breaking news
Khammam
-
●నా బిడ్డలకు భవిష్యత్ ఇవ్వండి..
ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా దుగ్గిరాలపాడుకు చెందిన గోపమ్మ తన ఇద్దరు పిల్లలతో కలిసి సోమవారం ఖమ్మం కలెక్టరేట్లో ప్రజావాణికి వచ్చింది. ఆమెకు చింతకాని మండలం ప్రొద్దుటూరు వాసితో వివాహం జరగగా.. ఆరేళ్ల నుంచి గోపమ్మ, పిల్లలను భర్త పట్టించుకోవడం లేదు. పిల్లల పేరిట రెండెకరాల భూమి రాస్తామని చెప్పిన భర్త, కుటుంబీకులు ఇప్పుడు అమ్మకానికి యత్నిస్తుండడంతో ఆమె కోర్టును ఆశ్రయించింది. భూమి అమ్మకుండా అడ్డుకోవాలని కోరడమే కాక పిల్లలకు వారసత్వ పట్టా అయ్యేలా చూడాలని కలెక్టరేట్లో అధికారులకు విన్నవించింది. ప్రజావాణి ప్రారంభం కాకుముందే వచ్చిన ఆమె పిల్లలను టిఫిన్ చేయిస్తుండగా వివరాలు ఆరా తీయడంతో తన గోడు వెళ్లబోసుకుంది. – స్టాఫ్ ఫొటోగ్రాఫర్ -
రెండు మండలాల్లో భారీ వర్షం
తిరుమలాయపాలెం/కూసుమంచి: తిరుమలాయపాలెం మండల వ్యాప్తంగా ఆదివారం రాత్రి భారీ వర్షం కురిసింది. అర్ధరాత్రి సమయాన రెండున్నర గంటల పాటు వర్షం దంచికొట్టగా రికార్డు స్థాయిలో 8.5 సెం.మీ.గా వర్షపాతం నమోదైంది. ఇప్పటికే భక్తరామదాసు ప్రాజెక్టు నుంచి చెరువులకు నీరు వదలగా ఈ వర్షంతో బీరోలు, జూపెడ, హస్నాబాద్, ఎదుళ్లచెరువు, బచ్చోడు తదితర గ్రామాల చెరువుల్లోకిభారీగా వరద చేరి అలుగు పోశాయి. పలుచోట్ల వరి పొలాలు, పత్తి చేన్లు కోతకు గురవడమే కాక ఇసుక మేటలు వేశాయి. ఇక కూసుమంచి మండలంలోనూ వర్షంతో నర్సింహులగూడెం – కొత్తూరు, నర్సింహులగూడెం – కిష్టాపురం మధ్య వాగు వరద రోడ్లపైకి చేరి రాకపోకలు స్తంభించాయి. అంతేకాక తురకగూడెంవద్ద కూసుమంచి వెళ్లే బీటీ రహదారి కోతకు గురవగా, పత్తి చేన్లలో ఇసుక మేటలు వేసింది.తిరుమలాయపాలెం రికార్డు స్థాయిలో 8.5 సెం.మీ.గా నమోదు -
ఇక్కడి నుంచే రాజకీయ మార్పునకు పునాది
ఖమ్మంమామిళ్లగూడెం: తెలంగాణ రాజకీయ సమీకరణాల్లో ఖమ్మం కేంద్రబిందువుగా మారిందని, ఇక్కడే రాజకీయ మార్పునకు పునాది పడనుందని బీజేపీ రాష్ట్ర నాయకుడు, స్థానిక సంస్థల ఎన్నికల జిల్లా ఇన్చార్జి ఇనుగాల పెద్దిరెడ్డి పేర్కొన్నారు. ఖమ్మంలో సోమవారం ‘మహా సంపర్క్ అభియాన్’ పేరిట పార్టీ శ్రేణులతో సమావేశమైన ఆయన ఆతర్వాత విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఖమ్మం జిల్లా ఇప్పుడు ప్రధాని మోదీ నాయకత్వంలోని బీజేపీకి శక్తిని అందించనుందని తెలి పారు. జిల్లాలో రాజకీయ వాతావరణం మారుతూ, ప్రజలంతా మార్పు వైపు మొగ్గు చూపుతున్నందున స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటేలా బూత్ స్థాయిలో ప్రచారం నిర్వహిస్తామని వెల్లడించారు. బీఆర్ఎస్లో కుటుంబ కలహాలతో అలజడి నెలకొనగా, కాంగ్రెస్ ప్రభుత్వంలో శూన్యతను ప్రజలు గుర్తించారని తెలిపారు. బీజేపీ జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు మాట్లాడుతూ జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. ఈ సమావేశంలో నాయకులు దేవకీ వాసుదేవరావు, ఈ.వీ.రమేష్, నున్న రవికుమార్, పుల్లారావు యాదవ్, దొంగల సత్యనారాయణ, నంబూరి రామలింగేశ్వరరావు, అల్లిక అంజయ్య, జ్వాలా నర్సింహారావు, గడిల నరేష్, ధనియాకుల వెంకటనారాయణ యాదవ్ పాల్గొన్నారు. బీజేపీ రాష్ట్ర నాయకుడు ఇనుగాల పెద్దిరెడ్డి -
అన్నదమ్ముల మృతదేహాలు లభ్యం
చింతకాని: మండలంలోని నాగులవంచ రెడ్డిచెరువులో గల్లంతైన అన్నదమ్ములు మత్స్యకారులు కంభం నాగేశ్వరరావు(62), సత్యం(58) మృతదేహాలు సోమవారం ఉదయం లభ్యమయ్యాయి. గత 35ఏళ్లుగా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం సభ్యులుగా కొనసాగుతున్న వారికి ఈత కొట్టడంలో నైపుణ్యం ఉన్నా చెరువులో మునిగి మృతి చెందడంపై అనుమానాలు ఉన్నాయని కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు... మత్స్యకారుడైన కంభం నాగేశ్వరరావు గ్రామంలోని రెడ్డిచెరువును ఏటా రూ.4లక్షల చొప్పున సభ్యులకు చెల్లించేలా రెండేళ్ల కాలానికి లీజ్ తీసుకుని చేపల పెంచుతున్నాడు. రోజులాగే ఆయన ఆదివారం మధ్యాహ్నం తన తమ్ముడు సత్యంతో కలిసి ద్విచక్ర వాహనంపై చెరువు వద్దకు వెళ్లారు. కట్టపై ద్విచక్ర వాహనం పెట్టి అక్కడే బట్టలు, చెప్పులు విడిచి చెరువులోకి దిగిన అన్నదమ్ములు గల్లంతయ్యారు. రాత్రి వరకు వారు రాకపోవడం, సెల్ఫోన్లు స్విచాఫ్ ఉండడంతో కుటుంబీకులు పరిశీలించగా కట్టపై బైక్, దుస్తులు, చెప్పులు ఉండడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఎస్సై నాగుల్మీరా ఆధ్వర్యాన గాలించినా ఆచూకీ తెలియరాక చీకటి పడడంతో గాలింపు నిలిపివేశారు. తిరిగి సోమవారం ఉదయం గాలిస్తుండగా పాతర్లపాడు చెరువు నుంచి నీళ్లు రెడ్డి చెరువులో కలిసే ప్రాంతంలో నాగేశ్వరరావు, సత్యం మృతదేహాలు లభ్యమయ్యాయి. కాగా, గాలింపు చర్యలను వైరా సీఐ సాగర్ పర్యవేక్షించారు. కాగా, ఒకే ఘటనలో అన్నదమ్ములిద్దరి మృతితో కుటుంబంతో పాటు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆర్థికపరమైన విబేధాలు నాగేశ్వరరావు, సత్యం మృతిపై కుటుంబసభ్యులు అనుమానాలు వ్యక్తం చేశారు. రెడ్డి చెరువును నాగేశ్వరరావు సంఘ సభ్యులందరి సమ్మతితో లీజ్కు తీసుకోగా, సంఘంలో సభ్యుల మధ్య విభేదాల కారణంగా ముగ్గురు వ్యతిరేకించారు. దీంతో ఆ ముగ్గురు చెరువులో నాగేశ్వరరావు అమర్చిన వలలు తొలగించేందుకు ఆదివారం ఉదయం మరో ముగ్గురితో కలిసి వెళ్లినట్లు సమాచారం. ఈమేరకు నాగేశ్వరరావు, సత్యం వెళ్లడం ఆ తర్వాత గల్లంతవడంతో ఆరుగురిపైనే అనుమానం ఉందని కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, అన్నదమ్ముల మృతిపై నాగేశ్వరరావు కుమారుడు వెంకటేశ్వర్లు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని ఎస్సై నాగుల్మీరా తెలిపారు.ఘటనపై అనుమానాలతో కుటుంబీకుల ఫిర్యాదు -
టీఏల అసోసియేషన్ రాష్ట్ర కమిటీలో స్థానం
మధిర: ఉపాధి హామీ పథకం టెక్నికల్ అసిస్టెంట్ల రాష్ట్ర కమిటీని యాదగిరిగుట్టలో ఆదివారం ఎన్నుకున్నారు. ఈ మేరకు కమిటీలో జిల్లా నుంచి పలువురు టెక్నికల్ అసిస్టెంట్లకు స్థానం దక్కింది. రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా మేరుగు శ్రీని వాసరావు(పెనుబల్లి), ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఆవుల సంతోష్కుమార్, జాయింట్ సెక్రటరీగా మద్దాల శ్రీనివాస్, కార్యవర్గ సభ్యురాలిగా ఏ.సౌజన్య ఎన్నికయ్యారు. వీరిని జిల్లా అధ్యక్షుడు పగిడిపల్లి మనోహర్రావు, గౌరవ అధ్యక్షుడు షేక్ నజీర్, కోశాధికారి ఆదుర్తి రమేష్కుమార్ తదితరులు అభినందించారు. నేటి నుంచి రాజీవ్ ట్రోఫీఖమ్మం స్పోర్ట్స్: రాజీవ్ స్మారక అండర్–12, 14, 16 క్రికెట్పోటీలు మంగళవారం ప్రారంభం కాను న్నాయి. అండర్–12 ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలో, అండర్–14 కొత్తగూడెంలో, అండర్– 16 బాలుర క్రికెట్ పోటీలు కల్లూరు మినీ స్టేడియంలో నిర్వహిస్తామని టోర్నీ ఆర్గనైజింగ్ కార్యదర్శి ఎం.డీ.మతిన్ తెలిపారు. ఇప్పటికే పలు జట్ల బాధ్యులు పేర్లు నమోదు చేసుకోగా, ప్రైవేట్ పాఠశాలల ఆధ్వర్యాన టోర్నీ నిర్వహణకు ఏర్పా ట్లు చేశామని వెల్లడించారు. 10న ఉమ్మడి జిల్లా టీ.టీ. జట్ల ఎంపికఖమ్మం స్పోర్ట్స్: ఉమ్మడి జిల్లా స్థాయి టేబుల్ టెన్నిస్ జట్ల ఎంపిక పోటీలు ఈనెల 10 తేదీన ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలో నిర్వహించనున్నట్లు టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ ఉమ్మ డి జిల్లా అధ్యక్షుడు బాలసాని విజయ్ తెలి పారు. 11 – 19 ఏళ్ల వయసు కలిగిన బాలబాలికలతో పాటు ఓపెన్ విభాగంలో పురుషులు, మహిళల జట్లను ఎంపిక చేయనున్నట్లు వెల్లడించారు. ఖమ్మంలో జరిగే రాష్ట్రస్థాయి టేబుల్ టెన్నిస్ ర్యాంకింగ్ పోటీల్లో పాల్గొనేందుకు జట్లను ఎంపిక చేయనుండగా ఆసక్తి ఉన్న క్రీడాకారులు ఈనెల 10న ఉదయం 9గంటలకు జనన ధ్రువీకరణ పత్రంతో పాటు ఒక పాస్పోర్టు సైజు ఫొటోతో పటేల్ స్టేడియంలో రిపోర్ట్ చేయాలని సూచించారు. వివరాలకు కార్యదర్శి 98484 08335 నంబర్లో సంప్రదించాలని విజయ్ తెలిపారు. ఇన్స్ట్రక్టర్ కుటుంబానికి రూ.1.88లక్షల ఆర్థికసాయంతల్లాడ: మండలంలోని రామచంద్రాపురానికి చెందిన యోగా ఇన్స్ట్రక్టర్ కందుల శ్రీదేవి ఇటీవల డెంగీతో మృతి చెందింది. ఈమేరకు తెలంగాణ యోగా టీచర్ల కోఆర్డినేషన్ కమిటీ ఆధ్వర్యాన సేకరించిన రూ.1.88లక్షలను ఆమె కుమార్తె చదువుకు సోమవారం అందజేశారు. ఇన్స్ట్రక్టర్లు, యోగా కోఆర్డినేషన్ కమిటీ మహిళా సభ్యులు, యోగా సంస్థల నుంచి ఈ నగదు సేకరించినట్లు తెలిపారు. డాక్టర్ సత్యరెడ్డి, రవికుమార్, బాహర్ అలీ, వెంకటేశ్వర్లు, పద్మావతి, ఝాన్సీ, లక్ష్మి, సత్యనారాయణ, శ్రీకాంత్, కొండల్రావు, అజ్మీరా నాగేశ్వర్రావు పాల్గొన్నారు. 17మంది వైద్యుల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఖమ్మంవైద్యవిభాగం: జిల్లాలోని వైద్య విధాన పరిషత్ ఆస్పత్రుల్లో కాంట్రాక్ట్ పద్ధతిపై 17 మంది వైద్యులను నియమించనున్నట్లు జిల్లా ఆస్పత్రుల సమన్వయ అధికారి డాక్టర్ కె.రాజశేఖర్గౌడ్ తెలిపారు. ఆరుగురు గైనకాలజిస్ట్లు, ముగ్గు రు అనస్తీషియన్లు, ఇద్దరు చొప్పున ఆఫ్తాల్మిక్, పీడియాట్రిక్ వైద్యులతో పాటు ఈఎన్టీ, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, డ్యూటీ మెడికల్ ఆఫీసర్ విభాగాల్లో ఒక్కో పోస్టు ఉందని వెల్లడించారు. అర్హులైన వైద్యులు ఒరిజినల్ సర్టిఫికెట్లు, రెండు సెట్ల అటెస్టెడ్ జిరాక్స్లతో పాటు రెండు ఫొటోలతో ఈనెల 6న ఉదయం కలెక్టరేట్లోని డీసీహెచ్ఎస్ కార్యాలయంలో నిర్వహించే ఇంటర్వ్యూకు హాజరుకావాలని సూచించారు. -
రోడ్డుప్రమాదంలో యువకుడు మృతి
కొణిజర్ల: ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, కారు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో కారు నడుపుతున్న యువకుడు మృతి చెందిన ఘటన కొణిజర్ల మండలం పల్లిపాడు సమీపాన ఆదివారం అర్ధరాత్రి దాటాక జరిగింది. వైరాకు చెందిన రాయల కల్యాణ్(19) కొణిజర్ల మండలం చిన్నమునగాలలో అమ్మమ్మ, తాతయ్య వద్ద ఉంటూ పల్లిపాడు సమీపాన కారు గ్యారేజ్లో పని చేస్తున్నాడు. ఆదివారం అర్ధరాత్రి ఆయన గ్యారేజ్ నుంచి కారులో పల్లిపాడు వైపు వెళ్తుండగా రైస్ మిల్లు సమీపాన భద్రాచలం నుంచి హైదరాబాద్ వెళ్తున్న ట్రావెల్స్ బస్సు ఎదురుగా ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు ముందు భాగం నుజ్జునుజ్జవడంతో తీవ్రంగా గాయపడిన కల్యాణ్ అక్కడికక్కడే మృతి చెందాడు. కల్యాణ్ తాత తిగుళ్ల కోటేశ్వరరావు ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ జి.సూరజ్ తెలిపారు. కాగా, ఎదురెదురుగా ఢీకొన్న కారు, బస్సు రోడ్డు మధ్యలో నిలిచిపోవడంతో ఖమ్మం – వైరా రహదారిపై ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో పోలీసులు బస్సును జేసీబీ సాయంతో వాహనాలను పక్కకు తొలగించి రాకపోకలను క్రమబద్ధీకరించారు.ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన లారీ● భద్రాద్రి జిల్లా వాసి మృతి కొణిజర్ల: ద్విచక్రవాహనాన్ని వెనక నుంచి లారీ ఢీకొట్టిన ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. కొణిజర్ల ఎస్ఐ జి.సూరజ్ వెల్లడించిన వివరాలు... భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం మామిడి గుండాలకు చెందిన ముక్తి భూపతి(38) ఓ ప్రైవేట్ బీమా కంపెనీలో పనిచేస్తున్నాడు. వైరాలో మార్కెటింగ్ ఏజెంట్ల శిక్షణ సోమవారం జరగగా ఆయన హాజరై తిరిగి ఇంటికి ద్విచక్రవాహనంపై బయలుదేరాడు. మార్గమధ్యలో కొణిజర్ల ఎంపీడీఓ కార్యాలయం సమీపాన ఆయన బైక్ను వెనక నుంచి కంటైనర్ లారీ ఢీకొట్టడమే కాక టైరు భూపతి పైనుంచి వెళ్లడంతో తీవ్ర గాయాల పాలై ఘటనాస్థలిలోనే మృతి చెందాడు. మృతుడికి భార్య తులసి, ఇద్దరు కూతుళ్లు, ఓ కుమారుడు ఉన్నారు. భూపతి సోదరుడు విజయ్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. -
సంక్షోభంలో లారీల యాజమాన్యాలు
సత్తుపల్లి: సత్తుపల్లికి చెందిన లారీల యాజమాన్యాలు సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయి. ఉమ్మడి జిల్లాలోనే ఇక్కడ ఎక్కువ సంఖ్యలో లారీలు ఉండగా.. వేలాది మందికి ఉపాధి లభిస్తోంది. సత్తుపల్లి కేంద్రంగా బొగ్గు రవాణాపై యాజమానులు, డ్రైవ ర్లు, క్లీనర్ల కుటుంబాలు జీవనం సాగిస్తుండగా.. ప్రస్తుతం లోడింగ్ లేక వేలాది కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఎదురవుతోంది. ఫైనాన్స్ సంస్థల ఒత్తిడి.. ఏడాది క్రితం వరకు 650 బాడీ లారీలు, 100 టిప్పర్లతో కలిపి 750 లారీలు ఉండేవి. ఇప్పుడు ఆ సంఖ్య 450కు పడిపోయింది. లారీలకు బొగ్గు లోడింగ్ ఇవ్వకుండా ఆర్సీహెచ్పీ(రుద్రంపూర్ కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్)కు రవాణా చేస్తుండడంతో వారి ఉపాధిపై దెబ్బపడుతోంది. ఫైనాన్స్ కిస్తీలు, ట్యాక్స్లు కట్టలేక లారీ యజమానులు దిగులుతో మృతి చెందిన ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. ఇదే సమయాన ఫైనాన్స్ సంస్థల ఒత్తిడి పెరగడంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితి ఎదుర్కొంటున్నారు. కొందరైతే ఉన్న ఇళ్లను అమ్మేసి లారీల ఫైనాన్స్ చెల్లించాక ఆ లారీలను అమ్ముకుని జీవనోపాధి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు. లోడింగ్ను అడ్డుకుని.. బొగ్గునిల్వలు పేరుకుపోవడం, నిప్పు అంటుకుంటుందనే కారణంతో 1.50 లక్షల టన్నుల బొగ్గును రుద్రంపూర్ కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్(ఆర్సీహెచ్పీ)కు తరలించేందుకు గతేడాది మే 24న తాత్కాలికంగా అనుమతి ఇచ్చారు. కానీ ఆ రవాణా నేటికీ ఆగడం లేదు. రోజుకు 10వేల టన్నులు రవాణా జరుగుతుండగా.. మూడు నెలల్లో ఆర్సీహెచ్పీకి పూర్తికావాల్సిన రవాణాను పొడిగిస్తుండడంతో స్థానిక లారీలకు లోడింగ్ దక్కడం లేదు. దీంతో యజమానులు మూడు రోజులుగా రవాణాను అడ్డుకుంటూ ఆందోళన చేపడుతున్నారు. అయినా ఫలితం లేకపోగా, సోమవారం చర్చలు జరిపినట్లు తెలిసినప్పటికీ ఫలితం రాలేదని సమాచారం. ఆర్సీహెచ్పీకు బొగ్గు రవాణా అడ్డగింత మూడు రోజులుగా కొనసాగుతున్న ఆందోళన -
సర్టిఫికెట్ల పరిశీలన ప్రారంభం
ఖమ్మం సహకారనగర్: జిల్లాలో స్కూల్ అసిస్టెంట్లకు గ్రేడ్–2 హెచ్ఎంలుగా పదోన్నతి ఇచ్చే ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే సీనియారిటీ ఆధారంగా జాబితా విడుదల చేయగా ఉపాధ్యాయుల సర్టిఫికెట్ల పరిశీలన సోమవారం డీఈఓ కార్యాలయంలో మొదలుపెట్టారు. ఇద్దరు గెజిటెడ్ హెచ్ఎంలు, డీఈఓ కార్యాలయ ఉద్యోగితో ఏర్పాటైన ఏడు బృందాలు సర్టిఫికెట్ల పరిశీలన చేపట్టారు. ఈమేరకు 260మందిని అర్హులుగా గుర్తించగా, తొలిరోజు 213 మంది ఉపాధ్యాయులు హాజరుకావడంతో సర్టిఫికెట్ల పరిశీలన రాత్రి వరకు కొనసాగింది. న్యాయం చేయాలని ఎల్పీల వినతి పదోన్నతుల ప్రక్రియలో తమకు అన్యాయం జరిగిందని తెలుగు, హిందీ లాంగ్వేజ్ పండిట్లు పలువురు వాపోయారు. కొందరిని గత ఏడాది ఎస్ఏలుగా అప్గ్రేడ్ చేయగా.. ప్రస్తుతం ఎస్ఏ తెలుగు ఖాళీలు 26కి 18, హిందీ ఖాళీలు 16కు గాను 11గానే చూపించారని తెలిపారు. ఈమేరకు వాస్తవ సంఖ్య ఆధారంగా అర్హులకు పదోన్నతులు కల్పించాలని డీఈఓ కార్యాలయంతో పాటు తమకు అండగా నిలవాలని పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు కట్టా శేఖర్రావుకు వినతిపత్రాలు అందజేశారు.హాజరైన 213 మంది ఉపాధ్యాయులు -
దేవతామూర్తులకు పవిత్రాల ధారణ
ఎర్రుపాలెం: జమలాపురం శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో పవిత్రోత్సవాల సందర్భంగా సోమవారం దేవతా మూర్తులకు పవిత్రాల ధారణ నిర్వహించారు. పవిత్రోత్సవాల్లో భాగంగా రెండో రోజు యాగశాలలో ప్రాతఃకాలార్చన, మండపారాధన, ఆవాహిత దేవత హోమం, బలిహరణ పూజలు చేశారు. అనంతరం శ్రీవారి ఆలయంతో పాటు ఉప ఆలయాల్లో దేవతామూర్తులకు పవిత్రాల ధారణ, పూజలు నిర్వహించారు. ఏపీ రాష్ట్రం ఎన్టీఆర్ జిల్లా మొర్సుమల్లికి చెందిన కళ్యాణం విష్ణువర్ధన్, శ్రీధర్ అందజేసి నవగ్రహాల విగ్రహాలను పునఃప్రతిష్ట చేశారు. ఆలయ ఈఓ కొత్తూరు జగన్మోహన్రావు, ప్రధాన అర్చకులు శ్రీనివాసశర్మ, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.నేడు మంత్రి పొంగులేటి పర్యటన ఖమ్మం రూరల్/ఖమ్మంమయూరిసెంటర్: రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంగళవారం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 9గంటలకు తిరుమలాయపాలెంలో రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశాక, లబ్ధిదారులకు రేషన్ కార్డులు, కల్యాణలక్ష్మీ, సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేస్తారు. అలాగే, 11గంట లకు ఏదులాపురం జెడ్పీ హైస్కూల్ విద్యార్థినులకు పీఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యాన సైకిళ్లు పంపిణీ చేయనున్నారు. అనంతరం ఖమ్మం రూరల్ మండలం ఎం.వెంకటాయపాలెం, తనగంపాడు, కస్నాతండాలో రోడ్డు నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేస్తారు. సర్వే, శిక్షణకు ఐసీఎంఆర్ బృందం ఖమ్మం వైద్యవిభాగం: ఐసీఎంఆర్(ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్) సెంట్రల్ టీం సర్వేయర్లు (విద్యార్థులు) జిల్లాలో 60 రోజుల క్షేత్రస్థాయి శిక్షణ కోసం వచ్చారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ కార్యాలయంలో సోమవారం వారు రిపోర్టు చేయగా అసంక్రమిత వ్యాధుల నివారణ ప్రోగ్రాం అధికారి రామారావు, కీటక జనిత వ్యాధుల నివారణ అధికారి వెంకటరమణ పలు అంశాలను వివరించారు. అరవై రోజుల పాటు క్షేత్రస్థాయిలో వ్యాధుల విస్తృతిపై సర్వే చేయడమే కాక ప్రజలకు అవగాహన కల్పించనుండగా ప్రాజెక్ట్ శాస్త్రవేత్తలు స్వాతి, డాక్టర్ రోహిత్ పర్యవేక్షిస్తారు. కాగా, బీపీ, మధుమేహంతో బాధపడుతున్న వారి చికిత్సకు ముందు, తర్వాత పరిస్థితులపై ఈ బృందం అధ్యయనం చేయనునుంది. ప్రాజెక్ట్ క్వాలిటీ సూపర్వైజర్ మాలతి తదితరులు పాల్గొన్నారు. ఇక సిక్స్లు.. ఫోర్లు ! రఘునాథపాలెంలో క్రికెట్ స్టేడియానికి 20ఎకరాలు ఖమ్మంఅర్బన్: పెరుగుతున్న నగర విస్తరణ, యువతలో క్రీడలపై ఆసక్తి దృష్ట్యా ఖమ్మం సమీపాన రఘునాథపాలెంలో క్రికెట్ స్టేడియం నిర్మాణానికి 20 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించారు. సర్వే నంబర్ 218లోని ఈ భూమిని రెవెన్యూ అధికారులు క్రీడాశాఖకు అప్పగించారు. తొలుత 15.20ఎకరాలు అప్పగించగా, కనీసం 20ఎకరాల అవసరమనే వినతితో మిగతా స్థలాన్ని కూడా రెవెన్యూ అధికారులు కేటాయించారు. ప్రస్తుతం ఖమ్మంలో అన్ని క్రీడల శిక్షణకు 14ఎకరాల విస్తీర్ణంతో సర్దార్ పటేల్ స్టేడియం ఉన్నప్పటికీ క్రికెట్ క్రీడాకారుల అవసరాలకు ప్రత్యేక స్టేడియం లేదు. దీంతో రఘునాథపాలెం బైపాస్ రోడ్డుకు ఆనుకుని నరసింహులు గుట్టపై విశాలమైన స్థలాన్ని కేటాయించారు. సుమారు రూ.20 కోట్ల అంచనా వ్యయంతో అత్యాధునిక వసతులతో ఇక్కడ స్టేడియం నిర్మించేందుకు అధికారులు ప్రణాళిక రూపొందించారు. -
21 అడుగులకు పాలేరు
మండలంలోని పాలేరు రిజర్వాయర్ సోమవారం సాయంత్రం 21అడుగులకు చేరింది. రిజర్వాయర్ నీటిమట్టం 23 అడుగులు కాగా మరో రెండు అడుగులు చేరితే పూర్తిస్థాయిలో నిండుతుంది. సాగర్ నుండి ఇన్ఫ్లో 3,642 క్యూసెక్కులకు తోడు మరో 600 క్యూసెక్కుల వరద చేరుతోంది. దీంతో ఎడమ కాల్వ, పాలేరు పాత కాల్వ, భక్త రామదాసు ప్రాజెక్టుకు నీటి విడుదల కొనసాగిస్తున్నారు. కాగా, ఖమ్మం నిజాంపేటకు చెందిన ఓ వ్యక్తి సాగర్ కాల్వలో గల్లంతవగా గాలింపు చర్యల కోసం ఇన్ఫ్లో తగ్గించిన అధికారులు మృతదేహం లభించాక సరఫరా యథావిధిగా కొనసాగిస్తున్నారు. – కూసుమంచి -
మున్నేటికి వరద
వారం రోజులుగా జిల్లా కేంద్రంలోని మున్నేటికి ఎగువ నుంచి వరద తాకిడి లేకపోవడంతో ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. అయితే, సోమవారం సాయంత్రం ఒక్కసారిగా వరద పెరిగింది. మున్నేటికి ఎగువ ప్రాంతాల్లో వర్షం కురవడం, పాకాల నుండి వరద వస్తుండడంతో మధ్యాహ్నం 2గంటల నుంచి ఖమ్మం కాల్వొడ్డు వద్ద 10అడుగులకు పైగా వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో అప్రమత్తమైన అధికారులు మున్నేరు వైపు ఎవరూ వెళ్లకుండా పోలీసులతో గస్తీ ఏర్పాటు చేయించారు. అంతేకాక ఎగువ ప్రాంతాల్లో వర్షాలపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. – ఖమ్మంమయూరిసెంటర్/ఖమ్మం అర్బన్ -
నేరం జరిగిన వెంటనే చేరేలా...
● అందుబాటులోకి ఫోరెన్సిక్ ల్యాబ్ వ్యాన్ ● ప్రారంభించిన సీపీ సునీల్దత్ఖమ్మంక్రైం: నేరం జరిగే ప్రదేశంలో సాక్ష్యాలు సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించాక నివేదిక కోసం రోజుల తరబడి వేచి ఉండాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఆ అవసరం ఉండదు. ఎక్కడికక్కడ సాక్ష్యాల సేకరణ, విశ్లేషణ కోసం అత్యాధునిక పరికరాలతో కూడిన ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ మొబైల్ యూనిట్ అందుబాటులోకి వచ్చింది. ఈ ల్యాబ్ను పోలీసు కమిషనర్ సునీల్దత్ సోమవారం ప్రారంభించి మాట్లాడారు. నేరం జరిగిన ప్రదేశానికి వెళ్లి నిందితుల వేలిముద్రలు, రక్తపు నమూనాలు, ఇతర ఆధారాలను సేకరించడమే కాక విశ్లేషించేందుకు ఈ మొబైల్ ల్యాబ్ ఉపయోగపడుతుందని తెలిపారు. ఏఆర్ ఏసీపీ సుశీల్సింగ్, వైద్యులు నాగలక్ష్మి, సుధాకర్, అసిస్టెంట్ డైరెక్టర్ నరసింహ, ఆర్ఐలు కామరాజు, శ్రీశైలం, సురేష్, నాగుల్మీరా తదితరులు పాల్గొన్నారు. వేగంగా కేసుల విచారణ మాదకద్రవ్యాలు, పోక్సో కేసుల్లో విచారణ వేగంగా చేపట్టడమే కాక రోడ్డు ప్రమాదాలను అరికట్టే దిశగా పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని పోలీస్ కమిషనర్ సునీల్దత్ సూచించారు. జిల్లావ్యాప్తంగా పోలీసు అధికారులతో సోమవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేసుల నమోదు విచారణ, చార్జీషీట్ల దాఖలుపై సమీక్షించారు. వైరా, కల్లూరు డివిజన్ల పరిధిలో గుర్తించిన బ్లాక్ స్పాట్లలో బారికేడ్లు, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. నేరాల నియంత్రణ, చోరీ సొత్తు రికవరీ కోసం స్టేషన్ల వారీగా ప్రత్యేక బృందాలను నియమించాలని సూచించారు. అలాగే, జూదం, బెట్టింగ్, గంజాయి నియంత్రణ, సీసీ కెమెరాల ఏర్పాటుపై సూచనలు చేశారు. ఈ సమావేశంలో సీసీ ఆర్బీ ఇన్స్పెక్టర్ స్వామి, ఎస్సైలు రవి, సత్యనారాయణ పాల్గొన్నారు. -
ఎప్పటికప్పుడు దరఖాస్తుల పరిష్కారం
ఖమ్మం సహకారనగర్: ప్రజావాణిలో అందే దరఖాస్తులను సత్వరమే పరిశీలించి పరిష్కరించాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం ఆయన ప్రజావాణిలో ప్రజల నుంచి వినతులు, ఫిర్యాదులను స్వీకరించారు. అనంతరం వివిధ శాఖల అధికారులతో సమీక్షలో కలెక్టర్ మాట్లాడుతూ ఏ ఫిర్యాదును కూడా పెండింగ్లో పెట్టొద్దని తెలిపారు. అలాగే, అన్ని శాఖల ఆధ్వర్యాన ఫైళ్ల బదలాయింపు ఈ–ఆఫీస్ విధానంలోనే చేపట్టాలని స్పష్టం చేశారు. ● ప్రమాదవశాత్తు మరణించిన మల్టీ పర్పస్ వర్కర్ వీరస్వామి కుటుంబానికి మంజూరైన రూ.10 లక్షల బీమా పరిహారం చెక్కును కలెక్టర్ అనుదీప్, అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి అందజేశారు. గ్రామీణ ప్రాంతాల్లోని మల్టీ పర్పస్ వర్కర్లు 2,087 మందికి పోస్టల్ శాఖ ద్వారా ప్రమాద బీమా చేయించామని తెలిపారు. ● స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ అనుదీప్ సూచించారు. అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డితో కలిసి ఆయన మాట్లాడుతూ ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు ఇచ్చేందుకు నిర్దిష్ట సంఖ్యలో మాత్రమే దరఖాస్తులు ఇవ్వాలని తెలిపారు. ఈసమావేశాల్లో జెడ్పీ సీఈఓ దీక్ష రైనా, డీపీఓ ఆశాలత, కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్యాదవ్, డీఆర్డీఓ సన్యాసయ్య, కలెక్ట్టరేట్ ఏఓ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ● అలాగే, జూలై 31న ఉద్యోగ విరమణ చేసిన 13మంది అధికారులు, సిబ్బందిని కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ అనుదీప్ సన్మానించారు. వివిధ శాఖల్లో రిటైర్డ్ అయిన డాక్టర్ కె.శ్రీనివాసరావు, ఏ.వెంకటేశ్వర్లు, సత్యనారాయణ, పీ.వీ.నాగేందర్రావు, ఎస్.విజయకుమార్, డాక్టర్ కె.సుధారాణి, విజయ్, ఎన్.ఎల్లస్వామి, జహీరుద్దీన్, వెంకటేశ్వర్లు, బి.నరసయ్య, రాంచందర్, పద్మను సన్మానించి జ్ఞాపికలు అందజేశారు. కాగా, డీపీఆర్వో కార్యాలయ డ్రైవర్ నరసయ్యను డీపీఆర్వో గౌస్, ఉద్యోగులు సైతం సన్మానించారు. ఈ–ఆఫీస్ ద్వారానే ఫైళ్ల బదలాయింపు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి11న నులి పురుగుల నివారణ దినోత్సవం ఖమ్మంవైద్యవిభాగం: నులి పురుగుల నివారణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆదేశించారు. కలెక్టరేట్లో జరిగిన జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశంలో అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 1 – 19 ఏళ్ల పిల్లలకు ఈనెల 11న నులిపురుగుల నివారణ కోసం అల్బెండజోల్ మాత్రలు వేయాలని, ఎవరైనా మిగిలితే ఆగస్టు 18న అందించాలని సూచించారు. ఇందుకోసం ఏర్పాట్లు మొదలుపెట్టాలని తెలిపారు. డీఎంహెచ్ఓ కళావతిబాయి మాట్లాడగా కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్యాదవ్, డీఆర్వో ఏ.పద్మశ్రీ, జెడ్పీ సీఈఓ దీక్షారైనా, డీఆర్డీఓ సన్యాసయ్య తదితరులు పాల్గొన్నారు. -
పెద్దాస్పత్రి కిటకిట..
జిల్లాలో 30 డెంగీ కేసులు.. జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలతో పారిశుద్ధ్య సమస్యలు ఏర్పడి సీజనల్ వ్యాధుల వ్యాప్తి పెరిగింది. ముఖ్యంగా డెంగీ కేసులు ఎక్కువగా వెలుగు చూస్తున్నాయి. ఇటీవల తల్లాడ, తిరుమలాయపాలెం మండలాల్లో ఎక్కువగా కేసులు వెలుగులోకి వచ్చాయి. సీజనల్ వ్యాధుల కట్టడికి వైద్యారోగ్య శాఖ చర్యలు తీసుకుంటున్నా.. వ్యాధుల వ్యాప్తి మాత్రం పెరుగుతూనే ఉంది. ఆ శాఖ అధికారులు చేపట్టిన ఇంటింటి జ్వర సర్వేలో ఎక్కువ కేసులు వెలుగు చూస్తున్నట్లు తెలుస్తోంది. డెంగీతో పాటు విషజ్వరాల ప్రభావం అధికంగా ఉన్నట్లు సమాచారం. ఖమ్మంవైద్యవిభాగం: ఖమ్మం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి ఇటీవల పేషెంట్ల తాకిడి పెరిగింది. ముఖ్యంగా డెంగీ, విష జ్వరాలతో ఎక్కువ మంది వస్తున్నారు. అంతేకాక ఇతర వ్యాధుల ప్రభావం కూడా ఎక్కువగానే ఉండడంతో వార్డులన్నీ బాధితులతో నిండిపోయాయి. ఇక్కడ గత పది రోజులుగా సగటున నిత్యం 1100 నుంచి 1200 మంది వరకు వైద్య సేవల కోసం వస్తున్నారు. గత పది రోజుల్లో 11,165 మంది ఓపీ వైద్య సేవలు పొందగా, 922 మంది ఇన్ పేషెంట్లుగా చేరి చికిత్స పొందుతున్నారు. చిన్నారులు, వృద్ధులు, గర్భిణులు జ్వరాల ప్రభావంతో ఆస్పత్రికి ఎక్కువగా వస్తున్నారు. పెద్దాస్పత్రిలో ప్రస్తుతం ఇద్దరు డెంగీ పాజిటివ్ రోగులు చికిత్స పొందుతుండగా, వైరల్ జ్వరాల బారిన పడి వందలాది మంది చికిత్స తీసుకుంటున్నారు. లెక్క తేలని ‘ప్రైవేట్’.. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో గత 10 రోజులుగా జ్వరాలతో చేరే వారి సంఖ్య పెరిగిపోతోంది. అయితే ప్రైవేటు ఆస్పత్రుల్లో నమోదయ్యే జ్వర కేసుల వివరాలు తెలియడం లేదు. కేసుల వివరాలు ఎప్పటికప్పుడు తెలియజేయాలని, సమాచారం ఇవ్వాలని వైద్యారోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసినా ప్రైవేటు యాజమాన్యాలు పెడచెవిన పెడుతున్నాయి. ప్రైవేటు ఆస్పత్రుల నుంచి ఏరోజుకారోజు వివరాలు అందజేస్తే వైద్యారోగ్య శాఖ అప్రమత్తమయ్యే అవకాశం ఉంటుంది. ఎక్కువ జ్వర కేసులు ఎక్కడి నుంచి వస్తున్నాయో గుర్తించి, అక్కడ ముందస్తు చర్యలు తీసుకోవచ్చు. కానీ ప్రైవేటు ఆస్పత్రుల వారు లెక్కలు చెప్పకపోవడంతో జాగ్రత్త చర్యలు లేక వ్యాధులు తీవ్రమవుతున్నాయని తెలుస్తోంది. కాగా ప్రజలు పరిసరాల పరిశుభ్రత పాటించాలని వైద్య అధికారులు సూచిస్తున్నారు. డెంగీ కారక దోమ ఇంటి పరిసరాల్లోనే జీవిస్తుందని, ఇంటి పరిసరాల్లో పాత వస్తువులు నిల్వ ఉంచకుండా తొలగించాలని అంటున్నారు. లేదంటే వాటిలో గుడ్డు పొదిగి లార్వా వృద్ధి చెంది డెంగీ కారక దోమలు పుట్టుకొస్తాయని చెబుతున్నారు. సీజనల్ వ్యాధులతో వస్తున్న బాధితులు డెంగీ, విషజ్వరాలతో చేరుతున్న జిల్లా వాసులు రోజుకు 1000కి పైగా ఓపీ కేసులు గత పది రోజులుగా పెద్దాస్పత్రిలో ఓపీ, ఐపీ సేవలు తేదీ ఔట్ పేషెంట్ ఇన్ పేషెంట్ 24 (జూలై) 1,128 5925 1,083 10526 1,330 8527 (ఆదివారం) 00 3528 1,606 11929 1,452 10930 1,385 11031 839 8201 (ఆగస్టు) 1,230 11902 1,112 59 -
ఇన్చార్జ్ డీఈఓగా నాగపద్మజ
ఖమ్మం సహకారనగర్: జెడ్పీ డిప్యూటీ సీఈఓ నాగపద్మజ ఇన్చార్జ్ జిల్లా విద్యాశాఖాధికారిగా నియమితులయ్యారు. ఈమేరకు కలెక్టర్ అనుదీప్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇన్నాళ్లు డీఈఓగా కొనసాగిన సత్యనారాయణ ఉద్యోగ విరమణ చేయడంతో ఆ స్థానం ఖాళీ అయింది. ప్రస్తుతం ఉపాధ్యాయుల పదోన్నతుల ప్రక్రియ కొనసాగుతుండడంతో నాగపద్మజను ఇన్చార్జ్ డీఈఓగా నియమించారు. జీపీల పెండింగ్ బిల్లులపై ఆరా నేలకొండపల్లి: గ్రామపంచాయతీల్లో గత పాలకవర్గాలు చేపట్టిన పనుల పెండింగ్ బిల్లుల వివరాలు సమర్పించాలని ఉన్నతాధికారులు సూచించారు. ఐదేళ్లలో చేసిన పనులు, ఎం.బీ. రికార్డులు, రికార్డులు లేకుండా పనులు, వాటి బిల్లులు సమర్పించడమే కాక పాలకవర్గాలు తీర్మానాలు ఉంటే ఆ జిరాక్స్లు జత చేసి పంపాలని జిల్లా పంచాయతీ అధికారులు కార్యదర్శులను ఆదేశించారు. దీంతో సోమవారం జిల్లాలోని అన్ని జీపీల కార్యదర్శులు పెండింగ్ బిల్లులు సిద్ధం చేయడం మొదలుపెట్టారు. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రభుత్వం పెండింగ్ బిల్లులు మంజూరు చేసేందుకే వివరాలు ఆరా తీస్తోందన్న ప్రచా రంతో మాజీ సర్పంచ్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా, జిల్లాలోని ప్రతీ జీపీకి కనీసం రూ.5 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు బిల్లులు పెండింగ్ ఉన్నట్లు సమాచారం. -
చుక్క నీటినీ వదులుకోం: భట్టి విక్రమార్క
ముదిగొండ: తెలంగాణకు న్యాయంగా దక్కాల్సిన సాగునీటి వాటాలో ఒక్క చుక్క నీటిని కూడా వదులుకోబోమని, తమకు రాజకీయాల కంటే రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. బనకచర్ల పాపం బీఆర్ఎస్దేనని, ఈ విషయంలో ఏపీ ప్రభుత్వ కుట్రలను అడ్డుకుని తీరతామని అన్నారు. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం కమలాపురంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఆధ్వర్యంలో రూ.10 కోట్లతో నిర్మించనున్న 10 వేల మెట్రిక్ టన్నుల గోదాముల పనులకు ఆదివారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గతంలో 5.91 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదాములే రైతులకు అందుబాటులో ఉండేవని, తాము అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర వ్యవధిలోనే కొత్తగా 10.75 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదాంలు నిర్మించామని తెలిపారు. అన్నదాతల సంక్షేమం, వ్యవసాయాభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామని చెప్పారు. దాని ఫలితంగానే దేశంలోనే అత్యధికంగా వరి పండించే రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని అన్నారు. సీఎం, ఉత్తమ్ వల్లే బనకచర్లకు బ్రేక్ ఉమ్మడి ఏపీలో సాగునీటి రంగంలో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని, ఇప్పుడు కూడా రాష్ట్రంపై అవే కుట్రలు జరుగుతున్నాయని భట్టి చెప్పారు. తెలంగాణలో పంటలు ఎండిపోయేలా ఏపీ అక్రమ ప్రాజెక్టుల నిర్మాణానికి శ్రీకారం చుడుతోందని, సీఎం రేవంత్రెడ్డి, మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి సమర్థంగా వాదనలు వినిపించడం వల్లే బనకచర్ల ప్రాజెక్టుకు బ్రేక్ పడిందని చెప్పారు. కృష్ణా, గోదావరిపై గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు నిర్మించిన ప్రాజెక్టుల ద్వారానే పంటలకు నీరందుతోందని, బీఆర్ఎస్ హయాంలో ఒక్కటి కూడా పనికొచ్చే ప్రాజెక్టు నిర్మించలేదని విమర్శించారు. రూ.లక్ష కోట్లు వెచ్చించిన కాళేశ్వరంతో ఒక్క ఎకరాకు కూడా నీరందడం లేదన్నారు. నాడు పోలవరం నిర్మిస్తుంటే చోద్యం చూశారని, బనకచర్ల నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నా పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. తమ ప్రభుత్వం కృష్ణా, గోదావరి నీటిని సద్వినియోగం చేసుకుంటూ రాష్ట్రంలో ప్రతి ఎకరాకు నీరందించేలా పకడ్బందీ కార్యాచరణతో ముందుకెళ్తోందని భట్టి తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్ నాయుడు సత్యనారాయణ, ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తదితరులు పాల్గొన్నారు. -
ముగిసిన సౌత్ ఇండియా కరాటే టోర్నీ
ఖమ్మంస్పోర్ట్స్: నగరంలోని ఎండీ గార్డెన్స్లో జరుగుతున్న దక్షిణభారత కరాటే పోటీలు ఆదివారం ముగిశాయి. ఈ పోటీలను విన్ఫీల్డ్ పాఠశాల డైరెక్టర్ పి.శ్రీకాంత్ ప్రారంభించారు. దాదాపు 600 మందికి పైగా విద్యార్థులు పాల్గొనగా.. విజేతలకు నిర్వాహకులు పతకాలు ప్రదానం చేశారు. కార్యక్రమంలో టోర్నీ నిర్వాహకులు కె.సందేశ్, వినోద్ తదితరులు పాల్గొన్నారు. ఆర్యవైశ్యుల్లో రాజకీయ చైతన్యం రావాలినేలకొండపల్లి: ఆర్యవైశ్యుల్లో రాజకీయ చైత న్యం రావాలని జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు పసుమర్తి చందర్రావు ఆకాంక్షించారు. స్థానిక వాసవీభవన్లో పాలేరు నియోజకవర్గ ఆర్యవైశ్య రాజకీయ చైతన్య సదస్సు ఆది వారం నిర్వహించగా.. ఆయన పాల్గొని మాట్లాడారు. ఆర్యవైశ్యులు స్థానిక సంస్థల ఎన్నికల నుంచి అన్నిట్లోనూ పోటీ చేసేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. గెలిచినా, ఓడినా ప్రజల కోసం పనిచేస్తూ బలం పెంచుకోవాలని చెప్పా రు. ప్రజా సమస్యలు పరిష్కారం కోసం ఎవరి నైనా ఎదిరించే శక్తిని సాధించాలని పేర్కొన్నా రు. సమావేశంలో మాటూరి సుబ్రహ్మణ్యం, వెంకటేశ్వరరావు, నాగుబండి శ్రీనివాసరావు, నరసిహమూర్తి, పి.వెంకటేశ్వర్లు, సీతారామా రావు, హనుమంతరావు, దోసపాటి శేఖర్, గెల్లా జగన్మోహన్రావు, కనమర్లపూడి రమేశ్, కొత్తా రమేశ్, వంగవీటి నాగేశ్వరరావు, వందనపు నాగేశ్వరరావు, బోనగిరి కిరణ్, కొత్తా రాణి, తెల్లాకుల జయశ్రీ, మైలవరపు సంతోష్, రాయపూడి రాజేశ్ తదితరులు పాల్గొన్నారు. ‘లకారం’పైకి సందర్శకులు రాకుండా అడ్డగింత ఖమ్మంమయూరిసెంటర్: సెలవుదినం ఆదివా రం రోజు పిల్లలతో సేదదీరేందుకు లకారం ట్యాంక్బండ్కు మధ్యాహ్నం 12 గంటల సమయంలో వచ్చిన సందర్శకులను ఓ యువకుడు లోనికి అనుమతించకుండా అడ్డుకునే ప్రయ త్నం చేశాడు. ట్యాంక్బండ్పై గంజాయి తాగే వాళ్లు ఉన్నారు.. లోపలకి రాకూడదు అంటూ హల్చల్ చేశాడు. దీంతో అక్కడికి వచ్చిన వారు నివ్వెరపోతూ బారికేడ్ల వద్ద ఆగిపోయారు. కొందరిని మాత్రం లోపలకు అనుమతిస్తూ, కొందరిని అడ్డుకోవడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. దీంతో సందర్శకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. -
మల్చింగ్ సాగు.. బాగు
ఇల్లెందురూరల్: రైతులు సాగు చేసిన పంటలపై వాతావరణ పరిస్థితులు ప్రభావం చూపిస్తుంటాయి. దీనికి తోడు తెగుళ్లు, చీడపీడల బెదడ వంటి పలు కారణాలతో దిగుబడులు తగ్గి పెట్టుబడులు కూడా చేతికందక నష్టపోతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో రైతులు క్రమంగా సాంకేతిక సాగు పద్ధతులు అవలంభిస్తూ తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు ఘడించేలా నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు. విపత్తులను తట్టుకుంటూ చీడపీడలు, కలుపు నియంత్రిస్తూ, తక్కువ మోతాదులో నీటి తడులతో ఆశించిన దిగుబడులు అందించే మల్చింగ్ సాగు విధానంపై రైతులు దృష్టిసారిస్తున్నారు. షీట్ల ఎంపిక ఇలా.. ఉద్యాన పంటలైన కూరగాయలు, పండ్లు, పూల మొక్కల సాగులో మల్చింగ్ షీట్లను అధికంగా ఉపయోగిస్తారు. 3 నుంచి 4 నెలల కాలవ్యవధి ఉండే పంటల సాగులో 50 మైక్రాన్ల మల్చింగ్ షీట్లను ఉపయోగిస్తారు. 12 నుంచి 15 నెలల కాల వ్యవధి కలిగిన పంటల సాగులో 100 షీట్లను వాడటం మేలు. 7.25 మైక్రాన్ల మందం కలిగిన షీట్లు ఒక పంట కాలానికి, 50 నుంచి 200 మైక్రాన్ల మందం కలిగిన షీట్లు మూడేళ్ల వరకు మన్నిక కలిగి ఉంటాయి. సాగు విధానం.. మల్చింగ్ పరిచే విధానం పలు రూపాలలో ఉంటుంది. విత్తనం వేయక ముందు, వేసిన తరువాత కూడా మల్చింగ్ షీట్లను కప్పేందుకు అవకాశం ఉంటుంది. ●మొక్క పాదుకు సరిపడా షీట్ను కత్తిరించి మధ్యలో గుండ్రంగా మొక్క కాండానికి సరిపడా రంధ్రం చేసి బయటకు చీలిక చేయాలి. ●చీలిక గుండా కాండం మధ్యలోకి వచ్చేలా తొడిగి మట్టితో షీట్ అంచులు కప్పడంతో పాటు మూడు, నాలుగు అర్థచంద్రాకారంలో రంద్రాలు చేస్తే భూమిలోకి నీరు ఇంకుతుంది. ●కూరగాయల పంటల్లో విత్తనాలు విత్తేముందు మొక్క మధ్యలో వరుసల మధ్య ఉన్న దూరాన్ని బట్టి ముందే షీట్కు రంధ్రాలు చేయాలి. ●షీట్ను నాగలి సాలు మీద పరిచి రెండు వైపులా కొనలపై మట్టి ఎగదోస్తే కవర్లు కొట్టుకుపోకుండా ఉంటాయి. ఆతర్వాత రంధ్రాల్లో 2 నుంచి 3 విత్తనాలు వేసి మట్టి కప్పాలి. ●విత్తనాలు మొలిచాక మొక్క చుట్టూ షీట్ను తగిన సైజులో కత్తిరించి ప్రతి మొక్క మొదటలో వచ్చేలా తొడగాలి. ●ఈ షీట్ను ప్రతీ వరుసలో లేదా చెట్టు దగ్గర మరీ వదులుగా లేదా బిగుతుగా లేకుండా కప్పి అన్ని చివరలకు గాడిలో పోయేలా చేసి మట్టితో కప్పాలి. దీనివల్ల మల్చింగ్ షీటు గాలికి చెదిరిపోకుండా ఉంటుంది. ప్రయోజనాలిలా.. భూమిపై ప్లాస్టిక్ షీట్ కప్పి బయటి వాతావరణానికి సంబంధం లేకుండా నేలలోని ఉష్ణోగ్రతలను క్రమబద్ధీకరిస్తుంది. సూర్యకిరణాలను మొక్క ప్రతి భాగానికి అందించి అనుకూలమైన పరిస్థితులను ఏర్పర్చడానికి వీలు కలుగుతుంది. కలుపు నివారణ 80 శాతం తగ్గుతుంది. 50శాతం వరకు సాగునీటి ఆదాతో పాటు తెగుళ్ల నివారణకు దోహదపడుతుంది. వర్షాభావ పరిస్థితుల్లో సాగుచేసే రైతులకు ప్రయోజనం చేకూర్చుతుంది. కలుపు, చీడపీడల సమస్యకు చెక్ తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు ఆసక్తి చూపుతున్న ఏజెన్సీ రైతులు -
పోడు భూములు పచ్చగా..
● ‘ఇందిరా సౌర గిరి జలవికాసం’ద్వారా అభివృద్ధికి ప్రణాళిక ● నీటి పారుదలకు సోలార్ పంపుసెట్ల మంజూరు ● ఐదేళ్లలో ఉమ్మడి జిల్లాలో 73,733 మంది రైతులకు లబ్ధి ● 2.23 లక్షల ఎకరాల మేర సాగుకు ప్రయోజనం ఖమ్మంవ్యవసాయం: పోడు భూముల(ఆర్ఓఎఫ్ఆర్)ను ఉద్యాన వనాలుగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ‘ఇందిరా సౌర గిరి జల వికాసం’పథకాన్ని రూపొందించింది. ఆర్ఓఎఫ్ఆర్ (రికగ్నైజేషన్ ఆఫ్ ఫారెస్ట్ రైట్స్) భూములు గిరిజన ప్రాంతంలో ఉండటం, ఆయా భూములను గిరిజనులు సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తుండటంతో 2006లో అప్పటి ముఖ్యమంత్రి దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హక్కులు కల్పించారు. గిరిజనులు ఆ భూముల్లో వర్షాధారంగా మెట్ట పంటలను సాగు చేస్తున్నారు. సారవంతమైన ఈ భూ ములను అభివృద్ధి చేసేందుకు ఐదేళ్ల ప్రణాళికతో ఈ పథకానికి రూపకల్పన చేసి, అమలు బాధ్యత గిరిజనాభివృద్ధి సంస్థకు అప్పగించింది. రాష్ట్రంలో 2,30,735 మంది గిరిజన రైతులకు చెందిన 6.69 లక్షల ఎకరాల భూమిని రూ.12,600 కోట్లతో అభివృద్ధి చేసి, ఉద్యాన వనాలను పెంచా లని నిర్ణయించింది. రాష్ట్రంలోని 17జిల్లాల్లో ఉన్న పోడు భూముల అభివృద్ధికి ఈ పథకాన్ని వర్తింప జేసే విధంగా ప్రణాళిక రూపొందించారు. 2025–26 నుంచి 2029–30 వరకు అమలు చేయనున్న ఈ పథకంలో తొలి ఏడాది ప్రయోగాత్మకంగా తక్కువ మంది రైతులు, తక్కువ విస్తీర్ణంలో.. తరువాత నాలుగేళ్లలో నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకోనున్నారు. తొలి ఏడాది 10వేల మంది రైతులకు చెందిన 27,184 ఎకరాల్లో పథకాన్ని అమలు చేసే విధంగా రూ.600 కోట్లతో అంచనాలు రూపొందించారు. తిరిగి పచ్చదనం పూర్వం దట్టమైన అడవులతో ఉన్న భూములను ఆయా ప్రాంతాల్లో ఉన్న గిరిజనులు జీవనోపాధి కోసం సాగు భూములుగా మార్చుకున్నారు. దీంతో అడవులు క్రమంగా అంతరించి, పర్యావరణ సమతుల్యత దెబ్బతింటోంది. ఈ పథకంలో భాగంగా పోడు భూముల అభివృద్ధి, ఉద్యాన పంటల సాగును చేపట్టనుండటంతో గిరిజనుల జీవనోపాధి మెరుగుపర్చడమే కాకుండా తిరిగి ఆ భూములు అడవులను తలపిస్తాయని ప్రభుత్వం భావిస్తోంది. ప్రోత్సాహకాలు అందించి ఆయిల్ పామ్, మా మిడి, జామ, సపోట వంటి తోటలను పండించేలా చర్యలు చేపడుతున్నారు. సోలార్ పంపుసెట్ల మంజూరుకు ప్రణాళిక పథకంలో భాగంగా నీటి సౌకర్యం రెండున్నర ఎకరాలను ఒక యూనిట్గా తీసుకుని, వంద శాతం సబ్సిడీతో సోలార్ పంపుసెట్ను అందిస్తారు. ఒక యూనిట్కు రూ.6 లక్షల వ్యయంతో 200 అడుగుల లోతు బోరుగుంత తీసి, కేసింగ్ వేసి, పంపుసెట్ ఏర్పాటు చేస్తారు. సోలార్ పలకలు అమ ర్చి, ఇన్వర్టర్ ఏర్పాటు, పంపుసెట్, సోలార్ పలకల చుట్టూ ఫెన్సింగ్ వంటి నిర్మాణాలు చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ మొత్తాన్ని ఎంపిక చేసిన కంపెనీలు ఐదేళ్ల పాటు నిర్వహిస్తాయి. ఐదేళ్ల కాలంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 73,733 మంది రైతులకు చెందిన 2.23 లక్షల ఎకరాలకు అమలు చేయనున్నారు. ఖమ్మం జిల్లాలో 11,386 మంది రైతులకు చెందిన 27,448 ఎకరాలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 62,347 మంది రైతులకు చెందిన 1,95,998 ఎకరాల పోడు భూముల్లో పథకాన్ని అమలు చేయనున్నారు. ఈ ఏడాది మాత్రం ఖమ్మం జిల్లాలో 550 మంది రైతులకు చెందిన 1,516 ఎకరాలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 2,923 మంది రైతులకు చెందిన 8,046 ఎకరాల్లో అమలు చేయాలని నిర్ణయించారు.మార్గదర్శకాలు అందాల్సి ఉంది.. ఇందిర సౌర గిరి జల వికాసం పథకం అమలులో భాగంగా సోలార్ పంపుసెట్ల ఏర్పాటుపై ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు అందాల్సి ఉంది. వాటి ఆధారంగా ఎంపిక చేసిన లబ్ధిదారుల పోడు భూముల్లో సోలార్ పంపుసెట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటాం. పలు కంపెనీల ద్వారా సోలార్ పంపుసెట్లను ఏర్పాటు చేసే అవకాశం ఉంది. –పి. అజయ్కుమార్, రెడ్కో మేనేజర్, ఉమ్మడి ఖమ్మం జిల్లా ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో ఐదేళ్ల పాటు ‘ఇందిరా సౌర గిరి జలవికాసం’ప్రణాళిక ఖమ్మం జిల్లా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సంవత్సరం లబ్ధిదారుల సంఖ్య ఎకరాలు లబ్ధిదారుల సంఖ్య ఎకరాలు 2025–26 550 1,516 2,923 8,046 2026–27 2,809 6,483 14,856 46,988 2027–28 2,809 6,483 14,856 46,988 2028–29 2,809 6,483 14,856 46,988 2029–30 2,809 6,483 14,856 46,988 మొత్తం 11,786 27,448 62,347 1,95,988 -
ఇజ్రాయిల్.. దాడులు నిలిపివేయాలి
● 7న పాలస్తీనా సంఘీభావ ర్యాలీకి సీపీఎం మద్దతు ● పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం ఖమ్మంమయూరిసెంటర్: ఏళ్లుగా ఇజ్రాయిల్.. పాలస్తీనాపై చేస్తున్న అమానవీయ దాడులను వెంటనే నిలిపివేయాలని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం కోరారు. స్థానిక సుందరయ్య భవనంలో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. పశ్చిమాసియా ప్రాంతంలోని పాలస్తీనాపై ఇజ్రాయిల్ కొన్నేళ్ల నుంచి యుద్ధం చేస్తూ, వేల మంది ప్రాణాలను బలిగొందని విమర్శించారు. కనీస యుద్ధ నియమ, నిబంధనలను పాటించకుండా విచక్షణారహితంగా బాంబుల వర్షం కురిపిస్తోందని, ముఖ్యంగా గాజాలోని పాఠశాలలు, వైద్యశాలలు, పౌర సముదాయాలు, రేషన్ దుకాణాలపై యుద్ధోన్మాదంతో దాడులు చేస్తోందని మండిపడ్డారు. ఇప్పటికే సుమారు 56,000 మంది పాలస్తీనా పౌరులు చనిపోయినట్లు అంతర్జాతీయ సంస్థలు ప్రకటించాయని, అందులో సుమారు 20 వేల మంది పసిపిల్లలు ఉండడం బాధాకరమని పేర్కొన్నారు. ఆగస్టు 7న ఖమ్మం నగరంలో ఇజ్రాయిల్ యుద్ధోన్మాదాన్ని వ్యతిరేకిస్తూ పాలస్తీనా ప్రజలకు సంఘీభావాన్ని తెలియజేస్తూ నిర్వహిస్తున్న ర్యాలీకి సీపీఎం సంఘీభావం తెలుపుతోందన్నారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్రావు, జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, రాష్ట్ర కమిటీ సభ్యులు బండి రమేశ్, వై.విక్రమ్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రాణాలు పణంగా పెట్టి అడ్డుకుంటాం
సత్తుపల్లిటౌన్: ఈ ప్రాంత నిర్వాసితులకు చెందిన లారీలకు బొగ్గు లోడింగ్ ఇవ్వకుండా రుద్రంపూర్ కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్కు బొగ్గు రవాణా ఇస్తే ప్రాణాలుపణంగా పెట్టి అయినా అడ్డుకుంటామని లారీ యజమానులు స్పష్టం చేశారు. సత్తుపల్లి సింగరేణి లారీ, టిప్పర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యా న ఆదివారం జరిగిన సమావేశంలో సింగరేణి యా జమాన్యం తీరుపై మండిపడ్డారు. నాణ్యమైన బొగ్గు ను సమయానికి ఇవ్వకుండా నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తోందని దుయ్యబట్టారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నిబంధనలను అతిక్రమిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగరేణి సత్తుపల్లి, కిష్టారం ఓసీల్లో ఉత్పత్తి అయిన బొగ్గులో 30 శాతం లోడింగ్ స్థానిక లారీలకు కల్పించాలని కోరారు. బొగ్గు లోడింగ్ లేకపోవటం వల్ల లారీ యజమానులకు పూటగడవటం కూడా కష్టంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. 600 లారీలు ఉంటే.. రోజుకు రెండు లారీలకు లోడింగ్ ఇవ్వటం సింగరేణి అధికారుల తీరుకు నిదర్శనమన్నారు. ఆంధ్రా కార్పొరేట్ సంస్థలకు కొమ్ము కాస్తూ స్థానిక లారీలకు లోడింగ్ లేకుండా చేస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు కొండపల్లి రమేశ్రెడ్డి, చిన్నంశెట్టి సూరిబాబు, మౌలాలి, మునీర్, రమేశ్, పాలకుర్తి దాసు, పీఎల్ ప్రసాద్, కోట మోహన్రావు, కోటేశ్వరరెడ్డి, ఐ.శ్రీనివాసరావు, మారేశ్వరరావు పాల్గొన్నారు. -
చెరువులో మునిగి రైతు మృతి
చింతకాని: మండలంలోని నాగులవంచ గ్రామంలోని రామసముద్రం చెరువులో ప్రమాదవశాత్తు మునిగి గ్రామానికి చెందిన రైతు తోటకూరి జగన్ (35) ఆదివారం మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. జగన్ గేదెలను మేతకోసం పొలానికి తీసుకెళ్లి తిరిగి ఇంటికి తీసుకొస్తుండగా.. గేదెలు నీళ్ల కోసం రామసముద్రంలో చెరువులోకి దిగాయి. అవి బయటకు రాకపోవటంతో జగన్ చెరువులోకి దిగి, మునిగిపోయాడు. ఆయనకు ఈత రాకపోవటంతో మృతి చెందాడు. ఘటనా స్థలాన్ని ఎస్ఐ నాగుల్మీరా పరిశీలించి, మృతదేహాన్ని బయటకు తీయించి, ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. రెడ్డిచెరువులో సోదరులు గల్లంతు?చింతకాని: మండలంలోని నాగులవంచ గ్రామానికి చెందిన మత్స్యకారులు, సోదరులు కంభం నాగేశ్వరరావు, సత్యం రెడ్డిచెరువులో గల్లంతైన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. కంభం నాగేశ్వరరావు గ్రామంలోని రెడ్డిచెరువును లీజుకు తీసుకుని చేపల పెంపకం చేపట్టాడు. రోజూ మాదిరిగానే తన తమ్ముడు సత్యంతో కలిసి ద్విచక్ర వాహనంపై చెరువు వద్దకు వెళ్లారు. చీకటి పడినప్పటికీ వారు ఇంటికి రాకపోవటంతో కుటుంబ సభ్యులు ఫోన్చేయగా స్విచ్ఆఫ్ రావటంతో ఆందోళనతో చెరువు వద్దకు వెళ్లా రు. చెరువు కట్టపై ద్విచక్ర వాహనం, దుస్తులు, చెప్పులు విడిచి ఉండటాన్ని గుర్తించి గ్రామస్తులు, పోలీసులకు సమాచారం అందించారు. ఎస్ఐ నాగుల్మీరా చెరువు వద్దకు చేరుకుని స్థానికుల సహకారంతో నాటు పడవల్లో గాలించినప్పటికి ఆచూకీ లభ్యం కాలేదు. రాత్రి సమయం కావటంతో గాలింపు చర్యలు నిలిపివేశారు. రైలుకింద పడి గుర్తుతెలియని వృద్ధురాలు మృతిఖమ్మంక్రైం: రైలుకింద పడి గుర్తుతెలియని వృద్ధురాలు (70) మృతిచెందిన ఘటనపై ఖమ్మం జీఆర్పీ పోలీసులు కేసు నమోదు చేశారు. సారథినగర్ ప్రాంతంలో రైలుకింద పడి వృద్ధురాలు మృతిచెందింది. మృతదేహాన్ని పోలీసులు గుర్తించి, ప్రభుత్వాస్పత్రి మార్చురీకి తరలించారు. మృతురాలి వద్ద వరంగల్ నుంచి విజయవాడకు, గుంటూరు నుంచి వరంగల్కు తీసుకున్న టిక్కెట్లు లభించాయి. ఆంధ్రప్రదేశ్కు చెందిన మహిళగా భావిస్తున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు.మధిర పట్టణంలో చోరీమధిర: పట్టణంలోని నందిగామ బైపాస్ రోడ్డు సమీపంలోని ఓ ఇంట్లో శనివారం రాత్రి చోరీ జరిగింది. రియల్ ఎస్టేట్ వ్యాపారి చెరుకూరి నాగార్జున శనివారం హైదరాబాద్ వెళ్లగా ఆయన సతీమణి లక్ష్మి ఎన్టీఆర్జిల్లా వత్సవాయి మండలం మక్కపేటలోని పుట్టింటికి వెళ్లింది. గుర్తుతెలియని దుండగులు అదే రోజు రాత్రి తాళం పగలగొట్టి ఇంట్లోకి ప్రవేశించారు. బీరువాలో ఉన్న రూ.1.20 లక్షల నగదు, 4 బంగారు గాజులు, నల్లపూసల గొలుసు చోరీచేశారని, సుమారు రూ.9లక్షల సొత్తును అపహరించినట్లు బాధితుడు తెలిపారు. మరో గది తలుపు గడియ పగలగొట్టి దుస్తులు, వస్తువులను చిందరవందర చేశారు. ఘటనా స్థలాన్ని టౌన్ ఎస్హెచ్ఓ రమేశ్తో పాటు ఖమ్మం నుంచి క్లూస్ టీం వచ్చి వేలిముద్రలు సేకరించారు. రోడ్డు ప్రమాదంలో ఒకరికి గాయాలునేలకొండపల్లి: రోడ్డు ప్రమాదంలో మాజీ ఎంపీటీసీ, గ్రామదీపికకు గాయాలైన ఘటన ఆదివారం మండలంలో చోటుచేసుకుంది. కోనాయిగూడెం గ్రామానికి చెందిన గ్రామదీపిక, మాజీ ఎంపీటీసీ కొమ్మినేని పుష్పావతి స్కూటీపై వెళ్తుండగా గేదెలు అడ్డు వచ్చాయి. ద్విచక్రవాహనం అదుపుతప్పడంతో ఆమె కిందపడి గాయపడింది. ఆమెను మాజీ సర్పంచ్లు పెంటమళ్ల పుల్లమ్మ, తురక పాపయ్యతోపాటు వడ్లమూడి నర్సయ్య తదితరులు పరామర్శించారు. -
విద్యాశాఖకు దిక్కెవరు..?
● ఏళ్లుగా భర్తీ కాని డీఈఓ పోస్టు ● ఇన్చార్జ్లతో పాలన అంతంతమాత్రమే.. ● రెగ్యులర్ అధికారిని నియమించాలంటున్న ఉపాధ్యాయులు ఖమ్మం సహకారనగర్ : అత్యంత కీలకమైన ప్రభుత్వ శాఖల్లో విద్యా శాఖ ఒకటి. అంతటి ప్రాధాన్యత గల శాఖకు జిల్లాలో సుమారు మూడేళ్లుగా రెగ్యులర్ డీఈఓ లేకపోవడంతో పాలన అస్తవ్యస్తంగా మారింది. ఇటీవల కాలం వరకు డైట్ ప్రిన్సిపాల్కు అదనపు బాధ్యతలు అప్పగించగా.. ఆయన రెండు బాధ్యతలు నిర్వహించాల్సి రావడంతో దేనిపైనా పూర్తిస్థాయిలో పర్యవేక్షణ చేయలేకపోయారనే విమర్శలు వస్తున్నాయి. జిల్లాలోని పాఠశాలలపై పర్యవేక్షణ, అధికారులతో సమావేశాలు, వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, ఉపాధ్యాయుల సర్దుబాటు, మంత్రులు, ఇతర అధికారుల కార్యక్రమాలకు డీఈఓ హాజరు కావాల్సి ఉంటుంది. వీటితో పాటు నిత్యం పాఠశాలలు, ఉపాధ్యాయులపై పర్యవేక్షణ చేయాలి. అలాంటి కీలక పోస్టు మూడేళ్లుగా ఖాళీగా ఉంది. గతంలో అలా.. డైట్ లెక్చరర్గా ఉన్న సోమశేఖర శర్మను ఎఫ్ఏసీ డీఈఓగా నియమించగా ఆయన పనిచేసిన సుమారు రెండేళ్ల కాలంలోనూ అనేక ఆరోపణలు ఎదుర్కొన్నారు. ప్రధానంగా ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల్లో అక్రమాలు జరిగాయనే ఆరోపణలు సైతం వినిపించాయి. ఆయన డీఈఓగా ఉన్న సమయంలో అనర్హులకు ఉద్యోగాలు ఇవ్వగా దానిపై విచారణ అనంతరం వారిని ఉద్యోగం నుంచి తొలగించారు. ప్రస్తుతం ఇలా.. డైట్ ప్రిన్సిపాల్గా ఉన్న సత్యనారాయణ సుమారు మూడు నెలల క్రితం జిల్లా విద్యాశాఖ అధికారిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ క్రమంలో ఉపాధ్యాయులకు శిక్షణ సమయంలో ప్రభుత్వం నిధులు కేటాయించగా, వాటిలో కొన్ని దుర్వినియోగమయ్యాయనే ఆరోపణలు వచ్చాయి. తాజాగా ఆయన ఉద్యోగ విరమణ పొందిన తర్వాత రోజు కూడా ఆయన పెండింగ్ ఫైళ్లపై సంతకాలు చేశారని కార్యాలయ సిబ్బంది బహిరంగంగానే చెబుతున్నారు. ఉద్యోగ విరమణకు ముందు కూడా పలు కీలక అంశాల్లో సంతకాలు చేశారనే విమర్శలు సైతం వస్తున్నాయి. వీటిపై సమగ్ర విచారణ చేయాలని ఉపాధ్యాయులు డిమాండ్ చేస్తున్నారు. అధికారులు దృష్టి సారించకపోవడం వల్లే.. జిల్లా విద్యాశాఖకు రెగ్యులర్ అధికారి లేకపోవడంతో ఇతరులకు ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించారు. అయితే వారిపై ఉన్నతాధికారులు దృష్టి పెట్టకపోవడంతో ఇష్టారీతిన విధులు నిర్వహించారనే ఆరోపణలు వస్తున్నాయి. తప్పిదాలు వెలుగుచూశాక తూతూ మంత్రంగా చర్యలు తీసుకోవడంతో ఇతర అధికారులు కూడా అదే ఒరవడి కొనసాగిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికై నా రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించి రెగ్యులర్ డీఈఓను నియమిస్తే పాలన గాడిన పడే అవకాశం ఉంటుందని ఉపాద్యాయులు అంటున్నారు. జెడ్పీ డిప్యూటీ సీఈఓకు బాధ్యతలపై అసంతృప్తి.. ఇన్చార్జ్ డీఈఓగా ఉన్న సత్యనారాయణ ఉద్యోగ విరమణ పొందగా తాత్కాలికంగా జెడ్పీ డిప్యూటీ సీఈఓతో ఆ పోస్టు భర్తీ చేయాలని జిల్లా అధికార యంత్రాంగం నిర్ణయించింది. పదోన్నతుల ప్రక్రియ నిర్వహిస్తున్న సమయంలో పూర్తిస్థాయి డీఈఓ లేకుంటే ఎలా అని ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు. జెడ్పీ డిప్యూటీ సీఈఓకు ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించడంపై వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. విద్యాశాఖపై పూర్తిస్థాయిలో అవగాహన లేని వారికి డీఈఓ పోస్టు ఎలా ఇస్తారని అంటున్నారు. వెల్లువెత్తుతున్న ఆరోపణలు.. జిల్లాలో విద్యాశాఖ పనితీరుపై ప్రతీ ఏడాది తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. అయినప్పటికీ అధికార యంత్రాంగంలో మార్పు రాకపోవడం గమనార్హం. కీలక అధికారి పోస్టుకు ఇన్చార్జ్గా నియమితులైన అధికారి చేసే కార్యకలాపాలపై ఉన్నతాధికారులు దృష్టి సారించలేదు. సుమారు నాలుగేళ్లుగా విద్యాశాఖ అధికారి పోస్టు ఖాళీగా ఉన్న నేపథ్యంలో డైట్ కళాశాల సీనియర్ లెక్చరర్, ప్రిన్సిపాల్ ఎఫ్ఏసీ డీఈఓగా విధులు నిర్వహించారు. వీరిద్దరి పనితీరుపై పలు ఆరోపణలు వస్తుండడం విమర్శలకు బలం చేకూరుస్తోంది. -
పేదలందరికీ గూడు కల్పిస్తాం
ముదిగొండ : ప్రతీ పేదవాడికి గూడు నిర్మించే సంకల్పంతో రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నామని, రూ.22,500 కోట్లతో 4.50 లక్షల ఇళ్లు నిర్మిస్తున్నామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. మండలంలోని కమలాపురంలో రూ.10 కోట్లతో నిర్మించే 10వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదాం పనులకు ఆదివారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సకాలంలో సాగునీటి సరఫరా, రుణమాఫీ, రైతు భరోసా వంటి కార్యక్రమాల అమలుతో దేశంలోనే అత్యధికంగా వరి పండించిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందన్నారు. సీతారామ ప్రాజెక్టుతో జిల్లా భూములు సస్యశ్యామలం అవుతాయని చెప్పారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు కింద తుమ్మిడిహట్టి నుంచి ఎల్లంపల్లి నీరు తెచ్చేలా చేసిన డిజైన్ను గత పాలకులు నిర్లక్ష్యం చేశారని, కాళేశ్వరం, సీతారామ ప్రాజెక్టులతో ఒక్క చుక్క నీరు కూడా ఇవ్వలేదని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో ప్రాజెక్టులు పూర్తి చేస్తే నీటికి ఇబ్బంది ఉండేది కాదన్నారు. రాజకీయ విమర్శలకు తావు లేకుండా బనకచర్ల ప్రాజెక్టును ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలని అన్నారు. రాష్ట్రంలో 95 లక్షల పేద కుటుంబాలకు సన్న బియ్యం సరఫరా చేస్తున్నామని, ఆరోగ్యశ్రీ ద్వారా రూ.10 లక్షల వరకు వైద్యసేవలు అందుబాటులోకి తెచ్చామని చెప్పారు. 51 లక్షల కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నామని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల పిల్లలు ఒకే చోట చదువుకునేలా 104 యంగ్ ఇండియా సమీకృత గురుకులాలు నిర్మిస్తున్నామని వివరించారు. మహిళా సంఘాలకు రూ.21వేల కోట్ల వడ్డీ లేని రుణాలు అందించామని, ఐదేళ్లలో రూ.లక్ష కోట్లకు పెంచుతామని చెప్పారు. కమలాపురంలో చేపట్టిన గోదాముల నిర్మాణం వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ గోదాముల నిర్మాణం పూర్తయితే రైతులు పండించే వరి, ఇతర పంటల నిల్వలకు ఇబ్బంది ఉండదని అన్నారు. సన్న ధాన్యానికి రూ. 500 బోనస్తో వరి ఉత్పత్తి పెరుగుతోందని చెప్పారు. అనంతరం పెదమండవ ఎస్సీ కాలనీలో రూ.58.50 లక్షలతో నిర్మించనున్న అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణ పనులకు భట్టి శంకుస్థాపన చేశారు. ముదిగొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన డిజిటల్ తరగతి బోర్డును ప్రారంభించారు. ఆయా కార్యక్రమాల్లో గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, ఎండీ లక్ష్మి, హస్త కళల అభివృద్ధి సంస్థ చైర్మన్ నాయుడు సత్యనారాయణ, సీపీ సునీల్దత్, డీసీసీబీ చైర్మన్ దొండపాటి వెంకటేశ్వరరావు, డీఎంహెచ్ఓ కళావతి బాయి, డీఎంఓ ఎంఏ. అబ్దుల్ అలీమ్, జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ వాసిరెడ్డి శ్రీనివాస్, డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, నాయకులు మందరపు నాగేశ్వరరావు, వనం నర్సింగరావు, వల్లూరి భద్రారెడ్డి, వనం ప్రదీప్త చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో రూ.22,500 కోట్లతో 4.5ం లక్షల ఇందిరమ్మ ఇళ్లు 95 లక్షల రేషన్ కార్డులు, 51 లక్షల కుటుంబాలకు ‘గృహజ్యోతి’ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడి కమలాపురంలో గోదాం నిర్మాణానికి భూమి పూజ -
ప్రయాణం.. ప్రాణ సంకటం
గుంతలమయంగా మారిన రహదారులు ● జిల్లాలో పలుచోట్ల దెబ్బతిన్న రోడ్లు.. ● గతేడాది భారీ వర్షాలకు ధ్వంసమైన వైనం ● మరమ్మతులు చేపట్టక వాహనదారుల ఇక్కట్లు వర్షాలకు దెబ్బతిని.. తల్లాడ – కొత్తగూడెం, తల్లాడ – సత్తుపల్లి ఆర్అండ్బీ రోడ్లు పలుచోట్ల గుంతలు పడి అధ్వానంగా తయారయ్యాయి. ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్లు దెబ్బతిన్నాయి. ముఖ్యంగా తల్లాడ – లక్ష్మీనగర్, బిల్లుపాడు – అంజనాపురం, మల్సూర్తండా వద్ద రోడ్లు పాడయ్యాయి. తారు కొట్టుకుపోయింది. తల్లాడ రింగ్ రోడ్డు సెంటర్లో పరిస్థితి అధ్వానంగా ఉంది. అన్నారుగూడెం – నరసింహారావుపేట వద్ద కూడా రోడ్డు అక్కడక్కడా దెబ్బతిన్నది. రోడ్లు ఇలా ఉండడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల వెళ్లే వాహనాలన్నీ ఈ రోడ్డుపైనే వస్తుంటాయి. ఇప్పటికై నా ఈ రోడ్డు మరమ్మతులపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. సాక్షిప్రతినిధి, ఖమ్మం : జిల్లాలోని ఆర్అండ్బీ, పంచాయతీరాజ్ శాఖ పరిధిలోని రోడ్లన్నీ అస్తవ్యస్తంగా తయారయ్యాయి. భారీ గుంతలతో ఉన్న రహదారులు వాహనదారులను భయపెడుతున్నాయి. ఏడాదిగా రోడ్లన్నీ ఈ దుస్థితిలోనే ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదు. ఆయా శాఖల పరిధిలో ప్రతిపాదనలు పంపడం, నిధులు మంజూరయ్యాయని చెప్పడానికే పరిమితమయ్యారు తప్పితే.. కొత్త రహదారుల మాట అటుంచి కనీసం గుంతలు పూడ్చడం, మరమ్మతులు చేయడం కూడా మర్చిపోయారనే విమర్శలు వస్తున్నాయి. ఈ రహదారులపై వాహనాల రాకపోకలకు తీవ్ర అసౌకర్యం కలగడంతో పాటు పలుమార్లు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. గతేడాది తుపానుతో జిల్లాలోని పలు రహదారులు దెబ్బతిన్నాయి. వీటికి మరమ్మతులు చేయించాలని వాహనదారులు కోరుతున్నారు. అధ్వానం.. అసౌకర్యం.. జిల్లాలోని రహదారులన్నీ గుంతలమయంగా మారాయి. అసలే అంతంత మాత్రంగా ఉన్న రహదారులు గత ఏడాది వచ్చిన భారీ వర్షాలకు మరింతగా దెబ్బతిన్నాయి. ప్రధానంగా పట్టణ ప్రాంతాల నుంచి గ్రామీణ ప్రాంతాలకు వెళ్లే రహదారుల దుస్థితి అధ్వానంగా ఉంది. అలాగే వైరా – జగ్గయ్యపేట రాష్ట్రీయ రహదారిపై పలు చోట్ల గుంతలు పడ్డాయి. ఈ గుంతల్లో నీరు నిల్వడంతో ప్రమాదాలు సంభవిస్తున్నాయి. వైరా మండలం స్టేజీ పినపాక నుంచి ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ జిల్లా నెమలికి వెళ్లే ప్రధాన రహదారి పరిస్థితి మరీ దారుణంగా మారింది. రోడ్డు మధ్యలో పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. పైగా పలుచోట్ల కంకర తేలి గుంతల్లో నీరు నిలిచింది. ఆ రోడ్డుపై వాహదారులు వేగంగా వస్తే ప్రాణాలపై ఆశ వదులుకోవాల్సిందే. వైరా – కొణిజర్ల, కొణిజర్ల మండలంలోని పలు రహదారుల పరిస్థితీ ఇలాగే ఉంది. జిల్లాలోని అనేక ప్రాంతాల్లో ఆర్అండ్బీ, పంచాయతీరాజ్ రోడ్లన్నీ అధ్వానంగా మారాయి. ప్రయాణం.. ప్రమాదమే.. భారీ గుంతలు పడిన రోడ్లపై ప్రయాణం ప్రమాదకరంగా మారుతోందని వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. ప్రధాన రహదారులపై కొత్తగా ప్రయాణించేవారు వీటిపై అవగాహన లేక ప్రమాదాల బారిన పడిన ఘటనలు కూడా ఉన్నాయి. వైరా – జగ్గయ్యపేట రహదారిపై ఇలా పలు ప్రమాదాలు జరిగి ప్రాణాలు కూడా కోల్పోయారు. కనీసం గుంతలు పూడ్చడంపై అయినా అధికారులు దృష్టి పెట్టాలని స్థానికులు కోరుతున్నారు. దెబ్బతిన్న పల్లిపాడు – ఏన్కూరు రహదారి.. కొణిజర్ల మండలం పల్లిపాడు – ఏన్కూరు మధ్య రహదారి దెబ్బతిన్నది. ఖమ్మం నుంచి కొత్తగూడెం, భద్రాచలం వెళ్లేందుకు కొంత దూరం తగ్గేందుకు పలువురు ఈ రోడ్డుపై నుంచే వెళ్తుంటారు. దీంతో 2018లో అప్పటి ప్రభుత్వం దీన్ని డబుల్ రోడ్డుగా మార్చింది. ఇప్పుడు వర్షం పడితే రోడ్డంతా గుంతలమయం అవుతోంది. తీగల బంజర సమీపంలో పగిడేరు ప్రవహిస్తే రోడ్డు దాదాపు 100 మీటర్ల మేర కొట్టుకుపోతోంది. అధికారులు తూతూ మంత్రంగా మరమ్మతులు చేస్తున్నారు. ఈ రోడ్డుపై దాదాపు మోకాళ్ల లోతు గుంతలు ఏర్పడడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల తీగలబంజరకు చెందిన ఓ యువకుడు ద్విచక్ర వాహనంతో సహా గుంతలో పడి తీవ్ర గాయాల పాలయ్యాడు. పల్లిపాడు నుంచి అంజనాపురం వరకు, ఆ తర్వాత జన్నారం నుంచి ఏన్కూరు వరకు రోడ్డు పూర్తిగా ధ్వంసమైంది. -
ఉద్యోగుల పక్షాన నిలబడతాం..
ఖమ్మంరూరల్: ఏదులాపురం కాలనీలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి ఉద్యోగుల పక్షాన నిలబడతామని, మున్సిపాలిటీ అభివృద్ధి కోసం శాయశక్తులా కృషి చేస్తామని టీజీఓ రాష్ట్ర అధ్యక్షుడు, టీజీఈజేఏసీ జనరల్ సెక్రటరి ఏలూరి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. మండలంలోని సత్యనారాయణపురంలో గల టీసీవీరెడ్డి ఫంక్షన్హాల్లో జరిగిన ఏదులాపురం ఉద్యోగ, ఉపాధ్యాయ, రిటైర్డ్ ఉద్యోగుల సమ్మేళనంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. వాస్తవానికి మున్సిపాలిటీ పరిధిలో చాలాకాలనీలు ఉన్నాయని, అవన్నీ గత పాలకుల కాలంలో నిర్లక్ష్యానికి గురయ్యాయని తెలిపారు. ప్రస్తుతం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించారని పేర్కొన్నారు. మున్సిపాలిటీ పరిధిలో దాదాపు 40 వరకు వెంచర్లు ఉన్నాయని, వాటిలో ఉన్న వారంతా కమిటీగా ఏర్పడటం ఎంతో అభినందనీయమని పేర్కొన్నారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ ఆళ్ల శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. సమస్య ఉంటే తనను నేరుగా కలవొచ్చని చెప్పారు. కార్యక్రమంలో భైరు హరినాథ్బాబు, విజయ్, పెరుమాళ్లపల్లి శ్రీనివాసులు, కె.సత్యనారాయణ, ఊడుగు వెంకటేశ్వర్లు, జయపాల్, బి.శోభన్, టి.శ్రీనివాస్, కిషన్నాయక్, డి.నాగమణి, శ్రీదేవి, మద్ది పుల్లయ్య, సాయిబాబా, జి.మల్లికార్జున్, రామయ్య తదితరులు పాల్గొన్నారు. అలాగే, మండలంలోని రాజీవ్గృహకల్పలో జరిగిన సమావేశంలోనూ ఏలూరి శ్రీనివాసరావు పాల్గొని మాట్లాడారు. సమావేశంలో గుంటుపల్లి శ్రీనివాసరావు, కె.సత్యనారాయణ, వెంకన్న, లలితకుమారి, టి.శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. టీజీఓ రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు -
జమలాపురంలో పవిత్రోత్సవాలు ప్రారంభం
ఎర్రుపాలెం: తెలంగాణ తిరుపతిగా ప్రసిద్ధి గాంచిన జమలాపురం శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో ఆదివారం వార్షిక పవిత్రోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 8 – 15 గంటలకు శ్రీ స్వామివారి యాగశాలలో అర్చకులు పూజా కార్యక్రమాలు ప్రారంభించారు. శ్రీ విఘ్నేశ్వర పూజ, పుణ్యావాచనం, రుత్విక్కరణం, మండపారాధన నిర్వహించారు. శ్రీవారి పాదానికి పంచామృతాభిషేకం చేశారు. అనంతరం ప్రధాన కలశ స్థాపన, అగ్నిమథనం, హోమం నిర్వహించి పవిత్ర మాలలకు పుష్పాధివాసం,ఽ ధాన్యాధివాసం, శయ్యాధివాసం నిర్వహించారు. అనంతరం మహా నివేదన, నీరాజన మంత్రపుష్పం పఠించారు. ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ కె.జగన్మోహన్రావు, ప్రధానార్చకులు ఉప్పల శ్రీనివాసశర్మ, వ్యవస్థాపక ధర్మకర్త ఉప్పల శ్రీరామచంద్రమూర్తి, సూపరింటెండెంట్ విజయకుమారి, సిబ్బంది పాల్గొన్నారు. -
కిన్నెరసానిలో పర్యాటకుల సందడి
పాల్వంచరూరల్: కిన్నెరసానిలో ఆదివారం పర్యాటకులు సందడి చేశారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి పర్యాటకులు భారీగా తరలివచ్చారు. కిన్నెరసాని ప్రాజెక్ట్, డ్యామ్, జలాశయం, డీర్ పార్కులోని దుప్పులను వీక్షించారు. ప్రకృతి అందాల నడుమ ఆహ్లాదం పొందారు. 489 మంది పర్యాటకులు కిన్నెరసానిలోకి ప్రవేశించగా వైల్డ్లైఫ్ శాఖకు రూ.25,770 ఆదాయం లభించగా, 320 మంది బోటు షికారు చేయడం ద్వారా టూరిజం కార్పొరేషన్ సంస్థకు రూ.15,010 ఆదాయం లభించినట్లు నిర్వాహకులు తెలిపారు.ఒక్కరోజు ఆదాయం రూ.56,170 -
నేటి నుంచి సర్టిఫికెట్ల పరిశీలన
ఖమ్మం సహకారనగర్ : జిల్లాలో స్కూల్ అసిస్టెంట్(ఎస్ఏ) నుంచి గ్రేడ్–2 హెచ్ఎంలుగా పదోన్నతి కల్పించేందుకు ప్రభుత్వం ఇటీవల షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో ఎస్ఏ, గ్రేడ్–2 హెచ్ఎంలకు సంబంధించిన ఖాళీలను ప్రకటించడంతో పాటు స్కూల్ అసిస్టెంట్ పదోన్నతులకు అర్హులైన వారి జాబితాను సైతం వెల్లడించారు. దీంతో ఆది, సోమవారాల్లో డీఈఓ కార్యాలయ సిబ్బంది అభ్యంతరాలు స్వీకరిస్తున్నారు. అలాగే సోమవారం నుంచి సర్టిఫికెట్లు పరిశీలించనున్నట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా సీనియారిటీ జాబితాపై 25 మంది అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ దరఖాస్తులు సమర్పించారు. అందులో పేర్లు లేనివి 9 ఉండగా.. మిగతావి కరెక్షన్ కోసం దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఎస్ఏ ఉపాధ్యాయులకు గ్రేడ్–2 హెచ్ఎంలుగా పదోన్నతి కల్పించేందుకు ఇప్పటికే అర్హులైన వారి జాబితా ప్రకటించగా.. వారి సర్టిఫికెట్లను సోమ, మంగళవారాల్లో పరిశీలించనున్నారు. ఇందుకోసం ఎనిమిది బృందాలను ఏర్పాటు చేశారు. ఎనిమిది బృందాలతో వెరిఫికేషన్ -
ఆస్పత్రుల అభివృద్ధిపై సర్కారు దృష్టి
తిరుమలాయపాలెం: గ్రామీణ, పట్టణ ప్రాంత ఆస్పత్రుల అభివృద్ధితో పాటు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని సమాచార హక్కు చట్టం కమిషనర్ పి.వి.శ్రీనివాస్ అన్నారు. ఆదివారం ఆయన తిరుమలాయపాలెం సీహెచ్సీని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆస్పత్రిలో అవసరమైన వ్యాధి నిర్ధారణ పరీక్షలు విధిగా చేయాలని, తక్షణమే వైద్య సేవలు అందించి సంపూర్ణ ఆరోగ్యంతో ఇంటికి వెళ్లేలా చూడాలని సిబ్బందికి సూచించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరిగేలా చూడాలన్నారు. డెంగీ వంటి సీజనల్ జ్వరాలు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మండలంలోని చంద్రుతండా, అజ్మీరతండా గ్రామాల్లో ఇప్పటికే డెంగీ కేసులు నమోదయ్యాయని, ఇకపై కేసులు పెరగకుండా అదుపు చేయాలని అన్నారు. సిబ్బంది స్థానికంగా ఉండాలన్నారు. సీహెచ్సీలో సమస్యల పరిష్కారానికి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చర్యలు చేపట్టారని తెలిపారు. అనంతరం ఆపరేషన్ థియేటర్, డెలివరీ గది, వార్డు, ఫార్మసీ, రక్త నమూనాలు సేకరించే ల్యాబ్ను పరిశీలించారు. సిటిజన్ చార్ట్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. సమాచార హక్కు చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ చందూనాయక్, వైద్యులు బొల్లికొండ శ్రీనివాసరావు, కృపాఉషశ్రీ, మాజీ ఎంపీపీ కొప్పుల అశోక్, కమ్మకోమటి నాగేశ్వరరావు, చంద్రశేఖర్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.ఆర్టీఐ కమిషనర్ పి.వి.శ్రీనివాస్ -
●యాభై ఏళ్ల స్నేహం
మధిర: మధిర లడకబజార్కు చెందిన చెరుపల్లి శ్రీహరి, రావిరాల శశికుమార్, కాలం యుగంధర్, చెరుపల్లి శ్రీధర్, కంచి కృష్ణ, ఆలా ఆరోగ్య వరప్రసాద్, కోడెం రమణ, ఎస్.కే.యూనిస్, పాసికంటి రవి, కుడుముల శ్రీనివాసరావు మధ్య 50 ఏళ్ల కిందట ఏర్పడిన పరిచయం స్నేహంగా మారింది. ఇందులో ఐదేళ్ల కిందట కుడుముల శ్రీనివాసరావు అనారోగ్యంతో మృతి చెందగా ఆయన కుటుంబానికి అంతా అండగా నిలవడమే కాక ఆయన పేరిట ఏటా పేదలకు అన్నదానం చేస్తున్నారు. ఉద్యోగాలు, వ్యాపారాల్లో స్థిరపడిన వీరు తరచుగా కలుసుకోవడమే కాక ఎవరి ఇళ్లల్లో ఏ కార్యక్రమం జరిగినా సమష్టిగా బాధ్యతలు పంచుకుంటారు. అంతేకాక ఏటా విహారయాత్రలకు వెళ్తున్నారు. -
మేమంతా ఉన్నాం..
నీ కోసం నేనున్నా అనే ఆత్మీయ స్పర్శే స్నేహం. నిరాశ, నిస్పృహలు చుట్టుముట్టినా, భరించలేని కష్టం ఎదురైనా అండగా నిలబడే వారే స్నేహితులు. ప్రతిఫలంగా హితం కోరే వారిని నిజమైన స్నేహితులుగా భావిస్తారు. అలాంటి స్నేహం ఏళ్లు గడిచినా, స్థాయి మారినా కొనసాగితేనే ఆనందం! పలువురు తమ బృందంలోని వారికి సుఖాల్లోనే కాక కష్టాల్లోనూ తోడుగా నిలుస్తూ స్నేహబంధాన్ని చాటుతున్నారు. ఇంకొందరు స్నేహితులు బృందాలుగా ఏర్పడి ఆపదలో ఉన్న వారికి చేయూతనిస్తున్నారు. నేడు (ఆదివారం) అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం సందర్భంగా అలాంటి బృందాల్లో కొందరి కథనాలు. ● స్నేహం.. ఓ మాధుర్యం ● ఏళ్లు గడిచినా, స్థాయి పెరిగినా తగ్గని మైత్రి ● కష్టసుఖాల్లో అండగా నిల్తున్న మిత్రులు నేడు అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం ●డిగ్రీ స్నేహం.. చెదరని బంధం ఖమ్మంమయూరిసెంటర్: పాతికేళ్ల కిందట పాల్వంచ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో మొదలైన స్నేహం నేటికీ కొనసాగుతోంది. 1998–2001లో డిగ్రీ చదివిన జె.శివలింగం, శ్రీనివాసరావు, సత్యనారాయణ, త్రివేణి మధ్య ఏర్పడిన స్నేహం ఎక్కడా ఆగిపోలేదు. డిగ్రీ తర్వాత జె.శివలింగం గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో అకౌంట్స్ ఆఫీసర్గా, సత్యనారాయణ సాఫ్ట్వేర్ ఉద్యోగిగా, శ్రీనివాసరావు ఫార్మా రంగంలో, త్రివేణి ఉపాధ్యాయురాలిగా స్థిరపడ్డారు. కానీ, స్నేహం అలాగే ఉండటం, నలుగురి కుటుంబాలూ కలిసి ఆనందాల్లో పాలుపంచుకుంటూ, కష్టాల్లో అండగా నిలుస్తూ ముందుకు సాగుతున్నారు. -
జాతీయ సదస్సులో ఖమ్మం న్యాయవాది
ఖమ్మంలీగల్: కాంగ్రెస్ లీగల్ సెల్ జాతీయ కమిటీ ఆధ్వార్యన ఢిల్లీలో శనివారం రాజ్యాంగ పరిరక్షణ న్యాయవాద సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో లీగల్సెల్ రాష్ట్ర కన్వీనర్, ఖమ్మంకు చెందిన సింగం జనార్దన్ పాల్గొన్నా రు. 150 మంది న్యాయవాదులు పాల్గొనగా పలు అంశాలపై చర్చించినట్లు ఆయన ఓ ప్రకటనలో తెలిపారు. లాలాపురం వాసికి డాక్టరేట్కొణిజర్ల: మండలంలోని లాలాపురం గ్రా మానికి చెందిన ఇమ్మడి శ్రీనివాస్కు తమిళనాడులోని అన్నామలై యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ లభించింది. శ్రీనివాస్ ఎంఏ, ఎంఫిల్ పూర్తిచేశాక అన్నామలై యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ విల్లయికరసి పర్యవేక్షణలో సమర్పించిన పరిశోధనాత్మక సిద్ధాంత గ్రంథానికి డాక్టరేట్ ప్రకటించారు. ప్రస్తుతం ఆయన అసిస్టెంట్ ప్రొఫెసర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. సమాచార హక్కు చట్టం పకడ్బందీగా అమలు చేయాలి ఖమ్మంవైద్యవిభాగం/ఖమ్మం అర్బన్: ప్రభు త్వ కార్యాలయాల్లో సమాచార హక్కు చట్టాన్ని పారదర్శకంగా అమలు చేయాలని ఆర్టీఐ కమిషనర్ పీ.వీ.శ్రీనివాసరావు సూచించారు. కలెక్టరేట్లోని డీఎంహెచ్ఓ కార్యాలయాన్ని శనివా రం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఇప్పటివరకు అందిన దరఖాస్తులు, పరిష్కారంపై ఆరా తీశాక జిల్లా పౌరసంబంధాల అధికారి కా ర్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. రెండేళ్ల పాటు ఆర్టీఐ కమిషనర్ నియామకం లేక వేలా ది కేసులు పేరుకుపోయినందున త్వరగా పరిష్కరించేలా జిల్లాల్లో పర్యటిస్తున్నట్లు తెలిపారు. కాగా, ప్రతీ ప్రభుత్వ కార్యాలయం వద్ద సమాచార హక్కు చట్టం బాధ్యుల వివరాలు, ఫోన్ నంబర్లతో బోర్డులు ఏర్పాటు చేయాలని కమిషనర్ సూచించారు. అలాగే, ఖమ్మం ఇందిరానగర్లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలను సందర్శించిన సమాచార హక్కు చట్టం కమిషనర్ శ్రీనివాసరా వు విద్యార్థులతో మాట్లాడడంతో పాటు వారితో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. కార్యక్రమంలో హెచ్ఎం, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
●సేవలో మేటి.. యువ భారత్శక్తి
సత్తుపల్లిటౌన్: ఇంటర్, బీటెక్ కలిసి చదువుకున్న తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల వారు స్నేహబంధాన్ని కొనసాగిస్తూ యువభారత్ శక్తిగా ఏర్పడ్డారు. సత్తుపల్లికి చెందిన కామెర క్రాంతి, గౌస్పాషా, శబరినాథ్ కలిసి 2014 నుంచి సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఆపై 2018లో యువభారత్శక్తి ఫౌండేషన్ను ఏర్పాటుచేసి వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్ట్రాగాం ద్వారా ఎవరికి ఆపద ఉందని తెలిసినా అండగా నిలుస్తున్నారు. ఇప్పటి వరకు రూ.కోటి మేర సహాయం అందించడం విశేషం. ఉమ్మడి జిల్లాలో 46 రక్తదాన శిబిరాల ద్వారా 5 వేల మందికి రక్తదాననం చేశారు. జిల్లాలోని 24 ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు రూ.1.50 లక్షల విలువైన బ్యాగ్లు, కరోనా సమయంలో 60 రోజుల పాటు యాచకులు, వృద్ధులకు భోజనంతో పాటు వేయికి పైగా కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. 2020లో రూ.11.35 లక్షలు, 2021లో రూ.13.82 లక్షలు 2022లో రూ.15.59 లక్షలు, 2023లో రూ.15.48 లక్షలు, 2024లో రూ.12.69 లక్షలు, ఈ ఏడాది ఇప్పటి వరకు రూ.7 లక్షల మేర అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఆర్థిక సాయం అందించారు. కాగా, సేవాకార్యక్రమాలకు గాను పలు ఫౌండేషన్ల ద్వారా ‘యువభారత్ శక్తి’కి పురస్కారాలు లభించాయి. స్నేహితులే నా బలం.. 12 ఏళ్లుగా నిర్విరామంగా స్నేహితుల సహకారంతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. సోషల్ మీడియా వేదికగా ఆర్థిక సాయం సేకరించి అవసరమైన వారికి అందిస్తున్నాం. పది మందితో మొదలైన ఫౌండేషన్ ప్రస్తుతం 4 వేల మంది సభ్యులతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. –కామెర క్రాంతి, యువభారత్శక్తి ఫౌండేషన్ ఫౌండర్ ● -
●స్నేహంతో పాటు సమాజహితం
ఖమ్మంగాంధీచౌక్: ఖమ్మానికి చెందిన తూములూరి లక్ష్మీనరసింహారావు, పెనుగొండ శ్రీనివాసరావు, పల్లా లింగయ్య, బజ్జూరి రమణారెడ్డి, సోమారపు సుధీర్కుమార్, సూరినేటి మల్లేశం, దేవరశెట్టి రామారావు, పెనుగొండ సాయికుమార్, మోతుకూరి భద్రయ్య, ఎంఎస్.పుల్లారావు, జి.సూర్యనారాయణ, జంగిలి రమణ, మిట్టపల్లి రాధాకృష్ణ తదితరుల మధ్య ముప్పై ఏళ్లుగా స్నేహం కొనసాగుతోంది. జ్యోతి నివాసంలో ఉంటున్న అంధ, మూగ, చెవిటి విద్యార్థులకు నిత్యావసరాలు పంపిణీ చేశారు. ఖమ్మం రూరల్ మండలం మంగళగూడెం హైస్కూల్ విద్యార్థులకు నోట్ బుక్స్, పరీక్ష సామగ్రి, అంగన్వాడీ కేంద్రాలకు తాగునీటి ఫిల్టర్లు అందించగా.. ఓ షాప్లో గుమస్తా హరిప్రసాద్ ఇద్దరు కూతుళ్ల చదువులకు రూ.5 వేల చొప్పున ఆర్థిక సాయం చేశారు. ఏటా వేసవిలో హర్కారా బావి సెంటర్లో మజ్జిగ పంపిణీ చేసే ఈ బృందం సభ్యులు... కరోనా సమయాన ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలో రోగుల సహాయకులకు నిత్యం భోజనం సమకూర్చారు. -
కాంగ్రెస్లో కష్టపడిన కార్యకర్తలకు గుర్తింపు
ఖమ్మంమయూరిసెంటర్: కాంగ్రెస్ అభివృద్ధి కోసం నిరంతరం కష్టపడిన కార్యకర్తలకు గుర్తింపునిచ్చేందుకే రాజీవ్గాంధీ పంచాయతీరాజ్ సంఘటన్ (ఆర్జీపీఆర్ఎస్)ను ఏర్పాటు చేసినట్లు పార్టీ జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, ఆర్జీపీఆర్ఎస్ నిర్వాహకులు గంటా వినయ్ తెలిపారు. ఖమ్మంలోని కాంగ్రెస్ కార్యాలయంలో శనివారం ఆర్జీపీఆర్ఎస్పై పార్టీ శ్రేణులతో చర్చించాక వారు విలేకరులతో మాట్లాడారు. ఎవరైతే కాంగ్రెస్ పార్టీ కోసం నిరంతరం కష్టపడ్డారో వారిని కొత్తతరం నాయకులుగా తీర్చిదిద్దడానికి ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. కష్టపడిన వారికి కచ్చితంగా గుర్తింపు లభిస్తుందని, ఇందుకోసం గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లాస్థాయిలో ఆర్జీపీఆర్ఎస్ ద్వారా పరిశీలన ఉంటుందని వెల్లడించారు. సమావేశంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నూతి సత్యనారాయణ, నాయకులు దొబ్బల సౌజన్య, మహ్మద్ జావీద్ పాల్గొన్నారు. -
●మిత్ర ఫౌండేషన్ ఆపన్న హస్తం
ఖమ్మంగాంధీచౌక్: ఆపదలో ఉన్న వారికి అండగా నిలుస్తూ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోంది మిత్ర ఫౌండేషన్. వ్యాపారం, వివిధ వృత్తులు, ఉద్యోగాల్లో స్థిరపడిన ఖమ్మానికి చెందిన ఈ బృందం సభ్యులు సామాజిక సేవ, చైతన్యం కోసం రూ.లక్షలు వెచ్చిస్తున్నారు. గోదావరి, మున్నేటి వరదల సమయాన ముంపు ప్రాంతాల ప్రజలకు రూ.10 లక్షల విలువైన నిత్యావసరాలు అందించారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఏటా సైకిళ్లు, బుక్స్, బ్యాగులు అందిస్తున్నారు. గత ఏడాది పదో తరగతిలో ఉత్తమ ర్యాంకులు సాధించిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు రూ.3 లక్షల విలువైన బహుమతులు ఇవ్వడమే కాక టాపర్లు ఐదుగురికి విమానంలో ఢిల్లీ యాత్రకు తీసుకువెళ్లారు. కురువెళ్ల ప్రవీణ్కుమార్ చైర్మన్గా వ్యవహరిస్తున్న మిత్ర ఫౌండేషన్లో రంగా శ్రీనివాస్, పాలవరపు శ్రీనివాస్, చారుగుండ్ల రవికుమార్, చెరుకూరి యుగంధర్, నాగసాయి గ్యాస్ నగేశ్ తదితరులు సభ్యులుగా ఉన్నారు. -
●ఒకరికొకరుగా పూర్వవిద్యార్థులు
ముదిగొండ: ఒకరి కోసం మరొకరు అన్నట్లుగా ఈ స్నేహబంధం కొనసాగుతోంది. ఏటా ఓ వేదికపై కలుస్తూ ఆ సంవత్సరం చేయాల్సిన మంచి పనులు నిర్ణయించుకుని ముందుకు సాగు తున్నారు. మండలంలోని బా ణాపురం పాఠశాలలో ఒకటి నుంచి పదోతరగతి వరకు (2005–06 బ్యాచ్) చదివిన పూర్వ విద్యార్థులు సంఘంగా ఏర్పడ్డారు. ఈ బృందంలో 45 మంది ఉండగా.. 2023 నుంచి ఎవరికి ఏం జరిగినా సమాచారం ఇచ్చిపుచ్చుకుంటూ చేయూతనిస్తున్నారు. 2023లో ఏన్కూరు వద్ద రోడ్డు ప్రమాదంలో ఈ బృందానికి చెందిన వేణు మృతి చెందగా ఆయన ఇద్దరు కుమార్తెల పేరిట రూ.50 వేలు ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. 2024లో మరో స్నేహితురాలి భర్త అనారోగ్యంతో బాధపడుతుంటే చికిత్సకు రూ.40 వేలు అందించి ఆదుకున్నారు. మరో కుటుంబానికి రూ.13 వేల నిత్యావసర సరుకులు అందించగా.. ఇంకో స్నేహితుడు మృతి చెందగా రూ.40 వేలు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. అండగా అందరం.. కలిసి చదువుకున్న మేం ఏటా సమావేశమై మంచీచెడు చర్చించుకుంటాం. వృత్తి, వ్యాపారాలు, కుటుంబ వ్యవహారాలు, ఆర్థిక ఇబ్బందులు, శుభకార్యాలపై మాట్లాడుకుంటాం. అలాగే, మా బ్యాచ్కు సంబంధించిన ఎవరికి ఆపద వచ్చినా అంతా కలిసి అండగా నిలుస్తున్నాం. –బెందు లక్ష్మణ్, బాణాపురం కలిసికట్టుగా.. తోడునీడగా ఎక్కడ పనిచేస్తున్నా.. ఎంత దూరంలో ఉన్నా మా బృందంలో ఎవరికై నా సమస్య ఎదురైందంటే వెంటనే వచ్చేస్తాం. శుభకార్యాలకు బహుమతులు ఇవ్వడమే కాక ఇబ్బందుల్లో ఉన్న వారిని అండగా నిలుస్తున్నాం. అందరం కలసికట్టుగా, తోడునీడగా కొనసాగుతున్నాం. –డీకొండ వెంకటేశ్, బాణాపురం ● -
స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి
వైరా/తల్లాడ: త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు బీఆర్ఎస్ శ్రేణులు సిద్ధం కావాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూధన్ సూచించారు. వైరా, తల్లాడ మండలం నారాయణపురంలో శనివారం నిర్వహించిన బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశాల్లో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పాలనపై విసుగు చెందిన ప్రజలు బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్నారని తెలిపారు. ఈమేరకు ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తూ స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలని చెప్పారు. అయితే, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమల్లోకి వచ్చాకే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మాట్లాడుతూ స్థానిక సంస్థలతో పాటు మున్సిపల్ ఎన్నికల్లోనూ అత్యధిక సీట్లు సాధించేలా బీఆర్ఎస్ శ్రేణులు కృషి చేయాలన్నారు. మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ ముళ్లపాటి సీతారాములు, బీఆర్ఎస్ మండల, పట్టణ అధ్యక్షులు బాణాల వెంకటేశ్వరరావు, మద్దెల రవితో పాటు నాయకులు కట్టా కృష్ణార్జునరావు, వనమా విశ్వేశ్వరరావు, భూమాత కృష్ణమూర్తి, కాపా మురళీకృష్ణ మాదినేని సునీత, రెడ్డెం వీరమోహన్రెడ్డి, దొడ్డా శ్రీనివాసరావు, దుగ్గిదేవర వెంకట్లాల్, మువ్వా మురళి, బద్దం కోటిరెడ్డి, పెరికె నాగేశ్వరరావు, గరిడేపల్లి వెంకటేశ్వర్లు, కటికి నరసింహారావు, రఘు, కేతినేని చలపతిరావు, అయిలూరి ప్రదీదీరెడ్డి, తూము శ్రీనువాసరావు పాల్గొన్నారు. ●ఖమ్మం మామిళ్లగూడెం: ఖమ్మంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో 88మందికి మంజూరైన రూ.22 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్సీ మధుసూదన్, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అందజేసి మాట్లాడారు. నాయకులు సామినేని హరిప్రసాద్, బెల్లం వేణు, అజ్మీరా వీరునాయక్, బాషబోయిన వీరన్న, కనగాల వెంకటరావు, వాచేపల్లి లక్ష్మారెడ్డి, ఉప్పల వెంకటరమణ, బిచ్చాల తిరుమలరావు, కర్నాటి కృష్ణ, రుద్రగాని శ్రీదేవి, పోట్ల శీను, లకావత్ గిరిబాబు, పగడాల నరేందర్, లింగనబోయిన సతీష్, బంక మల్లయ్య, బలుసు మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తాతా మధు -
స్నేహితులతోనే అన్నీ పంచుకుంటాం..
తల్లిదండ్రుల తర్వాత కష్టసుఖాలు, ఆనందాలు పంచుకునేది స్నేహితులతోనే. తల్లిదండ్రులతో పాటు స్నేహితులు కూడా కుటుంబీకులే. అన్ని దినుసులు వేస్తేనే మంచి వంటకం తయారైనట్లు మంచి స్నేహితులు ఉంటే మన జీవితం కూడా రుచికరమైన వంటలా ఉంటుంది. – వి.హనీష, వార్డు ఆఫీసర్, కేఎంసీ స్నేహితులు లేని జీవితం లేదు.. స్నేహితులు లేని జీవితం ఉండదు. చిన్ననాటి నుంచి స్నేహితులతో గడిపిన క్షణాలు ఎన్నటికీ మరిచిపోలేం. రక్త సంబంధీకులతో సైతం పంచుకోలేని విషయాలు స్నేహితులమంతా ఒకరికి ఒకరం చెప్పుకుంటాం. కష్టాలు, సంతోషాల్లో నాతో నడిచిన స్నేహితులు చాలా మంది ఉన్నారు. – జి.ప్రసాద్, ఖమ్మం -
బాలల జీవితాల్లో వెలుగులు
● అనాథ పిల్లలకు గుర్తింపు కార్డుల జారీ ● జనన ధ్రువీకరణ, ఆధార్, ఎఫ్ఎస్సీ, ఆరోగ్యశ్రీ కార్డులు కూడా.. ● కలెక్టర్ చొరవతో 81 మంది పిల్లలకు లబ్ధిఖమ్మంమయూరిసెంటర్: కుటుంబీకులు ఎవరో తెలియక... చిరునామా లేకుండా జిల్లాలోని బాలల సదనం, అనాథ శరణాలయాల్లో ఉండడమే కాక ఉనికిని నిరూపించుకోలేని అసహాయత.. ప్రభుత్వ ఆసరాకు దూరంగా జీవిస్తున్న బాలల జీవితాల్లో వెలుగురేఖలు ప్రసరించే సమయం ఆసన్నమైంది. జిల్లా యంత్రాంగం తీసుకున్న మానవీయ నిర్ణయం వారి బతుకులకు కొత్త అర్థాన్ని ఇవ్వనుంది. అనాథ బాలలందరికీ జనన ధృవీకరణ పత్రాలు, ఆధార్ కార్డులు, ఫుడ్ సెక్యూరిటీ కార్డులే కాక ఆరోగ్యశ్రీ కార్డులు జారీ చేసే బృహత్తర కార్యక్రమానికి కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి శ్రీకారం చుట్టారు. దీన్ని పరిపాలనా ప్రక్రియగా కాక చిన్నారుల జీవితాలకు గౌరవప్రదమైన పునరుజ్జీవనంగా అధికారులు చెబుతున్నారు. కలెక్టర్ ప్రత్యేక చొరవతో జిల్లాలోని 81 మంది అనాథ బాలలకు గుర్తింపు లభించనుంది. నిరాశ నుండి నూతన ఆశకు.. సమాజంలో గుర్తింపు లేకపోవడం ఎంతటి వేదనో అనుభవించిన వారికే తెలుస్తుంది. అనాథ బాలలు అలాంటి వేదనను నిత్యం అనుభవించారు. పాఠశాల మెట్లు ఎక్కాలన్నా, అనారోగ్యానికి గురైతే వైద్యం పొందాలన్నా నువ్వెవరు.. అన్న ప్రశ్న ఎదురయ్యేది. ఆధార్ కార్డు కూడా లేని కారణంగా వారికి కేటాయించిన హక్కులు, అవకాశాలు దక్కలేదు. ప్రతీ చిన్న అవసరానికి ఆటంకాలు ఎదురవుతుండడం లేత మనస్సులపై ప్రభావం చూపించింది. కంటి నిండా కలలు ఉన్నా, సాకారం చేసుకునేందుకు కనీస మార్గం లేకపోవడాన్ని గ్రహించిన కలెక్టర్ అనుదీప్ మానవతా దృక్పథంతో బాలలకు సరైన దారి చూపాలని నిర్ణయించారు. భవిష్యత్కు భరోసా.. చిన్నారుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు అధికారులు ప్రణాళిక రూపొందించారు. జిల్లాలోని ప్రభుత్వ బాలల సదనంతో పాటు స్వచ్ఛంద సేవా సంస్థల ఆధ్వర్యాన నిర్వహిస్తున్న అనాథశరణాలయాల్లో ఉన్న చిన్నారులకు గుర్తింపు ఇచ్చేందుకు నిర్ణయించారు. ఈమేరకు 81 మందికి ఎలాంటి గుర్తింపు లేదని తెలుసుకున్న అధికారులు కలెక్టర్ ఆదేశాలతో ఐడీ కార్డుల జారీకి శ్రీకారం చుట్టారు. తొలుత జనన ధృవీకరణ పత్రం(ఆర్డీఓ ప్రొసీడింగ్స్ ద్వారా) ఇప్పించారు. ఆ పత్రం ఆధారంగా ఆధార్ కార్డు, అందులోని చిరునామా ఆధారంగా ఫుడ్ సెక్యూరిటీ కార్డు జారీ చేశారు. అంతేకాక ఆరోగ్యశ్రీ కార్డుకు దరఖాస్తు చేయడంతో అందరి లాగే ఆ చిన్నారులకు గుర్తింపుతో పాటు భవిష్యత్పై భరోసా లభిస్తోంది. అంతేకాక వారిలో ఆత్మవిశ్వాసం, ఆశలను.. సమాజంలో తమకంటూ ఒక స్థానం ఉందని గుర్తించే భరోసాను కల్పించినట్లయింది. కాగా, ఆరోగ్యశ్రీ కార్డుల ద్వారా ఉచితంగా రూ.10 లక్షల వరకు వైద్యసేవలు పొందనుండడం విశేషం.జిల్లాలో అనాథ బాలల వివరాలు.. బాలల సదనం 55 అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ, ఖమ్మం 15 శాంతి నిలయం, బోనకల్ 11 మొత్తం 81 -
నేడు డిప్యూటీ సీఎం భట్టి పర్యటన
ముదిగొండ: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆదివారం ముదిగొండ మండలంలో పర్యటించనున్నారు. కమలాపురంలో రూ.10 కోట్ల నిధులతో నిర్మించే గిడ్డంగి, కమలాపురం, పెద్ద మండవ, వల్లభి, ముదిగొండల్లో రూ.10 కోట్ల నిధులతో నిర్మించే సీసీ రోడ్లకు డిప్యూటీ సీఎం శంకుస్థాపన చేస్తారని రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ రాయల నాగేశ్వరరావు తెలిపారు. ఈ మేరకు ఆయన శనివారం కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్తో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. మంత్రి పొంగులేటి.. ఖమ్మంమయూరిసెంటర్: రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదివారం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు ఖమ్మం చేరుకోనున్న ఆయన రఘునాథపాలెం మండలం వి.వెంకటాయపాలెం, వేంసూరు మండలం అడసర్లపాడు, సత్తుపల్లిలో జరిగే ప్రైవేట్ కార్యక్రమాలకు హాజరవుతారు. సాయంత్రం 5 గంటలకు తిరుమలాయపాలెంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్న మంత్రి.. లబ్ధిదారులకు రేషన్కార్డులు, కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేస్తారు. అలాగే, ఆతర్వాత 6 గంటలకు కొక్కిరేణిలో అభివృద్ధి పనులకు పొంగులేటి శంకుస్థాపన చేయనున్నారు. శాకాంబరీ రూపంలో అమ్మవార్లు ఎర్రుపాలెం: జమలాపురంలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి మూలవిరాట్తో పాటు ఆలయ ఆవరణలోని స్వామివారి పాదానికి పంచామృతంతో అభిషేకం జరిపించారు. ఆతర్వాత అలివేలు మంగ, పద్మావతి అమ్మవార్లను శాకాంబరీదేవి రూపంలో అలంకరించగా పెద్దసంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. అలాగే, స్వామి, అమ్మవార్ల కల్యాణం, పల్లకీ సేవ నిర్వహించారు. కాగా, ఆదివారం నుంచి 5వ తేదీ వరకు ఆలయంలో పవిత్రోత్సవాలు నిర్వహించనున్నట్లు ఈఓ కె.జగన్మోహన్రావు తెలిపారు. వ్యవస్థాపక ధర్మకర్త ఉప్పల శ్రీరామచంద్రమూర్తి, ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాసశర్మ, సూపరింటెండెంట్ విజయకుమారి, అర్చకులు రాజీవ్శర్మ, మురళీమోహన్శర్మ పాల్గొన్నారు. భూసమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి ఎర్రుపాలెం: భూసమస్యలపై అందిన దరఖాస్తుల పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. ఎరుపాలెం తహసీల్ను శనివారం తనిఖీ చేసిన ఆయన రికార్డులు పరిశీలించాక భూసంబంధిత సమస్యలపై ఆరా తీశారు. అలాగే, ములుగుమాడులో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన భూముల రీసర్వే, రెవెన్యూ సదస్సుల్లో అందిన దరఖాస్తుల పరిశీలన, భూభారతి పోర్టల్పై తహసీల్దార్ ఎం.ఉషాశారదతో చర్చించి సూచనలు చేశారు. ఆర్ఐ రవి, సర్వేయర్ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ సమస్యల పరిష్కారానికి కృషి వైరారూరల్: పొలంబాట ద్వారా రైతులు ఎదుర్కొంటున్న విద్యుత్ సంబంధిత సమస్యలను తెలుసుకుని పరిష్కరిస్తున్నామని ఎస్ఈ శ్రీని వాసాచారి తెలిపారు. వైరా మండలం దాచాపురంలో శనివారం నిర్వహించిన పొలం బాటలో ఆయన పాల్గొన్నారు. తక్కువ ఎత్తులో ఉన్న లైన్లు, ట్రాన్స్ఫార్మర్లు తదితర సమస్యలు తెలుసుకోవడంతో పాటు విద్యుత్ మోటార్లకు కెపాసిటర్ల ఏర్పాటుతో లాభాలను వివరించారు. ఏడీఏ కిరణ్కుమార్, ఏఈ వెంకటసాయి, లైన్మెన్ పాషా పాల్గొన్నారు. సీనియారిటీ జాబితా విడుదల ఖమ్మం సహకారనగర్: ఉపాధ్యాయుల పదో న్నతుల ప్రక్రియ మొదలైంది. ఈమేరకు స్కూల్ అసిస్టెంట్లకు గ్రేడ్–2 హెచ్ఎంలుగా పదోన్నతి కల్పించనుండగా శనివారం సీనియారిటీ జాబితాతో పాటు గ్రేడ్–2 హెచ్ఎం ఖాళీలను ప్రకటించారు. జిల్లాలో 2,859 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉండగా 2,503 మంది ఉపాధ్యాయులు విధులు నిర్వర్తిస్తున్నారు. వీరిలో పదోన్నతులకు 260మందిని అర్హులుగా గుర్తించారు. కాగా, సీనియారిటీ జాబితాపై అభ్యంతరాలు స్వీకరించి పరిశీలించాక తుదిజాబితా విడుదల చేయనున్న అధికా రులు ధ్రువపత్రాల పరిశీలన అనంతరం పదోన్నతుల ఉత్తర్వులు జారీ చేస్తారు. -
నానో యూరియాతో మంచి ఫలితాలు
వైరా: పంటల్లో సంప్రదాయ గుళికల యూరియాకు బదులు నానో యూరియా వాడడం ద్వారా మంచి ఫలితాలు వస్తాయని జిల్లా వ్యవసాయాధికారి ధనసరి పుల్లయ్య తెలిపారు. వైరా మున్సిపాలిటీ పరిధి సోమవరంలో నానో యూరియా, నానో డీఏపీపై శనివారం రైతులకు అవగాహన కల్పించారు. రైతులు అవసరం మేరకే యూరియా వాడడం ద్వారా భూసారాన్ని సంరక్షిస్తూ ఖర్చు తగ్గించుకోవాలని సూచించారు. ఏఓ మయాన్ మంజుఖాన్, ఏఈఓ మేడా రాజేష్, రైతులు పాల్గొన్నారు. ●ఖమ్మంవ్యవసాయం: రైతులు నానో యూరియా వినియోగానికి అలవాటు పడుతున్నారని డీఏఓ పుల్లయ్య తెలిపారు. ఖమ్మంలోని ఫర్టిలైజర్ షాప్లను ఏఓ కిశోర్బాబుతో కలిసి తనిఖీ చేశాక మాట్లాడారు. నానో యూరియాతో లాభాలపై రైతులకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. -
పకడ్బందీగా ఆర్టీఐ చట్టం అమలు
ఖమ్మంసహకారనగర్: గత రెండేళ్లుగా ఆర్టీఐ కమిషనర్లు లేని కారణంగా 15 వేలకు పైగా కేసులు పేరుకుపోయాయని, వీటిని త్వరగా పరిష్కరిస్తూ చట్టాన్ని పకడ్బందీగా అమలుచేయడంపై అధికారులు దృష్టి సారించాలని సమాచార హక్కు చట్టం కమిషనర్ పీ.వీ.శ్రీనివాసరావు సూచించారు. ఖమ్మం కలెక్టరేట్లో మరో కమిషనర్ భూపాల్, కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, పోలీస్ కమీషనర్ సునీల్దత్, అదనపు కలెక్టర్ పి.శ్రీనివాస్రెడ్డితో కలిసి శుక్రవారం ఆయన అధికారులతో సమీక్షించారు. పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించాలనే లక్ష్యంతో ఉన్నందున అధికారులు సహకరించాలని తెలి పారు. దరఖాస్తుల పరిష్కారంలో ఆలస్యమైతే ప్రజల్లో అనుమానాలు రానున్నందున.. ఎప్పటికప్పుడు అందుబాటులో ఉన్న సమాచారం ఇవ్వాలని సూచించారు. మరో కమిషనర్ భూపాల్ మాట్లాడుతూ ఆర్టీసీ చట్టంపై అధికారులు పూర్తి స్థాయిలో అవగాహన పెంచుకోవాలని తెలిపారు. అనంతరం పెండింగ్ కేసులపై అప్పీళ్లను స్వీకరించారు. ఆతర్వాత కలెక్టర్ అనుదీప్ మాట్లాడగా ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అభిషేక్ అగస్త్య, డీఎఫ్ఓ సిద్ధార్థ్ విక్రమ్ సింగ్, డీఆర్ఓ పద్మశ్రీ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. రిటైనింగ్ వాల్ పనులపై కలెక్టర్ సమీక్ష ఖమ్మం మున్నేరు అభివృద్ధి పనులపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించి భూసేకరణలో వేగం పెంచాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆదేశించారు. మున్నేటి రిటైనింగ్ వాల్ నిర్మాణ పురోగతి, అవసరమైన భూసేకరణ, భూనిర్వాసితులకు ఇచ్చే లే ఔట్ పనులపై శుక్రవారం అధికారులతో సమీక్షించారు. రిటైనింగ్ వాల్ నిర్మాణానికి అవసరమైన భూమి సేకరించడమే కాక, నిర్వాసితులకు స్థలాలు కేటాయించనున్న లేఔట్ అభివృద్ధిపై సూచనలు చేశారు. రైతుల పొలాలకు ప్రత్యామ్నాయంగా ప్లాట్లును కేటాయిస్తున్నందున లేఔట్లో అంతర్గత రోడ్లు, వీధి లైట్లు, విద్యుత్ సంబంధిత పనులు చేపట్టాలని తెలిపారు. పాలేరు నియోజకవర్గ ప్రత్యేక అధికారి రమేష్, నీటి పారుదల శాఖ డిప్యూటీ ఈఈ రమేష్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.కమిషనర్లు శ్రీనివాసరావు, భూపాల్ -
ఆశ్రీ.. ఉన్నాయి అంతే!
జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్ల సమస్య నిత్యకృత్యమైంది. అనేక పాఠశాలల్లో మరుగుదొడ్లు లేక విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా ఈ విషయంలో బాలికల తిప్పలు చెప్పనలవి కాకుండా ఉన్నాయి. ప్రభుత్వం మరుగుదొడ్ల ఏర్పాటు, మరమ్మతులపై ఏ మాత్రం దృష్టి సారించకపోవడమే కాక పలు చోట్ల నీటి సరఫరా లేకపోవడం.. ఇంకొన్ని చోట్ల తలుపులు బేడాలు లేకపోవడంతో నిరుపయోగంగా మారాయి. – సాక్షిప్రతినిధి, ఖమ్మంఇలా ఉండాల్సిందే.. పాఠశాలలో టాయిలెట్లు, యూరినల్స్ నిర్మాణంపై ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు ఉన్నా అమలుకు నోచుకోవడం లేదు. ప్రతీ 30 మంది విద్యార్థులకు ఒక టాయిలెట్, ప్రతీ పది మందికి ఒక యూరినల్ ఉండాలి. కానీ ఎక్కడా ఇలా ఉన్న దాఖలాలు కానరావు. ప్రభుత్వం తరఫున చొరవ లేకపోగా విద్యాశాఖ అధికారులు సైతం పట్టించుకోకపోవడం విద్యార్థుల సమస్యకు కారణమవుతోంది. ప్రతిపాదనలతోనే సరి జిల్లాలోని పలు పాఠశాలల్లో టాయిలెట్ల అవసరాన్ని విద్యాశాఖ అధికారులు గుర్తించారు. బాలురకు సంబంధించి 75 పాఠశాలల్లో 75, బాలికలకు సంబంధించి ఆరు పాఠశాలల్లో ఆరు టాయిలెట్లు నిర్మించాలని ప్రతిపాదించారు. అలాగే, 14 పాఠశాలల్లో బాలురకు 103 టాయిలెట్లు, ఐదు చోట్ల బాలికలకు 26 టాయిలెట్ల మరమ్మతులు చేయించాలని పేర్కొన్నగా ప్రతిపాదనల దశ దాటలేదు. కానీ అమ్మ ఆదర్శపా ఠశాలల కమిటీల ఆధ్వర్యాన బాలురకు 89 టాయిలెట్లు, బాలికలకు 21 టాయిలెట్ల మరమ్మతు చేయించారు. లెక్కలో అంతా సరి... జిల్లాలో 1,216 పాఠశాలలు ఉండగా పలు స్కూళ్లలో విద్యార్థులు మరుగుదొడ్ల సమస్య ఎదుర్కొంటున్నారు. కానీ అధికారులు మాత్రం అంతా సవ్యంగా ఉన్నట్లు లెక్కలు చూపిస్తుండడం గమనార్హం. జిల్లాలో బాలురకు 4,741 టాయిలెట్లు ఉండగా.. అందులో 4,591 టాయిలెట్లు సక్రమంగా పనిచేస్తున్నాయని నివేదికలు చెబుతున్నాయి. ఇక బాలికలకు 5,871 మరుగుదొడ్లు ఉండగా.. అందులో 5,694 పనిచేస్తున్నాయని తేల్చారు. కానీ చాలా పాఠశాలల్లో మరుగుదొడ్లు అలంకారప్రాయంగా మారా యని విద్యార్థుల ద్వారా తెలుస్తోంది. కొన్నిచోట్ల నీటి సమస్య ఉండగా.. మరికొన్ని చోట్ల పైపులైన్లు ధ్వంసమై, తలుపులు, కిటికీలు దెబ్బతినడంతో ఉపయోగించుకునే వీలుండడం లేదు. సరిపడినంతగా లేవు.. ఖమ్మం నడిబొడ్డున ఇందిరానగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 157 మంది బాలికలు, 278 మంది బాలురు చదువుతున్నారు. గత ఏడాది వరకు ఈ పాఠశాలలో బాలురకు యూరినల్సే లేవు. దీంతో సమీపంలోని పబ్లిక్ టాయిలెట్కు వెళ్లేవారు. గత ఏడాది కొత్తగా 16 యూరినల్స్ నిర్మించడంతో కొంత ఇబ్బంది తీరింది. బాలికలకు ఐదు యూరినల్స్, రెండు మరుగుదొడ్లు ఉండగా.. విద్యార్థుల సంఖ్యకు ఇవి సరిపోవడం లేదు. ఇంకా బాలురకు రెండు, బాలికలకు మూడు యూరినల్స్ నిర్మించాల్సి ఉంది. అలాగే, ఈ పాఠశాలలో మహిళా టీచర్లకు ప్రత్యేకంగా మరుగుదొడ్లు లేకపోవడం గమనార్హం. క్యూ కట్టాల్సిందే.. కారేపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆరు నుంచి పదో తరగతి వరకు 121 మంది బాలురు, 45 మంది బాలికలు చదువుతున్నారు. ఇక్కడ బాలురు, బాలికలకు వేర్వేరుగా టాయిలెట్లు ఉన్నా ఇవి సరిపడా లేక క్యూ కట్టాల్సి వస్తోంది. ఇక్కడ ౖపైలెన్ పగిలి నీటి సౌకర్యం లేదు. టాయిలెట్ల తలుపులకు బేడాలు లేకపోవడంతో ఎవరైనా లోనకు వెళ్తే మరొకరు బయట కాపలా ఉండాల్సి వస్తోంది.ప్రభుత్వ పాఠశాలల్లో అధ్వానంగా మరుగుదొడ్లు పలు స్కూళ్లలో మరుగుదొడ్లు ఉన్నా నీరు కరువు కనీస మరమ్మతులకు నోచుకోక నిరుపయోగంగా.. ఫలితంగా విద్యార్థులు, ఉపాధ్యాయినుల ఇబ్బందులు నీరు తెచ్చుకోవాలి.. కామేపల్లి మండలం కొమ్మినేపల్లి ప్రాథమిక పాఠశాల మరుగుదొడ్డిలో నీటి సౌకర్యం లేదు. మరుగుదొడ్డిపై ట్యాంక్ నిర్మించినా బోర్ మోటార్ నుంచి పైపులైను కనెక్షన్ ఇవ్వలేదు. దీంతో ప్రతిరోజు స్కావెంజర్ నీరు సమకూర్చాల్సి వస్తోంది.మరమ్మతు చేయించాలి.. మా పాఠశాలలో టాయిలెట్లు సరిగా లేవు. పైపులైన్లు పగిలి నీళ్లు సరిగా రావడం లేదు. వచ్చినా వృథా అవుతోంది. గోడలన్నీ బీటలు బారాయి. టాయిలెట్కు వెళ్లాలంటే ఇబ్బందిగా ఉన్నందున మరమ్మతులు చేయిస్తే బాగుంటుంది. – కె.లాస్య, పదవ తరగతి, కారేపల్లి హైస్కూల్ -
అమృతం కంటే విలువైనవి తల్లి పాలు
ఖమ్మంవైద్యవిభాగం: తల్లిపాలు అమృతం కంటే విలువైనవని, బిడ్డ ఎదుగుదలకు దోహదపడతాయని ఖమ్మం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ మెతుకు నరేందర్ పేర్కొన్నారు. తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం నిర్వహించిన అవగాహన ర్యాలీని ఆయన డీఎంహెచ్ఓ బి.కళావతిబాయితో కలిసి ప్రారంభించారు. అనంతరం ఎంసీహెచ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో నరేందర్ మాట్లాడుతూ పుట్టిన గంటలోపు బిడ్డకు తల్లిపాలు పట్టించడం వల్ల రోగ నిరోధక శక్తి వస్తుందని, తల్లికి కూడా ప్రయోజనాలు ఉంటాయని తెలిపారు. ఈమేరకు వారం పాటు తల్లి పాల ఆవశ్యకతపై అవగాహన కల్పించనున్నట్లు వెల్లడించారు. డిప్యూటీ సూపరింటెండెంట్ బి.కిరణ్కుమార్, వివిధ విభాగాల వైద్యులు, ఉద్యోగులు బాబు రత్నాకర్, రాంబాబు, వినాయక్ రాథోడ్, యామిని, కిరణ్కుమార్, పవన్కుమార్, డి.శాంతకుమారి, శేషు పద్మ, రఘురాం పాల్గొన్నారు.పెద్దాస్పత్రి సూపరింటెండెంట్ నరేందర్ -
ప్రకాశ్నగర్ చెక్డ్యాం ఎత్తు తగ్గింపు
ఖమ్మంఅర్బన్: ఖమ్మం ప్రకాశ్నగర్లో మున్నేటిపై నిర్మించిన చెక్డ్యాం ఎత్తు తగ్గింపు పనులు మొదలయ్యాయి. ఈ చెక్డ్యాంను రూ.7కోట్లతో నిర్మించగా 2019లో మొదలైన పనులు 2022లో పూర్తయ్యాయి. అయితే, గత ఏడాది మున్నేటి వరద పోటెత్తగా ఈ చెక్డ్యాం వద్ద ప్రవాహం అడ్డుపడడంతోనే పరీవాహక ప్రాంతాలకు నష్టం జరిగిందనే అంచనాకు వచ్చారు. ఈమేరకు ఎత్తు తగ్గింపుపై కలెక్టర్ నివేదిక సమర్పించగా ఆయన ఆదేశాలతో శుక్రవారం పనులు మొదలుపెట్టారు. గ్రానైట్ రాళ్లు కట్ చేసేందుకు ఉపయోగించే యంత్రాల సాయంతో దాదాపు 200 మీటర్ల పొడవుతో ఉన్న చెక్డ్యాంను కొలత ప్రకారం ఎత్తు తగ్గిస్తున్నారు. కాగా, భూమి లోపలి నుంచి 11 అడుగుల ఎత్తుతో, ఉపరితలంపై ఏడు అడుగులుగా చెక్ డ్యాం ఉంటుంది. ప్రస్తుతం 5.5 అడుగుల మేర తొలగిస్తుండడంతో 1.5 అడుగులు మాత్రమే మిగిలే అవకాశముంది. ఈ పనులను ఖమ్మం రూరల్ తహసీల్దార్ పి.రాంప్రసాద్ పర్యవేక్షిస్తున్నారు.ప్రత్యేక యంత్రాలతో మొదలైన పనులుభిన్నాభిప్రాయాలు రూ.7కోట్లతో ప్రకాశ్నగర్ వద్ద మున్నేటిపై చెక్ డ్యాం నిర్మించగా అన్ని కాలాల్లో ఇక్కడ నీరు నిల్వ ఉంటోంది. నగరంలో భూగర్భ జలాలు పెరగడానికి ఇక్కడి నిల్వలే కారణమని చెబుతున్నారు. కానీ నిర్మించిన మూడేళ్లలోనే చెక్ డ్యాం ఎత్తు తగ్గిస్తుండడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గత ఏడాది కనీవిని ఎరుగని రీతిలో వరద వచ్చినా ఈ ఏడాది కూడా పరిశీలించాక.. ప్రమాదముందని నిర్ధారణ అయ్యాక తొలగిస్తే బాగుండేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. అలాంటిదేమీ లేకుండా చెక్డ్యాం తొలగిస్తుండడంతో నగరంలో భూగర్భ జలాలపై ప్రభావం పడుతుందని పలువురు చెబుతున్నారు. కాగా, ప్రజల భద్రత దృష్ట్యా చెక్ డ్యాం ఎత్తు తగ్గింపునకు కలెక్టర్ అనుమతి జారీ చేయగా... జలవనరుల శాఖ ఉన్నతాఽధికారుల అనుమతి కోసం లేఖ రాసినా బదులు రాలేదని సమాచారం. -
ఖమ్మంలో గ్రానైట్, మార్బుల్ నైపుణ్య శిక్షణ కేంద్రం
ఖమ్మంఅర్బన్: ఖమ్మంలో గ్రానైట్, మార్బుల్ వ్యాపారం మరింత అభివృద్ధి చెందేలా ఫిగ్సీ(ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ గ్రానైట్, స్టోన్ ఇండస్ట్రీ) ఆధ్వర్యాన నైపుణ్య శిక్షణ కేంద్రం ఏర్పాటుకు నిర్వాహకులు సంసిద్ధత వ్యక్తం చేశారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. పూణేలో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు శుక్రవారం వెళ్లిన మంత్రి తుమ్మల ఫిగ్సీ చైర్మన్ ఇష్వీందర్ సింగ్ ఆహ్వానంతో అక్కడి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను సందర్శించారు. ఈ సందర్భంగా యువతకు అందిస్తున్న శిక్షణ కార్యక్రమాలను పరిశీలించిన మంత్రి.. ఖమ్మంలో స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాన్ని ప్రారంభించాలని సూచించారు. ఈమేరకు చైర్మన్ రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తే సెంటర్ ఏర్పాటు చేస్తామని బదులిచ్చారు. ఈ పర్యటనలో కాంగ్రెస్ నాయకుడు సాదు రమేష్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అప్రమత్తతతోనే వ్యాధులు దూరం కూసుమంచి: ప్రతీఒక్కరు ఇళ్లలోనే కాక పరిసరాల పరిశుభ్రత పాటిస్తూ అప్రమత్తంగా ఉంటేనే సీజనల్ వ్యాధులు దరిచేరవని అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ తెలిపారు. మండలంలోని పాలేరు, గైగొళ్లపల్లి గ్రామాల్లో పారిశుద్ధ్య పనులను శుక్రవారం ఆమె పరిశీలించారు. డ్రై డే కార్యక్రమంలో ప్రజలను భాగస్వామ్యం చేయాలని సూచించిన అదనపు కలెక్టర్.. ఇళ్ల ముందు వర్షపు, మురుగునీరు నిల్వ ఉండకుండా చూడాలన్నారు. అలాగే, గ్రామాల్లో ఫీవర్ సర్వే నిర్వహణతో జ్వరాలను అదుపు చేయవచ్చని తెలిపారు. కాగా, గైగొళ్లపల్లిలో చేయూత పెన్షన్ల పంపిణీ తీరుపై ఆరా తీసిన శ్రీజ లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా జమ చేయాలని అధికారులను ఆదేశించారు. ఎంపీడీఓ రాంచందర్రావు తదితరులు పాల్గొన్నారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగి కుటుంబానికి చేయూత ఖమ్మంవ్యవసాయం: విధినిర్వహణలో ప్రమాదవశాత్తు మృతి చెందిన పాడి పరిశ్రమ ఔట్ సోర్సింగ్ ఉద్యోగి కుటుంబానికి రాష్ట్ర పాడి పరిశ్రమాభివృద్ధి సంస్థ రూ.10లక్షల ఆర్థిసాయాన్ని మంజూరు చేసింది. విజయ డెయిరీ ఖమ్మం యూనిట్ పరిధి కామేపల్లి మండలం కొత్తలింగాలలో పదేళ్లుగా పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగి పులి నాగేశ్వరరావు శరీరంపై ఇటీవల యాసిడ్ పడింది. ఎక్కడ చికిత్స చేయించినా ఫలితం లేక మృతి చెందడంతో ఆయన కుటుంబానికి రూ.10లక్షల సాయం ప్రకటించారు. ఈమేరకు నాగేశ్వరరావు భార్య సుగుణమ్మకు హైదరాబాద్లో విజయ డెయిరీ ఎండీ చంద్రశేఖర్రెడ్డి చెక్కు అందజేశారు. డ్రగ్ స్టోర్ను తనిఖీ చేసిన డీఎంహెచ్ఓ ఖమ్మంవైద్యవిభాగం: ఖమ్మంలోని పాత డీఎంహెచ్ఓ కార్యాలయంలో కొనసాగుతున్న సెంట్ర ల్ డ్రగ్ స్టోర్ను జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి బి.కళావతిబాయి శుక్రవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మందుల స్టాక్, రికార్డులు, పీహెచ్సీలకు సరఫరా, నిల్వల తీరును పరిశీలించారు. మందుల లభ్యత, గడువును ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ అవసరమైన మేర స్టాక్ తెప్పించుకోవాలని ఉద్యోగులకు సూచించారు. తద్వారా కొరత ఎదురుకాదని తెలిపారు. అంతేకాకుండా నిల్వల విషయంలో జాగ్రత్తలు పాటించాలని డీఎంహెచ్ఓ ఆదేశించారు. -
మరింత వేగంగా ఆధునికీకరణ పనులు
ఖమ్మం రాపర్తినగర్/మధిర: రైల్వేస్టేషన్లలో జరుగుతున్న ఆధునికీకరణ పనుల్లో వేగం పెంచి త్వరగా పూర్తిచేయాలని దక్షిణ మధ్య రైల్వే డీఆర్ఎం ఎం. గోపాలకృష్ణన్ ఆదేశించారు. జిల్లాలోని ఖమ్మం, మధిర స్టేషన్లలో పనులను శుక్రవారం ఆయన తని ఖీ చేశారు. ఖమ్మంలో తనిఖీల సందర్భంగా అభివృద్ధి పనులు నత్తనడకన సాగుతున్నాయని పేర్కొన్న ఆయన ఇకనైనా వేగం పెంచకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈసందర్భంగా ఖమ్మంలో ఎక్సలేటర్, ఫుట్ ఓవర్ బ్రిడ్జి, విశ్రాంతి భవన్, రైల్వేస్టేషన్ కార్యాలయం పనులపై సూచనలు చేశారు. అలాగే, మధిర స్టేషన్లోని 1, 2వ నంబర్ ప్లాట్ఫారంలపై పనులు పరిశీలించిన డీఆర్ఎం ఫొటో ఎగ్జిబిషన్ను తిలకించారు. ఈకార్యక్రమాల్లో ఖమ్మం రైల్వే స్టేషన్ మేనేజర్ సుభాస్ చంద్రబోస్, కమర్షియల్ ఇన్స్పెక్టర్ జి.శ్రీనివాసులు పాల్గొన్నారు.రైల్వేస్టేషన్లలో తనిఖీ చేసిన డీఆర్ఎం -
పత్తి పంట ధ్వంసంపై ఆగ్రహం
కారేపల్లి: ఏపుగా ఎదిగిన పత్తి పంటను ఓ వ్యక్తి ట్రాక్టర్తో ధ్వంసం చేయడంతో ఊరంతా ఏకమైంది. ఆయన అక్రమమార్గంలో పట్టా చేసుకోవడమే కాక పదేళ్లుగా రైతుబంధు నిధులు కాజేస్తూ ఇప్పుడు పత్తి పంటను ధ్వంసం చేయడంతో పోలీసుస్టేషన్ ఎదుటే దేహశుద్ధి చేసిన ఘటన ఇది. మండలంలోని గోవింద్తండా గ్రామానికి చెందిన బర్మావత్ భద్రు, ఆయన కుమారుడు దివ్యాంగుడైన సురేష్ తమకు ఉన్న రెండెకరాల్లో ఎకరం భూమిని 1998లో అదే గ్రామానికి చెందిన బర్మావత్ రాందాస్కు విక్రయించాడు. అయితే, రెండెకరాలకు లింకు డాక్యుమెంట్ను తీసుకున్న ఆయన అక్రమమార్గంలో మొత్తానికి పట్టా చేయించుకున్నాడని, ఇటీవల భూమి తనదేనని దౌర్జన్యం చేస్తున్నాడని భద్రు ఆరోపిస్తున్నాడు. ఈక్రమంలోనే ఏపుగా పెరిగిన పత్తి పంటను ధ్వంసం చేశాడు. దీంతో ఇరుపక్షాలు కారేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా, భద్రు, సురేష్కు మద్దతుగా ఊరంతా ట్రాక్టర్లపై పోలీసు స్టేషన్కు వచ్చి ఆందోళన చేపట్టారు. ఇంతలోనే అక్కడకు వచ్చిన రాందాస్కు దేహశుద్ధి చేయగా సీఐ తిరుపతిరెడ్డి, ఎస్ఐ బి.గోపి వారిని చెదరగొట్టి రాందాస్ను స్టేషన్లోకి తీసుకెళ్లారు. కాగా, పత్తి చేను ధ్వంసం చేసిన రాందాస్తో పాటు స్టేషన్ ముందు ఆందోళన చేసిన పలువురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.నిందితుడికి పోలీసుస్టేషన్ ఎదుటే దేహశుద్ధి -
బాలలకు ఆపన్నహస్తం..
● తప్పిపోయిన, పారిపోయి వచ్చిన వారికి ఆర్పీఎఫ్ చేయూత ● చైల్డ్లైన్ సహకారంతో కౌన్సెలింగ్ ● ఆపై తల్లిదండ్రుల దరికి చేరుస్తున్న వైనంఖమ్మంక్రైం: ●ఓ రోజు అర్ధరాత్రి పదో తరగతి చదివే బాలిక ఖమ్మం స్టేషన్లో రైలు దిగింది. కాసేపటికి 18ఏళ్ల బాలుడు వచ్చి ఆమెతో మాట్లాడుతుండగా ఆర్పీఎఫ్ సిబ్బంది గుర్తించి విచారించగా బాలికది ఒంగోలు అని తేలింది. ఇన్స్ట్రాగామ్లో పరిచయమైన ఖమ్మం బాలుడిని కలిసేందుకు వచ్చానని చెప్పగా.. ఇద్దరికీ చైల్డ్లైన్ సిబ్బంది సహకారంతో కౌన్సెలింగ్ ఇచ్చి కుటుంబీకులకు అప్పగించారు. ●వారం క్రితం ఆదిలాబాద్కు చెందిన ఓ బాలుడు, బాలిక ఖమ్మం రైల్వేస్టేషన్లో తిరుగుతుండగా అనుమానంతో ఆర్పీఎఫ్ సిబ్బంది వివరాలు ఆరా తీశారు. తామిద్దరం ప్రేమించకున్నా పెద్దలు ఒప్పుకోక ఆత్మహత్య చేసుకునేందుకు వచ్చామని చెప్పారు. దీంతో ఇద్దరికి కౌన్సెలింగ్ ఇచ్చి కుటుంబసభ్యులకు అప్పగించగా.. ప్రాణాలు కాపాడిన ఆర్పీఎఫ్, చైల్డ్లైన్ బాధ్యులకు వార కృతజ్ఞతలు తెలిపారు. ●ఐదు రోజుల క్రితం ఓ పదేళ్ల బాలుడు ఇంట్లో తల్లిదండ్రులు తిట్టారని వరంగల్లో నుంచి రైలు ఎక్కి ఖమ్మం చేరుకున్నాడు. ఆ బాలుడు ప్లాట్ఫాంపై తిరుగుతుండగా ఆర్పీఎఫ్ సిబ్బంది చైల్డ్లైన్కు అప్పగించారు. దీంతో వివరాలు తెలుసుకుని తల్లిదండ్రులను అప్పగించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇలా ఒకటి కాదు రెండు నిత్యం ఖమ్మం రైల్వేస్టేషన్లో గస్తీ నిర్వహించే ఆర్పీఎఫ్ సిబ్బంది అమాయకులైన చిన్నారుల పాలిట ఆపద్భాంవుల్లా నిలుస్తున్నారు. కొందరు తప్పిపోయి వస్తుండగా.. రకరకాల కారణాలతో ఇంకొందరు ఇళ్లలో చెప్పకుండా వస్తున్నారు. మరికొందరు బాలికలు యువకుల మాయమాటలు నమ్మి వస్తుండడంతో తనిఖీల్లో భాగంగా ఆర్పీఎఫ్ సిబ్బంది చేరదీస్తున్నారు. చైల్డ్లైన్ సిబ్బంది సహకారంతో వారికి కౌన్సెలింగ్ ఇస్తూ మెల్లగా వివరాలు సేకరించి తల్లిదండ్రులకు అప్పగించి వారికి గర్భశోకం మిగలకుండా చూస్తున్నారు. కాగా, 2024సంవత్సరంలో 28మంది మైనర్లను కాపాడగా, ఈసంవత్సరం ఇప్పటివరకు 23మందిని కాపాడడం విశేషం.తల్లిదండ్రుల నిఘా తప్పనిసరి మైనర్ల విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి. చిన్న వయస్సులో మొబైల్ ఫోన్లు ఇవ్వొద్దు. ఒకవేళ బయటకు వచ్చి నేరస్తుల కంట పడితే ప్రమాదం ఎదురవుతుంది. కొన్నిప్రాంతాల్లో తప్పిపోయి, పారిపోయి వచ్చిన పిల్లలను చేరదీసినట్లు నమ్మించి విక్రయించే అవకాశముంది. మా వంతుగా స్టేషన్లో నిరంతరం తని ఖీలు చేపడుతూ పిల్లలకు ఆపద ఎదురుకాకుండా పర్యవేక్షిస్తున్నాం. – బుర్రా సురేష్గౌడ్, ఆర్పీఎఫ్ సీఐ -
ఓయూ నుంచి డాక్టరేట్
తిరుమలాయపాలెం: మండలంలోని కాకరవాయికి చెందిన ధర్మపురి మధుకు ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ లభించింది. అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జి.ఉపేందర్ పర్యవేక్షణలో ఆయన సమర్పించిన పరిశోధనాత్మక గ్రంథానికి డాక్టరేట్ ప్రకటించారు. ప్రస్తుతం మధు హైదరాబాద్ హయత్నగర్లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఫిజిక్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. 16మంది పేకాటరాయుళ్లు అరెస్ట్ తల్లాడ/తిరులాయపాలెం: తల్లాడ మండల కేంద్రంతో పాటు అన్నారుగూడెంలో పేకాట స్థావరాలపై పోలీసులు శుక్రవారం దాడులు నిర్వహించారు. ఎస్ఐ ఎన్.వెంకటకృష్ణ ఆధ్వర్యాన దాడులు నిర్వహించగా అన్నారుగూడెంలో తొమ్మిది మంది, తల్లాడ మామిడి తోటలో నలుగురిని అరెస్ట్ చేశారు. వీరినుంచి రూ.14,390 నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ తెలిపారు. అలాగే, తిరుమలాయపాలెం మండలం కొక్కిరేణిలో పేకాట ఆడుతున్న ఏడుగురిపై కేసు నమోదు చేయగా ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదంలో తెగిపడిన చేయి కల్లూరు: మండలంలోని చెన్నూరు సమీపాన గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. చిన్నకోరుకొండికి చెందిన నామా ఆంధ్రాబాబు టాటా ఏస్లో కల్లూరు వస్తున్నాడు. మార్గమధ్యలో ఎదురుగా వస్తున్న టిప్పర్ వాహనాన్ని ఢీకొట్టగా, బయట పెట్టిన ఆయన చేయికి తాకడంతో తెగిపడింది. ఈమేరకు తీవ్రంగా గాయపడిన బాబును ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. మార్కెట్ ఉద్యోగిపై కేసు నమోదు ఖమ్మంక్రైం: ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో డేటా ఎంట్రీ ఆపరేటర్పై దాడి చేసి ఘటనలో అసిస్టెంట్ సెక్రటరీపై పోలీసులు కేసు నమోదు చేశారు. మార్కెట్లో పనిచేస్తున్న తాడేపల్లి చంద్రకాంత్ను గత నెల 23న అసిస్టెంట్ సెక్రటరీ వీరాంజనేయులు దూషిస్తూ అంతు చూస్తానంటూ మెడ పెట్టి గెంటేశాడు. ఘటనపై బాధితుడి ఫిర్యాదుతో శుక్రవారం కేసు నమోదు చేశామని ఖమ్మం త్రీటౌన్ సీఐ మోహన్బాబు తెలిపారు. -
రెండు ప్రైవేట్ ఆస్పత్రులు సీజ్
ఖమ్మంవైద్యవిభాగం: నిర్లక్ష్యంగా వైద్యం అందించి ఓ మహిళ మృతికి కారణమైన ఖమ్మంలోని బ్రీత్ ఆస్పత్రిని సీజ్ చేసినట్లు డీఎంహెచ్ఓ కళావతిబాయి తెలిపారు. గతనెల 23న తల్లాడకు చెందిన కె.శ్రీదేవి(34) ఖమ్మం మయూరిసెంటర్లోని బ్రీత్ ఆస్పత్రిలో చేరగా చికిత్స చేస్తుండగానే ప్రాణాలు కోల్పోయింది. వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యమే ఇందుకు ఘటనకు కారణమని తేలడంతో ఇటీవల సమీక్షలో అధికారులను కలెక్టర్ అనుదీప్ మందలించారు. దీంతో డీఎంహెచ్ఓ, ప్రోగ్రాం అధికారి చందునాయక్ శుక్రవారం ఆస్పత్రిలో తనిఖీ చేపట్టి సీజ్ చేశారు. అలాగే, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రికి తరలించారు. నకిలీ బిల్లుల కేసులో ‘మార్వెల్’ ఖమ్మం వైరారోడ్డులోని మార్వెల్స్ ఆస్పత్రిని సైతం అధికారులు సీజ్ చేశారు. ఇక్కడ సుమారు 168 మందికి చికిత్స చేయకున్నా నకిలీ పత్రాలు సృష్టించి సీఎంఆర్ఎఫ్ ద్వారా బిల్లులు తీసుకున్నారు. ఈ విషయమై అందిన ఫిర్యాదుతో తనిఖీ చేపట్టి సీజ్ చేశామని డీఎంహెచ్ఓ బి.కళావతిబాయి తెలిపారు. అక్కడి పేషంట్లను ప్రభుత్వ ప్రధానాస్పత్రికి తరలించడమే కాక ఆస్పత్రి బాధ్యులపై పోలీస్షన్లో ఫిర్యాదు చేశామని వెల్లడించారు. -
రైతులకు చుట్టాలుగా చట్టాలు..
మధిర/ఖమ్మం రూరల్/ఎర్రుపాలెం/బోనకల్: ఏ చట్టం చేసినా రైతులకు అండగా నిలిచేలా ఉండాలని.. ఈ విషయమై అవగాహన కల్పించేందుకు రాష్ట్ర రైతు సంక్షేమ కమిషన్ ఆధ్వర్యాన సాగు న్యాయ యాత్ర నిర్వహిస్తున్నామని న్యాయవాది, భూహక్కులు, వ్యవసాయ చట్టాల నిపుణుడు సునీల్ తెలిపారు. మధిర, ఖమ్మం రూరల్ మండలం తల్లంపాడు, బోనకల్, ఎర్రుపాలెంలో శుక్రవారం నిర్వహించిన సమావేశాల్లో ఆయన మాట్లాడారు. లీగల్ ఎంపవర్మెంట్ అండ్ అసిస్టెన్స్ ఫర్ ఫార్మర్స్ సొసైటీ(లీప్స్) సంస్థ సహకారంతో జూన్ 28న మొదలైన యాత్ర అక్టోబర్ 2వరకు 2,400 కి.మీ. మేర సాగనుండగా 8వేల గ్రామాల్లో రైతులకు అవగాహన కల్పిస్తామని తెలిపారు. ఇప్పటికే రాష్ట్రంలో దాదాపు 450 రెవెన్యూ గ్రామాల్లో భూముల సర్వే చేపట్టగా, లైసెన్స్డ్ సర్వేయర్లు త్వరలోనే విధుల్లో చేరనున్నారని పేర్కొన్నారు. అనంతరం రైతుల భూహక్కుల సమస్యలు, నకిలీ విత్తనాలు, ఎరువులు, పంటల బీమాపై అవగాహన కల్పించారు. ఈకార్యక్రమాల్లో భూభారతి రూపకర్తల్లో ఒకరైన బి.హరివెంకటప్రసాద్, భూదాన్ బోర్డు మాజీ చైర్మన్ గున్న రాజేందర్రెడ్డి, లీప్స్ సంస్థ ప్రతినిధులు జీవన్, అభిలాష్, మల్లేష్, రవి, ప్రవీణ్తో పాటు తహసీల్దార్లు రమాదేవి, పి.రాంప్రసాద్, ఉషాశారద, ఏఓలు సాయిదీక్షిత్, పి.వినయ్కుమార్, ఉమానగేష్, మధిర మార్కెట్ బండారు నరసింహారావు, వైస్ చైర్మన్ ఐలూరి సత్యనారాయణరెడ్డి, పీఏసీఎస్ వైస్ చైర్మన్ కడియం శ్రీనివాసరావు, ఏఈఓలు బి.రజిత, పి.అనూష, ఎం.త్రివేణి, జి.హరికృష్ణ, షేక్ హుస్సేన్ సాహెబ్, ఎన్.నాగసాయి, బాలకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.పలు మండలాల్లో సాగు న్యాయయాత్ర -
బయటకొస్తే భయం... భయం
● నానాటికీ పెరుగుతున్న కుక్కల దాడులు ● ఆస్పత్రులకు క్యూ కడుతున్న బాధితులు ● కు.ని. చేస్తున్నామని చెబుతున్నా కానరాని ఫలితం ఖమ్మంవైద్యవిభాగం: జిల్లాలో కుక్కలు హడలెత్తిస్తున్నాయి. గ్రామాలు, పట్టణాలు అనే తేడా లేకుండా గుంపులుగా తిరుగుతున్న శునకాలతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. చిన్నారులే కాక పెద్దలను కూడా వదలక దాడులు చేస్తుండడంతో వీధుల్లోకి రావాలంటే వణికిపోతున్నారు. ప్రధానంగా రాత్రివేళ కాలనీల్లో రహదారుల మధ్యలో బైఠాయిస్తున్న కుక్కలతో ఆ మార్గంలో వెళ్లాలంటే జంకే పరిస్థితులు నెలకొన్నాయి. ద్విచక్ర వాహనాలు, ఇతర వాహనాల వెంట పరుగులు తీస్తుండడంతో ప్రమాదాలు జరుగుతుండగా.. కుక్కల దాడిలో గాయపడిన వారు ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. గుంపులుగా సంచారం జిల్లాలో దాదాపుగా అన్నిచోట్ల కుక్కల సమస్య ఉంది. జిల్లా కేంద్రంలోని ఏ కాలనీ, ఏ వీధికి వెళ్లినా గుంపులుగా కుక్కలు కనిపిస్తున్నాయి. శునకాల దాడిలో గాయపడి నిత్యం 30 – 40 మంది ఆస్పత్రులకు వస్తున్నారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. కుక్కల భయంతో రహదారులపై తిరిగేందుకు జంకుతుండగా.. పిల్లలను పాఠశాలకు పంపించే తల్లిదండ్రులు తిరిగి వచ్చే ఆందోళనకు గడపాల్సి వస్తోంది. కాగా, శునకాల దాడిలో కొందరికి తీవ్రగాయాలు అవుతుండడంతో నయం కావడానికి నెలల సమయం పడుతోంది. ప్రభుత్వ ఆఆస్పత్రుల్లో రేబిస్ వ్యాక్సిన్ అందుబాటులో ఉన్నా సరైన వైద్యం అందక పలువురు ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. ఆస్పత్రులకు క్యూ.. జిల్లాలో కుక్కకాటు బాధితుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. దీంతో యాంటీ రేబిస్ వ్యాక్సిన్ వినియోగం పెరిగిపోతోంది. సగటున రోజుకు 30 – 40 మంది కుక్కకాటు బాధితులు ఆస్పత్రులకు వస్తున్నారు. తక్కువ గాయాలైన వారికి నిర్ణీత గడువు ప్రకారం వ్యాక్సిన్ డోస్ వేస్తున్నారు. తీవ్రంగా గాయపడితే ప్రభుత్వ పరంగా సరైన చికిత్స అందక ప్రైవేట్ ఆస్పత్రుల బాట పడుతున్నారు. కొందరు హైదరాబాద్లోని గాంధీ, ఉస్మానియా ఆస్పత్రులకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది జిల్లాలో ఇప్పటికే ప్రభుత్వ ఆస్పత్రుల్లో 10,895 కుక్కకాటు కేసులు నమోదు కాగా.. ప్రైవేట్ ఆస్పత్రుల గణాంకాలు తీసుకుంటే ఈ సంఖ్య మరింత పెరగుతుంది. కాగా, కుక్కల సంతతి తగ్గించేందుకు కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స చేస్తున్నామని పురపాలికల అధికారులు చెబుతున్నా వాటి సంతతి తగ్గకపోవడం అనుమానాలకు తావిస్తోంది.కొన్నేళ్లుగా జిల్లాలో కుక్కకాటు బాధితులు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉపయోగించిన వ్యాక్సిన్ ఏడాది బాధితులు వాడిన వ్యాక్సిన్ వాయిల్స్ 2020 11,973 16,563 2021 13,120 16,947 2022 14,676 17,996 2023 14,492 20,392 2024 16,224 17,887 2025 10,895 12,889 (ఇప్పటివరకు) -
వృత్తి నైపుణ్య శిక్షణ ప్రారంభం
ఖమ్మం రాపర్తినగర్: నిరుద్యోగ యువతకు వృత్తి నైపుణ్య రంగాల్లో ఇచ్చే శిక్షణ ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో శుక్రవారం ప్రారంభమైంది. కంప్యూటర్, ఫ్యాషన్ డిజైనింగ్, బ్యూటీషియన్ కోర్సుల్లో మూడు నెలల పాటు శిక్షణ ఇవ్వనుండగా, ఇంకా ఆసక్తి ఉన్న వారు దరఖాస్తులను స్టేడియంలోని జిల్లా యువజన క్రీడల శాఖ కార్యాలయంలో సంప్రదించాలని డీవైఎస్ఓ టి.సునీల్రెడ్డి సూచించారు. ఆయా కోర్సుల్లో శిక్షణ పూర్తయ్యాక ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలో ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. ఆసక్తి ఉన్న వారు వయస్సు, కుల ధ్రువీకరణ పత్రాలతో పాటు పాస్పోర్టుతో దరఖాస్తులు సమర్పించాలని, వివరాలకు 99482 07271 నంబర్లో సంప్రదించాలని డీవైఎస్ఓ సూచించారు. మధిర కాలేజీ ప్రిన్సిపాల్ కథకు అవార్డు మధిర: మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ జైదాస్ రాసిన ‘మరో గాలివాన’ కథకు ముల్కనూరు సాహితీ పీఠం అవార్డు దక్కింది. ముల్కనూరు సాహితీ పీఠం ఆధ్వర్యాన జాతీయస్థాయి కథల పోటీలు నిర్వహించగా రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా వివిధ దేశాల రచయితలు 417కథలను పంపించారు. ఇందులో 70కథలకు అవార్డులు ప్రకటించగా జాబితాలో జైదాస్కు సైతం స్థానం దక్కింది. అలాగే, మే 20న హైదరాబాద్ రవీంద్రభారతిలో తెలుగు కార్టూనిస్టుల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన పోటీల్లో జైదాస్ రూపొందించిన కార్టూన్ల పుస్తకం ‘జాయ్ టూన్స్’ను సినీనటులు రాజేంద్రప్రసాద్, తనికెళ్ల భరణి ఆవిష్కరించారు. నేడు కాంగ్రెస్ సర్వసభ్య సమావేశం ఖమ్మంమయూరిసెంటర్: సంస్థాగత నియామకాలపై చర్చించేందుకు ఖమ్మంలోని కాంగ్రెస్ కార్యాలయంలో శనివారం సర్వసభ్య సమావేశం నిర్వహిస్తున్నట్లు పార్టీ జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. అనుబంధ సంఘాల అధ్యక్షులు, బ్లాక్, మండల, పట్టణ, జిల్లా కాంగ్రెస్ నాయకులు హాజరుకావాలని సూచించారు. శనివారం మధ్యాహ్నం 2గంటలకు మొదలయ్యే ఈ సమావేశంలో రాజీవ్గాంధీ పంచాయతీరాజ్ సంఘటన్ జాతీయ కార్యనిర్వాహకులు గంటా వినయ్, రాష్ట్ర సమన్వయకర్త మహ్మద్ జావేద్ తదితరులు హాజరవుతారని తెలిపారు. ఎస్టీఎఫ్ఐ రజతోత్సవ పతాకావిష్కరణ ఖమ్మం సహకారనగర్: ఎస్టీఎఫ్ఐ(స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా) రజతోత్సవాల సందర్భంగా ఖమ్మంలోని యూటీఎఫ్ కార్యాలయంలో శుక్రవారం పతాకాన్ని ఆవిష్కరించారు. టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు, ఎస్టీఎఫ్ఐ జాతీయ కౌన్సిల్ సభ్యురాలు చావా దుర్గాభవాని పతాకాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. నూతన జాతీయ విద్యావిధానం, సీపీఎస్ విధానాన్ని రద్దు చేయడంతో పాటు ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ చేయాలని, సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని కోరారు. నాయకులు జీ.వీ.నాగమల్లేశ్వరరావు, షేక్ రంజాన్, పారుపల్లి నాగేశ్వరరావు, బుర్రి వెంకన్న, షమీ రాంబాబు పాల్గొన్నారు. కుర్నవల్లి పీఏసీఎస్ పాలకవర్గం రద్దు తల్లాడ: అవినీతి ఆరోపణల నేపథ్యాన మండలంలోని కుర్నవల్లి పీఏసీఎస్ పాలకవర్గాన్ని రద్దు చేస్తూ జిల్లా సహకార అదికారి గంగాధర్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. కుర్నవల్లి సొసైటీ పరిధిలో రూ.2.50 కోట్ల వ్యయంతో రెండేళ్ల క్రితం రైస్మిల్లు, దీనికి అనుబంధంగా రూ.52 లక్షలతో రేకుల షెడ్డు నిర్మించారు. అయితే, మే నెలలో వచ్చిన గాలిదుమారానికి షెడ్డు కూలిపోయింది. కాగా, నిర్మాణంలో పాలకవర్గం బాధ్యులు అవినీతికి పాల్పడ్డారని గ్రామానికి చెందిన కొందరు మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో పాటు డీసీఓకు ఫిర్యాదు చేశారు. ఈక్రమాన విచారణ అనంతరం 15 రోజుల క్రితం సీఈఓ ఒగ్గు నరసింహారెడ్డిని సస్పెండ్ చేయగా, ఇప్పుడు అయలూరి ప్రదీప్రెడ్డి చైర్మన్గా ఉన్న పాలకవర్గాన్ని రద్దు చేశారు. అలాగే, కుర్నవల్లి పీఏసీఎస్ పర్సన్ ఇన్చార్జిగా జి.శ్రీనివాస్ కుమార్ను నియమించడంతో ఆయన బాధ్యతలు స్వీకరించారు. -
కన్నీరే మిగిలింది..
కట్లేరులో గల్లంతైన ముగ్గురు మృతిఎర్రుపాలెం: కుటుంబ పెద్దలను కట్లేరు మింగేసింది. తమ వాళ్లు బతికి ఉంటారని గంటల తరబడి ఆశగా ఎదురుచూసిన కుటుంబీకుల నిరాశే మిగిలింది. చేపల వేట పేరిట వెళ్లిన ముగ్గురు విగత జీవులుగా ఇళ్లకు చేరడంతో మండలంలోని బంజర గ్రామంలో విషాదం నెలకొంది. ఈ ఘటనకు సంబంధించి వివరాలు... మండలంలోని బంజరకు చెందిన పలువురు మీనవోలు బ్రిడ్జి వద్ద కట్లేరులో గురువారం చేపల వేటకు వెళ్లారు. అయితే, కట్లేరులో గుంతలను గుర్తించక, ఈత రాని కారణంగా బాదావత్ రాజు(55), భూక్యా కోటి(46), భూక్యా సాయి గల్లంతైన విషయం విదితమే. ఈమేరకు సమాచారం అందుకున్న అధికారులు రాత్రి పొద్దుపోయే వరకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో గాలించినా ఫలితం దక్కలేదు. దీంతో శుక్రవారం ఉదయం నుంచే గాలింపుమొదలుపెట్టగా ముగ్గురి మృతదేహాలు లభ్యమయ్యాయి. ఈమేరకు ఘటనా స్థలంలో పంచనామా అనంతరం మృతదేహాలను మధిర ప్రభుత్వాస్పత్రికి తరలించి పోస్టుమార్టం తర్వాత కుటుంబీకులకు అప్పగించారు. ఒకేరోజు గ్రామానికి చెందిన ముగ్గురు మృతి చెందడంతో బంజర గ్రామంలో విషాదం అలుముకుంది. మృతుల కుటుంబీకులు, బంధువులు కన్నీరుమున్నీరుగా రోదిస్తుండడంతో గ్రామస్తులంతా కన్నీటి పర్యంతమయ్యారు. కాగా, మార్కెట్ చైర్మన్ బండారు నర్సింహారావు, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు వేమిరెడ్డి సుధాకర్రెడ్డి, నాయకులు బానోతు శ్రీను తదితరులు మృతుల కుటుంబాలను పరామర్శించారు. -
యూరియా కోసం ఆందోళన వద్దు..
వైరారూరల్/తల్లాడ: జిల్లాలో సరిపడా యూరియా నిల్వలు ఉన్నందున రైతులు ఆందోళన చెందొద్దని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ధనసరి పుల్లయ్య సూచించారు. వైరా పీఏసీఎస్ పరిధి సిరిపురం ఎల్ఎస్సీఎస్తో పాటు తల్లాడ మండలం తల్లాడ, గంగదేవిపాడు సొసైటీల్లో నిల్వ ఉన్న యూరియాను గురువారం డీఏఓ పరిశీలించి మాట్లాడారు. సొసైటీల్లో సమృద్ధిగా యూరియా నిల్వలు ఉన్నందున అందరికీ పంపిణీ చేస్తామని తెలిపారు. కాగా, వ్యాపారులు ప్రభుత్వం నిర్దేశించిన ధరలకే యూరియా అమ్మాలని, ఎవరైనా బ్లాక్ చేసినట్లు తెలిస్తే చర్యలు తీసుకుంటామని డీఏఓ హెచ్చరించారు. ఏఓలు మయాన్ మంజుఖాన్, ఎం.డీ.తాజుద్దీన్, ఏఈఓలు వెంపటి కీర్తి, మేడా రాజేష్, హసీనా, మాధవి, ముర ళి, శివకుమార్, సాయి, సొసైటీల సీఈఓలు నారపోగు నాగరాజు, నాగబాబు, రాకేష్ పాల్గొన్నారు. -
బిడ్డకు బలం.. వ్యాధులు దూరం
ముర్రుపాలు పట్టించా... నాకు సాధారణ కాన్పు ద్వారా సత్తుపల్లి ప్రభుత్వ ఆస్పత్రిలో బాబు పుట్టాడు. వైద్యులు, సిబ్బంది సూచనలతో బిడ్డ జన్మించిన అరగంటలోపే ముర్రుపాలు పట్టించా. ఇద్దరికి ఎలాంటి ఇబ్బంది లేదు. పాలు పట్టించే విధానంపై ఇక్కడ సిబ్బంది అవగాహన కల్పించారు. – ఎన్.మేఘన, సత్తుపల్లివిస్తృతంగా అవగాహన.. తల్లి పాల వారోత్సవాల నిర్వహణకు ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. శిశువుకు సరిపడా పాలు వచ్చేలా గర్భంతో ఉన్నప్పటి నుంచే తగిన మోతాదులో పౌష్టికాహారం తీసుకోవాలి. ఈ విషయమే కాక తల్లి పాల ప్రాముఖ్యతపై వారోత్సవాల్లో విస్తృతంగా అవగాహన కల్పిస్తాం. – రాంగోపాల్రెడ్డి, డీడబ్ల్యూఓసత్తుపల్లిటౌన్: పుట్టిన వెంటనే బిడ్డకు ముర్రుపాలు పట్టిస్తే తల్లీబిడ్డకు శ్రీరామరక్షగా నిలవడమేకాక బిడ్డకు వ్యాధులు దరిచేరని వైద్యులు చెబుతుంటారు. శిశువులకు సంపూర్ణ ఆరోగ్యంతో పాటు రోగనిరోధక శక్తికి పెంచే అమ్మపాలు అమృతంతో సమానమని గర్భిణులు, బాలింతలకు అంగన్వాడీ కేంద్రాల ద్వారా అవగాహన కల్పించేందుకు నేటి నుంచి తల్లి పాల వారోత్సవాలు నిర్వహించనున్నారు. జిల్లా సీ్త్ర, శిశు సంక్షేమ ద్వారా ఈ వారోత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగా 1నుంచి 7వ తేదీ వరకు చేపట్టాల్సిన ప్రత్యేక కార్యక్రమాలకు షెడ్యూల్ రూపొందించారు. ముర్రుపాల విశిష్టత {ç³çÜÐ]l… AĶæ*ÅMýS »êÍ…-™èlMýS$ Ððl¬§ýl-rV> Ð]l^óla Ðésìæ° Ð]l¬{Æý‡$-´ë-Ë$ A…sêÆý‡$. {V>Ò$׿ {´ë…™èl Ð]l$íßæ-âýæ-Ë$ D ´ëÌS¯]l$ ¼yýlzMýS$ CÐ]lÓ-MýS$…yé Ð]l–£é ^ólíÜ ™èlÆ>Ó™ól CçÜ$¢…sêÆý‡$. M>± Ð]l¬{Æý‡$-´ë-ÌS-™ø ÕÔ¶æ$-Ð]l#-ÌZÏ ÆøVýS-°Æø«§ýlMýS ÔèæMìS¢° ò³…^ól VýS$׿…, Ð]l*…çÜ-MýS–-™èl$-Ë$, ÑrÑ$¯]l$Ï E…sêÆ‡$$. D ´ëË$ ç³rtyýl… Ð]lÌSÏ í³ÌS-ÏÌZÏ ^èl$Æý‡$-MýS$-§ýl¯]l…, ™ðlÍÑ™ól-rË$ ò³Æý‡$-VýS$-™éƇ$$. A…™ól-M>MýS ™èlÍÏ´ë-ÌS-™ø ÕÔ¶æ$-Ð]l#MýS$ çÜÐ]l$-™èl$ÌS BàÆý‡… A…§ýl$-™èl$…§ýl°, {´÷-sîæ¯]l$Ï, ÑrÑ$¯]l$Ï E…yýl-yýl…-™ø M>ÍÛĶæ$… °ÌS-ÓË$ ò³ÇW ¼yýlz-ÌSMýS$ Æý‡MýS¢-ïßæ-¯]l™èl G§ýl$-Æý‡$-M>§ýl$. yýlÄôæ$-ÇĶæ*, ¯]l*ÅÐðl*-°Ä¶æ*, MóS¯]lÞ-ÆŠæ, VýS$…yðl-fº$¾-Ë$, GÌS-Èj, BçÜ¢Ð]l*, yýlĶæ*-»ñæ-sìæ-‹Ü ÐéÅ«§ýl$ÌS ¯]l$…_ Æý‡„ýS-׿ MýS͵…^èl-yýlÐól$ M>MýS C¯ðl¹-MýSÛ¯]l$Ï ™èlVýS$Y-™éĶæ$° OÐðl§ýl$Å-Ë$ ^ðlº$™èl$-¯é²Æý‡$. ♥ -
ముగ్గురిని మింగిన కట్లేరు?
● చేపల వేటకు వెళ్లగా గల్లంతు ● రాత్రి వరకు గాలించినా కానరాని ఫలితం ఎర్రుపాలెం: రెక్కాడితే డొక్కాడని పేద కుటుంబాలు.. వరదలో వేటాడితే చేపలు దొరుకుతాయనే భావనతో వెళ్లిన ముగ్గురు అదే వరదలో గల్లంతయ్యారు. అర్ధరాత్రి వరకు గాలింపు చేపట్టిన వారి జాడ తెలియరాకపోవడంతో మూడు కుటుంబాలు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నాయి. ఈత రాక.. గుంతలు తెలియక ఎర్రుపాలెం మండలం బంజర గ్రామానికి చెందిన బాదావత్ రాజు(55), భూక్యా కోటి(46), భూక్యా సాయితో పాటు మరో ఐదుగురు గురువారం చేపలు పట్టడానికి మీనవోలు బ్రిడ్జి వద్ద కట్లేరుకు వెళ్లారు. అంతా కలిసి చేపలు పట్టేందుకు అనువుగా ఉన్న ప్రదేశాన్ని ఎంచుకున్నారు. కట్లేరులో వరద ప్రవాహం పెద్దగా లేకపోయినా పలుచోట్ల దాదాపు 20 అడుగుల లోతు మేర గుంతలు ఉన్నాయి. దీంతో అంతా ఒకే చోట వలలు విసురుతూ చేపల వేట మొదలుపెట్టాక రాజు, కోటి, సాయి ఈత రాని కారణంగా గుంతల్లో మునిగిపోయారు. దీంతో ఈత వచ్చిన మిగతా ఐదుగురు వారి కోసం గాలించినా ఫలితం లేక బాధిత కుటుంబీకులకు, ఆపై అధికారులకు సమాచారం ఇచ్చారు. ఈమేరకు వైరా ఏసీసీ రహమాన్, మధిర సీఐ డి.మధు, ఎస్ఐ ఎం.రమేష్, తహసీల్దార్ ఎం.ఉషాశారద చేరుకుని ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని పిలిపించి రాత్రి పొద్దుపోయే వరకు గాలించినా ఫలితం కానరాలేదు. కాగా, ముగ్గురు గల్లంతైన విషయం తెలియగానే వారి కుటుంబీకులు, గ్రామస్తులు పెద్దసంఖ్యలో చేరుకున్నారు. రాత్రి వరకు కూడా వారి జాడ తెలియకపోవడంతో కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మళ్లీ శుక్రవారం ఉదయమే ఎన్డీఆర్ఎఫ్ బృందంతో గాలింపు మొదలుపెడతామని అధికారులు వెల్లడించారు. -
నాట్లు వేస్తుండగా గుండెపోటుతో రైతు మృతి
కొణిజర్ల: వరి నార్లు వేస్తుండగా గుండెపోటు రావడంతో ఓ రైతు మృతి చెందాడు. కొణిజర్లకు చెందిన బండారు పుల్లయ్య(63) గురువారం తన పొలంలో నారు కట్టలు పరిచేందుకు వెళ్లాడు. నార్ల కట్టలు మోస్తుండగా గుండెపోటుకు గురైన ఆయన కన్నుమూశాడు. పుల్లయ్యకు భార్య, ఓ కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కాగా, సీపీఐలో కొనసాగుతున్న ఆయన మృతదేహం వద్ద జాతీయ సమితి సభ్యుడు బాగం హేమంతరావు, జిల్లా కార్యదర్శి దండి సురేష్, నాయకులు గడల భాస్కర్, ఎర్రా బాబు, దొండపాటి రమేష్, స్వర్ణ రమేష్, తోటపల్లి సీతారాములు, తాటి వెంకటేశ్వర్లు, తాటి నిర్మల, లతాదేవి, కళావతి నివాళులర్పించారు. విద్యుదాఘాతంతో మహిళ... కారేపల్లి: ఆరవేసిన దుస్తులు తీసే క్రమాన విద్యుదాఘాతానికి గురైన మహిళ మృతి చెందింది. కారేపల్లి మండలం విశ్వనాథపల్లికి చెందిన బొగ్గారపు సరస్వతి(52) ఇంటి రేకుల షెడ్డులో కట్టిన జీ వైర్పై దుస్తులు ఆరేసింది. అయితే, షెడ్డు మీదుగా విద్యుత్ వైర్ వెళ్లడంతో జీ వైర్ గుండా విద్యుత్ ప్రసారమవుతున్నట్లు తెలిసింది. ఈమేరకు దుస్తులు తీసే క్రమాన సరస్వతి విద్యుదాఘాతానికి గురికాగా బట్టలు గట్టిగా లాగడంతో జీ వైరు తెగి మెడకు చుట్టుకుని తప్పించుకోలేక అక్కడే కుప్పకూలింది. ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు విద్యుత్ సరఫరా నిలిపివేసి పరిశీలించగా అప్పటికే ఆమె మృతి చెందింది. సరస్వతికి భర్త కిషన్రావు, ఓ కుమారుడు ఉన్నాడు. జేసీబీ, ట్రాక్టర్లు సీజ్ కామేపల్లి: అనుమతి లేకుండా మట్టి తవ్వి తరలిస్తున్న జేసీబీతో పాటు నాలుగు ట్రాక్టర్లను పోలీసులు గురువారం సీజ్ చేశారు. కామేపల్లిలో పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా శివార్లలో ప్రభుత్వ భూమి నుంచి అనుమతి లేకుండా మట్టి తవ్వకాలు చేస్తున్నారని గుర్తించారు. ఈమేరకు జేసీబీ, ట్రాక్టర్లను సీజ్ చేసి తదుపరి విచారణ కోసం రెవెన్యూ అధికారులకు అప్పగించినట్లు ఎస్సై సాయికుమార్ తెలిపారు. -
వడలిపోతున్న పత్తి మొక్కలు
● చేన్లలో నీటి నిల్వతో దెబ్బతింటున్న వేరు వ్యవస్థ ● సమగ్ర యాజమాన్య పద్ధతులతోనే పంటకు రక్షణ బోనకల్: ఇటీవల వరుస వర్షాలకు పత్తి పంట దెబ్బతిన్నది. మేలో తొలకరి జల్లులు పడడంతో రైతులు పత్తి విత్తనాలను విత్తారు. ఆ తర్వాత వరుణుడు ముఖం చాటేయడంతో మొక్కలను బతికించుకునేందుకు అన్నదాతలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. అడపాదడపా పడిన జల్లులకు పత్తిమొక్కలు ఏపుగా పెరిగాయి. ఇంతలోనే వారం రోజులుగా ఎడతెరిపి లేని భారీవర్షాలకు పత్తి పొలాల్లో నీరు నిలిచింది. రైతులు సాధ్యమైనంత మేర నీటిని బయటకు పంపినా ప్రతి రోజూ వర్షం పడడంతో భూమి అధిక నీరు పీల్చుకోవడంతో మొక్క వేరు వ్యవస్థ దెబ్బతిన్నది. ఇప్పుడు పొడి వాతావరణంతో ఎండకు పత్తి మొక్కలు వడలిపోతుండగా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు పత్తి పంట రక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రైతులకు సూచనలు చేస్తున్నారు. ఇందులో భాగంగా బోనకల్ మండల వ్యవసాయ అధికారి పసునూరి వినయ్కుమార్ చేసిన సూచనలు ఇలా ఉన్నాయి. -
వేతనాలు పెంచాలి.. పర్మనెంట్ చేయాలి
ఖమ్మంమయూరిసెంటర్: సంఘటిత, అసంఘటిత రంగాల కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని టీయూసీఐ(ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా) రాష్ట్ర ఉపాధ్యక్షుడు జి.రామయ్య డిమాండ్ చేశారు. కార్మికులకు కనీస వేతనం రూ.26వేలు ఇవ్వడంతో పాటు కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్ చేయాలనే డిమాండ్తో గురువారం ఖమ్మంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. ఖమ్మం పెవిలియన్ గ్రౌండ్ నుంచి మయూరి సెంటర్, బస్టాండ్, వైరా రోడ్ మీదుగా జెడ్పీ సెంటర్ వరకు ఈ ప్రదర్శన జరగగా టీయూసీఐ జిల్లా అధ్యక్షుడు ఏ.వెంకన్న అధ్యక్షతన జరిగిన సభలో రామయ్య మాట్లాడారు. పెరిగిన ధరలకు అనుగుణంగా కార్మికుల వేతనాలు పెంచడంతో పాటు ఈఎస్ఐ, పీఎఫ్ సమస్యలు పరిష్కరించాలని, బొగ్గు గనుల ప్రైవేటీకరణ నిలిపివేయాలని డిమాండ్ చేశారు. టీయూసీఐ నాయకులు కె.శ్రీనివాస్, ఆవుల అశోక్, పి.రామదాస్, ఈ.శరత్, ఎస్.కే.లాల్ మియా తదితరులు మాట్లాడగా డీఆర్ఓ, డిప్యూటీ లేబర్ కమిషనర్కు వినతిపత్రాలు అందజేశారు, ఈ కార్యక్రమంలో నాయకులు కె.పుల్లారావు, ములకలపల్లి లక్ష్మీనారాయణ, గోసు పుల్లయ్య, పేరబోయిన వెంకన్న, అంబేద్కర్ అశోక్, పాపారావు, మధుర, కృష్ణవేణి, బి.రమేష్, జె.రాంబాబు, దున్న గురవయ్య, కిన్నెర నారాయణ, గొడుగు విజయ్, పెదపాక వెంకన్న, అమరపుడి అప్పారావు, మీగడ సైదులు, కంకణాల శ్రీనివాస్, ఎడ్లపల్లి ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.‘పద్మమ్’ స్టోర్ వద్ద నటి రీతూవర్మ, నిర్వాహకులు -
పాలనా కష్టాలు
శిథిల భవనాలు.. 439 సొంతం.. 76 శిథిలం జిల్లాలో మొత్తం 571 గ్రామపంచాయతీలు ఉండగా, 439 జీపీలు సొంత భవనాల్లో నిర్వహిస్తున్నారు. మిగతా 132 పంచాయతీలు అద్దె భవనాల్లో ఉన్నాయి. అయితే, సొంత భవనాల్లో 76 పూర్తిగా శిథిలావస్థకు చేరాయని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఇవి కాకుండా మరికొన్ని భవనాలు కూడా దెబ్బతినడంతో శ్లాబ్లు పెచ్చులూడి.. చువ్వలు బయటకు తేలి కనిపిస్తున్నాయి. చిన్నపాటి వర్షం వచ్చినా గోడలన్నీ నాని కురుస్తుండడంతో రికార్డులు తడిసిపోవడమే కాక ఎప్పుడేం జరుగుతుందోనని సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. అలాగే, కొన్ని భవనాల్లో విద్యుత్ వైరింగ్ అస్తవ్యస్తంగా మారి వర్షం వచ్చిన సమయాన ప్రమాదాలకు ఆస్కారముండడంతో సిబ్బంది బిక్కుబిక్కుమంటూ విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ మండలాల్లో అధ్వానం.. జిల్లాలోని ముదిగొండ మండలంలో 25 గ్రామపంచాయతీలు ఉండగా.. పది భవనాలు శిథిలావస్థకు చేరాయి. కూసుమంచి మండలంలో 41 గ్రామపంచాయతీలకు గాను ఏడింటి భవనాలు దెబ్బతిన్నాయి. బోనకల్ మండలంలో సీతానగరం కొత్త పంచాయతీ ఏర్పడగా స్థల సమస్యతో భవన నిర్మాణం ముందుకు సాగడంలేదు. అలాగే, పెద్ద బీరవల్లి, జానకీపురం, బ్రాహ్మణపల్లి, రాపల్లి, రాయన్నపేట భవనాలు ప్రమాదపుటంచున ఉన్నాయి. ఏన్కూరు మండలంలోని 25 జీపీల్లో 14 సొంతభవనాలు ఉండగా.. కొత్తగా ఏర్పడిన 11 పంచాయతీలకు భవనాలు మంజూరయ్యాయి. కొనసాగుతున్న నిర్మాణాలు.. జిల్లాలో 164 గ్రామపంచాయతీ భవనాల నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. అయితే, వీటిలా చాలా నిర్మాణాలు ఎప్పుడు పూర్తవుతాయో తెలియని పరిస్థితి ఉంది. ఇందులో 98 పంచాయతీలకు ఎంజీఎన్ఆర్ఈజీఎస్ నిధులు, 66 పంచాయతీలకు ఎస్టీ కాంపోనెంట్ నిధులు కేటాయించారు. వీటిలో కేవలం 47 భవనాల నిర్మాణమే పూర్తయింది. ఏళ్లుగా మరమ్మతులకు నోచుకోని జీపీ భవనాలు కొత్త గ్రామపంచాయతీల్లో మరిన్ని ఇక్కట్లు నిధులు మంజూరైనా పూర్తయినవి కొన్నే.. గ్రామ స్వరాజ్యానికి పట్టుగొమ్మలుగా నిలిచే గ్రామపంచాయతీల్లో కొన్నింటి భవనాలు శిథిలావస్థకు చేరాయి. దీంతో ఉద్యోగులు, వివిధ పనులపై వచ్చే ప్రజలు ఎప్పుడు కూలుతాయోనన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంకొన్ని గ్రామపంచాయతీలకు సొంత భవనాలు లేక అద్దె భవనాల్లోనే కొనసాగిస్తున్నారు. అంతేకాక కొత్తగా ఏర్పడిన పంచాయతీ భవనాలకు నిధులు మంజూరైనా నిర్మాణ ప్రక్రియ ఏళ్లుగా కొనసాగుతోంది. – సాక్షిప్రతినిధి, ఖమ్మం40 ఏళ్ల క్రితం నిర్మాణం ఏన్కూరు మండలంలోని రాజలింగాల పంచాయతీ భవనాన్ని 40ఏళ్ల క్రితం నిర్మించారు. ఇది ప్రస్తుతం శిథిలావస్థకు చేరడంతో స్లాబ్ పెచ్చులూడి పడుతూ వర్షం వస్తే కురుస్తోంది. దీని స్థానంలో కొత్త భవనానికి నిధులు కేటాయించాలని ఉద్యోగులు, గ్రామస్తులు కోరుతున్నారు.జిల్లాలోని గ్రామపంచాయతీ భవనాల వివరాలు... మొత్తం గ్రామపంచాయతీలు 571సొంత భవనాల్లో ఉన్న జీపీలు 439అద్దె భవనాల్లో నిర్వహిస్తున్నవి 132శిథిలావస్థకు చేరిన భవనాలు 76కొత్త భవనాలు మంజూరైనవి 164నిర్మాణాలు పూర్తయినవి 47పనులు కొనసాగుతున్నవి 117అమ్మో.. ఆ భవనంలోనా? బోనకల్ మండలం జానకీపురం గ్రామపంచాయతీ భవనాన్ని 1991లో నాటి కేంద్ర మంత్రి పీ.వీ.రంగయ్య నాయుడు ప్రారంభించారు. భవన నిర్మాణ సమయంలో నాణ్యత పాటించలేదనే ఆరోపణలు ఉండగా కొన్నాళ్లకే శిథిలావస్థకు చేరింది. స్లాబ్ పైభాగంలో పెచ్చులు ఊడి చువ్వలు తేలగా, వర్షం వస్తే కురుస్తోంది. విధులు నిర్వర్తించేందుకు ఇబ్బంది పడుతున్న ఉద్యోగులు.. గ్రామసభలను ఆరు బయట టెంట్ వేసి నిర్వహిస్తున్నారు. పలుమార్లు విన్నవించగా ఇటీవల నూతన భవనం మంజూరైంది. -
తల్లి పాలు.. అమృతధారలు
● పెద్దాస్పత్రిలో మిల్క్ బ్యాంక్ ద్వారా సేకరణ ● వేలాది మంది చిన్నారులకు లబ్ధి ● నేటి నుంచి తల్లిపాల వారోత్సవాలుఖమ్మం వైద్యవిభాగం: వివిధ కారణాలతో కొందరు బాలింతలకు చనుబాలు సరిపడా వచ్చే పరిస్థితి ఉండడం లేదు. ఫలితంగా వారి శిశువులకు పాలు పట్టే పరిస్థితి లేక ఇబ్బంది పడుతున్నారు. ఇక కొందరికి చనుబాలు ఉన్నా అపోహలతో పిల్లలకు పట్టడం లేదు. దీంతో పిల్లల్లో పోషకాహార లోపం ఎదురవుతోంది. ఈమేరకు తల్లి పాల ప్రాముఖ్యతపై ప్రచారం చేయడమే కాక గర్భిణులు, బాలింతలకు అవగాహన కల్పించేందుకు ఏటా ఆగస్టు 1నుంచి 7వ తేదీ వరకు తల్లిపాల వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ వారోత్సవాలు శుక్రవారం మొదలుకానున్న నేపథ్యాన జిల్లా పెద్దాస్పత్రిలోని ‘మిల్క్ బ్యాంక్’పై కథనం. 2022లో ఏర్పాటు ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలో తల్లుల నుండి పాలు సేకరించే కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. మిల్క్ బ్యాంక్ పేరుతో 2022 మే నెలలో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయగా వేలాది మంది శిశువులకు లబ్ధి జరుగుతోంది. కొందరు బాలింతలకు చనుబాలు రాకపోగా.. ఇంకొందరికి పిల్లలకు అవసరమైన పాల కంటే ఎక్కువగా వస్తుంటారు. ఇలాంటి వారి నుంచి పాలు సేకరించి మిల్క్ బ్యాంక్లోని ప్రత్యేక ఫ్రీజర్లలో నిల్వ చేస్తారు. ఆపై అవసరమైన వారికి అందించడమే లక్ష్యంగా ఈ కేంద్రం కొనసాగుతోంది. గర్భిణులను ప్రతీనెలా వైద్యపరీక్షల కోసం ఆస్పత్రికి వస్తున్న నేపథ్యాన వారికి తల్లిపాల ప్రాముఖ్యతను వివరిస్తూనే అధికంగా పాలు ఉంటే బ్యాంక్కు ఇచ్చేలా అవగాహన కల్పిస్తున్నారు. ఫలితంగా ఏటేటా ఈ మిల్క్ బ్యాంకుకు పాలు సమకూర్చే బాలింతల సంఖ్య పెరుగుతోంది.పెద్దాస్పత్రిలోని మిల్క్ బ్యాంక్ ద్వారా సేకరించి, పిల్లలకు ఇచ్చిన పాల వివరాలు ఏడాది బాలింతలు సేకరించిన పాలు పిల్లలకు అందించిన లబ్ధి పొందిన (లీటర్లలో) పాలు (లీటర్లలో) శిశువులు 2022 396 139 138 480 2023 901 277 239 1,145 2024 929 295 288 3,851 2025 1,163 167 181 2,541 (ఇప్పటి వరకు) -
పారదర్శకంగా లేఔట్ అనుమతులు
● ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో నిరాకరించాలి ● జిల్లా లేఔట్ కమిటీ సమావేశంలో కలెక్టర్ అనుదీప్ఖమ్మంమయూరిసెంటర్: నిబంధనలకు అనుగుణంగా, పూర్తి పారదర్శకతతో లేఔట్ అనుమతులు జారీ చేయాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆదేశించారు. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో గురువారం నిర్వహించిన లేఔట్ కమిటీ సమావేశంలో కలెక్టర్ అనుదీప్, కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా లేఔట్ల కోసం వచ్చిన దరఖాస్తులపై రెవెన్యూ, ఇరిగేషన్, ఇతర అనుంబంధ శాఖల అధికారులతో సమీక్షించి సూచనలు చేశారు. ప్రతిపాదిత ప్రాంతాలు నీటి వనరుల సమీపాన ఉన్నాయా అని గూగుల్ ఎర్త్ ద్వారా పరిశీలించిన కలెక్టర్ మాట్లాడారు. లేఔట్ అనుమతుల సమయాన క్షేత్ర స్థాయిలో పరిశీలించి ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో ఉంటే దరఖాస్తులు తిరస్కరించాలని సూచించారు. ఇక అనుమతి వచ్చిన వాటి విషయంలో మొక్కల పెంపకానికి స్థలం కేటాయించేలా చూస్తూ స్ట్రీట్ లైట్లు, డ్రెయినేజీ వ్యవస్థ, విద్యుత్ సరఫరా, ఫైర్ సేఫ్టీ చర్యలపై పర్యవేక్షించాలని తెలిపారు. లేఔట్లకు అనుమతులు ఇచ్చాక విద్యుత్ స్తంభాల కేటాయింపునకు ఎన్పీడీసీఎల్ అధికారులతో చర్చించి వారంలోగా చెల్లించకపోతే డ్రాఫ్ట్ అనుమతి ఉపసంహరించాలని కలెక్టర్ చెప్పారు. కాగా, జిల్లాలో ఇక నుంచి ప్రతీ 15 రోజులకోసారి లేఔట్ జిల్లా కమిటీ సమావేశం నిర్వహించాలని సూచించారు. ఈ సమావేశంలో ఎస్డీసీ ఎం.రాజేశ్వరి, సుడా సీపీఓ రాజ్కుమార్, పీఆర్ ఈఈ మహేష్, ఏదులాపురం మున్సిపల్ కమిషనర్ ఏ.శ్రీనివాసరెడ్డి, తహసీల్దార్లు సైదులు, రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ప్రజల ఆరోగ్యంపై నిర్లక్ష్యం వద్దు కూసుమంచి: సీజనల్ వ్యాప్తి నేపథ్యాన వైద్యులు, సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. కూసుమంచిలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రంతో పాటు హోమియో, ఆయుర్వేద ఆస్పత్రులను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఓపీ రికార్డులు, ఉద్యోగుల హాజరును పరిశీలించాక మందుల లభ్యతపై ఆరాతీశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ వైద్యులు సమయపాలన పాటిస్తూ ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని, సాధారణ ప్రసవాలు పెంచేందుకు కృషి చేయాలని తెలిపారు. తహసీల్దార్ రవికుమార్, వైద్యాధికారులు సాయికుమార్, లక్ష్మీలోహిత, ఉద్యోగులు పాల్గొన్నారు. -
సుడాపై పట్టింపేది?
2023 డిసెంబర్లో రద్దయిన పాలకవర్గం ● ఆతర్వాత కార్యాలయ భవనం సైతం ఖాళీ ● మాస్టర్ ప్లాన్లోనూ కానరాని కదలిక ● పర్యవేక్షణ లేక ఇష్టారాజ్యంగా వెంచర్ల ఏర్పాటు, నిర్మాణాలు ●కార్యాలయం ఖాళీ పాలకవర్గం ఏర్పడిన తర్వాత సుడా కార్యాలయాన్ని రోటరీక్లబ్ పక్కన డీసీసీబీ బ్యాంక్ భవనంలో ఏర్పాటు చేశారు. ప్రభుత్వం మారాక పాలకవర్గాన్ని రద్దు చేయడంతో ఆ భవనం నుంచి ఖాళీ చేయించారు. దీంతో కార్యాలయ సామగ్రిని కేఎంసీకి తరలించి టౌన్ప్లానింగ్ విభాగంలోని ఓ గదిలో పెట్టించారు. ఫలితంగా పాలకవర్గం మాటేమో కానీ కనీసం కార్యాలయం కూడా లేక సుడా పాలన ఆగమ్యగోచరంగా మారింది.ఖమ్మంమయూరిసెంటర్: జిల్లాలోని పట్టణ ప్రాంతాలతో పాటు జిల్లా కేంద్రానికి ఆనుకుని ఉన్న గ్రామాల అభివృద్ధికి గత ప్రభుత్వం స్తంభాద్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(సుడా)ను ఏర్పాటు చేసింది. ఆపై పాలకవర్గాన్ని నియమించగా.. వెంచర్ల ఏర్పాటు, నిర్మాణాలకు అనుమతులు మంజూరు తదితర పనులు కొనసాగాయి. అయితే, ప్రభుత్వం మారాక 2023 డిసెంబర్లో పాలకవర్గాన్ని రద్దు చేసినా కొత్త పాలకవర్గాన్ని నియమించకపోవడం.. కనీసం కార్యాలయం కూడా లేకపోవడంతో పర్యవేక్షణ లోపించి ఇష్టారాజ్యంగా వెంచర్ల ఏర్పాటు, నిర్మాణాలు కొనసాగుతున్నాయి. ఇదే అదనుగా కొందరు ఉద్యోగులు అక్రమార్కులకు అండగా నిలుస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. 2017లో ఏర్పాటు స్తంభాద్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ 2017 అక్టోబర్ 24న ఏర్పాటైంది. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్తో పాటు వైరా మున్సిపాలిటీ, కూసుమంచి, ఖమ్మంరూరల్, ముదిగొండ, చింతకాని, కొణిజర్ల, రఘునాథపాలెం మండలాల్లోని 44 గ్రామపంచాయతీలతో 573 చదరపు కి.మీ. వైశా ల్యంతో సుడాను ఏర్పాటు చేశారు. ఈ పరిధిలో అభివృద్ధి పనులే కాక నిర్మాణాలు, వెంచర్ల ఏర్పాటును పర్యవేక్షించాల్సి ఉంటుంది. పరిధి మరింత విస్తరణ ‘సుడా’ విస్తరణతో అభివృద్ధి పనుల పర్యవేక్షణ సులువవుతుందని ప్రస్తుత ప్రభుత్వం నిర్ణయించింది. హెచ్ఎండీఏ విస్తరణ ద్వారా హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో జరిగిన అభివృద్ధి ఆధారంగా ఈ నిర్ణయం తీసుకోగా... జిల్లాలో అభివృద్ధికి వీలుగా ఉన్న అన్ని ప్రాంతాలను సుడా పరిధిలోకి తీసుకొచ్చారు. కామేపల్లి, ఏన్కూరు, కారేపల్లి మినహా అన్ని మండలాల పరిధిలోని గ్రామ పంచాయతీలను చేర్చారు. తద్వారా 17 మండలాల పరిధిలోని 279 గ్రామపంచాయతీలను, మధిర, సత్తుపల్లి మున్సిపాలిటీలను సుడాలో విలీనం చేస్తూ 2024 అక్టోబర్లో జీఓ జారీ చేశారు. పాలకవర్గం రద్దు తొలిసారి ‘సుడా’కు 2020 జూన్లో పాలకవర్గాన్ని నియమించగా, 2023 డిసెంబర్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరాక అదే నెలలో 10వ తేదీన పాలకవర్గాన్ని రద్దు చేసింది. చైర్మన్తో పాటు 14 మంది డైరెక్టర్లు పదవులు కోల్పోగా, ఇప్పటి వరకు కొత్త పాలకవర్గాన్ని నియమించలేదు. దీంతో ‘సుడా’ కార్యకలాపాలన్నింటినీ వైస్ చైర్మన్గా ఉన్న మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ పర్యవేక్షిస్తున్నారు. కాగా, పూర్తి స్థాయిలో ఉద్యోగులను నియమించని కారణంగా కేఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులే సుడా పనులనూ చక్కబెడుతున్నారు. అభివృద్ధికి ఆటంకం సుడా ఏర్పడ్డాక ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్తో పాటు మాస్టర్ ప్లాన్ తయారు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సుడా పరిధిలో మాస్టర్ ప్లాన్ ముసాయిదా సిద్ధమైనా రకరకాల కారణాలతో గత ప్రభుత్వం ఆమోదం తెలపలేదు. ఫలితంగా పాత ప్రణాళికలతోనే వెంచర్ల ఏర్పాటు, అభివృద్ధి పనులు, భవన నిర్మాణాలు జరుగుతున్నాయి. ఇక సుడా విస్తరించిన తర్వాత కూడా మాస్టర్ ప్లాన్ ఆమోదానికి ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో ఇష్టారీతిన జరుగుతున్న నిర్మాణాలు భవిష్యత్ అభివృద్ధికి ఆటంకంగా మారే అవకాశముందన్న చర్చ జరుగుతోంది. -
నిబద్ధతతో సేవలందించిన వెంకటనాగేశ్వరరావు
ఖమ్మం మయూరిసెంటర్: వృత్తి నిబద్ధతతో విధులు నిర్వర్తించిన వనం వెంకట నాగేశ్వరరావు సంస్థపై ప్రజల్లో నమ్మకం పెంచారని బీఎస్ఎన్ఎల్ ఉన్నతాధికారులు పేర్కొన్నారు. బీఎస్ఎన్ఎల్ ఇంజనీర్ వెంకట నాగేశ్వరావు ఉద్యోగ విరమణ సన్మాన గురువారం ఖమ్మంలోని బీఎస్ఎన్ఎల్ కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా బీఎస్ఎన్ఎల్ డీజీఎం రాజశేఖర్, ఏజీఎంలు సుష్మా, శ్రీనివాస్, పీఎస్ఎన్ఎల్ రాష్ట్ర కార్యదర్శి సాంబశివరావు తదితరులు మాట్లాడుతూ ఎక్కడైనా సమస్య వస్తే రాత్రీపగలు తేడా లేకుండా ఆయన స్పందించేవారని కొనియాడారు. అనంతరం వెంకటనాగేశ్వరావు – స్వర్ణలత దంపతులను పలువురు సన్మానించగా అర్చకులు బొర్రా వాసుదేవాచార్యుల బృందం వేద మంత్రాలతో ఆశీర్వదించింది. ఈకార్యక్రమంలో నాగేశ్వరరావు కుమార్తె, కుమారుడు రాణి రాజ్యలక్ష్మి, రాజీవ్, బీఎస్ఎన్ఎల్ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు తిరుమలాచార్యులు, బీఆర్.వీరస్వామి, సోమగాని ఉపేందర్, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
అన్ని సౌకర్యాలతో కార్యాలయాల సముదాయం
ఖమ్మం రూరల్: ఖమ్మం రూరల్ మండలానికి సంబంధించి అన్ని ప్రభుత్వ కార్యాలయాల సముదాయాన్ని సకల సౌకర్యాలతో నిర్మించేలా ప్రణాళిక రూపొందించాలని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. కలెక్టర్ అనుదీప్ దురిశెట్టితో కలిసి గురువారం ఆయన తరుణీ హాట్ వద్ద సమీకృత మండల కార్యాలయాల సముదాయానికి ఎంపిక చేసిన స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా స్థల లభ్యత, కార్యాలయాల వివరాలపై ఆరా తీశాక మంత్రి మాట్లాడుతూ నిర్మాణ స్థలాన్ని చదును చేయించి పాతబడిన భవనాలను తొలగించాలని సూచించారు. మండల ప్రజల సౌకర్యార్ధం ఎంపీడీఓ, తహసీల్, సబ్ రిజిస్ట్రార్, వ్యవసాయ శాఖ ఇలా అన్ని కార్యాలయాలు ఒకేచోట పూర్తిస్థాయి వసతులతో నిర్మించేలా ప్రతిపాదనలు సమర్పించాలని ఆదేశించారు. అలాగే, 30 ఫీట్ల రోడ్ల నిర్మాణం, సోలార్ విద్యుత్ ప్యానెళ్ల ఏర్పాటు, మిషన్ భగీరథ ద్వారా తాగునీటి వసతి కల్పించాల్సి ఉంటుందని తెలిపారు. ఆర్డీఓ నర్సింహారావు, మార్కెట్ చైర్మన్ హరినాధ్బాబు, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి, తహసీల్దార్ రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
హెచ్పీఎస్లో ప్రవేశాలకు దరఖాస్తులు
ఖమ్మంమయూరిసెంటర్: హైదరాబాద్ బేగంపేట, రామాంతపూర్లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూళ్లలో 2025–26 విద్యాసంవత్సరం ప్రవేశాలకు గిరిజన విద్యార్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా గిరిజనాభివృద్ధి శాఖ అధికారులు పేర్కొన్నారు. ఒకటో తరగతిలో డే స్కాలర్గా జిల్లా నుంచి బాలబాలికలకు మూడు చొప్పున సీట్లు కేటాయించగా, లంబాడీ మూడు, కోయలకు రెండుతో పాటు ఇతర గిరిజన కులాలకు ఒక సీటు ఉంటుందని తెలిపారు. అర్హత, ఆసక్తి కలిగిన పేద గిరిజన విద్యార్థుల తల్లిదండ్రులు కలెక్టరేట్లోని గిరిజన అభివృద్ధి అధికారి కార్యాలయంలో ఈనెల 8వ తేదీలోగా దరఖాస్తు చేసుకుంటే ఈనెల 12న లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేస్తామని వెల్లడించారు. అలాగే, హెచ్పీఎస్ల్లో షెడ్యూల్డ్ కులాల విద్యార్థులకు రెండు సీట్లు కేటాయించగా గెజిటెడ్ అధికారి అటెస్టేషన్ చేసిన జనన, కుల, ఆదాయ, స్థానికత ధ్రువపత్రాలు, రేషన్, ఆధార్ కార్డుల జిరాక్స్ కాపీలతో ఈనెల 8లోగా తమ కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని ఎస్సీ డీడీ కస్తాల సత్యనారాయణ సూచించారు. దరఖాస్తుదారుల్లో ఇద్దరిని ఈనెల 10వ తేదీన లాటరీ ద్వారా ఎంపిక చేస్తామని తెలిపారు. పనుల్లో నాణ్యతపై అవగాహన అవసరం ఖమ్మంఅర్బన్: జలవనరుల శాఖ ద్వారా చేపట్టే పనుల్లో నాణ్యతపై ఇంజినీర్లు అవగాహన కలిగి ఉండాలని, తద్వారా పనులు పదికాలాలు నిలుస్తాయని శాఖ ఎస్ఈ మంగళపూడి వెంకటేశ్వర్లు తెలిపారు. క్వాలిటీ కంట్రోల్ విభాగం ఈఈ వెంకటరమణకుమార్ ఆధ్వర్యాన గురువారం ఇంజనీర్లకు నిర్వహించిన వర్క్షాప్లో ఆయన మాట్లాడారు. ఇంజనీర్లు ఏ విభాగంలో విధులు నిర్వర్తించినా నాణ్యతపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జలవనరుల శాఖ క్వాలిటీ కంట్రోల్ డీఈ చంద్రమోహన్, పాలేరు, ఖమ్మం డివిజన్ల ఈఈలు, డీఈలు, ఏఈలు పాల్గొన్నారు. -
మీ కలలకు రెక్కలమవుతాం..
కూసుమంచి: ‘విద్యార్థులు గొప్ప లక్ష్యాలను ఎంచుకుని చదువుతూ తల్లిదండ్రుల కలలను నిజం చేయాలి.. అందుకు కావాల్సిన అన్ని వసతులు మేం సమకూరుస్తాం.. పిల్లల అభివృద్ధి బాధ్యతను అన్ని విధాలుగా మేమే చూసుకుంటాం..’ అని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. కూసుమంచిలో రూ.5.50 కోట్ల నిధులతో నిర్మించే ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనానికి మంత్రి గురువారం శంకుస్థాపన చేశారు. అనంతరం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థినులకు పీఎస్ఆర్ ట్రస్ట్ ద్వారా 76 సైకిళ్లను పంపిణీ చేశాక మంత్రి, కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి కాసేపు సైకిళ్లు తొక్కారు. ఆపై 75 మందికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు అందజేశాక మంత్రి మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక విద్యారంగానికి ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. ఒక్క పాలేరు నియోజకవర్గంలోనే ఏడాదిన్నర కాలంలో రూ.470 కోట్లు విద్యాభివృద్ధికి వెచ్చించడమే ఇందుకు నిదర్శనమని చెప్పారు. అలాగే, దేశంలో ఎక్కడా లేని విధంగా యంగ్ ఇండియా స్కూళ్లు, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటుచేస్తూ, వసతిగృహాల విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించేలా మెస్ చార్జీలతో పాటు కాస్మోటిక్ చార్జీలను రెట్టింపు చేశామని మంత్రి గుర్తు చేశారు. ఇక పాలేరు నియోజకవర్గంలో ఇంజనీరింగ్ కళాశాల, యంగ్ ఇండియా సమీకృత గురుకులం, ఐటీఐ భవనాలు సిద్ధమవుతున్నాయని తెలిపారు. పేద విద్యార్థులు ఎక్కువగా చదివే ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రభుత్వ పరంగానే కాక పీఎస్ఆర్ ట్రస్ట్ ద్వారా చేయూతనిస్తామని మంత్రి వెల్లడించారు. కలెక్టర్ అనుదీప్ మాట్లాడుతూ చదువుకు మించిన ఆస్తి ఉండదని.. తాను కలెక్టర్ కావడానికి చదువే కారణమని తెలిపారు. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జిల్లా ఇంటర్ విద్యాధికారి రవిబాబు, ఆర్డీఓ నర్సింహారావు, తహసీల్దార్ రవికుమార్, ఎంపీడీఓ రాంచందర్రావు, ఎంఈఓ రాయల శేషగిరి, జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ వీరభద్రంతో పాటు నాయకులు బాలసాని లక్ష్మీనారాయణ, స్వర్ణ కుమారి తదితరులు పాల్గొన్నారు. మేం వచ్చాకే విద్యాభివృద్ధికి పెద్దపీట రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి -
రేపు జాబ్మేళా
ఖమ్మంసహకారనగర్: హెచ్సీఎల్ టెక్ ఆధ్వర్యంలో 2023–24, 2024–25 విద్యా సంవత్స రాల్లో ఇంటర్మీడియట్ పూర్తిచేసిన విద్యార్థులకు సాఫ్ట్వేర్ రంగంలో ఐటీ, డీపీఓ ఉద్యోగాల్లో అవకాశం కల్పించేందుకు ఈ నెల (ఆగస్టు) 2న నగరంలోని నయాబజార్ జూనియర్ కళాశాలలో జాబ్మేళా నిర్వహించనున్న ట్లు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి కె.రవిబాబు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 75 శాతం మార్కులు సాధించిన వారు అర్హులని, ఆసక్తి ఉన్నవారు 2న నయాబజార్ జూనియర్ కళాశాలలో ఉదయం 9 గంటలకు పది, ఇంటర్మీడియట్ మెమోలు, ఆధార్ కార్డ్ జిరాక్స్, పాస్పోర్ట్ సైజ్ పొటో, ఆండ్రాయిడ్ మొబైళ్లతో హాజరు కావాలని, పూర్తి వివరాల కోసం 83414 05102, 79818 34205 నంబర్లలో సంప్రదించాలని కోరారు. జాబ్మేళాలో 23మంది ఎంపిక ఖమ్మం రాపర్తినగర్: జిల్లా ఉపాధి కల్పన శాఖ ఆధ్వర్యాన గురువారం ఖమ్మం టేకులపల్లి లోని మోడల్ కెరీర్ సెంటర్లో జాబ్మేళా నిర్వహించారు. వివిధ కంపెనీల బాధ్యులు పాల్గొని ఇంటర్వ్యూలు నిర్వహించగా 51 మందిలో 23 మందిని ఉద్యోగాలకు ఎంపిక చేశారు. జిల్లా ఉపాధి కల్పన శాఖ అధికారి ఎన్.మాధవి, ఆయా కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. రేగులచలకలో కేంద్రబృందం పరిశీలన రఘునాథపాలెం: కేంద్రప్రభుత్వ పథకాల అమలు, చేపట్టిన అభివృద్ధి పనులను మండలంలోని రేగులచలకలో నేషనల్ లెవల్ మానిటరింగ్(ఎన్ఎల్ఎం) బృందం పరిశీలించింది. ఉపాధిహామీ పథకం ద్వారా చేపట్టిన పనులు, రిజిస్టర్ల నిర్వహణపై ఆరా తీశాక ఉపాధిహామీ కూలీలు, డ్వాక్రా మహిళలు, గ్రామ సంఘం సభ్యులతో సమావేశమై పథకాల ద్వారా జరిగిన లబ్ధిని తెలుసుకున్నారు. అలాగే, గ్రామపంచాయతీ రికార్డులను కూడా తనిఖీ చేసిని బృందం వృద్ధా ప్య, వితంతు, దివ్యాంగుల పెన్షన్ లబ్దిదారులతో సమావేశమై అభిప్రాయాలు సేకరించారు. అనంతరం అంగన్వాడీల్లోని టాయిలెట్లు, అవె న్యూ ప్లాంటేషన్, నర్సరీలు, సీసీ రోడ్ల పనులను పరిశీలించారు. కేంద్ర బృందంలో డాక్టర్ డీ.డీ.గరుడ, ఎన్.అశ్విన్ గోపాల్తో పాటు ఎంపీడీఓ అశోక్కుమార్, వివిధ శాఖల ఉద్యోగులు చలపతిరావు, శ్రీదేవి, పద్మయ్యనాయుడు, శ్రీనివాస్, శ్రీనివాసరావు, దీపక్, మాజీ ఉపసర్పంచ్ యండపల్లి సత్యం, అన్నం భూషయ్య పాల్గొన్నారు. పదవీ విరమణ ఉద్యోగులకు సన్మానం ఖమ్మక్రైం: జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో విధులు నిర్వర్తిస్తూ ఉద్యోగ విరమణ చేసిన పోలీస్ ఉద్యోగులను సీపీ సునీల్దత్ గురువారం సన్మానించారు. ఖమ్మంలోని కమిషనర్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సుదీర్ఘ కాలంగా విధులు నిర్వర్తించి పోలీస్ శాఖకే కాక ప్రజలకు సేవలు చేశారని కొనియాడారు. ఈమేరకు ఏఆర్ ఎస్సై మోహన్రావుతో పాటు ఏఎస్సైలు ముత్తయ్య, లచ్చు, ఉద్యోగులు సైదయ్య, మన్సూర్, బాలకృష్ణ, వెంకయ్య, ఆనందరావును సన్మానించగా అడిషనల్ డీసీపీ ప్రసాద్రావు, ఏఆర్ ఏసీపీ నర్స య్య, ఆర్ఐలు కామరాజు, సురేష్, నాగుల్మీరా, పోలీస్ ఉద్యోగుల అసోసియేషన్ ఇన్చార్జ్ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. పెద్దాస్పత్రిలో మోకీలు శస్త్రచికిత్స ఖమ్మంవైద్యవిభాగం: ఖమ్మం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి వైద్యులు మోకీలు శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించారు. ఖమ్మం రూరల్ మండలానికి చెందిన 55ఏళ్ల బి.కల్యాణి మోకాలి నొప్పితో చాన్నాళ్లుగా బాధపడుతుండగా, పెద్దాస్పత్రి వైద్యులను సంప్రదించింది. దీంతో పరీక్షలు చేశాక ఆస్పత్రి ఆర్థోపెడిక్ హెచ్ఓడీ ఎల్.కిరణ్కుమార్ ఆధ్వర్యాన గురువారం ఆమెకు మోకీలు శస్త్రచికిత్స నిర్వహించారు. శస్త్ర చికిత్సలో హెచ్ఓడీతో పాటు వైద్యులు వినయ్కుమార్, మణికంఠ, మనీష్, సిబ్బంది పాల్గొన్నారు. ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునే ఆయిల్పామ్ కారేపల్లి: ఇతర పంటలతో పోలిస్తే ఆయిల్పామ్తో లాభాలు ఎక్కువగా వస్తాయని జిల్లా ఉద్యా న, పట్టు పరిశ్రమ శాఖాధికారి ఎం.వీ.మధుసూదన్ తెలిపారు. మండలంలోని చీమలపాడులో పలువురు రైతులు సాగు చేస్తున్న ఆయిల్పామ్ తోటలను గురువారం పరిశీలించిన ఆయన మాట్లాడారు. కోతుల బెడద, చీడపీడలు లేకపోవడమే కాక ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా ఆయిల్పామ్ తట్టుకుంటుందని తెలిపారు. ఉమ్మడి జిల్లాలో ఫ్యాక్టరీలు కూడా ఉన్నందున మార్కెటింగ్ సమస్య ఉండదని చెప్పారు. ఇవికాక ప్రభుత్వం రాయితీపై మొక్కలు ఇవ్వడంతో పాటు నిర్వహణ ఖర్చులు, సబ్సిడీపై డ్రిప్ అందజేస్తున్నందున రైతులు సద్వినియోగం చేసుకో వాలని మధుసూదన్ సూచించారు. వైరా డివిజ న్ ఉద్యానవన అధికారి ఆకుల వేణు, ఫీల్డ్ ఆఫీస ర్ శ్రావణి, రైతు పోతుల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. -
సంతాన సాఫల్య కేంద్రాల తీరుపై కలెక్టర్ ఆగ్రహం
ఖమ్మంవైద్యవిభాగం: జిల్లాలో విచ్చలవిడిగా సంతాన సాఫల్య కేంద్రాలు పుట్టుకొస్తున్నాయి. మంగళవారం సాక్షిలో ‘దంపతులతో దాగుడు మూతలు’ కథనం ప్రచురితమైంది. దీంతో కలెక్టర్ అనుదీప్ వైద్య ఆరోగ్య శాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్లను ఎప్పటి కప్పుడు తనిఖీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో డీఎంహెచ్ఓ కళావతిబాయి అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్లపై దాడులు చేయాలని నిర్ణయించారు. గురువారం నుంచి తనిఖీలు ప్రారంభిస్తామని ఒక ప్రకటనలో తెలిపారు. సంతాన సాఫల్య కేంద్రాలు అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ (రెగ్యులేషన్) యాక్ట్ 2021, సరోగసీ (రెగ్యులేషన్) చట్టం 2021 ప్రకారం చట్ట నియమాలు, నిబంధనలు పాటించాలని ఆదేశించారు. -
డెయిరీకి మహర్దశ
అటవీ పార్క్ ఎప్పుడో ? తెలంగాణ తిరుమలగా పేరున్న జమలాపురంలో అటవీ పార్క్ ఏర్పాటుకు నిధులు మంజూరైనా పనుల్లో కదలిక రావడం లేదు.ఖమ్మం ప్రభుత్వ పాడి పరిశ్రమ(విజయ డెయిరీ)కు మహర్దశ పట్టనుంది. డెయిరీని బలోపేతం చేసేలా సర్కారు అడుగులు వేస్తోంది. పాడి పరిశ్రమ స్థలాన్ని వాణిజ్య అవసరాలకు వినియోగించి ఆర్థిక వనరులు సమకూర్చుకోవాలని నిర్ణయించింది. అంతేగాక మరో చోట 15 ఎకరాల్లో ఇంకో పరిశ్రమను నెలకొల్పే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. కాగా, ప్రస్తుత ప్లాంట్ను రూ. 2.35 కోట్లతో అధునికీకరించాలని రాష్ట్ర పాడి పరిశ్రమ శాఖ నిర్ణయించింది. – ఖమ్మంవ్యవసాయంగురువారం శ్రీ 31 శ్రీ జూలై శ్రీ 20258లో50 ఏళ్లుగా వెనుకబాటే.. పూర్వపు ఖమ్మం జిల్లాతో పాటు నల్లగొండ జిల్లా కోదాడ, సూర్యాపేట వరకు గల పాల ఉత్పత్తిదారుల, వినియోగదారుల ప్రయోజనాల కోసం 1975 లో నాటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు నగరంలోని రోటరీనగర్లో పదెకరాల స్థలంలో పాడి పరిశ్రమను నెలకొల్పారు. 50 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ డెయిరీ అభివృద్ధిలో వెనకబడి ఉండగా, బలోపేతంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ క్రమంలో రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశ్రమను సందర్శించి అభివృద్ధికి చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. దీంతో కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, రాష్ట్ర పాడి పరిశ్రమ ఎండీ కె.చంద్రశేఖర్ రెడ్డి, అదనపు కలెక్టర్ పి.శ్రీనివాస రెడ్డి, పరిశ్రమ జనరల్ మేనేజర్, సూపరింటెండెంట్ ఇంజనీర్(సివిల్), ఖమ్మం ప్లాంట్ డిప్యూటీ డైరెక్టర్లు సమావేశమై అభివృద్ధిపై చర్చించి పలు నిర్ణయాలు తీసుకున్నారు. స్థలాన్ని సద్వినియోగం చేసేలా.. ఖమ్మం రోటరీనగర్ ప్రాంతం వ్యాపార కేంద్రంగా అభివృద్ధి చెందింది. ఈ ప్రాంతంలో పదెకరాల స్థలంలో విజయ డెయిరీ నడుస్తోంది. ఇందులో ఐదెకరాల వరకు వ్యాపార సమూదాయాలు నిర్మిస్తే పరిశ్రమకు ఆర్థిక వనరులు సమకూరుతాయని అధికారులు భావిస్తున్నారు. గతంలో ఈ స్థలాన్ని బస్టాండ్కు అప్పగించే అంశం కూడా చర్చకు వచ్చింది. ఇటువంటి పరిస్థితులు నెలకొనడంతో ఈ స్థలాన్ని పరిశ్రమ కు ప్రయోజనం కలిగేలా వినియోగించేందుకు చర్యలు తీసుకోవాలని నిర్ణయించగా.. కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులు కూడా సానుకూలంగా స్పందించారు. అభివృద్ధికి ప్రణాళికలు.. ప్రస్తుత పాడి పరిశ్రమ ఆధునికీకరణకు అధికారులు ప్రతిపాదనలు రూపొందించగా.. ఈ పనులకు రూ. 2.35 కోట్లు అవసరమని రాష్ట్ర పాడి పరిశ్రమ మేనేజింగ్ డైరెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి కలెక్టర్కు నివేదించారు. పరిశ్రమ నిర్వహణ, ప్రస్తుత ప్లాంటులో మార్పులు, పలు యంత్రాల ఏర్పాటుతో పాటు సివిల్ పనుల నిర్వహణకు నిధులు అవసరమని ప్రతిపాదనల్లో పేర్కొన్నారు. దీంతో పాల నాణ్యత పెరిగితే వినియోగదారుల నుంచి ఆదరణ కూడా పెరుగుతుందని అధికారులు అంటున్నారు. ఇక డెయిరీలో ఆది నుంచీ తాగునీటి సమస్య ఉంది. దీంతో ట్యాంకర్ల ద్వారా కొనుగోలు చేసిన సందర్భాలూ ఉన్నాయి. ఈ సమస్య పరిష్కారానికి ఖమ్మం కార్పొరేషన్ నుంచి తాగునీరు సరఫరా చేయాలని కమిషనర్ను కలెక్టర్ ఆదేశించారు. పరిసర ప్రాంతాల్లో డ్రెయిన్లు సరిగా లేక మురుగునీరు పరిశ్రమ ఆవరణలోకి వస్తుండగా దీని నివారణకు కూడా చర్యలు చేపట్టాలని సూచించారు.న్యూస్రీల్ఖమ్మం పాడి పరిశ్రమ అభివృద్ధికి ప్రణాళికలు వాణిజ్య అవసరాలకు ప్రస్తుత పరిశ్రమ స్థలం.. తద్వారా విజయ డెయిరీకి ఆర్థిక పరిపుష్టి కొత్తగా మరొక నిర్మాణానికి ప్రతిపాదనలు నూతన డెయిరీకి ప్రతిపాదన.. ప్రస్తుతం ఉన్న పాడి పరిశ్రమను కొనసాగిస్తూనే మరో చోట 15 ఎకరాలు పరిశ్రమకు కేటాయించి నూతన డెయిరీని నిర్మించాలని అధికారులు ప్రతిపాదనలు రూపొందించారు. ఈ అంశంపై కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఖమ్మం పరిసర ప్రాంతాల్లో అనువైన స్థలాన్ని గుర్తించి ప్రతిపాదనలు రూపొందించాలని అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డిని ఆదేశించారు. దీంతో అదనపు కలెక్టర్ ఖమ్మం ఆర్డీఓతో చర్చించి, పరిశ్రమకు అనువైన స్థలాలను గుర్తించే పనిలో ఉన్నారు.పాడి పరిశ్రమ అభివృద్ధిపై దృష్టి ఖమ్మం పాడి పరిశ్రమ అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ మేరకు ప్రతిపాదనలు రూపొందిస్తోంది. కలెక్టర్, రాష్ట్ర పాడి పరిశ్రమ మేనేజింగ్ డైరెక్టర్తో కూడిన అధికారుల బృందం పరిశ్రమ భవిష్యత్ను దృష్టిలో పెట్టుకొని పలు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇది ఖమ్మం డెయిరీకి శుభ పరిణామం. – కె.రవికుమార్, పాడి పరిశ్రమ అభివృద్ధి సంస్థ డీడీ -
విద్యార్థులు లక్ష్యం దిశగా సాగాలి
చింతకాని: విద్యార్థులు లక్ష్యాన్ని ఎంచుకుని ఆ దిశగా ముందుకు సాగాలని అదనపు కలెక్టర్ పి.శ్రీజ పేర్కొన్నారు. మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలను బుధవారం ఆమె తనిఖీ చేశారు. టా యిలెట్లు, తాగునీటి వసతి, వంటగది, మధ్యాహ భోజనాన్ని పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు ప్రభుత్వం అనేక సౌకర్యాలను కల్పిస్తోందని తెలిపారు. కార్యక్రమంలో మండల పంచాయతీ అధికారి పర్వీన్ ఖైసర్, ఎంఈఓ సలాది రామారావు, ఏఈ రఘు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు. -
సరికొత్త ఆశలు..
జిల్లాలో 189 మంది 2003 డీఎస్సీ ఉపాధ్యాయులు ఖమ్మం సహకారనగర్ : డీఎస్సీ 2003 ఉపాధ్యాయులకు ఓపీఎస్ వర్తింపజేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో జిల్లాలోని 189 మందిలో మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. కాగా, పాత పెన్షన్ను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ యూనియన్ (టీఎస్ సీపీఎస్ఈయూ), ఎన్ఎం ఓపీఎస్ల ఆధ్వర్యంలో పదేళ్లుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై దశల వారీగా ఉద్యమాలు చేశామని, దాని ఫలితంగానే 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు లబ్ధి చేకూరుతోందని సీపీఎస్ నాయకులు అంటున్నారు. -
భూసేకరణ వేగవంతం చేయాలి
ఖమ్మంఅర్బన్: జిల్లాలో చేపట్టిన కీలక అభివృద్ధి పనులకు అవసరమైన భూ సేకరణను వేగవంతం చేయాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. బుధవారం కలెక్టరేట్లో అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మున్నేరు నది రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులకు ఖమ్మం రూరల్, అర్బన్ మండలాల్లోని రైతులు అంగీకరించిన స్థలాల్లో పనులు వేగంగా కొనసాగించాలని సూచించారు. భూములు ఇచ్చిన రైతులకు ప్రత్యామ్నాయంగా లేఔట్ ప్లాట్లు కేటాయించడమే కాక, వాటిలో అంతర్గత రహదారులు, స్ట్రీట్లైట్లు, విద్యుత్ సరఫరా వంటి మౌలిక వసతులు కల్పించాలని ఆదేశించారు. లేఔట్లో 10 మీటర్ల వెడల్పు గల బ్రిడ్జి నిర్మాణానికి డిజైన్ను తుది రూపంలోకి తీసుకురావాలని, హైదరాబాద్లోని ప్రైవేట్ లేఔట్ల తరహాలోనే లేఔట్ను అభివృద్ధి చేయాలని అన్నారు. పనులన్నింటికీ స్పష్టమైన గడువును నిర్దేశించాలని సూచించారు. జాతీయ రహదారుల నిర్మాణానికి అవసరమైన భూసేకరణ పనులను వేగంగా పూర్తిచేయాలని అన్నారు. సమావేశంలో నీటి పారుదల శాఖ ఎస్ఈ ఎం.వెంకటేశ్వర్లు, ఖమ్మం ఆర్డీఓ నరసింహారావు, నేషనల్ హైవే మేనేజర్ దివ్య, ఖమ్మం అర్బన్ తహసీల్దార్ సైదులు, రూరల్ తహసీల్దార్ రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ ఆస్పత్రులపై నమ్మకం కల్పించాలి ఖమ్మంవైద్యవిభాగం : మెరుగైన సేవలతో ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజల్లో నమ్మకం కల్పించాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. బుధవారం కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. వైద్య విధాన పరిషత్ ఆస్పత్రుల ద్వారా ప్రజలకు మంచి సేవలు అందించాలన్నారు. జిల్లాలో 4 ఏరియా ఆస్పత్రులు, 3 సామాజిక ఆరోగ్య కేంద్రాలు వీవీపీ ద్వారా పని చేస్తున్నాయని చెప్పారు. సత్తుపల్లి, మధిర, కల్లూరు ఏరియా ఆస్పత్రుల నూతన భవనాలు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయన్నారు. వైద్యుల హాజరు సక్రమంగా ఉండాలని, రెండు రోజుల్లో వైద్యులంతా ఆధార్ ఆధారిత హాజరు యాప్లో నమోదు కావాలని సూచించారు. ఆస్పత్రుల్లో అవసరైమన మందులు అందుబాటులో ఉంచాలని సూచించారు. సమావేశంలో డీసీహెచ్ఎస్ రాజశేఖర్, వైద్యశాఖ ఈఈ ఉమా మహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి -
ఎప్పుడవుతుందో..?
అటవీ పార్క్ఎర్రుపాలెం: మధిర నియోజకవర్గాన్ని అభివృద్ధిలో అగ్రభాగాన నిలిపేందుకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క నిధుల మంజూరులో వేగం చూపిస్తున్నా.. క్షేత్రస్థాయిలో పనులు అంతే వేగంగా జరగడం లేదు. ఫలితంగా అధికార యంత్రాంగం తీరుపై ప్రజల్లో అసహనం వ్యక్తమవుతోంది. తెలంగాణ తిరుమలగా పేరున్న ఎర్రుపాలెం మండలంలోని జమలాపురంను పర్యాటక రంగంలోనూ అభివృద్ధి చేయాలని ప్రణాళిక రూపొందించారు. ఇందుకోసం డిప్యూటీ సీఎం అటవీ పార్క్ ఏర్పాటుకు నిధులు మంజూరు చేసినా పనుల్లో కదలిక లేక శిలాఫలకం అధికారుల తీరుకు నిదర్శనంగా నిలుస్తోంది. రూ.5.83 కోట్లు.. జనవరిలో శంకుస్థాపన శ్రీవేంకటేశ్వరస్వామి వారి ఆలయం కొలువైన జమలాపురం గ్రామంలో పర్యాటక అభివృద్ధి కోసం అడవులు, గుట్టల ఆధారంగా ఎకో అటవీ పార్కు నిర్మాణానికి (పర్యావరణ ఉద్యానవనం) కార్యాచరణ రూపొందించారు. రూ.5.83 కోట్ల నిధులు మంజూరు కాగా, డిప్యూటీ సీఎం భట్టి జనవరి 7న శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత పనులు నత్తనడకన సాగుతున్నాయి. అడవులను ధ్వంసం చేయకుండా, వీటి ఆధారంగా కాటేజీల నిర్మాణం.. తద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాల కల్పనే లక్ష్యంగా ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకోగా.. ఆరు నెలల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. కానీ, ఆ గడువు ముగిసినా అడుగు ముందుకు పడకపోవడం గమనార్హం. చేపట్టాల్సిన పనులు ఇవే.. అటవీ పార్కు నిర్మాణంలో భాగంగా అధికారులు పలు అభివృద్ధి పనులను చేపట్టాల్సి ఉంది. గుట్ట కింద మొత్తం ఐదు టాయెలెట్ల నిర్మాణం, గుట్టపైన ఉన్న శ్రీవారి పాదాల వరకు రహదారి మార్గం ఏర్పాటు చేయాలి. అలాగే, గుట్టపైకి దారితో పాటు ఫెన్సింగ్ ఏర్పాటు, సైడ్ వాల్స్ నిర్మాణం పనులు, టూరిస్టులు విడిది చేసేందుకు గానూ మూడు కాటేజీలు నిర్మించాల్సి ఉంది. అంతేకాక గుట్టపై పర్యాటకుల కోసం పార్క్ల ఏర్పాటు, టూరిస్టులు ఒకేచోట సేద తీరడం, కూర్చునేందుకు హట్స్ నిర్మించాల్సి ఉంది. జమలాపురంలో కదలిక లేని పనులు నిధులు మంజూరైనా పనుల్లో జాప్యం పర్యాటక అభివృద్ధి అవకాశాలపై పట్టింపు కరువుపార్క్ సిద్ధమైతే పర్యాటకుల తాకిడి శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయానికి అన్ని ప్రాంతాల నుంచి భక్తులు వస్తున్నారు. అటవీ పార్కు పూర్తయితే పర్యాటకుల తాకిడి మరింతగా పెరిగే అవకాశాలున్నాయి. ఆదాయ మార్గాలుంటాయి. యువతకు ఉపాది కూడా ఉంటుంది. గుట్టపైన కాటేజీల నిర్మాణంతో టూరిస్టులు విడిది చేయడానికి కూడా మొగ్గు చూపుతారు. గుట్టపైన శ్రీవారి పాదాల వద్దకు కూడా భక్తులు వెళ్లి సందర్శించి పూజలు నిర్వహిస్తున్నారు. –ఉప్పల శ్రీరామచంద్రమూర్తి, వ్యవస్థాపక ధర్మకర్త, జమలాపురం ఆలయం గుట్ట కింద పనులు చేస్తున్నాం.. జమలాపురంలో శ్రీవేంకటేశ్వరస్వామివారి దేవాలయం సమీపంలో 4,5 హెక్టార్లల్లో అటవీ పార్కు పనులు మొదలుపె ట్టాం. ఇప్పటికే టాయ్లెట్ల పనులు జరుగుతున్నాయి. గుట్ట కింద ఎర్త్ పనులు కూడా చేస్తున్నాం. నిధులు మంజూరైనప్పటికీ ఇంకా కాంట్రాక్టర్కు అసలు బిల్లులు రాలేదు. ఈ కారణంగా పనులు మందకొడిగా నడుస్తున్నాయి. బిల్లులు సకాలంలో వస్తే పనులు వేగం పుంజుకుంటాయి. –శ్రీనివాసరెడ్డి, ఫారెస్టు రేంజ్ ఆఫీసర్, మధిర -
గురుకుల కార్యదర్శికి నిరసన సెగ
ఖమ్మంమయూరిసెంటర్: జిల్లా పర్యటనలో భాగంగా ఖమ్మం వచ్చిన సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి అలుగు వర్షిణికి వామపక్ష విద్యార్థి సంఘాల నుంచి నిరసన సెగ ఎదురైంది. బుధవారం ఖమ్మంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల కళాశాలలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వచ్చిన ఆమెకు వినతిపత్రం అందించేందుకు ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, పీడీఎస్యూ, జార్జిరెడ్డి పీడీఎస్యూ సంఘాల నేతలు కళాశాల వద్దకు చేరుకున్నారు. వారిని కలిసేందుకు నిరాకరించడంతో గురుకులాల కార్యదర్శి కారును కళాశాలలోకి వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో స్థానిక అధికారులు మెయిన్ గేటు నుంచి కాకుండా పక్కనున్న గేటు ద్వారా లోనికి తీసుకెళ్లగా ఆగ్రహించిన విద్యార్థి సంఘాల నేతలు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. అంబేద్కర్ కళాశాలలో కార్యక్రమం ముగించుకొని దానవాయిగూడెం గురుకులం వద్దకు వెళ్లిన విషయం తెలుసుకుని అక్కడా వినతిపత్రం ఇచ్చేందుకు యత్నించారు. కార్యదర్శి కారుకు అడ్డుపడి ఆందోళన చేశారు. ఆందోళన ఉధృతం అవుతుండగా పోలీసులు చేరుకొని వారిని పక్కకు తప్పించే ప్రయత్నం చేశారు. సమస్యలు వింటేనే ఆందోళన విరమిస్తామని సంఘాల నేతలు పట్టుబట్టడంతో పోలీసులు జోక్యం చేసుకొని గురుకుల కార్యదర్శికి వినతిపత్రం అందజేయించారు. సమస్యలు వినకుండా గురుకుల కార్యదర్శి వ్యవహరించిన తీరుపై విద్యార్థి సంఘాల నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, గురుకులాల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు వినలేని గురుకుల కార్యదర్శి అలుగు వర్షిణిని సస్పెండ్ చేయాలని విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేశారు. అనంతరం ఖమ్మంలోని గిరిప్రసాద్ భవనంలో ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, పీడీఎస్యూ, జార్జిరెడ్డి పీడీఎస్యూ, పీడీఎస్యూ జిల్లా కార్యదర్శులు ఇటికాల రామకృష్ణ, టి.ప్రవీణ్కుమార్, వి.వెంకటేశ్, ఎం.సురేశ్, జి.మస్తాన్ మాట్లాడారు. తొలి నుంచి గురుకుల కార్యదర్శి అహంకారపూరితంగా వ్యవహరిస్తున్నారని, ఓ సందర్భంలో విద్యార్థులు బాత్రూమ్లు కడుక్కోలేరా అని మాట్లాడారని, ఇప్పుడు విద్యార్థుల సమస్యలను వివరించేందుకు వెళ్లిన తమతో మాట్లాడేందుకు నిరాకరించారని పేర్కొన్నారు. సమావేశంలో సుధాకర్, త్రినాథ్, మనోజ్, అజయ్, లోకేశ్, వెంకటేశ్, జంపన్న, వరుణ్, వెంకట్ పాల్గొన్నారు. గురుకుల పాఠశాల సందర్శనఖమ్మంరూరల్: మండలంలోని కోదాడక్రాస్రోడ్లోని టీజీఎస్ఈడబ్ల్యూఆర్ఎస్ను గురుకులాల కార్యదర్శి అలుగు వర్శిణి బుధవారం సందర్శించారు. పదో తరగతి విద్యార్థులను పలు సబ్జెక్టులపై ప్రశ్నించారు. పరిశుభ్రత, భోజనం ఎలా ఉందని ఆరా తీశారు. కారుకు అడ్డుపడి ఆందోళన చేసిన విద్యార్థి సంఘాల నేతలు -
సగానికి తగ్గిన సోలార్ విద్యుత్ ఉత్పత్తి
ఇల్లెందు: రూ.కోట్లు వెచ్చించి ఏర్పాటు చేసిన సింగరేణి సోలార్ విద్యుత్ ప్లాంట్లో విద్యుత్ ఉత్పత్తి సగానికి తగ్గిపోయింది. ప్లాంట్లో పనిచేసే మూడు విభాగాల్లోని ఉద్యోగులు, కార్మికులను తొలగించా రు. సోలార్ ప్లాంట్ నిర్వహణ అధ్వానంగా మారింది. ఇక్కడి సైట్ ఇంజనీర్ వెంకటేశ్ రోడ్డు ప్రమాదంలో మృతి చెంది 8 నెలలు కావొస్తుండగా ఆయన స్థానంలో మరో సైట్ ఇంజనీర్ను భర్తీ చేయలేదు. నిర్వహణ బాధ్యతలు చూసే సూపర్వైజర్ పోస్టు కూడా ఖాళీగా ఉంది. ఈనెల మొదటి వారం నుంచి కార్మికులు పనుల్లోకి వెళ్లటం లేదు. తమకు న్యాయం చేయాలని సమ్మెబాట పట్టారు. దీంతో ప్లాంట్లో విద్యుత్ ఉత్పత్తి సగానికి పడిపోయింది. ఇల్లెందు – కారేపల్లిరోడ్లో కోటమైసమ్మ ఆలయం సమీపంలో 350 ఎకరాల్లో ఏర్పాటు చేసిన విషయం విదితమే. ఈ ప్లాంట్ నిర్వహణ టెండర్ను ఓ సంస్థ దక్కించుకుంది. ప్లాంట్ రక్షణ కోసం 30 మంది వరకు గార్డులు పనిచేయాలి. కానీ, తొమ్మిది మంది గార్డులను కొనసాగిస్తామని చెప్పటంతో గార్డులు సమ్మె బాట పట్టారు. ఇక ఆరుగురు ఎలక్ట్రీషియన్లు, 10 మంది గ్రాస్ కట్టింగ్ కార్మి కులు పనిచేస్తున్నారు. నిర్వహణ భారంగా మారిందని కార్మికులను తొలగించారు. తొమ్మిదిమంది గార్డుల ను కొనసాగిస్తూ రాత్రుల్లో చోరీల అదుపుకోసం విధులకు హాజరు కావాలని ఒత్తిడి చేస్తున్నారు. ఇదిలాఉండగా ఇక్కడి సీసీ కెమెరాలు కూడా సక్రమంగా పనిచేయటంలేదు. దీంతో చోరీలు పెరిగిపోయా యి. కాగా, రాత్రి సమయాల్లో తాము ఎంతకాలం విధులు నిర్వర్తించాలని కార్మికులు ఆందోళన చెందుతున్నారు. జూలై మొదటి వారం నుంచి విద్యుత్ ఉత్పత్తి సగానికి సగం తగ్గిపోయింది. ప్రతీ రోజు 1.50 లక్షల యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగాల్సి ఉండగా సగం కూడా ఉత్పత్తి జరగడం లేదని అధికారులే చెబుతున్నారు. ఈ తరుణంలో రూ.కోట్లు వెచ్చించి ఏర్పాటు చేసిన సింగరేణి సోలార్ ప్లాంట్లో విద్యుత్ ఉత్పత్తి నీటి మీద రాతలుగా మారింది. ఈ అంశంపై సింగరేణి సోలార్ ప్లాంట్ పర్యవేక్షక ఇంజనీర్ వీరూనాయక్ను వివరణ కోరగా సంస్థ నిర్వహణ లోపం వల్ల విద్యుత్ ఉత్పత్తి జరగడం లేదని, ఇది సంస్థ లోపమే తప్ప సింగరేణి లోపం కాదని పేర్కొన్నారు. విద్యు త్ ఉత్పత్తి తగ్గిపోయిన విషయం వాస్తవమేనని, కొన్ని ప్లేట్లు పని చేయడం లేదని, చాలా సమస్యలు ఉన్నాయని, మరో సంస్థకు టెండర్ అప్పగించే ప్రయత్నంలో కొంత జాప్యం సాగుతోందని పేర్కొన్నారు. అంతా అస్తవ్యస్తంగా మారిన ఇల్లెందు ఏరియా సింగరేణి -
మహిళల పేరిటే పథకాలు
నేలకొండపల్లి : రాష్ట్రంలో అత్యధిక సంక్షేమ పథకాలను మహిళల పేరిటే అమలు చేస్తున్నామని రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. మండలంలోని వివిధ గ్రామాల్లో బుధవారం ఆయన పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. నేలకొండపల్లి డిగ్రీ కాలేజీలో మొక్కలు నాటారు. ఆ తర్వాత రేషన్ కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ పేదల కష్టాలను చూసిన ప్రభుత్వం.. వారికి భరోసా కల్పించేలా పాలన సాగిస్తోందని చెప్పారు. గత ఆర్థిక సంవత్సరంలో మహిళా సంఘాలకు సున్నా వడ్డీతో రూ.25.65 కోట్లు అందించామని తెలిపారు. కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ.. జిల్లాలో 19,690 కొత్త రేషన్ కార్డులు మంజూరు చేసినట్లు తెలిపారు. ఇంకా అర్హత ఉన్న వారు స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో లేదా మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మువ్వా విజయ్బాబు, డీసీసీబీ డైరెక్టర్ తుళ్లూరి బ్రహ్మయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ వెన్నపూసల సీతారాములు, నాయకులు శాఖమూరి రమేష్, జెర్రిపోతుల అంజిని, బచ్చలకూరి నాగరాజు, భద్రయ్య, రావెళ్ల కృష్ణారావు, కొర్లకుంట్ల నాగేశ్వరరావు, పగిళ్ల పృథ్వీ, కడియాల నరేష్, కొమ్మినేని విజయ్బాబు, గుండా బ్రహ్మం తదితరులు పాల్గొన్నారు.రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి -
రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపిక
బోనకల్: ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలో జరుగుతున్న అథ్లెటిక్స్ రాష్ట్రస్థాయి పోటీల ఎంపికల్లో ముష్టికుంట్ల ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న షేక్ ఫరీదా ప్రతిభ చూపింది. ఆమె అండర్–14 జట్టుకు ఎంపికై , వచ్చే నెల 3వ తేదీన వరంగల్లో జరిగే రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో ఆడనున్నట్లు హెచ్ఎం భాగ్యలక్ష్మి బుధవారం తెలిపారు. పీడీ నవీద్పాషా, ఉపాధ్యాయులు, గ్రామస్తులు అభినందించారు. మహిళా డెయిరీని సద్వినియోగం చేసుకోవాలిమధిర: ఇందిరా మహిళా డెయిరీని మహిళా సంఘం సభ్యులు సద్వినియోగం చేసుకోవాలని పశుసంవర్థక శాఖ జిల్లా అధికారి డాక్టర్ పురంధర్ తెలిపారు. మధిర ఐకేపీ కార్యాలయంలో ఇందిరా మహిళా డెయిరీ మొదటి విడత పాడి గేదెల కొనుగోలు లబ్ధిదారులతో బుధవారం సమావేశం నిర్వహించారు. మొదటి విడతలో ఎస్సీ లబ్ధిదారులకు 80 శాతం సబ్సిడీతో రెండు పాడి గేదెలను అందజేస్తారని, ముర్రా జాతి గేదెలను కొనుగోలు చేసుకోవాలని తెలిపారు. సమావేశంలో ఎంపీడీఓ వెంకటేశ్వర్లు, డీపీఎం శ్రీనివాస్, మండల పశువైద్యాధికారి ఉమాకుమారి, ఐకేపీ ఏపీఎం సుబ్బారావు, ఏఓ సాయి దీక్షిత్, లబ్ధి దారులు, తదితరులు పాల్గొన్నారు. ఉన్నత చదువులకు ఉపయోగంముదిగొండ: మధ్యలో చదువు మానేసిన వారికి ఉన్నత చదువుల కోసం ఓపెన్ స్కూల్ మంచి అవకాశమని ఉమ్మడి ఖమ్మం జిల్లా ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ మద్దినేని పాపారావు అన్నారు. ముదిగొండలో బుధవారం వాల్పోస్టర్లను ఆవిష్కరించారు. ఓపెన్ స్కూల్లో అడ్మిషన్ పొందేందుకు 80084 03522 నంబర్లో సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీధర్స్వామి, స్పెషల్ ఆఫీసర్ విజయలక్ష్మి, భాస్కర్రావు, డి.శోభారాణి, నాజర్, పాల్గొన్నారు. సావనీర్ ఆవిష్కరణఖమ్మంగాంధీచౌక్: నెలనెలా వెన్నెల 8వ వార్షికోత్సవం సందర్భంగా ఆగస్టు 7 నుంచి 10వ తేదీ వరకు తెలుగు రాష్ట్రాలస్థాయి ఆహ్వాన నాటిక పోటీలను నగరంలోని భక్త రామదాసు కళాక్షేత్రంలో నిర్వహిస్తున్నట్లు ఖమ్మం కళాపరిషత్ అధ్యక్షుడు డాక్టర్ నాగబత్తిని రవి, మిత్రా ఫౌండేషన్ చైర్మన్ కురువెళ్ల ప్రవీణ్కుమార్, అన్నాబత్తుల రవీంద్రనాథ్ కళా సాంస్కృతిక సంస్థ ప్రధాన కార్యదర్శి ఏఎస్కుమార్ తెలిపారు. బుధవారం ఖమ్మం నగరంలోని భక్తరామదాసు కళాక్షేత్రంలో నెలనెలా వెన్నెల వార్షికోత్సవ సావనీర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో నెల నెలా వెన్నెల నిర్వాహకులు మోటమర్రి జగన్మోహన్రావు, కొత్తూరు దేవేంద్ర, వేల్పుల విజేత, వేముల సదానందం, నందిగం కృష్ణ తదితరులు పాల్గొన్నారు. వ్యక్తికి జైలు శిక్షఖమ్మంలీగల్: యాదాద్రి భువనగిరి జిల్లా జమ్మాపూర్ గ్రామానికి చెందిన బంధనాథము సాగర్కు ఆజాగ్రత్తగా వాహనం నడిపి వ్యక్తి మరణానికి కారణమైన కేసులో ఆరు నెలల సాధారణ జైలు శిక్ష విధిస్తూ స్థానిక స్పెషల్ మొబైల్ కోర్టు న్యాయమూర్తి బి.నాగలక్ష్మి బుధవారం తీర్పు చెప్పారు. ఫిర్యాది మాతంగి వెంకటేశ్.. తన తమ్ముడు నరేశ్ (22) 2018, మార్చి 29న మో టార్ సైకిల్పై పాలేరు వస్తుండగా డీసీఎం ఢీకొట్టింది. నరేశ్ను ఆస్పత్రిలో చేర్పించగా మరునా డు మృతిచెందాడు. కూసుమంచి పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసిన పోలీసులు డీసీఎం డ్రైవర్ సాగర్పై కోర్టులో చార్జిషీటు దాఖ లు చేశారు. విచారణ అనంతరం నిందితుడికి ఆరు నెలల జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ తరఫున ఏపీపీ వీరయ్య వాదించగా లైజన్ ఆఫీసర్ శ్రీకాంత్, నాగేశ్వరరావు కోర్టు పీసీ భార్గవ్ సహకరించారు. యూటీ నిర్మాణ పనుల పరిశీలనకూసుమంచి: సాగర్ ఎడమ కాలువకు పాలేరు వద్ద నిర్మిస్తున్న యూటీ పనులు తుది దశకు చేరగా బుధవారం నీటిపారుదల శాఖ ఎస్ఈ మంగళంపూడి వెంకటేశ్వర్లుతో పాటు క్వాలిటీ కంట్రోల్ ఈఈ వెంకటరమణా రావు, ఇతర అధికారులు పరిశీలించారు. ప్రస్తుతం కాలువకు 2,600 క్యూసెక్కుల నీరు సరఫరా అవుతుండగా యూటీ ప్రాంతంలో పరిస్థితిని సమీక్షించారు. కాలువకు నీటి విడుదల పెంపుతో కలిగే ఇబ్బందులపై చర్చించారు. కార్యక్రమంలో డీఈఈ మాధవి పాల్గొన్నారు. -
స్తంభాద్రి ఆలయంలో పవిత్రోత్సవాలు ప్రారంభం
ఖమ్మంగాంధీచౌక్: నగరంలోని శ్రీ స్తంభాద్రి లక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయంలో 18వ వార్షిక పవిత్రోత్సవాలు బుధవారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం అనంతరం హోమం తదితర పూజలు చేశారు. ఆగస్టు 2వ తేదీన పూర్ణాహుతి కార్యక్రమంతో పవిత్రోత్సవాలు ముగుస్తాయని అర్చకులు తెలిపారు. ఆలయ కార్యనిర్వహణాధికారి కొత్తూరు జగన్మోహన్రావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జల విద్యుదుత్పత్తి ప్రారంభంకూసుమంచి : పాలేరులోని మినీ హైడల్ ప్రాజెక్టులో జల విద్యుదుత్పత్తి బుధవారం ప్రారంభమైంది. ప్రాజెక్టులో రెండు యూనిట్లు ఉండగా ప్రస్తుతం ఒక యూనిట్కు ట్రయల్రన్ నిర్వహించగా అది విజయవంతం అయింది. దీంతో ఆ యూనిట్ ద్వారా విద్యుదుత్పత్తి కొనసాగిస్తున్నారు. ఎడమ కాల్వకు నీటి విడుదల పెంచిన తర్వాత రెండో యూనిట్ను ప్రారంభిస్తామని, ఈలోపే ట్రయల్ రన్ చేస్తామని అధికారులు తెలిపారు. మోటార్లకు కెపాసిటర్లు అమర్చుకోవాలిచింతకాని : రైతులు వ్యవసాయ విద్యుత్ మోటార్లకు కెపాసిటర్లు అమర్చుకోవాలని విద్యుత్ శాఖ ఏస్ఈ శ్రీనివాసాచారి అన్నారు. మండలంలోని ప్రొద్దుటూరులో బుధవారం నిర్వహించిన పొలంబాట కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పొలంబాట ద్వారా వ్యవసాయ విద్యుత్ లైన్లకు సంబంధించిన ఒరిగిన స్తంభాలను సరిచేయడం, ప్రమాదకరంగా ఉన్న స్తంభాలను మార్చటం, వేలాడుతున్న వైర్లను సరిచేయడం వంటి పనులు చేపడుతున్నట్లు వివరించారు. వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్ అందిస్తామన్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ తిలక్, ఏఈ చావా శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. ‘న్యాస్’లో జిల్లాకు మూడో స్థానంఖమ్మం సహకారనగర్ : 2024 – 25 విద్యా సంవత్సరంలో విద్యార్థుల నైపుణ్యానికి సంబంధించి నిర్వహించిన న్యాస్ (నేషనల్ ఎచివ్మెంట్ సర్వే–జాతీయ ప్రతిభ పరీక్ష) ఫలితాల్లో జిల్లా రాష్ట్రంలో తృతీయ స్థానం సాధించింది. ఈ నేపథ్యంలో బుధవారం హైదరాబాద్లో సీఎం సలహాదారు కే.కేశవరావు, రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా, విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలాస్ తదితరులు అభినందించారు. అలాగే ఉత్తమ బోధన అంశంలో ఎన్నెస్సీ కాలనీ ఉపాధ్యాయులు రాజేష్, ఉమను కూడా అభినందించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ను సందర్శించిన సీపీఖమ్మంక్రైం: ప్రకాష్ నగర్లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ను సీపీ సునీల్దత్ బుధవారం సందర్శించారు. సీసీ కెమెరాల పర్యవేక్షణ, పనితీరును పరిశీలించారు. వర్షాలతో దెబ్బతిన్న సీసీ కెమెరాలను పునరుద్ధరించాలని సిబ్బందికి సూచించారు. నేరాల నియంత్రణలో కీలకంగా పనిచేస్తున్న సీసీ కెమెరాల ఏర్పాటుపై పోలీస్ స్టేషన్ల వారీగా ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. ఆర్ఐ కార్యాలయాల ప్రారంభంపోలీస్ హెడ్ క్వార్టర్స్లో ఆధునికీకరించిన సిటీ ఆర్మ్డ్ రిజర్వ్ కార్యాలయాలను సీపీ బుధవారం ప్రారంభించారు. కార్యక్రమంలో ఏఆర్ అడిషనల్ డీసీపీ కుమారస్వామి, ఎఆర్ ఏసీపీలు సుశీల్సింగ్, నర్సయ్య, ఆర్ఐలు కామరాజు, శ్రీశైలం, సురేష్ నాగుల్ మీరా పాల్గొన్నారు. -
ప్రతి ఉద్యోగికి పెన్షన్ రావాలి
ప్రతి ఉద్యోగికి పెన్షన్ కావాలని తమ యూనియన్ ఎంతో కాలగా ఉద్యమం చేస్తోంది. 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు కూడా పెన్షన్ కోసం న్యాయ పోరాటం చేశాం. ఆ ఉద్యమాల ఫలితంగానే నేడు ఈ తీర్పు వచ్చింది. తీర్పును స్వాగతిస్తూనే.. ప్రతి ఉద్యోగికి పెన్షన్ అనేది హక్కు కాబట్టి ఆ దిశగా మా పోరాటం కొనసాగనుంది. – చంద్రకంటి శశిధర్, టీఎస్ సీపీఎస్ఈయూ జిల్లా అధ్యక్షుడు ఆనందంగా ఉంది డీఎస్సీ 2003 ఉపాధ్యాయులకు పాత పెన్షన్ కల్పించాలని గత 10 సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వంపై పోరాడుతూనే మరో వైపున న్యాయపోరాటం కూడా చేశాం. దాని ఫలితమే ప్రస్తుతం వచ్చిన తీర్పు అని అభిప్రాయపడుతున్నా. – పల్లా రవి, ఎంపీ యూపీఎస్ సదాశివపురం, నేలకొండపల్లి మండలం ● -
హామీల అమలులో విఫలం
తల్లాడ: రాష్ట్రంలో వంద రోజుల్లోనే ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. అమలు చేయటంలో పూర్తిగా విఫలమైందని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం అన్నారు. తల్లాడ జీఎన్ఆర్ గార్డెన్స్లో మోరంపూడి పాండు అధ్యక్షతన జరిగిన సత్తుపల్లి డివిజన్ కమిటీ ప్లీనరీలో తమ్మినేని ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. సీఎం రేవంత్రెడ్డి అధికారంలోకి రాక ముందు జరిగిన సభల్లో కాంగ్రెస్ వస్తే ఆరు గ్యారంటీలను కచ్చితంగా అమలు చేస్తామని చెప్పి.. ప్రస్తుతం గత ప్రభుత్వం చేసిన అప్పులను ప్రస్తావిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. స్థానిక ఎన్నికల వరకే మభ్యపెట్టి ఆ తర్వాత ప్రస్తుతం అమలు చేస్తున్న రైతుభరోసా, ఇందిరమ్మ ఇళ్ల పథకం ఎత్తి వేసేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మత విద్వేషాలను రెచ్చగొడుతూ ఓట్ల రాజకీయం చేస్తోందని తెలిపారు. సమావేశంలో పోతినేని సుదర్శన్రావు, నున్నా నాగేశ్వర్రావు, తాతా భాస్కర్రావు, మాచర్ల భారతి, మాదినేని రమేశ్, చలమాల విఠల్రావు, శీలం సత్యనారాయణరెడ్డి, ఐనాల రామలింగేశ్వర్రావు, జాజిరి శ్రీనివాసరావు, మాదాల వెంకటేశ్వర్రావు, తన్నీరు కృష్ణార్జున్ పాల్గొన్నారు. నాలుగు నెలల తర్వాత కుటుంబం చెంతకు..ఖమ్మంక్రైం: నాలుగు నెలల కిందట తప్పిపోయిన ఓ వ్యక్తిని అన్నం ఫౌండేషన్ ఆధ్వర్యంలో బుధవారం కుటుంబ సభ్యులకు అప్పగించారు. గత ఏప్రిల్ 17న విజయవాడ నుంచి ఖమ్మం ప్రభుత్వ వైద్యశాలలో బంధువులను చూడటానికి వచ్చిన రవికుమార్.. మతిస్థిమితం కోల్పోయి పోన్నెకల్ పరిసరాల్లో తిరుగుతుండగా.. మాలోత్ మున్నానాయక్ కుటుంబ సభ్యులు చేరదీశారు. అన్నం ఫౌండేషన్ నిర్వాహకులు అన్నం శ్రీనివాసరావుకు సమాచారం అందించగా ఆయన తన ఆశ్రమానికి తీసుకొచ్చి వివరాలు సేకరించారు. టూటౌన్ పోలీసుల సమాచారంతో విజయవాడలోని అతని కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా వారు ఖమ్మం వచ్చారు. వారికి రవికుమార్ సీఐ బాలకృష్ణ సమక్షంలో అప్పగించారు. -
జీవనోపాధికి ఎలాంటి చర్యలు చేపడుతున్నారు..
ఖమ్మంమయూరిసెంటర్: బొగ్గు గనులు మూసేసిన ప్రాంతాల్లో అక్కడ నివసిస్తున్న ప్రజల జీవనోపాధికి ఏం చర్యలు చేపడుతున్నారు..? అని ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి లోక్సభలో ప్రశ్నించారు. పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా బుధవారం ఎంపీ మూడు ప్రశ్నలు అడిగారు. బొగ్గు గనులకు సంబంధించి జస్ట్ ట్రాన్సిషన్ పనితీరును మెరుగుపరచడానికి తీసుకున్న చర్యలు, మరో రెండు ప్రశ్నల్లో పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల వివరాలు, జాతీయ ఆహార భద్రతా చట్టం అమలు తీరు, రేషన్ కార్డుల జారీ వివరాలు కోరారు. కేంద్ర బొగ్గు, గనుల శాఖల మంత్రి జి.కిషన్రెడ్డి, విద్యుత్, కొత్త పునరుత్పాదక ఇంధనం శాఖల సహాయ మంత్రి శ్రీపాద్ యశోనాయక్, కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖల సహాయ మంత్రి నిముబెన్ జయంతిభాయ్బాంభణియా లిఖితపూర్వక సమాధానాలు ఇచ్చారు. ఈ ఏడాది జనవరి 31న జారీ చేసిన మైనింగ్ ప్లాన్ గనుల మూసివేత మార్గదర్శకాల ప్రకారం.. ప్రభావిత కుటుంబాల కోసం పునరావాస చర్యలు చేపడుతున్నామని జి.కిషన్రెడ్డి తెలిపారు. శ్రీపాద్యశోనాయక్ మాట్లాడుతూ.. పునరుత్పాదక ఇంధన అమలు సంస్థలు (ఆర్ఈఐఏఎస్) జారీ చేసిన టెండర్లకు సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎస్ఈసీఐ), ఎన్టీపీసీ తదితర సంస్థలతో కలుపుకుని ఈ ఏడాది జూన్ 30వ తేదీ నాటికి 43,922 మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్ సామర్థ్యం కలిగి ఉన్నట్లు చెప్పారు. విద్యుత్ అమ్మకపు ఒప్పందా (పీఎస్ఏఎస్)లను కేంద్రం వేగవంతం చేసిందన్నారు. జాతీయ ఆహార భద్రత చట్టం అమలు తీరుపై కేంద్ర సహాయ మంత్రి నిముబెన్ జయంతిభాయ్ బాంభణియా సమాధానం ఇస్తూ.. గ్రామీణ ప్రాంతాల్లో 75 శాతం, పట్టణ ప్రాంతాల్లో 50 శాతం వరకు జనాభా ఆహార అవసరాలను తీర్చడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. లోక్ సభలో మూడు ప్రశ్నలు అడిగిన ఎంపీ రఘురాంరెడ్డి -
వెళ్తే.. అభ్యంతరం చెప్పొద్దు!
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ముప్పై, నలభై ఏళ్ల కిందట అజ్ఞాతంలోకి వెళ్లి సాయుధ పోరాట బాట పట్టిన మావోయిస్టులు ప్రస్తుత సమాజ తీరు తెన్నులు తెలుసుకునేందుకు జనజీవన స్రవంతిలోకి వస్తున్నారా? అన్న ప్రశ్నకు ఔననే సమాధానం వస్తోంది. ఓవైపు పెరిగిన నిర్బంధానికి తోడు మరో వైపు వరుస ఎన్కౌంటర్లతో వనాలను వీడి జనాల్లోకి వచ్చేందుకు మావోయిస్టులు మొగ్గు చూపుతున్నట్లు తాజా పరిణామాల ఆధారంగా తెలుస్తోంది. తీవ్ర నిర్బంధం.. ఆపరేషన్ కగార్ మొదలయ్యాక సగటున పదిహేను రోజులకు ఒక ఎన్కౌంటర్ వంతున జరుగుతున్నాయి. ప్రతీ ఎన్కౌంటర్లో 10–15 మంది మావోయిస్టులు చనిపోతున్నారు. ఇలా పెరిగిన నిర్బంధం.. ఇంకో పక్క రిక్రూట్మెంట్లు తగ్గడమే కాక మావోయిస్టుల సప్లై చెయిన్ కూడా కుదుపులకు లోనైంది. దీంతో అడుగు వెనక్కి తగ్గిన మావోయిస్టులు మార్చి 28న శాంతి చర్చల ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చినా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. మరోవైపు మావోయిస్టుల కంచుకోటలుగా పేరున్న దండకారణ్యం, కర్రెగుట్టలు, ఏఓబీ, గడ్చిరోలి జిల్లాల్లో సాయుధ దళాల సంచారం కష్టంగా మారింది. ఇదే సమయంలో సరికొత్త సరెండర్ పాలసీని ప్రభుత్వాలు అమల్లోకి తెచ్చాయి. దీంతో ఈ ఏడాది ఆరంభం నుంచి దళ సభ్యులు, ఏరియా కమాండర్లు, జన మిలీíÙయా, పీఎల్జీఏ తదితర మావోయిస్టు పారీ్టకి చెందిన వారు పెద్ద ఎత్తున లొంగిపోతున్నారు. ఈనెల 24న ఛత్తీస్గఢ్లో ఐదు జిల్లాల పరిధిలో ఏకంగా 64 మంది మావోయిస్టులు లొంగిపోవడం ఈ కోవలోకి వస్తుంది. నంబాల మృతి తర్వాత.. శాంతిచర్చల కోసం చేసిన ప్రయత్నాలు సానుకూల ఫలితాలు ఇవ్వకపోగా, మే 21న జరిగిన గుండెకోట్ ఎన్కౌంటర్లో మావోయిస్టు పార్టీ సుప్రీం కమాండర్ నంబాల కేశవరావు మరణం ఆ పార్టీకి తీవ్ర నష్టాన్ని చేకూర్చింది. పైగా నంబాల కేశవరావు టీమ్లో ఉన్న ఇద్దరు సభ్యులు ఎన్కౌంటర్కు రెండ్రోజుల ముందు అజ్ఞాత దళాలను విడిచి వెళ్లడం పారీ్టపై ప్రభావం చూపిందని చెబుతున్నారు. తీవ్ర నిర్బంధం నేపథ్యంలో ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదో తెలియని అయోమయ పరిస్థితి పార్టీలో సభ్యులకు ఎదురైనట్టు తెలుస్తోంది. మరోవైపు సీనియర్ నాయకులకు అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నట్లు సమాచారం. ఇలా క్లిష్ట పరిస్థితుల్లో పార్టీ తరఫున దిశానిర్దేశం చేయడం అగ్రనాయకత్వానికి కష్టంగా మారగా.. కిందిస్థాయి నేతలకు అగ్రనాయకులతో కాంటాక్ట్ దొరకడం దుర్లభమనే పరిస్థితులు నెలకొన్నాయి. గెరిల్లాగా ఉండలేని పక్షంలో.. ఇటీవల జోరుగా కురుస్తున్న వానలతో అడవులు పచ్చబడ్డాయి. అయినా అడవులు మావోయిస్టులకు సేఫ్ జోన్గా ఉండలేకపోతున్నాయి. రోజురోజుకు పెరిగిన నిర్బంధం కారణంగా ఒకేచోట తలదాచుకోవడం, క్యాంప్లను మార్చడం క్లిష్టమైన వ్యవహారంగా మారింది. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే రాబోయే రోజుల్లో మరింత ఇక్కట్లు తప్పవనే భావనకు వచి్చనట్లు తెలిసింది. ఈ సమయంలో సాయుధ విప్లవ పోరాటమే మిన్న అనుకున్న వారు చావోరేవో అడవుల్లోనే అన్న నిర్ణయానికి రాగా.. అనారోగ్యం, ఇతర ఇబ్బందులు ఉన్నవారు లొంగిపోతే అభ్యంతరం చెప్పొద్దనే అభిప్రాయానికి పార్టీ వచ్చిందనే ప్రచారం సాగుతోంది. దీంతో గడిచిన రెండు వారాలుగా ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఏళ్లకు పైగా అజ్ఞాత జీవితం గడిపిన మావోయిస్టు లీడర్ల లొంగుబాట్లు పెరిగాయనే వాదన వినిపిస్తోంది. మార్పుల మదింపు నంబాల కేశవరావు వంటి నాయకుడు ఎన్కౌంటర్లో చనిపోతే, ఆయన మృతదేహానికి గౌరవప్రదమైన అంత్యక్రియలు నిర్వహించడంలో ప్రభుత్వం చూపిన వైఖరిపై పౌరసమాజం నుంచి వచి్చన స్పందనను కూడా పార్టీ మదింపు చేసే ఆలోచనలో ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సామాజికంగా, ఆర్థికంగా, సాంకేతికంగా ముప్పై నలభై ఏళ్ల కిందట గ్రామాలు, పట్టణాల్లో ఉన్న పరిస్థితులకు ఇప్పటి పరిస్థితులకు మధ్య వచి్చన మార్పును అంచనా వేయడం మంచిదనే అభిప్రాయానికి పార్టీ వచి్చనట్టు ప్రచారం జరుగుతోంది. అందుకే లొంగుబాట పట్టిన కేడర్ను వారించే ప్రయత్నం చేయడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. -
డెంగీ మరణాలు నమోదు కావొద్దు
ఖమ్మవైద్యవిభాగం: వైద్య రంగంలో జిల్లాను ఆదర్శంగా తీర్చిదిద్దేలా వైద్యులు, సిబ్బంది పనితీరు మెరుగుపడాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆదేశించారు. అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజతో కలిసి మంగళవారం ఆయన కలెక్టరేట్లో వైద్య, ఆరోగ్య శాఖపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పీహెచ్సీలు, సబ్ సెంటర్ల పరిధిలో సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా పర్యవేక్షిస్తూ డెంగీ మరణాలు నమోదు కాకుండా చూడాలని సూచించారు. డెంగీ కేసులను తక్కువ చేసి చూపించాల్సిన అవసరం లేదని, ఎన్ని కేసులు గుర్తించి చికిత్స చేస్తే అంత బాగా పని చేసినట్లు పరిగణిస్తామని తెలిపారు. జిల్లా ఆస్పత్రికి తాకిడి పెరుగుతుందంటే పీహెచ్సీల పనితీరు సరిగ్గా లేనట్లే భావించాల్సి వస్తుందన్నారు. ఇటీవల పలు ఆస్పత్రుల్లో తనిఖీ సందర్భంగా అందుబాటులో ఉన్న సిబ్బంది సేవలను మరింత వినియోగించాల్సి ఉందని గుర్తించానని తెలిపారు. ప్రతీ పీహెచ్సీకి అవసరమైన మందులు, వ్యాధి నిర్ధారణ కిట్లు సమకూర్చుకోవడంతో పాటు ప్రసవాల సంఖ్య పెరిగేలా కృషి చేయాలని ఆదేశించారు. వైద్య నిపుణులు ఉన్న కొన్ని ఆస్పత్రుల్లో ప్రసవాలు జరగకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన కలెక్టర్... అధికంగా ప్రసవాలు జరిగే ఐదు పీహెచ్సీలను 24 గంటల పీహెచ్సీలుగా మార్చేలా ప్రతిపాదించాలని సూచించారు. ఉద్యోగుల హాజరు ఆన్లైన్లో.. అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉద్యోగుల హాజరును ఆగస్టు 1వ తేదీ నుంచి బయోమెట్రిక్ ద్వారా నమోదు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. అనుమతి లేకుండా గైర్హాజరు, ఆలస్యంగా రావడాన్ని సహించేది లేదని హెచ్చరించారు. అలాగే, డిప్యూటేషన్ ఆస్పత్రి అవసరాలకే తప్ప ఉద్యోగుల సౌలభ్యం కోసం ఉండొద్దని తెలిపారు. ఈమేరకు ల్యాబ్ టెక్నీషియన్ల డిప్యూటేషన్ రద్దు చేసి కేటాయించిన ఆస్పత్రులకు పంపించాలని సూచించారు. ఈ సమావేశంలో జెడ్పీ సీఈఓ దీక్షారైనా, డీఎంహెచ్ఓ కళావతి బాయి, జెడ్పీ డిప్యూటీ సీఈఓ నాగపద్మజ, ఆస్పత్రులు సూపరింటెండెంట్లు, ఉద్యోగులు పాల్గొన్నారు. ‘ఇందిరమ్మ’ లబ్ధిదారులకు చేయూత రఘునాథపాలెం: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ఎంత వేగంగా చేపడితే అంత త్వరగా బిల్లులు విడుదలవుతాయని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి స్పష్టం చేశారు. రఘునాథపాలెం మండలం పువ్వాడ నగర్లో ఇళ్ల నిర్మాణాలను కలెక్టర్ మంగళవారం పరిశీలించి లబ్ధిదారులతో మాట్లాడారు. నిర్మాణదారులకు ఆర్థిక సాయం అందించడమే కాక ఉచితంగా ఇసుక రవాణా చేస్తున్నందున సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇదే సమయాన లబ్ధిదారులకు ఆర్థిక సాయంపై అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. దశల వారీగా పనులు పూర్తికాగానే ఆన్లైన్లో నమోదు చేయాలని తెలిపారు. ఆతర్వాత వనమహోత్సవంలో భాగంగా మెగా బ్లాక్ ప్లాంటేషన్ కోసం రఘునాథపాలెం మండలం జింకలతండా గుట్ట వద్ద స్థలాన్ని కలెక్టర్ పరిశీలించి సూచనలు చేశారు. జెడ్పీ సీఈఓ దీక్షారైనా, డీఆర్డీఓ సన్యాసయ్య, తహసీల్దార్ శ్వేత, ఎంపీడీఓ ఆశోక్కుమార్, ఉద్యోగులు ప్రవీణ్, పద్మయ్యనాయుడు తదితరులు పాల్గొన్నారు. పీహెచ్సీల్లో సరైన సేవలు అందకే జిల్లా ఆస్పత్రిలో రద్దీ వైద్య, ఆరోగ్య శాఖపై సమీక్షలో కలెక్టర్ అనుదీప్ -
మ.. మహిళ స.. సంఘం!
ఖమ్మంసహకారనగర్: ఏ ఒక్కరూ నిరక్షరాస్యులుగా మిగిలిపోవద్దనే లక్ష్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నాలను ముమ్మరం చేశాయి. గతంలో కేంద్ర ప్రభుత్వ పరిధిలో వయోజన విద్య కార్యక్రమం కొనసాగగా ఈసారి రాష్ట్ర ప్రభుత్వాన్ని సైతం భాగస్వామ్యం చేసింది. ఈమేరకు జిల్లాలోని 21మండలాల్లో ఇటీవల చేపట్టిన సర్వే ద్వారా 1.54లక్షల మంది నిరక్షరాస్యులు ఉన్నట్లు గుర్తించారు. తొలివిడతగా ఉల్లాస్ పేరుతో 50,564మందిని అక్షరాస్యులుగా చేయాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం రిసోర్స్ పర్సన్లుగా ఎంపిక చేసిన ఉపాధ్యాయులకు శిక్షణ కూడా ఇచ్చారు. లక్ష్యం 50,564మంది ఉల్లాస్ పథకం ద్వారా జిల్లాలో 50,564 మందిని అక్షరాస్యులుగా మార్చాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఇప్పటికే వీరి వివరాలను ఉల్లాస్ యాప్లో అప్లోడ్ చేశారు. ఈక్రమంలోనే ఖమ్మం కార్పొరేషన్ పరిధి 60డివిజన్లలో 16,984మందిని గుర్తించారు. తొలి విడతగా మహిళా స్వయం సహాయక సంఘాల్లో నిరక్షరాస్యులైన సభ్యులకు అదే సంఘాల్లో అక్షరాస్యులైన సభ్యులు శిక్షణ ఇస్తారు. అంతేకాక అంగన్వాడీ కేంద్రాల్లో 600మంది నిరక్షరాస్యులైన హెల్పర్లకు అంగన్వాడీ టీచర్లతో అక్షరాలు నేర్పించనున్నారు. పైలట్ ప్రాజెక్టుగా 59వ డివిజన్ ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ‘ఉల్లాస్’ అమలుకు 59వ డివిజన్ను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. ఇక్కడ నిరక్షరాస్యులకు శిక్షణ ఇచ్చేలా సిద్ధమవుతున్నారు. ఈ డివిజన్లో 800 మంది నిరక్షరాస్యులు ఉండగా, అక్షరాలు నేర్పించే బాధ్యత ముగ్గురు అంగన్వాడీలు, ముగ్గురు ఆర్పీలకు అప్పగించారు.సంపూర్ణ అక్షరాస్యత జిల్లాగా తీర్చిదిద్దేలా ప్రణాళిక 1.54లక్షల మంది నిరక్షరాస్యుల గుర్తింపు తొలి దశలో 50,564 మందికి తర్ఫీదు మహిళా సంఘాల సభ్యులకు మొదటి విడతలో ప్రాధాన్యతత్వరలోనే శిక్షణ ప్రారంభం నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దే క్రమాన ఇప్పటికే గుర్తింపు పూర్తయింది. మండల, గ్రామస్థాయిలో రిసోర్స్ పర్సన్లకు త్వరలోనే శిక్షణ ఉంటుంది. ఆతర్వాత నిరక్షరాస్యులకు పుస్తకాలు అందజేసి శిక్షణ ప్రారంభిస్తాం. తొలిదఫా స్వయం సహాయక సంఘాల సభ్యులను అక్షరా స్యులుగా చేయడమే లక్ష్యంగా నిర్దేశించుకున్నాం. – సీహెచ్.అనిల్కుమార్, వయోజన విద్య డిప్యూటీ డైరెక్టర్ -
నేడు మంత్రి పొంగులేటి పర్యటన
నేలకొండపల్లి: రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బుధవారం నేలకొండపల్లి మండలంలో పర్యటించనున్నారు. మండల కేంద్రంలోని మార్కెట్ యార్డు ఆవరణలో లబ్ధిదారులకు రేషన్కార్డులు పంపిణీ చేయనుండగా, వన మహోత్సవంలో భాగంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మొక్కలు నాటుతారు. అలాగే, పలు గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేస్తారు. ఈకార్యక్రమాల్లో పార్టీ శ్రేణులు పాల్గొని విజయవంతం చేయాలని మార్కెట్ చైర్మన్ వి.సీతారాములు ఓ ప్రకటనలో కోరారు. గురుకుల కళాశాలల్లో రేపు స్పాట్ కౌన్సెలింగ్ ఖమ్మంమయూరిసెంటర్: జోన్–4 పరిధిలోని గురుకుల కళాశాలల్లో ఖాళీ సీట్ల భర్తీకి గురువారం స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు జోనల్ అధికారి స్వరూపరాణి తెలిపారు. ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్ఈసీ గ్రూపుల్లో ప్రవేశాలకు 2025లో ఎస్ఎస్సీ, సీబీఎస్ఈ, సీఎస్ఈ నుంచి ఒకేసారి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు అర్హులని పేర్కొన్నారు. హాజరైన విద్యార్థుల మార్కులు సమానంగా ఉంటే సబ్జెక్టుల వారీగా మార్కులను పరిగనణలోకి తీసుకుంటామని తెలిపారు. కులం, ఆదాయం, జనన ధ్రువీకరణ పత్రాలతో పాటు విద్యార్హతల ఒరిజినల్ సర్టిఫికెట్లు, మూడు సెట్ల జిరాక్స్లు, మూడు పాస్పోర్ట్ సైజ్ ఫొటోలతో ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంటలోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. ఆతర్వాత మెరిట్, రిజర్వేషన్ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తామని ఆర్సీఓ తెలిపారు. స్థానిక, సంస్థాగత ఎన్నికలపై సమీక్ష ఖమ్మంమయూరిసెంటర్: స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు కాంగ్రెస్ సంస్థాగత ఎన్నికలపై పార్టీ రాష్ట్ర ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ హైదరాబాద్లో మంగళవారం నాయకులతో సమీక్షించారు. టీ పీసీసీ అధ్యక్షుడు మహేష్కుమార్ కూడా పాల్గొనగా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల పార్టీ అధ్యక్షులు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, పోదెం వీరయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికలకు సంసిద్ధత, పార్టీ మండల, జిల్లా కమిటీల నియామకంపై చర్చ జరిగిందని వారు తెలిపారు. ఉమ్మడి జిల్లా ఇన్చార్జి చల్లా వంశీచంద్రెడ్డి, పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ శ్రావణ్కుమార్రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే మట్టా రాగమయి, నాయకులు బేబీ స్వర్ణకుమారి, చక్కిలం రాజేశ్వరరావు, దైదా రవీందర్, తదితరులు పాల్గొన్నారు. వేగంగా హెచ్టీ సర్వీసుల మంజూరు ఖమ్మంవ్యవసాయం: వినియోగదారులకు హెచ్టీ 11 కేవీ, 33కేవీ, ఆపై ఓల్టేజీ సర్వీసుల మంజూరు వేగంగా జరగడానికి సింగిల్ విండో వ్యవస్థ ఉపయోగపడుతోందని ఖమ్మం ఎస్ఈ ఇనుగుర్తి శ్రీనివాసాచారి తెలిపారు. మంజూ రును సరళీకృతం చేసేలా సర్కిల్, కార్పొరేట్ కార్యాలయాల్లో ప్రత్యేక సెల్లు ఏర్పాటుచేసినట్లు వెల్లడించారు. వినియోగదారులు అవసరమైన పత్రాలతో దరఖాస్తులను ఎన్పీడీసీఎల్ పోర్టల్ ద్వారా సమర్పిస్తే అధికారులు పరిశీలించి అనుమతులు జారీ చేస్తారని తెలిపారు. ‘నవోదయ’ దరఖాస్తు గడువు పొడిగింపు కూసుమంచి: పాలేరులోని జవహర్ నవోదయ విద్యాలయతో పాటు భద్రాద్రి జిల్లాలో కొత్తగా ఏర్పాటు చేసిన నవోదయ విద్యాలయలో 2026–27 విద్యాసంవత్సరానికి ఆరో తరగతిలో ప్రవేశాల దరఖాస్తు గడువు పొడిగించారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు ఆగస్ట్ 13వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని పాలేరు ప్రిన్సిపాల్ కె.శ్రీనివాసులు తెలిపారు. పాలేరులో 80, భద్రాద్రి జిల్లాలోని విద్యాలయలో 40 సీట్లు భర్తీ చేయనున్నందున ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. -
మాకో సీటు కావాలి!
ఒక్కో స్టేషన్లో ఐదుగురు జిల్లా కేంద్రంతో పాటు ముఖ్యపట్టణాల్లో పోలీసుస్టేషన్లను శాంతిభద్రతల పర్యవేక్షణ, కేసుల సత్వర విచారణ కోసం అప్గ్రేడ్ చేశారు. ఆయా పీఎస్లకు ఎస్హెచ్ఓలుగా సీఐలను నియమించడమే కాక ఒక్కో స్టేషన్లలో ఐదుగురి నుంచి ఆరుగురు ఎస్సైలను కేటాయించారు. తద్వారా వాహనాల తనిఖీ, కేసుల విచారణ, ఇతర పనులన్నీ సాఫీగా, సులువుగా సాగిపోతున్నాయి. కూర్చోవడానికి కుర్చీలు ఏవీ? ఖమ్మంలోని వన్, టూ, త్రీ టౌన్ పీఎస్లే కాక ఖానాపురం, రఘునాథధపాలెం, ఖమ్మం రూరల్, ముదిగొండ, మధిర పోలీస్స్టేషన్లను దశల వారీగా అప్గ్రేడ్ చేశారు. ఇందులో వన్, టూ, త్రీ టౌన్ పీఎస్లతోపాటు ఖానాపురం హవేలీ పోలీస్ స్టేషన్కు కొన్నేళ్ల క్రితమే ఎస్హెచ్ఓగా సీఐ స్థాయి అధికారిని నియమించారు. దీంతో అప్పటివరకు స్టేషన్ ఇన్చార్జ్గా కొనసాగిన ఎస్ఐలు సిబ్బందిలో ఒకరిలా మారాల్సి వచ్చింది. అంతేకాక ఐదుగురి వరకు ఎస్సైలను కేటాయించి స్టేషన్ పరిధిని సెక్టార్లుగా విభజించి ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించారు. ఇంతవరకు బాగానే ఉన్నా అప్గ్రేడ్ అయిన ఠాణాల్లో ఎస్ఐ స్థాయి అధికారులు కూర్చోవడానికి కుర్చీలు లేక ఒకే గదిలో నలుగురి నుంచి ఐదుగురు కూర్చోవాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. దీంతో చేసేదేం లేక కింది స్థాయి సిబ్బంది కుర్చీలో సర్దుకుంటుండగా వారికి ఇక్కట్లు మొదలయ్యాయి. ఫలితంగా కొందరు ‘మా ఆరోగ్యమే బాగా లేక ఇబ్బంది పడుతున్నాం.. ఇప్పుడు మీరు మా కుర్చీల్లో కూర్చుంటే మేం నిలబడాలా’ అని ఎస్ఐల ముఖం పట్టుకుని అంటున్నట్లు తెలిసింది. త్రీటౌన్లో ప్రత్యేక గదులు ఎస్ఐల ఇక్కట్లు చూడలేక ఖమ్మం త్రీటౌన్ స్టేషన్ ఆవరణలో రేకులతో గదులు నిర్మిస్తున్నారు. ఇదే తరహాలో మిగతా స్టేషన్లలోనూ నిర్మిస్తే తప్ప ఎస్సైల ఇబ్బందులకు పరిష్కారం లభించే అవకాశంలేదు. ఉన్నతాధికారులు ఈ దిశగా ఆలోచించాలని ఉద్యోగులు కోరుతున్నారు. పలు పీఎస్ల్లో ఎస్సైలకు కుర్చీలు కరువు ఎస్హెచ్ఓ ఠాణాలన్నింటా ఇదే పరిస్థితి ఎస్ఐ ఉద్యోగం అంటే ఆ ఠీవి, హుందానే వేరు. ఈ కొలువుకు ఉన్న స్థాయి అంతాఇంతా కాదు. కానీ ఇదంతా గతకాల వైభవంగా మారిపోతోంది. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా జిల్లా కేంద్రంలోని అన్ని పోలీస్స్టేషన్లతో పాటు ముఖ్యపట్టణాల్లోని పీఎస్లను సైతం శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా ప్రభుత్వం అప్గ్రేడ్ చేసింది. తద్వారా అక్కడ ఎస్సైలకు బదులు సీఐ స్థాయి అధికారి ఎస్హెచ్ఓ(స్టేషన్ హౌస్ ఆఫీసర్)గా బాధ్యతలు నిర్వర్తిస్తుండడం ఎస్సైల సీటుకు ముప్పు తెచ్చిపెట్టినట్లయింది. – ఖమ్మంక్రైం -
స్థానిక ఎన్నికల్లో సత్తా చాటుతాం
ఖమ్మంమామిళ్లగూడెం: జిల్లాలో బీజేపీకి ఆదరణ పెరుగుతున్న నేపథ్యాన స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటడమే కాక ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ పీఠాన్ని సైతం కై వసం చేసుకుంటామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్రావు ధీమా వ్యక్తం చేశారు. జిల్లా పర్యటన కోసం మంగళవారం వచ్చిన ఆయనకు కూసుమంచి మండలం నాయకన్గూడెం వద్ద పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఆపై ఖమ్మం కాల్వొడ్డు, మయూరిసెంటర్, పాత బస్టాండ్, వైరా రోడ్డు మీదుగా జెడ్పీ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. అక్కడ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించాక ర్యాలీగా ఇల్లెందు క్రాస్రోడ్, బైపాస్ మీదుగా పార్టీ జిల్లా ముఖ్య నేతలు, కార్యకర్తలతో ఏర్పాటుచేసిన ఆత్మీయ సమ్మేళనానికి రాంచందర్రావు చేరుకున్నారు. అభివృద్ధి జాడలేవి? జిల్లా నుంచి ముగ్గురు మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్నా అభివృద్ధి జరగడం లేదని ఎన్.రామచందర్రావు విమర్శించారు. ఏ మంత్రి కూడా అభివృద్ధిపై దృష్టి పెట్టకపోవడంతో ఈ పరిస్థితి నెలకొందన్నారు. కేంద్రప్రభుత్వం అమృత్ పథకం కింద రూ.450 కోట్లను ఖమ్మం అభివృద్ధికి కేటాయించిందని తెలిపారు. ఖమ్మంలో నాలుగు జాతీయ రహదారులు కూడా కేంద్రం చొరవతో వచ్చాయని చెప్పారు. ఖమ్మంను నిన్నామొన్నటి వరకు కమ్యూనిస్టుల అడ్డాగా చెప్పగా.. రాబోయే రోజుల్లో బీజేపీ అడ్డాగా మారనుందని తెలిపారు. జిల్లాలో బీజేపీ బలోపేతం అవుతున్నందున స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. దేశం, ధర్మం, జాతి, సమాజంతోపాటు రైతుల కోసం పనిచేసేది బీజేపీ మాత్రమేనని రాంచందర్రావు వెల్లడించారు. ఈ సమ్మేళనంలో జిల్లా నలుమూలల నుంచి పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు తమ సమస్యలను వివరించారు. అనంతరం ఖమ్మం ఎన్టీఆర్ సర్కిల్ వద్ద బీజేపీ కార్యాలయాన్ని రాంచందర్రావు ప్రారంభించారు. ఆ తర్వాత వివిధ రంగాల మేధావులతో సమావేశమై చర్చించారు. బీజేపీ కిసాన్మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు, నాయకులు తాండ్ర వినోద్రావు, సన్నె ఉదయ్ప్రతాప్, దేవకి వాసుదేవరావు, గెంటేల విద్యాసాగర్, దొంగల సత్యనారాయణ, గల్లా సత్యనారాయణ, నంబూరి రామలింగేశ్వరరావు, వాకదాని పుల్లారావు, అల్లిక అంజయ్య, డాక్టర్ జి.వెంకటేశ్వర్లు, నున్నా రవి, విజయరాజు, రుద్రగాని ప్రదీప్, విజయారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కేఎంసీనీ కై వసం చేసుకుంటాం.. ముగ్గురు మంత్రులు ఉన్నా అభివృద్ధి సున్నా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు -
ప్రతిమ మృతిపై కేసు నమోదు
ఖమ్మంరూరల్: మండలంలోని గొల్లగూడెం గిరి జన ఆశ్రమ పాఠశాలలో ఫిట్స్తో సోమవారం పదో తరగతి విద్యార్థిని భూక్యా ప్రతిమ మృతి చెందగా, ఆమె తండ్రి రమేష్ ఫిర్యాదుతో రూరల్ పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. ఆమె ఫిట్స్తోనే మృతి చెందిందా, ఇతర కారణాలు ఉన్నాయా అనేది నిర్ధారించేందుకు పోలీసలు సీసీ టీవీ పుటేజీలు పరిశీలించడమే కాక ఆమె స్నేహితులు, వార్డెన్, ఉపాధ్యాయుల నుంచి వివరాలు సేకరించారు. కాగా, ప్రతిమ మృతితో గురుకులం నుంచి పలువురు విద్యార్థులను వారి తల్లిదండ్రులు ఇళ్లకు తీసుకెళ్లారు. అలాగే, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశామని సీఐ ముష్క రాజు తెలిపారు. ●ఖమ్మం మామిళ్లగూడెం: గొల్లగూడెం గిరిజన ఆశ్రమ పాఠశాలలో విద్యార్థిని మృతికి వార్డెన్, ప్రిన్సిపాల్ నిర్లక్ష్యంతో పాటు డీడీ పర్యవేక్షణ లోపమే కారణమని వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపించారు. ఈమేరకు బాధ్యులపై చర్యలు తీసుకోవడమే కాక విద్యార్థిని కుటుంబానికి రూ.50లక్షల పరిహారం చెల్లించాలని కోరుతూ డీఆర్ఓ పద్మశ్రీకి వినతిపత్రం అందజేశారు. పీడీఎస్యూ, ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ నాయకులు వంగూరి వెంకటేష్, మాడుపల్లి లక్ష్మణ్, గోకినపల్లి మస్తాన్, త్రినాధ్ తదితరులు పాల్గొన్నారు. ఆందోళనతో వెళ్లిపోయిన విద్యార్థినులు -
మళ్లీ రాజుకుంటున్న పోడు వివాదం
● ఏళ్లుగా పట్టాలకు నోచుకుని ఎల్లన్ననగర్ వాసులు ● ఫలితంగా ప్రతీ వానాకాలం గొడవలే కొణిజర్ల: కొణిజర్ల మండలంలో ఉన్న కాస్తంత అడవిని రక్షించాలని అటవీ అధికారులు... ఏళ్లుగా సాగు చేసకుంటున్నందునతమకు పట్టాలు ఇవ్వాలని పోడుదారులు పోటీ పడుతుండడంతో ఏటా ఘర్షణలు సర్వసాధారణమయ్యాయి. కొణిజర్ల మండలం గుబ్బగుర్తి అటవీ ప్రాంతంలో బేస్మెంట్ క్యాంప్ 58లో దాదాపు 490 హెక్టార్లలో అటవీ భూమి విస్తరించి ఉండేది. కొన్నేళ్లుగా ఈ భూమిలో పలువురు పోడు కొట్టి సాగు చేసుకుంటున్నారు. పదేళ్ల క్రితం వివిధ గ్రామాల నుంచి 200కుటుంబాల అటవీ ప్రాంతానికి సమీపానే ఎన్నెస్పీ కాల్వ పక్కన గుడిసెలు వేసుకున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో గుబ్బగుర్తి, విక్రమ్నగర్, జంపాలనగర్, క్రాంతినగర్, సాలెబంజర, మెకాలకుంట, లక్ష్మీపురం తదితర గ్రామాల ప్రజలకు పట్టాలు అందాయి. ఆపై బీఆర్ఎస్ వచ్చాక కూడా కొందరికి పట్టాలు ఇచ్చారు. ఆ తర్వాత పోడు కొట్టారని... ఎల్లన్ననగర్ వాసులు 2008 తర్వాత పోడు చేశారని అటవీ అఽధికారులు కొత్తగా ఎవరికీ పట్టాలు ఇవ్వడం లేదు. కనీసం ఎవరికి ఎంత భూమి ఉందో సర్వే చేయించలేదు. ఈక్రమాన 490 హెక్టార్లలో 450హెక్టార్ల అడవి అన్యాక్రాంతం కాగా, మిగిలిన భూమిని కాపాడుకోవాలనేది తమ ప్రయత్నంగా అటవీ అధికారులు చెబుతున్నారు. ఇదే సమయాన ఎల్లన్ననగర్ వాసులు మిగిలిన భూమిని సైతం దున్నుతున్నారని ఆంక్షలు పెడుతున్నారు. అయితే, అనుమతించిన భూమిలోనే పంటలు సాగు చేస్తుండగా అధికారులు మొక్కలను తొలగిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈనెల 19న కూడా ఓ రైతు పొలంలో పత్తి మొక్కలు తొలగించగా ఇరువర్గాలు పోలీసులకు ఫిర్యాదు చేశాయి. ఎల్లన్ననగర్లో పోడు సమ స్య నానాటికీ తీవ్రమవుతున్నందున అధికారులు, ప్రభుత్వం స్పందించాలని పలువురు కోరుతున్నారు. ఏటా మరింత లోనకు వస్తున్నారు... ఎల్లన్ననగర్ ప్రాంతంలో 24 హెక్టార్ల అడవే మా ఆధీనంలో ఉంది. దీన్ని కాపాడుకునేలా మొక్కలు నాటిస్తుంటే పోడు సాగుదారులు ఏటా కొంత చొప్పున చదును చేస్తున్నారు. అనుమతి ఉన్నంత మేర సాగు చేసుకోవాలని సూచించినా వినడం లేదు. జంతువులు నీళ్లు తాగేందుకు ఏర్పాటు చేసిన పిట్లను కూడా పగలగొట్టారు. దీంతో మొక్కలు నాటించడానికి వెళ్లాం తప్ప ఎవరి పంట తొలగించలేదు. – ఉపేంద్రయ్య, ఫారెస్టు సెక్షన్ ఆఫీసర్, కొణిజర్ల -
గురుకులంలో డీపీఓ తనిఖీ
ఎర్రుపాలెం: ప్రభుత్వ నిర్దేశిత మెనూ అమలవుతోందా, భోజనం నాణ్యతగా ఉంటుందా.. ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని జిల్లా పంచాయతీ అధికారి ఆశాలత ఆరా తీశారు. ఎర్రుపాలెంలోని గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన ఆమె భోజనాన్ని పరిశీలించి విద్యార్థుల నుంచి వివరాలు సేకరించారు. అలాగే, పారిశుద్ధ్య నిర్వహణపై ఉద్యోగులకు సూచనలు చేసిన డీపీఓ, సీజనల్ వ్యాధుల వ్యాప్తికి అవకాశం ఉన్నందున జాగ్రత్తలు వహించాలని తెలిపారు. ఆతర్వాత బనిగండ్లపాడు పీహెచ్సీని తనిఖీ చేస డాక్టర్ అశ్విని నుంచి వివరాలు సేకరించారు. అలాగే, దళిత కాలనీలో పారిశుద్ధ్య పనులను కూడా తనిఖీ చేశారు. ఎంపీఓ జి.శ్రీలక్ష్మి, పంచాయతీ కార్యదర్శి ఏలేశ్వరరావు పాల్గొన్నారు. -
సీజనల్ వ్యాధుల కట్టడిపై దృష్టి
బోనకల్/చింతకాని: మారిన వాతావరణ పరిస్థితుతో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశమున్నందున వైద్యులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ కళావతిబాయి ఆదేశించారు. బోనకల్లో డెంగీ కేసు నమోదైన నేపథ్యాన మంగళవారం ఆమె పీహెచ్సీని తనిఖీ చేశారు. ఓపీకి వస్తున్న వారి వివరాలు, అందుతున్న చికిత్స, మందుల లభ్యతపై ఆరాతీశారు. గ్రామపంచాయతీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన గ్రామసభలో ప్రజలకు పరిశుభ్రతపై సూచనలు చేశారు. ఆతర్వాత బస్టాండ్ సెంటర్ వద్ద ఎన్ఎస్పీ కెనాల్లో ప్లాస్టిక్ వస్తువులు, చెత్తాచెదారం పడి ఉండడంతో త్వరగా శుభ్రం చేయించాలని సూచించారు. వైద్యాధికారి స్రవంతి, ఉద్యోగులు దానయ్య, రాజేశ్వరి పాల్గొన్నారు. అలాగే, చింతకాని, నాగులవంచలోని ఆరోగ్య కేంద్రాలను కూడా తనిఖీ చేసిన డీఎంహెచ్ఓ సీజనల్ వ్యాధుల కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై వైద్యసిబ్బందికి సూచనలు చేశారు. పారిశుద్ధ్య పనులు, డ్రై డే నిర్వహణ, నీటి నిల్వ ప్రాంతాల్లో దోమల నివారణ మందు పిచికారీ చేయించాలని తెలిపారు. అనంతరం రేపల్లెవాడలో వైద్య శిబిరాన్ని పరిశీలించి ఇంటింటా సర్వేపై సూచనలు చేశారు. వైద్యులు అల్తాఫ్, వేణుమాధవ్, ఉద్యోగులు వీరేందర్, కృష్ణారావు, లక్ష్మి, దైవమ్మ, సుజాత, పద్మ పాల్గొన్నారు. -
అంతా సాఫీగా సాగుతోందా?
సంక్షేమ గురుకులాలు, హాస్టళ్లు, కేజీబీవీల్లో తనిఖీ కోసం వివిధ శాఖల అధికారులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేశారు.8లో●రాష్ట్రస్థాయిలో శిక్షణ పూర్తి ప్రస్తుతం నిరక్షరాస్యులను గుర్తించే కార్యక్రమం ముగియగా.. వీరికి శిక్షణ ఇచ్చేందుకు వలంటీర్ల ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది. ఈమేరకు హైదరాబాద్లో ఇద్దరు టీచర్లు, ఏపీఎం, డీపీఎంలకు డీఆర్పీలు(డిస్ట్రిక్ట్ రిసోర్స్ పర్సన్లు)గా శిక్షణ ఇచ్చారు. వీరు ఇక్కడ ఎంపిక చేసిన మండల స్థాయి రిసోర్స్ పర్సన్లకు ఆగస్టు 2న శిక్షణ ఇవ్వనున్నారు. ఇందుకోసం మండలానికి ఒక టీచర్, ఏపీఎంలను గుర్తించాల్సి ఉంది. ఆపై గ్రామస్థాయిలో వీఓలు, వీఓఏలకు శిక్షణ ఇచ్చాక నిరక్షరాస్యుల కోసం పుస్తకాలు సమకూర్చడంతో శిక్షణ మొదలవుతుంది. కాగా, ఉల్లాస్ అమలులో భాగంగా నిరక్షరాస్యుల గుర్తింపు, శిక్షణ కార్యక్రమాలను అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ పర్యవేక్షిస్తున్నారు. -
వారిది విద్వేషం.. మాది హక్కుల రక్షణ
కొణిజర్ల: దేశంలో మైనార్టీలు, మెజార్టీల మధ్య మత విద్వేషాలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందడమే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ లక్ష్యమని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. కొణిజర్లలో మంగళవారం నిర్వహించిన పార్టీ వైరా డివిజన్ స్థాయి వర్క్షాప్లో ఆయ న మాట్లాడారు. బీజేపీ పాలనలో పెరుగుతున్న నిరుద్యోగం, ధరలపై నుంచి ప్రజల దృష్టి మళ్లించేలా మతం పేరుతో విభజించి పాలిస్తున్నారన్నారు. ఇదే సమయాన రాజ్యాంగ హక్కుల పరిరక్షణకు కమ్యూనిస్టులుగా తాము కృషి చేస్తున్నామని తెలి పారు. కాగా, రాష్ట్రప్రభుత్వం స్థానిక ఎన్నికలను దృష్ట్యా ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు మంజూరు చేస్తోందని పేర్కొన్నారు. అయినప్పటికీ స్థానిక ఎన్నికల్లో అవకాశం ప్రతీచోట తాము స్వంతంగా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నామని తమ్మినేని తెలిపారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు పోతినేని సుదర్శనరావు మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్లు కాంగ్రెస్ శ్రేణులకు ఇస్తున్నారని విమర్శించా రు. సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, నాయకులు తాళ్లపల్లి కృష్ణ, సుంకర సుధాకర్, దుగ్గి కృష్ణ, మచ్చా మణి, కొండెబోయిన నాగేశ్వరరావు, కొప్పుల కృష్ణయ్య, చింతనిప్పు చలపతి రావు, బాణోత్ బాలాజీ, కుటుంబరావు పాల్గొన్నారు.సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం -
యూరియా కోసం బారులు
కల్లూరురూరల్: ఈ వానాకాలం సీజన్ అవసరాలకు కల్లూరు, చెన్నూరు, కొర్లగూడెం, పోచవరం, చిన్నకోరుకొండి పీఏసీఎస్లకు 570 మెట్రిక్ టన్నులు, డీలర్లకు 575 మెట్రిక్ టన్నుల యూరి యా సరఫరా అయింది. ఈ యూరియా రైతులందరికీ సరిపోయే పరిస్థితి లేకపోగా, భవిష్యత్లో మరింత కొరత వస్తుందనే ప్రచారంతో కొనుగోలుకు బారులు దీరుతున్నారు. ఫలితంగా భూమి ఆధారంగా యూరియా పంపిణీ చేస్తున్నారు. ఈక్రమంలోనే కల్లూరు, చెన్నూరు సొసైటీల వద్ద మంగళవారం రైతులు బారులు దీరగా ఏఓ రూప, ఎస్సై హరిత యూరియా పంపిణీని పర్యవేక్షించారు. -
విద్యుత్ సమస్యలు ఎదురుకావొద్దు
ముదిగొండ: జిల్లాలో ఎక్కడా విద్యుత్ సంబంధిత సమస్యలు రాకుండా ఉద్యోగులు విధులు నిర్వర్తించాలని విద్యుత్ శాఖ ఎస్ఈ ఇనుగుర్తి శ్రీనివాసాచారి తెలిపారు. ముదిగొండ మండలంలోని వివిధ గ్రామాల్లో జరుగుతున్న పనులను మంగళవారం ఆయన ఏఈలతో కలిసి పరిశీలించారు. వల్లబి, పమ్మి గ్రామాల్లో ఇళ్లపై వెళ్తున్న విద్యుత్ లైన్లను సరిచేస్తుండగా సూచనలు చేశారు. అనంతరం ఎస్ఈ ముదిగొండ సబ్స్టేషన్లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ●నేలకొండపల్లి: పాలేరు నియోజకవర్గంలో విద్యు త్ సమస్యల పరిష్కారానికి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చొరవతో రూ.8.87 కోట్ల విలు వైన పనులు చేపట్టామని ఎస్ఈ శ్రీనివాసాచారి వెల్లడించారు. మండలంలోని నేలకొండపల్లి, రాజేశ్వరపురం సబ్స్టేషన్ల పరిధిలో జరుగుతున్న పనులను పరిశీలించాక ఆయన మాట్లాడారు. పాలేరు నియోజకవర్గంలో 4,200 స్తంభాల ఏర్పా టు, ఇళ్ల పైనుంచి తీగలు వెళ్తున్న చోట లైన్ల మా ర్పిడి చేస్తున్నామని తెలిపారు. ఈకార్యక్రమాల్లో డీఈలు సీహెచ్.నాగేశ్వరరావు, చింతమళ్ల నాగేశ్వరరావు, ఏడీఈ బి.రామకృష్ట, కోక్యానాయక్, ఏఈలు మేకపోతుల శ్రీనివాస్, వి.నారాయణ, కె.రామారావు, నారాయణరావు, నేలకొండపల్లి మార్కెట్ చైర్మన్ వెన్నపూసల సీతారాములు తదితరులు పాల్గొన్నారు. -
చేపపిల్లల పంపిణీ ఎప్పుడు?
● ప్రతిపాదనలకే పరిమితమైన ప్రక్రియ ● టెండర్లపై మీనమేషాలు ● ఎదురుచూపుల్లో మత్స్యకారులు ఖమ్మంవ్యవసాయం: చేపపిల్లల ఉచిత పంపిణీలో జాప్యం మత్స్యకారులను ఆవేదనకు గురిచేస్తోంది. మత్స్యశాఖ సమర్పించిన ప్రతిపాదనలు ప్రభుత్వం వద్ద పెండింగ్లో ఉండగా.. ఆమోదముద్ర వేస్తేనే టెండర్ల ప్రక్రియ మొదలుకానుంది. ఆతర్వాత కాంట్రాక్టర్ల ఎంపిక, చేపపిల్లల సేకరణ, సరఫరా జరగాల్సి ఉండడంతో అదును దాటుతుందా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. మత్స్యకారుల జీవనోపాధి, ఆర్థికాభివృద్ధి కోసం 2018–19 నుంచి ఉచిత చేపపిల్లల పథకం అమలవుతుండగా, ఏటా ఏప్రిల్లోనే టెండర్లు నిర్వహించి జూలై, ఆగస్టు నెలల్లో చెరువులు, కుంటల్లో పిల్లలు వదులుతారు. అయితే, బకాయిలు పేరుకుపోయాయని కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో గత ఏడాది ఆగస్టు తర్వాతే పిల్లల పంపిణీ మొదలైంది. ఇక ఈసారి రాష్ట్ర ఆర్థిక శాఖ ఆమోదం తెలిపిన నేపథ్యాన, ముఖ్యమంత్రి ఆమోదిస్తే ఆర్థిక శాఖ నిధులు మంజూరు చేయనుంది. నిండుకుండల్లా జలాశయాలు ఇటీవలి వర్షాలతో జిల్లాలోని జలాశయాలన్నీ నిండాయి. చెరువులు, కుంటలు నిండినా చేపపిల్లల పంపిణీ టెండర్ల దశకు చేరలేదు. ఇప్పటికై నా ప్రభుత్వం చేపపిల్లల పథకానికి ఆమోదముద్ర వేస్తే మత్స్యశాఖ టెండర్ల ప్రక్రియ చేపడుతుంది. ఆగస్టు మొదటి, రెండు వారాల్లో టెండర్లు నిర్వహించినా ఆగస్టు చివరి లేదా సెప్టెంబర్ మొదటి వారం నుంచి చేపపిల్లల సరఫరాకు అవకాశం ఏర్పడుతుంది. జిల్లాకు 3.68 కోట్ల చేపపిల్లలు జిల్లాలో 880 చెరువులు, కుంటల్లో 3.68 కోట్ల చేపపిల్లల పంపిణీకి మత్స్యశాఖ ప్రతిపాదించింది. ఇందుకోసం రూ.5.50కోట్ల మేర నిధులు అవసరమని అంచనా. కాగా, 3.68కోట్ల పిల్లల్లో 1.40కోట్లు 35–40 మి.మీ., 2.28కోట్ల పిల్లలు 80–100మి.మీ.వి కావాలని ప్రతిపాదనల్లో పేర్కొన్నారు. చిన్న చేపపిల్ల ఖరీదు రూ.0.60, పెద్దవైతే రూ.1.50 వరకు ఉంటుంది. గత ఏడాది ఇదే ధరలతో టెండర్లు ఖరారయ్యా యి. చిన్నపిల్లలో బొచ్చ, రవ్వ, బంగారుతీగ, పెద్ద పిల్లల్లో బొచ్చ, రవ్వ, మృగాలు రకాలు ఉంటాయి. గత ఏడాది వరదల కారణంగా జిల్లాలో 2.68 కోట్ల చేపపిల్లలను 876 జలాశయాల్లో వదిలారు. 16వేల కుటుంబాలకు జీవనోపాధి జలాశయాల్లో చేపపిల్లల పెంపకం ద్వారా జిల్లాలో 220మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలకు చెందిన 16వేల మత్స్య కుటుంబాలకు ఉపాధి లభిస్తోంది. పరోక్షంగా మరికొన్ని వేల కుటుంబాలు ఉపాధి పొందుతున్నాయి. గతంలో సంఘాల ఆధ్వర్యాన చేపపిల్లలను కొనుగోలు చేసి జలాశయాల్లో వదిలేవారు. ఆ తర్వాత ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేస్తుండడంతో లబ్ధి జరుగుతుండగా, రెండేళ్ల నుంచి జాప్యంతో సమస్యలు మొదలయ్యాయి. ఈసారైనా సకాలంలో జలాశయాల్లోకి చేపపిల్లలు చేరేలా చూడాలని మత్స్యకారులు కోరుతున్నారు.జలాశయాలు అనుకూలం చేపపిల్లల పంపిణీకి ప్రభుత్వం అనుమతులు ఇవ్వగానే టెండర్లు మొదలయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం జిల్లా జలాశయాలు చేపపిల్లలను వదిలేందుకు అనుకూలంగా ఉన్నాయి. – శివప్రసాద్, జిల్లా మత్స్యశాఖ అధికారి -
డెంగీ నివారణకు ప్రత్యేక చర్యలు
తిరుమలాయపాలెం: మండలంలోని పలు గ్రామాల్లో డెంగీ కేసులు నమోదైనందున జ్వరాల కట్టడికి వైద్య, ఆరోగ్యశాఖ, పంచాయతీ ఉద్యోగులు ప్రత్యేక చర్యలు చేపట్టాలని అదనపు కలెక్టర్ డాక్టర్ శ్రీజ ఆదేశించారు. తిరులాయపాలెం మండలంలోని చంద్రుతండాలో ఏడుగురికి డెంగీ నమోదు కావడంతో మంగళవారం ఆమె గ్రామాన్ని పరిశీలించారు. డెంగ్యూ సోకిన వారి ఇళ్లలో అందరికీ పరీక్షలు చేయించడమే కాక సీజనల్ వ్యాధుల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆశా వర్కర్లు, పంచాయతీ కార్యదర్శులు అవగాహన కల్పించాలని తెలిపారు. అనంతరం మండలంలోని మహ్మదాపురం గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో విద్యార్థుల ఆరోగ్యంపై ఆరా తీసి పారిశుద్ధ్య నిర్వహణ, ఇంకుడు గుంతల నిర్మాణంపై ఎంపీడీఓ, పంచాయతీ కార్యదర్శిని సూచనలు చేశారు. ఆతర్వాత సుబ్లేడు పీహెచ్సీలో తనిఖీ చేసిన అదపు కలెక్టర్ మందుల లభ్యత, పరీక్షల నిర్వహనపై ఆరా తీసి ప్రతీ గ్రామపంచాయతీలో వైద్యశిబిరాలు నిర్వహించాలని ఆదేశించారు. డీఎల్పీఓ టి.రాంబాబు, వైద్యాధికారి సుబ్బారావు, ఎంపీడీఓ ఎస్.కే.సిలార్ సాహెబ్, ఎంపీఓ సూర్యనారాయణ, డాక్టర్ వసుంధర పాల్గొన్నారు. ఏటీసీల్లో కోర్సులపై విస్తృత ప్రచారం ఖమ్మంమయూరిసెంటర్: ఐటీఐ, ఏటీసీల్లో అందుబాటులో ఉన్న ఉపాధి కోర్సులపై విస్తృత ప్రచారం చేయాలని అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ ఆదేశించారు. కేఎంసీ కార్యాలయంలో మంగళవారం ఐటీఐల్లో ప్రవేశాలు, అక్షరాస్యత, పారిశుద్ధ్య నిర్వహణ, పెట్రోల్ పంపుల ఏర్పాటు అంశాలపై అధికారులతో సమీక్షించారు. జిల్లాలో అనువైన స్థలాలు గుర్తించి పెట్రోల్ బంక్ల ఏర్పాటుకు ప్రతిపాదించాలని తెలిపారు. ఏదులాపురం, రఘునాథపాలెం, మధిర, సత్తుపల్లి పరిసర ప్రాంతాల్లో ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ల ఏర్పాటుకు అనువైన స్థలాలు గుర్తించాలని చెప్పారు. ఐటీఐ, ఏటీసీల్లో 255 సీట్లు ఖాళీగా ఉన్నందున యువత చేరేలా విస్తృత ప్రచారం చేయాలన్నారు. అలాగే, నిరక్షరాస్యులకు అక్షరాలు నేర్పించడం, ఓపెన్ స్కూల్లో ప్రవేశాలు, ప్రభుత్వ విద్యాసంస్థల్లో అవసరమైన మరమమ్మతులు, కంప్యూటర్ ల్యాబ్ల ఏర్పాటుపై సూచనలు చేశారు. డీఈఓ ఎస్.సత్యనారాయణ, డీఐఈఓ రవిబాబు, ఆర్డీఓ నర్సింహారావు, అడిషనల్ డీఆర్డీఓ జయశ్రీ, కేఎంసీ సహాయ కమిషనర్ అనిల్కుమార్, మునిసిపల్ కమిషనర్లు సంపత్కుమార్, శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. అదనపు కలెక్టర్ డాక్టర్ శ్రీజ -
అంతా సాఫీగా సాగుతోందా?
● గురుకులాలు, హాస్టళ్లు, కేజీబీవీల్లో అధికారుల తనిఖీలు ● హాజరు, సౌకర్యాల పరిశీలన... మెనూ అమలుపై సర్వే ● మండల, మున్సిపల్ అధికారులతో బృందాల ఏర్పాటు ఖమ్మంమయూరిసెంటర్: ప్రభుత్వ సంక్షేమ గురుకులాలు, వసతి గృహాలతో పాటు కస్తూర్భాగాంధీ విద్యాలయాల్లో విద్యార్థులకు వసతులు, సౌకర్యాలను మరింత మెరుగుపర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఇప్పటికే ప్రతీ జిల్లాలో ఐఏఎస్ అధికారులు ఒక దఫా తనిఖీ చేపట్టగా.. మరోసారి పూర్తి స్థాయిలో తనిఖీ చేపట్టాలని జిల్లా అధికారులు నిర్ణయించారు. ఈమేరకు జిల్లాలోని ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనార్టీ గురుకులాలు, వసతిగృహాలతో పాటు కేజీబీవీల్లో తనిఖీల కోసం ప్రత్యేక అధికారులను నియమించారు. జిల్లాలో గురుకులాలు, వసతిగృహాలు, కేజీబీలు అన్నీ కలిపి 181 ఉండగా.. వీటిలో తనిఖీకి అధికారులను నియమిస్తూ అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ ఉత్తర్వులు జారీ చేశారు. బుధ, గురువారం తనిఖీ చేయాలని ఆదేశించగా కొన్నిచోట్ల అధికారులు ముందుగానే ప్రారంభించారు. అధికారులతో బృందాలు జిల్లా కేంద్రంతో పాటు మండల కేంద్రాలు, గ్రామాల్లోని గురుకుల పాఠశాలలు, కళాశాలలు, సంక్షేమ వసతిగృహాలు, కేజీబీవీల్లో తనిఖీ కోసం మండల, మున్సిపల్ అధికారులను నియమించారు. మండలాల నుంచి తహసీల్దార్, ఎంపీడీఓ, ఎంపీఓ, ఎంఈఓలను నియమించగా.. మున్సిపాలిటీల నుండి కమిషనర్లు, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ నుంచి అసిస్టెంట్ కమిషనర్, ఇంజీనీర్లు, ఉద్యాన అధికారికి బాధ్యతలు అప్పగించారు. వీరు తమకు కేటాయించిన విద్యాసంస్థల్లో బుధవారం, గురువారం తనిఖీ చేయాల్సి ఉంటుంది. ఏమేం పరిశీలిస్తారంటే... తనిఖీ సమయంలో అధికారులు ప్రధానంగా ఏడు అంశాలను పరిశీలించాల్సి ఉంటుంది. విద్యార్థుల హాజరు శాతం, వసతి గృహాల్లోని పడకలు, తాగునీరు, మరుగుదొడ్లు, స్నానపు గదులు వంటి కనీస సౌకర్యాల లభ్యతను పరిశీలిస్తారు. ఇవన్నీ విద్యార్థుల సంఖ్యకు తగినట్లు ఉన్నాయా, లేదా అని చూడడమే కాక భవనాలు, ప్రహరీ గోడలు, విద్యుత్ సరఫరా వంటి మౌలిక సదుపాయాల ప్రస్తుత పరిస్థితిని అంచనా వేస్తారు. ఎక్కడైనా మరమ్మతులు అవసరమా, భద్రతాపరమైన లోపాలు ఉన్నాయా అని కూడా పరిశీలించడమే కాక వంటశాలలు, దోమల నివారణ చర్యలు, తాగునీటి శుభ్రత, వ్యర్థాల నిర్వహణపైనా ఆరా తీస్తారు. ఇదే సమయాన విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలలు, మధ్యాహ్న భోజనం నాణ్యతను తనిఖీ చేస్తారు. అంతేకాక విద్యార్థుల విద్యా ప్రమాణాలు, పాఠ్య ప్రణాళిక అమలు, ఉపాధ్యాయుల హాజరు, బోధనా నాణ్యత ఆరా తీయనున్నారు. ఆయా అంశాల్లో ఏదైనా సమస్యలు, ఫిర్యాదులను గుర్తిస్తే విచారణ చేపడుతారు. నివేదికలు.. అధికారులు విద్యాసంస్థల్లో తనిఖీ సమయాన గుర్తించే అంశాలన్నింటినీ గూగుల్ ఫామ్(ఆన్లైన్)లో నమోదు చేయాల్సి ఉంటుంది. ఆపై ఆగస్టు 1న నివేదికలను శాఖల వారీగా ఉన్నతాధికారులకు సమర్పించారు. ఇందులోని అంశాల ఆధారంగా తీసుకునే చర్యలను వారు 4వ తేదీన కలెక్టర్కు అందించాల్సి ఉంటుంది. -
‘రాబోయే ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగరబోతోంది’
ఖమ్మం: దేశం కోసం, రైతుల కోసం పని చేసే పార్టీ బీజేపీ అని ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ఖమ్మం జిల్లా బీజేపీ అడ్డా కాబోతోందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ రోజు(మంగళవారం, జూలై 29) ఖమ్మం పర్యటనలో ఉన్న ఆయన మాట్లాడుతూ.. ‘ బీజేపీలో చేరేందుకు కమ్యూనిస్టులు సిద్ధంగా ఉన్నారు. నాతో కొంతమంది కమ్యూనిస్టు నాయకులు మాట్లాడుతున్నారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో కమ్యూనిస్టు పార్టీ ఉనికిని కోల్పోతుంది. తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇస్తూనే ముస్లింలకు 10 శాతం ఇవ్వడం న్యాయం కాదు. బీసీలకు మాత్రమే 42 శాతం రిజర్వేషన్ ఇవ్వాలి. అలాగని మేము ముస్లిలకు వ్యతిరేకం కాదు. ఓబీసీ ద్వారా 10 శాతం రిజర్వేషన్ ముస్లింలకు ఉంది. బీసీలను కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తోంది. రాష్ట్రంలో రైతు బంధు అయిపోయింది. స్థానిక సంస్థల ఎన్నికల కోసం తెరమీదకు రైతు బంద్ను తీసుకొచ్చారు. ఖమ్మం మున్సిపాలిటీ బీజేపీ పార్టీ కైవసం చేసుకోబోతుంది. మనలో ఏమైనా విభేదాలు ఉంటే వాటిని పక్కనపెట్టి పార్టీ కోసం పని చేయాలి. రాబోయే స్థానిక సంస్థల, మున్సిపాలిటీ ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగరబోతోంది’ అని రాంచందర్ రావు జోస్యం చెప్పారు. -
సబ్ కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన అజయ్
కల్లూరు: కల్లూరు సబ్ కలెక్టర్గా నియమితులైన ఐఏఎస్ అధికారి అజయ్ యాదవ్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. కల్లూరు డివిజన్ను ఇటీవల అప్గ్రేడ్ చేయగా 2023 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన అజయ్ను సబ్ కలెక్టర్గా నియమించిన విషయం విదితమే. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఇటావా జిల్లాకు చెందిన ఆయన ఢిల్లీ ఐఐటీలో బీటెక్ పూర్తిచేశాక సివిల్స్కు సిద్ధమయ్యారు. ఐఏఎస్ శిక్షణ అనంతరం కరీంనగర్లో ట్రెయినీ కలెక్టర్గా పనిచేయగా, తొలిపోస్టింగ్ కల్లూరులో కేటాయించారు. ఈ సందర్భంగా అజయ్యాదవ్ మాట్లాడుతూ డివిజన్ పరిధిలో సమస్యల పరిష్కారం, అర్హులకు ప్రభుత్వ పథకాలు అందేలా కృషి చేస్తానని తెలిపారు. తొలుత ఆయనకు ఆర్డీఓ రాజేందర్తో పాటు కార్యాలయ ఉద్యోగులు స్వాగతం పలికారు. కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుపై ఆరా కూసుమంచి: కూసుమంచి మండలం చేగొమ్మ గ్రామంలో కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో అమలవుతున్న పథకాలను ఎన్ఎల్ఎం అధికారుల బృందం సోమవారం పరిశీలించింది. ఉపాధి కూలీలు, మహిళా సంఘాల సభ్యులతో చర్చించడమే కాక రికార్డులను పరిశీలించారు. అలాగే, పెన్షన్లు అందుకుంటున్న లబ్ధిదారులతో మాట్లాడి వివరాలు సేకరించారు. ఆపై అంగన్వాడీ కేంద్రాలు, అవెన్యూ ప్లాంటేషన్, నర్సరీలు, సీసీ రహదారులను పరిశీలించి నిర్మాణ వివరాలపై అధికారులతో చర్చించారు. ఈ బృందంలో డాక్టర్ డీ.డీ.గరుడ, ఏ.అశ్విన్ గోపాల్ ఉండగా, ఈజీఎస్ ఏపీడీలు చలపతిరావు, శ్రీదేవి, డీఎల్పీఓ రాంబాబు, కూసుమంచి ఎంపీడీఓ రాంచందర్రావు, ఏపీఓ అప్పారావు, ఏపీఎం తిరుమలరావు తదితరులు పాల్గొన్నారు. జిల్లాకు మరో 1,085 మెట్రిక్ టన్నుల యూరియా ఖమ్మంవ్యవసాయం: ఉమ్మడి జిల్లా అవసరాల కోసం సోమవారం 1,085 మెట్రిక్ టన్నుల స్పిక్ యూరియా చేరింది. చింతకాని మండలం పందిళ్లపల్లి రేక్ పాయింట్కు యూరియాతో కూడిన గూడ్స్ రాగా, మార్క్ఫెడ్ గోదాములకు తరలించారు. ఇందులో 650 మెట్రిక్ టన్నులను మార్క్ఫెడ్ బఫర్ స్టాక్గా నిల్వ చేయనుండగా, మిగతా 435 మెట్రిక్ టన్నుల్లో 235 టన్నులు ఖమ్మం జిల్లాకు, 200 టన్నులు భద్రాద్రి కొత్తగూడెంకు కేటాయించారు. ఇక మంగళవారం కాంప్లెక్స్ 20:20 ఎరువుతో కూడిన రైలు, బుధవారం మరో 1,300 మెట్రిక్ టన్నుల క్రిబ్కో యూరియా రానుందని అధికారులు తెలిపారు. ప్రకాష్నగర్ వంతెనపై పగుళ్లు.. ఖమ్మంఅర్బన్: ఖమ్మం నుంచి రాకపోకలకు ప్రధాన మార్గంగా మున్నేరుపై ఉన్న ప్రకాష్నగర్ వంతెన భద్రతపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గత ఏడాది మున్నేటికి వచ్చిన భారీ వరదతో వంతెనపై పలుచోట్ల స్పైన్లు కదలగా రాకపోకలు నిలిపేసి రూ.కోటి వ్యయంతో మరమ్మతులు చేపట్టారు. అయితే, వంతనపై మళ్లీ పగుళ్లు వచ్చినట్లు తెలుస్తుండగా సోమవారం కొందరు వాహనదారులు తీసిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. దీంతో వంతెన భద్రతపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వేర్ కోటింగ్లో ఏర్పడిన పగుళ్లే... బ్రిడ్జిపై పగుళ్లు వచ్చాయనే సమాచారంతో ఆర్ అండ్ బీ డివిజన్ ఇంజనీర్ చంద్రశేఖర్, అసిస్టెంట్ ఇంజనీర్ ప్రవీణ్ పరిశీలంచారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వంతెనపై కనిపిస్తున్నవి కాంక్రీట్ లేదా స్పైన్లలో వచ్చిన పగుళ్లు కావని తేల్చిచెప్పారు. వంతెన శ్లాబ్ పైభాగంలో వేసే వేర్ కోటింగ్లో ఏర్పడిన అల్పస్థాయి పగుళ్లేనని, వీటితో వంతెనకు ఎలాంటి ప్రమాదం లేదని తెలిపారు. అయినప్పటికీ మంగళవారం మరోసారి వేర్ కోటింగ్ చేయిస్తామని వెల్లడించారు. -
ఖాళీల లెక్క తేలింది...
జిల్లాలో టీచర్ పోస్టులు 892ఖాళీఖమ్మం సహకారనగర్: ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పిస్తామని ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. దీంతో ఉపాధ్యాయ వర్గాల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ఈనేపథ్యాన ఈనెల 31వ తేదీన పలువురు ఉపాధ్యాయులు, హెచ్ఎంలు ఉద్యోగ విరమణ చేయనుండగా విద్యాశాఖ అధికారులు ఖాళీల లెక్క తేల్చేలా కసరత్తు ఆరంభించారు. జిల్లాలో మొత్తం 5,816 పోస్టులకు గాను 4,924మంది విధులు నిర్వర్తిస్తుండగా 858 పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఇటీవల ప్రకటించగా, ఈనెల 31న ఉద్యోగ విరమణ చేయనున్న వారితో కలిసి ఆ సంఖ్య 892కి చేరింది. కాగా, పదోన్నతుల షెడ్యూల్ మంగళవారం విడుదలయ్యే అవకాశముందని సమాచారం. షెడ్యూల్ ప్రకారం సీనియారిటీ ఆధారంగా పదోన్నతుల ప్రక్రియ చేపట్టనున్నారు. -
దంపతులతో దాగుడుమూతలు
● సంతానం లేని వారే లక్ష్యంగా దందా ● విచ్చలవిడిగా ఏర్పాటవుతున్న సంతాన సాఫల్య కేంద్రాలు ● అనుమతులు లేకున్నా యథేచ్ఛగా నిర్వహణ ● అమాయకుల నుంచి రూ.లక్షలు దండుకుంటున్న యాజమాన్యాలు సంతాన సాఫల్యతకు ఇవీ మార్గాలు ● ఐయూఐ (ఇంట్రా యూటిరిన్ ఇన్సెమినేషన్) : ఈ విధానంలో భర్త శుక్రకణాలను సేకరించి కదలిక మంచిగా ఉన్న వాటిని సిరంజీ ద్వారా భార్య గర్భసంచిలోకి ప్రవేశపెడతారు. ● ఐవీఎఫ్ (ఇన్విట్రో ఫెర్టిలైజేషన్) : ఇందులో మహిళ అండాన్ని ల్యాప్రోస్కోపిక్ ద్వారా తీసి ప్రిజర్వ్ చేస్తారు. ఆపై భర్త వీర్యకణాలు తీసి బయటే అండం, శుక్రకణాలను ఫలధీకరణం చేశాక అండాలను గర్భసంచిలో ప్రవేశపెడతారు. ● సరోగసీ : భార్య గర్భం దాల్చే అవకాశం లేదని తేలినప్పుడు ఈ విధానం ఎంచుకుంటారు. భర్త శుక్రకణాలు, భార్య అండాలను ఫలదీకరించి మరో మహిళ గర్భంలో ప్రవేశపెడతారు. ఈ విధానంలో చికిత్స చేసే ఆస్పత్రులకు జిల్లా స్థాయి కమిటీ అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. ఖమ్మంవైద్యవిభాగం: ఉమ్మడి జిల్లాలో సంతాన సాఫల్య కేంద్రాలు విచ్చలవిడిగా ఏర్పాటవుతున్నాయి. ప్రస్తుత జీవనశైలి, వాతావరణ పరిస్థితులతో పాటు ఇతర కారణాలతో సంతాన లేమి సమస్య ఎదురవుతుండగా.. పిల్లలు లేని జంటలే లక్ష్యంగా కేంద్రాల నిర్వాహకులు అందినకాడికి దండుకుంటున్నారు. ఆతర్వాత ఫలితం లేకపోతే తమ తప్పేం లేదని చేతులు దులుపుకుంటుండడందంపతులు కన్నీటికి కారణమవుతోంది. అయితే, కేంద్రాల ఏర్పాటుకు కొందరే అనుమతి తీసుకుంటుండగా.. అనుమతులు లేనివి లెక్కలేనన్ని పుట్టుకొస్తుండడం గమనార్హం. పదింటికే అనుమతి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మూడు, ఖమ్మం జిల్లాలో ఏడు సంతాన సాఫల్య కేంద్రాలకు వైద్య, ఆరోగ్య శాఖ అనుమతి ఉంది. ఖమ్మం జిల్లాలో రోహిత్ టెస్ట్ట్యూబ్ బేబీ సెంటర్, ప్రవీణ ఫెర్టిలిటీ సెంటర్, మాతృశ్రీ ఫెర్టిలిటీ సెంటర్, శ్రీగర్భ ఫెర్టిలిటీ సెంటర్, శ్యామల హాస్పిటల్, వింగ్స్ జోయా ఐవీఎఫ్ సెంటర్, కార్తీక్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులకు అనుమతి ఉండగా.. ఇందులో రోహిత్, ప్రవీణ సెంటర్లకు సరోగసీ అనుమతులు ఉన్నాయి. కానీ ఉమ్మడి జిల్లాలో ముప్ఫైకి పైగా సెంటర్లు కొనసాగుతుండడం అధికారుల పర్యవేక్షణ లేమిని తెలియజేస్తోంది. మరిచిపోయారా? గత ఏడాది మార్చిలో సంతాన సాఫల్య కేంద్రాల తీరుపై హెల్త్ అండ్ ఫ్యామిటీ వెల్ఫేర్ కమిషనర్కు ఫిర్యాదులు అందాయి. దీంతో ఖమ్మంలోని సెంటర్లలో హైదరాబాద్ అధికారులు తనిఖీ చేపట్టారు. అప్పుడు రెండు ఫెర్టిలిటీ సెంటర్లను సీజ్ చేయడమే కాక ఐదు టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్లకు నోటీసులు జారీ చేశారు. ఆతర్వాత రాష్ట్ర, జిల్లా అధికారుల తనిఖీ లేకపోవడంతో దందా అడ్డూఅదుపు లేకుండా కొనసాగుతోంది. కమీషన్లతో వ్యవహారం వివాహం జరిగి ఏళ్లు గడిచినా సంతానం లేని దంపతులే టార్గెట్గా నిర్వాహకులు దందా సాగిస్తున్నారు. ఫెర్టిలిటీ సెంటర్, టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ వంటి పేర్లతో ఏర్పాటుచేస్తున్న కేంద్రాల్లో చికిత్స చేయించుకుంటే బిడ్డ జన్మించడం గ్యారంటీ అని నమ్మిస్తూ రూ.లక్షల్లో వసూలు చేస్తున్నారనే విమర్శలున్నాయి. అనుమతి ఉన్నవేవో, లేనివేవో తెలియక సూర్యాపేట, మహబూబాబాద్తో పాటు తెలంగాణ సరిహద్దు ఛత్తీస్గఢ్, ఏపీలోని పలు జిల్లాల నుంచి దంపతులు సంతానంపై ఆశతో వస్తున్నారు. దంపతులను పంపిస్తే ఆర్ఎంపీలు, వైద్యులకు కమీషన్లు ఇచ్చేలా ఒప్పందాలు కుదుర్చుకుంటున్నట్లు సమాచారం. అతి తక్కువ ‘సక్సెస్ రేట్’ దంపతుల్లో సంతాన లేమికి అనేక కారణాలు ఉంటాయి. దంపతులెవరైనా సంతానం లేదని వస్తే వైద్యులు అందుకు కారణాలను నిర్ధారించి వివరించాల్సి ఉంటుంది. కానీ చికిత్స చేస్తే సంతానం గ్యారంటీ అని నమ్మబలికి వసూళ్లు మొదలుపెడుతున్నారు. దీంతో అటు కుటుంబం, ఇటు సమాజం నుంచి సూటిపోటి మాటలు భరిస్తున్న దంపతులు ఆస్తులు అమ్మి మరీ చెల్లిస్తున్నారు. కాగా, టెస్ట్ట్యూబ్ బేబీ సెంటర్లలో 10 – 15 శాతమే సక్సెస్ రేట్ ఉంటుందని నిపుణులు చెబుతుండగా.. సెంటర్ల నిర్వాహకులు ఆదాయమే లక్ష్యంగా చికిత్స కొనసాగిస్తున్నారని సమాచారం. హైదరాబాద్ ఘటనతో సందేహలు హైదరాబాద్లోని ఓ ఫెర్టిలిటీ సెంటర్లో దంపతులను మోసగించిన ఘటన ఇటీవల బయటపడింది. సరోగసీ పేరుతో ఇతరులకు పుట్టిన శిశువును అప్పగించిన వైద్యురాలి మోసం బయటపడగా.. ఆ సెంటర్కు లైసెన్సే లేనట్లు తేలింది. ఈ నేపథ్యాన ఉమ్మడి జిల్లాలోని ఫెర్టిలిటీ సెంటర్లలో జరుగుతున్న చికిత్సపై సందేహలు వెల్లువెత్తుతున్నాయి. చాలా సెంటర్లు అనుమతి లేకున్నా కొనసాగుతుండడంపై అధికారుల నిర్లక్ష్యాన్ని పలువురు తప్పుపడుతున్నారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు ఫెర్టిలిటీ సెంటర్లలో నిబంధనలు అతిక్రమించినట్లు తేలితే చట్టప్రకారం చర్యలు తప్పవు. అమాయకులైన దంపతులకు హానీ కలిగించేలా వ్యవహరించొద్దు. అనుమతి ఉన్న సెంటర్ల నిర్వాహకులైనా నిబంధనల ప్రకారం నడుచుకోవాలి. జిల్లాలోని అన్ని సెంటర్లను తనిఖీ చేసి నిబంధనల అమలును పరిశీలిస్తాం. – బి.కళావతిబాయి, డీఎంహెచ్ఓ -
విలువలను కాలారాస్తున్న బీజేపీ
ముదిగొండ: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజా స్వామ్య విలువలను కాలరాయడమే కాక ప్రభుత్వ రంగ సంస్థలను అడ్డం పెట్టుకుని వ్యవస్థలను నాశ నం చేస్తోందని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం విమర్శించారు. ముదిగొండలో సోమవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మోడీ హయాంలో ప్రజా ఉద్యమాలపై నిర్భంధం ప్రయోగిస్తున్నారని మండిపడ్డారు. ఈమేరకు ప్రజల హక్కులను కాపాడే బాధ్యత కమ్యూనిస్టులపై ఉందన్నారు. కాగా, రాష్ట్రంలో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలు విషయంలో రేవంత్రెడ్డి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని తమ్మినేని తెలిపారు. ఇంది రమ్మ ఇళ్ల మంజూరులో రాజకీయ జోక్యాన్ని అరికట్టి అర్హులకు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. భూ పోరాటం చిరస్మరణీయం ముదిగొండ భూపోరాటం చిరస్మరణీయమైనదని తమ్మినేని వీరభద్రం తెలిపారు. భూపోరాటంలో భాగంగా పోలీసుల కాల్పుల్లో మరణించిన వారి వర్ధంతి సభ సోమవారం నిర్వహించగా తమ్మినేని మాట్లాడారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు పోతినేని సుదర్శన్రావు, జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, నాయకులు బండి రమేష్, కళ్యాణం వెంకటేశ్వరరావు, పొన్నం వెంకటేశ్వరరావు, మడుపల్లి గోపాలరావు, భట్టు పురుషోత్తం, బండి పద్మ, మంకెన దామోదర్, టీఎస్.కల్యాణ్, వేల్పుల భద్రయ్య, ఇరుకు నాగేశ్వరరావు, మండరపు పద్మావతి, పయ్యావుల ప్రభావతి, మేడ నారాయణ, భట్టు రాజు, దస్తగిరి, మెట్టెల సతీష్, కట్టకూరి ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు. సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని -
షటిల్కోర్టులో గుండెపోటు
తల్లాడ/ఉప్పల్: రోజులాగే షటిల్ ఆడుతున్న యువకుడు గుండెపోటుతో కుప్పకూలి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. తల్లాడ మాజీ ఉపసర్పంచ్ గుండ్ల వెంకటేశ్వర్లు కుమారుడైన రాకేష్(25) డిగ్రీ పూర్తి చేశాక హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్డులో నివాసముంటూ అక్కడి ఓ కార్ల షోరూంలో పనిచేస్తూ అక్కడే ఉంటున్నాడు. చిన్నతనం నుంచే షటిల్పై మక్కువ పెంచుకున్న ఆయన నిత్యం సాధన చేసేవాడు. ఇందులో భాగంగానే రోజులగా హైదరాబాద్ ఉప్పల్ భగాయత్లోని అలైట్ బ్యాడ్మింటన్ ఆకాడమీలోఆదివారం రాత్రి షటిల్ ఆడుతుండగా.. 20 నిమిషాల ఆట అనంతరం రాకేష్ ఉన్నట్టుండి కుప్ప కూలాడు. దీంతో సహచరులు ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. తల్లాడలో విషాదం రాకేష్ మృతదేహానికి హైదరాబాద్లో పోస్టుమార్టం అనంతరం సోమవారం ఉదయం తల్లాడ తీసుకొచ్చారు. కాగా, ఆయన షటిల్ ఆడుతూ గుండెపోటుతో కుప్పకూలిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్కాగా.. రాకేష్కు నివాళుర్పించేందుకు హైదరాబాద్, తల్లాడ నుంచి స్నేహితులు పెద్దసంఖ్యలో చేరుకున్నారు. తమతో పాటు షటిల్ ఆడిన ఆయన గుండెపోటుతో మృతి చెందడాన్ని జీర్ణించుకోలేని స్నేహితులు కన్నీరు మున్నీరుగా విలపించడమే కాక ‘మేం కూడా నీతోనే వస్తాం’ అంటూ రోదించడం అందరికీ కంటతడి పెట్టించింది. కుప్పకూలి మృతి చెందిన తల్లాడ యువకుడు -
పర్యాటక అభివృద్ధికి ప్రాధాన్యత
● టెంపుల్, ఎకో టూరిజం ప్రాజెక్టులకు ప్రణాళికలు ● అధికారులతో సమీక్షలో మంత్రులు తుమ్మల, జూపల్లి ఖమ్మంఅర్బన్: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడం ద్వారా ప్రభావిత ప్రాంతాల ప్రజలతో పాటు ప్రభుత్వానికి ఆదాయం పెంచేలా కార్యాచరణ రూపొందించేందుకు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు. హైదరాబాద్లోని సచివాలయంలో మంత్రులు సోమవారం పర్యాటక ప్రాజెక్టులపై సమీక్షించారు. టూరిజం కార్పొరేషన్ ఎండీ వల్లూరి క్రాంతి, జనరల్ మేనేజర్ ఉపేందర్రెడ్డి తదితరులు పాల్గొనగా మంత్రులు మాట్లాడారు. అపారమైన అవకాశాలు ఖమ్మం ఉమ్మడి జిల్లాలో పర్యాటకంగా అభివృద్ధికి అనేక అవకాశాలు ఉన్నాయని మంత్రి తుమ్మల తెలిపారు. పాలేరు రిజర్వాయర్, భద్రాచలం రామాలయం, పర్ణశాల, కిన్నెరసాని ప్రాజెక్టు, ఖమ్మం ఖిల్లా, వెలుగుమట్ల పార్క్, వైరా రిజర్వాయర్, కనిగిరి హిల్స్, నేలకొండపల్లి బౌద్ధ స్తూపం తదితర ప్రదేశాలకు వన్నెలద్ది వసతులు కల్పిస్తే పర్యాటకుల రాక పెరుగుతుందని చెప్పారు. అంతేకాక టెంపుల్, ఎకో టూరిజాన్ని ప్రోత్సహించినట్లవుతుందని తెలిపారు. ఖమ్మం సమీపాన సుమారు 500 ఎకరాల అటవీ ప్రాంతంలో ఎకో టూరిజం అభివృద్ధి పనులు వేగవంతం చేయడమే కాక కొత్తగూడెం హరిత హోటల్ను పూర్తిచేసి ఖమ్మంలోనూ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. ప్రభుత్వం లేదా ప్రైవేట్ భాగస్వామ్యంతో పనులు చేపట్టే అవకాశముందని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వచ్చే నెల ఖమ్మం జిల్లాలో పర్యటించనున్న నేపథ్యాన పర్యాటక ప్రాజెక్టులకు సంబంధించి కార్యాచరణ సిద్ధం చేయాలని తుమ్మల, జూపల్లి కృష్ణారావు సూచించారు. -
వైద్య, ఆరోగ్యశాఖలో ఉద్యోగాల పేరిట టోకరా
ఖమ్మంక్రైం: ప్రభుత్వ వైద్యుడిగా పనిచేస్తున్న తనకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖలో అందరూ తెలుసునని నమ్మించిన ఓ వ్యక్తి స్టాఫ్నర్స్, ఏఎన్ఎం ఉద్యోగాల పేరిట రూ.లక్షల్లో వసూలు చేసిన ఘటన వెలుగు చూసింది. ఖమ్మం కవిరాజ్నగర్ ప్రాంతానికి చెందిన అనిల్ కొన్నేళ్ల క్రితం తన పేరు కేతన్ అని, ప్రభుత్వ వైద్యుడిగా పనిచేస్తున్నానంటూ ఖమ్మంతో పాటు ములుగు జిల్లా వాజేడు ప్రాంతానికి చెందిన పలువురితో పరిచయం పెంచుకున్నాడు. ఈక్రమాన వాజేడు ప్రాంత మహిళకు మొదట ఔట్ సోర్సింగ్ విధానం ద్వారా విద్యుత్ శాఖలో ఉద్యో గం ఇప్పించాడు. ఈ విషయాన్ని ప్రచారం చేసుకోవడమే కాక ఆ మహిళ ద్వారా మరికొందరితో పరిచయం పెంచుకున్నాడు. నిరుద్యోగుల బలహీనతను ఆసరాగా చేసుకున్న ఆయన వైద్య, ఆరోగ్య శాఖలో స్టాఫ్ నర్స్, ఏఎన్ఎం ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ పలువురి నుంచి రూ.4లక్షల నుంచి రూ. 5లక్షల మేర వసూలు చేశాడు. అయితే, నెలలు గడిచినా ఉద్యోగాలు రాకపోగా అనిల్ ఇంటికి వెళ్లి అడితే కుటుంబీకులు తమకు సంబంధం లేదని బదులిచ్చారు. దీంతో చేసేదేం లేక బాధితుల్లో కొందరు సోమవారం ఖమ్మం టూటౌన్ పోలీసులను ఆశ్రయించారు. కాగా, బాధితుల్లో ఎక్కువ మంది గిరిజనులే ఉండగా.. విచారణ చేస్తున్నామని సీఐ బాలకృష్ణ తెలిపారు.పలువురి వద్ద రూ.4లక్షల నుంచి రూ.ఐదు లక్షల వరకు వసూళ్లు -
ఫిర్యాదులు పెండింగ్ ఉండొద్దు..
గ్రీవెన్స్ డేలో అదనపు కలెక్టర్లు శ్రీజ, శ్రీనివాసరెడ్డి ఖమ్మం సహకారనగర్: ప్రజలు అందించే ప్రతీ ఫిర్యాదును పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్లు పి.శ్రీజ, పి.శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం గ్రీవెన్స్ డే(ప్రజావాణి)లో భాగంగా వారు ప్రజల నుంచి ఫిర్యాదులు, వినతిపత్రాలను స్వీకరించారు. అనంతరం అధికారులతో సమీక్షించారు. ఏ ఫిర్యాదు పెండింగ్ ఉండకుండా పరిశీలించి పరిష్కరించాలన్నారు. ఏవైనా తిరస్కరిస్తే అందుకు కారణాలను దరఖాస్తుదారులకు తెలియచేయాలని సూచించారు. ఈకార్యక్రమంలో డీఆర్వో పద్మశ్రీ, జెడ్పీ సీఈఓ దీక్షారైనా, డీఆర్డీఓ సన్యాసయ్య తదితరులు పాల్గొన్నారు. ఫిర్యాదుల్లో కొన్ని... ● బోనకల్కు చెందిన జె.శైలు, ఎర్రుపాలెంకు చెందిన జి.అరుణ తమకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని విన్నవించారు. ● ముదిగొండ మండలం వల్లభి మాజీ సర్పంచ్ బి.బిక్షం తమ గ్రామ గ్రంథాలయ అభివృద్ధిపై దృష్టి సారించి భవనానికి నిధులు మంజూరు చేయాలని, పోటీ పరీక్షలకు కావాల్సిన పుస్తకాలు సమకూర్చాలని కోరారు. ● ఖమ్మం నుంచి ముదిగొండ మీదుగా, వల్లభి, జగ్గయ్యపేట వరకు ఆర్టీసీ బస్సులు నడపాలని ఆయా గ్రామాల ప్రజలు గ్రీవెన్స్లో అధికారులకు వినతిపత్రం అందజేశారు. -
ఇంటింటా జల్లెడ
● జిల్లాలో మొదలైన ఫీవర్ సర్వే ● జ్వరం వచ్చిన వారికి చికిత్స.. మిగతా వారికి పరీక్షలు ● మండల, గ్రామస్థాయిలో ప్రత్యేక బృందాల ఏర్పాటు ● సీజనల్ వ్యాధుల కట్టడికి కార్యాచరణఖమ్మంవైద్యవిభాగం/రఘునాథపాలెం/సత్తుపల్లి టౌన్: జిల్లాలో వారం పాటు కురిసిన వర్షాలతో పారి శుద్ధ్య సమస్యలు ఏర్పడగా.. దోమలు వృద్ధితో సీజ నల్ వ్యాధులు ప్రబలుతుతున్నాయి. జిల్లాలోని తల్లా డ, తిరుమలాయపాలెం, బోనకల్తో పాటు ఖమ్మంలోనూ డెంగీకేసులు నమోదైన నేపథ్యాన వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ఇంటింటా సర్వే ద్వారా వ్యాధుల కట్టడికి నిర్ణయించగా.. ఈనెల 27వ తేదీ నుండి ఇంటింటికికీ వెళ్లి జ్వర పీడితులను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. సెప్టెంబర్ చివరి వరకు సాగే ఈ సర్వే కోసం అదనపు కలెక్టర్ శ్రీజ 12 మందితో కూడిన ప్రత్యేక బృందాలను ఏర్పా టు చేశారు.ఈబృందాలు నిరంతరం వారికి కేటా యిం చిన మండలాల్లో సర్వేను పర్యవేక్షించాల్సి ఉంటుంది. ఏం చేస్తారు? పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించడమే కాక జ్వరం వచ్చిన వారికి చికిత్స అందేలా ఆయా బృందాలు పర్యవేక్షిస్తారు. అంతేకాక జ్వరబాధితుల ఇళ్లలోని అందరి నుంచి రక్తనమూనాలు సేకరిస్తారు. సాధారణ జ్వరం, దగ్గు, జలుబు, ఒళ్లు నొప్పులతో బాధపడే వారికి మందులు ఇవ్వడంతో పాటు డెంగీ వంటి లక్షణాలు ఉంటే నిర్ధారించాక ఆస్పత్రులకు తరలిస్తారు. అలాగే, గ్రామాల్లో ఫాగింగ్ చేయించడం.. మురికి గుంతల్లో టీమోఫాస్ స్ప్రే, ఆయిల్ బాల్స్ వేయిస్తూ జ్వర పీడితులు ఎక్కువగా ఉన్నచోటట వైద్య శిబిరాలు ఏర్పాటుచేయిస్తారు. 12 మంది అధికారులు జిల్లాలో వ్యాధుల వ్యాప్తిని అరికట్టేలా నిర్వహిస్తున్న సర్వే పర్యవేక్షణకు 12మంది ప్రత్యేక అధికారులను నియమించారు. వీరు వ్యాధుల సీజనల్ ముగిసే వరకు క్షేత్ర స్ధాయిలో ఉండి మండల స్థాయి బృందా లు చేపట్టే సర్వేను పర్యవేక్షిస్తూనే ప్రజలకు అవగాహన కల్పించాల్సి ఉంటుంది. ఈమేరకు డీఐఓ చందూనాయక్కు మూడు మండలాలు కేటాయించగా, డీఎంహెచ్ఓ కళావతిబాయి, జెడ్పీ సీఈఓ దీక్షా రైనా, వ్యా క్సిన్ మేనేజర్ వెంకటరమణ, డీపీఓ ఆశాలత, డీఎల్పీఓలు జీ.వీ.సత్యనారాయణ, టి.రాంబాబు, జెడ్పీ డిప్యూటీ సీఈఓ నాగపద్మజ, డిప్యూటీ డీఎంహెచ్ఓ టి.సీతారామ్కు రెండు చొప్పున, జిల్లా క్షయ నివారణ అధికారి వి.సుబ్బారావు, కేఎంసీ అసిస్టెంట్ కమిషనర్కు ఒక్కో మండల ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగిస్తూ అదనపు కలెక్టర్ శ్రీజ ఉత్తర్వులు జారీ చేశారు. డెంగీ కేసుల నమోదుతో... గత ఏడాది జిల్లాలో 529 డెంగీ కేసులు నమోదు కాగా, ఈ ఏడాది కేసులు రావొద్దని అధికారులు ముందు నుంచి అప్రమత్తంగా ఉన్నారు. అయినా పలు ప్రాంతాల్లో కేసులు వస్తుండడం.. తల్లాడలో ఓ మహిళ మృతి చెందడంతో అధికారులు అప్రమత్తమై క్షేత్రస్ధాయిలో ఫీవర్ సర్వే నిర్వహణకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం జిల్లాలో 20 వరకు డెంగీ కేసులు నమోదు కాగా.. మరింత వ్యాప్తి చెందకుండా కట్టడి చేసేలా కార్యచరణ రూపొందించారు. ఈక్రమంలోనే ఇంటింటి సర్వే ద్వారా ఇళ్లలోని పాత సామగ్రిలో నీరు నిల్వ లేకుండా చూసుకోవడం, దోమల నివారణకు మెష్లు అమర్చేలా స్థానికులకు అవగాహన కల్పిస్తున్నారు. అంతేకాక కాచి చల్లార్చిన నీరే తాగాలని, వేడివేడి ఆహారం తీసుకోవాలని సూచిస్తున్నారు. అలాగే, గ్రామాల్లో తాగునీరు సరఫరా చేసే ట్యాంకుల్లో క్లోరినేషన్ చేయిస్తున్నారు. ఫీవర్ సర్వే తప్పనిసరి... కొణిజర్ల: ఇంటింటా ఫీవర్ సర్వేపై శ్రద్ధ వహించాలని జెడ్పీ సీఈఓ దీక్షారైనా సూచించారు. కొణిజర్ల పీహెచ్సీని సోమవారం తనిఖీ చేసిన ఆమె రికార్డులు పరిశీలించాక సిబ్బందికి సూచనలు చేశారు. ఇంటింట ఫీవర్ సర్వే ద్వారా జ్వరబాధితులను గుర్తిస్తే సత్వరమే చికిత్స అందించే వీలు ఉంటుందని తెలిపారు. రహదారుల వెంట, డ్రెయినేజీల్లో నిలిచిన మురుగునీటినిశుభ్రం చేయించాలని, దోమల వ్యాప్తిని అరికట్టేలా ఫాగింగ్ చేయించాలని ఆదేశించారు. ఎంపీడీఓ ఆర్.ఉపేంద్రయ్య, వైద్యాధికారి సుజాత, సిబ్బంది పాల్గొన్నారు. నిరంతర పర్యవేక్షణ.. సీజనల్ వ్యాధుల నియంత్రణకు కార్యాచరణ రూపొందించాం. ప్రతిరోజూ ఆరోగ్య బృందాలు తో జ్వర సర్వే, డ్రై డే చేపడున్నాం. దోమల నియంత్రణ, వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగా హన కల్పిస్తూన్తే వైద్యశిబిరాలు ఏర్పాటు చేస్తున్నాం. – టి.సీతారాం, డిప్యూటీ డీఎంహెచ్ఓ, సత్తుపల్లి -
చదువుతోనే సమాజంలో గౌరవం
● కారేపల్లి జెడ్పీహెచ్ఎస్లో కలెక్టర్ అనుదీప్ ● పీహెచ్సీ, సొసైటీ గోదాంల్లోనూ తనిఖీకారేపల్లి: చదువుతోనే సమాజంలో ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చని.. తద్వారా గౌరవం లభిస్తుందని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. ఈ విషయాన్ని విద్యార్థులు గుర్తించి క్రమశిక్షణతో పట్టుదలగా చదవాలని సూచించారు. కారేపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కలెక్టర్ సోమవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రాంగణమంతా పరిశీలించిన ఆయన పలుచోట్ల చెత్త పేరుకుపోవడం, పరిసరాలు అపరిశుభ్రంగా ఉండడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే, కంప్యూటర్, సైన్స్ ల్యాబ్లు, పుస్తకాలు, విద్యార్థుల యూనిఫామ్, క్రీడా సామగ్రి నిల్వ ఉంచే గదుల్లోనూ శుభ్రత లేకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. అనంతరం తరగతి గదులకు వెళ్లి విద్యార్థులకు సూచనలు చేసిన కలెక్టర్ పలు పాఠ్యాంశాల్లోని ప్రశ్నలు వేసి సమాధానాలు రాబడుతూ వారి ప్రగతిపై సంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే, మధ్యాహ్న భోజనం నాణ్యతపైనా ఆరా తీశారు. అనంతరం కారేపల్లి పీఏసీఎస్ను తనిఖీ చేసిన కలెక్టర్ ఎరువుల లభ్యత, సరఫరా ఆరా తీశాక సిబ్బందికి సూచనలు చేశారు. అక్కడి నుంచి ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లిన కలెక్టర్ అనుదీప్.. పలువురితో మాట్లాడి అందుతున్న వైద్యసేవలు తెలుసుకున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచేలా వైద్యులు కృషి చేయాలని, సీజనల్ వ్యాధుల కట్టడిపై దృష్టి సారించాలని ఆదేశించారు. తహసీల్దార్ అనంతుల రమేష్, ఇన్చార్జి ఎంపీడీఓ రవీంద్రప్రసాద్, ఎంఈఓ జయరాజు, హెచ్ఎం శ్యాంప్రసాద్, ఏఓ భట్టు అశోక్కుమార్, వైద్యాధికారి బి.సురేష్, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ నరేందర్, సొసైటీ సీఈఓ బి హన్మంతరావు పాల్గొన్నారు. నాణ్యమైన గేదెల కొనుగోలు ఖమ్మంవ్యవసాయం: మధిరలో ఏర్పాటుచేసే ఇందిరా మహిళా డెయిరీ లబ్ధిదారులతో నాణ్యమైన, ఆరోగ్యవంతమైన గేదెలే కొనుగోలు చేయించాలని కలెక్టర్ అనుదీప్ సూచించారు. అధిక పాల దిగుబడి వచ్చే రకాలు ఎంపిక చేయాలని తెలిపారు. అదనపు కలెక్టర్లు పి.శ్రీజ, పి.శ్రీనివాసరెడ్డితో కలిసి ఆయన అధికారులతో సమీక్షించారు. ఏపీలోని తుని, తణుకు, ఉండి, కంకిపాడు తదితర సంతల్లో అధికారులు పరిశీలించి మొదటి విడతగా 250 గేదెల సేకరణ చేపట్టాలని ఆదేశించారు. ప్రతీ బృందంలో 25 మంది లబ్ధిదారులు, నలుగురు అధికారులు వెళ్లాలని తెలిపారు. ఈసమావేశంలో డీఎఫ్ఓ సిద్ధార్థ్ విక్రమ్ సింగ్, డీఆర్డీఓ సన్యాసయ్య, జిల్లా పశు సంవర్థక అధికారి డాక్టర్ పురందర్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ నవీన్బాబు, జిల్లా ఉద్యాన శాఖ అధికారి ఎం.వీ.మధుసూదన్, ఏడీఏ విజయచందర్, ఎఫ్డీఓలు మంజుల, వెంకన్న పాల్గొన్నారు. -
రాష్ట్ర ఉషూ టోర్నీలో పతకాలు
ఖమ్మం స్పోర్ట్స్: సంగారెడ్డి జిల్లా కేంద్రంలో జరిగిన రాష్ట్రస్థాయి ఖేలోఇండియా ఉషూ పోటీ ల్లో జిల్లాక్రీడాకారులు మూడు పతకాలు సా ధించారు. సీనియర్స్ విభాగంలో పి.పవిత్రాచా రికి స్వర్ణపతకం సాధించగా, ఇతర ఈవెంట్లలో డి.హర్షిణి రజతం, టి.సాయి భవ్యశ్రీకి కాంస్య పతకం దక్కించుకున్నారు. క్రీడాకారులను డీవైఎస్ఓ టి.సునీల్కుమార్రెడ్డి, కోచ్ పి.పరిపూర్ణాచారి సోమవారం అభినందించారు. సస్యరక్షణ చర్యలే కీలకంకొణిజర్ల: ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో రైతులు తగిన సస్యరక్షణ చర్యలతో పంటలను కాపాడుకోవాలని జిల్లా వ్యవసాయాఽధికారి ధనసరి పుల్లయ్య సూచించారు. కొణిజర్ల మండలం చిన్నగోపతిలో పత్తి, పెసర పంటలను సోమవారం పరిశీలించిన ఆయన యాజమా న్య పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించారు. వర్షపు నీరు నిలిచి పత్తికి వేరుకుళ్లు తెగులు వచ్చే అవకాశమున్నందున కాపర్ ఆక్సీక్లోరైడ్ లేదా కార్బండిజమ్ను తెగులు సోకిన మొక్కల చుట్టూ పిచికారీ చేయాలన్నారు. అలాగే, ఎకరాకు 25కిలోల యూరియా, 20 కేజీల మ్యూరేట్ ఆఫ్ పొటాష్, రసాయన ఎరువులను పైపాటుగా మొక్కల మొదళ్లకు 7 – 10 సెం.మీ. దూరాన చల్లాలని తెలిపారు. అలాగే, పూత దశలో ఉన్న పెసరలో ఆకు మచ్చ తెలు గు, పల్లాకు తెగులు, ఎల్లో మొజాయిక్ తెగులు సోకుతున్నందున జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఓ డి.బాలాజీ తదితరులు పాల్గొన్నారు. భాగ్యనగర్తండా వాసికి డాక్టరేట్ కారేపల్లి: కారేపల్లి మండలం భాగ్యనగర్తండా గ్రామానికి చెందిన ఇస్లావత్ ఉపేందర్రావుకు తమిళనాడులోని చిదంబ రం అన్నామలై విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ లభించింది. జనగామ జిల్లా కేంద్రంలోని వికాస్ ఫార్మసీ కాలేజీలో ఆయన అసిస్టెంట్ ప్రొఫెసర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రొఫెసర్లు ఎన్.కన్నప్పన్, ఎల్.వెంకటేశ్వర్లు పర్యవేక్షణలో సమర్పించిన పరిశోధనాత్మక గ్రంథానికి డాక్టరేట్ ప్రకటించారు. పీవైఎల్ రాష్ట్ర అధ్యక్షుడిగా రాకేష్ఖమ్మం మామిళ్లగూడెం: ప్రగతిశీల యువజన సంఘం(పీవైఎల్) రాష్ట్ర అధ్యక్షుడిగా ఖమ్మం జిల్లాకు చెందిన తేలే రాకేష్ ఎన్నికయ్యారు. హైదరాబాద్లో జరిగిన రాష్ట్ర స్థాయి సమావేశంలో ఈ ఎన్నిక జరిగింది. 2014నుంచి పీవైఎల్లో కొనసాగుతున్న రాకేష్ నగర కోశాధికారిగా, డివిజన్ కమిటీ సభ్యుడిగా, జిల్లా కార్యదర్శిగా, రాష్ట్ర సహాయ కార్యదర్శిగా, రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా వ్యవహరించారు. ప్రస్తుతం రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికై న ఆయనను పలువురు అభినందించారు. ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పులునేలకొండపల్లి: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సిద్ధమవుతున్న నేపథ్యాన రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లలో వేగం పెంచింది. ఈమేరకు తుది ఓటర్ల జాబితా తయారీపై దృష్టి సారించారు. ఇప్పటికే రెండు మార్లు ఓటర్ల జాబితాలు సిద్ధం చేసి ఎంపీడీఓల లాగిన్ ద్వారా టీపోల్ పోర్టల్లో అప్లోడ్ చేశారు. ఇది జరిగి ఆరు నెలలు గడిచినందున వార్డుల సంఖ్య పెరగడం లేదా తగడం, ఓటర్లలో మార్పులు, చేర్పులు జరగనున్నందున మరోమారు పరిశీలించాలన్న ఎన్నికల సంఘం ఆదేశాలతో గ్రామ కార్యదర్శులు పరిశీలిస్తున్నారు. ఈ ఆరు నెలల కాలంలో మృతి చెందిన వారి పేర్లు తొలగించడంతో పాటు కొత్తగా అర్హత సాధించిన వారి పేర్లు నమోదు చేస్తారు. ఈ కారణంగా జాబితాలో క్రమ సంఖ్య మారనుంది. -
ఆశ్రమ పాఠశాల విద్యార్థిని మృతి
● పరీక్ష రాస్తుండగా ఫిట్స్, ఆస్పత్రికి తరలించగా కన్నుమూత ● న్యాయం చేయాలంటూ బంధువులు, సంఘాల నాయకుల ధర్నాఖమ్మంరూరల్: ఏదులాపురం మున్సిపాలిటీ పరి ధి గొల్లగూడెంలోని ఆశ్రమ పాఠశాల విద్యార్థిని భూక్యా ప్రతిమ(15) సోమవారం మృతి చెందింది. కూసుమంచి మండలం బోడియాతండా గ్రామపంచాయతీ నామతండాకు చెందిన భూక్యా రమేష్ – బూబమ్మ కుమార్తె ప్రతిమ పదో తరగతి చదువుతోంది. మధ్యాహ్నం ఆమె ఎఫ్ఏ–1 సోషల్ పరీక్ష రాస్తుండగా ఫిట్స్ వచ్చాయి. దీంతో ఉపాధ్యాయులు పాఠశాలలోని ఏఎన్ఎంతో ప్రాథమిక చికిత్స చేయించాక ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగానే ప్రతిమ మృతి చెందింది. న్యాయం చేయాలని ధర్నా ప్రతిమ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు మార్చురికీ తరలిస్తుండగా బంధువులు, తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. తన కుమార్తె ఎలా చనిపోయిందో చెప్పాలంటూ ప్రతిమ తండ్రి రమేష్ స్ట్రెచర్కు అడ్డుగా పడుకున్నాడు. అంతలోనే విద్యార్థి సంఘాల నాయకులు పెద్దసంఖ్యలో చేరుకుని ఆస్పత్రికి తరలించడంలో ఆలస్యంతోనే విద్యార్థిని మృతి చెందిందంటూ ఆందోళన చేపట్టారు. ఆమె కుటుంబానికి న్యాయం చేసే వరకు కదిలేది లేదని బైఠాయించగా పోలీసులు వారికి పక్కకు తొలగించా రు. అనంతరం అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి, ఖమ్మం ఆర్డీఓ నర్సింహారావు అక్కడికి చేరుకుని బంధువులు, విద్యార్థి సంఘాల నాయకులతో చర్చించారు. ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ అనంతరం నివేదికను ఉన్నతాధికారులకు పంపించనున్నట్లు అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి బంధువులకు హామీ ఇచ్చారు. పాఠశాలలో డీడీ విచారణ విద్యార్థి ప్రతిమ మృతి నేపథ్యాన గిరిజన సంక్షేమ శాఖ డీడీ విజయలక్ష్మి ఆశ్రమ పాఠశాలలో విచారణ చేపట్టారు. ఉదయం నుంచి విద్యార్థిని ఎలా ఉందో ఆరా తీసిన ఆమె అక్కడి నుంచి ఆస్పత్రికి వచ్చి బంధువులతో మాట్లాడారు. అయితే, ఆస్పత్రిలో ప్రతిమ ను చేర్పించిన ఉపాధ్యాయులు అక్కడ లేకపోవడంపై బంధువులు, విద్యార్థి సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ఇందిరమ్మ ఇళ్ల సర్వే మరోసారి...
నేలకొండపల్లి: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల వివరాలను ఆన్లైన్ నమోదు చేసేందుకు మరోమారు సర్వే చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని లబ్ధిదారుల వివరాల నమోదుకు కేంద్రప్రభుత్వం యాప్ను రూపొందించింది. లబ్ధిదారులకు ఇస్తున్న రూ.5లక్షల్లో కేంద్రం వాటా కూడా ఉండగా.. యాప్లో నమోదు చేస్తేనే నిధులు విడుదలవుతాయని స్పష్టం చేసినట్లు సమాచారం. దీంతో జిల్లావ్యాప్తంగా పంచాయతీ కార్యదర్శులు సర్వే మొదలుపెట్టారు. గ్రామీణ ప్రాంతాల్లోని 13వేల ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల వివరాలను 40ప్రశ్నల ద్వారా సేకరించి పీఎంఏజీవై యాప్లో పొందుపరుస్తున్నారు. ఒక్కో ఇంటి వద్ద వివరాల సేకరణకు దాదాపు అర గంటకు పైగా సమయం పడుతుండగా.. ఇంటి వద్ద ఫొటో తీసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అయితే, సోమవారంతో సర్వే ముగించాలని ఆదేశించగా సాంకేతిక కారణాలతో సాధ్యం కాలేదని సమాచారం. ఈనెల 31వరకు సమయం ఇస్తేనే సర్వే పూర్తవుతుందని కార్యదర్శులు చెబుతున్నప్పటికీ అప్పటివరకు యాప్ లాగిన్ ఉంటుందా, లేదా అన్నది ప్రశ్నార్ధకంగా మారింది. అయితే, జిల్లాలో సర్వే దాదాపు పూర్తి కావొచ్చిందని గృహ నిర్మాణ శాఖ ఈఈ శ్రీనివాసరావు తెలిపారు. ఈసారి కేంద్ర ప్రభుత్వం యాప్లో నమోదు -
ఖమ్మంలో చోరీ చేస్తే దొరికిపోతామని..
సూర్యాపేటటౌన్: సూర్యాపేటలోని సాయి సంతోషి జ్యువెలరీ షాపులో ఈనెల 21న జరిగిన బంగారం దోపిడీ కేసులో ఓ మహిళను పోలీసులు అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడు గతంలో ఖమ్మంలో చోరీ చేసి పట్టుబడ్డాడు. దీంతో ఖమ్మంలో చోరీ చేస్తే దొరికిపోతామని గ్రహించి సూర్యాపేటలో దొంగతనానికి స్కెచ్ వేశాడు. చోరీ కేసుని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జిల్లా ఎస్పీ నరసింహ 5 ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు. చోరీ చేసింది నేపాల్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్కు చెందిన ఐదుగురు సభ్యుల ముఠాగా గుర్తించారు. ప్రత్యక్షంగా ఐదుగురు నిందితు లు దొంగతనంలో పాల్గొనగా వారికి సహకరించింది మరో ఇద్దరని గుర్తించారు. దొంగతనంలో సహకరించిన యశోదను అరెస్ట్ చేశా రు. ఆదివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ వివరాలు వెల్లడించారు. ఆదివారం సూర్యాపేట హైటెక్ బస్టాండ్ సమీపంలో పోలీసులు ఫింగర్ ప్రింట్స్ తనిఖీలు చేస్తున్న క్రమంలో అనుమానాస్పదంగా కనిపించిన ఖమ్మంలోని నాయుడుపేటకు చెందిన మేకల యశోద బ్యాగును పరిశీలించగా శ్రీసాయి సంతోషి జ్యువెలరీ షాపులో చోరీకి గురైన కొన్ని ఆభరణాలు లభ్యమయ్యాయి. ఖమ్మం పట్టణంలో నేపాల్కు చెందిన ఏ–6 నిందితుడైన అమర్బట్ గూర్ఖాగా పనిచేస్తుండేవాడు. ఈ కేసులో ఏ–1 నిందితుడు, నేపాల్కు చెందిన ప్రకాష్అనిల్కుమార్.. ఖమ్మంలో ఉంటున్న అమర్బట్ వద్దకు వచ్చి గూర్ఖాగా పనిచేస్తూ యశోదతో సంబంధం ఏర్పరుచుకున్నాడు. ఖమ్మంలో చోరీ చేస్తే దొరికిపోతామని, సూ ర్యాపేట పట్టణాన్ని ఎంచుకున్నారు. ప్రకాష్ అనిల్కుమార్కు తెలిసిన మరో వ్యక్తి నేపాల్కు చెందిన కడాక్ సింగ్తోపాటు, జార్ఖండ్, బిహార్, ఉత్తరప్రదేశ్కు చెందిన మరో ముగ్గురిని పిలిపించుకుని చోరీ చేసేందుకు ప్రణాళిక రూపొందించారు. మేకల యశోదతో కలిసి సూర్యాపేట ఎంజీ రోడ్డులోని బంగారం షాపు వెనుక ప్రాంతంలో యజమాని లేని ఇంట్లో ఒక రూంను అద్దెకు తీసుకుని, రెక్కీ చేసి, శ్రీసాయి సంతోషి జ్యువెలరీలో షాపులో చోరీ చేశారు. తర్వాత బంగారం ఇక్కడ అమ్మితే అనుమానం వస్తుందని నేపాల్కు తీసుకెళ్లి అమ్ముదామని ఐదుగురు నిందితులు నిర్ణయించారు. నిందితురాలు ఇచి్చన సమాచారం మేరకు ప్రత్యక్ష్యంగా చోరీకి పాల్పడిన నేపాల్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన మొత్తం ఐదుగురిని గుర్తించామని ఎస్పీ తెలిపారు. ఏ–1 నిందితుడైన ప్రకాష్ అనిల్కుమార్పై గతంలో ఖమ్మం జిల్లాలో మూడు దొంగతనం కేసులు ఉన్నాయని, మిగిలిన నిందితులపై ఉన్న పాత కేసులు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. నిందితురాలి నుంచి 14 తులాల బంగారాన్ని స్వా«దీనం చేసుకున్నామని ఎస్పీ పేర్కొన్నారు. -
ప్రశాంతంగా సర్వేయర్ల పరీక్షలు
ఖమ్మంసహకారనగర్: భూ భారతి చట్టం అమల్లో భాగంగా గ్రామాల్లో భూ సమస్యల పరిష్కారానికి లైసెన్స్డ్ సర్వేయర్లను నియమించే క్రమంలో వారికి గత 50 రోజులుగా అధికారులు శిక్షణ ఇచ్చారు. ఈ క్రమంలో నగరంలోని ఎస్ఆర్అండ్బీజీఎన్ఆర్ డిగ్రీ కళాశాలలో ఆదివారం నిర్వహించిన పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. ఉదయం థియరీ, మధ్యాహ్నం ప్లాటింగ్ పరీక్షలకు 587 మందికి గాను 442 మంది హాజరు కాగా 75.30 శాతం నమోదైంది. కాగా పరీక్షలను సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడీ శ్రీనివాసులు, సీపీఓ శ్రీనివాస్ పర్యవేక్షించారు. బాలబాలికలకు జిల్లాస్థాయి అథ్లెటిక్స్ పోటీలు కల్లూరు: కల్లూరులోని మినీస్టేడియంలో ఖమ్మం జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం అండర్–8, 10, 12, 14, 16 బాలబాలికలకు అథ్లెటిక్స్లో విడివిడిగా క్రీడా పోటీలు నిర్వహించారు. 60 మీటర్ల పరుగు, స్టాండింగ్ బ్రాడ్ జంప్, ఐదు మీటర్ల అప్రోచ్ లాంగ్ జంప్, కిడ్స్ జావలెన్ త్రో పోటీలు నిర్వహించారు. ప్రథమ, ద్వితీయస్థానాలు సాధించిన వారు ఆగస్టు 7వ తేదీన జనగామలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికవుతారని నిర్వాహకులు పేర్కొన్నారు. క్రీడాకారులు, తల్లిదండ్రులకు భోజన వసతి కల్లూరు లయన్స్క్లబ్ బాధ్యులు చలువాది నగేశ్, ఇందోజు రమేశ్, కిన్నెర ఆనంద్ కల్పించారు. కార్యక్రమంలో ఎంఈఓ పత్తిపాటి నివేదిత, అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి షఫిక్అహ్మద్, బి.రవికుమార్, ప్రియాంక, స్టేడియం ఇన్చార్జ్ పసుపులేటి వీరరాఘవయ్య, కోచ్లు కండ్రాతి రాధాకృష్ణ, సీహెచ్ త్రివేణి, గౌతమ్రెడ్డి, గోపి, సతీశ్కుమార్, ఫిజికల్ ట్రైనర్ ఎన్.నాగబాబు, 100 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. సమన్వయంతో పని చేయండి.. డిప్యూటీ డీఎంహెచ్ఓ టి.సీతారాం సత్తుపల్లిరూరల్: వ్యాధులు ప్రబలకుండా అన్ని ప్రభుత్వ శాఖలతో సమన్వయం చేసుకుంటూ నియంత్రణ చర్యలు చేపట్టాలని సత్తుపల్లి డిప్యూటీ డీఎంహెచ్ఓ టి.సీతారాం అన్నారు. ఆదివారం గంగారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. రికార్డులు, మందుల స్టాక్ను పరిశీలించి, మాట్లాడారు. గ్రామాల్లో ముమ్మరంగా సర్వే నిర్వహించాలని, ప్రతి జ్వరం కేసును ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఆర్.అవినాష్, స్పందన, సూపర్వైజర్ శారారాణి, ఫార్మాసిస్ట్ సత్యనారాయణ, సిబ్బంది పాల్గొన్నారు. పారిశుద్ధ్య పనులు పకడ్బందీగా నిర్వహించాలిబోనకల్: గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ రామారావు, డీఎల్పీఓ రాంబాబు పేర్కొన్నారు. ఆదివారం మండలంలోని ముష్టికుంట్ల, బోనకల్, తూటికుంట్ల గ్రామాల్లో స్పెషల్ డ్రైవ్లో భాగంగా పారిశుద్ధ్య పనులు, ఫీవర్ సర్వేను పరిశీలించారు. ముష్టికుంట్లలోని పల్లె దవాఖానలో రికార్డులు, అనంతరం పారిశుద్ధ్య పనులు, బోనకల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని ఓపీ, స్టాక్ రిజిస్టర్లు, తూటికుంట్లలో ఇంటింటి ఫీవర్ సర్వేను పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ రమాదేవి, ఎంపీఓ శాస్త్రి, వైద్యాధికారి స్రవంతి, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు, పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
ఉండలేక.. కట్టలేక !
పక్కా ఇళ్ల నిర్మాణానికి అడ్డంకులు ● ఆంక్షలతో అడ్డుపడుతున్న అటవీ అధికారులు ● గుడిసెల్లో ఉండలేక తుమ్మలనగర్ గిరిజనుల అవస్థలు ● ఇందిరమ్మ ఇళ్లు వచ్చినా అడ్డుకుంటున్నారని ఆగ్రహం సత్తుపల్లి: ముప్పై ఏళ్లుగా గుడిసెల్లోనే జీవితం.. తాగునీళ్లు లేవు.. రోడ్లులేవు.. దోమలు, ఈగలతోనే సావాసం చేయాల్సిన దుస్థితి.. కరెంట్ కోసం తిరి గితే సత్తెమ్మతల్లి గుడి నుంచి ఒక లైను వేశారు.. ఈ కష్టాలన్నీ ఓ కొలిక్కి రాగా, గుడిసెల్లో ఉండలేని పరి స్థితి ఎదుర్కొంటున్న తమను అటవీ అధికారులు మరింత ఇబ్బంది పెడుతున్నారని సత్తుపల్లి మండలం చెరుకుపల్లి పంచాయతీ తుమ్మలనగర్ గిరిజనులు వాపోతున్నారు. ఇక్కడ సుమారు 50 గిరిజన కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. గతంలో తుమ్మలనగర్ వెనుకాల మూడు కి.మీ. దూరంలో అటవీప్రాంతంలో ఉండేది. రవాణా, విద్యుత్, రోడ్డు, మంచినీటి సౌకర్యాలు లేకపోవటంతో చెరుకుపల్లి పంచాయతీ పరిధిలోని సర్వే నంబర్ 22లో 11 ఎకరాలలో గుడిసెలు వేసుకొని నివాసం ఉంటున్నారు. ఇవి కూడా వర్షానికి తడుస్తున్నాయి.. కప్పుకుందామన్నా ఆంక్షలతో అడ్డుకుంటున్నారని గిరిజనులు వాపోతున్నారు. ఆర్ఓఎఫ్ఆర్ పట్టా ఉన్నా.. ఎన్నో ఆందోళనలు, విజ్ఞప్తులు, పోరాటాల ఫలితంగా 48 కుటుంబాలకు ప్రభుత్వం 2022లో ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలను అందించింది. గుడిసెలో ఉంటున్న ప్రదేశాన్ని లెక్కకట్టి ఒక్కోక్కరికి రెండు, మూడు, నాలుగు కుంటలు చొప్పున పట్టాలను రెవెన్యూ, అటవీశాఖ అందించింది. అయితే ఇళ్లను బాగు చేయించటం కానీ.. నూతనంగా నిర్మించటం కానీ.. రేకులు వేయించుకోవటం కానీ చేసుకోవటం కుదరదని అటవీశాఖ మెలిక పెడుతుంది. ఆర్ఓఎఫ్ఆర్ పట్టా ఉద్దేశం సాగు చేసుకోవాలని ఉందని.. కుంట, రెండు కుంటల్లో సాగు ఎలా చేస్తారంటూ గిరిజనులు ప్రశ్నిస్తున్నారు. ఇళ్లల్లో ఉన్నట్టు రికార్డుల్లో నమోదు చేసుకొని ఇప్పుడు ఇళ్లు బాగు చేసుకోవద్దంటూ ఎలా అంటూ నిలదీస్తున్నారు. అదీగాక 150 ఎకరాల పోడు భూములకు పట్టాలు ఇవ్వకుండా అడ్డుకుంటున్నారు. ●నిర్మాణాలు అడ్డగింత చెరుకుపల్లి పంచాయతీ పరిధిలోని తుమ్మలనగర్కు చెందిన తాటి వీరభద్రం, ఊకే రత్తమ్మలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు అయ్యాయి. తాటి వీరభద్రం ముగ్గు వేస్తుండగానే అటవీశాఖ సిబ్బంది నిలిపివేసింది. ఊకే రత్తమ్మ పునాదుల వరకు నిర్మించిన పనులను నిలిపివేశారు. తుమ్మలనగర్లో నివాసం ఉంటున్న 48 కుటుంబాలలో ఒక్కొక్కరి గుడిసెలో ఇద్దరేసి, ముగ్గురేసి కుటుంబాలు ఉండాల్సిన పరిస్థితి ఉంది. ప్రభుత్వం ఇచ్చిన భూమిలో ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం ఎలా అడ్డుకుంటారంటూ గిరిజనులు వాపోతున్నారు. అటవీ, రెవెన్యూశాఖలు సంయుక్తంగా జాయింట్ సర్వే చేస్తే చెరుకుపల్లి సర్వే నంబరు 22లోని భూమి రెవెన్యూ భూమిగా తేలుతుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.ముగ్గు వేయగానే నిలిపివేశారు.. ఇందిరమ్మ ఇళ్లు వచ్చిందని సంబరపడ్డాం. ఇంటి నిర్మాణం కోసం ముగ్గు వేశాం. అటవీశాఖ సిబ్బంది వచ్చి నిలిపివేశారు. ఇల్లు కట్టుకోవటం కుదరదని చెప్పి వెళ్లారు. మా గుడిసెలో ఇప్పటికే మూడు కుటుంబాలు ఉంటున్నాం. – తాటి సారిక, తుమ్మలనగర్అది అటవీశాఖ భూమే.. చెరుకుపల్లి పంచాయతీలోని తుమ్మలనగర్ అటవీశాఖకు చెందిన భూమి. దీంట్లో ఎలాంటి పక్కా నిర్మాణాలకు అనుమతులు లేవు. అటవీ భూములు అన్యాక్రాంతం కాకుండా చట్టాలు ఉన్నాయి. ఆర్ఓఎఫ్ఆర్ పట్టాల ఉద్దేశం ఇంటి నిర్మాణాలు చేపట్టకూడదు. – వాడపల్లి మంజుల, ఎఫ్డీఓ, సత్తుపల్లి -
మెరుగైన సేవలతో బ్యాంకు అభివృద్ధి
ఖమ్మంగాంధీచౌక్: ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించటం ద్వారా బ్యాంకు అభివృద్ధి పథంలో నిలుస్తుందని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు అన్నారు. భద్రాద్రి అర్బన్ కో–ఆపరేటివ్ బ్యాంక్ 28వ వార్షిక సర్వసభ్య సమావేశం ఆదివారం స్థానిక వాసవి కల్యాణ మండపంలో బ్యాంకు చైర్మన్ చెరుకూరి కృష్ణమూర్తి అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాజేశ్వరరావు తొలుత వాసవీ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, జ్యోతి ప్రజల్వనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. నూతన సాంకేతిక విధానాలను పాటిస్తూ ఖాతాదారులకు ప్రయోజనకరమైన సేవలు అందిస్తే బ్యాంకు మరింతగా విస్తరిస్తుందని తెలిపారు. జిల్లా సహకార అధికారి గంగాధర్ మాట్లాడుతూ.. సమాజాభివృద్ధిలో సహకార వ్యవస్థ కీలకమని, అన్ని వర్గాల ప్రజలకు సహకార రంగాలు అండగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా బ్యాంకు చైర్మన్ కృష్ణమూర్తి 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన నివేదికను వినిపించారు. అంతేగాక 2025–26 ఆర్థిక సంవత్సర బడ్జెట్ను ప్రవేశపెట్టి ఆమోదం పొందారు. గడిచిన ఆర్థిక సంవత్సరం నాటికి బ్యాంకు రూ.598.96 కోట్ల డిపాజిట్లను కలిగి ఉందని, రూ.365.99 కోట్లను పలు రూపాల్లో రుణాలుగా ఇచ్చామని, ఈ ఏడాది నూతనంగా 6 శాఖలను ప్రారంభించి మొత్తం 23 శాఖలతో వినియోగదారులకు సేవలందిస్తున్నామని చెప్పారు. బ్యాంకు మల్టీ స్టేట్ కో–ఆపరేటివ్ బ్యాంకుగా అనుమతులు పొందిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో బ్యాంక్ వైస్ చైర్మన్లు సన్నె ఉదయ్ప్రతాప్, వేములపల్లి వెంకటేశ్వరరావు, డైరెక్టర్లు దేవత రాజారావు, బలుసు సాంబమూర్తి, మద్ది పిచ్చయ్య, రాజ్ పురోహిత్ చైన్సింగ్, వైవీఎస్ రావు, రంగానాగా శ్రీనివాసరావు, దారా జీవన్రాం, కర్లపూడి నర్మద, కిలవాయి జయప్రద, బోర్డ్ మేనేజ్మెంట్ సభ్యులు సీజీ శాస్త్రి, పైడిమర్రి సత్యనారాయణ, ప్రొఫెసర్ పసుమర్తి మధుసూదన్రావు, బ్యాంకు అన్ని శాఖల మేనేజర్లు, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. భద్రాద్రి బ్యాంక్ 28వ వార్షికోత్సవంలో హైకోర్టు న్యాయమూర్తి రాజేశ్వరరావు -
డిజిటల్
పల్లె ముంగిటగ్రామాల్లో డిజిటల్ విప్లవం.. గ్రామీణ ప్రాంత ప్రజలు పట్టణాలు, నగరాలకు వెళ్లే అవసరం లేకుండా అన్ని సేవలు అందుబాటులోకి రానున్నాయి. డీఐసీఎస్సీ ద్వారా గ్రామాల్లో సీఎస్సీ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం రూ.35 వేలు మంజూరు చేస్తుంది. సెర్ప్, సీఎస్సీ–ఎస్పీవీ సంస్థలు జిల్లాను మండలాల వారీ క్లస్టర్లుగా విభజించి, ప్రతీ గ్రామానికి కనీసం ఒక మోడల్ సీఎస్సీ ఉండేలా ప్రణాళిక రూపొందించాయి. ఈ కేంద్రాల ద్వారా ప్రభుత్వ సర్టిఫికెట్లు, బ్యాంకింగ్ సేవలు, ఆధార్ అప్డేట్, బిల్లుల చెల్లింపు, మీ సేవ ద్వారా అందే సేవలు, నగదు రహిత లావాదేవీలు చేరువవుతాయి. అయితే, ఈ కేంద్రంలో చెల్లింపులన్నీ నగదు రహితంగా జరిగేలా చూస్తారు. దశల వారీగా శిక్షణ సెర్ప్, సీఎస్సీ–ఎస్పీవీ సంయుక్తంగా 153 మంది మహిళా సంఘాల సభ్యులకు శిక్షణ ఇవ్వాల్సి ఉండగా, తొలి దశలో 70 మందికి ఆర్ఎస్ఈటీఐ (రూరల్ సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్) ద్వారా ఏడు రోజుల శిక్షణ పూర్తి చేశారు. ఆపై ప్రోత్సాహకంగా మొదటి ఆరు నెలలు రూ.5వేల చొప్పున గౌరవ వేతనం అందిస్తారు. తద్వారా వారిలో నమ్మకం పెంచడంతో పాటు స్థిరమైన ఉపాధి దిశగా ప్రోత్సహించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇక రెండో దశలో మిగిలిన మహిళలకు టాస్క్(తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్) ఆధ్వర్యాన ఖమ్మంలోని ఐటీ హబ్లో ప్రత్యేకంగా ఈడీపీ/డిజిటల్ స్కిల్ శిక్షణ ఇచ్చారు. వీరికి ఉచితంగా బయోమెట్రిక్ పరికరాలు అందించగా, అక్టోబర్ 1 నుంచి ఎంపిక చేసిన గ్రామాల్లో సీఎస్సీల ద్వారా డిజిటల్ లావాదేవీలు, ఇతర సేవలు మొదలుకానున్నాయి. ఆధార్ సేవలకు అనుమతి వస్తే.. మోడల్ సీఎస్సీల ద్వారా గ్రామీణ ప్రజలకు ప్రభుత్వ సేవలు, బ్యాంకింగ్ లావాదేవీలే కాక ఆధార్ సేవలు కూడా అందించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందుకోసం కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖతో సమన్వయం చేసి, ఆధార్ అప్డేట్ సేవలకు అవసరమైన యూసీఎల్(అప్డేట్ క్లెయింట్ లైట్) అనుమతులకు అధికారులు యత్నిస్తున్నారు. ఇవి కూడా మంజూరైతే సీఎస్సీ కేంద్రాల ద్వారా ఆధార్ కార్డుల్లో మొబైల్ నంబర్ మార్పు, చిరునామా సవరణ సేవలు అందించగలుగుతారు.ఎస్హెచ్జీల ద్వారా నగదు రహిత లావాదేవీలు దేశవ్యాప్తంగా పది జిల్లాలు.. రాష్ట్రంలో ఖమ్మానికి స్థానం జిల్లాలో 153 మంది మహిళా సంఘాల సభ్యులకు శిక్షణ ఆపై గ్రామాల్లో మోడల్ సీఎస్సీల ఏర్పాటుకు ప్రణాళికదేశానికి ఆదర్శరంగా నిలిచేలా.. దేశవ్యాప్తంగా డీఐసీఎస్సీ ప్రాజెక్టులో పైలట్గా ఎంపిక చేసిన జిల్లాల్లో ఖమ్మం ఉంది. ఎస్హెచ్జీలతో సీఎస్సీలు నిర్వహించేలా శిక్షణ అందించాం. ఇందుకు సెర్ప్తో ఒప్పందం కుదుర్చుకున్నాం. తద్వారా సభ్యులకు ఉపాధి, గ్రామీణులకు డిజిటల్ సేవలు వేగంగా అందిస్తూ జిల్లాను దేశంలోనే ఆదర్శంగా నిలుపుతాం. – డాక్టర్ విగ్నేష్ సోర్ణమోహన్, స్టేట్ హెడ్, సీఎస్సీసేవలు చేరువ అవుతాయి.. బ్యాంకింగ్, బిల్లుల చెల్లింపుల వంటి సేవలు గ్రామీణులకు చేరువవుతాయి. దీంతో పట్టణాలకు వెళ్లే ఇబ్బంది ఉండదు. శిక్షణలో భాగంగా కేంద్రాల నిర్వహణపై అవగాహన కల్పించారు. ఇది మా జీవితాలను మార్చుకునేలా ఉపయోగపడుతుంది. సెర్ప్ నుంచి రుణం మంజూరు కాగానే సేవలను మరింతగా విస్తరిస్తాం. – గుగులోతు స్వప్న, ఎస్హెచ్జీ సభ్యురాలు, చింతగుర్తి, రఘనాథపాలెం మండలం -
‘రైల్ వన్’ లాభాలెన్నో..
● ప్రయాణికులకు అందుబాటులో రైల్ వన్ యాప్ ● జూలై 1 నుంచి సేవలు అమల్లోకి.. వైరా: రైలు ప్రయాణమంటే ఒక ప్రహసనమే.. ప్రస్తుతం రైల్వే శాఖ ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కసరత్తు చేస్తోంది. ఈ నెల 1వ తేదీ నుంచి రైల్ వన్ అనే యాప్ ను రైల్వే శాఖ ప్రవేశపెట్టింది. ప్రయాణికులకు కావాల్సిన సమాచారం అంతా ఒకే యాప్లో లభిస్తుందని ఇండియన్ రైల్వే శాఖ చెబుతోంది. ఈ యాప్ ద్వారా ప్రయాణికులకు అన్ని సేవలు అందుబాటులోకి రానున్నాయి. ●టికెట్కు ఇబ్బంది లేదు.. ఈ యాప్ నుంచి రిజర్వేషన్ చేసుకోవచ్చు. అత్యవసరంగా అన్ రిజర్వు టికెట్ కూడా వెంటనే కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. ప్లాట్ ఫామ్ టికెట్ సైతం పొందవచ్చు. ●రైళ్ల కోసం.. మనం వెళ్లాల్సిన ప్రాంతానికి ఏ రైళ్లు అందుబాటులో ఉన్నాయని వెతికేందుకు సెర్చ్ ట్రెయిన్స్ బటన్ ఉంటుంది. ఏ ప్లాట్ ఫామ్పై రైలు ఆగుతుంది? కోచ్ పొజిషన్ ఎక్కడ ఉందో కూడా తెలుసుకోవచ్చు. రైలు ఎక్కడ ఉంది? ఎప్పుడు వస్తుందని ట్రాక్ యువర్ ట్రెయిన్ ద్వారా తెలుసుకోవచ్చు. ●రిజర్వేషన్ ఇలా.. ఇందులో పీఎన్ఆర్ స్థితిని తెలుసుకోవడానికి కూడా అవకాశం కల్పించారు. ముందస్తు రిజర్వేషన్ టికెట్, సీటు కన్ఫర్మేషన్ స్టేటస్ తెలుసుకోవచ్చు. ట్రెయిన్ క్యాన్సిల్, రిజర్వేషన్ క్యానిల్ వంటి అంశాలను కూడా ఇందులో తెలుసుకోవచ్చు. ●సీటు వద్దకే ఆహారం.. మనకు ఇష్టమైన ఆహారాన్ని ఆర్డర్ చేసుకునేలా అవకాశం ఉంది. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం ద్వారా వివిధ రైల్వే స్టేషన్లకు చేరుకునే ముందే మనకు నచ్చిన ఆహారాన్ని ఆర్డర్ చేసుకుంటే మీరు ప్రయాణిస్తున్న ట్రెయిన్లో మీసీటు వద్దకే తెచ్చి ఇచ్చే సౌకర్యం ఉంది. సూచనలు, ఫిర్యాదులు.. రైల్వే శాఖకు ఏమైనా సూచనలు ఇవ్వాలి అనుకున్నా.. ట్రెయిన్లో ప్రయాణించే సమయంలో సమస్యలు తలెత్తినా ఫిర్యాదు చేయడానికి ఇదే యాప్లో రైల్ మదత్ విభాగం అందుబాటులో ఉంది. ఫిర్యాదు చేసిన కొద్ది సమయంలోనే రైల్వేశాఖ సిబ్బంది సమస్యకు పరిష్కారం చూపుతారు. డౌన్లోడ్ ఇలా.. మొబైల్ ఉపయోగించే వారికి ఎంతో ఉపయోకరంగా ఉండే ఈ యాప్ గూగుల్ ప్లేస్టోర్ నుంచి యాపిల్, ఐఓఎస్, యాపిల్ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. తర్వాత సెల్ నంబర్ లేదా మెయిల్ ఐడీ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకొని పాస్వర్డ్ పెట్టుకోవడం ద్వారా ఉపయోగంలోకి వస్తుంది. -
రామయ్యకు సువర్ణ పుష్పార్చన
భద్రాచలం: శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థాన అంతరాలయంలోని మూలమూర్తులకు ఆదివారం అభిషేకం, సువర్ణ పుష్పార్చన జరిపారు. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి స్వామివారిని పల్లకీ సేవగా చిత్రకూట మండపానికి తీసుకొచ్చారు. ఆ తర్వాత అర్చకులు స్వామివార్లకు విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు. సెలవురోజు కావడంతో పూజాది కార్యక్రమాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. -
ఖమ్మంలో చోరీ చేస్తే దొరికిపోతామని..
● సూర్యాపేటను ఎంచుకున్న దుండగులు ● బంగారం దోపిడీ కేసులో మహిళ అరెస్టుసూర్యాపేటటౌన్: సూర్యాపేటలోని సాయి సంతోషి జ్యువెలరీ షాపులో ఈనెల 21న జరిగిన బంగారం దోపిడీ కేసులో ఓ మహిళను పోలీసులు అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడు గతంలో ఖమ్మంలో చోరీ చేసి పట్టుబడ్డాడు. దీంతో ఖమ్మంలో చోరీ చేస్తే దొరికిపోతామని గ్రహించి సూర్యాపేటలో దొంగతనానికి స్కెచ్ వేశాడు. చోరీ కేసుని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జిల్లా ఎస్పీ నరసింహ 5 ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు. చోరీ చేసింది నేపాల్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్కు చెందిన ఐదుగురు సభ్యుల ముఠాగా గుర్తించారు. ప్రత్యక్షంగా ఐదుగురు నిందితు లు దొంగతనంలో పాల్గొనగా వారికి సహకరించింది మరో ఇద్దరని గుర్తించారు. దొంగతనంలో సహకరించిన యశోదను అరెస్ట్ చేశా రు. ఆదివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ వివరాలు వెల్లడించారు. ఆదివారం సూర్యాపేట హైటెక్ బస్టాండ్ సమీపంలో పోలీసులు ఫింగర్ ప్రింట్స్ తనిఖీలు చేస్తున్న క్రమంలో అనుమానాస్పదంగా కనిపించిన ఖమ్మంలోని నాయుడుపేటకు చెందిన మేకల యశోద బ్యాగును పరిశీలించగా శ్రీసాయి సంతోషి జ్యువెలరీ షాపులో చోరీకి గురైన కొన్ని ఆభరణాలు లభ్యమయ్యాయి. ఖమ్మం పట్టణంలో నేపాల్కు చెందిన ఏ–6 నిందితుడైన అమర్బట్ గూర్ఖాగా పనిచేస్తుండేవాడు. ఈ కేసులో ఏ–1 నిందితుడు, నేపాల్కు చెందిన ప్రకాష్అనిల్కుమార్.. ఖమ్మంలో ఉంటున్న అమర్బట్ వద్దకు వచ్చి గూర్ఖాగా పనిచేస్తూ యశోదతో సంబంధం ఏర్పరుచుకున్నాడు. ఖమ్మంలో చోరీ చేస్తే దొరికిపోతామని, సూ ర్యాపేట పట్టణాన్ని ఎంచుకున్నారు. ప్రకాష్ అనిల్కుమార్కు తెలిసిన మరో వ్యక్తి నేపాల్కు చెందిన కడాక్ సింగ్తోపాటు, జార్ఖండ్, బిహార్, ఉత్తరప్రదేశ్కు చెందిన మరో ముగ్గురిని పిలిపించుకుని చోరీ చేసేందుకు ప్రణాళిక రూపొందించారు. మేకల యశోదతో కలిసి సూర్యాపేట ఎంజీ రోడ్డులోని బంగారం షాపు వెనుక ప్రాంతంలో యజమాని లేని ఇంట్లో ఒక రూంను అద్దెకు తీసుకుని, రెక్కీ చేసి, శ్రీసాయి సంతోషి జ్యువెలరీలో షాపులో చోరీ చేశారు. తర్వాత బంగారం ఇక్కడ అమ్మితే అనుమానం వస్తుందని నేపాల్కు తీసుకెళ్లి అమ్ముదామని ఐదుగురు నిందితులు నిర్ణయించారు. నిందితురాలు ఇచ్చిన సమాచారం మేరకు ప్రత్యక్ష్యంగా చోరీకి పాల్పడిన నేపాల్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన మొత్తం ఐదుగురిని గుర్తించామని ఎస్పీ తెలిపారు. ఏ–1 నిందితుడైన ప్రకాష్ అనిల్కుమార్పై గతంలో ఖమ్మం జిల్లాలో మూడు దొంగతనం కేసులు ఉన్నాయని, మిగిలిన నిందితులపై ఉన్న పాత కేసులు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. నిందితురాలి నుంచి 14 తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ పేర్కొన్నారు. -
పెద్ద రాళ్లను తొలగించాలి
రాకాసితండా వాసుల వేడుకోలుతిరుమలాయపాలెం: గతేడాది భారీ వర్షాలు, వరదలతో సర్వం కోల్పోయిన రాకాసితండా వాసులు ఆకేరు ప్రవాహం పెరుగుతుంటే ఆందోళన చెందుతున్నారు. గత సంవత్సరం ఆకేరుపై సీతారామ నీళ్లు వెళ్లేందుకు ఏర్పాటు చేసిన అక్వాటెక్ట్ వద్ద కాంట్రాక్టు నిర్మాణ సంస్థ తమ పొక్లెయిన్లు, టిప్పర్లు వెళ్లేందుకు పెద్దపెద్ద బండరాళ్లను వేసి అలాగే వదిలివేశారు. దీంతో గతేడాది ఆకేరు ప్రవాహం పెరిగి నీళ్లు వెళ్లే మార్గం లేక రాకాసితండాను చుట్టుముట్టి తీవ్ర నష్టం జరిగింది. ఆ నాటి నుంచి ఇప్పటి వరకు అక్వాటెక్ట్కి అడ్డుగా ఉన్న బండరాళ్లు తొలగించకపోవడంతో గ్రామస్తులు ఇటీవల మండల ఎస్ఐ జగదీశ్ దృష్టికి తీసుకెళ్లి, చూపించారు. ఆకేరుకు భారీగా వరద వస్తే రాకాసితండాకు ఇబ్బందులు తప్పవని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి అక్వాటెక్ట్కి అడ్డుగా ఉన్న బండరాళ్లను తొలగించాలని కోరుతున్నారు. -
బీజేపీ వైఖరితో సెక్యులరిజానికి ముప్పు
నేలకొండపల్లి : కేంద్రంలో బీజేపీ అనుసరిస్తున్న మతోన్మాద విధానాలతో సెక్కులరిజానికి పెను ముప్పు పొంచి ఉందని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం విమర్శించారు. మండలంలోని మోటాపురంలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. న్యాయ వ్యవస్థను సైతం తప్పుదారి పట్టిస్తోందని ఆరోపించారు. నిత్యం మత ఘర్షణలు సృష్టిస్తూ ఓట్ల రాజకీయం చేస్తోందని, ప్రజలు రాజకీయంగా చైతన్యవంతులు కాకుండా కుట్ర పన్నుతోందన్నారు. దేశంలో ఏనాడూ బీసీల సంక్షేమాన్ని పట్టించుకోని కాంగ్రెస్.. బీసీ రిజర్వేషన్ల పేరుతో ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తోందని చెప్పారు. రాష్ట్రంలో ప్రజా సమస్యలను విస్మరించిందని, అమలు కానీ హమీ లతో స్థానిక సంస్థల ఎన్నికల పేరుతో హడావిడి చేస్తోందని విమర్శించారు. సమావేశంలో పోతినేని సుదర్శన్రావు, నున్నా నాగేశ్వరరావు, నాయకులు బండి రమేష్, కేవీ.రెడ్డి, రాజశేఖర్, సుదర్శన్రెడ్డి, కొమ్ము శ్రీను, రచ్చా నరసింహారావు, పగిడికత్తుల నాగేశ్వరరావు, బెల్లం లక్ష్మి, ఏటుకూరి రామారావు, భూక్యా కృష్ణ, ఇంటూరి ఆశోక్ పాల్గొన్నారు.సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని -
‘ఆర్యవైశ్యులకు అండగా కాంగ్రెస్’
వైరా: స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి ఆర్యవైశ్యులకు అన్ని రకాలుగా అండగా ఉంటున్నది కాంగ్రెస్ పార్టీ ఒక్కటేనని.. తెలంగాణ ఇచ్చింది కూడా ఆ పార్టీయేనని తెలంగాణ ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్ కాల్వ సుజాత అన్నారు. వైరాలోని హరిహర సుత అయ్యప్ప స్వామి మండపంలో జరిగిన ఉమ్మ డి ఖమ్మం జిల్లా ఆర్యవైశ్యుల రాజకీయ చైతన్య ఆత్మీయ సమ్మేళనంలో ఆమె పాల్గొని మాట్లాడారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆర్యవైశ్యులకు ప్రాధాన్యత కల్పించాలన్నారు. ఎమ్మెల్యే మాలోత్ రాందాస్నాయక్ మాట్లాడుతూ.. తాను ఎమ్మెల్యేగా గెలవడంలో ఆర్యవైశ్యుల సహకారం ఎంతో ఉంద ని తెలిపారు. కార్యక్రమంలో ఏపీ ఆర్యవైశ్య కార్పొరేషన్ నాయకుడు రాకేశ్, డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, మిడిదొడ్డి శ్యాంసుందర్, రాయల నాగేశ్వరరావు, కొదుమూరి దయాకర్, కొత్తా వెంకటేశ్వరరావు, బొర్రా రాజశేఖర్, శీలం నర్సిరెడ్డి, సీతారాములు, వెంకటేశ్వరరావు, రంగా జనార్దన్, మిట్టపల్లి రాఘవరావు, గ్రంధి ప్రవీణ్, మిట్టపల్లి శ్రీనివాసరావు, ఉపేందర్రావు, రాము, భాస్కరరావు, రవికుమార్, నాగేశ్వరరావు, ఈశ్వరి, నాగశ్రీలత, రోజా, మంజులకుమారి, శబరి తదితరులు పాల్గొన్నారు. -
నాటక రంగానికి నాడు ఘన కీర్తి
● అదనపు కలెక్టర్ పి శ్రీనివాస రెడ్డి ఖమ్మంగాంధీచౌక్: నాటక రంగానికి గతంలో ఘన కీర్తి ఉండేదని అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి అన్నారు. నగరంలోని భక్తరామదాసు కళాక్షేత్రంలో ఆదివారం నిర్వహించిన ‘నెల నెలా వెన్నెల’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. నాడు గ్రామాల్లో సురభి నాటికలు ప్రదర్శించేవారని, వాటిని ప్రజలు ఎంతగానో ఆదరించేవారని చెప్పారు. నాటకాల నుంచే సినిమా రంగం అభివృద్ధి చెందిందని, నెల నెలా వెన్నెల నిర్వాహకులు నాటక రంగానికి జీవం పోస్తున్నారని అభినందించారు. ఇటీవల మలేషియా సినీ అవార్డులు సాధించిన దర్శకులు కొత్తపల్లి శేషు, కమెడియన్ మొగిలి గుణకర్, యామిని, వైదేహి, రవి, అన్నపూర్ణ, గుజ్జరి శ్రీధర్బాబును శ్రీనివాసరెడ్డి సత్కరించారు. కార్యక్రమంలో చాంబర్ ఆఫ్ కామర్స్ గౌరవాధ్యక్షుడు మేళ్లచెరువు వెంకటేశ్వరరావు, కాళ్ల అనూరాధ, నెల నెలా వెన్నెల నిర్వాహకులు అన్నాబత్తుల సుబ్రమణ్యకుమార్, మోటమర్రి జగన్మోహన్ రావు, వేముల సదానందం తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఉషోదయ కళానికేతన్ వారు ప్రదర్శించిన ‘కిడ్నాప్’ నాటిక ప్రేక్షకులను అలరించింది. జిల్లాకు రేపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి రాకఖమ్మం మామిళ్లగూడెం : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నారపరాజు రామచంద్రరావు మంగళవారం జిల్లా పర్యటనకు వస్తున్నారని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు తెలిపారు. స్థానిక పార్టీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 29న ఉదయం 8 గంటలకు నాయకన్ గూడెంలో పార్టీ కార్యకర్తలు రామచంద్రరావుకు స్వాగతం పలుకుతారని, 9 గంటలకు కూసుమంచి శివాలయాన్ని దర్శించుకుంటున్నారని తెలిపారు. 10 గంటలకు ఖమ్మం కాల్వొడ్డు నుంచి బైక్ ర్యాలీగా సప్తపది ఫంక్షన్ హాల్కు చేరుకుని అక్కడ జరిగే సభలో పాల్గొంటారని వెల్లడించారు. ఆయన పర్యటనను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సమావేశంలో నాయకులు గెంటేల విద్యాసాగర్, ఈవీ.రమేష్, నంబూరి రామలింగేశ్వరావు, జయరాజు, దిద్దుకూరి వెంకటేశ్వర్లు, ఆర్వీఎస్ యాదవ్, విజయారెడ్డి, వెంకటనారాయణ, పమ్మి అనిత పాల్గొన్నారు. బోనకల్ యువతికి డాక్టరేట్బోనకల్: బోనకల్కు చెందిన బాలు నిర్మలకు ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు విభాగంలో ‘బోయ జంగయ్య కథలో మానవతా దృక్ప ధం’ అనే అంశంపై డాక్టరేట్ లభించింది. ఆచా ర్య మాదిరెడ్డి ఆండాళమ్మ పర్యవేక్షణలో పరిశోధనలు చేసినందుకు గాను ఆమె ఈ పురస్కారానికి ఎంపిక కాగా, పలువురు అభినందించారు. ఆరుగురు ఎంపీడీఓల నియామకంఖమ్మం సహకారనగర్ : జిల్లాలోని ఆరు మండలాలకు ఎంపీడీఓలను నియమిస్తూ రాష్ట్ర ఉన్నతాధికారులు ఆదివారం ఉత్తుర్వులు జారీ చేశారు. రఘునాథపాలెం ఎంపీడీఓగా కొండపల్లి శ్రీదేవి, కూసుమంచికి ఏమేడూరి రామచంద్రరావు, కొణిజర్లకు రామిరెడ్డి ఉపేంద్రయ్య, తల్లాడకు ఏనుగు సురేష్బాబు, ఏన్కూర్కు బి.రంజిత్కుమార్, సింగరేణి ఎంపీడీఓగా పెగళ్లపాటి సూర్యనారాయణను నియమించారు. వీరంతా వెంటనే విధుల్లో చేరనున్నారు. ‘నవోదయ’లో ప్రవేశానికి ఆహ్వానం కూసుమంచి: పాలేరులోని జవహర్ నవోదయ విద్యాలయలో 2026–27 విద్యాసంవత్సరం 9, 11వ తరగతుల్లో ఖాళీ సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ కె.శ్రీనివాసులు తెలిపారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు సెప్టెంబర్ 23లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వీరిలో అర్హులను 2026 జనవరి 7న జరిగే ప్రవేశపరీక్ష ద్వారా ఎంపిక చేస్తామని ఆయన ఓ ప్రకటనలో తెలిపారు. -
ప్రజా సంక్షేమమే ధ్యేయం
● అధికారులు ఆర్ఓఎఫ్ఆర్ భూముల జోలికి వెళ్లొద్దు ● ఆగస్టు రెండో వారంలో చేప పిల్లల పంపిణీ ● యూరియా కొరత లేకుండా చర్యలు తీసుకుంటాం ● రెండు జిల్లాల అధికారుల సమీక్షలో ఉప ముఖ్యమంత్రి భట్టి, మంత్రులు శ్రీహరి, తుమ్మల, పొంగులేటి సూపర్బజార్(కొత్తగూడెం): ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, మంత్రులు పేర్కొన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజల దరి చేర్చాలని సూచించారు. వరద ముంపు, సహాయక చర్యలు, సంక్షేమ పథకాలు, రేషన్ కార్డుల పంపిణీ తదితర అంశాలపై ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల అధికారులతో ఆదివారం కొత్తగూడెంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మల్లు భ ట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ఆర్ఓఎఫ్ఆర్ భూముల వద్దకు వెళ్లొద్దని అటవీ, పోలీస్ శాఖ అధికారులను ఆదేశించారు. ఆ భూములు సాగు చేసుకుంటున్న రైతులకు మూడేళ్లపాటు రూ.12,600 కోట్లతో ఇందిరా గిరి జలవికాసం ద్వారా సోలార్ పంపుసెట్లు, స్ప్రింక్లర్లు, డ్రిప్ పరికరాలు ఉచితంగా అందజేస్తామని తెలిపారు. రహదారుల నిర్మాణానికి ప్రభుత్వం రూ.20 వేల కోట్లతో ప్రణాళిక సిద్ధం చేయగా, ఎమ్మెల్యేలు ఆర్అండ్బీ, పంచాయతీరాజ్ రోడ్లకు ప్రతిపాదనలు ఇవ్వడంలో ఆలస్యమవుతోందని అన్నారు. యూరియా కొరత లేకుండా చర్యలు చేపడతామని, రైతులు ఆందోళన చెందవద్దని సూచించారు. మహిళా సంఘాల ద్వారా చేప పిల్లల పెంపకానికి ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. గోదావరి వరదలు ఇప్పటివరకు సాధారణ స్థితిలో ఉన్నాయని అన్నారు. వన మహోత్సవంలో ప్రజలకు ఉపయోగపడే మొక్కలు నాటాలని, గత పదేళ ్లలో నాటిన, బతికిన మొక్కల వివరాలు అందించాలని ఆదేశించారు. సంక్షేమ, గురుకుల విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని, వర్షాకాలం నేపథ్యంలో విద్యార్థులకు వైద్య పరీక్షలు చేయాలని అన్నారు. సమన్వయంతో పనిచేయాలి ప్రభుత్వ పథకాలు ప్రజల దరి చేరేలా అధికారులు, ప్రజాప్రతిధులు సమన్వయంతో పని చేయాలని ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇన్చార్జ్ మంత్రి వాకిటి శ్రీహరి సూచించారు. రైతుల సమస్యలపై ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని చెప్పారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు విద్యాభివృద్ధికి మలుపు తిప్పే కార్యక్రమమని అన్నారు. ఆగస్టు రెండో వారంలో చేప పిల్లల కార్యకమాన్ని చేపడతామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా చెరువు గట్లపై చేప పిల్లల పెంపకం, ఖర్చు తదితర వివరాలతో బోర్డులు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన ప్రతి ఇంటి ఆవరణలో ఐదు మొక్కలు నాటేలా చూడాలన్నారు. అభివృద్ధిలో మోడల్గా మార్చాలి రాష్ట్రంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాను అభివృద్ధిలో మోడల్గా తీర్చిదిద్దాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. గత ప్రభుత్వ పాలనలో అభివృద్ధి కార్యక్రమాలు లేవని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా యూరియా సరఫరాపై కట్టుబడి ఉందన్నారు. వరదలు, వర్షాలకు సంబంధించిన అన్ని ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని సూచించారు. సంక్షేమ లక్ష్యాన్ని సాధించాలి అధికారులు ప్రభుత్వ సంక్షేమ లక్ష్యాన్ని సాధించేలా పని చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సూచించారు. వన మహోత్సవంలో నాటిన ప్రతీ మొక్కను సంరక్షించాలన్నారు. రెవెన్యూ శాఖలో చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరిపే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆగస్టు 15 నాటికి డబుల్బెడ్ రూమ్ ఇళ్లను పంపిణీ చేయాలని ఆదేశించారు. ఆగస్టు నెలలో శ్రావణమాసం సందర్భంగా ఇందిరమ్మ ఇళ్లలో గృహ ప్రవేశాలు జరిగేలా చూడాలన్నారు. నిర్మాణానికి అవసరమైన ఇసుక సరఫరా చేయాలని, పంచాయతీరాజ్, ఆర్అండ్బీ శాఖల పరిధిలో పెండింగ్ పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. రహదారుల వెంట ఏర్పడిన గుంతలను పూడ్చాలని చెప్పారు. వర్షాకాలం నీరు కలుషితం కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఆస్పత్రులు, వసతి గృహాల పర్యవేక్షణ కోసం నియోజకవర్గాలకు ప్రత్యేకాధికారులను నియమించాలని ఆదేశించారు. సమావేశంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రత్యేక అధికారి సురేంద్రమోహన్, ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి, మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్, కొత్తగూడెం, పినపాక, భద్రాచలం, ఇల్లెందు, అశ్వారావుపేట, వైరా, సత్తుపల్లి ఎమ్మెల్యేలు కూనంనేని సాంబశివరావు, పాయం వెంకటేశ్వర్లు, తెల్లం వెంకట్రావు, కోరం కనకయ్య, జారే ఆదినారాయణ, మాలోత్ రాందాస్ నాయక్, మట్టా రాగమయి, అటవీశాఖ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పొదెం వీరయ్య, టీజీ ఐడీసీ చైర్మన్ మువ్వా విజయ్బాబు, ఖమ్మం కలెక్టర్ అనుదీప్, భద్రాద్రి జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
‘యూరియా’పై నిఘా
● సరఫరాను పర్యవేక్షిస్తున్న ప్రభుత్వ శాఖలు ● సహకార అధికారులకు మానిటరింగ్ బాధ్యత ● ఉమ్మడి జిల్లాకు 2,646 మెట్రిక్ టన్నులు ఖమ్మంవ్యవసాయం : యూరియా సరఫరాపై ప్రభుత్వం నిఘా పెంచింది. పలు ప్రాంతాల్లో రైతులకు యూరియా లభించక ఇబ్బంది పడుతున్నారు. సహకార సంఘాల్లో నిల్వ లేకపోవడంతో రైతులు పరుగులు తీస్తున్నారు. విస్తారంగా వర్షాలు కురుస్తున్న వేళ.. పంటలకు ఎరువుల వినియోగం పెరిగింది. ప్రధానంగా యూరియా కోసం రైతులు ఆరాట పడుతున్నారు. పలుచోట్ల సరిపడా లభ్యం కాక ఆందోళన కూడా చేస్తున్నారు. ఈ క్రమంలో యూరియా పంపిణీపై ప్రభుత్వం దృష్టి సారించింది. పక్కదారి పట్టకుండా నిఘా పెంచింది. ఇప్పటికే వ్యవసాయ అధికారులు, పోలీసులు ఎరువుల పంపిణీని పర్యవేక్షిస్తుండగా, తాజాగా సహకార శాఖ అధికారులకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించారు. అంతేకాక మార్క్ఫెడ్, వ్యవసాయ, సహకార జిల్లా స్థాయి అధికారుల బృందం కూడా ఎరువుల నిల్వలను, పంపిణీని తనిఖీ చేస్తోంది. ఉన్నతాధికారులకు నివేదికలు.. యూరియా కొరత, సరఫరాలో చోటు చేసుకుంటున్న ఇబ్బందులను అధిగమించటం, రైతులకు సక్రమంగా ఎరువును అందించటం లక్ష్యంగా సహకార శాఖలో పనిచేస్తున్న జూనియర్ ఇన్స్పెక్టర్లు, సీనియర్ ఇన్స్పెక్టర్లు, అసిస్టెంట్ రిజిస్టార్లకు సహకార సంఘాల్లో ఎరువుల పంపిణీపై మానిటరింగ్ బాధ్యతలు అప్పగించారు. ఖమ్మం జిల్లాలో 25 మంది సహకార అధికారులు కేటాయించిన సహకార సంఘాల్లో ఎరువుల నిల్వలు, పంపిణీకి తీసుకుంటున్న చర్యలు, అవసరాలు వంటి అంశాలపై ఎప్పటికప్పుడు నివేదికలను రూపొందించి ఉన్నతాధికారులకు పంపిస్తున్నారు. అంతేగాక సరఫరా అవుతున్న యూరియా సక్రమంగా రైతులు వినియోగిస్తున్నారా..?, పక్కదారి పడుతుందా..? వంటి అంశాలను కూడా అధికారులు పర్యవేక్షిస్తున్నారు. అంతేగాక జిల్లా సరిహద్దుల్లో ఉన్న చెక్ పోస్టులపై కూడా దృష్టిసారించారు. వీరితో పాటు వ్యవసాయ, పోలీసు యంత్రాంగం యూరియా విక్రయాలను తనిఖీలు చేస్తుంది. ఉన్నతాధికారుల తనిఖీలు.. యూరియా సరఫరాను ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు తనిఖీ చేస్తున్నారు. మార్క్ఫెడ్ గోదాముల్లో ఉన్న నిల్వలు, రేక్ పాయింట్కు వచ్చిన యూరియా, అక్కడ నుంచి ఖమ్మం, భద్రాద్రి జిల్లాలకు సరఫరా, సహకార సంఘాల్లో విక్రయాలు, నిల్వలను మార్క్ఫెడ్ జీఎం విష్ణువర్దన్, ఉమ్మడి జిల్లా మేనేజర్ సునీత, జిల్లా వ్యవసాయాధికారి ధనసరి పుల్లయ్య, డీసీఓ జి. గంగాధర్ రెండు రోజులుగా తనిఖీ చేస్తున్నారు. ఇప్పటికే కూసుమంచి, తిరుమలాయపాలెం, కొణిజర్ల, ఖమ్మం రూరల్ తదితర మండలాలతో పాటు భద్రాద్రి జిల్లాలోని చండ్రుగొండ, కొత్తగూడెం తదితర మండలాల్లో నిల్వలను పరిశీలించారు. ప్రాధాన్యతా క్రమంలో సరఫరా.. జలాశయాల్లో నీరు, ప్రధానంగా సాగు చేసే పంటలు, వాటికి ప్రస్తుతం అవసరమైన యూరియా వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ప్రాధాన్యతా క్రమంలో యూరియా సరఫరా చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. జిల్లాలో ఇప్పటికే సత్తుపల్లి, వేంసూరు, పెనుబల్లి, కల్లూరు, తల్లాడ మండలాల్లో లక్ష్యం మేరకు వరి సాగు చేశారు. మిగతా ప్రాంతాల్లో సాగు పనులు సాగుతున్నాయి. భద్రాద్రి జిల్లాలోని తాలిపేరు, కిన్నెరసాని వంటి ప్రాజెక్టుల కింద వరి, ఇతర పంటలు సాగు చేస్తుండగా ఆయా ప్రాంతాలకు యూరియా సరఫరాపై చర్యలు చేపట్టారు. రేక్ పాయింట్కు చేరిన యూరియా.. చింతకాని: ఉమ్మడి జిల్లాకు ఆదివారం 2,646 మెట్రిక్ టన్నుల యూరియాను ప్రభుత్వం సరఫరా చేసింది. ఎన్ఎఫ్ఎల్(నేషనల్ ఫెర్టిలైజర్స్ కంపెనీ లిమిటెడ్)కు చెందిన యూరియా మండలంలోని పందిళ్లపల్లి రైల్వే రేక్ పాయింట్కు చేరింది. దీన్ని పీఏసీఎస్లు, ఆగ్రో రైతు సేవా కేంద్రాలకు సరఫరా చేసి, అక్కడ నుంచి రైతులకు పంపిణీ చేస్తారు. ప్రస్తుతం వచ్చిన 2,646 మెట్రిక్ టన్నుల్లో ఖమ్మం జిల్లాకు 1,446, భద్రాద్రి జిల్లాకు 1,200 మెట్రిక్ టన్నులు కేటాయించారు. జిల్లాకు కేటాయించిన 1,446 టన్నుల్లో మార్క్ఫెడ్కు 867.6 టన్నులు, ప్రైవేటు డీలర్లకు 578.4 టన్నులు సరఫరా చేశారు. -
ఎమ్మార్పీకే ఎరువులు విక్రయించాలి
రఘునాథపాలెం : యూరియా, డీఏపీ సహా ఇతర ఎరువులన్నీ రైతులకు ఎమ్మార్పీకే విక్రయించాలని, బ్లాక్ పేరుతో అధిక ధరలకు అమ్మితే డీలర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ప్రత్యేకాధికారి సురేంద్రమోహన్ హెచ్చరించారు. రఘునాథపాలెం మండలం వీవీపాలెం సహకార సొసైటీలో ఎరువుల విక్రయాలను ఆదివారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రతీ డీలర్ దుకాణాల్లో స్టాక్ బోర్డులు స్పష్టంగా ప్రదర్శించాలని సూచించారు. రైతులకు సకాలంలో, సరిపడా ఎరువులు అందించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి ధనసరి పుల్లయ్య, ఖమ్మం డివిజన్ సహాయ వ్యవసాయ సంచాలకులు కొంగర వెంకటేశ్వరరావు, మండల వ్యవసాయ అధికారి ఉమామహేశ్వర్ రెడ్డి, వ్యవసాయ టెక్నికల్ అధికారి పవన్ కుమార్, ఖమ్మం మార్కెట్ కమిటీ చైర్మన్ యరగర్ల హనుమంతరావు, సొసైటీ అధ్యక్షడు రావూరి సైదబాబు, ఉపాధ్యక్షుడు రావెళ్ల శ్రీనివాసరావు, సీఈఓ తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు. మోడల్ మార్కెట్ నిర్మాణాలు ఆదర్శంగా ఉండాలి ఖమ్మంవ్యవసాయం: ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో నిర్మిస్తున్న మిర్చి మోడల్ మార్కెట్ పనులు ఆదర్శంగా ఉండాలని సురేంద్రమోహన్ అన్నారు. ఆదివారం ఆచప మోడల్ మార్కెట్ నిర్మాణ పనులను పరిశీలించి మాట్లాడారు. ఖమ్మంలో మిర్చి మోడల్ మార్కెట్ను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోందని, మార్కెట్ యార్డులతో పాటు కోల్డ్ స్టోరేజీ, రైతుల విశ్రాంతి భవనం, మార్కెట్ కమిటీ కార్యాలయ భవనాల పనుల్లో నాణ్యత పాటించాలని అన్నారు. మిర్చి సీజన్ నాటికి పూర్తి చేయాలని సూచించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ యరగర్ల హన్మంతరావు, వైస్ చైర్మన్ తల్లాడ రమేష్, డీఎంఓ ఎంఏ అలీం, మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి పి.ప్రవీణ్కుమార్ పాల్గొన్నారు. జిల్లా ప్రత్యేకాధికారి సురేంద్ర మోహన్ -
బైక్ను ఢీకొట్టిన లారీ
కామేపల్లి: బైక్ను లారీ ఢీకొట్టిన ఘటనలో ఇద్దరికీ తీవ్ర గాయాలు కాగా మరో వ్యక్తికి గాయాలైన ఘటన ముచ్చర్ల క్రాస్ రోడ్డు సమీ పంలో ఆదివారం చోటుచేసుకుంది. సింగరేణి మండ లం గిద్దవారిగూడెంనకు చెందిన గుగులోత్ రాజశేఖర్, రఘునాథపాలెం మండలం బూడిదంపాడుకు చెందిన కేలోత్ మంగీలాల్ బైక్పై ఖమ్మం వైపు వెళ్తుండగా ముచ్చర్ల క్రాస్ రోడ్డు సమీపంలో ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్పై ప్రయాణిస్తున్న ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 వాహనంలో ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పేకాట స్థావరాలపై దాడికారేపల్లి: పేకాట స్థావరాలపై కారేపల్లి పోలీసులు దాడి చేసి 12 మందిని అదుపులోకి తీసుకున్న ఘటన ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఎస్ఐ బి.గోపి ఆధ్వర్యంలో పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా ఉసిరికాయపల్లి శ్రీకోటమైసమ్మతల్లి ఆలయ సమీపంలోని గుట్టల్లో పేకాట ఆడుతున్నారని సమాచారం అందింది. ఈ క్రమంలో పేకాట స్థావరాలపై దాడి చేసి ఇల్లెందు పట్టణానికి చెందిన 12 మందిని అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేశారు. వారి వద్ద నుంచి 6 ద్విచక్రవాహనాలు, 9 సెల్ఫోన్లు, రూ.25,700 నగదును స్వాధీనం చేసుకున్నారు. దాడుల్లో కానిస్టేబుళ్లు భూక్య శంకర్, హరి, ఓంకార్, సైదులు తదితరులు పాల్గొన్నారు. చికిత్స పొందుతున్న వివాహిత మృతి రఘునాథపాలెం: గడ్డిమందు సేవించి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వివాహిత మృతి చెందిన ఘటన రఘునాథపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. రఘునాథపాలెం సీఐ ఉస్మాన్ షరీఫ్ కథనం ప్రకారం.. డోర్నకల్ మండలం తోడేళ్లగూడేనికి చెందిన అల్లి ఉమ కుమార్తె స్వాతికి మూడేళ్ల కిందట రామకృష్ణతో వివాహం జరిగింది. వీరికి రెండేళ్ల పాప ఉంది. వివాహానికి ముందే స్వాతి కడుపునొప్పితో బాధపడుతుండగా పెళ్లి తరువాత తలనొప్పి కూడా ప్రారంభమై ఇబ్బంది పడుతోంది. ఎన్ని ఆస్పత్రులకు తిరిగినా నయం కాకపోవడంతో మనస్తాపానికి గురైన ఆమె గత నెల 30న ఇంట్లో గడ్డిమందు తాగింది. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందింది. మృతురాలి తల్లి ఉమ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
గ్రామాల్లో కేంద్ర బృందం పర్యటన
సత్తుపల్లిరూరల్: కేంద్ర ప్రభుత్వ పథకాల అమలును పరిశీలించేందుకు జాతీయ స్థాయి పర్యవేక్షణ(ఎన్ఎల్ఎం) బృందం సత్తుపల్లి మండలంలోని నారాయణపురం, కాకర్లపల్లి గ్రామాల్లో శనివారం పర్యటించింది. ఈ సందర్భంగా ఉపాధిహామీ కూలీలు, గ్రామ సంఘం సభ్యులతో సమావేశమయ్యారు. ఉపాధి హామీ పనులతో లబ్ధి, వృద్ధాప్య, వితంతు, దివ్యాంగులకు అందుతున్న పింఛన్లపై ఆరా తీశారు. అలాగే, గ్రామాల్లో రోడ్ల వెంట నాటిన మొక్కలు, ఫీడర్ ఛానల్ పూడికతీత, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పను లను పరిశీలించారు. కేంద్ర బృందంలో డాక్టర్ గరుడ, ఎన్.అశ్విన్ గోపాల్ తదితరులు ఉండగా, కల్లూరు ఏపీడీ చలపతిరావు, ఎంపీడీఓ చిన్ననాగేశ్వరరావు, డీఈ వెంకటేశ్వరరావు, ఏపీ ఓ బాబురావు, ఏపీఎం కృష్ణయ్య పాల్గొన్నారు. పత్తి, పెసరలో తెగుళ్ల నివారణపై అవగాహన కొణిజర్ల: కొణిజర్లలో సాగవుతున్న పత్తి, పెసర పంటలను వైరా కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు శాస్త్రవేత్తలు డాక్టర్ వి.చైతన్య, డాక్టర్ పీఎస్ఎం.ఫణిశ్రీ, విజయ తదితరులు శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా వరుస వర్షాలతో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. పత్తి చేన్లలో నీరు చేరితే వేరుకుళ్లు తెగులు రానున్నందున కాల్వలు కొట్టి నీరు తొలగించాలని సూచించారు. అలాగే, ఎకరాకు 25 కేజీల యూరియా, 20 కేజీల పొటాష్ మొక్క సమీపాన చల్లి మట్టి కప్పాలని, నేల ద్వారా తెగుళ్లు వ్యాప్తి చెందకుండా కాపర్ ఆక్సీ క్లోరైడ్ లేదా యూరియాను నీటిలో వారానికి రెండు సార్లు పిచికారీ చేయాలని తెలిపారు. అంతేకాక పెసరలో ఆకుపచ్చ తెగులు నివారణకు కాపర్ఆక్సీ క్లోరైడ్ లేదా మంకోజాల్ పది రోజుల వ్యవధిలో పిచికారీ చేయాలని సూచించారు. ఈకార్యక్రమంలో ఏఓ బాలాజీ, ఏఈఓ శ్రీనివాసరాజు, రైతులు పాల్గొన్నారు. -
రాష్ట్రస్థాయి ఉషూ పోటీలకు ఎంపిక
ఖమ్మం స్పోర్ట్స్: సంగారెడ్డిలో ఈనెల 27వ తేదీన జరగనున్న రాష్ట్రస్థాయి ఉషూ పోటీలకు ఖమ్మం జిల్లా నుంచి ముగ్గురు క్రీడాకారులు ఎంపికయ్యారు. సీనియర్ కేటగిరీలో పి.పవిత్రాచారి, డి.హర్షిణి, టి.సాయి భవ్యశ్రీ ఎంపిక కాగా, టెక్నికల్ ఆఫీషియల్గా జిల్లా వాసి పి.సత్యజిత్చారి వ్యవహరించానున్నారు. వీరిని డీవైఎస్ఓ టి.సునీల్కుమార్రెడ్డి, కోచ్ పి.పరిపూర్ణచారి శనివారం అభినందించారు. ఐదుగురికి ఏఎస్సైలుగా పదోన్నతి ఖమ్మం క్రైం: ఖమ్మం కమిషనరేట్లోని పలు స్టేషన్లలో విధులు నిర్వర్తిస్తున్న ఐదుగురికి ఏఎస్సైలుగా పదోన్నతి లభించింది. ఈ జాబితాలో సీహెచ్.నాగేశ్వరరావు, ఎస్.హర్జా, సీహెచ్.చంద్రశేఖర్, బి.కిష న్, ఖాజామొహినుద్దీన్ ఉన్నారు. ఈ సందర్భంగా వీరిని శనివారం సీపీ సునీల్దత్ అభినందించారు. -
వ్యాధుల కట్టడిపై దృష్టి సారించండి
ఖమ్మం వైద్యవిభాగం: దోమల ద్వారా వచ్చే వ్యాధుల కట్టడిపై అధికారులు దృష్టి సారించాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ అడిషనల్ డైరెక్టర్ డాక్టర్ అమర్సింగ్ ఆదేశించారు. శనివారం ఖమ్మం వచ్చిన ఆయన డీఎంహెచ్ఓ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాలోని పీహెచ్సీల మెడికల్ ఆఫీసర్లు, ఉద్యోగులతో సమీక్షించారు. వర్షాకాలంలో దోమల ద్వారా సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందనున్నందున అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. దోమలు, లార్వా నివారణకు ఫాగింగ్ చేయించడంతో పాటు ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. ప్రధానంగా డెంగీ వ్యాప్తికి అవకాశాలు ఉన్నందున లక్షణాలు కనిపించిన వారికి పరీక్ష చేసి చికిత్స మొదలుపెట్టాలని తెలిపారు. ఈ వీసీలో డీఎంహెచ్ఓ బి.కళావతిబాయి, ప్రోగ్రాం అధికారులు వెంకట రమణ, చందునాయక్ తదితరులు పాల్గొన్నారు.వైద్య, ఆరోగ్య శాఖ ఏడీ అమర్ సింగ్ -
18.60 అడుగులకు చేరిన పాలేరు
కూసుమంచి: మండలంలోని పాలేరు రిజర్వాయర్లో నీటిమట్టం శనివారం సాయంత్రానికి 18.60 అడుగులకు చేరింది. సాగర్ నుండి 3,965 క్యూసెక్కుల నీటి సరఫరా కొనసాగుతుండగా మరో 100 క్యూసెక్కుల మేర వరద ప్రవాహం చేరుతోంది. ఇదే సమయాన రిజర్వాయర్ నుంచి దిగువకు 1,635 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. అయితే, ఔట్ ఫ్లో కన్నా ఇన్ఫ్లో ఎక్కువగా ఉండడంతో రెండు రోజుల్లో రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటిమట్టమైన 23 అడుగులకు చేరనుంది. కాగా, పాలేరు రిజర్వాయర్ సమీపాన ఎడమ కాల్వకు కొత్తగా యూటీ(అండర్ టన్నెల్) నిర్మాణం పూర్తికావడంతో ఎగువన ఉన్న పొలాల మీదుగా వచ్చే వరదను యూటీ ద్వారా సమీసంలోకి ఏటికి మళ్లించారు. -
జాతీయ సదస్సుకు ఖమ్మం జిల్లా ఉపాధ్యాయుడు
తిరుమలాయపాలెం: నూతన జాతీయ విధానంపై ఢిల్లీలో ఈనెల 29న జరగనున్న జాతీయ స్థాయి సదస్సులో పాల్గొనాల్సిందిగా తిరుమలాయపాలెం జెడ్పీహెచ్ఎస్ జీవశాస్త్రం ఉపాధ్యాయుడు పెసర ప్రభాకర్రెడ్డికి ఆహ్వానం అందింది. ఈ సదస్సును ప్రధాని మోదీ ప్రారంభించనుండగా, నేషనల్ మిషన్ ఫర్ మెంటారింగ్లో సభ్యుడైన ప్రభాకర్రెడ్డికి ఆహ్వానం పంపించారు. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుండి విద్యారంగ ప్రముఖులు, విషయ నిపుణులు, నేషనల్ మెంటారింగ్ మిషన్ సభ్యులు పాల్గొని నూతన విద్యావిదానంపై చర్చించనున్నారు. కాగా, జాతీయ సదస్సుకు ఎంపికై న ప్రభాకర్రెడ్డిని డీఈఓ సత్యనారాయణ ఏఎంఓ రాజశేఖర్, ఎంఈఓ శ్రీనివాసరావు, హెచ్ఎం విజయకుమారి అభినందించారు. -
రికార్డు సమయంలో ‘ఎత్తిపోతలు’
● త్వరగా పూర్తయిన ప్రాజెక్టుగా మంచుకొండ లిఫ్ట్ ● రూ.66 కోట్ల నిధులతో నాలుగు నెలల్లో నిర్మాణంఖమ్మంఅర్బన్: ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలంలోని చెరువులకు నీరు సరఫరా చేసి, ఆయకట్టుకు అందించేలా వీ.వీ.పాలెం సాగర్ప్రధాన కాల్వలపై నిర్మించిన మంచుకొండ ఎత్తిపోతల పథకం రికార్డు సమయంలో పూర్తయిందని జలవనరుల శాఖ అధికారులు చెబుతున్నారు. రూ.66 కోట్లతో చేపట్టిన ఈ ప్రాజెక్టును కేవలం నాలుగు నెలల్లోనే పూర్తి చేయడం విశేషం. సాగర్ ప్రధాన కాల్వపై ఏర్పాటు చేసిన ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ద్వారా మండలంలోని అన్ని చెరువులకు పైప్లైన్ల ద్వారా నీరు చేరుస్తారు. పంప్ హౌస్ నిర్మాణం, పైపులైన్ల ఏర్పాటు, మోటార్లు, పంపు సెట్ల ఏర్పాటు వంటి కీలక పనులన్నీ అతి తక్కువ సమయంలో పూర్తయిన ఎత్తిపోతల పథకం రాష్ట్రంలో ఇదే మొదటిదని అధికారులు చెబుతున్నారు. ఇంజనీరింగ్ శాఖ నిపుణులు, జలవనరుల శాఖ అధికారులు, శాఖ రాష్ట్ర సలహాదారుడు పెంటారెడ్డి పర్యవేక్షణలో కాంట్రాక్ట్ సంస్థ ప్రతినిధులు రాత్రీపగలు తేడా లేకుండా పనులు చేపట్టడంతో ఈ ఫలితం నమోదైందని భావిస్తున్నారు. అంతేకాక మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నిరంతరం పర్యవేక్షిస్తుండడంతో పనులు వేగంగా జరిగాయి. ఇప్పటికే మూడు మోటార్ల ట్రయల్ రన్ విజయవంతంగా పూర్తవగా.. త్వరలోనే విద్యుత్ సబ్స్టేషన్ నిర్మించి మండలంలోని చెరువులకు, ఆపై ఆయకట్టుకు నీరు సరఫరా చేయనున్నారు. రైతుల్లో ఆనందం రఘునాథపాలెం మండలంలోని చెరువులకు మంచుకొండ ఎత్తిపోతల పథకం ద్వారా సాగర్ జలాలు వస్తుండడంతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు. మండలంలో ఇన్నాళ్లు వర్షాధారంగానే చెరువులు నిండుతుండగా, సాగుకు ఇబ్బంది ఎదురుకావొద్దని మంచుకొండ వద్ద సాగర్ ప్రధాన కాల్వపై ఎత్తిపోతల పథకం నిర్మించారు. ఈ పథకంలోని మూడు మోటార్ల ట్రయల్ రన్ విజయవంతం కాగా, డెలివరీ పాయింట్ వద్దకు నీరు చేరుతోంది. ఈమేరకు రైతులు, నాయకులు శనివారం డెలివరీ పాయింట్ వద్ద సంబురాలు చేసుకున్నారు. అంతేకాక సీఎం రేవంత్రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చిత్రపటాలకు పుష్పాభిషేకం చేశారు. అలాగే, పథకాన్ని రికార్డు సమయాన పూర్తిచేయడంలో కీలకంగా వ్యవహరించిన జలవనరుల శాఖ ఎస్ఈ మంగళపూడి వెంకటేశ్వర్లు, ఈఈ అనన్య, డీఈ ఝాన్సీ, నిర్మాణ సంస్థ ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. ఖమ్మం మార్కెట్, ఆత్మ కమిటీ, పీఏసీఎస్ చైర్మన్లు యరగర్ల హన్మంతరావు, దిరిశాల చిన్న వెంకటేశ్వర్లు, తాతారావుతో పాటు నాయకులు వాంకుడు దీపక్నాయక్, కొంటెముక్క నాగేశ్వరరావు, బాలాజీనాయక్, కేలోత్ దేవ్సింగ్ తదితరులు పాల్గొన్నారు. -
భూమి ఆధారంగా యూరియా పంపిణీ
తల్లాడ: తల్లాడ మండలం గంగదేవిపాడు సొసైటీ వద్ద శనివారం యూరియా కోసం రైతులు బారులు తీరారు. గంగదేవిపాడు సొసైటీకీ 15 టన్నుల యూరియా వచ్చిందని తెలియడంతో ఎనిమిది గ్రామాల నుంచి పాస్బుక్, ఆధార్కార్డ్ జిరాక్స్లతో ఉదయమే చేరుకున్నారు. దీంతో అందరికీ యూరియా సరఫరా చేయాలనే భావనతో ఎకరం భూమి కలిగిన రైతుకు ఒకటి, 5 – 10 ఎకరాలు ఉంటే రెండు బస్తాల చొప్పున పంపిణీకి నిర్ణయించారు. ఈమేరకు ఏఓ ఎం.డీ.తాజుద్దీన్తో కూపన్లు జారీచేయించగా పీఏసీఎస్ చైర్మన్ తూము వీరభద్రరావు, అధికారులు పర్యవేక్షించారు. రైతులను ఇబ్బంది పెట్టొద్దు... ఖమ్మం వ్యవసాయం/ఖమ్మం రూరల్/తల్లాడ: వరుస వర్షాలతో పంటల సాగు పెరుగుతుండడంతో యూరియా అవసరం సైతం పెరుగుతోంది. దీంతో చాలాచోట్ల రైతులకు ఎదురవుతున్న ఇబ్బందులపై ‘సాక్షి’లో శనివారం కథనం ప్రచురితమైంది. దీంతో స్పందించిన అధికారులు జిల్లా వ్యాప్తంగా గోదాంలు, సొసైటీల్లో తనిఖీ చేశారు. గోదాంలో ఉన్న స్టాక్, రిజిస్టర్లలో వివరాలను సరిపోల్చడమేకాక రైతులను ఇబ్బంది పెట్టకుండా సరఫరా చేయాలని డీలర్లకు సూచించారు. కాగా, తల్లాడ మండలం గంగదేవిపాడు, తల్లాడ సొసైటీల వద్ద యూరియా పంపిణీనీ ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్దత్ పరిశీలించారు. స్టాక్ వివరాలు, ఇంకా అవసరమనే వివరాలు ఆరా తీశారు. అలాగే, ఖమ్మంరూరల్ మండలంలోని చినతండాలోని ఏదులాపురం పీఏసీఎస్ జిల్లా వ్యవసాధికారి ధనసరి పుల్లయ్య సందర్శించారు. గోదాంలో నిల్వ ఉన్న ఎరువులను తనిఖీ చేశాక నిర్వాహకులకు సూచనలు చేశారు. సరిపడా నిల్వలు ఉన్నందున రైతులు ఆందోళన చెందొద్దని తెలిపారు. అనంతరం పల్లెగూడెంలోని ఎరువుల షాపుల్లోనూ తనిఖీ చేయగాఏఓ ఉమానగేష్, పీఏసీఎస్ సీఈఓ మహమూద్అలీ, ఏఈఓలు పాల్గొన్నారు.తల్లాడలో పరిశీలించిన సీపీ సునీల్దత్ -
రోడ్డు ప్రమాదంలో కారేపల్లి వాసి మృతి
కారేపల్లి: ఊరూరా తిరుగుతూ గ్యాస్స్టౌల మరమ్మతుతో కుటుంబాన్ని పోషించే వ్యక్తి రోడ్డుప్రమాదంలో మృత్యువాత పడ్డాడు. ఈ ఘటనకు సంబంధించి వివరాలు.... కారేపల్లి మండలం మాధారం బుడిగ జంగాల కాలనీకి చెందిన తూరపాటి రాజు(32) ద్విచక్రవాహనంపై ఊరూరా తిరుగుతూ గ్యాస్స్టౌ రిపేర్ చేస్తూ జీవ నం సాగిస్తున్నాడు. శనివారం కూడా అలాగే వెళ్లగా పాల్వంచ మండలం సోములగూడెం క్రాస్ వద్ద ద్విచక్రవాహనం అదుపుతప్పి డివైడర్ను డీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. రాజుకు భార్య రమణ, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆయన మృతితో కుటుంబంలో విషాదం నెలకొనగా, మా జీ సర్పంచ్ అజ్మీరా నరేష్నాయక్ తదితరులు నివాళులర్పించారు. అదుపు తప్పి ట్రాక్టర్ బోల్తా నేలకొండపల్లి: పొలంలో దుక్కి దున్నేందుకు వెళ్తుండగా ట్రాక్టర్ ఇంజన్ అదుపు తప్పి బోల్తా పడడంతో డ్రైవర్కు గాయాలయ్యా యి. మండలంలోని మంగాపురం తండాకు చెందిన ధీరావత్ కేశ్యా(40) దుక్కిదున్నేందుకు శనివా రం ట్రాక్టర్పై వెళ్తున్నాడు. అయి తే, మార్గమధ్యలో ట్రాక్టర్ అదుపు తప్పి చెట్టుకు ఢీకొట్టి సమీప పొలంలో బోల్తా పడింది. ఈ క్రమంలో ట్రాక్టర్పై నుంచి కేశ్యా దూకడంతో స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. -
‘సర్వేలతో బీసీలను మోసం చేస్తున్న కాంగ్రెస్’
ఖమ్మం మామిళ్లగూడెం: సర్వేల పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను మోసం చేస్తోందని బీజేపీ రాష్ట్ర నాయకుడు, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్.ప్రభాకర్ పేర్కొన్నారు. ఖమ్మంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలోఆయన మాట్లాడుతూ బీసీలపై కాంగ్రెస్ ప్రభుత్వం సవతితల్లి ప్రేమ చూపిస్తుందన్నారు. బీసీల హక్కులను తాకట్టు పెట్టి రాజకీయ లబ్ధి పొందాలన్నది ఆ పార్టీ కుట్రగా భావిస్తున్నామని చెప్పారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం నిర్వహించిన సకల జనుల సర్వేలో బీసీల జనాభా 55శాతమని తేలగా, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం సర్వేలో బీసీల జనాభా తక్కువగా ఎలా వచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు. అంతేకాక 42శాతం రిజర్వేషన్లతో నిజమైన బీసీలు నష్టపోనున్నందున బీజేపీ అంగీకరించేది లేదని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు, కిసాన్మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్రెడ్డి, నాయకులు గల్లా సత్యనారాయణ, సన్నె ఉదయప్రతాప్, తాండ్ర వినోద్రావు, నున్న రవికుమార్, నంబూరి రామ లింగేశ్వర్రావు, విజయరాజు తదితరులు పాల్గొన్నారు. -
వాతావరణ ం
జిల్లాలో ఆదివారం సాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. సాయంత్రం తర్వాత కొన్ని ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశముంది.మోదీ పాలన దేశానికే ప్రమాదకరంసీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేనిఖమ్మంమయూరిసెంటర్: కేంద్రంలో మోదీ నేతృత్వాన సాగుతున్న పాలన దేశానికి ప్రమాదకరంగా పరిణమిస్తోందని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం అన్నారు. ఖమ్మం సుందరయ్య భవన్లో శనివారం జరిగిన ఖమ్మం డివిజన్ వర్క్ షాప్లో ఆయన మాట్లాడారు. బీజేపీ ఒక మతతత్వ పార్టీ అని.. మోదీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆర్థిక రంగంలో సంస్కరణల్లో వేగం పెంచారని ఆరోపించారు. ముఖ్యంగా రైల్వే, రక్షణ, విద్య, వైద్య, బీమా రంగంలో విదేశీ పెట్టుబడులను ఆహ్వానించడం, కార్మిక చట్టాల సవరణతో అందరికీ నష్టం ఎదురుకానుందని తెలిపారు. అయితే, బీజేపీ మతతత్వాన్ని కార్పొరేట్ శక్తులు కూడా సమర్థిస్తుండడం అత్యంత ప్రమాదకరమని చెప్పారు. కొన్ని రాష్ట్రాల్లో మైనారిటీలపై దాడులు చేస్తూ, పౌరసత్వం నిరూపించుకోవాలని చెబుతుండడం బీజేపీ తీరును తేటతెల్లం చేస్తోందని తెలిపారు. ఈమేరకు కేంద్రం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ఐక్య ఉద్యమాలు నిర్మించాలని తమ్మినేని పిలుపునిచ్చారు. కాగా, కేంద్రప్రభుత్వం దేశవ్యాప్త కులగణనను వ్యతిరేకిస్తుండగా.. కులగణన, రిజర్వేషన్లకు అనుకూలంగా రాష్ట్రంలో బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారని తెలిపారు. ఈ సమావేశంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు పోతినేని సుదర్శన్రావు, జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావుతో పాటు నాయకులు కళ్యాణం వెంకటేశ్వరరావు, వై.విక్రమ్, బొంతు రాంబాబు, ఎర్ర శ్రీనివాసరావు, విష్ణువర్ధన్, బండా రమేష్, ఎం.ఏ.జబ్బార్, ఎస్.నవీన్రెడ్డి, షేక్ మీరా సాహెబ్, దొంగల తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు. -
ప్రణాళికాయుతంగా నగర అభివృద్ధి
ఖమ్మంఅర్బన్: ఖమ్మం నగర అభివృద్ధి ప్రణాళికా యుతంగా జరిగేలా కార్యాచరణ రూపొందించామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఖమ్మం 3వ డివిజన్ పరిధిలో పలు అభివృద్ధి పనులకు శనివారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విలీన గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తూ ఇప్పటివరకు రూ.200 కోట్ల నిధులు మంజూరు చేశామని పేర్కొన్నారు. మరో రూ.150 కోట్ల ప్రతిపాదనలకు ఆమోదం లభించాల్సి ఉందని చెప్పారు. అంతేకాక ఆగస్టు 15నాటికి కనీసం రూ.100 కోట్ల నిధులు ఖమ్మం కార్పొరేషన్కు మంజూరు కానున్నాయని తెలిపారు. ఇప్పటికే రూ.280 కోట్లతో తీగల వంతెన, రూ.160 కోట్లతో మోడల్ మార్కెట్, రూ.30 కోట్లతో ఖిల్లా రోప్వే, రూ.200 కోట్లతో భూగర్భ డ్రెయినేజీ నిర్మాణ పనులు జరుగుతున్నాయని వెల్లడించారు. మేయర్ పునుకొల్లు నీరజ, కమిషనర్ అభిషేక్ అగస్త్య మాట్లాడగా రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, మార్కెట్ చైర్మన్ యరగర్ల హన్మంతరావు, ఆర్డీఓ నర్సింహారావు, కేఎంసీ సహాయక కమిషనర్ అనిల్, పబ్లిక్ హెల్త్ ఎస్ఈ రంజిత్, మునిసిపల్ ఈఈ కృష్ణలాల్, ఏసీపీ వసుంధర, విద్యుత్శాఖ డీఈ రామారావు, తహసీల్దార్ సైదులు, కార్పొరేటర్ లకావత్ సైదులుతో పాటు కాంగ్రెస్ నాయకులు సాధు రమేష్రెడ్డి, నల్లమల వెంకటేశ్వర్లు, మలీదు మనీష్, నాగమణి తదితరులు పాల్గొన్నారు.రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు -
భవిష్యత్ కోసమే పార్టీ మార్పు
వైరారూరల్: బీఆర్ఎస్ తనకు ఎలాంటి అన్యాయం చేయకపోగా తగిన గుర్తింపు ఇచ్చిందని మధిర మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు తెలిపారు. అయినా భవిష్యత్ కోసం పార్టీ మారాల్సి వస్తోందని చెప్పారు. ఆయన స్వగ్రామమైన వైరా మండలం కొండకొడిమలో శనివారం అనుచరులతో సమావేశమయ్యారు. బీఆర్ఎస్లో 11ఏళ్ల పాటు గౌరవించడమే కాక రాష్ట్ర స్థాయి పదవితో సముచిత స్థానం కల్పించారని తెలిపారు. అయితే, అభివృద్ధి, భవిష్యత్ కోసం కాంగ్రెస్లో చేరాలని నిర్ణయించుకోగా, అనుచరులతో సంప్రదిస్తున్నానని వెల్లడించారు. ఈ సమావేశంలో ధూళిపాల నాగేశ్వరరావు, కొప్పుల వెంకటేశ్వరరావు, దొంతెబోయినస్వామి, కస్తాల చిన్నసత్యనారాయణ, వాకదాని వెంకటేశ్వరరావు, దొంతెబోయిన వెంకటేశ్వరరావు, పగడవరపు నర్సింహారావు, పుట్ట వెంకటేశ్వరరావు, దారా వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.మాజీ ఎమ్మెల్యే కొండబాల కోటేశ్వరరావు -
చికిత్సకు వచ్చే వారితో మర్యాదగా మెలగాలి
ఖమ్మంవైద్యవిభాగం: చికిత్స కోసం వచ్చే వారితో పాటు సహాయకులతో పట్ల గౌరవంగా మెలగాలని ఖమ్మం ప్రభుత్వ జనరల్ ఆస్పతి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ నరేందర్ సూచించారు. ఆస్పత్రి పేషంట్ కేర్, సెక్యూరిటీ, శానిటేషన్ సిబ్బందితో శనివారం సమావేశమైన ఆయన పలు సూచనలు చేశారు. ఆస్పత్రిని ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచడమే కాక సేవల్లో సహకారం అందించాలని తెలిపారు. అలాగే, సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. హత్య కేసులో నిందితుడి రిమాండ్ తల్లాడ: మండలంలోని అన్నారుగూడెంలో శెట్టి లక్ష్మీనారాయణపై దాడి చేసి ఆయన మరణానికి కారణమైన సుంకర శివను పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. ఈనెల 19న మధ్యాహ్నం ఇంటి స్థలం గెట్టు విషయంలో గొడవ జరగగా, లక్ష్మీనారాయణ తలపై శివ ఇనుప రాడ్తో కొట్టడడంతో తీవ్రగాయాలతో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఘటనపై కేసు నమోదు కాగా శనివారం శివను అరెస్ట్ చేసి కోర్టు ఆదేశాలతో రిమాండ్కు తరలించినట్లు వైరా సీఐ సాగర్ తెలిపారు. -
శ్రీవారికి అభిషేకం, నిత్యకల్యాణం
ఎర్రుపాలెం: మండలంలోని జమలాపురం శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు జరిగాయి. తెల్లవారుజామునే స్వామి మూలవిరాట్తో పాటు ఆలయ ప్రాంగణంలోని శ్రీవారి పాదానికిఅర్చకులు పంచామృతంతో అభిషేకాలు చేశారు. అలాగే, పెద్దసంఖ్యలో హాజరైన భక్తుల సమక్షాన స్వామి, అమ్మవార్ల నిత్యకల్యానం, పల్లకీసేవ నిర్వహించారు. కాగా, అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి కుటుంబ సమేతంగా రాగా అర్చకులు, అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతించి పూజలు చేయించారు. ఈఓ జగన్మోహన్రావు, వ్యవస్థాపక ధర్మకర్త ఉప్పల శ్రీరామచంద్రమూర్తి, ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాసశర్మ, సూపరింటెండెంట్ విజయకుమారి, అర్చకులు రాజీవ్శర్మ, మురళీమోహన్శర్మ పాల్గొన్నారు. ప్రజలకు భరోసా కల్పించాలి బోనకల్: సమస్యలతో వచ్చే ప్రజలకు భరోసా కల్పించేలా పోలీసుల పనితీరు ఉండాలని పోలీస్ కమిషనర్ సునీల్దత్ సూచించారు. బోనకల్ పోలీస్స్టేషన్ను శనివారం తనిఖీ చేసిన ఆయన స్టేషన్ నిర్వహణ, ఉద్యోగుల పనితీరు, పెండింగ్ కేసుల విచారణపై ఆరాతీశారు. అనంతరం సీపీ మాట్లాడుతూ పెట్రోకార్, బీట్ సిబ్బంది విధినిర్వహణలో చురుగ్గా వ్యవహరించాలని ఆదేశించారు. అలాగే, పాత నేరస్తుల కదలికలపై నిఘా వేయాలని, రెండు రాష్ట్రాల సరిహద్దులో అక్రమ రవాణా నియంత్రణకు స్పెషల్ డ్రైవ్ చేట్టాలని సీపీ తెలిపారు. ఎస్ఐ పొదిలి వెంకన్న, సిబ్బంది పాల్గొన్నారు. ఎస్సీ న్యాయవాద పట్టభద్రులకు ఉచిత శిక్షణ ఖమ్మంమయూరిసెంటర్: షెడ్యూల్డ్ కులాల న్యాయవాద పట్టభద్రులకు ఉచిత శిక్షణతో పాటు ఆర్థిక ప్రోత్సాహకాలు అందించే పథకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఎస్సీ అభివృద్ధి శాఖ ఆధ్వర్యాన ఈ పథకానికి గాను ఉమ్మడి జిల్లాలోని అర్హులైన న్యాయవాద పట్టభద్రులు ఈనెల 31లోగా ఈ–పాస్ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ఎస్సీ డీడీ కె.సత్యనారాయణ సూచించారు. ఎంపికై న వారికి మూడేళ్ల పాటు సివిల్, క్రిమినల్ లాలో ఉచిత శిక్షణతో పాటు పుస్తకాలు, స్టేషనరీ కోసం రూ.50వేలు, నెలకు రూ.3వేల ఉపకార వేతనం, బార్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ ఫీజు రీయింబర్స్మెంట్ లభిస్తాయని తెలిపారు. రూ.2 లక్షల లోపు ఆదాయం కలిగిన వారు కుల, ఆదాయ ధ్రువపత్రాలు, మార్కుల జాబితాలు, బార్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్తో దరఖాస్తు చేసుకోవాలని వెల్లడించారు. హైవే భూసేకరణకు నోటిఫికేషన్ ఖమ్మం అర్బన్: నాగపూర్ – అమరావతి జాతీయ రహదారి(163జీ) విస్తరణలో భాగంగా జిల్లాలో అవసరమైన భూసేకరణకు కేంద్ర రోడ్లు, రవాణా శాఖ శుక్రవారం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. వరంగల్ నుంచి ఖమ్మం వరకు జిల్లాలోని 203.8 కి.మీ. నుంచి 220.48 కి.మీ మధ్య పాయింట్లలో భూములు సేకరించనున్నారు. ఈమేరకు ఖమ్మం రూరల్ మండలం తీర్థాల రెవెన్యూ పరిధి పది సర్వే నంబర్లు, ఒక డొంక రహదారి, రఘునాథపాలెం మండలంలోని రఘునాథపాలెం, వేపకుంట్ల, వి.వెంకటాయపాలెం గ్రామాల్లో పదికి పైగా సర్వే నంబర్ల పరిధిలో భూముల సేకరణకు గుర్తించారు. మొత్తంగా 5.978 హెక్టార్ల భూమి సేకరిస్తామని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఈమేరకు అభ్యంతరాలు ఉంటే 21 రోజుల్లోగా ఖమ్మం ఆర్డీఓకు లిఖితపూర్వకంగా సమర్పించాలని సూచించారు. ఆపై అభ్యంతరాలను పరిశీలించి తుది నిర్ణయం తీసుకుంటామని నోటిఫికేషన్ వెల్లడించారు. -
ఇది కొత్తగా ఉంది...
గోరింటాకుతో అనేక ప్రయోజనాలు ఉన్నాయి. చర్మ వాధుల నుంచి రక్షించడంతో పాటు శరీర ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది. ఇప్పుడు మ్యాథ్స్, సైన్స్ సంబంధించిన అంశాలను చేతులపై వేయడం కొత్తగా ఉంది. ఈ విధానంతో ఆయా అంశాలపై పట్టు పెరుగుతుంది. – మధుశాలిని, పదో తరగతిఎప్పటికీ మరిచిపోకుండా.. గోరింటాకుతో చేతులపై వివిధ డిజైన్లను చిత్రించవచ్చు. మా పాఠశాల ఉపాధ్యాయులు డిజైన్ల స్థానంలో గణితం, జీవ, భౌతిక శాస్త్రాలకు అంశాలను వేయించారు. చేతులపై ఉన్న ఫార్ములాలు తరచూ చదువుతుండడంతో ఎట్టి పరిస్థితుల్లో మరిచిపోయే అవకాశం ఉండదు. – దేవహర్షిని, పదో తరగతిఆసక్తిగా పాల్గొన్నారు.. అందం, ఆరోగ్యంతో పాటు విజ్ఞానాన్ని పెంచేందుకు సైతం గోరింటాకు దోహదపడుతుందని గుర్తించాం. అందుకే గోరింటాకుతో విద్యార్థినుల చేతులపై పాఠ్యాంశాలకు సంబంధించిన చిత్రాలు గీయించాం. ఈ విషయంలో పోటీలు నిర్వహించడంతో అంతా ఆసక్తిగా పాల్గొన్నారు. – వి.సునీత, గణిత ఉపాధ్యాయురాలు, ఖమ్మంవిద్యార్థుల్లో ఉత్సాహం... మానవ అవయవాల బొమ్మల ఆధారంగా విద్యార్థులకు సైన్స్ పాఠాలు బోధిస్తాం. అయితే, బొమ్మలు ఎప్పటికీ గుర్తుండడం, అవి గీసేలా విద్యార్థుల్లో ఆసక్తి పెంచాలని నిర్ణయించుకున్నాం. ఈక్రమంలోనే మెహందీతో వారి చేతులపై బొమ్మలు వేయించగా ఉత్సాహంగా ముందుకొచ్చి పోటాపోటీగా పాల్గొన్నారు. – పి.ప్రభాకర్రెడ్డి, ఉపాధ్యాయుడు, తిరుమలాయపాలెం జెడ్పీహెచ్ఎస్ -
వరదలు ఎదుర్కొనేలా అప్రమత్తత
● యూరియా అక్రమ రవాణా కట్టడిపై దృష్టి ● ఉమ్మడి జిల్లా ప్రత్యేక అధికారి సురేంద్రమోహన్ఖమ్మంమయూరిసెంటర్: భారీ వర్షాల నేపథ్యాన వరద ముంపు ఎదురైతే సమర్థవంతంగా ఎదుర్కొనేలా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఉమ్మడి జిల్లా ప్రత్యేక అధికారి సురేంద్ర మోహన్ ఆదేశించారు. ఉమ్మడి జిల్లా ప్రత్యేక అధికారిగా నియమితులైన ఆయన శనివారం హైదరాబాద్ నుండి వీసీ ద్వారా అధికారులతో సమీక్షించారు. జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలు, మున్నేటి వరదల పట్ల అప్రమత్తంగా ఉంటూ ఆస్తి, ప్రాణనష్టం జరగకుండా చూడాలని తెలిపారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలే కాక ఆపదమిత్ర వలంటీర్లను అందుబాటులో ఉంచాలని చెప్పారు. ఇక యూరియా అక్రమ రవాణా జరగకుండా పర్యవేక్షిస్తూ రైతులకు సరఫరా చేయించాలని సూచించారు. జిల్లా నుంచి కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ వరద విపత్తుల నిర్వహణ కోసం కలెక్టరేట్, కేఎంసీల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటుచేశామని, మున్నేటి పరీవాహక ప్రాంతంలో ఆపదమిత్రులుగా యువతకు శిక్షణ ఇచ్చామని తెలిపారు. మహబూబాబాద్, వరంగల్ జిల్లాల వాతావరణ పరిస్థితులను కూడా ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నామని చెప్పారు. ఇక యూరియా లభ్యత, సరఫరాను పర్యవేక్షిస్తుండగా, డెంగీ తదితర సీజనల్ వ్యాధుల కట్టడిపై ప్రత్యేక దృష్టి సారించామని కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్య, సీపీఓ శ్రీనివాస్, సివిల్ సప్లయీస్ డీఎం శ్రీలత, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జి.పుల్లయ్య, డీఎంహెచ్ఓ కళావతి బాయి, ఇరిగేషన్ ఎస్ఈ ఎం.వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. -
సైనికుల త్యాగాలు చిరస్మరణీయం
ఖమ్మంమయూరిసెంటర్: సైనికుల త్యాగాలను చిరస్మరణీయమని.. వారి సేవలను ఎల్లవేళలా గుర్తు చేసుకోవాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. ఖమ్మం ఫ్రీడమ్ పార్క్లో శనివారం జరిగిన చేపట్టిన కార్గిల్ విజయ దివస్ సిల్వర్ జూబ్లీ వేడుకల్లో పాల్గొన్న కలెక్టర్ అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించి మాట్లాడారు. ప్రజలంతా ప్రశాంతంగా, అభివృద్ధి పథంలో సాగడానికి సరిహద్దులో కష్టపడుతున్న సైనికులే కారణమని తెలిపారు. దేశ సరిహద్దులో 25 ఏళ్ల క్రితం సైన్యం ప్రాణాలకు తెగించి పోరాడడం ద్వారా కార్గిల్ విజయాన్ని అందించారని చెప్పారు. అనంతరం అమరవీరుల కుటుంబసభ్యులను సన్మానించడమే కాక ఫ్రీడమ్ పార్క్లో కలెక్టర్ మొక్కలు నాటారు. కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్య, కార్పొరేటర్ పగడాల శ్రీవిద్య, ప్రాంతీయ సైనిక సంక్షేమ అధికారి ఎం.చంద్రశేఖర్, ఇంటెలిజెన్స్ అడిషనల్ డీసీపీ రామోజీ రమేష్, వింగ్ కమాండర్ సురేంద్ర, మాజీ సైనికుల అసోసియేషన్ బాధ్యులు, అధికారులు పాల్గొన్నారు. రేషన్కార్డుల జారీ నిరంతర ప్రక్రియ సత్తుపల్లి: నూతన రేషన్కార్డుల జారీ, మార్పులు, చేర్పులు నిరంతరం సాగుతాయని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. సత్తుపల్లి మండలం కొత్తూరు రైతువేదికలో శనివారం రేషన్కార్డు మంజూరు పత్రాలను ఆయన ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయితో కలిసి అందజేశారు. అనంతరం కలెక్టర్, ఎమ్మెల్యే మాట్లాడుతూ సత్తుపల్లి నియోజకవర్గంలో 2,200 మందికి కొత్తగా రేషన్ కార్డులు మంజూరయ్యాయని తెలిపారు. తద్వారా వారికి సన్నబియ్యం అందడమే కాక ఆరోగ్యశ్రీ వర్తిస్తుందని చెప్పారు. జిల్లాలోనే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో సత్తుపల్లి ప్రథమ స్థానంలో ఉందని చెప్పారు. ఈ సమావేశంలో కల్లూరు ఆర్డీఓ రాజేంద్రగౌడ్, సింగరేణి పీఓ నర్సింహారావు, డీఎస్ఓ కె.చంద్రకుమార్, నాయకులు డాక్టర్ మట్టా దయానంద్, చల్లగుండ్ల కృష్ణయ్య, చల్లగుళ్ల నర్సింహారావు, గాదె చెన్నారావు, నారాయణవరపు శ్రీనివాసరావు, తోట సుజలరాణి, కొప్పుల నరేందర్రెడ్డి పాల్గొన్నారు.కార్గిల్ దివస్ వేడుకల్లో కలెక్టర్ అనుదీప్