగంగా ఒకటి నుంచి ఐదో తరగతి వరకు బాలురకు లైట్ బ్లూ షర్ట్, డార్క్ బ్లూ షార్ట్, 6 నుంచి 12వ తరగతి వరకు బాలురకు అదే రంగు షర్ట్, ప్యాంట్ అందిస్తారు. ఇక 1 నుంచి 3వ తరగతి వరకు బాలికలకు బాడీ ఫ్రాక్తోపాటు షర్ట్, 4, 5వ తరగతులకు షర్ట్, స్కర్ట్, 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు బాలికలకు పంజాబీ డ్రస్తోపాటు వెస్ట్ కోట్ సమకూర్చారు. త్వరలోనే జిల్లాకు క్లాత్ చేరాక యూనిఫామ్ కుట్టే బాధ్యతలను గతంలో మాదిరిగానే గ్రామీణ స్థాయిలో స్వయం సహాయక సంఘాలకు, మున్సిపాలిటీ, కార్పొరేషన్ పరిధిలో మెప్మా సిబ్బందికి అప్పగించనున్నారు. -
వర్షాల వేళ విద్యుత్తో జాగ్రత్త
ఖమ్మంవ్యవసాయం: వర్షాకాలం విద్యుత్ ప్రమాదాలు జరిగే ఆస్కారమున్నందున రైతులే కాక ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఖమ్మం ఎస్ఈ ఇనుగుర్తి శ్రీనివాసాచారి సూచించారు. ఈదురుగాలులకు విద్యుత్ వైర్లు తెగి పడడడంతో పాటు చెట్ల కొమ్మలకు వైర్లు ఆనుకొని ఉన్న చోట ప్రమాదాలు జరిగే అవకాశముంని తెలిపారు. ఈ నేపథ్యాన తడి స్తంభాలు, వైర్లను తాకొద్దని సూచించారు. తెగిన వైర్లు కనిపిస్తే 1912 లేదా వాట్సాప్ 87124 81489 నంబర్ ద్వారా సమాచారం ఇవ్వాలే తప్ప సొంతంగా తొలగించే ప్రయత్నం చేయొద్దని తెలిపారు. అలాగే, ఇళ్లలో దుస్తులు ఆరేసేందుకు ఇనుప తీగలు కాకుండా ప్లాస్టిక్ తీగలు వాడాలని చెప్పారు. ఎవరైనా షాక్కు గురైతే చేతితో నేరుగా తాకకుండా కర్ర లేదా ప్లాస్టిక్ వస్తువులతో దూరం చేయాలని తెలిపారు. అలాగే, ఇళ్లు, వ్యవసాయ మోటార్లకు సరైన ఎర్తింగ్ చేయించుకోవాలని ఎస్ఈ ఓ ప్రకటనలో సూచించారు. 26న ‘కనకతార’ నాటిక ప్రదర్శన ఖమ్మంగాంధీచౌక్: తొలి తెలుగు సినిమా పాటల రచయిత చందాల కేశవదాసు 150వ జయంతి సందర్భంగా ఈ నెల 26న ‘కనకతార’నాటిక ప్రదర్శన ఉంటుందని చందాల కేశవదాసు కళా పరిషత్ అధ్యక్షుడు కొండపల్లి జగన్మోహన్రావు తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఖమ్మంలో వాల్పోస్టర్లను పలు సంస్థల ప్రతినిధులతో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఈ నెల 26న సాయంత్రం ఖమ్మంలోని భక్త రామదాసు కళాక్షేత్రంలో రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో సురభి భానోదయ నాట్యమండలి కళాకారులు ఈ నాటకాన్ని ప్రదర్శిస్తారని తెలిపారు. కార్యక్రమంలో ఏఎస్ కుమార్, జగన్మోహన్రావు, డాక్టర్ నాగబత్తిని రవి, సీతారామారావు, డాక్టర్ సుబ్బరాజు తదితరులు పాల్గొన్నారు. ఉపాధి కూలీలకు నష్టం కలిగించొద్దు ఖమ్మంమయూరిసెంటర్: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని వీబీజీరాంజీగా పేరు మార్చి కార్మికులకు నష్టం జరిగేలా వ్యవహరిస్తే కేంద్ర ప్రభుత్వ పతనం తప్పదని సీపీఐ జిల్లా కార్యదర్శి దండి సురేశ్ హెచ్చరించారు. ఖమ్మంలోని గిరిప్రసాద్ భవన్లో ఆదివారం తాటి వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం (బీకేఎంయూ) సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉపాధి హామీ కూలీల హక్కులను కేంద్ర ప్రభుత్వం హరించి వేస్తోందన్నారు. ఈ మేరకు కార్మిక వ్యతిరేక చర్యలను తిప్పికొట్టేలా ఉద్యమించాలని సూచించారు. అలాగే, రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారంటీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. బీకేఎంయూ జిల్లా ప్రధాన కార్యదర్శి సిద్దినేని కర్ణకుమార్ మాట్లాడుతూ.. సంఘం ఆధ్వర్యాన ఈ నెల 23న కలెక్టరేట్ ఎదుట చేపట్టే ధర్నాను జయప్రదం చేయాలని కోరారు. నాయకులు ఏసు, మేళ్లచెరువు వీరబాబు, సింగారపు సత్యనారాయణ, పిట్టల రాంబాబు, అయోధ్య, గోగుల ఆది పాల్గొన్నారు. కిన్నెరసానిలో సందడిపాల్వంచరూరల్: ఎండ తీవ్రత తగ్గుముఖం పట్టడంతో పర్యాటక ప్రాంతమైన కిన్నెరసానిలో సండే సందడి వాతవరణం కన్పించింది. ఆదివారం జిల్లాతోపాటు ఇరుగుపొరుగు ప్రాంతాల నుంచి పర్యాటకులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. డ్యామ్, జలాశయం, డీర్ పార్కులోని దుప్పులను వీక్షించారు. 724 మంది పర్యాటకులు కిన్నెరసానిలోకి ప్రవేశించగా వైల్డ్లైఫ్ శాఖకు రూ.38,125 ఆదాయం లభించింది. 400 మంది బోటు షికారు చేయగా టూరిజం కార్పొరేషన్ సంస్థకు రూ.25,000 ఆదాయం లభించినట్లు నిర్వాహకులు తెలిపారు. నేవీ మార్కోస్లో గుండాల యువకుడు గుండాల: మండలంలోని నర్సాపురంతండాకు చెందిన బోడా నరేశ్నాయక్ భారత నావికా దళంలోని మార్కోస్ (మైరెన్ కమాండో)కు ఎంపికయ్యాడు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నివీర్కు దరఖాస్తు చేసుకుని పోటీ పరిక్షల్లో ప్రతిభ కనబర్చి ఎంపికయ్యాడు. శిక్షణలోనూ ఉత్తమ ప్రతిభ కనపర్చిన నరేశ్నాయక్ మార్కోస్కు ఎంపిక కావటంపై తల్లిదండ్రులు శ్రీను – సరోజ హర్షం వ్యక్తం చేశారు. ఒడిశాలో నాలుగు నెలల పాటు శిక్షణ పొందిన ఆయన త్వరలో మార్కోస్లో చేరబోతున్నాడని వారు తెలిపారు. -
ప్రారంభానికి సన్నద్ధం
గతంలో ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు మాత్రమే పోస్టర్లు, కరపత్రాలతో ఇంటింటి ప్రచారం చేసేవారు. కానీ రెండేళ్లుగా ప్రభుత్వ పాఠశాలలు ఉపాధ్యాయులు సైతం తమ పాఠశాల విద్యార్థులు సాధించిన మార్కులను వివరిస్తూ వినూత్న ప్రచారం చేస్తున్నారు. బడిబాట పేరిట ప్రభుత్వ పాఠశాలల్లోని సౌకర్యాలపై అవగాహన కల్పించడంతో పాటు మార్కులు, ఇతర సౌకర్యాలను వివరిస్తున్నారు. ఖమ్మంసహకారనగర్: వేసవి సెలవుల అనంతరం సోమవారం నుంచి కొత్త విద్యాసంవత్సరం మొదలుకానుంది. తొలుత ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం 12వ తేదీనే పాఠశాలలు ప్రారంభం కావాల్సి ఉంది. కానీ, ఎండల తీవ్రత దృష్ట్యా సెలవులు మరో మూడు రోజులు పొడిగించారు. ఈ మేరకు సొమవారం మొదలయ్యే కొత్త విద్యాసంవత్సరానికి ఏర్పాట్లు పూర్తిచేసిన అధికారులు విద్యార్థులకు స్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్నారు. అయితే, పాఠశాలల్లో ఇప్పటికే మధ్యాహ్న భోజనం అమలవుతుండగా, ఈసారి నుంచి అల్పాహారం కూడా సమకూరుస్తున్నామని ప్రభుత్వం ప్రకటించింది. కానీ, తొలిరోజే అల్పాహారం మొదలవుతుందా, కొంత సమయం పడుతుందా అన్నది సోమవారం స్పష్టత రానుంది. అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీల ద్వారా జిల్లాలోని 952 పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన పూర్తయింది. అంతేకాక గత ప్రభుత్వ హయంలో చేపట్టిన ‘మన ఊరు – మన బడి, మన బస్తీ – మన బడి’ పథకం ద్వారా 195 పాఠశాలల్లో కూడా పనులు పూర్తయ్యాయి. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ఒకటి నుంచి పదో తరగతి వరకు విద్యార్థుల కోసం అన్ని టైటిళ్లు కలిపి 4,45,820 పాఠ్య పుస్తకాలు అవసరమని అధికారులు ప్రతిపాదించారు. ఇందులో ఇప్పటికే 4,05,426 పాఠ్య పుస్తకాలు జిల్లా కేంద్రానికి చేరగా, ఎమ్మార్సీలకు ఆపై పాఠశాలలకు చేరవేశారు. మిగిలిన 40,394 పుస్తకాలు కూడా ఒకటి, రెండు రోజుల్లో జిల్లాకు చేరతాయని అధికారులు తెలిపారు. అలాగే, విద్యార్థులకు అవసరమైన నోట్ పుస్తకాలు పాఠశాలలకు చేర్చారు. తద్వారా పాఠశాలలు పునఃప్రారంభం రోజునే విద్యార్థులకు పాఠ్య, నోట్ పుస్తకాలు అందించనున్నారు. ప్రైవేట్ స్కూళ్లలో నర్సరీ, ఎల్కేజీ నిర్వహిస్తుండడంతో తల్లిదండ్రులు అటే మొగ్గుచూపుతున్నారు. ఈ నేపథ్యాన ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ఈ ఏడాది నుంచి ప్రీ ప్రైమరీ బోధన ప్రవేశపెట్టారు. గత ఏడాది జిల్లాలో 30 పాఠశాలలు ఉండగా, ఈసారి మరో 114 పాఠశాలలను ఎంపిక చేశారు. వీటిలో గదులకు రంగులు వేయించడం, పిల్లలను ఆకట్టుకునే బొమ్మలు వేసి సౌకర్యాలు సమకూర్చేందుకు నిధులు మంజూరు చేశారు. అంతేకాక ఇన్స్ట్రక్టర్లు, ఆయాల నియామకం కూడా చివరి దశకు చేరింది. యాజమాన్యం సంఖ్య విద్యార్థులు ప్రభుత్వ, అనుబంధం 1,319 84,222 ప్రైవేట్ 265 78,151 సీబీఎస్ఈ (ప్రైవేట్) 12 10,680 జిల్లాలో 21 మండలాల్లో ఎనిమిది భవిత కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు కల్పించారు. శారీరక వైకల్యంతో బాధపడే విద్యార్థులకు ఈ కేంద్రాల్లో ఫిజియోథెరపీ తదితర సేవలందించనున్నారు. ఈ మేరకు ప్రత్యేక పరికరాలు సమకూర్చడంతో పాటు ఇతర వసతులు సమకూర్చారు. -
ఆదేశాలు బేఖాతర్
● 241 బస్సులకు పరీక్ష చేయించని ప్రైవేట్ స్కూళ్ల బాధ్యులు ● నేటి నుంచి రవాణా శాఖ స్పెషల్ డ్రైవ్ ఖమ్మంక్రైం: జిల్లావ్యాప్తంగా అన్ని పాఠశాలలు సోమవారం తెరుచుకోనున్నాయి. అయితే, పలు ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు ఇప్పటివరకు తమ బస్సులకు పూర్తిస్థాయిలో ఫిట్నెస్ సర్టిఫికెట్లు తీసుకోలేదు. ఈ నెల 12వ తేదీ వరకే అధికారులు గడువు విధించినా తమకేమీ పట్టనట్టుగా వ్యవహరించడం గమనార్హం. ఫిట్నెస్ లేని బస్సులు రోడ్డు ఎక్కితే విద్యార్థుల భద్రతకు ఎవరు బాధ్యత వహిస్తారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యాన సోమవారం నుంచి రవాణా శాఖ అధికారులు స్పెషల్ డ్రైవ్ చేపట్టనుండగా, ఫిట్నెస్ సర్టిఫికెట్ లేని బస్సులను సీజ్ చేస్తామని చెబుతున్నారు. 241 బస్సులు దూరం జిల్లాలో అన్ని ప్రైవేట్ పాఠశాలలకు కలిపి 769 బస్సులు ఉన్నాయి. ఖమ్మం రవాణా శాఖ కార్యాలయ పరిధిలో 514, సత్తుపల్లి కార్యాలయ పరిధిలో 120, వైరాలో 135 బస్సులు ఉన్నాయి. ఇందులో ఇప్పటివరకు 528 బస్సులకే ఫిట్నెస్ చేయించారు. ఇంకా 241 బస్సులకు ఫిట్నెస్ పరీక్ష చేయించకపోవడం గమనార్హం. పిల్లల ప్రాణాలతో చెలగాటం ఫిట్నెస్ సర్టిఫికెట్ లేకుండానే కొన్ని స్కూళ్ల యాజమాన్యాలు పిల్లల రాకపోకలకు బస్సులు వినియోగించాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. బస్సులు సరైన స్థితిలో లేనందున వీటిని వినియోగిస్తే పిల్లల ప్రాణాలతో చెలగాటం ఆడినట్టేనని తల్లిదండ్రులు వాపోతున్నారు. ఏటా రూ.వేలల్లో ఫీజులు పెంచుతూ, బస్సులకు ఫిట్నెస్ సర్టిఫికెట్ తీసుకోని యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. జిల్లావ్యాప్తంగా సోమవారం నుంచి స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తాం. ప్రతీ పాఠశాల బస్సును తనిఖీ చేసి ఫిట్నెస్ సర్టిఫికెట్ లేకపోతే సీజ్ చేస్తాం. ఫిట్నెస్ సర్టిఫికెట్ ఉన్నా బస్సులు నిబంధనల మేరకు లేకపోతే చర్యలు తీసుకుంటాం. –శ్రీనివాస్, ఇన్చార్జ్ ఆర్టీఓ -
కరకట్ట కందకంలో పడి మృతి
ఖమ్మంక్రైం: వరద ముంపు రాకుండా మున్నేటి వద్ద నిర్మిస్తున్న కరకట్ట కందకంలో ప్రమాదవశాత్తు పడిన ఓ యువకుడు మతి చెందాడు. ఖమ్మం సుందరయ్యనగర్ ప్రాంతానికి చెందిన వనమాల కృష్ణ చిన్నకుమారుడు జయశంకర్ (21) ఇంటర్ తర్వాత ఇంటి వద్దే ఉంటున్నాడు. ఆయన శనివారం మధ్యాహ్న భోజనం చేశాక బయటకు వెళ్తున్నానని తల్లి, సోదరుడికి చెప్పి బయలుదేరాడు. అయితే, రాత్రి వరకు తిరిగి రాకపోవడం, సెల్ఫోన్ కూడా ఇంట్లోనే ఉండడంతో స్నేహితుల వద్ద ఆరా తీసినా ఫలితం కానరాలేదు. ఈ మేరకు ఆదివారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళ్తుండగా, మున్నేటి కరకట్ట కోసం తవ్విన 20 అడుగుల లోతు కందకంలో జయశంకర్ మృతదేహం తేలుతోందన్న సమాచారంతో వెళ్లిన కుటుంబీకులు కన్నీరమున్నీరయ్యారు. కందకంలో చేతులు కడుక్కోవటానికి వెళ్లిన ఆయన ప్రమాదవశాత్తు పడగా, ఈత రాకపోవడంతో మృతి చెంది ఉండొచ్చని భావిస్తున్నారు. ఈ మేరకు అన్నం ఫౌండేషన్ చైర్మన్ శ్రీనివాసరావు సహకారంతో మృతదేహాన్ని మార్చురీకి తరలించగా, జయశంకర్ తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని ఖమ్మం త్రీటౌన్ సీఐ మోహన్బాబు తెలిపారు. -
హెల్త్ కార్డుల జారీకి కృషి చేస్తా
ఖమ్మం సహకారనగర్: ఉద్యోగ, ఉపాధ్యాయులకు హెల్త్కార్డుల విషయంలో ఆందోళన అవసరం లేదని.. సీఎం, ఉన్నతాధికారులతో చర్చించి త్వరలోనే హెల్త్ కార్డుల జారీకి కృషి చేస్తానని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్రెడ్డి వెల్లడించారు. ఖమ్మంలోని పీఆర్టీయూ కార్యాలయంలో ఆదివారం జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. హెల్త్ కార్డుల విధివిధానాల రూపకల్పన, జారీపై ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తోందన్నారు. అయితే, ఈనెల 2వ తేదీ నాటికి పీఆర్సీ, డీఏలపై అనుకూల నిర్ణయం వస్తుందని ఆశించినా ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. ఇకనైనా ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు పీఆర్సీ ప్రకటించకపోతే ఉద్యోగ, ఉపాధ్యాయుల ఆగ్రహాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన పేర్కొన్నారు. అంతేకాక 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత పెన్షన్, సీపీఎస్ రద్దుపై నిర్ణయం తీసుకోవాలని శ్రీపాల్రెడ్డి కోరారు. అనంతరం కాంగ్రెస్ నాయకుడు తుమ్మల యుగంధర్ మాట్లాడగా, పీఆర్టీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కట్టా శేఖర్, ఆర్.రంగారావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఖాదర్ అలీ, పీఆర్టీయూ బాధ్యులు యలమద్ది వెంకటేశ్వర్లు, కె.వెంకటనర్సయ్య, జి.విజయ్, అమృత్కుమార్, ఆర్.బ్రహ్మారెడ్డి, చిత్తలూరి ప్రసాద్, కే.వీ.రమణ తదితరులు పాల్గొన్నారు. -
వృద్ధుడి అదృశ్యం
టేకులపల్లి: ఖమ్మం జిల్లా సింగరేణి మండలం మాణిక్యారం గ్రామ పరిధి గుడితండాకు చెందిన బానోతు సక్రు (70) ఈ నెల 10వ తేదీన ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. దీంతో కారేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆయన అల్లుడు, టేకులపల్లికి చెందిన గుగులోత్ కిషన్ ఆదివారం తెలిపారు. కొత్తగూడెం నుంచి సికింద్రాబాద్ వెళ్లే రైలు చీమలపాడు స్టేషన్లో ఎక్కినట్లు తెలుస్తుండగా, ఆ తర్వాత సక్రు ఆచూకీ తెలియరాలేదని వెల్లడించాడు. ఆయన ఆచూకీ తెలిసిన వారు 79934 48485, 83415 21726 నంబర్లకు సమాచారం ఇవ్వాలని కిషన్ కోరాడు -
ముందుగానే పుస్తకాల సేకరణ
మా స్వస్థలమైన మిర్యాలగూడలోనే దాదాపు నా చదువంతా కొనసాగింది. పాఠశాల విద్య సమయంలో వేసవి సెలవులు వస్తున్నాయనగానే ఆ తర్వాత ఏడాదికి ముందుగానే సీనియర్ల నుంచి పుస్తకాలు సేకరించుకునేవాళ్లం. అలా వేసవి సెలవుల్లోనే ఆ పుస్తకాలను చదవడం ఇష్టంగా ఉండేది. ఇక పాఠశాలలు మొదలయ్యాక కూడా ఏ రోజు ఏం పాఠం చెబుతారనే ఉత్సాహంతో వెళ్లేవాళ్లం. ఇంటి నుంచి రెండు, మూడు కి.మీ. సైకిళ్లపై పాఠశాలకు వెళ్లిన రోజులు ఉన్నాయి. ఏటా నూతన విద్యాసంవత్సరంలో పాత స్నేహితులతో పాటు కొత్తగా పలువురు కలిసేవారు. స్కూల్ ముగిశాక ఇంటికి వెళ్లే సమయాన అంతా కలిసి ఐస్క్రీమ్స్ కొనుక్కుని తినేవాళ్లం. పాఠశాల నాటి రోజులు గుర్తుకొస్తే ఇప్పటికీ ఆనందంగా ఉంటుంది. – జి.జ్యోతి, డీబీసీడీఓ, ఎస్సీ డీడీ, ఖమ్మం -
అన్నయ్య చేయి పట్టుకుని నడిచా..
మాది వరంగల్ జిల్లా ఖిలా వరంగల్ మండలం తిమ్మాపూర్. అమ్మానాన్న యాదగిరి – భాగ్య వ్యవసాయం చేస్తూ నన్ను, అన్నయ్య రాజును చదివించారు. చిన్నప్పుడు స్కూల్కు వెళ్లేందుకు మారాం చేసేవాడిని. కానీ అన్నయ్య సర్దిచెప్పి వెంట తీసుకెళ్లేవాడు. మా ఊరి ప్రభుత్వ పాఠశాలలోనే తెలుగు మీడియంలో 10వ తరగతి, ఇంటర్ వరంగల్లో చదివి ఓపెన్ డిగ్రీ పూర్తిచేశా. 2007లో హైదరాబాద్లో కానిస్టేబుల్గా పనిచేస్తూ 2009లో ఎస్ఐగా ఎంపికవడంతో తొలి పోస్టింగ్ కరకగూడెంలో వచ్చింది. ఈ జిల్లాలోని పలు స్టేషన్లలో విధులు నిర్వర్తించాక సీఐగా పదోన్నతిపై హైదరాబాద్ వెళ్లినా, మళ్లీ డీఎస్పీగా పదోన్నతితో భద్రాచలంలో పోస్టింగ్ వచ్చింది. మా అన్నయ్య రాజు జనగామ ్ల రెవెన్యూ శాఖలో విధులు నిర్వర్తిస్తున్నారు. అన్నయ్య ప్రోత్సాహంతోనే చదువు పూర్తిచేసి ఈ స్థాయికి చేరగలిగా. – అరుణ్కుమార్, భద్రాచలం డీఎస్పీ -
సైకిళ్లపై స్కూలుకు వెళ్లేవాళ్లం
మా నాన్న ఎన్.ఎస్.రాయుడు న్యాయవాది కాగా, అమ్మ లక్ష్మీదేవి రైల్వే శాఖలో ఆఫీస్ సూపరింటెండెంట్గా పనిచేశారు. దీంతో సికింద్రాబాద్లోని రైల్వే పాఠశాలలో నా చదువు కొనసాగింది. అమ్మ ఉదయం క్యారేజీ రెడీ చేస్తే, ఆ తర్వాత స్కూల్కు వెళ్లే వరకు నాన్న వెంట ఉండేవారు. ప్రాథమిక తరగతులకు ఆటోలో వెళ్లగా, ఆ తర్వాత స్నేహితులతో కలిసి సైకిళ్లపై స్కూల్కు వెళ్లా. అమ్మానాన్న సూచనలతో చదువు, క్రమశిక్షణలో ముందు నిలుస్తూ చదువులో స్నేహితులతో పోటీ పడేవాడిని. ఇంజనీరింగ్ అయ్యాక ఎస్బీఐ, ఇంటెలిజెన్స్ శాఖలో ఉద్యోగాలు వచ్చాయి. కానీ రైతులకు సేవలందించాలనే తపనతో డీసీసీబీ సీఈఓ పోస్టు ఎంచుకున్నా. – ఎన్.వెంకటఆదిత్య, డీసీసీబీ సీఈఓ -
అర్ధరాత్రి భూకంపం
పాల్వంచరూరల్/బూర్గంపాడు/పాల్వంచ: భద్రాద్రి జిల్లాలో ఆదివారం అర్ధరాత్రి 2:26 గంటలకు స్వల్ప భూకంపం సంభవించింది. పాల్వంచ మండలం సారెకల్లు, అశ్వాపురం మండలం మామిళ్లవాయి గ్రామాల మధ్యలో ఉన్న రిజర్వ్ ఫారెస్ట్ భూకంప కేంద్రంగా ఉన్నట్టు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ విభాగం గుర్తించింది. భూ ఉపరితలం నుంచి పది కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉండగా, తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.8 నమోదైంది. పాల్వంచ మండలంలోని లక్ష్మీదేవిపల్లి, జగన్నాథపురం, కేశవాపురం, సారెకల్లు, కారెగట్టు ప్రాంతాలతోపాటు పాల్వంచ పట్టణం, బూర్గంపాడు మండలాల్లో భూప్రకంపనలు వచ్చాయని స్థానికులు తెలిపారు. ప్రకంపనలతో ఉలిక్కిపడి బయటకు వచ్చినట్లు కొందరు చెబుతున్నారు. మరికొందరు భూకంప ప్రభావమేమీ కనిపించలేదని పేర్కొంటున్నారు. రాత్రి 2.30 గంటల సమయంలో ఒక్కసారిగా మంచం, తలుపులు స్వల్పంగా కంపించినట్లు అనిపించిందని, భూకంపంమే అని భావించి కుటుంబ సభ్యులతో బయటకు వచ్చామని పాల్వంచ గట్టాయిగూడేనికి చెందిన లింగం వెంకటేశ్వర్లు తెలిపారు. తక్కువ లోతు కావడంతో.. భూమి లోపలి పొరల్లో జరిగే ఘర్షణల కారణంగా భూకంపాలు తరచుగా సంభిస్తుంటాయి. వీటి తీవ్రతను రిక్టరు స్కేలు సాయంతో గుర్తిస్తుంటారు. భూకంపం తీవ్రత, అది సంభవించిన లోతును, భూ ఉపరితలం పరిస్థితుల ఆధారంగా భూకంప ప్రభావం ఉంటుంది. సాధారణంగా రిక్టర్ స్కేల్పై 3 కంటే తక్కువగా నమోదు అయ్యే కంపనాల గురించి సామాన్యులకు అర్థం కూడా కాదు. భూకంప తీవ్రత 3.5 దాటితే స్వల్పంగా ప్రభావం కనిపిస్తుంది. ప్రస్తుత భూంకప తీవ్రత 3.8 నమోదుకాగా, ఇది అంత ప్రమాదకరమైనది కాకపోయినా భూ ఉపరితలం నుంచి కేవలం 10 కి.మీ లోతులో కంపన కేంద్రం ఉండటం వల్ల తీవ్రత పెరిగింది. అందువల్లే అర్థరాత్రి 2.26 గంటల సమయంలో భూమి కంపించినా కొందరు ప్రజలు గుర్తించగలిగారు. అంతకుముందు 2024 డిసెంబర్ 4న ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో ఉదయం 7:27 గంటల సమయంలో సంభవించిన భూకంపం రిక్టర్ స్కేలుపై ప్రమాదకర స్థాయిలో 5.3గా నమోదైంది. ఈ భూకంప తీవ్రత ఉత్తర తెలంగాణ అంతా చవిచూసింది. అయితే, అప్పుడు 40 కి.మీ.లోతులో భూకంప కేంద్రం ఉండటంతో ప్రమాద తీవ్రత తగ్గింది. భూకంపాలు ఎప్పుడెప్పుడు వచ్చాయంటే.. గోదావరి తీరంలో విస్తరించిన జిల్లాకు భూకంపాలు కొత్తేమి కాదు. 1954లో రిక్టర్ స్కేల్పై 4.3 భూకంప తీవ్రత నమోదుకాగా, భద్రాచలం, కొత్తగూడెం ప్రాంతాల్లో ప్రకంపనలు వచ్చాయి. 1969లో దుమ్ముగూడెం మండలం పర్ణశాల దగ్గర 5.3 తీవ్రతతో భూంకపం వచ్చినట్టు రికార్డులు చెబుతున్నాయి. జిల్లాకు సంబంధించినంత వరకు అతి పెద్ద భూకంపంగా ఇది రికార్డుల్లో ఉంది. ఆ తర్వాత 2004లో మరోసారి వచ్చింది. ఆ తర్వాత చాలా ఏళ్లకు 2018 ఆగస్టు 14న జిల్లాలోని మణుగూరు, కొత్తగూడెం, భద్రాచలం, పాల్వంచ, ఇల్లెందు, బూర్గంపాడు ప్రాంతాల్లో రాత్రి వేళ కొన్ని సెకన్ల పాటు భూమి కంపించింది. మళ్లీ 2023 ఆగస్టు 25 తెల్లవారుజామున మణుగూరులో భూమి కంపించిన అనుభూతిని ప్రజలు పొందారు. 1968, 2004, 2009ల్లో కూడా స్వల్ప భూకంపం వచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు. చివరిసారి 2024 డిసెంబరులో ములుగులో వచ్చిన భూకంపానికి రాష్ట్రం మొత్తం వణికిపోయింది. తేదీ తీవ్రత సమయం 5 –7– 1969 5.3 –– 14 –8–2018 5.1 9:10 పీఎం 25 –8–2023 3.5 4:45 ఏఎం 04–12–2024 5.3 7:27 ఏఎం 13 –6– 2026 3.8 2.26 ఏఎం -
సెలవులకు సరిపడా హోమ్వర్క్
మాది జమ్మూకశ్మీర్. పంజాబ్ రాష్ట్రానికి సరిహద్దుగా మాగ్రామం ఉండేది. నా బాల్యం, చదువు అంతా గ్రామీణ ప్రాంతాల్లోనే సాగింది. నాన్న ప్రభుత్వ టీచర్ కావడంతో ఆయన పనిచేసే గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాలల్లో చదివా. ఏడో తరగతి వరకు పాఠశాలకు వెళ్లడం అంత ఆసక్తిగా ఉండేది కాదు. ఆ తర్వాత చదువుపై ఇష్టం పెరగడంతో ప్రతిరోజు స్కూల్కు వెళ్లడం.. చదవడంపై దృష్టి పెట్టా. మా చిన్నతనంలో పాఠశాలలకు ఎన్ని రోజులు సెలవులు ఇస్తే అన్ని రోజులకు సరిపడా హోంవర్క్ ఇచ్చేవారు. ఒక్కో హోంవర్క్ పూర్తి చేయడానికి రోజుల సమయం పట్టేది. దీంతో సెలవులన్నీ హోంవర్క్కే సరిపోయేవి. నేను చదివిన స్కూళ్లలో ఇంగ్లిష్ ఒక సబ్జెక్ట్గా మాత్రమే ఉండడం ఆ భాషపై పట్టు సాధించేందుకు చాలా కష్టపడ్డా. పైతరగతులకు వెళ్తున్నాకొద్దీ పట్టు సాధించా. మొత్తంగా పాఠశాల విద్య పూర్త య్యేలోగా నాలుగు భాషలు నేర్చుకున్నా. – అభిషేక్ అగస్త్య, కమిషనర్, కేఎంసీ -
రైతు జీవనాన్ని చాటిన ‘మట్టి మనిషి’
ఖమ్మంగాంధీచౌక్: రైతు జీవనం, అనుభవాలను ‘మట్టి మనిషి’నాటిక చాటిచెప్పింది. నెలనెలా వెన్నెల కార్యక్రమంలో భాగంగా అమరజీవి అన్నాబత్తుల రవీంద్రనాథ్ కళా సాంస్కతిక సంస్థ (ఆర్క్స్) నిర్వహణలో ఆదివారం రాత్రి ఖమ్మంలోని భక్త రామదాసు కళాక్షేత్రంలో ‘మట్టి మనిషి’ నాటికను ప్రదర్శించారు. డాక్టర్ వాసిరెడ్డి సీతాదేవి రచించిన మట్టి మనిషి నవల ఆధారంగా వల్లూరు శివప్రసాద్ ఈ నాటిక రూపొందించగా, ఎస్.ఎం.బాషా దర్శకత్వంలో హైదరాబాద్కు చెందిన మిత్ర క్రియేషన్స్ కళాకారులు 50 మంది ప్రదర్శించారు. భూమి ఉత్పత్తి సాధనమే తప్ప వ్యాపార వస్తువు కాదనే సంకేతాన్ని ఈ నాటిక ద్వారా ఇచ్చారు. తొలుత బత్తినేని చారిటబుల్ ట్రస్ట్ బాధ్యులు నాగప్రసాద్, నీరజ, తూము ప్రకాష్రావు చిత్రపటం వద్ద నివాళులర్పించారు. కాగా, నాటికను అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి, జిల్లా సంక్షేమాధికారి వేల్పుల విజేతతో పాటు పోతినేని సుదర్శన్, నున్నా నాగేశ్వరరావు, పొన్నం వెంకటేశ్వరరావు, మల్లంపాటి శ్రీధర్, రవిమారుత్, మేళ్లచెరువు వెంకటేశ్వరరావు, కాళ్ల పాపారావు, బుగ్గవీటి సరళ, ప్రసేన్, ఆనందాచారి, రైతు రవి తదితరులు తిలకించారు. కార్యక్రమంలో నిర్వాహకులు అన్నాబత్తుల సుబ్రహ్మణ్యకుమార్, మోటమర్రి జగన్మోహన్రావు, దేవేంద్ర, డాక్టర్ నాగబత్తిని రవి, నామా లక్ష్మీనారాయణ, వేముల సదానందం పాల్గొన్నారు. -
తెలంగాణలో కాంగ్రెస్ పతనం ఖాయం
కొణిజర్ల: రానున్న రోజుల్లో తెలంగాణలో కాంగ్రెస్ పతనం ఖాయమని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర అన్నారు. మండలంలోని అమ్మపాలెంలో ఆదివారం సాయంత్రం ఆయన ఎమ్మెల్సీ తాతా మధుతో కలిసి బీఆర్ఎస్ జెండా దిమ్మెను ఆవిష్కరించి మాట్లాడారు. అధికారంలోకి రావడానికి ముందు అన్ని కులాల వారికి రిజర్వేషన్లు ఇస్తామని ప్రకటించిన కాంగ్రెస్ నేతలు, ఢిల్లీలో దళిత క్రిస్టియన్ల రిజర్వేషన్లు తొలగిస్తుంటే పట్టించుకోవడం లేదని ఆరోపించారు. అంతేకాక ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు కనీసం నోరు మెదపలేదని పేర్కొన్నారు. అలాగే, రైతు రుణమాఫీ, రైతుబంధు అమలులో విఫలం కాగా, యూరియా సరఫరాకు యాప్ ప్రవేశపెట్టి రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమర్శించారు. కాగా, బీజేపీ, కాంగ్రెస్ కలిసి బీఆర్ఎస్ను అణగదొక్కాలని చేస్తున్న ప్రయత్నాలు ఫలించవని వద్దిరాజు స్పష్టం చేశారు. అధికారులు సైతం కాంగ్రెస్ పక్షాన నిలవకుండా పారదర్శకంగా వ్యవహరించాలని ఎంపీ సూచించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు లకావత్ గిరిబాబు, పోట్ల శ్రీను, డేరంగుల బ్రహ్మం, పోగుల శ్రీను, పాసంగులపాటి శ్రీను, కిలారు మాధవరావు, ఖాదర్బాబా, హుస్సేన్, బూర ప్రసాద్, రాజ్కుమార్, జీడయ్య, బాబూరావు, విజయ, నాగయ్య, చిలుకూరి నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర -
నడుస్తూ.. వాగులు దాటుతూ...
భద్రాద్రి జిల్లా ఇల్లెందు మండలం ధనియాలపాడులో జన్మించిన నాకు చదువులో మార్గదర్శకుడు అన్న వెంకటేశ్వర్లు. మా గ్రామంలో 3వ తరగతి వరకు ఉండేది. ఆ తర్వాత నాలుగు కి.మీ. అన్నతో కలిసి నడుస్తూ వాగులు దాటి స్కూల్కు వెళ్లేవాడిని. అలా మా గ్రామం నుంచి 15మంది ఉండేవాళ్లు. తిరిగి వచ్చేటప్పుడు మధ్యలో చెట్ల కింద కూర్చొని చదువుకునేవాళ్లం. అమ్మనాన్నది వ్యవసాయ కుటుంబమైనా మమ్ముల్ని చదువులో ప్రోత్సహించేవాళ్లు. అయితే, స్కూల్ దూరం కావడంతో ఇబ్బందిగా ఉందని కిన్నెరసాని గురుకులంలో చేర్పించారు. అక్కడ పదో తరగతి వరకు, భద్రాచలంలో ఇంటర్ పూర్తి చేసి అశ్వారావుపేటలో ఏజీబీఎస్సీ చదివాక ఉద్యోగం సాధించా. మా అన్నయ్య వెంకటేశ్వర్లు ఉన్నత విద్య పూర్తిచేసి సింగరేణిలో జీఎంగా పనిచేస్తున్నారు. అమ్మానాన్న ప్రోత్సాహంతో హాస్టళ్లలో ఉండి చదువుకోవడంతో ఈ స్థాయికి చేరాం. – ధనసరి పుల్లయ్య, డీఏఓ, ఖమ్మం -
ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో..
మాది సూర్యాపేట జిల్లా గోపాలపురం. వ్యవసాయ కుటుంబానికి చెందిన అమ్మానాన్నలు కృష్ణారెడ్డి – పద్మకు నేను, అన్నయ్య సంతానం. 10వ తరగతి వరకు తెలుగు మీడియంలోనే చదు వుతూ అన్నయ్యతో పాటు స్కూల్కి వెళ్లగా, ఉపాధ్యాయులు సత్యనారాయణ, సైదులు ప్రభావం నాపై ఎంతో ఉంది. ఎనిమిదో తరగతి నుంచి ఊరికి ఐదు కి.మీ. దూరాన పాఠశాలకు సైకిల్పై వెళ్లేవాళ్లం. పదో తరగతి తర్వాత సివిల్స్ను లక్ష్యంగా ఎంచుకున్నప్పటికీ నాన్న కోరికతో ఇంటర్లో బైపీసీ ఇంగ్లిష్ మీడియం చదివి, ఎంబీబీఎస్ పూర్తిచేశా. ఆపై పీజీ అనంతరం 2018లో ప్రభుత్వ వైద్యుడిగా ఎంపి కయ్యా. తొలి పోస్టింగ్ భద్రాచలంలో రాగా, ఇక్కడే సూపరింటెండెంట్ స్థాయికి చేరా. మా ఊరిలో మొదటి వైద్యుడిని నేనే. నన్ను ప్రోత్సహించిన నాన్న, అన్నయ్యతో పాటు ఉపాధ్యాయులకు రుణపడి ఉంటా. – డాక్టర్ రాజశేఖర్రెడ్డి, భద్రాచలం ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ -
మోదీ నేతృత్వాన 12ఏళ్లుగా సుపరిపాలన
ఖమ్మం మామిళ్లగూడెం: గత 12ఏళ్లుగా ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో వర్ధిల్లుతుండగా ప్రజలకు సుపరిపాలన అందుతోందని బీజేపీ రాష్ట్ర కోశాధికారి దేవకి వాసుదేవరావు వెల్లడించారు. ఖమ్మంలో శనివారం ఏర్పాటుచేసిన సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావుతో కలిసి ఆయన మాట్లాడారు. జిల్లాలో మహిళలు, శిశువులు, దివ్యాంగుల సాధికారత కోసం కేంద్రం పెద్దపీట వేసిందని తెలిపారు. సప్లిమెంటరీ న్యూట్రిషన్ ప్రోగ్రామ్ ద్వారా 52,243 మందికి పౌష్టికాహారం అందించగా, ఆరోగ్యలక్ష్మి పథకం ద్వారా 12,291 మంది గర్భిణులు, బాలింతలకు లబ్ధి జరిగిందని చెప్పారు. అలాగే, జాతీయ ఆహార భద్రతా చట్టం కింద జిల్లాలో 4.68 లక్షల కార్డుదారులకు బియ్యం పంపిణీ జరుగుతోందని వివరించారు. ఇవికాక ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద 70వేలకు మందికి పైగా మహిళలకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు అందాయని తెలిపారు. ఈ సమావేశంలో బీజేపీ నాయకులు డాక్టర్ గొంగూర వెంకటేశ్వర్లు, రుద్ర ప్రదీప్, రాలింగేశ్వరావు ,గుత్తా వెంకటేశ్వర్లు, నకిరకంటి వీరభద్రం, రవిరాథోడ్, రవిగౌడ్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. -
ఓటు హక్కు అత్యంత కీలకం
● అందరూ ఎన్యుమరేషన్ ఫారాలు సమర్పించాలి ● కలెక్టర్ దివాకర టీ.ఎస్.ఖమ్మం సహకారనగర్: ప్రజాస్వామ్యంలో అత్యంత విలువైన ఓటు హక్కు కోల్పోకుండా చూడడమే యంత్రాంగం లక్ష్యమని కలెక్టర్ దివాకర టీ.ఎస్. తెలిపారు. కలెక్టరేట్లో శనివారం ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్), ప్రత్యామ్నాయ పంటల సాగు తదితర అంశాలపై మాట్లాడారు. రాష్ట్రంలో 24ఏళ్ల తర్వాత ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ జరుగుతోందని చెప్పారు. ఈమేరకు 2002 నాటి ఓటరు జాబితాతో ప్రస్తుత ఓటరు జాబితాను మ్యాపింగ్ చేయగా జిల్లాలో 80 శాతం ఓటర్లు లింక్ అయ్యారని తెలిపారు. అయితే, ఇందులో 30 శాతం మంది పేర్లలో తేడాలు ఉన్నందున క్షేత్రస్థాయిలో మరోసారి పరిశీలించి ధ్రువీకరిస్తామన్నారు. ఈనెల 25 నుంచి వచ్చే నెల 24 వరకు బూత్ స్థాయి అధికారులు ఇంటింటి సర్వేకు రానుండగా ఓటర్లు తప్పక ఎన్యుమరేషన్ ఫారాలు సమర్పించాలని సూచించారు. లేనిపక్షంలో ఓరు హక్కు కోల్పోయే అవకాశం ఉంటుందని తెలిపారు. మ్యాపింగ్ కాని ఓటర్లు ఎన్యుమరేషన్ ఫారంతో పాటు ఎన్నికల సంఘం ఆమోదించిన 11 గుర్తింపు పత్రాల్లో ఏదైనా ఒకటి అందజేయాలని చెప్పారు. 1987 జూలై 1కు ముందు దేశంలో జన్మించిన వారు స్వీయ గుర్తింపు లేదా జనన ఆధార పత్రాలు సమర్పిస్తే సరిపోతుందని, 1987 జూలై 1నుంచి 2004 డిసెంబర్ 2వ తేదీ మధ్య జన్మించిన వారు ఆ పత్రాలతో పాటు తండ్రి లేదా తల్లి ఒకరి జనన లేదా గుర్తింపు పత్రం సమర్పించాలని వెల్లడించారు. ఇక 2004 డిసెంబర్ 2వ తేదీ తర్వాత జన్మించిన వారైతే తమ పత్రాలతో పాటు తల్లిదండ్రుల ఇద్దరి పత్రాలు సమర్పించాలని కలెక్టర్ సూచించారు. ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి ఈ సీజన్లో వరి సాగు విస్తీర్ణాన్ని కొంత మేర తగ్గించి రైతులను ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లించే ప్రయత్నాలు చేస్తున్నామని కలెక్టర్ దివాకర పేర్కొన్నారు. ఈ ఏడాది వర్షపాతం తక్కువగా నమోదయ్యే అవకాశం ఉన్నందున, కాల్వల చివరి ఆయకట్టు ప్రాంతాలు, బోర్వెల్ ఆధారిత గ్రామాల్లో వరి సాగు చేస్తే కీలక దశలో ఇబ్బంది అవుతుందని తెలిపారు. ఈమేరకు రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించేలా విస్తృత అవగాహన కల్పించనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
‘విత్తు’తో చిత్తు కాకుండా..
● జిల్లాలో తనిఖీలకు 21 బృందాలు ● పోలీసు, వ్యవసాయ శాఖల అధికారులతో ఏర్పాటు ● పంటల సాగుకు సిద్ధమవుతున్న రైతాంగంఖమ్మంవ్యవసాయం: వానాకాలం పంటల సాగుకు రైతులు సిద్ధమవుతున్నారు. ఈనేపథ్యాన సాగులో కీలకమైన విత్తనాలు విషయంలో అన్నదాతలు మోసపోకుండా అధికార యంత్రాంగం అన్ని చర్యలు తీసుకుంటోంది. గతంలో జిల్లాలోని పలు గ్రామీణ ప్రాంతాల్లో దళారులు అధిక దిగుబడుల పేరిట నకిలీ విత్తనాలు అమ్మిన ఘటనలు వెలుగు చూశాయి. అయితే, అమాయక రైతులు వీటిని కొనుగోలు చేశాక.. పూత, కాత సమయాన అసలు విషయం బయటపడుతుండగా ఏమీ చేయలేని పరిస్థితి ఎదురవుతోంది. ఈనేపథ్యాన ముందుగానే నకిలీలను కట్టడి చేసేలా తనిఖీ కోసం వ్యవసాయ, పోలీసు శాఖల ఉద్యోగులతో టాస్క్ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేశారు. నిరంతర తనిఖీలు జిల్లాలోని 21 మండలాలకు గాను ఒక్కో టాస్క్ఫోర్స్ బృందాన్ని ఏర్పాటుచేశారు. ఈ బృందానికి మండల వ్యవసాయాధికారి, పోలీసు ఎస్సై నేతృత్వం వహించనుండగా, ఏఈఓలు, ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లతో కలిసి విత్తన షాపుల్లోనే కాక గ్రామాల్లో తనిఖీలు చేపడుతారు. తద్వారా షాపుల్లో అనుమతి లేని విత్తనాలు అమ్మకుండా కట్టడి చేయనున్నారు. అంతేకాక గ్రామాలకు వచ్చి లూజ్గా అమ్మే వారి విత్తనాలు కొనకుండా రైతులకు అవగాహన కల్పిస్తారు. మార్కెట్లోకి పత్తి విత్తనాలు వానాకాలంలో మొదటగా సాగు చేసే పంటల్లో పత్తి ఒకటి. జిల్లాలో ఈ వానాకాలం 2.69 లక్షల ఎకరాల్లో పత్తి సాగయ్యే అవకాశముందని అంచనా వేశారు. ఇందుకోసం 6.74 లక్షల ప్యాకెట్ల విత్తనాలు అవసరం కాగా, ఇందులో వివిధ కంపెనీలకు చెందిన 4లక్షలకు పైగా ప్యాకెట్లు సిద్ధంగా ఉన్నాయి. అయితే పత్తి విత్తనాల్లో బీటీ –2 విత్తనాలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వగా, బీటీ–3 విత్తనాలను నిషేధించింది. అయినా కొందరు అధిక దిగుబడుల పేరిట బీటీ–3 పత్తి విత్తనాల విక్రయానికి సిద్ధమవుతున్నట్లు తేలింది. సరిహద్దుగా ఉన్న ఏపీ రాష్ట్రంలోని గుంటూరు ప్రాంతం నుంచి అక్రమార్కులు కొందరు నకిలీ విత్తనాలను అమ్మేందుకు జిల్లాను ఎంచుకున్నట్లు గతంలో బయటపడింది. వీరు నిషేధిత బీటీ–3 విత్తనాలను గుడ్డ సంచుల్లో 750 – 800 గ్రాముల చొప్పున అమ్మే అవకాశం ఉందన్న సమాచారంతో అధికారులు విస్తృత తనిఖీలు చేస్తూనే రైతులకు అవగాహన కల్పించడంలో నిమగ్నమయ్యారు.పంట సాగులో విత్తనాలే కీలకమైనందున నకిలీలు మార్కెట్లోకి రాకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నాం. జిల్లాలోని 21 మండలాల్లో టాస్క్ఫోర్స్ బృందాలను ఏర్పాటుచేశాం. వ్యాపారులు ఎవరైనా మోసాలకు పాల్పడితే చట్టప్రకారం చర్యలు తీసుకుంటాం. రైతులు కూడా లైసెన్స్డ్ డీలర్ల వద్దే విత్తనాలు కొనుగోలు చేసి పంట కాలం పూర్తయ్యే వరకు రశీదులు భద్రపర్చుకోవాలి. – ధనసరి పుల్లయ్య, జిల్లా వ్యవసాయాధికారి -
శిథిలం.. ఇక గతం!
● తహసీళ్లు, రిజిస్ట్రార్ కార్యాలయాలకు త్వరలోనే సొంత భవనాలు ● పలుచోట్ల రూపు కోల్పోయిన తహసీల్దార్ ఆఫీసులు ● అద్దె భవనాల్లో పలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ● వీటి స్థానంలో నిర్మాణాలకు నిర్ణయంసాక్షి ప్రతినిధి, ఖమ్మం: జిల్లాలోని రెవెన్యూ, సబ్రిజిస్ట్రార్ కార్యాలయాలు నూతన శోభ సంతరించుకోనున్నాయి. సొంత భవనాలు లేని, శిథిలావస్థకు చేరినవే కాక సౌకర్యాలు లేని కార్యాలయాల స్థానంలో కొత్తవి నిర్మించనున్నారు. ఈ విషయమై ఇటీవల రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటన చేసిన నేపథ్యాన త్వరలోనే కొత్త భవనాలకు మోక్షం లభించనుంది. జిల్లాలోని పలు మండలాల తహసీల్దార్ కార్యాలయాలు శిథిలావస్థకు చేరాయి. అలాగే, జిల్లా రిజి స్ట్రార్ కార్యాలయంతోపాటు చిట్ రిజిస్ట్రార్ కార్యాలయం, ఖమ్మం జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం, ఇంకొన్ని కార్యాలయాలకు సొంత భవనాలు లేవు. మంత్రి ప్రకటన నేపథ్యాన అధికారులు ఈ రెండు శాఖల్లో సొంత భవనాలు లేని, శిథిలావస్థకు చేరిన వాటి నివేదిక సిద్ధం చేస్తున్నారు. ఏళ్ల నాటి కార్యాలయాలు.. తహసీల్దార్ కార్యాలయాలన్నీ ప్రభుత్వ భవనాలే అయినా, వీటిలో పలు భవనాలను నిర్మించి దశాబ్దాలు గడిచిపోయింది. కొన్ని కార్యాలయాలైతే నిజాం కాలంలో నిర్మించవే కొనసాగుతున్నాయి. మధిర తహసీల్ను 1935 ఏడాదిలో నిర్మించారు. ఖమ్మంఅర్బన్ కార్యాలయానికి కూడా వందేళ్లు నిండాయి. ఇక వైరాలో తహసీల్దార్ కార్యాలయం శిథిలావస్థకు చేరగా ఇటీవల మరమ్మతులు చేశారు. పెనుబల్లిలో 25ఏళ్ల క్రితం నిర్మించిన భవనం ప్రస్తుత అవసరాలకు సరిపోవడం లేదు. సత్తుపల్లి తహసీల్ను 1974లో ముఖ్యమంత్రిగా జలగం వెంగళరావు ఉన్నప్పుడు నిర్మించారు. ఈ రెండు కార్యాలయాలు వర్షం వస్తే కురుస్తున్నాయి. కామేపల్లి తహసీల్ సైతం శిథిలావస్థకు చేరగా, ఎర్రుపాలెం తహసీల్దార్ కార్యాలయాన్ని 35 ఏళ్ల క్రితం నిర్మించారు. ఎర్రుపాలెంలో సమీకృత మండల కార్యాలయాల నిర్మాణానికి నిధులు మంజూరైనా పనులు మొదలుకాలేదు. అద్దె భవనాల్లో అవస్థలు ఉమ్మడి జిల్లాలో జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంతోపాటు 11 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. వీటిలో కొన్ని ఏళ్ల తరబడి అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. మధిర, సత్తుపల్లి, భద్రాచలం, కొత్తగూడెం, బూర్గంపాడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు ప్రభుత్వ భవనాలు ఉన్నాయి. జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంతోపాటు చిట్ రిజిస్ట్రార్, ఖమ్మం జాయింట్ సబ్ రిజిస్ట్రార్, ఖమ్మంరూరల్, కూసుమంచి, వైరా, కల్లూరు, ఇల్లెందు సబ్ రిజిస్ట్రార్ కార్యకలాపాలను అద్దె భవనాల్లోనే నిర్వర్తిస్తున్నారు. ఖమ్మం రూరల్తోపాటు ఖమ్మం జిల్లా రిజిస్ట్రార్, ఖమ్మం జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల నిర్మాణానికి పోలేపల్లి వద్ద భూమి కేటాయించారు. ఇందులో ఖమ్మంరూరల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం నిర్మాణానికి శంకుస్థాపన కూడా చేశారు. అవసరమైన చోట సొంతభవనాలు.. అద్దె భవనాల్లో కొనసాగుతున్నవి, శిథిలమైన రెవెన్యూ, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల స్థానాన శాశ్వత భవనాలు రానున్నాయి. ఈ విషయమై ఇటీవల నిర్వహించిన సమీక్షలో మంత్రి పొంగులేటి వెల్లడించగా... అద్దె భవనాల్లో ఎన్ని కొనసాగుతున్నాయి.. శిథిలావస్థకు చేరుకున్నవి, పాలనకు అనువుగా లేని భవనాల వివరాలు సేకరించారు. జిల్లాలో పూర్తిగా శిథిలమైన భవనాల స్థానంలో కొత్తవి నిర్మించనుండగా, బాగున్నవైతే అవసరమైన మరమ్మతులు చేయనున్నారు. ప్రతిపాదనల ఆధారంగా ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు కాగానే నిర్మాణానికి శ్రీకారం చుడతారు.జిల్లాలోని 21 మండలాల్లోని తహసీల్దార్ కార్యాలయాలు, ఖమ్మం, కల్లూరు ఆర్డీఓ కార్యాలయాలు సొంత భవనాల్లోనే కొనసాగుతున్నాయి. అయితే, పలు కార్యాలయాలు పూర్తిగా శిథిలావస్థకు చేరాయి. స్లాబ్ పెచ్చులూడుతూ, చువ్వలు తేలి కనిపిస్తున్నాయి. వర్షాకాలంలో ఉద్యోగులు భయం గుప్పిట్లో విధుల్లో నిర్వర్తించాల్సి వస్తోంది. ఇందులో తిరుమలాయపాలెం తహసీల్ మరీ అధ్వానంగా మారడంతో ఖాళీ చేసి అద్దె భవనంలోకి మార్చారు. -
స్కెచ్ విజయవాడలో..
● అక్కడ సాధ్యం కాక ఖమ్మంలో చోరీ ● సోనోవిజన్ చోరీపై ముమ్మరంగా దర్యాప్తు ఖమ్మంలో గత నెల జరిగిన భారీ బంగారం చోరీ కేసులో త్రీటౌన్ పోలీసులు పురోగతి సాధించినట్లు తెలిసింది. మే 20వ తేదీన నగల వ్యాపారి వంకాయల కార్తీక్ ద్విచక్రవాహనానికి తగిలించిన రూ.50లక్షలకు పైగా ఆభరణాలు ఉన్న బ్యాగ్ను నిందితులు ఎత్తుకెళ్లారు. ఈమేరకు విచారణలో భాగంగా నిందితులు కర్ణాటకలోని బీదర్ ప్రాంతానికి చెందిన గ్యాంగ్గా గుర్తించినట్లు తెలిసింది. దీంతో అక్కడకు వెళ్లిన పోలీసులు గ్యాంగ్లోని ముఖ్యులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. త్వరలో భారీ చోరీ కేసు మిస్టరీ వీడే అవకాశముందని పోలీసు వర్గాల ద్వారా తెలిసింది.ఖమ్మంక్రైం: ఖమ్మం వైరారోడ్డులో సోనోవిజన్ షోరూమ్లో రూ.66లక్షలకు పైగా విలువైన సెల్ఫోన్ల చోరీ ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈనెల 11న తెల్లవారుజామున చోరీ జరగగా అన్ని కోణాల్లో ఆరా తీస్తున్న పోలీసులు ప్రధానంగా సీసీ కెమెరాల పుటేజీ ఆధారంతో ముందుకు సాగుతున్నట్లు తెలిసింది. ఈ విచారణ క్రమంలో ఇప్పటికే కీలకమైన అంశాలను గుర్తించినట్లు సమాచారం. అనుకూలంగా లేదని.. దొంగల ముఠా తొలుత విజయవాడలోని సోనోవిజన్ షోరూమ్లో భారీ చోరీకి ప్రణాళిక రూపొందించినట్లు తెలిసింది. అయితే, అది ప్రధాన షోరూం కావడం, సెక్యూరిటీ పటిష్టంగా ఉండడంతో తమ ప్రయత్నం విరమించుకున్నట్లు సమాచారం. ఆపై ఖమ్మం షోరూంను ఎంచుకుని దోపిడీ చేసినట్లు తెలుస్తోంది. ఈనేపథ్యాన శనివారం పోలీసులు విజయవాడ వెళ్లి అక్కడి షోరూంతో పాటు సమీప షాపుల్లో సీసీ ఫుటేజీ పరిశీలించినట్లు సమాచారం. టోల్గేట్లు టచ్ కాకుండా.. విజయవాడ నుంచి ఖమ్మం వచ్చే క్రమాన ముఠా సభ్యులు టోల్ గేట్ల మీదుగా కాకుండా ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకున్నట్లు తెలిసింది. టోల్గేట్ల నుంచి వస్తే సులువుగా ఆచూకీ తెలుస్తుందనే భావనతో నందిగామ, కోదాడ హైవే కాకుండా బోనకల్ మీదుగా ఖమ్మం చేరుకున్నారని పోలీసులు గుర్తించినట్లు సమాచారం. తద్వారా ముఠా సభ్యులు ఈ ప్రాంత రహదారులపై ముందుగానే అధ్యయనం చేసి ఉంటారని తెలుస్తోంది. సరిహద్దు దాటేశారా? ఖమ్మంలో సెల్ఫోన్లు చోరీ చేసిన నిందితులు ప్రయాణించిన కారుకు అసలు నంబర్ ప్లేట్ కాకుండా నకిలీది అమర్చినట్లు తెలిసింది. చోరీ జరిగిన రోజే కారు నంబర్ ఆధారంగా పోలీసులు ఆరా తీస్తే ఆ నంబర్ గుంటూరులో రిజిస్టర్ కాగా, నిందితులు వచ్చింది వేరే కారు అని తేలినట్లు సమాచారం. దీంతో నంబర్ ప్లేట్లు మారుస్తూ నిందితులు రాష్ట్రాల సరిహద్దులు దాటి ఉండొచ్చనే అంచనాకు వచ్చారు. ఈమేరకు ఖమ్మం నగర, సీసీఎస్ ఏసీపీలు రమణమూర్తి, సర్వర్ ఆధ్వర్యాన ప్రత్యేక బృందాలు దర్యాప్తు ముమ్మరం చేయగా... అనుమానం ఉన్న అన్ని మార్గాల్లోని సీసీ టీవీల పుటేజీలను జల్లెడ పడుతున్నట్లు తెలిసింది. -
వనరులున్నా.. ప్రణాళిక లేక..
● ఆదాయం కోల్పోతున్న భద్రాచలం ఆర్టీసీ డిపో ● డ్రైవర్ల కొరతతో క్రమంగా తగ్గిపోతున్న సర్వీసులు ● సరిహద్దు ప్రాంతాల నుంచి ఇతర రాష్ట్రాల సర్వీసులు.. ● పదుల సంఖ్యలో సర్వీసులతో సొమ్ము చేసుకుంటున్న ప్రైవేట్ ట్రావెల్స్ భద్రాచలం: వనరులు ఉన్నా సిబ్బంది కొరత వల్ల భద్రాచలం ఆర్టీసీ డిపో ఆదాయం కోల్పోతోంది. దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలాన్ని అంతర్రాష్ట్ర డిపోగా మార్చాలనే డిమాండ్ ప్రతిపాదనలకే పరిమితమవుతోంది. మరో వైపు ఒడిశా, ఛత్తీస్గఢ్ల నుంచి భద్రగిరి మీదుగా బస్సుల ను తిప్పుతూ ప్రైవేటు ట్రావె ల్స్ సొమ్ము చేసుకుంటున్నా యి. కాగా, ముక్కోటి, శ్రీరామ నవమి ఉత్సవాలే డిపోకు శ్రీరామరక్షగా మారాయి. సరిహద్దు ఏపీకి ఆ రాష్ట్ర సర్వీసులే విభజనకు ముందు భద్రాచలం డిపో ఉమ్మడి రాష్ట్రంలోనే ఆదాయంలో ముందుండేది. 9 మండలాలతో కళకళలాడేది. ఇక్కడి నుంచి కుక్కునూరు, చర్ల, వెంకటాపురం, వాజేడు, పేరూరు, కూనవరం, రేకపల్లి, చింతూరు ప్రాంతాలకు నిత్యం ఎర్ర బస్సులు తిరిగేవి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల విభజనతో పరిస్థితి తారుమారైంది. ఉద్యోగుల బదలాయింపుతోపాటు సర్వీసులు కుదించారు. దీంతో రేకపల్లి, చింతూరు, కుక్కునూరు సర్వీసులను ఎత్తివేశారు. రాజమండ్రి వైపు వెళ్లే సర్వీసులను తగ్గించారు. ఇదే అవకాశంగా ఆంధ్రప్రదేశ్లోని గోకవరం తదితర డిపోల నుంచి సర్వీసులు పెంచి ఏపీఎస్ఆర్టీసీ ఆదాయం పొందుతోంది. డ్రైవర్ల కొరతతో ఇక్కట్లు ముక్కోటి, శ్రీరామనవమి రోజుల్లో ఆదాయం వస్తుండటంతో భద్రాచలం డిపో లాభాల్లో నడుస్తోంది. ఉత్సవాల సమయంలో మినహా మిగతా రోజుల్లో నష్టాలు వచ్చే పరిస్థితి ఉంది. డిపోలో డ్రైవర్ల కొరత తీవ్రంగా వేధిస్తోంది. ప్రస్తుతం డిపోలో 107 బస్సులు సర్వీసులు ఉన్నా మరమ్మతుల నేపథ్యంలో 103 సర్వీసులు మాత్రమే ప్రజలకు అందుబాటులో ఉంటున్నాయి. వీటికి 225 మంది డ్రైవర్లు, సిబ్బంది ఉండాల్సి ఉండగా, కేవలం 193 మంది మాత్రమే ఉన్నారు. 32 మంది లోటుతో సర్వీసులు నడపాల్సివస్తోంది. దీంతో డ్రైవర్లతో డబుల్ డ్యూటీలు చేయిస్తున్నారు. కాంట్రాక్ట్ డ్రైవర్లకు జిల్లాలోనే విధులు కేటాయించాలని నిబంధనలు ఉండటంతో సమస్య మరింత ఎక్కువైంది. ఈ క్రమంలో సర్వీసులను రద్దు చేస్తూ ఆర్టీసీ ప్రజలకు దూరమవుతోంది. బస్సుల పెంపుపై దృష్టిసారించాల్సిన ఆర్టీసీ.. ఖాళీ స్థలాల్లో షాపింగ్ కాంప్లెక్స్ల నిర్మాణం, దుకాణాలు అద్దెకు ఇవ్వటంపై చొరవ చూపడం గమనార్హం. భద్రాచలం, ఒడిశాల మధ్య బస్సులు తిప్పేందుకు మళ్లీ సర్వే నిర్వహిస్తాం. సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సరిహద్దు, ఇతర రాష్ట్రాలకు బస్సులు నడిచేలా చర్యలు తీసుకుంటాం. డ్రైవర్ల పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. –జంగయ్య, డిపో మేనేజర్, భద్రాచలంభద్రాచలం పుణ్యక్షేత్రానికి వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు వస్తుంటారు. సరిహద్దు ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాల నుంచి ప్రజల రాకపోకలు ఎక్కువగా ఉంటాయి. వీటితోపాటు తమిళనాడు, కర్ణాటక వంటి రాష్ట్రాలకు కూడా సర్వీసులను విస్తరించే అవకాశం ఉంది. ఆ దిశగా ఆర్టీసీ కనీసం ప్రణాళికలు రూపొందించలేదు. రెండేళ్ల క్రితం తెలంగాణ, ఒడిశా రాష్ట్రాల నడుమ బస్సులు నడపాలని ఒప్పందం కుదుర్చుకున్నా అమల్లోకి రాలేదు. మరో వైపు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు నిత్యం పదుల సంఖ్యలో తిరుగుతున్నాయి. ఏసీ, స్లీపర్ వంటి అధునాతన సౌకర్యాలతో సుమారు 10 బస్సులు భద్రాచలం మీదుగా ఒడిశాకు వెళ్తున్నాయి. ఆ రాష్ట్ర ప్రభుత్వ సర్వీస్ సైతం భద్రాచలం వస్తోంది. ఛత్తీస్గఢ్ నుంచీ రోజూ పదుల సంఖ్యలో ప్రైవేట్ వాహనాలు, వైద్య, వాణిజ్య కేంద్రమైన భద్రాచలానికి ప్రయాణాకులను తరలిస్తున్నాయి. భద్రాచలం డిపో నుంచి బస్సులు లేకపోవడంతో ఇతర రాష్ట్రాల డిపోలు, ప్రైవేట్ ట్రావెల్స్ ఆదాయం దండుకుంటున్నాయి. ఇప్పటికై నా తెలంగాణ ప్రభుత్వం భద్రాచలాన్ని అంతర్రాష్ట్ర డిపోగా ఏర్పాటుచేయడమే కాక సర్వీసులు, సిబ్బందిని పెంచాలని ప్రయాణికులు కోరుతున్నారు. -
అటవీ అధికారుల తీరు సరికాదు
సత్తుపల్లిటౌన్: సత్తుపల్లిలోని గుడిపాడులో 25ఏళ్లుగా పోడు వ్యవసాయం చేసుకుంటున్న గిరిజనులకు పూర్తిస్థాయిలో పట్టాలు ఇవ్వకుండా అటవీ అధికారులు ఏటా అడ్డుకోవడం సరికాదని పీఓడబ్ల్యూ రాష్ట్ర మాజీ కార్యదర్శి చండ్ర అరుణ పేర్కొన్నారు. గుడిపాడులో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. అటవీ అధికారులు ప్రతీ సీజన్లో పోడుదారులు, మహిళలపై దాడులు చేస్తున్నారని తెలిపారు. ఇకనైనా సర్వే చేసి పట్టాలు ఇవ్వడమే కాక ఆదివాసీ గిరిజనులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో నాయకులు శిరోమణి, ఝాన్సీ, దుర్గా, సరోజిని, పద్మ, నర్సమ్మ, పరిమళ, అమర్లపూడి శరత్, నాగిరెడ్డి, శ్రీనివాసరావు పాల్గొన్నారు. బాధిత కుటుంబానికి రూ.65వేల ఆర్థికసాయం కల్లూరురూరల్: కల్లూరుకు చెందిన దోసపాటి సర్వేశ్వరరావు కుటుంబానికి ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యాన శనివారం రూ.65వేల ఆర్థిక సాయం అందజేశారు. ఇటీవల సర్వేశ్వరరావు భార్య సుజాత మృతి చెందగా, నిరుపేద కుటుంబం కావడంతో సంఘం ఆధ్వర్యాన విరాళాలు సేకరించారు. ఆర్యవైశ్య మహాసభ జిల్లా, మండల అధ్యక్షులు పసుమర్తి చందర్రావు, అనుములు శ్రీనుతో పాటు దోసపాటి కృష్ణార్జున్రావు, నాళ్ల శ్రీనివాసరావు, రాచమళ్ల నాగేశ్వరరావు, దోసపాటి శ్రీనివాసరావు, పసుమర్తి రాంబాబు, చారుగుండ్ల సందీప్, ఎస్.పుల్లారావు పాల్గొన్నారు. అసోసియేషన్ల వివరాలు సమర్పించాలి ఖమ్మం స్పోర్ట్స్: హ్యాండ్బాల్ అసోసియేషన్ ఎన్నికల నిర్వహణకు గాను మండలాల వారీగా వివరాలను ఈనెల 16వ తేదీలోగా అందజేయాలని ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి సూచించారు. జాబితాలను పరిశీలించాక ఎన్నికల తేదీలను ప్రకటిస్తామని వెల్లడించారు. ఈమేరకు వివరాల కోసం 73966 69337 నంబర్లో సంప్రదించాలని ఓ ప్రకటనలో సూచించారు. వైద్యుల నిర్లక్ష్యం ఘటనపై విచారణ తిరుమలాయపాలెం: తిరుమలాయపాలెం సీహెచ్సీలో ఓ వృద్ధుడి చికిత్స సమయాన వైద్యుల నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆయన కుటుంబీకులు రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు పోలీసులకు శుక్రవారం ఫిర్యాదు చేశారు. దీంతో శనివారం డీసీహెచ్ఎస్ డాక్టర్ రాజశేఖర్గౌడ్ ఆస్పత్రిలో విచారణ చేపట్టారు. తిరుమలాయపాలెంకు తూమాటి కాంతయ్యకు వైద్యం చేసిన డాక్టర్ ప్రవీణ్కుమార్తో పాటు ఆస్పత్రి సూపరింటెండెంట్ కృపా ఉషశ్రీ ద్వారా వివరాలు సేకరించారు. అనంతరం వైద్యులు, సిబ్బందితో సమావేశమైన ఆయన మాట్లాడుతూ నిర్లక్ష్యం వహించకుండా ఆస్పత్రికి వచ్చే వారికి మెరుగైన సేవలు అందించాలని ఆదేశించారు. తెలుగును సరళతరం చేస్తే కలకాలం మనుగడ ఖమ్మం మామిళ్లగూడెం: కలకాలం నిలిచేలా తెలుగును మరింత సులభతరం చేసేలా లిపి రూపొందించినట్లు కొణిజర్ల మండలం బస్వాపురం ఎంిపీపీఎస్ ఉపాధ్యాయుడు చంద్రగిరి వెంకటేశ్వర్లు వెల్లడించారు. ఖమ్మంలో శనివారం ఆయన మాట్లాడుతూ ఇసుక దిబ్బలు, తాళపత్ర గ్రంథాలు, శిల్పాలపై చెక్కిన ప్రతీ సందర్భంలోనూ పూర్వీకులు లిపిని సరళం చేస్తూ వచ్చారని తెలిపారు. ఈక్రమాన రేపటి డిజిటల్ యుగం అవసరాలకు అనుగుణంగా అక్షరాలను సంస్కరించి తెలుగు ఎన్నటికీ వెలిగేలా లిపిలో మార్పులు చేశానని పేర్కొన్నారు. ప్రధానంగా ఒత్తులు గుర్తు పెట్టుకోవడంలో నేటి తరం ఇబ్బందుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. -
రక్తబంధం !
ఖమ్మం మయూరిసెంటర్: రక్తాన్ని పంచుకోవడానికి ఒకే కడుపున పుట్టాల్సిన పనిలేదు.. ఒక ప్రాణాన్ని నిలపాలనే మంచి మనసుంటే చాలు అని నిరూపిస్తున్నారు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన యువత. స్వార్థం లేకుండా, ఎవరనే పరిచయం లేకుండా.. కేవలం శ్వాస ఆగిపోవద్దనే సంకల్పంతో వారు తమ రక్తాన్ని ధారపోస్తున్నారు. ప్రమాదాల్లో మృత్యువుతో పోరాడే క్షతగాత్రులు, కాన్పుల సమయంలో కొట్టుమిట్టాడే తల్లులకే కాదు.. మా ఆయుష్షు పెంచండి అన్నా అంటూ ఆశగా ఎదురుచూసే వందలాది తలసేమియా చిన్నారులకు నడిసొచ్చే సంజీవనిలా మారుతున్నారు. ఆపదలో ఉన్నారనే కబురు అందితే చాలు.. పనులన్నీ పక్కనబెట్టి పరుగున ఆస్పత్రులకు వెళ్లి ప్రాణదాతలుగా నిలుస్తున్నారు. వాట్సాప్ వేదికగా.. ప్రాణాల రక్షణ! రక్తదానం విలువ తెలిసిన ఉమ్మడి జిల్లాలోని పలువురు యువకులు గ్రూపులుగా ఏర్పడి నెట్వర్క్ను బలోపేతం చేసుకున్నారు. పోలీసు శాఖ, మిసైల్ మ్యాన్ హెల్పింగ్ హ్యాండ్స్ (ఎంఎంహెచ్), యువ భారత్ శక్తి, జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్, యువజన చేయూత(టేకులపల్లి), హెల్పింగ్ హ్యాండ్స్ ఫర్ ద పీపుల్, బ్లడ్ డోనర్స్ గ్రూప్, మధిర స్విమ్మర్ అసోసియేషన్, కొత్తగూడెం బ్లడ్ డోనర్స్, చేగువేరా బ్లడ్ డోనర్స్, ఖమ్మం వాకర్స్ గ్రూప్ వంటి బృందాలు వాట్సాప్ ద్వారా సమాచారాన్ని వేగంగా చేరవేస్తున్నాయి. ఎక్కడ, ఏ గ్రూప్ రక్తం ఎవరికి అవసరమున్నా క్షణాల్లో స్పందించి వాలిపోతున్నారు. ప్రతీ మూడు నెలలకోసారి క్రమం తప్పకుండా బ్లడ్ బ్యాంక్ల్లో రక్తదానం చేస్తూ సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో దాదాపు 300 మందికి పైగా తలసేమియా చిన్నారులు నిశ్చింతగా ఉండడానికి రక్తదాతల సహకారమే కారణమని స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు, వైద్యులు చెబుతున్నారు. మరోవైపు సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థ, రెడ్క్రాస్ సొసైటీ తదితర సంస్థలు గ్రామీణ ప్రాంతాల యువతను రక్తదానం వైపు నడిపించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి.రక్తం దొరకక అల్లాడిపోతున్న తలసేమియా చిన్నారుల కోసం రక్తదాతలు మేమున్నామని ముందుకొస్తున్నారు. వందలాది మంది నిత్యం రక్తదానం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో ఏటా వందలాది క్యాంపులు నిర్వహిస్తూ తలసేమియా చిన్నారులకు అండగా నిలుస్తున్నారు. ప్రతిఫలం ఆశించకుండా, తమ రక్తాన్ని పంచి పరాయి ప్రాణాన్ని కాపాడుతున్న ఈ రుధిర దాతలంతా ‘సలాం’అనిపించకుంటున్నారు. వీరి స్ఫూర్తిగా తీసుకుని ప్రతిఒక్కరూ రక్తదానానికి ముందుకు రావాలని వైద్యులు, స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు కోతున్నారు.నేడు ప్రపంచ రక్తదాతల దినోత్సవం ఆపదలో ఉన్న వారికి రక్తదానం చేయడం అలవాటుగా మార్చుకున్నా. తలసేమియా చిన్నారుల కోసం దృష్ట్యా ప్రతీ మూడు, నాలుగు నెలలకోసారి రక్తదానం చేస్తున్నా. ఇప్పటి వరకు 30సార్లు రక్తదానం చేశా. సహచర ఉద్యోగులను కూడా ప్రోత్సహిస్తున్నా. – ఎం.సాయిలు, హెడ్ కానిస్టేబుల్, ఖమ్మంనా 19వ ఏట నుంచి రక్తదానం చేస్తున్నాను. నాది ఏ పాజిటివ్ బ్లడ్ గ్రూప్. చికిత్స పొందుతున్న వారికే కాక తలసేమియా చిన్నారులకు సైతం రక్తదానం చేస్తున్నా. ప్రతీ మూడు నెలలకోసారి క్రమం తప్పకుండా ఇప్పటి వరకు 20సార్లు రక్తదానం చేశా. – కె.వంశీ, రక్తదాత, రీచ్ ఫౌండేషన్ సభ్యుడు -
స్కూళ్లు మూసివేసే ఆలోచన విరమించుకోవాలి
ఖమ్మంసహకారనగర్: రాష్ట్రంలో 27వేల పాఠశాలలకు బదులు 4వేలే సరిపోతాయని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటించడం సరికాదని, ఈ ఆలోచనతో ప్రభుత్వ స్కూళ్లను మూసి వేసే వైఖరిని మానుకోవాలని టీపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎస్.విజయ్ సూచించారు. టీపీటీఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు ఎ.మల్లయ్య అధ్యక్షతన ఖమ్మంలో శనివారం జరిగిన జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. హెల్త్ కార్డుల విధివిధానాలు రూపొందించి ట్రస్ట్ను ఏర్పాటు చేయాలని, రిటైర్ అయిన 15 వేలమంది ఉద్యోగ, ఉపాధ్యాయులకు, ఉద్యోగుల పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని కోరారు. అంతేకాక సీపీఎస్ ఉపాధ్యాయుల డీఏ బకాయిలు, హెల్త్ కార్డులపై నగదు రహిత వైద్యంపై స్పందించాలన్నారు. అనంతరం పి.నాగిరెడ్డి, వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి వి.మనోహర్రాజు మాట్లాడుతూ.. సమస్యల పరిష్కారానికి ఉపాధ్యాయులు పోరాటాలకు సిద్ధంగా ఉండాలని కోరారు. ఈ సమావేశంలో టీపీటీఎఫ్ ప్రధాన కార్యదర్శి టి.వెంగళరావు, నాయకులు ముత్తయ్య ,శ్యాంసుందర్, వీరబాబు, వెంకటేశ్వరరావు,,ఉమాదేవి, నాగేశ్వరరావు, యాకూబ్ పాషా, కోటేశ్వరరావు, హన్మంతరావు, రాము తదితరులు పాల్గొన్నారు. కుదింపు ఆలోచన సరికాదు ప్రభుత్వ పాఠశాలలను కుదించాలనే ఆలోచన సరికాదని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు చావా దుర్గాభవాని పేర్కొన్నారు. యూనియన్ జిల్లా కమిటీ సమావేశం జిల్లా అధ్యక్షుడు షేక్ రంజాన్ అధ్యక్షతన నిర్వహించగా ఆమె మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని, ఇందుకోసం ప్రతీ గ్రామపంచాయతీలో ఒక పాఠశాలను ఆదర్శ పాఠశాలగా అభివృద్ధి చేయాలన్నారు. అలాగే, నర్సరీ, కేజీ తరగతులను ప్రవేశపెట్టి ప్రతీ తరగతికి ఒక ఉపాధ్యాయుడిని కేటాయించడమే కాక పాఠ్య, నోట్ పుస్తకాలు, యూనిఫామ్స్ సరఫరా చేయాలని కోరారు. నాయకులు పారుపల్లి నాగేశ్వరరావు, జీ.వీ.నాగమల్లేశ్వరరావు, బుర్రి వెంకన్న, షమీ, వి.రాంబాబు, బి.రాందాస్, డి.నాగేశ్వరరావు, పి.సురేష్, ఉద్దండ్, రామారావు, సుధాకర్, ప్రశాంతి పాల్గొన్నారు.టీపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎస్ విజయ్ -
మా హయాంలోనే సమస్యల పరిష్కారం
ఖమ్మంమయూరిసెంటర్: గ్రామ దీపికల సమస్యలను తమ ప్రభుత్వంలో ఐఎన్టీయూసీ ద్వారా పరిష్కరించుకుంటామని నాయకులు స్పష్టం చేశారు. ఐఎన్టీయూసీ జిల్లాఅధ్యక్షుడు కొత్తా సీతారాములు అధ్యక్షతన శనివారం ఖమ్మంలోని పార్టీ కార్యాలయంలో శనివారం వీఓఏల జిల్లా మహాసభ నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ గౌడ్, సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి మాట్లాడుతూ.. వీఓఏల కనీస వేతనం, ఉద్యోగ భద్రత, ఆరోగ్య భద్రత వంటి దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. సమస్యలను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి సీతక్క దృష్టికి తీసుకెళ్లి వీఓఏలకు న్యాయం జరిగేలా చూస్తామని తెలిపారు. అనంతరం సీతారాములు మాట్లాడుతూ.. కార్మిక లోకానికి అండగా నిలుస్తామని, వీఓఏల సమస్యల పరిష్కారంలో ముందు నిలుస్తామని చెప్పారు. వీఓఏల రాష్ట్ర అధ్యక్షురాలు అరుణ, కాంగ్రెస్ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు సౌజన్య, నాయకులు నరాల నరేష్ మోహన్నాయుడు, పద్మ, తలారి రాములు తదితరులు పాల్గొన్నారు. బీజేపీ కుట్రలను తిప్పికొట్టాలి.. సత్తుపల్లి: ‘సర్’పేరుతో ఓట్ల తొలగింపునకు బీజేపీ చేస్తున్న కుట్రలను తిప్పికొట్టేందుకు కాంగ్రెస్ శ్రేణులు అప్రమత్తంగా వ్యవహరించాలని డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ, ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి సూచించారు. సత్తుపల్లిలో శనివారం జరిగిన బూత్ లెవల్ ఏజెంట్ల శిక్షణలో టీపీసీసీ జనరల్ సెక్రటరీ, నియోజకవర్గ కన్వీనర్ రవిచంద్రతో కలిసి వారు మాట్లాడారు. బీఎల్ఏల అప్రమత్తంగా ఉంటూ ఓటర్లకు అవగాహన కల్పించాలని తెలిపారు. ప్రతీ గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి సంప్రదాయ ఓటు కోల్పోకుండా చూడాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందని చెప్పారు. అనంతరం కాంగ్రెస్ సత్తుపల్లి, వేంసూరు, పెనుబల్లి, కల్లూరు, తల్లాడ మండల అధ్యక్షులుగా నియమితులైన భీమిరెడ్డి సుబ్బారెడ్డి, కాసర్ల చంద్రశేఖర్రెడ్డి, పంది వెంకటేశ్వరరావు, పోట్రు అర్జున్రావు, గొడుగునూరి లక్ష్మీరెడ్డితో పాటు కల్లూరు, సత్తుపల్లి పట్టణ అధ్యక్షులు ఎస్.కే.ఉస్మాన్, గాదె చెన్నకేశవరావుతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు డాక్టర్ మట్టా దయానంద్, దొబ్బల సౌజన్య, ఎం.డీ.రెహానా కమల్పాషా, మోహన్నాయక్, గంగిశెట్టి ప్రసాద్, చల్లగుండ్ల కృష్ణయ్య, వంకాయలపాటి వెంకటేశ్వరరావు, దోమ ఆనంద్, బాగం నీరజ, బొంతు సుమలత, నారాయణవరపు శ్రీనివాస్, చల్లగుళ్ల నర్సింహారావు, ఉడతనేని అప్పారావు తదితరులు పాల్గొన్నారు. డీసీసీ అధ్యక్షుడు సత్యనారాయణ, ఎమ్మెల్యే రాగమయి -
వచ్చేనెల 1నుంచి అమల్లోకి వేతన సవరణ
● ఆర్టీసీ రీజినల్ మేనేజర్ సరిరామ్ ఖమ్మంమయూరిసెంటర్: ఆర్టీసీ కార్మికులు ఏప్రిల్లో చేపట్టిన సమ్మె సమయాన ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుకు అడుగులు పడుతున్నాయని, ఇందులో భాగంగా 2021 వేతన సవరణ వచ్చేనెల 1వ తేదీ నుంచి అమలవుతుందని ఆర్టీసీ ఖమ్మం రీజినల్ మేనేజర్ ఏ.సరిరామ్ తెలిపారు. ఖమ్మంలోని కార్యాలయంలో శనివారం ఆయన మాట్లాడుతూ ఇప్పటికే మూడు అంశాలపై ప్రభుత్వం క్యాబినెట్ సబ్ కమిటీ వేతన సవరణ, యూనియన్ల పునరుద్ధరణతో పాటు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంపై సానుకూలంగా స్పందించిందని చెప్పారు. త్వరలోనే యూనియన్లను పునరుద్ధరించి ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్మిక శాఖ ఎన్నికల నిర్వహించాక, గుర్తింపు పొందిన యూనియన్ నుంచి సభ్యుడిని విలీన కమిటీలోకి తీసుకుంటారని వెల్లడించారు. అలాగే, విలీన ప్రక్రియకు సంబంధించి సాంకేతిక, ఆర్థిక, పరిపాలనా అంశాలపై సమీక్షలు నిర్వహించగా, కార్మికుల అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకుంటారని తెలిపారు. మిగిలిన డిమాండ్లపై ఆర్టీసీ ఈడీల కమిటీ కార్మిక సంఘాలతో చర్చలు జరుపుతోందని ఆర్ఎం వివరించారు. ఈ సమావేశంలో డిప్యూటీ ఆర్ఎం వి.మల్లయ్య పాల్గొన్నారు. గ్యాస్ వినియోగదారుల ఈ కేవైసీ తప్పనిసరి ఖమ్మంసహకారనగర్: జిల్లాలోని ఎల్పీజీ వినియోగదారులు ఈనెల 30లోగా ఈ కేవైసీ పూర్తి చేయించుకోవాలని జిల్లా పౌర సరఫరాల శాఖాధికారి చందన్కుమార్ సూచించారు. బయోమెట్రిక్ ఆధారంగా ఈ కేవైసీ పూర్తి చేసుకోవాలని తెలిపారు. ఇందుకోసం ఆధార్ కార్డు, గ్యాస్ కనెక్షన్ వివరాలతో ఎల్పీజీ గ్యాస్ డీలర్ను సంప్రదించాలని ఆయన ఓ ప్రకటనలో వెల్లడించారు. శ్రీవారికి అభిషేకం, నిత్యకల్యాణం ఎర్రుపాలెం: తెలంగాణ తిరుపతిగా పేరున్న జమలాపురంలోని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు జరిగాయి. తెల్లవారుజామున స్వామి మూల విరాట్తో పాటు ఆలయ ఆవరణలోని శ్రీవారి పాదానికి పంచామృతంతో అభిషేకం నిర్వహించారు. ఆతర్వాత స్వామి, అలివేలు మంగ, పద్మావతి అమ్మవార్లను అర్చకులు పట్టువస్త్రాలతో అలంకరించి పెద్దసంఖ్యలో హాజరైన భక్తుల సమక్షాన నిత్యకల్యాణం, అనంతరం పల్లకీ సేవ చేశారు. కాగా, ఈనెల 29 నుంచి జరగనున్న మహా కుంభాభిషేకం ఉత్సవాలకు ఆలయ జూనియర్ అసిస్టెంట్ ఇరుకులపాటి కృష్ణప్రసాద్ కుటుంబీకులు రూ.1,01,116 విరాళం అందజేశారు. ఈకార్యక్రమంలో ఆలయ ఈఓ జగన్మోహన్రావు, వ్యవస్థాపక ధర్మకర్త ఉప్పల విజయదేవశర్మ, ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాసశర్మ, సీనియర్ అసిస్టెంట్ సోమయ్య తదితరులు పాల్గొన్నారు. -
కలెక్టర్ను కలిసిన ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ నేతలు
ఖమ్మం వైరారోడ్: జిల్లాలోని పలు సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య శనివారం కలెక్టర్ దివాకరకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఖమ్మంలో అఘాయిత్యానికి గురైన బాధిత బాలిక కుటుంబానికి తక్షణ సాయం అందిండమే కాక నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. బాధిత కుటుంబంలో ఒకరికి ఉద్యోగ అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే, రైతులకు సకాలంలో యూరియా, విత్తనాలు అందేలా చూడాలని, యూరియా యాప్ ద్వారా కాకుండా నేరుగా సరఫరా చేయాలని కోరారు. కలెక్టర్ను కలిసిన వారిలో నాయకులు బెల్లం వేణుగోపాల్, ఉన్నం బ్రహ్మయ్య, పాల వెంకట్రెడ్డి, భాషబోయిన వీరన్న, పోట్ల శ్రీనివాసరావు, డేరంగుల బ్రహ్మం, డేరంగుల వెంకటరమణ, పగుట్ల వేంకటేశ్వరరావు, రెంటాల ఆనంద్, లింగాల కృష్ణ, చుంచు విజయ్ కుమార్, దుర్గయ్య, గవర్రాజు శంకర్రాజు తదితరులు పాల్గొన్నారు. -
చేనేత కార్మికుల సమస్యలపై మంత్రికి వినతి
ఖమ్మంమామిళ్లగూడెం: చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కమర్తపు మురళి కోరారు. అఖిల భారత పద్మశాలి సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కందగట్ల స్వామి, గడ్డం జగన్నాథం తదితరులతో కలిసి శుక్రవారం ఆయన రాష్ట్ర చేనేత, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు వినతిపత్రం అందజేశారు. దీంతో ఆయన శాఖ కమిషనర్ శైలజా రామయ్యర్కు ఫోన్లో సూచనలు చేశారు. అనంతరం నాయకులు ఆమెను కలిసి సమస్యలను విన్నవించారు. ఇప్పటికే 2.50 లక్షల బెడ్ షీట్లు, కార్పెట్ల తయారీకి ఆర్డర్ ఇచ్చామని, మరో రెండు లక్షల బెడ్షీట్ల ఆర్డర్ కూడా ఇస్తామని తెలిపారు. అలాగే, ఈ ఏడాది మార్చి నుంచి చేనేత సహకార సంఘాల కార్మికులకు పెంచిన వేతనాలు అమవుతాయని, సహకార సంఘాల ఉత్పత్తులను కొనుగోలు చేస్తామని వెల్లడించారు. అంతేకాక పెండింగ్ బిల్లులు, మృతి చెందిన కార్మికులకు ఎక్స్గ్రేషియా చెల్లింపుపై చర్చించారు. కార్యక్రమంలో నాయకులు అవ్వారి భాస్కర్, మాచర్ల రామచందర్రావు, కందగట్ల భిక్షపతి, గుర్రం శ్రావణ్, వడ్నాల నరేందర్, అంబటి శ్రీనివాస్తో పాటు పలు జిల్లాల బాధ్యులు పాల్గొన్నారు. -
బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన అందరి బాధ్యత
ఖమ్మంలీగల్: బాల కార్మికులు లేని సమాజాన్ని తీర్చిదిద్దడంలో అందరూ పాలుపంచుకోవాలని జిల్లా న్యా య సేవా సంస్థ కార్యదర్శి పి.దేవీమానస సూచించా రు. బాల కార్మిక వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం తెలంగాణ గ్రానైట్ ఫ్యాక్టరీ ఓనర్ల అసోసియేషన్ కార్యాలయంలో నిర్వహించిన న్యాయ అవగాహన సదస్సులో ఆమె పాల్గొన్నారు. బాలల స్నేహపూర్వక న్యాయ సేవల పథకాలు, బాల కార్మిక నిషేధ చట్టాలపై వివరించాక ఆమె మాట్లాడుతూ పిల్లలు పనికి కాకుండా పాఠశాలకు వెళ్లేలా సహకరించాలని సూచించారు. బాలలను పనుల్లో పెట్టడం చట్టరీత్యా నేరమని తెలిపారు. సమావేశంలో కార్మిక శాఖ అధికారి రమేశ్, సీడబ్ల్యూసీ చైర్పర్సన్ భారతి, పారా లీగల్ వలంటీర్లు, గ్రానైట్ ఫ్యాక్టరీల యాజమాన్యాల అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. -
పీఆర్సీ వెంటనే అమలు చేయాలి
ఖమ్మంసహకారనగర్: ఉద్యోగులు, ఉపాధ్యాయు లు, పెన్షనర్లు పీఆర్సీ కోసం ఎదురుచూస్తున్న నేపథ్యాన ప్రభుత్వం వెంటనే నివేదిక తెప్పించుకుని అమలు చేయాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు దుర్గాభవాని డిమాండ్ చేశారు. ఖమ్మంలోని యూనియన్ కార్యాలయంలో శుక్రవారం జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. హెల్త్కార్డుల విధివిధానాలు రూపొందించి వెంటనే ట్రస్ట్ ఏర్పాటు చేయాలన్నారు. అలాగే, 2024 మార్చి నుంచి రిటైర్డ్ అయిన వేలాది మంది ఉద్యో గ, ఉపాధ్యాయులకు బెనిఫిట్లు, ఉద్యోగుల పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని కోరారు. అంతేకాక సీపీఎస్ ఉపాధ్యాయుల డీఏ, హెల్త్ కార్డులపై నగ దు రహిత వైద్యం, ఉపాధ్యాయుల సర్వీసు నిబంధనల రూపకల్పన, సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ తొలగింపుపై నిర్ణయం తీసుకోవాలన్నారు. సమా వేశంలో టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు షేక్ రంజాన్, పారుపల్లి నాగేశ్వరరావు, నాయకులు బుర్రి వెంకన్న, షమీ, రాంబాబు, రాందాస్, నర్సయ్య, నాగేశ్వరరావు, నిర్మలకుమారి, రామకృష్ణ, ఉద్దందు, పద్మ పాల్గొన్నారు. -
సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి
సూపర్బజార్(కొత్తగూడెం): సైబర్ మోసాలపై వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని ఎస్బీఐ రీజినల్ మేనేజర్ పీజీఎన్ శర్మ అన్నారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో కొత్తగూడెంలోని ప్రకాశం స్టేడియంలో శుక్రవారం సైబర్ మోసాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సురక్షితమైన డిజిటల్ వ్యవస్థను ప్రోత్సహించేందుకు ఎస్బీఐ రెండేళ్లుగా ఖాతాదారులకు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సైబర్ మోసం జరిగితే మొదటి గంటలోనే 1930 నంబర్కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు. త్వరగా ఫిర్యాదు చేస్తే నష్టపోయిన మొత్తాన్ని తిరిగి పొందే అవకాశాలు పెరుగుతాయన్నారు. అనుమానాస్పద కాల్స్, మెసేజ్లు, లింక్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. జిల్లాలోని ఎస్బీఐ బ్రాంచిల సిబ్బంది పాల్గొన్నారు.ఎస్బీఐ రీజినల్ మేనేజర్ పీజీఎన్ శర్మ -
యూరియా బుకింగ్కు గ్రీన్సిగ్నల్
ఖమ్మంవ్యవసాయం: వానాకాలం పంటల సాగు సీజన్ ప్రారంభమైన నేపథ్యాన రైతులకు ఎరువుల ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అయితే, పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావంతో ఎరువుల తయారీ ముడి పదార్థాలు ధరలు, రవాణా ఖర్చులు పెరిగి ఎరువుల ధరలు కూడా పెరిగాయి. ఈనేపథ్యాన గత ఏడాది వానా కాలం నుంచి యూరియా సరఫరాలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో యాసంగి సీజన్ నుంచి ప్రభుత్వం ఫెర్టిలైజర్ బుకింగ్ యాప్ ద్వారా బుకింగ్ చేసుకుంటేనే యూరియా సరఫరా చేస్తోంది. ఈసారి కూడా ఇదే విధానం అమలుకు నిర్ణయించింది. క్యూలో నిలబడకుండా.. జిల్లాలో సోమవారం నుంచి ఫెర్టిలైజర్ బుకింగ్ అమల్లోకి రానుంది. ఈ యాప్ ద్వారా బుకింగ్ చేసుకుని నిర్ణీత సెంటర్కు, నిర్ణీత తేదీలో వెళ్తే యూరియా అందిస్తారు. ఫలితంగా రైతులు క్యూలైన్లలో గంటల తరబడి నిలబడాల్సిన బాధ తప్పుతుందని అధికారులు చేపడుతున్నారు. ఈమేరకు పీఏసీఎస్లు, డీలర్లు, ఆగ్రోస్ రైతు సేవా కేంద్రాల ద్వారా యూరియా పంపిణీకి ఏర్పాట్లు చేశారు. నాలుగు స్టెప్పుల్లో బుకింగ్ తొలుత స్మార్ట్ ఫోన్లో ఫెర్టిలైజర్ బుకింగ్ యాప్ను డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేయాలి. ఆపై రైతు(పీపీబీ/ఆర్ఓఎఫ్ఆర్/ఎన్డీఎస్) ఎంపిక చేసి లాగిన్ కావాలి. అనంతరం సాగు వివరాలను నమోదు చేసి, అవసరమైన యూరియా బస్తాల సంఖ్య నమోదు చేసి బుకింగ్ చేసుకోవాలి. ఆతర్వాత వచ్చే గుర్తింపు నంబర్ను డీలర్కు చూపించి యూరియా బ్యాగ్లు కొనుగోలు చేయొచ్చు. ఇక్కట్లు రాకుండా... గత సీజన్లోనూ యాప్ ద్వారా యూరియా అమ్మకాలు చేపట్టినా ఇక్కట్లు ఎదురయ్యాయి. యాప్ సరిగ్గా పనిచేయక, రైతుల వద్ద స్మార్ట్ ఫోన్లు లేక సమస్యలు వచ్చాయి. దీంతో తొలుత ఒక్కో రైతు రెండు బస్తాల యూరియా ఇవ్వాలని నిర్ణయించారు. ప్రస్తుత వానాకాలం సీజన్కు జిల్లాలో సాగయ్యే పంటల ఆధారంగా 30వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరమని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఇప్పటికే 14,135మె.టన్నుల యూరియా జిల్లాలో ఉంది. ఇదిగాక రిజర్వ్లో మరో 6,197 మెట్రిక్ టన్నులు నిల్వ చేశారు. ఎల్నినో ప్రభావంపై అవగాహన కల్పిస్తున్నందున పంటల మార్పిడి జరిగితే యూరియా వినియోగం తగ్గే అవకాశముంది. తద్వారా సమస్య రాదని భావిస్తున్నారు. అంతేకాక యూరియా బుకింగ్లో సమస్యలు అధిగమించేందుకు టోల్ ఫ్రీ నెంబర్ 18001237157ను ఉదయం 10నుంచి సాయంత్రం 5గంటల వరకు సంప్రదించే వీలు కల్పించారు. అలాగే, స్మార్ట్ ఫోన్ లేని వారు ఏఈఓలను కానీ మీ సేవ, సీఎస్పీ సెంటర్లలో ద్వారా బుక్ చేసుకోవచ్చని అవగాహన కల్పిస్తారు.రైతులు అపోహలకు గురికావొద్దు. పంటల సాగుకు అనుగుణంగా అవసరమైన యూరియాను ప్రభుత్వం సరఫరా చేస్తుంది. యాప్ ద్వారా బుక్ చేసుకొని పొందొచ్చు. జిల్లాలో ఇబ్బంది రాకుండా చూస్తాం. – ధనసరి పుల్లయ్య, జిల్లా వ్యవసాయాధికారి -
ఎండోమెంట్ ఈఓ నరసింహారావుకు పదోన్నతి
ఖమ్మంగాంధీచౌక్: ఖమ్మం రోటరీనగర్ శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయం (పర్ణశాల)లో గ్రేడ్–2 ఈఓగా విధులు నిర్వర్తిస్తున్న వీ.వీ.నర్సింహారావుకు గ్రేడ్–1 ఈఓగా పదోన్న తి లభించింది. రాష్ట్రంలో పదోన్నతి పొందిన అధికారులకు శుక్రవారం హైదరాబాద్లో రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఉత్తర్వులు అందజేశారు. ఇందులో భాగంగా మంత్రి, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్య, కమిషనర్ ఎం. హన్మంతరావు చేతుల మీదుగా నర్సింహారా వు ఉత్తర్వులు అందుకున్నారు. ఆయనను ఉమ్మడి జిల్లా అసిస్టెంట్ కమిషనర్ మేకల వీరస్వామి తదితరులు అభినందించారు. కాగా, ఈ నెలాఖరు నాటికి గ్రేడ్–3 ఈఓలకు గ్రేడ్–2 ఈఓలుగా పదోన్నతి లభించే అవకాశముందని తెలిసింది. రోడ్డు నిర్మాణానికి రూ.6.50 కోట్లుకల్లూరురూరల్: కల్లూరు మండలంలోని చెన్నూ రు వద్ద నిర్మాణంలో ఉన్న ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్కు రహదారి నిర్మాణం కోసం రూ.6.50కోట్ల మంజూరు పత్రాన్ని సత్తుపల్లి ఎమ్మెల్యే రాగమయికి పంచాయతీరాజ్ శాఖ ఈఎన్సీ జోగారెడ్డి, జిల్లా ఎస్ఈ వెంకట్రెడ్డి శుక్రవారం అందజేశారు. స్కూల్కు వెళ్లే మార్గంలో రహదారి నిర్మాణానికి ఇప్పటికే సర్వే పూర్తయింది. అయితే, కొందరు రైతులు అభ్యంతరం తెలపగా వారిని ఒప్పించడంతో స్థలం ఇచ్చేందుకు అంగీకరించారు. దీంతో అడ్డంకులు తొలగిపోగా ప్రభుత్వం రహదారి నిర్మాణానికి రూ. 6.50 కోట్లు కేటాయించింది. ‘శ్రీచైతన్య’ అధ్యాపకుడికి అవార్డుఖమ్మంరూరల్: మండలంలోని పొన్నేకల్లోని శ్రీచైతన్య ఇంజనీరింగ్ కళాశాల ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విభాగం అధ్యాపకుడు డి.హతిరామ్ చైన్నె ఐఐటీ నుంచి అవార్డు అందుకున్నారు. ఎన్పీటీఈఎల్ కార్యక్రమం ద్వారా ఆయనకు మోటివేటెడ్ లెర్నర్ అవార్డు ప్రకటించారు. అధ్యాపక వృత్తిలో కొనసాగుతూనే ఏఐ, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ రంగాల్లో అధ్యయనం చేస్తూ ఆన్లైన్ కోర్సులు పూర్తి చేసిన ఆయన అవార్డుకు ఎంపికయ్యా రు. ఈ సందర్భంగా హతీరామ్ను కళాశాల చైర్మన్ మల్లెంపాటి శ్రీధర్, డైరెక్టర్ శ్రీవిద్య, ఈడీ డాక్టర్ సాయిగీతిక, ప్రిన్సిపాల్ డాక్టర్ జె.లక్ష్మీనారాయణ అధ్యాపకులు అభినందించారు. జాబితా సవరణలో బీఎల్ఓలే కీలకం ఏన్కూరు: సమగ్ర ఓటరు జాబితా సవరణ, అర్హుల పేర్లతో జాబితా తయారీలో బీఎల్ఓలదే కీలకపాత్ర అని అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ తెలిపారు. మండలంలోని భగవాన్నాయక్తండా, అక్కినపురం తండాల్లో సమగ్ర సర్వే మ్యాపింగ్ను శుక్రవారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. బీఎల్ఓలు సహాయకులుగా వలంటీర్లను నియమించుకోవచ్చని తెలిపారు. బీఎల్ఓల పనితీరును సూపర్వైజర్లు పరిశీలిస్తూ తప్పులు దొర్లకుండా చూడాలని సూచించారు. కార్యక్రమంలో ఏన్కూరు తహసీల్దార్ సీహెచ్ శేషగిరిరావు, ఉద్యోగులు పాల్గొన్నారు. -
15న సీట్లు పొందిన వారి సర్టిఫికెట్ల పరిశీలన
ఖమ్మంమయూరిసెంటర్: ఎస్సీ అభివృద్ధి శాఖ ఆధ్వర్యాన కొనసాగుతున్న పథకంలో భాగంగా కార్పొరేట్ కళాశాలల్లో ప్రవేశాలకు ఎంపికై న విద్యార్థుల ధ్రువపత్రాలను ఈ నెల 15న పరిశీలించనున్నట్లు ఎస్సీ డీడీ జి.జ్యోతి తెలిపారు. సీజీజీ–ఈపాస్ నుండి మెస్సేజ్ వచ్చిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఇబీసీ, మైనార్టీ, దివ్యాంగ విద్యార్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో కలెక్టరేట్లోని తమ కార్యాలయానికి హాజరు కావాలని సూచించారు. ఉదయం 11 గంటల నుండి సర్టిఫికెట్ల పరిశీలన మొదలవుతుందని ఆమె తెలిపారు. పోలీసు ఉద్యోగుల ఆరోగ్యానికి ప్రాధాన్యత ఖమ్మంక్రైం: పోలీసు ఉద్యోగులు, వారి కుటుంబాల ఆరోగ్యానికి శాఖ ప్రాధాన్యత ఇస్తోందని సీపీ సునీల్దత్ తెలిపారు. ఖమ్మం హెడ్క్వార్టర్స్లో హైదరాబాద్ యశోద ఆస్పత్రి ఆధ్వర్యాన శుక్రవారం ఉద్యోగులు, వారి కుటుంబీకులకు వైద్యపరీక్షలు నిర్వహించారు. ఈశిబిరాన్ని ప్రారంభించిన సీపీ మాట్లాడుతూ విధినిర్వహణలో ఒత్తిడి ఎదుర్కొనే ఉద్యోగుల్లో గుండెజబ్బులు, ఇతర సమస్యలను ముందుగా గుర్తించేలా పరీక్షలు చేయిస్తున్నట్లు చెప్పారు. ఈసీజీ, టూ డీ ఎకో తదితర పరీక్షలు చేయించి ప్రొఫెల్ అందిస్తున్నామని తెలిపారు. డాక్టర్ భరత్రెడ్డి, యశోద సీనియర్ మేనేజర్ వినయ్కుమార్, ఏసీపీలు మహేష్, సుశీల్సింగ్, నర్సయ్య, ఆర్ఐలు కామరాజు, శ్రీశైలం, సురేష్, సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. ‘ఏక్ పేడ్.. మాకే నామ్’ పోస్టర్లు ఆవిష్కరణ ఖమ్మం సహకారనగర్: పర్యావరణ పరిరక్షణ, విద్యార్థుల్లో ప్రకృతిపై అవగాహన పెంచే లక్ష్యంతో తెలంగాణ నేషనల్ గ్రీన్ కార్ప్స్(ఎన్జీసీ), విద్యాశాఖ సంయుక్త ఆధ్వర్యాన ‘ఏక్ పెడ్ మా కే నామ్(అమ్మ పేరుతో మొక్క నాటడం)’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈమేరకు కార్యక్రమ పోస్టర్లను అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ శుక్రవారం కలెక్టరేట్లో ఆవిష్కరించి మాట్లాడారు. ప్రతీ విద్యార్థితో తల్లి పేరిట మొక్క నాటించడం ద్వారా బాధ్యతగా సంరక్షిస్తారని, తద్వారా పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందని తెలిపారు. పాఠశాల, కళాశాల విద్యార్థులు, పరిశోధకులు, సాధారణ పౌరులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఫొటోలను అప్లోడ్ చేయడం ద్వారా పోటీలో పాల్గొనవచ్చని వెల్లడించారు. ఈకార్యక్రమంలో ఎన్జీసీ కోఆర్డినేటర్ ఇనుముల వెంకటేశ్వర్లు, డీపీఓ రాంబాబు, జిల్లా ప్లానింగ్ కోఆర్డినేటర్ రామకృష్ణ, ఏఎంఓ పి.ప్రభాకర్రెడ్డి, సీఎంఓ ప్రవీణ్కుమార్, ఏపీఓ శ్రీనివాసరావు, ఎంఈఓలు పాల్గొన్నారు. -
‘బీజేపీ హయాంలో సంక్షోభం’
ఖమ్మంమయూరిసెంటర్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, ప్రధాని మోదీ దేశాన్ని అన్నిరంగాల్లో సంక్షోభంలోకి నెడుతూ అథోగతి పాలు చేస్తున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు పోతినేని సుదర్శన్, జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు విమర్శించారు. ఖమ్మంలో జిల్లా కమిటీ సభ్యుడు బండారు రమేశ్ అధ్యక్షతన శుక్రవారం జరిగిన సమావేశంలో వారు మాట్లాడారు. దేశంలో నిరుద్యోగం, ధరలు, రైతులు, కార్మికుల సమస్యలు రోజురోజుకూ పెరుగుతున్నా కేంద్రం వాటి పరి ష్కారంపై దృష్టి పెట్టకుండా కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధానాలకు అనుగు ణంగా మోదీ వ్యవహరిస్తుండడం ఇక్కడి ప్రజలను కష్టాల్లోకి నెడుతోందని తెలిపారు. ఇకనైనా ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తూ, రాజ కీయ కక్షసాధింపు చర్యలను నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేశారు. సమావేశంలో నాయకులు పి.సోమయ్య, బండి రమేశ్, వై.విక్రం, భూక్యా వీరభద్రం, బొంతు రాంబాబు, శ్రీనివాసరావు, మడుపల్లి గోపాల్రావు, మెరుగు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
డిప్యూటీ సీఎంకు కుంభాభిషేకం ఉత్సవాల ఆహ్వానం
ఎర్రుపాలెం: మండలంలోని జమలాపురం శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో ఈనెల 29వ తేదీ నుంచి వచ్చే నెల 3వ తేదీ వరకు ధ్వజ ప్రతిష్ఠ సహిత మహా కుంభాభిషేకం ఉత్సవాలు జరగనున్నాయి. ఈమేరకు ఉత్సవాలకు హాజరుకావాలని కోరుతూ అధికారులు, అర్చకులు శుక్రవారం హైదరాబాద్లో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖకు ఆహ్వాన పత్రికలు అందజేశారు. అలాగే, వారికి స్వామి వారి ప్రసాదం అందజేసి సన్మానించారు. దేవాదాయ కమిషనర్ హన్మంతరావు, ఆలయ ఈఓ కె.జగన్మోహన్రావు, ప్రధాన అర్చకుడు ఉప్పల శ్రీనివాసశర్మ, ఉద్యోగులు కృష్ణప్రసాద్, వంశీ పాల్గొన్నారు. -
ఇసుకాసురుల ఇష్టారాజ్యం
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోనే కాక జిల్లా అంతటా ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా కొనసాగుతోంది. అనుమతి లేకుండా కొందరు, కేటాయించిన రూట్లను కాదని ఇంకొందరు ఇష్టారాజ్యంగా ఇసుక తరలిస్తున్నారు. అంతటితో ఆగకుండా రహదారులపైనే ఒక వాహనం నుంచి ఇంకో వాహనంలోకి డంప్ చేస్తుండడంతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడుతోంది. అనుమతి అవసరమే లేదు.. ఖమ్మంతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఇసుకను తరలించడానికి అధికారికంగా అనుమతులు లేవు. అయినా మున్నేటితో పాటు ఇతర వాగుల నుంచి ఇసుక తరలిపోతోంది. ముదిగొండ ప్రాంతంతోని మున్నేటి నుంచి వందల కొద్ది ట్రాక్టర్లు, ట్రక్కుల ద్వారా రాత్రీపగలు తేడా లేకుండా ఇసుక తీసుకెళ్తున్నారు. పోలీసులు అప్పుడప్పుడు వాహనాలను సీజ్ చేసి, జరిమానా విధించి వదిలేస్తుండటంతో మళ్లీ దందా సాగుతోంది. డిమాండ్ ఆధారంగా.. కొన్నేళ్లుగా జిల్లావ్యాప్తంగా నిర్మాణాల సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇసుక అవసరాలు పెరగడం అక్రమ వ్యాపారులకు కలిసొస్తోంది. డిమాండ్ ఆధారంగా ధర నిర్ణయించి సరఫరా చేస్తున్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పేరు చెప్పుకుని కొందరు ఇసుక పక్కదారి పట్టిస్తున్నారు. ఫలితంగా ప్రకృతి సంపద కరిగిపోతుండగా, వందలాది వాహనాల రాకపోకలతో రహదారుల వెంట ఉన్న జనం ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ఎప్పుడంటే అప్పుడు... వర్షం కురిసినా, అధికారుల తనిఖీలు ఉన్నా వాగుల్లోకి వెళ్లి ఇసుక తీసుకురావడం ఆలస్యం అవుతుంది. ఈక్రమాన అక్రమార్కులు సమయం కుదిరినప్పుడే ఇసుక తీసుకొచ్చి ఖాళీ ప్రదేశాల్లో డంప్ చేస్తున్నారు. ఆతర్వాత ఆర్డర్లఆధారంగా కావాల్సిన చోటకు తరలిస్తున్నారు. చెక్పోస్టులు ఏర్పాటు చేసినా.. ఇటీవలి ఇసుక అక్రమ రవాణా పెరగడంతో పోలీసులు కీలక ప్రాంతాలతో పాటు అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో చెక్పోస్ట్లు ఏర్పాటు చేశారు. దీంతో అక్రమార్కులు ప్రత్యామ్నాయదారులు ఎంచుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా లారీల్లో జిల్లాకే కాక హైదరాబాద్కు ఇసుక తరలిస్తున్నారు. ఇటీవల రాష్ట్ర సరిహద్దులైన అశ్వారావుపేట, ముదిగొండ మండల వల్లభి వద్ద ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తున్న లారీలను సీజ్ చేశారు. అలాగే భద్రాచలంలోని గోదావరి నుంచి కూడా ఇసుక లారీలు వస్తున్నాయి. అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నా.. దందా ఆగకపోవడం విమర్శలకు తావిస్తోంది.జిల్లా అంతటా యథేచ్ఛగా అక్రమ రవాణా ఖమ్మంలో ఇసుక అక్రమ రవాణాకు అడ్డు లేకుండా పోయింది. ట్రాక్టర్లు, లారీల్లో ప్రధాన రహదారుల మీదుగానే తరలిస్తున్నారు. దీంతో నూతనంగా వేసిన రహదారులు దెబ్బతింటున్నాయి. మరోవైపు లారీలను నడిరోడ్డుపై నిలిపి.. ట్రాక్టర్ లేదా మరో లారీలోకి డంప్ చేస్తున్నారు. కొత్త బస్టాండ్ పక్కన కేఎంసీ కార్యాలయానికి వెళ్లే దారిలో వాహనాల్లో ఇసుక డంప్ చేసే సమయాన రహదారిపై ఇసుక కుప్ప పడింది. దీంతో వాహనదారులు ప్రమాదాల బారిన పడ్డారు. -
చెట్టును ఢీకొన్న బైక్, యువకుడు మృతి
వైరారూరల్: రహదారిపై గుంతను తప్పించే క్రమాన ద్విచక్ర వాహనం అదుపుతప్పి చెట్టును ఢీకొనడంతో ఓ యువకుడు మృతి చెందాడు. మండలంలోని విప్పలమడకకు చెందిన తేళ్లూరు కళ్యాణ్ (23)దాచాపురంలో శుక్రవారం వాహనం ఇంజన్ ఆయిల్ మార్పించుకుని స్వగ్రామానికి వెళ్తున్నాడు. గరికపాడు సబ్స్టేషన్ సమీపాన రోడ్డుపై గుంతను తప్పించే ప్రయత్నంలో బైక్ అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఘటనలో తీవ్రగాయాలైన ఆయనను బ్లూకోల్ట్స్ కానిస్టేబుల్ నాగేశ్వరరావు ఇచ్చిన సమాచారంతో 108 వాహనంలో ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ పి.రామారావు తెలిపారు. రోడ్డు ప్రమాదంలో బీటెక్ విద్యార్థి .. ఖమ్మంక్రైం: ద్విచక్ర వాహనంపై వేగంగా వెళ్తూ మరో వాహనాన్ని ఢీకొట్టిన ఘటనలో బీటెక్ విద్యార్థి మృతి చెందాడు. ఖమ్మంలోని బైపాస్రోడ్డులోని మెడికల్ షాప్నకు బ్యాంక్కాలనీకి చెందిన చిండా జనకరాజు(69) గురువారం రాత్రి మందులు కొను గోలు చేసి వెళ్తున్నాడు. అదే సమయాన ఎన్టీఆర్ సర్కిల్ నుంచి కొత్త బస్టాండ్ వైపు పల్సర్పై వేగంగా వెళ్తున్న పాకబండ ప్రాంతానికి చెందిన బీటెక్ విద్యార్థి ఎండీ జుబేర్ (20) జనకరాజును బలంగా ఢీకొట్టాడు. ఘటనలో ఇద్దరికి తీవ్రగా యాలు కాగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ జుబేర్ శుక్రవారం ఉదయం మృతి చెందాడు. అలాగే, జనకరాజు పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరా బాద్ తరలించారు. ఘటనపై జనకరాజు బంధువుల ఫిర్యా దుతో కేసు నమోదు చేసినట్లు ఖమ్మం టూటౌన్ సీఐ బాలకృష్ణ తెలిపారు. ఉరి వేసుకుని ఆత్మహత్య కూసుమంచి: మండలంలోని నాయకన్గూడెం గ్రామానికి చెందిన షేక్ సుభానీ(45) ఈ నెల 9న తన ఇంట్లో ఉరి వేసుకోగా, చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న సుభానీ మద్యానికి బానిస కాగా కుటుంబ సభ్యులు మందలించారు. దీంతో ఆయన ఉరి వేసుకున్నాడు. ఈ మేరకు ఆయన భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. వడదెబ్బతో రైతు మృతిటేకులపల్లి: మండలంలోని లచ్చతండాకు చెందిన జాటోత్ భీంజీ (45) శుక్రవారం ఉదయం తన చేనులోనే వడదెబ్బకు గురై అస్వస్థతతో అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంబ యజమాని మరణంతో వారు శోకసంద్రంలో మునిగారు. హైవేపై తప్పిన ప్రమాదం వైరా: ఖమ్మం – దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారిపై గురువారం అర్ధఽరాత్రి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు లారీని ఢీకొట్టింది. కాకినా డ వెళ్తున్న ట్రావె ల్స్ బస్సు వైరా సోమవారం వద్ద ఆగి ఉన్న లారీని ఢీకొట్టగా బస్సు ముందు భాగం బాగా దెబ్బ తిన్నది. ఘటనలో ఎవరికీ గాయాలు కాకపోవడంతో ప్రమాదం తప్పినట్లయింది. వైరా ఎస్ఐ పి.రామారావు ఆధ్వర్యాన సిబ్బంది చేరుకుని వాహ నాలను పక్కకు తప్పించి రాకపోకలను క్రమబద్ధీకరించారు. -
సర్మని సాగిపోయేలా...
ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ(ఎస్ఐఆర్ – స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) మ్యాపింగ్లో జిల్లా యంత్రాంగం కొత్త పంథా అనుసరించి రికార్డు సృష్టించింది. కలెక్టర్ దివాకర టీ.ఎస్. ప్రణాళిక, ముందస్తు జాగ్రత్తలతో ఈనెల 24 నుంచి ప్రారంభం కానున్న ఎస్ఐఆర్ సులభతరం కానుంది. ఈనెల 15వరకు బీఎల్ఓల వద్ద ఉండే జాబితాలో ఓటర్లు తమ పేర్లు చూసుకునే వెసులుబాటు కల్పించారు. ఫలితంగా మ్యాపింగ్ కాని వారు ముందుగానే సంబంధిత ధ్రువపత్రాలు సిద్ధం చేసుకునే అవకాశముంటుంది. ఇక 2002, 2026 ఓటర్ల జాబితాను సరిపోల్చినప్పుడు ఎదురైనా అక్షర దోషాలను ముందే సరిచేస్తున్నారు. – సాక్షి ప్రతినిధి, ఖమ్మంమ్యాపింగ్లో ఖమ్మం మార్క్ ! ● బీఎల్ఓల వద్ద ఓటర్లు పేర్లు చూసుకునే అవకాశం ● జిల్లాలో 60వేల మంది ఓటర్ల పేర్లలో తప్పుల సవరణ ● కల్టెకర్ దివాకరకు ఎన్నికల సంఘం ప్రశంసలుప్రత్యేక కార్యక్రమం మ్యాపింగ్ కాని ఓటర్ల కోసం రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ప్రత్యేక కార్యక్రమం చేపడుతున్నారు. ఈనెల 15 వరకు బీఎల్ఓల వద్ద ఉన్న జాబితా ఆధారంగా ఓటర్లు మ్యాపింగ్ అయ్యాయో, లేదో పరిశీలించుకునే అవకాశం కల్పించారు. తద్వారా మ్యాపింగ్ కాని వారు ధ్రువపత్రం సిద్ధం చేసుకుని 24 నుంచి ప్రారంభమయ్యే ఎస్ఐఆర్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీల వద్ద కుల ధ్రువపత్రాలు ఉంటాయి. ఓసీలైతే పుట్టిన తేదీ, నివాస ధ్రువపత్రాలు లేదా ఎస్సెస్సీ మెమో అందచేయొచ్చు. చకచకా సర్టిఫికెట్లు జారీ సర్టిఫికెట్లు సిద్ధంగా లేని వారికి ఈనెల 30లోగా జారీ చేయాలని కలెక్టర్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ఓటర్ల దరఖాస్తుల పరిశీలన, అర్హత తేలితే వెంటనే జారీ చేసేలా రెవెన్యూ, మున్సిపల్ కార్యాలయాల్లో ఈనెలాఖరు వరకు ఉండేలా ప్రత్యేక సిబ్బందిని కేటాయించారు. అక్షర దోషాల సవరణ రెండు ఓటర్ల జాబితాల పరిశీలన సందర్భంగా పేర్లు, ఇంటి పేర్లలో అక్షర దోషాలు సమస్యగా మారాయి. ఇలాంటి ఓటర్లు జిల్లాలో 2.30 లక్షల మంది ఉన్నారు. ఉదాహరణకు 2026 జాబితాలో ఓ ఓటరు తండ్రి పేరు వెంకటేశ్వర్ అని ఉంటే, 2002 జాబితాలో వెంకటేశ్వర్లుగా నమోదైంది. కొన్నిచోట్ల ఇంటి పేరు లేదు. అలాగే, కృష్ణమూర్తికి బదులుగా.. కష్టమూర్తి, కిస్నమూర్తి అని నమోదయ్యాయి. కొన్నిచోట్ల కొత్తగా పెళ్లి అయిన మహిళ పేరును అత్తమామల జాబితాతో మ్యాపింగ్ చేశారు. ఆ పేరును ఆమె తల్లిదండ్రులతో మ్యాపింగ్ చేయాల్సి ఉంటుంది. ఇలాంటి సమస్యలను యంత్రాంగం గుర్తించగా, కలెక్టర్ దివాకర చొరవతో మూడు రోజుల్లోనే 60 వేల సమస్యలను పరిష్కరించారు. రాష్ట్ర వ్యాప్తంగా పరిశీలిస్తే ఈ కేటగిరీలో ఖమ్మం జిల్లాలోనే అతితక్కువ సమస్యలు ఉన్నాయి. దీంతో రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు ఇక్కడ ఎలా చేశారని ఆరా తీయడమే కాక కలెక్టర్ దివాకరను అభినందించారు. అంతేకాక ఇతర జిల్లాలోనూ ఖమ్మం ఫార్ములా అనుసరించాలని సూచించడం విశేషం.ఎస్ఐఆర్కి సంబంధించి 2002–2026 ఓటర్ల జాబితాను సరిపోలుస్తున్నారు. వీటిలో పేర్లు ఉన్నా, తల్లిదండ్రుల పేర్లు ఉన్న ఓటర్ల మ్యాపింగ్ పూర్తవుతుంది. 2002 జాబితాలో పేర్లు లేకపోతే అన్ మ్యాపింగ్గా నమోదు చేస్తారు. ఆపై ఎన్నికల సంఘం నిర్దేశించిన 11 రకాల ధ్రువపత్రాల్లో ఒకటి సమర్పించాల్సి ఉంటుంది. ఈమేరకు జిల్లాలో 77 శాతం మ్యాపింగ్ పూర్తయింది. జిల్లాలో ప్రస్తుతం ఉన్న 12,44,555 మంది ఓటర్ల పేర్లను పరిశీలించగా 2002 నాటి జాబితాలో 9.50 లక్షల మంది ఉన్నట్లు తేల్చారు. అయితే, వీరిలో 20 శాతం మంది పేర్లు, ఇంటి పేర్ల అక్షరదోషాలు ఉన్నాయని గుర్తించారు. -
రైతు సంక్షేమానికి పెద్దపీట
● రుణమాఫీ, రైతు భరోసా, ధాన్యం కొనుగోళ్లలో రికార్డు ● అధికారుల సూచనలతో పంటలు సాగు చేయాలి ● రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితిరుమలాయపాలెం: రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతు సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్నామని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార, పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. తిరుమలాయపాలెం సబ్స్టేషన్లో రూ.3 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసే 0.8 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్, ట్రాన్స్ఫార్మర్ల మరమ్మతు కేంద్రానికి అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డితో కలిసి మంత్రి శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఆతర్వాత ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో కల్యాణలక్ష్మి, సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమాల్లో మంత్రి పొంగులేటి మాట్లాడుతూ రైతుల సంక్షేమమే ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు. రాష్ట్రంలో 25 లక్షల మంది రైతులకు రూ.2 లక్షల మేర రుణమాఫీ చేయగా, రైతు భరోసా సాయాన్ని ఎకరాకు రూ.10 వేల నుంచి రూ.12 వేలకు పెంచామని చెప్పారు. అంతేకాక సన్న ధాన్యానికి మద్దతు ధరతో పాటు క్వింటాకు రూ.500 బోనస్ ఇస్తూ రికార్డు స్థాయిలో 75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని వెల్లడించారు. ఇదేకాక దివంగత సీఎం వై.ఎస్.రాజశేఖర్రెడ్డి స్ఫూర్తితో ఉచిత విద్యుత్ అమలుచేయడమే కాక ఇతర సంక్షేమ పథకాలు కొనసాగిస్తున్నామని తెలిపారు. కాగా, రెండో విడతలో ప్రతీ నియోజకవర్గానికి 2వేల చొప్పున ఇళ్లు మంజూరు చేస్తామని, లబ్ధిదారుల ఎంపికలో రాజకీయాలకు తావు ఉండదని స్పష్టం చేశారు. వారిది మొసలికన్నీరు నేలకొండపల్లి: సమస్యలపై ప్రశ్నించిన రైతులకు సంకెళ్లు వేసిన గత పాలకులు, ఇప్పుడు రైతులపై మొసలి కన్నీరు కారుస్తున్నారని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. నేలకొండపల్లి మండలం బైరవునిపల్లిలో గ్రామపంచాయతీ కార్యాలయాన్ని ప్రారంభించిన ఆయన మాట్లాడుతూ రైతుల కష్టం తెలియని వాళ్లు, తమ ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలపై అవగాహన లేని వారికి మాట్లాడే హక్కు లేదని తెలిపారు. తొలుత గ్రామంలో నూతనంగా నిర్మించిన కాటమయ్య దేవాలయాన్ని మంత్రి సందర్శించి పూజలు చేయగా ఆలయ చైర్మన్ పోలంపల్లి నాగేశ్వరరావు సన్మానించారు. అంతేకాక బుద్ధారంలో బీటీ రోడ్డుకు శంకుస్థాపన చేసిన మంత్రి, రాయగూడెంలో అనారోగ్యంతో బాధపడుతున్న కొర్లకుంట్ల నాగేశ్వరరావు తదితరులను పరామర్శించారు. ఈ కార్యక్రమాల్లో విద్యుత్ శాఖ ఎస్ఈ శ్రీనివాసచారి, డీఏఓ డి.పుల్లయ్య, నేలకొండపల్లి మార్కెట్ చైర్మన్ వెన్నపూసల సీతారాములు, ఏడీఏ సతీష్, తహాసీల్దార్ లూథర్ విల్సన్, ఎంపీడీఓ సిలార్సాహెబ్, ఆత్మ, బీరోలు పీఏసీఎస్ చైర్మన్లు చావా శివరామకృష్ణ రామసహాయం నరేష్రెడ్డితో పాటు నాయకులు కొడాలి గోవిందరావు, శాఖ మూరి రమేష్, భద్రయ్య, బచ్చలకూరి నాగరాజు, జెర్రిపోతుల సత్యనారాయణ పాల్గొన్నారు. పేదల సంక్షేమమే లక్ష్యం ఖమ్మంరూరల్: పేదలను ఆదుకునేలా సంక్షేమ పథకాలు అమలుచేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని లబ్ధిదారులు 76మంది కల్యాణలక్ష్మి, షాదీముబారక్ ఆయన చెక్కులు పంపిణీ చేసి మాట్లాడారు. పేదల సొంతింటి కల సాకారం చేసేలా దశల వారీగా మంజూరు చేస్తామని తెలిపారు. అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ పి.అనిత, కమిషనర్ ఆళ్ల శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.ఈ ఏడాది వర్షపాతం తక్కువగా ఉంటుందనే సూచనలు వస్తున్నందున వ్యవసాయ అధికారుల సూచనలు, సలహాలు తీసుకుని రైతులు అనుకూలమైన పంటలను సాగు చేయాలని మంత్రి పొంగులేటి సూచించారు. అరకొర వర్షాలతో తొందరపడి విత్తనాలు నాటొద్దని తెలిపారు. తక్కువ నీటితో సాగయ్యే ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారించాలని సూచించారు. -
దారి వెతలు తీరినట్టే..
● రోడ్లు, బ్రిడ్జిల నిర్మాణానికి నిధుల మంజూరు ● వైరా, మధిర నియోజకవర్గాలకు రూ.106 కోట్లు ● దశాబ్దాల తర్వాత పరిష్కారం కానున్న సమస్యలు ఖమ్మంఅర్బన్: జిల్లాలోని పలు ప్రాంతాల్లో దెబ్బతిన్న రహదారులు, వంతెనల పునర్నిర్మాణం, అప్రోచ్ రోడ్ల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం భారీగా నిధులు మంజూరు చేసింది. ఈమేరకు రోడ్లు, భవనాల శాఖ ద్వారా మధిర, వైరా నియోజకవర్గాల్లో పనులకు రూ.106.10 కోట్లకు పైగా పరిపాలనా అనుమతులు లభించాయి. ఇందులో మధిర నియోజకవర్గంలో కొత్త వంతెనల నిర్మాణానికి రూ.34.60 కోట్లు కేటాయించగా, ఫ్లడ్ డ్యామేజ్ రిపేర్(ఎఫ్డీఆర్) కింద మరో రూ.47.90 కోట్లతో వంతెనల పునర్నిర్మాణ పనులు చేపట్టనున్నారు. అంతేకాక వైరా నియోజకవర్గంలో రూ.23.60 కోట్లతో పలు వంతెనల పునర్నిర్మాణం, కొత్త హైలెవెల్ బ్రిడ్జిల నిర్మాణానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ నిధులతో చేపట్టే పనులు పూర్తయితే గ్రామీణ ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలు మెరుగుపడడంతో పాటు దశాబ్దాల కాలంగా వర్షాకాలంలో రాకపోకలకు ఎదురవుతున్న ఇబ్బందులు తీరనున్నాయి. ఎర్రుపాలెం: మండలంలోని పలు గ్రామాల్లో రోడ్డు బ్రిడ్జిల నిర్మాణాలకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. భారీ వర్షాల సమయాన రోడ్లపైకి వరద చేరి వాహనాల రాకపోకలకు అంతరాయం ఎదురవుతోంది. ఈమేరకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క స్పందించి మండలంలోని ఎనిమిది గ్రామాల్లోని రోడ్లపై బ్రిడ్జిల నిర్మాణానికి రూ.39 కోట్ల నిధులు మంజూరు చేశారు. ఇందులో ఎర్రుపాలెం – జమలాపురం ఆర్చి వద్ద బ్రిడ్జి నిర్మాణానికి రూ.9.40 కోట్లు, సకినివీడు – ములుగుమాడు రోడ్డులో బ్రిడ్జికి రూ.3.20 కోట్లు, ములుగుమాడు – ఇనగాలి మధ్య వంతెనకు రూ.6.40 కోట్లు, వెంకటాపురం నుంచి గట్ల గౌరారం రోడ్డులో రెండు బ్రిడ్జిలకు రూ.9.45 కోట్లు, బుచ్చిరెడ్డిపాలెం – నర్సింహాపురం రోడ్డులో నర్సింహాపురం (రోడ్డు వంతెన) కెనాల్పై బ్రిడ్జికి రూ.1.65 కోట్లు, నరసింహాపురం – రాజుపాలెం రోడ్డులో వంతెనకు రూ.2.30 కోట్లు, మీనవోలు – తొండలగోపవరం రహదారిలో బ్రిడ్జి నిర్మాణానికి రూ.2.50 కోట్లు, భీమవరం వద్ద బ్రిడ్జి నిర్మాణానికి రూ.4.10 కోట్లు మంజూరయ్యాయి. బోనకల్: మండలంలోని పలు గ్రామాల మధ్య వాగులపై ఆరు బ్రిడ్జిల నిర్మాణానికి రూ.25.2 కోట్లు మంజూరయ్యాయని కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కర్నాటి రామకోటేశ్వరరావు, పీసీసీ మెంబర్ పైడిపల్లి కిశోర్ తెలిపారు. కలకోట – మోటమర్రి మధ్య ప్రధాన రహదారిలో వాగుపై బ్రిడ్జి నిర్మాణానికి రూ.4.2 కోట్లు, కలకోట – మోటమర్రి మార్గంలో హైలెవల్ బ్రిడ్జి నిర్మాణానికి రూ.5 కోట్లు, రావినూతల – ప్రొద్దుటూరు రోడ్డు మూడు వాగులపై బ్రిడ్జిల నిర్మాణానికి రూ.8 కోట్లు, బోనకల్ – ఆళ్లపాడురోడ్డులో వాగుపై హైలెవెల్ బ్రిడ్జి నిర్మాణానికి రూ.8 కోట్లు మంజూరయ్యాయని వెల్లడించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టికి వారు కృతజ్ఞతలు తెలపగా, సమావేవంలో మాజీ జెడ్పీటీసీ మోదుగు సుధీర్బాబు, సర్పంచ్ భద్రూనాయక్ పాల్గొన్నారు. మధిర: డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రతిపాదనల మేరకు మండలంలోని పలు వంతెనల (హెచ్ఎల్బీ) పునర్నిర్మాణ పనులకు రాష్ట్ర ప్రభు త్వం నిధులు కేటాయించింది. మాటూరుపేట వద్ద నిధానపురం – మాటూరుపేట రోడ్డుపై హెచ్ఎల్బీ పునర్నిర్మాణం, డ్రెయిన్ల నిర్మాణానికి రూ.1.40 కోట్లు, రాయపట్నం బ్రిడ్జి – మోటమర్రి రోడ్డుపై హెచ్ఎల్బీ పునర్నిర్మాణానికి రూ.3.60 కోట్లు, దేశినేనిపాలెం – ఇల్లూరు రోడ్డుపై హెచ్ఎల్బీ పునర్ని ర్మాణానికి రూ.2.30కోట్లు కేటాయించారు. అలాగే, దెందుకూరు – ఖమ్మంపాడు మధ్య హెచ్ ఎల్బీ పునర్నిర్మాణానికి రూ.5.60 కోట్లు, మధిర – నందిగామ రోడ్డుపై రెండు మైనర్ బ్రిడ్జిల పునర్నిర్మాణానికి రూ.5.50కోట్లు మంజూరయ్యా యని కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పారుపల్లి విజయకుమార్ వెల్లడించారు. ఎర్రుపాలెం మండలంలో అవసరమైన మేర రోడ్లపై బ్రిడ్జిల నిర్మాణాలకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఈ పనులకు గాను త్వరలోనే టెండర్ల ప్రక్రియ మెదలు పడతాం. శాఖాపరంగా టెండర్లు ఖరారు కాగానే త్వరగా పనులు మొదలుపెట్టి పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటాం. –రాజేశ్, ఆర్అండ్బీ, ఏఈ, ఎర్రుపాలెం -
ఈదురుగాలులకు ఇళ్లు ధ్వంసం
చింతకాని: మండలంలోని లచ్చగూడెంలో శుక్రవా రం తెల్లవారుజామున ఈదురుగాలులతో కూడిన వర్షం కురవగా ఉప్పరపల్లి వెంకటేశ్వర్లు, తన్నీరు పుల్లమ్మకు చెందిన రేకుల ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఇంటి పైకప్పు రేకులు ఎగిరిపోవడంతో సామగ్రి తడిసి ముద్దయింది. అలాగే, గ్రామంలోని మసీదు వద్ద చింతకాని – వెంకటాయపాలెం రహదారిపై చెట్టు పడిపోగా గ్రామపంచాయతీ సిబ్బంది తొలగించారు. ●నేలకొండపల్లి: మండలంలోని మండ్రాజుపల్లిలో ఈదురుగాలులకు తుమ్మ నాగయ్య ఇంటి ప్రహరీ నేలమట్టమైంది. అలాగే, కోనాయిగూడెంలో బిందె చిరంజీవి ఇంటి ముందు భాగం పడిపోయింది. ఈ మేరకు బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు కోరారు. పిడుగుపాటుతో ఆంబోతు, ఆవు మృతి ●ముదిగొండ: మండలంలోని కమలాపురంలో గురువారం అర్ధరాత్రి నుంచి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. అంతేకాక శుక్రవారం తెల్లవారుజామున పిడుగుపడడంతో అమ్మపేటకు చెందిన రైతు వల్లబి వెంకటేశ్కు చెందిన ఆవు, గ్రామంలో తిరిగే ఆంబోతు మృతి చెందాయి. కాగా, ఆవు మృతితో రూ.70వేల నష్టం జరిగిందని రైతు వెంకటేశ్ వాపోయాడు. కాగా, సర్పంచ్ పందిరి అంజయ్య ఇచ్చిన సమాచారంతో వనంవారి కిష్టాపురం పశువైదాధికారి మన్నెం రమేశ్ ఆంబోతు కు పోస్టుమార్టం నిర్వహించగా, గ్రామంలో ఊరేగింపు నిర్వహించి ఖననం చేశారు. ఉపసర్పంచ్ మరికంటి లాలయ్య, పంచాయతీ కార్యదర్శి బి.లక్ష్మి, జీపీఓ శ్రీనివాస్తో పాటు వాక వెంకటేశ్వరరెడ్డి, మోహన్రెడ్డి, మరికంటి కృష్టయ్య, పలుసు సీతా రాములు పాల్గొన్నారు. -
నీటి లభ్యత ఆధారంగా పంటల సాగు మేలు
తిరుమాలయపాలెం: ఈ ఏడాది ఎల్నినో ప్రభా వంతో తక్కువ వర్షాలు కురుస్తాయనే అంచనాలు ఉన్నందున, రైతులు నీటి లభ్యత ఆధారంగా పంటలు సాగు చేయాలని జిల్లా వ్యవసాయాధికారి ధనసిరి పుల్లయ్య సూచించారు. మండలంలోని దమ్మాయిగూడెంలో శుక్రవారం నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. ఈ నెల సాధారణ వర్షపాతం, జూలైలో తక్కువగా, ఆగస్టులో లోటు నమోదై, సెప్టెంబర్లో అసలే వర్షాలు కురిసే పరిస్థితులు లేవని ఐఎండీ అంచనాల ద్వారా తెలుస్తోందన్నారు. ఈమేరకు నీటి వనరులు ఉంటేనే వరి సాగు చేయాలని, పత్తికి బదులు నూనె గింజలు, పెసర, కంది, నువ్వులు, జొన్న సజ్జలు సాగు చేయడం మంచిదని తెలిపారు. కాగా, యూరియా యాప్ ద్వారా బుక్ చేసుకోవచ్చని, స్మార్ట్ఫోన్ లేకపోతే ఏఈఓ లు, మీ సేవ కేంద్రాల్లో సంప్రదించాలని సూచించారు. ఎక్కడైనా నకిలీ విత్తనాలు అమ్మితే ఆ సమాచారం అధికారులకు తెలియచేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కూసుమంచి ఏడీఏ సతీష్, ఏఓ నారెడ్డి సీతారాంరెడ్డి, ఏఈఓ ఎండీ.ఆసియా, సర్పంచ్ వినోద పాల్గొన్నారు. రూ.47 లక్షలకు ఐపీ దాఖలు ఖమ్మంలీగల్: ఖమ్మం దానవాయిగూడెంనకు చెందిన చిలకమర్రి మౌనిక, చిలకమర్రి సురేశ్ రూ. 47.84 లక్షలకు గాను దివాలా పిటీషన్ (ఐపీ) దాఖ లు చేశారు. ఈ మేరకు న్యాయవాదుల ద్వారా వారు ఖమ్మం ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో శుక్రవారం పిటీషన్ దాఖలు చేశారు. ప్రైవేట్ చిట్ ఫండ్స్తో ఫైనాన్స్ వ్యాపారం నడిపించిన తాము చేసిన అప్పులు తీర్చలేని పరిస్థితి ఎదురైందంటూ 17 మందిని ప్రతివాదులుగా చేర్చారు. -
ప్రాణం తీస్తున్న పశువులు
● రహదారులపైకి చేరుతుండడంతో ఇక్కట్లు ● పట్టించుకోని జీవాల యజమానులు ● అవగాహన కల్పించడంలో అధికారులు విఫలం చుంచుపల్లి: రహదారులపై మూగజీవాల సంచారం నానాటికీ పెరుగుతోంది. రాత్రింబవళ్లు గుంపులుగా తిష్ట వేస్తున్న పశువులు ప్రమాదాలకు కారణమవుతున్నాయి. కొందరు యజమానులు పట్టింపు లేకుండా వాటిని వదిలిపెడుతుండడంతో అవి రోడ్లపైకి చేరి వాహనదారుల ప్రాణాలను బలిగొంటున్నాయి. పల్లెల్లో కాస్త నియంత్రణలో ఉన్నా పట్టణాల్లో పరిస్థితి తీవ్రత పెరుగుతోంది. పశువుల సంచారంపై పంచాయతీ, మండల అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం ఉండడం లేదని జనం మండిపడుతున్నారు. కొన్నిచోట్ల పశువులు రహదారులపై బైఠాయిస్తుండగా, ఇంకొన్ని చోట్ల పరిగెత్తి వస్తుండడంతో ఏం ప్రమాదం జరుగుతుందోనని వాహనదారులు ఆందోళనకు గురవుతున్నారు. చర్యలు కరువు... మున్సిపాలిటీలు, పంచాయతీల పరిధిలో పశువుల సమస్యను అరికట్టడానికి కఠిన నిబంధనలు అమలు చేయాల్సి ఉంది. పశువులు రోడ్లపైకి వస్తే మొదటి తప్పుగా రూ.వేయి నుంచి రూ.5వేల వరకు యజమానులకు జరిమానా విధించొచ్చు. యజమానుల నిర్లక్ష్యంతో ప్రాణనష్టం జరిగితే క్రిమినల్ కేసులు నమోదు చేసే అవకాశముంది. కానీ ఉమ్మడి జిల్లాలో ఈ నిబంధనలను అమలు చేస్తున్న దాఖలాలు ఎక్కడా లేవు. అంతేకాక పశువుల వల్ల జరుగుతున్న ప్రమాదాలపై యజమానులకు అవగాహన కూడా కల్పించకపోవడం గమనార్హం. రోడ్లే ఆవాసం గ్రామీణ రహదారుల్లోనే కాక పట్టణాలు, నగరాల్లో ప్రధాన రహదారుల్లో కూడా పశువులు తిష్ట వేస్తున్నాయి. హోటళ్లలో యజమానులు పడేసే ఆహారం, కూరగాయలు తింటుండగా.. ఇంకొందరు భక్తితో పెట్టే బియ్యం, అన్నం, పండ్లు తింటూ కాలం గడుపుతున్నాయి. కొన్నింటిని యజమానులే మేత కోసం వదులుతుండగా.., ఇంకొన్ని పశువులు ఎవరివో తెలియని పరిస్థితి నెలకొంది. మరికొందరు యజమానులు పశువులకు మేత పెట్టలేక రోడ్లపైకి వదిలేస్తుండడంతో వాహనదారులకు శాపంగా మారుతోంది. వీటి కారణంగా పలువురు ప్రాణాలు కోల్పోతుండగా, మరికొందరు తీవ్ర గాయాల పాలవుతున్నారు. ఇక రాత్రి పూట సమీపానికి వెళ్లే వరకు రహదారులపై గేదెలు కానరాక వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు.ఇంకొన్ని చోట్ల భారీ వాహనాలు ఢీకొడుతుండడంతో మూగజీవాలు సైతం గాయపడుతున్నాయి. అశ్వారావుపేట మండలం నారాయణపురం సమీపాన ఇటీవల ద్విచక్రవాహనంపై స్నేహితుడితో కలిసి వెళ్తున్న కారం దుర్గారావు(32) రహదారిపై గేదెలను ఢీకొట్టడంతో తలకు బలమైన గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. మణుగూరు పీవీ కాలనీకి చెందిన చింతల ఎల్లమ్మ(80) గత మంగళవారం ఇల్లెందు వెళ్లడానికి బస్టాండ్కు బయలుదేరింది. రహదారిపై పశువులు పోట్లాడుకుంటూ ఎల్లమ్మపై పడడంతో తీవ్రగాయాలతో కన్నుమూసింది.యజమానులు ఇస్టారాజ్యంగా పశువులను రహదారులపైకి వదిలేస్తున్నారని తెలిసింది. దీని వల్ల వాహనదారులు ప్రమాదాలకు గురై ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. కొన్ని చోట్ల ఆవులు, గేదెలు గుంపులు,గుంపులుగా తిష్ట చేయటమే కాకుండా వచ్చిపోయే ప్రజలు, వాహనదారులపై దాడులకు దిగుతున్నాయి. దీని విషయంలో పశువుల యజమానులు పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది. లేని పక్షంలో జరిమానాలతో పాటు కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇస్తాం. – ఎం.విద్యాచందన, డీపీఓ రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి గేదెను బైక్ ఢీకొనడంతో ఘటన పెనుబల్లి: మండలంలోని లింగగూడెంలో బుధవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. లింగగూడెంకు చెందిన స్నేహితులు పద్దం విష్ణు(19), విరపా గోపరాజు ములకలపల్లి మండలం కమలాపురం గ్రామానికి చెందిన మరో మిత్రుడు మిడియం శివ(19)ను వీఎం బంజర్లో ద్విచక్రవాహనం ఎక్కించుకున్నారు. ఆపై లింగగూడెం వస్తుండగా ఆకస్మాతుగా రోడ్డుపైకి వచ్చిన గేదెను బలంగా ఢీకొట్టి గాలిలో ఎగిరి పడ్డారు. ఘటనలో తీవ్రంగా గాయపడిన ముగ్గురిని 108 సిబ్బంది పెనుబల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే, బైక్ నడుపుతున్న విష్ణు అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆతర్వాత మిడియం శివ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఇక గాయాలైన గోపరాజును మెరుగైన వైద్యం కోసం ఖమ్మం తరలించినట్లు వీఎం బంజర్ పోలీసులు తెలిపారు. -
సుడాకు అండదండలేవీ?!
ఖమ్మంమయూరిసెంటర్: ఖమ్మం నగరంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలను ప్రణాళికాయుతంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ‘సుడా’ (స్తంబాద్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ) ఏర్పాటై పదేళ్లు కావొస్తున్నా ఇంకా బాలారిష్టాలు వీడడం లేదు. పాలక మండళ్లు మారుతున్నా, చైర్మన్లు బాధ్యతలు స్వీకరిస్తున్నా పాలన సాఫీగా సాగేల సొంత ఉద్యోగి ఒక్కరు లేకపోవడం గమనార్హం. ఫలితంగా ఖమ్మం నగరపాలక సంస్థ (కేఎంసీ) అధికారులే ఇటు కార్పొరేషన్, అటు సుడా బాధ్యతలను నిర్వర్తించాల్సి వస్తోంది. ఇక సుడా పరిధిని విస్తరిస్తూ ప్రభుత్వం 2024 అక్టోబర్లో ఉత్తర్వులు జారీ చేసినా అనుమతులు విడుదల చేయకపోవడంతో పాత పరిధిలోనే పాలన సాగుతోంది. ఆ ఉద్యోగులే అటూఇటు.. గత ప్రభుత్వం 2017లో ‘సుడా’ను ఏర్పాటుచేసి పాలక మండలిని నియమించింది. అయితే, రాష్ట్రంలో ప్రభుత్వం మారగానే గత కమిటీని రద్దుచేయగా, ఇటీవలే నూతన చైర్మన్ను నియమించారు. ఇలా నియామకాలు జరుగుతున్నా క్షేత్రస్థాయిలో పని చేసే యంత్రాంగం లేకపోవడంతో ఆశించిన స్థాయిలో పనులు సాగడం లేదు. నిబంధనల ప్రకారం సుడా వైస్ చైర్మన్గా కేఎంసీ కమిషనర్ వ్యవహరిస్తున్నారు. అంతేకాక కార్పొరేషన్కు చెందిన టౌన్ ప్లానింగ్, ఇంజినీరింగ్, అకౌంట్స్, ఎస్టాబ్లిస్మెంట్ విభాగాల ఉద్యోగులే సుడా కార్యకలాపాలను కూడా అదనంగా నిర్వర్తిస్తుండడంతో వారిపై భారం పడుతోంది. అటు కార్పొరేషన్ పనులు చేస్తూనే, ఇటు సుడా పరిధిలోని లే ఔట్లు, భవన నిర్మాణ అనుమతుల పరిశీలనకు ఆటంకం కలుగుతోంది. రాబడి పెరిగినా.. సుడా పరిధిలోని గ్రామాల్లో భవన నిర్మాణాలు, లే ఔట్లకు ఏర్పాటుకు అనుమతుల ద్వారా ఏటా రూ.కోట్లలో ఆదాయం సమకూరుతోంది. ఒకవేళ ప్రత్యేకంగా అధికారులు, సిబ్బందిని కేటాయిస్తే నిరంతరం పర్యవేక్షిస్తూ అక్రమ లేఔట్లను అడ్డుకుంటే రాబడి రెట్టింపు అవుతుంది. పొరుగున ఉన్న వరంగల్ జిల్లాకు చెందిన ‘కుడా’(కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ)కు ప్రభుత్వం ప్రత్యేక పోస్టులు మంజూరు చేయడంతో పాలన సాఫీగా సాగుతోంది. కానీ ‘సుడా’ విషయంలో ఆ చొరవ లేక ఇక్కట్లు ఎదురవుతున్నాయి. రెండుసార్లు ప్రతిపాదనలు పరిపాలన సజావుగా సాగడానికి ఐదు ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేసి, కనీసం 78 పోస్టులు మంజూరు చేయాలని గత ప్రభుత్వానికి ఓ సారి, ప్రస్తుత ప్రభుత్వానికి మరోసారి నివేదికలు పంపినట్లు తెలుస్తోంది. ప్లానింగ్, డెవలప్మెంట్, అర్బన్ ఫారెస్ట్రీ, అడ్మిన్/అకౌంట్స్, భూసేకరణ విభాగాలను ఏర్పాటు చేయాలని ఇందులో పేర్కొన్నారు. అయినా పోస్టుల మంజూరుపై సానుకూల స్పందన రాలేదు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి, ప్రత్యేక పోస్టులను సృష్టించి ఉద్యోగులను నియమిస్తేనే సార్ధకత ఉంటుందని స్థానికులు, నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈసారి కూడా... గత పాలకవర్గ హయాంలో కేఎంసీ ఉద్యోగులను ‘సుడా’లో విధినిర్వహణకు కేటాయించారు. తాజాగా చైర్మన్ను నియమించగా, పోస్టులు మంజూరు కాకపోవడంతో ఉన్నతాధికారులు మరోసారి కేఎంసీ వైపే చూశారు. ఈమేరకు కేఎంసీ టౌన్ ప్లానింగ్ సెక్షన్ నుంచి సీపీఓ రాజ్కుమార్, ఇంజనీరింగ్ సెక్షన్ నుండి డీఈఈ వి.నరేందర్, మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్ షమ, అకౌంట్స్ విభాగం నుంచి అకౌంట్స్ ఆఫీసర్ చింత శ్రీనివాసరెడ్డి, సీనియర్ అకౌంటెంట్ ఏ.ఉపేందర్రావు, ఎస్టాబ్లిష్మెంట్ విభాగం నుంచి మేనేజర్ జి.శ్రీనివాసరావు, టైపిస్ట్ చంద్రహాసినికి అదనపు బాధ్యతలు కేటాయించారు. -
సోనోవిజన్ షోరూంలో భారీ చోరీ
● సెల్ఫోన్లతో పాటు ఇతర పరికరాల అపహరణ ● షట్టర్ తెరిచి.. సాఫీగా సర్దుకున్న నిందితులు ఖమ్మంక్రైం: ఖమ్మం వైరా రోడ్డులో ఉన్న సోనోవిజన్ షోరూంలో గురువారం తెల్లవారుజామున భారీ చోరీ జరిగింది. షోరూం నుంచి విలువైన 200 సెల్ఫోన్లతోపాటు ఇతర సామగ్రిని నిందితులు ఎత్తుకెళ్లారు. సుమారు రూ.66.90లక్షల విలువైన సొత్తు చోరీ అయినట్లు నిర్వాహకులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. దర్జాగా షట్టర్ తెరిచి... జిల్లా కేంద్రంలోని ప్రధాన రహదారి అయిన వైరా రోడ్డులో సోనోవిజన్ షోరూం కొనసాగుతోంది. ఇక్కడ సెక్యూరిటీ గార్డు లేకపోవడంతో కారులో వచ్చిన దుండగులు తెల్లవారుజామున 3–30గంటలకు దర్జాగా షట్టర్ తాళాలు పగులగొట్టి తెరిచారు. ఆపై ర్యాక్ల్లో ఉన్న ఆపిల్, ఇతర కంపెనీల 200 ఫోన్లతో పాటు చార్జర్లు, అడాప్టర్లు వంటివి సర్దుకుని ఎత్తుకెళ్లారు. ముందే తెలిసిందా ? సోనోవిజన్ షోరూమ్కు బుధవారమే విలువైన సెల్ఫోన్ల స్టాక్ వచ్చింది. ఈ విషయమై దుండగులకు ఇక్కడి ఉద్యోగులు లేదా.. ఇంకెవరైనా సమాచారం ఇచ్చి ఉంటారని తెలుస్తోంది. అందుకే ఫోన్లు తప్ప ఇతర వస్తువులేవీ చోరీ చేయకపోవడం, ఫోన్లు అయితేనే సులువుగా తీసుకెళ్లవచ్చనే భావనతో ఈ పనిచేసి ఉండొచ్చని సమాచారం. రహదారిపై వెళ్తున్న వారెవరైనా చూసినా ఉద్యోగులే పని చేసుకుంటున్నారనే భావన వచ్చేలా షోరూమ్ షట్టర్ పూర్తిగా తెరిచినట్లు సమాచారం. పోలీసులకు సమాచారం ఇవ్వలేదా? విజయవాడ నుంచి సమాచారం అందగానే ఖమ్మం ఉద్యోగులు డయల్ 100కు కానీ పోలీసులకు కానీ సమాచారం ఇవ్వకుండా నేరుగా షోరూమ్కు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే, అప్పటికే దుండగులు వెళ్లిపోతుండడంతో ఏమీ చేయలేని పరిస్థితి ఎదురైందని సమాచారం. కాగా, దుండగుల కారు జాడల వైరా వరకు మాత్రమే సీసీ టీవీల్లో కనిపించగా, ఆతర్వాత ఎటు వెళ్లిందో గుర్తించలేకపోయారు. కారు నంబర్ ప్లేట్ ఏపీ రిజిస్ట్రేషన్ ఉండడంతో వైరా నుంచి గ్రీన్ఫీల్డ్ హైవేపైకి చేరుకుని ఏపీలోకి ప్రవేశించి ఉంటారని అనుమానిస్తున్నారు. చోరీ విషయం తెలియగానే ఖమ్మం పోలీసు కమిషనర్ సునీల్దత్, ఏపీపీ రమణమూర్తి ఆధ్వర్యాన క్లూస్ టీమ్ను రంగంలోకి దింపి దర్యాప్తు ఆరంభించారు. ఇదే క్రమాన చోరీ జరిగిన షోరూమ్తో పాటు ఇతర బ్రాంచ్ల్లోని సిబ్బందిని కూడా విచారిస్తున్నట్లు తెలిసింది. -
సాగుకు విత్తనాలు రెడీ..
● వరిలో ఐదు రకాలు, 7వేల క్వింటాళ్లు ● అందుబాటులో పెసర, మినుము విత్తనాలు కూడా.. ● పీఏసీఎస్లు, ఆగ్రోస్ ద్వారా విక్రయానికి ఏర్పాట్లు ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో పంటల సాగుకు అనుగుణంగా వ్యవసాయ శాఖ ఇండెంట్ల ఆధారంగా విత్తనాలను సమకూరుస్తున్నాం. ఇప్పటికే పచ్చిరొట్ట విత్తన విక్రయాలు మొదలయ్యాయి. వరి, పెసర, మినుము విత్తనాలు కూడా విక్రయానికి సిద్ధంగా ఉన్నాయి. – బయ్య రఘు, ప్రాంతీయ మేనేజర్, విత్తనాభివృద్ధి సంస్థఖమ్మంవ్యవసాయం: వానాకాలం సీజన్ మొదలుకావడంతో విత్తనాభివృద్ధి సంస్థ వివిధ పంటల సాగుకు అవసరమైన విత్తనాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఉమ్మడి జిల్లాలోని వనరులు, నేలల రకాలను పరిగణనలోకి తీసుకోవడంతో పాటు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల వ్యవసాయ శాఖల నుంచి అందిన ఇండెంట్ల ఆధారంగా విత్తనాలను సిద్ధం చేస్తోంది. ఉమ్మడి జిల్లాలో వరి ప్రధాన పంట కావడంతో ఐదు రకాల విత్తనాలు సమకూర్చనుండగా, మెట్ట పైర్లుగా సాగు చేసే పెసర, మినుము విత్తనాలను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటికే పచ్చిరొట్ట పంటలైన జీలుగు, జనుము, పిల్లి పెసర విత్తనాల విక్రయాలు ఉమ్మడి జిల్లాలోని సహకార సంఘాలు, ఆగ్రోస్ రైతు కేంద్రాల ద్వారా జరుగుతున్నాయి. సన్న రకాలు ప్రభుత్వం వరిలో సన్న రకాల సాగును ప్రోత్సహిస్తోంది. దీంతో మూడు రకాలను విత్తనాభివృద్ధి సంస్థ విక్రయానికి సిద్ధం చేసింది. ఇందులో బీపీటీ– 5204 రకం మూడు వేల క్వింటాళ్లు, ఆర్ఎన్ఆర్–15048 కేఎన్ఎం–1638 రకాలు రెండేసి వేల క్వింటాళ్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇవి కాక దొడ్డు రకాల్లో ఎంటీయూ–1010, కేఎన్ఎం–118 రకాలను 500 క్వింటాళ్లు చొప్పున సిద్ధం చేశారు. మెట్ట పంటలకు సైతం.. ఉమ్మడి జిల్లాలో మెట్ట పంటలుగా వర్షాధారం ఆధారంగా పెసర, మినుము సాగు చేస్తారు. అంతేగాక వరి మాగాణి భూముల్లో ముందస్తు పంటగా కొందరు రైతులు పెసర సాగు చేసి పరిస్థితులకు అనుగుణంగా పచ్చిరొట్టగా వినియోగిస్తారు. మిర్చి వంటి పంటల సాగుకు ముందు కూడా భూసారం పెంచేందుకు పెసర వేస్తారు. తద్వారా రైతులకు ఆదాయం లభించడమే కాక పచ్చిరొట్టగా ఉపయోగపడుతుంది. పెసరలో మధిర రకాలు ఎంజీజీ–295 రకం 500 క్వింటాళ్లు, ఎంజీజీ–385 రకం 800 క్వింటాళ్లు అందుబాటులో ఉండగా, మినుములో పీయూ–31 రకం 200 క్వింటాళ్లు సిద్ధంగా ఉన్నాయి. ఈ విత్తనాలను సహకార సంఘాలు, ఆగ్రోస్ రైతు విక్రయ కేంద్రాల ద్వారా విక్రయానికి ఏర్పాట్లు చేస్తున్నారు. -
ప్రభుత్వ కాలేజీల్లో ప్రవేశాలు పెంచాలి
బోనకల్: ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో అందుతున్న నాణ్యమైన బోధన, అందుబాటులో వసతులను వివరిస్తూ విద్యార్థులు చేరేలా అవగాహన కల్పించాలని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖాధికారి కె.రవిబాబు సూచించారు. బోనకల్ కాలేజీని గురువారం తనిఖీ చేసిన ఆయన భవన నిర్మాణాలను పరిశీలించారు. ఈ సందర్భంగా అధ్యాపకులతో సమావేశమైన డీఐఈఓ మాట్లాడుతూ ప్రతీగ్రామంలో పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులను కలిసి కాలేజీలో చేరాలని చూడాలన్నారు. ఈక్రమాన ఉచితంగా పాఠ్యపుస్తకాలు అందించడంతో పాటు అల్పాహారం, మధ్యాహ్న భోజనం అందుతుందనే అంశంపై అవగాహన కల్పించాలని సూచించారు. అనంతరం కాలేజీలో చేరిన విద్యార్థులకు ఆయన పుస్తకాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ నళినిశ్రీ, అధ్యాపకులు పాల్గొన్నారు. -
మిర్చి కొనుగోళ్లు ప్రారంభం
మధిర: మధిర వ్యవసాయ మార్కెట్లో మిర్చి కొనుగోళ్లు గురువారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా మార్కెట్ చైర్మన్ బండారు నరసింహారావు మాట్లాడుతూ ఇక్కడి మార్కెట్ను రెగ్యులర్ యార్డుగా మార్చేందుకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇప్పటికే హామీ ఇచ్చారని తెలిపారు. ఇది అమల్లోకి వస్తే పంట ఉత్పత్తుల క్రయవిక్రయాలు నిరంతరాయం కొనసాగుతాయని చెప్పారు. కాగా, తొలిరోజు రైతు రవికుమార్ తీసుకొచ్చిన తేజ రకం 18 బస్తాల మిర్చిని ట్రేడర్ కృష్ణ క్వింటాకు రూ.22వేల ధరతో కొనుగోలు చేశారు. ఇది ఈ సీజన్లో అత్యధిక ధర అని మార్కెట్ వర్గాలు వెల్లడించాయి. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల, పట్టణ అధ్యక్షులు పారుపల్లి విజయ్కుమార్, తలుపుల వెంకటేశ్వర్లు, ఎర్రుపాలెం మండల అధ్యక్షుడు బొగ్గుల శ్రీనివాస్రెడ్డి, నాయకులు కర్నాటి రామారావు, కోల్డ్ స్టోరేజ్ యాజమానులు మందడపు రామకష్ణ, కళ్యాణపు పుల్లారావు తదితరులు పాల్గొన్నారు. జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ బదిలీ ఖమ్మంమయూరిసెంటర్: జిల్లా గెజిటెడ్ ఫుడ్ ఇన్స్పెక్టర్ ఆర్.కిరణ్కుమార్ హనుమకొండ జిల్లాకు బదిలీ అయ్యారు. ఆయన 19ఏళ్లుగా వివిధ హోదాల్లో జిల్లాలోనే పనిచేయడం గమనార్హం. ఈమేరకు బదిలీపై వెళ్తున్న కిరణ్కుమార్ను ఆహార తనిఖీ శాఖ అధికారులు, ఉద్యోగులు గురువారం సన్మానించారు. కాగా, జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్గా ఇంకా ఎవరినీ నియమించలేదు. 13 మంది సీనియర్ అసిస్టెంట్లకు డీటీలుగా పదోన్నతి ఖమ్మం సహకారనగర్: జిల్లా రెవెన్యూ శాఖలో విధులు నిర్వర్తిస్తున్న సీనియర్ అసిస్టెంట్లు పలువురికి డిప్యూటీ తహసీల్దార్లుగా పదోన్నతి లభించింది. ఈమేరకు జిల్లా నుంచి 13మంది మంది పదోన్నతి లభించగా వారిలో కొందరికి ఇక్కడే, ఇంకొందరిని ఇతర జిల్లాలకు కేటాయించారు. అలాగే, ఇతర ప్రాంతాల్లో పనిచేస్తూ పదోన్నతి పొందిన వారిని జిల్లాకు కేటాయించారు. కాగా, గుగులోతు లక్ష్మణ్, పఠాన్ ఖాజామోహిద్దీన్, కాటిబోయిన అప్పిరాములు, నకిరికంటి జగదీశ్, దినవాహీ జ్యోతి, కే.వీ.వీ.ప్రసాద్కు పదోన్నతి కల్పించి జిల్లాకే కేటాయించారు. ఇక అల్లం రవికుమార్, బానోతు శ్యామ్ప్రసాద్ సింగ్, కె.రాజశేఖర్, షేక్ వహీద్, కే.వీ.సుజాత, కేతిబోయిన మానస, మహ్మద్ జాహెద్ బేగంను హన్మకొండ జిల్లాకు బదిలీ చేశారు. 724 మె.టన్నుల యూరియా చింతకాని: మండలంలోని పందిళ్లపల్లి రేక్ పాయింట్కు గురువారం స్పిక్ కంపెనీకి చెందిన 724.05 మెట్రిక్ టన్నుల యూరియా చేరిందని జిల్లా వ్యవసాయాధికారి డి.పుల్లయ్య తెలిపారు. ఇందులో ఖమ్మం జిల్లాకు 224.05 మెట్రిక్ టన్నులు, భద్రాద్రి జిల్లాకు 300 మె.టన్నులు, మహబూబాబాద్ జిల్లాకు 200 మె.టన్నులు సరఫరా చేశామని వెల్లడించారు. బీసీ స్టడీ సర్కిల్లో శిక్షణ పూర్తి ఖమ్మంమయూరిసెంటర్: ఖమ్మంలోని బీసీ స్టడీ సర్కిల్లో నాలుగు రోజులుగా ఏఐ, లైఫ్ స్కిల్స్పై ఇస్తున్న శిక్షణ గురువారం ముగిసింది. ఈ సందర్భంగా శిక్షణలో పాల్గొన్న 139 మంది అభ్యర్థులకు సర్టిఫికెట్లు అందజేశారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, కమ్యూనికేషన్, నాయకత్వ లక్షణాలపై నిపుణులతో శిక్షణ ఇప్పించినట్లు నిర్వాహకులు తెలిపారు. కాగా, గురువారం జరిగిన కార్యక్రమంలో డీబీసీడీఓ జి.జ్యోతి అభ్యర్థులకు సర్టిఫికెట్లను అందజేసి మాట్లాడారు. శిక్షణ పొందిన వారు సాంకేతికత ఆధారంగా జీవనోపాధికి బాటలు వేసుకోవాలని సూచించారు. బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ జి.శ్రీలత, అక్షిత, ఏబీసీడీఓ వెంగళ్రావు తదితరులు పాల్గొన్నారు. కనుల పండువగా రామయ్య కల్యాణంభద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో రామయ్య నిత్యకల్యాణం కనుల పండువగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. -
ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించండి
కూసుమంచి: వర్షపాతం తక్కువగా నమోదవుతుందనే సూచనలు ఉన్నందున చివరి ఆయకట్టు రైతులు వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని జిల్లా వ్యవసాయాధికారి డి.పుల్లయ్య సూచించారు. మండలంలోని నేలపట్లలో గురువారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. రైతులు నీటి వసతి ఆధారంగా పంటల సాగు చేపట్టాలని, ప్రస్తుతం పెసర, మినుము, అపరాల సాగు లాభదాయకమని తెలిపారు. భూగర్భ జలాలు తగ్గినప్పుడు రైతులు అధిక సాంద్రత విధానంలో పత్తి సాగు చేస్తే దిగుబడి పెరుగుతుందని, వరిలో కూడా వెదజల్లే పద్ధతి అనుసరించాలని సూచించారు. అనంతరం కూసుమంచిలోని పలు విత్తన దుకాణాలను టాస్క్ఫోర్స్ బృందంతో కలిసి డీఏఓ తనిఖీ చేశారు. సర్పంచ్ శోభన్బాబు, ఏడీఏ సతీష్, ఏఓ వాణి, జల వనరుల శాఖ ఏఈ నవీన్ తదితరులు పాల్గొన్నారు. -
డయేరియా కట్టడికి ప్రత్యేక ప్రణాళిక
చింతకాని: డయేరియా వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఈనెల 16నుంచి వచ్చే నెల 31వ తేదీ వరకు ‘స్టాప్ డయేరియా’ పేరిట ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి రామారావు తెలిపారు. మండల కేంద్రంలోని పీహెచ్సీని గురువారం ఆయన తనిఖీ చేశాక సిబ్బంది, ఆశా కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడుతూ హెచ్పీవీ వ్యాక్సిన్ లక్ష్యాన్ని చేరుకునేలా బాలికల తల్లిండ్రులకు అవగాహన కల్పించాలని సూచించారు. అలాగే, నెలాఖరున నిర్వహించే పల్స్ పోలియోకు సిద్ధం కావాలని తెలిపారు. తొలుత పీహెచ్సీలో అందుతున్న వైద్యసేవలు, వ్యాక్సినేషన్ రికార్డులను ఆయన పరిశీలించారు. మండల వైద్యాధికారి ఆల్తాఫ్, వైద్యులు సోహెల్, అనిల్, సుప్రియ, తబుషుం, ఉద్యోగులు జ్యోతి, కనకతార తదితరులు పాల్గొన్నారు. -
నేడు మంత్రి పొంగులేటి పర్యటన
ఖమ్మంమయూరిసెంటర్/తిరుమలాయపాలెం: రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శుక్రవారం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు తిరుమలాయపాలెంలో 0.8 మెగావాట్ల సౌర విద్యుత్ కేంద్రం నిర్మాణానికి శంకుస్థాపన చేశాక, మండల పరిషత్ కార్యాలయంలో కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేస్తారు. మధ్యాహ్నం 12–30 గంటలకు ఏదులాపురం మున్సిపాలిటీ పరిధి కాంగ్రెస్ పార్టీ బూత్ లెవల్ ఏజెంట్ల శిక్షణలో పాల్గొంటారు. సాయంత్రం 4గంటలకు రామ్లీల ఫంక్షన్హాల్లో ఖమ్మం రూరల్ మండల కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారులకు మంత్రి చెక్కులు పంపిణీ చేయనున్నారు. ఆతర్వాత నేలకొండపల్లి మండలం బైరవునిపల్లిలో గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభించనున్న మంత్రి, బుద్దారం గ్రామంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. 4లక్షల పోస్టల్ ఖాతాలే లక్ష్యం నేలకొండపల్లి: జిల్లాలో ఈ ఏడాది కొత్తగా 4లక్షల పోస్టల్ ఖాతాలు ప్రారంభించేలా కార్యాచరణ రూపొందించినట్లు శాఖ ఖమ్మం డివిజన్ సూపరింటెండెంట్ వీరభద్రస్వామి తెలిపారు. మండలంలోని వివిధ గ్రామాల్లోని బ్రాంచ్ పోస్టాఫీసులను గురువారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సూపరింటెండెంట్ మాట్లాడుతూ జిల్లాలో గత ఏడాది 2.30లక్షల నూతన ఖాతాలను ప్రారంభించగా, ఈ ఏడాది 4లక్షల లక్ష్యంలో ఇప్పటికే 30 వేల ఖాతాలను తెరిపించామని తెలిపారు. ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. పీఎల్ఐ, ఆర్పీఎల్ఐ బీమాను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కాగా, శాఖలో ఖాళీల భర్తీకి వచ్చే నెల నోటిఫికేషన్ విడుదలవుతుందని ఆయన తెలిపారు. ఈ తనిఖీల్లో సౌత్ సబ్ డివిజన్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, బీఎం రమేష్, బీపీఎంలు పాల్గొన్నారు. బీఎల్ఓలు అప్రమత్తంగా వ్యవహరించాలి వైరా/ఏన్కూరు: ఓటర్ల జాబితా మ్యాపింగ్ నేపథ్యాన బీఎల్ఓలు అప్రమత్తంగా వ్యవహరించాలని అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ సూచించారు. వైరా కేవీకేలో గురువారం వైరా, కొణిజర్ల, కారేపల్లి మండలాల బీఎల్ఓల సమావేశం ఏర్పాటుచేశారు. అలాగే, ఏన్కూరు రైతువేదికలో జూలూరుపాడు, ఏన్కూరు మండలాల బీఎల్ఓలు, సూపర్వైజర్లు, పంచాయతీ కార్యదర్శుల సమావేశం నిర్వహించగా ఆమె మాట్లాడారు. బీఎల్ఓలు, సూపర్వైజర్లు, పంచాయతీ కార్యదర్శులు ఓటరు జాబితా మ్యాపింగ్ విషయంలో జాగ్రత్తగా ఉంటూ వయస్సుల వారీగా విభజించుకుని అర్హులెవరూ ఓటుహక్కు కోల్పోకుండా చూడాలని తెలిపారు. ఇదేసమయాన అనర్హుల పేర్లు గుర్తించాలని సూచించారు. అవసరమైతే బీఎల్ఓలు సహాయకులను నియమించుకోవచ్చని చెప్పారు. కాగా, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు చర్యలు తప్పవని పేర్కొన్నారు. ఈసమావేశాల్లో తహసీల్దార్లు, ఉద్యోగులు పాల్గొన్నారు. గురుకులాలు, హాస్టళ్లను సిద్ధం చేయండి ఖమ్మంమయూరిసెంటర్: కొత్త విద్యాసంవత్సరం 15వ తేదీన మొదలుకానున్న నేపథ్యాన గురుకులాలు, వసతిగృహాల్లో అవసరమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి ఎం.డీ.ముజాహిద్ సూచించారు. ఖమ్మంలోని కార్యాలయంలో గురువారం ఆయన గురుకుల పాఠశాలలు, కళాశాలల ప్రిన్సిపాళ్లతో సమావేశమయ్యారు. గురుకులాల్లో అవమరమైన మరమత్తులను తక్షణమే పూర్తి చేయాలని తెలిపారు. వర్షాకాలం దృష్ట్యా వరద ప్రభావిత పాఠశాలల్లో ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలన్నారు. విద్యార్థుల ఆరోగ్యం, నాణ్యమైన ఆహారం, సురక్షిత తాగునీటి సరఫరాపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. అంతేకాక ప్రవేశాల సంఖ్య పెరిగేలా కృషి చేయాలని తెలిపారు. -
200
‘సుడా’కు అండదండలేవీ?! ‘సుడా’కు సొంత భవనం లేకపోగా.. కనీసం ఉద్యోగుల కేటాయింపు కూడా జరగగా కేఎంసీపైనే ఆధార పడాల్సి వస్తోంది.వాతావరణ ం జిల్లాలో శుక్రవారం ఉదయం, సాయంత్రం వాతావరణం చల్లగానే ఉంటుంది. మధ్యాహ్నం మాత్రం గరిష్ట ఉష్ణోగ్రత నమోదవుతుంది.శుక్రవారం శ్రీ 12 శ్రీ జూన్ శ్రీ 2026రెక్కీ.. చోరీ.. పరారీఖమ్మం సోనోవిజన్ షోరూంలో దుండగులు ప్రవేశించగానే విజయవాడలోని ప్రధాన కార్యాలయంలో అలారమ్ మోగింది. ఆ వెంటనే పది నిమిషాల్లో ఇక్కడి ఉద్యోగులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఇద్దరు ఉద్యోగులు బైక్పై వచ్చేసరికి దుండగులు షాపు ముందు నిలిపిన కారులో చోరీ సొత్తుతో వెళ్లిపోయేందుకు సిద్ధమవుతున్నారు. ఉద్యోగులు ఆ కారు ఎదుట తమ ద్విచక్ర వాహనాన్ని ఉంచి నిలువరించే ప్రయత్నం చేసినా దుండగులు కారు కాస్త రివర్స్ తీసుకుని పక్కనుంచి మళ్లీ ముందుకు వచ్చి యూ టర్న్ వద్ద తిప్పుకుని వైరా వైపు వేగంగా వెళ్లిపోయారు. -
సెప్టెంబర్లో ఏఐకేఎంఎస్ జాతీయ మహాసభలు
ఖమ్మంమయూరిసెంటర్: అఖిలభారత రైతు కూలీ సంఘం(ఏఐకేఎంఎస్) నాలుగో జాతీయ మహాసభలను ఖమ్మం వేదికగా నిర్వహించనున్నట్లు జాతీయ అధ్యక్షులు వేములపల్లి వెంకట్రామయ్య తెలిపారు. సెప్టెంబర్ 28, 29, 30వ తేదీల్లో జరిగే సభల పోస్టర్లను గురువారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్ఆర్బీజీఎన్ఆర్ కాలేజీ ఆడిటోరియంలో జరిగిన ఆహ్వాన సంఘం సమావేశానికి వి.కోటేశ్వరరావు అధ్యక్షత వమించగా వెంకట్రామయ్యతో పాటు డీసీసీబీ మాజీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, డాక్టర్ ఎం.ఎఫ్ గోపీనాథ్, రవిమారుత్, కొల్లి సత్యనారాయణ తదితరులు మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశ సంపద, వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతోందని విమర్శించారు. స్వామినాథన్ కమిషన్ సిఫారసుల అమలులో కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తితో ఖమ్మంలో జరిగే ఏఐకేఎంఎస్ జాతీయ మహాసభలను అన్నివర్గాల ప్రజలు విజయవంతం చేయాలని కోరారు. అనంతరం మహాసభల ఆహ్వాన సంఘాన్ని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మండల వెంకన్న, పీఓడబ్ల్యూ, టీపీటీఎఫ్తో పాటు న్యూడెమోక్రసీ నాయకులు ఎన్.తిరుమలరావు, ఝాన్సీ, తాళ్లూరి వేణు, పి.రామకోటేశ్వరరావు, శేషగిరిరావు, సీహెచ్.బాబురావు, ఆవునూరి మధు, బండారు ఐలయ్య, గౌని ఐలయ్య, ముక్తి సత్యం, జడ సీతారామయ్య, కోలా లక్ష్మీనారాయణ, బజ్జూరి వెంకట్రామిరెడ్డి, వై.ప్రకాష్, పి.విప్లవకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
గేదెలు ఢీకొని గార్డుకు తీవ్రగాయాలు
నేలకొండపల్లి: విధినిర్వహణలో భాగంగా చెక్పోస్టు వద్ద వాహనాన్ని వెంబడించే క్రమాన గేదెలు ఢీకొనడంతో వ్యవసాయ మార్కెట్ సెక్యూరిటీ గార్డుకు తీవ్ర గాయాలయ్యాయి. అయితే, అధికారులు పట్టించుకోవడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. నేలకొండపల్లి మార్కెట్ పరిధిలోని పైనంపల్లి చెక్పోస్టులో మారగాని వీరబాబు సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. ఇటీవల రాత్రి వేళ ఓ వాహనాన్ని ఆపినా ఆగకపోవడంతో బైక్పై వెంబడిస్తుండగా గేదెలు తగిలి పడిపోవడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఘటనపై ఆరా తీయకపోగా, ఖమ్మంలో చికిత్స పొందుతున్న తనను అధికారులు కనీసం పరామర్శించలేదని వాపోతున్నాడు. అంతేకాక చెక్పోస్టు నిర్మాణం కోసం వెచ్చించిన రూ.1.50 లక్షలు కూడా ఇవ్వడం లేదని వెల్లడించాడు. చెక్పోస్టు నుంచి లక్ష్యాన్ని మించి రూ.56 లక్షల ఆదాయం సమకూర్చిన తనను ఇకనైనా ఆదుకోవాలని కోరుతున్నాడు. ఈ విషయమై మార్కెట్ అధికారుల వివరణ కోసం ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు. -
● పెద్ద షాపులే దొంగల టార్గెట్ ● రూ.లక్షల విలువైన సొత్తు చోరీ చేసి మాయం ● మంత్రుల పర్యటనలు, ప్రోటోకాల్తో పోలీసుల బిజీబిజీ ● ఫలితంగా పెట్రోలింగ్ తగ్గి పెరుగుతున్న నేరాలు
సాక్షిప్రతినిధి, ఖమ్మం: జిల్లాలో కొద్దిరోజులుగా అంతర్రాష్ట్ర దొంగల ముఠా హల్చల్ సృష్టిస్తోంది. ప్రముఖ షాపింగ్ కాంప్లెక్స్లు, ఎలక్ట్రానిక్ షోరూమ్లను ఈ ముఠాలు లక్ష్యంగా చేసుకుంటున్నాయి. రెక్కీ నిర్వహించి మరీ లూటీ చేసి సరిహద్దు దాటేస్తున్నాయి. ఖమ్మంలోని సోనోవిజన్ ఎలక్ట్రానిక్స్ షోరూమ్లో గురువారం తెల్లవారుజామున ఏకంగా రూ.66లక్షలకు పైగా విలువైన 200 సెల్ఫోన్లను అపహరించడం కలకలం రేపింది. ఇటీవలి కాలంలో ఇదే భారీ దొంగతనంగా భావిస్తున్నారు. గత నెలలో కూడా ఖమ్మంలో ఓ వ్యాపారి నుంచి బంగారు ఆభరణాలు తస్కరించారు. కరీంనగర్లోని పీఎంజే జ్యూవెలరీ షాప్ చోరీ కేసులో పట్టుపడిన నిందితులు ఖమ్మంలోనూ రెక్కీ నిర్వహించామని ఒప్పుకోవడం.. ఆపై వరుసగా చోరీలు జరుగుతుండడం జిల్లావాసులను ఆందోళనకు గురి చేస్తోంది. మకాం వేశారా? కొద్దినెలలుగా అంతర్రాష్ట్ర దొంగల ముఠా ఖమ్మంలో మకాం వేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కరీంనగర్ పీఎంజే జ్యూయలరీ కేసు నిందితులు తొలుత ఖమ్మంలో రెక్కీ నిర్వహించామని అంగీకరించిన విషయం తెలిసిందే. అలాగే మే 21న గాంధీచౌక్లో వ్యాపారి కార్తీక్ తన బైక్పై ఉంచిన రూ.40 లక్షల విలువైన ఆభరణాల చోరీ జరిగింది. ఈ కేసులోనూ నిందితులు ఖమ్మంలోని ఓ లాడ్జీలో మకాం వేసి చుట్టుపక్కల జిల్లాల్లో దొంగతనాలకు ప్రణాళిక వేసినట్లు తెలిసింది. నల్లగొండలోని ఓ బ్యాంక్ ముందు పట్టుపడిన దొంగలు కూడా ఖమ్మంలోనే కొన్నాళ్లు ఉన్నట్లు సమాచారం. సులువుగా సరిహద్దు దాటేలా.. అంతర్రాష్ట్ర ముఠాలు రూ.కోట్లలో సొత్తు దోపిడీకి బంగారు షాపులు, ఎలక్ట్రానిక్స్ దుకాణాలను లక్ష్యంగా చేసుకుంటున్నారని తెలుస్తోంది. దొంగతనం ఎలా చేయాలి.. ఎటువైపు నుంచి పారిపోవాలి.. ఏయే రోడ్లు సురక్షితమనే అంశాలను బేరీజు వేసుకున్నాక రంగంలోకి దిగుతున్నట్లు సమాచా రం. గత నెలలో వ్యాపారి వద్ద బంగారు ఆభరణాల చోరీ, గురువారం సోనోవిజన్ ఎలక్ట్రానిక్స్ షాపులో జరిగిన దొంగతనాలను పరిశీలిస్తే ఇదే విషయం తెలుస్తోంది. సోనోవిజన్ షాపులో చోరీకి పాల్పడిన వారు ఏపీ రిజిస్ట్రేషన్ కారులో వచ్చి ఆంధ్రప్రదేశ్ వైపునకు పారిపోయినట్లుపోలీసులు గుర్తించారు. ఇటీవల అందుబాటులోకి వచ్చిన కొత్త హైవే నిందితులకు కలి సొస్తున్నట్లు భావిస్తున్నారు. ప్రోటోకాల్తో బిజీ... తగ్గిన పెట్రోలింగ్ ఖమ్మం నగరంతోపాటు జిల్లాలో ఇటీవల చోరీల సంఖ్య పెరుగుతోంది. అపార్ట్మెంట్స్, షాపింగ్ కాంప్లెక్స్లపై దుండగులు కన్నేసి చిన్నచిన్న దొంగతనాలు కాకుండా భారీ స్థాయిలో సొమ్ము కొల్లగొట్టేందుకు నిందితులు స్కెచ్ వేసినట్లు ఇటీవలి ఘటనల ద్వారా తెలుస్తోంది. అయితే గతంతో పోలిస్తే ఇటీవల పోలీసుల పెట్రోలింగ్ తగ్గినట్లుగా ప్రజలు చెబుతున్నారు. గతంలో రాత్రి సమయాన కాలనీల్లో పోలీస్ పెట్రోలింగ్ ఉండేదని, పోలీసు వాహనాల సైరన్ల మోత మోగేదని.. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదని తెలుస్తోంది. కాగా, ప్రభుత్వపరంగా కార్యక్రమాలు, బందోబస్తులో పాల్గొనాల్సి ఉండడంతో పోలీసులు బిజీబిజీగా ఉంటున్నట్లు సమాచారం. జిల్లా నుంచి డిప్యూటీ సీఎం, ఇద్దరు మంత్రుల్లో ఎవరో ఒకరు వస్తుండడంతో వారికి బందోబస్తు నిర్వహించాల్సి వస్తోంది. ఈనేపథ్యాన కేసుల దర్యాప్తు, పెట్రోలింగ్పై పూర్తి స్థాయిలో దృష్టి సారించలేకపోతున్నట్లు సమాచారం. అంతేకాక పెరిగిన నివాస ప్రాంతాల ఆధారంగా తగిన సిబ్బంది లేకపోవడం కూడా శాంతిభద్రతలపై ప్రభావం పడుతోంది. -
ప్రణాళికతో ముందుకు..
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ‘ప్రజాసమస్యలను పరిష్కరిస్తూ పారదర్శకమైన పాలన అందించేలా ప్రణాళికాయుతంగా ముందుకు సాగుతున్నాం. వానాకాలం సాగు సీజన్ నేపథ్యాన ఎల్నినో ప్రభావం, ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు విస్తృత అవగాహన కల్పిస్తున్నాం. ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్ల పునఃప్రారంభానికి క్షేత్రస్థాయిలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. అకాల వర్షాలు వచ్చినా నష్టం జరగకుండా యంత్రాంగాన్ని అప్రమత్తం చేశాం’ అని కలెక్టర్ దివాకర టీ.ఎస్. వెల్లడించారు. జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులు, భూభారతి, సాదాబైనామా దరఖాస్తుల పరిష్కారం తదితర అంశాలను బుధవారం ఆయన ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఆ వివరాలు కలెక్టర్ మాటల్లోనే...184 గ్రామాలపై నజర్ ఈ వానాకాలంలో ఎల్నినో ప్రభావం జిల్లాపై ఏ మేర ఉంటుంది.. రైతులకు కల్పించాల్సిన అవగాహన, ప్రభుత్వపరంగా తీసుకోవాల్సిన చర్యలపై ప్రణాళిక రూపొందించాం. జిల్లాలోని వనరుల్లో తగినంత నీరు ఉన్నందున తాగు అవసరాలకు ఎక్కడా ఇబ్బంది వచ్చే అవకాశం లేదు. ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోతే సాగునీరు అందని 184 గ్రామాలను గుర్తించాం. ఇందులో 64 గ్రామాల్లోని రైతులు కాల్వల చివరి భాగంలో ఉండి, బోరు బావులపై ఆధారపడి 150 ఎకరాలకు పైగా మిర్చి సాగు చేస్తారని తేలింది. అంతేకాక అత్యధిక నీరు అవసరమయ్యే పంటలు సాగు చేసే వారిని సైతం గుర్తించాం. జిల్లాలో ఏటా ఎక్కువగా సాగయ్యే వరి ఈసారి తగ్గించాలని చెబుతున్నాం. నాలుగు ఎకరాలు ఉంటే.. రెండెకరాల్లో వరి వేసి, మిర్చి అంతర్ పంటగా సాగు చేసుకోండి కానీ ఒకే పంట వేయొద్దని సూచిస్తున్నాం. ఇలా ఎల్నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. బడుల్లో ఏర్పాట్లు ఈ ఏడాది విద్యాసంవత్సరం ప్రారంభానికి అంతా సిద్ధంగా చేశాం. పాఠ్య, నోట్ పుస్తకాలే కాక యూనిఫామ్స్ వచ్చాయి. పాఠశాలలను శుభ్రం చేయించి టాయిలెట్లు, తాగునీటి వసతిని పరిశీలించాలని సూచించాం. అవసరమైన నిధులు కావాలన్నా ఇస్తామని చెప్పాం. కొత్తగా ప్రీ ప్రైమరీ పాఠశాలలు మంజూరయ్యాయి. ఇందులో ఒక టీచర్, ఆయా పోస్టు భర్తీకి మండలాల వారీగా త్రీమెన్ కమిటీ స్క్రూటినీ చేసి జాబితా ఇస్తే ఎంపిక చేస్తాం. విద్యా సంవత్సరం ప్రారంభంలోగా ఈ నియామకాలు పూర్తవుతాయి. ఎస్ఐఆర్పై అపోహలు విడనాడాలి జిల్లాలో ఈనెల 24 నుంచి ఎస్ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రారంభమవుతుంది. ఓటు హక్కు కోల్పోతారనే అపోహలు అవసరం లేదు. బీఎల్ఓల దగ్గర వివరాల ఆధారంగా మ్యాపింగ్ అయిన వారు ఎవరు, కాని వాళ్లెవరో తెలుసుకోవచ్చు. మ్యాపింగ్ అయిన వారికి సమస్య ఉండదు. మ్యాప్ అంటే 2002 ఓటరు జాబితాలో మీ పేరు ఉండాలి. అలా పేరు లేక మ్యాప్ కాని వాళ్లు 11 రకాల ధ్రువపత్రాల్లో ఏదైనా ఒకటి ఇచ్చి దరఖాస్తు చేసుకోవాలి. ఈ విషయంలో ఓటర్లు బీఎల్ఓలకు సహకరించాలి. ప్రజాదర్బార్లో 26వేల దరఖాస్తులు పాలేరు నియోజకవర్గాన్ని 14 క్లస్టర్లుగా విభజించి ప్రజాదర్బార్లు నిర్వహించాం. అలాగే సత్తుపల్లి నియోజకవర్గంలో ఒక ప్రజాదర్బార్ జరిగింది. మొత్తంగా 26 వేల దరఖాస్తులు అందగా, అత్యధికం ఇళ్ల కోసమే ఉన్నాయి. అలాగే పెన్షన్ల కోసం 5వేల వరకు, ఉపాధి హామీ పథకం కార్డు కోసం 600 మంది, రెవెన్యూ అంశాల్లో 4 వేల దరఖాస్తులు ఇచ్చారు. ప్రతీ దరఖాస్తులను పరిశీలించి పరిష్కరిస్తాం. పాలేరు నియోజకవర్గానికి సంబంధించి క్లస్టర్ వారీగా వచ్చిన దరఖాస్తుల పరిశీలన ఇప్పటికే కొనసాగుతోంది. ‘భూభారతి’కి పరిష్కారం భూభారతిలో చాలా మంది దరఖాస్తులు ఇస్తున్నా మీ సేవలో అప్లై చేయడం లేదు. తద్వారా సంబంధిత వ్యక్తులు మళ్లీమళ్లీ తిరగాల్సి వస్తోంది. భూభారతికి అందే దరఖాస్తుల్లో ఎక్కువగా పీఓటీ, అసైన్మెంట్ అంశాలే ఉన్నాయి. ప్రభుత్వ ఆదేశాలతో వీటికి పరిష్కారం చూపుతాం. మిగతావి ఎప్పటికప్పుడు పరిశీలించి క్లియర్ చేస్తున్నాం. జిల్లాలో 70 రెవెన్యూ గ్రామాలు డిజిటల్ భూ సర్వేకు ఎంపికయ్యాయి. తొలివిడతలో తిరుమలాయపాలెం మండలం కాకరవాయి ఎంపిక కాగా.. ఆ గ్రామంలోని 3,500 ఎకరాల సర్వే 22 రోజుల్లో పూర్తి చేశాం.ఎల్నినో, పంటల సాగుపై రైతులకు అవగాహన రైతులు యూరియా తక్కువగా ఉపయోగించాలి. అందుబాటులో ఉన్న యాప్ ద్వారా యూరియా కొనుగోలు చేసుకోవచ్చు. మొదటిసారి యూరియా బస్తా వాడాక నానో యూరియా వాడితే మంచిది. ఈ యూరియా నిల్వలు జిల్లాలో సరిపడినంత ఉన్నందున ఎంతైనా వాడుకోవచ్చు. దీన్ని స్ప్రేచేస్తే చాలు ఆకులు పీల్చుకుంటాయనే అంశాన్ని క్షేత్రస్థాయికి తీసుకెళ్తున్నాం.భారీ వర్షాలు కురిసి వరద వస్తే ఎలాంటి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నాం. ఇప్పటికే ఓసారి అధికారులతో సమీక్షించగా, రెండో సమావేశం శుక్రవారం ఉంటుంది. మండలాల వారీగా తహసీల్దార్, వ్యవసాయాధికారులతో బృందాలను ఏర్పాటుచేశాం. ఆయా బృందాలు మండలాల్లో భారీ వర్షాలు పడితే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రణాళిక రూపొందించి ఇతర శాఖలతో సమన్వయం చేసుకుంటారు. ఇక మున్నేటికి వచ్చే వరద పైపొరుగు జిల్లాల నుంచి నిరంతరం వివరాలు సేకరించేలా సిద్ధమయ్యాం. -
బడుల్లో లైబ్రరీలు
● విద్యార్థుల్లో పఠనాసక్తి పెంచేలా ఏర్పాటు ● జిల్లాలోని 23 పాఠశాలల ఎంపిక ● వసతుల కల్పనకు రూ.15 వేలు ● ఆ తర్వాత నెలకు రూ.వేయి మంజూరు జిల్లాలోని 23 పాఠశాలల్లో రీడింగ్ కార్నర్ల పేరిట గ్రంథాలయాల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతించింది. ఆయా స్కూళ్లలో ప్రత్యేక గదిని తీర్చిదిద్దేందుకు రూ.15 వేలు కేటాయిస్తారు. ఈ నిధులతో అవసరమైన ఏర్పాట్లు చేసి అందుబాటులోకి తీసుకొస్తాం. – చైతన్యజైనీ, జిల్లా విద్యాశాఖాధికారి లైట్రరీల ఏర్పాటుకు ఇప్పటికే మండలాల వారీగా పాఠశాలల ఎంపిక పూర్తయింది. ప్రభుత్వం ఇచ్చే నిధులతో వసతులు కల్పిస్తాం. గ్రంథాలయ ఏర్పాటుతో విద్యార్థులకు వార్తాపత్రికలు, ఇతర పుస్తకాలు అందుబాటులోకి వచ్చి పఠనాసక్తి పెరుగుతుంది. – పెసర ప్రభాకర్రెడ్డి, ఏఎంఓ ఖమ్మంసహకారనగర్: ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే కాక వారిలో పుస్తకాలు చదవడంపై ఆసక్తి పెంచేలా గ్రంథాలయాల ఏర్పాటుకు నిర్ణయించింది. రీడింగ్ కార్నర్ల పేరిట వీటిని తొలిదశలో జిల్లాలోని 23 పాఠశాలల్లో ఏర్పాటు చేస్తారు. పాఠశాలల్లో గది సౌకర్యం, విద్యార్థుల సంఖ్య తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని పాఠశాలలను ఎంపిక చేశారు. ఆహ్లాదంగా తీర్చిదిద్దేలా.. విద్యార్థులను పాఠ్యపుస్తకాలకే పరిమితం చేయకుండా వారిలో లోకజ్ఞానం పెంచడం, జాతీయ, అంతర్జాతీయ అంశాలపై అవగాహన పెంచేందుకు గాను లైబ్రరీల ఏర్పాటుకు నిర్ణయించారు. ఈ మేరకు ఎంపిక చేసిన పాఠశాలల్లోని ఓ గదిని అన్ని వసతులతో తీర్చిదిద్దుతారు. ఇందుకోసం ఒక్కో పాఠశాలకు ప్రభుత్వం రూ.15 వేల చొప్పున నిధులు కేటాయించింది. ఈ నగదుతో గదుల్లో అవసరమైన మరమ్మతులు చేయించి రంగులు వేయించడమే కాక రీడింగ్ టేబుళ్లు, కుర్చీలు, పుస్తకాల ర్యాక్లు, లైట్లు, ఫ్యాన్లు తదితర సౌకర్యాలు కల్పించాలి. ఆ తర్వాత రోజువారీగా వార్తా పత్రికలు, ఇతర జనరల్ నాలెడ్జి పుస్తకాలను లైట్రరీలో అందుబాటులో ఉంచనున్నారు. పుస్తకాల కొనుగోలు, ఇతర నిర్వహణ ఖర్చుల కోసం ఇకపై ప్రతీ నెల రూ.వేయి నగదును అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీల ఖాతాల్లో జమ చేస్తారు. అర్బన్లో అత్యధికం జిల్లాలో లైబ్రరీల ఏర్పాటుకు 23 పాఠశాలలను ఎంపిక చేశారు. ఇందులో అత్యధికంగా ఖమ్మం అర్బన్ మండలంలోనే 13 స్కూళ్లు ఉన్నాయి. ఇక సత్తుపల్లి మండలంలో నాలుగు, కొణిజర్ల, మధిర మండలాల్లో రెండేసి పాఠశాలలతో పాటు చింతకాని, తిరుమలాయపాలెం మండలంలో ఒక్కో పాఠశాలను ఎంపిక చేశారు. ఆయా స్కూళ్లలో ఈ విద్యా సంవత్సరం నుంచే గ్రంథాలయాలు అందుబాటులోకి రానున్నాయి. -
సమస్యలపై నిరంతర పోరాటాలు
● బీజేపీ తీరుతో పతనం.. హామీల అమల్లో కాంగ్రెస్ ఆలస్యం ● కలెక్టరేట్ ముట్టడిలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి సాంబశివరావు ఖమ్మంమయూరిసెంటర్: రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల సమస్యలను పరిష్కరించాలనే డిమాండ్తో నిరంతర పోరాటాలు నిర్వహిస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు వెల్లడించారు. ధరల పెరుగుదలకు నిరసనగా, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలనే డిమాండ్తో సీపీఐ ఆధ్వర్యాన బుధవారం ర్యాలీ, కలెక్టరేట్ ముట్టడి నిర్వహించారు. వి.వెంకటాయపాలెం స్టేజీ వద్ద నుంచి ప్రదర్శనగా వచ్చిన పార్టీ శ్రేణులు కలెక్టరేట్లోకి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేయడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో గేటు బయట దాదాపు రెండు గంటల పాటు బైఠాయించి నిరసన తెలిపారు. ప్రజలను విస్మరించి కార్పొరేట్ల కోసం.. కేంద్రంలోని మోదీ పాలనలో ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం కావడంతో దేశం ఆర్థిక పతనం దిశగా పయనిస్తోందని కూనంనేని పేర్కొన్నారు. సంపన్నులు, వ్యాపారులపై పన్నులు విధించి పేదలను ఆదుకునే ప్రయత్నం చేయాల్సి ఉన్నా, మోదీ పేదలపై భారాలు మోపి సంపన్నులు, కార్పొరేట్లకు రూ.లక్షల కోట్ల రాయితీలు ఇస్తోందని మండిపడ్డారు. పెట్రోల్, డీజిల్ ధరలే కాక గ్యాస్ ధరలు ఏడాదిలో మూడు సార్లు పెరిగిందని తెలిపారు. రాష్ట్రంలో పెట్రో ధరలను నియంత్రించే అవకాశం ఉన్నా అదే ఆదాయ వనరుగా భావిస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండున్నర ఏళ్ల కాలంలో ఇచ్చిన హామీలను అమలు చేయకపోగా, పింఛన్ల పెంపు, పూర్తి స్థాయిలో రైతు భరోసా జరగలేదన్నారు. ఆరు గ్యారంటీల అమలుపై ఇప్పటివరకు ప్రభుత్వం సరైన రీతిలో స్పందించకపోవడంతో ఆందోళన బాట పట్టామని కూనంనేని తెలిపారు. సీపీఐ జిల్లా కార్యదర్శి దండి సురేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో అప్పులను ఎరగా చూపుతూ పథకాల అమలును వాయిదా వేయడం సరికాదని తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి జమ్ముల జితేందర్రెడ్డి, రాష్ట్ర సమితి సభ్యులు యర్రా బాబు, ఎస్.కే.జానీమియా, నాయకులు బీ.జీ.క్లెమెంట్, సిద్దినేని కర్ణకుమార్, శింగు నర్సింహారావు, పోటు కళావతి, కర్నాటి భానుప్రసాద్, తాటి వెంకటేశ్వరరావు, ఇటికాల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
ఓవర్ ‘స్లో’ బ్రిడ్జి!
భద్రాచలం: ఏళ్లు గడుస్తున్నా భద్రాచలం వద్ద కరకట్ట పొడిగింపు పనుల్లో జాతీయ రహదారిపై ఓవర్ బ్రిడ్జి.. నిర్మాణానికి నోచుకోవడంలేదు. ఇప్పటికే పలుమార్లు డిజైన్లు రూపొందించినా ప్రభుత్వం ఆమోదించలేదు. ప్రస్తుతం రూ.150 కోట్ల భారీ బడ్జెట్ అంచనాతో రూపొందించిన ప్రతిపాదనలను జాతీయ రహదారుల శాఖ అంగీకారం తెలిపింది. ఉమ్మడి ఖమ్మం జిల్లా ఉన్నతాధికారులతో ఇరిగేషన్ ప్రాజెక్టులు, ఇతర సమస్యలపై ఆ శాఖ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి గురువారం హైదరాబాద్లో సమీక్ష జరపనున్నారు. పోలవరం ప్రాజెక్ట్తో ముంపుతో ఇప్పటికే భద్రాచలంవాసులు భయాందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో ఓవర్ బ్రిడ్జి సమస్యను సమీక్షించి నిధులు కేటాయించి, పూర్తిచేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. కరకట్టకు రూ.38 కోట్లు.., ఓవర్ బ్రిడ్జికి రూ.150 కోట్లు భద్రాచలం ముంపు కాలనీల ప్రజలను రక్షించేందుకు గోదావరి తీరం వెంబడి 2000 సంవత్సరంలో సుమారు 7.5 కిలోమీటర్ల పొడవున కరకట్ట నిర్మించారు. కూనవరం రోడ్డులో జాతీయ రహదారిపై ఓవర్ బ్రిడ్జి నిర్మించాల్సి రావడంతో సుమారు 700 మీటర్ల మేర కరకట్ట నిర్మాణం ఆగిపోయింది. 2022లో గోదావరి వరదలు తీర ప్రాంత కాలనీలను ముంచెత్తడంతో పాలకులు రూ.38 కోట్లతో కరకట్ట పొడగింపు పనులు చేపట్టారు. ఓవర్ బ్రిడ్జికి రూ.12 కోట్లను ప్రతిపాదించారు. కరకట్ట నిర్మాణం, స్లూయిస్, రిటైనింగ్ వాల్ తదితర పనులు ముగింపు దశకు వచ్చాయి. అయితే రూ.150 కోట్లతో ఓవర్ బ్రిడ్జి ప్లాన్ను జాతీయ రహదారుల శాఖ ఫైనల్ చేసింది. దీనిని ప్రభుత్వం ఆమోదిస్తేనే కరకట్ట పనులు పూర్తవుతాయి. ఇరిగేషన్ అధికారులకు తలనొప్పి పలు మార్లు డిజైన్లకు జాతీయ రహదారుల శాఖ అభ్యంతరం తెలుపుతుండగా, బ్రిడ్జి నిర్మాణంలో కాలయాపన సాగుతోంది. వర్షాకాలం సీజన్, గోదావరి వరదలు ముంచెత్తిన సందర్భంలో ప్రజాప్రతినిధులు, మంత్రులు ఆ శాఖ అధికారులకు చీవాట్లు పెడుతున్నారు. ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు పలుమార్లు కరకట్ట నిర్మాణ పనులను పరిశీలించి త్వరగా పూర్తి చేయాలని ఆదేశాలను సైతం జారీ చేశారు. కానీ నిర్మాణ ప్రక్రియ ముందుకు సాగడంలేదు. ఇరిగేషన్ అధికారులకు మాత్రం సమస్య తలనొప్పిగా మారింది.జాతీయ రహదారి శాఖ ఆమోదించిన ఫైనల్ డిజైన్ను ప్రభుత్వానికి ప్రతిపాదించాం. ప్రభుత్వం నుంచి ఆమోదం వస్తే తిరిగి ఆ పనులను ప్రారంభించి పూర్తి చేస్తాం. అదేవిధంగా మా శాఖ పరిధిలో ఉన్న ప్రాజెక్టులు, ఇతర సమస్యలను మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి సమావేశంలో ప్రస్తావించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం. –జాని, ఇరిగేషన్ ఈఈ, భద్రాచలం -
30లోగా కమిటీల నియామకం పూర్తి
ఖమ్మంమయూరిసెంటర్: ఎస్ఐఆర్ పరిశీలన కోసం బూత్, గ్రామ, మండల, పట్టణ కమిటీల నియామకానికి ఈనెల 30లోగా పూర్తి చేయాలని డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణగౌడ్ సూచించారు. ఖమ్మంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో బుధవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇప్పటికే మండలాలకు ఇన్చార్జిలను నియమించిన నేపథ్యా వారు ఎమ్మెల్యేల ఆమోదంతో కమిటీలను నియమించాలని తెలిపారు. కాగా, ఈనెల 15న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమాలు చేపట్టాలని తీర్మానం చేసినట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో పార్టీ, అనుబంధ సంఘాల నాయకులు వడ్డేబోయిన నర్సింహారావు, సూరంశెట్టి నాగభూషణం, పులిపాటి వెంకయ్య, కొత్తా సీతారాములు, దొబ్బల సౌజన్య, వేజెండ్ల సాయికుమార్, మొక్క శేఖర్గౌడ్, బొడ్డు బొందయ్య, కాపా మురళీకృష్ణ, పుచ్చకాయల వీరభద్రం, గజ్జెల్లి వెంకన్న, బండారు నరసింహారావు, మట్టూరి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.డీసీసీ అధ్యక్షుడు సత్యనారాయణ గౌడ్ -
విమర్శించేవారిపై కక్ష సాధింపు చర్యలు
● రాష్ట్రపథకాలతో పేదలకు జరగని లబ్ధి ● సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు వీరభద్రం ముదిగొండ: ప్రజావ్యతిరేక విధానాలను విమర్శించే వారిపై కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. ముదిగొండ మండలం వెంకటాపురంలో బుధవారం జరిగిన వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా మహాసభలో ఆయన మాట్లాడారు. బీజేపీ నేతలు కేవలం హిందువులు – ముస్లింల మధ్య చిచ్చు పెట్టడంపైనే దృష్టి సారించి ప్రజల ఇబ్బందులను పట్టించుకోవడం లేదని తెలిపారు. ఏళ్లుగా దేశంలో అన్నివర్గాల వారు కలిసే ఉంటుండగా విభజన తీసుకొచ్చేందుకు కుట్ర పన్నారన్నారు. కాగా, రాష్ట్రప్రభుత్వ పథకాలు పెద్దలకు ఉపయోగపడేవే తప్ప పేదలకు ఎలాంటి లబ్ధి జరగడం లేదని తెలిపారు. హిట్లర్ను స్ఫూర్తిగా చెప్పుకుంటున్న రేవంత్రెడ్డి, ఆయనను ప్రపంచమంతా వ్యతిరేకిస్తున్న విషయాన్ని గుర్తించాలని సూచించారు. కాగా, లక్షల మంది విద్యార్థులు రాసిన నీట్ ప్రశ్నపత్రం లీకేజీపై రాష్ట్రప్రభుత్వం ఎందుకు మాట్లాడడం లేదో చెప్పాలని నిలదీశారు. ఇంకా ఈ సభలో సీపీఎం జిల్లా, మండల కార్యదర్శులు నున్నా నాగేశ్వరరావు, బట్టు పురుషోత్తం, రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు, నాయకులు బండి రమేష్, రాయల వెంకటేశ్వర్లు, వాసిరెడ్డి వరప్రసాద్, వేల్పుల భద్రయ్య, ఆర్.వెంకట్రావు, బుర్రి ప్రసాద్, బండి రమేష్, బండి పద్మ, బుగ్గవీటి సరళ పాల్గొన్నారు. -
రహదారి భద్రత.. అందరి బాధ్యత
కూసుమంచి: రహదారి భద్రతను వాహనదారులంతా బాధ్యతగా భావిస్తే ప్రమాదాలు తగ్గుముఖం పడతాయని పోలీస్ కమిషనర్ సునీల్దత్ తెలిపారు. ఈ మేరకు నిబంధనలు పాటిస్తూ వాహనాలు నడిపి సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని సూచించారు. కూసుమంచి మండలం నాయకన్గూడెంలో బుధవారం రోడ్డు భద్రతపై నిర్వహించిన అవగాహన సదస్సులో సీపీ మాట్లాడారు. వాహననం నడిపేటప్పుడు తమ కోసం కుటుంబం ఎదురుచూస్తుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలని తెలిపారు. తద్వారా నిబంధనలు పాటిస్తూ వాహనదారులు తమను కాపాడుకోవడంతో పాటు ఎదుటి వాహనదారులకు మేలు చేసిన వారవుతారని చెప్పారు. ద్విచక్ర వాహనదారులు నాణ్యత కలిగిన హెల్మెట్, కారు నడిపేవారు సీటు బెల్ట్ తప్పక ధరించాలని సూచించారు. అలాగే, మద్యం, మత్తు పదార్థాలను సేవించి వాహనాలను నడిపి ప్రమాదాల బారిన పడొద్దని తెలిపారు. అనంతరం ఇటీవల పలు ప్రమాదాల్లో గాయపడిన బాధిత కుటుంబాలతో మాట్లాడిన సీపీ వారికి సురక్షిత ప్రయాణంపై సలహాలు, సూచనలు అందించారు. అలాగే, రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన లోక్యాతండాకు చెందిన జర్పుల సందీప్ తల్లి లలితకు ఆర్థికసాయం అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ కాంచాని సైదమ్మ, ఖమ్మం రూరల్ ఏసీపీ తిరుపతిరెడ్డి, సీఐ సంజీవ్, తహసీల్దార్ సైదులు, ఎంపీడీఓ జశ్వంత్కుమార్, ఎస్ఐలు నాగరాజు, జగదీశ్, సంతోష్, స్రవంతి, దివ్య, ఏఓ వాణి తదితరులు పాల్గొన్నారు. పదోన్నతి పొందిన కానిస్టేబుళ్లకు అభినందన ఖమ్మంక్రైం: పోలీసు శాఖలో కానిస్టేబుళ్లుగా విధులు నిర్వర్తిస్తున్న ఎనిమిది మంది (2000 బ్యాచ్)కి హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి లభించింది. వీరిలో నలుగురిని భద్రాద్రి జిల్లాకు, ఇద్దరిని ఖమ్మం కమిషనరేట్కు, మహబూబాబాద్, ఇంటెలిజెన్స్కు ఒక్కొక్కరినీ కేటాయించారు. ఈ సందర్భంగా పదోన్నతి పొందిన వారు సీపీ సునీల్దత్ను బుధవారం కలవగా ఆయన అభినందించారు.పోలీస్ కమిషనర్ సునీల్దత్ -
ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు
● మూడేళ్ల చిన్నారి మృతి, మరో నలుగురికి గాయాలు ● దైవదర్శనానికి వెళ్తుండగా ప్రమాదం పాల్వంచరూరల్/మధిర: ఏపీలోని శ్రీకాకుళం నుంచి మధిరలో ఉంటున్న వైద్యుడి వద్దకు ఆయన తల్లిదండ్రులు, సోదరి, మేనకోడలు వచ్చారు. మేనకోడలికి గొంతు సంబంధిత శస్త్రచికిత్స చేయించారు. చికిత్స విజయవంతం కావడంతో భద్రాచలంలో రామయ్యను దర్శించుకుని స్వస్థలానికి వెళ్లాలని కారులో వెళ్తుండగా మార్గమధ్యలో ప్రమాదం బారిన పడ్డారు. దీంతో చిన్నారి మృత్యువాత పడగా మిగతా వారికి తీవ్రగాయాలైన ఘటన పాల్వంచలో బుధవారం చోటుచేసుకుంది. శ్రీకాకుళం నుంచి పాల్వంచకు.. ఏపీలోని శ్రీకాకుళంకు చెందిన పద్మావతి – కృష్ణారావుల కుమార్తె హావియాకు భర్త అనురాగ్, మూడేళ్ల కుమార్తె బాల ఆద్య ఉన్నారు. ఇందులో అనురాగ్ అమెరికాలో ఉంటుండగా, హావియా తన కుమార్తెతో భర్త స్వస్థలమైన వైజాగ్లోని మధురవాడలో ఉంటోంది. ఇటీవల శ్రీకాకుళం వెళ్లిన హావియా తల్లిదండ్రులతో కలిసి మధిరలో ఉండే సోదరుడు డాక్టర్ సోమశేఖర్ వద్దకు వారం క్రితం వచ్చింది. ఆద్యకు గొంతు సంబంధిత సమస్య ఉండడంతో శస్త్రచికిత్స చేయించారు. ఆ తర్వాత భద్రాచలంలో శ్రీసీతారామచంద్రస్వామిని దర్శించుకునేందుకు బుధవారం కారులో వెళ్తున్నారు. కారులో కృష్ణారావు దంపతులు, హావియా, ఆమె కుమార్తె ఆద్య ఉంది. అయితే, పాల్వంచ మండలం ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమీపాన జాతీయ రహదారి పక్కన టిప్పర్ వాహనం నిలిపి ఉంది. ఆ రహదారిపై వెళ్తున్న వీరి కారుకు కుక్క అడ్డు రావడంతో డ్రైవర్ తడికమల్ల కృష్ణ దానిని తప్పించే క్రమంలో ఆగిఉన్న టిప్పర్ను ఢీకొట్టాడు. ఘటనలో కారు ముందు భాగం నుజ్జునుజ్జయి బెలూన్లు తెరుచుకున్నప్పటికీ అమ్మమ్మ ఒడిలో కూర్చున్న చిన్నారి ఆద్య తలకు బలమైన గాయాలై అక్కడికక్కడే మృతి చెందింది. ఆమె తల్లి, అమ్మమ్మ, తాతయ్యతోపాటు డ్రైవర్కు తీవ్రగాయాలయ్యాయి. దీంతో ఎస్ఐ బి.సురేశ్ క్షతగాత్రులను కొత్తగూడెం ఏరియా ఆస్పత్రికి తరలించారు. కాగా, నిద్రమత్తు కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలిసింది. -
అకాడమీలు, ట్యూషన్ పాయింట్లకు అనుమతి లేదు
ఖమ్మం సహకారనగర్: మెడికల్ అకాడమీలు, ట్యూషన్ పాయింట్లలో ఇంటర్మీడియట్ ప్రవేశాలకు బోర్డు నుంచి ఎలాంటి అనుమతి లేదని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖాధికారి కె.రవి బాబు వెల్లడించారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించి అనుమతి ఉన్న కాలేజీల్లో పిల్లలను చేర్పించాలని తెలిపారు. ఈ కాలేజీల జాబితాను tgbie.cgg.gov.in వెబ్సైట్లో చూడొచ్చన్నారు. ఎవరైనా నిర్వాహకులు కాలేజీలో అడ్మిషన్ చేయించి.. అకాడమీ, ట్యూషన్ పాయింట్లలో తరగతులకు పంపినట్లు తేలితే కళాశాలల యజమాన్యాలపై చర్యలు తీసుకుంటామని డీఐతో తెలిపారు. కరాటేతో ఆత్మవిశ్వాసం, ఆత్మరక్షణ ఖమ్మం స్పోర్ట్స్: కరాటే శిక్షణ విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుందని డీవైఎస్ఓ టి.సునీల్రెడ్డి తెలిపారు. ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో నెల పాటు నిర్వహించిన శిక్షణా శిబిరం బుధవారం ముగిసింది. ఈసందర్భంగా డీవైఎస్ఓ మాట్లాడుతూ కరాటే శిక్షణ బాలికల ఆత్మరక్షణకు ఉపయోగపడతుందని చెప్పారు. అనంతరం శిక్షణ పూర్తిచేసుకున్న వారికి సర్టిఫికెట్లు అందజేశారు. కరాటే మాస్టర్ జి.రాము, మేనేజర్ ఉదయ్కుమార్, ఇన్స్ట్రక్టర్లు జె.హరీష్, మణి పాల్గొన్నారు. గంజాయి రహిత సమాజమే లక్ష్యం ఖమ్మంవైద్యవిభాగం: గంజాయి అమ్మకాలు, వాడకాన్ని సమూలంగా నిర్మూలించడమే లక్ష్యంగా అందరూ కృషి చేయాలని అడిషనల్ డీసీపీ రామానుజం సూచించారు. ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’లో భాగంగా ఈగల్ ఫోర్స్ ఆధ్వర్యాన మాదక ద్రవ్యాల నియంత్రణపై బుధవారం ర్యాలీ నిర్వహించారు. అనంతరం జిల్లా జనరల్ ఆస్పత్రిలోని డీ అడిక్షన్ సెంటర్ వద్ద అడిషనల్ డీసీపీ మొక్కలను నాటారు. ఆతర్వాత ఆయన మాట్లాడుతూ గంజాయి, మత్తు పదార్థాల వినియోగానికి యువత, విద్యార్థులు దూరంగా ఉండడమే కాక వాటితో నష్టాలపై అందరికీ అవగాహన కల్పించాలని సూచించారు. అలాగే, అమ్మేవారి సమాచారం తెలిస్తే తమకు అందించాలని తెలిపారు. గంజాయి వినియోగం, రవాణాకు పాల్పడితే తీవ్రమైన శిక్ష అనుభవించాల్సి వస్తుందని పేర్కొన్నారు. చెప్పారు. ఈకార్యక్రమంలో ఖమ్మం నగర ఏసీపీ రమణమూర్తి, ఇన్స్పెక్టర్లు కరుణాకర్, బాలకృష్ణ, ఆస్పత్రి సూపరిండెంట్ డాక్టర్ నరేందర్, ఉద్యోగులు పాల్గొన్నారు. -
మద్యం తాగి వాహనాలు నడపొద్దు
ఏన్కూరు: మద్యం తాగి వాహనాలు నడిపి ప్రమాదాలకు గురికావొద్దని కల్లూరు ఏసీపీ వసుంధరయాదవ్ సూచించారు. మండలంలోని నూకలంపాడులో బుధవారం జరిగిన గ్రామసభలో ఆమె మాట్లాడారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ద్వారా ప్రమాదాలు జరగవని తెలిపారు. ద్విచక్రవాహనదారులు హెల్మెట్ఽ, కార్లలో వెళ్లే వారు సీట్బెల్ట్ వినియోగించాలని సూచించారు. అనంతరం ఏన్కూరు పోలీసుస్టేషన్ను తనిఖీ చేసిన ఏసీపీ కేసుల నమోదు, విచారణపై సమీక్షించడంతో పాటు సీసీ కెమెరాల పనితీరును పరిశీలించారు. పెనుబల్లి సీఐ ముత్తిలింగం, ఎస్ఐ నారబోయిన సంధ్య పాల్గొన్నారు. -
ఆలయ భూముల కౌలుకు రేపు వేలం
పెనుబల్లి: మండలంలోని శ్రీనీలాద్రీశ్వర స్వామి ఆలయానికి చెందిన ఎకరం భూమి అన్నపురెడ్డిపల్లి మండలం నామవరంలో ఉండగా, కౌలుకు ఇచ్చేందుకు శుక్రవారం బహిరంగ వేలం నిర్వహిస్తున్నట్లు ఈఓ రజనీకుమారి తెలిపారు. అన్నపురెడ్డిపల్లి మండలం రాజాపురంలోని శ్రీ కోదండ రామాలయంలో వేలం పాట ఉంటుందని, ఆసక్తి ఉన్నవారు రూ.5 వేలు డిపాజిట్ చెల్లించి పాల్గొనాలని సూచించారు. అలాగే, ఈ నెల 13వ తేదీన మాస శివరాత్రి, శని త్రయోదశి సందర్భంగా నీలాద్రీశ్వర స్వామి దేవస్థానంలో శనీశ్వర స్వామికి జరిగే తైలాభిషేకంలో భక్తులు పాల్గొనవచ్చని ఈఓ వెల్లడించారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ ఎన్నిక ముదిగొండ: వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నూతన కమిటీని బుధవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ముదిగొండలో బుధవారం జరిగిన జిల్లా మహాసభలో కార్యవర్గాన్ని ప్రకటించారు. అధ్యక్షుడిగా మెరుగు సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శిగా ఎర్ర శ్రీనివాస్తో పాటు 45 మందితో జిల్లా కమిటీ ఎన్నికై ంది. ఈ సమావేశంలో సీపీఎం, వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శులు భట్టు పురుషోత్తం, వేల్పుల భద్రయ్య, నాయకులు టీఎస్ కల్యాణ్, వెంకన్న, దామోదర్, సర్పంచ్ కట్టకూరి ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు. ప్రతాపం చూపిన భానుడు ఖమ్మంవ్యవసాయం: వర్షాకాలం ప్రారంభమైనా సూర్యప్రతాపం తగ్గడం లేదు. గత సోమవారమే మృగశిర కార్తె ప్రవేశించగా, రెండు రోజులు దాటినా ఉష్ణోగ్రతల్లో మార్పు కనిపించడం లేదు. వర్షం కురిసిన రోజే స్వల్పంగా ఉష్ణోగ్రత తగ్గుతూ, మళ్లీ భానుడు జూలు విదులుస్తున్నాడు. ఈ క్రమాన బుధవారం జిల్లాలో 41.1 – 42.8 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో పగటి వేళ వేడి, వడగాలులతో ప్రజలు ఇబ్బంది పడ్డారు. అత్యధికంగా ముదిగొండలో 42.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇక పల్లెగూడెం, కుర్నవల్లిలో 42.7, గేటు కారేపల్లి, కొణిజర్ల, గుబ్బగుర్తిలో 42.6, కల్లూరు, బాణాపురంలో 42.5, గౌరారం, ప్రకాష్నగర్, చింతకాని, ఎర్రుపాలెంలో 42.4, పమ్మి, ఏన్కూరులలో 42.3, ఖానాపురం, పెనుబల్లి, పెద్దగోపతి, వైరా, మధిర, సత్తుపల్లిలో 42.2, తల్లాడ, రఘునాథపాలెం, వైరాలలో 42.1, లింగాల, నేలకొండపల్లి, కాకరవాయి, రావినూతలలో 42 మేర ఉష్ణోగ్రత నమోదైంది. కుంగిపోయిన రహదారి ఖమ్మంరూరల్: ఏదులాపురం మున్సిపాలిటీ పరిధి 24వ వార్డు సమీపాన ఖమ్మం – కురవి రహదారి నిర్మాణ పనులు జరుగుతుండగానే ఓ చోట కుంగిపోయింది. ఇలా జరగడానికి అధికారుల పర్యవేక్షణ లోపమే కారణమనే విమర్శలు వస్తున్నాయి. ఈ మేరకు నాసిరకం పనులకు బాధ్యులైన కాంట్రాక్టర్లు, పట్టించుకోని అధికారులపై చర్యలు తీసుకోవాలని వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు. కాగా, కుంగిపోయిన చోట గుంత కానరాకుండా మట్టి పోయడం గమనార్హం. విద్యుత్ ఉద్యోగినుల ప్రతిభ ఖమ్మంవ్యవసాయం: టీజీ ఎన్పీడీసీఎల్ ఆధ్వర్యాన ‘విశ్వేశ్వరయ్య లెక్చర్ సిరీస్–03’కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ఆన్లైన్ క్విజ్లో ఖమ్మం సర్కిల్ విద్యుత్ ఉద్యోగినులు ప్రతిభ కనబరిచారు. పే రోల్స్ విభాగంలో ఎన్.స్వాతి, ఎస్ఏపీ పర్చేస్ ఆర్డర్ క్రియేషన్ విభాగంలో కె.నవ్యశ్రీ ప్రతిభ చాటి ప్రశంసాపత్రాలు సాధించారు. ఈ సందర్భంగా వీరిని ఎస్ఈ ఇనుగుర్తి శ్రీనివాసాచారి బుధవారం అభినందించారు. -
కమనీయంగా రామయ్య కల్యాణం
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో మంగళవారం రామయ్య కల్యాణం కమనీయంగా జరిగింది. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి బేడా మండపంలో కొలువుదీరిన స్వామివారికి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ మహోత్సవాన్ని శాస్త్రోక్తంగా జరిపారు. మంగళవారం సందర్భంగా అభయాంజనేయస్వామి ఉపాలయంలో అభిషేకం, తమల పాకులతో అర్చన జరిపారు. -
నకిలీ విత్తనాలు అంటగడితే కఠినచర్యలు
తిరుమలాయపాలెం: రైతుల అవసరాన్ని ఆసరా చేసుకుని నకిలీ విత్తనాలు అమ్మి మోసాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని జిల్లా వ్యవసాయాధికారి ధనసిరి పుల్లయ్య హెచ్చరించారు. తిరుమలాయపాలెం మండలంలోని పలు విత్తన షాపులను బుధవారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డీలర్ల స్టాక్ రిజిస్టర్లు, లైసెన్స్లను పరిశీలించాక డీఏఓ మాట్లాడారు. ఎప్పటికప్పుడు స్టాక్ వివరాలు నమోదు చేయడమే కాక రైతులకు ప్రత్యామ్నాయ పంటల సాగు, నానో యూరియా వాడకంపై అవగాహన కల్పించాలని తెలిపారు. రైతులు కూడా లైసెన్స్ ఉన్న డీలర్ల వద్ద మాత్రమే విత్తనాలు కొనుగోలు చేయాలని సూచించారు. గ్రామాల్లో ఎవరైనా విత్తనాలు అమ్మేందుకు వస్తే ఆ సమాచారాన్ని పోలీస్, వ్యవసాయాధికారులకు ఇవ్వాలని తెలిపారు. అనంతరం ఏలువారిగూడెం గ్రామసభలో డీఏఓ పుల్లయ్య మాట్లాడారు. ఏడీఏ మిట్టపల్లి సతీశ్, ఏఓ నారెడ్డి సీతారాంరెడ్డి, ఏఈఓలు పాల్గొన్నారు.డీఎఓ ధనసరి పుల్లయ్య -
జేకే ఓసీ విస్తరణ భూముల పరిశీలన
ఇల్లెందు: సింగరేణి ఇల్లెందు ఏరియాలోని జేకే ఓసీ విస్తరణకు ప్రతిపాదించిన 17.51హెక్టార్ల అటవీ భూమి మళ్లింపు ప్రాంతాన్ని బుధవారం పర్యావరణ అటవీ వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ సమగ్ర ప్రాంతీయ కార్యాలయం అధికారి ఎస్.యువరాజ్ పరిశీలించారు. భూమి విస్తీర్ణం, ప్రాజెక్ట్ అవసరాలు, ప్రభావిత ప్రాంత వివరాలు, కుటుంబాల సంఖ్య తదితర వివరాలను ఇల్లెందు జీఎం వీసం కృష్ణయ్యను అడిగి తెలుసుకున్నారు. జేకే ఓసీ భవిష్యత్ అభివృద్ధి, ప్రాజెక్టు విస్తరణకు అవసరమైన అటవీ భూమి మళ్లింపు, అనుమతుల ప్రక్రియపై అధికారులతో చర్చించారు. డీఎఫ్ఓ కృష్ణాగౌడ్, ఎఫ్డీఓ కరుణాకర్, ఎస్ఓటూ జీఎం బలరాం పాల్గొన్నారు. -
బాలికపై అఘాయిత్యం చేసి.. పైనుంచి తోసేసి..
ఖమ్మం క్రైం: ఖమ్మం జిల్లా కేంద్రంలో ఓ కీచకుడి దుర్మార్గం బట్టబయలైంది. వేసవి సెలవుల కోసం తాత ఇంటికి వచ్చిన ఓ 12 ఏళ్ల బాలికపై అతను అత్యాచారానికి పాల్పడటమే కాకుండా ఆపై ఆ బాలికను హతమార్చేందుకు ప్రయత్నించిన ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చివరకు బాధితురాలు అసలు విషయం చెప్పడంతో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఖమ్మం టూటౌన్ సీఐ బాలకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మంలోని ఓ అపార్ట్మెంట్లో వాచ్మెన్గా పనిచేసే వ్యక్తి కుమార్తె తన భర్తతో గొడవపడి తండ్రి వద్దకు వచ్చి ఉంటోంది. ఆమె కుమార్తె అయిన 12 ఏళ్ల బాలిక కూడా తల్లి, తాత వద్దకు వేసవి సెలవుల్లో వచ్చింది. అదే అపార్ట్మెంట్లోని ఓ ఫ్లాట్లో ఉంటున్న మహ్మద్ గౌస్ (50) బాలికపై కన్నేశాడు. 15 రోజుల క్రితం ఆమెతో అసభ్యంగా ప్రవర్తించగా బాలిక తన తల్లికి చెప్పింది. ఆమె ఈ విషయాన్ని ఓ ఫ్లాట్లోని మహిళకు చెప్పగా బాలికను ఒంటరిగా బయటకు పంపొద్దని సూచించింది. అదే అదునుగా.. : ఈ నెల 6న గౌస్ భార్య ఇంట్లో లేని వేళ తన ఫ్లాట్ ఉన్న అంతస్తులోకి బాలిక రావడాన్ని గమనించిన గౌస్.. ఆమెను బలవంతంగా ఇంట్లోకి లాక్కెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనంతరం బాధితురాలు ఈ విషయాన్ని బయటపెడుతుందనే ఉద్దేశంతో ఆమెను హతమార్చేందుకు ఐదో అంతస్తు నుంచి కిందకు తోసేశాడు. అనంతరం ఏమీ తెలియని వాడిలా కిందకు వచ్చి బాలిక కళ్లు తిరిగి పడిపోయి ఉంటుందని అందరినీ నమ్మించే ప్రయత్నం చేశాడు. అయితే సోమవారం సాయంత్రానికి కాస్త కోలుకున్న బాలిక.. అత్యాచారం, హత్యాయత్నం గురించి తన మేనమామకు చెప్పగా ఆయన ఇతర కుటుంబ సభ్యులతో కలిసి టూటౌన్ పోలీసు స్టేషన్లో గౌస్పై కేసు పెట్టారు. అనంతరం బాధితురాలి నుంచి న్యాయమూర్తి వాంగ్మూలం సేకరించారు. ఈ మేరకు గౌస్పై పోక్సో కేసుతోపాటు హత్యాయత్నం కూడా నమోదు చేసి రిమాండ్కు తరలించారు. మంత్రి పొంగులేటి భరోసా..: బాలిక వెన్నెముక, పక్కటెముకలు విరిగిపోయాయని.. కోలుకోవడానికి చాలాకాలం పడుతుందని వైద్యులు పేర్కొన్నారు. ఈ విషయం తెలుసుకున్న జిల్లా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బాధితురాలి తండ్రి, సర్పంచ్తో ఫోన్లో మాట్లాడారు. ‘ముందు పాప ప్రాణాలను కాపాడుకుందాం, అధైర్యపడకండి.. నేనున్నా’అని ధైర్యం చెప్పారు. బాలికకు అత్యున్నత వైద్యం అందించడం కోసం వెంటనే హైదరాబాద్లోని నిమ్స్కు తరలించాలని.. వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానని భరోసా ఇచ్చారు. నిందితుడిని చట్టపరంగా అత్యంత కఠినంగా శిక్షిస్తామని స్పష్టం చేశారు. -
రేపు వర్షం వస్తుంది !
వ్యవసాయ రంగంలో అధునాతన సాంకేతికత రోజురోజుకు పెరుగుతోంది. సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా రైతులకు ప్రయోజనం చేకూర్చేలా ప్రభుత్వంతో పాటు అధికారులు కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా అన్నదాతలకు వాతావరణ పరిస్థితులపై ముందస్తు సమాచారం ఇచ్చే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్(ఏఐ) ఆధారిత ‘తెలంగాణ వాతావరణ సమాచారం’ కార్యక్రమాన్ని తాజాగా ప్రారంభించారు. వాతావరణ శాఖ సహకారంతో తొలిదశలో రాష్ట్రంలోని 17 జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. ఈ జాబితాలో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలతో పాటు మహబూబాబాద్, హనుమకొండ, వరంగల్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, కరీంనగర్, రాజన్న సిరిసిల్లా, జగిత్యాల, పెద్దపల్లి, మంచిర్యాల, కుమురం భీం, ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, సిద్దిపేట జిల్లాలు ఉన్నాయి.నేరుగా వాట్సాప్కు...వాతావరణ పరిస్థితులపై ముందస్తు సమాచారాన్ని నేరుగా రైతుల సెల్ఫోన్ వాట్సాప్కు ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్(ఏఐ) ఆధారిత సలహాలను చేరవేస్తారు. ఏఐ, డిజిటల్ సాంకేతిక డేటాల అనుసంధానంతో శాటిలైట్ ఆధారిత వాతావరణ అంచనాలతో రూపొందించిన సమాచారం అందుతుంది. ఈ కార్యక్రమం అమలుకు డెవలప్మెంట్ ఇన్నోవేషన్ ల్యాబ్(డీఐఎల్), ఇండియా ఎవిడెన్స్ యాక్షన్ సంస్థలతో వ్యవసాయ శాఖ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.విత్తనాలు, ఎరువులపై కూడా..వర్షాలు, ఉష్ణోగ్రతలు, వడగాలులే కాక రాబోయే వాతావరణ మార్పుల ముందస్తు అంచనాలను రైతులకు అందించనున్నారు. ఇవికాక వాతావరణం, వర్షాపాతం ఆధారంగా ఏ సమయంలో ఏ విత్తనాలు వేయాలి, ఎరువులు వాడాలి, పంటలను ఎలా రక్షించుకోవాలనే అంశంపై నిపుణుల సలహాలు కూడా ఇందులో ఉంటాయి. తాజా వాతావరణ పరిస్థితులతో పాటు సలహాల కోసం స్థానిక వ్యవసాయ అధికారులను కూడా సంప్రదించవచ్చు. దీంతో పాటు ఎప్పటికప్పుడు ఐఎండీ సూచనలను తెలుసుకోవడానికి Met centre Hyderabad& IMD ఈ ను సందర్శించే అవకాశం కల్పించారు. రాబోయే ఎల్నినో వంటి క్లిష్టమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడినప్పుడు తట్టుకుని పంట నష్టాలను తగ్గించుకునేలా రైతులకు ఈ ఏఐ ఆధారిత వ్యవస్థ కచ్చితమైన సమాచారాన్ని అందించనుంది.ఖమ్మంలో జిల్లాలో 3.58 లక్షల మందికి..రైతు భరోసా పోర్టల్ ఆధారంగా 17 జిల్లాలకు చెందిన 15 లక్షల మందికి తొలిదశలో ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. తద్వారా ఖమ్మం జిల్లాలో రైతు భరోసా సాయం అందుతున్న 3,58,753 మంది రైతుల సెల్ఫోన్ నంబర్లను అనుసంధానం చేశారు. ఆయా రైతులకు ఎప్పటికప్పుడు మారుతున్న వాతావరణ పరిస్థితులపై ఏఐ ఆధారిత వాతావరణ వివరాలు అందుతున్నాయి. అయితే, ఇందులో నమోదుకాని రైతులు వ్యవసాయ శాఖ, వ్యవసాయ విస్తరణ అధికారులను సంప్రదించే అవకాశాన్ని కల్పించారు.రైతులకు ప్రయోజనంఏఐ ఆధారిత ముందస్తు వాతావరణ సమాచారం, పంటల నిర్వహణపై సలహాలు రైతులకు ఉపయోగపడతాయి. ప్రస్తుతం అందరి చేతుల్లో సెల్ఫోన్ ఉంటున్నందున వాట్సాప్కు వాతావరణం, పంటల సాగుపై సలహాలు అందుతాయి. ఈ సమాచారం ఆధారంగా రైతులు సాగులో ముందుకు సాగే అవకాశం ఉంటుంది.– ధనసరి పుల్లయ్య, జిల్లా వ్యవసాయాధికారి -
ప్రీ ప్రైమరీ పాఠశాలలపై ప్రత్యేక దృష్టి
ఖమ్మం సహకారనగర్: జిల్లాకు కొత్తగా మంజూరైన ప్రీ–ప్రైమరీ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు, వారి ఆరోగ్య సంరక్షణ, పోషకాహారం పంపిణీపై సంబంధిత శాఖల ఉద్యోగులు సమన్వయంతో దృష్టి సారించాలని ఖమ్మం జిల్లా విద్యాశాఖ అధికారి చైతన్య జైనీ సూచించారు. కలెక్టరేట్లో సోమవారం జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ నాలుగేళ్లు నిండిన చిన్నారులను ప్రీ–ప్రైమరీ పాఠశాలల్లో చేర్పించేలా అంగన్వాడీ టీచర్లు కృషి చేయాల్సి ఉండగా, ఐసీడీఎస్ సూపర్వైజర్లు, సీడీపీఓలు, జిల్లా మహిళా సంక్షేమ శాఖ అధికారులు పర్యవేక్షించాలని తెలిపారు. అంతేకాక చిన్నారులకు ఆరోగ్య పరీక్షలు, ఎదుగుదల రికార్డుల పర్యవేక్షణ, ఆరోగ్య సంరక్షణ తప్పకుండా నిర్వహించాలని చెప్పారు. డీఎంహెచ్ఓ డాక్టర్ రామారావు మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల్లో నిర్వహిస్తున్న వైద్య పరీక్షల మాదిరిగానే ప్రీ–ప్రైమరీ పాఠశాలల్లోనూ నిర్వహిస్తామన్నారు. జిల్లా మహిళా సంక్షేమ అధికారి ప్రమీల మాట్లాడుతూ ఐసీడీఎస్ సీడీపీఓలు, సూపర్వైజర్లు, అంగన్వాడీ టీచర్లతో సమన్వయం చేసుకుంటూ అర్హులైన చిన్నారులను సమీప ప్రీ–ప్రైమరీ పాఠశాలల్లో చేర్పిస్తామని తెలిపారు. ఇంకా ఈ సమావేశంలో ఏఎంఓ ప్రభాకర్రెడ్డి, సీఎంఓ ప్రవీణ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.డీఈఓ చైతన్య జైనీ -
కేంద్ర ప్రభుత్వం కార్యాచరణ రూపొందించాలి
కామేపల్లి: రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలంటే కేంద్రప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందించి పంటలకు మద్దతు ధర, మార్కెట్ సౌకర్యం కల్పించాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తీగల సాగర్, రాష్ట్ర వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ డైరెక్టర్ రాంరెడ్డి గోపాల్రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని కొత్తలింగాల క్రాస్ రోడ్డులోని ఓ ఫంక్షన్ హాల్లో సంఘం జిల్లా శిక్షణా తరగతులు సోమవారం ప్రారంభమ్యాయి. ఈసమావేశంలో వారు మాట్లాడూ కేంద్ర ప్రభుత్వం అమెరికాతో కుదుర్చుకున్న వ్యవసాయ, వాణిజ్య ఒప్పందంతో దేశ రైతులను దెబ్బ తీసేలా ఉందని ఆరోపించారు. పత్తి, వరి పంటలకు బదులు ప్రత్యామ్నాయ పంటల సాగుకు రైతులు ముందుకు రావాలంటే వాటికి కనీస మద్దతు ధర, బోనస్ ప్రకటించాలని సూచించారు. ఈ సమావేశంలో నాయకులు మద్దినేని రమేష్బాబు, నల్లమోతు లక్ష్మయ్య, ఇంజం నాగభూషణం, అంబటి శ్రీనివాస్, బొంతు రాంబాబు, శీలం ఫకీరయ్య, వాసిరెడ్డి ప్రసాద్, ఎస్.కే.మీరా, గొడవర్తి నాగేశ్వరరావు, బిక్కసాని గంగాధర్, దీవెల వీరయ్య, బాదావత్ శ్రీనివాస్, రాయల సత్యనారాయణ, మంగీలాల్ తదితరులు పాల్గొన్నారు. -
ఫిట్నెస్.. లేట్ !
● స్కూల్ బస్సుల ఫిట్నెస్ పరీక్షకు నాలుగు రోజులే గడువు ● ఇప్పటికీ ముందుకు రాని యాజమాన్యాలు ● ఇంకా 331 బస్సులు పరీక్షకు దూరం అన్ని ప్రైవేట్ స్కూళ్ల బస్సులకు ఈనెల 12వ తేదీ వరకు ఫిట్నెస్ పరీక్ష చేయించుకోవాలి. ఈ సర్టిఫికెట్ లేకుండా విద్యార్థులను తీసుకెళ్లినట్లు తేలితే భారీ జరిమానా విధించడమే కాక బస్సులు సీజ్ చేస్తాం. ఈ విషయమై ఉన్నతాధికారుల నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. అందుకే యాజమాన్యాలు త్వరగా ముందుకు రావాలి. – జేఎన్.శ్రీనివాస్, జిల్లా ఇన్చార్జ్ రవాణా శాఖాధికారిఖమ్మంక్రైం: జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు ఈనెల 15నుంచి మొదలుకానున్నాయి. ఇందులో ప్రైవేట్ పాఠశాలల బస్సులకు పాఠశాలల ప్రారంభానికి 20రోజులకు ముందే రవాణా శాఖ కార్యాలయంలో తనిఖీ చేయించి ఫిట్నెస్ సర్టిఫికెట్ తీసుకోవాలి. అలాకాకుండా రోడ్డు ఎక్కితే జరిమానా విధిస్తారు. అంతేకాక బస్సులను సీజ్ చేసే అవకాశముంది. ఈ పరీక్ష కోసం 12వ తేదీ వరకు గడువు విధించగా, ఇంకా నాలుగు రోజుల సమయమే ఉంది. అయినా జిల్లాలోని పలు ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు ఫిట్నెస్ పరీక్షపై దృష్టి సారించకపోవడం గమనార్హం. వేసవి సెలవులు ముగిసే సమయానికి స్కూల్ బస్సులను అధికారులు పరీక్షిస్తారు. ప్రధానంగా కిటికీల వద్ద ఇనుపగ్రిల్స్, ఫైర్ అలారం, మంటలు ఆర్పే యంత్రాలు, అత్యవసర ద్వారం, ఫస్ట్ ఎయిడ్ కిట్, పుస్తకాలు పెట్టుకునేందుకు హ్యాంగర్లు వంటివి బస్సుల్లో ఉండాలి. ఇవి కాక రిజిస్ట్రేషన్, పొల్యూషన్, ఇన్సూరెన్స్ సర్టిఫికెట్లతో పాటు డ్రైవర్ల లైసెన్సులను పరిశీలించి అన్నీ సవ్యంగా ఉంటే ఫిట్నెస్ సర్టిఫికెట్ జారీ చేస్తారు. కానీ యాజమాన్యాలు ఇప్పటివరకు ముందుకు రాకపోవడం అను మానాలకు తావిస్తోంది. చివరి సమయంలోనైతే అధికారులు ౖపైపెన పరిశీలించి సర్టి ఫికెట్ ఇస్తారని, తద్వారా బస్సుల్లో లోపాలు ఉన్నా ఏం కాదనే భావనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇదేజరిగితే పిల్లల ప్రాణాలు ప్రమాదంలో పడనున్నందున అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.కార్యాలయం మొత్తం బస్సులు పరీక్ష పూర్తి మిగిలినవి ఖమ్మం 514 302 202 వైరా 135 51 84 సత్తుపల్లి 120 85 35 మొత్తం 769 438 331 -
ఫలప్రదం
‘ఉపాధి హామీ’ ద్వారా పండ్ల తోటల సాగు ● రైతులకు మొక్కలు, ఎరువుల సరఫరా, ఇతర ఖర్చులు చెల్లింపు ● జాబ్ కార్డు ఉన్న వారందరూ అర్హులే ● ఈ ఏడాది 1,100 ఎకరాల్లో ఉద్యాన పంటల సాగు లక్ష్యంరైతులను ప్రత్యామ్నాయ పంటల సాగు వైపునకు మళ్లించడమే కాక వారి ఆదాయం, జీవనోపాధి పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం ఉద్యాన పంటల సాగుకు ప్రోత్సాహం అందించనుంది. కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా ఈ పంటల సాగుకు ఊతమివ్వాలని నిర్ణయించింది. ఉపాధి హామీ పథకంలో జాబ్కార్డులు కలిగి, ఐదెకరాల లోపు భూమి ఉన్న రైతులను అర్హులుగా నిర్దేశించారు. జిల్లాలో 1,100 ఎకరాల్లో ఈ ఏడాది పండ్ల తోటల పెంపకం చేపట్టేలా ఆసక్తి ఉన్న వారి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. – సాక్షి ప్రతినిధి, ఖమ్మంపండ్ల తోటలకు ఊతం పండ్ల తోటలు సాగు చేయాలనుకునే రైతులకు ప్రభుత్వం ఉపాధి హామీ పథకం కింద సాయం అందించనుంది. ఇందులో భాగంగా పంచాయతీరాజ్, గ్రామీణాభివద్ధి శాఖల ఆధ్వర్యాన నిర్వహించే పథకానికి జిల్లాలో శ్రీకారం చుడుతున్నారు. గ్రామపంచాయతీల వారీగా అర్హులైన లబ్ధిదారులను గుర్తించి భూవిస్తీర్ణంలో 20 శాతం మేర మొక్కల పెంపకం, ఉద్యాన పంటల సాగుకు ప్రోత్సహించనున్నారు. మండలానికి 50 ఎకరాలు ప్రస్తుత వానాకాలం సీజన్లో జిల్లాలోని 1,100 ఎకరాల్లో ఉద్యానవన పంటల సాగు చేపట్టాలని లక్ష్యంగా నిర్ణయించారు. ప్రతీ మండలంలో 50 ఎకరాలకు తక్కువ కాకుండా పంటల సాగు చేయించాలని నిర్దేశించారు. ఇందుకోసం ఉపాధి హామీ పథకం జాబ్కార్డులు ఉన్న సన్న, చిన్నకారు రైతులను ఎంపిక చేసి ప్రభుత్వం నుంచి సహాయ, సహకారాలు అందిస్తారు. ఇప్పటికే కొన్ని చోట్ల రైతులు ఈ పంటల సాగుపై ఆసక్తి చూపుతుండగా, ప్రభుత్వ ప్రోత్సాహంతో రానున్న ఏడాది మరింత మంది ఆసక్తి చూపుతారనే భావన వ్యక్తమవుతోంది. మూడేళ్లపాటు ఆసరా ఐదెకరాల లోపు వ్యవసాయ భూములు కలిగిన ఎస్సీ, ఎస్టీలతోపాటు ఇతర వర్గాల రైతులకు ఈ పథకం వర్తిస్తుంది. జామ, నిమ్మ, దానిమ్మ, కొబ్బరి, మామిడి, జీడిమామిడి, వెదురు, సీతాఫలం, డ్రాగన్ ఫ్రూట్, ఆయిల్ పామ్, సపోటా, బత్తాయి, అల్లనేరేడు మొక్కలను అధికారులే పంపిణీ చేస్తారు. అంతేకాక రాష్ట్ర ప్రభుత్వం మూడేళ్ల పాటు చేయూత ఇవ్వనుంది. మట్టి నమూనా సేకరణ, పరీక్ష, మొక్కలు నాటేలా గుంతలు తీయడం, నాటడం, వంగిపోకుండా కర్రలు కట్టడం, సంరక్షణ, ఎరువులు తదితర ఖర్చులన్నీ ప్రభుత్వమే అందిస్తుంది. డిమాండ్ ఆధారంగా.. సీజన్ వారీగా లభించే పండ్లకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుంది. అయితే, ఇవి జిల్లాలో ఆశించిన స్థాయిలో సాగవక లభ్యత తగ్గి ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. ఈనేపథ్యాన ఉపాధి హమీ పథకం కింద ప్రోత్సహించనుండడంతో జిల్లాలో ఉద్యాన పంటల సాగు విస్తీర్ణం పెరుగుతుందని భావిస్తున్నారు. తద్వారా రైతులకు దీర్ఘకాల జీవనోపాధి, సుస్థిర ఆదా యం, వినియోగదారులకు నాణ్యమైనవి లభిస్తాయి. జిల్లాలోని చిన్న, సన్నకారు రైతులు ఉద్యాన పంటలను సాగు చేసేలా ఉపాధి హామీ పథకం ద్వారా సహకారం అందిస్తాం. అవసరమైన మొక్కలు నాటేందుకు అయ్యే ఖర్చు, మూడేళ్లపాటు నిర్వహణ ఖర్చులు కూడా అందుతాయి. ఉపాధి కూలీల ద్వారా ఈ పనులు చేయిస్తాం. జాబ్కార్డు కలిగిన చిన్న, సన్నకారు రైతులు ఉద్యాన పంటల సాగుకు దరఖాస్తు చేసుకుంటే జిల్లాకు కేటాయించిన లక్ష్యం ఆధారంగా అవకాశం కల్పిస్తాం. – కొండపల్లి శ్రీరామ్, డీఆర్డీఓ -
మార్కెట్లో క్రయవిక్రయాలు ప్రారంభం
ఖమ్మంవ్యవసాయం: వేసవి సెలవులు ముగియడంతో నెల రోజుల తర్వాత ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో పంటల క్రయవిక్రయాలు సోమవారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు 10 వేల మిర్చి బస్తాలతో పాటు కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ పెట్టిన మిర్చి శాంపిళ్లే కాక పత్తి, కందులు, పెసలు కూడా తీసుకొచ్చారు. నిల్వ మిర్చి క్వింటాకు గరిష్టంగా రూ.21,500, మోడల్ ధర రూ.19 వేలు, కనిష్ట ధర రూ.10 వేలుగా పలికింది. ఇక రైతులు తీసుకొచ్చిన మిర్చి ధర గరిష్టంగా రూ. 18,500, మోడల్ ధర రూ.16 వేలు, కనిష్ట ధర రూ. 10 వేలుగా నమోదైంది. ఇక తాలు మిర్చి ధర క్వింటాకు రూ.7వేల నుంచి రూ. 10వేల వరకు పలికింది. వేసవి సెలవులకు ముందు ఇంచుమించుగా ఇవే ధరలు పలికాయి. విక్రయాలకే మొగ్గు వానాకాలం వ్యవసాయ సీజన్ ప్రారంభం అవుతుండడంతో పెట్టుబడి కోసం రైతులు మిర్చితో పాటు అపరాల పంటల విక్రయానికి మొగ్గు చూపుతున్నారు. విత్తనాలు, ఎరువులు కొనుగోలు ఇతర అవసరాల కోసం పంటలను అమ్మేందుకు తీసుకొచ్చారు. ప్రస్తుతం మిర్చి ధర కాస్త ఆశాజనకంగా ఉండటంతో కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ చేసిన మిర్చిని సైతం విక్రయించేందుకే ఆసక్తి ఆసక్తి బరుస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లాలోని 48 కోల్డ్ స్టోరేజీల్లో సగటున లక్ష బస్తాల చొప్పున మిర్చి నిల్వ ఉన్నట్లు అంచనా. ఇందులో రైతులు నిల్వ చేసిన పంట విక్రయించే అవకాశం ఉండగా, వ్యాపారులు మాత్రం ధర మరింత పెరిగే వరకు ఎదురుచూడనున్నట్లు తెలుస్తోంది.తొలిరోజు 10 వేల మిర్చి బస్తాల రాక -
రేపు వర్షం వస్తుంది !
● అన్నదాతలకు వాతావరణంపై ముందస్తు సమాచారం ● నేరుగా వాట్సాప్లకు ఏఐ ఆధారిత సలహాలు ● పంటల నిర్వహణపైనా సలహాలు, సూచనలుఖమ్మం వ్యవసాయం: వ్యవసాయ రంగంలో అధునాతన సాంకేతికత రోజురోజుకు పెరుగుతోంది. సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా రైతులకు ప్రయోజనం చేకూర్చేలా ప్రభుత్వంతో పాటు అధికారులు కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా అన్నదాతలకు వాతావరణ పరిస్థితులపై ముందస్తు సమాచారం ఇచ్చే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్(ఏఐ) ఆధారిత ‘తెలంగాణ వాతావరణ సమాచారం’ కార్యక్రమాన్ని తాజాగా ప్రారంభించారు. వాతావరణ శాఖ సహకారంతో తొలిదశలో రాష్ట్రంలోని 17 జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. ఈ జాబితాలో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలతో పాటు మహబూబాబాద్, హనుమకొండ, వరంగల్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, కరీంనగర్, రాజన్న సిరిసిల్లా, జగిత్యాల, పెద్దపల్లి, మంచిర్యాల, కుమురం భీం, ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, సిద్దిపేట జిల్లాలు ఉన్నాయి. నేరుగా వాట్సాప్కు... వాతావరణ పరిస్థితులపై ముందస్తు సమాచారాన్ని నేరుగా రైతుల సెల్ఫోన్ వాట్సాప్కు ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్(ఏఐ) ఆధారిత సలహాలను చేరవేస్తారు. ఏఐ, డిజిటల్ సాంకేతిక డేటాల అనుసంధానంతో శాటిలైట్ ఆధారిత వాతావరణ అంచనాలతో రూపొందించిన సమాచారం అందుతుంది. ఈ కార్యక్రమం అమలుకు డెవలప్మెంట్ ఇన్నోవేషన్ ల్యాబ్(డీఐఎల్), ఇండియా ఎవిడెన్స్ యాక్షన్ సంస్థలతో వ్యవసాయ శాఖ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. విత్తనాలు, ఎరువులపై కూడా.. వర్షాలు, ఉష్ణోగ్రతలు, వడగాలులే కాక రాబోయే వాతావరణ మార్పుల ముందస్తు అంచనాలను రైతులకు అందించనున్నారు. ఇవికాక వాతావరణం, వర్షాపాతం ఆధారంగా ఏ సమయంలో ఏ విత్తనాలు వేయాలి, ఎరువులు వాడాలి, పంటలను ఎలా రక్షించుకోవాలనే అంశంపై నిపుణుల సలహాలు కూడా ఇందులో ఉంటాయి. తాజా వాతావరణ పరిస్థితులతో పాటు సలహాల కోసం స్థానిక వ్యవసాయ అధికారులను కూడా సంప్రదించవచ్చు. దీంతో పాటు ఎప్పటికప్పుడు ఐఎండీ సూచనలను తెలుసుకోవడానికి Met centre Hyderabad& IMD ను సందర్శించే అవకాశం కల్పించారు. రాబోయే ఎల్నినో వంటి క్లిష్టమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడినప్పుడు తట్టుకుని పంట నష్టాలను తగ్గించుకునేలా రైతులకు ఈ ఏఐ ఆధారిత వ్యవస్థ కచ్చితమైన సమాచారాన్ని అందించనుంది. ఖమ్మంలో జిల్లాలో 3.58 లక్షల మందికి.. రైతు భరోసా పోర్టల్ ఆధారంగా 17 జిల్లాలకు చెందిన 15 లక్షల మందికి తొలిదశలో ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. తద్వారా ఖమ్మం జిల్లాలో రైతు భరోసా సాయం అందుతున్న 3,58,753 మంది రైతుల సెల్ఫోన్ నంబర్లను అనుసంధానం చేశారు. ఆయా రైతులకు ఎప్పటికప్పుడు మారుతున్న వాతావరణ పరిస్థితులపై ఏఐ ఆధారిత వాతావరణ వివరాలు అందుతున్నాయి. అయితే, ఇందులో నమోదుకాని రైతులు వ్యవసాయ శాఖ, వ్యవసాయ విస్తరణ అధికారులను సంప్రదించే అవకాశాన్ని కల్పించారు.ఏఐ ఆధారిత ముందస్తు వాతావరణ సమాచారం, పంటల నిర్వహణపై సలహాలు రైతులకు ఉపయోగపడతాయి. ప్రస్తుతం అందరి చేతుల్లో సెల్ఫోన్ ఉంటున్నందున వాట్సాప్కు వాతావరణం, పంటల సాగుపై సలహాలు అందుతాయి. ఈ సమాచారం ఆధారంగా రైతులు సాగులో ముందుకు సాగే అవకాశం ఉంటుంది. – ధనసరి పుల్లయ్య, జిల్లా వ్యవసాయాధికారి -
బొమ్మలు గీయడంలో దిట్ట!
అశ్వారావుపేటరూరల్: వేసవి సెలవులను వృథా చేయకుండా స్వతహాగా ఉన్న ఆసక్తితో బొమ్మలు గీస్తూ ప్రతిభ చాటుతోంది ఓ విద్యార్థిని. అశ్వారావుపేట బీఎస్ఆర్ నగర్కు చెందిన కృష్ణారెడ్డి – తిరుపతమ్మ దంపతుల కుమార్తె లక్కిరెడ్డి ఏశ్విత సాయి రోషిణిశ్రీ 9వ తరగతి పూర్తి చేసింది. కొంతకాలంగా చదువుతో పాటు బొమ్మలు గీయడంలో కుడా ఆసక్తి చూపించడంతో తల్లిదండ్రులు ప్రోత్సహిస్తున్నారు. దీంతో తక్కువ రోజుల్లోనే వందల సంఖ్యలో బొమ్మలు గీసింది. చిత్రకళలో రాణించాలంటే కొద్దోగొప్పో శిక్షణ అవసరం. కానీ ఏశ్విత సాయిరోషిణిశ్రీ మాత్రం ఎలాంటి శిక్షణ లేకుండానే అందమైన బొమ్మలను చకచకా వేస్తోంది. పెన్సిల్, వాటర్ కలర్లు, పెన్నులతో జాతీయ నాయకులు, గ్రామీణ మహిళలు, గ్రామీణ ప్రకృతి అందాలు, సామాజిక అంశాలు, రాజకీయ నాయకులు, దేవుళ్లు, సినీ నటుల చిత్రాలను గీస్తూ ఆకట్టుకుంటోంది. అంతేకాదు లీఫ్ ఆర్ట్స్, పేపర్ ఆర్ట్స్ సైతం అద్భుతంగా చేస్తోంది. ఆమె గీసిన బొమ్మలకు సోషల్ మీడియా ద్వారా బంధువులు, స్నేహితుల అభినందనలు అందుతున్నాయి. -
పలకరించిన నైరుతి!
సాక్షిప్రతినిధి, ఖమ్మం: నైరుతి రుతు పవనాల పలకరింపుతో జిల్లా పులకరించింది. రెండు రోజులుగా చెదురుమదురుగా వర్షాలు కురుస్తుండగా, సోమవారం మృగశిర కార్తె ప్రారంభమైన సందర్భంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో సాగుకు ఏర్పాట్లు చేసుకున్న రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ఇక అత్యధిక ఉష్ణోగ్రతలతో అల్లాడిన జనానికి ఈ వర్షంతో ఉపశమనం కలిగినట్లయింది. ఓ మోస్తరు వర్షాలే అయినా వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నాయి. ఈదురుగాలులతో.. రాష్ట్రంలోకి నైరుతి రుతు పవనాలు ఇప్పటికే ప్రవేశించగా, రానున్న రెండు, మూడు రోజుల్లో విస్తరిస్తాయని తెలుస్తోంది. ఈ ప్రభావంతో జిల్లాలోని పలు ప్రాంతాల్లో రెండు, మూడు రోజులుగా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షపాతం నమోదవుతోంది. రోజూ ఉదయం నుంచి సాయంత్రం వరకు పొడి వాతావరణమే ఉంటున్నా.. సాయంత్రం అయ్యేసరికి చల్లటి ఈదురుగాలులతో వర్షం కురుస్తోంది. జిల్లాలో 1.8 సెం.మీ. వర్షపాతం జిల్లాలో ఆదివారం ఉదయం 8–30నుంచి సోమవారం ఉదయం 8–30 గంటల వరకు 1.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వైరాలో 6.3 సెం.మీ., రఘునాథపాలెం మండలంలో 5.7, తల్లాడలో 3.6, మధిరలో 3.3, బోనకల్లో 2.5 సెంటీమీటర్లు, చింతకానిలో 2 సెంటీమీటర్ల వర్షం కురిసింది. మొత్తం 21 మండలాల్లోనూ వర్షప్రభావం కనిపించింది. ఇక సోమవారం తెల్లవారుజామున, సాయంత్రం పలు మండలాల్లో వర్షం కురిసింది. రాత్రి 7 గంటల వరకు ఖమ్మం అర్బన్ మండలం ఖానాపురంలో 1.6 సెం.మీ. వర్షపాతం నమోదైంది. అలాగే ప్రకాష్నగర్లో 1.4 సెం.మీ., ఖమ్మంరూరల్ మండలం పల్లెగూడెం వద్ద 1.3, తిరుమలాయపాలెం మండలం కాకరవాయిలో 1.3 సెం.మీ. వర్షపాతం నమోదు కాగా ఇంకొన్ని ప్రాంతాల్లోనూ వర్షం కురిసింది.నైరుతి రుతుపవనాల ప్రభావంతో తేలికపాటి వర్షాలు కురుస్తుండగా, రుతుపవనాలు విస్తరించే కొద్ది వర్షాలు ఉధృతం కానున్నాయి. ఈమేరకు పంటల సాగుకు రైతులు సిద్ధమవుతున్నారు. సహజంగా ఏటా మే నెలాఖరులోనే దుక్కులు దున్నుతారు. అయితే ఈసారి వర్షాలు లేకపోవడం, అధిక ఉష్ణోగ్రతలతో అక్కడక్కడా పొడి దుక్కులే ప్రారంభించారు. ఇప్పుడు వర్షాలు మొదలుకావడంతో పత్తి తదితర మెట్ట పంటల సాగుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.జిల్లాలో మొదలైన వర్షాలు -
తండ్రి కూలీ.. కుమారుడు డెలివరీ బాయ్
ఖమ్మం స్పోర్ట్స్: ఇటీవల వెల్లడైన బీపీఈడీ ఎంట్రెన్స్ ఫలితాల్లో ఖమ్మంకు చెందిన రామడుగు నరేందర్ రాష్ట్రస్థాయిలో ఐదో ర్యాంకు సాధించాడు. నిరుపేద కుటుంబానికి చెందిన ఆయన జాతీయస్థాయిలో బాస్కెట్బాల్, నెట్బాల్ క్రీడల్లో రాణించడమే కాక యూనివర్సిటీ స్థాయి బాస్కెట్బాల్ జట్టుకు ఎంపికయ్యాడు. ఆయన తండ్రి రోజువారీ కూలీగా పనిచేస్తూనే నరేందర్కు క్రీడలపై ఉన్న ఆసక్తి దృష్ట్యా శిక్షణ ఇప్పించాడు. మరోపక్క నరేందర్ సైతం వివిధ సంస్థల్లో ఫుడ్ డెలివరీ బాయ్గా పనిచేస్తూనే చదువుకుని బీపీఈడీ ఎంట్రెన్స్లో రాష్ట్రస్థాయి ఐదో ర్యాంక్ సాధించడంపై నెట్బాల్ సంఘం జిల్లా మాజీ కార్యదర్శి పీ.వీ.రమణ, తదితరులు అభినందించారు.బీపీఈడీ ఎంట్రెన్స్లో రాష్ట్ర ఐదో ర్యాంక్ -
కూల్చిన చోటే ఇళ్లు నిర్మించి ఇవ్వాలి
ఖమ్మం అర్బన్: ఖమ్మం వెలుగుమట్లలో ఇళ్లు కోల్పోయిన బాధితులకు ప్రభుత్వం అక్కడే స్థల పట్టాలు, ఇళ్లు మంజూరు చేయాలని బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు తోట్ల రాఘవేంద్ర ముదిరాజ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు డిమాండ్తో సోమవారం ఖమ్మంలో భూదాన్ బాధితుల నిజనిర్ధారణ కమిటీ ఆధ్వర్యాన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రాఘవేంద్ర మాట్లాడుతూ బాధితుల సమస్యలను రాష్ట్రపతి, ప్రధానమంత్రితో పాటు రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి ఉత్తరాల ద్వారా తెలియజేశామని చెప్పారు. వెలుగుమట్లలో ఇళ్లు కోల్పోయిన వారికి 100 గజాల స్థలంలో తిరిగి ఇళ్లు నిర్మించి ఇచ్చేవరకు ఆందోళనలు కొనసాగిస్తామని తెలిపారు. జేఏసీ రాష్ట్ర కార్యదర్శి రాంబాబు మాట్లాడుతూ బాధితులకు న్యాయం జరిగేలా రాష్ట్రపతికి వినతిపత్రం సమర్పిస్తామన్నారు. బాధితుల పోరాటానికి అన్ని పార్టీలు, సంఘాలు మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో న్యాయవాది వంజాకుల లక్ష్మీనారాయణ, నిజనిర్ధారణ కమిటీ కన్వీనర్ కేవీ.కృష్ణారావుతో పాటు వట్టే ఉదయ్కిరణ్, మట్టే నవ్య, సుమలత, రామకృష్ణ, కృష్ణ, రాము పాల్గొన్నారు.వెలుగుమట్ల బాధితుల ర్యాలీ -
ప్రత్యామ్నాయ పంటల సాగు చేపట్టాలి
కూసుమంచి: వాతావరణ పరిస్థితుల దృష్టాయ రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించి సేంద్రియ వ్యవసాయ విధానం అనుసరించాలని ఖమ్మం కలెక్టర్ దివాకర టీ.ఎస్. సూచించారు. కూసుమంచి మండలం ఈశ్వరమాధారంలో సోమవారం నిర్వహించిన గ్రామసభలో ఆయన రైతులు సంప్రదాయ పంటలకు బదులు లాభదాయక పంటలను సాగు చేస్తే ఫలితం ఉంటుందని తెలిపారు. కాగా, వర్షాలు మొదలైనందున పారిశుద్ధ్య లోపం ఎదురుకాకుండా చూడాలని, తద్వారా సీజనల్ వ్యాధులు దరిచేరవని చెప్పారు. ఓటర్ల జాబితా మ్యాపింగ్పై అపోహలు విడనాడి ఉద్యోగులకు సహకరించాలని సూచించారు. ఆర్డీఓ శ్రీనివాస్, మండల ప్రత్యేకాధికారి సునీల్రెడ్డి, ఎంపీడీఓ జశ్వంత్కుమార్ తదితరులు పాల్గొన్నారు.కలెక్టర్ దివాకర టీ.ఎస్. -
జీపీఎస్ ట్రాకర్తో రాబందు !
చర్ల: చర్ల మండలంలోని తిప్పాపురం గ్రామానికి జీపీఎస్ ట్రాకర్ కలిగిన ఓ రాబందు సోమవారం చేరుకుంది. నీరసించిన స్థితిలో ఉన్న ఈ రాబందు గ్రామ శివారు చెరువు వద్ద పడి ఉండగా స్థానికులు ఆహారం, నీళ్లు అందించారు. కాగా, 2024 అక్టోబర్ 1, 2వ తేదీల్లోనూ చర్ల మండలంలోని సాయినగర్ సమీప గుట్టల్లో ఇలాంటి రాబందు ఒకటి పడిపోగా అటవీ శాఖాధికారులు గుర్తించారు. ఆ రాబందు కాలికి జీపీఎస్ ట్రాకర్ ఉండడంతో అప్పట్లో మావోయిస్టుల అన్వేషణ కోసం కేంద్ర బలగాలు పంపించి ఉంటాయనే ప్రచారం జరిగింది. అయితే, మహారాష్ట్రలోని ముంబై నేచురల్ హిస్టరీ సొసైటీ బాధ్యులు రాబందుల సంరక్షణలో భాగంగా దాన్ని విడిచిపెట్టినట్లు తేలింది. మళ్లీ ఇప్పుడు కూడా జీపీఎస్ ట్రాకర్తో ఉన్న రాబందు రావడంతో మహారాష్ట్ర నుంచే విడిచిపెట్టి ఉంటారని భావిస్తున్నారు. ఈ మేరకు స్థానికులు అటవీ శాఖాదికారులకు సమాచారం ఇచ్చారు. -
గోల్డ్ లోన్.. కష్టాలు!
● నిబంధనలు కఠినతరం చేసిన ఆర్బీఐ ● రెన్యూవల్కు అసలు, వడ్డీ చెల్లించాలంటున్న బ్యాంకర్లు ● దిక్కుతోచని స్థితిలో రుణగ్రహీతలు ● ఆదాయం లేనివారు అనర్హులు.. రెన్యూవల్కు మినహాయింపు భద్రాచలంఅర్బన్: సాధారణ, మధ్య తరగతి కుటుంబీకులకు బంగారమంటే కేవలం అలంకరణే కాదు.. ఆపద నుంచి గట్టెక్కించేది కూడా. వ్యక్తిగత, వ్యాపార, తదితర స్వల్పకాలిక, దీర్ఘకాలిక అవసరాల్లో తక్షణమే పొందగలిగేది పసిడి రుణం మాత్రమే. మొన్నటి వరకు బ్యాంకుల్లో చాలా సులభంగా పొందే గోల్డ్ లోన్ ప్రస్తుతం కఠినతరంగా మారింది. ఆర్బీఐ తాజాగా తీసుకొచ్చిన నిబంధనల కారణంగా బ్యాంకుల్లో బంగారు రుణాలు తీసుకున్న వారు కొత్త నిబంధనలతో దిక్కుతోచని స్థితిని ఎదుర్కొంటున్నారు. ‘ప్రైవేటు’ను ఆశ్రయిస్తూ.. రుణాలను అసలు, వడ్డీ చెల్లిస్తేనే రెన్యూవల్ చేస్తామని బ్యాంకర్లు చెబుతుండడంతో కొందరు రుణ గ్రహీతలు రెన్యూవల్ కోసం నానా అవస్థలు పడుతున్నారు. రెన్యూవల్ కోసం రూ.లక్షలు అప్పులు పుట్టక.. చివరకు వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. వీరు రెండు, మూడు రోజుల్లోనే రూ.2 చొప్పున వడ్డీ చెల్లిస్తేనే ఇస్తామని చెబుతున్నా.. చేసేదిలేక రుణగ్రస్తులు వడ్డీకి డబ్బులు తీసుకొచ్చి తీవ్రంగా నష్టపోతున్నారు. నూతన నిబంధనలు ఇలా.. బంగారం రుణాలను అగ్రి లోన్స్, నాన్ అగ్రి లోన్స్ అంటూ రెండు భాగాలుగా విభజించారు. రూ.2.25 లక్షల రుణం తీసుకునే వారికి నిబంధనలు కాస్త సరళతరంగా ఉండగా.. అంతకు మించి అయితే రుణం పొందలేని పరిస్థితి ఉంది. ● వ్యవసాయదారుడు రుణం తీసుకోవాలంటే పట్టాదారు పాస్ పుస్తకంతో పాటు తహసీల్దార్ ధ్రువీకరించిన ఆదాయ సర్టిఫికెట్, భూమికి చెందిన 1బీ, పశువుల వివరాలు, వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకానికి సంబంధించిన రశీదులు సమర్పించాల్సి ఉంటుంది. ● ఇక నాన్ అగ్రి రుణం తీసుకునే వారికి ఐటీఆర్, సిబిల్, ఆదాయ ధ్రువీకరణ చేసుకున్నాకే రుణం మంజూరు చేస్తారు. ● గతంలో డిఫాల్టర్గా ఉండి సెటిల్మెంట్ చేసుకున్న వారికి బంగారంపై రుణాలు ఇవ్వబడవు. ● ఆదాయాన్ని బట్టి ఒక్కరు మూడు నుంచి ఐదు రుణాలను మాత్రమే తీసుకోవడానికి అర్హులు. ఆదాయ వనరులు, ఆదాయం లేని వారు రుణం పొందడానికి అనర్హులు. ● రెన్యూవల్లో మాత్రం నిబంధనలను సడలించింది. ఏడాదిలోపు రుణాన్ని రెన్యూవల్ చేసుకునే వారికి వడ్డీ మాత్రమే చెల్లించేలా వెసులుబాటు కల్పించింది. ఈ వెసులుబాటు కేవలం మూడు పర్యాయాలు మాత్రమే వర్తించనుంది. ● అలాగే బంగారం రుణాల మంజూరు ప్రక్రియలో రుణగ్రహీత నిధులను ఎందుకోసం ఖర్చు చేయనున్నారనే విషయంపై ఆరా తీయాలని బ్యాంకులకు ఆర్బీఐ ఆదేశించినట్లు సమాచార. ● అంతేకాక రుణగ్రహీతల బ్యాక్గ్రౌండ్ చెక్ చేయాలని, తాకట్టు పెట్టిన బంగారం వాస్తవ హక్కుదారు ఎవరనేదీ తెలుసుకోవాలని నిర్దేశించినట్లు తెలిసింది. పసిడి రుణాల వ్యాపారంలో అనైతిక వ్యవహారాలకు చెక్ పెట్టడంతో పాటు ఆర్థిక వ్యవస్థ స్థిరత్వానికి భంగం కలగకుండా చూడటమే ఆర్బీఐ ఉద్దేశంగా ఉన్నట్లు తెలుస్తోంది. వివిధ బ్యాంకులు బంగారం రుణాల్లో భారీగా చార్జీలు పెంచింది. గతంలో రూ.3 లక్షల వరకు ఉచితంగా ఉండగా.. రూ.3 లక్షలు పైన నామినల్ చార్జీలు తీసుకునే వారు. అయితే ఇటీవల బంగారం రుణాలు తీసుకునే వారిపై చార్జీల మోత మోగిస్తోంది. ప్రతి రూ.లక్ష రుణానికి అప్రైజర్ చార్జితో పాటు సర్వీస్ చార్జి అంటూ సుమారు రూ.900 వరకు వసూలు చేస్తున్నారు. ఇలా రూ.5 లక్షల వరకు రుణానికి అయితే గోల్డ్ అప్రైజర్కు రూ. 590, ప్రాసెసింగ్ చార్జిలు రూ. 295లు వసూలు చేస్తుండగా.. రూ.5 లక్షల పైన రుణానికి అయితే గోల్డ్ అప్రైజర్కు రూ. 708, ప్రాసెసింగ్ చార్జిలు రూ. 590 లు వసూలు చేస్తున్నారు. కాగా, బ్యాంకుల వారీగా చార్జీలు ఉన్నాయి. ఇకనైనా బ్యాంకర్లు వడ్డీ మాత్రమే కట్టించుకుని రుణాలు రెన్యూవల్ చేయాలని రైతులు కోరుతున్నారు. -
‘ఎస్ఐఆర్ పేరుతో ఓటర్ల తొలగింపునకు కుట్ర’
ఖమ్మం మామిళ్లగూడెం: ఎస్ఐఆర్ పేరుతో మైనార్టీలు, దళితులు, ఆదివాసీల ఓట్ల తొలగించే ప్రయత్నం జరుగుతున్నందున రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కు కాపాడుకోవడంపై ప్రజలు దృష్టి సారించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు పోతినేని సుదర్శన్ సూచించారు. ఖమ్మం సుందరయ్య భవనంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యురాలు మాచర్ల భారతి అధ్యక్షతన సోమవారం జరిగిన జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ధ్రువీకరణ పత్రాల లేమి కారణంగా పేద ప్రజలు ఓటు హక్కు కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. ప్రజలు ప్రభుత్వాలను ఎన్నుకునే ప్రజాస్వామ్య విధానానికి బదులుగా ప్రభుత్వమే ఓటర్లను ఎంపిక చేసేలా కుట్ర పన్నిన బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. పార్టీ జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు మాట్లాడుతూ విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరించే కేంద్ర ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా రాష్ట్రప్రభుత్వం రైతు డిస్కంను తెరపైకి తీసుకొచ్చిందన్నారు. ఈ నిర్ణయం ద్వారా రైతులు, పేదలకు అందుతున్న విద్యుత్ సబ్సిడీలను ఎత్తివేసే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. ఇంకా ఈ సమావేశంలో నాయకులు బండి రమేష్, కళ్యాణం వెంకటేశ్వరరావు, వై.విక్రమ్, బొంతు రాంబాబు, భూక్యా వీరభద్రం, యర్రా శ్రీనివాసరావు, బండి పద్మ, మెరుగు సత్యనారాయణ, ఎం.గోపాల్రావు తదితరులు పాల్గొన్నారు. -
ఆయిల్పామ్ ధర జోరు..
● తాజాగా రూ.23,852కు చేరిన టన్ను గెలలు ● ఏడు నెలలుగా పెరుగుతూ రికార్డు సృష్టిస్తున్న రేటు అశ్వారావుపేటరూరల్: పెరుగుతున్న పామాయిల్ గెలల ధర రైతుల్లో ఉత్సాహం నింపుతోంది. గత నెలలో టన్ను ధర రూ.23,501కు చేరుకోగా, ఈ నెలలో రూ.23,852కు పెరిగింది. టన్నుకు తాజాగా మరో రూ.351 పెరిగి ఆయిల్ఫెడ్ చరిత్రలోనే ఆల్టైం రికార్డు సృష్టించింది. అశ్వారావుపేట, దమ్మపేట మండలంలోని అప్పారావుపేటలో ఆయిల్పామ్ ఫ్యాక్టరీలు ఏర్పాటైన తర్వాత అత్యధిక ధర ఇదే కావడం విశేషం. కరోనా సమయం, 2022వ సంవత్సరంలో అత్యధికంగా టన్నుకు రూ.23,467 గరిష్టంగా నమోదైంది. కరోనా సమయం మళ్లీ ఈ ఏడాదిలోనే తర్వాత రూ.23వేల మార్క్ దాటింది. దీంతో ఆయిల్పామ్ సాగుదారుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. కొత్త ఏడాది ఆరంభం నుంచే ధరలో పెరుగుదల కనిపించగా, ఆరు నెలలుగా పెరుగుతూనే ఉంది. దీంతో మరికొందరు రైతులు పామాయిల్ తోటల సాగుపై ఆసక్తి చూపిస్తున్నారు. ఆయిల్పామ్ తోటలను కౌలు తీసుకుని సాగు చేసే రైతులపై ధరల భారం పడుతోంది. గతేడాది ఎకరం ఆయిల్పామ్ తోట కౌలు రూ.45 వేల నుంచి అత్యధికంగా రూ.70 వేలుగా ఉంది. ఈ ఏడాది పామాయిల్ గెలల టన్ను ధర పెరుగుదల, ధర తగ్గకపోవడంతో సాగుదారులు ఒకేసారి కౌలు ధరలు పెంచేశారు. గడిచిన కొద్ది నెలలుగా జిల్లాలోని అశ్వారావుపేట, దమ్మపేట మండలాల్లో ఎకరం కౌలు ఏకంగా రూ.లక్ష దాటింది. జిల్లాలోని మిగిలిన ప్రాంతాల్లో ఎకరం కౌలు ధరలు కొంతమేర ఆశాజనకంగానే ఉండగా, ఈ రెండు మండలాల్లోనే కౌలు ధర ఆందోళన కలిగిస్తోంది. భారీగా పెరిగిన కౌలు ధరలతో చిన్న, సన్నకారు రైతులు అవేదన వ్యక్తం చేస్తున్నారు. -
అతి నమ్మకం అనర్థం
నేను రాసిన కథసత్తుపల్లి టౌన్: సిరిపురం గ్రామంలో గౌతమ్ అనే విద్యార్థి ఉండేవాడు. ఏ పనినైనా ఇట్టే చేసేయగలనని ఆయనకు అతి నమ్మకం ఉండేది. కానీ ఆ నమ్మకంతోనే ఎందులోనూ రాణించలేకపోయేవాడు. ఒకరోజు గౌతమ్ వాళ్ల వ్యాయామ ఉపాధ్యాయుడు వారం రోజుల్లో రామాపురం అనే గ్రామంలో ఆటలు పోటీలు ఉన్నాయి. అందరూ బాగా సాధన చేయండి అని సూచించాడు. మిగతా పిల్లలందరూ సార్ చెప్పినట్టుగా సాధన చేయసాగారు. కానీ గౌతమ్ మాత్రం తనకు అన్నీ వచ్చనే అతి నమ్మకంతో ఉన్నాడు. సైకిల్ తొక్కుతూ రోడ్లమీద తిరుగుతూ వృథాగా కాలక్షేపం చేయసాగాడు. అటు ఉపాధ్యాయుడు, ఇటు స్నేహితులు ఎంత చెప్పినా వినలేదు. ఇంతలో పోటీల రోజు రానే వచ్చింది. అందరూ రామాపురం వెళ్లారు. అందరూ దూరం కావడంతో.. రామాపురంలో జరిగిన పోటీల్లో మొదటి రెండు ఆటల్లో గౌతమ్ను తీసుకోలేదు. మూడో ఆటలో ఆయనను తీసుకున్నా ఆయన ఆటతీరు సరిగ్గా లేక ఓడిపోయారు. దీంతో స్నేహితులంతా గౌతమ్ వల్లే ఓడిపోయామని తిట్టారు. సార్ కూడా కోపడ్డాడు. దీంతో ఆయన బాధపడుతూ సైకిల్ మీద ఇంటికి బయలు దేరాడు. అదే విషయం ఆలోచిస్తూ వెళ్తుండడంతో సైకిల్తో ఆగి ఉన్న లారీని ఢీకొట్టగా కాళ్లు, చేతులకి బాగా దెబ్బలు తగిలాయి. చుట్టుపక్కల వాళ్లు ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించారు. కొన్నాళ్లపాటు పాఠశాల, స్నేహితులకు దూరమయ్యాడు. అప్పుడు గౌతమ్ ‘అతి నమ్మకం వల్లే కదా ఈ పరిస్థితి వచ్చింది’అని తెలుసుకుఇ బాధపడ్డాడు. ఒక సంవత్సరం తర్వాత పాఠశాలకు వెళ్లిన గౌతమ్ వ్యాయామ ఉపాధ్యాయుడి వద్దకు వెళ్లి ‘నేను మళ్లీ ఆటలు ఆడుతాను సార్. ఇప్పటినుంచి బాగా సాధన చేస్తాను. మీరు చెప్పినట్లు నడుచుకుంటాను’అని చెప్పాడు. అందుకు అనుగుణంగానే బాగా సాధన చేసి మంచి క్రీడాకారుడుగా ఎదిగాడు.నీతి : నమ్మకం ఉండడం తప్పు కాదు కానీ అతి నమ్మకం ఉండకూడదు. అతి నమ్మకం అహంకారానికి, ఆ అహంకారం పతనానికి దారి తీస్తుంది. -
నిరుద్యోగులకు స్వయం ఉపాధి శిక్షణ
భద్రాచలం: గిరిజన యువత స్వయం ఉపాధి పొందేలా 25 కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నట్లు భద్రాచలం ఐటీడీఏ ఏపీఓ జనరల్ డేవిడ్ రాజ్ తెలిపారు. భద్రాచలంలోని కార్యాయం నుంచి సోమవారం ఆయన భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల ఎంపీడీఓలతో టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా డేవిడ్రాజ్ మాట్లాడుతూ నిరుద్యోగ యువత 2,500 మందికి 90 రోజులపాటు శిక్షణ అందించనున్నట్లు తెలిపారు. ఆపై స్వయం ఉపాధి సాధించేలా ముద్ర రుణాలు ఇప్పించనున్నట్లు చెప్పారు. భద్రాచలం, కొత్తగూడెం, ఇల్లెందు, ఖమ్మం మండలాల్లో ఈనెల 15నుంచి శిక్షణ ఇవ్వనుండగా, ఎంపీడీఓలు, పంచాయతీ కార్యదర్శులు వారి పరిధిలోని నిరుద్యోగ యువతను గుర్తించి 12వ తేదీలోగా జాబితా పంపించాలని సూచించారు. టీజీ టీ–20లో కారేపల్లి యువకుడు ● వరంగల్ వారియర్స్ జట్టుకు దివిన్ ఎంపిక కారేపల్లి: తెలంగాణ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ) నిర్వహిస్తున్న టీ–20 లీగ్ క్రికెట్ టోర్నీకి కారేపల్లి మండల క్రికెటర్ ఎంపికయ్యాడు. తాజాగా నిర్వహించిన వేలంలో కారేపల్లి మండలం సూర్యతండా గ్రామానికి చెందిన ఆంగోతు కై లా–కవిత దంపతుల పెద్ద కుమారుడు ఆంగోతు దివిన్ను వరంగల్ వారియర్స్ జట్టు రూ.85 వేలకు కొనుగోలు చేసింది. ఇదేజట్టులో భారత జట్టు ఆటగాడు మహమ్మద్ సిరాజ్ కూడా ఉండడం విశేషం. కాగా, దివిన్ ప్రస్తుతం హనుమకొండలోని వాగ్దేవి కళాశాలలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. రైట్హ్యాండ్ బ్యాట్స్మెన్, వికెట్ కీపర్ అయిన ఆయన అండర్–19, 23 కేటగిరీల్లో జిల్లా జట్టు తరఫున ఆడి అత్యుత్తమ ప్రతిభ కనబరిచాడు. కాగా, దివిన్ తండ్రి కై లా చాతకొండ బెటాలియన్లో హెడ్కానిస్టేబుల్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. భద్రాచలం ఆస్పత్రి ఇన్చార్జి సూపరింటెండెంట్గా రాజశేఖర్రెడ్డి భద్రాచలంఅర్బన్: భద్రాచలం ఏరియా ఆస్పత్రి ఇన్చార్జి సూపరింటెండెంట్గా రాజశేఖర్రెడ్డి నియమితులయ్యారు. ఈమేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సమన్వయ అధికారి(డీసీహెచ్ఎస్) రవిబాబు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం సూపరింటెండెంట్గా విధులు నిర్వర్తిస్తున్న రామకృష్ణ మణుగూరు ఏరియా ఆస్పత్రికి బదిలీ కావడంతో ఆర్ఎంఓగా ఉన్న రాజశేఖర్రెడ్డికి ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. అయితే, త్వరలోనే పూర్తిస్థాయి సూపరింటెండెంట్గా రాజశేఖర్రెడ్డి, ఆర్ఎంఓ–1గా సంతోష్ నియమితులయ్యే అవకాశముందని సమాచారం. గ్రామపంచాయతీలను అభివృద్ధి చేసుకోవాలి ● పంచాయతీరాజ్ డిప్యూటీ కమిషనర్ విద్యాలత చింతకాని: ప్రభుత్వం మంజూరు చేస్తున్న నిధులతో గ్రామాల్లో ప్రాధాన్యత క్రమాన పనులు చేపడుతూ అభివృద్ధి చేసుకోవాలని పంచాయతీరాజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ విద్యాలత సూచించారు. ‘ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక’లో భాగంగా సోమవారం మండలంలోని నేరడలో నిర్వహించిన గ్రామసభలో ఆమె మాట్లాడారు. అర్ములకు ఇందిరమ్మ ఇళ్లు, ఫించన్లు మంజూరు చేసేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంన్నారు. అనంతరం ఈజీఎస్ నిధులు రూ.10 లక్షలతో గ్రామంలో నిర్మించే సీ్త్ర శక్తి భవనానికి ఆమె శంకుస్థాపన చేశారు. అలాగే ఉన్నత పాఠశాలలో మొక్కలు నాటారు. సర్పంచ్ దూసరి నేతాజీ, జెడ్పీ డిప్యూటీ సీఈఓ శ్రీనివాస్, ఎంపీడీఓ చుంచు శ్రీనివాసరావు, ఎంపీఓ పర్వీన్ ఖైసర్, ఏఈ రఘు, ఆర్ఐ శ్రీనివాస్, గ్రామపంచాయతీ కార్యదర్శి అర్జున్ తదితరులు పాల్గొన్నారు. ఓటర్ల సవరణలో లోపాలు గుర్తించాలి కారేపల్లి: ప్రత్యేక ఓటర్ల సవరణను పకడ్బందీగా చేపడుతూ అందులో తప్పులను 10వ తేదీలోగా గుర్తించాలని ఖమ్మం జిల్లా అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ ఆదేశించారు. మండలంలోని గాదెపాడులో ఓటర్ల జాబితా మ్యాపింగ్ను సోమవారం ఆమె పరిశీలించారు. మ్యాపింగ్ వివరాలు తెలుసుకున్నాక ఆమె ఉద్యోగులకు సూచనలు చేశారు. తహసీల్దార్ ఓరుగంటి వెంకటేశ్వర్లు, సర్పంచ్ భూక్యా రంజిత్కుమార్, ఆర్ఐ జగదీష్, జీపీఓ శ్రీనివాస్ పాల్గొన్నారు. -
ప్రతీ న్యాయమైన సమస్య పరిష్కరిస్తాం
● రెండో విడతలో ప్రతీ నియోజకవర్గానికి 2వేల ఇళ్లు ● రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిఖమ్మంరూరల్: ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని సత్వర పరిష్కారం చూపించడమే ప్రజాదర్బార్ కార్యక్రమం లక్ష్యమని రాష్ట్ర రెవెన్యూ, గహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో సోమవారం నిర్వహించిన ప్రజాదర్బార్లో కలెక్టర్ దివాకర టీ.ఎస్.తో కలిసి మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాలేరు నియోజకవర్గాన్ని 14 క్లస్టర్లగా విభజించి ప్రజాదర్బార్లు నిర్వహిస్తున్నామన్నారు. ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో చివరి ప్రజాదర్బార్ జరగగా 3,500 దరఖాస్తులకు వచ్చాయని తెలిపారు. వీటిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ పరిష్కరించేలా అధికారులకు సూచనలు చేశామని చెప్పారు. మొత్తం ప్రజా దర్బార్లలో అందిన 21,536 దరఖాస్తుల్లో అత్యధికంగా 9,731 దరఖాస్తులు ఇందిరమ్మ ఇళ్ల కోసమే వచ్చాయని తెలిపారు. ఇక పెన్షన్ల కోసం 4,700, భూ సమస్యలకు 4వేలు, గృహజ్యోతి పథకం కోసం 900 దరఖాస్తులు ఉన్నాయని పేర్కొన్నారు. ఆర్థిక సమస్యలు ఉన్నా... రాష్ట్రప్రభుత్వానికి ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ వాటిని అధిగమిస్తూ అభివద్ధి, సంక్షేమ పథకాలను అమలుచేస్తున్నామని పొంగులేటి తెలిపారు. ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, సన్నబియ్యం పంపిణీ, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, కొత్త రేషన్ కార్డుల జారీ చేయడమే కాక మహిళా సంఘాలకు రూ.66 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు అందించామని చెప్పారు. ఇక పేదల సొంతింటి కలను సాకారం చేయాలనే సంకల్పంతో తొలి విడతలో 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసి, నిర్మాణ పురోగతి ఆధారంగా బిల్లులు విడుదల చేస్తున్నామని తెలిపారు. రెండో విడతగా ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గానికి మరో 2వేల ఇళ్లు మంజూరు చేయనున్నట్లు వివరించారు. చివరి నిరుపేదకు ఇళ్లు మంజూరు అయ్యే వరకు పథకం కొనసాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పి. శ్రీనివాసరెడ్డి, డీఎఫ్ఓ అనూజ్ అగర్వాల్, ఏదులాపురం మునిసిపల్ చైర్పర్సన్ అనిత, వైస్ చైర్మన్ నవీన్, కయమిషనర్ శ్రీనివాస్రెడ్డి, మద్దులపల్లి మార్కెట్ చైర్మన్ హరినాథ్ బాబు, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. -
ఆధార్తో ‘చేయూత’పై నజర్
ఖమ్మంమయూరిసెంటర్: అటు కొత్త ఆశలు.. ఇటు అర్హత పరీక్షలు! ఇదీ ఖమ్మం నగరపాలక సంస్థ పింఛన్ల విభాగంలో కనిపిస్తున్న పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా చేయూత పింఛన్ల మంజూరుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ అర్హుల జాబితా సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించింది. దీంతో దరఖాస్తులు ఇచ్చే వారితో పాటు ఇప్పటికే దరఖాస్తులు ఇచ్చి విచారణ పూర్తయిన వారు కేఎంసీకి బారులు దీరుతున్నారు. ఇదే సమయాన అనర్హులను తొలగించేందుకు జీవన్ అపమాణ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఫించన్ పొందుతున్న వారు తాము జీవించి ఉన్నామని తెలిపేందుకు జీవన్ ప్రమాణ్లో భాగంగా ఫొటో దిగుతున్నారు. మేం బతికే ఉన్నాం... ప్రస్తుతం ఆసరా పింఛన్లు పొందుతున్న వారు అర్హులా, కాదా అన్నది తేల్చేందుకు ప్రభుత్వం జీవన్ ప్రమాణ్ (లైవ్ సర్టిఫికేట్) ప్రక్రియను తెరపైకి తీసుకొచ్చింది. ఈ మేరకు లబ్ధిదారులు ఫొటో దిగాల్సి ఉంటుంది. ఈ ఫొటోను వారి ఆధార్ డేటాతో సరిపోల్చి జీవించి ఉన్నట్లు ధ్రువీకరిస్తారు. అంధులు, చేతులు లేని వారు, ఇతర దివ్యాంగుల కోసం ఐరిస్ (కంటిపాప) గుర్తింపు వంటి పద్ధతులను వాడుతున్నారు. ఈమేరకు లబ్ధిదారులు కేఎంసీ కార్యాలయానికి క్యూ కడుతుండగా.. కార్యాలయానికి రాలేనివారి ఇళ్లకు సిబ్బందే వెళ్తున్నారు. సాగుతున్న ప్రక్రియ.. పది రోజులుగా ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో బయోమెట్రిక్ ప్రక్రియ జోరుగా సాగుతోంది. కేఎంసీకి వచ్చే వారి కోసం కమిషనర్ అభిషేక్ అగస్త్య ప్రత్యేక ఏర్పాట్లు చేయించారు. ఇక మెప్మా ఆర్పీలు, వార్డు అధికారుల ఆధ్వర్యాన డివిజన్ల వారీగా ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి వివరాలు సేకరిస్తున్నారు. కేఎంసీ పరిధిలో మొత్తం 26,073 మంది పింఛన్దారులు ఉండగా.. ఇప్పటివరకు 18,657 మంది జీవన్ ప్రమాణ్ పూర్తి చేసుకున్నారు. ఈనెల 15వ తేదీ వరకే గడువు ఇవ్వడంతో అధికారులు ప్రక్రియను వేగవంతం చేశారు. వారం రోజుల్లో మిగిలిన 7,416 మంది జీవించి ఉన్నట్లు అధికారులు గుర్తించాల్సి ఉంది. ఈ ప్రక్రియ పూర్తయ్యాక పింఛన్ తీసుకుంటున్న వారిలో అనర్హులు ఎందరు ఉన్నారనేది తేలుతుంది.కేఎంసీలో ముమ్మరంగా జీవన్ ప్రమాణ్ -
రైతులకు అండగా ‘సాక్షి’
నేడు డీఏఓతో ఫోన్ ఇన్ఖమ్మంవ్యవసాయం: నైరుతి రుతుపవనాల రాకతో వర్షాలు మొదలయ్యాయి. దీంతో రైతులు వ్యవసాయ పనులకు శ్రీకారం చుడుతున్నారు. అయితే, దుక్కులు దున్నడంలో జాగ్రత్తలు, మేలైన విత్తనాల ఎంపిక, నకిలీల బారిన పడకుండా కాపాడుకోవడం, ఎంచుకోవా ల్సిన ప్రత్యామ్నాయ పంటలు తదితర అంశాలపై అవగాహన కోసం రైతులకు ‘సాక్షి’ అండగా నిలవనుంది. రైతులు తమ సందేహాలపై నేరుగా జిల్లా వ్యవసాయాధికారి ధనసరి పుల్లయ్యతో మాట్లాడేలా ‘ఫోన్ ఇన్’ నిర్వహిస్తోంది. ఈమేరకు అన్నదాతలు నిర్ణీత సమయంలో ఫోన్ చేసి తమ సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు. తేదీ : 09–06–2026, మంగళవారం (నేడు) సమయం : ఉదయం 8నుంచి 9 గంటల వరకు ఫోన్ చేయాల్సిన నంబర్ 89777 47500 -
ఉరి వేసుకుని యువకుడి ఆత్మహత్య
నేలకొండపల్లి: మండలంలోని అజయ్తండాకు చెందిన బానోత్ గోపి(24) ఆదివారం అర్ధరాత్రి తన ఇంట్లో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు సీపీఆర్ చేసినా ఫలితం లేక ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లేసరికి అప్పటికే మృతి చెందాడని వైద్యులు నిర్ధారించారు. గ్రామానికి చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం నేపథ్యాన ఆమె వేధింపులు భరించలేక గోపి ఆత్మహత్య చేసుకున్నాడని ఆయన తల్లి జయమ్మ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. వివాహిత అదృశ్యంపై కేసు మండలంలోని ఆజయ్తండాకు చెందిన ఓ వివాహిత కానరావడం లేదని ఆమె కుటుంబీకులు ఫిర్యాదు చేశారు. ఆమె ఆదివారం రాత్రి ఇంటి నుంచి వెళ్లిపోగా.. ఎక్కడ వెతికినా ఫలితం లేకపోవడంతో ఆమె తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చికిత్స పొందుతున్న రైతు మృతి తిరుమలాయపాలెం: వడదెబ్బకు గురైన ఓ రైతు చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. మండలంలోని తాళ్లచెరువు గ్రామానికి చెందిన రైతు పులకాని వెంకన్న(57) పది రోజుల క్రితం వడదెబ్బతో అస్వస్థతకు గురికాగా ఖమ్మం ఆస్పత్రిలో చికిత్స చేయిస్తున్నారు. ఈనేపథ్యాన పరిస్థితి విషమించి సోమవారం మృతి చెందాడు. ఆయనకు భార్య పద్మ, కుమారులు ఉన్నారు. అదుపుతప్పి లారీ బోల్తా బోనకల్: మండలంలోని రాపల్లి స్టేజీ వద్ద సోమవారం అదుపుతప్పిన లారీ బోల్తా పడింది. పాల్వంచ నుంచి గ్రీన్ఫీల్డ్ హైవే కోసం ఫ్లై యాష్ తీసుకొస్తున్న లారీ బోల్తా పడగా, డ్రైవర్ క్యాబిన్ లోపలే చిక్కుకుపోయాడు. దీంతో స్థానికులు అద్దాలను పగులకొట్టి స్వల్పగాయాలైన డ్రైవర్ను బయటకు తీశారు. -
ఎన్సీసీలో గురుకుల విద్యార్థినుల ప్రతిభ
కొణిజర్ల: కొణిజర్ల మండలం తనికెళ్లలోని గిరిజన సంక్షేమ మహిళా గురుకుల డిగ్రీ కళాశాల విద్యార్థినులు ఎన్సీసీ సర్టిఫికెట్ పరీక్షలో ప్రఽతిభ కనబరిచారు. ఇటీవల జరిగిన ఎన్సీసీ ‘బీ’ సర్టిఫికెట్ పరీక్షలకు కళాశాల నుంచి 38 మంది బాలికలు హాజరు కాగా అందరూ ఉత్తీర్ణత సాఽధించారు. వీరిలో 20 మంది ‘ఏ’ గ్రేడ్ సాధించగా, 18 మంది ‘బీ’ గ్రేడ్ సాధించారు. విద్యార్థినులను కళాశాల ప్రిన్సిపాల్ కె.రజని, వైస్ ప్రిన్సిపాల్ బి.రాజేశ్వరి, ఎన్సీసీ కేర్ టేకర్ కె.హేమభార్గవి అభినందించారు. ఫర్టిలైజర్ షాపుల్లో డీఏఓ తనిఖీ వైరా: వైరా మున్సిపాలిటీతో పాటు మండలంలోని పలు విత్తన దుకాణాల్లో టాస్క్ఫోర్స్ బృందంతో కలిసి జిల్లా వ్యవసాయ శాఖాధికారి డి.పుల్లయ్య సోమవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విత్తనాల నిల్వలను పరిశీలించడంతో ప్రతీ అమ్మకంపై పూర్తి వివరాలతో రశీదు ఇవ్వాలని నిర్వాహకులకు సూచించారు. అంతేకాక ప్రత్యామ్నాయ పంటల సాగు, నానో యూరి యా వినియోగంపై రైతులకు అవగాహన కల్పించాలని తెలిపారు. కాగా, రైతులు ఆధీకృత డీలర్ల వద్దే విత్తనాలు కొనుగోలు చేసి పంట కాలం పూర్తయ్యే వరకు రశీదు భద్రపర్చుకోవాలని సూచించారు. వర్షాభావ పరిస్థితులు ఎదురైనా ఇబ్బంది రాకుండా కంది, పెసర, మినుము సాగు చేయాలని తెలిపారు. టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ పవన్కుమార్, ఏఓ మయాన్ మంజుఖాన్, ఏఈఓ రాజేష్ పాల్గొన్నారు. 2.94 క్వింటాళ్ల గంజాయి దహనం తల్లాడ: జిల్లాలోని వివిధ ఎకై ్సజ్ స్టేషన్ల పరిధిలో స్వాధీనం చేసుకున్న 2.94 క్వింటాళ్ల గంజాయిని సోమవారం తల్లాడ మండలం గోపాలపేటలోని వ్యర్థాల నివారణ ఫ్యాక్టరీలో దహనం చేశారు. రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ నిబంధనల మేరకు గంజాయిని దహనం చేశామని అధికారులు వెల్లడించారు. జిల్లా ఎకై ్సజ్ ప్రొహిబిషన్ అధికారి జి.నాగేందర్రెడ్డి, సూపరింటెండెంట్ వేణుగోపాల్, ఇన్స్పెక్టర్ మమతారెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. -
పనుల్లో నాణ్యతే కీలకం
రఘునాథపాలెం: అభివృద్ధి పనులను వేగంగా పూర్తిచేయడం ఎంత ముఖ్యమో, భావితరాలకు ఉపయోగపడేలా నాణ్యత పాటించడం కూడా అంతే కీలకమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రఘునాథపాలెం మండలంలోని వీ.వీ.పాలెంలో రూ.97 లక్షల ‘సుడా’ నిధులతో నిర్మించే సీసీ రోడ్లు, డ్రెయినేజీ పనులకు అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజతో కలిసి సోమవారం ఆయన శంకుస్థాపన చేశారు. అలాగే, రూ.30 లక్షలతో నిర్మించిన పశు వైద్యశాల భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ వీ.వీ.పాలెం గ్రామంతో తనకు సుదీర్ఘ అనుబంధం ఉందని, 1982లో దివంగత ఎన్టీఆర్తో కలిసి ఇక్కడకు వచ్చానని గుర్తు చేశారు. అప్పట్లోనే ఎత్తిపోతల పనులు చేపట్టామని తెలిపారు. కాగా, గ్రామస్తులు ఇంటి పరిసరాల్లో మాదిరి గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకుంటే వ్యాధులు దరి చేరవని చెప్పారు. అదనపు కలెక్టర్ శ్రీజ మాట్లాడుతూ మండల స్థాయికి కేటాయించే పశు వైద్యశాలను వీ.వీ.పాలెంలో నిర్మించడంతో ఈ ప్రాంత ప్రాధాన్యతను తెలియజేస్తోందన్నారు. రాష్ట్ర గిడ్డంగుల సంస్థ, సుడా, జిల్లాగ్రంథాలయ సంస్థ, ఖమ్మం మార్కెట్ చైర్మన్లు రాయల నాగేశ్వరరావు, పువ్వాళ్ల దుర్గాప్రసాద్, ఖాదర్ బాబా, యరగర్ల హన్మంతరావు, పంచాయతీరాజ్ ఎస్ఈ వెంకట్రెడ్డి, పశుసంవర్థక శాఖ అధికారి బి.పురంధర్, జిల్లా వ్యవసాయ, ఉద్యాన శాఖల అధికారులు డి.పుల్లయ్య, మధుసూదన్, తహసీల్దార్ శ్వేత, సర్పంచ్ కాపా ఆదినారాయణ, ఉప సర్పంచ్ గుగులోతు ప్రవీణ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు -
సీడ్స్ కార్పొరేషన్ మేనేజర్గా రఘు
ఖమ్మంవ్యవసాయం: ఉమ్మడి ఖమ్మం జిల్లా విత్తనాభివృద్ధి సంస్థ మేనేజర్గా బయ్య రఘు నియమితులయ్యారు. ఈమేరకు ఆయన బాధ్యతలు స్వీకరించారు. నిజామాబాద్ జిల్లా మేనేజర్గా పనిచేస్తున్న రఘును ఉమ్మడి జిల్లాకు బదిలీ చేయగా, ఈ స్థానంలో ఉన్న బిక్షం కరీంనగర్ మేనేజర్గా బదిలీ అయ్యారు. డీఎంఓగా సంతోష్కుమార్ ఖమ్మంవ్యవసాయం: జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి(డీఎంఓ)గా రత్నం సంతోష్కుమార్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన బదిలీల్లో ఆయనను ఖమ్మం వ్యవసాయ మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శిగా నియమించడమే కాక డీఎంఓగా అదనపు బాధ్యతలు అప్పగించింది. దీంతో ఇన్చార్జి డీఎంఓగా కొనసాగుతున్న ఎంఏ.అలీం ఆయన అసలు స్థానమైన భద్రాద్రి కొత్తగూడెంకు వెళ్లగా ఆ స్థానంలో సంతోష్ బాధ్యతలు చేపట్టారు. కాగా, ప్రస్తుతం ఖమ్మం మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శిగా ఆన్డ్యూటీపై విధులు నిర్వర్తిస్తున్న పి.ప్రవీణ్కుమార్ మిర్చి మార్కెట్ పనుల దృష్ట్యా మరో ఆరు నెలలు కొనసాగేలా ఉత్తర్వులు అందాయి. వైద్య, ఆరోగ్య శాఖలో 76మంది బదిలీ ఖమ్మం వైద్యవిభాగం: జిల్లా వైద్య, ఆరోగ్య శాఖలో 76 మంది ఉద్యోగుల బదిలీ జరిగింది. కేడర్ ఆధారంగా కొందరిని ఇతర జిల్లాలకు, మరికొందరిని జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రులకు కేటాయించారు. అడిషనల్ డీఎంహెచ్ఓ కేడర్ మొదలు ప్రోగ్రామ్ ఆఫీసర్లు, హెల్త్ ఎడ్యుకేటర్లు, సీనియర్, జూనియర్ అసిస్టెంట్లు, హెల్త్ ఎడ్యుకేటర్లు, ఏఎన్ఎమ్లు కలిపి 76 మందికి స్థానచలనం కలిగింది. అలాగే, ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఐదుగురు అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ఒక ల్యాబ్ టెక్నీషియన్ను బదిలీ చేయగా, వైద్య విధాన పరిషత్ ఆస్పత్రుల్లోని ఆరుగురు వైద్యులకు ఇతర జిల్లాల్లో పోస్టింగ్ ఇచ్చారు. ఇక ఇతర కేడర్లలో 10 మందిని జిల్లా ఆస్పత్రులకు బదిలీ చేశారు. ఐఈఎల్టీఎస్ పరీక్షకు దరఖాస్తుల ఆహ్వానం ఖమ్మంమయూరిసెంటర్: విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించాలనుకునే మైనార్టీ అభ్యర్థులకు ఐఈఎల్టీఎస్ పరీక్ష నిర్వహించనున్నట్లు జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ అధికారి మహమ్మద్ ముజాహిద్ తెలిపారు. జనరల్, ప్రొఫెషనల్ డిగ్రీ చేసిన అభ్యర్థులు హైదరాబాద్లోని స్టడీ సర్కిల్లో ఈనెల 15లోగా దరఖాస్తులు అందజేయాలని సూచించారు. -
డివైడర్ను ఢీకొని బోల్తాపడిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు
సాక్షి,ఖమ్మం: పెనుబల్లి మండలం కొత్తలంకపల్లి రైల్వే బ్రిడ్జిపై ప్రమాదం చోటు చేసుకుంది. ఆదివారం అర్ధరాత్రి ఓ ప్రైవేట్ ట్రావెల్స్కు చెందిన బస్సు మితిమీరిన వేగంతో బ్రిడ్జిని ఢీకొట్టి బోల్తా పడింది. ప్రమాద సమయంలో బస్సులో ఉన్న 36మంది ప్రయాణికుల్లో 26మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. ప్రమాదంతో అప్రమత్తమైన తోటి వాహనదారులు, సమాచారం అందుకున్న పోలీసులు, స్థానికులు క్షతగాత్రుల్ని అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. రాజమండ్రి నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఘటన చోటు చేసుకోగా.. ప్రమాదానికి గురైన బస్సు కేవీఆర్ ట్రావెల్స్ బస్సుగా పోలీసులు గుర్తించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
డ్యాన్స్.. అదుర్స్ !
సత్తుపల్లిటౌన్: అదిరేటి స్టెప్పులతో అదుర్స్ అన్పిస్తున్నారు చిన్నారులు. శరీరాన్ని మెలికలు తిప్పుతూ ఆకట్టుకుంటున్నారు. వేసవి సెలవుల్లో సత్తుపల్లిలోని కళాభారతిలో నృత్య శిక్షణ శిబిరం కొనసాగుతుండగా, ఉత్సాహంగా సాధన చేస్తూ చిన్నారులు ప్రతిభ మెరుగుపర్చుకుంటున్నారు. ఉల్లాసంగా, ఉత్సాహంగా.. కళాభారతిలో శిక్షణకు సుమారు వంద మంది చిన్నారులు హాజరవుతున్నారు. ఇద్దరు డ్యాన్స్ మాస్టర్ల పర్యవేక్షణలో శిక్షణ కొనసాగుతుండగా, సినిమా పాటలకే కాక జానపద గేయాలకు సైతం లయబద్ధంగా అడుగులేస్తూ పిల్లలు ఔరా అనిపిస్తున్నారు. డ్యాన్స్ మాస్టర్లు తమ్మిశెట్టి గణేశ్బాబు, జి.మంజూష ప్రత్యేక శ్రద్ధతో మెళకువలు నేర్పిస్తుండగా, ఇప్పటికే నెల దాటడంతో పిల్లలు డ్యాన్స్లో ప్రావీణ్యం సాధించారు. పిల్లలు సెల్ఫోన్లు, టీవీలు, కంప్యూటర్లకు అతుక్కుపోకుండా నృత్యంలో శిక్షణ ఇప్పించాలని తల్లిదండ్రులు క్రమం తప్పకుండా పంపిస్తూ ప్రోత్సహిహిస్తున్నారు. నృత్యం సృజనాత్మక శక్తిని పెంచడమే కాక శారీకక ఆరోగ్యం, ఏకాగ్రతను పెంచుతుందని మాస్టర్లు చెబుతున్నారు.ఈ సంవత్సరం నుంచే డ్యాన్స్ క్లాస్లకు వస్తున్నా. చాలా ఇష్టంగా ఈ వేసవి సెలవులను డ్యాన్స్ నేర్చుకునేందుకు సద్వినియోగం చేసుకుంటున్నా. అందరం పోటీ పడి నృత్యం నేర్చుకుంటున్నాం. –జె.అధర్వరిషి. 3వ తరగతి, సత్తుపల్లి మూడేళ్ల నుంచి ఈ కళాభారతిలో డ్యాన్స్ నేర్చుకుంటున్నా. డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. జానపదం, సినిమా పాటలకు నృత్యాన్ని మాస్టర్ నేర్పిస్తున్నారు. ఈ సెలవుల్లో మరింత తర్ఫీదు పొందాను. –దోమ హెబ్సిబా, 4వ తరగతి, సత్తుపల్లి కళాభారతిలో టీచర్ మంచిగా నేర్పుతున్నారు. సినిమా పాటలే కాక జానపద నృత్యాలకు కూడా నేర్పిస్తున్నారు. నాకు జానపద నృత్యాలు వచ్చాయి. పాఠశాలలో జరిగే కార్యక్రమాల్లో ప్రదర్శన ఇస్తా. –రామాల జెన్సీ, 4వ తరగతి, సత్తుపల్లి తల్లిదండ్రుల ప్రోత్సాహంతో చిన్నారులు డ్యాన్స్ నేర్చుకునేందుకు వస్తున్నారు. పిల్లలు ఉత్సాహంగా నేర్చుకోవడమే కాక ప్రావీణ్యం సాధించారు. చాలామంది అదిరేలా సెప్పులు వేస్తూ అదుర్స్ అనిపిస్తున్నారు. –తమ్మిశెట్టి గణేశ్బాబు, డ్యాన్స్మాస్టర్, సత్తుపల్లి -
జలపుష్పాల జాతర
ఖమ్మంవ్యవసాయం: మృగశిర కార్తె సోమవారం మొదలుకానుంది. రోహిణి కార్తె తర్వాత వచ్చే ఈ కార్తెలో వర్షాలు ప్రారంభమవుతాయి. ఈ కార్తె మొదటి రోజున పలు వర్గాల వారు చేపలు తినడం ఆనవాయితీగా వస్తోంది. ఈరోజు చేపలు తింటే ఆరోగ్యానికి మంచిదని పెద్దలు చెబుతారు. అలాగే, ఇదేరోజు ఉబ్బసం, ఆయాసంతో బాధపడే వారికి హైదరాబాద్లో బత్తిని సోదరులు చేపమందు ఇస్తుంటారు. వేసవిలో ఉష్ణోగ్రతతో శరీరంలో వేడి పెరుగుతుందని.. అది చేపలు తినటం ద్వారా దూరమవుతుందని నమ్ముతారు. తద్వారా ఏటా మృగశిర ఆరంభం రోజున చేపల అమ్మకాలు జోరుగా సాగుతాయి. అయితే, మృగశిర కార్తె సోమవారం మొదలుకానుండగా, జిల్లా అంతటా ఆదివారమే చేపల అమ్మకాలు జోరందుకున్నాయి. ఆంధ్రా నుంచి దిగుమతి మృగశిర కార్తెను పురస్కరించుకుని జిల్లాలో సోమవారం ఒకేరోజు దాదాపు 150 టన్నుల నుంచి 200 టన్నుల వరకు చేపలు అమ్ముడవుతాయని అంచనా. ఈ మేరకు మత్స్యకారులు జిల్లా చెరువుల్లో వేట మొదలుపెట్టారు. అంతేకాక సరిహద్దు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా, గోదావరి జిల్లాల నుంచి పెద్ద ఎత్తున చేపలు దిగుమతి చేసుకున్నారు. ఏలూరు, కై కలూరు, బాపట్ల, విజయవాడ, రాజమండ్రితో పాటు పలు ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకున్న చేపలను ఆక్సిజన్ సిలిండర్ల ఆధారంగా నిల్వ చేశారు. రకాల ఆధారంగా డిమాండ్ జిల్లాలో ఆదివారమే చేపల అమ్మకాలు జోరుగా మొదలయ్యాయి. సహజంగా మృగశిర కార్తె రోజున చేపలకు డిమాండ్ ఉండడంతో రకాల ఆధారంగా ధరలు నిర్ణయించారు. సహజంగా మన ప్రాంతంలో అధిక ధర ఉండే కొర్రమేను చేప ధర మరింత పెరిగింది. సాధారణ రోజుల్లో ఈ చేపలు కిలో రూ.350 ఉంటుంది. కానీ అది ఇప్పుడు రూ.500 వరకు చేరింది. ఇక బొచ్చలు, రవ్వలు, గ్యాస్కట్లు, బంగారు తీగలు వంటి తెల్లచేపల ధర మామూలుగా కిలో రూ.180 నుంచి రూ.200 వరకు ఉండగా.. ఇప్పుడు రూ.220, అంతకు మించి ధరతో విక్రయిస్తున్నారు. అలాగే, రూ.350 కేజీ లభించే పచ్చి రొయ్యల ధర రూ.450 వరకు పెంచారు.నేడు మృగశిర కార్తె -
గ్యాస్ ధర పెంపుతో సామాన్యులపై భారం
ఖమ్మంమయూరిసెంటర్: కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్ సిలిండర్ల ధరను రూ.29 పెంచడంతో సామాన్యులపై మోయలేని భారం పడిందని ప్రగతిశీల మహిళా సంఘం (పీఓడబ్ల్యూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్ శిరోమణి పేర్కొన్నారు. ఖమ్మంలోని రామనరసయ్య విజ్ఞాన కేంద్రంలో పీఓడబ్ల్యూ జిల్లా అధ్యక్షురాలు గోకినపల్లి లలిత అధ్యక్షతన ఆదివారం జరిగిన జిల్లా కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగియగానే కేంద్ర ప్రభుత్వం అన్ని ధరలను ఎడాపెడా పెంచుతూ ప్రజలపై భారం మోపుతోందని విమర్శించారు. ఓ వైపు ధరలు పెంచుతూ, మరోవైపు ప్రజలు పొదుపు పాటించాలని సూచించడం కేంద్రం ద్వంద్వ వైఖరి, నీతికి నిదర్శనమన్నారు. కార్పొరేట్ శక్తులకు వరాల జల్లులు కురిపిస్తున్న కేంద్ర ప్రభుత్వం.. సామాన్యులపై మాత్రం పన్నుల భారం మోపుతోందని తెలిపారు. ఈ మేరకు ప్రజావ్యతిరేక విధానాలపై ప్రజలంతా ఏకమై పోరాడాలని పిలుపునిచ్చారు. సమావేశంలో పీఓడబ్ల్యూ జిల్లా సహాయ కార్యదర్శి ప్రతాపనేని శోభ, నాయకులు టి.ఝాన్సీ, గోకినపల్లి సరోజిని, బందెల లలిత, స్వాతి, ప్రమీల, అనసూర్య తదితరులు పాల్గొన్నారు. గోదాం నిర్మాణాన్ని అడ్డుకున్న ఆదివాసీలు ● విగ్రహాలు ధ్వంసమవుతున్నాయని ఆందోళన కారేపల్లి: మండలంలోని గంగాదేవి గుట్టపై గోదాం నిర్మాణ పనులను గుట్టకింద గుంపు గ్రామస్తులు ఆదివారం అడ్డుకున్నారు. ఇక్కడ గోదాం నిర్మాణానికి ఇటీవల రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే రాందాస్నాయక్ శంకుస్థాపన చేశారు. అయితే, గోదాం నిర్మాణం పేరుతో ఆధ్యాత్మిక చరిత్ర కలిగిన గంగాదేవి గుట్టను ధ్వంసం చేయడం సరికాదని ఆదివాసీలు చెబుతున్నారు. తమ ఆరాధ్య దైవమైన గంగాదేవి గుట్ట, కాళికాదేవి, సమ్మక్క విగ్రహాలను విధ్వంసం చేస్తున్నారని మండిపడ్డారు. అంతేకాక గుట్ట మట్టిని తరలించి కాంట్రాక్టర్ సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకుడు ఇమ్మడి తిరుపతిరావు మాట్లాడుతూ.. గోదాం నిర్మాణం పేరుతో గుట్టను గుల్ల చేస్తున్నారని, తద్వారా ఆరాధ్య దైవాల విగ్రహాలు విధ్వంసమవుతున్నాయని తెలిపారు. ఇకనైనా గోదాం నిర్మాణ పనులను నిలిపివేయాలని కోరారు. కాగా, ఆదివాసీల ఆందోళన విషయం తెలిసి ఎస్ఐ గోపి, సిబ్బందితో చేరుకుని సర్దిచెప్పే ప్రయత్నం చేసినా వారు ససేమిరా అనడంతో వెనుదిరిగారు. -
అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం
ముదిగొండ: ముదిగొండ మండలంలోని పలు గ్రామాల్లో అభివృద్ధి పనులకు ఆదివారం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క శంకుస్థాపన చేశారు. అంతేకాక పూర్తయిన పనులను ప్రారంభించారు. మండలంలోని యడలవల్లి లక్ష్మీపురంలో గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభించగా, యడవల్లిలో సబ్స్టేషన్, యడవల్లి నుంచి ఖమ్మం రూరల్ మండలం తల్లపాడు, యడవల్లి నుంచి తెల్దారుపల్లి వరకు రోడ్డు, ముదిగొండ పారిశ్రామిక ప్రాంతంలో ఈఆర్ఓ కార్యాలయానికి శంకుస్థాపన చేశాక 50పడకల ఆస్పత్రి భవన నిర్మాణాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ పేదలకు పథకాలు మంజూరు చేస్తూనే, సౌకర్యాల కల్పనపై దృష్టి సారించామన్నారు. గ్రామీణ లింక్ రహదారుల అభివృద్ధి, సబ్స్టేషన్ల ఏర్పాటుకు ప్రణాళిక రూపొందించామని తెలిపారు. ఈకార్యక్రమాల్లో కలెక్టర్ దివాకర టీ.ఎస్., అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర గిడ్డంగులు, హస్తకళలు, సుడా చైర్మన్లు రాయల నాగేశ్వరరావు, నాయుడు సత్యనారాయణ, పి.దుర్గాప్రసాద్, సర్పంచ్లు కందుల బాలచందర్, యరకల భారతమ్మ, పందిరి అంజయ్య, ముదిగొండ, మేడేపల్లి సొసైటీల చైర్మన్లు తుపాకుల యలగొండస్వామి, సామినేని వెంకటేశ్వరరావు, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బుచ్చిరామయ్యతో పాటు వనం బాబు, మందరపు నాగేశ్వరరావు, దేవేంద్రం, ఇసుకల రమేష్, మట్టా బాబురాంరెడ్డి, తలారి పిచ్చయ్య, దొంతగాని నాగరాజు, అన్వేష్, పాల్గొన్నారు. -
భానుడు తగ్గేదేలే..
ఖమ్మంవ్యవసాయం: ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో అప్పుడప్పుడూ వర్షం కురుస్తున్నా భానుడు మాత్రం తన ప్రతాపాన్ని ఏమాత్రం తగ్గించడం లేదు. రోహిణి కార్తె ముగిసి సోమవారం మృగశిర కార్తె మొదలు కానుండడంతో వర్షాలు కురుస్తాయని అన్నదాతలు ఎదురుచూస్తున్నారు. కానీ జూన్ మొదటి వారం పూర్తి కావొస్తున్నా మే నెల మాదిరిగానే ఎండల తీవ్రత కొనసాగుతుండడం గమనార్హం. జిల్లాలో ఆదివారం 40.6 నుంచి 42.8 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా ఖమ్మం ఖానాపురం, మధిర మండలం సిరిపురంలో 42.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇక మధిర, చింతకాని, కొణిజర్ల, ప్రకాష్నగర్లో 42.7, కల్లూరు, పమ్మిలో 42.5, కాకరవాయిలో 42.4, నేలకొండపల్లి, బచ్చోడు, నాగులవంచ, కుర్నవల్లిలో 42.3, సత్తుపల్లి ఓసీ, మధిర ఏఆర్ఎస్, బాణాపురం, తిమ్మారావుపేటలో 42.2, ఎర్రుపాలెం, సత్తుపల్లి, గుబ్బగుర్తి, గంగారం, లింగాల, పల్లెగూడెం, పెనుబల్లి, గేటు కారేపల్లిలో 42.1, గౌరారంలో 42, ఏన్కూరు, ఖమ్మం ఎన్నెస్పీ, తిరుమలాయపాలెంలో 41.9, రఘునాథపాలెంలో 41.8, పంగిడి, పెద్దగోపతి, ముదిగొండలో 41.7, వైరా ఏఆర్ఎస్లో 41.6, రావినూతల, మంచుకొండలో 41.5, వైరా, తల్లాడ, కూసుమంచిలో 41.4, వేంసూరులో 41, సదాశివునిపాలెంలో 40.7, ఖమ్మం కలెక్టరేట్ వద్ద 40.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.జిల్లాలో 40.6 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత -
డిమాండ్ పెరిగినా కోతలు లేవు..
ఖమ్మం అర్బన్: నానాటికీ పెరుగుతున్న విద్యుత్ అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతులను విస్తరిస్తూ విద్యుత్ రంగాన్ని బలోపేతం చేస్తున్నామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. డిమాండ్ గణనీయంగా పెరిగినా వ్యవసాయం, పరిశ్రమలు, గృహావసరాలకు కోతలు లేకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నామని తెలిపారు. ఖమ్మం పాకబండ వద్ద నిర్మించిన 33/11 కేవీ విద్యుత్ సబ్స్టేషన్ను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి ఆయన ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ 2023లో నమోదైన 15 వేల మెగావాట్ల గరిష్ట డిమాండ్ ప్రస్తుతం 18,548 మెగావాట్లకు చేరిందని తెలిపారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులతో విద్యుత్ అవసరాలు మరింత పెరుగుతాయన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని 2030 నాటికి 20వేల మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా తమ ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. ఇందులో భాగంగానే రాష్ట్రంలోని 85 గ్రామాల్లో ప్రతీ ఇల్లు, వ్యవసాయ పంపుసెట్లకు సోలార్ ప్యానళ్లు అమరుస్తున్నామని తెలిపారు. కాగా, రైతులకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రత్యేక రైతు డిస్కం ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధం చేశామని వెల్లడించారు.రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఖమ్మంలో అవసరాల దృష్ట్యా ఉంచుకొని మరిన్ని సబ్స్టేషన్లు, ట్రాన్స్మిషన్ లైన్ల ద్వారా విద్యుత్ పంపిణీ వ్యవస్థలను బలోపేతం చేయాలని ఆదేశించారు. అంతేకాక ప్రభుత్వ ఖాళీ స్థలాల్లో సోలార్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుపై కార్యాచరణ రూపొందించాలని తెలిపారు. కలెక్టర్ దివాకర టీఎస్ మాట్లాడుతూ ఖమ్మంలో రానున్న 30 ఏళ్ల అవసరాలను పరిగణనలోకి తీసుకుని విద్యుత్ మౌలిక వసతులు అభివృద్ధి చేస్తుండగా, మరో ఐదు సబ్స్టేషన్లకు భూకేటాయింపు వారంలో పూర్తి చేస్తామన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి, కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్య, రాష్ట్ర గిడ్డంగులు, సుడా, జిల్లా గ్రంథాలయ సంస్థల చైర్మన్లు రాయల నాగేశ్వరరావు, పువ్వాళ్ల దుర్గాప్రసాద్, మహమ్మద్ ఖాదర్ బాబా, ఎస్ఈ శ్రీనివాసచారి, మాజీ మేయర్ పి.నీరజ తదితరులు పాల్గొన్నారు. -
ఆర్టీసీపై అ‘ధనం’!
● డీజిల్ ధర పెరుగుదలతో భారం ● రీజియన్పై భారం రోజుకు రూ.4.25 లక్షలు.. ● పొదుపు చర్యల వేళ ధరలతో సతమతం ఖమ్మంమయూరిసెంటర్: సంక్షోభాల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్న ప్రభుత్వ రవాణా సంస్థ టీజీఎస్ ఆర్టీసీపై డీజిల్ ధరల పెంపు పిడుగులా పడింది. ఇప్పటికే రకరకాల భారాలతో సతమతమవుతున్న సంస్థకు ఇటీవల రోజుల వ్యవధిలోనే డీజిల్ ధర లీటర్కు సుమారు రూ.9 మేర పెరగడం కోలుకోలేని దెబ్బతీసింది. ఖమ్మం రీజియన్లో ప్రాంతాల వారీగా రూ.96 నుండి రూ.97 వరకు ఉన్న లీటర్ డీజిల్ ధర ఇప్పుడు రూ.103.41 నుంచి రూ.105.08 వరకు చేరింది. ఫలితంగా ఆర్టీసీ చక్రాలు తిరగడం భారంగా మారింది. కి.మీ.కు రూ.1.51 అదనం ఖమ్మం రీజియన్లోని ఏడు డిపోల పరిధిలో ఆర్టీసీ సొంత బస్సులతో పాటు అద్దె బస్సులు కలిపి ప్రతిరోజూ లక్షలాది మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తున్నాయి. రీజియన్ పరిధిలో ఆర్టీసీ, అద్దె బస్సులు కలిపి రోజుకు సగటున 2.82 లక్షల కి.మీ. మేర తిరుగుతున్నాయి. ధరల పెంపుతో కిలోమీటర్పై రూ.1.51 అదనపు భారం పడగా.. సంస్థ రోజువారీ ఖర్చులు అమాంతం పెరిగిపోయాయి. నెలకు రూ.1.27 కోట్లు డీజిల్ ధర పెరుగుదలతో ఆర్టీసీ ఖమ్మం రీజియన్పై రోజుకు అదనంగా రూ.4,25,820 వెచ్చించాల్సి వస్తోంది. ఇది నెలకు రూ.1,27,74,600 గా నమోదవుతుందని అంచనా. ఉమ్మడి జిల్లాలోని డిపోల ఆదాయం అంతంతమాత్రంగానే సాగుతుంటే, మరోవైపు డీజిల్ భారం పడడంపై అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోజుల వ్యవధిలోనే లీటర్పై రూ.9 పెరగడం సంస్థకు కోలుకోలేని దెబ్బగా భావిస్తున్నారు. ప్రతీ రూపాయిని పొదుపు చేస్తూ రూట్లను లాభాల్లోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్న సమయాన ఇంధన ధరల పెంపు తమ అంచనాలను తలకిందులు చేస్తోందని అధికారులు చెబుతున్నారు.ఆర్టీసీ, అద్దె బస్సులు తిరిగే దూరం 2.82 లక్షల కి.మీ. ప్రతీ కిలోమీటర్పై అదనపు భారం రూ.1.51 రోజుకు.. రూ.4,25,820 నెలకు.. రూ.1,27,74,600 -
బట్ట సంచి... ప్లాస్టిక్ కవర్ !
కరకగూడెం: ఒక గ్రామంలోని కిరాణా దుకాణంలో బట్ట సంచి, ప్లాస్టిక్ కవర్ పక్కపక్కనే ఉండేవి. ప్లాస్టిక్ కవర్ తన మెరుపును చూసుకుని గర్వపడేది. ‘నన్ను చూడు... తేలికగా ఉంటాను. అందరూ నన్నే తీసుకెళ్తారు. నువ్వు మాత్రం పాతకాలం వస్తువులా కనిపిస్తున్నావు’అని బట్ట సంచిని ఎగతాళి చేసేది. అందుకు బదులుగా బట్ట సంచి ‘సరైన సమయంలో వస్తువుల విలువ తెలుస్తుంది’అనేది. కాలక్రమంలో అవసరం తీరాక ప్లాస్టిక్ కవర్లను రోడ్ల వెంట, డ్రెయినేజీల్లో వేస్తుండడంతో కుప్పలు పేరుకుపోయాయి. ఓ రోజు భారీ వర్షం కురిసింది. గ్రామంలోని డ్రెయినేజీలు ప్లాస్టిక్ కవర్లతో నిండడంతో వర్షపు నీరు రోడ్లపైకి చేరింది. దీంతో గ్రామస్తులు ఇబ్బంది పడగా గ్రామ పెద్దలు సమావేశమై ‘ఈ ఇబ్బందికి కారణమైన ప్లాస్టిక్ కవర్ల వాడకాన్ని తగ్గించాలి’అని నిర్ణయించారు. మరుసటి రోజు నుంచి గ్రామంలో ప్రతిఒక్కరూ బట్ట సంచి ఉపయోగించడం ప్రారంభించారు. కాలక్రమంలో గ్రామం పరిశుభ్రంగా మారింది. కాల్వలు శుభ్రంగా ఉండడంతో వర్షపు నీరు సాఫీగా వెళ్లేది. అప్పుడు ప్లాస్టిక్ కవర్ ఒకసారి మాత్రమే ఉపయోగపడతాను. తర్వాత ప్రకృతికి భారంగా మారతాను.. కానీ నువ్వు ఎన్నోసార్లు ఉపయోగపడుతూ ప్రకృతిని కాపాడుతున్నావు. నిజంగా నువ్వే గొప్పదానివి’అని బట్ట సంచితో చెప్పింది. అందుకు బట్ట సంచి నవ్వుతూ ‘గొప్పతనం బయట కనిపించే అందంలో కాదు. ఇతరులు, ప్రకృతికి ఉపయోగపడడంలో ఉంటుంది’అని చెప్పింది. ఆ మాటలు విన్న కవర్ తన తప్పు తెలుసుకుంది.నీతి: తాత్కాలిక సౌకర్యం కంటే ప్రకృతిని కాపాడే అలవాట్లే గొప్పవి. చిన్నచిన్న మార్పులే పర్యావరణాన్ని రక్షిస్తాయి. -
‘నెట్బాల్’ విజేత హార్విగో హాస్టలర్స్
ఖమ్మంస్పోర్ట్స్: రెండురోజులుగా ఖమ్మంలోని హార్వెస్ట్ పబ్లిక్ స్కూల్లో నిర్వహిస్తున్న నెట్బాల్ ప్రీమియర్ లీగ్ పోటీలు ఆదివారం ముగిశాయి. టోర్నీలో విజేతగా హార్విగో హాస్టలర్స్ నిలవగా, హార్వెస్ట్ చాలెంజర్స్, ఎవర్ గ్రీన్స్ ప్రాజెక్టు జట్లు రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. ఈ సందర్భంగా ఆయా జట్లకు హార్వెస్ట్ విద్యాసంస్థల కరస్పాండెంట్ పి.రవిమారుత్, ప్రిన్సిపాల్, నెట్బాల్ అసోసియేషన్ జిల్లా చైర్మన్ ఆర్.పార్వతీరెడ్డి ట్రోఫీలు అందజేసి మాట్లాడారు. క్రీడలు విద్యార్థుల జీవితంలో ముఖ్య పాత్ర వహించడమే కాక క్రమశిక్షణ, నాయకత్వ లక్ష ణాలు, ఆత్మ విశ్వాసాన్ని పెంచుతాయని తెలిపారు. కార్యక్రమంలో ప్రాంచైజీల బాధ్యులు డాక్టర్ రవికుమార్, దీప్తి, చల్లపల్లి ఆదిత్య, డాక్టర్ రాజ్కుమార్, డాక్టర్ అమర్నాథ్, డాక్టర్ బాలభాస్కర్, సత్యనారాయణ, నర్సింహారావు, నెట్బాల్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి ఫణికుమార్, పీవీ రమణ తదితరులు పాల్గొన్నారు. -
ఎల్నినో.. ఏం చేద్దాం?!
–జిల్లా వ్యవసాయ అధికారి పుల్లయ్యగత ఏడాది పుష్కలం గత ఏడాది అన్నీ కలిపి 6.08 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతాయని అంచనా వేస్తే రైతులు 6.17 లక్షల ఎకరాల్లో సాగు చేశారు. జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో సాధారణానికి మించి వర్షాలు కురిశాయి. 2025 జూన్ నుంచి ఈ ఏడాది మే చివరి వరకు జిల్లాలో సగటున 10.42 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా.. ఏడు మండలాలు మినహా 14మండలాల్లో సాధారణానికి మించి వర్షపాతం నమోదైనట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. గత ఏడాది మే చివరి వారం నుంచే వర్షాలు ప్రారంభమైతే, ప్రస్తుత పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. ఈనెల 1నుంచి 6వ తేదీ వరకు జిల్లాలో సగటున 2.5 సెం.మీ. వర్షపాతమే నమోదైంది. ఆగమనమే ఆలస్యం ఇప్పటికే జిల్లాలోకి నైరుతి రుతుపవనాలు రావాల్సి ఉండగా, రాష్ట్రంలోకి రావడానికే మరో మూడు నుంచి నాలుగు రోజులు పడుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. జూన్ మొదటి వారం దాటుతున్నా సరైన వర్షం పడలేదు. గత ఏడాది జూన్లో జిల్లాలో సగటున 12.3 సెం.మీ., జూలైలో 28.1 సెం.మీ., ఆగస్టులో 38.9 సెం.మీ., సెప్టెంబర్లో 24.0, అక్టోబర్లో 19.4 సెం.మీ. వర్షపాతం నమోదైంది. కానీ ఈ వేసవిలో ఉష్ణోగ్రత రికార్డు స్థాయిలో నమోదు కావడంతో భూమిలో తేమ శాతం తగ్గి, ఇప్పటికీ 40 డిగ్రీలకు తగ్గకుండా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అదునులో రాకపోతే.. నైరుతి రుతుపవనాల ఆగమనంతో వర్షాలు సమృద్ధిగా కురవాల్సి ఉన్నా ఎల్నినో ప్రభావంతో రుతుపవనాలు దిశ మార్చుకుంటాయనే ఆందోళన రైతాంగాన్ని వేధిస్తోంది. ఫసిఫిక్ మహాసముద్రంలో ఉపరితల నీరు అసాధారణంగా వేడెక్కడాన్ని శాస్త్రవేత్తలు ఎల్నినోగా పేర్కొంటున్నారు. దీనివల్ల గాలివీచే దిశలు మారి, రుతు పవనాలు దారితప్పుతాయని చెబుతున్నారు. తద్వారా ప్రస్తుతం రుతుపవనాలు వచ్చినా.. ఆగస్టు, సెప్టెంబర్ల్లో ఎల్నినో ప్రభావం పడుతుందని తెలుస్తోంది. పంటల సాగుకు సరైన సమయం అదే కావడంతో వరి తదితర పంటలు పొట్ట దశకు చేరుకునేటప్పుడు నీరు అవసరం ఉంటుంది. ఆ సమయంలో వర్షాలు కురవకపోతే పరిస్థితి ఏమిటనే ప్రశ్న రైతులను వేధిస్తోంది. అయితే ఒకటి, రెండు తుపాన్లు వస్తే ఎల్నినో పెద్దగా ప్రభావం చూపదనే ధైర్యంతో ఇంకొందరు ఉన్నారు.ఈ సమయానికే మెట్ట పంటలకు సంబంధించి దుక్కులు దున్నడం మొదలుకావాలి. కానీ సరైన వర్షాలు లేక రైతులు ముందుకు రావడం లేదు. వాతావరణ పరిస్థితులు, ఎల్నినో ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకుని వ్యవసాయ శాఖ ఈసారి ప్రత్యామ్నాయ పంటలే సాగు చేయాలని ప్రచారం చేస్తోంది. ఇటీవల వ్యవసాయ శాఖపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నిర్వహించిన సమీక్షలోనూ ఇదే సూచన చేశారు. ఈ ఏడాది తక్కువ వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ(ఇండియన్ మెటీరియాలజికల్ డిపార్ట్మెంట్) ప్రకటన నేపథ్యాన అధికారులు అలసంద, కంది, పెసర తదితర పంటలను సాగు చేయాలని సూచిస్తున్నారు. అయితే ప్రస్తుత పరిస్థితులను పరిశీలిస్తే ఈ పంటలైనా సాగవుతాయా అన్న అనుమానం రైతుల్లో వ్యక్తమవుతోంది.ఈ ఏడాది వానాకాలం పంటల సాగుపై ఎల్నినో ప్రభావం పడుతుందనే సూచనలతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ వేసవిలో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదు కావడం, నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించేందుకు మరింత సమయం పట్టడమే కాక ఎల్నినో ప్రభావం కారణంగా సాధారణ వర్షపాతమే నమోదవుతుందని అధికారిక వర్గాలు చెబుతున్నాయి. ఫలితంగా మెట్ట పంటల సాగు తగ్గే పరిస్థితి కనిపిస్తోంది. గత ఏడాది ఈ సమయానికే రుతుపవనాల ఆగమనంతో రైతులు దుక్కులు దున్ని ముమ్మరంగా పంటల సాగుకు కదిలారు. కానీ ఈసారి అధిక వేడితో భూమిలో తేమ తగ్గిపోగా ఇప్పుడిప్పుడే పొడి దుక్కులు ప్రారంభిస్తున్నారు. – సాక్షిప్రతినిధి, ఖమ్మంవానాకాలం సాగుపై రైతుల్లో సందిగ్ధత గత ఏడాది ఈ సమయానికి వర్షాలు పడడంతో దుక్కులు సిద్ధం చేసి పత్తి విత్తనాలు పెట్టాం. ఈ ఏడాది ఇప్పటికీ వర్షం పడలేదు. దుక్కులు ఇంకా సిద్ధం కాలేదు. గత ఏడాది కౌలుకు తీసుకుని నాలుగు ఎకరాల్లో పత్తి, ఎకరంలో మిర్చి పంట సాగు చేశా. ఈ ఏడాది కూడా పత్తి, మిర్చి సాగు చేసేందుకు విత్తనాలు సిద్ధం చేశాను. వర్షాలు వస్తే దుక్కులు దున్నుతాం. – తురక రాంబాబు, ఎదుళ్లచెరువు, తిరుమలాయపాలెం మండలం -
జీవితం సాగలేక..
వేతనాలు అందక విలవిల ● జీపీల్లో మల్టీపర్పస్ వర్కర్ల జీతాలు రాక మూడు నెలలు ● మరోపక్క పనిభారంతో సతమతం ఎర్రుపాలెం: రెక్కాడితే కానీ డొక్కాడని పేదలైన పలువురికి గ్రామపంచాయతీల్లో మల్టీపర్పస్ వర్కర్లుగా అవకాశం దక్కగానే సంతోషించారు. ఎంతో కొంత వేతనమైనా ప్రతీనెలా వస్తుందని, తద్వారా కుటుంబ పోషణకు ఇక్కట్లు తీరుతాయని భావించారు. కానీ ప్రతీసారి నెలల తరబడి పెండింగ్ పెడుతుండడం.. కొన్నిసార్లు మూడు, నాలుగు నెలలకోసారి కూడా వేతనాలు అందక ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ఇచ్చేదే తక్కువ గ్రామపంచాయతీల్లో మల్టీ పర్పస్ వర్కర్లకు నిర్దిష్టమైన పని అంటూ ఉండదు. పంచాయతీ పరిధిలో అన్ని రకాల పనులు చేసేందుకు సిద్ధంగా ఉండాలి. ఈ పరిస్థితి నుంచి మినహాయింపు కావాలని వర్కర్లు కోరుతున్నా అది నెరవేరడం లేదు. ఇక నెలకు రూ.9,500 వేతనమే ఇస్తున్నా అది కూడా క్రమం తప్పక చెల్లించడం లేదు. ప్రసుత్తం మల్టీపర్పస్ వర్కర్లకు మూడు నెలల వేతనం పెండింగ్ ఉంది. మరోపక్క జూన్ కూడా రావడంతో ఈ నెల కలిపితే నాలుగు నెలల వేతనం చెల్లించాలి. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు నెలనెలా వేతనాలు ఇస్తున్నామని చెబుతున్నా ప్రభుత్వం కనీస జీతంతో కష్టంగా బతుకు వెళ్లదీస్తున్న తమను పట్టించుకోకపోవడం సరికాదని కార్మికులు వాపోతున్నారు. వేతనాల విషయం బయట తెలిసి కనీసం అప్పు కూడా పుట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మూడు నెలలుగా మల్టీపర్పస్ వర్కర్ల వేతనాలు పెండింగ్ ఉన్నమాట వాస్తవమే. కేంద్ర ప్రభుత్వ నిధుల నుంచి వర్కర్లకు వేతనాలు ఇవ్వాలని పంచాయతీ కార్యదర్శులకు సూచించాం. ఈ నెల 15వ తేదీలోగా చెల్లించేలా చర్యలు తీసుకుంటాం. –త్యాగరాజు కృష్ణ, ఎంపీఓ, ఎర్రుపాలెం -
10లోగా సవరణలు పరిష్కరించాలి
ఖమ్మం అర్బన్/రఘునాథపాలెం: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్ఐఆర్) మ్యాపింగ్లో భాగంగా సవరణలను ఇంటింటి పరిశీలన ద్వారా బీఎల్ఓలు ఈనెల 10వ తేదీలోగా పూర్తిచేయాలని కలెక్టర్ దివాకర టీ.ఎస్. ఆదేశించారు. రఘునాథపాలెం మండలం కోటపాడు, ఖమ్మం నగరంలోని పాండురంగాపురంలో ఎస్ఐఆర్ మ్యాపింగ్ను కలెక్టర్ ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూడాలని తెలిపారు. ప్రతీ పోలింగ్ స్టేషన్ పరిధిలో 2002 నాటి జాబితాలోని ఓటర్లు, వారి వారసులు, కుటుంబీకులను ప్రస్తుత ఓటరు జాబితాతో మ్యాపింగ్ చేస్తూ, ఎక్కడైనా తేడాలు వస్తే క్షేత్రస్థాయి పరిశీలన సవరించాలని సూచించారు. ఈ విషయమై ఓటర్లకు అవగాహన కల్పించాలని తెలిపారు. అంతేకాక ప్రక్రియను సూపర్వైజర్లు, అధికారులు పర్యవేక్షిస్తూ డబుల్ ఓట్లు, మరణించిన ఓటర్ల వివరాలను ధ్రవీకరించుకున్నాకే తొలగించాలని స్పష్టం చేశారు. అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి, కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్య, రఘునాథపాలెం, ఖమ్మం అర్బన్ తహసీల్దార్లు శ్వేత, జయచందర్ తదితరులు పాల్గొన్నారు.కలెక్టర్ దివాకర టీ.ఎస్. -
ప్రత్యామ్నాయ పంటలే మేలు
జిల్లా వ్యవసాయ అధికారి పుల్లయ్య ఖమ్మంవ్యవసాయం: ఈ సీజన్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నందున రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని జిల్లా వ్యవసాయ అధికారి ధనసరి పుల్లయ్య సూచించారు. ఈ విషయమై వ్యవసాయ, జల వనరులు, ఉద్యానవన, భూగర్భ జల వనరుల శాఖల ఆధ్వర్యాన గ్రామాల్లో విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా డీఏఓ విడుదల చేసిన ప్రకటనలోని సూచనలు ఇలా ఉన్నాయి. వర్షాలు ఆలస్యమైతే వరి సాగు చేసే రైతులు నాటు విధానానికి బదులుగా వెదజల్లే పద్ధతిని అనుసరించాలని సూచించారు. స్వల్పకాలిక వరి రకాలైన బీపీటీ–5204, ఆర్ఎన్ఆర్–15048, డబ్ల్యూజీఎల్–44, జేజీఎల్–1978, ఎంటీయూ–1010, జైశ్రీరామ్, హెచ్ఎంటీ సోనా వంటి రకాలు ఎంచుకుంటే మెరుగైన ఫలితాలు వస్తాయని తెలిపారు. వర్షాభావ పరిస్థితులతో వరి, మొక్కజొన్న, పత్తి తదితర పంటల సాగు విస్తీర్ణం తగ్గిన పక్షంలో వాటి స్థానాన పెసర, మినుము, బొబ్బర, కంది, వేరుశనగ వంటి పంటలను సాగు చేయించేలా ప్రణాళిక సిద్ధం చేసినట్లు డీఏఓ పేర్కొన్నారు. రైతులకు అవసరమైన పెసర విత్తనాలను ఆత్మనిర్భరత మిషన్ పథకం కింద రాయితీపై అందజేస్తామని తెలిపారు. పత్తి సాగు చేసే రైతులు తొందరపడి విత్తనాలు నాటొద్దని, భూమిలో తగినంత తేమ ఉన్నప్పుడే విత్తనాలు వేయాలని సూచించారు. కనీసం 60 – 70 మి.మీ. వర్షపాతం నమోదయ్యాకే పత్తి విత్తనాలు నాటాలని తెలిపారు. జూలై 15 వరకు పత్తి సాగుకు అనుకూల సమయం ఉంటుందని డీఏఓ వివరించారు. -
జిల్లా క్రీడాకారులకు రాష్ట్రస్థాయి ర్యాంకింగ్స్
ఖమ్మం స్పోర్ట్స్: రాష్ట్ర టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ తాజాగా విడుదల చేసిన రాష్ట్రస్థాయి ర్యాంకింగ్స్లో జిల్లా క్రీడాకారులు మెరుగైన స్థానాల్లో నిలిచారు. అండర్–11 బాలికల విభాగంలో బి.హార్విక లక్ష్మి 14వ ర్యాంక్ సాధించగా, పి.ఆరాధ్య 17వ ర్యాంక్, టి.రోస్మి త 27వ ర్యాంక్, అండర్–13లో బి.సాయి శివాని 18వ ర్యాంక్, అండర్–17లో జి.సిరి 22 వ ర్యాంక్, అండర్–19లో జి.సిరి 16వ ర్యాంక్, బి.సాయిశివాని 22వ ర్యాంక్ సాధించారు. ఇక బాలుర విభాగం అండర్–11 లో ఏ.యశ్వంత్ 23వ ర్యాంక్, అండర్–13 ఈ.హరి 22వ ర్యాంక్, అండర్–19లో పి.జ్వలిత్ 23, ఈ.హరి 29వ ర్యాంక్ సాధించారు. ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలోని అకాడమీలో శిక్షణ పొందుతున్న బాలబాలికలు ర్యాకింగ్స్లో సత్తా చాటడంపై డీవైఎస్ఓ టి.సునీల్రెడ్డి, కోచ్ వీ.వీ.ఎస్.మూర్తి అభినందించారు. ఇన్స్ట్రక్టర్లు, ఆయా పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం ఖమ్మం సహకారనగర్: జిల్లాకు 114 పూర్వ ప్రాథమిక పాఠశాలలు మంజూరు కాగా, అందులో తాత్కాలిక పద్ధతిపై ఇన్స్ట్రక్టర్లు, ఆయాల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈఓ చైతన్య జైనీ తెలిపారు. ఇన్స్ట్రక్టర్ పోస్టుకు ఇంటర్, ఆయాలైతే ఏడో తరగతి విద్యార్హత ఉండాలని పేర్కొన్నారు. వయో పరిమితిని 18 – 44ఏళ్లుగా నిర్ణయించినప్పటికీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుందని తెలిపారు. అయితే, దరఖాస్తుదారులు పాఠశాల పరిధి నివాస ప్రాంతం, గ్రామపంచాయతీ, అదే మండలం అయి ఉండాలని వెల్లడించారు. ఆసక్తి, అర్హతలు కలిగిన వారు ఈనెల 8, 9వ తేదీల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆపై 10వ తేదీన మండల కమిటీ, 11వ తేదీన ఆర్డీఓ, సబ్ కలెక్టర్ స్థాయిలో పరిశీలన అనంతరం నియామకాలు పూర్తిచేస్తామని డీఈఓ తెలిపారు. బీపీఈడీ ఎంట్రెన్స్లో రాష్ట్రస్థాయి ర్యాంకులు కొణిజర్ల: మండలంలోని తనికెళ్ల తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాల విద్యార్థినులు బ్యాచ్లర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్(బీపీఈడీ) ఎంట్రన్స్లో రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించారు. కళాశాలలో డిగ్రీ పూర్తిచేసిన ఎం.శిరీష రాష్ట్ర స్థాయిలో 11వ ర్యాంకు సాధించగా, డి.ఉమ 243, బి.అఖిల 396, పి.ఇందు 447, టి.ప్రమీల 592, కె.సౌమ్య 1,013వ ర్యాంకు సాధించారు. ఆయా విద్యార్థినులను ప్రిన్సిపాల్ కె.రజని, వైస్ ప్రిన్సిపాల్ బి.రాజేశ్వరి, పీడీ బి.రమ్య, వివిధ విభాగాల కోఆర్డినేటర్లు డాక్టర్ కే.పీ.ఐశ్వర్య, దీప్తి, ఎం.నవ్య అభినందించారు. ఘనంగా నదీ హారతి.. భద్రాచలం: పవిత్ర గోదావరి తీరంలో నిర్వహించిన నదీ హారతి నయనానందకరంగా సాగింది. గోదావరి తల్లికి ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమ నిర్వహకులు రామవజ్జుల రవికుమార్ బహుళ సప్తమి నదీ హారతి విశిష్టతను వివరించారు. గణపతి పూజ, దీపోత్సవం నిర్వహించారు. పూజా ద్రవ్యాలతో రామయ్యకు, గోదావరి నదికి అష్టోత్తర శతనామార్చన చేశారు. పురోహితులు సుబ్రహ్మణ్యం శర్మ, వీరభద్ర శర్మ, రామాచార్యులు, ప్రసాద్ శర్మ, కృష్ణ శర్మ, తేజ శర్మ పాల్గొన్నారు. అన్విత ఫ్రాంచైజ్కు ఉమ్మడి జిల్లావాసులు ఖమ్మంస్పోర్ట్స్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నిర్వహించనున్న తెలంగాణ టీ–20 క్రికెట్కు అన్విత గ్రూప్ ఫ్రాంచైజ్కు ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ఐదుగురు క్రికెటర్లు ఎంపికయ్యారు. జిల్లా నుంచి రాష్ట్ర డిప్యూటీ సీఎం కుమారుడు సహేంద్ర మల్లు, బి.విశాల్, అజ హర్, దివిన్, నారాయణతేజ్ ఎంపికయ్యారు. వీరు త్వరలో జరగనున్న టీ–20 లీగ్లో సంబంధిత జట్టు తరఫున ఆడనున్నారు. జిల్లా నుంచి జూనియర్ క్రికెటర్లు ఎంపికకావడంపై సీనియర్ క్రికెటర్లు అభినందనలు తెలిపారు. -
పగలు ఎండ, సాయంత్రం జల్లులు
ఖమ్మంవ్యవసాయం: జిల్లాలో శనివారం రోజంతా ఎండ ఉండగా.. సాయంత్రం తర్వాత ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు కురిశాయి. నైరుతి రుతుపవనాల ఆలస్యంతో మే నెల మాదిరిగానే ప్రస్తుతం కూడా ఎండ తీవ్రత కొనసాగుతోంది. జిల్లా వ్యాప్తంగా శనివారం 40–45 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా ముదిగొండలో 42.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, లింగాల, రఘునాథపాలెం, గౌరారంలో 42.7, ఖానాపురం, మధిరలో 42.6, పెనుబల్లి, కాకరవాయి, కొణిజర్ల, ఖమ్మం ప్రకాష్నగర్, ఎర్రుపాలెంలో 42.5, మధిర, మంచుకొండ, గేటు కారేపల్లి, పమ్మిలో 42.4, సిరిపురం, బచ్చోడు, పల్లెగూడెం, కల్లూరులో 42.3, తిమ్మారావుపేట, గుబ్బగుర్తిలో 42.2, బాణాపురంలో 42.1 ఉష్ణోగ్రత నమోదైందని అధికారులు వెల్లడించారు. అయితే, రాత్రి 7 గంటల తర్వాత కొన్నిప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షపు జల్లులు కురిశాయి. -
హంగులు.. రంగులు!
తరగతి గదిలో పిల్లల బొమ్మలు భవిత కేంద్రంలో ప్రత్యేకంగా రాయించిన సంజ్ఞలు, అక్షరాలుఖమ్మం సహకారనగర్: కొత్త విద్యాసంవత్సరం సమీపిస్తోంది. ఈ నేపథ్యాన ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే విద్యార్థులను ఆకట్టుకునేలా భవనాలను సిద్ధం చేసుకున్నారు. అవసరమైన భవనాలకు రంగులు వేయించడమే కాక ఆవరణలోని మహనీయులు, ఇతర బొమ్మలతో తీర్చిదిద్దుతున్నారు. వివిధ పథకాల ద్వారా వచ్చిన నిధులతో చేపడుతున్న అభివృద్ధి పనులను అధికారులు నిత్యం పర్యవేక్షిస్తుండగా చివరి దశకు చేరాయి. తద్వారా ప్రైవేట్ స్కూళ్లకు దీటుగా సిద్ధమవుతున్న ప్రభుత్వ పాఠశాలలు విద్యార్థులకు సరి‘కొత్త’గా స్వాగతం పలకనున్నాయి. మౌలిక వసతులు ప్రభుత్వం విద్యారంగంపై ప్రత్యేక దృష్టి సారించడమే కాక అవసరమైన పనులకు నిధులు సమకూరుస్తోంది. దీంతో పాఠశాలలు కొత్త హంగులు అద్దుకుని విద్యార్థులకు స్వాగతం పలకనున్నాయి. అంతేకాక తాగునీరు, బాత్రూంలు, నీటి సౌకర్యం తదితర అవసరమైన మౌలిక సదుపాయాలు సైతం అందుబాటులోకి వచ్చాయి. గత కొన్నేళ్లల్లో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారుతుండగా, ఈసారి మరింతగా రంగులు అద్దుకున్నాయి. ఈ ఏడాది మధ్యాహ్న భోజన పథకానికి తోడు విద్యార్థులకు అల్పాహారం కూడా సమకూర్చనుండడంతో ప్రవేశాల సంఖ్య పెరుగుతుందని భావిస్తున్నారు. ‘మన ఊరు – మన బడి’తో.. గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన మన ఊరు – మన బడి, మన బస్తీ – మన బడి కార్యక్రమాల ద్వారా కూడా పనులు చేపట్టారు. ఈ పథకంలో భాగంగా 426 పాఠశాలల్లో రూ.61,88,17,284 అంచనా వ్యయంతో పనులు చేయించగా, 195 స్కూళ్లలో పనులు పూర్తయ్యాయి. ఇందుకు సంబంధించి రూ.32,79,79,939 కోట్ల బిల్లులు సిద్ధం కాగా, రూ.23,71,26,903 చెల్లించారు.ముస్తాబవుతున్న ప్రభుత్వ పాఠశాలలు అమ్మ ఆదర్శ పాఠశాలల పథకం ద్వారా స్కూళ్లలో మౌలిక సదుపాయాలు మెరుగయ్యాయి. పాఠశాల స్థాయిలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలను ఏర్పాటుచేసి అభివృద్ధి, విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందేలా పర్యవేక్షణ చేపడుతున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాలల మరమ్మతులు, మౌలిక వసతుల కల్పనకు కోసం 954 పాఠశాలలకు రూ.35.5 కోట్లు మంజూరయ్యాయి. ఇందులో 952 పాఠశాలల్లో ఇప్పటికే పనులు పూర్తికాగా, మరో రెండు చోట్ల చివరి దశలో ఉన్నాయి. కాగా, పూర్తయిన పనులకు సంబంధించి రూ.24,49,51,922 బిల్లులు కూడా చెల్లించారు. -
గిరిజనంపై మక్కువ.. సంస్కృతి పరిరక్షణ
● సంప్రదాయాలను కాపాడేందుకు ఐటీడీఏ పీఓ రాహుల్ కృషి ● జాతీయ స్థాయిలో గుర్తింపు, రూ.5 లక్షల నగదు పురస్కారం ● కోయ భాష నేర్చుకుని ఆదివాసీలతో మమేకంభద్రాచలం: గిరిజనాభివృద్ధికి, గిరిజన సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణకు పాటుపడుతున్న భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి బి.రాహుల్కు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ఈ నెల 3న ఢిల్లీలోని విజ్ఞాన భవన్లో జరిగిన జాతీయ పీవోస్ కార్పొరేషన్లో దేశంలోనే ఉత్తమ ప్రాజెక్ట్ అధికారిగా నీతి అయోగ్ వైస్ చైర్మన్ అశోక్ కుమార్, ట్రైబల్ అఫైర్స్ మినిస్ట్రీస్ సెక్రెటరీ రంజాన్ చోప్రా చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. భద్రాచలం ఐటీడీఏ పీఓగా 2024 జూన్ 25న బాధ్యతలు స్వీకరించారు. త్వరలోనే రెండేళ్ల సర్వీస్ పూర్తి చేసుకునే క్రమంలో రూ. 5 లక్షల నగదు పురస్కారం అందుకోవడంతోపాటు కేంద్ర ప్రభుత్వ సత్కారం పొందారు. గిరిజనులు, ఆదివాసీ సంఘాల నాయకులు, స్థానికులు కూడా అభినందిస్తున్నారు. గతంలో సైతం మంచిర్యాల జిల్లాలో స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్గా పని చేసే సమయంలో బెస్ట్ ఎలక్ట్రోరల్ ప్రాక్టీసెస్ అవార్డును గవర్నర్ చేతుల మీదుగా, బెస్ట్ రూరల్ టూరిజం అవార్డును ముఖ్యమంత్రి చేతుల మీదుగా అందుకున్నారు. ప్రస్తుతం భద్రాచలం పీఓగా పని చేస్తూ ఆదివాసీ గిరిజనుల ఐక్యవేదిక తరఫున ఆదివాసీ వికాసరత్న బిరుదు పొందారు. విద్యా, ఇతర రంగాల్లో గిరిజన విద్యార్థులకు విద్యలో ప్రాథమిక దశలోనే కనీస సామర్థ్యాలను పెంపొందించే దిశగా ప్రత్యేకంగా ఉద్దీపనం పేరిట 3, 4వ తరగతుల్లో గణితం, ఇంగ్లిష్ సబ్జెక్ట్ల్లో స్టడీ మెటీరియల్ను తొలుత రూపొందించారు. ఆశించిన స్థాయిలో ఫలితాలు ఉండటంతో దీనిని విస్తృతపర్చి 1, 2వ తరగతులకు సైతం ప్రవేశపెట్టారు. ఉన్నత విద్య బలోపేతం కావడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతోంది. పదో తరగతి అనంతరం ఉన్నత విద్య, ఉద్యోగాలపై కెరీర్ గైడెన్స్ వాల్ను పాఠశాలల్లో ఏర్పాటుచేసి ఉన్నతాధికారులతో సూచనలు ఇప్పి స్తూ విద్యార్థుల భవిష్యత్కు బాటలు వేస్తున్నారు. -
వాడుకున్నారు.. వదిలేశారు !
● ఫుడ్పార్క్లో కంపెనీ విద్యుత్ బకాయి రూ.1.03 కోట్లు ● ఫలితంగా ఈ సీజన్లో కార్యకలాపాలకు బ్రేక్ఎల్లో అండ్ గ్రీన్స్ కంపెనీ మీటర్పై రూ.1,03,23,768 బిల్లు బకాయి ఉండడంతో నోటీసు ఇచ్చాం. చట్టప్రకారం వసూలు చేస్తాం. – ఎల్.రాములు, డీఈఈ, సత్తుపల్లి ఎల్లో అండ్ గ్రీన్స్ పేరిట ఉన్న విద్యుత్ బకాయి కంపెనీ బాధ్యులే చెల్లిస్తారు. ఈ సమస్య ఇతర కంపెనీలపై ఎలాంటి ప్రభావం చూపబోదు. – స్వామి, ఇన్చార్జ్ జోనల్ మేనేజర్ సత్తుపల్లి: ఓ పరిశ్రమ వస్తుందని ఆనందిస్తుండగానే, ఇంకో పరిశ్రమ మూతపడుతోంది. ఫలితంగా సత్తుపల్లి మండలం బుగ్గపాడులోని టీఎస్ఐఐసీ ఫుడ్పార్కులో ఎప్పటికి పూర్తిస్థాయి కార్యకలాపాలు మొదలవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. సత్తుపల్లి, అశ్వారావుపేట ప్రాంతాల్లో పండ్ల తోటలు విస్తారంగా ఉన్నందున 2008 జనవరి 27న అప్పటి సీఎం వైఎస్.రాజశేఖర్రెడ్డి సహకారంతో నాటి ఎమ్మెల్యే జలగం వెంకటరావు స్థానిక రైతులను ఒప్పించి 203 ఎకరాల భూమి సేకరించి మెగా ఫుడ్పార్క్కు అంకురార్పణ చేశారు. ఆపై 2016 నవంబర్ 16న నాటి మంత్రులు కేటీఆర్, తుమ్మల నాగేశ్వరరావు రూ.109 కోట్లతో పూర్తయిన పరిపాలన భవనం, గోదాంలు, సబ్స్టేషన్ ప్రారంభించారు. కొన్ని రెడీ.. ఇంకొన్ని పెండింగ్ బుగ్గపాడు ఫుడ్పార్కులో పరిశ్రమలు పెట్టేలా యజమానులను ఆకర్షించేలా రెండు, మూడు సార్లు ప్రభుత్వం మేళాలు నిర్వహించింది. అందులో భాగంగా కోల్డ్ స్టోరేజ్ను హైదరాబాద్కు చెందిన ఎల్లో అండ్ గ్రీన్స్ అగ్రిఫ్రెష్ ప్రైవేట్ లిమిటెడ్ బాధ్యులు మామిడి జ్యూస్ తయారీ, నిల్వల కోసం తీసుకున్నారు. ఇక స్టాడెంట్ ఫ్యాక్టరీ షెడ్ను విజయవాడ కేంద్రంగా పనిచేసే ట్రాన్స్సెండ్ ఫుడ్వర్క్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ జీడిగింజలు ప్రాసెస్, మామిడి, జామ పండ్లతో పల్ప్ తయారీకి కోసం తీసుకుంది. అంతేకాక యాంకరింగ్ ప్రాజెక్టు కింద బెంగళూరుకు చెందిన ఫ్రూషన్ ఇండియా, బయోగ్రీన్ ఇండియా కంపెనీలకు భూకేటాయింపులు జరిగినా ఫ్రూషన్ ఇండియా కంపెనీ పిల్లర్ల దశలో నిలిపివేసింది. బయోగ్రీన్ ఇండియా అసలు పనులే చేపట్టలేదు. రూ.కోటి దాటిన బకాయి ఐదేళ్ల క్రితం ఎల్లో అండ్ గ్రీన్ అగ్రిఫ్రెష్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ బుగ్గపాడు ఫుడ్పార్కులో కోల్డ్ స్టోరేజీని లీజ్కు తీసుకుంది. ఏటా మూడు నెలల మామిడి సీజన్లో ఇక్కడ మామిడితో జ్యూస్ తీసి కోల్డ్స్టోరేజ్లో భద్రపరిచి ఎగుమతి చేసేలా ఒప్పందం కుదిరింది. దీనికి విద్యుత్ సరఫరా కోసం 700 కిలోవాట్ల హెచ్టీ లైన్ సర్వీస్ను విద్యుత్శాఖ సమకూర్చింది. సరాసరి నెలకు వాడినా, వాడకున్నా రూ.5 లక్షల నుంచి రూ.6 లక్షల బిల్లు చెల్లించాల్సి ఉంటుంది. గతేడాది వరకే రూ.50 లక్షల బిల్లు బకాయి ఉండడంతో ఉన్నతాధికారులతో చర్చించి విడతల వారీగా బకాయిలు చెల్లిస్తామని చెప్పి దఫాలుగా రూ.20 లక్షలు చెల్లించి గత సీజన్లో పనిచేయించారు. ఈ ఏడాది మళ్లీ వస్తే రూ.1.03 కోట్ల బకాయి చెల్లించాలని ఉందని చెప్పడంతో పనులు చేపట్టలేదు. అయితే, బకాయి రూ.కోటి దాటే వరకు విద్యుత్శాఖ అధికా రులు ఎందుకు పట్టించుకోలేదనే అంశంపై సందేహాలు తలెత్తుతున్నాయి. కాగా, ఖాయిలా పరిశ్రమ కింద చూపించి బకా యిల మాఫీకి ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. -
నేడు డిప్యూటీ సీఎం భట్టి పర్యటన
ముదిగొండ: రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆదివారం ముదిగొండ మండలంఓ పర్యటించనున్నారు. ఉదయం మధ్యాహ్నం 12గంటలకు ఆయన యడవల్లి లక్ష్మీపురంలో గ్రామపంచాయతీ భవనం ప్రారంభించడంతో పాటు యడవల్లిలో సబ్స్టేషన్, ముదిగొండలో ఈఆర్ఓ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. అలాగే, యడవల్లి – తల్లంపాడు రహదారి అభివృద్ధి పనులు, యడవల్లి నుంచి లక్ష్మీపురం మీదుగా తెల్దార్పల్లి వరకు ఆర్అండ్బీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. ఆతర్వాత మధ్యాహ్నం 3గంటలకు బోనకల్ మండలంలో యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ పాఠశాల నిర్మాణ పనులను భట్టి పరిశీలిస్తారు. పంట అవశేషాలు కాలిస్తే రూ.25 వేల జరిమానా ఏన్కూరు: రైతులు పొలాల్లో మిగిలిన అవశేషాలను కాలిస్తే రూ.5వేల నుంచి రూ.25వేల వరకు జరిమానా విధించనున్నట్లు జిల్లా వ్యవసాయాధికారి ధనసరి పుల్లయ్య తెలిపారు. మండల కేంద్రంలోని విత్తన దుకాణాలను శనివారం ఆయన తనిఖీ చేసిన ఆయన రికార్డుల నిర్వహణ, బిల్లులపై యజమానులకు సూచనలు చేశారు. రైతులకు నానో యూరియా వినియోగంపై అవగాహన కల్పించాలని తెలిపారు. ఆతర్వాత తూతలింగన్నపేట గ్రామసభలో డీఏఓ మాట్లాడుతూ రైతులు మొక్కజొన్న, వరి కోశాక అవశేషాలను కాల్చడం వల్ల నష్టాలు ఎదురవుతున్నందున, భూమిలో కలియదున్నాలని సూచించారు. ఎల్నినో ప్రభావం కారణంగా వర్షాభావ పరిస్థితులు ఏర్పడనున్నందున ప్రత్యామ్నాయంగా కంది పెసర, మినుములు, జొన్నలు వంటివి సాగుచేయాలన్నారు. అంతేకాక తొలకరి వర్షాలతో తొందరపడకుండా భూమి పదును వచ్చాకే విత్తనాలు నాటాలని సూచించారు. ఎంపీడీఓ పల్లి భాగ్యశ్రీ, ఏఓ నర్సింహరావు, ఏఈఓలు అశోక్, సైదులు పాల్గొన్నారు. రేపటి ప్రజావాణి రద్దు ఖమ్మం సహకారనగర్: ప్రజా సమస్యలపై దరఖాస్తులు, వినతిపత్రాలు స్వీకరించేందుకు ప్రతీ సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణి (గీవెన్స్ డే) ఈనెల 8వ తేదీన రద్దు చేసినట్లు కలెక్టర్ దివాకర టీ.ఎస్. తెలిపారు. అన్ని శాఖల జిల్లా స్థాయి అధికారులు ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’లో భాగంగా గ్రామసభల్లో పాల్గొంటున్నందున ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని ఆయన ఓ ప్రకటనలో సూచించారు. శృంగేరి పీఠాధిపతికి ఆహ్వానం ఎర్రుపాలెం: తెలంగాణ తిరుమలగా పేరున్న జమలాపురంలోని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఈనెల 29నుంచి వచ్చే నెల 3వ తేదీ వరకు మహా కుంభాభిషేకం ఉత్సవాలు జరగనున్నాయి. ఇందులో పాల్గొనాలని కోరుతూ కర్ణాటక రాష్ట్రం శృంగేరిలోని శారదా పీఠాధిపతి శ్రీశ్రీ విధుశేఖర భారతీ స్వామికి దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ ఆహ్వాన పత్రిక అందజేశారు. ఆమె వెంట శాఖ కమిషనర్ కె.హనుమంతరావు, సలహాదారుడు గోవిందా హరి, ఈఓ కె.జగన్మోహన్రావు, వ్యవస్థాపక ధర్మకర్త ఉప్పల విజయదేవశర్మ, ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాసశర్మ, వేదపండితులు ఉన్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రత్యేకతలు, మహా కుంభాభిషేకానికి జరుగుతున్న ఏర్పాట్లను స్వామీజీకి వివరించారు. జమలాపురం శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు జరిగాయి. స్వామి వారి మూలవిరాట్తో పాటు ఆలయ ఆవరణలోని శ్రీవారి పాదానికి పంచామృతంతో అభిషేకంతో పాటు స్వామి, అమ్మవార్ల నిత్యకల్యాణం, పల్లకీ సేవ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అర్చకులతో పాటు ఆలయ ఉద్యోగులు సోమయ్య, కృష్ణప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
27 రకాల పక్షి జాతుల గుర్తింపు
సత్తుపల్లిటౌన్: ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా సత్తుపల్లి అటవీ రేంజ్ ఉద్యోగులు వాకర్లు, సందర్శకులు నీలాద్రి అర్బన్ పార్కులో శనివారం ‘బర్డ్ వాక్’ నిర్వహించారు. ఈ సందర్భంగా పక్షులను పరిశీలిస్తూ వాటి ప్రత్యేకతలపై వన్యప్రాణి నిపుణుడు దీపక్ రామాయణ్ అవగాహన కల్పించారు. ఈక్రమాన 27 రకాల పక్షి జాతులు పార్క్లో ఆవాసం ఏర్పర్చుకున్నట్లు గుర్తించారు. సత్తుపల్లిలో ఈ పార్కు జీవవైవిధ్యానికి చిరునామాగా నిలుస్తోందని ఈ సందర్భంగా రేంజర్ ఎల్లయ్య, ఉద్యోగులు తెలిపారు. -
విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలు
వైరారూరల్: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు వృద్ధిలోకి రావడమే కాక సమాజ అభివృద్ధికి పాటుపడాలని ఎమ్మెల్యే మాలోతు రాందాస్నాయక్ సూచించారు. ప్రవాస భారతీయుడు కొండబోలు సురేష్, ఆయన సోదరి లలిత సహకారంతో వైరా మండలంలోని ప్రభుత్వ హైస్కూళ్లు, కళాశాలల్లో ఎస్సెస్సీ, ఇంటర్లో ప్రథమ, ద్వితీయస్థానం సాధించిన విద్యార్థులకు రూ.10 వేలు, రూ.7,500 చొప్పున 38 మందికి రూ.3,37,500 నగదు ప్రోత్సాహకాలను శనివారం ఎంపీడీఓ కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాందాస్ మాట్లాడుతూ.. సురేశ్, లలిత విద్యార్థులను ప్రోత్సహించడం అభినందనీయమన్నారు. విద్యార్థులు ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలు, దాతల చేయూతను సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం 90 శాతం హాజరు ఉన్న ఉపాధ్యాయులకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నుంచి అందిన ప్రశంసాపత్రాలను ఎమ్మెల్యే అందజేశారు. ఎంఈఓ కొత్తపల్లి వెంకటేశ్వర్లు, కౌన్సిలర్ ముళ్లపాటి విజయలక్ష్మి, మార్కెట్ చైర్మన్ బోళ్ల గంగారావు, నాయకులు డాక్టర్ కాపా మురళీకృష్ణ, బెజవాడ వీరభద్రం, శీలం వెంకటనర్సిరెడ్డి, పొదిలి హరినాథ్, మచ్చా వెంకటేశ్వరరావు, గూడపాటి సూర్యప్రకాశ్రావు తదితరులు పాల్గొన్నారు.ఎన్ఆర్ఐ చేయూతతో అందించిన ఎమ్మెల్యే రాందాస్ -
హాస్టళ్లలో వసతులు మెరుగుపర్చాలి
ఖమ్మంమయూరిసెంటర్: విద్యా సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యాన ప్రభుత్వ సంక్షేమ వసతిగృహాల్లో వసతులను మెరుగుపరచాలని ఎస్సీ, బీసీ అభివృద్ధి అధికారి జి.జ్యోతి సూచించారు. వసతి గృహాల్లో సౌకర్యాల కల్పన, ప్రవేశాలపై ఆమె శనివారం అధికారులతో సమీక్షించారు. ప్రవేశాలు పెరిగేలా అధికారులు గ్రామాల్లో పర్యటించాలని తెలిపారు. అలాగే, వసతి గృహాల మరమ్మతు పనులను పర్యవేక్షిస్తూ, ఎక్కడైనా భవనాలు శిథిలావస్థ లో ఉంటే వారిని ప్రైవేట్ భవనాల్లోకి మార్చాల్సి ఉంటుందని చెప్పారు. అంతేకాక వసతి గృహాల్లో మెనూ చార్టులు ప్రదర్శించి, 9వ తేదీన సంపూర్ణ శానిటేషన్ చేపట్టాలని సూచించారు. ఆయా శాఖల అసిస్టెంట్ వెల్ఫేర్ ఆఫీసర్లు, ఉద్యోగులు పాల్గొన్నారు. -
నీట్కు పకడ్బందీ ఏర్పాట్లు
ఖమ్మంసహకారనగర్: మెడికల్ కాలేజీల్లో ప్రవేశాలకు నిర్వహించనున్న నీట్ పకడ్బందీగా జరిగేలా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ దివాకర్ టీ.ఎస్. సూచించారు. నీట్ నిర్వహణ, ప్రభుత్వ పాఠశాలల్లో ఏర్పాట్లు, ధాన్యం కొనుగోళ్లు తదితర అంశాలపై శనివారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సమావేశం అనంతరం అధికారులతో సమావేశమైన కలెక్టర్ మాట్లాడుతూ.. ఎలాంటి లోటుపాట్లు జరగకుండా నీట్ నిర్వహణకు సిద్ధం కావాలని సూచించారు. అలాగే, ప్రభుత్వ పాఠశాలలు తెరిచే సమయం సమీపిస్తున్నందున వసతులపై దృష్టి సారించాలని తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి, డీఈఓ చైతన్యజైనీ, డీఎంహెచ్ఓ రామారావు, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు ●కలెక్టరేట్ ఆవరణలోని ఈవీఎం గోదాంను కలెక్టర్ దివాకర తనిఖీ చేశారు. ఈ సందర్భంగా భద్రతపై ఉద్యోగులకు సూచనలు చేశారు. అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి, ఉద్యోగులు రాజు, అన్సారీ, పలు పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. ●ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థుల ఆరోగ్యం, భద్రత, సౌకర్యాల కల్పన విషయంలో అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని కలెక్టర్ దివాకర తెలిపారు. టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు గుంటుపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యాన హాస్టళ్లలోని సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్కు వినతిపత్రం ఇవ్వగా ఆయన సూచనలు చేశారు. టీఎన్జీవోస్ జిల్లా కార్యదర్శి కొనిదెన శ్రీనివాస్, హాస్టల్ వెల్ఫేర్ ఫోరం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కోటపాటి రుక్మారావు, ఎన్.నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 25 నుంచి ఇంటింటి సర్వే ఖమ్మంసహకారనగర్: అర్హులెవరూ ఓటు హక్కు కోల్పోకుండా చూడాలని కలెక్టర్ దివాకర సూచించారు. కలెక్టరేట్లో ఎస్ఐఆర్ జరిగిన సమీక్షలో అదనపు కలెక్టర్లు డాక్టర్ పి.శ్రీజ, పి.శ్రీనివాసరెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. 2002 నాటి జాబితా, ప్రస్తుత జాబితా ఆధారంగా ఓటర్ల మ్యాపింగ్ పూర్తయినందున ఈ నెల 25 నుంచి జూలై 24 వరకు బీఎల్ఓలు ఇంటింటి సర్వే చేపట్టాలని తెలిపారు. ఇందుకోసం సెర్ప్, మెప్మా సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు, ఏఈఓలకు 11వ తేదీన శిక్షణ ఇస్తామని, జాబితాలో పనితీరు సరిగ్గా లేని వారిని త్వరగా గుర్తించాలన్నారు. కాగా, మ్యాపింగ్లో గుర్తించిన లోపాల ఆధారంగా ఓటర్లకు నోటీసులు జారీ చేయాలని తెలిపారు. ఆపై ఇంటింటి సర్వేలో భాగంగా ఎన్యూమరేషన్ ఫారాలు స్వీకరించాలని సూచించారు. సమావేశంలో కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్య, కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్యాదవ్, ఆర్డీఓ శ్రీనివాస్, ఉద్యోగులు రాజు, అన్సారీ తదితరులు పాల్గొన్నారు.మఽధిర: ఓటరు జాబితాలో అర్హుల పేర్లే ఉండేలా ఎస్ఐఆర్ పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలని కలెక్టర్ దివాకర టీఎస్ సూచించారు. మధిర మండలం జాలిముడిలో ఓటర్ల జాబితా మ్యాపింగ్ను అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డితో కలిసి ఆయన పరిశీలించారు. పలువురు ఓటర్ల ఇంటికి వెళ్లి సమస్యలు ఆరా తీయడమే కాక ఉద్యోగులకు సూచనలు చేశారు. క్షేత్రస్థాయిలో కచ్చితమైన ధ్రువీకరణ, డేటా నమోదును పారదర్శకతతో పనిచేయాలన్నారు. ఆర్డీఓ శ్రీనివాస్, తహసీల్దార్ రాంబాబు తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ దివాకర టీ.ఎస్. -
సెలవులంటే అప్పుడే!
ఇల్లెందురూరల్: ఆ రోజుల్లో వేసవి సెలవులు వచ్చాయంటే చాలు.. మనసు గాలిలో తేలిపోయేది. అప్పటివరకు ఉన్న క్రమశిక్షణ అంతా ఆనందపు కేకలుగా మారిపోయేది. ఇలా నాటి సెలవుల్లో బాలలు అమ్మమ్మ ఇంటికి వెళ్లేందుకు ఎంత హుషారుగా సిద్ధమయ్యేవారో.. అంతే ఆనందాన్ని సెలవుల్లో అందిపుచ్చుకొని తిరుగుముఖం పట్టేవారు. పల్లె వాకిళ్లలోకి చేరి ఎలాంటి ఆనందం.. అనుభూతి, ఆప్యాయతలను అందిపుచ్చుకునేవారో ఆ రోజుల్లోకి వెళ్లి ఓసారి చూసొద్దాం.ఊరికి వెళ్లే ఎర్రబస్సు ఎక్కగానే ప్రాణం లేచివచ్చేది. కిటికీ పక్కన సీటుకోసం అన్నాచెల్లెళ్ల మధ్యజరిగే ఆ చిన్న గొడవలే తీయని జ్ఞాపకాలుగా మిగిలేవి. బస్సు కిటికీలో నుంచి వస్తున్న ఆ చల్లటి గాలి.. వెనక్కి పరిగెడుతున్న పచ్చని పొలాలు.. ప్రతీది అమ్మమ్మ ఊరి వైపు మరింత వేగంగా లాగేస్తున్నట్లు అనిపించేది. ఊరు రాగానే బస్టాండ్లో ఎదురు చూస్తున్న తాతయ్య ముఖంలో కనిపించే ఆనందం ముందు ప్రపంచంలో మరేదీ సాటిరాదు. అప్పట్లో కార్లు ఎక్కడివి? తాతయ్య ఎడ్ల బండిపై మట్టిరోడ్ల మీద వెళ్తుంటే ఆ మట్టి వాసనలు.. ఆ గళగళ శబ్దాలు మనసుకు హత్తుకునేవి. ఇంటి గుమ్మం తొక్కగానే అమ్మమ్మ ఇచ్చేహారతితో పల్లెటూరి ప్రేమకు స్వాగతం పలికినట్లు ఉండేది. ఉదయాన్నే పెరట్లో రాగి గంగాళంలో కాగిన వేడి నీళ్లతో అమ్మమ్మ చేయించే తలంటు స్నానం, కుంకుడు కాయల గుమగుమలు ఇప్పటికీ గుర్తే కదూ. అందరూ కలిసి కింద కూర్చుని విస్తరాకుల్లో వడ్డించుకొని తింటుంటే ఆ అన్నంలో అమ్మమ్మ కలిపిన ప్రేమ కూడా తోడై అమృతంలా అనిపించేది. మధ్యాహ్నం వేళ పెద్దల కళ్లు కప్పి మామిడితోటల్లోకి దూరి రాళ్లతో కొట్టి కాయలు రాల్చడం పెద్ద సాహసమే. ఆ కాయల ముక్కలకు కారం అద్దుకొని తింటుంటే పులుపుకు కళ్లు మూసుకుపోయినా తిన డం మాత్రం ఆపేవాళ్లు కాదు. మిద్దె మీద అమ్మ, అమ్మమ్మ ఒడియాలు పెడుతుంటే మధ్యమధ్యలో పచ్చి పిండిని దొంగతనంగా తినడం అందరికీ అలవాటే. అమ్మమ్మ చేతులతో కలుపుతున్న కొత్త ఆవకాయ రుచి చూడడానికి మనసంతా ఆరాటపడేది. మండే ఎండల్లో ఊరి చెరువు పక్కన గంటల తరబడి ఈతలు కొట్టడం.. కళ్లు ఎర్రబడే దాకా నీళ్లలో ఆడుకోవడం మజాగా ఉండేది. సూర్యుడు పడమట కొండల్లోకి వెళ్లే వేళ మర్రి చెట్టుకు కట్టిన ఊడలకు కట్టిన ఊయల ఊగుతుంటే ఆ గాలికి మనసు కూడా ఊయలలూగేది. రాత్రిపూట ఎగురుతున్న మినుగురు పురుగులను పట్టుకొని అగ్గిపెట్టెలో దాచుకొని మురిసిపోవడం ఆ నాటి అమాయకత్వానికి గుర్తు. జేబుల నిండా గోలీలు వేసుకొని ఊరి స్నేహితులతో కలిసి మట్టిలో ఆడుకున్న ఆ ఆటల ముందు ఇప్పటి వీడియో గేమ్లు ఏపాటివి?!ఇలా ఆనందంగా గడిపే సరికి సెలవులు ఇట్టే అయిపోయినట్లు అనిపించేవి. తిరుగు ప్రయాణానికి మళ్లీ ఇనుప పెట్టెలో బట్టలు సర్దే ప్రక్రియ ప్రారంభమైంది. ఈసారి ఆ పెట్టెలో బట్టల కన్నా అమ్మమ్మ చేసిన ఆవకాయలు, వడియాలే ఎక్కువగా ఉండేవి. ఇక ఊరు విడిచిపెట్టి వెళ్లే రోజు రానే వచ్చింది. మళ్లీ ఎప్పుడు వస్తారోనని కళ్లలో నీళ్లు పెట్టుకునే తాతయ్య, అమ్మమ్మను వదిలి రావడం మనసుకు చాలా భారంగా ఉండేది. ఎర్ర బస్సులో ప్రయాణం చేస్తుంటే ఆ సమయంలో వెనక్కు వెళ్తున్న ఊరు, పచ్చని పొలాలను చూస్తూ బరువెక్కిన హృదయంతో ఊరికి వీడ్కోలు పలికేవాళ్లం. మళ్లీ కాంక్రీట్ అడవిలోకి వచ్చేసినా.. మనసంతా ఆ పల్లెటూరి జ్ఞాపకాల్లోనే చాన్నాళ్లు విహరించేది. కాలం ఎంత మారినా ఎన్ని టెక్నాలజీలు వచ్చినా ఆనాటి వేసవి సెలవుల జ్ఞాపకాలు ఎప్పటికీ చెరిగిపోనివి.. అమూల్యమైనవి. -
కోహెడ తరలిన రైతులు, ప్రతినిధులు
ఖమ్మంవ్యవసాయం/కల్లూరు రూరల్: రంగారెడ్డి జిల్లా కోహెడలో సమీకృత పండ్ల మార్కెట్ నిర్మాణానికి సీఎం రేవంత్రెడ్డి శనివారం శంకుస్థాపన చేశారు. కార్యక్రమానికి జిల్లా నుంచి రైతులు, రైతు ప్రతినిధులు, వ్యవసాయ మార్కెట్ కమిటీల ప్రతినిధులు వెళ్లారు. ఖమ్మం మార్కెట్ చైర్మన్ యరగర్ల హన్మంతరావుతో పాటు మధిర, కల్లూరు తదితర మార్కెట్ల ప్రతినిధులు వెళ్లగా, వీరి బస్సులను జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి(డీఎంఓ) అలీం ప్రారంభించారు. కాగా, కల్లూరు నుంచి వెళ్తున్న మార్కెట్ పాలకవర్గం, ఉద్యోగులు, రైతుల వాహనాలను మార్కెట్ చైర్మన్ బాగం నీరజాదేవి ప్రారంభించారు. ప్రీమియర్ లీగ్ నెట్బాల్ పోటీలు ప్రారంభం ఖమ్మంస్పోర్ట్స్: జిల్లాస్థాయి ప్రీమియర్ లీగ్ నెట్బాల్ పోటీలు శనివారం ఖమ్మంలోని హార్వెస్ట్ పబ్లిక్ స్కూల్లో ప్రారంభమయ్యాయి. ఐఎంఏ అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ రెహనాబేగం, డాక్టర్ కోటేశ్వరరావు ఈ పోటీలను ప్రారంభించి మాట్లాడారు. క్రీడలు శారీరక దృఢత్వాన్నే కాక క్రమశిక్షణను పెంపొందిస్తాయన్నారు. హార్వెస్ట్ ప్రిన్సిపాల్ ఆర్.పార్వతీరెడ్డి మాట్లాడుతూ.. గెలుపోటములను సమానంగా స్వీకరిస్తే క్రీడాకారులకు విజయాలు సొంతమవుతాయని తెలిపారు. నెట్బాల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సీహెచ్ దీప్తి, ఎన్.ఫణికుమార్తో పాటు పీవీ రమణ, నాగయ్య పాల్గొన్నారు. కాగా, తొలిరోజు నాలుగు మ్యాచ్లు నిర్వహించి విజేతలను ప్రకటించారు. తపాలా ఉద్యోగులకు అవార్డులు ఖమ్మంగాంధీచౌక్: ఉమ్మడి జిల్లాలో 2025–26 సంవత్సరానికి ప్రతిభ కనబరిచిన తపాలా శాఖ ఉద్యోగులకు అవార్డులు ప్రకటించారు. ఖమ్మంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో ఉద్యోగులకు పోస్టల్ సూపరింటెండెంట్ వీరభద్రస్వామి అవార్డులు అందజేసి మాట్లాడారు. గత ఆర్థిక సంవత్సరం తపాలా జీవిత బీమా విభాగంలో రూ.31.27 కోట్లు, గ్రామీణ తపాలా జీవిత బీమా విభాగంలో రూ.27 కోట్లు సేకరించామని తెలిపారు. ఈ ఏడాది కూడా లక్ష్యాలను అధిగమించి తెలంగాణ సర్కిల్లోనే ఖమ్మం డివిజన్ను అగ్రగామిగా నిలపాలన్నారు. ఐపీపీబీ (ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంక్) మేనేజర్ రాజేశ్ మాట్లాడుతూ.. ఖమ్మం తపాలా డివిజన్లో 41,500 ఖాతాలు తెరవగా, గ్రూప్ యాక్సిడెంట్ పాలసీల విభాగంలో రూ.1.50 కోట్లు వసూలయ్యాయని తెలిపారు. అంతేకాక రూ. 6 కోట్ల క్లెయిమ్లు చెల్లించినట్లు వెల్లడించారు. అనంతరం ఏఎస్పీ మల్లికార్జున్ మాట్లాడగా పలు విభాగాల్లో 200 మందికి అవార్డులు అందజేశారు. పోస్టల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, ఖమ్మం హెడ్ పోస్టాఫీస్ పోస్టు మాస్టర్ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. -
దేశ ఆర్థికాభివృద్ధిలో పన్నుల ఆదాయమే కీలకం
ఖమ్మంగాంధీచౌక్: దేశ ఆర్థికాభివృద్ధిలో పన్నుల ఆదాయం కీలక పాత్ర పోషిస్తోందని రాష్ట్ర పన్నుల శాఖ సంయుక్త కమిషనర్ తల్లాపల్లి శ్రీనివాసరావు తెలిపారు. ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ ట్యాక్స్ ప్రాక్టీషనర్స్(ఏఐఎఫ్టీపీ), జిల్లా జీఎస్టీ ప్రొఫెషనల్స్ అసోసియేషన్(కేజీపీఏ) సంయుక్త ఆధ్వర్యాన ఖమ్మంలో శనివారం నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. వ్యాపారులు – ప్రభుత్వానికి మధ్య వారధిలా వ్యవహరించే ప్రాక్టీషనర్లు పన్ను చట్టాల్లో మార్పులపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. అనంతరం ఏఐఎఫ్టీపీ సెక్రటరీ జనరల్ జి.భాస్కర్, సౌత్ జోన్ చైర్మన్ డీఎం భట్టాడ్, కార్యదర్శి కె.సుబ్రహ్మణ్యం, జాతీయ ఉపాధ్యక్షుడు సి.సంజీవరావు మాట్లాడగా.. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు. వుల్లిబోయిన సైదులు అధ్యక్షతన జరిగిన సదస్సుకు బి.దుర్గాప్రసాద్రావు చైర్మన్గా వ్యవహరించగా, కేజీపీఏ కార్యదర్శి పవన్కుమార్తో పాటు రమేశ్, శ్రీనివాసులు, శ్రీధర్రెడ్డి, వాసు, ఈశ్వరయ్య, ఉపేందర్, సురేశ్, రామకృష్ణ, ఖాజా తదితరులు పాల్గొన్నారు. ముదిగొండలో డిజిటల్ మోడల్ లైబ్రరీ! ఖమ్మంగాంధీచౌక్: ముదిగొండలో డిజిటల్ మోడల్ లైబ్రరీ ఏర్పాటుకు కృషి జరుగుతోంది. ప్రస్తుత లైబ్రరీ ఇరుకుగా ఉండగా, డిజిటల్ లైబ్రరీ భవన నిర్మాణానికి రూ.40 లక్షలు మంజూరు కోసం రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు హామీ ఇచ్చారు. దీంతో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎండీ ఖాదర్బాబా శనివారం ఖమ్మం ఆర్డీఓ శ్రీనివాస్ను కలిసి స్థల కేటాయింపుపై చర్చించారు. ఆయన ముదిగొండ తహసీల్దార్తో మాట్లాడి అందరికీ ఆమోదయోగ్యమైన స్థల కేటాయింపునకు చర్యలు తీసుకోవాలని సూచించారు.రాష్ట్ర పన్నుల శాఖ సంయుక్త కమిషనర్ శ్రీనివాస్ -
నవ్వుల పంట
బాల గేయంనవ్వుల పంట పండిద్దాం నలుగురికి నవ్వులు పంచుదాం అందరినీ సమంగా చూద్దాం ఆప్యాయంగా పలకరిస్తూ అందరికీ ప్రేమను అందిద్దాం మమతను పంచి మాట్లాడితే మల్లెలే పరిమళించునులే సమతతో నడిచిన చోట సంతోషమే నిండిపోవునులే చిన్నాపెద్ద భేదం లేక చిరునవ్వుతో కలిసి పోదాం పగలు, పంతాలు వీడుదాం మంచితనాన్ని నింపుదాం –అశ్వారావుపేటరూరల్ -
మేడేపల్లికి బడి కావాలి..
● పిల్లల చదువు కోసం గొత్తికోయల గోస ● పూర్వ కలెక్టర్, డీఎఫ్ఓ చొరవ చూపినా ముందుకు సాగని పనులు ● అటవీ అభ్యంతరాలతో నిలిచిన కంటైనర్ పాఠశాల నిర్మాణం ఏన్కూరు: అంతా కూటి కోసం పొట్ట చేతపట్టుకొని రాష్ట్రాల దాటి వలస వచ్చిన వారే. పోడు కొట్టుకొని తిండి గింజలు పండించుకుంటూ జీవనం సాగిస్తున్నారు. గత 15ఏళ్లుగా ఏన్కూరు మండలం కొత్తమేడేపల్లి అటవీ ప్రాంతంలో దుర్భర జీవనం సాగిస్తున్న ఈ వలస గొత్తి కోయలకు విద్యుత్, విద్యం, వైద్య సౌకర్యాలు అందడం లేదు. అయినా భరిస్తూ తమ పిల్లలకు మాత్రం ఆ పరిస్థితి రావొద్దని ఆశిస్తున్నారు. పిల్లలను చదివించాలని ఆశపడుతున్న వీరు.. తద్వారా కూలీలుగా కాకుండా గౌరవంగా బతుకుతారని చెబుతున్నారు. ఈమేరకు అధికారులు కూడా స్పందిస్తేనే వీరి పిల్లలకు విద్యాబుద్ధులు అందనున్నాయి. 15 ఏళ్ల క్రితం వలస వచ్చి.. ఛత్తీస్గఢ్కు చెందిన పలువురు గొత్తికోయలు పదిహేనేళ్ల క్రితం ఏన్కూరు మండలం మేడేపల్లికి వచ్చారు. సమీప అడవిలో పోడు కొట్టుకొని పంటలు సాగు చేస్తూ ఇక్కడే జీవిస్తున్నారు. క్రమేణా వీరి నివాస ప్రాంతం కొత్త మేడేపల్లిగా స్థిరపడింది. ఇక్కడ సుమారు 60 కుటుంబాలు నివసిస్తుండగా వీరిలో 180 మందికి ఓటు హక్కు కూడా ఉంది. కానీ వీరి పిల్లల కోసం పాఠశాల లేకపోవడంతో 30 మంది చదువుకు దూరమవుతున్నారు. వీరి ఆవేదన గుర్తించి బాలవెలుగు ఆధ్వర్యాన పాఠశాలను ఏర్పాటుచేసినా కొన్నాళ్లకు మూతపడడంతో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. ఆ అధికారులు బదిలీ అయ్యారని.. గొత్తికోయల పిల్లలు చదువుకు దూరమవుతున్నాయని తెలియడంతో గత కలెక్టర్, అటవీ అధికారులు పాఠశాల నిర్మాణానికి అనుమతి మంజూరు చేసారు. అంతేకాక రూ.2లక్షలు కూడా విడుదల చేయడంతో కంటైనర్ పాఠశాల నిర్మాణానికి మండల విద్యా శాఖాధికారులు శంకుస్థాపన చేసి పునాది నిర్మాణం పూర్తి చేశారు. ఈలోగా అటవీ అధికారులు అటవీ ప్రాంతంలో నిర్మాణం నిలిపివేయాలని ఆదేశించడంతో పనులు నిలిచిపోయాయి. ఫలితంగా నిర్మాణం ఆగిపోయింది. దీంతో గొత్తికోయలు ఏమిటని ఆరా తీయగా అనుమతి ఇచ్చిన కలెక్టర్, అటవీశాఖ అధికారి బదిలీ అయ్యారని చెప్పడంతో నివ్వెరపోయారు. ఆపై స్థానిక విద్యాశాఖాధికారులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లగా కొత్తమేడేపల్లిలో పరిశీలించారు. కొత్తగా పోడు కొట్టమని, అటవీ జంతువులను వేటాడబోమని రాసి ఇవ్వాలని సూచించగా గొత్తికోయలంతా సంతకాలు పెట్టారు. అయితే, ఈనెల 12వ తేదీన నూతన విద్యాసంవత్సరం మొదలుకానున్నందున ఆలోగా పాఠశాల నిర్మాణం పూర్తిచేసి తమ పిల్లలకు చదువు నేర్చేలా అధికారులు చొరవ చూపాలని గొత్తికోయలు కోరుతున్నారు. వీరి గోడు అధికారులు ఆలకిస్తారో, లేదో తేలాల్సి ఉంది. -
కమ్యూనిస్టులే సమాజానికి రక్ష
బోనకల్: మారుతున్న పరిస్థితుల నేపథ్యాన సమాజానికి కమ్యూనిస్టులే రక్ష అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తెలిపారు. మండలంలోని జనరల్ బ్రాహ్మణపల్లిలో ఏలూరి రమేష్ అధ్యక్షతన శుక్రవారం జరిగిన పార్టీ శ్రేణుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్షా కార్పొరేట్ అనుకూల పాలన సాగిస్తుండడమే కాక కాంగ్రెస్ కంటే కమ్యూనిస్టులపైనే ఎక్కువ దుష్ప్రచారం చేస్తున్నారని తెలిపారు. హామీలను పక్కనపెట్టి వ్యవసాయం, పారిశ్రామిక రంగాలపై వివక్ష కనబరుస్తున్నారని ఆరోపించారు. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు, వాగ్దానాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. కాగా, ప్రాంతీయ విబేధాలను రెచ్చగొట్టడం ద్వారా లబ్ధి పొందాలనే వారికి సీపీఐ తగిన సమాధానం చెబుతుందని కూనంనేని పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాడుతూనే, స్థానిక సంస్థల ఎన్నికల్లో బలానికి అనుగుణంగా శ్రేణులు పోటీ చేయాలని సూచించారు. తొలుత సీపీఐ పతాకాన్ని తెలంగాణ సాయుధ పోరాట యోదుడు పారుపల్లి రాఘవయ్య ఆవిష్కరించారు. ఇంకా ఈ సమావేశంలో పార్టీ జిల్లా, మండల కార్యదర్శులు దండి సురేష్, యంగల ఆనంద్రావు, నాయకులు జమ్ముల జితేందర్రెడ్డి, ఏనుగు గాంధీ, తూము రోషన్కుమార్, జక్కుల రామారావు, పారుపల్లి నరసింహారావు, నాగేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని -
తొలకరి.. పలకరించింది !
ఖమ్మంవ్యవసాయం: జిల్లా వాతావరణంలో శుక్రవారం మార్పులు చోటు చేసుకున్నాయి. ఉపరితల ద్రోణి కారణంగా అక్కడక్కడ వర్షాలు కురిశాయి. దీంతో కొద్ది రోజులుగా అత్యధిక ఉష్ణోగ్రతలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న జిల్లా వాసులకు ఉపశమనం లభించినట్లయింది. తెలంగాణ మీదుగా ఉన్న ఉపరితల ద్రోణి కారణంగా తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ ప్రభావంతో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతుండగా, అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం సాయంత్రం 3గంటల నుంచి సుమారు గంట పాటు పలుప్రాంతాల్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ఏన్కూరులో అత్యధికంగా 36.3 మి.మీ.ల వర్షపాతం నమోదైంది. అలాగే, తిరుమలాయపాలెం మండలం కాకరవాయిలో 25.5, ఖమ్మం ప్రకాష్నగర్లో 20.3, బచ్చోడు, ముదిగొండలో 14, పల్లెగూడెంలో 13, నేలకొండపల్లిలో 10.5, ఖానాపురంలో 6.8, పెద్దగోపతిలో 6.5, తిరుమలాయపాలెంలో 2.3, కూసుమంచి, రఘునాథపాలెం, గౌరారంలో 1.5 మి.మీ. వర్షపాతం నమోదైందని అధికారులు వెల్లడించారు. రోజంతా ఎండ జిల్లా అంతటా శుక్రవారం సాయంత్రం వరకు ఎండ దంచి కొట్టింది. అత్యధికంగా మధిరలో 42.8 డిగ్రీలుగా నమోదైంది. అలాగే, కుర్నవల్లి, ఖానాపురంలో 42.7, ఎర్రుపాలెంలో 42.4, సిరిపురంలో 42.3, పమ్మిలో 42.1, బాణాపురంలో 41.8, చింతకానిలో 41.7, బచ్చోడు, నేలకొండపల్లిలో 41.5, ఖమ్మం ఎన్ఎస్పీ, పల్లెగూడెంలో 41.4, ప్రకాష్నగ ర్ 41.3, రావినూతల, ముదిగొండలో 41.2, గుబ్బ గుర్తిలో 41.1, కొణిజర్ల, తిమ్మారావుపేట, పెనుబల్లి, గంగారంలో 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైంది. కానీ ఆ తర్వాత వాతావరణంలో మార్పులతో వర్షం కురవగా జనం ఊపిరి పీల్చుకున్నారు. -
అంచనాలతోనే సరి..
ఖమ్మంమయూరిసెంటర్: పేద, వెనుకబడిన వర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు వసతి కల్పించాలనే ప్రభుత్వ లక్ష్యం క్షేత్రస్థాయిలో నీరుగారుతోంది. జిల్లాలోని ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలు సమస్యలుగా నిలయాలుగా మారడంతో ఈ పరిస్థితి నెలకొంది. ప్రతీసారి మరమ్మతుల పేరిట అంచనాలు సిద్ధం చేస్తున్నా సమస్యల పరిష్కారానికి పూనుకోకపోవడంపై విమర్శలు వస్తున్నారు. ప్రత్యేక అధికారులు, ఇంజనీర్లు వసతిగృహాల్లో సమస్యలు, చేపట్టాల్సిన మరమ్మతులపై ఉన్నతాధికారులకు నివేదికలు ఇస్తున్నా.. పరిష్కారం దక్కడం లేదు. రెండేళ్లుగా అదే తంతు.. జిల్లాలోని పలు సంక్షేమ వసతి గృహాల్లో కనీస సౌకర్యాలు కరువై, భవనాలు దెబ్బతిన్న విషయాన్ని అధికారులు గుర్తించి దాదాపు రెండేళ్లు కావొస్తోంది. ఏయే మరమ్మతులు చేపట్టాలి, మరుగుదొడ్లు, తాగునీరు, విద్యుత్ సౌకర్యాల పునరుద్ధరణకు ఎంత ఖర్చవుతుందనే అంశంపై ఇంజనీరింగ్ అధికారులతో కలిసి అంచనాలు తయారుచేశారు. ఒక్కో శాఖకు సంబంధించి రూ.20 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు నిధులు అవసరమని ప్రతిపాదించినా నిధులు మాత్రం విడుదల కాలేదు. ఇక గిరిజన వసతిగృహాలకు సంబంధించి స్వయంగా ఐటీడీఏ పీఓ పరిశీలన చేసినప్పటికీ ఆ సమస్యలు పరిష్కారం కాలేదని తెలుస్తోంది. ప్రతిపాదనలు పంపడమే తప్ప నిధులు మంజూరు చేయించడంలో స్థానిక యంత్రాంగం విఫలమవుతుందనే ఆరోపణలు వస్తున్నాయి. భయం గుప్పిట్లో విద్యార్థులు గత కొన్నేళ్లుగా హాస్టల్ భవనాల నిర్వహణ లోపించి గోడలు బీటలు వారాయి. వర్షాకాలం వస్తే పైకప్పు నుంచి నీరు కారుతూ విద్యార్థులు నిద్రలేని రాత్రులు గడపాల్సి వస్తోంది. అంతేకాక పలు హాస్టళ్లలో మరుగుదొడ్లు, స్నానాల గదుల తలుపులు ఊడిపోయి, అపరిశుభ్రంగా మారాయి. అలాగే, విద్యుత్ వైరింగ్ దెబ్బతిని ప్రమాదకరంగా మారగా.. వసతిగృహాలు రంగులు వెలిసిపోయి కళ కోల్పోయాయి. ఈనెల 12 నుండి ప్రభుత్వ సంక్షేమ వసతిగృహాలు తెరుచుకోనున్నప్పటికీ మరమ్మతులు చేయకపోవడంతో ఈసారి కూడా విద్యార్థులు సమస్యలతో సహజీవనం చేయాల్సిన పరిస్థితి నెలకొంది. మళ్లీ గుర్తింపు! గతంలో తయారు చేసిన అంచనాలు ఏమయ్యాయో తెలియదు కానీ ప్రస్తుతం అధికారులు వసతి గృహాల్లో చేపట్టాల్సిన మరమ్మతులను గుర్తించే పనిలో పడ్డారు. కొత్త విద్యాసంవత్సరం ప్రారంభమవుతున్న నేపథ్యాన ఎస్సీ, ఎస్టీ, బీసీ వసతి గృహాల్లో అత్యవసరంగా చేపట్టాల్సిన పనుల జాబితా సిద్ధం చేస్తున్నారు. రెండు రోజులుగా జిల్లాలోని సంక్షేమ వసతిగృహాల్లో పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులు పనులను గుర్తిస్తున్నారు. అత్యవసరంగా చేయాల్సిన పనులు, వారం పది రోజుల్లో పూర్తి చేయాల్సిన పనులు అంటూ రెండు, మూడు జాబితాలను రూపొందిస్తున్నారు. -
కృతజ్ఞతాభావం..
నేను రాసిన కథఅశ్వారావుపేట రూరల్: ఒక రాజ్యంలో కాంతవర్మ అనే రాజు పాలన చేసేవాడు. ఆయన కోపిష్టి కావడంతో ఎవరు ఏ చిన్న తప్పు చేసినా కఠినంగా శిక్షించేవాడు. రాజుగారి మామిడి తోటలో పనిచేసే శాంతయ్య అనే తోటమాలి మామిడి కాయల లెక్క పొరపాటుగా తప్పు చెప్పాడు. రాజుగారికి ఈ విషయం తెలిస్తే శిక్ష తప్పదని భావించి శాంతయ్య పారిపోతాడు. ఆ తర్వాత ఈ విషయం తెలిసిన రాజు.. శాంతయ్యను పట్టుకురమ్మని తన భటులను ఆజ్ఞాపిస్తాడు. దీంతో భటులు వెంబడిస్తుండగా శాంతయ్య పరుగులు తీస్తాడు. కొంత దూరం పరిగెత్తాక దాహంతో చెరువు వద్ద ఆగగా భటులు దగ్గరగా రావడంతో మళ్లీ పరుగు మొదలుపెడతారు. ఎదురుగా గుహ కనిపించడంతో అందులో దాక్కుందామని వెళ్తే సింహం కనిపిస్తుంది. వెనక్కి వెళ్తే భటులు.. ముందుకు వెళ్దామంటే సింహం ఉండడంతో ఏం చేయాలో పాలుపోక శాంతయ్య ఆలోచిస్తుంటాడు. శిక్ష కంటే ఇదే మేలని.. ఇంతలోనే ఎదురుగా ఉన్న సింహం శాంతయ్యను గమనించి దగ్గరకు రమ్మని సైగ చేస్తుంది. భటులకు చిక్కితే రాజు కఠినంగా శిక్షిస్తాడు.. అంతకంటే సింహానికి ఆహారంగా మారడమే మేలు అనుకుని ఆయన దగ్గరకు వెళ్తాడు. ఆ సింహం శాంతయ్యకు తన కాలుని చూపిస్తుంది. కాలికి గాయమై రక్తం కారుతుండడాన్ని గమనించిన శాంతయ్య అక్కడి చెట్టు ఆకులను కోసి పసరు తీసి కట్టుకడతాడు. రెండు రోజులు అలాగే కడుతూ అక్కడే ఉంటాడు. మూడో రోజున ఆకలి తీర్చుకునేందుకు సమీపంలోని చెట్టు పండ్లు కోసుకునేందుకు వెళ్తాడు. ఈ విషయాన్ని భటులు గమనించి రాజుకు చెబుతారు. దీంతో రాజు ఆదేశాలతో శాంతయ్య బంధించి తీసుకెళ్లగా ఆయనకు సింహ భక్షణ శిక్ష విధిస్తాడు. ఆపై భటులు ఒక బోనులో సింహాన్ని ఉంచి అందులోకి శాంతయ్యను పంపిస్తారు. ఆపై సింహం గర్జిస్తూ శాంతయ్య దగ్గరకు రావడంతో ఆయన భయపడుతుండగా అది మాత్రం శాంతయ్య చుట్టూ తిరుగుతూ ఒంటిని ప్రేమగా నాకుతుంది. ఇది చూసి రాజు, ప్రజలంతా ఆశ్చర్యపోతారు. శాంతయ్య మాత్రం తాను వైద్యం చేసిన సింహం అదేనని గుర్తించి అది ప్రేమ చూపించిందని భావించగా.. రాజు వద్ద ఇన్నేళ్లు సేవలు చేసిన చిన్న తప్పుకే చంపాలని చూస్తున్నాడని అనుకుంటూ సింహానికి మనసులో కృతజ్ఞత తెలుపుకుంటాడు. ఆపై రాజు వివరాలు ఆరా తీయగా శాంతయ్య ఏనాడూ తాను తప్పు చేయలేదని.. మామిడికాయల లెక్క రోజున తన కూతురికి జ్వరం రావడంతో కంగారు పడ్డాడని చెప్పాడు. దీంతో మృగమే కృతజ్ఞత చూపించినప్పుడు తాను మాత్రం ఆవేశం చూపించడం సరికాదని గ్రహించిన రాజు అప్పటి నుంచి కోపాన్ని తగ్గించుకోవడం మొదలుపెట్టాడు.నీతి : మనం చేసిన మేలు ఎప్పటికై నా కృతజ్ఞతగా తిరిగి వస్తుంది. -
టీటీడీకి 20 ఎకరాల స్థలం అప్పగింత
ఖమ్మం అర్బన్: తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఆధ్వర్యాన ఖమ్మం అల్లీపురంలో శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే ఆలయ నిర్మాణానికి టీటీడీ అంగీకరించగా, అధికారులు స్థల పరిశీలన పూర్తిచేశారు. ఆపై స్థలాన్ని కేటాయిస్తూ రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఆమోదించారు. ఈనేపథ్యాన టీటీడీకి ధంసలాపురం రెవెన్యూ పరిధి సర్వే నంబర్ 408లో కేటాయించిన 20.04ఎకరాల భూమికి ఖమ్మం అర్బన్ సర్వేయర్ నాగేశ్వరరావు, ఆర్ఐ సత్యనారాయణ ఆధ్వర్యాన శుక్రవారం హద్దులు నిర్ధారించారు. ఆపై స్థలపత్రాలను టీటీడీ సర్వేయర్ హరినాథ్, ఉద్యోగులు చెలికాని జగన్మోహన్రావు, బాలాజీకి అప్పగించారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ రావూరి సైదుబాబు తదితరులు పాల్గొన్నారు. -
బీఎస్ఎన్ఎల్ పునర్వైభవానికి కృషి
ఖమ్మంమయూరిసెంటర్: ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో బీఎస్ఎన్ఎల్ సేవలు మెరుగయ్యేలా చూస్తూ పునర్వైభవానికి కలిసికట్టుగా కృషి చేస్తామని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, ఖమ్మం లోక్సభ సభ్యుడు రామసహాయం రఘురాంరెడ్డి స్పష్టం చేశారు. ఖమ్మంలోని బీఎస్ఎన్ఎల్ భవన్లో శుక్రవారం నిర్వహించిన టెలికాం అడ్వైజరీ కమిటీ(టీఏసీ) సమావేశంలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ వద్దిరాజు మాట్లాడుతూ గత ఏడాది రూ.13.90 కోట్ల నష్టాల్లో ఉన్న బీఎస్ఎన్ఎల్ ఈ ఏడాది రూ.8.6కోట్ల లాభాల్లోకి వచ్చిందని, వచ్చే ఏడాది రూ.25 కోట్లకు పెరిగేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. కేంద్రప్రభుత్వం తీరు ప్రైవేట్ సంస్థలకు లబ్ధి జరిగేలా ఉందని, దేశమంతా 5జీ వైపు దూసుకువెళ్తుంటే బీఎస్ఎన్ఎల్లో మాత్రం 4జీ, 5జీ ప్రక్రియను ఆలస్యం చేస్తోందని విమర్శించారు. ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి మాట్లాడుతూ ఐటీ, టెలికమ్యూనికేషన్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా తాను సమస్యలపై నిరంతరం ప్రశ్నిస్తూనే ఉన్నానని తెలిపారు. గుండా ల తదితర అటవీ, ఏజెన్సీ ప్రాంతాల్లో సిగ్నల్ వ్యవస్థ మెరుగుపడేలా టవర్లను అప్గ్రేడ్ చేయాలని, అవసరమైన చోట కొత్త టవర్ల ఏర్పాటుకు అటవీ అనుమతులు వచ్చేలా రెండు జిల్లాల కలెక్టర్లతో మాట్లాడతానని చెప్పారు. బీఎస్ఎన్ఎల్ అధికారులు పూర్తి వివరాలతో నివేదిక ఇస్తే కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్లి నిధులు సాధిస్తామని తెలిపారు. అనంతరం ఎంపీలను, టీఏసీ సభ్యులు అధికారులు సత్కరించారు. ఈ సమావేశంలో సంస్థ ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ పి.వెంకటేశం, టీఏసీ సభ్యులు యాస వెంకటేశ్వర్లు, షేక్ ఇమామ్, పల్లెల రామలక్ష్మయ్య, మచ్చ రామారావు, బోదాసు కనకరాజు, బానోత్ రంజిత్కుమార్, ఉమ్మినేని కృష్ణ, అమరవాయి సత్యనారాయణరెడ్డి, అధికారులు పాల్గొన్నారు.టీఏసీ సమావేశంలో ఎంపీలు వద్దిరాజు, రఘురాంరెడ్డి -
ప్లాస్టిక్ నిర్మూలనతోనే పర్యావరణ పరిరక్షణ
● డీఎఫ్ఓ అనూజ్ అగర్వాల్ తల్లాడ/సత్తుపల్లి టౌన్: ప్లాస్టిక్ను నిర్మూలించడంతో పాటు విరివిగా మొక్కలు నాటితేనే పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందని జిల్లా అటవీ శాఖాధికారి అనూజ్ అగర్వాల్ తెలిపారు. తల్లాడ మండలం గూడూరు బీట్లో హైడెన్సిటీ ప్లాంటేషన్లో భాగంగా శుక్రవారం ఆయన మొక్కలు నాటి మాట్లాడారు. కాలుష్య నివారణకు ప్రతిఒక్కరూ మొక్కలు నాటడంతో పాటు సంరక్షించాలని సూచించారు. అనంతరం గూడూరు వన సంరక్షణ సమితి సభ్యులు తయారు చేసిన ప్లాస్టిక్ రహిత విస్తరాకులను పరిశీలించి అభినందించారు. ఆపై మువ్వ గూడూరు నుంచి వెంకట్రామునితండా వరకు ర్యాలీ నిర్వహించారు. తల్లాడ ఫారెస్ట్ రేంజ్ అదికారి ఉమ, వెంగన్నపేట సర్పంచ్ బి.మౌనిక, డీఆర్ఓలు రవికుమార్, సురేష్కుమార్, ఎఫ్ఎస్ఓ కిషోర్, ఎఫ్బీఓ ఉమామహేశ్వర్, ఉద్యోగులు అజమ్ ఆలీ, స్వాతి, బీమా, చందర్, అరుణ, లావణ్య, రమేష్, వీరభద్రం, మస్తాన్, కేశవ్, పుల్లాచారి, శ్రీకాంత్, లక్ష్మి పాల్గొన్నారు. అనంతరం డీఎఫ్ఓ సత్తుపల్లిలోని ఫారెస్ట్ డివిజనల్ కార్యాలయాన్ని సందర్శించి నీలాద్రి అర్బన్పార్క్, ఇతర అభివృద్ధి పనులపై చర్చించారు. రేంజర్ సీహెచ్.ఎల్లయ్య, ఏఓ స్వామి, డీఆర్ఓ నాగరాజు, వైల్డ్ లైఫ్ ఎక్స్పర్ట్ దీపక్ పాల్గొన్నారు. కొత్త విద్యాసంవత్సరానికి సిద్ధం కావాలి నేలకొండపల్లి: కొత్త విద్యాసంవత్సరంలో విద్యార్థులకు మెరుగైన బోధన అందించేందుకు ఉపాధ్యాయులు సిద్ధం కావాలని గురుకులాల మల్టీజోనల్ ఆఫీసర్ అరుణకుమారి సూచించారు. నేలకొండపల్లి మండలం సింగారెడ్డిపాలెంలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలను శుక్రవారం ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులు, గురుకులంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించాక అధ్యాపకులతో సమావేశమయ్యారు. ఎస్సెస్సీ, ఇంటర్లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థినుల ఫొటోలతో ఫ్లెక్సీ ఏర్పాటుచేయడాన్ని అభినందించిన అరుణకుమారి, ఇలాంటి కార్యక్రమాలు ప్రభుత్వ విద్యాసంస్థలపై నమ్మకాన్ని పెంచుతాయని తెలిపారు. గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీలత తదితరులు పాల్గొన్నారు. ఈనెల 20నుంచి గెలల సేకరణ వేంసూరు: మండంలోని కల్లూరుగూడెంలో నిర్మిస్తున్న పామాయిల్ ఫ్యాక్టరీ వద్ద ఈ నెల 20నుంచి ఆయిల్ పామ్ గెలలు సేకరించనున్నట్లు సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి తెలిపారు. ఫ్యాక్టరీ పనులను శుక్రవారం పరిశీలించిన ఆమె మాట్లాడారు. ఈ ఏడాదిలోనే ఫ్యాక్టరీ రైతులకు అందుబాటులోకి రానుందని, తద్వారా రైతులకు దూరాభారం తప్పుతుందని తెలిపారు. కాగా, వాతావరణ పరిస్థితులు దృష్ట్యా సంప్రదాయ పంటలకు బదులు ఆయిల్పామ్ తదితర ప్రత్యామ్నాయ పంటలపై రైతులు దృష్టి సారించాలని సూచించారు. మార్కెట్ చైర్మన్ ఆనంద్ బాబు, ఆయిల్ఫెడ్ మేనేజర్ పవన్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కాసరి చంద్రశేఖర్రెడ్డి, నాయకులు డాక్టర్ మట్టా దయానంద్, పుచ్చకాయల సోమిరెడ్డి, మందపాటి రాఘవరెడ్డి, కనమతరెడ్డి రంగరెడ్డి, భానుప్రకాష్ పాల్గొన్నారు. విధుల్లో చేరిన డీఈఓ ఖమ్మం సహకారనగర్: గత ఇరవై రోజులుగా సెలవులో ఉన్న జిల్లా విద్యాశాఖాధికారి చైతన్యజైనీ శుక్రవారం విధుల్లో చేరారు. విద్యాసంవత్సరం మొదలుకానున్న నేపథ్యాన ఆమె పాఠశాలల్లో జరుగుతున్న పనులు, ఇతర కార్యకలాపాలపై దృష్టి సారించనున్నారు. -
నైతిక విలువలపై శిక్షణ
పాల్వంచ: వేసవి సెలవుల్లో పిల్లలకు నైతికల విలువలు నేర్పించడమే కాక సృజన్మాతకత వెల్లివిరిసేలా పలు ప్రధాన చర్చిల్లో వీబీఎస్(ఒకేషనల్ బైబిల్ స్కూల్) తరగతులను నిర్వహిస్తున్నారు. పిల్లలను ఆధ్యాత్మిక బాట పట్టించడమే కాక సామాజిక స్పృ హ పెరిగేలా ఈ తరగతులు తోడ్పడుతున్నాయి. ఆట పాటలతో కూడిన బోధన సాగుతుండడంతో వారు సంతోషంగా, ఉత్సాహంగా హాజరవుతున్నారు. అందరికీ ప్రవేశం సమ్మర్ క్యాంపుల్లో పిల్లలు నేర్చుకునే విషయాలు వారు సమాజంలో బాధ్యతాయుతమైన, ఉత్తమమై న వ్యక్తులుగా ఎదగడానికి తోడ్పడుతాయని చెబుతున్నారు. 4–15 వయస్సు కలిగిన చర్చి సభ్యులే కాకుండా సమాజంలో పిల్లలందరికీ ప్రవేశం కల్పిస్తున్నారు. దీంతో పాటలు, నృత్యం నేర్చుకోవడమే కాక చిన్న వస్తువులు, గ్రీటింగ్ కార్డులు తయారుచేయడం, చిత్రాలు గీయడంపై శిక్షణ ఇస్తూ ఆటలు, క్విజ్, జ్ఞాపకశక్తి పోటీలు నిర్వహిస్తున్నారు. ఇవికాక మంచి నడవడిక, క్రమశిక్షణ, నిజాలే మాట్లాడడం, పెద్దలను గౌరవించడం, ఇతరులకు సహాయం చేయడం, క్షమించే గుణం వంటి నైతిక విలువలను నేర్పిస్తున్నారు. తద్వారా నిజాయితీ, క్షమాగుణం, ప్రేమ, కరుణ, ఇతరులను గౌరవించడం వంటి లక్షణాలు అలవాటవుతాయని, ఇతర పిల్లలతో కలిసి ఉండడంతో వల్ల కొత్త స్నేహాలు ఏర్పడి నలుగురితో ఎలా కలిసిపోవాలో తెలుస్తుందని చెబుతున్నారు.చర్చిల్లో ప్రత్యేక వీబీఎస్ తరగతులు పిల్లలు చెడు స్నేహాలకు దగ్గరైతే అంతే త్వరగా చెడు అలవాట్లకు ఆకర్షితులవుతారు. అందుకే పిల్లలు, యువతను మంచి మార్గంలో నడిపించాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉంది. ఆధ్యాత్మిక మార్గంలో నడిపించడమే కాక సామాజిక చైతన్యం కల్పించి సృజనాత్మకతను వెలికి తీసేలా శిక్షణ తరగతులు దోహదం చేస్తున్నాయి. – పాస్టర్ కె.టైటస్ లివింగ్ వాటర్, ఎల్జీఎం చర్చి నిర్వాహకులు -
వాతావరణ ం
జిల్లాలో శనివారం ఉదయం ఎండ ప్రభావం తక్కువగానే ఉంటుంది. మధ్యాహ్నానికి పెరిగినా సాయంత్రం మళ్లీ చల్లబడుతుంది.వర్షాకాలంలో ఖమ్మం నగరాన్ని డ్రెయినేజీ సమస్య వేధిస్తోంది. చిన్న వర్షం కురిసినా డ్రెయినేజీల్లో నీరు సాఫీగా సాగక రోడ్లపైకి చేరుతోంది. దీన్ని అధిగమించేలా నగరంలోని 60 డివిజన్లలో రూ.50 కోట్లతో సీసీ రోడ్లు, డ్రెయినేజీల నిర్మాణం చేపట్టారు. అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్(యూఐడీఎఫ్) కింద 37 పనులకు రూ.50 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. ఐటీ హబ్ నుంచి సీఆర్జీ టవర్స్ వద్ద కల్వర్ట్ వరకు రూ.1.66 కోట్లతో ఫుట్పాత్ నిర్మాణం, ఎఫ్సీఐ గోడౌన్ నుంచి బైపాస్ రోడ్డు వరకు రూ.1.15 కోట్లతో సీసీ డ్రెయిన్ నిర్మాణం తదితర పనులు మొదలుకాగా, ఇంకొన్ని ప్రారంభం కావాల్సి ఉంది. మరోపక్క ప్రత్యేక గ్రాంట్ల కింద నగరాభివృద్ధికి ప్రభుత్వం మరో రూ.15కోట్లు కేటాయించింది. ఈ నిధులతో చేపట్టే పనులన్నీ వర్షాలు జోరందుకునేలా పూర్తి చేయాలని పలుమార్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. తాజాగా జరిగిన సమీక్షలోనూ మంత్రి ఇదే సూచన చేసిన నేపథ్యాన.. వర్షాలు ముంచెత్తినా పనులు పూర్తికాకపోతే ప్రజలకు గత ఇబ్బందులే పునరావృతం కానున్నాయి. -
రోడ్డు ప్రమాదంలో వార్డుసభ్యుడు మృతి
చింతకాని: ఇసుక టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యం, అతివేగంతో వార్డుసభ్యుడు మృతి చెందగా.. మరో వ్యక్తికి తీవ్రగాయాలైన ఘటన చింతకాని మండలం పందిళ్లపల్లిలో శుక్రవారం తెల్లవారుజామున జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చింతకాని 10వ వార్డు సభ్యుడు, కాంగ్రెస్ నాయకుడు మాతంగి నాగరాజు(32) తన స్నేహితుడు లింగాల మహేందర్తో కలిసి ఖమ్మం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బంధువులను చూసేందుకు బైక్పై గురువారం రాత్రి వెళ్లాడు. శుక్రవారం తెల్లవారుజామున తిరిగి వస్తుండగా పందిళ్లపల్లి సబ్స్టేషన్ వద్ద బోనకల్ వైపు నుంచి ఖమ్మం ఇసుక లోడుతో వెళ్తున్న టిప్పర్ ఢీకొట్టడమే కాక ద్విచక్ర వాహనాన్ని కొద్దిదూరం ఈడ్చుకుంటూ వెళ్లింది. దీంతో వాహనం వెనుక కూర్చొన్న నాగరాజు కాళ్ల పైనుంచి టిప్పర్ టైరు వెళ్లటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అలాగే, వాహనం నడుపుతున్న మహేందర్ తల, కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. ఈమేరకు సమాచారం అందుకున్న పోలీసులు 108లో క్షతగాత్రుడిని ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, నాగరాజు సోదరుడు లుకాస్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై వీరేందర్ తెలిపారు. కాగా, నాగరాజుకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. వార్డు నాగరాజు మృతదేహం వద్ద రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, సుడా చైర్మన్ పువ్వాళ్ల దుర్గాప్రసాద్, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నూతి సత్యనారాయణ గౌడ్ తదితరులు నివాళులర్పించి కుటుంబీకులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో మత్కేపల్లి మార్కెట్ చైర్మన్ అంబటి వెంకటేశ్వరరావు, కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శులు కొప్పుల గోవిందరావు, అబ్దుల్ నబీ, మండల అధ్యక్షుడు కన్నెబోయిన గోపీ, సర్పంచ్ కిలారు మనోహర్బాబు తదితరులు పాల్గొన్నారు.బైక్ను ఢీకొట్టి ఈడ్చుకెళ్లిన ఇసుక టిప్పర్ -
బకాయిల సాధనకు ఆందోళనలు
ఖమ్మంరూరల్: రాష్ట్రంలో కాంట్రాక్టర్లకు రూ.వేల కోట్ల బిల్లులు పెండింగ్లో ఉన్నాయని, తద్వారా తమకు ఎదురవుతున్న ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకే చలో హైదరాబాద్కు పిలుపునిచ్చామని బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(బీఏఐ) నాయకులు, కాంట్రాక్టర్లు వెల్లడించారు. ఈమేరకు ఏదులాపురంలోని ఓ ఫంక్షన్హాల్లో శుక్రవారం బీఏఐ ఆల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ డీవీఎన్.రెడ్డి, రాష్ట్ర చైర్మన్ శ్రీనివాసరావు, కార్యదర్శి పవన్, కోశాధికారి సంతోష్రెడ్డి, కిసాన్ శ్రీనివాసరావు, ఖమ్మం చైర్మన్ కిశోర్ తదితరులు కార్యక్రమ పోస్టర్లు ఆవిష్కరించి మాట్లాడారు. కొన్నేళ్లుగా వివిధ ప్రభుత్వ శాఖల నుంచి బిల్లులు రాక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. కొందరికి మాత్రం బిల్లులు అందుతుండగా, మిగతా రూ.వందల కోట్ల పనులు చేసిన కాంట్రాక్టర్లకు సమస్యలు వస్తున్నాయని చెప్పారు. ఈకారణంగా స్కిల్డ్, నాన్ స్కిల్డ్ కార్మికులు, వారి కుటుంబాలు వీధిన పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాక పలువురు కాంట్రాక్టర్లు గుండెపోటుతో మృతి చెందగా, ఇంకొందరు బలవన్మరణానికి పాల్పడ్డారని తెలిపారు. ప్రభుత్వానికి తాము వ్యతిరేకం కాదని, పనుల ఆధారంగానే బిల్లులు చెల్లించాలని కోరుతున్నట్లు చెప్పారు. అంతేకాక బిల్లుల చెల్లింపు వివరాలు తెలుసుకునేందుకు సమాచార హక్కు చట్టం ద్వారా దరఖాస్తు చేసుకున్నా ఫలితం లేకపోగా, వెబ్సైట్ను కూడా మూసివేశారని వాపోయారు. విధిలేని పరిస్థితుల్లో బిల్లుల సాధన కోసం ఈనెల 18న చలో హైదరాబాద్కు పిలుపునిచ్చిన నేపథ్యాన ఉమ్మడి జిల్లా నుంచి బిల్డర్స్ అసోసియేషన్ ప్రతినిధులు, కాంట్రాక్టర్లు తరలిరావాలని కోరారు. ఈ కార్యక్రమంతో కూడా ప్రభుత్వం నుంచి స్పందన రాకపోతే దశలవారీగా ఆందోళనలు చేపడతామని వారు హెచ్చరించారు.బీఏఐ రాష్ట్ర నాయకులు, కాంట్రాక్టర్ల వెల్లడి -
ఐటీఐ ప్రిన్సిపాల్గా సక్రు
ఖమ్మం సహకారనగర్: ఖమ్మంలోని టేకులపల్లిలోని ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపాల్గా సక్రు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ ప్రిన్సిపాల్గా ఉన్న ఏ.శ్రీనివాసరావు మధిర ఐటీఐకి బదిలీ అయ్యారు. ఆ స్థానంలో హన్మకొండ ప్రిన్సిపాల్ సక్రును నియమించగా ఆయన విధుల్లో చేరారు. ఫర్టిలైజర్ షాపుల్లో టాస్క్ఫోర్స్ తనిఖీలు ఖమ్మంవ్యవసాయం: వానాకాలం సాగు సీజన్ సమీపించడంలో నకిలీ విత్తనాలు మార్కెట్లోకి రాకుండా టాస్క్ఫోర్స్ తనిఖీలు మొదలుపెట్టాయి. ఈమేరకు ఖమ్మంలోని పలు విత్తన దుకాణాలు, గోదాముల్లో పోలీసు, వ్యవసాయ శాఖలకు చెందిన టాస్క్ఫోర్క్ అధికారుల బృందం శుక్రవారం తనిఖీ చేసింది. పత్తిలో ప్రభుత్వం బీటీ–2 పత్తి విత్తనాలకు అనుమతి ఇవ్వగా కొందరు హెచ్టీ కాటన్(బీటీ–3) విత్తనాలను అమ్ముతున్నారనే ఫిర్యాదులతో నిశితంగా పరిశీలించారు. అంతేకాక విత్తన దుకాణాల లైసెన్సులు, స్టాక్ను పరిశీలించి నిర్వాహకులకు సూచనలు చేశారు. బృందంలో ఖమ్మం ఏడీఏ కొంగర వెంకటేశ్వరరావు, ఖమ్మం అర్బన్ ఏఓ బలుసు కిషోర్బాబు, టాస్క్ఫోర్స్ సీఐ వి.ఉదయ్కుమార్, ఎస్ఐ సి.రవి పాల్గొన్నారు. చిన్నారి ఆరోగ్యంపై ఎమ్మెల్యే ఆరా వైరారూరల్: ఖమ్మం జనరల్ ఆస్పత్రిలోని ఎంసీహెచ్ వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా వైరా మండలంలోని పుణ్యపురానికి చెందిన రేణుక నెలల కుమారుడు మోహన్ రుద్రాక్ష చేయి తొలగించిన విషయం విదితమే. ఈమేరకు కొత్తగూడెం గొల్లగూడెంలో ఉంటున్న రేణుకను శుక్రవారం ఎమ్మెల్యే మాలోతు రాందాస్నాయక్ పరామర్శించి చిన్నారి చికిత్స ఆరోగ్య వివరాలు తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్తో ఫోన్లో మాట్లాడి ఘటనకు కారకులైన వైద్యులు, సిబ్బందిపై చర్యలు తీసుకోవా లని కోరారు. అలాగే, చిన్నారి వైద్యఖర్చులు భరించడంతో పాటు కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగం కోసం ప్రభుత్వానికి సిఫారసు చేస్తానని తెలిపారు. వైరా మున్సిపల్ వైస్ చైర్మన్ కట్ల సంతోష్, నాయకులు వెంగళ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. జామాయిల్ తోట దగ్ధం కారేపల్లి: మండలంలోని బొక్కలతండా స్టేజీ సమీపాన రైతు వాకుండోత్ గన్యాకు చెందిన జామాయిల్ తోటకు నిప్పంటుకుని పూర్తిగా దగ్ధమైంది. గ్రామంలో శుక్రవారం సాయంత్రం గాలిదుమారానికి విద్యుత్ వైర్లు రాసుకుని షార్ట్సర్క్యూట్ ఏర్పడడంతో నిప్పు రవ్వలు తోటపై పడి మంటలు మొదలయ్యాయి. సమీప రైతులు గమనించి ఇచ్చిన సమాచారంతో అగ్నిమాపక శాఖ సిబ్బంది చేరుకుని మంటలు ఆర్పేలోగానే తోట కాలిపోయింది. ఘటనలో రూ.3 లక్షల మేర ఆస్తినష్టం జరిగినందున ప్రభుత్వం ఆదుకోవాలని రైతు గన్యా కోరాడు. -
డీసీసీబీలో వివాదాస్పదంగా క్లస్టర్ల వ్యవస్థ
ఖమ్మంవ్యవసాయం: జిల్లా కేంద్ర సహకార బ్యాంక్(డీసీసీబీ) ప్రవేశపెట్టిన క్లస్టర్ల సూపర్వైజర్ల వ్యవస్థ వివాదాస్పదంగా మారింది. మునుపెన్నడూ లేనివిధంగా ప్రతీ నాలుగు నుంచి ఐదు పీఏసీఎస్ల లావాదేవీలు, రుణ స్థితిగతులను పర్యవేక్షించేందుకు ఒక క్లస్టర్ సూపర్వైజర్(స్టాఫ్ అసిస్టెంట్)ను సీఈఓ ఎన్.వెంకట్ ఆదిత్య నియమించారు. ఇప్పటికే ప్రతీ బ్యాంకు బ్రాంచిలో ఒక స్టాఫ్ అసిస్టెంట్ ఆ పరిధిలోని లావాదేవీలను పర్యవేక్షిస్తున్నారు. మళ్లీ కొత్తగా క్లస్టర్ సూపర్వైజర్ల వ్యవస్థను తీసుకురావడాన్ని ఉద్యోగ సంఘాలు, తెలంగాణ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్(టీసీసీబీఈఏ) వ్యతిరేకిస్తోంది. ఈ విధానాన్ని ఉపసంహరించుకోవాలని సీఈఓను కోరినా ఫలితం లేక రెండు రోజులుగా డీసీసీబీ ప్రధాన కార్యాలయం, బ్రాంచ్ల ఎదుటభోజన విరామ సమయంలో ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలుపుతున్నారు. సర్వీస్ నిబంధనలకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన క్లస్టర్ల వ్యవస్థను వెనక్కి తీసుకోకపోతే ఆందోళనను తీవ్రతరం చేస్తామని ప్రతినిధులు హెచ్చరిస్తున్నారు. టీసీసీబీఈఏ జిల్లా కార్యదర్శి ఎం.రామకృష్ణ, డీసీబీఈయూ జిల్లా కార్యదర్శి బి.రవికుమార్, ఉద్యోగులు పాల్గొన్నారు. పోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలుశిక్ష ఖమ్మం లీగల్/రఘునాథపాలెం: మాయమాటలతో బాలికను ఇంటి నుంచి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడిన కేసులో నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.30 వేల జరిమానా విధిస్తూ తీర్పు వెలువడింది. ఖమ్మం జిల్లా పోక్స్–1 కోర్టు ఇన్చార్జ్ న్యాయాధికారి, మొదటి అదనపు జిల్లా న్యాయాధికారి బాకరాజు శ్రీనివాసరావు శుక్రవారం వెలువరించిన ఈ తీర్పు వివరాలిలా ఉన్నాయి. మండలంలోని గణేశ్వరం గ్రామానికి చెందిన మాలోత్ హుస్సేన్ ఓ బాలికను ఇంటి నుంచి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆమె తల్లిదండ్రులు 2024 ఏప్రిల్ 25న ఫిర్యాదు చేయగా పోక్సో కేసు నమోదైంది. ఈమేరకు సాక్ష్యాలు, వైద్య నివేదికల ఆధారంగా చార్జిషీట్ దాఖలు చేయడంతో విచారణ అనంతరం నిందితుడిపై అభియోగాలు రుజువు కాగా జైలుశిక్ష, జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ తరఫున వాదించిన ఏపీపీ శరత్కుమార్రెడ్డి, విచారణ చేపట్టిన నాటి, ప్రస్తుత సీఐలు శ్రీహరి, ఉస్మాన్ షరీఫ్, భరోసా లీగల్ ఆఫీసర్ ఎం.ఉమారాణి, సిబ్బంది సాంబశివరావు, శ్రీకాంత్, చిట్టిబాబును పోలీసు కమిషనర్ సునీల్దత్ అభినందించారు. -
‘గల్లీ’ల నిండా ప్రమాదాలు..!
● ఖమ్మంలో సెట్బ్యాక్ లేకుండానే నిర్మాణాలు ● ఇరుకు సందుల్లో అంతస్తులపై అంతస్తులు ● అగ్నిప్రమాదం జరిగితే ఫైరింజన్ కూడా వెళ్లలేని దుస్థితి ● ఢిల్లీ, అమీర్పేట ఘటనల నుంచి పాఠాలు నేర్వకపోతే కష్టమే.. ఖమ్మంమయూరిసెంటర్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్ తర్వాత అత్యంత వేగంగా విస్తరిస్తూ, ప్రధాన నగరాలతో పోటీ పడుతున్న ఖమ్మం నగరం అభివృద్ధిలో దూసుకెళ్తోంది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నగరంలో వాణిజ్య, వ్యాపార లావాదేవీలు రెట్టింపయ్యాయి. ఇదే వేగాన్ని ఆసరాగా చేసుకుని కొందరు రియల్టర్లు, భవన యజమానులు నిబంధనలను బేఖాతరు చేస్తూ.. నగరంలోని చిన్నచిన్న గల్లీల్లో సైతం భారీ భవనాలను నిర్మిస్తున్నారు. భవనం – భవనానికి మధ్య కనీస ఖాళీ స్థలం(సెట్బ్యాక్) లేకుండా పాత భవనాలను ఆనుకుని కొత్త నిర్మాణాలు చేపడుతున్నారు. ఈ అడ్డగోలు నిర్మాణాల కారణంగా భారీ ప్రమాదాలు జరిగితే కోలుకోలేని నష్టం ఎదురయ్యే అవకాశం ఉండడం ఆందోళనలకు గురిచేస్తోంది. తప్పించుకునే దారి లేకుండా.. నగరంలో కొత్త భవనాల నిర్మాణాల సమయాన కనీస నిబంధనలు పాటించడం లేదు. అత్యవసర పరిస్థితుల్లో లేదా ప్రమాదం జరిగితే భవనాల్లోని ప్రజలు ప్రాణాలు దక్కించుకుని బయటకు తప్పించుకునేందుకు కూడా వీల్లేకుండా ఈ నిర్మాణాలు సాగుతుండడం గమనార్హం. ఒకవేళ అగ్నిప్రమాదం జరిగితే మంటలను ఆర్పే అగ్నిమాపక యంత్రం లోపలికి వెళ్లే పరిస్థితి కూడా కానరావడం లేదు. నాలుగైదు అంతస్తుల భవనాలను నిర్మిస్తే భవనం చుట్టూ ఫైర్ ఇంజన్ తరిగేలా సెట్బ్యాక్ వదలాలి. కానీ ఖమ్మంలో అలాంటివి లేకుండానే భారీ భవనాలను నిర్మిస్తున్నారు. నివాస భవనాలే కాక వాణిజ్య భవనాల్లో ఇదే పరిస్థితి ఉన్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఆ సందులు ఇరుకుమయం.. ఖమ్మంలోని ప్రధాన వ్యాపార కేంద్రాలైన కమాన్బజార్, కస్బాబజార్, అజీజ్ గల్లీతో పాటు వైరా రోడ్డుకు ఇరువైపులా ఉన్న ఇరుకు సందుల్లో వాహనాలు వెళ్లేందుకు కనీస దారి కూడా లేకుండా భవనాలను నిర్మించేశారు. పలుచోట్ల ఫైర్ ఇంజన్ మాటేమో కానీ ద్విచక్ర వాహనాలు కూడా వెళ్లే పరిస్థితి లేదు. సెట్బ్యాక్ లేకుండా నిర్మించిన ఇటువంటి భవనాలపై మున్సిపల్, టౌన్ ప్లానింగ్ అధికారులు కనీసం పట్టింపు కూడా లేకుండా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిర్మాణాలను క్షేత్రస్థాయిలో పరిశీలించాల్సిన అధికారులు ఆ ఊసే ఎత్తడం లేదనే ఆరోపణలున్నాయి. వైరా రోడ్డుకు ఇరువైపుల ఉన్న కొన్ని భవనాల యజమానులు జనరేటర్లను సైతం కార్పొరేషన్ డ్రెయినేజీలపై ఏర్పాటు చేయడం గమనార్హం.ఇది ఖమ్మంలోని అజీజ్ గల్లీ. రెండు వైపులా షాపులు, వాటి ముందు షాపులకు సంబంధించి సామగ్రి. ఆపై షాప్లకు వచ్చే వారి వాహనాలు. కొనుగోళ్లకు వచ్చివెళ్లే వారితో ఇదే కాక మరికొన్ని గల్లీలు నిత్యం రద్దీగా ఉంటాయి. దీంతో కార్లు వంటివి ఏమో కానీ కనీసం ద్విచక్ర వాహనదారులు సాఫీగా వెళ్లలేని పరిస్థితి. ఇక ఇలాంటి గల్లీల్లో ఏదైనా ప్రమాదం జరిగితే సహాయక చర్యలు చేపట్టడం ఎంత కష్టమో ఊహించుకోవచ్చు.™égêV> ÉìlÎÏÌZ° K çßZrÌŒæ-ÌZ fÇW¯]l AW²{ç³-Ð]l*-§ýl…-ÌZ 21Ð]l$…¨ çÜiÐ]l §ýlçßæ-¯]l-Ð]l$-Ķæ*ÅÆý‡$. A…™ól-M>MýS ÉìlÎÏÌZ Csîæ-Ð]lÌS K ´ë™èl ¿ýæÐ]l¯]l… MýS$ç³µ-MýS*-Í…¨. AÌêVóS, Oòßæ§ýl-Æ>»ê§Šæ-ÌZ° AÒ$ÆŠ‡-õ³-rÌZ ¿êÈ AW²{ç³-Ð]l*§ýl… fÇW…¨. D çœ$r¯]l-ÌS¯]l$ E§éçßæ-Ç-çÜ*¢ ¯]lVýS-Æý‡…-ÌZ° °Æ>Ã-×êÌS¯]l$ ^èl*çÜ$¢¯]l² f¯]l… Ð]l×ìæ-MìS-´ù-™èl$-¯é²Æý‡$. CÆý‡$MýS$ çÜ…§ýl$-Ë$, òÜsŒæ-»êÅ-MŠS-Ë$ ÌôæMýS-´ù-Ð]lyýl… Ð]lÌôæÏ AMýSPyýl çÜàĶæ$MýS ^èlÆý‡Å-ÌSMýS$ ¡{Ð]l Br…MýS… HÆý‡µ-yìl…¨. CÌê…sìæ çœ$r¯]l-Ë$ ^èl*OòÜ-¯é A«¨M>Æý‡$-Ë$ MýSâ¶æ$Ï ™ðlÆý‡-ÐéÌS° {ç³fË$ MøÆý‡$-™èl$-¯é²Æý‡$. QÐ]l$Ã…ÌZ ¿ýæÑçÙÅ-™Œæ-ÌZ H {ç³Ð]l*§ýl… fÆý‡-Vö§ýlª-¯]l$-MýS$…sôæ ¿ýæÐ]l¯]l °Æ>Ã-×êÌS A¯]l$-Ð]l$-™èl$-ÌZÏ A«¨M>Æý‡$-Ë$ MýSv¯]l…-V> Ð]lÅÐ]l-çßæ-Ç…^éÌS°, °º…«§ýl-¯]l-Ë$ EÌSÏ…-íœ$…_¯]l ÐéÇOò³ MýSv¯]l ^èlÆý‡Å-Ë$ ¡çÜ$-MøÐéÌS° yìlÐ]l*…yŠæ ^ólçÜ$¢-¯é²Æý‡$. ☻ -
లెక్కలకు రెక్కలు !
‘గల్లీ’ల నిండా ప్రమాదాలు! జిల్లా కేంద్రంలోని పలుచోట్ల ఇరుకు గల్లీల కారణంగా ఏదైనా ప్రమాదం జరిగితే సహాయక చర్యలు చేపట్టే పరిస్థితి కానరావడం లేదు.శుక్రవారం శ్రీ 5 శ్రీ జూన్ శ్రీ 2026ఉమ్మడి జిల్లా పరిధిలో భూముల మార్కెట్ విలువలకు రెక్కలొచ్చాయి. సవరించిన ధరలు శుక్రవారం నుంచి అమల్లోకి రానున్నాయి. వ్యవసాయ, వ్యవసాయేతర భూముల ధరలను 100 శాతం వరకు పెంచగా.. అపార్ట్మెంట్లలో ఫ్లాట్ల ధరలను మాత్రం 20శాతానికి మించకుండా పరిమితం చేశారు. ప్రధానంగా రోడ్లకు ఇరువైపులా, ప్రధాన కూడళ్లలో ఉన్న భూముల విలువ భారీగా పెరిగింది. అయితే సర్వే నంబర్ల ఆధారంగా ధరలు నిర్ణయించడంతో రోడ్డు పక్క భూములకు భారీగా, లోపలి వైపు ఉన్న భూములకు స్వల్పంగా పెరగడంతో ఒకే గ్రామంలో రకరకాల ధరలు అమలవుతాయి. – ఖమ్మంమయూరిసెంటర్ఖమ్మం అర్బన్, సత్తుపల్లి మండలాల పరిధిలోని కొన్ని రెవెన్యూ గ్రామాల్లో వ్యవసాయ భూముల ధర ఎకరానికి ఏకంగా రూ.కోటి దాటింది. ఖమ్మం అర్బన్ మండలం ఖమ్మం, పాకబండ రెవెన్యూ పరిధిలో గతంలో ఎకరా వ్యవసాయ భూమి ధర రూ.84 లక్షలు ఉండగా.. దానిని ఏకంగా రూ.1.26 కోట్లకు పెంచారు. ఇక అత్యల్పంగా ఖమ్మం అర్బన్ మండలం మల్లెమడుగులో రూ.6.75 లక్షలు ఉన్న ధరను రూ.11.12 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. సత్తుపల్లి మండలం అయ్యగారిపేట రెవెన్యూ గ్రామంలో గతంలో రూ.91.48 లక్షలు ఉన్న ఎకరా ధరను ఇప్పుడు రూ.1.14 కోట్లకు పెంచారు. ఇదే గ్రామంలో అత్యల్పంగా రూ.9 లక్షలుగా ఉన్న ధర రూ.18 లక్షలకు చేరింది. ఖమ్మం కార్పొరేషన్ పరిధి లో ఇళ్ల స్థలాల ధరలు సామాన్యుడికి అందనంత ఎత్తుకు చేరాయి. ప్రధాన వాణిజ్య కేంద్రమైన వైరా రోడ్డుకు ఇరువైపులా గతంలో గజం ధర రూ.44,900 ఉండగా.. ఇప్పుడు అది రూ.51,700 కు పెంచారు. అలాగే, అపార్ట్మెంట్లలో ఫ్లాట్ల ధర(ఎస్ఎఫ్టీ) అత్యల్పంగా రూ.2వేలు ఉండగా.. అది రూ.2,400కు చేర్చారు. అలాగే గరిష్ట ధర రూ.2,800గా ఖరారైంది. వైరా మున్సిపాలిటీతో పాటు కొణిజర్ల మండలంలోనూ ధరలు భారీగానే పెరిగాయి. వైరా పరిధిలో వ్యవసాయేతర భూమి అత్యల్పంగా రూ,1,700 ఉన్న గజం ధరను రూ.3,000కు పెంచారు. అత్యధికంగా రూ.10,800 ఉన్న గజం ధర రూ.16,200కు చేరింది. అపార్ట్మెంట్లలో ఫ్లాట్ల ధర(ఎస్ఎఫ్టీ) రూ.1,500 నుంచి రూ.1,800కు చేర్చారు. ఇక కొణిజర్ల మండలంలో ఇళ్ల స్థలాల ధర గజానికి రూ.1,100 ఉంటే రూ.1,700కు పెంచారు. అపార్ట్మెంట్లలో ఫ్లాట్లకు ఎస్ఎఫ్టీ ధర రూ.1,300 నుంచి రూ.1,600కు పెరిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రమైన కొత్తగూడెంలో వ్యవసాయేతర భూముల ధరలను సైతం ప్రభుత్వం భారీగా పెంచింది. ఇళ్ల స్థలాల గజం ధర గతంలో కనిష్టంగా రూ.3,100 ఉన్న చోట దాన్ని ఇప్పుడు రూ.5,500గా నిర్ణయించారు. అలాగే గరిష్టంగా రూ.29,900 ఉన్న ధరను ఏకంగా రూ.37,400కు పెంచారు. ఇక్కడ అపార్ట్మెంట్లలో ఫ్లాట్ ధర(ఎస్ఎఫ్టీ) అత్యల్పంగా రూ.1,500 ఉండగా రూ.1,800కు.. అత్యధికంగా ఉన్న రూ.2,800 ధరను రూ.3,400కు చేర్చారు.నేటి నుంచి అమల్లోకి భూముల కొత్త మార్కెట్ ధరలు -
●హమ్మయ్య.. దప్పిక తీరింది !
భానుడి భగభగలకు మూగజీవాలు అల్లాడిపోతున్నాయి. మేతకు వెళ్తున్న సమయాన కనుచూపు మేర నీరు దొరకక అవస్థ ఎదుర్కొంటున్నాయి. గతంలో మాదిరి తొట్లు లేకపోవడంతో ఎక్కడ నీరు దొరుకుతుందా అని జీవాలు ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. మండలంలోని పండితాపురంలో గురువారం మేకల గుంపు మేతకు వెళ్తుండగా.. రైతు కొమ్మినేని వెంకటేశ్వర్లు తన వ్యవసాయ బావి మోటార్ ఆన్ చేశాడు. దీంతో మేకలతో పాటు ఇతర జీవాలు చేరుకుని ఇలా దప్పిక తీర్చుకున్నాయి. – కామేపల్లి -
అటు పాలు.. ఇటు పెట్రోల్ !
ఖమ్మంవ్యవసాయం: ఖమ్మంలోని విజయ డెయిరీ ఆవరణలో పెట్రోల్ బంక్ ఏర్పాటుకు కసరత్తు జరుగుతోంది. పాడి పరిశ్రమ యూనిట్ ఆవరణ ప్రధాని రహదారికి ఆనుకుని ఉండడం, ఖాళీ స్థలం ఎక్కువగా ఉన్న నేపథ్యాన దీన్ని సద్వినియోగం చేసుకుంటే ఆదాయం వస్తుందని అధికారులు భావిస్తున్నారు. ఈక్రమంలోనే బంక్ ఏర్పాటు కోసం కోసం లీజ్కు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఖమ్మం రోటరీనగర్లోని పది ఎకరాల విస్తీర్ణంలో పాడి పరిశ్రమాభివృద్ధి సంస్థను ఏళ్ల క్రితం ఏర్పాటు చేశారు. ఈ ప్రాంగణంలో పాల సేకరణ, నిల్వ, ప్యాకెట్ల తయారీ తదితర యూనిట్లు కొనసాగుతున్నాయి. అంతేకాక కార్యాలయాలు, ఉద్యోగుల క్వార్టర్లు కూడా నిర్మించినా ఇంకా చాలా స్థలం ఖాళీగా ఉంది. ప్రస్తుతం ఇది డిమాండ్ ఉన్న స్థలం కావడంతో బంక్ ఏర్పాటుకు కేటాయిస్తే అదనపు ఆదాయం లభిస్తుందని.. మరోపక్క అన్యాక్రాంతం కాకుండా కాపాడుకోవచ్చనే భావనకు అధికారులు వచ్చినట్లు తెలిసింది. ఎకరం కేటాయింపు డెయిరీ ఆవరణలోని ఎకరం స్థలాన్ని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐఓసీ)కు చెందిన కార్యకలాపాలకు కేటాయించే అంశాన్ని రాష్ట్ర పాడి పరిశ్రమాభివృద్ది సంస్థ పరిశీలిస్తుంది. ఇప్పటికే ఐఓసీ కంపెనీ ప్రతినిధులు ప్రాంగణాన్ని పరిశీలించి వెళ్లారు. బంక్ ఏర్పాటుకు స్థలం అనువుగా ఉందని వారు నిర్ధారణకు వచ్చిన నేపథ్యాన త్వరలోనే ఒప్పందం కుదుర్చుకునే అవకాశముందని ఉందని తెలిసింది. ఈక్రమంలోనే డెయిరీ ప్రాంగణాన్ని ఆనుకుని ఏర్పాటైన కూరగాయలు, కొబ్బరి బోండాలు తదితర వ్యాపారులను ఖాళీ చేయించి వారి డబ్బాలు తొలగించడం మొదలుపెట్టారు. సంస్థకు ఆదాయం ఖమ్మం – వైరా ప్రధాన రహదారిపై పాడి పరిశ్రమకు చెందిన రూ.కోట్ల విలువైన ఎకరాల భూమి నిష్ప్రయోజనంగా మారింది. ఇప్పటికే చిరువ్యాపారులు డబ్బా కొట్టు ఏర్పాటుచేసుకున్నారు. ఇదిలాగే వదిలేస్తే భూమి అన్యాక్రాంతం అయ్యే అవకాశం ఉండడంతో పాడి పరిశ్రమకు ఆదాయాన్ని రాబట్టేలా లీజ్కు ఇవ్వాలని, తద్వారా అద్దె కూడా వస్తుందని ఉన్నతాధికారులు నిర్ణయించినట్లు తెలిసింది. ఇప్పటికే విజయ డెయిరీ వెంట 11షాపులు నిర్మించి అద్దెకు ఇవ్వడం ద్వారా నెలకు రూ.2లక్షల మేర ఆదాయం వస్తోంది. ప్రస్తుతం ఐఓసీకి ఎకరం స్థలం కేటాయిస్తే ఆదాయం మరింత పెరగడమే కాక స్థలానికి భద్రత ఉంటుందని భావిస్తున్నారు.డెయిరీ ప్రాంగణంలో బంక్ ఏర్పాటుకు ప్రణాళిక ఐఓసీ కంపెనీ డెయిరీ ప్రాంగణంలో మల్టీపర్పస్ బంక్ను ఏర్పాటుచేసే అవకాశముందని సమాచారం. పెట్రోల్, డీజిల్తో పాటు సీఎన్జీ(కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్) స్టేషన్ల ఏర్పాటుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. అంతేకాక విద్యుత్ వాహనాల చార్జింగ్ స్టేషన్లు, వాషింగ్ స్టేషన్ ఏర్పాటుకు కూడా ప్రతిపాదించినట్లు సమాచారం. అన్నీ అనుకూలిస్తే త్వరలోనే పాడి పరిశ్రమ – ఐఓసీ మధ్య స్థలం లీజ్ ఒప్పందం కుదిరే అవకాశముంది.


