Khammam
-
కత్తెర పురుగు నిర్మూలనపై అవగాహన
తల్లాడ: మండలంలోని గోపాలపేటలో పలువురు రైతుల మొక్కజొన్న క్షేత్రాలను తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ మొక్కజొన్న పరిశోధన కేంద్రం ప్రధాన శాస్త్ర వేత్త డి.భద్రునాయక్, సీనియర్ శాస్త్రవేత్త బి.మల్లయ్య బుధవారం పరిశీలించారు. ఈసందర్భంగా పంటను ఆశిస్తున్న కత్తెర పురుగులు, రెక్కల పురుగులను గుర్తించడంతో పాటు సస్యరక్షణ చర్యలపై అవగాహన కల్పించారు. లేత మొక్కజొన్నలో ఎకరానికి(30 రోజుల వరకు) 10 – 15 లింగార్షక బుట్టలను అమర్చుకోవాలని, వేప సంబంధిత మందు అజాడి రక్తిన్ (1500 పీపీఎం) 5 మి.లీ.ను లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలని సూచించారు. ఏఓ ఎం.డీ.తాజుద్దీన్, ఏఈఓ హసీనాబేగం, రైతులు పాల్గొన్నారు. -
మెప్మాలో అడుగడుగునా నిర్లక్ష్యం
● బకాయిలపై సభ్యులకు బ్యాంకర్ల నుండి నోటీసులు ● ఆర్పీ పక్కదారి పట్టించడమే కారణంఖమ్మంమయూరిసెంటర్: మహిళా సంఘాల సభ్యులు స్వయం ఉపాధితో ఆర్థికంగా ఎదగాలని ప్రభుత్వం బ్యాంకుల ద్వారా రుణాలు మంజూరు చేయిస్తోంది. పట్టణాల్లో సంఘాల సభ్యులకు పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ(మెప్మా) ఆధ్వర్యాన ఈ రుణాలు మంజూరు చేయిస్తుంటారు. ఇదంతా టీఎల్ఎఫ్, సీఓ, ఆర్పీల పర్యవేక్షణలో కొనసాగుతుండగా కొందరు ఆర్పీలు సభ్యుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని నగదు స్వాహా చేస్తున్నారు. ఈక్రమంలోనే ఖమ్మం ప్రకాశ్నగర్కు చెందిన ఓ ఆర్పీ.. సభ్యులకు మంజూరైన రుణాన్ని తీసుకుని తిరిగి కట్టకపోవడంతో సభ్యులకు బ్యాంకు నుంచి నోటీసులు అందాయి. వరుస నోటీసులతో... ప్రకాశ్నగర్ ప్రాంతానికి చెందిన ఆరు మహిళా సంఘాలకు 2021–22 ఏడాదిలో రూ.2 కోట్లకు పైగా రుణాలను బ్యాంక్ లింకేజి, సీ్త్రనిధి ద్వారా ఆర్పీ మంజూరు చేయించారు. ఈ సమయాన ఒక సీఓ సంతకం చేసినా మరొకరి సంతకాన్ని ఆర్పీ ఫోర్జరీ చేసినట్లు సమాచారం అంతేకాక 40 మంది సభ్యుల ఖాతాల్లో జమ అయిన కొంత మొత్తాన్ని ఆమె తీసుకున్నట్లు సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇక సభ్యులు తాము రుణాలు సకాలంలో చెల్లించినా, ఆర్పీ నగదు తరిగి కట్టకపోవడంతో బ్యాంకర్లు నోటీసులు జారీ చేస్తున్నారు. తాజాగా బ్యాంకర్లు ఆర్పీ ఇంటికి వెళ్లగా తాళం వేసి ఉండడం గమనార్హం. సుమారు రూ.1.50 కోట్ల మేర ఆర్పీ తీసుకున్నట్లు తెలుస్తుండగా, నోటీసులకు స్పందించని కారణంగా సభ్యులతో పాటు ఆర్పీ ఖాతాను ఇప్పటికే బ్లాక్ చేసినట్లు తెలిసింది. ‘వన్ టైం’ కోసం.. ఖమ్మం పరిధిలోని మెప్మా ద్వారా మంజూరు చేయించే రుణాల చెల్లింపులో ఆర్పీలు అలసత్వం ప్రదర్శిస్తున్నారని ఎప్పటి నుంచో విమర్శలు ఉన్నాయి. సభ్యులకు మంజూరయ్యే రుణాలు ఆర్పీలు తీసుకుని తామే చెల్లిస్తామని నమ్మబలకడం, ఆ తర్వాత సకాలంలో చెల్లించకపోవడంతో బకాయిలు పేరుకుపోతున్నాయి. ఈక్రమంలోనే ఖాతాలను బ్లాక్లో పెడుతున్న బ్యాంకర్లు కొన్నాళ్లకు వన్టైం సెటిల్మెంట్కు అవకాశం ఇస్తున్నారు. దీంతో ఎంతోకొంత చెల్లించి ఆర్పీలు సెటిల్ చేస్తున్నారని సమాచారం. ఇదేమాదిరి ప్రకాశ్నగర్ ప్రాంత ఆర్పీ కూడా వ్యవహరించగా, ఇందులో సీఓల పాత్ర కూడా ఉందని తెలిసింది. ఈఅంశంపై మెప్మా అధికారులను వివరణ కోరగా.. బ్యాంకర్లు రుణాలను సభ్యుల ఖాతాల్లో జమ చేశారని తెలి పారు. అప్పుడు ఒక సీఓ సంతకాన్ని ఆర్పీ ఫోర్జరీ చేసినట్లు తేలగా ఆమెను విధుల నుంచి తొలగించి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. -
కన్నీరు ఇంకిపోతోంది..
జిల్లాలో నాగార్జునసాగర్ ఆయకట్టుతోపాటు నాన్ ఆయకట్టులోనూ బోర్లు, బావులు, చెరువుల కింద సాగు చేసిన వరి, మొక్కజొన్న, ఇతర పంటలు ఎండిపోతున్నాయి. యాసంగిలో అన్నీ కలిపి 2,93,991 ఎకరాల్లో పంటలు సాగు చేయగా ఇందులో వరి, మొక్కజొన్న అత్యధికంగా ఉన్నాయి. నాన్ ఆయకట్టులో బోర్లు, బావుల్లో నీళ్లు ఇంకిపోవడమే కాక చెరువుల్లో నీటి మట్టం తగ్గింది. అలాగే, వారబందీ విధానంతో సాగర్ చివరి ఆయకట్టుకు నీరు అందడం లేదు. అటు కాల్వలు, బావులు, బోర్లలోనే కాక కళ్లలోనూ ఇంకిపోయిన నీటితో పంటలను కాపాడుకునేందుకు రైతులు నానాపాట్లు పడుతున్నారు. ఈమేరకు అన్నదాతల ఆవేదన, పంటల పరిస్థితిపై బుధవారం ‘సాక్షి’ చేపట్టిన పరిశీలనలో వెల్లడైన అంశాలతో కథనం... – సాక్షి ప్రతినిధి, ఖమ్మం / నెట్వర్క్ఈ కుటుంబానికి దిక్కెవరు? చింతకాని మండలం లచ్చగూడెంకు చెందిన నెర్సుల ఎల్లయ్య పదిహేనేళ్ల పాటు ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేశాడు. ఇటీవల ఆరోగ్యం సహకరించక గ్రామంలోనే మూడెకరాలు కౌలుకు తీసుకుని వరి సాగు చేశాడు. సాగర్ ఆయకట్టు చివరి భూమి కావడం, బావిలోనూ నీళ్లు అడుగంటడంతో నీరు అందించలేని పరిస్థితి ఎదురైంది. ఇప్పటికే రూ.60 వేలు పెట్టుబడి పెట్టిన ఆయన కళ్ల ముందే పంట ఎండిపోతుండడంతో మంగళవారం పొలం వద్దే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో తమకు దిక్కెవరని రోదిస్తున్న ఆయన భార్య నర్సమ్మ, ఇద్దరు ఆడపిల్లలకు సమాధానం చెప్పేవారు కరువయ్యారు.చివరి ఆయకట్టు చింతసాగర్ ఆయకట్టు 2.54 లక్షల ఎకరాలు కాగా.. కాల్వల ఆధారంగా లిఫ్ట్ ఇరిగేషన్లతో కలిపి 2.79 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ఖమ్మం, వైరా, మధిర, పాలేరు, సత్తుపల్లి నియోజకవర్గాలకు సాగర్ జలాలు సరఫరా అవుతుండడంతో వరి, మొక్కజొన్నతోపాటు ఆరుతడి పంటలను సాగు చేశారు. ఇందులో మొక్కజొన్న పంట కంకి దశలో ఉండగా నీటి తడులు ఎక్కువగా అవసరమవుతున్నాయి. కానీ సాగర్ జలాలను వారబందీ విధానంలో గత ఏడాది డిసెంబర్ 15 నుంచి విడుదల చేస్తున్నారు. మొదటి తడి 27 రోజులు ఇచ్చి తొమ్మిది రోజులు నిలిపేశారు. ఆపై రెండో తడి నుంచి తొమ్మిది రోజులు ఆన్, ఆరు రోజులు ఆఫ్ విధానం అమలవుతోంది. ఈ విధానంతో కొన్ని మండలాలకు నీరు అంది.. ఆపై నిలిచిపోవడంతో చివరి ఆయకట్టు రైతులు గగ్గోలు పెడుతున్నారు. దీంతో వారబందీ విధానం తొలగించి కనీసం రెండు నెలలపాటు సక్రమంగా సరఫరా చేయాలని ఇటీవల బోనకల్ మండల రైతులు కలెక్టర్ను కలిసి అభ్యర్థించారు. అడుగంటిన భూగర్భ జలాలుయాసంగిలో రైతులు సాగర్ జలాలతోపాటు బోర్లు, బావులను నమ్ముకోగా భూగర్భ జలాలు సైతం పడిపోయాయి. అధికారిక లెక్కల ప్రకారం గత ఏడాది డిసెంబర్లో భూగర్భ జలాలు 3.87 మీటర్ల లోతులో ఉంటే.. ఈ ఏడాది జనవరిలో 4.49 మీటర్ల లోతుకు పడిపోయాయి. ఫిబ్రవరిలో ఎండలు పెరగగా నీటిమట్టం మరింత పడిపోయి బోర్లు, బావుల్లో కూడా నీళ్లు రోజురోజుకూ అడుగంటుతున్నాయి. బోరు బావుల్లో నీరు తగ్గగా పలువురు 5 హెచ్పీ మోటార్లు తీసేసి 3 హెచ్పీ మోటార్లను బిగించి వచ్చే అరకొర నీటిని పంటలకు పెడుతున్నారు. కళ్ల ముందే ఎండుతున్న పంటలుబోనకల్ మండలంలో ఎక్కువగా సాగర్ జలాలపైనే ఆధారపడి రైతులు పంటలు సాగు చేస్తున్నారు. బోనకల్ బ్రాంచ్ కెనాల్(బీబీసీ) పరిధి ఆళ్లపాడు, నారాయణపురం, కలకోట, రాపల్లి, గోవిందపురం, రాయన్నపేట తదితర గ్రామాల్లో ఆరు వేల ఎకరాల్లో మొక్కజొన్న సాగు కాగా వారబందీ విధానంతో చివరి భూములకు నీరందే పరిస్థితి లేదు. కొందరు రైతులు సమీపంలోని చెరువులు, వాగుల నుండి తాత్కాలికంగా నీటిని పెట్టుకుంటున్నారు. అలాంటి వసతి లేనివారు కళ్ల ముందే పంట ఎండిపోతున్నా కన్నీరు పెట్టుకునే పరిస్థితి నెలకొంది. బీబీసీ పరిధిలో 11 మైనర్ కాల్వలు ఉండగా, ఇక్కడి నుంచే ఏపీకి జలాలు వెళ్లాలి. కానీ చింతకాని మండలం, బోనకల్ మండలంలోని కొన్ని గ్రామాలకు నీరు చేరగానే నిలిచిపోతుండడంతో చివరి ఆయకట్టు ఎండిపోతోంది. ఇక తల్లాడ మండలంలోని సిరిపురం మేజర్ పరిధి తెలగవరం, తల్లాడ మైనర్ల కింద ఉన్న ఆయకట్టుకు నీరు అందడం లేదు. పుణ్యపురం మేజర్లోనూ ఇదే పరిస్థితి ఉంది. వైరా మండలం అష్ణగుర్తిలో రాపల్లి మేజర్ కాల్వ పదో కి.మీ. పరిధిలో నీరు అందక మొక్కజొన్న పంట నిలువునా ఎండిపోతోంది. ఏపీ నుంచి నీటి కొనుగోలుమధిర మండలం నిదానపురం మేజర్ కింద ఖమ్మంపాడుకు చెందిన గుమ్మా రవి ఐదెకరాల్లో మిర్చి సాగు చేశాడు. సాగర్ జలాలు అందుతాయని ఆశించి ఎకరాకు రూ.10వేల చొప్పున కౌలు చెల్లించాడు. రెండుసార్లు మాత్రమే సాగర్నీరు అందగా.. ఇప్పుడు తోట ఎండిపోతుండటంతో ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా వీరులపాడు మండలం వి.అన్నవరంలోని లిఫ్ట్ నుంచి నీరు కొనుగోలు చేశాడు. ఒక్కో తడికి ఎకరాకు రూ.2వేలు చెల్లిస్తున్నానని రవి తెలిపాడు.జిల్లాలో సాగునీటికి కటకట చివరి ఆయకట్టుకు అందని సాగర్ జలాలు వారబందీ విధానంతో రైతుల ఆందోళన బోర్లు, బావుల్లోనూ అడుగంటుతున్న భూగర్భ జలాలతో పంటల ఎండుముఖంపంట చేతికందేలా లేదు.. ముదిగొండ మండలం గంధసిరికి చెందిన కుక్కల ఫకీరు ఆరెకరాలు కౌలుకు తీసుకుని వరి సాగు చేశాడు. మున్నేరు సమీపంలో ఉన్నా బావిలో నీరు లేక ఇబ్బంది పడుతున్నాడు. కౌలు కింద 48 బస్తాలు చెల్లించాల్సి ఉండగా ఇప్పటికే పెట్టుబడిగా రూ.1.20 లక్షలు వెచ్చించాడు. పరిస్థితి ఇలాగే ఉంటే పంట చేతికందడం కష్టమేనని చెబుతున్నాడు. ఎర్రుపాలెం మండలం మూమునూరులో కట్లేరుకు వచ్చే సాగర్ జలాలను నమ్ముకుని వరి, మొక్కజొన్న సాగు చేసినా నీళ్లు అందక పంటలు ఎండుతున్నాయి.వరి వదిలి.. మామిడి సాగు.. తల్లాడ మండలం అంజనాపురానికి చెందిన కొమ్మినేని రాంబాబు మూడేళ్లుగా వరి సాగు చేస్తున్నాడు. అయితే సాగర్ నీరందక నష్టం ఎదురవుతుండడంతో ఈసారి వరి మానేసి రెండెకరాల్లో మామిడి మొక్కలు నాటాడు. మామిడి దిగుబడి మూడేళ్లు దాటితే కానీ రాదు. దీంతో ఆదాయం కోల్పోతున్నా చేసేదేం లేదని చెబుతున్నాడు.మిర్చికి అరకొరగానే.. కామేపల్లి మండలం పండితాపురానికి చెందిన సామినేని వెంకటేశ్వర్లు ఐదెకరాల భూమిలో రెండు బోర్లు వేయించాడు. గతంలో మోటార్ల నుంచి 3 ఇంచుల మేర నీరు రావడంతో యాసంగిలో మిర్చి, పత్తి, మొక్కజొన్న వేశాడు. డిసెంబర్ నుంచి బోర్లలో నీరు తగ్గి కేవలం ఇంచు ధార మాత్రమే వస్తోంది. చేసేదేం లేక రెండున్నర ఎకరాల మొక్కజొన్న చొప్పను గొర్రెల మేతగా రూ.13 వేలకు విక్రయించాడు. పంటసాగుకు రూ.లక్ష వరకు పెట్టుబడి పెట్టిన ఆయన పరిస్థితి దయనీయంగా మారింది. ఇక బోర్లలో నీరు తగ్గగా 5హెచ్పీ మోటార్లు తీసేసి 3హెచ్పీ మోటార్లు బిగించి వస్తున్న అరకొర నీటిని మిరప పంటకు అందిస్తున్నాడు. ఇదే గ్రామానికి చెందిన ధనియాకుల హన్మంతరావు రెండెకరాల్లో మిర్చి సాగు చేశాడు. బోరును నమ్ముకొని సాగు చేస్తే వారం రోజులుగా నీళ్లు ఇంకుతున్నాయి. దీంతో కొత్తగా మూడు బోర్లు వేయిస్తే చుక్కనీరు పడకపోగా రూ.లక్ష వరకు ఖర్చయింది. -
ఆరుతడి పంటలతో నికర ఆదాయం
రఘునాథపాలెం: రైతులు ఆరుతడి పంటలుగా పెసర తదితర పంటలు సాగు చేస్తే మిగతా వాటితో పోలిస్తే నికర ఆదాయం లభిస్తుందని జిల్లా వ్యవసాయ అధికారి(డీఏఓ) ధనసరి పుల్ల య్య తెలిపారు. రఘునాథపాలెం మండలం మంచుకొండలో పలువురు రైతులు సాగు చేసిన పెసర పంటను బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా పెసరను మారుక మచ్చల పురుగు ఆశిస్తుండడంతో పూత, పిందె రాలిపోతోందని తెలిపారు. దీని నివారణకు 1500 పీపీఎం వేప నూనె పిచికారీ చేయాలని, పురుగు ఉధృతంగా ఉంటే ప్లాత్రో, అంప్లిగో మందులను వారం వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలని సూచించారు. ఏఓ కర్నాటి ఉమామహేశ్వర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మొక్కల పెంపకంపై నిర్లక్ష్యం వద్దు కామేపల్లి: నర్సరీల్లో మొక్కల సంరక్షణ, పెంపకంపై నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ హెచ్చరించారు. మండలంలోని ముచ్చర్ల, కొత్తలింగాల, జాస్తిపల్లిలో బుధవారం పర్యటించిన ఆమె ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టిన నిర్మాణాలను పరిశీలించారు. అలాగే, నర్సరీలను పరిశీలించిన అదనపు కలెక్టర్ ఎండ తీవ్రత కారణంగా మొక్కలు చనిపోకుండా సంరక్షించాలని సూచించారు. ఉపాధి పని ప్రదేశాల్లో కూలీలకు తాగునీరు, నీడ కల్పించాలని తెలిపారు. ఎంపీడీఓ రవీందర్, ఈజీఎస్ ఏపీఓ శ్రీరాణీ, ఈసీ వెంకటేశ్వర్లు, టీఏ భాస్కర్, ఫీల్డ్ అసిసెంట్లు పాల్గొన్నారు. కమనీయం.. రామయ్య నిత్యకల్యాణంభద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి నిత్యకల్యాణ వేడుక బుధవారం కమనీయంగా సాగింది. తెల్లవారుజామున గ ర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేనపూజ, పుణ్యావాచనం చేశారు. స్వామి వారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గా వించి నిత్యకల్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. -
రూ.11.58 లక్షల విలువైన గంజాయి స్వాధీనం
ఖమ్మంక్రైం: ఖమ్మంలో రైల్వేస్టేషన్ నుంచి ముంబై తరలించడానికి సిద్ధంగా ఉన్న గంజాయిని జీఆర్పీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఖమ్మం జీఆర్పీ సీఐ అంజలి, డోర్నకల్ ఎస్ఐ సురేష్ మంగళవారం సాయంత్రం ఖమ్మం స్టేషన్లో తనిఖీ చేస్తుండగా రెండో నంబర్ ప్లాట్ఫాంపై రెండు సూట్కేసులతో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించాడు. దీంతో ఆయన వద్ద సోదా చేయగా రూ.11.58లక్షల విలు వైన 46కేజీల గంజాయి లభ్యమైంది. మహారాష్ట్రలోని పర్బనీ జిల్లాకు కార్మికుడైన ఆయన తేలికగా డబ్బు సంపాదించడానికి ఒడిశాలోని మల్కాన్గిరి జిల్లాలో తక్కువ ధరకు గంజాయి కొనుగోలు చేసి ముంబైలో అమ్మడానికి వెళ్తున్నట్లుగా తేలింది. ఈమేరకు నిందితుడిని బుధవారం రిమాండ్కు తరలించినట్లు సీఐ అంజలి తెలిపారు. తనిఖీల్లో హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
ఏ ఒక్కరూ వడదెబ్బ బారిన పడొద్దు
● జాగ్రత్తలపై విస్తృతంగా అవగాహన ● ప్రభుత్వ కార్యాలయాల్లో చలివేంద్రాల ఏర్పాటు ● టాస్క్ఫోర్స్ కమిటీ సమావేశంలో కలెక్టర్ ముజమ్మిల్ఖాన్ఖమ్మంవైద్యవిభాగం: నానాటికీ ఎండలు పెరుగుతుండడం, వడగాలులు మొదలయ్యే అవకాశమున్నందున ప్రజలు వడదెబ్బ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విస్తృత అవగాహన కల్పించాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఆదేశించారు. కలెక్టరేట్లో బుదవారం ఆయన అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజతో కలిసి టాస్క్ ఫోర్స్ కమిటీతో సమావేశమయ్యారు. గత ఏడాది జిల్లాలో 45 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదైనందున, ఈసారీ అదే పరిస్థితి ఉండొచ్చని చెప్పారు. ఈమేరకు ఎండలో పనిచేసే నిర్మాణ కార్మికులు, కూలీలు, పారిశుద్ధ్య కార్మికుల వివరాలు సేకరించాలని, గత అనుభవాల దృష్ట్యా వ్యవసాయ మార్కెట్లలో టెంట్లు, తాగునీరు సమకూర్చడమే కాక ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలన్నారు. అంతేకాక అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని, క్షేత్రస్థాయిలో పర్యటించే ప్రభుత్వ శాఖల సిబ్బంది కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. అనంతరం అవగాహన కల్పించేలా రూపొందించిన పోస్టర్లను ఆవిష్కరించారు. అదనపు డీసీపీ నరేష్కుమార్, డీఎంహెచ్ఓ కళావతిబాయి, డీసీహెచ్ఎస్ రాజశేఖర్, డీపీఓ ఆశాలత, డీడబ్ల్యూఓ కె.రాంగోపాల్రెడ్డి, ఎస్సీ డీడీ కె.సత్యనారాయణ, జిల్లా పశు సంవర్థక శాఖ అధికారి డాక్టర్ కె.వెంకటనారాయణ, వివిధ శాఖల ఉద్యోగులు నర్సింహారావు, ఎల్.రాజేందర్, నూరుద్దీన్, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. పిల్లల సంరక్షణకు కట్టుదిట్టమైన చర్యలు ఖమ్మం సహకారనగర్: పిల్లల సంరక్షణకు అన్ని చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సూచించారు. జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ మండల స్థాయిలో తప్పనిసరిగా బాలల సంరక్షణ కమిటీ సమావేశాలు నిర్వహించాలని, పిల్లలపై జరిగే మానసిక, శారీరక దాడుల నియంత్రణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఇక ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో మహిళా ఉద్యోగులపై వేధింపులు నివారణ కోసం అంతర్గత కమిటీలను ఏర్పాటు చేయంచాలని చెప్పారు. చివరి ఆయకట్టుకూ సాగునీరు జిల్లాలో చిట్టచివరి ఆయకట్టుకు సైతం సాగునీరు అందేలా కార్యాచరణ అమలుచేయాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఆదేశించారు. సాగునీటి సరఫరాపై అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజతో కలిసి సమీక్షించిన ఆయన నీటిపారుదల, వ్యవసాయ, విద్యుత్ శాఖల అధికారులు సమన్వయంతో వ్యవహరిస్తూ సమస్యలు ఎక్కడ ఉన్నాయో గుర్తించి పరిష్కరించాలన్నారు. డీఆర్వో పద్మశ్రీ, జలవనరుల శాఖ ఎస్ఈ ఎం.వెంకటేశ్వర్లు, డీఏఓ పుల్లయ్య, ఆర్డీఓలు నర్సింహారావు, రాజేందర్ పాల్గొన్నారు.చెల్లెమ్మా.. టీ బాగుంది! ఖమ్మంరూరల్: అద్భుతమైన రుచితో టీ చేశారు.. చాలా బాగుంది చెల్లెమ్మా అంటూ కలెక్టర్ ముజమ్మిల్ఖాన్ సీ్త్ర టీ క్యాంటీన్ నిర్వాహకురాలిని అభినందించారు. కలెక్టర్ చొరవతో ఇందిరా మహిళా శక్తి ద్వారా మంజూరైన రుణాలతో జిల్లాలో 22 సీ్త్ర టీ క్యాంటీన్లు ఏర్పాటయ్యాయి. ఈమేరకు ఖమ్మం రూరల్ మండల పర్యటనకు వెళ్లిన కలెక్టర్ తరుణి హాట్ ఎదుట ఏర్పాటుచేసిన క్యాంటీన్ను పరిశీలించారు. ఈసమయంలో నిర్వాహకురాలు శ్రీరంగం గీత టీ అందించగా రుచి చూసిన కలెక్టర్ బాగుందని ప్రశంసించారు. నాణ్యత పాటిస్తూ ప్రజల్లో నమ్మకం చూరగొనడం ద్వారా వ్యాపారం విస్తరించుకోవాలని సూచించారు. తద్వారా ఖమ్మం బ్రాండ్కు పేరు తీసుకురావాలని ఆయన తెలిపారు. ఇందుకు యంత్రాంగం అండగా ఉంటుందని కలెక్టర్ భరోసా కల్పించారు. అనంతరం ఇందిరమ్మ నమూనా ఇంటి నిర్మాణానికి ఎంపిక చేసిన స్థలా న్ని కలెక్టర్ పరిశీలించి సూచనలు చేశారు. తహసీల్దార్ పి.రాంప్రసాద్, గృహనిర్మాణ శాఖ ఈఈ శ్రీనివాసరావు, పీఆర్ ఈఈ వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మిల్లులు, స్కూళ్లలో డీఎస్ఓ తనిఖీ
ఖమ్మంరూరల్: మండలంలోని పలు రైస్ మిల్లుల్లో ధాన్యం నిల్వలు, పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం నిర్వహణను జిల్లా పౌరసరఫరాల అధికారి చందన్కుమార్ బుధవారం తనిఖీ చేశారు. జలగంగనర్తో పాటు ఇంకొన్ని ఉన్నత పాఠశాల్లో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించిన ఆయన నాణ్యమైన భోజనం అందించాలని నిర్వాహకులకు సూచించారు. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని నాణ్యమైన బియ్యం, కూరగాయలు, గుడ్లు అందించాలని తెలిపారు. ఆతర్వాత వరంగల్ క్రాస్లోని రైస్ మిల్లును తనిఖీ చేసిన ఆయన గడువులోగా సీఎంఆర్ అందించాలని ఆదేశించారు. తనిఖీల్లో సివిల్ సప్లయీస్ డీటీ విజయ్బాబు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వాస్పత్రిలో సేవలపై ఆరా కల్లూరు: కల్లూరు ప్రభుత్వ ఆస్పత్రిని మెడికల్ అండ్ హెల్త్ అడిషనల్ డైరెక్టర్, టాస్క్ఫోర్స్ టీమ్ లీడర్ కె.శశిశ్రీ, అసోసియేటెడ్ ప్రొఫెసర్ ఎం.విజయ్కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆస్పత్రి ద్వారా ప్రజలకు అందుతున్న వైద్యసేవలు, ప్రసవాల సంఖ్య, అందుబాటులో ఉన్న మందులు, వ్యాక్సిన్లపై ఆరా తీశారు. వైద్యులు, సిబ్బంది ప్రజలకు మెరుగైన సేవలందిస్తూనే నిర్దేశిత లక్ష్యాలను నూరు శాతం సాధించాలని, అన్ని వివరాలు ఆన్లైన్లో నమోదు చేయాలని సూచించారు. డిప్యూటీ డీఎంహెచ్ఓ టి.సీతారామ్, డీపీఓ దుర్గ, వైద్యాధికారులు, ఉద్యోగులు రమేష్, నవ్యకాంత్, మౌనికాశృతి, మోహన్ తదితరులు పాల్గొన్నారు. -
బియ్యం ఇస్తారా, ఇవ్వరా?
● ఇంకా పలువురికి అందని రేషన్ బియ్యం ● ‘పోర్టబులిటీ’తో డీలర్ల వద్ద కొరత ● నేటితో ముగియనున్న పంపిణీ గడువుఖమ్మం సహకారనగర్/ఖమ్మం అర్బన్: రేషన్కార్డు ఏ ప్రాంతంలో ఉన్నప్పటికీ నివసించే చోట బియ్యం తీసుకునేలా కొన్నాళ్ల నుంచి ’వన్ నేషన్.. వన్ రేషన్’ పేరిట పోర్టబులిటీ విధానం అమలవుతోంది. లబ్ధిదారులు నష్టపోవద్దని ఈ విధానాన్ని ప్రవేశపెట్టగా జిల్లా కేంద్రంలోని రేషన్ షాపుల్లో త్వరగా బియ్యం నిల్వలు కరిగిపోతున్నాయి. దీంతో స్థానిక లబ్ధిదారులకు బియ్యం అందక షాపుల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తోంది. ఇలా ప్రతీనెలా జరుగుతున్నా డిమాండ్ ఉన్న షాపులకు అదనంగా బియ్యం కేటాయించాల్సిన అధికారుల నిర్లక్ష్యంతో సమస్య తీవ్రరూపం దాలుస్తోంది. జిల్లా కేంద్రంలోనే సమస్య జిల్లాలో 748 రేషన్ షాపులు ఉండగా, వీటి పరిధిలో 4,11,566 రేషన్కార్డులు ఉన్నాయి. ఇక 11,29,030మంది లబ్ధిదారులు ఉండగా ప్రతినెల సుమారు 6వేల మెట్రిక్ బియ్యం అవసరమవుతుంది. అయితే, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వివిధ ప్రాంతాల వారు నివసిస్తుండగా పోర్టబులిటీ విధానంలో నెల తొలినాళ్లలోనే బియ్యం తీసుకుంటున్నారు. దీంతో స్థానికులు వచ్చేసరికి షాపుల్లో బియ్యం నిల్వలు నిండుకుంటున్నాయి. ఖమ్మం నగరంలో 94 రేషన్ దుకాణాలకు గాను సుమారు 80షాపుల్లో పోర్టబులిటీ ద్వారా బియ్యం తీసుకెళ్తున్నారని అంచనా. తద్వారా ఆయా షాపుల పరిధి లబ్ధిదారులకు నెలనెలా కేటాయించే బియ్యానికి తోడు డీలర్లకు సుమారు 50క్వింటాళ్ల బియ్యం అదనంగా అవసరమవుతున్నట్లు తెలుస్తోంది. అప్రూవ్ అయినా... అదనంగా బియ్యం అవసరమైన డీలర్లు 7, 8వ తేదీకల్లా జిల్లా పౌరసరఫరాల అధికారి(డీఎస్ఓ)కి వినతి ఇవ్వగానే అధికారి అప్రూవ్ చేస్తే గోదాం నుంచి విడుదల చేస్తారు. కానీ గత రెండు నెలలుగా డీలర్లకు సకాలంలో బియ్యం అందక ఇక్కట్లు ఎదురవుతున్నాయి. ఈనెల 19వ తేదీ నాటికి కూడా అధికారి అప్రూవ్ చేసినా డీలర్లకు బియ్యం అందకపోవడం గమనార్హం. జిల్లాలోని గోదాంల్లో నిల్వలు లేక ఈ పరిస్థితి నెలకొందని సమాచారం. ఈనెలారంభం నుంచే బియ్యం అరకొరగా సరఫరా అవుతుండడంతో 20వ తేదీ వరకు తీసుకోవచ్చని అధికారులు వెల్లడించారు. కానీ జిల్లాలోని షాపులకు ఇంకా 350 మెట్రిక్ టన్నుల బియ్యం సరఫరా కావాల్సి ఉండడం, 20వ తేదీ గురువారంతో సరఫరా గడువు ముగియనుండడంతో సందిగ్ధత నెలకొంది. అయితే, గతంలోనూ ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు గడువు మరిన్ని రోజులు పెంచినందున ఈసారీ పొడిగించే అవకాశముందని తెలుస్తోంది. రెండు, మూడు రోజుల్లో సరఫరా చేస్తాం జిల్లాకు సుమారు 350మెట్రిక్ టన్నుల మేర అదనంగా బియ్యం అవసరముంది. నల్లగొండ జిల్లా నుంచి బియ్యం తెప్పించేందుకు అక్కడి అధికారులతో మాట్లాడాం. రెండు, మూడు రోజుల్లో రేషన్ దుకాణాలకు అందించి లబ్ధిదారులకు సరఫరా చేసేలా చర్యలు తీసుకుంటాం. – జి.శ్రీలత, జిల్లా మేనేజర్, పౌరసరఫరాల సంస్థ -
చెల్లని చెక్కు కేసులో మూడు నెలల జైలుశిక్ష
ఖమ్మం లీగల్: చెల్లని చెక్కు జారీ చేసిన కేసులో ఖమ్మం బీ.కే.బజార్కు చెందిన బిజ్జాల భాస్కర్కు మూడు నెలలు జైలు శిక్ష విధిస్తూ ఖమ్మం ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు న్యాయాధికారి కాసరగడ్డ దీప బుధవారం తీర్పు చెప్పారు. బీ.కే.బజార్కు చెందిన ఉల్లి శ్రీనివాసరావు వద్ద భాస్కర్ 2015 సెప్టెంబర్ 30న రూ.లక్ష అప్పుగా తీసుకున్నాడు. ఆతర్వాత అప్పు చెల్లించే క్రమంలో 2018 ఫిబ్రవరి 28న రూ.లక్షకు చెక్కు జారీ చేయగా ఆ చెక్కును ఖాతాలో జమ చేస్తే సరిపడా నగదు లేక గురైంది. దీంతో శ్రీనివాసరావు తన న్యాయవాది ద్వారా నోటీస్ జారీచేసి కోర్టులో ప్రైవేట్ కేసు దాఖలు చేశారు. కేసును విచారించాక భాస్కర్పై నేరం రుజువు కావడంతో మూడు నెలల జైలు శిక్షతో పాటు ఫిర్యాదికి రూ.1.20 లక్షలు చెల్లించాలని న్యాయాధికారి తీర్పు చెప్పారు. వాహనం ఢీకొని వ్యక్తి మృతి సత్తుపల్లిరూరల్: రోడ్డుపక్కగా నడిచి వెళ్తున్న వ్యక్తిని ద్విచక్ర వాహనం ఢీకొట్టడంతో తీవ్రగాయాల పాలై మృతి చెందాడు. మండలంలోని కాకర్లపల్లికి చెందిన నాగళ్ల రామకృష్ణ(38) బుధవారం గ్రామశివారులో నడిచి వెళ్తుండగా వాహనం ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఆయనను ఖమ్మం ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు. కాగా, మోపెడ్ నడుపుతున్న ఇండ్ల వెంకటేశ్వరరావు సైతం గాయపడగా సత్తుపల్లి ప్రభుత్వాస్పత్రిలో చేర్పించారు. కుక్కల దాడిలో గేదె ... నేలకొండపల్లి: ఓ గేదెను వేటాడిన కుక్కలు తీవ్రంగా గాయపర్చడంతో మృతి చెందింది. నేలకొండపల్లికి చెందిన రైతు డి.ఉపేందర్ బుధవారం పాడి గేదెను మేతకు వదిలాడు. ఒక్కసారిగా అక్కడకు వచ్చిన 20కి పైగా కుక్కలు దాడి చేయడంతో గేదె పరుగులు తీసింది. అయినా కుక్కల గుంపు వెంటాడి దాడి చేయగా తీవ్రగాయాలతో మృతి చెందింది. కళ్ల ముందే రూ.70వేల విలువైన గేదె మృతి చెందడంతో రైతు కన్నీరు మున్నీరయ్యాడు. కాగా, ఉపేందర్కు చెందిన నాలుగు నెలల దూడపై వారం క్రితం కుక్కలు దాడి చేసి చంపేశాయి. ఇకనైనా అధికారులు స్పందించి మండల కేంద్రంలో కుక్కల బెదడను నివారించాలని స్థానికులు కోరుతున్నారు. ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య సత్తుపల్లిరూరల్: అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వ్యక్తి ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. సత్తుపల్లి మండలం గంగారానికి చెందిన ఆటోడ్రైవర్ ఎస్.కే.నజీరుద్దీన్(43) కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. రెండు నెలల క్రితం ఒక కిడ్నీ తొలగించగా మరో కిడ్నీకి కూడా సమస్య ఉందని చెప్పడంతో మనస్తాపానికి గురైన ఆయన బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయాన ఆత్మహత్య చేసుకున్నాడు. నజీరుద్దీన్కు భార్య జీనద్ ఉన్నారు. క్షణికావేశ ంలో మరొకరు.. కారేపల్లి: మద్యానికి బానిసైన వ్యక్తి ఇంట్లో గొడవ పడి క్షణికావేశంలో ఆత్మహత్య చేసుకున్నాడు. మండలంలోని పేరుపల్లికి చెందిన పద్దం మాధవరావు(53) రైల్వే కాంట్రాక్టు కూలీ పనులు చేస్తుంటాడు. ఇటీవల మద్యానికి బానిసైన ఆయన బుధవారం కూడా మద్యం తాగి రావడంతో భార్య నాగమణితో గొడవ జరిగింది. దీంతో భార్య ఇంటి నుంచి బయటికి వెళ్లిపోగా ఆయన చీరతో ఉరి వేసుకున్నాడు. కాసేపటికి వచ్చిన నాగమణి కేకలు వేయగా చుట్టుపక్కల వారు వచ్చి చూసేసరికి మాధవరావు మృతి చెందాడు. ఆయనకు భార్యతో పాటు ఇద్దరు కుమారులు ఉన్నారు. 22న బియ్యం వేలం ఖమ్మం సహకారనగర్: వివిధ కేసుల్లో జప్తు చేసిన 771.969మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఖమ్మం అర్బన్, ఖమ్మం రూరల్, ఏన్కూరు, వైరా, మధిర, నేలకొండపల్లి, సత్తుపల్లి, కల్లూరు గోడౌన్లలో నిల్వ చేయగా, వేలం ద్వారా విక్రయించనున్నట్లు జిల్లా పౌరసరఫరాల శాఖాధికారి చందన్కుమార్ తెలిపారు. ఈనెల 22న ఉదయం 11గంటలకు కలెక్టరేట్లోని తమ కార్యాలయం వద్ద వేలం ఉంటుందని పేర్కొన్నారు. జీఎస్టీ లైసెన్స్దారులు, డిస్టిలరీలు, బేవరేజెస్ కంపెనీల బాధ్యులు మాత్రమే అర్హులని, ఆసక్తి ఉన్న వారు వారు రూ.50వేల రూపాయల డీడీతో హాజరుకావాలని సూచించారు. -
పాలన మరింత పారదర్శకంగా..
● కేఎంసీ ఉద్యోగుల సమయపాలనపై దృష్టి ● అధికారులు, ఉద్యోగులకు గుర్తింపు కార్డులు కూడా..ఖమ్మంమయూరిసెంటర్: ఖమ్మం నగర పాలక సంస్థ(కేఎంసీ) కార్యాలయంలో పరిపాలన మరింత పారదర్శకంగా ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రజలకు నాణ్యమైన, సత్వర సేవలు అందించడంపై కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్య దృష్టి సారించారు. ఇందులో భాగంగా ఉద్యోగులు, సిబ్బంది సమయపాలన పాటించేలా పర్యవేక్షించడాన్ని ప్రథమ ప్రాధాన్యత తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఫిర్యాదులు, వినతులు ఇచ్చేందుకు ప్రజలు వస్తుండగా, ఇంకొందరు ప్రైవేట్ వ్యక్తులు కూడా ఇష్టారాజ్యంగా వచ్చివెళ్తుండడంతో ప్రత్యేక సెక్యూరిటీ సిబ్బందిని నియమించాలని భావిస్తున్నట్లు సమాచారం. ఎప్పుడొస్తున్నారు ? కేఎంసీ కార్యాలయంలో రెవెన్యూ, ఇంజనీరింగ్, టౌన్ప్లానింగ్, ఎస్టాబ్లిస్మెంట్, అకౌంట్స్, శానిటేషన్ తదితర విభాగాలకు సంబంధించి రెగ్యులర్ ఉద్యోగులు 250 మంది వరకు ఉండగా.. వీరిలో 120 మంది వరకు కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్నారు. ఇక ఔట్ సోర్సింగ్ విధానంలో పారిశుద్ధ్య కార్మికులు, ఇతర సిబ్బంది 1,100 మందికి గాను 100 మంది వరకు కార్యాలయంలో పనిచేస్తున్నారు. అయితే, ఇందులో ఎవరెవరు, ఎప్పుడెప్పుడు వస్తున్నారో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో కార్యాలయంలో విధులు నిర్వర్తించే అందరికీ గుర్తింపు కార్డులు జారీ చేసి, ఆన్లైన్లో హాజరు నమోదుకు కమిషనర్ నిర్ణయించినట్లు తెలిసింది. ఇప్పటికే సెల్ఫోన్ సాయంతో లొకేషన్ ఆధారంగా హాజరు నమోదుకు ఏర్పాట్లు మొదలైనట్లు సమాచారం. భోజనం ఇక్కడే.. కార్యాలయంలో విధులు నిర్వర్తించే ఉద్యోగులంతా కేఎంసీలోనే భోజనం చేయాలని కమిషనర్ ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. భోజనం పేరిట పలువురు బయటకు గంటల తరబడి సమయం వృధా చేస్తున్నట్లు తేలడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఈమేరకు మధ్యాహ్నం 1–30 నుండి 2గంటల వరకు విరామ సమయంలో కార్యాలయ మూడో అంస్తులోని డైనింగ్ హాల్లో భోజనం చేయాలని సూచించారు. ఇక కార్యాలయానికి ఎవరెవరు, ఏయే పనులపై వస్తున్నారో నమోదుకు కొత్తగా రిసెప్షన్ కౌంటర్ ఏర్పాటు చేయనున్నారు. కార్యాలయ ప్రవేశం వద్దే ఈ కౌంటర్ ఏర్పాటుచేసి ఉద్యోగిని నియమిస్తారు. తద్వారా ఎవరు, ఏ పనిపై వచ్చారో నమోదు చేసుకుని స్లిప్ జారీ చేసి ఆ విభాగంలోకే వెళ్లేలా పర్యవేక్షిస్తారు. -
రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి తీవ్రగాయాలు
సత్తుపల్లిరూరల్/దమ్మపేట: రెండు ద్విచక్రవాహనాలు ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా గాయపడిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం గండుగులపల్లిలో బుధవారం జరిగింది. క్షతగాత్రుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. సత్తుపల్లి మండలం చిన్నపాకలగూడేనికి చెందిన కేతేపల్లి జానకీరాం బైక్పై పట్వారిగూడెం వైపు నుంచి సత్తుపల్లి వైపు వస్తుండగా.. దమ్మపేట మండలం జగ్గారానికి చెందిన మడివి నాగేంద్రబాబు, వగ్గెల లక్ష్మణ్ మరో ద్విచక్రవాహనంపై జగ్గారం వెళ్తున్నారు. మార్గమధ్యలోని గండుగులపల్లిలో వీరి వాహనాలు ఎదురెదురుగా ఢీకొనగా లక్ష్మణ్, జానకీరాం, నాగేంద్రబాబుకు తీవ్రగాయాలు కావడంతో 108లో సత్తుపల్లి ప్రభుత్వాస్పత్రికి తీసుకొచ్చారు. అయితే, జానకీరాం, లక్ష్మణ్ పరిస్థితి విషమంగా ఉండటంతో ప్రాథమిక చికిత్స అనంతరం ఖమ్మం తరలించారు. కాగా, క్షతగాత్రులను 108లో సత్తుపల్లి ప్రభుత్వాస్పత్రికి తీసుకొచ్చిన సమయాన సిబ్బంది ఒక్కరే ఉండడంతో వారిని లోపలకు తీసుకెళ్లేందుకు 20 నిమిషాలకు పైగా సమయం పట్టింది. అంతసేపు క్షతగాత్రులు అవస్థ పడ్డారు. సిబ్బంది లేక అంబులెన్స్లోనే 20 నిమిషాలు -
నేడు మంత్రి పొంగులేటి పర్యటన
ఖమ్మంవన్టౌన్: రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీని వాసరెడ్డి గురువారం జిల్లాలో పర్యటించనున్నారు. తిరుమలాయపాలెం మండలం మహ్మదాపురం, ఖమ్మం, టేకులపల్లిలో పలు కార్యక్రమాలకు ఆయన హాజరవుతారు. ఆతర్వాత ఖమ్మం క్యాంపు కార్యాలయంలో నాయకులు, కార్యకర్తలను కలవనున్న మంత్రి.. భద్రాద్రి జిల్లా త్రీ ఇంక్లైన్ , లక్ష్మీదేవిపల్లి, పాల్వంచ, గాంధీనగర్, వైరాలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటారు. రాష్ట్ర ఉషూ టోర్నీలో పతకం ఖమ్మం స్పోర్ట్స్: ఆదిలాబాద్లో జరుగుతున్న రాష్ట్రస్థాయి ఖేలో ఇండియా ఉషూ టోర్నీలో జిల్లాకు చెందిన పి.పవిత్రాచారి సీనియర్స్ విభాగంలో ప్రథమస్థానం దక్కించుకుంది. ఈమేరకు ఆమె బంగారు పతకం గెలవడమే కాక త్వరలో జరగనున్న జాతీయ స్థాయి ఖేలో ఇండియా పోటీలకు అర్హత సాధించింది. ఆమెను డీవైఎస్ఓ టి.సునీల్కుమార్రెడ్డి, కోచ్ పి.పరిపూర్ణాచారి అభినందించారు. ఆర్టీసీ సమ్మె నాటి కేసు కొట్టివేత ఖమ్మం లీగల్: ఆర్టీసీ కార్మికుల సమ్మె సందర్భంగా 2020 ఏడాదిలో నమోదైన ఓ కేసును కొట్టేస్తూ ఖమ్మం ఒకటో అదనపు ప్రథమ శ్రేణి మెజిస్ట్రేట్ బిక్కం రజని బుధవారం తీర్పునిచ్చారు. ఆర్టీసీలో సమ్మె 55రోజుల పాటు సాగగా, మహిళా కండక్టర్ నీరజ ఖమ్మంలోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనకు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్ పార్టీల నాయకులు ఆమె మృతదేహంతో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నేతలపై కేసు నమోదు చేయగా విచారణ అనంతరం కొట్టివేశారు. కాగా, వివిధ పార్టీల నాయకులు బాగం హేమంతరావు, పోతినేని సుదర్శన్, పువ్వాళ్ల దుర్గాప్రసాద్, మంద వెంకటేశ్వర్లు, చోటా బాబా, తాజుద్దీన్ తదితరులపై అప్పట్లో కేసు నమోదు కాగా, కేసును న్యాయవాదులు ఓరుగంటి శేషగిరిరావు, ఏడునూతల శ్రీనివాసరావు వాదించారు. పేకాటరాయుళ ్ల అరెస్ట్ కల్లూరురూరల్: మండలంలోని బత్తులపల్లి శివారులో కొందరు పేకాట ఆడుతున్నారనే సమాచారంతో పోలీసులు బుధవారం తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పెనుబల్లి మండలం బ్రహ్మాళ్లకుంట, బత్తులపల్లికి చెందిన ఇద్దరు పట్టుబడగా మరికొందరు పారిపోయారు. పట్టుబడిన వారి నుంచి రూ.6,400 నగదు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై హరిత తెలిపారు. కోడిపందెం రాయుళ్లు... ఎర్రుపాలెం: మండలంలోని రేమిడిచర్లలో శ్మశానవాటిక సమీపాన కొద్ది రోజులుగా కోడిపందేలు నిర్వహిస్తున్నారనే సమాచారంతో పోలీసులు బుధవారం తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా 12 మందిని అరెస్టు చేయగా, ఇంకో ఇద్దరు పరారయ్యారని ఎస్ఐ పి.వెంకటేష్ తెలిపారు. అదుపులోకి తీసుకున్న వారి నుంచి రూ.7వేల నగదు, ఆరు బైక్లు, రెండు కోడిపుంజులను స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. ప్రేమించి పెళ్లికి నిరాకరించిన యువకుడిపై కేసు కారేపల్లి: ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి ఆ తర్వాత ముఖం చాటేసిన యువకుడిపై కారేపల్లి పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. మండలంలోని భాగ్యనగర్ తండాకు చెందిన కిరణ్సాయి ఓ యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మించడంతో రెండేళ్లుగా ప్రేమలో ఉన్నారు. ఇటీవల ఆమె పెళ్లి చేసుకోవాలని అడగగా నిరాకరించాడు. అంతేకాక పలువురి స్నేహితులతో కలిసి ఆమె ఇంటికి వెళ్లి గొడవ చేశాడు. ఈమేరకు బాధితురాలి ఫిర్యాదుతో కిరణ్సాయి, ఆయన స్నేహితులపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ ఎన్.రాజారాం తెలిపారు. ఆర్మీ జవాన్ అదృశ్యంపై ఫిర్యాదు ఖమ్మంక్రైం: ఆరు నెలల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయిన వ్యక్తి తిరిగి రాకపోవడంతో ఎక్కడ వెతికినా ఆచూకీ లేక కుటుంబీకుల ఫిర్యాదు మేరకు ఖమ్మం వన్టౌన్ పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. ఖమ్మం సంభానీనగర్కు చెందిన పాటి రాజేష్(37) ఆర్మీలో జవాన్గా పనిచేయగా ఏడాది క్రితం అనారోగ్యానికి గురవడమే కాక మతిస్థిమితం తప్పడంతో ఇంటికి వచ్చేశాడు. గత ఏడాది ఆగస్టు నెల 24న ఇంటి నుంచి వెళ్లిన ఆయన ఎక్కడ వెతికినా ఆచూకీ తెలియరాలేదు. రాజేష్ ఇంటి నుంచి వెళ్లే సమయాన 63785 22492 నంబర్తో కూడిన ఫోన్ ఉందని కుటుంబీకులు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈమేరకు వివరాలు తెలిసిన వారు 87125 75779 నంబర్కు సమాచారం ఇవ్వాలని ఎస్ఐ మౌలానా సూచించారు. -
నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ దృష్టికి తీసుకెళ్తాం
సత్తుపల్లి: మండలంలోని సింగరేణికి చెందిన కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ ద్వారా వస్తున్న దుమ్ముదూళితో స్థానికులు పడుతున్న ఇబ్బందులను నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ దృష్టికి తీసుకెళ్తామని బీజేపీ నాయకులు నంబూరి రామలింగేశ్వరరావు, ఈ.వీ.రమేష్ తెలిపారు. ప్లాంట్ నుంచి వెలువడే కాలుష్యంతో అనారోగ్యం బారిన పడుతున్నామని కిష్టారం అంబేద్కర్నగర్ వాసులు చేపట్టిన రిలే నిరాహార దీక్షల శిబిరాన్ని బుధవారం వారు సందర్శించారు. అక్కడి నుంచే సింగరేణి సీఎండి బలరాంనాయక్, మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్రెడ్డితో మాట్లాడి సమస్యను వివరించారు. సీహెచ్పీ ద్వారా వచ్చే దుమ్ముదూళితో కిష్టారం, లంకపల్లి, జలగంనగర్, రేజర్ల, ఎన్టీఆర్నగర్, వెంగళరావునగర్, చౌడవరం వాసులు ఇబ్బంది పడుతున్నందున సింగరేణి అధికారులు స్పందించాలన్నారు. కాగా, సింగరేణి సీఎండీ బలరాం స్పందించి ప్రత్యేక కమిటీ ద్వారా పరిశీలిస్తామని చెప్పినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు వీరంరాజు, సుదర్శన్ మిశ్రా, మట్టా ప్రసాద్, పాలకొల్లు శ్రీనివాస్, విజయ్, వసంతరావు, రెహమతుల్లా, శేషగిరి, శివ పాల్గొన్నారు. -
కొనసాగుతున్న రాజీవ్గాంధీ స్మారక క్రికెట్ టోర్నీ
ఖమ్మం స్పోర్ట్స్: ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో నిర్వహిస్తున్న రాజీవ్గాంధీ స్మారక జిల్థాస్థాయి క్రికెట్ టోర్నీ కొనసాగుతుంది. ఈమేరకు బుధవారం కొత్తగూడెం రూరల్ – కిన్నెరసాని పాల్వంచ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో కొత్తగూడెం రూరల్ జట్టు విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కిన్నెరసాని పాల్వంచ జట్టు నిర్ణీత 16 ఓవర్లలో 9వికెట్లు కోల్పోయి 130 పరుగులు చేసింది. జట్టులో భైరవ్సర్కార్ 20 బంతుల్లో 35 పరుగులు చేశాడు. ఆతర్వాత బ్యాటింగ్కు దిగిన కొత్తగూడెం రూరల్ జట్టు 14 ఓవర్లలోనే 133 పరుగుల చేయగా విజయం సాధించింది. ఈ జట్టులో అశోక్ నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసి 5 వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. తొలుత మ్యాచ్ను డాక్టర్ గ్రీష్మ ప్రారంభించారు. టోర్నీ ఆర్గనైజింగ్ కార్యదర్శి ఎం.డీ.మతిన్తో పాటు రాజేష్, భరత్, లింగేష్, రాజారమేష్ పాల్గొన్నారు. -
ఎకరాకు రూ.50 లక్షల పరిహారం ఇవ్వాల్సిందే..
చింతకాని: నాగపూర్ – అమరావతి జాతీయ రహదారి నిర్మాణంతో భూమి కోల్పోతున్న తమకు ఎకరాకు రూ.50 లక్షల పరిహారం చెల్లించాలని రైతులు డిమాండ్ చేశారు. మండలంలోని కొదుమూరులో భూ నిర్వాసిత రైతులతో ఆర్డీఓ నర్సింహారావు బుధవారం సమావేశమయ్యారు. అయితే, ఎకరాకు రూ.25 లక్షలే జమ చేశారని, మార్కెట్ ధర ప్రకారం రూ.50 లక్షలు చెల్లించడంతోపాటు పొలాలకు వెళ్లేందుకు అండర్ పాస్, సర్వీస్ రోడ్డు నిర్మించాలని వారు డిమాండ్ చేశారు. అలాగే, వ్యవసాయ బావులు, దీర్ఘకాలిక పంటలకు సైతం పరిహారాన్ని అందించాలన్నారు. అప్పటివరకు రహదారి నిర్మాణ పనులు చేయనిచ్చేది లేదని రైతులు స్పష్టం చేయగా, విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని ఆర్డీఓ తెలిపారు. తహసీల్దార్ కూరపాటి అనంతరాజుతో పాటు వివిధ సంఘాల నాయకులు, రైతులు పాల్గొన్నారు. -
ఏకగ్రీవంగా హెచ్డబ్ల్యూఓల కార్యవర్గం
ఖమ్మంమయూరిసెంటర్: ప్రభుత్వ వసతిగృహ సంక్షేమ అధికారుల(హెచ్డబ్ల్యూఓ) సంఘం నూతన కార్యవర్గ ఎన్నిక ఏకగ్రీవమైంది. ఖమ్మంలోని టీఎన్జీవోస్ భవన్లో జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గుంటుపల్లి శ్రీనివాసరావు, కొణిదెన శ్రీనివాస్, హెచ్బ్ల్యూఓల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎం.డీ.గౌస్ హష్మీ ఆధ్వర్యాన బుధవారం ఎన్నికలు నిర్వహించారు. ఈసందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షుడిగా కోటపాటి రుక్మారావు, కార్యదర్శిగా నెల్లూరి నాగేశ్వరరావు, అసోసియేట్ అధ్యక్షులుగా బజ్జురి వెంకటేశ్వరరావు, కోశాధికారిగా కంభం తిరుపతిరావును ప్రకటించారు. అలాగే, ఉపాధ్యక్షులుగా కె.వీరభద్రరావు, ఎస్.వెంకట్రెడ్డి, ఎం.కోమలితో పాటు వివిధ పదవులకు కె.వెంకటేశ్వరరావు, ఆర్.నాగరాజు, పి.మాధురి, సీహెచ్.నాగమణి, జి.వినోద, ఐ.జ్యోత్స్న, టి.స్టాలిన్, జి.వెంకటేశ్వర్లు, ఎం.వెంకటకృష్ణ, పి.కృష్ణకిరణ్, జె.నర్సింహారావు ఎన్నికయ్యారని వెల్లడించారు. ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు గౌస్ హస్మి మాట్లాడుతూ హాస్టళ్లకు బిల్లులు, ఇతర సమస్యలను టీఎన్జీవోస్ సహకారంతో పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు. ఈసమావేశంలో కె.దుర్గాప్రసాద్, తాళ్లూరి శ్రీకాంత్, వై.రమేష్, కరణ్ సింగ్, బి.చంద్రశేఖర్, రాధాకృష్ణ, శ్రీధర్సింగ్, వై.శ్రీనివాసరావు, అస్లాం, ఎన్.విజయ, ఎం.వీరన్న, కృష్ణ, మాధవ్గౌడ్, ముజాహిద్ తదితరులు పాల్గొన్నారు. -
ఈ వయస్సు వారిలో రక్తపోటు, మధుమేహం
● ఎన్సీడీ ద్వారా స్క్రీనింగ్తో గుర్తింపు, మందుల పంపిణీ ● రేపటి నుంచి మరో దఫా పరీక్షలకు సన్నద్ధంనిర్లక్ష్యంతో పెరుగుతున్న నష్టం చాలా మంది బీపీ, షుగర్ బాధితులు తాము వాటి బారిన పడిన సంగతే గుర్తించడం లేదు. నిర్లక్ష్య ధోరణి కారణంగా రోజురోజుకూ బాధితుల సంఖ్య పెరుగుతోంది. మానసిక ఒత్తిడి, ఆహారపు అలవాట్లు, తగిన వ్యాయామం లేకపోవడం, సమయానికి తినకపోవడం వంటి కారణాలతో ఈ పరిస్థితి ఎదురవుతోందని చెబుతున్నారు. జిల్లాలో 30ఏళ్లు పైబడిన వారి జనాభా 7,30,852 మంది ఉండగా వంద శాతం మందికి మూడు విడతల్లో పరీక్షలు నిర్వహించారు. ఈ జనాభాలో 10శాతం మంది బీపీ, 7.1శాతం మంది షుగర్తో బాధపడుతున్నట్లు తేలింది. వీరిలో బీపీ బాధితులు 63శాతం మంది, మధుమేహ బాధితులు 65శాతం మంది ఎన్సీడీ క్లినిక్ల ద్వారా మందులు వాడుతున్నట్లు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ గణాంకాలు చెబుతున్నాయి. మిగతా వారు ప్రైవేట్ ఆస్పత్రుల్లో మందులు వాడుతున్నట్లు తెలుస్తోంది. ఎన్సీడీ కార్నర్, క్లినిక్ల్లో సేవలు జిల్లాలో ఎన్సీడీ కార్యక్రమం అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో అమలు చేస్తున్నారు. పీహెచ్సీలు, అర్బన్ హెల్త్ సెంటర్లలో ఎన్సీడీ కార్నర్లు ఏర్పాటుచేసి ప్రత్యేకంగా స్టాఫ్నర్స్లను కేటాయించారు. అలాగే, జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి, మధిర, సత్తుపల్లి, పెనుబల్లి, నేలకొండపల్లి ఏరియా ఆస్పత్రుల్లోనూ ఎన్సీడీ క్లినిక్లు ఏర్పాటు చేశారు. ఆయా కేంద్రాలకు వచ్చే బీపీ, షుగర్ బాధితులకు నెలకు సరిపడా మందులు ఒకేసారి ఇస్తున్నారు. అంతేకాక ప్రత్యేక ట్రీట్మెంట్ కార్డు జారీ చేసి నెలనెలా మందుల జారీ, వాడకం వివరాలు నమోదు చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా మొత్తం 35 సెంటర్లలో బీపీ, షుగర్ బాధితులకు ప్రస్తుతం సేవలందుతున్నాయి. రేపటి నుంచి మరో దఫా ఇప్పటికే 30ఏళ్లు దాటిన వారిలో బీపీ, మధుమేహ బాధితులను గుర్తించేలా మూడు విడతల్లో పరీక్షలు నిర్వహించారు. అయితే, బీపీ, షుగర్తో పాటు మూడు రకాల కేన్సర్ల గుర్తింపునకు ఇంకో విడత సర్వే చేపట్టాలని జాతీయ ఆరోగ్య మిషన్ నిర్ణయించింది. ఈ సర్వే 20వ తేదీ గురువారం నుంచి మొదలుకానుంది. మార్చి నెలాఖరు వరకు పరీక్షలు పూర్తిచేసేలా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు ప్రణాళిక రూపొందించారు.జిల్లాలో ఎన్సీడీ లెక్కలు ఇలా.. 30ఏళ్లు పైబడిన వారి జనాభా 7,30,852 (సుమారు) బీపీ బాధితులు 73,327 షుగర్ బాధితులు 51,851 ఎన్సీడీ క్లినిక్ల ద్వారా మందులు వాడుతున్నది 64శాతం ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకుంటున్నది 36శాతంనాణ్యమైన వైద్యసేవలు దీర్ఘకాలిక వ్యాధుల నియంత్రణలో భాగంగా బాధితులకు ఎన్డీసీ ద్వారా మెరుగైన సేవలందిస్తున్నాం. మధుమేహం, రక్తపోటు బారిన పడకుండా ప్రజల్లో అవగాహన కల్పిస్తూ, ఇప్పటికే బాధితులుగా తేలిన వారు మందులు వాడేలా పర్యవేక్షిస్తున్నాం. దీర్ఘకాలిక వ్యాధులు దరిచేరకుండా ప్రతీఒక్కరు వ్యాయామం చేస్తూ ఆరోగ్యకరమైన, మితమైన ఆహారాన్ని తీసుకోవాలి. – బి.కళావతిబాయి, డీఎంహెచ్ఓ నియంత్రణే మార్గం రక్తపోటు, మధుమేహం ఒక్కసారి సోకితే నియంత్రణ తప్ప నివారణకు అవకాశం ఉండదు. ఇలాంటి వ్యాధుల కట్టడికి కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ పథకం కింద నాన్ కమ్యూనికేబుల్ డిసీస్ కార్యక్రమాన్ని 2018 సెప్టెంబర్లో ప్రారంభించింది. 30 ఏళ్లు పైబడి రక్తపోటు, మధుమేహం గురయ్యే వారిని గుర్తించి ముందస్తుగా వారికి వైద్యసేవలు అందించడం.. తద్వారా వారి ఆయుష్షును పొడిగించడం ఈ పథకం లక్ష్యం. జిల్లాలో పలు విడతలుగా సర్వే నిర్వహించి బీపీ, షుగర్ బాధితులను గుర్తించగా సంబంధిత సెంటర్ల ద్వారా మందులు తీసుకుంటూ ఉపశమనం పొందుతున్నారు. అయితే, మరోమారు స్కీనింగ్ నిర్వహిస్తే ల్లాలో బీపీ, షుగర్ బాధితుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశముందని అధికారులు భావిస్తున్నా. -
కలెక్టర్ పనితీరుపై సీఎస్ అభినందనలు
ఖమ్మం సహకారనగర్: ప్రతీ బుధవారం ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లలో మధ్యాహ్న భోజన నాణ్యత తనిఖీ, పాఠశాలల్లో కిచెన్ గార్డెన్లు, హాస్టళ్లలో వాటర్ ఫిల్టర్ల ఏర్పాటుతో సత్ఫలితాలు వస్తున్న నేపథ్యాన కలెక్టర్ ముజమ్మిల్ఖాన్ను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అభినందించారు. హైదరాబాద్ నుంచి మంగళవారం సీఎస్ తాగునీరు, సాగునీరు, విద్యుత్ సరఫరా, రైతుభరోసా, రేషన్ కార్డుల దరఖాస్తుల పరిశీలనపై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లాలో మధ్యాహ్న భోజనం నాణ్యత పెంపు, కిచెన్ గార్డెన్లు, వాటర్ ఫిల్టర్ల ఏర్పాటుతో వస్తున్న ఫలితాలను కలెక్టర్ వివరించగా ఆమె ప్రశంసించారు. అనంతరం తాగునీరు, రబీ పంటలకు సాగు నీటి సరఫరా, డిమాండ్కు అనుగుణంగా విద్యుత్ సరఫరా, రేషన్ కార్డుల దరఖాస్తుల ధ్రువీకరణ, రైతు భరోసా పథకాల అమలుపై సూచనలు చేశారు. జిల్లా నుంచి కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ మిషన్ భగీరథ ద్వారా తాగునీటి సరఫరాకు ప్రస్తుతం ఇబ్బందులు లేవని, ఖమ్మం నగరంలో వరదల కారణంగా దెబ్బతిన్న పైపులైన్లను సైతం మరమ్మతు చేయించామని తెలిపారు. అదనపు కలెక్టర్లు డాక్టర్ పి.శ్రీజ, శ్రీనివాసరెడ్డి, విద్యుత్ శాఖ ఎస్ఈ సురేందర్, డీఏఓ పుల్లయ్య, డీఎస్ఓ చందన్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ఎలా ‘సాగు’తున్నారు..
కారేపల్లి: ఆధునిక పద్ధతులను పాటిస్తే ఏ పంట ల్లోనైనా దిగుబడులు లాభదాయకంగా ఉంటా యని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు. కారేపల్లి మండలం చీమలపాడులో మంగళవారం పర్యటించిన ఆయన రైతు వెంకటేశ్వర్లు సాగు చేస్తున్న ఆయిల్పామ్, శ్రీనివాసరావు సాగు చేస్తున్న డ్రాగన్ ఫ్రూట్తో పాటు పలువురి పంటలను పరిశీలించారు. అనంతరం రైతులతో సమావేశమైన కలెక్టర్ సమస్యలపై ఆరా తీశారు. ప్రధానంగా కోతుల బెడదతో ఇబ్బంది పడుతున్నామని వాపోయిన రైతులు టపాకాయలు పేల్చినా ఫలితం ఉండడం లేదని చెప్పారు. సోలార్ ఫెన్సింగ్ అమర్చుకునేందుకు సహకరించాలని కోరగా కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. ఈ అంశంపై సమీక్షించడంతో పాటు మోటార్లకు సబ్సిడీపై దశల వారీగా సోలార్ ప్యానళ్లు సమకూరుస్తామని తెలిపారు. ఆపై సాగునీటి వనరులు, సాగు చేస్తున్న పంటలు, పెట్టుబడి, దిగుబడిపై ఆరాతీశారు. అయిల్పామ్తో దీర్ఘకాలిక ఆదాయం ఉన్నందున రైతులు ముందుకు రావాలని సూచించారు. డ్రాగన్ ఫ్రూట్ అమ్మకానికి ఏర్పాట్లు డ్రాగన్ఫ్రూట్ సాగు చేస్తున్న రైతులతో మాట్లాడే క్రమాన మార్కెటింగ్ ఇబ్బందిగా ఉందని కలెక్టర్ దృష్టికి పలువురు తీసుకొచ్చారు. అయితే, కార్పొరేట్ షాపింగ్ మాళ్ల బాధ్యులతో సమావేశమై రైతుల నుంచి కొనుగోలు చేసేలా చూడాలని అధికారులను ఆదేశించారు. అలాగే, భూసార పరీక్షలు, సోలార్ ప్యానళ్ల ఏర్పాటు, ట్రాన్స్ఫార్మర్ మరమ్మతులు, అటవీ నిబంధనలకు అనుగుణంగా గ్రామాల్లో ఉపాధి హామీ ద్వారా మట్టి రోడ్డు నిర్మాణంపై అధికారులకు సూచనలు చేశారు. అలాగే, ఇందిరమ్మ ఇళ్లు, రైతుభరోసా, ఆత్మీయ భరోసా, సన్నధాన్యం అమ్మిన రైతులకు బోనస్, రుణమాఫీపై భరోసా కల్పించారు. ఆతర్వాత గుడితండా వద్ద రైతు బద్దూలాల్ ఇంటిపై ఏర్పాటు చేసుకున్న సోలార్ ప్యానళ్లను కలెక్టర్ పరిశీలించారు. జిల్లా వ్యవసాయాశాఖ అధికారి డి.పుల్ల య్య, తహసీల్దార్ సంపత్కుమార్, ఎంపీడీఓ సురేందర్, విద్యుత్ శాఖ ఏడీ ఆనంద్, ఉద్యానవన శాఖ అధికారి వేణు, ఏఓ అశోక్కుమార్, ఉద్యోగులు కె.రామకృష్ణ, జార్జి, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఆధునిక పద్ధతులు పాటిస్తేనే లాభదాయకం పంటలను పరిశీలించిన కలెక్టర్ ముజమ్మిల్ఖాన్ కోతుల బెడదను ఏకరువు పెట్టిన రైతులు -
కులగణన శాసీ్త్రయంగా చేపట్టాలి..
● జనాభా పెరుగుతుంటే.. బీసీలు ఎలా తగ్గుతారు? ● 317 జీఓ విషయంలో కేసీఆర్ బాటలోనే రేవంత్రెడ్డి ● బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, ఎంపీ ఈటల రాజేందర్సాక్షిప్రతినిధి, ఖమ్మం: ప్రభుత్వానికి చిత్తశుద్ధి, నిజాయితీ ఉంటే కమిషన్ వేసి కులగణన శాసీ్త్రయంగా చేయాలని మల్కాజ్గిరి ఎంపీ, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. తమిళనాడు, బిహార్ రాష్ట్రాల్లో చట్టబద్ధమైన కమిటీ వేసి కులగణన చేపట్టారని తెలిపారు. ఖమ్మం – నల్లగొండ – వరంగల్ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా పులి సరోత్తంరెడ్డి తరఫున మంగళవారం ఆయన ఖమ్మంలో ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పులి సరోత్తమ్రెడ్డి తమ అభ్యర్థి అని, ఆయనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని ఉపాధ్యాయులను కోరారు. అనంతరం ఈటల విలేకరులతో మాట్లాడుతూ.. 2011లో 3.61 కోట్లుగా ఉన్న రాష్ట్ర జనాభా.. ఇప్పుడు 4కోట్లు దాటి ఉంటుందన్నారు. ఓ పక్క జనాభా పెరుగుతుంటే బీసీల జనాభా ఎలా తగ్గుతుందని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి నిజాయితీ లేకపోవడంతోనే ప్రజలను మోసం చేస్తున్నారని పేర్కొన్నారు. 317 జీఓకు వ్యతిరేకంగా పోరాడాం.. గతంలో కేసీఆర్ తీసుకొచ్చిన 317 జీఓతో టీచర్లు మనోవేదనకు గురయ్యారని, ఈ జీఓ తొలగిస్తామన్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కూడా మోసం చేశారని ఈటల విమర్శించారు. కానీ 317 జీఓకు వ్యతిరేకంగా బీజేపీ కొట్లాడిందన్నారు. కాంట్రిబ్యూటరీ పెన్షన్ వద్దనుకుంటే రాష్ట్రాలు ఆప్షన్ తీసుకోవచ్చని కేంద్రం చెప్పినా కేసీఆర్ తీసేయలేదని, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సైతం తన విధానాన్ని ప్రకటించలేదని అన్నారు. ఇక ఉద్యోగులకు ఐదు డీఏలు పెండింగ్ ఉండగా, పీఆర్సీ అమలుకు నోచుకోలేదన్నారు. అలాగే, ఉద్యోగ విరమణ చేసిన వారికి 15 నెలలుగా బకాయిలు రాని పరిస్థితి ఉందని చెప్పారు. ఈ విషయంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ దగా చేశాయని విమర్శించారు. టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో యూటీఎఫ్ను గెలిపిస్తే వారు ఒరగబెట్టింది ఏమీ లేదని, అపారమైన అనుభవం కలిగిన సరోత్తమ్రెడ్డిని గెలిపిస్తే సమస్యల పరిష్కారానికి మండలిలో గళం ఎత్తుతారని ఈటల తెలిపారు. కాగా, ఆరు గ్యారంటీలు, 66 హామీల అమలుకోసం కొట్లాడుతామన్నారు. డబ్బు సంపాదించడమే లక్ష్యంగా అసైన్డ్ భూములను లాక్కోవడం, హైడ్రా, మూసీ పేరుతో కూల్చివేస్తున్నారే తప్ప హామీల అమలుపై దృష్టి పెట్టడం లేదని విమర్శించారు. ఈ సమావేశంలో మాజీ ఎంపీ సీతారాంనాయక్, మాజీ ఎమ్మెల్యేలు సైదిరెడ్డి, సుభాష్రెడ్డి, బీజేపీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణతో పాటుచాడ శ్రీనివాస్, అల్లిక అంజయ్య, దొంగల సత్యనారాయణ, శ్యాంరాథోడ్, చెన్నకేశవరెడ్డి, డాక్టర్ పాపారావు, పుల్లారావు యాదవ్, మంద సరస్వతి తదితరులు పాల్గొన్నారు. -
వీ.వీ.పాలెంలో ఐసీఎంఆర్ – ఎన్సీడీ బృందం
రఘునాథపాలెం: మండలంలోని వీ.వీ.పాలెంలో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ను ఢిల్లీ నుండి వచ్చిన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) ఎన్సీడీ బృందం సభ్యులు మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా రికార్డులను పరిశీలించాక కేంద్రం పరిధిలో బీపీ, షుగర్ బాధితులకు అందుతున్న వైద్యసేవలపై ఆరా తీశారు. ఎన్సీడీ పోర్టల్లో చేయాల్సిన మార్పులు, చేర్పులను గుర్తించేందుకు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ఈ బృందం రోహిత్, మాలతి తదితరులు ఉండగా హెల్త్ ఎడ్యుకేటర్ శారద, ఉద్యోగులు మౌనిక, తాల్లూరి శ్రీకాంత్, పద్మ, మేడా పుష్పావతి, పర్వీన్ పాల్గొన్నారు. కూసుమంచి ఫైర్ ఆఫీసర్ సస్పెన్షన్ కూసుమంచి: కూసుమంచి ఫైర్ స్టేషన్ ఆఫీసర్ మోహన్రావును సస్పెండ్ చేస్తూ మంగళవారం ఉత్వర్వులు జారీ అయ్యాయి. ఇక్కడి ఫైర్మెన్ నాగేందర్ తనపై ఫైర్ ఆఫీసర్ విధుల విషయంలో కక్ష్యసాధింపు చర్యలకు పాల్పడడమే కాక దురుసుగా ప్రవర్తిస్తున్నాడని ఫిర్యాదు చేశాడు. దీంతో ప్రాథమిక విచారణ అనంతరం నాగేందర్ను సస్పెండ్ చేశామని జిల్లా ఫైర్ ఆఫీసర్ అజయ్కుమార్ తెలిపారు. అయితే, పూర్తిస్థాయి విచారణ కొనసాగిస్తామని వెల్లడించారు. మిర్చి కొనుగోళ్లు, ధరలపై ఇంటెలిజెన్స్ ఆరా ● రైతులు, మార్కెట్వర్గాలతో మాట్లాడిన అధికారులు ఖమ్మంవ్యవసాయం: ఖమ్మం మార్కెట్లో మిర్చి క్రయవిక్రయాలు, ధరలపై ఇంటెలిజెన్స్ వర్గాలు ఆరా తీశాయి. రాష్ట్రంలో అత్యధికంగా మిర్చి కొనుగోళ్లు ఇక్కడే జరుగుతున్న నేపథ్యాన అధికారులు మంగళవారం మార్కెట్లో పరి శీలించారు. విదేశాల్లో డిమాండ్ కలిగిన ‘తేజా’ రకం మిర్చి క్వింటాకు గత ఏడాది ఖమ్మంలో గరిష్టంగా రూ.23వేల వరకు ధర పలకగా ఈ ఏడాది పతనమైంది. చైనాలో పంట సాగు పెరిగిందని ఎగుమతిదారులు చెబుతున్న నేపథ్యాన ప్రస్తుతం గరిష్టంగా రూ.14 వేలు, మోడల్ ధర 13,300గా నమోదవుతోంది. ఓ వైపు ధర తగ్గడం, మరోవైపు తెగుళ్లతో దిగుబడి పడిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. రైతులు నష్టపోతున్నందున కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మిర్చి బోర్డు ఏర్పాటు చేసి క్వింటాకు రూ.25 వేల ధరతో కొనుగోలు చేయాలని వామపక్షాల పార్టీల అనుబంధ రైతు సంఘాల నాయకులు మంగళవారం మార్కెట్లో ఆందోళన చేపట్టారు. ఈనేపథ్యాన ఇంటెలిజెన్స్ అధికారులు మార్కెట్లో మంగళవారం మిర్చి జెండా పాట, ధర నిర్ణయం, అందుకు ఎంచుకునే ప్రమాణాలపై ఆరా తీయడమే కాక రైతులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఆ తర్వాత మార్కెట్ అధికారులతో మాట్లాడి ధర పతనంపై చర్చించినట్లు తెలిసింది. పత్తి యార్డు భవనంలోకి డీఎంఓ కార్యాలయం ఖమ్మంవ్యవసాయం: జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి(డీఎంఓ) కార్యాలయాన్ని ఖమ్మం వ్యవసాయ మార్కెట్ పత్తి యార్డులోని ఓ భవనంలోకి మార్చారు. మార్కెట్ ప్రాంగణంలోనే ఏళ్లుగా డీఎంఓ కార్యాలయం కొనసాగుతుండగా ఆ భవనాన్ని మిర్చి యార్డు ఆధునికీకరణ పనుల్లో భాగంగా కూల్చివేశారు. దీంతో కార్యాలయ నిర్వహణకు పత్తి యార్డులో ఖాళీగా ఉన్న క్యాంటిన్ భవనాన్ని కేటాయించారు. ఇందులో మార్కెటింగ్ శాఖ అధికారితో ఇంజనీరింగ్ విభాగం కూడా కొనసాగించాల్సి ఉన్నందున మరో గదిని సైతం అప్పగించాలని అధికారులు భావిస్తున్నట్లు తెలిసింది. కాగా, మిర్చి యార్డు నూతన నిర్మాణంతో పాటే జిల్లా మార్కెటింగ్ శాఖ కార్యాలయ భవన నిర్మాణం ఉంటుందని అధికారులు తెలిపారు. ఎస్సారెస్సీ కాల్వ తవ్వకానికి తొలగిన అడ్డంకులు కూసుమంచి: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు 54వ ప్యాకేజీలో కాల్వ తవ్వకానికి అవసరమైన 13ఎకరాల భూసేకరణలో ఇబ్బందులతో పనులు నిలిచిపోయిన విషయం విదితమే. కాల్వ తవ్వకపోవడంతో కూసుమంచి, తిరుమలాయపాలెం, ఖమ్మంరూరల్ మండలాల్లోని వేలాది ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందడం లేదు. ఈ విషయాన్ని ఇరిగేషన్ అధికారులు మంత్రి పొంగులేటి శ్రీని వాసరెడ్డి దృష్టికి తీసుకెళ్లగా ఆయన నిర్వాసిత రైతులను ఒప్పించారు. ఈ మేరకు రూ.2.64 కోట్ల పరిహారం రైతుల ఖాతాల్లో జమ కావడంతో కాలుల్వవ తవ్వకానికి అడ్డంకులు తొలగిపోయినట్లయింది. ఈ పనులు పూర్తయితే మూడు మండలాల్లో అదనంగా 11వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని అధికారులు తెలిపారు. -
ముప్పై దాటితే
జిల్లాలో ముప్పై ఏళ్ల వయస్సు దాటిన వారిలో పలువురు రక్తపోటు, మధుమేహం సమస్య ఎదుర్కొంటున్నారు. ఈ రెండు వ్యాధులు వారిని ఆస్పత్రుల పాలు చేస్తున్నాయి. ఈనేపథ్యాన నాన్ కమ్యూనికబుల్ డిసీస్(ఎన్సీడీ) పేరుతో ప్రత్యేక కార్యక్రమం అమలుచేస్తూ బీపీ, షుగర్ బాధితులను గుర్తించి వైద్యంతో పాటు మందులు పంపిణీ చేస్తున్నారు. ఇప్పటివరకు జిల్లాలో చేపట్టిన స్క్రీనింగ్లో 10 శాతం మంది బీపీ, 7.1 శాతం మంది షుగర్తో బాధపడుతున్నట్లు తేలింది. దీంతో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారుల సూచనల మేరకు వారు మందులు వాడుతున్నారు. దీర్ఘకాలిక వ్యాధుల నియంత్రణకు జిల్లాలోని ఎన్సీడీ కార్నర్లు, క్లినిక్ల ద్వారా అందిస్తున్న సేవలు విస్తృతం కావడం, పెద్దసంఖ్యలో పరీక్షలు చేస్తుండడంతో బాధితుల సంఖ్య పెరుగుతుండగా, అదేస్థాయిలో చికిత్స కొనసాగుతోంది. – ఖమ్మంవైద్యవిభాగం -
స్తంభాద్రి గిరిప్రదక్షిణ.. వైభోగం
● దారి పొడవునా స్వామికి భక్తుల నీరాజనం ● ఆపై నక్షత్ర జ్యోతి దర్శనంఖమ్మంగాంధీచౌక్: అరుణాచలం, యాదగిరిగుట్ట మాదిరిగానే ఖమ్మంకు మూలమైన త్రేతాయుగం నాటి స్వయంభూ దివ్య క్షేత్రం శ్రీ స్తంభాద్రి లక్ష్మీనరసింహ స్వామి కొండ చుట్టూ గిరి ప్రదక్షిణ ప్రారంభమైంది. స్వామి జన్మనక్షత్రమైన స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకుని ప్రతీనెలా గిరి ప్రదక్షిణ నిర్వహించాలని నిర్ణయించగా మంగళవారం వేలాది మంది భక్తుల నడుమ నిర్వహించారు. వేద పండితులు మంత్రోచ్ఛరణల నడుమ స్వామి వారిని సతీసమేతంగా ఆలయం నుంచి పల్లకీపైకి చేర్చి గుట్ట కిందకు తీసుకొచ్చాక భజనలు, కోలాటాల నడుమ గిరి ప్రదక్షిణ ప్రారంభమైంది. వేలాదిగా హాజరైన భక్తులు నృసింహ నామ స్మరణకు తోడు కీర్తనలు ఆలపిస్తూ పాల్గొన్నారు. స్తంభాద్రి ఘాట్ రోడ్డు గేటు వద్ద ప్రారంభమైన ప్రదక్షిణ ఎన్నెస్పీ రోడ్, కవిత డిగ్రీ అండ్ పీజీ కళాశాల, స్తంభాద్రి మండపం, సరిత క్లినిక్, ఎల్ఐసీ కార్యాలయం మీదుగా తిరిగి గేట్ నుంచి ఘాట్ రోడ్ ద్వారా గుట్టపై ఆలయం వద్దకు చేరింది. ఆతర్వాత ఆలయం పక్కన కొండపై నక్షత్ర జ్యోతిని అర్చకులు వెలిగించారు. ప్రతీనెల స్వాతి నక్షత్రం రోజున సాయంత్రం గిరి ప్రదక్షిణ ఉంటుందని ఆలయ ఈఓ కొత్తూరు జగన్మోహన్రావు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ, ధర్మాదాయ శాఖ ఉమ్మడి జిల్లా అసిస్టెంట్ కమిషనర్ వీరస్వామితో పాటు భక్త మండళ్ల బాధ్యులు, అర్చకులు, స్థానికులు పాల్గొన్నారు. -
నేత్రపర్వం.. రామయ్య నిత్యకల్యాణం
భద్రాచలం: భద్రాచలంలో శ్రీ సీతారామచంద్ర స్వామి వారి నిత్యకల్యాణ వేడుక మంగళవారం నేత్రపర్వంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామి వారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. కాగా, మంగళవారాన్ని పురస్కరించుకుని అభయాంజనేయస్వామి వారికి అభిషేకం, ప్రత్యేక పూజలు చేశారు. -
అర్హత లేదు.. అనుమతులూ లేవు
ఖమ్మంవైద్యవిభాగం: నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న ఆక్యూ పంక్చర్ ఆస్పత్రిని డీఎంహెచ్ఓ డాక్టర్ కళావతిబాయి సీజ్ చేశారు. ఖమ్మం కమాన్బజార్లోని పెయిన్ రిలీఫ్ ఆక్యూ పంక్చర్ ఆస్పత్రిని డీఎంహెచ్ఓ మంగళవారం తనిఖీ చేశారు. ఆ సమయంలో డాక్టర్గా వ్యవహరిస్తున్న పి.విజయభాస్కర్ లేకపోగా, ఆయనకు అర్హత లేదని, రిజిస్ట్రేషన్ లేకుండానే ఆస్పత్రి నడుపుతున్నట్లు తేలడంతో సీజ్ చేయించచారు. తగిన అర్హతలు లేకుండా వైద్యం చేయడం నేరమని, ఒకవేళ అర్హత ఉన్నా ఆలోపతిక్ చట్టప్రకారం రిజిస్ట్రేషన్ చేయింకున్నాక ప్రాక్టీస్ చేయాలని ఆమె స్పష్టం చేశారు. తనిఖీల్లో డిప్యూటీ డీఎంహెచ్ఓ సైదులు, సీహెచ్ఐ పీఓ చందునాయక్, డెమో సాంబశివరెడ్డి పాల్గొన్నారు.ఆక్యూ పంక్చర్ ఆస్పత్రి సీజ్ -
అదనపు నిర్మాణాలకు అడ్డుకట్ట
● అనుమతి లేని నిర్మాణదారులకు నోటీసులు ● ఖమ్మంలో పలుచోట్ల పనుల అడ్డగింత, కూల్చివేతఖమ్మంమయూరిసెంటర్: ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నానాటికీ స్థిరపడుతున్న జనాభాతో పాటే నగరం విస్తరిస్తోంది. పిల్లల చదువుతో పాటు వ్యాపారం, ఉద్యోగాలు, ఉపాధి కోసం నగరానికి వచ్చే పలువురు సొంతంగా ఇళ్ల నిర్మాణం చేపడుతున్నారు. మరికొందరు అద్దె ఇళ్లలో ఉంటుండగా డిమాండ్ పెరగడంతో యజమానులు అనుమతి లేకుండా అక్రమ నిర్మాణాలకు తెరలేపుతున్నారు. కేఎంసీ కొందరు అనుమతి తీసుకోకపోగా, ఇంకొందరు తీసుకుంటున్నా అనుమతికి మించి నిర్మాణాలు చేపడుతున్నారు. ఈ విషయమై అందిన ఫిర్యాదులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కలెక్టర్ ముజమ్మిల్ఖాన్ సీరియస్గా తీసుకుని అనుమతులు లేని నిర్మాణాలను అడ్డుకోవాలని కేఎంసీ అధికారులకు సూచించారు. దీంతో కమిషనర్ అభిషేక్ అగస్త్య ఆదేశాలతో టౌన్ ప్లానింగ్ అధికారులు రంగంలోకి దిగారు. పుట్టగొడుగుల్లా.. కేఎంసీలో విలీనమైన పంచాయతీలు, నగర శివారు ప్రాంతాల్లో కొత్తగా నిర్మాణాల సంఖ్య భారీగా ఉంటోంది. అలాగే, పాత భవనాలపై అదనపు నిర్మాణాలు చేపడుతున్నారు. అయితే, ఇందులో ఎన్నింటికి అనుమతి ఉందో అధికారులకు సైతం పరిస్థితి నెలకొంది. కేఎంసీలో టౌన్ ప్లానింగ్ సిబ్బంది తక్కువగా ఉండడం, ఉన్న వారికి అదనపు విధులు, ఎల్ఆర్ఎస్ పనులు ఉండడంతో అక్రమ నిర్మాణాలను పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. ఇదే అదునుగా నిర్మాణదారులు యథేచ్ఛగా నిర్మాణాలు పూర్తి చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. కూల్చివేతలే.. అనుమతుల లేకుండా నిర్మాణాలు చేపట్టవద్దని అధికా రులు ఇప్పటికే పలుమార్లు హెచ్చరించారు. కొందరికి నోటీసులను కూడా చేసినా ఫలితం కానరావడం లేదు. దీంతో టౌన్ ప్లానింగ్ అధికారులు అడుగు ముందుకేశారు. ఖమ్మంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం టౌన్ ప్లానింగ్ ఏసీపీ వసుంధర నేతృత్వాన తనిఖీలు చేపట్టారు. కొన్నిచోట్ల అనుమతులు చేపడుతున్న నిర్మాణాలను అడ్డుకొని పిల్లర్లు, స్టాబ్లను కూల్చివేశారు. కొత్తగా నిర్మించే భవనాల పిల్లర్లను జేసీబీలతో తొలగించగా.. అపార్ట్మెంట్లు, ఇతర భవనాలపై నిర్మిస్తున్న పెంట్ హౌజ్ల గోడలను కూల్చివేశారు. అలాగే, స్లాబ్ వేసేందుకు సిద్ధంగా ఉన్న సెంట్రిగ్లను సైతం తొలగించారు. కాగా, కేఎంసీ అనుమతి లేకుండా నిర్మాణాలు చేపడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు అవగాహన కల్పించారు. అలాగే, నిర్మాణ అనుమతుల పత్రాలను పనుల వద్ద ప్రదర్శించాలని సూచించారు. -
ఉద్యోగి నుంచి డబ్బు వసూలుకు పన్నాగం
● మహిళలను వేధించిన కేసు నమోదైందని బెదిరింపులు ఖమ్మంఅర్బన్: సైబర్ మోసాలు రోజురోజుకు కొత్తపుంతలు తొక్కుతున్నాయి. అలాంటి ఘటనే సోమవారం వెలుగుచూసింది. ఖమ్మం మమత రోడ్డులో నివాసముండే ఓ వ్యక్తి ఖమ్మం రూరల్ మండలంలోని పంచాయతీరాజ్శాఖలో ఉద్యోగం చేస్తున్నాడు. ఆయనకు సోమవారం గుర్తు తెలియని నంబర్ నుంచి ఫోన్ రాగా హిందీ, ఇంగ్లిషు భాషల్లో మాట్లాడిన అవతలి వ్యక్తి బెంగళూరు పోలీసుగా చెప్పుకున్నాడు. సదరు ఉద్యోగి ఫోన్ నుంచి మహిళలకు ఫోన్ చేస్తూ వేధిస్తున్నారని, ఈ విషయమై అందిన ఫిర్యాదుతో ఎఫ్ఐఆర్ నమోదైందని చెబుతూ, సెటిల్మెంట్ కోసం డబ్బులు డిమాండ్ చేశాడు. దీంతో కంగారు పడిన సదరు ఉద్యోగి తన మిత్రుడు పోలీసు శాఖలో ఉండడంతో సమాచారం ఇచ్చాడు. అయితే, ఇది సైబర్ నేరగాళ్ల పనేనని పోలీసు ఉద్యోగి చెప్పడంతో తనకు వచ్చిన ఫోన్ నంబర్ వివరాలతో సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చెల్లని చెక్కు కేసులో జైలుశిక్ష, జరిమానా ఖమ్మం లీగల్: తీసుకున్న అప్పు చెల్లించే క్రమాన ఇచ్చిన చెక్కు చెల్లకపోవడంతో ఖమ్మం బుర్హాన్పురకు చెందిన బ్రహ్మదేవర సోమయ్యకు ఏడాది జైలుశిక్ష, రూ.5వేల జరిమానా విధిస్తూ ఖమ్మం ఆబ్కారీ కోర్టు న్యాయమూర్తి రాళ్లబండి శాంతిలత మంగళవారం తీర్పు చెప్పారు. ఖమ్మం కుమ్మరి బజార్కు చెందిన తవిడిశెట్టి యుగంధర్ వద్ద సోమయ్య 2015 ఫిబ్రవరి 15న రూ.10 లక్షల అప్పు తీసుకున్నాడు. ఈ అప్పు చెల్లించే క్రమాన 2017 ఫిబ్రవరి 14న రూ.14.80లక్షలకు చెక్కు జారీ చేశాడు. అయితే, ఆ చెక్కును బ్యాంకు ఖాతాలో జమ చేసేందుకు వెళ్లగా అప్పటికే సోమయ్య ఖాతా మూసివేశాడని తెలియడంతో కోర్టులో ప్రైవేట్ కేసు దాఖలు చేశాడు. ఈ కేసు విచారణలో ఆయనపై నేరం రుజువు కాగా ఏడాది జైలు శిక్షతో పాటు రూ.5వేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. పట్టపగలే చోరీకి యత్నం, బంధించిన స్థానికులు ఖమ్మంఅర్బన్: ఖమ్మం రోటరీనగర్లో ఓ ఇంటి తాళాన్ని రోకలిబండతో పగులగొట్టేందుకు ప్రయత్నించిన వ్యక్తిని స్థానికులు పోలీసులకు పట్టించారు. మంగళవారం మధ్యాహ్నం సాగర్ ప్రధాన కాల్వ సమీపాన ఒక ఇంటికి తాళం వేసి ఉండగా గుర్తుతెలియని రోకలిబండతో పగులగొట్టేందుకు యత్నిస్తున్నాడు. ఈక్రమంలో శబ్దం విన్న స్థానికులు ఆయనను పట్టుకొని ఖమ్మం అర్బన్ పోలీసులకు అప్పగించారు. కాగా, చోరీకి యత్నించిన వ్యక్తి పాత నేరస్తుడని, గతంలో కొణిజర్ల స్టేషన్లో నమోదైన కేసులో వారెంట్ జారీ అయిందని పోలీసులు తెలిపారు. దీంతో నిందితుడిని కొణిజర్ల పోలీసులకు అప్పగించినట్లు ఖమ్మం అర్బన్ పోలీసులు తెలిపారు. -
ముదిగొండ, తల్లాడ జట్ల గెలుపు
ఖమ్మం స్పోర్ట్స్: ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో నిర్వహిస్తున్న రాజీవ్గాంధీ స్మారక క్రికెట్ టోర్నీలో మంగళవారం ముదిగొండ, తల్లాడ జట్లు విజయం సాధించాయి. ముదిగొండ – ఏన్కూరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ముదిగొండ 15 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 120 పరుగులు చేసింది. ఈ జట్టులో పవన్ 43 బంతులు ఆడి ఐదు ఫోర్లు, రెండు సిక్సర్లతో 68 పరుగులు చేశాడు. అనంతరం బ్యాటింగ్కు దిగిన ఏన్కూరు జట్టు విజయానికి సరిపడా పరుగులు చేయకపోవడంతో ముదిగొండ జట్టు గెలుపొందింది. అనంతరం తల్లాడ – జూలూరుపాడు మధ్య మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేపట్టిన తల్లాడ జట్టు 16ఓవర్లలో 121 పరుగులు చేసింది. ఆపై జూలూరుపాడు జట్టు 16ఓవర్లలో 100పరుగులే చేయడంతో ఓటమి పాలైంది. మ్యాచ్లను కబడ్డీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు తుంబూరు దయాకర్రెడ్డి, ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి కె.క్రిస్టోఫర్బాబు, డీవైఎస్ఓ టి.సునీల్కుమార్రెడ్డి, టోర్నీ ఆర్గనైజింగ్ కార్యదర్శి ఎం.డీ.మతిన్, కోచ్ ఎం.డీ.గౌస్ ప్రారంభించారు. జేవీఆర్ సీహెచ్పీని పరిశీలించిన డైరెక్టర్ సింగరేణి(కొత్తగూడెం): సత్తుపల్లిలోని జేవీఆర్ సీహెచ్పీని సింగరేణి డైరెక్టర్ (ప్రాజెక్ట్ అండ్ ప్లానింగ్) పీపీ) కె.వెంకటేశ్వర్లు మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా బొగ్గు రవాణా, కోల్ రిసీవింగ్ కాంప్లెక్స్ వద్ద అన్లోడింగ్ సమయంలో ఎదురవుతున్న ఇబ్బందులపై ఆరా తీశారు. ఆ తర్వాత కోల్ ఏరియా, డిశ్చార్జి పాయింట్ను కూడా పరిశీలించారు. సీహెచ్పీ నుంచి దుమ్ము వెలువడకుండా తీసుకోవాల్సిన చర్యలపై ఏరియా జీఎం శాలేంరాజుతో చర్చించారు. కార్యక్రమంలో అధికారులు సూర్యనారాయణ, కోటిరెడ్డి, రామకృష్ణ, ఆర్.ప్రహ్లాద్, నర్సింహారావు, కె.సోమశేఖర్ పాల్గొన్నారు. -
ఈ మూడు వారాలే కీలకం
ఖమ్మంఅర్బన్: రబీ సీజన్లో సాగు చేసిన పంటలకు రానున్న మూడు వారాలు కీలకమని, ఈ సమయాన సాగర్ ప్రాజెక్టుతో పాటు ఇతర ప్రాజెక్టులు, చెరువుల పరిధి ఆయకట్టుకు సక్రమంగా నీరు సరఫరా చేయడంపై దృష్టి సారించాలని జల వనరుల శాఖ ఉన్నతాధికారులు సూచించారు. ఈమేరకు జిల్లా చీఫ్ ఇంజనీర్కు మంగళవారం ఆదేశాలు అందాయి. ఆయకట్టుకు నీరు అందించే విషయంలో ఇంజనీర్లు రానున్న మూడు వారాలు అప్రమత్తంగా వ్యవహరించాలని అందులో సూచించారు. ఎక్కడా నీరు వృధా కాకుండా కాల్వలపై ఈఈలు రాత్రి వేళల్లో పెట్రోలింగ్ చేయాలని సూచించినట్లు తెలిసింది. ఇదే సమయాన వైరా రిజర్వాయర్ కింద స్థిరీకరించిన ఆయకట్టు సుమారు 17,390 ఎకరాలు ఉండగా, రబీ పంటలకు సాగర్ జలాలు అందించేలా ప్రణాళిక రూపొందించాలని అధికారులకు ఆదేశాలు అందాయి. డిప్యూటీ సీఎం భట్టి సమీక్ష మధిర నియోజకవర్గంలో జరుగుతున్న పనులపై జలవనరుల శాఖ అధికారులతో హైదరాబాద్లో మంగళవారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమీక్షించారు. ఖమ్మం జలవనరుల శాఖ సీఈ రమేష్, కల్లూరు ఎస్ఈ వాసంతితో పాటు పలువురు ఇంజనీర్లు పాల్గొనగా మండలాలు, ప్రాజెక్టుల వారీగా మంజూరైన నిధులు, ఇప్పటివరకు చేపట్టిన పనులపై సమీక్షించిన ఆయన సూచనలు చేసినట్లు తెలిసింది. సాగునీటి సరఫరాలో అప్రమత్తత తప్పనిసరి -
వ్యక్తి ఆత్మహత్య
సత్తుపల్లిరూరల్: సత్తుపల్లి మండలం గంగారం పంచాయతీ జలగంనగర్కు చెందిన కంచి రాధాకృష్ణ(30) మంగళవారం ఆత్మహత్య చేసుకున్నాడు. గంగారంలోని ఓ హోటల్లో పనిచేస్తూ జీవనం సాగిస్తున్న ఆయన ఇంట్లో ఎవరూ లేని సమయాన ఉరి వేసుకున్నాడు. ఈమేరకు సత్తుపల్లి పోలీసులు వివరాలు సేకరించారు. అయితే, ఆయన ఆత్మహత్యకు కారణాలు తెలియకపోగా ఎవరూ ఫిర్యాదు చేయలేదని పోలీసులు తెలిపారు. కాగా, రాధాకృష్ణకు భార్య, ఒక కుమారుడు ఉన్నారు. ఆరుగురు వాహన యజమానులపై కేసు చింతకాని: సరుకు రవాణాకు వినియోగించే బోలెరో వాహనాల్లో ప్రయాణికులను తీసుకెళ్తున్న ఆరు వాహనాల యజమానులపై మంగళవారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై నాగుల్మీరా తెలిపారు. బోనకల్ నుంచి బోలెరో వాహనాల్లో కూలీలను ఎక్కించుకుని నాగులవంచ వైపు వస్తుండగా పోలీసులు తనిఖీ చేశారు. ఈసందర్భంగా జరిగే ప్రమాదాలపై ప్రయాణికులకు అవగాహన కల్పించి, వాహన యజమానులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
కబడ్డీ ఎంపిక పోటీలకు 195మంది హాజరు
ఖమ్మం స్పోర్ట్స్: రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్స్ కబడ్డీ పోటీల్లో పాల్గొనే జిల్లా బాలబాలికల జట్ల ఎంపికకు ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలో మంగళవారం నిర్వహించిన పోటీలకు మంచి స్పందన లభించింది. కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యాన నిర్వహించిన ఈ పోటీలకు బాలురు 120 మంది, బాలికలు 75 మంది హాజరయ్యారు. వీరిని జట్లుగా విభజించి పోటీలు నిర్వహించగా, ప్రతిభ కనబర్చిన వారితో జిల్లా బాలబాలికల జట్లను ఎంపిక చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. కబడ్డీ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శి టి.దయాకర్రెడ్డి, కె.క్రిస్టోఫర్బాబు, డీవైఎస్ఓ టి.సునీల్కుమార్రెడ్డితో పాటు సుధాకర్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
ఏసీబీ వలలో అటవీ అధికారులు
ఇల్లెందురూరల్ : అటవీ భూముల నుంచి మట్టి తరలించేందుకు రూ.30 వేలు లంచం తీసుకుంటూ ఎఫ్ఆర్ఓ, ఎఫ్బీఓ ఏసీబీ అధికారులకు చిక్కారు. ఈ ఘటన ఇల్లెందు మండలంలో మంగళవారం చోటుచేసుకుంది. ఏసీబీ డీఎస్పీ రమేష్ తెలిపిన వివరాల ప్రకారం.. గతేడాది సెప్టెంబర్లో కురిసిన భారీ వర్షాలతో పలు గ్రామాల్లో రహదారులు అధ్వానంగా మారాయి. పొలాలకు వెళ్లేందుకు ఇబ్బందిగా మారడంతో మండలంలోని బోడుతండా, కొమరారం, పోచారం తండా గ్రామాల రైతులు స్థానిక ఎమ్మెల్యే కోరం కనకయ్య ద్వారా కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు. దీంతో కలెక్టర్ ఫ్లడ్ రిలీఫ్ ఫండ్ నుంచి ఒక్కో గ్రామానికి రూ.1.50 లక్షల చొప్పున విడుదల చేశారు. పొలాలకు వెళ్లే రహదారులపై గ్రావెల్ పోసుకోవాలని సూచించారు. దీంతో బోడుతండాకు చెందిన ఓ రైతు ఈ ఏడాది సంక్రాంతి రోజున మట్టి కోసం అటవీ ప్రాంతానికి వెళ్లాడు. విషయం తెలుసుకున్న కొమురారం ఎఫ్ఆర్ఓ ఉదయ్కిరణ్, ఎఫ్బీఓ హరిలాల్ మట్టి తరలింపును అడ్డుకుని జేసీబీని స్వాధీనం చేసుకున్నారు. దీంతో రైతు రూ.15వేలు ముట్టజెప్పి జేసీబీని విడిపించుకున్నాడు. ఆపై మొరం తోలకానికి అనుమతి ఇవ్వాలని అటవీ అధికారులను వేడుకోగా రూ.50 వేలు లంచం డిమాండ్ చేశారు. చివరకు బతిమిలాడి రూ.20 వేలు చెల్లించి పనులు ప్రారంభించాడు. అయితే పొలాలకు నీరు పెడుతుండడంతో ఆ దారిలో ట్రాక్టర్ వెళ్లేందుకు వీల్లేక కొన్ని రోజులు పనులు నిలిపివేసి, వారం క్రితం మట్టి తోలుకుంటున్నట్టు అటవీ అధికారులకు సమాచారం ఇచ్చాడు. మిగిలిన రూ.30 వేలు ఇస్తేనే మట్టి తీసుకెళ్లాలని వారు ఖరాఖండిగా చెప్పడంతో రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారి సూచన మేరకు మంగళవారం రూ.30 వేలు తీసుకుని అటవీ రేంజ్ కార్యాలయానికి వెళ్లాడు. అక్కడ ఎఫ్ఆర్ఓ సూచనతో ఎఫ్బీఓకు నగదు ఇస్తుండగా మాటువేసిన ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఇద్దరినీ అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. -
26నుంచి రెండు రాష్ట్రాల స్థాయి కబడ్డీ పోటీలు
చింతకాని: మహాశివరాత్రి సందర్భంగా ఈనెల 26నుంచి మండలంలోని నేరడలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల స్థాయి కబడ్డీ పోటీలు నిర్వహించనున్నారు. ఈ పోటీలు మూడు రోజుల పాటు జరుగుతాయని నేతాజీ యువజన సంఘం కార్యదర్శి దూసరి గోపాలరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జట్ల బాధ్యులు రూ.500 ఎంట్రీ ఫీజు చెల్లించి ఈనెల 25వ తేదీ లోగా నమోదు చేసుకోవాలని సూచించారు. మొదటి మూడు స్థానాల్లో నిలిచేవారికి వరుసగా రూ.50 వేలు, రూ.40 వేలు, రూ.30వేలతో పాటు ఎనిమిదో స్థానం వరకు నిలిచే జట్లకు సైతం నగదు బహుమతులు అందజేస్తామని తెలి పారు. వివరాలకు క్రీడాకారులు 70939 00119, 93945 71739, 80084 92173 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని ఆయన సూచించారు. -
మిర్చిబోర్డు ఏర్పాటు చేయాల్సిందే...
ఖమ్మంవ్యవసాయం: మిర్చి ధర స్థిరీకరణ కోసం ఖమ్మంలో మిర్చి బోర్డు ఏర్పాటు చేయాలనే డిమాండ్తో వామపక్ష పార్టీల అనుబంధ రైతు సంఘాల ఆధ్వర్యాన ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో మంగళవారం ధర్నా నిర్వహించారు. నానాటికీ మిర్చి ధర పతనమవుతున్నందున రైతులు నష్టపోకుండా ఇతర పంటల మాదిరి మద్దతు ధర ప్రకటించి ప్రభుత్వమే ఏజెన్సీల ద్వారా కొనుగోలు చేయాలన్నారు. ఈసందర్భంగా సీపీఎం అనుబంధ తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పోతినేని సుదర్శన్, రాష్ట్ర నాయకుడు నున్నా నాగేశ్వరరావు మాట్లాడుతూ మిర్చి ధర స్థిరీకరణకు మిర్చిబోర్డు ఆవశ్యమని తెలిపారు. ఈ బోర్డునుఖమ్మంలో ఏర్పాటుచేసిన క్వింటాకు రూ.25 వేలు చెల్లించేలా మార్క్ఫెడ్, నాఫెడ్ల ద్వారా కొనుగోళ్లు చేయించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఇద్దరు కేంద్ర మంత్రులు, జిల్లాలో ముగ్గురు రాష్ట్రమంత్రులు ఉన్నందున ఈ విషయంలో స్పందించాలన్నారు. అలాగే, సీపీఐ అనుబంధ తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఆధ్వర్యాన కూడా నిరసన తెలపగా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బాగం హేమంతరావు మాట్లాడారు. మిర్చి ధర పతనానికి పాలకులే బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు. మిర్చిబోర్డు ఏర్పాటుతోనే రైతులకు న్యాయం జరుగుతుందని తెలిపారు. ఈవిషయంలో స్పందించకపోతే మార్కెట్లోలో లావాదేవీలను స్తంబింపచేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమాల్లో సీపీఎం, సీపీఐ, అనుబంధ సంఘాల నాయకులు యర్రా శ్రీకాంత్, మాదినేని రమేష్, భూక్యా వీరభద్రం, వై.విక్రమ్, యర్రా శ్రీనివాసరావు, యల్లంపల్లి వెంకట్రావు, తాతా భాస్కర్రావు, కొక్కెర పుల్లయ్య, దండి సురేష్, మహ్మద్ మౌలానా, దొండపాటి రమేష్, కొండపర్తి గోవిందరావు, యర్రా బాబు, శింగునర్సింహారావు, పోటు కళావతి, మిడికంటి చిన్న వెంకటరెడ్డితో పాటు మిర్చి తీసుకొస్తున్న రైతులు కూడా పాల్గొన్నారు. కాగా, మార్కెట్ కమిటీ చైర్మన్ యరగర్ల హన్మంతరావు వారితో చర్చించి త్వరలోనే అధికారులు, వ్యాపారులతో సమావేశం ఏర్పాటు చేస్తామని తెలిపారు. సీపీఎం, సీపీఐ అనుబంధ సంఘాల ఆధ్వర్యాన ధర్నా క్వింటాకు రూ.25 వేలు చెల్లించాలని డిమాండ్ -
కంటి పరీక్షల శిబిరాన్ని పరిశీలించిన డీఎంహెచ్ఓ
ఖమ్మంవైద్యవిభాగం: ఖమ్మం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాటుచేసిన ప్రత్యేక శిబిరాన్ని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి బి.కళావతిబాయి మంగళవారం పరిశీలించారు. ఈసందర్భంగా పలువురికి స్వయంగా పరీక్షలు చేసిన ఆమె వైద్యులతో సమీక్షించారు. కంటి సమస్యలు ఉన్న వారికి రెండో విడత పరీక్షల అనంతరం అవసరమైన విద్యార్థులకు కంటి అద్దాలు పంపిణీ చేస్తామని తెలిపారు. ఎవరికై నా ఆపరేషన్ అవసరమైతే హైదరాబాద్ పంపిస్తామని చెప్పారు. జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి చందునాయక్, డెమో సాంబశివరెడ్డి పాల్గొన్నారు. -
పీహెచ్సీలో కేంద్ర బృందం తనిఖీ
ముదిగొండ: ముదిగొండ ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని వైద్య ఆరోగ్య అడిషనల్ డైరెక్టర్ డాక్టర్ కె.శశిశ్రీతో పాటు కేంద్రప్రభుత్వ టాస్క్పోర్స్ టీమ్ సభ్యులు మంగళవారం తనిఖీ చేశారు. కేంద్రంలోని రికార్డులను పరిశీలించాక మందుల నిల్వలు, టీకాలపై ఆరాతీశారు. ఆరోగ్యకేంద్రంలోని ఫార్మసీకి సరఫరా అయిన మందులు, పంపిణీపై వివరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఆతర్వాత వైద్యసేవపై ఉద్యోగులకు సూచనలు చేశారు. అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ విజయ్కుమార్, కుత్బుల్లాపూర్ డ్రగ్స్ ఇన్స్పెక్టర్ తిరుపతి, డీపీఓ దుర్గ, వైద్యాదికారి డాక్టర్ అరుణాదేవి, ఉద్యోగులు మోహన్, ఖాదర్బీ, సత్యవతి, రాణి పాల్గొన్నారు. -
ఎంపీకి రాష్ట్రపతి, ప్రధాని జన్మదిన శుభాకాంక్షలు
ఖమ్మంవన్టౌన్: ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి పుట్టినరోజు బుధవారం జరగనుండగా.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ఖర్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాజీవితంలో భవిష్యత్లో మరిన్ని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షిస్తూ మంగళవారం వారు వేర్వేరుగా సందేశాలు పంపారు. సీఎం, డిప్యూటీ సీఎంను కలిసిన డీసీసీబీ చైర్మన్ మధిర: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కను డీసీసీబీ చైర్మన్ దొండపాటి వెంకటేశ్వరరావు హైదరాబాద్లో మంగళవారం కలిశారు. డీసీసీబీలు, పీఏసీఎస్ల పాలకవర్గాల పదవీ కాలాన్ని ఆరు నెలల పాటు పొడిగిస్తూ ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ఈనేపథ్యాన సీఎం, డిప్యూటీ సీఎంను కలిసిన చైర్మన్ వారికి కృతజ్ఞతలు తెలిపారు. అసిస్టెంట్ ప్రొఫెసర్కు డాక్టరేట్ ఖమ్మంసహకారనగర్: ఖమ్మం ఎస్ఆర్అండ్బీజీఎన్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల జువాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ బండారు చెంచురత్నయ్యకు డాక్టరేట్ లభించింది. ‘ఆర్సినిక్ ఇండ్యూస్డ్ టాక్సీసిటీ అండ్ ఇట్స్ బయోకెమికల్ ఎఫెక్ట్ ఆన్ ది సెలెక్టెడ్ టిష్యూస్ ఆఫ్ మేల్ ఆల్బినో ర్యాట్’అంశంపై ఆయన రిటైర్డ్ ప్రొఫెసర్ ఎ.ఉషారాణి పర్యవేక్షణలో సమర్పించిన పరిశోధనాత్మక సిద్ధాంత గ్రంథానికి తిరుపతిలోని శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ ప్రకటించారు. ఈ సందర్భంగా రత్నయ్యను కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మహ్మద్ జకీరుల్లా, అధ్యాపకులు, ఉద్యోగులు ఎస్.కిశోర్, డాక్టర్ సునంద, బి.కవిత తదితరులు అభినందించారు.రాష్ట్రస్థాయి ఉషూ పోటీలకు ఎంపిక ఖమ్మం స్పోర్ట్స్: ఆదిలాబాద్లో ఈనెల 19నుంచి జరగనున్న రాష్ట్రస్థాయి ఉషూ పోటీలకు జిల్లా నుంచి మగ్గురు క్రీడాకారులు ఎంపికయ్యారు. ఈమేరకు జిల్లా నుంచి పి.పవిత్రచారి, టి.సాయి భవ్యశ్రీ, హర్షిణి ఎంపిక కాగా, డీవైఎస్ఓ టి.సునీల్కుమార్రెడ్డి, అసోసియేషన్ కార్యదర్శి పి.పరిపూర్ణచారి మంగళవారం అభినందించారు. ఆంగ్లంపై పట్టు సాధించాలి చింతకాని: విద్యార్థులు ఆంగ్ల భాషపై విద్యార్థులు పట్టు సాధించాలని డీఈఓ సోమశేఖరశర్మ సూచించారు. మండలంలోని పందిళ్లపల్లి ఉన్నత పాఠశాలలో ‘వి కెన్ లెర్న్ ఇంగ్లిష్’ కార్యక్రమ అమలును మంగళవారం ఆయన పరిశీ లించి మాట్లాడారు. తప్పులు వచ్చినా నిత్యం తరగతి గదిలో ఆంగ్లంలో మాట్లాడడం ద్వారా ఫలితముంటుందని చెప్పారు. అలాగే, ఉపాధ్యాయులు కూడా ఇంగ్లిష్ పాఠాలు సులువుగా అర్థమయ్యేలా బోధించాలని, విద్యార్థులు తరగతి గదిలో ఆంగ్లంలోనే మాట్లాడేలా ప్రోత్సహించాలని చెప్పారు. ఆతర్వాత పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతుల నిర్వహణ, పరీక్షలకు సన్నద్ధతపై సమీక్షించారు. ఎంఈఓ వీరపనేని శ్రీనివాసరావు, హెచ్ఎం శ్రీనివాసరావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి ఖమ్మంరూరల్: మండలంలోని ఏదులాపురం క్రాస్ వద్ద జరిగిన రోడ్డుప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి(42) మృతి చెందాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు.. సదరు వ్యక్తి మంగళవారం రాత్రి రోడ్డు దాటుతుండగా ఖమ్మం – వరంగల్ ప్రధాన రహదారిపై వెళ్తున్న వాహనం బలంగా ఢీకొట్టింది. ఆయన కింద పడిపోయాక తల పైనుంచి వాహనం వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో పోలీసుల సూచనల మేరకు అన్నం ఫౌండేషన్ చైర్మన్ శ్రీనివాసరావు మృతదేహాన్ని ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి తరలించగా, ఘటనపై కేసు నమోదు చేసినట్లు సీఐ ఎం.రాజు తెలిపారు. ఆటో బోల్తా, ఇద్దరికి గాయాలు కూసుమంచి: ఖమ్మం–సూర్యాపేట జాతీయ రహదారిపై మంగళవారం టాటా ఏస్ ఆటో బోల్తా పడింది. ఖమ్మం నుండి సూర్యాపేట వైపునకు అలంకరణ సామగ్రితో తీసుకెళ్తున్న ఆటో మండలంలోని హట్యాతండా సమీపానడివైడర్ను ఢీకొట్టి బొల్తా కొట్టింది. ఈఘటనలో డ్రైవర్, మరో వ్యక్తి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. -
ఓట్ల కోసమే సీఎం రేవంత్ డ్రామాలు: ఈటల
సాక్షి: ఖమ్మం జిల్లా: తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. బీసీల పట్ల రేవంత్కు చిత్తశుద్ధి లేదన్నారు. ఓట్ల కోసం సీఎం రేవంత్ డ్రామాలు చేస్తున్నాడని.. 45 ఏళ్లు పాటు ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని పరిపాలించింది కాంగ్రెస్ పార్టీనే.. ఒక్క బీసీ, ఎస్టీలను ముఖ్యమంత్రి చేయలేకపోయారని మండిపడ్డారు.‘‘బీసీల గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్ పార్టీకి లేదు. అందుకే ప్రజలు ఓటు వేసే ముందు ఆలోచించాలి. ఎవరు మనవాళ్లు, అనేది చూసి ఓటు వేయాలి. మాట ఇస్తే నిలబడే వ్యక్తికి ఓటు వేయాలి. మోసం చేసేవారికి కాదు. టీచర్స్ ఎమ్మెల్సీ ప్రచారంలో ఉపాధ్యాయులు నుంచి మంచి స్పందన వస్తుంది. 317 జీవో తీసుకొచ్చి ఉపాధ్యాయుల జీవితాల్లో మట్టి కొట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు అవుతున్న ఇప్పటికీ డీఏలు, ఇంక్రిమెంట్లు లేవు. ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగులకు బెనిఫిట్స్ అందించలేని ప్రభుత్వం రేవంత్ ప్రభుత్వం’’ అంటూ ఈటల దుయ్యబట్టారు. -
నేడు స్తంభాద్రి గిరి ప్రదక్షిణ ప్రారంభం
2 కి.మీ. యాత్ర అనంతరం దివ్యజ్యోతి దర్శనంఖమ్మంగాంధీచౌక్ : త్రేతాయుగం నాటి స్వయంభు దివ్య క్షేత్రంగా విరాజిల్లుతున్న ఖమ్మం శ్రీ స్తంభాద్రి లక్ష్మీనరసింహ స్వామి(గుట్ట) సన్నిధిలోని కొండ చుట్టూ గిరి ప్రదక్షిణ కార్యక్రమం మంగళవారం ప్రారంభం కానుంది. స్వామివారి జన్మ నక్షత్రం సందర్భంగా ఈ కార్యక్రమానికి ఏర్పాట్లు చేశారు. సాయంత్రం 5:30 గంటలకు మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, పండితుల మంత్రోచ్ఛరణల నడుమ గిరి ప్రదక్షిణ ప్రారంభిస్తారు. నృసింహ నామ స్మరణ, కీర్తనలు ఆలపిస్తూ నిర్వహించే ఈ కార్యక్రమంలో కోలాట బృందాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ప్రదక్షిణ అనంతరం 6:30 గంటలకు కొండ మీద ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై దివ్య జ్యోతి దర్శనం చేసుకునేలా కార్యక్రమాన్ని రూపొందించారు. గిరి ప్రదక్షిణ స్తంభాద్రి ఘాట్ రోడ్ గేటు వద్ద ప్రారంభమై ఎన్ఎస్పీ రోడ్, కవిత డిగ్రీ, పీజీ కళాశాల, స్తంభాద్రి మండపం, సరిత క్లినిక్, ఎల్ఐసీ కార్యాలయం మీదుగా తిరిగి గేటు నుంచి ఘాట్ రోడ్ ద్వారా గుట్టపై ఉన్న నృసింహుని ఆలయానికి చేరుతుంది. -
కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో అసంతృప్తి
● తెలంగాణ కోసం 35 పార్టీలను కేసీఆర్ ఏకం చేశారు ● మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ఖమ్మంమయూరిసెంటర్ : కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉందని మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. మాజీ సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా సోమవారం ఆయన కేక్ కట్ చేయడంతో పాటు మమత ఆస్పత్రిలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణ సాధనకు 35 పార్టీలను ఏకం చేసి పోరాడిన వ్యక్తి కేసీఆర్ అని అన్నారు. బీఆర్ఎస్ హయాంలో గురుకుల పాఠశాలల్లో చేరేందుకు కొన్ని వేల దరఖాస్తులు వచ్చేవని, ఇప్పుడు సరైన సదుపాయాలు లేక దుర్భర పరిస్థితి నెలకొందని ఆరోపించారు. రాష్ట్ర సాధన ఉద్యమ సమయంలో స్ఫూర్తినిచ్చిన తెలంగాణ తల్లి విగ్రహ రూపాన్ని మార్చారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, డీసీసీబీ మాజీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, నాయకులు ఆర్జేసీ కృష్ణ, టేకులపల్లి సొసైటీ చైర్మన్ బీరెడ్డి నాగచంద్రారెడ్డి, సుడా మాజీ చైర్మన్ బచ్చు విజయ్కుమార్, జిల్లా మైనారిటీ అధ్యక్షుడు తాజుద్దీన్, వీరునాయక్, కొల్లు పద్మ, షకీనా పాల్గొన్నారు. -
ఆర్థోపెడిక్ వైద్యుడికి ఉత్తమ అవార్డు
ఖమ్మంవైద్యవిభాగం: ఖమ్మం ప్రభుత్వ వైద్య కళాశాలలో ఆర్థోపెడిక్ ప్రొఫెసర్గా విధులు నిర్వహిస్తున్న హనుమాన్ ఉత్తమ డాక్టర్ అవార్డు పొందారు. హైదరాబాద్లోని నిమ్స్ ఆస్పత్రిలో ఈ నెల 13 నుంచి 16 వరకు నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఆర్థోపెడిక్ సదస్సుకు ఆయన హాజరయ్యారు. రోడ్డు ప్రమాదంలో విరిగిన కాలు ఎముకలకు ఇతర పద్ధతుల్లో రాడ్లు వేసే ఆపరేషన్ల గురించి ఆయన ప్రజెంటేషన్ ఇచ్చారు. చీము పట్టినప్పుడు ఎముకలను తీసేయకుండా చేస్తున్న ఇలిజారోవ్ ఆపరేషన్ల గురించి వివరించారు. ఈ ప్రెజెంటేషన్కు గాను ట్రామా విభాగంలో బెస్ట్ డాక్టర్ అవార్డు లభించింది. ఈ సందర్బంగా హనుమాన్ను కళాశాల ప్రిన్సిపాల్ ఎస్.రాజేశ్వరరావు, సూపరింటెండెంట్ ఎల్. కిరణ్కుమార్ తదితరులు అభినందించారు. -
పశువైద్య శాఖ జేడీగా వెంకటనారాయణ
ఖమ్మంవ్యవసాయం : జిల్లా పశు వైద్య, పశుసంవర్థక శాఖ జాయింట్ డైరెక్టర్గా డాక్టర్ కె. వెంకటనారాయణను నియమిస్తూ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సవ్యసాచి గోష్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర పశుసంవర్థక శాఖలో డిప్యూటీ డైరెక్టర్లుగా పనిచేస్తున్న ఐదుగురికి జాయింట్ డైరెక్టర్లుగా పదోన్నతి కల్పించి వివిధ జిల్లాల్లో నియమించారు. ఈ క్రమంలో హన్మకొండ జిల్లాలో డిప్యూటీ డైరెక్టర్గా పనిచేస్తూ, ఖమ్మం పశుసంవర్థక శాఖ అధికారిగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న వెంకటనారాయణకు జేడీగా పదోన్నతి కల్పించి జిల్లాకు నియమించారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు ఉద్యోగులు అభినందనలు తెలిపారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాఎమ్మెల్సీ అభ్యర్థి పూల రవీందర్ ఖమ్మం సహకారనగర్ : తనను ఎమ్మెల్సీగా గెలి పిస్తే ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి పోరాడుతానని వరంగల్–ఖమ్మం–నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి పూల రవీందర్ అన్నారు. నగరంలో సోమవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణ, ఉపాధ్యాయుల హక్కులను కాపాడేందుకే తాను బరిలో నిలిచానని చెప్పా రు. తెలంగాణ ఉద్యమకాలంలో ఉపాధ్యాయ జేఏసీ చైర్మన్గా వ్యవహరించానని, సకల జనుల సమ్మెలో పాల్గొని నాటి సీఎంను ఒప్పించి ఆన్డ్యూటీ సౌకర్యం కల్పించానని అన్నారు. పెండింగ్లో ఉన్న పలు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, తనను ఈ ఎన్నికల్లో గెలిపించాలని కోరారు. కేఎంసీ అధికారులకు షోకాజ్ నోటీసులు !ఖమ్మంమయూరిసెంటర్ : ఖమ్మం నగర పాలక సంస్థ అధికారులకు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, ఇన్చార్జ్ కమిషనర్ శ్రీజ షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది. ఆదివారం కేఎంసీలో అందుబాటులో లేరని, ఎలాంటి సమాచారం లేకుండా బయటకు వెళ్లారని అసిస్టెంట్ కమిషనర్ అహ్మద్ షఫీఉల్లా, శానిటరీ సూపర్వైజర్ సాంబయ్యకు నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. శానిటరీ సూపర్వైజర్ నోటీసు తీసుకోగా, అసిస్టెంట్ కమిషనర్కు ఇంకా అందలేదని తెలిసింది. ఆదివారం డంపింగ్యార్డ్లో వ్యర్థాలకు మంటలు అంటుకున్న సమయంలో సంబంధిత అధికారులు ఎవరూ లేకపోవడంతో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. సోమవారం ఉదయం డంపింగ్యార్డ్సు సందర్శించిన శ్రీజ అధికారులకు షోకాజ్ నోటీసుల జారీకి ఆదేశించినట్లు తెలిసింది. సింగరేణిలో ఆరుగురు జీఎంల బదిలీసింగరేణి(కొత్తగూడెం): సింగరేణిలో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న ఆరుగురు జీఎంలను బదిలీ చేస్తూ సోమవారం యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసింది. బెల్లంపల్లి జీఎం శ్రీనివాస్ను శ్రీరాంపూర్ ఏరియాకు, కార్పొరేట్ కాంట్రాక్ట్ మేనేజ్మెంట్ విభాగం జీఎం ఎం.విజయ్భాస్కర్ రెడ్డిని బెల్లంపల్లి ఏరియాకు, కార్పొరేట్ విభాగం జీఎం మేకల కనకయ్యను కొత్తగూడెం రీజియన్ క్వాలిటీ మేనేజ్మెంట్ విభాగానికి బదిలీ చేసింది. ఆర్జీ–3 ఏరియాలో అడిషనల్ జీఎం కొలిపాక నాగేశ్వరరావును అడ్రియాల ప్రాజెక్ట్ జీఎంగా, మందమర్రి ఏరియా కేకే గ్రూప్ ఆఫ్ మైన్స్లో అడిషనల్ జీఎం వి.రామదాసును కార్పొరేట్ బిజినెస్ డెవలప్మెంట్ విభాగం జీఎంగా, ఆర్జీ–2 ఏరియాలో అడిషనల్ జీఎం మధుసూదన్ను కార్పొరేట్ కాంట్రాక్ట్ మేనేజ్మెంట్ జీఎంగా బదిలీ చేసింది. ముత్తంగి అలంకరణలో రామయ్యభద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారు సోమవారం ముత్తంగి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చి కనువిందు చేశారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి బేడా మండపంలో కొలువుదీరిన స్వామివారికి విష్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు. -
ఉపాధ్యాయులకు బీజేపీ అండగా ఉంటుంది
ఖమ్మంమయూరిసెంటర్ : ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి బీజేపీ ఎప్పుడూ అండగా ఉంటుందని ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు, మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. వచ్చే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పులి సరోత్తంరెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు. సోమవారం ఖమ్మంలోని ఓ హోటల్లో ఎమ్మెల్సీ అభ్యర్థి సరోత్తంరెడ్డి, ఉపాధ్యాయులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గతంలో ఉపాధ్యాయుల ఓట్లతో శాసనమండలికి వెళ్లిన ఎమ్మెల్సీలు టీచర్ల సమస్యలపై ఎప్పుడూ మాట్లాడలేదని అన్నారు. ఈ ఎన్నికల్లో సరోత్తంరెడ్డిని గెలిపిస్తే ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారం అవుతాయని హామీ ఇచ్చారు. తొలుత బీజేపీ జిల్లా నాయకులు ఈటలకు ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. సరోత్తంరెడ్డిని ఎమ్మెల్సీగా గెలిపించండి మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ -
కనకగిరి అడవుల్లో జీవ వైవిధ్యం
ఖమ్మంవన్టౌన్ : ఉమ్మడి ఖమ్మం జిల్లాలో విస్తరించి ఉన్న కనకగిరి రిజర్వు ఫారెస్ట్ జీవ వైవిధ్యానికి చిరునామాగా మారింది. వన్యప్రాణి నిపుణులు ఆదివారం ఈ అడవిలో 12 గంటల పాటు కాలి నడకన పర్యటించారు. ఈ సందర్భంగా బ్లూ – ఇయర్డ్ కింగ్ఫిషర్ (లకుముకిపిట్ట)ను గుర్తించారు. జిల్లాలోని సత్తుపల్లి డివిజన్ తల్లాడ పరిధిలోని కనకగిరి రిజర్వ్ ఫారెస్ట్లో చేపట్టిన ఈ వాక్లో వృక్షాలు, జంతువులకు సంబంధించిన వైవిధ్యాన్ని కనుగొన్నారు. 12 మంది వన్యప్రాణి నిపుణులు నాలుగు కిలోమీటర్ల అడవిని అన్వేషించి.. 65 పక్షిజాతులు, 5 క్షీరద జాతులు, 5 చేప జాతులను డాక్యుమెంటరీ రూపంలో రికార్డు చేశారు. ఇక మిగిలిన పక్షులలో బ్లాక్–వింగ్డ్ ష్రైక్, రూఫస్ వడ్రంగిపిట్ట, వైట్–రంప్డ్ మునియా, బ్లూ–థ్రోటెడ్ బ్లూ ఫ్లైక్యాచర్, బ్లాక్–రంప్డ్ షామా ఉన్నాయి. ఇక్కడి ప్రకృతి దృశ్యాలు, వన్యప్రాణుల రకాలు ప్రకృతి ప్రేమికులకు స్వర్గధామంగా ఉంటుందని నిపుణులు పేర్కొన్నారు. కార్యక్రమంలో వైల్డ్ తెలంగాణ నుంచి ప్రదీప్ ప్రాజ్, మీరాకి ఆర్గనైజేషన్ నుంచి నవీన్ బాలా, ఎ.సుజిత్, వి ఊల్ఫ్ ఫౌండేషన్ నుంచి పి.హరికృష్ణ, రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
కాంగ్రె్స్ పాలనలోనే గిరిజన సంక్షేమం
కూసుమంచి: కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలోనే గిరిజనులకు సంక్షేమం అందుతుందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. కూసుమంచిలో సోమవారం నిర్వహించిన శ్రీ సంత్ సేవాలాల్ జయంతి వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. హింస, కరుణ, మద్యపాన నిషేధం తదితర అంశాలపై సేవాలాల్ సమాజ హితానికి పాటుపడ్డారని, మానవుడి రూపంలో ఉన్న భగవంతుడిగా మారారని అన్నారు. ఆయన సిద్ధాంతాలను నేటి తరం వారు ఆచరించాల్సిన అవసరం ఉందన్నారు. అలాంటి మహనీయుడి జయంతి వేడుకలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడంతో పాటు ఆదివాసీల గౌరవాన్ని పెంచేలా కృషి చేస్తోందని చెప్పారు. ఇందిరా గాంధీ పాలనలోనే బంజారాలను ఎస్టీ జాబితాలో చేర్చారని, దీంతో కలిగిన రిజర్వేషన్తో నేడు గిరిజనులు విద్య, ఉద్యోగావకాశాలు పొందుతున్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి గిరిజనులకు మధ్య బంధం విడదీయలేమని, ఇందిరమ్మ రాజ్యంలో గిరిజనులు సుఖ సంతోషాలతో ఉంటారని అన్నారు. సీఎం రేవంత్రెడ్డి ఆధ్వర్యంలో తామంతా శ్రమంచి రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని వివరించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరుతామన్నారు. ఈ సందర్భంగా పొంగులేటిని గిరిజన పెద్దలు తలపాగా చుట్టి గజమాలతో సత్కరించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీలు బాణోత్ శ్రీనివాస్ నాయక్, బోడ మంగీలాల్ తదితరులు పాల్గొన్నారు. సేవాలాల్ సిద్ధాంతాలను ఆచరించాలి రెవన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి -
మహిళా మార్ట్ ప్రత్యేకత చాటాలి
● ఘనంగా ఏర్పాట్లు చేయండి ● అధికారులకు కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సూచన ఖమ్మంమయూరిసెంటర్ : మహిళా మార్ట్ ప్రత్యేకత చాటి చెప్పేలా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. నగరంలోని సీక్వెల్ రోడ్డులో మహిళా మార్ట్ ఏర్పాటు చేయనున్న భవనాన్ని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజతో కలిసి సోమవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మార్ట్ ముందు పార్కింగ్ సౌకర్యం కల్పించాలని, స్లైడింగ్ గేట్ ఏర్పాటు చేయాలని సూచించారు. మొదటిసారి మహిళలతో ఏర్పాటు చేస్తున్నామని, ఆ తర్వాత నగరంలో మరి కొన్నింటి ఏర్పాటుకు ప్రణాళిక రూపొందిస్తున్నామని వివరించారు. స్వశక్తి మహిళా సంఘాల వారు తయారుచేసిన పదార్థాలు, వస్తువులను ఇందులో విక్రయిస్తామని, ఉత్పత్తుల వివరాలు, తయారీ విధానం, అమ్మే మహిళ స్టోరీని డాక్యుమెంట్ చేస్తూ ప్రదర్శించాలని అన్నారు. మార్చి మొదటి వారంలోగా మహిళా మార్ట్ ఏర్పాటయ్యేలా కార్యాచరణ ఉండాలని, ప్రతి వస్తువుపై ‘మేడ్ ఇన్ ఖమ్మం’ అనే స్టిక్కర్ వేయాలని సూచించారు. మహిళా మార్ట్కు అవసరమైన నిధులను డీఆర్డీఏ ద్వారా రెండు రోజుల్లో అందిస్తామని చెప్పారు. కార్యక్రమంలో డీఆర్డీఓ సన్యాసయ్య, పీఆర్ ఈఈ వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. యూబీఐ బ్రాంచ్ ప్రారంభం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(యూబీఐ) ముస్తఫానగర్ బ్రాంచ్ను కలెక్టర్ ముజిమ్మల్ ఖాన్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. వివిధ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో యూబీఐ ముందుంటుందని చెప్పారు. అనంతరం స్వయ సహాయక సంఘాలకు, విశ్వకర్మ, పీఎంఈజీపీ లబ్ధిదారులకు కలెక్టర్ చేతుల మీదుగా మంజూరుపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో బ్యాంక్ ఖమ్మం రీజినల్ హెడ్ హనుమంత రెడ్డి, డిప్యూటీ రీజినల్ హెడ్ సర్వేశ్, సుధాకర్, బ్రాంచ్ మేనేజర్ సల్మా పర్వీన్, శ్రీరామ్ హిల్స్ హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు బెల్లం మనోహర్ రావు తదితరులు పాల్గొన్నారు. ఫిర్యాదులు పరిష్కరించండి ఖమ్మం సహకారనగర్ : ప్రజలు అందించిన ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. సోమవారం ప్రజావాణి సందర్భంగా కలెక్టరేట్లో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజావాణిలో వచ్చిన అర్జీలను పరిశీలించి పెండింగ్లో లేకుండా పరిష్కరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి, డీఆర్వో పద్మశ్రీ, డీఆర్డీఓ సన్యాసయ్య తదితరులు పాల్గొన్నారు. కాగా, బోనకల్ మండలం రావినూతల గ్రామానికి చెందిన ఎం.సీత పేదరికంలో ఉన్న తనకు ఖమ్మం దగ్గరలో ఉన్న బీసీ గురుకులంలో స్వీపర్ పోస్ట్ ఇప్పించాలని విన్నవించారు. తిరుమలాయపాలెం మండలం బచ్చోడు ప్రాథమిక పాఠశాలలో రూ.7.50 లక్షలతో టాయిలెట్ల మరమ్మతులు, విద్యుత్, నీటి వసతి పనులు చేశామని, తమకు అడ్వాన్స్గా ఇచ్చిన రూ.25 వేలు మినహా ఏ బిల్లూ రాలేదని, త్వరగా ఇప్పించాలని గ్రామానికి చెందిన బి.విజయ కోరారు. -
రేషన్కార్డు తొలగింపుపై ఆందోళన
నేలకొండపల్లి: కొత్తగా పెళ్లి అయిందని సాకు చూపి.. 26 ఏళ్ల కిందట పెళ్లయిన ఓ కుటుంబం రేషన్కార్డును తొలగించారు. దీనిపై బాధితులు గ్రీవెన్స్లో మొరపెట్టుకోగా.. చర్యలు చేపడుతామని తహసీల్దార్ హామీ ఇచ్చారు. మండలంలోని భైరవునిపల్లి గ్రామానికి చెందిన మల్లెబోయిన వీరబాబు – రాధిక దంపతులకు 26 ఏళ్ల కిందట వివాహం జరిగింది. వారికి ఇద్దరు కుమార్తెలుండగా.. పెద్ద కుమార్తెకు వివాహమైంది. వీరికి రేషన్ కార్డు ఉంది. జనవరి రేషన్ తీసుకున్న వీరు.. ఫిబ్రవరి కోటా తీసుకునేందుకు రేషన్ దుకాణానికి వెళ్లగా రేషన్ కార్డు తొలగించినట్లు తెలిసింది. రెవెన్యూ కార్యాలయానికి వెళ్లి విచారించగా.. కొత్తగా పెళ్లి కావడంతో రేషన్ కార్డు తొలిగించారని చెప్పడంతో ఖంగుతిన్నారు. తాము ఫిర్యాదు, దరఖాస్తు చేయకుండా ఎలా తొలగిస్తారని, అధికారుల ప్రమేయం లేకుండానే ఈ ప్రక్రియ ఎలా జరుగుతుందని బాధితులు సోమవారం గ్రీవెన్స్లో ఆందోళనకు దిగారు. కాగా, సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ జె.మానిక్రావు హమీ ఇవ్వటంతో బాధితులు ఆందోళన విరమించారు. -
కార్గోతో కాసులు
మంగళవారం శ్రీ 18 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025టీజీఎస్ ఆర్టీసీ ఖమ్మం రీజియన్లో కార్గో కాసుల పంట పండిస్తోంది. వినియోగదారులకు సైతం విస్తృత సేవలందిస్తూ ఆదరణ చూరగొంటోంది. కొరియర్ సేవలు ప్రారంభించిన 58 నెలల్లో రూ.కోట్లు ఆర్జించింది. గతేడాది ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు 3,29,743 పార్శిళ్ల బుకింగ్ ద్వారా రూ.6,49,30,640 ఆదాయం లభించింది. ఈ క్రమంలో వినియోగదారులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు ఆర్టీసీ లాజిస్టిక్స్కు సిద్ధమవుతోంది. ఇప్పటి వరకు హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి నగరాలకు పరిమితమైన హోం డెలివరీ సౌకర్యాన్ని త్వరలోనే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రారంభించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తోంది. – సాక్షిప్రతినిధి, ఖమ్మం రాజుకుంటున్న మంటలు దానవాయిగూడెం డంపింగ్యార్డ్లో వేసవి కాలం ప్రారంభానికి ముందే మంటలు లేవడం కలకలం సృష్టిస్తోంది. 8లోన్యూస్రీల్ -
గత ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు ఆర్టీసీకి రూ.6.49 కోట్ల ఆదాయం
● కార్గోకు నానాటికీ పెరుగుతున్న ఆదరణ ● జిల్లా నుంచి హైదరాబాద్కు హోం డెలివరీ సౌకర్యం ● త్వరలోనే ఉమ్మడి జిల్లాలో అమలుకు కార్యాచరణ2024, ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు కార్గోకు వచ్చిన ఆదాయం వివరాలు (రూ.లలో) నెల పార్శిల్స్ ఆదాయం ఏప్రిల్ 29,244 57,04,840 మే 35,199 68,46,890 జూన్ 30,458 60,61,210 జూలై 29,384 56,12,285 ఆగస్ట్ 30,358 58,01,695 సెప్టెంబర్ 27,809 53,90,575 అక్టోబర్ 31,650 61,64,170 నవంబర్ 32,896 66,24,995 డిసెంబర్ 33,588 68,97,835 జనవరి 32,287 64,94,285 ఫిబ్రవరి 16,870 33,31,860 (ఇప్పటివరకు)కొరియర్ సర్వీస్కు బ్రాండ్.. 2020 జూన్ 19న కార్గో సేవలు ప్రారంభించారు. అప్పటి నుంచి పార్శిళ్లను గమ్యస్థానాలకు చేర్చడంలో వినియోగదారుల నమ్మకాన్ని సంస్థ చూరగొంది. దీంతో ఇక్కడ సేవలు పొందే వారి సంఖ్య ప్రతీ ఏడాది పెరుగుతూ వస్తోంది. చిన్న కవర్ల నుంచి పెద్ద పార్శిళ్లు, కంప్యూటర్లు, వ్యవసాయ పనిముట్లు, ఇతర సామగ్రి ఏదైనా కార్గోలో సురక్షితంగా, తక్కువ సమయంలో గమ్యస్థానాలకు చేరుతోంది. దీంతో అందరూ ఈ సేవలను వినియోగించుకుంటున్నారు. ప్రైవేట్ కొరియర్ సర్వీసుల చిరునామాలకు ఇబ్బంది పడాల్సి రావడం, కొన్ని వస్తువులను వారు అంగీకరించకపోవడంతో అందరూ కార్గో బాట పట్టారు. ఈ సేవలు ఆర్టీసీ బస్టాండ్లలో లభిస్తుండటంతో అడ్రస్ కోసం వెదుక్కోవాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఎవరికై నా పార్శిల్ పంపించాలంటే మొదట గుర్తొచ్చేది కార్గోనే అనేలా కొరియర్ సర్వీస్కు బ్రాండ్గా మారింది. ఏడాదిలో రూ.6.49 కోట్లు.. టీజీఎస్ ఆర్టీసీకి కార్గో ఆదాయ వనరుగా మారింది. ఈ సేవలను ప్రారంభించిన తొలి ఏడాదిలో రూ.1.71 కోట్లు రాగా.. ఆ తర్వాత ప్రతి ఏడాది ఆదాయం పెరుగుతూ వస్తోంది. 2023 –24లో రూ.7.24 కోట్లు వచ్చింది. గతేడాది ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు 3,29,743 పార్శిళ్ల బుకింగ్ ద్వారా రూ.6,49,30,640 ఆదాయం వచ్చింది. ఖమ్మం రీజియన్లోని ఖమ్మం, కొత్తగూడెం, సత్తుపల్లి, భద్రాచలం, మణుగూరు, మధిర, ఇల్లెందు డిపోల నుంచి ఇతర ప్రాంతాలకు, అక్కడి నుంచి ఇక్కడికి పార్శిళ్లు వస్తుంటాయి. అయితే ఆదాయం పెరగడంలో కార్గో సిబ్బందితో పాటు ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్ల కృషి ఎంతో ఉంది. అత్యధికంగా మేలో జిల్లాలో 35,199 పార్శిళ్ల బుకింగ్ ద్వారా రూ.68,46,890 వచ్చాయి. అలాగే డిసెంబర్లో 33,588 పార్శిళ్ల ద్వారా రూ.68,97,835 ఆదాయం లభించింది. అలాగే ఇతర ప్రాంతాలకు 1,740 పార్శిళ్లు హోం డెలివరీ ద్వారా కార్గో రూ.4,84,050 ఆదాయం పొందింది. త్వరలో ఇక్కడా హోం డెలివరీ.. వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేందుకు టీజీఎస్ ఆర్టీసీ లాజిస్టిక్స్ సిద్ధమవుతోంది. ఇప్పటి వరకు హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాల్లో మాత్రమే హోం డెలివరీ సౌకర్యం ఉండగా త్వరలోనే ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనూ అవకాశాన్ని కల్పిస్తాం. ఈ మేరకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం. హోం డెలివరీ సౌకర్యంతో వినియోగదారులకు మరింతగా సేవలు అందుబాటులోకి రానున్నాయి. – వి.రామారావు, మేనేజర్, ఉమ్మడి కరీంనగర్, వరంగల్, ఖమ్మం లాజిస్టిక్స్కచ్చితమైన సేవలు.. ఆర్టీసీ కొరియర్ సర్వీస్ ద్వారా వస్తువులను పంపించడం సులువుగా మారింది. పార్శిల్ ఇవ్వగానే ఆర్టీసీ బస్ ద్వారా పంపుతుండగా వేగంగా గమ్యస్థానాలకు చేరుతున్నాయి. బుక్ చేసిన వెంటనే, డెలివరీ అయిన తర్వాత సెల్కు మెసేజ్ వస్తుండడంతో ఎలాంటి భయం లేకుండా పోతోంది. ఖరీదైన వస్తువులను కూడా కార్గో ద్వారా పంపించేందుకు ఎవరూ వెనుకాడడం లేదు. ఆర్టీసీ సంస్థ సైతం వినియోగదారులకు జవాబుదారీగా వ్యవహరిస్తూ ఎలాంటి రిమార్క్ లేకుండా సేవలందిస్తోంది. -
ఎన్క్వాస్ బృందం వర్చువల్ తనిఖీ
చింతకాని : మండల పరిధిలోని నేరడలో గల ఆయుష్మాన్ ఆరోగ్య ఉప కేంద్రాన్ని నేషనల్ క్వాలిటీ అసెస్మెంట్ స్టాండర్డ్ (ఎన్క్వాస్) బృందం సభ్యులు డాక్టర్ కుమార్ భార్గవ్, డాక్టర్ పుష్పలత సోమవారం వర్చువల్గా తనిఖీ చేశారు. ఎన్క్వాస్ నిబంధనలకు అనుగుణంగా ఆరోగ్య కేంద్రంలో ఏడు విభాగాలకు సంబంధించి నాణ్యతా ప్రమాణాలను పరిశీలించారు. కార్యక్రమంలో జిల్లా నుంచి అసంక్రమిత వ్యాధుల నివారణ అధికారి రామారావు, జిల్లా ప్రోగ్రాం అధికారి దుర్గ, మండల వైద్యాధికారులు డాక్టర్ ఆల్తాఫ్, సాయికుమార్, సీహెచ్ఓ వీరేందర్, పల్లె దవాఖానా వైద్యులు సోహెల్, హెల్త్ సూపర్వైజర్లు కృష్ణారావు, నాగేశ్వరరావు, రేచల్రాణి, జ్యోతి రత్న పాల్గొన్నారు. -
వేమన పద్య గళార్చనకు స్పందన
సత్తుపల్లి: ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు ఏకకంఠంతో వేమన పద్యాలను చూడకుండా చదివి వినిపించడంతో జేవీఆర్ డిగ్రీ కళాశాల ప్రాంగణం పులకరించింది. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా సత్తుపల్లి మండలానికి చెందిన ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు రెండు వందల మంది ఏకగళంతో వేమన పద్యాలను సోమవారం చదివి వినిపించారు. జేవీఆర్ డిగ్రీ కళాశాలలో గార్లపాటి, బొల్లేపల్లి స్మారక ట్రస్ట్ ఆధ్వర్యంలో తెలుగుశాఖ, ఆషా, లైవ్, సృజన స్వచ్ఛంద సంస్థలు, మండల విద్యాశాఖ సహకారంతో వేమన శతక పద్య గళార్చన పేరుతో ఈ కార్యక్రమం నిర్వహించగా జేవీఆర్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్.గోపి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఎంఈఓ ఎన్.రాజేశ్వరరావు మాట్లాడుతూ.. విద్యార్థుల్లో తెలుగు భాషపై ఆసక్తిని పెంపొందించే దిశగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి, ప్రోత్సహిస్తున్న నిర్వాహకులను, సహకరిస్తున్న సంస్థలతోపాటు కేవలం మూడు నెలల వ్యవధిలో విద్యార్థులను తీర్చిదిద్దిన ఉపాధ్యాయులు, పాఠశాలల యాజమాన్యాలను అభినందించారు. అనంతరం ఎమ్మెల్యే మట్టా రాగమయి తరఫున విద్యార్థులకు ప్రశంసాపత్రాలు, పాఠశాలలకు జ్ఞాపికలు అతిథుల చేతులమీదుగా అందించారు. కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా పలు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. ఏఎంసీ చైర్మన్ దోమ ఆనంద్బాబు, నిర్వాహకులు రామకృష్ణ, మధుసూదన్రాజు, కిశోర్రెడ్డి, నాగేశ్వరరావు, జేవీఆర్ డిగ్రీ కళాశాల తెలుగు విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ పూర్ణచందర్రావు, రిటైర్డ్ టీచర్ కళ్యాణశర్మ, అయ్యదేవర శేషగిరిరావు, మాలతి, మల్లికార్జున్రావు, రమణమూర్తి, గట్టే వాసు, గండ్ర కిశోర్కుమార్రెడ్డి, దొడ్డా కృష్ణయ్య, పసుపులేటి నాగేశ్వరరావు, పల్లం పిచ్చయ్య, ఖాసీం, ఎన్.ప్రసాద్ పాల్గొన్నారు. -
గిరిజనుల సమస్యలు సత్వరమే పరిష్కరించాలి
భద్రాచలం: గిరిజన దర్బార్లో ఇచ్చే ఫిర్యాదులను అర్హత మేరకు సత్వరమే పరిష్కరించాలని ఐటీడీఏ పీఓ బి. రాహుల్ అధికారులకు సూచించారు. సోమవారం ఐటీడీఏ సమావేశ మందిరంలో నిర్వహించిన గిరిజన దర్బార్లో ఆయన దరఖాస్తులను స్వీకరించారు. గిరిజనుల సమస్యలు తెలుసుకొని సంబంధిత యూనిట్ అధికారులకు అప్పగించారు. ఈ సందర్భంగా పీఓ మాట్లాడుతూ.. ఐటీడీఏకు వచ్చే గిరిజనుల పట్ల మర్యాదగా ప్రవర్తించాలని సూచించారు. అనంతరం సింగరేణి మండలానికి చెందిన బాలు తమ గ్రామానికి కరెంట్ కనెక్షన్ ఇప్పించాలని, ములకలపల్లి మండలం చింతపేట రైతులకు బోర్లు, కరెంటు మోటార్లు ఇప్పించాలని, అశ్వారావుపేట మండలం తిరుమలకుంటలో అంగన్వాడీ కేంద్రం నిర్మించాలని ఆ గ్రామస్తులు వినతిపత్రాలు సమర్పించారు. ఇంకా గుండాల మండలం ముత్యంపేట గ్రామానికి చెందిన వెంకయ్య సోలార్ విద్యుత్తో బోర్ కనెక్షన్ ఇవ్వాలని.. ఇలా పలువురు దరఖాస్తులు అందజేయగా సంబంధిత అధికారులకు ఎండార్స్ చేశారు. దర్బార్లో ఏపీఓ జనరల్ డేవిడ్రాజ్, డీడీ మణెమ్మ, ఎస్డీసీ రవీంద్రనాథ్, ఈఈ చంద్రశేఖర్, ఏఓ సున్నం రాంబాబు, ఎస్ఓ భాస్కరన్, ఏపీఓ వేణు, ఆర్ఓఎఫ్ఆర్ డీటీ లక్ష్మీనారాయణ, డీఎస్ఓ ప్రభాకర్ రావు, ఎల్టీఆర్ డీటీ మనిధర్, మేనేజర్ ఆదినారాయణ, గురుకులం ఏఓ నరేందర్, ఐసీడీఎస్ సూపర్వైజర్ అనసూయ, హెచ్ఈఓ లింగానాయక్, జేడీఎం హరికృష్ణ, మిషన్ భగీరథ ఏఈఈ నారాయణరావు పాల్గొన్నారు.ఐటీడీఏ పీఓ రాహుల్ -
పెట్టుబడి పెడితే రెట్టింపవుతుందని టోకరా
● పోలీస్స్టేషన్ను ఆశ్రయించిన బాధితులు ● విచారణ చేపట్టిన పోలీసులు ఖమ్మంఅర్బన్/కారేపల్లి: దుబాయ్ కేంద్రంగా పనిచేసే ఓ ఆన్లైన్ సంస్థలో పెట్టుబడి పెడితే రెట్టింపు డబ్బు వస్తుందని ఆశ చూపారు. మరో ఇద్దరిని చేర్పిస్తే కమీషన్ రూపంలో డబ్బు వస్తుందని ఊదరగొట్టారు. మధ్యలో గోవా, బ్యాంకాక్ లాంటి ప్రదేశాలకు తీసుకెళ్తామని నమ్మబలికారు. తీరా చూస్తే ఉన్న డబ్బు పోయి మోసపోయామని గుర్తించి, చివరికి పోలీసులను ఆశ్రయించారు బాధితులు. కారేపల్లిలో ఓ ల్యాబ్ నిర్వాహకుడు రూ.4 లక్షలు పెట్టుబడి పెట్టగా.. టేకులపల్లికి చెందిన ఉపేందర్, కారేపల్లికి చెందిన రవికుమార్, రామనర్సయ్యతో పాటు మరో పదిమంది ఖమ్మానికి చెందిన ముగ్గురు వ్యక్తుల ద్వారా డిపాజిట్ చేసి, మోసపోయామని పోలీసులను ఆశ్రయించారు. కారేపల్లి ఎస్ఐ ఎన్.రాజారాంను వివరణ కోరగా.. మెటాప్లస్కు సంబంధించిన బాధితులు ఫిర్యాదు చేశారని, కేసు నమోదు చేసి ప్రాథమిక విచారణ చేపట్టామని చెప్పారు. ఇదే రకంగా మోసపోయిన కొందరు బాధితులు నగర ఏసీపీని కలిసి వివరించినట్లు తెలిసింది. ఏసీపీ సూచన మేరకు కొందరు బాధితులు ఖమ్మంఅర్బన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు సమాచారం. సీఐ భానుప్రకాష్ను వివరణ కోరగా కొందరు ఫిర్యాదు చేయగా విచారణ చేట్టామని, గోవా ట్రిప్నకు కూడా తీసుకెళ్లినట్లు సమాచారం ఉందని, వీటన్నింటిపై పూర్తిస్థాయిలో విచారణ చేస్తే అసలు విషయం తెలుస్తుందని వెల్లడించారు. -
ఫోర్జరీ సంతకంపై ఫిర్యాదు
ఖమ్మంరూరల్: మండలంలోని తెల్దారుపల్లి గ్రామ కార్యదర్శి కొడాలి రాధారాణి సంతకాన్ని అదే గ్రామానికి చెందిన చెరుకుపల్లి ముత్తయ్య ఫోర్జరీ చేశారని సోమవారం పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రాధారాణి 2021 నుంచి 2022 వరకు గ్రామ కార్యదర్శిగా పని చేసిన సమయంలో ఆమె సంతకాన్ని ఫోర్జరీ చేసి ముత్తయ్య తన ఇంటిని రిజిస్ట్రేషన్ చేయించుకుని చెరుకుపల్లి భవానీకి గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేయించారు. ఈ మేరకు కార్యదర్శి ఫిర్యాదు మేరకు విచారణ చేస్తున్నట్లు సీఐ ఎం.రాజు తెలిపారు. ఇసుక ట్రాక్టర్ పట్టివేతఖమ్మంఅర్బన్: నగరంలోని శ్రీశ్రీ సర్కిల్ వద్ద అక్రమంగా ఇసుక లోడుతో వస్తున్న ట్రాక్టర్ను గుర్తించిన టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకొని ఖమ్మం అర్బన్ పోలీస్ స్టేషన్లో అప్పగించారు. ఎలాంటి పత్రాలు లేకుండా ఇసుకను అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించి కేసు నమోదు చేశామని సీఐ భానుప్రకాష్ తెలిపారు. పాఠశాలలో క్షుద్రపూజల కలకలంచండ్రుగొండ: మండలంలోని బాలికుంట గ్రామంలోని గిరిజన సంక్షేమ ప్రాథమిక పాఠశాలలో క్షుద్రపూజలు చేసిన ఆనవాళ్లతో కలకలం రేకెత్తించింది. వివరాలిలా ఉన్నాయి.. బాలికుంట పాఠశాలకు సోమవారం ఉదయం విద్యార్థులతోపాటు ఉపాధ్యాయుడు రవికుమార్ హాజరయ్యారు. పాఠశాల భవనం వరాండాలో పసుపు, కుంకుమతోపాటు నిమ్మకాయ, ఎండుమిర్చి, ముగ్గు వేసి ఉండటంతో విద్యార్థులు ఉలిక్కిపడ్డారు. గ్రామస్తులు పాఠశాలకు చేరుకోగా.. హెచ్ఎం రవికుమార్ వాటిని శుభ్రం చేయంచి పాఠశాల ప్రారంభించారు. సమాచారం అందుకున్న ఎంఈఓ సత్యనారాయణ, పోలీసులు పాఠశాలను సందర్శించారు. ఒకరోజు ముందు ఆదివారం కావడంతో ఎకరో ఆకతాయిలు ఇలా చేసి ఉంటారని ఎంఈఓ తెలిపారు. -
జ్యూయలరీ దుకాణంలో చోరీ
చర్ల: మండల కేంద్రంలోని జ్యూయలరీ దుకాణంలో చోరీ జరిగిన ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. ఆదివారం అర్ధరాత్రి మెయిన్రోడ్లోని శ్రీలక్ష్మీ నర్సింహ జ్యూయలరీ దుకాణం తాళాలు పగులగొట్టేందుకు యత్నించగా.. అవి పగలక పోవడంతో అక్కడి నుంచి భద్రాద్రిరామా జ్యూయలరీ దుకాణం వద్దకు వచ్చారు. తాళాలు పగలగొట్టి 3 కిలోల వెండి వస్తువులు, చిన్న బంగారు వస్తువులు, రూ.15 వేల నగదు, వెయిట్ మిషిన్లను చోరీ చేశారు. మొత్తం సొత్తు విలువ రూ.1.95 లక్షలు ఉంటుందని యజమాని పందిళ్లపల్లి శంకరాచారి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎస్ఐ వి.కేశవ్ కేసు నమోదు చేశారు. ఘటనా స్థలానికి ఎస్ఐతోపాటు క్లూస్ టీం చేరుకుని వివరాలను సేకరించింది. -
కేసీఆర్కు శుభాకాంక్షలు తెలిపిన ఎంపీ వద్దిరాజు
ఖమ్మంమయూరిసెంటర్: మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావును ఎంపీ వద్దిరాజు రవిచంద్ర సోమవారం ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్లో మర్యాదపూర్వకంగా కలిసి, పుష్పగుచ్ఛం అందించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. చిన్నారులకు కంటి పరీక్షలుఖమ్మంవైద్యవిభాగం: జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులకు సోమవారం కంటి పరీక్షలు ప్రారంభించారు. గతేడాది ఏప్రిల్, సెప్టెంబర్లో రెండు పర్యాయాలు 5 నుంచి 10వ తరగతి విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించారు. మొత్తం 71,086 మంది విద్యార్థులకు పరీక్షలు నిర్వహించగా అందులో జిల్లా వ్యాప్తంగా 3,350 మంది విద్యార్థులకు వివిధ రకాల కంటి సమస్యలు ఉన్నట్లు గుర్తించారు. వారికి జిల్లాలోని సత్తుపల్లి, పెనుబల్లి, నేలకొండపల్లి ఆస్పత్రుల్లో పరీక్షలు నిర్వహించనుండగా.. ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలో రోజూ 150 మందిని పరీక్షించనున్నారు. సాధారణ సమస్యలకు జిల్లాలోనే వైద్య సేవలు అందిస్తుండగా, తీవ్రంగా ఉన్న విద్యార్థులను హైదరాబాద్ తరలించి చికిత్స అందించనున్నారు. ఈజీఎస్ జాబ్ కార్డులు అప్డేట్ చేయాలి ఎర్రుపాలెం: ఈజీఎస్ కూలీల జాబ్ కార్డులు ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని అడిషనల్ డీఆర్డీఓ చుంచు శ్రీనివాసరావు ఆదేశించారు. సోమవారం మండల కేంద్రంలోని ఈజీఎస్ కార్యాలయంలో నిర్వహించిన సామాజిక తనిఖీ ఓపెన్ ఫోరంలో ఆయన మాట్లాడారు. తొలుత 2023 ఏప్రిల్ నుంచి మార్చి 2024 వరకు ఈజీఎస్ ద్వారా మండలంలో చేపట్టిన పనుల వివరాలను ఓపెన్ ఫోరంలో గ్రామాల్లో ఆడిట్ జరిపిన 12 బృందాల నివేదికలను చదివి వినిపించారు. కూలీల హాజరు – కొలతల్లో గమనించిన తేడాలను వెంటనే రికవరీ చేయాలని సంబంధిత అధికారులను అడిషనల్ డీఆర్డీఓ శ్రీనివాసరావు ఆదేశించారు. సమావేశంలో జిల్లా విజిలెన్స్ అధికారి టి.సక్రియానాయక్, జిల్లా క్వాలిటీ కంట్రోల్ అధికారి వీరయ్య, అంబుడ్స్మెన్ రమేశ్బాబు, ఎంపీడీఓ సురేందర్, ఏపీఓ కె.నాగరాజు, విజిలెన్స్ సూపరింటెండెంట్ వీవీఎస్ శాస్త్రి, అసిస్టెంట్ మేనేజర్ పవన్, ఎస్ఆర్పీ సాంబశివాచారి, ఎంపీఓ జి.శ్రీలక్ష్మి, ఆర్ఐ బి.రాజశేఖర్, పీఆర్ ఏఈ నరేశ్ తదితరులున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీలు సత్తాచాటాలిఖమ్మంమామిళ్లగూడెం: ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీలు సత్తా చాటాలని రిటైర్డ్ ఐఏఎస్, మేధావుల సంఘం చైర్మన్ చిరంజీవులు పిలుపునిచ్చారు. ఐక్య వేదిక సమావేశం ఆర్జేసీ కృష్ణ అధ్యక్షతన ఖమ్మంలో నిర్వహించగా చిరంజీవులు పాల్గొని మాట్లాడారు. తాను 1931 జనగణనను అధ్యయనం చేశానని, ఇటీవల రాష్ట్రంలో జరిగిన జనగణనలో బీసీల జనాభాను తగ్గించి ఓసీల జనాభాను పెంచారని తెలిపారు. 8 శాతం ఉండాల్సిన ఓసీ జనాభా 13 శాతానికి పెంచి.. 56 శాతం ఉండాల్సిన బీసీ జనాభాను 46 శాతానికి తగ్గించినట్లు వివరించారు. బీసీలంతా ఏకమై హక్కుల సాధనలో రాజీలేని పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో కూరపాటి వెంకటేశ్వర్లు, బొమ్మా రాజేశ్వరరావు, కత్తి నెహ్రూగౌడ్, పసుపులేటి నర్సయ్య, పద్మ, డాక్టర్ కేవీ కృష్ణారావు, షేక్ షకీన, సోమరాజ్, రాంబాబు, మాటేటి కిరణ్, పెళ్లూరి విజయ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. ద్విచక్రవాహనం చోరీరఘునాథపాలెం: మండలంలోని రాంక్యాతండాకు చెందిన ఈ.రమేశ్ ద్విచక్రవాహనం చోరీకి గురికాగా.. సోమవారం రఘునాథపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐ ఉస్మాన్షరీఫ్ కథనం ప్రకారం.. ఆదివారం రాత్రి రమేశ్ గ్రామ సెంటర్లో ఉన్న సెలూన్లో హెయిర్ కటింగ్ చేయించుకుని బయటకు రాగా.. ద్విచక్రవాహనం కనిపించలేదు. బాధితుడి ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
జ్యూయలరీ దుకాణంలో చోరీకి యత్నం..
దుమ్ముగూడెం: మండలంలోని లక్ష్మీనగరం గ్రామంలోని ఝూన్సీ జ్యూయలరీ దుకాణంలో దొంగలు చోరీకి విఫలయత్నం చేశారు. ఈ ఘటన సోమవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. ఓ దొంగల మూఠా బొలేరో వాహనంలో లక్ష్మీనగరం గ్రామంలోని ఝూన్సీ జ్యూయలరీ దుకాణంలో దొంగతనానికి ప్రయత్నించింది. దుకాణం షెట్టర్ తొలగించి లోపలి కౌంటర్ను తోయగా ఆ శబ్దం విన్న వెనుక అద్దెకు ఉండేవారు నిద్ర లేచి బయటకు రావడంతో వారు పరారయ్యారు. సమాచారం అందుకున్న సీఐ అశోక్, ఎస్ఐలు వెంకటప్పయ్య, గణేశ్ ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. జిల్లా కేంద్రం నుంచి వచ్చిన క్లూస్ టీం సభ్యులు ఆధారాలను సేకరించారు. జ్యూయలరీ దుకాణంలో ఏమీ చోరీకి గురికాకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. పక్కా స్కెచ్.. దొంగలు లక్ష్మీనగరం గ్రామంలోని జ్యూయలరీ దుకాణంలో చోరీ చేసేందుకు పక్కా ప్రణాళికతో వచ్చినట్లు సీసీ కెమెరాల ఆధారంగా తెలుస్తోంది. భద్రాచలం వైపు నుంచి బొలేరో వాహనం చర్ల వైపు వెళ్తూ యూటర్న్ తీసుకుని వెనక్కి వచ్చి ఓ స్వీట్ షాప్ దగ్గర నిలిపి, అక్కడి నుంచి దొంగలు ఝూన్సీ జ్యూయలరీ దుకాణం వద్దకు వెళ్లినట్టు సీసీ కెమెరాలో కనిపిస్తోంది. వాహనంలో నుంచి ఇద్దరు వ్యక్తులు దిగి జ్యూయలరీ దుకాణం వ్దకు వెళ్లగా వాహనం రివర్స్లో దుకాణం వద్దకు వెళ్లింది. షట్టర్ తొలగించి కౌంటర్ను తోయడం.. వెనుక ఉన్న వాళ్లు లేవడం.. దొంగలు పరారుకావడం కూడా నిఘా నేత్రాల్లో నిక్షిప్తమైంది. అనంతరం వారు వెళ్తూ కూడా టార్చిలైట్ వేసి దుకాణాలను పరిశీలించి వెళ్లారు. తొలుత అర్ధరాత్రి 2.01 గంటలకు సాయితిరుమల ఇంజనీరింగ్ వర్క్స్ దుకాణం వద్దకు వెళ్లారు. మరోసారి 3.28 గంటలకు సమయంలో మరోసారి ఆ దుకాణం వద్దకు వెళ్లగా లోపల నిద్రిస్తున్న వ్యక్తులు లేవగా హిందీలో తాగునీరు కావాలని అడిగినట్టు తెలిసింది. అద్దెకున్న వాళ్లు లేవడంతో ప్రయత్నం విఫలం -
లారీ క్యాబిన్లో షార్ట్ సర్క్యూట్
వైరా: ఆగి ఉన్న లారీ క్యాబిన్లో ప్రమాదవశాత్తూ షార్ట్ సర్క్యూట్ అయి మంటలు చెలరేగాయి. వైరా మున్సిపాలిటీ పరిధిలోని శాంతినగర్ వద్ద సోమవారం ఉదయం కోల్కతా నుంచి మిర్యాలగూడెంనకు తౌడు లోడుతో వెళ్తూ ఆగింది. ఆ సమయంలో లారీ క్యాబిన్లో షార్ట్ సర్క్యూట్ జరిగి మంటలు చెలరేగాయి. స్థానికులు ఆగ్ని మాపక సిబ్బందికి సమాచారం ఇవ్వగా ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపుచేశారు. షార్ట్ సర్క్యూట్తో క్యాబిన్ దగ్ధమై సుమారు రూ.2 లక్షలు నష్టం వాటిల్లినట్లు డ్రైవర్ తెలిపారు. గల్లంతైన వ్యక్తి విగతజీవిగా..భద్రాచలంఅర్బన్: గోదావరి బ్రిడ్జి పైనుంచి దూకిన ఓ వ్యక్తి మృతదేహాన్ని సోమవారం గుర్తించారు. వివరాలివీ.. కొత్తగూడెం పట్టణానికి చెందిన రిటైర్డ్ సింగరేణి కార్మికుడు వేముల మల్లేశ్ (68) ఇంట్లో గొడవపడి ఆదివారం ఉదయం భద్రాచలం వచ్చి గోదావరి బ్రిడ్జి పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిసింది. అదే రోజు మృతదేహం దొరక్క పోవడంతో సోమవారం గజ ఈతగాళ్లు, పోలీసుల ఆధ్వర్యంలో గాలింపు చర్యలు చేపట్టగా మృతదేహం దొరకడంతో ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి పోలీస్ స్టేషన్లో ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. కార్మికుడు అదృశ్యంఖమ్మంఅర్బన్: నగరంలోని పాండురంగాపురంలో ఉంటూ పాలిష్ కార్మికుడిగా పనిచేస్తున్న బాలకృష్ణ కనిపించకుండా పోవడంతో సోమవారం ఖమ్మంఅర్బన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. గత నెల 23న పనికి వెళ్తున్నానని చెప్పి వెళ్లి తిరిగి రాలేదని, అనేక చోట్ల ఆరా తీసినా ఆచూకీ లభించలేదని.. బాలకృష్ణ అత్త కోటమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన కుమార్తె, అల్లుడు పుట్టుకతో మూగవారని తెలిపింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
రాజుకుంటున్న మంటలు
● డంపింగ్యార్డ్లో అగ్ని ప్రమాదం ● కుప్పలుగా పేరుకుపోతున్న వ్యర్థాలతో ఆందోళన ● సిబ్బంది నిర్లక్ష్యంతోనే మంటలు వ్యాపించాయని ఆరోపణలుఖమ్మంమయూరిసెంటర్: కొంతకాలంగా ప్రశాంతంగా ఉన్న దానవాయిగూడెం ప్రాంతంలోని డంపింగ్యార్డ్లో మళ్లీ మంటలు కలకలం సృష్టించాయి. వేసవి కాలం ప్రారంభానికి ముందే మంటలు అంటుకొని వ్యర్థాలు కాలిపోవడం స్థానికులను ఆందోళనకు గురిచేస్తోంది. డంపింగ్యార్డులో వ్యర్థాలు కుప్పలుగా పేరుకుపోవడం, వాటిని తొలగించకపోవడంతో ఈ సమస్య పునరావృతం అవుతోందని స్థానికులు పేర్కొంటున్నారు. ఇక ఆదివారం డంపింగ్యార్డులో మంటలు చెలరేగడానికి కారణం ఎవరైనా నిప్పు పెట్టి ఉంటారా? అనే అనుమానాలు అధికారులు నుంచి వ్యక్తమవుతున్నాయి. మంటలను వెంటనే గుర్తించి ఫైరింజన్తో అదుపు చేయడం వల్ల యార్డు మొత్తం మంటలు వ్యాపించకుండా అడ్డుకున్నట్లు స్థానిక సిబ్బంది పేర్కొంటున్నారు. మంటలు పెరిగితే పెద్ద మొత్తంలో పొగ చుట్టు పక్కల ప్రాంతాలను కమ్మేసి ఉండేదని, స్థానిక ప్రజలు ఇబ్బందిపడే వారని ఆ ప్రాంత వాసులు చర్చించుకున్నారు. గుట్టలుగా వ్యర్థాలు.. డంపింగ్యార్డులో దశాబ్దాల కాలం నాటి వ్యర్థాలను తొలగించేందుకు బయో మైనింగ్ ప్రక్రియను చేపట్టారు. ఈ ప్రక్రియ గత మూడేళ్లకు పైగా కొనసాగుతూనే ఉంది. అయినా వ్యర్థాల గుట్టలు అలాగే పేరుకుపోయి ఉన్నాయి. ఇక రోజు వారీగా వచ్చే 180 మెట్రిక్ టన్నులకు పైగా వ్యర్థాలు ఇక్కడే పోస్తుండటంతో డంపింగ్ యార్డు అంతా వ్యర్థాలతో నిండిపోతోంది. డంపింగ్యార్డు ఇన్చార్జ్లు పట్టించుకోకపోవడంతో గుట్టలుగా పోయాల్సిన వ్యర్థాలను దారి పొడవునా డంప్ చేస్తూ యార్డులో ఉన్న స్థలాన్ని వ్యర్థాలతో నింపారు. సిబ్బంది నిర్లక్ష్యం.. డంపింగ్యార్డు నిర్వహణకు కేఎంసీ అధికారులు.. సిబ్బందిని ప్రత్యేకంగా కేటాయించారు. ఓ ఉద్యోగిని డంపింగ్యార్డుకు ఇన్చార్జ్గా కేటయించి.. ఆయన ఆధ్వర్యంలో మరో నలుగురిని డంపింగ్యార్డు పర్యవేక్షకులుగా నియమించారు. అయితే వీరు అక్కడ విధులు నిర్వహించాల్సిన సమయంలో కేఎంసీ కార్యాలయంలో, బయట ప్రాంతాల్లోనే ఎక్కువ సమయం గడుపుతున్నట్లు విమర్శలున్నాయి. ఏడాది కాలంలో మంటలు లేకుండా ప్రశాంతంగా ఉన్న డంపింగ్యార్డులో ఇప్పుడు మంటలు ఎలా వచ్చాయనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ మంటల వ్యాప్తికి కారణం బయట వ్యక్తులా? లేక ఇక్కడి సిబ్బంది నిర్వాకమేనా..? కాగితాలు ఏరుకునే వారా..?అనేది తెలుసుకునేందుకు అధికారులు దృష్టి సారించినట్లు తెలిసింది. నిరంతర పర్యవేక్షణ అవసరం.. డంపింగ్యార్డ్లో వ్యర్థాల నిర్వహణపై నిరంతర పర్యవేక్షణ అవసరం ఉంది. డంపింగ్యార్డ్ను తర లించాలని స్థానికులు ఆందోళన చేస్తున్న తరుణంలో వ్యర్థాలకు మంటలు వ్యాపించడం కొంత ఆందోళనకరమైన విషయంగా అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షించడం ద్వారా ఇక్కడ మంటలు ఎలా వ్యాపిస్తున్నాయో పసిగట్టవచ్చని చెబుతున్నారు. ఇప్పటికే కొన్ని సీసీ కెమెరాలు ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసినా.. వీటిని డంపింగ్యార్డ్కు అన్ని వైపులా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందంటున్నారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ సందర్శన.. డంపింగ్ యార్డులో ఆదివారం మంటలు రావడంతో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, ఇన్చార్జ్ కమిషనర్ డాక్టర్ పి.శ్రీజ సోమవారం డంపింగ్యార్డును సందర్శించారు. మంటలు చెలరేగిన ప్రాంతాన్ని పరిశీలించి అధికారులతో మాట్లాడారు. మంటలు రావడానికి కారణమేంటని కేఎంసీ ఈఈ కృష్ణాలాల్ను అడిగారు. వ్యర్థాల కుప్పలు పేరుకుపోయినప్పుడు లోపలి నుంచి వేడికి మంటలు వ్యాపించే అవకాశం ఉంటుందని అదనపు కలెక్టర్కు తెలిపినట్లు సమాచారం. అరెకరం మేరకు వ్యర్థాలు కాలినట్లు అధికారులు గుర్తించారు. ఇక సోమవారం ఉదయం కూడా పొగలు రావడంతో ఎప్పటికప్పుడు వ్యర్థాలపై మట్టిపోస్తూ మంటలు రాకుండా స్థానిక సిబ్బంది అడ్డుకున్నారు. -
కాకతీయుల కాలంలోని అద్భుతమైన నిర్మాణం
జూలూరుపాడు: సుమారు ఏడు శతాబ్దాల క్రితం కాకతీయ రాజులు నిర్మించిన చారిత్రక కట్టడం కనుమరుగవుతోంది. కాకతీయుల కాలంలో తాగునీటి అవసరాలు, శత్రు సైన్యాల నుంచి తమను రక్షించుకోవడానికి దట్టమైన అడవి ఉన్న జూలూరుపాడు (Julurpadu) ప్రాంతంలో రాజాబావిని రాతికట్టడంతో నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. సువిశాలమైన రాజాబావికి రెండు వైపులా నివాసం కోసం గదులు నిర్మించి ఉంటారని తెలుస్తోంది. ఈ బావి పైభాగాన తూర్పు, పడమరకు ఎదురెదురుగా 10 గదులు నిర్మించారు. బావిలోకి దిగేందుకు 30 అడుగుల పొడవు, 3 అడుగుల వెడల్పుతో రాళ్లతో మెట్లు నిర్మించారు. ఈ బావి చుట్టూ 8 అడుగుల పొడవు, 10 అడుగుల వెడల్పు గల పైకప్పు ఒకేరాయిలా కనిపిస్తోంది. పూడిక మట్టితో నిండిపోవడంతో బావి లోతు ఎంత అనేది తెలియడం లేదు. సున్నం, రాళ్లతో నిర్మించిన ఈ ప్రాచీన కట్టడం నేటికీ చెక్కుచెదరలేదు. అయితే, గుప్తనిధుల కోసం తవ్వకాలు, చెత్తాచెదారం పేరుకుపోవడం, బావిలో పూడిక పెరగడంతో నానాటికీ వైభవం కోల్పోతున్నా సంరక్షణపై అధికారులు చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. దండయాత్రల నుంచి రక్షణకు.. శత్రువులు దండయాత్ర చేసినప్పుడు రక్షణ కోసం కాకతీయ రాజులు (Kakatiya Kings) పలు ప్రాంతాల్లో సొరంగ మార్గాలు ఏర్పాటు చేసుకునేవారని చరిత్ర చెబుతోంది. ఇందులో భాగంగానే వివిధ ప్రాంతాల మీదుగా సొరంగ మార్గాల ద్వారా ఖమ్మం ఖిలాకు వచ్చేవారని, కాకతీయుల రాజధాని అయిన ఓరుగల్లు (వరంగల్)కోటకు, పాత ఖమ్మం (Khammam) జిల్లాలోని జూలూరుపాడు రాజుల బావి, భేతాళపాడు గుట్టలపై ఉన్న కోట వరకు వచ్చేవారని తెలుస్తోంది. జూలూరుపాడు నుంచి పాపకొల్లులోని పుట్టకోట, చండ్రుగొండ మండలం బెండాలపాడు గుట్టల్లో వెలిసిన శ్రీవీరభద్రస్వామి, కనగిరి గుట్టల్లోని ఆలయాలు, అప్పట్లో సైనికులు తలదాచుకునేందుకు ఏర్పాటు చేసిన కొన్ని స్థావరాలు నేటికీ కనిపిస్తాయి. అక్కడ ఉన్న సొరంగ మార్గాల ద్వారా శత్రువుల నుంచి రక్షణ పొందటంతోపాటు, శత్రువులపై మెరుపు దాడులు నిర్వహించేందుకు ఈ మార్గాలను ఉపయోగించుకునేవారు.గుప్తనిధుల కోసం తవ్వకాలు.. కాకతీయ రాజులు వజ్ర వైఢూర్యాలు, బంగారు అభరణాలను ఈ బావిలో భద్రపరిచే వారని నమ్ముతుంటారు. బావిలో గుప్త నిధులు ఉన్నాయనే ప్రచారంతో ఏడేళ్ల క్రితం గుర్తు తెలియని వ్యక్తులు బావి పైభాగాన ఉన్న గదుల్లో తవ్వకాలు జరిపారు. ఈ క్రమంలో క్షుద్రపూజలు చేసిన ఆనవాళ్లు కనిపించినా అధికారులు పట్టించుకోకపోవడంతో అక్రమార్కులు యథేచ్ఛగా తవ్వకాలు జరుపుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీంతో చారిత్రక కట్టడం ధ్వంసానికి గురవడంతో బావి ఆనవాళ్లు భావితరాలకు కన్పించకుండా పోయే పరిస్థితి ఏర్పడనుంది. తగ్గని నీటిమట్టం.. బావి నీటిని గతంలో ఈ ప్రాంత వాసులు తాగునీటిగా ఉపయోగించేవారు. బావిలో నీటిమట్టం తరగకపోవడంతో, బావిలో ఏమైనా గుప్త నిధులు ఉన్నాయా అని తెలుసుకునేందుకు కొన్నేళ్ల క్రితం గ్రామస్తులు ఆయిల్ ఇంజిన్లు పెట్టి నీటిని 15 రోజుల పాటు పంటలకు వినియోగించినా నీటిమట్టం ఎంతమాత్రం తగ్గలేదు. దీంతో గ్రామస్తులు ఆశ్చర్యానికి గురయ్యారు. బావిలోకి దిగుడు మెట్లు, బావి చుట్టూ తిరగటానికి వీలుగా ప్లాట్ఫామ్ ఉన్నాయి. ఈ తరం ఇంజనీర్లకు సైతం అంతు చిక్కని అద్భుత సాంకేతిక నైపుణ్యంతో రాతిబావిని నిర్మించడం విశేషం. అలాంటి బావి పాలకులు, అధికారుల నిర్లక్ష్యానికి గురవుతూ పూడిక మట్టి, ముళ్ల పొదలతో నిండిపోయింది. బావి చుట్టూ ఉన్న స్థలం కూడా ఆక్రమణకు గురికావడంతో ముళ్ల పొదలు, చెట్లతో కళావిహీనంగా మారింది. చారిత్రక సంపద ధ్వంసం కాకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని, పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని స్థానికులు కోరుతున్నారు. రాజాబావి నీళ్లు తాగే వాళ్లం 40 ఏళ్ల క్రితం రాజాబావి నీళ్లు తాగే వాళ్లం. వేసవి కాలంలో కూడా నీళ్లు బాగా ఉండేవి. ఈ నీటిని పంటల సాగుకూ ఉపయోగించేవారు. ప్రస్తుతం పూడికతో నిండిపోవడంతో పాటు ముళ్ల పొదలు, చెట్లు పెరగడంతో అటువైపు ఎవరూ వెళ్లడం లేదు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి మరమ్మతులు చేయాలి. – చిన్నకేశి వెంకటేశ్వర్లు, జూలూరుపాడు చారిత్రక కట్టడాన్ని కాపాడాలి వందల ఏళ్ల నాటి చారిత్రక కట్టడం కనుమరుగు కాకుండా చూడాలి. రాజాబావి ధ్వంసమవుతుండటంతో భావితరాలకు కన్పించకుండాపోయే ప్రమాదం ఉంది. ఇలాంటి చారిత్రక సంపదను రక్షించేందుకు ప్రభుత్వం, అధికారులు చర్యలు చేపట్టాలి. – తాళ్లూరి వెంకటేశ్వర్లు, జూలూరుపాడు బావి అభివృద్ధికి చర్యలు చేపట్టాలి రాజాబావి అభివృద్ధికి అధికారులు చర్యలు తీసుకోవాలి. కొన్ని దశాబ్దాలుగా అధికారులు పట్టించుకోకపోవడంతో ముళ్ల పొదలు, చెట్లతో నిండి కళావిహీనంగా మారింది. దీన్ని రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. – నర్వనేని పుల్లారావు, జూలూరుపాడు చదవండి: వరంగల్ పేరు ఎలా వచ్చిందంటే..పురాతన సంపదను కాపాడతాం కాకతీయుల కాలం నాటి పురాతన కట్టడమైన రాజా బావిని కాపాడుతాం. ఈ సమస్యను ఉన్నతాధికారులు, పర్యాటక శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్తాం. స్థానిక గ్రామ పంచాయతీ నుంచి ఏమైనా చేయవచ్చేమో పరిశీలిస్తాం. ముళ్ల పొదలు, చెట్లు తొలిగించి, పూర్వవైభవం వచ్చేలా చర్యలు చేపడతాం. – డి.కరుణాకర్రెడ్డి, ఎంపీడీఓ జూలూరుపాడు -
అల్లుడిపై పెట్రోలు పోసి నిప్పు పెట్టిన అత్తా మామ..
టేకులపల్లి: భార్యాపిల్లలను చూసేందుకు అత్తారింటికి వచ్చిన అల్లుడిపై పెట్రోల్ పోసి నిప్పంటించి, ఇంట్లోకి వెళ్లి తలుపుపెట్టుకున్నారు. మంటలకు తాళలేక ఎంతగా మెత్తుకున్నా వారు తలుపు తీయకపోవడంతో పక్కనే ఉన్న నీటితొట్టిలో దూకాడు. స్థానికులు ఆస్పత్రికి తరలించగా.. చికిత్సపొందుతూ మృతిచెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. పాల్వంచ మండలం దంతెలబోరు ఎస్సీకాలనీకి చెందిన బల్లెం చినవెంకటేశ్వర్లు పెద్ద కుమారుడు బల్లెం గౌతమ్ (23).. టేకులపల్లి మండలం రామచంద్రునిపేట గ్రామానికి చెందిన ఎజ్జు వెంకటేశ్వర్లు కుమార్తె కావ్యను రెండేళ్ల కిందట ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం వీరికి ఇద్దరు కుమార్తెలున్నారు. సుజాతనగర్లో ఉంటూ కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. గత నెల కావ్య తన ఇద్దరు పిల్లలతో కలిసి రామచంద్రునిపేటలోని పుట్టింటికి వచ్చింది. ఈ నెల 2న రాత్రి గౌతమ్ తన పిల్లలు, భార్యను చూసేందుకు రామచంద్రునిపేటకు వచ్చాడు. గౌతమ్ని లోపలికి వెళ్లనీయకుండా అత్తా మామ, బావమరుదులు అడ్డుకున్నారు. దుర్భాషలాడి, దాడి చేయడంతో పాటు గౌతమ్పై పెట్రోలు పోసి నిప్పంటించారు. అనంతరం అందరూ లోపలికి వెళ్లి తలుపులు వేసుకున్నారు. మంటల్లో కాలుతూ ఆర్తనాదాలు చేస్తున్నా రక్షించలేదు. పక్కనే ఉన్న నీటి తొట్టిలో దూకిన గౌతమ్ని చుట్టు పక్కల వారు బయటకు తీసి, కొత్తగూడెం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి ఖమ్మం, వరంగల్ ఎంజీఎంకు తరలించారు. 14 రోజుల పాటు చికిత్స పొందిన గౌతమ్ ఆదివారం మృతి చెందాడు. బోడు ఎస్ఐ పొడిశెట్టి శ్రీకాంత్ను వివరణ కోరగా ఈ నెల 2న రామచంద్రునిపేటలో ఘటన జరిగిందని, 11న మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు. కాగా, ఈ నెల 2న ఘటన జరిగి, 11న ఫిర్యాదు వచ్చినప్పటికీ ఈ విషయాన్ని గోప్యంగా ఉంచడంతో ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. -
పరీక్షలా.. తగ్గేది లేదు..
●ప్రభుత్వ పాఠశాలల్లో ప్రత్యేక తరగతులు ●విద్యార్థుల్లో భయం పోగొట్టేలా అవగాహన సదస్సులు ●కలెక్టర్ ప్రత్యేక చొరవతో నిర్వహణఖమ్మంసహకారనగర్: పదో తరగతి పరీక్షలు అంటే విద్యార్థుల్లో ఆందోళన ఉండటం సహజం. వారి ఆందోళన తొలగించేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తుంది. ఈ సారి ఫలితాలంటే ఆషామాషీగా కాకుండా ఉత్తీర్ణత శాతం పెంచాలనేది లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రతి పాఠశాలలో 100 శాతం ఫలితాలు సాధించే దిశగా విద్యాశాఖ ఉన్నతాధికారులు, కలెక్టర్ ముజమ్మిల్ఖాన్ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే విద్యార్థుల్లో భయం పోగొట్టేలా అవగాహన కల్పిస్తున్నారు. ఇటు విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు కూడా పరీక్షలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. మార్చి 23 నుంచి పరీక్షలు జరగనున్న నేపథ్యంలో విద్యార్థులను సన్నద్ధం చేసేందుకు విద్యాశాఖ ముమ్మర కసరత్తు చేస్తోంది. విద్యార్థుల సిలబస్ పూర్తి చేయించడం.. వారితో రివిజన్ చేయించడంపై చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ప్రత్యేక తరగతులు కూడా నిర్వహిస్తున్నారు. 9 వేల మందికి పైగా విద్యార్థులు జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు 282 ఉండగా.. వాటిల్లో 9,833 మంది విద్యార్థులు మార్చిలో జరిగే పదో తరగతి వార్షిక పరీక్షలు రాయనున్నారు. వారు మెరుగైన ఫలితాలు సాధించేందుకు కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఆదేశాల మేరకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. ఉదయం గంట, సాయంత్రం ఒక గంట చొప్పున ప్రత్యేక తరగతులు ఏర్పాటు చేశారు. ఈ తరగతుల్లో విద్యార్థులను చదివించటంతో పాటు వారికున్న సందేహాలను నివృత్తి చేస్తున్నారు. దీంతో విద్యార్థులకు ప్రతి సబ్జెక్ట్పై పట్టువస్తుందని హెచ్ఎంలు చెబుతున్నారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నెల 1వ తేదీ నుంచి అల్పాహారం అందిస్తోంది. సుమారు రూ.55 లక్షలను అల్పాహారం కింద ప్రభుత్వం వెచ్చిస్తోంది. -
కాలుష్య సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్తా
సత్తుపల్లి: సత్తుపల్లి సైలో బంకర్ నుంచి వస్తున్న కాలుష్య సమస్యను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. సత్తుపల్లి మండలం కిష్టారం గ్రామంలోని అంబేద్కర్నగర్ కాలనీ వాసులు సింగరేణి సైలో బంకర్ కాలుష్యానికి వ్యతిరేకంగా ఆందోళన చేపడుతున్నారు. ఈ క్రమంలో ఆదివారం మంత్రి తుమ్మలను గండుగులపల్లిలో కలిసిన బాధితులు సమస్యను ఆయనకు వివరించారు. సైలో బంకర్ నుంచి విడుదల చేస్తున్న బొగ్గు కాలుష్యంతో కాలనీలోని ప్రజలు ఊపిరితిత్తులు, శ్వాసకోశ వ్యాధులతో బాధ పడుతున్నారని, ఇప్పటికే పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారని విన్నవించారు. కాలుష్యం బారి నుంచి తప్పించి పునరావాసం కల్పించాలని కోరారు. దీనికి స్పందించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిన అనంతరం సింగరేణి అధికారులతో చర్చిస్తామని, అధికారుల స్పందనను సీఎం రేవంత్రెడ్డి దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు కడారి మదీనా, మారోజు నాగేశ్వరరావు, పాలకుర్తి నాగేశ్వరరావు, పాలకుర్తి ప్రభుదాసు, పాలకుర్తి మణిబాబు, కొత్త సాంబయ్య, కిష్టపాటి కోటిరెడ్డి, వాడపల్లి కోటేశ్వరరావు, కొండ నాగరత్నం, వాడపల్లి నాగమణి, పాలకుర్తి రాణి, వాడపల్లి అరుణ పాల్గొన్నారు. వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల -
మెరుగైన వైద్య సేవలందించాలి
● డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ● మధిరలో ఆరోగ్యశ్రీ సేవలు ప్రారంభంమధిర: రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకం ద్వారా ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. మధిర పట్టణంలోని కేవీఆర్ జనరల్ ఎమర్జెన్సీ ఆస్పత్రిలో ఆరోగ్యశ్రీ సేవలను ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ ప్రాంత ప్రజలు ఆరోగ్య శ్రీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ముందుగా భట్టి విక్రమార్కకు ఆస్పత్రి అధినేత డాక్టర్ కోట రాంబాబు, డాక్టర్ అరుణకుమారి ఘన స్వాగతం పలికారు. అనంతరం పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు మిరియాల రమణగుప్త, లావణ్య దంపతుల కుమార్తె సాత్విక వివాహ వేడుకకు హాజరైన భట్టి నూతన వధూవరులను ఆశీర్వదించారు. -
భళా.. సప్తకళ!
ఖమ్మంగాంధీచౌక్: నగరంలోని భక్త రామదాసు కళాక్షేత్రంలో ఆదివారం రాత్రి నిర్వహించిన సప్తకళల ప్రదర్శనలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఖమ్మం కళా పరిషత్ అధ్యక్షుడు డాక్టర్ నాగబత్తిని రవి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో అతిథులు మాట్లాడుతూ.. విభిన్నమైన, సాహసోపేతమైన కళలను ప్రదర్శించటం అభినందనీయమన్నారు. సాధారణ కళా ప్రదర్శనలకు భిన్నంగా కళలను విన్యాసాలకు జోడించి ప్రదర్శించటం ప్రత్యేక ప్రతిభగా అభివర్ణించారు. భిన్నమైన ప్రదర్శనలు.. ముంబైకి చెందిన గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ ఆఫ్ రికార్డ్స్ హోల్డర్ కిషన్ జంగ్లర్ కత్తుల జగ్లింగ్ ప్రదర్శన, చైన్నెకి చెందిన పాల్రాజ్ 5 ఫేస్ డ్యాన్స్, మణిక్ చంద్ వేసిన ప్లేట్లు, గ్లాసులపై రాజస్థానీ డ్యాన్స్, ఖమ్మానికి చెందిన బేబి ఫైర్ ప్రార్థవిక స్కేటింగ్పై భరతనాట్యం, మంటలతో ఫైర్ రవి, బేబీ పండు విన్యాసాలు, చైన్నెకి చెందిన కళాకారుల అమేజింగ్ డ్యాన్స్, శివనాగులు, కాల్వకట్ట జాన్ ఆలపించిన గేయాలు అందరినీ ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో మిత్ర గ్రూప్స్ చైర్మన్ కురువెళ్ల ప్రవీణ్కుమార్, తస్మా రాష్ట్ర కార్యదర్శులు ఐ.వి. రమణారావు, నెల నెలా వెన్నెల నిర్వాహకులు అన్నాబత్తుల సుబ్రహ్మణ్యకుమార్, కాళ్ల పాపారావు, జల్లా లక్ష్మీనారాయణ, బొల్లు సైదులు, టి వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.ఆకట్టుకున్న విన్యాసాలు -
15 అడుగులకు ‘పాలేరు’
కూసుమంచి: మండలంలోని పాలేరు రిజర్వాయర్లో నీటిమట్టం 15 అడుగులకు చేరింది. ఇటీవల నీటిమట్టం 20 అడుగుల పైగానే ఉండగా ఆయకట్టు పరిధిలో పంటలకు నీరు విడుదల చేస్తుండడడంతో తగ్గుముఖం పడుతోంది. ప్రస్తుతం సాగర్ నుంచి 4,550 క్యూసెక్కుల నీరు చేరుతుండగా 4,334 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అలాగే, మిషన్ భగీరథ పథకానికి 135 క్యూసెక్కుల నీరు వినియోగిస్తున్నారు. ఈ నేపథ్యాన నీటిమట్టం తగ్గుతుండడంతో పాలేరు పాత కాల్వ, భక్తరామదాసు ప్రాజెక్టులకు సరఫరా నిలిపేశారు. కాగా.. తాగు, సాగునీటి అవసరాలకు ఇబ్బంది లేకుండా సాగర్ నుంచి నీటి సరఫరాను పెంచనుండగా పాత కాల్వకు రెండు రోజుల్లో విడుదల చేస్తామని అధికారులు వెల్లడించారు. ఘనంగా భజన బృందాల ఆత్మీయ సమ్మేళనం ఖమ్మంఅర్బన్: విశ్వహిందూ పరిషత్ సనాతన ధర్మం, సత్సంగం, భక్తి మార్గం ప్రచారంలో భాగంగా ఆదివారం నగరంలోని రోటరీనగర్లోని శ్రీరాజరాజేశ్వరి ఆలయ మండపంలో భజన బృందాల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. జిల్లాలోని భజన బృందాలందరినీ సమన్వయం చేయాలనే ఉద్దేశంతో ఈ సమ్మేళనం ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా సనాతన ధర్మం, పూజా విధానం, భజన చేసే విధానాలపై తిరుమల తిరుపతి ధర్మ ప్రచారకులు వనం తేజశ్రీ బోధించారు. ఈ కార్యక్రమంలో వివిధ సంఘాలకు చెందిన పండరినాథ్, బోనాల రామకృష్ణ, బొడ్డు కృష్ణ, చలమల వెంకటేశ్వర్లు, వెంకట రాణాప్రతాప్, పసుమర్తి రవి, నేరెళ్ల శ్రీనివాస్, కనగంటి నాగమణి, కట్టా వైదేహి, కృష్ణప్రియ, శ్రీనివాసు, రాణి, రాజు, రవి, రాము, లక్ష్మీనారాయణ, భానుమతి, శశాంక్ పాల్గొన్నారు. ఇష్టపడి చదివితే ఉత్తమ ఫలితాలుటీజీఓస్ రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరి ఖమ్మం సహకారనగర్ : నేటి విద్యార్థులే రేపటి సారథులని, విద్యార్థులు ప్రాథమిక స్థాయి నుంచే ఇష్టపడి చదివి మంచి ఫలితాలు సాధించాలని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం (టీజీఓ) రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు అన్నారు. నగరంలోని సైన్స్ మ్యూజియంలో పరిశ సీతారత్నం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి ప్రతిభాపాటవ పరీక్ష విజేతలకు ఆదివారం బహుమతులు పంపణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏలూరి మాట్లాడుతూ.. విద్యారంగంలో ట్రస్ట్ సేవలను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. తొలుత డీఈఓ సోమశేఖర శర్మ ప్రశ్నపత్రాలను విడుదల చేశారు. కార్యక్రమానికి ట్రస్ట్ అధ్యక్షులు పరిశ పుల్లయ్య అధ్యక్షత వహించగా టీజీఓ జిల్లా కార్యదర్శి మోదుగు వేలాద్రి, పరీక్షల ఏసీ రమేష్, డీసీఈబీ సెక్రటరి నారాయణ, ఖమ్మం అర్బన్ ఎంఈఓ కె.వి.శైలజాలక్ష్మి, టీఎన్జీఓస్ జిల్లా కార్యదర్శి కొణిదెన శ్రీనివాస్, జగదీశ్వర్, శ్యాంసన్, రాయల రవికుమార్, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. కిన్నెరసానిలో సండే సందడి పాల్వంచరూరల్: పాల్వంచ మండలంలో గల కిన్నెరసానిలో పర్యాటకులు ఆదివారం సందడి చేశారు. జిల్లా నలుమూలలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా డ్యామ్ పైనుంచి జలాశయాన్ని, డీర్పార్కులోని దుప్పులను వీక్షించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆనందోత్సాహాల నడుమ గడిపారు. 474 మంది పర్యాటకులు కిన్నెరసానిలోకి ప్రవేశించడం ద్వారా వైల్డ్లైఫ్ శాఖకు రూ.15,695 ఆదాయం లభించగా, 200మంది బోటు షికారు చేయడం ద్వారా టూరిజం కార్పొరేషన్కు రూ.12,490 ఆదాయం లభించినట్లు నిర్వాహకులు తెలిపారు. -
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
తిరుమలాయపాలెం: మండలంలోని ఏలువారిగూడెం – మేడిదపల్లి గ్రామాల మధ్యలో ఎస్సారెస్పీ కాల్వ కట్టపై ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన ఘటన ఆదివారం వెలుగుచూసింది. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని పాతర్లపాడు గ్రామానికి చెందిన కోల సైదులు (41) మేళం వాయిస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ నెల 14న బ్యాండ్ మేళం వాయించే పని ఉందని భార్య ఉషకు చెప్పి ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. 15న ఉదయం భార్యతో ఫోన్లో మాట్లాడగా ఆ తర్వాత ఫోన్ స్విచ్ఛాఫ్ వచ్చింది. ఆదివారం ఉదయం మేడిదపల్లి సమీపంలోని ఎస్సారెస్పీ కాలువపై సైదులు అనుమానాస్పద స్థితిలో మృతిచెంది ఉన్నట్లు గుర్తించారు. సమాచారం తెలుసుకున్న సైదులు భార్య ఉష ఘటనా స్థలానికి చేరుకుని తన భర్త మృతిపై అనుమానాలు ఉన్నట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎస్ఐ కూచిపూడి జగదీశ్ ఘటనా స్థలానికి వెళ్లి విచారించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. మృతుడికి ఇద్దకు కుమార్తెలున్నారు. -
సీనియర్లు, జూనియర్ల మధ్య ఘర్షణ
సోషల్ వెల్ఫేర్ కాలేజీలో ఘటన పెనుబల్లి: మండలంలోని కుప్పెనకుంట్ల తెలంగాణ సోషల్ వెల్ఫేర్ బాయ్స్ రెసిడెన్షియల్ స్కూల్, కాలేజీలో సీనియర్ జూనియర్ విద్యార్థుల మధ్య జరిగిన గొడవ పోలీస్ స్టేషన్కు చేరింది. శనివారం రాత్రి సీనియర్ – జూనియర్ ఇంటర్ విద్యార్థులు టీవీలో సినిమా చూస్తున్న సమయంలో చానల్ మార్చే విషయంలో ఏర్పడిన వివాదం ఘర్షణకు దారి తీసింది. జూనియర్ విద్యార్థిపై సీనియర్ విద్యార్థులు దాడి చేయడంతో గాయాలయ్యాయి. ఆదివారం ఉదయం హాస్టల్ సిబ్బంది, ఉపాధ్యాయులు ఆ విద్యార్థిని పెనుబల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. ఈ ఘటనపై బాధిత విద్యార్థి ఫిర్యాదుతో దాడికి పాల్పడిన ఐదుగురు విద్యార్థులపై కేసు నమోదు చేసినట్లు వీఎం.బంజర పోలీసులు తెలిపారు. వాటర్ ట్యాంకర్ బోల్తా.. సత్తుపల్లిరూరల్: గ్రీన్ఫీల్డ్ హైవే జాతీయ రహదారి పనుల్లో భాగంగా సత్తుపల్లి మండలం కిష్టాపురం తండా సమీపంలో రోడ్డుపై ఉన్న దుమ్ముదూళిపై నీళ్లు చల్లుతున్న వాటర్ ట్యాంకర్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్కు స్వల్ప గాయాలయ్యాయి. క్రేన్తో వాటర్ ట్యాంకర్ను తొలగించటంతో కొద్దిసేపు ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. రూ.1.09 లక్షలు చోరీసత్తుపల్లిరూరల్: సత్తుపల్లి మండలం కిష్టారం అంబేడ్కర్నగర్లో ఓ ఇంట్లో శనివారం రాత్రి చోరీ జరిగింది. పాగా వెంకటేశ్వరరావుకు చెందిన మూడున్నర ఎకరాల భూమికి సొసైటీలో రూ.1,09,500 రుణం రాగా నగదును బీరువాలో పెట్టాడు. శనివారం రాత్రి దొంగలు బీరువాను పగులకొట్టి నగదు ఎత్తుకెళ్లారని సత్తుపల్లి పోలీసులకు వెంకటేశ్వరరావు ఆదివారం ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గోదావరి బ్రిడ్జి పైనుంచి దూకిన వ్యక్తిభద్రాచలంటౌన్: భద్రాచలం వద్ద గోదావరి బిడ్జి పైనుంచి గుర్తు తెలియని వ్యక్తి ఆదివారం నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. గుర్తు తెలియని వ్యక్తి బ్రిడ్జిపై చెప్పులు విడిచి, గోదావరిలో దూకి గల్లంతయ్యాడు. పోలీసులకు సమాచారం అందడంతో టౌన్ ఎస్ఐ రామకృష్ణ ఆధ్వర్యంలో గాలింపు చర్యలు చేపట్టినా రాత్రి వరకు వ్యక్తి ఆచూకీ లభించలేదు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. లేబర్ కోడ్ల రద్దుకు పోరాడుదాం.. ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్యసింగరేణి(కొత్తగూడెం): కార్మిక వ్యతిరేక లేబర్కోడ్ల రద్దు కోసం పోరాడుదామని ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య పిలుపునిచ్చారు. ఆదివారం కొత్తగూడెం పట్టణంలోని ఉర్దుఘర్లో ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా జిల్లా మొదటి మహాసభ ఆర్.మధుసూదన్రెడ్డి అధ్యక్షతన నిర్వహించగా.. నర్సయ్య మాట్లాడారు. దేశంలో, రాష్ట్రంలో కార్మిక వ్యతిరేక పాలన జరుగుతోందని, కేంద్రం, రాష్ట్ర పరిధిలోని పథకాల్లో పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనాలు, చట్టబద్ధ హక్కులు, రిటైర్డ్ కార్మికులకు బెనిఫిట్లు ఇవ్వడం లేదని పేర్కొన్నారు. హక్కుల సాధనకు కార్మికులు ఐక్యంగా పోరాటం చేయాలని సూచించారు. అనంతరం మాస్లైన్ జిల్లా కార్యదర్శి ముద్దా భిక్షం, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సూర్యం మాట్లాడుతూ.. కార్మిక వర్గానికి నాలుగు లేబర్కోడ్లను తీసుకొచ్చి ఎనిమిది గంటల పనిలేకుండా చేయటం సరికాదని మండిపడ్డారు. సభలో గడిపెల్లి కృష్ణప్రసాద్, గోపాల్రావు, పెద్దబోయిన సతీశ్, చంద్రశేఖర్, పాయం వెంకన్న, మల్లెల వెంకటేశ్వర్లు, శేషయ్య, వేల్పుల రమేశ్, గురునాథం, కోరం శాంతయ్య, జరుపుల సుందర్, మల్సూర్, సిద్ధు, రాజేందర్కుమార్, భారతి, వీరన్న తదితరులు పాల్గొన్నారు. తొలుత రైల్వేస్టేషన్ నుంచి ఉర్దూఘర్ వరకు ప్రదర్శన నిర్వహించారు. సభలో సాంస్కతిక కార్యక్రమాలు అలరించాయి. -
వెలవెల..
వాతావరణ ం జిల్లాలో సోమవారం ఉదయం మొదలైన ఎండ మధ్యాహ్నానికి అధికమవుతుంది. రాత్రి వాతావరణం మాత్రం చల్లగా ఉంటుంది.కళకళ.. తళతళ.. 8లోసోమవారం శ్రీ 17 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025చాలా మంది ఇళ్లలో ఆదివారం వస్తే ముక్క లేనిదే ముద్ద దిగడం కష్టమే. అది చికెన్, మటన్ లేదా చేపలు ఏదో ఒకటి స్తోమత ఆధారంగా ఉండాల్సిందే. ఇటీవల కోళ్లకు వైరస్ సోకుతోందనే ప్రచారం జోరందుకున్న నేపథ్యాన జిల్లాలో ఆ ప్రభావం లేదని అధికారులు వెల్లడించారు. అయినప్పటికీ జనాన్ని పట్టిన భయం వీడలేదు. ఇంతలోనే ఆదివారం వచ్చింది. అందరికీ అందుబాటు ధరలో ఉండే చికెన్ తెచ్చుకుందామనుకుంటే వైరస్ భయం పట్టి పీడిస్తోంది. ఫలితంగా చేసేదేం లేక కొందరు మటన్, ఇంకొందరు ఉదయం నుంచే చేపల షాపుల వద్ద బారులుదీరారు. అయితే, మాంసాహార ప్రియులు ఎప్పుడూ లేనంతగా వెల్లువెత్తడంతో ఇదే అదునుగా మటన్ ధర రూ.1200కు పెంచగా.. చేపల ధర సైతం కేజీకి రూ.30కి పైగా పెంచినట్లు తెలిసింది. అయినా ముక్క లేనిదే ఆదివారం భోజనం చేయడం కష్టమైన వారంతా తప్పదనుకుని కొనేశారు ! – ఖమ్మంఅర్బన్/చుంచుపల్లిబర్డ్ఫ్లూ కలకలం చింతకాని మండలం ప్రొద్దుటూరు, లచ్చగూడెం గ్రామాల్లో కోళ్లు మృతి చెందుతుండడంతో బర్డ్ ఫ్లూ నే కారణమని ఆందోళన చెందుతున్నారు. 8లోన్యూస్రీల్ -
పైలట్ ప్రాజెక్ట్గా 31 గ్రామాలు
ఖమ్మం జిల్లాలో 27, భద్రాద్రి జిల్లాలో నాలుగు గ్రామాలను పూర్తి సోలార్ విలేజ్లుగా మార్చేందుకు అధికారులు ఎంపిక చేశారు. ఖమ్మం జిల్లా బోనకల్ మండలంలో 22 గ్రామాలు, నేలకొండపల్లి మండలం చెరువుమాధారం, రఘునాథపాలెం మండల కేంద్రం, మధిర మండలం సిరిపురం, ఏన్కూర్ మండలం లచ్చగూడెం, శ్రీరాంగిరి, భద్రాద్రి జిల్లాలో దమ్మపేట మండలం గండుగులపల్లి, దురదపాడు, కె.ఎం.గూడెం, రెడ్డియాలపాడు గ్రామాలను పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేశారు. ఆయా గ్రామాల్లో ప్రతి ఇంటికి 1 కిలోవాట్ నుంచి 3 కిలోవాట్ల వరకు ఉచితంగా సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నారు. రైతుల పొలాల్లో 5 హెచ్పీ మోటార్కు సోలార్ను ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే ఆయా గ్రామాల్లో అధికారులు సర్వే చేస్తున్నారు. -
రామయ్యకు సువర్ణ పుష్పార్చన
భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామ చంద్రస్వామివారి మూలమూర్తులకు ఆదివారం అభిషేకం, సువర్ణ పుష్పార్చన వైభవంగా నిర్వహించారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి బేడా మండపంలో కొలువుదీరిన స్వామివారికి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు. భక్తులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. నిత్యకల్యాణంలో దంపతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడు...
మధిర: మధిరలోని శాంతి థియేటర్ సమీపంలో శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో దాములూరి రోహన్సాయి (18) మృతి చెందాడు. వివరాలిలా ఉన్నాయి.. ఎనిమిదో వార్డుకు చెందిన రోహన్సాయి, గౌస్పాషా, అశోక్ బైక్పై వెళ్తూ మరో బైక్ను ఢీకొట్టి.. అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టారు. గాయపడిన వారిని ఖమ్మం తరలిస్తుండగా మార్గమధ్యలో రోహన్సాయి మృతిచెందాడు. గౌస్ పాషా ఖమ్మంలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అశోక్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. మరోబైక్పై వెళ్తున్న శ్రీనివాస్కు ప్రాణాపాయం తప్పింది. మధిర టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
శ్రద్ధగా చదువుకుంటున్నాం
పాఠశాలలో ప్రతీ రోజు ఉదయం, సాయంత్రం సమయా ల్లో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. తరగతులు మాకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. మాకు ఉన్న సందేహాలను నివృత్తి చేసుకుంటున్నాం. పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు మా వెన్నంటే ఉండి ప్రోత్సహిస్తున్నారు. ప్రత్యేక తరగతుల్లో శ్రద్ధగా చదువుకొని మంచి ఉత్తీర్ణత సాధిస్తామనే నమ్మకం ఉంది. –డి.హిందు, నాగులవంచ హైస్కూల్, చింతకాని మండలం మంచి మార్కులు సాధిస్తాం పదో తరగతి సిలబస్ను జనవరిలోనే ఉపాధ్యాయు లు పూర్తి చేశారు. ఆ తర్వాత నుంచి ప్రతి నాలుగు పాఠాలు, ఐదు పాఠాలు మాదిరిగా స్పెషల్ టెస్టులు నిర్వహించారు. స్పెషల్ టెస్ట్ల వల్ల పరీక్షల్లో వచ్చే ప్రశ్నలను ముందుగానే అవగాహన చేసుకుని మంచి మార్కులు పొందేందుకు మార్గం దొరికింది. మంచి మార్కులు సాధిస్తామనే నమ్మకం ఉంది. – యువరాజ్, శాంతినగర్ హైస్కూల్, ఖమ్మం నూరు శాతం ఫలితాలు సాధించేలా.. జిల్లాలో పదో తరగతి విద్యార్థులు నూరుశాతం ఫలితాలు సాధించేలా కృషి చేస్తున్నాం. ఇందులో భాగంగా ప్రత్యేక తరగతులను నిర్వహిస్తున్నాం. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక దృష్టి సారించేలా ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు కృషి చేస్తున్నారు. విద్యార్థులకు సైతం పరీక్షలపై భయం పోగొట్టేలా కలెక్టర్ ముజమ్మిల్ఖాన్ అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. – సోమశేఖరశర్మ, డీఈఓ, ఖమ్మం● -
ప్రశాంతంగా ముగిసిన ప్రవేశ పరీక్ష
రఘునాథపాలెం: గిరిజన గురుకుల విద్యాలయాల్లో నీట్ జేఈఈ శిక్షణ కోసం కేటాయించిన కాలేజ్ ఆఫ్ ఎక్స్లెన్స్లో 2025 – 26 విద్యా సంవత్సరానికి మొదటి సంవత్సరంలో ప్రవేశం కోసం నిర్వహించిన పరీక్ష ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. ఎంపీసీ, బైపీసీ కోర్సుల్లో ప్రవేశానికి స్క్రీనింగ్ (ప్రవేశ) పరీక్ష మండల కేంద్రమైన రఘునాథపాలెంలోని గిరిజన గురుకుల ప్రతిభ పాఠశాలలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరిగింది. పరీక్షకు 430 మంది విద్యార్థులకు గాను 412 మంది హాజరయ్యారని ప్రిన్సిపాల్ మల్లెల బాలస్వామి తెలిపారు. పరిశీలకులుగా సింగరేణి గిరిజన గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ హరికృష్ణ వ్యహరించారు. -
●జొన్నరొట్టె.. కొరివి పచ్చడి!
ప్రేమతో ఏది పెట్టినా పరమాన్నమే అంటున్న మంత్రి పొంగులేటిరఘునాథపాలెం: ‘జొన్న రొట్టె.. కొరివి పచ్చడి అంటే నాకు ఎంతో ఇష్టం.. ప్రేమతో ఏది పెట్టినా అది పరమాన్నమే’ అన్నారు రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఆదివారం ఆయన రఘునాథపాలెం మండలం పుటానితండాలో గిరిజన నాయకుడు మూడ్ బాలాజీ కుమార్తె వివాహ రిసెప్షన్ వేడుకకు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు అందించిన జొన్నరొట్టె తింటూ అక్కడి నాయకులతో కాసేపు మాట్లాడారు. మంత్రి వెంట మూడ్ చిన్న, వాంకుడోత్ దీపక్, బోడ శ్రావణ్కుమార్ ఉన్నారు. -
కరకట్టకు బ్రిడ్జి బ్రేక్!
వచ్చే వర్షాకాలంలోనూ తప్పని వరద ముప్పు ఇటీవల కొత్తగూడెం అవతల వేపలగడ్డ గ్రామం వద్ద నిర్మించిన రైల్వే ఓవర్ బ్రిడ్జి తరహాలో శాశ్వత ప్రాతిపదికన నిర్మాణం ఉండాలని జాతీయ రహదారుల శాఖ సూచించినట్లు తెలిసింది. ఆ ప్రకారం అప్రోచ్ రోడ్లు, బ్రిడ్జి, బైపాస్ రోడ్ నిర్మాణాలకు బడ్జెట్ భారీగా పెరిగే అవకాశం ఉంది. కరకట్ట పొడిగింపునకు ప్రభుత్వం కేటాయించిన రూ. 38 కోట్లకు వ్యయం మూడు, నాలుగింతలయ్యే అవకాశం ఉంటుందని ఇరిగేషన్ అఽధికారులు పేర్కొంటున్నారు. దీనిపై ఆడిటింగ్, రాష్ట్ర కమిటీ విజిట్ సర్వేలు, ఇతర పనులు పూర్తయితే తప్ప ఆగిపోయిన పనులు తిరిగి ప్రారంభంకావు. ఈ నేపథ్యంలో రానున్న వర్షాకాలం సీజన్ నాటికీ కరకట్ట పూర్తయ్యే పరిస్థితి కనిపించటం లేదు. దిగువ ప్రాంత కాలనీ వాసులు మళ్లీ గోదావరి వరద ముంపు భయంతో ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి జిల్లా మంత్రులు దృష్టి సారించి పనులు త్వరితగతిన పూర్తయ్యేలా చూడాలని వేడుకుంటున్నారు. భద్రాచలం: భద్రాచలంలో కూనవరం రోడ్డులో నిర్మిస్తున్న కరకట్ట పొడిగింపు పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఇరిగేషన్, జాతీయ రహదారుల శాఖల మధ్య సమన్వయ లోపం, డిజైన్ల మార్పుతో పనులు వేగవంతంగా సాగడంలేదు. ఫలితంగా వచ్చే వర్షాకాలంలో కూడా సుభాష్ నగర్, సీఆర్పీఎఫ్ క్యాంపు పరిసర ప్రాంతాలాలకు గోదావరి వరద ముప్పు తప్పేలా లేదు. రూ.38 కోట్లతో కట్ట పొడిగింపు గోదావరి వరద నుంచి భద్రాచలంలోని ముంపు కాలనీల ప్రజలను రక్షించేందుకు తీరం వెంబడి 2000లో సుమారు 7.5 కిలోమీటర్ల పొడవునా 10 నుంచి 15 మీటర్ల ఎత్తుతో కరకట్ట నిర్మించారు. కూనవరం రోడ్డులో సరస్వతి శిశు మందిర్ వద్ద ఓవర్ బ్రిడ్జి నిర్మించాల్సి ఉండటంతో అక్కడ రోడ్డుకు ఇరువైపులా 700 మీటర్ల దూరం కరకట్ట పనులు ఆగిపోయాయి. అనంతరం ప్రభుత్వాల నిర్లక్ష్యంతో ముందడుగు పడలేదు. మూడేళ్లు నుంచి గోదావరికి భారీ వరదలు రావడంతో కూనవరం రోడ్డు వైపు ఉన్న కాలనీలు పూర్తిగా ముంపునకు గురయ్యాయి. పలుమార్లు విన్నవించాక అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల కోడ్ ముందు 700 మీటర్ల కరకట్ట నిర్మాణానికి రూ. 38 కోట్లు విడుదల చేసింది. అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా పనులు కొనసాగాయి. ఎన్హెచ్పై రోడ్డు బ్రిడ్జి నిర్మాణమే పెద్ద సమస్య? 11 మీటర్ల ఎత్తుతో సాగుతున్న కరకట్ట పొడిగింపు పనులు గత జూన్ నాటికి పూర్తి కావాల్సి ఉంది. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి పలుమార్లు పరిశీలించి త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. కానీ విజయవాడ–జగదల్పూర్ జాతీయ రహదారిపై సరస్వతి శిశు మందిర్వద్ద ఓవర్ బ్రిడ్జి నిర్మించాల్సి ఉండటంతో నెల రోజుల నుంచి పనులు పూర్తిగా నిలిచిపోయాయి. పనులను ఇరిగేషన్ శాఖ పర్యవేక్షిస్తుండగా, ఓవర్ బ్రిడ్జి, ఇరువైపులా అప్రోచ్ రోడ్, రిటైనింగ్ వాల్ నిర్మాణాలు పటిష్టగా చేపట్టాలని జాతీయ రహదారుల శాఖ సూచించింది. ఈ క్రమంలో రెండు శాఖల మధ్య డిజైన్ల మార్పులపై సంప్రదింపులు, సర్వేలు సాగుతూనే ఉన్నాయి. ఇటీవల ఎన్హెచ్ అధికారులు ప్రాథమికంగా అనుమతి ఇవ్వగా, బ్రిడ్జి నిర్మాణ ప్రాంతంలో మట్టి శాంపిల్స్ను సేకరించి హైదరాబాద్ ల్యాబ్కు పంపారు. ఆ మట్టి సాంద్రత నివేదిక వచ్చాకే బేస్మెంట్, కరకట్ట ఎత్తు నిర్ధారించాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. నిలిచిన గోదావరి కరకట్ట పొడిగింపు నిర్మాణ పనులు జాతీయ రహదారిపై ఓవర్ బ్రిడ్జి నిర్మాణం ఆవశ్యం భారీగా పెరగనున్న నిర్మాణ అంచనా వ్యయం ఈ ఏడాది జూన్ నాటికీ పనులు పూర్తి కావడం కష్టమేనివేదిక వచ్చాకే... బ్రిడ్జి నిర్మాణ ప్రాంతంలో మట్టి శాంపిల్స్ సేకరించి పరీక్షలకు పంపాం. ఆ రిపోర్టులు అందాల్సి ఉంది. నిర్మాణ డిజైన్, బడ్జెట్ ప్రతిపాదనలను ప్రభుత్వం ముందుంచాం. గోదావరి వరదల నుంచి దిగువ ప్రాంత ప్రజలకు శాశ్వత రక్షణ ఉండేలా పనులు చేపడతాం. ప్రభుత్వం నుంచి ఇతర అనుమతులు రాగానే పనులు తిరిగి ప్రారంభమవుతాయి. – రాంప్రసాద్, ఈఈ, ఇరిగేషన్ శాఖ భద్రాచలం -
ట్రాక్టర్ ఢీకొని దంపతుల దుర్మరణం
మృతులు దుమ్ముగూడెం వాసులు ఎటపాక (అల్లూరిజిల్లా): మండలంలోని నవోదయ పాఠశాల సమీపంలో జామాయిల్ కర్రలోడు ట్రాక్టర్ ఢీకొని దంపతులు దుర్మరణం చెందిన ఘటన ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. సీఐ కన్నపరాజు కథనం ప్రకారం.. తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలంలోని మారాయిగూడెం పంచాయతీ భీమవరం గ్రామానికి చెందిన సోయం రాంబాబు(45), ముత్యాలమ్మ (40) ద్విచక్రవాహనంపై భద్రాచలం వచ్చారు. పని ముగించుకుని ఎటపాక మండలం బొజ్జిగుప్ప గ్రామం మీదుగా స్వగ్రామానికి వస్తున్నారు. జామాయిల్ కర్రలోడుతో ట్రాక్టర్ భద్రాచలం వస్తోంది. సింగిల్రోడ్డు కావడంతో వారు నవోదయ పాఠశాల సమీపంలో ట్రాక్టర్ను దాటి వెళ్లేక్రమంలో కర్ర ద్విచక్రవాహనానికి తగలడంతో దంపతులు కిందపడి తీవ్రంగా గాయపడ్డారు. వారిని 108 ద్వారా భద్రాచలం ఏరియా ఆస్పత్రికికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
నిల్వ చేసిన ఇసుక సీజ్
మధిర: మండలంలోని మహదేవపురం గ్రామంలోని ఓవర్ హెడ్ ట్యాంకు వద్ద అక్రమంగా నిల్వ ఉంచిన ఇసుకను ఆదివారం తహసీల్దార్ రాళ్లబండి రాంబాబు సీజ్ చేశారు. అనుమతి లేని మహదేవపురం ఇసుక రేవు నుంచి కొంతమంది అక్రమంగా ఇసుకను తరలించి నిల్వ చేస్తున్నట్లు రెవెన్యూ అధికారుల దృష్టికి వచ్చింది. దీంతో తహసీల్దార్ రాంబాబు విచారణ నిర్వహించి నిల్వ చేసిన ఇసుకకు బౌండరీ గీసి సీజ్ చేసినట్లు తెలిపారు. లారీ, బైక్ ఢీ.. ఒకిరికి గాయాలు కొణిజర్ల: కంటైనర్, ద్విచక్రవాహనం ఢీకొని ఓ వ్యక్తి గాయపడిన ఘటన ఆదివారం మండలంలోని తనికెళ్ల సమీపంలో చోటుచేసుకుంది. చింతకాని మండలం రామకృష్ణాపురం గ్రామానికి చెందిన చర్లపల్లి వెంకటేశ్ ఖమ్మంలో పనిచేస్తున్నాడు. ఆదివారం తన అత్తగారి ఇంటికి (కొణిజర్ల) వచ్చి భోజనం చేసి తిరిగి తన ద్విచక్ర వాహనంపై ఖమ్మం వెళ్తుండగా తనికెళ్ల చివరన రాజస్తానీ దాబాలోకి వెళ్లేందుకు మళ్లుతున్న కంటైనర్ లారీ వెనక వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వెంకటేశ్కు తీవ్ర గాయాలయ్యాయి. ద్విచక్రవాహనం లారీ కింద పడి నుజ్జునుజ్జయింది. వెంకటేశ్ను స్థానికులు ఖమ్మం తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రోడ్డు ప్రమాదంలో ఒకరికి...చండ్రుగొండ: మండలంలోని గానుగపాడు వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరికి గాయాలయ్యా యి. వివరాలిలా ఉన్నాయి.. జూలూరుపాడు మండలంలోని పడమటనర్సాపురం గ్రామానికి చెందిన కట్రం నర్సింహారావు, ఇనగంటి మురళి ద్విచక్రవాహనంపై చండ్రుగొండకు వచ్చి తిరిగి వెళ్తున్నారు. మార్గమధ్యలో గానుగపాడు వద్ద ద్విచక్రవాహనం అదుపుతప్పి పడిపోయింది. గాయపడిన మురళిని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. విద్యుదాఘాతంతో బాలికకు... అశ్వారావుపేటరూరల్: విద్యుదాఘాతంతో ఓ బాలికకు తీవ్ర గాయాలు కాగా, పరిస్థితి విషమంగా మారింది. స్థానికుల కథనం ప్రకారం.. మండలంలోని ఊట్లపల్లి కి చెందిన 13ఏళ్ల కేతా లాస్య ఆదివారం సాయంత్రం బట్టలు ఆరేసేందుకు బిల్డింగ్పైకి వెళ్లింది. తడి బట్టలు ఆరేసే క్రమంలో 33 కేవీ విద్యుత్ వైర్లు తగిలి విద్యుదాఘాతానికి గురి కాగా, తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన కుటుంబీకులు బాలికను అశ్వారావుపేట ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం ఖమ్మం తరలించగా, బాలిక పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెప్పారు. -
ఇక సౌర వెలుగులు..
● ఉమ్మడి జిల్లాలో 280 మెగావాట్ల ప్లాంట్ల ఏర్పాటుకు సన్నాహాలు ● పీఎం కుసుమ్ పథకం కింద దరఖాస్తుల స్వీకరణ ● ఉమ్మడి జిల్లాలో 15 మెగావాట్లకు అందిన తొమ్మిది అప్లికేషన్లు ● మోడల్ గ్రామాల్లో కొనసాగుతున్న సర్వే ఖమ్మంమయూరిసెంటర్: జిల్లాలో సౌర వెలుగులు నింపేందుకు అడుగులు ముందుకు పడుతున్నాయి. ప్రధానమంత్రి కిసాన్ ఉర్జా సురక్షా ఏవం ఉత్థాన్ మహాభియాన్ (పీఎం–కుసుమ్) పథకం కింద సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు చర్యలు వేగవంతం అవుతున్నాయి. సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు ఆసక్తి గల రైతులు, రైతు సంఘాలు, సహకార సంఘాలు, పంచాయతీలు, ఎస్హెచ్జీల నుంచి తెలంగాణ పునరుత్పాదక ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ (టీఎస్ రెడ్కో) అధికారులు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఇందు కోసం ప్రత్యేక వెబ్సైట్ రూపొందించి ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో ఈ పథకంపై విస్తృత ప్రచారం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో 280 మెగావాట్ల ప్లాంట్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యం నిర్దేశించగా.. ఇందులో 200 మెగావాట్ల ప్లాంట్లను రైతులు, రైతు సంఘాలు, డెవలపర్స్తో ఏర్పాటు చేయించాలని నిర్ణయించారు. మరో 80 మెగావాట్ల ప్లాంట్లను స్వయం సహాయక సంఘాలకు కేటాయించనున్నారు. వీటితో పాటు ఉమ్మడి జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్ కింద 31 గ్రామాలను సోలార్ మోడల్ విలేజ్లుగా ఎంపిక చేశారు. ఇప్పటివరకు పీఎం కుసుమ్ పథకం కింద ఉమ్మడి జిల్లాలో 15 మెగావాట్ల ప్లాంట్ల ఏర్పాటుకు తొమ్మిది దరఖాస్తులు అందాయని అధికారులు వెల్లడించారు. ఈనెల 22వ తేదీ వరకు అవకాశం ఉన్నందున ఈ సంఖ్య పెరుగుతుందని భావిస్తున్నారు. ఎస్హెచ్జీలకు 90శాతం రుణాలు.. సౌర విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు ఒక మెగావాట్కు రూ.2.97 కోట్ల వ్యయం అవుతుందని రెడ్కో అంచనా వేసింది. ఎస్హెచ్జీలు 10 శాతం వాటా భరిస్తే, మిగిలిన 90 శాతాన్ని బ్యాంకులు రుణంగా ఇవ్వనున్నాయి. అంటే, మెగావాట్ ప్లాంటు ఏర్పాటుకు ఎస్హెచ్జీలు రూ.29.70 లక్షలు పెట్టుబడి పెడితే, బ్యాంకులు రూ.2.61 కోట్లు రుణంగా ఇవ్వనున్నాయి. ప్లాంట్ల ఏర్పాటుకు ఎస్హెచ్జీలకు ప్రభుత్వ, అటవీ, దేవాదాయ భూములను ప్రభుత్వం లీజుకు ఇవ్వనుంది. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్) ఆధ్వర్యంలో అత్యుత్తమ పనితీరు కలిగిన సంఘాలను ఎంపిక చేస్తున్నారు. రైతులైతే 30 శాతం పెట్టుబడి పెడితే 70 శాతం మూలధనాన్ని బ్యాంకులు రుణంగా ఇవ్వనున్నాయి. ఈ ప్లాంట్ల ఏర్పాటుకు 6 శాతం వడ్డీకే రూ.2 కోట్ల వరకు రుణం ఇచ్చేందుకు బ్యాంకులు ముందుకొస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. మహిళా సంఘాల ఎంపిక చివరి దశకు ఉమ్మడి జిల్లాలో 80 మెగావాట్ల ప్లాంట్ల ఏర్పాటుకు ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వగా.. అధికారులు స్థలాల పరిశీలన, సంఘాల ఎంపిక చేపట్టారు. తొలుత ఖమ్మం జిల్లాలో రెండు, భద్రాద్రి జిల్లాలో రెండు యూనిట్ల ఏర్పాటుకు సంఘాలను ఎంపిక చేయాలని ప్రభుత్వం ఆదేశించినట్లు తెలిసింది. మహిళా దినోత్సవమైన మార్చి 8న ప్లాంట్లకు శంకుస్థాపన చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం. దీంతో ఖమ్మం జిల్లాలోని ఏన్కూరు, మధిర, కల్లూరు, పెనుబల్లి, రేలకాయలపల్లి ప్రాంతాలను, భద్రాద్రి జిల్లాలో సుజాతనగర్, బైరాగులపాడు (దుమ్మగూడెం మండలం) ప్రాంతాలను సర్వే చేసి సెర్ప్ అధికారులకు నివేదిక పంపించారు. ఖమ్మం జిల్లాలో రెండు యూనిట్ల ఏర్పాటుకు స్థలాన్ని ఖరారు చేయాల్సి ఉంది.ఆసక్తి పెరుగుతోంది.. ఉమ్మడి జిల్లాలో సోలార్ విద్యుత్ వినియోగానికి ప్రజల్లో ఆసక్తి కనిపిస్తోంది. ఇళ్లపై సోలార్ ప్యానల్ ఏర్పాటుకు పలువురు దరఖాస్తు చేస్తున్నారు. రైతులు, డెవలపర్లు, మహిళా సంఘాల వారి నుంచి అప్లికేషన్లు అందాయి. మోడల్ గ్రామాల్లో సర్వే పూర్తి చేస్తున్నాం. వీలైనన్ని ఎక్కువ సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నాం. ఆసక్తి ఉన్నవారు 63049 03919 నంబర్లో సంప్రదించవచ్చు. – పొలిశెట్టి అజయ్కుమార్, డీఎం, టీఎస్ రెడ్కో, ఖమ్మంసొంత భూముల్లో విద్యుదుత్పత్తి.. సొంత భూములు కలిగిన రైతులు, డెవలపర్లు, రైతు సంఘాలు, ఇతర సంస్థలు ఆసక్తి చూపితే వారితో 0.5 మెగావాట్ నుంచి 2 మెగావాట్ల సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేయించేందుకు చర్యలు చేపట్టారు. ఖమ్మం జిల్లాలో 100 మెగావాట్లు, భద్రాద్రి జిల్లాలో 100 మెగావాట్ల ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఆర్థిక స్తోమత లేకుంటే డెవలపర్లకు తమ భూములను లీజుకు ఇచ్చి ప్లాంటు పెట్టించుకోవచ్చని రైతులకు సూచిస్తున్నారు. ఒక మెగావాట్ సౌర విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు నాలుగెకరాల స్థలం అవసరం. ఈ ప్లాంట్లు ఉత్పత్తి చేసి విద్యుత్ను రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు 25 ఏళ్ల పాటు కొనుగోలు చేస్తామని హామీ ఇస్తూ ఒప్పందం చేసుకోనున్నాయి. రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) నిర్ణయించిన ధర ప్రకారం యూనిట్ విద్యుత్కు రూ.3.13 చొప్పున రైతులు, ఎస్హెచ్జీలకు డిస్కంలు చెల్లిస్తాయి. ఒక మెగావాట్ సౌర విద్యుత్ ప్లాంట్ ద్వారా ఏటా సగటున 16 లక్షల యూనిట్ల వరకు విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ప్లాంట్లు ఏర్పాటు చేసేవారికి రూ.45 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేశారు. -
చింతకానిలో బర్డ్ఫ్లూ కలకలం
చింతకాని: మండలంలోని ప్రొద్దుటూరు, లచ్చగూడెం గ్రామాల్లో బర్డ్ఫ్లూ వైరస్తో కోళ్ల ఫారంలోని వందలాది కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. గ్రామాల్లో ఏర్పాటు చేసుకున్న కోళ్ల ఫారంలలో పెంచుతున్న కోళ్లు బర్డ్ఫ్లూ వైరస్ సోకి రోజూ సుమారు 700 కోళ్లు మృతి చెందుతున్నాయని ఫారం నిర్వాహకులు ఉమ్మనేని లక్ష్మయ్య, అప్పన రమేశ్, సురేశ్ తెలిపారు. పశుసంవర్థక శాఖాధికారులకు చెప్పినా పట్టించుకోవటం లేదని వాపోయారు. ఆదివారం వారు విలేకరులతో మాట్లాడారు. బ్యాంక్లో రుణాలు తీసుకుని కోళ్ల ఫారంలను నిర్వహిస్తున్నామని, బర్డ్ఫ్లూ వైరస్తో ఫారంలోని కోళ్లు చనిపోతుండటంతో లక్షల్లో నష్టం వాటిల్లితుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా పశుసంవర్థకశాఖ అధికారులు పరీక్షలు నిర్వహించి వైరస్ను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. మృత్యువాత పడుతున్న కోళ్లు