breaking news
Khammam
-
విపత్తులను ఎదుర్కొనేలా..
● మున్నేటి ఒడ్డున మాక్డ్రిల్ ● పర్యవేక్షించిన కలెక్టర్, అధికారులుఖమ్మంమయూరిసెంటర్: వరదలు, ఇతర ప్రమాదాలు ఎదురైనప్పుడు బాధితులను రక్షించడంతో పాటు విపత్తులను ఎదుర్కోవడంపై ప్రజలకు అవగాహన కల్పించేలా సోమవారం మాక్ డ్రిల్ నిర్వహించారు. ఖమ్మంలోని కాల్వొడ్డు మున్నేరు(బొక్కలగడ్డ) వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్య పర్యవేక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మున్నేటికి గత రెండేళ్ల నుంచి భారీ వరదలు వస్తున్న నేపథ్యాన ప్రజలు తమను తాము రక్షించుకోవడంతో పాటు ఆస్తులు నష్టపోకుండా కాపాడుకునేలా అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. అలాగే, ప్రభుత్వ శాఖల సమన్వయంతో పనిచేసేలా ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని చెప్పారు. కాగా, జూన్ 2026 లోపు మున్నేటికి రిటైనింగ్ వాల్ నిర్మాణం పూర్తి చేయడమే లక్ష్యంగా పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. ఖమ్మం జనరల్ ఆస్పత్రి వద్ద కూడా మాక్డ్రిల్ చేపట్టామని వెల్లడించారు. రెస్క్యూ చేస్తూ.. వరదలో చిక్కుకున్న వారికి డ్రోన్ ద్వారా లైఫ్ జాకెట్లను పంపించి రక్షించడంపై ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది అవగాహన కల్పించారు. అలాగే, నీటిలో చిక్కుకున్న వారిని బయటకు తీశాక వైద్య సాయం అందించడం, ఇళ్లు మునిగితే ప్రజలను పునరావాస కేంద్రానికి తరలించే విధానాన్ని వివరించారు. అలాగే, మాక్డ్రిల్లో భాగంగా ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని ఓ ఫంక్షన్ హాల్లో పునరావాస కేంద్రం ఏర్పాటు చేసి అక్కడకు తరలించిన వారికి వైద్యసేవలు అందించడంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ ప్రసాద్ రావు, విద్యుత్, పబ్లిక్ హెల్త్ ఎస్ఈలు శ్రీనివాసాచారి, రంజిత్, జిల్లా అగ్నిమాపక అధికారి అజయ్కుమార్, డీఎంహెచ్ఓ రామారావు, డీసీఎస్ఓ చందన్కుమార్, జిల్లా ఇరిగేషన్ అధికారి వెంకట్రాం, ఏదులాపురం కమిషనర్ శ్రీనివాసరెడ్డితో పాటు వివిధ శాఖల ఉద్యోగులు అనిల్కుమార్, రాంప్రసాద్, ధరణికుమార్, శ్రీనివాస్, బెల్లం రాధిక, సుజాత, మాధవరావు, దివ్యశ్రీ, రాజేశ్వరి, వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నేడు డిప్యూటీ సీఎం భట్టి పర్యటన
ఖమ్మంమయూరిసెంటర్: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మంగళవారం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 10.30 గంటలకు ఖమ్మం చేరుకోనున్న ఆయన అక్కడి నుంచి తల్లాడ మండలం పినపాక వెళ్లి అధికారులు, ప్రజాప్రతినిధులతో సమావేశమవుతారు. ఆతర్వాత పినపాక, అన్నారుగూడెం, కల్లూరు మండలం లింగాలలో సబ్ స్టేషన్ల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. అనంతరం సత్తుపల్లిలో సింగరేణి ఏరియా జీఎం కార్యాలయ భవనాన్ని ప్రారంభించనున్న డిప్యూటీ సీఎం, ఆ తర్వాత జేవీఆర్ ఓసీని పరిశీలించి బొగ్గు ఉత్పత్తిపై సమీక్షించనున్నారు. ఆలయ నిర్మాణానికి రూ.6 లక్షల విరాళం కూసుమంచి: కూసుమంచిలో నిర్మించే రామాలయానికి కూసుమంచి వాసి, నకిరేకల్లో స్థిరపడిన బీఆర్ఎస్ నాయకుడు డాక్టర్ నలగాటి ప్రసన్నరాజ్ రూ.6,00,116 విరాళం ప్రకటించారు. ఆలయానికి భారీగా విరాళం ప్రకటించిన ప్రసన్నరాజ్ను సర్పంచ్ కొండా కృష్ణవేణితో పాటు గ్రామస్తులు అభినందించి సత్కరించారు. ఉప సర్పంచ్ చెన్ను వెంకటరమణ, మాజీ సర్పంచ్ చెన్నా మోహన్, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఆర్టీసీలో డీఎంల బదిలీ ఖమ్మంమయూరిసెంటర్: టీజీఎస్ ఆర్టీసీలో పలువురు డిపో మేనేజర్లను బదిలీ చేస్తూ ఉన్నతాధికారులు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఖమ్మం రీజియన్లో సత్తుపల్లి డిపో మేనేజర్ వి.సునీత సూర్యాపేటకు, సూర్యాపేట డీఎం జీ.ఎల్.నారాయణను సత్తుపల్లికి బదిలీ అయ్యారు. అలాగే, మధిర డిపో మేనేజర్ డి.శంకర్ను మియాపుర్ డిపో ఏడబ్ల్యూఎం, బీబీయూగా బదిలీ చేశారు. అంతేకాక భద్రాచలంలో అసిస్టెంట్ మేనేజర్గా విధులు నిర్వర్తిస్తున్న ఆర్.రామయ్యకు డిపో మేనేజర్గా పదోన్నతి కల్పిస్తూ మధిర డీఎంగా నియమించారు. ప్రజల సహకారంతోనే అటవీ వనరుల పరిరక్షణ ఖమ్మంవ్యవసాయం: అన్నిప్రజల సహకారంతోనే అటవీ వనరుల పరిరక్షణ సాధ్యమవుతుందని జిల్లా అటవీ అధికారి(డీఎఫ్ఓ) సిద్ధార్థ్ విక్రమ్ సింగ్ తెలిపారు. కృత్రిమ అటవీ సృష్టికర్త దుశర్ల సత్యనారాయణ సోమవారం ఖమ్మంలో డీఎఫ్ఓను కలిశారు. ఈ సందర్భంగా పులిగుండాల వద్ద ఎకో టూరింజం అభివృద్ధి పనులు, జిల్లాలో అడవుల పరిరక్షణ, అభివృద్ధి కార్యక్రమాలు, వన సంరక్షణ సమితిల ప్రయోజనాలపై చర్చించారు. అనంతరం డీఎఫ్ఓ మాట్లాడుతూ ప్రకృతి సంరక్షణ ఆవశ్యకతపై ప్రజలకు అవగాహన ఉండాలని తెలిపారు. టీజీవోస్ ఆధ్వర్యాన క్రిస్మస్ ఖమ్మం సహకారనగర్: రానున్న క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం ఆధ్వర్యాన సోమవారం రాత్రి యూనియన్ కార్యాలయంలో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా టీజీవోస్ రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. నాయకులు మోదుగు వేలాద్రి, శేషుప్రసాద్, రాంబాబు, రవీంద్రప్రసాద్, నరేందర్, విజయ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
సీహెచ్పీ ‘ప్రైవేట్’పరం
● టెండర్లలో దక్కించుకున్న ‘ఇనార్గో’ ● ఇప్పటికే ఉద్యోగ నియామకాలు కూడా.. ● ఆందోళన బాటలో సింగరేణి కార్మిక సంఘాలుసత్తుపల్లి: సింగరేణి సంస్థలో అత్యంత నాణ్యమైన బొగ్గు వెలికితీస్తున్న సత్తుపల్లి పరిధిలోని కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్(సీహెచ్పీ)ను ప్రైవేట్ పరం చేయడంపై కార్మికులు, సంఘాల నాయకులు మండిపడుతున్నారు. సంస్థ చరిత్రలోనే తొలిసారి ఆరు కిలోమీటర్ల పొడవుతో నిర్మించిన ప్లాంట్ నిర్వహణకు టెండర్లు పిలవగా ఇప్పటికే ఇనార్గో కంపెనీ చేజిక్కించుకుంది. అంతేకాక సంస్థ బాధ్యులు ఉద్యోగ నియామకాల ప్రక్రియ కూడా మొదలుపెట్టడం గమనార్హం. కానీ టెండర్ల కనీస సమాచారం బయటకు పొక్కకుండా సింగరేణి యాజమాన్యం గుట్టుచప్పుడు కాకుండా నిర్వహించడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. సాంకేతిక అద్భుతమని.. కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ను రాంచీలోని సెంట్రల్ మైన్స్ ప్లానింగ్ అండ్ డిజైన్ ఇన్స్టిట్యూట్ సహకారంతో రూ.398 కోట్ల వ్యయంతో బొగ్గు లోడింగ్ కోసం సత్తుపల్లి మండలం కిష్టారంలో నిర్మించారు. కోల్మైన్ ఇండియాకే పరిమితమైన ఇలాంటి ప్లాంట్ను తొలిసారి సింగరేని పరిధిలో నిర్మించగా 2022 మే 28 నుంచి రోజుకు 7 – 8 రేక్ల ద్వారా సుమారు 30 వేల నుండి 35 వేల మెట్రిక్ టన్నుల బొగ్గు రవాణా జరుగుతోంది. అయితే, ప్లాంట్ బంకర్లో ఏడాదిన్నర క్రితం పగుళ్లు రావటంతో పరిశీలన కోసం యాజమాన్యం కమిటీలను నియమించింది. నిర్మాణం చేపట్టిన సమంతా కంపెనీ నుంచే మరమ్మతు ఖర్చులు రాబడతామని అధికారులు చెబుతున్నా.. కార్యాచరణ అందుకు విరుద్ధంగా ఉండడం గమనార్హం. అయితే, బంకర్లను మరమ్మతు చేయించి ప్రైవేట్ సంస్థకు ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నట్లు చెబుతున్న అధికారులు.. మరమ్మతులు ఎవరు చేపడుతారో స్పష్టత ఇవ్వడం లేదు. బదిలీలు తప్పవా? జేవీఆర్ ఓసీకి అనుసంధానంగా పనిచేస్తున్న సీహెచ్పీలో 340 మంది సింగరేణి కార్మికులు పనిచేస్తున్నారు. ప్రస్తుతం దీన్ని ప్రైవేట్పరం చేయడంతో ఇంజనీరింగ్, టెక్నికల్ సిబ్బంది తప్ప మిగిలిన వారిని ప్రైవేట్ సంస్థే సమకూర్చుకుంటుంది. దీంతో ఇక్కడ కార్మికుల్లో కొందరిని జేవీఆర్ ఓసీ, కిష్టారం ఓసీలో సర్దుబాటు చేశాక మిగిలిన వారి బదిలీ తప్పదనే చర్చ జరుగుతోంది. సమ్మెకు వెనుకాడం సీహెచ్పీని ప్రైవేట్ సంస్థకు అప్పగిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని విరమించుకోవడమే సంస్థే నిర్వహించాలని హెచ్ఎంఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఇందుకోసం ఆందోళనలు చేపట్టడంతో పాటుఅవసరమతే సమ్మెకు వెనుకాడేదని లేదని తెలిపారు. ఈమేరకు సంఘం నాయకులు సోమవారం సత్తుపల్లి జీఎం చింతల శ్రీనివాస్కు లేఖ అందజేశారు. ప్రైవేట్ సంస్థలు లాభాపేక్షతో పని చేస్తాయని.. అవగాహన లేని కార్మికులను నియమిస్తే ప్రమాదాలకు అస్కారం ఉంటుందని తెలిపారు. హెచ్ఎంఎస్ ఏరియా ఉపాధ్యక్షుడు వై.ఆంజనేయులు, ఓసీ ఇన్చార్జ్ అజ్గర్ఖాన్ తదితరులు జీఎంను కలిసిన వారిలో ఉన్నారు. అదే తరహాలో.. సీహెచ్పీ నిర్మాణ సమయాన ప్రజా ఆమోదం కోసం గ్రామసభ నిర్వహించని అధికారులు ఇప్పుడు కూడా అదే తరహాలో వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. సైలో బంకర్ నిర్మాణ సమయంలో దుమ్ముదూళిపై ఎలాంటి అవగాహన కల్పించకపోవడంతో కిష్టారం అంబేద్కర్ కాలనీ వాసులు పలువురు శ్వాసకోశ వ్యాధులతో మృత్యువాత పడ్డారు. అంతేకాక నెలల తరబడి ఆందోళనలు చేసినా పట్టించుకోని అధికారులకు ప్రైవేట్ పరం చేసే హక్కు ఎక్కడిదని కార్మికులు ప్రశ్నిస్తున్నారు. సీహెచ్పీని నిర్వహణ ప్రైవేట్ సంస్థకు అప్పగించాం. అయినా టెక్నికల్, ఇంజనీరింగ్ సిబ్బంది సింగరేణి ఉద్యోగులే ఉంటారు. అదనంగా ఉన్న కార్మికులను ఇతర ఓసీల్లో సర్దుబాటు చేస్తాం. తొలుత డిప్యూటేషన్పై ఉన్నవారిని తిరిగి పంపిస్తాం. పగుళ్ల విషయంలో సమంతా సంస్థ నుంచి జరిమానా వసూలుకు అధికారులు చర్యలు చేపట్టారు. – చింతల శ్రీనివాసరావు, సత్తుపల్లి ఏరియా జీఎం -
వరాహ రూపంలో వరాల రామయ్య
● వాగ్గేయకార వంశీయుల ఆధ్వర్యంలో శోభాయాత్ర ● అధ్యయనోత్సవాలకు పోటెత్తిన భక్తజనం ● నేడు నరసింహావతారంలో స్వామివారుభద్రాచలం: లోకకంఠకుడైన హిరణ్యాక్షుడుని సంహరించి భూమిని తన కోరలతో పైకెత్తి లోకసంరక్షణ చేపట్టిన వరాహావతారంలో దర్శనమిచ్చిన రామయ్యకు భక్తులు నీరాజనం పలికారు. ‘వరాలు ఇచ్చే రామయ్య’ నామస్మరణతో భద్రగిరి పులకించింది. భద్రాచలంలో వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలు జరుగుతుండగా.. పగల్ పత్తు ఉత్సవాల్లో భాగంగా సోమవారం స్వామిని వరాహ అవతారంలో అలంకరించారు. తెల్లవారుజామున సుప్రభాతసేవ నిర్వహించి ఆరాధన, నివేదన సమర్పించారు. ఆ తర్వాత ఉత్సవమూర్తులను బేడా మండపానికి తీసుకొచ్చి పూజలు చేశారు. అనంతరం వేద పండితులు దివ్య ప్రబంధాలు పఠించారు. అనంతరం గర్భగుడి నుంచి బేడా మండపానికి తీసుకొచ్చి ఆళ్వార్లతో సహా కొలువుదీర్చారు. వైభవంగా శోభాయాత్ర.. భద్రాచలం రామాలయానికి ఆధ్యులు, భక్త రామదాసుగా పిలిచే కంచర్ల గోపన్న, ఆలయ అభివృద్ధిలో కీలకపాత్ర పోషించిన వాగ్గేయకారులు తూము నర్సింహదాసు వంశీయుల ఆధ్వర్యంలో శోభాయాత్ర నిర్వహించారు. మంగళవాయిద్యాలు, భక్తుల కోలాహలం నడుమ స్వామివారిని పల్లకీ సేవగా మిథిలా స్టేడియం వేదికపైకి తీసుకొచ్చారు. భక్తుల సందర్శన అనంతరం గోవిందరాజస్వామి ఆలయం వరకు తిరువీధి సేవ సాగింది. నేడు నరసింహావతారం.. అధ్యయనోత్సవాల్లో భాగంగా స్వామి వారిని మంగళవారం నరసింహావతారంలో అలంకరించనున్నారు. కుజ గ్రహ బాధలు ఉన్నవారు ఈ అవతారాన్ని దర్శిస్తే మంచిదని శాస్త్రం చెబుతోంది. -
పోలీసుల అత్యుత్సాహం
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి అభిమానులపై ఖమ్మం నగర పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. జగన్మోహన్రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఆదివారం ఖమ్మంలో భారీ ర్యాలీ నిర్వహించగా, ఓర్వలేని ఓ పార్టీ నేతల జోక్యంతో పోలీసులు ఏకంగా 11మందిపై క్రిమినల్ కేసులు నమోదు చేయడం గమనార్హం. అయితే ఓ మంత్రి, ఆయన తనయుడి ప్రమేయంతోనే పోలీసులు వారికి నచ్చినట్లు కేసులు పెట్టారని జగన్మోహన్రెడ్డి అభిమానులు ఘాటుగా విమర్శిస్తున్నారు. ముందే కవ్వించడంతో.. జగన్ అభిమానుల ర్యాలీ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ వైపు వెళ్తుండగా టీడీపీ కార్యాలయం వద్ద ఉన్న వారు ఆంధ్రప్రదేశ్కు చెందిన టీడీపీ నేతల వీడియోలను చూపిస్తూ కవ్వింపునకు దిగినట్లు తెలిసింది. అయినా పట్టించుకోకుండా జగన్ అభిమానులు ముందుకు సాగారు. తిరిగి ర్యాలీ వచ్చే సమయాన టీడీపీ కార్యాలయం ఎదుట రోడ్డు వద్ద ఉన్న వారు మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడినట్లు సమాచారం. దీన్ని తట్టుకోలేని జగన్ అభిమానులు జై జగన్ అంటూ నినదించగా, ఓ అభిమాని రోడ్డు మీద బైక్పై ఉండి స్లోగన్స్ ఇచ్చాడు. దీన్ని ఆసరా చేసుకుని టీడీపీ కార్యాలయ వాచ్మన్తో ఫిర్యాదు చేయించారు. కేసు లేదని.. బనాయించి ర్యాలీ ముగిశాక వైఎస్సార్ కాలనీలో రక్తదాన శిబిరం, అన్నదానం నిర్వహించారు. అక్కడ ఉన్న అభిమానులను ఖమ్మం అర్బన్ పోలీస్ స్టేషన్ రావాలని పిలవడంతో వెళ్లారు. దీంతో పోలీసులు ఏం జరిగిందో తెలుసుకుని తిరిగి పంపించేశారు. అనంతరం తెరవెనుక రాజకీయ ప్రమేయంతో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి మళ్లీ వారిని ఆదివారం రాత్రి టూటౌన్ పోలీస్ స్టేషన్కు పిలిపించారు. ‘మీపై ఎలాంటి కేసు నమోదు చేయబోం’ అని పిలిపించి రాత్రంతా స్టేషన్లో అక్రమంగా నిర్బంధించారు. అంతేకాక మొత్తం 11మందిపై కేసులు నమోదు చేసి అందులో ఎనిమిది మందిని సోమవారం ఉదయం రెండో అదనపు ప్రథమశ్రేణి కోర్టులో హాజరు పరచగా.. న్యాయమూర్తి 13 రోజుల పాటు రిమాండ్ విధించడంతో జిల్లా జైలుకు తరలించారు. ఈ అక్రమ కేసుల వెనుక మంత్రితోపాటు ఆయన తనయుడి ప్రమేయం ఉందని జగన్ అభిమానులు ఆరోపిస్తున్నారు. వీరిపైనే కేసులు పోలీసులు మొత్తం 11మందిపై అక్రమ కేసులు బనాయించారు. ఏ1గా ప్రకాష్నగర్కు చెందిన గంగరబోయిన రవి, ఏ2గా యర్రా నాగరాజురెడ్డి దానవాయిగూడెం) పేరు నమోదు చేయగా, ఆతర్వాత వరుసగా మర్రి శ్రీనివాస్(శ్రీనగర్కాలనీ), ఆలస్యం సుధాకర్ (ముస్తఫానగర్), సరికొండ రామరాజు (పాండురంగాపురం), గంగారపు మురళి(రావినూతల), పగిళ్ల నరేష్(వైఎస్సార్ కాలనీ), కంచి మితేష్(రామాపురం), ముడి శివారెడ్డి(కోదాడ), కంచర్ల సాయి(గాంధీచౌక్), వెంకీ పేర్లు చేర్చారు. వీరిలో ఎనిమిది మందిని రిమాండ్కు తరలించారు.వైఎస్.జగన్మోహన్రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా ఖమ్మంలో ఆదివారం ఉదయం కేక్ కట్ చేశాక భారీ ర్యాలీతో అభిమానులు సందడి చేశారు. శ్రీశ్రీ సర్కిల్ నుంచి మొదలైన ర్యాలీ ఇల్లెందు క్రాస్, ఎస్ఆర్అండ్బీజీఎన్ఆర్ కాలేజీ, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ రోడ్, జెడ్పీ సెంటర్, ముస్తఫానగర్, చర్చి కాంపౌండ్, కాల్వొడ్డు, రాపర్తినగర్, కేఎంసీ కార్యాలయం రోడ్, గట్టయ్య సెంటర్ మీదుగా ఎన్టీఆర్ సర్కిల్, శ్రీశ్రీ సర్కిల్, వైఎస్సార్ నగర్ వరకు కొనసాగింది. ఈ ర్యాలీలో వందలాది మంది పాల్గొన్నారు.జగన్ అభిమానులు 11మందిపై క్రిమినల్ కేసులు వైఎస్ అభిమానులపై పోలీసులు అక్రమ కేసులు బనాయించారు. జగన్మోహన్రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా నిర్వహించిన ర్యాలీ టీడీపీ కార్యాలయం ఎదుట రోడ్డుపై వెళ్తుండగా.. అక్కడ ఉన్న వారు కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. కానీ కార్యాలయం లోపలికి వెళ్లి వాచ్మన్ను దూషించారని, ఆఫీస్ను ధ్వంసం చేశారని చెప్పడం అవాస్తవం. టీడీపీ, బీఆర్ఎస్ ప్రభుత్వాల్లో మంత్రిగా పనిచేసి.. ఇప్పుడు కూడా మంత్రిగా ఉన్న నేత తప్పుడు కేసులు పెట్టించారు. ఈ కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నాం. – లక్కినేని సుధీర్, వైఎస్సార్సీపీ జిల్లా మాజీ అధ్యక్షుడు -
పెండింగ్ లేకుండా పరిష్కారం
● ప్రజావాణి దరఖాస్తులపై ప్రత్యేక శ్రద్ధ ● కలెక్టర్ అనుదీప్ దురిశెట్టిఖమ్మం సహకారనగర్: ప్రజలు అందించే ఫిర్యాదులు, వినతిపత్రాలపై ప్రత్యేక దృష్టి సారించి ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం ప్రజావాణిలో భాగంగా ఆయన పలువురి నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. అనంతరం అధికారులతో సమావేశమైన కలెక్టర్ సూచనలు చేశారు. అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి, డీఆర్వో పద్మశ్రీ, జెడ్పీ సీఈఓ దీక్షారైనా, కలెక్టరేట్ ఏఓ కె.శ్రీనివాసరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఫిర్యాదుల్లో కొన్ని.. ● సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలకు 2024–25 నుంచి పండ్లు సరఫరా చేస్తున్న తమపై పాత రేట్లతో భారం పడుతున్నందున ధరలు పరిశీలించాలని కోరారు. ● కొణిజర్ల మండలం బొట్లకుంటకు చెందిన రైతులు గ్రీన్ఫీల్డ్ హైవేతో చెరువు వరద పొలాల్లోకి చేరుతున్నందున సమస్య పరిష్కరించాలని వినతిపత్రం అందజేశారు. ● రంగనాయకుల గుట్ట వద్ద మున్నేటిపై చెక్డ్యాంను తొలగించడమే కాక ప్రకాష్నగర్ బ్రిడ్జి దగ్గర చెక్డ్యాం ఎత్తు తగ్గించాలని పలువురు కోరారు. ● సత్తుపల్లి మండలం కొమ్మేపల్లికి చెందిన గుర్రాల తేజోరమ్మ తనకు పునరావాసం చట్టం క్రింద కేటాయించిన ప్లాట్ను మరోచోటకు మార్చాలని విన్నవించింది. కల్లూరు సమీపాన ఉన్న భూమిని తనతో పాటు కుమారులకు తెలియకుండా కుమార్తెలు ఇద్దరు 23కుంటల చొప్పున రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. వృద్ధురాలినైన నాకు మాయమాటలు చెప్పి రిజిస్ట్రేషన్ చేయించుకున్నందున విచారణ జరిపించి న్యాయం చేయాలి. – తోట సక్కుభాయి, ఎర్రమాడు, ఆంధ్రప్రదేశ్ -
పండుగ వాతావరణంలో...
జిల్లాలో మూడు విడతలుగా జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో గెలిచిన సర్పంచ్లు, పాలకవర్గాలు సోమవారం కొలువుదీరాయి. సర్పంచ్లు, పాలకవర్గాలతో అధికారులు ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా గ్రామపంచాయతీ కార్యాలయాలకు రంగులు వేసి ముస్తాబు చేయగా, కొన్నిచోట్ల మామిడి తోరణాలు, పూలమాలలతో అలంకరించారు. అయితే, పలు జీపీలకు సొంత భవనాలు లేక కొన్నిచోట్ల అసంపూర్తి భవనాల్లో, మరికొన్ని గ్రామాల్లో ఇతర ప్రభుత్వ భవనాల్లో ప్రమాణ స్వీకారం పూర్తిచేశారు. ఈ సందర్భంగా పాలకవర్గాలను స్థానికులు సన్మానించారు. -
అనుమతి లేని ఆస్పత్రి సీజ్
ఏన్కూరు: ఏన్కూరులో అనుమతి లేకుండా నిర్వహిస్తున్న గాయత్రీ అస్పత్రిని జిల్లా వైద్యాధికారి డాక్టర్ రామారావు సోమవారం సీజ్చేశారు. వైద్యుడు నరేష్ అర్హతకు మించి చికిత్స చేస్తున్నట్లు గుర్తించడమే కాక ఆస్పత్రికి రిజిస్ట్రేషన్ లేదని కూడా ఆయన తెలిపారు. ఈమేరకు రికార్డులు స్వాధీనం చేసుకుని ఆస్పత్రిని సీజ్ చేసినట్లు డీఎంహెచ్ఓ రామారావు వెల్లడించారు. తనిఖీల్లో డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ ప్రదీప్, ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ ప్రతాప్ సంపత్, వైద్యాధికారి డాక్టర్ బి.రాములు పాల్గొన్నారు. చెరుకు తోటలో కొండచిలువ నేలకొండపల్లి: చెరుకు నరుకుతున్న కూలీలకు కొండచిలువ కనిపించడంతో ఆందోళనకు గురయ్యారు. మండలంలోని మోటాపురానికి చెందిన రామూర్తి తోటలో చెరుకు నరికేందుకు సోమవారం ఉదయం ఏపీకి చెందిన కూలీలు వచ్చారు. వీరు పనిచేస్తుండగా 12అడుగులకు పైగా ఉన్న కొండ చిలువ కని పించడంతో పరుగులు తీశారు. ఆపై గ్రామస్తులకు సమాచారం ఇవ్వడంతో పలువురు చేరుకుని దాన్ని హతమార్చారు. చెల్లని చెక్కు కేసులో ఏడాది జైలుశిక్షఖమ్మం లీగల్: అప్పు చెల్లించే క్రమాన ఇచ్చిన చెక్కు చెల్లకపోవడంతో ఓ మహిళకు ఏడాది జైలుశిక్ష విధిస్తూ ఖమ్మం రెండో అదనపు ప్రథమ శ్రేణి కోర్టు న్యాయాధికారి ఏపూరి బిందుప్రియ సోమవారం తీర్పు చెప్పారు. భద్రాద్రి జిల్లా బూర్గంపాడుకు చెందిన మంగిపుడి నాగమణి వద్ద అదే గ్రామానికి చెందిన బార్ల రత్నకుమారి 2020 మే నెలలో రూ.5లక్షల అప్పు తీసుకుంది. తిరిగి 2021 సెప్టెంబర్లో చెక్కు జారీ చేసినా ఆమె ఖాతాలో సరిపడా నగదు లేక తిరస్కరణకు గురైంది. దీంతో నాగమణి తన న్యాయవాది ద్వారా లీగల్ నోటీస్ జారీ చేసి కోర్టులో ప్రైవేట్ కేసు దాఖలు చేసింది. విచారణ అనంతరం రత్నకుమారికి జైలుశిక్ష విధించడమే కాక ఫిర్యాదికి రూ.5లక్షలు చెల్లంచాలని న్యాయాధికారి తీర్పు చెప్పారు. చోరీ కేసులో ఆరు నెలలు... ఖమ్మం లీగల్: ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా చాట్రాయి మండలం చిత్రపూర్ గ్రామానికి చెందిన త్రివేదుల సురేంద్రకు చోరి కేసులో ఆరు నెలల జైలుశిక్ష విధిస్తూ ఖమ్మం రెండో అదనపు ప్రథమశ్రేణి కోర్టు న్యాయాధికారి ఏపూరి బిందుప్రియ సోమవారం తీర్పు చెప్పారు. అలాగే, నిందితుడిపై ఉన్న మరో మూడు కేసుల్లో ఇంకో ఆరు నెలల జైలుశిక్ష విధించారు. ఖమ్మం అర్బన్ మండలం ధంసలాపురం కాలనీకి చెందిన వేరోజు వెంకటాచారి ఊరు వెళ్లగా జనవరి 11న చోరీ జరిగింది. ఆయన ఫిర్యాదుతో విచారణ చేపట్టిన ఖమ్మం అర్బన్ పోలీసులు సురేంద్రను నిందితుడిగా గుర్తించి కోర్టులో హాజరుపరిచారు. విచారణ అనంతరం ఆయనపై నేరం రుజువు కావడంతో జైలుశిక్ష విధించారు. ప్రాసిక్యూషన్ తరఫున ఏపీపీఓ జి.రాహుల్ వాదించగా కానిస్టేబుల్ అల్వాల మదార్ సహకరించారు. ప్రైవేట్ బస్సు ఢీకొని వ్యక్తి మృతి ఖమ్మంరూరల్: ట్రావెల్స్ బస్సు ఢీకొనడంతో ఖమ్మం ఖానాపురం పరిధిలోని బాలాజీనగర్కు చెందిన రిటైర్డ్ ఉద్యోగి పిల్లలమర్రి పాముల కేశవులు (63) మృతి చెందాడు. బాలాజీనగర్లో నివాసముంటున్న ఆయన ఏదులాపురం మున్సి పాలిటీ టీఎన్జీవోస్ కాలనీలో కొత్తగా ఇల్లు నిర్మించుకున్నాడు. ఉదయం కొత్త ఇంటి వద్దకు ద్విచక్రవాహనంపై వస్తుండగా వెనకాల నుంచి ప్రైవేట్ బస్సు ఢీకొట్టింది. ఘటనలో తీవ్రంగా గాయపడి న కేశవులు అక్కడికక్కడే మృతి చెందాడు. ఆయ న భార్య నాగమణి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై రాయుడు తెలిపారు. అనుమానాస్పద స్థితిలో వ్యక్తి.. ఖమ్మంరూరల్: అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతి చెందగా, మండలంలోని కొండాపురం ప్రదాన రహదారి పక్కన మృతదేహాన్ని గుర్తించారు. పశ్చిమబెంగాల్ రాష్ట్రం కై కాలి గ్రామానికి చెందిన ధనంజయ్ నస్కార్(20) కొండాపురం వద్ద ఓ గ్రానైట్ ఫ్యాక్టరీలో పని చేస్తూ తన భార్యతో కలిసి నివాసం ఉంటున్నాడు. ఈనెల 19న రాత్రి ఇంటికి నుంచి వెళ్లిన నస్కార్ తిరిగి రాకపోవడంతో 21వ తేదీన రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇంతలోనే కొండాపురం ప్రధాన రహదారి పక్కన పాడుబడిన ఇంట్లో ఆయన మృతదేహాన్ని గుర్తించారు. కాగా, ధనుంజయ్ని ఎవరైనా హత్య చేశారా, సాధారణ మరణమా అన్న అంశంపై పోలీసులు విచారణ చేపట్టారు. అనంతం అన్నం సేవా ఫౌండేషన్ చైర్మన్ శ్రీనివాసరావు సహకారంతో మృతదేహాన్ని ఖమ్మం ప్రభుత్వాస్పత్రి మార్చురీకి తరలించారు. -
ఆటో డ్రైవర్ నిజాయితీ
●35 గ్రాముల బంగారం అప్పగించిన రవి ఖమ్మం అర్బన్: ప్రయాణికురాలు మరిచిపోయిన బంగారు ఆభరణాలను తిరిగి జాగ్రత్తగా అప్పగించిన ఆటోడ్రైవర్ నిజాయితీని చాటుకున్నాడు. పాలేరు ప్రాంతానికి చెందిన నాగారం ధనలక్ష్మి శనివారం రాత్రి ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రి తన నగల బ్యాగ్ను ఆటోలోనే మరిచి పోయి దిగింది. ఆటోడ్రైవర్ బాలపేటకు చెందిన బానోతు రవికి కాసేపయ్యాక గుర్తించి తన స్నేహితుడు బానోతు గోపి, ఐఎన్టీయూసీ అధ్యక్షుడు పాల్వంచ కృష్ణతో కలిసి టూటౌన్ పోలీసులకు అప్పగించారు. బ్యాగ్లో పరిశీలిస్తే 35 గ్రాముల బంగారు ఆభరణాలు ఉండడంతో అందులోని వివరాల ఆధారంగా యజమా ని ధనలక్ష్మిని గుర్తించి సోమవారం సీఐ బాలకృష్ణ సమక్షాన అప్పగించారు. ఈ సందర్భంగా డ్రైవర్ రవిని పలువురు అభినందించారు. రోడ్డు ప్రమాదంలో ఉద్యోగికి గాయాలు కొణిజర్ల: కొణిజర్ల సమీపాన జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎంపీడీఓ కార్యాలయం అటెండర్కు తీవ్ర గాయాలయ్యాయి. ఎంపీడీఓ కార్యాలయం అటెండర్ ఎండీ.ఇసాక్ సోమవారం ద్విచక్రవాహనంపై ఖమ్మం నుంచి కొణిజర్ల వస్తుండగా ఓ వెంచర్ వద్ద రోడ్డు పక్కన పడిపోవడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఆయన వాహనం అదుపు తప్పిందా, ఇతర వాహనం ఢీకొట్టిందా అనేది తెలియ లేదు. ఈ మేరకు ఇసాక్ను 108 ద్వారా ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. -
కష్టాలు తీరేదెన్నడు?
కట్లేరు రైతులఎర్రుపాలెం: ఎర్రుపాలెం మండలానికి వరప్రదాయినిగా నిలుస్తున్న కట్లేరు ప్రాజెక్టు కింద ఐదు వేలకు ఎకరాలకు పైగా ఆయకట్టు ఉంది. ఇక్కడ 12 గ్రామాలకు చెందిన వందలాది మంది రైతులు వరి సాగు చేస్తున్నారు. కొన్నేళ్ల క్రితం కట్లేరు ప్రాజెక్టు షట్టర్లు తుప్పు పట్టి మరమ్మతులకు రావడంతో నీరు కిందకు వెళ్తోంది. ఈ నీరు కోతకు వచ్చిన వరి చేన్లలో నిలిచి రైతులు ఇబ్బంది పడుతున్నారు. మరోపక్క ప్రాజెక్టులోని నిల్వ ఉండాల్సిన సాగునీరు వృథా అవుతుండడంపై ఆవేదన వ్యక్తమవుతోంది. ఇదిలాగే కొనసాగితే యాసంగి పంటలకు ఇబ్బంది ఎదురవుతుందని వాపోయారు. మరో పక్క కాల్వల తూములు కూడా దెబ్బతిన్నాయి. ప్రాజెక్టు ఎడమ, కుడి కాల్వల్లో పిచ్చిచెట్లు, చెత్తాచెదారం నిండడంతో నీరు సాఫీగా ముందుకు సాగడం లేదు. రైతుల గోడు తీర్చేలా... ఆయకట్టు రైతుల ప్రాజెక్టు సమస్యలను డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన మరమ్మతుల కోసం రూ.36.5 కోట్లను ఏడాది క్రితమే మంజూరు చేశారు. ఈ నిధులతో షట్టర్ల మరమ్మతులు చేయాల్సి ఉంది. అలాగే, 11 కి.మీ. నిడివి ఉన్న కుడి కాల్వ, పది కి.మీ. పొడవైనా ఎడమ కాల్వకు కి.మీ. మేర సిమెంట్ లైనింగ్ చేయాలని నిర్ణయించారు. రెండు కాల్వలను పటిష్టం చేయడంతో పాటు ఆరుచోట్ల వంతెనలు నిర్మించాల్సి ఉంది. అయితే, నిధులు మంజూరై ఏడాది దాటినా మరమ్మతు పనులు చేయకపోవడంతో ఖరీఫ్లో వరి సాగవుతున్న పొలాల్లోకి షట్టర్ లీకేజీల నుంచి నీరు చేరి పంట నేలరాలుతోంది. అంతేకాక వాహనాలు పొలాల్లోకి వచ్చే పరిస్థితి లేక కోతలకు రైతులు ఇబ్బంది పడుతున్నారు. అలాగే, లీకేజీలతో ప్రాజెక్టులో నీరు తగ్గుతుండగా, యాసంగి అవసరాలకు ఇక్కట్లు ఎదురవుతాయనే ఆవేదన వ్యక్తమవుతోంది. ఈమేరకు అధికారులు త్వరగా టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి మరమ్మతులు చేపట్టాలని వారు కోరుతున్నారు.కట్లేరు ప్రాజెక్టు ఆధునీకరణ పనుల కోసం టెండర్ ప్రక్రియ పూర్తయింది. అగ్రిమెంట్ జనవరిలో పూర్తి చేస్తాం. ప్రాజెక్టు షట్టర్లు, తూములు మరమ్మతకు వచ్చిన మాట వాస్తవమే. షట్టర్ల నుండి నీరు లీకేజీ కాకుండా తాత్కాలిక చర్యలు చేపట్టినా ఫలితం కానరావడం లేదు. వీలైనంత త్వరగా పనులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటాం. – టి.సాంబశివరావు, డీఈ, జలవనరుల శాఖ -
రేపు జాబ్ మేళా
ఖమ్మం రాపర్తినగర్: నిరుద్యోగ యువతకు ప్రైవేట్ రంగంలో ఉపాధి అవకాశాలు కల్పించేలా ఈనెల 24వ తేదీన జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనశాఖ అధికారి కొండపల్లి శ్రీరాం తెలిపారు. భారత్ హ్యుండాయ్ కంపెనీలో సేల్స్ కన్సల్టెంట్, సర్వీస్ అడ్వైజర్, అకౌంట్ ఆఫీసర్, రిసెప్షనిస్ట్, సీఆర్ఈ, టీం లీడర్, మేనేజర్ తదితర పోస్టులకు అర్హులను ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారని వెల్లడించారు. డిగ్రీ విద్యార్హత కలిగిన నిరుద్యోగులు ఈనెల 24వ తేదీన ఖమ్మం టీటీడీసీ భవన్లో జరిగే ఇంటర్వ్యూలకు హాజరుకావాలని, వివరాలకు 70369 02902 నంబర్లో సంప్రదించాలని సూచించారు. పదోన్నతులతో పెరగనున్న బాధ్యతలు ఖమ్మంక్రైం: పదోన్నతులు బాధ్యతలను పెంచుతాయని పోలీసు కమిషనర్ సునీల్దత్ అన్నారు. కమిషనరేట్ పరిధిలో హెడ్ కానిస్టే బుళ్లుగా పనిచేస్తున్న పది మందికి ఏఎస్ఐలుగా పదోన్నతి లభించింది. ఈమేరకు డి.వెంకటసుబ్బారావు, అప్పారావు, పాపారావు, వెంకటసుబ్బారావు, వెంకన్న, అంజం రాజు, వెంకటేశ్వరరావు, హనీఫ్, రామానుజాచారి, వెంకటేశ్వర్లు సీపీని సోమవారం కలవగా అభినందించారు. కాగా, వీరిలో ఖమ్మం జిల్లాకు ఒకరిని, మహబూబాబాద్ జిల్లాకు ఇద్దరిని, భద్రాద్రి జిల్లాకు ఏడుగురిని కేటాయించారు. రామిరెడ్డికి ఏఐసీసీ కార్యదర్శి నివాళి కూసుమంచి: మండలంలోని పాలేరుకు చెందిన కాంగ్రెస్ నాయకుడు యడవెల్లి రాంరెడ్డి ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతిచెందగా సోమవారం రాత్రి ఏఐసీసీ కార్యదర్శి, ఎంపీ విశ్వనాధన్ ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. పాలేరులోని ఆయన ఇంటికి వచ్చిన ఆయన రాంరెడ్డి చిత్రపటం వద్ద నివాళులర్పించారు.రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, నాయకులు ఎండీ.హఫీజుద్దీన్, బజ్జూరి వెంకట్రెడ్డి, బెల్లంకొండ శరత్, నాగిరెడ్డి రమేష్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సామాన్యులకు అందని నాణ్యమైన విద్య ఖమ్మం సహకారనగర్: కేంద్రప్రభుత్వం విద్యారంగంలో తీసుకొస్తున్న సంస్కరణలతో సామాన్యులకు విద్య అందకపోగా, అందరికీ సమానమైన నాణ్యమైన విద్య కూడా సాధ్యం కావడం లేదని తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ప్రొఫెసర్ కె.లక్ష్మీనారాయణ అభిప్రాయపడ్డారు. ఖమ్మంలో టీపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి టి.వెంగళరావు అధ్యక్షతన సోమవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు విద్యారంగానికి ఏటా బడ్జెట్ తగ్గించడమే కాక ప్రాథమిక విద్యారంగానికి నిధులు కేటాయించకుండానే కొత్త పేర్లతో పాఠశాలలను ప్రారంభిస్తున్నారని తెలిపారు. అనంతరం వై.అశోక్ కుమార్, ఎం.సోమయ్య, కె.రవిచంద్ర, ఏ.రామారావు, వి.మనోహర్రాజు మాట్లాడగా తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ జిల్లా కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. జిల్లా అసోసియేట్ అధ్యక్షుడిగా డాక్టర్ సీహెచ్.రమేష్, అధ్యక్షులుగా టి.వెంగళరావు, ప్రధా న కార్యదర్శిగా రాజు, అసోసియేట్ ఉపాధ్యక్షులుగా ఏ రామారావు ఎన్నికయ్యారు. అలాగే, ఉపాధ్యక్షులుగా ఎం.రవీందర్, జి.రమేష్, పి. నాగేశ్వరరావు, కృష్ణయ్య, నాగమణి, ఎస్.పూర్ణచంద్రరావు, పి.వీరభద్రం, అదనపు ప్రధాన కార్యదర్శిగా ఎన్.కృష్ణారావు, కార్యదర్శులుగా వెంకటేష్, జి.మస్తాన్, ఐ.రామకృష్ణ, లక్ష్మీనా రాయణ, కె.రామ్మోహన్రావు, అజీజ్ టి. నారాయణను ఎన్నుకున్నట్లు తెలిపారు. -
●ఉపసర్పంచ్ పదవి ఇవ్వలేదని ఆందోళన
సత్తుపల్లి: మండలంలోని కిష్టారం గ్రామపంచాయతీ ముందస్తు ఒప్పందం ప్రకారం ఉప సర్పంచ్ పదవి ఇస్తామని చెప్పడంతో బీఆర్ఎస్ పోటీ నుంచి తప్పుకుందని.. కానీ ఇప్పుడు మాట తప్పారంటూ బీఆర్ఎస్ వార్డుసభ్యులు, నాయకులు సోమవారం ప్రమాణ స్వీకారాన్ని అడ్డుకున్నారు. సర్పంచ్ ఉమ్మడి అభ్యర్థిగా కాంగ్రెస్ నుంచి గెలిచిన సర్పంచ్ రాజీనామా చేయాలని పాలకుర్తి రాజు, భిక్షపతి తదితరులు డిమాండ్ చేశారు. అక్కడ ఉధ్రిక్తత నెలకొనడంతో సత్తుపల్లి పట్టణ సీఐ శ్రీహరి చేరుకుని నచ్చజెప్పారు. ఇదిలా ఉండగా ఏకగ్రీవమైతేనే ఉపసర్పంచ్ పదవి ఇస్తామని చెప్పామని, ఎన్నికలు జరిగినందున ఇవ్వలేదని సర్పంచ్ నరుకుళ్ల రాజేశ్వరి బదులిచ్చారు. -
●ప్రజల ముందే ప్రమాణం చేస్తాం..
తల్లాడ: తల్లాడ మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యులు ప్రజల ముందే ప్రమాణ స్వీకారం చేస్తామని పట్టుబట్టారు. ప్రమాణ స్వీకారం సందర్భంగా సోమవారం ర్యాలీ నిర్వహించగా, మధ్యాహ్నం ఒంటి గంటకు సర్పంచ్ పెరికె నాగేశ్వర్రావు, వార్డు సభ్యులు గ్రామపంచాయతీ కార్యాలయానికి వచ్చా రు. పంచాయతీ హాల్లో ప్రమాణ స్వీకారానికి ఏర్పా ట్లు చేయగా, గ్రామపంచాయతీ ముందు స్టేజీపై ప్రజల ముందే ప్రమాణ స్వీకారం చేస్తామని పాలకవర్గం పట్టుబట్టింది. ఈఓ కృష్ణారావు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు లోపలే చేయిస్తామని చెప్పినా ససే మిరా అనడంతో ఎంపీడీఓ, డీఎల్పీఓకు ఫోన్చేసి విషయాన్ని చెప్పారు. దీంతో ఆఫీస్లో ఫొటోలు తీసి బయట ప్రమాణం చేయించాలని సూచించడంతో కార్యక్రమం కొనసాగించారు. -
పాలన వ్యవహారాలపై దృష్టి
● సంక్రాంతి నాటికి వేయి ఇందిరమ్మ ఇళ్ల పూర్తి ● అధికారులతో సమీక్షలో కలెక్టర్ అనుదీప్ఖమ్మం సహకారనగర్: గ్రామపంచాయతీ ఎన్నికలు, కొత్త పాలకవర్గాల ప్రమాణ స్వీకారం ముగిసినందున అధికారులు ఇక నుంచి పాలనా వ్యవహారాలపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. కలెక్టరేట్లో సోమవారం ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. తొలుత పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించిన అధికారులను అభినందించారు. అనంరం కలెక్టర్ మాట్లాడుతూ గురుకులాలు, పాఠశాలలతో పాటు అభివృద్ధి పనులను జిల్లా అధికారులు తనిఖీ చేయాలని తెలిపారు. వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు ఆస్పత్రుల్లో వైద్యుల హాజరును బయోమెట్రిక్ విధానంలో నమోదు చేయించాలని, విధుల సమయాన వైద్యులు ప్రైవేట్ ప్రాక్టీస్ చేయకుండా చూడాలని సూచించారు. కాగా, సంక్రాంతి నాటికి జిల్లా పరిధిలో కనీసం వేయి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పూర్తి చేయించాలని తెలిపారు. ఇప్పటికే 250 ఇళ్లు పూర్తికాగా, 6,700 ఇళ్లకు స్లాబ్ పడినందున మిగతా పనుల్లో వేగం పెంచేలా పర్యవేక్షించాలని చెప్పారు. అలాగే, ఈనెల 24న విద్యా శాఖ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీ సంక్షేమ శాఖలపై డిప్యూటీ సీఎం సమీక్షించనున్నట్లు అధికారులు నివేదికలతో హాజరుకావాలని కలెక్టర్ సూచించారు. ●ఖరీఫ్ సీజన్ ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా సాగుతోందని కలెక్టర్ అనుదీప్ తెలిపారు. జిల్లాలోని 331 కేంద్రాల ద్వారా 43,236 మంది రైతుల నుంచి రూ.601 కోట్ల విలువైన 2.51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు చెప్పారు. ఇందులో 37,373 మంది రైతులకు రూ.530 కోట్ల చెల్లింపులు పూర్తయ్యాయని తెలిపారు. ●ఇప్పటివరకు తెలియని పర్యాటక ప్రదేశాలను ప్రపంచానికి చాటేలా వివరాలు పంపించాలని కలెక్టర్ అనుదీప్ సూచించారు. ‘100 వీకెండ్ వండర్స్ ఆఫ్ తెలంగాణ’ పోటీల పోస్టర్లను ఆవిష్కరించిన ఆయన మాట్లాడుతూ ప్రతీ ప్రదేశం మూడు ఫొటోలు, 60 సెకన్ల వీడియో, 100 పదాలతో వివరాలను జనవరి 5వ తేదీలోగా https://FORMS. GLE/VVJB7NZWBUZ7WW.JY కు పంపిస్తే విజేతలను ప్రకటిస్తారని తెలిపారు. ●స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్ఐఆర్) ఓటర్ జాబితా పకడ్బందీగా తయారు చేయాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆదేశించారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్పై కలెక్టర్లతో ఎన్నికల సంఘం రాష్ట్ర సీఈఓ సుదర్శన్రెడ్డి సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. అనంతరం అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి, కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్యతో పాటు అధికారులతో సమావేశమైన కలెక్టర్ సూచనలు చేశారు. జిల్లా ఓటరు జాబితాలో 40ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న వారు, అంత కంటే ఎక్కువ వయస్సు వారి జాబితా వేరుచేయాలని తెలిపారు. ఈ జాబితాను 2002లో నిర్వహించిన జాబితా ఆధారంగా సరిపోల్చుకోవాల్సి ఉంటుందని చెప్పారు. ఇదంతా పోలింగ్ బూత్ల వారీగా జరగాలని సూచించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి ఖమ్మంమయూరిసెంటర్: ప్రభుత్వ వ్యవస్థపై నమ్మకాన్ని పెంచచడంతో పాటు ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ఉద్యోగులు జవాబుదారీతనంతో పనిచేయాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. బీసీ స్టడీసర్కిల్లో శిక్షణ తీసుకుని గ్రూప్–3, 4లో ఉద్యోగాలు సాధించిన పలువురు కలెక్టర్ను కలవగా ఆయన అభినందించి మాట్లాడారు. ప్రభుత్వ బీసీ స్టడీ సర్కిల్లో శిక్షణ తీసుకుంటూ పట్టుదలతో చదివి విజయం సాధించడం అభినందనీయమన్నారు. ఈ సమావేశాల్లో అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి, డీఆర్ఓ ఏ.పద్మశ్రీ, జెడ్పీ సీఈఓ దీక్షారైనా, డీఎం శ్రీలత, డీఏఓ పుల్లయ్య, జిల్లా టూరిజం అధికారి సుమన్చక్రవర్తి, జిల్లా బీసీ సంక్షేమ శాఖాధికారి జి.జ్యోతి, బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ శ్రీలత తదితరులు పాల్గొన్నారు. -
ట్రాన్స్ జెండర్ శివాణి సరికొత్త ప్రస్థానం..!
ఖమ్మం: సమాజంలో ఒకప్పుడు చిన్నచూపునకు గురై, ఉపాధి మార్గాలు లేక యాచనకే పరిమితమైన ట్రాన్స్జెండర్ల జీవితాల్లో కొత్త వెలుగులు నిండుతున్నాయి. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్, మెప్మా అధికారుల చొరవ, ప్రభుత్వ ప్రోత్సాహంతో వారు ఇప్పుడు వ్యాపారులుగా ఎదుగుతున్నారు. మొదటి విడతలో ట్రాన్స్జెండర్లతో ఐదు స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేశారు. వాటిలో మూడు సంఘాలకు రుణాలు ఇప్పించడం ద్వారా స్వయం శక్తితో ఎదిగేందుకు అవకాశం కల్పించారు. గౌరవంగా బతికేలా.. ట్రాన్స్జెండర్లు గౌరవప్రదమైన జీవితం గడిపేందుకు అధికారులు అవకాశం కల్పించారు. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అభిషేక్ అగస్త్య ప్రోత్సాహం, మెప్మా అధికారుల చొరవతో వారందరితో స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేయించారు. మెప్మా అధికారులు వారికి పొదుపుపై అవగాహన కల్పించారు. దీంతో ట్రాన్స్జెండర్లకు సామాజిక రక్షణతోపాటు ఆర్థిక భరోసా లభించింది. బ్యాంక్ లింకేజీ రుణాలు..నగరంలోని ట్రాన్స్జెండర్లతో మెప్మా ఆధ్వర్యంలో ఐదు స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేశారు. వారికి ఆర్థికంగా అండగా నిలిచేందుకు బ్యాంక్ లింకేజీ రుణాలు మంజూరు చేయించారు. మూడు సంఘాలకు రూ.3 లక్షల చొప్పున రుణం ఇవ్వగా.. సంఘంలోని పది మంది సభ్యులకు రూ.30 వేల చొప్పున అందాయి. దీంతో వారు తమకు నచ్చిన రంగాల్లో స్వయం ఉపాధిని ప్రారంభించారు. రుణం తీసుకున్న సంఘాల్లో విశ్వం స్వయం సహాయక సంఘ సభ్యులు రూ.3లక్షలు సకాలంలో చెల్లించడంతో మరో రూ.10 లక్షల బ్యాంక్ లింకేజీ రుణం అందించారు. ఇక మిగిలిన రెండు సంఘాలు కూడా రుణాలను సక్రమంగానే చెల్లిస్తున్నాయి. అదర్శ జీవితం గడుపుతూ..గౌరవప్రద జీవనానికి ఖమ్మంలోని ట్రాన్స్జెండర్లు మార్గదర్శకులుగా మారారు. ఒకప్పుడు యాచనే ప్రధాన వృత్తిగా ఉన్న వీరు ప్రస్తుతం తమ కాళ్లపై తాము నిలబడగలమనే ఆత్మవిశ్వాసంతో పని చేస్తున్నారు. ‘మాకు గౌరవం కావాలి, మేమూ సమాజంలో భాగమే’ అని చాటిచెబుతూ, ఇతర ప్రాంతాల్లోని ట్రాన్స్జెండర్లకు ఖమ్మం బిడ్డలు మార్గదర్శకులుగా నిలుస్తున్నారు. స్వయం సహాయక సంఘాలుగా ఏర్పడి వచ్చిన రుణంతో చిన్న తరహా వ్యాపారాలు, కుటీర పరిశ్రమలు నిర్వహిస్తున్నారు. అలాగే కేటరింగ్, ఇతర రంగాల్లో కూడా సేవలు అందిస్తున్నారు. మెప్మా సిబ్బంది క్షేత్రస్థాయిలో పర్యటించి వారి సమస్యలను తెలుసుకుని బ్యాంకర్లతో మాట్లాడి రుణం ఇప్పించారు. అధికారులు తీసుకున్న చొరవతో ట్రాన్స్జెండర్లలో ఆర్ధిక స్థిరత్వం ఏర్పడింది.మరికొందరికి ఉపాధి కల్పించేలా..విశ్వం స్వయం సహాయక సంఘంలో సభ్యురాలైన బోడ శివాని తనకు వచ్చిన రూ.30వేల రుణంతో టీస్టాల్ ఏర్పా టు చేసుకుంది. తద్వారా వచ్చే ఆదాయంలో కొంత రుణం కింద చెల్లిస్తోంది. టీ స్టాల్ బాగానే నడుస్తుండటంతో మరింత అభివృద్ధి చేయాలనే కృతనిశ్చయంతో ఉంది. ఈ స్వ యం సహాయక సంఘం సభ్యులు తమ రుణమొత్తం రూ.3 లక్షలు చెల్లించడంతో మరో రూ.10లక్షల రుణం ఇచ్చేందుకు బ్యాంకర్లు ముందుకొచ్చారు. ఈ రుణంతో మరో ఆరుగురు సభ్యులతో వేర్వేరు వ్యాపారాలు ఏర్పాటు చేయించనున్నట్లు శివాని తెలిపింది. కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్య తమకు మంచి అవకాశం కల్పించారని చెప్పింది. -
ఆగి ఉన్న లారీని ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు
లారీ క్లీనర్ మృతి.. తిరుమలాయపాలెం: మండలంలోని చంద్రుతండా వద్ద ఖమ్మం–వరంగల్ జాతీయ రహదారిపై ఆదివారం అర్ధరాత్రి ఆగి ఉన్న లారీని ఆర్టీసీ బస్సు ఢీకొన్న దుర్ఘటనలో లారీ క్లీనర్ మృతిచెందగా బస్సులోని ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఈ ఘటనపై ఖమ్మం రూరల్ ఏసీపీ తిరుపతిరెడ్డి ఆది వారం ఉదయం అక్కడకు చేరుకుని వివరాలు సేకరించి వెల్లడించారు. తిరుమలాయపాలెం మండలం చంద్రుతండా వద్ద లారీ టైరు పంఛర్ కావడంతో లారీ క్లీనర్ మరమ్మతులు చేస్తున్నాడు. ఈ క్రమంలో బోధన్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఒంగోలు నుంచి నిజామాబాద్ వెళ్తుండగా.. లారీని వెనుక నుంచి ఢీ కొట్టింది. దీంతో లారీ టైరు మారుస్తున్న బిహార్కు చెందిన క్లినర్ నితీష్ కుమార్ రామ్ అక్కడికక్కడే మృతి చెందగా.. బస్సులో ఉన్న 30 మంది ప్రయాణికులకు స్వల్పగాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న ఎస్ఐ కూచిపూడి జగదీష్ సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను 108 ద్వారా ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి తరలించగా.. లారీ క్లీనర్ మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. చేపల వేటకు వెళ్లి యువకుడి మృతి ఖమ్మంరూరల్: ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని రాజీవ్గృహకల్పకు చెందిన జి.చినరంగయ్య(21) మున్నేటిలో చేపల వేటకు వెళ్లి మృతి చెందిన సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. చినరంగయ్య తన బంధువుతో కలిసి మున్నేటిలో చేపల వేటకు వెళ్లాడు. ఈ క్రమంలో చినరంగయ్య చేతిలో ఉన్న డిటోనేటర్ పేలడంతో అతని కుడి చేయి తెగిపోయింది. దీంతో 108లో ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి తరలించగా.. పరీక్షించిన వైద్యులు చినరంగయ్య మృతి చెందినట్లు ధ్రువీకరించారు. మృతుడి తల్లి జి.నర్సమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రాయుడు తెలిపారు. చెట్టును ఢీకొట్టిన లారీ డ్రైవర్..పెనుబల్లి: లారీ చెట్టుకు ఢీ కొట్టడంతో భవాని మాలలో ఉన్న లారీ డ్రైవర్ జంగం నరసయ్య(50) మృతి చెందాడు. స్థానికుల కథనం ప్రకారం.. పెనుబల్లి మండలం వీఎం బంజరు గ్రామ శివారులో మినీ డీసీఎం వ్యాను ఖమ్మం వైపు వెళ్తుండగా వెనుక నుంచి గుర్తు తెలియని లారీ ఢీ కొట్టడంతో అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న చెట్టును ఢీ కొట్టింది. దీంతో లారీ డ్రైవర్ క్యాబిన్లో ఇరుక్కుపోగా వీఎం బంజరు పోలీసులు అతడిని బయటికి తీసి పెనుబల్లి ప్రభుత్వాస్పత్రికి, ఆపై ఖమ్మం తరలిస్తుండగా.. మార్గమధ్యలో మృతి చెందాడు. మృతుడు ఏపీ రాష్ట్రానికి చెందిన చిల్లకల్లు గ్రామానికి చెందిన వాడిగా గుర్తించారు. ఆయనకు భార్య, పిల్లలు ఉన్నారు. ఘటనపై ఏఎస్సై సత్యనారాయణ కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. యువతి అదృశ్యంపై కేసు నమోదు ఖమ్మంరూరల్: ముదిగొండ మండలం పమ్మి గ్రామానికి చెందిన యువతి తిరుమలాయపాలెం మండలం దమ్మాయిగూడెంలో ఉంటూ ఆరెంపులలోని లారెన్స్ కళాశాలలో బీఈడీ చదువుతోంది. శనివారం మధ్యాహ్నం నుంచి ఆమె ఫోన్ స్విచ్ఛాఫ్ రావడంతో బంధువులు ఆచూకీ కోసం తెలిసిన వారి, బంధువుల ఇళ్లల్లో వెతికారు. అయినా ఆచూకీ లభించకపోవడంతో ఆమె తల్లి షేక్.అబ్బసల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసినట్లు ఎస్ఐ రాయుడు తెలిపారు. ధంసలాపురంలో.. ● ఖమ్మంఅర్బన్: నగరంలోని ధంసలాపురం అగ్రహారం కాలనీకి చెందిన 19 ఏళ్ల యువతి అదృశ్యంపై ఖమ్మంఅర్బన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈనెల 17న ఇంటి నుంచి బయటకు వెళ్లిన యువతి తిరిగి రాకపోవడంతో చాలా చోట్ల ఆరా తీశారు. అయినా ఆచూకీ లేకపోవడంతో ఆమె కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. -
ప్రజల విశ్వాసాన్ని చూరగొనాలి
ఖమ్మంమయూరిసెంటర్: గ్రామాల్లో నూతనంగా గెలిచిన సర్పంచ్లు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు ప్రజా సమస్యలు పరి ష్కరించి, ప్రజల విశ్వాసాన్ని చూరగొనాలని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యు డు తమ్మినేని వీరభద్రం సూచించారు. ఆదివారం ఖమ్మం సుందరయ్య భవనంలో నూతనంగా ఎన్నికై న సీపీఎం ప్రజాప్రతినిధులను సన్మానించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామాలకు విడుదల చేయాల్సిన నిధుల విషయంలో రాజీలేని పోరాటాలు నిర్వహించి గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. ఏకగ్రీవాల పేరుతో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న తరుణంలో సీపీఎం పోటీలో నిలబడ్డ వారికి ప్రజలు మద్దతుగా నిలిచి గెలిపించారని, వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా హక్కులను కాపాడాలన్నారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు పోతి నేని సుదర్శన్రావు మాట్లాడుతూ.. ప్రజా సమస్యలపై అంకితభావంతో పని చేసి ప్రజాభిమానం పొందాలని సూచించారు. ఈ సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, రాష్ట్ర కమిటీ సభ్యుడు బండిరమేష్, కళ్యాణ వెంకటేశ్వరరావు, వై. విక్రమ్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బొంతు రాంబాబు, భూక్య వీరభద్రం, రమేష్, ఎర్ర శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
‘ఫిట్నెస్’ తూచ్..!
రుద్రంపూర్: కొత్తగూడెం ఏరియా పరిధిలోని వీకే–7 ఓసీలో నడుస్తున్న వోల్వోలు ఫిట్నెస్ లేని కారణంగా గడిచిన 40 రోజుల్లో మూడు ప్రమాదాలు జరిగాయి. క్వారీలో పనిచేసేఉద్యోగులు, ఇతరసిబ్బంది సెల్ఫోన్ లు వాడదరాలని, ఫలితంగా ప్రమాదాలు జరుగుతున్నాయని సంస్థ ఉన్నతాధికారులు కిందిస్థాయి అధికా రులు, ఉద్యోగులకు ఆదేశాలు జారీ చేసినా.. పట్టించుకోకపోవడంతో ప్రమాదాలకు నిలయంగా మారింది. అంతేకాక ఉద్యోగులకు సరైన శిక్షణ (ఎంవీటీసీ) కూ డా లేదని, దీనికి తోడు క్వారీలో పనిచేస్తున్న సిబ్బం ది నిర్లక్ష్యంతో ప్రమాదాలు జరుగుతున్నాయని కార్మికలువాపోతున్నారు. సంస్థలోపనిచేసేఉద్యోగులకు ఎం వీటీసీతో పాటు ఇతర అన్ని రకాలు శిక్షణలు ముగిసి న తరువాతే క్వారీలో పనుల్లోకి వెళ్లాల్సి ఉండగా.. వీకే–ఓసీలో మాత్రంఇందుకు విరుద్ధంగాజరుగుతున్నా.. ఉన్నతాధికారులు స్పందించకపోవడం గమనార్హం. గతంలో ఎన్నడూ లేని ఒరవడి.. ఇదిలా ఉండగా, గతంలో ఇక్కడ ప్రాజెక్ట్ ఆఫీసర్గా పనిచేసే అధికారి ప్రతీ అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ఏ పనైనా జరిగేది. ఆయన ప్రతీ అంశాన్ని ప్రశ్నిస్తున్నారని చెప్పి ఇక్కడి నుంచి బదిలీ చేయించారని ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని నూతన ఒరవడి ఏరియాలో వినిపించడంతో కార్మికులను విస్మయానికి గురిచేస్తోంది. వారోత్సవాలు జరిగిన మూడు రోజులకే.. ఏంటికి ఏమి కాకముందే ఇన్ని ప్రమాదాలు జరిగితే మరో 25 ఏళ్లు నడిచే ఓసీలో మరెన్ని ప్రమాదాలు సంభవిస్తాయోనని కార్మికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు రక్షణ వారోత్సవాలు జరిగిన మూడు రోజులకే ప్రమాదం జరగడం విస్మయానికి గురి చేస్తోంది. ఈ క్రమంలో సేఫ్టీ కమిటీ ఏ విచారణ చేశారో అర్థం కానీ అంశం. జరిగిన ప్రమాదం మరోమారు జరగకుండా చూడాల్సిన అధికారులే తప్పిదాన్ని కప్పిపుచ్చుకోవడంపై కార్మికుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికై నా కార్పొరేట్ సేఫ్టీ, ఏరియా ఉన్నతాధికారులు స్పందించి మరోమారు ప్రమాదాలు జరుగకుండా చర్యలు తీసుకోవాలని కార్మికులు కోరుతున్నారు. వీకే–7 ఓసీలో ఫిట్నెస్లేని వోల్వోలు -
శిల్పారామం నిర్మాణానికి భూమి కేటాయింపు
ఖమ్మంఅర్బన్ : ఖమ్మం నగర అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు వేసింది. సంప్రదాయ కళలను పరిరక్షిస్తూ, తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని నిలబెట్టేలా నగరంలో శిల్పారామం నిర్మించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఖానాపురం హవేలీ రెవెన్యూ గ్రామ సర్వే నంబర్లు 94, 234లో 5.04 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించినట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. శిల్పారామం నిర్మాణం పూర్తయితే స్థానిక శిల్పులు, కళాకారులు, హస్తకళల కార్మికులకు శాశ్వత వేదిక సిద్ధమవుతుందని అన్నారు. పర్యాటక అభివృద్ధికీ మార్గం ఏర్పడుతుందని చెప్పారు. శిల్పారామంతో యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. శిల్పారామానికి ఆకర్షణీయ ముఖద్వారం నమూనా (ఎంట్రెన్స్ గేట్ డిజైన్) సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. త్వరలో పనుల ప్రారంభానికి చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే రాష్ట్ర, జాతీయ స్థాయిలో సాంస్కృతిక కేంద్రంగా ఖమ్మం గుర్తింపు పొందుతుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.మంత్రి తుమ్మల వెల్లడి -
మానవ సంబంధాల ప్రతిరూపం ‘ఫొటో’..
ఖమ్మంగాంధీచౌక్: మాసవ సంబంధాల ఆదర్శనీయతపై ప్రదర్శించిన ‘ఫొటో’నాటిక ప్రేక్షకులను ఆలోచింపజేసింది. నెలనెలా వెన్నెల కార్యక్రమంలో భాగంగా నగరంలోని భక్త రామదాసు కళాక్షేత్రంలో ఆదివారం రాత్రి నెల్లూరుకు చెందిన క్రాంతి ఆర్ట్స్ థియేటర్స్ కళా సంస్థ బృందం ‘ఫొటో’నాటిక ప్రదర్శించింది. కుటుంబ బంధాల పట్ల నాడు ఎలా ఉంది, నేటి తరంలో ఎలా ఆచరిస్తున్నారన్న తీరును స్పష్టంగా వివరిస్తున్న తీరు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అనంతరం రైతు సంఘం రాష్ట్ర నాయకుడు నున్నా నాగేశ్వరరావు మాట్లాడుతూ.. అంతరించిపోతున్న నాటక రంగాన్ని ముందుకు తీసుకెళ్తుండడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో ఖానాపురం మాజీ సర్పంచ్ బుగ్గవీటి సరళ, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ పెనుగొండ శ్రీనివాసరావు, డాక్టర్ వాసుదేవ్, మిక్కిలినేని నరేంద్ర, నిర్వాహకులు అన్నాబత్తుల సుబ్రమణ్యకుమార్, మోటమర్రి జగన్మోహన్ రావు, డాక్టర్ నాగబత్తిని రవి, నామ లక్ష్మీనారాయణ, వేము ల సదానందం, వీరబాబు, నవీన్ పాల్గొన్నారు. -
ఇక కొత్త కళ!
22 నెలలుగా ‘ప్రత్యేక’పాలన.. జిల్లాలోని మొత్తం 571 పంచాయతీల్లో గత 22 నెలలుగా ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతోంది. 2019లో 584 జీపీలకు ఎన్నికలు నిర్వహించగా.. ఆ ఏడాది ఫిబ్రవరి 2న పాలక వర్గాలు పగ్గాలు చేపట్టాయి. వీరి పదవీ కాలం 2024 ఫిబ్రవరి 1న ముగిసింది. అయితే ఏదులాపురం, కల్లూరు మున్సిపాలిటీలు ఏర్పడిన నేపథ్యంలో కొన్ని గ్రామపంచాయతీలు వీటిలో విలీనమయ్యాయి. దీంతో ప్రస్తుతం 571 గ్రామపంచాయతీలు ఉండగా.. అందులో ఐదు జీపీలకు స్టే కారణంగా ఎన్నికలు జరగలేదు. ఏన్కూరు మండలం నూకాలంపాడు గ్రామపంచాయతీ ఎస్టీకి రిజర్వ్ కాగా.. ఎస్టీ ఓటర్లు లేకపోవడంతో నామినేషన్లు దాఖలు కాలేదు. దీంతో ఇక్కడ కూడా ఎన్నిక జరగలేదు. ఈ ఆరు పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలనే కొనసాగుతుండగా.. మిగిలిన 565 జీపీలకు కొత్త పాలకవర్గాలు ఏర్పడ్డాయి. ఇక అభివృద్ధి బాట.. గ్రామాల్లో ప్రజాప్రతినిధుల పాలన ప్రారంభం కానుండడంతో పల్లెలు కొత్త కళ సంతరించుకుంటున్నాయి. ఇప్పటి వరకు ప్రత్యేకాధికారుల పాలనలో కనీస సమస్యలు కూడా పరిష్కారం కాలేదనే ఆరోపణలు ఉన్నాయి. పల్లెల్లో పారిశుద్ధ్యం అధ్వానంగా మారింది. డ్రెయిన్లలో చెత్త పేరుకుపోవడం, రోడ్లపక్కన చెత్త కుప్పల దర్శనం వంటివి నిత్యకృత్యం అయ్యాయి. ఇక వర్షం వస్తే ఇళ్ల ముందే మురుగు నీరు నిలిచి రోజుల తరబడి ప్రజలకు ఇబ్బందులు తప్పలేదు. సైడ్ డ్రెయిన్లలో చెత్త పేరుకుపోగా మురుగునీరు పొంగి రోడ్లపైకి, ఇళ్లలోకి రావడం సర్వసాధారణంగా మారింది. దీంతో దోమలు ప్రబలి ప్రజలు విషజ్వరాల బారిన పడిన ఘటనలూ ఉన్నాయి. కొన్ని పంచాయతీల్లో బ్లీచింగ్ కూడా చల్లించలేదు. ఇక ప్రత్యేకాధికారులకు వివిధ రకాల బాధ్యతలు ఉండడంతో ఆయా గ్రామాలపై ఎక్కువ దృష్టి పెట్టలేకపోయారు. దీంతో ప్రజలు పలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నిధుల విడుదలకు లైన్ క్లియర్.. గ్రామాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే నిధులకు అడ్డంకి తప్పింది. ఎన్నికలు జరగకుంటే కేంద్ర ప్రభుత్వ నిధులు వెనక్కు వెళ్లే ప్రమాదం ఉంది. ఎన్నికలు ముగిసినందున పల్లెలకు నిధులు విడుదలవుతాయనే ఆనందం వ్యక్తమవుతోంది. ఇప్పటి వరకు ఆస్తి, ఇతర పన్నుల వసూళ్లు కూడా అంతంతమాత్రంగానే జరగడంతో కనీస అవసరాలకు కూడా నిధులు సమకూర్చుకోలేని పరిస్థితుల్లో జీపీలున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి గ్రాంట్లు, 15వ ఆర్థిక సంఘం నిధులు వస్తే గ్రామాలు కొత్తకళ సంతరించుకుంటాయి. ఇక ప్రభుత్వం నుంచి పలు బిల్లులు కూడా రావాల్సి ఉంది. ఇవి కూడా విడుదలవుతాయని నూతన సర్పంచ్లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. పాలక వర్గాల ప్రమాణ స్వీకారోత్సవానికి గ్రామపంచాయతీలు ముస్తాబవుతున్నాయి. జీపీల్లో ప్రత్యేక సమావేశాల నిర్వహణకు ఏర్పాట్లతో పాటు భవనాలను అలంకరిస్తున్నారు. నూతన సర్పంచ్లు, ఉపసర్పంచ్లు, వార్డు సభ్యులతో పంచాయతీ కార్యదర్శులు సోమవారం ప్రమాణ స్వీకారం చేయిస్తారు. పాలకవర్గాలు ఏర్పడిన నేపథ్యంలో వీలైన సమయంలో గ్రామసభ ఏర్పాటు చేసుకుని గ్రామాభివృద్ధి, నిధుల వినియోగం, రావాల్సిన నిధులు తదితర వాటిపై చర్చిస్తారు. చేపట్టాల్సిన పనులపై తీర్మానం చేస్తారు. గ్రామంలో అవసరాలకు అనుగుణంగా నిధులు వెచ్చిస్తారు.పల్లెల్లో కొలువుదీరనున్న పాలకవర్గాలు -
27, 28వ తేదీల్లో ఖమ్మం జోన్ క్రికెట్ టోర్నీ
ఖమ్మం స్పోర్ట్స్: కాకతీయ యూనివర్సిటీ పరిధి ఉమ్మడి ఖమ్మం జోన్ డిగ్రీ కళాశాలల క్రికెట్ పోటీలు ఈనెల 27, 28వ తేదీల్లో నిర్వహిస్తున్నట్లు ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ బి.వెంకన్న తెలిపారు. ఖమ్మంలోని ఎస్ఆర్అండ్బీజీఎన్ఆర్ కళాశాల మైదానంలో జరిగే ఈ పోటీలు నాకౌట్ పద్ధతిలో జరుగుతాయని పేర్కొన్నారు. ఇప్పటికే ఖమ్మం జోన్ పరిధిలోని 14 కళాశాలల నుంచి జట్ల నుంచి ఎంట్రీలు అందాయని తెలిపారు. ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులతో ఖమ్మం జోన్ జట్టును ఎంపిక చేయనుండగా, కాకతీయ యూనివర్సిటీ స్థాయి టోర్నీలో పాల్గొంటుందని వెల్లడించారు. ‘ప్రకృతి విపత్తుల’పై నేడు మాక్ డ్రిల్ఖమ్మం సహకారనగర్ : ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు సమర్థవంతంగా ఎలా ఎదుర్కోవాలనే అంశంపై సోమవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు మాక్డ్రిల్ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ పి.శ్రీనివాస రెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని సమావేశ మంది రంలో ఆదివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఖమ్మం బొక్కలగడ్డ ప్రాంత ప్రజ లను రామ్లీలా ఫంక్షన్ హాల్లో ఏర్పాటుచేసిన పునరావాస కేంద్రానికి తరలించడం, ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి గ్రౌండ్ ఫ్లోర్ పేషెంట్లను టాప్ ఫ్లోర్కు తరలించడాన్ని మాక్ ఎక్సర్సైజ్గా చేపట్టనున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో లైవ్ స్ట్రీమింగ్ చేయాలన్నారు. మాక్డ్రిల్లో భాగంగా వరదలతో బొక్కలగడ్డ ప్రాంతం మునిగిపోతుందని ఉదయం 9 గంటలకు జిల్లా కంట్రోల్ రూమ్కు సమాచారం అందుతుందని, ఆ వెంటనే ఏయే శాఖలను అలర్ట్ చేయాలి, క్షేత్రస్థాయిలో ఎలా సాయం అందించాలి, ప్రజలను త్వరగా ఖాళీ చేయించడం ఎలా అనే అంశాలపై సూచనలు చేశారు. సమావేశంలో సీపీఓ ఎ.శ్రీనివాస్, వివిధ శాఖల అధికారులు యాకూబ్, అజయ్కుమార్, రామారావు, వెంకట్రాం తదితరులు పాల్గొన్నారు. గాదె ఇన్నయ్య అరెస్ట్కు ఖండనఖమ్మంమయూరిసెంటర్: తెలంగాణా ఉద్యమ కారుడు, ప్రజాతంత్ర వాది గాదె ఇన్నయ్యను ఎన్ఐఏ ఉపా చట్టం కింద అరెస్టు చేయడం దుర్మార్గమని, దీన్ని ఖండిస్తున్నామని సీపీఐ (ఎంఎల్) మాస్లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టుల నిర్మూలనకు పిలుపునిచ్చి నరమేధాన్ని అమలు చేస్తోందని ఆరోపించారు. ఇన్నయ్యపై కేసును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. -
బీజేపీది గాడ్సే వారసత్వం
ఖమ్మంమయూరిసెంటర్ : బీజేపీది గాంధీని చంపిన గాడ్సే వారసత్వమని డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ గౌడ్ అన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలు, ఉపాధి హామీ పథకం పేరు మార్పునకు నిరసనగా ఏఐసీసీ, టీపీసీసీ పిలుపు మేరకు ఆదివారం ఖమ్మం గాంధీచౌక్లో మహాత్మా గాంధీ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదరికాన్ని నిర్మూలించాల్సిన ప్రభుత్వం పెంచి పోషిస్తుందని ఆరోపించారు. ఆనాడు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రతీ పేదవాడికి ఉపాధి కల్పించేందుకు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని రూపొందించిందని, ఇప్పుడు ఆ పథకానికి తూట్లు పొడుస్తున్న బీజేపీ ప్రభుత్వం ఏకంగా పేరు మార్చిందని అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు నాగండ్ల దీపక్చౌదరి, మార్కెట్ చైర్మన్ యరగర్ల హనుమంతరావు, నాయకులు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, పోట్ల నాగేశ్వరరావు, బాలసాని లక్ష్మీనారాయణ, యర్రం బాలగంగాధర్ తిలక్, వడ్డెబోయిన నరసింహరావు, పులిపాటి వెంకయ్య, దొబ్బల సౌజన్య, వేజండ్ల సాయికుమార్, సయ్యద్ గౌస్, పుచ్చకాయల వీరభద్రం, మొక్క శేఖర్గౌడ్, కార్పొరేటర్లు మలీదు వెంకటేశ్వరరావు, దుద్దుకూరి వెంకటేశ్వరరావు, లకావత్ సైదులు, గజ్జల లక్ష్మి వెంకన్న పాల్గొన్నారు. -
అపజయాలే విజయాలకు సోపానం
ఖమ్మంసహకారనగర్ : అపజయాలను విజయాలకు సోపానాలుగా మలుచుకుని విద్యార్థులు ముందుకుసాగాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. నగరంలోని ఎస్ఎఫ్ఎస్ పాఠశాలలో నిర్వహిస్తున్న జిల్లా స్థాయి సైన్స్ఫేర్ ముగింపు కార్యక్రమానికి ఆదివారం ఆయన హాజరై మాట్లాడారు. సైన్స్ఫేర్కు 743, ఇన్స్పైర్కు 100 ప్రదర్శనలు వచ్చాయని, ఆర్టిిఫీషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్ అంశంపై 45 మంది విద్యార్థులు ప్రదర్శనలు చేయడం అభినందనీయమని అన్నారు. పిల్లలు తమ దైనందిన జీవితంలో ఎదురయ్యే సమస్యలకు పరిష్కారం దిశగా ఆవిష్కరణలు ఉండాలని సూచించారు. వైరా ఎమ్మెల్యే రాందాస్నాయక్ ప్రదర్శనలను తిలకించి విద్యార్థులతో ముచ్చటించారు. రాష్ట్రస్థాయికి 14 ప్రదర్శనలు.. జిల్లా స్థాయి సైన్స్ఫేర్లో ఏడు థీమ్లు ఉండగా అందులో సీనియర్, జూనియర్ విభాగాల నుంచి ఒక్కో అంశం చొప్పున మొత్తం 14 ప్రదర్శనలను రాష్ట్రస్థాయికి ఎంపిక చేశారు. అలాగే సదస్సు, ఒక టీచర్ ప్రదర్శన కూడా రాష్ట్రస్థాయికి ఎంపికయ్యాయి. వీరందరికీ కలెక్టర్ అనుదీప్ ప్రశంసాపత్రాలు అందించారు. డీఈఓ చైతన్య జైనీ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సెక్టోరియల్ అధికారులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ప్రైవేటు విద్యాసంస్థల బాధ్యులు పాల్గొన్నారు. ప్రైవేటు విద్యాసంస్థల ఆధ్వర్యంలో విద్యార్థులకు భోజన, అల్పాహారం అందజేశారు.సైన్స్ఫేర్ ముగింపు సభలో కలెక్టర్ అనుదీప్ -
కూర్మావతారంలో రామయ్య
భద్రాచలం: క్షీరాబ్ది సమయంలో మందరగిరిని తన వీపున మోసి దేవతలకు అమృతం అందించిన కూర్మావతార రాముడిని భక్తులు కనుల నిండుగా దర్శించుకున్నారు. వైకుంఠ ఏకాదశీ ప్రయుక్త అధ్యయనోత్సవాలలో భాగంగా భద్రాచల రామయ్య ఆదివారం కూర్మావతారంలో దర్శనమిచ్చారు. తెల్లవారుజామున 4గంటలకు ఆలయాన్ని తెరిచి స్వామివారికి సుప్రభాత సేవ నిర్వహించి ఆరాధన, ఆరగింపు ఇచ్చారు. వేద పండితులు స్వామివారికి దివ్య ప్రబంధం చేశారు. రెండు వందల నాళాయిర దివ్య ప్రబంధాలను చదివారు. పన్నెడు మంది ఆళ్వార్లకు పరివట్టం కట్టి పూలమాలలు వేసి తులసి దళాలు సమర్పించారు. అనంతరం కూర్మావతారంలో ప్రత్యేకంగా అలంకరించిన స్వామివారిని బేడా మండపంలో కొలువుదీర్చారు. వైభవంగా తిరువీధి సేవ అధ్యయనోత్సవ వేదికపై ప్రత్యేక పూజలు అందుకున్న స్వామివారు ఊరేగింపుగా తిరువీధి సేవకు వెళ్లారు. తాతగుడి వీధిలోని విశ్రాంతమండపం వద్దకు తీసుకెళ్లి అక్కడ కొద్దిసేపు ఉంచి పూజలు నిర్వహించారు. ఆ తర్వాత ఊరేగింపుగా తాతగుడి వరకు స్వామివారిని తీసుకెళ్లి తిరిగి గర్భగుడికి తీసుకొచ్చారు. దారి పొడవునా భక్తులు స్వామివారికి పూజలు నిర్వహించి ప్రసాదాలు అందుకున్నారు. -
‘యాప్’తో యూరియా కొనుగోలు సులభతరం
ఖమ్మంవ్యవసాయం: క్యూ కట్టకుండా, వేచి ఉండకుండా యాప్ ద్వారా యూరియా కొనుగోలు సులభం కానుందని అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి తెలిపారు. మొబైల్ యాప్ పనితీరుపై రైతులు, ఎరువుల డీలర్లకు శనివారం కలెక్టరేట్లో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. యూరియా లభ్యతపై రైతులు అనుమానాలు పెట్టుకోవద్దని తెలిపారు. సరిపడా యూరియా ఉండగా.. పారదర్శకత, అర్హులకే యూరియా అందాలనే భావనతో యాప్ ప్రవేశపెట్టినట్లు చెప్పారు. ఈమేరకు పూర్తి వివరాలతో లాగిన్ అయి బుక్ చేసుకోవాలని, అనుమానాలు ఉంటే ఏఈఓలను సంప్రదించాలని సూచించారు. కాగా, ఎకరంలోపు విస్తీర్ణం ఉన్న రైతులకు ఒక దఫాలో, 1 – 5 ఎకరాల్లోపు విస్తీర్ణం ఉన్న రైతులకు రెండు సార్లు, 5 – 20 ఎకరాల్లోపు ఉంటే మూడు దఫాల్లో, 20 ఎకరాల కంటే ఎక్కువ విస్తీర్ణం ఉన్న రైతులకు నాలుగు దఫాల్లో అవసరమైన యూరియా సరఫరా జరుగుతుందని తెలిపారు. కాగా, డీలర్లు ఈ విధానంపై అవగాహన పెంచుకోవాలని, ఎలాంటి అవకతవకలకు పాల్పడినా చర్యలు ఉంటాయని అదనపు కలెక్టర్ స్పష్టం చేశారు. జిల్లా వ్యవసాయ శాఖ అధికారి డి.పుల్లయ్య, జిల్లా ఉద్యానవన అధికారి ఎం.వీ.మధుసూదన్, డీసీఓ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. -
శ్రీనివాసుడికి ప్రత్యేక పూజలు
ఎర్రుపాలెం: తెలంగాణ తిరుపతిగా పేరున్న జమలాపురంలోని శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు జరిగాయి. తెల్లవారుజామునే స్వామి మూలవిరాట్తో పాటు ఆలయంలోని శ్రీవారి పాదానికి అర్చకులు పంచామృతంతో అభిషేకం నిర్వహించారు. ఆతర్వాత స్వామి, అమ్మవార్లను పట్టువస్త్రాలతో అలంకరించి వేలాదిగా హాజరైన భక్తుల సమక్షాన నిత్యకల్యాణం, పల్లకీ సేవ చేశారు. ఈఓ జగన్మోహన్రావు, వ్యవస్థాపక ధర్మకర్త ఉప్పల శ్రీరామచంద్రమూర్తి, ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాసశర్మ, సీనియర్ అసిస్టెంట్ సోమయ్య తదితరులు పాల్గొన్నారు.నేడు జాతీయ లోక్ అదాలత్ ఖమ్మంలీగల్: రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ సూచనల మేరకు జిల్లా కోర్టులోని న్యాయసేవా సదన్లో ఆదివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా జడ్జి ఎస్.రాజగోపాల్ తెలిపారు. సత్వర కేసుల పరిష్కారమే లక్ష్యంగా లోక్అదాలత్ నిర్వహణ ఉంటుందని వెల్లడించారు. ఉదయం 10 గంటలకు మొదలయ్యే లోక్ అదాలత్లో రాజీ పడదగిన అన్ని కేసులు పరిష్కరించనున్నందున కక్షిదారులు సద్విని యోగం చేసుకోవాలని ఆయన సూచించారు. కక్షిదారులు సద్వినియోగం చేసుకోండి ఓవర్సీస్ స్కాలర్షిప్ కోసం దరఖాస్తులు ఖమ్మంమయూరిసెంటర్: విదేశీ యూనివర్సిటీల్లో ప్రవేశం పొందిన మైనార్టీ విద్యార్థులు(ముస్లిం, క్రిస్టియన్, సిక్కులు, జైనులు, పార్శిలు) సీఎం ఓవర్సీస్ స్కాలర్షిప్ పథకం కోసం దరఖాస్తు చేసుకోవాలని జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి ముజాహిద్ సూచించారు. అమెరికా, కెనడా, బ్రిటన్, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, సింగపూర్, న్యూజిలాండ్, సౌత్ కొరియాలోని ఎంపిక చేసిన యూనివర్సిటీల్లో ప్రవేశాలు పొందిన వారే అర్హులని పేర్కొన్నారు. పీజీ కోసం ఇంజనీరింగ్ డిగ్రీలో 60 శాతం, డాక్టరేట్ చేసేందుకు పీజీలో 60 శాతం మార్కులు వచ్చి ప్రవేశాలు పొందిన వారు ఈనెల 31వ తేదీలోగా www.telanganaepass.cgg.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. అనంతరం దరఖాస్తు కాపీలకు ధ్రువపత్రాలు జత చేసి వచ్చేనెల 31లోగా కలెక్టరేట్లోని తమ కార్యాలయంలో అందజేయాలని సూచించారు. -
ఆకట్టుకున్న సైన్స్ఫేర్
జిల్లాస్థాయి సైన్స్ ఫేర్, ఇన్స్పైర్ ఎగ్జిబిషన్ బల్లేపల్లిలోని ఎస్ఎఫ్ఎస్ పాఠశాలలో శనివారం మొదలయ్యాయి. సైన్స్ఫేర్కు 743 ఎగ్జిబిట్లు, ఇన్స్పైర్కు 100 ప్రదర్శనలు ఏర్పాటు చేయడం.. వీటిని చూసేందుకు వివిధ పాఠశాలల విద్యార్థులు రావడంతో స్కూల్ ఆవరణ కళకళలాడింది. కాగా, కొందరు విద్యార్థులు ప్రదర్శించిన ఎగ్జిబిట్లు అబ్బురపరిచేలా ఉండడం విశేషం. దూరదృష్టితో ఆలోచించి కొందరు, కళ్ల ముందు చూసిన సమస్యలకు పరిష్కారంగా ఇంకొందరు తయారు చేసిన ఎగ్జిబిట్లను పరిశీలించిన వక్తలు, న్యాయనిర్ణేతలు అభినందించారు. వారు భావి శాస్త్రవేత్తలుగా ఎదగాలని ఆకాంక్షించారు. – ఖమ్మంసహకారనగర్●శాటిలైట్ల పనివిధానం.. సత్తుపల్లి కేపీఆర్ గౌతమ్ స్కూల్కు చెందిన బి.హానిశ్కుమార్నాయక్ ఇస్రో ప్రయోగించే శాటిలైట్ల పని విధానంపై ఎగ్జిబిట్ ప్రదర్శించాడు. భవిష్యత్లో శాస్త్రవేత్తగా ఎదగాలన్నదే తన లక్ష్యమని వెల్లడించాడు. ఇందులో భాగంగానే శాస్త్ర, సాంకేతిక రంగాలపై ఆసక్తితో ఇస్రో శాటిలైట్ల పనితీరుపై ఎగ్జిబిట్ రూపొందించానని చెప్పాడు. ●మల్టీపర్పస్ క్రాప్ ప్రొటెక్టర్ కొణిజర్ల జెడ్పీహెచ్ఎస్కు చెందిన ఆర్.హిమాసాగర్ మల్టీపర్పస్ క్రాప్ ప్రొటెక్టర్ ప్రదర్శిచాడు. అటవీ జంతువుల నుంచి పంటలకు రక్షణ కోసం ఈ పరికరం ఉపయోగపడుతుందని వెల్లడించారు. పగటి సమయంలో శబ్దంతో జంతువులు పారిపోతాయని, రాత్రి వేళ సోలార్ సిస్టమ్ ద్వారా వెలిగే లైట్తో క్రిమికీటకాలు దరిచేరవని వెల్లడించాడు. -
‘ట్రెసా’ నూతన కార్యవర్గం ఎన్నిక
● అధ్యక్ష, కార్యదర్శులుగా సునీల్రెడ్డి, ప్రసాద్ ఖమ్మంసహకారనగర్: తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్ (టీఆర్ఈఎస్ ఏ–ట్రెసా) జిల్లా నూతన కార్యవర్గాన్ని శనివారం ఎన్నుకున్నారు. ఖమ్మం డీపీఆర్సీ భవనంలో జరిగిన ఎన్నికల్లో జిల్లా అధ్యక్షుడిగా తుంబూరు సునీల్రెడ్డి, కార్యదర్శిగా కేవీవీ.ప్రసాద్, గౌరవ అధ్యక్షులుగా తుమ్మా రవీందర్, రాచకొండ సాయినరేష్ ఎన్నికయ్యారు. అలాగే, కోశాధికారి గా మిరియం క్రాంతికుమార్, వివిధ విభాగాల కార్యదర్శులుగా కె.శ్రీకాంత్, సతీష్, రంజిత్కుమార్, జగదీష్, ఎం.ఎస్.గౌతమ్, ఉపాధ్యక్షులుగా వెంకన్న, కిరణ్కుమార్, జాస్మిన్, రమేష్, రమణి, వెంకటేశ్వర్లు, సత్యనారాయణ, అన్సారి, రవికుమార్, సంయుక్త కార్యదర్శులుగా ఎస్కే.అజీజ్, ఏ.మధు, అశోక్ను ఎన్నుకున్నారు. అంతేకాక కార్యవర్గ సభ్యులుగా ప్రవీణ్కుమార్, ఏకవీర, నరసింహారావు, నళిని, శ్రావణ్కుమార్, ఉషారాణి, నాగరాజు ఎన్నిక కాగా, నూతన కార్యవర్గాన్ని జేఏసీ చాంబర్ చైర్మన్ గుంటుపల్లి శ్రీనివాసరావు, టీఆర్ఈఎస్ఏ ఉపాధ్యక్షుడు కారుమంచి శ్రీనివాసరావు, రాష్ట్ర కోశాధికారి బి.వెంకటేశ్వరరావు తదితరులు అభినందించారు. రేపటి నుంచి ప్రజావాణి ఖమ్మం సహకారనగర్: గ్రామపంచాయతీ ఎన్నికల కారణంగా ఇన్నాళ్లు వాయిదా వేసిన ప్రజావాణి(గ్రీవెన్స్ డే) కార్యక్రమాన్ని ఈ సోమవారం నుంచి కలెక్టరేట్లో యథావిధిగా నిర్వహిస్తామని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. ప్రజలు తమ సమస్యలపై దరఖాస్తులు అందజేయొచ్చని ఆయన ఓ ప్రకటనలో వెల్లడించారు. -
వాహనదారుల్లా వెళ్లి తనిఖీలు
● ఆర్టీఓ కార్యాలయంలో ఏసీబీ సోదాలు ● రూ.70వేల నగదుతో పాటు కార్డుల స్వాధీనం ● అధికారుల విచారణ, అదుపులో ఏజెంట్లు ఉదయం 11గంటలకే.. జిల్లా రవాణా శాఖ కార్యాలయంలోని కొందరు ఉద్యోగులపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో తనిఖీకి సిద్ధమైన ఏసీబీ ఉద్యోగులు ఉదయం 11గంటలకే రవాణా శాఖ కార్యాలయానికి ఆటోలో వచ్చి లైసెన్స్ల కోసమని కార్యాలయంలో ఆరాతీశారు. అయితే, సరైన సమాధానం రాకపోవడంతో సమీపంలోని ఏజెంట్ల కార్యాలయాల్లో సంప్రదించి వివరాలు తెలుసుకున్నారు. ఎంత చెల్లించాలి, ఎవరిని కలవాలో ఏజెంట్లు చెప్పాక తనిఖీలకు సిద్ధమయ్యారు. ఒక్కసారి ఆర్టీఏ కార్యాలయంలో ఏసీబీ అధికారులు తనిఖీలకు దిగడంతో కీలక పోస్ట్లోని అఽధికారి వద్ద పనిచేసే అసిస్టెంట్తోపాటు ఏజెంట్లు పారిపోతుండగా వెంటపడి మరీ పట్టుకున్నారు. ఇరవై మందికి పైగా ఏజెంట్లను అదుపులోకి తీసుకుని లెక్కల్లో లేని రూ.70వేలకు పైగా నగదు, ఆర్సీలు, లైసెన్స్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే, కీలక అధికారి అసిస్టెంట్గా భావిస్తున్న వ్యక్తి వద్ద కోడ్ వేసి పత్రాలు లభ్యమయ్యాయి. వాటా పెంచాల్సిందే... ఏజెంట్లు, ఖమ్మంలోని రవాణా శాఖా కార్యాలయ ఉద్యోగుల నడుమ కొన్నాళ్ల నుంచి వివాదాలు తలెత్తినట్లు తెలిసింది. లైసెన్స్ల జారీకి ప్రసుత్తం ఇస్తున్న వాటా పెంచాలంటూ కొందరు ఉద్యోగులు వారి ద్వారా వచ్చే దరఖాస్తులను పక్కన పెట్టినట్లు సమాచారం. దీంతో పలువురు ఏజెంట్లే నేరుగా హైదరాబాద్లోని ఏసీబీ ప్రధాన కార్యాలయంలో ఫిర్యాదు చేసినట్లు సమాచారం.ఏసీబీ డిఎస్పీ రమేష్ ఆధ్వర్యాన తనిఖీలు చేపడుతున్నసమయాన ఇన్చార్జ్ ఆర్టీఓ వెంకటరమణ కలెక్టరేట్లో వీడియో కాన్ఫరెన్స్లో ఉన్నారు. దీంతో అక్కడకు వెళ్లి ఆయనను బయటకు పిలిచి వెంకటరమణతో పాటు డ్రైవర్ సెల్ఫోన్లు స్వాధీనం చేసుకుని కార్యాలయానికి తీసుకొచ్చారు. అలాగే, పలువురు ఏఎంవీఐలు, సిబ్బంది ఫోన్లు కూడా స్వాధీనం చేసుకుని తనిఖీ చేశారు. కాగా, ఆర్టీఓ వెంకరమణ, ఏఎంవీఐ స్వర్ణలత ఇళ్లలో నూ ఏసీబీ అధికారుల సోదాలు కొనసాగాయి. అలాగే, రాత్రి వరకు కార్యాలయ ఉద్యోగులు బయటకు వెళ్లకుండా తనిఖీలు చేపట్టారు. ఏజెంట్ల వద్ద దొరికిన నగదు, వాహనదారులకు సంబంధించిన కార్డులను సీజ్ చేశామని.. వీటితో సంబంధం ఉన్న వారందరిపై కేసులు నమోదు చేస్తామని ఏసీబీ డీఎస్పీ రమేష్ తెలిపారు.సాధారణ వాహనదారుల్లా ఏజెంట్లను కలిసిన ఏసీబీ అధికారులు వాహనాల రిజిస్ట్రేషన్, లైసెన్స్కు ఎంత తీసుకుంటున్నారో ఆరాతీశారు.. అసలు ఫీజు కంటే ఎక్కువ వసూలు చేస్తున్నట్లు తేలడం, ఏజెంట్ల ద్వారా వెళ్తేనే పని అవుతుందని బయటపడడంతో ఒకేసారి బృందంగా ఏర్పడిన ఏసీబీ అధికారులు శనివారం జిల్లా రవాణా శాఖా కార్యాలయంలో తనిఖీలు చేశారు. ఈ విషయాన్ని గుర్తించి అటు ఏజెంట్లు, ఇటు ఉద్యోగులు తేరుకునేలోగా పలువురు ఏజెంట్లను అదుపులోకి తీసుకోవడంతో పాటు లెక్కల్లో లేని రూ.70వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాక రవాణా శాఖ ఉద్యోగుల ఇళ్లలోనూ చేపట్టిన తనిఖీలు శనివారం రాత్రి వరకు కొనసాగాయి. – ఖమ్మంక్రైం -
పది రోజుల్లో అక్రిడిటేషన్లు
ఖమ్మంసహకారనగర్: జర్నలిస్టులకు అక్రిడిటేషన్ జారీ ప్రక్రియ పది రోజుల్లో ప్రారంభిస్తామని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) జిల్లా మహాసభలు శనివారం ఖమ్మంలో జరగగా, సభకు హాజరుకావాల్సిన మంత్రి అత్యవసర సమావేశం కోసం హైదరాబాద్ వెళ్లారు. ఈ సందర్భంగా ఫోన్ ద్వారా తన సందేశాన్ని వినిపించిన మంత్రి.. అక్రిడిటేషన్ కార్డులు, ఇళ్ల స్థలాల సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని తెలిపారు. కోర్టు తీర్పు నేపథ్యాన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ప్రత్యామ్నాయ పద్ధతుల్లో ఇచ్చేలా చర్యలు చేపడుతున్నామన్నారు. కొత్త సంవత్సరం ఆరంభంలో ఈ విషయమై తీపి కబురు అందిస్తామన్నారు. అనంతరం సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి, మంత్రి పొంగులేటి క్యాంపు ఇన్చార్జ్ తుంబూరు దయాకర్రెడ్డి, తుమ్మల యుగంధర్, కూరపాటి ప్రదీప్, యలమంచిలి రవీంద్రనాథ్ మాట్లాడారు. ఈ మహాసభలో టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బసవ పున్నయ్య, కార్యదర్శి ఈ.చంద్రశేఖర్, ఉపాధ్యక్షుడు బి.రాజశేఖర్, కొత్తా యాకేశ్, నూకల రామచంద్రమూర్తి, జానీపాషా, జి.వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. జిల్లా నూతన కమిటీ టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా కమిటీని ఈ మహాసభల్లో ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్ష, కార్యదర్శులుగా ఖదీర్, శ్రీనివాసరెడ్డి ఎన్నికయ్యారు. అలాగే, కోశాధికారిగా తేనె వెంకటేశ్వర్లు, వైస్ ప్రెసిడెంట్గా దువ్వా సాగర్, సహాయ కార్యదర్శులుగా జక్కంపూడి కృష్ణ, కూరాకుల గోపి, నాగుల్మీరా ఎన్నికయ్యారు. రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి -
ప్రపంచంతో పోటీ పడేలా ఎదగాలి
● విద్యార్థులను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులే కీలకం ● జిల్లా స్థాయి సైన్స్ఫేర్ ప్రారంభోత్సవంలో మంత్రి తుమ్మల ఖమ్మం సహకారనగర్: ప్రపంచంలో పోటీ పడేలా విద్యార్థులను తీర్చిదిద్దేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. ఖమ్మం బల్లేపల్లిలోని ఎస్ఎఫ్ఎస్ పాఠశాలలో జిల్లా స్థాయి సైన్స్ఫేర్, ఇన్స్పైర్ ఎగ్జిబిషన్ను శనివారం ఆయన కలెక్టర్ అనుదీప్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ 900 ఎగ్జిబిట్లు ఎగ్జిబిషన్కు రావడం విద్యార్థుల్లో సృజనాత్మకతకు నిదర్శనమని అభినందించారు. గ్రామీణ ప్రాంతాల్లో తల్లిదండ్రులు పడుతున్న కష్టాలను చూసి కొందరు విద్యార్థులు పరికరాలు రూపొందించారని కొనియాడారు. ఇబ్బందులు వెంటాడినా అత్యున్నత స్థాయికి చేరిన మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంను విద్యార్థులు స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. ఉపాధ్యాయులు కూడా విద్యా ప్రమాణాలు పెంచేలా బోధించాలని తెలిపారు. కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ విద్యార్థుల్లో శాసీ్త్రయ అవగాహన పెంచేలా వైజ్ఞానిక ప్రదర్శనలు ఉపయోగపడతాయని తెలిపారు. విద్యార్థులు పాఠ్యాంశాలను చదువుతూనే పరిసరాలను పరిశీలిస్తే సమస్యలపై అవగాహన ఏర్పడుతుందని చెప్పారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగళిశ్రీపాల్రెడ్డి మాట్లాడుతూ జిల్లా స్థాయి ప్రదర్శనలు రాష్ట్రస్థాయిని తలపించేలా ఉన్నాయని అభినందించారు. డీఈఓ చైతన్య జైనీ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, ఖమ్మం మార్కెట్ కమిటీ చైర్మన్ ఎరగర్ల హన్మంతరావు, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, కార్పొరేటర్లు మల్లీదు వెంకటేశ్వర్లు, కమర్తపు మురళితోపాటు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. -
పత్తి అమ్మి వస్తుండగా ప్రమాదం
●కారేపల్లి వాసి మృతి మహబూబాబాద్ రూరల్/కారేపల్లి: ఓ రైతు పత్తి విక్రయించి వస్తుండగా జరిగిన ప్రమాదంలో మృతి చెందాడు. మహబూబాబాద్ జిల్లా జమాండ్లపల్లి శివారులో శుక్రవారం అర్ధరాత్రి ఈ ప్రమాదం జరిగింది. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం గిద్దెవారిగూడెంకు చెందిన కడారి ఉపేందర్(55) ఈనెల 18న వరంగల్ మార్కెట్కు వెళ్లాడు. అక్కడ పత్తి విక్రయించాక నర్సంపేట మీదుగా బొలెరోలో స్వగ్రామానికి బయలుదేరాడు. జమాండ్లపల్లి శివారులో టిప్పర్ డ్రైవర్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా వెనకకు రావడంతో బొలెరో నడుపుతున్న నరేశ్ అదుపు చేసేలోగా టిప్పర్ ఢీకొట్టింది. ఘటనలో బొలెరో బోల్తా పడగా ఉపేందర్ అక్కడికక్కడే మృతిచెందాడు. డ్రైవర్ నరేశ్కు గాయాలు కావడంతో ఖమ్మం తరలించారు. ఆయనకు భార్య మాణిక్యం, ఇద్దరు కుమార్తెలు ఉండగా భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కాగా, మృతదేహాన్ని శనివారం గిద్దెవారిగూడెం తీసుకురాగా, ఎమ్మెల్యే రాందాస్నాయక్ నివాళులర్పించారు. నాయకులు దేవ్లానాయక్, పగడాల మంజుల, అడ్డగోడ ఐలయ్య, డేగల ఉపేందర్, ఈసాల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. చికిత్స పొందుతున్న వ్యక్తి మృతి ఖమ్మంక్రైం: రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. ఖమ్మం గట్టయ్యసెంటర్కు చెందిన చెరుకుపల్లి నాగేశ్వరరావు (40) ఈనెల 19న బైపాస్రోడ్డులో నడిచి వెళ్తుండగా వెనుక నుంచి అజాగ్రత్తగా వచ్చిన లారీడ్రైవర్ ఢీకొట్టాడు. ఘటనలో తీవ్రంగా గాయపడిన నాగేశ్వరరావు చికిత్స పొందుతూ శనివారం మృతిచెందాడు. ఘటనపై ఆయన కుమారుడి ఫిర్యాదుతో ఖమ్మం టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. కుక్కల దాడిలో గొర్రెలు మృతి కల్లూరురూరల్: మండలంలోని చండ్రుపట్లలో వీధి కుక్కలు దాడిచేయగా 14 గొర్రెలుమృతిచెందాయి. మరో ఆరుగొర్రెలు తీవ్రంగా గాయపడ్డాయి. చండ్రుపట్లకు చెందిన జోనబోయిన కృష్ణ శుక్రవారం సాయంత్రం తన గొర్రెల మందను దొడ్డిలో జాగ్రత్త చేసి నిద్రించాడు. అర్ధరాత్రి సమయాన ఫెన్సింగ్ను దాటి దొడ్డి లోకి చొరబడిన కుక్కలు దాడి చేయడంతో 14 గొర్రెలు చనిపోయాయి. ఈ సమయాన ఒక గొర్రె తప్పించుకెళ్లి అరుస్తుండగా స్థానికులు లేచి కుక్కలను తరిమివేశా రు. కల్లూరు వెటర్నరీ డాక్టర్ మమత, ఉద్యోగి ఆమని శనివారం ఉదయం పంచనామా నిర్వహించారు. నాచారం–జూలూరుపాడు రోడ్డుకు రూ.43 కోట్లుఖమ్మంఅర్బన్: ఖమ్మం జిల్లా ఏన్కూరు, భద్రాద్రి జిల్లా జూలూరుపాడు మండలాలను కలిపే రహదారి విస్తరణకు ప్రభుత్వం రూ.43 కోట్ల నిధులు మంజూరు చేసింది. ఈ మేరకు మంత్రి తుమ్మల క్యాంప్ కార్యాలయం నుంచి ఓ ప్రకటన విడుదల చేశారు. ఒంటి గుడిసె మీదుగా నాచారం–జూలూరుపాడు మార్గంలో రహదారి విస్తరణ, అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. పాన్షాప్లో షార్ట్ సర్క్యూట్ ఖమ్మంక్రైం: ఖమ్మం పాతబస్టాండ్లోని ఓ పాన్ దుకాణంలో శనివారం రాత్రి ప్రమాదవశాత్తు షార్ట్ సర్క్యూట్ జరిగి మంటలు చెలరేగాయి. షాప్ యజమాని తాళం వేసి వెళ్లాక పొగలు వస్తుండటంతో స్థానికులు సమాచారం ఇచ్చారు. ఫైర్ స్టేషన్ సిబ్బంది చేరుకుని మంటలు ఆర్పివేశారు. పోలీసుస్టేషన్కు వెళ్తూ ఆత్మహత్యాయత్నం రఘునాథపాలెం: మండలంలోని కోటపాడుకు చెందిన కె.కుమార్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గ్రామానికి చెందిన లింగయ్యను చంపుతానని ఆయన బెదిరించినట్లు బాధితుడి ఫిర్యాదుతో శనివారం కేసు నమోదు చేసినట్టు సీఐ ఉస్మాన్ షరీఫ్ తెలిపారు. ఈ క్రమంలో విచారణ కోసం పోలీస్ స్టేషన్కు రావాలని సమాచారం ఇవ్వగా మార్గమధ్యలో కుమార్ పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. స్థానికులు ఆయనను ఆస్పత్రికి తరలించగా కేసు దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు. బ్యాంక్ ఉద్యోగిని ఆత్మహత్య ఖమ్మంక్రైం: మానసిక ఆందోళనతో ఓ బ్యాంక్ ఉద్యోగిని ఆత్మహత్యకు పాల్పడింది. ఖమ్మం ప్రకాష్నగర్లో నివసిస్తున్న శివకోటి భార్గవి (26) కామారెడ్డిలోని బ్యాంక్లో క్లర్క్గా పనిచేస్తోంది. మానసిక ఆందోళనకు గురవుతున్న ఆమె ఖమ్మంవచ్చి ఉరి వేసుకుని ఆత్మహ త్య చేసుకుంది. భార్గవి తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు త్రీ టౌన్ సీఐ మోహన్బాబు తెలిపారు. -
కీలకంగా ఖమ్మం–దేవరపల్లి హైవే
● త్వరగా పూర్తయ్యేలా పర్యవేక్షించాలి ● రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మంఅర్బన్: ఖమ్మం–దేవరపల్లి జాతీయ రహదారి ఉత్తర, దక్షిణ భారతదేశాన్ని అనుసంధానం చేసే కీలకమైనదిగా మారనుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఖమ్మం ధంసలాపురం వద్ద గ్రీన్ఫీల్డ్ హైవే, ఆర్వోబీ నిర్మాణ పనులను కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్యతో కలిసి ఆయన పరిశీలించారు. మున్నేటిపై వంతెన, ఎంట్రీ–ఎగ్జిట్ పాయింట్లు, రైల్వే ఓవర్ బ్రిడ్జి పనుల పురోగతిపై ఆరాతీసిన ఆయన త్వరగా పూర్తయ్యేలా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. రైల్వే శాఖతో సమన్వయం చేస్తూ బ్రిడ్జి పనుల్లో వేగం పెంచాలని ఆదేశించారు. రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి, మార్కెట్ చైర్మన్ యరగర్ల హన్మంతరావు, ఆర్డీఓ నర్సింహారావు, తహసీల్దార్ సైదులు, కార్పొరేటర్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ●ఖమ్మం 16వ డివిజన్లో అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్రూం ఇళ్లను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించారు. పనులు నిలిచిపోవడానికి కారణాలు, ఎదురవుతున్న సమస్యలను తెలుసుకున్న ఆయన నివేదికను హౌసింగ్ శాఖ మేనేజింగ్ డైరెక్టర్ గౌతమ్కు పంపించాలని ఆదేశించారు. ఆపై నిర్మాణాల పూర్తికి అవసరమైన నిధులు మంజూరు చేయిస్తానని తెలిపారు. ●భద్రాచలంలోని శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో జరుగుతున్న ముక్కోటి ఏకాదశి ఉత్సవాలకు రావాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు ఖమ్మంలో ఆలయ ఈఓ దామోదర్రావు ఆహ్వానపత్రం అందజేశారు. అలాగే, ఆలయ నూతన క్యాలెండర్ను అందించగా.. ముక్కోటి ఏర్పాట్ల వివరాలు తెలుసుకున్న మంత్రి భక్తులకు ఇబ్బంది ఎదురుకాకుండా పర్యవేక్షించాలని సూచించారు. -
● దైనందిన జీవితంలో ఎదురయ్యే సమస్యల పరిష్కారంపై ఎగ్జిబిట్లు ● ఔరా అనిపించేలా రూపొందించిన విద్యార్థులు ● భావి శాస్త్రవేత్తలుగా ఎదగాలని వక్తల సూచన
●వైర్లెస్ ఈవీ చార్జింగ్ ఖమ్మం విన్ఫీల్డ్ హైస్కూల్కు చెందిన భువన సాత్విక్, టి.నీరజ్ ఎలక్ట్రిక్ వాహనాలకు వైర్లెస్ చార్జింగ్ విధానంపై ఎగ్జిబిట్ రూపొందించారు. వాహనాలు వెళ్తుండగానే ఆటోమెటిక్గా చార్జింగ్ అయ్యేలా ‘రోడ్ ప్రాజెక్ట్’తయారు చేశారు. దీంతో వాహనాలకు అవసరమైన చార్జింగ్ సమయాన్ని తగ్గించి పనితీరును మెరుగుపరుస్తుందని తెలిపారు. ●అన్నదాతల కష్టాలు తొలగేలా.. రైతులు కష్టాలు తగ్గేలా ఖమ్మం వివాన్ ది స్కూల్కు చెందిన విద్యార్థిని బృందం మల్టీ పర్పస్ ఆటోమెటిక్ ఇరిగేషన్ సిస్టమ్ తయారు చేసింది. పైథాన్ కోడింగ్ అమలు చేయడంతో సుమారు ఐదెకరాల వరకు పంటకు నీరు అందించడం సులువవుతుంది. రైతులకు సమయం కలిసి రావడంతో పనులు వేగంగా జరుగుతాయని వెల్లడించింది. -
డీసీసీబీ, పీఏసీఎస్ల పాలకవర్గాలు రద్దు
● డీసీసీబీ పర్సన్ ఇన్చార్జిగా కలెక్టర్ ● పీఏసీఎస్లకు అధికారులతో కమిటీల నియామకంఖమ్మంవ్యవసాయం: జిల్లా కేంద్ర సహకార బ్యాంకు(డీసీసీబీ), ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల(పీఏసీఎస్) పాలక వర్గాలను రద్దుచేస్తూ రాష్ట్రప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. పాలకవర్గాల స్థానంలో పర్సన్ ఇన్చార్జిలతో కూడిన అధికారుల కమిటీని నియమించాలని ఆ ఆదేశాల్లో పేర్కొంది. దీనిలో భాగంగా ఖమ్మం జిల్లా కేంద్ర సహకార బ్యాంకుకు దొండపాటి వెంకటేశ్వరరావు చైర్మన్గా కొనసాగుతున్న పాలకవర్గం రద్దయింది. ఈ స్థానంలో కలెక్టర్ అనుదీప్ దురిశెట్టిని పర్సన్ ఇన్చార్జిగా నియమించగా ఆయన బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ సీఈఓ ఎన్.వెంకటఆదిత్య అధికారులు పాల్గొన్నారు. పీఏసీఎస్లకు అధికారుల కమిటీలు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల(పీఏసీఎస్) పాలకవర్గాలను రద్దు చేసిన ప్రభుత్వం ముగ్గురు అధికారులతో కూడిన కమిటీలను నియమించాలని సహకార శాఖను ఆదేశించింది. ఇందులో భాగంగా ఖమ్మం డీసీసీబీ పరిధిలోని ఖమ్మం జిల్లాలో 76, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 23, మహబూబాబాద్, ములుగు జిల్లాల్లో రెండు చొప్పున పీఏసీఎస్ల పాలకవర్గాలు రద్దయ్యాయి. ఈ స్థానంలో సహకార శాఖకు చెందిన అధికారి, సహకార సంఘానికి చెందిన సూపర్వైజర్, సంఘం పరిధిలోని డీసీసీబీ బ్యాంకు మేనేజర్తో కమిటీని నియమిస్తారు. ఆరు నెలలు లేదా ఎన్నికల వరకు... డీసీసీబీ, పీఏసీఎస్లకు నియమించే పర్సన్ ఇన్చార్జిలు, కమిటీలు ఆరు నెలల పాటు లేదా సంఘాలకు ఎన్నిక జరిగే వరకు అమల్లో ఉంటాయి. ప్రస్తుతం రద్దయిన కమిటీలు 2020 ఫిబ్రవరిలో నియామకమయ్యాయి. కమిటీల పదవీ కాలం పూర్తయ్యాక రైతులకు ప్రయోజనం కలిగేలా విడదీసి కొత్త సంఘాలను ఏర్పాటు చేయాలనే ఆలోచనతో ప్రభుత్వం కాల పరిమితిని పొడిగించింది. -
పెద్దమ్మతల్లి గుడిలో చోరీ
రఘునాథపాలెం: మండలంలోని బూడిదంపాడు పెద్దమ్మతల్లి దేవాలయంలో దొంగతనం జరిగింది. బూడిదంపాడు ముదిరాజ్ సంఘ సభ్యులు, దాతల సహకారంతో నిర్మించిన ఈ ఆలయానికి గురువారం సాయంత్రం తాళం వేసి వెళ్లిపోయారు. శుక్రవారం ఉదయం 6గంటల సమయాన గ్రామస్తులు వచ్చేసరికి గుడి తాళం పగలగొట్టి ఉండగా, హుండీ ధ్వంసమైంది. దీంతో హండీలోని రూ.15వేల మేర నగదు చోరీ జరిగినట్లు రఘునాథపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉన్నత శిఖరాలకు ఎదగాలిరుద్రంపూర్: విద్యార్థులు క్రమశిక్షణతో మెలిగి ఉన్నత శిఖరాలకు ఎదగాలని సింగరేణి డైరెక్టర్ (ప్రాజెక్ట్ అండ్ ప్లానింగ్) కే. వెంకటేశ్వర్లు అన్నారు. శుక్రవారం కొత్తగూడెం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఉమ్మడి జిల్లాస్థాయి పాలిటెక్నిక్ క్రీడా పోటీలను ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ క్రీడల ద్వారా స్నేహభావం ఏర్పడుతుందని అన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్ మాట్లాడుతూ ఆటలు ద్వారా నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయన్నారు. కొత్తగూడెం, మధిర, మణుగూరు, ఖమ్మం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలతోపాటు ఎస్బీఐటీ, ఎస్సీఐటీ, దరిపెల్లి అనంత రాములు, సత్తుపల్లి ఎస్ఎస్ఐటీ, ఎంఎస్ఐటీ కళాశాలల విద్యార్థులు పోటీల్లో పాల్గొని క్రీడా ప్రతిభ చాటారు. ఈ కార్యక్రమంలో క్రీడల కన్వీనర్ కరుణకుమార్, స్పోర్ట్స్ ఆర్గనైజింగ్ సెక్రటరీ, అండ్ ఫిజికల్ డైరెక్టర్ కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.సింగరేణి డైరెక్టర్ వెంకటేశ్వర్లు -
ఈజీ మనీ.. వెదజల్లారా?!
సత్తుపల్లి: సైబర్ నేరాలతో అంచెలంచెలుగా ఆర్థికంగా ఎదిగిన ఓ ముఠా బాధ్యులు ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో ప్రత్యర్థులకు చుక్కలు చూపించారు. ఎలాగైనా తమ వారికి పదవి దక్కేలా పావులు కదుపుతూ, అధికార, ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులకు డబ్బు సర్దుబాటు చేశారనే చర్చ జరుగుతోంది. ఫలితం తారుమారయ్యేలా విచ్చలవిడిగా డబ్బు ఎరవేశారని.. ప్రత్యర్థులకు బలమైన మద్దతు ఉన్న వ్యక్తులను గుర్తించి ఓటుకు రూ.10వేలు మొదలు నుంచి రూ.15వేల వరకు అందించారని సమాచారం. అయితే, ఈ వ్యవహారాన్ని తాము ఆలస్యంగా గుర్తించామంటూ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు బాధిత అభ్యర్థులు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. పథకం ప్రకారం.. ఎన్నికల ముందు సర్పంచ్ పదవే లక్ష్యంగా కొందరు వ్యూహరచన చేసినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అధికార పార్టీలో ముఖ్యనేతలకు సన్నిహితంగా ఉండే సర్పంచ్ అభ్యర్థులను ఓడించేందుకు వ్యూహాత్మకంగానే వ్యవహరించారని ఆరోపణలు వస్తున్నాయి. కొన్నిచోట్ల అధికార పార్టీ రెబల్గా పోటీ చేసిన వారికి సైతం ఆర్థికంగా సహకరిస్తామనే భరోసా ఇవ్వడంతోనే ఉపసంహరణకు అంగీకరించలేదని పలువురి పేర్లతో మంత్రికి వివరిస్తున్నట్లు తెలిసింది. సత్తుపల్లి, వేంసూరు, కల్లూరు, తల్లాడ మండలాల్లో ‘ఈజీ మనీ’ ఈ తరహా ఎత్తుగడలు అమలుచేసినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే, డబ్బుకు దాసోహమైన వారిలో అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకులు కూడా ఉన్నట్లు సమాచారం. విచ్చలవిడిగా వస్తున్న డబ్బును ఓటర్లకు అందించడం, వీరికి సైబర్ నేరారోపణలు ఎదుర్కొంటున్న వారు అండగా నిలవడంతో ఆర్థికంగా అండ లేని తాము ఓడిపోయామని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎవరి పాత్ర ఎంత? సత్తుపల్లి నియోజకవర్గంలో కొన్ని పంచాయతీల్లో సర్పంచ్ అభ్యర్థులు రూ.కోటికి పైగా ఖర్చు చేసినట్లు సమాచారం. అయితే, వీరికి హవాలా, సైబర్ నేరగాళ్ల అండదండలు ఉన్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే ఓడిపోయిన కొందరు మంత్రి తుమ్మలకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. దీంతో నిఘా వర్గాలు రంగంలోకి దిగి అభ్యర్థుల వారీగా ఎంత ఖర్చు చేశారు, వారికి నగదు ఎలా అందిందనే వివరాలు ఆరా తీసే పనిలో పడ్డాయి. ఫలితంగా ఎన్నికల్లో డబ్బు రవాణాకు సహకరించిన వారు ఆందోళన చెందుతున్నట్లు సమాచారం. -
‘సీతారామ’లో కీలక మార్పులు
● గతంలో మెయిన్ పంపుహౌజ్, కాల్వలకే పరిమితం ● ఇప్పుడు పంపిణీ వ్యవస్థను భాగం చేస్తూ నిధులు ● రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ఉమ్మడి జిల్లాను సస్యశ్యామలం చేయడమే లక్ష్యంగా సీతారామ ప్రాజెక్టులో కీలక మార్పులు చేస్తున్నామని, ప్రాజెక్టులో పంపిణీ వ్యవస్థను భాగస్వామ్యం చేసేలా ప్రభుత్వం నిధులు కేటాయించిందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. కలెక్టరేట్లో శుక్రవారం ఆయన జిల్లా అభివృద్ధి, సాగునీటి ప్రాజెక్టులపై సమీక్షించారు. అనంతరం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వం సీతారామ ప్రాజెక్టును మెయిన్ పంప్ హౌజ్లు, కాల్వలకే పరిమితం చేయడంతో క్షేత్రస్థాయిలో రైతులకు నీరు అందడం లేదన్నారు. దీంతో ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పంపిణీ వ్యవస్థను కూడా ప్రాజెక్టులో భాగం చేస్తూ నిధులు కేటాయించినట్లు తెలిపారు. డిస్ట్రిబ్యూటరీ కెనాళ్ల ద్వారా నీరు అందించేలా ప్రాజెక్టును విస్తరిస్తామని, పినపాక, కొత్తగూడెం, అశ్వారావుపేట, వైరా నియోజకవర్గాల్లో కాల్వల నిర్మాణానికి టెండర్లు పిలుస్తున్నట్లు వెల్లడించారు. వచ్చే ఏడాది జూన్కల్లా ప్రతీ నియోజకవర్గంలో కనీసం 25వేల ఎకరాలకు సాగునీరు అందించాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. అంతేకాక జూలూరుపాడు టన్నెల్కు కూడా టెండర్లు పిలిచామని, ఇందులో 10 కి.మీ. మేర అటవీశాఖ అనుమతులు రావాల్సి ఉందని చెప్పారు. టన్నెల్ పనులు పూర్తయితే నీరు పాలేరు లిఫ్ట్ కెనాల్ ద్వారా పాలేరు రిజర్వాయర్లోకి వస్తుందన్నారు. ఇక సీతమ్మ సాగర్కు సీడబ్ల్యూసీ క్లియరెన్స్ రాగా, ఎన్జీటీ (నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్) క్లియరెన్స్ రావాల్సి ఉందని మంత్రి తుమ్మల తెలిపారు. -
సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి
ఖమ్మంగాంధీచౌక్: ప్రజల సైబర్ మోసాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైం విభాగం ఎస్పీ జి.బిక్షంరెడ్డి, ఎస్బీఏ ఆర్ఎం రాజశేఖర్ సూచించారు. ‘ఫ్రాడ్ కా ఫుల్ స్టాప్’ పేరిట నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమాల్లో భాగంగా శుక్రవారం జెడ్పీలో ఏర్పాటుచేసిన సమావేశంలో వారు మాట్లాడారు. రోజుకో కొత్త రూపంలో సైబర్ మోసాలు వెలుగు చూస్తున్నందున ప్రజలు జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. డిజిటల్ అరెస్టు, కుటుంబ సభ్యులకు ప్రమాదం జరిగిందని, లాటరీలో డబ్బు గెలిచారంటూ వచ్చే ఫోన్లు, మెసేజ్లను నమ్మొద్దని వారు ఈ సందర్భంగా సూచించారు. మోసపూరిత లావాదేవీలను గుర్తిస్తే 1930 టోల్ ఫ్రీ నంబర్కు ఫోన్ చేయడమే కాక ఆన్లైన్లో ఫిర్యాదు చేయాలని తెలిపారు. సైబర్ క్రైం ఖమ్మం డీఎస్పీ ఫణీంద్ర, సీఐ కె.నరేష్, ఎస్బీఐ చీఫ్ మేనేజర్ ఫయాజ్ బాషా, మేనేజర్ షేక్ ఇబ్రహీంతో పాటు ఎస్సైలు రంజిత్కుమార్, విజయ్కుమార్ పాల్గొన్నారు. -
తిరిగి విధుల్లోకి తీసుకోండి
ఖమ్మం సహకారనగర్: ఇటీవల సస్పెన్షన్కు గురైన బీరోలు హెచ్ఎం రవి, టర్మినేట్ చేసిన రఘునాథపాలెం కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ లతను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు కోరారు. ఈ సందర్భంగా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టికి శుక్రవారం వినతిపత్రం అందజేశా రు. అనంతరం ఎస్టీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు, జేఏసీ వైస్ చైర్మన్ దేవరకొండ సైదులు మాట్లాడుతూ సస్పెన్షన్లు ఉపాధ్యాయుల ఆత్మస్థైరాన్ని దెబ్బతిస్తాయన్నారు. ఈమేరకు పునరాలోచన చేయాలని కోరారు. ఈకార్యక్రమంలో వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు విజయ్, రాయల వీరస్వామి, ప్రసాద్, షేక్ రంజాన్, పారుపల్లి నాగేశ్వరరావు, వెంగళరావు, మన్సూర్, యాదగిరి, మట్టా శ్రీనివాసరావు, శిరీష పాల్గొన్నారు. -
సైన్స్ ఫేర్కు రెడీ
రండి.. దయ చేయండి సురక్షితంగా గమ్యానికి చేరుస్తాం.. హ్యాపీ జర్నీ అంటూ ప్రయాణికులకు బస్సుల్లో ఆర్టీసీ సిబ్బంది స్వాగతం పలుకుతున్నారు.శనివారం శ్రీ 20 శ్రీ డిసెంబర్ శ్రీ 2025నేడు మంత్రి పొంగులేటి పర్యటన ఖమ్మంమయూరిసెంటర్: రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శనివారం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం కూసుమంచిలోని క్యాంపు కార్యాలయంలో కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేస్తారు. అనంతరం ఇంజనీరింగ్, పంచాయతీరాజ్, ఆర్అండ్బీ అధికారులతో అభివృద్ధి పనులపై సమీక్షించనున్నారు. మధ్యాహ్నం ఖమ్మంలో ఎస్ఆర్ కన్వెన్షన్ హాల్లో జరిగే టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా మహాసభలో పాల్గొననున్న మంత్రి, సాయంత్రం ఏదులాపురంలో మండల కార్యాలయాల కాంప్లెక్స్ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు.యాప్ ద్వారానే యూరియా విక్రయాలు వైరా: రైతులు యూరియా కోసం యాప్ ద్వారా మాత్రమే బుక్ చేసుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి ధనసరి పుల్లయ్య సూచించారు. వైరా మున్సిపాలిటీ పరిధి సోమవరం, వైరా మండలం నారపనేనిపల్లిలో శుక్రవారం యాప్పై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డీఏఓ మాట్లాడుతూ రైతులు తమ స్మార్ట్ఫోన్లలో ఫెర్టిలైజర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫోన్ నంబర్ ద్వారా బుక్ చేసుకోవాలన్నారు. స్లాట్ బుక్ చేసుకున్న 24 గంటల్లోగా యూరియా తీసుకోకపోతే రద్దవుతుందని తెలిపారు. పట్టాదారులే కాక కౌలుదారులు, పోడు సాగుదారులు కూడా బుకింగ్ చేసుకోవచ్చని, తద్వారా క్యూలో నిల్చోకుండా యూరియా తీసుకునే అవకాశం లభిస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏఓ మయాన్ మంజుఖాన్, ఏఈఓలు వెంపటి కీర్తి, మేడా రాజేష్ తదితరులు పాల్గొన్నారు. ఎరువుల వినియోగంపై శిక్షణ ‘పీఎం ప్రణమ్’ కార్యక్రమంలో వైరాలోని కృషి విజ్ఞాన కేంద్రంలో ఎరువుల సమతుల్య వినియోగంపై రైతులకు శుక్రవారం శిక్షణ ఏర్పాటుచేశారు. ఈ కార్యక్రమంలో మధిర వ్యవసాయ పరిశోధనా సంస్థ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ రుక్మిణీ దేవి, రాష్ట్రీయ కెమికల్స్ ఏరియా మేనేజర్ పురుషోత్తమసింగ్ ఎరువుల వినియోగంలో పాటించాల్సిన మెళకువలను వివరించారు. కేవీకే ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డాక్టర్ టి.సుచరితాదేవి, శాస్త్రవేత్తలు డాక్టర్ టి.పావని, డాక్టర్ వి.చైతన్య, ఫణిశ్రీ పలు సూచనలు చేశారు. విపత్తులు ఎదుర్కొనేలా ప్రణాళిక ఖమ్మం సహకారనగర్: విపత్తులు ఎదురైనప్పుడు వ్యవహరించాల్సిన తీరుపై మాక్ ఎక్సర్సైజ్ నిర్వహణకు ప్రణాళిక సిద్ధం చేయాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. జాతీయ విపత్తుల నిర్వహణ అథారిటీ ఆధ్వర్యాన ఎన్డీఎంఏ అధికారులతో కలిసి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు వీసీ ద్వారా హైదరాబాద్ నుంచి శుక్రవారం ఈ విషయమై సమీక్షించారు. కలెక్టరేట్ నుంచి కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి, కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్య పాల్గొన్నారు. వీసీ అనంతరం అధికారులతో సమావేశమైన కలెక్టర్ వరదలు వచ్చినప్పుడు, పరిశ్రమల్లో ప్రమాదాలు జరిగిన సమయాల్లో జరిగినప్పుడు స్పందించాల్సిన తీరుపై ముందస్తుగా మాక్ ఎక్సర్సైజ్ నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని తెలిపారు. డీఆర్ఓ ఏ.పద్మశ్రీ, జెడ్పీ సీఈఓ దీక్షా రైనా, వివిధ శాఖల అధికారులు సన్యాసయ్య, యాకోబు, రామారావు, వెంకటేశ్వర్లు, చందన్కుమార్, శ్రీలత, వెంకటరమణ, చైతన్య జైనీ, రంజిత్, నరసింహారావు, రాంప్రసాద్, సైదులు పాల్గొన్నారు.297 పంచాయతీలు వారివే.. ఇటీవల పల్లెస్థాయిలో కూడా మహిళలు రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఇందులో భాగంగానే జిల్లాలోని సగానికి పైగా పంచాయతీల్లో మహిళా సర్పంచ్లు కొలువుదీరారు. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి మహిళలకు ఎక్కువ సీట్లు రిజర్వ్ అయ్యాయి. మొత్తం 566 జీపీలకు గాను 259 స్థానాలకు మహిళలకు రిజర్వ్ అయ్యాయి. ఏన్కూరు మండలం నూకాలంపాడు గ్రామపంచాయతీకి ఎన్నికలు జరగకపోవడంతో మిగిలిన జీపీల్లో 297 చోట్ల మహిళలు సర్పంచ్లుగా గెలిచారు. అతివలకు ప్రాధాన్యత రాజకీయాల్లోనూ మహిళలకు ప్రాధాన్యం దక్కుతోంది. 50 శాతం రిజర్వేషన్లు కలిసి రావడమేకాక ప్రజాసేవ చేయాలనే తపనతో అనేకమంది మహిళలు రాజకీయాలకు ఎంచుకుంటున్నారు. వీరికి తొలిదశలో గ్రామపంచాయతీ ఎన్నికలు మంచి వేదికగా నిలిచాయి. దీంతో రిజర్వేషన్ సంఖ్య కంటే ఎక్కువ స్థానాల్లో విజయఢంకా మోగించారు. కుటుంబ సభ్యులు, భర్త ప్రోత్సాహంతో రాజకీయ అరంగేట్రం చేసి సర్పంచ్లుగా గెలిచిన వారు ప్రజోపయోగ కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తే రాజకీయంగా ఎదిగేందుకు అవకాశం ఉంటుంది. కాగా, అత్యధికంగా తిరుమలాయపాలెం మండలంలో 40 జీపీలు ఉంటే 22 జీపీల్లో, కూసుమంచిలో 41జీపీలకు గాను 22 జీపీల్లో, రఘునాథపాలెం మండలంలో 37 జీపీలకు 20 జీపీల్లో మహిళలు విజయం సాధించడం విశేషం. జనరల్ స్థానాల్లో బీసీలు జిల్లాలోని కొన్ని జనరల్ స్థానాల్లోనూ బీసీ మహిళలు విజయం సాధించారు. రఘునాథపాలెం మండలం వేపకుంట్ల జనరల్ స్థానం కాగా.. ఇక్కడ బీసీ మహిళ పోటీ చేసి గెలిచారు. అలాగే వైరా నియోజకవర్గంలోని జనరల్ స్థానాల్లో ఐదుగురు బీసీ, ముగ్గురు ఎస్టీ మహిళలు, సత్తుపల్లిలో ఇద్దరు బీసీ, ఒక ఎస్సీ, ఒక ఎస్టీ మహిళా అభ్యర్థి గెలుపొందారు. దీంతో వెనుకబడిన తరగతులకు చెందిన మహిళలకు గ్రామపంచాయతీ ఎన్నికలు మంచి అవకాశాన్ని కల్పించినట్లయింది.ఖమ్మం సహకారనగర్: ఖమ్మంలోని ఎస్ఎఫ్ఎస్ హైస్కూల్లో శనివారం నుంచి రెండు రోజుల పాటు జరగనున్న జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్, ఇన్స్పైర్ ఎగ్జిబిషన్కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ ఏడాది సైన్స్ ఫేర్కు రికార్డు స్థాయిలో దరఖాస్తులు వచ్చాయి. సైన్స్ ఎగ్జిబిషన్కు మొత్తం 743 మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకోగా, ఇన్స్పైర్ ఎగ్జిబిషన్కు 100 రిజిస్ట్రేషన్లు అందాయి మొత్తంగా 843 మంది విద్యార్థులు తమ ఎగ్జిబిట్లను ప్రదర్శించనున్నారు. అంతేకాక ఈసారి అటల్ టింకరింగ్ ల్యాబ్స్, పీఎంసీ పాఠశాలల నుంచి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్ విభాగాల్లో ప్రత్యేక పోటీలు నిర్వహించనున్నట్లు డీఈఓ చైతన్యజైనీ వెల్లడించారు. నమోదైన ఎగ్జిబిట్లు జిల్లా స్థాయి సైన్స్ఫేర్ నిర్వహణకు విభాగాల వారీగా అధికారులు ఎగ్జిబిట్లను ఆహ్వానించారు. ఈమేరకు సస్టెయినబుల్ అగ్రికల్చర్ విభాగంలో 90, వ్యర్థాల నిర్వహణలో 87, గ్రీన్ ఎనర్జీలో85, ఎమర్జింగ్ టెక్నాలజీలో 143, రిక్రియేషనల్ మ్యాథమెటికల్ మోడలింగ్లో 64, ఆరోగ్యం – పరిశుభ్రతలో 97, నీటి సంరక్షణ విభాగంలో 69 ఎగ్జిబిట్లను విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అలాగే, ఏఐ – రోబోటిక్స్లో 52, సెమినార్ విభాగంలో 41మంది, ఉపాధ్యాయులు 15 ఎగ్జిబిట్లు ప్రదర్శించనున్నారు. కాగా, శనివారం ఉదయం 8–30 గంటల నుంచి విద్యార్థులు ఎగ్జిబిట్తో రిపోర్టు చేయాలని, ఒక ఎగ్జిబిట్తో ఒకరికే అనుమతి ఉంటుందని డీఈఓ చైతన్యజైనీ తెలిపారు. దూరప్రాంతాల విద్యార్థులు, ఉపాధ్యాయులకు భోజనం, వసతి సౌకర్యం కల్పిస్తున్నట్లు వెల్లడించారు. కొణిజర్ల : పోటీలను ప్రారంభిస్తున్న జిల్లా ఇన్చార్జ్ శ్రీనివాసరావుకారేపల్లి : ఖో–ఖో పోటీలో తలపడుతున్న విద్యార్థినులు కొణిజర్ల/కారేపల్లి: విద్యార్థులు చదువుతో పాటు క్రీడలపైనా దృష్టి సారించాలని మైనార్టీ విద్యాసంస్థల జిల్లా ఇన్చార్జ్ బి.శ్రీనివాసరావు, జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖాధికారి ముజాహిద్ సూచించారు. కొణిజర్ల మండలం అమ్మపాలెం, కారేపల్లిలోని మైనార్టీ గురుకులాల్లో ఉమ్మడి జిల్లా స్థాయి గురుకులాల బాలురు, బాలికల క్రీడాపోటీలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. అండర్–14, 17 విభాగాల్లో అమ్మపాలెంలో బాలురకు, కారేపల్లిలో బాలికలకు కబడ్డీ, వాలీబాల్, ఖో–ఖో పోటీలు నిర్వహిస్తున్నారు. ఈమేరకు పోటీలను ప్రారంభించిన శ్రీనివాసరావు, ముజాహిద్ మాట్లాడుతూ క్రీడలను విద్యార్థులు తమ జీవితంలో భాగం చేసుకోవాలని తెలిపారు. తద్వారా ఉత్సాహం పెరగడమే కాక క్రీడల్లో రాణిస్తే విద్య, ఉద్యోగ రంగాల్లో అవకాశాలు మెరుగుపడతాయని చెప్పారు. మైనార్టీ విద్యాసంస్థల ఉమ్మడి జిల్లా ఆర్ఎల్సీ ఎం.జే.అరుణకుమారి మాట్లాడుతూ విద్యార్థులు క్రీడల్లో తర్ఫీదు పొందడం ద్వారా క్రమశిక్షణ పెరుగుతుందని తెలిపారు. పాఠశాలల ప్రిన్సిపాళ్లు ఎల్.జితేష్ సాహిల్, సావిత్రి, అధికారులు విజిలెన్స్ అధికారి కె.సీతారాములు మాట్లాడగా ఉపాధ్యాయులు శైలజ, అఖిల, సీత, అర్ఫిన్, బిపాషా, గీత, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.జిల్లాలో మూడు విడతలుగా జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో మహిళా ప్రజాప్రతినిధులు సత్తా చాటారు. అవకాశాన్ని అందిపుచ్చుకుని విజయఢంకా మోగించారు. జిల్లాలోని 565 గ్రామపంచాయతీలకు 297 జీపీల్లో మహిళలే సర్పంచ్లుగా గెలుపొందారు. పురుషుల కన్నా మహిళలు ప్రజాప్రతినిధులుగా రాణిస్తారనే అభిప్రాయం ప్రజల్లో ఉండడం.. సమస్యల పరిష్కారం, అభివృద్ధిలో మేటిగా నిలుస్తారనే నమ్మకంతోనే పట్టం కట్టినట్లు తెలుస్తోంది. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునేలా పనిచేస్తామని మహిళా ప్రజాప్రతినిధులు చెబుతున్నారు. – సాక్షిప్రతినిధి, ఖమ్మంజీపీ ఎన్నికల్లో సత్తా చాటిన అతివలు -
రేపు వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు
ఖమ్మంమయూరిసెంటర్: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి జన్మదిన వేడుకలను ఈనెల 21న ఖమ్మంలో నిర్వహిస్తున్నందున అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. ఖమ్మంలో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో వారు వివరాలు వెల్లడించారు. నగరంలో ఆదివా రం ఉదయం ముస్తఫానగర్ నుంచి త్రీటౌన్ మీదుగా మయూరిసెంటర్, డిపో రోడ్డు, రాపర్తినగర్, గట్టయ్యసెంటర్, ఎన్టీఆర్ సర్కిల్, శ్రీశ్రీ సర్కిల్ మీదుగా వైఎస్సార్ నగర్ కాలనీ వరకు బైక్ ర్యాలీ నిర్వహిస్తామని తెలిపారు. కూడళ్లలో కేక్లు కట్ చేయడమే కాక వైఎస్సార్ నగర్ కాలనీలో రక్తదానశిబిరం, అన్నదానం ఏర్పాటుచేస్తున్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో ఆలస్యం సుధాకర్, కన్నెబోయిన సీతారామయ్య, మర్రి శ్రీనివాస్, మందడపు శ్రీని వాస్, సట్టు సత్యనారాయణ, కొత్త బాలాజీ, పెంట్యాల ఉపేందర్, పగిళ్ల నరేష్, సరికొండ రామరాజు, ఆలస్యం నరసయ్య, సతీష్, రియాజ్, బోయిన ఉపేందర్, కోదాటి నరసింహ, మర్రి దిలీప్, గణపరపు మురళి, నాగరాజురెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
●తల్లాడ నుంచి నలుగురు...
తల్లాడ: మండలంలోని మల్లారం నుంచి ముగ్గురు, పినపాక వాసి ఇంకొకరు గ్రూప్–3 ఉద్యోగాలు సాధించారు. ప్రస్తుతం వీఆర్ఓగా పని చేస్తున్న గుడిపల్లి శ్రీరామ్మూర్తి సీని యర్ అసిస్టెంట్గా ఉద్యోగం సాధించగా, కటికి ఉపేందర్రావు ట్రెజరీలో సీనియర్ అసిస్టెంట్గా ఉద్యోగానికి ఎంపికయ్యాడు. అలాగే, దుగ్గిదేవర హరికృష్ణ హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో జూని యర్ అసిస్టెంట్గా, పినపాకకు చెందిన ఎన్.షాలినీరెడ్డి ట్రెజరీ లో సీనీయర్ అకౌంటెంట్ ఉద్యోగం సాధించింది. షాలినిరెడ్డి మొదట ఎకై ్సజ్ శాఖలో, ఆ తర్వాత గ్రూప్–4లో ఉద్యోగం సాధించగా, అనంతరం ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా ఎంపికై విధులు నిర్వరిస్తోంది. ఇప్పుడు గ్రూప్–3 ఉద్యోగం సాధించడం విశేషం. -
అక్రమ ఓట్ల తొలగింపే లక్ష్యం
ఖమ్మం మామిళ్లగూడెం: జాబితా నుంచి అక్రమ ఓట్లను తొలగించి, పారదర్శకమైన ప్రజాస్వామ్య వ్యవస్థను నిర్మించడమే లక్ష్యంగా కేంద్రప్రభుత్వం పనిచేస్తోందని బీజేపీ రాష్ట్ర కోశాధికారి దేవకి వాసుదేవరావు స్పష్టం చేశారు. ఖమ్మంలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన జిల్లా పదాధికా రుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఓటర్ల జాబితాలో విదేశీ చొరబాటుదారులకు చోటు దక్కితే దేశ భద్రతకు ముప్పు ఎదురుకానున్నందున తొలగింపు చేపట్టినట్లు తెలిపారు. ఈవీఎంలపై గతంలో మౌనంగా ఉండి, ఇప్పుడు ఆరోపణలు చేయడం ప్రతిపక్షాల వైఖరికి నిదర్శనమని తెలిపారు. స్వయం ప్రతిపత్తి కలిగిన ఎన్నికల సంఘంపై విమర్శలు సరికాదని సూచించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు, జిల్లా ఇన్చార్జి బద్ధం మహిపాల్రెడ్డి, నాయకులు సన్నె ఉదయప్రతాప్, గుత్తా వెంకటేశ్వరరావు, రాఘవరావు, ప్రవీణ్కుమార్, సుదర్శన్ మిశ్రా, రవి, నకిరేకంటి వీరభద్రం, వీరవెల్లి రాజేష్గుప్త, రజినీరెడ్డి, నెల్లూరి బెనర్జీ, కందుల శ్రీకృష్ణ, బి.సురేష్, సుబ్బారావు పాల్గొన్నారు. -
రండి.. దయచేయండి..
సత్తుపల్లిటౌన్/చుంచుపల్లి: ‘నా పేరు మాధవి. నేను సత్తుపల్లి ఆర్టీసీ డిపోలో కండక్టర్గా విధులు నిర్వహిస్తున్నాను. మనందరం సత్తుపల్లి నుంచి ఖమ్మంకు ఈ బస్సులో ప్రయాణిస్తున్నాం. ఇక్కడి నుంచి దాదాపు రెండు గంటలు ప్రయాణం ఉంటుంది. మీ అందరినీ క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చే బాధ్యత మాది. ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. మీ అందరికీ హ్యాపీ జర్నీ’ అంటూ తమను తాము పరిచయం చేసుకుంటూ ప్రయాణికులను కండక్టర్లు, డ్రైవర్లు ఆప్యాయంగా స్వాగతిస్తున్నారు. రూట్ వివరాలు సహా.. ఇది కేవలం ఒక్క బస్సులోనే కాదు, పల్లెవెలుగు మొ దలు ఏసీ బస్సుల వరకు, ప్రయాణించే దూరంతో సంబంధం లేకుండా ఆత్మీయ స్వాగతాలు, పలకరింపులు అమల్లోకి తెస్తున్నారు. టీజీఎస్ ఆర్టీసీ వినూత్న స్వాగత కార్యక్రమానికి ఇటీవల శ్రీకారం చుట్టింది. ప్రయాణికులను సిబ్బంది ఆత్మీయంగా పలకరిస్తూ బస్సులోకి ఆహ్వానిస్తున్నారు. సాధారణంగా విమానాల్లో ఇలాంటి సంఘటనలు చూస్తుంటాం. విమానం బయలుదేరే ముందు ఆ విమానం ఎక్కడికి వెళ్తుంది.. ఎంత సమయం పడుతుంది.. ప్రయాణికులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాల ను ఎయిర్ హోస్టెస్ వివరిస్తారు. అలాగే ఇప్పుడు ఆర్టీసీ బస్సుల్లో బస్సు డ్రైవర్, కండక్టర్ ప్రయాణికులకు తమను తాము పరిచయం చేసుకుంటూ, బస్సు వెళ్లే రూట్ వివరాలు అన్ని తెలుపుతున్నారు. ఆదరణ పొందేలా.. ప్రజా రవాణాలో కీలకపాత్ర పోషిస్తున్న ఆర్టీసీ ప్రతి రోజూ లక్షలాది మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తోంది. ఆదాయాన్ని పెంచుకోవడంతో పాటు ప్రయాణికుల ఆదరణ, మన్ననలు పొందేందుకు పలు కార్యక్రమాలు చేపడుతోంది. సంస్థ ఎండీగా నాగిరెడ్డి బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో ప్రయాణికులకు స్వాగతం పలికే కార్యక్రమం చేపట్టారు. తమతో పాటు సంస్థను పరిచయం చేయటం గమ్యస్థానాలకు చేర్చేందుకు పట్టే సమయం, ప్రయాణంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు వంటివి వివరిస్తున్నారు. అవగాహన కల్పిస్తూ.. ఖమ్మం రీజియన్లోని ఏడు డిపోల్లో అన్ని రకాలు కలిపి 501 బస్సులు ఉన్నాయి. రీజియన్లో 852 మంది కండక్టర్లు, 848 మంది డ్రైవర్లు విధులు నిర్వర్తిస్తున్నారు. ఇక్కడి నుంచి ఉమ్మడి జిల్లా హైదరాబాద్, బెంగళూరు తదితర ప్రాంతాలతో ఏపీకి కూడా బస్సులు రాకపోకలు సాగిస్తున్నాయి. ఈ మేరకు ఆర్టీసీలో ప్రయాణికులకు స్వాగతం పలకడం, తమతో పాటు సంస్థను పరిచయం చేయడం, గమ్యస్థానం చేరేందుకు ఎంత సమయం పడుతుంది, ప్రయాణ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు వంటి అంశాలను సిబ్బంది వివరిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని బస్సుల్లోనూ ఈ విధానం ప్రయాణికులను ఆకట్టుకుంటోంది. బస్సులో ప్రయాణించే వారికి స్వాగతం పలకడమే కాకుండా ఇతరత్రా అంశాల పైనా అవగాహన కల్పిస్తున్నారు. ప్రమాదం జరిగినప్పుడు, ఆపత్కాలంలో బస్సులోని ప్రధాన ద్వారమే కాకుండా అత్యవసర ద్వారం అందుబాటులో ఉంటుందని, అది ఎక్కడ ఉంటుంది, దాన్ని ఏవిధంగా ఉపయోగించుకోవాలనే విషయాలనూ తెలియజేస్తున్నారు. ఏసీ బస్సుల్లో అద్దాలను పగలగొట్టేందుకు వీలుగా అక్కడక్కడా హ్యామర్లు (సుత్తి) ఉంచుతున్నారు. వాటి వినియోగం తీరును ప్రయాణికులకు తెలుపుతున్నారు. సేవల్లో లోపాలు ఉన్నా, సంస్థ ఉన్నతికి తీసుకోవాల్సిన ఇతర చర్యలపై సలహాలు, సూచనలతో పాటు ఫిర్యాదు చేసేందుకు అవకాశం కల్పిస్తున్నారు. బస్సు ఎక్కడి నుంచి ఎక్కడకు ప్రయాణిస్తుందో తెలుపుతూ ఎంత సమయం పడుతుందో ప్రయాణికులకు వివరిస్తూ ఆర్టీసీని ఆదరించి ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేస్తున్నందుకు కృతజ్ఞతలు చెబుతున్నారు. సుఖవంతమైన, సురక్షితమైన ప్రయాణానికి ఆర్టీసీని ఆదరించాలని ప్రయాణికులను ఆర్టీసీ సిబ్బంది కోరడం ఆకట్టుకుంటోంది. లహరి ఏసీ/నాన్ఏసీ 10 రాజధాని ఏసీ బస్సులు 35 సూపర్లగ్జరీ బస్సులు 91 డీలక్స్ 40 ఎక్స్ప్రెస్లు 82 పల్లెవెలుగు 21 అద్దె బస్సులు 222 రీజియన్లో కండక్టర్లు 852 మంది డ్రైవర్లు 848 మంది -
వచ్చేనెలలో పీడీఎస్యూ రాష్ట్ర మహాసభలు
ఖమ్మంమయూరిసెంటర్: పీడీఎస్యూ రాష్ట్ర 23వ మహాసభలను ఖమ్మంలో వచ్చేనెల 23నుంచి 25వరకు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర అధ్యక్షుడు కాంపాటి పృథ్వీ తెలిపారు. ఖమ్మం రామనర్సయ్య విజ్ఞాన కేంద్రంలో శుక్రవారం జరిగిన జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెలలోనే మహాసభలు జరగాల్సి ఉన్నా గ్రామపంచాయతీ ఎన్నికలతో వాయిదా వేశామని వెల్లడించారు. ఈమేరకు ఉద్యమాల ఖిల్లా అయిన ఖమ్మంలో జనవరి 23నుంచి నిర్వహించే రాష్ట్ర మహాసభల్లో విద్యార్థులు, లౌకికవాదులు, మేధావులు, ప్రజాస్వామికవాదులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. పీడీఎస్యు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు తిప్పారపు లక్ష్మణ్, వి.వెంకటేష్, నాయకులు యశ్వంత్, వినయ్, శశికిరణ్, సాధిక్, హరిచంద్ర ప్రసాద్, సురేష్, అన్వేష్, కార్తీక్, రఘు, ప్రణవ్ పాల్గొన్నారు. నేడు, రేపు చేనేత వస్త్రాల ఎగ్జిబిషన్, సేల్స్ ఖమ్మంగాంధీచౌక్: ఖమ్మం టీఎన్జీవోస్భవన్లో శని, ఆదివారం చేనేత వస్త్రాల ఎగ్జిబిషన్, సేల్స్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర చేనేత పారిశ్రామికుల సహకార సంఘం లిమి టెడ్ డివిజనల్ మార్కెటింగ్ అధికారి బొట్టు వెంకటేశ్వర్లు తెలిపారు. రెండు రోజుల పాటు కొనసాగే ఎగ్జిబిషన్, సేల్స్లో అన్నిరకాల వస్త్రాలపై 30శాతం, ఇక్కత్ సిల్క్స్ చీరలపై 40 శాతం తగ్గింపు ఉంటుందని వెల్లడించారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల చేనేత వస్త్రాలను అందుబాటులోకి తీసుకొస్తున్నందున ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. విద్యుత్ ఉద్యోగి కుటుంబానికి బీమా పరిహారం ఖమ్మంగాంధీచౌక్: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విద్యుత్ శాఖ అసిస్టెంట్ ఇంజనీర్ రేపల్లె చెన్నారావు కుటుంబానికి ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ రూ.51,91,237.16 బీమా క్లెయిమ్ను అందించింది. ఎస్బీఐ నుంచి చెన్నారావు రూ.53.10లక్షల గృహరుణం తీసుకున్న సమయాన బీమా కూడా చేయించాడు. ఇటీవల ఆయన మృతి చెందడంతో నామినీ భార్గవికి సంస్థ ఏజీఎం సత్యంనాయుడు శుక్రవారం చెక్కు అందజేశారు. చీఫ్ మేనేజర్ (శాంక్షన్స్) సాయిశ్రీనివాస్, అనిల్ పాల్గొన్నారు. -
గడువులోగా అభివృద్ధి పనులు
ఖమ్మం సహకారనగర్: నగరంలో చేపడుతున్న అభివృద్ధి పనులు నిర్ణీత గడువులోగా నాణ్యతతో పూర్తయ్యేలా అధికారులు పర్యవేక్షించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. కలెక్టరేట్లో శుక్రవారం ఆయన కలెక్టర్ అనుదీప్ దురిశెట్టితో కలిసి అభివృద్ధి పనులపై సమీక్షించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత అనుభవాలకు భిన్నంగా ప్రశాంత వాతావరణంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించిన ఉద్యోగులను అభినందించారు. కాగా, పచ్చదనం పెంచేలా మొక్కలు నాటాలని, ‘నరేగా’ ద్వారా చేపట్టాల్సిన పనులపై ప్రతిపాదనలు సమర్పించాలని సూచించారు. భవిష్యత్లో సాగర్ జలాలు రాకున్నా పంటలకు సాగునీరు అందంచేలా సీతారామ ఎత్తిపోతల పథకం అనుమతులు సాధించాలని, సత్తుపల్లి ట్రంకు, పంప్ హౌస్, పాలేరు టన్నెల్ పెండింగ్ పనులు పూర్తి చేయాలని తెలిపారు. అనంతరం ఖిల్లాపైకి రోప్వే, యంగ్ ఇండియా సమీకత గురుకులాల నిర్మాణాలు, మెడికల్ కాలేజీ భవనం, మంచుకొండ ఎత్తిపోతల పథకంపై సమీక్షించారు. రోప్వే వచ్చే ఏడాది డిసెంబర్ కల్లా పూర్తయ్యేలా పర్యవేక్షించాలని మంత్రి తెలిపారు. రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి, కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్య, కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్యాదవ్, డీఎఫ్ఓ సిద్ధార్థ్ విక్రమ్ సింగ్, డీఆర్ఓ ఏ.పద్మశ్రీ తదితరులు పాల్గొన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా అభివృద్ధి ఖమ్మంవ్యవసాయం: రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేకున్నా ఖమ్మం అభివృద్ధికి ముఖ్యమంత్రి నిధులు మంజూరు చేస్తున్నారని రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఖమ్మం పాకబండ సమీపాన సబ్స్టేషన్ నిర్మాణ పనులకు అదనపు కలెక్టర్ పి. శ్రీనివాసరెడ్డితో కలిసి మంత్రి శంకుస్థాపన చేశా క మాట్లాడారు. అభివృద్ధి పనులను నాణ్యతతో, సకాలంలో పూర్తయ్యేలా ప్రజాప్రతినిధులు పర్యవేక్షించాలని సూచించారు. రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, విద్యుత్ శాఖ ఎస్ఈ శ్రీనివాసాచారి, తహసీల్దార్ సైదులు తదితరులు పాల్గొన్నారు. -
పట్టుబట్టారు.. కొలువు కొట్టారు !
టీజీపీఎస్సీ గురువారం రాత్రి విడుదల చేసిన గ్రూప్–3 ఫలితాల్లో జిల్లా వాసులు పలువురు సత్తా చాటారు. మెరుగైన ర్యాంకులతో ఉద్యోగాలకు ఎంపికయ్యారు. అయితే, ఇందులో కొందరు ఇప్పటికే గ్రూప్–4 ఉద్యోగాలు చేస్తుండగా ఇప్పుడు గ్రూప్–3 ఉద్యోగాలు రావడంతో ఆనందం వ్యక్తం చేశారు.కామేపల్లి: కామేపల్లి మండలం ముచ్చర్లకు చెందిన కర్నాటి కల్యాణి గ్రూప్–3లో ప్రతిభ కనబరిచి ట్రెజరీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో హెచ్ఓడీగా ఉద్యోగం సాధించింది. కర్నాటి కృష్ణ–సైదమ్మ దంపతుల రెండో కుమారై అయిన ఆమె చిన్నప్పటి నుంచే చదువులో రాణిస్తోంది. 2018లో పంచాయతీ కార్యదర్శిగా, 2019లో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్గా, 2024లో గురుకుల పాఠశాలలో జూనియర్ అసిస్టెంట్గా ఉద్యోగాలు సాధించిన ఆమె ఇప్పుడు గ్రూప్–3 ఉద్యోగానికి ఎంపికై ంది. భర్త జంగం నరసింహారావు ప్రోత్సాహంతో మరింత ఉన్నత స్థాయికి చేరడమే లక్ష్యమని కల్యాణి వెల్లడించింది. -
ఐదేళ్ల తర్వాత చిక్కిన నిందితులు
ఖమ్మంక్రైం: ఖమ్మంలోని రైల్వేస్టేషన్లో ఐదేళ్ల క్రితం నగల వ్యాపారిపై కత్తులతో దాడి చేసి బంగారం ఎత్తుకెళ్లిన రాజస్థాన్కు చెందిన కిరాయి దోపిడీ దొంగలను ఖమ్మం జీఆర్పీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు వివరాలను శుక్రవారం జీఆర్పీ సీఐ అంజలి వెల్లడించారు. రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన శ్రీపాల్ జైన్ విజయవాడలో ఉంటూ బంగారం, వెండి వ్యాపారం చేస్తున్నాడు. ఆర్డర్లపై బంగారం, వెండి ఆభరణాలను ఖమ్మంలోని వ్యాపారులకు సరఫరా చేసేవాడు. 2020 మార్చి 2న కూడా ఖమ్మంలో వ్యాపారులకు ఆభరణాలు అప్పగించి తిరిగి విజయవాడ వెళ్లేందుకు స్టేషన్కు వస్తున్నాడు. ఈక్రమంలో ఆయనను అనుసరిస్తున్న రాజస్థాన్కు చెందిన భరత్ సోలంకి, రఫీఖాన్, మహేష్ కత్తులతో దాడిచేసి ఆభరణాల బ్యాగ్ లాక్కుని పారిపోయారు. ఘటనపై అప్పట్లో జీఆర్పీ పోలీసులు విచారిస్తుండగా ఘటన వెనుక శ్రీపాల్కు తెలిసిన రాజస్థాన్ వాసి మీఠాలాల్, ఆయన తమ్ముడు భరత్కుమార్ ఉన్నట్లు బయటపడింది. రాజస్థాన్ నుంచి భరత్ సోలంకి, రఫీఖాన్, మహేష్కు డబ్బులు ఇస్తానని పిలిపించి రూ.4.16లక్షల విలువైన సొత్తు అహహరించినట్లు గుఇర్తంచారు. కొన్నాళ్ల క్రితం మీఠాలాల్ను అరెస్ట్ చేయగా, భరత్, రఫీఖాన్, మహేష్ ఆచూకీ తెలియడంతో అరెస్ట్ చేసి ఆభరణాల వివరాలు ఆరా తీస్తున్నామని సీఐ తెలిపారు. కేసు విచారణలో కీలకంగా వ్యవహరించిన ఎస్ఐ సురేష్, ఉద్యోగులు శ్రీనివాసరావు, సత్యనారయణరెడ్డి, మురళీకృష్ణ, అస్సాను, ప్రభాకర్, నాగరాజు, నాగరాజరావు, రామకృష్ణ, రఫీ, రమేష్, షరీఫ్, సురేష్, రఫీని సీఐ అభినందించారు.వ్యాపారి నుంచి బంగారం దోచుకున్న కేసు -
ఇదే ఉత్సాహం కొనసాగాలి
కల్లూరు/తల్లాడ: ఇటీవల జరిగిన గ్రామపంచాయితీ ఎన్నికల్లో జిల్లాలోనే అత్యధికంగా సత్తుపల్లి నియోజకవర్గం బీఆర్ఎస్ మద్దతుదారులు సర్పంచ్లుగా గెలిచారని మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య తెలిపారు. కల్లూరు, తల్లాడ మండలాల్లో బీఆర్ఎస్ మద్దతుతో గెలుపొందిన సర్పంచ్లు, ఉపసర్పంచ్లతో పాటు వార్డుసభ్యులను శుక్రవారం ఆయన సన్మానించి మాట్లాడారు. గెలిచిన సర్పంచ్లు గ్రామాల అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. వీరి గెలుపులో కీలకంగా పనిచేసిన పార్టీ శ్రేణులు ఇదే ఉత్సాహంతో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ము న్సిపల్ ఎన్నికల్లోనూ విజయానికి పాటుపడాలని తెలిపారు. కాగా, నియోజకవర్గంలో ఒక వ్యక్తి ఓటర్లను భయబ్రాంతులకు గురిచేశాడని ఆరోపించారు. కాంగ్రెస్ మద్దతుదారులకు ఓట్లు వేయకపోతే సంక్షేమ పథకాలు రాకుండా చూస్తానని బెదిరించారని తెలిపారు. ఇలా జరగకపోతే మరిన్ని స్థానాలు గెలిచేవాళ్లమని సండ్ర వెల్లడించారు. కాగా, ఓడిపోయిన అభ్యర్థులు నిరాశ చెందకుండా ప్రజాక్షేత్రంలో ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా వివిధ గ్రామాల సర్పంచ్లు పెరికె నాగేశ్వరరావు, గొడ్ల ప్రభాకర్, కోసూరి ధనలక్ష్మి, కోడూరి ఉమారాణి, వనగండ్ల మాధవరావు, నల్లగొర్ల పద్మ, కట్టా ధనమ్మ, జీనుగు శ్రీనివాసరావు, కాటమనేని విజయలక్ష్మి, వేము కృష్ణ, ఖమ్మంపాటి లక్ష్మి, రాచబంటి చిన్ని కృష్ణయ్య, పోట్రు శ్రీనివాసరావు, కంచెపోగు సుజాత, గుగులోత్ శ్రీను, కోలేటి శ్రీనివాసరావు, నాయుడు వెంకటకృష్ణ, బేబీ స్వరాజ్యలక్ష్మిని సన్మానించారు. కార్యక్రమాల్లో నాయకులు పాలెపు రామారావు, వీరమోహన్రెడ్డి, కట్టా అజయ్ కుమార్, లక్కినేని రఘు, మేకల కృష్ణ, కాటమనేని వెంకటేశ్వరరావు, బోబోలు లక్ష్మణరావు, దొడ్డా శ్రీనివాసరావు, రెడ్డెం వీరమోహన్రెడ్డి, దుగ్గిదేవర వెంకట్లాల్, దిరిశాల దాసురావు, శివారెడ్డి, దగ్గుల శ్రీనివాసరెడ్డి, కోసూరి నరసింహారావు, దూపాటి భద్రరాజు, లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.సర్పంచ్ల సన్మాన సభల్లో మాజీ ఎమ్మెల్యే సండ్ర -
‘పోస్టు’ మారింది!
తల్లాడ: మండలంలోని కొడవటిమెట్ట వాసి, పోస్టుబాయ్గా పనిచేసిన మోదుగు తిరుమలరావు సర్పంచ్ ఎన్నికయ్యాడు. తల్లాడ పోస్టుమాస్టర్ ద్వారా ఆయన స్థానికంగా ఉత్తరాలు పంపిణీ చేశారు. కొడవటిమెట్ట పంచాయతీ సర్పంచ్ స్థానం ఎస్సీలకు రిజర్వ్ కావడంతో తిరుమలరావు కాంగ్రెస్ మద్దతుతో పోటీ చేశారు. బీఆర్ఎస్ మద్దతు తెలిపిన అభ్యర్థి మోదుగు నాగేశ్వర్రావుపై 70 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. తల్లాడ: మండలంలోని బాలపేటలో గత ఎన్నికల్లో భర్త సర్పంచ్గా గెలవగా.. ఇప్పుడు ఆయన భార్య విజయం సాధించింది. 2019లో జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో బాలపేట సర్పంచ్గా కోసూరి వెంకటనరసింహారావు విజయం సాధించాడు. తాజా ఎన్నికల్లో ఆయన భార్య కోసూరి ధనలక్ష్మి.. సమీప అభ్యర్థి పాలెపు కుమారిపై 86 ఓట్ల మెజార్టీతో గెలుపొందింది. దీంతో మరో ఐదేళ్ల పాటు ఈ కుటుంబం చేతిలోనే పాలన సాగనుంది. దంపతులిద్దరూ వార్డుసభ్యులే.. సత్తుపల్లిరూరల్: సత్తుపల్లి మండలం బేతుపల్లి పంచాయతీలో 10, 11వ వార్డుల నుంచి భార్యాభర్తలు ఇండిపెండెంట్ పోటీ చేసి విజయం సాధించారు. ఇందులో 10వ వార్డు నుంచి గుండిపూడి రమేష్, 11వ వార్డు నుంచి ఆయన భార్య గండిపూడి యశోద గెలిచారు. ఈ పంచాయతీలో సర్పంచ్గా కూడా ఇండిపెండెంట్ అభ్యర్థి దొడ్డా రాజేంద్రప్రసాద్(అమ్ములు) విజయం సాధించగా, 12మంది వార్డు సభ్యులు కూడా స్వతంత్ర అభ్యర్థులే కావడం విశేషం. -
27నుంచి రెండు రాష్ట్రాల స్థాయి బ్యాడ్మింటన్ టోర్నీ
ఖమ్మం స్పోర్ట్స్: రెండు రాష్ట్రాల స్థాయి పులి రామస్వామి స్మారక బాల్ బ్యాడ్మింటన్ టోర్నీ ఈనెల 27, 28వ తేదీల్లో నిర్వహిస్తున్నట్లు టోర్నీ కన్వీనర్ డాక్టర్ రాధాకృష్ణమూర్తి తెలిపారు. ఖమ్మంలో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ టోర్నీ సర్దార్ పటేల్ స్టేడియంలో జరుగుతుందని తెలిపారు. బాల్ బ్మాడ్మింటన్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం నిర్వహించే టోర్నీలో పాల్గొనేందుకు రెండు తెలుగు రాష్ట్రాల క్రీడాకారులు 20వ తేదీలోపు ఎంట్రీలు సమర్పించాలని సూచించారు. ఈసమావేశంలో కోకన్వీనర్ టి.రామచంద్రరాజుతో పాటు విజయ్ కలాం, డాక్టర్ పులి మధు, శంకరమూర్తి, తిరుపతిరెడ్డి, బద్రి, శ్రీకాంత్, తాజ్వుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రకృతి వ్యవసాయంపై అధ్యయన యాత్ర
ఎర్రుపాలెం: ప్రకృతి వ్యవసాయంలో మెళుకువలను రైతులకు వివరించేందుకు ఉద్యానవన శాఖాధికారులు అధ్యయనయాత్ర ఏర్పాటుచేశారు. ఈ మేరకు జిల్లాలోని పలువురు రైతులను గురువారం బస్సులో ఏపీ రాష్ట్రం కృష్ణా జిల్లా గూడూరు మండలం పిన గూడూరులంక తీసుకెళ్లారు. అక్కడ ప్రకృతి వ్యవసాయం చేస్తున్న విజయ్రామ్ క్షేత్రంలో సాగులో మెళకువలు, దిగుబడిపై వివరించారు. అగ్రి హార్టికల్చర్ సొసైటీ సలహాదారుడు నల్లమల వెంకటేశ్వరరావు, వైరా ఏడీఏ కరుణశ్రీ, ఉద్యానవన శాఖాధికారి ఆకుల వేణు, రైతులు తల్లపురెడ్డి నాగిరెడ్డి, జంగా రవీందర్రెడ్డి, కంచర్ల చంద్రమోహన్ తదితరులు పాల్గొన్నారు. ‘స్వచ్ఛ్’ పాఠశాలల్లో పరిశీలన ఖమ్మంఅర్బన్: స్వచ్ఛ్ ఏవమ్ హరిత విద్యాలయాల రేటింగ్ కోసం జిల్లా స్థాయిలో ఎంపికై న పాఠశాలలను రాష్ట్ర బృందం గురువారం పరిశీలించింది. తిరుమలాయపాలెం, రఘునాథపాలెం, ఖమ్మం అర్బన్ మండలాల్లోని ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో పరిశీలించగా రాష్ట్ర పరిశీలకుడు ఎస్.కే.సైదులు వివరాలు వెల్లడించారు. పాఠశాలల్లో పచ్చదనం, పరిశుభ్రత, ఎకోక్లబ్ కార్యకలాపాలు, తాగునీటి వసతి, మరుగుదొడ్ల నిర్వహణ, పరిసరాల పరిశుభ్రత, అవగాహన ఆధారంగా రేటింగ్ ఇస్తామని తెలిపారు. ఆతర్వాత వివరాలను ఆన్లైన్లో అప్లోడ్ చేశాక అత్యధిక రేటింగ్ పొందిన పాఠశాలలను రాష్ట్ర, జాతీయ స్థాయి అవార్డుల కోసం ప్రతిపాదిస్తామని వెల్లడించారు. ఈకార్యక్రమంలో ఖమ్మం సీఎంఓ బాజోజు ప్రవీణ్కుమార్, కొత్తగూడెం ప్లానింగ్ కోఆర్డినేటర్ సతీష్కుమార్, డీఆర్పీ స్వరూప్కుమార్, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. 120క్వింటాళ్ల బియ్యం సీజ్ఖమ్మంఅర్బన్: ప్రజా పంపిణీకి కేటాయించిన బియ్యాన్ని అక్రమంగా తరలిస్తుండగా టాస్క్ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సివిల్ సప్లయీస్ ఖమ్మం అర్బన్ డీటీ మెచ్చు వెంకటేశ్వర్లు తెలిపిన వివరాలు... ఖమ్మంకు చెందిన ఏ.జగదీశ్ రేషన్ బియ్యాన్ని లారీలో తరలిస్తున్నట్లు అందిన సమాచారంతో హైదరాబాద్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డీఎస్పీ అంజయ్య నేతృత్వాన బుధవారం అర్ధరాత్రి తనిఖీలు చేపట్టారు. ఖమ్మం ఎన్టీఆర్ సర్కిల్ వద్ద లారీని తనిఖీ చేయగా 50 కేజీల చొప్పున 250 బస్తాల్లో 120 క్వింటాళ్ల రేషన్ బియ్యం ఉన్నట్లు తేలింది. కామేపల్లి మండలం పండితాపురం శివారులో బియ్యం లోడ్ చేసినట్లు గుర్తించి ఖమ్మం అర్బన్ ఎంఎల్ఎస్ పాయింట్కు అప్పగించారు. ఘటనపై ఖమ్మం టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయగా బియ్యం వ్యాపారి జగదీశ్, పండితాపురానికి చెందిన కానుగుల కృష్ణ, లారీ డ్రైవర్ మంగళగూడెంకు చెందిన ఎద్దులుపై కేసు నమోదైంది. తనిఖీల్లో ఏఎస్ఐ వెంకటకృష్ణ, తహసీల్దార్ బాషా, సివిల్ సప్లయిస్ డీటీ విజయబాబు, సీడీటీ వీరయ్య పాల్గొన్నారు. బ్యాంక్ సామగ్రి జప్తు సత్తుపల్లి: సీనియర్ సివిల్ జడ్జి కోర్టు ఆదేశాలతో సత్తుపల్లిలోని యూనియన్ బ్యాంక్–2వ శాఖలోని సామగ్రిని గురువారం జప్తు చేశారు. బ్యాంకు భవనం యజమాని చలసాని సాంబశివరావు పెంచిన లెక్కల ప్రకారం ఎనిమిదేళ్లుగా రూ.57 లక్షల బకాయి ఉండడంతో కోర్టును ఆశ్రయించాడు. ఈమేరకు కోర్టు ఆదేశాలతో రూ.5లక్షల విలువైన కుర్చీలు, బల్లలు, కంప్యూటర్లు, ఏసీలను జప్తు చేసి తరలించారు. కాగా, బ్యాంకు సామగ్రిని తరలిస్తుండడంతో ఖాతాదారులు వివరాలు ఆరా తీశారు. అలాగే, ఓ వ్యక్తి బ్యాంకులో తాకట్టు పెట్టిన బంగారం విడిపించేందుకు డబ్బు కట్టాక సామగ్రిని జప్తు చేయడంతో ఆందోళన వ్యక్తం చేశాడు. కుటుంబ కలహాలతో ఆత్మహత్య కల్లూరురూరల్: కల్లూరు మండలం చెన్నూరుకు చెందిన కంచిపోగు నగేష్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంట్లో గొడవపడి బుధవారం ఇంటి నుంచి వెళ్లిన ఆయన గురువారం ఉదయం వరకు రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు గాలిస్తుండగా సమీప మామిడితోటలో ఉరి వేసుకుని కనిపించాడు. ఘటనపై ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. -
గ్రూప్–3లో జిల్లా వాసుల సత్తా
ఖమ్మంమయూరిసెంటర్/ముదిగొండ: ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ వార్డు ఆఫీసర్, కమిషనర్ సీసీగా విధులు నిర్వర్తిస్తున్న బెందు వీరబాబు సీనియర్ అకౌంటెంట్ ఆఫీసర్గా ఎంపికయ్యారు. టీజీపీఎస్సీ గురువారం రాత్రి విడుదల చేసిన గ్రూప్–3 ఫలితాల్లో వీరబాబు ఎస్ఏఓగా ఎంపికవగా జోన్–4కు కేటాయించారు. ముదిగొండ మండలం బాణాపురం గ్రామానికి చెందిన వీరబాబు 17ఏళ్లు ఆర్మీలో విధులు నిర్వర్తించాక పోలీస్ శాఖలో ఎస్ఐ, కానిస్టేబుల్, గ్రూప్–3, 4, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఉద్యోగాల కోసం పరీక్షలు రాశారు. ఇందులో కానిస్టేబుల్, గ్రూప్–4, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఉద్యోగాలకు ఎంపికై న ఆయన గ్రూప్–4ద్వారా కేఎంసీలో వార్డు ఆఫీసర్గా చేరారు. ప్రస్తుతం కమిషనర్ వద్ద సీసీగా విధులు నిర్వర్తిస్తున్న వీరబాబు గ్రూప్–3లోనూ ఎంపికయ్యాడు. ఈమేరకు ఎస్ఏఓ ఉద్యోగానికి ఎంపికై న వీరబాబును కేఎంసీ ఉద్యోగులు, బాణాపురం వాసులు అభినందించారు. అలాగే, బాణాపురం గ్రామానికే చెందిన పానకాల వెంకటేశ్వర్లు కుమారుడు నరేష్ సైతం గ్రూప్–3లో మెరుగైన ర్యాంకు సాధించి ఉద్యోగానికి ఎంపికయ్యాడు. గతంలోనూ పలు ఉద్యోగ పరీక్షలు రాసిన ఆయన ఫలితం లేకపోవడంతో నిరాశ చెందకుండా గ్రూప్–3కు సిద్ధమయ్యాడు. ఈమేరకు మెరుగైన ర్యాంకుతో పంచాయతీరాజ్ శాఖలో ఉద్యోగానికి ఎంపికై నట్లు ఫలితాలు వెలువడగా నరేష్ను గ్రామస్తులు అబినందించారు. గోవింద్రాల బంజర వాసి.. కామేపల్లి: కామేపల్లి మండలం గోవింద్రాల బంజరకు చెందిన గంగారపు సాయి కృష్ణమనాయుడు మరో ఉద్యోగం సాధించాడు. గ్రామానికి చెందిన సత్యనారాయణ–జ్యోతిర్మయి పెద్దకుమారుడైన ఈయన ఇప్పటికే పలు ఉద్యోగ పరీక్షల్లో సత్తా చాటి రంగారెడ్డి జిల్లా కోర్టులో రికార్డు అసిస్టెంట్గా పనిచేశాక ఖమ్మం డీఎంహెచ్ఓ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. గురువారం రాత్రి విడుదలైన గ్రూప్–3 ఫలితాల్లోనూ ప్రతిభ కనబరిచి ఎంపికై ట్రెజరీ డిపార్ట్మెంట్లో సీనియర్ అసిస్టెంట్గా ఉద్యోగం సాధించాడు. కాగా, ఇదిలా ఉండగా సాయికృష్ణ భార్య నెల్లూరి కవిత ప్రభుత్వ ఉపాధ్యాయురాలుగా పనిచేస్తోంది. ఆయన సోదరుడు రత్నేశ్వరనాయుడు నాలుగు ఉద్యోగాలు సాధించి ప్రసుత్తం కొత్తగూడెంలో అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్(ఏటీఓ)గా పనిచేస్తుండగా, ఆయన భార్య మైసా ఉజ్వల హైదరాబాద్ సెక్రటేరియట్లో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్(ఏఎస్ఓ)గా విధులు నిర్వర్తిస్తోంది. బాణాపురం వాసులు ఇద్దరి ఎంపిక -
విశ్రాంత ఉద్యోగుల బకాయిలు చెల్లించాలి
ఖమ్మంమయూరిసెంటర్: రిటైర్డ్ ఉద్యోగుల పెండింగ్ బకాయిలతో పాటు డీఏలు, పీఆర్సీలను వెంటనే చెల్లించాలని మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి డిమాండ్ చేశారు. ఖమ్మంలోని మంచికంటి హాల్లో గురువారం జరగిన తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్ల అసోసియేషన్ జిల్లా సభలో ఆయన మాట్లాడారు. 2024 తర్వాత పదవీ విరమణ చేసిన వారి బకాయిలు విడుదల చేయడంతో పాటు ఉద్యోగులకు పెండింగ్ ఐదు డీఏలు, పీఆర్సీ వెంటనే ప్రకటించాలన్నారు. అయితే, బలమైన ఉద్యమాలతోనే ప్రభుత్వం స్పందిస్తుందనే విషయాన్ని గుర్తించి సంఘాలు కార్యాచరణ రూపొందించాలని సూచించారు. టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు గుంటుపల్లి శ్రీనివాసరావు, పెన్షనర్స్ అండర్ రిటైర్డ్ పర్సర్ల అసోసియేషన్ నాయకులు సీహెచ్.విద్యాసాగర్, అరుణ, కళ్యాణం నాగేశ్వరరావు, బాల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి -
ఆధ్యాత్మిక సందడి..
శ్రీసీతారామచంద్రస్వామివారి అవతారాలకు వేళాయె.. ● రేపటి నుంచి భద్రాచలంలో అధ్యయనోత్సవాలు ప్రారంభం ● 29న తెప్పోత్సవం, 30న ఉత్తరద్వార దర్శనం వేడుకలు భద్రాచలం: భూలోక వైకుంఠంగా పిలిచే భద్రగిరి అధ్యయనోత్సవాలకు సిద్ధమైంది. రామయ్య అవతారాలతోపాటు తెప్పోత్సవం, ఉత్తర ద్వార దర్శనం, విశ్వరూప సేవలను భక్తులు చూసి తరించే ఘడియలు సమీపించాయి. భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానంలో ఈ నెల 20 నుంచి వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలు ప్రారంభం కానున్నాయి. శనివారం నుంచి జనవరి 12 వరకు అధ్యయనోత్సవాలు, 16న విశ్వరూప సేవ నిర్వహించనున్నారు. అధ్యయనోత్సవాల్లో భాగంగా ఈనెల 20 నుంచి 29 వరకు పగల్ పత్తు, 30 నుంచి జనవరి 12 వరకు రాపత్తు ఉత్సవాలు జరగనున్నాయి. రోజొక అవతారంలో.. పగల్పత్తు ఉత్సవాల్లో స్వామివారు రోజుకొకటి చొప్పున తొమ్మిది అవతారాల్లో దర్శనమివ్వనున్నారు. ఈ నెల 29వ తేదీ సాయంత్రం 4 గంటలకు పవిత్ర గోదావరిలో స్వామి వారికి తెప్పోత్సవం, 30 న ఉదయం 5 నుంచి 6 గంటల వరకు ఉత్తర ద్వార దర్శనం ఉంటాయి. జనవరి 16న దేవతలందరినీ ఒకేచోట కొలువుదీర్చి ప్రత్యేక పూజలు చేసే ‘విశ్వరూప సేవ’ నిర్వహిస్తారు. ఈ వేడుక భద్రాద్రి రామయ్యకు మాత్రమే ప్రత్యేకం కావడం విశేషం. కాగా వైకుంఠ ఏకాదశి రోజు ముక్కోటి దేవతలు శ్రీమహావిష్ణువును శ్రీ వైకుంఠంలోని ఉత్తరద్వారం నుంచి దర్శించుకుంటారని భక్తులు విశ్వసిస్తారు. ఈ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అని కూడా అంటారు. -
ఏసీబీకి చిక్కిన ఆర్ఐ
కారేపల్లి: ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ జారీ చేసేందుకు రూ.10వేలు లంచం తీసుకుంటూ సింగరేణి మండల ఆర్ఐ ఏసీబీకి పట్టుబడింది. ఏసీబీ డీఎస్పీ వై.రమేష్ తెలిపిన వివరాలు... ఓ వ్యక్తి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ కోసం మీ సేవ ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. జీపీఓ పరిశీలన పూర్తయ్యాక ఆ దరఖాస్తు ఆర్ఐ లాగిల్కు వెళ్లింది. అనంతరం ఆర్ఐ విచారించి పై అధికారికి నివేదించాల్సి ఉంది. ఈక్రమంలో సింగరేణి తహసీల్లోని ఆర్ఐ–2 దౌలూరి శుభకామేశ్వరీదేవి రూ.10వేలు లంచం డిమాండ్ చేసింది. ఈనెల 17వ తేదీ వరకు ఇల్లెందు లలితాపురం వద్ద చెక్పోస్టులో ఎన్నికల తనిఖీ అధికారిగా విధులు నిర్వర్తించిన ఆమె తీరుపై దరఖాస్తుదారుడు ఏసీబీ అధికారులకు సమాచారం ఇచ్చాడు. అధికారుల సూచనలతో గురువారం రూ.10వేలు తీసుకొని తహసీల్కు వెళ్లగా కారేపల్లి ప్రభుత్వ సమీపాన తాను ఉండే ఇంటికి రావాలని ఆమె ఫోన్లో సూచించింది. దీంతో పిర్యాదుదారుడు అక్కడ రూ.10వేలు ఇస్తుండగా ఏసీబీ అధికారులు శుభకామేశ్వరీదేవిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అనంతరం తహసీల్కు తీసుకెళ్లి విచారణ చేపట్టారు. కాగా, ప్రభుత్వ ఉద్యోగులు లంచం డిమాండ్ చేస్తే టోల్ఫ్రీ నంబర్ 1064 లేదా 91543 88981 నంబర్కు సమాచారం ఇవ్వాలని డీఎస్పీ రమేష్ సూచించారు.ఫ్యామిలీ సర్టిఫికెట్ కోసం రూ.10వేలు డిమాండ్ -
సైన్స్ఫేర్కు ఏర్పాట్లు
● రేపటి నుంచి రెండు రోజులు నిర్వహణ ● 742 ఎగ్జిబిట్ల రిజిస్ట్రేషన్ఖమ్మం సహకారనగర్: ఖమ్మం బల్లేపల్లిలోని ఎస్ ఎఫ్ఎస్ పాఠశాలలో ఈనెల 20, 21వ తేదీల్లో జిల్లాస్థాయి సైన్స్ఫేర్, ఇన్స్పైర్ నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈమేరకు గురువారం సన్నాహక సమావేశంలో జిల్లా విద్యాశాఖాధికారి చైతన్య జైనీ మాట్లాడారు. సైన్స్ఫేర్ విజయవంతం అయ్యేలా కమిటీల బాధ్యులుకీలకంగా పనిచేయాలని తెలి పారు. విద్యార్థులు, ఎగ్జిబిట్ల సందర్శనకు వచ్చే వారికి అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లు ఉండాలని చెప్పారు. ఎగ్జిబిట్లు తీసుకొచ్చే వారితో దూరప్రాంతాల విద్యార్థులు, గైడ్టీచర్లకు భోజన, వసతి సౌకర్యాలు కల్పించినట్లు తెలిపారు. ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న ఎగ్జిబిట్లు తప్ప మిగతావి అనుమతించొద్దని సూచించారు. సెక్టోరియల్ అధికారులు, వివిధ సంఘాలు, కమిటీల బాధ్యులు పాల్గొన్నారు. భారీగా రిజిస్ట్రేషన్లు విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యాలను వెలికి తీసేలా నిర్వహించనున్న సైన్స్ ఫేర్కు ఈసారి అనూహ్య స్పందన వచ్చింది. గతంలో 400–450 ఎగ్జిబిట్లనే తీసుకొచ్చేవారు. కానీ ఈసారి సైన్స్ ఫేర్కు 742 ఎగిబిట్ల ప్రదర్శనకు విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. గురువారం రాత్రితో రిజిస్ట్రేషన్ గడువు ముగియగా సైన్స్ ఫేర్కు 742, ఇన్స్పైర్కు 100 రిజిస్ట్రేషన్లు వచ్చాయి. గతేడాది మాత్రం సైన్స్ ఫేర్కు 416 ప్రదర్శనలే రాగా ఈసారి దాదాపు రెట్టింపు స్థాయిలో నమోదు కావడం విశేషం. కాగా, 2025–26 విద్యాసంవత్సరానికి జిల్లాస్థాయి సైన్స్ ఫేర్, 2024–25 సంవత్సరానికి ఇన్స్పైర్ను శని, ఆదివారాల్లో నిర్వహించనున్నారు. అయితే, భారీ స్థాయిలో రిజిస్ట్రేషన్లు రావడంతో సైన్స్ఫేర్ నిర్వహణపై జిల్లా విద్యాశాఖ దృష్టి సారించింది. -
తండా నుంచి ఉన్నత స్థాయికి..
● యూపీఎస్సీ ఇంజనీరింగ్ సర్వీసెస్లో సత్తా ● 86వ ర్యాంక్ సాధించిన కార్తీక్ రఘునాథపాలెం: రఘునాథపాలెం మండలం సుక్ని తండాకు చెందిన మాలోత్ కార్తీక్ యూపీఎస్సీ నిర్వహించిన ఇంజనీరింగ్ సర్వీసెస్ పరీక్షలో ప్రతిభ కనబరిచాడు. పరీక్షలో 86వ ర్యాంక్ సాధించడం ద్వారా వెనుకబడిన గిరిజన ప్రాంతానికి చెందిన ఆయన దేశ అత్యున్నత సేవల్లో స్థానం సాధించినట్లయింది. పదో తరగతి వరకు ఖమ్మంలో చదివిన కార్తీక్ ఇంటర్ అనంతరం గౌహతి ఐఐటీలో బీటెక్ పూర్తిచేశాడు. ఇంజినీరింగ్ అయ్యాక 2020లో చైన్నె కార్పొరేషన్లో అసిస్టెంట్ ఇంజినీర్గా ఉద్యోగం సాధించి డిప్యూటీ ఇంజినీర్గా ఎదిగారు. ఉద్యోగం చేస్తున్నా తన లక్ష్యాన్ని మరిచిపోకుండా శ్రమించడంతో 2021లో ఇండియన్ ఇంజినీరింగ్ సర్వీసెస్కు ఎంపికయ్యారు. అంతేకాక ఎన్టీపీసీ, ఎయిర్పోర్ట్ అథారిటీ తదితర కేంద్ర సంస్థల్లో కూడా ఉద్యోగాలు సాధించాడు. అయినప్పటికీ సివిల్స్ సాధించడమే లక్ష్యంగా సొంతంగా సిద్ధమైన కార్తీక్ తాజాగా విడుదలైన ఫలితాల్లో యూపీఎస్సీ ఇంజనీరింగ్ సర్వీసెస్లో 86వ ర్యాంక్ సాధించినట్లు వెల్లడైంది. ఆయన తండ్రి మాలోత్ బాషా కొత్తగూడెం ఎకై ్సజ్ ఎస్ఐగా, తల్లి పార్వతి వైరా ఎస్టీ కాలనీ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వర్తిస్తున్నారు. తల్లిదండ్రుల క్రమశిక్షణ, ప్రోత్సాహంతోనే ఈ స్థాయికి వచ్చినట్లు వెల్లడించిన కార్తీక్.. పేద, వెనుకబడిన వర్గాల సంక్షేమం కోసం కృషి చేయొచ్చనే లక్ష్యంతోనే సివిల్ సర్వీసెస్ ఎంంచుకున్నట్లు తెలిపారు. -
పాల ఉత్పత్తులతో ఆదర్శంగా నిలవాలి
ఖమ్మం సహకారనగర్: మధిర నియోజకవర్గంలో ఏర్పాటుచేస్తున్న ఇందిరా మహిళా డెయిరీ త్వరగా అందుబాటులోకి వచ్చేలా అధికారులు పర్యవేక్షించాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సూచించారు. హైదరాబాద్ నుంచి గురువారం ఆయన సెర్ప్ సీఈఓ దివ్య, ఇతర ఉన్నతాధికారులతో కలిసి వీసీ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి భట్టి మాట్లాడుతూ జిల్లాలో పాల కొరతను తగ్గిండచమే కాక స్తూ మహిళలు ఆర్థికంగా ఎదిగేలా ఇందిరా మహిళా డెయిరీ పనిచేస్తుందని తెలిపారు. రానున్న మూడేళ్లలో 20వేల మంది మహిళలు భాగస్వామ్యం అయ్యేలా ఈ ప్రాజెక్టును రూపొందించామని తెలిపారు. ఈ మేరకు పాల సేకరణ, పాల ఉత్పత్తుల్లో ఆదర్శంగా నిలిచేలా అధికారులు పర్యవేక్షించాలని సూచించారు. కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ ఇప్పటివరకు 125 మంది లబ్ధిదారులకు రెండు పాడి గేదెలను పంపిణీ చేయగా, రోజుకు ఒక గేదె సరాసరి ఆరు లీటర్ల మేర పాలు ఇస్తోందని ఎర్రుపాలెంలో పాల సేకరణ జరుగుతుందని, మిగిలిన నాలుగు మండలాల్లో త్వరలోనే అందుబాటులోకి వస్తాయని తెలిపారు. అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ, డీఆర్డీఓ సన్యాసయ్య, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ నవీన్బాబు, బీసీ సంక్షేమ శాఖాధికారి జ్యోతి తదితరులు పాల్గొన్నారు.జిల్లాలో మూడు విడతలుగా నిర్వహించిన గ్రామపంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. మొత్తంగా 566 గ్రామపంచాయతీల్లో సర్పంచ్లు, 5,168 వార్డు సభ్యుల ఎన్నిక ప్రక్రియ పూర్తయిందని వెల్లడించారు. సమర్థవంతంగా ఎన్నికల విధులు నిర్వర్తించిన అధికారులు, ఉద్యోగులను ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు ఆయన ఓ ప్రకటనలో తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్లో డిప్యూటీ సీఎం భట్టి -
చిన్నారులకు పాల భాగ్యం !
ఖమ్మంమయూరిసెంటర్: పోషకాహార లోపాన్ని నివారించడమే కాక చిన్నారుల ఎదుగుదల ఆశాజనకంగా ఉండాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అంగన్వాడీ కేంద్రాల ద్వారా ఇప్పటికే గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పోషకాహారం అందిస్తుండగా.. 3 – 5 ఏళ్ల లోపు చిన్నారులకు పాలు సైతం అందించనున్నారు. ములుగు జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్గా అమలవుతున్న ఈ కార్యక్రమాన్ని త్వరలోనే రాష్ట్రమంతటా వర్తింపచేయనున్నారు. ప్రస్తుతం వారికే... అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలకు ప్రస్తుతం పోషకాహారంతో పాటు పాలు అందిస్తున్నారు. రోజూ 200 మి.లీ. పాలతో పాటు అన్నం, పప్పు, గుడ్డు అందుతున్నాయి. గర్భిణులుగా నమోదైన నాటి నుండి శిశువు జన్మించిన ఆరు నెలల వరకు ఇది అమలవుతోంది. శిశువుకు ఆరు నెలలు నిండాక బాలింతలకు పోషకాహారం నిలిపేసి, పిల్లలకే పండ్లు, గుడ్లు అందిస్తున్నారు. చిన్నారికి మూడేళ్లు వచ్చే వరకు నెలకు రెండున్నర కేజీల పోషకాలతో కూడిన పిండి, 16 గుడ్లు పంపిణీ చేస్తున్నారు. మరోపక్క పూర్వ ప్రాథమిక విద్య కోసం అంగన్వాడీల్లో చేరిన చిన్నారులకు భోజనం సమకూరుస్తున్నారు. ప్రోత్సాహం.. అంగన్వాడీలు పేద కుటుంబాల చిన్నారులకు తొలి పాఠశాలలుగా, పోషకాహార కేంద్రాలుగా పనిచేస్తున్నాయి. ప్రస్తుతం 3 – 5 ఏళ్ల చిన్నారులకు పోషకాలతో కూడిన భోజనం అందిస్తున్నారు. దీనికి అదనంగా పాల సరఫరా మొదలైతే వారిలో రక్తహీనత, పోషకాహార లోపం వంటి సమస్యలు తగ్గుతాయని అధికారులు భావిస్తున్నారు. కాగా, రాష్ట్ర ప్రభుత్వం సీ్త్ర, శిశు సంక్షేమశాఖ ద్వారా పాల పంపిణీ మొదలుపెడితే జిల్లాలో 31,860 మంది చిన్నారులకు లబ్ధి చేకూరనుంది. జిల్లాలోని ఏడు ప్రాజెక్టుల పరిధిలో 3 – 6 ఏళ్లలోపు చిన్నారుల పేర్లు నమోదయ్యాయి.అంగన్వాడీల ద్వారా గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పోషకాహారం అందుతోంది. పూర్వ ప్రాథమిక పాఠశాల విద్య కోసం అంగన్వాడీల్లో చేరే చిన్నారులకు త్వరలోనే పాల పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది. ప్రభుత్వం నిర్ణయం వెలువరించగానే జిల్లాలో చిన్నారులకు పాలు పంపిణీ చేసేలా చర్యలు తీసుకుంటాం. – వేల్పుల విజేత, జిల్లా సంక్షేమ అధికారి, ఖమ్మం -
ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి
ఖమ్మం సహకారనగర్: ఖమ్మం నగరంలో పెరుగుతున్న జనాభా, వారి అవసరాలను దృష్టిలో ఉంచుకుని అభివృద్ధి పనులు వేగంగా చేపడుతున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఖమ్మం 14వ డివిజన్ గోపాలపురంలో రూ.2.25 కోట్లతో నిర్మించే బీటీ, సీసీ రోడ్లు, డ్రెయిన్ పనులకు కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్యతో కలిసి మంత్రి గురువారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ నగర అభివృద్ధికి ముఖ్యమంత్రి పూర్తి సహకారం అందిస్తున్నారని తెలిపారు. అభివృద్ధి పనులకు ఇప్పటికే రూ.50 కోట్లు మంజూరు చేయగా, జనవరిలో మరో రూ.50 కోట్లు సాధించేలా ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. నగర జనాభా 5లక్షలకు చేరినందున రహదారుల విస్తరణ, తాగునీటి సరఫరా ప్రణాళికలు సిద్ధమయ్యాయన్నారు. కాగా, ఎన్నికల హామీ మేరకు కబ్జాదారులు, మట్కా నిర్వాహకులు, గంజాయి అమ్మకందారులపై కఠిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ విషయంలో అందరూ సహకరించాలని సూచించారు. కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్య మాట్లాడుతూ అన్ని డివిజన్లలో ఫుట్పాత్లు, పార్కులతో పాటు కేబుల్ బ్రిడ్జి, రోప్వే పనులు ప్రగతిలో ఉన్నాయని తెలిపారు. మార్కెట్ కమిటీ చైర్మన్ హన్మంతరావు, కార్పొరేటర్లు కూరాకుల వలరాజు, లకావత్ సైదులు, నీరజ, మలీదు వెంకటేశ్వర్లు, బోడ శ్రావణ్కుమార్, సొసైటీ చైర్మన్ రావూరి సైదబాబు, ఆర్డీఓ నర్సింహారావు, ఉద్యోగులు, నాయకులు ఎం.వెంకటేశ్వర్లు, అనన్య, ఉదయ్ప్రతాప్, కామతం రామకృష్ణ, తోట ప్రసాద్, దొబ్బల సౌజన్య తదితరులు పాల్గొన్నారు.రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల -
అక్క సర్పంచ్.. చెల్లె కలెక్టర్ !
ఖమ్మం జిల్లా: మండలంలోని తెట్టెలపాడు సర్పంచ్గా ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపరిచిన చిర్రా నర్సమ్మ గెలిచారు. ఆమె చెల్లె (పిన్ని కుమార్తె), కర్ణాటక రాష్ట్రంలోని గుల్బ ర్గా కలెక్టర్ హెప్సిబారాణి బుధవారం నర్సమ్మను అభినందించారు. గ్రామాభివృద్ధికి కృషి చేస్తూ ఆదర్శవంతమైన పాలన అందించాలని ఆకాంక్షించారు. తొలుత నర్సమ్మ విజయంపై గ్రామంలో బీఆర్ఎస్ ఆధ్వర్యాన విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. నాయకులు బిల్లగిరి ధనుంజయ్, గుంటి పుల్లయ్య, చిర్రా కృష్ణయ్య, రెడ్డిమల్ల నరేందర్, కొమ్ము శ్రీను, రెడ్డిమల్ల నరేందర్, పగిడిపల్లి బాబు తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్ అభిమానుల సంబురాలు
ఖమ్మం జిల్లా: తల్లాడ మండలం రామానుజవరం సర్పంచ్గా బుధవారం జరిగిన ఎన్నికలో స్వతంత్ర అభ్యర్థి కిన్నెర వెంకటకృష్ణవేణి గెలుపొందారు. ఆమెకు దివంగత సీఎం వైఎస్.రాజశేఖరరెడ్డి, ఏపీ మాజీ సీఎం వైఎస్.జగన్మోహన్రెడ్డి అభిమానుల మద్దతు ఉండడంతో ఫలితం వెలువడగానే సంబురాలు చేసుకున్నారు. ఈక్రమాన జగన్ ఫొటోతో సంబురాల్లో పాల్గొని తమ కృతజ్ఞత చాటుకున్నారు. -
సరిహద్దుల నుంచి..
నేను కాశ్మీర్ సరిహద్దుల్లో విధులు నిర్వర్తిస్తున్నాను. ఎన్నికల సమయంలో లీవ్ తీసుకుని మంగళవారం రాత్రి వచ్చాను. నా ఓటు హక్కు వినియోగించుకున్నాను. వ్యక్తులను ఎన్నుకుని గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలి. – షేక్ యాకూబ్ పాషా, ఆర్మీ జవాన్ కారేపల్లి నేనుహైదరాబాద్లోని ఓప్రైవేటు కంపెనీలో ఉ ద్యోగం చేస్తున్నాను. ఎన్నికల్లో ఓటువేయటం మన బాధ్యత. ఇప్పటివరకు నేనెప్పుడూ ఓటు మిస్ కాలేదు. మనం ఎక్కడ ఉన్నా మూలాలు మన ఊళ్లోనే ఉంటాయి. – షేక్ సలీమ్ పాషా, ప్రైవేటు ఉద్యోగి కారేపల్లి కారేపల్లి మండలంలో తొలి ట్రాన్స్జెండర్ ఓటరు ను నేనొక్కడినే. ట్రాన్స్జెండర్గా ఓటు హక్కు వచ్చి న తర్వాత సర్పంచ్ ఎన్నికల్లో పాల్గొనటం ఇదే ప్రథ మం. ఓటువేయటం నాకు చాలాఆనందంగాఉంది. – వేమూరి కీర్తి అలియాస్ శ్రీను, కారేపల్లి -
బాధ్యత గుర్తించి..
ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోవడం పౌరుల బాధ్యత. బీటెక్ పూర్తి చేసిన నాకు తొలిసారి ఓటు హక్కు లభించింది. అందుకే ఓటు హక్కు సద్వినియోగం కోసం హైదరాబాద్ నుంచి వచ్చాను. –మచ్చ మమత, బీటెక్, పూబెల్లి నేను బెంగళూరులో రైల్వే కాంట్రాక్ట్ వర్కర్గా పనిచేస్తున్నా. మా ఊరంటే అభిమానం ఎక్కువ. మంచి నాయకత్వంలో గ్రామం అభివృద్ధి చెందాలనే ఆశయంతో కుటుంబ సమేతంగా ఓటేసేందుకు వచ్చా. – అరెం బాబూరావు, వేపలగడ్డ -
కాంగ్రెస్.. తీన్మార్ !
తుది విడతలోనూ కాంగ్రెస్ హవాజిల్లాలో మూడు విడతలుగా జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు విజయదుందుభి మోగించారు. మెజార్టీ సర్పంచ్ స్థానాలను ఆ పార్టీ మద్దతుదారులు కై వసం చేసుకోవడంతో పార్టీ శ్రేణుల్లో సంబురాలు మిన్నంటాయి. మూడు విడతలు కలిపి 566 గ్రామపంచాయతీల ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడింది. ఇందులో ఏన్కూరు మండలం నూకాలంపాడు పంచాయతీ సర్పంచ్ స్థానం ఎస్టీకి రిజర్వ్ అయినా అక్కడ ఎస్టీ అభ్యర్థి లేకపోవడంతో ఎన్నిక జరగలేదు. మిగిలిన 565 స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తే.. ఇందులో అత్యధికంగా కాంగ్రెస్ పార్టీ 372 సర్పంచ్ స్థానాలను తన ఖాతాలో వేసుకుంది. ఆ తర్వాత బీఆర్ఎస్ మద్దతుదారులు 121 పంచాయతీలు, సీపీఎం 25, సీపీఐ 11, ఇతరులు 36 స్థానాల్లో గెలుపొందారు. ప్రధానంగా సత్తుపల్లి నియోజకవర్గంలో రెబల్స్ బెడదతో కాంగ్రెస్ పార్టీ పలు పంచాయతీలను కోల్పోయింది. – సాక్షిప్రతినిధి, ఖమ్మంఏకగ్రీవాలతో బోణీ కొట్టి.. పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిందే తరువాయి ఏకగ్రీవాలతోనే కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు విజయపరంపర మొదలుపెట్టారు. పార్టీ అధికారంలో ఉండడం, స్థానికంగా ముగ్గురు మంత్రులు, ఇద్దరు ఎమ్మెల్యేలు అధికార పార్టీ వారే కావడంతో ఎన్నికలు జరిగిన స్థానాల్లో కాంగ్రెస్ మద్దతుదారులకు తిరుగులేకుండా పోయింది. ఇదే మయాన బీఆర్ఎస్, సీపీఎం జిల్లాలో మెజార్టీ పంచాయతీల్లో పొత్తుతో ముందుకెళ్లి కాంగ్రెస్కు గట్టిపోటీ ఇచ్చాయి. అయినా కాంగ్రెస్ మద్దతుదారులు కల్లూరు మండలం మినహా ప్రతీ మండలంలోనూ మెజార్టీ పంచాయతీల్లో పాగా వేశారు. ఏకగ్రీవాలతో మొదలైన ఆ పార్టీ జైత్రయాత్ర మూడో విడత ముగిసే వరకు కొనసాగింది. పొత్తుతో ఆ రెండు పార్టీలు గ్రామపంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్, సీపీఎం అవగాహనతో పోటీ చేశాయి. ఆ పార్టీల మద్దతుదారులు పలు స్థానాల్లో గెలుపొందగా, కొన్నిచోట్ల స్వల్ప తేడాతో గెలుపొందారు. మధిర నియోజకవర్గంలోని 34 పంచాయతీల్లో, పాలేరులోని 42 స్థానాల్లో ఆ పార్టీ మద్దతుదారులు విజయం సాధించారు. ఇక ఖమ్మం నియోజకవర్గ పరిధి రఘునాథపాలెంలో బీఆర్ఎస్ 11 స్థానాల్లో గెలిచింది. నామినేషన్ల ముందు వరకు బీఆర్ఎస్, సీపీఎం ఒంటరిగా పోటీ చేసేందుకు ప్రాధాన్యతను ఇచ్చాయి. పలుమార్లు చర్చల అనంతరం కలిసి పోటీ చేయడంతో అనుకున్న దాని కన్నా ఎక్కువ స్థానాలు దక్కించుకోగలిగారనే చర్చ సాగుతోంది.సాక్షిప్రతినిధి, ఖమ్మం: తుది విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ మద్దతుదారుల విజయ పరంపర కొనసాగింది. కల్లూరు, పెనుబల్లి, సత్తుపల్లి, తల్లాడ, వేంసూరు, ఏన్కూరు, సింగరేణి మండలాల్లో బుధవారం ఎన్నికలు జరిగాయి. ఆయా మండలాల్లో ఏకగ్రీవాలు, ఎన్నికలు జరిగిన పంచాయతీలు కలిపి 190 స్థానాలకు గాను కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా 119 జీపీల్లో గెలుపొందింది. ఆ తర్వాత బీఆర్ఎస్ 45గ్రామపంచాయతీలను గెలుచుకోగా, సీపీఎం రెండు, సీపీఐ ఒక చోట విజయం సాధించాయి. ఇక ఇతరులు 23పంచాయతీలను దక్కించుకున్నారు. కాగా, సత్తుపల్లి నియోజకవర్గంలోని పలుచోట్ల కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులకు ఆ పార్టీ రెబల్స్ నుంచి గట్టి పోటీ ఎదురైంది. ఈక్రమాన రెబల్స్ పలు జీపీల్లో విజయం సాధించారు. ఇదే నియోజకవర్గంలో బీఆర్ఎస్ మద్దతుదారులు కూడా పోటీ ఇచ్చారు. కల్లూరు మండలంలో ఏకంగా కాంగ్రెస్ పార్టీ మద్దతుదారుల కన్నా ఎక్కువ స్థానాల్లో బీఆర్ఎస్ మద్దతుదారులు గెలుపొందారు. ఇక పెనుబల్లి, వేంసూరు మండలాల్లోనూ కాంగ్రెస్ మద్దతుదారులు మెజార్టీ పంచాయతీలు దక్కించుకున్నా.. బీఆర్ఎస్ మద్దతుదారులు సైతం సత్తా చాటారు. తల్లాడ, పెనుబల్లి మేజర్ పంచాయతీలను బీఆర్ఎస్ దక్కించుకోగా, వేంసూరు, వీఎం బంజర మేజర్ పంచాయతీ కాంగ్రెస్ పరమైంది.సత్తుపల్లి నియోజకవర్గంలో రెబల్స్ బెడదమూడు విడతల్లోనూ అధికార పార్టీ ఆధిక్యత నియోజకవర్గం జీపీలు కాంగ్రెస్ బీఆర్ఎస్ సీపీఎం సీపీఐ ఇతరులు మధిర 131 90 21 13 05 02పాలేరు 134 83 34 08 03 06ఖమ్మం 37 26 11 0 0 0సత్తుపల్లి 129 72 40 02 0 15వైరా 110 85 09 02 02 12(జూలూరుపాడు మినహా) ఇల్లెందు 24 16 06 00 01 01(కామేపల్లి మాత్రమే) మొత్తం 565 372 121 25 11 36పంచాయతీ ఎన్నికల్లో మూడు విడతల్లోనూ కాంగ్రెస్ మద్దతుదారులు స్పష్టమైన మెజార్టీ సాధించారు. జిల్లాలో డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ప్రాతినిధ్యం వహిస్తున్న మధిర, పాలేరు, ఖమ్మం నియోజకవర్గాల్లో విజయపరంపర కొనసాగింది. మొదటి, రెండు విడతల్లో ఈ నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగ్గా.. ఓటర్లు కాంగ్రెస్కు జై కొట్టారు. మధిర నియోజకవర్గంలో మొత్తం 131 జీపీలకు 90చోట్ల ఆ పార్టీ మద్దతుదారులు నెగ్గారు. అలాగే, పాలేరు నియోజకవర్గంలో 134 జీపీలకు 83లో, ఖమ్మం నియోజకవర్గంలో 37 జీపీలకు 26 గ్రామపంచాయతీల్లో విజయబావుటా ఎగురవేశారు. ఇక సత్తుపల్లి, వైరా నియోజకవర్గాల్లో కూడా ఓటర్లు కాంగ్రెస్ మద్దతుదారుల పక్షాన నిలిచారు. మరికొన్ని చోట్ల స్థానికంగా పార్టీలో శ్రేణుల్లో విభేదాలు, టికెట్ రాలేదనే ఉద్దేశంతో పనిచేయకపోవడంతో కొన్ని స్థానాలను కోల్పోయింది. -
అక్కడక్కడా ఇక్కట్లు.. అసౌకర్యాలు
జిల్లాలోని ఏడు మండలాల్లో మూడో విడతగా గ్రామపంచాయతీ ఎన్నికలు బుధవారం ముగిశాయి. కొన్నిచోట్ల స్వల్ప ఉద్రిక్తత మినహా ప్రశాంతంగా పోలింగ్ జరిగింది. పెనుబల్లి మండలం సూరయ్యబంజరలో ఇరు అభ్యర్థుల పోలింగ్ ఏజెంట్లు గుర్తులు చెబుతున్నారని గొడవ చెలరేగింది. ఇరువర్గాలను పోలీసులు చెదరగొట్టి బయటకు పంపించడంతో వివాదం సద్దుమణిగింది. ఇక కారేపల్లి మండలంలోని పేరుపల్లి హైస్కూల్ పోలింగ్ కేంద్రంలో పది పోలింగ్ బూత్ల ఏర్పాటుకు సిద్ధం కాగా, ఎనిమిదే గదులు ఉన్నాయి. దీంతో వరండాలో సైడ్ కర్టెన్స్ కట్టి బూత్లు ఏర్పాటు చేశారు. తల్లాడ మండలం మల్లవరంలోనూ ఇదే పరిస్థితి ఎదురైంది. ఇక కారేపల్లి హైస్కూల్ పోలింగ్ కేంద్రంలో మధ్యాహ్నం ఒంటిగంటకు గేట్లు మూసే సమయాన ఓ ఓటరు రావడంతో అనుమతించారు. కానీ ఆయన మద్యం సేవించి ఉండడంతో ‘నేను ఓటు వేయను’ అని చెబుతూ తిరిగి వెళ్లిపోయారు. అలాగే, ఏన్కూరు మండలం కోనాయపాలెంలో ఎనిమిది వార్డులకు ఏడు ఏకగ్రీవమైతే ఒకే వార్డుకు ఎన్నికలు జరిగాయి. ఇక్కడ 140 మంది ఓటర్లు చాలాసేపు రాకపోవడంతో సిబ్బంది ఎదురుచూశారు. చివరకు వారు వెళ్లి నచ్చజెప్పడంతో ఓటింగ్కు వచ్చారు. కాగా, సత్తుపల్లి మండలం సిద్ధారంలో ఓ దివ్యాంగురాలు ఓటు వేసేందుకు రాగా సిబ్బంది వీల్చైర్లో కూర్చోబెట్టి లోపలికి తీసుకెళ్లారు. కానీ, ఓటు వేశాక పట్టించుకోకపోవడంతో ఆమె తల్లే ఇబ్బంది పడుతూ నడిపించుకుని ఆటో వద్దకు వచ్చింది. –సత్తుపల్లి / సత్తుపల్లిరూరల్ / కారేపల్లి / ఏన్కూరు -
నేడు కొత్తగూడెంలో మంత్రి పొంగులేటి పర్యటన
ఖమ్మంమయూరిసెంటర్: రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు చుంచుపల్లి మండలం విద్యానగర్ కాలనీలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి అందుబాటులో ఉంటారు. ఈ సందర్భంగా భద్రాద్రి జిల్లాలోని గ్రామపంచాయతీల నుంచి కాంగ్రెస్ మద్దతుతో గెలిచిన సర్పంచ్లు, ఉపసర్పంచ్లు, వార్డు సభ్యులను మంత్రి సన్మానిస్తారని క్యాంపు కార్యాలయం ఇన్చార్జ్ తుంబూరు దయాకర్రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఖమ్మంలో మంత్రి తుమ్మల.. ఖమ్మంఅర్బన్: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గురువారం ఖమ్మంలో పర్యటించనున్నారు. ఖమ్మం 14వ డివిజన్ గోపాలపురంలో సీసీ రోడ్డు, డ్రెయిన్ పనులకు పనులకు శంకుస్థాపన చేస్తారు. ఆతర్వాత మరికొన్ని ప్రాంతాల్లోనూ అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేయనున్నారు. కోర్టు భవన స్థలం పరిశీలించిన జిల్లా జడ్జి రఘునాథపాలెం: రఘునాథపాలెంలోని జింకల తండా రోడ్డులో జిల్లా కోర్టుల భవన నిర్మాణాల కోసం కేటాయించిన పది ఎకరాల స్థలాన్ని బుధవారం జిల్లా జడ్జి రాజగోపాల్ పరిశీలించారు. ఈమేరకు భూమి వివరాలు, హద్దులను తహసీల్దార్ శ్వేత, సర్వేయర్ శివ, ఆర్ఐ ప్రవీణ్ ఆయనకు వివరించారు. స్వామి నారాయణన్ పాఠశాలకు కేటాయించిన భూమిని ఆనుకుని భూమిని కోర్టు నిర్మాణానికి అనువుగా గుర్తించి కేటాయించినట్లు అధికారులు తెలిపారు. అయితే, కోర్టుల సముదాయంతో పాటు ఉద్యోగుల క్వార్టర్ల కోసం మరో ఐదు ఎకరాలు కేటాయిస్తే ఉపయోగకరంగా ఉంటుందని చర్చ జరిగనట్లు సమాచారం. ప్రస్తుతం కోర్టు సముదాయం నిర్మాణం పూర్తయితే జిల్లా న్యాయ వ్యవస్థకు మరింత బలో పేతం కానుందని అధికారవర్గాలు పేర్కొన్నాయి. ముస్తాబవుతున్న భద్రగిరిభద్రాచలం: ముక్కోటి ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలకు భద్రాద్రి ముస్తాబవుతోంది. ఈనెల 20 నుంచి పగల్పత్తు ఉత్సవాల్లో భాగంగా స్వామివారి అవతరాల దర్శనం ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో పంచరంగులు, హంసవాహన పనులు వేగంగా సాగుతున్నాయి. బ్రిడ్జి రోడ్డు సెంటర్లో ప్రధాన స్వాగత ద్వారం, అభయాంజనేయస్వామి, సూపర్మార్కెట్ సెంటర్లతో పాటు ఇతర కూడళ్లలో సైతం స్వాగత ద్వారాలు సిద్ధమయ్యాయి. ఈనెల 29వ తేదీ రాత్రి గోదావరిలో తెప్పోత్సవం కోసం వినియోగించే తాత్కాలిక ర్యాంపు నిర్వహణ స్థలాన్ని ఇటీవల పరిశీలించిన అధికారులు తగు సూచనలు చేశారు. ఆన్లైన్లో 719 టికెట్ల విక్రయం.. కాగా ఉత్తరద్వార దర్శనం కోసం ఆన్లైన్లో 719 టికెట్లను విక్రయించారు. రూ.2వేల విలువగల సెక్టార్ టికెట్లు 353, రూ.1000 విలువైన టికెట్లు 52, రూ.500 విలువైన సెక్టార్ బీ, డీ టికెట్లు 416, రూ.250 విలువైన టికెట్లు 300 ఖాళీగా ఉన్నాయని, వీటిని భక్తులు వెబ్సైట్లో కొనుగోలు చేసుకోవచ్చని అధికారులు వివరించారు. -
ఓటు కోసమే..
సత్తుపల్లి మండలం కాకర్లపల్లి మా గ్రామం. నేను హైదరాబాద్లో ఉంటూ టీవీ సీరియళ్లలో నటిస్తున్నా. నాకు ఐదు నెలల బిడ్డ ఉంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చా. –ఈర్ల హరిత, బుల్లితెర నటి, కాకర్లపల్లి ఈ నెల 17న పోలింగ్ ఉందని గ్రామస్తులు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారు. సొంత గ్రామంలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు అమెరికా నుంచి వచ్చా. ఎంతో సంతోషంగా ఉంది. – చీకటి శ్రీనివాసరావు, ఎన్ఆర్ఐ, అన్నారుగూడెం నేను హైదరాబాద్లో హోటల్ నిర్వహిస్తున్నాను. ఓటు వేసేందుకు కుటుంబ సమేతంగా వచ్చా. ఓట్ల రోజు నా స్నేహితులంతా కలిశారు. ఓటు వేయటం మా ఊరివాడిగా నా బాధ్యత. చాలా ఆనందంగా ఉంది. – చెరుకుమళ్ల రామారావు, కారేపల్లి -
అక్క సర్పంచ్.. చెల్లె కలెక్టర్ !
తిరుమలాయపాలెం: మండలంలోని తెట్టెలపాడు సర్పంచ్గా ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపరిచిన చిర్రా నర్సమ్మ గెలిచారు. ఆమె చెల్లె (పిన్ని కుమార్తె), కర్ణాటక రాష్ట్రంలోని గుల్బ ర్గా కలెక్టర్ హెప్సిబారాణి బుధవారం నర్సమ్మను అభినందించారు. గ్రామాభివృద్ధికి కృషి చేస్తూ ఆదర్శవంతమైన పాలన అందించాలని ఆకాంక్షించారు. తొలుత నర్సమ్మ విజయంపై గ్రామంలో బీఆర్ఎస్ ఆధ్వర్యాన విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. నాయకులు బిల్లగిరి ధనుంజయ్, గుంటి పుల్లయ్య, చిర్రా కృష్ణయ్య, రెడ్డిమల్ల నరేందర్, కొమ్ము శ్రీను, రెడ్డిమల్ల నరేందర్, పగిడిపల్లి బాబు తదితరులు పాల్గొన్నారు. క్షయ వ్యాధిని ముందుగా గుర్తిస్తే ఫలితం మధిర: చిన్నపిల్లల్లో క్షయవ్యాధిని ముందుగానే గుర్తించాలని, తద్వారా మెరుగైన చికిత్స చేయొ చ్చని జిల్లా క్షయ నివారణ అధికారి వరికూటి సుబ్బారావు తెలిపారు. ఈమేరకు వైద్య, ఆరోగ్య శాఖ ఉద్యోగులు చొరవ చూపాలని సూచించారు. మధిర మండలం దెందుకూరు, మాటూరుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, మధిర పరిధిలోని ప్రసూతి సేవల కేంద్రాన్ని బుధవారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సుబ్బారావు మా ట్లాడుతూ.. చిన్నపిల్లల్లో శ్వాసకోశ సంబంధిత వ్యాధులు, క్షయ వ్యాధిని ముందుగానే గుర్తించి చికిత్స అందించాలని తెలిపారు. కార్యక్రమంలో వైద్యులు పృథ్వీరాజ్నాయక్, వీరబాబు, రామ్మోహన్నాయక్, ఉద్యోగులు శైలజ, వి.వెంకటేశ్వర్లు, శరత్, సందీప్, లంకా కొండయ్య, సుబ్బలక్ష్మి, శ్రీనివాస్ పాల్గొన్నారు. జనరల్ ఆస్పత్రిలో పరిశీలించిన డీఎంహెచ్ఓ ఖమ్మంవైద్యవిభాగం: ఖమ్మం ప్రభుత్వ జనర ల్ ఆస్పత్రిని బుధవారం జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి రామారావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన ఎన్ఆర్సీ (పోషకాహార పునరుద్ధరణ కేంద్రం), ఎంసీహెచ్ వార్డులను పరిశీలించి చికిత్స పొందుతున్న పిల్లలు, గర్భిణులు, బాలింతలతో మాట్లాడారు. అనంతరం మెడికల్ సూపరింటెండెంట్ ఎం.నరేందర్తో సమావేశమై ఆస్పత్రిలో వైద్య సేవలు, మందుల లభ్యత, పారిశుద్ధ్య వివరాలపై సమీక్షించారు. ఎన్ఆర్సీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సునీత, బయో మెడికల్ ఇంజనీర్ రెడ్యా, ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ జ్యోతి, నర్సింగ్ ఆఫీసర్లు పాల్గొన్నారు. -
రైలు ఢీకొని వ్యక్తి మృతి
చింతకాని: మండలంలోని రామకృష్ణాపురం రైల్వేగేట్ సమీపాన బుధవారం రైలు ఢీకొనడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. చింతకాని గ్రామానికి చెందిన ఇట్టా కనకయ్య (50) పనుల కోసం వెళ్తుండగా ఖమ్మం నుంచి విజయవాడ వైపు వెళ్లే రైలు ఢీకొట్టింది. ఘటనలో ఆయన తల ఛిద్రమై అక్కడికక్కడే మృతి చెందాడు. తొలుత ఆనవాళ్లు తెలియకపోగా, ఆతర్వాత స్థానికులు పరిశీలించి మృతుడిని కనకయ్యగా గుర్తించారు. ఆయన మృతదేహాన్ని అన్నం సేవా ఫౌండేషన్ చైర్మన్ శ్రీనివాసరావు సహకారంతో ఖమ్మం ప్రభుత్వాస్పత్రి మార్చురీకి తరలించినట్లు జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసరావు వెల్లడించారు. ద్విచక్ర వాహనం అదుపు తప్పి... వైరారూరల్: వైరా మండలంలోని స్టేజీ పినపాక సమీపాన బుధవారం ద్విచక్ర వాహనం అదుపుతప్పడంతో ఓ యువకుడు మృతి చెందాడు. తల్లాడ మండలం ముద్దునూరుకు చెందిన మండె నాగరాజు (28), నర్రావుల శ్రీకాంత్ వైరా వచ్చి స్వగ్రామానికి వెళ్తున్నారు. శ్రీకాంత్ వాహనం నడుపుతున్నాడు. స్టేజీ పినపాక సమీపాన బైక్ అదుపుతప్పి పల్టీ కొట్టడంతో నాగరాజుకు తీవ్ర గాయాలు కాగా.. శ్రీకాంత్ ఎడమ చేతికి గాయమైంది. వీరిని 108 వాహనంలో ఖమ్మం ఆస్పపత్రికి తరలిస్తుండగా నాగరాజు మార్గమధ్యలో మృతిచెందాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రోడ్డు ప్రమాదంలో కాంగ్రెస్ నాయకుడు.. కూసుమంచి: మండలంలోని పాలేరు గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఎడవెల్లి రాంరెడ్డి (55) బుధవారం రాత్రి జరిగిన రోడ్డుప్రమాదంలో మృతిచెందారు. ఆయన తన ఇంటి నుంచి ద్విచక్ర వాహనంపై అదే గ్రామంలో మరోచోట ఉంటున్న తండ్రి వద్దకు వెళ్తున్నాడు. నాయకన్గూడెం నుంచి ద్విచక్ర వాహనంపై వస్తున్న యువకులు ఆయన వాహనాన్ని బలంగా ఢీకొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఖమ్మం ఆస్పత్రికి తరలించేలోగా రాంరెడ్డి మృతి చెందారు. కాగా, రాంరెడ్డి మృతిపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. కాంగ్రెస్ పార్టీ కోసం ఆయన నిబద్ధతతో పనిచేశారని, గ్రామపంచాయతీ ఎన్నికల్లో పాలేరు ఏకగ్రీవమయ్యేలా కృషిచేశారని గుర్తు చేశారు. అలాగే, మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు కూడా సంతాపం ప్రకటించారు. లారీ ఢీకొని వ్యక్తి.. సత్తుపల్లిటౌన్: రోడ్డు దాటుతుండగా లారీ ఢీకొనడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. సత్తుపల్లి మండలం కిష్టారం సమీపాన బుధవారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. భద్రాద్రి జిల్లా బూర్గంపాడు మండలం సారపాకకు చెందిన తోట వరప్రసాద్(48) సత్తుపల్లిలో బొగ్గు లారీడ్రైవర్గా పనిచేస్తున్నాడు. కిష్టారం సమీపంలో రోడ్డు దాటుతుండగా సత్తుపల్లి నుంచి ఖమ్మం వైపు వెళ్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రగాయాల పాలైన వరప్రసాద్ అక్కడికక్కడే మృతిచెందాడు. రైలు నుంచి జారిపడి యువకుడికి గాయాలు చింతకాని: చింతకాని రైల్వేస్టేషన్ సమీపాన బుధవారం రైలు నుంచి జారిపడిన యువకుడికి తీవ్రగాయాలయ్యాయి. హైదరాబాద్లో బీటెక్ చదువుతున్న విష్ణువర్దన్రెడ్డి పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు స్వగ్రామమైన పెనుబల్లి మండలం కరాలపాడు వచ్చాడు. తిరిగి హైదరాబాద్ వెళ్లేందుకు ఖమ్మం చేరుకున్న ఆయన అదే మార్గంలో వెళ్తుందని విజయవాడ వైపు వెళ్లే ఈస్ట్కోస్ట్ ఎక్స్ప్రెస్ ఎక్కినట్లు తెలుస్తోంది. కాసేపయ్యాక గుర్తించిన ఆయన దిగే క్రమాన జారి పడి ఉండొచ్చని భావిస్తున్నారు. ఘటనలో విష్ణువర్దన్కు రెండు కాళ్లు, ఎడమ చేయి విరగగా 108 వాహనంలో ఖమ్మంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించినట్లు జీఆర్పీ హెడ్కానిస్టేబుల్ శ్రీనివాసరావు తెలిపారు. -
వాతావరణ ం
జిల్లాలో గురువారం మంచు, చలిగాలుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మధ్యాహ్నం సాధారణ ఉష్ణోగ్రతలే నమోదవుతాయి.కలెక్టర్ పరిశీలన ఖమ్మం సహకారనగర్: జిల్లాలోని మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణను కలెక్టరేట్లోని మానిటరింగ్ సెల్ నుంచి కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి పరిశీలించారు. పోలింగ్ బూత్ల్లో ఓటింగ్ సరళిని పరిశీలించిన ఆయన ఉద్యోగులకు సూచనలు చేశారు. డీఆర్వో పద్మశ్రీ, కలెక్టరేట్ ఏఓ కారుమంచి శ్రీనివాసరావు, సీపీఓ శ్రీనివాస్, ఈడీఎం దుర్గాప్రసాద్, డీపీఓ ఆశాలతతో పాటు రాంబాబు, రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కట్టుదిట్టమైన భద్రత ఖమ్మంక్రైం: జిల్లాలో మూడో విడత గ్రామపంచాయితీ ఎన్నికల సందర్భంగా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటుచేయగా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. పెనుబల్లి మండలం చింతగూడెం, ఏరుగట్ల, లంకపల్లి, కల్లూరు మండలం ఎర్రబోయినపల్లి తదితర పోలింగ్ కేంద్రాలను పోలీసు కమిషనర్ సునీల్దత్ పరిశీలించారు. ఓట్ల లెక్కింపు ముగిసే వరకు పహారా కొనసాగించాలని ఉద్యోగులకు సూచించారు. సీపీ కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్ ఉండగా, ఏన్కూరు, కల్లూరు మండలాల్లో పలు పోలింగ్ కేంద్రాలను అడిషనల్ డీసీపీలు రామానుజం, ప్రసాద్రావు పరిశీలించారు. వార్డు సభ్యుడిగా తల్లిపై తనయుడి విజయం ఇల్లెందురూరల్: ఇల్లెందు మండలంలోని సీఎస్పీ బస్తీ గ్రామపంచాయతీ ఆరో వార్డులో కాంగ్రెస్ మద్దతుతో తల్లి భూక్యా సక్కుబాయి, బీఆర్ఎస్ మద్దతుతో కుమారుడు భూక్యా రవికుమార్ పోటీ పడ్డారు. బుధవారం జరిగిన ఎన్నికల్లో రవికుమార్ తన తల్లిపై 9ఓట్ల మెజార్టీతో గెలిచాడు. ఇక పోలారం జీపీ రెండో వార్డులో కాంగ్రెస్ బలపర్చిన బానోత్ రమాదేవి ఒకే ఓటు తేడాతో విజయం సాధించింది. -
ఎన్ని పనులున్నా..
ఎన్ని పనులు ఉన్నా బాధ్యతాయుతంగా నా ఓటు హక్కును వినియోగించుకుంటా. ప్రస్తుతం ఫార్మసీ విభాగంలో స్థిరపడి పుణేలో ఉపాధి పొందుతున్నాను. పోలింగ్లో పాల్గొనేందుకు కుటుంబ సమేతంగా వచ్చాను. – మచ్చ వీరస్వామి, పూబెల్లి ఉపాధి కోసం హైదరాబాద్లో ఉంటున్నాను. పల్లెల బాగుకు పంచాయతీ ఎన్నికల్లో సమర్థులే పీఠమెక్కాలి. పనిఒత్తిడి ఉన్నా బాధ్యత గుర్తించి ఓటువేసేందుకు మా వూరు వచ్చాను. – సోలెం ముక్తేశ్వరరావు, బొజ్జాయిగూడెం -
వైద్యం వికటించి మృతి చెందాడని ఆందోళన
వైరారూరల్: గ్రామీణ వైద్యుడు చేసిన వైద్యం వికటించడంతోనే విద్యార్థి మృతి చెందాడంటూ ఆయన కుటుంబీకులు ఆందోళనకు దిగారు. మండలంలోని గొల్లపూడికి చెందిన పసుపులేటి వెంకటరామయ్య కుమారుడు గోపి (19) మధిర మండలం కృష్ణాపురంలోని బీసీ వెల్ఫేర్ గురుకులంలో ఇంటర్ చదువుతున్నాడు. రెండు రోజుల కిందట ఇంటికి వచ్చిన గోపి బుధవారం చేతి వేళ్లపై గాట్లు ఉండడంతో తల్లిదండ్రులకు చెప్పడంతో వారు గ్రామీణ వైద్యుడు రాజారావు వద్దకు తీసుకెళ్లారు. దీంతో ఆయన ఇంజక్షన్ చేసి సైలెన్ పెట్టాక గోపికి రియాక్షన్ కావడంతో వైరాలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లగా వైద్యులు సీపీఆర్ చేశారు. ఆయనకు ప్రాణం ఉన్నట్లు గ్రహించిన వైద్యుడు చికిత్స చేస్తుండగానే గోపి మృతి చెందాడు. కాగా, గ్రామీణ వైద్యుడి వైద్యం వికటించడంతోనే తమ కుమారుడు చనిపోయాడని గోపి కుటుబీకులు ఆయన మృతదేహంతో ఆర్ఎంపీ రాజారావు ఇంటి ఎదుట ఆందోళన నిర్వహించారు. ఆపై పోలీసులకు ఫిర్యాదు చేయగా, దర్యాప్తు చేయనున్నట్లు ఎస్ఐ పుష్పాల రామారావు తెలిపారు. -
ఓటు వేసేందుకు వచ్చా
నేను యూఎస్లోని మిచ్గన్ లారెన్స్ టెక్నాలజీ యూనివర్సిటీలో ఎంఎస్ చదుతున్నా. నెల రోజుల ముందుగా ఐ–94 పర్మిషన్ తీసుకుని, విమాన చార్జీలు రూ.1.90 లక్షలు చెల్లించి మంగళవారం రాత్రి స్వగ్రామం వచ్చాను. నా ఓటు హక్కు వినియోగించుకున్నాను. – ఆళ్ల సాయి తరుణ్, గుండెపుడి నేనుహైదరాబాద్లో ప్రైవేటు జా బ్ చేస్తున్నా. నాభర్తఅఖిల్సాఫ్ట్వే ర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ఓ టు వెంగన్నపాలెంలోఉండటం తో మంగళవారం రాత్రివచ్చేశాం. ఓటు హక్కు వినియోగం అందరూ బాధ్యతగా భా వించాలి. – ముత్యాల హరిచందన, వెంగన్నపాలెం -
బారులుదీరిన ఓటర్లు
సాక్షిప్రతినిధి, ఖమ్మం: మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో 88.84 శాతం పోలింగ్ నమోదైంది. జిల్లాలోని ఏన్కూరు, కల్లూరు, పెనుబల్లి, సత్తుపల్లి, సింగరేణి, తల్లాడ, వేంసూరు మండలాల్లో ఎన్నికలు జరిగాయి. ఏకగ్రీవాలు, నామినేషన్లు దాఖలు కానివి మినహా 168గ్రామపంచాయతీల్లో పోలింగ్ నిర్వహించారు. కల్లూరు మండలం చెన్నూరు, పెనుబల్లి మండలం సూరయ్య బంజర తండాలో స్వల్ప ఉద్రిక్తతలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7గంటలకు పోలింగ్ మొదలుకాగా, పోలింగ్బూత్ల వద్ద ఓటర్లు బారులు దీరారు. వృద్ధులు, మహిళలు, యువత అధికంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. అయితే, మొదటి విడత ఎన్నికల్లో 90.08శాతం, రెండో విడతకు వచ్చే సరికి మరింత పెరిగి 91.21 శాతం పోలింగ్ నమోదైంది. కానీ మూడో విడతలో మొదటి విడత కంటే తగ్గడం గమనార్హం. ఉదయం నుంచే.. జిల్లాలోని ఏడు మండలాల్లో మూడో విడతగా ఎన్నికలు జరగ్గా.. ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు క్యూ కట్టారు. వృద్ధులు, మహిళలు, యువత ఉత్సాహంతో పాల్గొన్నారు. వృద్ధులు, దివ్యాంగులను వీల్చైర్లతోపాటు ఎత్తుకుని పోలింగ్ కేంద్రాల వద్దకు తీసుకొచ్చారు. పలుచోట్ల ఎన్నారైలు, వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన వారు కూడా వచ్చి ఓట్లు వేశారు. ఏన్కూరు మండలం కొనాయిపాలెంలో ఒకే వార్డుకు ఎన్నికలు జరగగా, ఓటర్ల కోసం సిబ్బంది ఎదురు చూడాల్సి వచ్చింది. కాగా, మొత్తం ఓటర్లు 2,43,983 మందికి గాను పురుషులు 1,05,668 మంది, మహిళలు 1,11,095 మంది, ఇతరులు ఇద్దరు ఉన్నారు. వీరిలో మొత్తంగా 2,16,765 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన మానిటరింగ్ సెల్ నుంచి ఓటింగ్ సరళిని పర్యవక్షించిన కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, తల్లాడ మండలం పినపాక గ్రామంలో జెడ్పీహెచ్ఎస్లోనూ పోలింగ్ను పరిశీలించారు. పలుచోట్ల స్వల్ప ఉద్రిక్తతలు పోలింగ్ సందర్భంగా పలు గ్రామాల్లో స్వల్ప ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. కల్లూరు మండలం చెన్నూరులో బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. పోలింగ్ కేంద్రానికి సమీపాన ఇంటర్నెట్ సెంటర్లో రూ.70 వేల నగదు దొరకడంతో వాటిని నెట్సెంటర్ యజమానివి చెప్పారు. కానీ బీఆర్ఎస్, కాంగ్రెస్ వర్గీయుల నగదు అని చెబుతూ కొందరు అనుమానాలు వ్యక్తం చేశారు. ఇక పెనుబల్లి మండలం సూరయ్య బంజరతండాలో ఇద్దరు ఏజెంట్ల మధ్య వాగ్వాదం జరిగింది. ఇరుపక్షాల వారు ఒకరిని ఒకరు నెట్టుకుంటూ ఘర్షణకు దిగడంతో పోలీసులు చెదరగొట్టారు. బందోబస్తు ఎన్నికలు జరిగిన గ్రామపంచాయతీల వద్ద పోలీసులు భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. 318 క్రిటికల్ పోలింగ్ కేంద్రాల వద్ద సీసీ కెమెరాలతోపాటు వెబ్కాస్టింగ్ ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్దే కాక గ్రామాల్లోనూ పహారా నిర్వహించారు. ఇక 63 కేంద్రాల వద్ద అదనంగా సిబ్బందిని నియమించారు. చేశారు. పెనుబల్లి మండలం చింతగూడెం, ఏరుగట్ల, లంకపల్లి, కల్లూరు మండలం ఎర్రబోయినపల్లిల్లోని పోలింగ్ కేంద్రాలను పోలీస్ కమిషనర్ సునీల్దత్ తనిఖీ చేశారు.మొదటిసారి ఓటు వేసిన యువతి -
పథకాల అమలులో అగ్రభాగాన వ్యవసాయ శాఖ
ఖమ్మంవ్యవసాయం: ప్రభుత్వ పథకాల అమలులో రాష్ట్రంలోనే జిల్లా వ్యవసాయ శాఖ ముందంజలో నిలిచింది. రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రతీ నెల ర్యాంకులు కేటాయిస్తుండగా ఖమ్మం జిల్లా అగ్రభాగాన నిలిచింది. మొత్తం 12 అంశాలకు గాను.. ఒక్కో అంశానికి పది మార్కుల చొప్పున 120 పాయింట్లకు జిల్లాకు 97.67 పాయింట్లు దక్కాయి. పంట నమోదు, పీఎం కిసాన్ ఈకేవైసీ, రైతుబీమా అమలు, రికార్డుల నిర్వహణ, యూరియా, ఎరువుల పరిశీలన, రైతునేస్తం, సాయిల్ హెల్త్కార్డ్స్ తదితర అంశాల ప్రామాణికంగా ఈ పాయింట్లు కేటాయించారు. జిల్లా వ్యవసాయాధికారి ధనసరి పుల్లయ్య ఆధ్వర్యాన ఉద్యోగులు బుధవారం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టిని కలవగా అభినందించారు. -
ఆనందంగా ఉంది..
నేను లండన్లో వ్యాపారం చేస్తున్నా. మాది సత్తుపల్లి మండలం కొత్తూరు. పంచాయతీ ఎన్నికలని తెలియడంతో మావూరు వచ్చేశాను. పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేయటం చాలా ఆనందంగా ఉంది. – పి.రామకృష్ణారెడ్డి, లండన్నేను అమెరికాలోని కాలిఫోర్నియలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పని చేస్తున్నాను. ఓటు హక్కు వినియోగంచుకునేందుకు ఎల్లలు దాటి వచ్చా. చాలా సంతోషంగా ఉంది. మాది సత్తుపల్లి మండలం కొత్తూరు గ్రామం. –ఎన్.కృష్ణారావు, అమెరికా మా ఊరు సత్తుపల్లి మండలం గౌరిగూడెం. ఢిల్లీలో ఫోరెన్సిక్ సైన్స్ గ్రూప్లో గ్రాడ్యుయేషన్ చేస్తున్నాను. ఓటేసేందుకు ఇంటికి వచ్చా. ఓటుతో నిజాయతీగా పని చేసే నాయకుడినే ఎన్నుకోవాలి. – ఎస్.సాయిమనోహర్, ఢిల్లీ -
ఎంపీ పార్థసారధిరెడ్డి స్వగ్రామంలో బీఆర్ఎస్సే..
వేంసూరు: హెటిరో డ్రగ్స్ అధినేత, రాజ్యసభ సభ్యుడైన బండి పార్థసారధిరెడ్డి స్వగ్రామం వేంసూ రు మండలం కందుకూరులో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి విజయం సాధించాడు. ఈ గ్రామ సర్పంచ్గా బీఆర్ఎస్ బలపర్చిన మందపాటి వెంకటరెడ్డి 802 ఓట్ల మెజార్టీతో సమీప అభ్యర్థిపై గెలుపొందారు. వేంసూరు మండలంలోనే అత్యధిక మె జార్టీ ఈ గ్రామంలోనే నమోదు కావడం విశేషం. చెన్నూరులో రూ.90 వేల నగదు స్వాధీనం కల్లూరు/కల్లూరురూరల్: కల్లూరు మండలం చెన్నూరులో గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా స్క్వాడ్ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఒక నెట్ సెంటర్లో రూ.90 వేల నగదు లభ్యమైంది. ఈ డబ్బులు ఓటర్లకు పంచేందుకే పెట్టారని కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు పరస్పరం ఆరోపించారు. దీంతో గందరగోళం ఏర్పడి ఇరు పార్టీల నాయకుల మధ్య తోపులాట జరిగింది. ఈ మేరకు అధికారులు నెట్సెంటర్ యజమానిని అదుపులోకి తీసుకున్నారు. -
మేము ఓట్లు వెయ్యం.. పంచాయతీ ఎన్నికలను బహిష్కరించిన గ్రామస్తులు
సాక్షి, ఖమ్మం జిల్లా: తుదివిడత పల్లె పోరు నేడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతోంది. ఈ మూడోవిడత పంచాయతీ ఎన్నికలతో రాష్ట్రంలో పల్లెపోరు ముగియనుంది. అయితే ఓ గ్రామ పంచాయతీలో మాత్రం ఎన్నికలు జరగడం లేదు. ఎందుకంటే గ్రామంలో కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని వారు కోరుతున్నారు. రహదారులు, తాగునీరు, విద్యుత్ వంటి అవసరాలు అందించాలని డిమాండ్ చేస్తున్నారు.ఖమ్మం జిల్లాలోని ఏన్కూరు మండల పరిధిలోని కొత్త మేడేపల్లి గ్రామ పంచాయతీ ఎన్నికలను గ్రామస్తులు బహిష్కరించారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా ఈ గ్రామ ప్రజలు ఓటింగ్ను బహిష్కరించారు. తమ గ్రామ సమస్యలు పరిష్కారం చేస్తామని స్పష్టమైన హామీ ఇస్తేనే ఓట్లు వేస్తామంటున్నారు. గ్రామంలో కనీస మౌలిక సదుపాయాలను కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఓట్లు అడగడానికి మాత్రమే మేము రాజకీయ నాయకులకు గుర్తుకు వస్తాం లేకపోతే మేము ఎవరికీ కనపడం అంటూ గ్రామ ప్రజలు మండిపడుతున్నారు. -
154 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్
●ఓ వ్యాపారి, ఇద్దరు డ్రైవర్లపై కేసు రఘునాథపాలెం: ప్రజాపంపిణీ వ్యవస్థకు చెందిన బియ్యాన్ని అక్రమంగా తరలించే ప్రయత్నాన్ని రఘునాథపాలెం పోలీసులు అడ్డుకున్నారు. ఖమ్మం అర్బన్ సివి ల్ సప్లయీస్ డీటీ మెచ్చు వెంకటేశ్వర్లు కథనం ప్రకారం.. రఘునాథపాలం మండలం రేగులచలకకు చెంది న బియ్యం వ్యాపారి సీహెచ్ నాగేశ్వరరావు రేషన్ బియ్యాన్ని బొలేరో వాహనాల్లో తీసుకొచ్చి సోమవారం అర్ధరాత్రి మరో లారీలోకి లోడ్ చేస్తుండగా రఘునాథపాలెం పోలీసులు తనిఖీ చేశారు. 352 ప్లాస్టిక్ సంచుల్లోని 153.50 క్వింటాళ్ల బియ్యాన్ని ఎంఎల్ఎస్ పాయింట్కు అప్పగించినట్లు డీటీ తెలిపారు. ఈ ఘటనలో వ్యాపారి నాగేశ్వరరావుతో పాటు వాహనాల డ్రైవర్లు వెంకటేశ్వర్లు, పవన్కుమార్పై కేసునమోదు చేయడమే కాక మూడు బొలేరో వాహనాలు, ఒక లారీని పోలీస్స్టేషన్కు తరలించినట్లు వెల్లడించారు. లబ్ధిదారుల నుంచి తక్కువ ధరతో కొనుగోలు చేసి అధిక ధరకు విక్రయిస్తున్నట్లు వ్యాపారి నాగేశ్వరరావు ఒప్పుకున్నాడని డీటీ వెల్లడించారు. ఇసుక లారీ సీజ్ అశ్వారావుపేటరూరల్: అనుమతి లేకుండా ఇసుక తరలిస్తున్న లారీని మంగళవారం పోలీసులు సీజ్ చేశారు. ఏపీలోని కొవ్వూరు నుంచి ఖమ్మం జిల్లా సత్తుపల్లికి ఇసుక తరలిస్తున్న లారీని అశ్వారావుపేటలో తనిఖీ చేయగా అనుమతి లేదని తేలింది. దీంతో లారీసీజ్ చేయడంతో పాటు సత్తుపల్లిలోని ఎన్టీఆర్ కాలనీకి చెందిన డ్రైవర్ మాదు గౌతమ్, యజమాని ఎస్డీ ఫిర్దోష్పై కేసు నమో దు చేసినట్లు ఎస్ఐ యయాతి రాజు వెల్లడించారు. ద్విచక్రవాహనం అదుపు తప్పి యువకుడు మృతి ఖమ్మంరూరల్: ద్విచక్రవాహనం అదుపుతప్పడంతో కింద పడిన యువకుడు తీవ్రగాయాలతో మృతి చెందాడు. హనుమకొండలోని ద్వారకాసాయి కాలనీకి చెందిన బండి పూర్ణచందర్(రిజర్వ్ ఇన్స్పెక్టర్) కుమారుడైన హర్షిత్చంద్ర తన స్నేహితుడైన పూదారి మణికంఠతో కలిసి హైదరాబాద్ నుంచి అరకుకు ద్విచక్రవాహనంపై మంగళవారం వెళ్తున్నాడు. ఖమ్మం రూరల్ మండలం పొన్నేకల్లోని మూలమలుపు వద్ద గేదె అడ్డు రావడంతో తప్పించే క్రమంలో ద్విచక్రవాహనం అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న రాళ్లను ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రగాయాల పాలైన హర్షిత్చంద్ర అక్కడికక్కడే మృతి చెందాడు. వెనకాల కూర్చున్న మణికంఠకు గాయాలయ్యాయి. ఘటనపై హర్షిత్ తండ్రి పూర్ణచందర్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు సీఐ ముష్క రాజు తెలిపారు. దిమ్మె పడి వృద్ధురాలు .. సత్తుపల్లిటౌన్: మనవరాలి వద్దకు వచ్చిన ఓ వృద్ధురాలు ప్రమాదవశాత్తు మృతి చెందింది. ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా చనుబండ గ్రామానికి చెందిన షేక్ షకీనాబీ ఆదివారం తన మనమరాలిని చూసేందుకు సత్తుపల్లిలోని వెంగళరావునగర్ వచ్చింది. సోమవారం రాత్రి మనమరాలి ఇంటి సమీపాన ఒక కార్ రివర్స్ చేస్తుండగా ఇంటి గేట్ దిమ్మెను ఢీకొట్టింది. ఆ దిమ్మె వెనకాల షేక్ షకీనాబీ కూర్చొని ఉండగా ఆమైపె కూలిన భాగం పడడంతో తీవ్రగాయాలయ్యాయి. దీంతో విజయవాడ తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతిచెందింది. ఘటనపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
నేడు మంత్రి పొంగులేటి పర్యటన
ఖమ్మంమయూరిసెంటర్: రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బుధవారం కూసుమంచి మండలంలో పర్యటించనున్నారు. పాలేరు నియోజకవర్గంలోని నాలుగు మండలాల నుంచి ఇటీవల ఎన్నికై న సర్పంచ్లు, ఉపసర్పంచ్లు, వార్డు సభ్యులతో కూసుమంచిలోని క్యాంపు కార్యాలయంలో ఆయన సమావేశమవుతారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ తరఫున ఎన్నికై న వారు హాజరుకావాలని మంత్రి క్యాంపు కార్యాలయ ఇన్చార్జ్ తుంబూరు దయాకర్రెడ్డి ఒక ప్రకటనలో కోరారు. తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో 1,023 కి.మీ. మేర రోడ్లు ఖమ్మంమయూరిసెంటర్: తెలంగాణలోని వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన(పీఎంజీఎస్వై), ఆర్సీపీఎల్డబ్ల్యూఈఏ పథకాల ద్వారా 1,023 కి.మీ. మేర రోడ్ల నిర్మాణం చేపట్టినట్లు కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ సహాయ మంత్రి కమలేష్ పాశ్వాన్ వెల్లడించారు. పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా మంగళవారం ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి ఈ విషయమై ప్రశ్నించారు. దీనికి మంత్రి కమలేష్ సమాధానం ఇస్తూ.. ఆర్సీపీఎల్డబ్ల్యూఈఏ కింద తెలంగాణకు 146 రహదారి పనులు, 112 వంతెనలు మంజూరు చేసినట్లు వెల్లడించారు. మొత్తం 1,023 కి.మీ. నిడివికి గాను రూ.681.15 కోట్ల వ్యయంతో ఇప్పటివరకు 478 కి.మీ. మేర 39 రహదారులు, 50 వంతెనల నిర్మాణం పూర్తయిందని వెల్లడించారు. మిగిలిన పనులను 2026 మార్చి నాటికి పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకుని తెలిపారు. ఇక 2016లో ప్రారంభించిన ఆర్సీపీఎల్డబ్ల్యూఈఏ పథకం ద్వారా తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల జిల్లాల్లో రహదారి అనుసంధాన పనులు కొనసాగుతున్నాయని కేంద్ర మంత్రి వెల్లడించారు. ‘మీ డబ్బు, మీ హక్కు’పై ఈనెల 20న శిబిరం ఖమ్మంవ్యవసాయం: కేంద్ర ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలోని ఆర్థిక సేవల విభాగం ఆదేశాల మేరకు ‘మీ డబ్బు, మీ హక్కు‘ అంశంపై ఈనెల 20న సదస్సు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. క్లెయిమ్ చేసుకోని ఆర్థికపరమైన ఆస్తుల సమస్యను పరిష్కరించేందుకు ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఇందులో భాగంగా 20వ తేదీన ఉదయం 11నుంచి సాయంత్రం 4గంటల వరకు కలెక్టరేట్లో జరిగే శిబిరాన్ని క్లెయిమ్ చేసుకోని ఆస్తుల వాస్తవ యజమానులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఓ ప్రకటనలో సూచించారు. ఉపాధి కోర్సుల్లో ఉచిత శిక్షణ ఖమ్మంఅర్బన్: ఖమ్మం టేకులపల్లిలోని జిల్లా మహిళా ప్రాంగణంలో వివిధ ఉపాధి కోర్సుల్లో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు ప్రాంగణం మేనేజర్ వేల్పుల విజేత తెలిపారు. ఈ మేరకు 18 – 35 ఏళ్ల వయస్సు కలిగిన మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని, శిక్షణ తర్వాత మెరుగైన ఉపాధి అవకాశాలు లభిస్తాయని వెల్లడించారు. పదో తరగతి అర్హతతో రెండు నెలల పాటు కమ్యూనిటీ హెల్త్ వర్కర్(సీహెచ్డబ్ల్యూ), కంప్యూటర్ కోర్సులు, ఎనిమిదో తరగతి అర్హతతో టైలరింగ్, బ్యూటీషియన్ శిక్షణ ఉంటుందని తెలిపారు. ఆసక్తి ఉన్నవారు ఈనెల 20వ తేదీలోగా మహిళా ప్రాంగణంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కొనసాగిన రాష్ట్ర బృందం పరిశీలన ఖమ్మం సహకారనగర్: ‘స్వచ్ఛ’ ఏవం హరిత విద్యాలయ రేటింగ్స్లో జిల్లా స్థాయికి ఎంపికై న ఎనిమిది పాఠశాలలను సోమవారం పరిశీలించిన రాష్ట్ర బృందం మంగళవారం తిరుమలాయపాలెం, రఘునాథపాలెం, ఖమ్మం అర్బన్ మండలాల్లో పర్యటించింది. ఆయా మండలాల్లోని ప్రాథమిక, ఉన్నత పాఠశాలలను పరిశీలించి ఎకో క్లబ్ కార్యక్రమాలు, పచ్చదనం పరిశుభ్రత, తాగునీరు, టాయిలెట్ల నిర్వహణ, విద్యార్థుల్లో పరిసరాలపై అవగాహన తదితర అంశాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా రాష్ట్ర పరిశీలకుడు సైదులుతో పాటు బాజోజు ప్రవీణ్ కుమార్, కొత్తగూడెం ప్లానింగ్ కోఆర్డినేటర్ సతీష్ కుమార్, స్వరూప్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
వాతావరణ ం
జిల్లాలో బుధవారం మధ్యాహ్నం ఉష్ణోగ్రత కాస్త పెరిగే అవకాశముంది. రాత్రి మాత్రం చలిగాలుల తీవ్రత ఉంటుంది.కేన్సర్ బాధితులకు ఊరట ‘ఆరోగ్య మహిళ’ ద్వారా కేన్సర్ బాధితులను గుర్తిస్తూ, జిల్లా ఆస్పత్రిలో కీమోథెరపీ చేస్తుండడంతో దూరాభారం తప్పుతోంది.బుధవారం శ్రీ 17 శ్రీ డిసెంబర్ శ్రీ 2025 కారేపల్లిలో పోలింగ్ సామగ్రి తీసుకునేందుకు వచ్చిన ఉద్యోగులు (ఇన్ సెట్) బ్యాలెట్ బాక్స్, సామగ్రితో కేంద్రానికి వెళ్తున్న ఉద్యోగులుబరిలో 3,854మంది మూడో విడతలో 191 గ్రామపంచాయతీలు, 1,742 వార్డులకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈనెల 3 నుంచి 5వ తేదీ వరకు సర్పంచ్ స్థానాలకు 1,025, వార్డులకు 4,085 మంది నామినేషన్లు దాఖలు చేశారు. ఆపై 21 గ్రామపంచాయతీల వార్డులతోపాటు సర్పంచ్ స్థానాలు, ఒక సర్పంచ్ స్థానం ఏకగ్రీవం కాగా.. ఏన్కూరు మండలం నూకాలంపాడు గ్రామపంచాయతీ సర్పంచ్ స్థానానికి నామినేషన్లు దాఖలు కాలేదు. ఇక్కడ ఎస్టీ ఓటర్లు లేకపోవడంతో ఈ పరిస్థితి ఎదురైంది. మొత్తంగా 22 పంచాయతీలు పోగా 168 జీపీల్లో బుధవారం ఎన్నికలు జరగనున్నాయి. అలాగే, 9 వార్డులకు నామినేషన్లు దాఖలు కాకపోగా, 361 ఏకగ్రీవమయ్యాయి. ఇవి మినహా 1,372 వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తారు. సర్పంచ్ స్థానాలకు 485 మంది, వార్డులకు 3,369 మంది బరిలో ఉన్నారు. పోలింగ్కు సర్వం సిద్ధం జిల్లాలో ఏడు మండలాల్లోని గ్రామపంచాయతీల్లో పోలింగ్కు యంత్రాంగం సిద్ధమైంది. క్రిటికల్ పోలింగ్ కేంద్రాలను గుర్తించి అక్కడ వెబ్కాస్టింగ్కు ఏర్పాట్లుచేయడమే కాక మైక్రో అబ్జర్వర్లను కేటాయించారు. 1,564 పోలింగ్ స్టేషన్లలో ఎన్నికలను 1,742 బృందాలు పర్యవేక్షిస్తాయి. కేంద్రాల్లో 2,091మంది పీఓలు, 2,493మంది ఓపీఓలు విధులు నిర్వర్తించనున్నారు. సామగ్రి పంపిణీ తుది విడత ఎన్నికల్లో పాల్గొనే ఉద్యోగులకు మండల స్థాయి కేంద్రాల్లో మంగళవారం సామగ్రి పంపిణీ చేశారు. బ్యాలెట్ బాక్స్లు, బ్యాలెట్ పత్రాలను, ఇతర సామగ్రితో ఉద్యోగులు వాహనాల్లో పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. కారేపల్లి జూనియర్ కాలేజీలోని డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని కలెక్టర్ అనుదీప్, అదనపు కలెక్టర్ శ్రీజ, జెడ్పీ సీఈఓ దీక్షారైనా, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రాజేశ్వరి పరిశీలించగా, సత్తుపల్లిలో డిప్యూటీ సీఈఓ నాగపద్మజ పరిశీలించారు. కౌంటింగ్కు ఏర్పాట్లు గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ అనంతరం మధ్యాహ్నం 2గంటల నుంచి ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. పోలింగ్ ముగియగానే లెక్కింపు కేంద్రంలో ఓట్ల సంఖ్య ఆధారంగా టేబుళ్లు ఏర్పాటుచేస్తారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్ పత్రాలు లెక్కించాక, వార్డు సభ్యుల ఓట్లు, చివరగా సర్పంచ్ ఓట్ల లెక్కింపు చేపడుతారు. కట్టుదిట్టంగా భద్రత ఎన్నికల సందర్భంగా అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భద్రతా ఏర్పాట్లు చేశారు. మొత్తం 318 క్రిటికల్ పోలింగ్ స్టేషన్ల నుంచి వెబ్కాస్టింగ్ ద్వారా పర్యవేక్షించనున్నారు. ఆయా కేంద్రాల్లో 23 మంది మైక్రో అబ్జర్వర్లతో పాటు ఎనిమిది మంది ఏసీపీలు, 20మంది సీఐలు, 87 మంది ఎస్సైలు, 1,700 మంది పోలీసు సిబ్బందిని బందోబస్తు విధులకు కేటాయించారు.ఫైనల్ ఫైట్.. నేడే !ఏడు మండలాల్లోని జీపీల్లో పోలింగ్ గ్రామపంచాయతీ ఎన్నికలు తుదిదశకు చేరాయి. చివరి విడతగా బుధవారం ఏన్కూరు, కల్లూరు, పెనుబల్లి, సత్తుపల్లి, తల్లాడ, వేంసూరు, సింగరేణి మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. మండల కేంద్రాల్లోని డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల వద్ద మంగళవారం పోలింగ్ సామగ్రిని తీసుకున్న ఉద్యోగులు పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. ఉదయం 7నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ నిర్వహించాక, మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపడుతూ ఫలితాలను ప్రకటిస్తారు. ఆ తర్వాత ఉప సర్పంచ్ ఎన్నిక ఉంటుంది. – సాక్షి ప్రతినిధి, ఖమ్మంమండలం జీపీలు వార్డులు పురుషులు మహిళలు ఇతరులతో కలిపి మొత్తం ఏన్కూరు 17 123 9,008 9,746 18,754 కల్లూరు 21 160 16,045 16,774 32,819 పెనుబల్లి 30 247 19,704 20,819 40,523 సత్తుపల్లి 18 168 15,644 16,832 32,478 సింగరేణి 35 255 20,429 21,365 41,796 తల్లాడ 24 205 20,655 21,728 42,385 వేంసూరు 23 214 17,415 18,116 35,531మొత్తం 168 1,372 1,18,900 1,25,380 2,44,286 -
గ్రామాల్లో తిరిగితేనే సమస్యలు తెలుస్తాయి..
కొణిజర్ల: విద్యుత్ ఉద్యోగులు కార్యాలయాలకే పరిమితం కాకుండా క్షేత్ర స్థాయిలో పర్యటిస్తే సమస్యలు తెలుస్తాయని విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక(సీజీఆర్ఎఫ్) చైర్పర్సన్ ఎన్వీ వేణుగోపాలచారి అన్నారు. తనికెళ్లలోని రైతువేదికలో మంగళవారం చింతకాని, కొణిజర్ల మండలాల విద్యుత్ వినియోగదారుల సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సిబ్బంది గ్రామాలకు రాకపోవడంతో ప్రతీ పనికి ప్రైవేట్ సిబ్బందిపై ఆధారపడాల్సి వస్తోందని పలువురు ఫిర్యాదు చేశారు. తనికెళ్ల ఎస్సీకాలనీలో పూర్వ కాలం నాటి ఇనుప స్తంభాలను మార్పించాలని, ఉప్పలచలకలో విద్యుత్ తీగలు సరిచేయాలని రైతు దరియాసింగ్ తదితరులు కోరారు. అంతేకాక తన ఎద్దు మూడేళ్ల క్రితం షాక్తో చనిపోతే ఇంతవరకు పరిహారానికి ప్రతిపాదనలు పంపలేదని మరో రైతు ఫిర్యాదు చేశాడు. ఈ సందర్భంగా చైర్పర్సన్ స్పందిస్తూ వినియోగదారుల సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందించాలని సూచించారు. ట్రాన్స్ఫార్మర్లను చేతికందేలా కాకుండా భూమి నుంచి 6 – 7 అడుగుల ఎత్తు దిమ్మెలపైనే ఏర్పాటు చేయాలని తెలిపారు. సమావేశంలో సీజీఆర్ఎఫ్ సభ్యులు కె.రమేశ్, ఎన్.దేవేందర్, ఎం.రామారావు, విద్యుత్ ఉద్యోగులు పాల్గొన్నారు. సీజీఆర్ఎఫ్ చైర్పర్సన్ వేణుగోపాలాచారి -
‘గూగుల్’ పోటీల్లో సత్తా చాటిన తెల్లపాలెం యువకుడు
ఎర్రుపాలెం: మండలంలోని తెల్లపాలెం గ్రామానికి చెందిన వేమిరెడ్డి కార్తీక్రెడ్డి గూగుల్ సంస్థ నిర్వహించిన ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ పోటీల్లో పాల్గొని ద్వితీయ బహుమతిగా రూ.6.50 లక్షల నగదు గెలుచుకున్నాడు. కార్తీక్రెడ్డి ఇంటర్ వరకు ఖమ్మంలో చదివాక భువనేశ్వర్లో ఇంజనీరింగ్ పూర్తిచేసి క్యాంపస్ ఇంటర్వ్యూల్లో రూ.18 లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగం సాధించాడు. ఏడాదిపాటు ఉద్యోగం చేశా క అమెరికా వెళ్లి ఎంస్ పూర్తిచేసిన ఆయన వరల్డ్ వైడ్ కేన్సర్ రీసెర్చ్ టీంలో సభ్యుడిగా కొనసాగుతున్నాడు. తాజాగా గూగుల్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఏఐ అంశంపై నిర్వహించిన పోటీల్లో లక్షలాది మంది పాల్గొనగా ద్వితీయస్థానంలో నిలిచిన కార్తీక్రెడ్డి నగదు బహుమతి గెలుచుకున్నాడు. కాగా, కార్తీక్ తండ్రి భాస్కర్రెడ్డి ఏన్కూరు మండలంలో హెల్త్ అసిస్టెంట్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. సొంతమైన రూ.6.50 లక్షల బహుమతి -
కేన్సర్ బాధితులకు ఊరట
ఖమ్మంవైద్యవిభాగం: ఖమ్మం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో కేన్సర్ బాధితులకు వైద్యసేవలు కొంతమేర మెరుగుపడ్డాయి. ఓపీ సేవలతో పాటు రోగనిర్ధారణ, కీమోథెరపీ, ఆలన ద్వారా చికిత్స అందిస్తున్నారు. కేన్సర్ విభాగం లేకపోయినా ఎంఎన్జే సహకారంతో చికిత్స చేస్తూనే మందులు అందజేస్తున్నారు. ప్రస్తుతం కేన్సర్ కేసులు పెరుగుతుండగా, చివరి దశ వరకు గుర్తించకపోవడం పెనుముప్పుగా మారుతోంది. దైనందిన జీవితంలో మారిన అలవాట్లు, ధూమపానం, తంబాకు, గుట్కా తదితర అలవాట్ల మూలంగా కేన్సర్ జిల్లాలో వేగంగా విస్తరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యాన వ్యాధి నిర్ధారణకు కావాల్సిన పరీక్షలు పెద్దాస్పత్రిలో అందుబాటులోకి తీసుకొచ్చారు. 6,222 మంది మహిళలకు పరీక్షలు సాధారణంగా మహిళలు సర్వైకల్, రొమ్ము, చాతి తదితర కేన్సర్ల బారిన పడుతుండగా, మద్యం, ధూ మపానం, తంబాకు, గుట్కా తినేవారు పెద్దపేగు, నోటి కేన్సర్కు గురవుతున్నారు. మహిళలు కేన్సర్ బారినపడకుండా ముందస్తుగా గుర్తించేందుకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యాన ‘ఆరోగ్య మహిళ’ కా ర్యక్రమం నిర్వహిస్తున్నారు. జిల్లాలోని 12 పీహెచ్సీ ల్లో 2023 మార్చి 8న ఈ కార్యక్రమం మొదలైంది. ఇప్పటి వరకు 6,222 మంది మహిళలను పరీక్షించి, కేన్సర్అనుమానితులను జనరల్ ఆస్పత్రిలో ప్రతీ మంగళ, గురువారం నిర్వహించే పరీక్షలకు పంపిస్తున్నారు. తద్వారా ఇప్పటివరకు 216 మంది మహిళలకు కేన్సర్ ఉన్నట్లు గుర్తించారు. వీరిలో బ్రెస్ట్ కేన్సర్ 89, గర్భాశయ(సర్వైకల్) కేన్సర్ 66, థైరాయిడ్ 19 కేసులు ఉండగా, మిగిలినవి ఇతర రకాల కేన్సర్లు ఉన్నాయి. ఇందులో 37 మంది మృతి చెందగా, పలువురు ఎన్ఎంజేలో చికిత్స తీసుకుంటున్నారు. చివరి దశలో ఉన్న వారికి చేయూత వైద్య, ఆరోగ్యశాఖ చేపట్టిన స్క్రీనింగ్ ద్వారా సు మారు 3 వేల వరకు అనుమానిత కేసులు బయటపడ్డాయి. ఇక ప్రైవేట్ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకుంటున్న వారి గణాంకాలు లేవు. ఎక్కువ మంది బ్లడ్ కేన్సర్, కాలేయ,గర్భాశయ, పెద్దపేగు, నోటి, ఊపిరి తిత్తులు, మెదడు, రొమ్ము తదితర కేన్సర్ల బారిన పడుతున్నారు. ఎమ్ఎన్జే ఆస్పత్రిలో చికిత్స తీసుకు న్నా ఫలితం లేక జీవిత చరమాంకానికి చేరిన వారు జనరల్ ఆస్పత్రిలోని పాలియేటివ్ కేర్ సెంటర్ను ఆశ్రయిస్తున్నారు. కొందరు ఇన్పేషంట్లుగా చేరి తే, ఇంకొందరికి ‘ఆలన’ పేరుతో వాహనం ద్వారా మందులు అందిస్తున్నారు. ఈ సెంటర్లో ప్రతీనెల సుమారు 50 మంది వరకు చికిత్స పొందుతున్నారు. కేన్సర్ తీవ్రత ఆధారంగా వైద్యులు కీమోధెరపీ, రేడియోథెరపీ చికిత్స అందిస్తారు. జిల్లా లో ఈ సేవలు అందుబాటులో లేక హైదరాబాద్ వెళ్లాల్సి వచ్చేది. గత ఏడాది పెద్దాస్పత్రిలో ప్రత్యేక వార్డు ఏర్పాటు చేసి సిబ్బందికి శిక్షణ ఇప్పించాక కీమోథెరపీ సేవలు అందుబాటులోకి తెచ్చారు. ఇప్పటికే ప్రతీనెల 50 మంది వరకు కీమోథెరపీ చేయించుకుంటున్నారు. అయితే సేవలపై అందరికీ అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. ఇక ప్రత్యేక కేన్సర్ విభాగాన్ని ఏర్పాటు చేసి రేడియోథెరపీ సేవలు కూడా అందుబాటులోకి తీసుకొస్తే బాధితులకు ఊరట కలగనుంది. పెద్దాస్పత్రిలో ప్రతీ మంగళ, గురువారాల్లో నిర్వహించే ‘ఆరోగ్య మహిళ’ కార్యక్రమం సత్ఫలితాలు ఇస్తోంది. 130 – 150 మంది చికిత్స కోసం వస్తున్నారు. మామోగ్రామ్, పాప్స్మియర్, ఇతర పరీక్షల ద్వారా కేన్సర్ను నిర్ధారిస్తున్నాం. తొలి దశలో గుర్తిస్తే చికిత్సతో మెరుగైన ఫలితాలు ఉంటాయి. ప్రతీఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తూ కేన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి. –డాక్టర్ ప్రేమలత, ‘ఆరోగ్య మహిళ’ నోడల్ ఆఫీసర్ జనరల్ ఆస్పత్రిలో కీమోథెరపీ సేవలు తెలియడంతో ప్రతీనెల 50 మంది వరకు వస్తున్నారు. ఓపీ సేవలకు కూడా వస్తున్నారు. కీమోథెరపీపై నేను, మరికొందరం ప్రత్యేక శిక్షణ తీసుకున్నాం. ఎమ్ఎన్జే నుంచి కీమోథెరపీకి కావాల్సిన మందులు, ఇంజక్షన్లు అందుతుండగా అవసరమైన వారు వినియోగించుకోవాలి. –డాక్టర్ అనూషజిల్లా జనరల్ ఆస్పత్రిలో వైద్యసేవలు -
‘మహాలక్ష్మి’తో మహిళలకు ఆదా
● రాష్ట్రంలోని ప్రతీ జిల్లా నుంచి భద్రగిరికి బస్సులు ● ఆర్టీసీ ఎండీ వై.నాగిరెడ్డి భద్రాచలంటౌన్: రాష్ట్రంలో మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అమలవుతోందని, ఇప్పటివరకు చార్జీల రూపంలో మహిళలకు రూ.850 కోట్లు ఆదా అయ్యాయని ఆర్టీసీ ఎండీ వై.నాగిరెడ్డి వెల్లడించారు. భద్రాచలం ఆర్టీసీ డిపోకు మంగళవారం వచ్చిన ఆయన మెకానిక్ వర్క్షాప్, బస్టాండ్ను పరిశీలించారు. అనంతరం ఎండీ నాగిరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ప్రతీ జిల్లా నుంచి పుణ్యక్షేత్రమైన భద్రాచలానికి బస్సులు నడిచేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా పది వేల బస్సులతో రోజుకు సుమారు 60 లక్షల మంది ప్రయాణికులు గమ్యస్థానాలకు చేరుస్తున్న ఆర్టీసీ గడిచిన రెండేళ్లలో 2,500 కొత్త బస్సులను కొనుగోలు చేసిందని చెప్పారు. వచ్చే రెండేళ్లలో గ్రామీణ ప్రాంతాలకు సైతం ఎలక్ట్రిక్ బస్సులను నడిపిస్తామని తెలిపారు. కాగా, ఆంధ్రప్రదేశ్లో విలీనమైన భద్రాచలం సమీప మండలాలకు బస్సులు నడపడంతో పాటు తెల్లవారుజామున వెంకటాపురం వరకు బస్సు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. అనంతరం ఉద్యోగులు పలు సమస్యలపై వినతిపత్రాలను అందజేసి, ఎండీని సత్కరించారు. ఖమ్మం ఆర్ఎం సరిరాం, డిప్యూటీ ఆర్ఎం మల్లయ్య, డిపో మేనేజర్లు రాజ్యలక్ష్మి, శ్యాంసుందర్, ఉద్యోగులు రవీందర్, రామయ్య, రవీందర్, నాగబాబు పాల్గొన్నారు. -
ఆ తర్వాత మళ్లీ ఇప్పుడే...
● సర్పంచ్లు విద్య, వైద్యరంగాలపై దృష్టి సారించాలి ● ఆత్మీయ సమ్మేళనంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క చింతకాని: 1970లో కాంగ్రెస్ ఏక పార్టీగా ఉన్నప్పు డు, 2004 వైఎస్.రాజశేఖర్రెడ్డి సీఎంగా ఉన్నప్పటి తర్వాత మళ్లీ ఇప్పుడే మధిర నియోజకవర్గంలో అత్యధిక సర్పంచ్ స్థానాలను కాంగ్రెస్ మద్దతుదారులు గెలుచుకున్నారని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క వెల్లడించారు. నియోజకవర్గంలోని 131 స్థానాలకు 90 సర్పంచ్ స్థానాలను గెలవడం అభినందనీయమని తెలిపారు. చింతాని, ముదిగొండ మండలాల జీపీల నుంచి సర్పంచ్లుగా గెలిచిన వారితో చింతకాని మండలం నాగులవంచలో మంగళవారం నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. మధిర నియోజకవర్గంలోనే కాక రాష్ట్రవ్యాప్తంగా మెజార్టీ పంచాయతీలను కాంగ్రెస్ మద్దతుదారులు గెలుస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ బలంగా ఉండడంతోనే స్నేహం ఎరుగని గ్రామాల్లో కూడా ఏకగ్రీవంగా సర్పంచ్లను ఎన్నుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అమలుచేస్తున్న పథకాలతో ప్రజలు పట్టం కడుతున్నారని వెల్లడించారు. ఇందిరమ్మ ఇళ్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, సన్న బియ్యం పంపిణీ, 200 యూనిట్లు ఉచిత విద్యుత్, మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు, రైతు భరోసా, రుణమాఫీతో పాటుట ఇంటిగ్రేటెడ్ రెసిరెన్షియల్ స్కూళ్ల ఏర్పాటు అంశాలతో సత్ఫలితాలు వస్తున్నాయని చెప్పారు. కాగా, నూతన సర్పంచ్ల బాధ్యత ప్రారంభమైందని.. గ్రామపాలనతో పాటు విద్య, వైద్య రంగాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. పరిమిత వనరులను ప్రాధాన్యతా పనులకు ఖర్చు చేస్తూ గ్రామాభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని తెలిపారు. నియోజకవర్గంలోని ప్రతీ గ్రామపంచాయతీ అభివృద్ధికి తాను సహకరిస్తానని భట్టి హామీ ఇచ్చారు. రాగద్వేషాలకు అతీతంగా ప్రజల భాగస్వామ్యంతో గ్రామాన్ని అభివృద్ధి చేసినప్పుడే గుర్తింపు వస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నూతి సత్యనారాయణ, నాయకులు కొండబాల కోటేశ్వరరావు, అంబటి వెంకటేశ్వర్లు, కొమ్మినేని రమేష్బాబు తదితరులు పాల్గొన్నారు. -
నేత్రపర్వంగా గిరి ప్రదక్షిణ
ఖమ్మంగాంధీచౌక్: భక్తజన సందోహం నడుమ ఖమ్మం స్తంభాద్రి గుట్ట చుట్టూ శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి ఉత్సవ విగ్రహాల గిరి ప్రదక్షిణ వైభవంగా సాగింది. స్వామి వారి జన్మనక్షత్రం (స్వాతి నక్షత్రం) సందర్భంగా మంగళవారం సాయంత్రం గిరి ప్రదక్షిణ నిర్వహించారు. పండితుల మంత్రోచ్ఛరణల నడుమ స్వామి వారి ఉత్సవ విగ్రహాలను ఆలయం నుంచి బయటకు తీసుకొచ్చి పల్లకీపైకి చేర్చారు. అనంతరం గుట్ట చుట్టూ నగర పుర వీధుల్లో గిరి ప్రదక్షిణ చేయగా పెద్దసంఖ్యలో భక్తులు స్వామి వారి కీర్తనలు పాడుతూ ముందుకు సాగారు. అనంతరం గుట్టపై నక్షత్ర జ్యోతిని అర్చకులు వెలిగించారు. ఆలయ ఈఓ కొత్తూరు జగన్మోహన్రావు పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తుమ్మల యుగంధర్, దీపక్చౌదరి, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. -
యూరియా.. దారి తప్పకుండా
పంపిణీ కోసం ప్రత్యేక యాప్ ● స్లాట్ బుకింగ్ విధానంలో సరఫరా ● ఈనెల 20వ తేదీ నుంచి అమలుకు కార్యాచరణ ఖమ్మంవ్యవసాయం: యూరియా పంపిణీకి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. పంటలకు అవసరమైన మేరకే రైతులు యూరియా తీసుకెళ్లేలా ప్రస్తుత యాసంగి సీజన్ నుంచి ప్రత్యేక ప్రణాళిక అమలుచేయనుంది. గత ఖరీఫ్ సీజన్లో యూరియా కొరత కారణంగా రైతులు ఇబ్బంది పడడంతో ఈసారి ఎటువంటి లోటుపాట్లు జరగకుండా పంపిణీకి ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. ఈమేరకు ప్రత్యేక యాప్ను రూపొందించి స్లాట్ బుకింగ్ విధానంలో పంట విస్తీర్ణానికి సరిపడా యూరియా సరఫరా చేయనున్నారు. ప్రత్యేక యాప్ రైతులకు యూరియా సక్రమంగా అందించేందుకు ప్రభుత్వం ‘యూరియా బుకింగ్ యాప్’ను అందుబాటులోకి తీసుకొస్తోంది. రైతులు పట్టాదారు పాస్ పుస్తకం వివరాల ఆధారంగా యాప్లో నమోదు చేస్తే భూమి విస్తీర్ణం మేరకు ఎంత ఎరువు అవసరమో తెలుస్తుంది. ఆపై యూరియా కావాలనుకున్నప్పుడు యాప్లో నమోదు చేస్తే రైతు ఫోన్ నంబర్కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ద్వారా స్లాట్ బుక్ చేసుకుని 15 రోజుల వ్యవధిలో మండలంలోని ఎరువుల దుకాణాలు లేదా సహకార సంఘంలో ఎరువులు తీసుకోవచ్చు. ఈక్రమంలో ఏ దుకాణానికి ఎంత ఎరువు కేటాయించారు, ఎంత సరఫరా అయిందో వివరాలను ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తూ అవసరమైన మేర స్టాక్ కేటాయిస్తారు. ఇదే విధానం కౌలు రైతులకు కూడా వర్తించేలా యాప్ను రూపొందించారు. పట్టాదారు రైతు ద్వారా కౌలు రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. రైతులకు ఉన్న భూవిస్తీర్ణం ఆధారంగా మూడు నుంచి నాలుగు సార్లు స్లాట్ బుకింగ్ ద్వారా ఎరువు పొందే వీలుంటుంది. ఇప్పటికే అవగాహన యాసంగి సీజన్ ప్రారంభమైన నేపథ్యాన రైతులకు యూరియా సరఫరా చేసేందుకు ఈనెల 20 నుంచి యాప్ విధానాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ విషయమై వ్యవసాయ శాఖ అధికారులకు అవగాహన కల్పిస్తున్నారు. ఆతర్వాత స్లాట్ బుకింగ్పై రైతులకు వివరించాల్సి ఉంటుంది. జిల్లాకు 82 వేల మెట్రిక్ టన్నులు ప్రస్తుత యాసంగి సీజన్లో జిల్లాలో అన్నీ కలిపి 4,16,609 ఎకరాల్లో పంటలు సాగవుతాయని అధికారులు అంచనా వేశారు. ఇందులో వరి 2,46,988, మొక్కజొన్న 1,59,462 ఎకరాల్లో సాగు కానున్నాయి. వీటితోపాటు పప్పు ధాన్యాలు, ఇతర పంటలు జాబితాలో ఉన్నాయి. ఈ పంటల కోసం ప్రభుత్వం 82 వేల మెట్రిక్ టన్నుల యూరియా కేటాయించింది. ఇదీకాక జిల్లాలో 16 వేల మెట్రిక్ టన్నుల నిల్వలు ఉన్నాయి. ఈ యూరియాను పంపిణీ చేస్తూ మరింత అవసరమైతే సరఫరా చేసే అవకాశం ఉంది. -
జిల్లా ఆస్పత్రిలో మహిళా ఉన్నతోద్యోగిపై వేధింపులు
ఖమ్మంక్రైం: ఖమ్మం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలోని ఓ మహిళా ఉన్నతోద్యోగిని అదే విభాగంలో పనిచేస్తున్న ఇద్దరు కిందిస్థాయి ఉద్యోగులు వేధిస్తుండగా, ఆమె ఫిర్యాదుతో ఖమ్మంవన్టౌన్ పోలీసులు కేసు నమోదు చేశా రు. ఆస్పత్రిలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న ఆమెకు.. ఇద్దరు ల్యాబ్ టెక్నీషియన్లు వాట్సాప్లో అసభ్యకరమైన సందేశాలు పంపిస్తూ ఇబ్బంది పెడుతున్నారు. పలుమార్లు హెచ్చరించినా తీరు మారకపోవడంతో ఆమె ఫిర్యాదుతో ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు సీఐ కరుణాకర్ తెలిపారు. ‘ట్రెసా’నూతన కమిటీలు ఎన్నిక ఖమ్మంసహకారనగర్: తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ (ట్రెసా) కలెక్టరేట్ యూనిట్, ఖమ్మం డివిజన్ ఎన్నికలు మంగళవారం జరిగాయి. కలెక్టరేట్ యూనిట్ అధ్యక్ష, కార్యదర్శులుగా పగడాల రాజేశ్, రవి, ఖమ్మం డివిజన్ అధ్యక్ష, కార్యదర్శులుగా సురేశ్, శ్రీనివాస్తో పాటు కార్యవర్గాలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయని ఎన్నికల అధికారులు బి.వెంకటేశ్వరరావు, వెంకన్న తెలిపారు. నూతన కార్యవర్గాలను అదనపు కలెక్టర్ పిన్రెడ్డి శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కారుమంచి శ్రీనివాసరావు, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు తుంబూరు సునీల్రెడ్డి, పుల్లయ్య తదితరులు అభినందించారు. ప్రకృతి వ్యవసాయంపై రేపు విజ్ఞాన యాత్ర ఖమ్మంవ్యవసాయం: ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పించేలా గురువారం విజ్ఞానయాత్ర నిర్వహిస్తున్నట్లు అగ్రి – హార్టి కల్చర్ సొసైటీ ముఖ్య సలహాదారుడు నల్లమల వెంకటేశ్వరరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు రైతులను సుభాష్ పాలేకర్ కృషి పద్ధతి ప్రచారకుడు విజయ్రామ్ ఏపీలోని కృష్ణాజిల్లా పినగూడూరులంకలో నిర్వహిస్తున్న ఐదంచెల ప్రకృతి సేద్య క్షేత్ర సందర్శనకు తీసుకెళ్లనున్నట్లు పేర్కొన్నా రు. కార్యక్రమంలో పాల్గొనే రైతులకు ఉద్యాన శాఖ బస్సులు ఏర్పాటు చేస్తున్నందున సద్వినియోగం చేసుకోవాలని కోరారు. భోజనం కోసం ఉద్యోగుల పాట్లు సత్తుపల్లిరూరల్: సత్తుపల్లి మండలంలో బుధవారం జరగనున్న గ్రామపంచాయతీ ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులకు జేవీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సామగ్రి అందజేశారు. ఈ సందర్భంగా స్టాళ్లలో కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయలేదని పలువురు అసంతృప్తి వ్యక్తం చేశారు. అంతేకాక మధ్యాహ్నం ఒంటి గంటకే కూరలన్నీ అయిపోవడంతో ప్లేట్లలో భోజనం పెట్టుకుని వేచి ఉండాల్సి వచ్చింది. మరోపక్క నీరు తాగేందుకు గ్లాస్లు కూడా లేక ఇక్కట్లు ఎదుర్కొన్నారు. ఉద్యోగులకు సరిపడా భోజనాలు తీసుకురాకపోవడంతోనే ఈ పరిస్థితి ఎదురైందని తెలుస్తోంది. రాళ్లదాడిలో ఒకరికి గాయాలు కొణిజర్ల: రహదారి విషయంలో ఘర్షణ పడిన కొందరు.. మరో వ్యక్తిపై రాళ్లతో దాడి చేయడంతో గాయాలయ్యాయి. మండలంలోని లాలాపురం నుంచి వైరా శాంతినగర్ వరకు రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ క్రమాన రోడ్డుకు అడ్డుగా ఉన్న కల్వర్టు పైపులు తొలగించడానికి పీఆర్ ఇంజనీరింగ్ అధికారులు మంగళవారం లాలాపురం చెరువు వద్దకు రాగా అదే గ్రామానికి చెందిన పాసంగులపాటి రమేశ్ ఇప్పుడు కల్వర్టు తొలగిస్తే రైతులకే కాక మత్స్యకారులకు నష్టం ఎదురవుతుందని చెప్పాడు. ఈ సమయాన గ్రామానికి చెందిన పాసంగులపాటి శ్రీనివాస్, పాసంగులపాటి శ్రీనివాసరావు, కట్ట సత్యనారాయణ తదితరులు రమేశ్పై రాళ్లతో దాడిచేయడంతో గాయాలయ్యాయి. ఘటనపై రమేశ్ ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని ఎస్ఐ సూరజ్ వెల్లడించారు. -
పోలింగ్కు సర్వం సిద్ధం
కారేపల్లి: ప్రజలు ప్రశాంత వాతావరణంలో ఓటుహక్కు వినియోగించుకునేలా అన్ని ఏర్పాట్లు చేశామని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. కారేపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాన్ని మంగళవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్, సీసీ కెమెరాలతో నిరంతర పర్యవేక్షణ ఉంటుందని తెలిపారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటుచేశామని పేర్కొన్నారు. ఉద్యోగులు పూర్తిస్థాయిలో నిబంధనలు పాటిస్తే ఏ ఇబ్బంది ఎదురుకాదని చెప్పారు. ఉదయం 7గంటలకు పోలింగ్ మొదలుపెట్టి, మధ్యాహ్నం 2గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభించాలని సూచించారు. కేంద్రాల వద్ద ఓటర్లకు తాగునీరు, టెంట్లు ఏర్పాటుచేయాలని సూచించారు. అలాగే, డిస్ట్రిబ్యూషన్ సెంటర్ను అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ, జెడ్పీ సీఈఓ దీక్షారైనా, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రాజేశ్వరి కూడా పరిశీలించగా, మండల ప్రత్యేకాధికారి చందన్కుమార్, తహసీల్దార్ రమేష్, ఎంపీడీఓ శ్రీనివాసరావు, ఎంపీఓ రవీంద్రప్రసాద్ పాల్గొన్నారు. సమస్యాత్మక కేంద్రాల్లో పరిశీలన కారేపల్లి: మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యాన సింగరేణి మండలంలోని పలు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను పోలీసు కమిషనర్ మంగళవారం పరిశీలించారు. కారేపల్లి పోలింగ్ కేంద్రంలో బందోబస్తుపై ఆరా తీసిన ఎలాంటి ఘటనలు జరగకుండా పర్యవేక్షించాలని సూచించారు. రాజకీయ పార్టీల నాయకులతో పాటు ఓటర్లు కూడా సమన్వయం పాటించాలని సూచించారు. ఎవరైనా ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని సీపీ హెచ్చరించారు. -
జనవరి నాటికి ఆర్వోబీ పూర్తి
ఖమ్మంఅర్బన్: ఖమ్మం – దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి కొత్త సంవత్సరంలో ప్రజలకు అందుబాటులోకి వచ్చేలా పనుల్లో వేగం పెంచాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆదేశించారు. రైల్వే శాఖతో సమన్వయం చేసుకుంటూ ధంసలాపురం వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జి(ఆర్వోబీ) నిర్మాణ పనులు జనవరి నాటికి పూర్తి చేయాలని తెలిపారు. ఖమ్మంలోని ధంసలాపురం వద్ద గ్రీన్ఫీల్డ్ హైవే, ఆర్వోబీ, ఎంట్రీ – ఎగ్జిట్ పాయింట్ల పనులను కలెక్టర్ మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పనుల పురోగతిపై ఆరాతీస్తూ ఉద్యోగులకు సూచనలు చేశారు. ధంసలాపురం వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జి, మున్నేటిపై వంతెన నిర్మాణాలు వేగవంతం చేయాలన్నారు. ఆర్వోబీ నిర్మాణానికి సంబంధించి భూసేకరణ పూర్తయిందని తెలిపారు. కాగా, పనుల సమయాన వాహనాల రాకపోకలకు ఆటంకం కలగకుండా చూడాలని చెప్పారు. నేషనల్ హైవేస్ పీడీ దివ్య, ఖమ్మం ఆర్డీఓ నర్సింహారావు, తహసీల్దార్ సైదులు తదితరులు పాల్గొన్నారు. పరిశ్రమల విస్తరణకు చర్యలు రఘునాథపాలెం: జిల్లాలో చిన్న, మధ్యతరహా పరిశ్రమల విస్తరణకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ అనుదీప్ తెలిపారు. రఘునాథపాలెం మండలం జింకలతండా, పువ్వాడనగర్ పరిధిలో తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ (టీజీఐఐసీ)కు కేటాయించిన భూములను కలెక్టర్ పరిశీలించారు. భూవిస్తీర్ణం, సరిహద్దులు, రహదారి అనుసంధానం, మౌలిక వసతుల లభ్యతపై అధికారులతో చర్చించిన కలెక్టర్ మాట్లాడుతూ.. టీజీఐఐసీ ద్వారా కేటాయించిన భూములను సమర్థవంతంగా వినియోగించేలా పర్యవేక్షించాలని సూచించారు. మైనింగ్ ఏడీ సాయినాథ్, పరిశ్రమల శాఖ జీఎం సీతారాంనాయక్, ఆర్డీఓ జి.నరసింహారావు, తహసీల్దార్ శ్వేత, ఆర్ఐ ప్రవీణ్ పాల్గొన్నారు. భూసేకరణ త్వరగా పూర్తిచేయాలి ఖమ్మంసహకారనగర్: జాతీయ రహదారుల నిర్మా ణ పనులు వేగంగా పూర్తయ్యేలా అవసరమైన భూసేకరణపై దృష్టి సారించాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆదేశించారు. భూసేకరణ ప్రక్రియ, హై వేల నిర్మాణ పురోగతిపై క్యాంపు కార్యాలయంలో ఆయన అధికారులతో సమీక్షించారు. ఖమ్మం – దేవరపల్లి, ఖమ్మం – కురవి సెక్షన్, నాగపూర్ – అమరావతి జాతీయ రహదారుల నిర్మాణం నిర్ణీత సమయంలోగా పూర్తయ్యేలా భూసేకరణే కీలకమ ని తెలిపారు. ఆర్డీఓ నర్సింహారావు, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడీశ్రీనివాసులు, ఎన్హెచ్ఏఐ పీడీ రామాంజనేయరెడ్డి, ఈఈయుగంధర్ పాల్గొన్నారు. హైవే పనుల తనిఖీలో కలెక్టర్ అనుదీప్ -
ఎంప్లాయ్మెంట్ హబ్గా ఫుడ్పార్క్
సాక్షిప్రతినిధి, ఖమ్మం: సత్తుపల్లి మండలంలోని బుగ్గపాడు మెగా ఫుడ్పార్క్ ఎంప్లాయ్మెంట్ హబ్గా మారనుందని, ఇక్కడ ఏర్పాటుచేసే పరిశ్రమలు వ్యవసాయ రంగంలో మార్పు తీసుకురానున్నాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఈ ఫుడ్పార్క్లో సంక్రాంతి నాటికి మరికొన్ని పరిశ్రమలు ప్రారంభమవుతాయని వెల్లడించారు. ఫుడ్పార్క్ పురోగతిపై మంగళవారం హైదరాబాద్లోని సచివాలయంలో పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబుతో కలిసి తుమ్మల సమీక్షించారు. పొలం నుంచి మార్కెట్కు ఉత్పత్తులు వచ్చేలోగా విలువ పెంచేలా ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన కోసం ఫుడ్ పార్క్ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం 26ఎకరాల్లోని 26 ప్లాట్లను పలు కంపెనీలకు కేటాయించగా, తాజాగా దీపక్ నెక్స్జెన్ ఆక్వా ప్రాజెక్ట్కు స్థలం కేటాయించినట్లు వివరించారు. ఈ కంపెనీ రూ.615 కోట్ల పెట్టుబడితో ప్రారంభించే ఆక్వా పరిశ్రమలో 3,200 మందికి ఉపాధి అవకాశాలు దక్కుతాయన్నారు. ఈమేరకు అనుమతులు వేగవంతం చేసి సంక్రాంతి నాటికి ప్రారంభించేలా అధికారులు పర్యవేక్షించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఇండస్ట్రీస్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సంజయ్కుమార్, టీజీఐఐసీ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శశాంక, ఇండస్ట్రీస్ కమిషనర్ నిఖిల్ చక్రవర్తి, ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డైరెక్టర్ ఆఫ్ బిజినెస్ సుష్మ, టీజీఐఐసీ ఈడీ పవన్ కుమార్, ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ సభ్యులు శ్రీరామ్, ఆర్లిన్ తదితరులు పాల్గొన్నారు.సమీక్షలో మంత్రులు శ్రీధర్బాబు, తుమ్మల -
●నాడు భర్త... నేడు భార్య
నేలకొండపల్లి/తిరుమలాయపాలెం: నేలకొండపల్లి మండలం అప్పలనరసింహాపురం సర్పంచ్గా కాంగ్రెస్ మద్దతుతో పోటీ చేసిన మన్నె రాజశ్రీ గెలిచారు. ఇదే పంచాయతీ సర్పంచ్గా ఆమె భర్త మన్నె నగేష్ 2013లో టీడీపీ నుంచి విజయం సాధించారు. ఇప్పుడు రాజశ్రీ కాంగ్రెస్ నుంచి గెలుపొందడం విశేషం. అలాగే, తిరుమలాయపాలెం మండలం గోల్తండా గ్రామపంచాయతీ సర్పంచ్లుగా భార్యాభర్తలకు అవకాశం దక్కింది. బానోతు అనిల్కుమార్ వైఎస్సార్ సీపీ బలపరచగా 2013 ఎన్నికల్లో గెలిచారు. ప్రస్తుత ఎన్నికల్లో అనిల్ భార్య బానోతు సుజాత 282 మెజార్టీతో విజయం సాధించింది. -
ఇక ప్రలోభాల పర్వం!
● మూడో విడతకు ముగిసిన ప్రచారం ● గెలుపు కోసం అభ్యర్థుల వ్యూహాలు ● ఏడు మండలాల్లో జోరుగా మద్యం, డబ్బు పంపిణీసాక్షి ప్రతినిధి, ఖమ్మం: మూడో విడత ఎన్నికలు జరిగే ఏన్కూరు, కల్లూరు, పెనుబల్లి, సత్తుపల్లి, తల్లాడ, వేంసూరు, సింగరేణి మండలాల్లో సోమవారంతో ప్రచారం ముగిసింది. దీంతో అభ్యర్థులు ఇతర మార్గాల్లో ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. చివరి రోజున అభ్యర్థులు జోరుగా ప్రచారం చేశాక కొత్త అస్త్రాలను తీసే పనిలో పడ్డారు. పోలింగ్కు ఒకేరోజు సమయం ఉండడంతో గుట్టుచప్పుడు కాకుండా ఓటర్లను కలుస్తూ ఒప్పందాలు చేసుకుంటున్నారు. 168 జీపీల్లో ఎన్నికలు ఏడు మండలాల్లో 191 గ్రామపంచాయతీలకు మూడో విడతలో ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే, ఏన్కూరు మండలం నూకాలంపాడు గ్రామపంచాయతీకి ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాకపోగా, 22 గ్రామపంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. దీంతో 168 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. అలాగే 1,742 వార్డుల్లో నామినేషన్లు దాఖలు కాని తొమ్మిది, ఏకగ్రీవమైన 361 వార్డులు మినహా 1,372 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ స్థానాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు, పార్టీల నాయకులతో కలిసి చివరి రోజైన సోమవారం వరకు ప్రచారం హోరెత్తించారు. వ్యూహాలకు పదును ప్రచారం ముగియడంతో అభ్యర్థులు గెలుపు కోసం వ్యూహాలకు పదును పెట్టారు. గ్రామాల్లో ఎందరు ఓటర్లు ఉన్నారు, అందులో ఎవరెవరు తమకు ఓటు వేస్తారు... ఎవరిని ఎలా ప్రసన్నం చేసుకునే అవకాశముందనే అంశాలపై దృష్టి సారించారు. అంతేకాక ఎదుటి వర్గంలో పోటీ చేసే అవకాశం దక్కక నిరాశతో ఉన్నవారిని తమ వైపు తిప్పుకునేలా చర్చలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. వీరితో చేతులు కలపడం ద్వారా తమ గెలుపును సునాయాసం చేసుకోవాలనే భావనలో ఉన్నారు. ఓటరు జాబితా ఆధారంగా ప్రతీ ఒక్కరినీ కలిసేలా ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈక్రమంలో ఒకరిని మించి ఇంకొకరు మద్యం, డబ్బు పంపిణీ చేస్తుండగా, ఇంటింటికీ మటన్, చికెన్ కూడా చేరవేస్తున్నట్లు తెలుస్తోంది. -
నోటే.. ఓటయింది !
వైరా: పల్లెలే దేశానికి పట్టుకొమ్మలని చెబుతారు. పల్లెలు అభివృద్ధితోనే గ్రామ స్వరాజ్యం సిద్ధిస్తుందని నమ్ముతారు. కానీ ప్రస్తుతం జరుగుతున్న గ్రామపంచాయతీ ఎన్నికలను చూస్తే విచ్చలవిడిగా డబ్బు ఖర్చు పెడుతున్న అభ్యర్థులు గ్రామాల అభివృద్ధి ఏ మేరకు పాటుపడతారనే చర్చ జరుగుతోంది. జిల్లాలో ఇప్పటికే రెండు విడతల ఎన్నికలు పూర్తికాగా, మూడో దశ గ్రామాల్లో బుధవారం పోలింగ్ జరగనుంది. మొదటి రెండు దశల్లో సర్పంచ్, వార్డుస్థానాలకు పోటీ పడిన అభ్యర్థులు తమ పరిధిలోని ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు డబ్బుతో పాటు మద్యం, మాంసం పంపిణీ చేరారని చెబుతున్నారు. ఇక మూడో విడత అభ్యర్థులు సైతం తామేం తీసిపోమన్నట్లుగా అదే బాటలో పయనిస్తున్నారు. గ్రామాల్లో ఎన్నికలంటే సహజంగానే సందడి ఉంటుంది. కానీ ఆ సందడి అభివృద్ధి హామీలు ఇవ్వడంపై కాకుండా పరస్పర దూషణలు, పోటాపోటీగా తాయిలాలు పంపిణీ చేసేలా ఉండడంపై గతంలో సర్పంచ్లుగా పనిచేసిన వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పల్లెల్లో ఎన్నికల విధానం నేటి తరానికి స్ఫూర్తిగా ఉండాల్సిందిగా పోయి ‘నోటుస్వామ్యం’ మాదిరి వర్ధిల్లుతోందని చెబుతున్నారు. డబ్బు, మద్యమే ఎన్నికలను శాసిస్తున్నాయని, పార్టీ రహిత గ్రామపంచాయతీ ఎన్నికలకు పార్టీల రంగులను అద్ది అభ్యర్థుల తరఫున ఎమ్మెల్యేలు, నాయకులు ప్రచారం చేస్తుండడం చర్చనీయాంశంగా మారుతోంది. కొన్ని గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థులు ఓటుకు రూ.10వేలు ఇచ్చారని, ఇంకో చోట వరుసగా కొన్నిరోజుల పాటు ఇంటికే మటన్, చికెన్ పంపిణీ చేశారనే ప్రచారంపై పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈమేరకు 10 – 15 ఏళ్ల క్రితం సర్పంచ్లుగా గెలిచిన వారిని పలకరించగా తమ అభిప్రాయాలు వెల్లడించారు. -
భక్తులపైనే భారం..
● భద్రగిరిలో ముక్కోటి వేడుకలకు అందని సర్కారు సాయం ● పగల్పత్తు ఉత్సవాల నిర్వహణకు దాతలకు పిలుపు భద్రాచలం: భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థాన అధికారులు నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు. ఉత్సవాల ఖర్చులు పెరుగు తున్నా ప్రభుత్వ సాయం అందక ప్రత్యామ్నాయం వైపు చూస్తున్నారు. ఈక్రమాన పగల్ పత్తు ఉత్సవాల్లో రోజుకో సంస్థ ఖర్చు భరించి భాగస్వాములయ్యేలా ప్రతిపాదించారు. దీంతో ఖర్చులు దాతలపై వేస్తున్నందుకు బాధపడాలో, ఉత్సవంలో భాగస్వాములు అవుతున్నందుకు ఆనందించాలో తేల్చుకోలేని సందిగ్ధావస్థ ఎదురవుతోంది. పెరుగుతున్న వ్యయం భద్రాచలంలో ముక్కోటి, శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తుండగా దేశ నలుమూలల నుంచి భక్తులు వస్తారు. ఇందుకు అనుగుణంగా చేసే ఏర్పాట్లకు ఖర్చు పెరుగుతోంది. ఈనెల 20 నుంచి ప్రారంభమయ్యే ముక్కోటి ఉత్సవాల పనులకు ఇప్పటికే రూ.80 లక్షలకు టెండర్ దాఖలైంది. వీటికి అదనంగా మరో రూ.50 లక్షల వరకు ఖర్చవుతాయని అంచనా. అలాగే, శ్రీరామనవమి, పట్టాభిషేకానికి సుమారు రూ.2 కోట్ల వ్యయాన్నీ హుండీ ఆదాయం నుంచే భరించాల్సి వస్తోంది. ‘పగల్పత్తు’లో భాగం కండి.. ఆలయంపై పడుతున్న భారాన్ని తట్టుకునేందుకు అధికారులు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకున్నారు. ముక్కోటి ఉత్సవాల్లో మొదటి తొమ్మిది రోజులు స్వామి రోజొక అవతారంలో దర్శనమిస్తారు. వీటిని పగల్ పత్తు ఉత్సవాలు అంటారు. ముక్కోటి తర్వాత జరిగే రాపత్తు ఉత్సవాలను ఇప్పటికే వివిధ ప్రభుత్వ శాఖల వారే ఖర్చు భరించి నిర్వహిస్తున్నారు. ఈసారి పగల్పత్తు ఉత్సవాలనూ రోజొక ధార్మిక సంస్థ లేదా అసోయేషన్లు నిర్వహించేలా వీలు కల్పించారు. చాంబర్ ఆఫ్ కామర్స్, స్వచ్చంద, ధార్మిక సంస్థలతో సమావేశం నిర్వహించగా రోజుకు రూ.లక్ష నుంచి రూ.2లక్షల వరకు ఖర్చు భరించేందుకు కొన్నిసంస్థలు గ్రీన్సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రభుత్వాలు మారినా.. సాయం సున్నా భద్రాచల క్షేత్రంలో ఉత్సవాలకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆర్థిక సాయం అందడం లేదు. ప్రత్యేక నిధులు కేటాయించాలని భక్తులు కోరుతున్నా, ఆల యం నుంచి నివేదించినా ఫలితం లేదు. ప్రభుత్వాలు మారుతున్నా పరిస్థితిలో మార్పు లేకపోవడంపై విమర్శలొస్తున్నాయి. ఆలయ ఈఓ కె.దామోదర్ రావు మాట్లాడుతూ ముక్కోటి ఉత్సవాల్లో భక్తులను భాగస్వాములను చేసేందుకే దాతలను ఆశ్రయించామని తెలిపారు. తద్వారా దేవస్థానంపై వ్యయ భారం తప్పుతుందని పేర్కొన్నారు. -
తల్లంపాడు ఉపసర్పంచ్ ఎన్నికలో రసాభసా
ఖమ్మంరూరల్: మండలంలోని తల్లంపాడులో ఉప సర్పంచ్ ఎన్నిక విషయమై కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య సోమవారం స్వల్ప ఘర్షణ జరిగింది. ఈ గ్రామం నుంచి సర్పంచ్గా కుమ్మరి అంబేద్కర్ గెలిచారు. గ్రామంలో 12 వార్డులకు ఏడు బీఆర్ఎస్, సీపీఎం కూటమి, ఐదు వార్డులను కాంగ్రెస్ మద్దతుదారులు గెలుచుకున్నారు. అయితే, సోమవారం ఎలాంటి సమాచారం లేకుండా ఉప సర్పంచ్ ఎన్నిక నిర్వహించడం సరికాదని, మరికొంత సమయం ఇవ్వాలని సర్పంచ్గా గెలిచిన అంబేద్కర్ అధికారులను కోరారు. దీంతో ఎన్నిక వాయిదా వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. మరో పక్కఎన్నిక నిర్వహించాల్సిందేనని బీఆర్ఎస్ వార్డు మెంబర్లు, నాయకులు పట్టుబట్టారు. అయితే, అధికారులు మాత్రం ఎన్నికను వాయిదా వేయడంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ వర్గీయుల మధ్య స్వల్ప ఘర్షణ చోటు చేసుకుంది. అనంతరం ఎన్నిక నిర్వహించాలని బీఆర్ఎస్, సీపీఎం కూటమి నాయకులు నిరసన తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు చేరుకుని ఇరువర్గాలను సముదాయించారు. -
●ఒకే కుటుంబం నుంచి ప్రత్యర్థులు
కామేపల్లి: కామేపల్లి మండలం పింజరమడుగు గ్రామపంచాయతీ నుంచి గతంలో, ఇప్పుడు ఒకే కుటుంబానికి చెందిన అభ్యర్థులను గెలవగా, ఒకే కుటుంబానికి చెందిన అభ్యర్థులు ఓడిపోవడం గమనార్హం. 2019 ఎన్నికల్లో సర్పంచ్ స్థానానికి గుగులోత్ దేవి, కేలోత్ జ్యోతి మధ్య పోటీ జరగగా దేవి విజయం సాధించింది. ఇప్పుడు కాంగ్రెస్ మద్దతుతో దేవి భర్త బాషా, బీఆర్ఎస్ మద్దతుతో జ్యోతి భర్త భాస్కర్ బరిలోకి దిగారు. ఈక్రమాన భాస్కర్పై 117 ఓట్ల మెజార్టీతో బాషా విజయం సాధించాడు. వరుసగా గుగులోత్ దేవి, బాషాకు పీఠం దక్కగా, జ్యోతి, భాస్కర్ ఓటమి పాలయ్యారు. -
పినపాకలో ఇరువర్గాల వాగ్వాదం
తల్లాడ: మండలంలోని పాత పినపాక గ్రామంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ వర్గీయు ల మధ్య సోమవారం వాగ్వాదం చోటు చేసుకుంది. పినపాకకు చెందిన బీఆర్ఎస్ తరఫున వార్డుసభ్యులుగా పోటీ చేస్తున్న ఎక్కిరాల నాగేశ్వరరావు, ఎక్కిరా ల అనసూర్య, తేళ్లపుట్ల లక్ష్మి, తేళ్లపుట్ల కుమారి, తేళ్లపుట్ల మహేష్ మాట్లాడుతూ కాంగ్రెస్కు చెందిన గుర్రం నాగేశ్వరరావు, ఆళ్ల శ్రీను, గుర్రం శివరాం, తేళ్లపుట్ల నాగేశ్వర్రావు, నర్వనేని శ్రీను తదితరులు ఎక్కిరాల నాగేశ్వరరావుపై దాడికి యత్నించారని ఆరోపించారు. అయితే, బీఆర్ఎస్ నేతలే దౌర్జన్యానికి పాల్పడుతున్నారని ఎక్కిరాల ప్రభాకర్రావు పేర్కొన్నారు. ఇరువర్గాల నుంచి ఫిర్యాదు అందిందని ఎస్సై ఎన్.వెంకటకృష్ణ తెలిపారు. న్యూలక్ష్మీపురంలో ఘర్షణ ముదిగొండ: మండలంలోని న్యూలక్ష్మీపురంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ వర్గీయుల మధ్య సోమవారం ఘర్షణ చోటుచేసుకుంది. ఇరువర్గాల వారు గ్రామ రహదారిపైకి చేరడంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. దీంతో పోలీసులు చేరుకుని ఇరువర్గాల వారిని పంపించారు. అయితే, రాళ్లు, కర్రలతో తమపై దాడి చేశారంటూ ఇరువర్గాల వారు పరస్పరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
జానకీ సదనానికి రూ.12 లక్షల విరాళం
భద్రాచలం: భద్రాచలంలో శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానానికి వచ్చే భక్తులకు వసతి కల్పించేందుకు జానకీ సదనం నిర్మిస్తున్నారు. ఈ నిర్మాణంలో భాగమయ్యేలా ఖమ్మం జయనగర్ కాలనీకి చెందిన శ్రీరంగం వకుళాభాష్యం రూ.12 లక్షల విరాళాన్ని సోమవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ ఏఈఓ శ్రావణ్కుమార్కు దాతలకు రశీదు అందించాక స్వామికి దర్శించుకున్నారు. ఈకార్యక్రమంలో ఆలయ పర్యవేక్షకులు లింగాల సాయిబాబు తదితరులు పాల్గొన్నారు.అభ్యసన సామర్థ్యాలు మెరుగుపరచాలి చింతకాని/బోనకల్: విద్యార్థులకు మెరుగైన బోధన అందిస్తూ వారిలో అభ్యసన సామర్థ్యాలను మెరుగుపరచాలని జిల్లా విద్యాశాఖాధికారి చైతన్యజైనీ సూచించారు. చింతకాని మండలం నాగులవంచ ప్రాథమిక పాఠశాల, బోనకల్లోని కేబీవీని సోమవారం ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా నాగులవంచలో డీఈ ఓ మాట్లాడుతూ విద్యార్థులు ఆంగ్లం, తెలుగు భాషపై పట్టు సాధించేలా అభ్యసన సామర్థ్యాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. అనంతరం మధ్యాహ్న భోజనాన్ని పరి శీలించిన డీఈఓ.. విద్యార్థులకు గుడ్డు పెట్టకపోవడంపై ఏజెన్సీ నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మెనూ ప్రకారం భోజనం అందేలా హెచ్ఎం, ఉపాధ్యాయులు పర్యవేక్షించా ల ని ఆదేశించారు. పాఠశాల ఇన్చార్జ్ హెచ్ఎం ప్రధానోపాధ్యాయులు శైలజ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అలాగే, బోనకల్ కేజీబీవీ తనిఖీ సందర్భంగా పాఠశాల పరిసరాలు, హాస్టల్లో పరిశీలించిన డీఈఓ, విద్యార్థులతో మాట్లాడి వసతులు, బోధనపై ఆరాతీశారు. ట్యాంక్ స్థలం ఆక్రమిస్తున్నారని ఫిర్యాదు రఘునాథపాలెం: మండలంలోని వీ.వీ.పాలెం గ్రామంలో నీళ్ల ట్యాంకు కూల్చివేసిన స్థలం ఆక్రమణకు కొందరు ప్రయత్నిస్తున్నారని గ్రామస్తులు సోమవారం ఫిర్యాదు చేశారు. గ్రామంలో పీర్ల చావిడి, దాన్ని ఆనుకుని నీళ్ల ట్యాంకు, బావి ఉండేదని తెలిపారు. పీర్ల చావిడిని గతంలో గ్రామవాసే ఆక్రమించుకోగా, ఇప్పుడు నీళ్లట్యాంకు కూల్చివేసిన 100 చదరపు గజాల స్థలం ఆక్రమణకు యత్నిస్తున్నారని పేర్కొన్నారు. ఖాళీగా ఉన్న స్థలానికి ప్రహరీ నిర్మాణానికి సిద్ధమయ్యారని కలెక్టరేట్తో పాటు గ్రామపంచాయతీ కార్యదర్శికి ఫిర్యాదు అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీను, పుల్లారావు, బిక్షం, కమలమ్మ, రంగమ్మ, కృష్ణమోహన్, నాగమణి, సీతారాములు, శ్యామలమ్మ తదితరులు పాల్గొన్నారు. వ్యక్తి అదృశ్యంపైకేసు ఖమ్మంఅర్బన్: ఖమ్మం బల్లెపల్లికి చెందిన ఓ వ్యక్తి కానరాకుండా పోయిన ఘటనపై కేసు నమోదైంది. బల్లేపల్లికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ గండు వెంకన్న(42) గత నెల 25న ఉదయం ఇంటి నుంచి వెళ్లిపోయి తిరిగి రాలేదు. ఎక్కడ వెతికినా ఆచూకీ లేకపోవడంతో ఆయన కుమారుడు నవీన్ ఫిర్యాదు ఖమ్మం అర్బన్ పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. గోపాలపురంలో మహిళ.. ఖమ్మం గోపాలపురానికి చెందిన మహిళ (23) ఈనెల 13న ఉదయం ఇంటి నుంచి వెళ్లిపోయి తిరిగి రాలేదు. భర్త నుండి విడాకులు తీసుకుని తల్లిదండ్రుల వద్ద ఉంటున్న ఆమె కోసం బంధువులు, స్నేహితుల వద్ద విచారించినా ఫలితం కానరాలేదు. దీంతో ఆమె తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు సీఐ భానుప్రకాష్ తెలిపారు. నూతన వార్డుసభ్యుడి మృతి రఘునాథపాలెం: మండలంలోని మంగ్యాతండా గ్రామ వాసి, ఈనెల 11న వార్డుమెంబర్గా ఎన్నికై న కొడకళ్ల వెంకటాచారి(45) మృతి చెందాడు. గ్రామ ఒకటో వార్డు సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నికై న ఆయన గుండెపోటుతో మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. వడ్రంగిగా జీవనం సాగించే ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈమేరకు వెంకటాచారి చిత్రపటం వద్ద నూతన సర్పంచ్ మాలోతు భార్గవి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు అజ్మీరా వీరూనాయక్, నాయకులు రవికిరణ్, నాగేశ్వరరావు, రమేశ్, నాగాచారి, భాస్కర్ నాయకులు నివాళులర్పించి కుటుంబీకులను పరామర్శించారు. -
సత్తుపల్లి నుంచి శబరిమలకు సైకిల్యాత్ర
సత్తుపల్లిటౌన్: అయ్యప్ప మాల ధరించిన ఇద్దరు భక్తులు శబరిమలలో స్వామి దర్శనాని కి సైకిల్పై బయలుదేరారు. సత్తుపల్లికి చెందిన బేతిని శేషగిరిరావు, మొండ్రు క్రాంతికుమార్ సోమవారం స్థానిక మెట్టాంజనేయస్వామి ఆలయంలో ఇరుముడి ధరించి సైకిళ్లపై యాత్ర ప్రారంభించారు. ఇందులో శేషగిరిరావు గతంలో ఆరుసార్లు శబరిమల వెళ్లగా, క్రాంతి తొలిసారి వెళ్లున్నారు. వీరికి హరిహరాత్మజ అయ్యప్పస్వామి ఆలయ కమిటీ బాధ్యులు ద్రోణంరాజు మల్లికార్జున శర్మ, క్రాంతి శ్రీనివాసరావు, బొంతు శ్రీనివాసరావు శుభాకాంక్షలు తెలిపారు. -
జమలాపురంలో శ్రీవేంకటేశ్వర వ్రతకల్ప ఉత్సవం
ఎర్రుపాలెం: తెలంగాణ తిరుపతిగా పేరున్న జమలాపురం వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలోని వకుళామాత స్టేడియంలో సోమవారం తొలిసారి శ్రీవేంకటేశ్వర వ్రతకల్ప ఉత్సవం నిర్వహించారు. ఆ తర్వాత చామంతి తదితర పూలతో స్వామి, అమ్మవార్లకు పుష్పయాగం చేశారు. అలాగే, వేంకటేశ్వరస్వామి వ్రతం నిర్వహించారు. ఆలయ ఈఓ కె.జగన్మోహన్రావు, ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాసశర్మ, స్టేడియం నిర్మాణ దాత తుళ్లూరు కోటేశ్వరరావు– నిర్మల దంపతులు, అర్చకులు రాజీవ్శర్మ, మార్తి వెంకటరమణ, కాసులనాటి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.నేడు డిప్యూటీ సీఎం పర్యటన మధిర: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మంగళవారం మధిరలో పర్యటించనున్నారు. ఉదయం 11:30 క్యాంపు కార్యాలయాన్ని రానున్న అధికారులతో సమావేశమవుతారు. ఆతర్వాత నూతనంగా ఎన్నికై న సర్పంచ్లతో మాట్లాడి అభివృద్ధిపై దిశానిర్దేశం చేయనున్నారు. త్వరలోనే అందుబాటులోకి వంద పడకల ఆస్పత్రి సత్తుపల్లిటౌన్: సత్తుపల్లిలో రూ.35 కోట్లతో నిర్మించిన వంద పడకల ఆస్పత్రిని త్వరలోనే ప్రారంభిస్తామని వైద్యవిధాన పరిషత్ ఆస్పత్రుల జిల్లా సమన్వయ అధికారి డాక్టర్ రాజశేఖర్గౌడ్ తెలిపారు. సత్తుపల్లి ప్రభుత్వాస్పత్రిని సోమవారం తనిఖీ చేసిన ఆయన ల్యాబ్, పేషెంట్ వార్డులు, డయాలసిస్, సిమాంక్ కేంద్రాలను పరిశీలించారు. అనంతరం సూపరిండెంటెంట్ కె.వెంకటేశ్వర్లు, ఉద్యోగులతో సమావేశమైన ఆయన సాధారణ కాన్పులు పెంచడంతో పాటు మెరుగైన వైద్యసేవలు అందించాలని సూచించారు. డాక్టర్ సురేష్నారాయణ్, ఉద్యోగులు పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణపై అవగాహన ఖమ్మంవ్యవసాయం: పర్యావరణ పరిరక్షణ, వన్యప్రాణుల సంరక్షణపై అందరూ అవగాహన పెంచుకోవాలని జిల్లా అటవీ అధికారి(డీఎఫ్ఓ) సిద్ధార్థ్ విక్రమ్సింగ్ సూచించారు. రాష్ట్ర చిహ్నాలు, ముఖ్యమైన వణ్య ప్రాణులు, ప్రకృతి సంరక్షణను వివరిస్తూ రూపొందించిన పోస్టర్లను సోమవారం ఆవిష్కరించి మాట్లాడారు. ప్రజల్లో పర్యావరణ స్పృహ పెంచడం, ప్రకృతిపై ప్రేమ, బాధ్యత పెంపొందించడమే లక్ష్యంగా పోస్టర్ల ద్వారా ప్రచారం చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎఫ్డీఓ మంజుల, గ్రీన్ వారియర్ జేవీఎస్.చంద్రశేఖర్, ఉద్యోగులు పాల్గొన్నారు. -
బంధువులతోనే పోటీ
నేలకొండపల్లి/కామేపల్లి: నేలకొండపల్లి మండలం కొంగర గ్రామపంచాయతీలో సొంత అక్కాచెల్లెళ్ల మధ్య పోరు నడిచింది. ఈ మేరకు చెల్లె రంగమ్మపై అక్క కృష్ణకుమారి విజయం సాధించారు. ప్రస్తుతం సర్పంచ్గా ఎన్నికై న కృష్ణకుమారి భర్త గత 20ఏళ్ల క్రితం కట్టుకాచారం–కొంగర ఉమ్మడి గ్రామపంచాయతీ సర్పంచ్గా పనిచేశారు. ఇక కామేపల్లి మండలం జాస్తిపల్లిలో ధరావత్ నాగమణి బీఆర్ఎస్ మద్దతుతో, నాగమణి బావ కుమారై ధరావత్ స్వాతిక కాంగ్రెస్ మద్దతుతో సర్పంచ్గా బరిలో నిలిచారు. ఈ మేరకు స్వాతికపై 77ఓట్ల మెజార్టీతో నాగమణి విజయం సాధించింది. స్వాతిక విద్యావంతురాలైనా మాత్రం నాగమణివైపే మొగ్గు చూపారు. -
నిర్దిష్ట లక్ష్యాలతోనే విజయాలు
కలెక్టర్ అనుదీప్ దురిశెట్టిఖమ్మంఅర్బన్: విద్యార్థులు భవిష్యత్పై నిర్దిష్ట లక్ష్యాలను ఎంచుకుని సాధన చేస్తే విజయాలు వరిస్తాయని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. ఖమ్మం టేకులపల్లిలోని మహిళా ప్రాంగణంలో శిక్షణ పొందిన విద్యార్థినులు ఎంపీహెచ్డబ్ల్యూ పరీక్షల్లో రాష్ట్ర స్థాయి 2, 4, 5, 7, 8, 10వ ర్యాంకులు సాధించగా వారిని సోమవారం కలెక్టర్ అభినందించి మాట్లాడారు. పేద కుటుంబాలు, ఏజెన్సీ ప్రాంతాల విద్యార్థినులు ఇక్కడితో ఆగిపోకుండా ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి జీవితంలో స్థిరపడాలని సూచించారు. ర్యాంకులు సాధించిన జబ్బా పావని, మచ్చా శ్రావణి, దేవత్ సంధ్యవిక, చిదిం మౌనిక, బానోతు కల్పన, పగిడిపల్లి రాజేశ్వరితో పాటు మహిళా ప్రాంగణం మేనేజర్ వేల్పుల విజేత, ఉద్యోగులు నాగ సరస్వతి, స్పందన, మల్లిక, సుధీర్, సుకన్య, మౌనిక, లాలయ్య పాల్గొన్నారు. నైపుణ్యాల సాధనే కీలకం ఖమ్మంరూరల్: విద్యార్థులు ఆసక్తి ఉన్న రంగాల్లో నైపుణ్యాలు సాధిస్తే జీవితంలో విజయాలు సొంతమవుతాయని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. పోలేపల్లిలోని పీఎంశ్రీ కేంద్రియ విద్యాలయంలో ఇన్నోవేషన్ అండ్ స్కిల్ సెంటర్ను సోమవారం ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లి వంటి వారు ఒకేరోజు గొప్పవారు కాలేదని, నిరంతర శిక్షణతోనే ఈ స్థాయికి చేరిన విషయాన్ని విద్యార్థులు గుర్తించి చదువుపై దృష్టి సారించాలని సూచించారు. మున్సిపల్ కమిషనర్ ఆళ్ల శ్రీనివాసరెడ్డి, ప్రిన్సిపాల్ కవీంద్రరాయ్తో పాటు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
రద్దయిన సర్వీసుల పునరుద్ధరణ
● దశల వారీగా డీజిల్ బస్సుల స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులు ● టీజీఎస్ ఆర్టీసీ వైస్ చైర్మన్, ఎండీ వై.నాగిరెడ్డి ఖమ్మంమయూరిసెంటర్: కోవిడ్ సమయాన గ్రామీణ ప్రాంతాలకు నిలిపేసిన బస్సులన్నీ తిరిగి ప్రారంభించేలా చర్యలు చేపడుతున్నట్లు టీజీఎస్ ఆర్టీసీ వైస్ చైర్మన్, ఎండీ వై.నాగిరెడ్డి తెలిపారు. ఖమ్మం కొత్త బస్టాండ్లోని కార్గో పాయింట్, ప్లాట్ఫామ్స్, దుకాణాలను సోమవారం ఆయన తనిఖీ చేశారు. రాజధాని బస్సులో ప్రయాణికులతో మాట్లాడి సౌకర్యాలు, ప్రయాణ సమయం, సమస్యలపై ఆరా తీశారు. అనంతరం ఎండీ మాట్లాడుతూ రెండేళ్లలో మహాలక్ష్మి పథకం ద్వారా 250 కోట్ల ప్రయాణాలు జరగగా, రూ.8,500 కోట్లను ప్రభుత్వం భరించిందని తెలిపారు. ఈ నగదు మహిళలకు ఆదా అయిందని చెప్పారు. భవిష్యత్లో ఎలక్ట్రికల్ బస్సుల ధరలు తగ్గే కొద్దీ డీజిల్ బస్సుల స్థానంలో ప్రవేశపెడతామన్నారు. మహిళా సంఘాల ద్వారా 600బస్సులను తీసుకుంటామని, సంస్థలో వేయి మంది డ్రైవర్లు, 761 మంది శ్రామిక్ల నియామక ప్రక్రియ చేపడుతున్నామని తెలిపారు. ఖమ్మం రీజియన్ కొంత నష్టాల్లో ఉంది ఖమ్మం రీజియన్లోని అన్ని డిపోల పరిధిలో అవసరమైన రూట్లలో బస్సులు ఏర్పాటు చేయడంతో పాటు రూట్లలో సర్వీసుల సంఖ్య పెంచాలని ఎండీ వై.నాగిరెడ్డి సూచించారు. ఓ ప్రయాణికుడు బస్టాండ్లోని స్టాళ్లలో ఎంఆర్పీకి మించి వసూలు చేస్తున్నారని ఫిర్యాదు చేయడంతో చర్యలు తీసుకోవాలని ఆర్ఎంకు సూచించారు. కాగా, రాష్ట్రం మొత్తంగా చూస్తే ఖమ్మం రీజియన్ కొంత నష్టాల్లో ఉందని తెలిపారు. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్సులు నడిపించడం, గ్రామాలకు రహదారులు బాగుంటే కొత్త సర్వీసులు ఏర్పాటు చేయడంద్వారా ఆదాయం పెంచుకోవాలని అధికారులకు సూచించారు. తొలుత ఆర్ఎం సరిరామ్ ఎండీకి పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. డిప్యూటీ ఆర్ఎం వి.మల్లయ్య, ఖమ్మం డీఎం ఎం.శివప్రసాద్, విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ ఎం.రవీందర్, ఉద్యోగులు వి.జ్యోత్స్న, పి.సంపత్, కోటాజీ తదితరులు పాల్గొనగా, అద్దె బస్సుల ఓనర్లు ఎండీని మర్యాదపూర్వకంగా కలిశారు. -
పాఠశాలల రేటింగ్పై రాష్ట్ర బృందం పరిశీలన
ఖమ్మం సహకారనగర్: ‘స్వచ్ఛ్ ఏవం హరిత విద్యాలయ’ పథకం కింద జిల్లా స్థాయిలో ఎంపికైన ఎనిమిది పాఠశాలలను రాష్ట్రస్థాయి బృందం సోమవారం పరిశీలించింది. సత్తుపల్లి, కల్లూరు, తల్లాడ మండలాల్లోని ఆయా పాఠశాలలను పరిశీలించాక రాష్ట్ర పరిశీలకుడు సైదులు మాట్లాడారు. ఎకో క్లబ్ కార్యక్రమాల నిర్వహణ, పచ్చదనం – పరిశుభ్రత, తాగునీరు, టాయిలెట్ల నిర్వహణ, విద్యార్థుల్లో పరిసరాలపై అవగాహన తదితర అంశాలను పరిశీలించి రేటింగ్ ఇస్తామని తెలిపారు. ఈ వివరాలను ఆన్లైన్లో నమోదు చేస్తే అత్యధిక రేటింగ్ పొందిన పాఠశాలలు రాష్ట్ర, జాతీయ స్ధాయిలో అవార్డుకు ఎంపికవుతాయని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బృందం సభ్యుడు స్వరూప్కూమార్, హెచ్ఎంలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
స్వామి సేవకు వేళాయె...
ఖమ్మంగాంధీచౌక్: ధనుర్మాసంలో నిర్వహించే తిరుప్పావై వ్రతానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. కలియుగంలో మానవ కన్యగా జన్మించి గోదాదేవిగా పేరు మోసిన ఆండాళ్ భగవంతుడినే భర్తగా భావించి ఆయనను చేపట్టడానికి సంకల్పించిన వ్రతమే తిరుప్పావై వ్రతం. ఈ వ్రతం నిర్వహించే ధనుర్మాసం మంగళవారం మొదలుకానుంది. సంక్రాతికి ముందు 30 రోజుల కాలాన్ని ధనుర్మాసంగా వ్యవహరిస్తూ ఆలయాల్లో భగవంతుడిని కొలుస్తారు. ఈ మాసంలో ప్రధానంగా శ్రీ మహావిష్ణువుకు ప్రత్యేక పూజలు చేస్తారు. ధనుర్మాసం మంగళవారం మొదలై జనవరి 14 వరకు ఉంటుంది. ఽఈ నెల పాటు జిల్లాలోని శ్రీ వైష్ణవ ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరగనున్నాయి. ఈమేరకు ఖమ్మం కమాన్బజార్లోని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం, త్రీటౌన్లోని ప్రాచీన శ్రీ కరిగిరి లక్ష్మీరంగనాథ స్వామి ఆలయం, గుట్టపై ఉన్న శ్రీ స్తంభాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం, శ్రీ రామాలయం, కాల్వొడ్డు, ఇతర ప్రాంతాల్లోని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయాలతో పాటు జిల్లా వ్యాప్తంగా వైష్ణవ ఆలయాల్లో ఉత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. మహా విష్ణువుకు ప్రీతిపాత్రం ధనుర్మాసం శ్రీ మహా విష్ణువుకు ఎంతో ప్రీతికరమైనదిగా నమ్మిక. అందుకే ఈ నెలంతా వైష్ణవ దేవాలయాల్లో ప్రత్యేక పూజలు, గురువారం మహాలక్ష్మికి పూజలు చేస్తారు. ఇక ధనుర్మాసంలోనే వైకుంఠ ఏకాదశిగా కూడా పిలిచే ముక్కోటి ఏకాదశి వస్తుంది. ఈనెల 30న ముక్కోటి ఉత్సవాల సందర్భంగా ఆలయాల్లో స్వామిని ఉత్తర ద్వారాన దర్శించుకుంటారు. అలాగే, ఈనెలలో బాలికలు, మహిళలు ఇళ్ల ముందు ప్రతిరోజు అందమైన సంక్రాంతి ముగ్గులు వేయడంతో పాటు ఆవుపేడతో గొబ్బెమ్మలు చేసి మధ్యలో లక్ష్మీదేవి రూపంగా పూలు, పసుపు కుంకుమలతో పూజిస్తారు. నేటి నుంచి ధనుర్మాసం -
కాంగ్రెస్లో జోష్
జిల్లాలో పూర్తయిన మొదటి, రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు జయకేతనం ఎగురవేశారు. ప్రధానంగా డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న మధిర, రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పాలేరుల్లో కాంగ్రెస్ మద్దతుదారులు అత్యధిక స్థానాలు కై వసం చేసుకున్నారు. మరికొన్ని స్థానాల్లో స్వల్ప తేడాతో ఓటమి చవిచూశారు. ఈ రెండు విడతల్లోనూ వచ్చిన ఫలితాలపై పార్టీ నాయకత్వం సంతృప్తి వ్యక్తం చేస్తూ, మూడో విడత ఎన్నికల్లో మరింత మెరుగైన ఫలితాలు రాబట్టే లక్ష్యంతో పనిచేయాలని కార్యకర్తలకు సూచించింది. – సాక్షిప్రతినిధి, ఖమ్మంమధిర, పాలేరు నియోజకవర్గాల్లో సత్తా చాటిన పార్టీ మధిరలో కాంగ్రెస్ ఢంకా మధిర నియోజకవర్గ పరిధి మధిర, బోనకల్, చింతకాని, ఎర్రుపాలెం మండలాల్లో మొదటి విడతగా, ముదిగొండ మండలానికి రెండో విడతలో ఎన్నికలు నిర్వహించారు. మొత్తం 131 జీపీ స్థానాలకు 90చోట్ల కాంగ్రెస్ మద్దతుదారులు గెలిచారు. ఎర్రుపాలెం మండలంలో 31 స్థానాలకు 26, మధిర మండలంలో 27కు 19, బోనకల్లో 22కు 14, చింతకానిలో 26కు 13 జీపీ స్థానాల్లో నెగ్గింది. ముదిగొండ మండలంలో 25 స్థానాలకు గాను 18లో సత్తా చాటింది. ఏకగ్రీవాలతోపాటు ఎన్నికలు జరిగిన పంచాయతీల్లో కాంగ్రెస్కు ఏకపక్షంగానే ఓటింగ్ జరగగా, పలు మండలాల్లో బీఆర్ఎస్, సీపీఎం పొత్తుతో కొంత ప్రభావం కనిపించిందని చెబుతున్నారు. పాలేరులోనూ పట్టం రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పాలేరు నియోజకవర్గంలోని గ్రామపంచాయతీల్లో కాంగ్రెస్ మద్దతుదారులు జెండా పాతారు. ఇక్కడ రెండో విడతలో ఎన్నికలు జరిగాయి. కూసుమంచి, నేలకొండపల్లి, తిరుమలాయపాలెం, ఖమ్మంరూరల్ మండలాల్లో 134 గ్రామపంచాయతీలకు గాను 83 స్థానాల్లో కాంగ్రెస్ మద్దతుదారులు విజయం సాధించారు. బీఆర్ఎస్ 34 స్థానాల్లో, సీపీఎం ఎనిమిది, సీపీఐ మూడు, ఇతరులు ఆరు స్థానాల్లో గెలిచారు. ఈ నియోజకవర్గంలో బీఆర్ఎస్, సీపీఎం పొత్తుతో కొన్ని స్థానాలను కాంగ్రెస్ స్వల్ప తేడాతో కోల్పోయినా పలు మేజర్ గ్రామపంచాయతీలు కాంగ్రెస్ ఖాతాలో చేరాయి. స్వల్ప తేడాతో మరికొన్ని.. రెండు నియోజకవర్గాల్లో అత్యధిక స్థానాలను కాంగ్రెస్ మద్దతుదారులు గెలిచినా, మరికొన్ని స్థానాలను కోల్పోయారు. కొన్నిచోట్ల ఒకటి నుంచి 30ఓట్ల తేడాతో ఓడిపోగా, చాలాస్థానాల్లో కాంగ్రెస్ రెబెల్స్ బరిలో ఉండడం ఇందుకు కారణమైందని చెబుతున్నారు. గ్రామస్థాయి నేతల్లో మనస్పర్థలతో గెలవాల్సిన జీపీలను కూడా కోల్పోయామని పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. ఇక సీపీఎం, బీఆర్ఎస్ పొత్తుగా పోటీ చేయడం కూడా కొన్ని స్థానాలు కోల్పోవడానికి కారణంగా భావిస్తున్నారు. మూడో విడతలో మరింత మెరుగైన ఫలితాలు వచ్చేలా విభేదాలు లేకుండా పనిచేసేలా నాయకులు సూచిస్తున్నారు. మూడో విడత ఎన్నికలు జరిగే జీపీల్లో ప్రచార గడువు ముగిసినందున కాంగ్రెస్ పార్టీ యంత్రాంగం పోల్ మేనేజ్మెంట్పై దృష్టి సారించింది. గ్రామపంచాయతీ ఎన్నికలు పార్టీల రహితంగా జరిగినా, పార్టీల మద్దతుతోనే అభ్యర్థులు బరిలో దిగారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచాయి. ప్రభుత్వం అమలుచేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలతోనే ఓటర్లు తమకు పట్టం కట్టారని అభ్యర్థులు చెబుతున్నారు. ప్రచారంలో కూడా అభ్యర్థులు ప్రభుత్వ పథకాలను ఓటర్లకు వివరిస్తూ తమకు ఓటు వేయాలని అభ్యర్థించారు. ప్రధానంగా ఇందిరమ్మ ఇళ్ల పథకం మంచి ప్రభావాన్ని చూపిందని ఆ పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. -
●పదేళ్ల పాలనకు మళ్లీ పట్టం
●వెంకయ్య కుటుంబానికి మూడోసారి అవకాశం ముదిగొండ: ముదిగొండ మండలం అమ్మపేటకు చెందిన మేకపోతుల వెంకయ్య – భద్రమ్మ చెరోసారి సర్పంచ్గా పనిచేశారు. దీంతో అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని ఈసారి భద్రమ్మకు సర్పంచ్గా మరోసారి ప్రజలు అవకాశం ఇచ్చారు. 2006లో మేకపోతుల వెంకయ్య సర్పంచ్గా పోటీ చేసి గెలిచారు. 2013 ఎన్నికల్లో మేకపోతుల భద్రమ్మ గెలించింది. ప్రస్తుతం సర్పంచ్ స్థానం జనరల్ మహిళకు రిజర్వ్ కావడంతో భద్రమ్మ బరిలోకి దిగగా ప్రజలు గెలిపించగా ఆమె రెండోసారి సర్పంచ్గా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. -
మంత్రి స్వగ్రామంలో కాంగ్రెస్దే గెలుపు
దమ్మపేట: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో పాటు అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ స్వగ్రామమైన దమ్మపేట మండలం గండుగులపల్లి సర్పంచ్గా కాంగ్రెస్ బలపర్చిన మెచ్చు ఈదప్ప విజయం సాధించాడు. ఇక్కడ పోటీలో ఉన్న బీఆర్ఎస్ మద్దతుదారుడు పండు సాంబశివరావుపై ఆయన 350 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు. అంతేకాక పది వార్డులకు ఏడింటిని కాంగ్రెస్ కై వసం చేసుకుంది. ఎమ్మెల్సీ స్వగ్రామంలో బీఆర్ఎస్ మద్దతుతో సీపీఎం విజయం తిరుమలాయపాలెం: ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తాత మధుసూదన్ స్వగ్రామమైన పిండిప్రోలులో బీఆర్ఎస్ మద్దతుతో సీపీఎం సర్పంచ్ అభ్యర్థి కామళ్ల సువార్త 381ఓట్ల మెజార్టీతో విజయం సాధించింది. ఆమెకు 1,750 ఓట్లు రాగా మాస్లైన్ అభ్యర్థి ఆరెంపుల కేతమ్మకు 1,369 ఓట్లు వచ్చాయి. ఇక్కడ 12 వార్డులకు గాను కాంగ్రెస్, మాస్లైన్ అభ్యర్థులు నాలుగు వార్డులు కై వసం చేసుకోగా, బీఆర్ఎస్, సీపీఎం కూటమికి ఎనిమిది వార్డులు దక్కాయి. రాజుపేట బీఆర్ఎస్ కై వసం కూసుమంచి: కూసుమంచి మండలం రాజుపేట గ్రామంలో బీఆర్ఎస్ మద్దతుదారుడు బానోత్ మహేష్ సర్పంచ్గా గెలుపొందాడు. పాలేరు, సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యేలు కందాళ ఉపేందర్రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య స్వగ్రామం ఇదే కావడంతో నాయకులు ప్రతిష్టాత్మంగా తీసుకున్నారు. మరోపక్క కాంగ్రెస్ నాయకులు కూడా హోరాహోరీగా ప్రచారం చేశారు. ఇక్కడి బీఆర్ఎస్ అభ్యర్థి బానోత్ మహేష్ కాంగ్రెస్ బలపర్చిన కుర్రా రమేష్పై 23 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందాడు. బీటెక్ సర్పంచ్ ! కామేపల్లి: కామేపల్లి మండలం పొన్నేకల్లో కాంగ్రెస్ పార్టీ బలపర్చిన గుగులోత్ భూమిక సర్పంచ్గా గెలిచింది. ఇక్కడ మొత్తం 842 ఓటర్లకు గాను 728 ఓట్లు పోలయ్యాయి. ఈమేరకు భూమిక 603 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందింది. బీటెక్(ఈఈఈ) పూర్తి చేసిన ఆమె 23 ఏళ్ల వయస్సులోనే గ్రామ ప్రథమ పౌరురాలిగా ఎన్నికవడం విశేషం. విద్యావంతురాలినైన తాను గ్రామాభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తానని ప్రచారంలో వెల్లడించింది. -
మేమూ ఓటేశాం..
ఆసక్తి, ఆనందంతో తొలిసారి ఓటు హక్కు వినియోగం ● ఎన్నికల ప్రక్రియలో భాగమైనందుకు యువతీయువకుల్లో హర్షంమొదటిసారి నా ఓటు హక్కు గ్రామపంచాయతీ ఎన్నికల్లో వినియోగించుకోవడం సంతోషంగా ఉంది. ఓటు రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు. అందుకే బాధ్యతగా ఓటేశాను. – కొర్రా అంజలి, కామేపల్లి గ్రామపంచాయతీ ఎన్నికల్లో తొలిసారి ఓటు వేయడం ఆనందంగా ఉంది. ఓటు హక్కు ఉంటే మనకు నచ్చిన సర్పంచ్, వార్డు సభ్యులను ఎన్నుకునే అవకాశం లభిస్తుంది. అందరూ స్వేచ్ఛగా ఓటేయాలి. –పి.నవ్యశ్రీ, పాతర్లపాడు తొలిసారి ఓటు హక్కు లభించిన యువతీయువకులు ఉత్సాహంగా ఓటేశారు. రాజ్యాంగ హక్కును వినియోగించుకుని.. గ్రామాభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ఓటేశామని.. మొదటిసారి ఓటేయడం బాధ్యతగా భావించడంతోపాటు మధురానుభూతిని కలిగించిందని.. గెలుపులో యువత ఓట్లే కీలకమని.. సమర్థులైన సర్పంచ్ల ఎన్నికల్లో భాగస్వామ్యమైనందుకు సంతోషంగా ఉందని యువ ఓటర్లు పేర్కొన్నారు. ఆదివారం రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించగా, పలువురు యువతీ, యువకులు ఆసక్తి, ఆనందంతో ఓటు హక్కును వినియోగించుకున్నారు. – కామేపల్లి / నేలకొండపల్లి / దమ్మపేట / అశ్వారావుపేట రూరల్ / చుంచుపల్లి / పాల్వంచ రూరల్ -
ఈసారి అంతకు మించి!
పోలింగ్ శాతంసాక్షి ప్రతినిధి, ఖమ్మం: రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైంది. జిల్లాలోని కామేపల్లి, ఖమ్మంరూరల్, కూసుమంచి, ముదిగొండ, నేలకొండపల్లి, తిరుమలాయపాలెం మండలాల్లో ఆదివారం ఎన్నికలు జరగగా, ఉదయం 7గంటల నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు బారులు దీరారు. దీంతో పోలింగ్ ముగిసే సమయానికి 91.21 శాతంగా నమోదైంది. మొదటి విడతతో పోలిస్తే ఇది 1.13 శాతం అదనం కావడం విశేషం. తొలి విడత ఎన్నికల్లో 90.08 శాతంతో రాష్ట్రంలో జిల్లా నాలుగో స్థానంలో నిలవగా.. ఇప్పుడు రెండో స్థానానికి ఎగబాకింది. యాదాద్రి భువనగిరి జిల్లా 91.72 శాతంతో మొదటి స్థానంలో నిలిచింది. బారులు దీరిన ఓటర్లు పోలింగ్ ప్రారంభం నుంచే ఓటర్లు కేంద్రాలకు తరలివచ్చారు. ఆరు మండలాల్లోని దాదాపు అన్ని కేంద్రాల వద్ద ఇదే దృశ్యం కనిపించింది. అభ్యర్థులు ఓటర్లను పోలింగ్కేంద్రాలకు తరలించారు. ఇంకొందరు వృద్ధులు, మహిళలు, దివ్యాంగులు కుటుంబీకుల సాయంతో వచ్చారు. రెండో విడతలో మొత్తం 183 గ్రామపంచాయతీలు, 1,686 వార్డుల్లో ఎన్నికలు జరగాల్సి ఉండగా.. 23 జీపీలు, 306 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. ఇంకో వార్డుకు నామినేషన్లు దాఖలు కాలేదు. దీంతో 160 గ్రామపంచాయతీలు, 1,379 వార్డుల్లో ఆదివారం ఎన్నికలు నిర్వహించారు. పోలింగ్ పర్యవేక్షణ రెండో విడత పోలింగ్ తీరును కలెక్టరేట్లోని మానిటరింగ్ సెల్ నుంచి కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి పర్యవేక్షించారు. మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న వారికి టోకెన్లు ఇచ్చి ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించినట్లు కలెక్టర్ తెలిపారు. అలాగే సాధారణ ఎన్నికల పరిశీలకులు ఖర్తడే కాళీచరణ్ సుధామారావు ముదిగొండ, నేలకొండపల్లి, కూసుమంచి, ఖమ్మంరూరల్ మండలాల్లో, కామేపల్లి మండలం ముచ్చర్లలో అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ పరిశీలించారు. గంటగంటకూ పెరిగిన పోలింగ్ మొదటి విడత మాదిరిగానే రెండో విడత ఎన్నికల్లోనూ పోలింగ్ జోరు కొనసాగింది. మొత్తం 2,48,239 మంది ఓటర్లకు 2,26,417 మంది ఓటు వేశారు. ఇందులో 1,12,160 మంది పురుషులు, 1,14,252 మంది మహిళలు, ఇతరులు ఐదుగురు ఉన్నారు. ఖమ్మం రూరల్ మండలంలో అత్యధికంగా 93.76 శాతం పోలింగ్ నమోదు కాగా, ఇక్కడ 33,851 మంది ఓటర్లకు 31,739 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. బందోబస్తు నడుమ పోలింగ్ కేంద్రాల వద్ద భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. దాదాపు 2వేల మంది పోలీసులు పహారా కాశారు. క్రిటికల్ స్టేషన్ల వద్ద అదనపు బలగాలను మోహరించారు. ఆరు మండలాల పరిధి 304 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద అడిషనల్ డీసీపీ పర్యవేక్షణలో బలగాలతో పాటు ప్రత్యేక బృందాలను నియమించారు. ఖమ్మం రూరల్, కామంచికల్, తీర్థాల, గోళ్లపాడు, ముదిగొండ, నేలకొండపల్లి, ముజ్జుగూడెం, రాజేశ్వరపురం, కూసుమంచి, జల్లేపల్లి, దమ్మాయిగూడెం, తిరుమలాయపాలెం గ్రామాల్లో కేంద్రాలను పోలీస్ కమిషనర్ సునీల్దత్ పరిశీలించారు.కూసుమంచిలో మొదటిసారి ఓటు వేసిన ఆనందంలో యువతిబ్యాలెట్ బాక్స్లో ఓటు వేస్తున్న యువతి రికార్డు స్థాయిలో 91.21శాతం పోలింగ్ మండలం మొత్తం ఓట్లు పోలైన ఓట్లు పోలింగ్ శాతం కామేపల్లి 30,349 26,414 87.03 ఖమ్మంరూరల్ 33,851 31,739 93.76 కూసుమంచి 45,420 41,298 90.92 ముదిగొండ 43,877 40,155 91.52 నేలకొండపల్లి 47,420 43,480 91.69 తిరుమలాయపాలెం 47,322 43,331 91.57మొత్తం 2,48,239 2,26.417 91.21 -
● అమృత్ పథకం కింద రూ.249 కోట్లతో పనులు ● మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి ఖమ్మం అర్బన్: ఖమ్మంలో జరుగుతున్న అభి వృద్ధి పనుల్లో అంతర్జాతీయ ప్రమాణాలు పాటిస్తూ పది కాలాలు మన్నికగా ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఖమ్మంలోని పలు డివిజన్లలో ఆదివారం పర్యటించిన ఆయన అభివృద్ధి పనుల ప్రతిపాదనలు, కార్యాచరణపై ఆరా తీసి అధికారులకు దిశానిర్దేశం చేశారు. వర్షపు నీరు, మురుగునీరు వేర్వేరుగా ప్రవహించేలా స్టార్మ్ వాటర్ డ్రెయిన్లు, అండర్ గ్రౌండ్ డ్రెయినేజీల నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. తద్వారా చెరువులు కలుషితం కాకుండా రక్షించుకోవచ్చని చెప్పారు. అమృత్ పథకం ద్వారా రూ.249 కోట్లతో చేపట్టిన భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థ పనులు వచ్చే వర్షాకాలానికి ముందే పూర్తయ్యేలా పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు. అలాగే, ఖానాపురం ఊరచెరువు నుంచి ధంసలాపురం చెరువు వరకు 8.5 కి.మీ. మేర ట్రంక్ పైప్లైన్, ధంసలాపురంలో 44 ఎంఎల్డీ సామర్థ్యం గల మురుగునీటి శుద్ధి కేంద్రం, పుట్టకోటలో 9.5 ఎంఎల్డీ సామర్థ్యం గల ఎస్టీపీ పనులపై సూచనలు చేశారు. అదనపు కలెక్టర్ పి.శ్రీనివాస్రెడ్డి, కేఎంసీ ఎస్ఈ వి.రంజిత్, కార్పొరేటర్లు ఆళ్ల నిరోష అంజిరెడ్డి, చామకూర వెంకటేశ్వర్లు, జలవనరులశాఖ ఈఈ అనన్య, డీఈ ఉదయ్ప్రతాప్, తహసీల్దార్ సైదులు, కాంగ్రెస్ ఖమ్మం అధ్యక్షుడు నాగండ్ల దీపక్ చౌదరి పాల్గొన్నారు. గాయత్రీ మహా యజ్ఞంలో మంత్రి ఖమ్మం పెవిలియన్ మైదానంలో నిర్వహించిన 108 కుండముల గాయత్రీ జ్ఞాన మహాయజ్ఞంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొని పూజలు చేశారు. మాతాజీ జన్మ శతాబ్ది సందర్భంగా చేపట్టిన మహాయజ్ఞంతో ఆధ్యాత్మిక చైతన్యం, నైతిక విలువలు, సద్గుణాలు మరింతగా పెరగాలని ఆకాంక్షించారు. రోడ్డుప్రమాదంలో యువతి మృతి మధిర: మండలంలోని ఖాజీపురం సమీపాన ఆదివారం ట్రాక్టర్, ఆటో ఢీకొన్న ఘటనలో ఒక యువతి మృతి చెందింది. ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం చెవిటికల్లు గ్రామానికి చెందిన షేక్ జాన్సైదా కుటుంబానికి చెందిన బంధువుల ఫంక్షన్లో పాల్గొనేందుకు టాటా ఏస్ వాహనం అద్దెకు తీసుకుని ఎన్టీఆర్ జిల్లా ఊటుకూరు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో ఖాజీపురం మీదుగా వెళ్తుండగా ఎదురుగా వచ్చిన ట్రాక్టర్ ఢీకొట్టడంతో అందులో ప్రయాణిస్తున్న షేక్ ఆయేషా(17)కి తీవ్ర గాయాలు కాగా.. మరో ఆరుగురికి స్వల్ప గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను 108 వాహనంలో మధిర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆయేషా మృతి చెందింది. ఘటనపై మధిర రూరల్ ఎస్ఐ లక్ష్మీభార్గవి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
● అంతా సజావుగానే..
జిల్లాలో రెండో విడత పోలింగ్ సజావుగానే సాగింది. ఉదయం నుంచే ఓటర్లు ఓటు వేసేందుకు బారులుదీరారు. వృద్ధులు, ఇతర ఇబ్బందులు కలిగిన ఓటర్లను వీల్చైర్ల ద్వారా సహాయకులు తీసుకొచ్చి ఓటు వేయించారు. కొందరు మహిళలు చంటిబిడ్డలతో వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పలు పోలింగ్ కేంద్రాలను అదనపు కలెక్టర్ శ్రీజ, సీపీ సునీల్దత్, ఎన్నికల అధికారి ఖర్తడే కాళీ చరణ్ సుధామారావుతోపాటు పలువురు అధికారులు సందర్శించి, సిబ్బంది సూచనలు చేశారు. చిన్నచిన్న ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగియడంతో అధికారులు, సిబ్బంది ఊపిరిపీల్చుకున్నారు. –సాక్షి నెట్వర్క్ -
చెదురుముదురు ఘటనలు
తిరుమలాయపాలెం: తిరుమలాయపాలెం మండలంలోని కొక్కిరేణికి చెందిన పలువురు ఉపాధి, ఉద్యోగాల నిమిత్తం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉంటున్నారు. ఎన్నికల సందర్భంగా వీరి కోసం ట్రావెల్స్ బస్సు ఏర్పాటు చేయగా ఆదివారం నేరుగా పోలింగ్ కేంద్రం వద్దకు వచ్చారు. దీంతో బస్సు నుంచి దిగుతుండగా రెండు పార్టీల అభ్యర్థులు ఓట్లు అభ్యర్థించేందుకు గుమికూడడంతో గందగోళం నెలకొంది. ఈ మేరకు ఎస్ఐ కూచిపూడి జగదీశ్ ఇరువర్గాల వారిని దూరంగా పంపించారు. ● మండలంలోని పిండిప్రోలులో ఓటు హక్కు వినియోగించుకునేందుకు వచ్చిన ఇద్దరు ఆర్మీ జవాన్లను అధికారులు అనుమతించలేదు. పోస్టల్ బ్యాలెట్కు దరఖాస్తు చేసి ఉంటారని చెప్పగా, తాము చేయలేదని జవాన్లు స్పష్టం చేశారు. అప్పటికే ఒక జవాన్ ఓటు వేశాడని ప్రశ్నించడం, ఇరు పార్టీల నాయకులు చేరుకోవడంతో ఉద్రిక్తత నెలకొనగా పోలీసులు చెదరగొట్టారు. అనంతరం ఎంపీడీఓ కార్యాలయం నుంచి వివరాలు తెప్పించుకుని పోస్టల్ బ్యాలెట్కు దరఖాస్తు చేసుకోలేదని గుర్తించాక ఇద్దరు జవాన్లతో ఓటు వేయించారు. ● మండలంలోని పిండిప్రోలులో ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తాతా మధుసూదన్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ముదిగొండ: ముదిగొండ నాలుగో వార్డులో ఏజెంట్లు ఓటర్లను మభ్య పెడుతున్నారంటూ పోలీసులను కొందరు ప్రశ్నించగా వాగ్వాదం జరిగింది. వీరికి సర్దిచెప్పి బయటకు పంపించారు. అలాగే, పోలింగ్ కేంద్రం బయట వంద మీటర్ల పరిధిలోపు కాంగ్రెస్, సీపీఎం నేతలు రావడంతో ఉద్రిక్తత నెలకొంది. సీఐ రమేశ్ సిబ్బందితో కలిసి వారిని దూరంగా పంపించివేశారు. మల్లారంలో ఓ స్వతంత్ర అభ్యర్థిని తరఫు వ్యక్తి ఇద్దరిపై దాడి చేయగా పోలీసుస్టేషన్కు తరలించారు. ఖమ్మంరూరల్: మండలంలోని తీర్థాలలో కాంగ్రెస్, బీఆర్ఎస్, ఆరెకోడులో కాంగ్రెస్, సీపీఎం వర్గాల మధ్య స్వల్ప ఘర్షణ చోటు చేసుకోగా పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. కూసుమంచి: మండలంలోని రాజుపేటలో మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్రెడ్డి దంపతులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. అక్కడక్కడా ఘర్షణ.. నిలువరించిన పోలీసులు -
యడవల్లి సర్పంచ్కు అత్యధిక మెజార్టీ
● గిడ్డంగుల సంస్థ చైర్మన్ తండ్రి ఓటమి ముదిగొండ: ముదిగొండ మండలం యడవల్లి సర్పంచ్గా కాంగ్రెస్ మద్దతుతో పోటీ చేసిన ఎరకల భారతమ్మ 1,478 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు. ఇక ఖానాపురంలో కాంగ్రెస్ నుంచే ఇరువర్గాల పోటీకి దిగగా మాజీ జెడ్పీటీసీ పసుపులేటి దుర్గ, పోకల బాబు చేతిలో ఓడిపోయారు. అలాగే, వెంకటాపురంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు తండ్రి, 91ఏళ్ల వయస్సు కలిగిన రాయల వెంకటేశ్వర్లు సీపీఎం నుంచి పోటీ చేయగా కాంగ్రెస్ అభ్యర్థి కందుల బాలచందర్ చేతిలో ఓటమి ఎదురైంది. నాలుగోసారి సర్పంచ్గా... కామేపల్లి: కామేపల్లి మండలం ముచ్చర్ల సర్పంచ్గా మూడు దఫాలు వ్యవహరించిన జాటోత్ జాయ్లూసీ నాలుగోసారి బీఆర్ఎస్ పార్టీ బలపర్చిన అభ్యర్థిగా బరిలో నిలిచి గెలిచింది. 2004, 2014లో గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఆమె పోటీ ద్వారా సర్పంచ్గా గెలిచింది. 2019లో ఏకగ్రీవంగా ఎన్నికై ంది. మళ్లీ ఇప్పుడు సర్పంచ్గా గెలవగా.. జాయ్లూసీ మాట్లాడుతూ గ్రామాభివృద్ధే ధ్యేయంగా కృషిచేస్తున్న తనను ఆదరించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. సీనియర్ నెట్బాల్ క్రీడాకారుల ఎంపిక ఖమ్మంస్పోర్ట్స్: ఉమ్మడి జిల్లాస్థాయి సీనియర్ నెట్బాల్ క్రీడాకారుల ఎంపిక పోటీలు ఖమ్మంలోని సెయింట్ జోసెఫ్ పాఠశాలలో ఆదివారం జరిగాయి. ఈ పోటీలకు 60 మందికి పైగా పురుషులు, మహిళలు హాజరయ్యారు. మహబూబ్నగర్లో ఈ నెల 25 నుంచి జరగనున్న రాష్ట్రస్థాయి సీనియర్ నెట్బాల్ పోటీలకు క్రీడాకారులను ఎంపిక చేయగా, వారం పాటు శిక్షణ అనంతరం జట్టును ప్రకటిస్తామని నెట్బాల్ అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షులు సీహెచ్ దీప్తి, కార్యదర్శి ఎన్.ఫణికుమార్ తెలిపారు. ఎంపిక పోటీలను ఫాదర్ సంపత్, విహారి, అఖిల్ తదితరులు పర్యవేక్షించారు. ఖమ్మం మీదుగా సంక్రాతికి ప్రత్యేక రైళ్లు ఖమ్మంరాపర్తినగర్: సంక్రాంతి పండుగకు దక్షిణ మధ్య రైల్వే ఏర్పాటు చేసిన పలు ప్రత్యేక రైళ్లు ఖమ్మం మీదుగా రాకపోకలు సాగించనున్నాయని సీసీటీఓ రాజగోపాల్ తెలిపారు. సికింద్రాబాద్ – కాకినాడటౌన్ (07261) ఎక్స్ప్రెస్ జనవరి 9, 11, 13వ తేదీల్లో ఉంటుందని, కాకినాడ – సికింద్రాబాద్(07262) ఎక్స్ప్రెస్ 10, 12వ తేదీల్లో ఉంటుందని వెల్లడించారు. అలాగే, వికారాబాద్ – కాకినాడటౌన్ (07271) ఎక్స్ప్రెస్ 10, 12వ తేదీల్లో, కాకినాడటౌన్ – వికారాబాద్(07272) రైలు 11వ తేదీన ఉంటుందని తెలిపారు. ఆయా రైళ్లలో ప్రయాణానికి ఖమ్మం రైల్వేస్టేషన్లో లేదా ఐఆర్సీటీసీ ద్వారా రిజర్వేషన్ చేయించుకోవచ్చని పేర్కొన్నారు. కలుపు మందుతో మాడిపోయిన మిర్చి తోట రఘునాథపాలెం: రఘునాథపాలెం మండలం రాంక్యాతండాలో రైతు కేలోతు రామోజీకి చెందిన మిరప తోటపై గుర్తుతెలియని వ్యక్తులు కలుపు మందు పిచికారీ చేశారు. దీంతో తోట కొంత మేర మాడిపోయిందని బాధిత రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. ఈనెల 11న జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఓటేయలేదనే కక్షతోనే కొందరు రాత్రి ఈ ఘటనకు పాల్పడి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేసిన ఆయన, పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. వైరల్ ఫీవర్తో యువతి మృతి మధిర: మహదేవపురం గ్రామానికి చెందిన ఓ యువతి వైరల్ ఫీవర్తో బాధపడుతూ ఆదివారం మృతి చెందింది. గ్రామానికి చెందిన కిన్నెర గోపి కుమార్తె మహాలక్ష్మి (17) కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతోంది. ఆమెను శనివారం ఖమ్మంలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. గ్రామ నూతన సర్పంచ్ వాసిరెడ్డి నాగేశ్వరరావు, బీఆర్ఎస్ నాయకులు మొండితోక జయాకర్ మహాలక్ష్మి మృతదేహం వద్ద నివాళులర్పించి కుటుంబీకులను పరామర్శించారు.రోడ్డుప్రమాదంలో ముగ్గురికి గాయాలు రఘునాథపాలెం: మండలంలో రఘునాథపాలెం–చింతగుర్తి మార్గంలో ఆదివారం ట్రాక్టర్ ఢీకొనగా ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ముగ్గురికి గాయాలయ్యాయి. మండలంలోని రాంక్యాతండాకు చెందిన బోడ రవి తన భార్య, కుమార్తెతో ఖమ్మం నుండి రాంక్యాతండా వెళ్తున్నాడు. వీరి ద్విచక్ర వాహనాన్ని ఎదురుగా వచ్చిన ట్రాక్టర్ ఢీకొట్టగా ముగ్గురు గాయపడ్డారు. దీంతో ఆస్పత్రికి తరలించగా, ఘటనపై రఘునాథపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
చేయి ఎత్తిన పల్లెలు!
● మలివిడతలోనూ మెజార్టీ జీపీలు కాంగ్రెస్ కై వసం ● 113 స్థానాల్లో విజయం ● కాంగ్రెస్ పొత్తుతో సీపీఐకి నాలుగు పంచాయతీలు ● బీఆర్ఎస్కు 42, సీపీఎంకు 13సాక్షిప్రతినిధి, ఖమ్మం: జిల్లాలో మలివిడత ఎన్నికలు జరిగిన ఆరు మండలాల్లోని గ్రామపంచాయతీల్లోనూ సర్పంచ్లుగా కాంగ్రెస్ పార్టీ మద్దతుదారుల హవా కొనసాగింది. కూసుమంచి, నేలకొండపల్లి, తిరుమలాయపాలెం, ఖమ్మంరూరల్, ముదిగొండ, కామేపల్లి మండలాల్లోని 183 గ్రామపంచాయతీలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాగా.. 23గ్రామపంచాయతీలు ఏకగ్రీవం అయ్యా యి. మిగతా160 స్థానాలకు ఎన్నికలు జరగ్గా.. కాంగ్రెస్కు 95, బీఆర్ఎస్కు 39, సీపీఎం మద్దతుదారులు 13స్థానాలు దక్కించుకున్నారు. ఇక సీపీఐకి ఒకటి, ఇతరులకు 11 స్థానాలు దక్కాయి. ఏకగ్రీవాలు, ఎన్నికలు జరిగిన జీపీలు కలిపి మొత్తంగా కాంగ్రెస్ మద్దతుదారులు 113పంచాయతీలు, బీఆర్ఎస్ మద్దతుదారులు 42, సీపీఎం 13, సీపీఐ 4, ఇతరులు 11 స్థానాల్లో విజయం సాధించారు. బీఆర్ఎస్, సీపీఎం పొత్తు పెట్టుకోవడంతో పట్టుఉన్న చోట సత్తా చాటారు. ఏకగ్రీవాలతో కాంగి‘రేసు’.. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పాలేరు నియోజకవర్గంలోని నాలుగు మండలాలు, డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న మధిర నియోజకవర్గంలోని ముదిగొండతో పాటు కామేపల్లి మండలాలకు రెండో విడతలో ఎన్నికలు జరిగాయి. ఈ దఫాలో ఏకగ్రీవమైన 23 జీపీల్లో మెజార్టీ స్థానాలు కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఏకగ్రీవ పంచాయతీల్లో కాంగ్రెస్ మద్దతుదారులకు 18, బీఆర్ఎస్, మాస్లైన్కు ఒక్కొక్కటి, సీపీఐకి మూడు స్థానాలు దక్కాయి. ‘హస్తం’ హవా మొదటి విడత మాదిరిగానే రెండో విడతలోనూ కాంగ్రెస్ మద్దతుదారుల హవా కొనసాగింది. ఏకగ్రీవాలతో కలిసి 113స్థానాలను ఆ పార్టీ మద్దతుదారులు గెలుచుకున్నారు. ప్రభుత్వం అమలుచేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుతో పల్లె జనం జై కొట్టినట్లు కనిపించింది. ఇక సీపీఐ కామేపల్లి మండలంలో ఒక్క స్థానమే దక్కించుకుంది. పాలేరు నియోజకవర్గంలో కాంగ్రెస్ మెజార్టీ స్థానాలు దక్కించుకోవడంతో పార్టీ శ్రేణుల సంబరాలు అంబరాన్నంటాయి. కలిసి వచ్చిన పొత్తు ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్, సీపీఎం కలిసి బరిలో నిలవగా రెండు పార్టీలు కలిపి 53స్థానాల్లో పాగా వేశాయి. మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్రెడ్డి స్వగ్రామం కూసుమంచి మండలం రాజుపేటలో బీఆర్ఎస్ అభ్యర్థి విజయం సాధించాడు. అలాగే ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తాతా మధుసూదన్ స్వగ్రామం తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలులోనూ బీఆర్ఎస్ పొత్తుతో సీపీఎం గెలుపొందింది. కూసుమంచి: మండలంలోని చేగొమ్మ గ్రామపంచాయతీ ఎన్నికల ఫలితాల్లో ఉత్కంఠకు రాత్రి పొద్దు పోయాక తెరపడింది. ఇక్కడ సర్పంచ్గా కాంగ్రెస్ మద్దతుదారుడిగా బొల్లికొండ వెంకన్న, బీఆర్ఎస్ మద్దతుదారుడిగా బత్తుల వీరస్వామి పోటీపడ్డారు. అయితే, ఇద్దరికీ సమానంగా 945 ఓట్లు రావడంతో గెలుపు నిర్ణయించేందుకు అధికారులు టాస్ ఎంచుకున్నారు. కానీ అభ్యర్థులిద్దరూ ససేమిరా అనడమే కాక చెరో రెండున్నర ఏళ్లు సర్పంచ్ పదవి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆపై తొలుత ఎవరు సర్పంచ్గా బాధ్యతలు నిర్వర్తించాలనే అంశం తేల్చేందుకు టాస్ వేయగా మొదటి రెండున్నరేళ్ల అవకాశం బీఆర్ఎస్ అభ్యర్థి వీరస్వామికి దక్కింది. మండలం జీపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ సీపీఎం సీపీఐ ఇతరులు కూసుమంచి 41 28 12 00 00 01 నేలకొండపల్లి 32 20 07 02 00 03 తిరుమలాయపాలెం 40 23 10 02 00 05 ఖమ్మంరూరల్ 21 08 05 04 03 01 ముదిగొండ 25 18 02 05 00 00 కామేపల్లి 24 16 06 00 01 01మొత్తం 183 113 42 13 04 11 -
ఒక ఓటుతో వరించిన విజయం
కూసుమంచి/తిరుమలాయపాలెం: కూసుమంచి మండలంలోని జుజుల్రావుపేట సర్పంచ్గా బీఆర్ఎస్ మద్దతుదారుడు దాట్ల సలీమ్ ఒక్క ఓటుతో గెలుపొందాడు. కాంగ్రెస్ మద్దతుదారు దాట్ల అనూషపై తొలుత మూడు ఓట్లతో ఆయన గెలిచినట్లు అధికారులు ప్రకటించారు. దీనిపై కాంగ్రెస్ అభ్యర్థి అభ్యంతరం తెలపగా మూడు సార్లు రీకౌంటింగ్ నిర్వహించారు. చివరకు సలీమ్ను ఒక ఓటుతో సర్పంచ్ పదవి వరించింది. ●తిరుమలాయపాలెం మండలం తాళ్లచెరువులోనూ ఒక్క ఓటుతో బీఆర్ఎస్ బలపరిచిన గడుపుడి వెంకటనారాయణ సర్పంచ్గా విజయం సాధించారు. వెంకటనారాయణకు 312 ఓట్లు రాగా కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి గడుపుడి వీరభద్రంకు 311 ఓట్లు వచ్చాయి. ఇక్కడ వార్డుల వారీగా బీఆర్ఎస్కు 90 ఓట్ల మెజార్టీ రాగా, బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థికి కాంగ్రెస్ అభ్యర్థి గట్టి పోటీ ఇచ్చినా ఒక్క ఓటుతో పరాజయం పాలయ్యాడు. ●కూసుమంచి మండలం నేలపట్ల గ్రామపంచాయతీలో కూడా రీకౌంటింగ్ నిర్వహించగా కాంగ్రెస్ మద్దతుదారుడు నూకల శోభన్బాబు నాలుగు ఓట్లతో విజయం సాధించాడు. ఇక కూసుమంచి సర్పంచ్గా కాంగ్రెస్ మద్దతుదారు కొండా కృష్ణవేణి వేయి ఓట్ల మెజార్టీతో గెలవగా.. జీళ్లచెరువు కాంగ్రెస్ అభ్యర్థి ఐతగాని వెంకటరమణ 400పై చిలుకు ఓట్లతో విజయం సాధించింది. మునిగేపల్లిలో స్వతంత్ర అభ్యర్థి గంగా స్రవంతి 250 ఓట్లతో విజయం సాధించడం విశేషం. -
ఎన్నికలకు భారీ బందోబస్తు
పోలింగ్, కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించిన సీపీ సునీల్దత్ఖమ్మంక్రైం: జిల్లాలో రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా ఖమ్మం రూరల్ మండలం కామంచికల్లు, తీర్థాల, గోళ్లపాడు, ముదిగొండ, నేలకొండపల్లి, ముజ్జుగూడెం, రాజేశ్వరపురం, కూసుమంచి, జల్లేపల్లి, దమ్మాయిగూడెం, తిరుమలాయపాలెం గ్రామాల్లో పోలింగ్ను సీపీ సునీల్దత్ పరిశీలించి భద్రతపై ఉద్యోగులకు సూచనలు చేశారు. అలాగే, ఓట్ల లెక్కింపు సందర్భంగా ఆదివారం సాయంత్రం ఖమ్మం రూరల్ మండలం మంగళగూడెం, కూసుమంచి మండలం చేగొమ్మ గ్రామాల్లో సీపీ పర్యటించారు. గ్రామస్తులు చిన్నచిన్న విషయాల్లో గొడవ పడకుండా సమన్వయం పాటించాలని సూచించారు. ఇక గంధసిరి, చేగొమ్మ, చెరువుమాధారం, తల్లంపాడులో పోలింగ్ కేంద్రాలను అడిషనల్ డీసీపీ పరిశీలించారు. -
క్షణక్షణం అప్రమత్తంగా..
ఖమ్మం సహకారనగర్: జిల్లాలో రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. ఈ విడత ఎన్నికలు ఆరు మండలాల్లో జరగ్గా క్రిటికల్ పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాిస్టింగ్ ఏర్పాటుచేసినట్లు వెల్లడించారు. అక్కడ సీసీ కెమెరాల ద్వారా ప్రతీ అంశాన్ని కలెక్టరేట్లోని వెబ్ కాస్టింగ్ మానిటరింగ్ సెల్ నుంచి పరిశీలించామని కలెక్టర్ తెలిపారు. ఇదిలా ఉండగా మానిటరింగ్ సెల్లోని ఉద్యోగులు కూడా సమస్యాత్మక కేంద్రాల్లో పోలింగ్ను పరిశీలిస్తూ అక్కడి సిబ్బందికి అవసరమైన సూచనలు చేశారు. డీఆర్ఓ ఏ.పద్మశ్రీ, సీపీఓ ఏ.శ్రీనివాస్, కలెక్టరేట్ ఏఓ కె.శ్రీనివాసరావు పాల్గొన్నారు. మానిటరింగ్ సెల్ నుంచి పర్యవేక్షించిన కలెక్టర్ -
తుది విడతకు నేటితో తెర
● ఎన్నికల ప్రచారానికి కొద్దిగంటలే... ● చివరిరోజు అందరినీ కలిసేలా అభ్యర్థుల ప్రణాళికసాక్షిప్రతినిధి, ఖమ్మం: జిల్లాలో మూడో విడత ఎన్నికలు జరిగే ఏడు మండలాల్లో సోమవారం సాయంత్రం 5గంటలతో ప్రచారం ముగియనుంది. ఏన్కూరు, కల్లూరు, పెనుబల్లి, సత్తుపల్లి, తల్లాడ, వేంసూరు, సింగరేణి మండలాల్లో ఏకగ్రీవాలు, ఉపసంహరణ అనంతరం బరిలో మిగిలిన సర్పంచ్, వార్డుస్థానాల అభ్యర్థులు ప్రచారాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. ప్రచారం ముగిశాక కూడా ఓటర్లను మెప్పించేలా ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు. 168 జీపీల్లో ఎన్నికలు మూడో విడత ఎన్నికలు జరిగే మండలాల్లో 191 సర్పంచ్ స్థానాలు, 1,742 వార్డులు ఉన్నాయి. అయితే ఏన్కూరు మండలం నూకాలంపాడు గ్రామపంచాయతీ ఎస్టీలకు రిజర్వ్ అయినా అక్కడ ఎస్టీ ఓటర్లు లేకపోవడంతో నామినేషన్లు దాఖలు కాలేదు. మరో 22గ్రామపంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. అలాగే, 1,742 వార్డులకు గాను తొమ్మిది వార్డులకు నామినేషన్లు దాఖలు కాలేదు. ఇంకో 361 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. దీంతో మొత్తం 168 సర్పంచ్ స్థానాలు, 1,372 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి పోటాపోటీగా.. బరిలో ఉన్న అభ్యర్థులు గ్రామపంచాయతీల్లో పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎక్కడా తగ్గేదే..లే అన్న రీతిలో ఓటర్లను ఆకట్టుకోవడంలో నిమగ్నమయ్యారు. కొందరు ఇంటింటికి వెళ్లి ఓటర్లను కలిసి అనుబంధాలను గుర్తు చేస్తూ తమకు ఓటు వేయాలని సెంటిమెంట్తో అభ్యర్థిస్తున్నారు. మరికొందరు అభ్యర్థులు యువ ఓటర్లను ఆకట్టుకునేలా వినూత్న రీతిలో ప్రచారం చేపట్టారు. పోస్టర్లు, డోర్ స్టిక్కర్లపై తమ గుర్తు ముద్రించడమే కాక వాహనాల్లో మైకులు అమర్చి ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. తెరచాటు ప్రయత్నాలు ఎన్నికల ప్రచారం గడువు సోమవారంతో ముగియనుంది. ఇన్నాళ్లు ఓట్లను రాబట్టుకునేలా ప్రచారాన్ని నమ్ముకోగా.. ఇకపై అభ్యర్థులకు మద్దతు ఇస్తున్న పార్టీల నాయకులు గెలుపు కోసం వ్యూహ రచన చేస్తున్నాయి. ఇందులో భాగంగా ప్రత్యర్థి పార్టీల్లోని వ్యక్తులను తమ వైపు తిప్పుకునేందుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నారు. అలాగే, సాధారణ ఎన్నికల స్థాయిలో డబ్బు, మద్యం ఏరులై పారిస్తున్నారు. పోటీ ఎక్కువగా ఉన్న జీపీల్లో ఓటుకు రూ.వేయి, కొన్నిచోట్ల అంతకు మించి పంచేందుకు అభ్యర్థులు సిద్ధమైనట్లు తెలుస్తోంది. -
తీవ్ర విషాదం.. సర్పంచ్ అభ్యర్థి మృతి
సాక్షి, నేలకొండపల్లి: ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం అనాసాగరంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామపంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ గా పోటీ చేసిన ఇండిపెండెంట్ అభ్యర్థి దామల నాగరాజు మృతి చెందారు. నామినేషన్ వేసిన అనంతరం అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. వైద్యులు అతను బ్రెయిన్ డెడ్ తో మృతి చెందాడని నిర్దారించడంతో, కుటుంబ సభ్యులు మృతదేహాన్ని ఇంటికి తరలించారు. నాగరాజు కు ఎన్నికల్లో ఉంగరం గుర్తును కేటాయించారు. ఎన్నికల రోజే ఇండిపెండెంట్ అభ్యర్థి మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.తెలంగాణలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ఆదివారం ప్రారంభమయ్యాయి. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరగనుంది. 3,911 సర్పంచ్ పదవులకు పోటీలో 12,782 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. 29,917 వార్డులకు బరిలో 71,071 మంది అభ్యర్థులు నిలుచున్నారు. ఇప్పటికే 415 సర్పంచ్ స్థానాలు, 8,307 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. రెండోదశ పంచాయతీ ఎన్నికల్లో ఒక్కో సర్పంచ్ పదవికి సగటున ముగ్గురు, నలుగురు బరిలో నిలవగా, వార్డు సభ్యస్థానాలకు సగటున ఇద్దరు, ముగ్గురు పోటీపడుతున్నారు.మరోవైపు రెండోదశ ఎన్నికల వరకు రూ. 2.02 కోట్ల నగదు, రూ. 3.46 కోట్ల విలువైన మద్యం, రూ. 2.28 కోట్ల విలువైన డ్రగ్స్ సహా మొత్తంగా రూ. 8.59 కోట్ల విలువైన మొత్తాన్ని స్వా«దీనం చేసుకున్నట్లు ఎస్ఈసీ వెల్లడించింది. మొత్తం 3,675 ఎఫ్ఐఆర్లు నమోదు చేసి ముందుజాగ్రత్తగా 33,262 మందిని బైండోవర్ చేశామని తెలిపింది. -
అయ్యప్ప భక్తులకు ఆర్టీసీ బస్సులు
భద్రాచలంఅర్బన్: అయ్యప్ప మాలధారులు శబరిమల వెళ్లేందుకు ఆర్టీసీ బస్సులను అద్దెకు ఇస్తోంది. ఉమ్మడి జిల్లాలోని ఖమ్మం, సత్తుపల్లి, మధిర, భద్రాచలం, కొత్తగూడెం, మణుగూరు డిపోల నుంచి బస్సులు బుక్ చేసుకునే సదుపాయం ఉంది. 36 సీట్లు ఉండే సూపర్ లగ్జరీ, 40 సీట్లు ఉండే డీలక్స్, 49 సీట్లు ఉండే ఎక్స్ప్రెస్ బస్సులతో పాటు రాజధాని బస్సులను అద్దెకు ఇవ్వనున్నారు. కిలోమీటర్కు డీలక్స్ బస్సుకు రూ. 57, లగ్జరీ బస్సుకు రూ.59, ఎక్స్ప్రెస్ బస్సుకు రూ.68, ఏసీ రాజధాని బస్సుకు రూ.77 చొప్పున అద్దె చెల్లించాలని అధికారులు తెలిపారు. స్వాములు వంట సామగ్రి తీసుకెళ్లే వెసులుబాటు కూడా కల్పించారు. ప్రయాణించే కిలోమీటర్ల ఆధారంగా అడ్వాన్స్ చెల్లించాల్సి ఉంటుంది. అన్ని బస్సులకు వెయిటింగ్ చార్జి గంటకు రూ.300గా నిర్ణయించారు. ఒక బస్సు బుక్ చేస్తే గురుస్వామితోపాటు ఇద్దరు వంట మనుషులు, ఇద్దరు మణికంఠ స్వాములు, అటెండర్కు చార్జి మినహాయింపు ఉంటుంది. ఒకటి కంటే ఎక్కువ బస్సులు బుక్ చేస్తే గురుస్వామికి రోజుకు రూ.300 చొప్పున కమీషన్ చెల్లించనున్నారు. ఒక్కో బస్సుకు ఇద్దరు డ్రైవర్లను కేటాయించనున్నారు. బస్సుల కోసం డిపోమేనేజర్లను సంప్రదించాలని, ఇతర తీర్థయాత్రలకూ బస్సులు ఏర్పాటుచేస్తామని అధికారులు తెలిపారు.అద్దెకు ఇస్తున్న యాజమాన్యం శబరిమల యాత్ర భక్తుల కోసం బస్సులను అద్దెకు ఇస్తున్నాం. కిలోమీటరు చొప్పున, వెయిటింగ్ సమయాన్ని లెక్కగట్టి తగిన ధర నిర్ణయిస్తాం. ఈ అవకాశాన్ని అయ్యప్ప స్వాములు సద్వినియోగం చేసుకోవాలి. – జంగయ్య, ఆర్టీసీ డిపో మేనేజర్, భద్రాచలం -
ప్రలోభాలకు గురిచేస్తే ఫిర్యాదు చేస్తా!
నేలకొండపల్లి: పంచాయతీ ఎన్నికల సందర్భంగా తమను ప్రలోభాలకు గురి చేయాలని చూస్తే ఎన్నికల సంఘం అధికారులకు కు ఫిర్యాదు చేస్తామంటూ ఓ ఇంటి యజమాని ఫ్లెక్సీ ఏర్పాటు చేశాడు. నేలకొండపల్లి మండలం చెరువుమాధారం గ్రామానికి చెందిన కె.సంతోష్ తమ కుటుంబంలోని ఓట్లను అమ్ముకోబోమని... డబ్బు, మద్యం, మాంసం వంటి బహుమతులు ఇవ్వొద్దని, ఒకవేళ బలవంతంగా ఇవ్వాలని ప్రయత్నిస్తే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. ఈ వివరాలతో ఆయన ఇంటి వద్ద ఏర్పాటుచేసిన ఫ్లెక్సీ ఏర్పాటుచేయగా పలువురు ఆసక్తిగా పరిశీలిస్తున్నారు. ఎన్నికల అఽధికారి బెదిరించాడని ఫిర్యాదు మధిర: మండలంలోని పరిధిలోని వంగవీడు గ్రామపంచాయతీ ఎన్నికల అధికారిగా వ్యవహరించిన వేల్పుల జయరాజ్పై బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి దొండపాటి నాగమణి మఽధిర రూరల్ పోలీసుకు శనివారం ఫిర్యాదు చేశారు. ఈనెల 11న జరిగిన పోలింగ్లో తనకు మూడు ఓట్ల మెజార్టీ రాగా కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి సిద్దిపోగు ప్రసాద్ రీకౌంటింగ్ కోరారని ఆమె వెల్లడించింది. రీకౌంటింగ్లోనూ తనకు మెజార్టీ వచ్చినా జయరాజ్ ఏకపక్షంగా వ్యవహరిస్తూ కాంగ్రెస్ అభ్యర్థి నాలుగు ఓట్ల మెజార్టీతో గెలిచినట్లు ప్రకటించాడని తెలిపారు. శనివారం ఉదయం ఆయన తన ఇంటి వద్దకు వచ్చి ఎంపీడీఓ కార్యాలయంలో బ్యాలెట్ బాక్సులను తెరిచి మళ్లీ ఓట్లు లెక్కిస్తానని చెప్పడంతో వెళ్తుండగా మార్గమధ్యలో బెదిరించాడని వాపోయింది. ఓటమిని అంగీకరిస్తూ సంతకం పెట్టాలని బెదిరించినట్లు ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. -
ఓసీల్లో మహిళా ఆపరేటర్లు
కొత్తగూడెంఅర్బన్: సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల్లో తొలిసారిగా మహిళా ఆపరేటర్లు అడుగుపెట్టనున్నారు. ఆఫీస్ విధులకే పరిమితమైన మహిళలు ఇక నుంచి యంత్రాలతో బొగ్గు తవ్వకాలు చేపట్టడంతోపాటు రవాణా చేయనున్నారు. ఇందుకోసం సంస్థ సీఎండీ బలరాం చొరవ తీసుకున్నారు. జనరల్ అసిస్టెంట్లు, బదిలీ వర్కర్లుగా పని చేస్తున్న మహిళల నుంచి గత సెప్టెంబర్లో దరఖాస్తులు ఆహ్వానించగా, ఓసీల్లో పనిచేసేందుకు 43 మంది ముందుకువచ్చారు. ప్రస్తుతం వారికి సింగరేణి ప్రధాన కార్యాలయంలో ఇంటర్వ్యూలు, ప్రధాన ఆస్పత్రిలో మెడికల్ టెస్టులు చేస్తున్నారు. ఆ తర్వాత సిరిసిల్లలోని తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డ్రైవింగ్ ఎడ్యుకేషన్ అండ్ స్కిల్స్ సంస్థలో హెవీ గూడ్స్ వెహికల్, హెవీ మోటార్ వెహికల్ విభాగంలో 30 రోజుల శిక్షణ ఇవ్వనున్నారు. ఆ తర్వాత ఖాళీల లభ్యత ఆధారంగా ఈపీ ఆపరేటర్ ట్రైనీ కేటగిరీ–5 డిసిగ్నేషన్తో పోస్టింగ్ ఇవ్వనున్నారు. అనుకూలమైన యంత్రాలు.. ఓసీల్లో డోజర్లు మహిళా ఆపరేటర్లు పనిచేసేందుకు అనువుగా ఉంటాయని అధికారులు చెబుతున్నారు. తక్కువ వైబ్రేషన్ ఉండటంతో సులభంగా ఆపరేట్ చేసేందుకు వీలుగా ఉంటాయి. రోడ్లను లెవలింగ్ చేసేందుకు ఓసీల్లో గ్రేడర్లను, దుమ్ము, ధూళి లేవకుండా వాటర్ ట్యాంకర్లను వినియోగిస్తారు. బరువులు ఎత్తడానికి హైడ్రాలిక్ క్రేన్లను ఉపయోగిస్తారు. 35 నుంచి 60 టన్నుల సామర్థ్యం కలిగిన చిన్న డంపర్లు కూడా ఉన్నాయి. ఆయా యంత్రాల్లో ఆటోమేటిక్ వ్యవస్థ, పవర్ స్టీరింగ్ వంటి సౌకర్యాలు ఉండటంతో మహిళలు సులభంగా పనిచేయవచ్చని అధికారులు పేర్కొంటున్నారు. మైనింగ్ జోన్లలో సేఫ్టీ రెస్పాన్స్ వాహనాలుగా ఉండే అంబులెన్స్లు కూడా మహిళా డ్రైవర్లు నడపవచ్చు. స్టాకర్ రిక్లైయిమర్, కన్వేయర్ సిస్టమ్, క్రషర్ ఆపరేటర్ వంటివి జాయ్స్టిక్, బటన్లతో నడిపే యంత్రాలపై మహిళలు తేలికగా పనిచేయవచ్చని సింగరేణి అధికారులు చెబుతున్నారు. ఒత్తిడి, శక్తి వినియోగంలేని యంత్రాలతో పని -
పెద్దమ్మతల్లి ఆలయంలో నేటి నుంచి పవిత్రోత్సవాలు
పాల్వంచరూరల్ : పాల్వంచ మండల పరిధిలో కొలువుదీరిన శ్రీ పెద్దమ్మతల్లి ఆలయంలో ఆదివారం నుంచి 16వ తేదీ వరకు పవిత్రోత్సవాలు నిర్వహించనున్నట్లు ఈఓ ఎన్.రజనీకుమారి ఒక ప్రకటనలో తెలిపారు. దేవాలయ పవిత్రత, భక్తుల శ్రేయస్సు కోసం ఈ ఉత్సవాలు జరుపుతున్నామని, భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారి కృపకు పాత్రులు కావాలని ఆమె కోరారు. ఏఐఎఫ్టీపీ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా సైదులు ఖమ్మంగాంధీచౌక్: ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ టాక్స్ ప్రాక్టీషనర్స్(ఏఐఎఫ్టీపీ) జాతీయ కార్యవర్గ సభ్యుడిగా జిల్లాకు చెందిన ఉల్లిబోయి న సైదులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బెంగళూరులో నిర్వహించిన సమావేశంలో ఈ ఎన్నిక జరిగింది. కాగా, సైదులు 2019లో జిల్లా జీఎస్టీ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ ఫౌండర్గా, జనరల్ సెక్రటరీగా రెండుసార్లు, వైస్ ప్రెసిడెంట్గా ఒకసారి బాధ్యతలు నిర్వర్తించారు. ప్రస్తుతం ఆయన జాతీయ కార్యవర్గ సభ్యుడిగా ఎన్నికవడంపై పలువురు అభినందించారు. యువకుడి ఆత్మహత్యాయత్నం సత్తుపల్లిరూరల్: వ్యక్తిగత కారణాలతో ఓ యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. సత్తుపల్లి మండలం కొమ్ముగూడెంకు చెందిన సోయం అజయ్ కలుపు మందు తాగగా, కుటుంబీకులు ఇచ్చిన సమాచారంతో 108 సిబ్బంది చేరుకుని బాధితుడిని సత్తుపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే, అజయ్ ఆత్మహత్యాయత్నానికి కారణాలు తెలియరాలేదు. అదనపు సెషన్స్ కోర్టు ఏర్పాటు చేయండిభద్రాచలంఅర్బన్: భద్రాచలంలో అదనపు సెషన్స్ కోర్టు ఏర్పాటు చేయాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కాజా శరత్ను బార్ అసోసియేషన్ సభ్యులు కోరారు. ఈ మేరకు సారపాక ఐటీసీ గెస్హౌస్లో వారు న్యాయమూర్తికి శనివారం వినతిపత్రం అందజేశారు. భద్రాచలం, మణుగూరు ప్రాంతాల నుంచి 600 పైగా సెషన్స్ ట్రయల్ కేసులు కొత్తగూడెంలో పెండింగ్ ఉన్నాయని, ఏజెన్సీ ప్రాంతంలో నివసించే నిరుపేదలు అంతదూరం వెళ్లాలంటే ఆర్థిక భారం అవుతోందని వివరించారు. గిరిజనులకు సత్వర న్యాయం అందించాలంటే భద్రాచలంలో అదనపు సెషన్స్ కోర్టు అవసరమని జడ్జి దృష్టికి తీసుకెళ్లారు. లేదంటే కొత్తగూడెం నుంచి ఒక అదనపు సెషన్స్ కోర్టును భద్రాచలానికి మార్చాలని కోరారు. వినతిపత్రం అందించిన వారిలో భద్రాచలం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కోటా దేవదానం, ఉపాధ్యక్షుడు సున్నం రమేష్, జనరల్ సెక్రటరీ పుసాల శ్రీనివాస్, న్యాయవాదులు కొడాలి శ్రీనివాసన్, టి.చైతన్య, మోహన్కృష్ణ, బి.రామకృష్ణ తదితరులు ఉన్నారు. -
బకాయిదారులకు రెడ్నోటీస్లు
● కేఎంసీ పరిధిలో పన్నుల వసూళ్లపై దృష్టి ● వంద శాతం ఆదాయం నమోదుకు కార్యాచరణ ● క్షేత్రస్థాయికి వెళ్లేలా సిబ్బందికి ఆదేశాలుఖమ్మంమయూరిసెంటర్: ఖమ్మం ము న్సిపల్ కార్పొరేషన్ (కేఎంసీ) పరిధిలో పన్ను బకాయిలు వంద శాతం వసూలు చేసేలా అధికారులు దృష్టి సారించారు. ఆర్థిక సంవత్సరం ముగింపు వరకు వేచి చూడకుండా ముందుగానే పన్నులు వసూలు చేసేందుకు కార్యాచరణ చేపట్టారు. కేఎంసీ ఖజానా ఖాళీ అవుతుండడం, ఇదిలాగే కొనసాగితే ఉద్యోగుల వేతనాలతో పాటు ఇతర ఖర్చులకు ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉన్నందున ఆస్తి పన్నుల వసూళ్లలో వేగం పెంచారు. ఇప్పటికే వార్డు ఆఫీసర్లు, బిల్లు కలెక్టర్లకు సహాయకులను ఏర్పాటు చేశారు. వీరు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ బకాయిదారులకు రెడ్నోటీసులు జారీ చేస్తున్నారు. కమిషనర్ ఆదేశాలతో.. పన్నుల వసూళ్లలో పురోగతి లేకపోవడంతో నేరుగా కార్పొరేషన్ కమిషనర్ అభిషేక్ అగస్త్య రంగంలోకి దిగారు. వసూళ్ల బాధ్యతలో ఉన్న ఉద్యోగులు కార్యాలయాన్ని వదిలిపెట్టి క్షేత్రస్థాయిలోకి వెళ్లాలని ఆదేశించారు. ఉద్యోగులు ఫీల్డ్లో ఉండడమే కాక రోజువారీ వసూళ్లు వివరాలు తెలపాలని స్పష్టం చేయడంతో అటు రెవెన్యూ అధికారులు, ఇటు సిబ్బందిలో కదలిక వచ్చింది. బకాయిదారుల గుర్తింపు అధికారులు ప్రస్తుతం పన్నుల వసూళ్లతో పాటు, భారీగా బకాయిలు ఉన్న వారిని గుర్తించడంలో నిమగ్నమయ్యారు. భారీగా బకాయిలు ఉండి, ఏళ్ల తరబడి పన్నులు చెల్లించని వారి జాబితా సిద్ధం చేస్తున్నారు. ఇప్పటి వరకు 250 మందిని గుర్తించిన అధికారులు వారిలో 40 మందికి రెడ్నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. నోటీసుల జారీ తర్వాత కూడా పన్ను కట్టని వారిపై మున్సిపల్ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఏదిఏమైనా బకాయిదారులపై ఒత్తిడి పెంచి పన్నులు రాబట్టడమే లక్ష్యంగా ఉద్యోగులు కృషి చేస్తున్నారు. కేఎంసీ ఖజానా అడుగంటడంతో ప్రస్తుతం ఉద్యోగులు, సిబ్బంది, కార్మికులకు వేతనాలు, పారిశుద్ద్య వాహనాలకు ఇంధన ఖర్చులు మాత్రమే చెల్లిస్తున్నారు. అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులు, ఈఎండీలు, ఎఫ్ఎస్డీ వంటి బిల్లులను చెల్లించలేని పరిస్థితి నెలకొంది. ఇంకొన్ని రోజు లు ఇలాగే గడిస్తే వేతనాలు, పారిశుద్ద్య ఖర్చులకు కూడా నిధులు వెచ్చించలేని పరిస్థితి ఎదురయ్యే ప్రమాదాన్ని గుర్తించిన అధికారులు పన్ను వసూళ్లే మార్గమని భావించారు. ఈమేరకు కార్యాలయంలో అదనంగా ఉన్న సిబ్బందిని సహాయకులుగా నియమించి వసూళ్లలో వేగం పెంచేలా పర్యవేక్షిస్తున్నారు. ఖాళీగా ఉన్న సిబ్బందితో పాటు పలు విభాగాల్లోని కొందరు కంప్యూటర్ ఆపరేటర్లను సైతం వార్డు ఆఫీసర్లు, బిల్ కలెక్టర్లకు సహాయకులుగా నియమించారు. అయితే, ఇందులో కొందరు క్షేత్రస్థాయికి వెళ్లకుండా కార్యాలయంలోనే ఉండేలా ప్రజాప్రతినిధులతో పైరవీలు చేయిస్తున్నట్లు తెలిసింది. -
రామయ్యకు సువర్ణ తులసీ అర్చన
భద్రాచలంటౌన్: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి శనివారం సువర్ణ తులసీ అర్చన నిర్వహించారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాతసేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేనపూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. వివిధ ప్రాంతాల భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. నిత్యాన్నదానానికి విరాళంశ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో జరిగే శాశ్వత నిత్యాన్నదాన కార్యక్రమానికి హైదరాబాద్ కూకట్పల్లికి చెందిన శ్రీరామాంజనేయరెడ్డి – శారద దంపతులు రూ.1,00,116 చెక్కును ఆలయ అధికారులకు శనివారం అందజేశారు. ఈ సందర్భంగా దాత కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. అనంతరం ఆలయ అధికారులు స్వామివారి ప్రసాదం, జ్ఞాపిక అందజేశారు. రామయ్యను దర్శించుకున్న ఆండవన్స్వామి.. శ్రీరంగంలోని శ్రీ పౌండరీపుర స్వామి ఆశ్రమానికి చెందిన ఆండవన్ స్వామి శనివారం శ్రీ సీతారామచంద్రస్వామి వారిని దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అర్చకులు, ఆలయ ఈఓ దామోదర్రావు దంపతులు మర్యాదపూర్వకంగా స్వాగతం పలికారు. అనంతరం స్వామివారి మూలవిరాట్ వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. పంట ధ్వంసం చేసిన వ్యక్తిపై కేసు రఘునాథపాలెం: మొక్కజొన్న పంటను ధ్వంసం చేశారంటూ అందిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసినట్లు రఘునాథపాలెం సీఐ ఉస్మాన్ షరీఫ్ తెలిపా రు. మండలంలోని వీ.వీ.పాలెంకు చెందిన చండ్ర రమేష్ తనకు చెందిన రెండెకరాల్లో మొక్కజొన్న సాగుచేస్తున్నాడు. అదేగ్రామానికి చెందిన కుతుంబాకు రాంప్రసాద్ దున్నించి పంటను ధ్వంసం చేశాడని శనివారం రమేష్ ఫిర్యాదు చేయగా కేసు నమో దు చేసినట్లు సీఐ తెలిపారు. -
17ఏళ్ల అనంతరం కుటుంబం చెంతకు...
ఖమ్మంఅర్బన్: కొడుకు దూరమయ్యాడనే బెంగతో కన్నీరుమున్నీరైన తల్లిదండ్రులు కన్నుమూశారు. అలా 17ఏళ్లు గడిచాక ఆ వ్యక్తి కుటుంబం చెంతకు చేరగా.. చనిపోయాడని భావించిన వ్యక్తి తిరిగిరావడంతో వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. వివరాలు... ఈ ఏడాది ఆగస్టులో మహబూబాబాద్ జిల్లా గార్లలో మతిస్థిమితం కోల్పోయిన వ్యక్తి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తుండగా అక్కడి పోలీసులు ఖమ్మంలోని అన్నం సేవా ఫౌండేషన్కు అప్పగించారు. దీంతో ఫౌండేషన్ చైర్మన్ అన్నం శ్రీనివాసరావు ఆధ్వర్యాన ఆయనకు చికిత్స చేయిస్తుండగా ఇటీవల కోలుకున్నా డు. తన పేరు షేక్ నయీం అని, మహారాష్ట్ర రాష్ట్రం అమరావతి జిల్లా చమన్నగర్ వాసినని చెప్పగా అక్కడి పోలీసులను సంప్రదించి వారి ద్వారా కుటుంబం ఆచూకీ తెలుసుకున్నారు. దీంతో శనివా రం నయీం అన్న షేక్హసన్ తదితరులు ఖమ్మం రావడంతో శ్రీని వాసరావు వారికి అప్పగించాడు. కాగా, షేక్ నయీం ట్రాక్టర్ నడుపుతూ జీవనం సాగించేవాడని, పెళ్లయిన కొన్నాళ్లకే భార్య వదిలేసి వెళ్లడంతో మతిస్థిమితం కోల్పోయిన ఆయన ఇంటి నుంచి వెళ్లిపోయాడని కుటుంబీకులు తెలిపారు. ఈక్రమాన తల్లిదండ్రులు బెంగతో కన్నుమూశారని, ఇప్పుడు అన్నం సేవా ఫౌండేషన్ చొరవతో నయీం తమకు దక్కాడని ఆయన సోదరుడు సంతోషం వ్యక్తం చేశాడు. -
మలివిడతకు రెడీ
రెడ్నోటీసులు... ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో వంద శాతం పన్ను వసూళ్లే లక్ష్యంగా బకాయిదారులకు రెడ్నోటీసులు జారీ చేస్తున్నారు. జిల్లాలో రెండోవిడత గ్రామపంచాయతీ ఎన్నికలు ఆదివారం జరగనున్నాయి. కామేపల్లి, ఖమ్మం రూరల్, కూసుమంచి, ముదిగొండ, నేలకొండపల్లి, తిరుమలాయపాలెం మండలాల్లో ఏకగ్రీవాలు పోగా మిగతా సర్పంచ్ స్థానాలు, వార్డుల్లో పోలింగ్కు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ నిర్వహించాక, ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు. ఆ తర్వాత ఉప సర్పంచ్ల ఎన్నిక ఉంటుంది. – సాక్షిప్రతినిధి, ఖమ్మంఆదివారం శ్రీ 14 శ్రీ డిసెంబర్ శ్రీ 2025బ్యాలెట్ పేపర్లు సరి చూసుకుంటున్న సిబ్బంది160 జీపీలు.. 1,379 వార్డుల్లో పోలింగ్ రెండో విడతగా 183 గ్రామపంచాయతీలు, 1,686 వార్డుల్లో ఎన్నికకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. గతనెల 30 నుంచి ఈనెల 2వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించారు. సర్పంచ్ స్థానాలకు 1,055, వార్డులకు 4,160 నామినేషన్లు దాఖలు కాగా 19 గ్రామపంచాయతీల్లో సర్పంచ్లతోపాటు వార్డుస్థానాలు కూడా ఏకగ్రీవమయ్యాయి. అలాగే, నాలుగు జీపీల్లో సర్పంచ్ స్థానాలే ఏకగ్రీవం అయ్యాయి. దీంతో 23 స్థానాలు పోగా 160 సర్పంచ్ స్థానాలకు ఎన్నిక జరగనుంది. ఇక ఏకగ్రీవమైన 306 వార్డులు, నామినేషన్లు దాఖలు కాని ఒక వార్డు మినహా 1,379 వార్డులకు ఎన్నికలు జరుగుతాయి. సర్పంచ్ స్థానాలకు 451 మంది, వార్డులకు 3,352 మంది పోటీ పడుతున్నారు. మొత్తం 1,526 కేంద్రాలకు గాను 304 క్రిటికల్ పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ ద్వారా పర్యవేక్షించనుండగా, ఓటర్లకు సౌకర్యాలు కల్పించారు. ఫ్లయింగ్ స్క్వాడ్, సర్వై లెన్స్ సహా 1,526 బృందాలు ఎన్నికల నిర్వహణను పర్యవేక్షిస్తాయి. ఉద్యోగులకు సామగ్రి పంపిణీ మండల స్థాయిలో 20కేంద్రాల ద్వారా సిబ్బందికి బ్యాలెట్ బాక్స్లు, బ్యాలెట్ పత్రాలు, ఇతర సామగ్రిని శనివారం అందజేశారు. పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది వెళ్లిరావడానికి బస్సులు కేటాయించారు. కూసుమంచి, కామేపల్లిల్లో ఏర్పాటు చేసిన పంపిణీ కేంద్రాలను కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, ముదిగొండ, నేలకొండపల్లిల్లో అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ పరిశీలించారు. ఖమ్మంరూరల్ మండలంలోని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను పోలీస్ కమిషనర్ సునీల్దత్ పరిశీలించి ఉద్యోగులకు దిశానిర్దేశం చేశారు. పోలింగ్.. ఆ వెంటనే కౌంటింగ్ గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ అనంతరం మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. లెక్కింపు సజావుగా, పారదర్శకంగా జరిగేలా ఉద్యోగులకు శిక్షణ ఇచ్చారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద తాత్కాలిక స్ట్రాంగ్రూమ్లు ఏర్పాటుచేయడంతో పాటు సీసీ టీవీలు బిగించారు. పోలింగ్ పూర్తి కాగానే బ్యాలెట్ బాక్స్లు, ఇతర సామగ్రిని స్ట్రాంగ్రూమ్లో భద్రపర్చి, రెండు గంటల నుంచి ఓట్లు లెక్కిస్తూ ఫలితాలను ప్రకటిస్తారు. భారీ భద్రత పోలింగ్ సందర్భంగా అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా రెండు వేల మంది పోలీసులతో భద్రత ఏర్పాట్లు చేశారు. జిల్లా పోలీసులతో పాటు ప్రత్యేక బలగాలు కూడా చేరుకున్నాయి. భద్రతను అడిషనల్ డీసీపీలు పర్యవేక్షిస్తూ స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్, రూట్మొబైల్ పార్టీలు, ఐదు ఎఫ్ఎస్టీ బృందాలు, 15 ఎస్ఎఫ్టీ బృందాల ద్వారా నిఘా వేయనున్నారు. మొత్తంగా 304 కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించి వెబ్కాస్టింగ్కు ఏర్పాటు చేశారు. అలాగే, 77 పోలింగ్ కేంద్రాల్లో నామినేషన్ల దాఖలు నుంచే నిఘా పెంచారు. -
స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోండి
● క్రిటికల్ కేంద్రాల్లో ప్రత్యక్ష పర్యవేక్షణ ● కలెక్టర్ అనుదీప్ దురిశెట్టికూసుమంచి/కామేపల్లి: జిల్లాలో రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేశామని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. ఈమేరకు ప్రజలు స్వేచ్ఛగా ఓటుహక్కు వినియోగించుకోవాలని సూచించారు. రెండో విడత గ్రామపంచాయతీల్లో ఆదివారం పోలింగ్ జరగనుండగా కూసుమంచి జెడ్పీ ఉన్నత పాఠశాల, కామేపల్లిలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఉద్యోగులకు సామగ్రి పంపిణీని శనివారం ఆయన పరిశీలించి మాట్లాడారు. ఖమ్మం రూరల్, కూసుమంచి, ముదిగొండ, నేలకొండపల్లి, తిరుమలాయపాలెం, కామేపల్లి మండలాల పరిధిలోని సర్పంచ్, వార్డుమెంబర్ స్థానాలకు పోలింగ్ జరగనుందని తెలిపారు. ఉదయం ఏడు నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ నిర్వహిస్తామని, నిర్ణీత సమయంలో ఓటర్లు కేంద్రాలకు రావాలని సూచించారు. సమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించి కట్టుదిట్టమైన భద్రత కల్పించినట్లు తెలిపారు. కాగా, ఉద్యోగులు పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా ఏర్పాట్లు చేసుకుని, లోటుపాట్లు, గందరగోళానికి తావివ్వకుండా విధులు నిర్వర్తించాలని సూచించారు. ఎన్నికల అధికారులు వెబ్కాస్టింగ్ ద్వారా పోలింగ్ సరళిని పరిశీలిస్తూ అవసరమైతే సూచనలు చేస్తారని తెలిపారు. మధ్యాహ్నం ఒంటి గంటకు పోలింగ్ ముగియగానే రెండు గంటలకు లెక్కింపు మొదలుపెట్టి ఫలితాలు వెల్లడించాలని, ఆతర్వాత ఉప సర్పంచ్ ఎన్నిక పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమాల్లో మండలాల ప్రత్యేక అధికారులు ఎం.వీ.మధుసూదన్, శ్రీలత, ఖమ్మం ట్రాఫిక్ ఏసీపీ బి. నివాసులు, తహసీల్దార్లు సుధాకర్, రవికుమార్, ఎంపీడీఓలు రవీందర్, జశ్వంత్కుమార్, ఎంఈఓ వెంకట్ తదితరులు పాల్గొన్నారు. -
విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదు..
ఖమ్మంక్రైం: ఎన్నికలు జరిగే మండలాల్లో 163 యాక్ట్ అమల్లో ఉంటుందని పోలీసు కమిషనర్ సునీల్దత్ తెలిపారు. ఈమేరకు ఆయా మండలాల్లో విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదని, ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. రెండో విడత ఎన్నికలు జరగనున్న మండలాల్లోని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను ఆయన పరిశీలించి భద్రతపై ఉద్యోగులకు సూచనలు చేశారు. అనంతరం సీపీ మాట్లాడుతూ రెండో విడత గ్రామపంచాయితీ ఎన్నికల్లో ఓటర్లు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేలా 2వేల మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అంతేకాక 77 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద అడిషనల్ డీసీపీ స్దాయి అధికారులతో పర్యవేక్షణ ఉంటుందని తెలిపారు. కాగా, డబ్బు, మద్యం ప్రభావాన్ని నియంత్రించేలా చేపట్టిన తనిఖీల్లో రూ.22లక్షల నగదు, రూ.12లక్షల విలువ చేసే మద్యాన్ని సీజ్ చేసినట్లు వెల్లడించారు. అలాగే, 1,059 కేసుల్లో 7,129మందిని బైండోవర్ చేశామని తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణకు నాయకులు సహకరించాలని సూచించారు.పోలీసు కమిషనర్ సునీల్దత్ -
శ్రీవారికి ప్రత్యేక పూజలు
ఎర్రుపాలెం: మండలంలోని జమలాపురం శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజామునే ఆలయ ఆవరణలోని స్వామివారి పాదం, మూలవిరాట్కు పంచామృతంతో వేదమంత్రాల నడుమ అభిషేకాలు చేశారు. అనంతరం స్వామి, అమ్మవార్లను పట్టువస్త్రాలతో అలంకరించి పెద్దసంఖ్యలో హాజరైన భక్తుల సమక్షాన కల్యాణం నిర్వహించారు. ఆతర్వాత పల్లకీ సేవ నిర్వహించగా భక్తులు పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ఈఓ జగన్మోహన్రావు, వ్యవస్థాపక ధర్మకర్త ఉప్పల శ్రీరామచంద్రమూర్తి, ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాసశర్మ, సీనియర్ అసిస్టెంట్ సోమయ్య తదితరులు పాల్గొన్నారు. నేడు నెట్బాల్ క్రీడాకారుల ఎంపిక పోటీలు ఖమ్మం స్పోర్ట్స్: సీనియర్స్ విభాగంలో ఉమ్మడి జిల్లాస్థాయి పురుషులు, మహిళల నెట్బాల్ జట్ల ఎంపిక పోటీలు ఆదివారం జరగనున్నాయి. ఖమ్మంలోని సెయింట్ జోసెఫ్ హైస్కూల్లో ఈ పోటీలు జరుగుతాయని నెట్బాల్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి ఎన్.ఫణికుమార్ తెలిపారు. ఆసక్తి ఉన్న క్రీడాకారులు ఆధార్ కార్డు వెంట తీసుకుని ఉదయం 9గంటలకు రిపోర్టు చేయాలని సూచించారు. డేటా ఎంట్రీ ఆపరేటర్ల నూతన కార్యవర్గం ఖమ్మంవ్యవసాయం: ఉమ్మడి జిల్లాలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ డేటా ఎంట్రీ ఆపరేటర్ల నూతన కార్యవర్గాన్ని శనివారం ఎన్నుకున్నారు. ఖమ్మంలో నిర్వహించిన కమిటీ సమావేశంలో మూడేళ్ల కాలానికి ఈ ఎన్నిక జరిగింది. కమిటీ అధ్యక్షుడిగా ఆర్.సంపత్కుమార్, ప్రధాన కార్యదర్శిగా పి.ఉపేందర్, కోశాధికారిగా ఏ.రాము, వర్కింగ్ ప్రెసిడెంట్గా ప్రకాష్ ఎన్నికయ్యారు. అలాగే, ఉపాధ్యక్షులుగా సురేష్, భార్గవ్, సీహెచ్.ప్రభుకిషోర్, సంయుక్త కార్యదర్శులుగా ప్రభుదాస్, కె.కవిత, ప్రియ, ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా కె.ఉమాశంకర్, లోకేష్, వసంత్, ప్రచార కార్యదర్శిగా ఎస్.డీ.గౌసియాబేగం, కార్యవర్గ సభ్యులుగా ఝాన్సీ, సంధ్య, కౌసల్య ను ఎన్నుకున్నారు. ‘నవోదయ’ ప్రవేశ పరీక్షకు 2,995మంది హాజరు కూసుమంచి: ఖమ్మం జిల్లా పాలేరు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని జవహర్ నవోదయ విద్యాలయాల్లో 2026–27 విద్యాసంవత్సరానికి ఆరో తరగతిలో ప్రవేశాల కోసం శనివారం పరీక్ష నిర్వహించారు. ఖమ్మం, భద్రాద్రి జిల్లాలో ఎనిమిది చొప్పున, ములుగు జిల్లా వెంకటాపురంలో ఒక పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటుచేయగా 3,737 మంది విద్యార్థులకు 2,995మంది హాజరయ్యారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో డీఈఓ, సింగరేణిలోని పరీక్షా కేంద్రాన్ని పాలేరు విద్యాలయ ప్రిన్సిపాల్ శ్రీనివాసులు తనిఖీ చేశారు. -
‘వేట’ ముగిసిందా ?!
సత్తుపల్లి: సత్తుపల్లి అర్బన్పార్కులో చుక్కల దుప్పులను తుపాకీతో వేటాడిన ఘటనలో నలుగురిని అరెస్ట్ చేసిన అటవీశాఖ అధికారులు ఆ తర్వాత విచా రణలో మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఇందులో ఇతర వేటగాళ్ల పాత్ర ఉందా.. వారికి ఎవరైనాసహకరించారా అన్న కోణంలో విచారణ ముందుకు సాగడం లేదు. అసలు విచారిస్తున్నారా, లేదా అన్న అంశంపై స్పష్టత లేకపోగా, అధికారులు ఏ అంశాన్ని బయటకు వెల్లడించకపోవడం చర్చకు దారి తీస్తోంది. వెలుగులోకి తీసుకొచ్చిన ‘సాక్షి’ సత్తుపల్లి పార్క్లో దుప్పుల వేట సాగుతోందని, ఓ వ్యక్తి వివాహ విందులో దుప్పి మాంసం వడ్డించారనే సమాచారంతో ‘సాక్షి’లో గతనెల 29న ‘తూటా దూసుకెళ్తోంది..’ శీర్షికన కథనం ప్రచురితమైంది. దీంతో విషయం వెలుగులోకి రాగా వరుస కథనాలు వస్తుండడంతో అటవీ శాఖ అధికారులు ఉరుకులు, పరుగులు పెట్టారు. తొలుత ఇద్దరిని అరెస్ట్ చేయగా, వారం తర్వాత మరో ఇద్దరు లొంగిపోయారని సత్తుపల్లి ఎఫ్డీఓ మంజుల ప్రకటించారు. ఆపై సైలెన్సర్ బిగించిన తుపాకీతో దుప్పులను వేటాడినట్లు గుర్తించామని, తదుపరి చర్యల కోసం రెండు జిల్లాల పోలీసు అధికారులు, భద్రాద్రి జిల్లా అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చినట్లు డీఎఫ్ఓ సిద్ధార్ధ విక్రమ్సింగ్ తెలిపారు. జవాబు లేని ప్రశ్నలెన్నో.. దుప్పులను వేటాడినట్లు నలుగురిని అరెస్ట్ చేయగా, ఇంకా అందులో ఎవరి పాత్ర లేదా అన్న ప్రశ్నకు అటవీశాఖ అధికారుల నుంచి సమాధానం రావడం లేదు. సత్తుపల్లి, దమ్మపేట మండలాల నుంచే కాకుండా ఏపీ నుంచి కూడా కొందరు వేటగాళ్లు వచ్చారనే ప్రచారం జరుగుతున్నా స్పష్టత ఇవ్వడంలేదు. ఐదు దుప్పులనే వేటాడారా.. ఇంకా ఎన్నింటిని హతమార్చారు, ఆ మాంసం ఎక్కడ విక్రయించారనే వివరాలు వేటగాళ్లను రిమాండ్కు తరలించే ముందు తెలుసుకునే అవకాశం ఉన్నా ఆ దిశగా ప్రయత్నాలు చేశారా, లేదా అన్నది తెలియరావడం లేదు. ఇక దుప్పి మాంసాన్ని ఓ వివాహ విందులో వడ్డించినట్లు తెలిసినా, ఎవరెవరు హాజరయ్యారు, ఆ ఫంక్షన్ హాల్ పరిసరాల్లో ఆధారాలు సేకరించారా, హతమార్చిన వన్యప్రాణుల చర్మాలను స్వాధీనం చేసుకున్నారా అన్న ప్రశ్నలకు సమాధానం లభించడం లేదు. కాగా, వేటలో పాల్గొన్న దమ్మపేట మండలం తాటి సుబ్బన్నగూడెంకు చెందిన మెచ్చా రఘు నుంచి రెండు తుపాకులు స్వాధీనం చేసుకోగా, ఆయన లైసెన్స్ను దుర్వినియోగం చేసినట్లుగా పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిసింది. అధికారుల బాధ్యత లేదా? సత్తుపల్లి అటవీశాఖ డివిజన్ పరిధిలో ఎఫ్డీఓ, రేంజర్, ఎఫ్ఎస్ఓ, బీట్ ఆఫీసర్లతో పాటు సుమారు 100 మందికి పైగా విధులు నిర్వర్తిస్తున్నారు. అర్బన్పార్కులో వరుస ఘటనలు జరుగుతున్నా.. ఏ ఒక్కరికి కనీస సందేహం రాకపోవడం గమనార్హం. ఔట్సోర్సింగ్ విధానంలో విధులు నిర్వర్తిస్తున్న వారిపై నిఘా పెట్టడంలో అధికారుల వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నా.. ఎవరిపైనా చర్యలు తీసుకున్నారో వెల్లడించలేదు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను బాధ్యులుగా చేసి విధుల నుంచి తొలగించిన అధికారులు.. రెగ్యులర్ ఉద్యోగులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో తెలియడం లేదు. ఈ అంశంపై సత్తుపల్లి ఎఫ్డీఓ వాడపల్లి మంజులను వివరణ కోరగా.. అంతర్గతంగా అన్ని కోణాల్లో విచారిస్తున్నామని, అది పూర్తయ్యాక వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. -
పోలింగ్కు పకడ్బందీగా ఏర్పాట్లు
నేలకొండపల్లి: రెండో విడతగా ఎన్నికలు జరగనున్న గ్రామపంచాయతీల్లో పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా పంచాయతీ అధికారి ఆశాలత తెలిపారు. మండలంలోని కొత్తకొత్తూరులో సామగ్రి డిస్ట్రిబ్యూసన్ కేంద్రం, పోస్టల్ బ్యాలెట్ కేంద్రాన్ని శుక్రవారం పరిశీలించిన ఆమె మాట్లాడారు. నేలకొండపల్లి మండలంలోని 29 గ్రామపంచాయతీలలో ఆదివారం పోలింగ్ జరగనుండగా, నాలుగు జోన్లు, ఆరు రూట్లుగా విభజించినట్లు తెలిపారు. కొత్తకొత్తూరు ఎస్ఎఫ్ఎస్ పాఠశాలలోని పది కౌంటర్ల ద్వారా ఉద్యోగులకు సామగ్రి పంపిణీ చేసి 27 బస్సుల్లో కేంద్రాలకు తరలిస్తామని వెల్లడించారు. నేలకొండపల్లి ఎంపీడీఓ ఎం.యర్రయ్య, ఎంపీఓ సీ.హెచ్.శివ తదితరులు పాల్గొన్నారు. -
ఒక్కో తీరు
ఒక్కోచోట..సాక్షి ప్రతినిధి, ఖమ్మం: గ్రామపంచాయతీ ఎన్నికల తొలి విడతలో మెజార్టీ స్థానాలు కాంగ్రెస్ మద్దతుదారులకు దక్కినా.. ఒక్కో పంచాయతీలో ఒక్కో తీరుగా ఫలితాలు వెలువడ్డాయి. పార్టీ ప్రభావం, సానుభూతి, అభ్యర్థుల వ్యక్తిత్వం, డబ్బు పంపిణీ తదితర అంశాలు ఫలితాలను తారుమారు చేశాయి. మెజార్టీ పంచాయతీల్లో కాంగ్రెస్ గెలవడానికి అధికారం ‘చేతి’లో ఉండడమే కారణమని విశ్లేషిస్తున్నారు. అయితే, స్థానిక కుంపట్లతో ఆ పార్టీ పలు పంచాయతీలను కోల్పోగా.. ఇంకొన్నిచోట్ల రెబల్స్ విజయఢంకా మోగించారు. వైరాలో కాంగ్రెస్ సత్తా చాటి.. వైరా నియోజవకర్గంలో వైరా, కొణిజర్ల మండలాల్లో 49పంచాయతీలకు గాను 38 చోట్ల కాంగ్రెస్, నాలుగు బీఆర్ఎస్, రెండు సీపీఎం, ఒకటి సీపీఐ మద్దతుదారులు గెలవగా..ఇతరులు నాలుగు పంచాయతీల్లో పాగా వేశారు. మధిర నియోజకవర్గంలోని మండలాలతో పోలిస్తే వైరా, కొణిజర్ల మండలాల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు ఎక్కువ స్థానాల్లో గెలిచారు. వైరాలో 22పంచాయతీలకు ఏకంగా 20 పంచాయతీలు కాంగ్రెస్ ఖాతాలో చేరాయి. ఖమ్మం నియోజకవర్గంలోని రఘునాథపాలెం మండలం 37పంచాయతీలకు గాను ఏకగ్రీవాలతో కలిపి కాంగ్రెస్ 26 పంచాయతీలను కై వసం చేసుకోగా బీఆర్ఎస్ 11 పంచాయతీలను దక్కించుకుంది. మూడు పంచాయతీలను బీఆర్ఎస్ మద్దతుదారులు తక్కువ మెజార్టీతో కోల్పోయారు. సానుభూతితో భారీ మెజార్టీ చింతకాని మండలం పాతర్లపాడు జీపీలో 12వార్డులకు గాను బీఆర్ఎస్ మద్దతుతో సీపీఎం బలపరిచిన అభ్యర్థులు 11వార్డులు గెలుచుకున్నారు. సర్పంచ్ అభ్యర్థిగా సీపీఎం మద్దతు తెలిపిన ఓబినబోయిన లక్ష్మి తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ మద్దతుదారురాలు బొర్రా ఉమపై 567 ఓట్ల మెజార్టీతో విజయం సాధించింది. ఈ గ్రామానికి చెందిన సీపీఎం నేత సామినేని రామారావు హత్యకు గురయ్యాడు. ఈ హత్య రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. సీపీఎం మద్దతుదారులు ఇంత మెజార్టీతో గెలవడానికి రామారావుపై ఉన్న సానుభూతే కారణమన్న చర్చ జరుగుతోంది. గతంలో పలుమార్లు సీపీఎం ఈ గ్రామపంచాయతీని దక్కించుకున్నా ఇన్ని వార్డులు గెలవలేదు.. ఇంత మెజార్టీ రాలేదు. పోటాపోటీ చింతకాని మండంలోని ఓ పంచాయతీలో ఒక అభ్యర్థి ఓటుకు రూ.7,500, మరో పంచాయతీలో రూ.5 వేల వరకు పంపిణీ చేసినట్లు ప్రచారం జరిగింది. ప్రత్యర్థి పార్టీ అభ్యర్థి ఓటుకు ఎంత ఇచ్చాడో తెలుసుకుని అంతకన్నా ఎక్కువ ఇచ్చేలా ఇక్కడి అభ్యర్థులు పోటీ పడినట్లు సమాచారం. ఎర్రుపాలెం మండలంలో బీఆర్ఎస్ మద్దతుదారులు ఐదు పంచాయతీల్లో విజయం సాధించారు. ఈ అభ్యర్థులకు ‘స్థానికం’గా బలం ఉండడంతో వీరి గెలుపు సాధ్యమైందన్న రాజకీయ చర్చ జరుగుతోంది. మొదటి విడతలో జనరల్కి రిజర్వ్ అయిన పలు పంచాయతీల్లో ఓటరుకు డబ్బు పంపిణీ పోటాపోటీగా చేసినట్లు తెలుస్తోంది. తక్కువ ఓట్లు.. వర్గపోరు కాంగ్రెస్ పార్టీలో స్థానిక నేతల మధ్య వర్గపోరుతో పలు పంచాయతీలను తక్కువ ఓట్లతో కోల్పోవడం, మరికొన్ని పంచాయతీల్లో ప్రత్యర్థి పార్టీ మద్దతుదారులకు ఎక్కువ మెజార్టీ తెచ్చిపెట్టాయన్న ప్రచారం జరుగుతోంది. బోనకల్ మండలంలోని ఆళ్లపాడు, లక్ష్మీపురం పంచాయతీలు తక్కువ ఓట్లతో కాంగ్రెస్ కోల్పోయింది. అలాగే మధిర మండలంలోని బయ్యారంలో రెండు ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ బయటపడింది. ఎర్రుపాలెం మండలంలో పలు పంచాయతీల్లో కాంగ్రెస్ రెబల్స్ పోటీ చేశారు. ఇందులో కొన్ని కాంగ్రెస్ మద్దతుదారులు, ఇంకొన్ని రెబల్స్ గెలిచినా మెజార్టీపై మాత్రం ప్రభావం చూపింది. బోనకల్ మేజర్ గ్రామపంచాయతీని అత్యధికంగా 960 ఓట్ల మెజార్టీతో బీఆర్ఎస్ పార్టీ మద్దతుదారురాలు బానోతు జ్యోతి దక్కించుకుంది. ఇక్కడ 3,770 ఓట్లకు 3,406 ఓట్లు పోలయ్యాయి. ఈ పంచాయతీలో కాంగ్రెస్ వర్గ పోరు ఆ పార్టీ మద్దతుదారుల ఓటమికి కారణమైనట్లు సమాచారం. కాంగ్రెస్ నుంచి ముందు రెబల్స్ నామినేషన్లు వేసి ఎవరికి వారు తామే బరిలో ఉంటామని ప్రచారం చేసుకున్నారు. అయితే, నాయకులు, అభ్యర్థులు నచ్చచెప్పడంతో ఉపసంహరించుకున్నా ఆ తర్వాత పట్టనట్లు ఉన్నారు. దీంతో బీఆర్ఎస్ మద్దతుదారులు భారీ మెజార్టీతో గెలవగా, కాంగ్రెస్ పార్టీ మద్దతుదారురాలిగా బరిలో నిలిచిన భూక్యా మంగమ్మ ఓటమి పాలైంది. -
నెమ్మదిగా రోప్వే పనులు
● ఇంకా లోయర్ స్టేషన్ దగ్గరే కసరత్తు ● పూర్తి కావడానికి రెండేళ్లకు పైగా సమయం ఖమ్మం రాపర్తినగర్: ఖమ్మం పర్యాటక రంగంలో కలికితురాయిగా నిలుస్తుందని భావిస్తూ ఖిల్లాపైకి చేపడుతున్న రోప్ వే నిర్మాణ పనులు ఆలస్యమయ్యే ఆవకాశాలు కనిపిస్తున్నాయి. ఏడాదిన్నరలోగా రోప్వే నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నా రెండేళ్లు, అంతకు మించి సమయం పడుతుందని తెలుస్తోంది. రోప్వే నిర్మాణం, ఖిల్లాపై సౌకర్యాల కల్పనకు పర్యాటక శాఖ రూ.29 కోట్లు కేటాయించగా, ఇందులో రోప్ వే నిర్మాణానికి రూ.15 కోట్లు వెచ్చించనున్నట్లు ప్రకటించారు. ఈమేరకు కోల్కత్తాకు చెందిన కాంట్రాక్టర్ పనులు దక్కించుకుని ఇటీవల మొదలుపెట్టాడు. కానీ లోయర్ స్టేషన్ ప్రతిపాదిత ప్రాంతం నుంచి అడుగు ముందుకు పడకపోవడం, ఇక్కడే పనులకు మరో నెల పట్టే అవకాశముండగా మొత్తం పనుల్లో ఆలస్యం జరిగే అవకాశముందని భావిస్తున్నారు. 236 మీటర్ల మేర రోప్వే ఖిల్లా కింది భాగం నుంచి పైవరకు 236 మీటర్ల మేర రోప్వే నిర్మాణానికి ప్రతిపాదించారు. అయితే, లోయర్ స్టేషన్ నిర్మించే ప్రాంతంలో ఇళ్లు ఖాళీ చేయించాల్సి రావడం, అక్కడ చాలా లోతు వరకు రాళ్లు ఉండడంతో పనులు ఆలస్యమవుతున్నాయని తెలుస్తోంది. లోయర్ స్టేషన్ నిర్మించాక ఇతర పనులు వేగంగా జరుగుతాయని చెబుతున్నా ప్రభుత్వం విధించిన 18నెలల గడువులోగా పూర్తవడం కష్టమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాళ్ల తవ్వకాలు పూర్తి కాగానే లోయర్ స్టేషన్ నిర్మిస్తామని, ఆపై అప్పర్ స్టేషన్ నిర్మాణం, రోప్వే ఏర్పాటు త్వరగా పూర్తయ్యేలా పర్యవేక్షిస్తామని అధికారులు చెబుతున్నారు. నాలుగు క్యాబిన్లు.. పైన పార్క్లు రోప్వే నిర్మాణంలో భాగంగా నాలుగు క్యాబిన్లు ఏర్పాటు చేస్తారు. ఇందులో రెండు పైకి, మరో రెండు కిందకు రాకపోకలు సాగిస్తాయి. అంతేకాక ఖిల్లాపై పిల్లలు, పెద్దలు సేదతీరేలా ఆధునాతనహోటల్, వాటర్ షౌంటెన్లు, అమ్యూజ్మెంట్ పార్క్, మినీ థియేటర్, ఆట పరికరాలు ఏర్పాటుచేయనున్నారు. అంతేకాక విజ్ఞానం పెంపొందించేలా మ్యూజియం ఏర్పాటుకు ప్రతిపాదించారు. రోప్వే పూర్తయితే ఖమ్మం ఖిల్లా పర్యాటక ప్రాంతంగా మారనున్నందున పనులు త్వరగా పూర్తయ్యేలా పర్యవేక్షించాలని స్థానికులు కోరుతున్నారు. -
ముక్కోటి పోస్టర్ల ఆవిష్కరణ
సూపర్బజార్(కొత్తగూడెం): భద్రాచలంలో ఈనెల 29, 30వ తేదీల్లో జరగనున్న ముక్కోటి ఏకాదశి ఉత్సవాల వాల్ పోస్టర్లను భద్రాద్రి జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ శుక్రవారం కలెక్టరేట్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీతారామచంద్ర స్వామివారి తెప్పోత్సవం, ఉత్తరద్వార దర్శనానికి అధిక సంఖ్యలో వచ్చే భక్తులకు పూర్తి సమాచారం తెలిసేలా రాష్ట్రవ్యాప్తంగా పోస్టర్లు అంటిస్తామని తెలిపారు. సౌకర్యాల కల్పపై ఈనెల 15న భద్రాచలం సబ్ కలెక్టరేట్లో డివిజన్స్థాయి అధికారులతో సమావేశం నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈఓ దామోదర్రావు, అర్చకులు పాల్గొన్నారు.స్వర్ణకవచధారణలో రామయ్యభద్రాచలం: శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం అంతరాలయంలోని మూలమూర్తులు శుక్రవారం స్వర్ణ కవచధారులై దర్శనమిచ్చారు. తొలుత తెల్లవా రుజామున గర్భగుడిలో స్వామికి సుప్రభాత సే వ, సేవాకాలం, ఆరాధన పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి బేడా మండపంలో కొలువుదీరిన స్వామివారికి విష్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా పూర్తిచేశారు. శుక్రవారం సందర్భంగా శ్రీ లక్ష్మీతాయారు అమ్మవారి ఆలయంలో అమ్మవారికి అభిషేకం తదితర పూజలు చేశారు. -
ఈ గెలుపు ప్రజాపాలనకు నిదర్శనం
ఖమ్మం అర్బన్: సర్పంచ్లుగా కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులు విజయం సాధించడం తమ ప్రభుత్వం సాగిస్తున్న ప్రజాపాలనకు నిదర్శనమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రఘునాథపాలెం మండలం నుంచి గెలుపొందిన సర్పంచ్లు, ఉపసర్పంచ్లు, పాలకవర్గాలను ఖమ్మంలోని క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఆయన సన్మానించి మాట్లాడారు. గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. సీఎం రేవంత్రెడ్డి నేతృత్వాన తమ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తుండగా, అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు. సర్పంచ్లు, పాలకవర్గాలు గ్రామాల అభివృద్ధిలో కీలకపాత్ర పోషించాలని సూచించారు. వివాదాలకు తావు లేకుండా సమన్వయంతో వ్యవహరిస్తూ గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా నిజాయితీతో పనిచేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా, ఖమ్మం నగర అధ్యక్షులు నూతి సత్యనారాయణ, నాగళ్ల దీపక్చౌదరి, రాష్ట్ర విత్తన గిడ్డంగుల సంస్థ కార్పొరేషన్ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, మార్కెట్, ఆత్మ కమిటీలు, పీఏసీఎస్ల చైర్మన్లు యరగార్ల హన్మంతరావు, దిరిశాల చిన్న వెంకటేశ్వర్లు, తాతా రఘురామ్, రావూరి సైదుబాబు, నాయకులు పువ్వాళ దుర్గాప్రసాద్, మానుకొండ రాధాకిషోర్, మురళి, చోటా బాబు, గుత్తా వెంకటేశ్వరావు, సండ్ర రాంబాబు తదితరులు పాల్గొన్నారు.సర్పంచ్ల సన్మాన సభలో మంత్రి తుమ్మల -
రెండో విడత ఎన్నికలకు సిద్ధం
ఖమ్మం సహకారనగర్: జిల్లాలో ఈనెల 14వ తేదీన రెండో విడతగా జరగనున్న గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. ఆరు మండలాల్లో ని 160 గ్రామపంచాయతీల సర్పంచ్ స్థానాలకు 451 మంది, 1,379 వార్డులకు 3,352 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారని పేర్కొన్నారు. ఎన్నికల నిర్వహణకు 2,023 బ్యాలెట్ బాక్సులు సిద్ధం చేయడంతో పాటు 1,831 పోలింగ్ అధికారులు, 2346 మంది ఓపీఓలకు శిక్షణ ఇచ్చామని తెలిపారు. కాగా, 28 ప్రాంతాల్లో 304 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి సీసీ కెమెరాల ద్వారా వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేస్తున్నామ ని వెల్లడించారు. ఈ విడతలో 2,51,327 మంది ఓటర్లు ఓటు హ క్కు వినియోగించుకోనున్నారని కలెక్టర్ తెలిపారు. భూవివాదాలపై అవగాహన అవసరం భూవివాదాలు, చట్టాలపై పోలీసు అధికారులు అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. హైదరాబాద్లో శిక్షణ పొందుతున్న ట్రెయినీ ఐపీఎస్లకు భూవివాదాలు, శాంతి భద్రతల నిర్వహణపై కలెక్టర్ అనుదీప్ వీసీ ద్వారా అవగాహన కల్పించారు. ప్రభుత్వ సేవలు, భూ సమస్యల పరిష్కార విధానాలు, కోర్టు వ్యవహారాలు, పోలీసుశాఖతో సమన్వయం, భూభారతిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఆయన వివరించారు. అనంతరం ట్రెయినీ ఐపీఎస్లు పాలనా పారదర్శకత, బాధ్యత, క్షేత్రస్థాయి సవాళ్లు, భూసంబంధిత అంశాలు, కోర్టు కేసులపై అడిగిన ప్రశ్నలకు కలెక్టర్ సమాధానాలు ఇచ్చారు. భూవ్యవహారాలకు సంబంధించి పోలీసు అధికారులు కనీస పరిజ్ఞానం, అవగాహన పెంచుకుంటే శాంతిభద్రతల నిర్వహణలో ఉపయోగపడుతుందని తెలిపారు.కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి -
విపత్తుల నిర్వహణకు పటిష్ట ప్రణాళిక
● అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి ఖమ్మం అర్బన్: విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కొనేలా ప్రణాళిక సిద్ధం చేయాలని అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి సూచించారు. వరదలు, పరిశ్రమలు, ఇతర ప్రమాదాల నియంత్రణపై జాతీయ విపత్తుల నిర్వహణ అథారిటీ మేజర్ జనరల్ సుధీర్ బాహల్ శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. వరదలు వచ్చినప్పుడు, పరిశ్రమల్లో ప్రమాదాలు జరిగినప్పుడు స్పందించాల్సిన తీరుపై నమూనా కార్యక్రమాలు చేపట్టాలని ఆయన తెలిపారు. ఈ వీసీకి కలెక్టరేట్ నుంచి హాజరైన అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి, ఆతర్వాత అధికారులతో సమావేశమయ్యారు. జాతీయ విపత్తుల నిర్వహణ అథారిటీ సూచనలు, గత అనుభవాల దృష్ట్యా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈసమావేశంలో జిల్లా పరిశ్రమల శాఖ సహాయ సంచాలకులు నకుల్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. సైన్స్ ఫేర్ను విజయవంతం చేద్దాం ఖమ్మం సహకారనగర్: ఖమ్మం బల్లేపల్లిలోని ఎస్ఎఫ్ఎస్ హైస్కూల్లో ఈనెల 20, 21వ తేదీల్లో జరిగే జిల్లా స్థాయి సైన్స్ ఫేర్ను జయప్రదం చేసేలా అందరూ కృషి చేయాలని జిల్లా విద్యాశాఖాధికారి చైతన్య జైనీ సూచించారు. సైన్స్ మ్యూజియంలో శుక్రవారం జరిగిన సన్నాహాక సమావేశంలో ఆమె మాట్లాడుతూ కమిటీల కన్వీనర్లు, సభ్యులు విధులు సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. విద్యార్థులు తమ ఎగ్జిబిట్ల వివరాలను గూగుల్ ఫాం ద్వారా ఈనెల 18వ తేదీ రాత్రి వరకు పంపించేలా అవగాహన కల్పించాలని సూచించారు. ఈసమావేశంలో కోఆర్డినేటర్ రామకృష్ణ, ఏఎంఓ పెసర ప్రభాకర్రెడ్డి, సీఎంఓ ప్రవీణ్ కుమార్, జీసీడీఓ రూబీ, డీసీఈబీ సెక్రటరీ కనపర్తి వెంకటేశ్వర్లు, ఎంఈఓలు శైలజలక్ష్మి, శ్రీనివాసరావు, రాములు, వెంకటేశ్వర్లు, వీరస్వామి తదితరులు పాల్గొన్నారు. సభ్యత్వ నమోదులో పాలుపంచుకోవాలి ఖమ్మం సహకారనగర్: టీఎన్జీవోస్ సభ్యత్వ నమోదులో అందరూ చురుగ్గా పాల్గొనాలని జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గుంటుపల్లి శ్రీనివాసరావు, కొణిదన శ్రీనివాస్ సూచించారు. ఖమ్మంలోని యూనియన్ కార్యాలయంలో శుక్రవారం జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశంలో వారు మాట్లాడారు. సభ్యత్వ నమోదును విజయవంతం చేయడంతో పాటు 2026 డైరీ రూపకల్పనలో పాలుపంచుకోవాలని తెలిపారు. కాగా, ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్ డీఏలు, బకాయిలు విడుదల చేయడంతో పాటు ఈహెచ్ఎస్ కార్డులు జారీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ తీర్మానించారు. నాయకులు జెడ్.ఎస్.జైపాల్, విజయ్ కుమార్, గంగవరపు బాలకృష్ణ, కొమరగిరి దుర్గాప్రసాద్, వల్లపు వెంకన్న, ఎస్.లలితకుమారి, ఎస్.రాధికారెడ్డి, తాళ్లూరి శ్రీకాంత్, భూసా చంద్రశేఖర్, హరికృష్ణ కోణార్ తదితరులు పాల్గొన్నారు. శ్రీకనకదుర్గమ్మకు పంచామృతాభిషేకంపాల్వంచరూరల్: పాల్వంచ మండలంలోని శ్రీకనకదుర్గ(పెద్దమ్మతల్లి) ఆలయంలో అమ్మ వారికి శుక్రవారం వైభవంగా పంచామృతాభిషేకం నిర్వహించారు. ఆలయంలో అమ్మవారి జన్మస్థలం వద్ద పంచామృతం, పసుపు, కుంకుమ, గాజులు, హారతిని అర్చకులు సమర్పించారు. అనంతరం ఆలయంలోని మూలవిరాట్కు పంచామృతంతో అభిషేక పూజలు, పంచహారతులు, నివేదన, నీరాజనం, మంత్రపుష్పం పూజలతోపాటు కుంకుమపూజ, గణపతి హోమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈఓ రజనీకుమారి, ఆలయ కమిటీ చైర్మన్ బాలినేని నాగేశ్వరరావు పాల్గొన్నారు. -
బాల్య వివాహాల నిర్మూలనకు కృషి
వైరా: బాల్య వివాహాలు లేని సమాజ స్థాపనకు అందరూ కృషి చేయాలని యాక్షన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్(ఎయిడ్) సంస్థ జిల్లా కోఆర్డినేటర్ కె.శ్రీనివాస్ సూచించారు. వైరాలోని మధు జూనియర్ కళాశాలలో శుక్రవారం నిర్వహించిన అవగాహన సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో 2030 నాటికల్లా బాల్య వివాహాలను అరికట్టాలని ప్రభుత్వ శాఖల ద్వారా రెండున్నరేళ్ల నుంచి అవగాహన కల్పిస్తున్నారని తెలిపారు. ఇందులో అందరూ పాలుపంచుకుని బాలికలకు మెరుగైన భవిష్యత్ దక్కలా పాటుపడాలని సూచించారు. అనంతరం బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో పారాలీగల్ వలంటీర్ మాధవీలత, మధు కళాశాల సెక్రటరీ మల్లెంపాటి వీరభద్రం, కరస్పాండెంట్ రంజిత్, ప్రిన్సిపాల్ రాంబాబు, కే.వీ.చారి తదితరులు పాల్గొన్నారు. -
అవినీతి పరులపై
● ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్, క్యూ ఆర్ కోడ్తో స్టిక్కర్లు ● ప్రభుత్వ కార్యాలయాల్లో అంటిస్తూ ప్రచారం ● సెల్ఫోన్లో స్కాన్ చేసి ఫిర్యాదుకు అవకాశం ఫిర్యాదు చేయండిపాల్వంచరూరల్: చట్టప్రకారం ప్రజలకు సేవలు అందించాల్సిన అధికారులు అవినీతికి పాల్పడితే చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)ని ఏర్పాటు చేసింది. ఏసీబీ జిల్లాలో ఇటీవల దాడులు చేస్తూ అవినీతి అధికారులను అరెస్ట్ చేసి, జైలుకు పంపుతోంది. ఈ క్రమంలోనే సులువుగా ఫిర్యాదు చేసేందుకు ప్రభుత్వ కార్యాలయాల్లో క్యూర్ కోడ్ స్కానర్లకు సంబంధించిన స్టిక్కర్లు ఏర్పాటు చేసింది. స్మార్ట్ఫోన్ ద్వారా క్యూర్ కోడ్ను స్కాన్చేసి సులభంగా ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేయవచ్చు. 2025లో 20 కేసులు నమోదు పోలీసు, రెవెన్యూ, మున్సిపల్, విద్య, వైద్య, పంచాయతీరాజ్, నీటిపారుదల, ఫారెస్టు, రిజిస్ట్రేషన్ శాఖల్లో అవినీతి అధికంగా జరుగుతున్నట్లు అవినీతి నిరోధక శాఖ అధికారులు గుర్తించారు. అవినీతి నిరోధక శాఖ అధికారులు ఈఏడాది జనవరి నుంచి ఈనెల 9వ తేదీ వరకు వరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 20 కేసులు నమోదు చేశారు. అవినీతికి పాల్పడిన ఉద్యోగులను కటకటాల్లోకి పంపారు. తద్వారాఏజెన్సీ ప్రాంతంలోనే అధికంగా కేసులు నమోదవుతున్నట్లు తేలింది. రెవెన్యూ శాఖలో ఆరు, పోలీసుశాఖలో మూడు, రిజిస్ట్రేషన్, వ్యవసాయశాఖల్లో రెండు చొప్పున, మైనార్టీ సంక్షేమం, ఇరిగేషన్, ఫారెస్ట్, మున్సిపల్, కార్మిక, ఎక్సెజ్, విద్యాశాఖల్లో ఒక్కో కేసు నమోదయ్యాయి. ఇలా ఫిర్యాదు చేయవచ్చు ప్రభుత్వ ఆఫీసుల్లో అధికారులు లంచం అడిగితే అదే ఆఫీసులో ఏసీబీ అధికారులు అంటించిన స్టికర్(క్యూర్ కోడ్) స్కాన్ చేస్తే యాప్ ఓపెన్ అవుతుంది. అందులో వివరాలను నమోదు చేసి సెండ్ చేసిన వెంటనే మీ మొబైల్ ఫోన్కు ఓటీపీ నంబర్ వస్తుంది. టోల్ఫ్రీ నంబర్ 1064, ఉమ్మడి ఖమ్మం జిల్లా డీఎస్పీ వై.రమేష్ 91543 88981కు ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదు చేసిన వ్యక్తితో ఏసీబీ అధికారులు సంప్రదించి వివరాలు సేకరించుకుని ఫిర్యాదుదారుని పేర్లను రహస్యంగా ఉంచుతారు. కాగా ఈ నెల 3వ తేదీ నుంచి 9వ తేదీ వరకు ఏసీబీ ఆధ్వర్యంలో అవినీతి వ్యతిరేక వారోత్సవాలు నిర్వహించారు. ప్రజలకు అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. పనుల కోసం అధికారులకు డబ్బులు ఇవ్వడం, తీసుకోవడం నేరం. అధికారులు ఇబ్బందులు పెట్టినా, డబ్బులు డిమాండ్ చేసినా మా దృష్టికి తీసుకొస్తే చర్యలు తీసుకుంటాం. అవినీతికి పాల్పడితే ఎవరైనా వదిలిపెట్టం. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నా ఫిర్యాదులు చేయవచ్చు. – వై.రమేష్, ఏసీబీ డీఎస్పీ -
భద్రగిరిలో తీవ్ర నిరీక్షణ
● అధికారుల నిర్లక్ష్యంతో ఆలస్యంగా కౌంటింగ్ ● అందరికీ ఓటర్ల స్లిప్లు పంపిణీ చేయలేదనే ఆరోపణలు ● భద్రాద్రి జిల్లాలో భద్రాచలం జీపీలోనే అతి తక్కువ పోలింగ్ శాతం భద్రాచలం: అధికారుల నిర్లక్ష్యంతో భద్రాచలం మేజర్ గ్రామపంచాయతీ ఎన్నికల ఫలితాల కోసం అభ్యర్థులు పడిగాపులు కాశారు. శుక్రవారం ఉదయం ఏడు గంటల వరకు సర్పంచ్ ఫలితాలు వెల్లడికాకపోవడంతో రాత్రంతా అభ్యర్థులు, వారి మద్దతుదారులు, కార్యకర్తలు చలిలో గజగజ వణికిపోయారు. గురువారం ఉదయం ఏడు నుంచి ఒంటి గంట వరకు పోలింగ్ ముగియాల్సి ఉంది. ఒంటిగంటలోపు పోలింగ్ కేంద్రానికి చేరుకున్న ఓటర్లకు ఓటు వేసేందుకు అవకాశం ఇవ్వడంతో కొంత సమయం పట్టింది. మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల లోపు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రానికి బ్యాలెట్ బాక్స్లు చేర్చి కౌంటింగ్ ప్రారంభించాల్సి ఉంది. కానీ తీవ్ర జాప్యం జరిగింది. తన ఓటు హక్కును మరొకరు వినియోగించుకున్నారనే ఫిర్యాదుతో వెంకటలక్ష్మి అనే ఓటరుకు టెంపర్ ఓటును కేటాయించారు. ఆ ఓటు కౌంటింగ్, విధి విధానాలు స్థానిక ఎన్నికల అధికారులకు తెలియకపోవడంతో రాష్ట్ర అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమాచారం తెలుసుకున్న అనంతరం బ్యాలెట్ బాక్సులోని ఓట్లను కట్టలు కట్టడం ప్రారంభించారు. దీంతో రాత్రి ఏడు గంటల వరకు కౌంటింగ్ ప్రారంభం కాలేదు. ఈ సమయంలో బయట వేచి చూస్తున్న అభ్యర్థులకు, పార్టీ కార్యకర్తలకు ఏం జరుగుతుందో తెలియక అయోమయానికి గురయ్యారు. బీఆర్ఎస్ నాయకులు కౌంటింగ్ కేంద్రంలో అవకతవకలకు పాల్పడుతున్నారంటూ సోషల్మీడియాలో విమర్శలు సైతం చేశారు. ఇతర పంచాయతీల్లో ఆ సమయానికి సర్పంచ్ ఫలితాలు సైతం వెలువడ్డాయి. అఽధికారుల నిర్లక్ష్యం వల్ల భద్రాచలం పంచాయతీ సర్పంచ్ ఫలితం శుక్రవారం తెల్లవారుజామున వెలువడింది. అప్పటివరకు చలిలో అభ్యర్థులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, మద్దతుదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అతి తక్కువగా భద్రాచలంలో ఓటింగ్ భద్రాద్రి జిల్లా మొత్తం మీదుగా అత్యధిక ఓటర్లు ఉన్న భద్రాచలం గ్రామపంచాయతీలో అతి తక్కువ ఓటింగ్ నమోదు కావడం చర్చనీయాంశంగా మారింది. అత్యల్పంగా 48.87 శాతం పోలింగ్ నమోదయింది. ఓటర్లు స్లిప్లు ఇంటింటికీ చేరవేయడంలో ప్రభుత్వం విఫలమయిందనే ఆరోపణలు వచ్చాయి. పాత ఓటర్ల లిస్టు స్థానంలో కొత్త జాబితా విడుదల చేశారు. దీంతో ఓటరు క్రమసంఖ్య మారింది. ఓటరు జాబితా ప్రకారం పోలింగ్ కేంద్రాల వివరాలు ముందస్తుగా ప్రచారం చేయలేదు. దీంతో ఓటర్లు భద్రాచలంలో ఉన్న అన్ని పోలింగ్ కేంద్రాల చుట్టూ ప్రదక్షిణలు చేశారు. ప్రచారానికి అతి తక్కువ రోజులు ఉండటంతో వార్డు మెంబర్ పోటీదారులు తప్ప సర్పంచ్ పోటీదారులు అన్ని కాలనీల్లో ఇంటింటి ప్రచారం చేయలేకపోయారు. ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చేలా ప్రభావం చూపలేకపోయారు. ఇతర ప్రాంతాలు, నగరాల్లో ఉంటున్న పట్టభద్రులు, ఉద్యోగులను భద్రాచలం తీసుకురాలేకపోయారు. ఇక ప్రధానంగా పోటీదారులు ఓటుకు నోటునే బలంగా నమ్ముకోవడంతో అత్యధిక ఓటర్లు, వృద్ధులు నోటు తీసుకొని చడీచప్పుడు చేయకుండా ఇంట్లోనే ఉండిపోయారు. దీంతో 40,761 ఓట్లకుగాను 19,838 ఓట్లు మాత్రమే నమోదయ్యాయి. -
సత్వర సేవలు..
● బాలింతలు, గర్భిణులకు అండగా ‘102’ ● ఉమ్మడి జిల్లాలో 30 వాహనాల ద్వారా లబ్ధి ● అత్యవసర సేవల్లో మేటిగా ‘108’ వాహనాలు ఖమ్మంవైద్యవిభాగం: అత్యవసర వైద్యసేవలు అందించటంలో 108, 102 వాహనాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలో ఈ వాహనాల ద్వారా లబ్ధి పొందే వారి సంఖ్య ఏటా పెరుగుతోంది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని ప్రభుత్వ ఆస్పత్రులకు చేరవేయటంలో 108 వాహనాలు కీలక ప్రాత పోషిస్తుండగా, గర్భిణులు, బాలింతలను క్రమం తప్పకుండా పెద్దాస్పత్రులకు తీసుకెళ్లి వైద్యం చేయించి తిరిగి గమ్యస్థానాలకు చేర్చడంలో 102 వాహనాలదే ప్రముఖ పాత్ర. ఈ వాహనాలు గర్భిణులు, బాలింతలు, అత్యవసర చికిత్స పొందే వారికి సంజీవనిలా ఉపయోగపడుతున్నాయి. అమ్మ ఒడి సేవలతో.. గతంలో గర్భిణులు ప్రతీనెలా వైద్య పరీక్షలతో పాటు ప్రసవ సమయాన ఆస్పత్రులకు వెళ్లటానికి ఇబ్బంది పడేవారు. సరైన రవాణా సౌకర్యాలు లేక ఇతర వాహనాలు సమకూర్చుకొని అవస్థలు పడుతూనే వెళ్లే వారు. కానీ, 102 అమ్మ ఒడి సేవలు అందుబాటులోకి వచ్చిన తర్వాత వారి ఇబ్బందులు తప్పాయి. వాహనాల్లో ఆశ కార్యకర్తలు వెంట ఉండి అవసరమైన పరీక్షలు చేయిస్తున్నారు. ఈ వాహనంలో అత్యవసర చికిత్సకు వైద్య కిట్లు, ప్రసవానికి అవసరమయ్యే పరికరాలు అందుబాటులో ఉన్నందున ఇబ్బందులు ఎదురుకావడం లేదు. ప్రసవానంతరం కొన్ని నెలల వరకు తల్లీబిడ్డలకు అవసరమయ్యే టీకాలు వేయించేందుకు, ఇతర చికిత్స కోసం పెద్దాస్పత్రికి తీసుకెళ్లి తిరిగి ఇంటి వద్దకు చేర్చుతున్నారు. ఈ వాహనాల ద్వారా పీహెచ్సీలు, ఆరోగ్య ఉపకేంద్రాల వారీగా గర్భిణులు, బాలింతలకు సేవలందుతున్నాయి. ఖమ్మం జిల్లాలో 11, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 19 వాహనాలు ఉండగా, గత ఏడాది జనవరి నుంచి ఈ ఏడాది నవంబర్ వరకు ఉమ్మడి జిల్లాలో 1,89,088 మంది గర్భిణులు, బాలింతలు వీటి ద్వారా వైద్యసేవలు పొందారు. 50,862 మందికి అత్యవసర సేవలు ఉమ్మడి జిల్లాలో అత్యవసర వాహన సేవలు కీలకంగా మారాయి. ప్రమాద బాధితులు, ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని ఆస్పత్రులకు చేర్చటంలో 108 వాహనాలు కీలకపాత్ర పోషిస్తున్నాయి. అంతే కాకుండా ప్రసవ వేదనతో బాధపడుతున్న వారిని ఆస్పత్రులకు తరలించటంలోనూ ముఖ్య భూమిక ఈ వాహనాలదే. ఉమ్మడి జిల్లాలో రాష్ట్ర, జాతీయ రహదారులు ఉండటంతో తరచూ వాహన ప్రామాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ సమయాన క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలిస్తూ వందలాది మంది ప్రాణాలు నిలుపుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో 108 వాహనాలు 49 ఉండగా, భద్రాద్రి జిల్లాలో 28 వాహనాలు, ఖమ్మం జిల్లాలో 21 వాహనాలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా భద్రాద్రి జిల్లాలో మారుమూల అటవీ ప్రాంతాలకు వెళ్లి అత్యవసర చికిత్స అవసరమైన రోగులను 108 వాహనం ద్వారా తరలిస్తూ ప్రాణాలు నిలుపుతున్నారు. ఉమ్మడి జిల్లాలో ఈ ఏడాది 50,862 మందికి అత్యవసర చికిత్స అందించి వారి ప్రాణాలు నిలపడంలో 108 వాహనాలు, సిబ్బంది కీలక పాత్ర పోషించారు. ఉమ్మడి జిల్లావాసులు 102, 108 వాహన సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. రవాణా సౌకర్యం లేని మారుమూల గ్రామాలకు సైతం వాహనాలు వెళ్తున్నాయి. 102 వాహనం ద్వారా ప్రసవానంతరం తల్లీబిడ్డలను ఇంటికి చేర్చడం, బాలింతలకు అవసరమైన పరీక్షలు, చికిత్స అందిస్తున్నాం. ఫోన్ చేసిన పావు గంట లోపే ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను రక్షించేలా చర్యలు తీసుకుంటున్నాం. అత్యవసర సమయంలో వాహనంలోనే ప్రసవం చేసేలా సిబ్బందికి శిక్షణ ఇచ్చాం. – శివకుమార్, 108, 102 వాహనాల ప్రోగ్రామ్ మేనేజర్ -
లెక్క పక్కాగా ఉండేలా..
● ఎరువులు, విత్తనాల వివరాల నమోదుకు పుస్తకం ● పీఏసీఎస్ల ఆధ్వర్యాన రైతులకు పంపిణీనేలకొండపల్లి: వానాకాలం సీజన్లో ఎరువుల కోసం రైతులు పడిన పాట్లు అన్నీఇన్ని కావు. సొసైటీలకు సమయానికి ఎరువులు చేరక, వచ్చిన ఎరువులు ఎవరు తీసుకెళ్లారో లెక్క తెలియకపోవడంతో కొందరు ఎక్కువ ఎరువులు తీసుకెళ్లగా, మరికొందరికి అసలే దక్కక పడిగాపులు కాశారు. ఇలాంటి సమస్యలకు చెక్ పెడుతూ ఏయే రైతు ఎన్ని ఎరువులు, ఎంత మొత్తంలో విత్తనాలు తీసుకున్నారో పూర్తి వివరాలు నమోదు చేసేలా పీఏసీఎస్ల ద్వారా పుస్తకాలు అందించనున్నారు. ఈ పుస్తకంతో రైతు సొసైటీకి వెళ్తే భూవిస్తీర్ణం ఆధారంగా ఎరువులు, విత్తనాలు అందించే అవకాశముంది. పూర్తి వివరాలు పీఏసీఎస్ల వారీగా సభ్యత్వం ఉన్న అన్నదాతలకు ‘రైతు ఎరువుల పాస్పుస్తకం’ పేరిట పుస్తకాలు అందిస్తున్నారు. నేలకొండపల్లి మండలంలోని బోదులబండ పీఏసీఎస్లో ఈ పుస్తకాల పంపిణీని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి డి.పుల్లయ్య ఇటీవల ప్రా రంభించారు. దశల వారీగా అన్ని పీఏసీఎస్ల పరిధి రైతులకు వీటిని అందజేయనుండగా వీటిపై రైతు పేరు, ఆధార్ నెంబర్, గ్రామం, మండలం, జిల్లాతో పాటు ఇతరత్రా వివరాలను నమోదు చేస్తారు. అలాగే, సేల్స్మెన్ ఫోన్ నంబర్లు, కేంద్రం తెరిచి ఉండే సమయం కూడా ముద్రించారు. రైతులు ఈ పుస్తకంతో వెళ్తే వారు తీసుకున్న ఎరువులు, విత్తనాల వివరాలను అందులో నమోదు చేయనున్నారు. భూవిస్తీర్ణం ఆధారంగా వీటిని పంపిణీ చేయనుండగా, పరిమితికి మించి తీసుకెళ్లాలని ప్రయత్నిస్తే పుస్తకంలోని వివరాల ఆధారంగా నిరా కరించే అవకాశముంది. తద్వారా అవసరం మేరకే విత్తనాలు, ఎరువులు తీసుకెళ్తారని, ఫలితంగా అందరికీ అందుతాయని అధికారులు చెబుతున్నారు. రైతులకు ప్రభుత్వం సరఫరా చేసే ఎరువులు, విత్తనాలు ఎంత మేరకు తీసుకున్నారో ఈ పుస్తకంలోని వివరాల ఆధారంగా తెలిసిపోతుంది. అంతేకాక భూవిస్తీర్ణం ఆధారంగానే పంపిణీ చేపట్టే అవకాశం ఏర్పడుతుంది. ఈ పుస్తకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి. – ఎం.రాధ, ఏఓ, నేలకొండపల్లి


