Khammam
-
బతికే భాగ్యమున్నా.. నమ్మిన సిద్ధాంతం కోసం
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం/సాక్షి, సిద్దిపేట/ మిరుదొడ్డి: రాష్ట్రం నుంచి అజ్ఞాతంలో ఉన్న చివరి మహిళా మావోయిస్టు రంగనబోయిన భాగ్య అలియాస్ రూపీ చివరకు ప్రాణాలు కోల్పోయింది. ఛత్తీస్గఢ్లోని కాంకేర్ జిల్లాలో సోమవారం తెల్లవారుజామున చోటు చేసుకున్న ఎన్కౌంటర్లో ఆమె చనిపోయింది. అబూజ్మాడ్ అడవిలోని చోటేబెటియా–పర్తాపూర్ పోలీస్స్టేషన్ ఏరియా పరిధి మచ్పల్లి దగ్గర మావోయిస్టు కమాండర్ రూపీ నేతృత్వాన దళం సంచరిస్తోందనే సమాచారంతో ఆదివారం రాత్రి నుంచి భద్రతా దళాలు కూంబింగ్ చేపట్టాయి. సోమవారం చోటు చేసుకున్న ఎదురుకాల్పుల్లో రూపీ మరణించినట్టు కాంకేర్ ఎస్పీ నిఖిల్ రఖేచా వెల్లడించారు. ఘటనాస్థలి నుంచి ఒక తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. మరో 12మంది మావోయిస్టులు ఘటనాస్థలం నుంచి తప్పించుకున్నట్టు సమాచారం. దీంతో మచ్పల్లి అడవుల్లో కూంబింగ్ కొనసాగిస్తున్నామని పోలీసులు తెలిపారు.చివరి వరకు అక్కడే...ఎన్ని ఒత్తిళ్లు ఎదురైనా, లొంగిపొమ్మని ఎందరు చెప్పినా నమ్మిన సిద్ధాంతం కోసం చివరి వరకు పోరాడుతానని చెప్పిన రూపీ అలాగే కొనసాగింది. ఈ ఏడాది మార్చి 31వ తేదీ లక్ష్యంగా కేంద్రం చేపట్టిన ఆపరేషన్ కగార్ ప్రభావంతో దండకారణ్యంలో మావోయిస్టులకు ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యాయి. నలువైపులా ఒత్తిడి పెరగడం, కనీసం తినడానికి తిండి, తాగడానికి నీరు కూడా దళ సభ్యులకు లభించని గడ్డు పరిస్థితులు ఉన్నాయి. రహస్య శిబిరం నుంచి కాలు బయటపెడితే ఎన్కౌంటర్ కావడం తథ్యమనే పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఆ పార్టీకి చెందిన కేంద్ర కమిటీ సభ్యులు సైతం లొంగుబాట పట్టారు. ఈ క్రమంలోనే రూపీని సైతం లొంగిపోవాలని కోరుతూ కాంకేర్ ఎస్పీ రెండుసార్లు పత్రికా ప్రకటన విడుదల చేశారు. లొంగుబాటుకు మార్గం సుగమం చేస్తామని అక్కడి విలేకరులు సైతం ఆమెకు మూడుసార్లు లేఖలు పంపించారు. అయితే, ఈ ప్రతిపాదనలను ఆమె తిరస్కరించినట్టు స్థానిక మీడియా ద్వారా తెలిసింది. ఆఖరి వరకు ఉద్యమంలోనే ఉంటానంటూ మధ్యవర్తుల ద్వారా సమాధానం పంపినట్టు తెలిపారు. అన్నట్టుగానే చివరకు రూపీ ఎన్కౌంటర్లోనే ప్రాణాలు కోల్పోయారు. శారీరక దివ్యాంగురాలైన రూపీ పట్టుదలతో రెండు దశాబ్దాలకు పైగా అజ్ఞాత జీవితం గడిపింది. కగార్ నిర్బంధం మధ్య, కేంద్రం విధించిన గడువు దాటే వరకు భద్రతా దళాల కంట పడకుండా ఆమె రహస్య జీవితం గడపడం విశేషం.2002లో అజ్ఞాతంలోకి...సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం ధర్మారం గ్రామానికి చెందిన రంగనబోయిన ఎల్లవ్వ–నర్సయ్య దంపతులకు పెద్ద కూతురైన భాగ్య 2002లో మావోయిస్టుల కార్యకలాపాలకు ఆకర్షితురాలై అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. అప్పటి నుంచి స్వగ్రామానికి తిరిగి రాలేదు. తొమ్మిదేళ్ల క్రితం తండ్రి నర్సయ్య చనిపోయినా, కడసారి చూపు కోసం భాగ్య రాలేదు. ఎన్కౌంటర్లో భాగ్య మృతి చెందినట్టు కుటుంబ సభ్యులకు సమాచారం అందటంతో ధర్మారం శోకసముద్రంలో మునిగిపోయింది. భాగ్య మృతదేహాన్ని తీసుకొచ్చేందుకు గ్రామ సర్పంచ్ చెప్యాల శ్రీనివాస్ నేతృత్వంలో గ్రామస్తులు బయలుదేరి వెళ్లారు.శవమై వస్తున్నవా బిడ్డా....‘లొంగిపోయి ప్రాణాలతో వస్తావనుకున్న బిడ్డా.. చివరకు మాకు దు:ఖాన్ని మిగిల్చి శవమై వస్తున్నవా బిడ్డా..వృద్ధాప్యంలో నేనే చనిపోతే నువ్వు వస్తవో రావో అనుకున్నా బిడ్డా.. ఇప్పుడు నీ శవాన్ని చూసి ఎలా తట్టుకోవాలి బిడ్డా... మీ అయ్య సచ్చినా నువ్వు రాలేదు బిడ్డా’అంటూ... మావోయిస్టు భాగ్య అలియాస్ రూపీ తల్లి ఎల్లవ్వ రోదించిన తీరు పలువురిని కంటతడి పెట్టించింది. ఎన్కౌంటర్లో అక్క మృతి చెందిన విషయం తెలిసి భాగ్య చెల్లెళ్లు కవిత, మమత, తమ్ముడు కుమార్లు బోరున విలపించారు. -
ఫలితాలు అంతంతే..
● గతం కంటే కూడా తక్కువగా నమోదు ● ఫస్టియర్లో సగం కళాశాలల్లో 50 శాతం దాటని వైనం ● కేజీబీవీల్లో కాస్త మెరుగ్గా ఉత్తీర్ణతప్రభుత్వ కాలేజీల్లో 2025–26 హాజరైన విద్యార్థులు ఉత్తీర్ణత శాతం ఫస్టియర్ 2,858 1,394 48.78 సెకండియర్ 2,345 1,497 63.84 2024–25 హాజరైన విద్యార్థులు ఉత్తీర్ణత శాతం ఫస్టియర్ 2,340 1,146 48.97 సెకండియర్ 2,056 1,353 65.81ఖమ్మం సహకారనగర్: రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తోంది. ఈక్రమంలోనే జూనియర్ కాలేజీలకు భవనాలు, ఇతర వసతులు కల్పించడమే కాక ప్రయోగశాలల్లో సామగ్రి కొనుగోళ్లకు నిధులు కేటాయించింది. ఇదంతా బాగానే ఉన్నా తాజాగా విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాల్లో జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఫలితాలు అంతంత మాత్రంగానే నమోదు కావడం గమనార్హం. జిల్లాలో 21 ప్రభుత్వ జూనియర్ కాలేజీలకు గాను ఎక్కడ కూడా ఆశించిన స్థాయిలో ఉత్తీర్ణత నమోదు కాకపోవడం చర్చనీయాంశంగా మారింది. 50శాతమూ దాటలేదు... జిల్లాలో 21 ప్రభుత్వ జూనియర్ కాలేజీలు కొనసాగుతున్నాయి. ఇందులో ఏ కాలేజీలో కూడా ప్రథమ సంవత్సరంలో ఉత్తీర్ణత శాతం 50శాతానికి మించలేదు. ద్వితీయ సంవత్సరంలో సైతం సగం కాలేజీల్లోనే ఉత్తీర్ణత 50శాతం దాటింది. గతం కంటే ఉత్తీర్ణత శాతం కాస్తే తగ్గినా ఎందుకు ఇలా జరిగిందనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ప్రథమ సంవత్సరంలో నాగులవంచ జూనియర్ కళాశాల నుంచి హాజరైన 98మంది విద్యార్థులకు గాను 65మంది ఉత్తీర్ణత సాధించగా 66.33శాతం నమోదైంది. ద్వితీయ సంవత్సరం విషయానికొస్తే బనిగండ్లపాడు జూనియర్ కాలేజీలో 60మందికి 56మంది పాస్ కావడంతో 93.33 శాతం ఉత్తీర్ణత నమోదైంది. సాధించారు. మొదటి, ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో జిల్లాలో ఇవే అత్యధికం కావడం గమనార్హం. ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో 91.03 శాతంతో నాగులవంచ కాలేజీ రెండో స్థానాన నిలిచింది. ఇక ఏన్కూరు కాలేజీ మొదటి, ద్వితీయ సంవత్సరం రెండింట్లోనూ చివరి స్థానాన నిలిచింది. ఈ కాలేజీ నుంచి మొదటి సంవత్సరం పరీక్షలకు 78మంది విద్యార్థులు హాజరైతే కేవలం 21మంది(26.92 శాతం), ద్వితీయ సంవత్సరంలో 73మందికి గాను 28మందే ఉత్తీర్ణత (38.36శాతం) ఉత్తీర్ణత సాధించగలిగారు.జిల్లాలో 14 కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాలు ఉన్నాయి. ప్రథమ, ద్వితీయ సంవత్సరం కలిపి 1,440మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా 1,243మంది ఉత్తీర్ణత సాధించగా 86శాతం ఉత్తీర్ణత సాధించాయి. వీటిలో చింతకాని కేజీబీవీ విద్యార్థినులు వంద శాతం ఉత్తీర్ణత సాధించడం విశేషం. అలాగే, బోనకల్ కేజీబీవీలో 98.08శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఇంకెకక్కడా వంద శాతం నమోదు కాకున్నా ఫలితాలు కాస్త మెరుగ్గానే ఉన్నాయని చెప్పొచ్చు. లింగాల కేజీబీవీ 68శాతంతో చివరి స్థానాన నిలిచింది. కాగా, చింతకాని కేజీబీవీ విద్యార్థిని బి.హారిక బైపీసీలో కేజీబీవీల్లోనే రాష్ట్ర మొదటి స్థానాన నిలిచింది. -
నిబంధనలు పాటిస్తేనే ప్రమాదాలకు చెక్
ఖమ్మంరూరల్: వాహనదారులంతా రోడ్డు భద్రత, సురక్షితమైన ప్రయాణంపై అవగాహన పెంచుకుంటే రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయని పోలీసు కమిషనర్ సునీల్దత్ తెలిపారు. ‘అరైవ్– అలైవ్’ కార్యక్రమంలో భాగంగా ఏదులాపురం మున్సిపాలిటీ పరిధి వరంగల్ క్రాస్రోడ్డులో సోమవారం ఏర్పాటుచేసిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. జిల్లాలో జరుగుతున్న ప్రమాదాల్లో పరిశీలిస్తే ఎక్కువగా మానవ నిర్లక్ష్యంతోనే జరుగుతున్నట్లు తేలిందన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపడం, అతివేగం, ట్రాఫిక్ నిబంధనలను పాటించకపోవడం, హెల్మెట్, సీటుబెల్ట్ వాడకంలో అలసత్వం వంటి వాటితో ప్రమాదాలు నిత్యకృత్యమయ్యాయని చెప్పారు. ఈమేరకు వాహనదారులకు అవగాహన కల్పించేలా సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సీఐ ముష్క రాజు, విద్యుత్ శాఖ ఏఈ కోటేశ్వరరావు, వివిధ శాఖల ఉద్యోగులు పాల్గొన్నారు. రోడ్డు భద్రత.. అందరి బాధ్యత ఖమ్మం మామిళ్లగూడెం: నిబంధనలు పాటిస్తూనే రహదారి భద్రతను అందరూ బాధ్యతగా భావించాలని ఆర్టీసీ ఖమ్మం రీజినల్ మేనేజర్ సరిరామ్, రవాణా శాఖ అధికారి దినేష్ సూచించారు. ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’లో భాగంగా సోమవారం ‘అరైవ్ – అలీవ్’ పేరిట అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఖమ్మం పాత బస్టాండ్ నుంచి మయూరి సెంటర్ మీదుగా బస్ డిపో వరకు సాగిన ర్యాలీలో వారు మాట్లాడారు. ఆర్టీసీ ఖమ్మం డీఎం శివప్రసాద్, ఆర్టీసీ, రవాణా, పోలీసు శాఖల ఉద్యోగులు పాల్గొన్నారు.పోలీసు కమిషనర్ సునీల్దత్ -
మహిళా సాధికారతకు కట్టుబడి ఉన్నాం..
ఖమ్మం అర్బన్: మహిళల ఆదాయం పెరిగితేనే కుటుంబ సంక్షేమం సాధ్యమవుతుందని.. ఈవిషయాన్ని పరిగణనలోకి తీసుకున్న తమ ప్రభుత్వం మహిళా సాధికారతకు కట్టుబడి పనిచేస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. ఖమ్మంలోని క్యాంపు కార్యాలయంలో సోమవారం ఆయన మైనార్టీ మహిళలకు కుట్టుమిషన్లు పంపిణీ చేశారు. ఆతర్వాత టీఎన్జీవోస్ హాల్లో అంగన్వాడీ టీచర్లకు సెల్ఫోన్లు అందజేశారు. ఈ కార్యక్రమాల్లో మంత్రి మాట్లాడుతూ పేద మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోందన్నారు. స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఏటా రూ.20 వేల కోట్ల మేర వడ్డీ లేని రుణాలు అందిస్తున్నామని తెలిపారు. అంతేకాక ఉచిత బస్సు ప్రయాణానికి రూ.10వేల కోట్లు వ్యయం చేస్తున్నట్లు చెప్పారు. కాగా, ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా ఖమ్మం నగరంలో 2,500 ఇళ్లు మంజూరు చేయగా, వచ్చే ఏడాది మరో 3,500మంది లబ్ధిదారులు ప్రయోజనం పొందనున్నారని తెలిపారు. అంగన్వాడీ టీచర్లు సేవా దృక్పథంతో విధులు నిర్వర్తించాలని సూచించారు. చిన్నచిన్న సమస్యల పేరుతో ఉద్యమాలు చేయొద్దని సూచించిన ఆయన... వారి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని హామీ ఇచ్చారు. జిల్లాలోని అన్ని అంగన్వాడీ కేంద్రాలకు కొత్త భవనాలను మంజూరు చేయగా త్వరలోనే పూర్తి చేస్తామని మంత్రి తుమ్మల తెలిపారు. అనంతరం ఖమ్మం నగరపాలక సంస్థ కొనుగోలు చేసిన రహదారులు ఊడ్చే మూడు యంత్రాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అభిషేక్ అగస్త్య, మేయర్ పునుకొల్లు నీరజ, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహారా, జిల్లా సంక్షేమ అధికారి వేల్పుల విజేత, మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి ముజాహిద్, కార్పొరేటర్లు, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల -
అంతర్ధానం
ఎంతో వేదనతో కొన్నేళ్లపాటు శ్రీరామనవమి వేడుకలు.. ఆ తర్వాత మిథిలా స్టేడియానికి మార్చినా.. భక్తుల రద్దీ, వర్షాల వేళ నిత్యకల్యాణం, హోలీ రోజు పసుపు కొట్టి రామయ్య పెళ్లి పనులకు శ్రీకారం, రామదాసు జయంతికి సంగీతోత్సవాలు పండితులు ఎస్టీజీ శ్రీమన్నారాయణాచార్యుల సంస్కృత పాఠాలు.. ఆలయ హుండీ లెక్కింపు, ఆదాయ గణనా.. నవమి, ముక్కోటికి లడ్డూల తయారీ.. సత్యనారాయణ స్వామి వ్రతాలు.. ఇలా అన్నీ నా ఒడిలోనే 45 ఏళ్లుగా రామయ్య ఉత్సవాల్లో సేవలు అందించాను. ఉత్తర మెట్లు తొలగించాక భక్తులకు మార్గంగా, వీవీఐపీలు, వీఐపీల దర్శనానికి స్వాగత ద్వారంలా నిలిచాను. ఇంకా ఏళ్లపాటు సేవలు అందించాలని ఉన్నా.. పెరుగుతున్న భక్తుల రద్దీ దృష్ట్యా.. రాములోరి ఆలయ ఆధునికీకరణ పనుల్లో నా అంతర్ధానం.. ఎంతో వేదనకు గురిచేస్తోంది. రామయ్య ఆలయం మరింత అందంగా ముస్తాబవుతుందంటే.. భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందుతాయంటే.. నేనెలా అడ్డుగా ఉండగలను. అందుకే తొలగిపోతున్నా.. అయినా ఎక్కడికెళ్తాను లెండీ.. మీ మదిలో చిరకాల జ్ఞాపకంగా నిలిచే ఉంటా. భక్తిప్రపత్తులతో చిత్రకూట మండపంచిత్రకూట మండపం భద్రాచలం: చిత్రకూట మండపాన్ని శ్రీ భద్రాచల సీతారామాలయ ఉద్దరణ సంఘం ఆధ్వర్యంలో 45 ఏళ్ల క్రితం నిర్మించారు. అప్పటి ఉప ప్రధాని మొరార్జీ దేశాయ్ జూలై 15, 1967లో శంకుస్థాపన చేయగా, 1982లో ఏప్రిల్ 4న నాటి దేవాదాయ శాఖ మంత్రి పీవీ చౌదరి ప్రారంభించారు. అప్పటి నుంచి ఆలయంలో జరిగే పలు ఉత్సవాలకు వేదికగా నిలుస్తోంది. ప్రభుత్వం రామాలయ ఆధునికీకరణ పనుల్లో భాగంగా చిత్రకూట మండపాన్ని పూర్తిగా తొలగించనున్నారు. మరో రెండు, మూడు రోజుల తర్వాత ఇక కనిపించదు. -
స్నేహితుడి కుమార్తెకు అండగా పూర్వ విద్యార్థులు
తిరుమలాయపాలెం: కలిసి చదువుకున్న వారిలో ఎవరైనా విధి వక్రీకరించి ప్రాణాలు కోల్పోతే వారి పిల్లల చదువులకు గాను పూర్వ విద్యార్థులు అండగా నిలుస్తున్నారు. మండలంలోని పిండిప్రోలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 1994–95 బ్యాచ్ విద్యార్థులు 2009లో కలిసినప్పుడు తీసుకున్న నిర్ణయాన్ని కొనసాగిస్తున్నారు. ఇటీవల ఈ బ్యాచ్కు చెందిన ఐతనబోయిన రవికుమార్ అనారోగ్యంతో మృతి చెందగా ఆయన కుమార్తె మైత్రి పేరిట రూ.26వేల ఫిక్స్్డ్ డిపాజిట్ బాండ్ను సోమవారం అందజేశారు. గతంలో రూ.1.50లక్షలతో పాఠశాలలో వేదిక నిర్మించగా, 2019లో పెరుగు ఉపేందర్ కుమార్తె పేరిట రూ. 42 వేల ఫిక్స్డ్ డిపాజిట్ అందించారు. ఈ కార్యక్రమంలో మీగడ సైదులు, మేకల సత్యనారాయణ, మడికంటి స్కైలాబ్, రామనబోయిన వెంకటేశ్వర్లు, టి.వెంకటేశ్వర్లు, భాషబోయిన వీరభద్రం పాల్గొన్నారు. -
దళితులపై కొనసాగుతున్న వివక్ష..
ఖమ్మంమయూరిసెంటర్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దళిత వర్గాలకు సంక్షేమ పథకాల అమలులో వివక్ష కనబరుస్తున్నాయని దళిత హక్కుల పోరాట సమితి(డీహెచ్పీఎస్) రాష్ట్ర అధ్యక్షుడు ఏసురత్నం విమర్శించారు. సబ్ ప్లాన్ నిధులను కేవలం బడ్జెట్లో కేటాయిస్తున్నా పూర్తి స్థాయిలో వినియోగించడం లేదని తెలిపారు. డీహెచ్పీఎస్ జిల్లా మహాసభ సోమవారం ఖమ్మంలో నిర్వహించగా ఆయన మాట్లాడుతూ దశాబ్దాలుగా దళితుల కోసం కేటాయిస్తున్న నిధులు పక్కదారి పడుతుండడంతో ఆర్థికంగా, సామాజికంగా వెనకబడిపోతున్నారని తెలిపారు. ఈ ఏడాది బడ్జెట్లోనూ 20 శాతం ఉన్న దళితులకు 16 శాతమే కేటాయింపులు చేశారని, అలాకాకుండా జనాభా దామాషా ప్రకారం నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ మహాసభలో సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి జమ్ముల జితేందర్రెడ్డి, డీహెచ్పీఎస్ నాయకులు యంగల ఆనందరావు, పగిడిపల్లి ఏసు, తడికమళ్ల ఏబు, తోటపల్లి సీతారాములు, మామిడాల కిరణ్, యామాల గోపాల్రావు, సృజన, వరదా నర్సింహారావు, నారపోగు వసంతరావు తదితరులు పాల్గొన్నారు. జిల్లా నూతన కమిటీ ఎన్నిక.. డీహెచ్పీఎస్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులుగా పగిడిపల్లి ఏసు, యంగల ఆనందరావును మహాసభ ఏకగ్రీవంగా ఎన్నుకుంది. మొత్తం 31 మంది కౌన్సిల్ సభ్యులు, 18మంది కార్యవర్గ సభ్యులతో పాటు 11మంది ఆఫీస్ బేరర్లను ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షుడిగా తడికమళ్ల ఏబు, ఉపాధ్యక్షులుగా నాగేశ్వరరావు, సీతారాములు, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా యామాల గోపాలరావు, సహాయ కార్యదర్శులుగా వరదా నర్సింహారావు, మామిడాల కిరణ్, నారపోగు వసంతరావు, కోశాధికారిగా సృజన ఎన్నికయ్యారు.డీహెచ్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఏసురత్నం -
ముగిసిన పరీక్షలు.. మురిసిన విద్యార్థులు
పదో తరగతి వార్షిక పరీక్షలు సోమవారం ముగిశాయి. చివరి పరీక్ష రాసిన విద్యార్థులు సంతోషంగా కేంద్రాల నుంచి బయటకు వచ్చారు. అనంతరం పరీక్షలు ఎలా రాశారు.. ఇంటర్లో ఏ కాలేజీలో చేరుతున్నారనే వివరాలు చర్చించుకున్నారు. ఆ తర్వాత స్నేహితులంతా ఆటోగ్రాఫ్లు, ఫోన్ నెంబర్లు ఇచ్చి పుచ్చుకుని ఇళ్లకు బయలుదేరారు. – స్టాఫ్ ఫొటోగ్రాఫర్ -
మాతృ, శిశు మరణాల కట్టడికి కార్యాచరణ
● గర్భిణుల గుర్తింపు, పర్యవేక్షణ తప్పనిసరి ● పాఠశాలల్లో పిల్లల భద్రతకు ప్రత్యేక చర్యలు ● కలెక్టర్ అనుదీప్ దురిశెట్టిఖమ్మం వైద్యవిభాగం: జిల్లాలో మాతృ, శిశు మరణాలను పూర్తిగా అరికట్టడమే లక్ష్యంగా అధికారులు కార్యాచరణ రూపొందించాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం ఆయన అదనపు కలెక్టర్లు డాక్టర్ పి.శ్రీజ, పి.శ్రీనివాసరెడ్డితో కలిసి అధికారులతో సమీక్షించారు. జిల్లాలో ప్రతీ ప్రసవం సురక్షితంగా జరుగుతుందనే భావన వచ్చేలా ప్రతీ పీహెచ్సీ పరిధిలో గర్భిణులను గుర్తించి నిరంతరం పర్యవేక్షించాలని తెలిపారు. అలాగే, అంగన్వాడీ టీచర్లు పాఠశాలకు వెళ్లనిపిల్లలు, అనాథలు, బాల కార్మికులు, సదరం కేటగిరీ పిల్లల వివరాలు సేకరించి ప్రభుత్వ పథకాలు అందేలా చూడాలని చెప్పారు. అంతేకాక పాఠశాలల్లో బాలల భద్రతకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పిల్లల నుంచి ఫిర్యాదులు స్వీకరించేలా ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయాలని సూచించారు. ● ఖమ్మంక్రైం: రోడ్డు ప్రమాదాల నివారణకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అనుదీప్ సూచించారు. కలెక్టరేట్లో అధికారులతో సమావేశమైన ఆయన మాట్లాడుతూ రోడ్డు భద్రతపై విస్తృత అవగాహన కల్పిస్తూ, గుర్తించిన బ్లాక్ స్పాట్ల వద్ద ప్రమాదాల కట్టడికి చర్యలు చేపట్టాలని తెలిపారు. అంతేకాక రాహ–వీర్, పీఎం రాహత్ పథకాలపై విస్తృత ప్రచారం నిర్వహించాలని చెప్పారు. అలాగే, ప్రైవేట్ పాఠశాలు, వాహనాల డ్రైవర్ల ఫిట్నెస్, ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. కాగా, ఈనెల 16న మండల స్థాయిలో సభల నిర్వహణ, ప్రభుత్వ కార్యాలయాల ప్రాంగణాల్లో పరిశుభ్రతపై సూచనలు చేశారు. ● ఖమ్మం సహకారనగర్: జిల్లాలో పరిపాలన మరింత సమర్థవంతంగా చేపడుతూ ప్రజలకు వేగవంతమైన సేవలు అందించాలని కలెక్టర్ అనుదీప్ ఆదేశించారు. కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో సమావేశమైన ఆయన మాట్లాడుతూ శాఖల మధ్య సమన్వయం కోసం ప్రతీ సోమవారం సమావేశాలు నిర్వహించాలని తెలిపారు. వైరా ప్రాంతంలో మట్టి తరలింపునకు అనుమతులు, ఈ–ఆఫీస్ ద్వారా ఫైళ్ల పరిష్కారం, పంట ఉత్పత్తులు తరలించే వాహనాలకు జీపీఏస్ ట్రాకింగ్ ఏర్పాటు, తాగునీటి సమస్యల పరిష్కారంపై సూచనలు చేశారు. కాగా, హెచ్పీవీ వ్యాక్సినేషన్లో జిల్లాను ముందు వరుసలో నిలిపిన వైద్య అధికారులను కలెక్టర్ అభినందించారు. ● ప్రజలు అందించే ప్రతీ ఫిర్యాదును పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని ల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి స్పష్టం చేశారు. కలెక్టరేట్లో ప్రజావాణిలో భాగంగా ఫిర్యాదులు, వినతిపత్రాలు స్వీకరించాక ఆయన మాట్లాడారు. ఈ సమావేశాల్లో డీఆర్ఓ ఏ.పద్మశ్రీ, జెడ్పీ సీఈఓ దీక్షారైనా, డీఎంహెచ్ఓ రామారావు, డీసీహెచ్ఎస్ రాజశేఖర్గౌడ్, డీడబ్ల్యూఓ వేల్పుల విజేత, డీసీపీఓ విష్ణువందన, ఇన్చార్జ్ ఆర్టీ జే.ఎన్.శ్రీనివాసరావు, ఏఎంవీఐలు జి. దినేష్, జి.సుమలత, ఆర్టీఏ మెంబర్ జి.వెంకన్న, కలెక్టరేట్ ఏఓ కె.శ్రీనివాసరావు పాల్గొన్నారు. ● జిల్లాలో నానాటికీ ఉష్ణోగ్రత పెరుగుతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ అనుదీప్ ఓ ప్రకటనలో సూచించారు. అత్యవసరమైతే తప్పబయటకు రావొద్దని, చిన్నారులు, వయోవృద్ధులు ఇంటికే పరిమితం కావాలని తెలిపారు. ఎండలో పనిచేసే కార్మికులు తరచుగా నీటితో పాటు ఓఆర్ఎస్ ద్రావణాన్ని తీసుకుంటే వడదెబ్బ బారిన పడకుండా కాపాడుకోవచ్చని చెప్పారు. ఎవరికై నా వడదెబ్బ లక్షణాలు కనిపిస్తే సమీప ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు.ఖమ్మం సహకారనగర్: రెవెన్యూ వ్యవస్థలో నిర్లక్ష్యాన్ని సహించేది లేదని, ఎవరైనా అలా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి హెచ్చరించారు. కలెక్టరేట్లో ఆయన భూసేకరణ, భూభారతి, సాదా బైనామా, ఇతర రెవెన్యూ సంబంధిత అంశాలపై అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి, కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్యాదవ్తో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అభివృద్ధి పనులు సకాలంలో పూర్తయ్యేలా భూసేకరణలో వేగం పెంచాలన్నారు. అలాగే, భూభారతి, సాదాబైనామా దరఖాస్తుల పరిశీలనలో వేగం పెంచి సమయం నిర్దేశించుకుని పరిష్కరించాలని తెలిపారు. పట్టాదారు యాజమాన్యంపై సందేహాలు ఉంటే నిబంధనల ప్రకారం రద్దు చేయాలే తప్ప స్లాట్ పెండింగ్లో ఉంచొద్దని సూచించారు. -
దాడి చేశారని పోలీసులకు ఫిర్యాదు
వైరా: అకారణంగా తమను కొట్టి గాయపరిచారని వైరా మున్సిపాలిటీ పరిధి గండగలపాడుకు చెందిన పొన్నెకంటి కుసుమాంబ సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తనతోపాటు భర్త సత్యనారాయణ, కుమారుడు సునీల్పై కక్ష పెంచుకున్న మాజీ వార్డు కౌన్సిలర్ భర్త కర్నాటి హన్మంతరావు, ఆయన తమ్ముడు రవి అకారణంగా తమ కుమారుడిని కొట్టారని తెలిపారు. దీనిని అడ్డుకోగా తమను అసభ్య పదజాలంతో దూషిస్తూ దాడి చేశారని వెల్లడించింది. ఘటనతో తన చేయి విరగగా పోలీసులకు ఫిర్యాదు చేశానని పేర్కొన్నారు. -
విద్యుత్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
ఖమ్మంవ్యవసాయం: విద్యుత్ కార్మికుల సమస్యలు సత్వరమే పరిష్కరించాలని పలు కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మె సోమవారం ఆరో రోజుకు చేరింది. ఖమ్మం ట్రాన్స్కో కార్యాలయం వద్ద శిబిరాన్ని వివిధ సంఘాల నాయకులు మందపాటి సత్యనారాయణరెడ్డి, సీతారాం గోపాల్, ఆర్.సత్యనారాయణ, నాగేంద్రకుమార్, టి.శేషగిరిరావు, వెంకటరమణారెడ్డి, సురేష్, శ్రీనివాస్, రమేష్, నాగేశ్వరరావు, ఎం.ప్రసాద్, కోక్యానాయక్ సందర్శించి సంఘీభావం తెలిపారు. ఉమ్మడి జిల్లా కార్మిక సంఘం జేఏసీ చైర్మన్ వల్లాల యుగంధర్, కన్వీనర్ అన్వర్ పాషా ఆధ్వర్యాన జరుగుతున్న సమ్మెలో సురేందర్రెడ్డి, ఉపేందర్, రామకృష్ణ, దాసు, రామ్మోహన్, అజారుద్దీన్, నరసింహారావు, వెంకటరెడ్డి, మంగ్యానాయక్, సైదులు, నరేష్, నాగరాజు, మోబిన్, రమాదేవి, నాగలక్ష్మి, సంధ్యారాణి, నస్రీన్, రవి, భద్రు, అనంతయ్య, సురేష్, జానీ పాల్గొన్నారు. ● ఖమ్మం మామిళ్లగూడెం: న్యాయమైన డిమాండ్ల సాధనకు సమ్మె చేస్తున్న విద్యుత్ కార్మికులకు బీజేపీ సంపూర్ణ మద్దతు ఉంటుందని పార్టీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు తెలిపారు. సమ్మె శిబిరాన్ని పరిశీలించిన ఆయన మాట్లాడుతూ అహర్నిశలు శ్రమించే కార్మికుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేశారు. నాయకులు సుబ్బారావు, గుత్తా వెంకటేశ్వర్లు, వాకదాని రామకృష్ణ, వెంకన్న తదితరులు పాల్గొన్నారు. -
రైతు ఇంట్లో నెమలి స్వాధీనం
ఖమ్మంరూరల్: ఖమ్మంరూరల్ మండలంలోని తీర్థాలలోని ఓ రైతు ఇంట్లో నెమలి ఉందన్న సమాచారంతో అటవీ శాఖాధికారులు సోమవారం తనిఖీలు చేపట్టారు. గ్రామానికి చెందిన రైతు మాలోత్ కిషన్ మొక్కజొన్న చేనులో ఇటీవల గాయాలతో పడి ఉన్న నెమలిని తీసుకొచ్చి ఇంట్లో సపర్యలు చేయడమే కాక బోనులో పెట్టి మేత వేస్తున్నాడు. ఈ విషయం తెలియడంతో కూసుమంచి డిప్యూటీ రేంజర్ కేవీ.రామారావు గ్రామానికి వెళ్లి నెమలిని స్వాధీనం చేసుకున్నారు. అయితే, ఉద్దేశపూర్వకంగా తీసుకొచ్చారా, లేక మరేదైనా కారణం ఉందా అన్న కోణంలో విచారిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఒకవేళ కావాలనే బంధించినట్లే తేలితే వణ్యప్రాణి సంరక్షణ చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. బొగ్గు టిప్పర్ దగ్ధంమణుగూరుటౌన్: ిసంగరేణి మణుగూరు ఏరియాలోని కొండాపురం కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్(కేసీహెచ్పీ) వద్ద షార్ట్ సర్క్యూట్తో బొగ్గు టిప్పర్ సోమవారం దగ్ధమైంది. పట్టణంలోని శేషగిరినగర్కి చెందిన కుమార్ టిప్పర్కు డీజిల్ పైప్ లీకేజీ ఉన్నట్లు సమాచారం. కాగా రోజూలాగే బొగ్గు లోడింగ్ కోసం రాగా, మధ్యాహ్నం రెండు గంటలకు ఓవర్ హీట్ కారణంగా టిప్పర్లో మంటలు చెలరేగి ఎగసిపడ్డాయి. దీంతో టిప్పర్ పూర్తిగా దగ్ధమైంది. కాగా, ప్రమాద సమయంలో టిప్పర్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. మహిళ ఆత్మహత్యసుజాతనగర్: అప్పు తీసుకుని తిరిగి చెల్లించకపోవడంతో అక్కాచెల్లెళ్ల మధ్య గొడవ జరిగి ఒకరు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన సుజాతనగర్ మండలంలో సోమవారం జరిగింది. ఎస్సై రమాదేవి కథనం ప్రకారం... మండలంలోని లెనిన్నగర్కు చెందిన తమ్మిశెట్టి నాగమణి (48) తన చెల్లెలుకు ఏడాదిన్నర క్రితం రూ.2 లక్షలు అప్పుగా ఇచ్చింది. తిరిగి ఇవ్వాలని అడుగగా, చెల్లెలు పలుమార్లు వాయిదాలు వేసుకుంటూ వచ్చింది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య గొడవలు జరిగాయి. దీంతో మనస్తాపం చెందిన అక్క నాగమణి ఈనెల 8న ఎలుకల మందు తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు ఖమ్మం ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఐదు గ్రామాలు వచ్చేవరకు పోరు
భద్రాచలంటౌన్: ఏపీలో విలీనంచేసిన ఐదు పంచాయతీలను తిరిగి తెలంగాణలో తెచ్చేందుకు నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు పోరాడతానని కేంద్ర మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి అన్నారు. రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్లో విలీనమైన ఐదు గ్రామ పంచాయతీలను తిరిగి తెలంగాణలో (భద్రాచలంలో) కలపాలని డిమాండ్ చేస్తూ ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం పట్టణంలో ‘భద్రాద్రి పునరేకీకరణ’ సభ నిర్వహించారు. ఆమె జ్యోతి ప్రజ్వలన చేసి సభను ప్రారంభించి మాట్లాడారు. భద్రాద్రి ప్రాంత ఆడబిడ్డగా ఈ నేల, హక్కుల కోసం పోరాడతానని అన్నారు. ఇది భద్రాద్రి రామయ్య ఆదాయంతో ముడిపడి ఉన్న సున్నితమైన సమస్య అని పేర్కొన్నారు. సమస్యను గతంలోనే పార్లమెంటులో ప్రస్తావించానని, కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నామని చెప్పా రు. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయు డు ఈ విషయంలో సానుకూలంగా స్పందించి ముందడుగు వేయాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి కూడా త్వరలోనే సానుకూల నిర్ణయం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సమస్య పరిష్కారం కాకపోతే పాదయాత్ర నిర్వహిస్తానని తెలిపారు. ముఖ్యమంత్రుల స్థాయిలో చర్చలు జరగాలి.. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పరస్పరం చర్చించుకుని, కేంద్ర ప్రభుత్వానికి అధికారిక ప్రతి పాదనలు పంపడం ద్వారా ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు అన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, భౌగోళిక ఇబ్బందులను తొలగించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ పొదెం వీరయ్య మా ట్లాడుతూ రాష్ట్ర విభజన సమయంలో ఆర్డినెన్స్ ద్వారా ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్లో కలపడం వల్ల ఈ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. కనీసం ఐదు గ్రామ పంచాయతీలనైనా తిరిగి తెలంగాణలో విలీనం చేసేలా ఇద్దరు ముఖ్యమంత్రులు చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి రాకేష్ రెడ్డి మాట్లాడుతూ ఏడు మండలాలను అశాసీ్త్రయంగా ఆంధ్రప్రదేశ్లో కలపడంతో స్థానిక ప్రజలు 11 ఏళ్లుగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. సాంకేతికంగా ఆ ఐదు గ్రామాలు ఏపీలో ఉన్నా, అక్కడి ప్రజల మనసంతా భద్రాచలం రామయ్య పాదాల చెంతనే ఉందని చెప్పారు. ప్రస్తుతం భద్రాచలం నుంచి పర్ణశాలకు వెళ్లాలన్నా 9 కిలోమీటర్ల మేర ఆంధ్రా ప్రాంతం గుండా వెళ్లాల్సి వస్తోందని అన్నారు. ఆ ఐదు గ్రామాలను తక్షణమే తెలంగాణలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలంగాణ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్ ఏలూరి శ్రీనివాసరావు, చాడా రవికుమార్, ఖమ్మం జిల్లా జేఏసీ చైర్మన్ గుంటుపల్లి శ్రీనివాస్, కన్వీనర్ కొని దెల శ్రీనివాస్, భద్రాద్రి జిల్లా జేఏసీ చైర్మన్ అమర్నేని రామారావు, చైతన్యభార్గవ్, వీరబాబు, డెక్క నరసింహారావు, గగ్గూరి బాలకృష్ణ పాల్గొన్నారు. రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి -
బాహుబలి గెటప్లో వరుడు.. శోభన ఫ్లెక్సీ వైరల్!
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఓ పెళ్లి కొత్త స్టైల్తో హైలైట్ అయింది. ములకలపల్లి మండలం నల్లివారం గూడెంకు చెందిన గోపి పెళ్లి ఈ నెల 10న జరిగింది. కానీ అసలు టాక్ మాత్రం శోభన ఫ్లెక్సీదే! వరుడిని ‘బాహుబలి’ గెటప్లో స్టైలిష్గా డిజైన్ చేసి, “బ్రహ్మచారి జీవితానికి Good Bye.. సంసార జీవితానికి Welcome” అంటూ పెట్టిన క్యాప్షన్ నెటిజన్లను ఆకట్టుకుంది. హీరో లుక్లో ఉన్న వరుడి ఫ్లెక్సీ చూసి గ్రామస్తులు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు.ఇప్పుడు ఈ ఫ్లెక్సీ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పెళ్లిళ్లలో క్రియేటివిటీకి ఇది కొత్త లెవల్ అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు! -
ప్రైవేట్ కాలేజీల విద్యార్థుల సత్తా..
ఇంటర్మీడియట్ మొదటి, ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో జిల్లాలోని పలు ప్రైవేట్ కళాశాలల విద్యార్థులు సత్తా చాటారు. అత్యుత్తమ మార్కులతో రాష్ట్రస్థాయిలోనే అగ్రస్థానాన నిలిచారు. ఈ సందర్భంగా ఫలితాల వివరాలను వెల్లడించిన కళాశాలల యజమాన్యాలు విద్యార్థులను అభినందించారు. – ఖమ్మం సహకారనగర్ఇంటర్లో ఉత్తమ మార్కులతో రాష్ట్రస్థాయి ప్రతిభఇంటర్ ఫలితాల్లో అత్యుత్తమ మార్కులతో తమ విద్యార్థులు రాష్ట్రస్థాయిలో జయభేరి మోగించారని శ్రీచైతన్య విద్యాసంస్థల చైర్మన్ మల్లెంపాటి శ్రీధర్, డైరెక్టర్ శ్రీవిద్య తెలిపారు. విద్యార్థులను అభినందించాక వారు వివరాలు వెల్లడించారు. సీనియర్ బైపీసీలో వేయి మార్కులకు 997 మార్కులతో కె.జ్యోత్స్న, ఎంపీసీలో 996 మార్కులతో పి.ప్రియలక్ష్మి 996 మార్కులతో రాష్ట్రస్థాయి మొదటి ర్యాంకు సాధించారని తెలిపారు. అలాగే, మొదటి సంవత్సరం బైపీసీలో 440కి 438మార్కులతో ఇద్దరు, ఎంఈసీలో 500కి 496మార్కులతో స్టేట్ టాపర్గా నిలిచారన్నారు. అంతేకాక సీనియర్ ఎంపీసీలో ఎం.డీ.జారా మహిక్, జి.హర్షిణి, ఎన్.సూర్యప్రకాష్ 995, జి.తన్మయి, జి.భావన, ఎం.శ్రీఉజ్వల, కె.యశస్విని, ఎం.నిహారిక 994, సీహెచ్.రిషిత సాయిశ్రీ, వి.కీర్తి, వై.భరత్ తేజ, ఎం.సింధు, ఎస్.బిందు వర్షిణి లక్ష్మీసాయి, బి.నిహారిక, వై.సాయి షాన్విక, ఎస్.నౌషిన్, పి.సాయి కీర్తన 993 మార్కులు సాధించారన్నారు. జి.విజయాంజలి 992, కె.గాయత్రి 991, ఎన్.ఆకాంక్ష 989, బి.అపూర్వ, జి.జాన్ విశిష్ట, జి.నవ్య 988, ఈ.ఎవన్గ్లీన్ 987, ఎస్.హర్షిత, ఏ.అశ్విత, బి.తేజస్విని, బి.స్రవంతి, ఎన్.శ్రేష్ఠ, ఐ.ప్రియాంకలు 985మార్కులు సాధించారని తెలిపారు. జూనియర్ ఎంపీసీలో బి.రాజ్ వర్థన్ వర్మ, జి.నాగమల్లేశ్వరి, ఎన్.తన్మయిసాయి, జి.హిమశ్రీ, జె.తిలోషా, ఎం.సాయి హర్షిణి, వై.విమరత, ఏ.గగన్య, కె.సంధ్య, ఎం.దేవతి, ఎన్.గయా, డి.త్రిష, కె.సాత్విక 468మార్కులు, బైపీసీలో వి.ఛాయశ్రీ 438, జి.శ్రీజ 438, బి.మమత 437, ఎస్కే.అమోతు షుకర హాసిరా 437, ఎస్.నందిని, బి.అనూష, బి.వాసవి, ఎస్.లక్ష్మీసంజన, కె.నాగ లోకేష్రెడ్డి 436, బి.యశస్విని, సీహెచ్.సుస్మిత, వి.శ్రియ, ఆర్.వర్షిణిశ్రీ ప్రియ, వి.యోజిత, ఏ.సంజన, ఎం.గణేశ్వరి, జె.లావణ్య, కె.రక్షిత అత్యధిక మార్కులు సాధించారన్నారు. జూనియర్ ఎంఈసీలో బి.నందునాయక్ 496, ఎస్.సాయి శ్రీ వర్థన్ 489, ఎస్.మనస్వితరెడ్డి 484, కె.నందు 481మార్కులు సాధించారని తెలిపారు. విద్యార్థులను చైర్మన్, డైరెక్టర్తో పాటు అకడమిక్ డైరెక్టర్లు బి.సాయిగీతిక, డీజీఎం చేతన్ మాదూర్, ఎగ్జిక్యూటివ్ డీన్ ఎన్ఆర్ఎస్డీ.వర్మ, డీన్ జె.కృష్ణ, ఏజిఎంలు సీహెచ్.బ్రహ్మం, ప్రకాష్, గోపాలకృష్ణ అభినందించారు.ఇంటర్ ఫలితాల్లో తమ విద్యార్థులు విజయదుందుభి మోగించారని న్యూవిజన్ విద్యాసంస్థల చైర్మన్ సీహెచ్జీకే.ప్రసాద్ తెలిపారు. అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను ఆదివారం అభినందించిన ఆయన వివరాలు వెల్లడించారు. జూనియర్ ఎంపీసీలో 470కి ఏడుగురు విద్యార్ధులు 468మార్కులు, బైపీసీలో 440కి 438, సీనియర్ ఎంపీసీలో వేయికి 994మార్కులు, బైపీసీలో వేయికి 991మార్కులతో అగ్రస్థానాన నిలిచారన్నారు. జూనియర్ ఎంపీసీలో బి.రాఘవ, ఎన్.తనుశ్రీ, ఎస్.కే.నైమా, టి.లాస్యశ్రీ, బి.కనితచౌదరి, బి.శిల్ప, టి.తేజశ్రీ 468మార్కులు, కె.తన్వి, ఎం.సాత్విక్, ఎ.స్వర్షశ్రీ, డి.హాసినిరెడ్డి, కె.ఆశ్రిత, ఎన్.యువన్ సూర్య, ఎన్.జతిన్, పి.చాహ్న, ఎస్.కే.రిహా తంజీన్, ఎన్.భవ్యశ్రీ 467మార్కులు, జూనియర్ బైపీసీలో వి.శివశ్రీ, డి.అక్షిత 438మార్కులు, ఏ.నిహారిక, డి.మహీ 437, ఐ.సాత్విక, డి.దేవశ్రీ, పి.తేజశ్రీ 436మార్కులు సాధించారన్నారు. అలాగే, సీనియర్ ఎంపీసీలో జి.చిన్మయిశ్రీ 994మార్కులు, ఎస్.గౌరినందన్రెడ్డి, కె.నేహశ్రీ, జి.అభినాష్, ఎస్.కే.సమీర్, యు.శృతి 993, పి.సాత్విక, కె.ప్రకీర్తి 992, సీనియర్ బైపీసీలో ఎం.ఇనాస్ 991, కె.గుణశేషు 989, బి.శశాంక్ 989, కె.ఆరోణ్ నిహాల్రాయ్ 989, ఏ విద్యశ్రీ 989, ఎ.నూర్ నాఫియా 989, ఎం.రోషిణి 986, బి.ఆశ్రిత 983, కె.తేజయాదవ్ 983, గోమతి 982, జి.ప్రణీత్ 982, జి.శ్రీవెంకటనాగకోమలి 982, బి.హిమ 982 మార్కులు సాధించారని తెలిపారు. విద్యార్థులను చైర్మన్తో పాటు డైరెక్టర్ సీ.హెచ్.కార్తీక్, సీ.హెచ్.గోపిచంద్, డీన్ శ్రీధర్, ప్రిన్సిపాళ్లు బ్రహ్మచారి, శ్రీనివాసరావు, అధ్యాపకులు అభినందించారు.ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో తమ కళాశాల విద్యార్థులు అత్యుత్తమ మార్కులతో విజయభేరి మోగించారని హార్వెస్ట్ విద్యాసంస్థల కరస్పాండెంట్ పి.రవిమారుత్, ప్రిన్సిపాల్ పార్వతిరెడ్డి తెలిపారు. ప్రథమ సంవత్సరం ఎంపీసీలో బి. నీరజ్ 467మార్కులు, ఎస్.కే.లాల్బి 467, బి.సాత్వికప్రియ 466. ఎం.సాయిదుర్గ 466, ఎస్.కే.మనా తన్వీర్ 465, ఏ.అక్షయ్ 465, టీ.బీ.నరసింహ 465, బి.కార్తికారెడ్డి 464, ఒ.రిషిలక్ష్మణ్ 464, ఎం.రేవంత్కుమార్ 464, ఏ.కుమార్ నాయక్ 464, టి.హారిక 464, కె.తనుష్క 464 మార్కులు సాధించారన్నారు. అలాగే, ద్వితీయ సంవత్సరం ఎంపీసీ నుంచి కె.రుచిత 993 మార్కులు సాధించగా, యామిని 992, ఏ.శ్రీకళ 991, జి.కౌసల్య 989, వి.కీర్తిరెడ్డి 988, జి.ప్రణతి 987, జి.శ్రావణ్కుమార్ 986, ఎన్.సిరిసాన్వి 985, షేక్ మహబూబ్ పాషా 985, వై.యశ్వంత్ 984, పి.సంజయ్ రామస్వామి 984, జి.సమిత్ 982, జి.యశ్మిత 982, పీ.జే.రాఘవచౌదరి 982 మార్కులు సాధించారని తెలిపారు. -
రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో చాంపియన్షిప్
వరంగల్ స్పోర్ట్స్: హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో రెండు రోజుల పాటు జరిగిన 11వ తెలంగాణ ఫెడరేషన్ కప్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ పోటీలు ఆదివారం ముగిశాయి. రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి 552 మంది అథ్లెట్లు 76 ఈవెంట్లలో నువ్వా, నేనా అన్నట్లు తలపడ్డారు. ఈ మేరకు పురుషుల విభాగంలో ఖమ్మం జిల్లా అథ్లెట్లు, మహిళల విభాగంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అథ్లెట్లు ఓవరాల్ చాంపియన్షిప్ను దక్కించుకున్నారు. ముగింపు వేడుకల్లో విజేతలకు ములుగు డీవైఎస్ఓ ఎ.ధరానాయక్ ట్రోఫీలు అందజేశారు. అథ్లెటిక్స్ అసోసియేషన్ ములుగు జిల్లా ప్రధాన కార్యదర్శి పగడాల వెంకటేశ్వర్రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి సారంగపాణి, అసోసియేషన్ చీఫ్ కోచ్ ఎండీ.గౌస్ తదితరులు పాల్గొన్నారు. నేడు మంత్రి తుమ్మల పర్యటన ఖమ్మంఅర్బన్: రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సోమవారం ఖమ్మం నగరంలో పర్యటించనున్నారు. సాయంత్రం వీడీవోస్ కాలనీలోని టీఎన్జీవోస్ ఫంక్షన్ హాల్లో జరిగే సమావేశంలో ముస్లిం మైనార్టీలకు కుట్టుమిషన్లు పంపిణీ చేస్తారు. అలాగే, అంగన్వాడీ టీచర్లకు మొబైల్ ఫోన్లు, విద్యార్థులకు ల్యాప్టాప్లు, స్మార్ట్ఫోన్లు అందజేయనున్నారు. ఆతర్వాత మహిళా ప్రాంగణంలో డ్రోన్ల నిర్వహణపై శిక్షణ పూర్తిచేసిన వారికి సర్టిఫికెట్లు పంపిణీ చేయనున్నారు. భార్య గర్భిణి.. తల్లికి అనారోగ్యం ● చికిత్స కోసం వచ్చిన వ్యక్తిని రైలు ఢీకొట్టగా మృతి ఖమ్మంక్రైం: ఖమ్మం గాంధీచౌక్ రైల్వే గేటు వద్ద ఓ వ్యక్తి పట్టాలు దాటుతుండగా వేగంగా వచ్చిన రైలు ఢీకొనడంతో మృతి చెందాడు. శనివారం అర్ధరాత్రి ఈ ప్రమాదం జరగగా సదరు వ్యక్తి సుమారు 100 మీటర్ల దూరానికి ఎగిరిపడ్డాడు. మృతుడి వద్ద లభించిన సెల్ఫోన్ ఆధారంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం గాండ్లగూడెంనకు చెందిన హలావత్ ప్రసాద్నాయక్(31)గా గుర్తించారు. హైదరాబాద్లో కూలీ పనులతో జీవనం సాగిస్తున్న ఆయన అక్కడి మహిళను కులాంతర వివాహం చేసుకున్నాడు. ప్రస్తుతం భార్య నిండు గర్భవతి కాగా, ఆయన తల్లి అనారోగ్యం బారిన పడడంతో ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స చేయిస్తున్నాడు. ఈ క్రమాన శనివారం అర్ధరాత్రి గాంధీచౌక్కు వెళ్తూ పట్టాలు దాటే సమయాన రైలు ఢీకొని మృత్యువాత పడ్డాడు. దీంతో జీఆర్పీ పోలీసులు ఇచ్చిన సమాచారంతో అన్నం ఫౌండేషన్ చైర్మన్ శ్రీనివాసరావు, సిబ్బంది చేరుకుని మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. జీఆర్పీ హెడ్కానిస్టేబుల్ ఎం. మురళీకృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు. గ్రామీణ వైద్యుడి బలవన్మరణం చింతకాని: మండలంలోని రామకృష్ణాపురం గ్రామానికి చెందిన గ్రామీణ వైద్యుడు ముక్తవరపు కృష్ణమూర్తి (62) ఆదివారం తెల్లవారుజామున ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన డాబా మెట్ల పైకప్పుకు ఉన్న పైపుకు ప్లాస్టిక్ తాడుతో ఉరి వేసుకున్నాడు. కుమారులు ఉదయం చూడగా అప్పటికే చనిపోయి ఉన్నాడు. ఆయన కుమారుడు అరుణ్కుమార్ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వీరేందర్ తెలిపారు. -
సర్వజ్ఞ సత్తా
ఇంటర్మీడియట్ ఫలితాల్లో తమ విద్యార్థులు అత్యుత్తమ మార్కులతో విజయభేరి మోగించారని సర్వజ్ఞ జూనియర్ కళాశాల చైర్మన్ ఆర్.వీ.నాగేంద్రకుమార్, డైరెక్టర్ నీలిమ తెలిపారు. మార్కులు సాధించిన విద్యార్థులను అభినందించాక వారు మాట్లాడుతూ ప్రథమ సంవత్సరం ఎంపీసీలో 470మార్కులకు వై.వెన్నెల 468, ఎన్.సాయి మణికంఠ, బి.తరుణ్, వై.అనితర 467 మార్కులు, జి.అనన్య వెంకట్, జి.జ్ఞాన దీప్తి, వై.గీత మాధురి 466మార్కులు, పి.ఆదిత్య 464, బి.హశ్వంత్, ఏ.భవ్య, ఆర్.సాయితేజ 463 మార్కులు సాధించారని చెప్పారు. బైపీసీలో 440 మార్కులకు ఐ.సాయి విశ్వనాథ్ 437, జ్ఞాన ప్రసూనంబ 435, ఎన్.అభినందిత 434, బి.అశ్విత 433 మార్కులు సాధించారని, పలువురు 400కిపైగా మార్కులు సాధించారని తెలిపారు. వీరిని చైర్మన్, డైరెక్టర్తో పాటు అధ్యాపకులు, ఉద్యోగులు జనార్దన్ అభినందించారు. -
దుఃఖాన్ని దిగమింగుకుని పరీక్షలకు..
ఖమ్మం సహకారనగర్: ఇంటర్ పరీక్షలకు సిద్ధమవుతుండగానే తండ్రి మృతి చెందాడు. అయినా ఆ విద్యార్థిని దుఃఖాన్ని దిగుమింగుకుని పరీక్షలు రాసి సత్తా చాటింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందుకు చెందిన గుంటి ప్రహర్ష ఖమ్మంలోని కృష్ణవేణి జూనియర్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం బైపీసీ చదువుతోంది. ఆమె తండ్రి, ఆటోడ్రైవర్ శ్రీను మూడు నెలల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. ఈక్రమాన ప్రహర్షకు కళాశాల యజమాన్యం, అధ్యాపకులు ధైర్యం చెప్పడంతో పరీక్షలు రాసి వేయి మార్కులకు 994 మార్కులు సాధించడం విశేషం. చిరుద్యోగి కుమార్తె వైరా: ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో చిరుద్యోగి కుమార్తె అత్యధిక మార్కులు సాధించింది. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగి సంతోష్ కూతురు సాత్విక వైరాలోని ప్రభుత్వ గురుకుల కళాశాలలో ఇంటర్ బైపీసీ చదివించింది. ఆదివారం విడుదలైన ఫలితాల్లో ఆమె 991 మార్కులు సాధించగా పలువురు అభినందించారు.994మార్కులు సాధించిన విద్యార్థిని -
గురుకులాల విద్యార్థుల ప్రతిభ
ఖమ్మంమయూరిసెంటర్: ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల ఫలితాలు ఆదివారం విడుదల చేయగా, జిల్లాలోని సంక్షేమ గురుకుల కళాశాలల విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. జిల్లాలోని ఎస్సీ, బీసీ, మైనారిటీ విద్యార్థులు రాష్ట్ర స్థాయి మార్కులు సాధించారు. ఎస్సీ గురుకులాల విద్యార్థులు జిల్లాలో 13 సాంఘిక సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాలలు ఉన్నాయి. ఈ కళాశాలల నుంచి ప్రథమ సంవత్సరం పరీక్షలకు 827 మంది పరీక్షలకు హాజరు కాగా 682 మంది ఉత్తీర్ణులయ్యారు. ద్వితీయ సంవత్సరంలో 880 మందికి 814 మంది ఉత్తీర్ణత సాధించారు. దానవాయిగూడెం, కూసుమంచి బాలికల కళాశాలల్లో ద్వితీయ సంవత్సరం నుంచి వంద శాతం ఉత్తీర్ణత సాధించగా, ఖమ్మం అంబేద్కర్ గురుకులంలో ఎంపీసీ ప్రథమ సంవత్సరం విద్యార్థి వి.ప్రదీప్తి 470 మార్కులకు గాను 468 మార్కులు సాధించింది. బీసీ గురుకులాల్లో.. బీసీ గురుకులాల విద్యార్థులు ఇంటర్మీడియట్లో ఉత్తమ మార్కులు సాధించారు. ప్రథమ సంవత్సరంలో 647 మందికి 596 మంది, ద్వితీయ సంవత్సరంలో 585 మంది విద్యార్థులకు 557 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. దానవాయిగూడెం బాలికల కళాశాలకు చెందిన ఎం.వర్ష 467, సత్తుపల్లి బాలికల కళాశాలకు చెందిన ఎన్.అఖిల, సీహెచ్.పూజిత 467 మార్కులు సాధించారు. ద్వితీయ సంవత్సరంలో కూసుమంచి బాలుర కళాశాలకు చెందిన పి.సాయి వేయి మార్కులకు గాను 992మార్కులు సాధించగా గురుకులాల కార్యదర్శి బి.సైదులు, ఆర్సీఓ సీహెచ్.రాంబాబు, డీసీఓలు, ప్రిన్సిపాళ్లు అభినందించారు. మైనార్టీ గురుకులాల్లో.. ఇంటర్ ఫలితాల్లో మైనార్టీ గురుకుల విద్యార్థులు ప్రతిభ చాటారు. ఏడు గురుకులాల నుంచి ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 315మంది హాజరుకాగా, 284మంది(90శాతం) ఉత్తీర్ణులయ్యారు. మధిర, సత్తుపల్లి బాలుర గురుకులాల్లో వందశాతం ఉత్తీర్ణత నమోదైంది. ప్రథమ సంవత్సరంలో 359 మందికి 305 మంది (84.95 శాతం) ఉత్తీర్ణత సాధించారు. రాష్ట్రస్థాయిలో సత్తా రఘునాథపాలెం: రఘునాథపాలెంలోని తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల ప్రతిభా కళాశాల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారని ప్రిన్సిపాల్ ఎం. బాలస్వామి వెల్లడించారు. జూనియర్ ఎంపీసీలో టి.యుగేందర్ 468, జె.జోషిత్ 467 మార్కులు సాధించారని, 13మంది 450కి పైగా మార్కులు సాధించగా 97శాతం ఉత్తీర్ణత నమోదైందని తెలి పారు. బైపీసీలో ఎం.మహేష్ 433 మార్కులు సాధించగా 92శాతం ఉత్తీర్ణత నమోదైందన్నారు. సీనియర్ బైపీసీలో డి.గణేష్ 991, ఎంపీసీలో కె.నితిన్ 980, బి.జశ్వంత్ 979మార్కులు సాధించారని, వంద శాతం ఉత్తీర్ణత నమోదైందని వివరించారు.బీసీ, ఎస్సీ గురుకుల విద్యార్థులకు టాప్ మార్కులు -
రెజొనెన్స్ జయకేతనం
ఇంటర్మీడియట్ ఫలితాల్లో తమ విద్యార్థులు అత్యుత్తమ మార్కులతో విజయకేతనం ఎగురవేశారని రెజొనెన్స్ కళాశాలల డైరెక్టర్లు ఆర్.వీ.నాగేంద్రకుమార్, కె.శ్రీధర్రావు తెలిపారు. విద్యార్థులను అభినందించాక వారు మాట్లాడుతూ ప్రథమ సంవత్సరం ఎంపీసీలో 470మార్కులకు జె.సాహితి 467, షేక్.మదార్ సాహెబ్, షేక్.నుజాహత్ ఆయేషా, వి.తేజశ్రీ 467మార్కులు, షేక్ జవేదా జీరాబేగం, బి.క్రాంతి చరిత, వై.హాసిని, కె.జోషిత, ఎం.తీర్థ శ్రీ వెన్నెల, సీహెచ్.గణేష్, ఆరుబా జైనాబ్ 466మార్కులు సాధించారని చెప్పారు. బైపీసీలో 440మార్కులకు షేక్ ఉమ్మె సాల్మ, జోషిక 437మార్కులు, వి.గీతిక శ్రీ 436, ఎం.డీ.అబేద్ 436, కె.తేజిత 434, డి.తరుణ్ 432, పి.భరత్ సంజయ్ 431, కె.నవ్య శ్రీ దుర్గేశ్వరి, వి.శివనాగేశ్వరి, ఎం.డీ.సుహానా 430మార్కులు సాధించారన్నారు. ద్వితీయ సంవత్సరం ఎంపీసీలో వేయి మార్కులకు ఎం.మన్విత 994మార్కులు, వి.తన్మయి 992, బి.వెంకట శ్రీవర్షిత 992, డి.హారిక, ఏ.హాసిని, ఏ.వర్షిణి 990మార్కులు సాధించారన్నారు. బైపీసీలో షేక్ తరున్నం ఫర్హీన్ 989, కె.హారిక రెడ్డి 988, బి.దివ్య శ్రీ 977, ఎం.ధరణి 977, కె.వర్షిత 972మార్కులు సాధించగా డైరెక్టర్లతో పాటు ప్రిన్సిపాళ్లు వి.సతీష్, భాస్కర్రెడ్డి అధ్యాపకులు అభినందించారు. -
ఎస్ఆర్కు టాప్ మార్కులు
ఇంటర్మీడియట్ ఫలితాల్లో తమ విద్యార్థులు టాప్మార్కులతో ప్రభంజనం సృష్టించారని ఎస్ఆర్ కళాశాల చైర్మన్ వరదారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రథమ సంవత్సరం ఎంపీసీలో 470 మార్కులకు ఏ ఊహిత, ఎన్.గీత, కె.రేణుక, ఓ.జోష్ణ, షేక్ అస్మా, ఎం.వర్షిత, ఇ.లిఖిన్ 467మార్కులు సాధించారన్నారు. బైపీసీలో 440 మార్కులకు పి.హేమబిందు 438, డి.యోగిత 437, పి.ప్రియాంక 437, ఎం.వరూధిని, షేక్ ఖాజిమ్ థౌసిఫ్ 436, జి.వర్షిత 435మార్కులు సాధించారని తెలిపారు. ఇక ద్వితీయ సంవత్సరం ఎంపీసీలో వేయి మార్కులకు కె.రోహిణి 996, బి.ప్రశాంతిక రమ్య 995, సీహెచ్.సాత్విక్, డి.పూజిత 994, బైపీసీలో ఎన్.మేధ, పి.అనన్య 990 మార్కులు సాధించారన్నారు. చైర్మన్తో పాటు డైరెక్టర్లు మధుకర్రెడ్డి, సంతోష్, సీఈఓ సురేందర్రెడ్డి, డీజీఎం గోవర్దన్రెడ్డి, చీఫ్ జోనల్ సదన్రావు, జోనల్ ఇన్చార్జ్ విజయభాస్కర్రెడ్డి, డీన్ శ్రీనివాస్రెడ్డి, ప్రిన్సిపాళ్లు అశోక్, శ్రీనివాస్, సుధాకర్, బ్రహ్మం అభినందించారు.ఇంటర్మీడియట్ ఫలితాల్లో తమ కళాశాల విద్యార్థులు అత్యుత్తమ మార్కులతో సత్తా చాటారని కృష్ణవేణి కళాశాల డైరెక్టర్లు గొల్లపూడి జగదీష్, మాచవరపు కోటేశ్వరావు, యార్లగడ్డ వెంకటేశ్వరరావు తెలిపారు. సీనియర్ ఇంటర్ ఎంపీసీలో వేయి మార్కులకు కె.కావ్యకళ 995, ఎన్.చందన 995, ఎస్.నవదీప్ 994, వి.గణేష్ 994, బైపీసీలో జి.ప్రహర్ష 994, బి.సాయి కీర్తన 992, జేఎల్ఎస్.మైత్రేయి 990, జూనియర్ ఎంపీసీలో 470 మార్కులకు బి.ఉదయ్కిరణ్, సీహెచ్.భావన, యు.వీ.ప్రణవి 468, లోహితశ్రీ, ఎం.శ్రావ్య సాత్విక, పి.హవీల, కె.జ్యోత్స్న, ఆర్. మనీష, ఎస్.నందిని, కె.పల్లవి శ్రీదుర్గ 467, బైపీసీలో 440 మార్కులు ఎల్.లోకేష్, సీహెచ్.ప్రశాంత్ 437, బి.సమత, జి.అఖిల, బి.జెస్సికా 436, నౌషీన్, బి.శ్రావణి, నిహారిక, పి.రిత్విక్రెడ్డి 435, ఎంఈసీలో 500 మార్కులకు ఆర్.దీపిక శరణ్య 496, సీఈసీలో 500 మార్కులకు గీతిక 489, జయేని 488 మార్కులు సాధించారని తెలిపారు. వీరిని డైరెక్టర్లతో పాటు డీన్ ఏలూరి వంశీకృష్ణ, ఏఓ నిరంజన్, హెచ్ఓడీలు లక్ష్మణ్, రాజశేఖర్రెడ్డి అభినందించారు. -
స్టెమ్స్పార్క్ ప్రభంజనం
ఇంటర్మీడియట్ పరీక్షల్లో తమ విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారని స్టెమ్స్పార్క్ జూనియర్ కళాశాల డైరెక్టర్లు కొండా శ్రీధర్రావు, కొండా కృష్ణవేణి తెలిపారు. అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంపీసీలో 470మార్కులకు బి.ప్రతిభ, పి.శ్రావ్య, పీఎల్.శరత్చంద్ర, జి.గణేష్ 467మార్కులు, కె.గాయత్రి తన్విష, డి.అఖిల్, సీ.హెచ్.హాసిని, జి.ధనుష్ కుమార్, జి.అనీష్రెడ్డి, షేక్ మహమ్మద్ ఆసిన్,బి. విశాలాక్షి 466మార్కులు సాధించారన్నారు. ద్వితీయ సంవత్సరం ఎంపీసీలో వేయి మార్కులకు వై.అక్షిత 992మార్కులు, ఏ.భానుతేజ, సీ.హెచ్.వీ.సాయి పవన్ 989, సీ.హెచ్.గాయత్రి 987, సీ.హెచ్. హిమజ 986మార్కులు సాధించారని తెలిపారు. -
ఇంటర్ ఫలితాల్లో హవా
రాష్ట్రస్థాయిలో జిల్లా విద్యార్థుల సత్తా ● ఫస్టియర్లో 72.06, సెకండియర్లో 81.60 శాతం ఉత్తీర్ణత ● రాష్ట్రంలో జిల్లాకు 4, 6వ స్థానాలు ఖమ్మంసహకారనగర్: ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం వార్షిక పరీక్షల ఫలితాల్లో జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. ప్రథమ సంవత్సరంలో జిల్లా రాష్ట్రంలో 4వ స్థానం దక్కించుకోగా, ద్వితీయ సంవత్సరంలో ఆరో స్థానాన నిలిచింది. కాగా, గతేడాది ప్రథమ సంవత్సరంలో మూడో స్థానం, ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో ఐదో స్థానం దక్కింది. ఈసారి ఉత్తీర్ణత శాతం పెరిగినప్పటికీ స్థానాలు మాత్రం తగ్గాయి. ఈ ఏడాది ప్రథమ సంవత్సరంలో 72.06శాతం, ద్వితీయ సంవత్సరంలో 81.60 శాతం ఉత్తీర్ణత నమోదైంది. అలాగే, ఒకేషనల్ విభాగం నుంచి ప్రథమ సంవత్సరంలో 2,190 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 1,321 మంది(60.32 శాతం), ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 1,928 మంది హాజరుకాగా 1,429 మంది(74.12శాతం) ఉత్తీర్ణులయ్యారు. బాలికలదే పైచేయి ప్రథమ సంవత్సరం పరీక్షలకు బాలురు 7,618 మంది హాజరైతే 4,918 మంది(65.51శాతం) ఉత్తీర్ణులయ్యారు. బాలికలు 7,681మందికి 6.044మంది(78.69 శాతం) ఉత్తీర్ణత సాధించారు. ఇక ద్వితీయ సంవత్సరం పరీక్షలకు బాలురు 7,282 మందికి 5,498 మంది(75.50శాతం), బాలికలు 7,345మందిలో 6,438 మంది(87.65శాతం) ఉత్తీర్ణులయ్యారు. రాష్ట్రస్థాయిలో అత్యధిక మార్కులు ఈ ఏడాది ఇంటర్ ఫలితాల్లో ప్రైవేట్ జూనియర్ కళాశాలల విద్యార్థులు సత్తా చాటారు. ద్వితీయ సంవత్సరం ఎంపీసీలో అత్యధికంగా 996మార్కులు, బైపీసీలో 997 మార్కులు ప్రైవేట్ కళాశాలల విద్యార్థులు సాధించారు. అంతేకాక పలువురికి 900కిపైగా మార్కులు వచ్చాయి. ప్రథమ సంవత్సరం ఎంపీసీలో 468మార్కులు పలువురు విద్యార్థులు సాధించగా, 400కిపైగా మార్కులు చాలామంది సాధించారు. ఇదే సమయాన జిల్లాలోని కేజీబీవీలు, సంక్షేమ శాఖల గురుకులాలు, ప్రభుత్వ కాలేజీల విద్యార్థులు సైతం పోటాపోటీగా మార్కులు సాధించడం విశేషం. పెరుగుతున్న ఉత్తీర్ణత గడిచిన మూడేళ్లుగా జిల్లాలో ఇంటర్మీడియట్ ఫలితాలు మెరుగుపడుతున్నాయి. గత మూడేళ్ల ఫలితాలు పరిశీలిస్తే ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో 3 – 8శాతం మెరుగుదల నమోదవుతోంది. ఈసారి మరింత మెరుగైన ఫలితాలతో రాష్ట్రస్థాయిలో జిల్లాకు గుర్తింపు లభించినట్లయింది. ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరంలో ఫెయిలైన విద్యార్థులు ఈనెల 20వ తేదీలోగా పరీక్ష ఫీజు చెల్లించాలని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి కె.రవిబాబు సూచించారు. వచ్చే నెల 13వ తేదీ నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయని తెలిపారు. ఈమేరకు ఈనెల 20వ తేదీలోగా ఆయా కళాశాలల్లో ఫీజు చెల్లించాలని పేర్కొన్నారు. అలాగే, రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కోసం కూడా ఈనెల 20వ తేదీ వరకు tgbie.cgg.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. రీకౌంటింగ్ కోసం ప్రతీ సబ్జెక్టుకు రూ.100, రీ వెరిఫికేషన్కు రూ.800 చొప్పున ఫీజు ఉంటుందన్నారు. -
భక్తిశ్రద్ధలతో నదీ హారతి
భద్రాచలంటౌన్: భద్రాచలంలోని గోదావరి తీరం ఆదివారం ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. పురోహితుడు రవికుమార్ ఆధ్వర్యంలో వేద పండితులు గోదావరి మాతకు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. గణపతి పూజ, దీపోత్సవం, అష్టోత్తర శతనామార్చన గావించారు. భక్తి శ్రద్ధలత నదీ హారతి సమర్పించారు. ఉత్తరప్రదేశ్కు చెందిన సేవా లక్ష్మీనారాయణ దంపతులు, వారణాసి, కాశీ ప్రాంతాలకు చెందిన రిషికేశ్–సరిత, రాజేష్–అనామిక, అంజుకుమారి కుటుంబ సభ్యులు భక్తులకు ప్రసాద వితరణ చేశారు. భద్రాచలం రెడీమేడ్ బట్టల షాప్స్ అసోసియేషన్ వారు పూజా సామగ్రి సమకూర్చారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ వెంకటేశ్వర్లు, పురోహితులు సురేష్ శర్మ, అశోక్ కుమార్ శర్మ పాల్గొన్నారు. రామయ్యకు స్వర్ణ పుష్పార్చన భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థాన అంతరాలయంలోని మూలమూర్తులకు ఆదివారం స్వర్ణ పుష్పార్చన, అభిషేకం జరి పారు. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరా ధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి బేడా మండపంలో కొలువుదీరిన స్వామివారికి విశ్వక్సేన పూజ, పుణ్యావాచ నం చేశారు. స్వామి వారికి కంకణధారణ, యజ్ఞోపవీతధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్ర ధారణ గావించి నిత్యకల్యాణ మహోత్సవాన్ని శాస్త్రోక్తంగా జరిపారు. -
2,965 మెట్రిక్ టన్నుల యూరియా
చింతకాని: మండలంలోని పందిళ్లపల్లి రేక్ పాయింట్కు ఆర్ఎఫ్సీఎల్ కంపెనీకి చెందిన 2,965.14 మెట్రిక్ టన్నుల యూరియా ఆది వారం చేరింది. ఈ యూరియాను మూడు జిల్లాలకు సరఫరా చేసినట్లు జిల్లా వ్యవసాయాధికారి ధనసరి పుల్లయ్య తెలిపారు. ఈమేరకు ఖమ్మం జిల్లాకు 585.14 మె.టన్నులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు 880 మె.టన్నులు, మహబూబాబాద్ జిల్లాకు 500 మెట్రిక్ టన్నులు సరఫరా చేయగా, మిగతా వేయి మెట్రిక్ టన్నుల ను బఫర్ స్టాక్గానిల్వ చేశామని వెల్లడించారు. ఐదో రోజుకు చేరిన విద్యుత్ కార్మికుల సమ్మె ఖమ్మంవ్యవసాయం: సమస్యల పరిష్కారం, డిమాండ్ల సాధన కోసం విద్యుత్ కార్మికులు చేపట్టిన సమ్మె ఆదివారం ఐదో రోజుకు చేరింది. సమ్మెలో ఆర్టిజన్లు, అన్మ్యాన్డ్ కార్మికులు, మీటర్ రీడర్లు, కలెక్షన్ ఏజెంట్లు, స్టోర్ హమాలీలు పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా ఖమ్మంలోని ట్రాన్స్కో కార్యాలయం వద్ద సమ్మె శిబిరంలో కార్మికులకు పలు యూని యన్ల నాయకులు ఎం.శ్రీనివాసరావు, టి.శేషగిరిరావు, నాగేశ్వరరావు సంఘీభావం తెలిపి మాట్లాడారు. టీవీఏఈ జేఏసీ ఉమ్మడి జిల్లా చైర్మన్ వల్లాల యుగంధర్, ప్రతినిధులు సురేందర్రెడ్డి, ఉపేందర్, రామకృష్ణ, వెంకన్న, అన్వర్ జానీపాషా, నఫీస్, మోబిన్ నస్రీన్, పెద్ది భాస్కర్, వేణుమోహన్, కోటేశ్వరరావు, నర్సింహారావు, మంగ్యానాయక్ పాల్గొన్నారు. భానుడి భగభగ పలు ప్రాంతాల్లో గరిష్టస్థాయి ఉష్ణోగ్రతలు ఖమ్మంవ్యవసాయం: జిల్లాలో భానుడి ప్రతా పం రోజురోజుకు పెరుగుతోంది. ఈ సీజన్లోనే గరిష్టంగా ఆదివారం 41.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఉదయం 10గంటలకే మొదలవుతున్న ఎండ మధ్యాహ్నానికి తీవ్రస్థాయికి చేరడమే కాక సాయంత్రం వరకు కొనసాగుతోంది. దీనికితోడు వడగాలులతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. చాలాచోట్ల మధ్యాహ్నం ప్రధాన రహదారులు బోసిపోయి కనిపిస్తున్నాయి. 40 డిగ్రీలకు పైగానే... జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు అప్రమత్తత(అలర్ట్) స్థాయికి చేరాయి. ఆదివారం పలుచోట్ల 40 – 45 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కల్లూరు, గుబ్బగుర్తి(కొణిజర్ల మండలం)ల్లో అత్యధికంగా 41.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైంది. ఖానాపురం(ఖమ్మం అర్బన్)లో 41.5, కలెక్టరేట్ వద్ద, మధిరలో 41.2, పెనుబల్లిలో 40.8 సిరిపురంలో 40.7, రావినూతలలో 40.4, పెద్దగోపతి, తిమ్మారావుపేట, కొణజిర్లలో 40.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడం గమనార్హం. మిగిలిన ప్రాంతాల్లోనూ 35–40 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రత నమోదు కావడంతో మున్ముందు ఎలా ఉంటుందోనని జనం బెంబేలెత్తిపోతున్నారు. -
జిల్లా వాసికి ‘వీరశౌర్య దివస్’ అవార్డు
● ప్రధాని చేతుల మీదుగా అందుకున్న నూతనప్రసాద్ నేలకొండపల్లి: మండలంలోని మంగాపుర తండాకు చెందిన ఆర్మీ జవాన్ భూక్యా నూతనప్రసాద్ విధినిర్వహణలో ప్రతిభకు గాను గుర్తింపు లభించింది. 2024లో మణిపూర్లో ఉగ్రవాదులు జరిపిన దాడులను తిప్పికొట్టటంలో ఆయన ప్రతిభ కనపరిచారు. ఈ సందర్భంగా నూతనప్రసాద్కు కేంద్రప్రభుత్వం వీరశౌర్య దివస్ అవార్డు ప్రకటించింది. ఢిల్లీలో ఆదివారం ప్రధాన మంత్రి నరేంద్రమోడీ ఆయనకు అవార్డు అందజేయగా కుటుంబీకులు, గ్రామస్తులు అభినందనలు తెలిపారు. -
వచ్చే నెలాఖరులోగా ఇళ్ల నిర్మాణాలు పూర్తి
రఘునాథపాలెం: ఖమ్మం నియోజకవర్గానికి మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వచ్చే నెలాఖరులోగా పూర్తయ్యేలా అధికారులు పర్యవేక్షించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. ఖమ్మంలోని క్యాంప్ కార్యాలయంలో ఆదివారం ఆయన గృహ నిర్మాణ సంస్థ అధికారులతో సమీక్షించారు. ఇళ్ల నిర్మాణ పురోగతిని నిరంతరం పరిశీలిస్తే, ఎక్కడైనా ఆలస్యమైతే లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని తెలి పారు. ఇంకా నిర్మాణం మొదలుపెట్టని లబ్ధిదారులపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఇలాంటి వారికి ఇళ్లు అవసరం లేకపోతే గుడిసెల్లో నివసిస్తున్న నిరుపేదలకు మంజూరు చేయాలని తెలిపారు. రఘునాథపాలెం ఎంపీడీఓ అశోక్కుమార్, హౌసింగ్ అధికారులు శ్రీనివాస్, రామకృష్ణ, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, ఖమ్మం మార్కెట్ చైర్మన్ యరగర్ల హన్మంతరావు, కార్పొరేటర్లు లకావత్ సైదులు, మలీదు వెంకటేశ్వర్లు, డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ, మాజీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. హిమవంతరావు ఆశయాలు సాధించాలి ఖమ్మం సహకారనగర్: నిజాయితీ, నిబద్ధతకు నిలువుటద్దంలా నిలిచిన సామినేని హిమవంతరావు ఆశయాలు, ఆలోచనలను నేటి తరం ముందుకు తీసుకెళ్లాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. పీఆర్టీయూ వ్యవస్థాపకుడు, మాజీ ఎమ్మెల్సీ హిమవంతరావు విగ్రహాన్ని ఖమ్మంలోని సంఘం కార్యాలయంలో మంత్రి ఆవిష్కరించి మాట్లాడారు. ఉపాధ్యాయుల సంక్షేమానికి ఆయన చేసిన కృషి మరువలేనిదని తెలిపారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్రెడ్డి మాట్లాడుతూ పీఆర్టీయూ స్థాపన ద్వారా ఉపాధ్యాయుల హక్కుల సాధనలో హిమవంతరావు కీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు. రాష్ట్ర అధ్యక్షుడు పులగం దామోదర్రెడ్డి మాట్లాడుతూ జిల్లా కార్యాలయం రాష్ట్రానికి ఆదర్శంగా నిలుస్తుందని అభినందించారు. ఇందుకు సహకరించిన హిమవంతరావు కుటుంబీకులకు కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా అధ్యక్షుడు కట్టా శేఖర్ రావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుంకర బిక్షంగౌడ్, ఆడిట్ కమిటీ చైర్మన్ సోమిరెడ్డి శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, మేయర్ పునుకొల్లు నీరజ తదితరులు పాల్గొన్నారు.అధికారులతో సమీక్షలో మంత్రి తుమ్మల -
పీఆర్సీ, పెండింగ్ బిల్లుల కోసం పోరాటం
ఖమ్మం సహకారనగర్: ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు పీఆర్సీ కోసం ఎదురుచూస్తున్న నేపథ్యాన ప్రభుత్వం ఆలస్యం చేయకుండా వెంటనే అమలుచేయాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావా రవి డిమాండ్ చేశారు. టీఎస్ యూటీఎఫ్ జిల్లా కమిటీ సమావేశం ఆదివారం ఖమ్మంలో జిల్లా అధ్యక్షుడు షేక్ రంజాన్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో చావా రవి మాట్లాడుతూ 2024 మార్చి నుంచి రిటైర్ అయిన సుమారు 12వేల మంది ఉద్యోగులు, ఉపాధ్యాయుల బకాయిల కోసం ఏక మొత్తంగా రూ.10వేల కోట్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అలాగే, జీపీఎఫ్, సీపీఎస్ ఉపాధ్యాయుల డీఏ బకాయిలు విడుదల చేయడంతో పాటు నాలుగు డీఏలను ప్రకటించాలని, హెల్త్ కార్డుల ద్వారా నగదు రహిత వైద్యం అందే చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమస్యల పరిష్కారానికి ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యాన దశలవారీ పోరాటం నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సీహెచ్.దుర్గాభవాని మాట్లాడుతూ ఆర్థిక భారం లేని సమస్యల పరిష్కారం, టెట్ అర్హత మార్కులు తగ్గింపుపైనా పట్టింపు లేనట్లు వ్యవహరించడం సరికాదన్నారు. అనంతరం సీపీఎస్ రద్దు, 2003 డీఎస్సీ టీచర్లకు పాత పెన్షన్ అమలు, కేజీబీవీ, సమగ్ర శిక్ష ఉద్యోగులకు బేసిక్ పే, మోడల్ స్కూళ్లు, గురుకులాల ఉద్యోగులకు హెల్త్ కార్డులు అమలుపై తీర్మానాలు ఆమోదించారు. తొలుత జ్యోతిరావు పూలే చిత్రపటం వద్ద నివాళులర్పించారు. జిల్లా ప్రధాన కార్యదర్శి పారుపల్లి నాగేశ్వరరావు, ఉపాధ్యక్షులు బుర్రి వెంకన్న, షేక్ యూసుఫ్ సైదా, కోశాధికారి వి.రాంబాబు, నర్సయ్య, నాగేశ్వరరావు, ఉద్దండ, సురేష్, రామకృష్ణ, కోటేశ్వరరావు, విజయ్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు రవి -
హెచ్పీవీ వ్యాక్సినేషన్లో అగ్రస్థానం
ఖమ్మంవైద్యవిభాగం: మహిళల ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేసే వ్యాధుల్లో గర్భాశయ ముఖద్వార కేన్సర్ ముందు స్థానాన నిలుస్తోంది. ఈమేరకు కేన్సర్ కట్టడికి బాలికలకు ముందస్తుగా హెచ్పీవీ వ్యాక్సిన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాలోని 14 – 15 ఏళ్ల బాలికలకు వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యాన వ్యాక్సిన్ ఇస్తుండగా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి నిత్యం పర్యవేక్షిస్తుండడంతో జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానాన నిలిచింది. రాష్ట్రంలోనే ముందంజ జిల్లాలో 14–15 ఏళ్ల బాలికలు 15వేల మంది ఉంటారని అంచనా. ఇందులో ఇప్పటి వరకు 3,040 మంది బాలికలకు వ్యాక్సిన్ వేశారు. ఇది రాష్ట్రంలోనే అత్యధికమని అధికారులు వెల్లడించారు. హెచ్పీవీ వైరస్తో గర్భాశయ ముఖద్వార కేన్సర్ మాత్రమే కాక మరికొన్ని ప్రమాదకర కేన్సర్లు సోకే ప్రమాదముందని చెబుతున్నారు. ఈమేరకు వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా గర్భాశయ ముఖద్వారా కేన్సర్తో పాటు ఆరు రకాల కేన్సర్ల నుంచి రక్షణ లభిస్తుందని వైద్యులు వెల్లడించారు. ఈ వ్యాక్సిన్తో శరీరంలో బలమైన యాంటీబాడీలు ఏర్పడి దీర్ఘకాలిక రోగనిరోధక శక్తి లభిస్తుందని, తద్వారా కేన్సర్ సోకే ముప్పు గణనీయంగా తగ్గుతుందని చెబుతున్నారు. ఇందులో భాగంగా వ్యాక్సిన్పై వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు విస్తృత అవగాహన కల్పిస్తుండడంతో బాలికలకు వేయించేందుకు తల్లిదండ్రులు ముందుకొస్తున్నారు. జిల్లాలోని ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రితో పాటు సీహెచ్సీలు, 24 గంటల వైద్య కేంద్రాలు కలిపి 12కేంద్రాల్లో వ్యాక్సిన్ అందుబాటులో ఉందని అధికారులు వెల్లడించారు. త్వరలోనే పీహెచ్సీల్లో కూడా ప్రారంభించనున్నందున సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జిల్లాలో ఇప్పటివరకు 3,040 మందికి టీకా -
పేదల అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయం
ఖమ్మంరూరల్: ఎన్నికల వరకు మాత్రమే రాజకీయాలు ఉంటాయని.. ఆతర్వాత ప్రజల సంక్షేమం, అభివృద్ధి మాత్రమే తమ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టంచ ఏశారు. ఈక్రమంలో రాజకీయాలకు తావు లేకుండా పథకాలు అమలుచేస్తున్నామని తెలిపారు. ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో ఆటోనగర్ నుంచి మద్దులపల్లి మార్కెట్ వరకు రూ.4.50కోట్ల వ్యయంతో నిర్మించే రోడ్డు, రూ.2.50కోట్లతో కొత్తూరు నుంచి కాచిరాజుగూడెం వరకు రోడ్డు, స్లాబ్, కల్వర్టు నిర్మాణ పనులకు మంగళగూడెంలో మంత్రి శనివారం శంకుస్థాపన చేశారు. అలాగే, 64మందికి కళ్యాణలక్ష్మి, 227మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశాక మాట్లాడారు. గడిచిన రెండేళ్లలో ఈ ప్రాంతానికి రూ.64.92కోట్ల నిధులు మంజూరు చేశామన్నారు. ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులున్నా పథకాలకు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. ఇందులో భాగంగానే 200 యూనిట్ల ఉచిత విద్యుత్, కొత్త రేషన్కార్డులు, పేదలకు సన్నబియ్యం పంపిణీ, రైతు రుణమాఫీ, మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇస్తుండగా, గత ప్రభుత్వం విస్మరించినా తాము రాగానే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టామని వెల్లడించారు. మొదటి దశలో నియోజకవర్గానికి 3,500 ఇళ్లు మంజూరు చేయగా, త్వరలోనే రెండో విడత మంజూరు ఉంటుందని తెలిపారు. ప్రతీ పేద కుటుంబానికి పథకాలు తిరుమలాయపాలెం: ప్రతీ పేద కుటుంబానికి సంక్షేమ, అభివృద్ధి ఫలాలు అందిస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. తిరుమలాయపాలెం మండల ప్రజాపరిషత్ కార్యాలయ ఆవరణలో 12మందికి కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు, 137 మందికి రూ.41.73 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులతో పాటే పాలేరు నియోజకవర్గంలోని 331 మంది అంగన్వాడీ టీచర్లకు మొబైల్ ఫోన్లు అందజేశారు. అనంతరం మంత్రి పొంగులేటి మాట్లాడుతూ సీఎం రేవంత్రెడ్డి నాయకత్వంలోని తమ ప్రభుత్వం ప్రతీ పేద వ్యక్తికి భరోసా, భద్రత కల్పిస్తోందని తెలిపారు. పేదల కోసం పథకాలు అమలుచేస్తూనే ఉద్యోగులకు 1వ తేదీన జీతాలు చెల్లిస్తున్నామని చెప్పారు. అంగన్వాడీ సేవలు మెరుగపడేలా టీచర్లకు సెల్ఫోన్లు అందజేసినట్లు తెలిపారు. అనంతరం హైదర్సాయిపేటలో రూ.1.35 కోట్లతో నిర్మించే బీటీ రోడ్డు పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమాల్లో అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి, ఏదులాపురం మున్సిపల్ చైర్పర్సన్ పోకబత్తిని అనిత, ఆర్ అండ్ బీ ఎస్ఈ యాకోబు డీపీఓ రాంబాబు, డీడబ్ల్యూఓ వేల్పుల విజేత, ఖమ్మం ఆర్డీఓ శ్రీనివాస్, మద్దులపల్లి మార్కెట్ చైర్మన్ భైరు హరినాధ్బాబు, పాలేరు నియోజకవర్గ ప్రత్యేకాధికారి రమేష్, తహసీల్దార్ విల్సన్, ఎంపీడీఓ సిలార్ సాహెబ్, సర్పంచ్లు, ఉపసర్పంచ్లు మేకల సత్యనారాయణ, చీమ్లానాయక్, సుజాత, కన్నేటి అనిల్ తదితరులు పాల్గొన్నారు. -
●అభయాంజనేయస్వామి
రామాలయ ప్రాంగణంలోని అభయాంజనేయ స్వామి ఉపాలయం తొలగింపు లేదని ప్రస్తుతం పేర్కొంటున్నా.. ఉపాలయాలు, ప్రధాన ఆలయం పరిసర ప్రాంతాల్లో అభివృద్ధి జరిగాక ఇక్కడ కూడా మార్పులు, చేర్పులకు అవకాశం ఉంటుంది. ఆలయ ప్రాంగణంలో ఉన్న ఆళ్వార్ల ఉపాలయాలు సైతం అభివృద్ధిలో భాగంగా మార్పు కానున్నాయి. రామయ్య స్వామిని దర్శించుకున్నాక ఆలయం నుంచి రంగనాయకుల గుట్టవరకు భక్తులు సుమారు అర కిలోమీటరు నడిచివెళ్లాల్సి వస్తోంది. శివాలయం పక్క నుంచి 100 మీటర్ల రోడ్డు నిర్మిస్తే రంగనాథస్వామి ఆలయం, భక్త రామదాసు ధ్యాన మందిరం సులభంగా సందర్శించుకోవచ్చు. గుట్టపైన వ్యూ పాయింట్ ఏర్పాటు చేయవచ్చు. -
బ్యూటీషియన్ కోర్సుల్లో శిక్షణ
‘సాక్షి’ మైత్రి మహిళ ఆధ్వర్యంలో..‘సాక్షి’ మైత్రి మహిళ ఆధ్వర్యంలో ఈనెల 14వ తేదీ నుంచి మే 12వ తేదీ వరకు బ్యూటీషియన్ కోర్సులో శిక్షణ ఇవ్వనున్నారు. ఆదివారం మినహా మిగిలిన రోజుల్లో ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు శిక్షణ ఉంటుంది. హెయిర్ కటింగ్, వ్యాక్స్, పెడిక్యూర్, మెనిక్యూర్, బ్లీచింగ్, స్కిన్కేర్, హెయిర్ కేర్, వెడ్డింగ్ ఫేస్ప్యాక్స్, హెయిర్ కట్స్, హెయిర్స్టైల్స్, హెన్నా ప్రిపరేషన్, ఐబ్రోస్, బేసిక్ పింపుల్ ట్రీట్మెంట్, మేకప్ (బ్రైడల్, పార్టీ, లైట్ మేకప్), హెయిర్ మసాజ్, కమ్యూనికేషన్, గ్రూమింగ్ ఫేషియల్స్, శారీ డ్రాపింగ్ వంటి వాటిల్లో శిక్షణ ఇస్తారు. ఇందుకోసం ఈనెల 13వ తేదీ వరకు ఉదయం 10నుంచి సాయంత్రం 6 గంటల వరకు రిజిస్ట్రేషన్లు స్వీకరిస్తారు. ఆసక్తి ఉన్న వారు రిజిస్ట్రేషన్ సమయాన రూ.2,500 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఆపై 14 నుంచి వచ్చేనెల 12 వరకు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు వర్క్షాపు ఉంటుంది. రిజిస్ట్రేషన్ కోసం ఖమ్మం మామిళ్లగూడెంలోని వాసవి కిరాణం సమీపాన ఉన్న లహరి బ్యూటీపార్లర్ – ట్రైనింగ్ సెంటర్లో సంప్రదించాలి. ఇతర వివరాలకు 96660 13544, 96182 18701 నెంబర్లలో సంప్రదించవచ్చు. -
సైన్స్ మ్యూజియంతో విద్యార్థుల ఉన్నతి
ఖమ్మం సహకారనగర్: విద్యార్థులు శాస్త్ర, సాంకేతిక రంగాలపై ఆసక్తి పెంచడంతో పాటు వారు ఉన్నత స్థాయికి చేరేలా సైన్స్ మ్యూజియం దోహదపడుతుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఖమ్మంలో ఏర్పాటు చేసిన జిల్లా సైన్స్ మ్యూజియంను శనివారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. విద్యార్థుల్లో శాసీ్త్రయ దృక్పథాన్ని పెంపొందించేలా ఉపాధ్యాయులు ఈ మ్యూజియం ద్వారా కృషి చేయాలని సూచించారు. కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ విద్యార్థులు సైన్స్ మ్యూజియంను సద్వినియోగం చేసుకోవాలన్నారు. సీపీ సునీల్దత్, కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్య, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, డీఈఓ చైతన్య జైనీ, కేఎంసీ మేయర్ పునుకొల్లు నీరజ, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహారా, కార్పొరేటర్ పసుమర్తి రాంమోహన్రావు, హార్వెస్ట్ విద్యాసంస్థల అధినేత రవిమారుత్, డీఈఓ కార్యాలయ ఉద్యోగులు శ్రీనివాసరావు, రామకృష్ణ, ప్రభాకర్రెడ్డి, సీఎంఓ ప్రవీణ్కుమార్, ఎంఈఓలు శైలజాలక్ష్మి, రాములు, శ్రీనివాసరావు, వెంకటేశ్వర్లు, బయాలజికల్ సైన్స్, ఫిజికల్ సైన్స్ ఫోరం బాధ్యులు, కాంగ్రెస్ నగర అధ్యక్షుడు నాగండ్ల దీపక్చౌదరి తదితరులు పాల్గొన్నారు. ●ఖమ్మం అర్బన్: ఖమ్మం 34, 35, 36వ డివిజన్లలో చేపట్టే అభివృద్ధి పనులకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శనివారం శంకుస్థాపన చేశారు. కలెక్టర్ అనుదీప్, సీపీ సునీల్దత్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, మేయర్ పునుకొల్లు నీరజ, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహారా పాల్గొన్నారు.రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు -
పెద్దాస్పత్రిలో డీ అడిక్షన్ సెంటర్
ఖమ్మంవైద్యవిభాగం: ఖమ్మంలోని జిల్లా జనరల్ ఆస్పత్రిలో మత్తు వ్యసన నిర్మూలన సలహా కేంద్రం(డీ–అడిక్షన్ సెంటర్) ఏర్పాటుచేశారు. ఈ సెంటర్ ను డీఎంహెచ్ఓ రామారావు శనివారం ప్రారంభించి మాట్లాడారు. మద్యపానం, మత్తు పదార్థాలకు బానిసలుగా మారిన వారికి సలహాలు, చికిత్స సాయంతో పాటు పునరావాస మార్గదర్శకత్వం చేసేందుకు ఈ సెంటర్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అంతేకాక మత్తు పదార్థాలతో ఎదురయ్యే నష్టాలపై అవగాహన సదస్సులు నిర్వహిస్తామన్నారు. మత్తు పదార్థాలకు అలవాటైతే క్రమంగా ఆరోగ్యాన్ని దెబ్బతీయడమే కాక కుటుంబ కలహాలు, సామాజిక సమస్యలు ఏర్పడతాయని తెలిపారు. అనంతరం వ్యాసరచన, చిత్రలేఖన పోటీల్లో విజేతలకు డీఎంహెచ్ఓ బహుమతులు అందజేశారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎం.నరేందర్, మానసిక వైద్య నిపుణురాలు సౌమ్య, డ్రగ్ ఇన్స్పెక్టర్ అనిల్కుమార్, పాలేరు నర్సింగ్ కళాశాల, ప్రభుత్వ మెడికల్ కాలేజీ విద్యార్థులు పాల్గొన్నారు. -
ఉపాలయాలకూ మహర్దశ
రామాలయం పక్కనే ఉన్న ఉమారామలింగేశ్వర స్వామి ఆలయం దక్షిణ భాగం విస్తరణకు అధికారులు ప్రతిపాదనలు రూపొందించి దేవాదాయ శాఖకు అందజేశారు. ఉత్తరం దిక్కున శివపార్వతుల ప్రతిమలతో స్వాగతం పలుకుతుండగా, శివరాత్రి, ఇతర ఉత్సవాల రోజుల్లో రద్దీకి అనుగుణంగా ఆలయ ప్రాంగణం సరిపోవటం లేదు. దీంతో దక్షిణ భాగం వైపు విస్తరణతోపాటు ఇతర అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. దేవస్థానానికి అనుబంధంగా శ్రీలక్ష్మీతాయారు అమ్మవారు, శ్రీ అభయాంజనేయస్వామి, శ్రీ ఉమా రామలింగేశ్వరస్వామి, యోగానంద లక్ష్మీ నరసింహాలయం, రంగనాయకుల గుట్టపై రంగనాథ స్వామి, తాతగుడి సెంటర్లో గోవిందరాజ స్వామి ఉపాలయాలు ఉన్నాయి. వీటిలో ధూపదీప నైవేద్యాలతోపాటు నిత్యపూజలు రామాలయ సిబ్బందే నిర్వర్తిస్తున్నారు. తిరు కల్యాణ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవోపేతంగా జరుపుతారు. కాగా, ఆలయ ప్రాంగణంలోని ఉపాలయాలు తప్ప ఇతర ఆలయాలకు తగిన ప్రచారం లేదు. దేవస్థానం నుంచి నేరుగా వెళ్లేందుకు కనెక్టివిటీ కూడా లేదు. దీంతో తీగల వంతెన తదితర నిర్మాణాలు చేపట్టాలనే వినతులు వస్తున్నాయి.రామాలయానికి పడమర దిక్కున ఉన్న యోగా నంద లక్ష్మీ నరసింహాలయం ఎంతో ప్రాశస్త్యం కలిగి ఉంది. పూర్వకాలం రాముడిని దర్శించుకునే ముందు ఈ స్వామివారిని దర్శించుకునేవారని పెద్దలు చెబుతున్నారు. రామాలయం నుంచి ఈ ఆలయానికి నేరుగా కనెక్టివిటీ కల్పిస్తే ఆదరణ లభించనుంది. లక్ష్మీ నరసింహాలయం నుంచి గో దావరి వరకు ఫుట్ ఓవర్ బ్రిడ్జి లేదా తీగలవంతెన నిర్మించాలని భక్తులు కోరుతున్నారు. అయితే, ఇప్పటికే కల్యాణ మండప ప్రాకారాన్ని నిర్మించేందుకు అధికారులు ప్రతిపాదనలు సమర్పించారు.శ్రీ లక్ష్మీతాయారు అమ్మవారి ఉపాలయం రామాలయ ప్రాంగణంలో ఉంది. సీతారామ చంద్రస్వామివారిని దర్శించుకున్న భక్తులందరూ అమ్మవారి ని దర్శించుకుంటారు. భక్తులకు ఇక్కడే వేదాశీర్వచనం ఇస్తారు. దసరా వేడుకలు నిర్వహిస్తారు. అభివృద్ధి పనుల్లో ఈ ఆలయాన్ని పూర్తిస్థాయిలో తొలగించనున్నారు. ఆలయ ప్రాకారాల ఏర్పాటులో భాగంగా నిర్మాణం వేదిక మారనుంది. తాతగుడి సెంటర్లో ఉన్న గోవిందరాజ స్వామి ఆలయంలో మరికొన్ని అభివృద్ధి పనులను చేపట్టేలా దేవస్థానం అధికారులు ప్రణా ళికలను రూపొందించాలని భక్తులుకోరుతున్నారు. ప్రస్తు తం ప్రసాద్ పథకంలో భాగంగా టూరిజం హోటల్లో నిరుపయోగంగా ఉన్న బ్యాటరీ వాహనాలతోపాటు ఇతర ఉచిత రవా ణా సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.భద్రాచల రామాలయ అభివృద్ధిపై ప్రభుత్వ దృష్టి -
కోతులను అదిలించబోయి రైతు మృతి
కొణిజర్ల: వరి పొలాన్ని ఆగం చేస్తున్న కోతులను అదిలించేందుకు ఓ రైతు రేకులషెడ్డుపైకి ఎక్కగా.. అక్కడ రేకు విరగడంతో కింద పడి మృతి చెందాడు. కొణిజర్ల మండలం లాలాపురంలో శనివారం ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన నామా శ్రీనివాసరావు(50) అదే గ్రామానికి చెందిన ఓ రైతు పొలాన్ని కౌలుకు తీసుకుని వరి సాగు చేస్తున్నాడు. పొలంలో కోతులు చేరి పాడు చేస్తుండగా శ్రీనివాసరావు, మరో వ్యక్తికితో కలిసి వెళ్లాడు. అక్కడ కోతులు సమీపంలోని సిమెంట్ బ్రిక్స్ ఫ్యాక్టరీ రేకులషెడ్డు పైకిచేరగా, శ్రీనివాసరావు కూడా పైకి వెళ్లడంతో శిథిలావస్థఽలో ఉన్న రేకు విరిగి పైనుంచి ఫ్యాక్టరీలోని యంత్రాలపై పడ్డాడు. తలకు తీవ్ర గాయాలైన ఆయన్ను కొణిజర్లలోని ప్రైవేట్ ఆస్పత్రికి, అక్కడి నుంచి ఖమ్మం తరలిస్తుండగా మృతి చెందాడు. మృతుడికి భార్య రాజేశ్వరి, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆయన కుమారుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ జి.సూరజ్ తెలిపారు. 108 వాహనంలో గర్భిణి ప్రసవం చింతకాని: ఏపీలోని గంపల గూడెం మండలం నెమలికొణిజర్ల గ్రామానికి చెందిన గర్భిణి రమాదేవి శనివారం 108 వాహనంలో ప్రసవించింది. పురిటినొప్పులతో బాధపడుతున్న ఆమెను కుటుంబీకులు ప్రసవం కోసం మధిర ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకొచ్చారు. అయితే, అక్కడి వైద్యులు ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి సిఫారసు చేయగా 108 వాహనంలో తీసుకెళ్తున్నారు. ఈ క్రమాన నాగులవంచ సమీపాన పురిటి నొప్పులు ఎక్కువవడంతో రమాదేవికి 108 సిబ్బంది గుజ్జర్లపూడి రామయ్య, పేరెల్లి రవీంద్రబాబు ప్రసవం చేయగా మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ సందర్భంగా సిబ్బందికి ఆమె కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. గంగదేవిపాడులో పట్టపగలే చోరీ ● రూ.12 లక్షల సొత్తు అపహరణ తల్లాడ: మండలంలోని గంగదేవిపాడు గ్రామంలో శనివారం పట్టపగలే చోరీ జరిగింది. గ్రామానికి చెందిన శిలివేరు నరసింహారావు ఇంటికి తాళం వేసి వెళ్లగా దొంగలు తాళాలు పగులగొట్టి ప్రవేశించారు. ఆపై బీరువా తాళాలు సైతం పగులగొట్టి తొమ్మిది తులాల బంగారు నెక్లెస్, గొలుసు, ఉంగరాలు, మాటీలు, చెంప సవరాలే కాక రూ.90 వేల నగదు చోరీ చేశారు. మొత్తంగా రూ.12 లక్షల సొత్తు చోరీ జరిగిందని.. బాధితులు ఇచ్చిన ఫిర్యాదుతో క్లూస్టీమ్ బృందం పరిశీలించి ఆధారాలు సేకరించింది. ఘటనపై కేసు నమోదు చేసినట్లు తల్లాడ ఎస్ఐ వెంకటకృష్ణ తెలిపారు. గంజాయి రవాణా చేస్తున్న వ్యక్తి అరెస్ట్ ● 2.440 కిలోల గంజాయి స్వాధీనం బోనకల్: బోనకల్ పోలీసులు శనివారం నిర్వహించిన తనిఖీల్లో విజయవాడకు చెందిన ఒకరిని అదుపులోకి తీసుకుని గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఎస్ఐ పి.వెంకన్న కథనం మేరకు.. బోనకల్ రైల్వే అండర్ బ్రిడ్జి సమీపాన శనివారం పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. బైక్పై వస్తున్న వ్యక్తి పోలీసులను చూసి తప్పించుకునే ప్రయత్నం చేయగా అదుపులోకి తీసుకున్నారు. సదరు వ్యక్తి విజయవాడలోని చిట్టినగర్ ప్రాంతానికి చెందిన పోసాని రవిరాజుగా గుర్తించి, ఆయన బ్యాగ్లో 2.440 కిలోల గంజాయి ఉండగా స్వాధీనం చేసుకున్నారు. ఒడిశాకు చెందిన రవి, కృష్ణ, రవీంద్ర, తమ్మిశెట్టి కిరణ్ నుంచి గంజాయి సేకరించి అధిక ధరతో అమ్మడానికి వెళ్తున్నట్లు అంగీకరించాడు. దీంతో ఐదుగురిపై కేసు నమోదు చేసి రవిరాజును రిమాండ్కు తరలించిట్లు ఎస్ఐ తెలిపారు. గల్లంతైన బాలుడి మృతదేహం లభ్యం ఖమ్మంరూరల్: సాగర్ కాల్వలో గల్లంతైన ఏదులాపురానికి చెందిన పదో తరగతి విద్యార్థి పుట్టబంతి రామకృష్ణ(16) మృతదేహం శనివారం లభ్యమైంది. ఓ స్నేహితుడి పుట్టినరోజు ఉండడంతో శుక్రవారం రామకృష్ణ తదితరులు మద్దులపల్లిలోని సాగర్ కాల్వ వద్ద వేడుక చేసుకున్నారు. అనంతరం సాగర్ కాల్వలోకి ఈతకు దిగిన సమయాన ఆయన గల్లంతయ్యాడు. శనివారం ఉదయం గత ఈతగాళ్లతో గాలిస్తుండగా గొల్లగూడెం వద్ద మృతదేహం లభించింది. అయితే, మృతదేహంపై గాయాలు ఉండడం, ముక్కు నుంచి రక్తం రావడంతో రామకృష్ణ స్నేహితులే కొట్టి కాల్వలో వేసి ఉంటారని ఆయన తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ ముష్క రాజు తెలిపారు. -
సామాజిక సేవకూ సమయం కేటాయించాలి
కొణిజర్ల: విద్యార్థులు శ్రద్ధగా చదివి లక్ష్యాలను చేరాక సామాజిక సేవకు కూడా సమయం కేటాయించాలని శ్రీకవిత విద్యాసంస్థల చైర్మన్ పారుపల్లి ఉషాకిరణ్కుమార్ సూచించారు. తనికెళ్లలోని విజయ ఇంజనీరింగ్ కళాశాలలో శనివారం జాతీయ స్థాయి కల్చరల్ ఫెస్ట్ ఆవిష్కార్–2026 నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ విద్యార్థులు నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ ప్రతిభను మెరుగుపర్చుకోవాలని తెలిపారు. కాగా, ఫెస్ట్లో ‘దివానా’ సినిమా హీరో హర్షిత్ రెడ్డి, హీరో స్నేహితులుగా నటించిన నర్సింగ్, శివరామ్ పాల్గొని విద్యార్ధులతో సందడి చేయగా సినీ గాయకులు పాడిన పాటలు ఉర్రూతలూగించాయి. అనంతరం వివిధ విభాగాల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కళాశాల వైస్ చైర్మన్ పారుపల్లి విజయలక్ష్మి, డైరెక్టర్ శ్రీకవిత పారుపల్లి ఎర్రా, ప్రిన్సిపాల్ వి.చిన్నయ్య, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ అయేషా తరుణమ్, డీన్లు డాక్టర్ డి.శ్రీనివాసరావు, డాక్టర్ హరిప్రసాద్, డాక్టర్ ఫరీద్బాబా తదితరులు పాల్గొన్నారు.శ్రీకవిత విద్యాసంస్థల చైర్మన్ ఉషాకిరణ్కుమార్ -
సంతగుడి ఆవరణలో సంత యథాతథం
కారేపల్లి: దేవాదాయ, ధర్మాదాయ శాఖ ఆధ్వర్యాన కారేపల్లిలోని శ్రీవేంకటేశ్వరస్వామి (సంతగుడి) దేవస్థానం ప్రాంగణంలో ప్రతీ ఆదివారం జరిగే వారాంతపు సంత యథావిధిగా కొనసాగుతుందని ఆలయ ఈఓ కె.వేణుగోపాలాచార్యులు, సింగరేణి గ్రామ కార్యదర్శి నెహ్రూ తెలిపారు. సంత ఆదాయంలో 15 శాతం గ్రామపంచాయతీకి చెల్లించాల్సి ఉండగా 2014 నుంచి రూ.3.52 లక్షలు బకాయి పేరుకుపోయింది. ఈ బకాయి చెల్లించకపోతే 12వ తేదీన సంత నిలిపివేస్తామని జీపీ నుంచి నోటీసు జారీ చేశారు. ఈ నేపథ్యాన శనివారం సింగరేణి (కారేపల్లి) గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ మేదరి టోనీవీరప్రతాప్తో పాటు పాలక వర్గం, దేవాదాయ శాఖ అధికారులు సమావేశమయ్యారు. ఈ మేరకు వన్టైమ్ సెటిల్మెంట్లో భాగంగా దేవాదాయ శాఖ నుంచి రూ.2 లక్షలను రెండు దఫాలుగా చెల్లిస్తామని చెప్పడంతో అంగీకరించారు. దీంతో సంత నిర్వహణకు అడ్డంకులు తొలగిపోయినట్లయింది. సమావేశంలో ఉప సర్పంచ్ పెద్దమ్మ భాగ్యలక్ష్మి, ఉద్యోగులు పగడాల మోహన్కృష్ణ, మూడ్ మోహన్చౌహాన్, వార్డు సభ్యులు ఆదెర్ల అంజయ్య, యాకూబ్ అలీ, రావుల రాజశేఖర్, భూమిక, రాధ తదితరులు పాల్గొన్నారు.దేవాదాయ శాఖ, జీపీ పాలకవర్గం మధ్య చర్చలు సఫలం -
ఐటీడీఏ కృషి అభినందనీయం
భద్రాచలం: గిరిజన మహిళలు, నిరుద్యోగులకు ఆర్థిక చేయూత ఇచ్చేందుకు భద్రాచలం ఐటీడీఏ చేస్తున్న కృషి అభినందనీయమని న్యూఢిల్లీలోని మినిస్టర్ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ డైరెక్టర్ వమాలి దికాకు అన్నారు. శనివారం హైదరాబాదులోని డీఎస్ఎస్ భవనంలో రెండు తెలుగు రాష్ట్రాల ఐటీడీఏల ప్రాజెక్టు అధికారులు, గిరిజన సంక్షేమ శాఖ అధికారులతో సంక్షేమ పథకాల అమలుపై వర్క్షాప్ నిర్వహించారు. భద్రాచలం ఐటీడీఏ తరఫున ఏపీఓ జనరల్ డేవిడ్రాజ్ ఆధ్వర్యంలో అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమెను గిరిజన సంక్షేమ శాఖ అడిషనల్ డైరెక్టర్ సర్వేశ్వర్రెడ్డి, టీసీఆర్టీఎన్టీ డైరెక్టర్ సమజ్వాల, ములుగు ఐటీడీఏ పీఓ దివాకర్ సమక్షంలో శాలువాతో సత్కరించి గిరిజన ఉత్పత్తులను అందజేశారు. ఈ సందర్భంగా ఐటీడీఏ ఆధ్వర్యంలో ప్రారంభించిన భద్రగిరి మార్ట్ లక్ష్యం, ఉత్పత్తులు, వాటి ఉపయోగాలు, ఆర్థిక చేయూత గురించి వివరించారు. అనంతరం వమాలి దికాకు మాట్లాడుతూ.. ఇలాంటి మార్ట్ల వల్ల గిరిజనులు ఆర్థికాభివృద్ధితో పాటు గిరిజన రైతులు, దళారుల దోపిడీకి గురి కాకుండా లాభపడతారన్నారు. మిగిలిన ఐటీడీఏల్లో కూడా ఇలాంటి గిరిజన మార్ట్లు ప్రారంభించి గిరిజన వ్యవసాయ ఉత్పత్తులు, ఇతర ఆహార పదార్థాలు కొనుగోలు చేసి చేయూత అందించాలని సూచించారు. కార్యక్రమంలో ఐటీడీఏ పీఓలు, డీటీడీఓలు, ఇతర విభాగాల అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
నెలాఖరుకు బేస్మెంట్ పూర్తి
● కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి వైరా: యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాల బోధన, హాస్టల్ భవనాల బేస్మెంట్ ఈ నెలాఖరుకు పూర్తి చేయాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆదేశించారు. వైరాలో నిర్మిస్తున్న గురుకుల పాఠశాల భవనాలను శనివారం ఆయన పరిశీలించి మాట్లాడారు. ఇక్కడ నాలుగు జూనియర్, తొమ్మిది సీనియర్ హాస్టల్ బ్లాక్లు నిర్మిస్తుండగా, నెలాఖరుకు బేస్మెంట్ స్థాయి పూర్తి కావాలని స్పష్టం చేశారు. జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలల భవనాలు కొనసాగుతున్నాయని తెలిపారు. భూ సంబంధిత సమస్యలన్నీ పరిష్కారమైనందున పనుల్లో వేగం పెంచాలని సూచించారు. జమలాపురంలో ప్రత్యేక పూజలు ఎర్రుపాలెం: తెలంగాణ తిరుపతిగా పేరున్న జమలాపురంలోని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు జరిగాయి. స్వామి మూలవిరాట్తో పాటు ఆలయ ప్రాంగణంలోని శ్రీవారి పాదానికి పంచామృతంతో అర్చకులు అభిషేకం చేశారు. అనంతరం స్వామి, అలివేలుమంగ, పద్మావతి అమ్మవార్ల ను పట్టువస్త్రాలతో అలంకరించి నిత్యకల్యా ణం, స్వామి పల్లకీ సేవ నిర్వహించగా తెలంగాణ, ఏపీలోని వివిధ ప్రాంతాల భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. ఈఓ జగన్మోహన్రావు, వ్యవస్థాపక ధర్మకర్త ఉప్పల విజయదేవశర్మ, ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాసశర్మ, ఉద్యోగులు సోమయ్య, కృష్ణప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. చెదలు పట్టిన మాత్రలపై డీఎంహెచ్ఓ ఆరా నేలకొండపల్లి: మండలంలోని మంగాపురంతండా జీపీ కార్యాయంలో శుక్రవారం నిర్వహించిన ఆరోగ్య అవగాహన సదస్సులో చెదలు పట్టిన మాత్రలు ప్రదర్శించడంపై డీఎంహెచ్ఓ రామారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయమై ‘సాక్షి’లో ‘చెదలు పట్టిన మాత్రలతో సదస్సు!’శీర్షికన కథనం ప్రచురితమైంది. దీంతో శనివారం స్పందించిన ఆయన వివరాలు ఆరా తీశారు. అంతేకాక చెదలు పట్టిన మాత్రలను ఎందుకు ప్రదర్శించారు.. చెదలు పట్టడానికి కారణాలపై వివరణ ఇవ్వాలని ఆదేశించారు. దీంతో పల్లె దవాఖానా వైద్యాధికారి మాధవి చెరువుమాధారం పీహెచ్సీ వైద్యాధికారి శ్రావణ్కుమార్కు వివరణ సమర్పించగా ఆయన డీఎంహెచ్ఓకు పంపించారు. పదేళ్ల తర్వాత శస్త్రచికిత్స ! ● అధికారుల చొరవతో సీహెచ్సీలో సౌకర్యాలు నేలకొండపల్లి: నేలకొండపల్లిలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో పదేళ్ల తర్వాత సిజేరియన్ ద్వారా ప్రసవం చేశారు. కొంతకాలంగా ఆస్పత్రిలో సౌకర్యాలు లేకపోవడంతో సాధారణ ప్రసవాలు మాత్రమే చేస్తున్నారు. ఈమేరకు అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ కలెక్టర్ అనుదీప్ దృష్టికి తీసుకెళ్లి నిధులు మంజూరు చేయించారు. అంతేకాకుండా పలుమార్లు స్వయంగా పరిశీలించి పనులు చేయించడంతో అన్ని వసతులు సమకూరాయి. ఈమేరకు దానవాయిగూడెంకు చెందిన గర్భిణి చందన పురినొప్పులతో శనివారం ఆస్పత్రిలో చేరగా ఇబ్బంది ఏర్పడిందని గుర్తించారు. ఆపై వైద్యులు మంగళ, కె.రాజేష్ శస్త్రచకిత్స చేయడంతో ఆమె క్షేమంగా బిడ్డకు జన్మనిచ్చింది. శస్త్రచికిత్సలో ఉద్యోగులు కవిత, ప్రశాంతి పాలుపంచుకున్నారు. రిటైర్డ్ ఉద్యోగుల కమిటీ ఎన్నిక ఖమ్మంసహకారనగర్: నాలుగో తరగతి రిటైర్డ్ ఉద్యోగుల ఉమ్మడి జిల్లా కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఖమ్మం ఇందిరానగర్లోని సంఘం భవనంలో శనివారం ఈ ఎన్నిక జరిగింది. నూతన అధ్యక్షుడిగా కోడి లింగయ్య, ఉపాధ్యక్షుడిగా ఆర్.వెంకటేశ్వరరావు, కార్యదర్శిగా పి.గణపతిరెడ్డి, సహాయ కార్యదర్శిగా కె.శ్రీను, కోశాధికారిగా గట్టికొండ నాగేశ్వరరావు, కార్యవర్గ సభ్యులుగా గిరిజాకుమారి, ఉమాదేవి, అంజమ్మ, కె.వెంకటేశ్వర్లు ఎన్నికయ్యారు. -
చుట్టూ ట్రాక్.. మధ్యలో ఫీల్డ్!
ఖమ్మం స్పోర్ట్స్: ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో సింథటిక్ అథ్లెటిక్స్ ట్రాక్ పనులు చివరి దశకు చేరాయి. ఇదేసమయాన ట్రాక్ మధ్యలో ఫుట్బాల్ ఫీల్డ్ ఏర్పాటు పనులు కూడా చేపడుతున్నారు. జిల్లాలో ఫుట్బాల్ క్రీడకు మంచి ఆదరణ ఉండడంతో అధికారులు ఈనిర్ణయం తీసుకున్నారు. ఇక్కడి క్రీడాకారులు జాతీయస్థాయిలో సత్తాచాటగా ప్రస్తుతం జిల్లా కేంద్రంలోనే 60మందికి పైగా శిక్షణ పొందు తూ పోటీల్లో రాణిస్తున్నారు. ఈనేపథ్యాన వీరికి మెరుగైన శిక్షణ అందేలా అథ్లెటిక్ ట్రాక్మధ్యలో 100 మీటర్ల పొడవు, వెడల్పుతో గడ్డి అమర్చి.. సంరక్షణ చర్యలు చేపడుతున్నారు. ఇందుకోసం దాదాపు రూ. 15 లక్షల వెచ్చిస్తున్నట్లు తెలియగా త్వరలోనే ఫుట్బాల్ క్రీడాకారులకు అందుబాటులోకి రానుంది.ఫుట్బాల్ క్రీడాకారుల కోసం ఏర్పాటు -
మెండుగా లాభాలు
మండే ఎండల్లో.. రైతులు ఎండాకాలంలో నీటి లభ్యత తక్కువగా ఉంటుందనే భావనతో పంటల సాగుకు దూరమవుతారు. కానీ ఉష్ణోగ్రతను తట్టుకొని కొద్ది పాటి నీటితోనే అధిక దిగుబడి ఇచ్చే పంటలు ఎన్నో ఉన్నాయి. నీటి వనరులు ఉన్న ప్రాంతాల్లో కూరగాయలు, ఆకుకూరలు సాగుచేస్తే తక్కువ సమయాన లాభాలను గడించొచ్చు. అంతేకాక కూరగాయల, ఆకుకూరలకు మంచి డిమాండ్ ఉంటుంది. ఈమేరకు వేసవిలో ఉష్ణోగ్రతలను తట్టుకునే కూరగాయల సాగుకు ముందుకు రావాలని అధికారులు సూచిస్తున్నారు.ఖమ్మంవ్యవసాయం: కాస్త నీటి వనరులు ఉంటే వేసవిలో కూరగాయలు, ఆకుకూరల సాగు లాభా లు తెచ్చిపెడుతుంది. సాధారణంగా వేసవిలో కూరగాయల సాగు తగ్గడంతో లభ్యత లేక మార్కెట్లో డిమాండ్తో పాటు ధరలు పెరుగుతాయి. అయితే, గత ఏడాది వానాకాలంలో విస్తారంగా కురిసిన వానలతో జిల్లాలోని జలాశయాల్లో సమృద్ధిగా నీరు ఉండడమే కాక సాగర్ నీటి విడుదలతో భూగర్భజలాలు సైతం ఆశించిన స్థాయిలో ఉన్నాయి. ఈ నేపథ్యాన జిల్లాలోని పలు ప్రాంతాల్లో కూరగాయలు, ఆకుకూరలను పండించే అవకాశం ఉన్నందున రైతులు ముందుకొస్తే తక్కువ వ్యవధిలో లాభాలు గడించొచ్చని అధికారులు చెబుతున్నారు. ఈనేపథ్యాన వేసవిలో సాగుకు అవకాశం ఉన్న ఆకుకూరలు, కూరగాయలు, ఎంచుకోవాల్సిన రకాలపై ఖమ్మం జిల్లా ఉద్యాన, పట్టుపరిశ్రమ అధికారి ఎం.వీ.మధుసూదన్ ఇచ్చిన సూచనలు ఇలా ఉన్నాయి. ఇవి మంచిది.. పలు రకాల కూరగాయలు, అకుకూరల పంటలు వేసవిలో ఉష్ణోగ్రతను తట్టుకునే శక్తి కలిగి ఉంటాయి. దోస, పొట్ల, గోరుచిక్కుడు, బెండ, దొండకాయ వంటి కూరగాయలతో పాటు అన్నిరకాల ఆకుకూరలను వేసవిలో సాగు చేస్తే మంచి దిగుబడులు వస్తాయి. దొండసాగు: దొండ ఒకసారి సాగు చేస్తే ఆరేళ్ల కాలం దిగుబడి వస్తూనే ఉంటుంది. నీటి అవసరం కూడా తక్కువగా ఉంటుంది. రైతులు ముందస్తు ప్రణాళిక రూపొందించుకుంటే నిరంతరాయంగా దిగుబడి సాధించవచ్చు. కాకర : కాకరకు మార్కెట్లో ఎల్లవేళలా డిమాండ్ ఉంటుంది. ఔషధ గుణాలు ఎక్కువగా ఉండడంతో కాలంతో పని లేకుండా అన్ని సమయాల్లో మంచి ధర పలుకుతుంది. పంట వేసిన 80 రోజుల్లో దిగబడి మొదలై నాలుగు నెలలు కొనసాగుతుంది. అయితే, ఎండ తీవ్రతను తట్టుకుని దిగుబడి ఇచ్చే రకాలు ఎంచుకోవాలి. వీటిలో పూసా–2, మౌసమి, యూఎస్ 6214, కోబ్రా హైబ్రిడ్ రకాలు ఉన్నాయి. సోర: ఉష్ణోగ్రతలను తట్టుకుని వేగంగా పెరిగే పంటల్లో సోర ఒకటి. పంటవేసిన 50రోజుల్లో దిగుబడి మొలై 60 రోజుల వరకు నిరంతరం వస్తూనే ఉంటుంది. అంతేకాక వేసవిలో ఈ పంటకు డిమాండ్ ఎక్కువ. పూసా నవీన్, ఆర్క బీహార్, అంకుర్ హెచ్బీజీ, సింజె వంటి రకాలు సాగు చేసుకోవచ్చు. బెండ: వేసవిలో ఉష్ణోగ్రతను తట్టుకుని ఆదా యాన్ని ఇచ్చే కూరగాయల పంటల్లో బెండ ఒకటి. పంట నాటిన 45 రోజుల్లో ఉత్పత్తి మొలై రెండు నెలల పాటు నిరంతరం కొనసాగుతుంది. బెండలో ఆర్క అనామిక్, పూసా పావని రకాలు వేసవిలో మంచి దిగుబడులను ఇస్తాయి. బీరకాయ: ఉష్ణోగ్రతలోనూ అధిక దిగుబడి ఇచ్చే కూరగాయల పంటల్లో బీర కూడా ఉంది. బీర నాటిన 50 – 60 రోజుల్లో దిగుబడి మొదలై రెండు నెలలు నిరంతరం వస్తూనే ఉంటుంది. ఈ పంటలో ఆర్కా సుజాత్, పూసా నస్తార్, నాగ హైబ్రిడ్, యూఎస్ 7109 రకాలు మేలైనవిగా చెబుతారు. ఆకుకూరలు: వేసవిలో ఆకుకూరలు తినేందుకు ప్రజలు ప్రాధాన్యత ఇస్తారు. తద్వారా ఎక్కువ పోషక విలువలు కలిగిన ఆకుకూరలకు డిమాండ్ ఉంటుంది. అయితే అన్ని రకాల ఆకుకూరలు ఎండ తీవ్రతను తట్టుకోలేవు. పాలకూర, కొత్తిమీర, చుక్కకూర త్వరగా దెబ్బతినే అవకాశం ఉండగా.. తోటకూర, మెంతికూరకు ఎండలను తట్టుకునే శక్తి ఉంటుంది. తోటకూరలో అర్క, అరుణిమ రకాలు సాగు చేసుకోవచ్చు. పంట వేసిన నెలలోగా దిగుబడి మొదలై రెండు మాసాలు కొనసాగుతుంది. మెంతికూరలో పూసా ఎర్లీ, బంచింగ్ రకాలు ఉత్తమమైనవి. ఇది కూడా రెండు నెలల పాటు దిగుబడి ఇస్తుంది. -
ఈతకు వెళ్లి సాగర్ కాల్వలో విద్యార్థి గల్లంతు
ఖమ్మంరూరల్: స్నేహితులతో కలిసి సరదాగా ఈత కొట్టేందుకు సాగర్ కాల్వలోకి దిగిన పదో తరగతి విద్యార్థి గల్లంతయ్యాడు. ఏదులాపురానికి చెందిన ఆటోడ్రైవర్ పుట్టబంతి నాగయ్యకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరిలో చిన్న కుమారుడైన రామకృష్ణ (16) ఏదులాపురం ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతూ వార్షిక పరీక్షలు రాస్తున్నాడు. మరో పరీక్ష రాస్తే పదో తరగతి పూర్తికానుంది. శుక్రవారం స్నేహితుడి పుట్టినరోజు కావడంతో ఐదుగురితో కలిసి సరదాగా మద్దులపల్లి వద్ద సాగర్ కాల్వలో ఈత కొడుతున్నారు. ఈతరాని రామకృష్ణ కొద్దిగా లోతు ప్రాంతంలోకి వెళ్లగా కాల్వలో మునిగిపోయాడు. ఆయన వెంట ఉన్న స్నేహితులకు కూడా ఈత రాకపోవడంతో కాపాడలేకపోయారు. ఈమేరకు సమాచారం అందుకున్న పోలీసులు గజ ఈతగాళ్లను రప్పించి గాలింపు చేపట్టారు. -
ఎంసీహెచ్ఓలో మందుల పంపిణీకి బ్రేక్
ఖమ్మంవైద్యవిభాగం: ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలోని మాతా శిశు ఆరోగ్య కేంద్రం (ఎంసీహెచ్)లో మందులు ఇచ్చే గదికి తాళం పడింది. దీంతో మూడు రోజులుగా మందుల పంపిణీ నిలిచిపోగా ఆస్పత్రికి వచ్చే గర్భిణులు, బాలింతలు ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. నిత్యం ఎంసీహెచ్లో 400 – 600 మంది వస్తుంటారు. అయితే ఇక్కడ మందులు ఇచ్చే ఫార్మసిస్ట్ వైద్య విధాన పరిషత్ ఉద్యోగి అయినా పెద్దాస్పత్రిలో అవసరమై అధికారులు డీఎంఈ వైపు పంపించారు. కానీ, ఇటీవల వెనక్కి పిలిపించడంతో ఫార్మసిస్ట్ లేక గదికి తాళం వేశారు. ఈ క్రమాన జనరల్ ఆస్పత్రి ఫార్మసీలో మందులు తీసుకోవాలని సూచిస్తుండడంతో పరీక్షల అనంతరం ఎంసీహెచ్ నుంచి అక్కడకు వెళ్లాల్సి వస్తోంది. ఈ విషయమై ఆస్పత్రి సూపరింటెండెంట్ నరేందర్ను వివరణ కోరగా ఫార్మసిస్ట్ వెళ్లిపోవడంతో ఈ పరిస్థితి ఎదురైందని తెలిపారు. ప్రస్తుతం జనరల్ ఆస్పత్రిలో ఫార్మసిస్ట్లు సరిపడా లేక ఎంసీహెచ్లో సర్దుబాటు చేయలేకపోతున్నామని, త్వరలోనే ప్రత్యామ్నాయం చూస్తామని వెల్లడించారు. -
సాగర్ కాల్వలోకి దూసుకెళ్లిన ట్రాక్టర్
కూసుమంచి: మండలంలోని హట్యాతండా సమీపాన సాగర్ ఐట్ ఫ్లో కెనాల్లోకి శుక్రవారం ట్రాక్టర్ దూసుకెళ్లింది. రైతు బదావత్ శ్రీను తన ట్రాక్టర్తో పొలానికి వెళ్తుండగా అదుపు తప్పడంతో ఈ ఘటన జరిగింది. ఇంజిన్ ముందు భాగం నీటిలో మునగగా శ్రీను బయటకు వచ్చి ఈదుతూ ఒడ్డుకు చేరాడు. అనంతరం జేసీబీ సాయంతో ట్రాక్టర్ను బయటకు తీశారు. అదుపు తప్పి కారు బోల్తా రఘునాథపాలెం: మండలంలోని మంచుకొండ – బూడిదంపాడు మార్గంలో మూలమలుపు చెరువు వద్ద శుక్రవారం కారు అదుపుతప్పి బోల్తా పడింది. అయితే, కారు పూర్తిగా ధ్వంసమైనా అందులో ఉన్న వారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఖమ్మంకు చెందిన ఇద్దరు డ్రైవర్తో కలిసి గురువారం ఇల్లెందు వెళ్లి శుక్రవారం తిరిగి వస్తుండగా కారు అదుపుతప్పడంతో ప్రమాదం జరిగింది. ఘటనపై బాదితులు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు సీఐ ఉస్మాన్ షరీఫ్ తెలిపారు. డీలర్పై కేసు నమోదు ఖమ్మం సహకారనగర్/ఖమ్మం రూరల్: ఖమ్మం రూరల్ మండలం తల్లంపాడులోని ఓ రేషన్ దుకాణంలో శుక్రవారం జిల్లా పౌరఫరాల శాఖాధికారి చందన్కుమార్ నేతృత్వాన తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా షాప్లో 43.68 క్వింటాళ్ల సన్నబియ్యం తక్కువగా ఉన్నట్లు తేలింది. దీంతో డీలర్పై 6ఏ కేసు నమోదు చేసినట్లు డీసీఎస్ఓ తెలిపారు. తనిఖీల్లో ఖమ్మం రూరల్ డీటీ విజయబాబు, సిబ్బంది పాల్గొన్నారు. -
కొనసాగుతున్న విద్యుత్ కార్మికుల సమ్మె
ఖమ్మంవ్యవసాయం: సమస్యల పరిష్కారం, డిమాండ్ల సాధనే లక్ష్యంగా విద్యుత్ కార్మికులు చేపట్టిన సమ్మె శుక్రవారానికి మూడో రోజుకు చేరింది. ఆర్టిజన్లు, అన్మ్యాన్డ్ కార్మికులు, స్పాట్ బిల్లర్లు, పీస్ రేట్ వర్కర్లు సమ్మెలో పాల్గొంటున్నారు. ఖమ్మంలోని ట్రాన్స్కో కార్యాలయం వద్ద సమ్మె శిబిరంలో కార్మికులు ప్లకార్డులు ప్రదర్శించారు. యునైటెడ్ ఎలక్ట్రికల్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రతినిధి ముత్యాల ప్రసాద్ మాట్లాడుతూ.. కార్మికుల సమస్యలపై యాజమాన్యం, ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. నాయకులు పెద్ది భాస్కర్, బషీర్, వల్లాల యుగంధర్, విప్పా వేణు, మోహన్, టి.రామకృష్ణ, తెనాలి నరసింహారావు, పంకు రామకృష్ణ, బండారు నరేశ్, హరికృష్ణ, ఖైరున్నీసాబేగం, సంధ్యారాణి పాల్గొన్నారు. -
ఉపాధి కూలీల సంఖ్య మరింత పెంచాలి
నేలకొండపల్లి/ముదిగొండ: జిల్లాలో ఉపాధి హమీ పథకం పనులకు వచ్చే కూలీల సంఖ్య మరింత పెంచేలా ఉద్యోగులు కృషి చేయాలని డీఆర్డీఓ కొండపల్లి శ్రీరామ్ సూచించారు. నేలకొండపల్లి మండలంలోని చెరువుమాధారం, ముదిగొండ మండలంలోని కట్టకూరులో శుక్రవారం ఆయన నర్సరీలు, ఉపాధి హమీ పథకం పనులను పరిశీలించారు. మస్టర్లు తనిఖీ చేయడమే కాక కూలీలకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందజేశారు. అనంతరం డీఆర్డీఓ మాట్లాడుతూ జిల్లాలో ప్రతీరోజు 12 వేల మంది కూలీలు పనులకు వస్తుండగా.. ఈ సంఖ్య మరింత పెరిగేలా చూడడంతో పాటు ఉదయం 6–30 గంటలకే ప్రారంభించాలని సూచించారు. అలాగే, హాజరు నమోదు, ఎండ బారిన పడకుండా సౌకర్యాల కల్పనపై సూచనలు చేశారు. అలాగే, ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి, ఇప్పటివరకు 85 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎంపీడీఓ బండి భాస్కర్రావు, సర్పంచ్ యల్ల య్య, ఏపీఓలు ఆర్.సునీత, రమ, ఈసీ శేషగిరిరావు తదితరులు పాల్గొన్నారు. -
అభివృద్ధి పనులకు శ్రీకారం
● ప్రారంభమైన భద్రాచల రామాలయ అభివృద్ధి పనులు ● నైవేద్య వంటశాలకు తాత్కాలిక షెడ్ నిర్మాణం.. ● మరో రెండు రోజుల్లో పూర్తిస్థాయి పనులు షురూ.. భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయి. గత నెల 27న శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవానికి విచ్చేసిన సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేసిన విషయం విదితమే. 2027 మార్చి నాటికి పనులను పూర్తి చేసి అప్పగించాలని ఆదేశాలను జారీ చేశారు. సమయం తక్కువగా ఉండటంతోపాటు గోదావరి పుష్కరాలు–2027 సైతం సమీపిస్తుండటంతో అభివృద్ధి పనుల ప్రక్రియ వేగవంతమైంది. తొలుత ఆలయంలోని మొదటి ప్రాకారం నిర్మించేందుకు, ఉపాలయాల తొలగింపునకు ప్రణాళికలు రచించారు. స్వామివారికి నివేదనను తయారు చేసే వంటశాల షెడ్ను తాత్కాలికంగా కొబ్బరికాయలు కొట్టే ప్రదేశంలో శబరి విగ్రహం ఉన్న స్థలంలో నిర్మించనుండగా, శుక్రవారం పనులు ప్రారంభించారు. లడ్డూల తయారీ కేంద్రాన్ని సీఆర్వో కార్యాలయం పైభాగాన తానీషా కల్యాణ మండపానికి తరలించనున్నారు. ఇక చిత్రకూట మండపం, భద్ర మహర్షి ఆలయాన్ని సైతం తొలగించనున్నారు. 26న మూర్తులకు పూజలు ఆలయ విస్తరణలో ఉపాలయాల తొలగింపు కీలకంగా మారింది. ఆలయ ప్రాంగణంలో కొలువైన శ్రీ లక్ష్మీతాయారు అమ్మవారు, ఆళ్వార్ల మూర్తులను తొలగించనున్నారు. లక్ష్మీతాయారు అమ్మవారి మూలమూర్తులను అంతరాలయంలో ఉంచి పూజలను జరపనున్నారు. ఆళ్వార్లు, చిత్ర కూట మండపంలో ఉన్న స్వర్ణ పూత వాహనాలను, మూ ర్తులను రంగనాయకుల గుట్టపైన ఉన్న ధ్యానమందిరానికి తరలించనున్నారు. ఈ నెల 25 నాటికి పనులన్నీ పూర్తి చేసి 26న అమ్మవారు, ఆళ్వార్ల మూర్తులకు పూజలు చేసి, కదిలించనున్నారు. భవనాల తొలగింపునకు టెండర్లు ఆలయ అభివృద్ధికి రూ.586 కోట్లను ప్రకటించగా, తొలి విడతగా రూ.351 కోట్లతో మార్చి 2027 నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. ఇందులో మూడు భాగాలుగా పనులు విభజించారు. రూ. 75 కోట్లతో గోదావరి ఘాట్లు, రూ.180కోట్లతో ఆలయ కాంప్లెక్స్ విస్తరణ, రూ. 96 కోట్లతో ఆలయ పరిసర ప్రాంతాల అభివృద్ధి చేపట్టనున్నారు. పనుల బాధ్యత అప్పగించిన ఆర్అండ్బీ శాఖ ఏక కాలంలో మూడింటి పనులను ప్రారంభించాలని సన్నాహాలు చేస్తున్నట్లు తెలు స్తోంది. తొలుత ఉపాలయాలు, చిత్రకూట మండ పం, ఇతర భవనాల తొలగింపునకు సుమారు రూ. 4కోట్లతో టెండర్లు ఖరారు చేసే అవకాశం ఉంది. మే మొదటి వారంలో పనులు ప్రారంభించేలా అధికారులు ముందుకు సాగుతున్నారు. రామాలయ అభివృద్ధి పనుల ప్రక్రియ వేగవంతం కావడంతో స్థానికులు, భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
అమెరికా సామ్రాజ్యవాదానికి ఘోరమైన ఓటమి
● అంతర్జాతీయంగా ప్రాముఖ్యత కోల్పోయిన భారత్ ● సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం ఖమ్మంమయూరిసెంటర్: ప్రపంచ దేశాలపై ఆధిపత్యం, వనరుల దోపిడీకి అమెరికా, ఇజ్రాయిల్ కలిసి ఇరాన్పై దాడులకు దిగగా... అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అహంకారానికి చైనా సాంకేతిక సహకారంతో ఇరాన్ గుణపాఠం చెప్పిందని చెప్పిందని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం అన్నారు. ఖమ్మంలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం జరిగిన సీపీఎం జిల్లా స్థాయి ప్లీనంలో ఆయన మాట్లాడారు. ఇరాన్లో ప్రభుత్వాన్ని ఉంచాలా, దించాలా అన్నది అక్కడి పాలన ఆధారంగా ప్రజలే నిర్ణయించుకోవాల్సి ఉంటుందన్నారు. కానీ పాలకులు తమకు పాదాక్రాంతం కాకపోతే దేశ నాగరికతనే నాశనం చేస్తామంటూ హిట్లర్ మాదిరి ట్రంప్ హెచ్చరించినా చైనా సాంకేతిక సహకారంతో ఇరాన్ ఎదురించిందని తెలిపారు. రాజకీయ సంకల్ప బలం, జాతీయవాదంతో వచ్చే ప్రేరణ, త్యాగనిరతి ఉన్న ప్రజల ముందు ఆయుధబలం ఓడిపోతుందని నాడు వియత్నాం, నేడు ఇరాన్ యుద్ధం నిరూపించిందన్నారు. కాగా, చైనా, రష్యా అండతో అమెరికా, ఇజ్రాయిల్ సామ్రాజ్యవాదంపై ఇరాన్ విజయం సాధిస్తే.. అమెరికా చెప్పింది చేసే అలవాటు ఉన్న మోదీ కారణంగా అంతర్జాతీయ రాజకీయాల్లో భారత్ తన ప్రాముఖ్యత కోల్పోయిందని తమ్మినేని పేర్కొన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర, జిల్లా నాయకులు పోతినేని సుదర్శన్రావు, నున్నా నాగేశ్వరరావు, మాచర్ల భారతి, బండి రమేష్, వై విక్రమ్, బుగ్గవీటి సరళ, బొంతు రాంబాబు, భూక్యా వీరభద్రం, శ్రీనివాసరావు, బండి పద్మ, మెరుగు సత్యనారాయణ, మడుపల్లి గోపాల్రావు తదితరులు పాల్గొన్నారు. -
మిల్లర్ల వైపే మొగ్గు..
రకం సాగు (ఎకరాల్లో) దిగుబడి అంచనా (మె.టన్నుల్లో) దొడ్డు రకం 92,770 2,62,802 సన్న రకం 1,39,157 3,37,889సాక్షి ప్రతినిధి, ఖమ్మం: జిల్లాలో వరి కోతలు ముమ్మరంగా సాగుతున్నా.. కొనుగోలు కేంద్రాలు పూర్తిస్థాయిలో ప్రారంభం కాలేదు. మొత్తం 306 కేంద్రాలను ప్రారంభిస్తామని అధికారులు ప్రకటించగా.. ఇప్పటివరకు 136 కేంద్రాలే మొదలయ్యాయి. దీనికి తోడు మొదలైన కేంద్రాల్లోనూ కఠినమైన తేమ శాతం నిబంధనతో రైతులు మిల్లర్ల వైపు మొగ్గుచూపుతున్నారు. ప్రభుత్వ మద్దతు ధర క్వింటాకు రూ.2,389గా ఉండగా, మిల్లర్లు ఎలాంటి కొర్రీలు పెట్టకుండా మెరుగైన ధర చెల్లిస్తుండడడం ఇందుకు కారణమవుతోంది. అంచనాలకు మించి వరి సాగు జిల్లావ్యాప్తంగా ఈ యాసంగిలో రైతులు గణనీయంగా వరి సాగు చేశారు. మొత్తం 2,28,434 ఎకరాల్లో వరి సాగవుతుందని వ్యవసాయశాఖ అంచనా వేస్తే అది కాస్తా 2,31,828 ఎకరాలకు చేరింది. చెరువులు, కుంటల్లో నీరు పుష్కలంగా ఉండడం, మిగతా చోట్ల భూగర్భ జలాలు ఆశించిన స్థాయిలో ఉండడంతో వరి వైపు మొగ్గు చూపారు. మొత్తంగా జిల్లాలో 6,00,691 మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేశారు. ఇందులో స్థానిక అవసరాలు, విత్తనాల కోసం 6,758 మెట్రిక్ టన్నులు, 3,56,360 మెట్రిక్ టన్నులను మిల్లర్లు, వ్యాపారుల కొనుగోళ్లు చేస్తారని.. మిగతా ధాన్యం ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలకు వస్తుందని లెక్కలు వేసుకున్నారు. ఈమేరకు 1,05,121 మెట్రిక్ టన్నుల దొడ్డు ధాన్యం, 1,32,452 మెట్రిక్ టన్నుల సన్న ధాన్యం కలిపి 2,37,573 మెట్రిక్ టన్నులు సేకరించాలని జిల్లా పౌర సరఫరాల సంస్థ నిర్ణయించుకుంది. మార్చి నుంచే కోతలు జిల్లాలో ధాన్యం కొనుగోళ్లకు 306 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని అధికారులు నిర్ణయించారు. అయితే, జిల్లాలో మార్చి నెలాఖరు నుంచే వరి కోతలు మొదలుకాగా, ఈనెల మొదటి వారం నుంచే కేంద్రాలు ఏర్పాటుచేస్తున్నారు. ఇప్పటి వరకు 136 కేంద్రాలే ప్రారంభించగా కొనుగోళ్ల మాత్రం ఊపందుకోలేదు. నేలకొండపల్లి మండలంలోని చెరువుమాదారం, మంగాపురం తండా, రాజేశ్వరపురంల్లో కేంద్రాలను ప్రారంభించినా ఇప్పటివరకు గింజ కూడా కొనుగోలు చేయలేదు. అంతేకాక 17లోపు తేమ శాతానికి మించొద్దని, చెత్తాచెదారం లేకుండా పట్టాదార్ పాస్ పుస్తకం, బ్యాంక్ పాస్బుక్, ఆధార్కార్డ్ జిరాక్స్తో రావాలని సూచిస్తున్నారు. అప్పుడే క్వింటాకు మద్దతు ధర రూ.2,389, కామన్ రకానికి రూ.2,369 దక్కుతుందని చెబుతున్నారు. నాకు ఉన్న 15 ఎకరాల్లో వరి సాగు చేశా. అందులో 675 బస్తాలు దిగుబడి వచ్చింది. ఽకొనుగోలు కేంద్రానికి వెళ్లాలని అనుకున్నా అక్కడ తేమ శాతం కోసం పడిగాపులు కాయాల్సి ఉంటుంది. అందుకే పొలం నుంచి నేరుగా మిల్లుకే తీసుకెళ్లా. ధర కూడా సంతృప్తిగానే లభించింది. – బాలిన కృష్ణంరాజు, రైతు, బైరవునిపల్లిజెన్సీ ప్రతిపాదిత ఇప్పటివరకు కేంద్రాలు ప్రారంభమైనవి ఐకేపీ గ్రూపులు 115 78పీఏసీఎస్ 151 50డీసీఎంఎస్ 33 05మెప్మా 07 03మొత్తం 306 136వరి కోతలు పూర్తి చేసిన రైతులు అమ్మకానికి మిల్లర్లను ఆశ్రయిస్తున్నారు. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకెళ్లినా తేమ శాతం తదితర నిబంధనలతో రోజుల తరబడి ఆరబెట్టుకోవాల్సి వస్తోందని రైతులు పేర్కొంటున్నారు. మరికొన్ని కేంద్రాల్లో ధాన్యం సేకరణే మొదలుకాలేదు. మరోపక్క మిల్లర్లు ఎలాంటి షరతులు లేకుండా చింట్లు రకం క్వింటాకు రూ.2,450, హెచ్ఎంటీ రకమైతే రూ.2,300 చెల్లిస్తున్నారు. ఈమేరకు కొనుగోలు కేంద్రాల వద్ద వేచి ఉండడం కంటే మిల్లర్లకు అమ్మితేనే మేలనే భావనలో రైతులు అటే వెళ్తున్నారు. ప్రభుత్వ కేంద్రాలపై ధాన్యం రైతుల నిరాసక్తత -
పోలీసుల విస్తృత తనిఖీలు
ఖమ్మంక్రైం: అక్రమ రవాణా, చట్టవ్యతిరేక కార్యకలాపాలను కట్టడి చేసేందుకు జిల్లావ్యాప్తంగా పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. గురువారం అర్ధరాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజాము వరకు ఏటీఎం సెంటర్లు, బ్యాంకుల పరిసరాల్లో తనిఖీలు చేపట్టగా, అనుమానాస్పద వ్యక్తులు, వాహనాల వివరాలు ఆరా తీసినట్లు సీపీ సునీల్దత్ శుక్రవారం వెల్లడించారు. నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులకు జరిమానా విధించినట్లు పేర్కొన్నారు. కాగా, తరచుగా తనిఖీలు నిర్వహిస్తూ సరిహద్దు రాష్ట్రాల మీదుగా ఇసుక, గంజాయి, రేషన్ బియ్యం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని, అక్రమంగా ఇసుక తరలించే లారీల బాధ్యులపై కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. ఇదే సమయాన మద్యం మత్తులో వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు కారణమవుతున్న వారి గుర్తింపునకు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టాలని సూచించారు. -
హోమియో వైద్యశిబిరంలో 321 మందికి పరీక్షలు
ఖమ్మంవైద్యవిభాగం: ప్రపంచ హోమియోపతి దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఖమ్మం మామిళ్లగూడెంలోని ప్రభుత్వ పాఠశాలలో వైద్యశిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో 321 మందికి రక్త, మధుమేహం తదితర పరీక్షలు నిర్వహించి ఆరోగ్య జాగ్రత్తలపై అవగాహన కల్పించి మందులు అందజేశారు. అంతేకాక మరో 15 మందిని మెరుగైన చికిత్స కోసం జిల్లా ప్రధాన ఆస్పత్రికి తరలించారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ డి.రామారావు, డాక్టర్ అరుణ పాల్గొనగా.. హోమియో ప్రాంతీయ సంచాలకురాలు ప్రమీల మాట్లాడుతూ.. హోమియోపతి విధానంలో ఇచ్చే మందులు శరీరంలోని రోగనిరోధకశక్తిని పెంచి, తక్కువ దుష్ప్రభావాలతో సురక్షితమైన చికిత్సను అందిస్తాయని తెలిపారు. వైద్యులు పద్మావతి, ఉపేందర్, సుధాకర్, జ్యోతి, నస్రీన్, ప్రవీణ్, వెంకటలోస్, కృష్ణ చైతన్య, సంధ్య, సిబ్బంది రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
చెదలు పట్టిన మాత్రలతో సదస్సు!
నేలకొండపల్లి: ఎవరి నిర్లక్ష్యమో తెలియదు కానీ ఆరోగ్యంపై అవగాహన కోసం ఏర్పాటుచేసిన సదస్సులో చెదలు పట్టిన మాత్రలను ప్రదర్శించడం విమర్శలకు తావిచ్చింది. మండలంలోని మంగాపురంతండా జీపీ కార్యాలయంలో శుక్రవారం ఆరోగ్య అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా పల్లె దవా ఖానా సిబ్బంది పలు రకాల మందులను ప్రదర్శించగా.. అందులో చాలా మందుల షీట్లకు చెదలు పట్టి ఉంది. ఈ విషయాన్ని గమనించిన సర్పంచ్ ధీరా వత్ అశోక్రాణి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈమేరకు సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని చెరువుమాధారం మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఉపాధ్యక్షుడు ధీరావత్ రాధాకృష్ణమూర్తి అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై పల్లె దవాఖానా వైద్యాధికారి వివరణ కోసం ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు. -
ఉక్కపోతతో విలవిల
ఖమ్మంవైద్యవిభాగం: జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారికి వేసవి కష్టాలు మొదలయ్యాయి. పలు విభాగాల్లో ఏసీలు పాతవి కావడం, ఇందులో చాలావరకు పనిచేయకపోగా.. ఎండవేడి, ఉక్కపోతతో ఇన్ పేషెంట్లు విలవిల్లాడిపోతున్నారు. జిల్లాలో ప్రస్తుతం 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇది మరింత పెరిగే అవకాశం ఉండడంతో అసలే ఆరోగ్యం బాగా లేక చికిత్స కోసం వచ్చేవారు మరింత ఇబ్బంది పడే ప్రమాదముంది. అవార్డులతోనే సంతృప్తి ఈనెల 7వ తేదీన జనరల్ ఆస్పత్రికి రాష్ట్ర స్థాయిలో ఉత్తమ అవార్డు వరించింది. మెరుగైన వైద్యసేవలు, రోగులకు అవసరమైన సౌకర్యాల కల్పనకు గాను ప్రకటించిన ఈ వార్డును రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ చేతుల మీదుగా సూపరింటెండెంట్ నరేందర్ అందుకున్నారు. అవార్డు రావడం ఆనందమే అయినా క్షేత్రస్థాయిలో వసతుల కల్పనలో మాత్రం ఆ పరిస్థితులు లేవనే విమర్శలు వస్తున్నాయి. జిల్లా ఆస్పత్రికి ఖమ్మం నుంచే భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, మహబూబాబా ద్ జిల్లాల నుంచి చికిత్స కోసం వస్తుంటారు. హైదరాబాద్ తర్వాత ఎక్కువ సంఖ్యలో ఇక్కడే చికిత్స పొందుతున్నా.. ఎండాకాలంలో ఏసీలను మరమ్మతు చేయించకపోవడంపై పెదవి విరుస్తున్నారు. జనరల్ ఆస్పత్రితో పాటు మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో పూర్తి స్ధాయిలో ఏసీలు లేక బాలింతలు, గర్బిణులు, చిన్నారులు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ఇందులో కొందరు సొంతంగా బ్యాటరీ ఫ్యాన్లు, టేబుల్ ఫ్యాన్లు తెచ్చుకుని ఉపశమనం పొందుతున్నారు. భానుడు మరింత ప్రతాపం చూపకముందే పూర్తిస్థాయిలో ఏసీలను మరమ్మతు చేయించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఆస్పత్రిలో ఏసీల మరమ్మతు బాధ్యతలు కొత్త కాంట్రాక్టర్కు అప్పగించాం. ఇప్పటికే ఎన్ని పని చేయడం లేదో గుర్తించారు. వారంలోగా అన్ని ఏసీలను పూర్తి స్థాయిలో మరమ్మతు చేయిస్తాం. ఆ తర్వాత ఏడాది పాటు బాధ్యతలు కాంట్రాక్టర్ చూసుకుంటారు. – సంతోష్, ఏడీ, జనరల్ ఆస్పత్రిపెద్దాస్పత్రిలోని పలు విభాగాల్లో 178 ఏసీలు ఉన్నాయి. ఇటీవల అధికారులు అన్నింటినీ తనిఖీ చేయించగా కేవలం 30 మాత్రమే పనిచేస్తున్నాయని తేలింది. ఆస్పత్రి వైద్యవిధాన పరిషత్ పరిధిలో ఉన్నప్పుడు ఏసీ నిర్వహణ బాధ్యతను కాంట్రాక్టర్కు అప్పగించారు. కాంట్రాక్టు సంస్థ బాధ్యులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తే ఏసీలు పాడైతే మరమ్మతు చేసేవారు. ఆ వెంటనే బిల్లు సమర్పిస్తే నిధులు మంజూరయ్యేవి. కానీ జనరల్ ఆస్పత్రి రెండున్నరేళ్ల క్రితం డీఎమ్ఈ పరిధిలోకి వెళ్లాక అనేక ఏసీలు పాడైనా బడ్జెట్ లేకపోవడంతో మరమ్మతులు జరగలేదు. ఫలితంగా 30 మాత్రమే పనిచేస్తున్నాయని తేలడంతో అధికారులే నిర్ఘాంతపోయినట్లు తెలిసింది. -
కూసుమంచి కెనరా బ్యాంకులో పొగలు
కూసుమంచి: కూసుమంచిలోని కెనరా బ్యాంకులో శుక్రవారం పొగలు వ్యాపించగా సిబ్బంది ఆందోళనకు గురయ్యారు. బ్యాంకు పనివేళలు ముగిశాక సిబ్బంది మూసివేసే క్రమాన షార్ట్ సర్క్యూట్తో ఒక్కసారిగా పొగలు వ్యాపించాయి. అంతేకాక కొద్దిమేర మంటలు వ్యాపించి పేస్లిప్పులు కాలిపోయాయి. దీంతో అప్రమత్తమైన సిబ్బంది అగ్నిమాపక శాఖ కార్యాలయానికి సమాచారం ఇచ్చారు. ఖమ్మం నుంచి వాహనంతో వచ్చిన సిబ్బంది బ్యాంకులో కమ్ముకున్న పొగను పైపుల ద్వారా బయటకు పంపించారు. ఆ తర్వాత మంటలు వ్యాపించకుండా చర్యలు చేపట్టగా.. విలువైన పత్రాలకు నష్టం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. -
ఖమ్మం మార్కెట్లోకి ‘న్యూ రెనాల్ట్ డస్టర్’
ఖమ్మంఅర్బన్: Æð‡¯éÌŒæt çÜ…çܦ Mö™èl¢ Ððl*yýlÌŒæ yýlçÜtÆŠ‡ M>Æý‡$¯]l$ QÐ]l$Ã… Ð]l*Æð‡P-sŒæ-ÌZMìS Ñyýl$-§ýlÌS ^ólíÜ…¨. D çÜ…§ýl-Æý‡Â…V> BÆ>P Æð‡¯éÌŒæt ÚùÆý‡*…ÌZ Ô¶æ${MýS-ÐéÆý‡… AíÜ-òÜt…sŒæ Ððl*sêÆŠ‡ Ððlíßæ-MýSÌŒæ C¯ŒS-òܵ-MýStÆý‡$Ï ¨¯ólÔŒæ, Æý‡Ñ^èl…{§ýl M>Æý‡$¯]l$ BÑçÙP-Ç…-^éÆý‡$. A¯]l…-™èlÆý‡… ÚùÆý‡*… õÜÌŒæÞ òßæyŠæ ¯]lÒ¯ŒS-M>…™Œæ ¯]l*Å Æð‡¯éÌŒæt yýlçÜtÆŠ‡ {ç³™ólÅ-MýS-™èl-ÌS¯]l$ ÑÐ]l-Ç…^éÆý‡$. B«§ýl$-°MýS Ýë…MóS-†MýS™èl, BMýS-Æý‡Û-×îæ-Ķæ$-OÐðl$¯]l yìlOgñ毌S-™ø Ðéçßæ¯]l… Æý‡*´÷…¨…_-¯]lr$Ï ™ðlÍ´ëÆý‡$. ¿êÆý‡™Œæ, BÆ>P {VýS*‹³ O^ðlÆý‡Ã¯ŒS MóSÝë çÜ$¿ê‹Ù ^èl…{§ýl-»Z‹Ü, BÆ>P çßZ…yé iG… Ððl…MýS-sôæ-ÔèæÓ-Æý‡-Æ>Ð]l#, ÚùÆý‡*… Ķæ*fÐ]l*-¯]lÅ… MóSÝë çÜ…ç³™Œæ, §éçÜÇ çÜÓÆ>gŒæ, VýS$Æý‡$-MìS-çÙ¯ŒS ™èl¨™èl-Æý‡$-Ë$ ´ëÌŸY-¯é²Æý‡$. ˘ ‘ప్రశ్నించే వారిని బంధించే యత్నంలో కేంద్రం’ ఖమ్మంమయూరిసెంటర్: ప్రశ్నించే వారిని నిర్బంధిస్తూ వారి గొంతు నొక్కేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని సీపీఐ జాతీయ సమితి సభ్యులు బాగం హేమంతరావు ఆరోపించారు. ఈ క్రమంలోనే ప్రజాస్వామిక వాదులపై జాతీయ దర్యాప్తు సంస్థ విచారణ జరిపిస్తోందని తెలిపారు. మాస్లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావును ఎన్ఐఏ విచారణకు పిలవడం ప్రజాస్వామికవాదుల గొంతు నొక్కడమేనని పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వాలను ప్రశ్నించడం, ప్రభుత్వ చట్టవ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం తమ కర్తవ్యమని తెలిపారు. ఈ క్రమాన సుదీర్ఘ కమ్యూనిస్టు పార్టీ ప్రస్థానంలో బెదిరింపులు, నిర్బంధాలను చవిచూసినప్పటికీ అకారణంగా ఎన్ఐఏ దర్యాప్తునకు ఆదేశించడం మాత్రం మోదీ హయాంలోనే చూస్తున్నామని ఓ ప్రకటనలో వెల్లడించారు. కాగా, పోటు రంగారావుపై ఎన్ఐఏ కేసు ఉపసంహరించుకోవాలని సీపీఐ జిల్లా కార్యదర్శి దండి సురేశ్ డిమాండ్ చేశారు. నైటింగేల్ స్ఫూర్తితో సేవలు అందించాలి సత్తుపల్లి: నర్సింగ్ పూర్తి చేయనున్న విద్యార్థి నులు ఫ్లోరెన్స్ నైటింగేల్ స్ఫూర్తితో వైద్య సేవలు అందించాలని డీసీహెచ్ఎస్ రాజశేఖర్గౌడ్, సత్తుపల్లి మున్సిపల్ చైర్పర్సన్ ఎండీ రెహానాబేగం సూచించారు. సత్తుపల్లిలోని ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో ప్రథమ సంవత్సరం విద్యార్థినుల ‘ల్యాంప్ లైటింగ్ సెరిమొనీ’శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. అనంతరం ఇటీవల అవార్డులు అందుకున్న గంగారం పీహెచ్సీ వైద్యాధికారి ఆర్.అవినాష్, పెనుబల్లి ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్ ఎన్.కిరణ్కుమార్ను సన్మానించగా, ప్రతిభ చూపిన నర్సింగ్ విద్యార్థులకు బహుమతులు అందించారు. సత్తుపల్లి ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ సురేశ్నారాయణ్, డాక్టర్ స్రవంతి, ఎన్ఎస్ రాధాకృష్ణకుమారి, హైమావతి, ప్రిన్సిపాల్ కేవీ జ్యోత్స్న, కౌన్సిలర్లు వీరివాడ అపర్ణ, విజయ్కుమారి, మానస, ఉష పాల్గొన్నారు. చెరువు రిటైనింగ్ వాల్కు రూ.3 కోట్లు బోనకల్: మండలంలోని ఆళ్లపాడు ఊరచెరువు ప్రధాన రహదారి పక్కన ఉండడంతో తరుచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యాన చెరువులో పడి పలువురు మృతి చెందారు. దీంతో చెరువుకు రిటైనింగ్ వాల్ నిర్మించేలా ప్రభుత్వం రూ.3 కోట్లను మంజూరు చేసింది. మార్కెట్ డైరెక్టర్ కందుల పాపారావు, కాంగ్రెస్ నాయకులు చెరువును శుక్రవారం పరిశీలించారు. నిధులు మంజూరు చేసిన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు కృతజ్ఞతలు తెలిపారు. విద్యుదాఘాతంతో మృతి పెనుబల్లి: మండలం పాత అగ్రహారానికి చెందిన మూడే బిక్షు(70) శుక్రవారం విద్యుదాఘాతంతో మృతి చెందాడు. ఆయన ఇంట్లో కరెంట్ మోటార్ స్విచాన్ చేయగా పైపులైన్ లీకేజీ అయింది. దీంతో ఇనుప పైపునకు గుడ్డ చుట్టే క్రమాన షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. ఆయనకు మాజీ సర్పంచ్ సోమ్లానాయక్తో పాటు మరో కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. -
పలువురు న్యాయమూర్తుల బదిలీ
ఖమ్మం లీగల్: జిల్లా కోర్టుకు చెందిన పలువురు న్యాయమూర్తులు బదిలీ అయ్యారు. ఈమేరకు హైకోర్టు రిజిస్ట్రార్ నుంచి గురువారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈమేరకు ఖమ్మం మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి కె.ఉమాదేవి మేడ్చల్ మల్కాజ్గిరి ఫ్యామిలీ కోర్టుకు, రెండో అదనపు జి ల్లా న్యాయాధికారి వెంపటి అపర్ణ హైదరాబాద్లోని 26వ అదనపు చీఫ్ జడ్జి, సిటీ సివిల్ కోర్టుకు, ఖమ్మం ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి దేవినేని రాంప్రసాద్ కూకట్పల్లి ఫ్యామిలీ కోర్టుకు బదిలీ అయ్యా రు. ఇకఖమ్మం కుటుంబ న్యాయస్థానం న్యాయమూర్తి అర్చనాకుమారిని హైదరాబాద్ 12వ అదనపు సెషన్స్ జడ్జి(పోక్సో కోర్టు) కోర్టుకు బదిలీ చేశారు. ఇదిలా ఉండగా హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో 9వ అదనపు చీఫ్ జడ్జి బాకరాజు శ్రీనివాసరావును ఖమ్మం మొదటిఅదనపు జిల్లా న్యాయమూర్తిగా ని యమించారు. అలాగే, 18వ అదనపు చీఫ్ జడ్జి డాక్టర్ జీ.వీ.మహేష్నాథ్ను ఖమ్మం కుటుంబ న్యాయస్థానం న్యాయమూర్తిగా, సంగారెడ్డి మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి డాక్టర్ పుల్లభట్ల పొగడ కృష్ణార్జున్ను ఖమ్మం ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. నేడు, రేపు మంత్రి తుమ్మల పర్యటన ఖమ్మంఅర్బన్: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శని, ఆదివారం ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా శనివారం సాయంత్రం ఖమ్మం 36వ డివిజన్ ట్రంక్ రోడ్డులో జిల్లా సైన్స్ మ్యూజియాన్ని మంత్రి ప్రారంభిస్తారు. ఆతర్వాత 34వ డివిజన్లో సీసీ రహదారి నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. ఇక ఆదివారం ఉదయం ఖమ్మం ఎన్నెస్పీ క్యాంప్లోని పీఆర్టీయూ టీఎస్ కార్యాలయంలో సామినేని హిమవంతరావు విగ్రహాన్ని మంత్రి ఆవిష్కరిస్తారు. గృహనిర్మాణాల్లో వేగం పెరగాలి కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఖమ్మంగాంధీచౌక్: ఈ నెలాఖరుకు నాటికి జిల్లాలో 10వేల ఇందిరమ్మ ఇళ్లను గృహప్రవేశానికి సిద్ధం చేయాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. ఈమేరకు పనుల్లో వేగం పెరిగేలా నిత్యం పర్యవేక్షించాలని తెలిపారు. కలెక్టరేట్లో శుక్రవారం ఆయన ఎంపీడీఓలు, తహసీల్దార్లు, హౌజింగ్ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 10వేల ఇళ్ల నిర్మాణం పూర్తయ్యేలా లబ్ధిదారులకు అధికారులు అండగా నిలవాలని తెలిపారు. ఇవికాక జిల్లాలో ఇంకా 1,912 నిర్మాణాలు మొదలుకాలేదని చెప్పారు. ఈమేరకు లబ్ధిదారులకు అవగాహన కల్పించి త్వరగా పనులు ప్రారంభించేలా చొరవ చూపాలని సూచించారు. కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్య, అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి, హౌజింగ్ పీడీ భూక్యా శ్రీనివాస్ పాల్గొన్నారు. ఆధునిక విధానాలతో మత్స్యరంగం అభివృద్ధి కూసుమంచి: చేపల పెంపకం, వేట జీవనాధారంగా ఉన్న మత్స్యకారులు ఆధునిక విధానాలను అందిపుచ్చుకోవాలని, తద్వారా మరింత లబ్ధి జరుగుతుందని నాబార్డు డీడీఎం ఎల్.సుజిత్కుమార్ సూచించారు. పాలేరులోని మత్స్య పరిశోధనా కేంద్రంలో బయోప్లాక్ విధానంలో చేపల పెంపకంపై ఇస్తున్న శిక్షణ శుక్రవారం రెండో రోజుకు చేరింది. ఈ సందర్భంగా డీడీఎం మాట్లాడుతూ నాబార్డు ఆధ్వర్యాన మత్స్యరంగం అభివృద్ధికి అమలుచేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. శిక్షణలో నేర్చుకున్న అంశాలను అమలుచేస్తే చేపల ఉత్పత్తి పెరుగుతుందని తెలిపారు. పరిశోధనా కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ శ్యాంప్రసాద్, శాస్త్రవేత్తలు రవీందర్, శాంతన్న, నాగరాజు మాట్లాడగా ఆత్మ బ్లాక్ టెక్నాలజీ మేనేజర్ శ్రీనివాస్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. రేక్ పాయింట్కు 3,017 మె.టన్నుల యూరియా చింతకాని: చింతకాని మండలంలోని పందిళ్లపల్లి రేక్ పాయింట్కు శుక్రవారం ఆర్ఎఫ్సీఎల్ కంపెనీకి చెందిన 3,017.16 మెట్రిక్ టన్నుల యూరియా వచ్చిందని జిల్లా వ్యవసాయాధికారి ధనసరి పుల్లయ్య తెలిపారు. ఇందులో ఖమ్మం జిల్లాకు 757.16 మె.టన్నులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు 1,130 మె.టన్నులు, మహబూబాబాద్ జిల్లాకు 630 మె. టన్నులు సరఫరా చేసినట్లు వెల్లడించారు. మిగతా 500 మెట్రిక్ టన్నుల యూరియాను బఫర్ స్టాక్గా నిల్వ చేశామని తెలిపారు. -
ఎర్ర బంగారం కళకళ
● ‘తేజా’ రకం క్వింటాకు రూ.20 వేలు దాటిన ధర ● దిగుబడి తగ్గిన వేళ పెరుగుతున్న డిమాండ్ ఖమ్మంవ్యవసాయం: తేజా రకం మిర్చి ధర కొద్దికొద్దిగా పెరుగుతోంది. ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో శుక్రవారం ఈ రకం మిర్చి క్వింటాకు జెండాపాట రూ.20,100గా పలికింది. పంట సీజన్ ఆరంభంతో పోలిస్తే రూ.5 వేల వరకు పెరిగినట్లయింది. ఈ ఏడాది సాగు చేసిన మిర్చి పంట ఉత్పత్తి నవంబర్లో మొదలుకాగా తొలినాళ్లలో గరిష్టంగా రూ.15 వేలు ధర పలికింది. సంక్రాంతి వరకు అదే పరిస్థితి ఉండగా.. జనవరి 20న రూ.17,600కు చేరింది. ఇక జనవరి 20 నుంచి 23వరకు మాత్రం రూ.20 వేల నుంచి 21,150 వరకు ధర పలికింది. మళ్లీ ఫిబ్రవరిలో రూ.18 వేలకు పడిపోయినా మార్చి నుంచి క్రమంగా పెరుగుతోంది. గురువారం రూ.19,800గా పలికిన ధర శుక్రవారం రూ.20,100కు చేరడం విశేషం. అంతేకాకుండా మరింత నాణ్యత కలిగిన కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ మిర్చి ధర రూ.20,500గా పలికింది. కాగా, మార్కెట్కు ప్రతిరోజూ సగటున 35 వేలనుంచి 40 వేల బస్తాలకు పైగా మిర్చి తీసుకొస్తున్నారు. సాగు, దిగుబడి తగ్గడంతో.. మిర్చి పంట సాగు విస్తీర్ణం జిల్లాలో గణనీయంగా తగ్గింది. సాధారణంగా లక్ష ఎకరాల్లో సాగయ్యే మిర్చి గత ఏడాది 60 వేల ఎకరాలకు, ఈసారి 30 వేల ఎకరాలకు పడిపోయింది. గతంలో ఎదురైన నష్టాలతో రైతులు సాగు తగ్గించారు. అంతేకాక అధిక వర్షాలు, నల్లి కారణంగా దిగుబడులు కూడా రాలేదు. సాధారణంగా ఎకరాకు 30 – 40 క్వింటాళ్లు వచ్చే దిగుబడి ఈ ఏడాది 15 క్వింటాళ్లు దాటలేదు. అయితే, ఈ ఏడాది ఆరంభం నుంచి మిర్చి విదేశీ ఆర్డర్లు లేకున్నా దేశీయంగా డిమాండ్ పలుకుతోంది. ఇక్కడ కొనుగోలు చేసే తేజా రకం మిర్చిని కోల్కత్తా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ తదితర ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. ఇంకొందరు మాత్రం చైనాకు కూడా పంపిస్తున్నారు. మరికొందరు వ్యాపారులు రైతుల నుంచి పంటను కొనుగోలు చేసి కోల్డ్స్టోరేజీల్లో నిల్వ చేస్తున్నారు. ఇలా రకారకాల కారణాలతో గత ఏడాది ధరతో పోలిస్తే ఈసారి ఽమిర్చి ధర ఆశాజనకంగా ఉండడంతో రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. మిర్చి ధర కొంత మేరకు ఆశాజనకంగా ఉంది. నేను ఆరు ఎకరాల్లో పంట సాగు చేశా. ఎకరాకు 20 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చింది. 50 బస్తాల మిర్చిని ఖమ్మం తీసుకొస్తే క్వింటాకు రూ.20 వేల ధర పలికింది. –బానోత్ కిషన్, నల్లెల్ల, మహబూబాబాద్ జిల్లా మూడెకరాల్లో మిర్చి సాగు చేశా. ఎకరాకు 25 క్వింటాళ్లు వచ్చే దిగుబడి 15 క్వింటాళ్లుదాటలేదు. అధిక వర్షాలు, నల్లితో ఈ పరిస్థితి ఉంది. 30 బస్తాల మిర్చి తీసుకొస్తే కొంత తేమ ఉండడంతో ధర రూ.19 వేలుగా నిర్ణయించారు. –జి.రవి, గేటు కారేపల్లి, ఖమ్మం జిల్లా -
పేదల సంక్షేమంలో రాజీ లేదు..
నేలకొండపల్లి: ఆర్థిక పరిస్థితులు సహకరించకున్నా పేదల సంక్షేమం విషయంలో రాజీ పడడం లేదని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. నేలకొండపల్లి మండలం కోనాయిగూడెంలోని గురుకుల పాఠశాలలో రూ.34 లక్షల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశాక వంటలు, కూరగాయలను పరిశీలించి మెనూ అమలుపై విద్యార్థినులతో మాట్లాడారు. అలాగే, వివిధ గ్రామాల్లో పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి, 132 మందికి రూ.45.66 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందించారు. ఈ కార్యక్రమాల్లో మంత్రి పొంగులేటి మాట్లాడుతూ ప్రజల దీవెనలతో ఏర్పడిన తమ ప్రభుత్వం పేదల వైద్యానికి ఆరోగ్యానికి పెద్దపీట వేస్తూనే వారి సంక్షేమానికి అనేక పథకాలు అమలుచేస్తోందని తెలిపారు. పేదలకు ఇందిరమ్మ ఇళ్లు, మహిళలకు ఉచిత ప్రయాణం, నూతన రేషన్కార్డులు, సన్న బియ్యం పంపిణీ, రూ.500 గ్యాస్ సిలిండర్ సరఫరా, 200 యూనిట్ల ఉచిత విద్యుత్తో పేదలకు అందగా నిలుస్తున్నామని చెప్పారు. కాగా, ఏప్రిల్ నెలాఖరు లేదా మే మెదటి వారంలో రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరు ఉంటుందని మంత్రి ప్రకటించారు. గత ప్రభుత్వం పదేళ్లలో ఒక్క ఇల్లు కూడా ఇవ్వకపోగా.. తాము అధికారంలోకి రాగానే ఇళ్ల మంజూరుకు శ్రీకారం చుట్టామని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ, ఆర్డీఓ శ్రీనివాస్, ప్రత్యేక అధికారి రమేష్, మార్కెట్ చైర్మన్ వెన్నపూసల సీతారాములు, నాయకులు కొడాలి గోవిందరావు, జెర్రిపోతుల అంజిని, బచ్చలకూరి నాగరాజు, రాయపూడి నవీన్, ఎం.వెంకన్న, బొందయ్య, భద్రయ్య, నంబూరి రామారావు, పసుపులేటి శ్రీలత, జెర్రిపోతుల సత్యనారాయణ, పెంటమళ్ల పుల్లమ్మ తదితరులు పాల్గొన్నారు. నేడు మంత్రి పొంగులేటి పర్యటన ఖమ్మంమయూరిసెంటర్: రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శనివారం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు శ్రీశ్రీ సర్కిల్లో నిర్వహించే జ్యోతిరావు పూలే జయంతి వేడుకల్లో పాల్గొంటారు. ఆతర్వాత ఏదులాపురం మున్సిపాలిటీ పరిధి ఆటోనగర్ వద్ద అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశాక కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేయనున్నారు. అలాగే సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేస్తారు. అనంతరం ఖమ్మంరూరల్ మండలం మంగళగూడెంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్న మంత్రి, సాయంత్రం తిరుమలాయపాలెం ఎంపీడీఓ కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేస్తారు. -
పౌరసరఫరాల సంస్థ డీఎం శ్రీలత బదిలీ
ఖమ్మం సహకారనగర్: రాష్ట్రంలో పది మంది స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లు, డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈమేరకు డిప్యూటీ కలెక్టర్ హోదాలో పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్గా విధులు నిర్వర్తిస్తున్న గంటా శ్రీలతకు స్థానచలనం కలిగింది. ఆమెను హైదరాబాద్లో రెరా(రియల్ ఎస్టేట్ రెగ్యులరేటరీ అథారిటీ)కి డిప్యూటేషన్పై బదిలీ చేశారు. అయితే, జిల్లాలో డీఎంగా మాత్రం ఎవరికీ పోస్టింగ్ ఇవ్వలేదు. హెచ్ఎంపై సస్పెన్షన్ ఎత్తివేయాలని విద్యార్థినుల ఆందోళన కామేపల్లి: కామేపల్లి ప్రభుత్వ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల ఇన్చార్జ్ హెచ్ఎం బి.నెహ్రూపై సస్పెన్షన్ ఎత్తివేయాలని విద్యార్థినులు కోరారు. ఈమేరకు పాఠశాల ఎదుట గురువారం ఆందోళన చేపట్టారు. ఓ ఉపాధ్యాయురాలి తప్పుడు ఫిర్యాదుతో అధికారులు సస్పెండ్ చేసినందున, ఆమైపె చర్యలు తీసుకోవాలని చేపట్టిన నిరసన మూడు గంటల పాటు కొనసాగింది. దీంతో ఐటీడీఏ ఏటీడీఓలు రమేష్, సత్యవతి, సీఐ సాగర్, ఎస్సై శ్రీకాంత్ చేరుకుని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని చెప్పడంతో విద్యార్థినులు ఆందోళన విరమించారు. కాగా, బాలికలతో హెచ్ఎం అసభ్యంగా ప్రవర్తించాడని ఫిర్యాదు చేసి బాలికల మనస్తాపానికి కారణమైన ఉపాధ్యాయురాలిపై చర్యలు తీసుకోవాలని సర్పంచ్ అజ్మీరా బుల్లి, స్థానికులు డిమాండ్ చేశారు. ధర్నా సమయాన ఎండతో ఓ విద్యార్థిని సొమ్మసిల్లి పడిపోగా పీహెచ్సీలో చికిత్స చేయించారు. 11న ఉమ్మడి జిల్లాస్థాయి క్రికెట్ ఎంపికలు ఖమ్మం స్పోర్ట్స్: ఉమ్మడి జిల్లా క్రికెట్ జట్టు ఎంపిక పోటీలు ఈనెల 11న నిర్వహిస్తున్నట్లు క్రికెట్ అసోసియేషన్ ఖమ్మం జిల్లా కార్యదర్శి సీహెచ్.వెంకట్, కోఆర్డినేటర్ ఎం.డీ.మసూద్ తెలిపారు. ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలో ఈ పోటీలు ఉంటాయని వెల్లడించారు. ఆసక్తి ఉన్న క్రికెటర్లు వయసు ధ్రువీకరణపత్రాలతో ఉదయం 10 గంటలకు రిపోర్ట్ చేయాలని, వివరాలకు 79818 81095 నంబర్లో సంప్రదించాలని సూచించారు. 30వ తేదీ వరకు బియ్యం పంపిణీ ఖమ్మం సహకారనగర్: ఏప్రిల్, మే, జూన్ నెలల రేషన్ బియ్యం పంపిణీ ఈనెల 30వ తేదీ వరకు కొనసాగుతుందని డీసీఎస్ఓ చందన్కుమార్ తెలిపారు. ఈమేరకు లబ్ధిదారులు ఈ–కేవైసీ చేయించుకొని బియ్యం తీసుకోవాలని ఆయన ఓ ప్రకటనలో సూచించారు. డీలర్పై కేసు నమోదు.. వేంసూరు మండలం దుద్దేపుడికి చెందిన రేషన్ డీలర్పై 6ఏ కేసు నమోదైంది. రేషన్ దుకాణాన్ని ఖమ్మం రూరల్ డీటీ విజయబాబు గురువారం తనిఖీ చేయగా 20.77క్వింటాళ్ల బియ్యం తక్కువగా ఉండడంతో డీలర్పై కేసు నమోదు చేసినట్లు జిల్లా పౌరసరఫరాల శాఖాధికారి చందన్కుమార్ తెలిపారు. పాడి గేదెల పథకం దరఖాస్తు గడువు పొడిగింపు ఖమ్మంమయూరిసెంటర్: ఎస్సీ యాక్షన్ ప్లాన్ ద్వారా రెండేసి పాడి గేదెల పంపిణీ పథకం దరఖాస్తు గడువును ఈనెల 16 వరకు పొడిగించినట్లు జిల్లా షెడ్యూల్డ్ కులాల సహకార అభివృద్ధి సంస్థ లిమిటెడ్ ఈడీ నవీన్బాబు తెలిపారు. ఈమేరకు ఇంటర్నెట్, మీ సేవ కేంద్రాల్లో tgobmms.cgg.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకుని దాని ప్రతికి అన్ని పత్రాలు జత చేసి మున్సిపల్, మండల పరిషత్ కార్యాలయాల్లో ఈనెల 16 లోపు అందజేయాలని సూచించారు. గడువులోగా అందిన దరఖాస్తులను పరిగణనలోకి తీసుకుంటామని తెలిపారు. వ్యాక్సిన్తో గాలికుంటు వ్యాధి నివారణ సత్తుపల్లిరూరల్: పశువులకు టీకా వేయించడం ద్వారా గాలికుంటు వ్యాధి సోకకుండా కాపాడుకోవచ్చని జిల్లా పశువైద్యాధికారి పురందర్ తెలిపారు. సత్తుపల్లి మండలంలోని పలు గ్రామాల్లో వ్యాక్సిన్ శిబిరాలను గురువారం పరిశీలించిన ఆయన రైతులకు అవగాహన కల్పించారు. పశువులకు టీకా వేయించకపోతే గాలికుంటు వ్యాధి సోకి పాల ఉత్పత్తి, పునరుత్పత్తి తగ్గుతుందని తెలిపారు. వైద్యులు కె.ప్రదీప్, ఎస్.కే.సఫియా, సీహెచ్.శశిదీప్, కె.రాజశేఖర్, ఉద్యోగులు పాల్గొన్నారు. -
భద్రగిరి మార్ట్కు ఆదరణ
● త్వరలో ఖమ్మంలోనూ ఏర్పాటు ● ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి రాహుల్భధ్రాచలం: గిరిజన నిరుద్యోగులకు, మహిళా సమాఖ్యలకు చేయూతనిచ్చేందుకు భద్రాచలంలో ఏర్పాటు చేసిన భద్రగిరి మార్ట్కు ఆదరణ లభిస్తోందని భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి.రాహుల్ తెలిపారు. గురువారం ఐటీడీఏలోని తన చాంబర్లో విలేకరులతో మాట్లాడారు. వినియోగదారులను రిసీవ్ చేసుకునేందుకు గ్రూప్–4 గిరిజన ఉద్యోగిణిలకు బాధ్యతలు అప్పగించినట్లు తెలిపారు. మార్ట్ ద్వారా రోజుకు రూ.లక్ష ఆదాయం వస్తుందన్నారు. ముడి సరుకులకు ఇబ్బందులు లేకుండా జీసీసీ సహకారం తీసుకుంటున్నామని, త్వరలో పాల్వంచ, ఖమ్మం కేంద్రాలలో మార్టులు ఏర్పాటు చేసే ఆలోచన ఉందన్నారు. భద్రాచలం మినీ స్టేడియం పనులు వచ్చే నెలలో ప్రారంభమయ్యే అవకాశం ఉందన్నారు. అధునాతన స్టేడియానికి రూ.4 కోట్ల నిధులు అవసరమని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని, అనుమతి రాగానే పనులు ప్రారంభం అవుతాయని వెల్లడించారు. సెంట్రల్ లైటింగ్ పనులు టెండర్ అనుకోని కారణాలతో ఆగిపోయిందని, తిరిగి టెండర్లను నిర్ణయించి పనులను పూర్తి చేస్తామని, భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిపై పూర్తి స్థాయిలో దృష్టి సారిస్తామని వివరించారు. స్టేడియానికి 5 ఎకరాల కేటాయింపు భద్రాచలంటౌన్: భద్రాచలంలో స్టేడియం నిర్మాణం కోసం ప్రభుత్వం ఐదు ఎకరాల స్థలాన్ని కేటాయించింది. బుధవారం రెవెన్యూ అధికారులు, ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వెంటనే అంచనాలు రూపొందించి ప్రభుత్వానికి నివేదిక పంపాలని డీవైఎస్ఓ పరంధామరెడ్డిని ఆదేశించారు. అనంతరం తహసీల్దార్ దనియాల వెంకటేశ్వర్లు పంచనామా నిర్వహించి భూమిని క్రీడా శాఖకు అప్పగించారు. సర్పంచ్ పూనెం కృష్ణ, అధికారులు హరీష్, రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
జనగణనకు రెడీ..
జిల్లాలో జనగణన ఏర్పాట్లపై అధికారులు దృష్టి సారించారు. సర్వే పారదర్శకంగా నిర్వహించేలా ఎన్యుమరేటర్లు, వారికి మార్గనిర్దేశం కోసం సూపర్వైజర్లను నియమించారు. అంతేకాక ఎన్యుమరేటర్ల వివరాలను సీఎంఎంఎస్(సెన్సస్ మేనేజ్మెంట్ అండ్ మానిటరింగ్ సిస్టమ్) పోర్టర్లో నమోదు చేస్తున్నారు. అలాగే, హౌస్ లిస్టింగ్ బ్లాక్, ఎన్యుమరేషన్ బ్లాక్లను ఏర్పాటు చేస్తున్నారు. ఇక మొదటి దశ సర్వే ప్రక్రియ వచ్చేనెల 10 లేదా 11వ తేదీన ప్రారంభం కానుంది. – సాక్షి ప్రతినిధి, ఖమ్మం● పూర్తయిన ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్ల నియామకం ● చివరి దశకు చేరిన బ్లాక్ల గుర్తింపు ● వచ్చే నెల నుంచి మొదటి దశ సర్వే హౌస్ లిస్టింగ్ బ్లాక్ సర్వేలో భాగంగా ఖమ్మం 50వ డివిజన్లో వివరాలు తెలుసుకుంటున్న ఉద్యోగులురెండు దశల్లో గణన.. జనగణన కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం రెండు దశల్లో చేపట్టనుంది. మొదటి దశ ఈ ఏడాది మే నెలలో, రెండో దశ వచ్చే ఏడాది ప్రారంభమవుతుంది. తొలి దశలో భాగంగా గృహగణన చేపడతారు. ఒక ప్రాంతంలోని నివాస గృహాలు, వాణిజ్య భవనాలు, ఖాళీ స్థలాల వివరాలు సేకరించి నంబర్లు కేటాయించి జాబితా రూపొందిస్తారు. అలాగే, ఎన్యుమరేషన్ బ్లాక్లు(జనాభా గణన బ్లాక్లు) కూడా ఏర్పాటు చేస్తారు. పెద్ద గ్రామాలు, పట్టణాలను చిన్న భౌగోళిక ప్రాంతాలు(బ్లాక్)లుగా విభజించి ప్రతీ బ్లాక్కు ఒక అధికారిని కేటాయించి ప్రతీ ఇంటి వివరాలు సేకరిస్తారు. ఇది పూర్తయితే జనగణనలో భాగమైన ప్రాథమిక దశ ముగిసినట్లవుతుంది. పొరపాట్లకు తావులేకుండా.. జనగణనలో పొరపాట్లు జరగకుండా అధికారులు అప్రమత్తతతో వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం హౌస్ లిస్టింగ్ బ్లాక్ల కోసం మ్యాపింగ్ చేపట్టారు. ప్రతీ 800మంది జనాభా లేదా 300 – 350 ఇళ్లను ఒక ఎన్యుమరేషన్ బ్లాక్గా పరిగణిస్తారు. ఈ మ్యాపింగ్ ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పూర్తి కాగా.. జిల్లాలోని ఇంకొన్ని చోట్ల చివరి దశలో ఉంది. ఇందులో పొరపాట్లు దొర్లితే సరిచేసేందుకు ఉద్యోగులు మరోమారు పరిశీలిస్తున్నారు. ఒకవేళ ఇళ్లు, జనాభాలో హెచ్చుతగ్గులు వస్తే సరిచేశాక సీఎంఎంఎస్ పోర్టర్లో నమోదు చేస్తారు. గ్రామ స్థాయిలో ల్యాండ్మార్క్లు, పాఠశాలలు, ఆలయాలు, గ్రామపంచాయతీ కార్యాలయాలను బ్లాక్ వారీగా నమోదు చేయాల్సి ఉంటుంది. జనగణన సులువుగా జరిగేందుకు హౌస్ లిస్టింగ్ బ్లాక్లు కీలకం కానున్నందున అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారు. ప్రతీ బ్లాక్కు ఎన్యుమరేటర్ ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్ల నియామకం, శిక్షణ, హౌస్ లిస్టింగ్, ఎన్యుమరేషన్ బ్లాక్ల గుర్తింపు పూర్తయ్యాక హౌస్ లిస్టింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ప్రస్తుతం హౌస్ లిస్టింగ్ బ్లాక్ల్లో మ్యాపింగ్ జరుగుతోంది. ఆపై యాప్లో నమోదు చేశాక వచ్చేనెలలో ఎన్యూమరేటర్లు సర్వే ప్రారంభిస్తారు. ఇందుకోసం ప్రతీ బ్లాక్కు ఒక ఎన్యూమరేటర్ను కేటాయించనుండగా, వీరు ఇంటింటికీ వెళ్లి 33 ప్రశ్నలతో కూడిన ప్రశ్నావళి ఆధారంగా వివరాలు సేకరిస్తారు. జనగణన కోసం జిల్లాలో పది శాతం రిజర్వ్ కలిపి 2,091 మంది ఎన్యూమరేటర్లను నియమించారు. అలాగే, ప్రతీ ఆరుగురు ఎన్యూమరేటర్లపై పర్యవేక్షణకు ఒక సూపర్వైజర్ చొప్పున 390 మందిని ఏర్పాటు చేశారు. వీరికి సర్వేపై ప్రత్యేక శిక్షణ ఇస్తారు. అలాగే, సర్వే ప్రారంభానికి ముందు ఎన్యుమరేటర్లు తమకు కేటాయించిన బ్లాక్లను క్షేత్రస్థాయిలో పరిశీలించి వివరాలు సరిచూసుకోవాల్సి ఉంటుంది. -
నేడు మంత్రి పొంగులేటి పర్యటన
నేలకొండపల్లి: రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శుక్రవారం నేలకొండపల్లి, కూసుమంచి మండలాల్లో పర్యటించనున్నారు. కూసుమంచి మండలం వెంకటాపురంలో ఇందిరమ్మ ఇళ్లు, చేగొమ్మలో సొసైటీ గోదాంను మంత్రి ప్రారంభిస్తారు. అంతేకాక కూసుమంచి క్యాంపు కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేయనున్నారు. ఆతర్వాత నేలకొండపల్లి మండలం కోనాయిగూడెంలో గురుకుల పాఠశాల భవనం మరమ్మతు పనులు, సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశాక కల్యాణలక్ష్మి, సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేస్తారు. అలాగే, నాచేపల్లి, బైరవునిపల్లి, గువ్వలగూ డెం, అప్పలనరసింహాపురం, కట్టుకాచారాంలో జరిగే పలు కార్యక్రమాల్లో మంత్రి పాల్గొంటారని క్యాంపు కార్యాలయ ఇన్చార్జ్ తుంబూరు దయాకర్రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. రైల్వే సమస్యలపై స్పందించండి రైల్వే మంత్రిత్వ శాఖ ఈడీకి ఎంపీ వినతి ఖమ్మంమయూరిసెంటర్: ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో పెండింగ్ రైల్వే సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి కోరారు. ఈ సందర్భంగా ఢిల్లీలో కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్(ఈడీ) వికాస్కుమార్ జైన్కు గురువారం ఆయన వినతిపత్రం అందజేసి మాట్లాడారు. పాలేరు నియోజకవర్గంలోని అన్ని మండలాల మీదుగా వెళ్లనున్న డోర్నకల్ – మిర్యాలగూడ, డోర్నకల్ – గద్వాల లైన్ అలైన్మెంట్ను మార్చి వెన్నారం, కురవి, అబ్బాయిపాలెం, మరిపెడ, మోతె మీదుగా లైన్ ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే, భద్రాచలం రోడ్(కొత్తగూడెం) రైల్వేస్టేషన్ నుంచి న్యూ గొల్లగూడెం మీదుగా రహదారి విస్తరణకు 4,556 చ.మీ. రైల్వే భూమి అవసరమని తెలిపారు. ఇందుకు బదులుగా ఖమ్మం రైల్వేస్టేషన్ వద్ద 9,969.5 చ.మీ. రాష్ట్ర ప్రభుత్వ భూమి ఇవ్వనున్నందున ఇరు జిల్లాల కలెక్టర్లు పంపిన ప్రతిపాదనలను ఆమోదించాలని ఎంపీ కోరారు. ఎయిడ్స్ నియంత్రణలో జిల్లాకు మొదటి స్థానం ఖమ్మం వైద్యవిభాగం: హెచ్ఐవీ ఎయిడ్స్ నియంత్రణలో జిల్లా ప్రథమ స్థానాన ఉందని అడిషనల్ డీఎంహెచ్ఓ డాక్టర్ చందూనాయక్ తెలిపారు. ఖమ్మం లకారం ట్యాంక్ బండ్ నుంచి మమతా రోడ్డు మీదుగా గురువారం ఎయిడ్స్ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని ప్రారంభించిన చందూనాయక్ మాట్లాడడారు. కొత్తగా ఎయిడ్స్ కేసులు నమోదు కాకుండా విస్తృత అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ఇందుకు అందరూ సహకరించాలని కోరారు. ఎయిడ్స్ నియంత్రణ విభాగం ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థల సభ్యులు, నర్సింగ్ కళాశాలల విద్యార్థినులు పాల్గొన్నారు. రేషన్ బియ్యం సరఫరా త్వరగా పూర్తిచేయాలి నేలకొండపల్లి: మూడు నెలల బియ్యం కోటాను రేషన్ షాపులకు త్వరగా తరలించాలని పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ పి.శ్రీలత సూచించారు. నేలకొండపల్లిలోని మండల స్థాయి స్టాక్ పాయింట్ను గురువారం ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఇప్పటికే షాపులకు తరలించిన బియ్యం, ఇంకా ఎంత తరలించాల్సి ఉందో రికార్డుల ఆధారంగా పరిశీలించారు. షాపుల్లో బియ్యం నిల్వలు అయిపోకముందే సరిపడా తరలించాలని తెలిపారు. అలాగే, పాడైన పంచదార వేలం పాటను పరిశీలించగా, 50.13 క్వింటాళ్ల చక్కెరను సోమయ్య కిలో రూ.6 చొప్పున దక్కించుకోవడంతో వివరాలు ఆరా తీశారు. జిల్లాలోని ఐదు స్టాక్ పాయింట్లలో పాడైన 23.842 క్వింటాళ్ల పంచదారను వేలం ద్వారా విక్రయిస్తున్నామని డీఎం తెలిపారు. నేలకొండపల్లి గోదాం ఇన్చార్జ్ లక్ష్మణ్, ఎంఆర్ఐ ఆలస్యం మధుసూధన్రావు పాల్గొన్నారు. -
ప్రకృతి రక్షణలోనే ‘వనజీవి’ జీవితం
ఖమ్మంవ్యవసాయం: ప్రకృతి రక్షణ కోసం చివరివరకు కృషి చేసిన వనజీవి రామయ్య జీవితం అందరికీ ఆదర్శమని భద్రాద్రి సర్కిల్ అటవీ సంరక్షణ అధికారి(సీసీఎఫ్) డాక్టర్ డి.భీమానాయక్ అన్నారు. జిల్లాకు చెందిన రామయ్య జీవిత చరిత్ర ఆధారంగా రూపొందించిన ‘వనజీవి రామయ్య’ చిత్రానికి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం గద్దర్ అవార్డు ప్రకటించింది. ఈ సందర్భంగా చిత్రబృందాన్ని గురువారం ఖమ్మం భక్త రామదాసు కళాక్షేత్రంలో సన్మానించారు. జిల్లా అటవీ అధికారి సిద్ధార్థ్ విక్రమ్సింగ్ ఆధ్వర్యాన వాసవిక్ సేవా ఫౌండేషన్ సహకారంతో సన్మానించగా సీసీఎఫ్ బీమానాయక్ మాట్లాడుతూ ప్రకృతి పరిరక్షణకు విశేష సేవలందించిన రామయ్య పద్మశ్రీ అవార్డు సాధించారని గుర్తుచేశారు. అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ రామయ్య జీవితకథ అందరికీ తెలిసేలా సినిమా రూపొందించడం అభినందనీయమన్నారు. అనంతరం డీఎఫ్ఓ సిద్ధార్థ విక్రమ్సింగ్, మేయర్ పి.నీరజ, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కార్యాలయ ఇన్చార్జి టి.దయాకర్రెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు వేముగంటి, నిర్మాతలు నిడిగొండ నరేష్కుమార్, లింగంపల్లి చంద్రశేఖర్, నటులు బ్రహ్మాజీ, నాగరాణి, సంగీత దర్శకుడు బల్లేపల్లి మోహన్, రమణ తదితరులను సత్కరించగా, వనజీవి రామయ్య సతీమణి జానకమ్మకు నిర్మాతలు రూ.లక్ష చెక్కు అందజేశారు. సీసీఎఫ్ బీమానాయక్ -
13న భద్రాచలంలో పునరేకీకరణ ‘అభ్యర్థన సదస్సు’
ఖమ్మం సహకారనగర్: భద్రాచలం పరిసరాల్లోని ఐదు గ్రామపంచాయతీలను తిరిగి తెలంగాణలో విలీనం చేయాలని తెలంగాణ గెజిటెడ్, ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల, కార్మికుల జేఏసీ రాష్ట్ర సెక్రటరీ జనరల్, టీజీవోస్ రాష్ట్ర అధ్యక్షుడు అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ఖమ్మంలోని టీఎన్జీవోస్ ఫంక్షన్ హాల్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎటపాక, పురుషోత్తమపట్నం, పిచుకలపాడు, కన్నాయిగూడెం, గుండాల జీపీలను ఏపీలో విలీనం చేయడం వల్ల భద్రాచలం కేవలం 10 చ.కి.మీకే పరిమితమైందన్నారు. తద్వారా అభివృద్ధికి ఆటంకంగా మారినందున తిరిగి తెలంగాణలో కలపాలనే డిమాండ్తో సామాజిక బాధ్యతగా డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. ఈమేరకు 13వ తేదీన తేదీన భద్రాచలం పాత ఆర్అండ్బీ భవనంలో ‘అభ్యర్థన సదస్సు‘నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. సమస్యను రాజకీయ అంశంగా సామాజిక బాధ్యతగా చూస్తూ అందరూ హాజరుకావాలని కోరారు. అనంతరం సదస్సు పోస్టర్లను ఆవిష్కరించారు. టీజేఏసీ జిల్లా చైర్మన్ గుంటుపల్లి శ్రీనివాసరావు, బాధ్యులు కొణిదన శ్రీనివాసరావు, కె.వెంకటేశ్వరరావు, మోదుగు వేలాద్రి, తుంబూరు సునీల్రెడ్డి, మల్లెల రవీంద్రప్రసాద్, పారుపల్లి నాగేశ్వరరావు, కట్టా శేఖర్రావు, సుబ్బయ్య, యలమద్ది వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. టీజీ ఈజేఏసీ సెక్రటరీ జనరల్, టీజీవోస్ రాష్ట్ర అధ్యక్షుడు ‘ఏలూరి’ -
విద్యుత్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
ఖమ్మంవ్యవసాయం: విద్యుత్ కార్మికుల న్యాయమైన సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఆర్టిజన్లు, అన్మ్యాన్డ్, స్పాట్ బిల్లర్లు, కలెక్షన్ ఏజెంట్లు, పీసు రేట్ కార్మికులు, స్టోర్ హమాలీల సమస్యల పరిష్కారం కోసం నిర్వహిస్తున్న నిరవధిక సమ్మె గురువారం రెండోరోజుకు చేరుకుంది. ఖమ్మంలోని ఖానాపురం ట్రాన్స్కో కార్యాలయం వద్ద సమ్మె శిబిరాన్ని యూనియన్ల నాయకులు టి.శేషగిరిరావు, ఎం ప్రసాద్, సీహెచ్.నాగార్జున సందర్శించి సంఘీభావం తెలిపారు. అనంతరం ప్రొఫెసర్ జయశంకర్, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలకు వినతిపత్రాలను సమర్పించారు. జేఏసీ ఉమ్మడి జిల్లా చైర్మన్ వల్లాల యుగంధర్, కన్వీనర్లు అన్వర్ పాషా, పురుషోత్తమరావు, వెంకన్న, సురేందర్రెడ్డి, రామకృష్ణ, ఉపేందర్, రవి, రామ్మోహన్, మంగ్యానాయక్, నస్రీన్ సుల్తానా, ఖైరున్నీసా బేగం తదితరులు పాల్గొన్నారు. కాగా, కార్మికులు విధులను బహిష్కరించడంతో విద్యుత్ సరఫరా నిర్వహణలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రెండో రోజుకు చేరిన సమ్మె -
కొత్తగూడెంలో జర్మనీ బృందం..
● కార్పొరేషన్లోని పలు ప్రాంతాలను సందర్శించిన ప్రతినిధులు ● టీఓడీ ప్రాజెక్ట్ ద్వారా రుణ మంజూరుకు అవకాశం కొత్తగూడెంఅర్బన్/పాల్వంచ: జర్మనీకి చెందిన కేఎఫ్డబ్ల్యూ కన్సల్టెన్సీ ప్రతినిధులు గురువారం కొత్తగూడెం కార్పొరేషన్లో పర్యటించారు. ట్రాన్సి ట్ ఓరియెంటెడ్ డెవలప్మెంట్ (టీఓడీ) ప్రాజెక్ట్ అమలులో భాగంగా కొత్తగూడెం కార్పొరేషన్కు ఆర్థికసాయం చేయనున్నారు. ఈ నేపథ్యంలో ప్రతినిధులు ఎస్.పరిమల్, ఎన్ఎన్రావు, రుచిఖరనాలతో పాటు ఢిల్లీకి చెందిన నితిన్ తదితరులు కొత్తగూడెం నుంచి పెద్దమ్మగుడి వరకు నగర తీరుతెన్నులు పరిశీలించారు. పాల్వంచలోని నటరాజ్ సెంటర్, అంబేద్కర్ సెంటర్, మున్సిపల్ స్టేడియం, కొత్తగూడెం ఫుడ్కోర్ట్ తదితర ప్రాంతాలను సందర్శించారు. తొలుత కార్పొరేషన్ కార్యాలయంలో వివిధ విభాగాల అధికారులతో సమావేశమయ్యారు. ప్రజలకు అందుతున్న సర్వీసులు, ఆర్థిక వనరుల వివరాలు తెలుసుకున్నారు. కార్పొరేషన్ అభివృద్ధికి కావాల్సిన నిధులపై ప్రభుత్వానికి నివేదిక పంపాలని మేయర్ మూడ్ గణేష్ కోరారు. కమిషనర్ సుజాత, అధికారులు పాల్గొన్నారు. నగర అభివృద్ధికి నిధులు నగర అభివృద్ధికి సుమారు రూ.300 కోట్లు వెచ్చించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ప్రతినిధులు ప్రాజెక్ట్ పురోగతి, అమలు విధానం, మౌలిక వసతులు, అభివృద్ధిపై చర్చించ, అధికారులు సమగ్ర ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రధాన రవాణా మార్గాలు, రైల్వే, బస్సు కారిడార్ల పరిసర ప్రాంతాలను అభివృద్ధి అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రజల నివాసాలు, ఉద్యోగాలు, వాణిజ్య కేంద్రాలు ఒకే ప్రాంతంలో అందుబాటులో ఉండేలా ప్రణాళికలు రూపొందించనున్నట్లు తెలుస్తోంది. నీటి సరఫరా వ్యవస్థ, మురుగునీటి శుద్ధి ప్రాజెక్ట్లు, ఫుట్పాత్లు, రహదారుల అనుసంధానం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు. ప్రాజెక్ట్ బృందం రుణ ఆమోదం ఇస్తే నగరం అభివృద్ధి కానుంది. -
రాజుకుంటున్న ‘పంచాయితీ’
● ఐదు విలీన పంచాయతీల కోసం ఉద్యోగ సంఘాల పోరు ● తెలంగాణలో కలపాలని పార్లమెంట్లో లేవనెత్తిన ఎంపీలు భద్రాచలం: అన్యాయంగా, ప్రజల మద్దతు లేకుండా రాష్ట్ర విభజన సమయంలో ఏపీలో కలిపిన ఐదు గ్రామపంచాయతీలను తిరిగి తెలంగాణలోకి రావాలనే డిమాండ్ ఊపందుకుంటోంది. ఇప్పటికే ఎంపీలు పార్లమెంట్లో ప్రస్తావించగా, జిల్లా మంత్రులు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల దృష్టికి తీసుకెళ్లారు. గతంలో ఐటీడీఏ పీఓగా పనిచేసిన దివ్యా రాజన్ తెలంగాణలో కలిపితే ఆ గ్రామాల ప్రజలకు ఉపయోగకరమని ప్రభుత్వానికి నివేదిక కూడ అందజేశారు. తాజాగా తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన నాన్గెజిటెడ్, గెజిటెడ్ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ఐదు గ్రామపంచాయతీల కోసం మరో ఉద్యమాన్ని చేపడతామని పేర్కొంటున్నారు. అసంబద్ధంగా రాష్ట్ర విభజన రాష్ట్ర విభజనకు ముందు భద్రాచలం మండల పరిధిలో యటపాక, గుండాల, పురుషోత్తపట్నం, పిచుకలపాడు, కన్నాయిగూడెంలు ఉండేవి. భద్రాచలం పట్టణానికి మూడువైపులా సరిహద్దుల్లో ఈ పంచాయతీలు ఉన్నాయి. రాష్ట్ర విభజన సమయంలో పోలవరం ముంపు పేరుతో ఆర్డినెన్స్ ద్వారా ఐదు పంచాయతీలను ఏపీలో కలిపారు. దీంతో భద్రాచలంలో అంతర్భాగంగా ఉన్న ప్రజలు నాటి నుంచి మనోవ్యధకు గురవుతూ దశాబ్దకాలంగా తిరిగి తెలంగాణలో కలపాలని వేడుకుంటున్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం కన్నాయిగూడెం గ్రామపంచాయతీ పరిధిలో 2,161, పిచుకలపాడు పరిధిలో 2,187, గుండాల పరిధిలో 3,816, పురుషోత్నపట్నంలో 1,372, యటపాకలో 2,410తో మొత్తం 11,946 జనాభా ఉండగా, ప్రస్తుతం 25 వేలకు పైగా జనాభా ఉంటుందని అంచనా. భద్రాచలం పట్టణంలో నాడు 40 వేల జనాభా ఉండగా ఇప్పుడు సుమారు లక్ష వరకు ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఉద్యోగ జేఏసీ నేతృత్వంలో ఉద్యమం ఐదు పంచాయతీలను తెలంగాణలో కలపాలని కోరుతూ తెలంగాణ ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యాచరణ చేపట్టనున్నారు. గురువారం భద్రాచలంలో నిర్వహించిన ఐక్య వేదిక సమావేశంలో ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుతోపాటు రాష్ట్ర తెలంగాణ ఎంప్లాయీస్ సెక్రటరీ జనరల్, రాష్ట్ర గెజిటెడ్ ఆఫీసర్స్ యూనియన్ అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావులు పాల్గొన్నారు. ఈనెల 13న భద్రాచలంలోని భారీ సభ నిర్వహించనున్నారు. ధూంధాం సాంస్కృతిక కార్యక్రమాలతోపాటు, రాజకీయాలకు అతీతంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఇతర ఉద్యోగ, ప్రజా, కుల సంఘాల నాయకులు పాల్గొంటారని పేర్కొన్నారు. దీంతో ఐదు పంచాయతీల వేడి రాజుకుంటోంది. -
పరిశోధనా కేంద్రంలో మత్స్య రైతులకు శిక్షణ
కూసుమంచి: పాలేరులోని మత్స్య పరిశోధనా కేంద్రంలో ‘బయో ప్లాక్ విధానంలో చేపల సాగు’ అంశంపై రైతులకు ఇచ్చే శిక్షణ గురువారం మొదలైంది. ఖమ్మంతో పాటు సూర్యాపేట, వనపర్తి, జగిత్యాల జిల్లాల మత్స్య రైతులు, మత్స్యకారులు పాల్గొనగా తొలిరోజు శిక్షణను సూర్యాపేట జిల్లా పశు సంవర్థక అధికారి డాక్టర్ బి.శ్రీనివాసరావు ప్రారంభించి మాట్లాడారు. బయోప్లాక్ విధానంలో చేపల పెంపకం ద్వారా మంచి అధిక వస్తాయని, తద్వారా రైతులకు లబ్ధి జరుగుతుందని తెలిపారు. పాలేరు మత్స్య పరిశోధనా కేంద్రం ప్రధాన ఽశాస్త్రవేత్త శ్యాంప్రసాద్ మాట్లాడగా శాస్త్రవేత్తలు శాంతన్న, రవీందర్, గణేష్, దివ్య తదితరులు పాల్గొన్నారు. సభ్యత్వానికి వారసులే అర్హులు కారేపల్లి: మత్స్య సహకార సంఘం సభ్యుల్లో ఎవరైనా మరణిస్తే వారి స్థానాన వారసులకే సభ్యత్వం ఇవ్వాలని మత్స్య శాఖ ఏడీ జి.శివప్రసాద్ స్పష్టం చేశారు. మండలంలోని మాధారంలో మత్స్య సహకార సంఘం సభ్యులతో ఏడీ గురువారం సమావేశమయ్యారు. ఉమ్మడి జీపీ పరిధిలో నాలుగు చెరువులకు గాను 71 మంది మత్స్యకారులు సభ్యులుగా ఉండగా, వీరిలో 22 మంది మరణించారు. వీరి స్థానంలో బాధిత కుటుంబాల్లో వారసులకు కాకుండా డబ్బులు తీసుకుని సభ్యత్వాలు ఇస్తున్నట్లు కలెక్టర్కు ఫిర్యాదులు అందాయి. దీంతో సభ్యులతో సమావేశమైన ఏడీ.. వారసులకే సభ్యత్వం ఇవ్వాలని స్పష్టం చేశారు. సంఘం అధ్యక్షులు అజ్మీరా సూక్యా, సర్పంచ్లు ధరావత్ మంగీలాల్, అజ్మీరా ఉమానరేష్, గుగులోతు కృష్ణవేణి, ధరావత్ వెంకటేశ్వర్లు, సభ్యులు గుగులోతు రమేష్, వీరబాబు, రాములు తదితరులు పాల్గొన్నారు. -
ఇంట్లో జారిపడి మహిళ మృతి
ఖమ్మంక్రైం: ప్రమాదవశాత్తు ఇంట్లో జారిపడిన మహిళ మృతి చెందింది. ఖమ్మం త్రీటౌన్ పోలీస్ స్టేషన్లో హెడ్కానిస్టేబుల్గా పనిచేస్తున్న మిరియాల నర్సయ్య–సక్కుబాయి(55) దంపతులు ఇందిరానగర్లో నివాసం ఉంటున్నారు. బుధవారం అర్ధరాత్రి దాటాక తాగునీటి కోసం కిచెన్లోకి వెళ్లగా లోబీపీకారణంగా కళ్లు తిరగడంతో గ్రానైట్ బల్లపై పడింది. ఈక్రమాన నుదుటిపై తీవ్రగాయమై రక్తస్రావంతో స్పృహ కోల్పోయినట్లు తెలుస్తోంది. అప్పుడు నిద్రలో ఉన్న నర్సయ్య గమనించకపోగా గురువారం ఉదయం లేచి ఆమెను పిలిచినా పలకకపోవడంతో స్థానికులను పిలిచేలోగా సక్కుబాయి మృతి చెందింది. టూటౌన్ సీఐ బాలకృష్ణ, ఎస్ఐ రమేష్ పరిశీలించి కేసు నమోదు చేయగా, అన్నం ఫౌండేషన్ చైర్మన్ శ్రీనివాసరావు సాయంతో మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. ఈమేరకు నర్సయ్య కుటుంబాన్ని పలువురు పోలీసు ఉద్యోగులు పరామర్శించారు. గంజాయి స్వాధీనం ఖమ్మం క్రైం: ఖమ్మం ప్రకాశ్నగర్ వద్ద గురువారం పోలీసుల చేపట్టిన తనిఖీల్లో గంజాయి లభ్యమైంది. అదే ప్రాంతానికి చెందిన సాయిశ్రీనివాస్ వద్ద 240 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు త్రీటౌన్ సీఐ మోహన్బాబు తెలిపారు. ఆయన వెంట ఓ మైనర్ కూడా ఉండగా కేసు నమోదు చేశామని వెల్లడించారు. -
గుడిసెల గుర్తింపునకు సర్వే
● అర్హులకు ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో అవకాశం ● ఇప్పటికే ప్రజావాణికి వేలాదిగా దరఖాస్తులు ● సర్వే తర్వాత ప్రాధాన్యతా క్రమాన కేటాయింపు ఖమ్మంగాంధీచౌక్: జిల్లాలో పూరి గుడిసెలను గుర్తించే పనిలో అధికార యంత్రాంగం నిమగ్నమైంది. రాష్ట్ర ప్రభుత్వం గుడిసెల రహిత తెలంగాణే లక్ష్యంగా తీర్చిదిద్దాలని నిర్ణయించడంతో జిల్లాలో సర్వే మొదలుపెట్టారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రవేశపెట్టగా.. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి 3,500 చొప్పునజిల్లాకు 16,495 ఇళ్లు మంజూరయ్యాయి. అయితే, ఇళ్లు మంజూరు కాని పేదలు ప్రతీ సోమవారం కలెక్టరేట్, మండల కేంద్రాల్లో నిర్వహించే ప్రజావాణిలో దరఖాస్తులు ఇస్తున్నారు. ఇప్పటికే దరఖాస్తుల సంఖ్య 6వేలకు చేరినట్లు అంచనా. ఈ దరఖాస్తులను పరిగణనలోకి తీసుకుంటూనే గుడిసెల్లో నివసించే వారికి ఇందిరమ్మ ఇళ్ల పథకంలో ప్రాధాన్యత కల్పించేలా ప్రభుత్వం సర్వేకు ఆదేశించింది. వివరాలు ఆరా... గుడిసెల్లో, టార్పాలిన్ల కింద నివసించే వారిని గుర్తించాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఇటీవల ఆదేశించారు. దీంతో మండల రెవెన్యూ అధికారులు, మండల అభివృద్ధి అధికారులు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, గ్రామ కార్యదర్శులతో కూడిన బృందాలు సర్వే ప్రారంభించాయి. ప్రజావాణిలో ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారి గృహాలను పరిశీలిస్తున్నారు. ఇళ్లు మంజూరు కాకపోవడానికి కారణాలు ఏమిటి, అర్హులు కాదా, స్థలం ఉన్నా తాత్కాలికంగా వలస వెళ్లారా... లేక ఇందిరమ్మ కమిటీ సిఫారసు చేయలేదా తదితర వివరాలు ఆరాతీస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలు, ఆ సర్వే పూర్తి చేసి కలెక్టర్కు నివేదిక అందించాక అర్హులకు ఇందిరమ్మ ఇళ్ల పథకంలో అవకాశం కల్పించే అవకాశముందని తెలుస్తోంది. ఆసక్తి చూపకపోతే అర్హులకు.. మొదటి దశలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన 1,943 మంది నిర్మాణాలు మొదలుపెట్టలేదు. వీరిలో 252 మంది ఆర్దిక ఇబ్బందులతో నిర్మించుకోలేకపోయారని యంత్రాంగం గుర్తించింది. దీంతో వీరికి రుణం అందించి నిర్మాణం చేపట్టేలా ప్రోత్సహించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. మిగతా 1,691 మంది విషయంలో సర్వే ఆధారంగా నిర్ణయం తీసుకునే అవకాశముంది. ఇందులో ఎవరైనా ఆసక్తి చూపకపోతే రద్దు చేసి గుడిసెల సర్వేలో తేలే అర్హులకు కేటాయించనున్నారు. తద్వారా ఇందిరమ్మ ఇళ్ల మొదటి దశలోనే కొందరికి అవకాశం దక్కనుంది. మిగిలిన వారికి రెండో విడతలో ఇళ్లు మంజూరు చేయనున్నట్లు చెబుతున్నారు.గుడిసెల గుర్తింపు సర్వే ఆధారంగా అర్హులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు అవకాశం ఉంది. ఇళ్ల కోసం జిల్లాలో దరఖాస్తు చేసుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. సర్వే తర్వాత అందే నివేదిక ఆధారంగా ప్రాధాన్యతా క్రమంలో ఇళ్ల మంజూరవుతాయి. ఇందిరమ్మ కమిటీల ద్వారా లబ్ధిదారుల గుర్తింపు ఉంటుంది. – బి.శ్రీనివాస్, నోడల్ అధికారి, జిల్లా గృహ నిర్మాణ శాఖనేలకొండపల్లి: అర్హులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో భాగంగా ఇంకా గుడిసెలు, టార్పాలిన్ షీట్ల పైకప్పు కింద నివసిస్తున్నారు వారు ఎందరు, వారికి స్థలం ఉందా, ఇళ్లకు అర్హులేనా, లేదా అన్నది తేల్చేందుకు క్షేత్ర స్థాయిలో చేపట్టిన సర్వే కొనసాగుతోంది. ఈమేరకు గ్రామాల వారీగా కార్యదర్శులు పూర్తి వివరాలు సేకరించడమే కాక గుడిసె, టార్పాలిన్ పైకప్పు ఇంటి వద్ద ఫొటో తీస్తున్నారు. -
వైరాలో కాంప్లెక్స్ నిర్మాణానికి అడుగులు
వైరా: వైరాలో కొన్నేళ్ల నుంచి ప్రతిపాదనల దశలో ఉన్న షాపింగ్ క్లాంపెక్స్ నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి. ప్రతిపాదిత స్థలంలో ఏళ్ల క్రితం కొందరు షాపులు నిర్మించుకోగా, నాలుగేళ్ల క్రితం అధికారులు వాటిని తొలగించేందుకు సిద్ధమయ్యారు. ఆ స్థలంలో కొత్త కాంప్లెక్స్ నిర్మించాలని భావించినా.. ఎనిమిది మంది కోర్టును ఆశ్రయించడంతో తొలగింపు అసంపూర్తిగా మిగిలిపోయింది. కోర్టులో పెండింగ్ ఉన్న ఈ కేసు పరిష్కారం దిశగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. త్వరలోనే మిగిలిన దుకాణాలనూ తొలగించి అక్కడ పాషింగ్ కాంప్లెక్స్ నిర్మించే అవకాశముంది. ఆపై కోర్టు సూచనల మేరకు టెండర్ల ద్వారా షాపులు కట్టబెడతారని తెలిసింది. ఇటీవల డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వైరా క్రాస్ రోడ్డులోని ప్రభుత్వ స్థలాలను పరిశీలించి షాపింగ్ క్లాంపెక్స్లు నిర్మిస్తామని, అర్హులందరికీ అవకాశం కల్పిస్తామని ప్రకటించారు. ఈనేపథ్యాన న్యాయపరమైన ఇబ్బందులు తొలగిపోయి క్లాంపెక్స్ నిర్మిస్తే మున్సిపాలిటీకి ఆదాయం పెరగనుంది. అంతేకాక చిరువ్యాపారులకు సరైన అడ్డా లభిస్తుందని భావిస్తున్నారు.పరిష్కారం దిశగా కోర్టు కేసులు -
ఎరువు.. మరింత బరువు
ఖమ్మంవ్యవసాయం: ఎరువుల ధరలకు రెక్కలొచ్చాయి. ఆశించిన స్థాయిలో పంటల దిగుబడి రాకపోవడం.. ఆపై మార్కెట్లో గిట్టుబాటు ధరలు లభించక రైతులు ఇబ్బంది పడుతుండగా.. ఇప్పుడు ఎరువుల ధరలు పెరగడం వారిని ఆందోళనకు గురిచేస్తోంది. గడిచిన వానాకాలం నుంచి ఇప్పటి వరకు మూడు సార్లు ఎరువుల ధరలు పెరగడం గమనార్హం. అమల్లోకి కొత్త ధరలు పెరిగిన ఎరువుల ధరలు ఈనెల నుంచి అమల్లోకి వచ్చాయి. గడిచిన యాసంగి సీజన్తో పోలిస్తే కాంప్లెక్స్ ఎరువుల ధర రూ.300 మేర పెరిగింది. అలాగే, మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ధర రూ.125 పెరిగింది. గడిచిన వానాకాలంతో పరిశీలిస్తే ఎరువుల ధర రూ. 600, పొటాష్ ధర రూ. 275 మేర పెరగడం గమనార్హం. ఇక డీఏపీ(డై అమోనియా పాస్పేట్), సింగిల్ సూపర్ పాస్పేట్(ఎస్ఎస్పీ) ధరలు యథాతథంగా ఉండగా, ప్రభుత్వం సబ్సిడీపై అందించే యూరియా ధరలో మాత్రం మార్పు చేయలేదు. 2 లక్షల మె.టన్నుల వినియోగం అధిక దిగుబడి, పంటల నాణ్యత కోసం రైతులు కాంప్లెక్స్, డీఏపీ, మ్యూరేట్ ఆఫ్ పొటాష్ వంటి ఎరువులను వినియోగిస్తారు. ఉమ్మడి జిల్లాలో దాదాపు 11 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయి. ఈ పంటల్లో ఒక్కో సీజన్కు దాదాపు 2 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు వినియోగిస్తారని అంచనా. ఇందులో 65వేల మెట్రిక్ టన్నుల యూరియా, కాంప్లెక్స్ ఎరువులు మరో 65 వేల మెట్రిక్ టన్నులు, పొటాష్ 15వేల మెట్రిక్ టన్నులు, డీఏపీ, సింగిల్ సూపర్ పాస్పేట్ వంటి ఎరువులు 55 వేల మెట్రిక్ టన్నుల మేర ఉంటాయి. ఎరువులను సబ్సిడీపై పంపిణీ చేస్తుండడంతో రైతులు ఎక్కువగా వినియోగిస్తున్నారు. కానీ ఏడాదిగా యూరియా కొరతతో ప్రభుత్వం సరఫరా తగ్గించగా, ఆ స్థానంలో కాంప్లెక్స్ ఎరువులు వినియోగిస్తున్నారు. ముడి పదార్థాల ధరలు పెరగడంతోనే.. అంతర్జాతీయ మార్కెట్లో ముడి పదార్థాల ధరలు పెరగడం ఎరువుల ధరలపై ప్రభావం చూపినట్లు తెలుస్తోంది. యుద్ధం కారణంగా సహజ వాయువు సరఫరా నిలిచిపోవటం, రవాణా చార్జీలు పెరగటానికి తోడు డాలర్తో రూపాయి విలువ తగ్గడం కూడా కారణాలుగా చెబుతున్నారు. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం తర్వాత ప్రస్తుతం ఇరాన్ – ఇజ్రాయిల్ యుద్ధంతో ఈ పరిస్థితి ఏర్పడిందని, మున్ముందు ఎరువుల ధరలు మరింత పెరిగే అవకాశముందని వ్యాపార వర్గాల ద్వారా తెలుస్తోంది. ధరల పెంపునకు తోడు కొరత ఏర్పడుతుందనే భావనతో కొందరు రైతులు రానున్న వానాకాలం సీజన్ కోసం పలు రకాల కాంప్లెక్స్, డీఏపీ, పొటాష్ ఎరువులను నిల్వ చేసుకుంటున్నట్లు సమాచారం. ఇదే అదునుగా ఎరువుల వ్యాపారులు పాత నిల్వలను కూడా కొత్త ధరలతో విక్రయిస్తున్నారని తెలుస్తోంది. -
20నుంచి ఓపెన్ స్కూల్ పరీక్షలు
ఖమ్మం సహకారనగర్: ఈనెల 20వ తేదీ నుంచి 27వ తేదీ వరకు ఓపెన్ స్కూల్ సొసైటీ పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈమేరకు అభ్యర్థులు https:// telanganaopenschool.org వెబ్సైట్ లేదా మీసేవ వాట్సాప్ నంబర్ 80969 58096 నుంచి ‘హాయ్’ అని మెసేజ్ పంపించి హాల్టికెట్ పొందొచ్చని డీఈఓ చైతన్య జైనీ, ఓపెన్ స్కూల్ ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ మంగపతిరావు తెలిపారు. అభ్యర్థులు హాల్ టికెట్తో పాటు ఒరిజనల్ ఆధార్కార్డుతో పరీక్ష కేంద్రాలకు రావాలని సూచించారు.వెబ్సైట్, వాట్సాప్ ద్వారా హాల్టికెట్ డౌన్లోడ్ -
ట్యాంకర్ బోల్తా పడి డ్రైవర్ మృతి
బోనకల్: మండలంలోని పెద్దబీరవల్లి గ్రామ మలుపు సమీపాన గురువారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ట్యాంకర్ డ్రైవర్ చక్రపాణి(35) మృతి చెందాడు. ఏపీలోని జగ్గయ్యపేటకు చెందిన రామంజనేయ ట్రాన్స్పోర్ట్కు చెందిన ఫ్లైయాష్ ట్యాంకర్ కొత్తగూడెం నుంచి జగ్గయ్యపేట వైపు వెళ్తోంది. ఈమేరకు తెల్ల వారుజామున పెద్దబీరవల్లి మలుపు వద్ద వాహనం అతివేగంగా కారణంగా డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో రోడ్డు పక్కన బోల్తా పడింది. ఈక్రమాన ట్యాంకర్ క్యాబిన్ భాగం డ్రైవర్ చక్రపాణిపై పడడంతో తీవ్ర గాయాలపాలై ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు చేరుకుని మృతదేహాన్ని బయటకుతీశాక, ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ పొదిలి వెంకన్న తెలిపారు. నగదు, నగలతో పాటు సిలిండర్ చోరీ! వంటనూనె కూడా ఎత్తుకెళ్లిన దుండగులు పెనుబల్లి: సహజంగా చోరీకి వచ్చిన వారు నగలు, నగదుతో పాటు విలువైన వస్తువులు ఎత్తుకెళ్లారు. అయితే, ఇవి కాకుండా వంటనూనె, గ్యాస్ సిలిండర్ కూడా చోరీ చేసిన ఘటన ఇది. జార్ఖండ్ నుంచి ఏళ్ల క్రితం పెనుబల్లి మండలం లంకపల్లికి వచ్చిన మహమ్మద్ కమాలుద్దీన్ మసీదులో మౌల్వీగా పనిచేస్తూ లంకపల్లి సెంటర్లో ఫ్యాన్సీ షాపు నిర్వహిస్తున్నాడు. ఈక్రమాన గురువారం ఉదయం ఆయన ఇంటికి తాళం వేసి భార్యతో పాటు షాపునకు వెళ్లారు. తిరిగి మధ్యాహ్నం వచ్చే సరికి ఇంటి తాళాలు, బీరువా తాళాలు పగులగొట్టి ఉన్నాయి. ఈమేరకు పరిశీలించగా బీరువాలోని రూ.10వేల నగదు, 5.195 గ్రాముల బంగారు, 454,74 గ్రాములు వెండి ఆభరణాల చోరీ జరిగినట్లు తేలింది. ఆపై వంట గదిలో చూస్తే 15 లీటర్ల వంట నూనె, గ్యాస్ సిలిండర్ కూడా లేకపోవడంతో అవి కూడా దుండగులు ఎత్తుకెళ్లి ఉంటారనే నిర్ధారణకు వచ్చారు. ఘటనపై కమాలుద్దీన్ ఇచ్చిన ఫిర్యాదుతో వీ.ఎం.బంజరు పోలీసులు పరిశీలించి దర్యాప్తు చేపట్టారు. మహిళా కూలీలకు గాయాలు వేంసూరు: వేంసూరు మండలం కందుకూరులో ట్రాక్టర్ ట్రక్కు బోల్తా కొట్టగా నలుగురు మహిళ కూలీలకు స్వల గాయాలయ్యాయి. కందుకూరుకు చెందిన 10 మంది మహిళా కూలీలు గురువారం ట్రాక్టర్లో నువ్వుల కట్టె లోడ్ చేసి అదే లోడ్పై కూర్చుని వెళ్తున్నారు. ఈమేరకు పొలాల్లో ఎగుడుదిగుడుగా ఉన్న చోట ట్రాక్టర్ ట్రక్కు పల్టీ కొట్టింది. ఘటనలో నలుగురు కూలీలకు గాయాలు కాగా సత్తుపల్లి ఆస్పత్రికి తరలించారు. -
విద్యారంగానికి 13.5 శాతం నిధులు
ఎర్రుపాలెం/బోనకల్: విద్యారంగం, విద్యార్థుల భవిష్యత్ను తీర్చిదిద్దడమే లక్ష్యంగా రాష్ట్రప్రభుత్వం బడ్జెట్లో విద్యాశాఖకు 13.5 శాతం నిధులు కేటాయించామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. ఎర్రుపాలెం, బోనకల్లో గురువారం ఏర్పాటుచేసిన సమావేశాల్లో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, జూనియర్ కాలేజీల విద్యార్థులకు అమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యాన ఉచితంగా సైకిళ్లు పంపిణీ చేశారు. ఈసందర్భంగా భట్టి మాట్లాడుతూ పదేళ్ల పాటు గత ప్రభుత్వం విద్యార్థుల డైట్, కాస్మోటిక్ చార్జీలు పెంచకపోతే, తాము అధికారంలోకి రాగానే డైట్ చార్జీలు 40 శాతం, కాస్మోటిక్ చార్జీలను 200 శాతం పెంచామని తెలిపారు. విద్యార్థుల సమయాన్ని ఆదా చేయడం, వారికి శ్రమ ఉండొద్దనే భావనతో అమ్మ ఫౌండేషన్ ద్వారా ఉచితంగా సైకిళ్లు పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు వచ్చే విద్యాసంవత్సరం నుంచి అల్పాహారం, జూనియర్ కాలేజీల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పంపిణీ ప్రారంభించనున్నామని వెల్లడించారు. అలాగే, జూన్ 2వ తేదీ నుంచి రాష్ట్రంలోని 1.15 కోట్ల కుటుంబాలకు ఇందిరమ్మ బీమా భరోసా పథకం అమలు చేస్తామని భట్టి ప్రకటించారు. రైతులకు అండగా... ఎర్రుపాలెం మండలం ములుగుమాడు సమీపాన రూ. 36.5 కోట్లతో చేపట్టే కట్లేరు కాల్వల ఆధునికీరణ పనులకు భట్టి లాంఛనంగా శంకుస్థాపన చేశారు. సాగర్ ఆయకట్టు ఉన్నప్పటికీ ఎర్రుపాలెం మండలంలోని పంటలకు సాగు నీరు అందడం లేదని.. ఇక్కడ ఎత్తిపోతల పథకానికి ప్రతిపాదించినా గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందన్నారు. అంతేకాక సీతారామ ప్రాజెక్టుకు సైతం ప్రాధాన్యత ఇవ్వలేదని తెలిపారు. ఈమేరకు తాము అధికారంలోకి వచ్చాక ప్రతీ ఎకరాకు సాగు నీరు అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి తెలిపారు. కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ, పోలీసు కమిషనర్ పీ సునీల్దత్, కార్పొరేషన్ల చైర్మన్లు నాయుడు సత్యనారాయణ, రాయల నాగేశ్వరరావు, మార్కెట్, ఆత్మ కమిటీ చైర్మన్లు బండారు నర్సింహారావు, కర్నాటి రామకోటేశ్వరావు, తహసీల్దార్ రమాదేవి, ఎంపీడీఓ రమాదేవి, ఎంఈఓ దామాల పుల్లయ్య, మాజీ ఎమ్మెల్యే కొండబాల కోటేశ్వరరావు, నాయకులు, సర్పంచ్లు, అధికారులు చావా రామకృష్ణ, అయిలూరి వెంకటేశ్వరరెడ్డి, నండ్రు అశ్విని, బొగ్గుల గోవర్దన్రెడ్డి, తుళ్లూరు నిర్మలకుమారి, వేమిరెడ్డి అన్నపూర్ణ, తల్లపురెడ్డి నాగిరెడ్డి, గంటా తిరుపతమ్మ, చింతిరాల ఇమ్మేలమ్మ, గొల్లమందల అనసూర్య, వేమిరెడ్డి సుధాకర్రెడ్డి, గంటా శ్రీనివాసరావు, కొట్టె వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
మరమ్మతులు వేగంగా పూర్తిచేయాలి
కామేపల్లి: మండల కేంద్రంలో నిరుపయోగంగా ఉన్న బీసీ వసతి గృహం భవనాన్ని వినియోగంలోకి తెచ్చేలా చేపట్టిన మరమ్మతు పనులను వేగంగా పూర్తిచేయాలని అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ ఆదేశించారు. వసతి గృహంలో పనులను బుధవారం ఆమె పరిశీలించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు హాస్టల్ వసతి కోసం భవనాన్ని కేటాయించనున్నట్లు తెలిపారు. ఎంపీడీఓ రవీందర్, పీఆర్ ఏఈ అశోక్, కార్యదర్శి నర్సింహారావు పాల్గొన్నారు. టీబీ నియంత్రణ విభాగానికి అవార్డులు ఖమ్మంవైద్యవిభాగం: జిల్లా టీబీ ఆస్పత్రితో పాటు, గంగారం పీహెచ్సీ వైద్యుడికి టీబీ నియంత్రణ విభాగంలో రాష్ట్రస్థాయి అవార్డులు దక్కాయి. టీబీ నివారణ, నియంత్రణ కార్యక్రమాలు విజయవంతంగా అమలు చేసినందుకు గాను అవార్డులు ప్రకటించగా, హైదరాబాద్లో మంగళవారం ఏర్పాటుచేసిన సమావేశంలో అధికారులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఖమ్మంలోని డీఎంహెచ్ఓ కార్యాలయంలో గంగారం పీహెచ్సీ డాక్టర్ అవినాష్, జిల్లా క్షయ నివారణ అఽధికారి డాక్టర్ సుబ్బారావును సన్మానించారు. అనంతరం డీఎంహెచ్ఓ రామారావు మాట్లాడుతూ నిరంతర కృషితో టీబీ నివారణలో జిల్లా రాష్ట్రంలో మొదటి స్థానాన నిలిచిందని తెలిపారు. నంబర్ ప్లేట్ లేకపోతే చర్యలు ఖమ్మంక్రైం: ద్విచక్రవాహనాలకు నంబర్ ప్లేట్ లేకపోతే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ఖమ్మం ట్రాఫిక్ సీఐ సత్యనారాయణ తెలిపారు. నంబర్ ప్లేట్ అసలే లేని, నిబంధనలు విరుద్ధంగా ఉన్న వాహనాల గుర్తింపునకు బుధవారం స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. ఈ సందర్భంగా సరైన నంబర్ ప్లేట్ లేని పలువురి ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకుని వాహనదారులకు రూ.14వేలు, నిబంధనలకు విరుద్ధంగా వెళ్తున్న వారికి రూ.1,700 జరిమానా విధించడమే కాక ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించారు. రోడ్డు ప్రమాదాల కట్టడి, చోరీల నివారణకు తీసుకుంటున్న చర్యలకు వాహనదారులు సహకరించాలని ఈ సందర్భంగా సీఐ సూచించారు. -
రాబోయేది కేసీఆర్ ప్రభుత్వమే...
ఖమ్మంవైరారోడ్: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చేస్తున్న మోసాలకు ప్రజలు విసిగిపోయారని మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ తెలిపారు. దీంతో వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ను గెలిపించేందుకు సిద్ధమవుతున్నారని చెప్పారు. ఖమ్మం నియోజకవర్గం ముఖ్య నాయకుల సమావేశం బుధవారం జరగగా పువ్వా డ మాట్లాడారు. అసెంబ్లీలో ప్రతిపక్షంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ప్రశ్నలను తట్టుకోలేక అధికార పార్టీ సస్పెండ్ చేసిందని ఎద్దేవా చేశారు. అంతేకాక కాంగ్రెస్ ఆరు గ్యారంటీలను అమలు చేయలేక బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పనులనే వారి పనులుగా చెబుతూ ప్రజలను మభ్య పెడుతున్నారని తెలిపారు. మట్టి గుట్టలు అమ్ముకున్నట్లు తనపై నిందలు వేసిన వారు ఇప్పటివరకు ఎందుకు నిరూపించలేదో చెప్పాలని సూచించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక జిల్లాలో మాయమైన గుట్టలపై ఏం సమాధానం చెబుతారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండున్నరేళ్లు గడిచినా చేసిందేమీ లేదని ప్రజలకు అర్థం కావడంతో వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ ప్రభుత్వాన్ని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని పువ్వాడ తెలిపారు. పార్టీ శ్రేణులు ధైర్యంగా ఉండాలని సూచించారు. బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, డీసీసీబీ, మార్కెట్, సుడా మాజీ చైర్మన్లు కూరాకుల నాగభూషణం, గుండాల కృష్ణ, బచ్చు విజయ్కుమార్తో పాటు బీరెడ్డి నాగచంద్రారెడ్డి, కార్పొరేటర్ మక్బూల్ తదితరులు పాల్గొన్నారు. మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ -
●చేపల విక్రయాలు ప్రారంభం
సుజాతనగర్ మండలం సింగభూపాలెం చెరువులో బుధవారం నుంచి చేపల విక్రయాలు ప్రారంభమయ్యాయి. ఇక్కడి చేపలు రుచిగా ఉంటాయని స్థానికులు చెబుతుంటారు. చెరువుపై ఆధారపడి సుమారు 400 మత్స్యకారుల కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. నెల పాటు చేపల వేట కొనసాగనుండగా, తొలిరోజు బొచ్చ, రవ్వ రకం చేపలు కిలో రూ.140 చొప్పున, పాంప్లెట్లు కిలో రూ.100 చొప్పున విక్రయించారు. – సుజాతనగర్ -
తలసేమియా నిర్మూలనే లక్ష్యం
ఖమ్మంవైద్యవిభాగం: తలసేమియా రహిత సమా జ నిర్మాణానికి అంతా కలిసి రావాలని సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థ బాధ్యులు పిలుపునిచ్చారు. వచ్చేనెల 8న ప్రపంచ తలసేమియా దినోత్సవం జరుపుకోనుండగా, నెల పాటు అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈమేరకు బుధవారం ఖమ్మంలోని రితన్య ఆస్పత్రిలో ఏర్పాటుచేసిన రక్తదాన శిబిరాన్ని సీఎస్బీ ఏసీపీ టి.మహేష్, సీఏఆర్ ఏసీపీ నరసయ్య, సీసీఎస్ ఏసీపీ సర్వర్, సీఎస్బీ సీఐ రాజిరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా చిన్నారుల తల్లిదండ్రులు, బంధువులతో పాటు ఎస్సీ సంక్షేమ శాఖ వసతి గృహం విద్యార్థులు రక్తదానం చేశారు. అనంతరం అధికారులు మాట్లాడు తూ సంకల్ప సంస్థకు అండగా నిలిచేలా చిన్నారులకు అవసరమైన సమయాల్లో రక్తదానం చేస్తామని తెలిపారు. ఆతర్వాత డాక్టర్ డి.నారాయణమూర్తి, సంస్థ బాధ్యులు ప్రొద్దుటూరి రవిచందర్ మాట్లాడగా ఏసీపీ టి.మహేష్, సీఐ రాజిరెడ్డి రూ.10వేల చొప్పున ఆర్థిక సాయం అందజేశారు. ఆశ్రమ పాఠశాల హెచ్ఎం సస్పెండ్ కామేపల్లి: కామేపల్లి గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల ఇన్చార్జ్ హెచ్ఎం బి.నెహ్రూపై సస్పెన్సన్ వేటు పడింది. ఈ మేరకు భద్రాచలం ఐటీడీఏ పీఓ రాహుల్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. విద్యార్థులతో అసభ్యకరంగా వ్యవహరించడం, మెనూ సక్రమంగా అమలు చేయకపోవడమే కాక విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు తేలడంతో సస్పెండ్ చేస్తున్నట్లు వెల్లడించారు. -
సురక్షిత మాతృత్వంతోనే.. బలమైన సమాజం
● మాతాశివు మరణాలు సున్నాకు చేరేలా కృషి చేయాలి ● కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఖమ్మంవైద్యవిభాగం: సురక్షితమైన ప్రసవాలతో తల్లులు ఆరోగ్యంగా ఉండటంతోపాటు ఆరోగ్యవంతమైన కుటుంబం, బలమైన సమాజానికి పునాది పడుతుందని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా బుధవారం కలెక్టరేట్లో సురక్షిత మాతృత్వ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. తల్లి ఆరోగ్యం కుటుంబానికే కాక సమాజ ఆరో గ్య స్థితిని ప్రతిబింబిస్తుందని తెలిపారు. మాతా – శిశు మరణాల తగ్గింపులో మంచి ఫలితాలు వస్తున్నా, మరింత మెరుగుదల అవసరమన్నారు. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో గర్భిణులు, చిన్నారుల ఆరోగ్యంపై ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, అంగన్వాడీ సిబ్బంది దృష్టి సారించాలని సూ చించారు. ప్రతి గర్భిణీ పేరును తొలి దశలోనే నమోదు చేసి, క్రమం తప్పకుండా పరీక్షలు చేయిస్తే ప్రసవ సమయాన ఇబ్బంది ఉండదని పేర్కొన్నారు. ప్రసవానికి ప్రభు త్వ ఆస్పత్రులకే వచ్చేలా అవగాహన కల్పించడంతో పాటు బిడ్డ పుట్టాక తల్లిపాల ఆవశ్యకతను వివరించాలని చెప్పారు. డీఎంహెచ్ఓ రామారావు, డీసీహెచ్ఎస్ రాజశేఖర్, అడిషనల్ డీఎంహెచ్ఓ చందునాయక్, డిప్యూటీ డీఎంహెచ్ఓ వేణుమాధవరావు, ప్రోగ్రాం అధికారి బిందుశ్రీ, వైద్యులు యామిని, ఎండీ సోహైల్, చేతన్, షమా ఫిర్దౌస్ తదితరులు పాల్గొన్నారు. గడువులోగా యంగ్ ఇండియా గురుకుల నిర్మాణం ఖమ్మంరూరల్: పిల్లల ఉజ్వల భవిష్యత్కు బాటలు వేసేలా యంగ్ ఇండియా సమీకృత గురుకులాల నిర్మాణాలు గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ అనుదీప్ ఆదేశించారు. రూరల్ మండలం పొన్నేకల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల పనులను కలెక్టర్ బుధవారం పరిశీలించి మాట్లాడారు. ప్రధాన భవన నిర్మాణంతో పాటు లింక్, అంతర్గత రోడ్ల నిర్మాణం, విద్యుత్ సరఫరాకు ఏర్పాట్లు చేయాలని తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరం నాటికి పనులు పూర్తిచేసి పిల్లలకు అందుబాటులోకి తీసుకురావాలని, పనుల పురోగతి వివరాలను ఎప్పటికప్పుడు నివేదికల రూపొంలో అందించాలని అధికారులను ఆదేశించారు. విద్యాశాఖ ఈఈ బుగ్గయ్య, తహసీల్దార్ వినయేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఖమ్మంసహకారనగర్: జిల్లాలో జనగణన అత్యంత పకడ్బందీగా, కచ్చితత్వంతో పూర్తి చేయాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆదేశించారు. తొలుత గృహ సముదాయాల బ్లాక్ లను గుర్తించి సీఎంఎంఎస్ పోర్టల్లో నమోదు చేయాలని తెలిపారు. కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జనగణన, పీఎన్జీ గ్యాస్ పైప్లైన్, ధాన్యం, మొక్కజొన్నల కొనుగోళ్లపై అధికారులతో ఆయన సమీక్షించారు. హౌస్ లిస్టింగ్ బ్లాక్లకు సంబంధించి క్షేత్రస్థాయిలో తప్పక పరిశీలించి నమోదు చేయాలని తెలిపారు. మే 10న ఈ కార్యక్రమం ప్రారంభం కానుండగా, ప్రతీ 300 ఇళ్లు లేదా 800 జనాభాను ఒక బ్లాక్గా గుర్తించాలని చెప్పారు. ఆ తర్వాత గ్యాస్ పైపులైన్ల ఏర్పాటుకు ఆసక్తి ఉన్న వారు అనుమతి తీసుకునేలా అవగాహన కల్పించాలని సూచించారు. ఆ తర్వాత ధాన్యం, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, వసతుల కల్పనపై సూచనలు చేశారు. డీఆర్ఓ ఏ.పద్మశ్రీ, డీసీఓ గంగాధర్, డీసీఎస్ఓ చందన్కుమార్, సీపీఓ ఏ.శ్రీనివాస్, డీపీఓ రాంబాబు, ఆర్అండ్బీ ఎస్ఈ యాకూబ్, డీఎంఏ ఎం.ఏ.అలీం, మార్క్ఫెడ్ మేనేజర్ శ్యామ్కుమార్ పాల్గొన్నారు. -
వలస కూలీల తిరుగుపయనం
చర్ల: మిర్చికోతలకు వచ్చిన సరిహద్దు ఛత్తీస్గఢ్ వలస కూలీలు తిరుగుపయనమయ్యారు. బీజాపూర్, దంతెవాడ, సుకుమా జిల్లాల్లోని అటవీ ప్రాంతాల ఆదివాసీలు ఉపాధి కోసం డిసెంబర్, జనవరి నెలల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలకు మిర్చి కోతలకు వలసవచ్చారు. తెలంగాణ నుంచి ఛత్తీస్గఢ్కు రవాణా వ్యవస్థ మెరుగుపడటంతో ఈ ఏడాది ఎక్కువ సంఖ్యలో వచ్చారు. మిర్చి కోత పనులు చివరి దశకు చేరుకుంటుండటంతో తిరిగి వెళ్తున్నారు. దీంతో సరిహద్దు రహదారులు, గ్రామాలు సందడిగా మారాయి. కొన్ని నెలలకు సరిపడా నిత్యావసర వస్తువులను ఇక్కడే కొనుగోలు చేస్తున్నారు. దీంతో చర్లలోని దుకాణాలన్నీ కళకళలాడుతున్నాయి. గత ఆదివారం వారపు సంతలో బియ్యం, నూకలు ఇతర విక్రయాలు భారీగా సాగాయి. మూడు, నాలుగు నెలల తర్వాత తిరిగి ఇళ్లకు చేరుకుంటుండడంతో ఛత్తీస్గఢ్లోని ఆదివాసీ గూడేల్లో సందడి నెలకొంటోంది. -
రేపటి నుంచి ఉర్సు వేడుకలు
టేకులపల్లి: టేకులపల్లి మండలంలోని బేతంపూడిలో ఉన్న హజరత్ సయ్యద్ జమాలుద్దీన్ బిహారీ బాబా దర్గా ఉర్సు వేడుకలు ఈనెల 10న ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు బుధవారం ఉర్సు కమిటీ సభ్యులు వివరాలు వెల్లడించారు. కులమతాలకు అతీతంగా జరిగే వేడుకలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. దర్గా ఆవరణలో తోరణాలు కట్టారు. విద్యుత్ దీపాలతో అలంకరించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాతోపాటు రెండు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల నుంచి భక్తులు తరలిరానున్నారు. శుక్రవారం రాత్రి 8 గంటలకు కొత్తగూడెంలోని సూపర్ బజార్కు చెందిన సి.మాలిక్ నివాసం నుంచి గంధాన్ని ఊరేగింపుగా తీసుకురానున్నారు. గంధం దర్గాలో సమర్పించడంతో వేడుకలు ప్రారంభమవుతాయి. వేడుకల్లో ఢిల్లీకి చెందిన ప్రముఖ కళాకారుడు నుస్రత్ ఆలీ జహంకార్ ఖవ్వాలి కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఏటా సుమారు పది వేల మందికిపైగా భక్తులు తరలివస్తారని, ఈసారి ఇంకా పెరిగే అవకాశం ఉందని నిర్వాహకులు తెలిపారు. భక్తులకు ఇబ్బంది లేకుండా బందోబస్తు చర్యలు చేపడుతున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. -
కంటి ఆపరేషన్లు చకచకా..
ఖమ్మంవైద్యవిభాగం: ఖమ్మం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో కంటి ఆపరేషన్ల నిర్వహణలో వేగం పెరగనుంది. ఈమేరకు శస్త్రచికిత్సకు అవసరమైన ఏ–స్కాన్, బీ–స్కాన్ యంత్రాలు అందుబాటులోకి వచ్చాయి. కంటి విభాగంలో ఈ యంత్రాలను ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ ఎం.నరేందర్ బుధవారం ప్రారంభించి మాట్లాడారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం కలిగిన ఈ యంత్రాల ద్వారా అత్యంత కచ్చితత్వంతో కంటి పరీక్షలు, ఆపరేషన్లు సాధ్యమవుతాయని తెలిపారు. అంతేకాక ఎక్కువ ఆపరేషన్లు చేయడానికి వీలవుతుతుందని చెప్పారు. డిప్యూటీ సూపరింటెండెంట్ బి.కిరణ్కుమార్, ఆర్ఎంఓలు రాంబాబు, శ్రీకాంత్, రాజేంద్రప్రసాద్, జిల్లా అంధత్వ నివారణ అధికారి, ఆప్తాల్మిక్ హెచ్ఓడీ రామూనాయక్, ప్రొఫెసర్ జయంతి, అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఆయేషాబేగం, ఎస్కే. ఆస్మా, సీనియర్ రెసిడెంట్లు రవీనా, పావని, నందగిరి శ్రీను పాల్గొన్నారు. రామయ్యకు స్నపన తిరుమంజనంభద్రాచలం: భద్రాచలంలో శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో స్వామివారికి బుధవారం స్నపన తిరుమంజనం జరిపారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం మేళతాళాల నడుమ గర్భగుడి నుంచి స్వామివారిని ఊరేగింపుగా తీసుకొచ్చి బేడా మండపంలో కొలువుదీర్చారు. విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం అనంతరం కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి కల్యాణాన్ని శాస్రోక్తంగా జరిపారు. పెద్దాస్పత్రికి కొత్త యంత్రాలు -
నేడు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటన
మధిర/ఎర్రుపాలెం: డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గురువారం మధిర నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఉదయం 11గంటలకు ఎర్రుపాలెంలోని టీజీఎస్డబ్ల్యూ రెసిడెన్షియల్ స్కూల్లో విద్యార్థినులకు సైకిళ్లు పంపిణీ చేస్తారు. ఆతర్వాత ములుగుమాడులో రూ.365కోట్లతో చేపట్టే కట్టలేరు ఆధునికీకరణ రెండో విడత పనులకు శంకుస్థాపన చేయనన్నారు. అలాగే, మధ్యాహ్నం 12–30 గంటలకు మధిర మండలం మాటూరుపేట వద్ద అంబరుపేట – మాటూరుపేట బీటీ రోడ్డు, మల్లారం – మిట్టగూడెం బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. అలాగే, ఎన్పీడీసీఎల్ నూతన డివిజనల్ కార్యాలయాన్ని ప్రారంభించనున్న భట్టి, ఎలక్ట్రిసిటీ రెవెన్యూ కార్యాలయం, ఎస్పీఎం సెంటర్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. ఆతర్వాత మధిరలో ఇందిరమ్మ గృహాల పురోగతిపై సమీక్షించి, మధిరలో నిర్మించే మహాప్రస్థానం నమూనాలను పరిశీలిస్తారు. అనంతరం సాయత్రం 4–30 గంటలకు బోనకల్ రైతు వేదిక వద్ద ప్రభుత్వ పాఠశాలల్లోని బాలికలకు డిప్యూటీ సీఎం సైకిళ్లు పంపిణీ చేస్తారు. ఈవీఎం గోదాం వద్ద పటిష్టమైన నిఘా ఖమ్మం సహకారనగర్: ఈవీఎం గోదాం వద్ద పటిష్టమైన నిఘా కొనసాగించాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆదేశించారు. కలెక్టరేట్ ఆవరణలోని గోదాంను నెలవారీ తనిఖీల్లో భాగంగా బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా అగ్నిమాపక పరికరాలు, సీసీ కెమెరాల పనితీరుపై ఆరా తీశాక సిబ్బందికి సూచనలు చేశారు. కలెక్టరేట్ ఏఓ కె.శ్రీనివాసరావు, ఎన్నిక ల డీటీ అన్సారీ, ఉద్యోగులు పాల్గొన్నారు. క్రీడలతో శారీరక, మానసిక దృఢత్వం ఖమ్మంక్రైం: పోలీసులు క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలని, తద్వారా శారీరక, మానసిక దృఢత్వం సొంతమవుతుందని పోలీసు కమిషనర్ సునీల్దత్ తెలిపారు. ఖమ్మం సిటీ ఆర్మ్డ్ హెడ్క్వార్టర్స్ ఆవరణలో ఇటీవల ప్రారంభమైన స్పోర్ట్స్ కాంప్లెక్స్లో అత్యాధునిక హంగులతో నిర్మించిన షటిల్ బ్యాడ్మింటన్ కోర్టును బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కొద్దిసేపు షటిల్ ఆడిన సీపీ మాట్లాడుతూ పోలీసు సిబ్బంది, కుటుంబాలు కాంప్లెక్స్ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నేడు ‘వనజీవి రామయ్య’ చిత్రబృందానికి సత్కారం ఖమ్మంగాంధీచౌక్: ఇటీవల గద్దర్ అవార్డు గెలుచుకున్న ‘వనజీవి రామయ్య’ చిత్రబృందా న్ని గురువారం ఖమ్మంలో సన్మానించనున్నారు. జిల్లా అటవీ శాఖ, వాస్విక్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యాన ఖమ్మం భక్త రామదాసు కళాక్షేత్రంలో ఉదయం 10గంటలకు సన్మానం ఉంటుందని జిల్లా అటవీ అధికారి సిద్ధార్థ్ విక్రమ్సింగ్ తెలిపారు. పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా కృషి చేసి పద్మశ్రీ అవార్డు పొందిన వనజీవి రామ య్య జీవితచరిత్ర ఆధారంగా రూపొందించిన లఘు చిత్రానికి ప్రభుత్వం గద్దర్ అవార్డు ప్రదా నం చేసింది. ఈమేరకు చిత్రబృందానికి జరిగే సత్కారంలో అధికారులు, ప్రకృతి ప్రేమికులు, ప్రజలు పాల్గొనాలని డీఎఫ్ఓ కోరారు. గ్యాస్ పైపులైన్ వేగవంతం చేయాలి భ ద్రాద్రి కలెక్టర్ అంకిత్సూపర్బజార్(కొత్తగూడెం): ఖమ్మం నుంచి కొత్తగూడెం వరకు చేపట్టనున్న సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ (సీజీడీ) పైపులైన్ విస్తరణ పనులను వేగవంతం చేయాలని భద్రాద్రి కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. కలెక్టరేట్లో బుధవారం అధికారులతో సమావేశమైన ఆయన మెగా డిస్ట్రిబ్యూటరీ సంస్థ క్వాలిటీ ఇన్చార్జి రామకృష్ణతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. పైపులైన్ రూట్ మ్యాప్, పనుల పురోగతి, సమస్యలు, తీసుకోవాల్సిన చర్యలపై వివరాలు సేకరించి సూచనలు చేశారు. భూసేకరణ, అనుమతుల మంజూరు, రోడ్ల తవ్వకాలు, ట్రాఫిక్ నియంత్రణ వంటి పనుల్లో జాప్యం చేయొద్దన్నారు. సింగిల్ విండో విధానం ద్వారా 24 గంటల్లో అనుమతులు పొందే విధానాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని, డిగ్ అండ్ రీస్టోర్ సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని వివరించారు. జిల్లాలో ఎల్పీజీ గ్యాస్ కొరత నివారించేందుకు పీఎన్జీ సరఫరాను త్వరగా అందుబాటులోకి తీసుకురావా లన్నారు. ఈ ప్రాజెక్ట్కు నోడల్ అధికారిగా జిల్లా పౌర సరఫరాల అధికారి ప్రేమ్ కుమార్ను నియమించినట్లు కలెక్టర్ తెలిపారు. -
ప్రాణం తీస్తున్న వేగం
ఇటీవల కొణిజర్ల వద్ద ప్రమాదంలో దెబ్బతిన్నలారీ, కారురక్తమోడుతున్న రహదారులు ప్రతిరోజూ జిల్లాలో ఎక్కడో ఓ చోట జరుగుతున్న ప్రమాదాలు ప్రజలను కలవరపాటుకు గురి చేస్తున్నాయి. అతి వేగంగా వెళ్లే వాహనదారులు ప్రమాదాల బారిన పడడమే కాక మిగతా వారికీ సమస్యలు తెచ్చిపెడుతున్నారు. గత సోమవారం కొణిజర్లలో జరిగిన ప్రమాదానికి లారీ డ్రైవర్ అతివేగమే కారణమని అధికారులు నిర్ధారించారు. ఈ ఘటనలో కారు, లారీ ముందుభాగాలు నుజ్జునుజ్జ కాగా, వాహనాలు నడుపుతున్న వారు అందులో ఇరుక్కుపోయారు. వీరిని బయటకు తీసి ఆస్పత్రికి తరలించడానికి చాలా సమయం పట్టింది. ఇక కొందరు భారీ వాహనాల డ్రైవర్లు రాత్రి సమయాన్నే ప్రయాణానికి ఎంచుకుని మద్యం మత్తులో తూలుతున్నారని తెలుస్తోంది. అంతేకాక రోడ్డు నిబంధనలను కూడా పాటించక ప్రమాదాలకు కారణమవుతున్నారు. పట్టింపు ఏదీ? తరచూ రోడ్డు ప్రమాదాల కట్టడి, నష్టనివారణ చర్యలపై పోలీసు, రవాణా శాఖ తీసుకుంటున్న చర్యలు నామమాత్రమేనని చెప్పాలి. రాత్రి పూట వాహనాలు తనిఖీ చేయకపోవడం, స్పీడ్గన్లు ఉపయోగించకపోవడం, మద్యం మత్తులో వాహనాలను నడిపే వారిని గుర్తించడానికి కొన్ని స్టేషన్లలో బ్రీత్ ఎనలైజర్లు లేకపోవడం గమనార్హం. ఇక సామర్థ్యానికి మించి లోడ్, అతివేగంగా వెళ్లే వాహనాల గుర్తింపునకు రవాణా శాఖ అధికారులు తనిఖీలు చేపట్టిన దాఖలాలే లేవని చెప్పాలి. కేవలం రోడ్డు భద్రతా వారోత్సవాల సమయంలో అవగాహన సదస్సులు ఏర్పాటుచేసి చేతులు దులుపుకోవడం తప్ప ఇతర సమయాన సదస్సులు, తనిఖీలు శూన్యమేనన్న విమర్శలు వస్తున్నాయి. ఇక ఆర్ అండ్ బీ శాఖ తరఫున ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో సరైన సూచికబోర్డులు కూడా ఏర్పాటు చేయకపోవడం గమనార్హం. 85మంది మృత్యువాత ఈ ఏడాది ఇప్పటివరకు జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 85మంది మృత్యువాత పడ్డారు. ఇక 250మందికి పైగా క్షతగాత్రులుగా మిగిలారు. ఇక రికార్డులకు ఎక్కని ప్రమాదాలు ఎన్ని ఉన్నాయో తెలియడం లేదు. అయితే, ఇందులో ఎక్కువ ప్రమాదాలకు అతివేగమే కారణమని మాత్రం చెబుతున్నారు. అంతేకాక మృతుల్లో ఎక్కువగా యువత ఉండడం కుటుంబాలకు వేదనను మిగులుస్తోంది. మరోపక్క జిల్లా మీదుగా సాగే గ్రీన్ఫీల్డ్ హైవేపైకి వైరా వద్ద ప్రవేశానికి అనుమతించారు. దీంతో వైరా, తల్లాడ, సత్తుపల్లి ప్రాంతాల్లో ప్రమాదాల సంఖ్య తగ్గే అవకాశం ఉన్నా హైవేపై పెట్రోలింగ్ పెంచకపోతే ముప్పు పొంచి ఉన్నట్లే భావించాలి.వాహనాల అతివేగం, ఓవర్లోడ్తో ప్రమాదాలు జిల్లాలో జరుగుతున్న ప్రమాదాలకు అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగే ప్రధాన కారణాలుగా తెలుస్తోంది. అయితే, కారణాలు ఏమిటన్నది పక్కన పెడితే వరుస ప్రమాదాల్లో పలువురి ప్రాణాలు గాలిలో కలుస్తుండడం వారి కుటుంబాల్లో విషాదాన్ని నింపుతోంది. ఇదే సమయాన వందల సంఖ్యలో వాహనదారులు క్షతగాత్రులుగా మిగులుతున్నారు. – ఖమ్మంక్రైంచాలావరకు ప్రమాదాల్లో వాహనదారుల అతివేగమే కారణమని తెలుస్తోంది. ఇంకొన్ని సందర్భాల్లో నిబంధనలు పాటించకపోవడం, మద్యం మత్తుతో ప్రమాదాలు జరుగుతున్నాయి. వీటి కట్టడికి పోలీసు శాఖతో సమన్వయంతో కృషి చేస్తున్నాం. ప్రధానంగా ఓవర్ లోడ్, వేగ నియంత్రణకు తనిఖీలు ముమ్మరం చేస్తాం. – శ్రీనివాసరావు, ఇన్చార్జ్ ఆర్టీఓజిల్లాలో ప్రధానంగా మూడుచోట్ల అత్యధిక ప్రమాదాలు జరుగుతున్నాయి. తనికెళ్ల – కొణిజర్ల ప్రాంతంతో పాటు వైరా, తల్లాడ మండలాల్లో రోడ్డు ప్రమాదాలు గణనీయమైన సంఖ్యలో నమోదవుతున్నాయి. జిల్లా ఉన్నతాధికారులు సైతం ఆయా ప్రాంతాల్లో బ్లాక్ స్పాట్లు అధికంగానే ఉన్నాయని గుర్తించారు. హైదరాబాద్ నుంచి విశాఖపట్నం, పశ్చిమ బెంగాల్ నుండి హైదరాబాద్ వెళ్లే భారీ వాహనాలను డ్రైవర్లు అతివేగంగా నడపడం, మద్యం మత్తులో ఉండడం.. తరచుగా అనుభవం లేని క్లీనర్లకు స్టీరింగ్ ఇస్తుండడం ప్రమాదాలకు ఓ కారణంగా తెలుస్తోంది. మిగతా ప్రాంతాల్లోనూ వాహనదారుల అతివేగంతో ప్రమాదాలు జరుగుతున్నాయని చెబుతున్నారు. -
విద్యుత్ కార్మికుల నిరవధిక సమ్మె
జిల్లావ్యాప్తంగా విధుల బహిష్కరణఖమ్మంవ్యవసాయం: సమస్యల పరిష్కారం, డిమాండ్ల సాధనే లక్ష్యంగా విద్యుత్ కార్మికులు బుధవారం నుంచి నిరవధిక సమ్మెకు దిగారు. ఆర్టిజన్లకు ఏపీఎస్ఈబీ రూల్స్ వర్తింపచేయాలని, అన్మ్యాన్డ్ కార్మికులను ఆర్టిజన్లుగా గుర్తించాలని, పీస్రేట్ కార్మికులు, స్టోర్ హమాలీలకు కనీస వేతనం చెల్లించాలనే డిమాండ్లతో కొన్నాళ్ల నుంచి రాష్ట్రవ్యాప్తంగా డిస్కం, ట్రాన్స్కో విభాగాల కార్మికులు పోరాడుతున్నారు. ఈమేరకు జేఏసీగా ఏర్పడి చేపడుతున్న ఉద్యమంలో భాగంగా బుధవారం నుంచి ఉమ్మడి జిల్లాలో సమ్మెకు దిగారు. ఈమేరకు ఖమ్మం ఖానాపురంలోని ఉన్న ట్రాన్స్కో కార్యాలయం, మధిర, వైరా, సత్తుపల్లి డివిజన్లతో పాటు కొత్తగూడెం, భద్రాచలం విద్యుత్ డివిజన్ల ఎదుట నిరసన తెలిపారు. ఉమ్మడి జిల్లా జేఏసీ చైర్మన్ వల్లాల యుగంధర్, కన్వీనన్లు అన్వర్ పాషా, సురేందర్రెడ్డి, రామకృష్ణ, ఉపేందర్ నాయకత్వాన సమ్మె మొదలుకాగా, 1104, 327, సీఐటీయూ, 1532 తదితర సంఘాల ప్రతినిధులు తక్కెళ్లపల్లి శేషగిరిరావు, రవికుమార్, ఎం.ప్రసాద్, బానోత్ ఉపేందర్, మడక శ్రీను తదితరులు సంఘీభావం తెలిపారు. కాగా, కార్మికులంతా ఏకకాలంగా సమ్మెకు దిగడంతో పలు విద్యుత్ సెక్షన్లలో నిర్వహణకు ఇబ్బంది తలెత్తగా ఉన్న వారితోనే అధికారులు పనిచేయిస్తూ చక్కదిద్దారు. -
●మిర్చి క్వింటా రూ.19,550
ఖమ్మంవ్యవసాయం: ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు బుధవారం ప్రస్తుత సీజన్లోనే అత్యధికంగా 52 వేల బస్తాల మిర్చి విక్రయానికి వచ్చింది. నిత్యం 32 – 35వేల బస్తాల మిర్చి తీసుకొస్తుండగా గత సోమవారం 45వేల బస్తాల మిర్చి తీసుకొచ్చారు. ఇక మంగళవారం సెలవు కావడంతో బుధవారం ఏకంగా 52 వేల బస్తాల మిర్చి రాగా యార్డు నలుదిక్కులా నిండిపోయింది. ఇదేసమయాన ధర కూడా కాస్త పుంజుకుంది. సోమవారం క్వింటాకు రూ.19,500 పలికిన ధర బుధవారం రూ.19,550కు చేరింది. మోడల్ ధర రూ.19 వేలుగా నమోదైంది. అంతేకాక తాలు మిర్చి ధర క్వింటా గరిష్టంగా రూ.10 వేలు పలకడం విశేషం. మార్కెట్ చైర్మన్ యరగర్ల హన్మంతరావు, ఉన్నత శ్రేణి కార్యదర్శి పి ప్రవీణ్కుమార్ క్రయవిక్రయాలను పర్యవేక్షించారు. -
ప్రశ్నించే గొంతుల అణచివేతే కేంద్రం లక్ష్యం
● అకస్మాత్తుగా నోటీసుల వెనుక రాజకీయ కుట్ర ● సీపీఐ(ఎంఎల్) మాస్లైన్ రాష్ట్ర కార్యదర్శి రంగారావు ఖమ్మంమయూరిసెంటర్: ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజల హక్కుల కోసం పోరాడుతున్న వారిని అక్రమ కేసులతో వేధించడం ఫాసిజమేనని, ఎన్ఐఏ నోటీసులకు భయపడే ప్రసక్తే లేదని సీపీఐ (ఎంఎల్) మాస్లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు స్పష్టం చేశారు. ఖమ్మంలో బుధవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. యాభై ఏళ్లుగా ప్రజా సమస్యలు, హక్కుల కోసం పోరాడుతున్న తనపై పాత కేసులన్నీ 2026 మార్చి నాటికే కోర్టులు కొట్టివేశాయని తెలిపారు. అయినా అకస్మాత్తుగా ఎన్ఐఏ నోటీసులు ఇవ్వడం వెనుక రాజకీయ కుట్ర దాగి ఉందని ఆరోపించారు. 2025 నవంబర్లో నమోదైన ఓ కేసులో విచారణకు రావాలంటూ నోటీసులు పంపడాన్ని ఆయన తప్పుబట్టారు. సుప్రీంకోర్టు తీర్పులు, ప్రభుత్వ విధానాలను ప్రజాస్వామ్యబద్ధంగా విమర్శించడం పౌరుల ప్రాథమిక హక్కు అని, గాదె ఇన్నయ్య అరెస్టును ఖండించినందుకే తనపై కేసు పెట్టడం హాస్యాస్పదమని అన్నారు. ప్రజాస్వామ్య పద్ధతులకు విరుద్ధం.. మాస్లైన్ పార్టీ కేంద్ర కమిటీ నాయకులు కేజీ.రామచందర్, కె.రమ, మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజాస్వామ్య పద్ధతులకు విరుద్ధంగా వ్యవహరిస్తూ ఎన్ఐఏ ద్వారా విచారణ పేరుతో వేధించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. ప్రజాస్వామ్య పద్ధతిలో పోటు రంగారావు విచారణకు సిద్ధమేనని చెబుతూ... విచారణ పేరుతో కేసుల నమోదు చేయడం మాత్రం అప్రజాస్వామికమని పేర్కొన్నారు. మాస్లైన్ నాయకులు ఎస్.ఎల్.పద్మ, కె.సూర్యం, సదానందం, ఎం. కృష్ణారెడ్డి, గుర్రం అచ్చయ్య, సీ.వై.పుల్లయ్య, జి.రామయ్య, ఆవుల అశోక్, మలీదు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అలాగే, పోటు రంగారావుకు నోటీసులు ఇవ్వడాన్ని సీపీఎం జిల్లా కమిటీ తరఫున ఖండిస్తున్నట్లు జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. పేదల హక్కుల కోసం పోరాడుతున్న నాయకులపై దేశద్రోహం తరహా కేసులు నమోదు చేయడం ప్రజాస్వామ్య విరుద్ధమని పేర్కొన్నారు. -
మార్కెట్లకు నిధుల కటకట
● ఏడాదిగా పేరుకుపోయిన బకాయిలు ● జిల్లాకు రూ.2.10 కోట్ల మేర పెండింగ్ ఖమ్మంవ్యవసాయం: రాష్ట్రంలోని వ్యవసాయ మార్కెట్లకు ఏడాది కాలంగా నిర్వహణ నిధులు నిలిచిపోయాయయి. రాష్ట్రంలో వివిధ స్థాయిల్లో 215 వ్యవసాయ మార్కెట్లు కొనసాగుతుండగా ప్రతీ నెల లేదా రెండునెలలకోసారి రాష్ట్ర మార్కెటింగ్ శాఖ నిర్వహణ నిధులు విడుదల చేసేది. కానీ గత ఏడాది జూన్ నుంచి ఇప్పటి వరకు అంటే పది నెలలుగా నిధులు ఆగిపోయాయి. ఫలితంగా బకాయిలు దాదాపు రూ.200 కోట్లకు చేరాయి. చిల్లిగవ్వ లేక... వ్యవసాయ మార్కెట్ల పరిధిలో పంట ఉత్పత్తులు నిల్వ చేసే గోదాములకు ఏటా బీమా చెల్లింపులు చేయాలి. కానీ ప్రభుత్వం నుంచి నిధులు రాక బీమా చెల్లింపులే కాక మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీలకు ఆస్తి పన్నుల చెల్లింపులు నిలిచిపోయాయి. అంతేకాక కరెంటు బిల్లు బకాయిలు పేరుకుపోవడంతో పలుచోట్ల మార్కెట్లు, చెక్ పోస్టులకు సరఫరా తొలగించారు. ఇక రెగ్యులేటెడ్ మార్కెట్లలో క్లీనింగ్ కాంట్రాక్టర్లకు పది నెలల బిల్లులు రాక ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇవికాక కార్యాలయాల్లో కంప్యూటర్లు, ప్రింటర్ల నిర్వహణతో పాటు చైర్మన్లకు వాహన ఖర్చులు, ఇతర చెల్లింపులూ జరగడం లేదు. ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్, మలక్పేట, బాట సింగారం, సిద్దిపేట, ఒంటిమామిడి వంటి పెద్ద మార్కెట్లకు రూ. కోట్లలో బకాయిలు ఉండగా, ఖమ్మం జిల్లాలోనే రూ.2.10 కోట్ల మేర నిధులు అందాల్సి ఉంది. వ్యవసాయ మార్కెట్లు పంట కొనుగోళ్ల నుంచి వసూలు చేసే ఫీజును మార్కెటింగ్ శాఖకు చెల్లిస్తున్నా మునుపెన్నడూ లేని విధంగా పది నెలల నిధులు నిలిచిపోవడం గమనార్హం. ఇప్పటికై నా నిర్వహణ నిధులు చెల్లించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మార్కెట్ కమిటీలు కోరుతున్నాయి. -
బాల్య వివాహాల కట్టడికి చర్యలు
రఘునాథపాలెం: బాల్య వివాహాల నివారణకు అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్పర్సన్ సీతా దయాకర్రెడ్డి సూచించారు. ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా రఘునాథపాలెం రైతు వేదికలో బుధవారం జిల్లా సంక్షేమాధికారి వేల్పుల విజేత అధ్యక్షతన సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శులు, ఉపాధ్యాయులు, ఆంగన్వాడీ సిబ్బంది, వివిధ శాఖల ఉద్యోగుల సమావేశం ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా బాలల హక్కుల పరిరక్షణ, బాల్యవివాహాలు, బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన, విద్యా హక్కుపై చర్చించాక సీతా దయాకర్రెడ్డి మాట్లాడారు. గ్రామస్థాయిలో గ్రామ బాలల పరిరక్షణ కమిటీలు చురుగ్గా పనిచేస్తూ బాలల సమస్యల పరిష్కారానికి పాలుపడాలని తెలిపారు. కాగా, పిల్లల భద్రతలో జిల్లా యంత్రాంగం కృషిని ఆమె అభినందించారు. జిల్లా సంక్షేమాధికారి విజేత మాట్లాడుతూ రఘునాథపాలెం మండలాన్ని బాల్య వివాహ రహిత మండలంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. డీపీఓ రాంబాబు, డీఎంహెచ్ఓ రామారావు, బాలల హక్కుల కమిటీ సభ్యులు చందన, సరిత మాట్లాడగా ఎంపీడీఓ అశోక్కుమార్ తదితరులు పాల్గొన్నారు. ●ఖమ్మం రాపర్తినగర్/ఖమ్మం రూరల్: జిల్లాలో బాల్య వివాహాల నిర్మూలనను అందరూ బాధ్యతగా భావించాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు చందన, సరిత సూచించారు. ఖమ్మం ఎన్సెస్పీ గెస్ట్హౌస్లో ఆమె మాట్లాడుతూ సర్పంచ్లు వారి గ్రామాల్లో ఆడపిల్లల సంఖ్య, బడికి ఎవరెవరు వెళ్లడం లేదో గుర్తించడమే కాక బాలలకు వివాహం జరిపిస్తే తమకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. జిల్లా మహిళ సంక్షేమ శాఖ అధికారి విజేత తదితరులు పాల్గొన్నారు. అలాగే, ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని కేజీబీవీని కమిషన్ సభ్యులు తనిఖీ చేశారు. ఈసందర్భంగా విద్యార్థినిలతో మాట్లాడి మెనూ అమలు, బోధన, సౌకర్యాలపై ఆరా తీశారు. సభ్యులు చందన, సరితతో పాటు అధికారులు పాల్గొన్నారు.బాలల పరిరక్షణ కమిషన్ రాష్ట్ర చైర్పర్సన్ సీతా దయాకర్రెడ్డి -
పక్కాగా చట్టం అమలు
● నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు ● కలెక్టర్ అనుదీప్ దురిశెట్టిఖమ్మంవైద్యవిభాగం: గర్భిణి కడుపులో పెరుగుతున్న శిశువు లింగాన్ని నిర్ధారించడానికి కట్టడి చేసేలా అమల్లో ఉన్న చట్టం పక్కాగా అమలయ్యేలా అధికారులు పర్యవేక్షించాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆదేశించారు. కలెక్టరేట్లో మంగళవారం పీసీపీఎన్డీటీ చట్టంపై జరిగిన సమావేశంలో అదనపు కలెక్టర్ పి.శ్రీజ, న్యాయమూర్తులు డి.రాంప్రసాద్ రావు, వి.శ్రీనయ్య, అదనపు డీసీపీ బి.రామానుజంతో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్కానింగ్ కేంద్రాలకు సంబంధించి పది కొత్త దరఖాస్తులు, 11 రెన్యూవల్ దరఖాస్తులు ఉండగా పూర్తిస్థాయిలో పరిశీలించి నివేదిక ఇవ్వాలని తెలిపారు. ప్రతీ స్కానింగ్ యంత్రం వివరాలే కాక అన్ని స్కానింగ్ల వివరాలు ఆన్లైన్లో నమోదయ్యేలా పర్యవేక్షించాలని చెప్పారు. ఎక్కడ కూడా మొబైల్ స్కానింగ్ యంత్రాలు వాడకుండా చూడాలని తెలిపారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో డీఎంహెచ్ఓ రామారావు, అదనపు డీఎంహెచ్ఓ చందూనాయక్, డిప్యూటీ డీఎంహెచ్ఓ వేణుమాధవ్, ఐఎంఏ అధ్యక్షురాలు ఎస్.రెహనా బేగం, కమిటీ సభ్యులు, ఎం.కుముదిని, విష్ణువందన తదితరులు పాల్గొన్నారు. ఆరోగ్య కేంద్రాల్లో మెరుగైన వైద్యం ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉంటూ ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. ఖమ్మం ట్రంక్రోడ్డులోని వెంకటేశ్వరనగర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన ఆయన ఉద్యోగుల హాజరు, వైద్యసేవలపై ఆరాతీశాక మాట్లాడారు. అంతేకాక జిల్లాలోని పీహెచ్సీలు, యూపీహెచ్సీల్లో సిబ్బంది అవసరమైతే వివరాలు అందజేయాలని అధికారులకు సూచించారు. వైద్యాధికారి ఐ.దేవిశ్రీ, ఉద్యోగులు డాక్టర్ మోత్యా, సయ్యద్ షమీమ్, ఎస్.కే.ముదస్సర్ తదితరులు పాల్గొన్నారు.అందరూ ఆరోగ్యంగా ఉంటే సమాజ అభివృద్ధికి పునాది అవుతుందని కలెక్టర్ అనుదీప్ పేర్కొన్నారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ నిత్యం నడక, వ్యాయామం, ప్రకృతి లో సమయం గడిపితే అనారోగ్యం దరిచేరదని తెలిపారు. ఈ ఏడాది చివరల్లా మాతృ, శిశు మరణాలు జిల్లాలో సున్నాకు చేరేలా వైద్యాధికారులు, ఉద్యోగులు కృషి చేయాలని ఆదేశించారు. డీఎంహెచ్ఓ రామారావు, అదనపు డీఎంహెచ్ఓ చందూనాయక్, డిప్యూటీ డీఎంహెచ్ఓ వేణుమాధవ్ పాల్గొన్నారు. -
భగ భగలు..
జిల్లాలో భానుడి భగభగలు మొదలయ్యాయి. కొద్ది రోజులుగా ఎండల తీవ్రత క్రమంగా పెరుగుతుండగా.. ఉదయం పది గంటల నుంచే సూర్యుడు తన ప్రతాపం చూపుతున్నాడు. ఫలితంగా ఉక్కపోత, వేడిగాలులతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈనెల రెండో వారం నుంచి ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని, వడగాలుల తీవ్రత మొదలవుతుందని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈనేపథ్యాన ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. – సాక్షి ప్రతినిధి, ఖమ్మంనిర్మానుష్యంగా మారిన ఖమ్మం ఎన్టీఆర్ సర్కిల్ – కొత్త బస్టాండ్ రహదారి ఈనెల 1వ తేదీ నుంచి జిల్లాలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. ప్రతిరోజు 38 – 40 డిగ్రీల సెల్సియస్ మేర గరిష్ట ఉష్ణోగ్రత నమోదవుతోంది. సోమవారం సాయంత్రం 4గంటల వరకు ఎండ ఎక్కువగా ఉన్నా.. 5గంటల తర్వాత వాతావరణం చల్లబడి చిరుజల్లులు కురవడంతో ప్రజలు ఉపశమనం పొందారు. అయితే, మంగళవారం ఉదయం 10 గంటల నుంచి సూర్యుడు నిప్పులు కురిపించాడు. ఈ వేసవిలో అధిక వేడి ఇదే కావడంతో ప్రధాన రహదారులన్నీ బోసిపోయి కనిపించాయి. అత్యవసర పరిస్థితుల్లో బయటకు వచ్చిన పలువురు ఎండ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. పగటి సమయాన ఎండ వేడితో ఇబ్బంది పడుతుండగా.. రాత్రింబవళ్లు తేడా లేకుండా ఉక్కపోత ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. పనుల నిమిత్తం బయటకు వచ్చిన వారు సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఫలితంగా చాలామంది ఉదయం 10నుంచి సాయంత్రం 5 గంటల వరకు బయటకు రావడం లేదు. ఉష్ణోగ్రతలు 38 నుంచి 40 డిగ్రీల సెల్సియస్ లోపే చూపుతున్నా.. ఉక్కపోత కారణంగా ప్రజలు నిస్సత్తువకు గురవుతున్నారు. ఈ వేసవిలో వాతావరణం చిత్రవిచిత్రంగా మారుతోంది. ఏప్రిల్ రెండోవారం నుంచి మే నెల మొత్తం వడగాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. వడగాలుల నేపథ్యాన ఉదయం 11నుంచి సాయంత్రం 4గంటల వరకు బయటకు రావొద్దని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు వెల్లడించారు. మొత్తంగా రెండు నెలల పాటు ఎండల తీవ్రతకు తోడు వడగాలుల ప్రభావం ఉండనుండడంతో ప్రజలకు అప్రమత్తంగా ఉండక తప్పని పరిస్థితి ఎదురవుతోంది. ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా వడదెబ్బ బారిన పడే ప్రమాదం ఉన్నందున జాగ్రత్తలు పాటించాలని అధికారులు, వైద్యులు సూచిస్తున్నారు.జిల్లాలో క్రమంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ఈనెల 10వ తేదీ తర్వాత సాధారణం కన్నా మూడు నాలుగు డిగ్రీలు ఎక్కువగానే ఉష్ణోగ్రత నమోదవుతుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈమేరకు అప్రమత్తంగా ఉండాలని జిల్లాకు అలర్ట్ ప్రకటించింది. ఈనెల రెండో వారం తర్వాత 40 – 44 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రత నమోదవుతుందని, మే నెలలో తీవ్రత మరింతగా ఉంటుందని తెలుస్తోంది. -
రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపిక
ఖమ్మం స్పోర్ట్స్: హనుమకొండలో ఈనెల 11, 12వ తేదీల్లో జరగనున్న రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు జిల్లా నుంచి క్రీడాకారులను ఎంపిక చేశారు. ఈమేరకు జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యాన ఖమ్మంలోని ఎస్ఆర్అండ్బీజీఎన్ఆర్ డిగ్రీ కళాశాల మైదానంలో అండర్–20, సీనియర్ పురుషుల, మహిళల విభాగా ల్లో ఎంపిక పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో ప్రతిభ కనబర్చిన వారిని రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేసినట్లు నిర్వాహకులు వెల్లడించారు. అండర్–20 బాలుర విభాగంలో డి.వివేక్చంద్ర, అబ్దుల్రజాక్, అక్సార్, ఏ.గణేష్, స్వరూప్, బాలికల్లో బి.వైశాలి, ఎం.ప్రసన్నకుమారి, రాజరాజేశ్వరి ఎంపికయ్యారు. ఇక సీని యర్ పురుషుల జట్టుకు ప్రసన్నకుమార్, కె. శివ, బి.బన్సీలాల్, ఎస్.కే.మసూద్పాషా, ఎస్. కే.ఆఫ్తాబ్, ఎం.మురళీకృష్ణ, ఎల్.విక్రమ్, మహిళల విభాగంలో హజీరా ఫాతిమా, ఏ.సుకన్య, అమీనానాజ్ ఎంపికయ్యారని తెలిపారు. పోటీలనుఅథ్లెటిక్స్ అకాడమీ చీఫ్ కోచ్ ఎం.డీ. గౌస్, ఎం.సుధాకర్ తదితరులు పర్యవేక్షించారు. 10నుంచి డిగ్రీ ప్రాక్టికల్ పరీక్షలు ఖమ్మం సహకారనగర్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలో 2016 కంటే ముందు డిగ్రీ చదివి ప్రాక్టికల్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించని విద్యార్థులకు పరీక్షలు నిర్వహించనున్నట్లు ఖమ్మం ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బానోతు రెడ్డి తెలిపారు. తృతీయ సంవత్సరం విద్యార్థులకు ఈనెల 10, 11వ తేదీల్లో, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు 12, 13వ తేదీలలో, ప్రథమ సంవత్సరం వారికి 14, 15వ తేదీల్లో పరీక్షలు ఉంటాయని వెల్లడించారు. ఖమ్మం ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో జరిగే పరీక్షల వివరాల కోసం 91605 38938 నంబర్లో సంప్రదించాలని ఆయన ఓ ప్రకటనలో సూచించారు. గిరిజన మహిళా డిగ్రీ కళాశాలకు రూ.2లక్షలు కొణిజర్ల: కొణిజర్ల మండలం తనికెళ్లలోని గిరిజన సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో బాలికలకు శిక్షణ కోసం రూ.2లక్షలు కేటాయించారు. ఈమేరకు చెక్కును భద్రాచలం ఐటీడీఏ పీఓ రాహుల్ మంగళవారం అందజేశారు. ఈ కళాశాలలో బాలికలకు బ్యూటీషియన్, టైలరింగ్, మగ్గం వర్క్, పుట్టగొడుగుల పెంపకం, తాటి ఆకులతో బుట్టలు అల్లడమే కాక కాస్మోటిక్స్ తయారీపై శిక్షణ ఇస్తున్నారు. అలాగే, పెయింటింగ్లో ప్రతిభ చాటుతున్న డిగ్రీ తృతీయ సంవత్సరం విద్యార్థిని ఇర్సా స్వాతికి పీఓ రూ.22,500 నగదు పురస్కారం ఆందజేశారు. ఆమె గతంలో పెయింటింగ్లు వేయగా, ఐటీడీఏ మ్యూజియంలో పెట్టేకుందుకు మరికొన్ని పెయింటింగ్స్ వేయాలని సూచించారు. వీటిని పూర్తిచేయగా స్వాతిని పీఓ అభినందించారు. గురుకులాల ఉమ్మడి జిల్లా ఆర్సీఓ అరుణకుమారి, కళాశాల ప్రిన్సిపాల్ రజని పాల్గొన్నారు. శాస్త్రోక్తంగా రామయ్య నిత్యకల్యాణం భద్రాచలం: భద్రాచలంలో శ్రీ సీతారామచంద్రస్వామి వారి నిత్యకల్యాణ వేడుక మంగళవారం కనుల పండువగా జరిగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం నిర్వహించారు. ఆతర్వాత స్వామికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని శాస్త్రోక్తంగా జరిపించారు. కాగా, మంగళవారం కావడంతో ఆంజనేయస్వామి వారికి అభిషేకం, ప్రత్యేక పూజలు చేశారు. -
పంటకు మరో తడి..
● సాగుకు ఢోకా లేకుండా సాగర్ జలాలు.. ● రైతుల వినతులతో గడువు పొడిగింపు? ఖమ్మంఅర్బన్: జిల్లాలో రబీ పంటల సాగు ఆఖరి దశలో ఉండగా ఇబ్బందులు ఎదురుకాకుండా సాగర్ జలాలు మరికొన్నాళ్లు విడుదల చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ఈనెల 7వ తేదీతో సరఫరా నిలిపివేయాల్సి ఉంది. అయితే, రైతుల డిమాండ్ దృష్ట్యా మరికొన్నాళ్లు నీటి విడుదల కొనసాగించాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి సూచించినట్లు సమాచారం. హైదరాబాద్లో తాజాగా నిర్వహించిన సమీక్షల్లో ఇంజనీర్ల నుంచి అందిన నివేదికలు, ఆయకట్టులో పంటల సాగుపై చర్చించారు. ఈమేరకు పంటలు ఎండి పోకుండా మరో తడి వరకు నీరు విడుదల చేయడానికి మంత్రి అంగీకరించినట్లు తెలిసింది. దీంతో మరో వారం నుంచి పది రోజుల వరకు సాగర్ జలాలు విడుదలయ్యే అవకాశం ఉంది. 25వేల ఎకరాలకు అవసరం జిల్లాలోని రైతులు యాసంగిలో సాగర్ ఆయకట్టు కింద 2,54,250 ఎకరాల్లో పంటలు సాగు చేశారు. ఇందులో 90 శాతం పంటలకు నీటి అవసరం తీరింది. అయినా దాదాపు 25వేల ఎకరాలకు నీటి అవసరం ఉన్నట్లు అధికారులు నివేదించారు. ఈ పంటలన్నీ చివరి దశలో ఉన్నందున ఒక్క తడి అందిస్తే సాఫీగా చేతికొచ్చే అవకాశముంది. ఈమేరకు రైతుల విన్నపాలకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది. అంతేకాక జూలై వరకు ఎక్కడా తాగునీటి ఎద్దడి రాకుండా సాగర్ పరిధిలోని చెరువులను నింపాలని మంత్రి అధికారులకు సూచించారు. ప్రస్తుతం సాగర్ నుంచి పాలేరు వరకు 4,800 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా, దిగువకు సుమారు 4వేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. పాలేరు రిజర్వాయర్ పూర్తి సామర్థ్యం 23 అడుగులకు గాను ప్రస్తుతం 21.5 అడుగులుగా ఉంది. ఈ నీటిని సమర్థవంతంగా వినియోగిస్తూ సాగు, తాగు అవసరాలకు మళ్లించాలని ఇంజనీర్లను మంత్రి ఆదేశించారు. చెరువులు ఎండిపోవు... సాగర్ జలాల పొడిగింపు నిర్ణయం జిల్లా రైతులకు ఉపశమనం కలిగించనుంది. ఇదే సమయాన తాగునీటి అవసరాలకు ఇబ్బంది ఉండదని భావిస్తున్నారు. జిల్లాలో 1,400కి పైగా చెరువులు ఉంటే, అందులో 700 చెరువులకు సాగర్ జలాలు చేరతాయి. ఆయా చెరువుల్లో ఇప్పటికే 50 – 100 శాతం నీటి నిల్వలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఎక్కడైనా చేపల వేట కోసం నీరు విడుదల చేస్తే తప్ప సాగర్ పరిధిలో చెరువులు ఎండిపోయే అవకాశం లేదని తెలుస్తోంది. రానున్న రోజుల్లో నేరుగా సాగర్ జలాలతో నిండే 236 చెరువులకు సుమారు 2 టీఎంసీలు అవసరమనే అంచనాతో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు.జిల్లాలో సాగర్ జలాలు చేరే చెరువుల పరిధిలో తాగునీటి ఎద్దడి ఎదురయ్యే అవకాశం లేదు. అయినా ప్రభుత్వ సూచనల మేరకు అన్ని చెరువులను నింపుతాం. ఇక పంటలు ఎక్కడా ఎండిపోకుండా నీరు అందించాం. కొన్నిచోట్ల ఇంకా నీరు అవసరమని విజ్ఞప్తులు అందుతున్నాయి. నిల్వల ఆధారంగా విడుదల చేసే అవకాశాన్ని పరిశీలిస్తాం. అయితే, తొలి ప్రాధాన్యత మాత్రం తాగు అవసరాలకు ఇస్తాం. – మంగళపూడి వెంకటేశ్వర్లు, సీఈ, జలవనరులశాఖ -
సాగర్ ప్రధాన కాల్వ కట్టపై పగుళ్లు
ఖమ్మంఅర్బన్: జిల్లాలోని ఖమ్మం రూరల్ మండలం పల్లెగూడెం పరిధి సాగర్ ప్రధాన ఎడమ కాల్వ కట్ట ప్రమాదం ముంగిట ఉన్నట్లు తెలుస్తోంది. పల్లెగూడెం నుంచి కరకట్టకు వెళ్లే మార్గంలో కాల్వకు ఇరువైపులా కట్టపై బీటలు (నెర్రెలు) వారాయి. వారం రోజులుగా పగుళ్లు బయటపడుతుండగా రోజురోజుకూ విస్తరిస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. సుమారు అర కిలోమీటరు పొడవునా ఈ పగుళ్లు ఏర్పడ్డాయి. పగుళ్లు పెరుగుతున్న వేళ వెంటనే స్పందించి మరమ్మతులు చేపట్టకపోతే భవిష్యత్లో పెనుప్రమాదం సంభవించే అవకాశం ఉందని స్థానికులు హెచ్చరిస్తున్నారు.ప్రస్తుతం సాగునీటి విడుదల కొనసాగుతుండగా, పగుళ్లు మరింత పెరిగితే ప్రమాదం జరగొచ్చని స్థానికులు అంటున్నారు. కట్ట దెబ్బతింటే సమీప గ్రామాలకు ముప్పు ఏర్పడే అవకాశముందని ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. పరిశీలించిన అధికారులు కాల్వ కట్టపై పగుళ్లు ఏర్పడ్డాయనే సమాచారంతో జలవనరులశాఖ అధికారులు రంగంలోకి దిగారు. ఈ మేరకు ఇంజనీర్లు, రెవెన్యూ అధికారులు నెర్రలు బారిన కట్ట ప్రాంతాన్ని మంగళవారం పరిశీలించారు. అంతేకాక ఉన్నతాధికారులకు వివరించినట్లు తెలిసింది. జలవనరులశాఖ ఈఈ అనన్య, డీఈ ఉదయ్ప్రతాప్, ఏఈ సతీశ్ పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
మధిర: మండలంలోని మాటూరుపేట క్రాస్ వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. చిరు వ్యాపారంతో జీవనం సాగించే నాగవరప్పాడు గ్రామానికి చెందిన తోకా వెంకయ్య (55) ద్విచక్ర వాహనంపై మధిర వెళ్తున్నాడు. ఈ క్రమంలో తాపీ పనిచేసే ఎర్రుపాలెం మండలం మొలుగుమాడుకు చెందిన తనిగంటి కోటేశ్వరరావు ద్విచక్ర వాహనంపై మధిరకు వెళ్తూ.. వెంకయ్య బైక్ను ఢీకొట్టాడు. వెంకయ్య తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కోటేశ్వరరావుకు కూడా తీవ్రగాయాలు కాగా మధిర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసినట్లు మధిర రూరల్ పోలీసులు తెలిపారు. అప్పుల బాధ తాళలేక ఆత్మహత్య మధిర: అప్పులు తీర్చే మార్గం లేక ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎర్రుపాలెం మండలం రాజులదేవరపాడుకు చెందిన లక్కిరెడ్డి గురవారెడ్డి (55) తాపీమేసీ్త్రగా పనిచేస్తున్నాడు. పలు గ్రామాల్లో కొన్నేళ్లుగా పనిచేసి వచ్చాక ఐదేళ్ల నుంచి స్వగ్రామంలోనే ఉంటున్నాడు. ఇటీవల అప్పులు పెరగడంతో మనస్తాపానికి గురై ఆయన మధిర మండలం దెందుకూరు సాగర్ కాలువ ఒడ్డున మర్రిచెట్టుకు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఘటనపై మధిర రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. వైద్యుడిపై దాడిరఘునాథపాలెం: మండలంలోని మంచుకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ కాశయ్యపై గుర్తుతెలియని వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. మాస్క్ ధరించి వచ్చిన సదరు వ్యక్తి వైద్యుడిపై దాడి చేసి పరారయ్యాడు. వైద్యుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి సీసీ పుటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ఉస్మాన్ ఫరీఫ్ తెలిపారు. -
●ఆస్పత్రులకు అవార్డుల పంట
ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహించిన ఆరోగ్య వారోత్సవాల సందర్భంగా రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనబరిచిన ఆస్పత్రులు, వైద్యులు, ఉద్యోగులకు అవార్డులు ప్రకటించగా జిల్లా సత్తా చాటింది. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లో మంగళవారం నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ చేతుల మీదుగా జిల్లా వైద్య, ఆరోగ్య అధికారులు, వైద్యులు అవార్డులు అందుకున్నారు. ఈమేరకు ఉత్తమ ఆస్పత్రి అవార్డును ఖమ్మం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ ఎం.నరేందర్ స్వీకరించారు. అలాగే, బెస్ట్ ఆధార్ బేస్డ్ అటెండెన్స్ సిస్టమ్ వన్ ఇన్స్టిట్యూట్ అవార్డు, మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ శంకర్కు కోచ్లర్ ఇంప్లాంట్ విభాగంలో అవార్డు అందుకున్నారు. ఇక వీవీపీ ఆస్పత్రుల్లో వైద్యసేవలు మెరుగపర్చడానికి చేస్తున్న కృషికి గాను డీసీహెచ్ఎస్ ఎన్.రాజశేఖర్ గౌడ్ అవార్డు స్వీకరించారు. అంతేకాక ఆధార్ బేస్డ్ అటెండెన్స్ నిర్వహణలో పెనుబల్లి, కల్లూరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ల వైద్యులు ఎన్.కిరణ్కుమార్, బి.శివకృష్ణ, రామ్శరణ్ అవార్డు అందుకున్నారు. ఇక క్షయ వ్యాధి పరీక్షలు, గుర్తింపు, నివారణలో ముందంజలో నిలిచిన సత్తుపల్లి మండలం గంగారం పీహెచ్సీ అవార్డుకు ఎంపికై ంది. ఈమేరకు వైద్యాధికారి ఆర్.అవినాష్ అవార్డు అందుకున్నారు. అలాగే, – ఖమ్మం వైద్యవిభాగం/సత్తుపల్లి టౌన్/పెనుబల్లి -
రూ.6.79 లక్షలు స్వాహా చేసిన గ్రామదీపిక
వైరారూరల్: మండలంలోని నారపునేనిపల్లికి మహిళా సంఘాల సభ్యుల సీ్త్రనిధి నగదును గ్రామదీపిక బొల్లినేని హేమ స్వాహా చేసింది. గ్రామంలో 12 గ్రూపులకు చెందిన సీ్త్రనిధి నగదును ఆమెకు అందించగా, బ్యాంకులో చెల్లించకుండా రూ.6.79 లక్షల మేర సొంతానికి వాడుకున్నట్లు బయటపడింది. గ్రూప్ సభ్యులు నెలనెలా కట్టిన నగదు బ్యాంకులో జమ చేయకపోవడంతో అనుమానం వచ్చి గ్రామదీపికను నిలదీయడంతో కుటుంబ అవసరాలకు వాడుకున్నందున తిరిగి చెల్లిస్తానని హామీ ఇచ్చింది. కానీ, నెలలు గడుస్తున్నా నగదు ఇవ్వకపోవడంతో సభ్యులు ఒత్తిడి చేయగా హేమ ఫోన్ స్విచాఫ్ చేసి ఇళ్లు వదిలి వెళ్లిపోయింది. దీంతో సభ్యులు ఐకేపీ ఏపీఓతో పాటు సర్పంచ్కు ఫిర్యాదు చేయగా మంగళవారం విచారణ చేపట్టారు. -
బ్యూటీషియన్ కోర్సుల్లో శిక్షణ
‘సాక్షి’ మైత్రి మహిళ ఆధ్వర్యంలో..‘సాక్షి’ మైత్రి మహిళ ఆధ్వర్యంలో ఈనెల 14వ తేదీ నుంచి మే 12వ తేదీ వరకు బ్యూటీషియన్ కోర్సులో శిక్షణ ఇవ్వనున్నారు. ఆదివారం మినహా మిగిలిన రోజుల్లో ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్న ఒంటి గంట వరకు శిక్షణ ఉంటుంది. హెయిర్ కటింగ్, వ్యాక్స్, పెడిక్యూర్, మెనిక్యూర్, బ్లీచింగ్, స్కిన్కేర్, హెయిర్ కేర్, వెడ్డింగ్ ఫేస్ప్యాక్స్, హెయిర్ కట్స్, హెయిర్స్టైల్స్, హెన్నా ప్రిపరేషన్, ఐబ్రోస్, బేసిక్ పింపుల్ ట్రీట్మెంట్, మేకప్ (బ్రైడల్, పార్టీ, లైట్ మేకప్), హెయిర్ మసాజ్, కమ్యూనికేషన్, గ్రూమింగ్ ఫేషియల్స్, శారీ డ్రాపింగ్ వంటి వాటిల్లో శిక్షణ ఇస్తారు. ఇందుకోసం ఈనెల 8నుంచి 13వ తేదీ వరకు ఉదయం 10నుంచి సాయంత్రం 6 గంటల వరకు రిజిస్ట్రేషన్లు స్వీకరిస్తారు. ఆసక్తి ఉన్న వారు రిజిస్ట్రేషన్ సమయాన రూ.2,500 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఆపై 14 నుంచి వచ్చేనెల 12 వరకు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు వర్క్షాపు ఉంటుంది. రిజిస్ట్రేషన్ కోసం ఖమ్మం మామిళ్లగూడెంలోని వాసవి కిరాణం సమీపాన ఉన్న లహరి బ్యూటీపార్లర్ – ట్రైనింగ్ సెంటర్లోసంప్రదించాలి. ఇతర వివరాలకు 96660 13544, 96182 16701 నంబర్లలో సంప్రదించవచ్చు. -
ప్రతీ గ్రామంలో కొనుగోళ్లు చేపట్టాలి
ఖమ్మంమయూరిసెంటర్: మొక్కజొన్న, వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు సకాలంలో ప్రారంభించకుండా ప్రభుత్వం జాప్యం చేయడంతో రైతులు నష్టపోతున్నారని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర నాయకుడు నున్నా నాగేశ్వరరావు అన్నారు. ఈ మేరకు ప్రతీ గ్రామంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడమే కాక ఎకరాకు 26 క్వింటాళ్ల సేకరణ నిబంధన తొలగించాలని డిమాండ్ చేశారు. వీటితో పాటు సాదాబైనామా దరఖాస్తుల పరిశీలన, అర్హులైన రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు మంజూరు, ప్రతీ రైతుకు భూభారతి పోర్టల్ ద్వారా పట్టాదారు పాస్ పుస్తకాలు జారీ డిమాండ్తో కలెక్టరేట్ ఎదుట మంగళవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ.. సకాలంలో మొక్కజొన్న, వరి ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో రైతులు క్వింటాకు రూ.700 నుంచి రూ.800 నష్టపోతున్నారన్నారు. జిల్లాలో 1.80 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న, 2.65 లక్షల ఎకరాల్లో వరి సాగైన నేపథ్యాన ప్రతీ గ్రామంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టికి వినతిపత్రం అందజేశారు. తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బొంతు రాంబాబు, నాయకులు బండి రమేశ్, ఎస్కే మీరా, దుగ్గి కృష్ణ, గొడవర్తి నాగేశ్వరరావు, వాసిరెడ్డి ప్రసాద్, గంగాధర్, దొండపాటి నాగేశ్వరరావు, రచ్చా నరసింహారావు, నల్లమోతు మోహన్రావు, వై.విక్రమ్, యర్రా శ్రీనివాసరావు, లత, సునీత, మల్లెంపాటి రామారావు పాల్గొన్నారు. -
పాఠశాల బస్సును ఢీకొట్టిన లారీ
ఖమ్మంరూరల్: పదోతరగతి పరీక్ష రాసిన విద్యార్థులు బస్సులో పాఠశాలకు వెళ్తుండగా లారీ ఢీకొట్టడంతో పలువురు గాయపడ్డారు. ఆరెంపులలోని ముస్లిం మైనార్టీ పాఠశాల పదో తరగతి విద్యార్థులు 30 మంది మంగళవారం సత్యనారాయణపురంలోని కేజీబీవీలో పరీక్ష రాశారు. తిరిగి బస్సులో పాఠశాల హాస్టల్కు బస్సులో బయలుదేరారు. బస్సు సత్యనారాయణపురం వద్ద ఇందిరమ్మ కాలనీ వైపు తిరుగుతుండగా ఖమ్మం వైపు నుంచి వరంగల్ క్రాస్రోడ్డు వైపు వెళ్తున్న లారీ అతివేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సులోని ఎస్కే షమీర్, హనీఫ్, ఫిరోజ్, ఎండీ పాషా, ఎస్కే అఫ్రోజ్ సహా 23 మందికి స్వల్ప గాయాలయ్యాయి. అదే సమయాన అక్కడే ఉన్న ఏదులాపురం మున్సిపల్ చైర్పర్సన్ పోకబత్తిని అనిత స్థానికుల సాయంతో విద్యార్థులను చికిత్స నిమిత్తం ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే, విద్యార్థులెవరికీ ప్రమాదం లేదని చెప్పడంతో చికిత్స అనంతరం హాస్టల్కు పంపించారు. కాగా, బస్సు డ్రైవర్ కె.సుమన్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు సీఐ ముష్క రాజు తెలిపారు. 23 మంది విద్యార్థులకు స్వల్ప గాయాలు -
ఆగని వన్యప్రాణుల వేట..!
లక్ష్మీదేవిపల్లి మండలం హమాలీకాలనీ అటవీ శివారులో ఈనెల 2న తాగునీటి కోసం బయటకు వచ్చిన రెండు దుప్పులు వస్త్రం సమ్మయ్య, కారెంగుల సాంబయ్య పెట్టిన ఉచ్చుల్లో పడ్డాయి. వీటిని చంపగా అధికారులు గుర్తించారు. నిందితులను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. అయితే, వేసవి మొదలుకాగానే దాహంతో బయటకు వచ్చే వన్యప్రాణులను హతమార్చడం సాధారణమైపోయింది. చుంచుపల్లి: వేసవి ఆరంభంలోనే జిల్లాలో వన్యప్రాణుల వేట మొదలైంది. ఉచ్చులు, విద్యుత్ వైర్లను అమర్చి, వేటగాళ్లు అటవీ జంతువులను చంపతున్నా రు. నదులు, చెరువులు, వాగుల వద్ద పొదల్లో ఉరు లు, ఉచ్చులను బిగించి వేటగాళ్లు వన్యప్రాణులను పొట్టన పెట్టుకుంటున్నారు. జంతువుల వేటకు ఎక్కువగా ప్రమాదకరమైన విద్యుత్ తీగలనే వాడుతున్నట్లు తెలుస్తోంది. అటవీసిబ్బంది నిర్లక్ష్యం, రాత్రిపూట అట వీ ప్రాంతాల్లో సరైన నిఘా లేకపోవడంతో వేటగాళ్లకు అనుకూలంగా మారుతోంది. విద్యుత్ తీగలు కొన్నిసార్లు మనుషుల ప్రాణాలూ తీస్తున్నాయి. సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో వేటగాళ్లు జంతువుల కొమ్ములు, మాంసం, గోళ్లు, చర్మం విక్రయిస్తున్నారు. జిల్లాలోని అటవీ ప్రాంతం జింకలు, అడవి పందులు, ముళ్ల పందులు, కొండ గొర్రెలు, ఎలుగుబంట్లు, దుప్పులు, ఉడుములు, నక్కలు, అడవి పిల్లులు, ముంగిసలు, ఇతర జంతువులకు అనువుగా ఉంది. వన్యప్రాణులను వేటాడితే కఠిన శిక్షలు భద్రాద్రి జిల్లాలోని కొత్తగూడెం, పాల్వంచ, మణుగూరు, భద్రాచలం, పాల్వంచ, కిన్నెరసాని వంటి ఆరు అటవీ డివిజన్ల పరిధిలో 10.45 లక్షల ఎకరాల అడవులు విస్తరించి ఉన్నాయి. అడవి జంతువులను పెంచడం, వేటా డటం పూర్తిగా నిషేధం. మన పరిసరాల్లోనూ వాటిని మచ్చిక చేసుకోవడంతో పాటు మాంసం కలిగి ఉండటం నేరమని వన్యప్రాణుల సంరక్షణ చట్టం 1972 చెబుతోంది. ఈ చట్టంలోనూ ఇటీవల కొన్ని మార్పు లు చేశారు. జంతువులను వేటాడే వారికి ఏడేళ్ల జైలు, రూ.50 లక్షల జరిమానా.. నేరాన్ని బట్టి ఈరెండింటినీ ఏకకాలంలో అమలు చేయొచ్చుని అధికారులు చెబు తున్నారు. కొన్ని జంతువులను వేటాడితే బెయిల్ కూడా లభించదు. గ్రామాల్లోకి అడవిజంతువులు వస్తే హాని తలపెట్టకుండా అధికారులకు తెలపాల్సి ఉంటుంది. అయితే, వేసవిలో రాత్రిసమయాల్లో దప్పిక తీర్చుకునేందుకు నీటి వనరులను అన్వేషిస్తూ గ్రామా ల సరిహద్దుల్లోకి జంతువులు రావటం సాధారణంగా మారింది. ఇదే అదనుగా వేటగాళ్లు నీటి కుంటలు, ప్రధాన కాల్వల వద్ద విద్యుత్ వైర్లు, ఉచ్చులు ఏర్పాటు చేసి వధిస్తున్నారు. విద్యుత్ తీగలు అమర్చడంతో మనుషులు, పశువుల ప్రాణాలు కూడా పోతు న్నాయి. వేటగాళ్లు వన్య ప్రాణులను వేటాడి మాంసం, చర్మం, కొమ్ములు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. కిన్నెరసాని, పాల్వంచ, లక్ష్మీదేవిపల్లి, చుంచుపల్లి, దమ్మపేట, చంద్రుగొండ, దుమ్ముగూడెం, పినపాక, ములకలపల్లి, జూలూరుపాడు, టేకులపల్లి మండలాల్లోని అటవీ ప్రాంతాల్లో వేట సాగుతున్న ట్లు సమాచారం. వేసవిలో వన్యప్రాణులు నీటి కోసం వస్తుంటాయి. వేటగాళ్లు కరెంట్ తీగలు, ఉచ్చులు అమర్చి వేటాడుతున్నారు. వీటికి అడ్డుకట్ట వేసేందుకు నిఘా పెట్టాం. అటవీ జంతువులు సంచరించే ప్రాంతాల్లో పర్యవేక్షణ పెంచుతాం. వేటకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటాం. – కిష్టాగౌడ్, భద్రాద్రి జిల్లా అటవీశాఖ అధికారి 2021 డిసెంబర్లో దమ్మపేట మండలం రంగువారిగూడేనికి చెందిన తండ్రీకొడుకులు ప్రొద్దుటూరి డానియేలు, రాకేశ్ వేటకు వెళ్లి జంతువుల కోసం అమర్చిన విద్యుత్ తీగలు తగిలి మృతిచెందారు. 2022 మార్చిలో కొత్తగూడెం పట్టణానికి చెందిన సునీల్కుమార్ చుంచుపల్లి మండలం పెనుబల్లి అటవీ ప్రాంతంలో విద్యుత్ తీగలు తగలడంతో మృత్యువాత పడ్డాడు. 2023 మార్చిలో ఫారెస్ట్ స్పెషల్ టీం కొత్తగూడెంలోని ఇల్లెందు క్రాస్ రోడ్డు వద్ద పులి చర్మం అమ్మడానికి వెళ్తున్న తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్నారు. సుజాతనగర్ మండలం ఒడ్డుగూడెంలో కుక్కలదాడిలో చుక్కల దుప్పి చనిపోయింది. -
స్టాప్లు స్మార్ట్గా!
ఖమ్మంమయూరిసెంటర్: ఖమ్మం నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో నగరపాలక సంస్థ కీలక అడుగు వేసింది. ప్రయాణికుల సౌకర్యార్థం నగరంలోని ఏడు ప్రాంతాల్లో రెండు రకాల అత్యాధునిక బస్షెల్టర్ల నిర్మాణానికి సిద్ధమైంది. ఈమేరకు నేషనల్ ఇన్స్టిట్యూట్ అర్బన్ మేనేజ్మెంట్(ఎన్ఐయూఎం) ప్రతినిధులు ఇప్పటికే మూడు డిజైన్లతో పాటు నిర్మాణ అంచనాలను కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్యకు అందజేశారు. కేవలం కాంక్రీట్ కట్టడాలుగా కాకుండా పర్యావరణహితంగా, స్మార్ట్ ఫీచర్లతో ఈ షెల్టర్లు రూపుదిద్దుకోనున్నాయి. బస్ షెల్టర్లతో పాటు ఫారెస్ట్ చెక్ పోస్ట్ వద్ద సెక్యూరిటీ క్యాబిన్లు సైతం ఏర్పాటు చేయనున్నారు. ‘వెర్నాక్యులర్’ ఎలా ఉంటుందంటే... పర్యావరణ ప్రేమికులను ఆకట్టుకునేలా ‘డిజైన్ అవేర్’ సంస్థ ప్రత్యేకంగా వెర్నాక్యులర్ బస్ షెల్టర్ నమూనా రూపొందించింది. స్టీల్ స్ట్రక్చర్పై వెదురు సూపర్ స్ట్రక్చర్, కాన్వాస్ కవర్తో షెల్టర్ నిర్మిస్తారు. అంతేకాక వేసవిలో ప్రయాణికులకు చల్లదనాన్ని ఇచ్చేలా మిస్టింగ్ సిస్టమ్(నీటి తుంపర్ల వ్యవస్థ) ఏర్పాటు చేస్తారు. ఇందుకోసం షెల్టర్పై 2వేల లీటర్ల నీటి ట్యాంకు అమర్చుతారు. ఒక్కో షెల్టర్ 5 మీటర్ల పొడవు, 1.5 మీటర్ల వెడల్పుతో ఉండి, చుట్టూ ప్లాంటర్లు, ల్యాండ్ స్కేపింగ్, స్టోన్ క్లాడింగ్తో ప్రకృతి ఒడిలో ఉన్న అనుభూతిని కలిగిస్తుంది. ఒక్కో షెల్టర్ నిర్మాణానికి రూ.10 లక్షల వరకు ఖర్చవుతుందని అధికారులు అంచనా వేశారు. మెట్రో లుక్ ఈ–ఫ్రాస్కేప్స్ సంస్థ మెట్రో నగరాల తరహా రూపును ఇచ్చేలా ఎంఎస్ స్ట్రక్చర్ బస్షెల్టర్లను డిజైన్ చేసింది. 15 అడుగుల ఎత్తుతో ఉండే ఈ షెల్టర్లకు 10 ఎంఎం మందపాటి మల్టీవాల్ పాలీ కార్పొనేట్ షీట్తో కప్పు నిర్మిస్తారు. ఇందులో ప్రయాణికులు కూర్చోవడానికి బెంచీలతో పాటు రద్దీ సమయంలో ఆసరా కోసం స్టాండింగ్ బెంచీలు కూడా ఉంటాయి. మున్సిపాలిటీకి ఆదాయం చేకూర్చేలా ప్రకటనలు ప్రదర్శించుకునేందుకు ప్రత్యేక స్థలం కేటాయిస్తారు. ఈ మోడల్ బస్ షెల్టర్ల నిర్మాణానికి రూ.6లక్షల చొప్పున వ్యయం కానుండగా.. నాలుగు ప్రాంతాలను గుర్తించారు. ఏడు ప్రాంతాల ఎంపిక వెర్నాక్యులర్ రూపుతో పాటు ఎంఎస్ స్ట్రక్చర్లో బస్ షెల్టర్ల నిర్మాణానికి కేఎంసీ అధికారులు ప్రధాన ప్రాంతాలను గుర్తించారు. వెర్నాక్యులర్ డిజైన్తో ఐటీ హబ్, ప్రభుత్వ ఆస్పత్రి, ఖానాపురం ఎన్నెస్సీ కెనాల్ బ్రిడ్జిపై షెల్టర్ల నిర్మాణానికి ప్రతిపాదించారు. ఇక ఎంఎస్ స్ట్రక్చర్తో బల్లేపల్లి స్టేజీ, ఇందిరానగర్ పర్ణశాల, ఎస్ఆర్అండ్బీజీఎన్ఆర్ కళాశాల, ఇల్లెందు క్రాస్లోని విద్యుత్శాఖ స్టోర్ వద్ద నిర్మించనున్నారు.ఖమ్మంలో అత్యాధునిక హంగులతో బస్షెల్టర్లు ఖమ్మం అభివృద్ధితో పాటే మరింత సుందరంగా తీర్చిదిద్దేందుకు ఉన్న వనరులను సద్వినియోగం చేసుకుంటున్నాం. ఇందులో భాగంగా ఆధునాతన హంగులు, సౌకర్యాలతో కూడిన బస్ షెల్టర్ల్లు నిర్మించనున్నాం. హైదరాబాద్కు చెందిన ఆర్కిటెక్చర్లు ఇప్పటికే నమూనాలు సమర్పించారు. త్వరలోనే వీటి నిర్మాణాలను ప్రారంభిస్తాం. – అభిషేక్ అగస్త్య, కమిషనర్, కేఎంసీ బస్ షెల్టర్లతో పాటు భద్రతను పర్యవేక్షించేందుకు వీలుగా ప్రధాన కూడళ్లలో సెక్యూరిటీ క్యాబిన్లు కూడా ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ సర్కిల్లో ఉన్న ఫారెస్ట్ చెక్పోస్ట్ సెక్యూరిటీ గదిని మోడల్ క్యాబిన్గా తీర్చిదిద్దనున్నారు. వుడ్ కాంపోజిట్ రాఫ్టర్లతో నిర్మించే ఈ క్యాబిన్కు రూ.5 లక్షలు వ్యయం అవుతుంది. ప్రతిపాదిత మూడు ప్రాజెక్టులు అందుబాటులోకి వస్తే ఖమ్మం స్మార్ట్ సిటీగా మారుతుందని అధికారులు భావిస్తున్నారు. -
‘రైతులకు వ్యతిరేకంగా ప్రభుత్వ పాలన’
ఖమ్మంవైరారోడ్: రాష్ట్రప్రభుత్వం పంటల కొనుగోళ్లలో విఫలమై రైతుల విషయంలో నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తోందని మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య విమర్శించారు. డీసీసీబీ, జెడ్పీ మాజీ చైర్మన్లు కూరాకుల నాగభూషణం, లింగాల కమల్రాజుతో కలిసి మంగళవారం ఆయన ఖమ్మంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో మాట్లాడారు. కేసీఆర్ పాలనలో పంటలు చేతికి రాకముందే కొనుగోలు కేంద్రాలు, బస్తాలు సిద్ధం చేయగా, ఇప్పుడు ఏప్రిల్ వచ్చినా కొనుగోళ్ల ప్రక్రియ మొక్కుబడిగా సాగుతోందని మండిపడ్డారు. వరికి మద్దతు ధర రూ.2,389 ఉంటే కేంద్రాలు లేకపోవడంతో వ్యాపారులకు రైతులు రూ.1,800కే అమ్ముకుంటూ క్వింటాకు రూ.600 మేర నష్టపోతున్నారని తెలిపారు. మొక్కజొన్నల విషయంలోనూ అదే పరిస్థితి నెలకొందని చెప్పారు. ఇకనైనా వేయి ఎకరాలకు పైగా మొక్కజొన్న, వరి సాగైన ప్రతీ గ్రామంలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని సండ్ర, నాగభూషణం, కమల్రాజ్ డిమాండ్ చేశారు. కాగా, పారిశ్రామిక అభివృద్ధి పేరుతో రైతుల భూములు లాక్కుంటుండగా, అడ్డుకోవడానికి వెళ్తున్న మాజీ మంత్రి హరీష్రావును అరెస్టు చేయడం గర్హనయమని పేర్కొన్నారు. నాయకులు ఉన్నం బ్రహ్మయ్య, వాచేపల్లి లక్ష్మారెడ్డి, కనగాల వెంకట్రావు, పగడాల నరేందర్, సామినేని హరిప్రసాద్, ముత్యాల వెంకటఅప్పారావు, మంకెన్ రమేష్, బొడ్డు వెంకట రామారావు తదితరులు పాల్గొన్నారు. రేపు మండల కేంద్రాల్లో ధర్నా వేయి ఎకరాలకు పైగా వరి, మొక్కజొన్న సాగైన ప్రతీ గ్రామంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేయాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు డిమాండ్ చేశారు. ఈమేరకు 9వ తేదీన అన్ని మండలాల్లో కేంద్రాల్లో ధర్నా నిర్వహించనున్నట్లు తెలి పారు. పార్టీ శ్రేణులతో పాటు రైతులు పాల్గొని ధర్నాలను విజయవంతం చేయాలని ఆయన కోరారు. -
108 వాహనం పనితీరు పరిశీలన
నేలకొండపల్లి: మండల కేంద్రంలోని 108 అంబులెన్స్ను జీవీకే ఈఎంఆర్ఐ గ్రీన్ హెల్త్ (జీవీకే ఈఎంఆర్ఐ) పోగ్రామ్ మేనేజర్ షేక్ నజీరుద్దీన్ మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా పరికరాల పనితీరు, మందుల లభ్యత, రికార్డులను తనిఖీ చేశారు. సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ క్షతగాత్రులను సకాలంలో ఆస్పత్రులకు చేర్చాలని సూచించారు. కేంద్ర కార్యాలయం ఆడిటర్ ఫకీర్ దాసు, జిల్లా మేనేజర్ అవులూరి దుర్గాప్రసాద్, నేలకొండపల్లి ఈఎంటీ పుష్ప, పైలట్ పాలడుగు రామకృష్ణ పాల్గొన్నారు. ఏబీఏపీ జిల్లా అధ్యక్షుడిగా కాటేపల్లికల్లూరు: అఖిల భార త అయ్యప్ప ధర్మ ప్రచారసభ (ఏబీఏపీ) జిల్లా అధ్యక్షుడిగా కల్లూరుకు చెందిన కాటేపల్లి రజనీకాంత్ ఎన్నికయ్యారు. ఖమ్మంలో మంగళవా రం ఈ ఎన్నిక జరిగింది. అలాగే, ఉపాధ్యక్షుడి గా లంకా అప్పలనాయుడు, కార్యదర్శిగా చిర్రా రవి, కోశాధికారిగా ఆళ్ల వెంకటేశ్వరరావుతో పాటు మరో 11 మంది కార్యవర్గ సభ్యు లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారులుగా జనగామ తిరుపతి, గుండగాని ఉప్పలయ్య వ్యవహరించగా, రాష్ట్ర అధ్యక్షుడు టీవీ పుల్లంరాజు, జోనల్ సెక్రటరీగా ఇస్లావత్ నగేశ్ పాల్గొన్నారు. రెమ్యునరేషన్ బకాయిలు చెల్లించాలి ఖమ్మంసహకారనగర్: గత ఏడాది ఎస్సెస్సీ జవాబుపత్రాల మూల్యాంకనం చేసి న ఉపాధ్యాయులకు రెమ్యునరేషన్ బకాయిలు చెల్లించాలని ఉపాధ్యాయ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఖమ్మంలోని స్పాట్ కేంద్రంలో మంగళవారం భోజన విరామ సమయాన నిరసన తెలిపి డీఈఓ చైతన్యజైనీకి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సంఘాల నాయకులు మాట్లాడుతూ.. మూల్యాంకనం రేట్లు 50శాతం పెంచడమే కాక 2022, 2025 బకాయిలు చెల్లించాలన్నారు. అలాగే, 2023లో కోత విధించిన డీఏ, సమగ్ర కుటుంబ సర్వే పైకం సైతం చెల్లించాలన్నారు. ఉపాధ్యాయ సంఘాల నాయకులు కట్టా శేఖర్, షేక్ రంజాన్, పారుపల్లి నాగేశ్వరరావు, ఎస్.విజయ్, వెంగళరావు, కరామత్ అలీ, రాములు, మన్సూర్, యాదగిరి, వెంకటరమణారెడ్డి, మంగ్యానాయక్, రవీంద్ర, విజయ్, అమృత్కుమార్, వెంకన్న, రాంబాబు పాల్గొన్నారు. -
సిలిండర్కు పోలీసు సెక్యూరిటీ
గ్యాస్ సిలిండర్ల కొరతతో పంపిణీ ప్రక్రియ రోజురోజుకు క్లిష్టంగా మారుతోంది. ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో ఇదే పరిస్థితి నెలకొనగా పోలీసు పహారా నడుమ సిలిండర్లు పంపిణీ చేయాల్సి వచ్చింది. నేలకొండపల్లిలోని ఏజెన్సీకి మంగళవారం 60 సిలిండర్లు వచ్చాయి. బుకింగ్ చేసుకున్న దాదాపు 200 మంది రావడం, అందరికీ అందే పరిస్థితి లేకపోవడానికి తోడు ఎండతీవ్రతతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ కార్యాలయంలోకి చొరబడడంతో గందరగోళం నెలకొంది. ఈమేరకు పోలీసులు చేరుకుని అందరినీ బయటకు పంపించారు. అయితే, రోజుల తరబడి సిలిండర్ల కోసం చూస్తుండగా, ఇంకెన్నాళ్లు తిరగాలని నిర్వాహకులు, పోలీసులతో వాగ్వాదానికి దిగారు. చివరకు పోలీసులు అందరి నుంచి గ్యాస్కనెక్షన్ పుస్తకాలు తీసుకుని బుకింగ్ ఆధారంగా క్రమపద్ధతిలో పిలుస్తూ 60మందికి సిలిండర్లు సరఫరా చేయించారు. మిగిలినవారికి మరో దఫా రాగానే అందిస్తామని నచ్చచెప్పడంతో నిరాశగా వెనుదిరిగారు. -
ధాన్యం లారీ బోల్తా : క్లీనర్ మృతి
తల్లాడ: తల్లాడ మండలం వెంగన్నపేట కల్లూరు వాగులో ఆదివారం అర్ధరాత్రి లారీ బోల్తా పడగా క్లీనర్ మృతి చెందాడు. వెంగన్నపేటలో ధాన్యం లోడ్ చేసుకున్నాక లారీలో ఏపీలోని రాజమండ్రికి వెళ్తుండగా బయలుదేరిన పది నిముషాల్లోనే లారీ వాగు వద్ద అదుపు తప్పి బోల్తా పడింది. ఘటనలో అనకాపల్లి జిల్లా మడకపాలెంకు చెందిన క్లీనర్ మడక జోగేశ్వర్రావు(38) అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే, లారీ డ్రైవర్ సాలెపు సంతోష్కుమార్ మద్యం మత్తులో ఉండడమే ప్రమాదానికి కారణమని తెలిసింది. ఈ మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సాగర్ కాల్వలో గల్లంతైన వ్యక్తి.. కల్లూరు: మండల కేంద్రంలోని సాగర్ కాల్వలో ఈనెల 4వ తేదీన పడి గల్లంతైన వ్యక్తి సోమవారం మృతదేహమై తేలాడు. మండలంలోని నారాయణపురానికి చెందిన తొర్రికొండ వెంకటేశ్వర్లు(50) శనివారం గ్యాస్ సిలిండర్ కోసం వాచ్యానాయక్ తండా వెళ్లి వచ్చే క్రమాన ప్రమాదవశాత్తు వాహనంతో సమా సాగర్ కాల్వలో పడ్డాడు. ఆయన మృతదేహం పెద్దకోరుకొండి సమీపాన లభించగా కుటుంబీకుల ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి.. కత్లూరు: మండలంలోని రామకృష్ణాపురం వద్ద జాతీయ రహదారి రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొనగా ఓ వ్యక్తి మృతి చెందాడు. మండల పరిధిలోని రాళ్లబంజరకు చెందిన బానోత్ నాగరాజు (32) బైక్పై వెళ్తుండగా, ఏపీలోని జంగారెడ్డిగూడెంకు చెందిన మరో ద్విచక్ర వాహనదారుడు శ్రీరామ్ ఖమ్మం వైపు వెళ్తూ ఎదురుగా ఢీకొన్నారు. ఇదే సమయాన సత్తుపల్లి వైపు నుంచి ఖమ్మం వైపు వెళ్తున్న ఐషర్ వాహనం నాగరాజు వాహనాన్ని ఢీకొట్టడంతో తీవ్రగాయాల పాలై అక్కడికక్కడే మృతి చెందాడు. అలాగే, శ్రీరామ్కు తీవ్రగాయాలయ్యాయి. ఘటనపై నాగరాజు భార్య కవిత ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. -
నేడు జిల్లాలో ఎంపీ రఘురాంరెడ్డి పర్యటన
ఖమ్మంమయూరిసెంటర్: ఖమ్మం పార్లమెంట్ సభ్యుడు రామసహాయం రఘురాంరెడ్డి మంగళవారం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు ఖమ్మం గట్టయ్య సెంటర్లోని క్యాంప్ కార్యాలయంలో వివిధ మండలాల లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేస్తారు. ఆతర్వాత ముదిగొండ మండలంలోని న్యూలక్ష్మీపురం, వల్లభి, గంధసిరి గ్రామాల్లో సీసీ రోడ్లను ప్రారంభించనున్న ఎంపీ.. పమ్మి, కమలాపురం, బాణాపురంల్లో సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయడమే కాక బోర్ వెల్లను ప్రారంభిస్తారు. హెచ్డబ్ల్యూఓల ఫోరం అధ్యక్షుడికి ‘దళితరత్న’ అవార్డు ఖమ్మంమయూరిసెంటర్: విద్యా, సామాజిక సేవా రంగాల్లో రాణిస్తున్న ఎస్సీ వసతి గృహాల సంక్షేమ అధికారుల ఫోరం జిల్లా అధ్యక్షుడు కోటపాటి రుక్మారావుకు ‘దళితరత్న’ అవార్డు లభించింది. రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ, బాబు జగ్జీవన్ రామ్ జయంతోత్సవ కమిటీ ఆధ్వర్యాన హైదరాబాద్లో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆయనకు రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ అడిషనల్ డైరెక్టర్ సి.శ్రీధర్, ఉత్సవ కమిటీ కన్వీనర్ దొమ్మాటి సుదర్శన్ బాబు అవార్డు అందజేశారు. ఈ సందర్భంగా అడిషనల్ డైరెక్టర్ శ్రీధర్, సుదర్శన్ మాట్లాడుతూ మాట్లాడుతూ వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్న వ్యక్తులను గుర్తించి ప్రోత్సహించడం అభినందనీయమన్నారు. అవార్డు గ్రహీత రుక్మారావు మాట్లాడుతూ భవిష్యత్లోనూ హాస్టల్ విద్యార్థుల సంక్షేమం, సమాజ సేవకు పాటుపడతానని తెలిపారు. కాగా, రుక్మారావుకు పలువురు అభినందించారు. 108 వాహనం తనిఖీ తిరుమలాయపాలెం: తిరుమలాయపాలెం మండలానికి కేటాయించిన 108 వాహనాన్ని జీవీకే గ్రీన్ హెల్త్ సర్వీసెస్ క్వాలిటీ కంట్రోల్ ఆడిటింగ్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అంబులెన్స్లోని పరికరాలు, నిర్వహణ, మందుల లభ్యత, ఆక్సిజన్ నిల్వలను పరిశీలించడంతో పాటు కేసులపై ఆరా తీశారు. సిబ్బంది అప్రమతంగా ఉంటూ క్షతగాత్రులను వీలైనంత త్వరగా ఆస్పత్రులకు చేర్చాలని సూచించారు. ప్రోగ్రామ్ మేనేజర్ నజీరుద్దీన్, సూపర్వైజర్ దుర్గాప్రసాద్, సిబ్బంది కృష్ణయ్య, సక్రు పాల్గొన్నారు. ఏడు సిలిండర్లు స్వాధీనం చింతకాని: మండలంలోని పందిళ్లపల్లిలో ఒక ఫుడ్ ఫ్యాక్టరీలో అక్రమంగా నిల్వ చేసిన ఏడు గృహోపయోగ గ్యాస్ సిలిండర్లను పోలీసులు సోమవారం స్వాధీనం చేసుకున్నారు. ఈమేరకు ఫ్యాక్టరీ యజమానిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై వీరేందర్ తెలిపారు. పిప్పిరి సభకు తరలిన కాంగ్రెస్ శ్రేణులుఖమ్మంమయూరిసెంటర్: డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్రకు మూడేళ్లు పూర్తయిన సందర్భంగా పిప్పిరిలో సోమవారం నిర్వహించిన బహిరంగ సభకు జిల్లా నుంచి కాంగ్రెస్ నాయకులు తరలివెళ్లారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు నూతి సత్యనారాయణ గౌడ్ ఆధ్వర్యాన పలువురు వాహనాల్లో బయలుదేరారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ 2023 మార్చి 16న ప్రారంభమైన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర తెలంగాణ రాజకీయ చరిత్రలో కీలక మలుపుగా నిలిచిందన్నారు. నాయకులు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, రంగా జనార్దన్, కూరపాటి కిషోర్, వేజండ్ల సాయి కుమార్, మొక్క శేఖర్గౌడ్, బానోత్ బాలాజీనాయక్, కోసూరి శ్రీనివాస్, నూతి వెంకటేశ్వరరావు, మూడుముంతల గంగరాజు యాదవ్, బాబు జానీ, గజ్జి సూర్యనారాయణ, గుమ్మా రోశయ్య, వేల్పుల మురళి, శేఖర్, జెర్రిపోతుల అంజనీకుమార్ పాల్గొన్నారు. -
ఫిర్యాదులు సత్వరమే పరిష్కరించాలి
కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఖమ్మం సహకారనగర్: ప్రజలు అందించే ప్రతీ ఫిర్యాదును పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆదేశించారు. కలెక్టరేట్లో అదనపు కలెక్టర్లు డాక్టర్ పి.శ్రీజ, పి.శ్రీనివాసరెడ్డితో కలిసి సోమవారం ఆయన ప్రజావాణిలో భాగంగా ప్రజల నుంచి ఫిర్యాదులు, వినతిపత్రాలు స్వీకరించారు. అనంతరం పరిశీలన, పరిష్కారంపై అధికారులకు సూచనలు చేశారు. డీఆర్వో పద్మశ్రీ, జెడ్పీ సీఈఓ దీక్షారైనా, కలెక్టరేట్ ఏఓ శ్రీనివాసరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఫిర్యాదుల్లో కొన్ని.. కూసుమంచి మండలం మునిగేపల్లికి చెందిన కె.నరేందర్ ఎస్సీ కాలనీలో స్థలం పట్టా మంజూరు చేయాలని కోరారు. సింగరేణి మండలం ఉసిరికాయలపల్లిలో తమ భూమిని హైవే నిర్మాణానికి సేకరించినందున పరిహారం ఇప్పించాలని జి.దేవిశ్రీ వినతిపత్రం అందజేశారు. అలాగే, అక్రమంగా జరుగుతున్న మట్టి తవ్వకాలను అరికట్టాలని ఏన్కూరు మండలం బద్రుతండ, ఒంటి గుడిసె గ్రామప్రజలు కోరారు. ధాన్యం కొనుగోళ్లకు ప్రణాళిక యాసంగి సాగైన ధాన్యం కొనుగోళ్లకు ప్రణాళికలు సిద్ధం చేయాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ కోతలు మొదలయ్యే ప్రాంతాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరవాలని, ఇందుకోసం షెడ్యూలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. అర్హులకు లబ్ధి జరిగేలా.. పాలన పారదర్శకంగా నిర్వహిస్తూ అర్హులకు పథకాలు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అనుదీప్ ఆదేశించారు. కలెక్టరేట్లో వివిధ శాఖలో అధికారులతో సమావేశమైన తక్కువ హాజరు నమోదు ఉన్న శాఖల అధికారులు వివరణ సమర్పించాలని సూచించారు. అలాగే, రెవెన్యూ సదస్సులు, భూభారతి దరఖాస్తులు, భూసేకరణపై చర్చించారు. కాగా, చిన్న కోరుకోండిలో మహిళా సంఘాల ద్వారా చేపట్టిన సౌర విద్యుత్ ప్లాంట్ పనులు ఆలస్యం అవుతున్నందున ప్రత్యామ్నాయ స్థలం ఎంపిక చేయాని తెలిపారు. ఆతర్వాత మాతా, శిశు మరణాలు తగ్గింపునకు చేపట్టాల్సిన చర్యలపై సమీక్షించారు. అలాగే, మార్చిలో ఉద్యోగ విరమణ చేసిన వివిధ శాఖల అధికారులు బి.అరుణ్ కుమార్, బి.జయదాస్, ఎండీ.అఫ్జల్ మియా, ఎం.వీ.నరసింహారావు, ఎస్.కే.ఆసిఫ్మియా, ఐ.ఉమేశ్వర్, డి.అమతమ్మ, డి.ఎలీశమ్మను సన్మానించారు. కలెక్టర్ను కలిసిన పరిశ్రమల శాఖ జీఎం ఖమ్మంఅర్బన్: జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్(జీఎం)గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన ప్రవీణ్కుమార్ సోమవారం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈమేరకు జిల్లాలో పరిశ్రమల వృద్ధి ద్వారా ఉపాధి అవకాశాలు పెంచేలా కార్యాచరణ చేపట్టాలని కలెక్టర్ సూచించారు. ఖమ్మంరూరల్: విద్యాసంస్థల్లోని ప్రతీ విద్యార్థి ఆరోగ్యంపై శ్రద్ధ వహించేలా అందరి హెల్త్ ప్రొఫైళ్లు రూపొందించాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. ఏదులాపురం మున్సిపాలిటీ పరిధి నాయుడుపేటలోని కస్తూర్భాగాంధీ విద్యాలయాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. ఈసందర్భంగా తరగతి గదులు, వంటగది, ఆహార నాణ్యత, కూరగాయలను పరిశీలించాక మాట్లాడారు. ప్రహారీ, డైనింగ్ హాల్ నిర్మాణానికి ప్రతిపాదనలు ఇవ్వాలని తెలిపారు. మండల ప్రత్యేకాధికారుల ప్రతీ వారం కేజీబీవీలు, గురుకులాలు, ఇతర ప్రభుత్వ విద్యాసంస్థలను తనిఖీ చేసి మెనూ అమలు, సరుకుల నాణ్యతను పరిశీలించాలన్నారు. విద్యార్థులకు రుచికరమైన ఆహారం అందితే చదువుపై దృష్టి పెడతారని తెలిపారు. జిల్లా జెండర్ ఈక్వాలిటీ కోఆర్డినేటర్ రూబీ, ప్రత్యేకాధికారి ఆజియా, ఉద్యోగులు పాల్గొన్నారు. -
నిబద్ధత కలిగిన మార్క్సిస్టు శ్రీకాంత్
ఖమ్మంమయూరిసెంటర్: పార్టీ అప్పగించిన పనిని ఎన్ని ఆటుపోట్లు వచ్చినా పూర్తి చేసేవరకు విశ్రమించని నిబద్ధత కలిగిన మార్క్సిస్టు యర్రా శ్రీకాంత్ అని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం అన్నారు. శ్రీకాంత్ వర్ధంతి సభ సోమవారం ఖమ్మంలోని బోస్ సెంటర్లో డివిజన్ కార్యదర్శి వై.విక్రం అధ్యక్షతన నిర్వహించగా తమ్మినేని మాట్లాడారు. గతంలో త్రీటౌన్ ప్రాంతం నుండి మార్కెట్ తరలకుండా పోరాడడమేకాక ఇళ్ల స్థలాల పోరాటంలో శ్రీకాంత్ ముందు నిలిచేవారని గుర్తు చేశారు. కాగా, నేడు జాతీయ, అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాల్లో సీపీఎం పార్టీ స్పష్టమైన వైఖరితో పోరాటాలు చేస్తోందని తెలిపారు. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయిల్వి దురాక్రమ దాడులని ఆరోపించారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్, సీపీఎం ఆలిండియా కమిటీ సభ్యుడు ఎం.సాయిబాబా, జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు మాట్లాడగా సభకు ముందు మార్కెట్ నుంచి బోస్ సెంటర్ వరుకు ర్యాలీ నిర్వహించారు. పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు బండి రమేష్, బుగ్గవీటి సరళ, నాయకులు పొన్నం వెంకటేశ్వరరావు, యర్రా శ్రీనివాసరావు, బొంతు రాంబాబు, భూక్యా వీరభద్రం, మడుపల్లి గోపాల్రావు, బండి పద్మ, జబ్బార్, మీరా, తిరుపతిరావు, ఎస్.నవీన్రెడ్డి, యర్రా రమేష్, యర్రా రంజిత్, యర్రా జ్ఞానేష్, యర్రా గోపి, భూక్యా శ్రీనివాసరావు, బండారు యాకయ్య, ఎల్లంపల్లి వెంకట్రావు, బండి పద్మ, పత్తిపాక నాగసులోచన పాల్గొన్నారు.వర్ధంతి సభలో సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు వీరభద్రం -
కొడుకును కాలేజీలో చేర్చడానికి వెళ్తూ...
● రోడ్డు ప్రమాదంలో దంపతుల మృతి ● లారీ రూపంలో కబళించిన మృత్యువుకొణిజర్ల: పదో తరగతి పూర్తి చేసిన కుమారుడికి బంగారు భవిష్యత్ ఇవ్వాలని ఆ దంపతులు కల కన్నారు. అందులో భాగంగా ఉత్తమ బోధన ఉండే కాలేజీని ఎంచుకుని చేర్పించాలని హైదరాబాద్ బయలుదేరారు. కానీ వారు గమ్యాన్ని చేరకుండానే కన్నుమూశారు. ఈ ప్రమాదంలో తల్లిదండ్రులు మృతి చెందగా కుమారుడు తీవ్రగాయాలతో బయటపడ్డాడు. కొణిజర్ల వద్ద సోమవారం తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదం వివరాలు... ఆస్పత్రికి తరలించేలోగా.. అప్రమత్తమైన స్థానికులు కారులో నుంచి వీర శైలజను, యశ్వంత్ను బయటకు తీసి 108లో ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శైలజ మృతి చెందింది. అలాగే, వీర్రాజు కారు సహా లారీ కింద ఇరుక్కుపోవడంతో పోలీసులు రెండు జేసీబీల సాయంతో విడదీసి వీర్రాజు, లారీ డ్రైవర్ శ్రీనును బయటకు తీసి ఆస్పత్రికి పంపించారు. అయితే, ప్రమాదం జరిగాక గంటకు పైగా తీవ్ర రక్తస్రావం జరగడంతో వీర్రాజును ఆస్పత్రికి తీసుకెళ్లేలోగా మృతి చెందాడు. కాగా, కారును ఢీకొట్టిన లారీ అడ్డం తిరిగి బ్రిడ్జిపై అడ్డంగా నిలిచిపోవడంతో రోడ్డుకు ఇరువైపులా వాహనాలు భారీగా నిలిచిపోయాయి. గంటన్నర పాటు రాకపోకలకు అంతరాయం ఏర్పడగా ఎస్ఐ జి.సూరజ్ నేతృత్వాన జేసీబీలతో వాహనాలను పక్కకు తప్పించి రాకపోకలను క్రమబద్ధీకరించారు. ఇక ట్రాఫిక్ జామ్ అయిన క్రమాన కొణిజర్ల ఎంపీడీఓ కార్యాలయం వద్ద నిలిచిన లారీని ధాన్యం లోడ్తో వచ్చిన మరో లారీ వెనక నుంచి ఢీకొట్టింది. ఘటనలో ధాన్యం లోడు లారీ డ్రైవర్ స్వల్పంగా గాయపడ్డాడు.ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి మోరంపూడి గాదాలమ్మనగర్కు ఉండమట్ల వీర్రాజు(46) ధవళేశ్వరంలో పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్నాడు. ఆయనకు భార్య వీర శైలజ (36), కుమారుడు యశ్వంత్ ఉన్నారు. యశ్వంత్ ఇటీవల పదోతరగతి పూర్తిచేయగా ఇంటర్లో చేర్పించేందుకు హైదరాబాద్లోని కళాశాలలు చూడడమే కాక బంధువులను కలవాలని కారులో బయలుదేరారు. వీరి కారు సోమవారం తెల్లవారుజామున కొణిజర్లలోని సాగర్ కాల్వ బ్రిడ్జిపైకి రాగానే ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. దీంతో లారీ ముందు టైరు రిమ్ము విరిగిపోవడమే కాక కారు లారీ కిందకు దూసువెళ్లింది. ఆపై లారీ అదుపు తప్పి బ్రిడ్జిపై అడ్డంగా తిరిగింది. అదేసమయాన వైరా వైపు నుంచి వస్తున్న మరో లారీని సైతం ఢీకొట్టింది. ఘటనలో కారు నడుపుతున్న వీర్రాజు, ముందు సీట్లో కూర్చున్న వీరశైలజ తీవ్రంగా గాయపడ్డారు. అలాగే, లారీ డ్రైవర్ అలుగోలు శ్రీను క్యాబిన్లో ఇరుక్కుపోయాడు. -
ఎకై ్సజ్లో బదిలీల గందరగోళం
● నాలుగు జిల్లాల పరిధిలో ట్రాన్స్ఫర్లు ● నేటి ముగియనున్న సిబ్బంది ఆప్షన్ల గడువు ● కుటుంబాలకు దూరం అవుతామని ఆవేదనఖమ్మంక్రైం: ఎకై ్సజ్ శాఖ ఉద్యోగుల బదిలీల్లో 317 జీవో గందరగోళానికి దారితీసిందని చెబుతున్నారు. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ఎకై ్సజ్శాఖలోని హెడ్కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్ల బదిలీల ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఇందులో భాగంగా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోనూ బదిలీల ప్రక్రియ మొదలుకావడంతో ఉద్యోగులు ఆనందపడ్డారు. కానీ ఈ జీఓ కొత్త తలనొప్పి తెచ్చిపెట్టిందని వాపోతున్నారు. 41 స్టేషన్లకు ఆప్షన్ ఉమ్మడి జిల్లాలో ఎకై ్సజ్ కానిస్టేబుళ్లు, హెడ్కానిస్టేబుళ్ల బదిలీలకు సంబంధించి ఆప్షన్లు పెట్టుకునే గడువు మంగళవారం ముగియనుంది. కాగా, నాలుగు జిల్లాలో 44 ఎకై ్సజ్ స్టేషన్లు ఉండగా.. ఉద్యోగులు 41 స్టేషన్లకు ఆప్షన్ పెట్టుకోవాలని ఆదేశాలు అందాయి. దీంతో సిబ్బంది ఆప్షన్లు నమోదు చేస్తున్నా ఏ జిల్లాకు బదిలీ అవుతుందోనని ఉత్కంఠకు లోనవుతున్నారు. కాగా, ఆప్షన్ల పరిశీలన అనంతరం 133 మంది కానిస్టేబుళ్లు, 32 హెడ్కానిస్టేబుళ్లకు ఈనెల 10వ తేదీన బదిలీ ఉత్తర్వులు అందనున్నాయి. పైరవీలు ప్రారంభం 317 జీఓపై అవగాహన లేదని చాలా మంది ఎకై ్సజ్ సిబ్బంది చెబుతున్నారు. గతంలో ఖమ్మంలో పని చేసిన వారు భద్రాద్రి జిల్లాకు, భద్రాద్రి జిల్లాలో పనిచేసిన వారు ఖమ్మంకు బదిలీపై వచ్చారు. అయితే జీఓ 317 ప్రకారం ఖమ్మం ఎకై ్సజ్ స్టేషన్లో పనిచేస్తున్న హెడ్కానిస్టేబుల్ను భద్రాద్రి జిల్లాకు కాకుండా వరంగల్ లేదా హనుమకొండ జిల్లాకు బదిలీ చేసినా తప్పక వెళ్లాల్సి వస్తుంది. అదే జరిగితే కుటుంబం, పిల్లలకు దూరంగా ఉండాల్సి వస్తుందని చెబుతున్నారు. పిల్లల చదువుల దృష్ట్యా కుటుంబాన్ని తీసుకెళ్లే పరిస్థితి ఉండదని, తద్వారా ఇబ్బంది వస్తుందని తల పట్టుకుంటున్నారు. ఈనేపథ్యాన కొందరు తమకు తెలిసిన ఎకై ్సజ్ ఉన్నతాధికారుల ద్వారా పైరవీలు చేస్తున్నట్లు తెలిసింది. పని చేస్తున్న ప్రాంతంలోనే మరో స్టేషన్కు బదిలీ చేయాలని, లేకపోతే పక్క జిల్లాకు పంపించాలని కోరుతున్నట్లు సమాచారం. ఇంకొందరు రాజకీయ నాయకుల ద్వారా కూడా పైరవీలు మొదలుపెట్టినట్లు తెలిసింది. అయితే, ఎలాంటి పైరవీలకు తావు లేదని, ఎక్కడకు బదిలీ చేసిన వెళ్లాల్సిందేనని అదికారులు చెబుతున్నారు. 2019 సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం ఎక్సైజ్ శాఖలో 317 జీఓను అమల్లోకి తెచ్చింది. ఈ జీఓ ప్రకారం సీడీ(4) కింద ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాలు ఉన్నాయి. ఫలితంగా ఇప్పుడు నాలుగు జిల్లాల్లో ఎక్కడైనా బదిలీ చేసే అవకాశం ఉంది. సీనియారిటీ, మైదాన, ఏజెన్సీ ప్రాంతాలే కాక ఉద్యోగుల ఆరోగ్య పరిస్థితుల ఆధారంగా బదిలీలు ఉంటాయని అధికారులు చెబుతున్నా.. ఉమ్మడి జిల్లాను వీడి వెళ్లాల్సి రానుండడంపై సిబ్బందిలో ఆందోళన వ్యక్తమవుతోంది. -
త్వరలోనే మహిళలకు స్మార్ట్కార్డులు
ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డివైరా/మధిర: మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత ప్రయాణం సులువుగా సాగేలా మహిళలకు స్మార్ట్కార్డులు జారీ చేయనున్నట్లు టీఎస్ ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి తెలిపారు. వైరా బస్టాండ్ను సోమవారం తనిఖీ చేసిన ఆయన మాట్లాడారు. మహిళలకు స్మార్ట్కార్డులు ఈ వేసవిలోనే ఇచ్చే ప్రయత్నం చేస్తామన్నారు. తద్వారా ప్రతీసారి ఆధార్ కార్డు వెంట తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదని తెలిపారు. కాగా, రాష్ట్రంలో దాదాపు అన్ని బస్టాండ్లు 25 – 40 ఏళ్ల నాటివి కావడంతో సరైన నిర్వహణ లేక కూలి పోతున్నాయన్నారు. ఇందులో భాగంగా వైరా బస్టాండ్ అభివృద్ధికి త్వరలో ప్రణాళిక సిద్ధం చేస్తామని తెలిపారు. అంతేకాక ప్రయాణేతర ఆదాయ మార్గాల పరిశీలన కొనసాగుతోందని చెప్పారు. కాగా, వైరా బస్టాండ్లో గతంలో రెండేసి ఇన్, ఔట్ గేట్లు ఉన్నా రెండింటిని మూసివేయడంతో ఇబ్బంది ఎదురవుతోందని స్థానికులు ఎండీకి వివరించగా అది సాంకేతిక నిర్ణయమని స్పష్టం చేశారు. అలాగే, మధిర బస్టాండ్, డిపోను కూడా ఎండీ నాగిరెడ్డి పరిశీలించారు. మధిరలో బస్టాండ్ అభివృద్ధి పనులను పరిశీలించి అధికారులతో సమీక్షించారు. అనంతరం తాత్కాలిక బస్టాండ్, డిపో గ్యారేజీలో పరిశీలించారు. కరీంనగర్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సోలోమన్, ఖమ్మం రీజినల్ మేనేజర్ సరిరామ్, డిప్యూటీ రీజినల్ మేనేజర్ మల్లయ్య, డిపో మేనేజర్ రామయ్య, ఉద్యోగులు పాల్గొన్నారు. -
నాణ్యమైన ఆహారంతోనే ఆరోగ్యం
ఖమ్మంవైద్యవిభాగం: నాణ్యమైన ఆహారం తీసుకుంటేనే జీవన ప్రమాణాలు మెరుగవుతాయని అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి తెలిపారు. ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’లో భాగంగా సోమవారం ‘ఫుడ్ సేఫ్టీ ఫోకస్ డే’ నిర్వహించారు. ఈ సందర్భంగా ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియం వద్ద అవగాహన ర్యాలీని ప్రారంభించిన అదనపు కలెక్టర్ మాట్లాడారు. ఆహార భద్రత ప్రమాణాలపై ప్రజలకేకాక వ్యాపారుల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. నాణ్యత విషయంలో నిక్కచ్చిగా వ్యవహరించకపోతే భవిష్యత్లో దుష్ప్రభావాలు ఎదురవుతాయని చెప్పారు. ఈమేరకు సంబంధిత శాఖ అధికారులు నిరంతరం దృష్టి సారించాలని సూచించారు. అనంతరం ర్యాలీ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వరకు కొనసాగగా.. ఆహార భద్రత ప్రాముఖ్యతపై నినాదాలు చేశారు. డీఎంహెచ్ఓ రామారావు, జిల్లా ఆస్పత్రుల కోఆర్డినేటర్ రాజశేఖర్గౌడ్, డీవైఎస్ఓ సునీల్ రెడ్డి, జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ కిరణ్కుమార్, ఉద్యోఉలు జడ్.ఎస్.జయపాల్, బిట్టా ప్రవీణ్కుమార్ తదితరులు అధికారులు పాల్గొన్నారు.అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి -
నేడు, రేపు మంత్రి తుమ్మల పర్యటన
ఖమ్మంఅర్బన్: రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మంగళ, బుధవారం జిల్లాలో పర్యటించనున్నారు. మంగళవారం సాయంత్రం ఖమ్మం రానున్న మంత్రి 56వ డివిజన్ విజయనగర్ కాలనీలో సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశాక 20వ డివిజన్ రామచంద్రయ్య నగర్లో సబ్స్టేషన్ను ప్రారంభిస్తారు. అలాగే, బుధవారం ఉదయం 41వ డివిజన్ నిజాంపేట్లో అంధ విద్యార్థుల పాఠశాలను ప్రారంభించడంతో పాటు 34వ డివిజన్ పీసీకే తోటలో సీసీ రోడ్డు నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేయనున్నారు. సింగరేణి కార్మికులకు మజ్జిగ పంపిణీ ప్రారంభం సత్తుపల్లిరూరల్: నానాటికీ ఎండలు పెరుగుతుండడంతో సింగరేణి కార్మికుల ఆరోగ్యం దృష్ట్యా మజ్జిగ పంపిణీని ప్రారంభించారు. సత్తుపల్లి ఏరియాలోని అన్ని విభాగాల్లో సోమవారం మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఓసీల్లో కార్మికులు, కార్యాలయాల ఉద్యోగులకు జేవీఆర్, కిష్టారం ఓసీల ప్రాజెక్టు ఆఫీసర్లు ఎస్.ప్రహ్లాద్, ఏఎల్ఎస్వీ.సునీల్వర్మ, సోమశేఖర్రావు ఆధ్వర్యాన మజ్జిగ పంపిణీ చేయగా అధికారులు మాట్లాడారు. గనులు, కార్యాలయాల సిబ్బంది వడదెబ్బ బారిన పడకుండా చల్లని తాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, మజ్జిగ నిరంతరం అందుబాటులో ఉంచుతున్నామని తెలిపారు. మార్క్ఫెడ్ మేనేజర్గా శ్యామ్కుమార్ ఖమ్మంవ్యవసాయం: మార్క్ఫెడ్ సంస్థ రాష్ట్రంలోని 13మంది మేనేజర్లను బదిలీ చేసింది. ఇందులో భాగంగా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల మేనేజర్ సునీతను సిద్దిపేటకు బదిలీ చేశారు. అలాగే, హనుమకొండ జిల్లా మేనేజర్ ఐ.శ్యామ్కుమార్కు ఖమ్మం, భద్రాద్రి జిల్లా మేనేజర్గా బదిలీ చేయడంతో పాటు మహబూబాబాద్ జిల్లా మేనేజర్గా బాధ్యతలు అప్పగించారు. ఈమేరకు శ్యామ్కుమార్ సోమవారం బాధ్యతలు స్వీకరించగా, మొక్కజొన్న కొనుగోళ్లపై అధికారులతో సమీక్షించారు. టెక్స్టైల్స్ డిప్లొమా కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు ఖమ్మంగాంధీచౌక్: హైదరాబాద్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హాండ్లూమ్ టెక్నాలజీ(ఐఐహెచ్టీ)లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు చేనేత, జౌళి శాఖ సహాయ సంచాలకులు ఎం.విజయలక్ష్మి తెలిపారు. 2026–27 సంవత్సరానికి గాను చేనేత, టెక్స్టైల్స్ టెక్నాలజీ డిప్లొమా కోర్సులో 60 సీట్లు ఉండగా, పదో తరగతి ఉత్తీర్ణత సాధించి 2026 జూలై 1నాటికి 23 ఏళ్లు నిండిన వారు అర్హులని పేర్కొన్నారు. అయితే, షెడ్యూల్ కులాలు, తెగల వారు 25ఏళ్ల వరకు అవకాశం ఉంటుందని తెలిపారు. ఆసక్తి, అర్హతలు కలిగిన వారు హైదరాబాద్లోని పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. ఇతర వివరాలకు 90300 79242 నంబర్లో లేదా website: klbiht. telangana. gov. in వెబ్సైట్లో సంప్రదించాలని సూచించారు.అవార్డులకు నామినేషన్లు ఆహ్వానం ఖమ్మంమయూరిసెంటర్: మే డే సందర్భంగా శ్రమశక్తి అవార్డులు, ఉత్తమ యాజమాన్య అవార్డులకు నామినేషన్లు ఆహ్వానిస్తున్నట్లు ఉప కార్మిక కమిషనర్ కె.విజయభాస్కర్ రెడ్డి తెలిపారు. కార్మికుల సంక్షేమానికి విశేష సేవలందించిన కార్మికులు, ట్రేడ్ యూనియన్ నాయకులకు శ్రమశక్తి అవార్డులు అందజేయనున్నట్లు వెల్లడించారు. అలాగే, యూనియన్లు, కార్మికులతో సఖ్యతగా ఉంటూ రాష్ట్ర పురోగతికి దోహదపడిన చిన్న, మధ్యతరహా, పెద్ద పరిశ్రమల యాజమాన్యాలకు ఉత్తమ యాజమాన్య అవార్డులు ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. ఈమేరకు ఉమ్మడి జిల్లాలోని ట్రేడ్ యూనియన్ల నాయకులు, కార్మికులు, పరిశ్రమల యాజమాన్యాలు నిర్ణీత ప్రొఫార్మాలో నామినేషన్లను ఈనెల 15వ తేదీలోగా అందజేయాలని సూచించారు, నామినేషన్ ప్రొఫార్మా, వివరాల కోసం డిప్యూటీ కమిషనర్ కార్మిక కార్యాలయంలో సంప్రదించాలని ఆయన తెలిపారు. -
నెలాఖరు నాటికి 10వేల గృహ ప్రవేశాలు
ఖమ్మంగాంధీచౌక్: జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు వేగం జరిగేలా అధికారులు పర్యవేక్షించాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆదేశించారు. కలెక్టరేట్లో ఇళ్ల నిర్మాణంపై అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజతో కలిసి ఆయన అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాకు 16,495 గృహాలు మంజూరైనందున 99 రోజుల కార్యాచరణలో దృష్టి సారించి త్వరగా పూర్తయ్యేలా చూడాలని తెలిపారు. పలు మండలాల్లో అధికారుల సరైన దృష్టి పెట్టకపోవడంతో పురోగతి నమోదు కావడం లేదన్నారు. ప్రజావాణిలో కూడా గృహాలపై ఎక్కువ సంఖ్యలో వినతులు వస్తున్నాయని, ఇసుక సమస్య పరిష్కారమైందని వేగం పెరిగేలా చూడాలని స్పష్టం చేశారు. ప్రస్తుతం 2వేల ఇళ్లు పూర్తయ్యాయని, మరో 9,217 ఇళ్లు స్లాబ్ దశలో ఉన్నందున ఇవి నెలాఖరులోగా పూర్తయ్యేలా చూసి మొత్తంగా 10 వేల గృహ ప్రవేశాలు జరగడమే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. అలాగే, నిర్మాణం మొదలుకాని లబ్ధిదారులతో మాట్లాడి రుణాలను మంజూరు చేయించాలని చెప్పారు. ఈ అంశాలపై 10, 17, 24, 30వ తేదీల్లో సమీక్షిస్తామని తెలిపారు. తప్పులు దొర్లితే చర్యలు గుడిసెల రహితంగా తెలంగాణను తీర్చిదిద్దాలని ప్రభుత్వం నిర్ణయించినందున జిల్లాలో గుడిసెల గుర్తింపునకు సర్వే చేపట్టాలని కలెక్టర్ అనుదీప్ ఆదేశించారు. సర్వే తర్వాత మండలాల వారీగా థర్డ్ పార్టీతో ఆడిట్ చేయిస్తామని, ఎక్కడైనా తప్పులు దొర్లినట్లు తేలితే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈమేరకు గ్రామపంచాయతీ కార్యదర్శులు, వార్డు అధికారులు సరైన సమాచారం సేకరించి రెండు రోజుల్లోగా నివేదిక ఇవ్వాలన్నారు. గుడిసెల గుర్తింపు తర్వాత మొదటి దశలో నిర్మించని ఇందిరమ్మ ఇళ్లను కేటాయించాలని సూచించారు. ఈ సమావేశంలో ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అభిషేక్ అగస్త్య, కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్, జెడ్పీ సీఈఓ దీక్షారైనా, హౌసింగ్ పీడీ భూక్యా శ్రీనివాస్ పాల్గొన్నారు. -
మార్కెట్కు పోటెత్తిన మిర్చి
ఖమ్మంవ్యవసాయం: ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు సోమవారం మిర్చి పోటెత్తింది. గడిచిన గురువారం నుంచి వరుసగా మూడు రోజులు సెలవులు రావడంతో సోమవారం భారీగా సరుకు వచ్చింది. జిల్లాతో పాటు భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, సూర్యాపేట, నల్లగొండ, ఏపీలోని ఉమ్మడి కృష్ణ, గుంటూరు జిల్లాల రైతులు దాదాపు 45 వేల బస్తాల మిర్చి విక్రయానికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా మిర్చి విక్రయాలతో పాటు ధరలోనూ పురోగతి నమోదై మునుపటి కన్నా జెండా పాట ఎక్కువగా పలికింది. ఈనెల 2వ తేదీన తేజా రకం జెండాపాట క్వింటాకు రూ.19,450 పలకగా, సోమవారం రూ.19,500కు చేరింది. అలాగే, మోడల్ ధర రూ. 18వేలుగా నమోదైంది. అలాగే, తాలు మిర్చికి గరిష్టంగా రూ.10 వేలు, మోడల్ ధర రూ.8,200గా పలికింది. కొనుగోళ్లను మార్కెట్ చైర్మన్ యరగర్ల హన్మంతరావు, ఉన్నత శ్రేణి కార్యదర్శి పి.ప్రవీణ్కుమార్ పర్యవేక్షించారు.‘తేజా’ రకం క్వింటాకు రూ.19,500 -
షరతులు వర్తిస్తాయి..!
బోనకల్ మండలం ముష్టికుంట్లలో ఆరబోసిన మక్కలు నేర్పుతున్న రైతు ఉమ్మడి జిల్లాలో ఈ ఏడాది మొక్కజొన్న అధిక విస్తీర్ణంలో సాగైంది. ప్రస్తుతం పంట చేతికి వస్తుండగా ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర రూ.2,400తో కొనుగోళ్లకు మార్క్ఫెడ్ ఆధ్వర్యాన అరకొరగానే కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇవి కూడా కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితమయ్యాయి. దీంతో ప్రైవేట్ వ్యాపారులు క్వింటాకు రూ.1,600కు మించి చెల్లించకపోవడంతో నష్టం ఎదురవుతోంది. ఇదే సమయాన ఎకరానికి 40 – 50 క్వింటాళ్ల దిగుబడి వస్తున్నా కేవలం 26.5 క్వింటాళ్లే కొనుగోలు చేస్తామన్న షరతు రైతులకు ఇబ్బందిగా మారింది. – సాక్షి ప్రతినిధి, ఖమ్మంపెరిగిన సాగు విస్తీర్ణం ఈ ఏడాది యాసంగిలో ఉమ్మడి జిల్లాలో మొక్కజొన్న పంట విస్తారంగా సాగు చేశారు. గడిచిన వానాకాలంలో విస్తారంగా వర్షాలు కురవడంతో జలాశయాలు నిండడమే కాక భూగర్భ జలాలు ఆశించిన స్థాయిలో ఉండడంతో మొక్కజొన్న వైపు రైతులు మొగ్గు చూపారు. అంతేకాక అధిక వర్షాలతో పత్తి దెబ్బతినగా ఒకటి, రెండు తీతల తర్వాత తొలగించి మొక్కజొన్న వేశారు. ఫలితంగా ఏటా ఉమ్మడి జిల్లాలో సగటున 96 వేల ఎకరాల్లో సాగయ్యే మొక్కజొన్న ఈసారి ఏకంగా 2.43లక్షల ఎకరాలకు చేరింది. ఇందులో ఖమ్మం జిల్లాలో 1.70 లక్షల ఎకరాలు, భద్రాద్రి కొత్తగూడెంలో 73 వేల ఎకరాల్లో సాగైంది. 16 కేంద్రాలకే అనుమతి మక్కలకు సరైన ధర లభించని సమయాల్లోనే కేంద్రప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తుంది. మూడేళ్ల క్రితం ఉమ్మడి జిల్లాలో 50వరకు కేంద్రాల్లో మక్కలు కొనుగోలు చేశారు. ఈసారి మాత్రం సాగు విస్తీర్ణం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోనే కేంద్రాల ఏర్పాటుకు నిర్ణయించింది. ఈమేరకు ఖమ్మంలో 11, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఐదు కలిపి కేవలం 16 కేంద్రాల ఏర్పాటుకే మార్క్ఫెడ్ సిద్ధమైంది. ఖమ్మం జిల్లాలో చింతకాని, మధిర, ఎర్రుపాలెం, బోనకల్, ఏదులాపురం(మద్దులపల్లి), జీళ్లచెరువు, మోటాపురం, కొణిజర్ల, మంచుకొండ, అల్లిపురం, కొత్తలింగాలలో, భద్రాద్రి జిల్లాలోని టేకులపల్లి, బోడు, ఇల్లెందు మార్కెట్, చల్లసముద్రం, కొమరారంలో మాత్రమే కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. దీంతో ఇతర ప్రాంతాల రైతులు పంట విక్రయాలకు ప్రైవేట్ వ్యాపారులను ఆశ్రయించక తప్పని పరిస్థితి ఎదురవుతోంది. కొనుగోలు చేసేది సగమే.. మార్క్ఫెడ్ ద్వారా అరకొరగా కేంద్రాలను ఏర్పాటు చేసిన కేంద్రప్రభుత్వం సేకరణలోనూ కొర్రీలు పెడుతోంది. ఉమ్మడి జిల్లాలో 2.43 లక్షల ఎకరాల్లో మక్కజొన్న సాగైతే 6.25 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అంచనా. ఎకరాకు 40 నుంచి 45 క్వింటాళ్ల దిగుబడి వస్తోంది. అయితే ఎకరాకు కేవలం 26.50 క్వింటాళ్లే కొనుగోలు చేస్తామని మార్క్ఫెడ్ చెబుతుండడం రైతులకు ఇబ్బందిగా మారింది. దీంతో మిగతా మక్కలను వ్యాపారులకు తక్కువ ధరతో అమ్మితే రైతులు నష్టపోవాల్సి వస్తుంది. ప్రభుత్వ మద్దతు ధర రూ.2,400 ఉంటే దళారులు రూ.1,700 చెల్లిస్తున్నారు. ఎనిమిది ఎకరాల్లో సాగు చేసిన మొక్కజొన్నలను కల్లంలో ఆరబోసి ఆరబోసి 15రోజులుగా ఎదురుచూస్తున్నా. ప్రభుత్వం మరింత ఆలస్యం చేస్తే.. ఆలోగా వర్షం వస్తే నష్టపోతాం. – దూబ శ్రీను, ముష్టికుంట్ల, బోనకల్ మండలం ప్రభుత్వ ఆదేశాలతో నిర్దేశించిన ప్రాంతాల్లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పటికే ఖమ్మం జిల్లాలో 10 కేంద్రాలను ప్రారంభించగా, భద్రాద్రి జిల్లాలో ప్రక్రియ కొనసాగుతోంది. నిబంధనల మేర రైతులు మొక్కజొన్నలను తీసుకురావాలి. – శ్యామ్కుమార్, మార్క్ఫెడ్ మేనేజర్, ఉమ్మడి జిల్లాకేంద్ర ప్రభుత్వం మక్కలు క్వింటాకు రూ.2,400గా ధర ప్రకటించింది. కానీ మార్క్ఫెడ్ ఆధ్వర్యాన కొనుగోళ్లు ఆలస్యంగా మొదలయ్యాయి. ఇంతలోనే ప్రైవేట్ వ్యాపారులు రంగంలోకి దిగి క్వింటాకు రూ.1,600 చొప్పున కొనుగోళ్లు మొదలుపెట్టారు. నాణ్యత లేదని, తేమ ఉందనే కారణాలతో ధర తగ్గిస్తున్నారు. ఫలితంగా మద్దతు ధరతో పోలిస్తే రైతులు క్వింటాకు రూ.800 మేర నష్టపోతున్నారు. దీంతో రైతుల ఆందోళనలు, అభ్యర్థనల మేరకు ప్రభుత్వం మొక్కజొన్నల కొనుగోళ్లకు ముందుకొచ్చింది. మక్కల విక్రయంలో రైతులకు తిప్పలు -
ఆలయ అభివృద్ధి..
పుష్కరాల పనులుభద్రాచలం: గోదావరి పుష్కరాల నేపథ్యంలో భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం అభివృద్ధికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. అభివృద్ధి పనులు నిర్ణీత సమయానికి పూర్తి చేస్తామని ప్రకటించింది. అయితే సమయం తక్కువగా ఉండటంతో వందలాది కోట్ల రూపాయల అభివృద్ధి పను ల పర్యవేక్షణ, గోదావరి పుష్కరాల పనుల బాధ్యతలను ఐఏఎస్ అధికారికి అప్పగించాలని భక్తులు కోరుతున్నారు. మాస్టర్ ప్లాన్, గోదావరి పుష్కరాలకు భారీగా నిధులు గోదావరి పుష్కరాలు 2027, జూలై 23 నుంచి ఆగస్టు 3వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్రంలో గోదావరి కారిడార్లో పుష్కరాల విజయవంతానికి సుమారు 300 రూ. కోట్ల వరకు కేటాయించింది. భక్తులు అధికసంఖ్య లో వచ్చే భద్రాచలం వద్ద ఏర్పాట్లపై దృష్టి సారించింది. నెల రోజుల క్రితం పుష్కరాల ఏర్పాట్లపై రాష్ట్రస్థాయిలో ఇరిగేషన్, దేవాదాయ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. భద్రాచలం వద్ద సుమారు రూ.60కోట్ల నుంచి రూ. 80 కోట్లతో పనులు చేపట్టేలా ప్రతిపాదనలు అందజేశారు. దీంతో ఈ ఏడాది పుష్కరాల పనులు నిర్విరామంగా జరగనున్నాయి. ఇటీవల భద్రాచలం రామాలయ అభివృద్ధి పనులకు సీఎం రేవంత్రెడ్డి శంకుస్థాపన చేశా రు. మొత్తంగా రూ.586 కోట్లు కేటాయించగా, మూ డు విడతలుగా పనులు చేపట్టాలని నిర్ణయించారు. తొలి విడతలో రూ.75కోట్లతో గోదావరి ఘాట్ల విస్తరణ, రూ.180 కోట్లతో ఆలయ కాంప్లెక్స్ విస్తరణ, రూ.96 కోట్లతో ఆలయ పరిసర ప్రాంతాల అభివృద్ధి.. మొత్తంగా రూ.351 కోట్ల పనులను చేయనున్నారు. వీటిని మార్చి 2027 లోగా పూర్తి చేయాలని ప్రణాళిక రూపొందించారు. రెండో విడతలో 2028 నాటికి కాపా రామలక్ష్మమ్మ ట్రస్టు వద్ద ఉన్న ఆరెకరాల స్థలంలో రూ.108 కోట్లతో పనలు చేపట్టాల్సి ఉంది. మూడో విడతలో రూ.127 కోట్లతో భద్రాచలం టెంపుల్ టౌన్ అభివృద్ధి పనులు 2029వరకు పూర్తిచేయనున్నారు. వెరసి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.400 కోట్లతో గోదావరి పుష్కరాలు, ఆలయ అభివృద్ధి పనులు జరగనున్నాయి. గోదావరి పుష్కరాలు, ఆలయ అభివృద్ధి పనులను నిరంతరం పర్యవేక్షించడంతోపాటు నాణ్యతతో నిర్ణీత సమయంలోగా పూర్తి చేయాలి. ఇందుకోసం వివిధ శాఖలతో సమన్వయం చేసుకోవాల్సి ఉంటుంది. ఉమ్మడి జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు కూడా వీటిపై ప్రత్యేక దృష్టి సారించారు. గత పుష్కరాల సమయంలో చివరి నిమిషంలో పనులు పూర్తి కాక భక్తులు ఇబ్బందులు పడ్డారు. మళ్లీ ఇటువంటి సమస్య రాకుండా, ప్రభుత్వ లక్ష్యం నెరవేరాలంటే ఐఏఎస్ అధికారికి బాధ్యతలు అప్పగిస్తే మేలనే అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి. ప్రస్తుతం భద్రాచలంలో సబ్ కలెక్టర్గా మృణాళ్ శ్రేష్ఠ, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారిగా బి.రాహుల్ ఇద్దరు ఐఏఎస్లు సేవలందిస్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం తగిన ఆలోచన చేసి వీరిద్దరిలో ఒకరికి లేదా మరో సీనియర్ అధికారికి అభివృద్ధి పనుల బాధ్యతలను అప్పగించాలని భక్తులు కోరుతున్నారు. -
పరీక్ష లేదు.. ఫలితం లేదు
● పెద్దాస్పతిలోని టీ హబ్లో నిలిచిన రోగ నిర్ధారణ టెస్టులు ● యంత్రాలకు కాలం చెల్లడంతో రెండు రోజులుగా బంద్ ● ఇతర ఆస్పత్రుల నుంచి శాంపిళ్ల సేకరణకు సైతం బ్రేక్ఖమ్మంవైద్యవిభాగం: ఖమ్మం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి ఆవరణలోని తెలంగాణ డయోగ్నస్టిక్ హబ్లో పరీక్షలు పూర్తిగా నిలిచిపోయాయి. తరచుగా యంత్రాలు మొరాయించడం, రసాయనాల సరఫరాలతో అవాంతరాలతో పరీక్షలు ఆగిపోవడం ఇక్కడ సర్వసాధారమే అయినా ప్రస్తుతం యంత్రాల కాలం చెల్లడంతో రెండు రోజులుగా టెస్టులు పూర్తిగా నిలిపివేశారు. దీంతో ఇతర ప్రాంతాల నుంచి శాంపిళ్లు కూడా పంపించడం లేదు. 57నుంచి 134 పరీక్షలకు... పేద ప్రజలకు ఉచితంగా 57 రకాల పరీక్షలు చేసేందుకు గత ప్రభుత్వం తెలంగాణ డయాగ్నస్టిక్ సెంటర్లను నెలకొల్పింది. క్లినికల్ పాథాలజీ, మైక్రోబయాలజీ, క్లినికల్ బయో కెమిస్ట్రీకి చెందిన 57 రకాల పరీక్షలు నిర్వహించగా, దశల వారీగా పరీక్షల సంఖ్య 134కు చేరింది. పెద్దాస్పత్రికి వచ్చేవారే కాక జిల్లాలోని పీహెచ్సీలు, అర్బన్ హెల్త్ సెంటర్లు, పట్టణ దవాఖానాలు, ఏరియా ఆస్పత్రుల నుంచి నిత్యం 2 వేలకు పైగా శాంపిళ్లు వచ్చేవి. ఇక్కడ పరీక్షలు చేశాక నేరుగా రోగి సెల్కు రిపోర్టు పంపిస్తే వైద్యులకు చూపించి చికిత్స చేయించుకునేవారు. అయితే, ఖమ్మం ఆస్పత్రిలో ఏర్పాటుచేసిన సెంటర్ ద్వారా కొద్దినెలల పాటు సక్రమంగానే పరీక్షలు జరిగినా, ఇటీవల రసాయనాల కొరత, యంత్రాల లోపాలతో తరచూ అవాంతరాలు ఎదురయ్యాయి. ఇప్పుడు యంత్రాలు పూర్తిగా మూలనపడటంతో పరీక్షలన్నీ నిలిపివేశారు. దీంతో ఆస్పత్రికి వచ్చే వారిలో కొందరు ప్రైవేట్ డయాగ్నొస్టిక్ సెంటర్లను ఆశ్రయించి ఆర్థికంగా నష్టపోతున్నారు. మరికొందరు పేదలు నిరాశగా వెనుతిరుగుతున్నారు. లక్షలాది మందికి సేవలు పెద్దాస్పత్రిలోని డయాగ్నస్టిక్ హబ్ ద్వారా ఇప్పటి వరకు లక్షలాది మందికి సేవలు అందాయి. 2021లో హబ్లో డయోగ్నస్టిక్ సేవలు మొదలయ్యాయి. ఇప్పటి వరకు 6,92,681 మంది నుంచి 12,74,564 శాంపిళ్లు సేకరించగా, 25,89,677 పరీక్షలు నిర్వహించారు. ఇప్పుడు కొత్త యంత్రాలు వస్తే తప్ప సెంటర్ తెరుచుకునే అవకాశాలు కనిపించడం లేదు. దీంతో అప్పటి వరకు రోగులు ప్రైవేట్ డయాగ్నస్టిక్ సెంటర్లకు వెళ్లక తప్పని పరిస్థితి ఎదురుకానుంది. ఆస్పత్రిలోని హబ్లో పరీక్షలు నిలిచిపోయిన విషయం వాస్తవమే. హబ్లోని యంత్రాల పరిస్థితిని కలెక్టర్కు నివేదించాము. కొత్త యంత్రాల అవసరాన్ని ప్రతిపాదించాము. కలెక్టర్ చొరవతో త్వరలోనే సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. – డాక్టర్ రాంబాబు, ఆస్పత్రి ఇన్చార్జ్ మెడికల్ సూపరింటెండెంట్డయాగ్నస్టిక్ హబ్లో గంటకు 1,520 పరీక్షల సామర్ధ్యంతో యంత్రాలు ఉన్నాయి. ఇందులో కెమిస్ట్రీ ఎనలైజర్ మిషన్ ద్వారా 1,200 పరీక్షలు, ఇమ్యూనో ఎనలైజర్ మిషన్ ద్వారా 220, సీబీపీ మిషన్ ద్వారా వంద మందికి ఒకేసారి పరీక్షలు జరిగేవి. అయితే సీబీపీ మిషన్ మిషన్ మినహా కెమిస్ట్రీ ఎనలైజర్, ఇమ్యూనో ఎనలైజర్ యంత్రాలు పూర్తిగా మూలనపడ్డాయి. వీటి కాలం తీరడంతో తరచూ మొరాయిస్తుండగా ఇంజనీర్లను పిలిపించి తాత్కాలికంగా మరమ్మతులు చేయిస్తే కొద్దిరోజులే పనిచేసేవి. ప్రస్తుతం కీలకమైన ఈ యంత్రాలు మరమ్మతు చేయడానికి కూడా వీల్లేకుండా పాడయ్యాయని ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి. -
బాలభీముడి జననం.. డాక్టర్లకే ఆశ్చర్యం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో బాలభీముడు జన్మించాడు. మండ లంలోని అచ్యుతాపురం గ్రామానికి చెందిన ముంగర మమత కాన్పు కోసం ప్రభుత్వ ఆస్ప త్రికి రాగా, వైద్యులు ఆమెకు సాధారణ ప్రస వం చేశారు. ఆమె 4.5కిలోల బరువు ఉన్న మగ శిశువు జన్మించాడు. సహజంగా అప్పుడే జన్మించే శిశువులు రెండు నుంచి మూడున్నర కిలోల బరువు ఉంటారని, 4.5కిలోల బరువు ఉండటం అరుదైన ఘటనగా ఆస్పత్రి గైనకాల జిస్టు మౌనిక తెలిపారు. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారని పేర్కొన్నారు. -
●‘సాక్షి’ ఫొటోగ్రాఫర్కు అవార్డు
‘సాక్షి’ ఖమ్మం యూనిట్ చీఫ్ ఫొటోగ్రాఫర్ రాధారపు రాజుకు అవార్డు లభించింది. తెలంగాణ ఫొటో జర్నలిస్ట్ అసోసియేషన్(టీపీజేఏ) ఆధ్వర్యాన గత ఏడాది జాతీయ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన పోటీల్లో ఆయన తీసిన ఫొటో అవార్డుకు ఎంపికై ంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో ఆదివారం జరిగిన వేడుకలో మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాసరెడ్డి చేతుల మీదుగా రాజు అవార్డు అందుకున్నారు. – ఖమ్మం మయూరిసెంటర్ -
ఆరబోస్తూ.. ఎదురుచూస్తూ
జిల్లా అంతటితో పాటు ముదిగొండ మండలంలో కూడా రైతులు ఎక్కువగానే మొక్కజొన్న సాగు చేశారు. ఈనేపథ్యాన పంట కోత పూర్తికావడంతో తేమ తగ్గేలా మండలంలోని బాణాపురంలో ఇటీవల నిర్మాణం పూర్తయిన సీసీ రోడ్డుపై ఆరబోశారు. దాదాపు కిలోమీటర్ మేర ఉన్న ఈ రోడ్డుపై మక్కలు ఆరబోయగా.. ఇటీవల ఎండలకు బాగా ఎండి గలగలలాడుతున్నాయి. అయితే, రాత్రి మక్కలను ఎత్తడం, ఉదయం ఆరబోయడం రైతులకు సమస్యగా మారింది. ఈ నేపథ్యాన ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు త్వరగా ఏర్పాటుచేసి మద్దతు ధరతో కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు. – ముదిగొండ -
పథకం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు డిపోల వారీగా లబ్ధిదారులు
డిపో ప్రయాణించిన మహిళలు చార్జీల విలువ (రూ.ల్లో) ఖమ్మం 2,42,52,201 118,78,47,000సత్తుపల్లి 2,03,31,248 87,47,41,000మణుగూరు 1,52,83,995 69,55,96,000కొత్తగూడెం 1,50,25,096 61,29,67,000భద్రాచలం 1,19,42,306 61,78,98,000మధిర 1,04,86,537 75,52,54,000ఇల్లెందు 43,12,708 17,76,50,000మొత్తం 10,16,34,091 492,19,53,000 -
ఎన్పీడీసీఎల్ కంపెనీ కార్యవర్గం ఎన్నిక
పాల్వంచ: తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ (హెచ్–142) అనుబంధ ఎన్పీడీసీఎల్ కంపెనీ నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఎన్నుకున్నారు. పాల్వంచలోని కేటీపీఎస్ ‘ఏ’ కాలనీలో ఉన్న తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ (హెచ్–142) కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు కేవీ.రామారావు ఆధ్వర్యాన జరిగిన సమావేశానికి కామారెడ్డి, సిద్దిపేట, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాల నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కంపెనీ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా బి.దేవ్సింగ్, ఉపాధ్యక్షులుగా బి.స్వామి, ప్రధాన కార్యదర్శిగా ఎ.నాగరాజు, సహాయ కార్యదర్శిగా వి.మోతీలాల్, ప్రచార కార్యదర్శిగా ఆర్.యాకయ్య, కోశాధికారిగా సీహెచ్.కృష్ణయ్యతో పాటు కార్యవర్గ సభ్యులుగా కె.బాలరాజు, జి.వేణు, ఎం.రాజు, ఎల్.బలరాంను ఎన్నుకున్నారు. అలాగే, వివిధ జిల్లాలకు చెందిన నాయకులు యూనియన్లో చేరగా వారిని ఆహ్వానించాక రామారావు మాట్లాడారు. కార్మికులు కష్టించి పనిచేస్తూ సంస్థ అభివృద్ధికి చేయూతనివ్వాలని సూచించారు. అలాగే, నూతన కార్యవర్గం కార్మిక సంక్షేమం కోసం కృషి చేయాలని తెలిపారు. నాయకులు ఎస్.శ్రీనివాసాచారి, డి.సత్యరాజ్ స్టీవెన్, వెంపటి వెంకటేశ్వర్లు, షేక్.సయ్యద్, వి.కోటేశ్వరరావు, యాకయ్య, భిక్షపతి, గణేశ్, అమర్ తదితరులు పాల్గొన్నారు. -
మీ సేవలకు ‘సెలవు’!
● గురుకులాల్లో ఔట్సోర్సింగ్ సిబ్బందికి నెలన్నర విరామం ● మైనార్టీ విద్యాసంస్థల్లో అమల్లోకి నిర్ణయం ● తిరిగి జూన్లో విధుల్లోకి తీసుకుంటామని అధికారుల వెల్లడి ఖమ్మం మయూరిసెంటర్: గురుకుల విద్యాసంస్థల్లో పని చేసే ఔట్ సోర్సింగ్ సిబ్బందిని తాత్కాలికంగా పక్కనపెడుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. విద్యాసంస్థలు పనిచేసే పది నెలలే వేతనం చెల్లిస్తూ, వేసవి సెలవుల్లో వీరి సేవలు వినియోగించుకోనందున వేతనం చెల్లించొద్దనే భావనతో విధులకు విరామం ప్రకటించినట్లు తెలిసింది. ఇప్పటికే మైనార్టీ గురుకులాల్లో ఈ విధానం అమల్లోకి వచ్చింది. ఫలితంగా ఉమ్మడి జిల్లాలోని మైనార్టీ గురుకుల జూనియర్ కాలేజీల్లో ఔట్సోర్సింగ్ సిబ్బందికి గతనెల 31నుంచి, పాఠశాలల్లో ఈనెల 24నుంచి విరామం అమలుకానుంది. అయితే, ఇది నిబంధనల ప్రకారం ఇచ్చే విరామమే తప్ప ఎవరినీ తొలగించడం లేదని మైనార్టీ గురుకులాల అధికారులు స్పష్టం చేస్తున్నారు. మిగతా గురుకుల సొసైటీల్లో కూడా ఈ నిర్ణయం అమలుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. రెగ్యులర్ కాకపోవడంతో.. ఏటా ఔట్సోర్సింగ్ సిబ్బందికి ఇచ్చే విరామంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. వీరంతా రెగ్యులర్ ఉద్యోగులు కానందున ప్రస్తుతానికి పక్కనపెట్టి జూన్ 1వ తేదీన తిరిగి విధుల్లోకి తీసుకుంటామని చెబుతున్నారు. ఈ ప్రభావం ఉమ్మడి జిల్లాలో దాదాపు 100 మంది ఔట్సోర్సింగ్ సిబ్బందిపై పడుతుందని అంచనా. ఇందులో నాన్ – టీచింగ్ సిబ్బంది 70 మంది, బోధన విభాగంలో 30 మంది ఉంటారని తెలిసింది. ఇటీవలే ఉపాధ్యాయుల నియామకం జరగడంతో ఔట్సోర్సింగ్ టీచర్ల సంఖ్య తగ్గింది. వీరికి మినహాయింపు గురుకులాల్లో అత్యవసర విధులను దృష్టిలో ఉంచుకుని కొందరికి మాత్రం మినహాయింపు ఇచ్చారు. ఆఫీస్ సూపరింటెండెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, ఆఫీస్ సబార్డినేట్, ప్రిన్సిపాళ్లు మాత్రం యథావిధిగా విధుల్లో కొనసాగుతారు. అంతేకాక భద్రత కోసం సెక్యూరిటీ గార్డులు, పరిశుభ్రత కోసం స్కావెంజర్లు కూడా విధుల్లో ఉంటారని అధికారులు తెలిపారు. -
భద్రగిరి రామయ్యకు అభిషేకం
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలోని అంతరాలయంలో ఆదివారం మూలమూర్తులకు స్వర్ణ పుష్పార్చన, అభిషేకం జరిపారు. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి బేడా మండపంలో కొలువుదీరిన స్వామివారికి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ మహోత్సవాన్ని శాస్త్రోక్తంగా జరిపారు. సెలవు రోజు కావడంతో ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. గోదావరికి నదీహారతి భద్రాచలం: భద్రాచలం వద్ద పవిత్ర గోదావరికి ఆదివారం అర్చకులు నదీ హారతి సమర్పించారు. తొలుత నది ఒడ్డున చిన్నారులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. అర్చకులు గోదావరి నదికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించారు. అనంతరం శాంతిమంత్ర పఠనం జరిపి హారతులు సమర్పించారు. గ్రీన్ భద్రాద్రి అధ్యక్షుడు గోళ్ల భూపతిరావు దంపతులు ప్రసాదం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అర్చకులు రామవజుల రవికుమార్, సురేష్ శర్మ, అశోక్కుమార్, వీరభద్ర శర్మ, రామాచార్యులు, ప్రసాద్ శర్మ, ఫణికుమార్ శర్మ పాల్గొన్నారు. -
స్టేజీ వద్ద బస్సు ఆపలేదని వాగ్వాదం
నేలకొండపల్లి: ప్రయాణికులు చేయి ఎత్తినా బస్సు ఆపలేదంటూ బైక్ అడ్డు పెట్టి నిరసన తెలిపిన ఘటన ఇది. కోదాడ డిపో బస్సు ఆదివారం ఖమ్మం వెళ్తుండగా నేలకొండపల్లి స్టేజీ వద్ద పలువురు ఆపేందుకు ప్రయత్నించారు. బస్సు వెంట పరుగెత్తినా ఫలితం లేకపోవడంతో కొందరు బైక్లపై వెళ్లి బస్సుకు అడ్డంగా పెట్టి నిరసన తెలిపారు. మండే ఎండలో వేచి ఉంటే బస్సు ఆపకపోవడం ఏమిటని డ్రైవర్తో వాగ్వాదానికి దిగారు. ఇకనైనా స్టేజీల వద్ద బస్సులు ఆపేలా అధికారులు డ్రైవర్లకు సూచనలు చేయాలని పలువురు కోరారు. రైతులకు పరిహారం అందించాలి మధిర: మధిరలోని సాయిబాలాజీ కోల్డ్ స్టోరేజీ ఇటీవల అగ్నిప్రమాదంలో కాలిపోగా, మిర్చి నష్టపోయిన రైతులకు తక్షణమే పరిహారం చెల్లించాలని రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు కోరారు. మధిరలో ఆదివారం జరిగిన కోల్డ్ స్టోరేజీ బాధిత రైతుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అగ్ని ప్రమాదంలో రూ.కోట్ల విలువైన మిర్చి నష్టపోయిన రైతులకు వెంటనే ఇన్సూరెన్స్ అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. కాగా, బాధితులు పక్షాన పోరాడేందుకు కమిటీని ఏర్పాటుచేసి కన్వీనర్గా దొండపాటి నాగేశ్వరరావు, కోకన్వీనర్గా గువ్వల సీతారామిరెడ్డిని నియమించారు. ఈ సమావేశంలో సీపీఎం డివిజన్ కార్యదర్శి మడుపల్లి గోపాలరావు, నాయకులు శీలం నరసింహారావు, మందా సైదులు, మందడపు ఉపేందర్, రైతులు పాల్గొన్నారు. భట్రాజుల సంఘం జిల్లా అధ్యక్షుడిగా పుల్లంరాజు ఖమ్మంమామిళ్లగూడెం/ఖమ్మంఅర్బన్: భట్రాజుల సంఘం జిల్లా నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఖమ్మంలో ఎన్నుకున్నారు. రాష్ట్ర ప్రతినిధులు ప్రతికంఠం దేవేందర్రాజు, ఆదూరి కళాధర్రాజు పర్యవేక్షణలో ఎన్నికలు నిర్వహించగా అధ్యక్షుడిగా డాక్టర్ తోకచిచ్చు వెంకటపుల్లంరాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అలాగే, ప్రధాన కార్యదర్శిగా సరికొండ రవికిరణ్రాజు, కోశాధికారిగా తంగెళ్ల వినోభారాజుతో పాటు మరో 18 మందితో కార్యవర్గాన్ని ప్రకటించారు. అంతేకాక, మహిళా విభాగం అధ్యక్షురాలిగా అంపోజ్వాలం అరుణాదేవి, కార్యదర్శిగా రాళ్లబండి నిర్మల, కోశాధికారిగా సరికొండ విజయలక్ష్మితో పాటు ఎనిమిది మంది సభ్యులను ఎన్నుకున్నారు. అంతేకాక యువజన విభాగం అధ్యక్షుడిగా ప్రతిగడప రవికిశోర్రాజు, కార్యదర్శిగా కోలాహలం రామరాజు, కోశాధికారిగా ఏలూరి నాగదిలీప్రాజుతో సహా మిగతా కార్యవర్గాన్ని ప్రకటించగా ప్రమాణ స్వీకారం చేశారు. సాగర్ కాలువలో వ్యక్తి గల్లంతు కల్లూరు: కల్లూరు ఎన్నెస్పీ ప్రాంతానికి చెందిన కిరాణషాపు యజమాని తొర్రుకొండ వెంకటేశ్వర్లు(53) సాగర్ కాలువలో పడి గల్లంతయ్యాడు. గ్యాస్ సిలిండర్ తీసుకొస్తానని చెప్పి శనివారం ఉదయం ఇంటి నుంచి వెళ్లిన ఆయన ఆదివారం కూడా తిరిగి రాలేదు. అనుమానంతో కాలువలో వెతకగా వెంకటేశ్వర్లు తీసుకెళ్లిన ద్విచక్ర వాహనం లభించింది. కానీ ఆయన ఆచూకీ లభించలేదు. -
ఉన్నత స్థాయికి చేరితే కన్నవాళ్లకు సంతృప్తి
ఖమ్మంఅర్బన్: విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థాయికి చేరుకోవడమే తల్లిదండ్రులకు ఇచ్చే అతి పెద్ద బహుమతి అని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా పదో తరగతి పరీక్షలకు హాజరై మెరుగైన ఫలితాలు సాధించాలని సూచించారు. ఖమ్మంలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాన్ని ఆదివారం తనిఖీ చేసిన కలెక్టర్... తరగతి గదులు, పాఠశాల పరిసరాలను పరిశీలించి మౌలిక వసతులు, వంటగది పరిశుభ్రత, బియ్యం, కూరగాయల నాణ్యతపై ఆరా తీశారు. ఈ సందర్భంగా పదో తరగతి విద్యార్థులతో మాట్లాడిన ఆయన మెనూ అమలు, బోధన, వసతుల వివరాలు తెలుసుకున్నారు. ఇప్పటి వరకు రాసిన పరీక్షల వివరాలు తెలుసుకున్నాక, మిగిలిన పరీక్షలు కూడా భయం లేకుండా రాసి ఉత్తమ ఫలితాలు సాధించాలని సూచించారు. ఎంత సమయం చదివామన్నది కాక ఎంత శ్రద్ధగా చదివామన్నదే ప్రధానమని తెలిపారు. ఎండలు పెరుగుతున్నందున తగినంత నీరు తాగుతూ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని చెప్పారు. జిల్లా అకడమిక్ మానిటరింగ్ అధికారి పెసర ప్రభాకర్రెడ్డి, జిల్లా జెండర్ ఈక్వాలిటీ కోఆర్డినేటర్ రూబీ, ఖమ్మం అర్బన్ ఎంఈఓ శైలజాలక్ష్మి పాల్గొన్నారు. కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి -
కార్మికుల సంఖ్య తగ్గుముఖం
సంస్థలో గత 14 ఏళ్లలో కార్మికుల సంఖ్య తగ్గిపోతోంది. యాజమాన్యం మాత్రం ఉత్పత్తి లక్ష్యం పెంచుతూ కార్మికులపై పనిభారం మోపుతోంది. దీనివల్ల కార్మికులు గనుల్లో ఎక్కువ కాలం పనిచేయలేక పోతున్నారు. – రియాజ్ అహ్మద్, హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి సింగరేణి సంస్థ ఉన్న గనుల్లో లక్ష్యాలను పెంచుకోవటం వల్ల బొగ్గు నిక్షేపాలు తగ్గుముఖం పడుతున్నాయి. అదేరీతిలో కొత్త గనుల ఏర్పాటుకు చిత్తశుద్ధితో చర్యలు చేపట్టాలి. అప్పుడు కార్మికుల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుంది. –కాపు కృష్ణ, టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి రుద్రంపూర్: సింగరేణి సంస్థలో క్రమంగా కార్మికుల సంఖ్య తగ్గిపోతోంది. దీంతో గనులు, కాలనీలు వెలవెలబోతున్నాయి. యాజమాన్యం యాంత్రీకరణ పేరుతో భూగర్భ గనులను మూసివేసి ఓపెన్కాస్ట్ గనులు ఏర్పాటు చేస్తుండటంతో కార్మికుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. వీఆర్ఎస్, గోల్డెన్ హ్యాండ్షేక్ వంటి స్కీమ్లతో గత 14 ఏళ్లలో దాదాపు 28 వేల మంది కార్మికులు ఇంటిబాట పట్టినట్లు కంపెనీ గణాంకాలే చెబుతున్నాయి. 2013–14 సంవత్సరంలో 61,778 మంది కార్మికులు ఉండగా, ప్రస్తుతం 39,460 మంది కార్మికులు మాత్రమే పనిచేస్తున్నారు. సంస్థలో కార్మికుల సంఖ్య తగ్గుతున్నా యాజమాన్యం మాత్రం ఏటా ఉత్పత్తి రేషియోను 10 శాతం పెంచుకుంటూ పోతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 72 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యం నిర్దేశించుకుంది. అయితే కార్మికుల సంఖ్య తగ్గుతుంటే, ఉత్పత్తి లక్ష్యం పెంచడం వల్లే కార్మికులపై పనిభారం పెరుగుతోందని కార్మిక నాయకులు ఆరోపిస్తున్నారు. ఏడాది కార్మికుల ఉత్పత్తి (మిలియన్ సంఖ్య టన్నులు) 2013-14 61,778 50.47 2017-18 54,043 62.01 2021-22 43,672 65.02 2025-26 39,460 68.00సింగరేణిలో పెరుగుతున్న పనిభారం -
వేగంగా.. సులభంగా !
ఖమ్మంవ్యవసాయం: ఈదురుగాలులతో కూడిన వర్షం ఎప్పుడు కురుస్తుందో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. ఈక్రమాన చెట్లు విరిగి విద్యుత్ లైన్లపై పడినా, విద్యుత్ స్తంభాలు నేలకొరిగి సరఫరాకు అంతరాయం ఏర్పడినా తక్షణమే మరమ్మతులు చేసేలా ఖమ్మం సర్కిల్ పరిధిలో ఎమర్జెన్సీ రీస్టోరేషన్ బృందాలను ఏర్పాటుచేశారు. ఐటీఐలో ఎలక్ట్రీషియన్, ఫిట్టర్ విద్యార్హత, ఇతర సాంకేతికత నైపుణ్యాలు ఉన్న వారిని ఈ బృందాల్లో నియమించారు. సర్కిల్ పరిధిలో ఆరుగురు సభ్యులతో ఐదు బృందాలను ఏర్పాటుచేశారు. ఈ బృందాలకు పనిమట్లు, కండక్టర్లు, ఇన్సులేటర్లు, కేబుళ్లతో కూడిన వాహనాలు కూడా సమకూర్చారు. మున్సిపాలిటీల వారీగా.. జిల్లాలోని మున్సిపాలిటీలను కేంద్రాలుగా చేసుకుని ఈ బృందాలను నియమించారు. అయితే మున్సిపాలిటీ పరిధిలోనే కాక కేటాయించిన ఇతర ప్రాంతాల్లోనూ విద్యుత్ పునరుద్ధరణ పనులు చేపట్టాల్సి ఉంటుంది. సర్కిల్ పరిధిలో ఐదు విద్యుత్ డివిజన్లు, 13 సబ్ డివిజన్లు ఉండగా ఇక్కడి అధికారుల పర్యవేక్షణలో బృందాలు పనిచేస్తాయి. ఖమ్మం నగరంలో రెండు బృందాలతో పాటు మధిర, ఏదులాపురం, సత్తుపల్లి మున్సిపాలిటీల పరిధిలో ఒక్కో బృందాన్ని నియమించారు. సమస్య ఉన్న చోటకు... వేసవిలో ఈదురుగాలుల కారణంగా విద్యుత్ స్తంభాలు విరగడంతో పాటు లైన్లు తెగిపడడం, ట్రాన్స్ఫార్మర్లు కూలిపోవడం, తీగలు, స్తంభాలపై చెట్ల కొమ్మలు విరిగిపడడడం జరుగుతుంటుంది. ఇలాంటి సమస్యలు ఎదురైన చోటకు బృందాలు చేరుకుని విద్యుత్ లైన్ల పురుద్ధరణ పనులు చేపడతారు. వాహనాలకు జీపీఆర్ఎస్ అమర్చిన నేపథ్యాన సమస్య ఎదురైన ప్రాంతానికి సులువుగా చేరుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. అయితే, బృందాలను ఎమర్జెన్సీ రీస్టోరేషన్ సేవలకే కాక సెక్షన్లలోని ఆపరేషన్ మెయింటనెన్స్ విభాగంలో సిబ్బంది కొరత ఉన్న చోట కూడా పనులకు వినియోగిస్తున్నారు.విద్యుత్ మరమ్మతులు, పునరుద్ధరణ పనులను వేగంగా చేపట్టేలా ఎమర్జెన్సీ రీస్టోరేషన్ బృందాలను ఏర్పాటు చేశాం. సమస్య ఉన్న చోటకు సభ్యులు వాహనాల్లో వెళ్లి పనులు చేపడుతారు. ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈ వాహనాలపై 1912 టోల్ ఫ్రీ నంబర్ ముద్రించాం. సమస్య ఉన్న ప్రాంతం వివరాలను ఫోన్లో తెలియచేస్తే బృందాలు చేరుకుంటాయి. – ఇనుగుర్తి శ్రీనివాసాచారి, ఎస్ఈ, ఖమ్మం -
19న తెలంగాణ మోడల్ స్కూళ్ల ప్రవేశపరీక్ష
ఖమ్మం సహకారనగర్: వచ్చే విద్యాసంవత్సరానికి తెలంగాణ మోడల్ స్కూళ్లలో 6వ తరగతికి ప్రవేశాలు కల్పించడంతో పాటు 7 నుంచి 10వ తరగతుల్లో మిగిలిన సీట్ల భర్తీకి ఈనెల 19న కామన్ ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహించనున్నట్లు డీఈఓ చైతన్యజైనీ తెలిపారు. ఆరో తరగతి పరీక్ష ఉదయం 10నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, 7 నుండి 10వ తరగతుల పరీక్ష మధ్యాహ్నం 2నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరుగుతుందని వెల్లడించారు. కారేపల్లి మోడల్ స్కూల్, జెడ్పీహెచ్ఎస్, టేకులపల్లి మోడల్ స్కూళ్లలో కేంద్రాలు ఏర్పాటుచేసినట్లు తెలిపారు. కాగా, ప్రశ్నాపత్రం లీకేజీపై ఎవరైనా ప్రచారం చేస్తే తల్లిదండ్రులు నమ్మొద్దని, అలాంటి సమాచారాన్ని కలెక్టర్, సీపీ లేదా తమకు తెలియచేయాలని డీఈఓ ఓ ప్రకటనలో కోరారు. మార్కెట్ల రిటైర్డ్ ఉద్యోగుల కార్యవర్గం ఎన్నిక ఖమ్మంవ్యవసాయం: వ్యవసాయ మార్కెట్ కమిటీల విశ్రాంత ఉద్యోగుల ఉమ్మడి జిల్లా కమిటీని ఆదివారం ఎన్నుకున్నారు. ఖమ్మం మార్కెట్లో టి.విశ్వనాథం అధ్యక్షతన జరిగిన సమావేశంలో సమస్యలపై చర్చించాక నూతన కమిటీని ప్రకటించారు. గౌరవ సలహాదారుగా ఆమంచి కోటయ్య, గౌరవ అధ్యక్షుడిగా టి.విశ్వనాథం, అధ్యక్షుడిగా జల్లా వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శిగా శ్రీపాద నిరంజన్, కోశాధికారిగా సీహెచ్.నాగేశ్వరరావు ఎన్నికయ్యారు. అలాగే, ఉపాధ్యక్షులుగా డి.ఉప్పలయ్య, బి.సుధాకర్, రెంటాల చిన్నహుస్సేన్, పరిటాల సత్యనారాయణ, మూర్తి, సంయుక్త కార్యదర్శులుగా ఎం.ఆంజనేయులు, ఎం.కేశవరావు, కె.సురేందర్రెడ్డి, కార్యవర్గ సభ్యులుగా ఎం.అరుణ్కుమార్, పి.వెంకయ్య, డి వెంకటేశ్వర్లు, ఉమామహేశ్వరరావు, ఆర్.రెడ్డి, బాబులాల్, ఉదయలక్ష్మి, శర్మ, సారంగపాణిని ఎన్నుకోగా, ఆర్సీహెచ్.హుస్సేన్ రాసిన శిశిర సింధూరం గేయ సంపుటిని ఆవిష్కరించారు. -
విద్యా కమిషన్ సిఫారసులపై చర్చ జరగాలి
మధిర: రాష్ట్ర విద్యా కమిషన్ ఇటీవల సమర్పించిన నివేదికలోని సిఫారసులపై సమగ్ర చర్చ జరపాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావా రవి డిమాండ్ చేశారు. అంతేకాక ప్రభుత్వ విద్యారంగానికి నష్టం కలిగించేవి, ఉపాధ్యాయుల గౌరవానికి భంగం కలిగించే అంశాలను తొలగించి విద్యాభివృద్ధికి దోహదపడే అంశాలనే అమలు చేయాలని సూచించారు. మధిరలో యూనియన్ జిల్లా కార్యదర్శి షేక్ నాగూర్ వలీ అధ్యక్షతన ఆదివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉపాధ్యాయ సంఘాలు, విద్యారంగ నిపుణులతో చర్చించకుండా, కనీసం అసెంబ్లీలో చర్చకు పెట్టకుండా ఏకపక్షంగా సిఫారసులు అమలు చేయాలని నిర్ణయించడం సరికాదన్నారు. అలాగే, ఉద్యోగులు, పెన్షనర్లు ఎదురుచూస్తున్న పీఆర్సీ అమలుచేయడమే కాక పెండింగ్ బిల్లులు, డీఏలు విడుల చేయాలని కోరారు. అంతేకాక సర్వీసు నిబంధనలు, పదోన్నతులు, టెట్ మినహాయింపు, సీపీఎస్ రద్దు, 2003 డీఎస్సీ టీచర్లు, కేజీబీవీ, సమగ్ర శిక్షా అభియాన్, మోడల్ స్కూళ్లు, గురుకులాల ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం పోరాటానికి సిద్ధమవుతున్నట్టు రవి తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి పారుపల్లి నాగేశ్వరరావు, నాయకులు అనుమోలు కోటేశ్వరరావు, రామకృష్ణ, నాగరాజు, వీరయ్య పాల్గొన్నారు. -
యాదవులు సంఘటితంగా పోరాడాలి
ఖమ్మంమామిళ్లగూడెం: యాదవుల జనాభా 18 శాతం ఉన్నా అందుకు తగినట్లు రాజకీయ అవకాశాలు దక్కడం లేదని.. ఈ విషయాన్ని గుర్తించి రాజకీయాలకతీతంగా యాదవులు సంఘటితమైతే భవిష్యత్లో రాజ్యాధికారం సిద్ధిస్తుందని జూబ్లిహిల్స్ ఎమ్మెల్యే నవీన్యాదవ్ తెలిపారు. అఖిలభారత యాదవ మహాసభ, గొర్రెలు, పెంపకందారుల జిల్లా సహకార సంఘం సంయుక్త ఆధ్వర్యాన నవీన్యాదవ్తో పాటు ఇటీవల సర్పంచ్లు, వార్డు సభ్యులు, కౌన్సిలర్లుగా గెలిచిన యాదవులను ఆదివారం ఖమ్మంలో సన్మానించారు. నవీన్యాదవ్ మాట్లాడుతూ.. ఎవరికి ఏ సమస్య వచ్చినా అండగా నిలుస్తానని చెప్పారు. అనంతరం మల్లిబాబుయాదవ్, చిలకల వెంకట నరసయ్యయాదవ్, చిత్తారు సింహాద్రియాదవ్, పుచ్చకాయల వీరభద్రం, గంగదేవుల లోకేశ్యాదవ్, వాగదాని పుల్లారావు మాట్లాడుతూ.. నవీన్యాదవ్కు మంత్రి పదవి ఇవ్వడంతో పాటు జిల్లా యాదవులకు రాజకీయంగా ప్రాతినిధ్యం కల్పించాలని కోరారు. అలాగే, గొర్రెల పెంపకందారులకు రుణాలు, ప్రమాదవశాత్తు మరణిస్తే ఎక్స్గ్రేషియా, ఖమ్మంలో గొర్రెల మార్కెట్ యార్డుకు నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో లోడిగ వెంకన్న, దుబాకుల వెంకటేశ్వర్లు, చంద్రకాని రమణ, తెల్లబోయిన వెంకటరమణ, మేకల మల్లికార్జునరావు, దుబాకుల శ్రీనివాస్, చేతుల నాగేశ్వరరావు, మొరిమేకల కోటయ్య, ముసలయ్య, వేణు, కుమార్, ఐలయ్య, మంద నాగేశ్వరరావు, పుట్ట ఉపేందర్, డేగల ఉపేందర్, అల్లిక అంజయ్య, బుక్కా కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.సన్మాన సభలో ఎమ్మెల్యే నవీన్యాదవ్ -
గోదాం పేరుతో గుట్ట గుల్ల
కారేపల్లి: అదొక గుట్ట.. అది రెవెన్యూ శాఖ పరిధిలో ఉండడంతో ప్రభుత్వం గోదాం నిర్మాణానికి నిర్ణయించి కాంట్రాక్టర్కు పనులు కట్టబెట్టింది. దీన్ని అలుసుగా తీసుకున్న సదరు కాంట్రాక్టర్ పరి మితికి మించి గుట్టను జేసీబీలతో తవ్విస్తూ మట్టి, రాళ్లను కిందకు తరలించి అమ్మకోవ డం మొదలు పెట్టాడని తెలిసింది. ఇందుకోసం గుట్ట పైనుంచి కిందకు ఏకంగా రోడ్డు మాదిరి చదును చేయించడం గమనార్హం. దీన్ని పక్క న పెడితే హద్దులుదాటి అటవీ భూమిలోనూ తవ్వకాలు మొదలుపెట్టడంతో అటు స్థానికులు, ఇటు అటవీ అధికారులు పనులను అడ్డుకున్నారు. ఫలితంగా గోదాం నిర్మాణ పనులు ఆగిపోయాయి. అయితే, ఇదంతా జరిగేలోగా సదరు కాంట్రాక్టర్ రూ.లక్షల్లో ఆర్జించినట్లు విమర్శలు వస్తున్నాయి. ఎక్కడ.. ఏమిటీ కథ? కారేపల్లి మండలం గుట్టకిందిగుంపు గ్రామ సమీపా న గంగదేవి గుట్ట ఉంటుంది. ఈ గుట్టపై గోదాం నిర్మించేందుకు ప్రభుత్వం 10 ఎకరాల భూమి కేటాయించడమే కాక రూ.9కోట్ల నిధులు మంజూరు చేసింది. ఈమేరకు కాంట్రాక్టర్కు అప్పగించగా మూడునెలల క్రితం పనులు మొదలయ్యాయి. మొదట్లో అంతా సవ్యంగానే సాగినా సదరు కాంట్రాక్టర్ గుట్టపై చెట్లు నరికివేయడమే కాక మట్టిని జేసీబీలతో కొల్లగొట్టి టిప్పర్లతో తరలించడం ప్రారంభించాడు. ఇందుకోసం గుట్టను తొలిచి ఇల్లెందు–కారేపల్లి ప్రధాన రహదారి వరకు సుమారు 500 మీటర్ల రోడ్డు వేసేశాడు. దీంతో స్థానికులు పరిశీలించడంతో జేసీబీలతో తొలుస్తూ పదుల సంఖ్యలో టిప్పర్లతో మట్టిని తరలిస్తున్నట్లు తేలగా పనులు చేపట్టేందుకు వీల్లేదని పట్టుబట్టారు. అది కూడా మనదే ! మండలంలోని చీమలపాడులో 33 ఎకరాల మేర అటవీ భూమిని సీతారామ ప్రాజెక్టు కాల్వ నిర్మాణంలో సేకరించారు. ఇందుకు బదులుగా రెవెన్యూ గుట్ట అయిన గంగదేవి గుట్టపై 33 ఎకరాలను అటవీశాఖకు కేటాయించారు. కాగా, రెవెన్యూ పరిధిలోనే గోదాం నిర్మాణ పనులు చేపట్టాల్సిన కాంట్రాక్టర్ అక్కడ మట్టి తవ్వి తరలిస్తూనే కొద్దికొద్దిగా అటవీ శాఖకు కేటాయించిన భూమి నుంచి కూడా తవ్వకాలు మొలుపెట్టాడు. ఈ విషయాన్ని ఫిబ్రవరి 25న గుర్తించిన కారేపల్లి అటవీ అధికారులు టిప్పర్లను అడ్డుకుని పోలీసులకు అప్పగించారు. అయితే, నియోజకవర్గ స్థాయి ప్రజాప్రతినిధి ఒకరు కలగజేసుకోవడంతో అప్పటి వరకు అటవీ అధికారులు – కాంట్రాక్టర్ నడుమ వివాదం సద్దుమణిగింది. మేం ఊరుకునేదే లేదు.. తవ్వకాల విషయంలో అటవీ అధికారులు కాస్త మెత్తబడినా.. స్థానికులు మాత్రం ససేమిరా అన్నారు. నూరు శాతం ఆదివాసీ గ్రామమైన గుట్టకింది గుంపు గ్రామంలోని గంగదేవి గుట్టను గోదాం నిర్మాణం పేరుతో ధ్వంసం చేస్తున్నారని, మట్టి తరలిస్తూ కాంట్రాక్టర్ రూ.లక్షల్లో ఆర్జిస్తున్నాడంటూ తుడుందెబ్బ, ఆదివాసీ సంక్షేమ పరిషత్ నాయకులే కాక గుట్టకిందిగుంపు సర్పంచ్ ఉండం రాఘవులు, గ్రామస్తులు పనులు అడ్డుకుని మార్చి 25న ఆందోళన చేపట్టారు. జీపీ తీర్మానం లేకుండా పనులు చేపట్టడమే తప్పు కాగా, ఇక మట్టి తవ్వకాలను సహించేది లేదని హెచ్చరించారు. స్థానికులు, నాయకుల తిరుగుబాటును గమనించిన కాంట్రాక్టర్ పనులను నిలిపివేశాడు. అప్పటికి కానీ స్పందించని ఉన్నతాధికారులు ఈ విషయంపై దృష్టి సారించారు. ఈమేరకు రెండు రోజుల క్రితం గిడ్డంగుల సంస్థ ఎస్ఈ ఆర్.శ్రీనివాసరావు గ్రామానికి వచ్చారు. పనుల ప్రదేశాన్ని పరిశీ లించడమే కాక సర్పంచ్, గ్రామస్తులతో మాట్లాడి అభ్యంతరాలపై ఆరా తీశారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని చెప్పిన నేపథ్యా న.. ఆ తర్వాత ఏం జరగనుందోనని స్థానికులు ఎదురుచూస్తున్నారు.ఇష్టారాజ్యంగా మట్టి, రాళ్ల తవ్వకం, తరలింపు -
వేడుకగా డిప్యూటీ సీఎం కుమారుడి రిసెప్షన్
ఖమ్మంమయూరిసెంటర్: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క – నందిని దంపతుల కుమారుడు సూర్య విక్రమాదిత్య – సాక్షి వివాహ రిసెప్షన్ ఆదివారం ఖమ్మంలో వేడుకగా జరిగింది. ఖమ్మం వైఎస్సార్ కాలనీలోని గ్రీన్హిల్స్లో నిర్వహించిన రిసెప్షన్కు ఉమ్మడి ఖమ్మం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులు, నాయకులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దంపతులు మాట్లాడుతూ గత నెల 5న హైదరాబాద్లో వివాహం జరగగా, జిల్లా ప్రజల ఆశీస్సుల కోసం ఇక్కడ రిసెప్షన్ ఏర్పాటుచేశామని వెల్లడించారు. ఈమేరకు హాజరైన వారికి కృతజ్ఞతలు తెలిపారు. -
మీ సేవలకు ‘సెలవు’!
గురుకులాల్లోని ఔట్ సోర్సింగ్ సిబ్బందికి నెలన్నర పాటు విరామం ప్రకటించగా, మైనార్టీ విద్యాసంస్థల్లో అమలవుతోంది.ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో పనిచేస్తా. ఆర్టీసీ బస్సులో నిత్యం వచ్చి వెళ్తుంటాను. మహాలక్ష్మి పథకానికి ముందు ప్రతీనెల పాస్ కొనుగోలు చేశాను. ఇప్పుడు ఉచిత ప్రయాణం అందుబాటులోకి రాగా పాస్ కొనే నగదు వేతనంలో ఆదా అవుతోంది. – మాధవి, నేలకొండపల్లిప్రభుత్వం మహిళల కోసం తీసుకొచ్చిన మహాలక్ష్మి పథకం మాకు కలిసొచ్చింది. తక్కువ వేతనాలతో పని చేసే మాకు ఈ పథకం వచ్చాక భారం తప్పింది. చార్జీల నగదును ఇతర అవసరాలకు వినియోగిస్తూ, కొంత పొదుపు చేసుకునే వెసులుబాటు కలిగింది. – ప్రియ, నేలకొండపల్లి -
క్రీడలతో దేహదారుఢ్యం, ఆరోగ్యం
సూపర్బజార్(కొత్తగూడెం): క్రీడలతో దేహదారుఢ్యం, మానసికోల్లాసం, ఆరోగ్యం దరిచేరుతుందని రాజ్య సభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర అన్నారు. కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని ప్రగతి మైదానంలో గాయత్రి క్రికెట్ చాంపియన్ షిప్ టోర్నీని శనివారం ఆయన ప్రారంభించా రు. తొలుత బీఆర్ఎస్ నాయకులు దిండిగల రాజేందర్, వనమా రాఘవేందర్, కాపు సీతాలక్ష్మి, మున్నూరుకాపు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆకుల గాంధీతో కలిసి అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. అనంతరం ఎంపీ మాట్లాడు తూ యువత క్రీడలపై దృష్టి సారించి సూచించారు. పోటీల నిర్వాహకులు బి. శ్రీనివాస్, కన్నీ, బీఆర్ఎస్ నాయకులు ఏనుగుల రాకేష్రెడ్డి, రంగనాథ్, బాదావత్ శాంతి, కార్పొరేటర్లు మల్హోత్రా సాగర్, సింధు తపస్వీ తదితరులు పాల్గొన్నారు. అండగా నిలుస్తాం కొత్తగూడెంఅర్బన్: ఎన్నికలలో గెలిచినా, ఓడినా బీఆర్ఎస్ నేతలు ప్రజలకు అండగా నిలుస్తారని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర తెలిపారు. కొత్తగూడెంలో జరిగిన పలు కార్యక్రమాలకు హాజరైన ఆయన మాజీ కౌన్సిల ర్ రుక్మాంగధర్ బండారి ఇంట్లో నాయకులతో మా ట్లాడారు. పద్మశాలి సంఘం నూతన కమిటీని అభినందించారు. మాజీ మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి, బీఆర్ఎస్ నాయకులు వనమా రాఘవేంద్రరావు, దుండిగల రాజేందర్, ఆకుల గాంధీ, వేములప్రసాద్, అంబుల వేణు పాల్గొన్నారు. -
వైద్యాన్ని ప్రజల దరికి చేర్చడం ప్రభుత్వాల బాధ్యత
ఖమ్మంమయూరిసెంటర్: పేద, మధ్యతరగతి ప్రజలకు మెరుగైన వైద్యం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదేనని ప్రముఖ వైద్యుడు యలమంచిలి రవీంద్రనాథ్, సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు పోతినేని సుదర్శన్రావు అన్నారు. బీపీ, షుగర్ బాధితుల కోసం నెలనెలా బోడేపూడి విజ్ఞాన కేంద్రం (బీవీకే) – సీపీఎం ఖమ్మం టు టౌన్ కమిటీ ఆధ్వర్యాన నిర్వహిస్తున్న ఉచిత మెడికల్ క్యాంపులకు దశాబ్దం పూర్తవుతున్న సందర్భంగా ఖమ్మం మంచికంటి ఫంక్షన్ హాల్లో శనివారం మెగా క్యాంపు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రూ.100 ఫీజుతో నెలకు సరిపడా మందులు అందిస్తూ పదేళ్లుగా శిబిరాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ విషయంలో దివంగత ఎమ్మెల్యే బోడేపూడి వెంకటేశ్వరరావు చూపిన శ్రద్ధను గుర్తు చేసుకున్నారు. అనంతరం సీపీఎం ఖమ్మం డివిజన్ కార్యదర్శి వై.విక్ర మ్ మాట్లాడుతూ మొదట్లో క్యాంపునకు 40–50 మంది హాజరయ్యేవారని, ఇప్పుడు 500 మందికి పైగా వస్తున్నారని తెలిపారు. శిబిరాలకు సహకరిస్తున్న వీవీసీ సంస్థల అధినేత వంకాయలపాటి రాజేంద్రప్రసాద్, చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు కురువెళ్ల ప్రవీణ్కుమార్, ప్రముఖ వ్యాపాని భీమనాదుల పుల్లారావు, వైద్యులు చీకటి భారవి, రవీంద్రనాథ్, రంగారావు, సుబ్బారావుతో పాటు క్యాంపునకు హాజరైన వైద్యులను సన్మానించారు. బీవీకే వైస్ చైర్మన్ యలమద్ది శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, వివిధ విభాగాల వైద్యులు పేర్ల హర్షతేజ, పిల్లలమర్రి సుబ్బారావు, యలమూడి మనో జ్, రావెళ్ల రంజిత్, అడప జయశ్రీ, యమున, రజిత, శ్రీలేఖ, రావూరి హర్ష, వినీషా, తన్మయి, రంగారావు, సురేష్తో పాటు నాయకులు యర్రా శ్రీని వాస్, మెరుగు సత్యనారాయణ, బోడపట్ల సుదర్శన్, పొన్నం వెంకటేశ్వరరావు, పారుపల్లి ఝాన్సీ, ఎం.సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. -
ఉపాధి కూలీలకు ఊరట
● ఈనెల కూడా పాత పేరుతోనే పథకం కొనసాగింపు ● జిల్లాకు 10 లక్షల నుండి 15 లక్షల పనిదినాలు ● ఎండల దృష్ట్యా ఉదయమే చేపట్టేలా చర్యలు ఖమ్మంమయూరిసెంటర్: జిల్లాలోని ఉపాధి హామీ కూలీలకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. సాధారణంగా ఆర్థిక సంవత్సరం ముగింపులో పని దినాల లక్ష్యంతో దాటితే పనులు ఆగిపోయే ప్రమా దం ఏర్పడుతుంది. ఈసారి కూడా అలాగే జరగడం, ఉపాధి హామీ పథకంలో తీసుకొచ్చిన మార్పుల అమలుకు సమయం పట్టనుండడంతో ఏప్రిల్ నెలలో కూడా పాత పేరుతో కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు సమర్పించింది. దీంతో సానుకూలంగా స్పందించిన కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఏప్రిల్ కోసం రాష్ట్రవ్యాప్తంగా అదనంగా 2.5 కోట్ల పనిదినాలను కేటాయిస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ఫలితంగా జిల్లాలో కూడా గ్రామీణ ప్రాంత కూలీలకు ఉపాధి దక్కనుంది. జిల్లాలో భారీగా డిమాండ్ వ్యవసాయ పనులు లేకపోవడంతో జిల్లాలోని గ్రామీణ ప్రాంత కూలీలంతా ఉపాధి హామీ పనులపైనే ఆధారపడుతున్నారు. దీంతో జిల్లాలో ఏప్రిల్కు దాదాపు 20 లక్షలకు పైగా పనిదినాలు అవసరమవుతాయని అధికారులు గుర్తించారు. అయితే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి కేటాయించిన పనిదినాల ప్రకారం జిల్లాకు 10 లక్షల నుండి 15 లక్షల పనిదినాలు కేటాయించే అవకాశం ఉంది. 2026–27 ఆర్థిక సంవత్సరంలో కొత్తగా వీబీ–జీరాం చట్టం అమలు కానుండగా, ప్రస్తుతం ఉన్న మిగిలిపోయిన నిధులతోనే పనులను కొనసాగించనున్నారు. ఇందుకు సంబంధించి ఒకటి, రెండు రోజుల్లో ఉత్తర్వులు వెలువడనున్నాయని సమాచారం. ఈనెల కూడా పాత పథకమే కొనసాగనున్న దృష్ట్యా వేలాది మంది పేద కుటుంబాలకు ఉపాధి లభించడమే కాకుండా, పెండింగ్ పనుల పూర్తికి అవకాశం కలుగుతుంది. బిల్లుల చెల్లింపులపై దృష్టి ఉపాధి హామీ పథకానికి మార్పులు జరగనుండడంతో అధికారులు పాత బిల్లులపై దృష్టి సారించారు. ప్రస్తుతం కొనసాగుతున్న పనులను పూర్తి చేయించడమే కాక పూర్తయిన పనులకు బిల్లుల చెల్లింపు వేగవంతం చేశారు. కొత్త చట్టం అమల్లోకి వచ్చేలోగా పాత రికార్డులను క్లియర్ చేయడానికి పొడిగించిన నెల సమయం అధికారులకు కీలకం కానుంది.ప్రస్తుతం ఎండలు ముదురుతుండడంతో కూలీల ఆరోగ్య దృష్ట్యా అధికారులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. ఎండ తీవ్రత పెరగకముందే ఉదయం పూట పనులు ముగించేలా ఫీల్డ్ అసిస్టెంట్లకు సూచనలు చేస్తున్నారు. అంతేకాక పని ప్రదేశాల్లో నీడ కోసం టెంట్లు ఏర్పాటుచేయడమే కాక తాగునీరు, ఫస్ట్ ఎయిడ్ కిట్లు సమకూరుస్తున్నారు. అదనపు పనిదినాలకు సంబంధించి నిధులు కూడా వెంటనే విడుదలయ్యేలా కేంద్రం ప్రణాళికలు సిద్ధం చేయడంతో వేతనాల చెల్లింపుల్లో జాప్యం ఉండబోదని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. -
యుద్ధంతో ప్రపంచ శాంతికి విఘాతం
ఖమ్మంగాంధీచౌక్: పశ్చిమ, తూర్పు దేశాల్లో కొనసాగుతున్న యుద్ధం ప్రపంచ శాంతికి విఘాతం కలిగిస్తోందని ఉమ్మడి జిల్లా ఆర్సీఎం బిషప్ డాక్టర్ సగిలి ప్రకాష్ పేర్కొన్నారు. ఈనేపథ్యాన శాంతి నెలకొనాలని ఆకాంక్షిస్తూ ఖమ్మంలో శనివారం ఐక్య క్రైస్తవ సంఘాల ఆధ్వర్యాన రన్ ఫర్ జీసస్ పేరిట శాంతి ర్యాలీ నిర్వహించారు. పెవిలియన్ గ్రౌండ్ వద్ద ప్రారంభమైన ర్యాలీని ఉద్దేశించి ప్రకాష్ మాట్లాడుతూ యుద్ధంతో అనేక దేశాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, కొన్నిచోట్ల నిత్యావసరాలు లభించని పరిస్థితి నెలకొందన్నారు. ఈమేరకు యుద్ధం ముగిసి శాంతి వెల్లివిరియాలని ఆకాంక్షించారు. కాగా, దళిత క్రైస్తవులకు ఎస్సీ రిజర్వేషన్ తీర్పుపై సుప్రీంకోర్టు తీర్పును పునఃసమీక్షించాలని కోరారు. అనంతరం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కార్యాలయ ఇన్చార్జి తుంబూరి దయాకర్రెడ్డి మాట్లాడగా, ర్యాలీ మయూరిసెంటర్, పాత బస్టాండ్, వైరా రోడ్, జెడ్పీ సెంటర్, ఇల్లెందు క్రాస్ మీదుగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల వరకు సాగింది. ఈ కార్యక్రమంలో క్రైస్తవ సంఘాల ప్రతినిధులు రమేష్, టి.శౌరి, సూరేపల్లి ఐజక్, విజయ్కుమార్, పల్లా రవికిషోర్, జాకబ్, ముత్తమాల ప్రసాద్, కొమ్ము ప్రసాద్, సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు. ఆర్సీఎం బిషప్ సగిలి ప్రకాష్ -
హైవేపైకి స్వాగతం!
● సోమవరం వద్ద ప్రవేశానికి అనుమతి ● రెండు రోజులుగా గ్రీన్ఫీల్డ్ హైవేపై రాకపోకలు వైరా: ఖమ్మం – దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవేపై వాహనాల రాకపోకలు అధికారికంగా ప్రారంభమయ్యాయి. అయితే, ఖమ్మంలో కాకుండా వైరా మండలం సోమవరం వద్ద హైవేపైకి ఈనెల 2వ తేదీ నుంచి వాహనాలను అనుమతిస్తున్నారు. హైదరాబాద్ నుంచి సూర్యాపేట మీదుగా ఖమ్మం వస్తున్న వాహనాలు వైరా దాటాక సోమవరం వద్ద గ్రీన్ఫీల్డ్ హైవే పైకి చేరుకుంటున్నాయి. ఫలితంగా దేవరపల్లి వరకు జాతీయ రహదారిపై రాకపోకలు ఊపందుకుంటున్నాయి. 162కి.మీ. నిడివితో నిర్మాణం.. ఖమ్మం నుంచి దేవరపల్లి వరకు 162 కిలోమీటర్ల నిడివితో జాతీయ రహదారి నిర్మాణం చేపట్టారు. ఈ హైవే ఖమ్మం జిల్లాలోనే 105 కి.మీ. మేర ఉంది. అయితే, ఖమ్మం సమీపాన మున్నేటిపై వంతెన, ధంసలాపురం వద్ద రైల్వేలైన్పై బ్రిడ్జి నిర్మాణ పనులు ఇంకా పూర్తికాలేదు. ఈ ఏడాది జనవరిలో సంక్రాంతి సమయాన వైరా వద్ద హైవేపైకి వాహనాలను అనుమతించినా ప్రమాదాలు జరగడంతో నిలిపివేశారు. కాగా, మున్నేరు, రైల్వేలైన్పై బ్రిడ్జిల నిర్మాణ పనులకు ఇంకా సమయం పట్టనుండడంతో రద్దీని నియంత్రించేలా వైరా మండలం సోమవారం వద్ద హైవేపైకి వాహనాలను అధికారికంగా అనుమతిచాలని నిర్ణయించారు. ఈవిషయమై అవగాహన కల్పించేలా ఖమ్మం నుంచి వైరా వరకు పలు ప్రాంతాల్లో సైన్బోర్డులు ఏర్పాటు చేశారు. అంతా సిద్ధం.. రెండు బ్రిడ్జిలు మినహా హైవే నిర్మాణం దాదాపు పూర్తయింది. డివైడర్ల నిర్మాణం పూర్తికాగా పూల మొక్కలు నాటడమే కాక వేగ నియంత్రణను తెలిపేలా సైన్ బోర్డుల ఏర్పాటు, రెస్ట్ రూమ్లు, పెట్రోల్ బంక్లు, వైద్య సదుపాయం కోసం కల్లూరు మండలం లింగాల సమీపాన గదులు నిర్మించారు. అంతేకాక టోల్ రుసుము వసూలుకు గేట్లు కూడా ఏర్పాటు చేశారు. రాత్రి వేళ వెలుగుల కోసం సోలార్ లైట్లు బిగించారు. ఈనేపథ్యాన హైదరాబాద్ నుంచి సూర్యాపేట మీదుగా ఖమ్మం చేరుకుంటున్న వాహనాలు.. ఆపై 20 కి.మీ. ప్రయాణిస్తే వైరా మండలం సోమవరం వద్ద ఎంట్రీ పాయింట్ వస్తుంది. అక్కడ హైవేపైకి చేరితే దేవరపల్లి వరకు సులువుగా వెళ్లే అవకాశం ఉండడంతో వాహనదారులు వినియోగించుకుంటున్నారు. -
డీసీసీబీ లాభాల్లో పీఏసీఎస్లకు వాటా
ఖమ్మంవ్యవసాయం: జిల్లా కేంద్ర సహకార బ్యాంక్(డీసీసీబీ) 2025–26 ఆర్థిక సంవత్సరం సాధించిన రూ.30 కోట్ల లాభాల నుంచి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల(పీఏసీఎస్)లకు రూ.6 కోట్లను డివిడెంట్ రూపంలో అందించింది. ఈమేరకు డీసీసీ బీ ఆర్థిక ప్రగతి వివరాలను బ్యాంకు సీఈఓ ఎన్.వెంకట్ ఆదిత్య శనివారం ఓ ప్రకటనలో వెల్లడించారు. వ్యాపారంతో పాటే లాభాలు గతంతో పోలిస్తే 2025–26 ఆర్థిక సంవత్సరంలో బ్యాంకు రూ.878 కోట్ల వ్యాపారాన్ని పెంచుకొని మొత్తం రూ.4,338 కోట్ల లావాదేవీలకు చేరిందని సీఈఓ తెలిపారు. తద్వారా రాష్ట్రంలోని ఉన్న తొమ్మిది కేంద్ర సహకార బ్యాంకుల్లో రెండో స్థానాన నిలిచిందని పేర్కొన్నారు. రుణాలను సకాలంలో వసూలు చేయడం ద్వారా నిరర్ధక ఆస్తుల శాతాన్ని 0.95కు తగ్గించామని తెలిపారు. 2024–25 ఆర్థిక సంవత్సరంలో రూ.5.30 కోట్ల లాభాలు గడిస్తే.. 2025–26లో రూ.30 కోట్లకు చేరాయని, ఇందులో నుంచి పీఏసీఎస్లకు డివిడెంట్గా అందించామని పేర్కొన్నారు. రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సహకారం, కలెక్టర్, బ్యాంకు పర్సన్ ఇన్చార్జి అనుదీప్ దురిశెట్టి పర్యవేక్షణలో అధికారులు, ఉద్యోగుల కృషి ఫలితంగా ఆర్ధికాభివృద్ధి నమోదైందని, 2026–27లో లావాదేవీలను రూ. 6 వేల కోట్లకు పెంచేలా కృషి చేస్తున్నామని తెలిపారు.డివిడెంట్గా రూ.6కోట్ల పంపిణీ -
30వరకు సాగర్ జలాలు విడుదల చేయండి
ఖమ్మంమయూరిసెంటర్: నాగార్జునసాగర్ ఎడమ కాలువ ద్వారా ఈనెల 30 వరకు నీరు విడుదల చేయాలని సీపీఐ నాయకులు కోరారు. ఈ సందర్భంగా శనివారం సీఈ మంగళపూడి వెంకటేశ్వర్లుకు వినతిపత్రం అందజేశాక సీపీఐ జాతీయ సమితి సభ్యుడు బాగం హేమంతరావు మాట్లాడారు. జిల్లాలో ఎడమ కాలువ కింద రెండున్నర లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతుండగా, వరి, మొక్కజొన్న, మిర్చికి ఈ నెలాఖరు వరకు నీరు అవసరం ఉందని తెలిపారు. ఈమేరకు వారబందీ విధానంలో కాకుండా నెలాఖరు వరకు పూర్తి స్థాయిలో నీరు విడుదల చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర క్రమశిక్షణ సంఘం చైర్మన్ మహ్మద్ మౌలానా, జిల్లా కార్యదర్శి దండి సురేష్, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు దొండపాటి రమేష్, నాయకులు నంబూరి శంకర్రావు తదితరులు పాల్గొన్నారు. అసోసియేట్ ప్రొఫెసర్కు డాక్టరేట్ ఖమ్మం మామిళ్లగూడెం: ఖమ్మం బ్రౌన్స్ ఫార్మసీ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ ఫాలక్ నాజ్కు డాక్టరేట్ లభించింది. ఫార్మకాలజీ అంశంపై ఆమె ప్రొఫెసర్ డాక్టర్ ప్రవీణ పర్యవేక్షణలో సమర్పించిన పరిశోధనాత్మక గ్రంధానికి హైదరాబాద్లోని చైతన్య డీమ్డ్ టు బీ యూనివర్సిటీ డాక్టరేట్ ప్రకటించింది. ఈ సందర్భంగా హైదరాబాద్లో జరిగిన యూనివర్సిటీ స్నాతకోత్సవంలో డైరెక్టర్ డాక్టర్ రామానుజ నారాయణ్, యూనివర్సిటీ చాన్సలర్ డాక్టర్ సీహెచ్.వీ.పురుషోత్తంరెడ్డి, వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ జి.శంకర్లింగం చేతుల మీదుగా ఫాక్నాజ్ డాక్టరేట్ అందుకున్నారు. కాగా, ఆమె భర్త అస్లాంఖాన్ షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖలో సీనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వర్తిస్తున్నారు. -
కేఎంసీ ఎన్నికల్లో బీజేపీ విజయమే లక్ష్యం
ఖమ్మం మామిళ్లగూడెం: రానున్న ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ జెండాను ఎగురవేయడమే లక్ష్యంగా కార్యకర్తలు శ్రమించాలని పార్టీ జిల్లా ఇన్చార్జి బద్దం మహిపాల్రెడ్డి పిలుపునిచ్చారు. ఖమ్మంలో శనివారం జిల్లా అధ్యక్షుడు కోటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్యకర్తలు గెలుపే లక్ష్యంగా ఇప్పటినుంచే పనిచేయాలని, రాష్ట్రప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. బీజేపీ రాష్ట్ర కోశాధికారి దేవకీ వాసుదేవరావు, నాయకులు సన్నె ఉదయప్రతాప్, పుల్లారావు, గల్లా సత్యనారాయణ, గోంగూర వెంకటేశ్వరరావు, రమేష్, రుద్ర ప్రదీప్, నున్న రవికుమార్, విజయరాజు, గుత్తా వెంకటేశ్వరరావు, రాఘవరావు పాల్గొన్నారు. -
జమలాపురంలో అభిషేకం, నిత్యకల్యాణం
ఎర్రుపాలెం: మండలంలోని జమలాపురం శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు జరిగాయి. తొలుత స్వామి మూలవిరాట్తో పాటు ఆలయ ఆవరణలోని శ్రీవారి పాదానికి అర్చకులు పంచామృతంతో అభిషేకాలు చేశారు. ఆతర్వాత స్వామి, అలివేలు మంగ, పద్మావతి అమ్మవార్లను పట్టువస్త్రాలతో అలంకరించి పెద్దసంఖ్యలో హాజరైన భక్తుల సమక్షాన నిత్యకల్యాణం, పల్లకీ సేవ నిర్వహించారు. ఈఓ జగన్మోహన్రావు, వ్యవస్థాపక ధర్మకర్త ఉప్పల విజయదేవశర్మ, ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాసశర్మ, ఉద్యోగులు సోమయ్య, కృష్ణప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. 10 శాతమైనా పెంచండి రైల్వేలైన్ భూసేకరణపై నిర్వాసితుల వినతి కారేపల్లి: డోర్నకల్–భద్రాచలం రోడ్డు రైల్వే మార్గంలో డబ్లింగ్ పనుల కోసం సేకరించనున్న భూములపై నిర్వాసితులతో ఈ అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి, భూసేకరణ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రాజేశ్వరి శనివారం కలెక్టరేట్లో సమావేశమయ్యారు. సింగరేణి గ్రామానికి చెందిన నిర్వాసితులు హాజరుకాగా, ఆమె వ్యవసాయ భూమిఎకరానికి రూ.19లక్షలు, ఇంటి స్థలం గజానికి రూ.6,300 పరిహారం చెల్లిస్తామని స్పష్టం చేశారు. ఏజెన్సీ ప్రాంతాల్లో భూసేకరణకు నిర్ణయించిన ధర ఇదేనని చెప్పగా, నిర్వాసితులు అంగీకరించలేదు. నాన్ ఏజెన్సీ భూముల ధరలను కూడా పరిగణనలోకి తీసుకుని కనీసం పది శాతమైన పెంచాలని కోరారు. ఇప్పటికి రెండు సార్లు సమావేశం ఏర్పాటుచేసినా ఫలితం లేనందున, వైరా ఎమ్మెల్యే రాందాస్నాయక్ సమక్షాన ఇంకోసారి భేటీ ఏర్పాటుచేయాలని విజ్ఞప్తి చేశారు. అయితే, వారంలోగా నిర్వహించే సమావేశంలో నిర్ణయం తెలపాలని అధికారులు సూచించారు. పీహెచ్సీ పనులు వేగంగా పూర్తి చేయాలి అదనపు కలెక్టర్ శ్రీజ నేలకొండపల్లి: మండలంలోని చెరువుమాదారంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మరమ్మతు పనులను శరవేగంగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ ఆదేశించారు. మండలంలోని చెరువుమాధారం, నేలకొండపల్లి ఆస్పత్రులను శనివారం ఆమె తనిఖీ చేశారు. తొలుత చెరువుమాదారం పీహెచ్సీలో పనులను పరిశీలించగా, అసంపూర్తి పనులను పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేయాలని తెలిపారు. ఆతర్వాత నేలకొండపల్లి సీహెచ్సీలో రికార్డులు పరిశీలించి వైద్యసేవలపై చికిత్స పొందుతున్న వారితో ఆరా తీశారు. జిల్లా ఆస్పత్రుల సమన్వయ అధికారి కె.రాజశేఖర్గౌడ్, తహసీల్దార్ పి.రాంప్రసాద్, ఎంపీడీఓ ఎం.యర్రయ్య, ఎంఈఓ శివ, పీఆర్ ఏఈ ప్రసాద్, వైద్యాధికారులు మంగళ, కె.రాజేష్, శ్రావణ్కుమార్ పాల్గొన్నారు. పాడైన పంచదార వేలం ఖమ్మం సహకారనగర్: జిల్లాలోని గోదాముల్లో వినియోగానికి పనికిరాకుండా పోయిన చక్కెరను వేలం వేయనున్నట్లు పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ శ్రీలత తెలిపారు. ఖమ్మం అర్బన్లో 0.538 మెట్రిక్ టన్నుల చక్కెరను ఈనెల 8న, నేలకొండపల్లిలో 5.013 మెట్రిక్ టన్నులు 9న, ఏన్కూరులో 0.067 మెట్రిక్ టన్నులు 10వ తేదీన ఉదయం వేలం వేస్తామని వెల్లడించారు. అలాగే, వైరాలో 12.523 మెట్రిక్ టన్నుల చక్కెను 9న, సత్తుపల్లిలో 5.701 మెట్రిక్ టన్నులను 10న సాయంత్రం 4 గంటలకు వేలం నిర్వహిస్తామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా వేలం ధర నిర్ణయించనుండగా, దక్కించుకున్న వారే ఎత్తడం, శుభ్రపరిచే ఖర్చులు భరించాల్సి ఉంటుందని డీఎం ఓ ప్రకటనలో వెల్లడించారు. -
హోటళ్లలో గ్యాస్ సిలిండర్లు సీజ్
నేలకొండపల్లి: మండల కేంద్రంలోని పలు హోటళ్లలో టాస్క్ఫోర్స్ అధికారులు శనివారం తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా రెండు హోటళ్లలో వాణిజ్య సిలిండర్లకు బదులు గృహోపయోగ సిలిండర్లు వినియోగిస్తున్నట్లు తేలింది. దీంతో ఆరు సిలిండర్లు స్వాధీనం చేసుకుని పోలీసులకు అప్పగించినట్లు టాస్క్ఫోర్స్ ఎస్సై రఘు తెలిపారు. శ్రీరాంనగర్లోని రెండు ఇళ్లలో చోరీ ఖమ్మంఅర్బన్: ఖమ్మం 16వ డివిజన్ శ్రీరాంనగర్ రోడ్డునంబర్ 14లోని రెండు ఇళ్లలో శుక్రవారం అర్ధరాత్రి చోరీ జరిగింది. కాలనీ నివసిస్తున్న దండా విక్రమ్, దుర్గాల రవితేజ ఇళ్లకు తాళాలు వేసి వెళ్లారు. ఈ విషయాన్ని గుర్తించి బైక్పై వచ్చిన దుండగులు అర్ధరాత్రి 2:45 గంటలకు చోరీ చేసినట్లు సీసీ కెమెరాల్లో నమోదైంది. ముగ్గురు వ్యక్తులు ఇళ్ల తాళాలు పగులగొట్టి చోరీ చేసినట్లు తెలుస్తోంది. కాగా, దండా విక్రమ్ నివాసంలో రూ.14 వేల నగదు చోరీ జరగగా, రవితేజ కుటుంబం వచ్చాక చోరీ విషయమై స్పష్ట రానుంది. ఈమేరకు ఖమ్మం అర్బన్ ఎస్ఐ మధుబాబు, క్లూస్ టీమ్ సభ్యులు శనివారం ఉదయం రెండు ఇళ్లలో పరిశీలించి ఆధారాలు సేకరించారు. మాయమాటలతో బాలికను తీసుకెళ్లిన వ్యక్తి కారేపల్లి: మాయమాటలు చెప్పిన వివాహిత వ్యక్తి పెళ్లి చేసుకుంటానంటూ ఓ బాలికను తీసుకెళ్లిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మండలంలోని ఓ గ్రామానికి చెందిన 38ఏళ్ల హరికి వివాహం జరిగి ఇద్దరు కుమార్తెలు ఉండగా, ఆయన భార్య ఇటీవల మృతి చెందింది. ఈనేపథ్యాన గ్రామానికే చెందిన ఇంటర్ విద్యార్థికి మాయమాటలు చెప్పి ఈనెల 2వ తేదీ రాత్రి ఇంటి నుంచి తీసుకెళ్లాడు. ఎక్కడ వెతికినా జాడ లేకపోవడంతో కుటుంబీకులు ఫిర్యాదు చేయగా కారేపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, శనివారం ఆమె ఆచూకీ తెలియడంతో గ్రామానికి తీసుకురాగా పోలీసుస్టేషన్కు తరలించారు. అక్కడే ఉన్న బాలిక కుటుంబ సభ్యులు నిందితుడిపై దాడికి దిగడంతో పోలీసులు అడ్డుకున్నారు. ఈమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు కారేపల్లి ఎస్ఐ బి.గోపి తెలిపారు. -
50 క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనం
డీలర్ నుంచి నేరుగా తరలిస్తున్నట్లు వెల్లడితిరుమలాయపాలెం: డీలర్ నుంచే నేరుగా సన్నబియ్యం అక్రమ రవాణా చేస్తున్న విషయం పోలీసుల తనిఖీల్లో బయటపడింది. ఇందుకు సంబంధించి తిరుమలాయపాలెం ఎస్ఐ కె.జగదీష్ వెల్లడించిన వివరాలు.. మండల కేంద్రం సమీపాన కొక్కిరేణి క్రాస్ వద్ద వద్ద శనివారం వాహన తనిఖీలు చేపడుతుండగా అశోక్ లేలాండ్ వాహనంలో పరిశీలించారు. అందులో 50 క్వింటాళ్ల రేషన్ బియ్యం ఉండగా, వాహనంలోని ఖమ్మం కాల్వొడ్డుకు చెందిన నేరేళ్ల శ్రీకాంత్, ధరావత్ రమేష్, పగిళ్ల గణేష్ను విచారించారు. వీరు మేడిదపల్లికి చెందిన రేషన్ డీలర్ భర్త రామాచారి ద్వారా బియ్యం సేకరించి ఖమ్మంకు చెందిన షేక్ నన్నేమియా ద్వారా పెద్ద వ్యాపారులకు ఎక్కువ ధరతో అమ్మేందుకు తీసుకెళ్తున్నట్లు వెల్లడించారు. ఈమేరకు ఐదుగురిపై ఐదుగురు కేసు నమోదు చేశామని, పరారీలో ఉన్న డీలర్ భర్త రామాచారి తప్ప మిగతా వారిని అరెస్ట్ చేసినట్లు ఎస్ఐ వెల్లడించారు. కాగా, నలుగురు నిందితులు ఇటీవల డీలర్ల నుండి బియ్యాన్ని సేకరించి లారీలో తీసుకెళ్తూ హైదరాబాద్ టాస్క్ఫోర్స్ అధికారులకు పట్టుబడినట్లు సమాచారం. -
రెస్పెక్ట్ ఏదిరా?
గంగాధర: తమకు గౌరవం ఇవ్వడం లేదని పదో తరగతి విద్యార్థులు 9వ తరగతి విద్యార్థులను చితకబాదారు. కరీంనగర్ జిల్లా గంగాధరలోని మహాత్మా జ్యోతిబాఫూలే బీసీ బాలుర గురుకుల విద్యాలయంలో జరిగిన ఈ సంఘటన వివరాలివి. శుక్రవారం రాత్రి పది గంటలు దాటిన తరువాత వాచ్మన్, డ్యూటీలో ఉండే ఉపాధ్యాయుడు నిద్రపోయారు. పదో తరగతి విద్యార్థులు 25 మంది కలిసి తొమ్మిదో తరగతి చదువుతున్న 15 మందిని, ఒక్కొక్కరిగా తమ గదిలోకి పిలుస్తూ చితకబాదారు. దెబ్బలు తిన్న విద్యార్థులు శనివారం ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు.దెబ్బలు తిన్న వారిలో ఓ విద్యార్థి పుట్టిన రోజు కావడంతో.. శనివారం అతని తల్లి పాఠశాలకు వచ్చినప్పుడు విషయం వెలుగులోకి వచ్చింది. తరువాత బాధిత విద్యార్థుల తల్లిదండ్రులందరూ పాఠశాలకు చేరుకోగా, సిబ్బంది లోపలికి అనుమతించలేదు. దీంతో పోలీసులకు సమాచారమిచ్చారు. మండల విద్యాధికారి ఏనుగు ప్రభాకర్రావు, ఎస్ఐ వంశీకృష్ణ, పాఠశాలకు చేరుకొని విచారణ జరిపారు. బాధిత విద్యార్థులకు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స చేయించారు. ఇద్దరిని కరీంనగర్ తరలించారు.అనంతరం విద్యార్థుల తల్లిదండ్రులు ఘటనపై తహసీల్దార్ అంబటి రజితకు ఫిర్యాదు చేశారు. దాడి జరుగుతున్నా డ్యూటీలో ఉన్న వాచ్మన్, ఉపాధ్యాయుడు పట్టించుకోలేదని, ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపించారు. తహసీల్దార్ రజిత విచారణ చేపట్టి దాడి చేసిన పదో తరగతి విద్యార్థుల తల్లిదండ్రులను పిలిపించి, ఇంటికి పంపించారు. వాచ్మన్, ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేయాలని, ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులను బదిలీ చేయాలని ఉన్నతాధికారులకు సిఫారసు చేశారు.గదిలో బంధించి ర్యాగింగ్7వ తరగతి విద్యార్థిని కొట్టిన టెన్త్ విద్యార్థులుకారేపల్లి: గురుకులం విద్యార్థులు సాయంత్రం వేళ ఆడుకుంటున్న సమయంలో తలెత్తిన గొడవ ఏడో తరగతి విద్యార్థిపై దాడికి దారితీసింది. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం గాంధీనగర్ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయంలో శనివారం సాయంత్రం కొందరు పదో తరగతి విద్యార్థులు ఓ గదిలో 7వ తరగతి విద్యార్థిని బంధించి ర్యాగింగ్ చేస్తూ దాడికి పాల్పడ్డారు.ఈ సమయాన ఉపాధ్యాయులెవరూ లేకపోగా, విద్యార్థి అరుపులు విన్న సమీపంలోని డబుల్ బెడ్రూం వాసులు చేరుకుని విద్యార్థి తల్లిదండ్రులకు ఫోన్లో సమాచారం ఇచ్చారు. గాయపడిన విద్యార్థిని 108 అంబులెన్స్లో ఇల్లెందు ఆస్పత్రికి తరలించారు. ఇంతలోనే చేరుకున్న విద్యార్థి కుటుంబీకులు, స్థానికులు దాడి చేసిన టెన్త్ విద్యార్థులను తమకు అప్పగించాలని ఆందోళన చేపట్టారు. అనంతరం ఉపాధ్యాయులు చేరుకుని 10వ తరగతి విద్యార్థులను ఓ గదిలో ఉంచి.. ఉదయం మాట్లాడదామని నచ్చజెప్పినా వినకపోవడంతో ఉద్రిక్తత నెలకొంది. ఈ మేరకు సమాచారం అందుకున్న కారేపల్లి పోలీసులు చేరుకుని పర్యవేక్షిస్తున్నారు.


