breaking news
Khammam
-
ఉన్నత ప్రమాణాలతో క్రికెట్ పిచ్లు
ఖమ్మంస్పోర్ట్స్: కూసుమంచి మండలం జీళ్లచెర్వు పరిధిలోని ఆగ్రహారంలో ఖమ్మం జిల్లా క్రికెట్ అసో సియేషన్ ఆధ్వర్యంలో రెండు క్రికెట్ పిచ్లను అందుబాటులోకి తీసుకొస్తున్నామని సంఘం కార్య ద ర్శి, జిల్లా క్రికెట్ అసోసియేషన్ కోఆర్డినేటర్ ఎండీ మసూద్పాషా తెలిపారు. ఆదివారం నగరంలోని సీక్వెల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జీళ్లచెర్వులో 14 ఏకరాల స్థలంలో క్రికెట్ మైదానంతోపాటు బీసీసీఐ ప్రమాణాలతో రెండు క్రికెట్ పిచ్లను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు చెప్పారు. ఒక్క పిచ్ను జిల్లా, రాష్ట్రస్థాయి టోర్నమెంట్లు ఆడే విధంగా సిద్ధం చేస్తున్నామని, మరో పిచ్లో ప్రాక్టీస్ చేసుకునేందుకు తీర్చిదిద్దుతున్నామన్నారు. పనులు త్వరలో పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టామని, రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా నగరంలో క్రికెట్ను ప్రోత్సహించేందుకు నడుంబిగించామని తెలిపారు. నిధులు దుర్వినియోగం జరిగినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, క్రికెట్ అభివృద్ధికి తనవంతు సాయం చేయడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని వివరించారు. ఎస్.కె.గయాజ్పాషా, బి.సందీప్, ఫారుఖ్, యాకూబ్, అసిఫ్, మల్సూర్, క్రికెటర్ల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. జీళ్లచెర్వులో త్వరలో అందుబాటులోకి.. -
సురవరం.. ఓ విప్లవోద్యమ కెరటం..
ఖమ్మంమయూరిసెంటర్: ఓ తరం విప్లవోద్యమ కెరటం సురవరం సుధాకర్రెడ్డి అని, ఆయన మరణంతో మార్క్సిస్ట్ మేధావిని కోల్పోయామని సీపీఐ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ పువ్వాడ నాగేశ్వరరావు తెలిపారు. విద్యార్థి దశ నుంచే సురవరంతో కలిసి పనిచేశానని, ఆ తర్వాత ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర బాధ్యతలను సుధాకర్రెడ్డి స్వీకరించారని చెప్పారు. ఆరు దశాబ్దాల పాటు కలిసి పనిచేశామని తన జీవితాన్ని పోరాట చరిత్రగా మార్చుకున్న ఘనుడు ఆయన అని కొనియాడారు. సుధాకర్ రెడ్డికి నివాళులు.. సీపీఐ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి పార్థివదేహానికి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు దుర్గాప్రసాద్.. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో కలిసి నివాళులర్పించారు. వారితో పాటు ఎమ్మెల్యే మాలోత్ రాందాస్నాయక్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నూతి సత్యనారాయణ, పీసీసీ సభ్యులు వడ్డే నారాయణరావు, పుచ్చకాయల వీరభద్రం తదితరులు ఉన్నారు. -
కాంగ్రెస్ గెలుపులో బీసీలదే కీలక పాత్ర
సత్తుపల్లిరూరల్: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి బీసీలు కీలక భూమిక పోషించారని, గత బీఆర్ఎస్ ప్రభుత్వం బీసీ సమాజాన్ని మోసం చేసిందని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పసుపులేటి వీరబాబు అన్నారు. ఆదివారం స్థానిక బీసీ సంఘం కార్యాలయంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నారాయణవరపు శ్రీనివాస్తో కలిసి వీరబాబు మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కోసం చేస్తున్న పోరాటాన్ని బీసీ సమాజం మరిచిపోదన్నారు. అనంతరం వీరబాబును బీసీ సంక్షేమ సంఘం నాయకులు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో మల్లెలి శ్రీనివాస్, మరీదు ప్రసాద్, వీరివాడ నాగభూషణం, సుధాకర్, వెంకటేశ్వర్లు, రంగారావు, నాంచారి, గౌతమ్ పాల్గొన్నారు. -
ఐటీఐతో ఉపాధి అవకాశాలు
● విద్యార్థుల భవిష్యత్ దృష్ట్యా మార్పులు ● సకల సౌకర్యాలతో సిద్ధమైన ఖమ్మం ఏటీసీ ● ఈనెల 28వరకు ప్రవేశాలకు కౌన్సెలింగ్ఖమ్మం సహకారనగర్: ఐటీఐ కోర్సులతో ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటాయనే విశ్వాసాన్ని విద్యార్థుల్లో కల్పించేలా ప్రభుత్వం, అధికారులు, ఐటీఐ కళాశాల బాధ్యులు కృషి చేస్తున్నారు. రాష్ట్రంలో 65 ప్రభుత్వ ఐటీఐ కళాశాలలుండగా... గత ఏడాది వీటిని అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్లు (ఏటీసీ)గా మార్పు చేయాలని నిర్ణయించారు. తొలి దశలో రాష్ట్రంలోని మూడు కళాశాలలను మోడల్ ఏటీసీగా ప్రభుత్వం అప్గ్రేడ్ చేసింది. ఈ జాబితాలో ఖమ్మంలోని టేకులపల్లిలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాల ఉంది. ఇక నూతనంగా ప్రభుత్వం తెలంగాణ గేట్ ఫర్ అడాప్టింగ్ అండ్ ట్రైనింగ్ ఎంప్లాయ్మెంట్ (టీ–గేట్) విధానాన్ని ప్రవేశపెట్టింది. టీ–గేట్తో ఐటీఐ (ఏటీసీ)లో ప్రాంగణ నియామకాలు పెంచి విద్యార్థులకు ఉపాధి అవకాశాలను కల్పించే దిశగా కృషి చేయనున్నారు. టీ–గేట్తో ఉపాధి.. ప్రభుత్వం ఏర్పాటు చేసిన టీ–గేట్తో ఐటీఐ విద్యార్థులకు ఉపాధి అవకాశాలు మెండుగా లభించనున్నాయి. తెలంగాణ గేట్ ఫర్ అడాప్టింగ్ అండ్ ట్రైనింగ్ ఎంప్లాయ్మెంట్ (టీ–గేట్) పథకం ద్వారా జిల్లాలోని పరిశ్రమల్లో విద్యార్థులకు ఉద్యోగ కల్పన చేపట్టనున్నారు. ఇందుకోసం ప్రధాన పరి శ్రమ లేదా సంస్థ డైరెక్టర్, సీఎండీ స్థాయి అధికారి కమిటీ చైర్మన్గా, కార్మిక విభాగం అధికారి వైస్ చైర్మన్గా, ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్ కన్వీ నర్గా ఉంటారు. ఈ కమిటీ జిల్లాలోని పరిశ్రమల్లో ఉన్న ఖాళీలను గుర్తించి.. ఐటీఐ విద్యార్థులతో భర్తీ చేసేలా ప్రణాళిక రూపొందిస్తుంది. దీనిద్వారా పరి శ్రమల్లో ఖాళీలు భర్తీ కావడంతోపాటు విద్యార్థులకు ఉద్యోగాలు దక్కుతాయి. అలాగే పరిశ్రమల్లో ఖాళీలు భర్తీ చేసినందుకు గాను ఆయా పరిశ్రమలు సీఎస్ఆర్ పథకం కింద ఐటీఐ కళాశాలలకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తాయి. అలాగే పరిశ్రమల్లో అవసరమైన అర్హతలు కలిగిన ఉద్యోగి ఐటీఐల్లో లేకపోతే.. అలాంటి విభాగాల్లో ప్రత్యేకంగా ఐటీఐలో శిక్షణ అందించి ఆయా ఖాళీలను భర్తీ చేసే బాధ్యతను ఐటీఐలు తీసుకుంటాయి. దీని ద్వారా ఐటీఐతో విద్యార్థులకు మంచి ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ఈ టీ–గేట్ పనిచేస్తోంది. నగరంలోని ఏటీసీ కేంద్రంలో విద్యార్థులకు ఉపయోగపడే కోర్సులకు సంబంధించిన సామగ్రి అంతా చేరడంతో విద్యార్థుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. కొనసాగుతున్న ప్రవేశాలు ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఏడు కోర్సులు ఉండగా... వీటిలో కోర్సు ఆధారంగా విద్యార్థుల ప్రవేశాలు ఉంటున్నాయి. అన్ని కోర్సులకు సంబంధించి 172 సీట్లకు గాను 166 భర్తీ అయ్యాయి. ఇక ఏటీసీలో గత ఏడాది 172సీట్లకు గాను అన్నీ భర్తీ అయ్యాయి. ఈ విద్యా సంవత్సరంలో 172 సీట్లకు 165 సీట్లు ఇప్పటికే భర్తీ అయ్యాయి. కొత్తగా వాక్ ఇన్ అడ్మిషన్ ఐటీఐల్లో ప్రవేశాల ప్రక్రియ రెండో దశ ముగిసింది. కొత్తగా వాక్ ఇన్ అడ్మిషన్ పేరుతో ప్రవేశాలు కల్పించేందుకు నిర్ణయించారు. ఈమేరకు అర్హత కలిగిన అభ్యర్థులు 28వ తేదీ వరకు ప్రతిరోజు 11 గంటల్లోగా ఆన్లైన్లో నమోదు చేసుకొని కళాశాలల్లో దరఖాస్తు ఫారంతో పాటు ఒరిజనల్ సర్టిఫికెట్లు సమర్పిస్తే పరిశీలించి ఖాళీల ఆధారంగా సీట్లు కేటాయిస్తారు. ప్రవేశాలకు ముమ్మర ప్రయత్నాలు ఇటీవలటీ–గేట్ బృందం ప్రవేశాల పెంపు, కావాల్సి న సౌకర్యాలు, ఉపాధి అవకాశాలపై సమీక్ష నిర్వహించింది. ఇందులో పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించి అందుకు అవసరమైన ప్రణాళికలు రూ పొందించారు. అనంతరం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టిని కలిసి ఆయా అంశాలను వివరించారు. ఇదిలా ఉండగా కలెక్టర్ అనుదీప్ ఇటీవల ఐటీఐని సందర్శించి పలు సూచనలు చేశారు. అంతకు ముందు కలెక్టరేట్, కేఎంసీల్లో అదనపు కలెక్టర్ శ్రీజ ఐటీఐల్లో ప్రవేశాల పెంపునకు అధికారులతో చర్చించారు.ఐటీఐ విద్యను అభ్యసించడం వల్ల విద్యార్థులకు చదువుతోపాటే ఉపాధి అవకాశాలు లభించే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటి వరకు విద్యను అభ్యసించి ఉపాధి అవకాశాలు చూపించగా.. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం టీ–గేట్ ఏర్పాటు చేసింది. దీనివల్ల విద్య, ఉపాధితోపాటు కళాశాలలో అవసరమైన సదుపాయాలు సైతం సమకూరడంతో విద్యార్థులకు ఉపాధి అవకాశాలు మెండుగా లభించనున్నాయి. – ఎ.శ్రీనివాసరావు, ప్రిన్సిపాల్, ప్రభుత్వ ఐటీఐ, టీ–గేట్ కన్వీనర్ -
ఉపాధ్యాయుడికి బంగారు నంది అవార్డు
ఖమ్మం సహకారనగర్ : ముదిగొండ జెడ్పీ ఉన్నత పాఠశాల గణిత ఉపాధ్యాయుడు అవధానుల మురళీకృష్ణకు జాతీయస్థాయిలో బంగారు నంది అవార్డు లభించింది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా హైదరాబాద్కు చెందిన కీర్తి ఆర్ట్ అకాడమీ వారు.. వివిధ రంగాల్లో పని చేస్తున్న వారి నుంచి అవార్డుల కోసం నామినేషన్లు స్వీకరించారు. అందులో విద్యా విభాగం నుంచి తనకు అవార్డు లభించినట్లు తెలిపారు. కాగా, ఈ అవార్డును కేంద్ర మాజీమంత్రి సముద్రాల వేణుగోపాల చారి, ఆధ్యాత్మికవేత్త దైవజ్ఞ శర్మ, అకాడమీ అధినేతల చేతులమీదుగా అందుకున్నానని చెప్పారు. విద్యుత్ సేఫ్టీ అధికారుల నియామకంఖమ్మంవ్యవసాయం : విద్యుత్ ప్రమాదాలను పూర్తిగా నివారించేందుకు గాను సేఫ్టీ అధికారులను నియమిస్తున్నట్లు విద్యుత్ సర్కిల్ ఎస్ఈ ఇనుగుర్తి శ్రీనివాసాచారి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సర్కిల్ పరిధిలో పనిచేసే టెక్నికల్ డీఈలను సేఫ్టీ అధికారులగా నియమించేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. వినియోగదారులు, ముఖ్యంగా రైతుల్లో విద్యుత్పై అవగాహన పెంచడమే లక్ష్యంగా చైతన్య కార్యక్రమాల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. రైతుల కోసం చేపట్టిన పొలంబాట కార్యక్రమంలో ఇప్పటివరకు 2,197 లూజ్లైన్లను పునరుద్ధరించామని, 1,510 స్తంభాలను సరి చేశామని, 2,296 అదనపు స్తంభాలను ఏర్పాటు చేశామని వివరించారు. విద్యుత్ సమస్యలు గుర్తిస్తే వినియోగదారులు, ప్రజలు 1912 టోల్ ఫ్రీ నంబర్కు సమాచారం అందించాలని కోరారు. పదోన్నతుల జాబితా సిద్ధం ఖమ్మం సహకారనగర్ : జిల్లాలో ఎస్జీటీల నుంచి ఎస్ఏ(స్కూల్ అసిస్టెంట్లు)లుగా పదోన్నతి పొందే వారి జాబితాను విద్యాశాఖ సిద్ధం చేసింది. ఈ మేరకు జిల్లాలో 1: 3 నిష్పత్తిలో సుమారు 600 మంది ఎస్జీటీలు ఉండగా 1:1 నిష్పత్తిలో వివిధ సబ్జెక్ట్లకు సంబంధించి 207 మందితో తుది జాబితా తయారు చేసి ఉన్నతాధికారులకు నివేదించారు. కాగా సోమవారం ఉదయం ఈ 207 మందికి వెబ్ ఆప్షన్లు మొదలయ్యే అవకాశం ఉన్నట్లు విద్యాశాఖ వర్గాలు తెలిపాయి. -
రాజీవ్ స్వగృహ ఇళ్లు వేలం
● 18 ఏళ్ల క్రితం రాజీవ్ స్వగృహ ఇళ్ల నిర్మాణం ● చివరి దశలో ఆగిన పనులు ● వేలంలో విక్రయించాలని ప్రభుత్వ నిర్ణయం ఖమ్మంరూరల్: ఖమ్మంరూరల్ మండలం పోలేపల్లి పరిధిలో దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో 2007లో మధ్యతరగతి ప్రభుత్వ ఉద్యోగుల కోసం 9.22 ఎకరాల్లో రాజీవ్ గృహకల్ప నిర్మించారు. బహుళ అంతస్తుల భవనాలు, ఎనిమిది బ్లాకులు, తొమ్మిది ఫ్లోర్లు, ఒక్కో ఫ్లోర్కు 8 ఫ్లాట్లు ఉన్నాయి. మొత్తం మీద 576 ఫ్లాట్లతో రాజీవ్ స్వగృహ ఇళ్లను నిర్మించారు. అప్పటి ప్రభుత్వం ప్రైవేట్ కాంట్రాక్టర్లకు ఇళ్ల నిర్మాణ బాధ్యతను కట్టబెట్టింది. సదరు కాంట్రాక్టర్లు ఇళ్లకు స్లాబులు వేసి, ప్లాస్టరింగ్ చేసి వదిలి వేశారు. ఇక అప్పటి నుంచి అవి ఖాళీగానే ఉంటున్నాయి. ఇళ్ల నిర్మాణం కంటే ముందు మధ్యతరగతి ప్రభుత్వ ఉద్యోగులకు ఇళ్లు కేటాయించాలని నిర్ణయించి అర్హులైన వారి నుంచి రూ.3 వేలు చొప్పున డిపాజిట్ తీసుకున్నారు. ఇక 15 ఏళ్లుగా డిపాజిట్ చేసిన ఉద్యోగులు ఇళ్ల కేటాయింపు కోసం ఎదురుచూశారు. అనంతరం తమకే ఇళ్లు కేటాయించాలని అప్పట్లో పెద్దఎత్తున ఆందోళన చేశారు. దీంతో అప్పటి ప్రభుత్వం డిపాజిట్ చేసిన సొమ్మును తిరిగి వారికి చెల్లించింది. వేలంలో విక్రయం.. రాజీవ్ స్వగృహ ఇళ్లను వేలం ద్వారా విక్రయించాలని బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయించింది. డిపాజిట్ చేసిన రూ.3వేలు తిరిగి తీసుకెళ్లాలని, ఇళ్లను కొత్తగా వేలం వేసి విక్రయిస్తున్నట్లు తెలిపింది. ఆమేరకు డిపాజిట్లు వెనక్కి ఇచ్చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం వచ్చీ రాగానే సీఎం రేవంత్రెడ్డి కూడా రాజీవ్స్వగృహ ఇళ్లను వేలం ద్వారా విక్రయిచి, వచ్చే సొమ్మును ప్రభుత్వాదాయానికి సమకూర్చుకోవాలని నిర్ణయించింది. త్వరలోనే స్వగృహ ఇళ్లను వేలం ద్వారా విక్రయించనున్నారు. ఏర్పాట్లలో అధికారులు.. ఇదిలా ఉండగా స్వగృహ ఇళ్ల సముదాయాన్ని ఈ నెల మొదటి వారంలో జిల్లా కలెక్టర్ అనుదీప్ సందర్శించా రు. నాణ్యతపై సంతృప్తి వ్యక్తం చేశారు. అయితే స్వగృహకు వెళ్లడానికి ఖమ్మం వరంగల్ ప్రధాన రహదారి నుంచి స్వగృహ వరకు 60అడుగుల అప్రోచ్ రోడ్ మంజూరు చేసి వెంటనే పనులను కూడా ప్రారంభించారు. స్వగృహ ఇళ్లకు రక్షణగా మున్నేరు వద్ద రిటైనింగ్ వాల్ నిర్మిస్తున్నందున బఫర్ జోన్ కూడా వర్తించదని, అదనంగా సౌకర్యాలు కూడా కల్పిస్తామని సదరు బిల్డర్లకు, కొనుగోలుదారులకు హామీ ఇచ్చారు. అదనంగా క్లబ్ హౌస్, ఓపెన్ ఎయిర్ థియేటర్, స్విమ్మింగ్ పూల్, 24 గంటల సెక్యూరిటీ, వాకింగ్ ట్రాక్ వంటి సౌకర్యాలతో పాటు సురక్షిత, ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉద్యోగుల కుటుంబాలు నివసించే విధంగా తీర్చిదిద్దనున్నారు. రాష్ట్ర ఉద్యోగులతో పాటు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, నాలుగో తరగతి ఉద్యోగులు, పంచాయతీరాజ్, రెవెన్యూ, ఆర్టీసీ, ట్రాన్స్కో, జెన్కో, సింగరేణి, కేటీపీఎస్, బ్యాంకింగ్, ఎఫ్సీఐ, ఎల్ఐసీ ఉద్యోగులతో పాటు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు కూడా కొనుగోలు చేసుకోవడానికి అవకాశం కల్పించనున్నారు. కాగా, 150కి పైగా ఫ్లాట్స్ కొనుగోలు కోసం వివిధ శాఖలకు చెందిన ఉద్యోగులు రిజిస్టర్ చేసుకున్నారు. స్వగృహలో చదరపు అడుగు ధర రూ.1,150 మాత్రమే. ముఖ్యంగా వివిధ సంస్థలో పని చేసే ఉద్యోగులకు మేలు చేకూర్చాలన్న లక్ష్యంతో నిర్మాణానికి అయిన ఖర్చు మాత్రమే పరిగణనలోకి తీసుకుంటూ ఇంత తక్కువ ధరలో ఇవ్వాలని నిర్ణయించాం. బిల్డర్లు, డెవలపర్లు, జాయింట్ వెంచర్లు, ఇలా గ్రూప్ హౌసింగ్ పథకాలపై ఆసక్తి ఉన్న వారు ఎవరైనా ఇందు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. జూలై 22న నోటిఫికేషన్ విడుదల చేసి, సెప్టెంబర్ 8న లాటరీ విధానంలో కేటాయించనున్నాం. స్వగృహలో అన్ని సౌకర్యాలు ఉంటాయి. –వీపీ గౌతమ్, స్వగృహ ఎండీ -
పేదల సంక్షేమమే లక్ష్యం
ఖమ్మం అర్బన్ : పేదల అభివృద్ధి, సంక్షేమమే తమ ప్రభుత్వ లక్ష్యమని, రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మం నగరంలోని 57వ డివిజన్ రమణగుట్ట ప్రాంతంలో రూ.2.36 కోట్లతో చేపట్టనున్న సీసీ రోడ్లు, డ్రెయినేజీ నిర్మాణ పనులకు ఆదివారం ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు, కొత్త రేషన్కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 57వ డివిజన్లో పేదలు అధికంగా ఉన్నందున ఎక్కువ నిధులు కేటాయించామని తెలిపారు. నగరానికి రెండు వేల ఇళ్లు మంజూరు చేస్తే అందులో 200పైగా ఈ డివిజన్కే అందించామని వెల్లడించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ విడతల వారీగా ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, సీఎం రిలీఫ్ ఫండ్, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ వంటి పథకాలు అందజేస్తామని హామీ ఇచ్చారు. అభివృద్ధి పనులు నాణ్యతతో ఉండాలని, పాఠశాల నిర్మాణ ప్రతిపాదనలు త్వరలో ఆమోదం పొందుతాయని చెప్పారు. నగర మేయర్ పునుకొల్లు నీరజ మాట్లాడుతూ 57వ డివిజన్లో 230 మందికి ఇళ్లు మంజూరయ్యాయని తెలిపారు. నగర పరిశుభ్రతలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి డి.పుల్లయ్య, ఆర్డీఓ నరసింహారావు, మున్సిపల్ ఈఈ వి.రంజిత్, అర్బన్ తహసీల్దార్ సైదులు, మార్కెట్ కమిటీ చైర్మన్ యరగర్ల హనుమంతరావు, డీసీసీబీ చైర్మన్ దొండపాటి వెంకటేశ్వరరావు, మహ్మద్ రఫీదా బేగం, మలీదు వెంకటేశ్వర్లు, నాయకులు ఎండీ ముస్తఫా, మిక్కిలినేని నరేంద్ర, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, దొబ్బల సౌజన్య, రావూరి సైదబాబు, పైడుపల్లి సత్యనారాయణ, దీపక్చౌదరి, సాధు రమేష్రెడ్డి పాల్గొన్నారు. -
ఆరోగ్యశ్రీ.. భారీ బాకీ
● జిల్లాలో నెట్వర్క్ ఆస్పత్రులకు రూ.50 కోట్లకు పైగానే.. ● ప్రభుత్వ ఆస్పత్రులకూ అందని నిధులు ● 31 నుంచి ఆరోగ్యశ్రీ సేవల బంద్కు పిలుపుఖమ్మంవైద్యవిభాగం: నిరుపేదలకు కార్పొరేట్ వైద్యం అందించాలనే ఉద్దేశంతో తీసుకొచ్చిన ఆరోగ్యశ్రీ పథకం రెండు అడుగులు ముందుకు, నాలుగు అడుగులు వెనక్కు అన్నచందంగా తయారైంది. ఉమ్మడి రాష్ట్రంలో నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి తీసుకొచ్చిన ఆరోగ్యశ్రీ పథకాన్ని సక్రమంగా నిర్వహించకపోవడంతో లబ్ధిదారులు వినియోగించుకోలేకపోతున్నారు. జిల్లాలో ఈ పథకం పలు ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో అందుబాటులో ఉండగా.. గత కొంతకాలంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆయా ఆస్పత్రులకు నిధులు విడుదల కావడం లేదు. దీంతో భారీగా చెల్లింపులు నిలిచిపోవడంతో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేయాలని నిర్ణయించారు. అదే విధంగా ప్రభుత్వ ఆస్పత్రులకూ నిధులు రాకపోవడంతో పేషంట్లకు అందించాల్సిన సేవలపై ఆ ప్రభావం పడుతోంది. ఆయా నిధులు అందితే ప్రభుత్వాస్పత్రుల అభివృద్ధితో పాటు రోగులకు సదుపాయాలు కల్పించే ఆస్కారం లభిస్తుంది. పరిమితి పెంపు.. చెల్లింపులు నిల్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెల్లరేషన్ కార్డు కలిగిన ప్రతీ కుటుంబానికి ఉచితంగా వైద్య సేవలు అందించేలా ఆరోగ్యశ్రీ సేవలను 2008లో అందుబాటులోకి తీసుకొచ్చారు. జిల్లాలో మొత్తం 7,12, 461 రేషన్ కార్డులు ఉండగా.. వీరందరూ ఈ పథకానికి అర్హులు. గతంలో రేషన్కార్డు కలిగిన కుటుంబసభ్యులకు రూ.5లక్షలలోపు వైద్యం పొందే అవకాశం ఉండేది. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. ఆ మొత్తాన్ని రూ.10లక్షలకు పెంచింది. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా 1,835 రకాల వ్యాధులకు చికిత్సలు అందిస్తున్నారు. అయితే ఏడాదికి పైగా ప్రైవేటు(నెట్వర్క్) ఆస్పత్రులకు చెల్లింపులు జరగట్లేదు. ఆందోళన బాట పట్టినప్పుడు కంటి తుడుపుగా కొంత చెల్లించడం, ఆతర్వాత పట్టించుకోకపోవడం పరిపాటిగా మారింది. ఏడాదికి పైగా సర్జరీలకు సంబంధించి బకాయిలు పేరుకుపోవడంతో నెట్వర్క్ ఆస్పత్రుల నిర్వహణ కష్టంగా మారిందని, సిబ్బందికి జీతాలు కూడా చెల్లించలేకపోతున్నామని చెబుతున్నారు. దీంతో ఈనెల 31వ తేదీ అర్ధరాత్రి నుంచి ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోనున్నాయి. ఖమ్మం జిల్లాలో ఆరోగ్యశ్రీ బకాయిలు రూ. 50 కోట్లకు పైగా ఉంటాయని ఆస్పత్రుల యాజమాన్యాలు చెబుతున్నాయి. జిల్లాలో 31 ఆస్పత్రులు.. బకాయిలు చెల్లించాలని, ప్యాకేజీలు పునర్సమీక్షించాలనే డిమాండ్తో నెట్వర్క్ ఆస్పత్రుల అసోసియేషన్ పిలుపునిచ్చింది. డిమాండ్లు పరిష్కరించకపోతే ఈనెల 31 అర్ధరాత్రి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేయాలని నిర్ణయించింది. ఖమ్మం జిల్లాలో 31 ప్రైవేటు(నెట్వర్క్) ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలకు అనుమతి ఉంది. భారీగా బకాయిలు పేరుకుపోవడంతో ఆరోగ్యశ్రీ పథకంతో పాటు ఉద్యోగుల ఆరోగ్య పథకం, జర్నలిస్ట్ ఆరోగ్య పథకం కింద సేవలు బంద్ కానున్నాయి. జిల్లాలో రూ. 50 కోట్లకు పైగా బకాయిలు ఉండడంతో నిర్వహణ తమ వల్ల కావట్లేదని, ప్రభుత్వం క్రమంతప్పకుండా బకాయిలు చెల్లించాలని, ప్యాకేజీ ధరలను పెంచాలని యాజమాన్యాలు డిమాండ్ చేస్తున్నాయి. అలాగే జిల్లాలో 8 ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ ద్వారా సేవలు అందిస్తుండగా.. అందులో ఖమ్మం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో 90 శాతానికి పైగా ఆరోగ్యశ్రీ సేవలు అందుతాయి. మొత్తం 8 ఆస్పత్రులకు కలిపి రూ. 5.5 కోట్ల చెల్లింపులు రావాల్సి ఉండగా.. ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి రూ. 5 కోట్లు ఇవ్వాల్సి ఉంది. అయితే ఖమ్మం ఆస్పత్రిలో కార్యాలయ నిర్వహణ, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కాక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఒక్కోసారి ఆరోగ్యశ్రీ రోగులకు మందులు ప్రైవేట్ నుంచి కొనుగోలు చేయాల్సి వస్తోంది. పెండింగ్ ఆరోగ్యశ్రీ నిధులు అయినా విడుదలైతే ఆస్పత్రి నిర్వహణ అయినా సక్రమంగా జరుగుతుందని అధికారులు చెబుతున్నారు. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులకు 14 నెలల బిల్లు బకాయి ఉంది. తద్వారా మందులు, నిర్వహణ ఖర్చులకు అప్పు చేయాల్సి వస్తోంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పరిమితిని రూ.10 లక్షలకు పెంచినా బిల్లులు మాత్రం చెల్లించట్లేదు. ఆస్పత్రులు నడిచే పరిస్థితి లేక ఈనెల 31నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపేయాలని నిర్ణయించాం. ప్రజలను ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం లేకున్నా ఇతర గత్యంతరం లేదు. – డాక్టర్ గోంగూర వెంకటేశ్వర్లు, శ్రీరక్ష ఆస్పత్రి -
రామయ్యకు సువర్ణ పుష్పార్చన
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారికి ఆదివారం అభిషేకం, సువర్ణ పుష్పార్చన జరిపారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాతసేవ, సేవాకాలం, ఆరాధన తది తర పూజలు చేశారు. అనంతరం చిత్ర కూట మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. -
ఈవీ.. రయ్ రయ్!
ఎలక్ట్రిక్ వాహనాలు బ్యాటరీల ద్వారా విద్యుత్శక్తితో నడుస్తాయి. వీటికి ఇంజన్లు ఉండవు. దీంతో వాయుకాలుష్యం చాలా తక్కువ. పర్యావరణ హితంగా ఉంటాయి. వీటిలో ఎటువంటి కాలుష్యాన్ని ఉత్పత్తి చేయని మోటార్ ఉంటుంది. ప్రస్తుత కాలంలో వాయుకాలుష్యం విపరీతంగా పెరుగుతోంది. ఈ క్రమంలో ఎలక్ట్రిక్ వాహనాలు పెరగడం ద్వారా వాతావరణ కాలుష్యం నివారించేందుకు వీలవుతుంది. ఇక వాహనాల నుంచి అతి తక్కువ శబ్దం రావడంతో పాటు ప్రయాణం చాలా మృదువుగా సాగుతుంది. ఈ వాహనాలను చార్జింగ్ చేసేందుకు స్టేషన్ల కొరత ఉంది. రాష్ట్రంలో అతి తక్కువ ప్రాంతాల్లోనే చార్జింగ్ స్టేషన్లు ఉన్నాయి. ఇక జిల్లాలో ఈ చార్జింగ్ స్టేషన్లు అసలే లేవు. దీంతో వాహనాలను కొనుగోలు చేసిన వారు ఇంటివద్దే చార్జింగ్ పెట్టుకోవాల్సి వస్తోంది. మధ్య మధ్య చార్జింగ్ స్టేషన్లు లేకపోవడంతో ఎక్కువ దూరం ఈ వాహనాలపై ప్రయాణించలేకపోతున్నారు. అయితే రానున్న కాలంలో పలు ప్రాంతాల్లో స్టేషన్లు ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వాహనాల సంఖ్య పెరిగితే చార్జింగ్ స్టేషన్లు కూడా అనివార్యంగా రానున్నాయి. స్టేషన్లు ఏర్పాటు చేస్తే తక్కువ సమయంలో ఎక్కువ చార్జింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంట్లో వాహనాలకు చార్జింగ్ పెట్టాలంటే ఎక్కువ సమయం పడుతోందని యజమానులు చెబుతున్నారు. సాక్షిప్రతినిధి, ఖమ్మం: జిల్లాలో ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇటీవలి కాలంలో వీటి ప్రయోజనాలు తెలుసుకునేందుకు వాహనదారులు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. గతంలో పలు కారణాలతో ఈ వాహనాల కొనుగోళ్లు ఆశాజనకంగా లేవు. అయితే క్రమంగా సంప్రదాయ వాహనాలతోపాటు వీటికి కూడా డిమాండ్ ఏర్పడుతోంది. జిల్లాలో ప్రస్తుతం అన్ని రకాల ఎలక్ట్రిక్ వాహనాలు కలిపి 4,044 ఉన్నాయి. వీటిలో టూ వీలర్ల నుంచి పెద్ద వాహనాల వరకు ఉన్నాయి. ప్రధానంగా ఈ వాహనాలతో పర్యావరణ కాలుష్యం తగ్గుతుంది. అయితే చార్జింగ్ స్టేషన్లు లేకపోవడంతో ఇబ్బంది అవుతోందని వినియోగదారులు అంటున్నారు. ఈ స్టేషన్లు ఏర్పాటైతే ఎలక్ట్రికల్ వాహనాల మార్కెట్ మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఈ వాహనాలకు రాయితీ.. ఎలక్ట్రికల్ వాహనాల్లో పలు రకాలున్నాయి. బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనాలు బ్యాటరీతో మాత్రమే పనిచేస్తాయి. హైబ్రీడ్ ఎలక్ట్రిక్ వాహనాలకు పెట్రోల్ ఇంజన్, బ్యాటరీ రెండూ ఉంటాయి. ప్లగ్ ఇన్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వాహనాలు ప్లగ్ ఇన్ ద్వారా చార్జ్ చేయగల బ్యాటరీలను కలిగి ఉంటాయి. సంప్రదాయ వాహనాలతో పోలిస్తే ఎలక్ట్రికల్ వాహనాల ధర ఎక్కువగానే ఉంది. అయితే ఈ వాహనాలు కొనుగోలు చేస్తున్న వారికి రవాణా శాఖ పలు రాయితీలు కల్పిస్తోంది. వీటికి లైఫ్ ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం ఉండదు. అలాగే రిజిస్ట్రేషన్ ఫీజు కూడా లేదు. జిల్లాలో 4,044 వాహనాలు.. జిల్లాలో ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య గతంతో పోలిస్తే భారీగా పెరిగింది. ఒకప్పుడు ఈ వాహనాల కొనుగోలుకు అనేక అనుమానాలు వ్యక్తం చేసిన ప్రజలు.. ప్రస్తుతం కొంత ఆసక్తి చూపుతున్నారు. రవాణా శాఖలో రిజిస్ట్రేషన్ చేయించుకున్న వివరాల ప్రకారం.. జిల్లాలో హెవీ, మీడియం, లైట్ ఎలక్ట్రికల్ వెహికిల్స్ మూడు ఉన్నాయి. ఇక త్రీ వీలర్ గూడ్స్ వాహనాలు 22 ఉన్నాయి. మోటారు సైకిళ్లు, స్కూటర్లు 3,731 ఉన్నాయి. టీజీఎస్ ఆర్టీసీ పలు జిల్లాల్లో ఎలక్ట్రికల్ బస్సులను ప్రవేశపెట్టింది. అయితే చార్జింగ్ స్టేషన్లు లేకపోవడంతో ఇంకా ఖమ్మం రీజియన్కు ఈ బస్సులు రాలేదు. ఇక జిల్లాలో సంప్రదాయ వాహనాలు 6,35,951 ఉన్నాయి. ఇందులో అధికంగా మోటారు సైకిళ్లు 4,60,476 ఉన్నాయి. అలాగే కార్లు 46,143 ఉన్నాయి. ఆటోలు 32,672 ఉన్నాయి. వాహనం పేరు సంఖ్య హెవీ,మీడియం,లైట్ వెహికిళ్లు 03త్రీవీలర్ గూడ్స్ 22ట్యాక్సీ క్యాబ్ 01ఆటోలు 142ప్రైవేట్ సర్వీస్ వాహనాలు 08మోటారు సైకిళ్లు, స్కూటర్లు 3,731ఎలక్ట్రిక్ కార్లు 137మొత్తం 4,044జిల్లాలో పెరుగుతున్న ఎలక్ట్రిక్ వాహనాలు -
బాలికల సర్వతోముఖాభివృద్ధికి కృషి చేయాలి
కొణిజర్ల: బాలికలను అన్ని రంగాల్లో నిష్ణాతులుగా తీర్చిదిద్ది, వారి సర్వతోముఖాభివృద్ధికి అధ్యాపకులు కృషి చేయాలని ఉమ్మడి జిల్లా గురుకులాల రీజినల్ కోఆర్డినేటర్(ఆర్సీఓ) అరుణకుమారి అన్నారు. మండలంలోని తనికెళ్ల తెలంగాణ గిరిజన సంక్షేమ మహిళా గురుకుల డిగ్రీ కళాశాలలో ఆదివారం డిగ్రీ ప్రథమ సంవత్సర బాలికలకు స్వాగత వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అరుణకుమారి మాట్లాడుతూ.. విద్యార్థినులు చదువుతో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్, స్పోకెన్ ఇంగ్లిష్లో పట్టు సాధించాలని సూచించారు. బాలికల అభివృద్ధికి ప్రభుత్వం అనేక పథకాలు ప్రవేశ పెడుతోందని, గురుకులాల్లో సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని బాగా చదవాలని, భవిష్యత్లో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని పిలుపునిచ్చారు. అనంతరం బాలికల నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ప్రిన్సిపాల్ కె. రజని అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ ఎం.నవ్య, వివిధ విభాగాల కోఆర్డినేటర్లు కె.పి. ఐశ్వర్య, ఎ.దీప్తి, ఎన్సీసీ కోఆర్డినేటర్ కె.రజిత తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి జిల్లా గురుకులాల ఆర్సీఓ అరుణకుమారి -
పన్నుల ఎగవేతకు అడ్డదారులు
● నకిలీ పర్మిట్లతో పంటల ఎగుమతి ● లైసెన్సులు మార్చి కొనుగోళ్లు.. ● ప్రభుత్వ ఖజానాకు రూ.కోట్లలో గండి ● రాజకీయ పలుకుబడితో అక్రమ దందాఖమ్మంవ్యవసాయం: పంట ఉత్పత్తుల క్రయ విక్రయాలు, ఎగుమతుల్లో వ్యాపారులు అడ్డదారులు తొక్కుతున్నారు. సర్కారుకు చెల్లించే పన్నుల ఎగవేతకు అక్రమ మార్గాలు అనుసరిస్తున్నారు. రైతుల నుంచి పంట కొనుగోళ్లు మొదలు ఇతర రాష్ట్రాలు, దేశాలకు జరిగే ఎగుమతుల వరకు ఈ దందా సాగుతోంది. కొందరు వ్యాపారులు నకిలీ ఎగుమతి పర్మిట్లు సృష్టించి వివిధ పంటలను ఇతర ప్రాంతాలకు రవాణా చేస్తున్నారు. ప్రధానంగా దేశీయంగా జరిగే పంటల రవాణాలో ఈ దందా యథేచ్ఛగా సాగుతోంది. తద్వారా రూ.కోట్లలో పన్ను చెల్లింపులకు ఎగనామం పెడుతున్నారు. ఈ ఘటన ఖమ్మం వ్యవసాయ మార్కెట్ పరిధిలో వెలుగుచూసింది. బిల్లుల్లో తేడాతో.. ఖమ్మంలోని ఎంకే ట్రేడర్స్ పేరుతో పంటలు కొనుగోలు చేసే మన్నం కృష్ణయ్య అనే వ్యాపారి 2023 నవంబర్లో నకిలీ ఎక్స్పోర్ట్ పర్మిట్లతో రూ.కోటి విలువైన 1,393 పత్తి బస్తాలు ఏపీలోని ఎమ్మిగనూరు మార్కెట్ పరిధిలోని ఓ సంస్థకు తరలించాడు. సంస్థ ఇన్పుట్ సబ్సిడీ కోసం ప్రయత్నించగా బిల్లులు ట్యాలీ కాకపోవడంతో అనుమానం వచ్చిన అధికారులు పర్మిట్లు పరిశీలించారు. దీంతో ఐదు లారీల్లో నకిలీ పర్మిట్లతో పత్తి రవాణా జరిగినట్లు గుర్తించారు. నకిలీ పర్మిట్లు ఖమ్మం మార్కెట్ నుంచి జారీ చేసినట్లు ఉండడంతో సదరు అధికారులు ఇక్కడికి వచ్చి పర్మిట్లను తనిఖీ చేయగా నకిలీవని బయటపడింది. వెంటనే కృష్ణయ్యపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, కేసు నమోదైంది. ఈ ఒక్క ఘటనలోనే సదరు వ్యాపారి మార్కెట్ ఫీజు(సెస్) రూ.లక్ష ఎగవేతకు పాల్పడగా.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన జీఎస్టీకి కూడా మంగళం పాడే అవకాశం ఉంది. ఇలాంటి దందా జిల్లాలోని పలువురు వ్యాపారులు సాగిస్తున్నట్లు సమాచారం. లైసెన్సులు మార్చి కొనుగోళ్లు.. పన్నుల కాలయాపన, ఎగవేతకు కొందరు వ్యాపారులు లైసెన్సులు మార్చి పంటలు కొనుగోలు చేస్తున్నారు. కుటుంబ సభ్యుల పేరిట మూడు, నాలుగు లైసెన్సులు తీసుకుంటూ వాటిలో ఒక లైసెన్స్తో రూ. కోట్ల విలువైన పంటలు కొనుగోలు చేసి ఎగుమతి చేస్తారు. వాటికి సంబంధించిన పన్నులు చెల్లించకుండా బకాయి పెడతారు. అధికారుల నుంచి నోటీసులు వస్తే మరో లైసెన్స్తో వ్యాపారంలోకి దిగుతారు. ఇలా కొందరు వ్యాపారులు ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు రూ. లక్షల్లో ఫీజులు, జీఎస్టీలు బకాయి పడి ఉన్నారు. జిల్లాలో సమృద్ధిగా పంటలు పండుతున్నా మార్కెట్లకు ఏటా రూ. 63కోట్లు మాత్రమే పన్నులు వసూలవుతున్నాయి. రాష్ట్రంలో పెద్ద మార్కెట్లలో ఒకటైన ఖమ్మంలో ప్రధానంగా పత్తి, మిర్చి క్రయ, విక్రయాలు జరుగుతుంటాయి. వీటిలో మిర్చి విదేశీ ఎగుమతులు కూడా ఉంటాయి. దీంతో మార్కెట్ 1 శాతం పన్ను రూ. 30 కోట్లు ఉంటుంది. పంటల ధరలను వ్యాపారులు స్పష్టంగా బిల్లుల్లో పేర్కొంటే పన్నులు మరో రెండు రెట్లు పెరిగి రూ. 90 కోట్లకు చేరే అవకాశం ఉంది. అయితే కొందరు వ్యాపారులు పారదర్శకత పాటించకుండా మార్కెట్ పన్నుల్లో కోత విధిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో 225 మంది ఖరీదుదారులు ఉండగా వీరిలో 150 మంది వివిధ పంటలు కొనుగోలు చేసి దేశ, విదేశాలకు ఎగుమతి చేస్తుంటారు. ఇందులో 10, 15 మంది వ్యాపారులు రూ.1.50 కోట్ల మేర పన్నులు బకాయి ఉన్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు చూస్తే మొత్తంగా రూ. 2.50 కోట్ల మేర బకాయిలు పేరుకుపోయాయి. రాజకీయ అండతోనే.. వ్యాపారులు వివిధ పార్టీల్లో నాయకులుగా, కార్యకర్తలుగా చెలామణి అవుతున్నారు. ఉన్నత పదువుల్లో ఉన్న వారి వెంట తిరుగుతూ.. వారి మనుషులమని చెప్పుకుంటూ తప్పుడు విధానాలకు పాల్పడుతున్నారు. తద్వారా సర్కారుకు చెల్లించాల్సిన పన్నులకే గండి కొడుతున్నారు. అధికారులు కూడా వారిని ప్రశ్నించాలన్నా, నోటీసులు జారీ చేయాలన్నా ఇబ్బంది పడుతున్నారు. వారి దందాను అడ్డుకునే ప్రయత్నం చేస్తే అధికారులపైనే నింద మోపుతూ ఇరకాటంలో పెడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పంటల కొనుగోళ్లకు సంబంధించి మార్కెట్కు వ్యాపారులు చెల్లించాల్సిన 1 శాతం పన్ను చట్ట ప్రకారం, నిబంధనలు పాటిస్తూ వసూలు చేస్తాం. పాత బకాయిలపై దృష్టి సారించాం. నకిలీ ఎక్స్పోర్ట్ పర్మిట్లతో పంట ఎగుమతి జరిగినట్లు గుర్తించి ఓ ట్రేడింగ్ కంపెనీపై పోలీసులకు ఫిర్యాదు చేశాం. అక్రమాలకు పాల్పడే వ్యాపారులపై చర్యలు తీసుకుంటాం. – పి ప్రవీణ్కుమార్, ఖమ్మం మార్కెట్ కమిటీ ఉన్నత శ్రేణి కార్యదర్శి -
అ‘పూర్వ’ సమ్మేళనం
ఖమ్మంలీగల్: ఖమ్మంలోని ఆర్ట్స్, సైన్స్ కాలేజీలో 1972 – 1975 బ్యాచ్ బీఎస్సీ (బీజెడ్సీ) విద్యార్థులు ఆదివారం నగరంలోని ఓ హోటల్ లో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. మొత్తం 27 మంది పూర్వ విద్యార్థులు తమ కుటుంబాలతో కలిసి పాల్గొన్నారు. పాత జ్ఞాపకాలను స్మరించుకున్నారు. ఖమ్మంలో నివసిస్తున్న యరమళ్ల సుదర్శన్రావు (రిటైర్డ్ మేనేజర్), ఆళ్ల వెంకట్రావు (రిటైర్డ్ పారా మెడికల్ ఆఫీసర్), బండి సత్యనారాయణ (రిటైర్డ్ జ్యుడీషియల్ ఆఫీసర్), లక్ష్మణ్రావు (రిటైర్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్), చి.రామారావు, డి.వెంకటేశ్వ ర్లు, డి.సుధాకర్ పాల్గొన్నారు. -
ఓపీఎస్ను పునరుద్ధరించాల్సిందే...
● టీఎస్ సీపీఎస్ ఈయూ జిల్లా అధ్యక్షుడు శశిధర్ ● కార్యాలయాలు, విద్యాసంస్థల్లో నల్లబ్యాడ్జీలతో నిరసన ఖమ్మం సహకారనగర్: గత ప్రభుత్వం జారీ చేసిన జీఓ 28ను రద్దు చేయడమే కాక పాత పింఛన్ విధానాన్ని పునరుద్ధరించాలనే డిమాండ్తో జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలల్లో ఉద్యోగ, ఉపాధ్యాయులు శనివారం మధ్యాహ్న భోజన సమయంలో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ వద్ద జరిగిన నిరసనలో తెలంగాణ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ అసోసియేషన్(టీఎస్ సీపీఎస్ ఈయూ) జిల్లా అధ్యక్షులు చంద్రకంటి శశిధర్ మాట్లాడారు. తెలంగాణ ఏర్పడితే తమ జీవితాలు బాగు పడతాయని ఆశిస్తే పదేళ్లయినా ఫలితం లేదని తెలిపారు. గత ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో సంప్రదించకుండానే తెలంగాణ సీపీఎస్ ఉద్యోగులు నూతన పెన్షన్ విధానంలోనే కొనసాగుతారని లేఖ ఇచ్చిందని విమర్శించారు. ప్రస్తుత ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని కోరారు. ఈకార్యక్రమంలో ఉద్యోగులు వేముల శంకర్, పవన్, గిరిజా, కేశవ లక్ష్మీ, అజీ బాబాతో పాటు టీఎస్ టీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ నాయక్, వ్యవస్థాపక అధ్యక్షుడు రామారావు తదితరులు పాల్గొన్నారు. ● పాత పెన్షన్ విధానాన్ని పునరు ద్ధరించాలని పీఆర్టీయూ తెలంగాణ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.అనిల్కుమార్, ఎం.సురేష్ కలెక్టరేట్ ఏఓకు వినతిపత్రం అందజేశారు.వీఎస్ఎస్ సభ్యుల అభ్యున్నతికి కృషి -
పత్తిని దెబ్బతీసిన వాన
● అధిక వర్షాలతో చేలలో నిలిచిన నీరు ● సమగ్ర పోషకాలు అందక పూత, కాత దశలో ఎర్రబారిన చేన్లుఖమ్మంవ్యవసాయం/వైరా రూరల్: ఇటీవల విస్తారంగా కురిసిన వర్షాలు పత్తి పంటకు ప్రతికూలంగా మారాయి. అధిక వర్షాలతో చేలలో నీరు నిలిచి రోజుల తరబడి నిల్వ ఉండడంతో పైరు స్థితి మారుతోంది. తేమ కారణంగా సమగ్ర పోషకాలు అందక ఎర్రబారడమే కాక పూత, కాత రాలిపోయాయి. ఫలితంగా దిగుబడి తగ్గే ప్రమాదముందని రైతులు ఆందోళన చెందుతున్నారు. మిర్చికి ఆశించిన ధర లేక ఈ ఏడాది రైతులు పత్తి సాగుకు ప్రాధాన్యత ఇచ్చారు. దీంతో జిల్లా సాధారణ విస్తీర్ణం 2.15 లక్షల ఎకరాలైతే 2,25,022 ఎకరాల్లో సాగైంది. అత్యధికంగా కారేపల్లి మండలంలో 22,934 ఎకరాల్లో, రఘునాథపాలెంలో 22,179, చింతకాని మండలంలో 20,181 ఎకరాల్లో పత్తి సాగు చేశారు. కనిష్టంగా సత్తుపల్లి మండలంలో కేవలం 215 ఎకరాల్లో పత్తి సాగైనట్లు గణాంకాలు చెబుతున్నాయి. పది రోజుల పాటు వాన పత్తిని మెట్ట పంటగా సాగు చేస్తారు. కొందరు వర్షాదారంగా, ఇంకొందరు నీటి వనరులు ఉన్న భూముల్లోనూ సాగు చేశారు. ఈ ఏడాది మే చివరి వారంలో కురిసిన వానలతో విత్తనాలు నాటారు. ఆపై జూన్లో సాధారణ వర్షపాతం కూడా లేకపోగా, జూలైలో సాధారణానికి మించి, ఈనెలలో పది రోజుల పాటు వర్షాలు కురిశాయి. పత్తి పూత, కాత దశకు చేరిన సమయంలో కరిసిన వర్షాలు పంటపై ప్రభావాన్ని చూపాయి. రోజుల తరబడి చేన్లలో నీరు నిలిచి తేమ పెరగగా పత్తికి సమగ్ర పోషకాలు అందక మొక్కలు ఎర్రబారాయి. అంతేగాక రసం పీల్చే పురుగు ఆశిస్తోంది. ఇదికాక వర్షం కారణంగా కలుపు విపరీతంగా పెరగడం రైతులను ఆవేదనకు గురిచేస్తోంది. దిగుబడిపై ప్రభావం అధిక వర్షాలు పంట దిగుబడిపై ప్రభావం చూపే పరిస్థితి కనిపిస్తోంది. చాలాచోట్ల పూత, కాత రాలిపోగా దిగుబడి తగ్గే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక పల్లపు నేలల్లో పత్తి బాగా దెబ్బతిన్నదని, దిగుబడులపై ఆశ లేనట్టేనని చెబుతున్నారు. సహజంగా ఎకరాకు 10 – 12 క్వింటాళ్లు రావాల్సిన దిగుబడి ఆరు క్వింటాళ్లు రావడం కూడా కష్టమేనని ఆవేదన దుతున్నారు. ఈ జాగ్రత్తలు తప్పనిసరి ●వర్షపునీటినికాల్వల ద్వారా బయటకు పంపించాలి. ●ఎకరాకు 20 కిలోల యూరియా, 15 కిలోల ఎంఓపీ(మ్యూరేట్ ఆఫ్ పొటాష్) వేస్తే నైట్రోజన్, పొటాష్ కొరత తీరుతుంది. ●యూరియా(2శాతం) లేదా మల్టీ కే (ఒక శాతం) ద్రావణం పిచికారీ చేస్తే మొక్కకు త్వరగా పోషకాలు అందుతాయి. ●కాపర్ ఆక్సీ క్లోరైడ్ 3 గ్రాములు లేదా ఒక గ్రాము కార్బాండిజం, 25 గ్రాముల మాంకోజెబ్ను లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. ●వడల తెగులు గమనిస్తే కాపర్ ఆక్సీ క్లోరైడ్ మూడు గ్రాములను లీటరు నీటిలో కలిపి మొక్క మొదళ్లు తడిచేలా పోయాలి. ●రసం పీల్చే పురుగు నివారణకు పిప్రొనిల్ లేదా ఎసిటామిప్రిడ్ మందు పిచికారీ చేయాలి. -
జ్వరబాధిత విద్యార్థులు ఇంటికి..
సత్తుపల్లి: సత్తుపల్లిలోని మైనార్టీ గురుకులంలో జ్వరాల బారిన పడిన విద్యార్థులను శనివారం ఇళ్లకు పంపించారు. తొలుత గంగారం పీహెచ్సీ వైద్యాధికారి ఆర్.అవినాష్ ఆధ్వర్యాన విద్యార్థులకు పరీక్షలు నిర్వహించారు. జలుబు, దగ్గుతో పలువు రు బాధపడుతుండగా మందులు అందజేశారు. ఆపై తల్లిదండ్రులతో ఇళ్లకు పంపించారు. అయితే, వర్షాకాలం సీజన్లో దోమలు, ఆపై వ్యాధులు ప్రబలే అవకాశమండగా, గురుకులంలోని కొన్ని గదుల కిటికీల మెష్లు తొలగించారు. దీంతో దోమల బెడద పెరిగినట్లు తెలుస్తోంది. కాగా, కల్లూరు డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ టి.సీతారాం పాఠశాలలో వైద్యశిబిరాన్ని పరిశీలించారు. అలాగే, పారిశుద్ధ్యం, డైనింగ్హాల్, తాగునీటి సరఫరా, వంట గదులను తనిఖీ చేశారు. పారిశుద్ధ్య నిర్వహణపై దృష్టి సారించడమే కాక వేడి ఆహారాన్ని అందించాలని సూచించారు. పాఠశాల ప్రిన్సిపాల్ వెంకట్రామయ్య, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. రిజర్వేషన్ ప్రకారం పదోన్నతులు ఇవ్వాలి ఖమ్మం సహకారనగర్: రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం ఉపాధ్యాయ పదోన్నతుల్లో ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని టీజీటీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఇస్లావత్ లక్ష్మణ్నాయక్, వ్యవస్థాపక అధ్యక్షుడు మాలోతు రామారావు డిమాండ్ చేశారు. ఈమేరకు శనివారం కలెక్టరేట్ వద్ద సంఘం నాయకులతో కలిసి నిరసన తెలిపాక అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ జనరల్ రోస్టర్లో పదోన్నతులు పొందిన ఎస్సీ, ఎస్టీ ఉద్యోగ, ఉపాధ్యాయులను కూడా రూల్ ఆఫ్ రిజర్వేషన్ కోటా కింద లెక్కించడం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఏ.బన్సీలాల్, బి.జగ్గి లాల్తో పాటు బాబురావు, ఈర్యా, రవికుమార్, శంకర్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
‘భగీరథ’ కార్మికుల సమ్మె విరమణ
కూసుమంచి/వైరా: నాలుగు నెలల పెండింగ్ వేతనాలు చెల్లించాలనే డిమాండ్తో మిషన్ భగీరథ కార్మికులు జిల్లా వ్యాప్తంగా శనివారం సమ్మెకు దిగారు. ఇందులో భాగంగానే కూసుమంచి మండలంలోని పాలేరు, వైరా రిజర్వాయర్ సమీపాన సబ్స్టేషన్ వద్ద కార్మికులు ఆందోళన చేపట్టారు. వైరాలో కార్మికులు మూడు గంటల పాటు ఆందోళన చేపట్టగా భగీరథ సీఈ శ్రీనివాసరావు మాట్లాడుతూ కార్మికులందరికీ నాలుగు నెలల వేతనాలను విడతల వారీగా వచ్చేనెల 15లోగా జమ చేస్తామని హామీ ఇచ్చారు. దీనికితోడు జేఏసీ నాయకులతో అధికారులు జరిపిన చర్చలు సఫలం కావటంతో సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో కార్మికులు విధులకు హాజరై నీటి సరఫరాను పునరుద్ధరించారు. ఆందోళనలో బీఆర్టీయూ ఐఎన్టీయూసీ, సీఐటీయూ నాయకులు రవి, రాములు, అనంతరాములు, బాలకృష్ణ, రాంబాబు, వెంకయ్య పాల్గొన్నారు. -
కూపన్ల ఆధారంగా యూరియా
● పాస్పుస్తకం పరిశీలించాకే జారీ ● క్యూలైన్లను తగ్గించేలా అమలుకు అధికారుల నిర్ణయంఖమ్మంవ్యవసాయం: కూపన్ల ద్వారా యూరియా పంపిణీకి అధికారులు చర్యలు చేపట్టారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో సరిపడా యూరియా అందుబాటులో లేక రైతులు పడిగాపులు కాయాల్సి వస్తోంది. సంఘాలకు వచ్చే యూరియా కొద్దిగా ఉండడం, రైతులు ఎక్కువ కావడంతో చాలా మంది ఖాళీగా వెళ్లాల్సి వస్తోంది. ఈనేపథ్యాన రాష్ట్ర వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచనలతో యూరియా పంపిణీ కేంద్రాలు, పీఏసీఎస్ల వద్ద రైతులు వేచి ఉండకుండా టోకెన్ల(కూపన్లు) జారీ చేయాలని ఆదేశించారు. స్టాక్ ఆధారంగా రైతులకు కూపన్లు ఇచ్చి వారే వచ్చి యూరియా తీసుకెళ్లేలా చర్యలు చేపట్టాలని సూచించారు. పాస్పుస్తకంతో వస్తే... రైతులు పట్టాదారు పాస్ పుస్తకాలు, ఆధార్ కార్డుతో వస్తే ఏఈఓ, పీఏసీఎస్ సీఈఓలు పరిశీలించి భూవిస్తీర్ణం ఆధారంగా యూరియా కూపన్లు జారీ చేస్తారు. ఆ కూపన్ల ఆధారంగా గరిష్టంగా రెండు యూరియా బస్తాలు తీసుకెళ్లే వెసులుబాటు కల్పి స్తారు. అయితే, పంపిణీదారులు పలువురి పేరిట కూపన్లను పక్కదారి పట్టించే అవకాశముందని, పలుకుబడి ఉన్న వారికే ఇచ్చే ప్రమాదముందని రైతులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కాగా, జిల్లాలో శనివారం వరకు 900 మెట్రిక్ టన్నుల యూరియా పంపిణీ చేయగా, మార్క్ఫెడ్ వద్ద 150మెట్రిక్ టన్నుల నిల్వలు ఉన్నాయని జిల్లా వ్యవసాయ శాఖాధికారి డి.పుల్లయ్య తెలిపారు. కారేపల్లి: సరిపడా యూరియా సరఫరా చేయడం లేదంటూ రైతులు కారేపల్లిలో శనివారం ఆందోళనకు దిగారు. మండలంలోని వివిధ గ్రామాల నుంచి పెద్దసంఖ్యలో రైతులు ఉదయం 5గంటలకే కారేపల్లి సొసైటీ కార్యాలయం వద్దకు వచ్చారు. అయితే, యూరియా స్టాక్ లేదని, 8గంటల వరకు లారీ వస్తే పంపిణీ చేస్తామని సొసైటీ సిబ్బంది చెప్పారు. అయితే, 8గంటల వరకు ఉన్నా లారీ రాకపోగా, ఇకపై రాదని సిబ్బంది చెప్పడంతో రైతులు ర్యాలీగా వెళ్లి కుమురంభీం సెంటర్లో బైఠాయించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ పనులు వదిలేసి ఉదయాన్నే వస్తే యూరియా ఇవ్వకపోవడం సరికాదని మండిపడ్డారు. దీంతో వాహనాలు నిలిచిపోగా ఎస్ఐ బి.గోపి, ఏఓ భట్టు అశోక్ సర్దిచెప్పడంతో వారు ఆందోళన విరమించారు. -
పొలంలో రైతు మృతి
కూసుమంచి: పొలానికి నీళ్లు పెట్టేందుకు వెళ్లిన అక్కడే మృతి చెందిన ఘట న శనివారం మండలంలోని పాలేరులో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన యడవెల్లి వీరభద్రారెడ్డి(52) పొలానికి నీళ్లు పెట్టేందుకు ఉదయమే ఇంటి నుంచి వెళ్లాడు. ఎంతకూ తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యులు వెళ్లి చూడగా మోటారు వద్ద మృతదేహం పడి ఉంది. వీరభద్రారెడ్డి గుండెపోటుతో మృతిచెందాడని భావిస్తుండగా, ఆయన కుమారుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని ఎస్పై నాగరాజు తెలిపారు. చికిత్స పొందుతున్న వృద్ధురాలు మృతి తల్లాడ: తల్లాడ ఎన్టీఆర్నగర్ సమీపాన ఈనెల 20న జరిగిన రోడ్డుప్రమాదంలో గాయపడిన గుర్తుతెలియని యాచకురాలు చికిత్స పొందుతూ శనివా రం మృతిచెందింది. మండలంలోని గాంధీనగర్ తండా వైపు నుంచి తల్లాడ వైపు వృద్ధురాలు నడిచి వస్తుండగా.. వెంగన్నపేటకు చెందిన జినుగు వెంకటి బైక్పై వెళ్తూ ఢీ కొట్టాడు. ఈఘటనలో గాయపడిన ఆమెను ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందిందని తల్లాడ రెండో ఎస్ఐ వెంకటేశ్ తెలిపారు. స్థల వివాదంతో సోదరి ఇంటిపై దాడి ఖమ్మంఅర్బన్: స్థల వివాదం కారణంగా వివాహిత ఇంటిపై దాడి చేసిన ఆమె సోదరుడు, ఆయన కుమారుడిపై శనివారం ఖమ్మం అర్బన్(ఖానా పురం హవేలీ) పోలీసులు కేసు నమోదు చేశారు. అల్లీపురంలో ప్రమీల, ఆమె సోదరుడు జి.శ్రీను వేర్వేరుగా నివసిస్తున్నారు. గతంలో శ్రీను ఓ కేసులో జైలుకు వెళ్తే బెయిల్ కోసం ప్రమీల రూ.2 లక్షలు ఇచ్చింది. దీనికి ప్రతిఫలంగా ఆయన పేరిట ఉన్న ఇంటి స్థలాన్ని రాశాడు. కానీ ఇప్పుడు స్థలం విలువ పెరగడంతో శ్రీను మళ్లీ తనకే కావాలని పేచీ పెడుతున్నాడు. ఈక్రమంలోనే శ్రీను, ఆయన కొడుకు రాజరత్నం కలిసి శనివారం ప్రమీల ఇంటిపై దాడికి పాల్పడ్డారు. ఆమె ఫిర్యాదుతో ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవాలి
ఖమ్మంక్రైం: వినాయక నవరాత్రోత్సవాలు, నిమజ్జన కార్యక్రమం భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని పోలీసు కమిషనర్ సునీల్దత్ సూచించారు. ఈనెల 27న వినాయక నవరాత్రులు మొదలుకానుండగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఖమ్మంలో శనివారం జరిగి న శాంతి కమిటీ, గణేష్ ఉత్సవ కమిటీల సభ్యుల సమావేశంలో సీపీ మాట్లాడారు. అతిపెద్ద ఉత్సవాల్లో ఒకటైన గణేష్ వేడుకలను గతంలో మాదిరిగానే ప్రశాంతంగా జరుపుకోవాలని సూచించారు. ఇందుకోసం పోలీసులు తీసుకునే ముందు జాగ్రత్త చర్యలకు సహకరించాలని తెలిపారు. మండపాల ఏర్పాటుకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, ప్రైవేట్ స్థలాలైతే యజమానుల నుంచి అభ్యంతరం లేదనే పత్రం తీసుకోవాలని సీపీ చెప్పారు. అలాగే, మండపాల్లో డీజే ఏర్పాటుకు అనుమతి ఇవ్వబోమని స్పష్టం చేశారు. కాగా, మండపాల వద్ద కమిటీ వివరాలతో ఫ్లెక్సీ ఏర్పాటుచేయాలని సీపీ సూచించారు. ఈ సమావేశంలో అడిషనల్ డీసీపీ ప్రసాద్రావు, ఏసీపీలు రమణమూర్తి, శ్రీనివాస్, మహేష్, అధికారులు పాల్గొన్నారు.కమిటీల సమావేశంలో సీపీ సునీల్దత్ -
కమీషన్ అందక ఇక్కట్లు
ఖమ్మం సహకారనగర్/ నేలకొండపల్లి: ప్రభుత్వ చౌకధరల దుకాణాల ద్వారా లబ్ధిదారులకు నెలనెలా బియ్యం పంపిణీ చేసే డీలర్లకు కమీషన్ సక్రమంగా అందడం లేదు. ప్రభుత్వం నుంచి వచ్చే కమీషన్ ఐదు నెలలుగా బకాయి ఉండడంతో నెలవారీఖర్చులకు అవస్థపడుతున్నామని వాపోతున్నా రు. ఏప్రిల్, మే నెలకు సంబంధించి రాష్ట్ర కమీషన్ విడుదలైనా ఆతర్వాత రాలేదని, కేంద్రం నుంచి మాత్రం ఐదు నెలలుగా విడుదల కాలేదని చెబుతున్నారు. క్వింటాకు రూ.1.40 కమీషన్ కిలో బియ్యానికి రూ.1.40 చొప్పున క్వింటాకు రూ. 140 కమీషన్ను ప్రభుత్వం డీలర్లకు చెల్లిస్తోంది. ఇందులో కేంద్రం వాటా 45 పైసలు, రాష్ట్ర వాటా 95 పైసలుగా ఉంది. ఒక డీలర్ నెలలో 250 క్వింటాళ్ల బియ్యం పంపిణీ చేస్తే కమీషన్ రూ.35 వేలు రావాలి. కానీ ఐదు నెలలుగా పెండింగ్ ఉండడంతో నిర్వహణ ఖర్చులకు ఇబ్బందిగా మారినందున డీలర్లు ఆందోళనలకు సిద్ధమవుతున్నారు. కాగా, జిల్లాలో 748 రేషన్షాపులు ఉండగా, 4,52,758 కార్డుల ద్వారా నెలకు 81,45,723 మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ చేస్తున్నారు. రేపు వినతిపత్రాలు.. ఐదు నెలలుగా కమీషన్ విడుదల చేయాలని కోరు తూ సోమవారం జిల్లావ్యాప్తంగా కలెక్టర్, ఆర్డీఓ, తహసీల్ కార్యాలయాల్లో వినతిపత్రాలు ఇవ్వనున్నట్లు డీలర్ల సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బానోతు వెంకన్న, షేక్ జానీమియా, నాయకుడు దుర్గయ్య తెలిపారు. ఈమేరకు శనివారం ఖమ్మంలో నిర్వహించిన సమావేశంలో నిర్ణయించినట్లు వెల్లడించారు. అయినా స్పందన రాకపోతే డీలర్లు వరుస ఆందోళనలు నిర్వహించే యోచనలో ఉన్నట్లు తెలిసింది. -
చకచకా పామాయిల్ ఫ్యాక్టరీ
● ఉమ్మడి జిల్లాలో మూడో ఫ్యాక్టరీ నిర్మాణం ● కల్లూరుగూడెంలో కొనసాగుతున్న పనులు ● రైతులకు తగ్గనున్న దూరాభారం వేంసూరు: ఉమ్మడి జిల్లాలో మూడో పామాయిల్ ఫ్యాక్టరీ నిర్మాణ పనులు చకచకా జరుగుతున్నాయి. వేంసూరు మండలం కల్లూరుగూడెంలో 42 ఎకరాల్లో ఫ్యాక్టరీ నిర్మాణానికి ఉగాది పండుగ రోజున శంకుస్థాపన చేశారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, రూ.40 కోట్ల వ్యయంతో ఈ ఫ్యాక్టరీని నిర్మిస్తున్నారు. గంటకు 15టన్నుల గెలల క్రషింగ్ చేసే సామర్థ్యం ఉంటుందని, భవిష్యత్లో దిగుబడి ఆధారంగా గంటకు 60 టన్నుల మేర క్రషింగ్ చేసేలా సామర్ధ్యం పెంచుకోవచ్చని ఆయిల్ఫెడ్ అధికారులు చెబుతున్నారు. పెరిగిన ఆయిల్పామ్ సాగు జిల్లావ్యాప్తంగా ఆయిల్ పామ్ సాగు ఏటా పెరుగుతోంది. ప్రస్తుతం 7,792 మంది రైతులు 28,685.11 ఎకరాల్లో ఆయిల్పామ్ సాగు చేస్తున్నారు. అయితే, ఈ ఏడాది మరో 10వేల ఎకరాలు పెంచాలని అధికారులు కృషి చేస్తున్నారు. జిల్లాలోనే అత్యధికంగా సత్తుపల్లి నియోజకవర్గంలో 4,626 మంది రైతులు 17,221 ఎకరాల్లో పంట సాగు చేస్తున్నారు. వేంసూరు మండలం కల్లూరుగూడెంలో ఫ్యాక్టరీ నిర్మాణానికి శంకుస్థాపన చేశాక ఈ మండలంలో రైతులు ఇంకొందరు ఆయిల్పామ్ సాగుపై దృష్టి సారించారు. ఆయిల్పామ్ దీర్ఘకాలిక పంట కావడం, చీడపీడలు, ప్రకృతి వైపరీత్యాలు, కోతుల బెడద లేకపోవడంతో రైతులు ఆసక్తి కనబరుస్తున్నారు. రైతులకు మేలు ప్రస్తుతం అశ్వారావుపేటలో 30 టన్నులు, అప్పారావుపేట లో 60టన్నుల సామర్ధ్యంతో పామాయిల్ ఫ్యాక్టరీలు కొనసాగుతున్నాయి. కొన్నేళ్లుగా రాష్ట్రవ్యాప్తంగానే కాక జిల్లాలోనూ ఆయిల్పామ్ సాగు పెరగగా ఎక్కువగా ఈ రెండు ఫ్యాక్టరీలకే గెలలు తీసుకొస్తుండడంతో వీటిపై భారం పడుతోంది. అంతేకాక రైతులు వ్యయప్రయాసలకోర్చి ఆయిల్పామ్ గెలలను తీసుకెళ్లాల్సి వస్తోంది. ఈ నేపథ్యాన కల్లూరుగూడెంలో ఫ్యాక్టరీ అందుబాటులోకి వస్తే రైతుల ఇక్కట్లు తీరనున్నాయి. అంతేకాక స్థానికులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని భావిస్తున్నారు.మా గ్రామంలో పామాయిల్ ఫ్యాక్టరీ నిర్మిస్తుండడం సంతోషంగా ఉంది. ఫ్యాక్టరీ నిర్మాణం పూర్తయితే ఆయిల్పామ్ గెలల తరలింపులో రవాణా భారం తగ్గుతుంది. గెలలను సులువుగా తరలించవచ్చు. స్థానికులకు ఉపాధి సైతం పెరుగుతుంది. – బొమ్మనబోయిన వెంకటేశ్వరరావు, కల్లూరుగూడెం -
రోజంతా ఆటపాటలే!
ఖమ్మం సహకారనగర్/ఖమ్మం అర్బన్/రఘునాథపాలెం: ప్రతీ నెల నాలుగో శనివారం ప్రభుత్వ పాఠశాలల్లో ‘నో బ్యాగ్ డే’ అమలు చేయాలనే నిర్ణయం అమల్లోకి వచ్చింది. ఈ సందర్భంగా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచనలతో జిల్లావ్యాప్తంగా పాఠశాలల విద్యార్థులు బ్యాగ్లు లేకుండా వచ్చేలా ఉపాధ్యాయులు అవగాహన కల్పించారు. ఈమేరకు పిల్లలు అలాగే రావడంతో రోజంతా వివిధ అంశాల్లో పోటీలు నిర్వహించడమే కాక విద్య, వైజ్ఞానిక అంశాలపై అవగాహన కల్పించారు. అలాగే, పర్యావరణ స్పృహ పెంపొందించేలా మట్టితో గణేష్ ప్రతిమలు, పేపర్ క్రాఫ్ట్ తయారీ నేర్పించారు. అంతేకాక మాక్ పోలింగ్ నిర్వహించి ఎన్నికల ప్రక్రియపై అవగాహన కల్పించారు. దీంతో విద్యార్థులు రోజంతా ఉత్సాహంగా గడిపారు. పోటీలు.. ఆటపాటలు ఖమ్మం శాంతినగర్ పాఠశాలలో స్పెల్ బీ పోటీలు, మట్టితో వినాయకుడి ప్రతిమ, ఇతర బొమ్మల తయారీని నేర్పించారు. అలాగే, కాగితాలు, ఆకులతో బొమ్మల తయారీపై ఉపాధ్యాయులు అవగాహన కల్పించారు. ఆపై చంద్రయాన్ ప్రయోగం, ఉన్నత స్థానాల్లో ఉన్న వారి విజయగాధల వీడియోలు ప్రదర్శించారు. ఆతర్వాత ఆటలు, పాటలు, క్విజ్, చిత్రలేఖనం పోటీలు నిర్వహించడంతో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ‘నో బ్యాగ్ డే’ నిర్వహణతో రోజంతా పుస్తకాలతో కుస్తీ పట్టే విద్యార్థుల్లో నూతనోత్సాహం వస్తుందని.. తద్వారా మిగతా రోజుల్లో చదువుపై శ్రద్ధ కనబరుస్తారని ఉపాధ్యాయులు అభిప్రాయం వ్యక్తం చేశారు. విద్యార్థుల్లో ప్రతిభ వికాసానికే.. విద్యార్థుల అభిరుచి, ఆసక్తి ఆధారంగా ఆటలు, సంగీతం, నృత్యం, ఇతర సృజనాత్మక కార్యక్రమాల్లో పాల్గొనేలా ప్రోత్సహించడమే ‘నో బ్యాగ్ డే’ ఉద్దేశమని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. ఖమ్మం ఇందిరానగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు ఆయన వెళ్లగా విద్యార్థులు కాగితం, పూలతో చేసిన పుష్పగుచ్ఛాలు ఇవ్వగా అభినందించారు. అలాగే, విద్యార్థులు చేసిన గ్రీటింగ్ కార్డులు, పోస్టర్లు, మట్టి ప్రతిమలను కలెక్టర్ పరిశీలించి మాట్లాడారు. పుస్తకాల బరువు తగ్గించి పిల్లలకు ఆసక్తి ఉన్న అంశాలను గుర్తించేలా ఉపాధ్యాయులు ‘నో బ్యాగ్ డే’ నిర్వహించాలని సూచించారు. అనంతరం వీ.వీ.పాలెం జెడ్పీహెచ్ఎస్ విద్యార్థులు కలెక్టరేట్కు రాగా కలెక్టర్ అనుదీప్ వారితో మాట్లాడి కలెక్టరేట్లోని కార్యాలయాల కార్యకలాపాలు, అధికారుల విధులపై అవగాహన కల్పించారు. ఇక ఖమ్మం మోమినాన్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ పరిశీలించి మాట్లాడారు. పిల్లల్లో సామాజిక చైతన్యం కలిగించేలా వివిధ కార్యక్రమాలను నో బ్యాగ్ డే రోజున నిర్వహించాలని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో డీఈఓ నాగపద్మజ, ఎంఈఓ శైలజాలక్ష్మి, హెచ్ఎంలు, ఉపాధ్యాయులు శ్రీమన్నారాయణ, ఏ.రమాదేవి, శారద, డోరిస్, శైలజ, మాధవి, దాస్, వెంకటేశ్వర్లు, నగేష్, నాగులు, పుల్లయ్య, ఆదర్శ్కుమార్, పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు కట్టా శేఖర్రావు తదితరులు పాల్గొన్నారు.ప్రభుత్వ పాఠశాలల్లో ‘నో బ్యాగ్ డే’ మా పాఠశాలలో ఆకులతో రకరకాల పక్షులు, జంతువుల బొమ్మలను తయారు చేయడాన్ని టీచర్లు నేర్పించారు. అంతేకాక అందరం కలిసి మైదా పిండితో వినాయక విగ్రహాలను తయారు చేశాం. బ్యాగ్ లేకుండా వచ్చిన మాకు కొత్త విషయాలు నేర్పించారు. – బి.సాకేత్, 4వ తరగతి, బీ.కే.బజార్ స్కూల్మా పాఠశాలలో నో బ్యాగ్ డే ను నిర్వహించారు. రోజంతా వివిధ రకాల కార్యక్రమాలను నిర్వహించడంతో అందరం ఆనందంగా పాల్గొన్నాం. ఉపాధ్యాయులు స్పెల్ బీ పోటీలు నిర్వహించారు. అలాగే, మట్టితో గణపతి విగ్రహాల తయారీని నేర్పించారు. – హేమలత, పదో తరగతి, శాంతినగర్ హైస్కూల్, ఖమ్మం -
పేద ప్రజల గొంతుక.. సురవరం
ఖమ్మంమయూరిసెంటర్: పేద, కార్మిక వర్గాల సమస్యలను చట్టసభల్లోనే కాక పలు వేదికలపై వినిపించిన సురవరం సుధాకర్రెడ్డి ప్రజల గొంతుకగా నిలిచారని సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి జమ్ముల జితేందర్రెడ్డి తెలిపారు. సీపీఐ జాతీయ నాయకుడు, మాజీ ఎంపీ సుధాకర్రెడ్డి మృతి చెందగా, ఆయన సంతావసభ శనివారం ఖమ్మంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా సురవరం చిత్రపటానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించాక జితేందర్రెడ్డి మాట్లాడారు. పార్లమెంటరీ వ్యవస్థలో గొప్పవిగా చెప్పుకునే 18ఏళ్లకే ఓటు హక్కు, సమాచార హక్కుచట్టం, ఉపాధి హామీ పథకం సాధనలో సురవరం కీలక భూమిక పోషించారన్నారు. ఖమ్మం జిల్లాతో ఆయనకు ప్రత్యేక అనుబంధం ఉందని గుర్తుచేశారు. ఈ సభలో పార్టీ రాష్ట్ర సమితి సభ్యుడు సిద్దినేని కర్ణకుమార్, నాయకులు శింగు నర్సింహారావు, పోటు కళావతి, పగడాల మల్లేష్, మేకల శ్రీనివాసరావు, పుచ్చకాయల కమలాకర్, వై.సాంబశివరెడ్డి, కూచిపుడ్డి రవి, నూనె శశిధర్, వరద నర్సింహారావు, ఎస్.కే.సైదా తదితరులు పాల్గొన్నారు. అలాగే ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యాన ప్రియదర్శిని డిగ్రీ కళాశాలలో సురవరం సంతాప సభ నిర్వహించగా నాయకులు రావి శివరామకృష్ణ, ఇటికాల రామకృష్ణ, జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్, ప్రిన్సిపాల్ రామారావు పాల్గొన్నారు. పలువురు నేతల నివాళి ఖమ్మం వైరారోడ్: సీపీఐ జాతీయ నేత సురవరం సుధాకర్రెడ్డి మృతిపై వివిధ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు సంతాపం ప్రకటించారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీలు రామసహాయం రఘురాంరెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్, మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావుతో పాటు నాయకులు తాతా మధుసూదన్, బాగం హేమంతరావు, దండి సురేష్, మహ్మద్ మౌలానా, పోటు రంగారావు, నున్నా నాగేశ్వరరావు వేరువేరు ప్రకటనల్లో సంతాపం తెలిపారు.సంతాపసభలో సీపీఐ నాయకులు -
పుస్తకాలు వదిలి.. పాఠశాలకు కదిలి
ఖమ్మం సహకారనగర్: ప్రతీనెల నాలుగో శనివారం ‘నో బ్యాగ్ డే’ అమలు చేయాలన్న ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ ఆదేశాలతో.. ప్రభుత్వ పాఠశాలల్లో ఈ వారం కార్యక్రమం మొదలైంది. ఈ సందర్భంగా అన్ని పాఠశాలల విద్యార్థులు బ్యాగ్లు లేకుండానే వచ్చారు. ఈ మేరకు పాఠశాలల్లో విద్యార్థులకు చిత్రలేఖనం, క్విజ్, వ్యాసరచన, కవితల పోటీలు నిర్వహించి విజేతలను అభినందించారు.మట్టితో గణపతి ప్రతిమలు, ఆకులు, పేపర్లతో కళారూపాల తయారీ, పర్యావరణ పరిరక్షణ అంశాలపై ఉపాధ్యాయులు అవగాహన కల్పించారు. పుస్తకాలు లేకుండా రావడం.. రోజంతా ఆటపాటలు నిర్వహించడంతో విద్యార్థులు ఉత్సాహంగా గడిపారు. కలెక్టర్ అనుదీప్ పలు పాఠశాలల్లో కార్యక్రమాన్ని పరిశీలించడమే కాక.. కొన్ని పాఠశాలల విద్యార్థులను కలెక్టరేట్కు పిలిపించి కార్యాలయ కార్యకలాపాలపై అవగాహన కల్పించారు. -
సర్వేలతోనే సరి..
● వసతిగృహాలు, గురుకులాల్లో పరిష్కారం కాని సమస్యలు ● నిధులు లేక మరమ్మతుకు నోచుకోని భవనాలు ● గిరిజన శాఖలో మెస్ బిల్లులు రాక ఏడు నెలలు ● మరోసారి సర్వేకు సిద్ధమవుతున్న యంత్రాంగం ఖమ్మంమయూరిసెంటర్: ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలు, గురుకులాల్లో విద్యార్థుల సమస్యలు పరి ష్కారం కావడం లేదు. అధికారులు సర్వేల పేరుతో కాలం గడుపుతూ నిమ్మకు నీరెత్తినట్లు వ్య వహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. గత నెల 29, 30వ తేదీల్లో జిల్లాలోని అనేక సంక్షేమ వసతిగృహాలు, గురుకులాలను అధికారులు సందర్శించా రు. అక్కడి సమస్యలను గుర్తించి ఉన్నతాధికారులకు నివేదికలు సమర్పించారు. అయినా ఇప్పటికీ వీటిని పరిష్కరించకపోగా వసతిగృహాల సంక్షేమ అధికారులకు మెమోలు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. మళ్లీ మరోసారి సర్వేకు సిద్ధమవుతుండడంతో పరిష్కారం ఎప్పుడు జరుగుతుందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అన్నీ సమస్యలే.. ప్రభుత్వం పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలనే ఉద్దేశంతో సంక్షేమ వసతిగృహాలు, గురుకులాలను ఏర్పాటు చేసింది. కానీ, నిర్వహణలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందనే విమర్శలు పెరుగుతున్నాయి. విద్యార్థులకు కనీస సౌకర్యాలు లేక ఇబ్బంది పడుతున్నారు. మరుగుదొడ్ల నిర్వహణ సరిగా లేకపోవడం, తాగునీటి సౌకర్యాలు లేకపోవడం, గదులు ఇరుకుగా ఉండడం తదితర సమస్యలు వేధిస్తున్నాయి. దాటవేత ధోరణి గత నెలలో అధికారులు వసతి గృహాలను, గురుకులాలను పరిశీలించగా గుర్తించిన సమస్యలపై జిల్లా అధికారులకు నివేదికలు అందజేశారు. చాలా వసతిగృహాలకు డోర్లు, మెష్ డోర్లు, కిటికీలకు తలుపులు, బాత్రూమ్లు సరిగ్గా లేకపోవడం, తాగునీరు అందకపోవడాన్ని గుర్తించారు. వీటి పరిష్కారానికి ఎటువంటి చర్యలు తీసుకోలేదు. కానీ, మరోమారు ఈ నెల 21, 22వ తేదీల్లో సర్వే చేయించడం గమనార్హం. గతంలో గుర్తించిన సమస్యలను పక్కనపెట్టి మరోమారు సర్వేతో ప్రయోజనం ఏమిటని విద్యార్థి సంఘాల నాయకులు, తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. ప్రతిపాదనలు బుట్టదాఖలే.. జిల్లాలోని బీసీ వసతిగృహాల్లో మరమ్మతుల కోసం రూ.20.10 లక్షలు అవసరమని అధికారులు ప్రతిపాదించారు. అలాగే గిరిజన సంక్షేమ శాఖ వసతిగృహాల్లోనూ సమస్యలు వేధిస్తున్నాయి. మధిరలోని ఎస్టీహెచ్ (షెడ్యూల్డ్ ట్రైబ్ హాస్టల్), ముదిగొండ మండలం వల్లభిలోని ఆశ్రమ పాఠశాల, తిమ్మారావుపేట ఎస్టీహెచ్, ఖమ్మం, ఖమ్మంరూరల్ పోస్ట్మెట్రిక్ కాలేజీల్లో పూర్తిస్థాయి మరమ్మతులు చేయించేందుకు ప్రతిపాదనలు చేశారు. ఎస్సీ వసతి గృహాల్లో కూడా వసతులు సక్రమంగా లేవు. జిల్లాలోని 52 వసతిగృహాల్లో మరమ్మతులకు రూ.2,42,11,000 అవసరమని ప్రతిపాదిస్తే ఇవన్నీ బుట్టదాఖలయ్యాయే తప్ప ఒక్క రూపాయి మంజూరు కాలేదు. బిల్లులు అందక ఏడు నెలలు.. వసతిగృహాల మరమ్మతులకు నిధులు లేక కునారిల్లుతుంటే.. మరోపక్క విద్యార్థుల మెస్ బిల్లులు కూడా రావడం లేదని తెలుస్తోంది. గిరిజన సంక్షేమ శాఖకు సంబంధించిన వసతిగృహాలకు ఫిబ్రవరి నుంచి బిల్లులు పెండింగ్ ఉన్నాయి. దీంతో విద్యార్థులకు భోజనం అందించడంలో ఇక్కట్లు ఎదురవుతున్నాయని తెలుస్తోంది. మెస్ బిల్లులు రాక.. వసతిగృహాల మరమ్మతులకు నిధులు రాక వసతిగృహాల సంక్షేమ అధికారులు ఇబ్బంది పడుతున్నారనే చర్చ జరుగుతోంది. ప్రభుత్వ సంక్షేమ వసతిగృహా లు, గురుకులాల్లో అవసరమైన మరమ్మతులు వెంటనే చేయించాలి. చాలా భవనాలు శిథిలా వస్థకు చేరాయి. అధికారుల సర్వేల్లో లోపాలను గుర్తించి నివేదికలు ఇచ్చినా చర్యలు తీసుకోలేదు. ప్రభుత్వం ఇప్పటికై నా నిధులు మంజూరు చేసి మరమ్మతులు చేయించాలి. –టి.ప్రవీణ్, జిల్లా కార్యదర్శి, ఎస్ఎఫ్ఐ సంక్షేమ వసతిగృహాలు, గురుకులాలు సమస్యలకు నిలయాలుగా మారుతున్నాయి. మర మ్మతులు చేపట్టక భవనాలు శిథిలమయ్యాయి. ఇకనైనా ప్రత్యేక నిధులు కేటాయించి మరమ్మతులు పూర్తి చేయించాలి. కొన్నిచోట్ల టాయిలెట్లు బాగా లేవని తెలిసినా అధికారులు పట్టించుకోకపోవడం సరికాదు. –వి.వెంకటేశ్, జిల్లా కార్యదర్శి, పీడీఎస్యూ -
చికిత్స పొందుతున్న వ్యక్తి మృతి
చింతకాని: మండలంలోని సీతంపేటకు చెందిన మేడ వెంకయ్య (49) ఇటీవల పురుగులమందు తాగగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం పురుగుల మందు తాగగా కుటుంబీకులు ఖమ్మం ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడే చికిత్స పొందుతూ మృతి చెందడంతో వెంకయ్య కుమారుడు జాషువా ఫిర్యాదు మేరకు శుక్రవారం కేసు నమోదు చేశామని ఎస్ఐ నాగుల్మీరా తెలిపారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి.. రఘునాథపాలెం: మండలంలోని చింతగుర్తి సమీపాన గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. పంగిడికి చెందిన అజ్మీరా రాందాస్ (35) ఖమ్మం నుంచి స్వగ్రామానికి వెళ్తుండగా నియంత్రణ తప్పి రోడ్డు పక్కన చెట్టును ఢీకొనడంతో తీవ్రగాయాల పాలై అక్కడికక్కడే మృతి చెందాడు. రాందాస్ భార్య స్వరూప ఫిర్యాదుతో శుక్రవారం కేసు నమోదు చేసినట్లు సీఐ ఉస్మాన్ షరీఫ్ తెలిపారు. చికిత్స పొందుతున్న మహిళ.. కూసుమంచి: మండలంలోని గోపాలరావుపేటకు చెందిన కుమ్మరికుంట్ల ఉమారాణి (25) ఈ నెల 3వ తేదీన భర్తతో గొడవపడి గడ్డిమందు తాగింది. ఆమెను ఖమ్మం ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందింది. ఉమారాణి తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని ఎస్ఐ నాగరాజు తెలిపారు. కట్లేరులో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం ఎర్రుపాలెం: మండలంలోని కట్లేరు ప్రాజెక్టు వద్ద గుర్తు తెలియని పురుషుడి(45) మృతదేహాన్ని శుక్రవారం గుర్తించారు. మృతదేహంపై దుస్తులు లేవని, ఆయన ఆచూకీ తెలిసిన వారు 87126 59164, 87126 59165 నంబర్లకు సమాచారం ఇవ్వాలని ఎస్సై రమేష్కుమార్ సూచించారు. కాగా, మృతదేహాన్ని మధిర ప్రభుత్వాస్పత్రికి తరలించినట్లు తెలిపారు. జ్వరంతో విద్యార్థులకు అస్వస్థత..సత్తుపల్లి: సత్తుపల్లి మై నార్టీ గురుకుల పాఠశాల విద్యార్థులు జ్వరా ల బారిన పడ్డారు. రెండు రోజులుగా జ్వరాలతో బాధపడుతున్న తొ మ్మిది మందిని శుక్రవా రం సత్తుపల్లి ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. అయితే, ఆస్పత్రిలో బెడ్లు సరి పడా లేక ఒక్కో పడకపై నలుగురికి చికిత్స అందిస్తున్నారు. కాగా, గంగారం పీహెచ్సీ ఆధ్వర్యాన మూడు రోజులుగా మైనార్టీ పాఠశాలలో వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు వైద్యాధికారి ఆర్.అవినాష్ తెలిపారు. అయితే, రెండురోజులుగా జ్వరాలతో బాధపడుతున్న విద్యార్థులను ఇళ్లకు పంపించకుండా పాఠశాలలోనే ఉంచడంతో పలువురికి తీవ్రత పెరగగా.. ఇంకొందరికి జ్వరం సోకిందని తెలిసింది. బోనకల్ గురుకుల విద్యార్థినులకు.. బోనకల్: మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల విద్యార్ధిర్థిలు జ్వరాల బారిన పడ్డారు. సుమారు 20మంది జ్వరంతో బాధపడుతుండగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకురావడంతో వైద్యాధికారి స్రవంతి చికిత్స చేశారు. ఇటీవల కురిసిన వర్షాలతో పాఠశాల ఆవరణలో నీరు నిలవగా దోమలు పెరిగి విద్యార్థినులు జ్వరాల బారిన పడినట్లు తెలిసింది. ప్రభుత్వాస్పత్రిలో కొనసాగుతున్న చికిత్స -
పత్తి కొనుగోళ్లలో సీసీఐ కొత్తపంథా
● ‘కాపాస్ కిసాన్’ పేరిట ప్రత్యేక యాప్ ● యాప్లో రిజిస్ట్రేషన్తో సీసీఐ కేంద్రాల్లో మద్దతు ధరఖమ్మంవ్యవసాయం: పత్తి కొనుగోళ్లలో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) ఈసారి నూతన విధానం అమలుచేయనుంది. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర అందించేలా సీసీఐ ‘కాపాస్ కిసాన్’ యాప్ను రూపొందించింది. ఈ యాప్లో రైతులు రిజిస్ట్రేషన్ చేయించకుంటేనే సీసీఐ కేంద్రాల్లో పంట విక్రయించే అవకాశం ఏర్పడుతుంది. ఈనెల 30 నుంచి గుగూల్ ప్లే స్టోర్, యాపిల్ ఐఓఎస్ స్టోర్లో యాప్ అందుబాటులోకి రానుంది. ఈమేరకు రైతులు యాప్ డౌన్లోడ్ చేసుకుని భూమి పత్రాలు, పత్తి సాగు చేసినట్లు రెవెన్యూ శాఖ ధ్రువీకరణ, ఆధార్ కార్డులతో సెప్టెంబర్ 1నుంచి 30వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. పారదర్శకత, మద్దతు ధర కేంద్ర ప్రభుత్వం పత్తికి నిర్ణయించిన మద్దతు ధర రైతులకు దక్కేలా సీసీఐ నూతన విధానం అమలుకు చర్యలు చేపట్టింది. గతంలో అనుసరించిన విధానంలో కేంద్రం నిర్ణయించిన మద్దతు ధర ఎక్కువగా దళారులే దక్కించుకున్నారనే విమర్శలు వచ్చాయి. రైతుల నుంచి దళారులు కొనుగోలు చేసి బినామీల పేరిట పత్రాలతో సీసీఐ కేంద్రాల్లో అమ్ముతూ మద్దతు ధర పొందారనే ప్రచారం జరిగింది. ఈ నేపథ్యాన నూతన విధానానికి శ్రీకారం చుట్టారు. ఫలితంగా క్వింటా పత్తికి నాణ్యత ఆధారంగా కేంద్రం ప్రకటించిన మద్దతు ధర గరిష్టంగా రూ. 8,110 రైతులకే దక్కేలా ‘కాపాస్ కిసాన్’ యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చారు. -
పీఎం శ్రీ నిధులు సమర్థవంతంగా వినియోగించాలి
ఖమ్మం సహకారనగర్: జిల్లాలోని పీఎం శ్రీ పాఠశాలలకు కేటాయించిన నిధులను సమర్థవంతంగా వినియోగించుకుంటూ వసతులు కల్పించాలని అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ ఆదేశించారు. కలెక్టరేట్లో విద్యాశాఖ అధికారులతో శుక్రవారం సమావేశమైన ఆమె మాట్లాడారు. పీఎంశ్రీ నిధులతో చేపట్టిన పనులు, పాఠశాల నిర్వహణ గ్రాంట్ ద్వారా పూర్తిచేసిన పనులపై నివేదిక ఇవ్వాలని సూచించారు. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు దేశంలోని వివిధ ప్రాంతాల కళలు, సంస్కృతిపై అవగాహన కల్పించాలని తెలిపారు. డీఈఓ నాగ పద్మజ, ప్లానింగ్ కోఆర్డినేటర్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. లబ్ధిదారుల ఆమోదంతోనే పశువుల కొనుగోలు ఖమ్మంమయూరిసెంటర్: ఇందిరా మహిళా డెయిరీలో భాగంగా లబ్ధిదారుల ఆమోదంతో పాడి పశువులను కొనుగోలు చేయాలని అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ స్పష్టం చేశారు. కలెక్టరేట్లో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ మహిళా డెయిరీలో మొదటి విడతగా 125 మంది సభ్యులకు రెండేసి పాడి పశువులు కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు. ఇందుకోసం కమిటీ సభ్యులు లబ్ధిదారులతో నిర్దేశిత ప్రాంతాలకు వెల్లి పశువులు కొనుగోలు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో డీఆర్డీఓ సన్యాసయ్య, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ కె.నవీన్ బాబు, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ కస్తాల సత్యనారాయణ, అధికారులు పాల్గొన్నారు. అదనపు కలెక్టర్ డాక్టర్ శ్రీజ -
రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యంతోనే యూరియా కొరత
ఖమ్మంమయూరిసెంటర్ (ఖమ్మంమామిళ్లగూడెం): రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యంతోనే యూరియా కొరత ఏర్పడగా.. ఈ విషయాన్ని పక్కన పెట్టి కేంద్రంపై అసత్య ప్రచారాలు చేయడం సరికాదని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్రెడ్డి పేర్కొన్నారు. ఖమ్మంలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ సహజంగా ఆగస్టులో యూరియా అవసరం ఎక్కువగా ఉంటుందని తెలిపారు. అయినా అడిగినంత మేర కేంద్రం సరఫరా చేయలేదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు చెప్పడం గర్హనీయమని పేర్కొన్నారు. బ్లాక్ మార్కెట్ను నియంత్రించడంలో విఫలమైన రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై విమర్శలు చేయడాన్ని మాను కోవాలని సూచించారు. సమావేశంలో బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ, నాయకులు భూక్యా శ్యాంనాయక్, వేణుగోపాల్రెడ్డి, సంతోష్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీధర్రెడ్డి -
ఆక్రమిత స్థలాల స్వాధీనం
మధిర: మధిర మున్సిపాలిటీ పరిధిలోనిని హిందూ శ్మశాన వాటిక స్థలంతోపాటు ప్రభుత్వ డొంకలో ఆక్రమణకు గురైన ఖాళీ స్థలాలను రెవెన్యూ అధికారులు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. సర్వేనెంబర్ 425, 427, 429, 430లోని డొంక స్థలం, 424 సర్వే నంబర్లోనిహిందూ శ్మశాన వాటిక కొంత మేర ఆక్రమణకు గురికాగా సర్వే అనంతరం స్వాధీనం చేసుకుని మున్సిపాలిటీకి అప్పగించారు. ప్రభుత్వ డొంకలోఆరుగురు 3,245 గజాలను, శ్మశాన వాటికలో ఐదుగురు 2,158 గజాల ఖాళీ స్థలాన్ని ఆక్రమించినట్లు తేల్చారు. అలాగే, శ్మశాన వాటికలోని కొంత స్థలాన్ని ఆక్రమించుకుని నివసిస్తున్న పేదలకు బీపీఎల్ కోటాలో రెగ్యులరైజేషన్కు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇక ఓ పాఠశాల యజమాని ప్రభుత్వ డొంకలో 2,040 గజాలు, శ్మశాన వాటికలో 370 గజాలు, మరో పాఠశాల యజమాని 705 గజాల స్థలాన్ని ఆక్రమించినట్లు తేల్చగా, ఇంకో కాంట్రాక్టర్ 450 గజాల స్థలాన్ని ఆక్రమించి ఇళ్లు నిర్మించినట్లు గుర్తించారు. ఈమేరకు ఆక్రమణదారులకు నోటీసులు ఇవ్వనున్నట్లు తహసీల్దార్ తెలిపారు. అయితే, వారు కోర్టుకు వెళ్లగా అప్పీల్ చేసుకునే అవకాశం కల్పించారు. -
ఐడియాథాన్లో మెరిసిన డిగ్రీ కళాశాల విద్యార్థినులు
కొణిజర్ల: హైదరాబాద్లో డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ తెలంగాణ(డీఈఈటీ) ఆధ్వర్యాన నిర్వహించిన ఐడియాథాన్లో కొణిజర్ల మండలం తనికెళ్లలోని తెలంగాణ గిరిజన సంక్షేమ మహిళా డిగ్రీకళాశాల విద్యార్థినులు సత్తాచాటారు. కళాశాలకు చెందిన ఎం.విజయలక్ష్మి, కీర్తన, దివ్య ‘కవచ్’ పేరుతో అనారోగ్యంతో ఉన్నప్పుడు హెచ్చరికలు జారీచేసే రిస్ట్బ్యాండ్ను, కొత్తప్రాంతాల్లో చిరునామా తెలు సుకునేలా ‘ఏకం’ పేరిట ‘వాయిస్ అసిస్టెంట్ ఫర్ ద పీపుల్ బై ట్రావెలింగ్’ లొకేషన్ మ్యాప్ ను సీహెచ్.కావ్య, ఐశ్వర్య, శరణ్య ప్రదర్శించా రు. ఈ ఆవిష్కరణలను అభినందించిన న్యా యనిర్ణేతలు విద్యార్థినులకు టాప్–25 జాబితా లో చోటు కల్పించారు. విద్యార్థినులను కళాశా ల ప్రిన్సిపాల్ కె.రజని, వైస్ ప్రిన్సిపాల్ ఎం. నవ్య, కోఆర్డినేటర్లు కే.పీ.ఐశ్వర్య, దీప్తి, అధ్యాపకులు అభినందించారు. గొల్లపూడి జీపీ కార్యదర్శి సస్పెన్షన్ రూ.2 లక్షల దుర్వినియోగంతో చర్యలు వైరారూరల్: వైరా మండలంలోని గొల్లపూడి గ్రామపంచాయతీ కార్యదర్శిని సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. గొల్లపూడి పరిధిలో సీసీరోడ్లు తదితర అభివృద్ధి పనులకు సంబంధించి రూ.7 లక్షల నగదు ఎన్ఆర్ఈజీఎస్ ఖాతాలో జమ కాగా ఆ నిధులను డ్రా చేసి పంచాయతీ ఖాతాలో జమ చేయాల్సి ఉంది. కానీ పంచాయతీ కార్యదర్శి తోట సునీత రూ.7 లక్షలు డ్రా చేసినా జీపీ ఖాతాలో రూ.5 లక్షలే జమచేసింది. దీంతో విచారణ చేపట్టగా రూ.2 లక్షల నగదు దుర్వి నియోగమైనట్లు తేలడంతో సునీతను సస్పెండ్ చేశారు. అలాగే, పంచాయతీ ప్రత్యేకాధికారి, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ కృష్ణచైతన్యకు షోకాజ్ నోటీసు జారీ చేశారు. స్పెషల్ డ్రైవ్లో 55 మోటార్సైకిళ్లు సీజ్తల్లాడ: తల్లాడలో పోలీసులు శుక్రవారం వాహన తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా హెల్మెట్ లేకుండా వాహనాలు నడుతుపుతున్న 55 మంది మోటార్ సైకిళ్లను సీజ్ చేసినట్లు ఎస్ఐ వెంకటకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ.. ద్విచక్ర వాహనదారులు తప్పక హెల్మెట్ ధరించడమే కాక అన్ని పత్రాలు వెంట ఉంచుకోవాలని సూచించారు. పరిసరాల పరిశుభ్రత తప్పనిసరితల్లాడ: ప్రజలు ఇళ్లలోనే కాక పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, తద్వారా వ్యాధులు దరిచేరవని జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి చందునాయక్ తెలిపారు. తల్లాడ పీహెచ్సీని శుక్రవారం తనిఖీ చేసిన ఆయన మండలంలోని మిట్టపల్లిలో ఫీవర్ సర్వేనుపరిశీలించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ వర్షాలు కురుస్తున్నందున వైద్య సిబ్బంది, అంగన్వాడీ కార్యకర్తలు, గ్రా మపంచాయతీ సిబ్బంది సమష్టిగా పారిశుద్ధ్య సమస్య ఏర్పడకుండా చూడాలని తెలిపారు. ఇదేసమయాన ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. వైద్యులు మౌనిక, గోపి, ఉద్యోగులు నవీన్కుమార్, కె.పెద్దపుల్లయ్య, రామ, రాజశ్రీ, పద్మ పాల్గొన్నారు. కమిషనర్ వచ్చారు.. వెళ్లారు!వైరా: వైరా మున్సిపల్ కమిషనర్ బదిలీ వ్యవహారంలో హైడ్రామా నెలకొంది. ఇక్కడ కమిషనర్గా పనిచేస్తున్న చింతా వేణునునల్లగొండ జిల్లా నందికొండకు, అక్కడి కమిషనర్ యు.గురులింగంను వైరాకు బదిలీ చేస్తూ ఇటీవల ఉత్తర్వులు విడుదలయ్యాయి. దీంతో గురులింగం శుక్రవారం బాధ్యతలు స్వీకరించాక ఎమ్మెల్యే మాలోత్ రాందాస్నాయక్ను కలిసేందుకు కారేపల్లి వెళ్లారు. అయితే, పలువురు కాంగ్రెస్ నాయకులు కమిషనర్గా వేణునే కొనసాగించాలని ఎమ్మెల్యేను కోరడంతో ఆయన గురులింగంను రెండు నెలలు ఆగాక రావాలని సూచించినట్లు సమాచారం. దీంతో వేణు బదిలీ ఆగిపోగా, గురులింగం అసంతృప్తితో వెనుదిరిగినట్లు తెలిసింది. కారణాలు ఏమైనా కమిషనర్ల బదిలీ ఆగిపోవడం చర్చనీయాంశంగా మారింది. -
ఇనుప గేట్ల చోరీ నిందితుల అరెస్టు
తిరుమలాయపాలెం: మండలంలోని గోల్తండా సమీపాన ఈ నెల 7న వ్యవసాయక్షేత్రంలో ఇనుప గేట్లను చోరీ చేసిన ముగ్గురిని శుక్రవారం పోలీసులు అరెస్టు చేశారు. ఖమ్మం వికలాంగుల కాలనీకి చెందిన ధనగుల కోటేశ్వరరావు, ఆయన భార్య రేణుక, బంధువు సుజాత కలిసి టాటా ఏస్ వాహనంలో గేట్లను తీసుకెళ్తూ ఎదుళ్లచెరువు సమీపాన పొదల్లో దాచారు. శుక్రవారం వీటిని వాహనంలో తరలిస్తుండగా పిండిప్రోలు వద్ద వాహన తనిఖీల్లో పట్టుబడ్డారని పోలీసులు తెలిపారు.సెంట్రింగ్ షీట్ల చోరీ కేసులో ముగ్గురు.. ఖమ్మంఅర్బన్: సెంట్రింగ్ షీట్ల చోరీ కేసులో ముగ్గురిని ఖానాపురం హవేలీ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. ఖమ్మం అర్బన్ మండలం గొల్లగూడెం రోడ్డులో గురువారం తనిఖీ చేస్తుండగా వాహనంలో భవన నిర్మాణ పనులకు వినియోగించే రూ.40 వేల విలువైన 30 సెంట్రింగ్ షీట్లు లభించాయి. అందులో ఉన్న చింతకాని మండలానికి చెందిన అరవింద్, ఎస్.వీరబాబు జి.గోపిని విచారించగా చోరీని అంగీకరించారు. గతంలోనూ వీరిపై చోరీ కేసులు ఉన్నందున కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించామని పోలీసులు తెలిపారు. ట్రాక్టర్ ట్రక్కుల దొంగ..చింతకాని: చింతకాని, కొణిజర్ల మండలాల్లో ట్రాక్టర్ ట్రక్కులను చోరీ చేసిన ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి మండలం డబ్బాకుపల్లి గ్రామా నికి చెందిన చింతల నరేంద్రను చింతకాని పోలీసు లు శుక్రవారం అరెస్ట్ చేశారు. ఎస్ఐ నాగుల్మీరా కథనం మేరకు.. బోనకల్ మండలం గోవిందాపురం(ఎల్)కు చెందిన ధర్మపురి పుల్లారావు ట్రాక్టర్ను తన స్నేహితుడైన చింతకాని మండలం ప్రొద్దుటూరు వాసి పాసంగులపాటి విష్ణువర్ధన్కు ఇచ్చా డు. అక్కడ ఈ నెల 15న ట్రక్కు చోరీ జరిగింది. పోలీసులు దర్యాప్తు చేస్తుండగా, మత్కేపల్లి క్రాస్ వద్ద గురువారం చేపట్టిన తనిఖీల్లో బోనకల్ వైపు నుంచి ఖమ్మం వైపు వెళ్తున్న ట్రాక్టర్ను ఆపేందుకు ప్రయత్నించారు. అయితే, పోలీసులను చూసి వెనక్కి తిప్పుకునే క్రమంలో అడ్డుకోగా, చింతల నరేంద్ర, ఆయన స్నేహితుడు మువ్వల ఉదయ్ కిరణ్తో కలిసి ప్రొద్దుటూరులో రెండు, కొణిజర్ల మండలం పెద్దమునగాలలో ట్రక్కును చోరీ చేసినట్లు అంగీకరించాడు. రూ.4.60 లక్షల విలువైన ట్రక్కులు స్వాధీనం చేసుకుని నరేంద్రను అరెస్ట్ చేశామని, ఉదయ్ పరారీలో ఉన్నాడని ఎస్ఐ తెలిపారు. సమావేశంలో ఎస్ఐ–2 సారయ్య, ఏఎస్సైలు సువర్ణబాబు, లక్ష్మణ్చౌదరి పాల్గొన్నారు. కృత్రిమ మేథకు బానిసలుగా మారొద్దు ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు ఖమ్మం సహకారనగర్: విద్యాభివృద్ధి, సమాజాభివృద్ధిలో కీలకంగా నిలవాల్సిన విద్యార్థులు కృత్రిమ మేధకు బానిసలుగా మారొద్దని ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు సూచించారు. ఖమ్మంలోని ఎస్టీఐటీ కళాశాలలో శుక్రవారం నిర్వహించిన ఓరియెంటేషన్ కార్యక్రమంలో ఆయ న పాల్గొన్నారు. కృత్రిమ మేధను అవసరానికి విని యోగించుకోవాలే తప్ప పూర్తిగా ఆధారపడొద్దని తెలిపారు. అలాగే, మంచి అలవాట్లు, నిరంతరం అభ్యాసంతో ఫలితాలు సాధించాలని చెప్పారు. అనంతరం కళాశాల చైర్మన్ గుండాల కృష్ణ, సెక్రటరీ, కరస్పాండెంట్ జి.ధాత్రి మాట్లాడగా అకడమిక్ డైరెక్టర్లు గుండాల ప్రవీణ్కుమార్, గంధం శ్రీని వాసరావు, శివప్రసాద్, జె.రవీంద్రబాబు, ప్రిన్సిపాల్ రాజ్కుమార్, అధ్యాపకులు పాల్గొన్నారు. ‘భగీరథ’ సిబ్బంది విధుల బహిష్కరణనేలకొండపల్లి/వైరా: మూడు నెలలుగా వేతనాలు అందనందున శుక్రవారం అర్ధరాత్రి నుంచి విధులు బహిష్కరిస్తున్నట్లు మిషన్ భగీరథ కార్మికులు ప్రకటించారు. మిషన్ భగీరథ ద్వారా నీటి సరఫరాలో ఫిట్టర్లు, ఎలక్ట్రీషియన్లు, పంపు ఆపరేటర్లు, వాల్ ఆపరేటర్లు, హెల్పర్లు కలిపి 463 మంది విధులు నిర్వర్తిస్తున్నారు. వీరికి మూడు నెలలుగా రూ.3 కోట్ల మేర వేతనం బకాయి ఉంది. ఈ విషయమై 12న అధికారులతో జేఏసీ నాయకులు చర్చిస్తే 21లోగా వేతనాలు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. అయినా ఫలితం లేక శుక్రవారం అర్ధరాత్రి నుంచి విధులు బహిష్కరణకు తీర్మానించారు. దీంతో శనివారం నుంచి జిల్లాలో తాగునీటి సరఫరాలతో సమస్య ఎదురవుతాయని భావిస్తున్నారు. కాగా, విధుల బహిష్కరణ విషయాన్ని జేఏసీ నాయకుడు మద్దెల రవి వెల్లడించారు. -
డేంజర్.. యమడేంజర్
హడలెత్తిస్తున్న రద్దీ, వేగం రోడ్లపై వాహనాల రద్దీకి తోడు పలువురు వాహనదారులు విపరీతమైన వేగంగా వెళ్తుండడం.. రహదారులపై గుంతలు ప్రమాదాలకు కారణమవుతున్నాయి. జాతీయ, రాష్ట్రీయ, ఇతర ప్రధాన రహదారులపై ప్రమాదాల సంఖ్య గణనీయంగా పెరిగింది. హైవేలపై నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తుండడం, కొందరు మద్యం మత్తులో వాహనాలు నడుపుతుండడం ప్రమాదాలకు కారణమవుతోంది. వీటికి తోడు మూలమలుపులు, గుంతలు పడిన చోట ప్రమాదాలు నిత్యకృత్యమయ్యాయి. ఇక ఎక్కడైనా వాహనాలు బ్రేక్ డౌన్ అయినప్పుడు రాత్రివేళ ఇవి కనిపించక ఇతర వాహనదారులు ఢీకొడుతుండడంతో రహదారులు రక్తమోడుతున్నాయి. వందల్లో మృతులు ఈ ఏడాది ఏడు నెలల్లో 607 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ప్రమాదాల బారిన వాటిలో అన్ని రకాల వాహనాలు ఉండగా.. 225 మంది మృతి చెందడమే కాక 526 మంది గాయపడ్డారు. ఇందులో కేవలం ద్విచక్రవాహన ప్రమాదాలు 150 ఉన్నాయని, ఈ ప్రమాదాల్లో 69 మంది మృతి చెందినట్లు నివేదికలు చెబుతున్నాయి. రోడ్డుపై వాహనదారులు వేగ నియంత్రణ పాటించకపోవడం.. ప్రధానంగా ద్విచక్ర వాహనదారుల నిర్లక్ష్యంతో ప్రమాదాలు జరుగుతున్నాయనే వాదన ఉంది. శాఖల సమన్వయంతో.. జిల్లాలో రోడ్డు ప్రమాదాలకు కారణాలు, నియంత్రణపై పోలీస్, పంచాయతీ రాజ్, రవాణా, రెవెన్యూ, ఎన్హెచ్ఏఐ, ఆర్అండ్బీ అధికారులు సమీక్షించారు. ప్రమాదాల సంఖ్య గణనీయంగా తగ్గించేలా క్షేత్రస్థాయిలో సమష్టిగా కృషి చేయాలని నిర్ణయించారు. రాత్రి వేళ పోలీస్ శాఖ ఆధ్వర్యాన డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు ముమ్మరం చేస్తూ పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. మరోపక్క ఇతర శాఖలు కూడా తమ పరిధిలో చర్యలు చేపట్టారు. అక్కడే అత్యధికంగా.. జిల్లా రోడ్డు భద్రతా కమిటీ ప్రమాదాల సంఖ్య ఎక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించింది. ఇందులో 43 ప్రాంతాలను బ్లాక్స్పాట్లుగా గుర్తించారు. వీటిలో 33 ప్రాంతాలు జాతీయ రహదారులపైనే ఉండడం గమనార్హం. ఖమ్మంరూరల్ మండలంలో ఏడు, కొణిజర్ల మండలంలో ఆరు, సత్తుపల్లి, వైరా మండలాల్లో నాలుగు చొప్పున బ్లాక్స్పాట్లను గుర్తించారు. ఇక్కడ వేగ నియంత్రికలు, సూచిక బోర్డులను ఏర్పాటు చేస్తున్నారు. అలాగే, జాతీయ, రాష్ట్ర, ఇతర ప్రధాన రహదారులకు గ్రామాలు, ఇతర ప్రాంతాల రోడ్లు అనుసంధానమయ్యే చోట వేగనియంత్రికలు ఏర్పాటుచేశారు. అంతేకాక హెచ్చరిక బోర్డులు, దారి మలుపులను తెలిపే సూచిక బోర్డులు, ట్రాఫిక్ సిగ్నళ్లు సైతం ఏర్పాటయ్యాయి.జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. నిత్యం డ్రంకెన్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేయిస్తున్నాం. అలాగే ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో అన్ని శాఖల సమన్వయంతో హెచ్చరికల బోర్డులు ఏర్పాటుచేయించాం. ద్విచక్ర వాహనదారులే ఎక్కువగా ప్రమాదాల బారిన పడుతున్నందున హెల్మెట్ తప్పనిసరి ధరించేలా తనిఖీల్లో సూచనలు చేస్తున్నాం. అలాగే, జాతీయ రహదారులపై వెళ్లేవారు వేగనియంత్రణ పాటిస్తే ప్రమాదాల సంఖ్య తగ్గుతుంది. – సునీల్దత్, పోలీసు కమిషనర్ఈ ఏడాది ఏడు నెలల్లో 607 రోడ్డు ప్రమాదాలు -
బియ్యం పంపిణీకి సిద్ధం
ఖమ్మం సహకారనగర్: రేషన్షాపుల ద్వారా సన్నబియ్యం పంపిణీ వచ్చే నెల నుంచి యథావిధిగా మొదలుకానుంది. వర్షాలు, వరదల ప్రభావంతో ఇబ్బందులు ఎదురుకాకుండా జూన్, జూలై, ఆగస్టు కోటాను జూన్ నెలలోనే పంపిణీ చేసిన విషయం విదితమే. ఇక సెప్టెంబర్ కోటాను అదే నెల 1వ తేదీ నుంచి పంపిణీ చేసేలా పౌరసరఫరాల శాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఒక్కో లబ్ధిదారుడికి ఆరు కిలోల చొప్పున సన్నబియ్యాన్ని ఉచితంగా పంపిణీ చేయనున్నారు. దుకాణాలకు సరఫరా జిల్లాలో వచ్చేనెల 1వ తేదీ నుంచి బియ్యం పంపిణీ మొదలుకానుంది. దీంతో ఇప్పటికే ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి రేషన్ దుకాణాలకు బియ్యం సరఫరా చేస్తున్నారు. జిల్లాలో 748 రేషన్ షాప్లు ఉండగా.. ఇప్పటి వరకు 150దుకాణాల వరకు బియ్యం చేరవేశామని అధికారులు తెలిపారు. కొత్తగా 41,615 రేషన్కార్డులు ప్రజాపాలన సభల్లో స్వీకరించిన దరఖాస్తులకు తోడు మీ సేవ కేంద్రాల ద్వారా అందిన దరఖాస్తుల ఆధారంగా అర్హులకు కొత్తగా రేషన్కార్డులు మంజూరు చేస్తున్నారు. ఇదేసమయాన కార్డుల్లో కొత్త పేర్లు సైతం నమోదు చేశారు. జిల్లాలోని 21 మండలాల పరిధిలో ఈ ఏడాది జనవరి 1 నుంచి ఇప్పటి వరకు 41,615 కార్డులు జారీ చేయగా, 1,42,601 లబ్ధిదారులకు లబ్ధి జరిగింది. మే నెల వరకు కార్డులు అందిన వారికి మూడు నెలల బియ్యాన్ని జూన్లో సరఫరా చేశారు. ఇక జూన్, జూలై, ఆగస్టు నెలల్లో 21,925 కొత్తకార్డులు మంజూరు చేయగా, వీరికి వచ్చే నెల నుంచి బియ్యం పంపిణీ చేస్తారు.మూడు నెలల తర్వాత వచ్చే నెల సరఫరా రేషన్కార్డు లబ్ధిదారులకు సెప్టెంబర్ నుంచి యథావిధిగానే నెలనెలా బియ్యం పంపిణీ చేస్తాం. ఇప్పటికే సెప్టెంబర్ కోటా బియ్యాన్ని రేషన్ దుకాణాలకు చేరవేస్తున్నాం. 1వ తేదీ నుంచి గతంలో మాదిరిగానే పంపిణీ మొదలవుతుంది. – చందన్కుమార్, జిల్లా పౌరసరఫరాల శాఖాధికారి -
హెచ్ఎంలుగా అక్కాచెల్లెళ్లు!
ఖమ్మం సహకారనగర్: ప్రభు త్వ ఉపాధ్యాయుల(ఎస్ఏ)కు గెజిటెడ్ హెచ్ఎంలుగా పదోన్నతులు కల్పించారు. ఈ సందర్భంగా అక్కాచెల్లెళ్లకు ఒకేసారి పదోన్నతి లభించింది. వీరిద్దరూ ఒకేసారి ఉపాధ్యాయులుగా విధుల్లో చేరడం, ఆపై ఎస్ఏలుగా పదో న్నతి పొందగా ఇప్పుడు ఒకేరోజు హెచ్ఎంలుగా ఉద్యోగోన్నతి పొందడం విశేషం. అక్క చావా ఉషారాణి, చెల్లె చావా దుర్గాభవాని 1993 జూన్ 14న ఎస్జీటీలుగా ఖమ్మం అర్బన్ యూపీఎస్, ఖమ్మం జీహెచ్ఎస్ మోమినాన్లో బాధ్యతలు స్వీకరించారు. ఆపై స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి పొంది కూసుమంచి మండలం నేలపట్ల, చింతకాని మండలం నేరడ పాఠశాలల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. వీరిద్దరు శుక్రవారం గెజిటెడ్ హెచ్ఎంలుగా పదోన్నతి పొందగా, దుర్గాభవాని ఎన్నెస్సీ కాలనీ, నయాబజార్ పాఠశాలలో ఉషారాణి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా వీరిని ఉపాధ్యాయులు అభినందించారు.ఒకేసారి ఇద్దరికి పదోన్నతి -
మూడు నెలల్లో ముగ్గురు మృతి
ఖమ్మం – సత్తుపల్లి జాతీయ రహదారిపై కొణిజర్ల పోలీస్స్టేషన్ సమీపాన నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. గత మూడు నెలల కాలంలో ఇక్కడ 12ప్రమాదాలు జరగ్గా ముగ్గురు మృతి చెందారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రాంతంలో రహదారిపై ఏర్పడిన గుంతలను పూడ్చకుండా మరమ్మతులతోనే సరిపెడుతుండడం.. మళ్లీ రెండు, మూడు నెలల్లో యథాస్థితికి చేరుతుండడం ప్రమాదాలకు కారణమవుతోంది. వారంలో సగటున రెండు రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నందున జాతీయ రహదారి అధికారులు ఈ స్థలాన్ని బ్లాక్స్పాట్గా గుర్తించి నియంత్రణపై దృష్టి సారించారు. -
ఈఎంటీ, కెప్టెన్ ఉద్యోగాలకు దరఖాస్తులు
ఖమ్మంవైద్యవిభాగం: ఈఎంఆర్ఐ 108 వాహనంలో ఎమర్జెన్సీ టెక్నీషియన్(ఈఎంటీ), 102 అమ్మ ఒడి వాహనంలో కెప్టెన్(డైవర్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు 108 ఉమ్మడి జిల్లా ప్రోగ్రాం మేనేజర్ శివకుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి కలిగిన పురుష అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లు, ఒక సెట్ జిరాక్స్తో పాటు ఆధార్ కార్డుతో ఇంటర్వ్యూకు హాజరుకావాలని సూచించారు. ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలోని 108 కార్యాలయంలో ఈనెల 25వ తేదీ ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు ఇంటరూవ్యలు జరుగుతాయని తెలిపారు. ఈఎంటీ పోస్టుకు బీఎస్సీ లైఫ్ సైన్స్, బీఎస్సీ నర్సింగ్, జీఎన్ఎం, ఏఎన్ఎం, బీఎస్సీ ఎంఎల్టీ, బీ ఫార్మసీ పూర్తిచేసిన వారు, డ్రైవర్ పోస్టుకు 10 తరగతి పాసై, 22 – 35 ఏళ్ల వయస్సు, కనీసం మూడేళ్ల అనుభవం, ఎల్ఎంవీ బ్యాడ్జ్ కలిగిన వారు అర్హులని వెల్లడించారు. ఇతర వివరాలకు 90102 51025, 91549 18117 నంబర్లను సంప్రదించాలని శివకుమార్ సూచించారు. యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేయాలి నేలకొండపల్లి/కూసుమంచి: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టే పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని ఎన్ఆర్ఈజీఎస్ జాయింట్ కమిషనర్ కె.కృష్ణ సూచించారు. నేలకొండపల్లి మండలం మోటాపురం, కూసుమంచి మండలం ఈశ్వరమాధారం, భగవత్వీడు గ్రామాల్లో పనుల జాతరలో భాగంగా శుక్రవారం పర్యటించిన ఆయన ఉపాధి నిధులతో చేపట్టే పనులను ప్రారంభించి మాట్లాడారు. ఉపాధి హామీ పథకం ద్వారా ప్రతీ పల్లెలో రహదారులు నిర్మిస్తుండగా నాణ్యతపై ఉద్యోగులు దృష్టి సారించాలని సూచించారు. విధుల్లో ఎవ రు నిర్లక్ష్యం వహించినా సహించేది లేదని హెచ్చరించారు. ఈకార్యక్రమాల్లో డీఆర్డీఓ ఏపీడీ శ్రీదేవి, ఎంపీడీఓలు ఎం.యర్రయ్య, రాంచందర్రావు, ఎంపీఓ శివ, ఏపీఓలు ఆర్.సునీత, అప్పారావు, ఈసీ శేషగిరిరావు పాల్గొన్నారు. రూ.9 కోట్లతో బీసీ హాస్టళ్లకు భవనాలు సత్తుపల్లిటౌన్: జిల్లాలోని వి.వెంకటాయ పాలెం, ముస్తాఫనగర్ బాలుర హాస్టల్, ఖమ్మంలోని బాలికల బీసీ హాస్టళ్లకు రూ.3కోట్ల చొప్పున రూ.9 కోట్ల నిధులతో నూతన భవనాల నిర్మాణం చేపడుతున్నట్లు జిల్లా బీసీ సంక్షేమ అభివృద్ధి అధికారి జి.జ్యోతి తెలిపారు. సత్తుపల్లిలోని బీసీ హాస్టళ్లను శుక్రవారం ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా బీసీడబ్ల్యూఓ మాట్లాడుతూ పెనుబల్లి, సత్తుపల్లి, తిరుమలాయపాలెం, చిన్నకోరుకొండి హాస్టళ్లకు భవన నిర్మాణం కోసం ప్రభుత్వానికి ప్రతిపాదించామని తెలిపారు. హాస్టళ్లు పునఃప్రారంభమైన రోజే విద్యార్థులకు బెడ్షీట్లు, కార్పెట్లు, నోట్పుస్తకాలు అందించామన్నారు. సత్తుపల్లి నియోజకవర్గంలోని హాస్టళ్లలో ఎమ్మెల్యే రాగమయి చొరవతో ఫ్యాన్లు, లైట్లు, కుర్చీలు అందుబాటులోకి తెచ్చామని తెలిపారు. విద్యార్థులు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేలా అన్ని కళాశాల హాస్టళ్లకు పుస్తకాలు సమకూర్చామని చెప్పారు. ఈసందర్భంగా ఆమె హాస్టళ్లలోని సరుకుల నాణ్యతను పరిశీలించారు. ఏబీసీడీఓ ఐ.గ్రీసమ్మ, వార్డెన్లు ఎం.వెంకటేశ్వర్లు, బి.హేమలత, ఎ.అశోక్రెడ్డి, కిరణ్ పాల్గొన్నారు. నేటి నుంచి జాతీయ క్రీడా దినోత్సవ పోటీలు ఖమ్మం స్పోర్ట్స్: జిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యాన శనివారం నుంచి ఈనెల 31వ తేదీ వరకు జాతీయ క్రీడా దినోత్సవంలో భాగంగా పోటీలు నిర్వహిస్తున్నట్లు డీవైఎస్ఓ టి.సునీల్రెడ్డి తెలిపారు. ఈనెల 23వ తేదీన మధిర, ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియం, వైరా, కల్లూరులో అండర్–10 బాలబాలికలకు స్కేటింగ్, టేబుల్ టెన్నిస్, బాస్కెట్బాల్, అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్ పోటీలు నిర్వహిస్తారు. అలాగే, 24న అన్ని కేటగిరీల్లో పోటీలు, 25న పటేల్ స్టేడియంలో హెల్త్ క్యాంప్, 26న వెటరన్ క్రీడాకారులకు పోటీలు నిర్వహించనున్నారు. అంతేకాక 27న సాంస్కృతిక కార్యక్రమాలు, 28న క్రీడారంగంపై డిబేట్, 29న జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలు, 30న ప్రేరణ తరగతులు, 31వ తేదీన సైక్లింగ్ ర్యాలీ ఉంటాయని డీవైఎస్ఓ తెలిపారు. -
ఇండోర్లో కేఎంసీ బృందం పర్యటన
ఖమ్మంమయూరిసెంటర్: ఖమ్మంను స్వచ్ఛ నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా కేఎంసీ మేయర్ పునుకొల్లు నీరజ ఆధ్వర్యాన కార్పొరేటర్లు, అధికారుల బృందం ఇండోర్లో తమ పర్యటన కొనసాగించారు. ఇండోర్లో గురువారం మేయర్ నీరజ, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహరా ఆధ్వర్యాన పర్యటించగా.. అక్కడ ఇంటింటా చెత్త సేకరణ, చెత్త వాహనాల ట్రాకింగ్, వ్యర్థాల రీసైక్లింగ్పై ఆరాతీశారు. స్వచ్ఛతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఇండోర్లో చెత్త సేకరణకు అవలంబిస్తున్న విధానాలను అడిగి తెలుసుకున్నారు. వ్యర్థాలను సేకరించే వాహనంలో ఆరు బ్లాక్లు ఉండగా.. మూడు బ్లాక్ల్లో ఎలక్ట్రికల్, మెడికల్ వ్యర్థాలు, శానిటరీ ప్యాడ్లు సేకరిస్తామని, మరో మూడింట్లో తడి, పొడి వేరుగా చేసి సేకరించడం, ఇతర వ్యర్థాలను తీసుకుంటున్నట్లు అక్కడి అధికారులు వివరించారు. అలాగే, వ్యర్థాలన్నింటినీ రీసైక్లింగ్ యూనిట్లకు తరలిస్తామని, తడి వ్యర్థాలతో సేంద్రియ ఎరువు, బయోగ్యాస్ తయారీకి తరలిస్తున్నట్లు తెలిపారు. ప్రతీ మూడు, నాలుగు డివిజన్లను జోనల్గా ఏర్పాటు చేసి 30 – 40 వాహనాల చెత్త సేకరిస్తూ డివిజన్కు 30 మంది కార్మికులను నియమించినట్లు వెల్లడించారు. చెత్త సేకరణ బాధ్యతను ఎన్జీవోలకు అప్పగించడంతో ప్రతీ ఇంట పక్కాగా చెత్త సేకరణ జరుగుతోందని, వాహనాలను ట్రాకింగ్ చేసేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు ఇండోర్ అధికారులు తెలిపారు. అలాగే, చెరువులు, కాల్వల ఆధునికీకరణ, రోడ్ల విస్తరణ పనులను కూడా మేయర్ బృందం పరిశీలించింది. అనంతరం ఇండోర్ మేయర్ పుష్యమిత్ర భార్గవ్తో భేటీ అయిన ఖమ్మం బృందం పలు అంశాలపై చర్చించారు. ఆదాయ వనరులు, వ్యయాలు, పాలన, పౌర సేవల వివరాలు ఆరా తీశారు. ఈ సందర్భంగా మేయర్ నీరజ మాట్లాడుతూ ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ను స్వచ్ఛత నగరంగా తీర్చిదిద్దేందుకు అన్ని అనుకూలతలు ఉన్నాయని తెలిపారు. ఇండోర్ స్టడీ టూర్లో పరిశీలించిన అంశాలను ఇక్కడ అమలుకు అధికారులతో చర్చిస్తామని తెలిపారు.వ్యర్థాల నిర్వహణ, అభివృద్ధి, పౌర సేవలపై పరిశీలన -
కూనంనేని.. మరోసారి
● సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా రెండోసారి ఎన్నిక ● రాష్ట్ర కార్యవర్గంలో జిల్లా నేతలకు స్థానంసూపర్బజార్(కొత్తగూడెం): కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా రెండో సారి ఎన్నికయ్యారు. మేడ్చల్ జిల్లా గాజుల రామవరంలో పార్టీ రాష్ట్ర మహాసభలు జరుగుతుండగా శుక్రవారం రాష్ట్ర కమిటీని ఎన్నుకున్నారు. ఈమేరకు కూనంనేని మరోమారు రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ఆయన ఐదు దశాబ్ధాలుగా సీపీఐలో కీలపాత్ర పోషిస్తున్నారు. 2005 నుండి 2009 వరకు ఉమ్మడి జిల్లా కార్యదర్శిగా పనిచేశారు. 2009లో కొత్తగూడెం నియోజకవర్గం నుంచి పోటీ చేసి అప్పటి రాష్ట్ర మంత్రి వనమా వెంకటేశ్వరరావుపై విజయం సాధించి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆతర్వాత 2023లో ఎన్నికల్లోనూ బరిలోకి దిగిన కూనంనేని గెలిచారు. రాష్ట్ర కార్యదర్శిగా గత మూడేళ్లలో రంగారెడ్డి, వరంగల్, హనుమకొండ, భూపాలపల్లి, మేడ్చల్, మహబూబాబాద్ తదితర జిల్లాలో భూపోరాటాల ద్వారా పేదలకు ఇళ్ల స్థలాలు, సాగుభూముల పంపిణీలో కీలకంగా వ్యవహరించారు. రాష్ట్రంలో వామపక్షాల నుంచి ఏకై క ఎమ్మెల్యేగా కొనసాగుతున్న కూనంనేని 2023లో జరిగిన సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో సీపీఐ అనుబంధ సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ గుర్తింపు సంఘంగా విజయానికి కృషి చేశారు. రాష్ట్ర కమిటీలో 13 మందికి చోటు సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా కూనంనేని సాంబశివరావు ఎన్నికవడమే కాక రాష్ట్ర కార్యవర్గంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేతలు పలువురికి స్థానం దక్కింది. జిల్లా నుంచి ముగ్గురు రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా, పది మంది రాష్ట్ర సమితిలో చోటు దక్కించుకున్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్.కే.సాబీర్పాషా, నాయకులు ముత్యాలు విశ్వనాధం, కల్లూరి వెంకటేశ్వరరావు రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా ఎన్నికయ్యారు. అలాగే, రాష్ట్ర సమితి సభ్యులుగా కె.సారయ్య, మున్నా లక్ష్మీకుమారి, నరాటి ప్రసాద్, సరెడ్డి పుల్లారెడ్డి, వై.ఉదయ్భాస్కర్, ఎస్డీ.సలీం, రావులపల్లి రవికుమార్, సలిగంటి శ్రీనివాస్, చండ్ర నరేంద్రకుమార్ ఎన్నిక కాగా, సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ నుంచి మిర్యాల రంగయ్య రాష్ట్ర కంట్రోల్ కమిషన్ సభ్యుడిగా ఎన్నికయ్యారు. రాష్ట్ర కంట్రోల్ కమిషన్ చైర్మన్గా మౌలానా ఖమ్మం మయూరిసెంటర్: సీపీఐ రాష్ట్ర కంట్రోల్ కమిషన్ చైర్మన్గా మహమ్మద్ మౌలానా రెండోసారి ఎన్నికయ్యారు. సీపీఐ రాష్ట్ర మహాసభల్లో ఈ ఎన్నిక జరిగింది. ఈ సందర్భంగా మౌలానా ఎన్నికపై పార్టీ రాష్ట్ర, జిల్లా నాయకులు హర్షం వ్యక్తం చేశారు. -
80మందికి హెచ్ఎంలుగా పదోన్నతి
ఖమ్మం సహకారనగర్: జిల్లాలోని వివిధ పాఠశాలల్లో స్కూల్ అసిస్టెంట్లు(ఎస్ఏ)లుగా విధులు నిర్వర్తిస్తున్న 80మందికి గ్రేడ్–2 హెచ్ఎంలుగా పదోన్నతి లభించింది. ఈమేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేయగా పలువురు నూతన స్థానాల్లో బాధ్యతలు స్వీకరించారు. అయితే, ఏడుగురికి ఆదిలాబాద్ వంటి సుదూర ప్రాంతాల్లో పోస్టింగ్ రావడంతో ప్రమోషన్ తీసుకోమని డీఈఓ కార్యాలయంలో లేఖలు అందజేశారు. ఇక ఎస్జీటీల్లో స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతికి అర్హులైన ఉపాధ్యాయుల సీనియారిటీ, ఖాళీల జాబితాను శనివారం విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రాథమిక జాబితాపై శుక్రవారం అభ్యంతరాలు స్వీకరించగా తుది జాబితా శనివారం విడుదల చేస్తారు. కాగా, డీఈఓ కార్యాలయంలో ఇటీవల ఏఎంఓ బాధ్యతలు చేపట్టిన రాజశేఖర్కు గ్రేడ్–2 హెచ్ఎంగా పదోన్నతి లభించింది. దీంతో ఆయన ఇక్కడ రిలీవ్ అయి మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో బాధ్యతలు స్వీకరించారు. ఏఎంఓ స్థానాన్ని ఒకటి, రెండు రోజుల్లో భర్తీ చేయనున్నట్లు తెలిసింది. -
సామాజిక, వ్యక్తిగత ఆస్తుల సృష్టి
● రూ.67 కోట్లతో జిల్లాలో ఉపాధి హామీ పనులు ● ‘పనుల జాతర’ ప్రారంభంలో కలెక్టర్ అనుదీప్ రఘునాథపాలెం: ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టే పనులతో సమాజానికే కాక వ్యక్తులకు ఉపయోగపడే ఆస్తుల సృష్టి జరగాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. ‘పనుల జాతర’లో భాగంగా శుక్రవారం ఆయన రఘునాథపాలెం మండలం బూడిదంపాడులో పర్యటించారు. వంద రోజుల పనిదినాలు పూర్తి చేసిన కూలీలతో పాటు దివ్యాంగురాలు పేరం రమాదేవిని సన్మానించడమే కాక లబ్ధిదారులు అంగడాల నాగమణి, కేతినేని ద్రౌపదికి చెక్కులు అందజేశారు. అనంతరం ఉపాధి హామీ నిధులు రూ.3లక్షలతో నిర్మించిన పౌల్ట్రీ షెడ్డు, రూ.లక్షతో నిర్మించిన పశువుల షెడ్డును కలెక్టర్ ప్రారంభించి మాట్లాడారు. ఈ ఏడాది జిల్లాలో రూ.67 కోట్ల వ్యయంతో ఉపాధి హామీ పనులు జరుగుతున్నాయని తెలిపారు. గ్రామసభల తీర్మానాలతో పనులు చేపడుతున్నందున అంతా పర్యవేక్షించాలని సూచించారు. గతంలో ఈ పథకం ద్వారా పూడికతీత వంటి పనులే చేపట్టేవారని, ఇప్పుడు పౌల్ట్రీ, పశువుల షెడ్లు, తోటల పెంపకం, రహదారులు, అంగన్వాడీ భవనాల నిర్మాణం జరుగుతోందని తెలిపారు. రైతులు పంటలు సాగు చేస్తూనే పశువుల పెంపకంతో అదనపు ఆదాయం పొందాలని కలెక్టర్ సూచించారు. ఈకార్యక్రమంలో డీఆర్డీఓ ఎన్.సన్యాసయ్య, డీఎల్పీఓ రాంబాబు, ఎంపీడీఓ అశోక్కుమార్, తహసీల్దార్ శ్వేత, ఎంపీఓ శ్రీనివాసరెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ దిరిశాల చిన్న వెంకటేశ్వరరావు, మార్కెట్ డైరెక్టర్ నర్సయ్య, ఏపీఓ పద్మయ్యనాయుడు, గ్రామపంచాయతీ కార్యదర్శి నరేష్ పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంతాల కూలీలకు ఉపాధి ఖమ్మంమయూరిసెంటర్: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలులో భాగంగా గ్రామీణ ప్రాంత నిరుపేద కూలీ కుటుంబాల పనులు కల్పిస్తున్నట్లు అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. 2024–25 ఆర్థిక సంవత్సరంలో 60.24 లక్షల పనిదినాలు కల్పించి రూ.127.06 కోట్లను కూలీల వేతనంగా చెల్లించినట్లు తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 25.85 లక్షల పనిదినాలు కల్పించి రూ.70.14 కోట్ల వేతనం చెల్లింపు పూర్తయిందని పేర్కొన్నారు. కాగా, పనుల జాతరలో భాగంగా జిల్లాలోని 571 గ్రామాలలో శుక్రవారం రూ.8.78 కోట్ల విలువైన 626 పనులను ప్రారంభించడమేకాక కొత్త పనులకు శంకుస్థాపన చేసినట్లు తెలిపారు. -
మెడికల్ కాలేజీలో ప్రారంభమైన ప్రవేశాలు
ఖమ్మంవైద్యవిభాగం: ఖమ్మం ప్రభుత్వ మెడికల్ కళాశాలలో 2025–26 సంవత్సరానికి మొదటి సంవత్సరం విద్యార్థుల ప్రవేశాలు మొదలయ్యాయి. జాతీయ కోటాలో 15శాతం సీట్లు భర్తీ చేస్తుండగా మొదటి విడత కౌన్సెలింగ్లో ఐదుగురు చేరారు. ఇందులో కేరళ నుంచి ఇద్దరు, ఏపీ, రాజస్తాన్, ఢీల్లీ నుండి ఒక్కొక్కరు ఉన్నారు. మరో రెండు విడతల్లో జరిగే కౌన్సెలింగ్లో మొత్తం సీట్లు భర్తీ కానున్నాయి. ఇక 85శాతం సీట్లు రాష్ట్రస్థాయి విద్యార్థులకు కేటాయించనుండగా, స్థానికత విషయంలో కోర్టులో కేసు ఉండడంతో వచ్చే నెల కౌన్సెలింగ్ ప్రారంభమయ్యే అవకాశముందని ప్రిన్సిపాల్ డాక్టర్ శంకర్ తెలిపారు. కాలేజీలో 100 సీట్లు ఉండగా, వచ్చేనెల 15నుంచి మొదటి సంవత్సరం విద్యార్థులకు తరగతలు ప్రారంభమయ్యే అవకాశముంది. సీజనల్ వ్యాధులపై అప్రమత్తత చింతకాని: వరుస వర్షాలతో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశమున్నందున ఉద్యోగులు అప్రమత్తంగా వ్యవహరించాలని డీఎంహెచ్ఓ కళా వతిబాయి సూచించారు. చింతకాని మండలం రామకృష్ణాపురంలోని ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాన్ని గురువారం తనిఖీ చేసిన ఆమె మాట్లాడారు. గ్రామాల్లో ఆశా కార్యకర్తలు ప్రతి రోజు డ్రై డే నిర్వహిస్తూ పరిశుభ్రత ప్రాధాన్యతపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. నీటి నిల్వల ప్రాంతాల్లో దోమల నివారణ మందు పిచికారీ చేయించాలని సూచించారు. అనంతరం ఆమె గ్రామంలో నిర్వహిస్తున్న ఫీవర్ సర్వే తనిఖీ చేయగా, గర్భిణుల రిజిస్ట్రేషన్, ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల పెంపుపై సూచనలు చేశారు. వైద్యులు ఆల్తాఫ్, తబుసం, ఏఎన్ఎం జయమ్మ తదితరులు పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇళ్లకు ప్రతీ సోమవారం బిల్లులు ముదిగొండ: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు నిర్మాణాల్లో వేగం పెంచాలని జిల్లా పంచాయతీ అధికారి ఆశాలత సూచించారు. నిర్మాణ దశలకు అనుగుణంగా లబ్ధిదారుల ఖాతాల్లో ప్రతీ సోమవారం బిల్లులు జమ అవుతాయని తెలిపారు. ముదిగొండ మండలంలోని పండ్రేగుపల్లి, ఖానాపురం, న్యూలక్ష్మీపురంల్లో గురువారం ఆమె ఇళ్ల నిర్మాణ పురోగతిని పర్యవేక్షించారు. ఎంత త్వరగా పూర్తి చేస్తే అంతే త్వరగా బిల్లులు జమ అవుతాయని తెలిపారు. ఈ విషయమై అధికారులు పర్యవేక్షిస్తూ లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని సూచించారు. ఆ తర్వాత గ్రామాల్లో పారిశుద్ధ నిర్వహణపై సూచనలు చేశారు. ఎంపీడీఓ శ్రీధర్స్వామి, ఎంపీఓ వాల్మీకి కిషోర్, హౌసింగ్ ఏఈ సతీష్, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. హెచ్ఎంల వెబ్ఆప్షన్లు పూర్తి ● నేటి నుంచి ఎస్జీటీల పదోన్నతులు ఖమ్మం సహకారనగర్: జిల్లాలో స్కూల్ అసిస్టెంట్లకు హెచ్ఎంలుగా పదోన్నతి కల్పించే ప్రక్రియ కొనసాగుతోంది. ఈమేరకు బుధవారం నుంచి గురువారం ఉదయం వరకు 67మంది వెబ్ ఆప్షన్లు ఇచ్చారని అధికారులు తెలిపారు. దీంతో వీరికి గురువారం అర్ధరాత్రి వరకు గ్రేడ్–2 హెచ్ఎంలుగా పదోన్నతి ఉత్తర్వులు అందే అవకాశముంది. ఇక సెకండరీ గ్రేడ్ టీచర్ల(ఎస్జీటీ)కు స్కూల్ అసిస్టెంట్లు(ఎస్ఏ)లుగా పదోన్నతి ప్రక్రియ షెడ్యూల్ ప్రకారం కొనసాగించనున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం సీనియారిటీ జాబితా, ఖాళీలు ప్రదర్శిస్తారు. ఆపై అభ్యంతరాలు స్వీకరించాక తుది జాబితాను ఈ నెల 23, 24వ తేదీల్లో విడుదల చేస్తారు. అనంతరం 25వ తేదీన వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించి, 26వ తేదీన పదోన్నతి ఉత్తర్వులు జారీ చేయనున్నారు. -
గ్రామాల్లో ‘పనుల జాతర’
● నేడు ఊరూరా అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ● ఉపాధి నిధులతో పనులకు శ్రీకారం ● జీపీ, అంగన్వాడీ భవనాలపై దృష్టిఖమ్మంమయూరిసెంటర్: గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధి.. నిరుపేద కూలీల కుటుంబాలకు జీవనోపాధి పెంచేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. శాఖల సమన్వయంతో జిల్లాలోని అన్ని గ్రామాల్లో ఒకేసారి అభివృద్ధి పనులకు శంకుస్థాపన, పూర్తయిన పనులను ప్రారంభించాలని నిర్ణయించింది. ‘పనుల జాతర–2025’ పేరుతో నిర్వహించే ఈ కార్యక్రమాన్ని శుక్రవారం పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ఆధ్వర్యాన జిల్లాలోని 20 మండలాల పరిధి 571 గ్రామాల్లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ‘ఉపాధి హామీ’కి కొత్త రూపం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం(ఎంఎన్ఆర్ఈజీఎస్) పేదలకు పని కల్పనకే పరిమితం కాకుండా, గ్రామీణ సమాజానికి శాశ్వత ఆస్తులను సృష్టించేందుకు దోహదపడుతోంది. ఈమేరకు పనుల జాతర కార్యక్రమం ద్వారా వేలాది మందికి పని కల్పించడం సాధ్యమవుతుందని చెబుతున్నారు. ఇదే సమయాన వ్యక్తిగత, సామూహిక ఆస్తుల కల్పన పనులతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఊపు తీసుకురానున్నారు. ప్రారంభోత్సవాలే లక్ష్యంగా.. ‘పనుల జాతర’లో భాగంగా కీలకమైన నిర్మాణాల కు శుక్రవారం శంకుస్థాపన చేయనున్నారు. ఇందులో గ్రామపంచాయతీ, అంగన్వాడీ భవనాలు ఉన్నాయి. అలాగే, స్వచ్ఛభారత్ మిషన్(గ్రామీణ) ద్వారా నిర్మించిన సెగ్రిగేషన్ షెడ్లు, కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్లను ప్రారంభిస్తారు. అంతేకాక వర్షపు నీటిని సంరక్షించి, భూగర్భ జలాలను పెంపొందించేందుకు ఉద్దేశించిన ‘జలనిధి’ పథకం ద్వారా చేపట్టనున్న పనులకు కూడా భూమి పూజ చేస్తారు. ఇంకా ‘ఇందిరా మహిళా శక్తి – ఉపాధి భరోసా’ కింద చేపట్టే వ్యక్తిగత ఆస్తుల కల్పన పనులకు సైతం భూమి పూజ నిర్వహించనున్నారు. ఇందులో ప్రధానంగా పశువుల కొట్టాలు, కోళ్లు, గొర్రెల షెడ్లు, వానపాములతో ఎరువుల తయారీ కేంద్రాలు, అజోలా పిట్ నిర్మాణాలు ఉన్నాయి. ఈ పనులు మహిళల ఆదాయాన్ని పెంచి, వారి ఆర్థికాభివృద్ధికి బాటలు వేస్తాయని చెబుతున్నారు. నిస్వార్థ సేవకులకు సత్కారం సామూహికంగా చేపట్టే ఈ కార్యక్రమం అభివృద్ధి పనులకే పరిమితం కాకుండా, గ్రామాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న వ్యక్తులను గౌరవించేందుకు కూడా వేదికగా నిలవనుంది. ఎక్కువ రోజులు పని చేసిన ఉపాధి కూలీలు, దివ్యాంగులు, పారిశుద్ధ్య కార్మికులు, హరిత సంరక్షకులను అధికారులు సన్మానించనున్నారు. ఈ కార్యక్రమాల్లో నియోజకవర్గాల ప్రజాప్రతినిధులు పాల్గొనేలా షెడ్యూల్ రూపొందించారు. సమన్వయమే కీలకం పనుల జాతరను విజయవంతం చేసేందుకు జిల్లా అధికార యంత్రాంగం సిద్ధమైంది. ఇప్పటికే కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్ని విభాగాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. పంచాయతీరాజ్, గ్రామీణా భివృద్ధి విభాగాలైన ఉపాధి హామీ, స్వచ్ఛభారత్, ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీ రాజ్–ఇంజినీరింగ్, వాటర్ షెడ్ వంటి అన్ని విభాగాల అధికారులు పూర్తి సమన్వయంతో పనిచేస్తూ విజయవంతం చేయాలని ఆదేశించారు. -
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేలా బిల్లు
ఖమ్మంఅర్బన్: ప్రతిపక్షాలను అణచివేయడమే లక్ష్యంగా కేంద్రప్రభుత్వం పార్లమెంట్లో 30 రోజుల కస్టడీ బిల్లును ప్రవేశపెట్టిందని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం మండిపడ్డారు. అవినీతి నిర్మూలన పేరుతో తీసుకొచ్చిన ఈ బిల్లు బీజేపీకి గిట్టని పార్టీల ప్రభుత్వాలను అస్థిరం చేయడానికి పన్నిన కుట్రలో భాగమేనని.. తద్వారా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయనున్నారని పేర్కొన్నారు. ఖమ్మం టేకులపల్లిలో గురువారం నిర్వహించిన సీపీఎం నాయకుడు దొంగల కోటయ్య సంస్మరణ సభలో ఆయన మాట్లాడారు. ముప్ఫై రోజుల పాటు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్యమంత్రులు, ప్రధాని సైతం కస్టడీలో ఉంటే పదవులకు అనర్హులవుతారని బిల్లు పెట్టడం కేంద్ర ప్రభుత్వ ధోరణికి నిదర్శనమని తెలిపారు. ప్రజాసమస్యలపై పోరాడే నేతలను జైలులో పెడితే ఈ చట్టం ద్వారా పదవులు కోల్పోయే అవకాశముందని చెప్పారు. వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ కార్యదర్శి బి.వెంకట్ మాట్లాడుతూ ప్రజా ఉద్యమాలను అణచివేయడానికే మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు. సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు ఎం.సాయిబాబు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు పోతినేని సుదర్శనరావు, జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్తో పాటు నాయకులు వై.విక్రమ్, నాగరాజు, బుగ్గవీటి సరళ, బండి రమేష్, కళ్యాణం వెంకటేశ్వరరావు, మచ్చా వెంకటేశ్వర్లు, రాజారావు, పొన్నం వెంకటేశ్వరరావు, మాదినేని రమేష్, బొంతు రాంబాబు, యర్రా శ్రీనివాసరావు, బండి పద్మ, దొంగల తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు.సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని -
చిన్నారుల ఎదుగుదలపై పర్యవేక్షణ
● అంగన్వాడీల్లో వంద శాతం ఎఫ్ఆర్ఎస్ ద్వారానే హాజరు ● అదనపు కలెక్టర్ శ్రీజ ఖమ్మంమయూరిసెంటర్: అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లల ఎదుగుదలను నిరంతరం పర్యవేక్షించాలని అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ సూచించారు. కలెక్టరేట్లో గురువారం మహిళా, శిశు, దివ్యాంగుల సంక్షేమ శాఖపై సమీక్షించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో న్యూట్రిషన్ రిహాబిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేసినందున పిల్లలు పోషకాహార లోపంతో బాధపడుతుంటే పౌష్టికహారం సమకూర్చాలని తెలిపారు. ఈ విషయంలో నిర్లక్ష్యం చేసే ఉద్యోగులు జిల్లాలో పనిచేయాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పారు. అలాగే, అంగన్వాడీ కేంద్రాల్లో హాజరు ఎఫ్ఆర్ఎస్ ద్వారానే నమోదు చేయాలని తెలిపారు. కేంద్రాల్లో అవసరమైన మరమ్మతులు చేయించాలని సూచించారు. జిల్లా సంక్షేమ అధికారి కె.రాంగోపాల్రెడ్డి, సీడీపీఓలు, సూపర్వైజర్లు పాల్గొన్నారు. పెద్దాస్పత్రి నిర్వహణపై ఆగ్రహం ఖమ్మంవైద్యవిభాగం: ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిని అదనపు కలెక్టర్ శ్రీజ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మరుగుదొడ్ల మరమ్మతులకు నిధులు కేటాయించినా పనులు చేయకపోవడంపై టీఎస్ఎంఎస్ఐడీసీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే, పలు విభాగాల్లో అపరిశుభ్రంగా ఉండడాన్ని గుర్తించిన ఆమె సిబ్బందిని మందలించారు. మెడికల్ సూపరింటెండెంట్ ఎం.నరేందర్, ఆర్ఎంఓ బి.రాంబాబు పాల్గొన్నారు. -
రెండు కళ్లలా సంక్షేమం, అభివృద్ధి
● ‘భూభారతి’తో భూసమస్యల శాశ్వత పరిష్కారం ● ప్రజాప్రభుత్వానికి అంతా అండగా నిలవాలి ● రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితిరుమలాయపాలెం/నేలకొండపల్లి: పేదల సంక్షేమం, అభివృద్ధిని తమ ప్రభుత్వం రెండు కళ్లలా భావిస్తోందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈనేపథ్యాన అన్ని వర్గాల ప్రజలు తమకు అండగా నిలవాలని ఆయన కోరారు. తిరుమలాయపాలెం మండలంలోని సుబ్లేడు, పిండిప్రోలు, నేలకొండపల్లి మండలం గువ్వలగూడెంలో రహదారుల నిర్మాణానికి గురువారం శంకుస్థాపన చేసిన మంత్రి నేలకొండపల్లిలో పశు ఆస్పత్రి భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఆయా సమావేశాల్లో మంత్రి పొంగుటేటి మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతీ మారుమూల గ్రామంలో సీఎం రేవంత్రెడ్డి నేతృత్వాన అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు. గత ప్రభుత్వం అమలుచేసిన మంచి కార్యక్రమాలను బేషజాలకు పోకుండా కొనసాగిస్తూనే.. అదనంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలుచేస్తూ ఉచిత విద్యుత్, రూ.500కే గ్యాస్ సిలిండర్ పంపిణీ చేస్తున్నామని చెప్పారు. అలాగే, రైతులకు పెట్టుబడి సాయం పెంచామని, రుణమాఫీ చేయడమే కాక అర్హులకు రేషన్కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నామని మంత్రి తెలిపారు. అర్హులైన ప్రతీఒక్కరికి ఇల్లు మంజూరు చేసే బాధ్యత తాను తీసుకుంటానని మంత్రి చెప్పారు. కాగా, భూభారతి చట్టాన్ని ప్రవేశపెట్టి భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపిస్తున్నట్లు వెల్లడించారు. పాఠశాలల్లో వసతుల కల్పనకు రూ.497 కోట్లు పాలేరు నియోజకవర్గంలోని విద్యాసంస్థల్లో మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధికి రూ.497 కోట్లు వెచ్చిస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. తిరుమలాయపాలెం మండలంలోని పిండిప్రోలు, నేలకొండపల్లి మండలంలోని బోదులబండ జెడ్పీహెచ్ఎస్ విద్యార్థినులకు పీఎస్ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యాన కలెక్టర్ అనుదీప్ దురిశెట్టితో కలిసి సైకిళ్లు పంపిణీ చేశాక మంత్రి మాట్లాడారు. గడిచిన 19 నెలల కాలంలో నియోజకవర్గంలో రూ.497 కోట్ల నిధులతో పాఠశాలల్లో వసతులు కల్పించామని తెలిపారు. అలాగే, జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాల, యంగ్ ఇండియా సమీకృత గురుకులాల నిర్మాణం, తిరుమలాయపాలెంలో ఐటీఐ, కూసుమంచిలో జూనియర్ కళాశాల మంజూరు చేశామని చెప్పారు. కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ విద్యార్థినులు పాఠశాలలకు రావడానికి ఇబ్బంది పడకుండా పీఎస్ఆర్ ట్రస్టు ద్వారా మంత్రి సైకిళ్లు పంపిణీ చేస్తున్నందున సద్వినియోగం చేసుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. కాగా, పిండిప్రోలు జెడ్పీహెచ్ఎస్లో కిచెన్ షెడ్, మధ్యాహ్న భోజన నాణ్యతను తనిఖీ చేసిన మంత్రి, నేలకొండపల్లి మండలానికి చెందిన 25 మంది కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. ఈ కార్యక్రమాల్లో డీఈఓ నాగపద్మజ, ఆర్ అండ్ బీ, పీఆర్ ఎస్ఈలు యాకోబ్, వెంకట్రెడ్డి, జీసీడీఓ తులసి, ఆర్డీఓ నర్సింహారావు, పాలేరు నియోజకవర్గ ప్రత్యేక అధికారి రమేష్, తహసీల్దార్లు విల్సన్, వెంకటేశ్వర్లు, ఎంపీడీఓలు సిలార్సాహెబ్, ఎర్రయ్య, పీఏసీఎస్, ఆత్మ, మార్కెట్ చైర్మన్లు నరేష్రెడ్డి, చావా శివరామకృష్ణ, వెన్నపూసల సీతారాములు, ఎంఈఓ శ్రీనివాసరావు, హెచ్ఎంలు జ్యోతి, నిర్మలతో పాటు బెల్లం శ్రీనివాస్, మంగీలాల్, అశోక్, బొర్రా రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. స్థానిక సమరానికి సిద్దం కండి కూసుమంచి: త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగనున్నందున పార్టీ నాయకులు, కార్యకర్తలు సిద్ధం కావాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సూచించారు. కూసుమంచిలోని క్యాంపు కార్యాలయంలో మండల నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులతో సమావేశమైన ఆయన దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి స్థానిక ఎన్నికల్లో వారి మద్దతు పొందాలని తెలిపారు. గ్రామాల్లో మంచి వ్యక్తిని అంతా కలిసి ఎంపిక చేసి బరిలోకి దింపితే విజయం సొంతమవుతుందని చెప్పారు. ఇదే సమయాన పార్టీలో కష్టపడిన వారికి గుర్తింపు లభిస్తుందని, ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయమే లక్ష్యంగా పనిచేయాలని మంత్రి సూచించారు. -
లోకం చూడని బిడ్డలు
ఖమ్మంవైద్యవిభాగం: జిల్లాలో భ్రూణహత్యలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. కడుపులో పెరుగుతున్నది ఆడబిడ్డ అని తెలిస్తే చాలు పొట్టలోనే చిదిమేస్తున్నారు. లింగ నిర్ధారణ పరీక్షలు, ఫలితాల వెల్లడి చట్టప్రకారం నేరమని తెలిసినా కొందరు అదేమీ పట్టించుకోవడం లేదు. జిల్లా కేంద్రంతో పాటు మండలాల్లోని ప్రైవేట్ ఆస్పత్రులు, నర్సింగ్హోమ్ల్లో లింగ నిర్ధారణ పరీక్షలు అడ్డగోలుగా నిర్వహిస్తున్నారు. ఆపై భ్రూణహత్యలకు పాల్పడుతుండడంతో జిల్లాలో అబ్బాయిలు, అమ్మాయిల నిష్పత్తిలో తేడా కనిపిస్తోంది. అప్పుడు 926.. ఇప్పుడు 864 గతంతో పోలిస్తే జిల్లాలో ఈ ఏడాది సీ్త్ర, పురుష నిష్పత్తిలో తేడా నమోదైంది. ప్రతీ వేయి మంది మగ వారికి కేవలం 864 మందే ఆడవారు ఉన్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ లెక్కలు చెబుతున్నాయి. గత ఏడాది ఈ సంఖ్య 926గా ఉండగా.. ఇప్పుడు మరింత తగ్గడం యథేచ్ఛగా భ్రూణహత్యలు జరుగుతున్నాయనడానికి నిదర్శనంగా నిలుస్తోంది. అధికారుల పర్యవేక్షణ ఎక్కడ? సులువుగా లింగ నిర్ధారణ పరీక్షలు చేయించే అవకాశం ఏర్పడడానికి వైద్య, ఆరోగ్య శాఖ అధికారుల పర్యవేక్షణ లోపించడమే కారణమని తెలుస్తోంది. గర్భస్థ శిశు లింగ నిర్ధారణను బహిర్గతం చేయడం, పిండ దశలోనే హత్య చేయటం చట్టప్రకారం నేరం. దీన్ని విస్మరించే వారికి జైలు శిక్ష, జరిమానా విధించేలా చట్టం ఉన్నా అమలు కావడం లేదు. జిల్లాలో నిబంధనలకు విరుద్ధగా కొందరు స్కానింగ్ సెంటర్ల నిర్వాహకులు లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారని సమాచారం. కొందరు ఆర్ఎంపీలు ముఠాలుగా ఏర్పడి గర్భిణులను స్కానింగ్ సెంటర్లకు తీసుకొచ్చి పరీక్ష చేయించడమే కాక అవసరమైతే అబార్షన్ చేయించేలా ఒప్పందం కుదర్చుకుంటున్నారని సమాచారం. ఇటీవల ఓ ముఠా సభ్యులు వాహనంలోనే యంత్రాల సాయంతో లింగ నిర్ధారణ పరీక్షలు చేసినట్లు బయటపడినా కఠిన చర్యలేవీ తీసుకోకపోవడంతో అలాంటి వారి ఆగడాలు ఆగడం లేదు. తనిఖీలు లోపించడంతో.. జిల్లాలో గత ఏడాది ఆరంబంలో లింగ నిర్ధారణ, అబార్షన్లు చేస్తున్న సెంటర్లపై వైద్య, ఆరోగ్య శాఖ దాడులు నిర్వహించారు. ఇందులో భాగంగా కొన్ని ఆస్పత్రులను సీజ్ చేసినా ఆతర్వాత పట్టించుకోకపోవడంతో పరిస్థితి యథాస్థితికి చేరింది. సీజ్ చేసిన ఆస్పత్రులు వేరే పేర్లతో రిజిస్ట్రేషన్ చేయించి తిరిగి దందా కొనసాగిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఇక ఆ తర్వాత ఎక్కడా తనిఖీ చేసిన దాఖలు లేకపోగా.. ఫిర్యాదు వస్తే తనిఖీలు చేస్తామని అధికారులు చెబుతుండడం విమర్శలకు తావిస్తోంది. గర్భిణులకు ప్రత్యేక పరిస్ధితుల్లో మాత్రమే లింగ నిర్ధారణ పరీక్ష చేయించేందుకు అనుమతి ఉంటుంది. కడుపులో పెరుగుతున్న పిండం జన్యు సంబంధమైన వ్యాధులతో బాధపడుతున్నట్లు అనుమానం ఉంటే పరీక్ష చేయిస్తారు. రెండుసార్లు అంత కంటే ఎక్కువ సార్లు గర్భస్రావం జరిగినప్పుడు, గర్భిణి, ఆమె భర్త కుటుంబీకుల్లో ఎవరికై నా బుద్ది మాంధ్యం, శారీక వైకల్యం, జన్యు సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నా పిండానికి పరీక్షకు అనుమతి ఉంటుంది. కానీ వైద్య, ఆరోగ్యశాఖ నిర్లిప్తతతో కొన్ని స్కానింగ్ సెంటర్లలో లింగ నిర్ధారణ పరీక్షలు.. ఆపై భ్రూణహత్యలు యథేచ్ఛగా కొనసాగిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికై నా వైద్య ఆరోగ్య, పోలీస్, రెవెన్యూ తదితర శాఖలు సమన్వయంతో ఈ పరీక్షలను కట్టడి చేయకపోతే జిల్లాలో ఆడపిల్లల నిష్పత్తి మరింత దిగజారే ప్రమాదముంది. ఆడశిశువుగా తేలితే కడుపులోనే చిదిమేస్తున్న వైనం -
కొరత పేరుతో దందా
ఖమ్మంవ్యవసాయం: జిల్లాలో కొందరు ఎరువుల వ్యాపారుల దందాకు అడ్డూఅదుపు లేకుండా పోయింది. యూరియా కొరతను సాకుగా చూపుతూ రైతులను మోసం చేయడమే లక్ష్యంగా ఎత్తులు వేస్తున్నారు. మునుపెన్నడూ లేని విధంగా ఈసారి యూరియా కొరత ఏర్పడడంతో.. పీఏసీఎస్ల్లో ఒక్కో రైతుకు ఒకటి, రెండు బస్తాలే ఇస్తున్నారు. దీంతో రైతులు వ్యాపారులను ఆశ్రయిస్తుండగా యూరియా ఇవ్వాలంటే ఇతర ఎరువులు, పురుగు మందులు అంటగడుతున్నారు. ఇంకొందరు బినామీల ఇళ్లలో యూరియా నిల్వ చేసి అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ఈనేపథ్యాన తాజాగా టాస్క్ఫోర్స్ బృందాలు చేపట్టిన తనిఖీల్లో జిల్లాలోని ఐదు ఎరువుల దుకాణాల్లో అక్రమాలు వెలుగుచూశాయి. దీంతో ఆయా షాపుల నిర్వాహకులకు వ్యవసాయ శాఖ నోటీసులు జారీ చేసింది. అధిక ధర.. ఆపై ఇతర మందులు యూరియా బస్తా ఎమ్మార్పీ రూ.266 కాగా రూ.310గా పలువురు వ్యాపారులు అమ్ముతున్నారు. ఇదికాక రూ.500 నుంచి రూ.600 ధర ఉన్న బయోఫెర్టిలైజర్ బస్తాను రూ.900కు అంటగడుతున్నారు. ఇంకొందరు పురుగు మందులను బలవంతంగా కొనసాగాలని చెబుతున్నారు. ఇదేమిటని ప్రశ్నిస్తే నెపాన్ని కంపెనీలపైకి నెడుతుండడం గమనార్హం. అయినా యూరియా కొరతతో రైతులు చేసేదేం లేక వ్యాపారులు చెప్పినట్లు కొనుగోలు చేస్తున్నారు. అక్కడకు వెళ్లండి... వ్యాపారులకు సరఫరా అయ్యే యూరియాను బినామీల ఇళ్లలో నిల్వ చేస్తున్నారు. రైతులెవరైనా షాప్నకు యూరియా కోసం వెళ్తే తమ వద్ద లేదంటూ బినామీల వద్దకు పంపిస్తున్నారని సమాచా రం. అక్కడకు వెళ్తే యూరియా బస్తాను రూ.400కు అమ్ముతుండడం గమనార్హం. ఇక సహకార సంఘాల్లో సంఘాల పాలకవర్గాలు, రాజకీయ పార్టీల నాయకులు సిఫారసు చేసిన వారికి అడిగినంత యూరియా ఇస్తున్నారని సమాచారం. మిగిలిన వారికి ఒకటి, రెండు బస్తాలే ఇస్తుండడంతో రైతులు పడిగాపులు కాయాల్సి వస్తోంది. వెలుగుచూసిన అక్రమాలు యూరియా కొరతతో అన్నదాతలు ఇబ్బంది పడుతుండగా వ్యాపారులు దందాకు పాల్పడుతున్నట్లు పోలీస్ యంత్రాంగానికి సమాచారం అందింది. దీంతో పోలీస్ కమిషనర్ ఆదేశాలతో టాస్క్ఫోర్స్ బృందాలు వివిధ షాపుల్లో తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా ధర పెంచడం, ఇతర ఎరువులు అంటగడుతున్న విషయం నిజమేనని తేలింది. దీంతో ఐదు ఎరువుల షాపుల్లో అక్రమాలపై వ్యవసాయ శాఖకు నివేదించగా..వారికి షోకాజు నోటీసులు జారీ చేశారు. అయితే, వ్యాపారులు మాత్రం కంపెనీలు ఇస్తుండడంతో అమ్ముతున్నామే తప్ప తమ తప్పేమి లేదని తప్పించుకునే ప్రయత్నం చేసినట్లు సమాచారం. కాగా, సీజన్ ఆరంభం నుంచి ఎరువుల దందా కొనసాగుతున్నా వ్యవసాయ శాఖ ఒక్క కేసు నమోదు చేయకపోవడం.. పోలీసులు తనిఖీ చేసే వరకు మేల్కొనడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నేలకొండపల్లిలోని లక్ష్మీప్రసన్న ఫెర్టిలైజర్స్, రఘునాథపాలెం మండలం మంచుకొండలోని న్యూకుమార్ ఫెర్టిలైజర్స్, చింతకాని మండలం నాగులవంచలోని అన్నదాత ఎంటర్ప్రైజెస్, సత్తుపల్లిలోని పార్దసారధి ట్రేడర్స్, గంగారంలోని వెంకటేశ్వర ఫెర్టిలైజర్స్కు షోకాజు నోటీసులు జారీ అయ్యాయి.ఇతర ఎరువులతో లింక్ చేసి యూరియా విక్రయించటం చట్టవిరుద్ధం. ఈ విషయంలో రైతులు ఫిర్యాదు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. టాస్క్ఫోర్స్ బృందాల దాడిలో అక్రమాలకు పాల్పడినట్లు తేలిన ఐదు షాపుల నిర్వాహకులకు నోటీసులు ఇచ్చాం. దీనికి వివరణ అందాక చర్యలు తీసుకుంటాం. – ధనసరి పుల్లయ్య, జిల్లా వ్యవసాయాధికారి -
పుస్తక పఠనంతో లక్ష్య సాధన
సత్తుపల్లిటౌన్/సత్తుపల్లి(కల్లూరు): ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఉన్నత లక్ష్యాలు ఎంచుకోవడమే కాక వాటిని సాధించేలా పుస్తక పఠనాన్ని అలవాటుగా మార్చుకోవాలని భద్రాచలం ఐటీడీఏ పీఓ రాహుల్ సూచించారు. సత్తుపల్లి, కల్లూరులోని గిరిజన సంక్షేమ హాస్టళ్లను గురువారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డార్మెటరీలు, వంటగదులు, స్టోర్రూం, పరిసరాలను పరిశీలించారు. మెనూ ప్రకారం వేడివేడి ఆహారమే విద్యార్థులకు వడ్డించాలని వార్డెన్లను ఆదేశించారు. నాణ్యమైన సరుకులే తీసుకుంటూ ఎప్పటికప్కుపడు పర్యవేక్షించాలని తెలిపారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడిన పీఓ రోజువారీ సబ్జెక్టులతో పాటు పోటీ పరీక్షల పుస్తకాలు చదవాలని సూచించారు. కాగా, కల్లూరు హాస్టల్ను సబ్ కలెక్టర్ అజయ్యాదవ్తో కలిసి పరిశీలించిన పీఓ రాహుల్ ఇటీవల విద్యార్థినులకు నాసిరకం ఆహారం అందించడంతో ఆస్పత్రి పాలయ్యారని, ఇలాంటివి జరగకుండా జాగ్రత్త వహించాలని ఆదేశించారు. వార్డెన్లు బి.రాములు, మాధవి, ఏడీహెచ్ఓ సైదులు, హెచ్ఎం శ్రీనివాస్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.భద్రాచలం ఐటీడీఏ పీఓ రాహుల్ -
ఈ పోరాటం ప్రారంభం మాత్రమే..
ఖమ్మం సహకారనగర్: ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని చేస్తున్న పోరాటాలు ప్రారంభం మాత్రమేనని, ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమాలను ఉధృతం చేస్తామని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ(యూఎస్పీసీ) స్టీరింగ్ కమిటీ సభ్యులు, టీఎస్యుటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావా రవి, టీపీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తిరుపతి హెచ్చరించారు. ఖమ్మంలోని యూటీఎఫ్ కార్యాలయంలో గురువారం వారు మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడి 20నెలలు దాటినా ఉపాధ్యాయ, ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడంలో నిర్లక్ష్యం వహిస్తుందన్నారు. ఈమేరకు ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చేలా యూఎస్పీసీ ఆధ్వర్యాన ఈనెల 23న హైదరాబాద్ ధర్నాచౌక్లో మహాధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కాగా, నూతన జిల్లాలకు డీఈఓ పోస్టులు, ప్రతీ డివిజన్కు డిప్యూటీ ఈఓ, నూతన మండలాలకు ఎంఈఓ పోస్టులను మంజూరు చేయడమే కాక ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీసు రూల్స్ రూపొందించి ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని, సీపీఎస్ విధానాన్ని రద్దు చేయడమే కాక ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగుల పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అలాగే, విద్యారంగ సమస్యలన్నీ పరిష్కరించాలని పలు మారు విన్నవించినా ఫలితం లేక మహాధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈకార్యక్రమంలో యూఎస్పీసీ నాయకులు ఎస్.విజయ్, రంజాన్, పారుపల్లి నాగేశ్వరరావు, ఏ.వీ.నాగేశ్వరరావు, వెంగళరావు, బుర్రి వెంకన్న, వల్లంకొండ రాంబాబు, రోజా, రామకృష్ణ, కోటేశ్వరరావు, ఉద్దండ్, నర్సింహారావు, శారద, హన్మంతరావు, పద్మజ, కోటేశ్వరరావు, షరీఫ్, శ్రీనివాసరావు పాల్గొన్నారు. యూఎస్పీసీ రాష్ట్ర బాధ్యులు చావా రవి, తిరుపతి -
ఆత్మగౌరవ సభను విజయవంతం చేయండి
ఖమ్మం సహకారనగర్: పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని కోరుతూ తెలంగాణ సీపీఎస్ ఉద్యోగుల సంఘం (టీజీ సీపీఎస్ ఈయూ) ఆధ్వర్యాన వచ్చేనెల 1న సీపీఎస్ ఉద్యోగుల ఆత్మ గౌరవసభ నిర్వహిస్తున్నట్లు టీజీ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి తెలిపారు. హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద నిర్వహించే ఈ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కలెక్టరేట్కు గురువారం వచ్చిన ఆయన సీపీఎస్ ఉద్యోగులతో ముఖాముఖి నిర్వహించారు. సెప్టెంబర్ 1న జరిగే సదస్సుకు జిల్లా నుంచి సీపీఎస్ ఉద్యోగులు తరలిరావాలని కోరారు. తొలుత కలెక్టర్ అనుదీప్ దురిశెట్టిని మర్యాదపూర్వకంగా కలిశారు. టీజీ సీపీఎస్ ఈయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు లింగమొళ్ల దర్శన్గౌడ్, నాగవెల్లి ఉపేందర్ మాట్లాడగా, ఉద్యోగ సంఘాల బాధ్యులు కె.రామకృష్ణ, బానాల రాంరెడ్డి, భిక్షం, గరికె ఉపేంద్రరావు, రవికుమార్, రామదాసు, కొరివి కృష్ణ పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి -
రేపు జాబ్ మేళా
ఖమ్మం రాపర్తినగర్: నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు శనివారం ఖమ్మం టేకులపల్లిలోని మోడల్ కెరీర్ సెంటర్లో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన శాఖ అధికారి ఎన్.మాధవి తెలిపారు. రిలయన్స్ నిప్పాన్ లైఫ్ ఇన్సూరెన్స్, భారత్ హ్యూండాయ్లో ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారని వెల్లడించారు. ఆసక్తి ఉన్న యువతీ, యువకులు విద్యార్హతలు, ఇతర సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలతో హాజరుకావాలని సూచించారు. సీపీఎస్ ఈయూ ఆధ్వర్యాన నేడు బ్లాక్ డే ఖమ్మం సహకారనగర్: సీపీఎస్ ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించాలనే డిమాండ్తో శుక్రవారం బ్లాక్ డే నిర్వహించాలని నిర్ణయించినట్లు టీఎస్ సీపీఎస్ ఈయూ జిల్లా అధ్యక్షుడు చంద్రకంటి శశిధర్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈమేరకు సీపీఎస్ ఉద్యోగులు పని ప్రదేశాల్లో భోజన విరామ సమయాన నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలపాలని కోరారు. కాగా, తమ సమస్యలను సీఎం రేవంత్రెడ్డి పరిష్కరిస్తారనే నమ్మకం ఉందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఖమ్మం ర్యాలీపై కేంద్ర హోంశాఖ విచారణ ఖమ్మం మయూరిసెంటర్(ఖమ్మంమామిళ్లగూడెం): పాలస్తీనాపై ఇజ్రాయిల్ దాడులను నిరసిస్తూ ఈనెల 5న ఖమ్మంలో నిర్వహించిన ర్యాలీపై కేంద్ర హోంశాఖ విచారణకు ఆదేశించిందని బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ ఓ ప్రకటనలో తెలిపారు. పాలస్తీనాకు అనుకూలంగా నిర్వహించిన ర్యాలీకి అనుమతి లేకుండా మైనర్లను పిలిపించడమే కాక, ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా వారితో నినాదాలు చేయించారని పేర్కొన్నారు. ఈ మేరకు తాను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్కు ఫిర్యాదు చేయగా కేంద్ర హోంశాఖ విచారణకు ఆదేశిందని తెలిపారు. మెప్మా పీడీగా నళినీ పద్మావతి ఖమ్మంమయూరిసెంటర్: జిల్లా మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్గా జి.నళినీ పద్మావతి బాధ్యతలు స్వీకరించారు. పీడీగా నియమితులైన ఆమె ఖమ్మం నగర పాలక సంస్థ కార్యాలయంలోని మెప్మా కార్యాలయంలో గురువారం రిపోర్ట్ చేశారు. ఈ సందర్భంగా మెప్మా డీఎంసీ ఎస్.సుజాత, ఏడీఎంసీ, టీఎంసీ జి.సుజాత తదితరులు పీడీని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జిల్లాలో మెప్మా కార్యకలాపాలపై నళిని సమీక్షించారు. అథ్లెటిక్స్ ఎంపిక పోటీలకు 200మంది.. ఖమ్మం స్పోర్ట్స్: జిల్లాస్థాయి అథ్లెటిక్స్ జట్ల ఎంపిక పోటీలకు భారీ స్పందన లభించింది. జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యాన గురువారం ఖమ్మంలోని ఎస్ఆర్అండ్బీజీఎన్ఆర్ కళాశాల మైదానంలో పోటీలు నిర్వహించారు. ఈమేరకు 124 మంది బాలురు, 76 మంది బాలికలు హాజరుకాగా, ప్రతిభ కనబరిచిన వారిని జిల్లా జట్టుకు ఎంపిక చేసినట్లు అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు మందుల వెంకటేశ్వర్లు, ఎం.డీ.షఫీక్ అహ్మద్ తెలిపారు. ఈ జట్లు మహబూబ్నగర్లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటాయని వెల్లడించారు. ఖమ్మం అథ్లెటిక్స్ అకాడమీ చీఫ్ కోచ్ ఎం.డి.గౌస్, అసోసియేషన్ బాధ్యులు సుధాకర్, రవి, వెంకటేశ్వర్లు, నవీద్, తిరుపతి పాల్గొన్నారు. ‘బొమ్మ’ కాలేజీకి పేటెంట్ ఖమ్మంఅర్బన్: ఖమ్మంలోని బొమ్మ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఫార్మసీ కళాశాలకు మరో పేటెంట్ లభించింది. గతంలో ఓ పేటెంట్ ఉండగా, ప్రస్తుతం కేంద్రప్రభుత్వం పరిధిలోని ‘ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ విభాగం’నుంచి ‘ఆటోమేటెడ్ న్యూరల్ నెట్వర్క్ బేస్డ్(ఏడీఎంఈ) ప్రెడిక్షన్ షన్ సిస్టమ్ ఎక్విప్మెంట్’కు రెండో పేటెంట్ మంజూరు చేశారు. ఈ సందర్భంగా గురువారం బొమ్మ కాలేజీ చైర్మన్ రాజేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రంలోనే రెండు పేటెంట్లు దక్కించుకున్న ఏకై క కాలేజీ తమది కావడం గర్వంగా ఉందని తెలిపారు. అనంతరం వైస్ చైర్మన్ బొమ్మ సత్యప్రసాద్, సెక్రటరీ ఉదార్ శ్రీధర్, ప్రిన్సిపాల్ డాక్టర్ విజయ్భాస్కర్కు మాట్లాడగా అధ్యాపకులు డాక్టర్ కిరణ్ జ్యోతి, సంతోష్, సుచరిత, అక్షిత, విశ్వర్య, జ్ఞానేశ్వరరెడ్డి, యణవి, శ్రావణిరెడ్డి, నవీన్, రిక్షిత, సాంధిక పాల్గొన్నారు. -
‘సీతారామ’ పూర్తికాకుండా నీళ్లు ఎలా వస్తాయి?
ఎర్రుపాలెం: సీతారామ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయకుండా వైరా నదికి జలాలు ఎలా వస్తాయి, అక్కడి నుంచి జవహర్ ఎత్తిపోతలతో మధిర, ఎర్రుపాలెం మండలాలకు ఎలా సరఫరా చేస్తారో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చెప్పాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు పోతినేని సుదర్శన్రావు సూచించారు. ఎర్రుపాలెం మండలం మీనవోలు, భీమవరంల్లో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశాల్లో ఆయన మాట్లాడారు. అధికారంలోకి వస్తే ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి కరపత్రాల్లో సంతకం పెట్టిన డిప్యూటీ సీఎం అమలులో చిత్తశుద్ధి చూపడం లేదని ఆరోపించారు. మహిళలకు రూ.2,500, ఇందిరమ్మ భరోసా ద్వారా కూలీలకు రూ.12 వేలలు, ఆటో కార్మికులకు రూ.12వేలు ఇస్తామన్న హామీలను విస్మరించారని తెలిపారు. అంతేకాక ఇందిరమ్మ కమిటీల పేరుతో కాంగ్రెస్ శ్రేణులకే ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశారని విమర్శించారు. ఇక యూరియా లభించక రైతులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. కాగా, త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాల నుంచి పార్టీ శ్రేణులు పోటీకి సిద్ధం కావాలని సూచించారు. ఈ సమావేశాల్లో సీపీఎం నియోజకవర్గ, మండల కార్యదర్శులు మడుపల్లి గోపాలరావు, మద్దాల ప్రభాకర్రావు, నాయకులు దివ్వెల వీరయ్య, గొల్లపూడి కోటేశ్వరరావు, సగుర్తి సంజీవరావు, నల్లమోతు హన్మంతరావు, షేక్ లాల, దూదిగం బసవయ్య, మేడగాని తిరుపతిరావు, షేక్ నాగులమీరా తదితరులు పాల్గొన్నారు.సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు సుదర్శన్రావు -
ఎస్జీఎఫ్ కార్యదర్శి నియామకం ఎప్పుడు?
● కార్యదర్శి లేకుండానే ఎంపిక పోటీలు ● జిల్లా వ్యాయాయ ఉపాధ్యాయుల్లో ఆందోళన ఖమ్మ స్పోర్ట్స్: జిల్లా పాఠశాలల క్రీడల కార్యదర్శి నియామకంలో విద్యాశాఖ అధికారులు చేస్తున్న జాప్యం విమర్శలకు తావిస్తోంది. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శిని ఎందుకు నియమించడం లేదో స్పష్టత ఇవ్వకపోగా.. ఎడతెగని జాప్యం చేస్తుండడంపై వ్యాయామ ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర క్రీడా పోటీలు క్యాలెండర్ ఖరారైనా పట్టించుకోకపోగా.. కార్యదర్శి లేకుండానే జిల్లాస్థాయి పాఠశాలల అండర్–17 బాలబాలికల వాలీబాల్ ఎంపిక పోటీలు నిర్వహించడం గమనార్హం. ఈ విషయమై కొందరికి మాత్రమే సమాచారం ఇవ్వడంతో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల నుంచి ఆశించిన స్థాయిలో వాలీబాల్ క్రీడాకారులు హాజరుకాలేదు. సమాచారం కరువు సుబ్రతో ముఖర్జీ కప్ పేరిట ఫుట్బాల్ టోర్నీని ఏటా రాష్ట్ర పాఠశాలల క్రీడా సమాఖ్య నిర్వహిస్తుంది. ఈ పోటీలు సెప్టెంబర్ మొదటి వారంలో జరిగే అవకాశముంది. కానీ జిల్లాలో ఇంత వరకు పోటీలకు సంబంధించి సమాచారం ఎవరికీ ఇవ్వకపోవడంపై అధికారుల తీరును క్రీడాకారులు, కోచ్లు తప్పుపడుతున్నారు. ఇలాంటి అన్ని సమస్యలకు ఎస్జీఎఫ్ఐ కార్యదర్శి లేకపోవడమే కారణంగా నిలుస్తున్న నేపథ్యాన అధికారులు స్పందించాలని పలువురు కోరుతున్నారు.పాఠశాలల క్రీడా కార్యదర్శి నియామకంలో విద్యాశాఖ మీనమేషాలు లెక్కిస్తుండడం గమనార్హం. జిల్లాలో సీనియర్ ఫిజికల్ డైరెక్టర్కే పదవి ఇచ్చే ఆనవాయితీ ఉండగా, ఈసారి జూనియర్లకు ఇస్తారనే ప్రచారంతో సీనియర్లు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రంలోన ఇతర జిల్లాల మాదిరిగానే ఇక్కడ కూడా నియమించాలే తప్ప కొత్త నిబంధనలు తీసుకురావొద్దని కోరుతున్నారు. విద్యాసంవత్సరం ప్రారంభమై మూడు నెలలు కావొస్తున్న కార్యదర్శి నియామకాన్ని పట్టించుకోకపోగా, ఇప్పుడు వాలీబాల్ ఎంపిక పోటీల నిర్వహణను జూనియర్లకు అప్పగించడంపై అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. -
నాలుగు ఇసుక లారీలు సీజ్
సత్తుపల్లిటౌన్: అనుమతి లేకుండా ఇసుక తరలి స్తున్న నాలుగు లారీలను సత్తుపల్లి రవాణాశాఖ అధికారి గురువారం సీజ్ చేశారు. సత్తుపల్లి శివారులో వాహనాలు తనిఖీ చేస్తుండగా.. కొవ్వూరు నుంచి సత్తుపల్లికి అనుమతి లేకుండా ఇసుక తరలిస్తున్నట్లు గుర్తించారు. ఈమేరకు నాలుగు లారీలను సీజ్ చేసినట్లు రవాణాశాఖ అధికారి జే.ఎన్.శ్రీనివాసరావు తెలిపారు. పశువుల పరిహారం స్వాహాపై విచారణ తిరుమలాయపాలెం: మండలంలోని రాకాసితండాలో గత ఏడాది వచ్చిన వరదలతో పశువులు, మేకలు, కోళ్లు మృతి చెందగా, ప్రభుత్వ మంజూరు చేసిన పరిహారం పక్కదారి పట్టిందనే ఫిర్యాదులు అందాయి. ఈ మేరకు గురువారం జిల్లా వెటర్నరీ కార్యాలయ ఉద్యోగులు రాకాసి తండాలో విచారణ చేపట్టారు. ఇప్పటికే డీఆర్ఓ పద్మశ్రీ, ఉద్యోగులు శర్మ, బోడెపూడి శ్రీనివాసరావు, స్వర్ణలత విచారణ జరిపిన విషయం విదితమే. అయితే, చనిపోయిన జీవాలు, బాధితులకు అందిన పరిహారంపై పొంతన లేకపోవడంతో ఇంటింటి సర్వేకు నిర్ణయించారు. ఇందులో భాగంగా వెటర్నరీ కార్యాలయ ఏడీ శ్రీ రమణి, జీఓఎం స్వర్ణలత తదితరులు పరిహారం పొందిన వారికి ప్రస్తుతం ఉన్న పశువులు, మేకల వివరాలను నమోదు చేసుకున్నారు. అనంతరం తిరుమలాయపాలెం తహసీల్కు వెళ్లి వివరాలు సేకరించారు. రోడ్డు ప్రమాదంలో పోస్టుమ్యాన్ మృతిటేకులపల్లి: టేకులపల్లి మండలం మాలపల్లికి చెందిన పోస్ట్మ్యాన్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. మాలపల్లికి చెందిన గుమ్మడి జానకీరామ్(58) ప్రెగళ్లపాడులో పోస్టుమ్యాన్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. బుధవారం రాత్రి బైక్పై వెళ్తుండగా ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించే క్రమంలో అదుపుతప్పి కింద పడగా తీవ్ర గాయాలయ్యాయి. దీంతో జానకీరామ్ను హైదరాబాద్ తరలిస్తుండగా మృతి చెందాడు. ప్రేమబంధం.. ఏడాదిలో విషాదం ఇల్లెందురూరల్: పెద్దలు అంగీకరించకున్నా ప్రేమ వివాహం చేసుకున్న వారి కాపురం ఏడాది పాటు సాఫీగా సాగింది. వారంలోగా పండంటి బిడ్డ జన్మించనుందనే ఆనందంలో ఉండగా గురువారం జరిగిన రోడ్డు ప్రమాదం విషాదాన్ని నింపింది. మండలంలో మామిడిగుండాలకు చెందిన సూర్నపాక వెంకన్న(25), గార్ల మండలం గుంపెళ్లగూడేనికి చెందిన శ్రీజ ప్రేమవివాహం చేసుకున్నారు. ప్రస్తుతం శ్రీజ తొమ్మిదో నెల గర్భిణి కాగా, ప్రసవం తేదీ సమీపించడంతో గురువారం ఆస్పత్రికి వెళ్లడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే, శ్రీజ ఆధార్కార్డు గుంపెళ్లగూడెంలో ఉండడంతో తీసుకురావాలని బంధువులకు సమాచారం ఇచ్చారు. ఈమేరకు భర్త వెంకన్న ముందుగానే బైక్పై వెళ్లి వస్తుండగా ట్రాక్టర్ తగలడంతో కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. అదే సమయాన ఆటోలో అక్కడకు వచ్చిన శ్రీజ స్పృహ కోల్పోయింది. దీంతో ఆమెను ఆస్పత్రికి తరలించారు. శ్రీజ పురిటినొప్పులతో ఆస్పత్రిలోనే ఉండగానే.. ఆమెకు చివరి చూపు దక్కకకుండానే వెంకన్న అంత్యక్రియలు పూర్తి చేశారు.ప్రమాదంలో భర్త మృతి, పురిటినొప్పులతో ఆస్పత్రిలో భార్య -
స్టడీటూర్కు బయలుదేరిన కేఎంసీ పాలకవర్గం
ఖమ్మంమయూరిసెంటర్: ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పాలకవర్గం ఇండోర్లో స్టడీ టూర్కు బుధవారం బయలుదేరింది. ఈమేరకు సాయంత్రం వారు మధ్యప్రదేశ్లోని ఇండోర్ చేరుకున్నారు. మేయర్ పునుకొల్లు నీరజ, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహరా ఆధ్వర్యాన రెండు రోజుల పాటు సాగే స్టడీ టూర్లో కార్పొరేటర్లు, అధికారులు పాల్గొంటారు.ఖమ్మం వాసి నౌరీన్కు డాక్టరేట్ఖమ్మం అర్బన్: ఖమ్మంకు చెందిన మహమ్మద్ నౌరీన్ తెలుగు విభాగంలో డాక్టరేట్ అందుకున్నారు. ‘ముస్లిం మైనార్టీ కథలు – సాంస్కృతిక అంశాల అధ్యయనం’ అంశంపై ఆమె సమర్పించిన పరిశోధనాత్మక గ్రంథానికి ఉస్మాని యా యూనివర్సిటీనుంచి డాక్టరేట్ ప్రకటించా రు. ఓయూ స్నాతకోత్సవంలో ఇస్రో ఛైర్మన్ నా రాయణన్, గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, వీసీ కుమార్ చేతుల మీదుగా డాక్టరేట్ అందుకున్న నౌరీన్ మాట్లాడుతూ గైడ్ డాక్టర్ నాళేశ్వరం శంకరం, తన భర్త సమీర్ పాషా సహకారంతో పరిశోధన పూర్తిచేసినట్లు తెలిపారు. ప్రస్తుతం మెదక్ టీజీఎస్డబ్ల్యూ రెసిడెన్షియల్ మహిళా డిగ్రీ కళాశాల తెలుగు అధ్యాపకురాలిగా పనిచేస్తున్న ఆమెను ప్రిన్సిపాల్ డాక్టర్ కె.శిరీష, అధ్యాపకులు అభినందించారు.రాష్ట్ర వాలీబాల్ జట్టులో జిల్లా క్రీడాకారిణిఖమ్మం స్పోర్ట్స్: ఇటీవల హైదరాబాద్లో జరిగిన రాష్ట్రస్థాయి పాఠశాలల అండర్–15 బాలికల వాలీబాల్ పోటీల్లో ఖమ్మంకు చెందిన జి.డి.హన్సినీ ప్రతిభ చాటింది. దీంతో పూణేలో జరగనున్న జాతీయస్థాయి అండర్–15 బాలికల టోర్నీలో పాల్గొనే రాష్ట్ర జట్టుకు ఆమెను ఎంపిక చేశారు. ఖమ్మంలోని హార్వెస్ట్ స్కూల్లో చదువుతున్న హన్సినీ సర్దార్ పటేల్ స్టేడియంలో శిక్షణ పొందుతుండగా, డీవైఎస్ఓ సునీల్రెడ్డి, హార్వెస్ట్ కరస్పాడెంట్ రవిమారుత్, ప్రిన్సిపాల్ పార్వతీరెడ్డి అభినందించారు.డీఈఈలు, ఈఈలకు అదనపు బాధ్యతలుఖమ్మంఅర్బన్: జల వనరుల శాఖలో ఖాళీగా ఉన్న స్థానాల్లో డీఈఈలు, ఈఈలకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 43 మందికి అదనపు బాధ్యతలు కేటాయించగా జాబితాలో ఉమ్మడి జిల్లా నుంచి పలువురు ఉన్నారు. తిరుమలాయపాలెం డీఈఈ రమేశ్రెడ్డికి పాలేరు ఈఈగా, ఖమ్మం సీఈ కార్యాలయంలో డీఈ కె.శోభారాణికి అదే కార్యాలయంలో డీసీఈగా అదనపు బాధ్యత లు అప్పగించారు. అలాగే, సత్తుపల్లి ఈఈ ఎస్.శ్రీనివాస్రెడ్డికి కల్లూరు డీఎస్ఈగా, మధి ర డీఈఈ రాంప్రసాద్కు మధిర ఈఈగా బాధ్యతలుఅప్పగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యా యి. అంతేకాక భదాద్రి జిల్లా కొత్తగూడెం ఈఈ బి.అర్జున్కు ఆ జిల్లా డీసీఈగా, ఇల్లెందు డీఈఈ బి.కృష్ణకు ఇల్లెందు ఈఈగా అదనపు బాధ్యతలు అప్పగించారు. -
స్పాట్ కౌన్సెలింగ్ ద్వారా 419 సీట్లు భర్తీ
భద్రాచలంటౌన్: ఉమ్మడి జిల్లాలోని గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలల్లో సీట్ల భర్తీకి బుధవారం స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహించారు. భద్రాచలంలోని గిరిజన గురుకుల కళాశాలలో నిర్వహించిన కౌన్సెలింగ్లో 419 సీట్లు భర్తీ అయ్యాయని గురుకులాల రీజినల్ కోఆర్డినేట ర్ అరుణకుమారి తెలిపారు. గురుకుల విద్యాలయాల్లో ఐదు నుంచి 9వ తరగతి వరకు ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి కౌన్సెలింగ్ నిర్వహించగా బాలికలు 121 మంది, బారులు 298 మంది చేరారని వెల్లడించారు. ఉమ్మడి జిల్లాలోని పలు గురుకులాల ప్రిన్సిపాళ్లు రమాదేవి, రాణి, చైతన్య, మాధవీలత, శిరీష, మాధవి, వీరస్వామి, సురేశ్, శ్యాంకుమార్, హరికృష్ణ, భాస్కర్ పాల్గొన్నారు. -
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలి
ఖమ్మం సహకారనగర్: ఉమ్మడి జిల్లాలోని చెందిన 12 ఇంజనీరింగ్ కళాశాలలకు సుమారు రూ.24 కోట్ల మేర ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఉన్నందున తక్షణమే చెల్లించాలని కళాశాలల యాజమాన్యాలు కోరాయి. వివిధ కళాశాలల చైర్మన్లు గుండాల కృష్ణ, చలసాని సాంబశివరావు, శ్రీధర్, నవీన్, భరత్, కిరణ్, రాజేశ్వరరావు, మణి, దాసరి ప్రభాకర్రెడ్డి, అబ్దుల్ ఖలామ్ తదితరులు బుధవారం ఖమ్మంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల కోసం మంత్రులు, వామపక్ష పార్టీల కార్యదర్శులను కలవాలని నిర్ణయించామని చెప్పారు. బకాయిలు పేరుకుపోవడంతో యాజ మాన్యాలపైనే కాక విద్యార్థులతో ఒత్తిడి పెరుగుతున్నందున ప్రభుత్వం స్పందించాలని కోరారు. -
ఎట్టకేలకు ‘సుడా’ ముసాయిదా
● కలెక్టరేట్, కేఎంసీల్లో మాస్టర్ ప్లాన్ మ్యాప్లు ● మండల, గ్రామ కార్యాలయాల్లో మాత్రం కరువు ● ప్లాన్ అమలు కార్యాచరణపై తలెత్తుతున్న ప్రశ్నలుఖమ్మంమయూరిసెంటర్: ఖమ్మం నగరం, పరిసర ప్రాంతాల భవిష్యత్ను నిర్దేశించే స్తంభాద్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(సుడా) మాస్టర్ ప్లాన్ ముసాయిదాను అధికారులు ఎట్టకేలకు విడుదల చేశారు. దీంతో 2021లో ప్రారంభమైన ప్రక్రియ ఇప్పుడు తుది రూపుకు చేరినట్లయింది. మాస్టర్ ప్లాన్ ముసాయిదాపై ప్రజల నుండి అభ్యంతరాలు, సూచనలు స్వీకరించేందుకు మ్యాప్లను కలెక్టరేట్, కేఎంసీ కార్యాలయంలో ప్రదర్శించారు. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్తో పాటు ఏడు మండలాల పరిధి 45 గ్రామపంచాయతీలను కలుపుకుని అధికారులు మాస్టర్ ప్లాన్ ముసాయిదాను రూపొందించారు. 571.83 చ.కి.మీ. విస్తీర్ణంలో.. 2024 అక్టోబర్లో సుడా పరిధిని విస్తరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో సుడా పరిధి 571.83 చ.కి.మీ. విస్తరించి ఉండగా.. కేఎంసీతో పాటు ఏడు మండలాల పరిధిలోని 45 గ్రామపంచాయతీలు ఉన్నాయి. ఈ పరిధితోనే ప్రస్తుత మాస్టర్ ప్లాన్ ముసాయిదా రూపొందించారు. దీనిపై అధికారులు 90 రోజుల పాటు అభ్యంతరాలు, సూచనలను స్వీకరిస్తారు. పాలకవర్గం, ఉద్యోగులు ఎక్కడ? కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అంతకుముందు ‘సుడా’కు ఉన్న పాలకవర్గాన్ని 2023 డిసెంబర్లోనే రద్దు చేసింది. ఆతర్వాత కొత్త పాలకవర్గాన్ని నియమించకపోగా.. ఉద్యోగుల పోస్టులు సైతం కేటాయించలేదు. కేఎంసీ కమిషనర్ సుడా వైస్ చైర్మన్గా ఉండడంతో కేంఎసీ ఉద్యోగులతోనే పని చేయిస్తున్నారు. ఇప్పటికే కేఎంసీ టౌన్ ప్లానింగ్లో ఉద్యోగుల కొరత వేధిస్తుంటే.. ఉన్న వారిపై ‘సుడా’ భారం అదనంగా పడినట్లయింది. ఈ నేపథ్యాన సుడా అభివృద్ధి ఎలా సాధ్యమవుతుందని.. తాత్కాలిక ఏర్పాట్లతో భూసేకరణ, ప్రాజెక్టుల అమలు, అభివృద్ధి జరుగుతుందా అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. పరిశీలన, పర్యవేక్షణపై నీలినీడలు మాస్టర్ ప్లాన్ అంటే కేవలం రోడ్లు, భవనాల నిర్మాణమే కాదు నగర జీవనానికి కీలకమైన సహజ వనరుల పరిరక్షణ కూడా తప్పనిసరి. ఖమ్మం చుట్టుపక్కల అనేక చెరువులు, డొంక రోడ్లు కబ్జాకు గురవుతున్నాయి. అయినా పట్టించుకునే వారే కరువయ్యారు. ‘సుడా’ ఉద్యోగుల కొరతతో క్షేత్ర స్థాయికి వెళ్లి పరిశీలించే పరిస్థితులు లేక కబ్జాలు సర్వసాధారణమయ్యాయి. ఇక కొత్తగా అమలుచేయనున్న మాస్టర్ ప్లాన్లో కనీసం 30 అడుగుల రోడ్డు ఉంటేనే నిర్మాణ అనుమతులు ఇస్తామని అధికారులు చెబుతున్నారు. కానీ ఈ విషయంలో పరిశీలించే సిబ్బంది నియామకంపై మాత్రం పురోగతి కానరాకపోవడం గమనార్హం. ముసాయిదాపై పెదవి విరుపు భూముల విలువ పెంపు, సంస్థకు ఆదాయాన్ని సమకూర్చడంతో పాటు ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపర్చడం, భవిష్యత్ తరాలకు సుస్థిరమైన నగరాన్ని అందించే లక్ష్యంతో మాస్టర్ ప్లాన్ ముసాయిదా రూపొందించారు. కానీ ప్లాన్ ఆ స్థాయిలో లేకపోగా.. అభ్యంతరాల స్వీకరణలోనూ పారదర్శకత పాటించడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ‘సుడా’ ఏడు మండలాల పరిధిలో విస్తరించి ఉంటే ముసాయిదా మ్యాప్ను కేవలం కేఎంసీ, కలెక్టరేట్లో ఏర్పాటుచేయడం ఈ విమర్శలకు కారణమవుతోంది. మండల కేంద్రాల్లోని అన్ని కార్యాలయాల్లోనూ ప్లాన్ను విడుదల చేస్తే ఫలితం ఉండేదని చెబు తున్నారు. అలా చేయకపోవడంతో నామమాత్రంగానే అభ్యంతరాలు అందుతుండగా.. తుది ప్లాన్ ఎలా ఉంటుందోనన్న విమర్శలు వస్తున్నాయి. -
ఇందిరమ్మ కమిటీలను రద్దు చేయాలి
చింతకాని/కొణిజర్ల: ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో అక్రమాలు జరుగుతున్న గ్రామాల్లో ఇందిరమ్మ కమిటీలను రద్దు చేసి అర్హులకే మంజూరు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. చింతకాని మండలం పాతర్లపాడు లో బుధవారం జరిగిన దేవసాని వీరకృష్ణ సంతాప సభలో ఆయన మాట్లాడారు. ఇందిరమ్మ కమిటీల తీరుతో ఆర్థికంగా ఉన్న వారికే ఇళ్లు దక్కాయని ఆరోపించారు. ఈమేరకు నిరుపేదలకు అన్యాయం జరగకుండా ప్రభుత్వం స్పందించాలన్నారు. అలాగే, కొణిజర్లలో జరిగిన సమావేశంలో నాగేశ్వరరావు మాట్లాడుతూ ఇటీవల వర్షాలతో గ్రామాల్లో పారిశుద్ధ్యం లోపించినందున అధికారులు స్పందించాలని, యూరియా కొరత రాకుండా చూడాలని డిమాండ్ చేశారు. ఈసమావేశాల్లో సీపీఎం నాయకులు పొన్నం వెంకటేశ్వరరావు, సామినేని రామారావు, మునుకుంట్ల సుబ్బారావు, మడుపల్లి గోపాలరావు, రాచబంటి రాము, చింతపల్లి ప్రసాద్, తాళ్లపల్లి కృష్ణ, కొప్పుల కృష్ణయ్య, చెరుకుమల్లి కుటుంబరావు తదితరులు పాల్గొన్నారు. -
మరింత వేగంగా ఇళ్ల నిర్మాణం
బోనకల్/ఎర్రుపాలెం/చింతకాని: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు నిర్మాణాలో వేగం పెంచాలని జిల్లా పంచాయతీ అధికారి ఆశాలత సూచించారు. బోనకల్, ఎర్రుపాలెం, చింతకాని మండలాల్లో నిర్మాణాలను బుధవారం ఆమె పరిశీలించారు. ప్రభుత్వ నిబంధనల మేరకు నిర్మాణాలు వేగంగా చేపడు తుంటే బిల్లులు త్వరగా మంజూరవుతాయని తెలి పారు. అలాగే, సీజనల్ వ్యాధుల కట్టడిపై పంచాయతీ కార్యదర్శులకు సూచనలు చేశారు. నాగులవంచలో ఆరోగ్య కేంద్రం, పాఠశాలను డీపీఓ తనిఖీ చేశారు. ఎంపీఓలు శాస్త్రి, జి.శ్రీలక్ష్మి, పర్వీన్ ఖైసర్, పంచాయతీల కార్యదర్శులు పాల్గొన్నారు. -
రాజీవ్ సేవలు మరువలేనివి..
ఖమ్మంమయూరిసెంటర్: భారతరత్న, మాజీ ప్రధాని మంత్రి రాజీవ్గాంధీ దేశాభివృద్ధికి చేసిన సేవలు మరువలేనివని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్ పేర్కొన్నారు. రాజీవ్ జయంతి సందర్భంగా బుధవారం ఖమ్మంలోని పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటం వద్ద నివాళులర్పించి మాట్లాడారు. దేశ భవిష్యత్ దృష్ట్యా దూరదృష్టితో రాజీవ్గాంధీ తీసుకున్న నిర్ణయాలు ప్రజల హృదయాల్లో నిలిచిపోయాయని చెప్పారు. మాజీ ఎమ్మెల్సీలు పోట్ల నాగేశ్వరరావు, బాలసాని లక్ష్మీనారాయణ, మాజీ ఎమ్మెల్యే కొండబాల కోటేశ్వరరావు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మద్దినేని బేబీ స్వరణకుమారి, నాయకులు నాగండ్ల దీపక్చౌదరి, బాలగంగాధర్ తిలక్, వడ్డేబోయిన నర్సింహారావు, గజ్జెల్లి వెంకన్న, దొబ్బల సౌజన్య, సయ్యద్ ముజాహిద్ హుస్సేన్, బొడ్డు బొందయ్య, సయ్యద్ గౌస్, పుచ్చకాయల వీరభద్రం తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
కూసుమంచి: ఖమ్మం–సూర్యాపేట జాతీయ రహదారిపై మండలంలోని గంగబండతండా ఫ్లై ఓవర్ వద్ద జరిగిన ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఎస్సై నాగరాజు తెలిపిన వివరాలు... కర్నూలు జిల్లా ఓర్వకల్ మండలం చెన్నంశెట్టిపల్లికి చెందిన బోయ తిరుమలేష్(22) బొలేరో వాహనంలో మంగళవారం రాత్రి మిర్చి లోడు తీసుకుని ఖమ్మం వస్తున్నాడు. ఈక్రమాన ఫ్లై ఓవర్పై రహదారి మరమ్మతుల కారణంగా ఏర్పాటుచేసిన సూచిక బోర్డులను తప్పించే క్రమంలో వాహనం అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టింది. ఈఘటనలో వాహనం నడుపుతున్న తిరుమలేష్ తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఆయన సోదరుడు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం మధిర: మధిర సమీపాన వైరా నదిలో చేపల వేటకు వెళ్లి గల్లంతైన వ్యక్తి మృతదేహాన్ని బుధవారం ఉదయం గుర్తించారు. మడుపల్లికి చెందిన పెసరమల్లి వినోద్(28) చేపలు పట్టేందుకు మంగళవారం వైరా నదికి వెళ్లి గల్లంతయ్యా డు. ఈమేరకు బుధవారం ఎన్డీఆర్ఎఫ్ బృందం ఆధ్వర్యాన గాలించగా ఆయ న మృతదేహం లభించింది. ఘటనపై వినోద్ కుటుంబీకుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు మధిర టౌన్ ఇన్స్పెక్టర్ రమేష్ తెలిపారు. తల్లిదండ్రులు మందలించారని ఆత్మహత్య ఖమ్మంరూరల్: నిత్యం సెల్ఫోన్ చూస్తూ కాలం గడుపుతున్న యువకుడిని తల్లిదండ్రులు మందలించడంతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఖమ్మం అర్బన్ మండలం టేకులపల్లికి చెందిన ధనుష్ ఐటీఐ చదువుతున్నాడు. ఆయన నిత్యం నిత్యం సెల్ఫోన్ చూస్తూ కాలం గడుపుతుండడంతో తల్లిదండ్రులు మందలించారు. దీంతో ఈనెల14న ఇంటి నుండి వెళ్లిపోయిన ధనుష్ ఖమ్మం రూరల్ మండలం పెదతండాకు చేరుకున్నాడు. అక్కడ ఎలుకల మందు తాగి అపస్మారక స్థితికి చేరగా తెలిసిన వ్యక్తికి చెప్పడంతో ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడే చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందాడు. ఘటనపై ధనుష్ తండ్రి ఫిర్యాదుతో బుధవారం కేసు నమోదు చేశామని సీఐ ముష్క రాజు తెలిపారు. ఒంటరితనం భరించలేక.. పాల్వంచ: ఒంటరితనం భరించలేక ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల కథనం మేరకు.. ఖమ్మం శ్రీనివాసనగర్కు చెందిన సుగ్గాల వెంకటసాయిరామ్ (36) శాసీ్త్రరోడ్లోని పద్మజ ఫ్యాన్సీలో వర్కర్గా ఐదేళ్ల నుంచి పనిచేస్తున్నాడు. గట్టాయిగూడెంలో అద్దెకు ఉంటున్నాడు. అతని తల్లి చిన్నప్పుడే చనిపోగా, తండ్రి అనారోగ్యంతో మూడేళ్ల కిందట చనిపోయాడు. ఒంటరితనంతో మానసికంగా కృంగిపోయాడు. గత 15వ తేదీన ఆరోగ్యం బాగోలేదని దుకాణానికి రానని చెప్పాడు. బుధవారం తాను ఉంటున్న గది నుంచి దుర్వాసన వస్తుండటంతో స్థానికులు తలుపులు తీసి చూడగా, ఫ్యాన్కు ఉరి వేసుకుని ఉన్నాడు. ఒంటరితనం భరించలేకనే ఆత్మహత్యకు పాల్పడినట్లు అతని బంధువు మహిపతి లవరావు ఫిర్యాదు చేయగా.. ఎస్ఐ సుమన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మిల్లుల్లో అధికారుల తనిఖీ ఖమ్మం సహకారనగర్: వానాకాలానికి సంబంధించి లక్ష్యం మేర సీఎంఆర్ను మిల్లర్లు సకాలంలో ఇవ్వాలని హైదరాబాద్కు చెందిన ఎన్ఫోర్స్మెంట్ బృందం సభ్యుడు అంజయ్య, జిల్లా పౌరసరఫరాల శాఖాధికారి చందన్కుమార్ సూచించారు. జిల్లాలోని ముదిగొండ, తదితర మండలాల్లో మిల్లులను బుధవారం వారు తనిఖీ చేసి మాట్లాడారు. డిప్యూటీ తహసీల్దార్లు నాగలక్ష్మీ, విజయబాబు తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రపతి అవార్డు గ్రహీత దుగ్గినేని మృతి
ఖమ్మం సహకారనగర్/మధిర: జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడిగా నాటి రాష్ట్రపతి డాక్టర్ శంకర్దయాళ్శర్మ చేతుల మీదుగా అవార్డు అందుకున్న ఉపాధ్యాయ ఉద్యమ నేత దుగ్గినేని సత్యనారాయణరావు(94) మంగళవా రం తెల్లవారుజామున హైదరాబాద్లో మృతి చెందారు. మధిర మండలం ఇల్లూరుకు చెందిన ఆయన 1955లో ఉపాధ్యాయ వృత్తిలోకి ప్రవేశించారు. మధిర ఉన్నత పాఠశాలతో పాటు ఉపాధ్యాయ శిక్షణా కేంద్రంలో విధులు నిర్వర్తించడమే కాక రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం(ఎస్టీయూ) జిల్లా అధ్యక్షుడిగా, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడిగానూ పనిచేశారు. కాసు బ్రహ్మానందరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు కరువుభత్యం కోసం 56 రోజుల పాటు జరిగిన సమ్మెకు దుగ్గినేని నేతృత్వం వహించారు. ఆయన 29 ఏళ్ల పాటు ఉపాధ్యాయుడిగా పనిచేశాక 1984లో స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేసి శాసనమండలికి పోటీ చేసినా ఓటమి పాలయ్యారు. అలాగే, దుగ్గినేని చేకూరి కాశయ్యతో కలిసి ఖమ్మంలో గురుదక్షిణ ఫౌండేషన్ స్థాపించారు. అంతేకాక మధిర టీవీఎం ఉన్నత పాఠశాల వజ్రోత్సవ వేడుకలను సత్యనారాయణరావు సొంత ఖర్చులతో నిర్వహించారు. ఆయన మృతిపై మంగళవారం తెల్లవారుజామున మృతి చెందినట్లు రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పరిశ పుల్లయ్య, రాయల రవి, ఎస్టీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు డి.ప్రసాదరావు, ఎస్.కే.కరీం, గురుదక్షిణ ఫౌండేషన్ అధ్యక్ష, కార్యదర్శులు శంకరయ్య, చావా శ్రీనివాసరావు, విశ్రాంత ఎంఈఓ దుగ్గినేని శ్రీనివాసరావు, రామానుజస్వామి తదితరులు వేర్వేరు ప్రకటనల్లో సంతాపం ప్రకటించారు. -
ఆవుపేడ పొడితో గణపతి విగ్రహాలు
● నిమజ్జనం తర్వాత ఎరువుగా ఉపయోగం ● గోశాల నిర్వాహకుల వినూత్న ప్రయత్నంఖమ్మంఅర్బన్: ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసే వినాయక విగ్రహాలను నిమజ్జనం చేయడం ద్వారా జలాశయాలు కలుషిమవుతున్నాయి. ఈ విషయమై అవగాహన పెరగడంతో కొన్నేళ్లుగా చాలామంది మట్టితో చేసిన ప్రతిమలను పూజిస్తున్నారు. ఈక్రమంలో ఖమ్మం 7వ డివిజన్ టేకులపల్లిలోని శ్రీ వెంకటేశ్వర గోశాల నిర్వాహకులు ఆరుట్ల శ్రీనివాసాచార్యులు, ఆరుట్ల శ్రీరామ్ ఇంకో అడుగు ముందుకేశారు. గోశాలలో పెద్దసంఖ్యలో ఆవులను సంరక్షిస్తుండగా.. వీటి పేడను ఎండబెట్టి పొడిగా మార్చి వినాయక విగ్రహాలు రూపొందిస్తున్నారు. ఎలాంటి రసాయనాలు వాడకుండా తయారుచేసే ఈ ప్రతిమలను పూజలు చేశాక నిమజ్జనం చేస్తే నేలలో కలిసి ఎరువులుగా మారతాయి. ఒక్కో విగ్రహాన్ని రూ.100తో విక్రయిస్తుండడంతో భక్తులు కొనుగోలుకు ముందుకొస్తున్నారు. ఇలా వచ్చే ఆదాయాన్ని గోశాలలోని పశువుల దాణా, సంరక్షనకు వినియోగిస్తున్నామని శ్రీనివాసాచార్యులు తెలిపారు. కాగా, గతంలో ఆవుపేడ పొడితో రాఖీలు, దీపాంతలు కూడా తయారుచేశారు. అంతేకాక గోమూత్రంతో ఫినాయిల్ తయారుచేసి విక్రయిస్త్తున్నామని నిర్వాహకులు వెల్లడించారు. -
ప్రతిభకు పరీక్ష
● సైన్స్పై ఆసక్తి పెంచేలా ‘వీవీఎం’ ● 6 నుంచి ఇంటర్ విద్యార్థులకు అవకాశంఖమ్మంసహకారనగర్: సైన్స్పై విద్యార్థులకు ఆసక్తి పెంచడం, వారిలో ఉన్న ప్రతిభను వెలికితీసేలా విద్యార్థి విజ్ఞాన్ మంథన్(వీవీఎం) కార్యక్రమాన్ని రూపొందించారు. ఆరో తరగతి నుంచి ఇంటర్ మొదటి సంవత్సరం చదివే విద్యార్థుల కోసం నిర్వహించే ఈ పరీక్ష దేశంలో అతిపెద్ద సైన్స్ టాలెంట్ సెర్చ్గా పేరు సాధించింది. శాసీ్త్రయ దృక్పథం ఉన్న ప్రతిభావంతులైన విద్యార్థులను గుర్తించడం ఈ పరీక్ష ముఖ్య ఉద్దేశం కాగా.. 100 మార్కులకు ప్రాథమిక పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో ప్రతిభ చూపిన వారిని రాష్ట్రస్థాయికి, అక్కడ విజేతలుగా నిలిచిన వారిని జాతీయస్థాయికి ఎంపిక చేస్తారు. రిజిస్ట్రేషన్ ఇలా.. వీవీఎం పరీక్షలో పాల్గొనేందుకు సెప్టెంబర్ 30వరకు రూ.200 ఫీజు చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ఆరో తరగతి మొదలు ఇంటర్ విద్యార్థులకు విడివిడిగా పరీక్ష నిర్వహిస్తారు. తెలుగు, హిందీ, ఇంగ్లిష్ తదితర భారతీయ భాషల్లో పరీక్ష రాసే వెసలుబాటు ఉంది. ఇక అక్టోబర్ 23 లేదా 27వ తేదీల్లో పరీక్ష నిర్వహించి నవంబర్ 15న ఫలితాలు ప్రకటిస్తారు. ఆపై డిసెంబర్ 8, 15, 22తేదీల్లో ఒకరోజు రాష్ట్ర శిబిరం, మే 17, 18వ తేదీల్లో జాతీయ శిబిరం ఉంటుంది. ఎంపిక పోటీలు వచ్చేనెల 1 నుంచి మాక్ పరీక్షలు నిర్వహిస్తారు. పాఠశాల స్థాయి ప్రధాన పరీక్ష అక్టోబర్ 28 నుంచి 30 వరకు ఉంటుంది. ఇందులో ఉత్తీర్ణులైన వారికి లెవల్–2 పరీక్ష ఆన్లైన్లో పరిశీలకుల సమక్షాన నవంబర్ 19న నిర్వహిస్తారు. పాఠశాల స్థాయి పరీక్షలో తరగతుల వారీగా ప్రతిభచూపిన మొదటి 25 మందిని ఎంపిక చేస్తారు. మొత్తంగా 150 మందిని ఎంపిక చేసి, అందులో ప్రతిభ చూపిన ప్రతీ తరగతి నుంచి ముగ్గురు చొప్పున 18మందిని జాతీయ స్థాయికి ఎంపిక చేస్తారు. రాష్ట్రస్థాయిలో ప్రతీ తరగతి నుంచి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు రూ.5వేలు, రూ.3వేలు, రూ.2వేలతోపాటు జ్ఞాపిక, సర్టిఫికెట్ అందజేస్తారు. ఇక జాతీయ స్థాయి విజేతలకు వరుసగా రూ.25వేలు, రూ.15వేలు, రూ.10వేలే కాక మెమెంటో, ప్రశంసాపత్రం ఇస్తారు. ఇదికాక నెలకు రూ.2వేల చొప్పున ఏడాది పాటు ఉపకార వేతనం అందుతుంది. అలాగే ప్రఖ్యాత జాతీయ ప్రయోగశాలలు, పరిశోధన సంస్థల్లో మూడు వారాల పాటు ప్రత్యేక శిక్షణ, ఇంటర్న్షిప్ కార్యక్రమం నిర్వహిస్తారు. విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసేందుకు విద్యార్థి విజ్ఞాన్ మంథన్ ఉపయోగపడుతుంది. జాతీయస్థాయి పరీక్షల్లో ప్రతిభ చూపితే ప్రఖ్యాత సంస్థల్లో ఇంటర్న్షిప్ లభిస్తుంది. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి. పోటీతత్వాన్ని పెంచుకునేందుకు ఈ పరీక్ష దోహదపడుతుంది. – పెసర ప్రభాకర్రెడ్డి, జిల్లా కోఆర్డినేటర్ -
రెండోరోజూ అవే బారులు
తల్లాడ: తల్లాడ పీఏసీఎస్లో రెండో రోజైన మంగళవారం కూడా యూరియా కోసం రైతులు క్యూ కట్టారు. సొసైటీకీ 911 బస్తాల యూరియా రాగా కూపన్ల ద్వారా ఏఓ ఎం.డీ.తాజుద్దీన్, ట్రెయినీ ఎస్ఐ వెంకటేశ్, సీఈఓ నాగబాబు సమక్షాన పంపిణీ చేశారు. అయితే సొసైటీ పరిధిలో భార్యాభర్తల పేరిట భూమి ఉంటే ఇద్దరూ వచ్చి వేలిముద్ర వేయాలనే నిబంధన విధించారు. దీంతో రెండేసి బస్తాల యూరియా కోసం గంటల తరబడి క్యూలో నిల్చోవాల్సి వచ్చింది. కాగా, భార్యాభార్తలిద్దరూ రావాలనే నిబంధన సడలించాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. యూరియా పంపిణీని పార్టీ నాయకులు ఆపతి వెంకటరామారావు తదితరులు పరిశీలించి తహసీల్దార్ సురేష్కుమార్, ఏడీఏ శ్రీనివాసరెడ్డికి వినతిపత్రం అందజేశారు. నాయకులు గాదె కృష్ణారావు, కామినేని శ్రీనివాసరావు, పులి వీరయ్య, దావీదు, రామారావు, నరేష్ పాల్గొన్నారు. -
జమలాపురానికి దేవుడే దిక్కు
● ట్రస్ట్ బోర్డు లేక అభివృద్ధిపై నీలినీడలు ● దాతలు ముందుకొస్తేనే ఆలయంలో పనులు ● పూర్తిస్థాయి ఈఓ కూడా లేక కొరవడిన పర్యవేక్షణ ఎర్రుపాలెం: తెలంగాణ తిరుపతిగా పేరున్న జమలాపురంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధిపై నీలినీడలు కమ్ముకున్నాయి. దశాబ్దాలుగా పాలకుల పట్టింపు లేక.. ఏటా రూ.4కోట్ల నికర ఆదాయం ఉన్నప్పటికీ అభివృద్ధి విషయంలో ముందుడుగు పడడం లేదు. రాష్ట్ర మంత్రులు ఆలయంలో శ్రీవారిని దర్శించుకుని వెళ్లడమే తప్ప ప్రభుత్వం నుంచి రూపాయి కూడా కేటాయించకపోవడంపై భక్తుల నుంచి విమర్శలు వస్తున్నాయి. ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు దాతలు రూ.కోట్లాది నిధులతో నిర్మాణాలు చేపట్టి ఆలయానికి అప్పగించారు. ఇవి తప్ప ప్రభుత్వపరంగా చొరవ మాత్రం కానరావడం లేదు. మధిర నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేక దృష్టి సారించి ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం నుంచి నిధులు కేటాయించాలని భక్తులు కోరుతున్నారు. పాలకమండలి ఏర్పాటులో జాప్యం ఆలయాల అభివృద్ధికి పాలక మండళ్లు(ట్రస్టు బోర్డు) కృషి చేస్తాయి. కానీ దశాబ్దకాలంగా జమలాపురం ఆలయానకి పాలకమండలి లేకపోవడం గమనార్హం. ఈ ఆలయానికి చైర్మన్గా ఆలయ వ్యవస్థాపక ధర్మకర్తలే వ్యవహరిస్తుండగా.. పాలక మండలి సభ్యులను ఎంపిక చేయాల్సి ఉంది. అది కూడా జరకపోవడం, గత ఏడాది నుండి మూడుసార్లు నోటిఫికేషన్ జారీ చేసినా నియామకం చేపట్టకపోవడం గమనార్హం. పాలక మండలి ఉంటే ఆలయ అభివృద్ధికి సూచనలు చేయడమే కాక దాతల నుంచి నిధుల సేకరణకు అవకాశం ఉండేది. ఆరింటిలో ఇదొకటి.. ఆదాయం విషయంలో గణనీయంగా పురోగతి సాధిస్తున్న జమలాపురం ఆలయానికి ఈఓగా అసిస్టెంట్ కమిషనర్ స్థాయి అధికారిని నియమించాల్సి ఉంది. కానీ ఇన్చార్జి ఈఓతోనే సరిపెడుతున్నారు. ప్రస్తుత ఇన్చార్జ్ ఈఓ కొత్తూరి జగన్మోహన్రావుకు ఖమ్మంలోని స్తంభాద్రి ఆలయం, మారెమ్మ ఆలయం, కూసుమంచి మండలం జీళ్లచెరువులోని రామాలయం, శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆలయం, మధిరలోని మృత్యుంజయస్వామి వారి ఆలయాల బాధ్యతలు కూడా కట్టబెట్టడంతో జమలాపురం ఆలయ పర్యవేక్షణ కింది స్థాయి ఉద్యోగులే చూసుకోవాల్సి వస్తోంది. వారానికి ఒకటి, రెండు రోజులు మాత్రమే ఇన్చార్జి ఈఓ వచ్చివెళ్తుండడం.. పాలక మండలి కూడా లేకపోవడంతో ఆలయ అభివృద్ధి విషయంలో పురోగతి కానరావడం లేదు. -
మార్కెట్ యార్డుల అభివృద్ధిపై దృష్టి
మధిర/ఎర్రుపాలెం: మధిర వ్యవసాయ మార్కెట్ యార్డులో నిరంతరం కార్యకలాపాల నిర్వహణకు సాధ్యాసాధ్యాలపై మంగళవారం చర్చించారు. ఈ సమావేశంలో మార్కెటింగ్ శాఖ వరంగల్ రీజియన్ జాయింట్ డైరెక్టర్ వి.శ్రీనివాస్ పాల్గొనగా చైర్మన్ బండారు నర్సింహారావు, కోల్డ్ స్టోరేజీల యాజమాన్యాలు, వ్యాపారులు హాజరయ్యారు. వ్యాపారులు ట్రేడ్ లైసెన్స్ తీసుకుని నిరంతరం కొనుగోళ్లు చేయడం ద్వారా రైతులకు న్యాయం జరుగుతుందని జేడీఎం తెలిపారు. అనంతరం శ్రీనివాస్ ఎర్రుపాలెంలోని గోదాంలను పరిశీలించి, అక్కడ చేయాల్సిన అభివృద్ధిపై పనులపై చర్చించారు. అలాగే, రాజుపాలెం వద్ద చెక్పోస్టును కూడా పరిశీలించారు. మార్కెట్ డైరెక్టర్లు గుడేటి బాబురావు, వేమిరెడ్డి అనురాధ, యన్నం పిచ్చిరెడ్డి, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.మధిర మార్కెట్లో నిరంతరం కొనుగోళ్లు -
గ్రానైట్ పరిశ్రమ పరిరక్షణకు ఐక్య ఉద్యమాలు
ఖమ్మంఅర్బన్: జిల్లాలో గ్రానైట్ పరిశ్రమను పరిరక్షించేలా అవసరమైతే ఐక్య ఉద్యమాలు చేపట్టాలని పలువురు సూచించారు. సీపీఎం జిల్లా కమిటీ ఆధ్వర్యాన మంగళవారం ఖమ్మంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో వివిధ పార్టీలు, సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెంచిన రాయల్టీ, పర్మిట్, సీవరేజ్ చార్జీల ఉపసంహరణ, వైఎస్సార్ హయాంలో ఇచ్చిన 40శాతం సబ్సిడీ పునరుద్ధరణ, పెండింగ్ ఉన్న రూ.20కోట్ల సబ్సిడీ విడుదల, గ్రానైట్ ఉత్పత్తులపై జీఎస్టీ తగ్గింపుపై చర్చించారు. ఈమేరకు సీఐటీయూ జాతీయ కోశాధికారి ఎం.సాయిబాబు మాట్లాడుతూ గ్రానైట్ పరి శ్రమలో సంక్షోభాన్ని పరిష్కరించి కార్మికుల జీవనోపాధికి ఇబ్బంది ఎదురుకాకుండా చూడాలని కోరారు. జిల్లాలోనే పరిశ్రమపై ఆధారంగా ప్రత్యక్షంగా 35వేల మంది, పరోక్షంగా లక్ష మంది ఉపాధి పొందుతున్నందున రాయల్టీ పెంపు, అధిక విద్యుత్ చార్జీల సమస్య ఎదురుకాకుండా చూడాలని సీపీఎం జిల్లా కార్యదర్శి సున్నా నాగేశ్వరరావు సూచించారు. కాగా, గ్రానైట్ రంగాన్ని ఆదాయ వనరుగా కాకుండా ఉపాధి కోణంలో చూడాలని గ్రానైట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు యుగంధర్ కోరారు. ఇంకా సీపీఐ, బీఆర్ఎస్, మాస్లైన్ నాయకులు శింగు నర్సింహారావు, ఉప్పల వెంకటరమణ, గోకినేపల్లి వెంకటేశ్వర్లు మాట్లాడగా గ్రానైట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కమర్తపు గోపాలరావుతో పాటు వివిధ పార్టీలు, అసోసియేషన్ల నాయకులు రాజారావు, మాదినేని రమేష్, బండిరమేష్, విష్ణు, కళ్యాణం వెంకటేశ్వరరావు, యర్రా శ్రీనివాస్, బోడపట్ల సుదర్శన్, జబ్బార్, తమ్మినేని కోటేశ్వరరావు, మోరంపూడి పరమేశ్వరరెడ్డి, బుగ్గవీటి శ్రీధర్, పారా నాగేశ్వరరావు, వేముల రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు -
వెబినార్లో తిరుమలాయపాలెం విద్యార్థిని
తిరుమలాయపాలెం: కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్(సీజీఆర్) ఆధ్వర్యాన మంగళవారం నిర్వహించిన రాష్ట్రస్థాయి వెబినార్లో తిరుమలాయపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పదో తరగతి విద్యార్థిని ఎం.భవ్యశ్రీ పాల్గొంది. తెలంగాణలో 13 జిల్లాల నుంచి విద్యార్థులు పాల్గొనగా.. భవ్యశ్రీ రానున్న వినాయక చవితి సందర్భంగా మట్టి విగ్రహాల ప్రతిష్ఠాపన ఆవశ్యకతను వివరించింది. ప్రత్యక్షంగా మట్టి విగ్రహాలను తయారుచేస్తూ మాట్లాడిన ఆమెను జ్యూరీ సభ్యులు అభినందించారు. కాగా, రాష్ట్రస్థాయి వెబినార్లో ఉపాధ్యాయులు పెసర ప్రభాకర్రెడ్డి, తెప్పల్లి శ్యామ్కుమార్ సహకారంతో పాల్గొన్న భవ్యశ్రీని ఎంఈఓ శ్రీనివాసరావు, హెచ్ఎం విజయకుమారి అభినందించారు.మట్టి గణపతి ప్రాముఖ్యతను వివరించిన భవ్యశ్రీ -
విద్యుత్ వైర్లతో చేపలు వేటాడుతూ మృతి
చింతకాని: విద్యుత్ వైర్ల సాయంతో చేపలు పడుతున్న వ్యక్తి ప్రమాదవశాత్తు షాక్కు గురై మృతి చెందాడు. మండలంలోని అనంతసాగర్కు చెందిన డేగల భాస్కర్రావు(39) ఊట వాగులో విద్యుత్ వైర్ల సాయంతో మంగళవారం చేపలు పడుతున్నాడు. ఈక్రమాన నీటిలో జారి పడడడంతో చేతిలో ఉన్న విద్యుత్ వైర్లు ఆయనపై పడగా షాక్కు గురయ్యాడు. సమీపానే ఉన్న భాస్కర్రావు కుటుంబీకులు ఆయనను ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఆయన భార్య రమాదేవి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై నాగుల్మీరా తెలిపారు. చేపల వేటకు వెళ్లి గల్లంతు మధిర: వరదలతో చేపలు కొట్టుకొస్తుండగా వేటకు వెళ్లిన వ్యక్తి గల్లంతైన ఘటన మధిర సమీపాన వైరా నదిలో మంగళవారం చోటుచేసుకుంది. మడుపల్లికి చెందిన పెసరమల్లి వినోద్(28) చేపలు పట్టేందుకు వైరా నది వద్దకు వెళ్లాడు. ఈక్రమాన నదిలోకి దిగిన ఆయన ప్రవాహానికి కొట్టుకుపోయాడు. సాయంత్రం వరకు ఇంటికి రాకపోవడంతో కుటుంబీకులు ఆరా తీస్తుండగా చేపల వేటకు వెళ్లినట్లు తెలుసుకున్నారు. దీంతో రాత్రి వరకు గాలించినా ఫలితం లేకపోగా.. ఎన్డీఆర్ఎఫ్ బృందం సభ్యులు బుధవారం రానున్నట్లు తెలిసింది. విచ్చలవిడిగా వ్యవహరిస్తే కేసులుఖమ్మంక్రైం: బహిరంగ మద్యపానం, వేగంగా వాహనాలు నడిపే వారితో పాటు నిర్ణీత సమయానికి మించి షాప్లు తెరిచినా, నడిరోడ్లపై వేడుకలు నిర్వహించినా సిటీ పోలీస్ యాక్టు కింద కేసులు నమోదు చేస్తామని నగర ఏసీపీ రమణమూర్తి హెచ్చరించారు. అలాగే, చోరీ కేసులను త్వరగా చేధించేలా మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ బృందాల ద్వారా వేగంగా దర్యాప్తు చేసేలా సీసీ కెమెరాల పుటేజీ సేకరిస్తున్నట్లు వెల్లడించారు. అలాగే, గంజాయి సరఫరా, వినియోగాన్ని సమూలంగా నియంత్రించేలా విస్తృత తనిఖీలు చేస్తున్నామని తెలిపారు. ఈమేరకు ఈ ఏడాది జూలై, ఆగస్టు నెలల్లో ఖమ్మం డివిజన్లో 38 కేసులు నమోదు చేసి 167మందికి గాను 114 మందిని అరెస్ట్ చేశామని చెప్పారు. వీరి నుంచి రూ.11లక్షల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ తెలిపారు. తాలిపేరుకు కొనసాగుతున్న వరదచర్ల: ఎగువ ప్రాంతమైన ఛత్తీస్గఢ్లో భారీ వర్షాలు కురుస్తుండగా భద్రాద్రి కొత్తగూడెంజిల్లా చర్ల మండలంలోని తాలిపేరు మధ్యతరహా ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతోంది. మంగళవారం 21,387 క్యూసెక్కుల చొప్పున వరదనీరు రాగా, 10 గేట్లు ఎత్తి 20,759 క్యూసెక్కుల చొప్పున నీటిని దిగువన ఉన్న గోదావరిలోకి విడుదల చేశారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 74 మీటర్లకు గాను ఎగువ నుంచి భారీగా వరద వస్తున్న దృష్ట్యా 71.84 మీటర్లుగా క్రమబద్ధీకరిస్తున్నామని ఇంజనీర్లు వెల్లడించారు. -
జాతీయ సీనియర్ అథ్లెటిక్స్ మీట్కు ఎంపిక
ఖమ్మం స్పోర్ట్స్: జాతీయస్థాయి సీనియర్ అథ్లెటిక్స్ మీట్కు ఖమ్మం అథ్లెటిక్స్ అకాడమీకి చెందిన ఏ.గౌతమ్, ఎస్.గోపీచంద్, ఎ.మైథిలి ఎంపికయ్యారు. ఇటీవల హనుమకొండలో జరిగి న రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో వీరు ప్రతిభ చూపారు. దీంతో తమిళనాడు రాష్ట్రం చైన్నెలో ఈనెల 20నుంచి అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యాన నిర్వహించే జాతీయ స్థాయి పోటీల్లో తెలంగాణ జట్టు తరఫున ప్రాతినిధ్యం వహించనున్నారు. క్రీడాకారులను డీవైఎస్ఓ టి.సునీల్రెడ్డి, అథ్లెటిక్స్ కోచ్ ఎం.డీ.గౌస్, అథ్లెటిక్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మందుల వెంకటేశ్వర్లు, ఎం.డీ.షఫీక్ అహ్మద్ అభినందించారు. వైద్య, ఆరోగ్యశాఖ చట్టాలపై నేడు సదస్సుఖమ్మంవైద్యవిభాగం: వైద్య,ఆరోగ్యశాఖ చట్టా లపై అవగాహన కల్పించేందుకు బుధవారం సదస్సు నిర్వహిస్తున్నట్లు డీఎంహెచ్ఓ బి.కళా వతిబాయి తెలిపారు. చట్టాలు, వీటిని ఉల్లంఘిస్తే ఎదురయ్యే పరిణామాలపై వివరించే ఈ సదస్సు కలెక్టర్ అధ్యక్షతన జరుగుతుందని వెల్లడించారు. కలెక్టరేట్లో బుధవారం మధ్యాహ్నం 2గంటలకు మొదలయ్యే సదస్సుకు ప్రై వేట్ ఆస్పత్రుల యాజమాన్యాలు, స్కానింగ్, డయాగ్నస్టిక్, ఇన్ఫెర్టిలిటీ సెంటర్ల నిర్వాహకులు, ప్రభుత్వ, ప్రైవేట్ రేడియోలజిస్టులు, గైనకాలజిస్టులు హాజరుకావాలని సూచించారు. ఆలయ షాప్ల వేలంతో రూ.98లక్షల ఆదాయంఎర్రుపాలెం: మండలంలోని జమలాపురం శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో నిర్వహిస్తున్న పలు దుకాణాల అప్పగింతకు మంగళవారం అధికారులు వేలం నిర్వహించారు. ఏడాది కాలానికి తలనీలాలు, కొబ్బరి చిప్పల సేకరణ, పొంగళ్లకు గ్యాస్ స్టౌల సరఫరా, వా హనాల పార్కింగ్, కొబ్బరికాయలు, బొమ్మల దుకాణాల నిర్వహణకు వేలం వేయగా రూ. 98.79లక్షల ఆదాయం సమకూరిందని ఈఓ కె.జగన్మోహన్రావు తెలిపారు. గత ఏడాది కంటే ఇది రూ.21.94లక్షలు అదనమని వెల్లడించారు. ఆలయ సూపరింటెండెంట్ విజయకుమారి, ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాసశర్మ తదితరులు పాల్గొన్నారు. నర్సరీల్లో నాణ్యమైన మొక్కలే పెంచాలికూసుమంచి: నర్సరీల నిర్వాహకులు నాణ్య మైన మొక్కలే పెంచి రైతులకు అందించాలని జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమశాఖ అధికారి మధుసూధన్ సూచించారు. కూసుమంచి, కేశ్వాపురం, గోపాలరావుపేటల్లో నర్సరీలను మంగళవారం తనిఖీ చేసిన ఆయన మొక్కల నాణ్యతను పరిశీలించి మాట్లాడారు. నర్సరీల నిర్వాహకులు నిబంధనలు ఉల్లంఘించి రైతులు నష్టపోవడానికి కారణమైతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పాలేరు ఉద్యానవన శాఖ అధికారి అపర్ణ పాల్గొన్నారు. నేత్రపర్వంగా రామయ్య నిత్యకల్యాణం భద్రాచలం: భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి నిత్యకల్యాణ వేడుక మంగళవారం నేత్రపర్వంగా సాగింది. గర్భగుడిలో స్వామికి సుప్రభాతసేవ, సేవాకాలం, ఆరాధన పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణ ధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని అర్చకులు నిర్వహించారు. -
గడువులోగా సీఎంఆర్ డెలివరీ
● అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి ఖమ్మం సహకారనగర్: నిర్ణీత గడువులోగా కస్టమ్ మిల్లింగ్ రైస్(సీఎంఆర్) పంపిణీ పూర్తిచేయాలని అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. కలెక్టరేట్లో మంగళవారం ఆయన అధికారులు, రైస్మిల్లర్లతో సమీక్షించా రు. 2024–25కు సంబంధించి సీఎంఆర్ డెలి వరీ గడువును ప్రభుత్వం నెల పాటు పొడిగించినందున, సెప్టెంబర్ 12వరకు పూర్తిచేయాలని స్పష్టం చేశారు. అలాగే, ఖరీఫ్ సీజన్లో ఇవ్వాల్సిన 1.98 మెట్రిక్ టన్నుల సీఎంఆర్లో 1.69 మెట్రిక్ టన్నులు ఇచ్చినందున మిగతా కూడా త్వరగా సరఫరా చేయాలని సూచించారు. డీసీ ఎస్ఓ చందన్కుమార్, జిల్లా పౌర సరఫరాల సంస్థ మేనేజర్ శ్రీలత, మిల్లర్ల అసోసియేషన్ అధ్యక్షుడు బొమ్మ రాజేశ్వర్రావు పాల్గొన్నారు. పంటల కనీస మద్దతు ధర పెంపు ఖమ్మంవ్యవసాయం: కేంద్ర ప్రభుత్వం 2025– 26 సంవత్సరానికి పంటల కనీస మద్దతు ధర పెంచిందని అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి తెలిపారు. కేంద్రం నిర్ణయించిన కనీస మద్దతు ధరల వివరాలను ఆయన ఓ ప్రకటనలో వెల్లడించారు. వరి కామన్ రకం క్వింటాకు రూ.2,369, గ్రేడ్–ఏ రకం రూ.2,389, జొన్నలు హైబ్రిడ్ రూ.3,699, సజ్జలు రూ.2,775, మొక్కజొన్నలు రూ.2,400, కందులు రూ.8వేల, పెసలు రూ.8,768, మినుములు రూ.7,800, వేరుశనగ రూ.7,263, నువ్వులు రూ.9,846, పత్తి రూ. 8,110గా ధరలు నిర్ణయించారని తెలిపారు. ఈమేరకు రైతులు పంట ఉత్పత్తులను ప్రభుత్వ కేంద్రాల్లో విక్రయిస్తూ కనీస మద్దతు ధర పొందాలని అదనపు కలెక్టర్ సూచించారు. ‘నవోదయ’లో ముగిసిన కళా ఉత్సవ్ కూసుమంచి: పాలేరులోని జవహర్ నవోదయ విద్యాలయలో రెండు రోజుల పాటు నిర్వహించిన క్లస్టర్ స్థాయి కళా ఉత్సవ్ పోటీలు మంగళవారంతో ముగిశాయి. ఈ పోటీల్లో ప్రతిభ చాటిన విద్యార్థులకు డీఈఓ కార్యాలయ అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మీప్రసాద్ ప్రశంసాపత్రాలు అందజేసి మాట్లాడారు. విద్యార్థుల్లో కళానైపుణ్యాన్ని వెలికితీసేలా పోటీలు నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. ఎంఈఓ బీ.వీ. రామాచారి మాట్లాడగా విద్యాలయ ప్రిన్సిపా ల్ కె.శ్రీనివాసులు, వివిధ జిల్లాల నవోదయ విద్యాలయాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. దుమ్ము, ధూళి నియంత్రణపై పర్యవేక్షణ సత్తుపల్లిరూరల్: బొగ్గు రవాణా సమయంలో దుమ్ము, ధూళి నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్ సూచించారు. సత్తుపల్లిలోని జేవీఆర్ ఓసీని మంగళవారం ఆయన తనిఖీ చేశారు. బొగ్గు నిల్వచేసే సైలోబంకర్, లోడింగ్ విధానా న్ని పరిశీలించి మాట్లాడారు. ధూళి నియంత్రణ కు అత్యాధునిక పరిజ్ఞానాన్ని అమలుచేయాలని తెలిపారు. తహసీల్దార్ సత్యనారాయణ, ఓసీ పీఓ ప్రహ్లాద్, సీహెచ్పీ ఇన్చార్జ్ డీజీఎం సోమశేఖర్రావు, ఇంజనీర్ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. వర్షంతో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం సత్తుపల్లిలో సోమ, మంగళవారం కురిసిన వర్షం కారణంగా జేవీఆర్ ఓసీ, కిష్టారం ఓసీల్లో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. రెండు ఓసీల్లో 30వేల మెట్రిక్ టన్నుల బొగ్గు ఉత్పత్తి, 92వేల మెట్రిక్ టన్నుల మట్టి తొలగింపు నిలిచిపోయిందని అధికారులు తెలిపారు. -
రాష్ట్రంలోనే రెండోస్థానంలో డీసీసీబీ
● బంగారం రుణాల్లో నంబర్–1 ● బ్యాంకు చైర్మన్ దొండపాటి వెంకటేశ్వరరావుఖమ్మంవ్యవసాయం: జిల్లా కేంద్ర సహకార బ్యాంకు(డీసీసీబీ) రూ.3,743 కోట్ల లావాదేవీలతో రాష్ట్రంలో రెండో స్థానంలో నిలిచిందని చైర్మన్ దొండపాటి వెంకటేశ్వరరావు తెలిపారు. ఖమ్మంలోని బ్యాంకు ప్రధాన కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన బ్యాంకు ప్రగతిని వివరించారు. లావాదేవీల్లో రూ.7 వేల కోట్లతో కరీంనగర్ ప్రథమ స్థానంలో ఉండగా, ఆ తర్వాత స్థానం ఖమ్మంకు దక్కిందన్నారు. ఇక బంగారం తాకట్టు రుణాల్లో రూ.850 కోట్లతో ఖమ్మం బ్యాంకు ప్రథమ స్థానంలో ఉందని తెలిపారు. ఇటీవల కందుకూరు, అడసర్లపాడులో బ్రాంచ్లు ప్రారంభించగా, కరుణగిరి, చెరువుమాదారం బ్రాంచ్లు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయని, మంచుకొండ, సిరిపురంలోనూ ఏర్పాటుకు ప్రతిపాదించామని వెల్లడించారు. ఇదే సమయాన రైతుల సౌకర్యం కోసం సారపాక, అన్నపురెడ్డిపల్లి బ్రాంచ్లను నారాయణపురం, మొండికుంట(అశ్వాపురం)కు మార్చేందుకు నిర్ణయించామని తెలిపారు. పెరిగిన డిపాజిట్లు బ్యాంకు డిపాజిట్లు గతేడాదితో పోలిస్తే రూ.121 కోట్లు పెరిగి రూ.1,265 కోట్లకు చేరాయని చైర్మన్ వెంకటేశ్వరరావు తెలిపారు. ఇక రుణాలు రూ.355 కోట్లు పెరిగి రూ.2,195 కోట్లకు చేరాయన్నారు. 2019–20లో రూ.7.23 కోట్ల నష్టాల్లో ఉన్న బ్యాంకు 2023–24లో లాభాల్లోకి రాగా.. 2024–25లో లాభాలు రూ. 5.30 కోట్లకు పెరిగాయని తెలిపారు. అలాగే, ఈ ఏడాది వానాకాలంలో రూ.923 కోట్ల పంట రుణాలు ఇచ్చామని, ఏజెన్సీ, మైదాన ప్రాంతాల్లో ఆయిల్ పామ్ సాగుకు ఎకరాకు రూ.5 లక్షల చొప్పున రూ. 30 లక్షల వరకు రుణాలు ఇస్తున్నట్లు వెల్లడించారు. ఇక బ్యాంకు ఉద్యోగులకు 26శాతం వేతనాలు(పీఆర్సీ) పెంచామని, సభ్యుల బీమా ప్రీమియంను రూ.19 నుంచి రూ.14కు తగ్గించామని తెలిపారు. కాగా, ఖమ్మం ఎన్ఎస్టీ, ఖమ్మం రూరల్ బ్రాంచ్ల్లో నకిలీ ధ్రువపత్రాలతో ఇచ్చిన మార్ట్గేజ్ రుణాల నుంచి కొంత రికవరీ జరిగిందని చెప్పారు. పీఏసీఎస్లు, డీసీసీబీ పాలకవర్గాల పదవీ కాలాన్ని మరో ఆరు నెలలు పొడిగించి రైతులకు సేవ చేసే అవకాశం కల్పించిన సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో డైరెక్టర్ పి.రాంబ్రహ్మం, బ్యాంకు సీఈఓ ఎన్.వెంకట్ ఆదిత్య పాల్గొన్నారు. -
లబ్ధిదారుల సమక్షాన పాడి పశువుల ఎంపిక
● ప్రతీ పశువుకు బీమా, జియో ట్యాగ్ ● అదనపు కలెక్టర్ డాక్టర్ శ్రీజఖమ్మంమయూరిసెంటర్: మధిర నియోజకవర్గంలో ఇందిరా మహిళా డెయిరీ ఏర్పాటులో భాగంగా పాడి పశువుల కొనుగోలులో నిబంధనలు పాటించాలని అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ ఆదేశించారు. కలెక్టరేట్లో అధికారులతో మంగళవారం సమీక్షించిన ఆమె ఒక్కో లబ్ధిదారుకు రెండేసి పాడి పశువులు పంపిణీ చేసేలా కమిటీ ఏర్పాటు చేశామని తెలిపారు. ఇక్కడి వాతావరణంలో ఇమిడే పశువులను లబ్ధిదారుల ఆమోదంతో కొనుగోలు చేయాలని, ఆపై బీమా తప్పక చేయించడమే కాక ప్రతీ పాడి పశువుకు జియో ట్యాగ్ వేయాలని సూచించారు. వచ్చే శుక్రవారం నుంచి కొనుగోలు ప్రక్రియ మొదలుపెట్టాలని ఆమె తెలిపారు. డీఆర్డీఓ సన్యాసయ్య, ఎస్సీ డీడీ కస్తాల సత్యనారాయణ, గిరిజన సంక్షేమ శాఖ అధికారిణి విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. కోడిగుడ్ల సరఫరాకు టెండర్లు జిల్లాలోని గురుకుల విద్యాసంస్థలు, అంగన్వాడీ కేంద్రాలకు కోడిగుడ్ల సరఫరా కోసం మూడు టెండర్లు దాఖలయ్యాయని అదనపు కలెక్టర్ శ్రీజ తెలిపారు. కలెక్టరేట్లో టెండర్లను పరిశీలించాక ఆమె మాట్లాడారు. మూడు సంస్థల బాధ్యులు ఒక్కో గుడ్డుకు రూ.5.99, రూ.6.27, రూ.6.66కు కోట్ చేశారని, నిబంధనలు పాటిస్తూ తక్కువ ధరతో సరఫరా చేసే వారికి టెండరు ఖరారు చేస్తామని తెలిపారు. సాంఘిక సంక్షేమం, బీసీ, మైనార్టీ, గిరిజన సంక్షేమ శాఖల డీడీలు కస్తాల సత్యనారాయణ, జి.జ్యోతి, డాక్టర్ బి.పురంధర్, ఎన్.విజయలక్ష్మి, డీఈఓ కె.నాగపద్మజ, డీడబ్ల్యూఓ కె.రాంగోపాల్రెడ్డి, జిల్లా మార్కెటింగ్ అధికారి ఎం.ఏ.అలీమ్ పాల్గొన్నారు. కట్టుదిట్టంగా ఎఫ్ఆర్ఎస్ హాజరు నమోదు ఖమ్మం సహకారనగర్: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరును ఎఫ్ఆర్ఎస్(ఫేస్ రికగ్నైజేషన్ సిస్టమ్) ద్వారా కట్టుదిట్టంగా నమోదు చేయాలని అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ సూచించారు. కలెక్టరేట్లో ఆమె హాజరు నమోదుపై సమీక్షించారు. విద్యాశాఖకు వచ్చే నిధుల వినియోగం, పాఠశాలల్లో పారిశుద్ధ్య నిర్వహణ, భవిత కేంద్రాల మరమ్మతులపై సూచనలు చేశాక అదనపు కలెక్టర్ మాట్లాడారు. విద్యార్థుల గైర్హాజరుకు కారణాలు ఆరా తీయాలని, ఉపాధ్యాయులకు సెలవుల మంజూరులో ప్రణాళికాయుతంగా వ్యవహరించాలని సూచించారు. విద్యార్థులకు ఆగస్టు చివరి నాటికి అపార్ నంబర్ కేటాయించాలని తెలిపారు. డీఈఓ నాగపద్మజ, కోఆర్డినేటర్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. గ్రంథాలయాల నిర్వహణకు పటిష్ట చర్యలు ఖమ్మంగాంధీచౌక్: గ్రంథాలయాల నిర్వహణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ సూచించారు. గ్రంథాలయ సంస్థ సర్వసభ్య సమావేశం కలెక్టరేట్లో జరగగా ఆమె మాట్లాడారు. నేలకొండపల్లిలో నూతన భవన నిర్మాణం పూర్తయ్యేలా రూ.22.60లక్షలు, జిల్లా కేంద్రంలో అదనపు భవన నిర్మాణానికి ఈ ఏడాది రూ.1.50కోట్ల కేటాయింపు, పోటీ పరీక్షల పుస్తకాల కొనుగోలు తదితర అంశాలపై చర్చించారు. గ్రంథాలయ కార్యదర్శి కె.కరుణ, వయోజన విద్య డీడీ అనిల్, డీఈఓ నాగపద్మజ, డీపీఓ ఆశాలత, ఏపీఆర్ఓ అయూబ్ఖాన్ తదితరులు పాల్గొన్నారు. -
వర్షం జోరు.. ఫుల్లు నీరు!
ఖమ్మంఅర్బన్: వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో జిల్లాలోని చెరువులు, చిన్నాపెద్దా ప్రాజెక్టులు జలకళ సంతరించుకున్నాయి. జిల్లాలో కురుస్తున్న వర్షానికి తోడు ఎగువ నుంచి వరద వచ్చి చేరడంతో 70 శాతానికి పైగా చెరువులు అలుగు పోస్తున్నాయి. సాగర్ ఆయకట్టు పరిధిలోని 17మండలాల్లో చెరువులన్నీ దాదాపు అలుగులు పారుతున్నాయని అధికారులు చెబుతున్నారు. మిగిలిన మండలాల్లోనూ పరిస్థితి ఆశాజనకంగా ఉండగా.. వానా కాలం పంటల సాగుకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టులు ఇలా... కూసుమంచి మండలంలోని పాలేరు రిజర్వాయర్ గరిష్ట స్థాయి నీటిమట్టం 23 అడుగులు కాగా, ప్రస్తుతం 22.20 అడుగులుగా నమోదైంది. ఇందులో 2.558 టీఎంసీల సామర్థ్యానికి గాను 2.413 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఇక వైరా ప్రాజెక్టు 2.523 టీఎంసీల సామర్థ్యానికి గాను పూర్తిగా నిండి నీటిమట్టం 18.11 అడుగులుగా నమోదైంది. అలాగే, లంకాసాగర్లో 16 అడుగుల నీటిమట్టానికి గాను 15 అడుగుల మేర నీరు చేరగా.. 0.664 టీఎంసీల సామర్థ్యంలో 0.601 టీఎంసీల నీరు నిల్వ ఉంది. గణనీయంగా ప్రవాహం ఆకేరు, మున్నేటి వాగుల్లోనూ ప్రవాహం గణ నీయంగా కొనసాగుతోంది. ఆకేరుకు 6,700 క్యూసెక్కుల నీరు చేరుతుండగా, తీర్థాల వద్ద 8,400–8,900 క్యూసెక్కుల వరకు నీరు ప్రవహిస్తోంది. ఇక మున్నేరు ఆక్వాడెక్ట్ వద్ద 6,200 క్యూసెక్కులు, పోలిశెట్టిగూడెం వద్ద 12,700 క్యూసెక్కులు, ఖమ్మం వద్ద మున్నేరు–ఆకేరు కలిసే ప్రదేశంలో 27,957 క్యూసెక్కుల వరద ప్రవాహం నమోదైంది. కాగా, మున్నేరు, ఆకేరులో వరద ప్రవాహం స్థిరంగానే ఉన్నప్పటికీ జల వనరుల శాఖ అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. అలుగు స్థాయికి చెరువులు జిల్లాలోని మొత్తం 1,061 చెరువులకు గాను 70 శాతం పైగా చెరువుల్లోకి 75నుంచి 100శాతం నీరు చేరింది. ఇందులో 347 చెరువులు పూర్తిగా నిండి అలుగు పోస్తున్నాయి. 0–25 శాతం వరకు 38, 25–50శాతం 94, 50–75శాతం 132, 75–90శాతం 190, 90–100 శాతం మేర నీరు 260 చెరువుల్లోకి చేరిందని అధికారులు వెల్లడించారు. వర్షాలు సమృద్ధిగా కురుస్తున్న నేపథ్యాన నీరు వృథా కాకుండా సాధ్యమైనంత మేర చెరువులు, చెక్ డ్యాంలకు మళ్లించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి సూచించారు. హైదరాబాద్ నుంచి వీసీ ద్వారా ఇంజనీర్లతో సమీక్షించిన ఆయన వరద పరిస్థితి, చెరువులు, ప్రాజెక్టుల్లో నీటి నిల్వలపై ఆరా తీయడమే కాక నిల్వలపై సూచనలు చేశారు. -
అదనపు కలెక్టర్కు డీఈఓ బాధ్యతలు?
ఖమ్మం సహకారనగర్: స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పి.శ్రీజకు డీఈఓగా పూర్తి స్థాయి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసిందని సమాచారం. ఇటీవల పలు జిల్లాల్లో డీఈఓ పోస్టులు ఖాళీ కాగా.. అదనపు కలెక్టర్లకు బాధ్యతలు అప్పగించారు. కానీ ఖమ్మంలో మాత్రం జెడ్పీ డిప్యూటీ సీఈఓ నాగలక్ష్మిని ఆ స్థానంలో నియమించారు. ఈనేపథ్యాన మంగళవారం అదనపు కలెక్టర్కు బాధ్యతలు అప్పగించినట్లు తెలిసినా.. స్పష్టత రావాల్సి ఉంది. 31వరకు దరఖాస్తులు ఖమ్మం సహకారనగర్: తెలంగాణ ఓపెన్ స్కూల్లో పదో తరగతి, ఇంటర్లో ప్రవేశానికి ఈనెల 21వ తేదీ వరకు అపరాధ రుసుం లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చని డీఈఓ నాగపద్మజ, ఓపెన్ స్కూల్ ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ మద్దినేని పాపారావు తెలిపారు. అలాగే, అపరాధ రుసుముతో ఈనెల 31వ తేదీ వరకు ఫీజు చెల్లించే అవకాశముందని పేర్కొన్నారు. వివరాలకు 80084 03522 నంబర్లో సంప్రదించాలని సూచించారు. -
లక్ష్యం మేర వన మహోత్సవం
ఖమ్మంమయూరిసెంటర్: వనమహోత్సవం కింద శాఖల వారీగా కేటాయించిన లక్ష్యాల మేరకు నెలాఖరు లోగా మొక్కలు నాటాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆదేశించారు. అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ, కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్యతో కలిసి మంగళవారం ఆయన వనమహోత్సవం, సీజనల్ వ్యాధుల కట్టడి, ప్రభుత్వ కార్యాలయాల్లో సోలార్ విద్యుత్ ఉత్పత్తి, ఇందిరా గిరి జలవికాసం, జల్ జీవన్ మిషన్, ఇందిరమ్మ ఇళ్ల పురోగతిపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 35.32లక్షల మొక్కలకు గాను 25.71 లక్షల మొక్కలు నాటినందున మిగతావీ పూర్తిచేయాలన్నారు. అలాగే, సీజనల్ వ్యాధుల కట్టడిపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఇక 16,474 ఇందిరమ్మ ఇళ్లలో 12వేలకు మార్కింగ్ పూర్తయినందున నిర్మాణంలో వేగం పెరిగేలా పర్యవేక్షించాలని తెలిపారు. సోలార్ ప్యానెళ్ల ఏర్పాటుకు ప్రభుత్వ కార్యాలయాల నుంచి ప్రతిపాదనలు సేకరించాలని సూచించిన కలెక్టర్... పారిశుద్ధ్య పనులపై చర్చించారు. అలాగే, ఇందిరా గిరి జల వికాసం ద్వారా పోడు పట్టా కలిగిన రైతుల పొలాల్లో సోలార్ పంప్సెట్ల ద్వారా మోటార్ అమరిస్తే జిల్లాలో 11,786 మందికి లబ్ధి జరుగుతుందని తెలిపారు. ఆతర్వాత నీటి సరఫరా, హాస్టళ్లలో టాయిలెట్ల నిర్మాణం తదితర అంశాలపై కలెక్టర్ సమీక్షించారు. జెడ్పీ సీఈఓ దీక్షారైనా, డీఆర్డీఓ సన్యాసయ్య, డీఎంహెచ్ఓ కళావతిబాయి, డీపీఓ ఆశాలత, ట్రాన్స్కో, పీఆర్, పబ్లిక్ హెల్త్ ఎస్ఈలు శ్రీనివాసాచారి, శేఖర్రెడ్డి, రంజిత్, హౌజింగ్ పీడీ భూక్యా శ్రీనివాస్, గిరిజన సంక్షేమ శాఖ డీడీ విజయలక్ష్మి, మున్సిపల్ ఈఈ కృష్ణలాల్, ఐటీడీఏ ఏపీఓ డేవిడ్రాజ్ పాల్గొన్నారు. -
భార్య వివాహేతర సంబంధం..సెల్పీవీడియోతో భర్త బలవన్మరణం
భద్రాద్రికొత్తగూడెం జిల్లా: మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ ఆమె భర్త మృతికి కారణమైన ప్రభుత్వ ఉపాధ్యాయుడు కటకటాల పాలయ్యాడు. ఈ విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. భద్రాద్రికొత్తగూడెం జిల్లా జూలురుపాడు మండలం సూర్యాతండాకు చెందిన వాంకుడోత్ బావుసింగ్ ములుగు జిల్లా వాజేడు మండలం బిజినేపల్లి ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ క్రమంలో జూలురుపాడుకు చెందిన ఓ మహిళతో పరిచయం ఏర్పడి అది కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ విషయం సదరు మహిళ భర్తకు తెలియడంతో అతను సూసైడ్ నోట్ రాసి సెల్ఫీ వీడియో తీసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. సూసైడ్ నోట్, సెల్ఫీ వీడియో ఆధారంగా కేసు నమోదు చేసిన కొత్తగూడెం పోలీసులు సదరు ఉపాధ్యాయుడిని ఈనెల 11వ తేదీన అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు తెలిసింది. ఈ విషయంపై ఎంఈఓ వెంకటేశ్వర్లును వివరణ కోరగా బావుసింగ్ను అరెస్ట్ చేసిన మాట వాస్తమే కాని తనకు, జిల్లా విద్యాశాఖకు ఎలాంటి సమాచారం లేదన్నారు. విద్యార్థుల భవిష్యత్ దృష్టా సమీపంలోని మొరుమూరు పాఠశాల నుంచి ఓ ఉపాధ్యాయుడిని బిజినేపల్లి పాఠశాలకు పంపిస్తున్నట్లు తెలిపారు. -
నవంబర్లో పీడీఎస్యూ రాష్ట్ర మహాసభలు
ఖమ్మంమయూరిసెంటర్: ఖమ్మం జిల్లా కేంద్రంలో నవంబర్ మూడో వారంలో పీడీఎస్యూ రాష్ట్ర 23వ మహాసభలు నిర్వహించనున్నామని సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కాంపాటి పృథ్వీ, అనిల్ సాయిబోలా అన్నారు. సోమవారం ఖమ్మంలోని రామనర్సయ్య విజ్ఞాన కేంద్రంలో వారు విలేకరులతో మాట్లాడారు. 1960 దశకం చివరిలో ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా పీడీఎస్యూ పురుడు పోసుకుందని, జార్జిరెడ్డి, జంపాల చంద్రశేఖర ప్రసాద్, శ్రీపాద శ్రీహరి, కొలా శంకర్, చేరాలు వంటి ఎంతోమంది.. విద్యార్థుల హక్కుల కోసం, శాసీ్త్రయ విద్య, సమానత్వ సమాజ స్థాపనను కాంక్షిస్తూ విద్యార్థి ఉద్యమంలో అమరులయ్యారన్నారు. ఎన్నో సామాజిక, ప్రజాతంత్ర, విప్లవోద్యమాలకు పురిటిగడ్డ అయిన ఖమ్మం జిల్లా కేంద్రంలో పీడీఎస్యూ రాష్ట్ర మహాసభలను నిర్వహించనున్నామని, వీటిని విజయవంతం చేయాలని కోరారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విద్యారంగాన్ని కాషాయీకరించేందుకు దుర్మార్గ సంస్కరణలకు పూనుకుంటోందన్నారు. సమావేశంలో పీడీఎస్యూ రాష్ట్ర ఉపాధ్యక్షులు బి.నరసింహారావు, నరేందర్, అఖిల్ కుమార్, సహాయ కార్యదర్శి వెంకటేశ్, ఎస్.సాయికుమార్, సురేశ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు లక్ష్మణ్, అంగిడి కుమార్, అలవాల నరేశ్, మునిగల శివ, అజయ్, నాగరాజు, అషూర్, రాందాస్ తదితరులు పాల్గొన్నారు. సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు పృథ్వీ, అనిల్ -
ఇంత జరిగినా నిర్లక్ష్యమే..
● కల్లూరు గిరిజన ఆశ్రమ పాఠశాలలో మళ్లీ ఫుడ్ పాయిజన్ ● ఐటీడీఏ పీఓ హెచ్చరించినా తీరుమారని అధికారులు ● సాయంత్రం స్నాక్స్ను రాత్రి భోజనంలో పెట్టిన వైనం ● స్వాతంత్య్ర వేడుకల స్టాళ్ల ప్రదర్శనలోనూ బయటపడిన నిర్లక్ష్యం ఖ్మంమయూరిసెంటర్: సంక్షేమ శాఖల వసతి గృహాల నిర్వహణపై అధికారుల నిర్లక్ష్యం మరోసారి బట్టబయలైంది. విద్యార్థులకు సురక్షితమైన వసతి, భోజన సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యతను పక్కన పెట్టి, వారి ఆరోగ్యాన్ని గాలికొదిలేస్తున్నార న్న ఆరోపణలు వస్తున్నాయి. 14రోజుల వ్యవధిలోనే ఒకే ఆశ్రమ పాఠశాలలో రెండు సార్లు విద్యార్థి నులు ఫుడ్పాయిజన్కు గురికావడం తీవ్ర ఆందో ళన కలిగిస్తోంది. ఐటీడీఏ పీఓ హెచ్చరించినా.. జిల్లా అధికారులు, స్థానిక అధికారులు, సిబ్బందిలో మార్పు రాకపోవడంపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలోని కల్లూరు గిరిజన ఆశ్రమ పాఠశాలలో శనివారం రాత్రి తిన్న భోజనంతో విద్యార్థులు అస్వస్థతకు గురికావడం అధికారులు, సిబ్బంది అలసత్వానికి నిదర్శనమని విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నేతలు విమర్శిస్తున్నారు. వరుస ఘటనలు.. కల్లూరు గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో ఈ నెల 3న ఆదివారం అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంతో మధ్యాహ్నం వండిన చికెన్ రాత్రి తినడం, ఆ మరునాడే ఉదయం ఉడికి ఉడకని కిచిడి తినడంతో 15 మందికి పైగా విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. ఆ ఘటన మరువక ముందే ఈ నెల 16న శనివారం సాయంత్రం విద్యార్థినులకు అందించాల్సిన స్నాక్స్ (క్యాబేజీ పకోడి) రాత్రి భోజనంతో పాటు అందించడంతో పలువురు విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. ఒకే ఆశ్రమ పాఠశాలలో వరుసగా రెండు ఘటనలు చోటు చేసుకోవడంతో నిర్వహణ, జిల్లా అధికారుల పర్యవేక్షణ ఏస్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. సమయపాలన లేదు.. గిరిజన సంక్షేమ వసతిగృహాలు, ఆశ్రమ పాఠశాల ల్లో విద్యార్థులకు అందించాల్సిన అల్పాహారం, భోజనం, స్నాక్స్ వంటి వాటికి సమయపాలన లేదనే విమర్శలు వస్తున్నాయి. మధ్యాహ్నం వండిన చికెన్ సాయంత్రం, సాయంత్రం 4 గంటల సమయంలో అందించాల్సిన స్నాక్స్ రాత్రి భోజనంతో పెడుతున్నారు. జిల్లాలోని అన్ని గిరిజన వసతిగృహాలు, ఆశ్రమ పాఠశాలల్లో ఇలానే జరుగుతోందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కల్లూరులో శనివారం సాయంత్రం తయారు చేసిన స్నాక్స్ రాత్రి భోజనంతో అందించడంపై అధికారులు ఆరా తీ యగా.. హెచ్ఎం సరుకులు ఆలస్యంగా ఇచ్చా రని వర్కర్లు, వర్కర్ ఆలస్యంగా వంట తయారు చేశా రని హెచ్ఎం ఫిర్యాదు చేసినట్లు సమాచారం. కాగా, కల్లూరు ఆశ్రమ పాఠశాలలో ఐటీడీఏ పీఓ పర్యటించి వార్డెన్ నిర్లక్ష్యంతోనే ఫుడ్ పాయిజన్ జరిగినట్లు నిర్ధారించి సస్పెండ్ చేశారు. ఆహారం తయారు చేసిన సిబ్బందిపై చర్యలు తీసుకోలేదు. ఇలాంటి ఘటనలు పునరావృతం కావొద్దని అధికారులు, హెచ్ఎంలు, వసతిగృహ సంక్షేమ అధికారులను హెచ్చరించారు. అయినా వారు సీరియస్గా తీసుకున్నట్లు కనిపించడం లేదు. అదే ఆశ్రమ పాఠశాలలో మరో ఘటన చోటు చేసుకుందనే ఆరోపణలు ఉన్నాయి. వంట చేసిన వారిని అధికారులు వేరే వసతిగృహానికి మార్చి చేతులు దులుపుకున్నట్లు తెలిసింది. గిరిజన అభివృద్ధి శాఖ అధికారుల నిర్లక్ష్యం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ముందే బయటపడింది. ఈ నెల 15న స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా పోలీస్ పరేడ్ మైదానంలో వేడుకలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమశాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాళ్లలో నోట్బుక్స్పై కేసీఆర్, సత్యవతిరాథోడ్ ఫొటోలు ఉండడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా.. కల్లూరు ఆశ్రమ పాఠశాల ఘటనపై జిల్లా గిరిజన అభివృద్ధి అధికారిణి విజయలక్ష్మిని వివరణ కోరగా.. సాయంత్రం చేసిన స్నాక్స్ రాత్రి భోజనంతో పాటు తినడంతో విద్యార్థినులకు కడుపునొప్పి వచ్చిందని, ఘటనలో వర్కర్ను అక్కడి నుంచి మార్చామని తెలిపారు. -
విద్యార్థులకు తపాలా స్కాలర్షిప్లు
ఖమ్మంగాంధీచౌక్ : దీన్ దయాళ్ స్పర్శ యోజన పథకం కింద 2025 – 26 సంవత్సర పిలాటలీ స్కాలర్షిప్ పథకానికి 6 నుంచి 9వ తరగతి మధ్య చదువుతున్న విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఖమ్మం డివిజన్ పోస్టల్ సూపరింటెండెంట్ వి.వీరభద్ర స్వామి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. పిలాటలీ క్విజ్, ప్రాజెక్టు కార్యక్రమాలను పోస్టల్ డివిజనల్, రీజనల్/సర్కిల్ స్థాయిలో నిర్వహించనున్నామని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో ప్రతిభ కనబర్చిన వారికి నెలకు రూ. 500 చొప్పున ఏడాదికి రూ. 6 వేలు అందిస్తామని తెలిపారు. విద్యార్థులు తమ దరఖాస్తులను ‘సూపరింటెండెంట్ ఆఫ్ పోస్టాఫీసెస్, ఖమ్మం డివిజన్, ఖమ్మం 507003’ అడ్రస్కు సెప్టెంబర్ 13 లోగా పంపించాలని తెలిపారు. మరిన్ని వివరాలకు www.indiapost.gov.in వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చని సూచించారు. 21న జిల్లాస్థాయి అథ్లెటిక్స్ ఎంపికలుఖమ్మం స్పోర్ట్స్ : నగరంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో ఈనెల 21న జిల్లా స్థాయి అథ్లెటిక్స్ ఎంపికలు నిర్వహిస్తున్నట్లు జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ కార్యదర్శి ఎం.డి.షఫీక్ అహ్మద్ ఒక ప్రకటనలో తెలిపారు. అండర్–14, 16, 18, 20 బాలబాలికలకు ఎంపికలు జరుగుతాయని, ఆసక్తి గలవారు వయసు ధ్రువీకరణ పత్రాలతో హాజరు కావాలని పేర్కొన్నారు. జిల్లా జట్టుకు ఎంపికై న వారిని ఈనెల 30, 31 తేదీల్లో మహబూబ్నగర్లో జరిగే రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ చాంపియన్షిప్ పోటీలకు పంపిస్తామని తెలిపారు. క్రీడాకారులు 21న ఉదయం 9 గంటలకు స్టేడియంలో రిపోర్టు చేయాలని సూచించారు. విస్తారంగా వర్షాలు కొనసాగుతున్న అల్పపీడన ప్రభావంఖమ్మంవ్యవసాయం: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం రాత్రి నుంచి వర్షం సోమవారం రాత్రి వరకు వాన కొనసాగుతూనే ఉంది. వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం రాత్రి కల్లూరు మండలంలో అధికంగా 27.6 మి.మీ. వర్షపాతం నమోదు కాగా, ఖమ్మం రూరల్ మండలంలో 17.6, బోనకల్లో 14.2, ముదిగొండ, సత్తుపల్లిలో 12.8, చింతకానిలో 11.4, ఖమ్మం అర్బన్లో 10.2 మి.మీ. నమోదు కాగా, మిగిలిన మండలాల్లో 10 మి.మీ. లోపు వర్షపాతం నమోదైంది. సోమవారం ఉదయం నుంచి రాత్రి 7 గంటల వరకు జిల్లా వ్యాప్తంగా వర్షపు జల్లులు కొనసాగుతూనే ఉన్నాయి. మధిర మండలం సిరిపురంలో 11.3, రావినూతలలో 10.3 మి.మీ. వర్షపాతం నమోదు కాగా, మిగిలిన ప్రాంతాల్లో 10 మి.మీ.లోపు వర్షపాతం నమోదంది. అయితే ఎగువన కురిసిన వర్షాలతో జిల్లా మీదుగా ప్రవహించే వాగుల్లో వరద ఉధృతి కొనసాగుతోంది. మున్నేరు, బుగ్గవాగు తదితర వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. విద్యుత్ వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలి.. విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యాన విద్యుత్ వినియోగదారులు, ప్రధానంగా రైతులు అప్రమత్తంగా ఉండాలని ఖమ్మం విద్యుత్ సర్కిల్ ఎస్ఈ ఇనుగుర్తి శ్రీనివాసా చారి సోమవారం ఒక ప్రకటనలో కోరారు. గోదావరిలో వరద ఉధృతిభద్రాచలంఅర్బన్/దుమ్ముగూడెం: భద్రాచలం వద్ద గోదావరిలో వరద ఉధృతి మూడు రోజుల నుంచి క్రమంగా పెరుగుతోంది. కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లడంతోపాటు ఎగువన ఉన్న కాళేశ్వరం తదితర ప్రాజెక్ట్ల నుంచి వరదనీరు వస్తోంది. దీంతో సోమవారం మధ్యాహ్నం ఒంటి గంటకు భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 36.50 అడుగులకు చేరింది. సాయంత్రం 5 గంటలకు 37.70 అడుగులకు పెరిగింది. నది ఒడ్డున మెట్లప్రాంతంలోని తాత్కాలిక స్నానపు గదులు నీటమునిగాయి. దుమ్ముగూడెం మండలంలోని పర్ణశాల, కాశీనగరం, సున్నంబట్టి, దుమ్ముగూడెం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. పర్ణశాలలోని నారచీరల ప్రాంతంలో ఉన్న సీతమ్మవారి విగ్రహం పూర్తిగా నీట మునిగింది. సున్నంబట్టి–బైరాగులపాడు గ్రామాల మధ్య రహదారిపైకి వరదనీరు చేరి రాకపోకలు నిలిచిపోయాయి. -
ఖమ్మం ఫొటోగ్రాఫర్కు అవార్డు
ఖమ్మంఅర్బన్: ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి ఫొటోగ్రఫీ పోటీలను నిర్వహించగా ఖమ్మం నగరానికి చెందిన చావా సంపత్కుమార్ రెండు అవార్డులు గెలుచుకున్నారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, చేయూత, రాజీవ్ యువ వికాసం, జనరల్ విభాగాల్లో జరిగిన పోటీల్లో సంపత్ తీసిన చిత్రాలు ఆకర్షించాయి. అవార్డులను హైదరాబాద్లోని గ్రీన్ పార్క్ హోటల్లో ఆగస్ట్ 19న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర సమాచార శాఖ కమిషనర్ ప్రియాంక చేతుల మీదుగా ప్రదానం చేయనున్నారు. మోహినుద్దీన్ ప్రతిభ తిరుమలాయపాలెం: విజయవాడలోని ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ప్రదర్శనలో మండలంలోని గోల్తండా పరిధిలోని జింకలగూడేనికి చెందిన ఫొటోగ్రాఫర్ మోహినుద్దీన్ ‘సర్టిఫికెట్ ఆఫ్ మెరిట్ అవార్డు – 2025’అందుకున్నారు. ఇండియా ఇంటర్నేషనల్ ఫొటోగ్రాఫిక్ కౌన్సిల్, ఫొటోగ్రఫీ అకాడమీ ఆఫ్ ఇండియా సంయుక్తంగా నిర్వహించిన పోటీల్లో మోహినుద్దీన్ తీసిన ఫొటో అవార్డుకి ఎంపికై ంది. ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ, వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ కొంపల్లి సుందర్, ఫొటోగ్రఫీ అకాడమీ ఆఫ్ ఇండియా వ్యవస్థాపక చైర్మన్ తమ్మా శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు, టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్, సీఈఓ మల్లికార్జునరావు చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. -
కేంద్ర పన్నుల ఆదాయంలో రాష్ట్రాల వాటా ఎంత?
ఖమ్మంమయూరిసెంటర్: కేంద్ర పన్నుల నికర ఆదాయంలో 2024 – 25 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్రాలకు రావాల్సిన వాటా ఎంత..? అని ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురాంరెడ్డి లోక్సభలో ప్రశ్నించారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో భాగంగా సోమవారం ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ రాష్ట్రాలకు వాటాపై 15వ ఆర్థిక సంఘం సూచన, ప్రభుత్వం చేపట్టిన అధికార వికేంద్రీకరణ స్థాయి, రాష్ట్ర నిర్దిష్ట గ్రాంట్ల వివరాలను తెలపాల్సిందిగా కోరారు. దీనికి కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లిఖితపూర్వక సమాధానమిచ్చారు. రాష్ట్రాల వాటా రూ. 12.86 లక్షల కోట్లు. 2024 – 25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పన్నులు, సుంకాల నికర ఆదాయంలో రాష్ట్రాల వాటా మొత్తం రూ.12,86,885.44 కోట్లు ఉన్నట్లు తెలిపారు. 41 శాతం తక్కువగా ఉందా..? అని ఎంపీ ప్రశ్నించగా 15వ ఆర్థిక సంఘం ఆమోదించిన సిఫార్సుల ప్రకారం ఉన్నట్లు పేర్కొన్నారు. స్థానిక సంస్థలకు కేంద్రం నేరుగా ఎలాంటి పన్ను కేటాయించలేదని తెలిపారు. ముమ్మరంగా వాహనాల తనిఖీఖమ్మంక్రైం: సీపీసునీల్దత్ ఆదేశాల మేరకు అడి షనల్ డీసీపీప్రసాద్రావు పర్యవేక్షణలో ఆదివా రం అర్ధరాత్రి దాటిన తర్వాత పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. అనుమానాస్పద వ్యక్తు ల వేలిముద్రలు సేకరించారు. మద్యం సేవించి పట్టుబడిన వాహనదారులపై కేసు నమోదు చేశారు. ప్రమాద నివారణ చర్యలు చేపట్టారు. ఈ ఏడాది జనవరి నుంచి ఆగస్ట్ 17వ తేదీ వరకు నిర్వహించిన తనిఖీల్లో 10,141 మంది వాహనదారులు పట్టుబడ్డారని పోలీసులు తెలిపారు. లారీడ్రైవర్ను మోసగించిన సైబర్ దుండగులుఖమ్మంఅర్బన్: రెట్టింపు లాభం వస్తుందని నమ్మించి లారీడ్రైవర్ నుంచి రూ.83,940ను కాజేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఖమ్మంఅర్బన్ (ఖానాపురం హవేలి) పోలీస్స్టేషన్లో సోమవారం సైబర్ క్రైమ్ కేసు నమోదైంది. సీఐ భానుప్రకాశ్ కథనంప్రకారం..నగరంలోని శ్రీరాంనగర్కు చెం దిన షేక్జానీహుస్సేన్లారీడ్రైవర్గా పనిచేస్తున్నా డు.‘పెట్టుబడి పెడితే రెట్టింపులాభం వస్తుంది’ అంటూ సామాజిక మాధ్యమాల్లో వచ్చిన ప్రకటనను నమ్మి, మిత్రుడి సూచన మేరకు గత జూలై 23, 24 తేదీల్లో రూ.83,940 వివిధ దపాలుగా చెల్లించాడు. తర్వాత సంబంధిత ఖాతా బ్లాక్ అవడంతో మోసపోయానని సైబర్ క్రైమ్ నంబర్ 1930కి ఫిర్యాదు చేశాడు. రూ.18 వేలు డ్రా కాకుండా నిలువరించారు. బాధితుడి ఫిర్యాదుపై కేసు నమోదు చేశామని సీఐ తెలిపారు. -
యూజీడీ పనులు నాణ్యంగా ఉండాలి
మధిర: మధిర మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ నిర్మాణ పనులను నాణ్యతతో, వేగంగా పూర్తి చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన హైదరాబాద్లోని సచివాలయంలో మధిర పట్టణ సమగ్రాభివృద్ధిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. నెలకు ఒకసారి మున్సిపల్ ఇంజనీర్ ఇన్ చీఫ్ (ఈఎన్సీ), ప్రతి 15 రోజులకు సీఈ స్థాయి అధికారులు విధిగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను పరిశీలించాలని భట్టి సూచించారు. నాణ్యతతో అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ పనుల ప్రగతికి సంబంధించి ప్రతి వారం, 15 రోజులు, నెల రోజుల వ్యవధిలో టార్గెట్లు నిర్దేశించుకుని ప్రాజెక్టును పూర్తి చేయాలన్నారు. ఈ పనులపై ప్రజలకు అవగాహన కల్పించడంలో వార్డు కౌన్సిలర్లను భాగస్వాములను చేయాలని అన్నారు. ఈ ప్రాజెక్టు పనులపై తాను తరచూ సమీక్ష చేస్తానని తెలిపారు. అమృత్ పథకం కింద జరుగుతున్న అభివృద్ధి పనులు, జాలిమూడి నుంచి మధిర పట్టణానికి తాగునీటి సరఫరా తదితర అంశాలను సమీక్షించారు. నెల రోజుల్లో అంబేద్కర్ స్టేడియం పనులు పూర్తి చేయాలన్నారు. మధిరలో చెత్తను పూర్తిగా డంపింగ్ యార్డ్కు తరలించాలి తప్ప రహదారుల వెంట కనిపించొద్దని స్పష్టం చేశారు. పర్యాటక, మున్సిపల్, రోడ్లు భవనాల శాఖల అధికారులు సమన్వయం చేసుకొని ట్యాంక్ బండ్, ఇతర సుందరీకరణ పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. సమావేశంలో మున్సిపల్ అర్బన్ డెవలప్మెంట్ సెక్రటరీ శ్రీదేవి, పబ్లిక్ హెల్త్ ఈఎన్సీ భాస్కర్ రెడ్డి, మధిర మున్సిపల్ కమిషనర్ సంపత్ తదితరులు పాల్గొన్నారు. -
సమయపాలన పాటించాలి
● ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించండి ● అధికారులకు కలెక్టర్ ఆదేశంఖమ్మం సహకారనగర్ : కలెక్టరేట్లోని వివిధ శాఖల అధికారులు, సిబ్బంది ఫేస్ రికగ్నైజేషన్ సిస్టం ద్వారా హాజరు నమోదు చేయడంతో పాటు సమయపాలన పాటించాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్లు డాక్టర్ పి.శ్రీజ, పి.శ్రీనివాసరెడ్డితో కలిసి ఫిర్యాదులు స్వీకరించారు. అనంతరం మాట్లాడుతూ.. జనవరి ఒకటి నుంచి ఇప్పటివరకు మున్సిపల్ కార్పొరేషన్ వద్ద 37, డీఈఓ వద్ద 28, సర్వే ల్యాండ్ రికార్డ్స్ 26, ఎన్పీడీసీఎల్ 22, జీజీహెచ్ 17, వైద్యారోగ్య శాఖ 8, పంచాయతీరాజ్ శాఖ వద్ద ఏడు ప్రజావాణి దరఖాస్తులు పెండింగ్ ఉన్నాయని వివరించారు. వీటితో పాటు సీఎం ప్రజావాణి పెండింగ్ దరఖాస్తులను జిల్లా అధికారులు త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. కార్యాలయాలకు ప్రజాప్రతినిధులు పంపే ప్రతీ దరఖాస్తుకు సమాధానం ఇవ్వాలని, ఆ పని పూర్తి చేయలేకుంటే అందుకు గల కారణాలు తెలుపుతూ లేఖ రాయాలని సూచించారు. కార్యక్రమంలో డీఆర్ఓ ఎ.పద్మశ్రీ, జెడ్పీ సీఈఓ దీక్షారైనా, డీఆర్డీఓ సన్యాసయ్య, కలెక్టరేట్ ఏఓ కారుమంచి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఫిర్యాదుల్లో కొన్ని ఇలా.. ● ఖమ్మం రూరల్ మండలం మంగళగూడెం గ్రామానికి చెందిన కొప్పుల బుచ్చమ్మ.. తన భర్త నుంచి వారసత్వంగా సంక్రమించిన భూమి తన పేరున రెవెన్యూ రికార్డుల్లో నమోదుకు కుమార్తెలు అడ్డుపడుతూ, వృద్ధాప్యంలో ఉన్న తనను ఇబ్బంది పెడుతున్నారని ఫిర్యాదు చేసింది. ● ఖమ్మం నగరానికి చెందిన జోగుపర్తి వెంకమ్మ.. తన ఇద్దరు కుమారులపై గతంలో ఫిర్యాదు చేశానని, కలెక్టర్ గత ఫిబ్రవరిలో జారీ చేసిన ఆర్డర్ను వారు పాటించడం లేదని తెలపగా సీనియర్ సిటిజన్ సంరక్షణ చట్ట ప్రకారం అవార్డు అమలయ్యేలా చూడాలని డీడబ్ల్యూఓకు సూచించారు. ● వేంసూర్ మండలం మర్లపాడుకు చెందిన పిల్లి సర్వేష్ తనకు దివ్యాంగ పెన్షన్ మంజూరు చేయాలని కోరాడు. -
ఇరు వర్గాల మధ్య ఘర్షణ
ఖమ్మంఅర్బన్:మద్యం మత్తు లో జరిగిన గొడవ ప్రాణాలమీదకు తెచ్చింది. నగరంలోని గోపాలపురం ప్రాంతంలో రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో తీవ్రంగా గాయపడిన దేవందల కార్తీక్ (30) ఆస్పత్రిలో చికిత్సపొందుతూ సోమవా రం మృతిచెందాడు. ఖమ్మంఅర్బన్ (ఖానాపురం హవేలీ) పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. గోపాలపురం పరిధిలో మద్యం మత్తులో కొందరు యువకుల మధ్య ఘర్షణ జరిగింది. ఇరు వర్గాలకు చెదిన 11 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వారిలో ఏడుగురిని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపారు. ఇద్దరు పరారీలో ఉండగా, మరో ఇద్దరు వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. వారిలో తీవ్రంగా గాయనపడిన కార్తీక్ సోమవారం మృతి చెందాడు. కొందరు వ్యక్తులు ప్రేరేపించడమే ఘర్షణకు కారణమని మృతుడు కార్తీక్ కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపిస్తున్నారు. మృతుడి బంధువు దుర్గాభవాని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దాడి కేసును హత్య కేసుగా మార్చి దర్యాప్తు చేస్తామని సీఐ భానుప్రకాష్ తెలిపారు. యువకుడు మృతి -
వరద పరిస్థితిపై సీసీ కెమెరాలతో నిఘా..
గతేడాది వచ్చిన అనూహ్య వరదల దృష్ట్యా ముందు జాగ్రత్తలకు పటిష్ట చర్యలు చేపడుతున్నట్లు కలెక్టర్ అనుదీప్ తెలిపారు. సోమవారం తన చాంబర్లో ఆకేరు, మున్నేరుల వద్ద ఏర్పాటుచేసిన సీసీ కెమెరాల పనితీరును పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముందస్తుగా వరద పరిస్థితి తెలుసుకొని, సహాయక చర్యలు చేపట్టేలా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. వరదల సమాచారం తెలుసుకునేందుకు ఆకేరుకు సంబంధించి తిరుమలాయపాలెం మండలం తిప్పారెడ్డిగూడెం వద్ద, మున్నేరుకు సంబంధించి డోర్నకల్ వద్ద సోలార్ డే అండ్ నైట్ విజన్ కెమెరాలు ఏర్పాటు చేసి, 24/7 గంటల పర్యవేక్షణ చేయనున్నామని వెల్లడించారు. ఈ కెమెరాలను కలెక్టరేట్లోని కంట్రోల్ రూమ్, తన చాంబర్కు అనుసంధానం చేసినట్లు తెలిపారు. 24 గంటలు నీటి ప్రవాహం ప్రత్యక్షంగా చూస్తూ, ప్రమాద పరిస్థితిని ముందస్తుగా అంచనా వేసి, అవసరమైతే ముంపు ప్రాంతాల ప్రజలకు నష్టం వాటిల్లకుండా సురక్షిత ప్రాంతానికి లేదా పునరావాస కేంద్రాలకు తరలించేలా చర్యలు చేపట్టవచ్చన్నారు. ఈ కెమెరాలతో అధికారులు మొబైల్ ఫోన్ల ద్వారా పర్యవేక్షించవచ్చన్నారు. నగరంలోని కాల్వొడ్డులోనూ ఈ తరహా కెమెరా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఇరిగేషన్ డీఈ రమేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఎన్నడూ ఎరగని కష్టం..
● యూరియా కోసం రైతుల అగచాట్లు వర్ణతీతం ● తెల్లవారుజాము నుంచే సొసైటీ కార్యాలయం వద్దకు వస్తున్న అన్నదాతలు ● పోలీసుల పహారా మధ్య కూపన్ల పద్ధతిలో యూరియా పంపిణీ తల్లాడ/సుజాతనగర్/కరకగూడెం: యూరియా కోసం కనివినీఎరుగని కష్టం రైతులకొచ్చింది. యూరియా కోసం ఎన్నడూ తిప్పలు పడని రైతులు.. ప్రస్తుతం నానా అవస్థలు పడుతున్నారు. తెల్లవారింది మొదలు యూరియా కోసం పరుగులు పెడుతున్నారు. ఉదయం నాలుగు గంటలకే సొసై టీ కార్యాలయాల వద్ద బారులుదీరుతున్నారు. సోమవారం తెల్లవారుజామున 4 గంటల నుంచే తల్లాడ సొసైటీ కార్యాలయం వద్ద క్యూకట్టారు. తల్లాడ సొసైటీకీ 911 కట్టల యూరియా వచ్చిందనే సమాచారం తెలియడంతో రైతులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. అతి పెద్ద సొసైటీ అయిన తల్లాడలో 15 గ్రామాలున్నాయి. ఈ గ్రామాలకు చెందిన వెయ్యి మంది రైతులు సొసైటీ కార్యాలయానికి వచ్చారు. వచ్చిన వారందరికీ యూరియా ఇవ్వాలనీ రైతులు పట్టుబట్టారు. బీజేపీ జిల్లా నాయుకులు ఆపతి వెంకటరామారావు ఆధ్వ ర్యంలో సొసైటీ కార్యాలయం ఎదుట బైఠాయించి ఆందోళన చేపట్టారు. తల్లాడ మండల వ్యవసాయాధికారి ఎండీ తాజుద్దీన్, ట్రెయినీ ఎస్ఐ వెంకటేశ్, సొసైటీ సీఈఓ నాగబాబు ఆధ్వర్యంలో రైతులకు కూపన్లు పంపిణీ చేశారు. వచ్చిన ప్రతి రైతుకు ఒక కూపన్ చొప్పున పాస్బుక్, ఆధార్కార్డు జిరాక్స్లను పరిశీలించి అందించారు. ఈ కూపన్లు పొందిన రైతులకు మాత్రమే యూరియా కట్టలందజేశా రు. కూపన్లు అందని రైతులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఒకే రోజు యూరియా కట్టలు పంపిణీ చేయడం వీలు పడక మంగళవారం నాడు కూపన్లు పొందిన రైతుల్లో సగంమందికి యూరి యా పంపిణీ చేస్తామని అధికారులు ప్రకటించారు. ఓ పక్క వర్షం పడుతున్నా రైతులు యూరియా కోసం తడుచుకుంటూనే నిల్చున్నారు. యూరియా కొరత కారణంగా వచ్చిన వారిలో చాలా మందికి యూరియా అందలేదు. యూరియా వేయాల్సిన తరుణంలో కొరత ఏర్పడటంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో రైతులు కొట్టుమిట్టాడుతున్నా రు. ఇక సుజాతనగర్ సొసైటీ గోదాముకు యూరి యా వచ్చిన విషయం తెలుసుకున్న ఆయా గ్రా మాలకు చెందిన పురుషులు, మహిళా రైతులు సో మవారం పెద్దఎత్తున తరలివచ్చారు. వ్యవసాయ పనులు ఊపందుకోవడంతో యూరియా అవసరం పెరిగింది. ఆధార్కార్డుకు ఒకే బస్తా చొప్పున ఇస్తామని చెప్పడంతో రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గంటలతరబడి వేచి ఉన్నా కొందరికే యూ రియా బస్తాలు అందడంతో మరికొందరు బస్తాలు దొరక్క నిరాశతో వెనుదిరిగారు. అవసరానికి మించి యూరియాను కొనుగోలు చేసి నిల్వ ఉంచుకోవద్దని ఏఓ నర్మద తెలిపారు. మండలంలో రైతులందరికీ సరిపడా యూరియాను సరఫరా చేసేందుకు వ్యవసాయశాఖ సిద్ధంగా ఉందని చెప్పారు. కాగా, రైతులకు సరిపడా యూరియా అందించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని కౌలు రైతు సంఘం రాష్ట్ర నాయకులు నల్లగోపు పుల్లయ్య ఆరోపించారు. అలాగే, కరకగూడెంలోని ప్రాథమిక సహకార సంఘం సేల్ పాయింట్ వద్ద రైతులు జోరు వానను సైతం లెక్కచేయకుండా క్యూలో నిలబడి యూరియా కోసం నిరీక్షించారు. గొడుగు లు పట్టుకుని, రెయిన్ కోట్లు వేసుకుని ఉదయం నుంచి సాయంత్రం వరకు నిరీక్షించినా కొందరు రైతులకు మాత్రమే యూరియా అందింది. స్టాక్ అయిపోవడంతో పలువురు ఖాళీ చేతులతోనే వెనుదిరగాల్సి వచ్చింది. దీంతో రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బూర్గంపాడు: అలాగే, బూర్గంపాడు మండలంలోని మోరంపల్లిబంజర పీఏసీఎస్ గోదాంకు వచ్చిన ఒక లారీ యూరియా కోసం సుమారు 500 మంది రైతులు రాగా.. పంపిణీ చేసేందుకు అధికారులు కూడా ఇబ్బంది పడ్డారు. రైతుకు ఒక యూరియా బస్తా చొప్పున విక్రయించినా ఇంకా చాలామంది రైతులకు అందక నిరాశగా వెనుదిరిగారు. వారం రోజులుగా యూరియా కోసం తల్లాడ సొసైటీ కార్యాల యం వద్దకు వచ్చి పోతున్నా ను. యూరియాఒక్కకట్ట కూడా ఇవ్వ లేదు. యూరియా వేయాల్సిన తరుణంలో అందక పోవటంతో ఇబ్బంది పడాల్సి వస్తోంది. గతంలో ఎన్నడూ ఇంత ఇబ్బంది పడలేదు. యూరియా లోడ్ వచ్చిన రోజు ముందు వచ్చిన రైతులకే కూపన్లు ఇస్తున్నారు. చుట్టు పక్కల గ్రామాల రైతులు వచ్చే సరికి కూపన్లు అయిపోయాయని చెబుతున్నారు. – వి.వంశీకృష్ణారెడ్డి, రైతు, పినపాక పదెకరాలుంటే మూడు యూరి యా కట్టలు కూపన్ల పద్ధతిలో ఇచ్చారు. కూపన్ల కోసం గంటల తరబడి వేచి చూడాల్సి వచ్చింది. ఎకరానికి ఒక కట్ట తప్పనిసరిగా యూరియా వేయాలి. దీంతో ఇంకా ఏడు కట్టలు అసవరం ఉన్నది. అధికారులను అడిగితే మళ్లీ లోడ్ వస్తే ఇస్తామంటున్నారు. యూరియా కొరత వేధిస్తోంది. –కొలిపాక శ్రీనివాసరావు, రైతు, బిల్లుపాడు -
ఇక భూ గర్భంలో!
విద్యుత్ లైన్లు.. సాక్షి ప్రతినిధి,ఖమ్మం : గాలి, వానతో విద్యుత్ తీగలు తెగడంతో గంటల పాటు సరఫరాకు అంతరాయం.. వేలాడే తీగలతో ఏదో ఒక చోట ప్రమాదం వంటి ఘటనలు తరచూ జరుగుతూనే ఉంటాయి. భూ ఉపరితలంపై ఓవర్ హెడ్ విద్యుత్ లైన్లతో కలిగే ఈ సమస్యల పరిష్కారానికి భూగర్భ విద్యుత్ లైన్ల ఏర్పాటుకు అడుగులు పడుతున్నాయి. దేశంలోని బెంగళూరు నగరంలో కొన్ని ప్రాంతాలు, ముంబై నగరమంతటా ఈ సిస్టమ్తో విద్యుత్ సరఫరా విజయవంతంగా సాగుతోంది. రాష్ట్రంలో హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో కూడా ఈ విధానాన్ని ఏర్పాటు చేస్తుండగా.. జిల్లాలో ఖమ్మం కార్పొరేషన్, మధిర మున్సిపాలిటీల్లోనూ అమలుకు విద్యుత్ శాఖ అధికారులు ప్రభుత్వానికి డీపీఆర్ పంపించారు. నిధులు విడుదల కాగానే ఈ రెండు ప్రాంతాల్లో భూగర్భ విద్యుత్ లైన్ పనులు ప్రారంభం కానున్నాయి. అక్కడి సిస్టమ్ పరిశీలించి.. ఈ ఏడాది జూన్ 27 నుంచి మూడు రోజులు పాటు జిల్లా విద్యుత్ శాఖ ఎస్ఈ శ్రీనివాసాచారి నేతృత్వంలో ముఖ్య అధికారులు బెంగళూరులో పర్యటించి అండర్ గ్రౌండ్ విద్యుత్ సిస్టంపై అధ్యయనం చేశారు. భూగర్భ లైన్ల ఏర్పాటు, ట్రాన్స్ఫార్మర్లు, వీధి లైట్ల కోసం ప్రత్యేకంగా వేసిన లైన్లు, వాటి నిర్వహణపై బెంగళూరుకు చెందిన విద్యుత్ అధికారులతో చర్చించారు. విద్యుత్ సరఫరాలో ప్రయోజనాలు, సమస్యలు, మానిటరింగ్ తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు. క్షేత్ర స్థాయికి వెళ్లి ట్రాన్స్ఫార్మర్లు, లైన్లను పరిశీలించారు. ఆ తర్వాత ఖమ్మం కార్పొరేషన్, మధిరలో ఈ విద్యుత్ సిస్టమ్ ఏర్పాటుకు కావాల్సిన ప్రతిపాదనలను ప్రభుత్వానికి అందించారు. ఖమ్మం, మధిరలో ఏర్పాటు.. జిల్లాలో తొలుత ఖమ్మం కార్పొరేషన్, మధిర మున్సిపాలిటీల్లో ఈ విద్యుత్ సిస్టమ్ అమలుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ రెండు చోట్లా ఉన్న విద్యుత్ కనెక్షన్లు, ట్రాన్స్ఫార్మర్లు, 33 కేవీ, 11 కేవీ, ఎల్టీ లైన్లు ఎన్ని కిలోమీర్లు వంటి వివరాలతో ప్రభుత్వానికి డీపీఆర్(డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టు) పంపారు. రెండు ప్రాంతాల్లో కలిపి అంచనా వ్యయం రూ.1,268.05 కోట్లు అవుతుందని అందులో పేర్కొన్నారు. ఖమ్మం కార్పొరేషన్కు రూ.1,241.96 కోట్లు, మధిరకు రూ.26.09 కోట్లు అవసరమని చూపారు. మధిర మెయిన్రోడ్డులో ఆత్కూరు క్రాస్ రోడ్డు నుంచి దెందుకూరు వరకు తొలిదశ కింద ప్రతిపాదనలు వెళ్లగా.. ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో ఎన్నెస్టీ రోడ్డు, పీఎస్ఆర్ రోడ్డులో రూ.14.35 కోట్లు వ్యయంతో ఈ లైన్లు వేయనున్నారు. ఆ తర్వాత మిగతా అన్ని ప్రాంతాల్లో ఈ లైన్ల పనులు చేపడతారు. అండర్గ్రౌండ్ విద్యుత్ లైన్ సిస్టమ్తో అంతరాయం లేకుండా కరెంట్ సరఫరా అవుతుంది. భూ ఉపరితలంపై ఉన్న లైన్లతో ఇన్సూలేషన్ ఉండదు. పట్టుకున్నా.. చెట్టుకొమ్మ పడినా ట్రిప్ అవుతుంది. అండర్గ్రౌండ్ సిస్టమ్లో ఐరన్, సిమెంట్ స్తంభాలు ఉండవు. ట్రాన్స్ఫార్మర్లు మాత్రమే ఉపరితలంపై ఉంటాయి. ఈ సిస్టమ్తో ప్రమాదాలు జరగవు. జిల్లాలో మధిర మున్సిపాలిటీ, ఖమ్మం కార్పొరేషన్లో ఈ విద్యుత్ లైన్ల ఏర్పాటుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. ఈ సిస్టమ్ అమలుపై ఇటీవల బెంగళూరు నగరానికి వెళ్లి పరిశీలించాం. ఇనుగుర్తి శ్రీనివాసాచారి, విద్యుత్ శాఖ ఎస్ఈ ప్రస్తుతం కనిపిస్తున్న విద్యుత్ కనెక్షన్లు, తీగలు, స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్ల వంటివి భూగర్భ విద్యుత్ లైన్లలో కనిపించవు. కొన్ని ట్రాన్స్ఫార్మర్లు మాత్రమే పైకి కనిపిస్తాయి. సిమెంట్ లైనింగ్ కాల్వలో ఇసుక పోసి ప్రత్యేకంగా తయారు చేసిన పైపుల్లో విద్యుత్ తీగలు వేసుకుంటూ వెళ్తారు. నైపుణ్యం ఉన్న ఎలక్ట్రికల్ సిబ్బందితో మాత్రమే ఈ పనులు చేయిస్తారు. అంతేకాక ఈ విద్యుత్ మానిటరింగ్కు కొన్ని కిలోమీటర్లకు ఒక పర్యవేక్షణ సెంటర్ ఏర్పాటు చేస్తారు. ఈ విద్యుత్ సరఫరాలో ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ సెంటర్ నుంచి టెక్నీషియన్లు నిత్యం కంప్యూటరైజ్డ్ మానిటరింగ్ చేస్తారు. రూ.4 కోట్ల విలువైన చెకింగ్ మిషన్ వ్యాన్.. సరఫరాలో సమస్య ఎక్కడ వచ్చిందో క్షణాల్లోనే గుర్తిస్తుంది. దీంతో వెంటనే మరమ్మతులు చేసి సరఫరా పునరుద్ధరిస్తారు. వివరాలు ఖమ్మం మధిర కనెక్షన్లు 1,20,094 1,474 ట్రాన్స్ఫార్మర్లు 2,175 61 33 కేవీలైన్ కి.మీ. 65.49 0.5 11 కేవీ లైన్ కి.మీ. 286.418 18.076 ఎల్టీ లైన్ కి.మీ. 645.358 12.036 అంచనా వ్యయం రూ.1,241.96 కోట్లు రూ.26.09 కోట్లుమధిర, ఖమ్మం కార్పొరేషన్లో ఏర్పాటుకు కసరత్తు -
సౌర విద్యుత్కు ప్రతిపాదనలు సమర్పించాలి
ఖమ్మంవ్యవసాయం : ప్రభుత్వ కార్యాలయాలపై సోలార్ విద్యుత్ ప్యానళ్ల ఏర్పాటుకు నిర్ణీత నమూనాల్లో ప్రతిపాదనలు సమర్పించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డితో కలిసి ఆమె సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జిల్లాలో ప్రతి ప్రభుత్వ భవనంపై వీలైనంత మేరకు సోలార్ ప్యానళ్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ కార్యాలయాల విద్యుత్ బిల్లుల వివరాలు, రూఫ్ టాప్ ఏరియా, యూఎస్సీ నంబర్, కేటగిరీ(ఎల్టీ/హెచ్టీ) వంటి వివరాలను ప్రొఫార్మాలో పొందుపర్చాలని తెలిపారు. జిల్లాలో 4,700కు పైగా ప్రభుత్వ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయని తెలిపారు. ఈ మొత్తానికి 30 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి అవకాశాలు ఉన్నట్లు ఆ శాఖ అధికారులు అంచనాలు వేశారని తెలిపారు. సమావేశంలో డీఆర్ఓ పద్మశ్రీ, జెడ్పీ సీఈఓ దీక్షారైనా, డీఆర్డీఓ సన్యాసయ్య పాల్గొన్నారు. -
టెండర్లకు గ్రీన్ సిగ్నల్..
● జిల్లాలో 3.49 కోట్ల చేప పిల్లలకు అనుమతి ● టెండర్ దాఖలుకు సెప్టెంబర్ 1 తుది గడువు ● డీపీసీ పర్యవేక్షణలో ప్రక్రియ నిర్వహణ ఖమ్మంవ్యవసాయం: చేప పిల్లల టెండర్లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రభుత్వ ఆనుమతి మేరకు చేప పిల్లల టెండర్ల ప్రక్రియ నిర్వహించాలని రాష్ట్ర మత్స్యశాఖ కమిషనర్ నిఖిల సోమవారం ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో 882 చెరువుల్లో చేప పిల్లల పెంపకానికి మత్స్యశాఖ అనుమతులు ఇచ్చింది. ఈ చెరువుల్లో నీటి లభ్యత తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని చేప పిల్లలు వదిలేందుకు అవసరమైన ప్రణాళికలు చేశారు. విస్తారంగా కురిసిన వర్షాలతో జిల్లాలో జలాశయాల్లోకి నీరు చేరడంతో చేప పిల్లల పెంపకానికి మెరుగైన వనరులున్నాయి. జిల్లాలో 3.49 కోట్ల చేప పిల్లలకు.. జిల్లాలో జలాశయాల విస్తీర్ణం, వనరుల ఆధారంగా 3.49 కోట్ల చేప పిల్లలకు టెండర్లు నిర్వహించాలని రాష్ట్ర మత్స్యశాఖ అనుమతులు ఇచ్చింది. ఈ మేరకు దీర్ఘకాలం, స్వల్పకాలం నీటి సౌకర్యం ఉండే జలాశయాలను గుర్తించి వివిధ సైజుల్లో ఉన్న చేప పిల్లలను వదిలేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. 35 – 40 మి.మీ. సైజు చేప పిల్లలు 1.38 కోట్లు కాగా 80 – 100 మి.మీ. సైజు చేప పిల్లలు 2.11 కోట్ల పిల్లలకు టెండర్లు నిర్వహించాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. సెప్టెంబర్ 1 వరకు అవకాశం.. చేప పిల్లల టెండర్లకు సెప్టెంబర్ 1వ తేదీ సాయంత్రం 3 గంటల వరకు అవకాశం ఇచ్చారు. ఈ – ప్రొక్యూర్మెంట్ ప్లాట్ఫాంపై కాంట్రాక్టర్లు టెండర్లను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. టెండర్లు వేసేవారికి చేప పిల్లల పెంపకానికి అవసరమైన చెరువులు ఉండాలి. కనీసం మూడేళ్ల పాటు చేప పిల్లల పెంపకం, టెండర్ల ప్రక్రియలో పాల్గొన్న అనుభవం వంటి అర్హతలను ప్రామాణికంగా తీసుకుని అనుమతి ఇస్తారు. ఈ ప్రక్రియలో కాంట్రాక్టర్లు ఈఎండీ రూ. 8.50 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. డీపీసీ పర్యవేక్షణలో.. చేప పిల్లల పథకానికి రూపొందించిన జిల్లా పర్చేజింగ్ కమిటీ పర్యవేక్షణలో టెండర్ల ప్రక్రియను నిర్వహిస్తారు. ఈ కమిటీకి చైర్మన్గా అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి వ్యవహరిస్తుండగా, సభ్యులుగా జిల్లా మత్స్యశాఖ అధికారి శివప్రసాద్, జిల్లా పశుసంవర్థక శాఖ అధికారి డాక్టర్ బి.పురంధర్, ఎలక్ట్రానిక్ జిల్లా మేనేజర్ ఉంటారు. ఈ కమిటీ పర్యవేక్షణలో టెండర్ల నిర్వహణ ఉంటుంది. సెప్టెంబర్ 1వ తేదీ 3 గంటల వరకు టెండర్లను నిర్వహించి ఆ తరువాత ఓపెన్ చేస్తారు. తక్కువ ధరకు కోట్ చేసిన వారికి కాంట్రాక్ట్ అప్పగిస్తారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రక్రియను నిర్వహిస్తున్నట్లు జిల్లా మత్స్యశాఖ అధికారి శివప్రసాద్ తెలిపారు. -
వర్సిటీలో ప్రవేశాలు
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ప్రతిష్టాత్మక డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీలో దోస్త్ ద్వారా విద్యార్థులు అడ్మిషన్ పొందారు. వారికి సౌకర్యాలు కల్పించే పనిలో వర్సిటీ పాలనా విభాగం నిమగ్నమైంది. భవిష్యత్ అవసరాలకు తగినట్టు క్యాంపస్ను తీర్చిదిద్దడంపై దృష్టి సారించింది. యూనివర్సిటీలో అండర్ గ్రాడ్యుయేషన్లో నాలుగు కోర్సులు, పోస్ట్ గ్రాడ్యుయేషన్లో రెండు కోర్సులు ఉన్నాయి. అండర్ గ్రాడ్యుయేషన్ విభాగంలో కోర్సుకు 60 సీట్ల చొప్పున 120 సీట్లతో రెండు కోర్సులకు అడ్మిషన్లు ప్రారంభించారు. అన్ని రకాల అనుమతులు వచ్చే సరికి డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్, తెలంగాణ (దోస్త్) మూడో ఫేస్ చివరి దశలో ఉంది. దీంతో మొదటి బ్యాచ్లో తక్కువ మంది విద్యార్థులకే అడ్మిషన్లు దక్కాయిు. బీఎస్సీ (జియాలజీ) 10, బీఎస్సీ (ఎన్విరాన్మెంట్) 22.. మొత్తంగా 32 మంది విద్యార్థులు అడ్మిషన్లు పొందారు. మిగిలిన సీట్ల భర్తీకి స్పాట్ అడ్మిషన్లకు ప్రత్యేక అనుమతులు సాధించే పనిలో యూనివర్సిటీ యాజమాన్యం ఉంది. సీపీగెట్ (కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ టెస్ట్) – 2025 ద్వారా త్వరలో రెండు కోర్సుల్లో పీజీ విద్యార్థులు ఇక్కడికి రానున్నారు. చకచకా ఏర్పాట్లు మొదటి బ్యాచ్ విద్యార్థులకు ప్రస్తుతం ఉన్న ఇంజనీరింగ్ కాలేజీ భవనాల్లో తాత్కాలిక ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం క్యాంపస్లో మార్పులు, చేర్పులు చేపడుతున్నారు. పాత క్యాంపస్లో గతంలో ఎంబీఏ, ఎంసీఏ తరగతులు నిర్వహించగా, గదులను ఇటీవల ఆధునికీకరించారు. వీటిలో బీఎస్సీ తరగతులు నిర్వహించనున్నారు. ఇంజనీరింగ్ కాలేజీ పక్కన ఉన్న టీచర్ల క్వార్టర్లను బాలికల హాస్టల్గా, ఎన్జీవోస్ క్వార్టర్లను బాలుర హాస్టల్గా ఉపయోగించుకోవాలని నిర్ణయించారు. క్యాంపస్లో అంతర్గత రోడ్లకు మరమ్మతులు, పాత భవనాలకు వైట్వాష్, అవసరమైన ఫర్నిచర్ తదితర ఏర్పాట్లు చేపడుతున్నారు. స్పోర్ట్స్ ఎరేనాకు ప్రతిపాదనలు కొత్తగూడెం స్కూల్ ఆఫ్ మైన్స్గా, ఆ తర్వాత యూనివర్సిటీ కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్గా కొనసాగి న ఈ కళాశాల.. ఇటీవల డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్సైన్సెస్ యూనివర్సిటీగా అప్గ్రేడ్ అయింది. క్యాంపస్ ఒకప్పుడు 391 ఎకరాల్లో ఉండేది. మెడికల్ కాలేజీ, ఐడీఓసీ నిర్మాణాలకు కొంత స్థలం తీసుకోగా ప్రస్తుతం 310 ఎకరాల్లో ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ ఉంది. క్యాంపస్లో ఇంజనీరింగ్ విభాగంలో 800 సీట్లు ఉండగా, ప్రస్తుతం 650 మంది విద్యార్థులు ఉన్నారు. ఇంకా ఎర్త్ సైన్సెస్ విభాగానికి సంబంధించి 960 మంది విద్యార్థులు రానున్నారు. దీంతో క్యాంపస్లో 1,760 మంది విద్యార్థులు అభ్యసించే అవకాశం ఉంది. దీనికి తోడు ఇదే క్యాంపస్లో అంతర్భాగంగా ఉన్న మెడికల్ కాలేజీలో 600మంది విద్యార్థులు చదువుకునే అవకాశం ఉంది. వీటన్నింటీని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ వరల్డ్ క్లాస్ స్పోర్ట్స్ ఎరేనాను నిర్మించాలనే ప్రతిపాదనలు చేస్తున్నారు. ఇందులో ఇండోర్, ఔట్డోర్ క్రీడా సౌకర్యాలు, వీక్షకుల కోసం గ్యాలరీలు నిర్మించాలని యోచిస్తున్నారు. అంతకంటే ముందు నిరుపయోగంగా మారిన ఆడిటోరియానికి మరమ్మతులు చేయాలని, పాత బాలుర హాస్టల్ను స్టోర్రూమ్గా మార్చాలని భావిస్తున్నారు.ఎర్త్ సైన్సెస్ పీజీ, యూజీ కోర్సుల్లో 360 మంది విద్యార్థులకు విద్యాబోధన జరగనుంది. ఆ తర్వాత పీహెచ్డీ విద్యార్థులు కూడా వస్తారు. వీరందరికీ అవసరమైన తరగతి గదులు, ల్యాబ్లు, వర్క్షాప్, మెస్, హాస్టళ్లకు సంబంధించి నూతన భవనాలు నిర్మించాలి. బోధన, బోధనేతర సిబ్బంది ఎంతమంది అవసరం, ఎప్పుడు నియామకాలు చేపట్టాలనే అంశంపై ఇంకా తుది నిర్ణయం జరగలేదు. ఈ రెండు అంశాలపై ఉన్నత విద్యాశాఖ హైపవర్ కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ నివేదిక వచ్చాక ఎర్త్ సైన్సెస్ వర్సిటీకి సంబంధించిన నూతన భవనాల నిర్మాణం, స్టాఫ్ విషయంలో కదలిక వచ్చే అవకాశం ఉంది. -
కిన్నెరసానిలో ‘సఫారీ’
సఫారీ వాహనం (ఫైల్) పాల్వంచరూరల్: రాష్ట్రంలోని అమ్రాబాద్, కవ్వాల్ అటవీ ప్రాంతాల తరహాలో జిల్లాలోని కిన్నెరసాని అభయారణ్యంలో కూడా సఫారీ ఏర్పాటుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. కొండకోనలు, పచ్చని చెట్లు, జలాశయం, వన్యప్రాణులు, జీవ వైవిధ్యం కలిగిన కిన్నెరసాని ప్రకృతి అందాలు అడుగుడుగునా ఆహ్లాదం పంచుతాయి. ఆ సోయగాలను ఆస్వాదించేందుకు రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల నుంచి పర్యాటకులు తరలివస్తుంటారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కిన్నెరసాని అభయారణ్యంలో ఎకో టూరిజంపై దృష్టి సారించింది. సఫారీ ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. దీపావళిలోపు ప్రారంభం ఎత్తైన కొండల మధ్య జలాశయం, అందులో నాలుగు ద్వీపాలు ఉన్నాయి. జలాశయాన్ని ఆనుకుని గుట్టపై 9 కాటేజీలు, అద్దాలమేడల నిర్మాణం చేపట్టారు. రెండు బోట్లు ఉండటంతో రిజర్వాయర్లో పర్యాటకులు జలవిహారం చేస్తారు. రోజురోజుకూ పర్యాటకుల సంఖ్య పెరుగుతుండగా అటవీశాఖ అధికారులు సఫారీని అందుబాటులోకి తేనున్నారు. డీర్ పార్కు నుంచి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న బేస్ క్యాంపు వరకు అభయారణ్యంలో వన్యప్రాణులను తిలకించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. రూ.45 లక్షలతో పదిమంది కూర్చునే మూడు సఫారీ వాహనాలను వైల్డ్లైఫ్శాఖ అధికారులు కొనుగోలు చేశారు. దీపావళి లోపు సఫారీ ప్రారంభించాలని నిర్ణయించారు. దీంతో పర్యాటకులకు ఆహ్లాదంతోపాటు అటవీశాఖకు ఆదాయం లభించనుంది.రూ.45 లక్షలతో మూడు వాహనాలు కొనుగోలుఅభయారణ్యంలో మరో రెండు నెలల్లో కో టూరిజం అభివృద్ధి పనులు చేపడతాం. ఈ క్రమంలో సర్వే కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. సైక్లింగ్, ట్రెక్కింగ్ వంటి సౌకర్యాలు కల్పించే ఆలోచన చేస్తున్నాం. డీర్ పార్కు నుంచి చింతోనిచెలక మీదుగా రంగాపురం, సిద్దారం వరకు సఫారీ ఏర్పాటు చేస్తాం. –కృష్ణాగౌడ్, జిల్లా అటవీశాఖాధికారి -
గోపా ఉపాధ్యక్షుడికి డాక్టరేట్
ఖమ్మంమామిళ్లగూడెం: పాండిచేరి యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ పీస్కౌన్సిల్ నుంచి ఖమ్మానికి చెందిన గౌడ అఫీషియల్స్, ప్రొ ఫెషనల్స్ అసోసియేషన్ (గోపా) ఉపాధ్యక్షుడు తోడేటి దుర్గాప్రసాద్గౌడ్కు గౌరవ డాక్టరేట్ లభించింది. 20 ఏళ్లుగా ఆయన చేస్తున్న సేవలను గుర్తించిన సంస్థ పాండిచేరిలో జరిగిన కార్యక్రమంలో ఆయనకు డాక్టరేట్ను ప్రదానం చేసింది. ఒకేరోజు 18 మంది నగదు చెల్లింపుఖమ్మంసహకారనగర్: ఖమ్మంరూరల్ మండలం పోలేపల్లిలోని రాజీవ్ స్వగృహ భవన సముదాయంలో ఆదివారం ఒక్క రోజే 18 మంది నగదు కట్టి రిజిస్టర్ చేసుకున్నట్లు తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ జనరల్ సెక్రటరి ఏలూరి శ్రీనివాసరావు తెలిపారు. ఇటీవల కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి రాజీవ్ స్వగృహ నిర్మాణం, నాణ్యతపై సంతృప్తి వ్యక్తం చేశారు. 60 ఫీట్ల అప్రోచ్ రోడ్డు మంజూరైందని, మున్నేరు వరద ప్రభావం రాకుండా రిటైనింగ్ వాల్ నిర్మాణం జరుగుతోందని, ఈ భవన సముదాయానికి బఫర్ జోన్ వర్తించదని కలెక్టర్ పేర్కొనటంతో పాటు అదనంగా కావాల్సిన సౌకర్యాలు కూడా ప్రభుత్వం తరఫున కల్పిస్తామని కలెక్టర్ హామీ ఇవ్వడంతో ఉద్యోగులు పెద్ద ఎత్తున ఆదివారం ప్లాట్లు రిజిస్టర్ చేసుకున్నారు. అందులో డీఆర్డీఏ పీడీ సన్యాసయ్య, సూర్యాపేట జెడ్పీ సీఈఓ అప్పారావు, సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ కస్తాల సత్యనారాయణ, చింతకాని ఎంపీడీఓ సీహెచ్ శ్రీనివాసరావు, దుర్గాప్రసాద్, కె.పెద్దపుల్లయ్య, హరికృష్ణ, సాయికృష్ణ, డి.నిర్మల ఉన్నారు. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనంఖమ్మంసహకారనగర్: నగరంలోని ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ డిగ్రీ కళాశాల 1981 – 84 బీఏ (ఈపీపీ) బ్యాచ్ పూర్వ విద్యార్థులు ఆది వారం నగరంలోని ఓ హోటల్లో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా అందరి ఫొటోలు, చిరునామాలతో కూడిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. 70 ఏళ్లు దాటిన చంద్రయ్య, రామారావును సన్మానించారు. కార్యక్రమంలో జమిల్ పఠాన్, శ్రీహరి, కె.నర్స య్య, హరినాథ్, సుదర్శన్, రౌతు రవి, ఎస్కే బాబు తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ మోటార్ చోరీమధిర: పట్టణంలోని సుందరయ్య నగర్లో శనివారం రాత్రి విద్యుత్ మోటార్ చోరీ జరిగింది. గండ్ర నరసింహారావు ఇంటి ఆవరణలో ఉన్న విద్యుత్ మోటార్ను గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారు. ఇంటి యజమాని ఆదివారం ఉదయం చూడగా విద్యుత్ వైర్లు కత్తిరించి మోటార్ ఎత్తుకెళ్లినట్లు గుర్తించాడు. ఇటీవల రైల్వే అండర్ బ్రిడ్జి సమీపంలో బబ్లూకి చెందిన మోటార్ సైకిల్ చోరీకి గురైంది. వరుస చోరీలతో పట్టణ ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ప్రేమ్కుమార్ మృతదేహం లభ్యంగంగారం: మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం ఏడుబావుల జలపాతం వద్ద శనివారం సాయంత్రం గల్లంతైన ప్రాపర్తి ప్రేమ్కుమార్ (23) మృతదేహం లభ్యమైంది. ఏన్కూరు మండలం జెన్నారం ఎస్టీ కాలనీకి చెందిన ప్రాపర్తి ప్రేమ్కుమార్ శనివారం బంధువులు, స్నేహితులతో కలిసి ఏడుబావుల జలపాతం వద్దకు వచ్చాడు. పైనున్న బావులను చూసేందుకు వెళ్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు జారి బావిలో పడ్డాడు. దీంతో సహచరులు ఎంత గాలించినా ఆచూకీ లభించలేదు. ఆదివారం మధ్యాహ్నం ప్రేమ్కుమార్ మృతదేహం లభ్యమైంది. కాగా, సరదాగా జలపాతం చూడడానికి వచ్చి శవమై కనిపించడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ప్రేమ్కుమార్ సోదరుడు సైతం గతంలో వరద ప్రమాదంలోనే మృతిచెందినట్లు స్థానికులు తెలిపారు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రవికుమార్ తెలిపారు. -
జ్వరంతో ఇద్దరు మృతి
కొణిజర్ల: జ్వరంతో బాధపడుతూ హైదరాబాద్లో చికిత్స పొందుతూ విద్యార్థిని మృతి చెందిన ఘటన మండలంలోని తనికెళ్లలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికులు, మృతురాలి కుటుంబ సభ్యుల కథ నం ప్రకారం.. తనికెళ్లకు చెందిన తద్దెస్వాతి (18) ఖమ్మంలో డిగ్రీ చదువుతోంది. నాలుగు రోజుల కిందట తీవ్రజ్వరం రావడంతో ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా మారడంతో రెండు రోజుల కిందట హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. విద్యార్థిని డెంగీ లక్షణాలతో మృతిచెందినట్లు కటుంబ సభ్యులు తెలిపారు. వివరణ కోరేందుకు పెద్దగోపతి వైద్యాధికారులను ఫోన్లో సంప్రదించగా స్పందించలేదు. డెంగీ లక్షణాలతో బాలుడు డెంగీ లక్షణాలతో బాలుడు మృతిచెందిన ఘటన మండలంలోని గుబ్బగుర్తిలో ఆదివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బలమాల ప్రసాద్, అనూష దంపతుల కుమారుడు వినయ్ (5) నాలుగురోజులుగా తీవ్రజ్వరంతో బాధపడుతున్నాడు. ఖమ్మంలోని ప్రైవే ట్ అస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యంకోసం హైదరాబాద్ తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. డెంగీ లక్షణాలతోనే బాలుడు మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఆర్థిక బాధలు తాళలేక ఆత్మహత్యఖమ్మంక్రైం: ఆర్థిక బాధలు తాళలేక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదివారం త్రీటౌన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ మోహన్బాబు కథనం ప్రకారం.. పంపింగ్వెల్రోడ్ ప్రాంతానికి చెందిన లింగనబోయిన నాగరాజు (40) కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నాడు. అంతేకాకుండా ఆయన కుమార్తె మెదడువాపు వ్యాధితో బాధపడుతోంది. భార్య ఆరోగ్యం కూడా బాగా లేకపోవటంతో మనస్థాపానికి గురై ఈ నెల7న ఎలుకలమందు తాగాడు. ఆయన్ను ప్రభుత్వాస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పేకాట స్థావరంపై దాడిఎర్రుపాలెం: మండలంలోని అయ్యవారిగూడెం సమీపంలో పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేసి ఆరుగురిని అరెస్ట్ చేశారు. ఎస్ఐ రమేశ్కుమార్ కథనం ప్రకారం.. అయ్యవారిగూడెం సమీపంలో కొద్ది రోజులుగా కొందరు పేకాట ఆడుతున్నారు. సమాచారం మేరకు ఆదివారం స్థానిక పోలీసులు పేకాట కేంద్రంపై దాడి చేశారు. ఆరుగురిని అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి రూ.7,240 నగదు, ఐదు సెల్ఫోన్లు, 15 మోటారు సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. మరో 9 మంది పరారీలో ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వెల్లడించారు. -
మట్టి మేలు తలపెట్టవోయ్ !
ఖమ్మంగాంధీచౌక్ : వినాయక ఉత్సవాల్లో పర్యావరణానికి ప్రాధాన్యత పెరుగుతోంది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేసిన విగ్రహాలతో అనర్థాలు చోటుచేసుకుంటుండగా.. పర్యావరణ పరిరక్షణకు మట్టి విగ్రహాల ప్రాధాన్యం పెరిగింది. జిల్లాలో వేల సంఖ్యలో గణపతి ఉత్సవ మండళ్లు ఉండగా, ఒక ఖమ్మం నగరంలోనే 1000కి పైగా మండపాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈనెల 27న జరిగే వినాయక చవితి పండగను పురస్కరించుకుని ఇప్పటికే పలు చోట్ల పీఓపీ విగ్రహాలను విక్రయాలకు సిద్ధంగా ఉంచారు. మరో వైపు నగరంలోని బైపాస్ రోడ్ రాపర్తినగర్. ఇల్లెందు రోడ్ తదితర ప్రాంతాల్లో మట్టి విగ్రహాలు తయారవుతున్నాయి. విగ్రహం మోడల్ ఫొటో చూపిస్తే సిద్ధం చేస్తామని తయారీదారులు చెబుతున్నారు. కొందరు పశ్చిమ బెంగాల్ నుంచి మట్టి విగ్రహాలను తీసుకొచ్చి ఇక్కడ విక్రయిస్తుండగా, మరి కొందరు ఇక్కడే తయారు చేస్తున్నారు. పీఓపీతో నీటి కాలుష్యం.. గణేష్ ఉత్సవాల సమయంలో రంగురంగుల ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు విక్రయిస్తుంటారు. నవరాత్రి వేడుకల తర్వాత ఆ విగ్రహాలను నదులు, చెరువుల్లో నిమజ్జనం చేస్తుండగా నీరు కాలుష్యమై జలరాశులు మనుగడ దెబ్బతింటోంది. తాగునీటి జలాశయాలు కలుషితం అవుతున్నాయి. నీటిలో ప్రయోజనం కలిగించే సూక్ష్మ జీవులు మొదలు.. పెద్ద జీవుల వరకు నశించిపోతున్నాయి. మట్టి విగ్రహాలే మేలు.. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలతో అనర్థాలు చోటు చేసుకుంటుండడంతో ప్రత్యామ్నాయంగా మట్టి విగ్రహాలను పర్యావరణవేత్తలు ప్రోత్సహిస్తున్నారు. పీఓపీ విగ్రహాలతో కలిగే నష్టాలు, మట్టి విగ్రహాలతో ప్రయోజనాలపై విస్తృత ప్రచారం కల్పిస్తున్నారు. దీంతో కొందరు బంకమట్టి, వరిపొట్టు, వరిగడ్డి, కలకత్తా నుంచి గంగామట్టిని తీసుకొచ్చి వెదురు బొంగులు, సర్వే కర్రల సాయంతో విగ్రహాలు తయారు చేసి వాటర్ కలర్స్ దిద్దుతున్నారు. ఈ మట్టి విగ్రహాలతో నీరు కలుషితం కాకుండా జాగ్రత్తలు పాటిస్తున్నారు. ఖమ్మంలో తయారుచేసే మట్టి విగ్రహాలకు ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాలతో పాటు విజయవాడ, సత్తెనపల్లి, గుంటూరు, కడప నుంచి కూడా ఆర్డర్లు వస్తుండడం విశేషం. ఇక్కడ 5 నుంచి 16 అడుగుల ఎత్తు వినాయక విగ్రహాలను తయారు చేస్తున్నారు. సైజు, రూపాన్ని బట్టి రూ.10 వేల నుంచి ఆపైన ధరలతో విక్రయిస్తున్నారు. మట్టి గణపతులకు పెరుగుతున్న ప్రాధాన్యం పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి విగ్రహాలకు ప్రాధాన్యం పెరిగింది. మండప నిర్వాహకులు ఈ విగ్రహాల కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారు. పీఓపీతో కలిగే అనర్థాలపై పర్యావరణవేత్తల ప్రచారం కూడా దీనికి దోహదపడుతోంది. ప్రతి ఏటా మట్టి విగ్రహాలు కొనుగోలు చేసేవారి సంఖ్య పెరుగుతోంది. – గూడూరు దయాకర్, మట్టి విగ్రహాల కేంద్రం నిర్వాహకుడు -
మున్నేరు తగ్గుముఖం
● ఊపిరి పీల్చుకున్న అధికారులు, ముంపు ప్రాంత ప్రజలు ● శనివారం అర్ధరాత్రి తర్వాత తగ్గిన వరద ● తెల్లవార్లూ పరిశీలిస్తూ అప్రమత్తమైన అధికారులు ఖమ్మంమయూరిసెంటర్ : రెండు రోజులుగా మున్నేరు వరద ఉధృతి పెరగడంతో భయాందోళనకు గురైన ఖమ్మం ప్రజల్లో ప్రస్తుతం ఊరట నెలకొంది. శనివారం అర్ధరాత్రి వరకు కాల్వొడ్డు వద్ద నీటి మట్టం 15 అడుగుల వరకు పెరిగి భయాందోళన కలిగించింది. అయితే ఆదివారం తెల్లవారుజాము మూడు గంటల నుంచి వరద క్రమంగా తగ్గుతూ సాయంత్రం 4 గంటలకు 11 అడుగుల మేర నీటిమట్టం నమోదైంది. శనివారం ఉదయం 9.5 అడుగుల మేర వరద ఉండగా.. ఎగువ ప్రాంతాల నుంచి నీటి ఉధృతి పెరగడంతో రాత్రి 8 గంటల వరకు 15 అడుగులకు చేరింది. 15.10 అడుగుల వద్ద సుమారు ఐదు గంటల పాటు నిలకడగా కొనసాగడంతో అధికారులంతా అప్రమత్తమయ్యారు. దాదాపు 24 గంటల పాటు పర్యవేక్షణ కొనసాగించారు. అత్యవసర పరిస్థితులు ఎదురైతే తక్షణ సహాయక చర్యలు చేపట్టేందుకు మున్సిపల్ కార్పొరేషన్, రెవెన్యూ, పోలీసు విభాగాల సమన్వయంతో ప్రత్యేక బృందాలను కూడా సిద్ధం చేశారు. అదృష్టవశాత్తూ నీటి మట్టం తగ్గడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అధికారులు పర్యవేక్షణలోనే.. జిల్లాతో పాటు ఎగువ ప్రాంతాల్లో వర్షపాతం మళ్లీ పెరగకుండా ఉంటే పెద్దగా ముప్పు ఉండదని అధికారులు అంచనా వేస్తున్నారు. అయినా నిర్లక్ష్యం చేయరాదని, తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బొక్కలగడ్డ, పద్మావతినగర్, వెంకటేశ్వరనగర్ ప్రాంతాలను అధికారులు నిరంతరం సందర్శిస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. గతంలో జరిగిన నష్టం పునరావృతం కాకుండా శనివారం రాత్రి అంతా మున్నేరు పరీవాహక ప్రాంతంలోనే గస్తీ కాశారు. కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్య సూచనలతో అసిస్టెంట్ కమిషనర్ అనిల్కుమార్, ఎస్ఈ రంజిత్కుమార్, ఈఈ కృష్ణాలాల్, డీఈ ధరణికుమార్, టీపీఎస్ సంతోష్ మున్నేరు వరదను నిరంతరం పరిశీలిస్తూ ఉన్నతాధికారులకు ఎప్పటికప్పుడు సమాచారం అందించారు. ఆదివారం తెల్లవారుజామున 3 గంటలకు వరద 13.5 అడుగులకు, రాత్రి 8 గంటలకు 10.5 అడుగులకు చేరడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. మున్నేరుకు వరద పోటెత్తడంతో శనివారం మధ్యాహ్నం నుంచి సందర్శకుల తాకిడి పెరిగింది. కాల్వొడ్డుతో పాటు ప్రకాశ్నగర్ వద్ద ప్రజలు మున్నేటి వరదను చూసేందుకు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో పోలీసులు వారిని బ్రిడ్జిపైకి రాకుండా అడ్డుకున్నారు. వరదల సమయంలో మున్నేరు వద్ద సెల్ఫీలు తీసుకునేందుకు అనుమతి లేదంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. -
పెద్దమ్మతల్లికి విశేష పూజలు
పాల్వంచరూరల్: శ్రావణమాసం కావడంతో అమ్మవారి దర్శనం కోసం ఆదివారం భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. మండలంలోని శ్రీకనకదుర్గ (పెద్దమ్మతల్లి) ఆలయానికి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి సందర్శకులు వచ్చారు. క్యూలైన్ ద్వారా అమ్మవారిని దర్శించుకున్నారు. అన్నప్రాసనలు, ఒడిబియ్యం, పసుపు కుంకుమలు, చీరలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అర్చకులు అమ్మవారికి విశేషపూజలు జరిపారు. ఈ కార్యక్రమంలో ఈఓ ఎన్.రజనీకుమారి, ఆలయ కమిటీ చైర్మన్ బాలినేని నాగేశ్వరరావు, వేదపండితులు పద్మనాభశర్మ, అర్చకులు రవికుమార్శర్మ పాల్గొన్నారు. -
‘పోలవరం’తో భద్రాచలానికి ముప్పు
● ఏపీ సీఎం చంద్రబాబు బ్రెయిన్, గుండె మోదీకి ఇచ్చేశాడు ● మీడియా సమావేశంలో రాజ్యసభ సీపీఎం ఫ్లోర్ లీడర్ జాన్ బ్రిటాస్ భద్రాచలం అర్బన్: పోలవరం ప్రాజెక్ట్ కారణంగా భద్రాచల పట్టణం, పరిసర గ్రామాలను గోదావరి వరదలు ముంచెత్తుతున్నాయని సీపీఎం రాజ్యసభ ఫ్లోర్ లీడర్ జాన్ బ్రిటాస్ అన్నారు. ప్రాజెక్ట్ పూర్తయితే బ్యాక్ వాటర్తో వరదల తీవ్రత మరింత పెరుగుతుందన్నారు. ఆదివారం భద్రాచలంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పోలవరం కాపర్ డ్యాం వల్ల ప్రజలు ఇప్పటికే గృహనష్టాలు, జీవనోపాధితోపాటు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని గుర్తుచేశారు. ఈ సమస్యను కేంద్రం అత్యవసరంగా పరిగణించి నివారణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. భద్రాచలం శ్రీరాముని ఆలయంపై కేంద్ర ప్రభుత్వం వివక్ష వీడాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వాలను సమన్వయం చేసి ఏపీలో విలీనం చేసిన ఐదు గ్రామాలను తెలంగాణలోకి తేవాలన్నారు. స్వాతంత్య్ర వేడుకల వేదిక నుంచి ప్రధానమంత్రి ఆర్ఎస్ఎస్ను మాత్రమే ప్రస్తావించడం దేశ ప్రజల ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తోందని అన్నారు. స్వాతంత్య్ర సమరంలో కాంగ్రెస్వాదులు, కమ్యూనిస్టులు, రైతులు, కూలీలు, విద్యార్థులు, మహిళలు ఎందరో ప్రాణత్యాగాలు చేశారని, అనేక మంది విప్లవకారులు ఉరిశిక్షలు ఎదుర్కొన్నారని, కానీ కేవలం ఆర్ఎస్ఎస్నే పొగడటం చరిత్రను వక్రీకరించడమేనని పేర్కొన్నారు. ట్రంప్తో స్నేహం పెంచుకున్నానని చెబుతున్న ప్రధాని మోదీ.. ఆ స్నేహం దేశ ప్రయోజనాలకు ఉపయోగపడకపోతే అర్థమేమిటని ప్రశ్నించారు. ఇక ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బ్రెయిన్, గుండె మోదీకి అప్పగించారని విమర్శించారు. ఈ సమావేశంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు పోతినేని సుదర్శన్ రావు, జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు, నాయకులు అన్నవరపు కనకయ్య, ఏజే రమేష్, కారం పుల్లయ్య, ఎం.బి నర్సారెడ్డి, గడ్డం స్వామి, వంశీకృష్ణ, బండారు శరత్ బాబు తదితరులు పాల్గొన్నారు. -
బాల్ బ్యాడ్మింటన్ జిల్లా జట్ల ఎంపిక
ఖమ్మం స్పోర్ట్స్ : జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నగరంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో సీనియర్ మహిళల, పురుషుల జట్లను ఎంపిక చేసినట్లు అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు వేజెల్ల సురేష్, బొంతు శ్రీనివాస్రావు తెలిపారు. ఈ ఎంపికలకు జిల్లా వ్యాప్తంగా 80 మందికి పైగా క్రీడాకారులు హాజరయ్యారని, ఎంపిక చేసిన జట్లను ఈనెల 23, 24 తేదీల్లో ఆదిలాబాద్ జిల్లా గోలేటిలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు పంపిస్తామని వివరించారు. మహిళల జట్టులో జస్వతి, శ్రీహర్షిని, మధులత, అకాంక్ష, సాహితి, రాజేశ్వరీ, కరీనా, మనీషా, స్మైలీ, వ్యూహిత, అక్షయ ఎంపిక కాగా, పురుషుల జట్టులో బి.గోపి, శ్రీకాంత్, పవన్, కళ్యాణ్, మున్నా, నునావత్ గోపి, నవీన్, ప్రశాంత్, లాకేష్, విజయ్, కళ్యాణ్, జయదీప్ చోటు దక్కించుకున్నారని తెలిపారు. పవర్ డిప్లొమా ఇంజనీర్ల నూతన కమిటీ ఎన్నికఖమ్మంవ్యవసాయం: తెలంగాణ పవర్ డిప్లొమా ఇంజనీర్స్ అసోసియేషన్ జిల్లా నూతన కమిటీని ఆదివారం నగరంలోని విద్యుత్ గెస్ట్హౌస్లో ఎన్నుకున్నారు. అసోసియేషన్ ఎన్పీడీసీఎల్ అధ్యక్షుడు ఎం.ఇంద్రసేనారెడ్డి, డిప్యూటీ జనరల్ సెక్రటరీ మల్లికార్జున్, కంపెనీ సలహాదారు మధుసూదన్ పర్యవేక్షణలో ఎన్నికలు నిర్వహించగా.. అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వి.సుధాకర్రెడ్డి ఎలక్షన్ అధికారిగా వ్యవహరించారు. సంఘం జిల్లా అధ్యక్షుడిగా పి.వెంకట్, కార్యదర్శిగా నాగమల్లేశ్వరరావు, ఆర్గనైజింగ్ సెక్రటరీగా జె.ప్రభాకర్ రావు, ట్రెజరర్గా నాగరాజు, మహిళా ప్రతినిధిగా నవ్యశ్రీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మున్నేరు పరీవాహకంలో పంటల పరిశీలనఖమ్మంవ్యవసాయం: వరద ఉధృతి నేపథ్యంలో మున్నేరు పరీవాహక ప్రాంతంలోని పంటలను జిల్లా వ్యవసాయాధికారి ధనసరి పుల్లయ్య ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నదీ పరీవాహకంలో వరి పైర్లు దుబ్బుదశలో ఉన్నాయని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. ఎప్పటికప్పుడు పంటలను పర్యవేక్షిస్తూ రైతులకు తగిన సలహాలు అందించాలని స్థానిక వ్యవసాయాధికారులకు సూచించారు. ఆయన వెంట ఖమ్మం అర్బన్ ఏఓ కిషోర్ బాబు, ఏఈఓ దివ్య తదితరులు ఉన్నారు. రామయ్యకు సువర్ణ పుష్పార్చనభద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామ చంద్రస్వామివారి అంతరాలయంలోని మూలమూర్తులకు ఆదివారం అభిషేకం, సువర్ణ పుష్పార్చన జరిపారు. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి స్వామివారిని పల్లకీసేవగా చిత్రకూట మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు. భక్తులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. నిత్యకల్యాణంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కిన్నెరసానిలో పర్యాటక సందడిపాల్వంచరూరల్: కిన్నెరసాని ప్రాజెక్ట్ వద్ద ఆదివారం పర్యాటకులు సందడి చేశారు. జిల్లాలోని పలు ప్రాంతాలతోపాటు పొరుగు జిల్లాల నుంచి కూడా సందర్శకులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. డ్యామ్, జలాశయం, డీర్ పార్కులోని దుప్పులను వీక్షించారు. 619 మంది పర్యాటకులు కిన్నెరసానిలోకి ప్రవేశించగా వైల్డ్లైఫ్ శాఖకు రూ.33,310 ఆదాయం లభించింది. 320 మంది బోటు షికారు చేయగా ద్వారా టూరిజం కార్పొరేషన్కు రూ.15,000 ఆదాయం లభించినట్లు నిర్వాహకులు తెలిపారు. -
ఆరోగ్యశ్రీ సేవలకు బ్రేక్
ఖమ్మంవైద్యవిభాగం: గత వారం కోదాడకు చెందిన ఓ మహిళకు గుండె నొప్పి రావటంతో కుటుంబ సభ్యులు నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఆమె పరిస్థితి సీరియన్గా ఉండటంతో యాంజియోగ్రామ్ నిర్వహించి స్టంట్లు వేయాలని వైద్యులు కుటుంబ సభ్యులకు తెలిపారు. ఆ ఆస్పత్రిలో ఆరోగ్యశ్రీ సేవలు ఉండగా, కుటుంబ సభ్యులు వినియోగించుకోవా లని ప్రయత్నించారు. కానీ పేషంట్కు సీరియస్గా ఉందని, వెంటనే మూడు స్టంట్లు వేయాలని యా జమాన్యం తెలపడంతో ఆరోగ్యశ్రీ ద్వారా చేయా లని కోరారు. కానీ, ఆరోగ్యశ్రీ ద్వారా రెండు స్టంట్లకే అవకాశం ఉంటుందని చెప్పటంతో చేసేది లేక హుటాహుటిన రూ.2లక్షలు చెల్లించి స్టంట్లు వేయించారు. కనీసం హైదరాబాద్ రిఫర్ చేసినా వారికి ఉచితంగా సేవలు లభించేవి. దీంతో వారు ఆరోగ్య శ్రీ ట్రస్ట్కు ఆస్పత్రి యాజమాన్యంపై ఫిర్యాదు చేశారు. ●ఇటీవల తల్లాడ మండలానికి చెందిన ఓ వ్యక్తికి రాత్రిపూట గుండె నొప్పి రావటంతో కుటుంబ సభ్యులు నగరంలోని వైరారోడ్లో ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకొచ్చారు. అక్కడ ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులో ఉన్నా అర్ధరాత్రి కావటంతో రిజిస్ట్రేషన్ చేయటానికి ఆరోగ్యమిత్ర అందుబాటులో లేడు. దీంతో పేషంట్ పరిస్థితి సీరియస్గా ఉండటంతో చేసేదిలేక డబ్బులు పెట్టి యాంజియోగ్రామ్ చేయించి, స్టంట్లు వేయించారు. ●ఇలా రోజూ ఎందరో నిరుపేద, మద్యతరగతి రోగులు ఆరోగ్యశ్రీ సేవలకు అర్హులైనప్పటికీ నెట్వర్క్ ఆస్పత్రుల డబ్బుల దాహానికి బలవుతున్నా రు. అంతే కాకుండా సరిపోను ఆరోగ్యమిత్రలు లేకపోవటం కూడా నెట్వర్క్ ఆస్పత్రులకు వరంలా మారిపోయింది. మిత్రల కొరతతో ఆయా ఆస్పత్రు ల్లో మూడుషిఫ్టుల్లో పనిచేయాల్సిన వారు కరువయ్యారు. దీంతో ఉన్న వారితోనే నెట్టుకొస్తుండటంతో రోగులు తీవ్రఇబ్బందులు పాలవుతున్నారు. ఆరోగ్య శ్రీ పథకం 2008లో అప్పటి దివంగత ముఖ్యమంత్రిరాజశేఖర్రెడ్డి ప్రారంభించారు. పాద యాత్ర సమయంలో రోగులు పడుతున్న ఇబ్బందులను స్వయంగా చూసి చలించిపోయి ఆయన ఆలోచనలో వచ్చిందే ఈ ఆరోగ్యశ్రీ పథకం. అప్పట్లో ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా లక్షల మందికి ఉచితంగా వైద్యసేవలు అందించగా, ప్రస్తుతం ఆరోగ్యశ్రీ సేవలు అందటం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలో 68 మంది మాత్రమే పథకం ప్రారంభ సమయంలో ఉమ్మడి జిల్లాలో 125 మంది ఆరోగ్యమిత్రలతో ఆరోగ్యశ్రీ సేవలు ప్రారంభించారు. అప్పటి నుంచి ఉద్యోగ నియామకాలు చేపట్టకపోవటంతో ప్రస్తుతం ఉమ్మడి జిల్లా లో 68 మంది ఆరోగ్య మిత్రలు మిగిలిపోయారు. అందులో ఖమ్మం జిల్లాలో 38 మంది మిత్రలు పనిచేస్తుండగా, భద్రాద్రికొత్తగూడెంలో 30మంది సేవలు అందిస్తున్నారు. జిల్లా రెండుగా విడిపోయినా ఇప్పటివరకు ఉమ్మడి జిల్లాకు కలిపి ఖమ్మం కేంద్రంగా ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సేవలు కొనసాగుతున్నాయి. ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆరోగ్యశ్రీ ఆస్పత్రుల్లో అవసరమైనస్థాయిలో ఆరోగ్యమిత్రలు లేకపోవటం వల్ల రోగులకు ఆయుష్మాన్, ఆరోగ్యశ్రీ సేవలు అశించినస్థాయిలో అందట్లేదు. ఆరోగ్యశ్రీట్రస్ట్ ఏర్పడిన సమయంలో ఉమ్మడి జిల్లాలో కేవలం 10 ఆస్పత్రులకే అనుమతు లు ఉండేవి. ప్రస్తుతం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ప్రభు త్వ, ప్రైవేట్ ఆరోగ్యశ్రీ ఆస్పత్రులు 55 వరకు ఉన్నా యి. అందులో ఖమ్మం జిల్లాలో 31 ప్రైవేట్, 8 ప్రభు త్వ ఆస్పత్రుల్లో ఆరోగ్యసేవలు అందుబాటులో ఉన్నా యి. భద్రాద్రి కొత్తగూడెంలో 9 ప్రైవేట్, 7 ప్రభుత్వ ఆస్పత్రులకు అనుమతులు ఉన్నాయి. 7 లక్షలకు పైగా అర్హులు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆరోగ్యశ్రీ ద్వారా రూ.10లక్షల వరకు ఉచితంగా వైద్యసేవలు పొందే అవకాశం లభించింది. దీంతో ఆరోగ్యశ్రీ సేవ లకు ప్రాముఖ్యత పెరిగింది. కానీ, రోగులకు అనుకున్నస్థాయిలో వైద్య సేవలు అందట్లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఆరోగ్యశ్రీ అనుమతులు ఉన్న కొన్ని ప్రైవేట్ ఆస్పత్రులు ఎక్కువగా ధనార్జనే ధ్యేయంగా పనిచేస్తున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆరోగ్యశ్రీ అనుమతులు ఉన్నప్పటికీ పలురకాల కొర్రీలు పెట్టి రోగులకు ఉచితసేవలు అందకుండా చేస్తున్నారు. ఒక్కోసారి కొన్ని ఆస్పత్రుల్లో ఇక్కడ ఆరోగ్యశ్రీసేవలు లేవని బుకాయిస్తూ డబ్బులు చెల్లించేలా చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే, ఉమ్మడి జిల్లాలో 7,12,461 రేషన్ కార్డులు ఉండగా వారంతా ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్ భారత్కు అర్హులే. రోగి ఆయా ఆస్పత్రులకు వచ్చి సేవలు పొందే సంమయంలో ఆరోగ్యమిత్రలదే కీలక పాత్ర. అర్హులైన రోగులకు రిజిస్ట్రేషన్, ట్రస్ట్ నుంచి అనుమతులు పొందడంతోపాటు డిశ్చార్జ్ అయ్యే వరకు వారి సేవలు కీలకం. సరిపోను ఆరోగ్యమిత్రలు లేకపోవటం ఇబ్బందిగా మారింది. ఉమ్మడి జిల్లాలో ఇప్పుడు ఉన్న ఆరోగ్యశ్రీ ఆస్పత్రులకు గాను సుమారు మరో 100 మంది ఆరోగ్యమిత్రలు అవసరం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. సాధారణంగా ఆరోగ్యమిత్రలు ఉదయం, మధ్యాహ్నం, రాత్రిషిఫ్ట్లు చేయాల్సి ఉంటుంది. కానీ, సరిపోను సిబ్బంది లేక ఇబ్బందులు తప్పట్లేదు. ము ఖ్యంగా రాత్రి సమయాల్లో అత్యవసర సేవలు పొందేందుకు వచ్చేవారు ఆరోగ్యమిత్రలు అందుబాటులో లేక డబ్బులు చెల్లించి వైద్య సేవలు పొందాల్సి వస్తోంది. కొందరు ఆర్ఎంపీల మూలంగా కూడా ఆరోగ్యశ్రీ సేవలకు అర్హులైన రోగులు దూరమవుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కమీషన్లకు కక్కుర్తి పడి గ్రామాల్లో రోగులను ప్రైవేట్ ఆరోగ్యశ్రీ ఆస్పత్రులకు తీసుకొచ్చి చేర్పించి, వారితో డబ్బులు కట్టిస్తున్నారు. ఆ తర్వాత అక్కడ ఆరోగ్యశ్రీ ఉందనే విషయం తెలుసుకొని రోగులు లబోదిబోమంటున్నారు. ఉమ్మడి జిల్లాలో ఆరోగ్యశ్రీ సేవలకు ఇబ్బందులు లేకుండా చూస్తున్నాం. ఆరోగ్యమిత్రల కొరత ఉన్నా సర్దుకుంటూ పో తున్నాం. ఏ ఆస్పత్రి నుంచైనా ఫిర్యాదు అందితే విచారణ చేసి సంబంధిత రోగికి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. ప్రైవే ట్ ఆస్పత్రుల యాజమాన్యాలు నిర్లక్షం చేస్తే ఫిర్యా దు చేయాలి. –పి.శ్రీనివాస్, ఉమ్మడి జిల్లా ఆరోగ్యశ్రీ మేనేజర్ -
రైల్వేస్టేషన్లో టికెట్ కౌంటర్ ప్రారంభం
చింతకాని : మండల పరిధిలోని నాగులవంచ రైల్వేస్టేషన్లో మూడు నెలలుగా నిలిచిపోయిన టికెట్ కౌంటర్ సేవలను ఖమ్మం రైల్వేస్టేషన్ చీఫ్ బుకింగ్ సూపర్వైజర్ గంగిశెట్టి శ్రీనివాసులు ఆదివారం ప్రారంభించారు. ప్రయాణికుల నుంచి ఆదరణ తగ్గిందనే కారణంతో నాగులవంచ రైల్వేస్టేషన్ను మూసివేస్తున్నట్లు ఇటీవల దక్షిణ మధ్య రైల్వే అసిస్టెంట్ కమర్షియల్ మేనేజర్ బి.సునీత సర్క్యులర్ను జారీ చేశారు. దీంతో స్టేషన్ను కొనసాగించాలని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఆందోళన చేపట్టగా తిరిగి యథావిధిగా కొనసాగిస్తున్నట్లు ఈనెల 14న మళ్లీ ఉత్తర్వులు వెలువడ్డాయి. ప్రస్తుతం టికెట్ కౌంటర్ను ప్రారంభించడంతో నాగులవంచ, నాగులవంచ రైల్వేస్టేషన్, పాతర్లపాడు, రామాపురం తదితర గ్రామాల వారు టికెట్లు కొనుగోలు చేసి ప్యాసింజర్ రైలులో ప్రయాణించారు. ఈ సందర్భంగా శ్రీనివాసులు మాట్లాడుతూ.. ప్రతిరోజు వివిధ పనుల నిమిత్తం వెళ్లేవారు రైలులోనే ప్రయాణించాలని, తప్పనిసరిగా టికెట్లు కొనుగోలు చేసి స్టేషన్ ఆదాయం పెంచాలని కోరారు. కాగా, కాంట్రాక్ట్ పద్ధతిన కాకుండా రెగ్యులర్ టికెట్ బుకింగ్ క్లర్క్ను నియమించాలని, విద్యుత్ లైట్లు ఏర్పాటు చేయాలని, రాత్రి వేళ విజయవాడ నుంచి డోర్నకల్ వెళ్లే ప్యాసింజర్ రైలును నాగులవంచ రైల్వేస్టేషన్లో నిలపాలని ఆయా గ్రామాల వారు శ్రీనివాసులుకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఖమ్మం రైల్వేస్టేషన్ కమర్షియల్ సూపర్వైజర్ సూరపల్లి శేషుకుమారి, వివిధ పార్టీల నాయకులు బొర్రా ప్రసాద్రావు, ఆలస్యం బస్వయ్య, నాగమణి, వెచ్ఛా మంగపతిరావు, మద్దినేని నాగేశ్వరరావు, తేలుకుంట్ల శ్రీనివాసరావు, తాళ్లూరి రాము, కొండా గోపి, మద్దినేని వెంకటేశ్వరరావు, వంకాయలపాటి సత్యం, కొల్లి బాబు, కోపూరి నవీన్, పరిటాల యలమంద, తొండపు వేణు తదితరులు పాల్గొన్నారు.హర్షం వ్యక్తం చేసిన నాగులవంచ, పరిసర గ్రామాల ప్రజలు -
అందాలు చూద్దాం.. ఆస్వాదిద్దాం
● కొత్తదనం సంతరించుకున్న పులిగుండాల ● ఘాట్రోడ్డులో ప్రయాణం.. సఫారీపై స్వారీ ● అనేక రకాల రుదైన పక్షులు, ఔషధ మొక్కలకు ఆలవాలం ● ఉమ్మడి జిల్లా వాసులకు అందుబాటులో పర్యాటక కేంద్రం సత్తుపల్లి: కనుచూపు మేర పచ్చని చెట్లు.. చల్లనిగాలులు.. పక్షుల కిలకిలారావాలు.. జాలు వారే జలపాతాలు.. ఘాట్రోడ్పై వెళ్తుంటే మార్గమధ్యలో ఆలయాలు.. దూరంగా ఉమ్మడి జిల్లాకు సరిహద్దుగా కనిపించే కనిగిరి గుట్టలు.. అక్కడక్కడా అరుదైన నీలిరంగు పుట్టగొడుగులు, ఔషధ మొక్కలు.. ఈ అనుభూతులన్నీ మీ సొంతం కావాలంటే ఒక రోజు సమయం కేటాయించండి చాలు! ఎంతో దూరం వెళ్లాల్సిన పనికూడా లేదు. కుటుంబ సమేతంగా పెనుబల్లి మండలం పులిగుండాల ప్రాజెక్టు సందర్శనకు వెళ్తే మరిచిపోలేని అనుభూతులను మూటగట్టుకుని రావొచ్చు! ఈ ప్రాంతాన్ని ఎకో టూరిజంలో భాగంగా రూ.4.20కోట్ల నిధులతో పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే పనులు కొనసాగుతున్నాయి. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రెండు జిల్లాల కలెక్టర్లు అనుదీప్ దురిశెట్టి, జితేష్ వి.పాటిల్, ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్దత్, కొత్తగూడెం ఎస్పీ రోహిత్రాజ్, అటవీ శాఖ భద్రాద్రి జోన్ సీసీఎఫ్ భీమా నాయక్, డీఎఫ్ఓ సిద్ధార్థ్ విక్రమ్సింగ్. ఎఫ్డీఓ మంజుల తరచూ పర్యవేక్షిస్తుండడంతో పర్యాటకులకు ఒక్కటొక్కటిగా సౌకర్యాలు సమకూరుతూ ఉమ్మడి జిల్లా వాసులకు కొత్త పర్యాటక కేంద్రం అందుబాటులోకి వచ్చినట్లయింది. మనస్సును ఆహ్లాదపరిచేలా.. పులిగుండాల ప్రాజెక్టు వద్దకు వెళ్తే అన్ని బాధలు, కష్టాలు మరిచిపోవడమే కాక మనస్సు ఆహ్లాదంగా మారుతుంది. మార్గమధ్యలో ఎలుగుబంటి. దుప్పులు, కణుజులు, అడవిపిల్లులు, జంగుపిల్లులు, పూనుగు పిల్లులు, మూషిక జింక, నెమళ్లను చూడొచ్చు. సముద్ర మట్టానికి 700 అడుగుల ఎత్తులో నిర్మించిన లియోపార్డ్ టవర్ నుంచి చూస్తే అటవీ అందాలతో పాటు చిరుతపులి కదలికలూ అప్పుడప్పుడు కనిపిస్తాయి. ప్రత్యేక బస్సు.. అడ్వాన్స్ బుకింగ్ పులిగుండాల ప్రాజెక్టు సందర్శన కోసం ప్రత్యేక బస్సు సౌకర్యం కల్పించారు. ప్రతీ శని, ఆదివారం వి.ఎం.బంజరు బస్టాండ్ నుంచి అటవీశాఖ ఏర్పాటు చేసిన బస్సులు ఉదయం 9, 9.30 గంటలకు, కల్లూరు బస్టాండ్ నుంచి 11, 11.30 గంటల సమయాన బయలుదేరి రామకృష్ణాపురం వరకు వెళ్తాయి. బ్రహ్మాళ్లకుంట ముఖద్వారం నుంచి అటవీశాఖ ఏర్పాటు చేసిన సఫారి వాహనంలో ప్రయాణిస్తూ అటవీ అందాలను తిలకించవచ్చు. టికెట్ ధర పెద్దలకు రూ.20, పిల్లలకు రూ.10గా నిర్ణయించారు. అలాగే, 94412 18466 నంబర్ ద్వారా అడ్వాన్స్ బుకింగ్ సౌకర్యమూ కల్పించారు. సొంత వాహనంలో వచ్చే పర్యాటకులు సఫారీ వాహనంలోనే వెళ్లాల్సి ఉంటుంది. 27 కిలోమీటర్ల ప్రయాణం పెనుబల్లి మండలం బ్రహ్మాళ్లకుంట ముఖద్వారం నుంచి 27 కిలోమీటర్లు ఘాట్రోడ్డులో అటవీశాఖ ఏర్పాటు చేసిన సఫారి వాహనంలో ప్రయాణం అద్భుతంగా సాగుతుంది. అటవీశాఖ అభివృద్ధి చేసిన హట్లలో విశ్రాంతి తీసుకునే అవకాశముంది. ఎవరూ ఇబ్బంది పడకుండా టాయిలెట్లు, తాగునీటి సదుపాయం కల్పించారు. మూడు వాచ్టవర్లు, సెల్ఫీపాయింట్, రాత్రి బస కోసం నైట్ క్యాంపింగ్ సైట్, సోలార్ బోరు ఏర్పాటు చేశారు. డీఆర్డీఏ ఆధ్వర్యాన రిసెప్షన్ హట్(భోజనశాల), అటవీ ఉత్పత్తుల విక్రయ స్టాల్ కూడా ఉంది. కాగా, చండ్రుగొండ మండలం బెండాలపాడు సమీపాన కనిగిరి గుట్టలపై 11వ శతాబ్ధంలో ప్రతాపరుద్రుడు నిర్మించిన భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఆలయం.. అక్కడ మోటబావిని కూడా చూడొచ్చు. అలాగే, పులిగుండాల ప్రాజెక్టు సమీపాన శివాలయంలో పూజలు చేసే అవకాశముంది. -
శ్రీవారికి అభిషేకం, నిత్యకల్యాణం
ఎర్రుపాలెం: తెలంగాణ తిరుపతిగా పేరున్న జమలాపురంలోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు జరిగాయి. తెల్లవారుజామునే స్వామి మూలవిరాట్తో పాటు ఆలయ ఆవరణలోని శ్రీవారి పాదానికి అర్చకులు పంచామృతంతో అభిషేకం జరిపించారు. ఆతర్వాత స్వామి, అమ్మవార్లను పట్టువస్త్రాలతో అలంకరించి వేలాదిగా హాజరైన భక్తుల సమక్షాన నిత్యకల్యాణం, పల్లకీసేవ నిర్వహించారు. అలాగే, శ్రీకృష్ణాష్టమి సందర్భంగా ఆలయ ప్రాంగణంలోని గోకులంలో ప్రత్యేక పూజలు జరిగాయి. ఆలయ ఈఓ జగన్మోహన్రావు, వ్యవస్థాపక ధర్మకర్త ఉప్పల శ్రీరామచంద్రమూర్తి, ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాసశర్మ, సూపరింటెండెంట్ విజయకుమారి, అర్చకులు రాజీవ్శర్మ, మురళీమోహన్శర్మ, సిబ్బంది పాల్గొన్నారు. ధరలు పెంచితే చర్యలు ముదిగొండ: యూరియా స్టాక్ లేదంటూ డీలర్లు ధరలు పెంచి అమ్మితే చర్యలు తీసుకుంటామని జిల్లా వ్యవసాయ శాఖాధికారి డి.పుల్లయ్య హెచ్చరించారు. ముదిగొండ మండలంలోని పలు గ్రామాల్లో ఎరువుల దుకాణాలను శనివారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా నిల్వలు, రిజిస్టర్లను పరిశీలించి డీలర్లకు సూచనలు చేశారు. స్టాక్ వివరాలు ఎప్పటికప్పుడు నమోదు చేస్తూ నిర్ణీత ధరకే ఎరువులు అమ్మాలని సూచించారు. అలాగే, నానో యూరియా వాడకంపై అవగాహన కల్పించాలని తెలిపారు. ఏఓ సరిత పాల్గొన్నారు. -
పోటెత్తి.. రోడ్లపైకి చేరి
● పలు చోట్ల నిలిచిన రాకపోకలు ● ఇళ్లలోకీ వరద రావడంతో ప్రజల ఆందోళనవైరా: వైరా రిజర్వాయర్కు వరద పోటెత్తుతోంది. పూర్తి స్థాయి నీటి మట్టం 18.3 అడుగులు కాగా ప్రస్తుతం 20అడుగులకు ఉంది. రిజర్వాయర్లోకి సామర్థ్యానికి మించి నీరు చేరడంతో రాజీవ్నగర్ కాలనీలోకి వరద చేరగా స్థానికులను జెడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాలలకు తరలించారు. మున్సిపల్ కమీషనర్ చింతా వేణు, తహసీల్దార్ కే.వీ.శ్రీనివాస్, ఎస్సై రామారావు ఆధ్వర్యాన పరిశీలంచి వసతులు కల్పించారు. ●కొణిజర్ల: మండలంలోని పలు గ్రామాల మీదుగా ప్రవహించే పగిడేరు ఉధృతితో పలు గ్రామల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. శనివారం మధ్యాహ్నా నికి వాగు ఉధృతి తగ్గడంతో రాకపోకలు ప్రారంభమయ్యాయి. కాగా, పగిడేరు, నిమ్మవాగు వరద ఉధృతితో వైరా రిజర్వాయర్కు భారీగా వరద చేరగా, సమీపంలోని పెద్దరాంపురం ఇళ్లలోకి నీరు చేరింది. అలాగే, పలుచోట్ల పంటలు నీటమునిగాయి. ●రఘునాథపాలెం: చిన్న వర్షానికే బుగ్గవాగు పొంగి పొర్లి ప్రవహిస్తుండడంతో రాకపోకలు ఆగిపోతున్నాయని రఘునాథపాలెం మండలం వీఆర్.బంజర గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం సాయంత్రం వరకు వంతెనపై ప్రవామం ఉండడంతో ఇబ్బందులు ఎదరయ్యాయి. కాగా, డోర్నకల్ – ఖమ్మం మార్గంలో రాకపోకలు నిలిపివేయగా ఎంపీఓ శ్రీనివాసరెడ్డి, గ్రామాల కార్యదర్శులు నాగరాజు, హిమబిందు, పోలీసులు పర్యవేక్షిస్తున్నారు. ●కామేపల్లి: మండలంలోని పొన్నేకల్ బుగ్గవాగు ఉధృతితో లింగాల–డోర్నకల్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. బుగ్గవాగు వరద ఉధృతిని డీపీఓ ఆశాలత, డీఎల్పీఓ రాంబాబు, సీఐ తిరుపతిరెడ్డి, ఎస్సై సాయికుమార్ పరిశీలించారు. ●తల్లాడ: మండలంలో బిల్లుపాడు–రామచంద్రాపురం మధ్య, వెంగన్నపేట–నూతనకల్ మధ్య వాగులు, మిట్టపల్లి, పినపాక వద్ద వాగులు ఉధృతరూపం దాల్చగా రాకపోకలు స్తంభించాయి. ●వైరా రిజర్వాయర్ నుంచి అలుగుల ద్వారా వర ద దిగువకు చేరి వైరా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో పలుగ్రామాలకు రాకపోకలు ఆగిపోయా యి. ఎస్సై పుష్పాల రామారావు, ట్రెయినీ ఎస్సై వెంపటి పవన్ స్నానాల లక్ష్మీపురంలోని వైరా నది ఉధృతిని పరిశీలించి ప్రజలను అప్రమత్తం చేశారు. ●కారేపల్లి: మండలంలోని పేరుపల్లి వద్ద లోలెవల్ బ్రిడ్జి పైనుంచి బుగ్గవాగు ప్రవాహంతో రాకపోకలను నిలిపివేశారు. బుగ్గవాగు ఒడ్డున నిర్మించిన డబుల్ బెడ్రూం కాలనీలోకి వరద చేరడంతో సీఐ తిరుపతిరెడ్డి, ఎస్ఐ బి.గోపి, ఎంపీడీఓ రవీంద్రప్రసాద్ తదితరులు స్థానికులను హైస్కూల్ పునరావాస కేంద్రానికి తరలించారు. అలాగే, డీపీఓ ఆశాలత, డీఎల్పీఓ రాంబాబు పరిశీలించారు. ఇక పలుచోట్ల పత్తిచేన్లలోకి నీరు చేరడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ●ఏన్కూరు: మండలంలో భారీ వర్షానికి చెరువులు నిండగా, వాగులు పొంగాయి. జన్నారం– అంజనపురం వద్ద నిమ్మవాగు ప్రవాహంతో రాకపోకలు ఆటంకం ఎదురైంది. లోతట్టు ప్రాంతాల పొలాల్లో వరద నిలిచింది. ●నేలకొండపల్లి: మండలంలోని రాజేశ్వరపురం– శంకరగిరితండా మధ్య రహదారి వరద తాకిడికి కొట్టుకపోయింది. ఇక్కడ బ్రిడ్జి నిర్మించే క్రమాన పక్కన వేసిన రహదారి రాజేశ్వరపురం చెరువు అలుగు ప్రవాహంతో కొట్టుకపోయింది. అలాగే, వరి పొలాలు నీట మునిగాయి. ఈమేరకు పంచాయతీ కార్యదర్శులు రాకపోకలను నిలిపివేసి పహారా ఏర్పాటుచేశారు. -
కీలక పదవులు ఖాళీ...
● జలనవరుల శాఖలో అధికారుల కొరత ● ఉమ్మడి జిల్లాలో ఖాళీగా 8ఈఈ పోస్టులుఖమ్మంఅర్బన్: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జలవనరుల శాఖను అధికారుల కొరత వేధిస్తోంది. కీలక పోస్టులు ఖాళీగా ఉండడంతో సాగునీటి పంపిణీ పర్యవేక్షణలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. కొంతకాలంగా అధికారులు రిటైర్ అవుతుండగా.. ఆ స్థానాలను భర్తీ చేయకపోవడంతో ఎనిమిది ఈఈ పోస్టులు ఖాళీ అయ్యాయి. పలువురికి ఎస్ఈలుగా పదోన్నతి లభించడంతో కొరత మరింత పెరిగింది. కీలకమైన సమయమిది... ఓవైపు వానాకాలం పంటల సాగు ముమ్మరంగా సాగుతోంది. సాగర్ నుంచి నీరు విడుదలవుతుండగా.. జిల్లాలోనూ భారీ వర్షాలతో ప్రాజెక్టులు, చెరువులు జలకళ సంతరించుకున్నాయి. ఈ సమయాన సాగునీటి సరఫరా, పర్యవేక్షణలో కీలకంగా వ్యవహరించాల్సిన అధికారులు లేకపోవడంతో రైతులకు సమస్యలు ఎదురవుతున్నాయి. జిల్లాలోని పలు డివిజన్ల పరిధిలో సకాలంలో సాగునీరు సదుపాయం అందక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు ఆవేదన చెందుతున్నారు. మరోపక్క కీలకపోస్టులు ఖాళీగా ఉండటంతో ఉన్న ఉద్యోగులపై భారం పడి ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. సీఈ పోస్టూ ఖాళీనే... ఖమ్మం జలవనరుల శాఖ సీఈ పోస్టు కూడా కొద్దినెలలుగా ఖాళీగా ఉంది. ప్రస్తుతం సూర్యాపేట సీఈ, జలవనరుల శాఖ ఈఎన్సీ రమేష్బాబు ఇక్కడ అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అంతేకాక పాలేరు, మధిర, కల్లూరు ఈఈ పోస్టులు, ఖమ్మం డీసీఈ, కల్లూరు డిప్యూటీ ఎస్ఈ పోస్టులూ మార్చి నుంచి ఖాళీగానే ఉన్నాయి. మరోపక్క కొత్తగూడెం, ఇల్లెందు, భద్రాచలం డివిజన్లలో ఈఈ, డీఎస్సీ పోస్టులు కూడా ఇటీవల పదోన్నతుల కారణంగా ఖాళీ అయ్యాయి. ఈ మేరకు ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ప్రభుత్వం స్పందించి జలవనరుల శాఖలో ఇంజనీరింగ్ అధికారుల పోస్టులను భర్తీ చేయాలని రైతులు కోరుతున్నారు. -
● మున్నేటికి కాల్వొడ్డు వద్ద 15అడుగుల నీటిమట్టం ● ముంపు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు
మొదటి హెచ్చరిక దిశగా..ఖమ్మంమయూరిసెంటర్: జిల్లాలో కురుస్తున్న వర్షాలకు తోడు ఎగువ నుంచి వస్తున్న వరద మున్నేటికి పోటెత్తింది. ఈ ఏడాది తొలిసారి కాల్వొడ్డు వద్ద 15అడుగులకు పైగా వరద ప్రవహించింది. శనివారం ఉదయం 9.5 అడుగులుగా ఉన్న నీటిమట్టం అంతకంతకు పెరుగుతూ సాయంత్రం 6గంటల సమయాన 15అడుగులకు చేరడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఇక్కడ నీటిమట్టం 16అడుగులకు చేరితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు. అధికారుల పరిశీలన మున్నేటికి వరద ఉధృతి పెరుగుతుండడంతో మధ్యాహ్నం 12గంటల సమయాన కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్య, రాత్రి మేయర్ పి.నీరజ కాల్వొడ్డు వద్ద పరిశీలించి అధికారులను అప్రమత్తం చేశారు. ప్రత్యేక అధికారులు, వార్డు ఆఫీసర్లు స్థానికంగా ఉండి ప్రజలను అప్రమత్తం చేసేలా ఆదేశాలు ఇచ్చారు. సాయంత్రం 4.30గంటలకు నీటిమట్టం 14.5 అడుగులకు చేరగా లోతట్టు ప్రాంతాల ప్రజలు పునరావాస కేంద్రాలకు వెళ్లేలా విలువైన వస్తువులు భద్రపరుచుకోవాలని ప్రచారం చేశారు. కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్య, అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి, ఏదులాపురం మున్సిపల్ కమిషనర్ ఆళ్ల శ్రీనివాసరెడ్డితో కలిసి మున్నేటికి ఇరువైపులా పరిశీలించి కార్పొరేటర్లు, ప్రజలు, అధికారులతో మాట్లాడారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారుల సూచనలు రాగానే పునరావాస కేంద్రాలకు వెళ్లాలని సూచించారు. వరద పెరుగుతున్న నేపథ్యాన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచనలు చేశారు. అలాగే, అలాగే, కలెక్టర్ ఆదేశాలతో అన్ని శాఖల అధికారులు మున్నేటి పరీవాహకంలో పర్యవేక్షించారు. కేఎంసీ అసిస్టెంట్ కమిషనర్, ఎస్ఈ, ఇంజనీరింగ్, టౌన్ప్లానింగ్, శానిటేషన్ అధికారులు, పబ్లిక్ హెల్త్ ఇంజనీర్లే కాక అర్బన్, రూరల్ తహసీల్దార్లు, త్రీటౌన్ సీఐ, ఇరిగేషన్ అధికారులు ముంపు ప్రాంతాల్లో కలియదిరుగుతూ ప్రజలను అప్రమత్తం చేశారు. కార్పొరేటర్లు తోట గోవిందమ్మ రామారావు తదితరులు కూడా అధికారుల సూచనలు పాటించాలని, ఆస్తి నష్టం వాటిల్లకుండా ముందుగానే అప్రమత్తం కావాలని ప్రజలకు అవగాహన కల్పించారు. పునరావాస కేంద్రాలు సిద్ధం.. శనివారం రాత్రి మున్నేటి వరద 17అడుగుల వరకు చేరే అవకాశముందన్న సమాచారంతో అధికారులు క్షేత్రస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించారు. కానీ రాత్రి 10గంటల వరకు 15.01అడుగులుగానే నీటిమట్టం కొనసాగింది. అయినా పునరావాస కేంద్రాలను సిద్ధం చేసి ప్రజలను తరలించాల్సి వస్తే అవసరమైన సౌకర్యాలు, వసతులు కల్పించాలని కలెక్టర్ ఆదేశించారు. తొలిదఫా నయాబజార్ జూనియర్ కళాశాల, రామన్నపేట స్కూళ్లలో పునరావాస కేంద్రాలను సిద్ధం చేసి ఉంచారు. -
రొట్టమాకురేవు నుంచి ఎర్రకోటకు..
కారేపల్లి: మారుమూల ఆదివాసీ గ్రామానికి చెందిన మహిళ దేశ రాజధానిలోని ఎర్రకోట వద్ద జరిగిన స్వాతంత్య్ర సంబురాల్లో పాల్గొంది. కారేపల్లి మండలం రొట్టమాకురేవు గ్రామానికి చెందిన ఇర్ప సుహాసిని గతంలో జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలిగా వ్యవహరించింది. అలాగే, గ్రామంలో గోదావరి సమాఖ్య ద్వారా మహిళలకు పొదుపు, రుణాల మంజూరు, చెల్లింపునకు చేసిన కృషికి గాను ఎర్రకోట వద్ద జరిగే స్వాతంత్య్ర వేడుకలకు ఆహ్వా నించారు. ఈ వేడుకల్లో పాల్గొన్న సుహాసిని మాట్లాడుతూ ఢిల్లీలో ప్రధాని జాతీయ జెండా ఎగురవేయడాన్ని స్వయంగా చూడడం ఆనందాన్ని కలిగించిందని తెలిపారు. రామయ్యకు సువర్ణ తులసీ అర్చనభద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి శనివారం సువర్ణ తులసీ అర్చన వైభవంగా నిర్వహించారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన పూజలు చేశారు. అనంతరం చిత్రకూట మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. ఆతర్వాత నిత్యకల్యాణ ఘట్టాన్ని శాస్త్రోక్తంగా జరిపించారు. -
పంది మాంసం దుకాణం సీజ్
ఖమ్మంమయూరిసెంటర్: ఖమ్మం కొత్త బస్టాండ్ పక్కన వెజ్, ఫిష్ మార్కెట్లో ఎలాంటి అనుమతి లేకుండా పంది మాంసం షాప్ ఏర్పాటుచేయడంపై కేఎంసీ అధికారులు చర్యలు చేపట్టారు. ఈమేరకు దుకాణాన్ని సీజ్ చేయడంతో పాటు నిర్వాహకుడికి రూ.3వేల జరిమానా విధించారు. శానిటరీ సూపర్వైజర్ ఎం.సాంబయ్య, శానిటరీ ఇన్స్పెక్టర్ మల్లయ్య, జవాన్ పాల్గొన్నారు. ట్రాక్టర్ ట్రక్కు చోరీచింతకాని: మండలంలోని గోవిందాపురం(ఎల్) గ్రామానికి చెందిన రైతు ధర్మపురి పుల్లారావు ట్రాక్టర్ ట్రక్కు చోరీకి గురైంది. రైతు ఏడాది క్రితం ట్రాక్టర్ ఇంజన్, ట్రక్కు కొనుగోలు చేయగా, ప్రొద్దుటూరులో స్నేహితుడైన పాసంగులపాటి విష్ణువర్ధన్ అవసరాలకు శుక్రవారం పంపించాడు. ఆయన ఇంటి వద్ద శుక్రవారం రాత్రి ట్రక్కు చోరీ కావడంతో శనివారం పుల్లారావుకు సమాచారం ఇచ్చాడు. దీంతో రైతు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్సై నాగుల్మీరా తెలిపారు. ‘ఉపాధి’ కార్యాలయంలో అగ్నిప్రమాదంఏన్కూరు: ఏన్కూరు మండల కేంద్రంలోని ఉపాధి హామీ కార్యాలయంలో శనివారం విద్యుత్ షార్ట్సర్క్యూట్ కారనంగా మంటలు చెలరేగాయి. పథకం ప్రారంభమైనప్పటి నుంచి జరగిన పనుల రికార్డులు, ఇతర పైళ్లు అగ్నిప్రమాదంలో కాలి బూడిదయ్యాయి. అలాగే, బీరువాలు, ఇతర సామాగ్రి కూడా కాలిపోయాయి. మంటలు మొదలైన విషయం తెలియగానే ఏపీఓ సూరయ్య తహసీల్దార్, ఎస్ఐతో పాటు అగ్నిమాపక శాఖకు అధికారులకు సమాచారం ఇచ్చారు. ఇంతలోనే స్థానికులు, రేపల్లెవాడ వాసులు మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తుండగా.. అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను అదుపు చేశారు. ఎంపీడీఓ జీవీఎస్. నారాయణ, ఎస్ఐ రఫీ, ఆర్ఐ శ్రీనివాస్ పరిశీలించి వివరాలు సేకరించారు. బైక్ కొనివ్వలేదని తండ్రిపై గొడ్డలితో దాడిఖమ్మంరూరల్: పల్సర్ బైక్ కొనివ్వలేదంటూ ఓ వ్యక్తిపై ఆయన కుమారుడు గొడ్డలితో దాడి చేసిన ఘటన ఇది. ఖమ్మం రూరల్ మండలం మంగళగూడెంకు చెందిన బండారు నాగయ్య – లక్ష్మికి కుమారుడు సతీష్ ఉన్నాడు. ఇటీవల ఆయనకు సెల్ఫోన్ కొనిచ్చారు. అనంతరం ఈనెల 13న పల్సర్ బైక్ కొనివ్వాలని కోరగా అంత డబ్బు లేదని, ఏదైనా పని చేసుకుని బైక్ కొనుక్కోవాలంటూ సూచించారు. కానీ సతీష్ మాత్రం బైక్ కొనివ్వకపోతే ఇద్దరినీ చంపుతానంటూ బెదిరించాడు. ఈక్రమంలో 14న రాత్రి అంతా అన్నం తిని పడుకున్నాక అర్ధరాత్రి సమయాన సతీష్ తండ్రి నాగయ్య దాడి చేయడంతో నుదురు, దవడపై తీవ్ర రక్తస్రావమైంది. దాడిని అడ్డుకోబోయిన నాగలక్ష్మికి వెళ్లడంతో ఆమె కేకలు వేయగా ఇరుగుపొరుగు రావడంతో సతీష్ పారిపోయాడు. దీంతో నాగయ్యను ఆస్పత్రికి చేర్పించగా.. నాగలక్ష్మి ఫిర్యాదుతో శనివారం కేసు నమోదు చేసినట్లు సీఐ ముష్క రాజు తెలిపారు. -
నేడు మంత్రి పొంగులేటి పర్యటన
ఖమ్మంమయూరిసెంటర్: రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, పౌర సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదివారం ఉమ్మడి జిల్లాలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం నుంచి ఖమ్మంలో జిల్లాలో మొదలయ్యే మంత్రి పర్యటన కూసుమంచి, నేలకొండపల్లి మండలాలతో పాటు ఏదులాపురం మున్సిపాలిటీ, ఖమ్మంలో కొనసాగుతుంది. ఆతర్వాత సాయంత్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మణుగూరు, లక్ష్మిదేవిపల్లి మండలు, కొత్తగూడెం కార్పొరేషన్లలో జరిగే పలు ప్రైవేట్ కార్యక్రమాలకు మంత్రి హాజరవుతారు. సూర్యతండాను సందర్శించిన వైద్యాధికారులురఘునాథపాలెం: మండలంలోని సూర్యతండాకు చెందిన పలువురు చిన్నారులు వాంతులు, విరోచనాలతో అస్వస్థతకు గురైన విషయమై ‘సాక్షి’లో శనివారం కథనం ప్రచురితమైంది. దీంతో స్పందించిన వైద్యాధికారి బాలకృష్ణ, ఏఎన్ఎం రత్నకుమారి, ఆశా కార్యకర్తలతో కలిసి గ్రామానికి వెళ్లి పరిస్థితులపై ఆరా తీ శారు. అస్వస్థతకు గురైన చిన్నారులను పరీక్షించి మాట్లాడారు. ఇద్దరు చిన్నారులు ఇప్పటికే కోలుకోగా, మరో ఇద్దరు ఖమ్మంలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. వర్షాలు కురుస్తున్నందున వేడిచేసి చల్లార్చిన నీరే తాగించా లని, ఆహారం విషయంలోనూ జాగ్రత్తలు పాటించాలని డాక్టర్ బాలకృష్ణ సూచించారు. వాజ్పేయి ఆశయ సాధనకు కృషిఖమ్మం మామిళ్లగూడెం: మాజీ ప్రధాని వాజ్పేయ్ ఆశయ సాధన కోసం ప్రతిఒక్కరు కృషి చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరావు కోరారు. మాజీ ప్రధాని వాజ్పేయి వర్ధంతి సందర్భంగా శనివారం ఖమ్మంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కోటేశ్వరరావు దేశ రాజకీయాలను సన్మార్గంలో నడిపించిన మహానేత వాజ్పేయి అని కొనియాడారు. ఈకార్యక్రమంలో బీజేపీ నాయకులు గెంటేల విద్యాసాగర్, అల్లిక అంజయ్య, వేరేల్లి రాజేష్గుప్త, మేకల నాగేందర్, కుమిలి శ్రీనివాస్, గడిల నరేష్, రామకృష్ణ, యుగంధర్, రుద్రగాని మాధవ్, రవీందర్ తదితరులు పాల్గొన్నారు. ఆస్పత్రికి వెళ్లొచ్చేసరికి చోరీచింతకాని: మండలంలోని వందనం గ్రామానికి షేక్ సైదాబీ ఇంట్లో శనివారం చోరీ జరిగింది. ఆమె ఖమ్మం ఆస్పత్రికి వెళ్లగా.. గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి తాళం పగులగొట్టి ఇంట్లోకి చొరబడ్డారు. ఇంట్లోని సామగ్రిని ధ్వంసం చేయడమే కాక బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. ఖమ్మం నుంచి వచ్చాక చోరీ జరిగినట్లు సైదాబీ గుర్తించగా.. ఆమె కుమారుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై నాగుల్మీరా తెలిపారు. ఏడుబావుల వద్ద జిల్లా యువకుడి గల్లంతుబయ్యారం: మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం ఏడుబావుల వద్ద శనివారం ఓ యువకుడు గల్లంతయ్యాడు. ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం జెన్నారం ఎస్టీ కాలనీకి చెందిన ప్రాపర్తి ప్రేమ్కుమార్ తన బంధువులు, స్నేహితులతో కలిసి ఏడుబావుల జలపాతం చూసేందుకు వచ్చాడు. జలపాతం వద్ద పైన ఉన్న బావులను చూసేందుకు వెళ్తున్న క్రమాన ప్రేమ్ ప్రమాదవశాత్తు జారి బావిలో పడినట్లు తెలుస్తోది. ఆయన సహచరులు ఎంత గాలించినా ప్రేమ్కుమార్ ఆచూకీ లభించలేదు. ఇంతలోనే చీకటి పడడంతో గాలింపు చర్యలకు అంతరాయం ఏర్పడింది. -
అథారిటీతోనే అభివృద్ధి
● ఆశించినస్థాయిలో పురోగతి లేని భద్రాచలం ● శ్రీ సీతారామచంద్రస్వామి వారి భక్తులకు నిత్యం తిప్పలే ● మౌలిక సదుపాయాల కొరతతో స్థానికులకూ తప్పని పాట్లు భద్రాచలం: దక్షిణ అయోధ్యగా పేరుగాంచినా.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించకపోవడంతో భద్రాచలంలో అభివృద్ధి ముందుకు సాగడం లేదు. శ్రీసీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం, పట్టణం కలిపి లేదా విడివిడిగా ప్రత్యేక అథారిటీ ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నా పాలకులు పట్టించుకోవడం లేదు. భద్రాచలం పట్టణానికి దశాబ్దాల చరిత్ర ఉంది. బ్రిటీష్, నైజాంల కాలంలో నదీ రవాణాకు అనుకూలంగా ఉండడం, రామయ్య కొలువై ఉండడంతో క్రమంగా పట్టణం విస్తరించగా.. జనాభా ప్రస్తుతం లక్ష వరకు చేరింది. అయితే అభివృద్ధిలో మాత్రం జీరోగానే ఉంది. మేజర్ గ్రామపంచాయతీగా వార్షికాదాయం ఎక్కువగానే ఉంది. అయినా వర్షాకాలంలో చినుకుపడితే రోడ్లన్నీ జలమయంగా మారుతాయి. అస్తవ్యస్తమైన డ్రెయినేజీ, భవన, రోడ్ల నిర్మాణానికి సరైన ప్రణాళిక లేకపోవడంతో ఇష్టానురీతిగా అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నాయి. ఈక్రమంలో పట్టణాభివృద్ధికి మాస్టర్ప్లాన్ రూపొందించాల్సిన అవసరం ఉంది. మరోవైపు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల విభజనతో భద్రాచలం విస్తీర్ణం తగ్గిపోయింది. ప్రభుత్వ స్థలాలకు కొరత ఏర్పడింది. దీంతో అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు ఒకే చోట సమీకృత భవనం నిర్మించాలని, తద్వారా ఖాళీ స్థలాలను భక్తుల వసతి, ప్రభుత్వ అవసరాలకు వినియోగించాలని పలువురు కోరుతున్నారు. సత్వర అభివృద్ధి కావాలంటే.. భద్రాచలం దేవస్థానం అభివృద్ధి సైతం ముందుకు సాగడం లేదు. రెండేళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్నామని చెబుతున్నా.. అది మాఢ వీధుల విస్తరణ వద్దే ఆగిపోయింది. కొద్ది నెలల క్రితం బడ్జెట్లో యాద్రాద్రి టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీకి రూ.200 కోట్లు, వేములవాడ ఏరియా డెవలప్మెంట్ అథారిటీకి రూ.100 కోట్లను ప్రభుత్వం ప్రకటించింది. కానీ భద్రాచలానికి డెవలప్మెంట్ అఽథారిటీ ఏర్పాటు చేయలేదు. ఈ నేపథ్యంలో ఖమ్మం నగర అభివృద్ధికి స్తంభాద్రి అర్బన్ డెవలప్మెంట్ అథారి టీ ఏర్పాటు చేసిన తరహాలో భద్రాచల పట్టణం, దేవస్థాన అభివృద్ధికి టెంపుల్ అండ్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అథారిటీ ఏర్పాటు పర్యాటకా భిృద్ధికి కూడా దోహం చేస్తుందని చెబుతున్నారు. తగిన సదుపాయాలు కల్పిస్తే ఏజెన్సీలో జలపాతాలు, పాపికొండలకు సందర్శకుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంటుందని పేర్కొంటున్నారు.భద్రాచలం అభివృద్ధిలో నానాటికీ వెనుకబడిపోతోంది. అస్తవ్యస్తమైన డ్రెయినేజీ వ్యవస్థతో వర్షాకాలంలో అందరం ఇబ్బంది పడుతున్నాం. పట్టణాన్ని ప్రస్తుత, భవిష్యత్ అవసరాలకు సరిపడే విధంగా అభివృద్ధి చేయాలి. ఇందుకోసం ప్రభుత్వం టెంపుల్ అండ్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు చేయాలి. –కందుల రాము, స్థానికుడు -
వానొచ్చే.. వరదొచ్చే
ఎగువ జిల్లాల్లో భారీ వర్షానికి తోడు జిల్లాలోనూ శుక్రవారం రాత్రి కురిసిన వర్షంతో వరద పెరిగింది. మున్నేరు, ఆకేరు, వైరా, పాలేరు వాగులు ఉధృతంగా ప్రవహిస్తుండగా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలుచోట్ల లోలెవల్ వంతెనలపైకి వరద చేరడంతో గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. ఈమేరకు అధికారులు వరద పరిస్థితిని తెలుసుకుంటూ ముందస్తు చర్యల్లో నిమగ్నమయ్యారు. – సాక్షి ప్రతినిధి, ఖమ్మం● ఎగువన వర్షాలతో మున్నేరు, ఆకేరుకు భారీగా వరద ● నిండుకుండల్లా పాలేరు, వైరా రిజర్వాయర్లు, చెరువులు ● పలుచోట్ల రోడ్లపైకి నీరు చేరడంతో రాకపోకలకు బ్రేక్ ● మున్నేటి వరదను పరిశీలించిన కలెక్టర్, కమిషనర్ ● ఎగువన భారీ వర్షంతో మున్నేటికి వరద పెరిగింది. శనివారం ఉదయం 7గంటలకు కాల్వొడ్డు ఫ్లడ్ గేజ్ వద్ద 9.5 అడుగులుగా ఉన్న నీటిమట్టం మధ్యాహ్నం12 గంటలకు 12.5, ఒంటి గంటకు 13, సాయంత్రం 4.30గంటల సమయాన 14.5 అడుగులకు, 6గంటలకు సమయాన 15అడుగులకు చేరడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. మహబూబాబాద్ జిల్లాలో భారీ వర్షంతో మున్నేరు, ఆకేరులకు వరద భారీగా చేరుతోంది. దీంతో కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, కేఎంసీ, ఏదులాపురం కమిషనర్లు అభిషేక్అగస్త్య, శ్రీనివాసరెడ్డి ఇరువైపులా పరిశీలించి స్థానికులకు సూచనలు చేశారు. నీటిమట్టం 16అడుగులు దాటితే ప్రభావిత ప్రాంత ప్రజలకు పునరావాస కేంద్రాలకు తరలించాలని సిబ్బందిని ఆదేశించారు. ● కొణిజర్ల మండలం తీగలబంజరవద్ద పగిడేరు ఉధృతంగా ప్రవహించడంతో పల్లిపాడు – ఏన్కూరు రోడ్డులో రాకపోకలు నిలిచిపోయాయి. తల్లాడ మండలం బిల్లుపాడు – రామచంద్రాపురం మధ్య వాగు లోలెవల్ బ్రిడ్జి పైనుంచి ఉధృతంగా ప్రవహించడంతో రామచంద్రాపురం, వెంగన్నపేటకు రాకపోకలు బంద్ అయ్యాయి. మిట్టపల్లి వద్ద గంగదేవిపాడు వాగు పొంగి ప్రవహిస్తోంది. ● కారేపల్లి మండలం పేరుపల్లి వద్ద బుగ్గవాగు ఉధృతితో లోలెవల్ బ్రిడ్జి మునిగింది. దీంతో పేరుపల్లి – మాదారం మధ్య రాకపోకలు నిలిచాయి. ఈ గ్రామాల సమీపాన డబుల్బెడ్ రూం ఇళ్లకు వరద తాకడంతో స్థానికులను పునరావాస కేంద్రాలకు తరలించారు. ● వైరా రిజర్వాయర్ నిండుకుండలా మారడంతో ఐదు అలుగుల ద్వారా వరద బయటకు వెళ్తోంది. ఈ వరద దిగువన వాగులోకి చేరడంతో సాన్నాలలక్ష్మీపురం, సిరిపురం, పుణ్యపురం, గన్నవరం, ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ జిల్లా నెమలి గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. వైరా రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటిమట్టం 18.3 అడుగులు కాగా 20 అడుగులకు చేరింది. ఈ కారణంగా రాజీవ్నగర్కాలనీకి వరద చేరడంతో నిర్వాసితులను పునరావాస కేంద్రానికి పంపించారు. ● మున్నేరు, పాలేరుకు వరద పెరగడంతో అడిషనల్ డీసీపీ ప్రసాదరావు పరిశీలించారు. నీట మునిగిన రోడ్లు, వాగులు దాటకుండా చూడాలని సిబ్బందికి సూచించారు. వరద ఉధృతి ఎక్కువ ఉన్న వాగుల వద్ద పెట్రోలింగ్ ఏర్పాటుచేయాలని తెలిపారు. ● పాలేరు రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటిమట్టం 23 అడుగులు కాగా 23.25 అడుగులు, లంకాసాగర్ 16 అడుగులకు గాను 14.8 అడుగుల మేర వర ద చేరింది. జిల్లాలోని 1,061 చెరువులకు గాను 326 చెరువులు పూర్తిగా నిండి అలుగుపోస్తున్నా యి. 222 చెరువులు 90–100 శాతం, 205 చెరువులు 75–నుంచి 90శాతం వరకు నిండాయి. ● జిల్లాలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం ఉదయం 8–30 గంటల నుంచి శనివారం ఉదయం 8–30 గంటల వరకు వర్షం దంచికొట్టింది. జిల్లా వ్యాప్తంగా సగటున 2.7 సె.మీ. వర్షపాతం నమోదైంది. అత్యధికంగా కొణిజర్లలో 7సెం.మీ, కారేపల్లిలో 6.1, వైరాలో 5.5, కూసుమంచిలో 4.7, కామేపల్లిలో 4.6, ఏన్కూరులో 4.2, రఘునాథపాలెంలో 4.0, ముదిగొండలో 3.3, నేలకొండపల్లిలో 3.2, ఖమ్మంఅర్బన్లో 3 సెం.మీటర్ల వర్షపాతం నమోదైందని అధికారులు వెల్లడించారు. ● మున్నేటికి అంతకంతకూ వరద పెరుగుతున్న కలెక్టర్, సహా అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. హైదరాబాద్ నుంచి అధికారులతో సమీక్షించిన ఆయన వరద ముప్పు, పరీవాహక ప్రాంతాల ప్రజలను అవసరమైతే పునరావాస కేంద్రాలకు తరలించడంపై సూచనలు చేశారు. -
రిటైర్డ్ ఉద్యోగులకు సకాలంలో బెనిఫిట్లు అందించాలి
● సింగరేణి సీఎండీ బలరామ్ ఆదేశం ● సంస్థ ప్రధాన కార్యాలయంలో అధికారులు, నేతలతో సమావేశంసింగరేణి(కొత్తగూడెం): సింగరేణి సంస్థలో పని చేసి రిటైర్డ్ అయిన ఉద్యోగులకు సకాలంలో బెనిఫిట్లు అందించాలని సీఎండీ ఎన్.బలరామ్ సూచించారు. సీఎంపీఎఫ్ రీజియన్ కమిషనర్గా ఇటీవల నియమితులైన వంశీధర్ కుసుంభ శనివారం కొత్తగూడెంలోని సింగరేణి ప్రధాన కార్యాలయంలో సీఎండీని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ ఉద్యోగులు గతంలో ఏమైనా రుణాలు తీసుకుని ఉంటే నెల రోజుల ముందుగానే వాటిని క్లియర్ చేసుకునేలా అవగాహన కల్పించాలని సూచించారు. అంతేకాక కాంట్రాక్ట్ కార్మికులకు సీఎంపీఎఫ్ పుస్తకాలు అప్డేట్ చేయాలని, వారి వివరాలను ఆన్లైన్లో పొందుపరచాలని ఆదేశించారు. అంతకుముందు సంస్థ ప్రధాన కార్యాలయంలో బలరామ్ అధ్యక్షతన సీపీఆర్ఎంఎస్ ట్రస్ట్ బోర్డ్ సమావేశం నిర్వహించారు. గతంలో జరిగిన నాలుగు ట్రస్టీలకు సంబంధించిన పోస్ట్ రిటైర్మెంట్ కాంట్రిబ్యుటరీ మెడికల్ స్కీమ్ – నాన్ ఎగ్జిక్యూటివ్ (సీపీఆర్ఎంఎస్– ఎన్ఈ )లకు సంబందించిన అంశాలపై చర్చించారు. అలాగే. గత ఆర్థిక సంవత్సరం నుంచి ఇప్పటి వరకు మారిన ట్రస్ట్ సభ్యుల స్థానంలో కొత్తవారిని నియమించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈసమావేశంలో డైరెక్టర్(పా) గౌతమ్ పొట్రు, డైరెక్టర్(ఈఅండ్ఎం) సత్యనారాయణ రావు, డైరెక్టర్ (ఆపరేషన్స్) ఎల్.వీ.సూర్యనారాయణరావు, డైరెక్టర్(పీపీ) కె.వెంకటేశ్వర్లు, గుర్తింపు సంఘం అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, తదితరులు పాల్గొన్నారు. -
ప్రజలను అప్రమత్తం చేయండి
పోలీసు కమిషనర్ సునీల్దత్ఖమ్మం క్రైం: మున్నేటిలో వరద ఉధృతి నేపథ్యాన పోలీసు అధికారులు అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు సూచనలు చేయాలని పోలీసు కమిషనర్ సునీల్దత్ ఆదేశించారు. ఖమ్మంలోని కాల్వొడ్డు ప్రాంతంలో శుక్రవారం రాత్రి పర్యటించిన ఆయన ఉద్యోగులకు సూచనలు చేశారు. పోలీస్, రెవెన్యూ, మున్సిపల్, తదితర శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ ఎలాంటి నష్టం జరగకుండా చూడాలని తెలిపారు. అలాగే, చెరువులు, వాగుల ఉధృతి దృష్ట్యా ప్రజలెవరూ రోడ్డు దాటే ప్రయత్నం చేయొద్దని, చేపల వేటకు వెళ్లొద్దని సూచించారు. అత్యవసర సమయాల్లో డయల్ 100 లేదా పోలీస్ కంట్రోల్ రూమ్ నంబర్ 87126 59111, కలెక్టరేట్లోని కంట్రోల్ రూమ్ 1077, 90632 11298 నంబర్లకు సమాచారం ఇవ్వాలని సీపీ తెలిపారు. అదనపు డీసీపీ పరిశీలన ఖమ్మంరూరల్/కూసుమంచి: ఖమ్మం రూరల్ మండలం నాయుడుపేట వద్ద మున్నేటిని, కూసుమంచి మండలంలోని పాలేరు రిజర్వాయర్ను అడిషనల్ డీసీపీ ప్రసాద్రావు శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన ఉద్యోగులకు సూచనలు చేయడంతో ప్రజలను అప్రమత్తం చేసేలా ఆదేశాలు జారీ చేశారు. ఈకార్యక్రమాల్లో ఏసీపీ తిరుపతిరెడ్డి, సీఐలు ముష్క రాజు, సంజీవ్, ఎస్పై నాగరాజు పాల్గొన్నారు. నామినేషన్ల స్వీకరణ షురూపాల్వంచ: టీజీ జెన్కో పరిధిలోని తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ అసిస్టెంట్ ఇంజనీర్స్ అసోసియేషన్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ శనివారం ప్రారంభమైంది. రెండేళ్ల కాలపరిమితితో కూడిన ఈ ఎన్నికలు రాష్ట్రంలోని 25ప్రాంతాల్లో ఈనెల 30న నిర్వహించనుండగా.. 19వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఓట్ల లెక్కింపు కేటీపీఎస్లో సెప్టెంబర్ 2న చేపడతారు. తొలిరోజు కేటీపీఎస్ ఐదో దశకు చెందిన ఏఈ జి.కీర్తి ఫైనాన్స్ సెక్రటరీ పదవికి, 7వ దశకు చెందిన ఏఈ పి.నవీన్ జాయింట్ సెక్రటరీ(థర్మల్) పదవికి నామినేషన్లు దాఖలు చేశారు. -
మత ఫాసిజాన్ని ప్రతిఘటిస్తేనే వ్యవస్థల పరిరక్షణ
ఖమ్మంమయూరిసెంటర్: దేశంలో పెరుగుతున్న మత ఫాసిజానికి వ్యతిరేకంగా పోరాడి లౌకిక వ్యవస్థను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రజలు, ప్రజాస్వామ్యవాదులపై ఉందని రిటైర్డ్ ప్రొఫెసర్ విజయ్కుమార్ పిలుపునిచ్చారు. ఖమ్మంలోని రామనర్సయ్య విజ్ఞాన కేంద్రంలో శనివారం జరి గిన నాస్తిక సమాజ, అధ్యయన తరగతుల్లో ఆయన మాట్లాడారు. కమ్యూనిస్టులు దేశ పరిస్థితినే కాక ప్రపంచ పరిస్థితులను అధ్యయనం చేస్తూ పోరాట పంథా రూపొందించుకోవాలని సూచించారు. భావ మే ప్రధానంగా భావించిన వారు భావవాదులుగా, పదార్థమే ప్రధానంగా భావించిన వారు భౌతిక వాదులుగా విభజించబడ్డారని చెప్పారు. అయితే, భౌతికవాదమే అన్ని సమస్యలకు పరిష్కారాన్ని చూపించనుండగా, భావవాదం సమస్యల్ని ఇంకా పెంచుతుందని తెలిపారు. దీన్ని గుర్తించిన పాలకవర్గం ప్రజలను మత్తులో ఉంచడానికి మతం, దేవుళ్లను వాడుకుంటోందని వెల్లడించారు. ఈ విషయాన్ని గమనించి ఎవరికివారు తమను తాము ప్రశ్నించుకుంటే విజ్ఞానం వెల్లివిరుస్తుందని విజయ్కుమార్ తెలిపారు. అనంతరం ‘శాసీ్త్రయ దృక్పథం’ అంశంపై సీహెచ్.రమేష్, ‘వాస్తవాల ఆధారంగా జీవించడం ఎలా?’ అన్న అంశంపై బీ.వీ.రాఘవులు మాట్లాడారు. సామాజిక సంబంధమైన విషయాల్లో సత్యాలను బోధించే ఏకై క శాస్త్రం మార్క్సిజం అని పేర్కొన్నారు. ఈ తరగతులకు ఆవుల అశోక్, ప్రీతం అధ్యక్ష వర్గంగా వ్యవహరించగా కన్నెబోయిన అంజయ్య, కోటేశ్వరరావు, చార్వాక, సుధాకర్, క్రాంతి, స్టాలిన్, ఝాన్సీ, శోభ తదితరులు పాల్గొన్నారు. నాస్తిక సమాజ అధ్యయన తరగతుల్లో వక్తలు -
ఖమ్మం జిల్లాలో నీలి పుట్టగొడుగులు
ఖమ్మం వ్యవసాయం: ఖమ్మం జిల్లాలోని పులిగుండాల అటవీ ప్రాంతంలో అరుదైన నీలి పుట్టగొడుగులను అటవీ శాఖ అధికారులు గుర్తించారు. వీటిని ‘బ్లూ పిన్కిగిల్ మశ్రూమ్ ఎంటొలోమా హోచెస్టెటెరి’జాతికి చెందిన పుట్టగొడుగులుగా నిర్ధారించారు. గతంలో ఆదిలాబాద్ జిల్లాలోని కాగజ్నగర్ అటవీ విభాగంలో ఈ జాతి పుట్టగొడుగును గుర్తించగా, ఇప్పుడు ఖమ్మం జిల్లాలో కనిపించాయి. ఈ నీలిరంగు పుట్టగొడుగులకు పలు ప్రత్యేకతలు ఉన్నాయి. ఇది ఆకర్షణీయంగా ఆకాశ నీలిరంగులో ఉంటుంది. దీంతో దీన్ని స్కై బ్లూ మశ్రూమ్ అని అంటారు.న్యూజిలాండ్కు చెందిన ఈ జాతి మనదేశంలో అరుదుగా కనిపిస్తోంది. ఎంటొలోమా జాతికి చెందిన ఈ పుట్టగొడుగులు విషపూరితమని అటవీ అధికారులు భావిస్తున్నారు. దీంతో వీటిని ఆహారంగా వినియోగించవచ్చా.. లేదా అన్న అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. కాగా, పులిగుండాల అటవీ ప్రాంతంలో ఈ పుట్ట గొడుగు కనిపించడంతో ఖమ్మం అటవీ ప్రాంతంలో జీవవైవిధ్యం ప్రత్యేకతను సంతరించుకుంది.అధ్యయనానికి చర్యలుఖమ్మం అడవుల్లో అరుదైన పుట్టగొడుగు జాతి దర్శనమిచ్చింది. ఇది ఇక్కడి పర్యావ రణ ప్రాధాన్యతను మరింతగా బలపరు స్తోంది. జీవవైవిధ్యం రక్షణలో ఇది ఒక ముఖ్యమైన అడుగు. అయితే, ప్రజలు అడ వుల్లో తెలియని పుట్టగొడుగులను తాకొద్దు, తినొద్దు. ఎందుకంటే ఇవి విషపూరితమై ఉండొచ్చు. అందువల్ల ఈ జాతిపై మరింతగా అధ్యయనం చేయనున్నాం. –సిద్ధార్థ్ విక్రమ్ సింగ్, ఖమ్మం జిల్లా అటవీ అధికారి -
రాత్రయితే.. రచ్చరచ్చ
● జిల్లాలోని పలు ప్రాంతాల్లో రౌడీమూకల ఆగడాలు ● ఓ పక్క చోరీలు, ఇంకోపక్క అల్లర్లతో జనం ఆందోళన ● పోలీసులు పెట్రోలింగ్ పెంచాలని వినతులుఖమ్మంక్రైం: జిల్లావ్యాప్తంగా కొంతకాలంగా అల్లరిమూకలు శక్తులు పేట్రేగిపోతున్నాయి. ఓ పక్క చోరీలు సర్వసాధారణం కాగా.. రౌడీమూకలు, గంజాయి సేవిస్తూ అల్లర్లకు పాల్పడుతున్న వారి కారణంగా జనం బెంబేలెత్తిపోతున్నారు. రాత్రయితే చాలు గంజాయి సేవించి ఆ మత్తులో 24గంటల తెరిచే ఉండే బెల్ట్షాప్లకు వస్తున్న వారు చేసే గొడవలు ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. పోలీసు పెట్రోలింగ్ నామమాత్రంగా సాగుతుండడంతో ఈ పరిస్థితి ఎదురవుతోందని పలువురు విమర్శిస్తున్నారు. దొంగల విజృంభణ ఇటీవల జరుగుతున్న చోరీలకు ప్రజలు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో పాత నేరస్తులే కాక ఇతర ప్రాంతాలకు నుంచి ముఠాలు వచ్చినట్లు తెలుస్తుండగా.. తాళం వేసిన ఇళ్లే టార్గెట్గా రాత్రింబవళ్లు దోచుకోంటున్నారు. ఖమ్మం శివారు గొల్లగూడెం, మధురానగర్ ప్రాంతాలో ఇటీవల ముసుగు ధరించిన వ్యక్తులు తిరుగుతున్న సీసీ పుటేజీలు వైరల్గా మారాయి. అలాగే, సత్తుపల్లిలోని సింగరేణి క్వార్టర్స్లో దొంగలు చొరబడ్డారు. గతంలోనూ క్వార్టర్స్లో చోరీ జరిగినా పోలీస్ నిఘా ఏర్పాటు చేయకపోవడంతో ఈ పరిస్థితి ఎదురైందని చెబుతున్నారు. పలు ప్రాంతాల్లో రెక్కీ చేసి మరీ చోరీలకు పాల్పడే ముఠాల సంచారంపైనా పోలీసు నిఘా లేదని తెలుస్తోంది. నడిరోడ్డుపై గొడవలు జిల్లా కేంద్రంతో పాటు ఇతర పట్టణాలలో అసాంఘిక శక్తులు మద్యం, గంజాయి మత్తులో ఇష్టారీతిగా ప్రవర్తిస్తున్నారు. నడిరోడ్డుపై బైఠాయించి వాహనాలను ఆపుతూ తమనెవరూ ఏమీ చేయలేరని, తమ వెనుక నాయకులు ఉన్నారంటూ ప్రజలను బెదిరిస్తున్నారు. గంజాయితోపాటు మద్యం మత్తులో ఉన్న వీరిని ఏమీ చేయలేక స్థానికులు వణికిపోతున్నారు. గత మంగళవారం రాత్రి గోపాలపురం ప్రధాన రహదారిపై వైఎస్సాఆర్ నగర్కు చెందిన కొందరు ఆకతాయిలు గంజాయి, మద్యం మత్తులో నానా బీభత్సం సృష్టించారు. ఆ సమయంలో పోలీసు సిబ్బంది వచ్చినా తమనెవరూ ఏమీ చేయలేరని, అధికార పార్టీ నాయకులు తమకు ఉన్నారని గట్టిగా కేకలు వేయడం గమనార్హం. అయితే వైఎస్సార్ నగర్ ప్రాంతంలో చాలా కాలంగా ఆకతాయిలు ఆగడాలు పెచ్చుమీరినట్లు తాము ఫిర్యాదు చేస్తే పోలీసులు మొక్కుబడిగా మందలించి వదిలేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. పోలీసు నిఘా ఎక్కడ? కమిషనరేట్ పరిధిలో కొంతకాలంగా పోలీస్ తగ్గిందని తెలుస్తోంది. అర్ధరాత్రి వేళ ఆకతాయిలు పుట్టిన రోజు, ఇతర వేడుకలను రోడ్లుపైనే నిర్వహిస్తున్నా పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. ఖమ్మంతోపాటు సత్తుపల్లి, మధిర, వైరా ఇతర పట్టణాల శివార్లలో తెల్లవారు మద్యం సేవిస్తూ దాబాల వద్ద సైతం వీరంగం చేస్తున్నారని సమాచారం. ఇదంతా పోలీసుల దృష్టిలో ఉన్నా పట్టనట్లు వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది. ఇకనైనా పోలీసులు నిఘా పెంచి పెట్రోలింగ్ ముమ్మరం చేయాలని ప్రజలు కోరుతున్నారు. -
ప్రభుత్వాస్పత్రిలో ఐటీడీఏ పీవో సతీమణి ప్రసవం
భద్రాచలం టౌన్: భద్రాచలం ఐటీడీఏ పీవో రాహుల్ తన సతీమణి మనీషా కు భద్రా చలం ఏరియా ఆస్పత్రిలో ప్రసవం చేయించారు. ఈమేరకు ఆమె శుక్రవారం ఉదయం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ప్రభుత్వ ఆస్పత్రు ల్లో మెరుగైన వైద్యం అందుతోందని ప్రజలకు భరోసా కల్పించేందుకు.. గతంలో భద్రాద్రి కలెక్టర్గా పనిచేసిన అనుదీప్, ప్రస్తుత కలెక్టర్ జితేష్ వి.పాటిల్ తమ సతీ మణులకు ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే ప్రసవం చేయించడం తెలిసిందే. స్వాతంత్య్ర దినోత్స వం రోజు బిడ్డకు జన్మనిచ్చిన రాహుల్ దంపతులకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు. ఏరియా ఆస్పత్రి వైద్యులు రామకృష్ణ, విజయ్ బృందం ఆధ్వర్యంలో మనీషాకు ప్రసవం చేశారు. -
ఆర్మీ జవాన్ కుటుంబానికి అండగా నిలుస్తాం..
కారేపల్లి: కాశ్మీర్ లోయలో జరిగిన ప్రమాదంలో మృతి చెందిన ఆర్మీ జవాన్ అనిల్కుమార్ కుటుంబానికి అండగా నిలుస్తామని ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి తెలిపారు. కారేపల్లి మండలం సూర్యతండాలో అనిల్ కుటుంబాన్ని వైరా ఎమ్మెల్యే మాలోతు రాందాస్నాయక్తో కలిసి శుక్రవారం ఆయన పరామర్శించి మాట్లాడారు. ప్రభుత్వ పరంగా అన్ని ప్రయోజనాలు త్వరగా అందేలా చూస్తామని ఎంపీ తెలిపారు. కాగా, అనిల్ సతీమణి రేణుక బీటెక్ పూర్తిచేయగా ఎనిమిది నెలల కుమారుడు ఉన్నందున ఆదుకోవాలని స్థానికులు కోరారు. రైల్వేస్టేషన్ అభివృద్ధికి కృషి కారేపల్లి రైల్వేస్టేషన్లో వసతులు కల్పించడమే కాక అవసరమైన రైళ్ల హాల్టింగ్ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని ఎంపీ రఘురాంరెడ్డి తెలిపారు. స్టేషన్ను శుక్రవారం ఆయన పరిశీలించగా కరోనాకు ముందు నడిచిన రైళ్ల పునరుద్ధరణ, ప్యాసింజర్ రైళ్ల హాల్టింగ్పై స్థానికులు విన్నవించారు. దీంతో ఎంపీ సానుకూలంగా స్పందించారు. మార్క్ఫెడ్ మాజీ వైస్చైర్మన్ బొర్రా రాజశేఖర్, నాయకులు పగడాల మంజుల, తలారి చంద్రప్రకాశ్, అడ్డగోడ ఐలయ్య, సురేందర్ మణియార్, ఇమ్మడి తిరుపతిరావు, మేదరి టోనీవీరప్రతాప్, బానోతు పద్మావతి, మాలోతు ఈశ్వరీనందరాజ్, హేమలత, మల్లేల నాగేశ్వరరావు, వినోద్, సురేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఖమ్మం ఎంపీ రఘురాంరెడ్డి -
52మంది కమీషన్దారులకు లైసెన్సులు
ఖమ్మంవ్యవసాయం: ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో కొత్తగా 52 మంది కమీషన్దారులకు శుక్రవారం లైసెన్సులు అందజేశారు. ఉమ్మడిగా వ్యాపారాలు చేసేవారు, వారసత్వంగా వ్యాపారం చేస్తున్న వారి వినతితో కొత్త లైసెన్సులు జారీ చేశారు. ఈమేరకు మార్కెట్ చైర్మన్, వైస్చైర్మన్లు యరగర్ల హన్మంతరావు, తల్లాడ రమేష్, ఉన్నత శ్రేణి కార్యదర్శి పి.ప్రవీణ్కుమార్ వారికి లైసెన్సులు అందజేశారు. వ్యాపార వర్గాల ప్రతినిధులు దిరిశాల వెంకటేశ్వరరావు, ముత్యం ఉప్పల్రావు పాల్గొన్నారు. ఏఐఎఫ్టీఓ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ప్రసాద్సత్తుపల్లి: అఖిలభారత ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య(ఏఐఎఫ్టీఓ) రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా సత్తుపల్లికి చెందిన చిత్తలూరి ప్రసాద్ నియమితులయ్యారు. ఈమేరకు సంఘం ప్రధాన కార్యదర్శి సీఎల్.రోజ్ నియామకాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పింగళి శ్రీపాల్రెడ్డి సమక్షాన ఆయనకు పీఆర్టీయూ టీఎస్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గుండు లక్ష్మణ్, పుల్లం దామోదర్రెడ్డి ఉత్తర్వులు అందించారు. సహకార సంఘాల పదవీకాలం పెంపుపై హర్షంఖమ్మంవ్యవసాయం: పీఏసీఎస్లు, డీసీసీబీ పాలకవర్గాల పదవీ కాలాన్ని ప్రభుత్వం ఆరు నెలలు పొడిగించడంపై ఆయా సంఘాల ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. ఈమేరకు ఖమ్మం డీసీసీబీ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం చైర్మన్ దొండపాటి వెంకటేశ్వరరావు ఆధ్వర్యాన సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు డైరెక్టర్లు పాల్గొన్నారు. -
ఆశయ సాధనకు పునరంకితం
ఖమ్మం సహకారనగర్: స్వాతంత్య్ర సమరయోధుల ఆశయ సాధనకు ప్రతిఒక్కరూ పునరంకితం కావాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆకాంక్షించారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా క్యాంపు కార్యాలయంతో పాటు జిల్లా పరిషత్ కార్యాలయంలో ఆయన జాతీయ పతాకాలు ఆవిష్కరించి మాట్లాడారు. వీరుల త్యాగాలతో స్వాతంత్య్రం వచ్చినందున సమరయోధులను స్మరించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ దీక్షారైనా, డిప్యూటీ సీఈఓ నాగపద్మజ, పీఆర్ ఎస్ఈ వెంకటరెడ్డి, డీఈ మహేష్బాబు, ఉద్యోగులు పాల్గొన్నారు. సమస్యల పరిష్కారమే పరమావధి ప్రజా సమస్యల పరిష్కారమే పరమావధిగా అధికారులు కలిసికట్టుగా పని చేయాలని అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ సూచించారు. కలెక్టరేట్లో ఆమె జాతీయ జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి కార్యక్రమాల్లో జిల్లాను ముందు వరుసలో నిలిపిన అధికారులు ఇదే స్ఫూర్తి కొనసాగించాలని తెలిపారు. అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి ఏ.పద్మశ్రీ, వివిధ శాఖల అధికారులు, కలెక్టరేట్ ఏఓ కె.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. స్వాతంత్య్ర దినోత్సవంలో కలెక్టర్ అనుదీప్ -
ఇరువర్గాల ఘర్షణ.. ఇద్దరికి గాయాలు
తిరుమలాయపాలెం: మండలంలోని కాకరవాయిలో శుక్రవారం దుర్గమ్మ జాతర సందర్భంగా ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. గ్రామంలో దుర్గమ్మ జాతర జరుగుతుండగా గ్రామపంచాయతీ సమీపాన ఓ బెల్ట్షాపులో రెండు వర్గాల మధ్య మాటామాటా పెరిగింది. దీంతో జరిగిన గొడవలో వేణు అనే యువకుడికి గాయాలు కాగా ఆయనకు చికిత్స చేయిస్తుండగా మరికొందరు మద్యం సీసాలతో వచ్చి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో మధుకు గాయాలయ్యాయి. రజకులు, దళితుల మధ్య ఘర్షణ ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగప్రవేశం చేసి అదుపు చేశారు. గాయపడిన ఇద్దరి నుంచి ఫిర్యాదు అందిందని ఎస్ఐ జగదీష్ తెలిపారు. సూర్యతండాలో చిన్నారులకు అస్వస్థతరఘునాథపాలెం: రఘునాథపాలెం మండలంలోని సూర్యతండాలో పది రోజులుగా పలువురు చిన్నారులు అస్వస్థతకు గురవుతున్నారు. ఉన్నట్టుండి వరుసగా వాంతులు, విరోచనాల బారిన పడుతుండడంతో తల్లిదండ్రులు చికిత్స చేయిస్తున్నారు. ఒకే కుటుంబానికి చెందిన అన్నాచెల్లెలు జాటోత్ జయంత్, పవన్శ్రీ ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యం పొందుతున్నారు. కాగా, గ్రామంలో పలువురు చిన్నారులు అస్వస్థతకు గురవడానికి తాగునీరు కలుషితమా లేక వాతావరణ మార్పులు కారణమా అన్నది తెలియడం లేదు. వైద్యాధికారులు స్పందించి తగుచర్యలు తీసుకోవాలని సూర్యతండా వాసులు కోరుతున్నారు. 15 ఆర్కేఎం 303 – ప్రధాన సెంటర్లో ఘర్షణకు పాల్పడుతున్న ఇరువర్గాలు -
గుంతను తప్పించబోయి కారు బోల్తా
కొణిజర్ల: రహదారిపై గుంతను తప్పించే కారు బోల్తా పడిన ఘట న కొణిజర్ల మండలం తీగలబంజర సమీపాన శుక్రవారం ఉద యం జరిగింది. హైదరాబాద్ నుంచి భద్రాచలానికి ఇద్దరు కారులో వెళ్తుండగా తీగలబంజర సమీ పాన రోడ్డుపై భారీ గుంతను తప్పించే క్రమంలో పక్కకు తిప్పగా అదుపు తప్పి చెట్లలోకి దూసుకెళ్లి బోల్తా పడింది. కారులో ఉన్న ఇద్దరు క్షేమంగా బయటపడగా, జేసీబీ సాయంతో స్థానికులు కారును బయటకు తీశారు. అడవి పంది మాంసం స్వాధీనంసత్తుపల్లిరూరల్: అడవి పందిని వేటాడి మాంసం పంచుకుంటుండగా అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మండలంలోని యాతాలకుంట గ్రామానికి చెందిన నాగరాజు, నాగార్జున, రామకృష్ణ చేనులో అడవి పందిని కుక్కలు వేటాడడంతో చనిపోయింది. సుమారు ఎనిమిది నెలల వయస్సు ఉన్న అడవి పందిని శుక్రవారం ఇంటికి తీసుకొచ్చిన వారు పోగులు వేస్తున్నారు. ఈ విషయమై అందిన సమాచారంతో ఎఫ్ఎస్ఓ నాగరాజు, బీట్ ఆఫీసర్ కిరణ్ తనిఖీలు చేపట్టి మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. అలాగే, నిందితులపై వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం కేసు నమోదు చేసినట్లు అటవీ అధికారులు తెలిపారు. -
ఆంజనేయస్వామికి రూ.1.63లక్షల విలువైన ఆభరణాలు
ఎర్రుపాలెం: మండలంలోని బనిగండ్లపాడుకు చెందిన ఎన్ఆర్ఐ కర్నాటి శంకర్రెడ్డి–కరుణ దంపతులు అంజనాద్రిపై కొలువైన శ్రీఆంజనేయ స్వామి ఆలయానికి రూ.1.63 లక్షల విలువైన వెండి అభయహస్తం, పాదుకలు సమర్పించారు. వీటిని అర్చకులు వేదాంతం రాధాకృష్ణమాచారికి శుక్రవారం అందచేశాక స్వామిని దర్శించుకుని పూజలు చేశారు. మాజీ సర్పంచ్ జంగా పుల్లారెడ్డి, సొసైటీ చైర్మన్ శీలం అక్కిరెడ్డి, మార్కెట్ డైరెక్టర్ యన్నం పిచ్చిరెడ్డితో పాటు కోనా సత్యనారాయణ గుప్తా, యరమల నర్సింహారెడ్డి, రామ్మోహన్రెడ్డి, జంగా గురునాథరెడ్డి, వేమిరెడ్డి వెంకటరెడ్డి, వేమిరెడ్డి రామిరెడ్డి, వెదురు కృష్ణారెడ్డి, కొండారెడ్డి, నాగిరెడ్డి, శివ నాగరాజు, పత్తి సుబ్బారావు, సాంబయ్య, పండు పాల్గొన్నారు. ●చింతకాని: చింతకాని మండలం నాగులవంచలోని శ్రీ కోదండ రామాలయానికి యల్లంపల్లి చిన్న అప్పారావు, ప్రమీల దంపతులు రూ.లక్ష విలువైన వెండి కిరీటాన్ని అందజేశారు. ఆలయ కమిటీ చైర్మన్ నారగాని శ్రీనివాసరావుతో పాటు వెచ్చా మంగపతిరావు, అంబటి వెంకటేశ్వర్లు, ఆలస్యం బస్వయ్య, మద్దినేని వెంకటేశ్వరరావు, అంబటి శాంతయ్య, ముత్తినేని వెంకటేశ్వర్లు, తన్నీరు నర్సింహారావు, కోలేటి పెద్ద బ్రహ్మం, పరిటాల శ్రీను, అర్చకుడు యోగేంద్రాచార్యులు పాల్గొన్నారు. -
బంగారు భవిష్యత్..
సోలార్ విద్యుత్ ఉత్పత్తి ఇందిరా మహిళాశక్తి పథకం ద్వారా ఎర్రుపాలెం మండలం రాజులపాలెం, కల్లూరు మండలంలోని చిన్నకోరుకోండిలో 2 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నాం. ఇందిరా సౌరగిరి జలవికాసం ద్వారా జిల్లాలో 550మందికి సోలార్ పంపు సెట్లు సరఫరా చేస్తాం. ఈ పథకం ద్వారా రానున్న మూడేళ్లలో జిల్లాలోని 11,785 మంది రైతులకు చెందిన 27,447 ఎకరాలను అభివృద్ధి చేస్తాం. మోడల్ సోలార్ విలేజ్ స్కీంకు బోనకల్ మండలంలోని 22 గ్రామాలను ఎంపిక చేశాం. అలాగే, మహిళా మార్ట్, 64 సీ్త్ర టీ స్టాళ్లు ఏర్పాటు చేయించాం. ఇసుక రీచ్ల నిర్వహణ మహిళా సంఘాలకే అప్పగించాం. ఇందిరా మహిళా డెయిరీ ద్వారా 80 శాతం సబ్సిడీతో 40 వేల గేదెలు పంపిణీ చేస్తాం. ఏడాదిలోగా జవహర్ ఎత్తిపోతలు మధిర, ఎర్రుపాలెం మండలాల్లో సాగర్ ఆయకట్టుకు సాగునీరు అందించేలా రూ.630 కోట్లతో చేపట్టిన జవహర్ ఎత్తిపోతల పథకాన్ని ఏడాదిలోగా పూర్తిచేసి 33 వేల ఎకరాల ఆయకట్టును స్థిరీకరి స్తాం. సీతారామ ఎత్తిపోతల పథకం ద్వారా ఉమ్మడి జిల్లాలో 3,28,853 ఎకరాల్లో కొత్త ఆయకట్టుకు సాగునీటి వసతి కల్పిస్తాం. రఘునాథపాలెం మండలంలో మంచుకొండ ఎత్తిపోతల పథకం పూర్తయితే 455 ఎకరాల కొత్త ఆయకట్టు, 1,957 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుంది. ఆధునిక వైద్యం జిల్లా ఆస్పత్రిలో అత్యాధునిక పరికరాలు సమకూర్చడంతో గత ఏడాది 15,040 శస్త్ర చికిత్సలు, 6,658 ప్రసవాలు జరిగాయి. పాలేరు, సత్తుపల్లిలో రూ.25 కోట్ల చొప్పున వ్యయంతో ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలు, వైరాలో రూ.37.50 కోట్లతో 100 పడకల ఆస్పత్రి, జిల్లా ఆస్పపత్రిలో రూ. 23.50 కోట్లతో 50 పడకల క్రిటికల్ కేర్ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. బాలల సదనంలోని 81 మంది పిల్లలకు కలెక్టర్ ప్రత్యేక చొరవతో ఆరోగ్యశ్రీ కార్డులు, ఆధార్ కార్డులు అందాయి. పర్యాటకంపై ప్రత్యేక శ్రద్ధ వెలుగుమట్ల అర్బన్ పార్క్ వద్ద రహదారిని అభివృద్ధి చేశాం. జమలాపురం వేంకటేశ్వర స్వామి ఆలయం వద్ద అటవీ పార్క్, కాటేజీ అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఖమ్మం ఖిలా రోప్వే నిర్మాణ పనులు మొదలుకానున్నాయి. పాలేరు వద్ద పర్యాటకాభివృద్ధికి రూ.16.75 కోట్లకు గాను రూ.5 కోట్లు, నేలకొండపల్లి బౌద్ధస్తూపాల అభివృద్ధి, వసతుల కల్పనకు రూ.5.82 కోట్లలో రూ.2.50కోట్లు, మధిర పెద్ద చెరువు అభివృద్ధికి రూ.10 కోట్లకు రూ.6 కోట్లు మంజూరయ్యాయి. పెనుబల్లి మండలం పులిగుండాల ప్రాజెక్టు, కనకగిరి గుట్టలను ఎకో టూరిజం కింద అభివృద్ధి చేస్తున్నాం.నృత్యం చేస్తున్న చిన్నారి -
పక్కాగా నిధుల వ్యయం
● జూనియర్ కాలేజీలకు రూ.2.96 కోట్లు ● పనుల పర్యవేక్షణకు ‘అమ్మ ఆదర్శ కమిటీలు’నేలకొండపల్లి: ప్రభుత్వ పాఠశాలల్లో జరుగుతున్న అభివృద్ధి పనుల పర్యవేక్షణకు కొన్నాళ్ల క్రితం అమ్మ ఆదర్శ కమిటీలను నియమించారు. ఇదే తరహాలో జూనియర్ కాలేజీలకు సైతం కమిటీలను నియమించి పనుల పర్యవేక్షణ అప్పగించారు. దీంతో ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చేపట్టే పనులు నాణ్యతగా జరగడమే కాక నిధులు లెక్క పక్కాగా ఉంటుందని భావిస్తున్నారు. వసతుల కల్పన పరిశీలన జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో మౌలిక వసతులు కల్పనకు ప్రభుత్వం ఇటీవల నిధులు మంజూరు చేసింది. ఈ నిధులతో చేపట్టే పనులు నాణ్యతగా జరిగేలా అమ్మ ఆదర్శ కమిటీలను ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు ప్రాథమిక, ఉన్నత పాఠశాలలో ఈ కమిటీలు ఉండగా జూనియర్ కాలేజీల్లోనూ అమల్లోకి వచ్చాయి. కాలేజీ ఉన్న ప్రాంత సీ్త్ర శక్తి మహిళా సంఘాల సభ్యులే కాక విద్యార్థుల తల్లిదండ్రులతో ఈ కమిటీలు నియమిస్తున్నారు. మరుగుదొడ్ల నిర్మాణం, తాగునీరు, విద్యుత్ సౌకర్యం కల్పించడమేకాక ఫ్యాన్లు, ల్యాబ్ పరికరాల కొనుగోలు, మరమ్మతు వంటి అత్యవసర పనులను ఈ కమిటీల పర్యవేక్షణలో చేపట్టాల్సి ఉంటుంది. అలాగే, విద్యార్థులంతా హాజరయ్యే అధ్యాపకులకు ఈ కమిటీల సభ్యులు సహకరిస్తారు. 15 కాలేజీలకు రూ.2.96 కోటుల జిల్లాలో 21ప్రభుత్వ జూనియర్ కాలేజీలు ఉన్నాయి. ఇందులో 15 కాలేజీలకు రూ.2.96 కోట్ల నిధులు మంజూరయ్యాయి. ప్రతీ కాలేజీకి కనీసం రూ.18 లక్షల నుంచి రూ.30 లక్షలు కేటాయించారు. జిల్లాలోని సత్తుపల్లి, పెనుబల్లి, కల్లూరు, ఏన్కూరు, వైరా, బనిగండ్లపాడు, కారేపల్లి, కామేపల్లి, పిండిప్రోలు, ముదిగొండ, నయాబజార్, ఖమ్మం బాలికల కాలేజీ, శాంతినగర్, నాగులవంచ, బోనకల్ కళాశాలలకు ఈ నిధులు మంజూరయ్యాయి. ఈ నిధులో చేపట్టే పనులను మండల స్థాయిలో ఎంపీడీఓలు, మున్సిపల్ స్థాయిలో రిసోర్స్ పర్సన్లు పర్యవేక్షిస్తుండగా అదనంగా అమ్మ ఆదర్శ కమిటీలను సైతం నియమించారు. కేటాయించిన నిధుల్లో ఇప్పటికే 25 శాతం మేర విడుదల కాగా.. రెండు నెలల్లో పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు.జిల్లాలోని ప్రభుత్వ కాలేజీలకు మంజూరైన నిధులతో చేపట్టే పనులు నాణ్యతగానే కాగా త్వరగా పూర్తయ్యేలా పర్యవేక్షిస్తున్నాం. రెండు నెలల్లో పనులన్నీ పూర్తిచేయాలనేది లక్ష్యం. తద్వారా కళాశాలల్లో సౌకర్యాలు మెరుగుపడనున్నాయి. నిర్వహణ బాధ్యతలను అమ్మ ఆదర్శ కమిటీలు చూస్తాయి. – కె.రవిబాబు, జిల్లా ఇంటర్ విద్యాశాఖాధికారి -
‘సంకల్ప’ బలానికి సన్మానం
ఖమ్మంమయూరిసెంటర్: ఆర్టీసీ ఖమ్మం డిపోలో కండక్టర్ ఉద్యోగం చేస్తూనే సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా తలసేమియా చిన్నారులకు సేవలందిస్తున్న అప్పికట్ల(ప్రొద్దటూరి) అనితను సంస్థ ఎండీ వీ.సీ.సజ్జనార్ సత్కరించారు. హైదరాబాద్లోని బస్భవన్లో శుక్రవారం స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఉద్యోగులను సత్కరించి ప్రశంసాపత్రాలు అందజేశారు. అందులో భాగంగా అనిత, ఆమె భర్త ప్రొద్దుటూరి రవిచంద్ర, వారి కుమార్తెలను ఎండీ సత్కరించి అభినందించారు. అనిత చేస్తున్న సేవా కార్యక్రమాలకు సంస్థ అండగా ఉంటుందని, వారికి కావాల్సిన సహకారం అందిస్తామని సజ్జనార్ తెలిపారు. కాగా, సన్మానం అందుకున్న అనితను ఖమ్మం ఆర్ఎం ఏ.సరిరామ్, డిపో మేనేజర్ దినేష్కుమార్, అధికారులు, ఉద్యోగులు అభినందించగా.. తన సేవలకు గుర్తింపు ఇవ్వడంపై యాజమాన్యం, ఎండీ సజ్జనార్, ఆర్ఎంకు అనిత కతృజ్ఞతలు తెలిపారు.మున్నేటిని పరిశీలించిన మంత్రి తుమ్మల ఖమ్మంఅర్బన్: ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద చేరుతుండడంతో మున్నేటి ప్రవాహం పెరుగుతున్న నేపథ్యాన పరిస్థితులపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆరా తీశారు. ఖమ్మంలో మున్నేటిని శుక్రవారం పరిశీలించిన ఆయన గత అనుభవాల దృష్ట్యా అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వరద ఉధృతమైతే లోతట్టు ప్రాంతాలను పునరావాస కేంద్రాలకు తరలించాలని మంత్రి తెలిపారు. మున్నేటి నీటిమట్టం 10.30 అడుగులు ఖమ్మంఅర్బన్: జిల్లాలో శుక్రవారం పెద్దగా వర్షం లేకున్నా ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదతో మున్నేరు ఉధృతంగా ప్రవహిస్తోంది. శుక్రవారం ఉదయం 6గంటలకు 11.30 అడుగులుగా ఉన్న నీటిమట్టం సాయంత్రం 5గంటలకు 10.30 అడుగులకు పడిపోయింది. అయితే, జిల్లాలో శుక్రవారం రాత్రి వర్షం కురవగా.. బయ్యారం చెరువు, కొత్తగూడ, గార్ల, పాకాల తదితర ప్రాంతాల నుంచి వరద వచ్చి చేరుతోంది. దీంతో శనివారం ఉదయంకల్లా మున్నేరులో నీటిమట్టం కాస్త పెరిగే అవకాశం ఉందని జలవనరుల శాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు. -
ఉమ్మడి జిల్లాకు 2,638 మెట్రిక్ టన్నుల యూరియా
చింతకాని: ఆర్ఎఫ్సీఎల్ కంపెనీ నుంచి జిల్లాకు 2,638.44 టన్నుల యూరియా సరఫరా అయింది. చింతకాని మండలం పందిళ్లపల్లి రేక్ పాయింట్కు శుక్రవారం చేరిన యూరియాను ఏఓ(టెక్నికల్) పవన్కుమార్ పరిశీలించి జిల్లాల వారీగా కేటాయించారు. ఖమ్మం జిల్లాకు 1,538.44 మెట్రిక్ టన్నులు, భద్రాద్రి జిల్లాకు వెయ్యి టన్నులు కేటాయించగా వంద మెట్రిక్ టన్నుల యూరియాను బఫర్ స్టాక్గా నిల్వ చేసినట్లు ఏఓ తెలిపారు. జిల్లాకు సరిపడా యూరియా చేరినందున రైతులెవరూ ఆందోళన చెందొద్దని ఆయన సూచించారు. ప్రవేశాలకు సెప్టెంబర్ 10వరకు గడువు ఖమ్మం సహకారనగర్: కాకతీయ యూనివర్సిటీ పరిధి సెంటర్ ఫర్ డిస్టెన్స్ అండ్ ఆన్లైన్ ఎడ్యుకేషన్(గతంలో ఎస్డీఎల్సీఈ)లో డిగ్రీ, పీజీ, డిప్లొమా కోర్సులో ప్రవేశానికి సెప్టెంబర్ 10వ తేదీ వరకు గడువు పొడిగించారు. ఈ విషయాన్ని ఖమ్మంలోని యూనివర్సిటీ పీజీ కళాశాల అధ్యయన కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ గోపి తెలిపారు. ప్రవేశాలకు ఆసక్తి ఉన్నవారు ఆన్లైన్, ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించారు. ఫీజు, అర్హతలు వివరాల కోసం అధ్యయన కేంద్రం సెల్ నంబర్ 80088 11998 లేదా కేయూ దూరవిద్య కేంద్రం వెబ్సైట్లో పరిశీలించాలని సూచించారు. నాగులవంచ రైల్వేస్టేషన్ కొనసాగింపు -
వాగు హోరు.. వేట జోరు!
కూసుమంచి మండలం నర్సింహులగూడెం వాగులో చేపలు పడుతున్న స్థానికులుమూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో వాగులు పొంగిపొర్లుతుండగా వరదతో పాటే చేపలు కొట్టుకొస్తున్నాయి. దీనికి తోడు శుక్రవారం డ్రై డే కావడంతో మాంసం, చికెన్ దుకాణాలు మూసివేశారు. ఈమేరకు వాగుల వద్ద స్థానికులు చేపల వేటలో నిమగ్నమయ్యారు. కూసుమంచి మండలంలోని నర్సింహులగూడెం వద్ద వాగులో చేపలవేటకు పెద్దసంఖ్యలో జనం రావడంతో సందడి నెలకొంది. అలాగే, నేలకొండపల్లి మండలంలోని నేలకొండపల్లి, ముజ్జుగూడెం, అనాసాగారం, నాచేపల్లి, చెరువుమాధారం తదితర గ్రామాల్లోనూ స్థానికులు చేపలు వేటాడారు. చాలామందికి సరిపడా కంటే ఎక్కువ చేపలు లభించడంతో వాగుల వద్దే కిలో రూ.100 చొప్పున విక్రయించారు. – కూసుమంచి / నేలకొండపల్లి -
సమీకృత భవనాలకు లైన్ క్లియర్!
ఖమ్మంరూరల్: ఖమ్మం రూరల్ మండల కార్యాలయాలన్నీ ఒకేచోట నిర్మించాలని ఐదేళ్ల క్రితమే నిర్ణయించినా ఎవరికి వారు తమకు అనుకూలమైన ప్రదేశాన్ని ఎంపిక చేయాలనే పట్టుదలకు పోవడంతో ఎటూ తేలలేదు. బీఆర్ఎస్ హయాంలో ఈ విషయమై ఓ అడుగు ముందుకు పడినా స్థలం ఖరారుపై వివిధ పార్టీల నాయకులు పట్టు వీడకపోవడంతో ప్రతిష్ఠంభన నెలకొంది. చివరకు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చొరవతో ఏదులాపురం మున్సిపాలిటీ పరిధి తరుణీ హట్లో మండల సమీకృత భవన నిర్మాణాలకు ఖరారు చేశారు. ఇటీవల మంత్రి ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలించి అధికారులతో సమీక్షించారు. అక్కడొకటి.. ఇక్కడొకటి రూరల్ మండలం ఏర్పడిప్పటి నుండి తహసీల్, ఎంపీడీఓ, పోలీస్స్టేషన్లు విసిరేసినట్లుగా అక్కడొక్కటి, ఇక్కడొకటి అన్నట్లు ఉన్నాయి. తహసీల్ ఖమ్మం నగరంలో, ఎంపీడీఓ కార్యాలయం జలగంనగర్లో, పోలీస్స్టేషన్ వరంగల్ క్రాస్ రోడ్డులో కొనసాగుతున్నాయి. ప్రతీ కార్యాలయం మధ్య కిలోమీటర్కు పైగా దూరం ఉండడంతో పనుల కోసం కార్యాలయాలకు వెళ్లే ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మున్సిపాలిటీ ఏర్పాటుతో.. మండలంలోని 12 గ్రామాలను కలుపుతూ ఈ ఏడాది ఫిబ్రవరిలో ఏదులాపురం మున్సిపాలిటీ ఏర్పాటైంది. దీంతో సమీకృత భవనం నిర్మిస్తే అటు మున్సిపల్ కార్యాలయం, ఇటు మండల కార్యాలయాలన్నీ ఒకేచోట కొలువుదీరే అవకాశముంది. సముదాయంలో మున్సిపల్ కార్యాలయం, సమావేశ మందిరం, రెవెన్యూ, విద్యాభవనం, వ్యవసాయ, మత్స్య పరిశ్రమ, ఉద్యానవన, శిశు సంక్షేమం, ఆర్అండ్బీ, సబ్రిజిస్ట్రార్ కార్యాలయాలన్నీ ఒకే చోట నిర్మించాలనే ఆలోచనలకు వచ్చారు. తరుణీ హట్లో నిర్మించే సముదాయం వద్దకు 30అడుగుల రోడ్డు కూడా నిర్మించనున్నారు. జీ ప్లస్ టూ భవనాల నిర్మాణం మున్సిపాలిటీకి సంబంధించిన సమీకృత భవన నిర్మాణానికి గత మే నెలలోనే పరిపాలనాపరమైన అనుమతులు వచ్చాయి. దీంతో రోడ్లు భవనాల శాఖ అధికారులు జీ ప్లస్ టూ విధానంలో భవన నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఈ భవనంలోనే మండల కార్యాలయాలు కూడా కొలువుదీరనున్నాయి. కార్యాలయాల సముదాయంలో సోలార్ విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటుచేయనున్నారు. అలాగే, పార్కింగ్ సౌకర్యం, మిషన్ భగీరథ ద్వారా తాగునీటి సరఫరా, ప్రతీ ఫ్లోర్లో ప్రజల కోసం వెయిటింగ్ గదులు నిర్మించేలా బ్లూ ప్రింట్ సిద్ధం చేస్తున్నారు. త్వరలోనే శంకుస్థాపన సమీకృత భవన నిర్మాణాలకు త్వరలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శంకుస్థాపన చేయనున్నట్లు తెలిసింది. గతనెల 31న కలెక్టర్ అనుదీప్ దురిశెట్టితో కలిసి మంత్రి తరుణీ హట్లో ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలించారు. ఇప్పటికే అక్కడి చెట్లను తొలగించి శుభ్రం చేయించారు. అలాగే, నూతన భవనాల నిర్మాణాలకు అడ్డొచ్చే పాత భవనాల తొలగింపునకు సిద్ధమవుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే కార్యాలయ నిర్మాణాలకు శంకుస్థాపన జరగనుందని సమాచారం. కాగా, అటు మున్సిపాలిటీ, ఇటు మండల కార్యాలయాలన్నీ ఒకే చోట నిర్మించనుండడంతో ప్రజల ఇక్కట్లు తీరనున్నాయి.ఐదేళ్ల అనంతరం తరుణీ హట్లో ఖరారు -
నిమజ్జనానికి ఇప్పటి నుంచే ఏర్పాట్లు
ఖమ్మంగాంధీచౌక్/ఖమ్మం రూరల్/కూసుమంచి: వినాయక విగ్రహాల నిమజ్జన ఏర్పాట్లపై ఇప్పటి నుంచే దృష్టి సారించాలని అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. మున్నేటి పరీ వాహకంలో ప్రకాష్నగర్, పెద్ద తండా వద్ద గణేష్ నిమజ్జన పాయింట్లను అదనపు కలెక్టర్ శుక్రవారం వివిధ శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాయింట్ల వద్ద అవసరమైన క్రెయిన్ల ఏర్పాటు, విద్యుత్ లైట్లు, సీసీ టీవీలు ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే, గజ ఈతగాళ్ల నియామకం, మెడికల్ క్యాంపుల ఏర్పాటుకు ప్రణాళిక రూపొందించాలని తెలిపారు. వివిధ శాఖల అధికారులు, ఏదులాపురం మున్సిపల్ కమిషనర్ ఏ.శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. తొలుత అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి కూసుమంచి మండలంలోని పాలేరు రిజర్వాయర్ పరిశీలించారు. వరద ఉధృతి, ఇన్ఫ్లో, ఔట్ ఫ్లో వివరాలను ఎస్ఈ మంగళంపూడి వెంకటేశ్వర్లు వెల్లడించగా.. పర్యాటకుల తాకిడి పెరుగుతున్నందున ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చూడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఈఈలు రత్నకుమారి, మధు తదితరులు పాల్గొన్నారు.అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి -
సప్తపదుల ఖాదీ
ఖమ్మంగాంధీచౌక్: ఖాదీ లేదా ఖద్దరు వస్త్రాలు మహాత్మా గాంధీ నమ్మిన సత్యం, అహింస, స్వదేశీ భావాలకు ప్రతీకగా నిలిచాయి. స్వాత్రంత్య ఉద్యమంలో ఖాదీ వస్త్రాలు దేశ భక్తిని పెంపొందించాయి. చేనేత కార్మికులకు ఉపాధి కల్పించాయి. తక్కువ ధరకు లభించే ఈ వస్త్రాలు వేసవిలో చల్లదనాన్ని, చలికాలంలో వెచ్చదనాన్ని ఇస్తాయి. తొలుత నూలు వడికి మగ్గాలపై నేసేవారు. సాంకేతికత పెరిగాక యంత్ర పరికరాలపై బట్టను తయారు చేస్తున్నారు. వయసులో పెద్దవారు, రాజకీయ నాయకులు ఖద్దరు దుస్తులను ఎక్కువగా వినియోగిస్తారు. కాలక్రమంలో ఖాదీ వస్త్రాల కార్ఖానాలు వెలిశాయి. పలు రాష్ట్రాల్లో ఖాదీ పరిశ్రమలు పెరగటంతో ఉపాధి అవకాశాలు కూడా లభించాయి. కుటీర పరిశ్రమలుగానూ వెలిశాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఖాదీ వస్త్రాల తయారీకి ప్రత్యేక స్థానాలు ఉన్నాయి. ఏపీలోని పొందూరు ఖద్దరు, తెలంగాణలో వావిలాల ఖాదీ ఆదరణ చూరగొన్నాయని చెప్పొచ్చు. విస్తరించిన వావిలాల ఖాదీ గ్రామోద్యోగ్ స్వాతంత్రోద్యమంలో ఖాదీకి లభించిన ఆదరణ, ప్రాముఖ్యతతో కరీంనగర్ జిల్లా జగిత్యాలలో వావిలాల గ్రామోద్యోగ్ ప్రతిష్టాపన జరిగింది. కుటీర పరిశ్రమగా ఆవిర్భవించి అంచెలంచెలుగా రాష్ట్రంలో ఎనిమిది పరిశ్రమలకు విస్తరించింది. పరిశ్రమలు, చేతి మగ్గాలు, దుకాణాల్లో దాదాపు వెయ్యి మంది పనిచేస్తూ ఉపాధి పొందుతున్నారు. కరీంనగర్, హనుమకొండ, తొర్రూరు తదితర ప్రాంతాలకు పరిశ్రమ విస్తరించగా, పలు ప్రాంతాల్లో ప్రత్యేక ఖద్దరు విక్రయ దుకాణాలను నిర్వహిస్తున్నారు. జగిత్యాల, కరీంనగర్, వరంగల్, హనుమకొండ, ఖమ్మం, తొర్రూర్, హుజూరాబాద్, హైదరాబాద్లో పలు బ్రాంచీలు నిర్వహిస్తున్నారు. ఈ సంస్థకు చైర్పర్సన్గా దివంగత ప్రధాని పీవీ నర్సింహారావు తనయ ఎంఎల్సీ సురభి వాణితో పాటు కార్యదర్శిగా వడిదల కిషన్రావు వ్యవహరిస్తున్నారు. ఖమ్మం గ్రామోద్యోగ్కు 70 ఏళ్ల చరిత్ర వావిలాల ఖాదీ గ్రామోద్యోగ్ ప్రతిష్టాపన బ్రాంచిని ఖమ్మంలో 70 ఏళ్ల కిత్రం ఏర్పాటు చేశారు. ఖమ్మం నగరంలోని గాంధీ నడయాడిన గాంధీచౌక్లోనే ఈ బ్రాంచిని ఖాదీ గ్రామోద్యోగ్ ఎంపోరియం ఏర్పాటు చేశారు. నగరానికి చెందిన వేములపల్లి రంగారావు గ్రామోద్యోగ్లో ఉద్యోగిగా చేరి 40 ఏళ్ల పాటు నిర్వహించారు. ఆ తర్వాత ఆయన కుమారుడు కృష్ణారావు 30 ఏళ్లుగా గ్రామోద్యోగ్ ఉద్యోగిగా నిర్వహిస్తున్నారు. ఇక్కడ వంద శాతం ఖాదీ దుస్తులు పంచెలు, లుంగీలు, టవల్స్, చొక్కాలు విక్రయిస్తున్నారు. ఖమ్మం, వైరా, మధిర, సత్తుపల్లి, కొత్తగూడెం, మణుగూరు, భద్రాచలం, కోదాడ, నల్లగొండ, ఏపీలోని జగ్గయ్యపేట, నందిగామ తదితర ప్రాంతాల నుంచి ఇక్కడికి రెగ్యులర్ కష్టమర్లు వస్తుంటారు. ఇక రాజకీయ నాయకులు ఖద్దరు చొక్కాలు, పంచెల కోసం ప్రత్యేక ఆర్డర్లు ఇస్తారు. ఇక స్వాంతత్య్ర దినోత్సవం, గాంధీ జయంతి, వర్ధంతి, రిపబ్లిక్ డే వంటి ప్రత్యేకమైన రోజుల్లో సంస్థ ప్రత్యేక తగ్గింపు ధరలకు ఖాదీ బట్టను విక్రయిస్తుంది. ప్రస్తుత స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా 30 శాతం డిస్కౌంట్ సౌకర్యాన్ని కల్పించింది. దీంతో విక్రయాలు మరికొంత పెరిగాయి.గాంధేయ వాదులం. వావిలాల గ్రామోద్యోగ్లో ఖద్దరు బట్టలను కొనుగోలు చేసి చొక్కాలను ధరిస్తున్నాం. లుంగీలు, టవల్స్ను కూడా వాటినే వినియోగిస్తున్నాం. ఆర్యోగపరంగా కూడా ఈ బట్ట అనుకూలంగా ఉంటుంది. నాణ్యత బాగుంటుంది. –తూములూరి లక్ష్మీనరసింహారావు, ఖమ్మంఖాదీ వస్త్రాలకు ఆదరణ ఎప్పటికీ ఉంటుంది. వావిలాల ఖాదీ గ్రామోద్యోగ్ వస్త్రాలకు రాష్ట్రంలో మంచి గుర్తింపు ఉంది. ఖమ్మంలో 70 ఏళ్లుగా గ్రామోద్యోగ్ను నిర్వహిస్తున్నాం. లాభాపేక్ష లేకుండా సంస్థ ఖాదీ తయారీ, విక్రయాలు చేస్తోంది. – వేములపల్లి కృష్ణారావు, మేనేజర్, ఖమ్మం గ్రామోద్యోగ్ ఎంపోరియం -
ప్రతిభ కనబర్చిన పోస్టుమాస్టర్లకు సత్కారం
ఖమ్మంగాంధీచౌక్: తపాలా శాఖ ద్వారా ఖాతాదారులకు ఉత్తమ సేవలందించిన పలువురు పోస్టుమాస్టర్లను సన్మానించారు. నార్త్ సబ్ డివిజన్ బ్రాంచి పోస్టాఫీసుల పోస్టుమాస్టర్లు, అసిస్టెంట్ పోస్టుమాస్టర్ల సమావేశం ఖమ్మంలోని మహిళా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గురువారం జరిగింది. ఈసందర్భంగా సీతారాంపురం, కొక్కిరేణి, వెంకటగిరి పోస్టుమాస్టర్లు చెరుకూరి కోటేశ్వరరావు, వి.శ్రీనివాసరావు, హరిప్రియసింగ్ రాజ్పుత్ తదితరులను సన్మానించారు. ఖమ్మం డివిజన్ పోస్టల్ సూపరింటెండెంట్ వి.వీరభద్రస్వామి, ఇన్స్పెక్టర్ బీ.కే.మహేశ్వరి, ఖమ్మం హెడ్ పోస్టాఫీస్ పోస్టుమాస్టర్ శ్రీరామచంద్రమూర్తి పాల్గొన్నారు. కూలిన వైరా రిజర్వాయర్ కాల్వ గైడ్వాల్వ్ వైరారూరల్: వైరా మండలం విప్పలమడక సమీపాన వైరా రిజర్వాయర్ ఎడమ కాల్వ గైడ్ వాల్వ్ గురువారం కూలింది. రెండో విడత ఆధునికీకరణ పనుల్లో భాగంగా ఇటీవల రిజర్వాయర్ కుడి, ఎడమ కాల్వలకు ఇరువైపులా గైడ్ వాల్వ్లు నిర్మించారు. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో విప్పలమడక సమీపంలో డ్రెయినేజీ నీరు కాల్వలోకి చేరుతుండడంతో గైడ్వాల్వ్ ఓవైపు కుంగి సుమారు 100 మీటర్ల మేర కూలింది. రూ.లక్షలు వెచ్చించి నిర్మించిన నిర్మాణం ఆదిలోనే కూలడంపై విమర్శలు వస్తుండగా.. మరమ్మతులు చేయిస్తామని అధికారులు తెలిపారు. ‘ఆఫ్టైప్’ మొక్కలపై విచారణ చేయించండి సత్తుపల్లి: ఆఫ్టైప్ ఆయిల్పామ్ మొక్కల సరఫరాతో నష్టపోయినట్లు తాము ఇచ్చిన ఫిర్యాదులపై విచారణ వేగవంతం చేయాలని బాధిత రైతులు కోరారు. సత్తుపల్లిలో గురువారం జిల్లా, డివిజనరల్ ఉద్యానవన శాఖ అధికారులు ఎంవీ.మధుసూదన్, శంకర్, ఆయిల్ఫెడ్ ప్రత్యేక అధికారి అడపా కిరణ్తో రైతులు సమావేశమయ్యారు. తోటల పరిశీలనకు అధికారులతో కమిటీని నియమించడమే కాక రీప్లేస్ చేసిన మొక్కల్లో ఆఫ్టైప్ వస్తే ఎవరు బాధ్యత వహిస్తారో చెప్పాలని ప్రశ్నించారు. అంతేకాక ఇన్నేళ్ల కష్టానికి పరిహారం, బాధ్యులపై చర్యల విషయాన్ని వెల్లడించాలన్నారు. రైతులు కారం శ్రీరాములు, రాము, జగ్గారావు, రామకృష్ణ, సత్యనారాయణరెడ్డి, రమేష్రెడ్డి, వెంకట్రావు, ఉమామహేశ్వరరెడ్డి, చెలికాని సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. -
సింగరేణి ట్రక్కు.. అప్పాయిగూడెం ఇంజిన్!
కారేపల్లి: మండల కేంద్రమైన సింగరేణి((కారేపల్లి) గ్రామపంచాయతీ ట్రాక్టర్ మరమ్మతుకు వచ్చింది. ఏళ్లుగా కనీసం ఇంజన్ ఆయిల్ కూడా మార్చకపోవడంతో మొరాయిస్తోంది. ఈమేరకు మెకానిక్కు చూపిస్తే మరమ్మతులకు రూ.20వేలు అవసరమని చెప్పడంతో నిధులు లేక అధికారులు చేతులెత్తేశారు. అయితే, కారేపల్లిలో 12వార్డులతో పాటు రెండు కిలోమీటర్ల మేర ప్రధాన రహదారి ఉండడంతో ప్రతిరోజు చెత్త సేకరించాల్సి వస్తోంది. ప్రస్తుతం ట్రాక్టర్ ఇంజన్ లేకపోవడంతో అప్పాయిగూడెం గ్రామపంచాయతీ నుంచి ఇంజన్ను తెప్పించి కారేపల్లి ట్రక్కు అమర్చి చెత్త సేకరిస్తున్నారు. -
శాలివాహనులు రాజకీయంగా ఎదగాలి
● రిటైర్డ్ డీజీపీ పూర్ణచంద్రరావు ఖమ్మం మామిళ్లగూడెం: శాలివాహనులు అవకాశాలను అందిపుచ్చుకుంటూ రాజకీయంగా మరింత ఎదగాలని మాజీ డీజీపీ జుజ్జవరపు పూర్ణచంద్రరావు సూచించారు. శ్రీశ్రీశ్రీ దక్ష ప్రజాపతి శాలివాహన సొసైటీ, శాలివాహన వెల్ఫేర్ ట్రస్ట్ ఆధ్వర్యాన గురువారం ఖమ్మంలో నిర్వహించిన రాజకీయ చైతన్య సమావేశంలో ఆయన మాట్లాడారు. కుమ్మరి కులస్తులెవరూ తెలంగాణ అసెంబ్లీలో అడుగుపెట్టకపోవడం బాధాకరమని తెలిపారు. ఈమేరకు రాజకీయ అవకాశాలను అందిపుచ్చుకుంటూ ఎదగాలని సూచించారు. శాలివాహన వెల్ఫేర్ ట్రస్ట్ అధ్యక్షుడు దరిపల్లి కిరణ్ మాట్లాడుతూ ఉన్నత విద్యనభ్యసించే శాలివాహన విద్యార్థులకు సహకరిస్తామని తెలిపారు. ఈసమావేశంలో సూర్యారావు, శంకర్రావు, మల్లెల రామనాథం, శేషగిరిరావు, హన్మంతరావు, ఉపేందర్, సత్యనారాయణ, ప్రసాద్, చిరంజీవి, రాచర్ల రాజు, రమేష్, వెంకటేశ్వర్లు, భాస్కర్, సైదారావు, సర్వయ్య, పరశురాములు, కృష్ణ పాల్గొన్నారు. -
నాలుగో శనివారం.. బ్యాగ్ లెస్ డే !
విద్యాశాఖపై సమీక్షలో కలెక్టర్ అనుదీప్ ఖమ్మం సహకారనగర్: ఇక నుంచి ప్రతీనెల నాలుగో శనివారం ప్రభుత్వ పాఠశాలల్లో ‘బ్యాగ్ లెస్ డే’గా నిర్వహించాలని.. ఆ రోజు క్రీడా పోటీలు, పాటలు పాడించడమే కాక మొక్కల పెంపకం, మాక్ అసెంబ్లీ ఏర్పాటుచేయాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆదేశించారు. కలెక్టరేట్లో గురువారం విద్యాశాఖపై అదనపు కలెక్టర్ శ్రీజతో కలిసి సమీక్షించారు. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్, సమగ్రాభివృద్ధి దిశగా కార్యక్రమాలు ఉండాలని తెలిపారు. పీఎంశ్రీ, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా మంజూరైన నిధులతో పనులు పూర్తిచేయించడమే కాక రెండో యూనిఫామ్, పాఠ్య, నోట్ బుక్స్ పంపిణీ చేసి వివరాలను ఆన్లైన్లో అప్డేట్ చేయాలని చెప్పారు. యూనిఫామ్ పంపిణీలో నిర్లక్ష్యం వహించే ఎంఈఓలకు మెమో జారీ చేయాలని తెలిపారు. అలాగే, హాజరు నమోదుపై సూచనలు చేసిన కలెక్టర్... గుడిసెలు, శిథిల భవనాల్లో కొనసాగుతున్న పాఠశాలల స్థానంలో కంటైనర్లు ఏర్పాటు చేయించాలన్నారు. డీఈఓ నాగపద్మజ, ఎంఈఓలు, ఉద్యోగులు పాల్గొన్నారు. ●ఖమ్మంగాంధీచౌక్: నిర్మాణం పూర్తయిన డబుల్ బెడ్రూం ఇళ్లను ఆన్లైన్ ర్యాండమైజేషన్ ద్వారా లబ్ధిదారులకు పారదర్శకంగా కేటాయిస్తున్నామని కలెక్టర్ అనుదీప్ తెలిపారు. కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజతో కలిసి కామేపల్లి మండలం పింజరమడుగు, ముచ్చర్ల ప్రాంత 50మంది లబ్ధిదారులకు ఇళ్లు కేటాయించాక ఆయన మాట్లాడారు. త్వరలోనే వీరికి మంత్రులు, ఎమ్మెల్యే చేతుల మీదుగా పట్టాలు పంపిణీ చేస్తామని తెలిపారు. కామేపల్లి తహసీల్దార్ సుధాకర్, డబుల్ బెడ్రూం లబ్ధిదారులు, అధికారులు పాల్గొన్నారు. -
టోల్ రుసుముకు వార్షిక పాస్
ఖమ్మం అర్బన్: వాహనదారులకు జాతీయ రహదారుల సంస్థ(ఎన్హెచ్ఏఐ) ఆఫర్ ప్రకటించింది. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నూతన టోల్ విధానం అమలుకు శ్రీకారం చుట్టింది. ఈమేరకు గురువారం అర్ధరాత్రి(శుక్రవారం) నుంచి రూ.3వేల వార్షిక రుసుంతో 200టోల్ ప్రవేశాలకు అనుమతులు లభిస్తాయని ఎన్హెచ్ఏఐ ఖమ్మం పీడీ దివ్య తెలిపారు. ఫాస్ట్ట్యాగ్లో ఆక్టివేట్ చేసిన వార్షిక పాస్తో జాతీయ రహదారి, జాతీయ ఎక్స్ప్రెస్ వేల్లోని ప్లాజాల మీదుగా ఒక ఏడాది లేదా 200 ట్రిప్పుల రాకపోకలకు అనుమతి ఉంటుందని వెల్లడించారు. డౌన్లోడ్ ఇలా... వార్షిక పాస్ను వాహనదారులు రాజ్మార్గ్ యాత్ర యాప్ లేదా ఎన్హెచ్ఏఐ వెబ్సైట్లో యాక్టివేట్ చేయించుకోవచ్చు. సంబంధిత పాస్ట్టాగ్ ధృవీకరణ అనంతరం ఆమోదం లభిస్తుంది. రుసుము చెల్లించిన రెండు గంటల్లోగా అమల్లోకి వస్తుందని పీడీ తెలిపారు. ప్రస్తుతం ఉన్న ఫాస్ట్ట్యాగ్తోనే రూ.3వేలు చెల్లించి యాక్టివేషన్ చేసుకునే వెసలుబాటు ఉందని వెల్లడించారు. -
సమూల మార్పులతోనే..
దేశాభివృద్ధికి కొన్ని వ్యవస్థల్లో సమూల మార్పు చేయాలి. ప్రధానంగా విద్య, వైద్యం అందరికీ అందాలి. ఇందుకోసం యువత సేవలు వినియోగించుకుంటూ ఉపాధి రంగాల్లో చేయూత ఇవ్వాలి. రిజర్వేషన్లలోనూ మార్పులు చేపట్టాలి. – ఎ.ధనలక్ష్మిప్రస్తుతం కొనసాగుతున్న విద్యావ్యవస్థలో సరికొత్త విధానం తీసుకురావాలి. నిరుపేదలకు విద్య అందుబాటులోకి రావాలి. అప్పుడే దేశాభివృద్ధి సాధ్యమవుతుంది. అలాగే, ప్రభుత్వ విద్యాసంస్థల్లో వసతులు కల్పించి బలోపేతం చేయాలి. – షేక్ భాను -
రేపు నాస్తిక అధ్యయన తరగతులు
ఖమ్మంమయూరిసెంటర్: నాస్తిక సమాజం (తెలంగాణ – ఆంధ్రప్రదేశ్) ఆధ్వర్యాన శనివా రం ఖమ్మంలోని రామనర్సయ్య విజ్ఞాన కేంద్రంలో నాస్తిక అధ్యయన తరగతులు నిర్వహిస్తున్నట్లు కన్వీనర్ చార్వాక సుధాకర్ తెలిపారు. సరైన ఆలోచన, తాత్విక జీవనం కోసం మనుషులు స్వేచ్ఛగా, స్వతహాగా ఆలోచించేలా అవగాహన కల్పించడమే ఈ తరగతుల ఉద్దేశమని వెల్లడించారు. ఖమ్మంలో గురువారం ఆయన మాట్లాడుతూ జీవితంలో శాసీ్త్రయ ధృక్పథాన్ని పెంపొందించుకునేందుకు ఇవి ఉపయోగపడతాయని తెలిపారు. ఈ తరగతుల్లో రిటైర్డ్ ప్రొఫెసర్లు సీహెచ్.రమేష్బాబు, డాక్టర్ కె. విజయ్కుమార్, డాక్టర్ బి.వి.రాఘవులు పలు అంశాలపై మాట్లాడతారని సుధాకర్ వెల్లడించారు. ఈ సమావేశంలో నాయకులు ఆవుల అశోక్, సీహెచ్.రమేష్బాబు, నాగరాజు, సమతా శ్రీధర్, సత్యనారాయణ, ప్రీతమ్ తదితరులు పాల్గొన్నారు. సామర్థ్యాలకు అనుగుణంగా ప్రశ్నాపత్రాలు ఖమ్మం సహకారనగర్: విద్యార్థుల స్థాయి, విద్యా సామర్థ్యాల ఆధారంగా ప్రశ్నాపత్రాలు తయారీ జరగాలని జిల్లా విద్యాశాఖాధికారి కె.నాగపద్మజ తెలిపారు. ఖమ్మం రోటరీనగర్ హైస్కూల్లో జిల్లా కామన్ ఎగ్జామినేషన్ బోర్డు(డీసీఈబీ) ఆధ్వర్యాన గురువారం ఎస్ఏ–1 ప్రశ్నాపత్రం తయారీపై ఉపాధ్యాయులకు వర్క్షాపు ఏర్పాటుచేశారు. ఈ సమావేశంలో డీఈఓ మాట్లాడుతూ విద్యార్థులు ప్రశ్నాపత్రం చూడగానే ఆందోళన చెందకుండా ఉత్సాహంగా జవాబులు రాసేలా ఉండాలని తెలిపారు. ఇక్కడ తయారుచేసే ప్రశ్నాపత్రాలు ఇతర జిల్లాలకు ఆదర్శంగా ఉండేలా, విద్యార్థుల సామర్థ్యాల సరిగ్గా అంచనా వేసేలా రూపొందించాలని సూచించారు. డీసీఈబీ సెక్రటరీ కనపర్తి వెంకటేశ్వర్లు, హెచ్ఎం తుంగతుర్తి సుబ్బారావు, ఏఎంఓ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ట్రెజరీ డీడీగా సత్యనారాయణ ఖమ్మం సహకారనగర్: మహబూబాబాద్ జిల్లా ఖజనా శాఖాధికారి వెంటపల్లి సత్యనారాయణకు ఖమ్మం ట్రెజరీ డిప్యూటీ డైరెక్టర్(డీడీ)గా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈమేరకు అందిన ఆదేశాలతో గురువారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. అనంతరం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఇన్నాళ్లు డీడీగా ఉన్న ప్రసన్నకుమార్ వైరా ఏటీఓగా నియమించారు. కాగా, డీడీ సత్యనారాయణకు ఏటీఓలు రాంబాబు, జి.శ్రీనివాస్, ఎస్టీఓలు మోదుగు వేలాద్రి, నాగేంద్రకుమారి, శారద, ఉద్యోగులు అందించి శుభాకాంక్షలు తెలిపారు. -
చట్టాల్లో సంస్కరణలతో...
పెరుగుతున్న హింస.. పడుతున్న శిక్షలకు సంబంధం లేదు. ఈ విషయమై దేశంలో అమలవుతున్న చట్టాల్లో వీలైనంతగా సంస్కరణలు చేయాలి. ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువుతున్న వారికి ఉద్యోగావకాశాల్లో ప్రాధాన్యత కల్పించాలి. – ఎం.వినోద్కుమార్ప్రజాప్రతినిధులను ఎన్నుకునే విషయంలో ప్రజలు తమ ఓటు విలువ తెలుసుకోవాలి. ప్రధాన పార్టీలను మాత్రమే పరిగణనలోకి తీసుకోకుండా ప్రజలకు సేవ చేయగలిగే నేతను ఎన్నుకుంటే అభివృద్ధి సాధ్యమవుతుందనే విషయాన్ని అంతా గుర్తించాలి. – బి.వంశీ -
సర్వతోముఖాభివృద్ధి
సంస్కరణలతోనే● యువతలో దేశభక్తి, నైతిక విలువలు పెంపొందించాలి ● కొత్త ఆలోచనలు, నైపుణ్యాభివృద్ధి అవసరం ● దేశంపై బాధ్యత, నిజాయితీ, అంకితభావం తప్పనిసరి ‘వందేళ్ల భారతం’పై ‘సాక్షి టాక్ షో’లో విద్యార్థుల మనోగతంసుజాతనగర్: దేశం నేడు(శుక్రవారం) 79వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటోంది. 2047 నాటికి స్వాతంత్య్రం సాధించి వందేళ్లు పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో అనేక రంగాల అభివృద్ధిలో దేశం 2047 నాటికి ఎలా ఉండాలన్న అంశంపై సుజాతనగర్లోని ధన్వంతరి ఫార్మా కళాశాలలో ‘సాక్షి’ ఆధ్వర్యాన టాక్ షో నిర్వహించగా విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ అభిప్రాయాలు వెల్లడించారు. సంస్కరణలే కీలకం పేదరిక నిర్మూలన, ఉపాధి కల్పన, నీటి సంరక్షణ, వ్యవసాయం, రవాణా అభివృద్ధి, సాంకేతికత వినియోగం.. మహిళా సాధికారత, విద్య, వైద్య రంగాల్లో సంస్కరణలే దేశాన్ని అగ్రస్థానాన నిలబెడతాయని విద్యార్థులు అభిప్రాయపడ్డారు. యువత నూతన ఆలోచనలు, నైపుణ్యాలను స్వీకరిస్తూ వారికి విద్య, నైపుణ్యాభివృద్ధి అవకాశాలు కల్పించాలని తెలిపారు. అలాగే, అవినీతిని నిర్మూలించాలని.. రాజకీయాల్లో కొత్త తరానికి అవకాశం ఇవ్వడమే కాక పేదరిక నిర్మూలనకు ప్రణాళిక సిద్ధం చేయాలని చెప్పారు. విద్య, వైద్య రంగాల్లో మార్పులు, పాలనలో అవినీతి నిర్మూలన, సేవాగుణం, అభివృద్ధి చేయగలిగే నేతలను ఎన్నుకోవడం.. ప్రజల ఆర్థిక శ్రేయస్సు, సామాజిక సమాన త్వం, సాంకేతిక పురోగతి, పర్యావరణ స్థిరత్వం వంటివి అమల్లోకి తీసుకురాగలిగితే దేశాన్ని 2047 నాటికి ప్రపంచంలో అగ్రగామిగా నిలబెట్టడం కష్టమేమీ కాదని ధన్వంతరి కళాశాల విద్యార్థులు వెల్లడించారు. ఈ సందర్భంగా ‘సాక్షి’ టాక్ షోలో పలువురు విద్యార్థులు వెల్లడించిన అభిప్రాయాలు..భారత్ వేగంగా అభివృద్ధి చెందుతున్నా కొంత వెనకబాటు ఉంది. అధిక జనాభా, పేదరికం, తక్కువ తలసరి ఆదాయం, అవినీతి, వసతుల లేమి, జవాబుదారీతనంపై సరైన నిర్ణయాలు తీసుకుంటే 2047 నాటికి ప్రపంచంలో అగ్రగామిగా నిలుస్తుంది. – జి.నాగరాజు, ప్రిన్సిపాల్ -
ప్రాణ, ఆస్తినష్టం జరగకుండా పటిష్ట చర్యలు
ఖమ్మం సహకారనగర్: వాతావరణ శాఖ సూచనల ప్రకారం అధికారులు అప్రమత్తంగా ఉంటూ ఎక్కడా ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. హైదరాబాద్ నుంచి పొంగులేటి, సీఎస్ రామకృష్ణారావు, ఖమ్మం కలెక్టరేట్ నుంచి తుమ్మల గురువారం కలెక్టర్లతో వీసీ ద్వారా మీక్షించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ మరికొన్ని రోజులు వర్షాలు ఉన్నందున వరద ముంచెత్తినా నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని తెలిపారు. సహాయక చర్యల కోసం రూ.కోటి నిధులు విడుదల చేయగా, అవసరమైతే మరిన్ని నిధులు కూడా విడుదల చేస్తామన్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ ఆకేరు, మున్నేరు, పాలేరు, వైరా, లంకాసాగర్లో వరద నిలకడగా ఉన్నప్పటికీ ఎగువ జిల్లాల్లో వర్షం వివరాలు తెలుసుకుంటూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వీసీలో కలెక్టర్ అనుదీప్, సీపీ సునీల్దత్, అదనపు కలెక్టర్లు శ్రీజ, శ్రీనివాసరెడ్డి, కెఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్య తదితరులు పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ అనుదీప్ అధికారులతో సమావేశమై వర్షపాతం వివరాలు, వరద అంచనా, ముందస్తు చర్యలపైనే కాక సీజనల్ వ్యాధుల కట్టడిపై సూచనలు చేశారు. ఈ సమావేశంలో డీఆర్వో ఏ.పద్మశ్రీ, జిల్లా వ్యవసాయ శాఖాధికారి డి.పుల్లయ్య, డీఎంహెచ్ఓ కళావతి బాయి, సీపీఓ శ్రీనివాస్, వివిధ శాఖల ఎస్ఈలు శ్రీనివాసాచారి, ఎం.వెంకటేశ్వర్లు, వెంకట్రెడ్డి, మిషన్ భగీరథ ఈఈలు పుష్పలత, వాణిశ్రీ పాల్గొన్నారు. వీసీలో మంత్రులు పొంగులేటి, తుమ్మల -
పదేళ్లలో అత్యధికం.. 37.5అడుగులు
● రెండేళ్లుగా వణుకుతున్న మున్నేటి పరీవాహకం ● గతేడాది భారీ నష్టాన్ని మిగిల్చిన వరద ● ప్రస్తుత వర్షాలతో స్థానికుల్లో ఆందోళన సాక్షిప్రతినిధి, ఖమ్మం: గత ఏడాది మున్నేటికి వరద పోటెత్తగా పరీవాహక ప్రాంత కాలనీలన్నీ నీట మునిగాయి. ఈనేపథ్యాన ప్రస్తుత వర్షాలతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. గత పదేళ్లలో ఎన్నడూ లేని విధంగా గత ఏడాది అధికారిక లెక్కల ప్రకారం 37.5 అడుగులు, అనధికారికంగా దాదాపు 42 అడుగుల మేర మున్నేటికి వరద చేరింది. ఇక 2023లోనూ మున్నేరుకు వరద పోటెత్తింది. అయితే, గత ఏడాది ఎదురైన చేదు అనుభవాలతో అప్రమత్తంగానే ఉన్నా అటు అధికా రులు, ఇటు ప్రజల్లో ఆందోళన వీడడం లేదు. మున్నేరు ముంచింది.. గత ఏడాది ఆగస్ట్ 31, సెప్టెంబర్ 1న వచ్చిన వరదలతో మున్నేరు పరీవాహకం మొత్తం నీట మునిగింది. 42 అడుగుల మేర వరద రావడంతో ఖమ్మం నగరంలోని 14 డివిజన్లు, ఖమ్మంరూరల్ మండలంలోని 20 కాలనీలు వరద ముంపు బారిన పడి దాదాపు 80 శాతం కుటుంబాలు నిరాశ్రయులయ్యాయి. కొందరి ఇళ్లు పూర్తిగా ధ్వంసమై.. మరికొందరికి పాక్షికంగా దెబ్బతినడంతో పాటు ఉపకరణాలు పనికి రాకుండా పోయాయి. 2023లో 30 అడుగులకు పైగా.. గత 20 ఏళ్లలో మున్నేరు వరదను పరిశీలిస్తే అత్యధికంగా గత ఏడాదే నమోదైంది. అంతకుముందు 2023 జూలై 27న 30.70 అడుగులు, 2005లో 26 అడుగుల వరద వచ్చింది. అయితే, 2005లో మున్నేటికి ఇరువైపులా ఇన్ని కాలనీలు లేకపోవడంతో పెద్దగా నష్టం జరగలేదు. దాదాపు 18 ఏళ్ల తర్వాత 2023–24లో 30 అడుగుల మేరకు రావడంతో అదే అత్యధిక వరదగా నమోదైంది. కానీ 2024–25కు సంబంధించి 2024 సెప్టెంబర్ 1న ఊహించనంతగా 42 అడుగుల వరకు వరద రావడం గమనార్హం. ఎప్పుడేం జరుగుతుందో.. జిల్లాలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో మున్నేరు, ఆకేరు పరీవాహక ప్రాంత కాలనీల్లోని ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. గత 60 ఏళ్లలో ప్రశాంతంగా ఉన్న మున్నేరు గత రెండేళ్లుగా నిద్ర లేని రాత్రులను మిగులుస్తోందని కాలనీవాసులు కన్నీటిపరంతమవుతున్నారు. ప్రస్తుతం ఎడ తెరిపి లేని వర్షాలతో అధికారుల ముందస్తు చర్యలతో జనానికి మరింత భయం కలిగిస్తోంది. ఏ క్షణమైనా పునరావాస కేంద్రాలకు వెళ్లేలా విలువైన సామగ్రిని సర్దుకుంటున్నారు.జిల్లాలో గురువారం కూడా వర్షం దంచికొట్టింది. పలు ప్రాంతాల్లో భారీ వర్షం, మిగతాచోట్ల ఓ మోస్తరు వర్షంతో వాగులు, చెరువుల్లోకి నీరు చేరింది. గురువారం ఉదయం 8–30 నుంచి రాత్రి 9గంటల వరకు అత్యధికంగా చింతకాని మండలం నాగులవంచలో 66 మి.మీ. వర్షపా తం నమోదైంది. ఎర్రుపాలెం మండలంలో కట్టలేరుకు వరద పెరగగా, ముదిగొండ మండలం వల్లభి పెద్ద చెరువుకు అలుగు పడింది. వైరా నది ఉధృతితో స్నానాల లక్ష్మీపురం, సిరిపురం మధ్య రాకపోకలు నిలిపివేశారు. కూసుమంచి మండలంలోని పాలేరు రిజర్వాయర్కు సాగర్ నుంచి నీటి విడుదల తగ్గించడమే కాక దిగువకు 2,043 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. దీంతో పాటు అలుగు ద్వారా మరో 7,667క్యూసెక్కులు పాలేరు ఏటిలో కలుస్తుంది. ఈ మేరకు రిజర్వాయర్ నీటిమట్టం 23.45అడుగుల వద్ద నిలకడగా ఉంది. వైరా రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటిమట్ట మైన 18.3అడుగులు దాటి 19 అడుగులకు చేరింది. ఇక డోర్నకల్ వద్ద మున్నేరు 140 మీటర్లకు గాను 136, ఖమ్మం జిల్లా తీర్థాల వద్ద 20 అడుగులకు గాను 10, ఆకేరు తిప్పారెడ్డిగూడెం వద్ద 135 మీటర్లకు 132 మీటర్లు, ఖమ్మం కాల్వొడ్డు వద్ద మున్నేరు 7.90అడుగులుగా నమోదైంది. -
క్యాండిల్ ర్యాలీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
ఖమ్మం జిల్లా: జిల్లా వేదికగా కాంగ్రెస్ పార్టీ క్యాండిల్ ర్యాలీ నిర్వహించింది. దేశ వ్యాప్తంగా ఓట్లు తొలగింపు అంశానికి సంబంధించి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అంశాన్ని లేవనెత్తుతూ ఈరోజు(గురువారం, ఆగస్టు 14వ తేదీ) ఖమ్మం జిల్లాలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గా చేపట్టిన క్యాండిల్ ర్యాలీలో మల్లు భట్టి విక్రమార్క సైతం పాల్గొన్నారు. దీనిపై మల్లు మాట్లాడుతూ.. ‘రాహుల్ గాంధీ దేశంలో ఓట్లకు సంబంధించిన సమాచారాన్ని, ఓట్లు ఉన్నవారివి తీసినట్లుగా ఆధారాలతో ఎలక్షన్ కమిషన్కు సమర్పించారు. రాహుల్ గాంధీ అడుగుతున్న సాప్ట్ కాపీ ఇవ్వాలని డిమాండ్ చేస్తుంటే...దానికి సమాధానం చెప్పకుండా కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు. వాస్తవాలను ప్రజలకు వివరించే ప్రయత్నం జిల్లా కాంగ్రెస్ పార్టీ చేపట్టింది. భారత రాజ్యాంగాన్ని కాపాడుతూ చేపట్టే కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీనే చేస్తుంది. దేశానికి డిక్టేటర్షిప్ పరిపాలన తీసుకుని రావాలని బీజేపీ ప్రభుత్వం చూస్తుంది. ఎన్నికల కమిషన్ కూడా బీజేపీకి లొంగిపోయింది. దేశ ప్రజలు వాస్తవాన్ని గమనిస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి ప్రతి పౌరుడు ముందుకు రావాలి. దేశ వ్యాప్తంగా జరుగుతున్న ఎన్నికల్లో అవకతవకలు జరుగుతున్నాయి, వాటికి సంబంధించి ఆధారాలతో ఎలక్షన్ కమిషన్ ముందు ప్రవేశ పెట్టారు’ అని మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. -
అంతటా అప్రమత్తం
సాక్షిప్రతినిధి, ఖమ్మం: జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలు.. ఎగువ ప్రాంతాల్లో ఇప్పటికే వర్షాలు కురుస్తున్న నేపథ్యాన అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. గత ఏడాది అనుభవాల దృష్ట్యా ఆస్తి, ప్రాణనష్టం జరగకుండా మున్నేరు పరీవాహక ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. మున్నేటికి ఇరువైపులా ఇప్పటికే పునరావాస కేంద్రాలను సిద్ధం చేశారు. అత్యవసర సమయాన సహాయక చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. చెరువులు, వాగుల వద్ద పెట్రోలింగ్ ముమ్మరం చేయడమే కాక కలెక్టరేట్, పోలీసు కమిషనరేట్, మున్సిపాలిటీల్లో కంట్రోల్రూమ్లు ఏర్పాటుచేశారు. పరీవాహకంలో ఎడతెరిపి లేకుండా.. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షపాతం వివరాలను అధికారులు తెప్పించుకుంటున్నారు. వరంగల్, జనగామ, మహబూబాబాద్ జిల్లాల్లో మంగళవారం భారీ వర్షం కురిసింది. బుధవారం కూడా మున్నేరు, ఆకేరు పరీవాహక జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిశాయి. మున్నేరు పరీవాహకంలో రాత్రి 8గంటల వరకు 7.1 సెం.మీ., ఆకేరు పరీవాహ కంలో 1.0 సెం.మీ. వర్షపాతం నమోదైంది. పునరావాస కేంద్రాలు భారీ వర్షాలు, వరదల నేపథ్యాన మున్నేటి పరీవాహక ప్రాంతాల ప్రజలు ఆందోళన చెందకుండా అధికారులు ముందస్తు జాగ్రత్తల్లో నిమగ్నమయ్యారు. శిక్షణ వలంటీర్లతో అవగాహన కల్పి స్తూనే గజ ఈతగాళ్లు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను సమాయత్తం చేశారు. ఖమ్మం కార్పొరేషన్లో 12డివిజన్లు, ఏదులాపురం మున్సిపాలిటీలో 12వార్డులను ముంపు ప్రాంతాలుగా గుర్తించారు. ఈ ప్రాంతా లను వరద ముంచెత్తితే ప్రజలకు ఆశ్రయం కల్పించేలా 11 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. కట్టుదిట్టంగా ఏర్పాట్లు వరదలపై కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అలాగే, పోలీస్ కమిషనర్ సునీల్దత్ పోలీస్ యంత్రాంగాన్ని అలర్ట్ చేశారు. ఉధృతంగా ప్రవహిస్తున్న చెరువులు, వాగుల వద్ద పోలీస్ పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. మత్య్సకారులు చేపల వేటకు వెళ్లవద్దని, పశువుల కాపరులెవరూ చెరువులు, వాగులు దాటొద్దని హెచ్చరించారు. నీటి ఉధృతి ఎక్కువగా ఉంటే వంతెనలు, చప్టాలపై రాకపోకలు నిలిపేస్తున్నారు. ఆపద తొలగే వరకు.. ఒకేసారి భారీ వర్షం పడి వరద ముంచెత్తితే తక్కువ సమయంలో తీవ్ర నష్టం వాటిల్లుతుంది. గత ఏడా ది ఇలాంటి అనుభవమే ఎదురైనందున ఈసారి ముందస్తు చర్యలకు ఉపక్రమించారు. డ్రెయిన్లలో మురుగునీరు నిల్వ ఉండకుండా సాఫీగా వెళ్లేలా శుభ్రం చేయిస్తూనే పారిశుద్ధ్య పనులపైనా దృష్టి సారించారు. కాగా, పోలీస్ కమిషనర్ సునీల్దత్, కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్య బుధవారం కాల్వొడ్డు, ప్రకాష్నగర్ ప్రాంతాల్లో మున్నేరు వరదను పరిశీలించి పరిస్థితులు అంచనా వేశారు. బుధవారం సాయంత్రం ఖమ్మంలోని కాల్వొడ్డు వద్ద మున్నేరు 10 అడుగుల మేర ప్రవహిస్తోంది. నేడు విద్యాసంస్థలకు సెలవు భారీ వర్షాల నేపథ్యాన అన్ని యాజమాన్యాల పరిధి విద్యాసంస్థలకు గురువారం సెలవు ప్రకటించినట్లు కలెక్టర్ అనుదీప్ తెలిపారు. అలాగే, ప్రజలు అప్ర మత్తంగా ఉంటూ అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని, నీటి ప్రవాహాలు దాటే ప్రయత్నం చేయొద్దని ఆయన సూచించారు.వాతావరణ శాఖ హెచ్చరికలతో ముందస్తు చర్యలు మున్నేటికి ఇరువైపులా పునరావాస కేంద్రాలు సిద్ధం చెరువులు, వాగుల వద్ద పెట్రోలింగ్ అందుబాటులోకి వలంటీర్లు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు నేడు విద్యాసంస్థలకు సెలవు16 అడుగుల వరద వస్తే మొదటి హెచ్చరిక.. కాల్వొడ్డు వద్ద మున్నేరు 16అడుగులకు చేరితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తాం. ఆ వెంటనే కాల్వొడ్డు, బొక్కలగడ్డ ప్రాంతాల్లోని వారిని పునరావాస కేంద్రాలకు తరలిస్తాం. నగరంలోని 12 డివిజన్ల పరిధిలో లోతట్టు ప్రాంతాలను గుర్తించాం. అక్కడి ప్రజలను అప్రమత్తం చేసేందుకు వలంటీర్లను సిద్ధం చేశాం. ఎవరెవరిని ఏ పునరావాస కేంద్రానికి తరలించాలో మ్యాపింగ్ కూడా చేశాం. – అభిషేక్ అగస్త్య, కమిషనర్, కేఎంసీటోల్ఫ్రీ, కంట్రోల్ రూమ్ నంబర్లు కార్యాలయం నంబర్లు కలెక్టరేట్ 1077, 90632 11298కేఎంసీ 83338 33696ఏదులాపురం 95156 85414ఖమ్మంరూరల్ తహసీల్ 83319 30583పోలీసులు డయల్ 100పోలీసు కమిషనరేట్ 87126 59111 -
వరదతో పాటే వ్యాధులు
● జిల్లాలో పెరుగుతున్న డెంగీ కేసులు, జ్వరాలు ● డెంగీ కేసులు 50 దాటడంతో అప్రమత్తత ● ఫీవర్ సర్వేలో వెలుగుచూస్తున్న జ్వరబాధితులు ఖమ్మంవైద్యవిభాగం: జిల్లాలో సీజనల్ జ్వరాలు విజృంభిస్తున్నాయి. ముఖ్యంగా డెంగీ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండడం ఆందోళన కలిగి స్తోంది. కొంతకాలంగా కురుస్తున్న వర్షాలతో పారిశుద్ధ్య సమస్య ఏర్పడి డెంగీ, వైరల్ జ్వరాలు పెరుగుతున్నాయని భావిస్తున్నారు. వైద్య, ఆరోగ్య శాఖ ముందస్తు చర్యలు తీసుకుంటున్నా కేసుల సంఖ్య ఎక్కువగానే ఉండడంతో జనం ఆస్పత్రుల బాట పడుతున్నారు. దీనికితోడు అధికారులు చేపట్టిన ఫీవర్ సర్వేలోనూ వందలాది కేసులు వెలుగు చూస్తున్నాయి. వెలుగులోకి వందలాది కేసులు గత నెలలో జిల్లాలో సీజనల్ వ్యాధుల ప్రభావం మొదలైంది. దీంతో వైద్య, ఆరోగ్య శాఖ అప్రమత్తమై పీహెచ్సీలు, అర్బన్ హెల్త్ సెంటర్లు, సబ్ సెంటర్ల పరిధిలో ఫీవర్ సర్వే చేపట్టింది. ఆశాలు, ఏఎన్ఎంలు ఇంటింటికీ వెళ్లి అనుమానితుల రక్త నమూనాలు సేకరించి మందులు పంపిణీ చేస్తున్నారు. పరిస్థితి తీవ్రత ఉన్న వారిని ఆస్పత్రులకు తరలించారు. జూలై 8నుంచి 24వ తేదీ వరకు మొదటి విడత చేపట్టిన ఫీవర్ సర్వేలో రెండు హైరిస్క్ ఏరియాలను జల్లెడపట్టారు. ఈమేరకు 342 ఇళ్లలో 1,382 మందిని పరీక్షించగా 46 మంది విషజ్వరాలతో భాదపడుతున్నట్లు గుర్తించారు. ఆపై జ్వరాల తాకిడి పెరగటంతో జూలై 28నుంచి రెండో విడత ఫీవర్ సర్వే చేపట్టగా ఇప్పటి వరకు 1,554 మంది జ్వరంతో బాధపడుతున్నట్లు తేలింది. డెంగీ.. ౖపైపెకి జిల్లాలో డెంగీ జ్వరాలు ప్రబలుతున్నాయి. ఈనెల 12వ తేదీకి 52 కేసులు అధికారికంగా వెలుగుచూశాయి. అనధికారికంగా కేసుల సంఖ్య మరింత ఎక్కువగా ఉండే అవకాశముంది. ఖమ్మం నగరంతో పాటు తిరుమలాయపాలెం, రఘునాథపాలెం, తల్లాడ తదితర మండలాల్లో కేసులు ఎక్కువగా వస్తున్నాయి. అయితే, డెంగీ చికిత్స పేరుతో కొన్ని ప్రైవేట్ ఆస్పత్రుల్లో రూ.70వేల నుండి రూ.లక్ష వరకు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. అసలైతే ప్రైవేట్ ఆస్పత్రుల్లో డెంగీ పరీక్షలకు అనుమతి లేకపోగా.. ఎలీసా పరీక్షల కోసం రక్త నమూనాలను పెద్దాస్పత్రిలోని ఐడీఎస్పీ ల్యాబ్కు పంపించాలి. కానీ పలు ఆస్పత్రుల్లో పరీక్షలు.. ఆపై చికిత్స పేరుతో దోచుకుంటున్నట్లు తెలుస్తోంది.ఫీవర్ సర్వే వివరాలు... సర్వే చేసిన గృహాలు 1,57,332 పరీక్షించిన వారు 4,37,911 ఫీవర్ కేసులు 1,554 నెలల వారీగా వైరల్ జ్వరాలు, డెంగీ కేసులు నెల వైరల్ జ్వరాలు డెంగీ జూన్ 5,947 01 జూలై 6,476 27 ఆగస్టు 2,596 21 (ఇప్పటివరకు)డెంగీ కేసులు అదుపులోనే... జిల్లాలో డెంగీ కేసులు అదుపులోనే ఉన్నాయి. కేసులు వెలుగు చూసిన ప్రాంతాల్లో ప్రత్యేక శిబిరాల ద్వారా వ్యాప్తిని కట్టడి చేశాం. ఇక సీజనల్ వ్యాధుల వ్యాప్తి నామమాత్రంగానే ఉంది. ఫీవర్ సర్వేతో ఎప్పటికప్పుడు మందులు ఇస్తుండడంతో ప్రభావం తగ్గిపోయింది. అయినా ప్రజలు పరిసరాల పరిశుభ్రత పాటిస్తూ జ్వరం లక్షణాలు ఉంటే ప్రభుత్వ ఆస్పత్రిలో పరీక్ష చేయించుకోవాలి. – బి.కళావతిబాయి, డీఎంహెచ్ఓ -
ఎంత వరద వస్తే ఎక్కడ నష్టం?
ఖమ్మంమయూరిసెంటర్: జిల్లాలో కురిసే వర్షంతో పాటు ఎగువ నుంచి వరద వస్తే మున్నేరు పోటెత్తే అవకాశముంది. గతేడాది సెప్టెంబర్ 1న తెల్లవారుజాము 4గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు వచ్చిన వరదతో పరీవాహక కాలనీలకు భారీ నష్టం ఎదురైంది. ఈమేరకు గత ఏడాది వరద అంచనా ఆధారంగా మున్నేటికి ఎన్ని అడుగుల వరద వస్తే ఎన్ని కాలనీల్లో ఎన్ని ఇళ్లు నీట మునుగుతాయో అధికారులు లెక్కలు తేల్చారు. ఇందులో భాగంగా 16 అడుగులు వరద వస్తే మునిగే ఇళ్లను గూగుల్ ఎర్త్ మ్యాప్లో ఆరెంజ్ జోన్గా, 20 అడుగులు వస్తే మునిగే ప్రాంతాన్ని బ్లూ జోన్గా, 25 అడుగుల వరదతో నష్టం ఎదురయ్యే ప్రాంతాన్ని పింక్ జోన్గా గుర్తించడమే కాక 32 అడుగుల వరద వస్తే ప్రభావితమయ్యే ప్రాంతాలను రెడ్ జోన్లో చేర్చారు. ఈమేరకు డివిజన్లు, ఇళ్ల వారీగా జోన్లను నిర్ధారించి వరద ఆధారంగా ఆన్లైన్లో నమోదుకు సిద్ధమయ్యారు. గతేడాది ముంపు ఆధారంగా మ్యాపింగ్