Khammam
-
ఆస్పత్రి, సబ్స్టేషన్కు 35కుంటల స్థలం
కల్లూరు: కల్లూరు మండలంలోని నారాయణపురంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణానికి రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుటుంబీకులు సోమవారం 35 కుంటల భూమిని వితరణ చేశారు. పీఎస్ఆర్ ట్రస్ట్ ద్వారా సోమవారం భూమి పత్రాలను ప్రభుత్వ వైద్యాధికారి నవ్యకాంత్, విద్యుత్ ఏడీఈ సగ్గుర్తి రామారావుకు అందజేశారు. ఆరోగ్య కేంద్రానికి సర్వే నంబర్ 137లోని 20కుంటలు, సబ్స్టేషన్కు 15 కుంటలు కేటాయించారు. పంచాయతీ పాలకవర్గం తీర్మానం మేరకు భూమి పత్రాలను అధికారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గొల్లమందల వెంకటేశ్వర్లు, ఉప సర్పంచ్ దేవర వాసుదేవరావుతో పాటు అంకిరెడ్డి సత్యనారాయణరెడ్డి, భీమిరెడ్డి సత్యనారాయణరెడ్డి, పి.అంజిరెడ్డి, కె.కృష్ణారెడ్డి, జగదీష్ తదితరులు పాల్గొన్నారు. వితరణ చేసిన మంత్రి పొంగులేటి కుటుంబం -
కేన్సర్ను కట్టడి చేసేలా...
● జిల్లాలో కొనసాగుతున్న హెచ్పీవీ వ్యాక్సినేషన్ ● ఎనిమిది సెంటర్లలో బాలికలకు టీకాలు ● ఇప్పటి వరకు 2,230 మందికి పూర్తిఖమ్మంవైద్యవిభాగం: గర్భాశయ ముఖద్వార కేన్సర్ నివారణకు ప్రభుత్వం హెచ్పీవీ(హ్యూమన్ పాపిల్లోమా వైరస్) వ్యాక్సిన్ను అందుబాటులోకి తీసుకువచ్చింది. గతనెల 28వ హైదరాబాద్లో ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ వ్యాక్సినేషన్ను ప్రారంభించారు. ఆపై ఈనెల 8వ తేదీన ఖమ్మం పెద్దాస్పత్రిలో కలెక్టర్ అనుదీప్ దుదిశెట్టి వ్యాక్సినేషన్ను ప్రారంభించగా జిల్లాలో అందుబాటులోకి వచ్చినట్లయింది. జిల్లావ్యాప్తంగా 14 ఏళ్లు పూర్తయి 15వ ఏట అడుగుపెట్టిన బాలికలకు ఈ టీకా వేయనున్నారు. ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రితో పాటు సత్తుపల్లి, పెనుబల్లి, కల్లూరు, నేలకొండపల్లి, తిరుమలాయపాలెం, మధిర, వైరా ఆస్పత్రుల్లో వ్యాక్సిన్ వేస్తున్నారు. ప్రభుత్వ సెలవులు మినహా ప్రతిరోజు ఉదయం 9నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు బాలికలకు టీకా వేస్తుండగా, ఇప్పటివరకు 2,230 మందికి వ్యాక్సినేషన్ పూర్తయిందని అధికారులు తెలిపారు. దశల వారీగా విస్తరణ హెచ్పీవీ వ్యాక్సిన్ కార్యక్రమం జిల్లాలో మూడు నెలల పాటు కొనసాగనుంది. ప్రస్తుతం ఎనిమిది కేంద్రాల్లో టీకా వేస్తుండగా, త్వరలోనే 24 గంటలు నడిచే బనిగండ్లపాడు, చింతకాని, ఏన్కూరు, సింగరేణి ఆస్పత్రుల్లో ప్రారంభిస్తామని అధికారులు చెబుతున్నారు. ఆ తర్వాత క్రమంగా పీహెచ్సీల్లో కూడా టీకాను అందుబాటులోకి తీసుకొస్తారు. ఇన్ఫెక్షన్లతో కేన్సర్ జిల్లాలో 14 ఏళ్లు నిండిన బాలికలకు గార్డాసిల్–4 అనే టీకా వేయనుండగా, ఇది బాలికల్లో హ్యూమన్ పాపిల్లోమా వైరస్ను అరికడుతుందని వైద్యులు చెబుతున్నారు. సాధారణంగా ఈ వయస్సు బాలికల్లో హర్మోన్ల మార్పుల కారణంగా ఇన్ఫెక్షన్లు సోకుతాయని, సరైన చికిత్స తీసుకోకపోతే గర్భాశయ ముఖద్వార కేన్సర్కు దారితీసే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు. ఈమేరకు కేన్సర్ను అరికట్టడమే లక్ష్యంగా వ్యాక్సినేషన్కు శ్రీకారం చుట్టారు. జిల్లా నుంచి చదువు నిమిత్తం ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారు, ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడకు వచ్చిన బాలికలు సుమారు 15వేల మందికి పైగా ఉంటారనే అంచనాకు వచ్చారు. వీరందరికీ హెచ్పీవీ వ్యాక్సిన్ వేసేలా పకడ్బందీ చర్యలు చేపట్టారు. ఇప్పటివరకు జిల్లాలో 2,230మంది బాలికలకు వ్యాక్సిన్ వేసినట్లు అధికారులు వెల్లడించారు. సెంటర్లలో సరిపడా వ్యాక్సిన్ అందుబాటులో ఉన్నందున, అపోహలు విడనాడి టీకా వేయించుకుని సర్వైకల్ కేన్సర్ నుంచి రక్షణ పొందాలని అధికారులు సూచిస్తున్నారు. -
లెక్క.. పక్కాగా
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: జనగణన కార్యక్రమం జిల్లాలో పకడ్బందీగా చేపట్టేందుకు అధికార యంత్రాంగం సిద్ధమవుతోంది. కేంద్రప్రభుత్వం చేపట్టనున్న జనాభా లెక్కల సేకరణ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో పూర్తి స్థాయిలో ప్రారంభం కానుంది. ప్రస్తుతానికి ఈ ఏడాది మే నెలలో ఇళ్ల గుర్తింపు, జనాభా గణన బ్లాక్లను గుర్తించనున్నారు. ఇందుకోసం జిల్లా, డివిజన్, మండల స్థాయిలో నియమితులైన అధికారులకు ఈనెల 15 నుంచి 17 వరకు కలెక్టరేట్లో శిక్షణ ఇచ్చారు. ఈసారి జనగణన మొబైల్ యాప్ ద్వారా డిజిటల్ విధానంలో చేపడతారు. నియామకాలు పూర్తి జిల్లాలో వచ్చే ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించే జనగణన కోసం అధికారుల కసరత్తు వేగిరమైంది. జిల్లా నుంచి మండల స్థాయి వరకు అధికారుల నియామకాలను పూర్తి చేశారు. కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి జిల్లా ప్రిన్సిపల్ సెన్సెస్ అధికారిగా, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) పి.శ్రీనివాసరెడ్డి అదనపు ప్రిన్సిపల్ సెన్సెస్ అధికారిగా, డీఆర్ఓ జిల్లా సెన్సెస్ అధికారిగా వ్యవహరిస్తారు. అలాగే, జెడ్పీ సీఈఓ, సీపీఓ, డీఈఓ, డీపీఓ, డీఐఓ, స్టాటిస్టికల్ ఆఫీసర్, ప్రణాళిక శాఖ ఏడీలు అదనపు జిల్లా సెన్సెస్ అధికారులుగా ఉంటారు. మరోవైపు సబ్ డివిజన్, మున్సిపాలిటీలు, కార్పొరేషన్, మండల స్థాయిలో అధికారులకు బాధ్యతలను అప్పగించారు. మూడు రోజుల శిక్షణ జనగణన లోటుపాట్లు లేకుండా పారదర్శకంగా జరిగేలా ఈనెల 15 నుంచి 17వ తేదీ వరకు గణన అధికారులకు కలెక్టరేట్లో శిక్షణ ఇచ్చారు. ఎంపీడీఓలు, మున్సిపాలిటీ కమిషనర్లు, మేనేజర్లకు జనగణన విభాగం డైరెక్టరేట్కు చెందిన సంయుక్త సంచాలకులు శ్రీకాంత్, మాస్టర్ ట్రెయినర్ రవికుమార్ శిక్షణను ఇచ్చారు. ఇంటి జాబితా, ఎన్యుమరేషన్ బ్లాక్ల ఎంపికతోపాటు వచ్చే ఏడాది జరిగే జనగణన పకడ్బందీగా చేపట్టాలని సూచించారు. వీరు మండల స్థాయిలో అధికారులకు ఈనెల 28, 29, 30వ తేదీల్లో శిక్షణ ఇవ్వనున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి.. ఈ ఏడాది మే నెలలో ప్రాథమిక సర్వే చేపట్టనుండగా.. పూర్తి స్థాయి జనగణన 2027 ఫిబ్రవరి నుంచి ప్రారంభమవుతుంది. తొలిసారి డిజిటల్ విధానంలో గణన చేపడుతున్నందున ప్రజలు వెబ్ ఆధారంగా వివరాలు నమోదు చేసుకోవచ్చు. ఇక జనగణనతోపాటు కులగణన కూడా చేపట్టే అవకాశం ఉంది. ప్రభుత్వం పథకాల రూప కల్పన, అమలుకు జనగణన సమాచారం ఉపయుక్తంగా ఉంటుంది. తొలిసారి డిజిటల్ విధానంలో గణన ప్రక్రియ కొనసాగుతుంది. ప్రజలు వెబ్ ఆధారంగా తమ వివరాలను స్వయంగా నమోదు చేసుకునే అవకాశముంది. మొదటి దశలో ఇళ్ల జాబితా రూపకల్పన ప్రక్రియ ఈ ఏడాది మే 11నుంచి జూన్ 9వరకు నిర్వహిస్తాం. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో రెండో దశ జన గణన ఉంటుంది. – అనుదీప్ దురిశెట్టి, కలెక్టర్ప్రధాన జనగణన ఇబ్బంది లేకుండా చేపట్టాలనే ఉద్దేశంతో అధికారులు ఈ ఏడాది మే 11 నుంచి జూన్ 9 వరకు సర్వే చేపడతారు. తొలుత ఒక ప్రాంతంలో నివాస గృహాలు, వాణిజ్య భవనాలు, ఖాళీ స్థలాల వివరాలను సేకరించడమే కాక వాటికి నంబర్లు కేటాయించి జాబితా రూపొందించారు. అలాగే, ఎన్యుమరేషన్ బ్లాక్(జనాభా గణన బ్లాక్లు)లు కూడా ఏర్పాటవుతాయి. ఆపై జనగణనను సులువుగా చేపట్టేలా పెద్ద గ్రామాలు, పట్టణాలను చిన్న ప్రాంతాలుగా విభజిస్తారు. ప్రతీ బ్లాక్కు కేటాయించే అధికారి వారి పరిధిలోని ప్రతీ ఇంటిని సందర్శించి వివరాలు సేకరిస్తారు. ఏ ఇల్లు కానీ, వ్యక్తిని కానీ వదిలేయకుండా వివరాలు క్రమపద్ధతిలో సేకరించేలా ఇళ్ల జాబితా, జనాభా గణన బ్లాక్లను రూపొందిస్తారు. దీన్ని జన గణనలో ప్రాథమిక దశగా వ్యవహరిస్తారు.జనగణనకు యంత్రాంగం కసరత్తు -
ప్రజావాణి దరఖాస్తుకు స్పందన
ఖమ్మం సహకారనగర్: రెండు వారాల క్రితం ప్రజావాణిలో అందిన దరఖాస్తుపై స్పందించి మానవీయ కోణంలో చర్యలు చేపట్టామని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. తల్లాడ మండలం గోపాలపేటకు చెందిన రాయల రమేశ్ – సులోచన దంపతులు 20 ఏళ్ల క్రితం ఖమ్మంకు వలస వచ్చి అద్దె ఇళ్లలో ఉంటున్నారు. వీరి చిన్న కుమారుడు అజయ్(18)కు మెదడు ఎదుగుదల లోపించి మంచానికే పరిమితమయ్యాడు. సొంత ఇల్లు లేక, పనులు చేసుకోలేక ఇబ్బంది పడుతున్నట్లు రమేష్ దంపతులు కలెక్టరేట్లో జరిగే ప్రజావాణిలో విన్నవించారు. దీంతో స్పందించిన అధికారులు క్షేత్ర స్థాయి విచారణ అనంతరం ఆ కుటుంబానికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించారు. ఈమేరకు సోమవారం అల్లీపురంలోని డబుల్ బెడ్రూం సముదాయం ఐదో బ్లాక్లో జీ7 ఇంటిని కేటాయిస్తూ పత్రాలను ఖమ్మం అర్బన్ తహసీల్దార్ సైదులు వారికి అందజేశారు. ఈమేరకు తమ సమస్యపై స్పందించి ఇల్లు కేటాయించిన అధికారులకు రమేష్ దంపతులు కృతజ్ఞతలు తెలిపారు.డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయింపు -
ఘనంగా విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం
ఖమ్మంమయూరిసెంటర్: ఖమ్మం 16వ డివిజన్ సీతారాంపురం(అగ్రహారం)లోని ఆలయాల సముదాయంలో దేవతామూర్తుల విగ్రహాలు, బొడ్రాయి ప్రతిష్ఠా మహోత్సవాలు అంగరంగా వైభవంగా కొనసాగుతున్నాయి. శ్రీ సీతారామచంద్రస్వామి, శ్రీ వీరాంజనేయ, శ్రీ దాసాంజనేయ, శ్రీ ముత్యాలమ్మ, శ్రీ మైసమ్మ అమ్మవార్ల దేవాలయాలు, గ్రామంలో బొడ్రాయి ప్రతిష్ఠా పూజలు ఈనెల 25వ తేదీ వరకు కొనసాగనున్నాయి. అర్చకుడు బొర్రా వాసుదేవాచార్యులు బృందం ఆధ్వర్యాన నిర్వహిస్తున్న పూజల్లో భాగంగా సోమవారం జలబిందెల ఊరేగింపు, విగ్రహాల గ్రామోత్సవం జరిగింది. అలాగే, బుధవారం ఉదయం విగ్రహ ప్రతిష్ఠాపన జరగనుందని ఆలయ కమిటీ బాధ్యులు తెలిపారు. ఈ కార్యక్రమాల్లో కార్పొరేటర్లు మేడారపు వెంకటేశ్వర్లు, నిరీశతో పాటు తుమ్మ అప్పిరెడ్డి, ఆళ్ల అంజిరెడ్డి, ఆకుల నర్సింహారావు, బొమ్మిశెట్టి రమేష్, చెరుకూరి కోటేశ్వరరావు, నర్ల శ్రీను, మల్లేశ్వరి, రమాదేవి, సుజాత, ఆదూరి రాజవర్దన్రెడ్డి, నల్లగట్ల నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. -
వైభవంగా ఎదుర్కోలు ఉత్సవం
ఎర్రుపాలెం: మండలంలోని జమలాపురం శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా సోమవారం శ్రీవారిని పెళ్లి కుమారుడిగా, అలివేలు మంగ, పద్మావతి అమ్మవార్లను పెళ్లి కుమార్తెలుగా అలంకరించడంతో పాటు స్నాతకం, ఎదుర్కోలు ఉత్సవం నిర్వహించారు. స్వామి తరఫున పెళ్లి పెద్దలుగా ధర్మకర్త ఉప్పల విజయదేవశర్మ, ప్రధాన అర్చకులు శ్రీనివాసశర్మ, ఉప ప్రధాన అర్చకులు మురళీమోహన్శర్మ, అమ్మవార్ల తరఫున వేద పండితులు, అర్చకులు మారుతీ రఘురామకృష్ణ, మారుతి వెంకటరమణ వ్యవహరించారు. ఈ సందర్భంగా గోత్ర ప్రవరలు, గుణగణాలను వర్ణిస్తూ ఇరువర్గాల సంవాదం ఉత్సాహంగా సాగింది. ఆలయ ఈఓ జగన్మోహన్రావు, సూపరింటెండెంట్ సోమయ్య, అర్చకులు రాజీవ్శర్మ తదితరులు పాల్గొన్నారు.ఎస్సెస్సీ పరీక్ష విధుల నుంచి ముగ్గురి తొలగింపు ఖమ్మం సహకారనగర్: పదో తరగతి పరీక్షల విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ముగ్గురిని తొలగించినట్లు జిల్లా విద్యాశాఖాధికారి చైతన్యజైనీ తెలిపారు. బోనకల్ జెడ్పీహెచ్ఎస్లో ఇన్విజిలేటర్ విధుల్లో నిర్లక్ష్యం వహించినట్లు తేలడంతో రిలీవ్ చేయడమే కాక శాఖాపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు వెల్ల డించారు. అంతేకాక సెంటర్ చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంటల్ ఆఫీసర్లను సైతం విధుల నుంచి తొలగించినట్లు తెలిపారు. కాగా, సోమవారం జరిగిన పరీక్షకు 16,936మంది విద్యార్థుల్లో 16,918మంది హాజరు కాగా 18మంది గైర్హాజరయ్యారని పేర్కొన్నారు. జిల్లాలోని పలు కేంద్రాలను తనతో పాటు అసిస్టెంట్ కమిషనర్, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు తనిఖీ చేశాయని డీఈఓ తెలిపారు. రైతులకు పెట్టుబడి సాయం 3.35లక్షల మంది ఖాతాల్లో రూ.169.35 కోట్లు ఖమ్మంవ్యవసాయం: రైతు భరోసా పథకం కింద రాష్ట్రప్రభుత్వం విడుదల చేసిన పెట్టుబడి సాయం తొలి విడత నిధులు సోమవారం రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యాయి. ప్రస్తుత యాసంగి కాలానికి పెట్టుబడి సాయాన్ని విడతల వారీగా అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలి విడతలో ఎకరం విస్తీర్ణం వరకు పెట్టుబడి సాయాన్ని విడుదల చేసింది. జిల్లాలో మొదటి విడతగా 3,35,062 మంది రైతులు అర్హత సాధించారు. వీరి ఖాతాల్లో రూ.169.35 కోట్లు జమ కాగా, మిగతా వారికి విడతల వారీగా జమ అవుతుందని జిల్లా వ్యవసాయాధికారి ధనసరి పుల్లయ్య తెలిపారు. బార్ కౌన్సిల్ మెంబర్గా శ్రీనివాసరావు ఖమ్మం లీగల్: తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ మెంబర్గా ఖమ్మం బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు మందడపు శ్రీనివాసరావు ఎన్నికయ్యారు. ఇటీవల ఎన్నికలు నిర్వహించగా, సోమవారం చేపట్టిన లెక్కింపులో ఆయన విజయానికి అవసరమైన 1,085 ఓట్లు సాధించినట్లు తేలింది. దీంతో శ్రీనివాసరావు విజయాన్ని ఎన్నికల అధికారులు ధ్రువీకరించారు. ఈమేరకు పలువురు న్యాయవాదులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. -
అక్కడక్కడా చినుకులు
ఖమ్మంవ్యవసాయం: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి కారణంగా సోమవారం సాయంత్రం జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షపు జల్లులు కురిశాయి. గేటుకారేపల్లిలో 2.8మి.మీ.ల వర్షపాతం నమోదు కాగా, కామేపల్లి మండలం లింగాల, రఘునాథపాలెం, ఖమ్మంలోని ప్రకాష్నగర్, శ్రీనివాసనగర్, సుందరయ్యనగర్, వ్యవసాయ మార్కెట్ తది తర ప్రాంతాల్లోనూ వర్షం కురిసింది. ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు రావడంతో రైతులు ఆందోళనకు గురయ్యారు. ప్రస్తుతం మొక్కజొన్న, వరి, మిర్చి కోతలు జోరుగా సాగుతున్నాయి. దీంతో కోసిన పంటపై టార్పాలిన్ పట్టాలు కప్పుతూ రక్షించుకోవడంలో నిమగ్నమయ్యారు. ఇదిలా ఉండగా సోమవారం పగటి ఉష్ణోగ్రతలు గరిష్టంగా 37.1, కనిష్టంగా 33.8 డిగ్రీలుగా నమోదయ్యాయి. ఉష్ణోగ్రతలు మరో రెండు రోజుల్లో 40 డిగ్రీలకు చేరే అవకాశముందని తెలుస్తోంది. కాగా, వేంసూరు మండలంలోని మర్లపాడు, కందుకూరు తదితర గ్రామాల్లో ఆదివారం రాత్రి ఈదురుగాలులతో వడ్లగండ్ల వర్షం కురవడంతో మొక్కజొన్న పంట నేలవాలింది.అన్నదాతల్లో గుబులు -
రామదాసు మందిరంలో నవమి వేడుకలు ప్రారంభం
నేలకొండపల్లి: భద్రాచలం దేవస్థానం నిర్మాత, భక్తాగ్రేసరుడు కంచర్ల గోపన్న(భక్తరామదాసు) జన్మస్థలమైన నేలకొండపల్లిలో శ్రీ రామనవమి వేడుకలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఈమేరకు రామదాసు ధ్యాన మందిరంలో ప్రత్యేక పూజల అనంతరం స్థానిక మహిళలు పసుపు దంచడంతో పాటు ముత్యాల తలంబ్రాలు కలిపారు. అనంతరం గండికోట వెంకటలక్ష్మి ఆధ్వర్యాన రామదాసు కీర్తనలు ఆలపించారు. సర్పంచ్ శీలం వెంకటలక్ష్మితో పాటు పెండ్యాల శ్రీమతి, జక్కేపల్లి ఉష, లక్ష్మి, రాయపూడి ఉష, మల్లికాంబ, పూజారి సౌమిత్రి రమేష్ తదితరులు పాల్గొన్నారు. ‘భూదాన్’ కేసులో మరో నలుగురి అరెస్ట్ ఖమ్మంఅర్బన్: ఖమ్మం వెలుగుమట్లలోని భూదాన్, ప్రభుత్వ భూమిలో ప్లాట్లు ఇప్పిస్తామని డబ్బు వసూలు చేసిన కేసులో మరో నలుగురిని అరెస్ట్ చేసినట్లు నగర ఏసీపీ రమణమూర్తి తెలిపారు. ఖమ్మం అర్బన్ స్టేషన్లో సీఐ భానుప్రకాశ్తో కలిసి సోమవారం ఆయన వివరాలు వెల్లడించారు. బాధితుల ఫిర్యాదుతో ఖమ్మం అర్బన్ పోలీసులు కేసు నమోదు చేయగా, కల్తీ రామచంద్రయ్య, బాణాల లక్ష్మణచారి, చిప్పనపల్లి వీరయ్య, కుంజా కృష్ణయ్యను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. ఇప్పటికే కేసులో ప్రధాన నిందితులైన పోలెబోయిన ముత్తయ్య, బల్లి శ్రీనివాస్, కొప్పెర వెంకన్న, కొట్టే బసు, సంపంగి వెంకటాచలంను రిమాండ్కు తరలించగా, మెజిస్ట్రేట్ అనుమతితో కస్టడీలోకి తీసుకుని విచారించాక తిరిగి రిమాండ్కు తరలించినట్లు ఏసీపీ వివరించారు. కేసులో ఇప్పటివరకు 16 మందిని అరెస్ట్ చేయడంతో పాటు వారి అక్రమ ఆస్తులను చట్టప్రకారం స్వాధీనం చేసుకునే ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. చెల్లని చెక్కు కేసులో జైలుశిక్ష, జరిమానా ఖమ్మం లీగల్/మధిర: అప్పు చెల్లించే క్రమాన ఇచ్చిన చెక్కు చెల్లకపోవడంతో జైలుశిక్ష, జరిమానా విధిస్తూ ఖమ్మం రెండో అదనపు ప్రథమశ్రేణి కోర్టు న్యాయాధికారి ఏపూరి బిందు ప్రియ సోమవారం తీర్పు చెప్పారు. తల్లాడ మండలం మిట్టపల్లికి చెందిన తూము వీరభద్రరావు వద్ద మధిర టీచర్స్ కాలనీకి చెందిన ఎండీ.ముస్తఫా 2018 ఆగస్టు, సెప్టెంబర్లో రూ.10లక్షల అప్పు తీసుకున్నాడు. ఆతర్వాత 2020 సెప్టెంబర్లో రూ.14.50 లక్షలకు చెక్కు ఇచ్చినా ఆయన ఖాతాలో సరిపడా నగదు లేక తిరస్కరణకు గురైంది. దీంతో వీరభద్రరావు తన న్యాయవాది ఇమ్మడి లక్ష్మీనారాయణ ద్వారా లీగల్ నోటీసు జారీ చేసి కోర్టులో ప్రైవేట్ కేసు దాఖలు చేశాడు. విచారణ అనంతరం ముస్తఫాపై నేరం రుజువు కావడంతో 18నెలల జైలుశిక్ష విధించడమే కాక ఫిర్యాదికి రూ.14.50లక్షల పరిహారం చెల్లించాలని న్యాయాధికారి తీర్పు చెప్పారు. దాతలు స్పందిస్తేనే జీవితం తల్లాడ: మండలంలోని అన్నారుగూడెంకు చెందిన ఇస్నేపల్లి మహేష్(24) మూడు రోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. ముత్తగూడెం వద్ద కుక్క అడ్డు రావడంతో ద్విచక్రవాహనం అదుపుతప్పగా కింద పడడంతో ఆయన తలకు గాయాలయ్యాయి. దీంతో మహేష్కు ఖమ్మంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స చేయిస్తున్నారు. అయితే, ఆయనకు తండ్రి లేకపోవడం, తల్లి యశోదది రెక్కాడితే కాని డొక్కాడని పరిస్థితి కావడంతో చికిత్సకు సమస్య ఎదురవుతోంది. ఈమేరకు దాతలు ఆర్థికంగా ఆదుకుని తన కుమారుడి ప్రాణాలు కాపాడాలని ఆమె వేడుకుంటోంది. సాయం చేయాలనుకునేవారు 98660 29654, 99084 60315 నంబర్లకు ఫోన్ పే లేదా గూగుల్ పే చేసి ఆదుకోవాలని యశోద ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.దుఃఖాన్ని దిగమింగి పరీక్షకు.. కొణిజర్ల: తల్లి మరణించిందనే బాధతో ఉన్న విద్యార్థికి బంధువులు నచ్చచెప్పి పదో తరగతి పరీక్ష రాయించగా.. ఆతర్వాత తలకొరివి పెట్టి బాధ్యత తీర్చుకున్నాడు. కొణిజర్ల మండలం తనికెళ్లకు చెందిన పాలెపు ఉమ(36) అనారోగ్యంతో బాధ పడుతూ సోమవారం ఉదయం మృతి చెందింది. ఆమెకు ఇద్దరు కుమారులు రాంచరణ్, నవదీప్ ఉన్నారు. నవదీప్ స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతూ సెయింట్ అలోషియస్ పాఠశాలలో పరీక్షలు రాస్తున్నాడు. ఈక్రమాన సోమవారం పరీక్షకు సిద్ధమవుతుండగానే ఆయన తల్లి మృతి చెందింది. విద్యార్థి భవిష్యత్ దృష్ట్యా బంధువులు నచ్చచెప్పడంతో దుఃఖాన్ని దిగమింగుకుని కన్నీటితో పరీక్షకు హాజరయ్యాడు. పరీక్ష ముగిశాక తల్లికి తలకొరివి పెట్టాడు. -
వరికి ‘తాలు’ కాటు..
సత్తుపల్లిరూరల్: నకిలీ వరి విత్తనాలతో నట్టేట మునిగామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆర్ఎన్ఆర్ 15048 రకం వరి వంగడాన్ని సత్తుపల్లి మండలంలోని సిద్ధారం, గౌరిగూడెం, రేజర్లతో పాటు వేంసూరు మండలంలోని భీమవరానికి చెందిన రైతులు సుమారు 600 ఎకరాల్లో యాసంగి పంటగా సాగు చేశారు. అయితే, కంపెనీనే నకిలీ విత్తనాలను సరఫరా చేసిందని, తద్వారా తాలు కంకులు రావడంతో నష్టపోయామని చెబుతున్నారు. పెట్టుబడి కూడా రాక... వరి విత్తనాలను 20 కేజీల ప్యాకెట్ రూ.1,300 చొప్పున కొనుగోలు చేశామని రైతులు చెబుతున్నారు. ఒక్కో రైతు ఐదు నుంచి పది ఎకరాల్లో ఆర్ఎన్ఆర్ 15048 విత్తనాలతో సాగు చేయగా ప్రస్తుతం పంట వయస్సు 130 రోజులు దాటింది. అయితే, కోతకు వచ్చినా కంకులు తాలు కావడంతో కోసే పరిస్థితి లేదని.. కూలీలకు డబ్బు చెల్లించడం తప్ప కనీసం పెట్టుబడి కూడా రాదని వాపోతున్నారు. ఇప్పటికే ఎకరాకు రూ.35వేల వరకు పెట్టుబడి పెడితే, 50 – 70శాతానికిపైగా తాలు కుంకులు రావడంతో ఈ పరిస్థితి ఎదురైందని చెబుతున్నారు. సత్తుపల్లిలోని వెంకటరమణ సీడ్స్ దుకాణం యజమాని శ్రీరామ సీడ్స్ కంపెనీకి చెందిన ఈ వంగడంతో మంచి దిగుబడి వస్తుందని చెప్పడంతో నమ్మిన తాము మోసపోయామని వెల్లడించారు. ఈ విషయమై డీలర్ దృష్టికి తీసుకెళ్లడమే కాక కంపెనీ యజమానులు, వ్యవసాయాధికారులకు ఫిర్యాదు చేశామని తెలిపారు. ఈమేరకు కంపెనీపై అధికారులు చర్యలు తీసుకుని పరిహారం చెల్లించాలని కోరుతున్నారు. శాస్త్రవేత్తల పరిశీలన సత్తుపల్లి మండలంలోని గౌరిగూడెం, సిద్ధారం, రేజర్లల్లో సాగు చేసిన శ్రీరామ అగ్రి జెనిటిక్స్ కంపెనీకి చెందిన ఆర్ఎన్ఆర్–15048 వరి రకం పంటలో తాలు ఎక్కువగా వచ్చిందని రైతులు ఫిర్యాదు చేశారు. దీంతో వైరా కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డాక్టర్ టి.సుచరితాదేవి, శాస్త్రవేత్తలు డాక్టర్ టి.పావని, పీఎస్ఎం.ఫణిశ్రీ, వరంగల్ విత్తన ధ్రువీకరణ అధికారి టి.వేణుమాధవ్, ఏఓ వై.శ్రీనివాసరావు, ఏఈఓ కె.ఆశాజ్యోతి సోమవారం పొలాలను పరిశీలించారు. పంటల నమూనాలను సేకరించగా, పరీక్షల అనంతరం వివరాలు వెల్లడవుతాయని వారు తెలిపారు. రైతులు మందపాటి ముత్తారెడ్డి, మోరంపూడి ప్రసాద్, గొర్ల సోమిరెడ్డి, దేవదాసు, సాలి దేవదాసు, మరీదు నాగేశ్వరరావు, లింగారెడ్డి, రామారావు, గొర్ల నాగిరెడ్డి, సోమిరెడ్డి, చింతల శివనాగిరెడ్డి, పుచ్చా వసంతరావు, ములకలపాటి సత్యనారాయణ పాల్గొన్నారు. -
కానిస్టేబుళ్లకు పదోన్నతి
ఖమ్మంక్రైం: జిల్లాలోని వివిధ పోలీసుస్టేషన్లలో కానిస్టేబుళ్లుగా విధులు నిర్వర్తిస్తున్న పలువురు హెడ్కానిస్టేబుళ్లుగా ఉద్యోగోన్నతి పొందారు. ఈమేరకు రవీంద్రనాధ్, ప్రకాష్రావు, శ్రీనివాస్ భద్రాద్రి జిల్లాకు బదిలీపై వెళ్తుండగా సీపీ సునీల్దత్ సోమవారం అభినందించారు. అలా గే, వారికి పదోన్నతి చిహ్నాన్ని అలంకరించారు. ఈసీఆర్ ఒత్తిడి తగ్గించాలి ఖమ్మం సహకారనగర్: ఎవ్రీ చైల్డ్ రీడ్స్(ఈసీఆర్) కార్యక్రమంతో ఉపాధ్యాయులు మెరుగైన ఫలితాలు సాధిస్తున్నా చిన్నపాటి కారణాలతో షోకాజ్ నోటీసులు జారీచేసి ఒత్తిడికి గురి చేయడం సరికాదని టీఎస్ యూటీయఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రంజాన్, పారుపల్లి నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఇకనైనా ఉపాధ్యాయులపై ఒత్తిడి తగ్గించాలని వారు సోమవారం డీఈఓ చైతన్య జైనీకి వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ చిన్నచిన్న తప్పిదాలకు ఉపాధ్యాయులను నెలల తరబడి సస్పెండ్ చేయడం, వేతనంలో కోత విధించడం వంటి చర్యలు మానుకోవాలన్నారు. అలాగే, ఒంటిపూట బడి సమయాన మధ్యాహ్నం 1–30వరకు పనిచేయాలని పెనుబల్లి మండల అధికారులు ఆదేశాలు జారీ చేయడం సరికాదన్నారు. కాగా, పదో తరగతి మూల్యాంకన విధుల్లో పాల్గొన్న ఉపాధ్యాయులకు 2022, 2023 – 2025 బకాయిలు చెల్లించపోతే ఆందోళన చేపడుతామని తెలిపారు. ఈకార్యక్రమంలో నాయకులు వల్లంకొండ రాంబాబు, సురేష్, రామకృష్ణ, కే.వీ.మురళీకృష్ణ, బి.రమేష్ పాల్గొన్నారు. మంత్రి క్యాంప్ కార్యాలయం ముట్టడి ఖమ్మంమయూరిసెంటర్: ఎన్నికలకు ముందు ఆశా కార్యకర్తలకు ఇచ్చిన హామీ మేరకు బడ్జెట్ సమావేశాల్లో రూ.18 వేల వేతనం ప్రకటించాలనే డిమాండ్తో సోమవారం ఖమ్మంలోని మంత్రి తుమ్మల క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించారు. టీఎన్జీవోస్ భవనం నుండి ర్యాలీగా బయలుదేరిన కార్యకర్తలు మంత్రి కార్యాలయం వద్ద చేరుకోగా, లోనకు వెళ్లకుండా టూటౌన్ పోలీసులు బారికేడ్లు అమర్చారు. అయినా ఆశా కార్యకర్తలు, సీఐటీయూ నాయకులు లోనకు వెళ్లే ప్రయత్నం చేయడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకుడు తుమ్మ విష్ణువర్ధన్ మాట్లాడుతూ ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లో ఆశాలకు రూ.18వేల వేతనం ప్రకటించడంతో పాటు రూ.50 లక్షల బీమా, ఇతర ప్రయోజనాలు కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు పిన్నింటి రమ్య, ఎస్.నవీన్రెడ్డి, రమణ తదితరులు పాల్గొన్నారు. బీఆర్టీయూ ఆధ్వర్యాన... ఖమ్మంవైద్యవిభాగం: ఆశా కార్యకర్తలకు కనీస వేతనం చెల్లించాలని బీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు ఎండీవై.పాషా డిమాండ్ చేశారు. ఈమేరకు సోమవారం ఆశా కార్యకర్తలు పెవిలియన్ మైదానం నుంచి జెడ్పీ సెంటర్ వరకు ప్రదర్శనగా వెళ్లి అంబేద్కర్ విగ్రహం వద్ద బైఠాయించారు. ఈ సందర్భంగా పాషా మాట్లాడుతూ ఆశా కార్యకర్తలకు కనీస వేతనం రూ.18 వేలు చెల్లించడమే కాక బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఆశా వర్కర్ల యూనియన్ నాయకులు శైలజ, సులోచన, సుమతి, కవిత, నాగమణి, రేణుక, జ్యోతి తదితరులు పాల్గొన్నారు. -
మళ్లీ కట్టెల పొయ్యి..!
భద్రాద్రి కొత్తగూడెం: గ్యాస్ కొరతతో గ్రామాలు, పట్టణాల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గృహావసరాలకు గ్యాస్ కొరత లేదని అధికార యంత్రాంగం ప్రకటిస్తున్నా వాస్తవ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. గ్యాస్ సిలిండర్ బుక్ చేస్తే డెలివరీకి కనీసం పదిరోజుల సమయం పడుతోంది. గ్యాస్ సిలిండర్ తీసుకున్న 45 రోజుల తర్వాతనే గ్యాస్ తిరిగి బుక్ చేసుకోవాలని నిబంధనలు విధించారు. ఈలోగా గ్యాస్ అయిపోతే కట్టెల పొయ్యి వెలిగించాలి్సందే. వాణిజ్య అవసరాల కోసం వినియోగించే గ్యాస్ సిలిండర్లకు మరింత కొరత ఏర్పడింది. కమర్షియల్ సిలిండర్లు దొరకకపోవటంతో కొన్ని హోటళ్లను మూసేశారు. కొందరు కట్టెల పొయ్యిలతో తంటాలు పడుతున్నారు.వేధిస్తున్న కొరతగ్యాస్ కొరతతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. ముందస్తు అవసరాల కోసం గ్యాస్ను బుక్ చేసుకునేందుకు తొందరపడుతున్నారు. ఇదే అదనుగా కొందరు.. వినియోగదారుల అవసరాన్ని సొమ్ము చేసుకునే పనిలో పడ్డారు. గ్యాస్ కొరత కారణంగా పల్లె ప్రజలు మళ్లీ కట్టెల కోసం వెతుకుతున్నారు. పొలాలకు, అటవీ ప్రాంతాలకు వెళ్లి ఎండిన చెట్లు, కొమ్మలను వంట చేసుకునేందుకు తెచ్చుకుంటున్నారు. కొందరు కూలీలు కట్టెలు తీసుకువచ్చి గ్రామాలు, పట్టణాల్లో అమ్ముతున్నారు. గతంలో కట్టెల మోపు రూ.200 ఉండేది. ప్రస్తుతం రూ.300 నుంచి రూ.400కు విక్రయిస్తున్నారు. ఎడ్లబండ్లతో కట్టెలు తీసుకువస్తే రూ.2,500 నుంచి రూ.3,000 తీసుకుంటున్నారు.భారంగా హోటళ్ల నిర్వహణప్రస్తుతం వాణిజ్య గ్యాస్ సిలిండర్లు అందుబాటులో లేకపోవటంతో హోటళ్లు, రెస్టారెంట్ల నిర్వహణ భారంగా మారింది. టిఫిన్ సెంటర్లు, భోజన హోటళ్లు గ్యాస్ కొరతతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో నిమగ్నమయ్యాయి. సిలిండర్లు దొరకక కొందరు హోటళ్లను బంద్ చేసుకుంటున్నారు. కొందరు కట్టెల పొయ్యిలను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఎడ్లబండ్లు, సైకిళ్లపై కూలీలతో కట్టెలు తెప్పించుకుని వంట చేస్తున్నారు. పోడుసాగుతో అడవుల విస్తీర్ణం తగ్గిపోవటంతో కట్టెలకు కూడా ఇబ్బందికర పరిస్థితులున్నాయి. కట్టెల కోసం దూరప్రాంతాలకు వెళ్లాల్సి రావటంతో రేటు బాగా పెరిగిపోతోంది. హోటళ్లు, రెస్టారెంట్లలో కట్టెలతో చేసిన వంటల ఖర్చు గ్యాస్తో చేసిన ఖర్చును మించిపోతుండటంతో ధరలూ పెంచేశారు. గతంలో ఉన్న ధరలకు అదనంగా 30 శాతం ధరలను పెంచి టిఫిన్లు, భోజనం విక్రయిస్తున్నారు. పట్టణాల్లో కర్రీ పాయింట్లు కూడా గ్యాస్ కొరతతో మూతపడుతున్నాయి. కొన్ని కర్రీ పాయింట్లలో ధరలను రెట్టింపు చేశారు. టీ, కాఫీ సెంటర్లపై కూడా గ్యాస్ కొరత ప్రభావం చూపింది. మొన్నటి వరకు రూ.10 ఉన్న టీని రూ.15 చేశారు. రూ.20 ఉన్న కాఫీని రూ.25 చేశారు. స్వీట్లు తయారు చేసే నిర్వాహకులు కూడా గ్యాస్ కొరత కారణంగా ఇబ్బందులు పడుతున్నారు. గతంలో కంటే తక్కువగా తినుబండారాలు తయారు చేస్తున్నారు. ఖర్చులు పెరిగిపోవటంతో స్వీట్లు, తినుబండారాల రేట్లను పెంచుతున్నారు.ప్రత్యామ్నాయం ఏమిటో?గతంలో వరిపొట్టు, బొగ్గుతో పొయ్యిలను ఏర్పాటు చేసుకుని హోటళ్లు నడిపేవారు. పొట్టు, బొగ్గు ధరలు బాగా పెరగటంతో అందరు గ్యాస్పైనే ఆధారపడ్డారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా గ్యాస్ సరఫరాలో ఇబ్బందులు తలెత్తడంతో ఆహార సంబంధిత వ్యాపారాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్యాస్ కొరత పెద్దగా ఏమీ లేదని, దానివల్ల ఇబ్బందులు ఏమీ లేవని చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం గ్యాస్ సిలిండర్లకు ఇబ్బందికర పరిస్థితులున్నాయి. ఈ కొరత ఎంతకాలముంటుందో, ప్రభుత్వం ఎలాంటి ప్రత్యామ్నాయాలను చూపుతుందో వేచిచూడాలి. -
ఇంటి వద్దకే
రాములోరి తలంబ్రాలు..ఖమ్మంమయూరిసెంటర్: భద్రాచలంలో ఈనెల 27న జరిగే శ్రీసీతారాముల కల్యాణానికి వెళ్లలేని భక్తులకు కల్యాణ తలంబ్రాలను చేర్చేలా టీజీఎస్ ఆర్టీసీ ఏర్పాట్లు చేస్తోంది. ఆర్టీసీ లాజిస్టిక్ సేవల ద్వారా ఇంటి వద్దకే ముత్యాల తలంబ్రాలు చేరుస్తారు. గతంలో మంచి ఆదరణ రావడంతో ఈసారి మరిన్ని తలంబ్రాల ప్యాకెట్లు పంపిణీ చేసేలా యా జమాన్యం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇందులో భాగంగా ముందస్తుగానే తలంబ్రాల బుకింగ్ను ఆర్టీసీ కార్గో సర్వీస్ ద్వారా ప్రారంభించింది. 8 వేల ప్యాకెట్ల బుకింగ్ లక్ష్యం.. ఖమ్మం ఆర్టీసీ రీజియన్లోని ఖమ్మం, మధిర, సత్తుపల్లి, కొత్తగూడెం, భద్రాచలం, మణుగూరు, ఇల్లెందు డిపోల పరిధిలో 8 వేల ముత్యాల తలంబ్రాల ప్యాకెట్ల బుకింగ్ లక్ష్యంగా ఆర్టీసీ కార్గో అధికారులు చర్యలు చేపట్టారు. గతేడాది 8,500 ప్యాకెట్లను రీజియన్లో బుక్ చేయగా.. రూ.12.83 లక్షలు ఆదాయం సంస్థకు లభించింది. ఈ ఏడాది కూడా అదే స్థాయిలో బుకింగ్ల కోసం ఆర్టీసీ కార్గో సేవలపై విస్తృత ప్రచారం చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం ఇప్పటికే ఆర్టీసీ యాజమాన్యం తలంబ్రాలకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించి బుకింగ్లను ప్రారంభించారు. భక్తుల నుంచి ఆదరణ.. శ్రీ సీతారామచంద్ర స్వామి కల్యాణ తలంబ్రాలు భక్తుల ఇంటి వద్దే అందించేందుకు ఆర్టీసీ ఏర్పాట్లు చేస్తోంది. గతంలో మాదిరిగానే భక్తులు కోరుకున్న చోటే ప్యాకెట్లను ఇచ్చేలా చర్యలు చేపట్టింది. 2022 ఏడాది నుంచి ఆర్టీసీ ఈ సేవలను ప్రారంభించగా.. రెండేళ్ల క్రితం వరకు ఒక్కో ప్యాకెట్ ధర రూ. 116లుగా ఉంది. అయితే గత రెండేళ్ల నుంచి ఆ ధరను రూ.151కి పెంచింది. అయినా తలంబ్రాల ప్రాధాన్యత దృష్ట్యా భక్తుల నుంచి ఆదరణ తగ్గకపోవడంతో ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కార్గో అధికారులు భావిస్తున్నారు. నేరుగా లేదా ఆన్లైన్లో.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఏడుడిపోల్లో ఉన్న ఆర్టీసీ కార్గో పాయింట్ల నుంచి స్వామివారి తలంబ్రాలను బుక్ చేసుకునే సౌకర్యాన్ని ఆర్టీసీ అధికారులు కల్పించారు. అంతేకాక www. tgsrtc. gov. in వెబ్సైట్లో కూడా బుక్ చేసుకోవచ్చని సూచిస్తున్నా రు. తలంబ్రాలను బుక్ చేసుకున్న వారికి స్వామి వారి కల్యాణ అనంతరం ఇంటి వద్దకే తలంబ్రాలు చేరవేస్తామని తెలిపారు. రాముల వారి ముత్యాల తలంబ్రాలకు ఎంతో విశిష్టత ఉంది. ఈ తలంబ్రాలను శుభకార్యాలకు అక్షింతలుగా వాడితే సాక్షాత్తు రాముల వారి అనుగ్రహం లభిస్తుందని భక్తుల నమ్మకం. అంతే కాకుండా రైతులు తమ పొలాల్లో వ్యవసాయ పనులు మొదలు పెట్టే ముందు ఈ తలంబ్రాలు చల్లే ఆనవాయితీ ఉంది. అలాగే తలంబ్రాలను ఇళ్లలో పెట్టుకుని చిన్న వారిని ఆశీర్వదిస్తూ వారి కోరికలను ఫలించాలని కోరుకుంటుంటారు. ఇలా అన్నిరకాలుగా ప్రాధాన్యత ఉండడంతో రాష్ట్రవ్యాప్తంగా వీటి కోసం ఆసక్తి కనబరుస్తున్నారు. సెంటర్ సెల్ నంబర్ ఖమ్మం 91542 98583 మధిర, సత్తుపల్లి 91542 98585 కొత్తగూడెం, ఇల్లెందు 91542 98582 భద్రాచలం, మణుగూరు 91542 98586 కార్గోలో పంపిణీకి ఏర్పాట్లు -
ప్రజా సంక్షేమాన్ని విస్మరించిన బడ్జెట్..
ఖమ్మంవైరారోడ్: తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ ప్రజా సంక్షేమాన్ని విస్మరించి, కేవలం అంకెల గారడీతో ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేశారని ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తాతా మధుసూదన్ తీవ్రంగా విమర్శించారు. రాష్ట్ర ప్రగతిని అడ్డుకుంటూ, అప్పుల ఊబి లోకి నెట్టేలా బడ్జెట్ రూపుదిద్దుకుందన్నారు. ఆది వారం బీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పా టు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత పదేళ్లలో కేసీఆర్ నాయకత్వంలో రూ. 2.80 లక్షల కోట్ల అప్పు చేస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నర ఏళ్లల్లోనే రూ.3.75 లక్షల కోట్ల అప్పులు తెచ్చి ప్రజలకు ప్రయోజనం లేకుండా ఖర్చు చేస్తోందని ఆరోపించారు. నిధుల మళ్లింపు, సింగరేణి ఫండ్స్ డైవర్షన్, భూముల తాకట్టుపై ప్రభుత్వం వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ ఉపప్రణాళికలకు పునరుద్ధరించిన నిధులను తక్షణమే విడుదల చేయాలన్నారు. సీతారామ ప్రాజెక్టును పూర్తి చేసి జిల్లా రైతాంగాన్ని ఆదుకోవాలని, రైతు భరోసా, మహాలకి్ష్మ్ పథకం, నిరుద్యోగ భృతి హామీల అమలుపై స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో మండల పార్టీ అధ్యక్షుడు బెల్లం వేణుగోపాల్, పగడాల నాగరాజు, ఉన్నం బ్రహ్మ య్య, వేముల వీరయ్య, ఉద్యమకారులు బొమ్మెర రామ్మూర్తి, బిచ్చాల తిరుమలరావు, మైనారిటీ అధ్యక్షుడు తాజుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ -
కోల్డ్ స్టోరేజ్లో ఆగిన మంటలు..
మధిర: మధిర మండలంలోని ఆత్కూరు సమీపంలో ఉన్న శ్రీసాయి బాలాజీ కోల్డ్ స్టోరేజ్లో అగ్ని ప్రమాదం కారణంగా చెలరేగిన మంటలు ఆదివారం అదుపులోకి వచ్చినా.. దట్టమైన పొగ వస్తూనే ఉంది. ఈ కోల్డ్స్టోరేజ్లోని ఆరవ అంతస్తులో ఈనెల 21న విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో అగ్ని ప్రమాదం జరిగింది. ఇందులో 350 మంది రైతులకు చెందిన 32 వేల మిర్చి బస్తాలు అంటే సుమారు 12,800 క్వింటాళ్ల మిర్చి నిల్వ ఉంది. గతేడాది, ఈ ఏడాది పండిన మిర్చి పంటకు గిట్టుబాటు ధర లేకపోవడంతో 80 శాతం మంది ఆంధ్ర రైతులతో పాటు మధిర, బోనకల్, వైరా ప్రాంతానికి చెందిన మరి కొంతమంది రైతులు ఈ స్టోరేజ్లో నిల్వ చేశారు. కాగా, 2027 మార్చి వరకు స్టోరేజ్ యాజమాన్యం ఇన్సూరెన్స్ చేయించింది. ఈనెల 21 నుంచి నిరంతరాయంగా 9 ఫైర్ ఇంజన్లు సహాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈక్రమాన బాధిత రైతులు సుమారం 150 మంది ఘటనా స్థలానికి చేరుకుని బస్తాలకు సంబంధించిన రశీదులను అధికారులకు అందజేశారు. స్ఫూర్తినింపిన అవయవాల దానం●బ్రెయిన్డెడ్ వ్యక్తి లివర్, కిడ్నీలు దానం ఖమ్మం రాపర్తినగర్: ఇంటి పెద్ద దిక్కు మరణించి పుట్టెడు దుఖం:లో ఉన్నా.. అవయదానం చేయడంతో కుటుంబసభ్యులు తీసుకున్న నిర్ణయం ఎందరికో స్ఫూర్తిదాయకమైంది. ఖమ్మం పట్టణానికి చెందిన ఆవుల వెంకటరమణ (45) రోజువారిలాగే ఈ నెల 15న ఖమ్మం పెవిలియన్ గ్రౌండ్లో వాకింగ్ చేస్తూ కిందపడ్డాడు. చాలా సమయం తర్వాత గుర్తించిన స్థానికులు ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి ఆపై హైదరాబాద్కు తరలించగా అక్కడ వైద్యులు పరీక్షించి తలలో బ్లడ్క్లాట్ అయిందని గుర్తించారు. ఈక్రమంలో 18న ఉదయం బ్రెయిన్ డెడ్ అయి మృతి చెందాడు. ఆ తర్వాత అవయవదానంపై జీవన్దాన్ స్వచ్ఛంద సంస్థ, ఆస్పత్రిలోని అవయవదాన సమన్వయకర్తలు వివరించగా.. మృతుడి తల్లిదండ్రులు, కుటుంబసభ్యుల అంగీకారంతో లివర్, రెండు కిడ్నీలు దానం చేశారు. ఈక్రమంలో జీవన్ధాన్ ఆధ్వర్యాన అవసరం ఉన్నచోటుకు అవయవాలను తరలించనున్నట్లు తెలిపారు. కాగా, మృతుడు వెంటకరమణ నగరంలోని ఓల్డ్ క్లబ్ రోడ్డులో ప్రింటింగ్ ప్రెస్ నడుపుతుండడంతో పాటు ఫుట్బాల్ క్రీడాకారుడు కావడంతో పలువురు క్రీడాకారులు సంతాపం తెలిపారు. -
రేపటి నుంచి జిల్లాస్థాయి కబడ్డీ పోటీలు
షార్ట్ సర్క్యూట్తో.. రూ.50 వేల ఆస్తినష్టంట్రాక్టర్ ఫ్యాన్ రెక్కలు తగిలి వ్యక్తికి తీవ్ర గాయాలురఘునాథపాలెం: కూలి పనుల కోసం వెళ్లిన ఓ వ్యక్తికి ట్రాక్టర్ ఫ్యాన్ రెక్కలు తగిలి తీవ్రంగా గాయపడ్డాడు. గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన వాంకుడోతు అమరయ్య పొలంలో పెసలు తూర్పాల పట్టేందుకు కూలి పనులకు వెళ్లాడు. ఈక్రమంలో ట్రాక్టర్ ఫ్యాన్ రెక్కలు అతని కుడి చేతి భుజానికి తగిలి తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో 108లో ఖమ్మానికి, అక్కడి నుంచి హైదరాబాద్కు తరలించారు. సత్తుపల్లిరూరల్: ఇంట్లోని వారంతా డాబాపై నిద్రిస్తున్న సమయాన ఇంట్లో జరిగిన షార్ట్ సర్క్యూట్తో వస్తువులన్నీ దగ్ధమయ్యాయి. వివరాలిలా.. సత్తుపల్లి మండలం బేతుపల్లి ఎస్టీ కాలనీలో శనివారం అర్ధరాత్రి వడ్డంగి అశోక్ తన కుటుంబంతో డాబాపై నిద్రిస్తున్నాడు. ఈక్రమాన అర్ధరాత్రి దాటాక కాలిన వాసన వస్తుండడంతో కిందకు వెళ్లి చూడగా.. ఇంట్లో నుంచి మంటలు వస్తుండడంతో డోర్లు తీసి మంటలను అదుపు చేశారు. ఈక్రమాన వంట గదితో షార్ట్ సర్క్యూట్ అయి ఫ్రిజ్, గ్రైండర్, మిక్సీ, టీవీ, ఫ్యాన్లు, విద్యుత్ బోర్డులన్నీ కాలిపోయాయని, గ్యాస్ సిలిండర్లో గ్యాస్ లేకపోవడంతో పెనుప్రమాదం తప్పిందని కుటుంబసభ్యులు వాపోయారు. ఈక్రమంలో బేతుపల్లి సర్పంచ్ దొడ్డా రాజేంద్రప్రసాద్ సంఘటనా స్థలానికి చేరుకోగా సుమారు రూ.50వేల ఆస్థినష్టం వాటిల్లినట్లు బాధితుడు వివరించాడు. అధికారులు స్పందించి ఆదుకోవాలని బాధితులు కోరారు. నేలకొండపల్లి: శ్రీరామనవమి సందర్భంగా నేలకొండపల్లి యూత్ క్లబ్ ఆధ్వర్యాన ఈ నెల 24 నుంచి 26వ తేదీ వరకు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, నల్లగొండ జిల్లాల స్థాయిలో కబడ్డీ పోటీలను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపా రు. ఆదివారం విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ.. మండల కేంద్రంలోని ఎస్సీ, బీసీ కాలనీలో జరిగే ఈ పోటీలను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, ఖమ్మం జిల్లా కబడ్డీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు తుంబూరు దయాకర్రెడ్డిలు ప్రారంభిస్తారని తెలిపారు. మొదటి బహుమతి రూ.20,016, రెండో బహుమతి రూ.15,016, మూడో బహుమతి రూ.10,016, నాల్గవ బహుమతి రూ.8,016, ఐదో బహుమతి రూ.5,016 నగదుతో పాటు షీల్డ్లు అందించనున్నట్లు తెలిపారు. ఆసక్తి గల క్రీడాకారులు 78936 94778, 99638 66092లను సంప్రదించాలని కోరారు. -
ఇకపై ఆ ట్యాక్స్ రద్దు..
ఖమ్మంక్రైం: ఏదైనా వాహనదారుడికి అతడి పేరుపై ఆర్సీ కార్డు కలిగి ఉండి అతడు మరో వాహనం కొనాలంటే ప్రభుత్వానికి కచ్చితంగా రెండుశాతం అదనంగా లైఫ్ట్యాక్స్ కట్టాల్సి వచ్చేది. అయితే ఇప్పుడు ఆ ట్యాక్స్ను ఎత్తివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో వాహనదారులకు ఊరట కల్గించినట్లయింది. ఇది నేడు(సోమవారం) నుంచి అమల్లోకి రానుండడంతోటూ,త్రీ, ఫోర్ వీలర్స్ ఏదైనా కొనుగోలు చేసినా అదనపు ట్యాక్స్ ఉండదు. ఈవీల రాకతో.. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కాలుష్య నియంత్రణ, ట్రాఫిక్ను చక్కదిద్దే క్రమంలో భాగంగా కొత్త వాహనాలు కొనుగోళ్లను కంట్రోల్ చేసేందుకు అప్పటి ప్రభుత్వం అదనపు ట్యాక్స్ అమల్లోకి తెచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ ట్యాక్స్ కొనసాగుతూనే ఉంది. అయితే ఇటీవలకాలంలో వాహనదారులు ఎలక్ట్రికల్ వాహనాలు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తుండడంతో రానున్న కాలంలో కాలు ష్యాన్ని నివారించడానికి ఈ ట్యాక్స్ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతోవాహనాల కొనుగోళ్లు మరింత పెరిగేఅవకాశం ఉంది. ఈక్రమాన జిల్లాలోని ఖమ్మం, వైరా, సత్తుపల్లి రవాణాశాఖ కార్యాలయాల పరిధిలో నిత్యం 100కు పైగా వాహనాలకు సంబంధించి రిజిస్ట్రేషన్లు జరుగుతుండగా.. ఇటీవలకాలంలో షోరూమ్స్లోనే రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. దీంతో వాహనదారులు షోరూమ్కు వెళ్లకుండానే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుండడం గమనార్హం. కేంద్ర వాహన్ పోర్టల్లోకి.. తెలంగాణ రవాణాశాఖ ఈనెల23నుంచి జిల్లా రవాణా శాఖ పరిధిలోని వాహనాల డేటాను కేంద్ర ప్రభుత్వ పరిధిలోని వాహన్ పోర్టల్లోకి చేరవేయనుంది. నేషనల్ డేటాబేస్తో అనుసంధానం చేయడం ద్వారా వాహనాలకు సంబంధించిన డాక్యుమెంటేషన్ ప్రక్రియ ఈజీ అవుతుంది. అదేవిధంగా సెకండ్హ్యాండ్ వాహనాల కొనుగోలు విషయంలో జరిగే మోసాలను అరికట్టవచ్చు. ముఖ్యంగా దొంగ వాహనాల అమ్మకాలు, కొనుగోళ్లకు చెక్ పడే అవకాశం ఉంది. పెరగనున్న పారదర్శకత.. ఈ వాహన్ పోర్టల్ డిజిటల్ విధానంతో రవాణా శాఖ కార్యకలాపాల్లో పారదర్శకత పెరగడంతో పాటు ఏజెంట్ల జోక్యం తగ్గి వాహనదారుడికి రవాణా సేవలు వేగంగా అందుతాయి. అంతేకాక ఆర్సీ డూప్లికేట్ కాపీ, పేరు, చిరునామా మార్పు, లోన్ తొలగింపు వంటిసేవలను నేరుగా ఆన్లైన్లోనే పూర్తి చేసుకోవ చ్చు. ఫలితంగా ఆర్టీఓ కార్యాలయాల చుట్టూ తిరగా ల్సిన పనిలేకపోవడంతో పాటు వాహనదారులు తమ వాహన వివరాలను స్మార్ట్ఫోన్ ద్వారా ఎక్కడి నుంచి అయినా తెలుసుకోవచ్చు. డిజిటల్ డాక్యుమెంట్లను ఈ యాప్లో భద్రపర్చుకోవచ్చని రవాణా శాఖాధికారులు చెబుతున్నారు. వాహనదారులకు లైఫ్ట్యాక్స్ నుంచి ఊరట -
దేవాలయాలుగా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు
● నిర్మాణ పనుల నాణ్యతలో రాజీ పడొద్దు ● అగ్నిప్రమాద బాధిత రైతులకు న్యాయం చేస్తాం ● డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క మధిర/బోనకల్: దార్శనిక దేవాలయాలుగా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్సియల్ పాఠశాలల నిర్మాణం జరుగుతోందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. బోనకల్ మండలం లక్ష్మీపురంలో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణ పనులను ఆదివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇందిరమ్మ ప్రభుత్వం విద్యకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. విద్యకోసం పెట్టే ప్రతీ రూపాయి భవిష్యత్ తరాలను నిర్మించడం కోసం పెట్టే పెట్టుబడిగా అబివర్ణించారు. భవన నిర్మాణ పనుల్లో నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడొద్దని కాంట్రాక్టర్ను ఆదేశించారు. భవన నిర్మాణ మ్యాప్ను పరిశీలించి పలు సూచనలు చేశారు. బీమా ప్రకారం సొమ్ము చెల్లించాలి.. అగ్ని ప్రమాదంలో నష్టపోయిన రైతులకు న్యాయం చేస్తామని, బీమా ప్రకారం సొమ్ము వచ్చేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను భట్టి విక్రమార్క ఆదేశించారు. మధిర మండలం ఆత్కూరులో అగ్నిప్రమాదానికి గురైన శ్రీ సాయి బాలాజీ కోల్డ్ స్టోరేజీని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్దత్ తదితరులతో కలిసి ఆయన పరిశీలించారు. మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు అధికారులు చేపడుతున్న చర్యలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన బాధిత రైతులతో మాట్లాడుతూ.. శీతల గిడ్డంగిలో రికార్డు ప్రకారం ఉన్న మిర్చికి సంబంధించిన రైతులకు బీమా ద్వారా పరిహారం అందిస్తామని హామీ ఇచ్చారు. మధిర మార్కెట్లో కూడా మిర్చి అమ్మకాలు, కొనుగోళ్లు వేగంగా చేపట్టేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అగ్ని ప్రమాదం జరిగిన ప్రాంతంలో మళ్లీ మంటలు చెలరేగకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. కళాశాల భవనాల పరిశీలన.. మధిర మండలం సిరిపురంలో నిర్మిస్తున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనాలు, ఐటీఐ భవనాలను భట్టి విక్రమార్క పరిశీలించారు. నిర్ణీత గడువులోగా పనులన్నీ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పనుల్లో జాప్యం చేస్తే సహించేది లేదన్నారు. నిర్మాణ పనుల పురోగతిపై ఆయన అధికారులతో అక్కడే సమీక్ష నిర్వహించారు. పనుల్లో మరింత వేగం పెంచాలని, నాణ్యత పాటించాలని ఆదేశించారు. ఆయా కార్యక్రమాల్లో మాజీ ఎమ్మెల్యే కొండబాల కోటేశ్వరరావు, డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ, డీఈ నాగేశ్వరచారి, ఏఈలు నాగేశ్వరావు, సురేష్, కాంట్రాక్టర్ ప్రభాకర్రెడ్డి, నాయకులు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, మహమ్మద్ జావేద్ తదితరులు పాల్గొన్నారు. -
ఉపాధికి చేయూత
జిల్లాలోని షెడ్యూల్డ్ కులాల వారి ఆర్థికాభివృద్ధికి రాష్ట్ర ఎస్సీ సహకార అభివృద్ధి కార్పొరేషన్ (టీజీఎస్సీసీడీసీ) 2025 – 26 ఆర్థిక సంవత్సరానికి వార్షిక కార్యాచరణ ప్రణాళిక ఖరారు చేసింది. ఈ మేరకు జిల్లాలోని ఎస్సీ జనాభా ప్రాతిపదికన మొత్తం 540 మంది లబ్ధిదారులను ఎంపిక చేయాలని లక్ష్యంగా నిర్ణయించింది. ఇందుకోసం రూ.516.43 లక్షల సబ్సిడీని కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. – ఖమ్మం మయూరిసెంటర్రవాణా, వ్యవసాయ రంగాలకు పెద్దపీట జిల్లాకు కేటాయించిన యూనిట్లలో ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిచ్చింది. 256 ఎలక్ట్రిక్ టూ వీలర్లు, 128 త్రీ వీలర్లను నిరుద్యోగ యువతకు అందించనున్నారు. అలాగే వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసేందుకు 27 మంది ఎస్సీ రైతులకు సోలార్ యూనివర్సల్ పంప్ కంట్రోల్ యూనిట్లను మంజూరు చేయనున్నారు. వీటితో పాటు మొత్తం 129 మంది యువతకు వివిధ రంగాల్లో నైపుణ్య శిక్షణ అందించి, వారిని వేతన, స్వయం ఉపాధి వైపు మళ్లించనున్నారు. 24 వరకు దరఖాస్తు గడువు.. అర్హులైన అభ్యర్థులు ఆధార్, రేషన్ కార్డు, తెలంగాణ ఆవిర్భావం తర్వాత తీసుకున్న కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలతో ఆన్లైన్ ద్వారా ఓబీఎంఎంఎస్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రవాణా వాహనాలకు పర్మనెంట్ డ్రైవింగ్ లైసెన్స్, సోలార్ పంప్సెట్ల కోసం కనీసం రెండెకరాల భూమి, పట్టాదార్ పాస్బుక్ కలిగి ఉండటం తప్పనిసరి. ఈనెల 24వ తేదీ వరకు దరఖాస్తు చేయడంతో పాటు ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయంలో అందజేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ పూర్తయ్యాక కలెక్టర్ అధ్యక్షతన ఉండే కమిటీ లబ్ధిదారులను ఎంపిక చేస్తుంది. ఎంపికై న వారికి శిక్షణ పూర్తి చేసిన అనంతరం ఏప్రిల్ 16 లోపు యూనిట్ల గ్రౌండింగ్ పూర్తి చేసి యూసీలను అందజేసేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు. యూనిట్ ఆధారంగా సబ్సిడీ ఎస్సీ కార్పొరేషన్ ద్వారా లబ్ధిదారులకు అందించే స్వయం ఉపాధి, ఉపాధి యూనిట్లకు ప్రభుత్వం సబ్సిడీని ప్రకటించింది. యూనిట్ ధర ప్రకారం సబ్సిడీ ఇవ్వనుంది. రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు 90 శాతం, రూ.1,00,001 నుంచి రూ.2లక్షల వరకు 80 శాతం సబ్సిడీ, రూ.2,00,001 నుంచి రూ.4 లక్షల వరకు 70 శాతం, రూ.4,00,001 నుంచి రూ.5 లక్షల వరకు 60 శాతం సబ్సిడీ ఇవ్వనుంది. సబ్సిడీ పోను మిగిలిన యూనిట్ విలువను బ్యాంక్ రుణంగా ఇప్పించనుంది. ఉపాధి శిక్షణకు సంబంధించి యూనిట్ విలువకు పూర్తి సబ్సిడీ ఇవ్వనుంది.ఎస్సీ కార్పొరేషన్ ద్వారా అందించే యూనిట్లకు దరఖాస్తు చేసుకోవాలంటే ప్రభుత్వం కొన్ని అర్హతలు, నిబంధనలు విధించింది. ఈ పథకాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షల లోపు ఉండాలి. వ్యవసాయేతర పథకాలకు 21 నుంచి 50 ఏళ్లు, వ్యవసాయ పథకాలకు 21 నుంచి 60 ఏళ్ల మధ్య వయసు గలవారు అర్హులు. గత ఐదేళ్లలో ఏదైనా ప్రభుత్వ ఉపాధి పథకం పొందిన వారు, దళిత బంధు లబ్ధిదారులు ఈ పథకానికి అనర్హులని అధికారులు స్పష్టం చేశారు. మహిళలకు 33 శాతం, దివ్యాంగులకు 5 శాతం కోటా కేటాయించారు. ముఖ్యంగా ఎలక్ట్రిక్ టూ వీలర్ల కేటాయింపులో జొమాటో, స్విగ్గీ వంటి ప్లాట్ఫామ్లలో పనిచేసే గిగ్ వర్కర్లకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వనున్నారు.ప్రణాళిక ఖరారు చేసిన ఎస్సీసీడీసీ అధికారులు -
పైసా విదల్చదు
● బ్రహ్మోత్సవాలకు నిధులు కేటాయించని ప్రభుత్వం ● భక్తుల కానుకలతోనే శ్రీరామనవమి, ముక్కోటి వేడుకలు ● భద్రగిరికి ఫెస్టివల్ ఫండ్ ప్రకటించాలని కోరుతున్న భక్తులు భద్రాచలం: దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రగిరి బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతోంది. ఈ నెల 27న శ్రీరామనవమికి దేవాదాయశాఖ ఏర్పాట్లు చేస్తోంది. అయితే భక్తులు సమర్పించే హుండీ ఆదాయంతోనే ఉత్సవాలు నిర్వహించాల్సి వస్తోంది. ఏటా ప్రభుత్వం సీఎం చేతుల మీదుగా స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించి సరిపెట్టుకుంటోంది. వేడుకల నిర్వహణకు ఫెస్టివల్ ఫండ్ కేటాయించాలని ఏళ్లుగా భక్తులు కోరుతున్నా పట్టించుకోవడం లేదు. తాజాగా బ్రహ్మోత్సవాల నేపథ్యంలో భక్తకోటి మరోసారి ప్రభుత్వానికి గుర్తు చేస్తోంది. తాత్కాలిక పనులకే అధిక వ్యయం ముక్కోటికి, శ్రీరామనవమి వేడుకల సందర్భంగా దేవస్థానం అధికారులు తాత్కాలిక పనులు చేపడుతున్నారు. లైటింగ్, పెయింటింగ్, తాత్కాలిక పనులు, చలువ పందిళ్లు, ఏసీలు, ఎల్ఈడీలు తదితర పనుల నిమిత్తం అధికంగా నిధులు కేటాయిస్తున్నారు. ముక్కోటికి రూ.80 లక్షలకు పైగా, శ్రీరామమనవమికి రూ. కోటిన్నర వరకు ఖర్చు పెడుతున్నారు. అలా కాకుండా శాశ్వత అభివృద్ధి పనులు చేపట్టాలని, ఇందుకోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు కేటాయించాలని భక్తులు కోరుతున్నారు. మిథిలా స్టేడియాన్ని ఆధునికీకరిస్తే షెడ్లు, షామియానాలు, బారికేడ్లు తదితర పనుల వ్యయం ఆదా అవుతుందని పేర్కొంటున్నారు. కలగా మారిన ప్రభుత్వ ఫెస్టివల్ ఫండ్.. శ్రీరామనవమికి ప్రభుత్వం రూపాయి విదల్చకపోవడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మేడారం జాతర మాదిరిగా ఏటా రామయ్య ఉత్సవాలకు ఫెస్టివల్ ఫండ్ ప్రకటించాలని కొన్నేళ్లుగా కోరుతున్నారు. ప్రభుత్వ నిధులతో ఉత్సవాలు నిర్వహిస్తే వసతులు, సౌకర్యాలు పెరగటంతోపాటు ఆలయ ఆదాయం అభివృద్ధికి, ఇతర పనులకు సమకూర్చుకునే అవకాశం ఉంటుంది. సుమారుగా ఏడాదికి రూ. ఏడు కోట్లు ఆదా అయ్యే అవకాశం కనిపిస్తుంది. శ్రీరామనవమికి సమర్పించే పట్టువస్త్రాలకు సైతం నిధులు విడుదల చేయటం లేదనే అపవాదు ప్రభుత్వం మూటగట్టుకుంటోంది. గత ప్రభుత్వం రామాలయంపై శీతకన్ను వేసిందంటూ, అభివృద్ధి చేసి చూపిస్తామంటూ భద్రాచలంలో ఇచ్చిన హామీని రేవంత్ రెడ్డి సీఎంగా నిలబెట్టుకోవాలని పలువురు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు.శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో నిర్వహించే ప్రధాన ఉత్సవాలు ముక్కోటి, శ్రీరామనవమి. నవమి వేడుకలకు సుమారు రూ.2.5 కోట్లు ముక్కోటికి సుమారు రూ.1.5 కోట్లు ఖర్చు అవుతున్నాయి. ఆలయానికి ప్రధాన ఆదాయ వనరు భక్తులు సమర్పించే హుండీ ఆదాయమే. దీన్ని నుంచే అఽధికారులు, ఉద్యోగుల జీత భత్యాలు చెల్లించాలి. దేవస్థానం నిర్వహణ, ఉత్సవాలకు వ్యయం చేయాలి. శ్రీరామనవమికి సెక్టార్ టికెట్ల విక్రయం ద్వారా కొద్దిమేర ఆదాయం సమకూరుతుంది. అయితే ఉత్సవాల ఖర్చు కంటే వ్యయం అధికమని లెక్కలు చెబుతున్నాయి. గతంలో ఉభయదాతల టికెట్లు వెయ్యి ఉండేవి. వాటి విక్రయం ద్వారా అధిక ఆదాయం లభించేది. కాలక్రమేణా సీఎం సెక్టార్తోపాటు వీవీఐపీ, వీఐపీ సెక్టార్లు పెరుగుతుండటంతో ప్రస్తుతం ఉభయదాతల టికెట్లను 600కు కుదించారు. దీంతో ఆ ఆదాయం కూడా తగ్గింది. -
విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
మధిర: విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించే సిబ్బందిపై కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. ఆదివారం మధిర ప్రభుత్వ ప్రాంతీయ ఆస్పత్రిని ఆయన తనిఖీ చేశారు. పేషెంట్లతో మాట్లాడి వైద్య సేవలెలా అందుతున్నాయని ఆరా తీశారు. అనంతరం మాట్లాడుతూ.. మరింత నాణ్యమైన సేవలు అందేలా వైద్యాధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అనుమతి లేకుండా గైర్హాజరైన వైద్యులు, ఇతర సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీ చేయాలన్నారు. వైద్యుల హాజరు వివరాలను రెగ్యులర్గా తనకు అందించాలని సూచించారు. వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉంటూ మెరుగైన వైద్య సేవలు అందిస్తేనే ఎక్కువ మంది బాధితులు ప్రభుత్వ ఆస్పత్రికి వస్తారని తెలిపారు. సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలన్నారు. కలెక్టర్ వెంట మధిర తహసీల్దార్ రాంబాబు, తదితరులు ఉన్నారు.కలెక్టర్ అనుదీప్ హెచ్చరిక -
నీటి సంరక్షణకు కృషి చేయండి
రఘునాథపాలెం: నీటి సంరక్షణకు అందరూ కృషి చేయాలని ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ శేఖర్రెడ్డి అన్నారు. జల మహోత్సవాన్ని పురస్కరించుకుని ‘హర్ ఘర్ జల్’లో భాగంగా మండలంలోని రేగులచలకలో ఆదివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతీ ఇంటికి శుద్ధమైన తాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, మిషన్ భగీరథ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించిందని అన్నారు. అమూల్య వనరైన నీటిని వృథా చేయొద్దని సూచించారు. అనంతరం అధికారులు, ప్రజాప్రతినిధులు, జ్యోతిబాపూలే డిగ్రీ కళాశాల విద్యార్థులతో కలిసి గ్రామంలో ప్రదర్శన నిర్వహిచారు. నీటిని సంరక్షిస్తూ బాధ్యతగా వినియోగిస్తామని గ్రామస్తులతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో డీపీఓ రాంబాబు, ఆర్డబ్ల్యూఎస్, మిషన్భగీరథ ఈఈలు పుష్పలత, వాణిశ్రీ, డీఈ ఓంప్రకాష్, ఏఈ ఇందిరా జ్యోతి, ఆయా గ్రామాల సర్పంచ్లు, ఉపసర్పంచ్లు యండపల్లి రమాదేవి, బలుసుపాటి శేషయ్య, కొటేరు నర్సిరెడ్డి, నున్నా వెంకటేశ్వరరావు, మాదంశెట్టి హనుమంతరావు, పంచాయతీ కార్యదర్శి ఆదాం, ఉపాధి హమీ పథకం ఏపీఓ పద్మయ్యనాయుడు, డీఆర్ఓ వి.సల్మాన్రాజు పాల్గొన్నారు. ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ శేఖర్రెడ్డి -
సాగులో ఆధునిక పద్ధతులు అవలంబించాలి
చింతకాని : పంటల సాగులో ఆధునిక వ్యవసాయ పద్ధతులు అవలంబించాలని జిల్లా వ్యవసాయాధికారి ధనసరి పుల్లయ్య సూచించారు. నాగులవంచ రైతువేదికలో ఆదివారం వరి సాగుపై రైతులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేరుగా విత్తుకునే వరి సాగుతో ఖర్చు తగ్గడంతో పాటు అధిక దిగుబడి వస్తుందని తెలిపారు. ఈ విధానంలో పాటించాల్సిన పద్ధతులు, కలుపు యాజమాన్యం, ఎరువులు, మందుల వాడకంపై వివరించారు. రైతులు పామాయిల్ సాగుపై కూడా దృష్టి సారించాలని కోరారు. కార్యక్రమంలో మధిర ఏడీఏ స్వర్ణ విజయ్చంద్ర, డివిజన్ ఉద్యాన అధికారి విష్ణు, మత్కేపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అంబటి వెంకటేశ్వరరావు, ఆత్మ కమిటీ డైరెక్టర్ కొప్పుల గోవిందరావు, గ్రామసర్పంచ్ నారగాని రాంబాయి, ఆదర్శ స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్ రామకృష్ణ, ఏఓ సోములపల్లి మానస, ఏఈఓలు కళ్యాణి, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు. -
కొనసాగుతున్న శ్రీవారి బ్రహ్మోత్సవాలు
ఎర్రుపాలెం: తెలంగాణా తిరుపతిగా ప్రసిద్ధి గాంచిన జమలాపురం శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో వసంత నవరాత్రి బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. నాలుగో రోజైన ఆదివారం శ్రీవారి పాదాలకు అర్చకులు అష్టోత్తర కలశాభిషేకం చేశారు. ఆ తర్వాత సుప్రభాత సేవ నిర్వహించి శ్రీవేంకటేశ్వర స్వామి వారిని, శ్రీఅలివేలు మంగ, శ్రీపద్మావతి అమ్మవార్లను సుందరంగా అలంకరించారు. వేదమంత్రాలతో మండపారాధన, నవగ్రహం హోమం గావించారు. అనంతరం గోమాతలకు ప్రత్యేక పూజలు చేశారు. శ్రీవారిని, అమ్మవార్లను భక్తులు దర్శించుకుని మొక్కులు సమర్పించారు. చివరగా శ్రీపద్మావతి అలివేలు మంగా సమేతుడైన శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని హంస వాహనంపై కొలువుదీర్చి భక్తుల కోలాటాల నడుమ ఆలయ గిరి ప్రదక్షణ చేశారు. భక్తులకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో ఆలయ ప్రధానార్చకులు ఉప్పల శ్రీనివాసశర్మ, చైర్మన్ ఉప్పల విజయదేవశర్మ, సీనియర్ అసిస్టెంట్ సోమయ్య, జూనియర్ అసిస్టెంట్ కృష్ణప్రసాద్, ఉప ప్రధాన అర్చకులు, మురళీమోహన్శర్మ, రాజీవ్శర్మ పాల్గొన్నారు. పెనుబల్లి యువకుడికి ‘విశ్వగురు’ అవార్డుపెనుబల్లి: దక్షిణాఫ్రికాలోని మౌంట్ కిలిమంజారో, రష్యాలోని మౌంట్ ఎల్బ్రూన్ వంటి శిఖరాలను విజయవంతంగా అధిరోహించి, అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ చాటిన పెనుబల్లికి చెందిన బర్మావత్ మోతీకుమార్ ‘విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ అవార్డు’ అందుకున్నారు. ఈ మేరకు ఆదివారం విశాఖపట్టణంలో జరిగిన కార్యక్రమంలో విశాఖ సిటీ సీపీ శంఖబ్రతా బగ్చి, ఐఆర్ఎస్ అధికారి రవిశంకర్ మలిశెట్టి, సినీ నటుడు రాజీవ్ కనకాల, విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ ఫౌండర్ సత్యవోలు రాంబాబు తదితరులు ఈ అవార్డును ప్రదానం చేశారు. కాగా, మోతీకుమార్ అత్యున్నత ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నారు. ఈ మహత్తర లక్ష్య సాధనకు అవసరమైన ఆర్థిక సాయం అందించాలని ఆయన దాతలతో పాటు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. యాప్తో విద్యుత్ ఉద్యోగుల భద్రత ఖమ్మంవ్యవసాయం: క్షేత్ర స్థాయిలో విద్యుత్ ఉద్యోగుల భద్రత కోసం ఆన్లైన్ ఎల్సీ(లైన్ క్లియరెన్స్) యాప్ రూపొందించినట్లు ఖమ్మం ఎస్ఈ ఇనుగుర్తి శ్రీనివాసాచారి తెలిపారు. ఫీడర్ల ఎంపికలో లోపాలు, సమాచార లోపంతో ఉద్యోగులు ప్రమాదాలకు గురవుతున్నారని పేర్కొన్నారు. దీన్ని అధిగమించేందుకు యాప్ రూపొందించినట్లు తెలిపారు. తద్వారా పని చేయాల్సిన ఫీడర్, పంపిణీ లైన్ వివరాలు స్పష్టంగా తెలుస్తాయని, ఎలాంటి పొరపాట్లు జరగకపోగా సిబ్బంది మధ్య సమాచార మార్పిడి సులువవుతుందని వెల్లడించారు. అగ్నివీర్కు దరఖాస్తుల ఆహ్వానం ఖమ్మం రాపర్తినగర్: భారత సైన్యంలో నియామకాలకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తుల స్వీకరణ మొదలైందని అధికారులు తెలిపారు. ఈమేరకు జిల్లాలో ఆసక్తి ఉన్న అవివాహిత యువత అగ్నివీర్ ద్వారా ఎంపికకు ఏప్రిల్ 1వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వయో పరిమితిని 21నుంచి 22ఏళ్లకు పెంచగా, అగ్నివీర్ జనరల్ డ్యూటీ, టెక్నికల్, క్లర్క్/స్టోర్ కీపర్, ట్రేడ్స్మన్ పోస్టులకు ఎనిమిది నుంచి పదో తరగతి అర్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. వివరాలకు www.joinindianarmy.nic.in వెబ్సైట్లో లేదా 040–27740059 నంబర్లో సంప్రదించాలని సూచించారు. కాగా, నియామక ప్రక్రియ నిష్పక్షపాతంగా జరుగుతుందని, ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పే మధ్యవర్తుల మాటలు నమ్మి మోసపోవద్దని తెలిపారు. -
మైనింగ్ ఆదాయం భేష్..
● ఇప్పటికే రూ.124 కోట్లకు పైగా వసూళ్లు ● గత ఏడాదితో పోలిస్తే 44 శాతం అధికం ఖమ్మంఅర్బన్: జిల్లాలో మైనింగ్ శాఖ ద్వారా ప్రభుత్వానికి గణనీయమైన ఆదాయం సమకూరుతోంది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఆదాయం 44 శాతం పెరిగినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. గత ఏడాది ఫిబ్రవరి నాటికి రూ.86.34 కోట్లు వసూలైతే, ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి రూ.124.32 కోట్లకుపైగా వసూళ్లు నమోదు కావడం విశేషం. తద్వారా గత ఏడాదితో పోలిస్తే రూ.37.99 కోట్ల లక్షల అదనపు ఆదాయం ప్రభుత్వ ఖజానాకు చేరినట్లయింది. గ్రానైట్ క్వారీలు, ఫ్యాక్టరీలు జిల్లాలో ప్రధానంగా బ్లాక్ గ్రానైట్, కంకర, స్టోన్ క్రషర్లు తదితర మైనింగ్ కార్యకలాపాల ద్వారా భారీగా ఆదాయం సమకూరుతోంది. రాష్ట్రంలోనే ఎక్కువ సంఖ్యలో గ్రానైట్ క్వారీలు, ఫ్యాక్టరీలు ఉన్న జిల్లాల్లో ఖమ్మం ఒకటి కావడంతో మైనింగ్ రంగం ద్వారా ప్రభుత్వానికి గణనీయమైన రాబడి వస్తోంది. జిల్లాలోని 21 మండలాల్లో వివిధ రకాల మైనింగ్ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. ప్రధానంగా ఖమ్మం రూరల్, ముదిగొండ, నేలకొండపల్లి, తిరుమలాయపాలెం, ఖమ్మంఅర్బన్, రఘునాథపాలెం, కూసుమంచి తదితర మండలాల్లో క్వారీలు, గ్రానైట్ పరిశ్రమల ద్వారా ఆదాయం అధికంగా వస్తోంది. ఇటీవల జిల్లాలో జాతీయ రహదారుల నిర్మాణం కొనసాగుతుండగా మట్టి, కంకర, గ్రానైట్ వినియోగంతో పాటే ఆదాయం మరింత పెరిగింది. ఇక అక్రమ తవ్వకాలపై చర్యలు తీసుకోవడం ద్వారా కూడా మైనింగ్ శాఖకు చెప్పుకోదగిన స్థాయిలో ఆదాయం లభించింది. అక్రమంగా మైనింగ్ సామగ్రి తరలిస్తున్న వాహనాలను సీజ్ చేయడం, క్వారీల్లో నిబంధనలకు విరుద్ధంగా జరిగిన కార్యకలాపాలను గుర్తించి జరిమానా రూపంలో సుమారు రూ.4.03 కోట్లు వసూలు చేసినట్లు అధికారులు తెలిపారు. ఇందులో 639 వాహనాలపై చర్యలు తీసుకుని రూ.1.45 కోట్ల జరిమానా వసూలు చేసినట్లు వెల్లడించారు.గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి 44 శాతం అధిక ఆదాయం సాధించాం. ప్రభుత్వం రూ.150 కోట్లు లక్ష్యంగా నిర్దేశిస్తే, ఇప్పటివరకు రూ.124 కోట్లకుపైగా వసూలయ్యాయి. అక్రమ మైనింగ్పై నిరంతరం నిఘా ఉంచి కేసులు నమోదు చేస్తూ పెనాల్టీల రూపంలో కూడా గణనీయమైన ఆదాయం సాధిస్తున్నాం. –సాయినాథ్, జిల్లా మైనింగ్ అధికారి (ఏడీ) -
ఎం ఫార్మసీ విద్యార్థినికి ఆర్థిక సాయం
ఖమ్మంసహకారనగర్: ఎంఫార్మసీ చదువుతున్న కందిమళ్ల వైష్ణవి ఫీజులు, ఇతర అవసరాల నిమిత్తం పరిశ సీతారత్నం చారిటబుల్ ట్రస్ట్ ద్వారా రూ.20 వేలు ఆర్థిక సాయం ప్రకటించారు. ఈ మేరకు చెక్కును టీజీవోస్ రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు శనివారం ఖమ్మంలోని టీఎన్జీవోస్ భవన్ వద్ద అందించారు. ట్రస్ట్ చైర్మన్ పరిశ పుల్లయ్య, టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గుంటుపల్లి శ్రీనివాసరావు, కొణిదన శ్రీనివాసరావు, టీజీవోస్ జిల్లా కార్యదర్శి మోదుగు వేలాద్రి, నాయకులు తాళ్లూరి శ్రీకాంత్, సూరంపల్లి రాంబాబు, రుక్మారావు, విద్యార్థి తల్లి ఉషారాణి పాల్గొన్నారు. -
● మరో ఐదుగురికి తీవ్ర గాయాలు ● మసివాగు వద్ద ఆటోను ఢీ కొట్టిన కారు ● మద్యం మత్తులో కారు నడపడం వల్లే ఘోరం
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిఇల్లెందు రూరల్: మండలంలోని మసివాగు తండా వద్ద శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మహిళలు మృత్యువాత పడ్డారు. ఇల్లెందు మీదుగా మసివాగుకు ప్రయాణికులతో వెళ్తున్న ఆటోను పాఖాల నుంచి ఇల్లెందు వైపు వస్తున్న కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో గుగులోతు స్వప్న(58), బానోతు లక్ష్మి(55) మృతిచెందగా ఐదుగురికి గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే 108లో క్షతగాత్రులను ఇల్లెందు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వీరిలో బాణోత్ రాజేశ్వరి పరిస్థితి విషమంగా ఉండటంతో ఖమ్మం తరలించారు. మిగిలిన నలుగురికీ ఇల్లెందు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. తండ్రి మృతితో నిద్రకు వెళ్తుండగా.. కారేపల్లి మండలం చీమలపాడు సమీపంలోని బోటితండాకు చెందిన స్వప్న తండ్రి బానోతు నంద్యా ఇటీవల చనిపోయాడు. దీంతో స్వప్న కుటుంబసభ్యులను నిద్ర కోసం ఆమె చెల్లెలు స్రవంతి తన స్వగ్రామమైన మసివాగుకు ఆహ్వానించింది. ఈక్రమంలో స్వప్న కుటుంబసభ్యులు మొత్తం ఏడుగురు ఆటోలో శనివారం రాత్రి బోటితండా నుంచి బయల్దేరారు. ఇల్లెందు దాటే వరకు ప్రయాణం సాఫీగానే సాగింది. మరికొన్ని క్షణాల్లో మసివాగు చేరుకుంటారనగా వేగంగా దూసుకొచ్చిన కారు వీరి ఆటోను బలంగా ఢీకొట్టింది. దీంతో ఆటోలో ఉన్న వారు చెల్లా చెదురుగా రోడ్డుపై పడిపోయారు. ఆటోను సైడ్ నుంచి ఢీ కొట్టడంతో వెనుక సీట్లో కూర్చున్న బాణోత్ స్వప్న, లక్ష్మికి తీవ్ర గాయాలై ఘటనా స్థలిలోనే ప్రాణాలొదిలారు. మిగిలిన వారు చెల్లాచెదురుగా రోడ్డుపై పడిపోయి, తీవ్ర గాయాలతో రక్తసిక్తమయ్యారు. ఘటన జరిగిన తర్వాత ఆ దారిలో వెళ్లేవారు 108కు సమాచారం ఇచ్చారు. ఈలోగా స్థానికులు చేరుకుని గాయపడినవారికి సాయం చేశారు. మద్యం మత్తులో కారుడ్రైవర్.. కారు నడుపుతున్న వ్యక్తి అతిగా మద్యం సేవించడం వల్లే ప్రమాదం జరిగిందని బాధితులు చెబుతున్నారు. మరి కాసేపట్లో గమ్యస్థానం చేరుకుంటామనగా ఒక్కసారిగా కారు ఆటోపైకి దూసుకొచ్చిందని, అప్పటికీ ఆటో డ్రైవర్ ప్రేమ్ చాకచక్యంగా పక్కకు వెళ్లినా, ప్యాసింజర్ సీటు భాగం వద్ద కారు బలంగా ఢీ కొట్టిందని తెలిపారు. ఇంత జరిగినా కారు నడిపే వ్యక్తి కనీసం కిందకు దిగకుండా మత్తులో అందులోనే కూర్చున్నాడని చెబుతున్నారు. చివరకు ఇల్లెందు సీఐ తాటిపాముల సురేశ్ ఘటనా స్థలానికి చేరుకుని కారు నడిపిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు వచ్చిన తర్వాత కూడా అతను మత్తులో నుంచి బయటకు రాలేదు. రోదనలతో మార్మోగిన ఆస్పత్రి రాత్రి 9:30 గంటలకు ప్రమాదం జరగగా పది గంటల సమయంలో ఇల్లెందు ప్రభుత్వ ఆస్పత్రికి క్షతగాత్రులను తరలించారు. అప్పటికే ప్రమాద విషయం తెలుసుకున్న బోటి తండాకు చెందిన వారు పెద్ద సంఖ్యలో ఆస్పత్రి వద్దకు వచ్చారు. బంధువుల రోదనలు, క్షతగాత్రుల ఆర్తనాదాలతో ఆస్పత్రి ప్రాంగణం విషాదభరితంగా మారింది. కాగా, ప్రమాదంలో బాణోతు ప్రేమ్, బాణోత్ శ్రీను, వనజ, మనోజ్ గాయపడ్డారు. బీటీపీఎస్లో విద్యుత్కు అంతరాయంమణుగూరురూరల్: మండల పరిధిలోని చిక్కు డుగుంట సమీపంలో గల బీటీపీఎస్ రెండో యూనిట్లో శనివారం సాంకేతిక లోపం తలెత్తి 270 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం వాటిల్లింది. బాయిలర్లోని పైప్ లీకవడంతో సమస్య ఏర్పడిందని, ఉత్పత్తి నిలిచిపోవడంతో పాటు సరఫరాకూ అంతరాయం ఏర్పడిందని అధికారులు తెలిపారు. వెంటనే మరమ్మతు పనులు చేయిస్తున్నామని, రెండురోజుల్లో సమస్య పరిష్కరిస్తామని సీఈ బిచ్చన్న తెలిపారు. రెండో యూనిట్లో సాంకేతిక లోపం.. -
రెండు ఎలక్ట్రిక్ వాహనాలు దగ్ధం
● షార్ట్ సర్క్యూట్ జరిగినట్లు అనుమానాలు ఖమ్మంఅర్బన్: ఖమ్మం రోటరీనగర్ సమీపాన ఓలా ఎలక్ట్రిక్ వాహనాల షోరూమ్ వద్ద శనివారం జరిగిన అగ్ని ప్రమాదంలో రెండు వాహనాలు కాలిపోయాయి. షోరూం బయట వాహనాలు నిలిపి ఉంచగా, మధ్యాహ్నం వేళ ఎండ ప్రభావంతో అకస్మాత్తుగా మంటలు మొదలయ్యాయి. దీంతో రెండు వాహనాలు కాలిపోతూ దట్టమైన పొగలు వెలువడగా, మూడో వాహనానికి కూడా మంటలు అంటుకునే పరిస్థితి ఎదురైంది. ఈ మేరకు స్థానికులు, వాహనదారులు నీరు, ఇసుక చల్లుతూ మంటలను ఆర్పుతూనే అగ్నిమాపక శాఖ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. దీంతో వాహనంతో వచ్చిన సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకురావడంతో షోరూంలో పెద్దసంఖ్యలో ఉన్న వాహనాలకు ముప్పు తప్పినట్లయింది. అయితే, వాహనాలకు చార్జింగ్ పెట్టిన సమయాన షార్ట్ సర్క్యూట్తో ప్రమాదం జరిగిన ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నా, కచ్చితమైన కారణాలను షోరూమ్ నిర్వాహకులు వెల్లడించాల్సి ఉంది. యూ టర్న్ వద్ద మూడు వాహనాలు ఢీ ఖమ్మంఅర్బన్: ఖమ్మం మమత రోడ్డులోని ఈఆర్ఆర్ రిసార్ట్స్ సమీపాన యూ టర్న్ ప్రమాదాలకు నిలయంగా మారింది. ఈ ప్రాంతంలో శనివారం జరిగిన ప్రమాదంలో మూడు వాహనాలు ఢీకొనగా ముగ్గురికి గాయాలయ్యాయి. ఇందిరానగర్ జంక్షన్ వైపు వచ్చిన వాహనదారుడు యూ టర్న్ వద్ద తిరుగుతుండగా, ట్యాంక్ బండ్ వైపు నుంచి వచ్చిన వాహనం ఢీకొంది. ఇదే సమయాన వెనుకాల ఉన్న మరో వాహనదారుడు కూడా ఢీకొనడంతో ముగ్గురికి గాయాలు కాగా స్థానికులు 108లో ఆస్పత్రికి తరలించారు. ఇక్కడ తరచూ ప్రమాదాలు జరుగుతుండడం, పలువురు గాయపడడమే కాక కొందరు ప్రాణాలు కోల్పోయారని స్థానికులు చెబుతున్నారు. స్పీడ్ బ్రేకర్లు, హెచ్చరిక బోర్డులు, సరైన మార్కింగ్ లేకపోవడంతో ప్రమాదాలు నిత్యకృత్యమయ్యాయని తెలుస్తోంది. ఈ మేరకు ట్రాఫిక్ పోలీసులు స్పందించి స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయడమే కాక వాహనదారులు వేగంగా వెళ్లకుండా చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు. -
భద్రగిరిలో భక్తుల సందడి
భద్రాచలం: భద్రగిరి దివ్యక్షేత్రం శనివారం భక్తులతో సందడిగా మారింది. ఉగాది, రంజాన్తో పాటు వా రాంతపు సెలవులు వరుసగా రావడంతో భక్తులంతా భద్రాచలం బాట పట్టారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు పవిత్ర గోదావరిలో పుణ్యస్నానా లను ఆచరించారు. అనంతరం ప్రత్యేక క్యూలైన్ల ద్వారా స్వామి వారిని దర్శించుకున్నారు. ఆర్జిత సేవల్లోనూ పెద్ద ఎత్తున పాల్గొన్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. జోరుగా టికెట్ల విక్రయాలు శ్రీరామనవమి, పట్టాభిషేక మహోత్సవాలను పురస్కరించుకుని దేవస్థానం వెబ్సైట్లో ఉంచిన టికెట్ల విక్రయాలు వేగంగా జరుగుతున్నాయి. శనివా రం నాటికి 3ఏ సెక్టార్లోని రూ.7,500 విలువైప ఉభయదాతల టికెట్లు 400కు గాను 293 అమ్ముడుపోగా 107 మాత్ర మే మిగిలి ఉన్నాయి. రూ.2,500 విలువైన సెక్టార్ 3బీ టికెట్లు 550కి 419, రూ.2వేల విలువైన సెక్టార్ 3సీ 190కి 30 మాత్రమే ఉన్నాయి. ఇక రూ.1000 విలువైన సెక్టార్ 3డీలో 85 పూర్తిగా అమ్ముడు పోగా, 3ఈలో 315కు 19, 3 ఎఫ్లో 390కి 321 టికెట్లు ఉన్నాయి. సెక్టార్ 4ఏలో రూ. 300 విలువైన టికెట్లు 368కి మొత్తం, సెక్టార్ 4బీ లో రూ.300వి 385కు 385, సెక్టార్ 4సీలో 295కు 144 టికెట్లు ఉన్నాయి. వీటితో పాటు రూ.150 విలువైన టికెట్లు కూడా అందుబాటులో ఉన్నాయని అధికారులు వెల్లడించారు. ఆన్లైన్లో వేగంగా నవమి టికెట్ల విక్రయం -
పోలీసుల విస్తృత తనిఖీలు
ఖమ్మంక్రైం: అక్రమ రవాణా, చట్టవ్యతిరేక కార్యకలాపాలను కట్టడి చేసేందుకు పోలీసులు జిల్లావ్యాప్తంగా శుక్రవారం రాత్రి నుంచి శనివారం తెల్లవారుజాము వరకు విస్తృత తనిఖీలు చేపట్టారు. ఏటీఎం సెంటర్లు, బ్యాంకుల పరిసరాల్లో పెట్రోలింగ్ నిర్వహిచారు. అనుమానాస్పదంగా కనిపించిన వ్యక్తులు, వాహనాల వివరాలను పరిశీలించారు. సరిహద్దు రాష్ట్రం నుంచి ఇసుక, గంజాయి, రేషన్ బియ్యం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు తనిఖీలు చేపట్టినట్లు పోలీసు కమిషనర్ సునీల్దత్ తెలిపారు. అలాగే, మద్యం మత్తులో వాహనాలు నడపకుండా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని వెల్లడించారు. చికిత్స పొందుతున్న వ్యక్తి మృతి నేలకొండపల్లి: గడ్డి మందు తాగి, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తి మృతి చెందాడు. మండలంలోని బోదులబండకు చెందిన ఎ.మధు (32) రెండు రోజుల క్రితం గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. గమనించిన కుటుంబీకులు నేలకొండపల్లిలో ప్రాథమిక చికిత్స చేయించి, ఖమ్మం తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. కాగా, మధు ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది. -
పీసీసీ చీఫ్ను కలిసిన డీసీసీ అధ్యక్షుడు
ఖమ్మంమయూరిసెంటర్: జిల్లా కాంగ్రెస్ కమిటీని నియమించడంపై డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ గౌడ్ టీపీసీసీ అధ్యక్షుడు మహేష్కుమార్గౌడ్కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్లో పీసీసీ చీఫ్ను కలిసిన ఆయన సన్మానించాక మాట్లాడారు. అనాదిగా కాంగ్రెస్ కోసం కష్టపడుతున్న నేతలతో పాటు యువతరానికి ప్రాతినిధ్యం కలిస్తూ కమిటీ ఏర్పాటు చేశారని, సామాజిక సమతుల్యతను కూడా పాటించారని ఆయన వివరించారు. అయితే, పార్టీ కోసం పనిచేసినందున మరికొందరు యువకులు, మహిళలతో రెండో జాబితా సిద్ధం చేయాలని డీసీసీ అధ్యక్షుడికి టీపీపీ చీఫ్ సూచించారు. -
కాళీమాత ఆలయంలో విరూపాక్ష స్వామి పూజలు
మణుగూరు టౌన్: మణుగూరు మున్సిపాలిటీ పరిధిలోని కాళీమాత ఆలయాన్ని హంపి విరూపాక్ష భారతీ స్వామి శనివారం సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా భక్తులు.. బీటీపీఎస్ రైలు మార్గం నిర్మాణంలో ఆలయంలో కొంతభాగం పోతుందని స్వామి వారి కి వివరించగా, ప్రభుత్వం ఆలయానికి స్థలం కేటాయించిన తర్వాత పునఃనిర్మాణానికి పూర్తి గా సహకరిస్తామని స్వామిజీ ప్రకటించారు. అనంతరం భక్తులను ఆశీర్వదించి ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో పండితులు శ్రీకాంత్, దుర్గాప్రసాద్, సంతోష్, భార్గవ్, యుగంధర్ తదితరులు పాల్గొన్నారు. -
మక్కల కొనుగోళ్లకు గ్రీన్సిగ్నల్
● పీఏసీఎస్లు, డీసీఎంఎస్ ద్వారా కేంద్రాలు ● ఉమ్మడి జిల్లాలో 41కేంద్రాల ఏర్పాటుఖమ్మంవ్యవసాయం: యాసంగిలో మొక్కజొన్న సాగు చేసిన రైతుల కష్టాలు తీర్చేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పంట సాగు చేసిన ప్రాంతాల్లో మార్క్ఫెడ్ సంస్థ ద్వారా కొనుగోళ్లకు చర్యలు చేపట్టాలని ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది మొక్కజొన్న క్వింటాకు మద్దతు ధర రూ. 2,400గా ప్రకటించినా ప్రైవేటు మార్కెట్లో వ్యాపారులు రూ.1,600కు మించి చెల్లించడం లేదు. దీంతో క్వింటాకు రూ.800 మేర రైతులు నష్టపోతుండడంతో ప్రభుత్వం కొనుగోలు చేయాలని కోరుతున్నారు. ఈనేపథ్యాన ప్రభుత్వం మక్కల కొనుగోళ్లకు ముందుకొచ్చింది. ఎప్పటిలాగే మార్క్ఫెడ్కు కొనుగోలు బాధ్యతలు అప్పగించగా జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్ల సూచనలతో కేంద్రాల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. పంట సాగైన ప్రాంతాల్లో.. మార్క్ఫెడ్ ఆధ్వర్యాన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘా(పీఏసీఎస్)లు, జిల్లా కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ(డీసీఎంఎస్)ల ద్వారా మక్కల కొనుగోళ్లు చేపడతారు. పంట అత్యధికంగా సాగైన ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు కసరత్తు మొదలుపెట్టారు. ఈ ఏడాది యాసంగి పంటగా ఖమ్మం జిల్లాలో 1.67 లక్షల ఎకరాలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 72 వేల ఎకరాల్లో మక్కలు సాగయ్యాయి. ఖమ్మం జిల్లాలోని చింతకాని, కొణిజర్ల, బోనకల్, రఘునాథపాలెం, ముదిగొండ, ఏన్కూరు తదితర మండలాలు, భద్రాద్రి జిల్లాలోని టేకులపల్లి, ఇల్లెందు, గుండాల, ఆళ్లపల్లి తదితర మండలాల్లో మక్కల సాగు విస్తీర్ణం అధికంగా ఉంది. పంట ఎక్కువగా సాగైన మండలాల్లో రెండు నుంచి మూడు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుకు కసరత్తు జరుగుతోంది. మొత్తంగా ఖమ్మంలో జిల్లాలో 30, భద్రాద్రి జిల్లాలో 11 కేంద్రాల ఏర్పాటుకు నిర్ణయించారు. తొలి కేంద్రాన్ని ఖమ్మం జిల్లా చింతకాని మండల కేంద్రంలో శుక్రవారం ప్రారంభించగా, ఏప్రిల్ మొదటి వారంకల్లా అన్ని కేంద్రాలను దశల వారీగా ప్రారంభించనున్నట్లు అధికారులు వెల్లడించారు. -
కల్యాణోత్సవానికి డిప్యూటీ సీఎంకు ఆహ్వానం
ముదిగొండ: ఎక్కడా లేని విధంగా ముదిగొండ మండలం ముత్తారంలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో ఏటా శ్రీరామనవమి రోజున రాత్రివేళ శ్రీసీతారాముల కల్యాణం నిర్వహిస్తారు. ఈనెల 27న జరిగే కల్యాణోత్సవానికి హాజరుకావాలని ప్రజాప్రతినిధులు, ఆలయ బాధ్యులు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కను ఆహ్వానించారు. ఈమేరకు హైదరాబాద్లో శనివారం భట్టిని కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు. దేవస్థానం చైర్పర్సన్ తుళ్లూరి లత, సర్పంచ్ ఎల్.మమత, కాంగ్రెస్ నాయకులు మల్లెల అజయ్, తుళ్లూరి జీవన్, ఎల్.బుచ్చయ్య, పి.తిరపయ్య, వీరయ్య, రంగారావు పాల్గొన్నారు. మూడో రోజుకు చేరిన బ్రహ్మోత్సవాలు -
అభివృద్ధి పనుల్లో వేగం !
● ‘భద్రాచలం పునర్ నిర్మాణం, పునరుజ్జీవం’ పేరుతో చర్చ ● మాస్టర్ ప్లాన్ రూపకల్పనలో ప్రభుత్వం ● ప్లాన్లో పెరిగిన అంచనా వ్యయంసాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయ అభివృద్ధి పనుల్లో వేగం పెరిగింది. ఈ మేరకు హైదరాబాద్లో ‘భద్రాచలం పునర్ నిర్మాణం, పునరుజ్జీవం’ పేరుతో ఇక్కడ చేపట్టాల్సిన పనులపై మంత్రులు కొండా సురేఖ, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీని వాసరెడ్డి, వాకిటి శ్రీహరి, ఎంపీ బలరాంనాయక్, ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ఆధ్వర్యంలో శుక్రవారం, సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో శ నివారం పవర్ పాయింట్ ప్రజంటేషన్ నిర్వహించారు. ప్రధాన ఆలయం, గోదావరి తీరం, పట్టణంలో చేపట్టాల్సిన పనులపై ఇందులో చర్చ జరిగింది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం అక్కడ చర్చించిన అంశాల్లో ముఖ్యమైనవి ఇలా ఉన్నాయి.. నాలుగు కాదు.. మూడు గతంలో భద్రాచలం ఆలయం, పట్టణ అభివృద్ధి కోసం రూ.350 కోట్లు కేటాయించాలని నిర్ణయించా రు. అందులో తొలివిడతలో రూ.100 కోట్లతో పను లు చేపట్టాలని భావించారు. ఈ మేరకు ప్రణాళికలు కూడా సిద్ధం చేశారు. ఆ తర్వాత నాలుగు దశల్లో వేర్వేరు విధాల పనుల కోసం మిగిలిన నిధులు ఖర్చు చేసేలా ప్రణాళిక సిద్ధం చేశారు. కానీ గత 12 ఏళ్లుగా భద్రాచలంలో ఎక్కడి పనులు అక్కడే ఆగి పోవడం, నానాటికీ భక్తుల తాకిడి పెరగడంతో ముందుగా వేసిన అంచనాల్లో మార్పులు చేశారు. దీంతో పాటు ఇటీవల కాలంలో ఆంధ్రాకు దీటుగా తెలంగాణ జిల్లాల నుంచి కూడా పెరిగిన భక్తుల రద్దీని పరిగణనలోకి తీసుకుని మూడు దశ ల్లోనే పనులు చేపట్టేలా ప్రణాళికలు రూపొందించినట్టు తెలుస్తోంది. పెరిగిన అంచనా వ్యయం పుష్కరాల పనులను మినహాయించి భద్రాచలంలో ప్రధాన ఆలయం వద్ద వేర్వేరు పనుల కోసం ముందుగా నిర్ణయించిన రూ.350 కోట్ల అంచనా వ్యయాన్ని రూ. 560 కోట్లకు పెంచినట్టు సమాచారం. ఇందులో తొలి విడత పనుల కోసం తక్షణమే రూ.200 కోట్లు మంజూరు చేయాలని నిర్ణయించినట్టు తెలు స్తోంది. గర్భగుడిని కదిలించకుండా ఈ నిధులతో లోపలి భాగంలో వివిధ పనులు, ఆలయ ప్రాకారం, మాడ వీధుల విస్తరణ వంటి పనులు చేపట్టాలని నిర్ణయించినట్టు తెలిసింది. ఈ పనులకు సుమారు రూ.120కోట్ల వరకు వ్యయం కానుండగా మిగిలిన నిధులతో క్యూ లైన్ల నిర్వహణ, సామూహిక వసతి, బస, రోడ్ల విస్తరణ, పార్కింగ్ తదితర పనులు ఉంటాయి. ఈనెల 27న శ్రీరామనవమి రోజున పనులు ప్రారంభించి 2027 జూలైలో పుష్కరాల నాటికి పూర్తి చేయాలనేది లక్ష్యంగా తెలుస్తోంది. వచ్చే ఎన్నికల నాటికి.. రెండు, మూడు దశల్లో ప్రస్తుతం ఉన్న కల్యాణ మండపం (మిథిలా స్టేడియం) పునరుద్ధరణతో పాటు పట్టణంలో శాశ్వత ప్రాతిపదికన భక్తులు/పర్యాటకులకు ఆధ్యాత్మక, పర్యాటక పరంగా సౌకర్యాలు కల్పించేలా పనుల చేపట్టేందుకు వీలుగా అంచనాలు రూపొందిస్తున్నారు. ఇందుకోసం దేశంలో పేరెన్నిక గల కన్సల్టెన్సీకి పనులు అప్పగించాలని నిర్ణయించారు. పుష్కరాల నాటికి ప్రధాన ఆలయం వద్ద చేపట్టే తొలి విడత పనులు పూర్తయితే, ఆ తర్వాత రెండు, మూడో విడత పనులు చేపట్టి 2028 అసెంబ్లీ ఎన్నికల నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలుస్తోంది. మేడారం, భద్రాచలంలో చూపించిన మార్పులు తమకు లాభిస్తాయని ప్రభుత్వం భావిస్తోంది. -
చేరువలో..
ఆదివారం శ్రీ 22 శ్రీ మార్చి శ్రీ 2026ఆదాయం పైకి.. స్థానం కిందకు.. తలసరి ఆదాయంలో జిల్లా రాష్ట్రంలో 18వ స్థానాన నిలిచింది. రంగారెడ్డి జిల్లా 11,29,735తో మొదటి స్థానం దక్కించుకోగా, ఖమ్మం జిల్లా రూ.2,83,744తో ఉంది. పొరుగున ఉన్న భద్రాద్రి కొత్తగూడెం రూ.3,69,420తో ఐదో స్థానాన నిలవడం విశేషం. నిర్దిష్ట ప్రాంతంలో నివసించే ప్రతీ వ్యక్తికి లభించే సగటు ఆదాయాన్ని తలసరి ఆదాయంగా గణిస్తారు. ఇది ప్రజల ఆర్థిక స్థితిగతులు, జీవన ప్రమాణాలను అంచనా వేసేందుకు దోహదపడుతుంది. అయితే గత ఏడాది జిల్లా తలసరి ఆదాయం రూ.2,49,517తో 14వ స్థానాన ఉండగా, ఈసారి ఆదాయం పెరిగినా స్థానం మాత్రం 18కి పడిపోవడం గమనార్హం. జీడీడీపీ రూ.47,184 కోట్లు స్థూల జిల్లా దేశీయ ఉత్పత్తి (జీడీడీపీ) ప్రస్తుత ధరల వద్ద 2024–25 ఏడాదికి రూ.47,184 కోట్లుగా ఉంది. ఇందులో జిల్లా రాష్ట్రంలో 8వ స్థానాన నిలిచింది. ఏడాది కాలంలో జిల్లాలో ఉత్పత్తి అయిన వస్తువులు, సేవల మార్కెట్ను జీడీడీపీగా పిలుస్తారు. జీడీడీపీలో రంగారెడ్డి జిల్లా మొదటి స్థానంలో నిలిస్తే భద్రాద్రి జిల్లా రూ.48,354 కోట్లతో ఏడో స్థానాన నిలిచింది. ఖమ్మం జిల్లా గత ఏడాది రూ.41,576 కోట్లతో 8వ స్థానంలో ఉండగా, ఈసారి కూడా అదే స్థానం దక్కింది. అక్కడ అక్షరాస్యత.. ఇక్కడ అక్షరాస్యులు జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో అక్షరాస్యులు ఎక్కువగా ఉండగా.. అక్షరాస్యత శాతం మాత్రం పట్టణ ప్రాంతంలో ఎక్కువగా నమోదైంది. జిల్లా అక్షరాస్యత 65.95 శాతం ఉంటే, గ్రామీణప్రాంతాల్లో 60.86 శాతంగానే ఉంది. ఇదే సమయాన పట్టణాల్లో అక్షరాస్యత 83.35శాతంగా ఉంది. విద్యావంతులు జిల్లాలో 8,32,320 మంది ఉన్నారు. అందులో గ్రామీణ ప్రాంతాల్లో 5,94,262 మంది కాగా.. పట్టణ ప్రాంతాల్లో 2,38,058 మంది ఉన్నట్లు నివేదికలో పేర్కొన్నారు. కాగా, 2011 లెక్కల ప్రకారం జిల్లాలో 14,01,639 మంది జనాభా ఉన్నారు. ఇందులో 10,84,811 మంది గ్రామీణ ప్రాంతాల్లో, 3,16,828 మంది పట్టణ ప్రాంతాల్లో ఉండడంతో అక్షరాస్యుల సంఖ్య గ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్కువగా నమోదైంది.జిల్లా తలసరి ఆదాయం రూ.2,83,744 -
ద్విచక్రవాహనాల దొంగలు అరెస్ట్
● ఏడుగురి అరెస్ట్, 17బైక్లు స్వాధీనం ఖమ్మంక్రైం: ఖమ్మంలో ద్విచక్రవాహనాల చోరీకి పాల్పడుతున్న ఏడుగురిని ఖమ్మం త్రీటౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈమేరకు శుక్రవారం నగర ఏసీపీ రమణమూర్తి వివరాలు వెల్లడించారు. మామిళ్లగూడెం, కమాన్బజార్కు చెందిన కొండమీద యోగీశ్వర్, మేడ సాయికుమార్తో పాటు నలుగురు మైనర్లు విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి ద్విచక్రవాహనాలను చోరీ చేసి అమ్మేసి ఆ డబ్బుతో జల్సాలు చేస్తున్నారు. ఈమేరకు వాహనాల తనిఖీల సందర్భంగా సీఐ మోహన్బాబు వీరిని విచారించగా వ్యవహారం బయటపడింది. దీంతో ఆరుగురితో పాటు వాహనాలు కొనుగోలు చేసిన కొణిజర్ల మండలం తీగల బంజరకు చెందిన ముద్దంగుల నరేష్, హరీఫ్, నునావత్ వినోద్పైనా కేసులు నమోదు చేశారు. ఇందులో హరీఫ్, వినోద్ పరారీలో ఉన్నారని, నిందితుల నుంచి రూ.11లక్షల విలువైన 17 ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ తెలిపారు. నిందితులను అరెస్ట్ చేసిన సీఐ మోహన్బాబు, ఉద్యోగులను ఏసీపీ అభినందించారు. నిందితును కోర్టుకు రిమాండ్ చేసారు. రూ.3కోట్లు మోసపోయామని ఆందోళన ఎర్రుపాలెం: మండలంలోని జమలాపురంలోప్రైవేట్గా చీటీలు నడిపే కె.రామచంద్రరావు కానరాకుండా పోయాడని స్థానికులు ఆరోపించారు. సుమారు రూ.3కోట్ల డబ్బు ఇవ్వాల్సి ఉండగా కోర్టులో ఐపీ దాఖలు చేశాడని ఆరోపిస్తూ పలువురు శుక్రవారం ఎర్రుపాలెం పోలీస్స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు. వ్యాపారి ఆచూకీ తెలుసుకుని తమకు న్యాయం చేయాలని కోరారు. సర్పంచ్ టి.నిర్మలకుమారి, ఉప సర్పంచ్ పార్వతి సమస్యను ఎస్ఐ రమేష్కుమార్కు వివరించగా చర్యలు తీసుకుంటామని చెప్పడంతో ఆందోళన విరమించారు. పోక్సో కేసు నమోదు ఖమ్మం అర్బన్: ఖమ్మం శివారులోని ఓ గ్రామంలో మైనర్లతో అసభ్యంగా ప్రవర్తించిన యువకుడిపై ఖమ్మం అర్బన్ పోలీసులు శుక్రవారం పోక్సో కేసు నమోదు చేశారు. గ్రామానికి చెందిన ఇద్దరు మైనర్లు ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయాన ప్రవీణ్ అనే వ్యక్తి వెళ్లి అసభ్యకరంగా ప్రవర్తించగా, బాధిత కుటుంబసభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు సీఐ భానుప్రకాశ్ తెలిపారు. పులిగుండాలలో పక్షుల వీక్షణ ! ఖమ్మంవ్యవసాయం: పెనుబల్లి మండలంలోని పులిగుండాల అడవిలో 70కు పైగా జాతులకు చెందిన పక్షులు నివాసముంటున్నాయని గుర్తించారు. ఈ పక్షులను సులువుగా వీక్షించేలా అటవీ శాఖ ద్వారా రాష్ట్రంలోనే తొలిసారి ప్రత్యేక నివాసాన్ని ఏర్పాటు చేశారు. వీక్షకులకు ఇబ్బంది లేకుండా బైనాక్యులర్లతో ఈ నివాసాన్ని రూపొందించారు. పక్షుల వీక్షణకు వచ్చే వారికి గైడ్గా బీట్ ఆఫీసర్ను కేటాయించనున్నట్లు జిల్లా అటవీ అధికారి సిద్ధార్థ్ విక్రమ్ సింగ్ తెలిపారు. -
‘సమస్యలను గాలికొదిలేసిన ప్రభుత్వం’
ఖమ్మం మామిళ్లగూడెం: రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు, సమస్యలను గాలికొదిలేసిందని బీజేపీ నాయకులు ఆరోపించారు. ఈమేరకు సమస్యల పరిష్కారం, ఆరు గ్యారంటీల అమలు డిమాండ్తో శుక్రవారం కలెక్టరేట్ వద్ద బీజేపీ నాయకులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు మాట్లాడుతూ వెలుగుమట్లలో పేదల ఇళ్ల కూల్చివేత వెనుక భారీ కుట్ర దాగి ఉందని ఆరోపించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారుల ప్రయోజనాల కోసమే ఈ దుర్మార్గానికి ఒడిగట్టినందున ఇకనైనా తప్పు సరిదిద్దుకుని పేదలకు న్యాయం చేయాలన్నారు. అనంతరం అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డికి వినతిపత్రం అందజేశారు. బీజేపీ రాష్ట్ర కోశాధికారి దేవకీ వాసుదేవరావు, నాయకులు పుల్లారావు, రవికుమార్, రవిరాథోడ్, గుత్తా వెంకటేశ్వర్లు, సుబ్బారావు, నాగేశ్వరరావు, మేకల నాగేందర్, సరస్వతి, రమేష్, నర్సింహారావు, నరేష్ పాల్గొన్నారు. -
ప్రభుత్వ భూమి కబ్జా
● రిజిస్ట్రేషన్ చేయించుకుని, పన్ను చెల్లించిన మున్సిపల్ కార్మికుడు ● పరిశీలించకుండానే ఇంటి నంబర్ కేటాయించిన ఉద్యోగి వైరా: ఆక్రమణకు కాదేది అనర్హం అన్నట్లు మున్సిపల్ సిబ్బంది ఒకరు ప్రభుత్వ భూమిపై కన్నేయగా.. మనోడే కదా అనుకున్నారేమో కానీ ఆయనకు మున్సిపల్ ఉద్యోగి సహకరించడం విమర్శలకు తావిస్తోంది. భూమి ప్రభుత్వానిదని తెలిసినా ఆక్రమించుకున్న స్థలంలో ఇల్లు లేకున్నా ఇంటి నంబర్ ఇచ్చిన ఘటన ఇది. చివరకు విషయం బయటపడడంతో నంబర్ను రద్దు చేసి చేతులు దులుపుకున్నారు. దర్జాగా రిజిస్ట్రేషన్ వైరా నడిబొడ్డున వ్యవసాయ శాఖ కార్యాలయాన్ని ఆనుకుని 60 గజాల ప్రభుత్వ స్థలం ఉంది. ఈ స్థలాన్ని మున్సిపాలిటీ కార్మికుడు శ్రీకాంత్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. ఎలా చేయించుకున్నాడు, ఎవరెవరు సహకరించారో స్పష్టత లేకున్నా ఖాళీ స్థలంలోఇల్లు ఉందని చెబుతూ రూ.1,164 పన్ను చెల్లించి దరఖాస్తు చేసుకుంటే పరిశీలన మాటెత్తకుండా ఆర్ఐ ప్రదీప్ నంబర్ కేటాయించాడు. ఈ విషయం వెలుగులోకి రావడంతోనే ఇంటి నంబర్ను ఆన్లైన్లో రద్దు చేశారు. ఆపై ఇన్చార్జి తహసీల్దార్ సురేష్, ఆర్ఐ నవీన్ ఆక్రమణకు గురైన స్థలాన్ని పరిశీలించి మున్సిపల్ సిబ్బందికి నోటీసులు జారీ చేశారు. ఈ విషయమై మున్సిపల్ కమిషనర్ గురులింగాన్ని వివరణ కోరగా మున్సిపల్ సిబ్బందికి నోటీసులు ఇచ్చి విచారణ చేపడతామని తెలిపారు. -
ముంచిన నకిలీ విత్తనం
సత్తుపల్లిటౌన్: ఆరుగాలం కష్టించి పండించిన వరి చేతికొచ్చే సమయాన తాలు గింజలు రాగా.. నకిలీ విత్తనాలే కారణమని రైతులు లబోదిబోమంటున్నారు. సత్తుపల్లి మండలం సిద్ధారం, గౌరిగూడెం, రేజర్ల, నారాయణపురం, వేంసూరు మండలం భీమవరం తదితర గ్రామాలకు చెందిన రైతులు సుమారు 500 ఎకరాల్లో శ్రీరామా సీడ్స్ కంపెనీకి చెందిన ఆర్ఎన్ఆర్ 15048 విత్తనాలు సాగు చేశారు. 20 కేజీల ప్యాకెట్ను రూ.1,300 చొప్పున సత్తుపల్లిలోని వెంకటరమణ సీడ్స్ దుకాణంలో కొనుగోలు చేసినట్లు తెలిపారు. ఈ వంగడంతో అధిక దిగుబడులు వస్తాయని డీలర్ చెప్పాడని.. తీరా పంట చేతికొచ్చే సమయాన వరి కంకుల్లో తాలు వచ్చిందని వాపోయారు. కంపెనీ బాధ్యులు, వ్యవసాయాధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోవటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. విత్తన దుకాణం ముందు నిరసన నకిలీ విత్తనాల కారణంగా తాము నష్టపోయినా ఎవరూ పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ రైతులు తాలు కంకులతో సత్తుపల్లిలోని వెంకటరమణ సీడ్స్ దుకాణం ఎదుట శుక్రవారం ఆందోళనకు దిగారు. అయితే యజమాని వారం రోజులుగా దుకాణం తీయటం లేదని తెలియడంతో పోలీసులు, వ్యవసాయాధికారులకు ఫిర్యాదు చేశారు. ఒక్కో ఎకరానికి రూ.35వేలు అప్పు చేసి పెట్టుబడి పెట్టిన తమను ఆదుకోవాలని కోరారు. రైతులు మందపాటి ముత్తారెడ్డి, మోరంపూడి ప్రసాద్, ప్రభాకర్, సాలి దేవదాసు, గోర్ల నాగిరెడ్డి, సోమిరెడ్డి, చింతల శివనాగిరెడ్డి, పుచ్చా వసంతరావు, ములకలపాటి సత్యనారాయణ, మరీదు నాగేశ్వరరావు, లింగారెడ్డి రామారావు పాల్గొన్నారు. కాగా, నకిలీ విత్తనాలతో నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించి ఆదుకోవాలని సీపీఎం నాయకుడు జాజిరి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. సత్తుపల్లి మండలం సిద్ధారంలో వరి పొలాలను ఆయన నాయకులు కె.లక్ష్మణ్రావు, కృష్ణ, ప్రసాద్, రామకృష్ణ, వెంకటేశ్వరరావు, సత్యనారాయణ, రమేష్తో కలిసి పరిశీలించి మాట్లాడారు. -
39 గ్యాస్ సిలిండర్లు స్వాధీనం
ఖమ్మం సహకారనగర్: జిల్లాలోని వివిధ ప్రాంతా ల్లో అక్రమంగా నిల్వ చేసిన 39గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా పౌరసరఫరాల శాఖాధికారి చందన్కుమార్ తెలిపారు. రఘునాథపాలెం మీ సేవ కేంద్రం వద్ద నిల్వ చేసిన 32 సిలిండర్లు స్వాధీనం చేసుకొని మీ సేవ ఆపరేటర్ జె.దుర్గారావుపై 6ఏ కేసు నమోదు చేశామని వెల్లడించా రు. అలాగే, రఘునాథపాలెంలోని సితారా హోటల్లో నాలుగు, ఖమ్మం ఎన్టీఆర్ సర్కిల్లోని భవాని హోటల్లో మూడింటిని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. చట్టవిరుద్ధంగా వాణిజ్య అవసరాలకు గృహోపయోగ సిలిండర్లు వినియోగించే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తనిఖీ ల్లో డీటీ విజయ్బాబు, సిబ్బంది పాల్గొన్నారు. -
కొనసాగుతున్న శ్రీవారి బ్రహ్మోత్సవాలు
ఎర్రుపాలెం: మండలంలోని జమలాపురం శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలో వసంత నవరాత్రి బ్రహ్మోత్సవాలు శుక్రవారం రెండో రోజుకు చేరాయి. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు, అభిషేకం అనంతరం ఉత్సవాలకు ముక్కోటి దేవతలను ఆహ్వానిస్తూ ధ్వజారోహణం చేశారు. అలాగే, శ్రీవారి వాహనరూపుడైన గరుత్మంతునికి నివేదించిన ప్రసాదాన్ని సంతానం ఆశించే దంపతులకు అందజేశారు. ఆతర్వాత మయూర వాహనంపై స్వామి, అమ్మవార్లను గిరి ప్రదక్షిణ చేయించారు. ఆలయ ధర్మకర్త ఉప్పల విజయదేవశర్మ, ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాసశర్మ, సీనియర్ అసిస్టెంట్ సోమయ్య, అర్చకులు మురళీమోహన్శర్మ, రాజీవ్శర్మ తదితరులు పాల్గొన్నారు. -
మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యం
● తెలంగాణ గ్రామీణ బ్యాంక్ చైర్మన్ ప్రతాపరెడ్డి వైరా: గ్రామీణ ప్రాంతాల్లో మహిళా సంఘాల సభ్యులను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడమే తెలంగాణ గ్రామీణ బ్యాంకు లక్ష్యమని బ్యాంక్ చైర్మన్ ప్రతాపరెడ్డి తెలిపారు. వైరా బ్రాహ్మణపల్లిలో బ్యాంకు నూతన బ్రాంచ్ను రీజినల్ మేనేజర్ ప్రసన్నకుమార్తో కలిసి శుక్రవారం ఆయ న ప్రారంభించారు. ఈ సందర్భంగా మహిళా సంఘాలకు రూ.5కోట్ల రుణాల చెక్కులు అందజేశాక మాట్లాడారు. రాష్ట్రంలో 933 శాఖలు, రూ.80వేల కోట్ల టర్నోవర్తో బ్యాంకు కొనసాగుతోందని తెలిపారు. మహిళలు, రైతులు, చిరువ్యాపారులతో పాటు పారిశ్రామికవేత్తలకు రుణాలు అందిస్తున్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో చీఫ్ మేనేజర్ పి.సూరిరెడ్డి, సీనియర్ మేనేజర్ ప్రకాశ్, బ్రాంచ్ మేనేజర్ శ్రీనివాస్, హబ్ మేనేజర్ సంపత్ పాల్గొన్నారు. ‘భూదాన్’ లబ్ధిదారులకు బ్యాంకు రుణాలు ఖమ్మంమయూరిసెంటర్: భూదాన్ భూముల్లో ఇళ్లు కూల్చివేశాక అర్హులకు ప్రభుత్వం స్థలం, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసింది. వీరు ఇళ్ల నిర్మాణం చేపట్టేలా అధికారులు రుణాల మంజూరు చేయించాలని నిర్ణయించారు. ఇందిరమ్మ పథకం ద్వారా మంజూరైన ఇంటి నిర్మాణ ప్రారంభ ఖర్చు కోసం డీసీసీబీ ద్వారా రూ.లక్ష రుణంగా ఇప్పిస్తారు. ఈమేరకు లబ్ధిదారుల్లో స్వయం సహాయక సంఘాల్లో సభ్యులకు మెప్మా అధికారులు డీసీసీబీ ద్వారా రుణం మంజూరు చేయించనున్నారు. ఎవరైనా మహిళలు సంఘంలో సభ్యులుగా లేకపోతే వారితో సంఘాలను ఏర్పాటు చేయించేలా కార్యాచరణ రూపొందించారు. ఇప్పటి వరకు 31మంది మహిళలు సంఘంగా ఏర్పడేందుకు దరఖాస్తు చేసుకున్నారు. మూడోసారి కూడా వాయిదా కామేపల్లి: కొమ్మినేపల్లి(పండితాపురం) గ్రామపంచాయతీ పరిధిలోని శ్రీకృష్ణప్రసాద్ సంత వేలం పాట మూడోసారి కూడా వాయిదా పడింది. మొదటి సారి పోలీసుల సూచనతో, రెండోసారి మద్దతు ధర రాకపోవడంతో వాయిదా పడిన విషయం విదితమే. ఈమేరకు శుక్రవారం సర్పంచ్ ధరావత్ అనురాధ అధ్యక్షతన వేలం నిర్వహించగా బోడా శ్రీను, ధరావత్ విన్నిబాబు, గుగులోత్ వినోద్కుమార్, బాదావత్ నాగరాజు ధరావత్తు, సాల్వెన్సీ సొమ్ము రూ.35లక్షల చొప్పున చెల్లించి పాల్గొన్నారు. చివరికి బోడా శ్రీను రూ.1,82,80,000 హెచ్చు పాటదారుడిగా నిలిచినా ప్రభుత్వ మద్దతు ధర రాకపోవడంతో వాయిదా వేశారు. కాగా, మద్దతు ధర తగ్గిస్తేనే పాల్గొంటానని నాగరాజు మధ్యలోనే తప్పుకున్నాడు. కల్లూరు డీఎల్పీఓ విజయలక్ష్మి, ఉపసర్పంచ్ మేకల మల్లికార్జున్రావు, ఎంపీఓ వీ.వీ.శాసీ్త్ర, కార్యదర్శులు శంకర్, నెహ్రూ పాల్గొన్నారు. -
టీపీఎస్ల నిర్మాణానికి డిజైన్లు
ఖమ్మం సహకారనగర్: జిల్లాలో ఎంపిక చేసిన తొమ్మిది ప్రభుత్వ పాఠశాలలను తెలంగాణ పబ్లిక్ స్కూళ్లు(టీపీఎస్)గా అభివృద్ధి చేయనున్నందున డిజైన్లు సిద్ధం చేయాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. కలెక్టరేట్లో శుక్రవారం ఆయన అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ, కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్యాదవ్తో కలిసి అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఎంపిక చేసిన తొమ్మిది స్కూళ్లలో 800నుంచి వేయి మంది విద్యార్థులకు అవసరమైన తరగతి గదులు, మౌలిక వసతులు కల్పించేలా లే ఔట్లు సిద్ధం చేయాలన్నారు. నాబార్డ్ నుంచి నిధులు రానున్నందున మార్గదర్శకాలకు అనుగుణంగా పనులు చేపట్టాల్సి ఉంటుందని తెలిపారు. ఆతర్వాత పలు డిజైన్లను పరిశీలించి సూచనలు చేశారు. డీఈఓ చైతన్య జైనీ, విద్యాశాఖ ప్లానింగ్ కోఆర్డినేటర్ సీ.హెచ్.రామకృష్ణ, వివిధ శాఖల అధికారులు వెంకట్రెడ్డి, మహేష్బాబు తదితరులు పాల్గొన్నారు. ●ఖమ్మంమయూరిసెంటర్: ప్రభుత్వ సంరక్షణలో ఉన్న ప్రతీ చిన్నారి ఆరోగ్యంగా, ఆనందంగా ఎదగడమే లక్ష్యంగా సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. ఖమ్మంలోని బాలల సదనాన్ని శుక్రవారం తనిఖీ చేసిన ఆయన నిర్వహణతో పాటు ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించారు. పిల్లలతో మాట్లాడి మెనూ అమలు, ఇతర అంశాలపై ఆరా తీశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రతీ చిన్నారి ఆరోగ్యం, భద్రతపై సిబ్బంది బాధ్యతగా వ్యవహరించాలని, దత్తత ప్రక్రియలో చట్టపరమైన విధానాలను అమలుచేయాలని సూచించారు. జిల్లా సంక్షేమ అధికారి వేల్పుల విజేత, జిల్లా శిశు సంరక్షణ అధికారి విష్ణువందన పాల్గొన్నారు. ●ఖమ్మంఅర్బన్: గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణంలో పనిచేస్తూ ప్రమాదంలో కుడిచేయి కోల్పోయిన కార్మికుడికి రూ.31.31లక్షల నష్టపరిహారం అందింది. హెచ్జీ ఇంజనీరింగ్ లిమిటెడ్ కంపెనీ తరపున పనిచేస్తున్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పరవేష్ గత ఏడాది జూలై 30న ప్రమాదంలో చేయి కోల్పోయాడు. ఈమేరకు యాజమాన్యం రూ.31,31,000 డిపాజిట్ చేయడంతో చెక్కును శుక్రవారం బాధితుడికి కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అందజేశారు. కార్మికశాఖ ఉప కమిషనర్ కె.విజయభాస్కర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి -
నిధుల వరద!
ప్రాజెక్టులకుసీతారామ ప్రాజెక్టు (ఫైల్ )సీతరామకు తగ్గించి.. ఎర్రుపాలెంకు పెంచి.. జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులకు బడ్జెట్లో పెద్దపీట వేశారు. సీతారామ ప్రాజెక్టుకు గత ఏడాదితో పోలిస్తే నిధులు తగ్గినప్పటికీ ఎర్రుపాలెం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్కు పెంచారు. గత ఏడాది సీతారామ ప్రాజెక్టుకు రూ.699.35కోట్లు కేటాయిస్తే, ఈసారి రూ.336.78 కోట్లతో సరిపెట్టారు. ఈ నిధులతో భూసేకరణతోపాటు టన్నెల్ పనులు, ఇతర పెండింగ్ పనులు చేపడతారు. ఎర్రుపాలెం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్కు గత ఏడాది రూ.39.99 కోట్లే కేటాయిస్తే ఈసారి అది రూ.370.99 కోట్లకు చేరింది. ఈ పథకం పూర్తయితే మధిర, ఎర్రుపాలెం మండలాల్లోని 33,025 ఎకరాలకు నీరు అందుతుంది. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గంలోని పెద్దవాగు ప్రాజెక్టుకు నిధులు పెంచగా, భక్తరామదాసు, తాలిపేరు, లంకాసాగర్, కిన్నెరసాని ప్రాజెక్టులకు సైతం నిధులు అందనున్నాయి. ఇందిరమ్మ రెండో విడత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇందిరమ్మ ఇళ్లకు బడ్జెట్లో రూ.5,500 కోట్లు కేటాయించింది. దీంతో జిల్లాలో మరింత మంది నిరుపేదలకు ఇళ్లు దక్కనున్నాయి. మొదటి విడతగా 16,524 ఇళ్లు కేటాయించగా కొన్ని నిర్మాణాలు పూర్తయ్యాయి. ఇక రెండో విడత మంజూరు కార్యక్రమాన్ని త్వరలోనే ప్రారంభించనున్నారు. అల్పాహారం, మధ్యాహ్న భోజనం ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్ విద్యార్థుల వరకు 2026–27 విద్యాసంవత్సరం నుంచి అల్పాహారం సమకూర్చనున్నట్లు బడ్జెట్లో ప్రకటించారు. అలాగే, ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమల్లోకి రానుంది. అంతేకాక పాఠశాలల్లో వసతుల కల్పనకు నిధులు కేటాయింపు, పాలిటెక్నిక్ కళాశాలల్లో 15 కొత్త కోర్సులపై ప్రకటన వెలువడింది. దీంతో జిల్లాలోని 1,400 పాఠశాలల్లోని 70వేల మంది విద్యార్థులు, 21 జూనియర్ కళాశాలల్లోని 6,500 మంది విద్యార్థులకు ప్రయోజనం దక్కనుంది. కొత్త పింఛన్లకు మోక్షం చేయూత పథకానికి నిధులు కేటాయించిన నేపథ్యాన పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో ఆశలు చిగురిస్తున్నాయి. జిల్లాలో అన్నిరకాల పింఛన్దారులు 1,82,752 మంది ఉన్నారు. ఇదే సమయాన కొత్తగా పింఛన్ల కోసం 18వేల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. ప్రభుత్వం నిధులు కేటాయించిన క్రమాన వీరిలో అర్హులకు మంజూరు కానున్నాయి. బీమాతో ధీమా ఉద్యోగులు, పెన్షనర్లకు గతంలోనే ప్రభుత్వం ప్రమాదబీమా పథకాన్ని ప్రకటించింది. అలాగే క్యాష్లెస్ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్లను ప్రకటించింది. ఇందుకు గాను నిధులు కేటాయించడంతో ఉద్యోగులు, పెన్షనర్లకు భరోసా లభించనుంది. అన్ని ప్రభుత్వ ఆస్పత్రులు, ఎంప్యానెల్ ఆస్పత్రుల్లో జిల్లాలోని 13,317 మంది ఉద్యోగులు, 13,048 మంది పెన్షనర్ల చికిత్సకు అవకాశం ఏర్పడుతుంది. సంక్షేమ పథకాలకు పుష్కలంగా.. సంక్షేమ పథకాలకు ప్రభుత్వం పుష్కలంగా నిధులు కేటాయించింది. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కల్యాణలక్ష్మి / షాదీ ముబారక్, మహాలక్ష్మి పథకం, గృహజ్యోతి (200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్), రాజీవ్ ఆరోగ్యశ్రీతోపాటు పలు సంక్షేమ పథకాలకు బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించడంతో జిల్లాలోని లబ్ధిదారులకు ఉపయోగపడనున్నాయి.ఎర్రుపాలెం లిఫ్ట్, సీతారామకు రూ.700కోట్లకు పైగానే.. -
22 క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనం
ఖమ్మంరూరల్: మండలంలోని పొన్నేకల్కు చెందిన పి.లింగరాజు ఇంట్లో అక్రమంగా నిల్వ చేసిన 22 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. గ్రామంలోని లబ్ధిదారుల నుంచి బియ్యం కొనుగోలు చేసి బయట ఎక్కువ ధరకు అమ్మేందుకు సిద్ధమైనట్లు సమాచారంతో సివిల్ సప్లయీస్ డీటీ విజయ్బాబు ఆధ్వర్యాన గురువారం తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా 22 క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకోగా, లింగరాజుపై 6ఏ కేసు నమోదు చేసినట్లు డీటీ తెలిపారు. ఈదురుగాలులకు ఎగిరిపడిన రేకులు వైరారూరల్: వైరా మండలంలో బుధవారం రాత్రి వీచిన ఈదురుగాలులకు స్నానాల లక్ష్మీపురం శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం వద్ద స్నాన ఘట్టాలపై రేకులు ఎగిరిపడ్డాయి. గత ఏడాది మహా శివరాత్రి సమయాన స్నానాల ఘట్టాలను రేకుల కప్పుతో నిర్మించారు. ఒకరోజు ఈదురుగాలులకే ఇవి ఎగిరిపడడంతో నాణ్యతపై పలువురు విమర్శిస్తున్నారు. -
మాటూరుపేటలో రెండు రోజుల పండుగ!
మధిర: మధిర మండలం మాటూరుపేటలో గురువారం ఉగాది ఉత్సవాలను ప్రారంభించారు. రెండు రోజుల పాటు ఈ ఉత్సవాలు నిర్వహించేలా ప్రణాళిక రూపొందించారు. ఈమేరకు ఇతర ప్రాంతాల్లో స్థిరపడిన వారు కూడా హాజరయ్యేలా చూడడం, ఇక్కడి ఉత్సవాల సమాచారాన్ని చేరవేసేలా ‘మన జన్మభూమి– మాటూరుపేట’ పేరుతో వాట్సాప్ గ్రూప్ రూపొందించారు. ఈ గ్రూపులో గ్రామ పెద్దలతో పాటు వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన వారిని చేర్చారు. తొలిరోజైన గురువారం పలు ప్రాంతాల నుంచి స్థానికులు కుటుంబాలతో సహా చేరుకోగా ఉగాది ఉత్సవాలను గ్రామ సర్పంచ్ చిలివేరు పూర్ణమ్మ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో చిలువేరు బుచ్చిరామయ్య, టీవీ.రెడ్డి, మాదల రామారావు, శ్రీనివాసరావు, తలపురెడ్డి నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. పంచాంగ శ్రవణం, ఉగాది పచ్చడి పంపిణీ అనంతరం రాత్రి మాయాబజార్ పౌరాణిక నాటకాన్ని ప్రదర్శించారు. ఇక రెండో రోజైన శుక్రవారం వివిధ రంగాల్లో సేవలందించిన వారికి ఉగాది పురస్కారాలు అందించాక తల్లిదండ్రులకు పాదపూజ నిర్వహిస్తారు. చివరగా మాటూరుపేట కల్చరల్ ఆర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యాన చింతామణి సాంఘిక పద్యనాటకం ప్రదర్శన ఏర్పాటుచేశారు. -
38మంది నుంచి రూ.54.13 లక్షల వసూళ్లు
ఖమ్మంఅర్బన్: ఖమ్మం వెలుగుమట్లలోని భూదాన్ భూముల పేరుతో తమ నుంచి డబ్బు వసూలు చేసి మోసం చేశారంటూ మరికొందరు గురువారం నగర ఏసీపీ రమణమూర్తికి ఫిర్యాదు చేశారు. ఈమేరకు 38 మంది ఫిర్యాదు చేయగా ఏసీపీ వివరాలు వెల్లడించారు. ఒక్కొక్కరి వద్ద రూ.50 వేల నుంచి రూ.5 లక్షల చొప్పున రూ.54.13 లక్షల మేర పోలబోయిన ముత్తయ్య వసూలు చేసినట్లు ఫిర్యాదు అందిందని తెలిపారు. కాగా, సదరు ముత్తయ్య ఇచ్చిన రశీదులు భూదాన్ వినోభాబావే వెల్ఫేర్ సొసైటీ, యూసీసీఆర్ఐ(ఎంఎల్) పార్టీ, పి.అరవింద్ పేరుతో ఉన్నాయని వెల్లడించారు. ఇప్పటికే ముత్తయ్యను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించిన నేపథ్యాన విచారణ కోసం ఖమ్మం అర్బన్ పోలీసులు కస్టడీ కోరారని తెలిపారు. తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులు ఆపాలి భూముల పేరుతో వసూలు చేశారంటూ తప్పుడు కేసులు పెడుతున్న పోలీసులు అక్రమ అరెస్టులకు పాల్పడుతున్నారని ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ సంస్థ(ఓపీడీఆర్) ఉపాధ్యక్షుడు సుంకర ఆందోళన వ్యక్తం చేశారు. వెలుగుమట్ల నవోదయ భూదాన్ కాలనీలో నివసిస్తున్న వేయి కుటుంబాల ఇళ్లను కూల్చివేయడంతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత రాగా, అందులో నుంచి బయటపడేందుకు తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపించారు. అంతేకాక పీడీ యాక్ట్ పెడతామని బెదిరిస్తున్నారని తెలిపారు. భూదాన్ భూములను ఆక్రమించేందుకు కొందరు స్వార్థ ప్రయోజనాలతో చేస్తున్న తప్పుడు ఆరోపణల ను ప్రజలు నమ్మొద్దని ఆయన ఓప్రకటనలో కోరారు.ఏసీపీని ఫిర్యాదుచేసిన భూదాన్ బాధితులు -
వట్టిపోతున్న కాల్వలు
● పంటలు ఎండుతున్నాయని రైతుల ఆవేదన ● వారబందీ సరిగ్గా అమలుకాక ఇక్కట్లు ముదిగొండ: ముదిగొండ మండలంలోని రైతులు అత్యధికంగా సాగర్ జలాలపైనే ఆధారపడి పంటలు సాగు చేస్తున్నారు. అయితే, సాగర్ నీటి విడుదలలో వారబందీ విధానం అమలవుతుండగా సక్రమంగా నీరు అందడం లేదని రైతులు వాపోతున్నారు. మండలంలో ఎక్కువ మంది రైతులు వరి, మొక్కజొన్న పండిస్తున్నారు. వారబందీ విధానంలో లోపాలతో ఆయా పంటలు ఎండిపోతున్నాయనే ఆవేదన వ్యక్తమవుతోంది. చివరి భూముల్లోనూ కాదు.. బావులు, చెరువులు పంటల సాగు కొంతమేర ఆశాజనకంగా ఉంది. అయితే, సాగర్ డ్యాంలో సమృద్ధిగా నీరు ఉందనే ఆశతో ఆయకట్టులో పంటలు సాగు చేసిన రైతుల పరిస్థితి మాత్రం అగమ్యగోచరంగా మారింది. ముదిగొండ మండలంలోని పలు గ్రామాలకు గుదిమళ్ల, మంగాపురం మేజర్ కాల్వల ద్వారా నీరు చేరాలి. కానీ వారబందీ విధానంలో లోపాలతో చివరి భూములకు నీరు అందక.. కొన్నిచోట్ల మధ్యలో భూములకు సైతం నీరు చేరక ఇబ్బంది పడుతున్నారు. ఎన్నెస్పీ అధికారులు వారబందీ విధానాన్ని విస్మరించి రెండు వారాలకోసారు నీరు విడుదల చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఫలితంగా మధ్య, చివరి భూములకు అందక పంటలు ఎండిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పక్కనే సాగర్ కాల్వ ఉన్నా చుక్క నీరు అందక ఈ పరిస్థితి నెలకొన్నందున అధికారులు స్పందించి వారబందీ విధానమైనా సక్రమంగా అమలుచేసి చేతికొచ్చే దశలో ఉన్న పంటలను కాపాడాలని రైతులు కోరుతున్నారు. -
శ్రీకృష్ణసాయి ఆశ్రమాన్ని దర్శించుకున్న జిల్లా జడ్జి
ఖమ్మంగాంధీచౌక్: ఖమ్మం త్రీటౌన్లోని రంగనాయకుల గుట్టపై ఉన్న శ్రీకృష్ణసాయి ఆశ్రమాన్ని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.రాజగోపాల్ గురువారం దర్శించుకుని పూజలు చేశారు. ఈ సందర్భంగా జడ్జి దంపతులను ఆశ్రమం నిర్వహకులు సత్కరించారు. అలాగే, ఆర్యవైశ్య సంఘం బాధ్యులు పసుమర్తి సీతారామచంద్రరావు, గుమ్మడివల్లి శ్రీనివాస్ కూడా పూజలు చేయగా, ఆశ్రమం చైర్మన్ లగడపాటి రామారావు, కార్యదర్శి నాగమణితో పాటు మధు, సంజయ్, గ్రంధి మోహన్ రావు, కన్నం రమణ తదితరులు పాల్గొన్నారు. ఆలయ నిర్మాణానికి రూ.7లక్షల విరాళం ఏన్కూరు: మండల కేంద్రంలో కోదండ రామాలయం నిర్మాణానికి పలువురు దాతలు గురువారం రూ.7.23లక్షలకు పైగా విరాళాలు అందజేశారు. గ్రామానికి చెందిన మాదినేని బాబు రూ.2లక్షలు, పొన్నం హరికృష్ణ రూ.1,23,456, అమరనేని వెంకటేశ్వరావు రూ.లక్ష, చిట్టిని రామారావు రూ.50,116తో పాటు వేముల సత్యనారాయణ, తాళ్లూరి నర్సింహరావు, అమరనేని వీరభద్రం, మేడ ధర్మారావు, మాదినేని రమేష్ రూ.50 వేల చొప్పున అందజేశారని ఆలయ కమిటీ బాధ్యులు వెల్లడించారు. కట్లేరుకు సాగర్ జలాలు విడుదల ఎర్రుపాలెం: మండలంలోని కట్లేరుతో పాటు మామునూరుపేట చెరువులకు గురువారం సాగర్ జలాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా మధిర మార్కెట్ చైర్మన్ బండారు నర్సింహారావు మాట్లాడుతూ విసన్నపేట, మైలవరం బ్రాంచ్ కెనాళ్ల ద్వారా సుమారు 500 క్యూసెక్కుల నీటిని తాగు, సాగు అవసరాల కోసం మామునూరుపేట చెరువుకు విడుదల చేసినట్లు తెలిపారు. అలాగే, కొండ్రుపాడు ఎస్కేప్ నుంచి 100 క్యూసెక్కుల నీటిని కట్టేరులోకి విడుదల చేశామని వెల్లడించారు. నాయకులు అనుమోలు వెంకట కృష్ణారావు, శీలం వెంకట్రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. పేకాటరాయుళ్ల అరెస్ట్మధిర: మధిర సమీపాన రాయపట్నం ఏటిలో పలువురు పేకాట ఆడుతున్నారనే సమాచారంతో గురువారం టౌన్ పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పది మందిని అదుపులోకి తీసుకుని రూ.5,500 నగదు, నాలుగు బైక్లు స్వాధీనం చేసుకున్నట్లు మధిర టౌన్ ఇన్స్పెక్టర్ డీ.రమేష్ తెలిపారు. కాగా, ఎక్కడైనా పేకాట స్థావరాలు ఏర్పాటుచేసినట్లు తెలిస్తే స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఆయన సూచించారు. 1,020 మె.టన్నుల యూరియా చింతకాని: చింతకాని మండలం పందిళ్లపల్లి రేక్ పాయింట్కు సీఐఎల్ కంపెనీకి చెందిన 1,020.80 మెట్రిక్ టన్నుల యూరియాతో పాటు 20.20.0.13 కాంప్లెక్స్ ఎరువులు గురువారం చేరాయి. వీటిని ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు సరఫరా చేయడంతో పాటు కొంత మేర బఫర్ స్టాక్గా నిల్వ చేసినట్లు డీఏఓ పుల్లయ్య తెలిపారు. -
పండుగ పూటా అవే కష్టాలు
వైరా: వైరా మున్సిపాలిటీ పరిధి సోమవరం సమీపాన ఉన్న ఇండే గ్యాస్ కంపెనీ గోదాం వద్ద ఉగాది పండుగ రోజైన గురువారం కూడా సిలిండర్ల కోసం వినియోగదారులు పడిగాపులు కాశారు. కాణిపాకం పేరుతో నిర్వహిస్తున్న ఈ ఏజెన్సీ గోదాంకు ఇటీవల కొరతతో సిలిండర్లు రాలేదని చెబుతుండగా వినియోగదారులు నిజమేనని నమ్మారు. కానీ ఏజెన్సీ నిర్వాహకులు కామన్ పాయింట్ నుంచి తెప్పించి పలువురు సరఫరా చేస్తుండగా, ఆన్లైన్లో బుక్ చేసుకున్న వారికి మాత్రం ఇవ్వడం లేదు. దీంతో ఉగాది రోజు వచ్చిన వారికి స్టాక్ లేదని సిబ్బంది సమాధానం చెప్పడంతో వైరా – జగ్గయ్యపేట జాతీయ రహదారిపై ఆందోళనకు దిగారు. ఫలితంగా గంట పాటు వాహనాలు నిలిచిపోయాయి. ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఇండేన్ గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులతో మాట్లాడడడంతో రెండు రోజుల్లో అందరికీ గ్యాస్ సరఫరా చేస్తామని చెప్పగా ఆందోళన విరమించారు. ఈ విషయంపై ఏజెన్సీ ప్రతినిధులతో మాట్లాడేందుకు ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు. -
ప్రణాళికతో ప్రగతి
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ‘పల్లెలు, పట్టణాల రూపురేఖలు మారి ప్రగతిబాట పట్టాలి.. గ్రామపంచాయతీ నుంచి జిల్లాస్థాయి వరకు అభివృద్ధి కొత్త పుంతలు తొక్కడమే కాక పాలన ప్రజలకు చేరువ కావాలి’ అనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. ఈనెల 6న మొదలైన కార్యక్రమంలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పన, పారిశుద్ధ్యం మెరుగుదల, కార్యాలయాల్లో పెండింగ్ ఫైళ్ల క్లియరెన్స్, ప్రజారోగ్యం, రహదారుల మరమ్మతులు, నిర్మాణంతోపాటు ఇతర రంగాల్లో ప్రణాళికయుత అభివృద్ధిని ప్రాధాన్యతగా తీసుకున్నారు. జిల్లాలో ఈ కార్యక్రమ అమలును ప్రజాప్రతినిధులు, అధికారులు పర్యవేక్షింస్తుండగా ఒక్కటొక్కటిగా చక్కబడుతున్నాయి. పాలన చేరువయ్యేలా.. ప్రజలకు పాలన మరింత చేరువ చేయడం, ప్రజాసమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని ప్రారంభించింది. 99 రోజుల పాటు ఐదు దశల్లో పది రకాల అంశాలపై ఈ కార్యక్రమం కొనసాగనుంది. ఇందులో ఆరోగ్యం, రోడ్డు భద్రత, సంక్షేమం, చిన్నారుల భద్రత–యాంటీ డ్రగ్ డ్రైవ్, రైతుల సంక్షేమం, విద్య, యూత్ అండ్ స్పోర్ట్స్, మహిళల అభ్యున్నతి, పర్యావరణం తదితర అంశాలు ఉన్నాయి. వీటి అమలు, పర్యవేక్షణకు ప్రభుత్వం యాప్ను కూడా సిద్ధం చేసింది. పది వారాల పాటు.. ప్రతీ వారం ఒక్కో శాఖకు సంబంధించిన కార్యక్రమాన్ని అమలు చేసేలా ప్రణాళిక రూపొందించారు. అట్టహాసంగా ప్రారంభమై.. జిల్లాలో ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక అమలుపై ఈనెల 6న కలెక్టరేట్లో జరిగిన సన్నాహక సమావేశంలో రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వాకిటి శ్రీహరి పాల్గొన్నారు. అలాగే, ఈనెల 12న జరిగిన ప్రజాప్రతినిధులకు శిక్షణకు మంత్రి పొంగులేటి హాజరయ్యారు. ఆతర్వాత ఎమ్మెల్యేలు మాలోతు రాందాస్నాయక్, మట్టా రాగమయి వైరా, సత్తుపల్లిల్లో, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు పాలేరు నియోజకవర్గంలో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమాల్లో భాగస్వాములయ్యారు. ఇక కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి వైరా, కొణిజర్ల మండలాల్లో పర్యటించడమే కాక ఖమ్మం శ్రీనివాసనగర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. సమన్వయంతో ప్రణాళిక ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమం ప్రజాప్రతినిధులు, అధికారుల భాగస్వామ్యంతో ముందుకు సాగనుంది. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేసేలా కార్యాచరణ రూపొందించారు. గ్రామాలు, మున్సిపాలిటీల్లో సర్పంచ్లు, కౌన్సిలర్లు ప్రధాన పాత్ర పోషించనున్నారు. ఇక అధికారులు ప్రజల నుంచి సమస్యలపై వినతులు స్వీకరించి సత్వర పరిష్కారం కోసం చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. అంతేకాక రెండేళ్లలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరించడంతోపాటు జరుగుతున్న పనుల్లో నాణ్యతను పర్యవేక్షించాలి.99 రోజుల కార్యాచరణలో మొదట పారిశుద్ధ్య పనులకు ప్రాధాన్యత దక్కింది. అలాగే పెండింగ్ ఫైళ్లను పరిష్కరిస్తున్నారు. జిల్లాలోని 571 గ్రామపంచాయతీల్లోని 5,214 వార్డులు, ఖమ్మం కార్పొరేషన్, సత్తుపల్లి, ఏదులాపురం, మధిర, వైరా, కల్లూరు మున్సిపాలిటీల్లోని వార్డులు, డివిజన్లలో పారిశుద్ధ్య పనులు నిర్వహించారు. ఈ సందర్భంగా 1,77,539 కేజీల చెత్తను తొలగించడంతోపాటు 3,165 ప్రభుత్వ కార్యాలయాలను శుభ్రం చేశారు. దీంతో దాదాపు పల్లెలు, పట్టణాలన్నీ పరిశుభ్రంగా దర్శనమిస్తున్నాయి. ఇక 11,326 పెండింగ్ ఫైళ్లను క్లియర్ చేసినట్లు గణంకాలు చెబుతున్నాయి. -
శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
ఎర్రుపాలెం: తెలంగాణ తిరుపతిగా పేరున్న జమలాపురం శ్రీవేంకటేశ్వ ర స్వామి ఆలయంలో వసంత నవరాత్రి బ్రహ్మోత్సవాలు గురువారం ప్రారంభమయ్యాయి. ఉదయం శ్రీవారికి సుప్రభాత సేవతో పాటు పంచామృతంతో అభిషేకం నిర్వహించారు. అలాగే, స్వామి, అలివేలు మంగ, పద్మావతి అమ్మవార్లకు వేపపూవు ప్రసాదం నివేదించారు. ఆతర్వాత సాయంత్రం ఆలయ ప్రాంగణంలోని పుష్కరిణి నుంచి ఈఓ కె.జగన్మోహన్రావు, ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాసశర్మ, అర్చకులు, సిబ్బంది మేళతాళాల నడుమ తీర్థపు బిందె తీసుకురావడంతో పాటు ఉత్సవమూర్తులను యాగశాలకు చేర్చారు. అక్కడ ప్రత్యేక పూజల అనంతరం ఉగాది సందర్భంగా అర్చకులు పంచాంగ శ్రవణం చేశారు. ఆతర్వాత శ్రీవారి నిత్యకల్యాణం జరిపించగా పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. సర్పంచ్ తుళ్లూరు నిర్మల, వ్యవస్థాపక ధర్మకర్తలు ఉప్పల విజయదేవశర్మ, ఉద్యోగులు సోమయ్య, కృష్ణప్రసాద్, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు. -
వృత్తి నైపుణ్య కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం
ఖమ్మం రాపర్తినగర్: వృత్తి నైపుణ్య కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా యువజన క్రీడల శాఖ ఆధికారి టి.సునీల్రెడ్డి తెలిపారు. కంప్యూటర్, ఫ్యాషన్ డిజైనింగ్, బ్యూటీషియన్ కోర్సుల్లో శిక్షణ ఇవ్వనుండగా, శిక్షణ పూర్తయ్యాక సెట్విన్, ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాలు, స్వయం ఉపాధికి అవకాశం ఏర్పడుతుందని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న వారు కుల ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డు, విద్యార్హత సర్టిఫికెట్లు, పాస్పోర్ట్ ఫొటోతో ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలోని తమ కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలని, వివరాలకు 99482 07271 నంబర్లో సంప్రదించాలని ఆయన సూచించారు. నేడు పండితాపురం సంత వేలం కామేపల్లి: మండలంలోని కొమ్మినేపల్లి(పండితాపురం)లో శ్రీకృష్ణప్రసాద్ పశువుల వారాంతపు సంత వేలం పాట శుక్రవారం నిర్వహించనున్నట్లు సర్పంచ్ ధరావత్ అనురాధ, కార్యదర్శి శంకర్ తెలిపారు. తొలిసారి ఈనెల 13న వేలానికి నిర్ణయించినా ఆరోజు మంత్రి పర్యటన సందర్భంగా బందోబస్తు ఏర్పాటు చేయలేమని పోలీసులు చెప్పడంతో వాయిదా వేశారు. తిరిగి 14వ తేదీన నిర్వహించినా మద్దతు ధర రాకపోవడంతో వాయిదా పడింది. ఈమేరకు శుక్రవారం సంత ఆవరణలో వేలం నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. ‘సీ్త్ర జీవిత చిత్రణ’కు డాక్టరేట్ ఖమ్మం సహకారనగర్: ఖమ్మంకు చెందిన పెద్దపల్లి తేజస్వికి ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ లభించింది. ‘తెలంగాణ కథా రచయిత్రులు–సీ్త్ర జీవిత చిత్రణ(1991–2015)’ అంశంపై డాక్టర్ నాళేశ్వరం శంకరం పర్యవేక్షణలో ఆమె పరిశోధనాత్మక గ్రంథానికి డాక్టరేట్ ప్రకటించారు. కాగా, తేజస్వి రాసిన కథలు, పరిశోధనాత్మక వ్యాసాలు వివిధ పత్రికల్లో ప్రచురితం కాగా, జాతీయ, అంతర్జాతీయ సదస్సుల్లోనూ ఆమె పత్రాలు సమర్పించారు. -
ఐదు రోడ్లు.. రూ.594 కోట్లు
● జిల్లాలో కీలక మార్గాల విస్తరణకు గ్రీన్సిగ్నల్ ● నాలుగు వరుసలుగా ఆధునికీకరణమధిర: జిల్లాలోని పలు రహదారుల విస్తరణ, అభివృద్ధికి రూ.594 కోట్ల నిధులు మంజూరయ్యాయి. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చొరవతో కీలకమైన ఐదు మార్గాల విస్తరణకు గ్రీన్సిగ్నల్ లభించగా ఉగాది పండుగ రోజున ప్రకటన వెలువడింది. ఈ మార్గాల్లో రహదారులను నాలుగు వరుసలుగా విస్తరించే పనులు పూర్తయితే జిల్లావాసుల దశాబ్దాల కల నెరవేరడంతో పాటు రవాణా రంగం మెరుగుపడనుంది. రాకపోకలు సౌకర్యంగా.. హైబ్రిడ్ యాన్యూటీ మోడల్(హెచ్ఏఎం) పద్ధతిలో రహదారుల విస్తరణ, అభివృద్ధికి ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో జిల్లా నుంచి ఐదు రహదారులకు స్థానం దక్కింది. ఇవి మధిర, వైరా, ఖమ్మం నియోజకవర్గాల్లో ఉండగా, రహదారుల అభివృద్ధితో గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు రాకపోకలు సులువవుతాయ ని.. వ్యవసాయ ఉత్పత్తుల రవాణా సులభతరమవుతుందని భావిస్తున్నారు. ●వైరా నుంచి జగ్గయ్యపేట వరకు హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిని కలుపుతూ నాలుగు వరుసల రహదారిగా విస్తరిస్తారు. జగ్గయ్యపేట, బోనకల్, రావినూతల, ముజఫర్నగర్, జానకీపురం, పెద్ద బీరవల్లి, పాలడుగు, సీతానగరం, గొల్లపూడి, రెబ్బవరం, తాటిపూడి, జింకల తండా, సోమవరం మీదుగా వైరా వరకు 25.2 కి.మీ. రహదారి విస్తరణకు రూ.151.20 కోట్ల నిధులు మంజూరు చేశారు. ●మధిర నుంచి జిలుగుమాడు, ఆత్కూరు, కృష్ణాపురం, సిరిపురం, కలకోట, బ్రాహ్మణపల్లి మీదుగా తూటికుంట్ల వరకు 13.50 కి.మీ. మేర రహదారి విస్తరణకు రూ.81కోట్ల నిధులు కేటాయించారు. ●మధిర నుంచి ఇల్లెందులపాడు, దెందుకూరు మీదుగా ఎర్రుపాలెం వరకు 18.40 కి.మీ.మేర రహదారిని నాలుగు వరుసలుగా విస్తరిస్తారు. ఇందుకోసం రూ.110.40 కోట్ల నిధులు మంజూరయ్యాయి. ●ఖమ్మం నుంచి కొత్తూరు, ధంసలాపురం, గాంధీనగరం, రామకృష్ణా పురం, పందిళ్లపల్లి, జగన్నాధపురం, నాగులవంచ, ముష్టికుంట్ల మీదుగా బోనకల్ వరకు 28.03 కి.మీ. రహదారి విస్తరణకు రూ.157.23 కోట్లు మంజూరయ్యాయి. ●బోనకల్–ఆళ్లపాడు, రాయన్నపేట–వంగవీడు వరకు రహదారిని నాలుగు వరుసలుగా విస్తరిస్తారు. బోనకల్, ఆళ్లపాడు, రాయన్నపేట మీదుగా వంగవీడు వరకు 15.72 కి.మీ. రహదారి అభివృద్ధికి రూ 94.32 కోట్ల నిధులు మంజూరయ్యాయి. -
డీసీసీకి జంబో కార్యవర్గం!
● 79మంది పేర్లతో జాబితా విడుదల ● సీనియర్, జూనియర్ నాయకులకు స్థానం ఖమ్మంమయూరిసెంటర్: కాంగ్రెస్ జిల్లా కమిటీకి పూర్తిస్థాయి కార్యవర్గాన్ని నియమించారు. రాష్ట్రంలోని పలు జిల్లాల కమిటీలను టీపీసీసీ అధ్యక్షుడు బి.మహేష్కుమార్గౌడ్ గురువారం ప్రకటించగా.. జాబితాలో ఖమ్మం జిల్లా కూడా ఉంది. డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణతో సంప్రదింపులు జరిపిన అనంతరం ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కోశాధికారి, అధికార ప్రతినిధులు, కార్యదర్శులు, కార్యవర్గ సభ్యుల నియామకానికి ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులు విడుదల చేశారు. కార్యవర్గంలో మొత్తం 79 మందికి చోటు కల్పించగా, ఇందులో సీనియర్, జూనియర్ నాయకులకు స్థానం దక్కింది. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణగౌడ్ నియమితులైన వారికి అభినందనలు తెలిపారు. అన్ని వర్గాల చోటు దక్కేలా ఎంపిక చేసినందున క్షేత్రస్థాయి నుంచి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ●ఉపాధ్యక్షులు : తుములూరు లక్ష్మీనరసింహారావు, మల్లెడు హైమావతి, వేమిరెడ్డి సుధాకర్రెడ్డి, పసుపులేటి దేవేందర్, రాంపూడి రోశయ్య, పగడాల మంజుల, బుక్క కృష్ణవేణి, కాప సుధాకర్, మంకేన శ్రీనివాస్, కళ్లెం వెంకటరెడ్డి ●ప్రధాన కార్యదర్శులు : వల్లూరి పట్టాభిరెడ్డి, కిలారు అనిల్, మహమ్మద్ ముస్తఫా, హుస్సేన్, రెంటాల ప్రసాద్, కంచర్ల వెంకటనర్సయ్య, పులిబండ్ల చిట్టిబాబు, కొప్పుల గోవిందరావు, కొమ్మినేని రమేష్, కమతాల రేణుక, ప్రభావతిరెడ్డి, దొడ్డ పుల్లయ్య, బానోతు రామ్మూర్తి, పనిత శ్రీనివాసరావు, గోవిందు శ్రీనివాస్, నల్లమోతు సునీల్, సిరాజుద్దీన్, పి.సోమిరెడ్డి, మామిడి వెంకన్న, మహ్మద్ హఫీజుద్దీన్, రామసహాయం హరితారెడ్డి, ధరావత్ బాబు ●కోశాధికారి : పులిపాటి వెంకయ్య ●స్పోక్స్ పర్సన్లు : కాల్వకుంట్ల గోపాల్, కర్నాటి రామారావు, పమ్మి అశోక్, గంగిశెట్టి ప్రసాద్, బచ్చలకూర నాగరాజు నియమితులయ్యారు. అలాగే, కార్యదర్శులుగా 26 మంది, కార్యవర్గ సభ్యులుగా 15 మందికి డీసీసీ కార్యవర్గంలో చోటు కల్పించారు. -
196.40
కేఎంసీ బడ్జెట్...● మంచి సంస్కరణలు తీసుకొచ్చారు.. ● పాలకవర్గం, అధికారులకు కలెక్టర్ అనుదీప్ అభినందన ● మెరుగైన సేవలు అందిస్తున్నామన్న మేయర్ నీరజ ఖమ్మం మయూరిసెంటర్: 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఖమ్మం నగర పాలకసంస్థ అంచనా బడ్జెట్ను రూ.196.40 కోట్లతో ప్రవేశపెట్టారు. కేఎంసీ కౌన్సిల్ హాల్లో మేయర్ పునుకొల్లు నీరజ అధ్యక్షతన బడ్జెట్, కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. తొలుత అకౌంట్స్ ఆఫీసర్ చింతా శ్రీనివాసరెడ్డి వచ్చే ఆర్థిక సంవత్సర బడ్జెట్ను ప్రవేశపెట్టి, ఆదాయ, ఖర్చుల వివరాలను వెల్లడించారు. రూ.196.40 కోట్ల ఆదాయం అంచనా వేయగా, అదే స్థాయిలో వ్యయం ఉంటాయని వెల్లడించారు. అనంతరం మేయర్ నీరజ మాట్లాడుతూ నగర ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నామని తెలిపారు. అభివృద్ధి పనులు నాణ్యతతో జరిగేలా సమన్వయంతో పనిచేయాలని సూచించారు. మెరుగైన సేవలే లక్ష్యం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ హైదరాబాద్ తర్వాత ప్రధానమైన ఖమ్మం కార్పొరేషన్కు రూ.196 కోట్లతో బడ్జెట్ ప్రతిపాదించినట్లు తెలిపారు. ఈ నిధులతో నగరవాసులకు మెరుగైన సేవలు అందేలా పనులు చేపట్టాలని వెల్లడించారు. కార్పొరేషన్ ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో మంచి సంస్కరణలు తీసుకొచ్చి చాలా సమస్యలు పరిష్కరించారని అభినందించారు. అయితే, కార్పొరేషన్కు సొంత ఆదాయ వనరులు పెంచుకోవడంపై దృష్టి సారించాలని సూచించారు. పలు అంశాలకు ఆమోదం బడ్జెట్ సమావేశానికి మీడియాను అనుమతించకపోవడంపై సీపీఐ కార్పొరేటర్ బీజీ.క్లెమెంట్, బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ కర్నాటి కృష్ణ అధికారులను ప్రశ్నించారు. గత ప్రభుత్వ విధానాలనే ఈ ప్రభుత్వం అనుసరిస్తుందని క్లెమెంట్ విమర్శించారు. గత సమావేశంలో పంపు ఆపరేటర్లను మున్సిపల్ కార్మికులుగా గుర్తిస్తూ చేసిన తీర్మానాన్ని అమలుచేయాలని క్లెమెంట్ పట్టుబట్టడంతో సానుకూల నిర్ణయం తీసుకున్నారు. అలాగే, సారధినగర్ ఆర్యూబీకి కౌటూరి దుర్గాప్రసాద్ వారధిగా నామకరణం చేయాలన్న కార్పొరేటర్ దుద్దుకూరి వెంకటేశ్వర్లు ప్రతిపాదనను ఆమోదించారు. ఆతర్వాత ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ అధికారిపై చర్యలు తీసుకోవాలని కొందరు కార్పొరేటర్లు కమిషనర్కు లేఖనుఅందజేశారు. ఈ సమావేశంలో కార్పొరేషన్ కమిషనర్ అభిషేక్ అగస్త్య, అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహారా, కార్పొరేటర్లు, అధికారులు పాల్గొన్నారు. కోట్లురూ. -
ఈనెల 28న జాతీయ లోక్ అదాలత్
ఖమ్మం లీగల్: అత్యధిక కేసులను పరిష్కరించడంతో పాటు తక్షణ న్యాయం అందించాలనే లక్ష్యంతో ఈనెల 28న జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు న్యాయ సేవల అథారిటీ జిల్లా చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.రాజగోపాల్ తెలిపారు. కోర్టు ఆవరణలో బుధవారం న్యాయమూర్తులు, పోలీసు, వివిధ శాఖల అధికారులతో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. న్యాయమూర్తులు ఉమాదేవి, అర్చనకుమారి, రాంప్రసాదరావు, సీనయ్య, కల్పన, మురళీమోహన్, దీప, రజని, బిందుప్రియ, నాగలక్ష్మి, అఖిల తదితరులు పాల్గొన్నారు. ●ఖమ్మంగాంధీచౌక్: జిల్లా వైదిక బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యాన రూపొందించిన పంచాంగాన్ని జిల్లా జడ్జి రాజగోపాల్ ఆవిష్కరించారు. సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు తాటికొండల సీతారామశాస్త్రి, కొండూరి సరస్వతికుమార్తో పాటు కొనకంచి ప్రసాద్, నూతక్కి వెంకటేశ్వరరావు, మూల వెంకన్న, అవధానుల రామకృష్ణశర్మ, వడ్లమాని లక్ష్మీనారాయణ, ఆమంచి సురేష్శర్మ తదితరులు పాల్గొన్నారు. కొబ్బరి అభివృద్ధి బోర్డు ఏర్పాటుచేయండి ఖమ్మంమయూరిసెంటర్: తెలంగాణలోనే అత్యధికంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొబ్బరి తోటలు ఉన్నందున కొబ్బరి అభివృద్ధి బోర్డు ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు చేయాలని ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి కోరారు. పార్లమెంట్లో బుధవారం మాట్లాడిన ఆయన అశ్వారావుపేట లేదా దమ్మపేటలో కొబ్బరి అభివృద్ధి బోర్డు ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటుచేయాలని విజ్ఞప్తి చేశారు. తద్వారా రైతులకు సాంకేతిక సాయం, నాణ్యమైన సాగు, మార్కెట్ అవకాశాలు మెరుగుపడతాయని పేర్కొన్నారు. ప్రశాంతంగా ఎస్సెస్సీ పరీక్షఖమ్మం సహకారనగర్: పదో తరగతి రెండో పరీక్ష బుధవారం ప్రశాంతంగా జరిగిందని డీఈఓ చైతన్య జైనీ తెలిపారు. ఈమేరకు హిందీ పరీక్షకు 16,990మందిలో 16,972మంది హాజరయ్యారని వెల్లడించారు. జిల్లా స్థాయి అబ్జర్వర్లు, అసిస్టెంట్ కమిషనర్, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలతో పాటు తాను పలు కేంద్రాల్లో తనిఖీ చేశామని తెలిపారు. అడవి పందిని వే టాడిన ముగ్గురి అరెస్ట్ఖమ్మంవ్యవసాయం: పెనుబల్లి మండలం తాళ్లపెంట పెద్దచెరువు గుట్టపై అడవి పందిని వేటాడిన ముఠాను అటవీ శాఖాధికారులు పట్టుకున్నారు. తాళ్లపెంటకు చెందిన ఐదుగురు మంగళవారం అడవి పందిని హతమార్చి మాంసాన్ని బుధవారం విక్రయిస్తుండగా గడ్డి మారేష్, మడిపల్లి రాంబాబు, కొత్తపల్లి బాలయ్యను అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితులైన బద్దం నర్సింహారావు, పీట్ల రామకృష్ణ పరారీలో ఉన్నారని తల్లాడ రేంజ్ అధికారి జి.ఉమ తెలిపారు. ఉద్యోగం రాలేదనే మనస్తాపంతో ఆత్మహత్యఖమ్మం రూరల్: ఏదులాపురం మున్సిపాలిటీలోని తెల్దారుపల్లికి చెందిన ఉన్నం భవాని(26) ఆత్మహత్యకు పాల్పడింది. పీజీ పూర్తిచేసిన ఆమెకు ఉద్యోగం రాకపోవడంతో గడ్డి మందు తాగగా కుటుంబీకులు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఆమె తల్లి రమణకుమారి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు సీఐ ముష్కరాజ్ తెలిపారు. -
నీటి ఎద్దడి.. కట్టడి
● 18 గ్రామాల్లో సమస్య తలెత్తనున్నట్లు గుర్తింపు ● ఆయా గ్రామాల్లో భూగర్భ జలం అడుగంటుతున్నట్లు నిర్ధారణ ● ఇబ్బంది రాకుండా ముందస్తు చర్యల్లో నిమగ్నమైన అధికారులు ఖమ్మంఅర్బన్: జిల్లాలో ఈ వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపడుతున్నారు. భూగర్భ జలాలు తగ్గుతూ ఉండటంతో కొన్ని గ్రామాల్లో తాగునీటి సమస్య తలెత్తే అవకాశం ఉన్నట్లు గుర్తించారు. జిల్లాలోని 18 గ్రామాల్లో తాగునీటి ఎద్దడి ఎదురయ్యే అవకాశం ఉందని గుర్తించి, అక్కడ వివిధ మార్గాల ద్వారా తాగునీటి సరఫరాకు చర్యలు ప్రారంభించారు. హ్యాబిటేషన్లలో ఉన్న బోర్లు, నీటి వనరులు సరిపోని గ్రామాల్లో ప్రైవేట్ వనరులు, దాతల సహకారం ద్వారా లేదా అద్దెకు నీటి వనరులు తీసుకోవడం వంటి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని, సాధ్యం కాకపోతే ట్యాంకర్ల ద్వారా తాగునీరు సరఫరా చేసేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. జిల్లాలో 915 హ్యాబిటేషన్లు.. జిల్లాలోని 20 మండలాల పరిధిలో మొత్తం 915 హ్యాబిటేషన్లు ఉండగా, వాటిలో 911 హ్యాబిటేషన్లకు మిషన్ భగీరథ ద్వారా తాగునీటి సరఫరా అవుతోంది. ఎప్పుడైనా సరఫరాలో అంతరాయం కలిగితే ప్రత్యామ్నాయంగా నీటి వనరులను సిద్ధం చేస్తున్నట్లు ఆర్డబ్ల్యూఎస్ అధికారులు తెలిపారు. అవసరమైతే ప్రైవేట్ నీటి వనరులు అద్దెకు తీసుకోవడం, దాతల సహకారం పొందడం లేదా ట్యాంకర్ల ద్వారా తాగునీటిని సరఫరా చేయడం లాంటి ఏర్పాట్లు చేయనున్నారు. ఇదిలా ఉండగా జిల్లాలోని నాలుగు మండలాల్లో ప్రస్తుతం భూగర్భ జలాలు తగ్గుతున్నట్లు గుర్తించారు. వేసవిలో నీటి కొరత ఎక్కువయ్యే అవకాశం ఉన్న గ్రామాలుగా ముదిగొండ మండలంలోని బాణాపురం, ముదిగొండ, చింతకాని మండలంలోని నేరడ, పందిళ్లపల్లి, తల్లాడ మండలంలోని కురన్నవల్లి గ్రామాలను గుర్తించి ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆర్డబ్ల్యూఎస్ అధికారులు గత నెల 1వ తేదీ నుంచి 20వ తేదీ వరకు అన్ని హ్యాబిటేషన్లలో తాగునీటి పథకాల పరిస్థితిని పరిశీలించారు. చేతి పంపులు, పంపుసెట్లలో కొన్ని మరమ్మతులు అవసరమని, ఇంకొన్ని లీకేజీలు ఉన్నట్లు గుర్తించారు. మరమ్మతులు పూర్తి చేయడానికి సుమారు రూ.90 లక్షలు ఖర్చు అవుతుందని అంచనా వేసి జిల్లా పంచాయతీ అధికారికి నివేదిక అందించారు. 22 వరకు జల మహోత్సవం ఈ నెల 8న గ్రామ పంచాయతీల్లో మొదలైన ‘జల మహోత్సవం’22వ తేదీ వరకు కొనసాగనుంది. మహిళా సర్పంచులు ఉన్న గ్రామాల్లో ప్రత్యేకంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అలాగే, తాగునీటి సమస్య తలెత్తితే తెలుసుకుని టోల్ ఫ్రీ నంబర్ 1916ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ నంబర్కు అందిన సమస్యలు పరిష్కరించడమే కాక ఫిర్యాదు చేసిన వారికి సమాచారం అందజేస్తామని చెబుతున్నారు.వేసవిలో ఎక్కడా తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు ప్రణాళిక రూపొందిస్తున్నాం. ఇప్పటికే తాగునీటి పథకాలను పరిశీలించి ఎక్కడ ఏమేం చేయాలో నివేదికను డీపీఓ ద్వారా ఆయా గ్రామపంచాయతీలకు అందజేశాం. నీటి ఎద్దడి ఎదురయ్యే అవకాశం ఉన్న 18 గ్రామాల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి సారించాం. నీటి సమస్యలపై ఫిర్యాదు చేసేందుకు ట్రోల్ఫీ నంబర్ 1961ను అందుబాటులోకి తీసుకొచ్చాం. –పుష్పలత, ఆర్డబ్ల్యూఎస్ ఈఈ ఆర్డబ్ల్యూఎస్ విభాగం అధికారులు గుర్తించిన గ్రామాల్లో కూసుమంచి మండలంలోని గంగాబండతండా పంచాయతీ (బోటిమీదితండా, గంగాబండ తండా), తిరుమలాయపాలెం మండలంలోని హైదర్సాయిపేట, ఖమ్మంరూరల్ మండలంలోని గొల్లపాడు, పోలిశెట్టిగూడెం, ఏన్కూరు మండలంలోని కేసుపల్లి, కామేపల్లి మండలంలోని టేకులతండా, కల్లూరు మండలంలోని ఎర్రబోయినపల్లి, పేరువంచ, అంబేడ్కర్నగర్లో నీటి ఎద్దడి ఎదురయ్యే అవకాశముందని గుర్తించారు. అలాగే, జాబితాలో వేంసూరు మండలంలోని అమ్మపాలెం, వేంసూర్, భరణిపాడు, పెనుబల్లి మండలంలోని లింగగూడెం, తల్లాడ మండలంలోని కుర్నవల్లి, మల్లారం, సత్తుపల్లి మండలంలోని రేజర్ల, కిస్టారం గ్రామాలు కూడా ఉన్నాయి. ఈ గ్రామాల్లో నీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టి, అవసరమైతే ట్యాంకర్ల ద్వారా సరఫరా చేసేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. -
●సీ ఫిష్.. రుచి అదుర్స్!
● ఖమ్మంలో సముద్ర చేపల విక్రయం ● బరువు 60కేజీలు.. కిలో ధర రూ.600 నుంచి మొదలు ● కొనుగోళ్లకు నగరవాసుల ఆసక్తిఖమ్మంవ్యవసాయం: సముద్రంలో మాత్రమే లభించే భారీ చేపలను జిల్లా కేంద్రంలో అమ్మకానికి తీసుకొచ్చారు. భద్రాద్రి జిల్లా పాల్వంచకు చెందిన కొందరు యువకులు బృందంగా ఏర్పడి ఏపీలోని విశాఖపట్నంలో కొనుగోలు చేసిన ఈ చేపలను ఇక్కడ అమ్ముతున్నారు. వైట్ టూనా, బ్లూ టూనా తదితర రకాల చేపలు 60నుంచి 80 కిలోల వరకు బరువు ఉన్నాయి. వీటిని ముక్కలుగా చేసి కిలో రూ.600 నుంచి రూ.800 వరకు విక్రయించారు. ఇవి అరుదుగా మాత్రమే లభించే చేపలు కావడం, రుచి కూడా బాగుంటుందనే భావనతో పలువురు కొనుగోలు చేశారు. ఖమ్మంలోని లకారం ట్యాంక్ బండ్ సమీపాన మంగళవారం అడ్డా ఏర్పాటుచేసుకున్న యువకులు.. చేపల తల, రెక్కలను తొలగించి చేప చర్మం తీసి ముక్కలుగా చేస్తూ విక్రయించారు. ఇక ఈ చేపల మాంసంతో తయారుచేసిన పచ్చళ్లను కిలో రూ.వేయి చొప్పున అమ్మకానికి పెట్టారు. కాగా, ఉమ్మడి జిల్లాలో సముద్రపు చేపలకు డిమాండ్ ఉంటుందనే భావనతో 40 మంది కలిసి కొద్ది రోజులుగా విశాఖ నుంచి తీసుకువచ్చి విక్రయిస్తున్నామని పాల్వంచకు చెందిన కాకటి వినోజ్ తెలిపారు. ఇటీవల పాల్వంచ, మణుగూరులో విక్రయించగా మంచి ఆదరణ లభించిందని, ఖమ్మం వాసులు కూడా ఆసక్తిగా కొనుగోలు చేశారని వెల్లడించారు. -
నేత్రపర్వంగా నిత్యకల్యాణం
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి నిత్యకల్యాణ వేడుక మంగళవారం నేత్రపర్వంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. ఆ తర్వాత స్వామి వారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. మంగళవారాన్ని పురస్కరించుకుని ఆంజనేయస్వామి వారికి అభిషేకం, ప్రత్యేక పూజలు చేశారు. ఇస్రో రీసెర్చ్ స్కాలర్గా మల్కారం వాసిదమ్మపేట : మండలంలోని మల్కారం గ్రామానికి చెందిన కొవల ముత్యాలరావు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) పరిధిలోని తిరువనంతపురం విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రంలో జూనియర్ రీసెర్చ్ స్కాలర్గా ఎంపికయ్యారు. కాగా ఆయన హైదరాబాద్ జేఎన్టీయూలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ (మెకానికల్ ఇంజనీరింగ్)లో గోల్డ్ మెడల్ సాధించాడు. ఈ సందర్భంగా మంగళవారం మల్కారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు ముత్యాలరావును ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో హెచ్ఎం మారెమ్మ, ఉపాధ్యాయులు శ్యామలాదేవి, ఈశ్వర్ రెడ్డి, నాగాచారి, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
‘బార్’ అధ్యక్ష పదవి బరిలో నలుగురు
ఖమ్మంలీగల్: ఖమ్మం బార్ అసోసియేషన్ ఎన్నికలు ఈనెల 26న జరగనుండగా అధ్యక్ష పదవికి నలుగురు పోటీ పడుతున్నారు. అలాగే, నామినేషన్ల ఉపసంహరణ తర్వాత ఆరు పదవులకు ఒక్కొక్కరే మిగలడంతో ఏకగ్రీవమైనట్లు ప్రకటించారు. కాగా, అధ్యక్ష పదవికి మోసెస్ క్రిస్టోఫర్ గోపోజి, రమేష్ యడ్లపల్లి, సుగ్గల వెంకటేశ్వరరావు గుప్తా, అయ్యదేవర విజయరాఘవ పోటీలో మిగిలారని ఎన్నికల అధికారులు పీఏజే.శేఖర్రాజ్, తౌఫిక్ అహ్మద్ తెలిపారు. అలాగే, ప్రధాన కార్యదర్శి పదవికి కుందుల అమరనాథ్, కొప్పుల రవికుమార్, తాళ్ల వెంకటనారాయణ పోటీలో ఉన్నారు. ఇక ఉపాధ్యక్షుడిగా షేక్ జానీమియా, సంయుక్త కార్యదర్శిగా దొబ్బల శిరీష, గ్రంథాలయ కార్యదర్శిగా దేవరకొండ కళ్యాణి, క్రీడా కార్యదర్శిగా ధరావత్ రాందాస్, కోశాధికారిగా వీకేడీ.రాజేశ్వరి, మహిళా ప్రతినిధిగా కనపర్తి రాధమ్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని వెల్లడించారు.ఆరు పదవులు ఏకగ్రీవం -
భూసేకరణపై కొలిక్కిరాని పరిహారం
కారేపల్లి: డోర్నకల్– భద్రచాలం రోడ్ మార్గంలో రైల్వే డబ్లింగ్ లైన్ నిర్మాణానికి భూసేకరణపై చర్యలు కొలిక్కి రాలేదు. కారేపల్లి మండలం సింగరేణికి చెందిన నిర్వాసితులతో అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రాజేశ్వరి మంగళవారం కలెక్టరేట్లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వ్యవసాయ భూమి ఎకరానికి రూ.91లక్షలు, ఇంటి స్థలమైతే గజానికి రూ.20వేలు చెల్లించాలని బాధితులు కోరారు. కానీ అధికారులు మాత్రం వ్యవసాయ భూమి ఎకరానికి రూ.18లక్షలు, ఇంటి స్థలానికి గజానికి రూ.6,300 మాత్రమే చెల్లిస్తామని స్పష్టం చేశారు. ఇల్లు కలిగిన మునీర్ అనే వ్యక్తికి ఆర్ అండ్ బీ అధికారుల సూచనలతో అదనపు పరిహారం కలిపి రూ.46లక్షలు వస్తాయని తెలిపారు. ఏజెన్సీ ప్రాంతాల్లో భూసేకరణకు నిర్ణయించిన ధర ప్రకారమే పరిహారం చెల్లిస్తామని అధికారులు స్పష్టం చేయగా నిర్వాసితులు అంగీకరించలేదు. మైదాన ప్రాంతంలోని భూముల ధరలను పరిగణనలోకి తీసుకొని మానవతాదృక్పథంతో న్యాయం చేయాలని కోరగా, మరోమారు సమావేశం ఏర్పాటు చేసే సమావేశం నాటికి ఆలోచించుకొని నిర్ణయం తెలపాలని అధికారులు సూచించారు. అనంతరం సింగరేణి సర్పంచ్ మేదరి టోనీవీరప్రతాప్ ఆధ్వర్యాన నిర్వాసితులు అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సమావేశంలో తహసీల్దార్ రమేష్, రైల్వే జేఈ శ్రీకాంత్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ జగదీష్ తదితరులు పాల్గొన్నారు.బాధితులు కోరినంత ఇవ్వలేమన్న అధికారులు -
సబ్స్టేషన్ పనులు పరిశీలన
బోనకల్: మండలంలోని చిరునోముల, బ్రాహ్మణపల్లిల్లో విద్యుత్ సబ్ స్టేషన్ల నిర్మాణ పనులను ఎన్పీడీసీఎల్ చీఫ్ ఇంజనీర్ రాజుచౌహాన్ మంగళవారం పరిశీలించారు. అనంతరం మండల కేంద్రంలో అధికారులతో సమావేశమైన ఆయన పలు సూచనలు చేశారు. సబ్స్టేషన్ల నిర్మాణం త్వరగా పూర్తయ్యేలా నిరంతరం పరిశీలంచాలని ఆదేశించారు. ఆతర్వాత విద్యుత్ సామర్ధ్యం మెరుగుదల, సాంకేతిక అంశాలపై సూచనలు చేశారు. ఆతర్వాత మండలంలోని పలు గ్రామాల్లో సౌర విద్యుత్ ప్లాంట్ల పనులను కూడా సీఈ పరిశీలించారు. ఖమ్మం సూపరింటెండెంట్ ఇంజనీర్ ఈ.శ్రీనివాసాచారి, డివిజినల్ ఇంజనీర్లు భద్రూపవార్, డి.శ్రీనివాసరావు, ఏడీఈ వై.వీ.ఆనంద్కుమార్, ఏఈ టి.మనోహర్, సబ్ ఇంజనీర్లు తదితరులు పాల్గొన్నారు. -
జ్యుడీషియల్ ఉద్యోగుల ఉపాధ్యక్షుడిగా ప్రేమ్
ఖమ్మం లీగల్: ఇండియా జ్యుడీషియల్ ఎంప్లాయీస్ కాన్ఫిడరేషన్ ఉపాధ్యక్షుడిగా ఖమ్మంకు చెందిన దండి ప్రేమ్కుమార్ ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఆయన రాష్ట్ర న్యాయ ఉద్యోగుల సంఘానికి అసోసియేట్ ప్రెసిడెంట్గా వ్యవహరిస్తున్నారు. గతంలో జిల్లా న్యాయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా కూడా పనిచేసిన ప్రేమ్ ప్రస్తుతం హైదరాబాద్ కూకట్పపల్లి కోర్టులో చీఫ్ అడ్మిస్ట్రేటివ్ ఆఫీసర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయనకు జాతీయ కమిటీలో స్థానం లభించడంపై న్యాయ శాఖ ఉద్యోగులు అభినందించారు. సొమ్ము పక్కదారిపై ఆందోళన వైరా: రుణం వాయిదాలు బ్యాంకులో జమ చేయాలని ఇస్తే పక్క దారి పట్టించారని మహిళా సంఘం సభ్యులు మంగళవారం ఆందోళనకు దిగారు. ఈమేరకు వైరా మెప్మా కార్యాలయంలో ఫిర్యాదు చేయడ మే కాక డబ్బు వాడుకుని మోసం చేసిందని గ్రామదీపికను నిలదీయంతో ఉద్రిక్తత నెలకొంది. ఈ విషయం తెలిసి పోలీసులు చేరుకుని సర్దిచెప్పారు. ఆనంతరం మెప్మా అధికారి వెంకటేశ్వరరావు బ్యాంకుకు వెళ్లి వివరాలు ఆరాతీశారు. ఒక గ్రూపు సభ్యులు రూ.4 లక్షలు బ్యాంకులో జమ చేయాలని గ్రామదీపికకు ఇస్తే ఆమె రూ.3లక్షలే జమ చేసినట్లు తేలింది. దీంతో బుధవారం వైరాలోని రైతు వేదికలో చేపట్టే విచారణకు హాజరుకావాలని వెంకటేశ్వరరావు సభ్యులకు సూచించారు. -
నిజమైన సేవకులకు అవకాశం కల్పించాలి
ఖమ్మంగాంధీచౌక్: ఏసుక్రీస్తు బోధనలను ప్రజలకు అందిస్తూ ఆధ్యాత్మికత పెంచుతున్న నిజమైన సేవకులకే అవకాశం కల్పించాలని డోర్నకల్ డయాసిస్ బిషప్గా పోటీ చేస్తున్న కె.సేనంరాజు కోరారు. ఖమ్మంలో కార్పొరేటర్ బీజీ.క్లెమెంట్ అధ్యక్షతన మంగళవారం జరిగిన ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. కొత్తగూడెంలోని సెయింట్ అండ్రూస్ చర్చిలో మే 10వ తేదీన బిషప్ ఎన్నికలు జరుగుతాయని తెలిపారు. ఈ ఎన్నికల్లో బిషప్గా తనతో పాటు ప్యానల్గా పోటీలో ఉన్న కేటీ.విజయ్కుమార్, ఆర్.ఇజ్రాయేల్రెడ్డి, జేజే.కాంతారాణిని గెలిపించి క్రైస్తవ సంఘాలను రక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సమావేశంలో ఖమ్మం, భద్రాద్రి, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాలతో పాటు ఏపీలోని వివిధ జిల్లాల సభ్యులు ఐజక్ మల్లికార్జున్, ఆముదాల ప్రసాద్, ఈ.కిశోర్, రితేష్రెడ్డి, వేము కృష్ణ, నెమ్మది నవీన్, స్వర్ణప్రేమలత, శాంతారాజ్యం తదితరులు పాల్గొన్నారు.డోర్నకల్ డయాసిస్ బిషప్ అభ్యర్థి సేనంరాజు -
ప్రకృతి వ్యవసాయంతో లాభాలు
వైరా: రైతులు రసాయన ఎరువుల వాడకం తగ్గించి ప్రకృతి వ్యవసాయం చేయడం ద్వారా లాభాలు సాధించొచ్చని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ధనసరి పుల్లయ్య తెలిపారు. హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ అంశంపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడారు. ఈమేరకు సోమవరం రైతు వేదికలో వీడియో కాన్ఫరెన్స్ వీక్షించాక డీఏఓ పుల్లయ్య మాట్లాడారు. ప్రకృతి వ్యవసాయం చేయడం ద్వారా భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన భూమిని అందించొచ్చని తెలిపారు. అనంతరం ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులకు కిట్లు అందజేశారు. ఏడీఏ తుమ్మలపల్లి కరుణశ్రీ, ఏఓ మయాన్ మంజుఖాన్, ఏఈఓలు మేడా రాజేష్, వెంపటి కీర్తి, ఆలూరి వాసంతి, పరిటాల వెంకటనర్సయ్య తదితరులు పాల్గొన్నారు. చైనా గ్రానైట్ ఎగ్జిబిషన్లో రాయల నేలకొండపల్లి: గ్రానైట్ పరిశ్రమల్లో నూతన యంత్రాలపై చైనాలో జరుగుతున్న అంతర్జాతీయ స్థాయి ఎగ్జిబిషన్లో చిన్నతరహా గ్రానైట్ పరిశ్రమల రాష్ట్ర అధ్యక్షుడు, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు పాల్గొన్నారు. పలువురు వ్యాపారులతో కలిసి చైనాలోని జియామిన్లో జరుగుతున్న ఎగ్జిబిషన్ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా అధునాతనమైన గ్రానైట్ కటింగ్, పాలిషింగ్ యంత్రాలను పరిశీలించి వాటి పనితీరును తెలుసుకున్నారు. సాగునీరు విడుదల చేయండి పెనుబల్లి: పెనుబల్లి మండలంలోని పులిగుండాల ప్రాజెక్టు ఆయకట్టులో పంటల సాగుకు ఇబ్బంది ఎదురుకాకుండా నీరు విడుదల చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. ప్రాజెక్టులో బోటు షికారు కోసం నీటి విడుదల నిలిపివేశారని, తద్వారా వేయి ఎకరాల్లో వరి పంట ఎండిపోతోందని రైతులు ఇటీవల ఆందోళన చేశారు. ఈమేరకు కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్యాదవ్, డీఎఫ్ఓ సిద్ధార్థ్ విక్రమ్సింగ్తో ఫోన్లో మాట్లాడిన మంత్రి.. ఆయకట్టు రైతుల ప్రయోజనాల దృష్ట్యా తక్షణమే నీరు విడుదల చేయాలని సూచించారు. భూదాన్ నిర్వాసితులకు అండగా 22న ఖమ్మం బంద్ ఖమ్మంమయూరిసెంటర్: ఖమ్మం వెలుగుమట్లలోని భూదాన్ భూముల్లో ఇళ్లు కోల్పోయిన నిర్వాసితులకు న్యాయం చేయాలనే డిమాండ్తో ఈనెల 22న ఖమ్మం నగర బంద్కు పిలుపునిస్తున్నట్లు సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు ఆవునూరి మధు తెలిపారు. ఖమ్మంలో మంగళవారం ఆయన ఆయన మాట్లాడుతూ భూదాన్ భూముల్లో 700 ఇళ్లకు పైగా కూల్చివేసిన ప్రభుత్వం 311 మందికి మాత్రమే ఇళ్ల పట్టాలు ఇచ్చిందని తెలిపారు. ఇంకా అనేక మంది అర్హులు ఉన్నందున అందరికీ న్యాయం చేయాలనే డిమాండ్తో చేపడుతున్న బంద్కు ప్రజలు సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి బండారి ఐలయ్య, నాయకులు మందుల రాజేంద్రప్రసాద్, వెంకట్రాంరెడ్డి, వై.ప్రకాష్, ఖాసిం, గిరి, సురేష్, లక్ష్మి, గొర్రిపాటి రమేష్, సుదర్శన్, మోహన్రావు, జానకి, మస్తాన్ పాల్గొన్నారు. నిర్వాసితులందరికీ స్థలాలు ఇవ్వాల్సిందే.. ఖమ్మంఅర్బన్: వెలుగుమట్ల భూదాన్ భూముల్లో నిర్వాసితులందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించాలని భూదాన్ ఇళ్ల స్థలాల సాధన కమిటీ నాయకులు డిమాండ్ చేశారు. ఈమేరకు మాస్లైన్ నాయకులతో కలిసి మంగళవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. తొలిదశలో ఇళ్లు ఇచ్చిన 311 మందిలో అనర్హులు ఉన్నందున పరిశీలించి నిజమైన బాధితులకే స్థలాలు కేటాయించాలన్నారు. అనంతరం కలెక్టరేట్లో వినతిపత్రం అందజేశారు. నాయకులు సత్యనారాయణరెడ్డి, సీవై.పుల్లయ్య, ఆవుల అశోక్, కోటేశ్వరరావు, ఝాన్సీ, కె.నాగేశ్వరరావు, ఎం.నాగేశ్వరరావు, ఆవుల మంగతాయి, శోభ, ఉమ, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. -
మిథిలా.. వ్యథ
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాచలంలో సీతారాముల కల్యాణోత్సవం జరుగుతున్న మిథిలా స్టేడియం నిర్వహణ మేడిపండు చందంగా మారింది. కేవలం శ్రీరామనవమి సమయంలో తప్పితే మిగతా రోజుల్లో దీన్ని పట్టించుకునేవారు లేరు. ప్రస్తుత మాస్టర్ ప్లాన్లో అయినా ౖపైపె మెరుగులతో కాకుండా పూర్తి స్థాయిలో ఈ స్టేడియాన్ని అభివృద్ధి చేయడంతో పాటు భక్తులు ఉపయోగించుకునేందుకు అనువుగా మార్చాల్సిన అవసరం ఉంది.1988లో గ్యాలరీల నిర్మాణం దేశంలో ఎక్కడా లేని విధంగా చైత్ర శుద్ధ నవమి రోజున సీతారాముల కల్యాణం జరిపించే సంప్రదాయాన్ని భక్త రామదాసు భద్రాచలంలో ఆరంభించారు. ఆ రోజుల్లో నాటి పాలకుడైన తానీషా స్వయంగా పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు జానకిరాములకు సమర్పించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ ఆనవాయితీ కొనసాగుతూ వస్తోంది. అలాగే రామయ్య కల్యాణ క్రతువు చూసేందుకు వస్తున్న భక్తుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. నవమికి భద్రాద్రికి పోటెత్తున్న భక్తులను దృష్టిలో ఉంచుకుని ఆలయం వెలుపల 1960లో కల్యాణ మండపం పనులు మొదలుపెట్టగా 1964లో ప్రారంభమైంది. ఆ తర్వాత మండపంలో సీతారాముల కల్యాణాన్ని భక్తులు కనులారా చూసేందుకు వీలుగా 1988లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావు కల్యాణ మండపం చుట్టూ గ్యాలరీలు నిర్మించి మిథిలా స్టేడియంగా నామకరణం చేశారు. సమస్యల తిష్ట.. ఒకేసారి దీన్ని స్టేడియం తరహాలో నిర్మించకపోవడంతో కల్యాణ మండపం, గ్యాలరీల మధ్య సమన్వయం కొరవడింది. దీనికి తోడు కాల క్రమంలో మిథిలా స్టేడియం మధ్య భాగంలో ఎత్తుగా మట్టి పోయడంతో కల్యాణ మండపం, గ్యాలరీల మధ్య సమాంతరం లేకుండా పోయింది. దీంతో సీతా రాముల కల్యాణాన్ని ప్రత్యక్షంగా చూద్దామనే ఆశతో భద్రాచలం వచ్చి గ్యాలరీలో కూర్చునే సామాన్య భక్తులకు కల్యాణ మండపం పైకప్పు తప్ప మరేమీ కనిపించని దుస్థితి నెలకొంది. ఈ అవస్థను కొంతైనా దూరం చేసేందుకు గ్యాలరీల వద్ద కనీసం ఎల్ఈడీ స్క్రీన్లు కూడా ఏర్పాటు చేయడం లేదు. ఇక స్టేడియం గ్యాలరీల దిగువ భాగంలో పరిస్థితి చెప్పనలవి కానంత దారుణంగా ఉంది. ప్రతీ శ్రీరామనవమి, ముక్కోటి ఏకాదశి సమయాల్లో ఈ స్టేడియాన్ని ౖపైపెన శుభ్రం చేస్తుండగా ఆ తర్వాత రోజుల్లో ఇటు కన్నెత్తి చూడడం లేదు. పేర్లే ఘనం.. సుమారు రెండెకరాల విస్తీర్ణంలో మిథిలా స్టేడియం నిర్మించారు. భక్తులు కూర్చునే గ్యాలరీలకు దిగువ భాగంలో పెద్ద పెద్ద హాళ్లు ఉన్నాయి. వీటికి గోదావరి ఉప నదులైన సీలేరు, శబరి, కిన్నెరసాని, తాలిపేరు, వశిష్ట, ఇంద్రావతి, ప్రాణహిత, మానేరు, మంజీర, పెన్గంగా, వార్దా వంటి పేర్లు పెట్టారు. ఉప నదుల పేరుతో ఏర్పాటు చేసిన పెద్ద హాళ్లన్నీ ప్రస్తుతం నిరుపయోగంగా మారాయి. వీటి నిర్వహణను పట్టించుకోకపోవడంతో బూజు పట్టి, దుమ్ము కొట్టుకుపోయి గబ్బిలాలకు నిలయంగా మారుతున్నాయి. ఇక మిథిలా స్టేడియంలోకి వచ్చి పోయే ద్వారాలన్నీ సులభ్ కాంప్లెక్సుగా మారా యని చెప్పక తప్పదు. స్టేడియంలోకి వచ్చివెళ్లేందుకు ఆరుకు పైగా ప్రవేశమార్గాలు ఉండగా ఒకటి మినహా మిగిలిన చోట కనీసం అడుగు పెట్టలేనంత దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. చూస్తే కదా తేడా తెలిసేది.. మిథిలా స్టేడియం దిగువ భాగంలో ఒక హాలులో పోకల దమ్మక్క నిత్యాన్నదాన సత్రం, మరో హాల్లో హనుమాన్ భజన మందిరం కొనసాగుతున్నాయి. ఫలితంగా ఈ రెండు హాళ్లు ఎంతో శుభ్రంగా ఉన్నాయి. భద్రాచలం వచ్చే భక్తులకు తమ వంతుగా ఉపయోగపడుతున్నాయి. మిగిలిన హాళ్లను శుభ్రం చేసి వినియోగంలోకి తెచ్చేందుకు దేవా దాయ శాఖతో పాటు మరే ఇతర ప్రభుత్వ విభాగాలూ పట్టించుకోవడం లేదు. దీంతో అవన్నీ నిరుపయోగంగా మారి అపరిశుభ్రతకు చిరునామాగా కనిపిస్తున్నాయి. ఆలయం పక్కనే సుమారు 15వేల మంది భక్తులకు అవలీలగా వసతి సౌకర్యం కల్పించే సామర్థ్యం గల ఈ స్టేడియాన్ని ఇకనైనా అభివృద్ధి చేయాలనే డిమాండ్ వినిపిస్తోంది. ఎన్టీఆర్ హయాంలో స్టేడియం నిర్మాణం -
‘ముఖ’ సాక్ష్యం
● ఉపాధి హామీలో ఫేస్ అటెండెన్స్ ● రెండేసి సార్లు కూలీల హాజరు నమోదు ● గ్రామీణ ప్రాంతాల్లో సిగ్నల్ సమస్యలు ఖమ్మం మయూరిసెంటర్: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పారదర్శకతకు పెద్దపీట వేస్తున్నారు. మస్టర్లలో అక్రమాలకు తావులేకుండా, అర్హులైన కూలీలకు వేతనాలు సకాలంలో అందేలా కేంద్రప్రభుత్వం ‘ఫేస్ రికగ్నైజ్డ్ సిస్టమ్’ (ఎఫ్ఆర్ఎస్) విధానాన్ని ప్రవేశపెట్టింది. కూలీల హాజరును ఎఫ్ఆర్ఎస్ ద్వారా నమోదు చేయనుండగా, రాష్ట్రంలో ఖమ్మం జిల్లాను పైలట్ ప్రాజెక్ట్గా ఎంపిక చేశారు. గత నెల నుంచి ఇక్కడ మొదలైన ఈ విధానాన్ని తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్నారు. ఈ ప్రక్రియతో పని ప్రదేశాల్లో ఉన్న కూలీలకే హాజరు నమోదుకానుంది. గతనెల 9నుంచి.. కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ గత నెలలో జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం పైలట్ ప్రాజెక్టుగా ప్రతీ రాష్ట్రం నుండి ఒక జిల్లాను ఎంపిక చేశారు. ఇందులో తెలంగాణ నుంచి ఖమ్మం జిల్లాకు స్థానం దక్కగా, 92.65 శాతం మంది క్రియాశీలక కూలీలు ఈ–కేవైసీ పూర్తి చేసుకోవడంతో గతనెల 9 నుండి ప్రయోగాత్మకంగా ఎఫ్ఆర్ఎస్ అమలు చేస్తున్నారు. ఖమ్మంలో ఈ విధానం అమలును పరిశీలించి రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ ఇటీవల మొదలుపెట్టారు. స్కాన్ చేయాల్సిందే.. గతంలో పనిప్రదేశాల్లో కూలీలను బృందంగా ఫొటో తీసి ఎన్ఎంఎంఎస్ సాఫ్ట్వేర్లో నమోదు చేసేవారు. కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన ఎఫ్ఆర్ఎస్ విధానంతో ప్రతి కూలీ ముఖాన్ని ఫొటో తీసి యాప్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలా చేసిన వారికే హాజరు నమోదై వేతనం అందనుంది. అలాగే, ఒకరి పేరిట మరొకరు హాజరు వేయించుకునే విధానానికి అడ్డుకట్ట పడుతోంది. ఇదంతా బాగానే ఉన్నప్పటికీ పని ప్రదేశంలో ఉదయం, మధ్యాహ్నం రెండు పూటలా ఆన్లైన్ హాజరు వేయాల్సి ఉండడం భారంగా మారుతోంది. చాలాచోట్ల సర్వర్ డౌన్ కావడం, నెట్వర్క్ సమస్యల వల్ల కూలీల హాజరు నమోదులో ఆలస్యం, ఒక పూట హాజరు పడకపోయినా ఆ రోజు వేతనం కోల్పోవాల్సి ఉండడంతో కూలీలు పనికి రావడానికి నిరాసక్తత కనబరుస్తున్నారు. సమస్యలు అధిగమించేలా... గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ సిగ్నల్ సమస్య హాజరు నమోదుకు అవరోధంగా మారుతోంది. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లగాకీలక వెసులుబాటు కల్పిస్తున్నట్లు తెలిసింది. పని ప్రదేశంలో కూలీల ఫొటోలు తీసుకుని, సిగ్నల్ ఉన్న చోటుకు వెళ్లాక డేటా అప్లోడ్ చేయాలని సూచించినట్లు సమాచారం. అయితే, రెండు సార్లు కూలీ ముఖాన్ని ఫొటో తీసి అప్లోడ్ చేయాల్సి ఉండగా.. రెండింటి మధ్య నాలుగు గంటలు సమయం వ్యత్యాసం ఉండాలనే నిబంధన విధించారు. అయితే, కూలీలు హాజరు పెరిగితే సిగ్నల్ లేని ప్రాంతాల్లో ఇలా రెండు సార్లు దూరం వెళ్లి నమోదు చేసి రావడానికి ఇబ్బందులు తప్పవని సిబ్బంది చెబుతున్నారు. -
వాతావరణానికి అనుకూలంగా పంటల సాగు
వైరా: రైతులు వాతావరణ మార్పులను గమనిస్తూ అందుకు అనుగుణంగా పంటలు సాగు చేస్తే అధిక దిగుబడులు వస్తాయని ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ విస్తరణ అధికారి యాకాద్రి తెలిపారు. వైరా కృషి విజ్ఞాన కేంద్రంలో మంగళవారం ఏర్పాటు చేసిన కిసాన్ మేళాను అశ్వారావుపేటలోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ హేమంత్కుమార్ ప్రారంభించారు. అనంతరం యాకాద్రి మాట్లాడుతూ రైతులు కంది, పెసర, పత్తి, మొక్కజొన్న పంటలు సాగు చేయడంతో పాటు ఆయిల్పామ్పై దృష్టి సారించాలన్నారు. అనంతరం వ్యవసాయ కళాశాల విద్యార్థులు ఏర్పాటుచేసిన ఎగ్జిబిషన్ ద్వారా విత్తనాలు, ఎరువులు, పురుగు మందులపై అవగాహన కల్పించారు. జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ధనసరి పుల్లయ్య, అధికారులు, శాస్త్రవేత్తలు డాక్టర్ దేవి, ప్రశాంతి, ఫణిశ్రీ, చైతన్య, పావని, యాదగిరి, మధుసూదన్, కరుణశ్రీ పాల్గొన్నారు. 25లోగా హార్డ్కాపీలు సమర్పించాలి ఖమ్మంమయూరిసెంటర్: 2025–26 సంవత్సరానికి సంబంధించి స్వయం ఉపాధి పథకాల కోసం నిరుద్యోగ ఎస్సీ యువత ఈనెల 24లోగా https://tgobmms.cgg.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ఎస్సీ కార్పొరేషన్ ఈడీ నవీన్బాబు సూచించారు. ఆపై దరఖాస్తు హార్డ్కాపీకి ధృవ పత్రాలను జతచేసి 25వ తేదీలోగా కలెక్టరేట్లోని తమ కార్యాలయంలో అందజేయాలని తెలిపారు. నిరుద్యోగ ఎస్సీ యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం పలు పథకాల ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తోందని వెల్లడించారు. ఈమేరకు అర్హులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రిటైనింగ్ వాల్లో నాణ్యత తనిఖీలు ఖమ్మంఅర్బన్: మున్నేటికీ ఇరువైపులా ఖమ్మం, ఖమ్మం రూరల్ మండలాల్లో రూ.690 కోట్ల వ్యయంతో చేపడుతున్న రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులను నాణ్యత నియంత్రణ అధికారుల బృందం మంగళవారం పరిశీలించింది. క్వాలిటీ కంట్రోల్ ఎస్ఈ బుచ్చిరెడ్డి, ఈఈ వెంకటరమణ, డీఈ చంద్రమోహన్తో పాటు జలవనరుల శాఖ ఖమ్మం ఎస్ఈ మంగళపుడి వెంకటేశ్వర్లు, ఈఈ అనన్య, డీఈ ఉదయ్ప్రతాప్, ఏఈ రామకృష్ణ తదితరులు పనులపై ఆరా తీశారు. ఇప్పటివరకు పూర్తయిన నిర్మాణంలో నాణ్యత ను తనిఖీ చేయడమే కాక ఉపయోగిస్తున్న సామగ్రిని పరిశీలించి సూచనలు చేశారు. పీఎంఎఫ్బీవైతో రైతులకు భరోసా ఖమ్మంమయూరిసెంటర్: పంట నష్టాల సమయాన రైతులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన(పీఎంఎఫ్బీవై) ద్వారా నాలుగేళ్లలో భారీ స్థాయిలో క్లెయిమ్లు చెల్లించినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి లోక్సభలో మంగళవారం అడిగిన ప్రశ్నకు కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖల సహాయ మంత్రి భగీరథ్చౌదరి ఈమేరకు సమాధానం ఇచ్చారు. 2021–22 నుంచి 2024–25 (2025 డిసెంబర్ 31 వరకు) కాలంలో రైతులకు బీమా కంపెనీలు రూ.75,450.58 కోట్ల క్లెయిమ్లు చెల్లించాయని వెల్లడించారు. పీఎంఎఫ్బీవై అమలులో ప్రభుత్వంతో పాటు ప్రైవేట్ రంగ బీమా సంస్థలు కూడా భాగస్వామ్యంగా పనిచేస్తున్నాయని తెలిపారు. తద్వారా రైతులకు పంట నష్టాల సమయాన అండగా నిలుస్తూ, ఆర్థిక సాయం అందుతోందని స్పష్టం చేశారు. -
తమ్మినేని ఆరోగ్యం కుదుటపడుతోంది
ఖమ్మంమయూరిసెంటర్: సీపీఎం కేంద్రకమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతోందని, పార్టీ శ్రేణులు ఆందోళన చెందొద్దని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు తెలిపారు. రెండు రోజుల క్రితం ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించగా హైదరాబాద్లోని ఏఐజీ ఆస్పత్రిలో చేర్పించారు. ఐసీయూలో చికిత్స అందించిన వైద్యులు సోమవారం క్యాజువాలిటీ వార్డులోకి మార్చారు. ఊపిరితిత్తుల సమస్య, మూత్రపిండాల్లో క్రియాటిన్ లెవెల్స్ పెరగడం, రెండుసార్లు గుండెపోటుకు గురికావడం తదితర అనారోగ్య కారణాలతో ఆయనను కుటుంబసభ్యులు ఆస్పత్రిలో చేర్పించారని వెల్లడించారు. మరో రెండు రోజుల్లో ఆయన డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉందని తెలిపారు. కాగా, తమ్మినేనిని నున్నా నాగేశ్వరరావుతో పాటు సీఐటీయూ జాతీయ కోశాధికారి ఎం.సాయిబాబు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు, రాష్ట్ర కమిటీ సభ్యులు బండి రమేష్, అన్నవరపు కనకయ్య, జిల్లా కమిటీ సభ్యులు ఎస్.నవీన్ రెడ్డి, నాయకులు వీరబాబు తదితరులు పరామర్శించారు. -
పత్తి పడిపోయింది..
ఖమ్మంవ్యవసాయం: అధిక వర్షాలు, ప్రతికూల వాతావరణం పత్తి దిగుబడులను తీవ్రంగా దెబ్బతీశాయి. గతేడాది మిర్చి పంటకు ధర లేకపోవటంతో ఈ ఏడాది పత్తి సాగు విస్తీర్ణం పెంచారు. పూత, పిందె దశలో వర్షాలు కురవటంతో పత్తి చేలు పూర్తిగా దెబ్బతిన్నాయి. పత్తి పంట తీతలు సాధారణంగా మూడు సార్లు ఉంటాయి. ఈ ఏడాది ఒకటి, రెండు తీతలకే పరిమితమైంది. పల్లపు భూముల్లో సాగు చేసిన పత్తి పూర్తిగా చేతికి అందకుండా పోయింది. కొన్ని ప్రాంతాల్లో రైతులు దెబ్బతిన్న పత్తిని దున్ని మొక్కజొన్న పంటను సాగు చేశారు. నిపుణుల అంచనా ప్రకారం ఎకరాకు 12 క్వింటాళ్ల దిగుబడి రావాలి. కొన్నేళ్లుగా ఎకరాకు 5 నుంచి 6 క్వింటాళ్లకు మించకపోగా.. ఈ ఏడాది కనీసం ఎకరానికి సగటున 3 క్వింటాళ్ల దిగుబడి కూడా రాలేదని రైతులు వాపోతున్నారు. విస్తీర్ణం పెరిగింది.. దిగుబడి తగ్గింది.. జిల్లాలో గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది పంట సాగు విస్తీర్ణం పెరిగింది. గత ఏడాది 2,07,945 ఎకరాల్లో పంటను సాగు చేయగా, ఈ ఏడాది 2,56,871 ఎకరాల్లో పంటను సాగు చేశారు. గత ఏడాదితో పోలిస్తే పంట సాగు విస్తీర్ణం దాదాపు 49 వేల ఎకరాలు పెరిగింది. గత ఏడాది ప్రభుత్వ (సీసీఐ), ప్రైవేట్ కొనుగోళ్ల ఆధారంగా 10,37,818.75 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. ఈ ఏడాది ప్రభుత్వ, ప్రైవేట్ కొనుగోళ్ల ఆధారంగా కేవలం 7,35,816.35 క్వింటాళ్ల దిగుబడి వచ్చినట్లు లెక్కలు చెబుతున్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది దాదాపు 3 లక్షల క్వింటాళ్ల దిగుబడి తగ్గింది. అంటే గత ఏడాదితో పోలిస్తే 30 శాతం పంట దిగుబడిలో తేడా ఉంది. సీసీఐ వైపే మొగ్గు చూపిన రైతులు ఈ ఏడాది ప్రైవేట్ మార్కెట్లో పత్తికి కనీస మద్దతు ధర లభించకపోవటంతో రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన సీసీఐ(కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) కేంద్రాల్లో విక్రయానికి మొగ్గు చూపారు. ఈ ఏడాది కేంద్రం తేమశాతం ఆధారంగా పత్తికి గరిష్టంగా క్వింటాల్కు రూ.8,110 (8 శాతం వరకు తేమ)గా నిర్ణయించింది. ప్రైవేట్ మార్కెట్లో వ్యాపారులు రూ.5 వేల నుంచి రూ.6 వేలకు మించి ధర పెట్టలేదు. ఈ ఏడాది పంట విక్రయాలకు ప్రభుత్వం కపాస్ కిసాన్ యాప్ను రూపొందించి అమలు పరిచింది. ఈ యాప్ ద్వారా స్లాట్ బుక్ చేసుకొని, నిర్దేశించిన విధంగా పంటను విక్రయించుకునే అవకాశం కల్పించారు. ఈ విధానంలో ఆరంభంలో రైతులు ఇబ్బందులు పడ్డారు. ఈ విధానాన్ని కూడా కొందరు వ్యాపారులు పక్కదారి పట్టించి, వినియోగించుకొని రైతుల నుంచి పంట కొనుగోలు చేసి బినామీల పేరిట సీసీఐ కేంద్రాల్లో విక్రయించారు. గత ఏడాది ప్రైవేట్ మార్కెట్లో 4,85,857.4 క్వింటాళ్ల కొనుగోళ్లు జరగగా, ఈ ఏడాది 2,76,587.4 క్వింటాళ్లను కొనుగోలు చేయగా.. 2.10 లక్షల క్వింటాళ్లు తగ్గినట్లయింది. గత ఏడాది సీసీఐ ద్వారా 5,51,961.35 క్వింటాళ్ల పత్తి కొనుగోళ్లు జరగగా, ఈ ఏడాది 4,59,229.05 క్వింటాళ్లు కొనుగోలు చేసింది. గత ఏడాదితో పోలిస్తే ఏడాది సీసీఐ కొనుగోళ్లు 98 వేల క్వింటాళ్లు తగ్గాయి. మార్కెట్ ప్రైవేట్ కొనుగోళ్లు సీసీఐ కొనుగోళ్లు 2024–25 2025–26 2024–25 2025–26 ఖమ్మం 2,07,637.4 1,81,869.8 1,00,265.15 1,13,559.60 మధిర 20,322.0 23,328.5 1,15,933.75 1,18,618.35 నేలకొండపల్లి –– 13.0 85,785.45 –– కల్లూరు 2,492.0 567.0 –– –– వైరా 22,455.0 39,405.0 54,939.70 43,174.95 ఏన్కూరు 2,31,001.0 30,798.0 –– –– సత్తుపల్లి 680.0 486.0 –– –– మద్దులపల్లి 1,270.0 120.0 1,95,037.30 1,83,876.15 మొత్తం 4,85,857.4 2,76,587.3 5,51,961.35 4,59,229.05 -
విశారదన్ మహరాజ్ అరెస్టు
కొణిజర్ల/మధిర: ఖమ్మం వెలుగుమట్ల భూదాన్ బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపేందుకు వెళ్తున్న ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షుడు విశారదన్ మహరాజ్ను కొణిజర్ల పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. ఎస్ఐ జి.సూరజ్ కథనం ప్రకారం.. విశారదన్ మహరాజ్ కలెక్టరేట్ వద్ద ధర్నా చేసేందుకు ఏర్పాట్లు చేస్తుండగా కొణిజర్ల హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు సిబ్బందితో కలిసి పరిశీలించి, ఆయనను అదుపులోకి తీసుకుని కొణిజర్ల పోలీస్స్టేషన్కు తరలించారు. విశారదన్ మహరాజ్పై బైండోవర్ కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. అనంతరం ఆయనను మధిర టౌన్ పోలీస్స్టేషన్కు తరలించారు. అక్కడ రద్దీగా ఉండటంతో మధిర రూరల్ పోలీస్స్టేషన్కు తరలించారు. సుమారు రెండు గంటల తర్వాత హైదరాబాద్కు తిరిగి పంపించారు. -
ఫంక్షన్కు హాజరై.. గుండెపోటుకు గురై..
ఖమ్మంఅర్బన్: బంధువుల గృహ ప్రవేశ వేడుకకు హాజరైన మహిళ గుండెపోటుతో మృతిచెందిన ఘటన ఖమ్మం నగరంలో విషాదాన్ని నింపిన ఘటనలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నగరానికి చెందిన బొమ్మ సుస్మిత(40) ఖమ్మం 15వ డివిజన్లోని పుట్టకోట వద్ద బంధువుల గృహప్రవేశ కార్యక్రమానికి ఆదివారం వెళ్లింది. అందరితో ఉత్సాహంగా గడుపుతున్న సమయంలో గుండెపోటుకు గురై కుప్పకూలింది. వెంటనే బంధువులు ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. సుస్మిత ప్రైవేట్ టీచర్గా పనిచేస్తుండగా, ఆమె భర్త బొమ్మ వెంకటరమణ ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నారు. వీరికి విశ్వ జయంత్ అనే కుమారుడు ఉన్నాడు. సంతోషకరమైన వేడుకలో పాల్గొంటూ ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందడంతో కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర విషాదంలో మునిగి పోయారు. విషాద చాయల నడుమ సోమవారం ఆమె అంత్యక్రియలు నిర్వహించారు. మృతురాలు కొంతకాలంగా గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఖమ్మంలో మహిళ మృతితో విషాదం -
సాగర్ మిగులు భూమి ఆక్రమణ?
రఘునాథపాలెం: నాగార్జునసాగర్ ప్రధాన కాల్వకు చెందిన రూ.కోట్ల విలువైన సాగర్ మిగులు భూమిపై ఆక్రమణకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒకవైపు ప్రభుత్వ భూముల ఆక్రమణపై జిల్లావ్యాప్తంగా చర్యలు కొనసాగుతుండగా, మరోవైపు కొందరు భూములను ఆక్రమించుకునేందుకు యత్నిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. రఘునాథపాలెం మండలంలోని వీవీపాలెం రెవెన్యూ పరిధిలో ఎన్ఎస్పీ ప్రధాన కాల్వ సమీపంలో సర్వే నంబర్ 273లో సుమారు 10 ఎకరాలకుపైగా మిగులు భూమి ఉన్నట్లు సమాచారం. అందులో కొంత ఇటీవల పేదలకు ఇళ్ల స్థలాలుగా కేటాయించేందుకు లేఔట్ చేసి హద్దురాళ్లు కూడా ఏర్పాటు చేశారు. ఆ సమయంలోనే ఆ భూమిలో ఉన్న కాల్వ తవ్వకంలోని మట్టి కుప్పలను ప్రభుత్వం తరలించి చదును చేసి ఉంచింది. ఆ భూమిని కొందరు ఆక్రమించుకుంటున్నారని ప్రచారం సాగుతోంది. ప్రభుత్వం లేఔట్ చేసిన దానికి ఆనుకొని ఇంకా ఉన్న మిగులు భూమిలో కొంత భాగానికి కొందరు ఫెన్సింగ్ వేసి, బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఇక్కడ ఎకరం భూమి రూ.3 కోట్లు పలుకుతున్నట్లు సమాచారం. ఈ విషయంపై జల వనరుల శాఖ ఏఈ సతీశ్ను సంప్రదించగా ఫెన్సింగ్ వేస్తున్నట్లు సమాచారం అందడంతో అక్కడికి వెళ్లి పనులను నిలిపివేయించామని, భూమికి స్పష్టమైన హద్దులు నిర్ణయించాలంటూ తహసీల్దార్కు లేఖ రాశామని చెప్పారు. ప్రస్తుతం అక్కడ ఎలాంటి పనులు జరగడం లేదని స్పష్టం చేశారు. రూ.కోట్ల విలువైన భూమికి ఫెన్సింగ్.. -
యుద్ధంతో దేశం గాయాలపాలైంది
ఖమ్మంమయూరిసెంటర్: ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్ యుద్ధంతో దేశం గాయాల పాలైందని రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి అన్నారు. సోమవారం ఖమ్మంలోని డీసీసీ కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. ఎల్పీజీ సిలిండర్ల కోసం ప్రజలు ఇబ్బంది పడుతుంటే.. కేంద్రం ఎలాంటి కొరత లేదని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. మరో మూడు నెలల్లో యుద్ధం ఆగకపోతే రైతులు కూడా నష్టపోతారన్నారు. పరిస్థితి ఇలా ఉంటే ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్ని పార్టీలతో సమావేశం నిర్వహించకుండా.. ఎన్నికలే ఎజెండాగా ప్రచారం చేపట్టారని విమర్శించారు. విభజన హామీలను అమలు చేయడం లేదని, తెలంగాణపై కేంద్రం చిన్న చూపు చూస్తోందని ఆరోపించారు. అనంతరం వైరా మున్సిపల్ వైస్ చైర్మన్ సతీష్ను సన్మానించారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణగౌడ్, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, ఖమ్మం నగర అధ్యక్షుడు నాగండ్ల దీపక్చౌదరి పాల్గొన్నారు. -
సామాన్యులపై ధరాఘాతం
ఖమ్మంమయూరిసెంటర్: ట్రంప్ యుద్ధ కాంక్ష భారతదేశంలో సామాన్యులపై తీవ్ర ప్రభావం చూపుతోందని సీపీఐ జాతీయ సమితి సభ్యులు బాగం హేమంతరావు అన్నారు. గ్యాస్ ధరలతో పాటు నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయని అదే సమయంలో వ్యవసాయ ఉత్పత్తుల ధరలు క్షీణిస్తున్నాయని పేర్కొన్నారు. గ్యాస్ సహా ధరల పెరుగుదలను నిరసిస్తూ సీపీఐ జిల్లా సమితి ఆధ్వర్యంలో సోమవారం స్థానిక అంబేడ్కర్ సెంటర్ వద్ద నిరసన తెలిపారు. ధరల పెరుగుదలకు కేంద్ర విధానాలే కారణమని నినదించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంపన్న దేశాలపై దాడులు చేసి అక్రమించుకునే ప్రయత్నం చేస్తున్నారని, ఇజ్రాయెల్తో చేతులు కలిపి ఇరాన్పై దాడులు చేస్తున్నారన్నారు. మోదీ అలీన దేశపు ప్రధానిగా యుద్ధాన్ని నివారించకపోగా యుద్ధం వల్ల ఎదురయ్యే విపత్కర పరిస్థితులను అంచనా వేయడంలో విఫలమయ్యారని ఆరోపించారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి దండి సురేశ్తోపాటు సిద్దినేని కర్ణకుమార్, బీజీ క్లెమెంట్, శింగు నర్సింహారావు, తాటి వెంకటేశ్వరరావు, రావి శివరామకృష్ణ, మిడికంటి వెంకటరెడ్డి, పగడాల మల్లేశ్, ఏనుగు గాంధీ, యానాలి సాంబశివరెడ్డి, సుధాకర్, లక్ష్మీనారాయణ, రామకృష్ణ పాల్గొన్నారు. -
అద్దె కష్టాలకు చెక్..
చిన్నారులకు అక్షర జ్ఞానాన్ని అందిస్తూ, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం పంపిణీ చేసే అంగన్వాడీ కేంద్రాలకు త్వరలోనే ‘సొంత గూడు’ లభించనుంది. ఏళ్ల తరబడి అద్దె భవనాలు, ఇరుకు గదుల్లో కొనసాగుతున్న కేంద్రాలకు విముక్తి కల్పించేలా జిల్లా అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. ఎంఎన్ఆర్ఈజీఎస్ ఉపాధి హామీ పథకం నిధులతో అంగన్వాడీ భవనాల నిర్మాణానికి అనుమతులు మంజూరు చేశారు. జిల్లాలో 40 భవనాల నిర్మాణాలకు నిధులు మంజూరు చేయగా పనులు వేగంగా సాగుతున్నాయి. నిర్మాణం పూర్తయిన భవనాలను ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. – ఖమ్మంమయూరిసెంటర్ 80 భవనాలకు ప్రతిపాదనలు.. అంగన్వాడీ కేంద్రాలు అద్దె భవనాల్లో నిర్వహిస్తుండగా పలు చోట్ల సకాలంలో కిరాయిలు చెల్లించక యజమానులు కేంద్రాలకు తాళం వేసిన ఘటనలు ఉన్నాయి. అద్దె చెల్లించాలంటూ అంగన్వాడీ టీచర్లు, ఆయాలపై ఒత్తిడి తేవడంతో వారు తీవ్రంగా ఇబ్బందులకు గురయ్యారు. ఈ కష్టాలకు చెక్ పెట్టేందుకు సొంత స్థలం ఉన్న గ్రామాల్లో భవనాలు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కలెక్టర్ ఆదేశాలతో జిల్లా సంక్షేమాధికారి కార్యాలయం నుంచి జిల్లా వ్యాప్తంగా తొలిదశలో 80 అంగన్వాడీ పాఠశాలలకు శాశ్వత భవనాలు నిర్మించాలని కోరుతూ ప్రతిపాదనలు పంపించారు. ఇందులో ఉపాధి పథకం నుంచి 40 భవనాల నిర్మాణాలకు అనుమతులు మంజూరయ్యాయి. రూ.12 లక్షలతో నిర్మాణం.. జిల్లాలో అంగన్వాడీ కేంద్రాల అవసరాలను గుర్తించిన ప్రభుత్వం మొదటి విడతగా 40 సెంటర్లను ఎంపిక చేసింది. నిర్మాణానికి ఒక్కో భవనానికి రూ.12 లక్షల చొప్పున నిధులు విడుదలయ్యాయి. వీటిలో ఉపాధి హామీ పథకం కింద రూ.8 లక్షలు, సీ్త్ర, మహిళా, శిశు సంక్షేమ శాఖ నుంచి రూ.2 లక్షలు, ఇతర గ్రాంట్స్ నుంచి మరో రూ.2 లక్షలు ఇవ్వనున్నారు. ఈ నిధులతో సకల సౌకర్యాలతో కూడిన భవనాలు నిర్మించేలా ప్రణాళిక రూపొందించారు. గతంలో ఉన్న నిధుల కొరత తీరడం, పనులు పట్టాలెక్కడంతో ఇప్పటికే కొన్ని భవనాల నిర్మాణం పూర్తి కాగా, మరికొన్ని చివరి దశకు చేరుకున్నాయి. అత్యాధునిక వసతులతో.. చిన్నారులకు ఆహ్లాదకర వాతావరణం కల్పించేలా అంగన్వాడీ భవనాలను తీర్చిదిద్దనున్నారు. ఆడుకోవడం, చదువుకోవడానికి సరైన ఏర్పాట్లతో పాటు తగినంత గాలి, వెలుతురు వచ్చేలా నిర్మాణం చేపడుతున్నారు. పిల్లల ఆరోగ్యం దృష్ట్యా ప్రత్యేకంగా రక్షిత మంచినీటి సౌకర్యం, ఆధునిక మరుగుదొడ్లు నిర్మిస్తున్నారు. పౌష్టికాహారాన్ని పరిశుభ్రంగా వండేందుకు ప్రత్యేకంగా కిచెన్ రూమ్ నిర్మిస్తున్నారు. చిన్నారుల భవిష్యత్కు భరోసా.. ప్రస్తుతం జిల్లాలో అనేక కేంద్రాలు అద్దె ఇళ్లు, పాతబడిన ప్రభుత్వ పాఠశాల గదుల్లో నడుస్తున్నాయి. వర్షాకాలంలో కురవడం, ఇరుకు గదులతో పిల్లలు ఇబ్బంది పడడం వంటి సమస్యలు సాధారణంగా మారాయి. ప్రస్తుతం నిర్మిస్తున్న సొంత భవనాలతో కేంద్రాలకు హాజరయ్యే పిల్లల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. పౌష్టికాహార పంపిణీ వ్యవస్థ కూడా మరింత పటిష్టం కానుంది. భవన నిర్మాణానికి ప్రధాన ఆటంకమైన ‘స్థల సేకరణ’పై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. జిల్లాలోని వివిధ మండలాల్లో ఎంపిక చేసిన 80 కేంద్రాలకు ఇప్పటికే ప్రభుత్వ స్థలాలను గుర్తించారు. స్థానిక సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శుల సహకారంతో అనువైన ప్రదేశాలను ఎంపిక చేయగా, ఈ స్థలాలను అంగన్వాడీ విభాగం పేరున బదిలీ ప్రక్రియ కూడా పూర్తయింది. తద్వారా భవిష్యత్లో స్థల వివాదాలు తలెత్తకుండా పక్కాగా ఏర్పాట్లు చేస్తున్నారు. సొంత భవనాలు – 887ఉచిత అద్దె భవనాలు – 442అద్దె భవనాలు – 501అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనాలు -
ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
ఖమ్మం సహకారనగర్ : కేజీబీవీ, యూఆర్ఎస్, సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు చావా దుర్గాభవాని డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన నిరసన ప్రదర్శనలో ఆమె మాట్లాడారు. ఉద్యోగులకు కనీస వేతనం మంజూరు చేయాలని, హెల్త్ కార్డుల సౌకర్యం కల్పించాలని, అన్ని రకాల సెలవులు వర్తింపజేయాలని కోరారు. వారి వేతనాలు కూడా అరకొరగా ఉన్నాయని, సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని అన్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 20న ‘చలో అసెంబ్లీ’ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ఉద్యోగులు అధిక సంఖ్యలో హాజరు కావాలని పిలుపునిచ్చారు. అనంతరం కలెక్టరేట్ ఏఓ శ్రీనివాసరావుకు వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు షేక్ రంజాన్, పారుపల్లి నాగేశ్వరరావు, నాయకులు బుర్రి వెంకన్న, వల్లంకొండ రాంబాబు, డి.ఎస్.నాగేశ్వరరావు, రాజకుమారి, కవిత, విజయలక్ష్మి, అంబిక, విరిత, నాగేశ్వరరావు, నీలిమ, సత్యవతి పాల్గొన్నారు.టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు దుర్గాభవాని -
శ్రీవారి హుండీ ఆదాయం రూ.22.63 లక్షలు
ఎర్రుపాలెం: తెలంగాణా తిరుపతిగా ప్రసిద్ధి గాంచిన జమలాపురం శ్రీవేంకటేశ్వరస్వామి వారి ఆలయ హుండీ కానుకలను సోమవారం లెక్కించారు. 52 రోజులకు గానూ రూ.22,63,330 ఆదాయం లభించిందని దేవాదాయ శాఖ పరిశీలకులు రెంటాల సమత, ఆలయ ఈఓ కె. జగన్మోహన్రావు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త ఉప్పల విజయదేవశర్మ, అర్చకులు ఉప్పల మురళీమోహన్శర్మ, సీనియర్ అసిస్టెంట్ సోమయ్య, జూనియర్ అసిస్టెంట్ కృష్ణప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.స్వయం ఉపాధి పథకాలకు దరఖాస్తుల ఆహ్వానంఖమ్మంమయూరిసెంటర్ : స్వయం ఉపాధి పథకాలకు నిరుద్యోగ ఎస్సీ యువత నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎస్సీ కార్పొరేషన్ ఈడీ నవీన్బాబు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన వారు ఈనెల 24వ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వ్యవసాయేతర పథకాలకు 21 – 50 సంవత్సరాలు, వ్యవసాయ పథకాలకు 21 – 60 సంవత్సరాలు, స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమానికి 18 – 45 సంవత్సరాలు, వేతన ఉపాధి కార్యక్రమాలకు 18 – 35 సంవత్సరాల వారు అర్హులని వివరించారు. గత ఐదేళ్లలో ఎస్సీ కార్పొరేషన్ నుంచి లబ్ధి పొందిన కుటుంబాల వారు అనర్హులని పేర్కొన్నారు. అభ్యర్థులు బయోడేటా, ఆధార్, రేషన్ కార్డు, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దివ్యాంగ అభ్యర్థులైతే సదరం సర్టిఫికెట్, పాస్పోర్ట్ సైజ్ ఫొటోగ్రాఫ్ జత చేయాలని తెలిపారు. దరఖాస్తులను https:// tgobmms.cgg.gov.in ఆన్లైన్ పోర్టల్లో నమోదు చేయాలని తెలిపారు. పశువులకు ‘గాలికుంటు’ టీకాలు వేయించాలికామేపల్లి : పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలని జిల్లా పశు సంవర్థక శాఖాధికారి డాక్టర్ పురంధర్ రైతులకు సూచించారు. మండలంలోని ఊట్కూరులో సోమవారం ఆయన టీకాల పంపిణీ శిబిరాన్ని పరిశీలించి మాట్లాడారు. జిల్లాలో ఆవులు 93,420, గేదెలు 3,13,713 ఉన్నాయని, ఏప్రిల్ 9వ తేదీ లోగా ఉచితంగా టీకాలు వేయనున్నామని తెలిపారు. 2030 నాటికి వ్యాధిని పూర్తిగా నిర్మూలించాలనే లక్ష్యంతో కేంద్రప్రభుత్వం జాతీయ జంతువ్యాధి నియంత్రణ కార్యక్రమం కింద వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపట్టిందని వివరించారు. టీకా వేసిన తర్వాత పశువులకు సరైన పోషకాహారం అందించాలని సూచించారు. కార్యక్రమంలో మండల పశు వైద్యాధికారి డాక్టర్ జి.నాగులు, సిబ్బంది రాంబాబు, శిరీష, వంశీ, శరత్, జానీ పాల్గొన్నారు. బొగ్గు రవాణా లక్ష్యం సాధించాలిసత్తుపల్లిరూరల్: సత్తుపల్లి జేవీఆర్ ఓసీలో నిర్దేశించిన బొగ్గు రవాణా లక్ష్యాలను సాధించాలని సింగరేణి డైరెక్టర్ కె.వెంకటేశ్వర్లు ఆదేశించారు. సోమవారం ఆయన సత్తుపల్లి జీఎం చింతల శ్రీనివాస్తో కలిసి జేవీఆర్ ఓసీ సీహెచ్పీలోని కోల్ రిసీవింగ్ కాంప్లెక్స్, మొబైల్ క్రషర్ యూనిట్ను సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రక్షణతో కూడిన బొగ్గు ఉత్పత్తిని చేయాలని అన్నారు. కార్యక్రమంలో ఎస్ఓటు జీఎం బొల్లం శ్రీనివాస్, జేవీఆర్, కిష్టారం ఓసీల పీఓలు ప్రహ్లాద్, సునీల్ వర్మ, కె.సోమశేఖర్రావు, ఎస్ఓఎం బి.రాజేశ్వరరావు, జి.కల్యాణ్రామ్ తదితరులు పాల్గొన్నారు. -
రిటైనింగ్.. రైట్ రైట్!
● వాల్ నిర్మాణానికి లైన్ క్లియర్ ● ప్రభుత్వ భూముల్లో ఇప్పటికే వేగంగా పనులు ● మిగతా చోట్ల భూసేకరణకు జీఓ జారీ ● త్వరలోనే నిర్వాసితులకు భూమి, ప్లాట్లుఖమ్మంఅర్బన్: ఖమ్మం నగరంలో మున్నేరు నదికి ఇరువైపులా రూ.690 కోట్లతో 18 కిలో మీటర్ల మేర చేపట్టిన రిటైనింగ్ వాల్ పనులకు భూసేకరణ సమస్య కొలిక్కి వచ్చింది. ఈ మేరకు ప్రభుత్వం జీఓ జారీ చేయడంతో పనులు శరవేగంగా కొనసాగేందుకు మార్గం సుగమమైంది. మొత్తం 18 కి.మీ. మేర నిర్మించే వాల్ పనుల్లో భూ సమస్యలు లేని, ప్రభుత్వ భూముల పరిధిలో 10 కి.మీ. పరిధిలో పనులు చేపట్టగా 50 శాతం పూర్తయ్యాయి. మిగిలిన 8 కి.మీ. పరిధిలో నిర్మాణానికి పట్టా భూములు, ప్లాట్లు కూడా సేకరించాల్సి రావడంతో జాప్యం జరిగింది. దీంతో పాటు నగరంలో వరద నీరు మున్నేరులోకి వచ్చేలా సైడ్ డ్రెయిన్లు నిర్మించాల్సి ఉంది. భూ సమస్యకు పరిష్కారం లభిస్తే వర్షాలు, వరద ప్రభావం లేని ఈ నాలుగు నెలల్లో అత్యధిక శాతం పనులు జరిగే అవకాశం ఉంది. మిగులు భూమి వినియోగం రిటైనింగ్ వాల్ నిర్మాణంలో భూములు, ప్లాట్లు కోల్పోయే వారికి ప్రత్యామ్నాయంగా భూములు కేటాయించే చర్యలను ప్రభుత్వం చేపట్టింది. ఖమ్మం రూరల్ మండలం పోలేపల్లి గ్రామ సమీపంలో సాగర్ మిగులు భూమిగా ఉన్న 125 ఎకరాలను జలవనరుల శాఖ అవసరాలకు వినియోగించుకునేలా జీఓ నం.128 జారీ చేియడంతో పాటు మౌలిక సదుపాయాల కల్పనకు సుమారు రూ.53 కోట్లు కూడా విడుదల చేసింది. ఇక రెవెన్యూ పరంగా సర్వే చేసి ఎంత మేర భూమి సేకరించాలి, ఎంతమందికి పట్టాలు ఇవ్వాలి, కేటాయించిన భూమిలో లే ఔట్ చేయడం వంటి పనులు జరగాల్సి ఉంది. దీనిపై ఇటీవల కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి జలవనరుల శాఖ అధికారులతో సమీక్షించారు. మున్నేరు రిటైనింగ్ వాల్ నిర్మాణ పనుల్లో మరింత వేగం పెరుగుతుంది. భూ సేకరణకు కూడా ప్రత్యామ్నాయ భూమి కేటాయిస్తూ జీఓ వచ్చింది. ఇప్పటికే 50 శాతానికి పైగా పనులు పూర్తయ్యాయి. మిగిలిన పనులు త్వరలోనే పూర్తి చేస్తాం. – మంగళపూడి వెంకటేశ్వర్లు, ఎస్ఈ, జలనవరుల శాఖ రిటైనింగ్ వాల్ నిర్మాణంలో భూములు, ప్లాట్లు కోల్పోయే బాధితులు సుమారు 750 మందికి పైగా ఉన్నారని అధికారులు ప్రాథమికంగా గుర్తించినట్లు తెలిసింది. పట్టా భూమి కోల్పోయే రైతులకు ఎన్నెస్పీ మిగులు భూమిలో ఎకరం భూమికి బదులు 690 గజాల స్థలం కేటాయించేలా ప్రతిపాదనలు రూపొందించారు. అలాగే ప్లాట్లు కోల్పోయే వారికి వారి విస్తీర్ణాన్ని బట్టి 75 గజాలు, 100 గజాలు, 300 గజాల చొప్పున ఇవ్వాలనే ప్రతిపాదన ప్రభుత్వానికి పంపినట్లు తెలిసింది. ప్రస్తుతం పోలేపల్లి సమీపంలోని భూమిలో లే ఔట్ రూపొందించి అభివృద్ధి పనులకు సిద్ధం చేసినట్లు సమాచారం. అన్ని అనుమతులు పూర్తయ్యాక నిబంధనల ప్రకారం ఆ భూమిని అభివృద్ధి చేసి భూములు కోల్పోయిన పట్టాదారులు, ప్లాట్ యజమానులకు స్థలాలు కేటాయించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. భూసేకరణ ప్రక్రియ పూర్తయితే మున్నేరు రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులు మరింత వేగంగా సాగే అవకాశం ఉంది. -
చకచకా రామయ్య పెళ్లి పనులు
భద్రాచలం :శ్రీరామవనమి ఉత్సవాల పనులు జోరందుకున్నాయి. భద్రగిరి వీధులు శ్రీ సీతారా ముల కల్యాణానికి సర్వాంగ సుందరంగా ముస్తాబవుతున్నాయి. మరో రెండు రోజుల్లో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. రామయ్య పెళ్లి పనులు చకచకా సాగుతున్నాయి. సోమవారం ఆఫ్లైన్లో కూడా టికెట్ల విక్రయాలు ప్రారంభమయ్యాయి. వీఐపీలకు పెళ్లి పిలుపులు ఈ నెల 27న శ్రీ సీతారాముల కల్యాణం, 28న పట్టాభిషేక మహోత్సవాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో గోడ పత్రికలను, ఆహ్వాన పత్రికలను ఇటీవల దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆవిష్కరించారు. ఆలయ అధికారులు ఉత్సవాలకు వీఐపీలను ఆహ్వానిస్తున్నారు. ఇప్పటికే మంత్రులకు, స్థానిక ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, అటవీశాఖ కార్పొరేషన్ చైర్మన్ పొదెం వీరయ్య, స్థానిక ఏఎస్పీ, సర్పంచ్, ఇతర ప్రజాప్రతినిధులకు ఆహ్వానాలు అందజేశారు. సోమవారం కలెక్టర్ అంకిత్, ఐటీడీఏ పీఓ రాహుల్, భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాళ్ శ్రేష్ఠ, భద్రాచలం జ్యుడీషియల్ జడ్జి శివనాయక్ తదితరులకు ఆలయ ఈఓ దామోదర్రావు ఆహ్వాన పత్రికలు ఇవ్వగా పండితులు వేదాశీర్వచనం చేశారు. ఈ నెల 19న ఉగాది తెలుగు సంవత్సరాదిని పురస్కరించుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి, గవర్నర్లకు ఆహ్వాన పత్రికలు అందించనున్నారు. ఆఫ్లైన్లో టికెట్ల విక్రయం ప్రారంభం శ్రీరామనవమి వీక్షణ టికెట్లను ఇప్పటికే ఆన్లైన్లో విక్రయిస్తుండగా, సోమవారం ఆఫ్లైన్ విక్రయాలు కూడా ప్రారంభమయ్యాయి. ప్రత్యేక కౌంటర్ల ద్వారా సోమవారం ఆలయ ఈఈ రవీందర్ ప్రారంభించారు. దేవస్థానంలోని ప్రధాన కౌంటర్, తానీషా కల్యాణ మండపంలోని సీఆర్వో కార్యాలయం వద్ద, బ్రిడ్జి పాయింట్ వద్ద నున్న సీఆర్వో, భద్రాచలం సబ్ కలెక్టరేట్ కార్యలయం వద్ద కౌంటర్లను ఏర్పాటు చేశారు. ఉభయ దాతలతోపాటు ఇతర సెక్టార్ల టికెట్లను విక్రయించనున్నారు. ఆన్లైన్లో బుక్ చేసుకున్న భక్తులు ఈ నెల 20 నుంచి 27వ తేదీ ఉదయం 6గంటల వరకు ధ్రుకరణ పత్రాలతో టికెట్లు పొందాలని ఆలయ అధికారులు తెలిపారు. మిథిలా స్టేడియంలోని పనులు చకచకా సాగుతున్నాయి. స్టేడియం నిండా షామియానాల ఏర్పాటుకు పెండిలమ్ వర్క్ పూర్తయింది. సీఎం, ఇతర సెక్టార్ల విభజన పనులు కొనసాగుతున్నాయి. బారికేడ్లు, ఇనుప కంచె పనులు సాగుతుండగా, పెయింటింగ్ పనులు ముగిశాయి. స్వాగత ద్వారాల ఏర్పాటుతో భద్రాచలంలో నవమి శోభ ముందస్తుగానే సంతరించుకుంది. ఈ నెల 19న వసంత పక్ష ప్రయుక్త శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు ప్రారంభమై ఏప్రిల్ 2న ముగియనున్నాయి. 27న శ్రీ రామ పునర్వసు దీక్ష ప్రారంభం కానుండగా, ఏప్రిల్ 24న ముగియనుంది. 19న ఉగాది పర్వదినం రోజున బ్రహ్మోత్సవాలకు రక్షాబంధనం, స్నప న తిరుమంజనం, మృత్సంగ్రహణంతో అంకురార్పణ చేయనున్నారు. 23న మండల లేఖ, కుండ, కలశ, యాగశాల, అలంకరణాదులతో పాటుగా సార్వభౌమ సేవ జరగనుంది. 24న గరుడధ్వజపట లేఖనం, గరుడధ్వజపటావిష్కరణ, గరుడధ్వజాధివాసం, 25న అగ్ని ప్రతిష్ఠ, ధ్వజా రోహణం, దేవతాహ్వానం, బలిసమర్పణం, హనుమద్వాహన సేవలు నిర్వహించనున్నారు. 26న యాగశాల పూజ, చుతుఃస్థానార్చనం, గజ,గరుడ వాహన సేవలు, ఎదుర్కోలు ఉత్సవం, 27న ఉదయం 10:30 గంటల నుంచి 12:30 గంటల వరకు సీతారాముల తిరు కల్యాణోత్సవం, చంద్రప్రభ వాహన సేవ, 28న పట్టాభిషేకం, రథోత్సవం జరగనున్నాయి. 29న సదస్యం, 30న తెప్పోత్స వం, చోరోత్సవం, 31న ఊంజల్ సేవ, ఏప్రిల్ 1న వసంతోత్సవం, 2న పూర్ణాహుతి, ధ్వజావరోహణం, పుష్పయాగంలతో బ్రహ్మోత్సవాలకు ముగింపు పలకనున్నారు. -
సమస్యలు సత్వరమే పరిష్కరించాలి
ఖమ్మం సహకారనగర్ : ప్రజావాణిలో పలు సమస్యలపై ఇచ్చే ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అధికారి ఎ. పద్మశ్రీ అన్నారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన గ్రీవెన్స్లో ఆమె వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజలు ఎంతో నమ్మకంతో ప్రజావాణికి వస్తుంటారని, వారి సమస్యలపై స్పందించాలని సంబంధిత శాఖల అదికారులకు సూచించారు. కార్యక్రమంలో కలెక్టరేట్ ఏఓ కె.శ్రీనివాసరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఫిర్యాదుల్లో కొన్ని ఇలా.. ● తల్లాడ మండలం మల్లారం గ్రామ పంచాయతీ సర్పంచ్ కె. కిరణ్కుమార్ గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాన్ని పక్కనే ఖాళీగా ఉన్న ప్రభుత్వ బీసీ హాస్టల్ భవనంలోకి మార్చాలని విన్నవించారు. ● ఖమ్మం త్రీటౌన్ ప్రాంతంలో ఉన్న ఈద్గాకు మరమ్మతులు చేయాలని, గోడ నిర్మించాలని రాజ్యాంగ పరిరక్షణ వేదిక సభ్యులు వినతిపత్రం అందించారు. ● వైరా మండలం కోష్టాల గ్రామ సర్పంచ్ ఇష్టానుసారంగా నర్సరీ మొక్కలు పెంచుతున్నారని, తద్వారా గ్రామానికి నష్టం జరుగుతోందని, దీనిపై చర్యలు చేపట్టాలని వార్డు సభ్యుడు వి. సాంబయ్య కోరారు. ప్రజావాణిలో డీఆర్ఓ పద్మశ్రీ -
చిన్నారులకు ఆధునిక పరికరాలు
కొణిజర్ల: ప్రత్యేక అవసరాలు కలిగిన చిన్నారులకు ఆధునిక పరికరాలు పంపిణీ చేస్తామని, అన్ని రంగాల్లో నైపుణ్యాలు సాధించేందుకు శిక్షణ, సహకారం అందిస్తామని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి వెల్ల డించారు. కొణిజర్లలోని భవిత కేంద్రం, చిన్నమునగా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలను సోమవారం ఆయన పరిశీలించారు. కొణిజర్లలోని భవిత కేంద్రంలో వాల్ పెయింటింగ్, ఫిజియోథెరపీ, వినికిడి స్పీచ్ థెరపీ మిషనరీ, కృత్రిమ పరికరాలతో విద్యార్థులకు అందిస్తున్న శిక్షణ, వసతుల వంటి వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు అవసరమైన అన్ని ఏర్పాట్లు మెరుగు పరచాలని సిబ్బందిని ఆదేశించారు. చిన్నమునగాల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో నిర్వహిస్తున్న ఎవ్రీ చైల్డ్ రీడ్స్ కార్యక్రమ అమలును తనిఖీ చేశారు. అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి చిన్నారులు, గర్భిణులకు క్రమం తప్పకుండా కోడిగుడ్లు, పౌష్టికాహారం అందించాలన్నారు. భవిత కేంద్రాల్లో ప్రత్యేక విద్యా విధానం ద్వారా పిల్లలు మానసికంగా అభివృద్ధి చెందుతున్నారని చెప్పారు. దివ్యాంగులైన చిన్నారుల సంక్షేమం, అభివృద్ధికి కృషి చేస్తున్నామని తెలిపారు. భవిత సెంటర్లలో ప్రతిపాదించిన అభివృద్ధి పనులు వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు. శిథిలావస్థకు చేరిన పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల భవనాలను గుర్తించి తన దృష్టికి తీసుకురావాలని సిబ్బందిని ఆదేశించారు. కార్యక్రమంలో సీఎంఓ ప్రవీణ్కుమార్, విద్యా శాఖ ఈఈ బుగ్గయ్య, కొణిజర్ల ఎంఈఓ డి.అబ్రహం, హెచ్ఎం నాగమల్లేశ్వరరావు, సర్పంచ్ పూనాటి బాబూరావు, ఏఈ సురేష్ తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి వెల్లడి -
ఫోటో దిగుతూ గుండెపోటుతో కుప్పకూలిపోయి..
ఖమ్మం: ఇటీవల కాలంలో గుండెపోటు కారణంగా స్టేజ్లపైనే కుప్పకూలిపోయి మృత్యువాత పడుతున్న ఘటనలు పెరుగుతున్నాయి. తాజాగా ఓ మహిళ గృహ ప్రవేశ వేడుకకు వెళ్లి గుండె పోటుతో మృతి చెందిన ఘటన వెలుగుచూసింది. తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం నగరానికి చెందిన ఓ మహిళ.. బంధువుల గృహ ప్రవేశ వేడుకకు వెళ్లింది. అయితే అక్కడ ఫోటో దిగుతున్న సందర్భంలో పక్కనున్న మరొక మహిళతో మాట్లాడుతుండగానే కుప్పకూలిపోయింది. ఆ మహిళను వెంటనే ఆస్పత్రికి తరలించినా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్దారించారు. ఖమ్మం టూటౌన్కు చెందిన బొమ్మ సుస్మిత అనే మహిళ.. ఖమ్మంలోని ఓ గృహ ప్రవేశ వేడుకకు వెళ్లారు. అయితే అప్పటివరకూ అందరితో కలివిడిగా మాట్లాడుతూ తిరిగిన మహిళ.. ఫోటో దిగుతున్న సమయంలో గుండెపోటుకు లోనైంది. ఒక్కసారిగా పక్కనున్న మహిళపై చేయి వేస్తూనే కుప్పకూలిపోయింది. వెంటనే ఆస్పత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఈ ఘటనతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. -
అదుపుతప్పి బొలేరో బోల్తా
కొణిజర్ల: అతివేగంగా వస్తున్న బొలేరో వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కన పల్టీ కొట్టడంతో ఓ యువకుడు మృతి చెందగా ఐదుగురికి గాయాలైన ఘటన మండల పరిధిలోని తనికెళ్లలో ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. ఎస్ఐ సూరజ్ కథనం ప్రకారం.. ఏపీలోని ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం కోయమాధారానికి చెందిన చిచ్చడి రాము తన బంధువుల ఇంటి నిర్మాణం నిమిత్తం టైల్స్ తీసుకొచ్చేందుకు బొలేరో వాహనంలో హైదరాబాద్ బయలుదేరాడు. హైదరాబాద్ చూసేందుకని అదే గ్రామానికి చెందిన మొట్టుం సిద్ధు (19), కుంజా చరణ్, పల్లా రాము, కట్టం కార్తీక్, పాయం విష్ణు, తురం రామ్చరణ్, పల్లా రాజశేఖర్ అదేవాహనంలో వెళ్లారు. హైదరాబాద్ నుంచి టైల్స్లోడు చేసుకుని తిరుగు ప్రయాణంలో తనికెళ్ల విజయ కళాశాల సమీపంలోని ఓ పెట్రోలు బంక్ వద్ద ఆగి ఉన్న లారీ ఒకేసారి రోడ్డు పైకి రావడంతో దానిని తప్పించబోయి బొలేరో రోడ్డు పక్కన పల్టీ కొట్టింది. క్యాబిన్లో కూర్చున్న ఆరుగురు యువకులు కింద పడటంతో వారిపైన టైల్స్ పడ్డాయి. మొట్టుం సిద్ధు అక్కడికక్కడే మృతిచెందాడు. ట్రక్లో ఉన్న కుంజా చరణ్, కుంజా మంగరాజు, కారం రాంబాబు, కట్టం కార్తీక్కు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 ద్వారా ఆస్పత్రికి తరలించారు. మృతుడి తల్లి లక్ష్మి ఫిర్యాదు మేరకు ఎస్ఐ కేసు నమోదు చేశారు.ఒకరు మృతి, ఐదుగురికి గాయాలు -
గంజాయి పట్టివేత
ఖమ్మంక్రైం: నగరంలోని నూతన బస్టాండ్లో ఆదివారం ఎకై ్సజ్ ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది గంజాయిని పట్టుకున్నారు. బస్టాండ్ ప్రాంగణంలో తనిఖీలు నిర్వహిస్తుండగా ఒడిశా రాష్ట్రాం భువనేశ్వర్ ప్రాంతానికి చెందిన రాకేశ్జైన్ వద్ద సంచిలో 9 కేజీల గంజాయి లభ్యమైంది. అతడిని అదుపులోకి తీసుకుని, గంజాయి సీజ్ చేశారు. తనిఖీల్లో ఎకై ్సజ్ ఎస్ఐ శ్రీహరిరావు, సిబ్బంది కరీం, వెంకట్, హరీశ్, విజయ్, హనుమంతరావు, వీరబాబు పాల్గొన్నారు. గంజాయి సమాచారం తెలిస్తే టోల్ఫ్రీ నంబర్ 18004252523కు ఫోన్ చేయాలని అధికారులు కోరారు. రెండు ఆలయాల్లో చోరీ కల్లూరురూరల్: మండలంలోని చిన్నకోరుకొండి గ్రామంలోని శివాలయం, వేణుగోపాలస్వామి ఆలయాల్లోని హుండీలను పగలగొట్టిన దుండగులు అందులోని నగదు చోరీ చేశారు. శనివారం అర్ధరాత్రి ఘటన జరగగా ఆదివారం ఉదయం భక్తులు ఆలయాలకు వెళ్లగా హుండీలు పగలగొట్టి ఉండటం గమనించి గ్రామస్తులకు తెలిపారు. వారు కల్లూరు పోలీసులకు సమాచారం అందించగా.. వారు వచ్చి రెండు హుండీలను పరిశీలించారు. ఒకే వ్యక్తి హుండీలు పగలగొట్టి డబ్బులు చోరీ చేసినట్లు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది. శివాలయం హుండీలో సుమారు రూ.40 వేలు, వేణుగోపాలస్వామి ఆలయంలోని హుండీలో సుమారు రూ.15 వేలు చోరీ చేసినట్లు తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కోడి పైకి.. గుడ్డు కిందకు
ఖమ్మంవ్యవసాయం: చికెన్ ధరలకు రెక్కలొచ్చాయి. అలాగే, కోడిగుడ్డు ధర పతనమైంది. కోళ్ల ఉత్పత్తి తగ్గిపోవడంతో చికెన్ రేటు పెరిగిందని, గుడ్ల ఎగుమతులు లేకపోవడంతో ధర తగ్గిందని వ్యాపారులు విశ్లేషిస్తున్నారు. డిసెంబర్, జనవరిలో క్రిస్మస్, నూతన సంవత్సరం, సంక్రాంతి, ఆ తరువాత మేడారం జాతర సందర్భంగా స్కిన్లెస్ చికెన్ కిలో రూ.300 మొదలు, రూ.350 వరకు పలికింది. ఇక ఫిబ్రవరిలో కిలోకు రూ.100 తగ్గి రూ.250కు దిగి వచ్చింది. మార్చి ఆరంభం నుంచి మళ్లీ చికెన్ ధరలు పెరుగుతున్నాయి. గత నెలతో పోలిస్తే కిలో చికెన్కు రూ.100 వరకు ధర పెరిగింది. మరో మూడు, నాలుగు రోజుల్లో రంజాన్ పండగ వస్తుంది. ఈ పండగ వేళ సహజంగా మాసం ధరలు కొంత పెరగటం సహజం. ప్రస్తుతం కోళ్ల ఉత్పత్తి ఆశాజనకంగా లేకపోవటంతో చికెన్ ధరలు మరికొంత పెరిగే అవకాశాలు ఉన్నట్లు వ్యాపారులు విశ్లేషిస్తున్నారు. గుడ్డు ధర తగ్గింది.. మూడు నెలల క్రితం రిటైల్ గుడ్డు ధర ప్రాంతాన్ని బట్టి రూ.8 నుంచి రూ.9 వరకు విక్రయించారు. ప్రస్తుతం రిటైల్ మార్కెట్లో రూ.5.50 నుంచి రూ.6కు విక్రయిస్తున్నారు. చలికాలంలో గుడ్డు వినియోగం ఎక్కువగా కాబట్టి ధర ఎక్కువగా ఉండటం.. వేసవిలో తగ్గడం సాధారణమే. కానీ, ధర సగానికి పడి పోయేంతగా ఎప్పుడూ తగ్గలేదు. పశ్చిమాసియాలో యుద్ధం కొనసాగుతుండటం, దేశం నుంచి గుడ్లు ఎగుమతికి చెక్ పడటంతో ఆ ప్రభావం గుడ్డు ధరపై పడిందని పౌల్ట్రీ పరిశ్రమల బాధ్యులు చెబుతున్నారు. ఉత్పత్తి లేక.. వేసవిలో పౌల్ట్రీ యజమానులు కోళ్ల పెంపకానికి ఆసక్తి చూపరు. దీంతో కోళ్ల ఉత్పత్తి తగ్గింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నిత్యం 80 నుంచి 90 టన్నుల చికెన్ వినియోగం ఉంటుందని అంచనా. జిల్లాలోని పరిశ్రమల్లో 60 లక్షల వరకు కోళ్లను పెంచే అవకాశాలు ఉండగా, ప్రస్తుతం 20 నుంచి 25 లక్షలకు మించి కోళ్లను పెంచడం లేదని సమాచారం. దీంతో వరంగల్, కరీంనగర్, ఏపీలోని విజయవాడ, రాజమండ్రి ప్రాంతాల నుంచి కోళ్లను దిగుమతి చేసుకుంటుడటంతో చికెన్ ధరకు రెక్కలొచ్చాయని చెబుతున్నారు. ఇక, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నిత్యం 18 నుంచి 20 లక్షల వరకు గుడ్లు వినియోగిస్తున్నారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో కోడిగుడ్లు ఉత్పత్తి చేసే పరిశ్రమలు తక్కువ. కాగా, కోడిగుడ్డు ధర ఒక్కసారిగా పతనమవటం రైతులను కుంగదీస్తోంది. ప్రస్తుతం ఉన్న దానా ధర, నిర్వహణ ఖర్చులను పరిగణనలోకి తీసుకుంటే ఒక్క గుడ్డు ఉత్పత్తికి రూ.4.50 ఖర్చవుతోంది. ప్రస్తుతం గుడ్డు ధర రూ.4.20గా ఉండటంతో రూ.0.30 నష్టం వాటిల్లుతోంది. ప్రస్తుతం లేయర్ కోళ్ల పరిశ్రమల నిర్వహణ నుంచి కనీస పెట్టుబడులు కూడా రాని పరిస్థితితులు ఉన్నాయి. -
నేత్రపర్వంగా కల్యాణం..
పాల్వంచ: పాల్వంచలోని శ్రీనివాస గిరి భక్తుల కోలాహలంతో సందడిగా మారింది. గోవింద నామస్మరణతో మారుమోగింది. అశేష భక్త జన సందోహం నడుమ శ్రీనివాసకాలనీ గుట్టపై ఉన్న వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం శ్రీదేవి, భూదేవి సమేత స్వామి వారి కల్యాణం కనులపండువగా నిర్వహించారు. గర్భగుడి నుంచి ఉత్సవ మూర్తులను పల్లకీలో మేళతాళాలతో కల్యాణ మండపానికి ఊరేగింపుగా తీసుకొచ్చారు. అనంతరం శ్రీవారి కల్యాణాన్ని వనపర్తికి చెందిన సౌమిత్రి రామాచార్యులు, హైదరాబాద్కు చెందిన హరిచార్యులు, తోలేటి నగేశ్శర్మ, ఆరుట్ల ఫణిరాజాచార్యులు, సంపత్కుమార్ అప్పలాచార్యులు శాస్త్రోక్తంగా జరిపించారు. వేలాది మంది భక్తులు తరలి రావడంతో శ్రీనివాసగిరి కిటకిటలాడింది. ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు 1,600 మెట్లు ఎక్కి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బదులు తలెత్తకుండా భక్తులకు తాటి ఆకులతో చలువ పందిళ్లు వేశారు. ప్రత్యేక కౌంటర్ల ద్వారా తీర్థ ప్రసాదాలు, అక్షింతలు అందించారు. ఆలయ నిర్వాహకులు తాగునీటి వసతి కల్పించారు. గుట్టపైకి వచ్చే వారికి పాల్వంచ మెడికల్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఎస్పీ రోహిత్రాజు, కొత్వాల శ్రీనివాసరావు, డీసీసీ అధ్యక్షులు తోట దేవీప్రసన్న, నాగా సీతారాములు, డిప్యూటీ మేయర్ లలితకుమారి, కొత్త వెంకటేశ్వరరావు, డాక్టర్ ముక్కంటేశ్వరరావు, ఆరుట్ల లక్ష్మణాచార్యులు, డాక్టర్ బిక్కసాని సుధాకర్, ఊకే భద్రయ్య, శ్రీలత, భక్తులు పాల్గొన్నారు.గోవింద నామస్మరణతో మార్మోగిన శ్రీనివాసగిరి -
కోర్టు ఉద్యోగిపై పోలీస్ దాష్టీకం
● వాతలు తేలేవరకు లాఠీతో దాడి ● విచారణకు ఆదేశించిన న్యాయమూర్తిమధిర: కోర్టు ఉద్యోగిపై పాతకక్షను దృష్టిలో పెట్టుకొని లాఠీ విరిగేలా దాడి చేసి, తీవ్రంగా గాయపరిచిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. మధిర కోర్టులో కోర్టు ప్రాసెస్ సర్వర్గా పనిచేస్తున్న అంబర్ అలీ పాషా విధి నిర్వహణలో భాగంగా కొంతకాలం క్రితం మధిర రైల్వేస్టేషన్లో ఉన్న జీఆర్పీ కార్యాలయానికి వెళ్లాడు. అక్కడ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు అలీపాషాతో దురుసుగా ప్రవర్తించినట్లు తెలిసింది. కోర్టు పని మీద నోటీసులు ఇచ్చేందుకు వచ్చిన తనతో అసభ్యంగా మాట్లాడుతున్నారని, తాను కూడా ప్రభుత్వ ఉద్యోగినని సమాధానం చెప్పినట్లు తెలిసింది. తననే ప్రశ్నిస్తావా అంటూ అతడిపై ఆగ్రహం వ్యక్తం చేయగా అలీ పాషా వాదన ఎందుకని వెళ్లిపోయాడు. కాగా, తన బంధువును రైలు ఎక్కించేందుకు శనివారం అలీ పాషా మధిర రైల్వేస్టేషన్కు వెళ్లి, కదులుతున్న రైలులో ఉన్న తన బంధువుకు టికెట్ కొని అందించాడు. గమనించిన వెంకటేశ్వర్లు పాత కక్షను దృష్టిలో పెట్టుకొని పోలీస్స్టేషన్కు తీసుకువెళ్లి లాఠీతో చితకబాదినట్లు సమాచారం. ఈ విషయాన్ని బాధితుడు కోర్టు సిబ్బందికి తెలిపాడు. విషయం న్యాయమూర్తికి తెలిసి, మధిర టౌన్ సీఐ రమేశ్ను ఆదేశించినట్లు తెలిసింది. ఆయన ఖమ్మంలోని గవర్నమెంట్ రైల్వే పోలీస్కి కేసును బదిలీ చేశారు. కాగా, ఘటనపై ఖమ్మం జీఆర్పీ ఎస్ఐ వెంకటేశ్వర్లను వివరణ కోరగా.. బాధితుడి ఫిర్యాదు మేరకు కానిస్టేబుల్ వెంకటేశ్వర్లుపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. -
ఎమ్మెల్సీ పరామర్శ
తిరుమలాయపాలెం: మండలంలోని గోల్తండా గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ సర్పంచ్ బానోత్ పంతులు నాయక్ ఇటీవల గుండెపోటుతో మృతి చెందగా.. ఆయన కుటుంబాన్ని జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ ఆదివారం పరామర్శించారు. ఆయన మరణం పార్టీకి తీరనిలోటని కుటుంబసభ్యులకు మనోధైర్యం కల్పించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు భాషబోయిన వీరన్న, సర్పంచ్ ఆర్మీ రవి, ఉపసర్పంచ్లు చందు, చామకూరి రాజు, నాయకులు దేవేందర్రెడ్డి, మంచానాయక్, రామ్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. -
తాటి చెట్టు పైనుంచి పడి వ్యక్తి మృతి
కల్లూరురూరల్: మండలంలోని రఘునాథబంజర గ్రామంలో ఆదివారం ఉదయం తాటిచెట్టు పైనుంచి పడి గీత కార్మికుడు మృతి చెందాడు. గ్రామానికి చెందిన బండి నర్సింహారావు (48) కల్లు గీసేందుకు తాటిచెట్టు ఎక్కగా ప్రమాదవశాత్తు పైనుంచి కిందపడ్డాడు. తోటి కార్మికులు ఆయన్ను స్థానిక ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడికి భార్య ధనలక్ష్మి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతదేహాన్ని సర్పంచ్ కుక్క సుధారాణి, కాంగ్రెస్ నాయకుడు కుక్క రాణా, పలువురు సందర్శించారు. విద్యుదాఘాతంతో కార్యదర్శి...కారేపల్లి: విద్యుదాఘాతంతో పంచాయతీ కార్యదర్శి మృతి చెందిన ఘటన కారేపల్లి మండలం మంగళతండాలో ఆదివారం చోటుచేసుకుంది. కామేపల్లి మండలం గోవింద్రాలకు చెందిన లకావత్ సురేశ్ (32) ఏన్కూర్ మండలం తిమ్మారావుపేట గ్రామ పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తూ.. అత్తగారి ఇళ్లు అయిన కారేపల్లి మండలం మంగళితండాలో ఉంటున్నాడు. ఇంటి మరమ్మతులు నిర్వహిస్తుండగా విద్యుదాఘాతానికి గురై పడిపోయాడు. అతడిని ఇల్లెందు ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. మృతుడికి భార్య కాజారాణి, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ద్విచక్రవాహనం, లారీ ఢీ కొణిజర్ల: మండలంలోని గుబ్బగుర్తి సమీపంలో ద్విచక్రవాహనాన్ని లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో మండలంలోని అన్నవరం గ్రామానికి చెందిన బాణోత్ గణేశ్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు 108 ద్వారా ఖమ్మంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. 108 సిబ్బంది సతీశ్, మోహనకృష్ణ ప్రాథమిక చికిత్స అందించారు. -
మూడో ప్రపంచ యుద్ధం వచ్చే సూచనలు
బోనకల్: మూడో ప్రపంచ యుద్ధం వచ్చే సూచనలు కనిపిస్తున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తెలిపారు. బోనకల్లో ఆదివారం బత్తినేని చారిటబుల్ ట్రస్టు సహకారంతో నిర్మించిన సీపీఐ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. డాలర్ పెత్తనంతోనే యుద్ధ జరుగుతోందని, వెనిజులాలో దేశాధ్యక్షుడి కుటుంబ సభ్యులకు బేడీలు వేసి కారాగారంలో పెట్టిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భవిష్యత్లో మోదీని కూడా జైలులో పెట్టొచ్చని జోస్యం చెప్పారు. గతంలో సోవియట్ రష్యా అమెరికా పెత్తనానికి అడ్డుకట్ట వేయగలిగిందని, కమ్యూనిస్టులు బలంగా లేకపోతే మనవవాళికి రక్షణ ఉండదని పేర్కొన్నారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర నాయకులు బాగం హేమంతరావు, జమ్ముల జితేందర్రెడ్డి, జిల్లా కార్యదర్శి దండి సురేశ్, గోవిందరావు, షేక్ మహ్మద్ మౌలానా, బత్తినేని నీరజ, నాగ ప్రసాద్, రాకేశ్, ప్రకాష్, రోషన్కుమార్, యంగల ఆనందరావు, తోట రామాంజనేయులు, సర్పంచ్ బాణోతు జ్యోతి, ఉప సర్పంచ్ కొండ, కిలారు సురేశ్ పాల్గొన్నారు. 17 మిలియన్ టన్నుల లక్ష్యం రుద్రంపూర్: సింగరేణి సంస్థ ఈ ఆర్థిక సంవత్సరంలో 72 మిలియన్ టన్నుల ఉత్పత్తి లక్ష్యసాధన కోసం కృషి చేస్తోంది. ఈ నేపథ్యంలో మార్చి 15వ తేదీ వరకు 67.76 మిలియన్ టన్నులు సాధించాల్సి ఉండగా, 55.00మిలియ న్ టన్నులు 81శాతం ఉత్పత్తి చేసింది. రానున్న మార్చి 31 నాటికి 72 మిలియన్ టన్నుల ఉత్పత్తి పూర్తి చేయాల్సి ఉంది. అంటే ఈ 15 రోజుల్లో 17 మిలియన్ టన్నులు ఉత్పత్తి చేయాలి. గతేడాది ఈరోజు నాటికి 63.50 మిలియన్ టన్నుల ఉత్పత్తి సాధించగా.. ఈ ఏడాది 55.00 మిలియన్ టన్నులు ఉత్పత్తి కాగా.. సుమారు 8.50 మిలియన్ టన్నులు వెనుకబడింది. రంజాన్ను ఘనంగా జరుపుకోవాలిపాల్వంచ: ముస్లింలు పవిత్ర రంజాన్ పండుగను ఘనంగా జరుపుకోవాలని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర అన్నారు. ఆదివారం నటరాజ్ సెంటర్లోని జమా మసీద్లో ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ రంజాన్ ఐక్యతను చాటుతుందని, తోటి వారికి సహాయం చేయాలనే ఉద్దేశాన్ని తెలుపుతుందని అన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు వనమా రాఘవేందర్ రావు, మల్లెల రవిచంద్ర, సురేష్ తదితరులు పాల్గొన్నారు. పెద్దమ్మతల్లికి విశేషపూజలుపాల్వంచరూరల్: పెద్దమ్మతల్లి అమ్మవారికి ఆదివారం అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. మండలంలోని శ్రీకనకదుర్గ (పెద్దమ్మతల్లి) ఆలయానికి రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. క్యూలైన్ ద్వారాఅమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులు అన్నప్రాసనలు, ఒడిబియ్యం, పసుపు కుంకుమలు, చీరలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. పూజా కార్యక్రమంలో ఈఓ ఎన్.రజనీకుమారి,ఆలయ కమిటీ చైర్మన్ బాలినేని నాగేశ్వరరావు, వేదపండితులు పద్మనాభశర్మ, రవికుమార్శర్మ పాల్గొన్నారు. నేడు ‘షబ్–ఏ–ఖదర్’కరకగూడెం: పవిత్ర రంజాన్ మాసం కావడంతో ముస్లింలు భక్తిశ్రద్ధలతో ప్రార్థనలు చేస్తున్నారు. గత నెల 19 నుంచి ఉపవాస దీక్షలు పాటిస్తున్నారు. నేడు (సోమవారం) రాత్రి మసీదుల్లో ప్రత్యేక జాగారం చేయనున్నారు. రంజాన్ మాసం చివరి పది రోజుల్లో వచ్చే ఐదు బేసి రాత్రుల్లో ఒకటైన ఈ రాత్రికి ఇస్లాంలో ఎంతో విశిష్టత ఉంది. ఈ రాత్రి చేసే ప్రార్థనలు వెయ్యి మాసాల ప్రార్థనల కంటే ఎక్కువ పుణ్య ఫలాన్ని ఇస్తాయని ముస్లింలు విశ్వసిస్తారు. జిల్లా వ్యాప్తంగా 110మసీదులు ఉండగా, సుమారు 80 వేలమంది ముస్లింలు ఉన్నారు. జాగారం చేసేందుకు మసీదులను ముస్తాబు చేశారు. రాత్రంతా మేల్కొని ఖురాన్ పఠించనున్నారు. -
ఆస్పత్రుల అప్గ్రేడ్, రిజర్వాయర్కు నిధులపై..
వైరా నియోజకవర్గంలో విద్య, వైద్య రంగాలకు ప్రాధాన్యం ఇవ్వాలని అసెంబ్లీలో కోరతా. ప్రధానంగా వైరాలో పాలిటెక్నిక్, కారేపల్లి డిగ్రీ కళాశాల, ఏన్కూర్లో ఐటీఐ, వైరాలో డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి విన్నవిస్తా. కొణిజర్ల, ఏన్కూరు, జూలూరుపాడు పీహెచ్సీలను 30 పడకల ఆస్పత్రులుగా అప్గ్రేడ్ చేయాలని, వైరా రిజర్వాయర్ను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేలా నిధులు విడుదల చేయాలని కోరుతా.– మాలోతు రాందాస్నాయక్, వైరా ఎమ్మెల్యేఇల్లెందు వాసులు ప్రస్తుతం నివాసం ఉంటున్న భూమిపై హక్కులు కల్పించేందుకు జీఓ 76ను నిరంతరం అమల్లో ఉంచాలని ప్రభుత్వాన్ని కోరుతా. ఆ భూమిలో సింగరేణి లీజు పూర్తయి, వందల ఏళ్లుగా ఉంటున్న వారికి హక్కులు లేవు. సింగరేణి భూముల్లో ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకుంటున్న వారికి సంస్థ నుంచి ఆటంకాలు రాకుండా చూడాలని కోరుతా. – కోరం కనకయ్య, ఇల్లెందు ఎమ్మెల్యే భద్రాచలం శ్రీ సీతామచంద్రస్వామి కల్యాణ మహోత్సవం, పట్టాభిషేకం నిర్వహణకు నిధులు కావాలని సీఎంను కోరుతా. అలయ అభివృద్ధి, మాఢ వీధుల విస్తరణకు ఇప్పటికే మాస్టర్ ప్లాన్ కొలిక్కి వచ్చినందున నిధులు త్వరగా మంజూరు చేయాలని అడుగుతా. –తెల్లం వెంకట్రావ్, భద్రాచలం ఎమ్మెల్యే -
జనగణన పటిష్టంగా చేపట్టాలి
కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఖమ్మం సహకారనగర్ : జనగణనను పటిష్టంగా చేపట్టాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. జన గణనపై కలెక్టరేట్ సమావేశంలో మందిరంలో అధికారులకు మూడు రోజుల పాటు ఇవ్వనున్న శిక్షణను ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వివిధ పథకాల రూపకల్పన, నియోజకవర్గాల పునర్విభజన, ఓటరు నమో దు ప్రక్రియకు జనగణన సమాచారం కీలకమని అన్నారు. జనగణన ఎన్యుమరేషన్ బ్లాక్ ఎంపిక ప్రక్రియ చేయాలన్నారు. డిజిటల్ ఆధారంగా గణన ప్రక్రియ చేపట్టాలని, పౌరులు వెబ్ ఆధారంగా తమ వివరాలను స్వయంగా నమోదు చేసుకునే అవకాశం కల్పించాలని ఆదేశించారు. మే 11 నుంచి జూన్ 9వరకు మొదటి దశ, 2027 ఫిబ్రవరిలో రెండో దశ జనగణన ఉంటుందని వివరించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి, సీపీఓ ఎ.శ్రీనివాస్, డీఆర్వో పద్మశ్రీ, డీపీఓ రాంబాబు, మాస్టర్ ట్రైనర్ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. రేక్ పాయింట్కు చేరిన యూరియాచింతకాని: మండల పరిధిలోని పందిళ్లపల్లి రేక్ పాయింట్కు ఆదివారం ఎన్ఎఫ్ఎల్ కంపెనీకి చెందిన 2,643.75 మెట్రిక్ టన్నుల యూరియా చేరినట్లు జిల్లా వ్యవసాయాధికారి ధనసరి పుల్లయ్య తెలిపారు. ఇందులో ఖమ్మం జిల్లాకు 1,143.75 మెట్రిక్ టన్నులు, భద్రాద్రి జిల్లాకు 300 మెట్రిక్ టన్నులు, మహబూబాబాద్ జిల్లాకు 1,000 మెట్రిక్ టన్నులు, ఖమ్మం సీఆర్పీకి 200 మెట్రిక్ టన్నులను సరఫరా చేసినట్లు వివరించారు. న్యాయవాదికి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డుఖమ్మం స్పోర్ట్స్ : ఇండియన్ బాడీ బిల్డింగ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నాలుగేళ్లకోసారి ప్రదానం చేసే అత్యుత్తమ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఖమ్మానికి చెందిన ప్రముఖ న్యాయవాది స్వామి రమేష్కుమార్కు దక్కింది. చైన్నెలో జరిగిన 11వ సీనియర్ జాతీయస్థాయి బాడీబిల్డింగ్ చాంపియన్షిప్ పోటీల సందర్భంగా ఈ అవార్డును 14వ తేదీన స్థానిక ఎంపీ టి.ఆర్.బాలు రమేష్కుమార్కు అందజేశారు. గ్యాస్ అక్రమ వినియోగంపై తనిఖీలుఖమ్మం సహకారనగర్ : గ్యాస్ అక్రమ వినియోగంపై జిల్లాలోని గ్యాస్ గోదాములు, హోటళ్లలో ఆదివారం ముమ్మర తనిఖీలు చేపట్టినట్లు జిల్లా పౌరసరఫరాల శాఖాధికారి చందన్కుమార్ తెలిపారు. కొణిజర్లలోని చాణక్య గ్యాస్ ఏజెన్సీ గోదామును తనిఖీ చేసి, అక్రమంగా సరఫరా చేయొద్దని డీలర్కు ఆదేశాలు జారీ చేశామన్నారు. వినియోగదారులకు రీఫిల్ సిలిండర్లు సీనియారిటీ క్రమంలో మాత్రమే అందజేయాలని, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించొద్దని సూచించామని అన్నారు. కాగా, తమ తనిఖీల్లో వ్యాపార అవసరాలకు గృహ వినియోగ గ్యాస్ సిలిండర్లను అక్రమంగా వినియోగిస్తున్న విషయం వెలుగులోకి వచ్చిందని, మొత్తంగా 21 సిలిండర్లను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఈ మేరకు యజమానులపై 6ఏ కేసు నమోదు చేసినట్లు చెప్పారు. -
గ్రామాభివృద్ధిలో భాగస్వాములు కావాలి
రఘునాథపాలెం: గ్రామ పంచాయతీల అభివృద్ధిలో ప్రతీ ఒక్కరు భాగస్వాములు కావాలని, ఇంటితో పాటు పరిసరాలను శుభ్రంగా ఉంచాలని డీపీఓ రాంబాబు అన్నారు. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మండలంలోని అన్ని గ్రామపంచాయతీల్లో ఆదివారం సిబ్బందికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. పది రోజులుగా ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపడుతున్న వారిని సన్మానించారు. ఈ క్రమంలో వీవీపాలెంలో నిర్వహించిన కార్యక్రమానికి హాజరైన డీపీఓ.. సిబ్బందిని అభినందించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కాపా ఆదినారాయణ, ఎంపీఓ శ్రీనివాస రెడ్డి, పంచాయతీ కార్యదర్శి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. డీపీఓ రాంబాబు -
అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా చర్చిస్తా
అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర బడ్జెట్ ఉండాలని కోరుతా. రాష్ట్రంలో ధరణి స్థానాన తీసుకొచ్చిన భూ భారతితో ఆశించిన ప్రయోజనాలు రాలేదు. దీన్ని పకడ్బందీగా అమలు చేయాలని కోరుతా. సీతారామ ప్రాజెక్టు, ఆర్టీసీ, సింగరేణి పరిరక్షణపై చర్చిస్తా. – కూనంనేని సాంబశివరావు, కొత్తగూడెం ఎమ్మెల్యే సత్తుపల్లి నియోజకవర్గంలో రెండు మున్సిపాలిటీలు ఉన్నాయి. ఇటీవలి ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చేలా మరిన్ని నిధులు కావాలని అసెంబ్లీలో ప్రస్తావిస్తా. సత్తుపల్లి ప్రజల ఇళ్ల స్థలాల సమస్య పరిష్కరించాలని సీఎం రేవంత్రెడ్డి దృష్టికి తీసుకెళ్తా. అలాగే, కిష్టారం సైలోబంకర్ సమస్య, సింగరేణి బాధితుల ఇబ్బందులను అసెంబ్లీలో ప్రస్తావిస్తా. – డాక్టర్ మట్టా రాగమయి, సత్తుపల్లి ఎమ్మెల్యే నియోజకవర్గంలో శాశ్వత భవనాలు లేని ప్రభుత్వ కార్యాలయాలకు నిధులు మంజూరు చేయాలని కోరుతా. మణుగూరు, పినపాక మండలాల్లో ఎత్తిపోతల పథకాలు మంజూరు చేయాలని కోరుతా. – పాయం వెంకటేశ్వర్లు, పినపాక ఎమ్మెల్యే -
అడుగంటుతోంది !
వైరా రిజర్వాయర్లోకి ప్రస్తుతం సాగర్ జలాలు రోజుకు 320 క్యూసెక్కులు వస్తున్నాయి. వారం రోజుల పాటు సాగర్ నీరు చేరుతుంది. రానున్న వేసవిని దృష్టిలో ఉంచుకుని ప్రస్తుత పరిస్థితిని అంచనా వేసి జిల్లా ఉన్నతాధికారులకు నివేదిక అందిస్తాం. ప్రజలకు ఇబ్బంది లేకుండా చూస్తాం. – శ్రీనివాస్, ఐబీ, డీఈ, వైరావైరా: వైరా రిజర్వాయర్ నీటి మట్టం రోజురోజుకు తగ్గుతోంది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలకు తోడు సాగు అవసరాలకు విడుదల చేస్తుండడంతో ఈ పరిస్థితి నెలకొంది. రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటి మట్టం 18.3 అడుగులు కాగా ప్రస్తుతం 13 అడుగులకు చేరుకుంది. జిల్లాలోని 11 మండలాల పరిధిలో 467 గ్రామాలకు ఈ రిజర్వాయర్ నుంచి రోజుకు 10 కోట్ల లీటర్ల నీటిని మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ సరఫరా చేస్తున్నారు. మరో వైపు రిజర్వాయర్ కుడి, ఎడమ కాల్వల ద్వారా వారబందీ పద్ధతిలో ఆయకట్టుకు సాగునీరు విడుదల చేస్తున్నారు. ఏప్రిల్ 16వ తేదీ వరకు సాగు నీరు అందిస్తామని అధికారులు ఇప్పటికే ప్రకటించారు. రానున్న రెండు నెలల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరగనుండగా, నీటి లభ్యతపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. 1.6 టీఎంసీలు అవసరం వైరా రిజర్వాయర్ నుంచి ప్రతీ రోజు 33 క్యూసెక్కుల నీరు ఆవిరి రూపంలో పోతుండగా 37 క్యూసెక్కుల నీరు మిషన్ భగీరథ పథకం ద్వారా తాగునీరు అందిస్తున్నారు. ఇలా నిత్యం 70 క్యూసెక్కుల నీరు ఖర్చవుతోంది. ఈ ఏడాది వేసవి గట్టెక్కాలంటే 1.6 టీఎంసీల నీరు రిజర్వాయర్లోకి రావాల్సి ఉంది. మరో వైపు జిల్లాలో ఏప్రిల్ 15 వరకు సాగర్ జలాలు వారబందీ పద్ధతిన నీరు విడుదల చేయనున్నారు. రిజర్వాయర్లోకి సాగర్ జలాలు విడుదల చేస్తే తాగునీటికి ఇబ్బందులు తప్పుతాయి. అయితే ఈ విషయమై అధికారులకు స్పష్టమైన హామీ లభించలేదు. ముందస్తుగా మేల్కొంటేనే.. రిజర్వాయర్ నుంచి మిషన్ భగీరథ పథకం ద్వారా జిల్లాలోని వైరా, మధిర, కల్లూరు మున్సిపాలిటీలతో పాటు మరో 8 మండలాలకు 10 కోట్ల లీటర్ల తాగునీరు సరఫరా అవుతోంది. ఈ క్రమంలో రిజర్వాయర్లో నీటి వినియోగంతో పాటుగా ఆవిరి శాతం మరో 10 రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉంది. వేసవి ఉధృతిని దృష్టిలో ఉంచుకుని రిజర్వాయర్ పూర్తి స్థాయిలో ఖాళీ కాకముందే మిషన్ భగీరథ, నీటి పారుదల శాఖ అధికారులు అవసరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంది. లేదంటే వేసవిలో గృహ వినియోగానికి తీవ్ర ఇబ్బందులు తప్పేలా లేవు. రిజర్వాయర్లోని ప్రతికూల పరిస్థితులను బట్టి అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆయా మండలాల ప్రజలు కోరుతున్నారు. -
సాగులో ఆధునిక పద్ధతులు పాటించాలి
రఘునాథపాలెం: రైతులు ఆర్థికంగా బలపడాలంటే పంటల విస్తరణతో పాటు ఆధునిక వ్యవసాయ పద్ధతులు అవలంబించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. రఘునాథపాలెం మండలంలోని రైతు వేదికలో ఆదివారం నిర్వహించిన జిల్లా స్థాయి వ్యవసాయ యాంత్రీకరణ సదస్సులో రైతులకు సబ్సిడీపై వ్యవసాయ యంత్ర పరికరాలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మంచుకొండ ఎత్తిపోతల పథకం ద్వారా చెరువులకు నీటి వసతి కల్పించామని, వేసవికాలంలోనూ చెరువులు నిండుగా ఉండేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. రైతులు ఆయిల్పామ్ సాగు వైపు మొగ్గుచూపి మరింతగా లాభాలు గడించాలన్నారు. జిల్లాలో ఆయిల్ పామ్ సాగు విస్తరణకు ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తోందని చెప్పారు. వ్యవసాయ యాంత్రీకరణ పథకం కింద రైతులు పరికరాలు కొనుగోలు చేస్తే సబ్సిడీని రైతుల ఖాతాల్లో జమ చేస్తామని తెలిపారు. రాజకీయాల్లో నిజాయితీగా ఉండాలంటే వ్యవసాయం ద్వారా ఆదాయం ఉండాలని అన్నారు. గత ప్రభుత్వ కాలంలో ఖమ్మం పరిసర ప్రాంతాల్లో భూకబ్జాలు పెరిగాయని ఆరోపించిన మంత్రి.. వెలుగుమట్ల భూదాన్ భూముల్లో మాఫియా తరహాలో వ్యవహరిస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. నీరు, విద్యుత్, రహదారులు లేకుండా పేదలు ఉండొద్దని, అక్రమ నిర్మాణాలను తొలగించాలనే కోర్టు ఆదేశాల మేరకే కూల్చివేశామని వివరించారు. ఈనెల 22న సిద్దిపేట జిల్లా నర్మెట్టలో ఆయిల్పామ్ ఫ్యాక్టరీని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పి. శ్రీనివాసరెడ్డి, డీఏఓ ధనసరి పుల్లయ్య, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి మధుసూదన్, తహసీల్దార్ శ్వేత, ఎంపీడీఓ ఆశోక్కుమార్, ఏడీఏ కె.వెంకటేశ్వర్లు, ఖమ్మం మార్కెట్ చైర్మన్ యరగర్ల హనుమంతరావు, మాజీ చైర్మన్ ఎం.రాధాకిషోర్, ఆత్మ చైర్మన్ దిరిశాల చిన్న వెంకటేశ్వర్లు, రఘునాథపాలెం సర్పంచ్ గాజుల కృష్ణారావు, పీఏసీఎస్ రఘునాథపాలెం సొసైటీ మాజీ చైర్మన్ తాతా రఘురాం, ఏఓలు కర్నాటి ఉమామహేశ్వరరెడ్డి, భాస్కర్రావు, నగరకాంగ్రెస్ అధ్యక్షుడు నాగండ్ల దీపక్చౌదరి, సాధు రమేష్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల -
బడ్జెట్పైనే ఆశలు..
‘ఉమ్మడి ఖమ్మం జిల్లాకు నిధులు వస్తాయి.. సాగునీటి ప్రాజెక్టులు త్వరగా పూర్తవుతాయి.. రహదారులు కొత్త రూపు సంతరించుకుంటాయి.. స్థానిక సమస్యలు పరిష్కారం అవుతాయి..’ అని ప్రజలు సోమవారం ప్రారంభమయ్యే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపై ఆశలు పెట్టుకున్నారు. ప్రధానంగా సీతారామ ప్రాజెక్టు, ఖమ్మంలో రిటైనింగ్ వాల్, మున్నేరుపై తీగల వంతెన పనులు సాగుతున్నాయి. అలాగే పర్యాటక రంగ అభివృద్ధిపైనా ప్రభుత్వం దృష్టి పెట్టింది. వీటన్నింటికీ నిధులు కేటాయిస్తే ఈ ఏడాదే పనులు పూర్తయ్యే అవకాశం ఉంటుంది. – సాక్షిప్రతినిధి, ఖమ్మంసీతారామకు ప్రాధాన్యత దక్కేనా..? ఉమ్మడి జిల్లాలో సీతారామ ప్రాజెక్టు ప్రాధాన సాగునీటి వనరుగా ఉంది. గతంలో దీని అంచనా వ్యయం రూ.19,324 కోట్లు కేటాయించారు. అలాగే రిజర్వాయర్తోపాటు పాలేరు లింక్ కెనాల్ పనులు చేపట్టారు. మరోవైపు కొత్త కాల్వల తవ్వకానికి అనుమతులిచ్చారు. ఈ నేపథ్యంలో బడ్జెట్లో నిధుల కేటాయింపు ప్రధానంగా మారింది. అలాగే జిల్లాలో యాతాలకుంట, తిరుమలాయపాలెం తదితర ప్రాంతాల్లో టన్నెల్ నిర్మాణాలు పూర్తి కావాలి. గతేడాది బడ్జెట్లో ఈ ప్రాజెక్టుకు (ఖమ్మం సీఈ పరిధిలో) రూ.643.04 కోట్లు కేటాయించారు. ఈసారి బడ్జెట్లో ఎంత మేరకు కేటాయింపులు ఉంటాయో తేలాల్సి ఉంది. నిధుల వరద పారాలి.. ఎర్రుపాలెం వద్ద ఎన్నెస్పీపై లిఫ్ట్ ఇరిగేషన్ను సర్కారు చేపట్టింది. గతేడాది బడ్జెట్లో ఈ పథకానికి రూ.39.90 కోట్లు కేటాయించారు. దీన్ని రైతులకు అందుబాటులోకి తెచ్చేందుకు ఈసారి ఎన్ని నిధులు కేటాయిస్తారో వేచి చూడాల్సిందే. అలాగే జిల్లాలోని పలు ఎత్తిపోతల పథకాలు మరమ్మతులకు గురయ్యాయి. ఇందుకోసం నిధులు కేటాయించాలని రైతులు కోరుతున్నారు. ఇక లంకాసాగర్, వైరా, తాలిపేరు తదితర ప్రాజెక్టులకు పలు రకాల పనుల నిమిత్తం నిధులు కేటాయిస్తారనే చర్చ జరుగుతోంది. రిటైనింగ్ వాల్, తీగల వంతెన పూర్తయితే .. ఎగువ ప్రాంతంలో భారీ వర్షాలు కురిసినప్పుడు ఖమ్మం నగరలోని మున్నేరుకు వచ్చే వరదతో పరీవాహక ప్రాంతంలోని ఖమ్మం రూరల్ మండలం, నగరంలోని కాలనీలు ముంపునకు గురవుతున్నాయి. 2023లో వరదల సమయంలోనే మున్నేరుకు ఇరువైపులా రిటైనింగ్ వాల్ నిర్మించాలని అప్పటి ప్రభుత్వం నిర్ణయించి రూ.690 కోట్లు కేటాయించింది. ఇరువైపులా 8.50 కి.మీ. చొప్పున 17 కి.మీ. గోడ నిర్మించాల్సి ఉంది. ప్రస్తుతం రూరల్ మండల పరిధిలో 6 కి.మీ. మేరకు, ఖమ్మం నగరం వైపు 3 కి.మీ. మేర పనులు పూర్తయ్యాయి. అయితే భూసేకరణ సమస్యతో పనులు కొంత ఆలస్యమయ్యాయి. ఇటీవల కేబినెట్ సమావేశంలో 125 ఎకరాల భూసేకరణకు ప్రభుత్వం అనుమతించింది. మున్నేరుపై తీగల వంతెన నిర్మాణం కూడా పూర్తి కావాల్సి ఉంది. ఈ రెండింటికీ బడ్జెట్లో నిధులు కేటాయిస్తే పనులు చకచకా పూర్తయి ఖమ్మానికి కత్త కళ రానుంది. ఉమ్మడి జిల్లాలో పర్యాటకులను ఆకట్టుకునే ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి. వీటి అభివృద్ధికి ప్రణాళికతోపాటు నిధులు కేటాయిస్తే ఉమ్మడి ఖమ్మం జిల్లా పర్యాటక రంగంలో దూసుకుపోనుంది. కనకగిరి గుట్టలు, నేలకొండపల్లిలోని బౌద్ధక్షేత్రం, పలు జలపాతాలు, జమలాపురం వంటి పుణ్యక్షేత్రాలు పర్యాటక రంగానికి ఊతమివ్వనున్నాయి. దీనిపై పలువురు ఎమ్మెల్యేల అభిప్రాయాలతో కథనం.. -
వైభవంగా నదీ హారతి
భద్రాచలంటౌన్: భద్రాచలంలో గోదావరి స్నానఘట్టాల వద్ద పాప విమోచన ఏకాదశిని పురస్కరించుకుని ఆదివారం సాయంత్రం నిర్వహించిన నదీహారతి కార్యక్రమం కనుల పండువగా సాగింది. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం హైదరాబాద్కు చెందిన శ్రీ వాగ్దేవి కళా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన నాదోపాసన, కూచిపూడి నృత్యం, కర్ణాటక సంగీత కచేరి భక్తులను ఆకట్టుకున్నాయి. పురోహితులు గణపతి పూజ, దీపోత్సవం నిర్వహించి గోదావరి మాతకు, శ్రీరామునికి అష్టోత్తర శతనామార్చన చేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈఓ దామోదర్ రావు, సర్పంచ్ పునెం కృష్ణ దొర, డీఈ రవీందర్, తహసీల్దార్ ధనియాల వెంకటేశ్వర్లు, పురోహితులు సురేష్ శర్మ తదితరులు పాల్గొన్నారు. 10 గంటలపాటు కీర్తనల ఆలాపనభద్రగిరి రామయ్య సన్నిధిలో ఆదివారం అరుదైన ఆధ్యాత్మిక ఘట్టం చోటుచేసుకుంది. శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయ చిత్రకూట మండపంలో అల్లం రమాదేవి నిర్విరామంగా 10 గంటలపాటు 108 భక్తి సంకీర్తనలు ఆలపించి భక్తులను మంత్రముగ్ధులను చేశారు. ఆమె ప్రతిభను గుర్తించిన ‘తెలంగాణ స్టేట్ రికార్డ్స్’ ప్రతినిధులు రికార్డు ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు. ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు హాజరై రమాదేవి దంపతులను సత్కరించి సర్టిఫికెట్ను ప్రదానం చేశారు. డాక్టర్ చింతపట్ల వెంకటాచారి తదితరులు పాల్గొన్నారు. ఘనంగా నిత్యకల్యాణం భద్రాచలం శ్రీసీతారామ చంద్రస్వామివారి నిత్య కల్యాణ వేడుక ఆదివారం నేత్రపర్వంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం చిత్రకూట మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు. నిత్య కల్యాణంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. -
గ్రామం మీదుగా లైన్ వద్దేవద్దు..
సత్తుపల్లిరూరల్: మండలంలోని కిష్టారం మీదుగా సింగరేణి అధికారులు ప్రతిపాదించిన 32/11 కేవీ విద్యుత్ లైన్ను గ్రామస్తులు వ్యతిరేకించారు. గ్రామంలో సర్పంచ్ నరుకుళ్ల రాజేశ్వరి అప్పారావు ఆధ్వర్యాన శనివారం గ్రామసభ నిర్వహించగా సింగరేణి జీఎం చింతల శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సింగరేణి అధికారుల గృహసముదాయాలకు 32/11 కేవీ విద్యుత్ లైన్ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించగా గ్రామస్తులు నిరాకరించారు. ఇప్పటికే సైలోబంకర్ కాలుష్యంతో ప్రాణాలు కోల్పోతుండగా, ఆ సమస్యను పరిష్కరించకుండా మరో సమస్య తీసుకురావొద్దన్నారు. మూడు నెలల్లో సైలో బంకర్ సమస్యకు పరిష్కారం చూపిస్తామని తమ దీక్షలు విరమింపచేసి, ఏడాది గడిచినా పట్టించుకోలేదని ఆరోపించారు. ఈ సమావేశానికి హాజరైన కాంగ్రెస్ నాయకుడు డాక్టర్ మట్టా దయానంద్ మాట్లాడుతూ బొగ్గు తవ్వకాలపై సింగరేణికి ఎంత అధికారం ఉందో, బాధితులను ఆదుకునే బాధ్యత అంతే కంటే ఎక్కువగా ఉంటుందని తెలిపారు. అధికారులు గృహ సముదాయాలకు విద్యుత్ లైన్ ఏర్పాటులో ప్రజల నిర్ణయం మేరకే నడుచుకోవాలని సూచించారు. కాగా, సైలో బంకర్ సమస్యపై ఎమ్మెల్యే రాగమయి అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావించి బాధితులకు న్యాయం జరిగేలా చూస్తారని తెలిపారు. ఈ సమావేశంలో సింగరేణి జేవీఆర్ ఓసీ పీఓ ప్రహ్లాద్, ఏఈ శరత్ తదితరులు పాల్గొన్నారు. -
పిల్లల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రోత్సాహం
ఖమ్మం సహకారనగర్: ఖమ్మంలోని సర్వజ్ఞ పాఠశాల వార్షికోత్సవాన్ని సృజనోత్సవ్ పేరుతో శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రజాకవి, సినీ గేయ రచయిత పద్మశ్రీ సుద్దాల అశోక్తేజ హాజరుకాగా.. కేఎంసీ మేయర్ పునుకొల్లు నీరజ, పాఠశాల చైర్మన్ ఆర్వీ.నాగేంద్రకుమార్, డైరెక్టర్ నీలిమతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ నీరజ మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్ అనేది ప్రాథమికంగా తల్లిదండ్రుల ప్రోత్సాహంపైనే ఆధారపడి ఉంటుందని తెలిపారు. ఈమేరకు పిల్లల ఆశలు, ఆకాంక్షలను తెలుసుకోవాలని, ఆపై ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో వారు రాణిస్తారని వెల్లడించారు. అనంతరం సుద్దాల అశోక్ తేజ మాట్లాడుతూ ఏపీజే కలాం వంటి గొప్ప వ్యక్తులను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలన్నారు. విద్యార్థులు కష్టపడి కాకుండా ఇష్టపడి చదివితే మంచి ఫలితాలు వస్తాయని తెలిపారు. పాఠశాల చైర్మన్ నాగేంద్రకుమార్, డైరెక్టర్ నీలిమ మాట్లాడుతూ తమ పాఠశాలలో విద్యార్థులను పుస్తక జ్ఞానానికే పరిమితం చేయకుండా వారిలో సృజనాత్మకతను వెలికి తీయటమే లక్ష్యంగా పని చేస్తున్నామని వెల్లడించారు. క్రమశిక్షణతో కూడిన విద్యతో ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని తెలిపారు. అనంతరం విద్యార్థులు చేసిన నృత్యాలు ఆకట్టుకోగా.. వివిధ పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. ఈకార్యక్రమంలో ప్రిన్సిపాళ్లు, ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.‘సర్వజ్ఞ’ సృజనోత్సవ్లో వక్తలు -
మతసామరస్యానికి ప్రతీకగా జిల్లా
ఖమ్మం సహకారనగర్: జిల్లా ప్రజలు కులమతాలకతీతంగా జీవిస్తూ మత సామరస్యాన్ని చాటుతున్నారని వక్తలు పేర్కొన్నారు. రంజాన్ సందర్భంగా తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం(టీజీవోస్) ఆధ్వర్యాన శనివారం నగరంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి, సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు మాట్లాడుతూ రంజాన్ అనేది ఉపవాసం ఉండే నెల మాత్రమే కాదని, ఆత్మశుద్ధి చేసుకునే నెల అన్నారు. టీజీవోస్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కొంగర వెంకటేశ్వరరావు, మోదుగు వేలాద్రి, నాయకులు మల్లెల రవీంద్రప్రసాద్, గంగవరపు నరేందర్, సూరంపల్లి రాంబాబు, శేషుప్రసాద్, కస్తాల సత్యనారాయణ, టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గుంటుపల్లి శ్రీనివాస్, కొణిదన శ్రీనివాసరావుతో పాటు దుర్గాప్రసాద్, తాళ్లూరి శ్రీకాంత్, కోనార్తో పాటు వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొన్నారు.టీజీవోస్ ఇఫ్తార్ విందులో వక్తలు -
ప్రజల పక్షాన పనిచేయాలి
● ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ ● ముగిసిన సీపీఐ శిక్షణా తరగతులు పాల్వంచ: కమ్యూనిస్టు ప్రజా ప్రతినిధులు ఎల్లప్పుడూ ప్రజల పక్షానే పనిచేయాలని ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ అన్నారు. పాల్వంచలో నిర్వహిస్తున్న సీపీఐ ప్రజాప్రతినిధుల రాష్ట్రస్థాయి శిక్షణ తరగతులు రెండో రోజు శనివారం ముగిశాయి. తరగతుల్లో ‘ప్రజా ప్రతినిధులుగా కమ్యూనిస్ట్ల పాత్ర’ అనే అంశంపై నాగేశ్వర్ మాట్లాడారు. కమ్యూనిస్టులతోనే మెరుగైన పాలన సాధ్యమని, నూతనంగా ప్రజాప్రతినిధులు ఆ దిశగా అడుగులు వేయాలన్నారు. యూపీఏ–1 ప్రభుత్వంలో కమ్యూనిస్టులు కలిసి ఉన్నప్పుడు ఉపాధి హామీ చట్టం, సమాచార హక్కు చట్టం, అటవీ హక్కుల చట్టం వంటి ప్రజా ప్రయోజన చట్టాలు అమల్లోకి వస్తే యూపీఏ–2 నుంచి వైదొలగడంతో అన్నీ కుంభకోణాలే జరిగాయన్నారు. కమ్యూనిస్టు ప్రజాప్రతినిధులు ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ అట్టడుగు వర్గాల అభ్యున్నతికి నిరంతరం కృషి చేయాలన్నారు. మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని సూచించారు. బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తూ హక్కులు, నిధుల కోసం పోరాడాలన్నారు. ఆర్టీఐ మాజీ కమిషనర్ ప్రొఫెసర్ మాడభూసి శ్రీధర్ మాట్లాడుతూ దేశ పౌరులుగా హక్కుల కోసం పోరాడటంతో పాటు బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలని చెప్పారు. ఆతర్వాత సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మాట్లాడగా కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్, నాయకులు పశ్య పద్మ, ఎస్కె.సాబీర్పాషా, సృజన్, వెంకటేశ్వరరావు, విశ్వనాథం, అజయ్ సారధి తదితరులు పాల్గొన్నారు. -
మా కష్టాన్ని లాక్కోవద్దు..
కారేపల్లి: ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికందే సమయాన అన్యాయం చేయొద్దని రైతులు కోరారు. కారేపల్లి మండలం రేలకాయలపల్లి రెవెన్యూ చీమలపాడులో పలువురు రైతుల నుంచి సీతారామ ప్రాజెక్టు నిర్మాణానికి భూమి సేకరించారు. ఇక్కడ 67 ఎకరాల్లో సుబాబుల్ తోటలు సాగు చేయగా, చేతికి వచ్చే సమయాన భూసేకరణ పూర్తయి పరిహారం కూడా చెల్లించారు. అయితే, చివరి పంట తమకే ఇవ్వాలని కోరుతూ రైతులు శనివారం తోటలను నరికేందుకు సిద్ధమయ్యారు. దీంతో డీఈ కిషోర్, ఏఈ రంజిత్, వర్క్ ఇన్స్పెక్టర్ రామస్వామి చేరుకుని అడ్డగించారు. పంట తీసుకునే హక్కు కల్పించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కలెక్టర్ అనుదీప్, ఎమ్మెల్యే రాందాస్ దృష్టికి తీసుకెళ్లగా సానుకూలంగా స్పందించినందున సహకరించాలని కోరారు. ఈమేరకు నిర్వాసిత రైతులు పాటి రమేష్, బచ్చలి వెంకటేశ్వర్లు, పాటి రాంబాబు, మాలోతు స్వామి, గుజ్జర్లపూడి సైదులు, పాటి రంగయ్య, పాటి రామయ్య, మాలోతు బావ్సింగ్, మాచర్ల రమేష్ తదితరులు కోరినా అధికారులు వినకపోవడంతో తోపులాట, వాగ్వాదం జరిగింది. చివరకు డీఈ కిషోర్ కారేపల్లి పోలీసులకు పిర్యాదు చేశారు.సుబాబుల్ నరికివేత సందర్భంగా వాగ్వాదం -
రామనామం.. విశ్వవ్యాప్తం
● భద్రగిరిలో శిలాన్యాస్ తయారీ ● ఒక్కో శ్రీరామనామ ఇటుక రూ.60 ● నిర్మాణాలు, బహుమతులుగా ఇచ్చేందుకు పలువురి ఆసక్తిశ్రీరాముడు కొలువై ఉన్న ప్రాంగణంలో ఇటుకలు తయారు చేసి, శ్రీరామ నామాన్ని ఆవాహనం చేస్తున్నాం. ఈ ఇటుక భక్తి భావనకు చిహ్నంగా మారుతుంది. భద్రాచలంలో మాత్రమే ప్రత్యేకమైన ఈ ఇటుకలు నిత్యం అందుబాటులో ఉంటాయి. – కె.దామోదర్రావు, రామాలయ ఈఓ, భద్రాచలం భద్రాచలం శ్రీరామనామంతో ఇటుక ఉంటే మాకు శ్రీరామరక్షగా ఉందని భావిస్తాం. ఇంటిలో దేవుడి గదిలో పెట్టుకుని పూజిస్తాం. ఇంటి నిర్మాణాలకు ఇది వాడితే శ్రీరామచంద్రుడి అనుగ్రహం ఉంటుందని మా విశ్వాసం. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. – నరేష్, విశాఖపట్టణం‘శ్రీరామ రక్ష సర్వజగద్రక్ష’ శ్లోకం విశ్వ వ్యాప్తమైంది. దీనిని బుద్ధ కౌశిక రుషి రచించారని, శ్రీరాముడు రక్షకుడు, సమస్త జగత్తుకు అండగా ఉంటాడని అర్థమని పండితులు చెబుతున్నారు. ఈ శ్లోకాన్ని భద్రగిరి క్షేత్రంలో మరింతగా పఠిస్తుంటారు. అలాంటి శ్రీరామ నామాన్ని ఇటుకల్లో సైతం ముద్రించి భక్తులకు విక్రయించే కార్యక్రమాన్ని భద్రగిరి రామాలయ వర్గాలు చేపట్టాయి. దీంతో రామనామం విశ్వవ్యాప్తమవుతోందని అర్చకులు పేర్కొంటున్నారు. – భద్రాచలం శిలాన్యాస్కు శ్రీకారం శ్రీరామ శిలాన్యాస్ కార్యక్రమానికి భద్రాచలంలో ఆలయ అధికారులు శ్రీకారం చుట్టారు. రామాయణ కాలంలో ఇటుకను శిలాన్యాస్ అని పిలిచారని, ఇక్కడ తయారుచేసే ఇటుకకు శ్రీరామ శిలాన్యాస్ అని నామకరణం చేశామని పండితులు చెబుతున్నారు. మట్టి, ఇసుక కలిపి ఇటుకల తయారీకి ప్రత్యేక అచ్చులను సిద్ధం చేశారు. ఇటుకలపై ‘జై శ్రీరామ్’ అని వచ్చేలా చేశారు. కాగా, మొదట మట్టితోనే ఇలాంటి ఇటుకలు తయారు చేసినా.. భక్తులు కొనుగోలు చేసి తీసుకెళ్లే సమయంలో పగిలిపోతున్నాయి. దీంతో ఇటీవల ఇసుక, సిమెంట్తో ఇటుకలను తయారుచేస్తున్నారు. వీటికి టెండర్లు పిలిచి కాంట్రాక్టర్ ద్వారా విక్రయిస్తున్నారు. ఒక్కో ఇటుక రూ.60 చొప్పున భక్తులకు అందజేస్తున్నారు. ఆలయంలోని గోశాల ప్రాంగణంలో తయారు చేసి ప్రత్యేక కౌంటర్ ద్వారా విక్రయిస్తున్నారు. పెరుగుతున్న ఆదరణ సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు వీటిని కొనుగోలు చేసేందుకు క్రమంగా ఆసక్తి చూపుతున్నారు. అయితే వీటిని బస్సుల్లో తీసుకెళ్తుంటే విరిగిపోతాయని, ప్రయాణం కూడా భారమని కొందరు భయపడుతున్నారు. కార్లు, ఆటోల్లో వచ్చిన భక్తులు మాత్రం అత్యధికంగా కొనుగోలు చేస్తున్నారు. ఆన్లైన్ సౌకర్యంతోపాటు, ఆలయం వారే నేరుగా ఇంటివరకు రవాణా చేస్తే మరింతగా ఆదరణ పెరుగుతుందని భక్తులు భావిస్తున్నారు. ఇళ్లు, కార్యాలయాలు, ఇతర భవనాల నిర్మాణాలకు శంకుస్థాపన సమయంలో ఈ ఇటుకలు వినియోగిస్తున్నామని చెబుతున్నారు. బంధువులకు, స్నేహితులకు గిఫ్ట్గా ఇవ్వడంతో పాటు భక్తి, ఆధ్యాత్మికను పెంచే ధార్మిక కార్యక్రమాల్లో ఈ ఇటుకలు ఉపయోగించవచ్చని ఆలయ అధికారులు అంటున్నారు. -
నేడు మంత్రి తుమ్మల పర్యటన
ఖమ్మంఅర్బన్: రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదివారం ఉమ్మడి జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 9గంటలకు కొణిజర్ల మండలం అంజనాపురంలో గోద్రెజ్ ఆయిల్పామ్ ఫ్యాక్టరీ నిర్మాణ పనులను పరిశీలిస్తారు. ఆతర్వాత భద్రాద్రి జిల్లా పాల్వంచ శ్రీనివాస కాలనీలో జరిగే శ్రీ వేంకటేశ్వర స్వామి కల్యాణోత్సవంలో పాల్గొంటారు. శ్రీవారికి ప్రత్యేక పూజలు ఎర్రుపాలెం: జమలాపురంలోని శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు జరిగాయి. స్వామి మూలవిరాట్తో పాటు ఆవరణలోని శ్రీవారి పాదానికి అర్చకులు పంచామృతంతో అభిషేకం నిర్వహించారు. ఆతర్వాత స్వామి, అలివేలు మంగ, పద్మావతి అమ్మవార్లను అలంకరించి నిత్యకల్యాణం, పల్లకీసేవ చేశారు. జనగామ జిల్లా డిప్యూటీ కలెక్టర్ వెంకటరమణతో పాటు భక్తులు పెద్దసంఖ్యలో స్వామిని దర్శించుకున్నారు. ఈఓ జగన్మోహన్రావు, వ్యవస్థాపక ధర్మకర్త ఉప్పల విజయదేవశర్మ, ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాసశర్మ, ఉద్యోగులు సోమయ్య, కృష్ణప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
స్తంభాద్రి ఆలయ చైర్మన్గా కూరపాటి
ఖమ్మంగాంధీచౌక్: ఖమ్మంలోని స్వయంభూ శ్రీ స్తంభాద్రి లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం(గుట్ట) అభివృద్ధి కమిటీ చైర్మన్గా డాక్టర్ కూరపాటి ప్రదీప్కుమార్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. అలాగే, కమిటీ సభ్యులుగా కర్నాటి రాధిక, చిన్ని మధుసూదన్రావు, చల్లా మధుసూదన్ రావు, మోర్ల శ్రీనివాస్, మందడపు సాయివెంకటకృష్ణ, కొల్లా నాగేందర్, చారుగుండ్ల రవికుమార్, పంతం సీతారాములు, శనగవరపు ప్రసాద్ బాధ్యతలు చేపట్టారు. అనంతరం చైర్మన్, కమిటీ సభ్యులను పలువురు సన్మానించారు. దేవాదాయ, ధర్మాదాయ శాఖ పర్యవేక్షకురాలు సమత, ఆలయ ఈఓ కొత్తూరు జగన్మోహన్రావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం చైర్మన్ కూరపాటి మాట్లాడుతూ దేవస్థానం అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. రూ.కోటి వ్యయంతో పవర్ ట్రాన్స్ఫార్మర్ రఘునాఽథపాలెం: రఘునాథపాలెం సబ్స్టేషన్లో రూ.కోటి విలువైన 5 ఎంవీఏ సామర్థ్యంతో పవర్ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేశారు. ఇక్కడ ఇన్నాళ్లు 3.15 ఎంవీఏ ట్రాన్స్ఫార్మర్తో సరఫరా కొనసాగుతోంది. అయితే, గ్రామాల్లో లోఓల్టేజీ సమస్య నివారణ కోసం అధిక సామర్థ్యంతో కొత్త ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటుచేయగా శనివారం ప్రారంభించారు. డీఈలు రామారావు, భద్రుపవార్, ఏడీఈ సంజీవ్ కుమార్, ఏఏఈ శంకర్తో పాటు సిబ్బంది పాల్గొన్నారు. వేసవి దృష్ట్యా ఏసీ బస్సులు ఖమ్మంమయూరిసెంటర్: ఖమ్మం కొత్త బస్టాండ్ నుండి హైదరాబాద్, మియాపూర్, బెంగళూరుకు రాజధాని, లహరి ఏసీ బస్సులతో పాటు సూపర్ లగ్జరీ బస్సులు నడిపిస్తున్నట్లు ఖమ్మం డిపో మేనేజర్ శివప్రసాద్ తెలిపారు. వేసవి దృష్ట్యా ఖమ్మం నుంచి హైదరాబాద్కు ఉదయం 4నుంచి రాత్రి 10–45గంటల వరకు, హైదరాబాద్ నుంచి ఖమ్మంకు ఉదయం 4–15 నుంచి రాత్రి 11–30 గంటల వరకు ప్రతీ 45 నిమిషాలకొక నాన్ స్టాప్ ఏసీ రాజధాని బస్సులు ఉంటాయని వెల్లడించారు. ఖమ్మం నుంచి మియాపూర్కు ఏసీ బస్సులు తెల్లవారుజామున 3–15 గంటలకు, మధ్యాహ్నం 12–30 గంటలకు, సాయంత్రం 4–15, 6–40, రాత్రి 11–15 గంటలకు నడుస్తాయని, మధ్యాహ్నం 3గంటలకు బెంగళూరుకు ఏసీ లహరి స్లీపర్ బస్సు అందుబాటులో ఉందని తెలిపారు. అలాగే, ఖమ్మం నుంచి శ్రీశైలంకు రాత్రి 12–15 గంటలకు, విశాఖపట్నంకు ఉదయం 7–30, రాత్రి 7, 9గంటలకు సూపర్ లగ్జరీ బస్సులలతో పాటు ఉదయం 9గంటలకు రాజధాని బస్సు అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. రిజర్వేషన్ కోసం బస్స్టేషన్లోని కౌంటర్లో లేదా www.tgsrtcbus.in వెబ్సైట్లో సంప్రదించాలని డీఎం సూచించారు. పండితాపురం సంత వేలం మళ్లీ వాయిదా కామేపల్లి: కొమ్మినేపల్లి (పండితాపురం) గ్రామ పంచాయతీ పరిధిలోని శ్రీ కృష్ణప్రసాద్ పశువుల వారాంతపు సంత కౌలు వేలం మరోమారు వాయిదా పడింది. తొలుత వేలం శుక్రవారం నిర్వహించాల్సి ఉండగా పోలీసుల సూచనతో వాయిదా వేశారు. తిరిగి శనివారం డీపీఓ రాంబాబు ఆధ్వర్యాన సంత ఆవరణలో వేలం నిర్వహించారు. గ్రామానికి చెందిన భూక్యా వీరన్న, బోడా గణేష్, బోడా శ్రీను, ధరావత్ విన్నిబాబు, గుగులోత్ వినోద్కుమార్ ధరావత్, స్వాలెన్సీ రూ.35 లక్షల చొప్పున చెల్లించి పాటలో పాల్గొన్నారు. అయితే, రూ.1,81,90,000 తో హెచ్చు పాటదారుడిగా బోడా శ్రీను నిలిచినా, గతేడాది పాట రూ.2,42,30,000 కంటే తక్కువ రావడంతో వాయిదా వేశారు. మళ్లీ ఎప్పుడు వేలం నిర్వహించేది త్వరలోనే వెల్లడిస్తామని అధికారులు తెలిపారు. సర్పంచ్ ధరావత్ అనురాధ, ఉపసర్పంచ్ మేకల మల్లికార్జున్రావు, ఎంపీడీఓ రవీందర్, ఎంపీఓ వీ.వీ.శాస్త్రి, కార్యదర్శులు శంకర్, విక్రమ్, నెహ్రూ, నర్సింహా, రాజేందర్, విజయ్ తదితరులు పాల్గొన్నారు. ఏకలవ్య పాఠశాలల మెరిట్ జాబితా విడుదల భద్రాచలంటౌన్: ఖమ్మం రీజియన్ పరిధిలోని ఏకలవ్య మోడల్ గిరిజన పాఠశాలల్లో బోధనేతర (ఔట్సోర్సింగ్) సిబ్బంది భర్తీకి తాత్కాలిక మెరిట్ జాబితా విడుదల చేసినట్లు భద్రాచలం ఐటీడీఏ పీఓ బి.రాహుల్ తెలిపారు. గతేడాది నవంబర్ 24 నుంచి డిసెంబర్ 10 వరకు దరఖాస్తు చేసుకున్న వారి వివరాలతో జాబితాను భద్రాచలం ఐటీడీఏ ఆవరణలోని ఆర్సీఓ కార్యాలయ నోటీసు బోర్డులో ప్రదర్శించినట్లు వెల్లడించారు. అభ్యర్థులు జాబితాను పరిశీలించి అభ్యంతరాలు ఉంటే ఈనెల 18లోగా కార్యాలయ పనివేళల్లో స్వయంగా సమర్పించాలని సూచించారు. -
తొలిరోజు ప్రశాంతం
● మొదలైన ఎస్సెస్సీ వార్షిక పరీక్షలు ● పలు కేంద్రాల్లో తనిఖీ చేసిన కలెక్టర్ అనుదీప్ ● విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన నలుగురి తొలగింపుకేంద్రంలోకి వస్తున్న విద్యార్థిని ఖమ్మం సహకారనగర్: జిల్లాలో పదో తరగతి వార్షిక పరీక్షలు శనివారం మొదలయ్యాయి. తొలిరోజు తెలుగు పరీ క్షకు 16,962మంది విద్యార్థుల్లో 16,941మంది హాజరు కాగా... 21మంది గైర్హాజరయ్యారు. పరీక్ష ఉదయం 9–30 గంటల నుంచి ప్రారంభం కాగా, విద్యార్థులను ఉదయం 8–30గంటల నుంచే కేంద్రాల్లోకి అనుమతించారు. విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు రావడంతో కేంద్రాల వద్ద సందడి నెలకొంది. కాగా, ఖమ్మంలోని రాజేంద్రనగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ప్రకాష్ నగర్ రోడ్డులోని మౌంట్ ఫోర్ట్ పాఠశాలల పరీక్షా కేంద్రాలను కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై ఉద్యోగులకు సూచనలు చేశారు. అలాగే, పలు కేంద్రాలను అడిషనల్ డీసీపీ ప్రసాద్రావు తనిఖీ చేశారు. నలుగురిపై వేటు జిల్లాలోని పలు పరీక్ష కేంద్రాలను డీఈఓ చైతన్యజైనీతో పాటు జిల్లా స్థాయి అబ్జర్వర్లు, అసిస్టెంట్ కమిషనర్, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు తనిఖీ చేశారు. కొణిజర్ల జెడ్పీహెచ్ఎస్ పరీక్షా కేంద్రం ఉద్యోగులు విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తేలడంతో విధుల నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇన్విజిలేటర్ సత్యనారాయణ, సిట్టింగ్ స్క్వాడ్ రవికుమార్, చీఫ్ సూపరింటెండెంట్ సుజాత, డిపార్ట్మెంటల్ ఆఫీసర్ మురళిని విధుల నుంచి తొలగించి వేరే వారికి బాధ్యతలు అప్పగించాలని ఆదేశించారు. అలాగే, వీరిపై శాఖాపరమైన చర్యలు తీసుకోనున్నట్లు డీఈఓ తెలిపారు. -
అంతర్జాతీయ పార్లమెంటరీ గ్రూప్లో ఎంపీ రఘురాంరెడ్డి
ఖమ్మంమయూరిసెంటర్: ఖమ్మంం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డికి అంతర్జాతీయ పార్లమెంటరీ స్థాయిలో కీలక బాధ్యత దక్కింది. భారత్–స్విట్జర్లాండ్ పార్లమెంటరీ ఫ్రెండ్షిప్ గ్రూప్ సభ్యుడిగా ఆయనను లోక్సభ స్పీకర్ నామినేట్ చేశారు. ప్రస్తుత 18వ లోక్సభ కాలానికి సంబంధించి భారత్, స్విట్జర్లాండ్ దేశాల మధ్య పార్లమెంటరీ స్నేహ సంబంధాలను బలోపేతం చేసే లక్ష్యంతో ఈ గ్రూప్ ఏర్పాటు చేశారు. ఇందులో రఘురాంరెడ్డికి స్థానం కల్పించినట్లు సమాచారం అందింది. ఈ గ్రూప్ ద్వారా రెండు దేశాల పార్లమెంటరీ సభ్యుల మధ్య పరస్పర సహకారం, ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి అవకాశం లభిస్తుందని పేర్కొన్నారు. కాగా, ఎంపీ కీలక గ్రూప్లో స్థానం దక్కడంపై ఉమ్మడి జిల్లా నాయకులు హర్షం వ్యక్తం చేశారు. వేగంగా డిజిటల్ పంటల సర్వే బోనకల్: పంటల వివరాలు నమోదు చేసేందుకు డిజిటల్ సర్వేలో వేగం పెంచాలని జిల్లా వ్యవసాయాధికారి ధనసరి పుల్లయ్య సూచించారు. బోనకల్ మండలం లక్ష్మీపురంలో వలంటీర్లు చేపడుతున్న సర్వే ను శనివారం ఆయన పరిశీలించి సూచనలు చేశారు. క్షేత్రస్థాయిలో వివరాలు పరిశీలిస్తూ ఆన్లైన్లో నమోదు చేసే ప్రక్రియను ఏఈఓలు పర్యవేక్షించాలని తెలిపా రు. అనంతరం మొక్కజొన్నలో యాజమాన్య పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఏఓ వినయ్కుమార్, ఏఈ ఓ షేక్ హుస్సేన్ సాహెబ్ తదితరులు పాల్గొన్నారు. -
రామయ్య పెళ్లికి రండి
డిప్యూటీ సీఎం, మంత్రులకు ఆహ్వానంభద్రాచలం: భద్రాచలంలో ఈనెల 27, 28వ తేదీల్లో జరిగే సీతారాముల కల్యాణం, పట్టాభిషేకం వేడుకలకు హాజరు కావాలని డిప్యూటీ సీఎంతో పాటు పలువురు మంత్రులకు ఆలయ అధికారులు శనివారం హైదరాబాద్లో ఆహ్వాన పత్రికలు అందజేవారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర పశుసంవర్థక, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును వారి నివాసాల్లో కలిశారు. అర్చకులు మంత్రోచ్చరణలతో ఆశ్వీరదించగా, ఈఓ ప్రసాదాలు, ఆహ్వాన పత్రికలను అందించారు. ఆలయ ఈఓ దామోదర్, ఆలయ ఉప ప్రధానార్చకుడు శ్రీనివాస రామానుజం, రామాయణం పారాయణుడు అంతర్వేది కృష్ణమాచార్య, ఏఈఓ భవానీ రామకృష్ణ తదితరులు ఉన్నారు. -
పార్లమెంట్ ముట్టడికి తరలిరండి
ఖమ్మంమయూరిసెంటర్: అఖిల భారత యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈనెల 16న తలపెట్టిన పార్లమెంట్ ముట్టడి కార్యకమానికి యువత పెద్ద సంఖ్యలో హాజరుకావాలని డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ పిలుపునిచ్చారు. ఈమేరకు ఖమ్మంలోని పార్టీ కార్యాలయంలో శనివారం ఆయన చలో ఢిల్లీ పోస్టర్లు ఆవిష్కరించారు. అనంతరం యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు వేజెండ్ల సాయికుమార్ అధ్యతన జరిగిన సమావేశంలో సత్యనారాయణ మాట్లాడుతూ దేశంలోని రైతుల పొట్ట కొట్టేలా కేంద్రప్రభుత్వం అమెరికాతో చీకటి ఒప్పందం చేసుకుందన్నారు. ఫలితంగా రైతులను రోడ్డున పడనుండగా, ఒప్పందాన్ని రద్దు చేయాలని ప్రతిపక్షాలన్నీ నిలదీసినా మోదీ ప్రభుత్వంలో చలనం లేదన్నారు. అనంతరం సాయికుమార్ మాట్లాడుతూ ఈనెల 16న పార్లమెంట్ ఎదుట జరిగే ధర్నాకు జిల్లా నుంచి పెద్దసంఖ్యలో వెళ్లనున్నట్లు తెలిపారు. నాయకులు అంజనీకుమార్, బాలగంగాధర్, ఆదర్శ్, కిరణ్, బెల్లం సాయి తేజ, అంబటి ఈశ్వర్, చల్లగొండ్ల సాయితేజ, ఖైసర్, యశ్వంత్, యడ్లపల్లి తరుణ్ తదితరులు పాల్గొన్నారు.‘చలో ఢిల్లీ’ పోస్టర్ల ఆవిష్కరణలో డీసీసీ అధ్యక్షుడు నూతి -
బండ కోసం బారులు !
నేలకొండపల్లి: యుద్ధ ప్రభావం వంట గ్యాస్ వినియోగదారులను హైరానాకు గురి చేస్తోంది. వాణిజ్య సిలిండర్ల సరఫరా నిలిపివేసినా, గృహా అవసరాలకు గ్యాస్ కొరత లేదని ప్రభుత్వం ప్రకటించింది. కానీ క్షేత్ర స్థాయిలో భిన్నమైన పరిస్థితి నెలకొంది. ఇంటి నుంచి బుకింగ్ చేసుకునే వెసులుబాటు ఉన్నప్పటికీ సర్వర్ సమస్యతో అత్యధిక కనెక్షన్లు కలిగిన కంపెనీల వినియోగదారులకు ఇబ్బంది ఎదురవుతోంది. దీనికి తోడు కొందరు కొరత ఏర్పడుతుందనే భయంతో ఇప్పటికప్పుడు అవసరం ఉన్నా అదనపు సిలిండర్ కోసం బుకింగ్ చేసుకుంటున్నారు. నేలకొండపల్లి గ్యాస్ పాయింట్ వద్ద రోజుకు 50 – 60 సిలిండర్ల బుకింగ్ జరిగేది. కానీ ఇప్పుడు 120కు పైగా దాటుతుండగా శనివారం పాయింట్ వద్దకు కాళీ సిలిండర్లతో వచ్చిన పలువురు క్యూలో ఉండడం కనిపించింది. బారులు దీరిన జనం కల్లూరురూరల్: వంట గ్యాస్ కొరత ఏర్పడుతుందన్న ప్రచారంతో కల్లూరు భారత్ గ్యాస్ ఏజన్సీ ఎదుట శనివారం పలువురు క్యూ కట్టారు. పట్టణ ప్రాంతాల్లో 25 రోజులకు, గ్రామీణ ప్రాంతాలకు 45 రోజులకొక సిలిండర్ బుకింగ్కు అవకాశముంది. దీంతో పలువురు ఏజెన్సీ వద్దకే వచ్చి తీసుకెళ్తున్నారు.నేలకొండపల్లిలో క్యూలో పెట్టిన సిలిండర్లుఖమ్మంక్రైం: గ్యాస్ సిలిండర్ల బుకింగ్ పేరుతో సైబర్ మోసాలకు పాల్పడే అవకాశం ఉన్నందున వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని పోలీసు కమిషనర్ సునీల్దత్ సూచించారు. వాట్సాప్, ఎస్ఎంఎస్ల ద్వారా వచ్చే అనుమానిత లింక్లు ఓపెన్ చేయొద్దని తెలిపారు. తక్షణ డెలివరీ ఆశ చూపి డబ్బులు, కేవైసీ అప్డేట్ పేరుతో ఓటీపీ అడిగే అవకాశముందని చెప్పారు. అధికారిక యాప్ లేదా వెబ్సైట్ ద్వారా మాత్రమే బుక్ చేసుకోవాలి తప్ప తెలియని లింక్లను క్లిక్ చేయకూడదని సూచించారు. ఎవరైనా ఫోన్ చేసి కేవైసీ అప్డేట్, సబ్సిడీ పేరుతో ఓటీపీ, బ్యాంక్ వివరాలు అడిగితే నిరాకరించాలని తెలిపారు. ఎవరైనా మోసపోతే వెంటనే 1930 నంబర్కు ఫోన్ చేయడంతో పాటు cybercrime.gov.inలో రిపోర్ట్ చేయాలని సీపీ ఓ ప్రకటనలో సూచించారు.ఖమ్మం సహకారనగర్: జిల్లాలో అక్రమ గ్యాస్ వినియోగాన్ని కట్టడి చేసేందుకు ముమ్మర తనిఖీలు చేస్తున్నట్లు జిల్లా పౌరసరఫరాల శాఖాధికారి చందన్కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా శనివారం ఖమ్మంలోని పలు హోటళ్లు, రెస్టారెంట్లలో తనిఖీ చేయగా 20 డొమిస్టిక్ సిలిండర్లు సీజ్ చేశామని వెల్లడించారు. ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. తనిఖీల్లో డిప్యూటీ తహసీల్దార్ విజయ్బాబు, కిరణ్, వీరయ్య తదితరులు పాల్గొన్నారు. -
యువకుడిపై పోక్సో కేసు నమోదు
నేలకొండపల్లి: ఓ చిన్నారితో అనుచితంగా ప్రవర్తించిన యువకుడిపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. మండలంలోని ఓ గ్రామంలో రెండో తరగతి చదువుతున్న ఏడేళ్ల చిన్నారి పాఠశాలకు వెళ్లి వస్తుండగా అదే గ్రామానికి చెందిన యువకుడు చాక్లెట్, కూల్ డ్రింక్స్ ఇస్తానని ఇంట్లోకి తీసుకెళ్లి సెల్ఫోన్లో అసభ్యకరమైన వీడియోలు చూపిస్తూ అనుచితంగా ప్రవర్తించాడు. ఆపై చిన్నారి ఏడుస్తుండడంతో పారిపోయాడు. పాప కుటుంబీకులకు విషయం చెప్పడంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా శనివారం పోక్సో కేసు నమోదు చేశారు. విద్యుదాఘాతంతో 15 గొర్రెలు మృతి కొణిజర్ల: నీళ్లు తాగేందుకు ఏటిలో దిగిన గొర్రెలు విద్యుదాఘాతంతో మృత్యువాత పడ్డాయి. నారాయణపేట జిల్లాకు చెందిన పోతుల చిన్నవెంకటప్ప, జోజాపురం బాలరాజు తమ గొర్రెలతో కొణిజర్ల మండలానికి వచ్చారు. ఈ సందర్భంగా మండలంలోని గద్దలగూడెం – అరికాయలపాడు సమీపాన చేలల్లో శనివారం మేపుతుండగా సమీప పెద్ద ఏరులో నీరు తాగేందుకు 15 గొర్రెలు దిగాయి. ఆపై విద్యుదాఘాతంతో మృత్యువాత పడ్డాయి. అయితే, కొందరు రైతులు ఏరు నుంచి పంటలకు నీరు పట్టేందుకు సబ్ మెర్సిబుల్ మోటార్లను ఏర్పాటుచేసినట్లు తెలిసింది. ఆ మోటర్లకు సంబంధించి సర్వీస్ వైర్ తెగిపోవడంతో గొర్రెలకు షాక్ వచ్చి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈమేరకు ట్రాన్స్కో వైరా డీఈ రమేష్ పరిశీలించి వివరాలు సేకరించారు. -
ట్రెంచ్ తవ్వకాలను అడ్డుకున్న గిరిజనులు
సత్తుపల్లిటౌన్: పోడు భూముల వద్ద అటవీశాఖ అధికారులు శుక్రవారం ట్రెంచ్ తవ్వకాలు చేపడుతుండగా గిరిజనులు అడ్డుకున్నాడు. సత్తుపల్లి మండలం గుడిపాడులో అయ్యగారిపేట, తామరచెరువు శివారు పోడు భూముల్లో 2005 కంటే పూర్వం నుంచి తాము సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని గిరిజనులు తెలిపారు. మున్సిపల్ కౌన్సిలర్ మట్టా ప్రసాద్ ఆధ్వర్యాన గిరిజనులు తమకు న్యాయం చేయాలంటూ కోరారు. స్పష్టమైన హామీ ఇచ్చే వరకు ఆందోళన విరమించేది లేదని అటవీశాఖ ఉద్యోగులతో వాగ్వాదానికి దిగడంతో వివాదం నెలకొంది. వీఎస్ఎస్లో భాగస్వామ్యం చేసి వచ్చిన ఫలాలనే అందిస్తాం తప్ప భూములపై హక్కు ఉండదని అధికారులు స్పష్టం చేశారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే రాగమయికి కౌన్సిలర్ ఫోన్ ద్వారా తెలపగా ఆమె రేంజర్ స్నేహలతతో మాట్లాడి త్వరలోనే సమస్య పరిష్కరిస్తామని చెప్పడంతో వివాదం సర్ధుమణిగింది. -
బీడు భూముల్లో కరెంట్ పంట!
ఖమ్మంవ్యవసాయం: బీడు భూములే కదా అని వదిలేయకుండా పంట పండించే రోజులు వచ్చేశాయి! అయితే, ఇది సాధారణ పంట కాకుండా కరెంట్ పంట కావడం విశేషం. సోలార్ విద్యుత్ ఉత్పత్తి, ప్లాంట్ల ఏర్పాటుకు కేంద్రప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది. ఇళ్లపై సూర్యఘర్ పథకం ద్వారా సౌర విద్యుత్ ప్లాంట్లు మంజూరు చేస్తుండగా, అన్నదాతల కోసం ప్రత్యేక పథకాన్ని అమలుచేస్తోంది. పంటల సాగుకు పనికి రాకుండా నిష్ప్రయోజనంగా ఉన్న భూముల ద్వారా ఆదాయం లభించేలా ప్రధాన మంత్రి కుసుమ్ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ పథకంపై రెడ్–కో(రెన్యువబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్) సంస్థ ద్వారా రైతులకు అవగాహన కల్పించడంతో పట్టాలు కలిగిన బీడు, బంజర భూముల్లో సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు ముందుకొస్తున్నారు. 56 మంది.. 86 మెగావాట్లు ఉమ్మడి జిల్లాలో పీఎం కుసుమ్ పథకం కింద సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు ఇప్పటి వరకు 56మంది రైతులు ముందుకొచ్చారు. తమకు ఉన్న బీడుభూముల్లో నిర్మాణం వ్యయం ఆధారంగా సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో 86 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్ద్యం కలిగిన ప్లాంట్లు నిర్మాణ దశలో ఉన్నాయి. ఇందులో ఖమ్మం జిల్లాలో 43 మంది రైతులు 70 మెగావాట్ల సామర్ద్యం కలిగిన ప్లాంట్లు నిర్మిస్తుండగా, భద్రాద్రి జిల్లాలో 13 మంది 16 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సోలార్ ప్లాంట్ల ఏర్పాటులో నిమగ్నమయ్యారు. ఇప్పటికే ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం జూపెడలో బీరవల్లి శ్రీనివాసరావు తన భూమిలో 2 మెగావాట్ల సామర్ద్యం కలిగిన ప్లాంట్ను ఏర్పాటుచేయడంతో ఇటీవలే గ్రిడ్కు అనుసంధానం చేశారు. సాగుకు పనికిరాని, నీటి వనరులు లేక వృథాగా వదిలేస్తున్న భూముల్లో రైతులు పీఎం కుసమ్ పథకం ద్వారా సౌర విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుచేసుకోవచ్చు. తద్వారా నిరంతరం ఆదాయం సమకూరుతుంది. దరఖాస్తు ఈనెల 31 వరకు అవకాశం ఉన్నందున అర్హులైన రైతులు సద్వినియోగం చేసుకోవాలి. – పి.అజయ్కుమార్, మేనేజర్, రెడ్కో ఉమ్మడి జిల్లా బీడు భూముల కలిగిన రైతులు ఇన్నాళ్లు ఏ పంట పండించలేక వదిలేస్తున్నారు. ఇప్పుడు ఆయా భూముల్లో కేంద్రం సోలార్ ప్లాంట్ల ఏర్పాటును ప్రోత్సహిస్తుంది. ఒక మెగావాట్ సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు 3.20 నుంచి 4 ఎకరాల వరకు భూమి కలిగి ఉండాలి. ప్లాంట్ ఏర్పాటుకు రూ. 3.20 కోట్ల నుంచి రూ.3.60 కోట్లు ఖర్చవుతుండగా పీఎం కుసుం పథకం ద్వారా 70 – 85 శాతం రుణ సౌకర్యాన్ని 12ఏళ్ల కాలపరిమితితో కల్పిస్తారు. 15 – 30 శాతం తమ వాటా చెల్లించాలి. 12 ఏళ్ల కాలపరిమితితో రుణసౌకర్యం కల్పిస్తారు. ప్లాంట్ ఏర్పాటుతో ఉత్పత్తి అయ్యే విద్యుత్ను కొనుగోలు చేసేందుకు ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థ రైతుల నుంచి ఒప్పదం కుదుర్చుకుంటుంది. తద్వారా ఒక మెగావాట్ విద్యుత్ ఉత్పత్తితో రైతులకు ఏటా రూ.53 లక్షల నుంచి రూ.55 లక్షల ఆదాయం సమకూరుతుంది. సోలార్ ప్లాంట్ల ఏర్పాటుతో రైతులకు ఆదాయం -
మాంగళ్య షాపింగ్ మాల్ ప్రారంభం
ఖమ్మంగాంధీచౌక్: ఖమ్మం వైరారోడ్డులో ఐటీ టవర్ ఎదురుగా ఏర్పాటుచేసిన మాంగళ్య షాపింగ్ మాల్ శుక్రవారం ప్రారంభమైంది. ఈ మాల్ను ప్రారంభించిన రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ వస్త్ర వ్యాపార రంగంలో దశాబ్దాల అనుభవం కలిగి మూడు రాష్ట్రాల్లో శాఖలు కలిగిన మాంగళ్య షాపింగ్ మాల్ను ఖమ్మంలో ఏర్పాటుచేయడం అభినందనీయమన్నారు. యాజమాన్యం పీఎన్.మూర్తి, కాసం నమఃశివాయ బ్రదర్స్ కృష్ణార్జునుల మాదిరిగా వ్యాపారం చేస్తూ త్వరలోనే తమిళనాడులో శాఖ ఏర్పాటుచేయనున్నారని పేర్కొన్నారు. అనంతరం సినీ నటి శ్రీలీల జ్యోతి ప్రజ్వలన చేసి మాట్లాడారు.ఖమ్మం ప్రజలు మాంగళ్య షాపింగ్ మాల్కు ఆదరిస్తారని నమ్మకం ఉందని, తద్వారా మాల్ విజయవంతమవుతుందని తెలిపారు. ఆతర్వాత మాంగళ్య షాపింగ్ మాల్ డైరెక్టర్లు పుల్లూరు నరసింహమూర్తి, కాసం నమఃశివాయ, కాసం మల్లికార్జున, కాసం కేదారినాథ్, కాసం శివప్రసాద్, పుల్లూరు అరుణ్కుమార్ మాట్లాడుతూ అన్ని వర్గాల వారికి ప్రతీ సందర్భానికి కావాల్సిన నాణ్యమైన వస్త్రాలను అందుబాటు ధరల్లో అందిస్తుండడమే తమ విజయ రహస్యమని తెలిపారు. ప్రస్తుతం మూడు రాష్ట్రాల్లో 30 బ్రాంచ్లు ఉండగా.. ఈ మూడు రాష్ట్రాల్లోనే 9–10 కొత్త ప్రాజెక్టులతో పాటు తమిళనాడులోనూ విస్తరించనున్నట్లు వెల్లడించారు. రూ.99 నుంచి ప్రారంభమై రూ.లక్ష వరకు ధరల శ్రేణిలో వస్త్రాలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో డైరక్టర్లు విశాల్, వరుణ్, కార్తీక్, అరుణ్, పనీత్, సాయికృష్ణ పాల్గొన్నారు. -
అర్హులైన వారికి అన్యాయం చేయొద్దు
మాస్లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు ఖమ్మంమయూరిసెంటర్: ఖమ్మంలోని వెలుగుమట్ల భూదాన్ భూముల్లో ఇళ్లు కూల్చివేసిన ప్రభుత్వం అర్హులెవరికీ అన్యాయం జరగకుండా విచారణ జరిపి ఇంటి స్థలం, ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు డిమాండ్ చేశారు. ఖమ్మంలోని రామనర్సయ్య విజ్ఞాన కేంద్రంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పోటు రంగారావు మాట్లాడుతూ సీఎం, మంత్రులు ఆదేశించారంటూ అధికారులు హడావిడిగా కొన్ని పేర్లు ఎంపిక చేసినా అందులో నిజమైన అర్హుల పేర్లు లేవన్నారు. మధ్యవర్తుల ప్రమేయంతో నివాసాలు ఉన్న వారికే ఇళ్లు వచ్చినందున అధికారులు పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాలని ఆయన సూచించారు. ఇరాన్పై అమెరికా యుద్ధాన్ని ఖండించాలి ఇరాన్పై అమెరికా సాగిస్తున్న దురాక్రమణ యుద్ధాన్ని భారత్ తరఫున ఖండించాలని పోటు రంగారావు డిమాండ్ చేశారు. ఆదానీ కేసు, అంబానీ పెట్టుబడులకు అమెరికాలో లాభం చేకూర్చేలా ప్రధాని మోదీ అమెరికా ముందు తలవంచుతున్నారని విమర్శించారు. ఇప్పటికై నా అమెరికా, ఇజ్రాయిల్ దురాక్రమణ యుద్ధాన్ని భారత్ ఖండించి శాంతి నెలకొనడానికి కృషి చేయాలన్నారు. ఇదేసమయాన యుద్ధాన్ని సాకుగా చూపి ప్రజలపై భారాలు మోపొద్దని సూచించారు. మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య, నాయకులు గుండా సత్యనారాయణరెడ్డి, ఆవుల వెంకటేశ్వర్లు, వరగాని కోటేశ్వరరావు, సీవై పుల్లయ్య, జి.రామయ్య, ఆవుల అశోక్, మలీదు నాగేశ్వరరావు, కొలేటి నాగేశ్వరరావు, సీహెచ్.శిరోమణి, టి.ఝాన్సీ, మంగతాయి, శోభ, ఆజాద్, శ్రీనివాస్, కవిత, అనిత తదితరులు పాల్గొన్నారు. -
ఫొటోగ్రాఫర్ చికిత్సకు రూ.66వేల ఆర్థికసాయం
ఖమ్మంగాంధీచౌక్: ఇటీవల ప్రమాదానికి గురైన ఖమ్మంకు చెందిన ఫొటోగ్రాఫర్ రాముకు ఫొటోగ్రాఫర్ల అసోసియేషన్ తరఫున చేయూతనిచ్చారు. ప్రమాదంలో ఆయన ముఖం దెబ్బతినగా శస్త్రచికిత్స కోసం అసోసియేషన్ బాధ్యులు రూ.66వేల నగదును రాముకు శుక్రవారం అందజేశారు. ఫొటోగ్రాఫర్ల అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు వెంకట్తో పాటు తిరుపతిరావు, రఘు, శ్రీనివాసరావు, సుధాకర్రావు, బండారు శేషగిరిరావు, తిరుపతిరావు పాల్గొన్నారు. హైదరాబాద్కు ప్రతీరోజు ఆరు ఏసీ బస్సులు సత్తుపల్లిటౌన్: వేసవి దృష్ట్యా సత్తుపల్లి డిపో నుంచి ప్రతీరోజు హైదరాబాద్కు ఆరు ఏసీ బస్సులు నడిపిస్తున్నట్లు డిపో మేనేజర్ గురిజాల లక్ష్మీనారాయణ తెలిపారు. సత్తుపల్లి నుంచి ఉదయం 7.45, 9.15, 10గంటలకు, రాత్రి 9, 9.45, 10.30 గంటలకు ఏసీ సర్వీసులు ఉంటాయని పేర్కొన్నారు. తిరిగి బీహెచ్ఈఎల్ నుండి సత్తుపల్లికి ఉదయం 8, 9, 10గంటలకు, రాత్రి 9, 10, 11గంటలకు బస్సులు బయలుదేరతాయని తెలిపారు. ఇక సత్తుపల్లి నుంచి తిరుపతికి మధ్యాహ్నం 3గంటలకు, తిరుపతి నుంచి సత్తుపల్లికి మధ్యాహ్నం 3గంటలకు సూపర్ లగ్జరీ సర్వీస్ ఉంటుందని, ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్షిప్కు దరఖాస్తుల ఆహ్వానం ఖమ్మంమయూరిసెంటర్: టీజీఎస్ ఆర్టీసీ ఖమ్మం రీజియన్లో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్షిప్నకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆర్ఎం సరిరామ్ తెలిపారు. బీకాం, బీఎస్సీ, బీబీఏ, బీసీఏ, బీఏ, ఇంజనీరింగ్ / డిప్లమా తదితర డిగ్రీ కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులని పేర్కొన్నారు. 2021 తర్వాత డిగ్రీ పూర్తి చేసిన వారు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఆసక్తి, అర్హత ఉన్న వారు కేంద్రప్రభుత్వ ఎన్టీఏ 2.0 పోర్టల్ https:// nats. education. gov. in ద్వారా ఈనెల 23వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎంపికై న వారికి ఆర్టీసీ ఖమ్మం రీజియన్ పరిధిలోని డిపోలు, వర్క్షాపుల్లో అప్రెంటిస్షిప్ శిక్షణ ఇస్తామని ఆర్ఎం తెలిపారు. జాతీయస్థాయి ఆర్చరీ టోర్నీకి ఎంపిక ఖమ్మం స్పోర్ట్స్: ఛత్తీస్గఢ్ రాష్ట్రం రాయపూర్లో జరగనున్న గిరిజన ఖేలో ఇండియా జాతీయ స్థాయి ఆర్చరీ టోర్నీకి ఉమ్మడి జిల్లా నుంచి నలుగురు క్రీడాకారులు ఎంపికయ్యా రు. ఈ మేరకు బి.సంజనశ్రీ, కొమరం అశ్విత్దొర, ఈ.ఆనంద్, కాయం లక్ష్మణ్ పోటీలకు ఎంపిక కాగా, అక్కడ ప్రతిభ కనబరిస్తే మరింత మెరుగైన శిక్షణ అందే అవకాశముంది. క్రీడాకారులను ఖమ్మం, భద్రాద్రి డీవైఎస్ఓలు టి.సునీల్రెడ్డి, పరంధామరెడ్డి, ఆర్చరీ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సారంగపాణి, పుట్టా శంకరయ్య అభినందించారు. విదేశాల్లో వలస కార్మికులకు సాయం ఖమ్మంమయూరిసెంటర్: విదేశాల్లో ఉపాధి కోసం వెళ్లిన తెలంగాణ వలస కార్మికుల గణాంకాలు, రాష్ట్రాల వారీగా వివరాలు వెల్ల డించాలని ఖమ్మం లోక్సభ సభ్యుడు రామసహాయం రఘురాంరెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు శుక్రవారం లోక్సభలో ఆయన ప్రశ్నించగా కేంద్ర విదేశీ వ్యవహారాలు, టెక్స్టైల్స్ శాఖల సహాయ మంత్రి పబిత్ర మార్గరీటా లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. విదేశాల్లో ఉపాధి, ఉద్యోగాల కోసం వెళ్లే కార్మికుల వివరాలను ఈ–మైగ్రేట్ పోర్టల్ ద్వారా నమోదు చేస్తున్నట్లు తెలిపారు. గత ఐదేళ్లలో 46,614 మంది పురుషులు, 858 మంది మహిళా కార్మికులు వెళ్లారని వెల్లడించారు. అక్కడ ఇబ్బందులు ఎదుర్కొనే భారతీయులకు ఇండియన్ కమ్యూనిటీ వెల్ఫేర్ ఫండ్ ద్వారా అవసరమైన వసతి, వైద్యం, న్యాయ సాయమే కాక స్వదేశానికి రప్పించడం వంటి సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. కుక్కదాడిలో ఇద్దరికి గాయాలు వైరారూరల్: మండలంలోని ముసలిమడుగులో శుక్రవారం ఓ పిచ్చి కుక్క స్వైరవిహారం చేసింది. గ్రామానికి చెందిన జోజి, చైతన్య రహదారి వెంట నడిచి వెళ్తుండగా పిచ్చికుక్క వారిపై దాడి చేసింది. ఘటనలో గాయపడిన వారికి కుటుంబీకులు సోమవరం పీహెచ్సీలో వైద్యం చేయించారు. -
దుష్పరిణామాలపై అవగాహన అవసరం
ఖమ్మం సహకారనగర్: మత్తు పదార్థాల వినియోగంతో ఎదురయ్యే దుష్పరిమాణాలపై అందరూ అవగాహన కలిగి ఉండాలని జిల్లా ఈగల్ టీం ఇన్స్పెక్టర్ విజయ్కుమార్, విద్యాశాఖ సీఎంఓ బాబోజు ప్రవీణ్కుమార్ అన్నారు. ఖమ్మం ఎన్నెస్సీ కాలనీ పాఠశాలలో జిల్లా విద్యాశాఖ – సమగ్ర శిక్షా అభియాన్ ఆధ్వర్యాన మాదక ద్రవ్యాల దుర్వినియోగంపై శుక్రవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా విజయ్కుమార్, ప్రవీణ్కుమార్ మాట్లాడుతూ పాఠశాల స్థాయిలో మత్తు పదార్థాల నివారణ కోసం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులను అప్రమత్తం చేయడమే కాక ఎవరైనా డ్రగ్స్ సేవించినట్లు ఆనవాళ్లు ఉంటే 1908 నెంబర్కు తెలియచేయాలని సూచించారు. ఈ అవగాహన సదస్సుకు జిల్లాలోని 22 పాఠశాలల నుంచి ఒక్కో ఉపాధ్యాయుడు, ఇద్దరు విద్యార్థులు హాజరయ్యారని తెలిపారు. అనంతరం చిత్రలేఖనం, పోస్టర్ తయారీ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందించారు. ఏఎంఓ ప్రభాకర్రెడ్డి, ఎంఈఓ శైలజాలక్ష్మీ, హెచ్ఎంలు దుర్గాభవాని, రమేష్, సైకాలజిస్టులు సుప్రియ, డీఆర్పీలు భాస్కర్రావు, రాము, రాంబాబు పాల్గొన్నారు. మద్యానికి బానిసై ఆత్మహత్య తిరుమలాయపాలెం: మద్యానికి బానిస కావడంతో పాటు మానసిక స్థితి సరిగా లేని ఓ యువకుడు గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మండలంలోని కాకరవాయికి చెందిన దారమల్ల శ్రీను కుమారుడు దారమల్ల మహేష్(35) మద్యానికి బానిస కావడంతో పాటు మానసిక స్థితి సరిగా ఉండడం లేదు. ఈక్రమాన గురువారం గ్రామంలోని శ్మశాన వాటిక సమీపాన గడ్డి మందు తాగిన ఆయనను కుటుంబ సభ్యులు ఖమ్మం ఆస్పత్రికి తరలించగా శుక్రవారం తెల్లవారుజామున మృతిచెందాడు. ఘటనపై కుటుంబీకుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఎనిమిది ఇసుక ట్రాక్టర్లు సీజ్ చింతకాని: చింతకాని మండలంలోని తిమ్మినేనిపాలెం, చిన్నమండవ, ముదిగొండ మండలంలోని గంధసిరి మున్నేటి నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఎనిమిది ట్రాక్టర్లను సీజ్ చేశారు. శుక్రవారం చేపట్టిన ఆకస్మిక తనిఖీల్లో ఇసుక తరలింపునకు అనుమతి లేదని తేలడంలో సీజ్ చేసినట్లు వైరా సీఐ వెంకటప్రసాద్ తెలిపారు. కాగా, ట్రాక్టర్ల బాధ్యులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై వీరేందర్ వెల్లడించారు. రూ.10 లక్షలకు ఐపీ దాఖలు ఖమ్మం లీగల్: కొణిజర్ల మండలం తనికెళ్లకు చెందిన మేకల తిరుపతిరావు, మేకల గోపి, మేకల ముత్తయ్య, మేకల యల్లయ్య రూ.10.90లక్షలకు ఐపీ దాఖలు చేశారు. వ్యాపార అభివృద్ధి కోంస పలువురి వద్ద అప్పు తీసుకోగా, ఇప్పుడు తీర్చలేని పరిస్థితి ఎదురైందని పేర్కొన్నారు. ఈమేరకు వారు 11మందిని ప్రతివాదులుగా చేరుస్తూ ఖమ్మం ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో శుక్రవారం ఐపీ దాఖలు చేశారు. 18 సిలిండర్లు సీజ్ఖమ్మంరూరల్: నిబంధనలకు విరుద్ధంగా గృహావసర సిలిండర్లు వినియోగిస్తున్న హోటళ్లు, దాబాల్లో శుక్రవారం సివిల్ సప్లయీస్ అధికారులు తనికీ చేపట్టారు. ఈ సందర్భంగా ఏదులాపురం మున్సిపాలిటీ పరిధి వరంగల్ క్రాస్, కోదాడ క్రాస్ రోడ్లలోని శ్రేష్ట, బాటిల్ రెస్టారెంట్, చౌదరి హోటల్, కింగ్స్ దాబా, శ్రీచౌదరి, శివాజీ హోటళ్లలో 18 డొమెస్టిక్ సిలిండర్లను సీజ్ చేసి బాధ్యులపై 6ఏ కేసు నమోదు చేసినట్లు డీటీ విజయబాబు తెలిపారు. తనిఖీల్లో టాస్క్ఫోర్స్ ఎస్ఐ కృష్ణ, సివిల్ సప్లయ్ ఆర్ఐ వీరయ్య తదితరులు పాల్గొన్నారు. -
చెరువులో పడి యువకుడు మృతి
మోతె: కాలకృత్యాలు తీర్చుకునేందుకు చెరువు వద్దకు వెళ్లిన యువకుడు ప్రమాదవశాత్తు కాలు జారి నీటిలో పడి మృతి చెందాడు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా మోతె మండలం మామిళ్లగూడెంలో శుక్రవారం చోటు చేసుకుంది. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం బీరోలుకు చెందిన బుడ్డిపుడి రాములు – రాణి దంపతుల కుమారుడు వెంకటేష్(26) మోతె మండలం మామిళ్లగూడెంలోని అమ్మమ్మగారి ఇంటికి వచ్చాడు. శుక్రవారం మధ్యాహ్నం బహిర్భూమికి వెళ్తున్నట్లు చెప్పి గ్రామ శివారులోని చెరువు వద్దకు వెళ్లాడు. అక్కడ ప్రమాదవశాత్తు కాలు జారి చెరువు నీటిలో మునిగిపోయాడు. సమీపాన ఉన్న పిల్లలు గ్రామానికి వెళ్లి సమాచారం ఇవ్వగా బంధువులు చేరుకుని వెంకటేశ్ను బయటకు తీయగా అప్పటికే మృతి చెందాడు. -
వేతనాలు పెండింగ్ ఉండొద్దు
తల్లాడ: జిల్లాలో ఉపాధి హామీ పథకం ద్వారా చేసిన పనులకు బిల్లులు, వేతనాలు పెండింగ్ లేకుండా చెల్లించాలనీ డీఆర్డీఓ కొండపల్లి శ్రీరామ్ సూచించారు. తల్లాడ మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం జరిగిన పథకం సమీక్షలో ఆయన మాట్లాడారు. అడిగిన ప్రతీ కూలికి పని కల్పించడమే కాక వేతనం రూ.307కు తగ్గకుండా చూడాలని తెలిపారు. తల్లాడ మండలంలో ప్రస్తుతం రోజుకు 680 మంది కూలీలే వస్తున్నందున ఈ సంఖ్య పెంచాలన్నారు. అనంతరం తల్లాడ పంచాయతీ పరిధి మంగాపురం రోడ్డులో పారిశుద్ధ్య పనులను డీఆర్డీఓ పరిశీలించారు. ఏపీడీ చలపతి, ఎంపీడీఓ ఏ.శ్రీధర్రాజు, ఎంపీఓ సురేష్బాబుతో పాటు ఉద్యోగులు సీ.హెచ్.కోటయ్య, అరుంధతి, కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. -
ప్రాణాలు తీసిన లారీ..
● రెండు వాహనాలను ఢీకొట్టడంతో ఇద్దరు మృతి ● మృతులిద్దరూ చిరువ్యాపారులే..సత్తుపల్లిరూరల్: రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబాలు వారివి. తోటలకు వెళ్లి జాయకాయలు కొనుగోలు చేసి రోజంతా వాహనాలపై తిరిగి అమ్మితే సాయంత్రానికి వచ్చే కొద్దోగొప్పో లాభమే ఆ కుటుంబాలకు జీవనాధారం. అందుకోసమే వయస్సు పైబడినా జీవనపోరాటం ఆపని ఆ ఇద్దరిని లారీ రూపంలో మృత్యువు బలి తీసుకుంది. సత్తుపల్లి మండలం నారాయణపురం శివారులో గురువారం జరిగిన ఈ విషాద ఘటన వివరాలు... అదుపు లేని అతివేగం.. పెనుబల్లి మండలం మండాలపాడుకు చెందిన పానెం సులోమాన్(55), సత్తుపల్లి మండలం రేజర్లకు చెందిన సాలి నాగేశ్వరరావు(60) ఇద్దరూ సత్తుపల్లి ప్రాంతంలో ద్విచక్రవాహనాలపై తిరుగు తూ జామకాయల అమ్ముకుని జీవనం సాగిస్తున్నా రు. రోజులాగే గురువారం ఇద్దరూ గురుబట్లగూడెం సమీపాన తోటలో జామకాయలు కొనుగోలు చేసి రెండు ద్విచక్ర వాహనాలపై సత్తుపల్లి వైపు బయలుదేరారు. ఈక్రమాన నారాయణపురం శివారులో మూలమలుపు వద్ద అతివేగంగా ఎదురు నుంచి వచ్చిన లారీ అదుపు తప్పి వీరిని ఢీకొట్టి పైనుంచి దూసుకెళ్లింది. దీంతో సులోమాన్, నాగేశ్వరరావు దేహాలు ఛిద్రమై అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న సత్తుపల్లి పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సత్తుపల్లి ఏరియా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కాగా, ఘటనాస్థలికి వచ్చిన 108 సిబ్బంది పరీక్షించి అప్పటికే సులోమాన్, నాగేశ్వరరావు మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈక్రమాన వీరి వద్ద రూ.10వేల నగదు, మొబైల్ ఫోన్లు సేకరించి వారి బంధువులకు అప్పగించిన సిబ్బందిని 108 జిల్లా మేనేజర్ అవులూరి దుర్గాప్రసాద్, పర్యవేక్షణ అధికారి షేక్ నజీరుద్దీన్ అభినందించారు. -
ఆధునిక విధానాలతో అధిక దిగుబడులు
రఘునాథపాలెం/కామేపల్లి: రైతులు వ్యవసాయంలో ఆధునిక విధానాలపై దృష్టి సారించడం ద్వారా తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధించాలని ఆత్మ కమిటీ ఖమ్మం డివిజన్ చైర్మన్ దిరిశాల చిన్న వెంకటేశ్వర్లు సూచించారు. రఘునాథపాలెం మండలం రాంక్యాతండా, కామేపల్లి మండలం పాత లింగాలలోని రైతు వేదికల్లో ‘ఆత్మ’ఆధ్వర్యాన గురువారం రైతులకు ఏర్పాటుచేసిన శిక్షణల్లో ఆయన మాట్లాడారు. సంప్రదాయ పంటలతో పోలిస్తే ఆయిల్ పామ్తో మంచి లాభాలు ఉంటా యని, వరిలో వెదజల్లే పద్ధతి అవలంబించడం ద్వారా ఖర్చులు తగ్గి ఆదాయం పెరుగుతుందని వివరించారు. అనంతరం ఖమ్మం ఏడీఏ కొంగర వెంకటేశ్వరరావు మాట్లాడగా ఏఓలు నారాయణరావు, కె.ఉమామహేశ్వర్రెడ్డి, తారా దేవి, భాస్కర్రావు, ఉద్యానవనాధికారులు నగేష్, ఆకుల వేణుతో పాటు ఉద్యోగులు, కంపెనీల ప్రతినిధులు జగదీశ్వర్, భాస్కర్, కె.ఆనందరావు, శివ, మహేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధి పనులను పరిశీలించిన ఈఎన్సీఖమ్మంఅర్బన్: జిల్లాలో రోడ్లు, భవనాల శాఖ ద్వారా చేపడుతున్న అభివృద్ధి పనులను గురువారం శాఖ ఈఎన్సీ మోహన్నాయక్ పరిశీలించారు. పాలేరు నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో పర్యటించిన ఆయన రహదారులు, వంతెనల పరిస్థితిని సమీక్షించారు. రాకాసితండా, కాచిరాజుగూడెం తదితర ప్రాంతాల్లో వరదలతో దెబ్బతిన్న రహదారులు, వంతెనలను పరిశీలించడమే కాక మరమ్మతు, అభివృద్ధి పనులపై ఇంజినీర్లకు సూచనలు చేశారు. ఖమ్మం ఎస్ఈ యాకూబ్, ఈఈ పవార్, డీఈ భగవాన్, ఏఈలు పాల్గొన్నారు. ఔషధ మొక్కలపై దృష్టి సారించాలిఖమ్మంరూరల్: రైతులు ఔషధ మొక్కల సాగుపై దృష్టి సారించాలని, తద్వారా లాభా లు ఉంటాయని మెడికల్ ప్లాంట్స్ బోర్డు రీజినల్ సెంటర్(సదరన్ రీజియన్) ఎస్ఆర్ డాక్టర్ ఎం.చంద్రశేఖర్ తెలిపా రు. ఏదులాపురం మున్సిపాలిటీ పరిధి పోలేపల్లిలోని గురుదక్షిణ ఫౌండేషన్, నేచర్ క్యూర్ అండ్ యోగా ఆస్పత్రిలో గురువారం ఔషధ మొక్కల సాగుపై రైతులు, వ్యాపారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ మాట్లాడుతూ అదనపు ఆదాయం కోసం రైతులు ఔషధ మొక్కల సాగుకు ముందుకు రావాలని తెలిపారు. జిల్లా అటవీ శాఖాధికారి సిద్ధార్థ్ విక్రమ్సింగ్, ఆయుర్వేద డాక్టర్ రమణ, చావా రఘు, జి.శంకరయ్య, నరేంద్ర పాల్గొన్నారు. మున్సిపాలిటీలో డోజర్ బ్లేడ్ మాయం కల్లూరురూరల్: కల్లూరు మున్సిపాలిటీ కార్యాలయ ఆవరణలో భద్రపర్చిన డోజర్ బ్లేడ్ ఇనుప ఛానల్ మాయమైంది. దీని విలువ రూ.35వేలకు పైగా ఉంటుందని, కనీసం ముగ్గురు లేదా నలుగురు రాకపోతే తీసుకెళ్లడం సాధ్యం కాదని చెబుతున్నారు. ఇటీవల డోజర్కు అమర్చేందుకు ఛానల్ కోసం వెతికినా ఎక్కడా కానరాలేదని సమాచారం. దీంతో ఎవరైనా చోరీ చేశారా, సిబ్బందే భద్రపర్చారా అని ఆరా తీస్తున్నారు. -
బలమైన దేశానికి బలహీన ప్రధాని
● యుద్ధ ప్రభావంతోనే ధరల పెరుగుదల ● సీపీఐ నేతలు కె.నారాయణ, కూనంనేని ఖమ్మంమయూరిసెంటర్: ప్రపంచంలోనే అత్యంత బలమైన ప్రజాస్వామ్య పునాదులు ఉన్న భారతదేశానికి మోదీ అత్యంత బలహీన ప్రధాని అని, యుద్ధాన్ని ఆపేందుకు కనీసం పనిచేయడం లేదని సీపీఐ జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ డాక్టర్ కె.నారాయణ ఆరోపించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు సాగిలపడుతున్న మోదీకి ఇందిరాగాంధీకి ఉన్న ధైర్యంలో ఐదుశాతం కూడా లేదని తెలిపారు. ఖమ్మం గిరిప్రసాద్ భవన్లో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. భారతదేశంపై యుద్ధప్రభావం ప్రారంభమైందని, గ్యాస్ ఇతర నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోతుండగా.. ఎగుమతులు నిలిచి వ్యయసాయ ఉత్పత్తుల ధరలు పడిపోనున్నాయని తెలిపారు. కాగా, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వైఖరి సమర్థనీయం కాదని పేర్కొన్న ఆయన.. రాష్ట్రపతిగా ఆదివాసీ మహిళ ఉన్నందుకు గర్వపడుతున్నా ఆదివాసీలకు నష్టం చేసే చర్యలు చేపట్టే ప్రభుత్వానికి అనుమతి ఇవ్వడాన్ని సమర్థించబోమని తెలిపారు. ఖమ్మం వెలుగుమట్ల ఘటనపై నారాయణ స్పందిస్తూ భూస్వామ్య భూములను కమ్యూనిస్టులు ఆక్రమించే క్రమంలోనే భూదాన్ ఉద్యమం వచ్చిందన్నారు. వెలుగుమట్లలో నివాసాలను కూల్చడం ఎందుకు, తిరిగి అక్కడే పట్టాలివ్వడం ఎందుకని ప్రశ్నించారు. అక్కడ నివసించేదెవరైనా భారతీయులే అయినందున పేదలందరికీ పట్టాలు అందజేయాలని డిమాండ్ చేశారు. అర్థం, పర్థం లేని చర్యలు రియల్టర్ల కోసమే జరిగాయని ఆయన పేర్కొన్నారు. కమ్యూనిస్టులను బలహీనపర్చడమే వారి ధ్యేయం.. కమ్యూనిస్టులను బలహీన పర్చడమే ధ్యేయంగా పెట్టుకున్న వారు అనవసర విమర్శలు చేస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. తామెలా పని చేయాలో తెలుసునని, పేదల పక్షాన పని చేయడమే కర్తవ్యంగా పెట్టుకున్న తమపై దురుద్దేశంతో విమర్శలు చేయడం తగదని చెప్పారు. నిత్యం ప్రజల కోసమే పోరాడే తమకు కుహనావాదుల సూచనలు అవసరం లేదన్నారు. నివాస స్థలాల పంపిణీ, ఇళ్ల నిర్మాణం ప్రభుత్వ బాధ్యత తప్ప భిక్ష కాదని కూనంనేని తెలిపారు. కమ్యూనిస్టుల అవసరం ఈ సమాజానికి ఉన్నందున రానున్న కాలంలో మరింత బలపడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి దండి సురేష్, సహాయ కార్యదర్శి జమ్ముల జితేందర్ రెడ్డి పాల్గొన్నారు. -
పేదలకు ఉచిత వైద్యం అందించడమే లక్ష్యం
ఖమ్మంమయూరిసెంటర్: పేద ప్రజలకు ఉచిత వైద్యం అందించడమే ప్రధాన లక్ష్యమని టీపీసీసీ డాక్టర్స్–మెడికల్ హెల్త్ విభాగం రాష్ట్ర చైర్మన్ రాజీవ్ తెలిపారు. ఖమ్మంలోని డీసీసీ కార్యాలయంలో పార్టీ మెడికల్ – హెల్త్ విభాగం జిల్లా చైర్మన్గా నియమితులైన డాక్టర్ కాపా మురళీకృష్ణ గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణగౌడ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాజీవ్ మాట్లాడుతూ.. ప్రత్యే క శ్రద్ధతో పనిచేసే వ్యక్తిని హెల్త్ విభాగం చైర్మన్గా నియమించినట్లు తెలిపారు. ఆతర్వాత కాంగ్రెస్ జిల్లా, నగర అధ్యక్షులు సత్యనారాయణ, నాగండ్ల దీపక్చౌదరి, మాజీ ఎమ్మెల్యే కొండబాల కోటేశ్వరరావు, డీసీసీ మాజీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్ మాట్లాడుతూ.. మురళీకృష్ణ పదవికి వన్నెతేవాలని, పేదలకు వైద్యం అందించడంలో ముందు నిలవాలని కోరారు. కార్యక్రమంలో ఖమ్మం, వైరా మార్కెట్ చైర్మన్లు యరగర్ల హన్మంతరావు, బోళ్ల గంగారావు, నాయకులు కొత్తా సీతారాములు, దొబ్బల సౌజన్య, సయ్యద్ గౌస్, మొక్కాశేఖర్గౌడ్, మూడుముంతల గంగరాజు యాదవ్, దాసరి దానియేలు, రంగా జనార్దన్, కిలారి అనిల్కుమార్, వేల్పుల మురళి పాల్గొన్నారు. టీపీసీసీ డాక్టర్స్ – మెడికల్ హెల్త్ విభాగం రాష్ట్ర చైర్మన్ రాజీవ్ -
కల్యాణం చూతము రారండి..!
● శ్రీరామనవమికి ప్రత్యేక బస్సులు ● ఉమ్మడి జిల్లాతో పాటు ఏపీ నుంచి సర్వీసులు ● హైదరాబాద్ నుంచి వచ్చే భక్తులకు రిజర్వేషన్ఖమ్మంమయూరిసెంటర్: భద్రాచలంలో శ్రీసీతా రామచంద్ర స్వామివారి కల్యాణ మహో త్సవానికి వచ్చే భక్తుల కోసం టీజీఎస్ ఆర్టీసీ ఖమ్మం రీజియన్ అధికారులు ప్రత్యేక సర్వీసులు నడిపేందుకు సిద్ధమవుతున్నారు. ఈనెల 27, 28వ తేదీల్లో ఉమ్మడి జిల్లాలోని డిపోల నుంచి షెడ్యూల్ సర్వీసులకు తోడు వీటిని నడిపిస్తారు. అలాగే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వివిధప్రాంతాల నుంచి కూడా భద్రాచలానికి బస్సులు నడపాలని ఏపీఎస్ ఆర్టీసీ నిర్ణయించింది. మొత్తంగా ఉమ్మడి జిల్లా నుంచి 234, ఆంధ్రప్రదేశ్ నుంచి 172 బస్సులు శ్రీరామనవమికి వచ్చే భక్తుల కోసం ఏర్పాటు చేస్తున్నారు. తెలంగాణలో మహాలక్ష్మి, ఆంధ్రప్రదేశ్లో సీ్త్ర–శక్తి పథకం అమల్లో ఉన్నందున భక్తుల సంఖ్య గణనీ యంగా పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. హైదరాబాద్ నుంచి... హైదరాబాద్ నుంచి భద్రాచలానికి, భద్రాచలం నుంచి హైదరాబాద్కు ప్రత్యేక సర్వీసులు ఏర్పాటు చేయడమే కాక వీటిని రిజర్వేషన్ సౌకర్యం కల్పిస్తున్నారు. ఇవికాక ఖమ్మం నుంచి నేరుగా హైదరాబాద్ ఒక బస్సు నడిపిస్తారు. ఖమ్మం రీజియన్లోని డిపోల నుంచి భద్రాచలానికి షెడ్యూల్ బస్సులతో పాటు అదనంగా 234 సర్వీసులు, భద్రాచలం నుంచి పర్ణశాల వెళ్లే భక్తుల కోసం 30 బస్సులు ఏర్పాటు చేస్తారు. గత అనుభవాల దృష్ట్యా ఆర్టీసీ ఖమ్మం ఆర్ఎం ఏ.సరిరామ్ నేతృత్వాన అధికారులు ముందస్తు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. రోజువారీ సర్వీసులకు అదనం ఉమ్మడి జిల్లా నుంచి భద్రాచలానికి రోజు వారీ 113 సర్వీసులు కొనసాగుతున్నాయి. శ్రీరామనవమి సందర్భంగా రెండు రోజుల పాటు మరో 121 బస్సులు నడిపేలా ప్రణాళిక రూపొందించారు. ఇక ఆంధ్రప్రదేశ్ నుంచి రోజువారీ 45 బస్సులకు తోడు అదనంగా 127బస్సులు ఏర్పాటు చేస్తారు. విజయవాడ – భద్రాచలం రూట్లో అత్యధికంగా 103 బస్సులు నడిపేందుకు ఏపీఎస్ ఆర్టీసీ అధికారులు నిర్ణయించారు. విజయవాడ, రాజమండ్రి, గుంటూరు, ఏలూరు, కాకినాడ, అమలాపురం వైపు వెళ్లే భక్తుల కోసం భద్రాచలం జూనియర్ కళాశాల మైదానంలో పాయింట్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ పాయింట్లో దిగిన వారు ఆలయానికి వెళ్లేందుకు ఆలయ ఆర్చీవరకు రెండు ప్రత్యేక బస్సులను నిరంతరాయంగా నడిపిస్తూ ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పిస్తారు.డిపో రూట్ బస్సుల సంఖ్య విజయవాడ విజయవాడ – భద్రాచలం 103 తిరువూరు తిరువూరు – భద్రాచలం 06 జంగారెడ్డిగూడెం జంగారెడ్డిగూడెం – భద్రాచలం 15 తాడేపల్లిగూడెం తాడేపల్లిగూడెం – భద్రాచలం 08 కాకినాడ కాకినాడ – భద్రాచలం 23 విశాఖపట్నం విశాఖపట్నం – భద్రాచలం 07 రాజమండ్రి రాజమండ్రి – భద్రాచలం 10 శ్రీరామనవమికి భద్రాచలం వచ్చే భక్తుల కోసం ఉమ్మడి జిల్లాలోని ఏడు డిపోల నుంచి ప్రత్యేక బస్సులు ఉంటాయి. అన్ని బస్టాండ్ల నుంచి రద్దీకి అనుగుణంగా బస్సులను నడిపిస్తాం. ఇందులో ఖమ్మం, హైదరాబాద్కు ఎక్కువ సర్వీసులు ఉంటాయి. తెలంగాణ, ఏపీలోని ప్రధాన ప్రాంతాలకు ప్రత్యేక సర్వీసులు ఏర్పాటు చేస్తున్నాం. ఏపీ నుంచి ఏపీఎస్ ఆర్టీసీ కూడా అదనపు సర్వీసులు నడిపిస్తుంది. – ఏ.సరిరామ్, ఆర్ఎం, ఖమ్మం రీజియన్ -
సిలిండర్లు దారి మళ్లిస్తే కఠిన చర్యలు
ఖమ్మం సహకారనగర్: గృహ వినియోగ గ్యాస్ సిలిండర్లను దారి మళ్లించినా, అక్రమంగా వినియోగించినా కఠిన చర్యలు తీసుకుంటామని అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు. కలెక్టరేట్లో గురువారం అధికారులతో సమావేశమైన ఆయన పలు అంశాలపై సమీక్షించారు. డొమెస్టిక్ సిలిండర్లను అనుమతి లేకుండా నిల్వ చేయడం, హోటళ్లు, రెస్టారెంట్లలో వినియోగించడం చట్టవిరుద్ధమని తెలిపారు. వాణిజ్య అవసరాలకు కమర్షియల్ సిలిండర్లు మాత్రమే వాడాలని సూచించారు. అలాకాకుండా డొమెస్టిక్ సిలిండర్లను దారి మళ్లిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈమేరకు సివిల్ సప్లయీస్ అధికారులు నిరంతరం తనిఖీలు చేపడుతూ నిబంధనలు ఉల్లంఘించిన వారి లైసెన్సులు రద్దు చేయలని స్పష్టం చేశారు. అలాగే, ఎల్పీజీ సబ్సిడీ లబ్ధిదారులు ఈ–కేవైఈ చేయించుకుని డెలివరీ సమయాన ఓటీపీ ఇవ్వాలని సూచించారు. లేకపోతే సబ్సిడీ ఆగిపోయే అవకాశం ఉందని తెలిపారు. అంతేకాక డొమెస్టిక్ సిలిండర్ల అక్రమ వినియోగంపై సమాచారం తెలిస్తే సివిల్ సప్లయీస్ ఉద్యోగులు లేదా పోలీస్స్టేషన్లో తెలపాలని అదనపు కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో జిల్లా పౌరసరఫరాల అధికారి చందన్కుమార్, ఉద్యోగులు పాల్గొన్నారు.అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి -
●మరో గూడు కోసం
కల్యాణం చూతము రారండి! శ్రీసీతారాముల కల్యాణం వీక్షించేలా ఈనెల 27న భద్రాచలం వెళ్లే భక్తుల కోసం ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు నడిపించనుంది.భూదాన్ భూముల్లో ఇళ్లు కూల్చివేశాక నిర్వాసితులకు ఖమ్మం అంబేద్కర్ భవన్లో ఆశ్రయం కల్పించారు. అందులో అర్హులకు ఇళ్లస్థలాలు, ఇళ్ల మంజూరు పత్రాలు అందించడంతో వారంతా ఉండడానికి మరో ఇల్లు వెదుక్కుని సామగ్రితో సహా వెళ్లిపోయారు. మళ్లీ అంబేద్కర్ భవన్కి ఎవరూ రాకుండా, ఇంకెవరూ ఆందోళన చేయకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. – స్టాఫ్ ఫొటోగ్రాఫర్ -
పేదల ఆత్మగౌరవానికి మాది పూచీ
● రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ● వెలుగుమట్లలో ఇళ్ల నిర్మాణానికి భూమిపూజఖమ్మంఅర్బన్: రాష్ట్రంలోని పేదలు ఆత్మగౌరవంతో జీవించేలా తమ ప్రభుత్వం కట్టుబడి పని చేస్తోంని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఖమ్మం వెలుగుమట్ల భూదాన్ భూముల్లో పేదలకు ఇళ్ల పట్టాలు, ఇళ్ల మంజూరు పత్రాలు అందజేసిన విషయం విదితమే. ఈమేరకు ఇందిరమ్మ కాలనీగా ఇళ్ల నిర్మాణానికి మంత్రి తుమ్మల గురువారం భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల కోసం ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమం రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలుస్తుందన్నారు. గతంలో కొందరు పేదల సంఘం ముసుగులో నకిలీ పట్టాలు ఇచ్చి అమాయక ప్రజల నుంచి రూ.లక్షలు వసూలు చేశారని విమర్శించారు. ఒకే స్థలాన్ని పలువురికి అమ్ముతూ పేదలను దుర్భర పరిస్థితుల్లోకి నెట్టారని తెలిపారు. నీళ్లు, విద్యుత్, రోడ్లు లేని ప్రాంతంలో పేదలు ఇబ్బంది పడొద్దనే భావనతో తమ ప్రభుత్వం వారికి న్యాయం చేస్తోందని వెల్లడించారు. వెలుగుమట్ల కాలనీని తెలంగాణలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. ఇక్కడ కమ్యూనిటీ హాల్, షాపింగ్ కాంప్లెక్స్, ఇంగ్లిష్ మీడియం పాఠశాల ఏర్పాటుచేసి డిసెంబర్ 9న సోనియాగాంధీ జన్మదినం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేతుల మీదుగా ప్రారంభిస్తామని తుమ్మల వెల్లడించారు. ఈమేరకు నిర్మాణాలు, మౌలిక వసతుల కల్పనలో వేగం పెంచాలని అధికారులను ఆదేశించారు. కాగా, పేదలను మోసం చేసిన వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని మంత్రి స్పష్టం చేశారు. ఈకార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్రెడ్డి, సీపీ సునీల్దత్, రాష్ట్ర విత్తన గిడ్డంగి కార్కొపరేషన్ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్య, తహసీల్దార్ సైదులు, కాంగ్రెస్ నగర అధ్యక్షుడు నాగండ్ల దీపక్చౌదరి, నాయకులు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, తుపాకుల యలగొండస్వామి, రావూరి సైదబాబు తదితరులు పాల్గొన్నారు. -
సేవతోనే ప్రజాప్రతినిధులకు సంతృప్తి
సాక్షిప్రతినిధి, ఖమ్మం: ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ అధికారంలో ఉన్న సమయాన మంచి పనులు చేశామనే పేరు సాధిస్తే ప్రజాప్రతినిధులకు సంతృప్తి కలుగుతుందని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఇటీవల ఎన్నికై న సర్పంచ్లు, మున్సిపల్ చైర్పర్సన్లు, వార్డు కౌన్సిలర్లుకు ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’లో భాగంగా ఖమ్మం భక్త రామదాసు కళాక్షేత్రంలో నిర్వహించిన శిక్షణను కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయితో కలిసి మంత్రి ప్రారంభించి మాట్లాడారరు. ‘ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక’లో భాగంగా ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ అర్హులైన వారికి చేరేలా చూడాలని తెలిపారు. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం కొంత సమయం కేటాయిస్తే క్షేత్రస్థాయిలో మంచి మార్పు కనిపిస్తుందని వెల్లడించారు. నిధులను సద్వినియోగం చేసుకోవాలి.. పాలకవర్గాలు లేక గ్రామాలకు నిధులు రాకపోగా.. ఇటీవల ఎన్నికలు నిర్వహించాక పెద్ద ఎత్తున నిధులు విడుదల అయ్యాయని మంత్రి పొంగులేటి తెలిపారు. మార్చి 31లోపు మరిన్ని నిధులు విడుదల కానున్నందున ప్రణాళికాయుతంగా చట్టపరిధిలో సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సీసీ రోడ్లు, డ్రెయిన్ల నిర్మాణంలో నాణ్యం ఉండేలా అధికారులు, ప్రజా ప్రతినిధులు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. బాధ్యతగా పనిచేస్తేనే అభివృద్ధి : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రజాప్రతినిధులు బాధ్యతాయుతంగా పనిచేస్తే గ్రామాలు, పట్టణాల్లో అభివృద్ధి సాధ్యమవుతుందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ప్రజాప్రతినిధుల శిక్షణలో మంత్రి మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలు అధిక శాతం విజయం సాధించడం అభినందనీయమన్నారు. గ్రామాలు, పట్టణాల అభివృద్ధిలో స్థానిక సంస్థలే కీలకమైనందున నిధులను న్యాయబద్ధంగా వినియోగించాలని సూచించారు. ఇదేసమయాన సొంత ఆదాయ మార్గాలను పెంచుకోవాలని తెలిపారు. అనంతరం కలెక్టర్ అనుదీప్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ను విజయవంతం కావడంలో ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం కీలకమని తెలిపారు. పది అంశాలపై చేపట్టే కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు పాల్గొనాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, డీఎఫ్ఓ సిద్ధార్థ్ విక్రమ్ సింగ్, పంచాయతీ రాజ్ డిప్యూటీ కమిషనర్, జిల్లా ప్రత్యేక అధికారి విద్యాలత, జెడ్పీ సీఈఓ దీక్షా రైనా, డీపీఓ రాంబాబు, డీఆర్డీఓ కె.శ్రీరామ్, ిసీపీఓ ఏ.శ్రీనివాస్, డీవైఎస్ఓ సునీల్ రెడ్డి, డీఎంహెచ్ఓ డాక్టర్ రామారావు, ట్రైబల్ వెల్ఫేర్ డీడీ ఎన్.విజయలక్ష్మి, అడిషనల్ డీఎంహెచ్ఓ డాక్టర్ చందునాయక్తో పాటు ఎంపీడీఓలు పాల్గొన్నారు. -
డిప్యూటీ సీఎం భట్టికి బ్రహ్మోత్సవాల ఆహ్వానం
ఎర్రుపాలెం: తెలంగాణ తిరుపతిగా పేరున్న మండలంలోని జమలాపురం శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో ఈనెల 19వ తేదీ నుంచి స్వామి వారి వసంత నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ ఉత్సవాలకు హాజరుకావా లని కోరుతూ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు ఈఓ కె.జగన్మోహన్రావు, వ్యవస్థాపక ధర్మకర్త ఉప్పల విజయదేవశర్మ మధిరలో ఆహ్వానపత్రం అందచేశారు. అలాగే, శ్రీవారి శేషవస్త్రాలు, ప్రసాదం అందజేయగా ఉత్సవాల వాల్పోస్టర్లు, కరపత్రాలను భట్టి ఆవిష్కరించారు. సర్పంచ్ తుళ్లూరు నిర్మలాకుమారి, వకుళమాత స్టేడియం నిర్మాణదాత తుళ్లూరు కోటేశ్వరరావు, ఆలయ ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాసశర్మ తదితరులు పాల్గొన్నారు. నేడు మంత్రి పొంగులేటి పర్యటన ఖమ్మంమయూరిసెంటర్: రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శుక్రవారం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 8–30 గంటలకు తిరుమలాయపాలెం మండలం బీరోలులో జరిగే శ్రీరా మలింగేశ్వరస్వామి ఆలయ ట్రస్ట్బోర్డు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొంటారు. అలాగే బీరోలు నుంచి ఏలువారిగూడెం వరకు బీటీ రోడ్డు, అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. ఆతర్వాత రాకాసితండాలో ఆకేరు వరద బాధితులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు, తిరుమలాయపాలెం మండల మస్జీద్ కమిటీ ఆధ్వర్యాన ముస్లింలకు రంజాన్ తోఫా అందించాక బంధంపల్లిలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి దమ్మాయిగూడెంలో జరిగే ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక సమావేశంలో మంత్రి పాల్గొంటారు. అనంతరం 11గంట లకు కామేపల్లి మండలంలో జాస్తిపల్లి, ముచ్చ ర్ల, లాల్యాతండా, ఊటుకూరు, తాళ్లగూడెంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడంతో పాటు లబ్ధిదారులకు మంత్రి పొంగులేటి డబుల్ బెడ్రూం ఇళ్ల మంజూరు పత్రాలు అందజేస్తారు. మూడు జిల్లాల అవసరాలకు యూరియా చింతకాని: చింతకాని మండలం పందిళ్లపల్లి రేక్ పాయింట్కు గురువారం సీఐఎల్ కంపెనీకి చెందిన 2,636.77 మెట్రిక్ టన్నుల యూరియా చేరింది. ఇందులో 1,136.77 మె.టన్నులు ఖమ్మం జిల్లాకు, 300 మె.టన్నులను భద్రాద్రి జిల్లాకు కేటాయించినట్లు జిల్లా వ్యవసాయ శాఖాధికారి డి.పుల్లయ్య తెలిపారు. అలాగే, మహబూబాబాద్ జిల్లాకు వేయి మె. టన్నులు రవాణా చేయగా, మరో 200 మె.టన్నులను బఫర్ స్టాక్గా నిల్వ చేసినట్లు వెల్లడించారు. 16నుంచి ఒంటిపూట బడులు ఖమ్మం సహకారనగర్: వేసవి దృష్ట్యా ఈనెల 16వ తేదీ నుంచి అన్ని పాఠశాలల్లో ఒంటి పూట బడులు నిర్వహించాలని విద్యాశాఖ అధికారులు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఉదయం 8నుంచి మధ్యాహ్నం 12–30గంటల వరకు నిర్వహించనున్నారు. పదో తరగతి పరీక్ష కేంద్రాలు ఉన్న పాఠశాలల్లో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5గంటల వరకు తరగతులు నిర్వహించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ప్రతిరోజు మధ్యాహ్నం 12–30గంటల తర్వాత విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందిస్తారు. -
పరీక్ష కేంద్రాల వద్ద పోలీసు ఆంక్షలు
ఖమ్మంక్రైం: పదో తరగతి పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 బీఎన్ఎస్ఎస్ అమలు చేయనున్నట్లు పోలీసు కమిషనర్ సునీల్దత్ అన్నారు. ఇందులో భాగంగా కేంద్రాలకు 200మీటర్ల దూరం వరకు ఉదయం 8–30నుండి మధ్యాహ్నం 1–30గంటల వరకు ఐదుగురికి మించి గుంపుగా ఉండొద్దని సూచించారు. ఆ మార్గంలో సభలు, ర్యాలీలు, ధర్నాలకు అనుమతి ఉండదని, పరీక్ష సమయంలో ఇంటర్నెట్, జిరాక్స్ సెంటర్లు, స్టేషనరీ దుకాణాలు మూసివేయాలని తెలిపారు. అంతేకాక కేంద్రాల వద్ద ట్రాఫిక్ అంతరాయం ఏర్పడకుండా పోలీసు పెట్రోలింగ్ కొనసాగుతుందని సీపీ వెల్లడించారు. -
యంత్రతంత్రం
● చిరు వ్యాపారులకు పీఎంఎఫ్ఎంఈ ద్వారా చేయూత ● ఆహార ప్రాసెసింగ్ యూనిట్లకు సబ్సిడీ ● పథకం ద్వారా జిల్లాలో 400 యూనిట్ల లక్ష్యం సాక్షిప్రతినిధి, ఖమ్మం: చిరు వ్యాపారులు పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ (పీఎంఎఫ్ఎంఈ) పథకం దోహదపడుతోంది. సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ రంగం ఆధునికీకరణ, పోటీతత్వాన్ని పెంచడమే లక్ష్యంగా 2020లో ఈ పథకాన్ని కేంద్రం ప్రారంభించింది. పచ్చళ్ల తయారీ, బేకరీ ఉత్పత్తులు, నూడుల్స్ వంటి అసంఘటిత మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో ఉన్న వారికి ఈ పథకం వరంలా మారనుంది. 2021–22 ఏడాది నుంచి 2025–26 వరకు జిల్లాలో 400 యూనిట్లకు రుణ సదుపాయం కల్పించాలనే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో 216 యూని ట్లకు రుణాలు మంజురు చేయగా 185 యూనిట్లకు సబ్సిడీ విడుదలైంది. ఆధునికీకరణ, మార్పులు సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం పీఎంఎఫ్ఎంఈ స్కీమ్ను ప్రవేశపెట్టింది. అసంఘటిత రంగాన్ని ఆధునికీకరించడమే కాక ఇప్పటికే ఉన్న సంస్థల్లో పోటీతత్వాన్ని పెంచేలా సాంకేతికత, ఆర్ధికసాయం, శిక్షణ అందించేందుకు ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ చొరవతో ఈ పథకం అమలవుతోంది. సాంకేతికత, వ్యాపార మెళకువలు ఆర్థిక సాయం అందించి వదిలేయకుండా పీఎంఎఫ్ఎంఈ పథకం ద్వారా సాంకేతిక, వ్యాపార మెళకువలను కూడా అందిస్తారు. నాణ్యతలో రాజీ పడకుండా ఖర్చులు తగ్గించగల ప్రాంతాల గుర్తింపు, వృథాను తగ్గించడం, సామర్థ్యాన్ని పెంచగల సాంకేతికత కోసం నిధుల్లో కొంత మేర ఉపయోగపడతాయి. ఆర్థిక సాయం, శిక్షణ, సాంకేతిక సాయంతో చిన్న తరహా పరిశ్రమలు పూర్తిస్థాయిలో పురోగమించడానికి వీలవుతుంది. రూ.11.73 కోట్ల రుణం జిల్లాలో 2021–22 నుంచి ఇప్పటి వరకు 400 యూనిట్లకు రుణాలు అందించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈమేరకు 745 మంది డీపీఆర్(డిటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్)లను బ్యాంక్లకు సమర్పించారు. పరిశీలన అనంతరం 216 యూనిట్లకు రూ.11.73 కోట్ల రుణం మంజూరైంది. మరో 134 యూనిట్లకు రుణ చెల్లింపులు పురోగతిలో ఉన్నాయి. అలాగే 185 యూనిట్లకు సబ్సిడీ కూడా విడుదలైంది. రుణాలు, సబ్సిడీ అందుతుండటంతో సూక్ష్మ ఆహార పరిశ్రమలను ఏర్పాటుకు నిరుద్యోగ యువత ఆసక్తి కనబరుస్తున్నందున... పథకం అమలుతో జిల్లాలో ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని భావిస్తున్నారు.ఈ పథకం పచ్చళ్ల తయారీ, బేకరీ(స్వీట్స్, కేక్లు), పసుపు, కారం, పప్పు, బియ్యం మిల్లుల ఏర్పాటు, నూడుల్స్ తయారీ కేంద్రాలు, తినుబండారాలు, చపాతీ తయారీ తదితర చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటుకు మద్దతుగా నిలుస్తుంది. వ్యక్తులు, యాజమాన్యాలు, ఎఫ్పీఓలు, సహకార సంస్థలు, ఎస్హెచ్జీలు, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలకు ప్రాజెక్టు వ్యయంలో 35 శాతం సబ్సిడీ అందుతుంది. చిన్న పనిముట్ల కొనుగోలు కోసం ప్రతీ స్వయం సహాయక సంఘ సభ్యుడికి రూ.40 వేలు అందిస్తారు. అలాగే ఉత్పత్తుల బ్రాండింగ్, మార్కెటింగ్కు సాయపడేలా 50 శాతం గ్రాంట్ ఇస్తారు. -
‘పది’ పరీక్షలకు రెడీ..
ఖమ్మంసహకారనగర్: పదో తరగతి వార్షిక పరీక్షలకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈనెల 14వ తేదీన శనివారం ప్రారంభమయ్యే పరీక్షల కోసం 98 కేంద్రాలు ఏర్పాటు చేశారు. జిల్లాలో మొత్తం 17,293 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. వీరిలో రెగ్యులర్ విద్యార్థులు 16,975 మంది ఉండగా, ప్రైవేట్ విద్యార్థులు 318మంది ఉన్నారు. కాగా, నిర్ణీత తేదీల్లో పరీక్షలు ఉదయం 9–30 నుంచి మద్యాహ్నం 12–30గంటల వరకు జరుగుతాయి. అయితే, ఫస్ట్ లాంగ్వేజ్, కాంపోజిట్ కోర్సు, సైన్స్ పరీక్షలు 9–30 నుంచి 12–50గంటల వరకు జరగనున్నాయి. కాగా, విద్యార్థులను 8–30గంటల నుంచే కేంద్రాల్లోకి అనుమతిస్తామని, 9–35గంటల తర్వాత అనుమతి ఉండదని అధికారులు వెల్లడించారు. కేంద్రాల్లో సౌకర్యాలు వేసవి దృష్ట్యా పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులు ఇబ్బంది పడకుండా యంత్రాంగం పటిష్టమైన ఏర్పాట్లు చేసింది. పరీక్ష సమయంలో విద్యుత్ అంతరాయం ఏర్పడకుండా చూడడంతో పాటు తాగునీటి, వైద్యసౌకర్యం కల్పిస్తారు. అలాగే, విద్యార్థులు సమయానికి కేంద్రాలకు చేరుకునేగా ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపించనుంది. అంతేకాక కేంద్రాల వద్ద పోలీసు ఆంక్షలు అమలుచేయడంతో పాటు సమీపంలోని జిరాక్స్, ఇంటర్నెట్ సెంటర్లు మూసివేయాలని ఇప్పటికే ఉన్నతాధికారులు ఆదేశించారు. కంట్రోల్ రూం ఏర్పాటు ఏమైనా ఇబ్బందులు ఎదురైతే విద్యార్థులు సంప్రదించేలా విద్యాశాఖ ఆధ్వర్యాన కంట్రోల్ రూమ్ ఏర్పాటుచేశారు. అవసరమైన విద్యార్థులు 83318 51510 నంబర్కు ఫోన్ చేస్తే ఉద్యోగులు వారి సందేహాలను నివృత్తి చేస్తారు. అంతేకాక మునుపెన్నడూ లేని విధంగా ఈసారి కేంద్రాల్లో క్లాక్రూమ్లు ఏర్పాటు చేస్తున్నారు. విద్యార్థులు పరీక్షకు వచ్చేటప్పుడు ఏమైనా సామగ్రి తెచ్చుకుంటే అందులో భద్రపర్చుకునేలా వీలుంటుంది. ముందుగా చేరుకోవాలి పదో తరగతి విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు ముందుగా చేరుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. అంతేకాక కొన్ని కేంద్రాల పేర్లు ఒకటే తరహాలో ఉన్నందున ముందుగానే సెంటర్ను సరిచూసుకుంటే చివరి నిమిషంలో ఇబ్బందులు ఉండవని చెబుతున్నారు. 9–30గంటలకు పరీక్ష ప్రారంభం కానుండగా విద్యార్థులను 8–30నుంచే కేంద్రాల్లోకి అనుమతిస్తామని వెల్లడించారు.రేపటి నుంచి ఎస్సెస్సీ పరీక్షలు పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా జరిగేలా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. కేంద్రాల వద్ద తాగునీరు సమకూర్చడమే కాక వైద్య సిబ్బంది అందుబాటులో ఉంటారు. విద్యుత్ అంతరాయం లేకుండా చూస్తాం. విద్యార్థులు ముందుగానే కేంద్రాలకు చేరుకుంటే ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయొచ్చు. – చైతన్య జైనీ, జిల్లా విద్యాశాఖాధికారి -
సర్వేను అడ్డుకున్న రైతులు
చండ్రుగొండ: మండలంలో నిర్మించనున్న సీతారామ ప్రాజెక్ట్ ఉప కాల్వ నిర్మాణ సర్వేను రైతులు బుధవారం అడ్డుకున్నారు. మద్దుకూరు శివారు నుంచి అయన్నపాలెం, చండ్రుగొండ గ్రామాల మీదుగా ఉప కాల్వ చెరువుల మీదుగా వెళ్లనుంది. అయితే అనేకసార్లు కాల్వడిజైన్ మార్చడం వల్ల అవసరం లేని చోట విలువైన భూములు దెబ్బతింటు న్నాయని అయన్నపాలెం రైతులు అభ్యంతరం వ్యక్తంచేశారు. సమాచారం అందుకున్న కాల్వ నిర్మా ణం విభాగం డీఈ నాగేశ్వరరావు, ఏఈ గణేశ్ అక్కడికి చేరుకున్నారు. ప్రధాన రైతులు అంకిరెడ్డి కృష్ణారెడ్డి, తుమ్మలపల్లి సురేశ్ ఆధ్వర్యంలో రైతులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. కాల్వ పాత డిజైన్ ప్రకారం పనులు చేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో సమస్యను రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే జారెఆదినారాయణకు ఫోన్ ద్వారా తెలిపారు. మెజార్టీ రైతుల అభిప్రాయం మేరకే కాల్వపనులు చేపట్టాలని, క్షేత్రస్థాయిలో పరిస్థితిని బట్టి కాల్వ సర్వే చేయాలని, వారం రోజుల్లో సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని మంత్రితోపాటు ఎమ్మెల్యేహామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు. -
తప్పిపోయిన వృద్ధురాలు కుటుంబం చెంతకు..
ఖమ్మంఅర్బన్: నగరంలోని వన్టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గుర్తుతెలియని మతిస్థిమితం లేని వృద్ధురాలిని చేరదీసిన పోలీసులు, అన్నం ఫౌండేషన్ సభ్యులు బుధవారం కుటుంబ సభ్యులకు అప్పగించారు. పాత ఎస్పీ కార్యాలయం ప్రాంతంలో మతిస్థిమితం లేకుండా తిరుగుతున్న వృద్ధురాలిని మంగళవారం సాయంత్రం ఏఆర్ ఎస్ఐ గుర్తించి వన్టౌన్ పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చి అప్పగించారు. అనంతరం వన్టౌన్ ఎస్ఐ రామకృష్ణ అన్నం ఫౌండేషన్ నిర్వాహకులు శ్రీనివాసరావుకు సమాచారం అందించారు. ఫౌండేషన్ ప్రతినిధులు పోలీస్ స్టేషన్కు వచ్చి విచారించగా, వృద్ధురాలు మూడు రోజుల క్రితం తప్పిపోయినట్లు గుర్తించారు. ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా వారు పోలీస్ స్టేషన్కు చేరుకుని ఎస్ఐ సమక్షంలో తీసుకెళ్లారు. కుటుంబ సభ్యులు శ్రీకాకుళం జిల్లా నుంచి ఐదు నెలల క్రితం వలస కూలీలుగా వచ్చి ఖమ్మం నగరంలోని శ్రీనగర్కాలనీలో నివసిస్తూ పనిచేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో అన్నం శ్రీనివాసరావు, ఎస్ఐ రామకృష్ణ, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
రేపు ఖమ్మంలో ‘మాంగళ్య’ ప్రారంభం
ఖమ్మంగాంధీచౌక్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో 29 బ్రాంచ్లతో వస్త్ర ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న మాంగళ్య షాపింగ్ మాల్ను ఖమ్మంలో ఈ నెల 13వ తేదీన ప్రారంభించబోతున్నట్లు నిర్వాహకులు బుధవారం తెలిపారు. ఆధునిక ఫ్యాషన్ ట్రెండ్స్కు అనుగుణంగా, ఖమ్మం నగర ప్రజలకు సరికొత్తడిజైన్లు, విభిన్న మోడళ్లతో ఈ షాపింగ్ మాల్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని పేర్కొన్నారు. వెడ్డింగ్ కలెక్షన్లు, మహిళలు, పురుషులు, యువత, పిల్లల కోసం వేలాది రకాల దుస్తులు అందుబాటులో ఉంటాయని వివరించారు. కాగా, ప్రారంభోత్సవానికి ముందే నగరమంతా ఆకట్టుకునే విధంగా హోర్డింగ్స్, బ్యానర్లతో ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రముఖ సినీనటి శ్రీలీల మాల్ను ప్రారంభించనుండగా ప్రముఖులు, వ్యాపారులు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు. -
మరుగుదొడ్లు శుభ్రం చేసిన ఎమ్మెల్యే
వైరా: 99 రోజుల ప్రజాపాలన, ప్రగతి ప్రణాళికలో భాగంగా బుధవారం ఎమ్మెల్యే మాలోత్ రాందాస్నాయక్ వైరా మున్సిపల్ కార్యాలయం సమీపంలో ఉన్న పబ్లిక్ టాయ్లెట్ల వద్ద శుభ్రం చేశారు. మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ కాపా చంద్రకళతో కలిసి ఆయన మాట్లాడుతూ.. ప్రజలు నిత్యం ఉపయోగంచుకునేలా మరుగుదొడ్లను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ యు.గురులింగం, కట్ల సంతోష్, నిమ్మతోట శ్రావణి, బోళ్ల గంగారావు, డాక్టర్ మురళీకృష్ణ, శీలం వెంకటనర్సిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాగా, 8వ వార్డు అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో వార్డు కౌన్సిలర్ చిలకా చినకోటయ్య ఎమ్మెల్యే రాందాస్నాయక్తోపాటు మున్సిపల్ కౌన్సిలర్లను సత్కరించారు. డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ, బీఆర్ఎస్ జిల్లా నాయకుడు కట్టా కృష్ణార్జున్రావు, బాణాల వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. గడువుకు ముందే ఇళ్ల స్థలాలుఖమ్మంమయూరిసెంటర్: వెలుగుమట్ల భూదా న భూముల్లో నిర్వాసితులకు న్యాయం చేస్తామని, అర్హులైన వారికి ఇళ్ల స్థలాలతో పాటు ఇళ్ల నిర్మాణానికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని ప్రకటించడంతోపాటు గడువుకంటే ముందుగానే లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేశామని డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణగౌడ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన పేదలకు న్యాయం చేసి నిజమైన ప్రజా ప్రభుత్వంగా నిలిచిందని, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రు లు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ప్రతిష్టాత్మకంగా తీసుకొని, రాజకీయాలకు తావులేకుండా నిరుపేదలను గుర్తించి 311 కుటుంబాలకు ఇంటి స్థలాల పట్టాలతో పాటు ఇందిర్మమ ఇళ్లు మంజూరు చేశారని పేర్కొన్నారు. యూరియా వాడకం తగ్గించాలివైరా కేవీకే శాస్త్రవేత్త పావని చింతకాని: పంటల సాగులో యూరియా వాడకాన్ని తగ్గించుకోవాలని వెరా కేవీకే శాస్త్రవేత్త పావని పేర్కొన్నారు. మండలంలోని జగన్నాథపురం రైతువేదికలో బుధవారం నిర్వహించిన రైతు శిక్షణకు ఆమె హాజరై మాట్లాడారు. సాగులో ఆధునిక వ్యవసాయ పద్ధతులు అవలంబించాలని, పంటలపై మోతాదుకు మించి ఎరువులను వినియోగిస్తే భూసారం దెబ్బతిని దిగుబడిపై ప్రభావం చూపుతుందని తెలిపారు.నానో యూరియా, నానో డీఏపీ వల్ల కలి గే ప్రయోజనాలు, వరిలో ప్రస్తుతం ఉన్న వంగడాలు, ఆయిల్పాం సాగు,సాయిల్ హెల్త్ కార్డు ఉపయోగం, నేచురల్ ఫార్మింగ్, కిచెన్ గార్డెనింగ్ గురించి వివరించారు. కార్యక్రమంలో సర్పంచ్లు తాళ్లూరి స్వప్న, కంచం ద్రౌపతి, వత్సవాయి పద్మ, చాపలమడుగు వీరబాబు, షేక్ రహ్మతుల్లాతోపాటు బందెల నాగార్జున్, సట్టు వెంకటేశ్వర్లు, సోములపల్లి మానస, తేజ, ఆయేషా, కార్తీక్, రైతులు పాల్గొన్నారు. అట్రాసిటీ కేసు నమోదుఖమ్మంరూరల్: ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని 30వ వార్డుకు చెందిన వెంపటి ఉపేందర్, మరికొందరిపై బుధవారం ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. పోలీసుల కథనం ప్రకారం.. తలారి రాధాకృష్ణ ఇల్లు అద్దెకు తీసుకుని షాపు నడిపిస్తున్నాడు. దానికి విద్యుత్ సరఫరా లేకపోవడంతో దుకాణం యజమాని వెంపటి ఉపేందర్ ఇంటి నుంచి విద్యుత్ కనెక్షన్ ఇప్పించాడు. అనంతరం ఉపేందర్ విద్యుత్ సరఫరా కాకుండా వైర్ కట్ చేయగా ఇదేమిటని రామకృష్ణ ప్రశ్నించడంతో కులం పేరుతో ఇష్టం వచ్చినట్లు దూషించాడు. ఉపేందర్ మరికొందరితో కలిసి దుకాణంలోని సామగ్రిని పగులగొట్టి, అద్దాలను ధ్వంసం చేశారు. రాధాకృష్ణ ఫిర్యాదు మేరకు ఉపేందర్, మరో ఇద్దరిపై అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు సీఐ రాజు తెలిపారు. -
సదా.. మీ సేవలో !
● విద్యుత్ సమస్యల పరిష్కారానికి వాట్సాప్ చాట్బాట్ ● అందుబాటులోకి 79016 28348 నంబర్ ● ఇంటి నుంచే ఫిర్యాదులకు అవకాశంఖమ్మంవ్యవసాయం: విద్యుత్ వినియోగదారుల సమస్యలను సత్వరమే పరిష్కరించేలా ఎన్పీడీసీఎల్ అధికారులు సాంకేతికతను వినియోగించుకుంటున్నారు. ఇందులో భాగంగా సమస్యలపై ఫిర్యాదు చేసేందుకు కార్యాలయాలు, సబ్స్టేషన్ల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా సెల్ఫోన్ నుంచే నమోదు చేయడంతో పాటు స్థితిగతులు తెలుసుకునే అవకాశం కల్పించారు. ఈమేరకు వాట్సాప్ చాట్బాట్ ద్వారా ఫిర్యాదు చేసే సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఫిర్యాదు నమోదు చేసే విధానం వినియోగదారులు తమ ఫోన్ నుంచి 79016 28348 నంబర్కు వాట్సాప్లో ‘ఏఐ’ అని మెసేజ్ పంపాలి. ఆ వెంటనే ‘హాయ్.. ఎన్పీడీసీఎల్ కాల్సెంటర్కు స్వాగతం’ అనే సందేశంతో పాటు రిజిస్టర్ కంప్లైంట్, ట్రాక్ కంప్లైంట్, చాట్ విత్ ఏజెంట్ అనే ఆప్షన్లు వస్తాయి. అందులో రిజిస్టర్ కంప్లైంట్ ఎంచుకుంటే విద్యుత్ కనెక్షన్ నంబర్ వివరాలతో లేదా ఆ వివరాలు లేకుండా కూడా ఫిర్యాదు చేయొచ్చు. సర్వీస్ నంబర్ నమోదు చేశాక వినియోగదారుల వివరాలు కనిపిస్తాయి. అంతా సరిగ్గా ఉందని నిర్ధారించుకున్నాక మెనూలో సమస్య రకాన్ని ఎంచుకుని ముందుకు సాగాలి త్వరగా పరిష్కారం, పారదర్శకత ఫిర్యాదు నమోదు చేయగానే ఒక నంబర్ కేటాయిస్తారు. అంతేకాక ఫిర్యాదు సమాచారం సంబంధిత అధికారికి వెళ్తుంది. సమస్యను పరిష్కరించాక వినియోగదారులకు మెసేజ్ పంపడమే కాక ఐవీఆర్ఎస్ ద్వారా కాల్ సెంటర్ నుంచి నిర్ధారించుకుంటారు. ఒకవేళ పరిష్కారంపై సంతప్తి చెందకపోతే తిరిగి ఫిర్యాదు చేయడం లేదా ఫీడ్ బ్యాక్ ఇచ్చే సౌకర్యం కూడా కల్పించారు. వెబ్సైట్లోనూ... వినియోగదారులు ఎన్పీడీసీఎల్ అధికారిక వెబ్సైట్ www. tgnpdcl. comలోని వాట్సాప్ ఐకాన్ క్లిక్ చేసి కూడా ఈ సేవలు పొందవచ్చు. అత్యవసర పరిస్థితుల్లో టోల్ ఫ్రీ నంబర్ 1912ను సంప్రదించే అవకాశముంది.విద్యుత్ సమస్యల సత్వర పరిష్కారానికి వాట్సాప్ చాట్బాట్ దోహదపడుతుంది. దీని ద్వారా వినియోగదారులు ఎక్కడకు వెళ్లాల్సిన పని లేదు. ఇంట్లో నుంచే సెల్ఫోన్ ద్వారా సమస్యలను పరిష్కరించుకోవచ్చు. – ఇనుగుర్తి శ్రీనివాసాచారి, ఎస్ఈ, ఖమ్మం -
గోదాముల్లో తనిఖీ
నేలకొండపల్లి: రాష్ట్రంలో రూ.500 కోట్లతో 50 గోదాముల నిర్మాణం చేపడుతున్నట్లు రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు తెలిపారు. మండల కేంద్రంలోని గోదాములను బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. బియ్యం స్టాక్కు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. రానున్న సీజన్కు సంబంధించిన పంట ఉత్పత్తులు నిల్వ చేసేందుకు అవసరమైన ఏర్పాట్లపై చర్చించారు. వచ్చే సీజన్లో పంట ఉత్పత్తులను నిల్వ చేసేందుకు 32 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన గోదాములను సిద్ధం చేశామని, 15 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన ప్రైవేట్ గోదాములు, వ్యవసాయ మార్కెట్లకు చెందిన మరో 15 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన గోదాములను అద్దెకు తీసుకుంటున్నట్లు వివరించారు. కార్యక్రమంలో జెర్రిపోతుల అంజిని, బచ్చలకూరి నాగరాజు, నంబూరి రామారావు, యడవల్లి నాగరాజు, కడియాల నరేశ్ పాల్గొన్నారు. -
కత్తులతో ఒకరిపై ఒకరు దాడి
నేలకొండపల్లి: పాతకక్షల నేపథ్యంలో ఇద్దరు యువకులు కత్తులతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. నేలకొండపల్లికి చెందిన చింతల ప్రవీణ్ అదే గ్రామానికి చెందిన లక్కం విజయ్ మధ్య ఇటీవల ఘర్షణలు జరుగుతున్నాయి. మంగళవారం సాయంత్రం పెట్రోల్బంక్ సెంటర్ సమీపంలో ఇద్దరు తారసపడ్డారు. మాట, మాట పెరిగి, ఇద్దరూ కత్తులతో దాడి చేసుకుని, తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు ఇద్దరిపై కేసు నమోదు చేశారు. సర్పంచ్ మృతికి నివాళి కారేపల్లి: మండలంలోని పాతకమలాపురం గ్రామ పంచాయతీ సర్పంచ్ తేజావత్ బాబూరావు (50) గుండెపోటుతో బుధవారం సాయంత్రం మృతి చెందగా పలువురు నివాళులర్పించారు. పాతకమలాపురం గ్రామ పంచాయతీ చిమ్నాతండా గ్రామానికి చెందిన తేజావత్ బాబూరావు కాంగ్రెస్ పార్టీలో ఏళ్లుగా పనిచేస్తున్నారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సర్పంచ్గా పోటీ చేసి విజయం సాధించారు. ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళికలో భాగంగా గ్రామ పంచాయతీ సిబ్బందితో పని చేయించి సాయంత్రం 6 గంటల సమయంలో బాబూరావు ఇంటికి వచ్చాడు. ఈ క్రమంలోనే అకస్మాత్తుగా గుండెపోటు రావటంతో కుప్పకూలిపోగా కుటుంబ సభ్యులు ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడికి భార్య హైమావతి, ఇద్దరు కుమార్తెలు మమత, తేజస్విని, కుమారుడు శ్రీనివాస్ ఉన్నారు. -
పరుగు అంతర్జాతీయం వైపు..
● రూ.8.50 కోట్లతో అంతర్జాతీయ ప్రమాణాలతో అథ్లెటిక్ ట్రాక్ ● సర్దార్ పటేల్ స్టేడియంలో శరవేగంగా నిర్మాణ పనులు ● ఈనెల చివరి నాటికి అందుబాటులోకి.. ● అంతర్జాతీయ టోర్నీలకు వేదికగా నిలవనున్న స్టేడియం ఖమ్మంస్పోర్ట్స్: నగరంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో ఆధునిక సింథటిక్ అథ్లెటిక్స్ ట్రాక్ ముస్తాబవుతోంది. ఇక అంతర్జాతీయ టోర్నీలకు సైతం ఆతిథ్యమిచ్చేందుకు అత్యాధునిక సదుపాయాలతో, సకల సౌకర్యాలతో సిద్ధమవుతోంది. క్రీడాకారులకు అంతర్జాతీయ ప్రమాణాలతో శిక్షణ ఇప్పించాలనే లక్ష్యంతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రూ.8.50 కోట్ల వ్యయంతో సింథటిక్ అథ్లెటిక్స్ ట్రాక్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ నెల చివరి నాటికి ట్రాక్ అందుబాటులోకి రానుంది. ప్రయోజనాలు ఎన్నో.. సింథటిక్ అథ్లెటిక్స్ ట్రాక్ నిర్మాణం వల్ల క్రీడాకారులకు మెరుగైన శిక్షణ లభించనుంది. ఈ ట్రాక్ ప్రత్యేక ఉపరితలాన్ని కలిగి ఉండటం వల్ల అథ్లెట్లు వేగంగా పరుగెత్తడానికి సహాయపడుతుంది. అలా గే, గాయాల తీవ్రత తగ్గించడంలో కూడా ఇది కీలక పాత్ర పోషిస్తుంది. అన్ని వాతావరణ పరిస్థితుల్లో కూడా ఈ ట్రాక్పై శిక్షణ కొనసాగించవచ్చు. కనీస నిర్వహణతోనే దీర్ఘకాలం ఉపయోగించుకునేలా ఇది రూపొందింది. సహజ మట్టి ట్రాక్తో పోలిస్తే సింథటిక్ ట్రాక్ అథ్లెట్లకు మెరుగైన ఉపరితలం, సౌకర్యం అందిస్తుంది. మట్టి ట్రాక్పై సాధన చేసి సింథటిక్ ట్రాక్పై పోటీల్లో పాల్గొన్నప్పుడు రన్నర్ల సామర్థ్య వేగం రెండింతలు పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. దీంతో లక్ష్యాన్ని వేగంగా ఛేదించే ఆవకాశాలుంటాయి. అంతేగాక సుమారు 1.5 నుంచి 2 సెకన్ల తేడా రావడం వల్ల పతకాలు కోల్పోయే పరిస్థితులు జిల్లా అథ్లెట్లకు ఎదురయ్యా యి. దీంతో జిల్లాస్థాయి నుంచే సింథటిక్ ట్రాక్పై శిక్షణ చాలా అవసరమని క్రీడా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. క్రీడాకారుల్లో ఆనందం సర్దార్ పటేల్ స్టేడియంలో నిర్మిస్తున్న ఈ ట్రాక్ వల్ల ఖమ్మం జిల్లా యువతకు అథ్లెటిక్స్లో మరింత ప్రో త్సాహం లభించనుంది. ఇప్పటికే సీఎం కప్–2024 రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్లో జిల్లాకు చెందిన అథ్లెట్లు ప్రాతినిధ్యం వహించి, అధిక సంఖ్యలో పతకాలు సాధించారు. అంతేగాక జాతీయస్థాయి టోర్నీలకు అర్హత సాధిస్తున్నారు. ఖమ్మం అథ్లెటిక్స్ అకాడమీ ఏర్పడిన నాటి నుంచి పతకాలు వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు సింథటిక్ ట్రాక్ అందుబాటులోకి వస్తే జిల్లాలో మరింత మంది క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించే అవకాశాలు పెరుగుతాయని శిక్షకులు భావిస్తున్నారు. -
గాయపడిన విద్యార్థి మృతి
నేలకొండపల్లి: అనంతనగర్ – నేలకొండపల్లి గ్రామా ల మధ్య మూలమలుపు వద్ద గత శుక్రవారం జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన విద్యార్థి అభి నయ్ చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. మండలంలోని అనంతనగర్ సమీపంలో ఈ నెల 6వ తేదీన జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో కోరట్లగూడెంనకు చెందిన బచ్చలకూరి అభినయ్ (19) నేలకొండపల్లి ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ సెకండియర్ చదువుతున్నాడు. పరీక్షరాసి ఇంటికి వెళ్తున్న సమయంలో ప్రమాదం జరగా.. ఖమ్మంలోని ఓ ప్రవేట్ వైద్యశాలకు తరలించారు. బుధవారం హైదరాబాద్కు తరలిస్తుండగా మృతిచెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసునమోదుచేశారు. మృతదేహాన్ని రాష్ట్రగిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, బచ్చలకూరి నాగరాజు, జెర్రిపోతుల అంజిని, కడియాల నరేశ్ సందర్శించి నివాళులర్పించారు. రోడ్డు ప్రమాదంలో యువతి..మధిర: రోడ్డు ప్రమాదంలో యువతి మృతి చెందిన ఘటన బుధవారం ఇల్లెందులపాడు సమీపంలోని మాత కోల్డ్ స్టోరే జ్ వద్ద చోటుచేసుకుంది. మధిర పట్టణానికి చెందిన స్వర్గం శ్రీనివాసరావు, రాణి దంపతులు దెందుకూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. పాఠశాలకు ప్రతీరోజు బైక్ లేదా కారులో వెళ్లి వస్తుంటారు. శ్రీనివాసరావుకు వేరే పని ఉండటంతో తల్లిని తీసుకురమ్మని.. పెద్దకుమార్తె శరణ్య (21)కు చెప్పాడు. ఆమె మధిర నుంచి దెందుకూరు పాఠశాలకు ద్విచక్రవాహనంపై వెళ్తుండగా రాయపట్నం గ్రామానికి చెందిన కృష్ణ తన టాటా ఏస్ వాహనంతో మాత కోల్డ్ స్టోరేజీ వద్ద ఢీకొట్టాడు. దీంతో శరణ్య అక్కడికక్కడే మతి చెందింది. టౌన్ పోలీసులు చేరుకుని, మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. కాగా, మృతురాలు హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ కళాశాలలో బీటెక్ ఫైనలియర్ చదువుతోంది. బాణాపురం సమీపంలో యువకుడు.. ముదిగొండ: రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం చెందిన ఘటన మండలంలోని బాణాపురం సమీపంలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. ఏపీలోని జగ్గయ్యపేట మండలం గండ్రాయికి చెందిన నగరి శ్రీనివాస్ (25) ట్రాక్టర్పై కూర్చుని వస్తున్నాడు. అతివేగంగా, నిర్లక్ష్యంగాడ్రైవర్ పల్లెబోయిననరసింహారావు ట్రాక్టర్ను నడపడంతో శ్రీనివాస్ కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. ఆయన్ను జగ్గయ్యపేట ఆస్పత్రికి తరలించగా మృతిచెందాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేర కు ముదిగొండ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. అనుమానాస్పద స్థితిలో మహిళ ..ఖమ్మంక్రైం: నగరంలోని త్రీటౌన్ పరిధిలో బుధవారం అనుమానాస్పద స్థితిలో ఓ మహిళ మృతిచైందింది. సీఐ మోహన్బాబు కథనం ప్రకారం.. నక్కా వెంకటరమణ (33) అనారోగ్యంతో బాధపడుతుండగా.. ఆమె భర్త మల్లేశ్ గత నెల 9వ తేదీన ప్రమాదవశాత్తు మృతిచెందాడు. దీంతో ఆమె ఖమ్మంలోని శ్రీనివాసర్నగర్ ప్రాంతంలో ఉంటున్న ఆమె తండ్రి వంగూరి సైదులు ఇంటికి వచ్చింది. మంచంపై మృతి చెంది ఉండటంతో పోలీసులకు సమాచారం అందించారు. కాగా, తన అక్క మృతిపై అనుమానం ఉందని ఆమె సోదరుడు వెంకటేశ్ ఫిర్యాదు మేరకు త్రీటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని అన్నం ఫౌండేషన్ నిర్వాహకులు అన్నం శ్రీనివాసరావు సాయంతో మార్చురికి తరలించారు. -
హాస్టళ్లకు ‘గ్యాస్’ సెగ
● పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో సరఫరాపై నీలినీడలు ● జిల్లాలో అప్రమత్తమైన అధికారులు ● రంగంలోకి అదనపు కలెక్టర్.. ● సక్రమంగా పంపిణీ చేయాలని ఏజెన్సీలకు సూచన ఖమ్మంమయూరిసెంటర్ : పశ్చిమాసియా దేశాల్లో నెలకొన్న యుద్ధ మేఘాలు జిల్లాలోని సంక్షేమ వసతిగృహాల వంటగదుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో ముడి చమురు, గ్యాస్ ఉత్పత్తిపై పడుతున్న ప్రభావం కారణంగా స్థానికంగా గ్యాస్ కొరత ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. దీన్ని సాకుగా చూపుతూ గ్యాస్ ఏజెన్సీలు వసతిగృహాలకు సరఫరాను చేయలేమని చెబుతుండగా, వేలాది మంది విద్యార్థుల భోజన తయారీకి విఘాతం కలిగే పరిస్థితి ఏర్పడింది. ఈ విషయాన్ని హాస్టల్ వెల్ఫేర్, డీడబ్ల్యూఓ విభాగాల వారు జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లగా అదనపు కలెక్టర్ అప్రమత్తమై గ్యాస్ ఏజెన్సీలకు కీలక సూచనలు చేసినట్లు తెలిసింది. నిబంధనల మెలిక.. గత రెండు రోజులుగా జిల్లాలోని గ్యాస్ ఏజెన్సీల నిర్వాహకులు సంక్షేమ అధికారులకు షాకిచ్చారు. ‘కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం నిర్ణీత కోటా మేరకే గ్యాస్ సరఫరా చేస్తాం.. అంతకు మించి అదనపు సిలిండర్లు ఇవ్వలేం’ అని ఖరాకండిగా చెప్పారు. యుద్ధ ప్రభావం, కేంద్ర ప్రభుత్వ నిబంధనలు ఉన్నాయని, ప్రాధాన్యత క్రమంలోనే సిలిండర్లు ఇస్తామని చెప్పడంతో వసతిగృహాల సంక్షేమ అధికారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. వెంటనే ఈ నిబంధనల విషయాన్ని జిల్లా అధికారులకు వివరించారు. విద్యార్థుల భవితవ్యంపై ఆందోళన.. జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ వసతిగృహాలతో పాటు సంక్షేమ గురుకులాలు భారీ సంఖ్యలో ఉన్నాయి. ఒక్కో వసతిగృహంలో వందలాది మంది విద్యార్థులు ఉంటూ విద్యాభ్యాసం చేస్తున్నారు. గ్యాస్ సరఫరా నిలిచిపోతే కట్టెల పొయ్యిలపై వంట చేయడం అసాధ్యమని, దీంతో పిల్లలకు సకాలంలో భోజనం అందక ఇబ్బందులు పడతారని సంక్షేమ అధికారులు, వార్డెన్లు ఆందోళన చెందారు. అదనపు కలెక్టర్ జోక్యంతో.. సమస్య తీవ్రతను గమనించిన జిల్లా సంక్షేమ అధికారులు వెంటనే అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. దీంతో ఆయన గ్యాస్ ఏజెన్సీల ప్రతినిధులకు సూచనలు చేసినట్లు తెలిసింది. విద్యార్థుల సంక్షేమం దృష్ట్యా నిరంతరాయంగా గ్యాస్ సరఫరా చేయాలని, ఎక్కడా వంటలు ఆగిపోకుండా తగినన్ని సిలిండర్లను సిద్ధం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతానికి గ్యాస్ సరఫరాకు మార్గం సుగమమైంది. అయితే నిబంధనల ప్రకారం రికార్డులు సక్రమంగా ఉండాలని ఏజెన్సీలు కోరడంతో సంక్షేమాధికారుల నుంచి ప్రత్యేక అభ్యర్థన లేఖలను ఏజెన్సీలు సేకరిస్తున్నాయి.జిల్లాలోని హాస్టళ్లు, గురుకులాల్లో నెల వారీ సిలిండర్ల వినియోగం ఇలా..(ఒక్కో దానిలో) ప్రీ మెట్రిక్ హాస్టళ్లు 10 నుంచి 15 పోస్ట్ మెట్రిక్ హాస్టళ్లు 20 నుంచి 25 సంక్షేమ గురుకులాలు 30కి పైగా వసతిగృహాల్లో అవసరం మేరకు గ్యాస్ సిలిండర్లు ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులు ఏజెన్సీలకు సూచించారు. వసతిగృహాలకు గ్యాస్ సరఫరా గతంలోలాగే జరుగుతుంది. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తుగా అన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాం. – జి.జ్యోతి, డీబీసీడీఓ, ఖమ్మం -
మధ్యవర్తిత్వంతోనే కేసుల పరిష్కారం
● మీడియేటర్లు నిష్పక్షపాతంగా వ్యవహరించాలి ● జిల్లా జడ్జి రాజగోపాల్ఖమ్మం లీగల్ : మధ్యవర్తిత్వం ద్వారానే కేసులు త్వరితగతిన పరిష్కారం అవుతాయని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. రాజగోపాల్ అన్నారు. మీడియేటర్లు నిష్పక్షపాతంగా, గోప్యంగా వ్యవహరించాలని సూచించారు. ఖమ్మం న్యాయ సేవా సదన్లో న్యాయవాదులకు నిర్వహించిన 40 గంటల మీడియేషన్ బుధవారం ముగిసింది. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాజగోపాల్ మాట్లాడుతూ.. కోర్టుల్లో పెరుగుతున్న పెండింగ్ కేసుల దృష్ట్యా మీడియేషన్ ద్వారా ఇరు పక్షాలు స్నేహపూర్వక వాతావరణంలో కేసులు పరిష్కరించుకోవడం కీలకమని అన్నారు. మీడియేషన్లో ఇరు పక్షాలు స్వచ్ఛందంగా పాల్గొనాల్సి ఉంటుందన్నారు. మీడియేషన్కు అవసరమైన కమ్యూనికేషన్ స్కిల్స్ను రిసోర్స్ పర్సన్లు అరుణాచలం, విజయకమల, శశిదేవి, రత్నతార సమర్థంగా తరగతులు నిర్వహించారని అభినందించారు. అనంతరం తర్ఫీదు పొందిన న్యాయవాదులకు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. కార్యక్రమంలో రెండో అదనపు జిల్లా న్యాయమూర్తి అపర్ణ, న్యాయమూర్తులు అర్చనకుమారి, రాంప్రసాదరావు, సీనయ్య, శివరంజని, మురళీమోహన్, దీప, రజని, బిందుప్రియ, నాగలక్ష్మి, అఖిల, న్యాయసేవా సదన్ కార్యదర్శి ఎం.కల్పన తదితరులు పాల్గొన్నారు. -
ఆణిముత్యములె తలంబ్రాలుగా..
● భద్రగిరి సీతారాముల కల్యాణ అక్షితలపై భక్తుల ఆసక్తి ● ఈ ఏడాది 400 క్వింటాళ్ల తయారీకి ఏర్పాట్లుభద్రాచలం: ‘జానకి దోసిట కెంపుల ప్రోవై.. రాముడి దోసిట నీలపు రాశై.. ఆణిముత్యములె తలంబ్రాలుగా..’అంటూ సీతారాముల కల్యాణ తలంబ్రాల విశిష్టత తెలిపారు ఓ కవి. భద్రాచలంలోని సీతారాముల కల్యాణ తలంబ్రాలను తమపై చల్లుకుంటే ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, భోగభాగ్యాలు కలుగుతాయని భక్తులు విశ్వసిస్తారు. ఇంట్లో ఉంచుకుంటే అంతా మంచి జరుగుతుందని నమ్ముతారు. ఈ క్రమంలో ఏటేటా శ్రీరామనవమి నాటి ముత్యాల తలంబ్రాలు పొందే భక్తుల సంఖ్య పెరుగుతోంది. ముత్యాలు ఎందుకంటే.. సీతారాముల కల్యాణంలో ఉపయోగించే తలంబ్రాలకు ఎంతో ప్రాచుర్యం ఉంది. ముత్యం చంద్రునికి గుర్తు. చంద్రుడు మనస్సుకు అధిపతి అని, మనస్సుకు ప్రశాంతతను కలిగించేవాడు చంద్రుడు గనుక అతనికి గుర్తుగా ముత్యాలను తలంబ్రాలలో కలుపుతారని వేద పండితులు అంటున్నారు. ముత్యాలు కలిపిన తలంబ్రాలను శిరస్సుపై పోసుకుంటే దంపతుల మధ్య మరింత అనురాగం పెంపొంది అన్యోన్యంగా జీవిస్తారని చెబుతున్నారు. దీనికి ప్రతీకగా భద్రాచలంలో ముత్యాల తలంబ్రాలను శ్రీ సీతారాముల తిరుకల్యాణోత్సవంలో ఉపయోగిస్తారని అంటున్నారు. తానీషా కాలం నుంచి.. భద్రాచలంలో జరిగే శ్రీ సీతారాముల కల్యాణంలో భక్తులతోపాటు రాజ్యమంతా (ప్రభుత్వం) రామ య్య సేవలో గడపాలనే తలంపుతో తానీషా ప్రభు వు ముత్యాలను సమర్పించారు. ఆ తర్వాత ప్రభుత్వాలు కూడా కొనసాగించాలని శాసనం కూడా చేశారు. ఈ క్రమంలోనే ప్రతీ ఏటా భద్రాచలంలో జరిగే శ్రీ సీతారాముల కల్యాణానికి రాష్ట్ర ముఖ్య మంత్రి ముత్యాల తలంబ్రాలను సమర్పిస్తున్నారు. ఏటేటా పెరుగుతున్న భక్తుల ఆసక్తి ఏటేటా శ్రీ సీతారాముల తలంబ్రాలకు ప్రాచుర్యం పెరుగుతోంది. ఐదేళ్ల క్రితం 100 క్వింటాళ్ల తలంబ్రాలు సిద్ధం చేయగా, భక్తుల డిమాండ్ దృష్ట్యా క్రమంగా పెంచుతున్నారు. ఈ ఏడాది 400 క్వింటాళ్ల తలంబ్రాలను సిద్ధం చేస్తున్నారు. ఫాల్గుణ పౌర్ణమి రోజు నుంచి తలంబ్రాలను కలిపే పనులు చేపడతారు. ఇటీవల కాలంలో గోటి తలంబ్రాలు సమర్పించే భక్తులు కూడా పెరుగుతున్నారు. ఐటీసీ సంస్థ ఏటా 100 క్వింటాళ్లను అందజేస్తుండగా, ఏపీ, తెలంగాణలోని భక్తులు మరో 100 క్వింటాళ్ల వరకు అందిస్తున్నారు. ఇతర బియ్యాన్ని సైతం దేవస్థానం వర్గాలు దాతల ద్వారా సేకరించి తలంబ్రాలను తయారు చేస్తారు. శ్రీరామనవమి రోజు ప్రత్యేక కౌంటర్ల ద్వారా, ప్రధాన కూడళ్లలో, బస్టాండ్లలో, ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా తలంబ్రాలు అందజేస్తారు. -
చింతపల్లిలో కేంద్ర బృందం సభ్యుడి పర్యటన
ఖమ్మంరూరల్ : మండలంలోని చింతపల్లి గ్రామానికి నేషనల్ వాటర్ సఫీషియల్ థీమ్ అవార్డు కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపగా, కేంద్ర బృందం సభ్యుడు తారాచందర్ బుధవారం సందర్శించారు. గ్రామంలో రోడ్లు, మురుగునీటి కాల్వలు, ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రంతో పాటు సైబీరియా కొంగలు సంచరించే చెరువు పరిసరాలను పరిశీలించారు. గ్రామంలో ఇంటింటికీ నీటి కనెక్షన్లు ఉన్నాయా అని ఆరా తీశారు. అనంతరం గ్రామపంచాయతీ కార్యాలయంలో రికార్డులు తనిఖీ చేశారు. కాగా, గ్రామస్తులు ఆయనకు బతుకమ్మలతో స్వాగతం పలికారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ దీక్షారైనా, డీపీఓ రాంబాబు, ఎంపీడీఓ రవికుమార్, గ్రామసర్పంచ్ మరియమ్మ, ఎంపీఓ శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. -
పేదలందరికీ లబ్ధి
భూదాన్ భూముల్లో డిసెంబర్ 9న గృహప్రవేశాలుసాక్షిప్రతినిది, ఖమ్మం : ‘వెలుగుమట్లలో పేదలకు కేటాయించిన భూదాన్ భూముల్లో యుద్ధప్రాతిపదికన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేస్తాం. సోనియాగాంధీ జన్మదినం సందర్భంగా డిసెంబర్ 9న ఇందిరమ్మ ఇళ్లలో లబ్ధిదారులతో పాలు పొంగించి.. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేతుల మీదుగా కాలనీని ప్రారంభింపజేస్తాం’ అని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క అన్నారు. కలెక్టరేట్లో బుధవారం వెలుగుమట్ల భూదాన్ భూముల్లో నిర్వాసితులైన 311 మందికి ఇళ్ల పట్టాలు, ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను భట్టి విక్రమార్క, రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అందజేశారు. అలాగే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పలు మండలాలకు చెందిన 101 మంది లబ్ధిదారులకు వారి స్వస్థలాల్లో ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను అధికారులతో పంపిణీ చేయించారు. 311 మంది అర్హులకు ఒకేసారి ర్యాండమైజేషన్ ద్వారా ఇళ్ల స్థలాలు కేటాయించి.. ప్లాట్ నంబర్లు కేటాయించారు. అనంతరం డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. పేదలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో పనిచేస్తున్న తమ ప్రభుత్వంపై కొందరు కావాలనే విమర్శలు చేస్తున్నారని అన్నారు. ప్రతీ వారం ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు బిల్లులు విడుదల చేస్తున్నామని తెలిపారు. భూదాన్ భూముల్లో పలువురు వచ్చి పేదలను బెదిరించే వారని, భయాందోళనల మధ్య వారు జీవనం గడపగా ఆ పరిస్థితికి తమ ప్రభుత్వం స్వస్తి పలికిందని చెప్పారు. ఈ కాలనీలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ గురుకులాన్ని సైతం నిర్మిస్తామన్నారు. పేదల సమస్యలకు పరిష్కారం.. గత ఎనిమిదేళ్లుగా భూదాన్ భూముల్లో ఇబ్బందులు పడ్డారని, ఈ సమస్యకు నేడు పరిష్కారం లభించిందని రెవెన్యూ, గృహనిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. తాగునీరు, రోడ్లు, ఫంక్షన్ హాల్, షాపింగ్ కాంప్లెక్స్, స్కూల్, విద్యుత్ సరఫరా వంటి మౌలిక వసతుల పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తామని చెప్పారు. అర్హులైన బాధితులు ఎవరైనా మిగిలి ఉన్నా వారికి కూడా ఇళ్లు మంజూరు చేస్తామని ప్రకటించారు. పేదలను మోసం చేసి దళారులు వసూలు చేసిన డబ్బు రూపాయి కూడా వదలకుండా పూర్తి స్థాయిలో వసూలు చేసి బాధితులకు అందించాలని పోలీస్ కమిషనర్ను ఆదేశించారు. ఫిబ్రవరి 24న వెలుగుమట్ల ఇళ్ల కూల్చివేతలు జరిగిన తర్వాత ప్రధాన ప్రతిపక్ష నాయకులు వచ్చి మొసలి కన్నీరు కార్చారని పొంగులేటి ఎద్దేవా చేశారు. తమ ప్రభుత్వం ప్రజల కష్టాలను చూసి చలించి నేడు పట్టాలు పంపిణీ చేస్తోందని చెప్పారు. మాఫియాపై కేసులు నమోదు చేయాలి వెలుగుమట్ల భూదాన్ భూముల్లో పెద్ద మాఫియా నడుస్తోందని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారు. పేదల నుంచి డబ్బులు వసూలు చేసిన వారిపై కేసులు నమోదు చేయాలన్నారు. 311 మంది నిరుపేదల కు పట్టాలు, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రత్యేక కేసుగా పరిగణించి ఇంటి నిర్మాణ నిధులు పెంచాలని కోరారు. కార్యక్రమంలో కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, సీపీ సునీ ల్దత్, వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్, కార్పొరేషన్ చైర్మన్లు రాయల నాగేశ్వరరావు, నాయుడు సత్యనారాయణ, ఖమ్మం మేయర్ పునుకొల్లు నీరజ, కార్పొరేషన్ కమిషనర్ అభిషేక్ అగస్త్య, అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి, కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్, నగర డిప్యూటీ మేయర్ ఫాతిమా జొహ రా, డీఆర్ఓ ఎ.పద్మశ్రీ తదితరులు పాల్గొన్నారు.ఎనిమిదేళ్లుగా భూదాన్ కాలనీలోనే ఉన్నాం. మాకు కరెంటు, రోడ్లు, నీళ్లు లాంటివి లేవు. ఇవన్నీ ఇస్తామని మా దగ్గర రూ.10 వేల నుంచి రూ.50 వేలు తీసుకుని ఇబ్బంది పెట్టారు. మమ్మల్ని ప్రభుత్వం గుర్తించి న్యాయం చేసింది. మాకు ఇప్పుడు చాలా గౌరవంగా ఉంది. – లక్ష్మీ ప్రసన్న, లబ్ధిదారురాలు ఇంటి జాగా కోసం రూ.1.80 లక్షలు చెల్లించాం. పట్టాలు రాలేదు, కరెంటు లేదు, నీళ్లు లేవు చాలా ఇబ్బందులు పడ్డాం. మా కష్టాన్ని ప్రభుత్వం గుర్తించినందుకు సంతోషంగా ఉంది. ప్రభుత్వమే పట్టా ఇచ్చి ఇల్లు కట్టిస్తుండడంతో ఇక మాకేబాధ ఉండదు. ఇప్పటికై నా న్యాయం జరిగింది. – బానోతు భవాని, లబ్ధిదారురాలువెలుగుమట్ల నిర్వాసితుల్లో ప్రతీ లబ్ధిదారుకు ఇల్లు అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. పేదల దగ్గర డబ్బులు వసూలు చేసిన దళారుల వివరాలు పోలీసులకు అందించాలని, వారికి కఠిన శిక్ష పడేలా చూస్తామని అన్నారు. అక్రమ నిర్మాణాలు కూల్చివేసి దగాకోరులను తరిమివేశామని తెలిపారు. నిరుపేదలకు వెలుగుమట్ల భూదాన్ భూముల్లో పట్టాలు పంపిణీ చేశామని, వారి పిల్లల భవిష్యత్ కోసం ఇక్కడ మోడల్ స్కూల్ నిర్మిస్తామని చెప్పారు. -
ఇతర రాష్ట్రాల ముఠాల సంచారం..
● వరుసగా చోరీలకు పాల్పడుతున్న దుండగులు ● యూపీ, మహారాష్ట్రకు చెందిన వారని అనుమానాలు ఖమ్మంక్రైం: కొన్నిరోజులుగా ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలో వరుసగా ముసుగు ధరించిన దొంగలు చోరీలకు పాల్పడుతున్న ఘటనలు సంచలనం సృష్టిస్తున్నాయి. శివారు ప్రాంతాల్లో కళాశాలలు, పాఠశాలలు, ఉన్నత వర్గాలు నివసించే ప్రాంతాల్లో ఈ ఘటనలు జరుగుతుండటంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన దొంగల ముఠాలు సంచారిస్తున్నాయని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. యూపీ, మహారాష్ట్ర గ్యాంగ్లేనా? ఖమ్మం కమిషనరేట్ పరిధిలో యూపీ, మహారాష్ట్ర గ్యాంగ్లు సంచరిస్తున్నట్లు తెలిసింది. ముసుగులు ధరించి, కాళ్లకు చెప్పులు లేకుండా వినూత్నంగా దుస్తులు ధరించి చోరీలకు పాల్పడుతున్నట్లు సీసీ పుటేజ్లలో పోలీసులు గుర్తించారు. వారి వేషధారణతోపాటు ఇతర సమాచారం మేరకు వారు అక్కడి వారని పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చినట్లు తెలిసింది. ఈ తరహా చోరీలు ఎక్కువగా ఈ రాష్ట్రాల ముఠా వారే చేస్తారని పోలీసులు అభిప్రాయపడుతున్నారు. రైల్వేస్టేషన్ ఉన్న ప్రాంతాలను ఎన్నుకొని.. వరుసగా జరుగుతున్న చోరీలకు పాల్పడుతున్న ఇతర రాష్ట్రాల ముఠాలు రైల్వేస్టేషన్ ఉన్న ప్రాంతాలనే ఎక్కువగా ఎన్నుకుంటారని పోలీసులు చెబుతున్నారు. తమ పని సులువుగా చేసుకొని పోవడానికి రైల్వేస్టేషన్ ఉన్న నగరాలు, పట్టణాల శివారు ప్రాంతాలను ఎంచుకుంటారని, అనంతరం గుర్తింపులు లేని లాడ్జీలు, హోటళ్లలో అద్దెకు దిగుతారని, అనంతరం వారు రద్దీ లేని ప్రాంతాల్లో రెక్కి చేస్తారని తెలిసింది. పోలీస్ పెట్రోలింగ్ తక్కువగా ఉన్న ఏరియాలను చూసుకొని తాళాలు వేసి ఉన్న భవనాలను ఎంపిక చేసుకుని, ముసుగులు ధరించి చోరీలకు పాల్పడి వెంటనే ఆ ప్రాంతం నుంచి వెళ్లిపోయి రైల్వేస్టేషన్లలో రైలు ఎక్కి ఇతర ప్రాంతాలకు పారిపోతూ ఉంటారని సమాచారం. అయితే, ఈ ముఠాల్లో చాలామంది కరుడుగట్టిన వారు ఉంటారని, ఒక్కోసారి వారు ఇంట్లో వారిపై దాడులకు పాల్పడే అవకాశం ఉంటుందని తెలిసింది. కొణిజర్ల మండలం విజయ ఇంజనీరింగ్ కళాశాల, వీవీ పాలెం వద్ద ఉన్న ఓ ప్రైవైట్ పాఠశాల, వెలుగుమట్ల గుట్టపై ఉన్న బ్లూ విల్లాస్ సముదాయంలో ఓ ఇంట్లో చోరీకి పాల్పడింది ఒకటే ముఠా అని పోలీసులు నిర్ధారణకు వచ్చినట్లు తెలిసింది. గతంలో ఈ తరహా ముఠాలు ఎక్కడెక్కడ చోరీలకు పాల్పడ్డాయో ఆరా తీస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే విజయవాడ, హైదరాబాద్, వరంగల్ తదితర ప్రాంతాల్లోని పోలీసులతో ఈ ముఠాల కదలికలపై చర్చిస్తున్నట్లు సమాచారం.


