breaking news
Khammam
-
దంపతుల ‘మొక్క’వోని దీక్ష, ఏడాదికి రూ. లక్ష ఖర్చు
కోల్సిటీ(రామగుండం): ఆ ఇంటి ఆవరణలోకి అడుగుపెట్టగానే చల్లని వాతావరణం.. ఆకట్టుకునే పచ్చని మొక్కలు.. తీరొక్కపూలు స్వాగతం పలుకుతున్నాయి. గోదావరిఖని మార్కండేయకాలనీకి చెందిన ఆడెపు రామకృష్ణ దంపతులు తమ ఇంటిని పచ్చదనంతో నింపేసి పొదరిల్లుగా మార్చుకుని.. పర్యావరణానికి ఊపిరిపోస్తున్నారు. ఓ స్కూల్లో విద్యాబోధన చేస్తున్న గీతాశ్రీ– రామకృష్ణ దంపతులకు మొక్కల పెంపకం అంటే చాలాఇష్టం. గతంలో రామకృష్ణ ఎకో క్లబ్లో చేరి మొక్కల పెంపకంపై శిక్షణ పొందారు. ఆ తర్వాత 24 ఏళ్లుగా తన ఇంటి ఆవరణలోనే వివిధ రకాల పూలు, పండ్లు, స్వచ్ఛమైన గాలి అందించే అనేకరకాల మొక్కలు పెంచుతున్నారు. ఆకుకూరలూ సాగు చేస్తున్నారు. వంటగదిలోని వ్యర్థాలు, ఎండుఆకులు, కుళ్లిన కూరగాయలతో సేంద్రియ ఎరువు తయారు చేస్తూ మొక్కలకు వేస్తున్నారు. పనికిరాని వస్తువులు, ప్లాస్టిక్ డబ్బాలు, టోపీలు, బకెట్లు, పాడైన కూలర్లు, ఇంట్లోనే తయారు చేసిన సిమెంట్ కుండీలే మొక్కలకు నిలయాలుగా మార్చారు. ఏడాదికి రూ.లక్ష ఖర్చు నేను 24 ఏళ్లుగా మొక్కలు పెంచుతున్న. ఇది నాకు హాబీగా మారింది. ఎక్కడికి వెళ్లినా, ఎక్కడ శుభకార్యం జరిగినా అక్కడికి మొక్కతో వెళ్తాను. కొత్త మొక్కలు కనిపిస్తే ఖర్చుకోసం ఆలోచించకుండా కొంటాను. ఏడాదికి మొక్కల కొనుగోలుకు రూ.లక్ష వరకు ఖర్చు చేస్తుంటా. ఇంట్లోనే సేంద్రియ ఎరువు, సిమెంట్ తొట్టీలను తయారు చేస్తున్న. మొక్కల పెంపకంతో మాకు ఎంతో మానసిక ఆనందం కలుగుతుంది. – ఆడెపు రామకృష్ణ, గోదావరిఖనిఇదీ చదవండి: సింపుల్ చిట్కాలతో 15 కిలోలు తగ్గింది : నచ్చిన బట్టలు, క్రాప్ టాప్లు -
కల్లూరు అప్పయ్య, సంక్రాంతి లఘుచిత్రాలకు అవార్డులు
ఖమ్మంగాంధీచౌక్: ఖమ్మంకు చెందిన కొత్తపల్లి శేషు రచన, దర్శకత్వంలో రూపొందిన కల్లూరు అప్పయ్య, సంక్రాంతి–2కే25 లఘుచిత్రాలకు మలేషియా సినీ ఆవార్డ్స్ సంస్థ అవార్డులు ప్రకటించింది. ఈ సినిమాలకు గాను ఉత్తమ రచయిత, దర్శకుడు, స్క్రీన్ ప్లే అవార్డులు కొత్తపెల్లి శేషుకు, ఉతమ నిర్మాతగా గుజ్జూరిఽ శ్రీధర్బాబుకు, ఉత్తమ నటులుగా మొగిలి గుణకర్, నల్లగట్ల కిషోర్బాబుతో పాటు ఉత్తమ నటిగా మహేశ్వరి, యామినికి అవార్డులు లభించాయి. జిల్లాకు చెందిన దర్శకుడు, నటులు అవార్డులు సాధించడంపై మిత్రా గ్రూప్ చైర్మన్ కురువెళ్ల ప్రవీణ్కుమార్, డాక్టర్ కూరపాటి ప్రదీప్కుమార్, కాపా మురళీకృష్ణ, నటుడు కాంతేశ్వరరావుతో పాటు పలువురు కళాకారులు అభినందించారు. -
కొరవడుతున్న పర్యవేక్షణ
● ఉమ్మడి జిల్లాలో 600 పైగా ఆలయాలు ● ఏడాదికి రూ. 2లక్షలకు పైగా ఆదాయం వచ్చేవి 92.. ● ఈ దేవస్థానాల్లో 18 ఈఓ పోస్టులు.. ఉన్నది 11 మందే ● ఇన్చార్జ్లతో భక్తులకు తప్పని ఇక్కట్లు పాల్వంచరూరల్: దేవాలయాల్లో భక్తుల సౌకర్యాలు, ఆలయ ఆస్తుల పరిరక్షణ, సిబ్బంది పనితీరుపై పర్యవేక్షణ చేయాల్సిన ఈఓ పోస్టులు ఖాళీగా ఉండడంతో ఇక్కట్లు తప్పడం లేదు. ఉమ్మడి జిల్లాలోని అనేక ఆలయాల్లో ఈ సమస్య వేధిస్తోంది. ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో 600 ఆలయాలు ఉండగా, ఇందులో ఏడాదికి రూ.2లక్షలు, ఆపైన ఆదాయం వచ్చే ఆలయాలు 92 ఉన్నాయి. ఈ ఆలయాలకు సంబంధించి 18 ఈఓ పోస్టులు కేటాయించారు. అంటే ఒక్కో ఈఓ సుమారు ఐదు ఆలయాలను పర్యవేక్షించాలి. అయితే, ఈ 18లోనూ ప్రస్తుతం 11 మందే విధులు నిర్వరిస్తుండడంతో వీరిపై అదనపు భారం పడడమే కాక భక్తులకు కనీస సౌకర్యాలు అందడం లేదు. పెద్ద ఆలయాలకూ దిక్కు లేదు.. ఉమ్మడి జిల్లాలో నిత్యం భక్తుల రద్దీ ఉండే పలు ఆలయాలకు కూడా రెగ్యులర్ ఈఓలు లేరు. భద్రాద్రి జిల్లాలోని అన్నపురెడ్డిపల్లి శ్రీ బాలాజీ వేంకటేశ్వరస్వామి ఆలయం, కొత్తగూడెంలోని విజయ విఘ్నేశ్వరస్వామి, పాల్వంచలోని పెద్దమ్మతల్లి, భద్రాచలంలోని అభయాంజనేయస్వామి ఆలయాల్లో ఇన్చార్జ్ ఈఓలే విధులు నిర్వర్తిస్తున్నారు. ఖమ్మం జిల్లాలో జమలాపురం శ్రీ వేంకటేశ్వరస్వామి, ఖమ్మం కమాన్బజార్లోని వేంకటేశ్వరస్వామి ఆలయం, ఖమ్మం రూరల్ మండలంలోని మారెమ్మగుడి వంటి పెద్ద ఆలయాలకు కూడా రెగ్యులర్ ఈఓలు లేరు. ఉమ్మడి జిల్లాలో ప్రస్తుతం 11 మంది ఈఓలు ఉండగా, వారికి కేటాయించిన ఆలయాలతో పాటు ఆదాయం తక్కువగా ఉన్న ఇతర దేవాలయాల పర్యవేక్షణ బాధ్యతలు కూడా వీరిపైనే పడుతున్నాయి. ఒక్క అధికారి.. 17 ఆలయాలు ఈఓలు పరిమితికి మించి ఆలయాలకు ఇన్చార్జ్ లుగా ఉండడంతో పర్యవేక్షణ కొరవడుతోంది. కొత్తగూడెంలోని దాసాంజనేయస్వామి ఆలయ ఈఓ శేషయ్య 17 దేవస్థానాలకు ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు. ఇందులో భద్రాద్రి జిల్లాలో ఏడు, ఖమ్మం జిల్లాలో పది ఉన్నాయి. పెద్దమ్మగుడి ఆలయ ఈఓ రజినీకుమారి ఇక్కడే ఇన్చార్జ్గా ఉండగా, ఈ దేవస్థానంతో పాటు పాల్వంచలోని భజన మందిరం, పాత పాల్వంచలోని వేంకటేశ్వరస్వామి ఆలయం, కొత్తగూడెంలోని విఘ్నేశ్వరస్వామి ఆలయం, ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలోని నీలాద్రీశ్వరస్వామి ఆలయాల బాధ్యతలూ చూస్తున్నారు. ఖమ్మంలోని ప్రసిద్ధ శ్రీ స్తంభాద్రి లక్ష్మీనృసింహస్వామి ఈఓ కొత్తూరు జగన్మోహన్రావు జమలాపురం, జీళ్లచెరువులోని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయాలతో పాటు మారెమ్మగుడికి కూడా ఇన్చార్జ్ గా వ్యవహరిస్తున్నారు. దీంతో వీరు ఎక్కడా పూర్తిస్థాయిలో పని చేయలేకపోతున్నారు. ఉమ్మడి జిల్లాకు కేటాయించిన 18 పోస్టుల్లో ఖాళీగా ఏడు భర్తీ చేయడంతో పాటు అధిక ఆదాయం ఉన్న ఆలయాలకు ప్రత్యేకంగా ఈఓలను నియమించాలని భక్తులు కోరుతున్నారు. అన్యాక్రాంతమవుతున్న ఆలయ భూములు.. ఉమ్మడి జిల్లాలో దేవాదాయ శాఖ పరిధిలో మొత్తం 14,771 ఎకరాల భూములు ఉన్నాయని రికార్డులు చెబుతున్నాయి. ఇందులో ఖమ్మం జిల్లాలో 4,865 ఎకరాలు ఉండగా 862 ఎకరాలు అన్యాక్రాంతమైంది. భద్రాద్రి జిల్లాలో 9,906 ఎకరాలకు గాను 1,039 ఎకరాల భూమి ఆక్రమణకు గురైంది. వాటిని స్వాధీనం చేసుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నా.. ప్రత్యేకంగా ఈఓలు లేక సాధ్యపడడం లేదు. పోస్టుల భర్తీకి ప్రతిపాదనలు.. ఉమ్మడి జిల్లాకు 18 ఈఓ పోస్టులు ఉండగా, ఏడు భర్తీ చేయాల్సి ఉంది. ఇందుకోసం దేవాదాయ శాఖ కమిషనర్కు ప్రతిపాదనలు పంపించాం. అధికారులను నియమించగానే అవసరమైన ఆలయాలకు కేటాయిస్తాం. అప్పటివరకు భక్తులకు ఇబ్బంది లేకుండా పర్యవేక్షిస్తాం. – వీరస్వామి, ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ -
మహిళ హత్య కేసులో నిందితుడి రిమాండ్
కొణిజర్ల: మహిళను హతమార్చిన ఘటనలో ప్రధాన నిందితుడిని అరెస్టు చేసినట్లు వైరా ఏసీపీ ఎం.ఏ.రెహమాన్ తెలిపారు. వైరా సీఐ సాగర్, కొణిజర్ల ఎస్ఐ జి.సూరజ్తో కలిసి సోమవారం ఆయన వివరాలు వెల్లడించారు. కామేపల్లి మండలం టేకులపల్లి తండాకు చెందిన భూక్యా మదన్ అదే గ్రామ వాసి, అప్పటికే వివాహమైన భూక్యా హస్లీతో వివా హేతర సంబంధం పెట్టుకుని ఆమెతో కొణిజర్ల మండలం విక్రమ్నగర్లో ఆరేళ్లుగా సహజీవనం చేస్తున్నాడు. అయితే, హస్లీకి మళ్లీ పిల్లలు పుట్టే అవకాశం లేదని తెలిసి విక్రమ్నగర్ సమీపంలోని అఫ్జల్తండాకు చెందిన ఇంకో యువతిని వివాహం చేసుకున్నాడు. దీంతో గొడవలు జరుగుతుండగా హస్లీని అడ్డు తొలగించేలా ఇద్దరికి రూ.లక్ష సుపారీ ఇవ్వడమే కాక ఈనెల 8న హస్లీని బలవంతంగా సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం సమీప కిష్టారం అడవుల్లోకి తీసుకెళ్లి హత్య చేశారు. అయితే, హస్లీ కనిపించడం లేదని ఆమె కూతురు భూక్యా దేవి ఈనెల 11న ఫిర్యాదు చేయడమే కాక మదన్పై అనుమానం ఉందని వెల్లడించింది. దీంతో మదన్ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా హత్య చేయించినట్లు ఒప్పుకోవడమేకాక ఘటనాస్థలాన్ని చూపించాడు. ఈ మేరకు మదన్ను రిమాండ్ తరలించి మరో ఇద్దరు నిందితుల కోసం గాలిస్తున్నట్లు ఏసీపీ తెలిపారు. కేసును త్వరగా పరిష్కరించిన వైరా సీఐ సాగర్, ఎస్ఐ సూరజ్, సిబ్బందిని ఆయన అఽభినందించారు. -
సమస్యల పరిష్కారమే అజెండాగా కార్యాచరణ
ఖమ్మంమయూరిసెంటర్: ప్రజా సమస్యల పరిష్కారమే అజెండాగా కార్యాచరణ రూపొందించి అమలు చేయాలని సీపీఐ జాతీయ సమితి సభ్యులు బాగం హేమంతరావు సూచించారు. సీపీఐ జిల్లా కార్యవర్గ సమావేశం సోమవారం తోట రామాంజనేయులు అధ్యక్షతన ఖమ్మంలో సోమవారం జరగగా ఆయన మాట్లాడారు. పాలకులు ప్రజలను విస్మరించినందున ప్రజాసమస్యలు గుర్తించి పరిష్కారా నికి ఉద్యమాలు చేపట్టాలని తెలిపారు. కాగా, కేంద్రప్రభుత్వం కార్పొరేట్ల మేలు కోసమే పనిచేస్తోందని ఆరోపించారు. ఇక రాష్ట్రంలో రుణమాఫీ సంపూర్ణంగా అమలుచేయలేదని విమర్శించారు. ఈనెల 19, 20వ తేదీల్లో మధిరలో జరిగే పార్టీ జిల్లా మహాసభలను విజయవంతం చేయాలని సూచించారు. నాయకులు దండి సురేష్, మౌలానా, జమ్ముల జితేందర్రెడ్డి, క్లెమెంట్, యర్రా బాబు, ఎస్.కే.జానీమియా, లతాదేవి పాల్గొన్నారు. -
బీజేపీ అధ్యక్షుడిపై వ్యాఖ్యలకు నిరసన
ఖమ్మం మామిళ్లగూడెం: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావుపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అనుచిత వ్యాఖ్యలు చేయడం గర్హనీయమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరావు, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండేటి శ్రీధర్ పేర్కొన్నారు. ఈమేరకు సోమవారం ఖమ్మంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. ఈసందర్భంగా కోటేశ్వరరావు, శ్రీధర్ మాట్లాడుతూ దళితుల గౌరవాన్ని బీజేపీ ఎల్లవేళలా కాపాడుతుందనే విషయాన్ని గుర్తించాలని సూచించారు. నాయకులు కోటమర్తి సుదర్శన్, గెంటెల విద్యాసాగర్, నున్న రవికుమార్, ప్రతాప్, చిన్నికృష్ణ, శ్రీకృష్ణ, శ్రీని వాస్, రాజేష్, విజయరెడ్డి, సరస్వతి, మణి, రుద్ర ప్రదీప్, చంద్రశేఖర్, సతీష్, సాయిరాం, వీరభద్రం, నరేష్, నారాయణ, మల్లేశ్వరి, వంశీ, అనిత, జ్వాల పాల్గొన్నారు. నిరసనలో ఘర్షణ బీజేపీ నాయకులు నిరసన తెలిపే క్రమాన డిప్యూటీ సీఎం భట్టిపై విమర్శలు చేయగా, అక్కడకు చేరిన కొందరు కాంగ్రెస్ నాయకులు అభ్యంతరం తెలిపినట్లు తెలిసింది. ఈక్రమంలోనే ఇరువర్గాల మధ్య తోపులాట జరిగినట్లు సమాచారం. అక్కడ ఎస్సీ మోర్చా అధ్యక్షుడు శ్రీధర్పై దాడి చేశారని బీజేపీ నాయకులు ఆరోపించారు. ఆ సమయాన పోలీసులు ఇరువర్గాల ను పంపించారు. ఘటనలో శ్రీధర్కు గాయాలు కాగా ఆస్పత్రికి తరలించడంతో పలువురు పరామర్శించారు. అయితే, పోలీసుల పట్టింపులేని తనంతోనే ఈ ఘటన జరిగిందని బీజేపీ నాయకులు ఆరోపించారు. -
పాముకాటుతో మహిళ మృతి
పెనుబల్లి: ఇంట్లో పనిచేసుకుంటున్న మహిళకు పాము కాటు వేయడంతో మృతి చెందింది. మండలంలోని ముత్తగూడెంకు చెందిన గరిడి నాగేశ్వరరావు భార్య విజయలక్ష్మి (35) సోమవారం ఉదయం ఇల్లు శుభ్రం చేస్తుండగా కాలి బొటన వేలిపై పాము కాటు వేసింది. దీంతో ఆమెను తిరువూరు ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లేలోగా మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆమెకు ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుటుంబ కలహాలతో ఆత్మహత్య మధిర: కుటుంబ కలహాల నేపథ్యాన ఓ ఒక వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఏపీలోని విజయవాడకు చెందిన కత్తి బాబ్జీ(57) హైదరాబాద్ యూసఫ్గూడలోని ఒక అపార్ట్మెంట్లో సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తున్నాడు. ఆయనకు భార్య, కుమారుడు ఉండగా వారిద్దరు ఏడాదిగా వేరే నివసిస్తున్నారు. ఈ క్రమాన మనస్తాపానికి గుౖరైన బాబ్జీ ఆదివారం సాయంత్రం మధిర చేరుకుని ఒక హోటల్లో గది అద్దెకు తీసుకున్నాడు. అయితే, సోమవారం ఉదయం తలుపు తీయకపోవడంతో సిబ్బంది బలవంతంగా తెరిచి చూడగా బాబ్జీ ఫ్యాన్కు ఉరి వేసుకుని ఉన్నాడు. దీంతో మధిర టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి కుటుంబీకులకు సమాచారం ఇచ్చారు. -
విద్యుదాఘాతంతో మహిళ మృతి
ఖమ్మంరూరల్: డాబాపై దుస్తులు ఆరవేస్తున్న మహిళకు 11కేవీ విద్యుత్ తీగలు తాకడంతో షాక్కు గురై మృతి చెందిన ఘటన రూరల్ మండలంలోని కస్నాతండాలో సోమవారం జరిగింది. తండాకు చెందిన మాధవి(40)కి భ భర్త సైదయ్య, ఇద్దరు కుమారులు ఉండగా వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరి ఇంటిపై నుంచి 11 కేవీ విద్యుత్ లైన్ వెళ్తోంది. ఈక్రమాన సోమవారం ఉదయం మాధవి దుస్తులు ఆరవేసేందుకు డాబాపైకి వెళ్లగా తీగలు చేతికి తాకడంతో షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందింది. మృతదేహంతో ఆందోళన విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతోనే మాధవి మృతి చెందిందని ఆరోపిస్తూ ఆమె బంధువులు, స్థానికులు పల్లెగూడెం సబ్స్టేషన్ ఎదుట ధర్నా చేశారు. ఇళ్ల పైనుంచి వెళ్తున్న లైన్ను తొలగించాలని పలుమార్లు కోరినా పట్టించుకోని పేర్కొన్నారు. ఈవిషయాన్ని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి విన్నవిస్తే లైన్ మార్పునకు నిధులు మంజూరు చేసినా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే ప్రమాదం జరిగిందని ఆరోపించారు. ఈమేరకు మూడు గంటల పాటు ధర్నా జరగగా బంధువులు ఆగ్రహంతో సబ్స్టేషన్పై దాడి చేయగా కిటికీల అద్దాలు ధ్వంసమయ్యాయి. కాగా, ఆందోళన విష యం తెలుసుకున్న పోలీసులు చేరుకుని నచ్చచెప్పగా ఆందోళన విరమించారు. కాగా, ఘటనపై మాధవి భర్త సైదయ్య ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని సీఐ ముష్క రాజు తెలిపారు. హెచ్చరికలు పాటించకే ప్రమాదాలుహెచ్చరికలు పాటించకపోవడంతోనే విద్యుత్ ప్రమాదా లు చోటు జరుగుతున్నాయ ని, ఈక్రమంలోనే కస్నాతండాలో ప్రమాదం జరిగిందని విద్యుత్ శాఖ ఎస్ఈ ఇనుగుర్తి శ్రీనివాసాచారి ఒక ప్రకటనలో తెలిపారు. కస్నాతండాలో 11 కేవీ విద్యుత్ లైన్ కింద నిర్మించుకున్న మాధవి ఇంటికి విద్యుత్ కనెక్షన్ ఇవ్వకపోవడంతో అనుమతి లేకుండా విని యోగిస్తున్నారని వెల్లడించారు. ఈమేరకు ఏప్రిల్ 19న విద్యుత్ చౌర్యం కేసు కూడా నమోదైందని చెప్పారు. కాగా, ప్రమాదకరంగా ఉన్నచోట విద్యు త్ లైన్లను మార్చేందుకు చర్యలు చేపడుతామని ఎస్ఈ పేర్కొన్నారు. అధికారుల నిర్లక్ష్యమే కారణమని బంధువుల ధర్నా పల్లెగూడెం సబ్స్టేషన్పై దాడి -
కిసాన్ కాంగ్రెస్ను బలోపేతం చేయాలి
కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు దుర్గాప్రసాద్ఖమ్మంమయూరిసెంటర్: కిసాన్ కాంగ్రెస్ను గ్రామీణ ప్రాంతం నుండి బలోపేతం చేయాల ని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పువ్వాళ దుర్గ ప్రసాద్ సూచించారు. ఖమ్మంలోని కాంగ్రెస్ కార్యాలయంలో సోమవారం జరిగిన కిసాన్ కాంగ్రెస్ కార్యవర్గ సమావేశంలో ఆయన మా ట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల కోసం అమలుచేస్తున్న పథకాలను క్షేత్రస్థాయిలో వివరించాలని తెలిపారు. సీతారామ ప్రాజెక్టు జలా లతో జిల్లా సస్యశ్యామలం కానుందని చెప్పా రు. త్వరలో కిసాన్ కాంగ్రెస్ గ్రామ అధ్యక్షుల శిక్షణ ఏర్పాటుచేయనుండగా, ఆలోగా కమిటీ ల నియామకం పూర్తిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పీసీసీ ప్రధాన కార్యదర్శి నూతి సత్యనారాయణ, కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు మొక్క శేఖర్ గౌడ్, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావుతో పాటు వివిధ మండలా ల నాయకులు వల్లూరి భద్రారెడ్డి, భూక్యా చిననాయక్, శీలం బ్రహ్మారెడ్డి, గాదె ప్రసాద్, కడియాల సుధాకర్, చింతనిప్పు మాధవరా వు, గుత్తా గంగయ్య, మూడుముంతల గంగరాజు, ప్రతిభారెడ్డి తదితరులు పాల్గొన్నారు. భద్రాద్రి అడిషనల్ డీఎంహెచ్ఓగా సైదులుఖమ్మంవైద్యవిభాగం: ఖమ్మం జిల్లా డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ బి.సైదులుకు ఉద్యోగోన్న తి లభించింది. ఆయనను భద్రాద్రికొత్తగూడెం జిల్లా అడిషనల్ డీఎంహెచ్ఓగా నియమిస్తూ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టర్ బి. రవీంద్రనాయక్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. డాక్టర్సైదులు ఖమ్మం జిల్లాలో సుదీర్ఘకాలం వివిధ విభాగాల ప్రోగ్రామ్ ఆఫీసర్గా విధులు నిర్వర్తించారు. ఆయన పదోన్నతి పొందిన సందర్భంగా అధికారులు, ఉద్యోగులు అభినందించారు. వైదిక సంఘం జిల్లా నూతన కమిటీఖమ్మంగాంధీచౌక్: వైదిక సంఘం జిల్లా నూతన కమిటీని ఖమ్మంలో ఎన్నుకున్నారు. మూడేళ్ల కాలా నికి ఎన్నుకున్న ఈ కమిటీలో అధ్యక్షుడిగా తాటికొండల సీతారామశాస్త్రి, ప్రధాన కార్యదర్శిగా కాండూరి ఆదిత్య సరస్వతీకుమార్ ఎన్నికయ్యారు. అలాగే, కోశాధికారిగా కొనకంటి ప్రసాద్ శర్మలను ఎన్నుకున్నట్లు దేవలపల్లి ఆంజనేయశర్మ, కొనకంచి సాయిరాముశర్మ తెలిపారు. విద్యుత్ స్తంభాన్ని బైక్ ఢీకొని.. యువకుడు మృతి, మరొకరి పరిస్థితి విషమం ఇల్లెందురూరల్: విద్యుత్ స్తంభాన్ని బైక్ ఢీకొని ఓ యువకుడు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన మండలంలోని ఇల్లెందులపాడు చెరువు కట్ట సమీపంలో సోమవారం రాత్రి జరిగింది. మృతుడి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం... ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం ముత్యాలగూడెం గ్రామానికి చెందిన వీరబోయిన సాగర్ (23), శేరిపురం గ్రామానికి చెందిన వట్టం కొండల్రావు, రాజు బైక్పై ఇల్లెందు మండలంలోని ఏడుబావుల జలపాతం వద్దకు వెళ్లారు. సరదాగా గడిపి రాత్రి తిరిగి వస్తుండగా చెరువు కట్ట వద్ద మూలమలుపులో విద్యుత్తు స్తంభాన్ని ఢీకొన్నారు. దీంతో తీవ్రగాయాలై సాగర్ అక్కడికక్కడే మృతి చెందాడు. కొండల్రావుకు కూడా తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ఖమ్మం తరలించారు. రాజు ప్రమా దం నుంచి క్షేమంగా బయటపడ్డాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. -
30 కేజీల గంజాయి స్వాధీనం
ఖమ్మంక్రైం: ఖమ్మం కొత్త బస్టాండ్ సమీపాన సోమవారం ఉదయం చేపట్టిన తనిఖీల్లో 30 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నామని ఎకై ్సజ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్ఐ సీహెచ్.శ్రీహరిరావు తెలిపారు. ఎన్ఫోర్స్ సిబ్బంది తనిఖీలు చేపడుతుండగా బస్టాండ్ సమీపంలో రెండుప్లాస్టిక్ సంచులను గుర్తించారు. అందులో పరిశీలించగా 30కేజీల గంజాయి లభించగా, బాధ్యుల కోసం పరిసరాల్లో గాలించినా ఫలితం కానరాలేదని తెలిపారు. ఈ మేరకు గంజాయిని ఖమ్మం–1 ఎకై ్సజ్ స్టేషన్లో అప్పగించామని వెల్లడించారు. తనిఖీల్లో ఉద్యోగులు కరీం, బాలు, సుధీర్, వెంకట్, విజయ్,హన్మంతరా వు, వీరబాబు, స్వరూప, ఉపేందర్ పాల్గొన్నారు.6.64 క్వింటాళ్ల గంజాయి దహనం తల్లాడ: ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని వివిధ ప్రాంతాల్లో కొద్దిరోజులుగా ఎకై ్సజ్ అధికారులు స్వాధీనం చేసుకున్న 6.64 క్వింటాళ్ల గంజాయిని సోమవారంతల్లాడ మండలం గోపాలపేటలో ఏడబ్ల్యూఎం బర్నింగ్ ప్లాంట్లో దహనం చేయించారు. ఖమ్మం జిల్లాలో పట్టుబడిన 1.82 క్వింటాళ్లు, భద్రాద్రిజిల్లాలో 4.82 క్వింటాళ్ల గంజాయి ఇందులో ఉందని ఎక్సైజ్ అధికారులు తెలిపారు. హత్య కేసులో ఒకరికి జీవిత ఖైదు ఖమ్మం లీగల్: కేసు విషయమై రాజీ చేస్తామంటూ నమ్మించి ఓ యువకుడి హత్యకు కారణమైన వ్యక్తికి జీవిత ఖైదుతో పాటు రూ.10వేల జరిమానా విధిస్తూ ఖమ్మం ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి డి.రాంప్రసాద్రావు సోమవారం తీర్పు చెప్పారు. ఖమ్మంకు చెందిన శివను ఒక కేసు విషయంలో రాజీ చేస్తామని బీ.కే.బజార్ చెందిన ఉల్లోజు నాగరాజు నమ్మించాడు. ఈమేరకు 2024 జనవరి 22న శివను పిలిపించి నాగరాజుతో పాటు ఫిరంగి సాయి, ఫిరంగి కుమార్ కర్రలతో దాడి చేశారు. దీంతో తీవ్రంగా గాయపడిన శివ మృతి చెందగా ఆయన తండ్రి నారాయణ ఫిర్యాదుతో ఖమ్మం వన్టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, కేసును విచారణ అనంతరం ఏ1గా నాగరాజుపై నేరం రుజువు కావడంతో జీవితఖైదుతో పాటు జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు. మిగతా ఇద్దరిపై నేరంరుజువు కాకపోవడంతో నిర్దోషులుగా ప్రకటించారు. ప్రాసిక్యూషన్ తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ బి.కృష్ణమోహన్రావు వాదించగా, సిబ్బంది రామకృష్ణ, శ్రీకాంత్, చిట్టిబాబు సహకరించారు. -
రూ.లక్ష కోట్ల వడ్డీ లేని రుణాలు
● మహిళా సంఘాలతో సోలార్ పవర్ ప్రాజెక్టుల ఏర్పాటు ● కుటీర పరిశ్రమల ఏర్పాటుకు శిక్షణ ఇప్పిస్తాం ● డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్కచింతకాని: రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయాలనే సంకల్పంతో మహిళా సంఘాలకు రూ.లక్ష కోట్ల వడ్డీ లేని రుణాలు ఇవ్వనున్నామని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క ప్రకటించారు. చింతకాని మండల కేంద్రంలో సోమవా రం మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాల చెక్కులు, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధదారులకు మంజూరు పత్రాలను పంపిణీ చేసిన ఆయన ఇందిరా మహిళా శక్తి సంబరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ బీఆర్ఎస్ హయాంలో వడ్డీ లేని రుణాలను ఇవ్వకపోగా, తాము అధికారంలోకి రా గానే పునద్ధరించడమే కాక మొదటి ఏడాదే రూ. 21,632 కోట్లు వడ్డీ లేని రుణాలు అందించామని తెలిపారు. అలాగే, సోలార్ విద్యుత్ ప్రాజెక్ట్ల ఏర్పాటు, నిర్వహణ బాధ్యతలు సైతం మహిళా సంఘాలకు అప్పగించనున్నట్లు చెప్కాపరు. మధిర నియోజకవర్గంలోని నాలుగెకరాల్లో 2 మెగావాట్ల సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు ఒప్పందం కుదిరిందని తెలిపారు. కాగా, ప్రతీ నియోజకవర్గంలో మహిళలకు శిక్షణ ఇప్పించి కుటీర పరిశ్రమలు ఏర్పాటుచేయిస్తామని వెల్లడించారు. ఇప్పటికే మహిళా సంఘాల ద్వారా బస్సులు కొనుగోలు చేయించి ఆర్టీసీకి అద్దెకు ఇవ్వగా, పెట్రోల్ బంకులు, ఇసుక రీచ్ల నిర్వహణ కూడా వారికే అప్పగిస్తున్నామని తెలిపారు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు నిరుపేదలందరికీ దశల వారీగా ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క తెలిపారు. రాష్ట్రంలో 4.50 లక్షల ఇళ్లను మంజూరు చేయగా, లబ్ధిదారులకు దశల వారీగా బిల్లులు ఇస్తున్నామని చెప్పారు. అలాగే, రేషన్కార్డులపై సన్నబియ్యం, రూ.500కే సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని, మహిళల ఉచిత బస్సు ప్రయాణానికి రూ.6,632 కోట్లు వెచ్చించామని తెలిపారు. సెర్ప్ సీఈఓ డి.దివ్య మాట్లాడుతూ మహిళా సంఘాలకు ఇచ్చిన రుణాల్లో 99 శాతం తిరిగి చెల్లిస్తున్నారని చెప్పారు. మహిళా సంఘాల సభ్యులకు చీరలు ఇవ్వడానికి కార్యాచరణ రూపొందించామని తెలిపారు. ఈకార్యక్రమంలో మధిర నియోజకవర్గంలోని 4,590 మహిళా సంఘాలకు రూ.5.93 కోట్ల వడ్డీ లేని రుణాల చెక్కు, చింతకాని మండలానికి చెందిన 539 మందికి ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు, నియోజకవర్గానికి చెందిన మహిళా సంఘాలకు రూ.36.21 లక్షల బీమా చెక్కు, బోనకల్ మండలానికి చెందిన కిరణ్కుమార్కు రూ.10 లక్షల ప్రమాద బీమా చెక్కు భట్టివిక్రమార్క ఈ సందర్భంగా అందజేశారు. ఈ కార్యక్రమాల్లో కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, పోలీస్ కమీషనర్ సునీల్దత్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, వైరా ఎమ్మెల్యే రాందాస్నాయక్, డీఆర్డీఓ సన్యాసయ్య, డీఎస్ఓ చందన్కుమార్, డీపీఓ ఆశాలత, జెడ్పీ సీఈఓ దీక్షా రైనా, డీఎంహెచ్ఓ కళావతి బాయి, హౌసింగ్ పీడీ భూక్యా శ్రీనివాస్, ఎంపీడీఓ శ్రీనివాసరావు, తహసీల్దార్ కరుణాకర్రెడ్డి, ఐకేపీ ఏపీఎం శ్రీనివాసరావు, నాయకులు పాల్గొన్నారు. -
ఆగి ఉన్న బస్సును ఢీకొట్టిన ట్యాంకర్
● డ్రైవర్తో పాటు ఆరుగురికి గాయాలు ● వెనక సీటులో ఇరుక్కుపోయిన చిన్నారి, మహిళకారేపల్లి: ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును వెనక నుంచి వేగంగా వచ్చిన ట్యాంకర్ ఢీకొట్టిన ఘటన సోమవారం కారేపల్లి మండలం కామేపల్లి క్రాస్ వద్ద సోమవారం జరిగింది. ఖమ్మం నుంచి ఇల్లెందు వైపు వెళ్తున్న బస్సు కామేపల్లి క్రాస్ స్టేజీ వద్ద ఆగింది. ఈక్రమంలో ప్రయాణికులు దిగుతుండగా వెనుక నుంచి వచ్చిన యాష్ ట్యాంకర్ బలంగా ఢీకొట్టింది. ఈ సమయాన బస్సులో డ్రైవర్, కండక్టర్తో పాటు 47 మంది ప్రయాణికులు ఉండగా, డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో బస్సు కాస్త ముందుకు వెళ్లి ఆగింది. ఈ ఘటనలో డ్రైవర్ అంజికి తీవ్రగాయం కాగా, వెనక సీటులో ఉన్న చిన్నారి ఇషిత, మరో మహిళ అందులో ఇరుక్కుపోయారు. దీంతో కారేపల్లి, కామేపల్లి పోలీసులతో పాటు స్థానికలు బస్సు వెనకాల నుంచి లోనకి వెళ్లి వారిని అతి కష్టంపై బయటకు తీసుకొచ్చారు. కాగా, ఘటనలో డ్రైవర్ సహా రమాదేవి, శ్రీవిద్య, సౌరి, బానోతు బాలా, ఇషిత, నాగభూషణం గాయపడడంతో 108 అంబులెన్స్లో ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంతో ఖమ్మం – ఇల్లెందు రహదారిపై వాహనాలు నిలిచిపోగా జేసీబీ తో బస్సు, లారీని పక్కకు తీయించారు. కాగా, ప్రమాదం జరిగిన ప్రాంతం ఎడమ వైపు కామేపల్లి, కుడి వైపు కారేపల్లి మండల పరిధిలోకి రావడంతో కేసు ఎవరు నమోదు చేయాలనే అనే అంశంపై పోలీసులు తర్జనభర్జన పడినట్లుతెలిసింది. చివరకు కారేపల్లి పరిధిగా తేల్చి ట్యాంకర్ డ్రైవర్ను అదుపులోకి తీసుకుని కేసు నమోదుచేశారు.డినట్లు తెలిసింది. -
సాగర్ ఆయకట్టుకు జలకళ
సాఫీగా నీటి ప్రవాహం కూసుమంచి: సాగర్ ఎడమ కాల్వపై మత్స్య పరిశోధన కేంద్రం వద్ద ఉన్న యూటీ గత ఏడాది వరదలతో కొట్టుకుపోగా పునర్నిర్మించారు. ఈ పనులు చివరి దశకు చేరగా నిర్మాణ ప్రాంతం వద్ద కాల్వలో నీరు సాఫీగా సాగేలా అధికారులు ఇరువైపులా మట్టి కట్టలు వేయించారు. కాల్వకు డిప్యూటీ సీఎం, మంత్రి నీరు విడుదల చేశాక యూటీ వద్ద సాఫీగా ప్రవహించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.సాక్షి ప్రతినిధి, ఖమ్మం: కృష్ణా జలాలు సాగర్ కాల్వల్లో బిరబిరా పరుగులెడుతున్నాయి. వర్షాభావ పరిస్థితుల కారణంగా సాగుపై సందిగ్ధత నెలకొన్న వేళ సాగర్ జలాలు రావడంతో సాగుకు రైతులు సిద్ధం అవుతున్నారు. శ్రీశైలం నుంచి సాగర్లోకి నీరు చేరడంతో సాగు అవసరాలకు పాలేరు రిజర్వాయర్ నుంచి సోమవారం వెయ్యి క్యూసెక్కుల నీరు వదిలారు. రానున్న రోజుల్లో పూర్తి స్థాయిలో నీటి విడుదలకు కార్యాచరణ రూపొందించారు. ఏటా జూలై చివరి వారం, ఆగస్టు మొదటి వారంలో విడుదల చేసే సాగర్ జలాలను ఈసారి ఇక్కడ వర్షాభావ పరిస్థితుల నేపథ్యాన ముందస్తుగానే వదలడంతో 2.54 లక్షల ఎకరాల ఆయకట్టులో పంటల సాగుకు కష్టాలు తీరనున్నాయి. నిన్నటి వరకు వెలవెల జిల్లాలో ప్రధాన సాగునీటి వనరుగా నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిలుస్తుండగా, పాలేరు రిజర్వాయర్ నీరు లేక వెలవెలబోయింది. రిజర్వాయర్ నీటినిల్వ సామర్థ్యం 23 అడుగులు కాగా.. ఈనెల మొదట్లో 12.45 అడుగులకు పడిపోయింది. దీంతో అటు సాగు, ఇటు తాగునీటికి ఇబ్బందులు తలెత్తాయి. జిల్లాలో సాగర్ ఆయకట్టు పరిధిలోని 2.54 లక్షల ఎకరాల సాగుపై సందిగ్ధత నెలకొంది. తాగునీటి అవసరాలకు.. పాలేరు రిజర్వాయర్లో నీటి నిల్వలు తగ్గడంతో తాగునీటికి ఇబ్బంది ఎదురవుతుందని భావిస్తుండగానే కృష్ణా పరీవాహకంలో భారీ వర్షాలతో శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులో నీరు చేరింది. ఈక్రమాన సాగర్ నుంచి పాలేరు రిజర్వాయర్లోకి నీరు విడుదల చేయడంతో రిజర్వాయర్ 20 అడుగులకు చేరింది. ఈ నీటిని తాగునీటి అవసరాలకే వినియోగించాలని భావించినా, రైతుల అవస్థల దృష్ట్యా సాగు కోసం కూడా విడుదల చేయాలని నిర్ణయించారు. ఇక ఏటా మాదిరిగా సాగు అవసరాలకు ఈనెల 20నుంచి సాగర్ జలాలు విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. దీంతో పాలేరు రిజర్వాయర్లో 20 అడుగులుగా ఉన్న నీటిని దిగువకు విడుదల చేస్తున్నా.. మరోమారు సాగర్ నుంచి వచ్చే నీటితో రిజర్వాయర్ నిండుతుందని భావిస్తున్నారు. పంటల సాగుకు సిద్ధం.. సాగుపై సందిగ్ధంగా ఉన్న సమయాన సాగర్ జలాలు విడుదల కావడంతో రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఇప్పటి వరకు దుక్కులు దున్ని, వరి నారు సిద్ధం చేసుకున్న రైతులు ఇప్పుడు ధైర్యంగా నాట్లు వేయనున్నారు. జిల్లాలో సాగర్ ఆయకట్టు కింద 2,54,270 ఎకరాల భూమి ఉండగా, ఈ నీటితోనే పాలేరు, వైరా రిజర్వాయర్లు, పలు చెరువులు నింపాల్సి ఉంటుంది. స్విచాన్ చేసి రెండో జోన్కు.. పాలేరు రిజర్వాయర్ వద్ద రెండో జోన్కు సాగునీటిని సోమవారం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విడుదల చేశారు. తొలుత వెయ్యి క్యూసెక్కుల నీరు దిగువకు వదలగా.. డిప్యూటీ సీఎం, మంత్రి పూజలు చేసి కృష్ణా జలాలకు చీర, సారె సమర్పించారు. రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, సీపీ సునీల్దత్, ఆర్డీఓ నర్సింహారావు, ఇరిగేషన్ ఎస్ఈ మంగళంపూడి వెంకటేశ్వర్లు, తహసీల్దార్ రవికుమార్, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, మార్క్ఫెడ్ మాజీ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. వరినాట్లు వేసుకుంటాం.. మాకు పెద్ద కాల్వ కింద మూడెకరాల భూమి ఉంది. ఇన్నాళ్లు నీళ్ల పరిస్థితి తెలియక నాట్లు వేయడానికి ఆలోచించా. కానీ ముందుగానే సాగర్ నీళ్లు వదలడంతో వరి నాట్లు వేస్తాం. ముందుగా నీళ్లు వదలడం రైతులకు ఎంతో మంచిది. – జవ్వాజి పవన్కుమార్, మల్లాయిగూడెంపాలేరు రిజర్వాయర్ నుంచి వెయ్యి క్యూసెక్కుల నీటి విడుదల దశల వారీగా పూర్తిస్థాయిలో విడుదలకు ప్రణాళిక ఆయకట్టు పరిధిలో 2.54 లక్షల ఎకరాల సాగుకు భరోసా ఎడమకాల్వ వద్ద స్విచాన్ చేసిన డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి పొంగులేటి -
వెదురు బొంగులకు చెదలు..
● భారీగా సరుకు రాక.. వేలంలో జాప్యంతో సమస్య ● సత్తుపల్లి డిపోలో పరిశీలించిన ఎఫ్డీసీ ఎండీ సునీత ఎం.భగవత్ సత్తుపల్లి: నాణ్యత లేకపోవడమేకాక ఒకేసారి భారీగా సరుకు వచ్చినా వేలంలో జాప్యంతో వెదురు బొంగులు చెదలు పడుతున్నాయి. అంతేకాక తాజా వర్షాలతో తడిసి ఎక్కడికక్కడ విరిగిపోతుండడంతో ప్రస్తుతం వేలం వేసినా సరైన ఆదా యం వచ్చే పరిస్థితులు కానరావడం లేదు. వెదురుబొంగుల్లో నాణ్యత లేమికి తోడు అధికారుల నిర్లక్ష్యంతో ఈ సమస్య ఎదురైనట్లు తెలుస్తోంది. 4లక్షలకు పైగా బొంగులకు... సత్తుపల్లిలో అటవీ అభివృద్ధి కార్పొరేషన్(ఎఫ్డీసీ) ద్వారా ఏళ్ల క్రితం వెదురు డిపో ఏర్పాటుచేశారు. ఈ డిపోకు సత్తుపల్లి, కొత్తగూడెం, పాల్వంచ అటవీ డివిజన్ల నుంచి వెదురుబొంగు వస్తోంది. ఏటా 12 – 15లక్షల టన్నుల వెదురు డిపోకు వస్తుందని అంచనా. కానీ ఈ ఏడాది వెదురుబొంగుల చెట్లకు ఫ్లవరింగ్(పూత) సమస్య రావడంతో ఒకేసారి చెట్లన్నీ తొలగించారు. దీంతో ఏకంగా డిపోకు 33లక్షల వెదురుబొంగులు చేరాయి. సత్తుపల్లి మండలం బుగ్గపాడు, దమ్మపేట మండలం గండుగులపల్లి రేంజ్ల్లో 40 ఏళ్ల క్రితం అటవీ అధికారులు వెదురు ప్లాంటేషన్ వేశారు. అప్పటి నుంచి దిగుబడి బాగానే వచ్చింది. ఈ ఏడాది చెట్ల జీవితకాలం ముగియనుండడంతో ఫ్లవరింగ్ వచ్చినట్లు తెలు స్తుండగా విక్రయాల్లో జాప్యంతో చెదలు పడుతున్నట్లు తెలిసింది. ఇందులో 4లక్షలకు పైగా బొంగులకు చెదలు పట్టడంతో ఎక్కడికక్కడ విరిగిపోతున్నాయని సమాచారం. వేలంలో అధికారుల నిర్లక్ష్యం వెదురు పెద్ద ఎత్తున రావటంతో అధికారులు సరైన రీతిలో స్పందించలేదనే విమర్శలు వస్తున్నాయి. ప్రతీ నెల రెండుసార్లు వేలంపాట ద్వారా వెదురు అమ్ముతుంటారు. కానీ ఎక్కువ మొత్తంలో పేరుకుపోతే కనీసం ఐదారు సార్లు వేలం వేసే అవకాశం ఉన్నా ఆ దిశగా స్పందించలేదు. ఫలితంగా వెదురు పేరుకుపోయి చెదలు పట్టి ఇప్పుడు అమ్మలేని పరిస్థితి ఎదురైంది. కాగా, వెదురుబొంగుతో చేసిన గుజ్జుతో చెక్ పేపర్లు, బాండ్ పేపర్లు తయారుచేస్తారు. ఇటీవల వెదురుబొంగుల స్థానంలో సుబాబుల్, జామాయిల్ వినియోగిస్తుండడంతో డిమాండ్ తగ్గుతోంది. గతంలో భద్రాచలం, కాగజ్నగర్, రాజమండ్రి పేపర్ బోర్డుల నుంచి వచ్చే ఆర్డర్లు తగ్గాయని సమాచారం. ఉత్పత్తి పెరగడంతోనే... ఈ ఏడాది వెదురుబొంగుల ఉత్పత్తి పెరగగా, ఆర్డర్లు సరిపడా లేక బొంగులు పేరుకుపోయి చెదలు పడుతోందని టీజీ ఎఫ్డీసీ మేనేజింగ్ డైరెక్టర్ సునీత ఎం.భగవత్ తెలిపారు. సత్తుపల్లి అటవీ అభివృద్ధి కార్పొరేషన్ డిపోను సోమవారం ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎండీ మాట్లాడుతూ నష్టనివారణ చర్యల్లో భాగంగా వెదురు బొంగును కటింగ్ చేసి పరిశ్రమలకు విక్రయిస్తామని తెలిపారు. అయితే, వెదురుకు చెదలు పట్టడం వల్ల నష్టం ఎదురవుతుందనే ప్రచారంలో వాస్తవం లేదని చెప్పారు. కాగా, ఈ ఏడాది ఎకో టూరిజం, జామాయిల్, జీడి మామిడి సాగుతో సంస్థకు రూ.310 కోట్ల ఆదాయం లభించిందని తెలిపారు. జిల్లాలోని కనిగిరిగుట్టల్లో ఎకో టూరిజం అభివృద్ధికి అవకాశాలను పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు. ఎఫ్డీసీ ఉద్యోగులు స్కైలాబ్, ఎం.గణేష్ తదితరులు పాల్గొన్నారు. -
డిజిటల్ లావాదేవీలకు జిల్లా ఎంపిక
ఖమ్మంమయూరిసెంటర్: మహిళా సంఘాలకు ఇచ్చే బ్యాంక్ లింకేజీ రుణాలు సకాలంలో తిరిగి చెల్లించేలా అధికారులు, సిబ్బంది పర్యవేక్షించాలని సెర్ప్ సీఈఓ దివ్య దేవరాజన్ సూచించారు. జిల్లా పర్యటనలో భాగంగా సోమవారం ఆమె ఖమ్మంలోని మహిళా మార్ట్ను సందర్శించాక జిల్లా సమాఖ్య భవనంలో అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ, డీఆర్డీఏ అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీఈఓ మాట్లాడుతూ దేశంలోని 700 జిల్లాల్లో పది జిల్లాలను డిజిటల్ లావాదేవీలకు ఎంపిక చేయగా జాబితాలో ఖమ్మం కూడా ఉన్నందున మహిళా సంఘాల సభ్యులు నగదు లావాదేవీలను డిజిటల్ విధానంలో చేసేలా ప్రోత్సహించాలని తెలిపారు. అలాగే, సంఘాల నిర్వహణలో అవకతవకలు జరగకుండా, రుణాల మంజూరు, రికవరీ సాఫీ జరిగేలా మహిళా సంఘాల సభ్యులతో సమావేశాలు నిర్వహిస్తూ ఏపీఎం, డీపీఎంలు పాల్గొనాలని సూచించారు. జిల్లాలో మహిళా సమాఖ్యలకు గోదాంలు మంజూరు చేశామని, మండల సమాఖ్యలకు రెండు, వీఓఏలకు కేటాయించిన ఎనిమిది గోదాంల నిర్మాణాన్ని పర్యవేక్షించాలని తెలిపారు. కాగా, ప్రతీ గ్రామ సమాఖ్య పరిధిలో 15 – 18 ఏళ్ల కిశోర బాలికలు, 60 ఏళ్లు పైబడిన మహిళలు, దివ్యాంగులతో ఒక్కో సంఘం ఏర్పాటు చేయించాలని ఆదేశించారు. కాగా, బస్సు నడిపేందుకు ఆసక్తి ఉన్న మహిళలను గుర్తిస్తే శిక్షణ ఇప్పించనున్నట్లు సీఈఓ వెల్లడించారు. మహిళా మార్ట్ అద్భుతం.. మహిళా సంఘాల సభ్యులు రూపొందించే ఉత్పత్తుల అమ్మకానికి మహిళా మార్ట్ను ఏర్పాటు చేయడం.. నిర్వహణను సెర్ప్ సీఈఓ దివ్య అభినందించారు. మహిళా మార్ట్లో ఉత్పత్తులను పరిశీలించిన ఆమె సభ్యులతో మాట్లాడి ప్యాకింగ్, అమ్మకాలపై ఆరా తీశారు. ఆతర్వాత మార్ట్ వద్ద క్యాంటీన్లో టీ తాగి సిబ్బందిని అభినందించారు. కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్య, సెర్ప్ డైరెక్టర్లు రజిత, నర్సింహరెడ్డి, అడ్మిన్ విజ యలక్ష్మి, డీఆర్డీఓ ఆర్.సన్యాసయ్య, అడిషనల్ డీఆర్డీఓ జయశ్రీ, డీపీఎంలు ఆంజనేయులు, రాజేష్ పాల్గొన్నారు. జిల్లా సమాఖ్య సమావేశంలో సెర్ప్ సీఈఓ దివ్య మహిళా మార్ట్ నిర్వహణ బాగుందని కితాబు -
ఫిర్యాదులు పరిష్కరించండి
ఖమ్మం సహకారనగర్: ప్రజలు ఇచ్చే ఫిర్యాదును పరిశీలించి వీలైనంత త్వరగా పరిష్కరించాలని అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి సూచించారు. కలెక్టరేట్లో సోమవారం ప్రజావాణిలో భాగంగా ఆయన ప్రజల నుంచి ఫిర్యాదులు, వినతిపత్రాలు స్వీకరించారు. అనంతరం వివిధ శాఖల అధికారులతో సమావేశమై పరిష్కారంపై సూచనలు చేశారు. క్యూ కడుతున్నారు... ప్రతీ వారం కలెక్టర్లో నిర్వహించే ప్రజావాణికి జనం తాకిడి పెరుగుతోంది. అయితే, ఎవరికి వారే ముందు ఫిర్యాదు ఇవ్వాలనే భావనతో గుంపులుగా చేరి అధికార యంత్రాంగాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. సోమవారం కూడా ఇదే పరిస్థితి ఎదురుకాగా పోలీస్ సిబ్బంది చేరుకుని అంతా క్యూలో వచ్చేలా నియంత్రించారు.అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి -
పాఠశాలల్లో పెరిగిన విద్యార్థుల నమోదు
ఏన్కూరు: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఈ ఏడాది విద్యార్థులు నమోదు పెరిగిందని జిల్లా విద్యాశాఖాధికారి ఎస్.సత్యనారాయణ తెలిపా రు. ఏన్కూరు మండలం కొత్తమేడేపల్లి పాఠశాలను సోమవారం తనిఖీ చేసిన ఆయన విద్యార్థుల నమోదు, హాజరు, బోధనపై ఆరా తీశారు. అనంతరం డీఈఓ మాట్లాడుతూ పాఠశాలలో వసతులు కల్పించడంతో పాటు బడిబాట ద్వా రా విద్యార్థుల నమోదు పెరిగిందన్నారు. కలెక్టర్ చొరవతో కొత్తమేడేపల్లి పాఠశాలో ఇద్దరు ఉపాధ్యాయులను డిప్యూటేషన్పై నియమించనున్నామని తెలిపారు. కాగా, జిల్లాలోని అన్ని పాఠశాలల విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, ఒక జత యూనిఫామ్ పంపిణీ చేశామని డీఈఓ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఏంఈఓ రహీంబీ, ఉపాధ్యాయుడు జయరాం పాల్గొన్నారు. ఉద్యోగ పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ ఖమ్మంమయూరిసెంటర్: గ్రూప్–1, 2, 3, 4తో పాటు ఆర్ఆర్బీ, ఎస్ఎస్సీ, బ్యాంకింగ్ రిక్రూట్మెంట్ల పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ జి.శ్రీలత తెలిపారు. ఈ శిక్షణ వచ్చే నెల 25నుంచి 150 రోజులు ఉంటుందని పేర్కొన్నారు. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అభ్యర్థులు ఈనెల 11వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చని, వివరాలకు 08742–230848, 95738 59598, 94419 31359 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. నేడు ఆన్లైన్లో శిక్షణ ఖమ్మం సహకారనగర్: స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన అంశాలపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ అధికారులు మంగళవారం ఆన్లైన్ విధానంలో శిక్షణ ఇవ్వనున్నారు. ఈ శిక్షణలో జెడ్పీ అధికారులు, డీపీఓ, ఎంపీడీఓలు పాల్గొనాలని ఆదేశాలు అంధాయి. జిల్లా కేంద్రంలోని జెడ్పీ కార్యాలయంలో ఉదయం 11–30నుంచి 12–30గంటలకు వరకు శిక్షణ జరగనుండగా, ఆతర్వాత కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై సమీక్షించనున్నారు. ‘సీతారామ’తో 60 వేల ఎకరాలకు సాగునీరు ఏన్కూరు: సీతారామ ప్రాజెక్టు ద్వారా వైరా నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో 60 వేల ఎకరాలకు గోదావరి జలాలు అందనున్నాయని వైరా ఎమ్మెల్యే మాలోతు రాందాస్ నాయక్ తెలిపారు. అశ్వాపురం మండలం బీజీ కొత్తూరులోని సీతారామ ప్రాజెక్టు పంప్హౌస్ నుంచి విడుదల చేసిన నీరు జూలూరుపాడు మండలం వినోభానగర్ నగర్ వద్దకు చేరాయి. ఈ మేరకు ఏన్కూరులోని సాగర్ లింక్ కెనాల్కు నీటిని సోమవారం విడుదల చేసిన ఎమ్మెల్యే రాందాస్ మాట్లాడారు. వర్షాభావ పరిస్థితుల్లో సాగుకు ఇబ్బంది లేకుండా గోదావరి జలాలు ఉపయోగపడతాయని తెలిపారు. రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరావు, డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, నాయకులు శెట్టిపల్లి వెంకటేశ్వరావు, వేముల కృష్ణప్రసాద్, స్వర్ణ నరేందర్, రాయల నాగేశ్వరావు, బొర్రా రాజశేఖర్, మేడ ధర్మారావు పాల్గొన్నారు. -
సింధుకు అండగా ఎంపీ, మంత్రి
కూసుమంచి: కూసుమంచి మండలంలోని ధర్మాతండాకు చెందిన జర్పుల సింధు రోడ్డు ప్రమాదంలో గాయపడి అచేతన స్థితికి చేరగా, వైద్యం చేయించలేని పరిస్థితుల్లో ఆమె తండ్రి పరశురాం ఇటీవల ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆయన గతనెల 29న ఆత్మహత్య చేసుకోగా ‘సాక్షి’ ప్రధాన సంచికలో ‘నా వల్ల కావడం లేదు తల్లీ’ శీర్షికన కథనం ప్రచురితమైంది. దీంతో స్పందించిన రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సుమోటాగా స్వీకరించిన విషయం విదితమే. అలాగే, ఈనెల 3వ తేదీన సింధు కుటుంబాన్ని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి పరామర్శించి సింధు చికిత్స బాధ్యత తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇందులో భాగంగానే ఆమెను ఎంపీ రఘురాంరెడ్డి సోమవారం హైదరాబాద్లోని కేర్ ఆస్పత్రిలో చేర్పించారు. అలాగే, సింధు చికిత్సపై వైద్యులతో మాట్లాడడమే కాక మందులు ఇప్పించి ఆర్థిక సాయం అందజేశారు. -
మిర్చి ధర ముందడుగు..
● రూ.350 నుంచి రూ.500 పెరుగుదల ● వివిధ రాష్ట్రాల్లో డిమాండ్తో ఫలితంఖమ్మంవ్యవసాయం: మిర్చి ధరలో స్వల్ప పెరుగుదల నమోదైంది. కొంతకాలంగా ధరలతో పోలిస్తే ప్రస్తుతం రూ.350 నుంచి రూ.500మేర పెరిగింది. మార్చి, ఏప్రిల్లో క్వింటా మిర్చికి రూ.13,500 నుంచి రూ.13,850మధ్యే పలకగా మే నెలలో రూ.13వేలు కూడా దాటలేదు. జూన్ ఆరంభంలో ఏసీ మిర్చికి రూ.14,200వరకు రాగా, ఆతర్వాత రూ.13వేలకు పడిపో యి నా ఈ నెలారంభం నుంచి పురోగతి కనిపించింది. ఏసీ మిర్చి తేజా రకం ధర రూ.13,350 నుంచి పెరుగుతూ 11వ తేదీన రూ.13,500కు చేరింది. సోమవారం మరో రూ.350 పెరిగి రూ.13,850గా నమోదైంది. నాన్ ఏసీ మిర్చి జూన్లో రూ. 12,500లోపే పలకగా, సోమవారం రూ.13,600కు చేరింది. ఇతర రాష్ట్రాల్లో వినియోగంతో... మిర్చి ధర దేశీయ మార్కెట్లోనే పెరుగుతుండడంతో ఇక్కడ కూడా ఫలితం కనిపిస్తోంది. యూపీ, బిహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో తేజా రకం మిర్చి వినియోగం పెరగడం ఇందుకు కారణమని వ్యాపారులు విశ్లేషిస్తున్నారు. తేజా రకం మిర్చిని చైనా దేశానికి ఎగుమతి చేస్తున్నా ఈసారి ఆర్డర్లు రాలేదు. కానీ దేశీయంగా ఆర్డర్లతో ధరలో కదలిక రావడం రైతుల్లో ఆశలు నింపుతోంది. జిల్లాలోని 48 కోల్డ్ స్టోరేజీల్లో దాదాపు 48 లక్షల మిర్చి బస్తాలు, రైతుల ఇళ్లలో కూడా మిర్చి నిల్వ ఉండగా క్వింటాకు ధర రూ.15 వేల మార్క్ తాకితే అమ్మకాలు ఊపందుకునే అవకాశముందని భావిస్తున్నారు. -
వన మహోత్సవానికి పక్కా ప్రణాళిక
● సమన్వయంతో భూసమస్యల పరిష్కారం ● కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఖమ్మం సహకారనగర్: జిల్లాలో వన మహోత్సవం విజయవంతం చేసేలా ప్రణాళిక రూపొందించాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డితో కలిసి సోమవారం ఆయన రెవెన్యూ, అటవీ భూముల సమస్యలు, వన మహోత్సవం, ప్రభుత్వ గురుకులాల్లో మెనూ అమలుపై వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. వన మహోత్సవంలో భాగంగా మండలాల వారీగా పదెకరాలకు తక్కువ కాకుండా బ్లాక్లు గుర్తించి మొక్కలు నాటాలన్నారు. అలాగే, ప్రభుత్వ గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ సమస్య రాకుండా మెనూ అమలు, సామగ్రి నాణ్యతపై ఆర్సీఓలు పర్యవేక్షించాలని తెలిపారు. తహసీల్దార్లు ప్రభుత్వ గురుకులాలను వారానికోసారి తనిఖీ చేయాలని, గురుకులాల్లో కమిటీల నిర్వహణపై సూచనలు చేయాలన్నారు. అలాగే, ప్రభుత్వ భూముల పరిరక్షణకు అటవీ, రెవెన్యూ అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. దళారులకు ఆస్కారమివ్వొద్దు... రెవెన్యూ వ్యవస్థలో దళారులకు ఆస్కారం ఇవ్వకుండా నిబంధనల ప్రకారమే పనులు జరిగేలా అధికారులు, ఉద్యోగులు విధులు నిర్వర్తిచాలని కలెక్టర్ అనుదీప్ ఆదేశించారు. రెవెన్యూ శాఖపై అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డితో కలిసి సమీక్షించిన ఆయన తహసీల్, ఇతర కార్యాలయాల ఉద్యోగులు ప్రజల సమస్యల పరిష్కారంలో ఇతరుల జోక్యాన్ని అరికట్టాలని తెలిపారు. అలాగే, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల నుంచి దరఖాస్తులకు ప్రాధాన్యత ఇవ్వాలని, మీ సేవా కేంద్రాలను తరచూ తనిఖీ చేయాలని సూచించారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ, రహదారులు, మున్నేరు రిటైనింగ్ వాల్కు భూ సేకరణపై కలెక్టర్ సూచనలు చేశారు. డీఆర్ఓ పద్మశ్రీ, ఎస్డీసీ రాజేశ్వరి, ఆర్డీఓలు నర్సింహారావు, రాజేందర్ గౌడ్, ఏపీడీ శిరీష పాల్గొన్నారు. -
నేటి నుంచి రేషన్ కార్డుల పంపిణీ
● రాష్ట్రంలో 3.54 లక్షల కుటుంబాలకు కొత్త కార్డులు ● పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఒక్కరికీ ఇవ్వలేదు ● రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ మంత్రి పొంగులేటినేలకొండపల్లి : రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల పంపిణీకి సోమవారం శ్రీకారం చుట్టనున్నట్లు రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. మొత్తం 3.54.లక్షల కుటుంబాలకు కార్డులు ఇవ్వనుండగా.. సీఎం రేవంత్రెడ్డి నేడు పంపిణీని ప్రారంభిస్తారని వెల్లడించారు. మండలంలో ఆదివారం పర్యటించిన ఆయన.. సుర్దేపల్లి నుంచి బోదులబండ వరకు తాగునీటి పైపులైన్ నిర్మాణానికి, కోనాయిగూడెంలో సీసీ రోడ్లకు, మంగాపురంతండాలో బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గత పాలకులు పదేళ్లలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వకుండా కాలయాపన చేశారని విమర్శించారు. తమ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమాన్ని జోడెడ్లలా నడిపిస్తోందని, హామీల అమలకు సిద్ధంగా ఉందని అన్నారు. అర్హులందరికీ నాలుగు విడతల్లో ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని చెప్పారు. నాటి ప్రభుత్వం వరి వేస్తే ఉరి అంటే తమ సర్కారు రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేసిందని, తొమ్మిది రోజుల్లోనే రూ.9వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసిందని చెప్పారు. త్వరలోనే కృష్ణా జలాలు వస్తాయన్నారు. కోనాయిగూడెంలో పెసర పంటను పరిశీలించి సాగు వివరాలు రైతులను అడిగి తెలుసుకున్నారు. వరి నాట్లు వేసే కూలీల వద్దకు వెళ్లి వారి జీవన స్థితిగతులను తెలుసుకున్నారు. కార్యక్రమంలో కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, మార్కెట్ కమిటీ చైర్మన్ వెన్నపూసల సీతారాములు, నాయకుల శాఖమూరి రమేష్, కొడాలి గోవిందరావు, అంజిని, రావెళ్ల కృష్ణారావు, బోయిన వేణు, బచ్చలకూరి నాగరాజు, గుండా బ్రహ్మం, యడవల్లి నాగరాజు, రాయపూడి నవీన్, పెంటమళ్ల పుల్లమ్మ, బొందయ్య, కొమ్మినేని పుష్పావతి, పాకనాటి కన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఇన్చార్జ్ ఏఎస్డబ్ల్యూఓకు జాతీయ పురస్కారం
చింతకాని: మండలంలోని నాగులవంచ సమీకృత బాలుర వసతి గృహం సంక్షేమాధికారి, షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి సహాయ అధికారి (ఏఎస్డబ్ల్యూఓ), మధిర ఇన్చార్జ్ కొత్త వెంకటేశ్వరరావు తెలుగు వెలుగు జాతీయ గౌరవ పురస్కారాన్ని హైదరాబాద్ త్యాగరాయ గానసభలో శనివారం అందుకున్నారు. తెలుగు – వెలుగు సాహితీ వేదిక, కాళోజీ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ఆధ్వర్యంలో షెడూ్య్ల్డ్ కులాల విద్యార్థుల అభ్యున్నతికి, సామాజిక సేవకు గాను ఆయనకు అవార్డు అందజేశారు. శ్రీ విశ్వకళా విరాట్, బతుకమ్మ తల్లి గ్రంథకర్త, గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డ్స్ గ్రహీత డాక్టర్ వంగాల శాంతికృష్ణ చేతుల మీదుగా ఆయన పీవీ నర్సింహారావు జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా సహచర ఉద్యోగులు, పూర్వ విద్యార్థులు వెంకటేశ్వరరావును అభినందించారు. యాప్ ఓపెన్ చేస్తే డబ్బులు మాయంరఘునాథపాలెం: ఓ విద్యార్థి వాట్సప్నకు వచ్చిన లింక్ ద్వారా యాప్ ఓపెన్ చేయగానే బ్యాంక్ ఖాతాలో ఉన్న డబ్బులు మాయం అయ్యాయి. బాధితుడి ఫిర్యాదుపై ఆదివారం కేసు నమోదు చేసినట్లు రఘునాథపాలెం సీఐ ఉస్మాన్ షరీఫ్ తెలిపారు. కారేపల్లి మండలం కుక్కలతండాకు చెందిన అజ్మీరా సిద్ధార్థ రఘునాథపాలెంలో ఉంటున్నాడు. గత డిసెంబర్ 26న తన ఫోన్ వాట్సాప్నకు ఓ యాప్ మెసేజ్ వచ్చిందని దాన్ని ఓపెన్ చేయగానే తన ఖాతాలో నిల్వ ఉన్న నగదు రూ.70 వేలు పోయినట్లు మెసేజ్ వచ్చిందని, వెంటనే సైబర్ క్రైమ్కు ఫిర్యాదు చేస్తే ఖాతాను హోల్డ్ చేశారని బాధితుడు తెలిపాడు. సైబర్ క్రైమ్ అధికారుల సూచన మేరకు బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. రోడ్డు ప్రమాదంలో మహిళకు తీవ్ర గాయాలుచింతకాని: మండలంలోని మత్కేపల్లి తుమ్మలమ్మ వాగు వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఖమ్మం నగరానికి చెందిన సుగుణకు తీవ్ర గాయాలయ్యాయి. సుగుణ కుటుంబ సభ్యులతో కలిసి ద్విచక్ర వాహనంపై ఏపీలోని పెనుగంచిప్రోలు దైవ దర్శనానికి వెళ్లి తిరిగి ఖమ్మం వస్తుండగా తుమ్మలమ్మ వాగు వద్ద ద్విచక్ర వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కన పడిపోయింది. సుగుణ తలకు తీవ్ర గాయాలు కావటంతో సమాచారం తెలుసుకున్న ఎస్ఐ నాగుల్మీరా, ఏఎస్ఐ లక్ష్మణ్ ఆమెను 108లో ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. ఉత్తమ టీటీ కోచ్కు అవార్డుఖమ్మంస్పోర్ట్స్: రాష్ట్ర టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ ఆధ్వర్యాన ఆదివారం హైదరాబాద్లో ఉత్తమ టేబుల్ టెన్నిస్ కోచ్గా జిల్లా టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ కార్యదర్శి, కోచ్ వీవీ సాంబమూర్తికి ఉత్తమ కోచ్గా అవార్డు అందించారు. జిల్లా నుంచి రాష్ట్రస్థాయిలో అవార్డు అందుకున్న కోచ్గా సాంబమూర్తి నిలిచారు. ఆయనకు అవార్డు రావడంపై సంఘం జిల్లా అధ్యక్షులు బాలసాని విజయ్కుమార్, ఉపాధ్యక్షులు ఉప్పల్రెడ్డి, డాక్టర్ కూరపాటి ప్రదీప్కుమార్, జంగాల సునీల్, శ్రీధర్, ప్రవీణ్కుమార్, చలపతి, షేక్ మజ్జాహర్, జోజిచాకో, రాజేశ్, రెడ్డిసాయి తదితరులు హర్షం వ్యక్తం చేశారు. వరద తగ్గింది.. బురద మిగిలిందిభద్రాచలంటౌన్: భద్రాచలం వద్ద గోదావరికి భారీ వరద వచ్చి తగ్గింది. సుమారు 42 అడుగులకు చేరుకోవడంతో స్నానఘట్టాలు పూర్తిగా వరద నీటిలో మునిగిపోయాయి. వరద తగ్గడంతో ఆదివారం కొంత మేరకు స్నానఘట్టాలపై నీరు తగ్గింది. కానీ బురద మిగిలిపోయింది. దీంతో స్నానాలు ఆచరించేందుకు భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అక్కడక్కడా భక్తులే బురదను తొలగించుకుని స్నానాలు చేశారు. -
భక్తులతో పోటెత్తిన భద్రగిరి
భద్రాచలం: భద్రగిరి ఆదివారం భక్తులతో పోటెత్తింది. రెండో శనివారం, ఆదివారం వరుస సెలవులు రావడంతో భక్తులు భద్రాచలం బాట పట్టారు. పవిత్ర గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి క్యూలైన్లలో బారులుదీరి స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారి నిత్యకల్యాణం, అభిషేకం తదితర పూజా కార్యక్రమాల్లో అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రద్దీ ఉండటంతో పట్టణంలో ప్రైవేట్ లాడ్జీలలో, దేవస్థానం వసతి గృహాల్లో గదులు దొరకక భక్తులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. రామయ్యకు వైభవంగా కల్యాణం అంతరాలయంలోని మూలమూర్తులకు ఆదివారం అభిషేకం, సువర్ణ పుష్పార్చన జరిపారు. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి స్వామివారిని పల్లకీ సేవగా చిత్రకూట మండపానికి తీసుకొచ్చారు. ఆ తర్వాత అర్చకులు స్వామివార్లకు విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు. శ్రీసీతారామచంద్ర స్వామివారికి అభిషేకం, సువర్ణ పుష్పార్చన -
బైక్ను ఢీకొట్టిన లారీ
ఖమ్మంరూరల్: మండలంలోని చింతపల్లి వద్ద ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొట్టడంతో ఓ యువకుడు మృతి చెందిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. తిరుమలాయ పాలెం మండలం చంద్రుతండాకు చెందిన బానోత్ వీరకుమార్ (26)వంట మాస్టర్గా, ర్యాపిడో బైక్ ట్యాక్సీడ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఈనెల 12న ఉద యం ఇంటి నుంచి ఖమ్మం వెళ్లి పని ముగించుకుని తిరిగి ద్విచక్రవాహనంపై ఇంటికి వస్తున్నాడు. మార్గమధ్యలో చింతపల్లి వద్ద వరంగల్ వైపు నుంచి ఎదురుగా అతివేగంగా వచ్చిన లారీ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అన్నం ఫౌండేషన్ ఛైర్మన్ శ్రీనివాసరావు బృందం సాయంతో మృతదేహాన్ని ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య అంజలి ఇద్దరు పిల్లలున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రాజు తెలిపారు. బైక్ను ఢీకొట్టిన కారు.. ఎర్రుపాలెం: మండలంలోని పెగళ్లపాడు ఆర్వోబీపై కారు బైక్ను ఢీకొట్టిన ప్రమాదంలో చర్చి ఫాదర్ దుర్మరణం పాలైన ఘటన ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. మండలంలోని మీనవోలు గ్రామానికి చెందిన నండ్రు వెంకటేశ్వరరావు (50) అలియాస్ జ్ఞానప్రకాష్ మధిర పట్టణంలోని సెవెంత్ డే చర్చిలో ఫాదర్గా పనిచేస్తున్నాడు. ఆదివారం పెగళ్లపా డు గ్రామంలోని తమ బంధువుల ఇంటికి వచ్చి తిరిగి స్వగ్రామానికి బైక్పై వెళ్తుండగా పెగళ్లపాడు ఆర్వోబీపై ఎదురుగా వస్తున్న కారు ఢీకొట్టింది. వెంకటేశ్వరరావు అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనా స్థలం నుంచి కారుడ్రైవర్, పెద్దగోపవరం గ్రామానికి చెందిన శీలం శివరామకృష్ణారెడ్డి పరారయ్యాడు. మధిర రూరల్ సీఐ మధు, ఎస్ఐ రమేశ్ చేరుకుని వివరాలు సేకరించారు. మృతుడి బంధువులు ఘటనా స్థలానికి చేరుకుని ధర్నా చేశారు. పోలీసులు నచ్చజెప్పి ఆందోళన విరమింపజేశారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు, బాబు ఉన్నారు. మృతుడి సోదరుడు దావీదు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రమేశ్ తెలిపారు. యువకుడు మృతిచర్చి ఫాదర్ దుర్మరణం -
మార్కెట్ కార్మికుల చార్జీలు పెంపు
ఖమ్మంవ్యవసాయం: ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో పనిచేసే కార్మికుల చార్జీలు 13 శాతం పెరిగాయి. రెండేళ్లకు ఒకసారి మార్కెట్ కార్మికుల రేట్ల పెంపుపై నూతన ఒప్పందం ఉంటుంది. కార్మిక సంఘాల ప్రతినిధులు పెరిగిన నిత్యావసరాలు, ఇతర అవసరాలకు అనుగుణంగా తమకు రేట్లు పెంచాలని ఖమ్మం చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధి వర్గానికి, ఖమ్మం మార్కెట్ కమిటీకి నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసుల ఆధారంగా ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటీ, చాంబర్ ఆఫ్ కామర్స్, రైతు సంఘాల ప్రతినిధులు, కార్మిక సంఘాల ప్రతినిధులతో రెండుసార్లు సమావేశాలు నిర్వహించారు. ఈ ఏడాది మిర్చి ధర తగ్గినందున కార్మికుల రేట్ల పెంపును విరమించుకోవాలని రైతు సంఘాలు ప్రతిపాదించాయి. ఈ అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకొని కార్మికులు అభ్యర్థించిన రేట్ల పంపును పరిశీలించి 13 శాతం పెంచుతున్నట్లు నిర్ణయించారు. మార్కెట్లో హమాలీలు, దడవాయిలు, స్వీపర్లు, రెల్లుడు వంటి కార్మిక విభాగాలు పనిచేస్తాయి. ఆయా కార్మికులుకు గతంలో నిర్ణయించిన రేట్లపై 13 శాతాన్ని పెంచారు. పత్తి, పంటలు బోరాల్లో నింపితే అదనంగా చార్జి చెల్లించాల్సి ఉంటుంది. గింజలు పెట్టడం, ధాన ధర్మాలు(ముష్టి) వంటి విధానాలు పూర్తిగా నిషేధించారు. ఖమ్మం చాంబర్ ఆఫ్ కామర్స్ దిగుమతి శాఖ పర్యవేక్షణలో ఈ నూతన రేట్లు అమలు కానున్నాయి. రైతుల పంటను ఖరీదుదారులకు విక్రయించటంలో మధ్యవర్తులుగా వ్యవహరించే కమీషన్దారులు నూతన కార్మికుల రేట్లు అమలు చేయాల్సి ఉంటుంది. పెంచిన 13 శాతం రేట్లు మార్కెట్లో పనిచేసే సుమారు 2,500 మంది కార్మికులకు వర్తించే అవకాశం ఉంది. ఈ నెల 22 నుంచి 13 శాతం పెంపు అమలు -
సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు
రాష్ట్ర ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ డాక్టర్ రవీందర్ నాయక్చర్ల: ఏజెన్సీ ప్రాంతాల్లో వచ్చే సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ డాక్టర్ రవీందర్ నాయక్ సూచించారు. ఆదివారం ఆయన డీఎంహెచ్ఓ డాక్టర్ ఎస్.జయలక్ష్మితో కలిసి మండలంలోని ఉంజుపల్లి పల్లె దవాఖానాను సందర్శించారు. ఆస్పత్రిలో అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. సికిల్ సెల్ ఎనీమియా, టీబీ ముక్త్ భారత్, ఎన్సీడీ స్క్రీనింగ్, జ్వర పీడితుల గుర్తింపు తదితర వైద్య సేవలపై అధికారులు, సిబ్బందిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆరోగ్యంపై ప్రజల్లో పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని సూచించారు. ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ మధువరన్, చర్ల ప్రభుత్వ వైద్యశాల మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శ్రీధర్, డాక్టర్ స్పందన, డాక్టర్ పుల్లారెడ్డి, డాక్టర్ తేజశ్రీ, ఉంజుపల్లి సబ్సెంటర్ సిబ్బంది పాల్గొన్నారు. -
గొర్రెల్లో ‘నీలి నాలుక’
● దోమల ద్వారా వ్యాధి వ్యాప్తి ● జీవాలకు ప్రాణాంతకంగా మారుతున్న రుగ్మత ● ముందస్తు గుర్తింపు, జాగ్రత్తలతోనే మేలు ఖమ్మంవ్యవసాయం: గొర్రెల్లో నీలి నాలుక వ్యాధి (బ్లూటంగ్) విజృంభిస్తోంది. జిల్లాలో ఈ వ్యాధి లక్షణాలు ఉన్నట్లు పశుసంవర్థక శాఖ గుర్తించింది. దోమల వల్ల సంభవించే ఈ ప్రాణాంతక వ్యాధి వర్షాకాలంలో సోకుతుంది. వైరస్లతో కలిగే వ్యాధిని మూతి వాపు, పూత రోగం అని కూడా అంటారు. జిల్లాలో 6.67 లక్షల గొర్రెలున్నాయి. జీవాల పెంపకందారులు ఈ వ్యాధి విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని, వ్యాధి లక్ష ణాలు, నివారణ చర్యలపై జిల్లా పశువ్యాధి నిర్ధారణా ప్రయోగశాల అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ సీహెచ్ రఘుపతి ఇచ్చిన సలహాలు, సూచనలు ఇలా ఉన్నాయి. వ్యాధి వ్యాప్తి నీలి నాలుక వ్యాధి.. కలుగజేసే వైరస్లు ‘క్యూలికాయిడ్స్’ అనే దోమకాటు ద్వారా జీవాల్లో ప్రవేశిస్తా యి. వర్షాకాలంలో ఈ వ్యాధి క్రిముల అభివృద్ధికి, అవి విస్తరింపజేసే దోమల వ్యాప్తికి అనుకూలంగా ఉంటుంది. ఈ వ్యాధి సోకిన గొర్రెను దోమ కుట్టి అదే దోమ ఆరోగ్యవంతమైన గొర్రెను కుట్టడం వల్ల ఈ వ్యాధి ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వ్యాప్తి చెందుతుంది. మందలో ఒక్కసారిగా ఈ వ్యాధి సంభవించి, మరణాలకు దారితీస్తుంది. గొర్రెల కాపరులు వ్యాధిని గుర్తించి వెంటనే తగిన చర్యలు తీసుకోవాలి. లక్షణాలు ●వ్యాధి సోకిన గొర్రెల్లో జ్వరం ఎక్కువగా (105 – 106 డిగ్రీల ఫారన్ హీట్ ఉష్ణోగ్రత) ఉంటుంది. శరీర ఉష్ణోగ్రత పెరిగి 3–8 రోజుల్లో వ్యాధి లక్షణాలు బయట పడతాయి. ●వ్యాధి సోకిన 3వ రోజున గొర్రె నోరు, ముక్కుల లోపల ఎర్రగా కంది క్రమంగా పెదాలు వాస్తాయి. నోటి నుంచి చొంగకారుతుంది. క్రమంగా చొంగ చిక్కబడి ముక్కుల గుండా నీరుకారుతుంది. పొక్కులు ఏర్పడుతాయి. ●ముఖం, పెదవులు, దవడల మధ్య వాపు వస్తుంది. ●నోటి లోపల నాలుక ఎర్రబడి పైపొర లేచిపోయి పొక్కులుగా మారుతాయి. ●నాలుక నీలి రంగులోకి మారడం వల్ల నీలినాలుక రోగం అంటారు. ●వ్యాధి సోకిన వారం తరువాత గిట్టల పైభాగాన ఎర్రటి నెత్తురు చార కనిపించి గొర్రె కుంటుతుంది. ●ఆహారం తీసుకోకుండా క్షీణించి మరణాలు కూడా సంభవిస్తాయి. నివారణ ●వ్యాధి తీవ్రతపై సూర్యరశ్మి ప్రభావం చూపుతుంది కాబట్టి వ్యాధిగ్రస్త జీవాలను నీడలో ఉంచి చికిత్స చేయించాలి. మంద నుంచి దూరంగా ఉంచాలి. ●దోమల నివారణకు వేపాకు లేదా నీలగిరి, కలబండ లేదా పిడకల్ని కాల్చాలి. రాత్రి వేళల్లో ఎలక్ట్రిక్ బల్బులు పెడితే దోమల ఉధృతి తగ్గుతుంది. ●గొర్రెల షెడ్లలో ఫ్యాన్లు, దోమతెరలను వాడాలి. చికిత్స ●వ్యాధి లక్షణాలు గమనించిన వెంటనే పశువైద్యాధికారిని సంప్రదించాలి. యాంటిబయోటిక్, నొప్పి నివారణ మందులు వాడటం ద్వారా గొర్రెలు చనిపోకుండా కాపాడుకోవచ్చు. ●వ్యాధి సోకిన గొర్రెలను సకాలంలో గుర్తించాలి. నోటిపుండ్లను పొటాషియం పర్మాంగనేట్ లోషన్తో శుభ్రం చేసి వైద్యులు సూచించిన మందు పూయాలి. ●గొర్రెలకు రాగిజావ లేదా మొక్కజొన్న జావను ఉప్పు కలిపి తాగించాలి. లేత ఆకులను మేపాలి. ●5 రోజుల పాటు ఒక్కో గొర్రెకు డాక్టర్ సలహాతో యాంటీబయాటిక్ ఇంజక్షన్లు వేయాలి. నీరసించిన గొర్రెలకు గ్లూకోజ్ ఎక్కించాలి. ●కాలిగిట్టల మీద పుండ్లను కడిగి హిమాక్స్, నెమ్లెంట్ వంటి ఆయింట్మెంట్లను పూయాలి. వ్యాధి నివారణ చర్యలు ●గొర్రెల దొడ్లలో ఫినాయిల్, మలాథియాన్ వంటి క్రిమిసంహారక మందులను చల్లాలి ●ఎండిన వేపాకు పొగ, యూకలిప్టస్ పొగను సాయింత్రం పూట వేయాలి. ●డాక్టర్ సలహాపై మందులు విధిగా వాడాలి. ●విటమిన్–సీ ఇంజక్షన్, పౌడర్ను వాడాలి. విట్–ఏ సిరప్ను వాడాలి. -
నగరాలు, పట్టణాలకు నిధులు..
● కార్పొరేషన్, మున్సిపాలిటీలకు విడుదల చేస్తూ జీఓ ● స్వచ్ఛభారత్ మిషన్ కింద మంజూరు ● టాయిలెట్లు, భవనాల నిర్వహణకు వినియోగం ● కేఎంసీకి రూ.3.71 కోట్లు..ఖమ్మంమయూరిసెంటర్ : నిధులు లేక నిర్వహణలో ఇబ్బంది పడుతున్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. నగరా లు, పట్టణాలకు స్వచ్ఛభారత్ మిషన్ (అర్బన్) 2.0 కింద 2025–26 ఆర్థిక సంవత్సరానికి నిధులు విడుదల చేస్తూ సీడీఎం, స్టేట్ మిషన్ డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. మున్సిపాలిటీల్లో టాయిలెట్లు, భవనా ల నిర్వహణ, బయోమైనింగ్ పనులకు ఈ నిధుల ను వినియోగించుకునేలా వీలు కల్పిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఖమ్మం, కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్లతో పాటు మధిర, మణుగూరు, సత్తుపల్లి, వైరా, ఇల్లెందు మున్సిపాలిటీలకు ఈ నిధులు విడుదల చేశారు. పాల్వంచ మున్సిపాలిటీ కొత్తగూడెం కార్పొరేషన్లో విలీనం కావడంతో ఆ పట్టణ నిధులను కూడా కొత్తగూడెం కార్పొరేషన్కు కేటాయిస్తున్నట్లు వెల్లడించారు. మెరుగుపడనున్న సౌకర్యాలు.. మున్సిపాలిటీలకు సరైన నిధులు లేక, ఆదాయం రాక కార్యాలయ భవనాల నిర్వహణ, టాయిలెట్ల నిర్వహణ అంతంతమాత్రంగానే ఉంటోంది. ప్రభుత్వం నుంచి వచ్చే ఆదాయ వనరులు తగ్గడంతో మున్సిపాలిటీలపై భారం పెరిగింది. ఈ తరుణంలో ప్రభుత్వం స్వచ్ఛ భారత్ మిషన్ కింద నిధులు విడుదల చేయడంతో మున్సిపాలిటీల్లో సౌకర్యాలు మెరుగయ్యే అవకాశం ఉంది. బయోమైనింగ్కు నిధులు.. పట్టణాలు, నగరాలు విస్తరిస్తుండడం, జనాభా పెరగడంతో వ్యర్థాల నిర్వహణ మున్సిపాలిటీలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లో వ్యర్థాల డంపింగ్ పెద్ద సమస్యగా మారింది. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు కేఎంసీ అధికారులు బయోమైనింగ్ నిర్వహిస్తున్నారు. దీంతో దశాబ్దాలుగా పేరుకుపోయిన వ్యర్థాలను శుభ్రం చేస్తున్నారు. బయోమైనింగ్ నిర్వహణకు ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులను కేటాయించింది. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్కు రూ.3.71 కోట్లుకు పైగా ఎస్బీఎం కింద నిధులను కేటాయించగా.. ఇందులో రూ.3,35,62,783 బయోమైనింగ్కు కేటాయిస్తు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇక కొత్తగూడెం కార్పొరేషన్కు రూ.99.17 లక్షల నిధులు విడుదల చేయగా.. బయోమైనింగ్ కోసం రూ.76,65,007 కేటాయించారు. ఇల్లెందు మున్సిపాలిటీకి రూ.8,17,360 మంజూరు కాగా, బయోమైనింగ్కు రూ.1,36,924 కేటాయించారు. -
నమ్మి వస్తే.. ప్రాణం తీశాడు..
● స్నేహితులతో కలిసి మహిళను హత్య చేయించిన వ్యక్తి ● సూర్యాపేట జిల్లా కిష్టారం అడవుల్లో ఘటనకొణిజర్ల: జీవితాంతం కలిసి ఉంటాడని నమ్మి భర్త పిల్లలను వదిలేసి వచ్చిన ఓ మహిళను.. ఆ వ్యక్తే స్నేహితులతో కలిసి హత్య చేసి, అడవిలో పడేశాడు. ఈ ఘటన మండలంలోని విక్రమ్నగర్లో విషాదాన్ని నింపింది. ఎస్ఐ గుగులోత్ సూరజ్ కథనం ప్రకారం.. కామేపల్లి మండలం టేకులపల్లి గ్రామానికి చెందిన భూక్యా మదన్ అదే గ్రామానికి చెందిన హస్లీతో వివాహేతర సంబంధం పెట్టుకుని అక్కడి నుంచి ఆమెను తీసుకుని కొణిజర్ల మండలం విక్రమ్నగర్కు వచ్చి నివాసం ఏర్పాటు చేసుకున్నాడు. హస్లీకి అప్పటికే ఇద్దరు ఆడపిల్లలు ఉండగా కు.ని. చేయించుకుంది. దీంతో ఆమెకు పిల్లలు పుట్టరని మదన్ విక్రమ్నగర్కు చెందిన మరో మూగ యువతిని వివాహం చేసుకున్నాడు. అప్పటి నుంచి హస్లీకి, మదన్ వివాహం చేసుకున్న యువతికి, ఆమె కుటుంబ సభ్యులకు తరుచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఎలాగైనా హస్లీ పీడ వదిలించుకోవాలనుకున్న మదన్ తన స్నేహితులు అయిన కొణిజర్లకు చెందిన చల్లా నాగేశ్వరరావు, బస్వాపురానికి చెందిన తమ్మిశెట్టి నరసింహారావు సహకారంతో హస్లీకి మాయమాటలు చెప్పి చేతబడులు చేయించే వారున్నారని, వారితో చేతబడి చేయించి మూగ యువతిని చంపిద్దామని చెప్పి సూర్యాపేట జిల్లా కోదాడ మండలం చింతలపాలెం పోలీస్స్టేషన్ పరిధిలోని కిష్టారం అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి అక్కడ పసరు పేరుతో గుర్తు తెలియని విషం తాగించారు. ముగ్గురు కలిసి గొంతు నులిమి హత్య చేసి మృతదేహాన్ని అక్కడ పడవేసి గుట్టు చప్పుడు కాకుండా అక్కడి నుంచి ఇళ్లకు వచ్చేశారు. ఈ నెల 11న మహిళ అదృశ్యమైందని కొణిజర్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు అందగా.. తమకు మదన్ మీదనే అనుమానం ఉందని మృతురాలి కూతురు ఫిర్యాదు చేయడంతో ఎస్ఐ సూరజ్ నేతృత్వంలో పోలీసులు మదన్ను అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో తానే హత్య చేయించినట్లు ఒప్పుకున్నాడు. అనంతరం ఆదివారం ఘటనా స్థలానికి తీసుకెళ్లి మృతదేహాన్ని చూపించాడు. ఎస్ఐ సూరజ్ ఘటనా స్థలంలోనే మృతదేహానికి పోస్టుమార్టం చేయించి మృతురాలి బంధువులకు అప్పగించారు. మదన్ను అదుపులోకి తీసుకున్నామని, మిగిలిన ఇద్దరు పరారీలో ఉన్నారని, వారి కోసం గాలిస్తున్నామని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ వివరించారు. -
విద్యుదాఘాతంతో యువకుడి మృతి
ఖమ్మంక్రైం: నగరంలోని టూటౌన్ పరిధిలో విద్యుదాఘాతంతో యువకుడు మృతి చెందిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. స్థానికంగా నివాసం ఉండే ఉపేందర్ (28) తన ఇంట్లో కుట్టుమిషన్కు విద్యుత్ కనెక్షన్ ఇచ్చే క్రమంలో విద్యుదాఘాతానికి గురయ్యాడు. అపస్మారకస్థితికి చేరుకున్న అతడిని బంధువులు జిల్లా ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. తమకు ఇంకా ఫిర్యాదు రాలేదని టూటౌన్ పోలీసులు తెలిపారు. ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన ట్రాక్టర్కారేపల్లి: ద్విచక్ర వాహనాన్ని ట్రాక్టర్ ఢీకొట్టంతో దంపతులకు తీవ్రగాయా లైన ఘటన మండలంలోని భాగ్యనగర్తండాలో ఆదివారం చోటుచేసుకుంది. నెక్కొండ పట్టణానికి చెందిన విష్ణువర్దన్, సహన దంపతులు ఇల్లెందులో నివాసం ఉంటున్నారు. వీరు ఇల్లెందు నుంచి ద్విచక్రవాహనంపై కారేపల్లి మీదుగా ఖమ్మం వస్తుండగా భాగ్యనగర్తండా వద్ద కుక్క అడ్డురావటంతో రోడ్డుపై కిందపడ్డారు. వెనుకాల ఉంచి ట్రాక్టర్ వచ్చి దంపతుల మీది నుంచి వెళ్లడంతో తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు 108 ద్వారా ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. విష్ణువర్దన్ పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్ తరలించారు. ఎస్ఐ గోపి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దంపతులకు తీవ్ర గాయాలు -
గోర్బోలి భాషను అధికారికంగా గుర్తించాలి
కొత్తగూడెంఅర్బన్: బంజారులు మాట్లాడే గోర్బోలి భాషని అధికారికంగా గుర్తించి 8వ షెడ్యూల్లో చేర్చాలని వక్తలు డిమాండ్ చేశారు. ఆదివారం కొత్తగూడెం మార్కెట్ యార్డ్లో లంబాడీ (బంజారా)సంఘాల జేఏసీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతిని సాధారణ సెలవు దినంగా ప్రకటించాలని, ట్రైకార్ రుణాలకు తక్షణమే నిధులు విడుదల చేయాలని కోరారు. ఐటీడీఏల్లో బ్యాక్ లాగ్ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని, వేంకటేశ్వర స్వామి ఆలయం ఉన్న ప్రతీ చోట భగవాన్ హతీరామ్ బావాజి గుడి నిర్మించాలని డిమాండ్ చేశారు. టీటీడీ ట్రస్ట్ బోర్డు లాగే హతీరామ్ బావాజీ ట్రస్ట్ బోర్డును ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు రాజేష్ నాయక్, ఇస్లావత్ లక్ష్మణ్ నాయక్, బానోత్ రాములు నాయక్, హతిరామ్నాయక్, వీరూనాయక్, వెంకట్ నాయక్, సీతారాంనాయక్, రవి నాయక్, లాల్ సింగ్ నాయక్, బాబులాల్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు కొత్త పరికరాలు
ఖమ్మంమయూరిసెంటర్: జిల్లాలోని సబ్ రిజి స్ట్రార్ కార్యాలయాలకు కొత్త పరికరాలు చేరుకున్నాయి. డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్లో స్లాట్ విధానం అమలు చేస్తుండడంతో రిజిస్ట్రేషన్ ప్రక్రియను వేగంగా ముగించేలా కొత్త కంప్యూటర్లు, స్కానర్లు, బయోమెట్రిక్ డివైజ్లను అందజేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 11 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు ఈ పరికరాలు వచ్చాయి. పాత వాటితో రిజిస్ట్రేషన్లు ఆలస్యమవుతుండగా కొత్త పరికరాలు సరఫరా చేశారని, వాటిని ఆయా కార్యాలయాల్లో అమర్చామని రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు వెల్లడించారు. రాష్ట్రస్థాయి ఫుట్బాల్ పోటీల్లో ప్రతిభ● రజత పతకం సాధించిన మల్లెమడుగు విద్యార్థినులు ఖమ్మంఅర్బన్ : మంచిర్యాల జిల్లా రామకృష్ణాపురంలో ఈనెల 9 నుంచి 12వ తేదీ వరకు జరిగిన రాష్ట్రస్థాయి జూనియర్ ఫుట్బాల్ చాంపియన్షిప్లో మల్లెమడుగు ప్రభుత్వ పాఠశాల విద్యార్థినులు ప్రతిభ చాట్లారు. కె.అనిత, టి. నవ్యశ్రీ రజత పతకం సాధించారు. గతేడాది వనపర్తిలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లోనూ అనిత కాంస్య పతకం సాధించిందని, హైదరాబాద్లో జరిగిన సీఎం కప్ పోటీల్లో స్వర్ణ పతకం గెలుచుకుందని ప్రధానోపాధ్యాయురాలు జి.కృష్ణవేణి, పీడీ బియ్యని కృష్ణయ్య వివరించారు. కాగా, ఈ విద్యార్థినులను ఎంఈఓ శైలజలక్ష్మి తదితరులు అభినందించారు. ప్రొఫెసర్కు సేవా జ్యోతి లైఫ్ అచీవ్మెంట్ అవార్డుఎర్రుపాలెం: కాకతీయ యూనివర్సిటీ ప్రభుత్వ పాలనా శాస్త్రం, హెచ్ఆర్ఎం ప్రొఫెసర్, మండలంలోని బనిగండ్లపాడు గ్రామానికి చెందిన డాక్టర్ పెద్దమళ్ల శ్రీనివాసరావు ఏపీలోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుంచి సేవా జ్యోతి లైఫ్ అచీవ్మెంట్ అవార్డును ఆదివారం అందుకున్నారు. దివ్యాంగుడైన శ్రీనివాసరావు అంగవైకల్యం గల వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాడుతున్నారు. ఆయనకు అవార్డు రావడం పట్ల పలువురు అభినందించారు. ముందుగానే సాగర్ జలాలు..ఖమ్మంఅర్బన్ : జిల్లాలోని ఎన్నెస్పీ ఆయకట్టు రెండోజోన్కు ఈ ఏడాది ఖరీఫ్ పంటలకు గాను సాగర్ జలాలు దాదాపు నెల రోజులు ముందుగానే విడుదల కానున్నాయి. గతేడాది రెండో జోన్కు ఆగస్టు 3న నీరు విడుదల చేశారు. అయితే ఈ సంవత్సరం రైతుల అవసరాలు, డ్యామ్లో నీటి నిల్వలు, వరదల ప్రవాహం దృష్ట్యా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోమవారమే నీరు విడుదల చేయనున్నారు. సాగర్ ప్రాజెక్టు ప్రారంభంలోనే వేసిన డిజైన్ ప్రకారం.. జోన్–1కు జూలై 10, జోన్ –2కు ఆగస్టు 10, జోన్ –3కు నవంబర్ 15 తేదీల్లో నీరు విడుదల చేయాల్సి ఉండగా రైతుల అవసరాల మేరకు ముందుగానే అందిస్తున్నారు. ‘కోటా’కు జిల్లాతో ప్రత్యేక అనుబంధంఖమ్మంగాంధీచౌక్ : సినీ నటుడు కోటా శ్రీనివాసరావుకు జిల్లాతో ప్రత్యేక అనుబంధం ఉంది. ఖమ్మానికి చెందిన డాక్టర్ నాగబత్తిని రవి 1988లో నిర్మాతగా పనిచేసిన ఊరేగింపు సినిమాలో కోటా మంత్రిగా నటించారు. ఆయన నటించిన మరికొన్ని సినిమా షూటింగ్లు కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పలు ప్రాంతాల్లో జరిగాయి. ఖమ్మంతో పాటు భద్రాచలం, పాల్వంచ ప్రాంతాలతో కూడా ఆయనకు అనుబంధం ఉన్నట్లు కళాకారులు చెబుతున్నారు. 83 ఏళ్ల శ్రీనివాసరావు ఆదివారం మరణించగా జిల్లా వాసులు ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ నివాళులర్పించారు. ఆయన మరణం పట్ల ఖమ్మం కళాపరిషత్ అధ్యక్షులు డాక్టర్ నాగబత్తిని రవి, కార్యదర్శి వేల్పుల విజేత, ఆర్క్ కళా సాంస్కృతిక సంస్థ అధ్యక్ష, కార్యదర్శులు మోటమర్రి జగన్మోహన్ రావు, అన్నాబత్తుల సుబ్రమణ్యకుమార్ తదితరులు సంతాపం తెలిపారు. -
● ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీ భవనానికి రూ.108.64 కోట్లు ● మంత్రి పొంగులేటి చొరవతో మంజూరైనా నిర్మాణంలో జాప్యం ● రీ టెండరింగ్తో పనులు ఆలస్యం? ● మరో ఏడాది గడిస్తేనే సొంత భవనం
2023లో తరగతులు ప్రారంభం.. ఇంజనీరింగ్ కళాశాల మంజూరైనప్పటికీ శాశ్వత భవనాలు లేకపోవడంతో మొదటి ఏడాది బారుగూడెంలోని ఓ ప్రైవేట్ కళాశాలను అద్దెకు తీసుకుని నడిపించారు. అక్కడ అద్దె రూ.లక్షల్లో ఉండడంతో మద్దులపల్లిలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ వైటీసీ భవనంలోకి మార్చారు. ప్రస్తుతం ఈసీఈ, సీఎస్సీ, ఈఈఈ, సీఎస్డీ, మెకానికల్ బ్రాంచ్లలో తరగతులు నిర్వహిస్తుండగా ఒక్కో విభాగంలో 66 మంది చొప్పున మొత్తం 330 మంది విద్యార్థులు చదువుకునే అవకాశం కల్పించారు. అయితే 2023 – 24లో మొదటి బ్యాచ్ ప్రారంభం కాగా 150 మంది ప్రవేశం పొందారు. 2024 – 25లో 160 మంది జాయిన్ అయ్యారు. 2025 – 26 బ్యాచ్లో ఇంకా 300 మంది వరకు చేరే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో కలిపి 310 మంది విద్యనభ్యసిస్తున్నారు. మొత్తం 9 మంది ఉద్యోగులు పని చేస్తుండగా అందులో ముగ్గురు బోధనేతర సిబ్బంది ఉన్నారు. 30 ఎకరాలు.. రూ.108.64 కోట్లు మద్దులపల్లి పరిధిలో ప్రభుత్వానికి చెందిన 30 ఎకరాల్లో నూతనంగా ఇంజనీరింగ్ కళాశాల భవన నిర్మాణానికి ప్రభుత్వం ఇప్పటికే రూ.108.64 కోట్లు మంజూరు చేసింది. మంత్రి పొంగులేటి ప్రత్యేక శ్రద్ధ తీసుకుని భూమి, నిధుల కేటాయింపునకు సహకరించారు. దీంతో విద్యార్థులకు అవసరమైన అన్ని రకాల ల్యాబ్లు, తరగతి గదులు, అధ్యాపకుల గదులతో సువిశాలంగా నూతన భవన నిర్మాణాలు చేపట్టాలని నిర్ణయించారు. ఏటా పెరుగుతున్న ప్రవేశాలు.. ఇప్పటివరకు వైటీసీలో తరగతులు నిర్వహిస్తున్నా.. ఏటేటా విద్యార్థుల సంఖ్య పెరుగుతుండడంతో ఆ భవనాల్లో తరగతుల నిర్వహణ కష్టమనే భావన వ్యక్తమవుతోంది. గతంలో ఉన్న విద్యార్థుల సంఖ్యకు రెట్టింపుగా ఎంసెట్, పీసెట్లో క్వాలిఫై అయిన విద్యార్థులు ఇంజనీరింగ్ కోర్సులో చేరవచ్చని అంచనా. దాదాపు కొత్తగా ప్రథమ సంవత్సరంలో అయిదు బ్రాంచ్ల్లో కలిపి మరో 300 మంది చేరే అవకాశం ఉండగా అప్పుడు మొత్తం విద్యార్థుల సంఖ్య 600 వరకు ఉంటుంది. వీరందరికీ ప్రస్తుత భవనాల్లో బోధన చేయడం కష్టమే. విద్యార్థుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని పనులు త్వరగా ప్రారంభించి కొత్త భవనాలు అందుబాటులోకి తేవాలని పలువురు కోరుతున్నారు.ఈ ఏడాది కష్టమే.. నిధులు మంజూరైనా ఇంత వరకు పనులు ప్రారంభించకపోవడంతో ఈ ఏడాది ప్రభుత్వ భవనాల్లో తరగతుల నిర్వహణ కష్టమేనని తెలుస్తోంది. పనుల నిర్వహణకు మార్చిలో మొదటిసారి టెండర్లు ఆహ్వానించారు. దీంతో పనులు చకచకా సాగి ఈ ఏడాది అందుబాటులోకి వస్తుందని అంతా ఆశించారు. అయితే కారణం తెలియదు కానీ.. ఆ టెండర్లు రద్దు చేసి మళ్లీ ఆహ్వానించాలనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఇలా పనుల్లో రోజురోజుకూ జాప్యం జరుగుతుండడంతో సొంత భవనంలో తరగతుల నిర్వహణ ఎప్పుడోనని విద్యార్థులు వేచిచూస్తున్నారు. -
సాగు సమస్యకు చెక్!
పంటలకు నిరంతర విద్యుత్ సరఫరా.. ● డిమాండ్కు తగ్గ సరఫరాకు డిస్కమ్ల కసరత్తు ● విద్యుత్ ఆధారంగానే అధికంగా పంటలు ● వ్యవసాయ సీజన్లో మరింతగా పెరగనున్న వినియోగంసాక్షిప్రతినిధి, ఖమ్మం: జిల్లాలో విద్యుత్ డిమాండ్ పెరుగుతోంది. వేసవిలో గృహావసరాలకు అధికంగా వాడగా.. వానాకాలంలో వ్యవసాయ పనులు జోరందుకుంటే విద్యుత్ వినియోగం మరింతగా పెరగనుంది. డిమాండ్కు తగిన సరఫరా చేసేందుకు డిస్కమ్లు సిద్ధమవుతున్నాయి. సాగుకు ఆటంకం లేకుండా నాణ్యమైన విద్యుత్ అందించేందుకు సాంకేతిక పరమైన మార్పులకు విద్యుత్ శాఖ శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో డిమాండ్కు.. సరఫరాకు అంతగా వ్యత్యాసం లేకుండా పలు జాగ్రత్తలు తీసుకుంటోంది. దీంతో ఈ వానాకాలంలో జలాశయాల్లో కొంత నీరు తగ్గినా వ్యవసాయ బోర్లతో సాగు చేసేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్కు వరద వస్తుండగా ఈ నెలాఖరు నాటికి ప్రాజెక్టు నిండుతుందనే ఆశతో ఆయకట్టు రైతులు ఎదురుచూస్తున్నారు. దీంతో వానాకాలం సాగుకు నీళ్లు ఎలాగైనా వస్తాయనే నమ్మకంతో బోర్లు, బావుల కింద వరి నార్లు పోస్తున్నారు. నాన్ ఆయకట్టులో బోర్లు, బావుల కింద ముమ్మరంగా సాగు పనులు చేస్తున్నారు. ఈ క్రమంలో జిల్లాలో రెండు నెలల పాటు విద్యుత్ డిమాండ్ పెరగనుంది. వేసవి తాపంతో.. జిల్లాలో 4,97,098 గృహ సర్వీసులు ఉన్నాయి. ఈ సంఖ్య ప్రతీ ఏడాది పెరుగుతోంది. వేసవి కాలంలో గృహావసర విద్యుత్కు డిమాండ్ పెరిగింది. రోజుకు 40–45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కాగా ఫ్యాన్లు, కూలర్లు, ఏసీల వాడకం అధికమై విద్యుత్ డిమాండ్ పెరిగింది. జూలైలో డిమాండ్కు తగినట్లుగా.. ఇక వానాకాలంలో వ్యవసాయ సీజన్ ప్రారంభం కావడంతో మళ్లీ విద్యుత్ డిమాండ్ ఊపందుకుంటుందని డిస్కమ్ అంచనా వేసింది. గతేడాది జూలై కోటా 142.91 మిలియన్ యూనిట్లు కాగా.. 148.59 మిలియన్ యూనిట్లు వినియోగించారు. ఒక రోజు కోటా 4.61 మిలియన్ యూనిట్లు ఉండగా.. 4.79 మిలియన్ యూనిట్ల వరకు వాడారు. ఈ ఏడాది జూలైలో కోటా 149.11 మిలియన్ యూనిట్లు కాగా.. ఇప్పటి వరకు 38.31 మిలియన్ యూనిట్లు వాడారు. ప్రస్తుతం రోజు వారీ కోటా 4.81 ఎం.యూ ఉండగా.. 4.78 మిలియన్ యూనిట్లు వాడుతున్నారు. రానున్న కాలంలో మరింతగా.. ఈ ఏడాది ఇంకా వ్యవసాయ సీజన్ పూర్తిస్థాయిలో ప్రారంభం కాలేదు. దీంతో విద్యుత్ వినియోగంలో డిమాండ్కు, సరఫరాకు మధ్య అంతగా వ్యత్యాసం లేదు. అయితే వరి సాగు పెరిగి నీటి అవసరాలు అధికమైతే విద్యుత్కు డిమాండ్ ఏర్పడనుంది. ఇప్పుడిప్పుడే రైతులు వరినార్లు పోస్తున్నారు. ఈ ఏడాది వర్షాలు పూర్తిస్థాయిలో కురవకుంటే విద్యుత్ డిమాండ్ పెరిగే అవకాశం ఉంటుందని విద్యుత్ శాఖ అంచనా వేస్తోంది. వ్యవసాయ అవసరాలకు తగినట్లుగా సరఫరా పెంచేలా చర్యలు చేపడుతోంది. పెరిగిన కనెక్షన్లకు అనుగుణంగా.. ప్రతీ ఏడాది వ్యవసాయ కనెక్షన్ల సంఖ్య పెరుగుతోంది. జిల్లాలో ఈ ఏడాది వ్యవసాయ కనెక్షన్ల కోసం 1,866 దరఖాస్తులు రాగా, ఇప్పటివరకు 1,206 మందికి కనెక్షన్లు ఇచ్చారు. మరో 660 కనెక్షన్లు ఇవ్వాల్సి ఉంది. ప్రస్తుతం ఉన్న కనెక్షన్లు కాకుండా అదనంగా వచ్చిన సర్వీసులకు ఎన్ని మిలియన్ యూనిట్ల విద్యుత్ అవసరం ఉంటుందో అంచనా వేసి ఆ మేరకు ఉత్పత్తిపై డిస్కమ్లు దృష్టి పెట్టాయి.ఖమ్మం సర్కిల్ పరిధిలో విద్యుత్ సర్వీసుల సంఖ్యవ్యవసాయ సర్వీసులు 1,20,246మొత్తం 6,98,569పరిశ్రమలు, ఇతర కనెక్షన్లు 81,225గృహ సర్వీసులు 4,97,098విద్యుత్ బోరు ఆధారంగా సాగు.. వ్యవసాయ విద్యుత్ బోర్ల సాయంతో ఐదెకరాల్లో వరి పంట వేశా. ఈ మధ్య కాలంలో అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా ఇస్తున్నారు. లోవోల్టేజీ తదితర ఇబ్బందులు కూడా తలెత్తడం లేదు. సబ్స్టేషన్లలో ఫీజులు పోయినా సాంకేతిక పరిజ్ఞానంతో గుర్తించి సమస్య పరిష్కరిస్తున్నారు. నాణ్యమైన విద్యుత్ సరఫరాతో పొలాలకు నిరంతరం నీరందుతోంది. – నేరడి బిక్షం, ఎదుళ్ల చెరువు, తిరుమలాయపాలెం మండలం ఇబ్బందులు లేకుండా.. వ్యవసాయ అవసరాలకు కోతల్లేని విద్యుత్ సరఫరా అందించాలి. పొలానికి నీరు పెట్టిన సమయంలో అరగంట తర్వాత విద్యుత్ సరఫరా నిలిచిపోతే తడిసిన పొలం వల్ల కూడా ఉపయోగం ఉండదు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆ శాఖ వ్యవసాయ విద్యుత్ సరఫరాలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూస్తోంది. సాంకేతిక సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటోంది. జిల్లాలో 18 వరకు సబ్ స్టేషన్లు ఏర్పాటుచేసిన అధికారులు.. విద్యుత్ లైన్ల మార్పుతోపాటు వినియోగదారులకు ఇబ్బందులు రాకుండా డివిజన్లు ఏర్పాటు చేశారు. ఎక్కడైనా సమస్య తలెత్తితే అధికారులకు సమాచారం అందిస్తే పరిష్కరించేలా టోల్ఫ్రీ నంబర్లు కూడా ఏర్పాటు చేశారు. ఈ చర్యలతో వానాకాలంలో వ్యవసాయ పనులకు ఇబ్బందులు లేకుండా ఉండనున్నాయి. -
ఎండిపోతున్న వరి నారుమడులు
● వర్షాభావ పరిస్థితులతో రైతుల ఆందోళన ● సీతారామ జలాలు విడుదల కావడంతో ఊరట కల్లూరురూరల్: ఖరీఫ్ సీజన్లో వర్షాలు దోబూచులాడుతున్నాయి. ఇప్పటికే వరకు సరైన వర్షాలు లేక నాగార్జునసాగర్ ఆయకట్టుకు నీరు విడుదల చేయలేదు. దీంతో ఆయకట్టు ప్రాంతంలోని వరి నారుమడులు ఎండిపోతున్నాయి. కల్లూరు మండలంలోని వాచ్యానాయక్ తండా, చండ్రుపట్ల, రఘునాథ బంజరు, లింగాల, పుణ్యపురం మేజర్ కాలుల్వవ కింద పాయపూరు, ముచ్చవరం, యజ్ఞనారాయణపురం, ఓబులరావు బంజరు గ్రామాల్లో గత నెల 15వ తేదీ నుంచి వరి నారు సిద్ధం చేసుకుంటున్నారు. సాగర్ నీటి విడుదల ఆలస్యమైనా తప్పక నీరు అందుతుందనే భావనతో నార్లు పోయగా, కొందరు నాట్లు కూడా వేశారు. కానీ ఇప్పుడు వర్షాభావ పరిస్థితులు, సాగర్ నీటి విడుదలలో జాప్యంతో నారుమడులు, నాట్లు ఎండిపోయే పరిస్థితి ఏర్పడింది. సీతారామ ప్రాజెక్టు నీరే ఆధారం సాగర్ ఆయకట్టుకు నీరు విడుదల కాక వరి నాట్లు ఎండిపోయే పరిస్థితులు ఎదురవుతుండగా సీతారామ ప్రాజెక్టు నుంచి నీరు విడుదల చేయడం రైతుల్లో ఆశలు నింపింది. కల్లూరు, తల్లాడ, పెనుబల్లి, వేంసూరు మండలాల్లో 70శాతం మేరకు నాట్లు పూర్తికాగా, నాలుగు మండలాల్లో 69వేల ఎకరాల్లో నాట్లు వేసినటు అంచనా. ఈనేపథ్యాన శనివారం సీతారామ ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయడంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు. -
సకాలంలో వ్యాక్సినేషన్తో వ్యాధులు దూరం
తల్లాడ/కల్లూరు: అవసరమైన మేర వ్యాక్సిన్లను సకాలంలో వేయడం ద్వారా ప్రజలు వ్యాధుల బారిన పడకుండా కాపాడొచ్చని జిల్లా వ్యాక్సిన్ మేనేజర్ సీహెచ్.వెంకటరమణ తెలిపారు. తల్లాడ, కల్లూరు పీహెచ్సీల్లో శనివారం తనిఖీ చేసిన ఆయన వ్యాక్సిన్ల నిల్వలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా మేనేజర్ మాట్లాడుతూ పిల్లలకు 12 రకాల వ్యాధులు రాకుండా టీకాలు అందుబాటులో ఉన్నందున తల్లిదండ్రులు సకాలంలో వేయించేలా సిబ్బంది అవగాహన కల్పించాలన్నారు. ఆతర్వాత కల్లూరు అంబేద్కర్ నగర్లో వ్యాక్సినేషన్ను ఆయన పరిశీలించారు. వైద్యాధికారి నవ్యకాంత్, ఉద్యోగులు కె.పెద్ద పుల్లయ్య, శ్రీనివాస్, శిరీష, శ్రావణ సంధ్య, సరోజిని, జి.రామారావు, అనూష, భారతి, నాగమ్మ, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. మత్తుమందు ఇచ్చి ఆభరణాలు చోరీకూసుమంచి: కూల్డ్రింక్లో మత్తుమందు కలిపి అది తాగాక యువతి స్పృహ కోల్పోవడంతో ఆమె చెవి జూకాలు ఎత్తుకెళ్లిన ఘటన ఇది. మండలంలోని చేగొమ్మకు చెందిన చుంచు ఉమారాణి, ఆమె సోదరుడు ప్రవీణ్ ఇద్దరూ మానసిక దివ్యాంగులు. శుక్రవారం మధ్యాహ్నం వారిద్దరు ఇంటి వద్ద ఉండగా ఓ మహిళ, మరో వ్యక్తి వచ్చారు. ఉమారాణి, ప్రవీణ్తో మాట్లాడుతూనే ముందుగా మత్తుమందు కలిపి తీసుకొచ్చిన కూల్డ్రింక్ను వారికి ఇవ్వగా తాగి స్పృహ కోల్పోయారు. ఆపై ఉమారాణి చెవులకు ఉన్న జూకాలు తీసుకుని నిందితులు పారిపోయారు. ఘటనపై బాధితురాలి మామ తిరుపతయ్య ఇచ్చిన ఫిర్యాదుతో శనివారం కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. రోడ్డు ప్రమాదంలో విద్యార్థికి గాయాలు ఖమ్మంమయూరిసెంటర్: ఖమ్మం నయాబజార్ స్కూల్ ఎదురుగా శనివారం సాయంత్రం జరిగిన ప్రమాదంలో విద్యార్థికి గాయాలయ్యాయి. నయాబజార్ స్కూల్ ప్రాంగణంలోని బీసీ వసతిగృహంలో ఉంటున్న తెల్దారుపల్లికి చెందిన విద్యార్థి వివేకవర్ధన్ రెండు రోజుల వరుస సెలవులతో శుక్రవారం సాయంత్రం ఇంటికి వెళ్లాడు. తిరిగి శనివారం తిరిగి ఖమ్మం రాగా, కాల్వొడ్డు వద్ద రోడ్డు దాటుతున్న సమయాన టాటా ఏస్ ఢీకొట్టింది. ఈ ఘటనలో గాయపడిన వివేకవర్ధన్ను స్థానికులు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మత్తులో నలుగురిపై దాడి కామేపల్లి: ఓ వ్యక్తి మత్తులో నలుగురిపై సర్జికల్ బ్లేడుతో దాడి చేసి గాయపర్చాడు. మండలంలోని కొత్తలింగాలకు చెందిన రెట్టాల గోపీ శనివారం రాత్రి మద్యం లేదా గంజాయి మత్తు లో ఉన్నట్లు తెలుస్తుండగా, గ్రామానికే చెందిన ఎలమందల రాహుల్, కొరివి నాగేశ్వరరావు, శ్యామ్, గుదిమళ్ల సాయిపై దాడి చేశాడు. గాయపడిన వీరిని ఖమ్మం తరలించారు. -
అరుణాచలం యాత్రలో విషాదం
ఖమ్మంఅర్బన్: తమిళనాడులోని అరుణాచలేశ్వర స్వామి దర్శనానికి వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఖమ్మం వాసి మృతి చెందాడు. ఖమ్మం 4వ డివిజన్ వేణుగోపాల్నగర్కు చెందిన శ్రీ అభయ వెంకటేశ్వరస్వామి ఆలయ సభ్యుడు యర్రోజు చిన సుబ్బాచారి(50), దేవస్థాన మాజీ చైర్మన్ కొండల్తో పాటు వీరన్న, మణికంఠ తదితరులు రెండు రోజుల క్రితం స్వామి దర్శనానికి కారులో బయలుదేరారు. అరుణాచలం సమీపానికి చేరగా వీరి కారును ఎదురుగా వచ్చిన డీసీఎం ఢీకొట్టింది. ఈ ఘటనలో చిన్న సుబ్బాచారి తలకు తీవ్ర గాయాలు కాగా అక్కడికక్కడే మృతి చెందాడు. ఇంకా కొండల్, వీరన్న, మణికంఠ తదితరులకు గాయాలయ్యాయి. ఈమేరకు సుబ్బాచారి మృతదేహాన్ని శనివారం ఖమ్మం తీసుకురాగా, పలువురు నివాళులర్పించాక అంత్యక్రియలు పూర్తిచేశారు. కార్పొరేటర్లు దండా జ్యోతిరెడ్డి, నాగండ్ల కోటి, పల్లెబోయిన భారతిచంద్రం, అభయ వెంకటేశ్వర స్వామి ఆలయ చైర్మన్ బొల్లి కోమరయ్య తదితరులు పాల్గొన్నారు.మార్గమధ్యలో ఖమ్మం వాసి మృతి -
ఎక్కడికక్కడే సేకరణ.. అమ్మకం
ఖమ్మంవ్యవసాయం: పాల ప్రాధాన్యత పెరిగిన నేపథ్యాన సేకరణ, విక్రయాలు మరింత పెంచాలని రాష్ట్ర పాడి పరిశ్రమ(విజయ డెయిరీ) నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని యూనిట్ల వారీగా సేకరించిన పాలను ఆయా యూనిట్ల పరిధిలోనే ఏ రోజుకు ఆ రోజు విక్రయించాలని ఆదేశాలు జారీ చేసింది. ఇదే సమయాన పాల ఉత్పత్తుల వ్యాపారంపైనా దృష్టి సారించాలని ఆ ఆదేశాల్లో అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం యూనిట్లలో సేకరించే పాలలో తక్కువ శాతం స్థానికంగా విక్రయిస్తూ మిగిలిన పాలను రాష్ట్ర పాడి పరిశ్రమకు చేరవేస్తున్నారు. అక్కడ పాలను పొడిగానే కాక ఇతర ఉత్పత్తులుగా మార్చి రాష్ట్రంతో పాటు పొరుగు రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నారు. ఈక్రమంలో ఖర్చు పెరుగుతుండడమే కాక వ్యాపారం మందగించినప్పుడు పాల ఉత్పత్తులు పేరుకుపోతున్నాయి. ఈ అంశంపై సమీక్షించిన అధికారులు ప్రైవేట్ సంస్థల మాదిరిగానే ఎక్కడ సేకరించిన పాలను అక్కడే విక్రయించాలనే నిర్ణయానికి వచ్చారు. ‘విజయ’ డెయిరీ పాలకు ఆదరణ ఉన్నప్పటికీ అందుబాటులో లేక వ్యాపారం తగ్గుతుందనే భావనతో ఈ నిర్ణయం తీసుకున్నారు. 6వేల లీటర్ల సేకరణ ఖమ్మంలోని ప్రభుత్వ పాడి పరిశ్రమ(విజయ డెయిరీ) యూనిట్ ద్వారా ఉమ్మడి జిల్లాలోని 30మండలాల్లో 227 గ్రామాల్లో పాల సేకరణ కేంద్రాలు ఏర్పాటుచేశారు. వీటి ద్వారా 3,025 మంది పాడి రైతుల నుంచి నిత్యం 6వేల లీటర్ల పాలు సేకరిస్తున్నారు. కామేపల్లి, మధిర, ఎర్రుపాలెం, కల్లూరు, సత్తుపల్లి, ఇల్లెందు, కొత్తగూడెంలోని పాల శీతలీకరణ కేంద్రాల ద్వారా ఈ ప్రక్రియ జరుగుతోంది. ఖమ్మంలోని రోటరీనగర్లో 25వేల లీటర్ల సామర్ధ్యంతో యూనిట్ ఉన్నా అందుకు అనుగుణంగా పాల సేకరణ జరగడం లేదు. సీజన్లో 15వేల లీటర్ల పైగా, మిగతా సమయాల్లో ఆరు వేల లీటర్లు దాటడం లేదు. స్థానికంగా వ్యాపారంపై ప్రణాళిక ఉమ్మడి జిల్లాలో సేకరించే పాలను స్థానికంగానే విక్రయించేలా ప్రణాళిక రూపొందించారు. ప్రస్తుతం 6వేల లీటర్ల మేర పాలు సేకరిస్తుండగా రెండు వేల లీటర్లే ఇక్కడ విక్రయిస్తున్నారు. ఇందులో 1,500 లీటర్లు ప్రైవేట్ మార్కెట్ ద్వారా, 500 లీటర్ల పాలను ప్రభుత్వ హాస్టళ్లకు సరఫరా చేస్తున్నారు. మిగిలిన పాలను హైదరాబాద్ రాష్ట్ర పాడి పరిశ్రమకు పంపిస్తున్నారు. అయితే, ఉమ్మడి జిల్లాలో ప్రభుత్వ హాస్టళ్లు, గురుకులాలు ఉన్నందున అన్నింటికీ విజయ పాలు సరఫరా చేసేలా నిర్ణయించి, భద్రాచలం ఐటీడీఏ పీఓను డెయిరీ పాడి పరిశ్రమ అధికారులు కలిశారు. అన్నీ కలిసొస్తే త్వరలోనే ఇక్కడే విజయ డెయిరీ పాల విక్రయం పెరగనుంది. విజయ డెయిరీ అధికారుల కార్యాచరణ పట్టణాల్లో ఇంకొన్ని పార్లర్ల ఏర్పాటుకు చర్యలు ఏజెంట్లను మరింతగా ప్రోత్సహించాలని నిర్ణయంపాల సేకరణ పెంపునకు కృషి ఉమ్మడి జిల్లాలో పాల విక్రయానికి వనరులు ఉన్నాయి. ప్రస్తుతం సేకరిస్తున్న పాలలో మూడో వంతే ఇక్కడ విక్రయిస్తున్నాం. ఉన్నతాధికారుల ఆదేశాలతో మొత్తం పాలను స్థానికంగా విక్రయానికి ప్రణాళిక రూపొందించారు. ఇదే సమయాన పాల సేకరణను 20 వేల లీటర్లకు పెంచేలా కృషి చేస్తున్నాం. – కె.రవికుమార్, విజయ డెయిరీ డిప్యూటీ డైరెక్టర్, ఖమ్మం -
చిరువ్యాపారులకు అండగా ‘పోస్టల్ బ్యాంకు’
ఖమ్మంగాంధీచౌక్: నగదు రహిత విధానం లావాదేవీలు పెరిగిన నేపథ్యాన చిరు వ్యాపారుల కోసం వాణిజ్య బ్యాంకుల తరహాలోనే పోస్టల్ పేమెంట్ బ్యాంక్(ఐపీపీబీ) మర్చంట్ యాప్ను రూపొందించారు. వీధి వ్యాపారులు, కిరాణ షాపులు, కూరగాయలు, పండ్ల వ్యాపారులు, ఇతర చిన్న వ్యాపారులు వినియోగదారుల నుంచి డిజిటల్ విధానంలో చెల్లింపుల స్వీకరణకు ఈ విధానం ఉపయోగపడుతుందని అధికారులు చెబుతున్నారు. ఈ విధానంలో క్యూఆర్ కోడ్లను సౌకర్యంగా పొందించారు. గుర్తింపు కార్డు మాదిరిగా మెడలో వేసుకునేలా, స్టాండ్ విధానంలో అమర్చేలా క్యూఆర్ కోడ్లను రూపొందించారు. వ్యాపారులు తమ ఆధార్ కార్డుతో సమీప పోస్టాఫీస్లో సంప్రదించి రూ.200తో పోస్టల్ పేమెంట్ బ్యాంకులో ఖాతా తెరిస్తే అదనపు ఫీజు లేకుండా డిజిటల్ పేమెంట్ సౌకర్యం కల్పిస్తారు. ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే 2వేల మందికి చిరువ్యాపారులు ఈ విధానంలో లావాదేవీలు నిర్వహిస్తున్నందున మిగతా వారు కూడా సద్వినియోగం చేసుకోవాలని ఖమ్మం డివిజన్ పోస్టల్ సూపరింటెండెంట్ వీరభద్రస్వామి సూచించారు. -
ఉత్పత్తి.. ఉత్తుత్తే...
వైరా: జిల్లాలోని వైరాలో 48ఏళ్ల క్రితం ఏర్పాటుచేసిన చేపపిల్లల ఉత్పత్తి కేంద్రం(మత్స్య విత్తన కేంద్రం) నిర్లక్ష్యపు నీడలో కొట్టుమిట్టాడుతోంది. కేంద్రంపై పాలకులు, అధికారులు సవతితల్లి ప్రేమ కనబరుస్తుండడంతో ఉత్పత్తిపై నీలినీడలు కమ్ముకున్నాయి. సరైన సౌకర్యాలు లేక, సరిపడా సిబ్బందిని నియమించక ఈ పరిస్థితి ఎదురవుతోంది. కార్యాలయం, హెచరీ గది శిథిలావస్థకు చేరడంతో కేంద్రం కళ తప్పింది. అంతేకాక ఇక్కడ ఐదుగురు ఫిషర్మెన్స్ పోస్టులకు గాను ఇద్దరే విధులు నిర్వర్తిస్తున్నారు. ముంచుకొచ్చిన సీజన్ చేపపిల్లల సంతానోత్పత్తికి జూలై, ఆగస్టు మాసాలే అనువైనవి. ఇక్కడ ఉత్పత్తి చేసిన చేప పిల్లలను స్పాన్గా మారుస్తారు. తొలుత చెరువుల నుంచి తల్లి చేపలను తీసుకుకొచ్చి గుడ్లు సేకరిస్తారు. ఆపై హెచరీలో స్పాన్ తయారుచేసి పిల్లలను ఉత్పత్తి చేయాల్సి ఉంటుంది. ఇదంతా జూన్ మాసం నుంచి ఆగస్టు 2వ వారం వరకు పూర్తి చేసి పిల్లలను మత్స్య సహకార సంఘాలకు ఉచితంగా సరఫరా చేసేవారు. ఈ కేంద్రంలో బంగారు తీగ, బొచ్చ, కట్ల, రోహూ రకాల 14లక్షల చొప్పున, గంబూషీయా చేప పిల్లలు లక్ష మేర ఉత్పత్తి జరిగేది. కానీ పరిస్థితులు అనువుగా లేక ఇప్పటివరకు కూడా ఉత్పత్తి మొదలుకాలేదు. వైరా మత్స్య విత్తన కేంద్రం పరిధిలో 6వేల మందితో కూడి 55 మత్స్య సొసైటీలు ఉన్నాయి. వీరు 493 చెరువుల్లో చేపల పెంపకంపై ఆధారపడి జీవిస్తున్నారు. దిగుమతి అవసరమే ఉండదు.. చేపపిల్లల ఉత్పత్తి కేంద్రంలో సౌకర్యాలు కల్పిస్తే మెరుగైన ఫలితాలు వస్తాయి. ఏటా మత్స్యకారులకు ప్రభుత్వం వంద శాతం సబ్సిడీపై చేపపిల్లల పంపిణీకి టెండర్లు ఆహ్వానిస్తోంది. ఇందుకు రూ.కోట్లలో నిధులు వెచ్చిస్తున్నారు. అయితే, వైరా కేంద్రంలో చేపపిల్లలు ఉత్పత్తి మొదలైతే బయట కొనుగోలు చేయకుండా ఉమ్మడి జిల్లాలోని చెరువులన్నింటికీ సరఫరా చేయొచ్చు. ఇవీ ప్రధాన సమస్యలు... తల్లి చేపల నుంచి సేకరించే గుడ్లను హెచరీలో స్పాన్గా మారుస్తారు. అయితే, కేంద్రంలోని హెచరీ గది ఎలాంటి మరమ్మతులకు నోచుకోలేదు. ఫలితంగా శిథిలమవడంతో పాటు పైపులైన్ల లీకేజీతో నీరు సరఫరా కావడం లేదు. అలాగే, బాయిలర్లు తుప్పుపట్టిపోయాయి. అంతేకాక కేంద్రంలోని 38 సిమెంట్ పాండ్లకు ఎనిమిది శిథిలమవగా.. మరో ఐదు పాండ్ల లైనింగ్ కూలిపోయింది. అలాగే, మోటర్ కూడా సక్రమంగా పనిచేయడం లేదు. వీటికి తోడు ప్రహరీ లేక, 48ఏళ్ల క్రితం నిర్మించిన కార్యాలయ భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరడం గమనార్హం.వైరాలో 48ఏళ్ల క్రితం చేపపిల్లల ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు ఇక్కడే గంబూషియా చేపపిల్లలు కూడా.. నిర్వహణ లోపంతో నానాటికీ కుదేలవుతున్న కేంద్రం అయినా పట్టింపు లేనట్లుగా అధికారులు నిధుల మంజూరుకు ప్రతిపాదనలు కేంద్రంలో వసతులు లేక చేపపిల్లల ఉత్పత్తి ఇబ్బందిగా మారింది. ఇక్కడి సమస్యలను అధికారులకు నివేదించాం. మత్స్య విత్తన కేంద్రం ఆధునికీకరణకు ప్రతిపాదనలు కూడా పంపించాం. నిధులు మంజూరైతే సమస్యలన్నీ పరిష్కారమవుతాయి. – శివప్రసాద్, ఎఫ్డీఓ, వైరా -
కుక్క, కోతి దాడిలో నలుగురికి గాయాలు
ముదిగొండ: మండలంలోని న్యూలక్ష్మీపురం, ముదిగొండ, యడవల్లి గ్రామాల్లో శనివారం కుక్క, కోతి చేసిన దాడిలో నలుగురికి గాయాలయ్యాయి. వీధిలో వెళుతున్న నఫీసా, మరో కూలీపై కుక్క దాడి చేయగా, మరో ఇద్దరిపై కోతులు దాడి చేశాయి. ఈమేరకు గాయపడిన వారికి ముదిగొండ పీహెచ్సీలో చికిత్స చేయించారు. మట్టి తోలకాలపై రగడ నేలకొండపల్లి: మట్టి తోలకం విషయంలో ఇరువర్గాల నడుమ ఘర్షణ జరగగా పోలీసులు రంగప్రవేశం చేయాల్సి వచ్చింది. మండలంలోని కోనాయిగూడెం శివారు గుట్ట (కోరటేన్) వద్ద మూడు రోజులుగా జేసీబీలతో మట్టి తవ్వి తరలిస్తున్నారు. అయితే, శనివారం సదరు భూమి తమదంటే తమదని ఇరువురు రైతులు గొడవ పడగా వారి తరఫున జనం చేరడంతో వివాదం నెలకొంది. ఈ విషయం తెలిసి చేరుకున్న పోలీసులు సరైన పత్రాలతో స్టేషన్కు రావాలని సూచించగా ఇరువర్గాల వారు వెళ్లారు. అయితే, హద్దులు తేలే వరకు ఎవరూ మట్టి తవ్వొద్దని పోలీసుల సూచనలతో వివాదం తాత్కాలికంగా సద్దుమణిగింది. అయితే, మట్టి తవ్వకంపై మైనింగ్ అధికారులను వివరణగా తామెవరికీ అనమతి ఇవ్వలేదని, విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని తెలిపారు. అదుపు తప్పి స్తంభాన్ని ఢీకొట్టిన కారు నేలకొండపల్లి: ఓ కారు వేగంగా వెళ్తూ అదుపు తప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టగా తీగలు తెగిపడడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. ఈ ప్రమాదంలో చిన్నారితో పాటు ముగ్గురికు తీవ్ర గాయాలయ్యాయి. నేలకొండపల్లి మండలం మండ్రాజుపల్లికి చెందిన పానుగోతు ఉపేందర్ కూసుమంచి మండలంలోని గట్టుసింగారం నుంచి కారులో శనివారం ఇంటికి వస్తున్నారు. రాజేశ్వరపురం వద్ద ఎదురుగా వస్తున్న గేదెను తప్పించే క్రమాన స్తంభాన్ని ఢీకొట్టాడు. దీంతో కారు నుజునుజ్జు కాగా తీగలు తెగి పడగా స్థానికులు ఆందోళన చెందారు. ఈ ప్రమాదంలో పానుగోతు ఉపేందర్, మురళీనాయక్తో పాట ఏడేళ్ల బాలుడు జయంత్కుమార్కు తీవ్ర గాయాలు కాగా ఖమ్మం తరలించారు. ట్రాక్టర్ల బ్యాటరీలు చోరీ తల్లాడ: మండలంలోని కుర్నవల్లిలో పలువురు రైతుల ట్రాక్టర్ల నుంచి బ్యాటరీలు చోరీ అయ్యాయి. గ్రామ రైతులు యరమల వెంకట్రామిరెడ్డి, అయిలూరి కృష్ణారెడ్డి, పెద్ద కృష్ణారెడ్డి ట్రాక్టర్లలోని బ్యాటరీలను శుక్రవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేశారు. ఈమేరకు బాధితులు శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
ఇక పవర్ ‘ఫుల్’
కూసుమంచి: మండలంలోని పాలేరులో ఉన్న మినీ హైడల్ ప్రాజెక్టు(జల విద్యుదుత్పత్తి కేంద్రం)లో విద్యుత్ ఉత్పత్తికి సిద్ధమైంది. గత ఏడాది సెప్టెంబర్లో వచ్చిన భారీ వరదలతో ప్రాజెక్టుకు నీరు సరఫరా చేసే కాల్వ కట్టలు తెగిపోగా ప్రాజెక్టులోని యూనిట్లు, ప్యానల్ బోర్డులు సైతం నీటమునిగాయి. ఈ ప్రాజెక్టును జెన్కో ఆధ్వర్యాన పులిచింతల ప్రాజెక్టు అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఈమేరకు మరమ్మతుల కోసం రూ.5.50కోట్లు కేటాయించగా కొద్ది నెలలుగా చేపడుతున్న పనులు చివరి దశకు చేరాయి. భారీ గండి పూడ్చివేత భారీ వరదతో రిజర్వాయర్ నుంచి ప్రాజెక్టుకు నీరు సరఫరా చేసే కాల్వ కట్టలు తెగిపోయి గండి పడింది. దీంతో ప్రాజెక్టు కాల్వ నామరూపాలు లేకుండా పోయింది. ఈనేపథ్యాన అధికారులు వందలాది లారీల మట్టితో కట్టను యథావిధిగా నిర్మించారు. అంతేకాక మరోమారు వరద వచ్చినా ఇబ్బంది ఎదురుకాకుండా కాంక్రీట్తో పటిష్టం చేశారు. అలాగే, ప్రాజెక్టు ముందు భాగం కూడా వరద ప్రవాహంతో కోతకు గురవడంతో పటిష్టం చేసి సీసీ రహదారి నిర్మించి పూర్వ స్థితికి తీసుకొచ్చారు. రెండు యూనిట్లు సిద్ధం ప్రాజెక్టులో విద్యుదుత్పత్తికి రెండు టర్బయిన్లు(యూనిట్లు) ఏర్పాటుచేశారు. ఇందులో ఒక్కో యూనిట్ గంటకు ఒక మెగావాట్ చొప్పున విద్యుదుత్పత్తి చేస్తాయి. వరదలకు ముందే ఒక యూనిట్ మరమ్మతులకు గురవడం, వరదల్లో మరో యూనిట్ దెబ్బతినడంతో రెండింటికీ అధికారులు పూర్తిస్థాయిలో మరమ్మతులు చేపట్టారు. అలాగే, నీట మునిగిన విద్యుత్ ప్యానెల్ బోర్డులను సైతం సరిచేశారు. ఇక మిగిలిన చిన్నచిన్న మరమ్మతులు చివరి దశకు చేరాయి. పాలేరు రిజర్వాయర్ నుండి ఎడమ కాల్వకు నీరు విడుదల చేసినప్పుడు ఆ నీరు, రిజర్వాయర్ నీటిమట్టం ఆధారంగా ఈ ప్రాజెక్టులో విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. కాగా, రిజర్వాయర్కు త్వరలోనే సాగర్ జలాలు సరఫరా చేయనుండడడంతో జిల్లాలోని ఆయకట్టుకు విడుదల చేసేలా అధికారులు సిద్ధమవుతున్నారు. ఇదే సమయాన ప్రాజెక్టులో విద్యుదుత్పత్తి ప్రారంభించాలనే యోచనలో ఉన్నారు. విద్యుదుత్పత్తికి మినీ హైడల్ ప్రాజెక్టు సిద్ధం కాల్వ కట్టలు పటిష్టం, యూనిట్లకు మరమ్మతులు గతేడాది భారీ వరదలతో దెబ్బతిన్న ప్రాజెక్టు అన్ని పనులు పూర్తి పాలేరు వద్ద మినీ హైడల్ ప్రాజెక్టు వరదలతో దెబ్బతినగా పూర్తిస్థాయిలో మరమ్మతులు చేపట్టాం. ప్రాజెక్టులో సివిల్, ఇంజనీరింగ్ పనులు దాదాపు పూర్తయ్యాయి. మిగిలిన చిన్నపాటి పనులు త్వరలోనే పూర్తిచేసి విద్యుత్ ఉత్పత్తి మొదలుపెట్టేలా సిద్ధం చేస్తున్నాం. – దేశ్యానాయక్, ఎస్ఈ, పులిచింతల ప్రాజెక్టు -
‘సీతారామ’ జలాలు విడుదల
● మోటార్ ఆన్ చేసిన పినపాక ఎమ్మెల్యే పాయం ● సమస్యను మంత్రి ఉత్తమ్ దృష్టికి తుమ్మల తీసుకెళ్లడంతో ఫలితంఅశ్వాపురం/ఖమ్మంఅర్బన్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం బీజీ కొత్తూరులోని సీతారామ ప్రాజెక్ట్ పంప్హౌస్ నుంచి గోదావరి జలాలను ఎత్తిపోస్తున్నారు. ఒక మోటార్ను శనివారం పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు స్విచాన్ చేసి నీరు విడుదల చేశారు. నాగార్జుసాగర్ నుంచి సాగు అవసరాలకు నీరు విడుదల కాకపోవడంతో ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నా రు. ఈమేరకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నారుమడులు ఎండిపోతున్న విషయాన్ని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి దృష్టికి తీసుకెళ్లా రు. ఈ నేపథ్యాన అశ్వాపురం మండలం బీజీ కొత్తూరు పంప్హౌస్ నుంచి 1,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. గోదావరి లో 8లక్షల క్యూసెక్కుల జలాలు డిశ్చార్జ్ అవుతుండడంతో, ఉన్నతాధికారుల ఆదేశాలు వచ్చేవరకు పంప్హౌస్ నుంచి నీరు విడుదల చేస్తామని అఽధికారులు తెలిపారు. గోదావరి జలాలు ఇక్కడి నుంచి ములకలపల్లి మండలం పూసుగూడెం, కమలాపురం పంప్హౌస్ ల ద్వారా ఏన్కూరు లింక్ కెనాల్(రాజీవ్ కెనాల్) ద్వారా ఎన్ఎస్పీ కెనాల్కు తరలనున్నాయి. ఆపై వైరా, సత్తుపల్లి నియోజకవర్గా ల పరిధిలోని ఆయకట్టుకు నీరు అందనుంది. కాగా, నీటి విడుదల కార్యక్రమంలో నీటిపారుదల శాఖ ఎస్ఈ రవికుమార్, ఈఈ వెంకటేశ్వరరావు, డీఈ శ్రీనివాస్, ఏఈ రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
శ్రీవారికి అభిషేకం, నిత్యకల్యాణం
ఎర్రుపాలెం: తెలంగాణ తిరుపతిగా పేరున్న జమలాపురంలోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు జరిగాయి. తెల్లవారుజామున అర్చకులు స్వామి మూలవిరాట్తో పాటు ఆలయ ప్రాంగణంలోని శ్రీవారి పాదానికి పంచామృతంతో అభిషేకం చేశారు. ఆతర్వాత స్వామి, అలివేలు మంగ, పద్మావతి అమ్మవార్లను పట్టువస్త్రాలతో అలంకరించి నిత్యకల్యాణం జరిపించారు. అలాగే, తెలంగాణ, ఏపీలోని పలు ప్రాంతాల నుంచి హాజరైన భక్తుల నడుమ పల్లకీ సేవ చేశారు. ఆలయ ఈఓ జగన్మోహన్రావు, వ్యవస్థాపక ధర్మకర్త ఉప్పల శ్రీరామచంద్రమూర్తి, ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాసశర్మ, సూపరింటెండెంట్ విజయకుమారి, అర్చకులు రాజీవ్శర్మ, మురళీమోహన్శర్మ పాల్గొన్నారు. ‘భక్తరామదాసు’ నుంచి సాగునీటి విడుదల కూసుమంచి: మండలంలోని ఎర్రగడ్డ తండా వద్ద భక్తరామదాసు ప్రాజెక్టు నుండి సాగు అవసరాలకు అధికారులు శనివారం నీటిని విడుద ల చేఽశారు. పాలేరు నియోజకవర్గ ప్రత్యేకాధి కారి రమేష్ పూజలు నిర్వహించగా, ప్రాజెక్టు డీఈఈ రమేష్రెడ్డి మోటార్ స్విచాన్ చేశారు. ఈ ప్రాజెక్టు ద్వారా కూసుమంచి, తిరుమలాయపాలెం, ఖమ్మం రూరల్, నేలకొండపల్లి మండలా ల్లోని ఆయకట్టుతో పాటు చెరువులకు నీరు చేరుతుందని డీఈఈ తెలిపారు. మెట్ట పంటలు, వరి సాగుకు తొలుత పదిరోజులు నీరు సరఫరా చేస్తామని, ఈలోగా పాలేరు రిజర్వాయర్కు సాగర్ జలాలు చేరాక చెరువులను పూర్తిస్థాయిలో నింపుతామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో నాయకులు భీమిరెడ్డి శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 35 మంది ఆపరేటర్ల బదిలీలు ఖమ్మం సహకారనగర్: జిల్లాలోని రెవెన్యూ శాఖలో ఏళ్లుగా ఒకేచోట విధులు నిర్వర్తిస్తున్న సీసీఎల్ఏ, భూభారతి ఆపరేటర్లను బదిలీ చేస్తూ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. సీసీఎల్ఏ టైపిస్టు కమ్ ఆపరేటర్లు 14మంది, 21మంది భూభారతి ఆపరేటర్లను బదిలీ చేయగా, నూతన స్థానాల్లో వెంటనే చేరాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. పాలనలో జవాబుదారీతనం, పారదర్శకత కోసం బదిలీలు చేపట్టామని తెలిపారు. రెవెన్యూ శాఖ లో అన్ని స్థాయిల అధికారులు, సిబ్బంది విధుల్లో అవినీతికి ఆస్కారం లేకుండా, ప్రజలకు న్యాయం చేకూర్చాలనే నిబద్ధతతో నిర్వర్తించాలని కలెక్టర్ సూచించారు. రుణాల మంజూరు దరఖాస్తుల ఆహ్వానం ఖమ్మంమయూరిసెంటర్: ఉపాధి పునరావాస పథకం కింద దివ్యాంగులకు రుణాల మంజూరు కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మహిళా, శిశు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ అధికారి కె.రాంగోపాల్రెడ్డి తెలిపారు. జిల్లాకు రూ.50 వేల యూనిట్లు 25, రూ.లక్ష, రూ.2లక్షలు, రూ.3లక్షల యూనిట్లు ఒక్కొక్కటి మంజూరయ్యానని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న వారు ఈనెల 14నుంచి 31వ తేదీ వరకు http//tgobmms.cgg.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 31వరకు ఫీజు గడువు పొడిగింపు ఖమ్మం సహకారనగర్: ఓపెన్ స్కూల్ సొసైటీ ద్వారా పదో తరగతి, ఇంటర్మీ డియట్లో ప్రవేశాలకు ఫీజు చెల్లించే గడువును ఈనెల 31వ తేదీ వరకు పొడిగించినట్లు డీఈఓ ఎస్.సత్యనారాయణ, ఓపెన్ స్కూల్ ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ ఎం.పాపారావు తెలిపారు. అలాగే, ఆగస్టు 1నుండి 28వరకు సాధారణ ఫీజుతో పాటు పదో తరగతి వారు రూ.100, ఇంటర్మీడియట్ విద్యార్థులు రూ.200 జరిమానాతో ప్రవేశాలు పొందొచ్చని వెల్లడించారు. సమీపంలోని ఓపెన్ స్కూల్ సెంటర్లను లేదా www.telanganaopenschool.org వెబ్సైట్తో పాటు మీ సేవా, టీ సేవా సెంటర్లలో దరఖాస్తు చేసుకుని రెండు సెట్లను సెంటర్లో సమర్పించాలని సూచించారు. వివరాలకు 80084 03522 సంప్రదించాలని తెలిపారు. -
నెమ్మదిస్తున్న గోదావరి
భద్రాచలంటౌన్: భద్రాచలం వద్ద గోదావరిలో వరద ప్రవాహం శనివారం సాయంత్రం నుంచి నెమ్మదించింది. ఎగువన ప్రాజెక్టుల నుంచి వరద భారీగా వస్తుండడంతో రెండు రోజులుగా నదిలో ఉధృతి పెరిగింది. వరద నీటిమట్టం శుక్రవారం రాత్రి 11 గంటలకు 38.8అడుగులకు చేరింది. శనివారం ఉదయం 40.5 అడుగులకు, క్రమంగా మధ్యాహ్నం వరకు 41.5 అడుగులకు పెరిగింది. అనంతరం తగ్గుముఖం పట్టింది. రాత్రి 9గంటలకు 40 అడుగులకు తగ్గింది. ఎగువన ఉన్న ప్రాజెక్టులకు ఇన్ఫ్లో తగ్గుతుండడంతో క్రమంగా గోదావరి వరద కూడా తగ్గుతోందని ఇరిగేషన్ అధికారులు తెలిపారు. వరద ఉధృతితో రహదారులు మునిగి భద్రాచలం దిగువన ఏపీలోని విలీన మండలాల్లో పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. ఆపై వరద ప్రవాహం తగ్గుముఖం పట్టడంతో జిల్లా అధికారులు, ముంపు గ్రామాల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. దుమ్ముగూడెంలో నిలకడగా.. దుమ్ముగూడెం: ఎగువ ప్రాంతాల నుంచి వరద నెమ్మదించడంతో శనివారం మండలంలో గోదావరిలో వరద ప్రవాహం నిలకడగా ఉంది. పర్ణశాల నారచీరల ప్రాంతం వరద నీటిలోనే మునిగి ఉండగా, సున్నంబట్టి–బైరాగులపాడు గ్రామాల మధ్య రహదారి పైకి వరద నీరు చేరింది.భద్రాచలం వద్ద 41.5 అడుగులకు పెరిగి తగ్గుతున్న వరద -
●బోడకాకర.. కాస్ట్లీ గురూ!
ఖమ్మంవ్యవసాయం/మధిర: కాకరలో ఓ రకం బోడ కాకర. ఏటా ఈ సీజన్లో, అదీ తక్కువగా లభించే ఈ కాకరకు డిమాండ్ ఉంటుంది. జిల్లా కేంద్రంతో పాటు పలు ప్రాంతాల్లో ఇప్పుడిప్పుడే బోడకాకర కాయలు విక్రయిస్తుండగా ప్రాంతాల వారీగా కిలో ధర రూ.320 నుంచి రూ.350 వరకు పలుకుతోంది. ఖమ్మంలోని రైతుబజార్ల బోర్డులపై రూ.280గా రాస్తున్నా ఆ ధరకు విక్రయించడం లేదు. ప్రస్తుతం ఏపీలోని గోదావరి జిల్లాల నుంచి బోడ కాకర ఖమ్మం మార్కెట్కు వస్తోందని చెబుతున్నారు. హోల్సేల్ మార్కెట్లో రిటైల్ వ్యాపారులు రూ.200 చొప్పున కొనుగోలు చేసి రూ.320, అంత కంటే ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారు. చికెన్ ధర కన్నా అధికం సాధారణంగా బోడకాకర ధర కిలో రూ.180నుంచి రూ.200 వరకు పలుకుతుంది. కానీ ఈసారి ధర పెరగడం గమనార్హం. ప్రస్తుతం చికెన్ కిలో ధర రూ.200 ఉండగా.. అంతకు మించి బోడ కాకర ధర ఉండడంతో చాలా మంది వెనుకడుగు వేస్తున్నారు. కొందరు మాత్రం ఈ సీజన్లో లభించేది కావడంతో భారమైనా కొనుగోలు చేస్తున్నారు. గుట్టలు, కొండలు, అడవుల్లో లభించే ఈ కాకరను ప్రస్తుతం కొందరు రైతులు సాగు చేస్తున్నారు.కిలోకు రూ.320కి పైగానే ధర -
వెదజల్లు.. సాగు ఫుల్లు!
విస్తృత అవగాహన వెదజల్లే విధానంలో వరి సాగుతో ఉన్న లాభాలను వ్యవసాయ శాఖ అధికారులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. నానాటికీ పెరుగుతున్న కూలీల కొరతను అధిగమించొచ్చని, ఇతర ఖర్చులు కూడా తగ్గుతాయని చెబుతున్నారు. అంతేకాక అధికారులు క్షేత్రస్తాయిలో వెదజల్లే విధానంపై అవగాహన కల్పిస్తుండగా ఈ విధానం అవలంబించే రైతుల సంఖ్య పెరుగుతోంది. అలాగే, గతంలో సాగు చేసిన రైతులు సత్ఫలితాలు సాధించడంతో ఇంకొందరు కూడా ముందుకొస్తున్నారు. పాత విధానంలో వ్యయప్రయాసలు వరి సాగు చేసే రైతులు ఆది నుంచి ముందుగా నేల తయారీ, విత్తనాలతో నారు పోయడం.. ఆపై కలుపు తొలగించడం చేశాక పొలంలో నాట్లు వేయించేవారు. ఇదంతా కలిపి ఎకరానికి సుమారు రూ.25వేల వరకు ఖర్చవుతుంది. అందులో ప్రతీ పనికి కూలీలపై ఆధారపడాల్సి వస్తోంది. కానీ కూలీల కొరత ఏటా పెరుగుతుండడంతో ప్రత్యామ్నాయ పద్ధతులపై దృష్టి సారించారు. అలాగే, నారు తొలగించే సమయాన వేర్లు తెగిపోయి అధిక శాతం పిలకలే మిగులుతుండడం రైతులకు ఆర్థికంగా నష్టం ఎదురవుతోంది. ఈక్రమంలోనే వెదజల్లే పద్ధతి తెరపైకి వచ్చింది. ఖర్చులు ఆదా.. వెదజల్లే పద్ధతిలో రైతులు మామూలుగానే పొలం దుక్కి చేసుకోవాలి. ఆ తర్వాత ఎకరాకు 10 – 12 కేజీల లోపు వరి విత్తనాలను చల్లాలి. ఈ పద్ధతిలో ఎక్కువ ఎత్తు పెరగని రకం విత్తనాలు ఎంచుకోవాల్సి ఉంటుంది. అంతేకాక వ్యవసాయాధికారుల సూచనలు పాటిస్తే కూలీల అవసరం పెద్దగా లేకపోగా, ఎకరాకు సుమారు రూ.10వేల నుంచి రూ.12వేల వరకు ఖర్చు తగ్గుతుందని చెబుతున్నారు. కొన్నిచోట్ల పొడి దుక్కుల్లోనే రైతులు విత్తనాలు వెదజల్లుతుండగా వర్షాలు పడగానే మొలకెత్తుతున్నాయి. ఇక కాల్వల పరీవాహక ప్రాంతాల్లో తడి దుక్కుల్లో విత్తనాలు వెదజల్లి మంచి ఫలితాలు సాధిస్తున్నారు. ఇంకొందరు విత్తన శుద్ధి తర్వాత నానబెట్టడం, ఆపై గన్నీ సంచుల్లో నిల్వ చేసి మొలకలు వచ్చాక వెదజల్లే పద్ధతి అవలంబిస్తున్నారు. ఈమేరకు జిల్లాలోని ఒక్క కామేపల్లి మండలంలోని తాళ్లపల్లి, పండితాపురంలో సుమారు 2,200 ఎకరాల్లో వెదజల్లే విధానంలో వరి సాగు చేస్తుండా ఇంకొందరు రైతులు కూడా ముందుకొస్తున్నారు. అంతేకాక వైరా, తదితర మండలాల్లో ఈ విధానం నానాటికీ విస్తరిస్తోంది. కాగా, ఈ విధానంలో పెట్టుబడి తగ్గడమే కాక సాధారణ విధానంతో పోలిస్తే 15 రోజుల ముందే పంట కోత దశకు చేరుతోంది. నారు, నాట్లు లేకుండా వరి సాగుకు అవకాశం కూలీల కొరతకు చెక్, ఇతర ఖర్చులూ ఆదా జిల్లాలో వెదజల్లే పద్ధతికి పెరుగుతున్న ఆదరణ అధికారుల అవగాహనతో ముందుకొస్తున్న అన్నదాతలువరి సాగులో కొత్త ఒరవడి నానాటికీ విస్తృతమవుతోంది. నారు పోయడం, నాట్లు వేసే పని లేకుండా వెదజల్లే విధానంలో సాగుపై కలిగే లాభాలతో అధికారులు అవగాహన కల్పిస్తుండడంతో జిల్లా రైతులు ముందుకొస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో వెదజల్లడం, ఇంకొన్ని ప్రాంతాల్లో కరివేదగా పిలిచే ఈ విధానంలో సాగు ఖర్చులు కూడా తగ్గుతుండడం రైతులకు కలిసొస్తోంది. – కామేపల్లి/వైరారూరల్ రైతులకు ఎంతో మేలు.. వరి సాగు చేసే రైతులు వెదజల్లే పద్ధతి అవలంబిస్తే శ్రమ తగ్గుతుంది. డ్రమ్ సీడర్ విధానంలో కూడా వరి సాగు చేసుకోవచ్చు. గతేడాది కంటే ఈ ఏడాది మరింత ఎక్కువ మంది రైతులు ముందుకొచ్చేలా అవగాహన కల్పిస్తున్నాం. వెదజల్లే విధానంలో సాగుకు ఇది సరైన సమయం. – భూక్యా తారాదేవి, ఏఓ, కామేపల్లిఆదాయం పెరుగుతోంది.. గత యాసంగిలో నాలుగు ఎకరాల్లో వెదజల్లే పద్ధతిలో వరి సాగు చేశాను. సాధారణ నాట్ల కంటే ఇది సులువుగా ఉంది. ఎకరాకు రూ.10వేల ఖర్చు తగ్గింది. పైరు కూడా ఆశించిన స్థాయిలో పెరుగుతోంది. ఈ విధానంలో పెట్టుబడి తగ్గడమే కాక ఆదాయం పెరుగుతోంది. – కె.శ్రీనివాసరావు, రైతు, సోమవరం, వైరా మండలం -
ఆదాయం వచ్చే పంటలపై దృష్టి పెట్టాలి
కొణిజర్ల: రైతులు సంప్రదాయ పంటల స్థానంలో అధిక ఆదాయాన్ని ఇచ్చే ఆయిల్పామ్, వక్క తదితర పంటల సాగుపై దృష్టి సారించాలని రాష్ట్ర వ్యవసాయ సహకార, మార్కెటింగ్ పట్టు పరిశ్రమల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. కొణిజర్ల మండలం అంజనాపురంలో శనివా రం నిర్వహించిన ఆయిల్పామ్ మెగా ప్లాంటేషన్ ను ఆయన కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్నాయక్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ ఆయిల్పామ్ సాగు పై రైతుల్లో ఆసక్తి పెరుగుతోందని తెలిపారు. అయితే, విత్తనాల కోసం ఇతర దేశాలపై ఆధార పడాల్సి వస్తుండగా, కల్తీని మొక్కలు పెద్దయ్యే వరకు గుర్తించలేకపోతున్నామని చెప్పారు. ఈనేపథ్యాన గోద్రెజ్ కంపెనీ బాధ్యులు దేశంలోనే తొలిసారి కొణిజర్లలో సీడ్ గార్డెన్ ఏర్పాటుకు ముందుకొచ్చారని తెలిపారు. ఈ విషయమై సీఎం రేవంత్రెడ్డి దావోస్లో ఒప్పందం చేసుకోవడంతో ముందడుగు పడిందన్నారు. అంజనాపురంలో ఆయిల్పామ్ ఫ్యాక్టరీని ఈ ఏడాది నవంబర్ నాటికి సిద్ధం చేయాలని, రీసెర్చ్ సెంటర్ కూడా ఏర్పాటు చేయాలని సూచించారు. ఫ్యాక్టరీ ప్రారంభించకపోతే దున్నిస్తాం.. వైరా ఎమ్మెల్యే రాందాస్నాయక్ మాట్లాడుతూ అన్ని సహాయ, సహకారాలు అందుతున్నందున నవంబర్ నాటికి కంపెనీ ప్రతినిధులు ఫ్యాక్టరీని ప్రారంభించాలని సూచించారు. లేనిపక్షంలో రైతుల వద్ద నుంచి తీసుకున్న భూమిని తానే దగ్గరుండి దున్నిస్తానని తెలిపారు. రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు మాట్లాడగా డీఏఓ డి.పుల్లయ్య, జిల్లా ఉద్యానవన శాఖాఽధికారి ఎం.వీ. మధుసూదన్రావు, ఉద్యాన శాస్త్రవేత్త ఎన్.వీ ప్రసాద్, డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, నాయకులు నల్లమల వెంకటేశ్వరరావు, బొర్రా రాజశేఖర్, గోద్రెజ్ మార్కెటింగ్ మేనేజర్ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మొక్కలతో ఆరోగ్యం ఖమ్మంఅర్బన్/రఘునాథపాలెం: పర్యావరణ పరిరక్షణే కాక అందరం ఆరోగ్యంగా ఉండాలంటే మొక్కలు నాటాలని రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. ఖమ్మం 8వ డివిజన్ వైఎస్సార్ నగర్లోని రెండెకరాల స్థలంలో శనివారం వనమహోత్సవంలో భాగంగా ఆర్కానట్(వక్క) మొక్కలు నాటారు. కలెక్టర్ అనుదీప్, మేయర్ పునుకొల్లు నీరజ, మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య, డీఎఫ్ఓ సిద్ధార్థ్ విక్రమ్సింగ్తో కలిసి మొక్కలు నాటాక మంత్రి మాట్లాడుతూ కోనోకార్పస్ మొక్కలతో మంచి జరగడం లేదనే కథనాల నేపథ్యాన వాటిని తొలగించి మహాగని, ఆర్కానట్ మొక్కలు నాటనున్నామని తెలిపారు. అనంతరం రఘునాథపాలెం మండలం కే.వీ.బంజరలో బీటీ రోడ్డు నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. కే.వీ.బంజర నుంచి కొత్తతండా క్రాస్ వరకు రూ.1.30 కోట్లతో నిర్మించే రోడ్డు పనులకు కలెక్టర్ అనుదీప్తో కలిసి శంకుస్థాపన చేశాక మంత్రి మాట్లాడారు. రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, మార్కెట్ చైర్మన్ యరగర్ల హన్మంతరావు, ఆత్మకమిటీ చైర్మన్ దిరిశాల చిన్న వెంకటేశ్వర్లు, కేఎంసీ ఉద్యాన అధికారి బెల్లం రాధిక, కార్పొరేటర్లు లకావత్ బాలాజీ, దుద్దుకూరి వెంకటేశ్వర్లు, కమర్తపు మురళితో పాటు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, దొబ్బల సౌజన్య, రావూరి సైదబాబు, తాతా రఘురాం, తుపాకుల ఏలగొండస్వామి, వాంకుడోత్ దీపక్ తదితరులు పాల్గొన్నారు. నవంబర్ నాటికి అంజనాపురంలో ఆయిల్పామ్ ఫ్యాక్టరీ రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు -
విద్యా సామర్థ్యాలు పెంపొందించేలా కృషి
భద్రాచలంటౌన్: గిరిజన ఆశ్రమ పాఠశాలల్లోని విద్యార్థుల సామర్థ్యాలు ప్రతీ సబ్జెక్ట్లో మెరుగుపడేలా ఉపాధ్యాయులు శ్రద్ధ వహించాలని భద్రాచ లం ఐటీడీఏ పీఓ బి.రాహుల్ సూచించారు. భద్రాచలంలోని బీఈడీ కళాశాలలో ఉమ్మడి జిల్లాలోని పాఠశాలల హెచ్ఎంలతో శుక్రవారం ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పీఓ మాట్లాడుతూ.. సబ్జెక్ట్ టీచర్లు ఉద్దీపకం వర్క్ బుక్ల ద్వారా విద్యార్థులకు బోధన సాగించాలని తెలిపారు. పాఠశాలలకు సరఫరా చేసిన నోటుబుక్స్, టెక్ట్స్ బుక్స్, యూనిఫామ్లు వెంటనే అందించాల ని, నూతన మెనూ ప్రకారం భోజనం సమకూర్చా లని సూచించారు. వర్షాకాలం నేపథ్యాన పిల్లల ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తూనే బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ఆర్ఓ ప్లాంట్లు లేనిచోట వేడి చేసిన నీటినే విద్యార్థులకు అందించాలని పీఓ సూచించారు. సమావేశంలో డీడీలు మణెమ్మ, విజయలక్ష్మి, బీఈడీ కళాశాల ప్రిన్సిపాల్ వీరునాయక్, ఏసీఎంఓలు రాములు, రమేశ్, ఏటీడీఓలు అశోక్కుమార్, చంద్రమోహన్, రాధమ్మ తదితరులు పాల్గొన్నారు. ఐటీడీఏ పీఓ రాహుల్ -
ఫుట్బాల్ టోర్నీలో రన్నరప్గా జిల్లా జట్టు
ఖమ్మం స్పోర్ట్స్: ఆదిలాబాద్ జిల్లా రామకృష్ణాపూర్లో జరిగిన రాష్ట్రస్థాయి బాలికల జూని యర్ ఫుట్బాల్ టోర్నీలో ఉమ్మడి జిల్లా జట్టు రన్నరప్గా నిలిచింది. ఫైనల్స్లో నిజామాబాద్ జట్టుతో తలపడగా, హోరా హోరీగా సాగిన మ్యాచ్లో జిల్లా జట్టు రెండో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కాగా, జట్టు నుంచి శ్వేత ఉత్తమ క్రీడాకారిణిగా ఎంపికై ంది. ఈమేరకు క్రీడాకారులను ఫుట్బాల్ అసోసియేషన్ జిల్లా కార్య దర్శి కె.ఆదర్శ్కుమార్తో పాటు రమణ, కిషోర్, కోచ్లు నోయల్ జాక్సన్, మాధురి అభినందించారు. -
ఎరువు.. కృత్రిమ కరువు
● జిల్లా అంతటా యూరియాకు కటకట ● స్టాక్ ఉన్నా పక్కదారి పట్టిస్తున్న కొందరు డీలర్లు ● అమ్మకానికి ఇతర ఎరువులతో లింక్ఖమ్మంవ్యవసాయం: వ్యవసాయ సీజన్ ఇంకా ఊపందుకోకముందే అన్నదాతలకు ఎరువుల కష్టాలు మొదలయ్యాయి. ఎరువుల కోసం పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. వానాకాలం సీజన్లో సాధారణ పంటల సాగు 6,08,348 ఎకరాలు కాగా ఇప్పటివరకు 3లక్షలకు పైగా ఎకరాల్లో సాగయ్యాయి. పంటల సాగు దశలకు అనుగుణంగా ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు యూరియా 54,825 మెట్రిక్ టన్నులు, డీఏపీ(డై అమోనియా పాస్ఫేట్) 17,466 మెట్రిక్ టన్నులు, ఎంఓపీ(మ్యూరేట్ ఆఫ్ పొటాష్) 13,766 మెట్రిక్ టన్నులు, కాంప్లెక్స్ ఎరువులు 58,594 మెట్రిక్ టన్నులు, ఎస్ఎస్పీ(సింగిల్ సూపర్ పాస్ఫేట్)4,484 మెట్రిక్ టన్నులు అవసరమని అంచనా వేశారు. ప్రస్తుతం డీఏపీ, కాంప్లెక్స్ ఎరువులతో పాటు యూరియాను వినియోగిస్తుండగా, చాలా చోట్ల నెలవారీ లక్ష్యం మేర కేటాయింపులు లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. యూరియాకు కటకట జూలైలో 11,593 మెట్రిక్ టన్నుల యూరియా వినియోగం జరుగుతుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఇందులో జూలై 5వ తేదీ నాటికి 7వేల మెట్రిక్ టన్నులు సరఫరా కావాల్సి ఉండగా కేవలం 2,705 మెట్రిక్ టన్నులే వచ్చింది. యూరియా సరఫరా తక్కువగా ఉండటంతో సొసైటీల్లో పలుకుబడి ఉన్న వారే దక్కించుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. దీనికితోడు ప్రైవేట్ మార్కెట్లో అధిక ధరలు ఉండటం, ఇతర ఎరువులకు లింక్ పెడుతుండడంతో సహకార సంఘాల్లో పైరవీలు పెరిగాయి. డీలర్ల మాయాజాలం ఎరువుల విక్రయాల్లో డీలర్లు మాయాజాలం ప్రదర్శిస్తున్నారు. ఎరువుల కొరత పేరిట బ్లాక్ మార్కెట్కు తరలించేలా నిల్వ చేస్తున్నట్లు సమాచారం. ఎవరైనా యూరియా కోసం ఒత్తిడి చేస్తే డీఏపీ లేదా కాంప్లెక్స్ ఎరువు కొనాలని చెబుతున్నట్లు తెలిసింది. అంతేకాక 45 కిలోల యూరియా బస్తా ధర రూ.266.50 ఉండగా ప్రాంతాన్ని వారీగా రూ.320 నుంచి రూ.350 వరకు విక్రయిస్తున్నారు. దీనికి తోడు డీఏపీ లేదా కాంప్లెక్స్ ఎరువుల బస్తా కొనాల్సి వస్తుండడంతో రైతులు అదనంగా రూ.1,350 పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది. ఇబ్బందులు రాకుండా పర్యవేక్షణ ప్రస్తుతం మార్క్ఫెడ్, డీలర్లు, సొసైటీలు వద్ద 10,110 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వ ఉంది. నానో యూరియా కూడా అందుబాటులోకి వచ్చింది. దీని వినియోగంపై రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. యూరియా కొరత రాకుండా పర్యవేక్షిస్తూనే డీలర్లు అక్రమాలకు పాల్పడకుండా తనిఖీలు చేస్తున్నాం. – ధనసరి పుల్లయ్య, జిల్లా వ్యవసాయాధికారి -
జిల్లా మీదుగా ‘భారత్ గౌరవ్’ ప్రత్యేక రైలు
ఖమ్మం మామిళ్లగూడెం: దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను సందర్శించేలా ఏర్పాటుచేసిన ‘భారత్ గౌరవ్’ ప్రత్యేక రైలు జిల్లా మీదుగా ప్రయాణం సాగిస్తుందని ఐఆర్ిసీటీసీ అసిస్టెంట్ మేనేజర్ పీ.వీ.వెంకటేష్ తెలిపారు. ఖమ్మం శుక్రవరం ఆయన మాట్లాడుతూ ఈనెల 19న మొదలయ్యే హైదరాబాద్లో యాత్ర 26వ తేదీ వరకు సాగుతుందని వెల్లడించారు. యాత్రలో భాగంగా తిరువణ్ణామలై, రామేశ్వరం, మధురై, కన్యాకుమా రి, త్రివేండ్రం, తిరుచ్చి, తంజావూరు తదితర క్షేత్రా ల సందర్శన ఉంటుందని, సాధారణ బోగీలో రూ. 14,100, థర్ఢ్ ఏసీలో రూ.22,300, సెకండ్ ఏసీలో రూ.29,200గా టికెట్ ధర నిర్ణయించామని తెలిపారు. ఈ రైలుకు జిల్లాలోని ఖమ్మం, మధిరలో హాల్టింగ్ ఉన్నందున జిల్లావాసులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. టికెట్ల బుకింగ్, ఇతర వివరాల కోసం 97013 60701, 92814 95845, 92814 95843 , 92810 30749 నంబర్లలో సంప్రదించాలని వెంకటేష్ సూచించారు. ఈ సమావేశంలో ఉద్యోగులు ఎం.శ్రీకాంత్, కె.ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు . ఈనెల 19నుంచి 26వ తేదీ వరకు టూర్ -
పంట చేనులోనే పోయిన ప్రాణం
వేంసూరు: వానాకాలం సాగు పనులకు ఉపక్రమించిన రైతు పొలాన్ని సిద్ధం చేసే క్రమాన విద్యుదాఘాతంతో మృత్యువాత పడ్డాడు. వేంసూరు మండలం చౌడవరం తండా సమీపాన శుక్రవారం ఈ ప్రమాదం జరిగింది. వేంసూరు కమ్మబజార్కు చెందిన చల్లగుండ్ల నాగార్జున(55) శుక్రవారం ఉదయం చౌడవరం తండా సమీపంలో పొలంలో దుక్కి దున్నించేందుకు వెళ్లాడు. అయితే, మధ్యలో విద్యుత్ తీగ అడ్డుగా ఉందని తొలగించే క్రమాన షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. రైతు నాగార్జునకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాగా, రెండు రోజుల క్రితం వేంసూరు కమ్మబజార్కు చెందిన రావి నాగేశ్వరరావు మృతి చెందగా, ప్రస్తుతం నాగార్జున మృతితో స్థానికంగా విషాదం అలుముకుంది. భర్త వేధింపులు తట్టుకోలేక మహిళ ఆత్మహత్యకామేపల్లి: అనుమానంతో భర్త వేధిస్తుండడాన్ని తట్టుకోలేక ఓ వివాహిత ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్ప డింది. మండలంలోని బాసిత్నగర్కు చెందిన తేజావత్ మౌనిక వివాహం ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా తిరువూరుకు చెందిన సపావట్ కృష్ణప్రసాద్తో నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది. కొంతకాలంగా మద్యానికి బానిసైన ఆయన కృష్ణప్రసాద్ మౌనికను అనుమానిస్తుండడంతో కొద్ది రోజుల క్రితం పుట్టింటికి వచ్చింది. అయినా వేధింపులు ఆగకపోవడంతో శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయాన ఆత్మహత్య చేసుకుంది. ఆమెకు మూడేండ్ల కుమారుడు ఉన్నాడు. మౌనిక తండ్రి వీరన్న ఫిర్యాదుతో ఆమె భర్త, అత్త, ఆడబిడ్డపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.యువతి దూరం పెడుతోందని.. చింతకాని: ప్రేమించిన యువతి కొన్నాళ్లుగా మాట్లాడడం లేదని పురుగుల మందు తాగిన యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. కొణిజర్ల మండలం కొండవనమాలకు చెందిన హరికొట్ల శ్రీను(24) ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేస్తుండగా, ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. ఆమె కొద్దిరోజులుగామాట్లాడకపోవటంతో ఆయన ఈనెల 9వ తేదీ రాత్రి చింతకాని మండలం కొదుమూరు సమీపాన పురుగుల మందు తాగాడు. ఈ విషయాన్ని ఆస్పపత్రి సిబ్బందికి చెప్పగా వారు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందగా, శ్రీను తండ్రి నాగరాజు ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని ఎస్సై నాగుల్మీరా తెలిపారు. మూడు ఇళ్లలో చొరబడిన దొంగలు మధిర: ఒకేరోజు రాత్రి మూడు ఇళ్లలో దుండగులు చోరీకి యత్నించగా ఒక స్కూటీ ఎత్తుకెళ్లారు. మధిర మున్సిపల్ పరిధి అంబారుపేటకు చెందిన కర్నాటి కోటి, మణిభూషణం కుటుంబాలు వ్యాపార నిమిత్తం ఇతర ప్రాంతా లకు వెళ్లాయి. దీంతో గురువారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు వారి ఇళ్ల తాళాలు పగలగొట్టినా విలువైన వస్తువులేమీ లభించక బీరువాల్లో దుస్తులను చిందరవందర చేసి వెళ్లిపోయారని సమాచారం. సమీపంలోని కర్నాటి పెద్ద బుజ్జి ఇంట్లో నిద్రిస్తుండగా ఆరుబయట నిలిపిన స్కూటీని ఎత్తుకెళ్లారు.విద్యుదాఘాతంతో రైతు మృతి -
రవాణా శాఖలో వసూళ్ల దందా..
● ఏ పనికై నా ఏజెంట్లే సూత్రధారులు ● సత్తుపల్లి కార్యాలయ ఉద్యోగులపై రైతులు, వాహనదారుల విమర్శలుసత్తుపల్లి: రాష్ట్రంలోని పలుచోట్ల రవాణా శాఖ కార్యాలయాలపై ఏసీబీ దాడులు జరుగుతున్నా సత్తుపల్లిలో మాత్రం అధికారుల తీరు మారడం లేదనే విమర్శలు వస్తున్నాయి. సత్తుపల్లి రవాణా శాఖ కార్యాలయంలో కొందరు ఉద్యోగులు అక్రమంగా వసూళ్లు చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఏజెంట్లను నియమించుకుని వారి ద్వారా వచ్చే పనులే చేస్తూ నేరుగా వచ్చే వాహనదారులను ముప్పుతిప్పలు పెడుతున్నారని తెలు స్తోంది. గతంలో ఈ కార్యాలయంలో ఏసీబీ అధికారులు తనిఖీ చేయగా ఓ జూనియర్ అసిస్టెంట్ పట్టుబడ్డాడు. అయినా తీరు మారకపోవడం గమనార్హం. తనిఖీల్లో వసూళ్ల పర్వం వాహనాల తనిఖీ సందర్భంగా ఎంవీఐ ప్రైవేట్ సైన్యాన్ని నియమించుకుని వసూళ్లకు పాల్పడుతున్నట్లు వాహనదారులు ఆరోపిస్తున్నారు. పత్రాల్లో ఏ మాత్రం తేడా ఉన్నా కాసులు సమర్పించాల్సి వస్తోందని వాపోతున్నారు. సత్తుపల్లి నియోజకవర్గం ఏపీకి సరిహద్దుగా ఉండడంతో రెండు రాష్ట్రాల వాహనాలు అటూఇటు రాకపోకలు సాగిస్తుంటాయి. ఈక్రమంలోనే పర్మిట్ల పేరిట పెద్ద ఎత్తున వసూలు చేస్తున్నారనే విమర్శ వస్తుంది. ఇక రవాణా శాఖ కార్యాలయానికి ఏ పనిపై వెళ్లినా ఏజెంట్లను ఆశ్రయిస్తే సులువుగా పూర్తవుతుందనే ప్రచారం జరుగుతోంది. అదే వాహనదారులు సొంతంగా వెళ్తే రోజుల తరబడి తిరగాల్సి వస్తుందని చెబుతున్నారు. రైతుల ట్రాక్టర్లనూ వదలకుండా.. వ్యవసాయ సీజన్ కావడంతో రైతులు విత్తనాలు, ఎరువుల కొనుగోలుకు పట్టణాలకు వెళ్లివస్తున్నారు. ఈక్రమంలోనే రైతులను బెదిరిస్తున్న రవాణా శాఖ ఉద్యోగులు వసూళ్లకు పాల్పడుతున్నారనే ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. దీంతో కొందరు ప్రజాప్రతినిధులను ఆశ్రయించినట్లు సమాచారం. పన్నులు, ఇతర పేర్లతో రైతులను ఇబ్బంది పెడుతున్న ఎంవీఐపై చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. రోడ్ ట్యాక్స్ కట్టకపోతే జరిమానా వ్యవసాయ ఉత్పత్తులు తీసుకెళ్తున్న ట్రాక్టర్లపై ఎప్పుడు కేసులు రాయలేదు. రోడ్డు ట్యాక్స్ కట్టని వాటిపైనే కేసు నమోదు చేసి జరిమానా విధించాం. మా కార్యాలయంలో ఏజెంట్ల వ్యవస్థ అసలే లేదు. కొందరు చేస్తున్నవన్నీ తప్పుడు ఆరోపణలే. – శ్రీనివాసరావు, ఎంవీఐ, సత్తుపల్లి -
కూసుమంచి ఏడీఏ సరితకు పదోన్నతి
భద్రాద్రి జిల్లా ఆత్మ డీపీడీగా నియామకం ఖమ్మంవ్యవసాయం/కూసుమంచి: కూసుమంచి వ్యవసాయ డివిజన్ అసిస్టెంట్ డైరెక్టర్ (ఏడీఏ) బి.సరితకు డిప్యూటీ డైరెక్టర్గా పదోన్నతి లభించింది. ఈ మేరకు ఆమెను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆత్మ డిప్యూటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ (డీపీడీ)గా నియమిస్తూ గురువారం రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి ఎం.రఘునందన్రావు ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో శుక్రవారం సరిత విధుల నుంచి రిలీవ్ అయి భద్రాద్రి జిల్లాలో బాధ్యతలు స్వీకరించారు. ఇదే సమయాన ఖమ్మం రైతు శిక్షణ కేంద్రం ఏడీఏ ఎం.సతీశ్కు కూసుమంచి ఏడీఏగా అదనపు బాధ్యతలు అప్పగించారు. కాగా, సరిత సుదీర్ఘకాలం ఖమ్మం జిల్లా వ్యవసాయశాఖ కార్యాలయంలో టెక్నికల్ ఏడీఏ గానే కాక ఇన్చార్జ్ జిల్లా వ్యవసాయాధికారిగా విధులు నిర్వర్తించారు. ఇంజనీరింగ్ విద్యార్థినికి చేయూతఖమ్మంగాంధీచౌక్: వైరా మండలం పుణ్యపురికి చెందిన ఇంజనీరింగ్ విద్యార్థిని చెరుకూరి నివేదిత చదువు కోసం ఖమ్మం లయన్స్ క్లబ్ బాధ్యులు శుక్రవారం రూ.15 వేల ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ కె.జగదీష్బాబు, ఎం.దుర్గానాగేశ్వరరావుతో పాటు కృష్ణమూర్తి, డాక్టర్ బొల్లికొండ శ్రీనివాసరావు, విశ్వేశ్వరరావు, డీపీసీ.రావు, హనుమంతరావు, కృష్ణమూర్తి, వెంకయ్య తదితరులు పాల్గొన్నారు. అలాగే, లయన్స్ క్లబ్ ఆఫ్ ఆధ్వర్యాన ఇంజనీర్ల దినోత్సవంలో భాగంగా సీనియర్ ఇంజనీర్లు వేముల హన్మంతరావు, కొల్లూరి కృష్ణమూర్తిని సన్మానించారు. -
బయట నో స్టాక్.. లోపల స్టాక్
సత్తుపల్లి: ‘ఎరువులకు కొరతలేదు.. ఎమ్మార్పీకి మించి విక్రయిస్తే చర్యలు తీసుకుంటాం.. ఏది కావాలంటే అదే ఇవ్వాలి తప్ప ఇతర ఎరువులను లింక్ పెట్టొద్దు’ అని జిల్లా వ్యవసాయాధికారి డి.పుల్లయ్య సత్తుపల్లిలో తనిఖీ సందర్బంగా డీలర్లను హెచ్చరించి 48 గంటలు కూడా గడవలేదు. కానీ డీలర్లు ఎప్పటిలాగే రైతులను ముప్పతిప్పలు పెడుతున్నారు. యూరియా, పొటాష్ నిల్వ లు ఉన్నా లేవంటూ తిప్పి పంపిస్తుండడంతో ఇక్కట్లు ఎదురవుతున్నాయి. ఈక్రమంలో స్థానిక రైతు మలిరెడ్డి పూర్ణచంద్రారెడ్డి శుక్రవారం ఓ షాప్లో ఆరా తీయగా స్టాక్ లేదని సమాధానం ఇవ్వడంతో అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఏఓ శ్రీనివాసరావు తనిఖీ చేయగా సత్తుపల్లిలోని దేవి ఎంటర్ప్రైజెస్లో 150 బస్తాలు, రైతు ఆగ్రో ఏజెన్సీస్లో తనిఖీ చేయగా, దేవి ఎంటర్ప్రైజెస్లో 48 బస్తాలు ఎంఓపీ నిల్వలు బయటపడడం గమనార్హం. ధరలు పెరుగుతాయని.. యూరియా, ఎంఓపీ(మ్యూరేట్ ఆఫ్ పొటాష్)కు రైతుల నుంచి డిమాండ్ ఉంది. యూరియా, ఎంఓపీ ధరలను త్వరలోనే పెంచనున్నట్లు తెలిసింది. ఇదే అదునుగా డీలర్లు ఉన్న స్టాక్ను బ్లాక్ చేస్తున్నారని సమాచారం. అంతేకాక కొందరు డీలర్లు కాంప్లెక్స్ ఎరువు తీసుకుంటేనే యూరియా ఇస్తామని చెపుతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ మేరకు సత్పుల్లి ఏఓ శ్రీనివాసరావు మాట్లాడుతూ వ్యవసాయ శాఖ లెక్కల ప్రకారం స్టాక్ ఉన్న మేర ఎరువులు విక్రయించాలని సూచించారు. ధర పెంచినా, ఇతర ఎరువులతో లింక్ చేసినా చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
రాజ్యాంగం రద్దుకు ఆర్ఎస్ఎస్, బీజేపీ కుట్రలు
ఖమ్మంమయూరిసెంటర్: భారత రాజ్యాంగానికి మూలస్తంభాలుగా నిలుస్తున్న సెక్యులరిజం, సోషలిజం పదాలను తొలగించాలని ఆర్ఎస్ఎస్ నేత దత్తాత్రేయ వ్యాఖ్యానించడం దేశ ప్రజలందరినీ అవమానించినట్లేనని కేవీపీఎస్ రాష్ట్ర కార్యదర్శి టి.స్కైలాబ్బాబు పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలతో రాజ్యాంగం రద్దుకు ఆర్ఎస్ఎస్, బీజేపీ కుట్ర చేస్తున్నాయనే అనుమానాలు మరింత బలపడుతున్నాయని తెలిపారు. ఖమ్మంలో శుక్రవారం నిర్వహించిన సంఘం ఉమ్మడి జిల్లా స్థాయి శిక్షణా తరగతుల్లో ఆయన మాట్లాడారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దళితులపై దౌర్జన్యాలు, దాడులు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థను లేకుండా చేసి మత రాజ్యాంగం అమల్లోకి తీసుకురావాలని పాలకులు కుట్ర పన్నారని ఆరోపించారు. గోరక్షక దళాలు రాజ్యాంగేతర శక్తులుగా వ్యవహరిస్తూ చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటున్నాయని ఆయన పేర్కొన్నారు. అనంతరం ఆర్థిక దోపిడీ మూలాలు అంశంపై బండారు రమేష్ మాట్లాడగా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు నందిపాటి మనోహర్, జిల్లా ఉపాధ్యక్షులు మాచర్ల భారతితో పాటు బండి రమేష్, పాపిట్ల సత్యనారాయణ, కొమ్ము శ్రీను, కర్లకుంట నరేష్, మాచర్ల గోపాల్, ఎస్.కే.సైదులు, నోముల పుల్లయ్య, కె.సర్వేశ్వరరావు, నందిపాటి రమేష్, మన్నెం మోహన్రావు పాల్గొన్నారు. కేవీపీఎస్ రాష్ట్ర కార్యదర్శి స్కైలాబ్బాబు -
కాంగిరేస్లో ఎవరెవరో?!
జనాభా ప్రకారం పదవులు కేటాయించాలి ఖమ్మంమయూరిసెంటర్: జనాభా దామాషా ప్రకారం నామినేటెడ్ పదవులతో పాటు పార్టీ పదవుల్లో మాదిగలకు అవకాశం కల్పించాలని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ పిడమర్తి రవి, కాంగ్రెస్ నాయకుడు వక్కలగడ్డ సోమచంద్రశేఖర్ కోరారు. ఖమ్మంలో శుక్రవారం వారు ఏఐసీసీ సెక్రటరీ చల్లా వంశీచంద్రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఎస్సీ వర్గీకరణ అమలైన సందర్భంగా పార్టీ, నామినేటెడ్ జిల్లా, రాష్ట్ర స్థాయి పదవుల్లో మూడింట రెండు వంతులు మాదిగలకు అవకాశం కల్పించడం ద్వారా గత 40ఏళ్లుగా జరుగుతున్న అన్యాయాన్ని సరిచేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ అంశాన్ని పార్టీ అధి ష్టానం, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని వంశీచంద్రెడ్డి బదులిచ్చారు.ఏడేళ్ల తర్వాత.. ఏడేళ్ల తర్వాత ఉమ్మడి జిల్లాలో సంస్థాగతంగా పదవుల భర్తీపై కాంగ్రెస్ పార్టీ దృష్టి పెట్టింది. చివరిగా 2018లో మండల కాంగ్రెస్ అధ్యక్షులు, కమిటీలను నియమించారు. ఆ తర్వాత కొందరు మండల అధ్యక్షులు పార్టీ మారగా.. ఇంకొందరు స్తబ్దుగా ఉంటున్నారు. ఇలాంటి స్థానాల్లో ఇన్చార్జిలను మాత్రమే నియమించారు. చాలాచోట్ల గ్రామ, బూత్ స్థాయి కమిటీల పరిస్థితి కూడా అలాగే ఉంది. దీంతో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేలా కమిటీల భర్తీకి ఉపక్రమించారు. కసరత్తు షురూ.. స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా సంస్థాగత పదవుల భర్తీ ప్రక్రియను కాంగ్రెస్ ప్రారంభించింది. ఇందుకోసం ఏఐసీసీ సెక్రటరీ, మాజీ ఎమ్మెల్యే చల్లా వంశీచంద్రెడ్డిని ఉమ్మడి జిల్లా ఇన్చార్జిగా నియమించారు. ఆయన రెండు రోజులుగా మండల అధ్యక్షులు, జిల్లా కమిటీ సభ్యుల నియామకానికి ప్రతిపాదనలు స్వీకరిస్తున్నారు. మండల పార్టీ అధ్యక్షుల కోసం ఇద్దరికి తగ్గకుండా పేర్లు స్వీకరిస్తున్నారు. ఆ మండల నేతల నుంచి పేర్లు సేకరిస్తూనే, వ్యక్తిగతంగా ఇచ్చే వారి దరఖాస్తులు కూడా తీసుకుంటున్నారు. అలాగే రాష్ట్రస్థాయి కార్పొరేషన్, ప్రభుత్వ బోర్డుల డైరెక్టర్లు, సభ్యుల నియామకానికి నియోజకవర్గానికి ఇద్దరి పేర్లు సేకరిస్తున్నారు. 15లోగా మండల, జిల్లా కమిటీల ప్రతిపాదనలు అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థుల విజయానికి పాటుపడిన పార్టీ కార్యకర్తలు, నాయకులకు గుర్తింపు ఇచ్చేలా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తోంది. ఇందుకోసం పార్టీ కమిటీల్లో చోటు కల్పించేందుకు జిల్లా ఇన్చార్జి వంశీచంద్రెడ్డి ప్రతిపాదనలు స్వీకరిస్తున్నారు. శనివారంలోగా రాష్ట్రస్థాయి నామినేటెడ్ పదవులకు పేర్లను టీపీసీసీ అధ్యక్షుడికి పంపిస్తారు. అలాగే, 15లోగా మండల కాంగ్రెస్, జిల్లా కమిటీ సభ్యుల నియామకాలకు సేకరించిన పేర్లు అందజేయనున్నారు. కాగా, జిల్లా కమిటీ, నామినేటెడ్ పోస్టులకు సంబంధించిన ఆశావహుల వివరాలపై శుక్రవారం ఖమ్మం, భద్రాద్రి డీసీసీ అధ్యక్షులు, నేతలు పోట్ల నాగేశ్వరరావు, శ్రవణ్కుమార్రెడ్డి, ఎమ్మెల్యేలు, పార్లమెంట్ ఇన్చార్జిలతో వంశీచంద్ సమావేశమయ్యారు. అలాగే ఖమ్మం నగర కమిటీపైనా చర్చించారు. అయితే, డీసీసీ అధ్యక్షుడి నియామకానికి మరింత సమయం పట్టనుంది. అంతటా హడావుడి సుదీర్ఘకాలం తర్వాత కమిటీల నియామకం జరుగుతుండడంతో పార్టీ శ్రేణుల్లో హడావుడి మొదలైంది. కొన్నేళ్లుగా కాంగ్రెస్నే అంటి పెట్టుకుని ఉన్న వారు పదవుల కోసం నేతలను అభ్యర్థిస్తున్నారు. ఓవైపు మండల, జిల్లా కమిటీలు, మరోవైపు రాష్ట్రస్థాయి కార్పొరేషన్ల నియామకాలతో ఏదో ఓ పదవి వరి స్తుందని ఆశావహులు భావిస్తున్నారు. ఈమేరకు కొందరు తమ నేతల ద్వారా ప్రయత్నాలు చేస్తుండగా.. మరికొందరు నేరుగా ఇన్చార్జిల వద్దకు వెళ్లి తమ కష్టాన్ని వివరిస్తూ పాల్గొన్న కార్యక్రమాల ఫొటోలు, పత్రికల క్లిపింగ్లు అందిస్తున్నారు. ‘స్థానిక’ ఎన్నికల నేపథ్యాన అధికార పార్టీలో పదవుల పందేరం బూత్ స్థాయి నుంచి పార్టీ బలోపేతంపై నజర్ మండల, జిల్లా కమిటీల నియామకంపై కసరత్తు రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పదవుల భర్తీకీ ప్రతిపాదనలు కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా పటిష్టం చేసేందుకు అధిష్టానం చర్యలు చేపట్టింది. ఈనేపథ్యాన ఉమ్మడి జిల్లాలో బూత్ స్థాయి నుంచి డీసీసీ వరకు పదవుల భర్తీకి కసరత్తు మొదలుపెట్టారు. అలాగే, రాష్ట్రస్థాయి కార్పొరేషన్ల డైరెక్టర్లు, సభ్యుల నియామకానికి ప్రతిపాదనలు స్వీకరిస్తున్నారు. త్వరలోనే గ్రామపంచాయతీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరగనున్న నేపథ్యాన అన్ని స్థాయిల్లో పటిష్టమైన నిర్మాణం ఉండాలనే ఉద్దేశంతో నియామకాలకు శ్రీకారం చుట్టారు. – సాక్షిప్రతినిధి, ఖమ్మంవర్గాల వారీగా పోటీ.. మండల పార్టీ అధ్యక్షులుగా, డీసీసీ కమిటీలో స్థానంతో పాటు రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పోస్టుల కోసం ముఖ్య నేతల అనుచరులు వర్గాల వారీగా పోటీ పడుతున్నారు. ఉమ్మడి జిల్లాలోని పలు మండలాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. పదవులు దక్కించుకుని సత్తా చాటాలనుకునే నేతలు ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు. మండల అధ్యక్ష పదవి దక్కాలంటే మూడేళ్లు నిర్విరామంగా పార్టీలో పనిచేయాలనే నిబంధన పెట్టారు. అయితే ఎన్నికల ముందు, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఉమ్మడి జిల్లాలోని పలువురు ముఖ్యనేతలు, వారి అనుచరులు.. హస్తం గూటికి చేరారు. ఇలా కాంగ్రెస్లో చేరిన ముఖ్య నేతల అనుచరులు కూడా పదవులపై ఆశలు పెట్టుకున్నారు. కానీ అధిష్టానం నిబంధనతో ఎవరికి పదవులు దక్కుతాయన్న చర్చ మొదలైంది. -
యూటీ వద్ద హైరానా..
కూసుమంచి: మండలంలోని పాలేరు రిజర్వాయర్ సమీపాన ఔట్ఫాల్ కెనాల్(ఎడమ కాల్వ) యూటీ గత ఏడాది వరదలతో కొట్టుకుపోగా కొత్త నిర్మాణం చేపడుతున్నారు. ఈమేరకు కాల్వను అడ్డంగా తవ్వి రెండు వైపులా మట్టితో కట్టలు వేసి పనులు చేపట్టారు. అయితే, పాలేరు రిజర్వాయర్కు సాగర్ జలాలు చేరుతుండడంతో నీటి మట్టం పెరిగి ఔట్ఫాల్ కెనాల్ గేట్ల నుండి నీరు లీకేజీ అయి కాల్వలోకి చేరుతోంది. ఈమేరకు యూటీ వద్ద వేసిన అడ్డుకట్ట వరకు నిండడం, శుక్రవారం ఉదయానికి కాల్వ తెగిపోయే పరిస్థితి ఎదురుకావడంతో అధికారులు ఆందోళనకు గురయ్యారు. కాగా, యూటీ వద్ద కాల్వ అడుగు భాగం వరకు స్లాబ్ పూర్తయినందున అక్కడి నుంచి నీటిని మళ్లించేలా ఇరువైపులా మట్టి కట్టలు పోసి రోలింగ్ చేయించడమే కాక మట్టి కొట్టుకుపోకుండా పాలిథిన్ షీట్లు వేయించారు. ఎస్ఈ మంగళంపూడి వెంకటేశ్వరరావు పర్యవేక్షణలో ఉదయం నుంచి సాయంత్రం పనులు జరిగాయి. అయితే, ఔట్ఫాల్ కెనాల్ గేట్ల వద్ద లీకేజీల మరమ్మతులపై దృష్టి సారించకపోవడంతో ఈ పరిస్థితి ఎదురైందని తెలుస్తోంది. సాగర్ నుండి నిలిచిన నీటి సరఫరా తాగునీటి అవసరాల నిమిత్తం సాగర్ ప్రాజెక్టు నుంచి పాలేరు రిజర్వాయర్కు గత ఆదివారం నుండి నీరు విడుదల చేస్తున్నారు. దీంతో శుక్రవారం సాయంత్రానికి రిజర్వాయర్ 19.40 అడుగులకు చేరింది. అయితే, గురువారం రాత్రి సాగర్ నుండి నీటి సరఫరా నిలిపివేసినా కాలువలో 1,500 క్యూసెక్కుల మేర నీరు ఉండడంతో అది చేరితే రిజర్వాయర్ శనివారం 20 అడుగులకు చేరనుంది. పాలేరు రిజర్వాయర్ ఔట్ఫాల్ గేట్ల లీకేజీతో కాల్వలోకి నీరు యుద్ధప్రాతిపదికన కట్టలు వేసి మళ్లింపు -
విద్యాప్రమాణాలు పెంచడమే లక్ష్యం
● 15 నాటికి యూనిఫామ్, పుస్తకాల పంపిణీ పూర్తి ● విద్యాశాఖ సమీక్షలో కలెక్టర్ అనుదీప్ ఖమ్మం సహకారనగర్: జిల్లాలో ప్రతీ విద్యార్థి విద్యా ప్రమాణాలు పెంచడమే లక్ష్యంగా విద్యాశాఖ పని తీరు ఉండాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. కలెక్టరేట్లో శుక్రవారం అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజతో కలిసి విద్యాశాఖపై ఆయన సమీ క్షించారు. ప్రభుత్వం విద్యాశాఖకు పెద్దమొత్తంలో నిధులు కేటాయిస్తున్నందున సదుపాయాల కల్పన, ఫలితాల సాధనలో పురోగతి కనిపించాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఈనెల 15నాటి కి రెండేసి జతల యూనిఫామ్, పాఠ్య పుస్తకాల పంపిణీ పూర్తి చేయాలని సూచించారు. తనిఖీ సమయాన ఎక్కడైనా విద్యార్థులు యూనిఫామ్తో లేకపోతే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపా రు. అలాగే, విద్యార్థులకు బర్త్ సర్టిఫికేట్, ఆధార్ కార్డులో మార్పుల కోసం ఈనెల 18నుంచి మండల స్థాయిలో క్యాంపులు నిర్వహించాలని సూచించారు. అలాగే, విద్యార్థుల హాజరు, పాఠశాలలు, భవిత సెంటర్లలో వసతుల కల్పన, బిల్లుల చెల్లింపు, విద్యా ప్రమాణాల పెంపునకు తీసుకోవాల్సిన చర్యలపై కలెక్టర్ సూచనలు చేశారు. ఈసమావేశంలో డీఈఓ ఎస్.సత్యనారాయణ, సీఎంఓ రాజశేఖర్, ఆర్ అండ్ బీ ఈఈ పవార్ తదితరులు పాల్గొన్నారు. 67మందికి డబుల్ బెడ్రూం ఇళ్ల కేటాయింపు ఖమ్మంగాంధీచౌక్: డబుల్ బెడ్రూం ఇళ్ల కేటాయింపు పారదర్శకంగా పూర్తిచేశామని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. సత్తుపల్లి నియోజకవర్గంలోని యాతాలకుంట, రేజర్ల, పినపాక గ్రామాల్లో నిర్మాణం పూర్తయిన డబుల్ బెడ్రూం ఇళ్ల కేటాయింపు ప్రక్రియను కలెక్టరేట్లో చేపట్టారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కంప్యూటర్ ద్వారా ర్యాండమైజేషన్ పద్ధతిలో లబ్ధిదారులకు 67ఇళ్లను కేటాయించామని తెలిపారు. దరఖాస్తుదారుల నుంచి యాతాలకుంటలో 40, రేజర్లలో 20, పినపాకలో ఏడుగురిని ఎంపిక చేసినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు లబ్ధిదారులు మాట్లాడుతూ ఏళ్లుగా ఎదురుచూస్తున్న సొంతింటి నెరవేరడంపై సంతోషం వ్యక్తం చేస్తూ కలెక్టర్కు కృతజ్ఞతలు తెలిపారు. కల్లూరు ఆర్డీఓ ఎల్.రాజేందర్గౌడ్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ●ఖమ్మంక్రైం: ఉమ్మడి జిల్లా ప్రాంతీయ ఇంటెలిజెన్స్ అధికారి రామోజీ రమేష్ శుక్రవారం కలెక్టర్ అనుదీప్ను మర్మాదపూర్వకంగా కలిశారు. ఇంటెలెజెన్స్ డీఎస్పీ వెంకన్నబాబు, సీఐలు శ్రీనివాసరావు, వై.వీ.ప్రసాద్, ఎస్ఐ హరిసింగ్, ఉద్యోగులు శ్రీని వాసరావు, విజయ్ పాల్గొన్నారు. -
కాంగ్రెస్ పార్టీ.. బీసీల పక్షపాతి
ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్రెడ్డి, పువ్వాళ్లఖమ్మంమయూరిసెంటర్: దేశంలోనే తొలిసారి తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ప్రకటించడం ద్వారా కాంగ్రెస్ పార్టీ బీసీల పక్షపాతిగా నిలిచిందని ఏఐసీసీ కార్యదర్శి, కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణాల ఉమ్మడి జిల్లా ఇన్చార్జి వంశీచంద్రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్ అన్నారు. రిజర్వేషన్ అమలుకు ఆర్డినెన్స్ తీసుకొచ్చిన నేపథ్యాన శుక్రవారం ఖమ్మంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో కాంగ్రెస్ ఓబీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు పుచ్చకాయల వీరభద్రం ఆధ్వర్యాన సంబురాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశాక వంశీచంద్రెడ్డి, దుర్గాప్రసాద్ మాట్లాడారు. త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు ప్రాధాన్యత కల్పించాలని లక్ష్యంతో మంత్రివర్గ సమావేశంలో 42 శాతం అమలుకు నిర్ణయించినట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడుతోందని చెప్పడానికి ఇదే నిదర్శనమని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నగర అధ్యక్షుడు మహ్మద్ జావేద్, కార్పొరేటర్ రాపర్తి శరత్, మాజీ ఎమ్మెల్సీలు పోట్ల నాగేశ్వరరావు, బాలసాని లక్ష్మీనారాయణ, నాయకులు సాధు రమేష్రెడ్డి, హారికనాయడు, గజ్జెల్లి వెంకన్న తదితరులు పాల్గొన్నారు. -
సేంద్రియ ఉత్పత్తులతో ఆరోగ్యకరం
● వ్యవసాయంలో రసాయన ఎరువుల వాడకం తగ్గించాలి ● సేంద్రియ మార్కెట్ను ప్రారంభించిన మంత్రి తుమ్మలఖమ్మంవ్యవసాయం: సేంద్రియ ఉత్పత్తుల వినియోగంతో ఆరోగ్యం సొంతమవుతుందని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, చేనేత, జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఖమ్మం వీడీవోస్ కాలనీలోని సమీకృత రైతు మార్కెట్లో ఏర్పాటు చేసిన సేంద్రియ మార్కెట్ను శుక్రవారం ఆయన ప్రారంభించారు. రాష్ట్రంలో తొలి సేంద్రియ మార్కెట్ ఇదే కాగా, కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ రసాయనాలు, పురుగుమందుల స్థానంలో సహజ వనరులను ఉపయోగించి పండించే ఆహార ఉత్పత్తులను అందరికీ అంబాబాటులోకి తీసుకొచ్చేలా మార్కెట్ ఏర్పాటు చేశామన్నారు. పంటల సాగులో రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గిస్తే ప్రజలకు సేంద్రియ ఉత్పత్తులు లభిస్తాయని తెలిపారు. దేశంలోనే అత్యధికంగా ఎరువులు, పురుగు మందులు తెలంగాణలోనే వినియోగిస్తున్నట్లు కేంద్రప్రభుత్వం గుర్తించినందున రైతులు వినియోగాన్ని తగ్గించేలా అధికారులు అవగాహన కల్పించాలని మంత్రి సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, మేయర్ పునుకొల్లు నీరజ, అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ, ఖమ్మం మార్కెట్ చైర్మన్ యరగర్ల హనుమంతరావు, జిల్లా ఉద్యాన శాఖ అధికారి ఎం.వీ.మధుసూదన్, జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి ఎం.ఏ.అలీం, కేఎంసీ ఈఈ కృష్ణలాల్, తహసీల్దార్ సైదులుతో పాటు బాలసాని లక్ష్మీనారాయణ, నల్ల మల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ●ఖమ్మం అర్బన్: ఖమ్మం 55వ డివిజన్లో పలు అభివృద్ధి పనులకు మంత్రి తుమ్మల శంకుస్థాపన చేశారు. పనులు వేగంగా జరిగేలా పర్యవేక్షిస్తూ నాణ్యత తగ్గకుండా చూడాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ●ఖమ్మంమయూరిసెంటర్: ఏఐసీసీ కార్యదర్శి, ఉమ్మడి జిల్లా పార్టీ ఇన్చార్జి చల్ల వంశీచందర్రెడ్డిని రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శుక్రవారం కాంగ్రెస్ జిల్లా కార్యాలయంలో కలిశారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, వైరా ఎమ్మెల్యే రాందాస్నాయక్ పాల్గొన్నారు. -
ఇద్దరు తప్పనిసరి..
ప్రస్తుత పరిస్థితుల్లో ఇద్దరు పిల్లలు ఉండడం మంచిది. తద్వారా ఒకరికి ఒకరు తోడు నిలిస్తే ధైర్యం, భరోసాగా ఉంటుంది. ఇప్పటి ఖర్చులను బేరీజు వేసుకుంటే ఇద్దరిని పోషించడం కష్టమే. అయినా మంచీ, చెడుల్లో సహకరించుకోవడానికి అవకాశం ఉంటుంది. – ఎన్.శ్రీనివాస్ – మౌనిక, ఖమ్మం ఇద్దరైతేనే తోడూనీడ ప్రస్తుత పరిస్థితుల్లో ఇద్దరు పిల్లలు ఉండాల్సిందే. తద్వారా వారే ఒకరికొకరు తోడుగా ఉంటారు. ఒంటరి వారమనే భావన రాదు. కానీ ప్రసుత్త తరుణం విద్య, వైద్యానికి పెరుగుతున్న ఖర్చులతో చాలా మంది ఒక సంతానానికే పరిమితం అవుతున్నారు. – సుధీర్ – శ్రీలత, ఖమ్మం -
ఇంతింతై.. వటుడింతై...
● నానాటికీ పెరుగుతున్న ఉమ్మడి జిల్లా జనాభా ● 2011 నాటికి 27.97 లక్షలుగా నమోదు ● ఇప్పుడు లెక్కిస్తే మరింత పెరిగే అవకాశం సాక్షిప్రతినిధి, ఖమ్మం: ఉమ్మడి జిల్లాలో కొన్ని దశాబ్దాలుగా జనాభా పెరుగుదల నమోదవుతోంది. 1951 నుంచి గణాంకాలను పరిశీలిస్తే మొదట పదేళ్లలో 30.88 శాతం పెరగ్గా.. 1971లో 29.54శాతానికి పెరగడం గమనార్హం. 2001లో 16.39 శాతం పెరుగుదల ఉండగా, 2011లో 8.47శాతమే నమోదైంది. అయినప్పటికీ ఏ దశాబ్దంలోనూ జనాభా పెరుగుదలకు బ్రేక్ పడలేదు. 1951లో ఉమ్మడి జిల్లా జనాభా 8,08,002 మంది ఉండగా చివరగా జనగణన జరిగిన 2011లో 27,97,370కి చేరింది. షెడ్యూల్ ప్రకారం 2021లో జనగణన చేయాల్సి ఉన్నా కరోనాతో చేపట్టలేదు. వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి 2027 వరకు జన గణన షెడ్యూల్ను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. పునర్విభజనతో.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పునర్విభజన సందర్భంగా పోలవరం ప్రాజెక్టు ముంపు మండలాలు ఉన్నాయనే కారణంతో అప్పటి ఉమ్మడి ఖమ్మం, ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఐదు మండలాలు పూర్తిగా, రెండు మండలాలు పాక్షికంగా ఆంధ్రప్రదేశ్లో కలిపారు. ఇందులో కుక్కునూరు, వేలేరుపాడు, చింతూరు, కూనవరం, వరరామచంద్రాపురం మండలాలతోపాటు బూర్గంపాడులోని 12గ్రామాలు, భద్రాచలం పట్టణం మినహా మిగిలిన గ్రామాలు ఉన్నాయి. ఇక 2016లో చేపట్టిన జిల్లాల పునర్విభజన సందర్భంగా వాజేడు, వెంకటాపురం మండలాలను ములుగు జిల్లాలో, గార్ల, బయ్యారం మండలాలను మహబూబాబాద్ జిల్లాలో కలిపారు. దీంతో జిల్లాల పునర్విభజన నాటికి 2011 జనగణన ప్రకారం ఖమ్మం జిల్లాలో 14,01,639 మంది జనాభా మిగిలారు. ఇందులో పురుషులు 6,99,124 మంది, సీ్త్రలు 7,02,515 మంది ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. కాగా, రాష్ట్ర జననాల సగటులో జిల్లా తొమ్మిదో స్థానంలో ఉండగా, రోజుకు సగటున జిల్లాలో పది జననాలు నమోదవుతున్నాయి.ఉమ్మడి జిల్లా జనాభా వివరాలు.. ఏడాది జనాభా 1951 8,08,002 1961 10,57,542 1971 13,69,892 1981 17,51,574 1991 22,15,809 2001 25,78,927 2011 27,97,370 -
సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎంపీ
ఖమ్మంమయూరిసెంటర్: అనారోగ్య కారణాలతో ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకున్న వారికి తన సిఫారసుతో మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎంపీ వద్దిరాజు రవిచంద్ర గురువారం అందజేశారు. ఖమ్మం బుర్హాన్పురంలోని క్యాంప్ కార్యాలయంలో ఆయన 13 మందికి చెక్కులు అందజేసి మాట్లాడారు. కార్పొరేటర్లు శీలంశెట్టి వీరభద్రం, తోట రామారావు, బీఆర్ఎస్ నాయకులు ఉప్పల వెంకటరమణ, పగడాల నరేందర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. చోరీ కేసుల్లో నిందితుడి అరెస్ట్ ఖమ్మంక్రైం: పలు చోరీ కేసుల్లో నిందితుడైన ఖమ్మం రేవతిసెంటర్కు చెందిన దోన్వాన్ ప్రేమ్కుమార్ను ఖమ్మం టూటౌన్ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. గత కొన్నేళ్లుగా చోరీలకు పాల్పడుతున్న ఆయన జైలుకు వెళ్లివచ్చాడు. అయినా తీరు మార్చుకోక ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరిలో ఖమ్మం మామిళ్లగూడెం, ద్వారకానగర్, వరదయ్యనగర్లోని ఇళ్లలోనే కాక వెంకటేశ్వరస్వామి గుడిలో చోరీ చేశాడు. అలాగే, ఏప్రిల్లో పటేల్ స్టేడియం వద్ద ఓ వ్యక్తి నుంచి రెండు బంగారు ఉంగరాలను దొంగిలించాడు. ఈమేరకు నిందితుడిని అరెస్ట్ చేసి రూ.7.50లక్షల విలువైన 155 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నామని సీఐ బాలకృష్ణ తెలిపారు. డివైడర్ను ఢీకొని యువకుడు మృతి ఖమ్మంరూరల్: మండలంలోని మద్దులపల్లి వద్ద ఖమ్మం – సూర్యాపేట రహదారిపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో అంబోజి నవదేవ్(23) మృతి చెందాడు. ఏపీలోని జగ్గయ్యపేట మండలం మల్కాపురానికి చెందిన నవదేవ్, ముదిగొండ మండలం గోకినపల్లికి చెందిన నరేందర్ బైక్పై గురువారం కూసుమంచి వైపు నుండి ఖమ్మం వస్తున్నారు. మార్గమధ్యలో మద్దులపల్లి మూలమలుపు వద్ద ద్విచక్రవాహనం అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో నవదేవ్ మృతి చెందగా, నరేష్కు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో నవదేవ్ మృతదేహాన్ని అన్నం ఫౌండేషన్ చైర్మన్ శ్రీనివాసరావు సహకారంతో ప్రభుత్వాస్పత్రి మార్చురీకి తరలించారు. నిందితుడి కోసం పోలీసుల గాలింపునేలకొండపల్లి: అత్యాచారం కేసులో నిందితుడి కోసం భద్రాద్రి జిల్లా గుండాల పోలీసులు గాలిస్తున్నారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం రాజేశ్వరపురానికి చెందిన కుంభం వీరబాబు 2019లో గుండాల పోలీస్స్టేషన్ పరిధిలో ఓ మహిళపై అత్యాచారం చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు కాగా, కోర్టు వాయిదాలకు హాజరుకావడం లేదు. దీంతో గురువారం గుండాల సీఐ ఎల్.రవీందర్, సిబ్బంది రాజేశ్వపురం వచ్చి ఆయన ఆచూకీ కోసం ఆరా తీశారు. ఆగస్టు 13లోగా న్యాయస్థానంలో హాజరయ్యేలా చూడాలని బంధువులకు సూచించారు. కాగా, వీరబాబు ఆచూకీ తెలిసిన వారు 87126 82082, 87126 82084 నంబర్లకు సమాచారం ఇవ్వాలని సీఐ రవీందర్ కోరారు. -
చాలా సంతోషంగా ఉన్నాం
నేలకొండపల్లికి చెందిన పసుమర్తి శ్రీనివాస్–లావణ్య దంపతులు ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో సంతానం ఒక్కరు చాలని నిర్ణయించుకున్నారు. వీరికి కుమారుడు శ్రీ లలిత్ సౌరి ఉన్నాడు. ప్రస్తుతం పెరుగుతున్న ధరలు, పిల్లలకు కనీస అవసరాలు తీర్చడం కోసం అధిక మొత్తాలను వెచ్చించాల్సి రావడం వంటి సమస్యలను గుర్తించి ఒక్కరు చాలనకున్నామని, ఒక్క బాబుతో సంతోషంగా జీవనం సాగిస్తున్నామని ఆ దంపతులు తెలిపారు. ఇదే మాదిరి ఆర్థిక భారం పెరగడంతో చాలా మంది దంపతులు ఒకరి కంటే ఎక్కువ మంది పిల్లల్ని కనడంపై ఆసక్తి చూపించడం లేదు. విద్య, వైద్యం, ఆహారం, బట్టలు తదితర అవసరాల కోసం భారీగా ఖర్చు పెరుగుతుంది. తక్కువ ఆదాయం ఉన్న కుటుంబాలలో ఇదో పెద్ద సమస్యగా మారుతోంది. దీంతో పాపైనా, బాబైనా ఒక్కరితోనే సరిపెట్టుకుంటున్నారు. నా కష్టం పిల్లలు పడకూడదని.. మాది పెద్ద కుటుంబం. ఎనిమిది మంది సభ్యులం. ఇంత మందిని పోషించడం అమ్మనాన్నలకు ఇబ్బందిగా ఉండేది. చాలా రోజులు ఆహారం లేక ఉపవాసంతోనే నిద్రించేవాళ్లం. ఆ పరిస్థితి నా పిల్లలకు ఎదురవ్వొద్దని నా చిన్నతనంలోనే నిర్ణయించుకున్నా. నాకు రామనాథంతో పెళ్లయ్యాక భర్తను ఒప్పించి కొడుకై నా, కూతురైనా ఒక్కరే చాలనుకున్నాం. కుమార్తె జన్మించింది. ఉన్న కొద్దిపాటి భూమిని సాగు చేసుకుంటూ, రెక్కల కష్టంతో కుమార్తెను సుఖంగా పోషించుకుంటున్నాం. ఆమెను ప్రయోజకురాలిని చేయాలన్నదే మా లక్ష్యం. – చింత భారతి – రామనాధం, కుంజవారిగూడెం, ఇల్లెందు మండలం● -
సాక్షి వద్దకే న్యాయాధికారి
ఖమ్మం లీగల్: ఖమ్మం సంచార ప్రత్యేక న్యాయస్థానం న్యాయాధికారి బి.నాగలక్ష్మి గురువారం ఓ కేసు విచారణ సందర్భంగా సాక్షి దివ్యాంగుడు కావడంతో ఆయన ఉన్న ఆటో వద్దకే వెళ్లి వాంగ్మూలం నమోదు చేశారు. జిల్లాలోని సింగరేణి ఎకై ్సజ్ స్టేషన్ పరిధిలో నమోదైన కేసులో లావుడియా సురేష్ సాక్షిగా ఉన్నాడు. ఆయన దివ్యాంగుడు కావడంతో ఆటోలో తీసుకొచ్చినా కిందకు దింపడం కష్టమైంది. దీంతో వాహనం వద్దకే వెళ్లిన న్యాయాధికారి వాంగ్మూలాన్ని నమోదు చేశారు. వైరా రిజర్వాయర్ నుంచి నీటి విడుదల వైరా: వైరా రిజర్వాయర్ కింద వరి సాగు చేయనున్న రైతుల కోసం కుడి, ఎడమ కాల్వల ద్వారా అధికారులు గురువారం నీటిని విడుదల చేశారు. రిజర్వాయర్లో ప్రస్తుతం 17అడుగుల మేర నీరు ఉండడమే కాక 70 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోంది. దీంతో కాల్వల ద్వారా రోజుకు 50 క్యూసెక్కుల చొప్పున నీటి విడుదలకు నిర్ణయించారు. వరి సాగు చేయనున్న రైతులు నార్లు పోస్తుండడంతో వారు ఇబ్బంది పడకుండా వారం పాటు అనధికారికంగా నీరు విడుదల చేస్తున్నారు. ఆగస్టులోగా కోడిగుడ్ల సరఫరా టెండర్లు ఖమ్మంమయూరిసెంటర్: జిల్లాలోని సంక్షేమ హాస్టళ్లు(రెసిడెన్షియల్ పాఠశాలలు), అంగన్వాడీ కేంద్రాలకు అవసరమైన కోడిగుడ్ల సరఫరా కోసం ఆగస్టు మొదటి వారంలోగా టెండర్లు ఖరారు చేయాలని అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ సూచించారు. కలెక్టరేట్లో గురువారం ఆమె మరో అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డితో కలిసి పలు అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా శ్రీజ మాట్లాడుతూ హాస్టళ్లు, కేజీబీవీ లు, అంగన్వాడీ కేంద్రాలు, ఇతర విద్యాసంస్థలకు జిల్లా స్థాయి కమిటీ ఆధ్వర్యంలోనే అవసరమైన కోడిగుడ్లు కొనుగోలు చేయాల్సి ఉంటుందన్నారు. అలాగే, శిథిలావస్థ భవనాల్లో కొనసాగుతున్న హాస్టళ్లు, అంగన్వాడీ కేంద్రాలను ఇంకో చోట మార్చాలని సూచించిన ఆమె హాస్టళ్ల మెనూ అమలుపై తనిఖీ చేయాలని తెలిపారు. ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులు కస్తాల సత్యనారాయణ, ఎన్.విజయలక్ష్మి, డాక్టర్ పురందర్, నర్సయ్య, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. మిల్లర్లు సీఎంఆర్ సకాలంలో అప్పగించాలి ఖమ్మం సహకారనగర్: జిల్లాలోని మిల్లర్లు సీఎంఆర్(కస్టమ్ మిల్లింగ్ రైస్)ను సకాలంలో అప్పగించాలని అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి సూచించారు. కలెక్టరేట్లో గురువారం రైస్మిల్లర్లతో సమావేశమయ్యారు. గత ఖరీఫ్ సీజన్కు సంబంధించి పెండింగ్ ఉన్న బియ్యం అప్పగించడమే కాక ఈ ఏడాది యాసంగి సీఎంఆర్ అందజేయడం మొదలుపెట్టాలని తెలిపారు. ఈసమావేశంలో జిల్లా పౌర సరఫరాల శాఖ డీసీఎస్ఓ చందన్కుమార్, జిల్లా పౌర సరఫరాల సంస్థ మేనేజర్ శ్రీలత, మిల్లర్ల అసోసియేషన్ అధ్యక్షుడు బొమ్మ రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. 40రోజుల్లోగా ఇళ్ల నిర్మాణం ప్రారంభించకపోతే రద్దు రఘునాథపాలెం: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో లబ్ధిదారులు వేగం పెంచాలని జెడ్పీ సీఈవో దీక్ష రైనా సూచించారు. మంజూరైన నలభై రోజుల్లోగా నిర్మాణ పనులు ప్రారంభించకపోతే రద్దయ్యే ప్రమాదముందని ఆమె తెలిపారు. రఘునాథపాలెం మండలం చింతగుర్తిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను గురువారం పరిశీలించిన ఆమె మాట్లాడారు. మండలంలో ఇప్పటివరకు 1,303 ఇళ్లు మంజూరు కాగా, లబ్ధిదారులంతా నిర్మాణ పనులు మొదలుపెట్టాలన్నారు. తద్వారా దశల వారీగా బిల్లులు మంజూరవుతాయని తెలిపారు. ఎంపీడీఓ అశోక్కుమార్, హౌసింగ్ ఏఈ పుష్ప, గ్రామ కార్యదర్శి రాంబాబు, మాజీ సర్పంచ్ తమ్మిన నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించాలి బోనకల్: ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు అందగానే లబ్ధిదారులు నిర్మాణాలను ప్రారంభించాలని జిల్లా పంచాయతీ అధికారి ఆశాలత సూచించారు. మండలంలోని కలకోటలో గురువారం ఆమె పలు ఇళ్ల నిర్మాణాలను ప్రారంభించి మాట్లాడారు. నిర్మాణం జరుగుతుంటే దశల వారీగా బిల్లులు మంజూరవుతాయని తెలిపా రు. ఎంపీఓ శాస్త్రి తదితరులు పాల్గొన్నారు. -
శరవేగంగా సింథటిక్ ట్రాక్ నిర్మాణం
ఖమ్మం స్పోర్ట్స్: ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో రూ.8.35 కోట్ల వ్యయంతో అథ్లెటిక్స్ క్రీడాకారుల కోసం నిర్మిస్తున్న సింథటిక్ ట్రాక్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే 400 మీటర్ల ట్రాక్ కోసం మొదటి దశ పనులను పూర్తి చేయగా, కాంక్రీట్ పనులు పదిరోజుల్లో పూర్తికానున్నా యి. అంతేకాక భారీ వర్షం పడినా నీళ్లు నిలవకుండా ట్రాక్ చుట్టూ కాల్వ తీశారు. ఈమేరకు ట్రాక్ పనులను అథ్లెటిక్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి కె.సారంగపాణి గురువారం పరిశీలించి కాంట్రాక్టర్కు సూచనలను చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రస్తుతం మూడు సింథటిక్ ట్రాక్లు అందుబాటులో ఉండగా, ఖమ్మంలో నాలుగో ట్రాక్ సిద్ధమవుతోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీవైఎస్ఓ టి.సునీల్రెడ్డి, కోచ్లు పాల్గొన్నారు. -
ఆర్థిక పరిస్థితుల వల్లే..
● చిన్న కుటుంబాలుగా మారిన సమాజం ● అమ్మ, నాన్న, ఒక్కరిద్దరు పిల్లలతో జీవనం సమాజంలో ఆర్థిక పరిస్థితులు, స్వార్థం, నేను అనే భావన వంటి కారణాలతో ఉమ్మడి కుటుంబాలు కాస్త చిన్న కుటుంబాలుగా మారిపోయాయి. నేడు కుటుంబం అంటే భార్య, భర్త, వారి ఒకరిద్దరు సంతానం మాత్రమే. ఇలాంటి కుటుంబాలు ఆర్థికంగా బలపడినా మానసికంగా మాత్రం బలహీనపడుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇందుకు ఆయా కుటుంబాల పిల్లల మానసిక పరిపక్వత ప్రత్యక్ష నిదర్శనంగా నిలుస్తోంది. చిన్న కుటుంబాల్లో మంచి మాటలు చెప్పే పెద్దలు లేకపోవడంతో పిల్లలు టీవీ, సెల్ఫోన్లకు బానిసలవుతున్నారు. ఇది వారి ఆరోగ్య స్థితిగతులపై కూడా ప్రభావం చూపుతోంది. – నేలకొండపల్లి/ఇల్లెందురూరల్ -
తుది దశకు యూటీ నిర్మాణం
కూసుమంచి: పాలేరు రిజర్వాయర్కు సమీపాన సాగర్ ఎడమ కాల్వ యూటీ(అండర్ టన్నెల్) గత ఏడాది వరదలతో కొట్టుకుపోగా కొత్త యూటీ నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. మరో పది రోజుల్లో పనులు పూర్తిచేస్తే సాగునీటి సరఫరాకు ఇబ్బందులు ఉండవనే భావనతో అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఆగస్టు మొదటి వారంలో పాలేరు రిజర్వాయర్ నుండి ఆయకట్టుకు నీరు విడుదల చేసే అవకాశమున్నందున ఆలోగా పూర్తిచేయాలనే లక్ష్యంతో ఉన్నారు. కాగా, కాల్వకు 1965లో నిర్మించిన యూటీ గత ఏడాది వరదలకు తెగిపోయింది. దీంతో మరోమారు భారీ వరదలను వచ్చినా తట్టుకునేలా నిర్మిస్తున్నట్లు జలనవరుల శాఖ ఎస్ఈ ఎం.వెంకటేశ్వర్లు వివరించారు. ఈమేరకు ఆయన గురువారం పనులను పరిశీలించారు. -
●పాకనాటి కుటుంబం ఉన్నతి
పాకనాటి కుటుంబం ఉమ్మడిగా ఉంటూ ఉన్నత స్థితికి చేరింది. నేలకొండపల్లి మండలం అనంతనగర్కు చెందిన పాకనాటి ముత్తారెడ్డి, ముత్తమ్మ దంపతులకు ఐదుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. మధ్య తరగతి వ్యవసాయ కుటుంబంగా ఉన్న ముత్తారెడ్డి కుమారులను, కుమార్తెలను చదివించారు. పెద్ద కుమారులు ఇద్దరు వ్యవసాయం చేస్తుండగా, చిన్న కుమారులు ముగ్గురు ఉద్యోగాలు చేస్తున్నారు. కుమార్తెలు తాము ఎంచుకున్న వృత్తిలో రాణిస్తున్నారు. ఈ ఏడుగురికి 10 మంది సంతానం కలిగారు. వీరు ఉన్నత చదువులు చదివి స్థానికంగా, అమెరికాలో స్థిర పడ్డారు. కుటుంబంలో శుభకార్యాలు జరిగితే అంతా కలిసి ఆనందంగా గడుపుతారు. కుటుంబం ఐక్యంగా ఉంటూ ఉన్నతంగా నిలుస్తున్నారు. -
సంస్థాగతంగా బలోపేతానికి చర్యలు
సాక్షిప్రతినిధి, ఖమ్మం: కాంగ్రెస్ పార్టీని పోలింగ్ బూత్ నుంచి జాతీయ స్థాయి వరకు బలోపేతం చేయడంపై దృష్టి సారించినట్లు కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణాల ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే చల్లా వంశీచంద్రెడ్డి తెలిపారు. ఖమ్మంలోని డీసీసీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా కాంగ్రెస్ కమిటీల నియామకం కోసం గుజరాత్లో పైలట్ ప్రాజెక్టును అమలుచేయగా స్వయంగా ఏఐసీసీ అగ్రనేత రాహుల్గాంధీ పర్యవేక్షించారని తెలిపారు. అదే మాదిరి తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు తనతోపాటు ఇతర జిల్లాలకు తొమ్మిది మంది ఇన్చార్జిలను నియమించారని చెప్పారు. రాష్ట్రస్థాయిలో ఖాళీగా ఉన్న నామినేటెడ్, ప్రభుత్వ బోర్డుల డైరెక్టర్లు, సభ్యుల నియామకం కోసం ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పార్టీ కోసం కష్టించిన వారిలో ఇద్దరికి తగ్గకుండా పేర్లను ఈనెల 12లోగా ప్రతిపాదిస్తామని తెలిపారు. అంతేకాక జిల్లా కాంగ్రెస్ కమిటీలను సమీక్షించి నూతన కమిటీల ఏర్పాటుకు అర్హులైన వారిని టీపీసీసీకి ప్రతిపాదిస్తామని వెల్లడించారు. జిల్లా, మండల స్థాయి కమిటీల నియామకం తర్వాత గ్రామ కమిటీలతో పాటు పోలింగ్ బూత్ కమిటీలను నియమిస్తామని, ఈ విషయంలో పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ మీటింగ్లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. జిల్లా, మండల కమిటీలో 50 శాతానికి తగ్గకుండా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించనున్నామని, ప్రతీ కమిటీలో 50 శాతానికి తగ్గకుండా 50 ఏళ్ల వయసు లోపువారిని నియమిస్తామని చెప్పారు. కాగా, కాంగ్రెస్ పార్టీలో గ్రూపులు ఉండవని, భిన్నాభిప్రాయాలు మాత్రమే ఉంటాయని, అందరిదీ సోనియాగాంధీ, మల్లికార్జున్ ఖర్గే, రాహుల్గాంధీ గ్రూపు అని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక దేశంలో ఎక్కడా లేనట్టుగా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. అయితే, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కీలక పాత్ర పోషించిన ఉమ్మడి ఖమ్మం జిల్లా నాయకులు, కేడర్కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెబుతున్నామని వెల్లడించారు. ఈ సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయితో పాటు డాక్టర్ శ్రవణ్కుమార్రెడ్డి, నాగా సీతారాములు, మద్ది శ్రీనివాసరెడ్డి, పెసర మహిపాల్రెడ్డి, జావేద్, కట్ల రంగారావు, చకిలం రాజేశ్వరరావు, నాగండ్ల దీపక్చౌదరి, మద్దినేని బేబి స్వర్ణకుమారి, దైదా రవీందర్, కొత్త సీతారాములు, రఫీదాబేగం, ముస్తఫా తదితరులు పాల్గొన్నారు. త్వరలోనే పూర్తిస్థాయిలో కాంగ్రెస్ కమిటీల నియామకం మాజీ ఎమ్మెల్యే వంశీచంద్రెడ్డి -
ఒకరు లేదా ఇద్దరు చాలు!
ఎక్కువ సంతానంతో పోషణ, సంరక్షణ భారమవుతుందా?ఒకరే సంతానంతో పిల్లలకు ఒంటరితనం ఎదురుకాదా?సంతానం ఒకరు చాలా.. అంత కంటే ఎక్కువ ఉండాలా? ●ఒకే సంతానంతో యువజన జనాభా తగ్గనుండడంతో ఎక్కువ మందిని కనాలన్న సూచన మంచిదేనా?అలాంటిదేమీ ఉండదుఅవునుఒకరుకాదుప్రస్తుత జీవన వ్యయంతో సాధ్యం కాదుఅయినా తప్పదుఇద్దరు5374614303921ఆలోచించాల్సిన అంశమేఅంతకు మించితే పోషణ భారమే.. ● ‘సాక్షి’ సర్వేలో జంటల నోట ఇదే మాట ● సంతానం విషయంలో నేటి తరంలో స్పష్టత -
కలిసుంటే.. కలదు సుఖం!
ఉమ్మడి కుటుంబం ఐక్యతకు ప్రతీక.. కష్టసుఖాలను పంచుకునే వేదిక. బంధం, అనుబంధం, ప్రేమానురాగాలతో బృందావనాన్ని తలపిస్తుంది. తాతయ్య, నాయనమ్మ, తల్లిదండ్రులు, బాబాయిలు, చిన్నమ్మలు, మేనత్తలు, మామలు, అన్నయ్యలు, తమ్ముళ్లు, అక్కలు, చెల్లెళ్లు, వదినలు, మరదళ్లు, బావలు, బావమరుదులతో ఆనందంగా జీవిస్తుంటారు. పూర్వకాలం నుంచి దేశంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉన్నప్పటికీ కాలక్రమంలో మార్పులు వచ్చాయి. స్వేచ్ఛ లేదని, ప్రైవసీ కొరవడుతుందనే భావనతో వేరు కుటుంబాలుగా జీవిస్తుండటంతో దాదాపు ఉమ్మడి కుటుంబ వ్యవస్థ అంతరించిపోయే దశకు చేరగా.. ఇంకా ఒకటో, రెండో కుటుంబాలు అక్కడక్కడా ఉమ్మడిగా జీవనం సాగిస్తున్నాయి. ఆ కుటుంబాల గురించి తెలుసుకుందాం. – ఖమ్మంగాంధీచౌక్● ఉమ్మడి కుటుంబాలతోనే జీవన మాధుర్యం ● కష్టసుఖాల్లో ఒకరికి అందరూ.. అందరికీ ఒకరు ● ప్రేమానురాగాలు, వ్యవహారిక జ్ఞానం ద్విగుణీకృతం ●మార్గదర్శకం.. కురువెళ్ల కుటుంబం ఉమ్మడి కుటుంబానికి మార్గదర్శకం కురువెళ్ల కుటుబం అని చెప్పవచ్చు. ఖమ్మం నగరంలో అనాదిగా కురువెళ్ల కుటుంబం వ్యాపార రంగంలో రాణిస్తోంది. కురువెళ్ల వెంకటేశ్వరరావు, మంగతాయారు దంపతులకు ఎనిమిది మంది సంతానం. ఏడుగురు కుమారులు, కూతురు ఉన్నారు. వెంకటేశ్వరరావు 70 ఏళ్ల కిత్రం కమీషన్ మర్చంట్గా వ్యాపారం ప్రారంభించి రాణించారు. కుటుంబాన్ని ఉమ్మడిగా ఉంచటంలో మార్గదర్శకంగా నిలిచారు. కుమారులు, కూతురు వేర్వేరు వ్యాపారాలు చేస్తున్నా అందరూ కలిసే ఉంటున్నారు. ఖమ్మం త్రీటౌన్లో కురువెళ్ల టవర్స్ పేరిట ప్రత్యేకంగా అపార్ట్మెంట్ నిర్మించుకుని నివసిస్తున్నారు. ఈ ఎనిమిది కుటుంబాలకు 16 మంది సంతానం ఉన్నారు. వీరిలో కొందరు విదేశాల్లో కూడా స్థిరపడ్డారు. ఏ శుభకార్యం జరిగినా అందరూ కలిసి అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని కుటుంబీకులు తెలిపారు. -
మరింత మెరుగ్గా వ్యవసాయ విద్యుత్ సరఫరా
ఖమ్మంవ్యవసాయం: వ్యవసాయ అవసరాలకు విద్యుత్ సరఫరాను మెరుగుపర్చాలని ఎన్పీడీసీఎల్ డైరెక్టర్(ఆపరేషన్స్) టి.మధుసూదన్ సూచించారు. ఎన్పీడీసీఎల్ చీఫ్ ఇంజనీర్ రాజుచౌహాన్తో కలిసి ఖమ్మంలో ఆయన గురువారం విద్యుత్ అధికారులు, ఉద్యోగులతో సమావేశమయ్యారు. జిల్లాలో విద్యుత్ సరఫరాపై, పన్నుల వసూళ్లపై చర్చించాక డైరెక్టర్ మాట్లాడుతూ వినియోగదారులకు మెరుగైన, అంతరాయాలు లేని విద్యుత్ సరఫరా చేయాలని సూచించారు. వ్యవసాయ కనెక్షన్ల కోసం వచ్చిన దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించడమే కాక అవసరమైన చోట లైన్లు, ట్రాన్స్ఫార్మర్లు మరమ్మతు చేయాలని తెలిపారు. ఇదే సమయాన విద్యుత్ ఉద్యోగులు విధినిర్వహణలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఖమ్మం ఎస్ఈ ఇనుగుర్తి శ్రీనివాసాచారి, డీఈలు నంబూరి రామారావు, సీహెచ్.నాగేశ్వరరావు, ఎల్.రాములు, శ్రీనివాస్, బద్రుపవార్, ఈ.వెంకటేశ్వర్లు, ఎస్ఏఓ శ్రీధర్, ఏడీఈలు, ఏఏఓలు పాల్గొన్నారు. -
గంజాయి విక్రేతల అరెస్ట్
కల్లూరు: కల్లూరులో గంజాయి విక్రయిస్తున్న ముగ్గురిని అరెస్ట్ చేయగా, నిందితుల నుంచి 822 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కల్లూరు పోలీస్ స్టేషన్లో ఏసీపీ రఘు బుధవారం వివరాలు వెల్లడించారు. కల్లూరు ఎస్సై డి.హరిత మంగళవారం మధ్యాహ్నం తనిఖీలు చేస్తుండగా లక్ష్మీపురం రోడ్డులో ముగ్గురు యువకులు పారిపోయేందుకు యత్నించాడు. దీంతో వీరిని వెంబడించి అదుపులోకి తీసుకోగా కల్లూరుకు చెందిన ఎస్కే.హమీద్, మణుగూరు సాయినగర్కు చెందిన ఎస్కే.హబీబ్పాషా, మిడియం గోవిందుగా తేలింది. గంజాయికి అలవాటు పడిన వీరు ఒడిశాకు వెళ్లి రూ.3,500 చొప్పున నాలుగు కేజీల గంజాయి కొనుగోలు చేశారు. అందులో కొంత సొంత అవసరాలకు ఉంచకుని, మిగతాది చిన్న ప్యాకెట్లుగా మార్చి అమ్ముతున్నారు. ఈమేరకు నిందితులను అరెస్ట్ చేసి గంజాయి, బైక్లు స్వాధీనం చేసుకోవడమే కాక గంజాయి ఉపయోగించిన 19 మందిని సీఐ ముత్తులింగం ఆధ్వర్యాన గుర్తించినట్లు ఏసీపీ తెలిపారు. ●చింతకాని: మండలంలోని రామకృష్ణాపురం బస్టాండ్ సమీపాన గంజాయి తాగుతున్న ఖమ్మం ప్రకాశ్నగర్కు చెందిన బి.వంశీని పోలీసులు బుధవారం ఆరెస్ట్ చేశారు. ఆయన వద్ద సిగరెట్ రూపంలో ఉన్న గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై నాగుల్మీరా తెలిపారు. -
సాగర్ నీటి విడుదలకు కసరత్తు
● రేపటి హైదరాబాద్ సమావేశంలో తేదీ ఖరారయ్యే అవకాశం ● గత ఏడాది కంటే ముందే విడుదల చేస్తారని రైతుల ఆశలుఖమ్మంఅర్బన్: జిల్లాలో ప్రధాన సాగునీటి వనరు అయిన నాగార్జునసాగర్ కాల్వలకు జలాల విడుదలపై ఈనెల 11న హైదరాబాద్లో జరగనున్న రాష్ట్రస్థాయి వాటర్ మేనేజ్మెంట్ కమిటీ సమావేశంలో సృష్టత వచ్చే అవకాశం ఉంది. వర్షాభావ పరిస్థితులు, డ్యామ్లోని నీటి నిల్వలు, సాగు అవసరాలపై చర్చించాక తేదీ ఖరారు చేయనున్నట్లు జలవనరుల శాఖ జిల్లా అధికారులు వెల్లడించారు. కాగా, సాగర్ జలాల ఆధారంగా జిల్లాలోని 17 మండలాల్లో 2.54 లక్షల ఎకరాల ఆయకట్టుతో పాటు అర్బన్ పరిధిలో మరో 10వేల ఎకరాల భూమి సాగవుతోంది. ఈమేరకు వరి నాట్లకు సమయం సమీపిస్తున్నందున నీటి అవసరాలపై జిల్లా జలవనరుల శాఖ అధికారులు ప్రభుత్వానికి నివేదిక సమర్పించినట్లు తెలిసింది. ప్రస్తుతం నాగార్జునసాగర్ డ్యామ్ నుండి పాలేరు రిజర్వాయర్కు తాగునీటి అవసరాల నిమిత్తం నీరు విడుదల చేస్తున్నారు. అయినా పాలేరు రిజర్వాయర్ పూర్తిస్థాయి సామర్థ్యం 23అడుగులకు గాను 15 అడుగుల వరకు మాత్రమే నీరు నిల్వ ఉంది. ఈనెల రెండో వారంలో... గతేడాది సాగర్ నుంచి సాగు అవసరాలకు ఆగస్టు 3న నీరు విడుదల చేశారు. కానీ ఈసారి వర్షాభావ పరిస్థితుల నేపథ్యాన ఈనెల రెండో వారంలోనే నీటి విడుదలకు అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. వైరా రిజర్వాయర్లో కూడా ప్రస్తుతం 16 అడుగుల నీరే ఉంది. అటు పాలేరు, ఇటు వైరా రిజర్వాయర్తో పాటు ఇతర జలాశయాల్లో నీటిమట్టం ఆధారంగా సాగర్ నుంచి ముందస్తుగా నీటి విడుదలకు అవకాశముందని ఆయకట్టు రైతులు భావిస్తున్నారు. ఇదే సమయాన సాగర్ కాల్వల పరిధిలో జరుగుతున్న మరమ్మతులను త్వరగా పూర్తిచేయాలని అధికారులు కృషి చేస్తున్నారు. కూసుమంచి మండలంలో గత ఏడాది భారీ వర్షాలతో కోతకు గురైన యూటీ నిర్మాణ పనులను గత పదిరోజులుగా రాత్రీపగలు తేడా లేకుండా యుద్ధ ప్రాతిపదికన చేపడుతున్నారు. నీరు విడుదల కాకముందే పనులు పూర్తిచేసి ఎలాంటి అడ్డంకి లేకుండా చూస్తామని జలవనరులశాఖ అధికారులు చెబుతున్నారు. -
కొత్తగా 18 సబ్స్టేషన్లు
● స్థల సేకరణపై అధికారుల దృష్టి ● ఒక్కో నిర్మాణానికి రూ.1.50 కోట్లుఖమ్మంవ్యవసాయం: జిల్లాలో కొత్తగా 18 విద్యుత్ సబ్స్టేషన్ల ఏర్పాటుకు ఎన్పీడీసీఎల్ గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. నానాటికీ పెరుగుతున్న కనెక్షన్లు, డిమాండ్తో అంతరాయాలు ఏర్పడుతున్నాయి. డిమాండ్ మేర విద్యుత్ కోటా పెంచుతున్నా సరఫరా సాఫీగా సాగేలా వ్యవస్థ లేకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యాన అవసరం మేరకు 33/11 కేవీ సబ్స్టేషన్ల నిర్మాణానికి అనుమతించారు. ఖమ్మం సర్కిల్లో ఉన్న సర్వీసులు, విద్యుత్ వినియోగం తదితర అంశాలతో ఇచ్చిన నివేదిక ఆధారంగా నూతనంగా 18 సబ్స్టేషన్ల ఏర్పాటుకు ఎన్పీడీసీఎల్ అనుమతి జారీ చేసింది. జిల్లాలో ఇప్పటికే 125 సబ్స్టేషన్లు ఉండగా, కొత్తవి ఏర్పాటైతే ఈ సంఖ్య 143కు చేరుతుంది. 20గుంటలకు పైగా.. నూతన సబ్ స్టేషన్ల నిర్మాణం కోసం స్థల సేకరణపై అధికారులు దృష్టి సారించారు. ఒక్కో సబ్స్టేషన్ నిర్మాణానికి కనీసం 20 గుంటల నుంచి ఎకరం(40 గుంటలు) మేర స్థలం అవసరమవుతుంది. దీంతో సబ్ స్టేషన్లు ఏర్పాటుచేసే ప్రాంతాల వివరాలతో రెవెన్యూ శాఖకు నివేదిక ఇవ్వగా, అక్కడ స్థలాల గుర్తింపులో ఉద్యోగులు నిమగ్నమయ్యారు. కొన్ని ప్రాంతాల్లో స్థలాలు సిద్ధంగా ఉన్నందున రెవెన్యూ శాఖ సబ్ స్టేషన్ల నిర్మాణానికి అనుమతులు ఇచ్చింది. కాగా, ఒక్కో సబ్ స్టేషన్ నిర్మాణానికి రూ.1.50 కోట్లు అవసరమని అంచనా వేయగా, కొన్నిచోట్ల లైన్ల దూరం పెరగనుండడంతో వ్యయంలో మార్పులు ఉంటాయని సమాచారం. ఈమేరకు స్థల సేకరణ ప్రక్రియ త్వరగా పూర్తిచేసి సబ్ స్టేషన్ల నిర్మాణంపై దృష్టి సారించనున్నామని ఖమ్మం ఎస్ఈ ఇనుగుర్తి శ్రీనివాసాచారి తెలిపారు. ఇప్పటికే మాటూరులో సబ్ స్టేషన్ నిర్మాణ పనులు మొదలుపెట్టామని వెల్లడించారు. నియోజకవర్గాల వారీగా ప్రాంతాల గుర్తింపు ఖమ్మం నియోజకవర్గంలో టౌన్–4 సెక్షన్లోని కబేలా, రఘునాథపాలెం సెక్షన్లోని కామంచికల్లో సబ్స్టేషన్ నిర్మిస్తారు. అలాగే, పాలేరు నియోజకవర్గంలోని తరుణి హాట్, వెంకటగిరి(ఏదులాపురం), అనంతనగర్(రాజేశ్వరపురం), వైరా నియోజకవర్గంలోని తీగలబంజర(కొణిజర్ల), మాధాపురం(కారేపల్లి), బీఆర్.పురం(ఏన్కూరు), రెబ్బవరం(వైరా రూరల్), శాంతినగర్(వైరా టౌన్)లో సబ్స్టేషన్ నిర్మాణానికి నిర్ణయించారు. అంతేకాక మధిర నియోజకవర్గంలోని మాటూరు(మధిర రూరల్), లక్ష్మీపురం, బ్రాహ్మణపల్లి, చిరునోముల(బోనకల్), రాయపట్నం(మధిర టౌన్), రేమడిచర్ల(ఎర్రుపాలెం), సత్తుపల్లి నియోజకవర్గంలోని అన్నారుగూడెం(తల్లాడ), లింగాల(పెద్దకోరుకొండి)లో సబ్స్టేషన్లు నిర్మించనున్నారు. -
సరిపడా ఎరువుల నిల్వలు
సత్తుపల్లిటౌన్: వానాకాలం పంటలకు అవసరమైన ఎరువులు జిల్లాలో సరిపడా అందుబాటులో ఉన్నాయని జిల్లా వ్యవసాయాధికారి ధనసరి పుల్లయ్య స్పష్టం చేశారు. సత్తుపల్లి, రామానగరంలోని ఎరువుల దుకాణాలు, గోదాంలను బుధవారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎరువుల నిల్వలు, రికార్డులను పరిశీలించాక డీఏఓ మాట్లాడారు. కొరత పేరిట ఎరువుల ధరలు పెంచినా, అనవసరమైన సామగ్రి అంటగట్టినా డీలర్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఏఓ వై.శ్రీనివాసరావు, ఏఈఓలు పాల్గొన్నారు. నేటి నుంచి ఏఐసీసీ కార్యదర్శి పర్యటన ఖమ్మంమయూరిసెంటర్: ఏఐసీసీ కార్యదర్శి చల్లా వంశీచంద్రెడ్డి గురువారం నుంచి శనివా రం వరకు ఉమ్మడి జిల్లాలో పర్యటించనున్నా రు. ఉమ్మడి జిల్లా ఇన్చార్జిగా నియమితులైన ఆయన సంస్థాగత ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలపై దిశానిర్దేశం చేస్తారని డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్ తెలిపారు. ఈమేరకు 10వ తేదీ గురువారం ఖమ్మంలోని కాంగ్రెస్ కార్యాలయంలో జరిగే మీడియా సమావేశంలో వంశీచంద్రెడ్డి పాల్గొంటారని పేర్కొన్నా రు. ఆతర్వాత పార్టీ ముఖ్యలు, నియోజకవర్గ ఇన్చార్జిలు, ప్రజాప్రతినిధులతో సమావేశమవుతారని తెలిపారు. అలాగే, శుక్ర, శనివారాల్లోనూ ఉమ్మడి జిల్లాలోని నియోజకవర్గాల్లో ఆయన పర్యటిస్తారని వివరించారు. రేపు జాబ్మేళా ఖమ్మం రాపర్తినగర్: జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేలా ఈ నెల 11వ తేదీన ఖమ్మం టేకులపల్లిలోని మోడల్ కెరీర్ సెంటర్లో జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన శాఖ అధికారి ఎన్. మాధవి తెలిపారు. రిలయన్స్ కంపెనీలో 25 రిలేషన్షిప్ మేనేజర్ పోస్టులకు అర్హులను ఎంపిక చేస్తారని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న వారు ఒరిజినల్ సర్టిఫికెట్లు, జిరాక్స్లతో ఉదయం 10గంటలకల్లా హాజరుకావాలని ఆమె సూచించారు. సినిమాటోగ్రఫీ రంగంలో నైపుణ్య కోర్సులు ఖమ్మం సహకారనగర్: సినిమాటోగ్రఫీ రంగంలో స్వల్ప కాలిక నైపుణ్య కోర్సులు ప్రారంభిస్తున్నామని న్యాక్(నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్) అసిస్టెంట్ డైరెక్టర్ కె.వెంకటరాజు తెలిపారు. శశి ప్రీతం అకాడమీ ఆఫ్ సినిమా అండ్ ఎంటర్టైన్మెంట్(స్పేస్) సౌజన్యంతో సినిమాటోగ్రఫీ, వీడి యో ఎడిటింగ్, సౌండ్ రికార్డింగ్, డబ్బింగ్ అండ్ వాయిస్ ఓవర్ స్కిల్, యాంకరింగ్ అండ్ ఈఎంసీఈఈ, డిజిటల్ డిజైన్ అండ్ సోషల్ మీడియా మేనేజ్మెంట్, మ్యూజిక్ ప్రొడక్షన్, ప్రొఫెషనల్ సింగింగ్, ప్రొడక్షన్ మేనేజ్మెంట్ తది తర కోర్సుల్లో 12 వారాల శిక్షణ ఉంటుందని వెల్ల డించారు. ప్రతీ కోర్సుకు రూ.35 వేల ఫీజు నిర్ణయించగా, రెండు కంటే ఎక్కువ కోర్సులకు రాయితీ ఉంటుందని తెలిపారు. హైదరాబాద్ కొండాపూర్లోని న్యాక్ అకాడమీలో శిక్షణ ఇవ్వనుండగా, శిక్షణ పూర్తయ్యాక ప్రభుత్వం సర్టిఫికెట్ జారీ చేస్తుందని వెల్లడించారు. వాయిదా పద్ధతిలో ఫీజు చెల్లింపు, రాయితీపై హాస్టల్ వసతి ఉన్నందున ఆసక్తి ఉన్నవారు సద్విని యోగం చేసుకోవాలని ఏడీ సూచించారు. రెమ్యూనరేషన్ చెల్లించాలని వినతి మధిర: సమగ్ర కుటుంబ సర్వేలో పాల్గొన్న ఉపాధ్యాయులకు రెమ్యూనరేషన్ చెల్లించాలని టీఎస్ యూటీఎఫ్ నాయకులు కోరారు. ఈ సందర్భంగా బుధవారం మధిర తహసీల్దార్ ఆర్.రాంబా బుకు వినతిపత్రం అందజేశాక యూనియన్ జిల్లా కార్యదర్శి షేక్ నాగూర్ వలీ మాట్లాడారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సర్వేను ఉపాధ్యాయులు విజయవంతం చేసినా, ఇప్పటికీ రెమ్యూనరేషన్ చెల్లించలేదన్నారు. దీనికి తోడు డ్యూటీ సర్టిఫికెట్లు మంజూరు చేయకపోవడం సరికాదని పేర్కొన్నారు. పీడీఎస్యూ జిల్లా కమిటీ ఎన్నికఖమ్మం మామిళ్లగూడెం: పీడీఎస్ యూ జిల్లా నూతన అధ్యక్ష, కార్యదర్శులుగా తిప్పారపు లక్ష్మణ్, ఒంగూరి వెంకటేష్ ఎన్నికయ్యారు. అలాగే, ఉపాధ్యక్షులుగా వినయ్, యశ్వంత్, సహాయ కార్యదర్శులుగా సాధిక్, చందు, కోశాధికారి శశికిరణ్ను ఎన్నుకున్నట్లు పీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్షుడు కాంపాటి పృథ్వీ బుధవారం ఖమ్మంలో ప్రకటించారు. ఈసందర్భంగా అధ్యక్ష, కార్యదర్శులు లక్ష్మణ్, వెంకటేష్ మా ట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లోని సమస్యల ను ప్రభుత్వం ష్టికి తీసుకెళ్లేలా ఉద్యమాలు చేపడుతామని తెలిపారు. -
టాస్క్ఫోర్స్ ఏర్పాటుతో ఆస్తులకు రక్షణ
● పాలకుల అలసత్వంతోనే ఆలయ అధికారులపై దాడులు ● దేవాదాయ అర్చక, ఉద్యోగ జేఏసీ ప్రతినిధులుఖమ్మంగాంధీచౌక్: దేవాలయాల ఆస్తుల పరిరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక టాస్క్ఫోర్క్ను ఏర్పాటుచేయాలని దేవాదాయ, ధర్మాదాయ అర్చక, ఉద్యోగ జిల్లా జేఏసీ ప్రతినిధులు డిమాండ్ చేశారు. భద్రాచలంలోని శ్రీసీతారామచంద్ర స్వామి ఆలయ భూముల పరిరక్షణకు వెళ్లిన ఈఓ రమాదేవిపై ఏపీలోని పురుషోత్తమపట్నం గ్రామస్తుల దాడి నేపథ్యాన బుధవారం జిల్లా వ్యాప్తంగా ఆలయాల్లో అర్చక, ఉద్యోగులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఖమ్మంలోని శ్రీ గుంటుమల్లన్న ఆలయంలో జేఏసీ ప్రతినిధులు దాములూరి వీరభద్రరావు, తోటకూర వెంకటేశ్వర్లు మాట్లాడుతూ హైదరాబాద్లో ఏర్పాటు చేసిన హైడ్రా తరహాలో దేవాదాయ ఆస్తుల రక్షణకు ప్రత్యేక టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. తద్వారా ఆలయ భూములను అన్యాక్రాంతం కాకుండా కాపాడొచ్చని తెలిపారు. కాగా ఆలయ భూముల రక్షణలో పాలకుల అలసత్వం ఉండడంతో ఉద్యోగులపై దాడులు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా ఉద్యోగులపై రాజకీయ ఒత్తిడి లేకుండా చూస్తూ భూముల పరిరక్షణపై దృష్టి సారించాలని కోరారు. ఈ సమావేశంలో ప్రతినిధులు కె.జగన్మోహన్రావు, ఈ.వెంకటేవ్వర్లు, అనిల్, ఆనంద్, చుండూరి రామకోటేశ్వరరావు, కె.రామశర్మ, ప్రసాద్, వేణుగోపాలాచారి, హరిచంద్రశేఖర్, కృష్ణమాచార్యులు, శ్రీకాంత్, మునగలేటి రమేష్ శర్మ, ఆమంచి సురేష్ శర్మ, భార్గవాచార్యులు తదితరులు పాల్గొన్నారు. ఈఓపై దాడి సరికాదు.. నేలకొండపల్లి: భద్రాచలం ఆలయ ఈఓపై దాడి చేయడం సరికాదని అర్చకుల సంఘం బాధ్యుడు సౌమిత్రి రమేష్ పేర్కొన్నారు. దాడిని నిరసిస్తూ నేలకొండపల్లిలో అర్చక, ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించిన నిరసన తెలిపారు. ఈ సందర్భంగా భక్తరామదాసు ద్యాన మందిరం వద్ద రమేష్ మాట్లాడుతూ దాడులకు బాధ్యులైన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అర్చకులు కొడవటిగంటి శివయ్య, ముడుంబ రామానుజచార్యులు, హరి, సిబ్బంది కళ్యాణి, పల్లపుశ్రీను, పి.కృష్ణ పాల్గొన్నారు. -
కుమారుడు అమెరికా చేరకముందే తండ్రి మృతి
చింతకాని: మధిర ఆర్టీసీ డిపో ఉద్యోగి రామిశెట్టి శ్రీనివాసరావు(53) బుధవారం గుండెపోటుతో మృతి చెందాడు. ఆయన మృతికి ఆర్టీసీ అధికారుల ఒత్తిడే కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. అయితే, ఎంఎస్ చదివేందుకు కుమారుడిని మంగళవారమే అమెరికా విమానం ఎక్కించగా.. ఆయన అక్కడకు చేరకముందే తండ్రి మృతి చెందడం విషాదాన్ని నింపింది. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. ఖమ్మం బుర్హాన్పురంలో నివాసముండే శ్రీనివాసరావు మధిర డిపో టైర్ సెక్షన్లో విధులు నిర్వర్తిస్తుండగా పదోన్నతి వచ్చి ఏడాది పూర్తి కావొస్తోంది. ఆయన మంగళవారం సెలవులో ఉండగా, ప్రొబేషనరీ పీరియడ్లో ఉన్నందున తప్పక విధులకు హాజరుకావాలని అధికారులు బుధవారం ఉదయం ఫోన్ చేసినట్లు తెలిసింది. అయితే, సమ్మెతో బస్సులు లేనందున రైలులో ఖమ్మం నుంచి బయలుదేరాడు. మార్గమధ్యలో చింతకాని చేరేసరికి ఆయన గుండెనొప్పి రావడంతో అక్కడే దిగి డిపో అధికారులకు ఫోన్ చేయగా ఆస్పత్రిలో పరీక్ష చేయించుకుని విధులకు రావాలని స్పష్టం చేసినట్లు సమాచారం. దీంతో స్థానికుల సాయంతో పీహెచ్సీకి వెళ్లగా అక్కడ డాక్టర్ ఆల్తాఫ్ పరీక్షించి పరిస్థితి విషమంగా తేల్చి 108కు సమాచారం ఇచ్చారు. కానీ ఖమ్మం నుంచి 108 వాహనం వచ్చేలోగా గుండెపోటు రావడంతో వైద్యులు సీపీఆర్ చేసినా ఫలితం లేక మృతి చెందాడు. డిపో అధికారుల ఒత్తిడితోనే తన భర్త గుండెపోటుతో మృతి చెందాడని శ్రీనివాసరావు భార్య రమాదేవి ఆరోపించారు. వీరి ఏకైక కుమారుడు రామ్చరణ్ను ఎంఎస్ చదివించేందుకు మంగళవారమే అమెరికా పంపించగా, ఆయన అక్కడకు చేరకముందే శ్రీనివాసరావు మృతి చెందడంతో కుటుంబీకులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఆర్టీసీ అధికారుల ఒత్తిడే కారణమని కుటుంబీకుల ఆరోపణ -
వాతావరణ ం
జిల్లా అంతటా గురువారం సాధారణ ఉష్ణోగ్రతలే ఉంటాయి. కొన్నిచోట్ల ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది.విన్నవించినా పట్టించుకోలేదు.. కాల్వకు మరమ్మతు చేయించాలని ఎన్నోసార్లు అధికారులు, ప్రజాప్రతినిధులకు విన్నవించాం. అయినా ఎవరూ మా గోడును పట్టించుకోలేదు. దీంతో చేసేదేం లేక మేమే నగదు జమ చేసుకుని కాల్వ మరమ్మతు చేయించుకుంటున్నాం. – కంచర్ల శ్రీనివాసరెడ్డి, ఆయకట్టు రైతు, పేరుపల్లి20 ఏళ్లుగా మరమ్మతులు లేవు.. 20ఏళ్లుగా కట్టు కాల్వ మరమ్మతులను మరిచారు. దీంతో పూడిక, తుమ్మ చెట్లు పెరిగి నీరు అందడం లేదు. ఏటా చివరలో సాగునీరు అందక దిగుబడి తగ్గుతోంది. ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టించుకుంటే మాపై భారం పడేది కాదు. – అలెం చంద్రయ్య, ఆయకట్టు రైతు, పేరుపల్లి -
ఔట్ సోర్సింగ్ ఉద్యోగి ఆత్మహత్య
మధిర: మధిరకు చెందిన ఔట్ సోర్సింగ్ ఉద్యోగి బుధవారం రైలుకింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మధిరఆర్సీఎం చర్చి రోడ్డులో నివసించే తాండ్ర అనిల్ (45) మున్సిపాలిటీలో 2008 నుంచి ఔట్సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ఆయన భార్య ఉమ ప్రైవేట్ పాఠశాల ప్రిన్సిపాల్గా విధులు నిర్వర్తిస్తుండగా, అనిల్ ఇటీవల ఎవరితో సరిగా మాట్లాడడం లేదని తెలిసింది. బుధవారం సోదరుడు హరికి ఫోన్చేసి ఆత్మహత్యకు పాల్పడుతున్నానని చెప్పాడు. ఆపై సోదరుడు గాలిస్తుండగానే మధిర స్టేషన్ సమీపాన గూడ్స్ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ కలహాలా, అధికారుల ఒత్తిడితో అనిల్ ఆత్మహత్య చేసుకున్నాడా అనేది తేలాల్సి ఉంది. కేసు నమోదు చేసినట్లు జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ తెలిపారు. డివైడర్ను ఢీకొని యువకుడు మృతి మోతె: బైక్పై వెళ్తూ డివైడర్ ఢీకొన్న యువకుడు తీవ్రగాయాలతో మృతి చెందాడు. ఇదే ఘటనలో మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. సూర్యాపేట జిల్లా మోతె సమీపాన బుధవారం జరిగిన ఈ ప్రమాదం వివరాలిలా ఉన్నాయి. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం అంజనాపురానికి చెందిన బుర్రి వర్ధన్బాబు(22) తన స్నేహితుడు కంచర్ల తరుణ్తో కలిసి బుధవారం హైదరాబాద్ నుంచి బైక్పై స్వగ్రామానికి బయలుదేరాడు. మార్గమధ్యలో మోతె సమీపాన అడ్డుగా వచ్చిన కుక్కను తప్పించే క్రమాన డివైడర్ను ఢీకొట్టారు. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా, స్థానికులు సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే వర్ధన్బాబు మృతిచెందాడు. మృతుడి తండ్రి ప్రభాకర్రావు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు మోతె ఎస్సై యాదవేందర్రెడ్డి తెలిపారు. పేకాటరాయుళ్ల అరెస్టు ఎర్రుపాలెం: మండలంలోని బుచ్చిరెడ్డిపాలెంలో పేకాట ఆడుతున్న ఐదుగురిని బుధవారం పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి రూ.13,980 నగదు, సెల్ఫోన్లు, ఒక బైక్ స్వాధీనం చేసుకున్నామని ఎస్ఐ రమేష్ తెలిపారు. బాలికకు గర్భం చేసిన వ్యక్తిపై కేసు తిరుమలాయపాలెం: మండలంలోని బచ్చోడుతండాలో 16ఏళ్ల బాలికను మాయమాటలతో లొంగదీసుకుని ఆమె గర్భానికి కారణమైన వ్యక్తిపై పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. బచ్చోడుతండాకు చెందిన బాలిక 8వ తరగతి పూర్తిచేశాక ఇంటి వద్దే ఉంటోంది. అదే తండాకు చెందిన ధరావత్ బాలు ఆమెకు మాయమాటలు చెప్పి శారీరకంగా లొంగదీసుకోవడం గర్భం దాల్చింది. ఈ విషయమై బాలిక తల్లి ఫిర్యాదుతో బాలుపై కేసు నమోదు చేసి, బాలికను బాలికల సదనంకు పంపించినట్లు పోలీసులు తెలిపారు. -
బైక్పై 10వేల కి.మీ. ఆధ్యాత్మిక యాత్ర
సత్తుపల్లి: దేశంలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రాలను ద్విచక్ర వాహంనంపై చుట్టి రావాలని యువకుడు ఆ కోరిక నెరవేర్చుకున్నాడు. సత్తుపల్లి ద్వారకాపురి కాలనీకి చెందిన పురోహితుడు ఉప్పల ప్రవీణ్ శాస్త్రి చాలాకాలంగా రాయల్ ఎన్ఫీల్డ్పై దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను సందర్శించాలని నిర్ణయించుకున్నాడు. తొలుత పలువురు మిత్రులు కూడా కలిసొస్తామని చెప్పినా ఆతర్వాత వెనుకడుగు వేయడంతో బంధువైన శరత్కుమార్ వర్మతో కలిసి యాత్ర ప్రారంభించాడు. చెరో బైక్పై హైదరాబాద్లో ప్రయాణం ఆరంభించిన వారు నెల వ్యవధిలో 10వేల కి.మీ. మేర ప్రయాణించారు. ఈ క్రమంలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, మహా రాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్, హర్యానా, హరిద్వార్, ఉత్తరప్రదేశ్, బిహార్, జార్ఖండ్, ఒడిశా మీదుగా ఏపీలోని శ్రీకాకుళం నుంచి తిరిగి తెలంగాణలోకి తిరిగి ప్రవేశించినట్లు ప్రవీణ్ తెలిపారు. చార్ధామ్తో పాటు ఉత్తర, దక్షిణ భారతదేశంలోని అన్ని ముఖ్య క్షేత్రాలను సందర్శించిన ఆయనను సృజన సాహితీ సమాఖ్య బాధ్యులు బుధవారం సత్కరించారు. ఈ కార్యక్రమంలో రామకృష్ణ, మధుసూదన్రాజు, నాగేశ్వరరావు, నర్సింహారావు, రామిశెట్టి శ్రీనివాసరావు, వీరస్వామి తదితరులు పాల్గొన్నారు. -
బీఈడీలో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం
భద్రాచలంటౌన్: భద్రాచలంలోని గిరిజన బీఈడీ కళాశాలలో రెగ్యులర్ బీఈడీ కోర్సు(2025–27)లో ప్రవేశానికి ఏజెన్సీ షెడ్యూల్ ప్రాంత గిరిజన పట్టభద్రుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఐటీడీఏ పీఓ బి.రాహుల్ తెలిపారు. డిగ్రీ కనీసం 40శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించిన తెలంగాణలోని గిరిజన అభ్యర్థులు అర్హులని, డిగ్రీ మార్కుల ఆధారంగా ఎంపిక ఉంటుందని వెల్లడించారు. మొత్తం 100 సీట్లలో మహిళలు, ప్రత్యేక కేటగిరీ వారికి రిజర్వేషన్ ఉంటుందని తెలిపారు. ఏటూరునాగారం, ఉట్నూరు, మన్ననూరు ఐటీడీఏ కార్యాలయాలతో పాటు భద్రాచలం గిరిజన బీఈడీ కళాశాలలో దరఖాస్తులు తీసుకుని, ఆగస్టు 8వ తేదీ వరకు అందజేయాలని, వివరాలకు 89784 77345 నంబర్లో సంప్రదించాలని పీఓ సూచించారు. బౌద్ధక్షేత్రం భూముల స్వాధీనానికి సర్వే నేలకొండపల్లి: మండల కేంద్రంలోని బౌద్ధ క్షేత్రానికి సంబంధించి రూ.కోట్ల విలువైన భూములను ఆక్రమణ నుంచి విడిపించేందుకు అధికారులు రంగంలోకి దిగారు. ప్రభుత్వ ఆదేశాలతో రెవెన్యూ అధికారులు సర్వే చేస్తూ క్షేత్రం భూముల్లో హద్దు రాళ్లు ఏర్పాటుచేస్తున్నారు. నేలకొండపల్లిలో దక్షిణ భారతదేశంలోకెల్లా అతి పెద్దదైన బౌద్ధక్షేత్రం పేరిట 55.23 ఎకరాల భూములు ఉన్నాయి. కానీ చాలావరకు ఆక్రమణకు గురవగా ప్రస్తుతం 20 ఎకరాల మేర మిగిలినట్లు తెలిసింది. ఈ అంశంపై పలువురి ఫిర్యాదుతో స్పందించిన ప్రభుత్వం భూములను స్వాధీనం చేసుకోవాలని ఆదేశించింది. దీంతో రెవెన్యూ అధికారులు రెండు రోజులుగా సర్వే చేస్తూ భూములను గుర్తించి హద్దురాళ్లు ఏర్పాటుచేశారు. సర్వేలో తహసీల్దార్ వి.వెంకటేశ్వర్లు, ఎంఆర్ఐలు ఆలస్యం మధుసూదన్రావు, అల్లం రవి, సర్వేయర్ మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు. అయితే, రాళ్లు పాతిన ప్రాంతంలో తమ పట్టాభూములు ఉన్నాయని కొందరు రైతులు చెప్పగా పూర్తి స్థాయిలో విచారణ చేపడుతామని తెలిపారు. కాగా, సర్వేతో సరిపెట్టకుండా భూములను స్వాధీనం చేసుకోవాలని సామాజిక కార్యకర్త పసుమర్తి శ్రీనివాస్ తదితరులు కోరారు. గురుపౌర్ణమి పూజలకు ముస్తాబు ఖమ్మంగాంధీచౌక్: గురుపౌర్ణమి వేడుకను గురువారం జరుపుకోనుండగా షిర్డీ సాయిబాబా ఆలయాలు, ఆశ్రమాల్లో ఏర్పాట్లు చేశారు. ఆషాఢ శుద్ధ పంచమి నుంచి ప్రారంభమైన వేడుకలు పౌర్ణమితో ముగియనున్నాయి. ఈ సందర్భంగా 11 రోజుల పాటు మందిరాలు, ఆశ్రమాల్లో ప్రత్యేక హోమాలు, అభిషేకాలు చేసిన నిర్వాహకులు గురువారం గ్రామోత్సవాలు, అభిషేకాలకు సిద్ధమయ్యా రు. ఈమేరకు జిల్లాలోని ఆలయాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు. -
సార్వత్రిక సమ్మె సక్సెస్
ఖమ్మంమయూరిసెంటర్: కార్మికుల హక్కులను కేంద్రప్రభుత్వం హరించడమే కాక నాలుగు లేబర్ కోడ్ల ఏర్పాటును నిరసిస్తూ బుధవారం చేపట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె జిల్లాలో విజయవంతమైంది. దుకాణాలు, బ్యాంక్లు, పారిశ్రామిక వాడలను బంద్ చేయించగా, ఆర్టీసీ బస్సులు పాక్షికంగా తిరిగాయి. బంద్లో సీపీఎం, సీపీఐ, కాంగ్రెస్, సీపీఐ(ఎంఎల్) మాస్లైన్, న్యూడెమోక్రసీ నేతలు పాల్గొన్నారు. సమ్మెకు ఉద్యోగులు, వ్యవసాయ, రైతుసంఘాలు మద్దతు తెలపగా, కార్మికసంఘాలు, రాజకీయ పార్టీల ఆధ్వర్యాన ఖమ్మం పెవిలియన్ మైదానం నుంచి జెడ్పీ సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అలాగే, ఖమ్మంలో ట్రాక్టర్లతో భారీ ర్యాలీ నిర్వహించగా, జిల్లావ్యాప్తంగా కూడా ర్యాలీలు చేపట్టారు. ఆర్టీసీకి రూ.72 లక్షలు నష్టం సార్వత్రిక సమ్మె సందర్భంగా దుకాణాలను మూసివేయించారు. జిల్లా కేంద్రంలో ఆటోలు పూర్తిస్థాయిలో తిరగకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. దీనికి తోడు ఆర్టీసీ బస్సులు కూడా పాక్షికంగానే తిరిగాయి. రీజియన్లో 410 బస్సులకు గాను 210బస్సులనే అధికారులు నడిపించారు. రోజువారీగా రావాల్సిన రూ.1.40 కోట్ల ఆదాయంలో బుధవారం రూ.72లక్షల మేర కోత పడింది. ఇక పారిశ్రామిక ప్రాంతంలోని టైల్స్ దుకాణాలు, కోల్డ్ స్టోరేజీలు, దాల్ మిల్లులు, గ్రానైట్ పరిశ్రమలను మూసివేయించారు. సమ్మె హక్కును కాలరాస్తున్నారు.. సమ్మె సందర్భంగా జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహించగా జెడ్పీ సెంటర్ వద్ద వివిధ పార్టీలు, సంఘాల నాయకులు మాట్లాడారు. సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ దేశచరిత్రలో ఎన్నడూ లేని విధంగా సమ్మె జరిగిందని తెలిపారు. కార్మికులకు కష్టం వస్తే ఆదుకునే సంఘాలను తొలగించే కుట్ర జరుగుతోందని మండిపడ్డారు. సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి బాగం హేమంతరావు, మాస్లైన్ జిల్లా కార్యదర్శి గోకినపల్లి వెంకటేశ్వరరావు, ఎన్డీ జిల్లా కార్యదర్శి మధు, కాంగ్రెస్ నాయకుడు కొత్త సీతారాములు తదితరులు మాట్లాడుతూ వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్లకు కట్టబెట్టేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని ఆరో పించారు. ఇక బ్యాంకుల ఎదుట కూడా ఉద్యోగులు నిరసన తెలిపారు. ఈ కార్యక్రమాల్లో వివిధ సంఘాలు, పార్టీల నాయకులు పోతినేని సుదర్శన్రావు, నున్నా నాగేశ్వరరావు, కళ్యాణం వెంకటేశ్వరరావు, వై.విక్రమ్, తుమ్మ విష్ణువర్ధన్, జి.రామయ్య, పి. శోభ, సింగు నరసింహారావు, బీ.జీ.క్లెమెంట్, తోట రామాంజనేయులు, ఎం.డీ.జకీరుద్దీన్, కొండపర్తి గోవిందరావు, దొండపాటి రమేష్, తాటి వెంకటేశ్వ ర్లు, తాటి నిర్మల, పోటు కళావతి, రామకృష్ణ, రామస్వామి, రాజేష్,కుమార్, బుచ్చిబాబు, బొమ్మకంటి రమేష్, జలం రమేష్, వెంకన్న, శ్రీను, సిల్వరాజు, ఐలయ్య, దాసు, రవి తదితరులు పాల్గొన్నారు.ఖమ్మంలో ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహిస్తున్న దృశ్యం ఉద్యోగులు, వ్యవసాయ, రైతు సంఘాలు, పార్టీల మద్దతు దుకాణాలు, పారిశ్రామిక ప్రాంతం, బ్యాంకులు బంద్ పాక్షికంగా తిరిగిన ఆర్టీసీ బస్సులు -
ఆశల సాగుకు సిద్ధం
● వైరా రిజర్వాయర్ నుంచి నేడు నీటి విడుదల ● ఆధునికీకరణ పనులను పరిశీలించిన అధికారులువైరా: వైరా రిజర్వాయర్ ఆయకట్టు పరిధిలో ఈ ఏడాది వానాకాలం పంటల సాగుకు అన్నదాతలు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే రిజర్వాయర్ ఆధునికీకరణ పనులు 60 శాతానికి పైగా పూర్తయ్యాయి. మరో మూడు రోజుల్లో పనులు నిలిపివేసి, తిరిగి వచ్చే ఏడాది చేపట్టాలనే నిర్ణయానికి అధికారులు వచ్చినట్లు తెలిసింది. ఈ రిజర్వాయర్ ఆయకట్టు పరిధిలో ఇప్పటికే రైతులు వరి నారుమడులు సిద్ధం చేసుకుని, నాట్లు వేసేందుకు సరైన వర్షం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ ఏడాది రిజర్వాయర్ కింద సుమారు 25 వేల ఎకరాల్లో వరి సాగు చేసే అవకాశముందని అంచనా వేస్తున్నారు. నేడు నీరు విడుదల రిజర్వాయర్ ఆధునికీకరణ పనులను బుధవారం నీటి పారుదల శాఖ ఎస్ఈ ఎం.వెంకటేశ్వరరావు, ఈఈ బాబూరావు, డీఈ శ్రీనివాస్ పరిశీలించారు. రిజర్వాయర్లో ప్రస్తుతం 16అడుగుల మేర నీరు ఉండడంతో నారుమళ్లకు విడుదల చేసేందుకు ఎలాంటి ఇబ్బందులు లేవని తేల్చినట్లు సమాచారం. దీంతో అనధికారికంగా గురువారం నుంచి నీరు విడుదల చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఆధునికీకరణ పనుల్లో భాగంగా కుడి, ఎడమ కాల్వల లైనింగ్ పనులు పూర్తయినందున నీరు విడుదల చేస్తే ఒకే రోజులో చివరి ఆయకట్టు భూములకు సైతం నీరు చేరే అవకాశముందని భావిస్తున్నారు. ఈనేపథ్యాన రైతులు వరి నాట్లు వేసుకునేలా వారం పాటు నీరు విడుదల చేయాలని నిర్ణయించగా, నీటిని పొదుపుగా వాడేలా పర్యవేక్షణకు సిబ్బందిని నియమిస్తారు. -
ప్రయోగ ఫలితమేదీ?
● పదేళ్ల క్రితం ఉమ్మడి జిల్లా కేంద్రంగా సైన్స్ మ్యూజియం మంజూరు ● అన్నీ సిద్ధం చేసినా ప్రారంభించని వైనం ● ప్రయోగాత్మక వీక్షణకు దూరమవుతున్న విద్యార్థులుఖమ్మంసహకారనగర్: పాఠ్యపుస్తకాల్లోని అంశాలను విద్యార్థులకు ప్రయోగాత్మకంగా వివరించ డం.. బొమ్మల ఆధారంగా వివరాల వెల్లడి ద్వారా సులభంగా అర్థమయ్యేలా చూడడం, తద్వారా వారిలో కొత్త ఆలోచనలను రేకెత్తించడమే లక్ష్యంగా జిల్లా కేంద్రంలో సైన్స్ మ్యూజియం ఏర్పాటుచేశారు. అయితే, పదేళ్ల క్రితం మ్యూజియం మంజూరు కాగా.. అనేక అవాంతరాల నడుమ ఒక్కో అడుగు దాటుతూ వచ్చినా ప్రారంభానికి నోచుకోకపోవడంతో విద్యార్థులకు ప్రయోగాత్మక బోధన అందడం లేదు. మంజూరైన పదేళ్లకు ఏర్పాటు 2013–14 ఏడాదిలో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు అన్ని జిల్లాల్లో సైన్స్ మ్యూజియంలు ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. దీంతో ఖమ్మం జిల్లాకు కూడా మ్యూజియం మంజూరైంది. ఇందుకోసం అప్పట్లో రూ.29 లక్షల నిధులను ప్రభుత్వం కేటాయించింది. అయితే, ఈ నిధులను బ్యాంకులో జమ చేసి ఏళ్లు గడిచినా మ్యూజియం ఏర్పాటుకు నోచుకోలేదు. చివరకు 2023–24లో ఈ నిధులు రూ.40 లక్షలకు చేరగా.. అప్పటికి మేల్కొన్న యంత్రాంగం సైన్స్ మ్యూజియం ఏర్పాటుపై దృష్టి సారించింది. ఖమ్మంతో పాటే నిధులు మంజూరైన వరంగల్, సంగారెడ్డి, నారాయణఖేడ్ల్లో సైన్స్ మ్యూజియాలు వినియోగంలోకి వచ్చినా ఇక్కడ మాత్రం బాలారిష్టాలు దాటకపోవడం గమనార్హం. పాత డీఈఓ కార్యాలయంలో.. నిధులు కేటాయించిన పదేళ్లకు ఖమ్మంలోని పాత డీఈఓ కార్యాలయాన్ని సైన్స్ మ్యూజియంకు కేటాయించారు. ఈమేరకు రూ.40లక్షల నిధులను అప్పటి కలెక్టర్ గౌతమ్ మూడు విడతల్లో విడుదల చేశారు. అయితే, ఈ నిధులు సరిపోవనే భావనతో న్యూవోసోల్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి రూ.20 లక్షలను సీఎస్ఆర్ ఫండ్ కింద ఇచ్చారు. దీంతో భవనానికి అవసరమైన మరమ్మతులు చేయించగా 2024 మే నెలలో భవనం సిద్ధమైంది. అంతా సిద్ధమైనా.. భవనం ఆధునికీకరణ పూర్తికాగానే అవసరమైన పరికరాలను తెప్పించారు. శాస్త్రవేత్తల చరిత్రను తెలిపే ఫొటోఫ్రేమ్లే కాక సోలార్ వ్యవస్థ, జీర్ణవ్యవస్థ, శ్వాసవ్యవస్థ, వ్యర్థాల తొలగింపు, నరాలు, రక్తప్రసరణ, మానవ అస్తిపంజరం, పునరుత్పత్తి, మానవుల ముఖ్య అవయవాల బొమ్మలను అమర్చారు. అప్పుడే మ్యూజియంను ప్రారంభించాలని నిర్ణయించినా, చిన్నచిన్న కారణాలతో సాధ్యం కాలేదు. కార్యాలయంలో మరుగుదొడ్లు, తాగునీటి సదుపాయం లేకపోగా మ్యూజియం నిర్వహణకు అవసరమైన ముగ్గురు ఉపాధ్యాయులను కేటాయించాల్సి ఉంది. వీటిపై జిల్లా స్థాయిలో నిర్ణయం తీసుకునే అవకాశమున్నా అధికారులు ఎందుకు పట్టించుకోలేదో తెలియదు కానీ ఉమ్మడి జిల్లాలో 6నుంచి 10వ తరగతి వరకు చదివే సుమారు 60వేల మంది విద్యార్థులు మ్యూజియం వీక్షణకు దూరమవుతున్నారు. కాగా, మ్యూజియంకు కేటాయించిన నిధుల్లో ఇంకా రూ.15లక్షల వరకు నిల్వ ఉన్నందున అవసరమైన సదుపాయాలు కల్పించి మ్యూజియంను అందుబాటులోకి తీసుకురావాలని పలువురు కోరుతున్నారు.ఇంకొన్ని పనులు ఉన్నాయి.. సైన్స్ మ్యూజియం ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంది. అయితే, విద్యార్థులకు తాగునీరు, టాయిలెట్ సౌకర్యం లేదు. వీటికి తోడు చేయించాల్సిన చిన్నచిన్న మరమ్మతులపై అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. అన్నీ సమకూర్చి త్వరలోనే మ్యూజియంను ప్రారంభించేలా చర్యలు తీసుకుంటాం. – జగదీశ్వర్, జిల్లా సైన్స్ ఆఫీసర్ -
ఏకాగ్రతతో విధులు నిర్వర్తించాలి
ఖమ్మంమయూరిసెంటర్: ఆర్టీసీ డ్రైవర్లు ప్రయాణికుల భద్రతే లక్ష్యంగా ఏకాగ్రతతో విధులు నిర్వర్తించాలని ట్రాఫిక్ ఏసీపీ శ్రీని వాసులు సూచించారు. విధి నిర్వహణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఖమ్మం రీజియన్ పరిధిలోని డ్రైవర్లకు విడదల వారీగా శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యాన మంగళవారం ఇచ్చిన శిక్షణలో ఏసీపీ మాట్లాడారు. ప్రమాదాలకు కారణమయ్యే మద్యపానానికి డ్రైవర్లు దూరంగా ఉండాలని తెలిపారు. అనంతరం మానసిక ఒత్తిడిని అధిగమించడంపై బ్రహ్మకుమారి గీత అవగాహన కల్పించారు. ఆర్టీసీ డిప్యూటీ రీజనల్ మేనేజర్ మల్లయ్య, ఖమ్మం, మణుగూరు డీఎంలు దినేష్కుమార్, శ్యాంసుందర్తో పాటు ఉద్యోగులు వినాయకరావు, సురేశ్ పాల్గొన్నారు. బాల కార్మికుడి గుర్తింపు ఖమ్మంఅర్బన్: ‘ఆపరేషన్ ముస్కాన్’లో భాగంగా ఖమ్మంలోని పలు షాపుల్లో మంగళవారం వివిధ శాఖల అధికారులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఇల్లెందు క్రాస్లోని ఒక షాప్లో బాలుడు పని చేస్తుండడాన్ని గుర్తించి యజమానిపై కేసు నమోదు చేశామని ఖమ్మం అర్బన్ సీఐ భానుప్రకాశ్ తెలిపారు. ఆపరేషన్ ముస్కాన్లో భాగంగా సంబంధిత శాఖల సమన్వయంతో తనిఖీలు చేపడుతున్నామని వెల్లడించారు. ఆర్టీసీ డ్రైవర్ల శిక్షణ తరగతుల్లో ఏసీపీ శ్రీనివాసులు -
ఎల్లన్ననగర్లో త్వరలోనే పాఠశాల
కొణిజర్ల: మండలంలోని ఎల్లన్ననగర్లో పాఠశాల లేక, బయటకు వెళ్లాలంటే రహదారి లేకపోవడంతో విద్యార్థులు చదువుకు దూరమవుతున్నారని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి దృష్టికి పలువురు తీసుకెళ్లారు. గతంలో ఓ స్వచ్ఛంద సంస్థ బాధ్యులు గ్రామంలో పాఠశాల నడిపించినా, ఇప్పుడు మూసివేయడంతో బడి ఈడు పిల్లలు ఇంటికే పరిమితుతున్నారని తెలియడంతో ఆయన విచారణకు ఆదేశించారు. దీంతో డీఈఓ సామినేని సత్యనారాయణ, డీఎంహెచ్ఓ డాక్టర్ బి.కళావతిబాయి, ఆర్టీసీ అధికారులు మంగళవారం గ్రామంలో పర్యటించా రు. ఇద్దరు ఉపాధ్యాయులను డిప్యూటేషన్పై గ్రామానికి పంపించి పాఠశాల నిర్వహించాలని ఎంఈఓ డి.అబ్రహంను డీఈఓ ఆదేశించారు. అలాగే, పిల్లలకు యూనిఫామ్, పుస్తకాలు అందజేసి మధ్యాహ్న భోజన సదుపాయం సమకూర్చాలని సూచించారు. అలాగే, స్టాఫ్నర్స్, ఆశా కార్యకర్తను నియమిస్తామని డీఎంహెచ్ఓ కళావతిబాయి వెల్ల డించగా, గ్రామానికి రోడ్డు వేస్తే బస్సు నడిపిస్తామని ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఎంఓ రాజశేఖర్, ఉపాధ్యాయ సంఘాల నాయకులు కరామత్ అలీ, సూర్యనారాయణ, అచ్యుత్, సీఆర్పీలు పవన్, సైదబాబు పాల్గొన్నారు. -
‘విద్య ప్రాధాన్యతను మరిచిన ప్రభుత్వం’
ఖమ్మంమయూరిసెంటర్: సామాజిక, ఆర్థిక, అసమానతలు కలిగిన నేటి సమాజంలో కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా ప్రాధాన్యతను గుర్తించడం లేదని పీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్షుడు కాంపాటి పృధ్దీ విమర్శించారు. ఖమ్మంలోని రామ నర్సయ్య విజ్ఞాన కేంద్రంలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పదేళ్ల కేసీఆర్ పాలనలో ప్రభుత్వ విద్యారంగం విధ్వంసానికి గురైందని తెలంగాణ సమాజం రేవంత్రెడ్డిని గెలిపించిందని తెలిపారు. కానీ కేసీఆర్ బాటలోనే రేవంత్రెడ్డి ప్రయాణిస్తుండడం ఆందోళనలకు గురి చేస్తుందన్నారు. ఎన్నికల సమయాన విద్యారంగానికి 15శాతం నిధులు కేటాయిస్తామని చెప్పినా ఆ పరిస్థితి లేదని ఆరోపించారు. పీడీఎస్యూ రాష్ట్ర మాజీ కార్యదర్శి ఆవుల అశోక్, పీఓడబ్ల్యూ రాష్ట్ర కార్యదర్శి శిరోమణి మాట్లాడుతూ పాలకుల విద్యావ్యతిరేక విధానాలను నిరసిస్తూ విద్యార్థులు ఉద్యమాల్లో భాగస్వామ్యం కావాలనికోరారు. పీడీఎస్యూ జిల్లా కార్య దర్శి వెంకటేష్, నాయకులు శశి, కార్తీక్, యశ్వంత్, సందీప్, సాధిక్, సురేష్, పుదీల పధ్వీ, నాసిర్, అశోక్ ,శ్రీను, పేర్ల వెంకటేష్, ప్రసాద్, పాషా, ప్రాణవ్, స్టాలిన్, నరేందర్, అనూష, అఖిల పాల్గొన్నారు. -
రాష్ట్ర ఫుట్బాల్ టోర్నీకి జిల్లా జట్టు ఎంపిక
ఖమ్మం స్పోర్ట్స్: ఆదిలాబాద్ జిల్లా రామకృష్ణాపూర్లో బుధవారం నుంచి జరగనున్న రాష్ట్రస్థాయి జూ నియర్ బాలికల ఫుట్బాల్ టోర్నీలో పాల్గొనేందుకు జిల్లా జట్టును ఎంపిక చేశారు. ఫుట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యాన ఎంపిక చేసిన ఈ జట్టు మంగళవా రం ఉదయం రామకృష్ణాపూర్ బయలు దేరింది. ఈ సందర్భంగా క్రీడాకారులను ఫుట్బాల్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి కె.ఆదర్శ్కుమార్, రైల్వే సూపరిటెండెంట్ సుభాస్ చంద్రబోస్, డిప్యూటీ సూపరిటెండెంట్ ఎం.రాజేంద్ర, ట్రాక్ ఇంజనీర్ దేవిప్రియ, జాతీయ ఫుట్బాల్ క్రీడాకారుడు రాజ్ ఆదినారాయణ అభినందించారు. ఈకార్యక్రమంలో క్రీడాకారులు కిషోన్, రమణ, కోచ్లు నోయల్జాక్సన్, అశ్రిత్, మాధురి, శిరీష పాల్గొన్నారు. -
పత్తి మొలకలు అంతంతే..
● వర్షాభావ పరిస్థితుల్లో తగ్గిన మొలక శాతం ● పలు ప్రాంతాల్లో రెండోసారి విత్తనాలు నాటుతున్న రైతులు ● ఫలితంగా పెరగనున్న పెట్టుబడి భారంఖమ్మంవ్యవసాయం: ఈ ఏడాది ఇప్పటివరకు వర్షాలు అనుకూలించకపోవడంతో పత్తి మొలక శాతం తగ్గింది. ఫలితంగా మొలకెత్తని చోట రైతులు రెండోసారి విత్తనాలు పెడుతున్నారు. దీనికి తోడు వర్షాభావ పరిస్థితులతో జిల్లాలో పత్తి సాగు లక్ష్యం చేరలేదు. జిల్లాలో ఈ ఏడాది 2,20,550 ఎకరాల్లో పత్తి సాగవుతుందని అంచనా వేయగా, ఇప్పటి వరకు 1,78,171 ఎకరాల్లోనే విత్తనాలు నాటినట్లు వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. జిల్లాలో వరి తర్వాత అత్యధికంగా పత్తి సాగవుతుంది. ఇక్కడి నేలలు అనుకూలంగా ఉండటంతో రైతులు మెట్ట పంటగా పత్తి సాగుకు ప్రాధాన్యత ఇస్తారు. మరోమారు... జూన్ వర్షపాతం 131.2 మి.మీ.కు గాను 123.9 మి.మీ. మాత్రమే నమోదైంది. ఈ వర్షం కూడా జూన్ 29, 30వ తేదీల్లోనే కురిసింది. ఈ ప్రభావం పత్తిసాగుపై పడింది. ఇక జూన్ చివరి రెండు రోజు లు, జూలై మొదటి రెండు రోజులు మంచి వర్షాలు కురవడంతో మొలకెత్తిన పత్తికి ప్రాణం పోయగా, మొలక రాని చోట మరోసారి విత్తనాలు పెట్టేందుకు దోహదపడ్డాయి. దీంతో చాలాచోట్ల రైతులు అరకొరగా ఉన్న పత్తి మొక్కలను తొలగించి రెండోసారి విత్తే పనిలో నిమగ్నమయ్యారు. ఈ కారణంగా విత్తనాలు, దుక్కి దున్నడం, పాటు చేయటం, కూలీల ఖర్చులు కలిపి అదనంగా ఎకరాకు మరో రూ.8వేల నుంచి రూ.10 వేల వరకు వెచ్చించాల్సి వచ్చింది. ఈనెల మూడో వారం వరకు అవకాశం పత్తి విత్తనాలు నాటేందుకు ఈనెల మూడో వారం వరకు అవకాశముందని అధికారులు చెబుతున్నారు. జిల్లాలో ఇప్పటివరకు 1.78 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేయగా, ఈనెల 20వ తేదీ నాటికి లక్ష్యం చేరే అవకాశముందని భావిస్తున్నారు. తొలుత జిల్లాలో వివిధ కంపెనీలకు చెందిన 6,61,662 విత్తన ప్యాకెట్లు అందుబాటులోకి తీసుకురాగా, రైతులు రెండోసారి కొనుగోలు చేస్తుండడంతో అదనంగా 8,697 విత్తన ప్యాకెట్లు సమకూర్చారు. ఇవికాక మరో లక్ష విత్తన ప్యాకెట్లు అవసరమవుతాయని అంచనా వేస్తున్నారు. అనుకూలించని వానలు పత్తి పంట విత్తేందుకు ఈ ఏడాది వానలు అనుకూలించలేదు. సీజన్కు ముందే వర్షాలు కురవడంతో రైతులు ఆశగా సాగుకు ముందడుగు వేసినా ఆతర్వాత రుతుపవనాల ప్రభా వం మందగించింది. సాధారణంగా రుతుపవనాలు జూన్ 8 తర్వాత తెలుగు రాష్ట్రాలను తాకుతాయి. ఈసారి మాత్రం మే నెల 25నుంచే వర్షాలు మొదలయ్యాయి. ఈమేరకు మే చివరి వారం, జూన్ మొదటి వారంలో పత్తి విత్తనాలు నాటగా... కొందరు పొడి దుక్కుల్లోనే విత్తనాలు పెట్టారు. ఆతర్వాత జూన్ మూడో వారం వరకు వానలు ముఖం చాటేయడం.. పత్తి విత్తాక 15 – 20 రోజులు వర్షం లేకపోవడంతో మొలకశాతం పడిపోయింది.రెండుసార్లు విత్తా.. రెండెకరాల్లో పత్తి నాటాను. వర్షాలు లేక మొలకలు రాలేదు. దాదాపు 50 శాతం మొలకెత్తకపోవటంతో మరోమారు విత్తనాలు నాటాం. వానలు సక్రమంగా కురిస్తేనే ఈ విత్తనాలు మొలకెత్తే అవకాశం ఉంది. – బత్తుల ప్రసాద్, పండితాపురం, కామేపల్లి మండలం లక్ష్యం దిశగా పత్తి సాగు జిల్లాలో పత్తి సాగు లక్ష్యం దిశగా సాగుతోంది. వానలు అనుకూలించక అక్కడక్కడా రెండోసారి విత్తుతున్నారు. ఈనెల మూడోవారం వరకు నాటే అవకాశముంది. పూర్తి పదునులోనే విత్తనాలు నాటితే ఫలితముంటుంది. – ధనసరి పుల్లయ్య, జిల్లా వ్యవసాయాధికారి -
పత్తి కొనుగోళ్లలో కొత్త విధానానికి ఓకే..
ఖమ్మంవ్యవసాయం: పత్తి కొనుగోళ్లలో కేంద్రప్రభుత్వం ప్రయోగాత్మకంగా అమలు చేయనున్న పీడీపీఎస్(ప్రైస్ డిఫరెన్స్ పేమెంట్ పథకం)ను స్వాగతిస్తున్నామని ఖమ్మం చాంబర్ ఆఫ్ కామర్స్ బాధ్యులు తెలిపారు. ఖమ్మంలోని వర్తక సంఘం భవనంలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో చాంబర్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చిన్ని కృష్ణారావు, మెంతుల శ్రీశైలంతో పాటు మన్నెం కృష్ణ, తల్లాడ రమేష్, దిరిశాల చిన్న వెంకటేశ్వర్లు, ముత్యం ఉప్పల్రావు మాట్లాడారు. పత్తి కొనుగోళ్లలో పీడీపీఎస్ విధానాన్ని ఖమ్మం మార్కెట్లోనూ అమలుచేయాలని కోరుతున్నట్లు తెలిపారు. ఈ విధానంతో రైతులకు మేలు జరగనున్నందున అమలుకోసం రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దృష్టికి తీసుకెళ్తామని వెల్లడించారు. -
సార్వత్రిక సమ్మెకు యూఎస్పీసీ మద్దతు
ఖమ్మం సహకారనగర్: దేశవ్యాప్తంగా బుధవా రం నిర్వహిస్తున్న సార్వత్రిక సమ్మెక ఉపాధ్యా య సంఘాల పోరాట కమిటీ(యూఎస్పీసీ) జిల్లా స్టీరింగ్ కమిటీ మద్దతు ప్రకటించింది. ఖమ్మంలోని యూటీఎఫ్ కార్యాలయంలో మంగళవారం జరిగిన సమావేశంలో స్టీరింగ్ కమిటీ సభ్యులు పారుపల్లి నాగేశ్వరరావు, టి.వెంగళరావు మాట్లాడారు. నాలుగు లేబర్ కోడ్ల రద్దు, ధరల నియంత్రణ, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ కార్మికులు, ఉద్యోగులకు కనీస వేతనాలు, పని గంటల తగ్గింపునకు చేపడుతున్న సమ్మెకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని తెలిపారు. అలాగే, నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలని, ఇంటి అద్దెను ఆదాయ పన్ను నుండి మినహాయించాలని డిమాండ్ చేశారు. నాయకులు రంజాన్, ఏ.వీ.నాగేశ్వరావు, నాగమల్లేశ్వరరా వు, రాంబాబు, కె.వెంకటేశ్వరావు, మల్సూర్, దామోదర్, రామోజీ, జి.వెంకటేశ్వరావు పాల్గొన్నారు. ఏకలవ్య విద్యాలయాల్లో ప్రవేశానికి స్పాట్ కౌన్సెలింగ్ భద్రాచలంటౌన్: ఏకలవ్య మోడల్ సంక్షేమ విద్యాలయాల్లో ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాలకు స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు భద్రాచలం ఐటీడీఏ పీఓ రాహుల్ తెలిపారు. ఉమ్మడి జిల్లాలోని ఎనిమిది కళాశాలల్లో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హ్యూమాటిక్స్ గ్రూపుల్లో సీట్లు ఖాళీగా ఉండగా, గిరిజన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. 2024–25లో ఎస్సెస్సీ ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు ఈ నెల 11న చర్లలోని ఏకలవ్య విద్యాలయంలో జరిగే స్పాట్ కౌన్సెలింగ్కు అన్ని ధ్రువీకరణ పత్రాల ఒరిజినల్స్తో హాజరు కావాలని పీఓ సూచించారు. వసతి గృహాల్లో ప్రవేశాలు పెరగాలిఖమ్మంమయూరిసెంటర్:వసతిగృహాల్లో కల్పిస్తు న్న సౌకర్యాలను తల్లిదండ్రులకు వివరించి ఎక్కు వ మంది విద్యార్థులు చేరేలా ఉద్యోగులు కృషి చేయాలని సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ కస్తాలసత్యనారాయణ సూచించారు. ఖమ్మం లోని అంబేద్కర్ భవన్లో వసతిగృహ సంక్షేమాధికారులతో మంగళవారం ఆయన సమావేశమయ్యారు. అన్ని ఎస్సీ వసతిగృహాల్లో సీట్లు ఖాళీగా ఉన్నందున విస్తృత ప్రచారం చేయాలని తెలిపా రు. ఏదైనా హాస్టల్లో సంఖ్య పెరిగితే సమీప హాస్టల్కు పంపించాలని చెప్పారు. అలాగే, విద్యార్థుల వివరాలను ఈనెల 15లోగా ఆన్లైన్లో నమోదు చేయాలని సూచించారు. తెలంగాణ సంక్షేమాధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు కె.రుక్మారావు, ఏఎస్డబ్ల్యూఓలు పాల్గొన్నారు. భూసేకరణపై అభ్యంతరాల స్వీకరణ ఎర్రుపాలెం: ఎర్రుపాలెం నుంచి అమరావతి వరకు నూతన రైల్వే లైన్ ఏర్పాటుతో భూములు కోల్పోనున్న రైతులతో మండలకేంద్రంలోని రైతు వేదికలో అధికారులు మంగళవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తహసీల్దార్ ఉషాశార ద భూములు కోల్పోతున్న రైతుల వివరాలు వెల్ల డించారు. ఈ అంశంపై అభ్యంతరాలు ఉంటే సమర్పించాలని సూచించారు. ఐపీటీ రైల్వే డీటీ వీరభద్రనాయక్, ఆర్ఐ ఎస్ రవికుమార్, మధిర మార్కెట్ చైర్మన్ బండారు నర్సింహారావు, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు వేమిరెడ్డి సుధాకర్రెడ్డి తదతరులు పాల్గొన్నారు. ‘బాల పురస్కార్’కు దరఖాస్తుల ఆహ్వానంఖమ్మంమయూరిసెంటర్: ఆపదలో ఉన్న బాలబాలికలను రక్షించిన బాలలు, స్వచ్ఛంద సంస్థల నుంచి ప్రధాన మంత్రి రాష్టీయ్ర బాల పురస్కార్ అవార్డుల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా సంక్షేమ అధికారి కె.రాంగోపాల్రెడ్డి తెలిపారు. నూతన ఆవిష్కరణలు, అసాధారణ ప్రతిభాపాటవాలు, ఆటలు, కళలు, సాహిత్యం, సామాజిక సేవ, ధైర్యసాహసం అంశాల్లో అవార్డులు అందిస్తారని వెల్లడించారు. ఐదేళ్లు మొదలు 18 ఏళ్ల లోపు బాలబాలికలతో పాటు ఏడేళ్ల లోపు బాలబాలికల సంరక్షణకు పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థల బాధ్యులు https:// awards. gov. in వెబ్సైట్ ద్వారా ఈనెల 31వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆతర్వాత దరఖాస్తు ప్రతులను కలెక్టరేట్లోని తమ కార్యాలయంలో అందజేయాలని డీడబ్ల్యూఓ రాంగోపాల్రెడ్డి తెలిపారు. -
ప్రైవేట్ పాఠశాలలో నోట్పుస్తకాలు సీజ్
ఎర్రుపాలెం: మండల కేంద్రంలోని సెయింట్ విన్సెంట్ పాఠశాల యాజ మాన్యం పాఠశాల పేరిట నోట్ పుస్తకాలు ముద్రించి విద్యార్థులు విక్రయిస్తుండటంతో మంగళవారం ఎంఈఓ బి.మురళీమోహన్రావు సీజ్ చేశారు. పాఠశాల పేరుతో ముద్రించిన పుస్తకాలు అమ్ముతున్నారనే సమాచారంతో ఏఐఎస్ఎఫ్ నాయకులు ఆందోళన చేపట్టి ఎంఈఓకు సమాచారం ఇచ్చారు. దీంతో తనిఖీ చేసి పుస్తకాలు నిల్వ చేసిన గదిని సీజ్ చేశారు. ఏఐఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు మడుపల్లి లక్ష్మణ్, ఉపాధ్యక్షుడు ఉగ్గం సురేష్ పాల్గొన్నారు. పాముకాటుతో వ్యక్తి మృతికల్లూరు: మండలంలోని మర్లపాడుకు చెందిన కమ్మకంటి వెంకటి(35) పాముకాటుతో మృతి చెందాడు. వ్యవసాయ కూలీగా జీవనం సాగించే ఆయన మంగళవారం పొలంలో పనిచేస్తుండగా కాలిపై పాముకాటు వేసింది. దీంతో కుటుంబీకులు కల్లూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తుండగా పరిస్థితి విషమించడంతో మృతి చెందాడు. వెంకటికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.రెండేళ్ల బాలుడికి పాముకాటు కరకగూడెం: ఓ మహిళ పొలం పనులకు వెళ్తూ తన రెండేళ్ల మనవడిని వెంటబెట్టుకెళ్లగా ఆ చిన్నారిని పాముకాటు వేయడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కరకగూడెం మండలంలోని పద్మాపురం గ్రామానికి చెందిన ఊకే సారయ్య – నాగమణి దంపతుల కుమారుడు విక్రం ఆదిత్యను మంగళవారం ఆయన నాయనమ్మ పొలం పనులకు తీసుకెళ్లింది. సమీపాన బాబును పడుకోబెట్టి ఆమె పనుల్లో నిమగ్నం కాగా చిన్నారిని పాము కాటు వేయడంతో నురగలు కక్కుతూ స్పృహకోల్పోయాడు. దీంతో భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. -
దేవాదాయ శాఖ అర్చక, ఉద్యోగుల నిరసన
ఖమ్మంగాంధీచౌక్: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి భూముల ఆక్రమణను అడ్డుకునేందుకు వెళ్లిన ఆలయ ఈఓ రమాదేవిపై ఏపీలోని పురుషోత్తమపట్నంలో దాడి చేయడంపై అర్చక, ఉద్యోగులు నిరసన తెలిపారు. ఈమేరకు దేవాదాయ, ధర్మాదాయ శాఖ ఉద్యోగులు, అర్చకులు మంగళవారం ఖమ్మంలోని శ్రీ గుంటు మల్లేశ్వర స్వామి దేవాలయంలో నల్లబ్యాడ్జీలు ధరించి ఆందోళన చేపట్టారు. ఆలయ భూముల పరిరక్షణకు పాటుపడుతున్న మహిళా అధికారిపై దాడి చేయడం గర్హనీయమని పేర్కొన్నారు. ఘటనకు బాధ్యులను చర్యలు తీసుకోవడంతో పాటు దేవాదాయ శాఖ ఉద్యోగులపై దాడులు జరగకుండా తగిన చర్యలు చేపట్టాలని కోరారు. ఈకార్యక్రమంలో అర్చక, ఉద్యోగ, ఈఓల సంఘాల ప్రతినిధులు దాములూరి వీరభద్రరావు, వీ.వీ.నర్సింహారావు, చుండూరు రామకోటేశ్వరరావు, ఆనంద్, దాములూరి కృష్ణశర్మ తదితరులు పాల్గొన్నారు. -
అభివృద్ధి పనుల్లో నాణ్యత తప్పనిసరి
ఖమ్మం అర్బన్: రహదారుల నిర్మాణంతో పాటు ఇతర అభివృద్ధి పనులు నాణ్యతగా చేపట్టడమే కాక సకాలంలో పూర్తయ్యేలా అధికారులు పర్యవేక్షించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. ఖమ్మం 15వ డివిజన్లో రూ.48.25 లక్షలతో నిర్మించే రెండు రహదారుల పనులకు మంగళవారం ఆయన శంకుస్థాపన చేసి మాట్లాడారు. ఖమ్మం నగరాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేసేలా నిధులు కేటాయిస్తున్నామని తెలిపారు. అయితే, రహదారుల నిర్మాణం నాణ్యతగా జరిగేలా ప్రజలు కూడా పర్యవేక్షించాలని సూచించిన మంత్రి, ఆతర్వాత పరిశుభ్రతపై దృష్టి సారించాలని చెప్పారు. అంతేకాక ప్రతీఒక్కరు ఇళ్ల ఎదుట మొక్కలు నాటి సంరక్షించాలని సూచించారు. రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, మేయర్ పునుకొల్లు నీరజ, మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య, ఆర్డీఓ జి.నర్సింహారావు, తహసీల్దార్ సైదులు, మార్కెట్ చైర్మన్ యరగర్ల హన్మంతరావు, కార్పొరేటర్లు రావూరి కరుణ, కమర్తపు మురళితో పాటు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, సాధు రమేష్రెడ్డి, వాహిద్, రావూరి సైదబాబు, తుపాకుల ఏడుకొండలు, బోడా శ్రావణ్కుమార్, లక్ష్మణ్, లోడుగు వెంకన్న, సంక్రాంతి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.మంత్రి తుమ్మల నాగేశ్వరరావు -
వావివరుసలు మరిచి మామతో వివాహేతర సంబంధం
ఖమ్మం: వావివరుసలు మరిచి భర్త తండ్రితో వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళ.. తమ వ్యవహారాన్ని కుమార్తె గమనించిందని హత్య చేసింది. ఆపై అనారోగ్యంతో మృతి చెందినట్లు చిత్రీకరించినా భర్త అనుమానంతో విషయం బయటపడింది. ఈ కేసులో నిందితులిద్దరికీ జీవితఖైదు విధిస్తూ సత్తుపల్లి ఆరో అదనపు జిల్లా జడ్జి మారగాని శ్రీని వాస్ సోమవారం తీర్పు వెలువరించారు. బోనకల్ కు చెందిన పాలెపు సునీత తన మామ(భర్త తండ్రి) నర్సింహారావుతో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ట్రాలీ డ్రైవర్గా పనిచేస్తున్న భర్త హరికృష్ణ 2022 ఫిబ్రవరి 9న బయటకు వెళ్లగా ఆయన భార్య సునీత, తండ్రి నర్సింహారావు కలిశారు. ఈ విషయాన్ని అప్పుడు 11ఏళ్ల సునీత పెద్దకుమార్తె చూడడంతో ఆమె మెడకు వైరు బిగించి హతమార్చారు. ఆపై భర్త హరికృష్ణకు ఫోన్ చేసి కుమార్తె ఆరోగ్యం బాగా లేదని చెబుతూ 108లో ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లగా ఆమె చనిపోయిందని వైద్యులు ధ్రు వీకరించారు. అయితే, హరికృష్ణ కూతురు మెడపై కమిలినట్లు ఉండడంతో బోనకల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈక్రమాన దర్యాప్తు చేపట్టిన పోలీ సులు సునీత, నర్సింహారావును విచారించగా అసలు విషయం బయటపడడంతో కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. విచారణలో వీరిద్దరిపై నేరం రుజువు కాగా జీవితఖైదు విధిస్తూ న్యాయమూర్తి శ్రీనివాస్ తీర్పు వెలువరించారు. ప్రాసిక్యూషన్ తరఫున అదనపు ప్రాసిక్యూటర్ అబ్దుల్బాషా వాదించగా, కేసు విచారణలో కీలకంగా వ్యహరించిన సీఐ మురళి, ఎస్సై కవిత, సిబ్బంది బి.అరవింద్, శ్రీకాంత్ను పోలీస్ కమిషనర్ సునీల్దత్ అభినందించారు. -
ఆపరేషన్ కగార్.. కర్రి గుట్టలు
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: వచ్చే ఏడాది మార్చి 31 నాటికి దేశంలో మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా కేంద్ర సర్కారు ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో చేపట్టిన ఆపరేషన్ కగార్ కారణంగా.. బస్తర్ అడవుల్లో తరచూ తుపాకులు గర్జిస్తున్నాయి. వందలాది మంది చనిపోతున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రంలోని కర్రిగుట్టల్లో చేపట్టిన ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ తెలంగాణలోనూ చర్చనీయాంశమైంది.పద్నాలుగేళ్లకు..దేశంలోని సాయుధ విప్లవ పార్టీలన్నీ కలిసి 2004 సెప్టెంబర్ 20న భారత కమ్యూనిస్టు పార్టీ (మావో యిస్టు)గా ఏర్పాటయ్యాయి. నేపాల్ నుంచి శ్రీలంక వరకు ప్రాంతంలో నూతన ప్రజాస్వామిక విప్లవం సాధించడమే లక్ష్యంగా రెడ్ కారిడార్ పేరుతో కదం తొక్కాయి. ఈ క్రమాన 2010 నాటికి దేశంలోని 126 జిల్లాల్లో మావోయిస్టుల ప్రాబల్యం పెరిగిపోయింది. అప్పటి నుంచి మావోయిస్టులను అణచి వేసేందుకు ప్రభుత్వాలు అనేక ఎత్తుగడలు అమలు చేస్తూ వచ్చాయి. ఫలితంగా 2024 నాటికి మావోయిస్టు ప్రభావిత జిల్లాల సంఖ్య 126 నుంచి 38 జిల్లాలకు పడిపోయింది. దీంతో మావోయిస్టు తరహా విప్లవ పంథా అనుసరించే వారిని దేశం నుంచి ఏరివేయ డమే లక్ష్యంగా.. ఆపరేషన్ కగార్ (ఫైనల్ మిషన్)ను 2024 జనవరిలో కేంద్ర ప్రభుత్వం చేపట్టింది. సుప్రీం కమాండర్ ఎన్కౌంటర్ పెద్ద దెబ్బకేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేపడుతున్న ఆపరేషన్లతో మావోయిస్టు పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లింది. ఛత్తీస్గఢ్తో పాటు ఏపీ, తెలంగాణ, ఒడిశాలో చోటుచేసుకున్న వరుస ఎన్కౌంటర్లలో ఇప్పటి వరకు 439 మంది మావో యిస్టులు చనిపోయారు. ఇందులో జన మిలీషియా మొదలు పార్టీ సుప్రీం కమాండర్ నంబాల కేశవరావు వరకు ఉన్నారు. చలపతి, ప్రయాగ్మాంఝీ, తెంటు సుధాకర్, గాజర్ల గణేశ్ వంటి కేంద్ర కమిటీ సభ్యులతో పాటు పార్టీ కీలకమైన దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీకి చెందిన రేణుక, అరవింద్, ఊర్మిల వంటి ముఖ్యనేతలు మృతి చెందారు. తెలంగాణ కమిటీ లక్ష్యంగా జరిగిన ఎన్కౌంటర్లలో మైలారపు ఆడెళ్లు అలియాస్ భాస్కర్ చనిపోగా బడే దామోదర్ వంటి నేతలు తప్పించుకున్నారు. ఆపరేషన్ కగార్ మొదలైన తర్వాత భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాల్లో జరిగిన వేర్వేరు ఎన్కౌంటర్లలో 15 మంది మావోయిస్టులు చనిపో యారు. ఇప్పటి వరకు 1,457 మంది మావో యిస్టులు లొంగిపోగా మరో 1,469 మంది అరెస్ట్ అయ్యారు. మొత్తంగా 3,500 మంది వరకు సాయు ధ విప్లవ పోరాట పంథాకు దూరమయ్యారు. మొత్తంగా కగార్ ప్రభావంతో మావోయిస్టు ప్రభా విత జిల్లాల సంఖ్య 38 నుంచి 11కు పడిపోయింది. ఈ జిల్లాల్లో తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం, ఏపీలోని అల్లూరి సీతారామరాజు ఉన్నాయి.హైలైట్గా కర్రిగుట్టలుఆపరేషన్ కగార్ మొదలయ్యాక మే 21న ఛత్తీస్ గఢ్లోని నారాయణపూర్ జిల్లా గుండెకోట్ దగ్గర జరిగిన ఎన్కౌంటర్లో నంబాల కేశవరావు చనిపోవ డం పోలీసులు సాధించిన అతిపెద్ద విజయంగా చెబుతారు. ఆ తర్వాత స్థానం తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దులోని కర్రిగుట్టలపై 21 రోజుల పాటు భద్రతా దళాలు కొనసాగించిన ఆపరేషన్ బ్లాక్ ఫారె స్ట్కు దక్కుతుంది. సెంట్రల్ రీజనల్ బ్యూరో, తెలంగాణ, దండకారణ్య కమిటీలతో పాటు మోస్ట్ వాంటెడ్ హిడ్మాను పట్టుకోవడమే లక్ష్యంగా ఈ ఆపరేషన్ జరిగింది. ఇక్కడ చోటు చేసుకున్న ఎదురుకాల్పుల్లో 31 మంది మావోయిస్టులు చనిపోయారు. అయితే అగ్రనేతలెవరూ భద్రతా దళాలకు చిక్కలేదు. కానీ మావోయిస్టు పార్టీకి కంచుకోటగా ఉన్న కర్రిగుట్టలు పోలీసుల అధీనంలోకి వచ్చాయి. అంతకుముందు అక్టోబర్ 4న అబూజ్మడ్ అడవుల్లో జరిగిన తుల్తులీ ఎన్కౌంటర్లో ఏకంగా 38 మంది మావోయిస్టులు చనిపోయారు. సంఖ్యాపరంగా దేశంలో ఇదే అతి పెద్ద ఎన్కౌంటర్గా నిలిచింది. ఇదే సమయాన మావోయిస్టు ప్రభావిత బీజాపూర్, సుక్మా జిల్లాల్లో రికార్డు స్థాయిలో 72 కొత్త మొబైల్ నెట్వర్క్ టవర్లను నెలకొల్పారు.ప్రతిపాదనలకే పరిమితంఆపరేషన్ కగార్ ఉధృతం కావడంతో మార్చి 28న మావోయిస్టులు శాంతి చర్చల ప్రస్తావన తీసుకొచ్చారు. తెలంగాణలో మెజార్టీ రాజకీయ పక్షాలు ఈ శాంతిచర్చల నిర్ణయాన్ని స్వాగతించాయి. కానీ కేంద్ర ప్రభుత్వం శాంతిచర్చలపై సానుకూలంగా ఒక్క ప్రకటనా చేయలేదు. పైగా చర్చలపై భేటీలు జరుగుతుండగానే.. ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ పేరుతో అతి పెద్ద యాంటీ నక్సల్స్ ఆపరేషన్ చేపట్టింది. ఈ సమయంలోనే నంబాలతో పాటు అనేక మంది అగ్రనేతలు నేలకొరిగారు. దీంతో శాంతి చర్చల అంశం ఒకేవైపు ప్రతిపాదనలకే పరిమితమైందనే భావన నెలకొంది.కర్రిగుట్టలపై వినతికి ఏడాదిఛత్తీస్గఢ్, తెలంగాణ సరిహద్దుల్లోని కర్రి గుట్టలను కేంద్రంగా చేసుకుని మావోయిస్టులు తమ రాష్ట్రంలో అడుగు పెట్టేందుకు ప్రయత్నిస్తు న్నారని, వీటిని అడ్డుకోవాలని కోరుతూ 2024 జూలై 4న కేంద్ర హోంమంత్రి అమిత్షాకు సీఎం రేవంత్రెడ్డి విజ్ఞప్తి చేశారు. శాంతిభద్రతలకు సంబంధించిన అంశాలపై వారిద్దరి మధ్య గంటకు పైగా సమావేశం జరిగింది. ఇందులో మావో యిస్టుల రాకను అడ్డుకునేలా.. భద్రాద్రి కొత్తగూ డెం జిల్లా కొండవాయి, ములుగు జిల్లా ఆలుబా కలో జాయింట్ టాస్క్ఫోర్స్ (జేటీఎఫ్) క్యాంపులు ఏర్పాటు చేయాలని సీఎం కోరారు. భద్రాద్రి కొత్తగూడెంతో పాటు ములుగు, కుము రంభీం ఆసిఫాబాద్ జిల్లాలను కూడా మావో యిస్టు ప్రభావిత జిల్లాలను గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. సీఎం రేవంత్ సూచనల ప్రకారం జేటీ ఎఫ్ క్యాంపులు, మావోయిస్టు ప్రభావిత గుర్తింపు ఇవ్వడంపై సానుకూల ప్రకటనలు రాలేదు. కానీ కర్రిగుట్టలపై పట్టు సాధించేలా భద్రతా దళాలు ఒక్కొక్క అడుగు ముందుకేస్తూ ఈ ఏడాది మే 15 నాటికి విజయం సాధించాయి. -
అటవీ ప్లాంటేషన్లో సాగుకు యత్నం
కారేపల్లి: మండలంలోని మాణిక్యారం–ఎర్రబోడు అటవీ ప్రాంతంలో అటవీ అధికారులు వేసిన ప్లాంటేషన్లో సాగుకు యత్నించిన వారిని ఉద్యోగులు సోమవారం అడ్డుకున్నారు. దీంతో ఉద్యోగులు – పోడుదా రులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈసందర్భంగా పోడుదారులు మాట్లాడుతూ ఏళ్లుగా తాము ఇక్కడ వ్యవసాయం చేసుకుంటుండగా, రెండేళ్ల క్రితం అధికారులు ప్రత్యామ్నాయంగా భూమిఇస్తామని నమ్మించి ప్లాంటేషన్వేశారని తెలిపారు.ఇప్పుడు దాట వేత ధోరణి అవలవంబిస్తుండడంతో కుటుంబపోషణ భారమై సాగుకు సిద్ధమయ్యాయని చెప్పారు. కాగా, ఎఫ్డీఓ వెంకన్న చేరుకుని రెండు రోజుల్లో సమస్య పరిష్కరిస్తామని చెప్పడంతో వివాదం తాత్కాలికంగా సద్దుమణిగింది. ఎఫ్ఆర్ఓ ప్రడూస్, సిబ్బంది పాల్గొన్నారు. అడ్డుకున్న ఫారెస్టు అధికారులు -
తప్పులు సరిచేసుకోకపోతే కాంగ్రెస్కు అధోగతే
కొణిజర్ల: జైళ్లలో ఉండాల్సిన వారు అసెంబ్లీ, పార్లమెంట్లో ఉంటుండగా.. చట్టసభల్లో ఉండాల్సిన మేధావులు రోడ్డుపై ఉంటున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తెలిపారు. కొణిజర్ల మండలం మండలం తనికెళ్లలో సోమవారం నిర్వహించిన పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ను మోయడమే తమ పని కాదని కూనంనేని వెల్లడించారు. బీఆర్ఎస్ ప్రజా వ్యతిరేక విధానాల వల్లే కాంగ్రెస్కు మద్దతు ఇచ్చామని, ఇప్పుడు కాంగ్రెస్ కూడా కూడా ఇందిరమ్మ ఇల్లు, తదితర అంశాల్లో పేదలను విస్మరిస్తోందని ఆరోపించారు. ఇకనైనా పార్టీ తీరు మార్చుకోకపోతే అధోగతి ఎదురవుతుందని తెలిపారు. కాగా, బీజేపీకి మతం తప్ప వేరే సిద్ధాంతం లేకపోవడంతో, హిందూ మతం, రాముడిని అడ్డం పెట్టుకుని ఓట్ల రాజకీయం చేస్తోందని కూనంనేని ఆరోపించారు. పేదలకు సాయం చేయకపోగా మతాల మధ్య చిచ్చు పెట్టి పబ్బం గడుపుతున్నారని పేర్కొన్నారు. అంతేకాక ఆపరేషన్ కగార్ పేరుతో ఉద్యమకారులను పొట్టన బెట్టుకుంటున్నారని తెలిపారు. సీపీఐ జాతీయ సమితి సభ్యుడు బాగం హేమంతరావు మాట్లాడుతూ డిసెంబర్ 26న సీపీఐ శత జయంతి ఉత్సవాలను లక్ష మంది కార్యకర్తలతో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి దండిసురేష్, నాయకులు జమ్ముల జితేందర్రెడ్డి, యర్రా బాబు, దొండపాటి రమేష్, తాటివెంకటేశ్వర్లు, కొండపర్తి గోవిందరా వు, స్వర్ణ రమేష్, కంపసాటి వెంకన్న, యాసా వెంకటేశ్వరరావు, తాటి నిర్మల, తమ్మిశెట్టి వెంకటేశ్వ ర్లు, పీవీరావు, వేములకొండ రమేష్ తదితరులు పాల్గొన్నారు.సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని -
నిజాయితీ చాటుకున్న ఆర్టీసీ డ్రైవర్
మధిర: ప్రయాణికుడు మరిచిపోయిన రూ.10లక్షల విలువైన సామగ్రి కలిగిన బ్యాగ్ను తిరిగి అప్పగించి మధిర ఆర్టీసీ డిపో బస్ డ్రైవర్ నిజాయితీ చాటుకున్నాడు. బీహెచ్ఈఎల్ నుంచి మధిరకు వస్తున్న సూపర్ లగ్జరీ బస్సులో బోనకల్ మండలం నారా యణపురానికి చెందిన సీహెచ్.హనుమంతరావు జేఎన్టీయూ వద్ద ఎక్కాడు. బోనకల్ క్రాస్ వద్ద ఆయన బ్యాగ్ మర్చిపోయి దిగాడు. డిపోకు వెళ్లాక బ్యాగ్ను గుర్తించిన డ్రైవర్ ఎ.వెంకటేశ్వర్లు అందులో పరిశీలించగా రూ.2వేల నగదుతో పాటు రూ. 10లక్షల విలువైన బంగారు నెక్లెస్, గొలుసు, చెవి దిద్దులు, ఫోన్ ఉన్నాయి. సదరు ప్రయాణికుడికి సమాచారం ఇచ్చి బ్యాగ్ను ట్రాఫిక్ ఇన్చార్జ్ వెంకటేశ్వర్లు, కంట్రోలర్ కాలేషా సమక్షాన అందజేశా రు. ఈసందర్భంగా డ్రైవర్ వెంకటేశ్వర్లుతో పాటు డీఎం డి.శంకర్రావు, ఉద్యోగులకు హనుమంతరావు కృతజ్ఞతలు తెలిపారు. -
జిల్లా వాసులకు డాక్టరేట్లు
తల్లాడ/రఘునాథపాలెం/ఖమ్మం సహకారనగర్: తల్లాడ మండలంలోని నారాయణపురం గ్రామానికి చెందిన తులసీరామ్ కాకతీయ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా డాక్టరేట్ అందుకున్నారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్లో ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. నారాయణపురం గ్రామంలోని సరికొండ సాంబశివరాజు – జ్యోతి దంపతుల కుమారుడైన తులసీ రామ్ గ్రామీణ మార్కెట్లలో డిజిటల్ చెల్లింపుల విధానాలపై అధ్యయనం చేసి పరిశోధనాత్మక పత్రం సమర్పించగా డాక్టరేట్ లభించింది. అలాగే, రఘునాథపాలెం మండలంలోని పంగిడికి చెందిన అజ్మీరా సుజాత కేయూ స్నాతకోత్సవంలో డాక్టరేట్ స్వీకరించింది. సీనియర్ ప్రొఫెసర్ బన్న ఐలయ్య పర్యవేక్షణలో ఆమె ‘తెలంగాణ బంజారా గేయాలు – జీవన చిత్రణ’ అంశంపై సమర్పించిన పరిశోధనాత్మక పత్రానికి డాక్టరేట్ ప్రకటించారు. ఈసందర్భంగా సుజాతను గ్రామ మాజీ సర్పంచ్ బానోతు మంగీలాల్నాయక్, గ్రామస్తులు అభినందించారు. అంతేకాక ఖమ్మంకు చెందిన అద్దెపల్లి చరిత్ర రాజనీతిశాస్త్ర విభాగంలో డాక్టరేట్ అందుకుంది. ఖమ్మం ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో అధ్యాపకురాలిగా పనిచేస్తున్న ఆమెను పలువురు అభినందించారు. -
బౌద్ధక్షేత్రంలో పాముల భయం
నేలకొండపల్లి: దక్షిణ భారతదేశంలో కెల్లా అతిపెద్దదైన మండల కేంద్రంలోని బౌద్ధక్షేత్రంను తిలకించేందుకు సోమవారం పలువురు పర్యాటకులు రాగా పాములు కనిపించగడంతో పరుగులు తీశా రు. క్షేత్రంపై నిర్వహణపై అధికారుల పట్టింపు కరువై ఆవరణ అంతా పిచ్చిచెట్లు పెరిగాయి. దీంతో ఫొటోషూట్ కోసం వచ్చిన ఇద్దరితో పాటు పలువురు పర్యాటకులకు పాలములు కనిపించడంతో ఆందోళనగా పరుగులు పెట్టారు. దీంతో అక్కడి సిబ్బంది అటవీ శాఖ సెక్షన్ ఆఫీసర్ డానియేల్ కు సమాచారం ఇవ్వగా ఆయన ఖమ్మం నుంచి పాములు పట్టే వారిని పిలిపించడంతో వారు స్టోర్ రూమ్లో రెండు పాములను బంధించారు. అధికారులు ఇకనైనా బౌద్ధక్షేత్రం పరిసరాలను శుభ్రం చేయించాలని పలువురు కోరుతున్నారు. పోర్చుగల్లో ఉపాధి అవకాశాలు ఖమ్మం రాపర్తినగర్: పోర్చుగల్లో ఉపాధి అవకాశాలు ఉన్నందున ఆసక్తి కలిగిన వారు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా ఉపాధి అధికారి ఎన్.మాధవి సూచించారు. తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్(టామ్ కామ్) ద్వారా పోర్చుగల్లో హోటల్ మేనేజ్మెంట్, హౌస్ కీపర్, సేల్స్ ఎగ్జిక్యూటివ్, స్పా థెరపీ, ఈవెంట్ కోఆర్డినేటర్లుగా అర్హులను ఎంపిక చేస్తారని తెలిపారు. 21–40 ఏళ్ల లోపు వయస్సు, ఎంపిక చేసుకున్న రంగంలో సరైన విద్యార్హత, ఐదేళ్ల అనుభవం కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించారు. ఆసక్తి, అర్హత గల వారు దరఖాస్తు వివరాల కోసం 94400 52592, 94400 49937, 94400 51452 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. ‘దోచుకోవడానికే పని గంటల పెంపు’ ఖమ్మంమయూరిసెంటర్: కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే లేబర్ చట్టాలను కోడ్ల పేరిట కుదించి కార్మిక హక్కులపై దాడి చేస్తోందని సీపీఐ (ఎంఎల్) మాస్లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు పేర్కొన్నారు. దీనికి తోడు పని గంట లు పెంచడం మేడే పోరాట ఫలాన్ని పాతి పెట్ట డమేనని తెలిపారు. కార్పొరేట్ వర్గాలు, పెట్టుబడిదారుల లాభాల కోసం వేతన జీవుల శ్రమను అదనంగా దోచుకోవడానికి ఈ విధానాన్ని తీసుకొచ్చారని ఆరోపించారు. బీజేపీ బాటలో తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు పయనిస్తున్నాయని విమర్శించారు. ఇకనైనా పని గంటల పెంపు జీఓను వెనక్కు తీసుకోవాలని రంగారావు ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. ఏదులాపురం సొసైటీకి పర్సన్ ఇన్చార్జ్ ఖమ్మంరూరల్: మండలంలోని ఏదులాపురం ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘానికి పర్సన్ ఇన్చార్జ్ను నియమించాలని సోమవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సొసైటీ చైర్మన్ కొందరు రైతుల పేరిట రుణాలు తీసుకున్నారని, ఆ రుణాలు చెల్లించా లంటూ తమకు నోటీసులు వస్తున్నాయని పలువురు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై ‘సాక్షి’లో వరుస కథనాలు వచ్చిన విషయం విదిత మే. కాగా, రైతుల ఫిర్యాదుతో జిల్లా సహకార శాఖాధికారి విచారణకు ఆదేశించగా సొసైటీల అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఉషశ్రీ ఇరువర్గాలను విచా రించారు. ఆపై తుది నివేదికను రాష్ట్ర సహకారశాఖ ఉన్నతాఽధికారులకు సమర్పించారు. దీంతో నాలుగు నెలలు పాటు లేదా సొసైటీ ఎన్నికలు నిర్వహించే వరకు పర్సన్ ఇన్చార్జ్ను నియమించాలని జిల్లా సహకార శాఖ అధికారిని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. మోటాపురంలో చోరీ నేలకొండపల్లి: మండలంలోని మోటాపురంలో చోరీ జరిగింది. గ్రామానికి చెందిన చావా శేఖర్రావు కుటుంబ సభ్యులు ఆదివారం రాత్రి ఇంటికి తాళం వేసి ఖమ్మం వెళ్లారు. దీంతో అర్ధరాత్రి వచ్చిన దుండుగులు ఇంటి తలుపులు, ఆపై బీరువాను ధ్వంసం చేశారు. బీరువాలో ఉన్న రూ.50 వేల నగదు, దాదాపు రెండు తులాల బంగారం, అరకేజీ వెండి వస్తువులను ఎత్తుకెళ్లారు. ఈ విషయమై సోమవారం అందిన ఫిర్యాదుతో పోలీసులు విచారణ ప్రారంభించారు. రామయ్య భూముల్లో అక్రమంగా నిర్మాణంభద్రాచలంటౌన్: భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి దేవస్థాన భూముల ఆక్రమ కొనసాగుతోంది. పట్టణ సరిహద్దులోని ఏపీ పురుషోత్తపట్నంలో ఉన్న ఆలయ భూముల్లో కొందరు ఆక్రమణదారులు సోమవారం ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించారు. ఆలయ ఉద్యోగులు వెళ్లి అడ్డుకోవడంతో స్వల్ప ఘర్షణ జరిగింది. ఈ సందర్భంగా ఆలయ ఏఈఓ భవాని రామకృష్ణ మాట్లాడుతూ ఏపీ హైకోర్టు ఆదేశాల మేరకు 889.50 ఎకరాల భూములను దేవస్థానానికి అప్పగించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. -
ప్రతీ మండలంలో ‘సమర శంఖారావం’
ఖమ్మంమయూరిసెంటర్: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కార్యాచరణ రూపొందించామని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు తెలిపారు. ఖమ్మంలోని పార్టీ జిల్లా కార్యాలయం సోమవారం వారు విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలతో స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటడం ఖాయమన్నారు. అయితే, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే, సీఎం రేవంత్రెడ్డి సూచనలతో జిల్లాలో ముందుగానే స్థానిక సంస్థల ఎన్నికల శంఖారావం సమావేశాలు ప్రారంభిస్తున్నట్లు తెలిపా రు. ఎన్నికలు ఎప్పుడూ నిర్వహించిన సమర్థవంతంగా ఎదుర్కొనేలా పార్టీ శ్రేణులను సిద్ధం చేయడమే ఈ సమావేశాల లక్ష్యమని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వాన 19 నెలల్లో రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమంలో పరుగులు పెడుతున్నందున ప్రభుత్వ పథకాలను పార్టీ శ్రేణులు ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. కాగా, సత్తుపల్లి నియోజకవర్గం వేంసూరు మండలం నుండి సమర శంఖారావం సమావేశాలు ప్రారంభమవుతాయని, ప్రతీ మండలంలోని ఒక గ్రామంలో సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. ఇదే సమయాన పార్టీ బలోపేతానికి గ్రామస్థాయి నుండి అన్ని కమిటీలు ఏర్పాటు చేస్తున్నామని దుర్గాప్రసాద్, నాగేశ్వరరావు వెల్లడించారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నూతి సత్యనారాయణగౌడ్, నాయకులు దొబ్బల సౌజన్య, మొక్కా శేఖర్గౌడ్, సీతారాములు, వేజెండ్ల సాయికుమార్, సయ్యద్ ముజాహిద్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల, గిడ్డంగుల సంస్థ చైర్మన్ నాగేశ్వరరావు -
విద్యుదుత్పత్తిపై ముందస్తు ప్రణాళిక ఉండాలి
పాల్వంచ: విద్యుత్ ఉత్పత్తి కోసం ముందస్తు ప్రణాళిక ఉండాలని టీజీ జెన్కో డైరెక్టర్(థర్మల్) వై.రాజశేఖర్ రెడ్డి అన్నారు. పాల్వంచలోని కేటీపీఎస్ 5, 6వ దశల కర్మాగారంలో సోమవారం ఆయన డైరెక్టర్గా బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బి.లక్ష్మణ్, జనరేషన్ సీఈ పి.రత్నాకర్తో కలిసి కోల్ ప్లాంట్, వ్యాగన్ టిప్లర్, బీఓబీఆర్లో పర్యటించారు. అనంతరం అధికారులతో నిర్వహించిన సమీక్షలో మాట్లాడుతూ.. వర్షాకాలంలో విద్యుత్ ఉత్పత్తికి ఎలాంటి అంతరాయం లేకుండా చూడాలని సూచించారు. కార్యక్రమంలో కేటీపీఎస్ 5, 6వ దశల సీఈ ఎం. ప్రభాకర్ రావు తదితరులు పాల్గొన్నారు. కాగా, విద్యుత్ సంస్థల్లో ఇంజనీర్లకు బదిలీ పాలసీ రూపొందించాలని పవర్ ఇంజనీర్స్ అసోసియేషన్ల నాయకులు డైరెక్టర్లు రాజశేఖర్రెడ్డి, లక్ష్మయ్యకు వినతిపత్రం అందించారు. ఖాళీగా ఉన్న ఏఈ పోస్టులు భర్తీ చేయాలని, కేటీపీఎస్లో నూతన కర్మాగారం నిర్మించాలని కోరారు. జెన్కో డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి -
భగీరథ ప్రయత్నం!
ఎత్తిపోతలు ఇలా... సీతారామ ఎత్తిపోతల పథకం నుంచి రాజీవ్ లింక్ కెనాల్ ద్వారా 590 క్యూసెక్కుల నీటిని మధిర బ్రాంచ్ కెనాల్కు 51వ కిలోమీటర్ వద్ద ఎన్నెస్పీ కెనాల్లో ఎత్తిపోస్తారు. ఆ తర్వాత 51.7వ కిలోమీటర్ వద్ద తూము నిర్మించి ఒక ఫీడర్ కెనాల్ ద్వారా వైరా నదికి తరలిస్తారు(రిజర్వాయర్ దిగువకు). అలా వచ్చిన నీటిని వంగవీడు దగ్గర నిర్మించే చెక్ డ్యాం వద్ద నిల్వ చేస్తారు. ఆపై అక్కడ నిర్మించనున్న పంప్ హౌస్లోని మూడు పైప్లైన్ల ద్వారా రెండు మండలాలకు నీటిని తరలిస్తారు. మధిర: పూర్తిగా వ్యవసాయాధారిత ప్రాంతమైన మధిర నియోజకవర్గంలోని మధిర, ఎర్రుపాలెం మండలాలు సాగర్ ఆయకట్టు కింద జోన్–3లో ఉన్నాయి. దీంతో ప్రాజెక్టు నుంచి ఏపీకి నీరు వెళ్లాక అక్కడి నుంచి ఈ మండలాలకు చేరేలోగా విడుదల నిలిపివేస్తుండడంతో ఆయకట్టు రైతులు నష్టపోతున్నారు. ఈనేపథ్యాన మల్లు భట్టి విక్రమార్క డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించగా ఈ పరిధిని జోన్–3 నుంచి జోన్–2కు మార్పు చేయించారు. అంతేకాక మధిర, ఎర్రుపాలెం మండలంలోని సుమారు 33వేల ఎకరాలకు సాఫీగా నీరు అందేలా జవహర్ ఎత్తిపోతల పథకానికి రూపకల్పన చేశారు. త్వరలోనే శంకుస్థాపన చేయనున్న ఈ పథకం ద్వారా రెండు మండలాల రైతుల ఇక్కట్లు తీరనున్నాయి. ఇదీ ప్రాజెక్టు స్వరూపం మధిర మండలంలోని వంగవీడు సమీపాన వైరా నదిపై చెక్డ్యాం నిర్మిస్తారు. అక్కడ జవహర్ ఎత్తిపోతల పథకాన్ని నిర్మించి మధిర, ఎర్రుపాలెం మండలాల్లోని చివరి భూములకు సాగునీరు అందించేలా ప్రణాళిక రూపొందించారు. ఇప్పటికే ఎత్తిపోతల పథకానికి రూ.630.30 కోట్ల నిధులు మంజూరు చేయగా, ఈ ప్రాజెక్టు కింద మధిర, ఎర్రుపాలెం మండలాల్లోని సాగర్ ఆయకట్టును స్థిరీకరిస్తారు. ఇందుకోసం 250ఎకరాల భూసేకరణ చేయాల్సి ఉంది. కాగా, ఈ ప్రాజెక్టును ఏడాదిన్నర కాలంలో పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. పైప్లైన్ల ఏర్పాటు వంగవీడు దగ్గర పంప్హౌస్ నుంచి మొదటి పైప్లైన్ ద్వారా11 కి.మీ. దూరంలోని నిధానపురం మేజర్లోకి నీరు ఎత్తిపోస్తారు. దీంతో మధిర మండలంలోని 17,309 ఎకరాల ఆయకట్టు భూములకు సాగునీరు అందుతుంది. ఈ జాబితాలో మధిర మండలంలోని అంబారుపేట, చిలుకూరు, దెందుకూరు, ఇల్లందులపాడు, ఖమ్మంపాడు, మధిర, మాటూరు, నాగవరప్పాడు, నిధానపురం, సైదల్లిపురం, సిద్ధినేనిగూడెం, తొండల గోపవరం, తొర్లపాడు గ్రామాలు ఉన్నాయి. అలాగే, 2, 3వ పైప్లైన్ల ద్వారా ఎర్రుపాలెం మండలంలోని మైలవరం, జమలాపురం మేజర్ కాల్వల్లోకి నీటిని లిఫ్ట్ చేస్తారు. మైలవరం మేజర్ కెనాల్ ద్వారా 5,093 ఎకరాలకు, జమలాపురం కెనాల్ ద్వారా 10,623 ఎకరాలకు సాగునీరు సరఫరా అవుతుంది. తద్వారా రెండు మండలాల్లోని 33,025 ఎకరాల చివరి భూములకు సైతం సాగునీరు సాఫీగా అందనుంది. ఈ భూములు ఎర్రుపాలెం మండలంలోని రాజుపాలెం, రంగగూడెం, తాటిగూడెం, త్రిపురవరం, రేమిడిచర్ల, కేసిరెడ్డిపల్లి, జమలాపురం, ఎర్రుపా లెం, గుంటుపల్లి గోపవరం, భీమవరం, అయ్యవారిగూడెం, మామునూరు, చొప్పకట్లపాలెం, బనిగండ్లపాడు, పెద్ద గోపవరం, పెగళ్లపాడు, ఇనగాలి గ్రామాల్లో ఉన్నాయి. ‘జవహర్’ ఎత్తిపోతల పథకం నిర్మాణానికి అడుగులు 4.66 టీఎంసీల నీరు సాగర్ కాల్వలకు తరలింపు రూ.630.30 కోట్ల వ్యయంతో నిర్మాణానికి ప్రణాళిక మధిర, ఎర్రుపాలెం మండలాల్లో చివరి ఆయకట్టుకు భరోసానష్టాలు ఎదురుకావు.. మేజర్ జోన్–3 చివరలో నిధానపురం ఉంటుంది. కాల్వకు సాగర్ నీరు రాకపోవడంతో ఇబ్బందిగా ఉంది. రూ.లక్షల్లో పెట్టుబడి పెట్టిన పంటలకు చివరలో నీరు అందక ఎండిపోతున్నాయి. లిఫ్ట్ పూర్తయితే మూడు పంటలు పండించి నష్టాలను అధిగమిస్తాం. – చావలి బాలరాజు, రైతు నాగవరప్పాడు మా కష్టాలు తీరతాయి... సాగర్ కెనాల్ ద్వారా మధిర, ఎర్రుపాలెం మండలాలకు నీరు రావడం లేదు. రెండు, మూడేళ్లకోసారి కూడా నీరు అందక పంటలు నష్టపోతున్నాం. ఇప్పుడు మా గ్రామ సమీపాన నిర్మించే ఎత్తిపోతల పథకం పూర్తయితే ఇక్కడి రైతుల కష్టాలు తీరతాయి. – ఐలూరి సత్యనారాయణరెడ్డి, రైతు వంగవీడు -
ప్రజావాణిపై విశ్వాసం పెరగాలి..
కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఖమ్మం సహకారనగర్: ప్రజలు అందించే ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించడం ద్వారా ప్రజావాణి(గ్రీవెన్స్ డే)పై విశ్వాసం పెంపొందించాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. కలెక్టరేట్లో సోమవారం ప్రజావాణిలో భాగంగా అదనపు కలెక్టర్లు శ్రీజ, శ్రీనివాసరెడ్డితో కలిసి ఆయన ఫిర్యాదులు, వినతిపత్రాలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 2025 జనవరి నుండి ఇప్పటి వరకు పెండింగ్ ఉన్న185 దరఖాస్తులను వారంలోగా పరిష్కరించాలన్నారు. అలాగే, జిల్లా అధికారులు ప్రతీ వారం మండలాల వారీగా ప్రజావాణి దరఖాస్తులపై సమీక్షించాలని సూచించారు. ఈకార్యక్రమంలో డీఆర్ఓ ఏ.పద్మశ్రీ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. కాగా, ఖమ్మం అర్బన్ మండలం వినోబా(నవోదయ) కాలనీలో కోర్టు ఉత్తర్వుల మేరకు తాగునీరు, కరెంట్ వంటి మౌలిక వసతులు కల్పించాలని కోరారు. అలాగే, గ్రీన్ఫీల్డ్ హైవే మార్గంలో వైరా మండలం గండగలపాడు వద్ద సర్వీస్ రోడ్డు ఏర్పాటుచేయాలని, హైవే నిర్మాణంతో దెబ్బతిన్న సాగునీటి కాల్వలను పునరుద్ధరించాలని తెలంగాణ రైతు సంఘఽం నాయకులతో కలిసి రైతులు వినతిపత్రం అందజేశారు. ఇవి కాక ఇంకొన్ని అంశాలు వినతిపత్రాలు, ఫిర్యాదులు అందాయి. ఓపెన్ స్కూల్ బుక్లెట్ల ఆవిష్కరణ తెలంగాణ ఓపెన్ స్కూల్లో ప్రవేశాలపై అవగాహన కల్పించేలా రూపొందించిన బుక్లెట్లను కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆవిష్కరించారు. ఓపెన్ స్కూల్ జిల్లా కోఆర్డినేటర్ మద్దినేని పాపారావు, వయోజన విద్య డీడీ అనిల్, డీఈఓ కార్యాలయ ఉద్యోగి చావా శ్రీనివాసరావు పాల్గొన్నారు. అలాగే, ప్రైవేట్ కాలేజీలో ఫార్మసీ చదువుతున్న వేగినాటి దీపిక ఫీజు కోసం హెల్పింగ్ హాండ్స్ సంస్థ సభ్యుడు మద్దినేని ప్రసాదరావు కమల సమకూర్చిన రూ.35 వేల చెక్కును కలెక్టర్ చేతుల మీదుగా అందజేశారు. ఈకార్యక్రమంలో యలమద్ది వెంకటేశ్వర్లు, సిరిపురపు రమణారావు, కొంగర పురుషోత్తమరావు, ఏపూరి నాగేశ్వరరావు, మద్దినేని కమల తదితరులు పాల్గొన్నారు.పైలట్గా 15 పాఠశాలలు జిల్లాలో 15 ప్రభుత్వ పాఠశాలలను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి ఆదర్శంగా తీర్చిదిద్దాలని కలెక్టర్ అనుదీప్ సూచించారు. కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజతో కలిసి అధికారులతో సమీక్షించిన ఆయన 15 పాఠశాలలను ఎంపిక చేసి, రాష్ట్ర విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళితో సమన్వయం చేసుకుంటూ పనులు చేపట్టాలన్నారు. ఇందుకోసం రూ.12 కోట్ల సీఎస్ఆర్ నిధులు కేటాయిస్తామని తెలిపారు. ఇక మధిరలో జీ+2 విధానంలో ఇందిరమ్మ ఇళ్లు నిర్మించేలా ప్రతిపాదనలు సమర్పించాలని కలెక్టర్ సూచించారు. అక్కడ 13 ఎకరాల స్థలంలో 427 ఇళ్ల నిర్మాణంపై దృష్టి సారించాలని తెలిపారు. జెడ్పీ సీఈఓ దీక్షా రైనా, హౌసింగ్ పీడీ భూక్యా శ్రీనివాస్, విద్యాశాఖ ప్లానింగ్ కో ఆర్డినేటర్ రామకృష్ణ పాల్గొన్నారు. -
వన మహోత్సవానికి రెడీ..
● శాఖల వారీగా మొక్కలు నాటడానికి ఏర్పాట్లు ● 35.23 లక్షల మొక్కలు నాటేలా కార్యాచరణ ● ఎంపిక చేసిన ప్రాంతాల్లో బ్లాక్ ప్లాంటేషన్ కూడా..ఖమ్మంవ్యవసాయం: మానవ మనుగడ, పర్యావరణ పరిరక్షణ, సమతుల్యతకు మొక్కల పెంపకం కీలకంగా నిలుస్తుంది. ఈనేపథ్యాన ప్రభుత్వం ఏటా మాదిరిగానే ఈసారి వన మహోత్సవం పేరిట కార్యక్రమ నిర్వహణకు సిద్ధమవుతోంది. ఈ ఏడాది పది ప్రభుత్వ శాఖలను ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేశారు. అటవీ శాఖతో పాటు జిల్లా గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ, ఉద్యాన, పట్టు పరిశ్రమ, ఎకై ్సజ్, మున్సిపల్, విద్యాశాఖతో పాటు పరిశ్రమలు, గనులు, భూగర్భ శాఖలకు కార్యక్రమ నిర్వహణ బాధ్యత అప్పగించారు. ఇప్పుడిప్పుడే వర్షాలు కురుస్తున్న నేపథ్యాన మొక్కలు నాటడం మొదలుపెట్టి ఆగస్టు మొదటి వారానికి పూర్తి చేయాలనే లక్ష్యంతో జిల్లా యంత్రాంగం ప్రణాళిక రూపొందించింది. అటవీ శాఖ ద్వారా 5.47లక్షలు ఈ ఏడాది వన మహోత్సవంలో జిల్లా అంతటా కలిపి 35,23,300 మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఇందులో అటవీ శాఖ తరఫున ఖమ్మం డివిజన్ నుంచి 2,47,200, సత్తుపల్లి డివిజన్లో 3లక్షలు మొక్కలు నాటాల్సి ఉంది. రిజర్వ్ ఫారెస్ట్తో పాటు ఇతర ప్రాంతాల్లో ఈ మొక్కలు నాటుతారు. అలాగే, మున్సిపల్ శాఖ ద్వారా ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 3,08,920 మొక్కలు నాటనున్నారు. అంతేకాక మధిర, సత్తుపల్లి మున్సిపాలిటీల్లో 2,41,740 చొప్పున, కల్లూరులో 65వేలు, వైరాలో 50వేలు, ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో 40వేల మొక్కలు నాటాల్సి ఉంటుంది. ఇంకా మిగతా శాఖలకు కూడా లక్ష్యాలను కేటాయించారు. మూడు చోట్ల బ్లాక్ ప్లాంటేషన్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో బ్లాక్ ప్లాంటేషన్ పేరిట ఒకే చోట ఎక్కువ సంఖ్యలో మొక్కలు నాటాలని నిర్ణయించారు. అటవీ శాఖ ఆధ్వర్యాన ఈ కార్యక్రమం చేపడుతారు. ఎంపిక చేసిన ప్రాంతంలో పెద్దసంఖ్యలో నాటి సంరక్షించడం ద్వారా చిట్టడివి మాదిరి తీర్చిదిద్దడం ఈ కార్యక్రమ లక్ష్యం. ఇందుకోసం రఘునాథపాలెం మండలంలో 15 ఎకరాలు, తిరుమలాయపాలెం మండలంలో ఐదు నుంచి ఏడు ఎకరాలు గుర్తించగా, పులిగుండాల వద్ద ఎకోటూరిజంలో భాగంగా 25 ఎకరాల్లో 11,100 మొక్కలు నాటనున్నారు. సిద్ధంగా మొక్కలు వన మహోత్సవం కార్యక్రమానికి అవసరమైన మొక్కలు నర్సరీల్లో సిద్ధంగా ఉన్నాయి. గ్రామీణాభివృద్ధి సంస్థ, పంచాయతీరాజ్, అటవీ శాఖలు ఎన్ఆర్ఈజీఎస్, హరితనిధి వంటి పథకాల ద్వారా నర్సరీలు నిర్వహిస్తున్నాయి. ఈసారి నీడ, పండ్లు, పూలను ఇచ్చే మొక్కలే కాక ఔషధ మొక్కలు నాటాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు చింతచెట్లు, ఈత చెట్లు, చందనం వృక్షాలే కాక నేరేడు, జామ, సీతాఫలం, దానిమ్మ వంటి పండ్ల మొక్కలతో పాటు ఉసిరి, మునగ, గానుగ, నారవేప, రావి, మర్రి, వేప వంటి మొక్కలు సిద్ధం చేశారు. విద్యార్థుల భాగస్వామ్యం.. ఈ ఏడాది వన మహోత్సవంలో విద్యార్థులను ఎక్కువగా భాగస్వామ్యం చేయనున్నాం. ప్రభుత్వ శాఖలతో పాటు వనసంరక్షణ సమితి సభ్యులు, ప్రజలను కలుపుకుంటూ మొక్కలు నాటుతాం. ఇప్పటికే నర్సరీల్లో మొక్కలు సిద్ధంగా ఉన్నందున త్వరలోనే కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. – సిద్ధార్థ్ విక్రమ్ సింగ్, జిల్లా అటవీ అధికారి -
గురుకులాల్లో అదనపు కలెక్టర్ తనిఖీ
కొణిజర్ల: అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ సోమవారం సాయంత్రం కొణిజర్ల మండలంలోని పలు గురుకులాలను తనిఖీ చేశారు. అమ్మపాలెంలోని మైనార్టీ బాలురు గురుకుల పాఠశాల, జ్యోతిబాపూలే బీసీ బాలుర గురుకులాలను తనిఖీ చేసిన ఆమె వసతి, వంట గదులు, మెస్లను పరిశీలించడమే కాక వంట తయారీకి ఉపయోగిస్తున్న సరుకుల నాణ్యతపై ఆరా తీశారు. విద్యార్థులకు ఉత్తమ బోధనతో పాటు నాణ్యమైన ఆహారం అందించాలని సూచించారు. ప్రిన్సిపాళ్లు బి.నాగమణి, జితేష్ సాహిల్, ఉద్యోగులు సీహెచ్.రంజిత్, నిర్మల, యాకూబ్పాషా, తులసి పాల్గొన్నారు. కేఎంసీ కమిషనర్.. ఖమ్మంమయూరిసెంటర్: ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అభిషేక్ అగస్త్య సోమవారం పలు గురుకులాలను తనిఖీ చేశారు. అక్కడ విద్యార్థులతో మాట్లాడి సౌకర్యాలపై ఆరా తీయడమే కాక, అవసరమైన సామగ్రి, తాగునీరు, విద్యుత్ సదుపాయాలపై నివేదిక ఇవ్వాలని అధికారులకు సూచించారు. రేషన్ లబ్ధిదారులు ఈ కేవైసీ చేయించుకోవాలి ఖమ్మం సహకారనగర్: రేషన్ కార్డుదారులంతా రేషన్ షాపుల్లో ఈ కేవైసీ చేయించుకోవాలని జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి చందన్కుమార్ సూచించారు. జిల్లాలో 4,15,905 కార్డులకు 12,03,943 మంది లబ్ధిదారులు ఉన్నారని తెలిపారు. వీరిలో 9,64,236 మంది మాత్రమే ఈ కేవైసీ చేయించుకున్న నేపథ్యాన మిగతా వారు కూడా ముందుకు రావాలని తెలిపారు. కాగా, హోటళ్లు, హాస్టళ్లలో గృహోపయోగ గ్యాస్ సిలిండర్లను వినియోగిస్తే చర్యలు తీసుకుంటామని డీసీఎస్ఓ హెచ్చరించారు. ఖమ్మంలోని పలు ప్రాంతాల్లో సోమవారం చేపట్టిన తనిఖీల్లో సిలిండర్లు స్వాధీం చేసుకుని బాధ్యులపై కేసు నమోదు చేశామని తెలిపారు. నేటితో ముగియనున్న ఎప్సెట్ కౌన్సెలింగ్ ఖమ్మం సహకారనగర్: ఎప్సెట్లో అర్హత సాధించిన విద్యార్థులకు ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాలు కల్పించేందుకు చేపట్టిన కౌన్సెలింగ్ మంగళవారం ముగియనుంది. ఖమ్మంలోని ఎస్ఆర్బీజీఎన్ఆర్ కళాశాలలో గత వారం రోజులుగా సర్టిఫికెట్ల పరిశీలన జరుగుతోంది. ఈ కౌన్సెలింగ్ మంగళవారం ముగియనుందని ప్రిన్సిపాల్ డాక్టర్ మొహ్మద్ జాకిరుల్లా, కౌన్సెలింగ్ కోఆర్డినేటర్ చందా సుధాకర్ తెలిపారు. కాగా, సోమవారం 800 మంది విద్యార్థులు స్లాట్ బుక్ చేసుకోగా 760మంది హాజరయ్యారని వెల్లడించారు. గెజిటెడ్ అధికారులకే ‘స్వగృహ’ ఫ్లాట్లు ఖమ్మం సహకారనగర్: తొలుత నిర్ణయించినట్లుగా గెజిటెడ్ అధికారులకే మాత్రమే రాజీవ్ స్వగృహ సముదాయంలో ఫ్లాట్లు ఇవ్వనున్నామని టీజీవోస్ రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు తెలిపారు. ఖమ్మంలోని టీజీవోస్ భవన్లో జరిగిన సొసైటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ గెజిటెడ్ అధికారుల హౌస్ బిల్డింగ్ సొసైటీలో ఉమ్మడి జిల్లా నుంచి ఇప్పటి వరకు 1,012మంది సభ్యులుగా చేరారని తెలిపారు. ఇందులో పలువురు బ్యాంక్లో నగదు డిపాజిట్ చేశారని చెప్పారు. ఈనెల 10వ తేదీలోపు అందరూ డిపాజిట్ చేయాలని సూచించారు. ఈసమావేశంలో సొసైటీ అధ్యక్ష, కార్యదర్శులు కట్టా కిషోర్, విజయ్కుమార్, టీజీవోస్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కస్తాల సత్యనారాయణ, మోదుగు వేలాద్రితో పాటు శేషుప్రసాద్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. రామయ్యకు ముత్తంగి అలంకరణభద్రాచలం: భద్రాచలంలో శ్రీ సీతారామచంద్ర స్వామి మూలమూర్తులు సోమవారం ముత్తంగి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చి కనువిందు చేశారు. తెల్లవారుజామున గర్భగుడిలో సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన, తది తర పూజలు చేశారు. అనంతరం స్వామివారిని మేళతాళాల నడుమ బేడా మండపంలో కొలువుదీర్చారు. విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం అనంతరం స్వామివారికి కంకణ ధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్య కల్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. -
ఇంకా అందని యూనిఫామ్
ఎర్రుపాలెం: విద్యార్థులు అంతా సమానమేనన్న భావనతో ఉండేలా ప్రభుత్వం యూనిఫామ్ పంపిణీ చేస్తోంది. కానీ ఆచరణలో ఇది సాఫీగా సాగడం లేదు. విద్యాసంవత్సరం ప్రారంభమై నెల కావొస్తున్నా చాలా మంది విద్యార్థులకు ఒకే జత యూనిఫాం అందగా.. ఇంకొందరికి అది కూడా పంపిణీ చేయకపోవడంతో ఒక్కో పాఠశాలలో విద్యార్థులు కొందరు యూనిఫామ్తో, ఇంకొందరు సాధారణ దుస్తుల్లో హాజరవుతున్నారు. జిల్లాలోని అన్ని యాజమాన్యాల పాఠశాలలు 1,269 ఉండగా, వీటిలో 69,241 మంది చదువుతున్నారు. వీరందరికీ రెండు జతల యూనిఫామ్ అందించేలా క్లాత్ను మండలాలకు సరఫరా చేశారు. ఇప్పటివరకు జిల్లాలోని 66,868 మందికి ఒకే జత యూని ఫామ్ పంపిణీ పూర్తయిందని అధికారులు చెబుతున్నారు. కానీ క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే ఆ పరిస్థితి కనిపించడం లేదు. ఉతికితేనే యూనిఫామ్ జిల్లాలోని చాలా పాఠశాలల్లో విద్యార్థులకు ఒక జత యూనిఫామ్ కూడా నేటికీ అందలేదని తెలుస్తోంది. కొన్ని చోట్ల 7నుంచి 10వ తరగతుల వారికి ఒక జత అందించగా, ఆరో తరగతి విద్యార్థులకు అదీ పంపిణీ చేయలేదు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో దాదాపు 3వేల మందికి పైగా విద్యార్థులు ఆరో తరగతిలో కొత్తగా చేరినట్లు అంచనా. కొలతలు తీసుకోలేదని చెబుతూ వీరికి యూనిఫామ్ ఇవ్వలేదని తెలుస్తోంది. ఇక ఒకటే జత అందుకున్న విద్యార్థులు ఏ రోజుకారోజు ఉతికితేనే తెల్లారి పాఠశాలలకు యూనిఫామ్తో వెళ్లాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. నగదు తక్కువ కావడంతో.. యూనిఫామ్ కుట్టించే బాధ్యతను మహిళా సమాఖ్యలకు అప్పగించారు. సమాఖ్యల్లోని సభ్యులకు టైలరింగ్ వస్తే యూనిఫామ్ సొంతంగా కుడుతున్నారు. ఆ పరిస్థితి లేని చోట స్థానిక టైలర్లతో కుట్టిస్తున్నారు. ఒక జత యూనిఫామ్ కుట్టినందుకు ప్రభుత్వం రూ.70 చెల్లిస్తుండడంతో ఆ నగదు సరిపోదనే భావనతో టైలర్లు ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. ఈ కారణంగా రెండో జత యూనిఫామ్ పంపిణీలో జాప్యం జరుగుతున్నట్లు సమాచారం. ఇకనైనా మండలస్థాయి కమిటీల్లో సభ్యులైన తహసీల్దార్, ఎంఈఓ, ఐకేపీ ఏపీఎంలు దృష్టి సారిస్తేనే సమస్యకు పరిష్కారం లభించనుంది. ఒకరికే యూనిఫామ్ మా ఇద్దరు కుమారులు మీనవోలు స్కూల్లో ఏడు, ఆరో తరగతి చదువుతున్నారు. ఏడో తరగతి చదివే కుమారుడికి ఒక జత యూనిఫామ్ ఇవ్వగా, చిన్నకుమారుడికి అసలే ఇవ్వలేదు. దీంతో నాకెందుకు ఇవ్వలేదని అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోతున్నాం. – గుర్రాల వెంకటేశ్వరరెడ్డి, జెడ్పీ పాఠశాల పేరంట్, మీనవోలుమా స్కూల్కు యూనిఫాం రాలేదు.. మా పాఠశాలలోని 70 మంది విద్యార్థులకు ఒక జత కూడా యూనిఫామ్ రాలేదు. మహిళా సమాఖ్యలో అడిగితే కుట్టడం కాలేదని చెప్పారు. దీంతో యూనిఫామ్ కోసం తల్లిదండ్రులు ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఈ విషయాన్ని అధికారులకు దృష్టికి తీసుకెళ్లాం. – జంగా గురునాధరెడ్డి, పీఎస్(బీసీ కాలనీ) హెచ్ఎం, బనిగండ్లపాడు15న నాటికి రెండో జత జిల్లాలోని విద్యార్థులందరికీ 15వ తేదీ నాటికి రెండో జత యూనిఫామ్ ఇస్తాం. ఇప్పటికే యూనిఫామ్ కుట్టడం 30శాతం పూర్తయింది. ఈ ఏడాది ఆరో తరగతిలో చేరిన విద్యార్థుల కొలతలు తీసుకుంటున్నాం. వీరికి కూడా త్వరలోనే పంపిణీ చేస్తాం. – సామినేని సత్యనారాయణ, డీఈఓ 7–10వ తరగతి విద్యార్థులకు ఒకటే జత పంపిణీ ఆరో తరగతి విద్యార్థులకు అదీ అందని వైనం -
లింక్ పంపి.. డబ్బులు చోరీ..
రఘునాథపాలెం: స్మార్ట్ఫోన్ను ప్రతీ ఒక్కరు విరవిగా వాడుతున్నారు. బ్యాంకింగ్ సేవలు, పేమెంట్ యాప్స్ వాడకం ఎక్కువగా ఉండటంతో సాధారణ ప్రజలు కూడా స్మార్ట్ఫోన్ వినియోగిస్తున్నారు. అయితే, అమాయక ప్రజలు సైబర్ మోసాల బారినపడుతున్నారు. ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాల ప్రజలను లక్ష్యంగా చేసుకున్న సైబర్ నేరగాళ్లు తప్పుడు యాప్స్, గిఫ్ట్ లింకులు, ఫేక్ కాల్స్ ద్వారా వారి బ్యాంకు ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. నగరాల్లోనే కాక, రూరల్ ప్రాంతాల్లోనూ మొబైల్ బ్యాంకింగ్, గూగుల్ పే, ఫోన్ పే వంటివి విస్తృతంగా వాడకంలో ఉన్నాయి. దీనిని ఆసరాగా చేసుకున్న మోసగాళ్లు మొబైల్కు సందేశాల రూపంలో ‘గిఫ్ట్ లభించింది‘, ‘మీకు లాటరీ వచ్చింది‘, లేదా ‘వివరాలు అప్డేట్ చేయాలి‘ అంటూ తప్పుడు లింకులు పంపుతున్నారు. అమాయకులు వాటిని ఓపెన్ చేస్తే, వారి ఫోన్ హ్యాకింగ్కు గురై ఖాతాల్లోని డబ్బులు మాయమవుతున్నాయి. రఘునాథపాలెం మండలంలో ఒక్క వారం వ్యవధిలోనే నాలుగు కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. కొందరు రూ.50,000 నుంచి రూ.80,000 వరకు నష్టపోయారు. ఇక పరువు పోతుందని భావించి చాలామంది మోసపోయిన విషయాన్ని బయటపెట్టడంలేదు. కాగా, సైబర్ మోసగాళ్లు మరో పంథాను ఎంచుకుంటున్నారు. ‘మీ పిల్లలు కేసులో ఇరుక్కున్నారు.. డబ్బులు పంపించకపోతే అరెస్ట్ చేస్తాం’ అంటూ వాట్సాప్ కాల్స్ చేస్తూ బెదిరింపులకు దిగుతున్నారు. ఈ తరహా మోసాలతో భయపడిన కొన్ని కుటుంబాలు డబ్బులు పంపించిన ఘటనలు ఉన్నాయి. పోలీసులు అవగాహన కల్పిస్తున్నా, సైబర్ నేరగాళ్లు కొత్త పంథాలో మోసాలకు పాల్పడుతున్నారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ‘ఏ సందేశమైనా, యాప్ అయినా డౌన్లోడ్ చేసేముందు తాను ఎవరితో డీలింగ్ చేస్తున్నానో తెలుసుకోవాలి. ఎవరికై నా డబ్బులు పంపేముందు నమ్మదగిన వ్యక్తుల దగ్గర సలహా తీసుకోవాలి’ అని అధికారులు సూచిస్తున్నారు. సక్రమమైన బ్యాంకింగ్ యాప్ల ద్వారా మాత్రమే లావాదేవీలు చేయాలని, గుర్తు తెలియని లింకులు క్లిక్ చేయొద్దని విజ్ఞప్తి చేస్తున్నారు. అప్రమత్తంగా ఉండాలి.. ప్రతీ ఒక్కరు సైబర్ మోసాల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. సాధ్యమైనంత మేర తెలిసిన వారి ద్వారానే యాప్ల ద్వారా లావాదేవీలు సాగించాలి. వచ్చిన ప్రతి మేసేజ్లను క్లిక్ చేయకుండా తెలియక పోతే తెలిసిన వారికి చూపించిన తర్వాతనే ముందుకు సాగాలి. సైబర్ మోసం జరిగినట్లు గుర్తించిన వెంటనే టోల్ఫ్రీ నంబర్కు సమాచారం అందించి బ్యాంక్ లావాదేవీలను ఆపించాలి. కొత్త వ్యక్తులు పంపే లింక్లను ఓపెన్ చేయొద్దు. ఓటీపీలను చెప్పేముందు ఒకటికి రెండు సార్లు ఆరా తీయాలి. – ఉస్మాన్షరీఫ్, సీఐ రఘునాథపాలెం గ్రామీణ ప్రజలను టార్గెట్ చేస్తున్న సైబర్ మోసగాళ్లు రఘునాథపాలెం పీఎస్లో 7 కేసులు ఒక్క రఘునాథపాలెం మండలం పరిధిలోని వివిధ గ్రామాల్లో సైబర్ మోసగాళ్ల వలలో పడి అనేక మంది డబ్బులు పొగొట్టుకున్నప్పటికీ ఏడుగురు బాధితులు మాత్రమే పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారం రోజుల్లోనే ఈర్లపుడి నుంచి శ్రీనివాస్, రఘునాథపాలెం నుంచి శంకర్, పరికలబోడుతండా వాసి సంతోష్, తాటాకులతండా మహిళ ఇచ్చిన ఘటలనపై నాలుగు కేసులు నమోదు చేశారు. -
అణగారిన వర్గాల ఆశాజ్యోతి జగ్జీవన్రామ్
ఖమ్మంమయూరిసెంటర్: సమాజంలో అణగారిన వర్గాల సంక్షేమం కోసం అలుపెరుగని కృషి చేసిన మహనీయుడు భారత మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్రామ్ అని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు అన్నారు. ఆదివారం ఖమ్మంలోని డీసీసీ కార్యాలయం సంజీవరెడ్డిభవన్లో బాబు జగ్జీవన్రామ్ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జగ్జీవన్రామ్ భారతదేశ చరిత్రలో మహోన్నతమైన వ్యక్తి అని పేర్కొన్నారు. కార్యక్రమంలో మొక్కా శేఖర్గౌడ్, సయ్యద్గౌస్, సయ్యద్ ముజాహిద్, హుస్సేన్, గజ్జెల్లి వెంకన్న, మలీదు వేంకటేశ్వరరావు, లకావత్ సైదులునాయక్, దుద్దుకూరి వేంకటేశ్వరరావు, యడ్లపల్లి సంతోష్, జెర్రిపోతుల అంజనీకుమార్, మిక్కిలినేని నరేంద్ర, కొట్టేముక్కల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఆగి ఉన్న ట్రాక్టర్ను ఢీకొట్టిన లారీ.. ● వ్యక్తి దుర్మరణంములకలపల్లి: ఆగి ఉన్న ట్రాక్టర్ను ఓ లారీ ఢీకొట్టిన ఘటనలో ఓ వ్యక్తి దుర్మరణంపాలయ్యాడు. కొత్తగంగారం అటవీ ప్రాంతంలో శనివారం అర్ధరాత్రి చోటు చేసుకున్న ఈ సంఘటన వివరాలను ఎస్సై కిన్నెర రాజశేఖర్ ఇలా తెలిపారు. అశ్వారావుపేట మండలం దురదపాడు గ్రామానికి చెందిన కుర్సం అర్జున్రావు(38) స్నేహితులతో కలిసి ట్రాక్టర్పై ములకలపల్లి మండలంలోని పాతగుండాలపాడు వెళ్తున్నాడు. ఈ క్రమంలో మూత్రవిసర్జన నిమిత్తం ట్రాక్టర్ను కొత్తగంగారం అటవీ ప్రాంతంలో ఆపగా.. అటు వైపుగా వస్తున్న లారీ వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. దీంతో ట్రాక్టర్ డ్రైవర్ సీటు పక్కన కూర్చున్న అర్జున్రావు తలకు తీవ్రగాయమై అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి భార్య పద్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. గంజాయి స్వాధీనం ● నలుగురిపై కేసు నమోదుపాల్వంచరూరల్: ఒరిస్సా నుంచి తీసుకొచ్చి స్థానికంగా గంజాయిని విక్రయిస్తున్న నలుగురు యువకులను పోలీసులు పట్టుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. మండల పరిధి సోములగూడెం వైపు వెళ్లే మార్గంలో ఆదివారం ఎస్సై సురేష్ పెట్రోలింగ్ నిర్వహిస్తున్నాడు. ఈక్రమంలో జామాయిల్ తోటలో పాల్వంచకు చెందిన షకీర్, గోపి, జగన్నాధపురం గ్రామానికి చెందిన చరణ్, శ్రీరాంలు అనుమానస్పదంగా సంచరించడంతో వారిని పట్టుకుని విచారించారు. దీంతో వారి వద్ద ఒరిస్సాలోని బెజంగూడా నుంచి రూ.19వేల విలువ కలిగిన 380 గ్రామాల గంజాయి లభించింది. గంజాయిని స్వాధీనం చేసుకుని నలుగురు యువకులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
‘అబద్ధాలతోనే రేవంత్ పాలన’
ఖమ్మంరూరల్: అబద్ధాలు చెబుతూ సీఎం రేవంత్రెడ్డి పాలన సాగిస్తున్నారని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఏనుగుల రాకేశ్రెడ్డి విమర్శించారు. ఆదివారం ఎదులాపురం సాయిగణేశ్నగర్లోని మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్రెడ్డి క్యాంప్ కార్యాలయంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. ప్రజలు కాంగ్రెస్ పాలనను నిశితంగా గమనిస్తున్నారని, బీఆర్ఎస్ అంటే భరోసా అని, కాంగ్రెస్ అంటే కన్నింగ్ అని పేర్కొన్నారు. మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేదని, పొద్దున లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు కేసీఆర్, కేటీఆర్ను తిట్టటమే రేవంత్రెడ్డి పనిగా పెట్టుకున్నారని దుయ్యబట్టారు. రైతుబంధు నిధులు ఎగ్గొట్టారని, విత్తనాలు, ఎరువుల కోసం క్యూలైన్లో అర్ధరాత్రి వరకు నిలడబడాల్సి వస్తోందని తెలిపారు. దమ్ము, ధైర్యం ఉంటే కేటీఆర్ విసిరిన సవాల్ స్వీకరించి చర్చకు రావాలని సూచించారు. సమావేశంలో బెల్లం వేణుగోపాల్, భాషబోయిన వీరన్న, ఉన్నం బ్రహ్మయ్య, జర్పుల లక్ష్మణ్నాయక్, కోటి సైదారెడ్డి, ఉదయ్, సొడేపొంగు ప్రశాంత్, మాదాసు ఆదాం తదితరులు పాల్గొన్నారు. -
మోదీ పాలనలో ఉద్యోగాలు లేవు..
ఖమ్మంమయూరిసెంటర్: ఏటా రెండు కోట్ల ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన మోదీ పాలనలో రిటైర్మెంట్లు తప్ప రిక్రూట్మెంట్లు లేవని సీపీఐ జాతీయ సమితి సభ్యులు బాగం హేమంతరావు విమర్శించారు. సీపీఐ ఖమ్మం నగర 5వ మహాసభ ఆదివారం నగరంలోని సెయింట్ మేరీస్ హైస్కూల్ గ్రౌండ్లో నిర్వహించారు. సభకు ముందు నగరంలో సీపీఐ శ్రేణులు భారీ ప్రదర్శన నిర్వహించారు. సీపీఐ సీనియర్ నాయకులు పువ్వాడ నాగేశ్వరరావు పార్టీ జెండా ఆవిష్కరించారు. హేమంతరావు మాట్లాడుతూ.. బీజేపీ పాలనలో ప్రభుత్వ రంగం నిర్వీర్యమైందని, దేశ సంపదను ప్రైవేట్ వ్యక్తుల చేతులో పెట్టడంలో మోదీ ప్రభుత్వం రికార్డులు సృష్టించిందని విమర్శించారు. అలీన విధానానికి కేంద్ర ప్రభుత్వం తిలోదకాలు ఇచ్చి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అడుగులకు మడుగులొత్తుతున్నారని మండిపడ్డారు. మతోన్మాద బీజేపీతో దేశానికి ప్రమాదం పొంచి ఉందన్నారు. కాంగ్రెస్ అధికారం చేపట్టి 18 మాసాలు గడిచినా ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని ఆరోపించారు. అనంతరం పువ్వాడ నాగేశ్వరరావు మాట్లాడారు. సభలో పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి దండి సురేశ్, నాయకులు మహ్మద్ మౌలానా, ఏపూరి లతాదేవి, కొండపర్తి గోవిందరావు, జిల్లా కార్యవర్గ సభ్యులు పోటు కళావతి, బీజీ క్లెమెంట్, నగర కార్యదర్శి జానీమియా, మహ్మద్ సలాం, మిడికంటి వెంకటరెడ్డి, పగడాల మల్లేశ్, మేకల శ్రీనివాసరావు, జ్వాలా నర్సింహారావు, యానాలి సాంబశివారెడ్డి, నూనె శశిధర్, ఏనుగు గాంధీ పాల్గొన్నారు.సీపీఐ జాతీయ సమితి సభ్యులు హేమంతరావు -
పుష్కరాల తరుణంలో పెరుగుతున్న స్వరం
● ఏపీ విలీన పంచాయతీలను తిరిగి తేవాలని డిమాండ్ ● వసతి, సౌకర్యాలకు భూ సమస్య కూడా తీరే అవకాశం ● భద్రాచలంలో భక్తుల రద్దీగా తగినట్లు ఏర్పాట్లకు స్థలం ● మంత్రులు, ఎమ్మెల్యే, ఎంపీలు గళమెత్తాలని విన్నపాలు భద్రాచలం: గోదావరి పుష్కరాలకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. పన్నెండేళ్లకోసారి జరిగే ఈ క్రతువులో లక్షల కొద్దీ భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తారు. వారందరికీ తగిన సౌకర్యాలు కల్పించాల్సి న అవసరం ఉంది. ఇందుకోసం తాత్కాలిక వసతులు, శాశ్వత నిర్మాణాలు, మరుగుదొడ్లు, అన్నదానసత్రాలు వంటివి నిర్మించాలి. కానీ భద్రాచలంలో ఇప్పటికే భూ సమస్య వెంటాడుతోంది. ఈ నేపథ్యంలో పుష్కరాల అభివృద్ధి పనులకు భూమెక్కడ అనే ప్రశ్న తలెత్తోంది. ఏపీలో కలిపిన ఐదు పంచాయతీలను తెలంగాణలో తిరిగి విలీనం చేస్తే 2027 జూలైలో జరిగే పుష్కరాలకు భూ సమస్య తీరుతుందని భక్తులు అభిప్రాయపడుతున్నారు. వసతులు పరిమితం.. అద్దెలు అధికం శ్రీ సీతారామచంద్రస్వామివారి దర్శనం కోసం భద్రాచలం వచ్చే భక్తుల రద్దీ రోజురోజుకూ పెరుగుతోంది. దేవస్థానం కాటేజీలు, వసతి గదులు మాత్రం స్వల్ప స్థాయిలో ఉన్నాయి. దీంతో ప్రైవేట్ లాడ్జీల నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. వారాంతపు సెలవు దినాల్లో రూ. వేలల్లో అద్దె వసూలు చేస్తున్నారు. పది వేల మంది భక్తులు వస్తేనే ఇలాంటి ఇబ్బందులు తలెత్తితే పుష్కరాల సమయంలో రోజుకు లక్షకు పైగా భక్తులు వస్తారు. దీంతో వసతి సమస్య జఠిలంగా మారనుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ముందస్తుగా శాశ్వత, తాత్కాలిక వసతి నిర్మాణాలను చేపట్టాల్సి ఉంది. ఇప్పటికే కాళేశ్వరం వంటి పుణ్యక్షేత్రంలో పుష్కరాల పనులకు భూ సర్వే చేస్తున్నారు. ఐదు పంచాయతీలను కలిపితే భూమి అందుబాటులోకి.. ప్రస్తుతం భద్రాచలానికి మూడు వైపులా కిలోమీటరు పరిధి మించి విస్తీర్ణం లేదు. కానీ ఏపీలో కలిసిన గుండాల, పిచుకలపాడు, కన్నాయిగూడెం, ఎటపాక, పురుషోత్తపట్న గ్రామాలు ఇప్పటికీ భద్రాచలంలో అంతర్భాగంగానే ఉన్నాయి. రాష్ట్రాలు వేరయినా దైనందిక కార్యక్రమాలు, పనులు భద్రాచలంతోనే ముడిపడి ఉన్నాయి. ఆ ఐదు పంచాయతీలను తెలంగాణలో కలిపితే భద్రాచలానికి భూమి అందుబాటులోకి వస్తుంది. పురుషోత్తపట్నంలో స్వామివారికి సుమారు 900 ఎకరాల భూమి ఉంది. దీంతో ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టవచ్చు. చర్ల రోడ్డులో ఉన్న ఎటపాక, కూనవరం రోడ్డులో ఉన్న గుండాల పంచాయతీల్లో అటు వైపు నుంచి వచ్చే ట్రాఫిక్ను నియంత్రించవచ్చు. పుష్కరాల నేపథ్యంలో పంచాయతీల విలీన డిమాండ్పై స్వరం మరింత పెరుగుతోంది. ఐదు పంచాయతీలను తెలంగాణలో కలపాలి మా అభిప్రాయం తెలుసుకోకుండా ఏపీలో విలీనం చేసి అన్యాయం చేశారు. దీని వల్ల ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం. పార్టీలన్నీ ఏకమై కేంద్రం దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరించాలి. రానున్న పుష్కరాల సమయంలో అందరి దృష్టీ భద్రాచలం వైపే ఉంటుంది. పంచాయతీలకు ఇదే సరైన తరుణంగా భావించి ఎంపీలు చొరవ చూపాలి. – బండారు వీరభద్రం, కన్నాయిగూడెం, విలీన గ్రామపంచాయతీ వాసిమంత్రులు, ఎమ్మెల్యే, ఎంపీలు చొరవ చూపాలి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు చొరవ తీసుకుని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉంది. రాజ్యాంగ సవరణ ద్వారానే విలీనం పూర్తయ్యే అవకాశం ఉండటంతో పార్లమెంట్ సభ్యుల పాత్రే కీలకం. ఎన్నికల ముందు ఎంపీ బలరాంనాయక్ సైతం ఇదే హామీ ఇచ్చారు. పార్టీలకు అతీతంగా ఇతర ఎంపీల సహాయ సహకారాలతో పార్లమెంట్లో ఈ సమస్యను లేవనెత్తాలని బలరాంనాయక్ను భక్తులు కోరుతున్నారు. నిజామాబాద్లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షాను ఇటీవల కలిసిన రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇదే విషయమై విన్నవించారు. పుష్కరాల తరుణంలోనైనా విలీన పంచాయతీలు, భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని పలువురు కోరుతున్నారు. -
ఉన్నత చదువులకు ‘ఓపెన్’
● పదో తరగతి, ఇంటర్ చదివే అవకాశం ● ఈనెల 11 వరకు దరఖాస్తుల స్వీకరణ ● ఉమ్మడి జిల్లాలో 56 స్టడీ సెంటర్లు ఖమ్మంసహకారనగర్: ఓపెన్ స్కూల్ అనేది ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే వారికి ఓ వరం లాంటిది. వివిధ కారణాలతో విద్యను అభ్యసించలేకపోయిన వారు, చదువును మధ్యలోనే నిలిపివేసిన వారు, తమ వయసుతో సంబంధం లేకుండా మళ్లీ విద్యను అభ్యసించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సదవకాశాన్ని ఇచ్చింది. ఓపెన్ స్కూల్ పేరుతో నిర్వహిస్తున్న ఈ కేంద్రాల్లో 10వ తరగతి, ఇంటర్మీడియట్ విద్యను అందిస్తారు. చదువుకోవాలనే ఆసక్తి ఉన్న వారు ఈ ఓపెన్స్కూల్స్లో చేరేందుకు ఈ నెల 11వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 2008వ విద్యా సంవత్సరంలో ఓపెన్ స్కూల్ విధానం ప్రారంభం కాగా.. అప్పటి నుంచే పదో తరగతి ప్రారంభించారు. 2010–11వ విద్యా సంవత్సరం నుంచి ఇంటర్మీడియట్ను ప్రారంభించారు. 56 కేంద్రాలు.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మొత్తం 56 ఓపెన్ స్కూల్ కేంద్రాలుండగా... అందులో ఖమ్మం జిల్లాలో 25 సెంటర్లు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 31 కేంద్రాలున్నాయి. చిన్నప్పటి నుంచి చదువుకోకపోయినా సరే నేరుగా పదో తరగతిలో చేరే అవకాశం వీటి ద్వారా కలుగుతుంది. వయోజనులు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని తాము ఉన్నత విద్యావంతులుగా మారేందుకు కృషి చేసుకోవచ్చు. అర్హతలిలా... పదో తరగతిలో చేరాలనుకునే వారికి 31–08–2025 నాటికి 14 సంవత్సరాలు నఉండాలి. ఇంటర్మీడియట్లో చేరేందుకు 15 సంవత్సరాలు నిండి ఉండాలి. పదో తరగతి ఉత్తీర్ణులైన వారు అర్హులు. చదివిన తరగతులకు సంబంధించిన టీసీ, బోనఫైడ్ జత చేయాల్సి ఉంటుంది. ఇంటర్మీడియట్ చదవాలనుకునే వారు మాత్రం తప్పకుండా పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ఈ నెల 11వ తేదీ తుది గడువు.. ఓపెన్ స్కూల్లో ప్రవేశం పొందాలనుకునే ఈ నెల11వ తేదీ వరకు దరఖాస్తులు అధ్యయన కేంద్రంలో సమర్పించాల్సి ఉంటుంది. అదే విధంగా అపరాధ రుసుం పదో తరగతికి రూ.100, ఇంటర్మీడియట్కు రూ.200లతో ఆగస్టు(వచ్చే నెల) 12వ తేదీ వరకు మీ సేవా, ఆన్లైన్ కేంద్రాల్లో చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చు. ఫీజులు పదో తరగతికి జనరల్ పురుషులకు రూ.1,550, ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, మైనార్టీలు, మహిళలకు రూ.1,150 చెల్లించాలి. ఇంటర్మీడియట్కు జనరల్ పురుషులకు రూ.1,800, మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ దివ్యాంగులకు రూ.1,500 చెల్లించాల్సి ఉంటుంది. పదో తరగతి అడ్మిషన్ పొందేందుకు గాను వయస్సు ధ్రువీకరణ కోసం పుట్టిన తేదీని తెలిపే ఏదైనా పాఠశాల రికార్డు షీట్/టీసీ లేదా మున్సిపల్ అధికారి/ తహసీల్దార్/జిల్లా జనన మరణ రిజిస్ట్రార్ జారీ చేసిన పుట్టిన తేదీ ధ్రువపత్రం సమర్పించాలి. వచ్చే నెల 31 నాటికి 14 ఏళ్లు నిండి ఉన్న వారు తమ ఆధార్కార్డు, రెండు పాస్పోర్టు సైజ్ కలర్ ఫొటోలు తీసుకెళ్లాలి. అలాగే ఇంటర్లో ప్రవేశాలకు పదో తరగతి ఉత్తీర్ణత సర్టిఫికెట్ అదనంగా సమర్పించాల్సి ఉంటుంది. కొత్త కేంద్రాలివే... ఓపెన్ స్కూల్లో ప్రవేశాలకు అభ్యర్థుల నుంచి ఆసక్తి పెరుగుతున్న క్రమంలో జిల్లాలో కొత్తగా జెడ్పీహెచ్ఎస్ రఘునాథపాలెం, జెడ్పీహెచ్ఎస్ ఏదులాపురం, జీహెచ్ఎస్ నేలకొండపల్లి, జెడ్పీహెచ్ఎస్ తల్లాడలలో అదనంగా కేంద్రాలను ఏర్పాటు చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జెడ్పీహెచ్ఎస్ కరకగూడెం, అశ్వాపురం మండలం జెడ్పీహెచ్ఎస్ మిట్టగూడెం, జెడ్పీహెచ్ఎస్ ఆళ్లపల్లి, జీహెచ్ఎస్ టేకులపల్లి, జెడ్పీహెచ్ఎస్ చండ్రుగొండ, జెడ్పీహెచ్ఎస్ ఎర్రగుంట (అన్నపురెడ్డి మండలం), జెడ్పీహెచ్ఎస్ లక్ష్మీదేవిపల్లిలలో కేంద్రాలను ఏర్పాటు చేశారు.గత మూడేళ్లలో అడ్మిషన్లు, ఫలితాలిలా.. ఖమ్మం జిల్లా సంవత్సరం పదో తరగతి ఫలితాలు ఇంటర్మీడియట్ ఫలితాల శాతం 2022–23 770 26.3 995 48.53 2023–24 789 40.44 881 44.71 2024–25 607 40.44 797 57.93 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 2022–23 671 23.66 856 40.48 2023–24 623 32.28 788 50.97 2024–25 538 31.04 728 51.19సద్వినియోగం చేసుకోవాలి ఉన్నత చదువులు చదువుకోవడానికి ఓపెన్ స్కూల్ ఒక మంచి అవకాశం. చదువులు మధ్యలో ఆపేసిన వారు, చదవాలనుకునే వారు ఇందులో అడ్మిషన్ పొందొచ్చు. పది, ఇంటర్మీడియట్ చదవాలనుకునేవారు ఈ నెల 11 తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలి. – సామినేని సత్యనారాయణ, జిల్లా విద్యాశాఖాధికారి, ఖమ్మంఉన్నత విద్యకు దోహదం ఓపెన్ స్కూల్లో విద్యనభ్యసించి ఉన్నత స్థానాలకు వెళ్ళిన వారున్నారు. అభ్యర్థుల ఆసక్తి మేరకు ఈ ఏడాది ఉమ్మడి జిల్లాలో కొత్తగా 11 కేంద్రాలు ఏర్పాటయ్యాయి. ఆసక్తి కలిగిన అభ్యర్థులు సంబంధిత అధ్యయన కేంద్రాలు, ఆన్లైన్ సెంటర్లలో దరఖాస్తు చేసుకోవాలి. – మద్దినేని పాపారావు, ఓపెన్ స్కూల్ ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ -
రామయ్యకు సువర్ణ పుష్పార్చన
భద్రాచలం : భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారికి ఆదివారం సువర్ణ పుష్పార్చన, అభిషేకం వేడుకలను కనులపండువగా నిర్వహించారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత పల్లకీ సేవగా చిత్రకూట మండపంలో కొలువుదీర్చారు. విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశాక స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ వేడుకను వైభవంగా జరిపించారు. కాగా, తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా ఆలయంలో భక్తుల సందడి నెలకొంది. గోదావరిలో పుణ్య స్నానాలను ఆచరించి స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. -
రాజీవ్ స్వగృహ ఫ్లాట్లు కేటాయించాలి
ఖమ్మం సహకారనగర్: టీఎన్జీవోస్ సభ్యులకు రాజీవ్ స్వగృహ ప్లాట్లు కేటాయించాలని సంఘం జిల్లా అధ్యక్షుడు గుంటుపల్లి శ్రీనివాసరావు కోరారు. ఆదివారం టీఎన్జీవోస్ ఫంక్షన్ హాల్లో జరిగిన యూనియన్ జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. టీఎన్జీవోస్ హౌస్ బిల్డింగ్ సొసైటీలో సుమారు 3,500 మంది సభ్యులు ఉన్నారని, ఇందులో సగం మందికే ఇళ్ల స్థలాలు వచ్చాయని, మిగతా వారికి రాజీవ్ స్వగృహ ఫ్లాట్లు నాలుగు బ్లాక్లు టీఎన్జీవోస్ హౌస్ బిల్డింగ్ సొసైటీలకు కేటాయించాలని తీర్మానించామని అన్నారు. మధ్య తరగతి ఉద్యోగులు టీఎన్జీవోస్లో అధికంగా ఉన్నారని, అందరికీ న్యాయం చేయాలని కోరారు. అనంతరం టీఎన్జీవోస్ సెంట్రల్ కమిటీకి ఎన్నికై న బాలకృష్ణ, జైపాల్ విజయ్కుమార్తో పాటు ఇటీవల పదోన్నతులు పొందిన ఎర్రమల శ్రీనివాసరావు, నాగరాజును సత్కరించారు. కార్యక్రమంలో సంఘం జిల్లా కార్యదర్శి కొణిదన శ్రీనివాస్, నాయకులు కొమరగిరి దుర్గాప్రసాద్, వల్లపు వెంకన్న, శ్రీధర్ సింగ్, ప్రకాశరావు, కరణ్సింగ్, తాళ్లూరి శ్రీకాంత్, చంద్రశేఖర్, ఏలూరి హరికృష్ణ, రాధికారెడ్డి పాల్గొన్నారు. -
నేడు ములుగు, భద్రాద్రి జిల్లాల్లో తుమ్మల పర్యటన
ఖమ్మంఅర్బన్: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సోమవారం భద్రాద్రి, ములుగు జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ మేరకు మంత్రి క్యాంప్ కార్యాలయం నుంచి ఆదివారం ఒక ప్రకటన విడుదలైంది. సోమవారం ఉదయం 7 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరి 11.30 గంటలకు ములుగు జిల్లా వాజేడు చేరుకుంటారు. అక్కడ మొక్కజొన్నల రైతులకు మంత్రి సీతక్కతో కలిసి చెక్కులు పంపిణీ చేస్తారు. మధ్యాహ్నం 2.30 గంటలకు భద్రాద్రి జిల్లా అశ్వాపురం మండలం బి.జి.కొత్తూరులో మర్లపాడు లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని పరిశీలిస్తారు. 3.30 గంటలకు భద్రాచలం అంబేద్కర్ సెంటర్లో డివైడర్లు, సెంట్రల్ లైటింగ్ పనులకు శంకుస్థాపన చేస్తారు. సాయంత్రం 4.30 గంటలకు కొత్తగూడెం ఐడీఓసీలో నిర్వహించే సమావేశంలో పాల్గొంటారు. గురుకులాల్లో పరిశుభ్రత పాటించాలిఅదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి కారేపల్లి: గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి సిబ్బందిని ఆదేశించారు. కారేపల్లి ఎస్ఆర్ఆర్ ఇంజనీరింగ్ కళాశాల భవన సముదాయంలో నిర్వహిస్తున్న వైరా మైనారిటీ బాలికల గురుకుల విద్యాలయాన్ని ఆదివారం ఆయన తనిఖీ చేశారు. వసతులపై ఆరా తీశారు. విద్యార్థినులు, ఉపాధ్యాయుల హాజరు రిజిస్టర్లను పరిశీలించారు. మెనూ సక్రమంగా అమలు చేస్తున్నారా.. స్టడీ అవర్స్ నిర్వహిస్తున్నారా అని బాలికలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. సీజనల్ వ్యాధుల విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇటీవల పదో తరగతి, ఇంటర్మీడియట్లో వచ్చిన ఫలితాలు, విద్యార్థినుల ప్రగతిని తెలుసుకొని సంతృప్తి వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా.. కారేపల్లిలో నిర్వహిస్తున్న మైనార్టీ బాలికల గురుకులాన్ని ఖమ్మం, వైరా పట్టణాల సమీపంలోకి తరలిస్తున్నారనే వార్తలు రావడం, అదనపు కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించడం స్థానికంగా చర్చనీయాంశమైంది. అనర్హులతో డీసీఈబీ సెక్రటరీ పోస్టు భర్తీహెచ్ఎంల అసోసియేషన్ ఆరోపణ ఖమ్మం సహకారనగర్ : డిస్ట్రిక్ట్ కామన్ ఎగ్జామినేషన్ బోర్డు(డీసీఈబీ) సెక్రటరీ పోస్టును అర్హత లేని వారితో భర్తీ చేశారని తెలంగాణ రాష్ట్ర గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆర్.వీరస్వామి, టి.నాగేశ్వరరావు ఆరోపించారు. నగరంలోని ఇందిరానగర్ పాఠశాలలో ఆదివారం జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ డీసీఈబీ సెక్రటరీ ఎంపికలో నిబంధనలను తుంగలో తొక్కారని అన్నారు. బోర్డును రద్దు చేసినట్లు డీఈఓ చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. తాజాగా నియమించిన సెక్రటరీపై గతంలోనే పలు ఆరోపణలు వచ్చాయని, అలాంటి వ్యక్తిని మళ్లీ ఎలా నియమిస్తారని ప్రశ్నించారు. సమావేశంలో హెచ్ఎంలు రాయల శ్రీనివాసరావు, చావా శ్రీనివాసరావు, చిరంజీవి నాయుడు, ఆర్.వెంకటరావు, వి.వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
●రోజుల తరబడి నిల్వ..
హోటళ్లు, రెస్టారెంట్లలో ముడి పదార్థాలను రోజుల తరబడి నిల్వ చేస్తున్నారు. కొన్ని హోటళ్లలో కల్తీ ఆహార పదార్థాలనే వడ్డిస్తున్నారు. ఇలా కల్తీని గుర్తించిన పలువురు వినియోగదారులు ఇటీవల ఫుడ్సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేయగా, తనిఖీలకు వచ్చిన అధికారులే విస్తుపోయేలా అక్కడి పరిస్థితులున్నాయి. మరోవైపు ఆహార పదార్థాలపై హానికరమైన రంగులు కూడా వాడుతున్నట్లు గుర్తించారు. రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ టాస్క్ఫోర్స్ బృందం పలు హోటళ్లు, రెస్టారెంట్లు, మసాలా దినుసులు, పచ్చళ్ల తయారీ కేంద్రాలపై శుక్రవారం దాడులు నిర్వహించి, అక్కడి వాతావరణం అధ్వానంగా ఉన్నట్లు గుర్తించింది. అలాగే జిల్లా వ్యాప్తంగా కర్రీ పాయింట్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. పలుచోట్ల నాసిరకమైన కూరగాయలను తక్కువ ధరకు కొనుగోలు చేసి టేస్టీ మసాలాలు జోడించి కూరలు, పప్పు, చికెన్, చేపలు వంటివి విక్రయిస్తున్నారు. ఉదయం వండిన కూరలే రాత్రి వరకూ అమ్ముతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు.1000600జిల్లాలో మొత్తం బార్ అండ్ రెస్టారెంట్లు58తోపుడుబండ్లు● -
పెద్దమ్మతల్లికి జలాభిషేకం
పాల్వంచరూరల్: తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని పెద్దమ్మతల్లి అమ్మవారికి అర్చకులు జలాభిషేకం, పంచామృతాభిషేకం నిర్వహించారు. ఆదివారం తొలి ఏకాదశి పండుగ కావడంతో మండలంలోని శ్రీకనకదుర్గ (పెద్దమ్మతల్లి) ఆలయానికి రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. అర్చకులు అమ్మవారికి విశేష పూజలు జరపగా, భక్తులు క్యూలైన్ ద్వారా దర్శించుకున్నారు. అన్నప్రాసనలు, ఒడిబియ్యం, పసుపు కుంకుమలు, చీరలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. పూజా కార్యక్రమంలో ఈఓ ఎన్. రజనీకుమారి, ఆలయ కమిటీ చైర్మన్ బాలినేని నాగేశ్వరరావు, డైరెక్టర్లు, వేదపండితుడు పద్మనాభశర్మ, అర్చకుడు రవికుమార్శర్మ పాల్గొన్నారు. అమ్మవారికి వెండి తాంబాళం బహుకరణ పెద్దమ్మతల్లి అమ్మవారికి హైదరాబాద్కు చెందిన భక్త దంపతులు పొల్కంపల్లి ప్రసాద్, అరుణ రూ.7,116 విలువైన వెండి తాంబాళం బహుకరించారు. అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. -
పేదల ఆత్మగౌరవం కోసమే ఇందిరమ్మ ఇళ్లు
● రాజకీయాలకతీతంగా మంజూరు చేస్తాం ● డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ● లబ్ధిదారులకు మంజూరు పత్రాల పంపిణీ మధిర: పేదలు ఆత్మగౌరవంతో జీవించేలా ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తున్నామని, ప్రతీ పేదవాడి సొంతింటి కల సాకారం చేస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. స్థానిక పీవీఆర్ ఫంక్షన్ హాల్లో ఆదివారం ఆయన మధిర, ఎర్రుపాలెం, బోనకల్ మండలాల లబ్ధిదారులకు ఇళ్ల మంజూరు పత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలో తొలి విడతలో రూ. 22,500 కోట్లతో 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామని, పార్టీలకు, రాజకీయాలకు అతీతంగా పారదర్శకంగా అర్హులను ఎంపిక చేస్తున్నామని చెప్పారు. గతంలో తన పాదయాత్ర సందర్భంగా ప్రజల బాధను నేరుగా తెలుసుకున్నానని, వాటి పరిష్కారమే లక్ష్యంగా ప్రస్తుత ప్రభుత్వం పని చేస్తోందని తెలిపారు. 93లక్షల రేషన్కార్డు లబ్ధిదారులకు సన్న బియ్యం సరఫరా చేస్తున్నామని చెప్పారు. నిరుపేదల పిల్లలకు నాణ్యమైన విద్య కోసం యంగ్ ఇండియా గురుకులాలు నిర్మిస్తున్నామని, గురుకులాల్లో 40 శాతం డైట్ చార్జీల పెంపుతో పాటు 56వేల ఉద్యోగాలు భర్తీ చేశామని వివరించారు. రాజీవ్ యువ వికాసం కింద రూ. 8వేల కోట్లతో స్వయం ఉపాధి యూనిట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరికీ సంక్షేమ పథకాలు అందేలా తమ ప్రభుత్వం పని చేస్తోందన్నారు. సన్న రకం ధాన్యానికి క్వింటాకు రూ.500 బోనస్ అందించామని, రూ.2 లక్షల లోపు వ్యవసాయ రుణాలు మాఫీ చేశామని, రైతులకు పెట్టుబడి సాయంగా ఎకరానికి రూ.12 వేల రైతు భరోసా అమలు చేస్తున్నామని అన్నారు.వడ్డీ లేని రుణాలు.. ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం కింద మహిళలకు వడ్డీ లేని రుణాలను అందిస్తున్నామని భట్టి విక్రమార్క తెలిపారు. గత ప్రభుత్వం విధ్వంసం చేసిన రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుతూ ఒక్కో కార్యక్రమం అమలు చేస్తున్నామని తెలిపారు. మధిర ప్రాంత ప్రజలకు గౌరవం కలిగేలా పనిచేస్తున్నామని, రాబోయే రోజుల్లో మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తామని ప్రకటించారు. ఇంటి నిర్మాణానికి అవసరమైన సిమెంట్, స్టీల్, ఇటుక తదితర సామగ్రి ధరలు పెరగకుండా మండల స్థాయి అధికారులు నియంత్రించాలని ఆదేశించారు. కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ మధిర, ఎర్రుపాలెం, బోనకల్ మండలాల్లో 1,544 మంది పేదలకు మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను డిప్యూటీ సీఎం చేతుల మీదుగా అందించడం సంతోషంగా ఉందన్నారు. అర్హులందరికీ దశల వారీగా ఇళ్లు మంజూరు చేస్తున్నామని, మొదటి విడతలో రాని వారు ఆందోళన చెందొద్దని అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, పర్యాటక శాఖ ఎస్ఈ సరిత, జిల్లా పంచాయతీ అధికారి ఆశాలత, హౌసింగ్ పీడీ శ్రీనివాస్, మధిర ఏఎంసీ చైర్మన్ బండారు నర్సింహారావు, నాయకులు సూరంశెట్టి కిశోర్, వేమిరెడ్డి సుధాకర్రెడ్డి, దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. -
అంగన్వాడీల్లో అరకొర వసతులే..
● సగం కేంద్రాలకే సొంత భవనాలు ● విద్యార్థులు, గర్భిణులకు అనుకూలంగా లేని అద్దె బిల్డింగులు ● టాయిలెట్లు లేక అవస్థలు ● నిధులున్నా.. నిర్మాణాలు లేవు ఖమ్మంమయూరిసెంటర్ : జిల్లాలో అంగన్వాడీ కేంద్రాలు అరకొర సౌకర్యాలతోనే నడుస్తున్నాయి. సగం కేంద్రాలకు సొంత భవనాలు లేవు. కొన్ని చోట్ల మంజూరైనా నిర్మాణ పనులు ప్రారంభం కాలేదు. చిన్నారులకు పౌష్టికాహారం, గర్భిణులు, బాలింతలకు ఆరోగ్య సేవలు అందించే ఈ కేంద్రాలు తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. ఇక అద్దె భవనాల్లో నిర్వహిస్తున్న కేంద్రాల్లో సరైన సౌకర్యాలు లేక కొందరు తల్లిదండ్రులు తమ చిన్నారులను ఆయా కేంద్రాలకు పంపించడం లేదు. అద్దె భవనాలతో అవస్థలు.. జిల్లాలో మొత్తం 1,840 అంగన్వాడీ కేంద్రాలు ఉండగా 940 సెంటర్లకు మాత్రమే సొంత భవనాలు ఉన్నాయి. మిగిలిన 900 సెంటర్లలో 440 భవనాలు అద్దె లేకుండా, 460 కేంద్రాలను అద్దె చెల్లించి నిర్వహిస్తున్నారు. ఇక అద్దె భవనాలు చాలా చిన్నగా.. సరైన గాలి, వెలుతురు లేకుండా ఉంటున్నాయి. మరికొన్ని చోట్ల ఈ భవనాలు కూడా శిథిలావస్థకు చేరాయి. అయినా వాటిలోనే కేంద్రాలను కొనసాగిస్తుండడం గమనార్హం. ఇక ప్రీ స్కూల్గా నిర్వహిస్తున్న అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు సరైన ఆహ్లాదకర వాతావరణం ఉండడం లేదు. ఆడుకునేందుకు, సరదాగా కాసేపు బయట తిరిగేందుకు కూడా స్థలం లేక ఒకేచోట కూర్చోవాల్సి వస్తోంది. ఆట వస్తువులు కూడా అందుబాటులో ఉండడం లేదు. ఇక వర్షం వస్తే స్లాబ్లు కురుస్తుండగా చిన్నారులు ఇబ్బంది పడుతున్నారు. వసతులూ అంతంతే.. కేంద్రాల్లో మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యం వంటి కనీస వసతులు లేకపోవడం అతి పెద్ద సమస్యగా మారింది. మరుగుదొడ్లు ఉన్నా.. పరిశుభ్రత కొరవడుతోంది. సురక్షిత తాగునీరు అందుబాటులో లేక అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. అరకొర సౌకర్యాలతో నడుస్తున్న ఈ కేంద్రాలు తమ పిల్లల ఆరోగ్యానికి, భద్రతకు ముప్పుగా పరిణమిస్తున్నాయని అంటున్నారు. అలాగే గర్భిణులు, బాలింతలు వైద్య పరీక్షలు, పౌష్టికాహారం కోసం కేంద్రాలకు వచ్చినప్పుడు కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులు తప్పడం లేదు. నిధులున్నా నిరుపయోగమే.. వివిధ పథకాల కింద అంగన్వాడీ కేంద్రాలకు భవనాలు మంజూరవుతున్నాయి. 2024 – 25లో 20, 2025 – 26లో మరో 20 అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనాలు మంజూరయ్యాయి. ఎన్ఆర్ఈజీఎస్, ఏడీఐబీ, డీఎంఎఫ్ఏ, ఎమ్మెల్యే కోటా కింద నిధులు విడుదల చేస్తున్నారు. అధికారులు స్థలాలను పరిశీలించి అక్కడ నిర్మించాలని సూచిస్తున్నారు. కానీ ఇప్పటివరకు 40 భవనాలకు నిధులు మంజూరైతే పనులు ప్రారంభించింది నాలుగు మాత్రమే కావడం గమనార్హం.జిల్లాలో అంగన్వాడీ భవనాల వివరాలిలా.. తాగునీటి సదుపాయం లేనివి 296 విద్యుత్ సౌకర్యం లేని కేంద్రాలు 659 టాయిలెట్లు లేని సెంటర్లు 576 మొత్తం విద్యార్థులు 10,094 మంది బాలురు 5,303 బాలికలు 4,791 -
మొలుగుమాడు.. భూముల రీసర్వే చూడు
సాక్షి, హైదరాబాద్: ఖమ్మం–కృష్ణా జిల్లాల సరిహద్దు మండలమైన ఎర్రుపాలెం పరిధిలో ఉండే వ్యవసాయాధారిత గ్రామం మొలుగుమాడు. గతంలో ఇది ఆంధ్రప్రదేశ్లో భాగంగా ఉండేది. నిజాం కాలంలో తెలంగాణలో భాగమైంది. అయినా ఆ గ్రామానికి ఇప్పటివరకు నక్షా (గ్రామ పటం) లేదు. రెవెన్యూ రికార్డులు మాత్రం ఉన్నాయి. ఆ రికార్డుల మేరకు రైతులు ఎవరి భూమి వారు సాగు చేసుకుంటున్నారు. ఈ గ్రామంలోని రైతులందరికీ రైతు భరోసా కూడా వస్తోంది. కానీ గ్రామ పటం లేని కారణంగా అసలు గ్రామ సరిహద్దులేవో తేల్చలేని పరిస్థితి. వాగులు, వంకలు ఎక్కడెక్కడున్నాయో కాగితాల మీద చూపించలేని పరిస్థితి. ఇలాంటి గ్రామాలు తెలంగాణలో 413 ఉన్నాయని తేల్చిన ప్రభుత్వం.. పైలట్గా ఆ గ్రామంతో పాటు ఐదు గ్రామాల్లో భూముల రీసర్వే చేపట్టింది. మొలుగుమాడుకు సంబంధించిన 843 ఎకరాల్లో ఈ ప్రక్రియ పూర్తి చేసింది. రీ సర్వే అనంతరం మొలుగుమాడు గ్రామంలోని భూములపై స్పష్టత వచ్చింది. ఆ గ్రామ సరిహద్దులు తేలాయి. అసలు ఆ గ్రామంలో ఉన్న భూముల విస్తీర్ణం ఎంత? ఎంతమంది రైతులు సాగు చేసుకుంటున్నారు? ప్రభుత్వ భూమి ఎంత ఉంది? చెరువులు ఎంత విస్తీర్ణంలో ఉన్నాయి? వాగులు ఎంత మేరకు ఉన్నాయి? భూముల సాగుకు సంబంధించి ఎలాంటి సమస్యలున్నాయి? రోడ్లు ఎక్కడ ఉన్నాయి? శ్మశానాల సంగతేంటి? ఎన్ని సర్వే నంబర్లలో భూమి ఉంది? ఆ సర్వే నంబర్లను ఎన్ని సబ్ డివిజన్లు చేశారు? అనే వివరాలన్నీ స్పష్టంగా తెలిసిపోయాయి.దీంతో గ్రామానికి నక్షా వస్తోంది. టిప్పన్లు (రెవెన్యూ రికార్డుల ప్రకారం భూమి స్కెచ్) వస్తున్నాయి. దీంతో ఇదంతా ఎలా సాధ్యమయ్యింది? అసలు రీసర్వే ఎలా జరిగింది? అనేది ఆసక్తి రేకెత్తిస్తోంది. గ్రామస్తులకు ముందుగానే అవగాహన రాష్ట్ర ప్రభుత్వం భూముల రీసర్వే కోసం మొలుగుమాడు గ్రామాన్ని పైలట్గా ఎంపిక చేసిన తర్వాత ఆ గ్రామస్తులకు ఈ ప్రక్రియపై ముందుగా అవగాహన కల్పించారు. హైదరాబాద్కు చెందిన ఐఐసీ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఏజెన్సీ సర్వే నిర్వహించింది. ఎర్రుపాలెం తహశీల్దార్ ఎం.ఉషా శారదతో పాటు మధిర, ఎర్రుపాలెం సర్వేయర్లు, ముగ్గురు జూనియర్ అసిస్టెంట్లు, ఇద్దరు రికార్డు అసిస్టెంట్లు, ఆరుగురు సర్వే ఏజెన్సీ సిబ్బంది రెండు బృందాలుగా విడిపోయి భూముల రీసర్వే నిర్వహించారు. మరో ఆరుగురు డ్రోన్ సిబ్బంది వీరికి సహకరించారు. ఈ ఏడాది మే 26వ తేదీన సర్వే ప్రారంభం కాగా జూన్ 21వ తేదీతో పూర్తయింది. రోజుకు 60–80 సర్వే నంబర్ల చొప్పున విభజించుకుని సర్వే చేశారు. ఉత్తర దిక్కు నుంచే మొదలు.. ఉత్తరం దిక్కు నుంచి సర్వే ప్రారంభించారు. అంతకుముందు గ్రామాల సరిహద్దులను గుర్తించే ప్రక్రియ చేపట్టారు. ఉత్తరం దిక్కునే పురాతన సరిహద్దు రాయిని గుర్తించి అక్కడి నుంచి రీసర్వే ప్రారంభించారు. గ్రామంలో ఒకటో సర్వే నంబర్ కూడా ఉత్తరం దిక్కు నుంచే ప్రారంభమవుతోంది. అయితే ఎక్కడ సర్వే చేసినా ఉత్తరం దిక్కునే ప్రారంభిస్తారని, గడియారం ముల్లు తరహాలో ఉత్తరం నుంచి తూర్పు, దక్షిణం, పడమర దిక్కుల్లో సర్వే చేస్తారని రెవెన్యూ వర్గాలు వెల్లడించాయి. ఫలానా రోజు ఫలానా సర్వే నంబర్లలో రీ సర్వే ఉంటుందని ముందుగానే చాటింపు వేయడం వల్ల..సర్వే సమయంలో రైతులు తమ భూముల్లో సిద్ధంగా ఉండేవారు. వారి భూమి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉందో చూపించేవారు. ఈ క్రమంలో ఆ భూ కమతాన్ని గ్రౌండ్ ట్రూతింగ్ చేసిని సిబ్బంది.. డీజీపీఎస్ విధానంలో విస్తీర్ణాన్ని నిర్ధారించి సరిహద్దులు ఫిక్స్ చేశారు. దీన్ని రికార్డులో నమోదు చేశారు. వివరాలు ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు పంపారు. ఈ గ్రామంలో భూముల విషయంలో పెద్దగా వివాదాలు లేకపోవడంతో పోలీసుల అవసరం రాలేదు. 6 ఎకరాలు ఎక్కువ..! ఈ గ్రామంలో భూములకు సంబంధించిన వివాదాలు పెద్దగా రాలేదు కానీ, రీ సర్వే అనంతరం భూముల లెక్క మాత్రం తేడా వచ్చింది. గతంలో ఉన్న రికార్డుల ప్రకారం అక్కడ 845.32 ఎకరాల భూమి ఉంది. కానీ రీ సర్వే తర్వాత ఆ గ్రామంలో మొత్తం భూమి విస్తీర్ణం 852.10 ఎకరాలుగా తేలినట్లు తెలిసింది. అంటే 6 ఎకరాల 18 గుంటల భూమి ఎక్కువ ఉందన్నమాట. అయితే వ్యవసాయ భూముల విషయంలో ఎలాంటి తేడాలు రాలేదని, ప్రభుత్వ భూములు, చెరువులు, వాగులకు సంబంధించిన విస్తీర్ణం ఎక్కువ వచ్చి ఉండవచ్చని చెబుతున్నారు. వెలుగులోకి సమస్యలు ⇒ సర్వే నంబర్లకు సంబంధించిన సబ్ డివిజన్లు ఎక్కువగా ఉండడంతో కొన్నిచోట్ల రైతు ఎక్కడ కబ్జాలో ఉన్నాడో అర్థం కాలేదు. ముఖ్యంగా తెలుగులో ‘రు’, ‘ఎ’, ఇంగ్లీషులో ‘ఆర్’, ‘ఈ’ అని సబ్ డివిజన్లు ఉన్నచోట్ల ఈ సమస్య కనిపించింది. ⇒ వారసత్వంగా వచ్చే భూముల విషయంలో భాగస్వామ్య పంపకాలు పూర్తయిన తర్వాత కూడా పాత పట్టాదారు (తండ్రి లేదా తల్లి) పేరిట భూములకు పాసు పుస్తకాలు వచ్చాయి. ⇒ ఒక రైతు పేరిట 66 గజాల భూమి కూడా రికార్డయి పాసుపుస్తకం ఉంది. ఇది రైతుబంధు కోసం జరిగి ఉంటుందని రెవెన్యూ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ⇒ ఆన్లైన్ పహాణీలు కొన్నిచోట్ల సరిపోలలేదు. ఈ గ్రామంలోని 74వ సర్వే నంబర్లో భూమి రికార్డు ఒకరి పేరిట ఉంటే ఆ భూమి సాగు (కబ్జా)లో మరో ముగ్గురు రైతులున్నారు. సర్వేలో ఆ భూమి ముగ్గురు రైతులదేనని తేలింది. దీంతో ఇప్పుడు రికార్డుల్లో ఆ ముగ్గురి పేర్లు నమోదు చేసే అవకాశం లభించింది. ⇒ మరో రైతు భూమి 62, 63 సర్వే నంబర్లలో ఉంటే పహాణీలో 36 సర్వే నంబర్లో వచ్చింది. మరో రైతు భూమి 17వ సర్వే నంబర్లో ఉండాల్సి ఉండగా, ఆన్లైన్ రికార్డులో మాత్రం 49 సర్వే నంబర్ నమోదైంది. తేలని డొంక సమస్య ఈ గ్రామం,, సఖినవీడు గ్రామంతో కలిసే చోట రైతుల పొలాలకు వెళ్లేందుకు పూర్వం డొంక ఉండేదని గ్రామస్తులు చెపుతున్నారు. ఈ డొంకకు ఎదురుగా రోడ్డు అవతల 30 అడుగుల డొంక ఉంది. కానీ, రోడ్డు ఇవతలి వైపు లేకపోవడంతో రైతులు పొలాలకు వెళ్లేందుకు మార్గం లేకుండా పోయింది. దీంతో డొంక ఆవలి భూములను సాగు చేయలేని పరిస్థితి ఉంది. రీసర్వేలో భాగంగా ఈ డొంక సమస్యను తేల్చాలని, నక్షాలో చేర్చాలని గ్రామస్తులు కోరినా ఫలితం లేకుండా పోయింది. ఈ డొంక మార్గంలో సమాధులు ఉండడం, అందులోనే అసైన్డ్ భూమి ఉండడంతో డొంకను అధికారికంగా చూపెట్టలేమని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ సమస్యను తేలి్చన తర్వాతే నక్షా తయారు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. సహకరించిన అందరికీ ధన్యవాదాలు రాష్ట్రంలో ఇందిరమ్మ ప్రభుత్వం అధికారంలోకి వచి్చన తర్వాత ఒక్కొక్కటిగా భూముల సమస్యలు పరిష్కరిస్తున్నాం. నేను ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలోని మొలుగుమాడు గ్రామంలో నక్షా లేదని తెలిసి పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేశాం. అందరి సహకారంతో ఇక్కడ రీసర్వే పూర్తయిందనే సమాచారం వచ్చింది. రైతులు, సిబ్బంది అందరికీ ధన్యవాదాలు. – పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ఆ తృప్తి ఎప్పటికీ ఉంటుంది రీసర్వేకు మొలుగుమాడు గ్రామ రైతాంగం బాగా సహకరించింది. 843 ఎకరాల్లో భూములు సర్వే చేయడమంటే మాటలు కాదు. రెవెన్యూ సిబ్బందితో పాటు సర్వే ఏజెన్సీ కూడా బాగా పనిచేసింది. నా హయాంలో ఓ గ్రామానికి రెవెన్యూ పటం తయారు చేశానని, నక్షా ఇవ్వగలిగాననే తృప్తి ఎప్పటికీ మిగిలిపోతుంది. – మన్నె ఉషాశారద, ఎర్రుపాలెం మండల తహశీల్దార్ మంచి అవకాశం..వినియోగించుకున్నాం మా గ్రామానికి నక్షా లేని కారణంగా అసలు డొంకలెక్కడున్నాయో, రోడ్లు ఏవో అర్థమయ్యేది కాదు. గతంలో ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేదు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గతంలో చేసిన పాదయాత్ర సందర్భంగా వినతిపత్రం ఇచ్చాం. ఆయన మా గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టులో చేర్చారు. ఆ అవకాశాన్ని మేం వినియోగించుకున్నాం. – గంటా శ్రీనివాసరావు, మాజీ సర్పంచ్, మొలుగుమాడు ప్రతి రైతు నుంచి సంతకాలు తీసుకున్నాం భూముల రీసర్వే కోసం నిబద్ధతతో పనిచేశాం. సర్వే పూర్తయిన తర్వాత ప్రతి రైతు నుంచి సంతకాలు తీసుకున్నాం. ఎవరి పేరు మీద భూమి ఉంటే వారు వస్తేనే సర్వే చేశాం. ఎవరైనా కుటుంబ సభ్యులు వస్తే చేయలేదు. – రాజశేఖర్, గ్రామ సర్వేయర్ సర్వే సారాంశం ఇదీ: పట్టా ఉండి భూముల్లో కబ్జా ఉన్న రైతుల సంఖ్య: 1023 ఆ భూమి విస్తీర్ణం: 668.0226 ఎకరాలు ఎలాంటి టైటిల్ లేకుండానే సాగు చేసుకుంటున్న రైతులు: 62 ఆ భూమి విస్తీర్ణం: 34.3964 ఎకరాలు టైటిల్ ఉండి వాస్తవంగా భూమి లేని రైతులు: 13 ఆ భూమి విస్తీర్ణం: 3.0139 ఎకరాలు ఆన్లైన్లో ఎంట్రీ కాని రైతుల సంఖ్య: 54 ఆ భూమి విస్తీర్ణం: 26.316 ఎకరాలు గ్రామ సరిహద్దులివీ.. ఉత్తరం: ఇనగాలి గ్రామం (ఈ వైపున 21 సర్వే నంబర్లు ఉన్నాయి) దక్షిణం: సఖినవీడు గ్రామం (ఈ దిక్కున 24 సర్వే నంబర్లు ఉన్నాయి) తూర్పు: ఏరు (కట్లేరు) పశ్చిమం: మాటూరు గ్రామం (ఇటు వైపు 10 సర్వే నంబర్లు ఉన్నాయి.) భూముల రకం, విస్తీర్ణం.. భూమి రకం విస్తీర్ణం (ఎకరాలు, గుంటల్లో) ప్రభుత్వ భూమి 78.3359 ఇనాం భూమి 16.2039 గ్రామ కంఠం 49.38 చెరువు 25.2960 పట్టా భూమి 683.06 -
తొలి పండుగ..
● ఇప్పటి నుంచి హిందువుల పండుగలు షురూ ● పేలాల పిండికి ప్రత్యేక స్థానం నేడు తొలి ఏకాదశి ఖమ్మంగాంధీచౌక్: ఆషాఢంలో వచ్చే తొలి ఏకాదశి నుంచి హిందూ పండుగలు మొదలవుతాయి. ఆనందంతో పాటు ఆరోగ్యానిచ్చే పండుగ ఇది. హిందువుల తొలి పండుగగా ఖ్యాతికెక్కిన తొలి ఏకాదశి పర్వ దినానికి హైందవ సంస్కృతిలో విశేష స్థానం ఉంది. ఒక ఏడాదిలో వచ్చే 24 ఏకాదశుల్లో ఆషాఢ శుద్ధ ఏకాదశిని ‘తొలి ఏకాదశి’గా పిలుస్తారు. దీనినే ‘శయన ఏకాదశి’‘హరి వాసరం’‘పేలాల పండుగ’అని కూడా అంటారు. ఆదివారం ఆషాఢ శుద్ధ ఏకాదశిని పండగగా జరుపుకునేందుకు హిందువులు సిద్ధమవుతున్నారు. అయితే ప్రత్యక్ష దైవమైన సూర్యుడు దక్షిణం వైపునకు మరలినట్లు, ఈరోజు నుంచి దక్షిణాయనం ప్రారంభాన్ని సూచిస్తుంది. ఈరోజున చాతుర్మాస వ్రతం ప్రారంభమవుతుంది. ఈ రోజున ఉపవాసం ఉంటే ఆ విష్ణుమూర్తి అనుగ్రహం లభిస్తుందని విశ్వాసం. ఈ రోజు ఉదయాన్నే నిద్రలేచి విష్ణుమూర్తిని తులసీదళాలతో పూజించాలి. రాత్రంతా జాగరణ చేస్తూ విష్ణుమూర్తి నామస్మరణతో పూజలు చేస్తారు. ఏకాదశి నియమాలు ఏకాదశి రోజు మొత్తం నిరాహారులై ఉండాలి. ఏకా దశి రోజున సూరోదయానికి ముందుగానే శ్రీహరిని పూజించాలి. విష్ణుమూర్తి ప్రతిమను పసుపుకుంకుమలతో పూలతో అలంకరించి చక్కెర పొంగలి నైవేద్యం పెట్టి కర్పూర హారతినిస్తారు. ఈ రోజున కాల్చివండినవి, మాంసాహారం, ఉసిరి, ఉలవలు, మినుములు, వెల్లుల్లి వంటివి తినొద్దని పండితులు చెబుతున్నారు. పేలాల పిండి ఆరోగ్యం.. తొలి ఏకాదశి రోజు పేలాల పిండికి ప్రత్యేక స్థానం ఉంది. ఈ పిండిని తప్పక తినాలని అంటారు. పేలాలు పితృ దేవతలకు ఎంతో ఇష్టమైనవని.. జన్మనిచ్చిన పూర్వీకులను ఈ రోజున గుర్తు చేసుకోవటం మన బాధ్యత అని పెద్దలు చెబుతుంటారు. అంతేగాక ఆరోగ్యపరంగా బయట ఉష్ణోగ్రతలకు అనుగుణంగా శరీరం అనేక మార్పులకు లోనవుతుంది. గ్రీష్మ రుతువు ముగిసిన తరువాత వర్ష రుతువు ప్రారంభమయ్యే కాలం. ఈ కాలంలో పేలాల పిండి తింటే శరీరానికి వేడిని కలిగిస్తుంది. ఈ రోజున మొక్కజొన్న పేలాలను మెత్తటి పొడిగా దంచి అందులో నూరిన బెల్లం కలిపి దేవుడికి నైవేద్యంగా సమర్పిస్తారు. దేవాలయాల వద్ద, ఇళ్ల వద్ద పేలాల పిండిని ప్రసాదంగా పంచుతారు. మార్పులకు సంకేతం.. ప్రకృతిలో జరిగే మార్పులకు సంకేతం తొలి ఏకాదశి. సూర్య భగవానుడు ఈ రోజు నుంచి దక్షణా యనం వైపునకు మరలుతాడు. హిందువులు తొలి ఏకాదశిని తొలి పండుగగా జరుపుకుంటారు. రైతు లకు ఈ పండుగ ప్రత్యేకం. పాడి పంటలు సమృద్ధిగా ఉండాలని ప్రజలు తొలి ఏకాదశి రోజున ఉపవాసాలు, జాగరణ చేస్తారు. –నందుల సుబ్రహ్మణ్యశర్మ, పురోహితులు రైతుల పండుగ తొలిఏకాదశి రైతుల పండుగగా పురాణాలు చెబు తున్నాయి. రైతులు ఈ పండుగను వేడుకలా జరుపుకుంటారు. అతివృష్టి, అనావృష్టి వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించకుండా వేసిన పంటలకు ఎలాంటి తెగుళ్లు ఆశించకుండా ఉండాలని అన్నదాతలు తొలి ఏకాదశిరోజున ఇళ్లలో, ఆలయాల్లో ప్రత్యేకపూజలు చేస్తారు. వర్షాలు అనుకూలిస్తే వాగుల్లో, జలాశయాల్లో నీరు ప్రవహిస్తుంది. వాగు ల్లో వర్షపునీరు ముందుగా ప్రవహిస్తే ఏరు ముందని, అంతగా వర్షాలు లేకపోతే ఏకాశి ముందని రైతులు ప్రత్యేకంగా చెప్పుకుంటారు. వర్షాలు అనుకూలించి పంటలు పండాలని ఏకాదశి రోజున అన్నదాతలు భగంవతున్ని ప్రార్థిస్తుంటారు. -
గురుకులాల్లో వసతుల కల్పనకు చర్యలు
ఖమ్మంమయూరిసెంటర్: రెసిడెన్షియల్ విద్యా సంస్థల్లో మౌలిక వసతుల కల్పనకు చర్యలు చేపడుతున్నామని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. దానవాయిగూడెంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, జూనియర్ కళాశాలను శనివారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సాంఘిక సంక్షేమ గురుకులంలో రూ.1.50 కోట్లతో చేపడుతున్న పనులు సకాలంలో పూర్తి చేయాలన్నారు. ప్రహరీ నిర్మాణంతో పాటు మిషన్ భగీరథ ద్వారా నీరు సరఫరా చేయాలని సూచించారు. ఇంకా చేపట్టాల్సిన మరమ్మతు పనులపై నివేదిక అందించాలని అధికారులను ఆదేశించారు. డైనింగ్ హాల్లో టేబుళ్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఆ తర్వాత బి.ఆర్.అంబేద్కర్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల (బాలికలు)లో రూ.10 లక్షలతో చేపట్టిన పనులను పరిశీలించారు. ప్రభుత్వ రెసిడెన్షియల్ విద్యాసంస్థలో చదువుకుని ఐఐటీ, నీట్ వంటి జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నారని, జిల్లా నుంచి కూడా గొప్ప ఫలితాలు సాధించేలా విద్యార్థులను ఉత్తేజపరచాలని అన్నారు. అనంతరం కోయచలక క్రాస్ రోడ్డు వద్ద గల మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలను సందర్శించారు. విద్యార్థినులు నిత్యం చదువుతో పాటు కొంత సమయం క్రీడలకు కేటాయించాలని, పౌష్టికాహారం తీసుకోవాలని అన్నారు. కోతుల సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. మహాత్మా జ్యోతి బా పూలే విద్యాలయంలో వీధిదీపాలు, తాగునీటి సమస్యలు పరిష్కరించాలన్నారు. కలెక్టర్ వెంట సోషల్ వెల్ఫేర్ జోనల్ అధికారి స్వరూపా రాణి, జిల్లా మైనారిటీ సంక్షేమాధికారి డాక్టర్ పురంధర్, ప్రిన్సిపాళ్లు విజయదుర్గా, శైలజ, రాజ్యలక్ష్మి, ఆర్ఎల్సీ అరుణకుమారి తదితరులు ఉన్నారు.కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి -
పరిహారం స్వాహాపై కదలిక
తిరుమలాయపాలెం: భారీ వర్షాలు, వరదలతో ఆవులు, గేదెలు కొట్టుకుపోయి నష్టపోయిన రాకాసితండా రైతులకు ప్రభుత్వం నుంచి వచ్చిన పరిహారాన్ని మండల వెటర్నరీ డాక్టర్ భర్త వేరే ఖాతాకు మళ్లించిన ఘట నపై శనివారం సాక్షిలో ప్రచురితమైన ‘పశువుల పేరిట పరిహారం స్వాహా? కథననంతో జిల్లా పశుసంవర్థక శాఖ అధికారులు స్పందించారు. ఈ మేరకు శనివారం స్థానిక వెటర్నరీ డాక్టర్ను వివరణ కోరుతూ లేఖ పంపించినట్లు సమాచారం. పశువైద్యాధికారిణి భర్త రాకాసితండాలో ఓ రైతుకు చెల్లించాల్సిన డబ్బులను వేరే ఖాతాకు మళ్లించడంతో ఆ రైతు శుక్రవారం స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసిన విషయం విదితమే. ఈ ఘటనపై జిల్లా పశుసంవర్థకశాఖ అధికారి పురంధర్ను వివరణ కోరగా.. మండల పశువైద్యాధికారి వివరణ కోరామని, ఆ తర్వాత పూర్తి స్థాయిలో విచారణ చేపడతామని తెలిపారు. -
ముగ్గురు నకిలీ విత్తనాల విక్రేతల అరెస్ట్
తల్లాడ: రైతులకు నకిలీ పత్తి విత్తనాలు విక్రయించేందుకు వచ్చిన ముగ్గురిని శనివారం పోలీసులు అరెస్ట్ చేశారు. మరో మగ్గురు పరారయ్యారు. వారి వద్ద నుంచి తొమ్మిది నకిలీ పత్తి విత్తనాల ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. వివరాలిలా ఉన్నా యి. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం కాచారం గ్రామానికి చెందిన బ్రహ్మాజీ, ఏపీ రాష్ట్రం ఎన్టీఆర్ జిల్లా రెడ్డిగూడెం మండలం కుదుప గ్రామానికి చెందిన బాలగాని గోపి, కె.పర్వ గ్రామానికి చెందిన మంగరాజు గోపి, తల్లాడ మండలం మిట్టపల్లికి చెందిన గంధం కోటేశ్వరరావు, జంగా గోపాల్రెడ్డి, పోట్రు శ్రీను ముఠాగా ఏర్పడి మిట్టపల్లి పరిసర గ్రామాల్లో నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు తల్లాడ ఎస్ఐ వెంకటకృష్ణ, ఏఓ ఎండీ తాజుద్దీన్ శుక్రవారం రాత్రి నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తుండగా దాడి చేసి పట్టుకున్నారు. రూ.12వేల విలువైన తొమ్మిది అరుణోదయ పేరుతో ఉన్న నకిలీ పత్తి విత్తన ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. మంగరాజు గోపి, బాలగాని గోపి, గంధం కోటేశ్వరరావును అరెస్ట్ చేశారు. బ్రహ్మాజి, గోపాల్రెడ్డి, శ్రీను పరారీలో ఉన్నారు. -
జూనోసిస్ వ్యాధులు ప్రమాదకరం
● సాధు జంతువుల నుంచి సంక్రమణ ● వైరస్, బ్యాక్టీరియాల ద్వారా వ్యాప్తి ● రేబిస్, మెదడువాపు, ఆంత్రాక్స్ వంటివి ప్రాణాంతకమంటున్న వైద్యులు నేడు ‘జూనోసిస్ డే’ ఖమ్మంవ్యవసాయం: జూనోసిస్ వ్యాధులు ప్రమాదకరమైనవి. పశువుల నుంచి మాన వులకు, మానవుల నుంచి పశువులకు సంక్రమించే స్వభావమున్న వ్యాధులను జూనోసిస్ వ్యాధులు అంటారు. ఇవి మరణాలకు కూడా దారితీస్తాయి. 1885 జూలై 6న శాస్త్రవేత్త లూయిస్ పాశ్చ ర్ పిచ్చికుక్క కాటుతో వచ్చే వ్యాధి రేబిస్ నివారణ కు రేబిస్ టీకాను కనుగొన్నాడు. కుక్క కాటుకు గురైన బాలుడు జోసెఫ్ మీస్టర్పై ప్రయోగించి విజయం సాధించారు. అప్పటి నుంచి పెంపుడు జంతువులకు రేబిస్ సోకకుండా ముందుగా యాంటీ రేబిస్ టీకాను ఇస్తారు. ఏటా జూలై 6వ తేదీన ప్రపంచ జూనోసిస్ దినోత్సవంగా జరుపుకుంటున్నారు. పాలు, మాంసం, గుడ్ల కోసం పెంపుడు జంతువులను, కోళ్లను పెంచుతున్నాడు. మానసిక ఉల్లాసం కోసం కుక్కలను పెంచుతున్నారు. పెంపు డు జంతువుల వలన కూడా మానవులు అనేక వ్యాధుల బారిన పడుతున్నారు. జూనోసిస్ వ్యాధు ల రకాలు, వాటి నివారణ గురించి ఖమ్మం పశువ్యాధి నిర్ధారణ ప్రయోగశాల సహాయ సంచాలకులు డాక్టర్ అరుణ వివరించారు. కారకాలు.. ●బ్యాక్టీరియా: ఆంత్రాక్స్, బ్రూసెల్లోసిస్ లెప్టోస్పై రోసిస్, క్షయ ●వైరస్: రేబిస్, బర్డ్ఫ్లూ, మెదడువాపు, సార్స్, మేడ్కౌడిసీజ్ ●ప్రొటోజువా: టాక్సోప్లాస్మోడియా, లీష్మెనియాసిస్ ●రెకెట్షియా: టిక్, టైఫస్, క్యూఫీవర్ ●హెల్మెంథ్స్: ఎకై నోకోకోసిస్, టీనియాసిస్ ●ఎక్టోపారాసైట్స్: స్కేజిస్ రేబిస్: ఇది పిచ్చికుక్క కాటు ద్వారా వ్యాప్తి చెందే అతి భయంకరమైన వ్యాధి. పిచ్చికుక్కల లాలాజలంలో వ్యాధికారకం ‘రేబిస్’ వైరస్ ఉంటుంది. మనుషుల శరీరంపై ఉన్న పుండును నాకి నా లాలాజలం ద్వారా వ్యాధి సోకుతుంది. కుక్క కరిచిన వారం నుంచి 10 రోజుల లోపు వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి. ●మనుషుల్లో ఈ వ్యాధిని హైడ్రోఫోబియా అంటారు. ●ఈ వ్యాధి సోకిన మనిషి గుటక వేయలేడు. ●దాహం వేస్తున్నా నీళ్లు తాగమంటే భయపడతాడు. నివారణ: కుక్క కరిచిన వెంటనే ఆభాగాన్ని సబ్బుతో శుభ్రంగా కడగాలి. డాక్టర్ను సంప్రదించి చికిత్స చేయించుకోవాలి. పెంపుడు కుక్కలకు యాంటీ రేబిస్ టీకాలు వేయించాలి. బర్డ్ప్లూ వ్యాధి: బర్డ్ఫ్లూ లేదా ఇన్ఫ్లూయెంజా వ్యాధి కోళ్లను, ఇతర పక్షులను ఆశిస్తుంది. ఇది వైరస్తో కలిగే వ్యాధి. ఇది కోళ్లు, పక్షుల నుంచి మానవులకు సంక్రమిస్తుంది. వ్యాధి సోకిన మనుషుల్లో జలుబు, గొంతునొప్పి, దగ్గు, కండ్లకలకతో మొదలై ఊపిరితిత్తుల్లో రక్తం చేరి మరణానికి దారి తీస్తుంది. ఈ వ్యాధి నివారణకు కచ్చితమైన టీకా ఇంతవరకు కనుగొనలేదు. మెదడువాపు: వ్యాధి కారక వైరస్లు పందుల నుంచి దోమకాటు ద్వారా మనుషులకు వ్యాపిస్తాయి. ఇళ్ల దగ్గర పందుల సంచారం లేకుండా చూసుకోవాలి. ఆంత్రాక్స్: ఈ వ్యాధి బాసిల్లస్ ఆంత్రాసిస్ అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది. వ్యాధి సోకిన పశువుల పొట్ట ఉబ్బి అకస్మాత్తుగా చనిపోతాయి. వ్యాధి సోకి న మనుషుల్లో జ్వరం, న్యూమోనియా వస్తుంది. బ్రూసెల్లోసిస్: ఈ వ్యాధి పశువుల్లో బ్రూసెల్లా అబార్టస్ బూసెల్లా మెలిటెన్సిస్ అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది. ఈ వ్యాధి మనుషులు, అన్నిజాతుల పశు వులకు సోకుతుంది. ఇవిగాక మైకో బ్యాక్టీరియా, ట్యూబర్క్యులోసిస్తో క్షయ, లెప్టాస్పై రా ఇక్టిరోహి యో రెజికా బ్యాక్టీరియాతో లెప్టోస్పైరోసిస్ వ్యాధు లు వ్యాపిస్తాయి. తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. జూనోసిస్ వ్యాధులన్నీ పశువులకు సోకకుండా వ్యాధి నిరోధక టీకాలు వేయించాలి. వీధి కుక్కలకు యాంటీ రేబిస్ టీకాలు వేయించి లైసెన్సులు ఇవ్వాలి. పెంపుడు జంతువులతో, కోళ్లతో సన్నిహింతగా మెలిగే వాళ్లు జూనోసిస్ వ్యాధులపై అవగాహన కలిగి ఉండాలి. -
పాత వంతెనపై రాకపోకల పునరుద్ధరణ
ఖమ్మంక్రైం: ఖమ్మంలోని మున్నేటిపై కాల్వొడ్డు వద్ద ఉన్న పాత వంతెన మీదుగా శనివారం నుంచి వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు. తీగల వంతెన నిర్మాణం కారణంగా కాల్వొడ్డు పాత వంతెన మూతపడడం, అక్కడి చప్టాపైకి వరద చేరి కొట్టుకుపోవడం.. ప్రకాశ్నగర్ వంతెన దూరం కావడంతో వాహనాలన్నీ రాపర్తినగర్ బ్రిడ్జి వద్దకు వస్తుండడంతో ట్రాఫిక్ జామ్ అవుతోంది. ఈ అంశంపై ‘సాక్షి’లో శనివారం ‘రహదారి కష్టాలు’శీర్షికన కథనం ప్రచురితమైంది. దీంతో స్పందించిన అధికారులు కాల్వొడ్డు పాత వంతెన మీదుగా ద్విచక్ర వాహనాలను అనుమతించాలని పోలీసులు నిర్ణయించారు. ఈ మేరకు శనివారం రాకపోకలు మొదలుకాపోవడంతో రాపర్తినగర్ బ్రిడ్జిపై కాస్త భారం తగ్గినట్లయింది. -
ఎంపీడీఓల బదిలీలు
ఖమ్మంసహకారనగర్: గత ఎన్నికల సమయంలో ఎంపీడీఓల బదిలీలు జరగ్గా.. వారి వారి ప్రాంతాలకు బదిలీ చేస్తూ పంచాయతీరాజ్ డైరెక్టర్ జి.శ్రీజన శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఖమ్మం జిల్లాలో విధులు నిర్వర్తిస్తున్న జి.సురేందర్ను జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు బదిలీ చేయగా.. జి.రవీందర్, ఎస్. కుమార్, బి.వేణుగోపాల్రెడ్డి, పి.సరస్వతి, ఎ.రోజారాణిని మహబూబాబాద్ జిల్లాకు బది లీ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన కావూరి మహాలక్ష్మిని ఖమ్మంకు బదిలీ చేశారు. వీరంతా వెంటనే ఆయా జిల్లాల్లో విధుల్లో చేరనున్నారు. దూదేకుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా బడేసాహెబ్ఖమ్మంఅర్బన్: తెలంగా ణ దూదేకుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా షేక్ బడేసాహెబ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఖమ్మంలోని కొత్తగూడెంలో శనివారం జరిగిన సమావేశంలో ఈ ఎన్నిక జరగగా ఆయన మా ట్లాడారు. సంఘం బలోపేతానికి రాష్ట్ర మాజీ అధ్యక్షుడు ఫకీర్ సాహెబ్, గాలిబ్ సాహెబ్ ఎనలేని కృషి చేశారని, వారి ఆశయ సాధనకు అనుగుణంగా పనిచేస్తానని తెలిపారు. షేక్ సలీం అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ పుల్లాసాహెబ్, నాయకులు షేక్ మీరా, మహమ్మద్ అబ్దుల్ కలాం, షేక్ అన్వర్పాషా, షేక్ మీరాసాహెబ్, షేక్ మౌలాలీ, షేక్ ఉద్దండుసయ్యద్, అన్వర్పాషా, షేక్ లతీఫ్, షేక్ సుల్తాన్ తదితరులు పాల్గొన్నారు. బీటెక్ విద్యార్థి ఆత్మహత్య ముదిగొండ: పరీక్షల్లో ఫెయిల్ ఆయ్యాననే నమస్తాపంతో బీటెక్ విద్యార్థి వ్యవసాయ బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని వల్లాపురంలో శనివారం చోటుచేసుకుంది. వల్లాపురానికి చెందిన ఇండెమందుల యశ్వంత్ (19) హైదరాబాద్లో ఓ ప్రైవేట్ కళాశాలలో బీటెక్ చదువుతున్నాడు. ఇటీవల అమ్మమ్మ గారి ఊరైన వనంవారికిష్టాపురం వెళ్లాడు. కాగా, తొలి సెమిస్టర్ ఫలితాలు రాగా అందులో ఫెయిల్ అయ్యాడు. మనస్తాపంతో శుక్రవారం రాత్రి బయటకు వెళ్లి రాలేదు. సమాచారం అందుకున్న తల్లిదండ్రులు ఎంతగా గాలించినా ఫలితం లేకపోయింది. మరుసటి రోజు వనంవారికిష్టాపురం శివారులోని వ్యవసాయబావిలో విగతజీవిగా కనిపించాడు. మృతుడి తండ్రి పుల్లయ్య ఫిర్యాదుపై సీఐ మురళి కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. మద్యానికి డబ్బులివ్వలేదని..రఘునాథపాలెం: మద్యం తాగేందుకు తల్లిని డబ్బులడిగితే ఇవ్వలేదంటూ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన రఘునాథపాలెంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఎం.నాగేంద్రబాబు(30) మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో శుక్రవారం తల్లి భద్రమ్మను డబ్బు అడగగా ఆమె ఇవ్వలేదు. తల్లితో కాసేపు ఘర్షణ పడిన నాగేంద్రబాబు ఆ తర్వాత పురుగుల మందు తాగాడు. కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించగా శనివారం మృతిచెందాడు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ఉస్మాన్షరీప్ తెలిపారు. -
శ్రీ వేంకటేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు
ఎర్రుపాలెం: తెలంగాణా తిరుపతిగా ప్రసిద్ధి గాంచిన జమలాపురం శ్రీ వేంకటేశ్వరస్వామి వారికి శనివారం అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. శ్రీవారి పాదాలు, ఉత్సవ మూర్తులకు వేదమంత్రాల నడుమ పంచామృతాభిషేకం గావించారు. అనంతరం శ్రీ వారిని, శ్రీ అలివేలు మంగ, శ్రీ పద్మావతి అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించి నిత్య కల్యాణం నిర్వహించగా భక్తులు కనులపండువగా తిలకించారు. శ్రీవారికి పల్లకీ సేవ చేశారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు సమర్పించారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ కె. జగన్మోహన్రావు, వ్యవస్థాపక ధర్మకర్త ఉప్పల శ్రీరామచంద్రమూర్తి, ప్రధానార్చకులు ఉప్పల శ్రీనివాసశర్మ, సూపరింటెండెంట్ విజయకుమారి, అర్చకులు రాజీవ్శర్మ, మురళీమోహన్శర్మ తదితరులు పాల్గొన్నారు.నేడు మంత్రి పొంగులేటి పర్యటనఖమ్మంమయూరిసెంటర్: రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదివారం ఉమ్మడి జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం క్లబ్లో జరిగే సమావేశంలో పాల్వంచ, లక్ష్మీదేవిపల్లి, చుంచుపల్లి, సుజాతనగర్ మండలాల ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలు పంపిణీ చేయనున్నారు. అలాగే, చుంచుపల్లి మండలం ధన్బాద్లోని మాయాబజార్, వనమాకాలనీ వాసులకు ఇళ్ల స్థలాల పట్టాలు అందజేస్తారు. ఆ తర్వాత లక్ష్మీదేవిపల్లి మండలం సీతారాంపురం వద్ద సీతారాపురం–రూప్లాతండా రహదారిపై హైలెవెల్ బ్రిడ్జి నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేస్తారు. అలాగే, సాయంత్రం 6గంటలకు నేలకొండపల్లి మండలం కోనాయిగూడెంలో సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్న మంత్రి పొంగులేటి.. కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశాక సుర్దేపల్లిలో రహదారి నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. డీసీఈబీ సెక్రటరీగా బాధ్యతల స్వీకరణఖమ్మం సహకారనగర్ : డిస్ట్రిక్ట్ కామన్ ఎగ్జామినేషన్ బోర్డు(డీసీఈబీ) సెక్రటరీగా చింతకాని మండలం నాగులవంచ హెచ్ఎం కనపర్తి వెంకటేశ్వర్లు శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనను వివిధ సబ్జెక్టుల డీఆర్పీలతో పాటు పలువురు ఘనంగా సత్కరించారు. అనంతరం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. విద్యారంగాభివృద్ధికి కృషి చేయడంతో పాటు, పరీక్షల నిర్వహణ పటిష్టతకు కృషి చేస్తానని చెప్పారు. కార్యక్రమంలో వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు రమేష్, దామోదర ప్రసాద్, సుబ్బారావు, డీసీఈబీ మాజీ కార్యదర్శి నారాయణ తదితరులు పాల్గొన్నారు. ఢిల్లీలో మేయర్, డిప్యూటీ మేయర్ఖమ్మంమయూరిసెంటర్: ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పునుకొల్లు నీరజ, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహరా మూడు రోజులుగా ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా శనివారం అమృత్ పథకంపై చర్చల అనంతరం కొత్త, పాత పార్లమెంట్ భవనాలను ఇతర పట్టణాల మేయర్లతో కలిసి సందర్శించారు. అనంతరం లోక్సభ స్పీకర్ ఓంబిర్లాతో కలిసి ఫొటో సెషన్లో పాల్గొన్నారు. -
ఈ బ్యాంకు.. ‘బంగారం’!
● ఆభరణాల తాకట్టుపై డీసీసీబీలో సులువుగా రుణాలు ● ఉమ్మడి జిల్లాలోని 50 బ్రాంచ్ల ద్వారా రూ.765 కోట్లు ● రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఖమ్మం డీసీసీబీనేలకొండపల్లి: ప్రైవేట్ బ్యాంకులు, సంస్థలతో పోలిస్తే నిబంధనలు సరళంగా ఉండడంతో జిల్లా కేంద్ర సహకార బ్యాంకు(డీసీసీబీ) ద్వారా బంగారు ఆభరణాల తాకట్టుపై రుణాలు తీసుకునేందుకు రైతులు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరం ఇప్పటివరకు కొత్తగా ఇచ్చిన రుణాలే కాక, రెన్యూవల్ కలిపి ఖమ్మం డీసీసీబీ రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలవడం విశేషం. ఇప్పటివరకు బ్యాంకులోని బ్రాంచ్ల ద్వారా రూ.765 కోట్ల రుణాలు మంజూరు చేయడం రికార్డుగా నిలిచింది. 50 బ్రాంచ్లు ఖమ్మం డీసీసీబీ నాలుగు జిల్లాల పరిధిలో విస్తరించి ఉంది. ఖమ్మం, భద్రాద్రి జిల్లాలే కాక మహబూబాబాద్, ములుగు జిల్లాల్లో కలిపి 50 డీసీసీబీ బ్రాంచ్లు ఉన్నాయి. వీటి పరిధిలో రైతులతో పాటు వివిధ వర్గాల ప్రజలు ఖాతాదారులుగా ఉన్నారు. కొన్ని నెలలుగా బంగారం తాకట్టు రుణాలపై బ్యాంక్ అధికారులు విస్తృత ప్రచారం చేయడంతో మంచి ఫలితాలు వచ్చాయి. అంతా సక్రమంగా ఉంటే పది నిమిషాల్లోనే రుణం మంజూరు చేస్తామని ప్రకటించడమే కాక దానిని పక్కాగా అమలు చేశారు. దీంతో డీసీసీబీ పరిధిలోని శాఖల్లో పలువురు కొత్తగా రుణాలు తీసుకోగా, గత ఆర్థిక సంవత్సరం తీసుకున్న వారు రెన్యూవల్ చేసుకున్నారు. నిబంధనలు సరళంగా ఉండటం, జాప్యం లేకుండా రుణం మంజూరు కావడంతో తీసుకునే వారి సంఖ్య పెరిగింది. ఇలా డీసీసీబీ పరిధిలోని బ్రాంచ్ల ద్వారా ఇప్పటి వరకు 57,519 మంది దాదాపు రూ.765 కోట్ల మేర బంగారు ఆభరణాల తాకట్టుపై రుణాలు తీసుకున్నారు. మరో వారంలోగా ఇది రూ.800 కోట్లు దాటుతుందని అంచనా వేస్తున్నారు. ఈ రుణాల్లో రాష్ట్రంలోనే ఖమ్మం డీసీసీబీ మొదటి స్థానంలో నిలవగా, రెండో స్థానంలో నల్లగొండ నిలిచింది. కాగా, ఆ రుణాల ద్వారా బ్యాంకుకు రూ.కోట్లలో వడ్డీ సమకూరనుంది.సమష్టి కృషితోనే సాధ్యం.. బంగారం రుణాలు ఇవ్వడంలో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలవడం ఆనందంగా ఉంది. ఉద్యోగులు, పాలకవర్గ సభ్యులు సమష్టిగా ప్రచారం చేయడమే కాక నిబంధనల మేరకు త్వరగా రుణాలు మంజూరు చేస్తుండడంతో మంచి స్పందన లభించింది. ఇప్పటికే రూ.765 కోట్ల రుణాలు ఇవ్వగా.. వారం పది రోజుల్లో రూ.800 కోట్లు దాటుతుందని అంచనా వేస్తున్నాం. – ఎన్.వెంకట్ఆదిత్య, సీఈఓ, డీసీసీబీ -
● ఒకప్పుడు థియేటర్లో ఒకే సినిమా నాలుగు ఆటలు ● మల్టీప్లెక్స్ల రాకతో మారిన ప్రదర్శన విధానం ● సింగిల్ స్క్రీన్లలో సింగిల్ సినిమాలకు తగ్గిన క్రేజ్ ● ట్రెండ్కు తగ్గట్టు ఒకే తెరపై వేర్వేరు చిత్రాల ప్రదర్శన
మరింత సౌకర్యవంతంగా మల్టీప్లెక్స్లు.. ఇళ్లలోకి టీవీలు వచ్చాక థియేటర్ల కథ ముగుస్తుందనే ప్రచారం జరిగింది. థియేటర్ ఎక్స్పీరియన్స్ పేరుతో డాల్బీ డిజిటల్, డిజిటల్ ట్రాక్ సౌండ్ (డీటీఎస్), డాల్బీ ఆట్మోస్ పేరుతో సౌండ్ క్వాలిటీ, కుషన్, కపుల్ చైర్స్ వంటి సౌకర్యాలతో ఏసీ హాళ్లు వచ్చాయి. దీంతో ఎంటర్టైన్మెంట్లో థియేటర్లు మరింత అగ్రస్థానానికి చేరుకున్నాయి. ఇదే క్రమంలో మరింత సౌకర్యవంతంగా మల్టీప్లెక్స్లు అందుబాటులోకి వచ్చాయి. ఒకే ప్రాంగణంలో రెండుకు మించి స్క్రీన్లు, మూడుకు పైగా సినిమాలు ప్రదర్శించడం మొదలైంది. టాయిలెట్లు మొదలు స్క్రీన్ వరకు అన్నింటా బెస్ట్ సర్వీస్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తూ సినిమాకు సరికొత్త కేరాఫ్ అడ్రెస్గా మల్టీప్లెక్స్లు నిలిచాయి. ఓటీటీల రాకతో.. కరోనా సమయంలో విధించిన లాక్డౌన్ సినిమా థియేటర్ల పాలిట మృత్యుపాశంగా మారింది. ఓ వైపు మల్టీప్లెక్స్ హవా పెరుగుతుంటే మరోవైపు ఓవర్ ది టాప్ (ఓటీటీ) యాప్లు ఇబ్బడిముబ్బడిగా అందుబాటులోకి వచ్చాయి. రీజినల్, ఇంటర్నేషనల్ కంటెంట్ లోకల్ లాంగ్వేజ్లో అందుబాటులోకి వచ్చింది. దీంతో వినోద రంగంలో థియేటర్లకు గట్టి ప్రత్యామ్నాయం అందుబాటులోకి వచ్చినట్లయింది. ప్రేక్షకుడిని ఇంటి నుంచి థియేటర్కు రప్పించాలంటే స్టార్ పవర్.. లేదంటే మంచి కంటెంట్ ఉండక తప్పని పరిస్థితి ఎదురైంది. ఒకే రోజు రెండు, మూడు సినిమాలు.. మారిన పరిస్థితులకు తగ్గట్టుగా సింగిల్ స్క్రీన్ థియేటర్లు తమ పంథాను మార్చుకోక తప్పడం లేదు. ఒకప్పుడు సింగిల్ స్క్రీన్లలో నాలుగు షోలూ ఒకే సినిమా నడిపించగా ఇప్పుడు ఒకే రోజు రెండు, మూడు సినిమాలు నడిపించే పద్ధతిని అమల్లోకి తెస్తున్నారు. సినిమాలో ఉండే కంటెంట్, వచ్చే ప్రేక్షకులను బట్టి షోలు ఏర్పాటు చేస్తున్నారు. శనివారం ఖమ్మం వినోద థియేటర్లో హాలీవుడ్ చిత్రం జురాసిక్పార్క్ తెలుగు డబ్బింగ్ వెర్షన్ మార్నింగ్, మ్యాట్నీ షోలు ఉండగా ఫస్ట్ షో, సెకండ్ షోలలో ఇంగ్లిష్ వెర్షన్ ప్రదర్శించారు. ఇదే సినిమా కొత్తగూడెం ఏషియన్ మహేశ్వరి, భద్రాచలం విజయ్భాస్కర్లలో మ్యాట్నీ, సెకండ్షోలు ఉండగా మిగిలిన షోలలో కన్నప్ప, కుబేరా సినిమాలు ఆడిస్తున్నారు. ఈ ట్రెండ్ ఆర్నెళ్ల క్రితమే మొదలైనా పాపులారిటీ ఉన్న సినిమాలు ఇలా ఆడకపోవడంతో ఈ అంశం వెలుగులోకి రాలేదు. కానీ ఇప్పుడు ఒకేసారి వేర్వేరు సినిమాలు ప్రేక్షకుల ఆదరణ చూరగొనడంతో ఒకే థియేటర్లో వేర్వేరు షోలకు వేర్వేరు సినిమాలు ప్రదర్శించే అవకాశం చిక్కింది. ట్రెండ్కు తగ్గట్టు సింగిల్ స్క్రీన్లే మల్టీప్లెక్స్ ఎక్స్పీరియన్స్ ఇచ్చేందుకు సిద్ధమయ్యాయి. థియేటర్ల మూసివేత గతంతో పోల్చితే స్టార్డమ్ ఉన్న నటుల నుంచి వచ్చే సినిమాలు తగ్గిపోవడం, ఓటీటీలో మంచి కంటెంట్ వస్తుండటంతో థియేటర్కు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోతోంది. ఫలితంగా అవి మూసేయాల్సిన పరిస్థితి ఎదురైంది. శుక్రవారం సినిమా విడుదలైతే మూడో రోజు నుంచే ప్రేక్షకుల సంఖ్య తగ్గుతుండడంతో షోలు రద్దు చేయడం రివాజుగా మారింది. కొన్ని థియేటర్లయితే క్రేజ్ ఉన్న సినిమా విడుదలైనప్పుడు తెరవడం, ఆ తర్వాత మూసేస్తున్నారు. తెలంగాణలో సినిమా ప్రదర్శనలకు గుండెకాయలా ఉన్న ఉమ్మడి ఖమ్మం జిల్లాలో థియేటర్లు మూతపడిపోవడం మొదలైంది. ఒకప్పుడు ఖమ్మంలో 11 థియేటర్లు ఉంటే ఇప్పుడు ఐదే మిగిలాయి. కొత్తగూడెంలో ఏడుకు బదులు నాలుగు, పాల్వంచలో నాలిగింట రెండు, ఇల్లెందులో మూడు, మణుగూరు, భద్రాచలంలలో మూడింట రెండు థియేటర్లే నడుస్తున్నాయి. ఇక మండల కేంద్రాల్లోని థియేటర్లు ఎప్పుడో మూతబడ్డాయి. -
సూత్రాలను చట్టాలు ఉల్లంఘిస్తే సమీక్ష తప్పనిసరి
మధిర: రాజ్యాంగంలో సూత్రాలను శాసనసభలో చేసే చట్టాలు ఉల్లంఘించినప్పుడు న్యాయవ్యవస్థ కచ్చితంగా న్యాయ సమీక్ష చేయాల్సిందేనని హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ బి.చంద్రకుమార్ అభిప్రాయపడ్డారు. మధిరలో ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ (ఐఏఎల్) ఆధ్వర్యాన శనివారం ఏర్పాటుచేసిన న్యాయవాదుల శిక్షణా తరగతులకు హాజరైన ఆయన.. ఆర్ట్ ఆఫ్ క్రాస్ ఎగ్జామినేషన్ ఇన్ క్రిమినల్ కేసెస్, ప్రొఫెషనల్ ఎథిక్స్ తదితర అంశాలపై మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో శాసనసభ, న్యాయవ్యవస్థ, కార్యనిర్వాహక శాఖల పాత్ర దేనికదే ప్రత్యేకంగా ఉన్నందున ఒకరి పాత్రలోకి మరొకరు చొచ్చుకుపోకూడదన్నారు. ఎప్పుడైతే శాసన, కార్యనిర్వాహక శాఖలు న్యాయవ్యవస్థలోకి చొచ్చుకొచ్చి ప్రభావితం చేయాలని చూస్తాయో అప్పుడు వాటి మధ్య సంబంధం తెగిపోతుందని పేర్కొన్నారు. కాగా, శాసనసభలో ఆమోదం పొందే చట్టాలు ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉండకపోతే ప్రజల నుంచి తిరుగుబాటు వస్తుందన్నారు. న్యాయ సమీక్ష అధికారం కోర్టులకు లేనప్పుడు న్యాయవ్యవస్థ రూపం ప్రజాస్వామ్యంలో కనుమరుగైపోతుందని ఆయన అభిప్రాయపడ్డారు. కంప్యూటర్ కాలంలోనూ దేశ ప్రజలు కోర్టులపై నమ్మకాన్ని పోగొట్టుకోలేదని పలు సందర్భాల్లో నిరూపితమైందని తెలిపారు. ఎంతమంది యువ న్యాయవాదులు ఈ వృత్తిలోకి వస్తే అంత త్వరగా కేసులు పరిష్కారం కావడానికి అవకాశం ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే, ప్రస్తుతం న్యాయవ్యవస్థ అత్యంత ఖరీదైనదిగా మారిందని, సామాన్యుడు సుప్రీంకోర్టు మెట్లు ఎక్కే పరిస్థితి లేదని చంద్రకుమార్ తెలిపారు. న్యాయవాదులు ప్రజా సంబంధాలు కొనసాగిస్తూ పేదలు నివసించే ప్రాంతాలకు వెళ్లి వారికి న్యాయ పరిజ్ఞానాన్ని కల్పించాలని, కార్మికులకు హక్కుల గురించి తెలియజేయాలని సూచించారు. తెలంగాణ స్టేట్ బార్ కౌన్సిల్ మెంబర్ జనార్దన్, సీనియర్ న్యాయవాది మామిడి హనుమంతరావు వివిధ అంశాలపై అవగాహన కల్పించారు. శిక్షణా తరగతులకు ప్రారంభానికి ముందు మధిర ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి వేముల దీప్తిని ఐఏఎల్ బాధ్యులు సన్మానించారు. ఐఏఎల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వై ఉదయ భాస్కర్, సహాయ కార్యదర్శులు పి.పట్టాభి, వాసిరెడ్డి వెంకటేశ్వరరావు, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు షేక్ లతీఫ్, ఓరుగంటి శేషగిరిరావు, కొత్తగూడెం జిల్లా కార్యదర్శి భాగం మాధవరావుతో పాటు పారుపల్లి అమర్ చంద్, కోటం రాజు, మునిగడప వెంకటేశ్వర్లు, శాంతకుమారి, తెల్లప్రోలు వెంకటరావు, కావూరి రమేష్, షేక్ ఇమావళి, నెల్లూరి రవికుమార్, గంధం శ్రీనివాసరావు షేక్ నస్రీన్, అరుణ, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బోజడ్ల పుల్లారావు పాల్గొన్నారు.హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ -
లిఫ్ట్ ఇరిగేషన్ లతో పుష్కలంగా సాగునీరు
కల్లూరురూరల్: లిఫ్ట్ ఇరిగేషన్లతో పుష్కలంగా సాగునీరు అందించేలా చర్యలు తీసుకున్నామని రాష్ట్ర ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మువ్వా విజయబాబు తెలిపారు. శనివారం ఆయన లింగాలలో విలేకరులతో మాట్లాడారు. లిఫ్ట్లకు మరమ్మతులు అవసరమైతే నిధుల కోసం అంచనాలు రూపొందించాలని అధికారులను ఆదేశించామని తెలిపారు. ప్రతీ ఎకరాకు సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. వచ్చే సీజన్ నాటికి సీతారామ ప్రాజెక్టు నీరు అందుతుందన్నారు. రైతుబంధుతో పాటు సన్న ధాన్యానికి బోనస్ ఇచ్చి వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ఆయన వెంట నాయకులు మట్టూరి జనార్దన్, మద్దినేని లోకేశ్వరరావు, యాస వెంకటేశ్వరరావు, కాటేపల్లి కిరణ్కుమార్, యాస శ్రీకాంత్, తాళ్ల వెంకటేశ్వర్లు ఉన్నారు. -
రామాలయంలో సెక్యూరిటీ పటిష్టం
భద్రాచలం: భద్రాచలంలోని శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో సెక్యూరిటీ వ్యవస్థను మరింత పటిష్టం చేశారు. రెండు డోర్ ఫ్రేమ్లతోపాటు మెటల్ డిటెక్టర్, ఆరు హ్యాండ్ హోల్డ్ మెటల్ డిటెక్టర్లను కొనుగోలు చేసి శుక్రవారం ఆలయంలో అమర్చారు. ఎస్పీఎఫ్ సిబ్బంది భక్తులను తనిఖీ చేసి వీటి ద్వారానే అనుమతించారు. ఈఈ రవీందర్ పర్యవేక్షించారు. వస్త్ర దుకాణ టెండర్దారుడికి రూ.లక్ష జరిమానా అన్యమత ప్రచారం చేసే కవర్లను దేవస్థానంలో వినియోగించినందుకు దేవస్థానం అఽధికారులు వస్త్ర దుకాణ టెండర్దారుడికి రూ.లక్ష జరిమానా విధించారు. నెల రోజుల క్రితం ఆంధ్రాకు చెందిన ఓ భక్త జంట స్వామివారి వస్త్రాలను ఆలయ ప్రాంగణంలో కొనుగోలు చేయగా, వాటిని ఆ దుకాణదారుడు కవర్లో పెట్టి ఇచ్చారు. అయితే, కవర్పై అన్యమత ప్రచార నినాదాలు ఉండడంతో భక్తులు ఈఓకు ఫిర్యాదు చేయగా ఏఈఓ శ్రవణ్కుమార్తో విచారణ జరిపించారు. ఆయన ఇచ్చిన నివేదిక ఆధారంగా దుకాణదారుడికి ఈఓ రూ.లక్ష జరిమానా విధించారు. మెటల్ డిటెక్టర్ల ఏర్పాటు -
మారమంతే
మేమింతే..వానాకాలం గడువు ముగిసినా.. 2024–25 వానాకాలం సీజన్లో 2,95,605 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సీఎంఆర్ కోసం జిల్లాలోని 66 మిల్లులకు అందజేశారు. ఈ ధాన్యంలో క్వింటాకు 67 శాతం చొప్పున 1,98,066.880 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉంటుంది. బియ్యం అప్పగించే గడువు జూన్తోనే ముగిసినా ఇప్పటి వరకు 1,66,090.086 మెట్రిక్ టన్నుల బియ్యమే(84శాతం) అప్పగించారు. ఇంకా 31,976.794 మెట్రిక్ టన్నుల బియ్యం ఎప్పుడిస్తారో స్పష్టత రావడం లేదు. ఇందులో పాఠశాలలు, వసతిగృహాలు, అంగన్వాడీ కేంద్రాలకు అందించాల్సిన సన్నబియ్యం ఉండడం.. మిల్లర్లు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నా అధికారుల నుంచి చర్యలు లేకపోవడం గమనార్హం.సాక్షిప్రతినిధి, ఖమ్మం: ప్రభుత్వానికి కస్టమ్ మిల్లింగ్ రైస్(సీఎంఆర్)ను అందించడంలో కొందరు మిల్లర్లు నిర్లక్ష్యాన్ని వీడడం లేదు. సకాలంలో ఽబియ్యం అప్పగంచకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించడం.. ఆతర్వాత చర్యల్లో పురోగతి లేకపోవడంతో పరిస్థితులు మారడం లేదు. 2024–25 వానాకాలం సీజన్కు సంబంధించి గడువు ముగిసినా మరో 16 శాతం సీఎంఆర్ బకాయి ఉన్నారు. ఇక యాసంగికి సంబంధించి ఇప్పటి వరకు 60శాతం మాత్రమే అందింది. ప్రధానంగా కొన్ని మిల్లులు మొద్దు నిద్రను వీడకపోవడం.. ప్రభుత్వం గడువు పెంచడం పరిపాటిగా మారుతున్నా ఈ ఏడాది ఇంకా ప్రకటన మాత్రం రాలేదు. మరోసారి పెంచుతారా.. గడువు ముగిసినప్పటికీ సీఎంఆర్ అప్పగించని మిల్లర్లపై ప్రభుత్వం చూసీ చూడనట్లు వ్యవహరిస్తుందనే ఆరోపణలు వస్తున్నాయి. ఏటా ఇదే పరిస్థితి ఉత్పన్నమవుతుండగా, మరోసారి గడువు పెంచుతారులే అన్న ధీమాతో మిల్లుల యాజమాన్యాలు ఉంటున్నాయి. ఏటా గడువు ముగియగానే మరోసారి ప్రభుత్వం సమయం ఇస్తున్నా ఈసారి ఎలాంటి ప్రకటన రాలేదు. అయితే, 16 శాతం సీఎంఆర్ సేకరణకు ప్రభుత్వం గడువు పెంచుతుందని అధికారులు భావిస్తున్నారు. యాసంగిలో 60 శాతం.. ఇక 2024–25 ఏడాది యాసంగి సీజన్ సీఎంఆర్ ఇప్పటి వరకు 60 శాతం అందజేశారు. ఈ సీజన్లో 4,55,981.360 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పౌర సరఫరాల సంస్థ ద్వారా మిల్లర్లకు అందజేయగా.. 3,05,743.351 మెట్రిక్ టన్నుల బియ్యం తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది. ఇందులో 1,84,444.836 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ప్రభుత్వానికి అప్పగించారు. మరో 1,21,298.515 మెట్రిక్ టన్నుల బియ్యం అందజేయాల్సి ఉండగా.. ఈ ఏడాది సెప్టెంబర్ వరకు గడువు ఉంది. కానీ రెండు నెలల్లో 40 శాతం బియ్యం మిల్లర్లు అందజేస్తారా, లేదా అన్నది వేచి చూడాల్సిందే. కొందరు మిల్లర్లు తీరుతో.. జిల్లాలోని 66 మిల్లులకు పౌర సరఫరాల సంస్థ రెండు సీజన్లలో సీఎంఆర్ కోసం ధాన్యం అందజేస్తోంది. ఈ ధాన్యం అందించిన మూడు నెలల్లోగా బియ్యం అప్పగించాలనే నిబంధన ఉంది. అధికసంఖ్యలో మిల్లుల యాజమాన్యాలు గడువులోగా బియ్యం అందించే ప్రయత్నాలు చేస్తున్నా.. కొన్ని మిల్లుల యాజమాన్యాలు మాత్రం తమకేమీ పట్ట నట్టు వ్యవహరిస్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఇలా సకాలంలో సీఎంఆర్ అందజేయని కొన్ని మిల్లులపై గత ఏడాది టాస్క్ఫోర్స్ బృందాలు దాడులు నిర్వహించాయి. ఈమేరకు బియ్యం దారి మళ్లించినట్లు గుర్తించాయి. అయితే, అప్పుడప్పుడు కాకుండా ఏటా సీజన్ల వారీగా తనిఖీలు చేపడుతూ నిర్లక్ష్యంగా వ్యవహరించిన యాజమాన్యాలపై చర్యలు తీసుకుంటే సకాలంలో సీఎంఆర్ సేకరణ సాధ్యమవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.సీఎంఆర్ అప్పగింతలో కొందరు మిల్లర్ల నిర్లక్ష్యం 2024–25 వానాకాలం గడువు ముగిసినా 16శాతం బకాయి యాసంగి సీజన్లోనూ 60 శాతమే.. హెచ్చరికలే తప్ప చర్యలు లేకపోవడంతో ఇష్టారాజ్యంఒత్తిడి తీసుకొస్తాం.. జిల్లాలో లక్ష్యం మేర సీఎంఆర్ సేకరణకు అన్నిచర్యలు తీసుకుంటున్నాం. 2024–25 వానాకాలం సీజన్కు సంబంధించి మిల్లర్లు సీఎంఆర్ ఇచ్చే గతనెల 30తో ముగిసింది. ఇంకా బకాయి ఉన్న మిల్లర్లపై ఒత్తిడి తీసుకొస్తూ త్వరగా సీఎంఆర్ సేకరణ పూర్తిచేస్తాం. యాసంగికి సంబధించి సెప్టెంబర్ వరకు గడువు ఉన్నందున ఆలోగా లక్ష్యం మేర వసూలు చేస్తాం. – చందన్కుమార్, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి -
రహ‘దారి’ కష్టాలు
ఖమ్మంమయూరిసెంటర్: ఖమ్మంలో కాల్వొడ్డు వద్ద మున్నేటిపై పాత బ్రిడ్జి మీదుగా రాకపోకలు నిలిచి పోవడం, ఆ పక్కనే లోలెవల్ చపాపైకి వరద నీరు చేరగా వాహనాలను అనుమతించకపోవడం జిల్లా కేంద్రంలో వాహనదారులకష్టాలకు కారణమవుతోం ది. ఖమ్మం నుంచి సూర్యాపేట, వరంగల్, కోదాడ, జగ్గయ్యపేట వైపు వెళ్లేందుకు మున్నేటిపై మూడు చోట్ల బ్రిడ్జిలు నిర్మించారు. కాల్వొడ్డు వద్ద వందేళ్ల క్రితం నిర్మించిన బ్రిడ్జి ప్రక్కనే ప్రస్తుతం తీగల వంతెన నిర్మాణ పనులు జరుగుతున్నాయి. దీంతో పాత బ్రిడ్జి మీదుగా వాహనాల రాకపోకలను కొ న్నాళ్లుగా నిలిపివేశారు. ప్రకాశ్నగర్లోఇంకో బ్రిడ్జి ఉన్నప్పటికీ అది దూరాభారం కావడంతో వాహనదారులంతా రాపర్తినగర్ బ్రిడ్జి వచ్చివెళ్తున్నారు. దీంతో ఉదయం, సాయంత్రం ఇక్కడ తీవ్ర రద్దీ నెలకొని గంటల తరబడి ట్రాఫిక్ సమస్యలు ఎదురవుతున్నాయి. నత్తనడకన తీగల వంతెన నిర్మాణం మున్నేటిపై ఉన్న మూడు బ్రిడ్జిల్లో కాల్వొడ్డు బ్రిడ్జి కీలకంగా నిలుస్తోంది. ఇదినగరంలోని ప్రధాన ప్రాం తాలను కలుపుతూ నిత్యం వేలాది వాహనాలతో రద్దీగా ఉంటుంది. అయితే ఈ బ్రిడ్జి పక్కనే రూ.180 కోట్ల వ్యయంతో తీగల వంతెన నిర్మిస్తున్నారు. ఈ పనులకు ఆటంకం ఎదురుకావొద్దని పాత బ్రిడ్జిపై రాకపోకలు నిలిపివేశారు. అయితే, తీగల వంతెన నిర్మాణం 2023లో మొదలుపెట్టగా 2026 జూన్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. కానీ ఇప్పటివరకు 45శాతం పనులే పూర్తయ్యాయి. ప్రస్తుతం వర్షాలు మొదలవడంంతో పనులు నత్తనడకన సాగుతుండగా.. పాత బ్రిడ్జి పక్కన లోలెవల్ చప్టాపైకి ఇటీవల వరద చేరి ద్విచక్రవాహనాలు వచ్చివెళ్లేందుకు అనువుగా ఉన్న రోడ్డు కాస్త కొట్టుకుపోయింది. దీంతో వాహనదారులంతా నగరంలోకి రావాలన్నా.. వెళ్లాలన్నా అవస్థ పడక తప్పడంలేదు. రాపర్తినగర్పైనే భారమంతా.. కాల్వొడ్డు బ్రిడ్జి మూసివేయడడం.. ప్రకాశ్నగర్ బ్రిడ్జి దూరం కావడంతో ఖమ్మం నుంచి ఇతర ప్రాంతాలకు వచ్చివెళ్లే వాహనాలన్నీ రాపర్తినగర్ బ్రిడ్జి వైపునకు వస్తున్నాయి. సహజంగా రద్దీ ఉండే ఈ బ్రిడ్జిపై ఇప్పుడు మరింత భారం పడడంతో ఉదయం, సాయంత్రం కిలోమీటర్ల మేర వాహనాలు బారులు దీరుతున్నాయి. ద్విచక్ర వాహనదారులు, ఆటోలు, కార్లు, భారీ వాహనాలన్నీ వస్తుండడం.. బ్రిడ్జి వెడల్పు చాలా తక్కువగా ఉండడంతో సమస్యకు కారణమవుతోంది. భారీ వాహనాలు, కంటైనర్లు వచ్చినప్పుడు బ్రిడ్జి దాటే వరకు అటు కరుణగిరి, ఇటు రాపర్తినగర్ వైపు మిగతా వాహనాలను నిలిపివేస్తుండడంతో వాహనదారులు కష్టాలు మరింత పెరుగుతున్నాయి. శుక్రవారం ఉదయం రెండు లారీలు ఢీకొనడంతో సుమారు రెండు గంటల పాటు వాహనాలన్నీ ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. చివరకు కొన్ని వాహనాలను దారి మళ్లించి జెడ్పీ సెంటర్ మీదుగా ప్రకాశ్నగర్ బ్రిడ్జి వైపు పంపించారు. మున్నేటిపై కాల్వొడ్డు బ్రిడ్జి మూసివేత ఫలితంగా భారమంతా రాపర్తినగర్పైనే... వాహనాల రద్దీతో గంటల తరబడి ట్రాఫిక్ జామ్ప్రమాదాలు జరుగుతున్నాయి.. వాహనాలన్నీ రాపర్తినగర్ వైపు వస్తుండడంతో రద్దీ పెరి గింది. త్వరగా వెళ్లాలని ఆటోలు, ద్విచక్ర వాహనదారులు చిన్నచిన్న సందుల్లోకి వెళ్తూ ప్రమాదాలు బారిన పడుతున్నారు. పాత బ్రిడ్జిని పునరుద్ధరించి ట్రాఫిక్ ఇక్కట్లు తొలగించాలి. – సైదా, సీపీఐ నాయకుడుపాత బ్రిడ్జిపై అనుమతించాలి.. తీగల వంతెన నిర్మాణం పేరుతో పాత బ్రిడ్జిపై రాకపోకలు నిలిపివేయడంతో ట్రాఫిక్ సమస్య పెరిగింది. రాపర్తినగర్ బ్రిడ్జి వద్ద ట్రాఫిక్ జామ్ అవుతోంది. కాల్వొడ్డు వద్ద పాత బ్రిడ్జిపై వాహనా లు అనుమతిస్తేనే సమస్య పరిష్కారమవుతుంది. – వై.విక్రమ్, ఖమ్మం డివిజన్ కార్యదర్శి, సీపీఎం -
‘ఆమె’కు తొలి ఫలితం
ఆనందంగా ఉంది.. మండల సమాఖ్య ద్వారా బస్సు కొనుగోలు చేసి ఆర్టీసీకి అప్పగించాం. సంస్థ నుండి తొలి నెల ఆద్దె విడుదల చేయడం ఆనందంగా ఉంది. నెలనెలా అద్దె వస్తే ఈఎంఐ కడుతూ బాకీ తీరుస్తాం. మిగిలిన నగదుతో మా సమాఖ్యలోని సభ్యులకు ఆర్థిక భరోసా లభిస్తుంది. – మరియమ్మ, వైరా మండల సమాఖ్య అధ్యక్షురాలు ఖమ్మంమయూరిసెంటర్: మహిళా స్వయం సహాయక సంఘాల్లోని సభ్యులు ఆర్థికాభివృద్ధి సాధించేలా ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి ద్వారా పలు అవకాశాలు కల్పిస్తోంది. ఇందులో భాగంగా సంఘాలకు వడ్డీ లేని రుణాలు అందించడమే కాక ఆ రుణంతో బస్సులు కొనుగోలు చేయించి ఆర్టీసీకి అద్దె ప్రాతిపదికన అప్పగించారు. తద్వారా నెలవారీగా అద్దెతో రుణ వాయిదా చెల్లించి, మిగతా నగదును సభ్యులకు రుణం ఇచ్చేలా ప్రణాళిక రూపొందించారు. బస్సు బకాయి తీరాక సంఘాలకే అద్దె మొత్తం అందనుంది. ఈమేరకు మే 20వ తేదీన ఆర్టీసీకి అద్దె ప్రాతిపదికన బస్సులు అప్పగించడంతో జూన్ 20వ తేదీ నాటికి ఒక నెలకు సంబంధించి అద్దెను సంస్థ తాజాగా విడుదల చేసింది. ఈ నిధులను సంఘాల వారీగా అధికారులు శనివారం అందించనుండడంతో తొలి ఫలితం దక్కనుందని మహిళా సంఘాల సభ్యుల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఉమ్మడి జిల్లాలో 21 బస్సులు.. టీజీఎస్ ఆర్టీసీకి అద్దె ప్రాతిపదికన ఇచ్చేలా మండల సమాఖ్యల ద్వారా బస్సులు కొనుగోలు చేయించారు. ఉమ్మడి జిల్లాలో 31 సంఘాలకు తొలిదశలో అవకాశం కల్పించగా ఇప్పటి వరకు 21 బస్సులను సమకూర్చారు. ఖమ్మం జిల్లాలో 19, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రెండు మండల సమాఖ్యల ద్వారా రూ.36 లక్షల చొప్పున ఒక్కో బస్సు కొనుగోలు చేశారు. ఆర్టీసీ ద్వారా అందే అద్దెను ఏడేళ్ల పాటు(84నెలలు) మండల సమాఖ్యల ద్వారా జిల్లా సమాఖ్య లేదా రుణం జారీ చేసిన బ్యాంకుకు చెల్లించాల్సి ఉంటుంది. ఈఎంఐ చెల్లింపులు, వినియోగం ఆర్టీసీ ప్రతి నెలా 21నుంచి 25వ తేదీ మధ్య మండల మహిళా సమాఖ్యల ఖాతాల్లో అద్దె జమ చేస్తుంది. ఒక్కో బస్సుకు అద్దె రూపంలో రూ.69,468 జమ చేయనుండడంతో ఇందులో రూ.50వేలను కిస్తీగా చెల్లించాలి. మిగతా రూ.19,468 నగదును మహిళా సమాఖ్యల ఖాతా ద్వారా అవసరాలకు అనుగుణంగా సభ్యులు రుణంగా తీసుకోవచ్చు. కాగా, ఆర్టీసీ యాజమాన్యం బస్సులకు సంబంధించిన తొలి నెల అద్దె విడుదల చేయడంతో ఉమ్మడి జిల్లాలోని మహిళా సమాఖ్యల సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మహిళా సంఘాల ద్వారా ఆర్టీసీకి అద్దె బస్సులు నేడు మొదటి నెల అద్దె చెల్లించనున్న అధికారులు ఉమ్మడి జిల్లాలో 21 మండల సమాఖ్యలకు లబ్ధి -
ఫుడ్ సేఫ్టీ టాస్క్ఫోర్స్ తనిఖీలు
ఖమ్మంమయూరిసెంటర్: ఖమ్మంలోని పలు రెస్టారెంట్లతో పాటు మసాలా దినుసులు, పచ్చళ్ల తయా రీ కేంద్రాలు, స్వీట్స్ షాపుల్లో రాష్ట్రఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ బృందం శుక్రవారం తనిఖీలు చేపట్టింది. రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ టీం హెడ్, జోనల్ అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ వి.జ్యోతిర్మయి ఆధ్వర్యాన టాస్క్ఫోర్స్ ఫుడ్ ఇన్స్పెక్టర్లు రోహిత్రెడ్డి, పి.స్వాతి, శ్రీషిక, సీహెచ్.లోకేష్, శరత్తో కూడిన బృందం ఖమ్మం వైరా రోడ్డులోని పీఎస్కే ఫుడ్స్ అండ్ స్పైసెస్, ఎన్టీఆర్ సర్కిల్లోని జీ.పీ.రెడ్డి స్వీట్ షాప్, ఐస్ క్రీమ్ యూనిట్, పాలమూరు గ్రిల్స్ రెస్టారెంట్లలో తనిఖీ చేశారు. కాలం చెల్లిన పదార్థాలు, హానీకర రంగులు పాలమూరు గ్రిల్స్ రెస్టారెంట్లో వంటగది అపరిశుభ్రంగా ఉండడం, రిఫ్రిజిరేటర్, కోల్డ్ చాంబర్లో నిర్ణీత ఉష్ణోగ్రత లేవని అధికారులు గుర్తించారు. ఈసందర్భంగా ఆహార పదార్థాల తయారీలో ఉపయోగించే సామగ్రి, కూరగాయలు సరిగ్గా లేకపోవడంతో వాటిని ధ్వంసం చేసి నిర్వాహకులకు నోటీసులు ఇచ్చారు. అలాగే, పీఎస్కే ఫుడ్స్ అండ్ స్పైసెస్లో సిబ్బంది వ్యక్తిగత పరిశుభ్రత పాటించకపోగా, ప్లాస్టిక్ డ్రమ్ముల్లో పచ్చళ్లు నిల్వ చేయడం, ముడి సరుకులపై ఈగలు ఉండడాన్ని గుర్తించి శాంపిళ్లు సేకరించడమే కాక నోటీసులు జారీ చేశారు. అలాగే, వైరా రోడ్డులోని ఐబాకో ఐస్క్రీమ్ యూని ట్లో సరైన పేరుతో లైసెన్స్ లేకపోగా, అపరి శుభ్ర వాతావరణం ఉండడంతో నోటీసు ఇచ్చారు. అంతకేకాక జీపీ రెడ్డి స్వీట్స్లో అపరిశుభ్ర వాతావరణంలో కేక్స్ తయారు చేస్తున్నట్లు గుర్తించిన అధికారులు, కేక్లు, స్వీట్ల తయారీలో హానికర రసాయనా లు కలిగిన రంగులు కలుపుతున్నారని తేల్చారు. ఈమేరకు అనుమానిత సామగ్రిని సీజ్ చేసి నిర్వాహకులకు నోటీసులు జారీ చేశారు. హోటళ్లు, స్వీట్ షాపుల్లో హానికర రంగులు, కాలం చెల్లిన పదార్థాల సీజ్ -
రోడ్డు ప్రమాదంలో లష్కర్ మృతి
బోనకల్: మండలంలోని రావినూతల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో లష్కర్ మృతి చెందాడు. కలకోటకు చెందిన యంగల అప్పయ్య (50) గతంలో వీఆర్ఏగా పనిచేయగా, ఇటీవల ఇరిగేషన్ శాఖలో బోనకల్ సబ్ డివిజన్ పరి ధిలో లష్కర్గా నియమితులయ్యాడు. విధి నిర్వహణలో భాగంగా స్వగ్రామం నుంచి బోనకల్ వైపునకు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా గేదె అడ్డు రావడంతో సుబాబుల్ లోడ్తో వెళ్తున్న ట్రాక్టర్ను ఢీకొని కిందపడ్డాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆయనను ఆస్పత్రికి తరలిస్తుండగానే మృతి చెందాడు. అప్పయ్య భార్య, కు మారుడు, కుమార్తె ఉండగా, కేసు నమోదు చేశామని ఎస్సై పి.వెంకన్న తెలిపారు. రోడ్డు ప్రమాదంలో మృతి ఖమ్మంరూరల్: మండలంలోని నాయుడుపేటకు చెందిన సానబోయిన శ్రీనివాస్(52) రోడ్డు ప్రమాదంలో శుక్రవారం మృతి చెందాడు. గురువారం రాత్రి ఆయన ఖమ్మం నుంచి బైపాస్ రోడ్డు మీదుగా ద్విచక్ర వాహనంపై నాయుడుపేట సర్కిల్లోని తన దాబా వద్దకు వస్తున్నాడు. మార్గమధ్యలో కొత్తూరు వద్ద ద్విచక్రవాహనాన్ని రోడ్డు పక్కన ఆపి మూత్రవిసర్జన చేసి తిరిగి వాహనం స్టార్ట్ చేసే సమయాన ఖమ్మం వైపు నుంచి వచ్చిన ట్యాంకర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన శ్రీనివాస్ను ఖమ్మం ఆస్పత్రికి, అక్కడి నుంచి హైదరాబాద్ తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. శ్రీనివాస్ టీడీపీ మండల అధ్యక్షుడిగా కొనసాగుతుండగా, ఆయన మృతదేహం వద్ద పార్టీ నాయకులు డాక్టర్ వి.రామనాధం, కూరపాటి వెంకటేశ్వర్లు, కొండబాల కరుణాకర్, ఆరెకట్ల కొండల్రావు, కర్నాటి సీతారాములు, తాత సుధాకర్, రావుట్ల సత్యనారాయణ నివాళులర్పించారు. మైనర్పై అత్యాచారం కేసులో 20 ఏళ్ల జైలుశిక్షఖమ్మం లీగల్: మైనర్పై అత్యాచారం చేసిన కేసులో సత్తుపల్లి మండలం కొత్తూరు గ్రామానికి చెందిన నిందితుడు మామిడి పాపారావుకు ఇరవై ఏళ్ల జైలుశిక్షతో పాటు రూ.50 వేల జరిమానా విధిస్తూ ఖమ్మం మొదటి అదనపు జిల్లా న్యాయాధికారి కె.ఉమాదేవి శుక్రవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం తీర్పు వివరాలిలా ఉన్నాయి. కొత్తూరుకు చెందిన బాలిక 2023 ఆగస్టు 13న తన ఇంటి ముందు స్నేహితులతో ఆడుకుంటుండగా పాపారావు చాక్లెట్లు కొనిస్తానని చెప్పి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. దీంతో పాప రోదిస్తూ తన తల్లికి చెప్పగా ఆమె సత్తుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. విచారణలో నేరం రుజువు కావడంతో నిందితుడు పాపారావుకు 20ఏళ్ల జైలుశిక్షతో పాటు జరిమానా తీర్పు చెప్పారు. జరిమానా చెల్లించని పక్షంలో అదనంగా ఆరు నెలల జైలు శిక్ష అనుభవించాలని న్యాయాధికారి తీర్పులో పేర్కొన్నారు. ప్రాసిక్యూషన్ తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎం.డీ. ఇర్షాద్ వాదించగా, సిబ్బంది రవికుమార్, శ్రీకాంత్, చిట్టిబాబు సహకరించారు. అంతర్ రాష్ట్ర దొంగలు అరెస్ట్ ఖమ్మంక్రైం: వివిధ జిల్లాల్లో చోరీలకు పాల్పడిన ముగ్గురు నిందితులను ఖమ్మం త్రీటౌన్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన సంపంది రాజేందర్, అలకుంట మహేష్తో పాటు ఎర్రుపాలెంకు చెందిన ఫణీందర్ 2024 డిసెంబర్లో ఖమ్మం నయాబజార్లోని ఓ ఇంట్లో చోరీ చేశారు. ఆ సమీప ప్రాంతాల్లోని సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాల ఆధారంగా నిందితులను గుర్తించి శుక్రవారం అరెస్ట్ చేశామని సీఐ మోహన్బాబు తెలిపారు. వీరి నుంచి రూ.8లక్షల విలువైన సొత్తు చేసుకున్నట్లు వెల్లడించారు. కాగా, నిందితులు ఏపీలోని సామర్లకోట, అల్లవరం, అమలాపురంతో పాటు ఖమ్మం , మధిర, వైరా, రఘునాథపాలెం, మధిర రూరల్ పీఎస్ పరిధిలో చోరీలకు పాల్పడ్డారని తెలిపారు. -
దేశవ్యాప్త సమ్మెతో కేంద్రానికి కనువిప్పు
ఖమ్మంమయూరిసెంటర్: ఈనెల 9న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో కార్మికులు, రైతులు, వ్య వసాయ కూలీలు పాల్గొని జయప్రదం చేయాలని.. తద్వారా ప్రజావ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కేంద్రప్రభుత్వానికి కనువిప్పు కలిగించాలని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం పిలుపునిచ్చారు. ఖమ్మంలోని సుందరయ్య భవనంలో శుక్రవారం ప్రజాసంఘాల ఐక్యవేదిక సమావేశం కళ్యాణం వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో తమ్మినేని మాట్లాడుతూ మోడీ పాలనలో పదేళ్లుగా స్వదేశీ, విదేశీ పారిశ్రామికవేత్తల ఆర్థిక ప్రయోజనాల కోసం 29 కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లు తెచ్చారన్నారు. ఫలితంగా పని గంటలు, పనిభారం పెరగడమే కాక యూనియన్లు పెట్టుకునే హక్కు కోల్పోవాల్సి వస్తోందని చెప్పారు. అంతేకాక కనీస వేతనాలు, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్న తీర్పులను బుట్టదాఖలు చేస్తుండగా, కార్మిక సంక్షేమం, సాంఘిక భద్రత, ఉపాధి, ఉద్యోగ రక్షణ కరువవుతున్నాయని తెలిపారు. ఈమేరకు కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా 9వ తేదీన జరిగే సమ్మెను జయప్రదం చేయాలని వీరభద్రం పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పోతినేని సుదర్శన్రావు, నాయకులు నున్నా నాగేశ్వరరావు, పొన్నం వెంకటేశ్వరావు, బుగ్గవీటి సరళ, మాదినేని రమేష్, బొంతు రాంబాబు తదితరులు పాల్గొన్నారు. సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం -
విపత్తులు ఎదుర్కొనేలా సన్నద్ధం
● వరద ఉధృతిని సమర్థంగా అంచనా వేయాలి ● ఎన్డీఎంఏ అధికారులతో భేటీలో కలెక్టర్ అనుదీప్ఖమ్మంమయూరిసెంటర్: వరద విపత్తును సమర్థవంతంగా ఎదుర్కొనేలా సన్నద్ధంగా ఉన్నట్లు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. కలెక్టరేట్లో శుక్రవారం జిల్లా విపత్తుల నిర్వహణ అథారిటీ సమావేశం నిర్వహించగా అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ, ఎన్డీఎంఏ జాయింట్ అడ్వైజర్ నావల్ ప్రకాష్, అధికారులు అభిషేక్ బిశ్వాస్, డాక్టర్ వజీం ఇక్బాల్, రాష్ట్ర డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ కన్సల్టెంట్లు గౌతంకృష్ణ తేజ, బి.అనుపమ, టీ.జే.సండ్ర పాల్గొన్నారు. ఈ సందర్భంగా గత ఏడాది మున్నేటి వరదల సమయాన చేపట్టిన పనులను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించాక కలెక్టర్ మాట్లాడారు. ఈ ఏడాది వరద విపత్తు ఎదురైనా మరింత పకడ్బందీగా ఎదుర్కొనేలా అధ్యయనం చేస్తున్నామని, లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు వేగంగా తరలించేలా ఉద్యోగులు, ఆపదమిత్ర వలంటీర్లను సిద్ధం చేశామని తెలిపారు. అనంతరం ఎన్డీఎంఏ జాయింట్ అడ్వైజర్ నావల్ ప్రకాష్, ఖమ్మం మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య మాట్లాడారు. లోతట్టు ప్రాంతాల పరిశీలన ఖమ్మంమయూరిసెంటర్/ఖమ్మం రూరల్: ఖమ్మం నగరం, రూరల్ మండలాల్లోని మున్నేటి లోతట్టు ప్రాంతాలను కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, ఖమ్మం, ఏదులాపురం కమిషనర్లు అభిషేక్ అగస్త్య, ఆళ్ల శ్రీనివాసరెడ్డితో కలిసి పరిశీలించారు. కాల్వొడ్డు మున్నేరు బ్రిడ్జి, బొక్కలగడ్డ, వినాయక నిమజ్జన ఘాట్ ప్రాంతం, ప్రకాష్నగర్, జలగంనగర్ తదితర ప్రాంతాల్లో వివిధ శాఖల అధికారులతో కలిసి పర్యటించిన వారు వరద అంచనా, స్థానికుల అప్రమత్తతపై చర్చించారు. జిల్లా కేంద్రంలో 1077 నంబర్తో కంట్రోల్ రూమ్ ఏర్పాటైందనే విషయాన్ని స్థానికులకు అవగాహన కల్పించాలని సూచించారు. జిల్లా రెవెన్యూ అధికారి ఏ.పద్మశ్రీ, జెడ్పీ సీఈఓ దీక్షారైనా, డీఆర్డీఓ సన్యాసయ్య, సీపీఓ ఏ.శ్రీనివాస్, ఆర్డీవో నర్సింహారావు, ఎంపీడీఓ కుమార్, తహసీల్దార్ పి.రాంప్రసాద్ పాల్గొన్నారు. ఈవీఎం గోదాం తనిఖీ ఖమ్మం సహకారనగర్: కలెక్టరేట్ ఆవరణలోని ఈవీఎం గోదాంను కలెక్టర్ అనుదీప్ శుక్రవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా భద్రతపై ఉద్యోగులకు సూచనలు చేశారు. కలెక్టరేట్ ఏఓ కే. శ్రీనివాసరావు, డీటీ అన్సారీ పాల్గొన్నారు. -
ఏపీపీగా బాధ్యతలు స్వీకరించిన శరత్
ఖమ్మం లీగల్: ఖమ్మం ఒకటో అదనపు సెషన్స్ కోర్టు అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్(ఏపీపీ)గా జమ్ముల శరత్కుమార్రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ప్రాసిక్యూషన్ డీడీ కార్యాలయంలో నియామకపత్రం అందజేశాక జిల్లా ప్రధాన న్యాయమూర్తి రాజగోపాల్, న్యాయమూర్తి ఉమాదేవిని మర్యాదపూర్వకంగా కలిశారు. న్యాయవాదులు నిరంజన్రెడ్డి, హరేందర్రెడ్డి, శేఖర్రెడ్డి, సంపత్, హేమంత్, శేఖర్, జానీ పాల్గొన్నారు. నేడు ఐఏఎల్ అవగాహన సదస్సు మధిర/ఖమ్మంలీగల్: ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్(ఐఏఎల్) ఆధ్వర్యాన శని వారం మధిరలో జరగనున్న న్యాయవాదుల అవగాహన తరగతులకు హైకోర్టు రిటైర్డ్ జస్టిస్ బి.చంద్రకుమార్ హాజరు కానున్నారని న్యాయవాది వాసిరెడ్డి వెంకటేశ్వరరావు తెలిపారు. మధిరలో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ న్యాయవ్యవస్థలో వచ్చిన మార్పులపై న్యాయవాదులకు అవగా హన కల్పించాలనే భావనతో ఈ తరగతులు ఏర్పాటు చేశామన్నారు. ఈసందర్భంగా కొత్తగా అమల్లోకి వచ్చిన చట్టాలు, మార్పలపై జస్టిస్ బి.చంద్రకుమార్ బోధిస్తారని తెలిపారు. ఈ సమావేశంలో ఐఏఎల్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు షేక్ లతీఫ్, ఓరుగంటి శేషగిరిరావు, మధిర బార్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పుల్లారావు, జె.రమేష్తో పాటు కావూరి రమేష్, తేలపోలు వెంకట్రావు, జీ.వీ.లక్ష్మీనారాయణ, తోట రామాంజనేయులు, డి.జగన్మోహన్రావు, కోట జ్ఞానేష్, సీహెచ్.రామరాజు, జి.శ్రీనివాసరావు పాల్గొన్నారు. 900 గ్రాముల గంజాయి స్వాధీనం ఖమ్మంక్రైం: ఖమ్మంలో విక్రయానికి సిద్ధంగా ఉన్న గంజాయిని శుక్రవారం స్వాధీనం చేసుకున్నట్లు టూటౌన్ సీఐ బాలకృష్ణ తెలిపారు. ఎస్ఐ సంధ్య ఆధ్వర్యాన తనిఖీ చేస్తుండగా.. కొత్తగూడెంకు చెందిన మోహిత్ గంజాయి అమ్ముతూ కొత్త బస్టాండ్ సమీపంలోని గుట్టపై పట్టుబడ్డాడు. ఆయన నుంచి రూ.30వేల విలువైన 900 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకోవడమే కాక కొనుగోలుకు వచ్చిన గోపాలపురం, జహీర్పురవాసులు బాదావత్ ప్రవీణ్, దూర్ సందీప్, దోన్వాన్ సాయివినయ్ను అదుపులోకి తీసుకున్నట్లు సీఐ తెలిపారు. -
ఇన్ఫోసిస్కు ఎస్బీఐటీ విద్యార్థుల ఎంపిక
ఖమ్మం సహకారనగర్: ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ ఇన్ఫోసిస్ లిమిటెడ్కు ఖమ్మంలోని ఎస్బీఐటీ కళాశాల విద్యార్థులు ఐదుగురు ఎంపికయ్యారు. ఈమేరకు కళాశాల చైర్మన్ గుండాల కృష్ణ శుక్రవారం వారిని అభినందించి మాట్లాడారు. హైదరాబాద్లో నిర్వహించిన రాష్ట్రస్థాయి క్యాంపస్ ఫూల్ డ్రైవ్లో తమ విద్యార్థులు ఎంపికవగా.. వారికి ఆరు నెలల శిక్షణలో రూ.3.60 లక్షల చొప్పున, ఆతర్వాత రూ.9 లక్షల పైచిలుకు వార్షిక వేతనం అందుతుందన్నారు. కళాశాల సెక్రటరీ, కరస్పాండెంట్ ధాత్రి, అకడమిక్ డైరెక్టర్లు గుండాల ప్రవీణ్ కుమార్, గంధం శ్రీనివాసరావు, ఏ.వీ.వీ.శివప్రసాద్, జె.రవీంద్రబాబు, ఎన్.శ్రీనివాసరావు, టీపీఓ ఎన్.సవిత, కోఆర్డినేటర్ జి.ప్రభాకర్ పాల్గొన్నారు. -
భళా.. ప్రభుత్వ పాఠశాల
ఖమ్మం సహకారనగర్: ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు కల్పించడం.. నాణ్యమైన విద్య, ఉచితంగా యూనిఫామ్, పౌష్టికాహారం అందిస్తున్నామని చేసిన విస్తృత ప్రచారంతో మెరుగైన ఫలితాలు కనిపిస్తున్నాయి. ఈమేరకు జిల్లాలో నిర్వహించిన బడిబాట కార్యక్రమంతో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో కలిపి గత విద్యాసంవత్సరం కంటే ఈ ఏడాది 1,886మంది విద్యార్థులు పెరిగారు. గత విద్యాసంవత్సరం(2024–25)లో 66,289మంది ఉండగా... ఈసారి(2025–26) ఆ సంఖ్య 68,175కు చేరింది. అత్యధికంగా ఖమ్మం రూరల్ ఈ విద్యాసంవత్సరం జిల్లాలోని ఖమ్మం రూరల్ మండలంలో అత్యధికంగా 359మంది విద్యార్థులు పెరిగారు. అతి తక్కువగా మధిర మండలంలో ఆరుగురే పెరిగారు. ఇక కూసుమంచి మండలంలో 318, ఖమ్మం అర్బన్లో 218, సత్తుపల్లిలో 167, సింగరేణిలో 158, పెనుబల్లిలో 121, కల్లూరులో 105, బోనకల్లో 104, ఎర్రుపాలెంలో 91, ఏన్కూరులో 75, ముదిగొండలో 63, వేంసూరులో 59, నేలకొండపల్లిలో 44, తిరుమలాయపాలెంలో 39, రఘునాథపాలెంలో 29, తల్లాడలో 15, కామేపల్లిలో 11మంది విద్యార్థులు గత ఏడాది కంటే ఎక్కువగా నమోదయ్యారు. ఇక్కడ తగ్గారు... జిల్లాలోని కొణిజర్ల మండలంలో 60మంది, చింతకానిలో 33మంది, వైరాలో ముగ్గురు విద్యార్థులు గత ఏడాదితో పోలిస్తే తగ్గడం గమనార్హం. గత విద్యాసంవత్సరం కొణిజర్ల మండలంలో 3,294 మంది ఉండగా ఈసారి ఆ సంఖ్య 3,234కి పడిపోయింది. చింతకాని మండలంలో గత విద్యాసంవత్సరం 2,849మంది ఉండగా 33మంది తగ్గారు. అలాగే, వైరా మండలంలో గత ఏడాది 2,634మంది ఉండగా ఈ ఏడాది 2,631మందికి చేరారు. జిల్లా కేంద్రంలో ముందస్తు ప్రచారం బడిబాట కార్యక్రమం ఖమ్మం అర్బన్ మండలం(జిల్లా కేంద్రం)లో సత్ఫలితాలు ఇచ్చింది. నగరంలో 75ప్రభుత్వ పాఠశాలలు ఉండగా గత ఏడాది 9,420మంది విద్యార్థులు చదివారు. ఈసారి ఆ సంఖ్య 9,639మందికి చేరడం విశేషం. ఇందులో బడిబాట ద్వారా 2,177మంది విద్యార్థులు చేరినట్లు విద్యాశాఖ గణాంకాలు చెబుతున్నాయి. అత్యధికంగా ఖమ్మం ఎన్నెస్సీ కాలనీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 285మంది చేరగా.. ఇదే కాలనీ ప్రాథమిక పాఠశాలలో 137మంది, నయాబజార్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 100మంది చేరారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఏఐ ఆధారిత బోధన కొనసాగుతుండడం ప్రవేశాలు పెరగడానికి కారణంగా తెలుస్తోంది. ఇక ఖమ్మంలోని రుద్రంకోటలో రెండేళ్లు క్రితం మూతపడిన పాఠశాలను ఈఏడాది పునఃప్రారంభించగా 15మంది చేరారు. అలాగే, నిజాంపేట పాఠశాలలో ఐదుగురే విద్యార్థుల ఉండగా ఈసారి ఆ సంఖ్య 13కు చేరింది. ఈ ఏడాది పెరిగిన 1,886మంది విద్యార్థులు కొణిజర్ల, చింతకాని, వైరాలో తప్ప అన్ని చోట్ల పెరుగుదల ప్రథమ స్థానంలో ఖమ్మం రూరల్ మండలం బడిబాటతో మంచి ఫలితం ప్రభుత్వ పాఠశాలల్లో ప్రత్యేకతలు, బోధన వివరాలను బడిబాట ద్వారా తల్లిదండ్రులకు అవగాహన కల్పించాం. దీంతో ప్రవేశాలు పెరిగాయి. విస్తృత ప్రచారంతో 100మంది చేరగా... మా పాఠశాలలో విద్యార్థుల సంఖ్య 337కు చేరింది. – సుధారాణి, హెచ్ఎం, నయాబజార్ హైస్కూల్అన్ని పాఠశాలల్లో పెరిగారు.. మండలంలోని అన్ని పాఠశాలల్లో గతంలో కంటే విద్యార్థుల సంఖ్య పెరిగింది. రుద్రంకోట స్కూల్ను పునఃప్రారంభించాం. హెచ్ఎంలు, ఉపాధ్యాయులు ముందస్తుగా ప్రచారం చేయడం ప్రవేశాలు పెరగడానికి దోహదపడింది. – శైలజలక్ష్మి, ఎంఈఓ, ఖమ్మం అర్బన్ -
పారాలీగల్ వలంటీర్లుగా నమోదు చేసుకోవాలి
ఖమ్మం లీగల్: ఆసక్తి కలిగిన న్యాయ విద్యార్థులు పారా లీగల్ వలంటీర్లుగా నమోదు చేసుకుంటే అవసరమైన వారికి న్యాయసహాయం అందించొచ్చని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కే.వీ.చంద్రశేఖర్రావు తెలిపారు. ఖమ్మంలో శుక్రవారం జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యాన న్యాయ విద్యార్థులకు ఏర్పాటుచేసిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ఆర్థికంగా వెనుకబడిన, న్యాయసాయం కోసం ధనం వెచ్చించలేని వారికి సంస్థ ద్వారా ఉచిత సహాయం అందుతుందని తెలిపారు. ఈక్రమంలో విద్యార్థులు వలంటీర్లు నమోదైతే అర్హులకు సాయం అందేలా కృషి చేయొచ్చని చెప్పారు. న్యాయవాది పి.సంధ్యారాణి, మానేరు లా కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ నంద చిరంజీవి, అధ్యాపకులు నూరేన్, హరీశ్, రేహాన్, లావణ్య పాల్గొన్నారు. సాగర్ నుంచి పాలేరుకు నీటి విడుదల నాగార్జునసాగర్/కూసుమంచి: పాలేరు రిజ ర్వాయర్లో నీటి నిల్వలు తగ్గడంతో తాగునీటి సమస్య ఎదురుకాకుండా నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి 3వేల క్యూసెక్కుల నీటి విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. దీంతో శుక్రవారం మధ్యాహ్నం సాగునీటి శాఖ అధికారులు ప్రాజెక్టు ఎడమ కాల్వ ద్వారా నీరు విడుదల చేశారు. మొదట వేయి క్యూసెక్కులు విడుదల చేయగా, క్రమంగా మూడు వేల క్యూసెక్కులకు పెంచుతూ ఐదు రోజులు విడుదల చేస్తామని డ్యాం ఎస్ఈ మల్లికార్జున్ తెలిపారు. ప్రస్తుతం పాలేరు రిజర్వాయర్లో నీటిమట్టం 12.30 అడుగులకు పడిపోగా, సాగర్ జలాలు శనివారం రాత్రి వరకు చేరనుండడంతో నీటిమట్టం పెరగనుంది. తద్వారా ఖమ్మం, వరంగల్, మహ బూబాబాద్ జిల్లాలకు తాగునీటి విడుదల సాఫీగా సాగనుంది. డీసీఈబీ సెక్రటరీగా వెంకటేశ్వర్లు ఖమ్మం సహకారనగర్: డిస్ట్రిక్ట్ కామన్ ఎగ్జామినేషన్ బోర్డు(డీసీఈబీ) సెక్రటరీగా కనపర్తి వెంకటేశ్వర్లును నియమిస్తూ డీఈఓ ఎస్.సత్యనారాయణ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. చింతకాని మండలం నాగులవంచ హెచ్ఎంగా పనిచేస్తున్న వెంకటేశ్వర్లును సెక్రటరీగానే కాక మరో పది మందిని మూడేళ్ల కాలానికి సభ్యులుగా నియమించారు. సభ్యుల్లో జెడ్పీ, ప్రభుత్వ, కేజీబీవీ, రెసిడెన్షియల్, ప్రైవేట్ పాఠశాలల హెచ్ఎంలు ఉన్నారు. కాగా, వెంకటేశ్వర్లు గతంలోనూ డీసీఈబీ సెక్రటరీగా విధులు నిర్వర్తించారు. ఈమేరకు డీసీఈబీ కార్యదర్శి, సభ్యులను టీజీవోస్ రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కస్తాల సత్యనారాయణ, మోదుగు వేలాద్రి, ఉపాధ్యాయ సంఘాల నాయకులు కట్టా శేఖర్రావు, రంగారావు, మోత్కూరి మధు, రంజాన్, పారుపల్లి నాగేశ్వరరావు, ఏ.వీ.నాగేశ్వరరావు, వెంగళరావు, మోత్కూరి మధు, యలమద్ది వెంకటేశ్వర్లు తదితరులు అభినందించారు. సర్టిఫికెట్ల పరిశీలన ఖమ్మం సహకారనగర్: జిల్లాలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయం(కేజీబీవీ)ల్లో ఖాళీగా ఉన్న సీఆర్టీ, పీజీ సీఆర్టీ పోస్టుల భర్తీ ప్రక్రియ మొదలైంది. ఇప్పటికే దరఖాస్తులు స్వీకరించిన అధికారులు అభ్యర్థుల సర్టిఫికెట్లను శుక్రవారం డీఈఓ కార్యాలయంలో పరిశీలించారు. ప్రధానోపాధ్యాయులు అజిత, శివకుమారి సర్టిఫికెట్లు పరిశీలించగా జీసీడీఓ తులసి పర్యవేక్షించారు. ఈకార్యక్రమంలో డీఈఓ కార్యాలయ సూపరింటెండెంట్ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.