breaking news
Khammam
-
ఆర్టీసీకి దసరా బొనాంజా!
● ఖమ్మం రీజియన్కు రూ.24.22 కోట్ల ఆదాయం ● 6వ తేదీన అత్యధికంగా రూ.2.18 కోట్ల రాబడి ● అవిశ్రాంతంగా పనిచేసిన డ్రైవర్లు, కండక్టర్లు, సిబ్బందిఖమ్మంమయూరిసెంటర్: దసరా పండుగ ఆర్టీసీ ఖమ్మం రీజియన్కు కనకవర్షం కురిపించింది. పండుగ రద్దీ ఆధారంగా ఆర్ఎం సరిరామ్ ఆధ్వర్యాన ముందస్తు ప్రణాళికలు రూపొందించడమే కాక సిబ్బంది నిర్విరామంగా పనిచేయడంతో రాకపోకలు సాఫీగా సాగాయి. ఫలితంగా రీజియన్కు రూ.24,22,58,199 ఆదాయం లభించింది. 1,208 ప్రత్యేక బస్సులు.. బతుకమ్మ, దసరా పండుగలకు వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన ప్రజలు స్వస్థలాలకు రానున్నందున ముందుగానే డిపో మేనేజర్లు, సూపర్వైజర్లతో ఖమ్మం రీజియన్ మేనేజర్ సరిరాం పలు దఫాలు సమీక్షించారు. ఈమేరకు ప్రత్యేక బస్సులు నడిపేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. గతనెల 20 నుంచి ఈనెల 6వ తేదీ వరకు హైదరాబాద్ నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లాకు, ఉమ్మడి జిల్లా నుంచి హైదరాబాద్కు బస్సులు నడిపారు. ప్రధానంగా హైదరాబాద్ నుంచి ఖమ్మం, మధిర, సత్తుపల్లి, భద్రాచలం, కొత్తగూడెం, మణుగూరు, ఇల్లెందుకు, ఇక్కడి నుంచి హైదరాబాద్కు వేలాది మందిని చేర్చేలా 1,208 ప్రత్యేక సర్వీసులు రాకపోకలు సాగించాయి. 38.50లక్షల కి.మీ. ప్రయాణం గత నెల 20వ తేదీ నుంచి ఈనెల 6వరకు హైదరాబాద్ నుంచి ఖమ్మం రీజియన్కు, ఇక్కడి నుంచి హైదరాబాద్కు 38.50 లక్షల కి.మీ. బస్సులు తిరిగాయి. దీంతో ఆర్టీసీ రీజియన్కు మహాలక్ష్మితో కలిపి రూ.24.22 కోట్ల ఆదాయం సమకూరింది. ఇందులో ప్రత్యేక సర్వీసుల ద్వారా రూ.4.15 కోట్లకు పైగా ఆదాయం వచ్చిందని అధికారులు వెల్లడించారు. కాగా, బతుకమ్మ, దసరా పండుగకు వచ్చివెళ్లే ప్రయాణికులకు సేవలందించేలా రీజియన్లోని ఏడు డిపోల డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్లు, కార్మికులు, సూపర్వైజర్లు, డిపో మేనేజర్లు అవిశ్రాంతంగా పనిచేయడంతో ఎక్కడా లోటుపాట్లు ఎదురుకాలేదు. ఒకేరోజు 3.17 లక్షల కిలోమీటర్లు ఈ దసరా సెలవుల్లో ఖమ్మం రీజియన్ అధికారులు గత రికార్డులను బ్రేక్ చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ నెల 6వ తేదీ సోమవారం ఒకేరోజు 3.17 లక్షల కి.మీ. మేర బస్సులు తిరగగా రూ.2.18 కోట్ల ఆదాయం రాబట్టారు. ఇందులో రీజియన్లోని ఖమ్మం డిపోకు అత్యధికంగా రూ.49 లక్షలు ఆదాయం రాగా, భద్రాచలానికి రూ.38.39 లక్షలు, సత్తుపల్లికి రూ.37.95లక్షలు, మధిరకు రూ.32 లక్షలు, మణుగూరుకు రూ.21.50 లక్షలు, కొత్తగూడెంకు రూ.21.50 లక్షలు, ఇల్లెందుకు రూ.11 లక్షలు ఆదాయం సమకూరింది. సత్తుపల్లి డిపోలో సంబురాలు సత్తుపల్లిటౌన్: దసరా పండుగ సందర్భంగా సత్తుపల్లి డిపో నుంచి సోమవారం 104 సర్వీసులు నడిపించారు. హైదరాబాద్కు 25 రెగ్యులర్ సర్వీసులతో పాటు 22 అదనపు సర్వీసులు నడిపించగా మొత్తంగా 55,977 కి.మీ. బస్సులు తిరిగాయి. దీంతో 106 ఓఆర్, 67.80 ఈపీకేతో రూ.37,95,470 ఆదాయం సమకూరింది. ఈమేరకు మంగళవారం డిపోలో కండక్టర్లు, డ్రైవర్లు, ఉద్యోగులతో కలిసి డీఎం ఊటుకూరి సునీత కేక్ కట్ చేసి అభినందనలు తెలిపారు. అసిస్టెంట్ మేనేజర్ పి.విజయశ్రీ, ఎంఎఫ్ ఎస్.సాహితి, వీబీఓ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడంలో ఆర్టీసీని మించి మరేది లేదని ప్రయాణికులకు ఉన్న నమ్మకం మరోమారు రుజువైంది. అందుకే పండుగ సెలవుల్లో గమ్యస్థానాలకు చేరేందుకు ఎక్కువ మంది ఆర్టీసీనే ఆశ్రయించారు. ఇందుకు అనుగుణంగా మా సిబ్బంది శ్రమించారు. రానున్న రోజుల్లోనూ ఇదే తరహాలో సేవలందిస్తాం. – ఏ.సరిరామ్, ఆర్ఎం, ఖమ్మం రీజియన్ -
పైలేరియా నిర్మూలనపై ప్రత్యేక దృష్టి
ఖమ్మంవైద్యవిభాగం: జిల్లాలో పైలేరియా వ్యాధి సంపూర్ణ నిర్మూలనకు వైద్య సిబ్బంది కృషి చేయాలని డీఎంహెచ్ఓ కళావతిబాయి సూచించారు. కలెక్టరేట్లో మంగళవారం సర్వేపై ఉద్యోగులకు శిక్షణ ఇవ్వగా ఆమె మాట్లాడారు. ఫైలేరియా నిర్మూలనలో సర్వే కీలకమైనందున వ్యాధి వ్యాప్తి ఆగిందా, లేదా అనేది నిర్ధారించాలని తెలిపారు. ఆపై సర్వే విధానం, శాంపిళ్ల పరిశీలన, వివరాల నమోదుపై అదనపు డీఎంహెచ్ఓ వెంకటరమణ అవగాహన కల్పించారు. ఈ సమావేశంలో డిప్యూటీ డీఎంహెచ్ఓ చందునాయక్, ప్రోగ్రాం ఆఫీసర్ రామారావు తదితరులు పాల్గొన్నారు. వైద్యశిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి కామేపల్లి: ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం నిర్వహించే ఉచిత వైద్యశిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని డీఎంహెచ్ఓ కళావతిబాయి తెలిపారు. కామేపల్లి మండలం మద్దులపల్లిలో భద్రాచలం ఐటీడీఏ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యాన ఏర్పాటు చేసిన వైద్యశిబిరాన్ని ఆమె పరిశీలించి మా ట్లాడారు. గ్రామీణుల చెంతనే వైద్యం అఒందించేలా శిబిరాల ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇక్కడ 400 మందికి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులు అందజేశారు. భద్రాచలం ఐటీడీఏ అడిషినల్ డీఎంహెచ్ఓ సైదులు, వైద్యులు, ఉద్యోగులు నెల్లూరి చందన, శిరీష, ప్రసన్న జ్యోతి, అమీనాజ్, నిరోష, రాజశేఖర్, అభిలాష్ రెడ్డి, జైకీర్తి, శ్రీనివాసరావు, వెంకటేశ్వర్లు, నరేంద్రనాయక్, రాధాకృష్ణ పాల్గొన్నారు. డీఎంహెచ్ఓ కళావతిబాయి -
నిషేధ చట్టం కట్టుదిట్టంగా అమలు
ఖమ్మంవైద్యవిభాగం: గర్భధారణకు ముందు, గర్భధారణ సమయాన రోగనిర్ధారణ పద్ధతుల నిషేధ చట్టం కట్టుదిట్టంగా అమలయ్యేలా అధికారులు దృష్టి సారించాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. కలెక్టరేట్లో మంగళవారం జరిగిన గర్భస్థ పూర్వ, గర్బస్థ లింగ నిర్ధారణ చట్టం జిల్లా అడ్వైజరీ కమిటీ సమావేశంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కే.వీ.చంద్రశేఖర్రావు, పోలీస్ కమిషనర్ సునీల్దత్తో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫర్టిలిటీ సెంటర్లు, స్కానింగ్ సెంటర్లలో చికిత్సకు అయ్యే ఫీజు వివరాలతో బోర్డులు ఏర్పాటుచేయించాలని తెలిపారు. అలాగే, లింగ నిర్ధారణ చట్టం నిషేధంపై అందరికీ అవగాహన కలిగేలా వివరించాలని సూచించారు. పిల్లలు అవసరం లేదని వదిలించుకునే క్రమంలో చంపకుండా దత్తతకు ఉన్న అవకాశాలపై విస్తృత అవగాహన కల్పించాలని చెప్పారు. జిల్లాలో వేయిమంది మగ పిల్లలకు 946 మంది ఆడపిల్లలే జన్మిస్తున్నందున లింగ నిర్ధారణ పరీక్షలు చేసిన, చేయించుకున్న వారిపై కఠినంగా వ్యవహరించాలని తెలిపారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి చంద్రశేఖర్రావు మాట్లాడుతూ నిందితులకు శిక్షపడేలా అవసరమైన ఆధారాలు సేకరించాలని సూచించగా, చట్టాన్ని కట్టుదిట్టంగా అమలు చేసేలా చర్యలు తీసుకుంటున్నామని సీపీ సునీల్దత్ తెలిపారు. ఈ సమావేశంలో డీఎంహెచ్ఓ బి.కళావతిబాయి, జిల్లా సంక్షేమ అధికారి కె.రాంగోపాల్రెడ్డి, టి.విష్ణువందన, వివిధ శాఖల అధికారులు, సంస్థల బాధ్యులు చందునాయక్, సి.బిందుశ్రీ, డి.రామారావు, పి.వెంకటరమణ, ఎం.నరేందర్, టి.శంకర్, రెహనా బేగం, ఎస్.మంగళ, జి.అపర్ణ, కుముదిని పాల్గొన్నారు.కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి -
అమెరికాలో వేమన శతకం బోధన
సత్తుపల్లిటౌన్: అమెరికాలోని తెలుగు కుటుంబాల్లో పిల్లలకు వేమన శతకపద్యాలు కూడా నేర్పుతున్నారు. డల్లాస్లోని కార్యసిద్ధి హనుమాన్ ఆలయంలో తెలుగు కుటుంబాల పిల్ల లకు ప్రతీ ఆదివారం బాల రామాయణం, బాలభారతం వంటి పురాణాలతో పాటు మాతృభాష నేర్పిస్తుండగా సత్తుపల్లికి చెందిన రిటైర్డ్ ఉపాధ్యాయుడు అయ్యదేవర శేషగిరిరావు – మాదిరాజు మాలతి దంపతులు ఇటీవల పరిశీలించారు. బోధన కోసం సృజన సాహితీ సమాఖ్య సమకూర్చిన వేమన శతకం పుస్తకాలతో పాటు ఊరిమెళ్ల సునంద రాసిన తెలుగు భాషా వాచకాలను శిక్షకురాలు దీప్తి శరణ్యకు అందించారు. ఈ కార్యక్రమంలో సాయిప్రకాష్ కౌశిక్ తదితరులు పాల్గొన్నాయి. ఆర్టీసీ న్యాయవాదిగా ఉబ్బన రామకృష్ణఖమ్మంలీగల్/కల్లూరు: జిల్లా కోర్టులో గత 27ఏళ్లుగా న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్న కల్లూరుకు చెందిన ఉబ్బన రామకృష్ణ ఖమ్మం ఆర్టీసీ రీజియన్ స్టాండింగ్ న్యాయవాదిగా నియమితులయ్యారు. ఈమేరకు మంగళవారం ఆయనకు ఆర్ఎం సరిరామ్ నియామక ఉత్తర్వులు అందించారు. కాగా, రామకృష్ణను న్యాయవాది నిరంజన్రెడ్డి, ఏపీపీ శరత్కుమార్రెడ్డి, కల్లూరు వాసులు అభినందించారు. పెన్షనర్లకు బకాయిలు చెల్లించాలిఖమ్మం సహకారనగర్: ఉద్యోగ విరమణ చేసిన వారి బకాయిల చెల్లింపులో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని ఇకనైనా విడనాడి నెలకు రూ. వేయి కోట్ల చొప్పున కేటాయించాలని పెన్షనర్ల సంఘం రాష్ట్ర కార్యదర్శి మేరి ఏసుపాదం డిమాండ్ చేశారు. ఖమ్మంలో సంఘం జిల్లా అధ్యక్షుడు పరిశ పుల్లయ్య అధ్యక్షతన మంగళవారం జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. 2024 మార్చి నుండి ఉద్యోగ విరమణ చేసిన వారికి బకాయిలు అందకపోవడంతో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించాలని కోరారు. ఈసమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రాయల రవికుమార్తో పాటు గుర్రాల శ్రీనివాసరావు, ఊడుగు వెంకటేశ్వర్లు, తాడి అంజలి, లక్ష్మీ సుజాత, అన్నమ్మ, ప్రసాదరావు, సుధాకర్, కృష్ణారావు, వీరభద్రరావు పాల్గొన్నారు. ఏఐ విజేతకు అభినందనఖమ్మంరూరల్: ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్సీ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ విభాగంలో ప్రతిభ కనబరిచి ఇటీవల ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా అవార్డు అందుకున్న మండలంలోని ఆరెంపులకు చెందిన తాళ్లూరిపల్లవిని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే సూర్యనారాయణ అభినందించారు. ఆరెంపులలోని ఆమె ఇంటికి మంగళవారం వచ్చిన ఆయన పల్లవిని సన్మానించి మాట్లాడారు. ఈతరం యువతకు పల్లవి విజ యం స్ఫూర్తిగా నిలుస్తుందని తెలిపారు. అలాగే, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచంద్రరావు ఫోన్లో పల్లవిని అభినందించారు. -
ఆర్చరీ, కబడ్డీ, రెజ్లింగ్ జట్ల ఎంపిక
ఖమ్మంస్పోర్ట్స్: జిల్లా జూనియర్ కళాశాలల క్రీడా సంఘం ఆధ్వర్యాన వివిధ క్రీడల ఉమ్మడి జిల్లా స్థాయి జట్ల ఎంపికకు ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో మంగళవారం పోటీలు నిర్వహించా రు. కబడ్డీ జట్ల ఎంపికకు 110 మంది బాలబాలి కలు, ఆర్చరీ జట్ల ఎంపికకు 20 మంది, రెజ్లింగ్ ఎంపికకు 25 మంది హాజరయ్యారు. రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొననున్న జట్ల ఎంపిక పోటీలను కబడ్డీ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి కె.క్రిస్టోఫర్బాబు, ఖేలో ఇండియా ఖమ్మం సెంటర్ కోచ్ నగేశ్, క్రీడా సంఘం కార్యదర్శి ఎండీ మూసీకలీం పర్యవేక్షించారు. ●జిల్లా బాలుర కబడ్డీ జట్టులో బి.కౌశిక్, జి.వినయ్, పి.మనోహర్, వి.సాయికిరణ్, ఐ.కుమార్, ఆర్.రాకేశ్, జి.గణేశ్, కె.భార్గవ్రెడ్డి, ఈ.అజయ్కుమార్, బి.మధు, డి.సాయికిరణ్, సాయికృష్ణ, వి.వివేక్, ఎల్.అరవింద్, బి.శరత్, డి.ధనుష్, డి.ఆనంద్కిశోర్ స్థానం దక్కించుకున్నారు. ●బాలికల కబడ్డీ జట్టుకు జి.మైశ్రీ, బి.కుసుమ, బి.పల్లవి, ఎస్కే వాదాహసీనా, ఎన్.పల్లవి, జి. సాహితి, జి.హరిణి, టి.వినీల, ఎస్.భావ్యశ్రీ, కె.ప్రత్యూష, ఎస్కే రిజ్వాన, ఆర్.శ్రీలత, జి.యశస్విని, స్నేహ, కె.ఇందు, ఎండీ ఆసియా, ఎల్.మిత్ర, కె.సోమక్క ఎంపికయ్యారు. ●జిల్లా ఆర్చరీ బాలుర జట్టులో ముల్కి చరణ్, ఆర్.బార్గవ్, బి.హరికృష్ణ, ఎ.కొండల్రాయ్, బాలికల జట్టులో టి.వీరభద్రమ్మ, కుంజ భవ్యకు స్థానం దక్కింది. ●రెజ్లింగ్ బాలుర జట్టులో ఎ.విష్ణువర్దన్, జి.యువరాజ్, ఎన్.వివేక్వర్దన్, బి.మణిచరణ్, పి.శివతేజ్నందన్, పి.జయదేవ్, పి.గణేశ్, వి.ఉదయ్కిరణ్, కె.లిఖిత్ చరణ్, ఎం.అమేశ్ బహూదుర్, ఎస్.చరణ్రాజ్, బాలికల జట్టులో జి.వర్షిత, కె.దీక్షిత, ఆర్.గీత హర్షిణి స్థానం దక్కించుకున్నారు. అండర్–19 బాలికల ఫుట్బాల్ జట్టు ఉమ్మడి జిల్లాస్థాయి ఫుట్బాల్ బాలికల జట్టు ఎంపిక పోటీలు మంగళవారం ఖమ్మంలోని మున్సిపల్ పార్క్లో జరిగాయి. వివిధ ప్రాంతాలకు చెందిన 40 మంది క్రీడాకారిణులు పాల్గొనగా, ఎంపిక ప్రక్రియను ఫుట్బాల్ అసోసియేషన్ మాజీ కార్యదర్శి కె.ఆదర్శ్కుమార్, క్రీడల సంఘం కార్యదర్శి ఎం.డీ.మూపా కలీం పర్యవేక్షించారు. ఉమ్మడి జిల్లా జట్టుకు ఎం.కిరణ్మయి, జి.ఆశా, బి.వైష్ణవి, టి. స్వాతి, ఎం.రూప, బి.కావ్య, కె.సాత్వి, ఎం.సృజన, ఎం.నవ్యశ్రీ, ఎం.నక్షత్ర, ఎం.యువ వర్షిణి, ఎస్.కే.నసీమా, బి.హాసిని, కె.నందిని, బి.ప్రవళిక, కె.తేజశ్రీ, వర్షిత, భావన ఎంపికయ్యారని వెల్లడించారు. -
భక్త శబరికి స్మృత్యంజలి
● గిరిజనుల ఆటపాటల నడమ భద్రగిరి ప్రదక్షిణ ● రామయ్య కల్యాణంలో పాల్గొన్న గిరిజనులు భద్రాచలం: గిరిజనుల ఆటపాటలు, కొమ్ము నృత్యాలు, వారి సంస్కృతి, సంప్రదాయాల నడము భక్త శబరికి స్మృత్యంజలి ఘటించారు. భద్రాద్రి రామయ్యకు అపర భక్తురాలు, ప్రేమ, భక్తితో ఆయనకు ఎంగిలి పండ్లు సమర్పించిన శబరికి భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో మంగళవారం శబరి స్మృతి యాత్ర వైభవోపేతంగా నిర్వహించారు. దేవస్థానంలో 2013 నుంచి ఏటా అశ్వయుజ మాసంలో పౌర్ణమి రోజున యాత్ర నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఫల, పుష్పాలతో నీరాజనం యాత్ర నిర్వహణ కోసం వివిధ ప్రాంతాల గిరిజనుల ను బస్సుల్లో భద్రాచలం తీసుకొచ్చారు. మంగళవా రం ఉదయమే శబరి చిత్రపటంతో మేళతాళాలు, భక్తుల శ్రీరామ నామస్మరణ నడుమ గిరిప్రదక్షిణ చేశారు. ఆతర్వాత చప్టా దిగువన తూము రామదా సు, భక్త రామదాసు విగ్రహాలకు ఆలయ ఈఓ కొల్లు దామోదర్రావు పూలమాలలు, శబరి విగ్రహం వద్ద పూలు, పండ్లు, వస్త్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా గిరిజనుల సంప్రదాయ నృత్యాలు అలరించా యి. వీరితో పాటుగా ఈఓ దామోదర్రావు, ఇతర అధికారులు కొమ్ముపాగా ధరించి కాలు కదిపారు అనంతరం బేడా మండపంలో కొలువైన స్వామితో పాటు శబరికి గిరిజనులు పండ్లు, పూలను సమర్పించాక అర్చకులు పూజలు చేశారు. ఆపై చిత్రకూట మండపంలో స్వామివారి నిత్యకల్యాణం జరిపించగా గిరి జనులు కనులారా వీక్షించారు. కాగా, ఈ ఉత్సవంలో ఐటీడీఏ పీఓ బి.రాహుల్ పాల్గొని గిరిజన పెద్దలకు వస్త్రాలు, పూలు, పండ్లు అందజేసి సత్కరించారు. అలాగే, వాల్మీకి జయంతి కూడా నిర్వహించారు. ఇక ఆంధ్రప్రదేశ్లోని వరరామచంద్రాపురంలో శబరి నది వద్ద దేవస్థానం అర్చకులు పూజలు చేశారు. నది ఒడ్డున శబరి విగ్రహానికి అభిషేకం నిర్వహించారు. -
27,427 ఓటరు గుర్తింపు కార్డులు
ఖమ్మం సహకారనగర్: జిల్లా నుంచి ఓటరుగా దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఓటరు గుర్తింపు కార్డులు జారీ చేస్తోంది. ఈమేరకు కలెక్టరేట్కు మంగళవారం 27,427 ఓటరు గుర్తింపు కార్డులు చేరాయి. గత ఏడాది అక్టోబర్ నుంచి ఈ ఏడాది మార్చి వరకు ఓటర్లుగా గుర్తించిన వారికి సంబంధించి కార్డులు జారీ అయ్యాయని అధికారులు తెలిపారు. వీటిని పోస్టల్ శాఖ ద్వారా ఓటర్లకు చేరవేయనున్నారు. ఇందులో ఖమ్మం నియోజకవర్గానికి సంబంధించి 5,795, పాలేరుకు 8,245, మధిరకు 4,715, వైరాకు 3,903, సత్తుపల్లి నియోజకవర్గంలో ఓటర్లకు 4,769 గుర్తింపు కార్డులు అందించనున్నారు. ఆర్ఓలు, ఏఆర్వోలకు శిక్షణ జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఎంపిక చేసిన ఆర్ఓలు, ఏఆర్ఓలకు మంగళవారం శిక్షణ ఇచ్చారు. ఖమ్మంలోని భక్తరామదాసు కళాక్షేత్రంలో శిక్షణ ఏర్పాటుచేయగా మాస్టర్ ట్రెయినర్లు వీరికి ఎన్నికల విధులు, నిర్వహణలో జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. డీపీఓ ఆశాలత, డీఎల్పీఓ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
‘వసతి’కి తాళం..
ఖమ్మంమయూరిసెంటర్: వేతనాల సమస్యపై కొద్ది వారాలుగా కార్మికులు చేస్తున్న సమ్మెతో గిరిజన సంక్షేమ వసతిగృహాలు, ఆశ్రమ పాఠశాలల్లో వంటగదులు తెరుచుకోలేదు. దసరా సెలవుల కన్నా ముందే కార్మికులు సమ్మెలోకి దిగడంతో విద్యార్థులకు ఆహారం అందించడం సమస్యగా మారింది. సెలవులు ముగిసేలోగా పరిస్థితులు చక్కబడతా యని భావించినా ఆ పరిస్థితి లేక జిల్లాలోని పలు గిరిజన సంక్షేమ వసతిగృహాలు తెరుచుకోలేదు. ఈ విషయం తెలిసి ఆశ్రమ పాఠశాలలకు విద్యార్థులు కూడా అంతంతమాత్రంగానే వచ్చారు. వేతనాల తగ్గింపు జీఓను రద్దు చేయాలనే డిమాండ్తో సమ్మెకు దిగిన కార్మికులు సమస్య పరిష్కారమయ్యే వరకు సమ్మె విరమించేది లేదని చెబుతున్నారు. ఈ ప్రభావం విద్యార్థులపై పడుతుండగా.. అధికారులు కూడా సమస్య ప్రభుత్వం, కమిషనర్ స్థాయిలో ఉన్నందున తామేమీ చేయలేమని చెబుతుండడం గమనార్హం. రెండు రోజులైనా అదే పరిస్థితి.. కార్మికుల సమ్మె కాలంలో దసరా సెలవులు రావడంతో అటు గిరిజన శాఖ అధికారులు, ఇటు వసతిగృహ సంక్షేమ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. కానీ, సెలవులు ముగిసినా సమ్మె విరమింపజేయకపోవడంతో గిరిజన సంక్షేమ వసతిగృహాల్లో పొయ్యిలు వెలగడం లేదు. ప్రీమెట్రిక్ వసతిగృహాలు, ఆశ్రమ పాఠశాలలు ఈ నెల 4వ తేదీ శనివారం నుంచే తెరుచుకోవాల్సి ఉండగా సోమవా రం నుంచి రావాలని విద్యార్థులకు సమాచారం ఇచ్చారు. కొన్ని ఆశ్రమ పాఠశాలలు, ప్రీ మెట్రిక్ వసతి గృహాల అధికారులు మాత్రం తాము చెప్పేవరకు రావొద్దని సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. ఇక పోస్ట్మెట్రిక్ వసతి గృహాలకు సంబంధించి కొన్ని వసతిగృహాలను మూసి ఉంచారు. ఖమ్మంలో ఏడు వసతిగృహాలు ఉండగా రెండు, మూడే తెరిచినట్లు తెలుస్తోంది. బయటే టిఫిన్, భోజనం రాష్ట్రవ్యాప్తంగా గిరిజన సంక్షేమశాఖ వసతిగృహాలు, ఆశ్రమ పాఠశాలల్లో పనిచేసే ఔట్ సోర్సింగ్, డెయిలీ వేజ్ కార్మికుల సమ్మెతో వసతిగృహాల్లో పనులు నిలిచిపోయాయి. చాలా వసతిగృహాల్లో ఇద్దరు,ముగ్గురు డెయిలీ వేజ్, ఔట్ సోర్సింగ్ కార్మి కులే ఉన్నారు. దీంతో చాలా వాటిని మూసి ఉంచ గా, కొన్నింటిని తెరిచినా వంట చేయడం లేదని తెలుస్తోంది. ఖమ్మం రేవతిసెంటర్లోని ఏటీడీఓ కార్యాలయ ఆవరణలో ఉన్న గిరిజన సంక్షేమశాఖ ఖమ్మం రూరల్ కళాశాల బాలుర వసతిగృహంలో వంట గదితాళం తెరుచుకోలేదు. దీంతో వచ్చిన విద్యార్థులు టిఫిన్, భోజనం బయటే చేస్తున్నారు. ఏటీడీఓ కార్యాలయ ఆవరణలోని వసతిగృహం ఇలా ఉంటే మిగతా వాటి పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. విద్యార్థులపై ప్రభావం కార్మికుల సమ్మె ప్రభావం విద్యార్థులపై పడుతోంది. దసరా సెలవుల అనంతరం పాఠశాలలు, కళాశాలలు పునఃప్రారంభమైనా వసతిగృహాలు తెరుచుకోలేదు. దీంతో విద్యార్థులు ఇళ్లకే పరిమితమయ్యారు. మారుమూల గ్రామాలకు చెందిన వారు ఖమ్మం కళాశాలల్లో చదువుతుండగా వీరికి ఇక్కట్లు ఎదురవుతున్నాయి. కార్మికుల సమ్మెతో భోజనం సిద్ధం చేయించే పరిస్థితి లేక ఆశ్రమ పాఠశాలలకు రావొద్దని సమాచారం ఇచ్చినా త్వరలో జరగనున్న సమ్మెటివ్ పరీక్షల పరిస్థితి ఏమిటనే ప్రశ్న తలెత్తుతోంది. ఇకనైనా ప్రభుత్వం కార్మికుల సమస్యకు పరిష్కారం చూపాలని తల్లిదండ్రులు, నాయకులు డిమాండ్ చేస్తున్నారు.హాస్టల్ ఖమ్మం భద్రాద్రి పోస్ట్ మెట్రిక్ వసతిగృహాలు 12 22 ప్రీ మెట్రిక్ వసతిగృహాలు 08 17 ఆశ్రమ పాఠశాలలు 10 86 కార్మికుల సమస్యను పరిష్కరించి విద్యార్థులకు న్యాయం చేయాలి. కార్మికులు లేరనే సాకుతో కొన్ని వసతిగృహాలను తెరవకపోవడం సరికాదు. సెలవులు ముగియగానే వసతిగృహాలను తెరిపించాల్సిన అధికారులు పట్టింపులేనట్లు వ్యవహరించడం గర్హనీయం. –ఇటికాల రామకృష్ణ, ఏఐఎస్ఎఫ్ ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి వసతిగృహాలకు వస్తున్న విద్యార్థులకు భోజనం పెట్టడం లేదు. కార్మికులు లేరని వంట గదులు కూడా తెరవలేదు. అధికారులు వెంటనే కార్మికులను ఏర్పాటుచేసి విద్యార్థులకు భోజనం అందేలా చూడాలి. జిల్లా అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలి. –వి.వెంకటేశ్, పీడీఎస్యూ, ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శితెరుచుకోని హాస్టళ్లు.. వెలగని పొయ్యి -
పర్మిట్లలో లోపాలపై అధ్యయనం
● కలప అక్రమ రవాణాపై సీసీఎఫ్ సమీక్ష ● అటవీ ఉద్యోగుల విధులు, చెక్పోస్టుల నిర్వహణపై ఆరా ఖమ్మంవ్యవసాయం: ఇటీవల వెలుగుచూసిన కలప అక్రమ రవాణా వ్యవహారాన్ని అటవీ శాఖ తీవ్రంగా పరిగణించి లోతైన దర్యాప్తు చేస్తోంది. ఈ వ్యవహారం పలు రాష్ట్రాలతో ముడిపడి ఉండగా జాతీయ స్థాయి సమస్యగా పరిగణిస్తున్నారు. నేషనల్ ట్రాన్సిట్ పర్మిట్ల(ఎన్టీపీసీ) జారీలో ఉన్న లొసుగుల ఆధారంగా అనుమతి ఉన్న కలప మాటున విలువైన కలపను అక్రమంగా రవాణా చేస్తున్నట్లు ఇటీవల బయటపడింది. ఈ అంశంపై జిల్లా అధికారులు ఇప్పటికే విచారణ పూర్తిచేయగా, భద్రాద్రి జోన్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్(సీసీఎఫ్) భీమానాయక్ మంగళవారం ఖమ్మం వచ్చారు. మరింత నిఘా ఖమ్మం అటవీ కార్యాలయంలో అధికారులతో సమీక్షించిన సీసీఎఫ్.. నేషనల్ ట్రాన్సిట్ పర్మిట్ సిస్టంను అక్రమార్కులు ఎలా వినియోగించుకున్నారు. తప్పుడు పత్రాలు సృష్టించడానికి ఎంచుకున్న మార్గాలపై చర్చించారు. అలాగే, అటవీ ఉద్యోగుల విధులు, చెక్పోస్టుల నిర్వహణపైనా ఆరా తీశారు. తప్పుడు పర్మిట్లతో సర్కారు తుమ్మ కలప మాటున సండ్ర కలపను మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, హరియాణా, గుజరాత్కు తరలించిన అంశంపై వివరాలు తెలుసుకున్నారు. వాస్తవంగా చింతకాని అటవీ సెక్షన్లో సండ్ర కలప లేకున్నా ఇతర జిల్లాల నుంచి సేకరించి ఇక్కడ పర్మిట్ ఆధారంగా తరలించారని, ఇందుకోసం అక్రమార్కులు ఎన్టీపీసీ లోపాలను ఆధారంగా చేసుకున్నట్లు అధికారులు సీసీఎఫ్కు వివరించారు. ఇప్పటికే చింతకాని బీట్ ఆఫీసర్ శ్రీకాంత్పై చర్యలు తీసుకున్నామని చెప్పారు. ఈక్రమాన సూర్యాపేటకు చెందిన స్మగ్లర్ వ్యవహారంపై కూడా చర్చించిన అధికారులు మహబూబాబాద్, భద్రాద్రి జిల్లాల రిజర్వ్ ఫారెస్టు నుంచి సండ్ర కలపను అక్రమంగా రవాణా చేయకుండా నిఘా ముమ్మరం చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. అలాగే, స్మగ్లర్లతో సంబంధాలు ఉన్న ఉద్యోగుల వివరాలు సేకరించాలని సీసీఎఫ్ ఆదేశించారు. ఇదే సమయాన పర్మిట్లలో లోపాలు, ట్యాంపరింగ్కు ఉన్న అవకాశాలపై చర్చించి సాంకేతిక బృందానికి నివేదిక ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. కాగా, జిల్లా పర్యటనలో భాగంగా సీపీఎఫ్ భీమానాయక్ ఖమ్మం వెలుగుమట్ల అర్బన్ పార్క్లో అభివృద్ధి పనులను పరిశీలించి డీఎఫ్ఓ సిద్ధార్థ్ విక్రమ్ సింగ్తో చర్చించారు. -
ఆదర్శంగా మహనీయుల జీవితాలు
● వాల్మీకి జయంతిలో కలెక్టర్ అనుదీప్ ఖమ్మంమయూరిసెంటర్: మహనీయుల జీవితాలను ప్రతీఒక్కరు ఆదర్శంగా తీసుకుని వారి బాటలో నడవాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. వాల్మీకి జయంతి సందర్భంగా మంగళవారం ఆయన చిత్రపటానికి కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి పూలమాల వేసి నివాళులర్పించాక మాట్లాడారు. రామాయణం రచనతోవెలుగొందిన వాల్మీకి ఆదర్శ మానవులకు ఉండాల్సిన లక్షణాలను బోధించారని తెలిపారు. జిల్లా బీసీ అభివృద్ధి అధికారి జి.జ్యోతి, శాఖ ఉద్యోగులు, బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు. మిర్చి యార్డులోనే ఇకపై కొనుగోళ్లు ఖమ్మంవ్యవసాయం: ఖమ్మం వ్యవసాయ మార్కెట్లోని పత్తి యార్డులో ప్రస్తుతం మిర్చి కొనుగోళ్లు జరుగుతుండగా, మిర్చి యార్డుకే మారుస్తూ మార్కెట్ కమిటీ నిర్ణయించింది. పత్తి విక్రయాలు పెరిగిన నేపథ్యాన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈమేరకు మార్కెట్ చైర్మన్ యరగర్ల హనుమంతరావు, ఉన్నత శ్రేణి కార్యదర్శి పి.ప్రవీణ్కుమార్ మంగళవారం సమావేశమై ఏసీ మిర్చి నమూనాల పరిశీలనకు తిరిగి మిర్చి యార్డునే వినియోగించాలని నిర్ణయించారు. అలాగే, నాన్ ఏసీ మిర్చి కొనుగోళ్లకు పత్తి యార్డులోని 7, 8వ షెడ్లను కేటాయించగా, లాట్ ఐడీల జారీ ఫైర్ స్టేషన్ కార్యాలయంలో నిర్వహించనున్నట్లు తెలిపారు. వ్యాపారులు ఈ మార్పును గమనించాలని సూచించారు. విధులు బహిష్కరించిన న్యాయవాదులు ఖమ్మం లీగల్: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీ.ఆర్.గవాయ్పై సోమవారం జరిగిన దాడిని నిరసిస్తూ ఖమ్మం బార్ అసోసియేషన్ ఆధ్వర్యాన న్యాయవాదులు మంగళవారం విధులు బహిష్కరించారు. అలాగే, నల్లబ్యాడ్జీలు ధరించిన నిరసన తెలపగా బార్ అసోసియేషన్ హాల్లో నిర్వహించిన సమావేశంలో న్యాయవాద సంఘాల బాధ్యులు మాట్లాడారు. సీజేఐపై జరిగిన దాడిని భారత న్యాయ వ్యవస్థపై జరిగిన దాడిగా భావిస్తున్నామన్నారు. అత్యున్నత న్యాయస్థానంలో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. బార్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు తొండపు వెంకటేశ్వరరావు, గద్దల దిలీప్తో పాటు న్యాయవాదులు పాల్గొన్నారు. పెద్దమ్మతల్లి సన్నిధిలో చండీహోమం పాల్వంచరూరల్: పాల్వంచ మండలం కేశవాపురం – జగన్నాధపురం మధ్య కొలువైన శ్రీ కనకదుర్గ(పెద్దమ్మతల్లి) ఆలయంలో పౌర్ణమి సందర్భంగా మంగళవారం చండీ హోమం నిర్వహించారు. తొలుత మేళతాళాలు, వేద మంత్రోచ్ఛరణల నడుమ స్వామి వారిని ఊరేగింపుగా తీసుకెళ్లగా, మండపారాధన, గణపతి పూజ అనంతరం చండీహోమం చేశారు. ఈ పూజల్లో పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఆతర్వాత శివాలయంలో సుబ్రహ్మణ్యేశ్వరస్వామికి పంచా మృతంతో అభిషేకం నిర్వహించారు. -
ప్రతీ గడపకు బీజేపీ నినాదం
ఖమ్మం మామిళ్లగూడెం: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులతో పాటు పార్టీ విధానాలను గడపగడపకు తీసుకెళ్లాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు సూచించారు. ఖమ్మంలోని జిల్లా కార్యాలయంలో మంగళవారం ఆయన నూతన జిల్లా కార్యవర్గంతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కోటేశ్వరరావు మాట్లాడుతూ బీజేపీ ఎక్కడుంది అని ప్రశ్నించే వారికి సమాధానాలు చెప్పేలా పార్టీ విధానాలను ప్రజల్లో తీసుకెళ్లాలని, తద్వారా పార్టీ పటిష్టతకు కృషి చేయాలని చెప్పారు. గ్రామస్థాయి మొదలు పట్టణాల వరకు ప్రతీ ఓటరుతో నేరుగా సంబంధం పెట్టుకుని వారి సమస్యల పరిష్కారానికి పాటుపడాలని సూచించారు. అలాగే, ఆరు గ్యారంటీల పేరుతో ఇచ్చిన హామీలను రాష్ట్రప్రభుత్వం విస్మరించిన విషయాన్ని వివరించాలని తెలిపారు. కాగా, స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతీ స్థానం నుంచి బీజేపీ పోటీ చేయనుండగా అర్హులకు అవకాశం కల్పిస్తామని కోటేశ్వరరావు పేర్కొన్నారు. ఈ సమావేశంలో నాయకులు మందడపు సుబ్బారావు, గుత్తా వెంకటేశ్వరరావు, నాయుడు రాఘవరావు, నలగట్టు ప్రవీణ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
అన్ని రంగాల్లో ఖమ్మం అభివృద్ధి
ఖమ్మంఅర్బన్: ఖమ్మం ప్రజలు ప్రశాంత వాతావరణంలో జీవించేలా కృషి చేస్తూనే అన్ని రంగాల్లో అభివృద్ధికి ప్రణాళికలు అమలు చేస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఖమ్మం 46వ డివిజన్లో అభివృద్ధి పనులకు మంగళవారం శంకుస్థాపన చేసిన ఆయన మాట్లాడుతూ నగరంలో పెరుగుతున్న జనాభాకు తగినట్లుగా సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. రాజకీయ వేధింపులు, అక్రమ కేసులు లేకుండా పాలన సాగుతోందని తెలిపారు. రహదారుల విస్తరణకు ప్రజలు సహకరిస్తేనే ట్రాఫిక్ సమస్యలు తగ్గుతాయని చెప్పారు. ఖమ్మంను చూసి ఇతర ప్రాంతాలు అభివృద్ధి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశామని వెల్లడించారు. పేదల సొంతింటి కల నిజం చేసేలా అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపు జరుగుతుందని తెలిపారు. కాగా, ఖమ్మం అభివృద్ధి కోసం సీఎం రేవంత్రెడ్డి ద్వారా ఎన్ని నిధులైనా తెచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని మంత్రి ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహారా, కార్పొరేటర్లు కన్నం వైష్ణవి, కమర్తపు మురళి, మార్కెట్ చైర్మన్ యరగర్ల హన్మంతరావు, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణతో పాటు బాణాల లక్ష్మణరావు, ప్రసన్నకుమార్, సాధు రమేష్రెడ్డి, బాలగంగాధర్ తిలక్, తుపాకుల యలగొండస్వామి పాల్గొన్నారు. ●రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బుధవారం ఖమ్మంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన 18వ డివిజన్ ముస్తఫానగర్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు -
స్థానిక ఎన్నికల్లో పోటీపై పార్టీల్లో చర్చలు
● జట్టుగానా.. ఒంటరిగా పోటీ చేయాలా అని మీమాంస ● పరిస్థితులు అనుకూలించకపోతే పరస్పర అవగాహన ● కొన్ని చోట్ల ఆశావహుల నుంచి వ్యతిరేకతగత పరిస్థితుల ఆధారంగా.. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో స్థానిక పరిస్థితులకు అనుగుణంగానే పార్టీలు అభ్యర్థులను బరిలో నిలిపాయి. అంతకుముందు 2018 శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, టీజేఎస్ ప్రజాకూటమిగా ఏర్పడ్డాయి. కానీ ఆతర్వాత స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజాకూటమి ప్రభావం చూపలేదు. సత్తుపల్లి, అశ్వారావుపేట నియోజకవర్గాల్లో గెలుపొందిన టీడీపీ.. స్థానిక సంస్థల మాత్రం కాంగ్రెస్కు మద్దతు ఇచ్చింది. గ్రామపంచాయతీ ఎన్నికలు పార్టీ రహితంగా జరగడంతో కొన్నిచోట్ల బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య అవగాహన కుదిరింది. ఇక జెడ్పీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ కలిసి పోటీ చేస్తాయని ప్రచారం జరిగినా ఒంటరిగానే బరిలోకి దిగాయి. కొందరు అభ్యర్థుల మధ్య స్థానికంగా అవగాహనతో జెడ్పీటీసీ ఎన్నికల్లో ఒకరికి, ఎంపీటీసీ ఎన్నికల్లో మరొకరికి మద్దతు ఇచ్చారు. కాంగ్రెస్లో భారీగా పోటీ జెడ్పీటీసీ, ఎంపీటీసీ, గ్రామపంచాయతీ సర్పంచ్, వార్డుసభ్యులుగా పోటీ చేసేందుకు కాంగ్రెస్ పార్టీలో తీవ్ర పోటీ ఉంది. ఇతర పార్టీలతో పోలిస్తే ఎన్నికల అంశం ఎప్పుడు తెరపైకి వచ్చినా కాంగ్రెస్లోని ఆశావహులు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఒక్కో జెడ్పీటీసీ స్థానంలో ముగ్గురు నుంచి పది మంది వరకు టికెట్లు ఆశిస్తున్నారు. ఎంపీటీసీ స్థానాల్లో పోటీ కొంత తక్కువగా ఉన్నా.. సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాల్లో మాత్రం పోటీ ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడం, జిల్లాలో బలమైన కేడర్ కలిగి ఉన్న నేపథ్యాన పొత్తులకు విముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ పొత్తు అంటూ కుదిరితే సీపీఐతోనే ఉండొచ్చన్న ప్రచారం జరుగుతోంది. బీఆర్ఎస్కు ప్రతిష్టాత్మకం 2014 శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్కు జిల్లాలో ఆశించిన ఫలితాలు రాలేదు. ఆతర్వాత స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రం మెరుగైన స్థానాలు దక్కాయి. గత జెడ్పీటీసీ ఎన్నికల్లో 20 స్థానాలకు బీఆర్ఎస్ 17 స్థానాల్లో గెలవగా, 583 గ్రామపంచాయతీల్లో 351 స్థానాలు బీఆర్ఎస్ మద్దతుదారులు గెలుచుకున్నారు. అదే మాదిరి ఈసారి కూడా మంచి ఫలితాలు రాబట్టేలా బీఆర్ఎస్ వ్యూహరచన చేస్తోంది. అయితే, గతంలో మాదిరి బీఆర్ఎస్కు స్థానికంగా అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయా అన్న మీమాంస వెంటాడుతోంది. ఈ నేపథ్యాన పొత్తులతో బరిలో దిగితే ఫలితాలు ఎలా ఉంటాయనే అంశంపై పార్టీలో చర్చ జరిగే అవకాశముంది. కలిసి వచ్చే పార్టీలతో పొత్తు కుదుర్చుకోవడమే మంచిదనే భావనతో ఉన్నట్లు సమాచారం. అత్యధిక జెడ్పీటీసీ స్థానాలను గెలుచుకోవడమే లక్ష్యంగా పార్టీ వ్యూహాలను సిద్ధం చేస్తుండగా.. బుధవారం ఖమ్మంలో జరిగే జిల్లా స్థాయి సమావేశంలో ఎన్నికల కార్యాచరణపై చర్చించనున్నారు. లెఫ్ట్.. ఎటు రైట్? సీపీఎం, సీపీఐ, సీపీఐ(ఎంఎల్) మాస్లైన్, న్యూడెమోక్రసీ పార్టీలు ఈ ఎన్నికల్లో ఎటు వైపు వెళ్తాయన్నది రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటివరకు ఎవరికి వారు తమ పార్టీ ఎన్నికల్లో పోటీ చేస్తుందని ప్రకటిస్తున్నా చివరకు ఎవరితో జత కడతారనే చర్చ జరుగుతోంది. గత ఎన్నికల్లో పరిస్థితులను బేరీజు వేసుకుని ఈ ఎన్నికల్లో స్థానికంగా బలోపేతం కావాలన్న వ్యూహరచనలో లెఫ్ట్ పార్టీలు ఉన్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్తో.. వామపక్షాల్లో ఏ పార్టీలు కలుస్తాయో నోటిఫికేషన్ వెలువడ్డాక తేలనుంది. అయితే గతంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ, పంచాయతీల్లో ప్రభావం చూపిన ప్రాంతాలపై వామపక్ష పార్టీలు దృష్టి సారిస్తున్నాయి.గ్రామపంచాయతీ ఎన్నికలు పార్టీ రహితంగా జరుగుతుండడంతో ఇక్కడ స్థానిక పరిస్థితుల ఆధారంగా పొత్తులు కుదురుతాయి. ఈసారి అన్ని పార్టీలు జెడ్పీటీసీ ఎన్నికలనే ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. జెడ్పీ చైర్మన్ పదవిని కై వసం చేసుకోవడమే లక్ష్యంగా ఉండడంతో కొన్ని స్థానాల్లో వ్యూహాత్మకంగా పొత్తులకు వెళ్లే అవకాశముంది. ఏదైనా రెండు పార్టీల మధ్య అవగాహన ఉంటే అవసరాల మేరకు జెడ్పీటీసీ స్థానాల్లో పొత్తు కుదుర్చుకుని, జీపీ, ఎంపీటీసీ ఎన్నికల్లో మద్దతు ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకునే అవకాశముందని తెలుస్తోంది. అయితే, నోటిఫికేషన్ విడుదలై నామినేషన్ల దాఖలు ప్రారంభమైతే తప్ప పొత్తులపై స్పష్టత వచ్చే అవకాశం లేదనే చెప్పాలి. -
కలెక్టర్ను కలిసిన ట్రెయినీ అధికారి
ఖమ్మంమయూరిసెంటర్:ఇటీవల ప్రకటించిన గ్రూప్ –1 ఫలితాల్లో బీసీసంక్షేమ అధికారిగా ఎంపికై న సాయి శ్రీజను రాజన్న సిరిసిల్ల జిల్లాలో నియమించారు. ఆపై ఆమెను శిక్షణ నిమిత్తం ఖమ్మం జిల్లాకు కేటాయించడంతో ఇక్కడకు వచ్చారు.ఈ సందర్భంగా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టిని మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా బీసీ సంక్షేమ అధికారి జి.జ్యోతి పాల్గొన్నారు. ట్రెక్కింగ్ పోటీల్లో ప్రతిభ మణుగూరుటౌన్: ఆల్ ఇండియా ట్రెక్కింగ్ పోటీల్లో మణుగూరు సింగరేణి విద్యార్థులు ప్రతిభ చూపా రు. మంగళవారం పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థులకు హెచ్ఎం కల్యాణి ఎన్సీసీ ధ్రువపత్రాలను అందజేసి మాట్లాడారు. గత నెల 25 నుంచి ఈనెల 2వరకు తిరుపతిలో ఎన్సీసీ 8వ బెటాలియన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ట్రెక్కింగ్ పోటీల్లో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి 102 మంది పాల్గొన్నారని చెప్పారు. ఇందులో మణుగూరు సింగరేణి హైస్కూల్ నుంచి 8మంది ప్రతిభ చూపారన్నారు. కార్యక్రమంలో విద్యార్థుల కోచ్, ఏఎన్ఓ కె.రాజసింహ, ఉపాధ్యాయుడు మస్తానయ్య తదితరులు పాల్గొన్నారు. -
రైలు నుండి జారిపడి తమిళనాడు వాసి మృతి
ఖమ్మంక్రైం: రైలులో ప్రయాణిస్తున్న తమిళనాడుకు చెందిన వ్యక్తి ప్రమాదవశాత్తు జారిపడి మృతి చెందాడు. చైన్నెకి చెందిన గోపీనాధ్ (41) బ్రతుకుదెరువు కోసం హైదరాబాద్కు వచ్చి కూలీ పని చేస్తున్నాడు. కుటుంబీకులను చూడడానికి సోమవారం రాత్రి చార్మినార్ ఎక్స్ప్రెస్లో బయలు దేరగా, ఖమ్మం పోలీస్ హెడ్ క్వార్టర్స్ వెనకభాగంలో ప్రమాదవశాత్తు జారి పడగా తీవ్రగాయాలతో మృతిచెందాడు. మృతదేహం వద్ద లభించిన సెల్ఫోన్ ఆధారంగా ఆయన వివరాలను గుర్తించిన జీఆర్పీ పోలీసులు కుటుంబానికి సమాచారం ఇచ్చారు. రెండు కిలోమీటర్లు మృతదేహంతో.. రైలు పట్టాల వెంట గోపీనాధ్ మృతదేహాన్ని గుర్తించిన జీఆర్పీ పోలీసులు అక్కడి నుంచి మెయిన్రోడ్కు తీసుకురావానికి అన్నం పౌండేషన్ చైర్మన్ శ్రీని వాసరావు సహకారం కోరారు. దీంతో ఆయన తన బృందంతో చేరుకుని మృతదేహన్ని కర్రకు కట్టుకుని రెండు కి.మీ. నడుస్తూ వచ్చి వాహనంలో జిల్లా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. పార్ట్టైం ఉద్యోగాల పేరిట రూ.1.57 లక్షలు స్వాహా ఖమ్మంఅర్బన్: పార్ట్ టైం ఉద్యోగం ఇప్పిస్తానంటూ ఖమ్మంలో ఇద్దరిని మోసం చేసిన ఘటన వెలుగు చూసింది. ఖమ్మం యూపీహెచ్ కాలనీకి చెందిన కె.అన్వేష్ టెలిగ్రామ్ యాప్లో పార్ట్ టైం జాబ్ చేయండి, డబ్బు సంపాదించండి అంటూ వచ్చిన ప్రకటనకు స్పందించాడు. దీంతో ఆయనకు ఫోన్ చేసిన సైబర్ మోసగాళ్లు దఫాలుగా రూ.1.29 లక్షలు కాజేసి ముఖం చాటేశారు. అలాగే, ధంసలాపురం కొత్తూరుకు చెందిన యువతికి కూడాఇలాంటి ప్రకటననే నమ్మి సెప్టెంబర్ 19న రూ.28 వేలు కోల్పోయింది. బాధితుల ఫిర్యాదుతో మంగళవారం కేసులు నమోదు చేసినట్లు ఖమ్మం అర్బన్ సీఐ భానుప్రకాశ్ తెలిపారు. -
ప్రాధాన్యత ప్రకారం ఫిర్యాదుల పరిష్కారం
గ్రీవెన్స్ డేలో కలెక్టర్ అనుదీప్ ఖమ్మం సహకారనగర్: ప్రజావాణిలో ప్రజలు అందించే ఫిర్యాదులను ప్రాధాన్యత ప్రకారం పరిష్కరించాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజతో కలిసి ఆయన దరఖాస్తులు, వినతిపత్రాలు స్వీకరించారు. అనంతరం అధికారులతో సమావేశమైన కలెక్టర్ ఏ దరఖాస్తూ పెండింగ్ లేకుండా చూడాలని తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో డీఆర్వో పద్మశ్రీ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. నేటి నుంచి ‘ఎవ్రీ చైల్డ్ రీడ్స్’ ప్రాథమిక పాఠశాలల విద్యార్థుల్లో చదివే నైపుణ్యాలు పెంచేలా ఉపాధ్యాయులు పాటుపడాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. కలెక్టరెట్లో ‘ఎవ్రీ చైల్డ్ రీడ్స్’ కార్యక్రమంపై సమీక్షించిన ఆయన చింతకాని మండలంలో ఎంపిక చేసిన ఐదు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో పైలట్ ప్రాజెక్టుగా ప్రత్యేకంగా తయారు చేసిన యాప్ ద్వారా కార్యక్రమం అమలుచేయాలని తెలిపారు. ఇవికాక జిల్లాలోని అన్ని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ప్రతిరోజూ మధ్యాహ్నం 3నుంచి 4గంటల వరకు ఒక పీరియడ్ను సోమవారం నుంచే కేటాయించాలని సూచించారు. ఈ సమావేశంలో విద్యా శాఖ ప్లానింగ్ కోఆర్డినేటర్ సీ.హెచ్.రామకృష్ణ, సీఎంఓ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో మోడల్గా జిల్లా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేసి జిల్లాను రాష్ట్రంలో మోడల్గా నిలపాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. బోనకల్ మండలంలో నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల పనులపై సోమవారం ఆయన టీజీఈడబ్ల్యూఐడీసీ సీఈ షఫీమియాతో సమీక్షించారు. స్కూల్ భవనంతో పాటే రోడ్లు, తాగునీటి వసతి, పార్కింగ్, విద్యుద్దీకరణ పనులు పూర్తిచేయాలని తెలిపారు. పీఆర్ ఎస్ఈ జి.వెంకటరెడ్డి, సీపీఓ శ్రీనివాస్, మిషన్ భగీరథ ఈఈలు పుష్పలత, వాణిశ్రీ, విద్యాశాఖాధికారులు పాల్గొన్నారు. ఖమ్మంవ్యవసాయం: జిల్లాలో ఇందిరమ్మ లబ్ధిదారులకు సరిపడా ఇసుక లభ్యమయ్యేలా అధికారులు పర్యవేక్షించాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆదేశించారు. మధిర నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో ఇసుక లభ్యతపై కలెక్టర్ సోమవారం అధికారులతో సమీక్షించారు. స్థానిక వనరుల నుంచి ఇసుక సరఫరాకు చర్యలు తీసుకోవాలని, ఇళ్ల పేరిట ఇసుక పక్కదారి పట్టకుండా నిఘా వేయాలని సూచించారు. ఈ సమావేశంలో హౌసింగ్ పీడీ భూక్యా శ్రీనివాస్, ఉద్యోగులు పాల్గొన్నారు. -
కోటమైసమ్మ జాతర ఆదాయం రూ.29.10లక్షలు
కారేపల్లి: దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని కారేపల్లి మండలం ఉసిరికాయపల్లిలో నిర్వహించిన శ్రీ కోటమైసమ్మతల్లి జాతర సోమవారంతో ముగిసింది. ఈమేరకు భక్తులు సమర్పించిన కానుకలను దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు, ఈఓ కె.వేణుగోపాలాచార్యులు, పర్సా ట్రస్టు చైర్మన్ పర్సా పట్టాభిరామారావు ఆధ్వర్యాన సోమవారం లెక్కించారు. ఐదు రోజుల పాటు నిర్వహించిన జాతర ద్వారా మొత్తం రూ.29,10,386 ఆదాయం సమకూరగా, హుండీల ద్వారా రూ.7,41,764 కానుకలు వచ్చాయని వెల్లడించారు. గత ఏడాది జాతర ఆదాయం రూ.27,17,949కాగా ఈ ఏడాది రూ.29,10,386 రావడంతో రూ.1.92లక్షల మేర పెరిగినట్లయింది. అలాగే, గత ఏడాది హుండీల ద్వారా రూ.7,33,549 వస్తే ఈసారి రూ.8,215 పెరిగి రూ.7,41,764గా నమోదైంది. ఇక పూజా టికెట్ల ద్వారా గత ఏడాది రూ.5,51,700, ఈ ఏడాది రూ.4,95,290, షాపుల వేలం ద్వారా గత ఏడాది రూ.8,34,000, ఈ ఏడాది రూ.9,64,500 ఆదాయం వచ్చింది. లెక్కింపులో దేవాదాయ శాఖ సిబ్బంది పగడాల మోహన్కృష్ణ, తోటకూరి వెంకటేశ్వర్లు, పర్సా సాయిలలిత్, మూడ్ మోహన్చౌహాన్, బోడ బన్సీలాల్ పాల్గొన్నారు. గత ఏడాది కంటే రూ.1.92లక్షలు ఎక్కువ -
ముగ్గురితోనే ముడి !
అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ కసరత్తు ● జెడ్పీటీసీ స్థానాలకు ముగ్గురేసి అభ్యర్థులతో జాబితా ● మిగతా పార్టీల్లోనూ అభ్యర్థుల ఖరారుపై మల్లగుల్లాలు ● నోటిఫికేషన్ విడుదలైతేనే పోటీపై స్పష్టత ● హైకోర్టు తీర్పు అనంతరం కదనరంగంలోకి దూకేలా ప్రణాళికసాక్షిప్రతినిధి, ఖమ్మం: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల వ్యవహారంపై కోర్టు తీర్పు రావడమే కాక రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ వస్తేనే అన్ని పార్టీలు పూర్తిస్థాయిలో దృష్టి సారించనున్నట్లు తెలుస్తోంది. బీసీ రిజర్వేషన్లను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్ను సోమవారం కొట్టివేయగా హైకోర్టులో బుధవారం తీర్పు వెలువడే అవకాశముంది. దీంతో అభ్యర్థుల ఎంపిక, పొత్తులు తదితర అంశాలపై పార్టీలు అంతర్గతంగా అభిప్రాయాలు సేకరిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ బలమైన అభ్యర్థులను బరిలో నిలిపేలా పరిశీలిస్తుండగా బీఆర్ఎస్, బీజేపీ, వామపక్ష పార్టీలు సైతం కసరత్తు మొదలుపెట్టాయి. కోర్టు తీర్పుపై ఉత్కంఠ. బీసీలకు 42శాతం రిజర్వేషన్లపై జారీ చేసిన జీఓను కొట్టివేయాలని సుప్రీం కోర్టులో దాఖలైన పిటిషన్ను కొట్టివేశారు. ఇక హైకోర్టులో బుధవారం జరగనున్న విచారణపై అంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే తాము ఇచ్చే తీర్పు మేరకే స్థానిక ఎన్నికలు జరగుతాయని హైకోర్టు చెప్పిన నేపథ్యాన అందరిలో ఆసక్తి నెలకొంది. కోర్టు తీర్పు అనంతరం నోటిఫికేషన్ విడుదల చేసేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సన్నాహాలు చేస్తోంది. ఆ తర్వాత అభ్యర్థుల ఎంపికపై ఓ అభిప్రాయానికి రావాలనే ఉద్దేశంతో రాజకీయ పార్టీల నేతలు ఉన్నారు. కాంగ్రెస్ ఫోకస్ రాష్ట్రంలో అధికారంలో ఉండడంతో తమ మార్క్ చూపించేలా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపిక మొదలుపెట్టింది. జెడ్పీటీసీ అభ్యర్థులను తామే ఖరారు చేస్తామని పీసీసీ వెల్లడించిన నేపథ్యాన ఒక్కో స్థానానికి ముగ్గురేసి బలమైన అభ్యర్థులతో జాబితా సిద్ధం చేస్తున్నారు. ఈ జాబితా పరిశీలించాక పీసీసీ అభ్యర్థులను ఖరారు చేయనుంది. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు మండల స్థాయి నేతలతో సమావేశమవుతూ ఒక్కో జెడ్పీటీసీ స్థానానికి ఐదుగురి నుంచి ఆపై సంఖ్యలో అభ్యర్థుల జాబితా ప్రాథమికంగా రూపొందించినట్లు సమాచారం. కొన్ని మండలాల్లో జెడ్పీటీసీ బరిలో ఉండేందుకు పది మంది కూడా పోటీ పడుతున్నట్లు తెలిసింది. హైకోర్టు తీర్పు, నోటిఫికేషన్ వెలువడ్డాక ముగ్గురి పేర్లు ఖరారు చేసి పీసీసీకి ప్రతిపాదిస్తారు. ఇక వార్డు సభ్యులు, సర్పంచ్, ఎంపీటీసీ స్థానాలకు అభ్యర్థుల ఎంపిక జిల్లా స్థాయిలోనే జరగనుంది. నోటిఫికేషన్ వెలువడ్డాకే.. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైనా రాజకీయ పార్టీలు పూర్తిస్థాయిలో దృష్టి పెట్టడం లేదు. కాంగ్రెస్ మినహా మిగిలిన పార్టీలు వేచి చూసే ధోరణిలోనే ఉన్నాయి. బీసీ రిజర్వేషన్లపై కోర్టు తీర్పు ఎలా వస్తుందనే అంశంపై పార్టీల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతుండగా తీర్పు వెలువడ్డాకే చూద్దాంలే అనే భావనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయినప్పటికీ అంతర్గతంగా మాత్రం ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, ఎక్కడెక్కడ పోటీ చేయాలనే అంశాలపై చర్చలు సాగుతున్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ నేతలు ఇప్పటికే మండలాల వారీగా సమావేశాలు నిర్వహించినా సీపీఐ, సీపీఎం వైఖరి స్పష్టం కాలేదు. కాంగ్రెస్తో కలిసి సీపీఐ పోటీ చేస్తుందా.. ఒంటరిగా బరిలో దిగుతుందా, సీపీఎంతో జట్టు కడుతుందా అన్నది తేలాల్సి ఉంది. బరిలో ఉంటామని ఇప్పటికే సీపీఎం ప్రకటించింది. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడితే తప్ప పొత్తులు, పోటీపై స్పష్టత వచ్చే అవకాశం లేదని చెబుతున్నారు. ఎంపీటీసీపై అనాసక్తి ఆశావహుల్లో ఎక్కువ మంది జెడ్పీటీసీ, సర్పంచ్ పదవులపైనే ఆశ పెట్టుకున్నారు. ఈ విషయాన్ని నేతల దృష్టికి తీసుకెళ్తున్నారు. ఎంపీపీ అయ్యేందుకు అవకాశం ఉందని భావిస్తున్న వారే ఎంపీటీసీగా బరిలో నిలిచేందుకు సిద్ధమవుతున్నారు. అలా సాధ్యం కాదనుకునే వారు ఎంపీటీసీగా పోటీకి అయిష్టత కనబరుస్తున్నారు. దీంతో పార్టీల్లో జెడ్పీటీసీ, సర్పంచ్ స్థానాలకు పోటీ పెరుగుతుండగా.. కొందరు తామే పోటీ చేస్తామంటూ ప్రచారం చేసుకుంటుండడం ముఖ్యనేతలకు ఇబ్బందికరంగా మారింది. -
స్ట్రాంగ్ రూమ్లు పరిశీలించిన కలెక్టర్
ఖమ్మం సహకారనగర్/కొణిజర్ల: త్వరలో జరగనున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి సామగ్రి భద్రపర్చడంతో పాటు డిస్ట్రిబ్యూషన్, రిసీవింగ్ సెంటర్ల ఏర్పాటుకు అనువైన భవనాలను అధికారులు గుర్తిస్తున్నారు. ఇందులో భాగంగా కొణిజర్ల మండలంలోని గ్రేస్ కళాశాల, ఖమ్మంలోని ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ కళాశాల, బారుగూడెంలోని మహ్మదీయ కళాశాలలను కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సోమవారం పరిశీలించారు. చింతకాని, వైరా, కొణిజర్ల మండలాల బ్యాలెట్ బాక్సులను గ్రేస్ కళాశాలలో, సింగరేణి, కామేపల్లి, రఘునాథపాలెం మండలాలకు సంబంధించి ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్లో, తిరుమలాయపాలెం, కూసుమంచి, నేలకొండపల్లి, ముదిగొండ, ఖమ్మం రూరల్ మండలాల బ్యాలెట్ బాక్సులను మహ్మదీయ కళాశాలలో భద్రపర్చేందుకు ఉన్న వసతులను పరిశీలించి చేయాల్సిన ఏర్పాట్లపై సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ, జెడ్పీ సీఈఓ దీక్షారైనా, డీఆర్డీఓ సన్యాసయ్య, ఖమ్మం ఆర్డీఓ నర్సింహారావు, అడిషనల్ డీసీపీ ప్రసాదరావు, ఏదులాపురం మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి, వివిధ శాఖల ఉద్యోగులు పాల్గొన్నారు. బ్యాలెట్ పేపర్ల ముద్రణకు టెండర్లు ఖమ్మం సహకారనగర్: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు అవసరమైన బ్యాలెట్ పేపర్ల ముద్రణకు ఈనెల 8వ తేదీలోగా టెండర్లు దాఖలు చేయాలని కలెక్టర్ అనుదీప్ సూచించారు. టెండర్ ఖరారైన నాలుగు రోజుల్లోగా ముద్రించాల్సి ఉంటుందని తెలిపారు. ఇందుకు అవసరమైన పేపర్లు తాము సమకూరుస్తామని చెప్పారు. ఆసక్తిఉన్న ప్రింటింగ్ ప్రెస్ల యజ మానులు రూ.5వేల డీడీ చెల్లించి టెండర్ ఫారం తీసుకున్నాక పూర్తి వివరాలు, రూ.50 వేల డీడీతో ఈనెల 8లోగా సమర్పించాలని సూచించారు. -
నేడు మంత్రి తుమ్మల పర్యటన
ఖమ్మంఅర్బన్: రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మంగళవారం ఖమ్మంలో పర్యటించనున్నారు. ఖమ్మం కార్పొరేషన్ పరిధి 46వ డివిజన్ జూబ్లిపురలో సీసీ రోడ్డు, డ్రెయిన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారు. అలాగే, సారథినగర్ వద్ద రామాలయం సమీపాన అభివృద్ధి పనులను మంత్రిప్రారంభించనున్నారు. పెద్దాస్పత్రిలో లీగల్ ఎయిడ్ క్లినిక్ ఖమ్మంవైద్యవిభాగం: ఖమ్మం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో లీగల్ ఎయిడ్ క్లినిక్(డీ అడిక్షన్, రీహాబిలిటేషన్ సెంటర్)ను ఏర్పాటుచేశారు. ఈ సెంటర్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కే.వీ.చంద్రశేఖర్రావు సోమవారం ప్రారంభించి మాట్లాడుతూ డ్రగ్స్ మహమ్మారిని జిల్లా నుండి పారదోలేలా అందరూ సహకరించాలని సూచించారు. అలాగే, పిల్లలు, యువత పక్కదారి పట్టకుండా మార్చడాన్ని బాధ్యతగా భావించాలని తెలిపారు. ఎవరైనా డ్రగ్స్కు బానిలైన వారిని సెంటర్కు తీసుకొస్తే చికిత్స చేయడమే కాక కౌన్సెలింగ్ ఇస్తారని చెప్పారు. లీగల్ ఎయిడ్ క్లినిక్ ప్రతీ శనివారం ఉదయం 9నుంచి సాయంత్రం 4గంటల వరకు పనిచేస్తుందని తెలిపారు. ఆస్పత్రి మెడికల్ పరింటెండెంట్ ఎం.నరేందర్, మానసిక వైద్య నిపుణులు డాక్టర్ సౌమ్య, వైద్యులు, పారా లీగల్ వలంటీర్లు పాల్గొన్నారు. మెడికల్ కళాశాలలో 100 సీట్లు భర్తీ ఖమ్మంవైద్యవిభాగం: ఖమ్మం ప్రభుత్వ మెడికల్ కళాశాలలో 2025–26 ఏడాదికి గాను పూర్తి స్థాయిలో సీట్లు భర్తీ అయ్యాయి. జాతీయ కోటాలో 15 సీట్లు తొలి విడత కౌన్సెలింగ్లోనే భర్తీ కాగా, రాష్ట్ర స్థాయి కోటా కింద కేటాయించిన 85 సీట్లలో సోమవారం నాటికి విద్యార్థులు చేరారు. వంద సీట్లలో సగం మంది జిల్లాకు చెందిన వారే ఉండడం విశేషం. త్వరలోనే మూడో విడత కౌన్సెలింగ్ నిర్వహించనుండగా జాతీయ కోటా విద్యార్థుల్లో ఒకరిద్దరు వెళ్లినా, ఆ స్థానాలు భర్తీ చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. కాగా, బుధవారం నుండి ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభం కానున్నాయి. బీజేపీ జిల్లా నూతన కార్యవర్గం ఖమ్మం మామిళ్లగూడెం: భారతీయ జనతా పార్టీ(బీజేపీ) జిల్లా నూతన కార్యవర్గాన్ని పార్టీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరావు సోమవారం ప్రకటించారు. ఈమేరకు జిల్లా ఉపాధ్యక్షులుగా వీరవెల్లి రాజేష్, సుదర్శన్ మిశ్రా, బానోత్ రవిరాథోడ్, నకిరకంటి వీరభద్రం, బట్టు వీరంరాజు, బండారు నరేష్ నియమితులయ్యారు. అలాగే, జిల్లా ప్రధాన కార్యదర్శులుగా గుత్తా వెంకటేశ్వర్లు, నల్లగట్టు ప్రవీణ్కుమార్, నాయుడు రాఘవరావు, జిల్లా కార్యదర్శులుగా పమ్మి అనిత, కుంచం కృష్ణారావు, తమ్మెర రజినీరెడ్డి, రామసెట్టి నాగేశ్వరరావు, తొండేపు సైదేశ్వరరావు, పల నాగసురేందర్రెడ్డి నియమితులయ్యారు. ఇంకా కోశాధికారిగా కొణతం లక్ష్మీనారాయణ, మీడియా కన్వీనర్గా నెల్లూరి బెనర్జీ, సోషల్ మీడియా ఇన్చార్జ్గా కందుల శ్రీకృష్ణ, ఐటీ ఇన్చార్జ్గా బోయినపల్లి సురేష్, కార్యాలయ కార్యదర్శిగా నక్కల రవిగౌడ్ను నియమించినట్లు తెలిపారు. పార్టీ అభివృద్ధి కోసం కృషిచేస్తూనే ప్రజాసమస్యల పరిష్కారానికి కలిసికట్టుగా పోరాడాలని కోటేశ్వరరావు నూతన కార్యవర్గానికి సూచించారు. సీజేఐపై దాడి గర్హనీయం ఖమ్మంలీగల్: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గవాయ్పై జరిగిన దాడి గర్హనీయమని ఆలిండియా లాయర్ యూనియన్ బాధ్యులు పేర్కొన్నారు. దీన్ని స్వతంత్ర న్యాయవ్యవస్థపై జరిగిన దాడిగా పరిగణిస్తున్నట్లు వారు ఓ ప్రకటనలో తెలిపారు. ఈమేరకు ఆలిండియా లాయర్స్ యూనియన్ కమిటీల ఆధ్వర్యాన మంగళవారం కోర్టు ప్రాంగణాల్లో నిరసన తెలపనున్నట్లు వెల్లడించారు. అలాగే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై దాడిని బార్ అసోసియేషన్ బాధ్యులు ఖండించగా.. రాజ్యాంగ విలువలపై జరిగిన దాడిగా పరిగణిస్తున్నట్లు తెలిపారు. ఈమేరకు మంగళవారం జిల్లా కోర్టులో నిరసన తెలపాలని అసోసియేషన్ సర్వసభ్య సమావేశంలో నిర్ణయించినట్లు పేర్కొన్నారు. -
ఉద్యోగ విరమణ జీవితంలో కీలకఘట్టం
ఖమ్మం సహకారనగర్: ఉద్యోగుల జీవితంలో రిటైర్మెంట్ అనేది కీలకఘట్టమని డీఆర్వో పద్మశ్రీ అన్నారు. సెప్టెంబర్లో ఉద్యోగ విరమణ చేసిన ఉద్యోగులను కలెక్టరేట్లో సోమవారం సన్మానించారు. ఈ సందర్భంగా డీఆర్వో మాట్లాడుతూ బీసీ సంక్షేమ శాఖలో సహాయ అభివృద్ధి అధికారి ఎం.ఈదయ్య, వెటర్నరీ శాఖ ఆఫీస్ సబార్డినేట్ జి.సావిత్రి చిత్తశుద్ధితో విధులు నిర్వర్తించారని కొనియాడారు. ముప్ఫై ఏళ్లకు పైగా సేవలు అందించడం అభినందనీయమని తెలిపారు. అనంతరం సన్మాన గ్రహీతలు వారి ఉద్యోగ అనుభవాలను వివరించారు. జిల్లా బీసీ అభివృద్ధి అధికారి జి.జ్యోతి, వెటర్నరీ అధికారులు పాల్గొన్నారు. -
తప్పిన పెనుప్రమాదం
ముదిగొండ: ప్రభుత్వపాఠశాల ఆవరణలో పిడుగు పడగా.. ఆ సమ యాన విద్యార్థులెవరూ సమీపాన లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. ముదిగొండ మండలం వనంవారి కిష్టాపురంలో ఉన్న ముత్తారం హైస్కూల్ ఆవరణలోని గిన్నెచెట్టు పై సోమవారం సాయంత్రం వర్షం కురుస్తుండగా పిడుగు పడింది. భారీగా శబ్ధం రావడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఉలిక్కిపడగా ఆ సమయాన ఎవరూ లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. అయితే, పిడుగుపాడుతో చెట్టు నిట్టనిలువునా చీలిపోయింది. దాడి ఘటనలో ముగ్గురిపై కేసు చింతకాని: ఏపీఎస్పీ మూడో బెటాలియన్ కానిస్టేబుల్ కుటుంబసభ్యులపై దాడి చేసిన ఘటనలో చింతకాని మండలం పాతర్లపాడు ఎస్సీ కాలనీకి చెందిన దిలీప్తో పాటు మరో ఇద్దరిపై పోలీసులు సోమవారం కేసు నమోదు చేశా రు. నేలకొండపల్లి మండలం బోదులబండకు చెందిన కానిస్టేబుల్ కట్టెకోల శ్రీనివాస్ కుటుంబసభ్యులతో కలిసి కారులో పెనుగంచిప్రోలులోని శ్రీలక్ష్మీతిరుపతమ్మ తల్లి దైవదర్శనానికి వెళ్లి వస్తుండగా ఆదివారం రాత్రి నాగులవంచలో దిలీప్ సహా ముగ్గురు ద్విచక్ర వాహనాన్ని అడ్డుగా పెట్టి కారు నిలిపివేశారు. ఆపై కారులో ఉన్న కవిత, సంగీత, సందీప్, సునీతపై దాడి చేశారు. ఈ ఘటనను వీడియో తీస్తుండగా వారి సెల్ఫోన్లను పగులగొట్టి చంపుతామని బెదిరించారు. దీంతో కవిత ఫిర్యాదు మేరకు ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై వీరేందర్ తెలిపారు.పిడుగుపాటుతో చీలిపోయిన చెట్టు -
అభివృద్ధి సరే... ఆగే రైళ్లు ఏవీ?
● మధిర రైల్వేస్టేషన్ ద్వారా ఏటా రూ.5కోట్ల ఆదాయం ● అయినా పలు రైళ్లకు హాల్టింగ్ కరువు ● ఇబ్బందుల్లో ఏపీ – తెలంగాణ ప్రయాణికులుమధిర: అన్నీ ఉన్నా అల్లుడు నోట్లో శని అన్న చందంగా మారింది మధిర రైల్వేస్టేషన్ పరిస్థితి. ఈ రైల్వేస్టేషన్లో అవసరమైన రైళ్లను ఆపకుండా అభివృద్ధి చేస్తుండడంపై విమర్శలు వస్తున్నాయి. అమృత్ భారత్ పథకంలో భాగంగా మధిర రైల్వేస్టేషన్ను రూ.25 కోట్లతో అభివృద్ధి చేస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలకు సరిహద్దులో ఉన్న ఈ స్టేషన్ను అభివృద్ధి చేయడంపై హర్షం వ్యక్తమవుతున్నా.. అవసరమైన రైళ్లకు హాల్టింగ్ లేకపోవడంపై పలువురు పెదవి విరుస్తున్నారు. రోజూ 2వేల మంది రాకపోకలు మధిర రైల్వేస్టేషన్ ద్వారా ప్రతిరోజు సుమారు 2,200 మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. అయితే, ఈ ప్రాంత ప్రజలకు అవసరమైన రైళ్లకు హాల్టింగ్ ఇవ్వకపోగా, గతంలో ఆగిన పలు రైళ్ల హాల్టింగ్ కూడా ఎత్తివేశారు. మధిర నుంచి తిరుపతి వెళ్లే ప్రయాణికులకు పద్మావతి ఎక్స్ప్రెస్ సౌకర్యంగా ఉంటుంది. కానీ తిరుపతికి వెళ్లే మార్గంలో ఉన్నప్పటికీ తిరుగు ప్రయాణంలో హాల్టింగ్ లేదు. దీంతో తిరుపతి వెళ్లిన భక్తులు విజయవాడకు వచ్చి అక్కడి నుంచి కోణార్క్ లేదా శాతవాహన ఎక్స్ప్రెస్ రైలు ద్వారా మధిర చేరాల్సి వస్తోంది. ఈ క్రమాన గంటల తరబడి సమయం వృథా అవుతోందని వాపోతున్నారు. అంతేకాక ఈ ప్రాంత ప్రజలు సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న నవజీవన్ ఎక్స్ప్రెస్(12655, 12656) రైలుకు హాల్టింగ్ ఇవ్వాలని ప్రయాణికులు కోరుతున్నారు. రెండు రాష్ట్రాల సరిహద్దు నియోజకవర్గ కేంద్రమైన మధిర తెలంగాణ – ఏపీ రాష్ట్రాలకు సరిహద్దులో ఉంది. దీంతో ఏపీ రాష్ట్రంలోని తిరువూరు, జగ్గయ్యపేట, నందిగామ నియోజకవర్గాల ప్రజలతోపాటు మధిర పరిసర ప్రాంత ప్రజలు ఈ రైల్వేస్టేషన్ నుంచే ప్రయాణిస్తుంటారు. వీరికి అవసరమైన రైళ్లకు హాల్టింగ్ లేకపోవడంతో అటు విజయవాడ లేదా ఖమ్మం వెళ్లాల్సి వస్తోంది. స్టేషన్ ద్వారా ఏటా సుమారు రూ.5కోట్ల ఆదాయం వస్తున్నా, ఏటా ప్రయాణికుల సంఖ్య పెరుగుతున్నా పదేళ్ల క్రితం నాటి రైళ్లు తప్ప కొత్తవి ఆగడం లేదు. ఈవిషయమై ప్రజాప్రతినిధులు, రైల్వే ఉన్నతాధికారులకు వినతిపత్రాలు అందజేసినా ఫలితం కానరావడం లేదు. ఇకనైనా గతంలో హాల్టింగ్ ఉన్న రైళ్లను పునరుద్ధరించడంతో పాటు ఇంకొన్ని ఎక్స్ప్రెస్లను ఆపాలని.. తద్వారా ఆదాయం పెరిగి ప్రయాణికులకు మెరుగైన రవాణా సౌకర్యం ఏర్పడుతుందని చెబుతున్నారు. హాల్టింగ్ తొలగించిన రైళ్లు కరోనా కంటే ముందు పలు ఎక్ప్రెస్ రైళ్లకు మధిర హాల్టింగ్ ఉండేది. ఇందులో గౌతమి ఎక్స్ప్రెస్(12737, 12738), సింహపురి ఎక్స్ప్రెస్ (12710, 12709), పద్మావతి ఎక్స్ప్రెస్ (12763), విశాఖపట్నం – మహబూబ్ నగర్ ఎక్స్ప్రెస్ (12861), లక్నో ఎక్స్ప్రెస్ (16093, 16094)కు హాల్టింగ్ ఎత్తివేయడం గమనార్హం.గతంలో మధిర స్టేషన్లో ఆగిన అన్ని రైళ్ల హాల్టింగ్ పునరుద్ధరించాలి. తిరుపతికి వెళ్లే భక్తులు మధిర స్టేషన్కే వస్తుంటారు. వెళ్లడానికి పద్మావతి రైలు అందుబాటులో ఉన్నా తిరుగు ప్రయాణంలో హాల్టింగ్ లేదు. దీంతో విజయవాడలో దిగి ఇబ్బంది పడాల్సి వస్తోంది. – పాలడుగు మురళి, మధిర ఏపీలోని పలు ప్రాంతాల నుంచి మధిర చేరుకుని విజయవాడ, హైదరాబాద్, ఢిల్లీ, కలకత్తా ప్రాంతాలకు వెళ్తుంటాం. రెండు రాష్ట్రాల సరిహద్దులో ఉన్న ఈ స్టేషన్ ఎంతో సౌకర్యంగా ఉంటుంది. మరికొన్ని రైళ్లకు హాల్టింగ్ ఇస్తే ప్రయాణికుల సంఖ్య ఇంకా పెరుగుతుంది. – పద్మనాభుని నవీన్, పెనుగొలను -
ఐదు ఇసుక ట్రాక్టర్లు సీజ్
ముదిగొండ: ముదిగొండ మండలంలోని గంధసిరి, పెద్దమండవ పరిధి మున్నేటి నుంచి అనుమతి లేకుండా ఇసుక తరలిస్తున్న ఐదు ట్రాక్టర్లను సోమవారం పోలీసులు సీజ్ చేశారు. సువర్ణాపురం క్రాస్ వద్ద చేపట్టిన తనిఖీల్లో ఇసుక తరలింపునకు అనుమతి లేదని గుర్తించి సీజ్ చేశామని సీఐ మురళి తెలిపారు. ఈమేరకు డ్రైవర్లు, యాజమానులపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. క్షతగాత్రురాలికి డీసీహెచ్ఎస్ చేయూత రఘునాథపాలెం: ప్రమాదంలో గాయపడిన ఉపాధ్యాయురాలికి ఆ మార్గంలో వెళ్తున్న డీసీహెచ్ఎస్ డాక్టర్ రాజశేఖర్గౌడ్ తక్షణ చికిత్స అందించి ఆస్పత్రికి తరలించారు. కొణిజర్ల మండలం పెద్దగోపతి ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలైన మాధవి సోమవారం సాయంత్రం విధులు ముగించుకొని ఖమ్మం వెళ్తుండగా వీవీపాలెం స్టేజీ వద్ద కుక్క అడ్డు రావడంతో స్కూటీ అదుపు తప్పగా కిందపడింది. దీంతో ఆమె తలకు బలమైన గాయం కావడంతో పక్కనే షాప్లో ఉన్న నాగవాణి సీపీఆర్ చేసింది. అంతలోనే అదే మార్గంలో వెళ్తున్న డాక్టర్ రాజశేఖర్గౌడ్ తన కారులో ఆమెకు చికిత్స చేస్తూ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఫలితంగా మాధవికి ప్రాణాపాయం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కుక్కల దాడిలో చిన్నారులకు గాయాలు సత్తుపల్లిటౌన్: పాఠశాలకు వెళ్తున్న చిన్నారులపై వీధికుక్కలు దాడిచేయగా గాయాలయ్యాయి. సత్తుపల్లి జేవీఆర్ పార్క్ ఎదురుగా ఉన్న డబుల్ బెడ్రూమ్ గృహ సముదాయం నుంచి పాత సెంటర్ ప్రభు త్వ పాఠశాలకు సోమవారం విద్యార్థులు వెళ్తుండగా వీధికుక్కలు వెంబడించాయి. దీంతో ఆందోళనకు గురైన వారు కేకలు వేస్తూ పరుగు పెట్టారు. రెండో తరగతి విద్యార్థులు అబ్దుల్రషీద్, జి.శ్రావణ్కుమార్ను కుక్కలు వెంబడించి కరవడంతో గాయాలు కాగా తల్లిదండ్రులు చికిత్స చేయించారు. రైలుకింద పడి ఆత్మహత్య బోనకల్: బోనకల్ రైల్వేస్టేషన్ సమీపాన ఓ వ్యక్తి రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. మండలంలోని తూటికుంట్లకు చెందిన గందమాల సారధి(34) కారు డ్రైవర్గా జీవనం సాగిస్తున్నాడు. ఐదు నెలల క్రితం భార్య విడిచిపెట్టి వెళ్లడంతో తరచూ మద్యం సేవించేవాడు. ఈక్రమాన ఆదివారం ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆయన తిరిగి రాకపోవడంతో కుటుంబీకులు వెతుకున్నారు. ఇంతలోనే బోనకల్ స్టేషన్ సమీ పాన మృతదేహం ఉండడంతో పరిశీలించగా సారధిగా గుర్తించారు. ఈమేరకు ఆయన కుటుంబీకుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసరావు తెలిపారు. -
అసైన్డ్ భూమి.. అమ్మేసెయ్!
సత్తుపల్లి: సత్తుపల్లి నియోజకవర్గ కేంద్రం రోజురోజుకు విస్తరిస్తుండడంతో భూములరకు డిమాండ్ పెరుగుతోంది. దీనికి తగ్గట్టుగానే రియల్ ఎస్టేట్ మాఫియా భూములకు అక్రమ రిజిస్ట్రేషన్లు చేస్తూ రూ.లక్షలు ఆర్జిస్తున్నారు. సత్తుపల్లి రెవెన్యూ, అయ్యగారిపేట రెవెన్యూ పరిధిలో ఈ దందా విచ్చలవిడిగా సాగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. భూరికార్డుల ప్రక్షాళన సమయాన అసైన్డ్ భూములను పట్టా భూములుగా నమోదు చేసి అక్రమాలకు తెరలేపినట్లు సమాచారం. నిరుపేదలకు ప్రభుత్వం ఇచ్చిన వ్యవసాయ భూమి క్రయవిక్రయాలపై నిషేధం అమల్లో ఉంది. ఈమేరకు ప్రొహిబేషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ 1970 చట్టం ప్రకారం అసైన్డ్ భూముల అమ్మితే విచారణ జరిపి ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకునే అవకాశం ఉంది. సరిహద్దు పట్టా నంబర్లు వేసి... అయ్యగారిపేట రెవెన్యూ పరిధిలో అసైన్డ్ భూమికి సరిహద్దు పట్టా భూముల సర్వే నంబర్లు వేసి దర్జాగా రిజిస్ట్రేషన్ చేయిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. కాకర్లపల్లి రోడ్డు, కల్పతరురోడ్డు వైపుకు వెళ్లే రహదారిలోని దళితుల కు అసైన్డ్ భూమిని జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ పేరిట రాయించుకొని.. ఆపై ఖాళీ నివేశస్థలంగా మార్చి క్రయవిక్రయాలు జరిపినట్లు సమాచారం. సరిహద్దు వెంట గాడిదల వాగులో ముంపునకు గురైన పట్టా భూమి సర్వే నంబర్ల ఆధారంగా ఈ భూమి రిజిస్ట్రేషన్ చేసినట్లు తెలిసింది. ఇప్పటికీ ప్రభుత్వ రికార్డుల్లో అసైన్డ్ భూమిగా నమోదై ఉన్నా కుంటలుగా విభజించి రోడ్లు వేసి మరీ క్రయవిక్రయాలు జరుపుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. సాధారణంగా వ్యవసాయ భూమిని ఇళ్ల స్థలాలుగా మార్చాలంటే నాలా కన్వర్షన్ చేయాల్సి ఉంటుంది. ఇవేవీ లేకుండానే అసైన్డ్ భూమిని ఇళ్ల స్థలాలుగా విక్రయించి పట్టా భూమి సర్వే నంబర్లతో రిజిస్ట్రేషన్ చేయిస్తున్నారు. అలాగే, సత్తుపల్లిలోని కల్పతరు రోడు, మరో అసైన్డ్ భూమి విషయంలో ఇలా జరగగా.. భూమిని అధికార పార్టీ ప్రముఖుడికి విక్రయించి సొమ్ము చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. అధికారుల సహకారంతో.. అక్రమాల్లో అందరికీ వాటా ఉండడంతో రెవెన్యూ సబ్ రిజిస్ట్రార్ల అండతో భూమి రికార్డులు మార్పులు చేసుకుంటున్నట్లు తెలిసింది. అధికారుల సహకారంతో భూముల సర్వే నంబర్లు ఏమార్చి.. వీటిని నాలా కన్వర్షన్ చేసి ప్లాట్లుగా విభజించి రిజిస్ట్రేషన్ చేయిస్తున్నట్లు సమాచారం. అసైన్డ్, ప్రభుత్వ భూములపై విచారణ జరిపిస్తే ఇలాంటి అక్రమాలు మరిన్ని వెలుగులోకి వస్తాయని చెబుతున్నారు. ఇక అవగాహన లేకుండా అసైన్డ్ భూములను కొన్న పలువురు ఇంటి అనుమతి, బ్యాంకు రుణాల సమయాన ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ఈ విషయమై సత్తుపల్లి సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాస్ను వివరణ కోరగా.. నిషేధిత, అసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్పై నిబంధనల మేరకు నడుచుకుంటున్నామని తెలిపారు. తాను విధుల్లో చేరాక అసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్లు చేపట్టలేదని స్పష్టం చేశారు. -
ఎల్ఆర్ఎస్ చకచకా..
● ఫీజులు చెల్లించిన దరఖాస్తులకు ప్రొసీడింగ్స్ ● కేఎంసీలో 51.7 శాతం దరఖాస్తుల పరిశీలన పూర్తి ● సాంకేతిక, ఇతర కారణాలతో మిగతావి జాప్యం ఖమ్మంమయూరిసెంటర్: జిల్లాలో ఎల్ఆర్ఎస్(లే ఔట్ రెగ్యులరైజేషన్ స్కీమ్) కింద రూ.వేయి చెల్లించి దరఖాస్తు చేసుకుని.. నిర్దేశిత ఫీజు కూడా చెల్లించిన వారికి అధికారులు ప్రొసీడింగ్స్ జారీ చేస్తున్నారు. గత ఐదేళ్లుగా స్థలంపై యాజమాన్య హక్కుల కోసం దరఖాస్తుదారులు పడరాని పాట్లు పడగా.. ప్రభుత్వం సమస్యకు పరిష్కారం చూపేలా గతేడాది ఫీజు కట్టించుకుంది. ఆతర్వాత ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్తో పాటు ఐదు మున్సిపాలిటీల పరిధిలో ప్రొసీడింగ్స్ జారీలో జాప్యం జరగడంతో దరఖాస్తుదారులు కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేశారు. ఇంతలోనే కలెక్టర్, కేఎంసీ కమిషనర్ ప్రత్యేక దృష్టి సారించి ఎల్ఆర్ఎస్ ఫీజులు చెల్లించిన వారికి ప్రొసీడింగ్స్ జారీ చేయడాన్ని ప్రథమ ప్రాధాన్యత తీసుకోవాలని ఆదేశించారు. దీంతో కొద్దిరోజులుగా ప్రొసీడింగ్స్ జారీ ప్రక్రియ వేగవంతమైంది. 19,277 మంది ఫీజు చెల్లింపు ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్తో పాటు వైరా, మధిర, ఎదులాపురం, సత్తుపల్లి, కల్లూరు మున్సిపాలిటీల్లో లే ఔట్ రెగ్యులరైజేషన్ కోసం 19,277 మంది ఫీజు చెల్లించారు. ప్రభుత్వం ఇచ్చిన గడువులోగా రాయితీపై ఫీజు చెల్లించిన వారికి అధికారులు ప్రొసీడింగ్స్ ఇవ్వాల్సి ఉన్నా రకరకాల కారణాలతో జాప్యం జరిగింది. ఆపై దరఖాస్తులను మూడు దశల్లో పరిశీలించాలని అధికారులు నిర్ణయించారు. ఎల్–1లో అర్బన్ ఏరియాలోని టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్లు, ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి పత్రాలను పరిశీలిస్తున్నారు. అంతా సక్రమంగా ఉంటే ఎల్–2కు పంపిస్తున్నారు. అక్కడ టౌన్ప్లానింగ్ సూపర్వైజర్కు పైస్థాయి అధికారి పత్రాలను పరిశీలించి ఎల్–3 కి పంపుతున్నారు. అనంతరం అర్బన్ ప్రాంతంలో మున్సిపల్ కమిషనర్ దరఖాస్తులను పరిశీలించి అన్నీ సవ్యంగా ఉన్న దరఖాస్తులకు ప్రొసీడింగ్స్ జారీ చేస్తున్నారు. సిబ్బంది కొరత.. సాంకేతిక సమస్య జిల్లాలో కేఎంసీతో పాటు మున్సిపాలిటీల పరిధిలో మొత్తం 19,9277 మంది ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించగా.. అత్యధికంగా ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ నుంచే ఉన్నాయి. కేఎంసీ పరిధిలో 12,614 మంది ఫీజులు చెల్లించినా సిబ్బంది కొరతతో ఉన్న వారికి అదనపు బాధ్యతలు అప్పగించారు. దీనికి తోడు ఎల్ఆర్ఎస్ వెబ్సైట్లో సాంకేతిక లోపాలతో పరిశీలన మరింత జాప్యం జరుగుతోంది. ఇప్పటికీ దరఖాస్తుదారులు జత చేసిన పత్రాలు పూర్తి స్థాయిలో సైట్లో కనిపించక ఇక్కట్లు ఎదురవుతున్నాయి. అంతేకాక పరిశీలనలో మూడు శాఖల ఉద్యోగులు సమన్వయంతో పని చేయాల్సి ఉండడంతో ఇబ్బందులు ఎదురవుతున్నట్లు తెలుస్తోంది. అయితే, కాస్త అటూఇటుగానైనా కలెక్టర్, కమిషనర్ చొరవతో ఫీజు చెల్లించిన వారికి ప్రొసీడింగ్స్ జారీ అవుతుండడంతో దరఖాస్తుల్లో హర్షం వ్యక్తమవుతోంది.సంస్థ ఫీజు ప్రొసీడింగ్స్ చెల్లించింది జారీ అయినవి ఖమ్మం కార్పొరేషన్ 12,614 6,523 సత్తుపల్లి మున్సిపాలిటీ 654 621 మధిర 1,101 979 ఏదులాపురం 3,3946 2,323 వైరా 725 535 కల్లూరు 237 110 మొత్తం 19,277 11,091 -
ఆర్టీసీ ఉద్యోగులకు భోజనం
ఖమ్మంమయూరిసెంటర్: విధినిర్వహణలోఉన్న ఆర్టీసీ ఉద్యోగులు సోమవారం ఖమ్మం రీజియన్ మేనేజర్ సరిరామ్ భోజనం ప్యాకెట్లు అందజేశారు. దసరా పండుగ రద్దీ నేపథ్యాన కండక్టర్, డ్రైవర్లు, సూపర్వైజర్లు, సెక్యూరిటీ సిబ్బంది నిరంతరాయంగా విధులు నిర్వర్తిస్తున్నారు. దీంతో వీరికి భోజనం సమకూర్చారు. డిప్యూటీ రిజినల్ మేనేజర్ మల్లయ్య, డీఎం శివప్రసాద్, సెక్యూరిటీ ఎస్సై కోటాజీ పాల్గొన్నారు.భద్రాద్రి జిల్లా ఇన్చార్జిగా శ్రీనివాస్ఖమ్మంమామిళ్లగూడెం/కల్లూరు రూరల్: జాతీ య బీసీ సంక్షేమ సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, సత్తుపల్లికి చెందిన నారాయణవరపు శ్రీనివాస్కు సంఘం భద్రాద్రి జిల్లా బాధ్యతలు కూడా అప్పగించారు. సోమవారం హైదరాబా ద్లో ఆయనకు సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య నియామక పత్రం అందజేశారు. కాగా, బీసీ రిజర్వేషన్ల కోసం శ్రీనివాస్ ఆమరణ దీక్ష చేయడంపై అభినందించారు. నాయకులు గద్దె వెంకటరామయ్య, మరీదు ప్రసాద్గౌడ్, రాజేందర్, అనంతయ్య, రేగా రమేష్, రాజు కోటి, కర్రీ కమలాకర్, జొన్నలగడ్డ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.ఏఐ టాపర్కు ఎస్బీఐ అధికారుల సన్మానంతిరుమలాయపాలెం/ఖమ్మం గాంధీచౌక్: ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ ప్రోగ్రామింగ్లో జాతీయ స్థాయి టాపర్గా నిలిచిన ఖమ్మం రూరల్ మండలం ఆరెంపులకు చెందిన తాల్లూరి పల్లవి ఇటీవల ప్రధానమంత్రి మోదీ చేతుల మీదుగా అవార్డు అందుకుంది. ఈ సందర్భంగా పల్లవితో పాటు ఆమె తల్లిదండ్రులను సోమవారం ఎస్బీఐ రీజియన్ అధికారులు సన్మానించారు. జాతీయ స్థాయిలో ప్రతిభ కనబర్చిన పల్లవి జిల్లాకు కీర్తి తీసుకొచ్చిందని కొనియాడారు. ఎస్బీఐ చీఫ్ మేనేజర్లు వెంకటేశ్వర్లు, శ్రీలక్ష్మి, బ్రాంచ్ మేనేజర్లు షేక్ ఇబ్రహీం, ఉదయ్, చేతన్ పాల్గొన్నారు. అలాగే, ఆరెంపుల హైస్కూల్లో నిర్వహించిన కార్యక్రమంలో పల్లవిని పర్యావరణ వేత్త డాక్టర్ కడవెండి వేణుగోపాల్ సత్కరించారు.అండర్–19 టీ.టీ. జట్ల ఎంపికఖమ్మం స్పోర్ట్స్: ఉమ్మడి జిల్లాస్థాయి అండర్–19 జూనియర్ కళాశాలల టేబుల్ టెన్నిస్ జట్లను సోమవారం ఎంపిక చేశారు. ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో జరిగిన ఎంపిక పోటీలకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 40మంది క్రీడాకారులు హాజరయ్యారు. ఇందులో ప్రతిభ చాటిన వారితో బాలబాలికల జట్లను ఎంపిక చేయగా, త్వరలో హైదరాబాద్లో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి వీ.వీ.ఎస్. మూర్తి, క్రీడల సంఘం కార్యదర్శి ఎం.డీ.మూసీ కలీం తెలిపారు. కాగా, బాలుర జట్టుకు పి.మోహిత్కృష్ణ, ఈ.తరుణ్, జి. జెస్సీ, ఏ.వివేక్, కె.శశాంక్, టి.అఖిలేష్, బాలికల జట్టుకు జి.చంద్రికరాణి, కె.నవ్య, జి.షర్మిల, టి.శ్రీఅమృత, వి.సుప్రియ, శౌర్య ఎంపికయ్యారని వెల్లడించారు. -
‘ఆహార ఉత్పత్తులపై బహుళ జాతి కంపెనీల కన్ను’
కూసుమంచి: దేశ వ్యవసాయ రంగంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పెత్తననం చెలాయిస్తుండగా, ఆ దేశానికి ప్రధాని మోదీ మోకరిల్లుతున్నారని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పోతినేని సుదర్శన్ విమర్శించారు. కూసుమంచిలో సోమవారం నిర్వహించిన సంఘం పాలేరు డివిజన్ మహాసభలో ఆయన మాట్లాడారు. దేశంలో పండించే ఆహార ఉత్పత్తులపై బహుళజాతి కంపెనీల కన్ను పడిందని పేర్కొన్నారు. దీంతో కార్పొరేట్ శక్తులను అడ్డుపెట్టుకుని వ్యవసాయ రంగాన్ని నాశనం చేసేలా ప్రధాని వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఈక్రమాన రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతుండగా వ్యవసాయ రంగం సంక్షోభంలో పడిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈమేరకు ఉద్యమాలు, పోరాటాల ద్వారా వ్యవసాయ రంగాన్ని కాపాడుకోవాలని సుదర్శన్ పిలుపునిచ్చారు. అనంతరం తెలంగాణ రైతు సంఘం పాలేరు డివిజన్ అధ్యక్ష, కార్యదర్శులుగా బిక్కసాని గంగాధర్, గుడవర్తి నాగేశ్వరరావును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో జిల్లా అద్యక్ష, కార్యదర్శులు మాదినేని రమేష్, బొంతు రాంబాబు, నాయకులు రమణారెడ్డి, నర్సింహారావు, వెంకటరెడ్డి, నాగేశ్వరరావు, శ్రీనివాసరావు, సన్మంతరావు, రాజశేఖర్, వెంకటేశ్వర్లు, అశోక్, శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
టీజీవోస్ జిల్లా అధ్యక్షుడిగా ‘కొంగర’
ఖమ్మం సహకారనగర్: తెలంగాణ గెజిటెడ్ అధికారుల(టీజీవోస్) అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడిగా కొంగర వెంకటేశ్వర్లు ఎన్నికయ్యారు. ఖమ్మంలో సోమవారం జిల్లా కార్యవర్గ సమావేశం జరగగా, జిల్లా కార్యదర్శి మోదుగు వేలాద్రి ఎన్నికల అధికారిగా వ్యవహరించారు. గతంలో జిల్లా అధ్యక్షుడిగా ఉన్న కె.సత్యనారాయణ ఉద్యోగ విరమణ చేయగా, ఆ స్థానంలో ఖమ్మం డివిజన్ వ్యవసాయ సహాయ సంచాలకులు కొంగర వెంకటేశ్వర్లు నియామకాన్ని సభ్యులు ఆమోదించారు. అలాగే, జిల్లా ఉపాధ్యక్షుడిగా ఉన్న మల్లెల రవీంద్రప్రసాద్(కారేపల్లి ఎంపీఓ)ను అసోసియేట్ ప్రెసిడెంట్గా ఎన్నుకున్నారు. ఇక జిల్లా కోశాధికారి కొండపల్లి శేషుప్రసాద్ను రాష్ట్ర కార్యవర్గంలోకి తీసుకున్నందున ఆ స్థానంలో డాక్టర్ సూరంపల్లి రాంబాబు(అసిస్టెంట్ ప్రొఫెసర్, ఎస్ఆర్బీజీఎన్ఆర్ కాలేజీ) నియమితులయ్యారు. ఈమేరకు నూతన అధ్యక్షుడిని టీజీవోస్ రాష్ట్ర అధ్యక్షుడు, ఉద్యోగ సంఘాల జేఏసీ ప్రధాన కార్యదర్శి ఏలూరి శ్రీనివాసరావు అభినందించారు. ఈ కార్యక్రమంలో టీజీవోస్ జిల్లా మాజీ అధ్యక్షుడు కస్తాల సత్యనారాయణ, హౌస్ బిల్డింగ్ సొసైటీ కార్యదర్శి డాక్టర్ పి.విజయ్కుమార్, నాయకులు రమేష్, పుష్పరాజ్, ఎం.సతీష్, అరుణకుమారి, గోపాలకృష్ణ, ఎన్.మాధవరావు తదితరులు పాల్గొన్నారు. -
ఆ ఆనందం మరిచిపోలేనిది..
ఖమ్మంరూరల్: ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా అవార్డు అందుకోవడం మరిచిపోలేని మధురానుభూతి అని జిల్లాకు చెందిన తాళ్లూరి పల్లవి తెలిపారు. ఖమ్మం రూరల్ మండలం ఆరెంపులకు చెందిన ఆమె శ్రీ చైతన్య కళాశాలలో ఇంజనీరింగ్ పూర్తిచేశాక హైదరాబాద్లో ఏడాది పాటు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ విభాగంలో శిక్షణ తీసుకుంది. ఆపై నిర్వహించిన పరీక్షలో జాతీయ స్థాయి టాపర్గా నిలవడంతో తాజాగా ప్రధాని చేతుల మీదుగా అవార్డు అందుకుంది. ఈ నేపథ్యాన శ్రీచైతన్య కళాశాలలో పల్లవిని ఆదివారం సన్మానించారు. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ మల్లెంపాటి శ్రీధర్ మాట్లాడుతూ పల్లవి విజయం మిగతా విద్యార్థులకు స్ఫూరిగా నిలుస్తుందని తెలిపారు. అనంతరం పల్లవి మాట్లాడుతూ పరీక్షలో టాపర్గా నిలిచినప్పుడు సంతోషించినా.. ప్రధాని చేతుల మీదుగా అవార్డు అందుకోవడం మరింత ఆనందాన్ని ఇచ్చిందని తెలిపారు. కళాశాల డైరెక్టర్ శ్రీవిద్య, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ సాయిగీతిక, ప్రిన్సిపాల్ లక్ష్మీనారాయణ, అకడమిక్ డీన్ డాక్టర్ వి.సుదర్శన్, ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఆఫీసర్ డాక్టర్ రాజేష్ తదితరులు పాల్గొన్నారు. ● ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ విభాగంలో జాతీయ స్థాయి టాపర్గా నిలిచి ప్రధాని చేతుల మీదుగా అవార్డు అందుకున్న పల్లవిని హరియాణా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ అభినందించారు. ఆమెతో ఆదివారం ఫోన్లో మాట్లాడిన ఆయన భవిష్యత్లో ఉన్నత స్థాయికి చేరాలని ఆకాంక్షించారు. ప్రధాని నుంచి అవార్డు స్వీకరించిన పల్లవి -
ప్రతిపాదనలతోనే సరి
ఖమ్మం అర్బన్: జిల్లా వ్యాప్తంగా ఆర్అండ్ బీ పరిధిలోని రహదారులు ఇటీవల వర్షాలతో తీవ్రంగా దెబ్బతిన్నాయి. పలుచోట్ల గుంతలు తేలినా మరమ్మతులు లేకపోవడంతో వాహనదారులు రాకపోకలకు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. కనీసం తాత్కాలిక మరమ్మతులకు కూడా నిధులు అందక అనేక ప్రాంతాల్లో రోడ్లు ప్రమాదకరంగా మారాయి. గత రెండు నెలలుగా కురుస్తున్న వర్షాలతో రోడ్లపై తారు పొరలు ఊడిపోగా, గుంతలు మరింత పెద్దవయ్యాయి. తాత్కాలిక మరమ్మతుల కోసం అధికారులు పంపిన ప్రతిపాదనలకు మోక్షం లభించక ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. దీంతో సుమారు 120 కిలోమీటర్ల రోడ్ల శాశ్వత మరమ్మతుల కోసం రూ.75 కోట్లతో ప్రతిపాదనలు పంపిన అధికారులు ఎదురుచూస్తున్నారు. నిలిచిన పనులు ఖమ్మం – ఇల్లెందు నాలుగు లేన్ల రహదారి విస్తరణ పనులు రూ.40 కోట్ల అంచనాలతో ప్రారంభమయ్యాయి. రఘునాథపాలెం, మంచుకొండ వరకు సుమారు రూ.10 కోట్ల విలువైన పనులు చేసినా కాంట్రాక్టర్కు బిల్లులు అందలేదు. దీంతో పనులు మధ్యలోనే నిలిపివేశాడు. ఫలితంగా ఆ రోడ్డుపై ప్రయాణం ప్రమాదకరంగా మారింది. వర్షాలకు ఏర్పడిన గుంతల్లో చెత్త, నీరు పేరుకుపోయి ఇబ్బంది పడుతున్నామని వాహనదారులు వాపోతున్నారు. ఇదే పరిస్థితి జిల్లాలోని పలు ప్రాంతాల్లో నెలకొంది. చేసిన పనులకు బిల్లులు రాకపోవడంతో కొత్త పనులకు టెండర్లు ఆహ్వానించినా కాంట్రాక్టర్లు ఆసక్తి చూపడం లేదని సమాచారం. వాహనదారుల గోడు... ఖమ్మం – తిమ్మరావుపేట, ఖమ్మం – ఏన్కూరు వయా పండితాపురం ఖమ్మం – బోనకల్, పల్లిపాడు – ఏన్కూరు రహదారులు అధ్వానంగా మారాయి. ఇవేకాక సత్తుపల్లి, పాలేరు నియోజకవర్గాల్లోని పలు ప్రధాన రహదారులపైనా ఇదే పరిస్థితి నెలకొంది. ఖమ్మం – సత్తుపల్లి, తల్లాడ – కొత్తగూడెం తదితర రాష్ట్ర రహదారులన్నీ గుంతలమయమై ప్రయాణం భయానకంగా మారింది. పగటివేళ కూడా ప్రయాణం కష్టంగా మారడమే కాక రాత్రివేళ వాహనదారులు ఎంత జాగ్రత్తగా నడిపినా ఇక్కట్లు తప్పడం లేదు. నిధుల కొరతే కారణం ఆర్అండ్బీ రోడ్ల మరమ్మతులకు అవసరమైన నిధులు మంజూరు కాకపోవడమే సమస్యగా మారింది. శాశ్వత మరమ్మతుల మాటేమో కానీ తాత్కాలిక మరమ్మతుల కోసం రూ.8 కోట్లతో అంచనాలు పంపినా నిధులు రాకపోగా.. ఉన్న అరకొర నిధులతో టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్లు ముందుకు రావడంలేదు. కొందరు కాంట్రాక్టర్లు పనులు చేయకుండా ముఖం చాటేయడంతో అధికారులు పలు దపాలు నోటీసులు జారీ చేసినా స్పందన ఉండడం లేదని చెబుతున్నారు. వివిధ ప్రాంతాల్లో ఇటీవల వర్షాలతో రహదారులు దెబ్బతిన్నాయి. ఆయా ప్రాంతాల్లో తాత్కాలిక, శాశ్వత మరమ్మతుల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. మొత్తంగా రూ.83కోట్లు మంజూరు కావాల్సి ఉంది. తాత్కాలికంగా గుంతలు పూడ్చేందుకు టెండర్లు పిలిచాం. ఖరారైన చోట పనులు చేపడుతాం. – యాకూబ్, ఆర్అండ్బీ ఎస్ఈ రహదారులపై గుంతలకు తోడు పలుచోట్ల ఇరువైపులా పెరిగిన కంపచెట్లు, పొదలు కూడా వాహనదారులకు ఇబ్బందిగా మారాయి. తారురోడ్ల అంచుల వరకూ అల్లుకుపోయిన పొదలతో ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక ప్రమాదాలు పెరుగుతున్నాయి. ప్రధానంగా మూలమలపుల వద్ద, రాత్రివేళ ప్రమాదాలు నిత్యకృత్యమయ్యాయి. ఏటా వర్షాకాలం అనంతరం చేపట్టే జంగిల్ క్లియరెన్స్ పనులు కూడా ఈసారి నిధుల కొరతతో ఆగిపోయాయి. -
ఉద్యమ గుమ్మం నుంచే రణనినాదం
ఖమ్మంమయూరిసెంటర్: ఉద్యమ గుమ్మమైన ఖమ్మం నుంచే రణనినాదం మోగించడమే కాక పునరుత్తేజంతో కమ్యూనిస్టు పార్టీ విస్తరణకు కృషి జరగాలని సీపీఐ జాతీయ నాయకులు పిలుపునిచ్చారు. కమ్యూనిస్టులు లేని వ్యవస్థ మనజాలకపోగా, రానున్న కాలం కమ్యూనిస్టులదే అయినందున విస్తరణకు పునరంకితం కావడమే అందరి కర్తవ్యమని అన్నారు. సీపీఐ శత వసంతాల ముగింపు సభ డిసెంబర్ 26న జరగనున్న నేపథ్యాన ఆహ్వాన సంఘం సన్నాహాక సమావేశాన్ని ఆదివారం ఖమ్మంలో నిర్వహించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అధ్యక్షతన జరిగిన సభలో పార్టీ జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ కె.నారాయణ మాట్లాడుతూ దేశ చరిత్రలోనే ఖమ్మానికి ప్రత్యేక స్థానం ఉందని, ఆంధ్ర మహాసభ ద్వారా నైజాం పతనానికి నాంది పలికిన ఇక్కడ శత వసంత వేడుకల ముగింపు సభ జరగనుందని తెలిపారు. దేశవ్యాప్తంగా బహు పోరాటాలకు వేదికగా నిలిచిన కమ్యూనిస్టు పార్టీ ఇప్పుడు ప్రజాస్వామ్య వ్యవస్థల పరిరక్షణకు పునరంకితమవుతోందని తెలిపారు. ఇటీవల జరిగిన ఛండీఘర్ మహాసభ ఇదే పిలుపునిచ్చిందని నారాయణ గుర్తుచేశారు. కాగా, స్వాతంత్య్ర పోరాటంలోనూ, ఆ తర్వాత సామాజిక చైతన్యం కోసం జరిగిన ఏ పోరాటంతో సంబంధం లేని దేశద్రోహులు దేశభక్తులుగా చెలామణి అవుతున్నారని ఆరోపించారు. రాజ్యాంగాన్ని బీజేపీ ధ్వంసం చేస్తోందని, ఫెడరల్ స్ఫూర్తికి తిలోదకాలు ఇచ్చిందని పేర్కొన్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్షా మావోయిస్టులను తుదముట్టిస్తామని చెబుతుండగా.. మావోయిస్టులు అంతమైనా ఆ సిద్ధాంతం అంతం కాదని తేల్చిచెప్పారు. దేశాన్ని ముక్కలు కానివ్వమనే నినాదంతో పాటు గ్రామగ్రామాన కమ్యూనిస్టు పార్టీ విస్తరణే లక్ష్యంగా శత వసంత సభ నిర్వహిస్తామని నారాయణ తెలిపారు. ఆర్ఎస్ఎస్ది అధికార కాంక్ష.. ఆర్ఎస్ఎస్ది అధికార కాంక్ష మాత్రమే కాక విభజన, విధ్వంసం మాత్రమేనని సీపీఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి తెలిపారు. సన్నాహాక సమావేశంలో ఆయన మాట్లాడుతూ కమ్యూనిస్టులు సైద్ధాంతిక నిర్మాణంతో రాజకీయ లక్ష్యం కోసం పనిచేస్తున్నారని చెప్పారు. బలహీనపడినా పునరుత్తేజం తథ్యమని తెలిపారు. కొందరు అలవికాని హామీలు, ధన ప్రభావం ఇతరత్రా కారణాలతో ఎన్నికల్లో సానుకూల ఫలితాలు సాధించి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. కమ్యూనిస్టులే దేశానికి రక్ష, రాజకీయ ప్రత్యామ్నాయమని స్పష్టం చేశారు. సభకు అధ్యక్షత వహించిన కూనంనేని మాట్లాడుతూ త్యాగాల చరిత్రతో కమ్యూనిస్టులు ముందుకు సాగుతుంటే.. స్వార్థ చింతన, అధికార లక్ష్యంతో ఆర్ఎస్ఎస్ పనిచేస్తోందని అన్నారు. సీపీఐ సీనియర్ నాయకుడు పువ్వాడ నాగేశ్వరరావు, జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ, జాతీయ కార్యవర్గ సభ్యులు టీఎం.మూర్తి, పుదుచ్చేరి రాష్ట్ర కార్యదర్శి సలీం, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు బాగం హేమంతరావు తదితరులు మాట్లాడగా ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, పార్టీ జాతీయ, రాష్ట్ర నాయకులు చాడ వెంకటరెడ్డి, అజీజ్పాషా, అక్కినేని వనజ, ముప్పాల నాగేశ్వరరావు, జల్లి విల్సన్, రావుల వెంకయ్య, దండి సురేష్, ఎస్.కే.సాబీర్పాషా, నగర ప్రముఖులు ఎంఎఫ్.గోపీనాథ్, డాక్టర్ పి.గోర్కి, డాక్టర్ వై.ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
రామయ్యకు సువర్ణ పుష్పార్చన
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి మూలమూర్తులకు ఆదివారం అభిషేకం, సువర్ణ పుష్పార్చన నిర్వహించారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం జరిపించారు. స్వామి వారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. కాగా, ఆదివారం కావడంతో భక్తులు స్వామి వారిని పెద్ద ఎత్తున దర్శించుకున్నారు. నిత్యకల్యాణంలోనూ భారీగా పాల్గొన్నారు. గోశాల, శాశ్వత నిత్యాన్నదానానికి విరాళం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో నిర్వహించే గోశాల, శాశ్వత నిత్యాన్నదాన పథకానికి హైదరాబాద్కు చెందిన టీకే శ్వేత అనే భక్తురాలు గోశాలకు రూ.75,510, నిత్యాన్నదానానికి రూ.1,01,116 ఆలయ ఈఓ దామోదర్రావుకు అందజేశారు. -
లక్షణంగా వైద్యసేవలు!
సింహభాగం సీజనల్ వ్యాధులతోనే... సీజనల్ వ్యాధుల వ్యాప్తి నేపథ్యాన పెద్దాస్పత్రిలో వైద్య సేవలు పొందేందుకు భారీగా వస్తున్నారు. సాధారణంగా జూన్ నుండి సెప్టెంబర్ వరకు సీజనల్ వ్యాధుల కాలంగా పరిగణిస్తారు. ఈ సమయంలో జలుబు, దగ్గు, జ్వరం, డెంగీ, మలేరియా, చికెన్గున్యా, డయేరియా ప్రబలే అవకాశం ఉంటుంది. ఈ సమయాన పెద్దాస్పత్రిలో 1,35,693 మంది వైద్యసేవలు పొందారు. ఇందులో ఎక్కువగా సీజనల్ వ్యాధులతో బాధపడుతున్న వారే ఉన్నారని తెలుస్తోంది. అలాగే 10,302 మంది ఇన్ పేషెంట్లు చికిత్స చేయించుకున్నారు. జనవరి నుండి పరిశీలిస్తే ఇప్పటి వరకు 2,69,639 మంది ఓపీ సేవలు తీసుకోగా.. వీరిలో 22,877 మంది ఆస్పత్రిలో చేరారు. ఇక ఈ ఏడాది ఇప్పటి వరకు 45,969 మందికి అత్యవసర చికిత్స అందించారు. తరచుగా వర్షం కురుస్తూ నీరు నిలుస్తున్న కారణంగా సీజనల్ వ్యాధుల ప్రభావం తగ్గడం లేదని తెలుస్తోంది. ఫలితంగా సెప్టెంబర్ నెలలోనూ ఓపీ విభాగానికి వచ్చిన సంఖ్య ఏ మాత్రం తగ్గలేదు. జిల్లాలో పల్లె, పట్టణ దవాఖానాలు, పీహెచ్సీలు, సీహెచ్సీలు, అర్బన్ హెల్త్ సెంటర్లు అందుబాటులో ఉన్నా ఎక్కువ మంది పెద్దాస్పత్రికి రావడానికే మొగ్గు చూపుతున్నారు. దడపుట్టిస్తున్న వ్యాధుల వ్యాప్తి ఎడతెరిపి లేని వర్షాలతో దోమలు వృద్ధి చెంది ప్రజలు సీజనల్ వ్యాధుల బారిన పడుతున్నారు. విషజ్వరాలకు తోడు డెంగీ, మలేరియా, దగ్గు, జలుబు, డయేరియాతో ప్రజలు వణికిపోతున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు సరిహద్దు జిల్లాలైన మహబూబాబాద్, సూర్యాపేట తదితర జిల్లాల ప్రజలు కూడా పెద్దాస్పత్రికి వస్తుండటంతో నిత్యం కిటకిటలాడుతోంది. జిల్లాలో గత ఏడాది 32,656 మందికి డెంగీ పరీక్షలు చేయగా 529 మందికి నిర్ధారణ అయింది. ఈ ఏడాది ఇప్పటి వరకు 13,435మందికి పరీక్షలు చేయగా 208మంది డెంగీ బారిన పడినట్లు గుర్తించారు. ఒక ఆగస్టులోనే 101 డెంగీ కేసులు వెలుగు చూడగా, సెప్టెంబర్లో 75, జూలైలో 27 కేసులు బయటపడ్డాయి. ఈసారి మలేరియా, చికెన్గున్యా ప్రభావం లేకపోయినా వైరల్ ఫీవర్స్ వ్యాప్తి అధికంగా ఉంటోంది. దీనికి తోడు కలుషితమైన నీరు కారణంగా డయేరియా కేసులు పెరుగుతున్నాయి. నెల ఓపీ ఐపీ జనవరి 26,269 2,844 ఫిబ్రవరి 23,860 2,134 మార్చి 27,816 2,888 ఏప్రిల్ 28,473 2,591 మే 27,528 2,118 జూన్ 29,560 1,553 జూలై 38,336 3,209 ఆగస్టు 33,672 2,833 సెప్టెంబర్ 34,125 2,707 మొత్తం 2,69,639 22,877సీజనల్ వ్యాధుల ప్రభావంతో ఆస్పత్రికి తాకిడి పెరుతుండగా వైద్యులు అందుబాటులో ఉండేలా పర్యవేక్షిస్తున్నాం. ఇన్పేషంట్ వార్డుల్లోనూ నిరంతరం వైద్యులు ఉంటున్నారు. నిత్యం 1,500 నుంచి 2వేల మంది వైద్యసేవలు పొందుతున్నారు. ఎక్కువగా వైరల్ ఫీవర్స్, జలుబు, దగ్గు, డయోరియా, డెంగీతో బాధపడుతున్న వారు వస్తున్నారు. మందుల కొరత రాకుండా ముందస్తుగానే అందుబాటులో ఉంచాం. – ఎం.నరేందర్, జనరల్ ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ -
కోటమైసమ్మకు మొక్కుల చెల్లింపు
కారేపల్లి: మండలంలోని ఉసిరికాయలపల్లి గ్రామంలో కొలువుదీరిన శ్రీ కోటమైసమ్మ తల్లి జాతర కొనసాగుతోంది. దసరా పర్వదినాన మొదలైన జాతరకు భక్తజనం ఇంకా పోటెత్తుతూనే ఉన్నారు. ఆదివారం సెలవు కావడంతో వివిధ ప్రాంతాల భక్తులు పెద్దసంఖ్యలో అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దేవాదాయ ధర్మదాయ శాఖ, పర్సా ట్రస్టు ఆధ్వర్యాన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. తేనెటీగల పెంపకం లాభదాయకం సత్తుపల్లి: తేనెటీగల పెంపకం లాభదాయకంగా ఉంటుందని తెలంగాణ బీ హబ్ సొసైటీ అధ్యక్షుడు కె.ఇంద్రారెడ్డి తెలిపారు. జిల్లా అటవీశాఖ అధికారి సిద్ధార్థ విక్రమ్సింగ్ సూచనల మేరకు సత్తుపల్లి మండలం చంద్రాయపాలెంలో సయోధ్య ఎన్జీఓ సహకారంతో గిరిజనులకు తేనెటీగల పెంపకంపై ఆదివారం శిక్షణ ఏర్పాటుచేశారు. తేనెటీగల పెంపకం, తేనె సేకరణలో అధునాతన పద్ధతులు, మార్కెటింగ్ విధానంపై అవగాహన కల్పించాక 29 మందికి తేనేటీగల బాక్స్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రేంజర్ టి.స్నేహలత, ఎఫ్ఎస్ఓ నాగరాజు, బీట్ అధికారులు కిరణ్, కృష్ణ, వైల్డ్లైఫ్ ఎక్స్ఫర్ట్ దీపక్, బీ హబ్ సెక్రటరీ నిమ్మల రామచంద్రయ్యతో పాటు డాక్టర్ తిరుమలేష్, మృదుల, సీతాలక్ష్మణ్, బాబు, చుక్కమ్మ, మట్టా పద్మ, సురేష్, ఉష, కుమార్ పాల్గొన్నారు. రేపు బాలికల ఫుట్బాల్ జట్టు ఎంపిక ఖమ్మం స్పోర్ట్స్: ఉమ్మడి జిల్లాస్థాయి అండర్–19 బాలికల ఫుట్బాల్ జట్టును మంగళవారం ఎంపిక చేయనున్నట్లు జూనియర్ కళాశాలల క్రీడా సంఘం జిల్లా కార్యదర్శి ఎం.డీ.మూసాకలీం తెలిపారు. ఖమ్మంలోని మున్సిపల్ స్పోర్ట్స్ పార్క్లో జరిగే ఎంపిక పోటీలకు క్రీడాకారిణిలు వయసు ధ్రువీకరణ పత్రం, స్టడీ సర్టిఫికెట్తో హాజరుకావాలని సూచించారు. వివరాలకు 99896 47696, 97037 85786 నంబర్లలో సంప్రదించాలని తెలిపారు. 12న హాకీ ఎంపికలు.. ఉమ్మడి జిల్లాస్థాయి బాలబాలికల హాకీ జట్లను ఈనెల 12వ తేదీన కొత్తగూడెంలోని ఎస్ఆర్ఎస్ డిగ్రీ కళాశాలలో ఎంపిక చేయనున్నట్లు ఎం.డీ.మూసీ కలీం వెల్లడించారు. ఆసక్తి ఉన్న క్రీడాకారులు వయసు ధ్రువీకర పత్రం, స్టడీ సర్టిఫికెట్లతో ఉదయం 10 గంటలకు రిపోర్టు చేయాలని సూచించారు. జేకే ఓసీ ప్రారంభానికి ఏర్పాట్లు చేస్తున్నాంసింగరేణి డైరెక్టర్ వెంకటేశ్వర్లు ఇల్లెందు : నూతన జేకే ఓసీ ప్రారంభానికి ఏర్పాట్లు చేస్తున్నామని సింగరేణి డైరెక్టర్(పీఅండ్పీ) కె.వెంకటేశ్వర్లు తెలిపారు. ఆదివారం ఆయన ఇల్లెందు ఏరియాలో పర్యటించారు. అనంతరం జీఎం కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ.. ఓసీ ఏర్పాటుకు గల అడ్డంకులు తొలగిపోయేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. బొగ్గు ఉత్పత్తి, ఉత్పాదకత లక్ష్యాలను అధిగమించాలని, రవాణాకు ఎలాంటి ఆటంకం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఉపరితల గనుల్లో ఉద్యోగులు రక్షణ పరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అనంతరం ఏరియా ఆస్పత్రిని సందర్శించి అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. జీఎం వీసం కృష్ణయ్య, అధికారులు రామస్వామి, నరసింహరాజు, గిరిధర్రావు, జాకీర్ హుస్సేన్, తుకారం, రామ్మూర్తి, శివ వీరకుమార్, శివప్రసాద్, సతీష్ కుమార్, నాగేశ్వరరావు పాల్గొన్నారు. పెద్దమ్మతల్లికి విశేష పూజలుపాల్వంచరూరల్ : పాల్వంచ మండల పరిఽధి కేశవాపురం – జగన్నాథపురం మధ్య కొలువుదీరిన శ్రీకనకదుర్గ (పెద్దమ్మతల్లి) అమ్మవారికి ఆదివారం విశేష పూజలు నిర్వహించారు. జిల్లా నలుమూలలతో పాటు పొరుగు జిల్లాల భక్తులు అధిక సంఖ్యలో రావడంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. అమ్మవారికి పసుపు, కుంకుమ సమర్పించి మొక్కలు చెల్లించుకున్నారు. -
57 ఏళ్ల వయస్సు.. 41ఏళ్ల స్నేహం !
తల్లాడ: వారంతా తల్లాడ మండలం కుర్నవల్లి జిల్లా పరిషత్ పాఠశాలలో 1983–84 బ్యాచ్ పదో తరగతి విద్యార్థులు.. ప్రస్తుతం అందరి వయస్సు దాదాపు 57ఏళ్లు. ఇన్నాళ్ల తర్వాత ఇదే బ్యాచ్కు చెందిన యన్నం శ్రీనివాసరెడ్డి అందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చారు. చదువు నేర్పిన గురువులను సైతం ఆహ్వానించి ఆదివారం పూర్వవిద్యార్థుల సమ్మేళనం ఏర్పాటుచేశారు. వృత్తి, ఉద్యోగాలు, ఆరోగ్యంతో పాటు పిల్లల ఎదుగుదల వివరాలు పరస్పరం తెలుసుకుంటూ రోజంతా సందడిగా గడిపారు. ఆపై గురువులను సన్మానించి త్వరలోనే మళ్లీ కలవాలని నిర్ణయించుకుని బరువైన హృదయాలతో వెనుదిరిగారు. -
ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు మృతి
మధిర: మధిర పెద్ద చెరువులో ఈతకు వెళ్లిన యువకుడు ప్రమాదవశాత్తు నీట మునిగి మృతిచెందాడు. ఏపీలోని ఎన్టీఆర్జిల్లా గంపలగూడెం మండలం తునికిపాడుకు చెందిన ఇలవరపు వంశీ (21) తన స్నేహితులతో కలిసి ఆది వారం మధిర పెద్దచెరువులో ఈతకు వెళ్లాడు. పూర్తిస్థాయిలో ఈతరాని ఆయన వంశీ ప్యాంట్తో పాటే చెరువులోకి దిగాక కాసేపటికి ఆయాసంతో ఒడ్డుకు చేరలేకపోయాడు. ఈ సమయాన నీటిలో మునుగుతున్న ఆయనను కాపాడేందుకు స్నేహితులు యత్నించినా ఫలితం కానరాలేదు. సమాచారం అందుకున్న స్విమ్మర్స్ అసోసియేషన్ సభ్యులు నాలుగుగంటల పాటు శ్రమించి అతని మృతదేహాన్ని వెలికితీశారు. అయితే, గాలింపు కొనసాగినంత సేపు వంశీ ప్రాణాలతో బయటకు వస్తాడని ఎదురుచూసిన కుటుంబీకులు కన్నీరుమున్నీరయ్యారు. కాగా, ఆయన సంజీవరావు – మరియమ్మ దంపతుల్లో నలుగురి సంతానంలో వంశీ ఒక్కడే కుమారుడు కాగా ల్యాబ్ టెక్నీషియన్ కోర్స్ చదువుతున్న ఆయన మృతితో కుటుంబంలో విషాదం నెలకొంది. పాముకాటుతో కూలీ.. నేలకొండపల్లి: పత్తి చేనులో పనిచేస్తున్నమహిళను పాము కాటు వేయడంతో అస్వస్థతకు గురై మృతిచెందింది. ముదిగొండ మండలం పమ్మి గ్రామానికి చెందిన జె.రాధ నేలకొండపల్లి మండలం అనాసాగారంలో పనికి ఆదివారం వచ్చింది. పొలంలో పత్తి తీస్తుండగా పాము కాటేయడంతో మిగతా కూలీలు నేలకొండపల్లి ఆస్పత్రికి తరలించేలోగా మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. చికిత్స పొందుతున్న మహిళ.. రఘునాథపాలెం: గడ్డి మందు తాగిన మహిళ చికిత్స పొందుతూ మృతి చెందింది. రఘునాథపాలెం మండలం బద్యాతండాకు చెందిన గుగులోతు పద్మ(30) తల్లితో కలిసి నివసిస్తోంది. ఈక్రమాన పద్మ ప్రవర్తన నచ్చక తల్లి మందలించడంతో ఈనెల 3న ఆమె గడ్డిమందు తాగింది. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి చేర్పించగా చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతి చెందింది. ఘటనపై పద్మ తల్లి పిటోరి ఫిర్యాదుతో ఆదివారం కేసు నమోదు చేశామని సీఐ ఉస్మాన్ షరీఫ్ తెలిపారు. -
స్థానిక ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగరాలి
ఖమ్మం మామిళ్లగూడెం: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటి ప్రతీ గ్రామంలో కాషా య జెండా ఎగరేయాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఖమ్మంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మా ట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని, గ్రామాల అభివృద్ధి కేంద్ర నిధులతోనే సాధ్యమవుతుందనే అంశంపై అవగాహన కల్పించాలని సూ చించారు. ఇదే సమయాన రాష్ట్ర ప్రభుత్వం హామీల అమలులో విఫలమైన విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని తెలిపారు. తద్వారా జిల్లా వ్యాప్తంగా ఎంపీటీసీ, సర్పంచ్ స్థానాల్లో బీజేపీ అభ్యర్థుల విజయానికి బాటలు వేయాలని చెప్పారు. ఈ సమావేశంలో బీజేపీ నాయకులు గంట్యాల విద్యాసాగర్, వక్కలంక సుబ్రహ్మణ్యం, సన్నె ఉదయప్రతాప్, మందడపు సుబ్బారావు, నున్నా రవికుమార్, పుల్లారావు యాదవ్, డాక్టర్ శీలం పాపారావు, రామలింగేశ్వరరావు, వీరెల్లి రాజేష్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. -
ఆయిల్ఫెడ్లో అవకతవకలపై దర్యాప్తు జరపాలి
ఖమ్మంమయూరిసెంటర్: ఆయిల్ ఫెడ్ సంస్థలో జరుగుతున్న అవకతవకలపై సమగ్ర దర్యాప్తు జరిపించి నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలని మాజీ ఎమ్మెల్యేజూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు. ఆయి ల్ పామ్ రైతుల రాష్ట్రస్థాయి సదస్సు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు తుంబూరు మహేశ్వరరెడ్డి అధ్యక్షతన ఆది వారం ఖమ్మంలో జరగగా రంగారెడ్డి మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆయిల్పామ్ పామాయిల్ సాగు విస్తీర్ణం పెంపుపై దృష్టి సారించినా ఆ స్థాయిలో రైతులకు సలహాలు అందడం లేదన్నారు. అంతేకాక రైతులకు ఇబ్బందులు తలెత్తినప్పుడు బాధ్యతతో వ్య వహరించడం లేదనిచెప్పారు. కేంద్రప్రభుత్వం పామా యిల్ ధర పడిపోకుండా టన్నుకు కనీస మద్దతు ధర రూ.25 వేలుగా నిర్ణయించడమే కాక ఆయిల్ ఫెడ్ ద్వారా సరఫరా చేసిన మొక్కలు పెరగక నష్టోయిన రైతులకు పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో ప్ర స్తావించేందుకు ఎంపీలు కృషి చేయాలని సూచించా రు. రైతు సంఘం నాయకులు తుంబూరు మహేశ్వరరెడ్డి, బొంతురాంబాబు మాట్లాడగా కొకెరపాటి పుల్ల య్య, కారం శ్రీరాములు, రావు జోగిబాబు, చేలికాని వెంకట్రావు, దొడ్డ చక్రధర్రెడ్డి, బుచ్చన్న, గురువారెడ్డి, సంగీతరెడ్డి, చింతనిప్పు చలపతిరావు, ధనమ్మ, పాషా, సత్యనారాయణరెడ్డి పాల్గొన్నారు. -
కమ్యూనిస్టులతోనే దేశ భవిష్యత్
బోనకల్: కమ్యూనిస్టులపైనే దేశ భవిష్యత్ ఆధారపడి ఉందని, వారు లేకపోతే పరిస్థితులు మరింత ప్రమాదకరంగా మారతాయని సీపీఎం కేంద్ర కమి టీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం తెలిపారు. బోనకల్ మండలం గోవిందాపురం(ఎల్)లో సీపీఎం నాయకుడు మాదినేని నారాయణ కుమారుడు, రిటైర్డ్ జడ్జి మాదినేని రాధాకృష్ణ మృతిచెందగా ఆయన కుటుంబాన్ని ఆదివారం తమ్మినేని పరామర్శించి మాట్లాడారు. ప్రస్తుత రాజకీయాలు డబ్బు, పదవుల చుట్టే తిరుగుతుండడం ఆందోళన కలిగి స్తోందని తెలిపారు. కమ్యూనిస్టులు ఇప్పుడు బలంగా లేకున్నా, భవిష్యత్ మాత్రం కమ్యూనిస్టులదేనని చెప్పారు. కమ్యూనిస్టులను హేళన చేసే వారికి సమాధానం చెప్పే రోజు దగ్గరలోనే ఉందని తెలి పారు. సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు పోతినేని సుదర్శన్రావు, జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరావు, సీపీఎం, కాంగ్రెస్ నాయకులు మడిపల్లి గోపాల్రావు, పొన్నం వెంకటేశ్వరావు, పైడిపల్లి కిషోర్కుమార్, గాలి దుర్గారావు, మోదుగు సుధీర్బాబు తదితరులు సైతం రాధాకృష్ణ చిత్రపటం వద్ద నివాళులర్పించారు. సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని -
ఇద్దరు విద్యార్థినిలకు రూ.1.60 లక్షల ఆర్థికసాయం
కల్లూరు: స్ఫూర్తి ఫౌండేషన్ ఆధ్వర్యాన ఇద్దరు విద్యార్థినుల చదువుకు రూ.1.60 లక్షల ఆర్థిక సాయం అందజేశారు. నల్లగొండ జిల్లా చందనపేట మండలం తెల్ధేవరపల్లికి చెందిన లింగంపల్లి గోవింద్ – వాణి దంపతుల కుమార్తెల్లో పద్మ ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం, పావని బీటెక్ చదువుతోంది. కూలీపనులు చేసే గోవింద్కు వీరి ఫీజులు చెల్లించే స్థోమత లేక స్ఫూర్తి ఫౌండేషన్ బాధ్యుడు వరకా రామారావును ఆశ్రయించగా అమెరికాకు చెందిన దాత డాక్టర్ చిట్టిబోయిన శిరీష ద్వారా రూ.1.60లక్షల నగదు అందజేశారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ చైర్మన్ శ్రీవ్యాల్, బాధ్యుడు వరక రామారావు, దాత శిరీషకు వీరి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. మాజీ ఎంపీ జయంతిఖమ్మం సహకారనగర్: మాజీ ఎంపీ జి.వెంకటస్వామి జయంతిని ఆదివారం కలెక్టరేట్లో నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటస్వామి చిత్రపటం వద్ద కలెక్టరేట్ ఏఓ పూలమాలలు వేసి నివాళులర్పించారు. కలెక్టరేట్ సిబ్బంది వెంకన్న తదితరులు పాల్గొన్నారు. సైంటిస్టు అశ్విని, ఆమె తండ్రికి గుడివిగ్రహాలను ఆవిష్కరించిన కుటుంబీకులు కారేపల్లి: గత ఏడాది వరదల సమయాన ఆకేరు ప్రవాహంలో కారు కొట్టుకుపోవడంతో మండలంలోని గంగా రంతండాకు చెందిన అగ్రికల్చర్ సైంటిస్టు అశ్విని, ఆమె తండ్రి నూనావత్ మోతీలాల్ మృతి చెందిన విషయం విదితమే. వీరి జ్ఞాపకార్థం అశ్విని సోదరుడు అశోక్ గుడి నిర్మించాడు. గ్రామంలోని తమ వ్యవసాయ క్షేత్రంలో గుడి నిర్మించడమే కాక అశ్విని, మోతీలాల్ విగ్రహాలను ఏర్పాటు చేయగా మోతీలాల్ భార్య నేజీ ఆదివారం ఆవిష్కరించారు. అనంతరం అన్నదానం ఏర్పాటుచేశారు. తాళం పగలగొట్టి చోరీ మధిర: మధిర 21వ వార్డుకు చెందిన వెంపాటి రాజేంద్రప్రసాద్ ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. దసరా సందర్భంగా రాజేంద్రప్రసాద్ తన కుటుంబ సభ్యులతో కలిసి వారం క్రితం ఏపీలోనిఎన్టీఆర్ జిల్లా జి.కొండూరులో ఉన్న కుమార్తె వద్దకు వెళ్లారు. ఆదివారం తిరిగి వచ్చే సరికి ఇంటి తాళం, లోపల బీరువాను పగలగొట్టినట్లు గమనించారు. బీరువాలోని 12 గ్రాముల బంగారంతో పాటు నాలుగు బియ్యం బస్తాలు, నాలుగు ఇత్తడి కాగులు చోరీ జరిగినట్లు గుర్తించి ఫిర్యాదు చేయగా టౌన్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆరుగురు పేకాటరాయుళ్ల అరెస్ట్ ఖమ్మంఅర్బన్: నగరంలోని ధంసలాపురం వద్ద మున్నేటి ఒడ్డున పేకాట ఆడుతున్న ఆరుగురిని ఆదివారం అదుపులోకి తీసుకున్నట్లు ఖమ్మం అర్బన్ సీఐ భానుప్రకాష్ తెలిపారు. వీరి నుంచి రూ.6వేల నగదు స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. కానిస్టేబుల్ కుటుంబసభ్యులపై దాడిచింతకాని: ఏపీఎస్పీ మూడో బెటాలియన్ కానిస్టేబుల్ కట్టెకోల శ్రీనివాస్ కుటుంబ సభ్యులపై పాతర్లపాడు ఎస్సీ కాలనీకి చెందిన కొందరు ఆదివారం రాత్రి దాడిచేశారు. నేలకొండపల్లి మం డలం బోదులబండకు చెందిన శ్రీనివాస్ కుటుంబసభ్యులతో కలిసి కారులో ఏపీలోని పెనుగంచిప్రోలు శ్రీ లక్ష్మీతిరుపతమ్మ తల్లి దైవదర్శనానికి వెళ్లి వస్తున్నాడు. చింతకాని మండలం పాతర్లపాడు ఎస్సీ కాలనీకి చెందిన మద్యం మత్తులో ఉన్న ఇద్దరు వ్యక్తులు ద్విచక్రవాహనంపై మక్కపేట నుంచి కారును వెంబడించారు. వత్సవాయి వద్ద కారును ఆపి దుర్భాషలాడగా కానిస్టేబుల్ డయల్ 100కు సమాచారం ఇచ్చాడు. దీంతో బో నకల్ పోలీసులు రోడ్డు వద్దకు చేరుకోగా ఇద్దరు తప్పించుకుని నాగులవంచ చేరుకున్నారు. అక్క డ పాతర్లపాడు ఎస్సీ కాలనీ నుంచి మరికొందరిని పిలిపించి కానిస్టేబుల్ కారును నాగులవంచ సెంటర్లో అడ్డుకుని దాడిచేశారు. ఘటనలో శ్రీని వాస్, ఇద్దరు మహిళలు గాయపడగా, ఓ మహిళ మెడలో ఉన్న నల్లపూసల గొలుసు లాక్కెళ్లారు. దీంతో కొద్దిసేపు ఖమ్మం–బోనకల్ ప్రధాన రహదారిపై ట్రాఫిక్ నిలిచిపోయింది. సమాచారం తెలుసుకున్న ఎస్సై వీరేందర్ చేరుకుని వివరాలు సేకరించారు. -
వరుణుడి కటాక్షం
ఖమ్మంవ్యవసాయం: ఈ ఏడాది వానదేవుడు అనుకూలించాడు. వరుణుడి కటాక్షంతో సమృద్ధిగా వర్షాలు కురవడంతో జలాశయాలు నిండగా పంటలు అంచనాలకు మించి సాగవుతున్నాయి. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు జిల్లాలో సాధారణానికి మించి వర్షపాతం నమోదైంది. జూన్లో స్వల్పంగా తగ్గినా.. జూలై, ఆగస్టు, సెప్టెంబర్ల్లో మాత్రం లక్ష్యానికి మించి వర్షాలు కురిశాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది వర్షపాతం కొంత తక్కువగానే ఉన్నప్పటికీ ఆశించిన స్థాయిలోనే ఉండడం విశేషం. సమృద్ధిగా కురిసిన వానలతో జలాశయాలు సకాలంలో నిండడం.. సాగర్ జలాలు కూడా చేరడంతో పంటల సాగు విస్తీర్ణం లక్ష్యాలను మించి నమోదైంది. అంతకు మించి... ఈ ఏడాది జూన్ నుంచి సెప్టెంబర్ వరకు జిల్లాలో సాధారణానికి మించి వర్షపాతం నమోదైంది. జూన్ మినహా మిగిలిన మూడు నెలలు అధిక వర్షపాతం నమోదైంది. జూన్లో సాధారణ వర్షపాతం 131.2 మి.మీ.కు 123.9 మి.మీ.లు నమోవడంతో రైతుల్లో కొంత నిరాశ అలుముకుంది. కానీ జూన్ ఆరంభానికి ముందు మే 25, 26వ తేదీల్లో రోహిణి కార్తెలోనే వానలు ప్రారంభమయ్యాయి. దీంతో అప్పుడే జిల్లాలో వ్యవసాయ పనులు మొదలైనా జూన్లో కాస్త ఇబ్బందపడ్డారు. ఇక జూలైలో సాధరణానికి మించి 16.9 శాతం, ఆగస్టులో 62.4 శాతం, సెప్టెంబర్లో 34.7 శాతం వర్షపాతం అధికంగా నమోదైంది. ఆగస్టులో అదుర్స్ నాలుగు నెలల్లో పరిశీలిస్తే ఆగస్టు నెలలో అధిక వర్షపాతం నమోదైంది. ఈ నెలలో సాధారణ వర్షపాతం 240 మి.మీ.లు కాగా 389.7 మి.మీ.గా నమోదు కావడంతో జలాశయాలు నిండుకుండల్లా మారాయి. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు మొత్తం 52 రోజులు వర్షం కురవగా, ఆగస్టులో 17 రోజుల పాటు వర్షం కురిసింది. సస్యశ్యామలం సమృద్ధిగా కురిసిన వర్షాలు పంటల సాగుకు దోహదపడ్డాయి. ఈ ఏడాది వ్యవసాయ శాఖ అన్ని పంటలు కలిపి 6,08,348 ఎకరాల్లో సాగవుతాయని అంచనా వేశారు. కానీ 6,97,441 ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. ప్రధానంగా పత్తి, వరి సాగు విస్తీర్ణం పెరిగింది. వరి సాధారణ సాగు విస్తీర్ణం 2,87,928 ఎకరాలు కాగా 2,95,012 ఎకరాల్లో, పత్తి 2,15,643 ఎకరాలకు గాను 2,25,613 ఎకరాల్లో సాగైనట్లు వ్యవసాయ శాఖ గుర్తించింది. వీటితో పాటు పెసర, కంది వంటి పంటలు, చెరకు, మిర్చి పంటలు కూడా సాగు చేస్తున్నారు.నెల సాధారణం నమోదు జూన్ 131.2 123.9 జూలై 240.9 281.6 ఆగస్టు 240.0 389.7 సెప్టెంబర్ 179.0 241.1 -
ఈ ప్రయాణం ప్రహసనమే..
● దసరా సెలవులు ముగియడంతో తిరుగుముఖం ● బస్టాండ్లల్లో ఒకేసారి ప్రయాణికుల రద్దీ ● ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినా తీరని ఇక్కట్లుఖమ్మంమయూరిసెంటర్: దసరా పండుగ అనంతరం తిరిగి గమ్యస్థానాలకు వెళ్లే ప్రయాణికులతో జిల్లాలోని బస్టాండ్లు కిటకిటలాడుతున్నాయి. ఖమ్మం రీజియన్ ఆధ్వర్యాన దసరా సెలవులకు వచ్చివెళ్లే వారి కోసం వందల సంఖ్యలో స్పెషల్ బస్సులు ఏర్పాటు చేశారు. అయినా రద్దీకి ఏ సరి పోవడం లేదు. సెలవులు ముగియడం, సోమవా రం నుంచి విద్యాసంస్థలు ప్రారంభం కానుండడంతో ఆదివారం జనమంతా ఒకేసారి తిరుగుముఖం పట్టారు. హైదరాబాద్, వరంగల్తో పాటు ఇతర నగరాలకు వెళ్తుండగా రిజర్వేషన్ లేని వారు బస్సు ఎక్కేందుకు నానా పాట్లు పడుతున్నారు. సరిపోని ప్రత్యేక బస్సులు ప్రయాణికుల రద్దీని ముందుగానే అంచనా వేసిన అధికారులు గతంతో పోలిస్తే ఈసారి అదనంగా బస్సులు నడపాలని ఆర్టీసీ అధికారులు నిర్ణయించారు. ఈ నేపథ్యాన రీజియన్లోని ఏడు డిపోల నుంచి ఆదివారం మొత్తం 400 బస్సుల్లో 250 బస్సులను ప్రత్యేక సర్వీసులుగా నడిపారు. వీటిలో 100 బస్సులకు రిజర్వేషన్ ఉంది. మరో 150 బస్సులు నాన్ రిజర్వేషన్ సర్వీసుల కింద నడపగా బస్సులు ఎక్కేందుకు జనం నానా తంటాలు పడ్డారు. ఇసుకేస్తే రాలనంత.. రీజియన్ పరిధిలోని ఖమ్మం, సత్తుపల్లి, మధిర, కొత్తగూడెం, భద్రాచలం, మణుగూరు, ఇల్లెందు బస్టాండ్లు ఆదివారం ప్రయాణికులతో కిటకిటలా డాయి. పండుగ కోసం హైదరాబాద్, బెంగళూరు తదితర నగరాల నుంచి వచ్చిన జనం సెలవులు ముగియడంతో మళ్లీ తిరిగి వెళ్లేందుకు బస్టాండ్లకు చేరుకున్నారు. సుదూర ప్రాంతాలను మినహాయిస్తే హైదరాబాద్ వెళ్లే ప్రయాణికుల సంఖ్య అధికంగా ఉండడం.. రిజర్వేషన్ దొరకని వారు నేరుగా రావడంతో బస్సుల్లో సీట్లు దొరకడం గగనమైపోయింది. అక్కడే ఫుల్.. రెగ్యులర్గా హైదరాబాద్ వెళ్లే లహరి, రాజధాని, సూపర్ లగ్జరీ, డీలక్స్, ఎక్స్ప్రెస్ బస్సుల్లో ముందుగానే రిజర్వేషన్లు పూర్తయ్యాయి. ఈ బస్సుల ప్రారంభ స్థానంలోనే నిండిపోతుండగా.. తర్వాతి బస్టాండ్లల్లో ప్రయాణికులు ఎక్కడానికి వీలు లేకుండా పోయింది. మిగిలిన ప్రయాణికులకు స్పెషల్ బస్సులే అందుబాటులో ఉండడం.. ఇందులో సీట్లు దొరకక కొందరు బస్టాండ్ల బయట ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తున్నారు. పర్యవేక్షిస్తున్న అధికారులు తిరుగు పయనమైన వారితో బస్టాండ్లు కిటకిట లాడుతుండగా ఖమ్మం రీజినల్ మేనేజర్ సరిరామ్ అన్ని డిపోల మేనేజర్లను అప్రమత్తం చేశారు. ఆర్ఎం, డిప్యూటీ ఆర్ఎం, ఖమ్మం డిపో మేనేజర్లు ఖమ్మం కొత్త బస్టాండ్లో ప్రత్యేక బస్సులు, ఇతర డిపోల నుండి వచ్చిన బస్సుల రాకపోకలను పర్యవేక్షించారు. సిబ్బందికి సూచనలు చేస్తూ ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా అదనపు బస్సులు సమకూర్చారు. ఇక వేలాది మంది ప్రయాణికులతో బస్టాండ్లు కిటకిటలాడుతుండగా అవాంచనీయ ఘటనలు, చోరీలు జరగకుండా ఆర్టీసీ భద్రతా అధికారులు సిబ్బందితో 24 గంటల పాటు నిఘా ఏర్పాటు చేశారు. అటు పోలీస్ అధికారులు కూడా గస్తీ తిరుగుతున్నారు. ఫుట్బోర్డుపైనే ప్రయాణం కల్లూరురూరల్/తల్లాడ: దసరా పండుగ కోసం సొంత గ్రామాలకు వచ్చిన ప్రజలు తిరిగి వెళ్తుండడంతో ఆదివారం బసాండ్లలోరద్దీ ఏర్పడింది. సరిపడా బస్సులు లేకపోవడం సమస్యకు కారణమైంది. అరకొరగానే బస్సులు వస్తుండడంతో ప్రమాదమని తెలిసినా త్వరగా వెళ్లాలనే భావనతో పలువురు ఫుట్బోర్డులపైనే నిలుచుని ప్రయాణించడం కనిపించింది. -
కొనసాగుతున్న. కోటమైసమ్మ జాతర
కారేపల్లి: భక్తుల కోర్కెలు తీర్చే శ్రీ కోటమైసమ్మతల్లి జాతర మూడోరోజు శనివారం అంగరంగ వైభవంగా కొనసాగింది. ప్రతీ ఏడాది దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని దేవాదాయశాఖ, పర్సా ట్రస్ట్ ఆధ్వర్యంలో మండలంలోని ఉసిరికాయలపల్లిలోని శ్రీ కోటమైసమ్మతల్లి ఆలయ ప్రాంగణంలో జాతర నిర్వహిస్తుంటారు. ఈనెల2న ప్రారంభమైన జాతర 7వ తేదీ వరకు కొనసాగనుండగా.. భక్తులు భారీగా తరలివస్తున్నారు. ‘అమ్మా మైసమ్మా.. మా తల్లీ మైసమ్మా..’ అంటూ భక్తుల నామస్మరణతో ప్రాంగణం మార్మోగుతోంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఖమ్మం రూరల్ ఏసీపీ తిరుపతిరెడ్డి పర్యవేక్షణలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. దేవాదాయ శాఖ ఈఓ వేణుగోపాలాచార్యులు, పర్సా ట్రస్టు చైర్మన్ పట్టాభిరామారావు ఏర్పాట్లను పర్యవేక్షించారు. మూడోరోజూ అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్న భక్తులు -
మాసారు మాకే కావాలి
ఏన్కూరు: ‘మా సారు మాకు కావాలి’ అంటూ విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేసిన ఘటన మండల పరిధిలోని తిమ్మారావుపేట ప్రాథమిక పాఠశాలలో శనివారం చోటుచేసుకుంది. పాఠశాలలో పని చేస్తున్న చంద్రశేఖర్ అనే ఉపాధ్యాయుడిని డిప్యుటేషన్పై కొత్త మేడపల్లికి బదిలీ చేయగా విద్యార్థులు, తల్లిదండ్రులు పాఠశాల ఎదుట నిరసన తెలిపారు. 60 మంది విద్యార్థులున్న పాఠశాలలో ముగ్గురు ఉపాధ్యాయులు ఉండగా ఒకరిని బదిలీ చేయడంతో ఆందోళనకు దిగారు. ఆయన వల్లనే విద్యార్థులు హాజరు శాతం పెరిగిందని, బాగా చదువుతున్నారని తల్లిదండుల్రు తెలిపారు. విద్యార్థులు, తల్లిదండ్రుల ఆందోళన -
రైతులకు ‘పూల’బాట !
బోనకల్: మండలంలోని ముష్టికుంట్ల గ్రామంలో రైతులు వాణిజ్య పంటలకు స్వస్తి చెప్పి ఉద్యానవన పంటల సాగుకు మొగ్గు చూపారు. గత పది సంవత్సరాలుగా మిరప, పత్తి పంటలు సాగు చేసి నష్టపోగా, వారు ఉద్యాన పంటల సాగుకు శ్రీకారం చుట్టారు. ఉద్యాన పంటల సాగులో అంతర పంటలను వేసి ఏడాదికి మూడు సార్లు పంటల సాగు చేసి దిగుబడులు తీస్తున్నారు. వందల ఎకరాల్లో సాగు బంతి, చామంతి, గులాబి పంటలను వందల ఎకరాల్లో సాగు చేస్తున్నారు. ప్రదానంగా పండుగ సీజన్లో బంతి, చామంతి, కనకాంబరాలు సాగు చేస్తూ మంచి లాభాలను గడిస్తున్నారు. వినాయక చవితి, బతుకమ్మ సీజన్లతో పాటు కార్తీక మాసాల్లో జరిపే శుభకార్యాలల్లో పూలకు మంచి గిరాకీ ఉంది. బంతి కేజీ రూ. 70 నుంచి 100 వరకు అమ్ముతున్నారు. చామంతి పూలు కేజీ రూ. 500, కనకాంబరాలు రూ. 4000, గులాబీలు కేజీ రూ. 500 వరకు ధర పలుకుతోంది. పూల సాగుకు ఎకరాకు రూ.లక్ష వరకు పెట్టుబడి అవుతుంది. పూలను అమ్మగా రూ.3 లక్షల ఆదాయం వస్తుందని రైతులు చెబుతున్నారు. పండగ సీజన్ల తరువాత పూలను ఖమ్మం, విజయవాడ మార్కెట్లకు తరలిస్తున్నారు.పూలసాగు లాభసాటిగా ఉంది. గతంలో మిరప పంట వేసి తీవ్రంగా నష్టపోయాను. మూడు ఎకరాల్లో బంతి పూల సాగు చేపట్టాను. పండుగ సీజన్లో పూలు చేతికందేలా పంటను సాగు చేశాను. దింతో గిట్టుబాటు ధర లబిస్తోంది. – బొడ్డుపల్లి నర్సింహారావు, ముష్టికుంట్ల ఐదెకరాల్లో బంతి, చామంతి, గులాబీ పూల సాగు చేశాను. ప్రస్తుతం మార్కెట్లో మంచి ధర లబిస్తుండటంతో క్రమంగా పూలను ఖమ్మం, విజయవాడకు సులభతరంగా మార్కెటింగ్ చేస్తున్నా. మంచి ఆదాయం వస్తోంది. – బొడ్డుపల్లి మల్లికార్జున్రావు, ముష్టికుంట్ల -
నేడు సీపీఐ సన్నాహక సమావేశం
ఖమ్మంమయూరిసెంటర్ : సీపీఐ శతాబ్ది సంవత్సర ముగింపు ఉత్సవాల సందర్భంగా డిసెంబర్ 26న ఖమ్మంలో చారిత్రక సభ నిర్వహించనున్నామని, ఆ సభ ఏర్పాట్లను సమీక్షించేందుకు ఆదివారం సన్నాహక సమావేశం ఏర్పాటుచేశామని పార్టీ జాతీయ సమితి సభ్యులు బాగం హేమంతరావు తెలిపారు. ఖమ్మంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నేడు జరిగే సన్నాహక సమావేశానికి పార్టీ జాతీయ కార్యదర్శి డి.రాజా, జాతీయ నాయకులు బినయ్ విశ్వం, కె.నారాయణ, అజీజ్ పాషా, సీనియర్ నాయకులు పువ్వాడ నాగేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావుతో పాటు, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్నాటక, పుదుచ్చేరి రాష్ట్రాల కార్యదర్శులు హాజరు కానున్నారని తెలిపారు. డిసెంబర్ 26న ఖమ్మంలో జరిగే సభకు 31 దేశాల నుంచి ప్రతినిధులు హాజరవుతారని తెలిపారు. సీపీఐ వందేళ్ల సుదీర్ఘ ప్రస్తానంలో అనేక చారిత్రక ఘట్టాలున్నాయని, నాటి పోరాట చారిత్రక ఘట్టాలను నేటి యువతరానికి తెలియజేసేందుకు విస్తృత ప్రచారం నిర్వహించనున్నామని తెలిపారు. తెలంగాణ సాయుధ పోరాటంలోనూ, ఆ తర్వాత జరిగిన భూ పోరాటాల్లో సీపీఐ కీలక భూమిక పోషించిందన్నారు. వేల ఎకరాల భూములను పేదలకు పంచిన ఘనత కమ్యూనిస్టు పార్టీకి దక్కిందన్నారు. గ్రామ గ్రామాన శత సంవత్సర సంబరాల సందర్భంగా సభలు, సమావేశాలు నిర్వహించి యువతను కార్యోన్ముఖులను చేస్తామని తెలిపారు. బలానికి అనుగుణంగా పోటీ.. స్థానిక సంస్థల ఎన్నికలల్లో సీపీఐ బలానికి అనుగుణంగా పోటీ చేయనున్నట్లు హేమంతరావు తెలిపారు. జిల్లాలో కలిసివచ్చే రాజకీయ పార్టీలతో ఎన్నికల సర్దుబాటు ఉంటుందని వెల్లడించారు. సీపీఐకి బలం ఉన్న గ్రామాల్లో తప్పకుండా పోటీ చేస్తామని చెప్పారు. బీసీ రిజర్వేషన్లను తమ పార్టీ స్వాగతిస్తోందని, ఈ విషయంలో కొన్ని పార్టీలు ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నాయని విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించేందుకు కార్యకర్తలు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి దండి సురేష్, సహాయ కార్యదర్శి జమ్ముల జితేందర్రెడ్డి, రాష్ట్ర సమితి సభ్యులు యర్రా బాబు, ఎస్కే జానిమియా, ఏపూరి లతాదేవి, కొండపర్తి గోవిందరావు, సిద్దినేని కర్ణకుమార్ పాల్గొన్నారు. -
విద్యుత్ సబ్ స్టేషన్లో నూతన బ్రేకర్
మధిర: సిరిపురం విద్యుత్ సబ్ స్టేషన్లో ఏర్పాటుచేసిన నూతన బ్రేకర్ను విద్యుత్ శాఖ ఖమ్మం సర్కిల్ ఎస్ఈ ఇనుగుర్తి శ్రీనివాసాచారి శనివారం ప్రారంభించారు. సిరిపురం సబ్స్టేషన్ లిఫ్ట్ ఫీడర్ నుంచి సిరిపురం లిఫ్ట్కు, కలకోట, బ్రాహ్మణపల్లి, రాపల్లి గ్రామాలకు సరఫరా అవుతున్న విద్యుత్ను, ప్రత్యామ్నాయంగా కలకోట, సిరిపురం లిఫ్ట్ ఫీడర్లుగా విడదీస్తూ సుమారు రూ.8 లక్షల వ్యయంతో నూత న బ్రేకర్ను ఏర్పాటు చేశారు. దీంతో ప్రస్తుతం ఒకే బ్రేకర్ మీద సిరిపురం లిఫ్ట్కు, కలకోట, బ్రాహ్మణపల్లి, రాపల్లి గ్రామాలకు సరఫరా అవుతున్న విద్యుత్ను ప్రత్యామ్నాయ నూతన బ్రేకర్ ఏర్పాటుతో ఈ రెండింటినీ విడదీసి అంతరాయం లేని విద్యుత్ సరఫరాను అందించే అవకాశం ఏర్పడింది. ఈ కార్యక్రమంలో వైరా డివిజన్ డీఈ బండి శ్రీనివాసరావు, మధిర సబ్ డివిజన్ ఏడీఈ ఎం.అనురాధ, రూరల్ సెక్షన్ ఏఈ మైథిలి పాల్గొన్నారు. యోగా ఆశ్రమం అభినందనీయంఏన్కూరు: ప్రకృతితో మమేకమై ఆరోగ్యవంతమైన సమాజం కోసం యోగా కేంద్రం ఏర్పా టు చేయడం అభినందనీయమని ప్రముఖ సినీ గేయ రచయిత, ప్రకృతి కవి జి.జయరాజ్ అన్నారు. మండల పరిధిలోని నాచారంలో ఎస్ఎస్వై ప్రకృతి యోగా ఆశ్రమాన్ని శనివారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్ర ముఖ పుణ్యక్షేత్రమైన అద్భుత వేంకటేశ్వరస్వామి సన్నిధిలో కొండలు, గుట్టలతో ప్రకృతి పరవశించే ప్రదేశంలో ఈ ఆశ్రమాన్ని నెలకొల్పడం హర్షణీయమని అన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రకృతి పరిరక్షణ, ఆధ్యాత్మిక భావాలతో కూడిన ఆరోగ్య సంరక్షణకు నిర్విరామంగా ప్ర యత్నిస్తున్న యోగాచార్యులు డాక్టర్ ప్రేమ్ నిరంతర్ మల్లేష్గురూజీ ఆదర్శప్రాయులని అన్నారు. కార్యక్రమంలో ఎంఈఓ దామోదర్, ఎస్ఎస్వై ని ర్వాహకులు దారా విష్ణుమోహన్రావు, దుగ్గిదేవర అజయ్కుమార్, కోటగిరి ప్రవీణ్ పాల్గొన్నారు. ఇసుక ట్రాక్టర్ సీజ్భద్రాచలంఅర్బన్: అనుమతి లేకుండా అక్రమంగా రవాణా చేస్తున్న ఇసుక ట్రాక్టర్ను శనివారం భద్రాచలం పోలీసులు సీజ్ చేశారు. పట్టణంలోని కొల్లుగూడెం వద్ద గోదావరి నుంచి ఇసుక నింపుకుని వస్తుండగా పోలీసులు పట్టుకుని స్టేషన్కు తరలించారు. ట్రాక్టర్ డ్రైవర్, యజమానిపై కేసు నమోదు చేశారు. -
చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి
ఎర్రుపాలెం: కట్లేరులో చేపల వేటకు వెళ్లిన వ్యక్తి మృత్యువాత పడిన ఘటన శనివారం చోటు చేసుకుంది. మండలంలోని పెగళ్లపాడు గ్రామానికి చెందిన సగ్గుర్తి వెంకటరత్నం(57) వ్యవసాయ కూలీ పనులు చేస్తూ జీవిస్తాడు. శనివారం సాయంత్రం గ్రామ సమీపంలో కట్లేరులో చేపలు పట్టేందుకు వెళ్లగా ప్రమాదవశాత్తు లోతైన ప్రదేశంలో నీట మునిగి మృతి చెందాడు. అతడికి భార్య, ఇద్దరు కుమారులున్నారు. అయితే ఈ ఘటనపై తమకు ఫిర్యాదు అందలేదని ఎస్ఐ రమేష్ తెలిపారు. రూ.7 లక్షల విలువైన బాణసంచా పట్టివేతఖమ్మంక్రైం: నగరంలోని వన్టౌన్ పరిధిలో రూ.7 లక్షల విలువైన టపాసులను అక్రమంగా నిల్వ చేయగా పోలీసులు శనివారం పట్టుకున్నారు. కమాన్బజార్లో నాళ్ల బాలకృష్ణ అనే వ్యక్తి నిల్వ చేసి ఉంచగా విశ్వసనీయ సమాచారం మేరకు దాడి చేసి స్వాధీనం చేసుకున్నట్టు సీఐ కరుణాకర్ వెల్లడించారు. వాటికి లైసెన్స్ లేదని గుర్తించామని, ఈ మేరకు కేసు నమోదు చేశామని చెప్పారు. వృద్ధురాలి మెడలోని బంగారు గొలుసు చోరీతిరుమలాయపాలెం: ఓ వృద్ధురాలి ఇంట్లోకి గుర్తుతెలియని దుండగులు చొరబడి బంగారు గొలుసు ఎత్తుకెళ్లిన ఘటన మండలంలోని దమ్మాయిగూడెంలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. అందరూ దుర్గామాత నిమజ్జనం హడావిడిగా ఉండగా.. గ్రామానికి చెందిన గోకినపల్లి లచ్చమ్మ అనే మహిళ ఇంట్లో ఒంటరిగా ఉంది. ఈ విషయం గమనించిన గుర్తుతెలియని వ్యక్తులు ఆమె ఇంట్లోకి చొరబడి పెప్పర్ స్ప్రే ముఖానికి కొట్టి, లైట్ ఆఫ్ చేసి మెడలో ఉన్న రెండు తులాల బంగారు గొలుసు ఎత్తుకెళ్లారు. గ్రామస్తులు సమాచారం అందించడంతో పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు. పాఠశాలలో వంట పాత్రలు చోరీ జూలూరుపాడు: జూలూరుపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వంట పాత్రలను చోరీ చేసిన సంఘటన శనివారం వెలుగుచూసింది. దసరా సెలవుల అనంత రంపాఠశాలలను శనివారం తిరిగి ప్రారంభించారు. విద్యార్థులకు మధ్యాహ్న భోజ నం సిద్ధం చేసేందుకు సిద్ధమవుతుండగా కొన్ని వంట పాత్రలు చోరీకి గురైనట్లు గుర్తించారు. పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు హెచ్ఎం లక్ష్మీనరసయ్య తెలిపారు. పిడుగుపాటుతో ముగ్గురికి తీవ్ర గాయాలుజూలూరుపాడు: పిడుగుపాటుతో ముగ్గురికి తీవ్ర గాయాలైన సంఘటన మండలంలోని రాంపురం తండాలో శనివారం జరిగింది. తండాకు చెందిన కొర్ర కవిత, ఆమె పదేళ్ల కుమారుడు సంతోష్, తోడి కోడలు జానులు పత్తి చేలోకి కోతులు రాకుండా కాపలా వెళ్లారు. సాయంత్రం ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం వచ్చింది. పిడుగుపడటంతో ముగ్గురికీ తీవ్ర గాయాలయ్యాయి. వరద ఉధృతి ఎక్కువగా ఉండటంతో బాధితులను ట్రాక్టర్ సాయంతో వాగు దాటించి, కుటుంబీకులు ఆస్పత్రికి తరలించారు. విద్యార్థి మృతదేహం లభ్యంసుజాతనగర్: బహిర్భూమికి వెళ్లి సాగర్ కాల్వలో పడి గల్లంతైన విద్యార్థి లోహిత్ హర్ష(15) మృతదేహం ఏన్కూరు పోలీసులకు శనివారం ఉదయం లభ్యమైంది. సుజాతనగర్కు చెందిన బొమ్మనబోయిన లోహిత్ హర్ష శుక్రవారం సాయంత్రం ఏన్కూరు మండలం రాజలింగాలకు సమీపంలోని సాగర్ కాల్వలో గల్లంతైన విషయం విదితమే. దీంతో ఏన్కూరు పోలీసులు, రెస్క్యూ టీం ఆధ్వర్యంలో గాలింపు చేపట్టగా శనివారం ఉదయం మృతదేహం లభ్యమయింది. మృతదేహానికి ఖమ్మంలో పోస్టుమార్టం నిర్వహించి, అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సుజాతనగర్లో మృతదేహాన్ని సందర్శించి సంతాపం తెలిపారు. కుటుంబసభ్యులను ఓదార్చారు. బాలుడి మృతితో గ్రామంలో విషాదం నెలకొంది. -
కోతులు, కుక్కలను తరిమినోళ్లకే..
ఓటేస్తామంటున్న పల్లె ఓటర్లు ● గ్రామాల్లో శునకాలు, వానరాల బెడద తీవ్రం ● నిత్యం పదుల సంఖ్యలో దాడి ఘటనలు ● పంటల చేలను నాశనం చేస్తున్న కోతులు బూర్గంపాడు: సాధారణంగా ఎన్నికలు వస్తే రోడ్లు, డ్రెయినేజీలు, ఇళ్లు లేవని, పింఛన్లు రాలేదని పోటీ చేసే అభ్యర్థులను ఓటర్లు డిమాండ్ చేస్తుంటారు. అభ్యర్థులు కూడా వాటిపైనే హామీలిస్తుంటారు. కానీ ఈసారి పరిస్థితి మారింది. స్థానిక ఎన్నికల్లో గ్రామాల్లో కోతులు, కుక్కల నివారణే ప్రధాన ఏజెండాగా మారనుంది. పాతికేళ్లుగా గ్రామాల్లో కోతుల బెడద పెరుగుతోంది. అదేస్థాయిలో కుక్కలు కూడా పెరిగిపోయాయి. కోతులు, కుక్కల దాడుల్లో పలువురు గాయపడుతున్నారు. జనాలు ఇళ్లలోంచి బయటకు రావాలంటే భయపడుతున్నారు. కోతులు, కుక్కల బెడదను నివారించే అభ్యర్థులకే ఓటేస్తామనే డిమాండ్ ఓటర్ల నుంచి వస్తోంది. పంట చేలల్లోనూ కిష్కింధకాండ రాష్ట్రంలో అటవీ ప్రాంతంగా పేరున్న జిల్లాలో పోడు సాగు ప్రభావంతో కోతులు గ్రామాల వైపు మళ్లాయి. పట్టణాల్లో కూడా కోతుల బెడద తీవ్రంగానే ఉంది. ఇళ్లను చిందరవందర చేయటంతోపాటు పిల్లలను, మహిళలను, వృద్ధులపై దాడిచేసి గాయపరుస్తున్నాయి. చేతులలో ఏదైనా కవర్ కనిపిస్తే చాలు ఎగబడి దాడిచేసి లాక్కుపోతున్నాయి. ఇంటి పెరళ్లలో కూరగాయ, పూలమొక్కలు వేసుకునే పరిస్థితులు లేవు. జిల్లాలో రోజూ కనీసం నాలుగైదు చోట్ల కోతుల దాడులలో ప్రజలు గాయపడుతున్నారు. ఇక పంటచేలను కోతుల మందలు నాశనం చేస్తున్నాయి. పత్తి కాయలను కొరికి పడేస్తున్నాయి. వరికంకులను విరిచేస్తున్నాయి. పంటలను కాపాడుకునేందుకు కాపలా మనుషులను పెట్టుకోవాల్సివస్తోంది. అభ్యర్థులు ఏమి చెబుతారో.. ప్రస్తుతం ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులను బరిలోకి దింపేందుకు ముమ్మర కసరత్తు చేస్తున్నారు. ఓటర్లు మాత్రం ఈసారి స్థానిక ఎన్నికలలో కోతులు, కుక్కల నివారణ కోసం ఏమి చేస్తారని అఽభ్యర్థులను నిలదీసే పరిస్థితులున్నాయి. కొన్నిచోట్ల ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులు లిఖితపూర్వకంగా కోతులను, కుక్కలను తరిమేస్తామనే హామీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. మరికొన్ని చోట్ల ముందస్తుగా కోతులు, కుక్కలు తరిమించే చర్యలు చేపట్టిన వారిని ఏకగ్రీవంగా గెలిపిస్తామని ఓటర్లు చర్చించుకుంటున్నారు. గ్రామాల్లో వీధి కుక్కలు కూడా విపరీతంగా పెరిగిపోయాయి. ఇళ్ల నుంచి బయటకు రావాలంటే రక్షణగా చేతిలో కర్ర తెచ్చకోవాల్సి వస్తోంది. పదేళ్లుగా కుక్కల నివారణ చర్యలు చేపట్టడంలేదు. దీంతో కుక్కల దాడిలో పలువురు గాయాలపాలవుతున్నారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో రోజూ 20కుపైగా కుక్క కాటు కేసులు నమోదవుతున్నాయి. పలువురు రేబిస్ వ్యాధి బారిన పడుతున్నారు. ఇటీవల పినపాక మండలంలో ఓ వ్యక్తి కుక్కకాటుతో రేబిస్ సోకి మృతి చెందాడు. ఈ నేపథ్యంలో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. కుక్కలు, కోతుల నివారణ చర్యలు తీసుకోవాలని ఏళ్ల తరబడి ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. కొన్నిసార్లు అక్కడక్కడా కోతులను పట్టించే కార్యక్రమాలు చేపట్టారు. అవి కూడా తాత్కాలిక ఉపశమనమే తప్ప శాశ్వత పరిష్కారం చూపలేదు. -
రామయ్యకు సువర్ణ తులసీ అర్చన
భద్రాచలం: శ్రీసీతారామ చంద్రస్వామివారి దేవస్థానంలోని స్వామివారి మూలమూర్తులకు శనివారం సువర్ణ తులసీ అర్చన పూజలు చేశా రు. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాతసేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు నిర్వహించారు. అనంతరం మేళతాళాల నడుమ గర్భగుడి నుంచి ఊరేగింపుగా తీసుకొచ్చి బేడా మండపంలో కొలువుదీర్చారు. విశ్వక్సేన పూజ, పుణ్యావా చనం, అనంతరం కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్ర ధారణ గావించి కల్యాణాన్ని శాస్త్రోక్తంగా జరి పారు. వారాంతపు సెలవు దినాలు కావడంతో నిత్యకల్యాణంలో, ఆర్జిత సేవల్లో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలను స్వీకరించారు. కొనసాగుతున్న నిమజ్జనంభద్రాచలంటౌన్: భద్రాచలం గోదావరి తీరంలోని ఏర్పాటు చేసిన నిమజ్జన ఘాట్కు వరుసగా మూడో రోజు శనివారం భారీగా దుర్గామాత విగ్రహాలు నిమజ్జనానికి తరలిచ్చాయి. శరన్నవరాత్రుల సందర్భంగా పూజలు చేసిన భక్తులు రాష్ట్ర నలుమూలల నుంచి అమ్మవారి ప్రతిమలను నిమజ్జనానికి తీసుకొచ్చారు. విగ్రహాలను భారీ క్రేన్ల సహాయంతో వాహనాల నుంచి దించి లాంచీల ద్వారా గజ ఈతగాళ్లు నదిలో నిమజ్జనం చేస్తున్నారు. గోదావరిలో వరద ఉధృతి ఉండటంతో భక్తులను నిమజ్జన ఘాట్ వద్దకు అనుమతించడంలేదు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పర్యవేక్షిస్తున్నారు. తప్పిపోయిన వ్యక్తి కుటుంబ సభ్యుల చెంతకుబోనకల్: మండలంలోని గోవిందాపురం(ఏ) గ్రామంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తిని గ్రామస్తులు శనివారం పోలీస్స్టేషన్లో అప్పగించారు. అత డు అశ్వారావుపేట మండలం బండలగుంపు గ్రామానికి చెందిన సోడెం జోగారావుగా గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా వారు తీసుకెళ్లారు. గతనెల 26న ములకలపల్లిలో తప్పిపోయినట్లు గా కుటుంబసభ్యులు తెలిపారు. ఏడాది క్రితం రోడ్డు ప్రమాదంలో తలకు బలమైన గాయమైందని, దీంతో మతిస్థిమితం సక్రమంగా ఉండడం లే దన్నారు. -
ప్రమోద్ విజయం.. యువతకు స్ఫూర్తి
సత్తుపల్లిటౌన్: గ్రూప్ –1 పరీక్షల్లో మెడికల్ అండ్ హెల్త్ అడ్మినిస్ట్రేటివ్ అధికారిగా ఎంపికై న ప్రమోద్ సాయిని శనివారం సత్తుపల్లి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా సృజన సాహితీ సమాఖ్య నిర్వాహకులు మాట్లాడుతూ.. ప్రమోద్ సాధించిన విజయం నేటి తరానికి స్ఫూర్తిని కలిగిస్తుందని అన్నారు. అనంతరం ప్రమోద్ను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో సమాఖ్య అధ్యక్ష, కార్యదర్శులు గట్టే వాసు, జి.రామకృష్ణ, నిర్వాహకులు మధుసూదన్రాజు, పసుపులేటి నాగేశ్వరరావు, సత్యనారాయణ, నర్సింహారావు, అవినాష్, సంతోష్, ఆషా స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్ రామిశెట్టి శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
సాగుతున్న సమ్మె
● దసరా సెలవుల అనంతరం రేపు తెరుచుకోనున్న హాస్టళ్లు, ఆశ్రమ పాఠశాలలు ● ఆందోళన బాటలో కుక్లు, వర్కర్లు ● విద్యార్థులకు తప్పని ఇక్కట్లు ఖమ్మంమయూరిసెంటర్: తమ సమస్యలు పరి ష్కరించాలంటూ గిరిజన సంక్షేమ శాఖ వసతిగృహాల్లో పనిచేస్తున్న రోజువారీ, ఔట్సోర్సింగ్ కార్మి కులు చేపట్టిన సమ్మె కొనసాగుతోంది. పెండింగ్ వేతనాలు విడుదలైనా, ప్రధాన సమస్యల పరి ష్కారం కోసం పోరాటం కొనసాగిస్తామని కార్మి కులు ప్రకటించారు. వేతన బకాయిలు తాత్కాలిక ఉపశమనం మాత్రమేనని, తమ డిమాండ్లు నెరవేరే వరకు విధులు బహిష్కరిస్తామని తేల్చిచెబు తున్నారు. దీంతో జిల్లాలోని గిరిజన సంక్షేమ వసతిగృహాలు, ఆశ్రమ పాఠశాలల్లో వంటచేసే వర్క ర్లు లేక విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దసరా సెలవులతో దాదాపు 15 రోజుల పాటు హాస్టళ్లు మూతపడి ఉండడంతో ఈ సమ స్య పెద్దగా కనిపించకపోయినా.. సెలవుల అనంతరం కార్మికుల సమ్మె ప్రభావం అధికంగా ఉంటుందని అధికారులు చెబుతుండడం గమనార్హం. ఎప్పుడూ లేని విధంగా.. గతంలో వేతనాలు, సమస్యల పరిష్కారం కోసం కార్మికులు సమ్మె చేసినా అది నాలుగైదు రోజుల్లోనే ముగిసేది. కానీ ఈసారి కార్మికులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ సమ్మెను ఉధృతంగా కొనసాగిస్తున్నారు. ఇటీవల ఖమ్మంలో మంత్రుల క్యాంపు కార్యాలయాల వద్ద ధర్నాలు చేపట్టగా.. రాష్ట్ర అధికారులు 6 నెలల పెండింగ్ వేతనాలు విడుదల చేశారు. అయితే పెండింగ్ వేతనాలే కాదని, పనికి తగిన వేతనం ఇవ్వాలని, జీతాలు తగ్గిస్తూ తీసుకొచ్చిన జీఓలను రద్దు చేయాలని తదితర డిమాండ్లతో సమ్మె కొనసాగిస్తున్నారు. కార్మికుల సమ్మెకు కార్మిక, విద్యార్థి సంఘాలు మద్దతు తెలపడంతో.. కనీస సమస్యలు పరిష్కారం అయ్యేవరకై నా పోరు కొనసాగించాలని నిర్ణయించినట్లు తెలిసింది. ప్రభుత్వ స్పందనపై నిరీక్షణ.. పెండింగ్ వేతనాలు విడుదలైన నేపథ్యంలో, ప్రభుత్వం మిగిలిన డిమాండ్ల పరిష్కారంపై ఎంతవరకు దృష్టి సారిస్తుందనే దానిపై కార్మికులు, విద్యార్థులు నిరీక్షిస్తున్నారు. వేతన బకాయిల విడుదల కొంత సానుకూల పరిణామమైనా, కార్మికులు తమ భవిష్యత్కు భద్రత కోరుకుంటున్నారు. సమస్యల పరిష్కరించేలా ఉన్నతాధికారులు జోక్యం చేసుకోవాలని కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. వారిపై ఒత్తిడి.. జిల్లాలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలు, వసతిగృహాల్లో పని చేసే డెయిలీ వేజ్ వర్కర్లు 77 మంది, ఔట్ సోర్సింగ్ వర్కర్లు 45 మంది సమ్మె చేస్తున్నారు. వీరంతా సమ్మెలోకి వెళ్లిన రోజు నుంచి అక్కడ వారు చేసే పనుల కోసం రోజు వారీ కూలీలను ఏర్పాటు చేసుకోవాలని ఉన్నతాధికారులు వసతిగృహ సంక్షేమ అధికారులకు సూచించారు. ఇంత వరకూ బాగానే ఉన్నా.. అడ్డాపై పని చేసే కూలీలు రోజువారీ కూలీ రూ.600 నుంచి రూ.1,000 వరకు డిమాండ్ చేస్తుండడంతో వార్డెన్లు ఆందోళన చెందుతున్నారు. అసలే బిల్లులు రాక ఇబ్బందులు పడుతుంటే ఇప్పుడు రోజు వారీ వేతనాలు చెల్లించి కూలీలను ఎక్కడి నుంచి తీసుకురావాలని మథనపడుతున్నారు. వసతిగృహాల్లో విద్యార్థులకు వంట చేసి పెట్టడం, అధికారులు ఆదేశాలను పాటించడంలో కొంతమంది వార్డెన్లు ఒత్తిడికు లోనవుతున్నారనే చర్చ జరుగుతోంది.ఎన్నో ఏళ్లుగా వసతిగృహాల్లో పని చేస్తున్న మాకు కనీస వేతనాలు ఇవ్వడం లేదు. ఇచ్చే జీతమే తక్కువైనా అవి కూడా నెలనెలా ఇవ్వడం లేదు. నాలుగు డిమాండ్లతో మేం ఐక్యంగా సమ్మె చేస్తున్నాం. అవి పరిష్కరించే వరకు సమ్మె కొనసాగిస్తాం. – బాదావత్ లక్ష్మా, కార్మికుల సంఘం జిల్లా కార్యదర్శి -
రైతులకు మద్దతు ధర అందాలి
ఖమ్మంవ్యవసాయం: పంటలకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర రైతులకు అందేలా చర్యలు చేపట్టాలని అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో శనివా రం.. ధాన్యం కొనుగోళ్లు, సీసీఐ పత్తి కొనుగోళ్లపై అధికారులకు నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పంటల కొనుగోళ్లకు పటిష్ట కార్యాచరణ అమలు చేయాలని సూచించారు. వానాకాలం వరిసాగు ఆధారంగా 2.60 లక్షల మెట్రిక్ టన్నుల సన్నధాన్యం, 40 వేల మెట్రిక్ టన్నుల దొడ్డు ధాన్యం కొనుగోలు చేయాలనేది లక్ష్యమని తెలిపారు. ధాన్యం కొనుగోళ్లతో పాటు 3 నుంచి 4 నెలల పాటు మిల్లింగ్ చేయాల్సిన అవస రం ఉందన్నారు. తూర్పారబట్టిన తర్వాతే ధాన్యం కొనుగోలు చేయాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన యంత్రాలు అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. ప్రతీ క్లస్టర్ పరిధిలోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని ఏఈఓ లు సర్టిఫై చేయాలన్నారు. అవసరమైన మేరకు తేమ యంత్రాలు, టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని సూచించారు. పత్తి కొనుగోలు సులభతరం చేసేందుకు ‘కపాస్ కిసాన్’ యాప్పై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. మార్కెటింగ్ శాఖ డిప్యూ టీ డైరెక్టర్ పద్మావతి మాట్లాడుతూ.. పత్తి ధర పడిపోతున్న నేపథ్యాన కనీస మద్దతు ధర రైతులకు దక్కేలా సీసీఐ ద్వారా కొనుగోలు చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేశామని తెలిపారు. తేమశాతం ఆధారంగా పంట కొనుగోలు ఉంటుందని, 8శాతం తేమ ఉన్న పత్తికి క్వింటాకు రూ. 8,110 ధర ఉంటుందని తెలిపారు. తేమశాతం పెరుగుతుంటే ధరలో తేడా ఉంటుందని, ఈ విషయమై అధికారులు రైతులకు అవగాహన కల్పించాలని కోరారు. సమావేశంలో డీఏఓ ధనసరి పుల్లయ్య, డీఎంఓ ఎంఏ అలీం, పౌరసరఫరాల జిల్లా మేనేజర్ శ్రీలత పాల్గొన్నారు. -
ఆయిల్పామ్తో స్థిర ఆదాయం
దమ్మపేట: ఆయిల్పామ్ సాగుతో రైతులు స్థిర ఆదాయం పొందుతున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. శనివా రం మండల పరిధిలోని లింగాలపల్లి శివారు వ్యవసాయ క్షేత్రంలో ఆయిల్పామ్ రైతుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సమ్మేళనానికి మంత్రితోపాటు ఆయిల్ ఫెడ్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి, అశ్వారావుపేట, కొత్తగూడెం ఎమ్మెల్యేలు జారే ఆది నారాయణ, కూనంనేని సాంబశివరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కల్లూరుగూడెం పామాయిల్ ఫ్యాక్టరీ నిర్మాణం పూర్తయ్యాక అశ్వారావుపేటలో మరో ఫ్యాక్టరీ నిర్మి స్తామని తెలిపారు. ఆయిల్పామ్ సాగులో రసాయన ఎరువుల వాడకం తగ్గించాలని, అంతర పంటల సాగు పరిశీలనకు ఆయిల్ ఫెడ్ ద్వారా రైతుల ను పక్క రాష్ట్రాలకు తీసుకెళ్లే ఏర్పాటు చేస్తామన్నా రు. ఫ్యాక్టరీలకు గెలలు పోటెత్తిన సందర్భాల్లో జాప్యం చేయకుండా చర్యలు తీసుకుంటామన్నా రు. పామాయిల్ మొక్కలు నాటే ప్రక్రియను ఉపాధి హామీ పథకానికి అనుసంధానం చేస్తామని తెలి పారు. భూ ధ్రువ పత్రాలతో సంబంధం లేకుండా సాగుచేసే ప్రతీ రైతుకు ఆయిల్పామ్ మొక్కలను ఉచితంగా అందజేస్తామని అన్నారు. తప్పులను సరిదిద్దుతున్నాం గతంలో ఆయిల్ ఫెడ్లో జరిగిన తప్పులను సరిదిద్దుతున్నామని ఆయిల్ ఫెడ్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి అన్నారు. ఆఫ్ టైప్, నాణ్యతలేని మొక్కలను తొలగించి కొత్త మొక్కలను నాటుతామని తెలిపారు. అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారా యణ మాట్లాడుతూ ఫ్యాక్టరీల ఏర్పాటుతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆయిల్పామ్ సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగిందన్నారు. కొత్తగూడెం ఎమ్మె ల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ రాష్ట్రంలో సాగవుతున్న వరి పంట విస్తీర్ణానికి సమానంగా పామాయిల్ సాగయ్యేలా మంత్రి తుమ్మల కృషి చేస్తున్నారని అన్నారు. మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఆదివాసీలకు ప్రత్యేక రాయితీలు ప్రకటించాలని కోరారు. కార్యక్రమంలో ఖమ్మం డీసీసీబీ చైర్మన్ దొండపాటి వెంకటేశ్వరరావు, ఆత్మ కమిటీ చైర్మన్ సుంకవల్లి వీరభద్రరావు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వాసం రాణి, అలపాటి ప్రసాద్, చల్లగుళ్ల కృష్ణయ్య, చల్ల గుళ్ల నరసింహారావు, కందిమళ్ల కృష్ణారావు, బండి భాస్కర్, మొగళ్ల చెన్నకేశవరావు, కొయ్యల అచ్యుతరావు, పైడి వెంకటేశ్వరరావు, కాసాని నాగప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
ఎన్నికల విధులు పకడ్బందీగా నిర్వహించాలి
● నామినేషన్ల స్వీకరణకు మండలాల్లో ఏర్పాట్లుచేయాలి ● స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ శ్రీజఖమ్మం సహకారనగర్ : స్థానిక సంస్థల ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించేందుకు సిద్ధం కావాలని అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ అన్నారు. కలెక్టరేట్ నుంచి మండల ప్రత్యేకాధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీఓలతో శనివారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆమె మాట్లాడారు. స్థానిక ఎన్నికల నామినేషన్ల స్వీకరణకు ఎంపీడీఓ కార్యాలయాల్లో ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఎన్నికల విధుల పట్ల అధికారులు సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలన్నారు. ఈనెల 6న మొదటి దశ ర్యాండమైజేషన్ తర్వాత విధులు కేటాయించనున్నట్లు తెలిపారు. ఎన్నికల విధులు నిర్వహించే అధికారులకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు కల్పించాలని అన్నారు. నామినేషన్ కేంద్రాలకు 100 మీటర్ల పరిధిలో ఎలాంటి ర్యాలీలు, ప్రచారాలు నిర్వహించొద్దని, అభ్యర్థితో పాటు ముగ్గురిని మాత్రమే లోపలికి అనుమతిస్తామని తెలిపారు. ఎన్నికల్లో ప్రలోభాలకు గురి చేసేందుకు అక్రమంగా నగదు, మద్యం తరలిస్తే సీజ్ చేస్తామన్నారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ దీక్షారైనా, డీఆర్డీఓ సన్యాసయ్య, డీపీఓ ఆశాలత, అదనపు డీఆర్డీఓ జయశ్రీ, హౌసింగ్ పీడీ భూక్యా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల ఏర్పాట్ల పరిశీలన.. తిరుమలాయపాలెం/ముదిగొండ/నేలకొండపల్లి : స్థానిక సంస్థల ఏర్పాట్లను అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ శనివారం పరిశీలించారు. శనివారం ఆమె తిరుమలాయపాలెం, ముదిగొండ, నేలకొండపల్లి ఎంపీడీఓ కార్యాలయాలను తనిఖీ చేశారు. నామినేషన్ పత్రాలు, పోస్టల్ బ్యాలెట్ కవర్లు తదితర సామగ్రిని చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. ఎన్నికల సామగ్రి అందుబాటులో ఉంచుకోవాలని, ఎలాంటి వివాదాలకు తావు లేకుండా సజావుగా సాగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. నామినేషన్ల స్వీకరణ వివరాలు, వసతులు గురించి అడిగి తెలుసుకున్నారు. ఎవరైనా ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీడీఓలు సిలార్సాహెబ్, శ్రీధర్స్వామి, ఎం.ఎర్రయ్య, అధికారులు శారదాదేవి, బి.చలపతిరావు, ఏఈ ప్రసాద్, భాస్కర్రావు, సిబ్బంది శ్రీనివాస్, మీరా తదితరులు పాల్గొన్నారు -
పర్యావరణ హితం
ప్రకృతి సేద్యం..ఖమ్మంవ్యవసాయం: రసాయన ఎరువులు, పురుగుమందుల వాడకాన్ని తగ్గించి, పర్యావరణ హితమైన సహజ వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ‘ప్రకృతి సేద్యం’ పథకానికి శ్రీకారం చుట్టింది. రసాయన రహిత సాగు వైపునకు రైతులను మళ్లించి ఆరోగ్యవంతమైన ఆహారోత్పత్తులను అందించడం ఈ పథకం లక్ష్యం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అమలు చేస్తున్న ఈ పథకాన్ని రాష్ట్రంలో ‘నేచురల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్’(ప్రకృతి వ్యవసాయ మిషన్) పేరిట అమలు చేస్తున్నారు. ఈ క్రమంలో బయో రిసోర్స్ కేంద్రాలను కూడా ఏర్పాటుచేస్తారు. జిల్లాలో ఇప్పటికే కొందరు రైతులు సేంద్రియ వ్యవసాయం చేస్తూ సత్ఫలితాలు సాధిస్తున్నారు. జిల్లాలోని పలువురు రైతులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, వివిధ సంస్థల నుంచి అవార్డులు కూడా అందుకున్నారు. యాసంగి నుంచి అమలు.. ప్రకృతి సేద్యం పథకాన్ని జిల్లాలో యాసంగి సీజన్ నుంచి అమలు చేసేందుకు వ్యవసాయ శాఖ ప్రణాళికలు రూపొందించింది. వ్యవసాయ శాఖ, కృషి విజ్ఞాన కేంద్రం సంయుక్తంగా నేచురల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్ పథకాన్ని నిర్వహిస్తాయి. రసాయనాలు లేని పంటల సాగే లక్ష్యంగా ఈ పథకం ప్రారంభమైంది. ఈ నెల నుంచి యాసంగి పంటల సీజన్ ప్రారంభమవుతున్న వేళ జిల్లాలో రూపొందించిన ప్రకృతి సేద్యం పథకాన్ని అమలు చేసేందుకు అధికారులు కార్యాచరణ సిద్ధం చేశారు. కేంద్ర, రాష్ట్రం నుంచి నిధులు.. ప్రకృతి సేద్యం పథకాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండేళ్ల పాటు సంయుక్తంగా నిర్వహించేలా ప్రణాళిక రూపొందించారు. ఈ పథకం అమలుకు కేంద్రం 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం నిధులను ఖర్చు చేస్తుంది. ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కార్యక్రమాలు, వివిధ రకాల ప్రోత్సాహకాలు అందించేందుకు ఈ నిధులు వినియోగిస్తారు. పంటల సాగులో పెట్టుబడి భారాన్ని తగ్గించి, దిగుబడి పెంచే పద్ధతులను ప్రోత్సహించనున్నారు. పరీక్షలు పూర్తి ప్రకృతి సేద్యం పథకం కింద ఎంపిక చేసిన క్లస్టర్లలో పంటలు సాగు చేసే భూముల్లో మట్టి నమూనాలను సేకరించి భూసార పరీక్షలు చేయించారు. తద్వారా ప్రకృతి సేద్యం చేసే భూముల్లో ఉన్న పోషకాలు, వివిధ పంటలకు అవసరాలు అనే అంశాలపై అధ్యయనం చేసి పోషక లోపాల సవరణలకు కూడా చర్యలు చేపట్టనున్నారు.జిల్లాలో ‘నేచరల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్’ పథకానికి 15 మండలాలను ఎంపిక చేశారు. కామేపల్లి, ఖమ్మం అర్బన్, ఖమ్మం రూరల్, కూసుమంచి, నేలకొండపల్లి, ముదిగొండ, చింతకాని, మధిర, ఎర్రుపాలెం, వైరా, కొణిజర్ల, ఏన్కూరు, కల్లూరు, సత్తుపల్లి, వేంసూరు మండలాలను ఎంపిక చేయగా.. ఒక్కో మండలం నుంచి ఒకటి, రెండు గ్రామాలను క్లస్టర్గా గుర్తించారు. వాటి పరిధిలో 125 మంది రైతులు, 125 ఎకరాల చొప్పున ఎంపిక చేయగా, 15 మండలాల్లో 1,875 మంది రైతులు, 1,875 ఎకరాల భూమిని సేద్యం చేసేలా కార్యాచరణ రూపొందించారు. స్మార్ట్ఫోన్ ఉన్న రైతులనే ఈ పథకానికి ఎంపిక చేశారు. అంతేగాక విషయ పరిజ్ఞానాన్ని సహచర రైతులకు పరిచయం చేయగలిగే వారికి ప్రాధాన్యం ఇచ్చారు. క్లస్టర్ల వారీగా మండలానికి ఇద్దరు చొప్పున 30 మంది సీఆర్పీలను ఎంపిక చేయగా, వారికి గౌరవ వేతనం అందించనున్నారు. జిల్లాలో ఎంపిక చేసిన సీఆర్పీలకు ఇప్పటికే కేవీకే శాస్త్రవేత్తలు హైదరాబాద్లో ఐదు రోజుల పాటు శిక్షణ ఇప్పించారు.జిల్లాలో యాసంగి సీజన్ నుంచి పథకం అమలు నేచురల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్ పేరిట రూపొందిన ప్రకృతి సేద్యం పథకం ఎంతో ప్రయోజనకరమైంది. రసాయన రహిత వ్యవసాయం లక్ష్యంగా ఈ పథకాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అమలు చేస్తున్నాయి. జిల్లా రైతులకు ప్రకృతి వ్యవసాయంపై అవగాహన పెరుగుతుంది. ఇప్పటికే పలువురు రైతులు సహజ వ్యవసాయం చేస్తూ ఫలితాలు సాధిస్తున్నారు. యాసంగి సీజన్ నుంచి జిల్లాలో పథకం అమలుకు చర్యలు చేపట్టాం. – ధనసరి పుల్లయ్య, జిల్లా వ్యవసాయాధికారి -
శ్రీ వేంకటేశ్వరస్వామి వారికి ప్రత్యేక పూజలు
ఎర్రుపాలెం: తెలంగాణ తిరుపతిగా ప్రసిద్ధి గాంచిన జమలాపురం శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో స్వామివారికి శనివారం ప్రత్యేక పూజలు చేశారు. శ్రీవారి పాదానికి, శ్రీ స్వామివారి విగ్రహానికి వేదమంత్రాల నడుమ శాస్త్రోక్తంగా పంచామృతాభిషేకం గావించారు. శ్రీవారిని, శ్రీ అలివేలు మంగ, శ్రీ పద్మావతి అమ్మవార్లను సుందరంగా అలంకరించి నిత్య కల్యాణ వేడుకను ఘనంగా నిర్వహించగా భక్తులు కనులపండువగా తిలకించారు. ఆ తర్వాత శ్రీవారికి పల్లకీ సేవ చేశారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల భక్తులు శ్రీవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ ప్రాంగణంలో శ్రీ వేంకటేశ్వర అన్నదాన సేవా సమితి నిర్వాహకులు బొబ్బొ కృష్ణప్రసాద్, ఎల్వీ నారాయణరెడ్డి, కాకుమాను లీలాకృష్ణ, ఇమ్మడి ఈశ్వర్చంద్ర విద్యాసాగర్, చొప్పవరపు శ్రీనివాసరావు, గిరిజాలక్ష్మి, తదితరులు 500 మంది భక్తులకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ కొత్తూరి జగన్మోహన్రావు, వ్యవస్థాపక దర్మకర్త ఉప్పల శ్రీరామచంద్రమూర్తి, ప్రధానార్చకులు ఉప్పల శ్రీనివాసశర్మ తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో నేడు మంత్రి పొంగులేటి పర్యటనఖమ్మంమయూరిసెంటర్ : రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదివారం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు ఆయన పర్యటన ప్రారంభం కానుండగా ఖమ్మం నగరంతో పాటు కూసుమంచి, మధిర, వేంసూరు మండలాల్లో కొనసాగుతుంది. ఆయా మండలాల్లో పలు ప్రైవేటు కార్యక్రమాల్లో పాల్గొంటారు. ‘రేషన్’ పక్కదారి పడితే సహించంకారేపల్లి: రేషన్ బియ్యం పక్కదారి పడితే సహించేది లేదని, అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ బియ్యం చేరాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని జిల్లా సివిల్ సప్లయీస్ అధికారి (డీఎస్ఓ) చందన్కుమార్ అన్నారు. కారేపల్లిలోని సింగరేణి –1, 2 రేషన్ దుకాణాలను శనివారం ఆయన తనిఖీ చేశారు. రేషన్ దుకాణాల ఎదుట బోర్డు ఏర్పాటు చేసి సరుకుల నిల్వ వివరాలను పొందుపరచాలని, నిర్దేశిత సమయంలో లబ్ధిదారులకు సన్నబియ్యం అందించాలని డీలర్లకు సూచించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఫ్లెక్సీలు లేకుండా చూడాలన్నారు. రేపు అండర్ –19 టీటీ ఎంపికలుఖమ్మం స్పోర్ట్స్ : ఉమ్మడి జిల్లాస్థాయి అండర్– 19 బాలబాలికల టేబుల్ టెన్నిస్ జట్ల ఎంపికలు ఈనెల 6న ఉదయం 9 గంటలకు ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో నిర్వహిస్తున్నట్లు క్రీడల సంఘం కార్యదర్శి ఎం.డి.మూసాకలీం శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 7వ తేదీన బాలబాలికల కబడ్డీ జట్లను ఎంపిక చేస్తామని పేర్కొన్నారు. 6వ తరగతి నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు చదువుతున్న వారు పోటీలకు అర్హులని, ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, జూనియర్ కళాశాలల ప్రిన్సిపాళ్లు జారీ చేసిన స్టడీ సర్టిఫికెట్లు, ఆధార్ కార్డు జిరాక్స్ కాపీలతో హాజరు కావాలని సూచించారు. -
డ్యాన్స్ చేస్తూ.. అస్వస్థతకు గురై
బూర్గంపాడు: బతుకమ్మ నిమజ్జనంలో అపశృతి చోటుచేసుకుంది. లక్ష్మీపురం గ్రామంలో బతుకమ్మ నిమజ్జనానికి వెళ్తున్న క్రమంలో డ్యాన్స్ చేస్తూ అస్వస్థతకు గురైన యువకుడు మృతిచెందిన ఘటన గురువారం రాత్రి జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన యువకుడు గుండి రమేష్(30)బతుకమ్మ నిమజ్జనంలో డీజే పాటలకు డాన్స్ చేస్తూ అస్వస్థతకు గురయ్యాడు. గమనించిన మిగతావారు ఆస్పత్రికి తరలించేలోపే మృతిచెందాడు. రమేష్ గుండెపోటుతో మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. డీజే సౌండ్స్తోనే రమేష్ గుండెపోటుకు గురైనట్లు స్థానికంగా చర్చించుకుంటున్నారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదం అలుముకుంది.గుండెపోటుతో యువకుడి మృతి -
వన్య‘ప్రాణం’ తీయకండి!
పాల్వంచరూరల్: జంతు సంరక్షణకు చట్టాలు, సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చినా, అటవీశాఖ సిబ్బంది గస్తీ తిరుగుతున్నా, ట్రాప్ కెమెరాలు అమర్చినా జంతువులకు వేటగాళ్ల నుంచి రక్షణ కరువైంది. జిల్లాలోని కిన్నెరసాని అభయారణ్యంలో చుక్కల దుప్పులు, నెమళ్లు, కుందేళ్లు, కొండ గొర్రెలు, కణుజు, చిరుత పులులు, సాంబర్లు, ఎలుగుబంట్లు, అడవి దున్న వంటి వన్యప్రాణులు జీవిస్తున్నాయి. వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 ప్రకారం 1977 జనవరి 24న కిన్నెరసానిని అభయారణ్యంగా ప్రకటించారు. కానీ పలుమార్లు జంత వధ జరుగుతూనే ఉంది. జరిమానా, జైలు శిక్ష విధిస్తున్నా వన్యప్రాణులకు రక్షణలేకుండా పోయింది. అటవీశాఖ ఆధ్వర్యంలో ఈ నెల 2 నుంచి 10వ తేదీ వరకు వన్యప్రాణి సంరక్షణ వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. జిల్లాలోని వివిధ ఫారెస్ట్ డివిజన్ల ఆధ్వర్యంలో కూడా వారోత్సవాలు చేపడుతున్నారు. ప్రభుత్వ సెలవు దినాలు కాకుండా ఏడురోజులపాటు వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. నేడు ప్రపంచ జంతు దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం.. వన్యప్రాణులను హతమార్చిన ఘటనలు కొన్ని.. ● వన్యప్రాణులు వేటాగాళ్ల వేటుకు బలవుతూనే ఉన్నాయి. అటవీ ప్రాంతంలో విద్యుత్ ఉచ్చులు వేసి వధిస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 17న దమ్మపేట రేంజ్లో దుప్పిని వేటాడి చంపి మాంసాన్ని వండుతుండగా ఫారెస్ట్ అధికారులు పట్టుకుని నలుగురిపై కేసు నమోదు చేశారు. ● గతంలో కిన్నెరసాని డీర్ పార్కు సమీపంలోనే దుప్పిని కుక్కలతో వేటాడారు. పాల్వంచ మండలం సోములగూడెం రోడ్డులోని అటవీ ప్రాంతంలో దుప్పిని వధించి మాంసం విక్రయించారు. అటవీశాఖాధికారులు ఇద్దరు నిందితులను పట్టుకుని కేసు నమోదు చేశారు. ● దంతెలబోరు అటవీప్రాంతంలో అడవి పందిని చంపి మాంసాన్ని విక్రయించగా, అధికారులు పట్టుకున్నారు. ఏడుళ్లబయ్యారం అటవీప్రాంతంలో దుప్పిని బాణాలతో వేటాడి సంహరించారు. ములకలపల్లి, చండ్రుగొండ అటవీ ప్రాంతాల్లో కూడా వన్యప్రాణులను వధించిన సంఘటనలు ఉన్నాయి. ఇల్లెందు డివిజన్లో విద్యుత్ ఉచ్చులతో అడవి దున్నలను వధించారు. ● రెండున్నరేళ్ల క్రితం ఉల్వనూరు వద్ద ఎలుగుబంటిని వధించగా, ఐదుగురిపై కేసుమోదు చేశారు. రెండేళ్ల క్రితం అలుగును చంపి వాటి పెంకులను ఇతర రాష్ట్రాలకు విక్రయిస్తున్న ముఠాను అరెస్టు చేశారు. ఇలా ఏటా జిల్లా అటవీప్రాంతంలో వేటగాళ్లు వన్యప్రాణుల ఉసురు తీస్తున్నారు. అటవీ జంతువుల సంరక్షణకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. గతంతో పోలిస్తే వన్యప్రాణుల సంఖ్య పెరిగింది. ఈ నెల 2వ తేదీ నుంచి 10వ తేదీ వరకు అటవీ గ్రామాల్లో వన్యప్రాణుల సంరక్షణ వారోత్సవాలు నిర్వహిస్తున్నాం. ఈ సందర్భంగా విద్యార్థులకు వ్యాస రచన, చిత్రలేఖన పోటీలు వంటివి చేపడుతున్నాం. తొలిరోజు నాకా బందీ నిర్వహించాం. రాత్రి, పగలు వాహనాలను తనిఖీలు చేపట్టాం. –బి.బాబు, వైల్డ్లైఫ్ ఎఫ్డీఓ జంతువులను వధిస్తే 3 నుంచి 7 ఏళ్ల వరకు జైలు శిక్ష, రూ. 25 వేల నుంచి రూ. లక్ష జరిమానా విధించే అవకాశం ఉంది. వన్యమృగాల సంరక్షణ చట్టం 1972 ప్రకారం పులి, చిరుత, నెమలి, ఎలుగుబంటి, కుందేలు, పక్షులు, మొసళ్లు, అడవి దున్న, దుప్పి తదితర జంతువులను వధించడం నేరం. పులిని చంపినా, చర్మం, గోళ్లు తీసినా, ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి తరలించినా సెక్షన్ 51(ఎ) కింద 3 నుంచి ఏడేళ్ల వరకు జైలు శిక్ష, రూ. 25 వేల నుంచి రూ. లక్ష వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. ఏడాదిపాటు బెయిల్ కూడా లభించదు. చిరుతపులిని వధించినా ఇవే శిక్షలు విధిస్తారు. ఎలుగుబంటి చంపినా, పట్టుకున్నా, సర్కస్లో ఆడించినా 3 నెలల నుంచి ఏడాది వరకు జైలు శిక్ష, రూ. 20వేల నుంచి రూ. లక్ష వరకు జరిమానా విధిస్తారు. వేటాడినట్లు రుజువైతే సెక్షన్ 37(ఏ)కింద 3 నుంచి 7 ఏడేళ్ల వరకు జైలు శిక్ష విధించవచ్చు. కోతులను పట్టుకున్నా, చంపిన, ఇంట్లో పెంచుకున్నా, అది నివాసం ఉండే ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి తరలించినా 5 నుంచి7 నెలలపాటు జైలు శిక్ష, రూ.20 వేల వరకు జరిమాన విధించే అవకాశం ఉంది. కుందేళ్లను చంపినా, పట్టుకున్నా, ఇంట్లో పెంచుకున్నా మూడేళ్ల జైలుశిక్ష, రూ. లక్ష వరకు జరిమానా విధిస్తారు. నెమళ్లను పట్టుకున్నా, వధించినా, ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి తరలించినా, వాటి గుడ్లను పగులగొట్టిన, హాని చేసినా, వైల్డ్లైఫ్ చట్టం ప్రకారం ఏడేళ్ల జైలు శిక్ష, రూ. 25 నుంచి రూ. లక్ష వరకు జరిమాన విధించే అవకాశం ఉంది. పశువులను చంపినా, నిర్బంధించినా, సంతానం కలగకుండా చేసినా, తాళ్లు, గొలుసులతో బంధించి వాహనాల ద్వారా తరలించినా రూ. 25వేలకు పైగా జరిమానాతోపాటు జైలు శిక్ష కూడా విధిస్తారు. నేడు ప్రపంచ జంతు దినోత్సవం -
వాహన పూజకు ‘నకిలీ’ టికెట్లు?
పాల్వంచరూరల్: మండలంలోని పెద్దమ్మ తల్లి ఆలయం వద్ద వాహన పూజకు నకిలీ టికెట్లు విక్రయించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఎప్పటిలాగే దసరా పర్వదినం సందర్భంగా బుధవారం అర్ధరాత్రి నుంచి ఆలయానికి వేలాది వాహనాలు పూజ కోసం వచ్చాయి. వాహన పూజతో ఎండోమెంట్కు రూ.లక్షల్లో ఆదాయం వస్తుంది. ఇందుకోసం వాహనదారులు టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈసారి వాహన పూజ టికెట్ల విక్రయాలపై ఈఓ పర్యవేక్షణ కొరవడటంతో నకిలీ టికెట్లు వచ్చినట్లు వాహనదారులు ఆరోపించారు. టికెట్లపై ఈఓ, సంబంధిత క్లర్క్ సంతకాలు లేవు. రశీదుపై ఖమ్మం జిల్లా ఎండోమెంట్ శాఖ ముద్ర మాత్రమే ఉంది. పూజలు చేసిన తేదీ, వాహనదారులు చిరునామా వివరాలు కూడా నమోదు చేయలేదు. దేవాదాయశాఖ ఉద్యోగులు లేకుండా ప్రైవేట్ వ్యక్తులు నకిలీ రశీదులతో వేలాది రూపాయలను వాహనదారుల నుంచి వసూళ్లు చేశారు. వాహనాల పూజ టికెట్ల విషయంలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ జరిపి, సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని భక్తులు, వాహనదారులు కోరుతున్నారు. గాంధీ జయంతి రోజూ ఆగని జంతు బలి ఈ నెల 2న గాంధీ జయంతి. దీనికితోడు శ్రీదేవీ శరన్నవ రాత్రి మహోత్సవాల చివరి రోజు. దీంతో ఆలయం సముదాయంలో, పరిసర ప్రాంతాల్లో జంతుబలి నిషేధం అమలు చేయాలి. కానీ దసరా పండుగ అని ఆలయంలో మేకలు, గొర్రెలు, కోళ్లను యథేచ్ఛగా వధించారు. బెల్టుషాపుల ద్వారా మద్యం విక్రయాలు కూడా జోరుగా సాగాయి. ఆలయ ఈఓ, ఎకై ్సజ్శాఖ అధికారులు పట్టించుకోలేదు. జంతు బలిపై భక్తులు ఫిర్యాదు చేసినా ఈఓ స్పందించలేదని, జంతుబలిని పరోక్షంగా ప్రోత్సహించారనే విమర్శలు వ్యక్తవుతున్నాయి. ఈ వ్యవహారంపై పెద్దమ్మతల్లి ఆలయ ఈఓ ఎన్.రజినీకుమారిని వివరణ కోరగా.. టికెట్ల విక్రయాల్లో అవకతవకలు జరగలేదని తెలిపారు. పెద్దమ్మతల్లి ఆలయం వద్ద ప్రైవేటు వ్యక్తుల దందా -
రూ.3కోట్లు ‘హస్తార్పణం’
అశ్వారావుపేట: అధికార పార్టీ నాయకులకు లబ్ధి చేకూరేలా డిజైన్ చేసిన ఓ బీటీ రోడ్డు నిర్మాణం మూణ్ణాళ్ల ముచ్చటగానే నిలవగా స్థానికుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అశ్వారావుపేట మున్సిపాలిటీ పరిధి పేటమాలపల్లి నుంచి వ్యవసాయ క్షేత్రాల మీదుగా బోర్డర్ చెక్ పోస్టు వరకు మూడు కి.మీ. మార్గం ఉంది. ఆయిల్పామ్, కొబ్బరి, ఉద్యాన పంటలతో పచ్చగా కళకళలాడే వ్యవసాయ క్షేత్రాల మధ్య సాగే ఈ రోడ్డుపై ఎక్కడ గుంతలు ఉంటాయో.. ఎక్కడ రోడ్డు కోతకు గురైందో తెలియని పరిస్థితి నెలకొంది. కొందరు కాంగ్రెస్ నాయకులు ఈ రహదారిని నిర్మించగా.. వారు లాభాలు మాత్రమే చూసుకోవడంతో ఈ పరిస్థితి తలెత్తిందని రైతులు ఆరోపిస్తున్నారు. వ్యవసాయ, ఉద్యాన పంటల ఉత్తత్తులను వాహనాల్లో తరలించేందుకు గత పాలకులు రహదారి అవసరమని గుర్తించి ఐటీడీఏ నుంచి రూ.3కోట్లు కేటాయించారు. కానీ బినామీ కాంట్రాక్టర్ల తీరుతో రోడ్డు కొద్దికాలానికే దెబ్బతినడం.. అయినా అంతా బాగుందని సర్టిఫికెట్ ఇచ్చిన ఇంజనీర్ల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయాన్ని ఐటీడీఏ ఏఈఈ ప్రసాదరావు దృష్టికి తీసుకువెళ్లగా రహదారిని పూర్తి నాణ్యతా ప్రమాణాలతో పునర్మించే వరకు కాంట్రాక్టర్కు బిల్లు చెల్లించేది లేదని స్పష్టం చేశారు.రహదారి నిర్మాణంలో ఇష్టారాజ్యం -
దసరా వేడుకల్లో అపశృతులు
కల్లూరురూరల్: మండలంలోని కప్పలబంధంలో గురువారం రాత్రి దసరా సందర్భంగా బతుకమ్మ ఊరేగింపులో అపశృతి చోటు చేసుకుంది. ఈ ఘటనలో పండుగ కోసం స్వగ్రామానికి వచ్చిన ఉపాధ్యాయుడు మృతి చెందాడు. కప్పలబంధం గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు వేముల శ్రీనివాసరావు(48) కల్లూరు మండలం రఘునాథగూడెం ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తుండగా ఇటీవలే డిప్యూటేషన్పై కల్లూరుకు కేటాయించారు. దసరా సందర్భంగా కప్పలబంధం రాగా గురువారం రాత్రి బతుకమ్మ ఊరేగింపు చూసేందుకు వెళ్లారు. రోడ్డు పక్కన ఆయన నిలబడి ఉండగా, బతుకమ్మ ఊరేగింపుకు సంబంధించి ట్రాక్టర్ను వెనక్కి తీసే క్రమంలో రోడ్డు శంకుస్థాపన శిలాఫలకం దిమ్మెకు తాకి అది విరిగి ఆయనపై పడింది. దీంతో తీవ్రగాయాలైన శ్రీనివాసరావుకు కల్లూరులో చికిత్స అనంతరం ఖమ్మం తరలించగా శుక్రవారం తెల్లవారుజామున మృతి చెందాడు. ఆయనకు భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు. దసరా సందర్భంగా స్వగ్రామానికి వచ్చిన శ్రీనివాసరావు మృతితో విషాదం నెలకొనగా, యూటీఎఫ్, పీఆర్టీయూ సంఘాల నాయకులు సంతాపం తెలిపారు. రోడ్డు ప్రమాదంలో యువకుడు.. పెనుబల్లి: పెనుబల్లి బీసీ కాలనీ మసీద్రోడ్డులో యూ టర్న్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో పడిగా సాయి(25) మృతి చెందాడు. పెనుబల్లి మండలం వీ.ఎం.బంజరుకు సాయి దసరా సందర్భంగా గురువారం మిత్రులతో సరదాగా గడిపాక స్నేహితుడి కొత్త బైక్పై ట్రయల్ రన్ కోసమంటూ మరో స్నేహితుడు సిద్ధార్థతో కలిసి వెళ్లాడు. కొత్తగూడెం జాతీయ రహదారిపై వెళ్తుండగా మసీదు వద్ద యూ టర్న్ తీసుకునే క్రమంలో వీరి బైక్ను టిప్పర్ ఢీకొట్టింది. ఘటనలో సాయి తలకు బలమైన గాయం కాగా 108 వాహనంలో పెనుబల్లి ఆస్పత్రికి, అక్కడ ఖమ్మం తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మరో యువకుడు సిద్ధార్థకు కూడా బలమైన గాయాలయ్యాయి. ఘటనపై కేసు నమోదు చేసినట్లు వీ.ఎం.బంజరు ఎస్సై కె.వెంకటేష్ తెలిపారు.బతుకమ్మ ఊరేగింపులో దిమ్మె పడి టీచర్ మృతి -
గంగమ్మ చెంతకు దుర్గమ్మ
భద్రాచలంఅర్బన్ : ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో నవరాత్రి ఉత్సవాల సందర్భంగా పూజలందుకున్న దుర్గామాత విగ్రహాలు నిమజ్జనానికి భద్రాచలం గోదావరి ఘాట్ వద్దకు చేరుకున్నాయి. ప్రతి ఏడాది వినాయకుడి విగ్రహాలు మాత్రమే గోదావరిలో నిమజ్జనానికి వస్తుంటాయి, అమ్మవారి విగ్రహాలు వచ్చినా చాలా తక్కువ సంఖ్యలోనే ఉండేవి. అయితే ఈ ఏడాది అనూహ్యంగా విజయదశమి పండుగ రోజు అర్ధరాత్రి తర్వాత నిమజ్జన ఘాట్ వద్దకు అధిక సంఖ్యలో విగ్రహాలు చేరుకున్నాయి. కాగా, ఇక్కడ నిమజ్జనానికి ఏర్పాట్లు చేయకపోవడంతో భక్తుల్లో కొంతమేర ఆందోళన వ్యక్తమైంది. దీంతో అధికారులు శుక్రవారం మధ్యాహ్నం ఒక లాంచీతో పాటు క్రేన్ ఏర్పాటు చేశారు. కాగా, శని, ఆదివారాల్లో అమ్మవారి విగ్రహాలు నిమజ్జనానికి భారీగా వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. శుక్రవారం సాయంత్రం వరకు 42 విగ్రహాలు నిమజ్జనం కాగా, మరో 30 విగ్రహాలు గోదావరి ఘాట్ వద్ద ఉన్నాయి. నిమజ్జనం ఘాట్ను సందర్శించిన ఏఎస్పీ భద్రాచలం గోదావరి నది ఘాట్ వద్ద అమ్మవారి విగ్రహాల నిమజ్జనాన్ని ఏఎస్పీ విక్రాంత్కుమార్ సింగ్ శుక్రవారం సందర్శించారు. ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు. నిమజ్జన సమయంలో ఉత్సవ కమిటీ సభ్యులు పోలీసుల సూచనలను పాటించాలని, కార్యక్రమం ప్రశాంతంగా సాగేలా సహకరించాలని కోరారు. వీలైనంత త్వరగా విగ్రహాల నిమజ్జనం పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. మేం గత ఐదేళ్లుగా అమ్మవారి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నాం. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో విగ్రహాలు నిమజ్జనం చేయాలనుకున్నాం. గతేడాది బాసరలో నిమజ్జనం చేశాం. ఈ ఏడాది భద్రాచలంలో నిమజ్జనం చేయాలని 200 మందిమి వచ్చాం. – బాలకృష్ణ, హైదరాబాద్ -
మధిర కళాకారులకు బహుమతులు
మధిర: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తెనాలిలో నిర్వహించిన జాతీయ స్థాయి పద్య నాటక పోటీల్లో మధిర కళాకారులు ఉత్తమ ప్రదర్శనతో అవార్డులు సాధించారు. గతనెల 27నుంచి ఈ నెల 2వరకు జరిగిన పద్య నాటక పోటీల్లో మధిర కళాకారులు ప్రదర్శించిన కస్తూరి తిలకం తృతీయ బహుమతి సాధించింది. అలాగే, డాక్టర్ నిభానుపూడి సుబ్బరాజుకు ఉత్తమ దర్శకుడు, చింతామణి పాత్ర ధరించిన విజయరాణికి ప్రత్యేక జ్యూరీ బహుమతులు లభించాయి. ఈ సందర్భంగా డాక్టర్ సుబ్బరాజు మాట్లాడుతూ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చొరవతో సాంస్కతిక కళా కేంద్రం ఏర్పాటుకాగా, అక్కడ సాధన చేసే అవకాశం దక్కిందని.. తద్వారా బహుమతులు సాధిస్తున్నామని తెలిపారు. అలాగే, చిలువేరు శాంతయ్య, ఇనపనూరి వసంత్, కిషోర్ రెడ్డి, నరాల సాంబశివారెడ్డి, ఎర్రగుంట రాజేశ్వరరావు, రామవరపు ప్రసాద్ తదితరులు కూడా భట్టికి కృతజ్ఞతలు తెలిపారు. 7న అండర్–19 క్రీడా జట్ల ఎంపిక ఖమ్మం స్పోర్ట్స్: ఉమ్మడి జిల్లాస్థాయి అండర్–19 బాలబాలికల ఆర్చరీ, రెజ్లింగ్ క్రీడా జట్ల ఎంపిక పోటీలు ఈనెల 7వ తేదీన నిర్వహిస్తున్నట్లు జిల్లా జూనియర్ కళాశాలల క్రీడా సంఘం కార్యదర్శి ఎం.డీ.మూసా కలీం తెలిపారు. ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో ఈ పోటీలు జరుగుతాయని వెల్లడించారు. ఆసక్తి ఉన్న క్రీడాకారులు వయసు ధ్రువీకరణ పత్రాలతో ఉదయం 10 గంటలకు రిపోర్టు చేయాలని సూచించారు. అలాగే, ఉమ్మడి జిల్లాస్థాయి అండర్–19 ఖో–ఖో బాలబాలికల జట్ల ఎంపిక కల్లూరు మినీ స్టేడియంలో 11వ తేదీన జరుగుతుందని మూసీ కలీం తెలిపారు. నేడు ఉమ్మడి జిల్లాస్థాయి చెస్ ఎంపికలు ఖమ్మం స్పోర్ట్స్: ఉమ్మడి జిల్లాస్థాయి అండర్–15 బాలబాలికల చెస్ జట్లను శనివారం ఎంపిక చేయనున్నట్లు చెస్ అసోసియేషన్ బాధ్యులు సీహెచ్.గోపికృష్ణ, జ్యోత్స్న తెలిపారు. ఆసక్తి ఉన్న వారు క్రీడాకారులు 94401 62749, 83091 34971 నంబర్లలో సంప్రదించి పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. పోటీలకు హాజరయ్యే సమయాన వయసు ధ్రువీకరణ పత్రాలు వెంట తీసుకురావాలని తెలిపారు. అమ్మవారికి రూ.2.50లక్షల ఆభరణాలు వైరా: వైరా హనుమాన్బజార్లోని శ్రీ మహాలక్ష్మి అమ్మవారి అలంకరణ కోసం డాక్టర్ ఓర్సు వెంకటేశ్వర్లు – తైవశ్రీ దంపతులు రూ 2.50 లక్షల విలువైన బంగారు ఆభరణాలను గురువారం సమర్పించారు. ఈ సందర్భంగా దాతలను ఆలయ కమిటీ చైర్మన్ వేముల శివకృష్ణ సత్కరించారు. అర్చకుడు రాజశేఖర్తో పాటు రాము, బాలయ్య, ఆంజనేయులు, ఏడుకొండలు, తిరుపతి, శ్రీనివాసరావు, ఓర్సు శ్రీను, చిన్నరాములు, రాంబాబు పాల్గొన్నారు. భద్రాద్రి జిల్లాకు కేంద్రీయ విద్యాలయం మంజూరుసూపర్బజార్(కొత్తగూడెం): పూర్తి ఏజెన్సీ ప్రాంతమైన భద్రాద్రి జిల్లాలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుచేయాలని ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి కేంద్ర ప్రభుత్వానికి పలుమార్లు విజ్ఞప్తి చేయగా ఎట్టకేలకే ప్రభుత్వం స్పందించింది. రాష్ట్రానికి నాలుగు విద్యాలయాలు కేటాయించగా, అందులో ఒకటి జిల్లాకు దక్కింది. ఎంపీ చొరవ, ప్రత్యేక శ్రద్ధతో జిల్లాకు కేంద్రీయ విద్యాలయం మంజూరైందని కాంగ్రెస్ నాయకులు, జిల్లా ఆదివాసీ నేతలు హర్షం వ్యక్తం చేస్తూ రఘురాంరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. కిన్నెరసానిలో దసరా సందడిరెండురోజుల పాటు భారీ ఆదాయం పాల్వంచరూరల్ : పర్యాటక ప్రాంతమైన కిన్నెరసానిలో దసరా పర్వదినాన పర్యాటకులు సందడి చేశారు. గురు, శుక్రవారాల్లో జిల్లా నలుమూలలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా భారీ సంఖ్యలో తరలి వచ్చారు. డ్యామ్ పైనుంచి జలాశయాన్ని, డీర్పార్కులో దుప్పులను వీక్షించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆనందోత్సాహాల నడుమ గడిపారు. ఈ రెండు రోజుల్లో 1,795 మంది పర్యాటకులు కిన్నెరసానిలోకి ప్రవేశించడం ద్వారా వైల్డ్లైఫ్ శాఖకు రూ.1,07,515, 1,350 మంది బోటు షికారు చేయడం ద్వారా టూరిజం కార్పొరేషన్కు రూ.68,850 ఆదాయం లభించినట్లు నిర్వాహకులు తెలిపారు. -
‘జాగృతి’ జిల్లా అధ్యక్షురాలిగా కరుణ
ఖమ్మం మామిళ్లగూడెం: తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షురాలిగా గట్టు కరుణ నియమితులయ్యారు. రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఇటీవల జాగృతి రాష్ట్ర, జిల్లా కమిటీలు, అనుబంధ కమిటీలను శుక్రవారం ప్రకటించారు. ఇందులో భాగంగా జిల్లా మహిళా అధ్యక్షురాలుగా గతంలో పనిచేసిన కరుణను సంస్థ జిల్లా అధ్యక్షురాలిగా నియమించారు. ఆమెకు జి.సుందర్, డాక్టర్ ఎంఎస్.చిన్ని, వసంత్, ఎం.స్వరూపరాణి, అరుణశ్రీ, ఆశా, జ్యోతి తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. హక్కులను కాలరాస్తున్న ప్రభుత్వం మణుగూరు రూరల్: ఎన్నికలకు సంబంధించిన రాజ్యాంగ హక్కులను రాష్ట్ర ప్రభుత్వం కాలరాస్తోందని మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు బూర్గుల వెంకటేశ్వర్లు అన్నారు. శుక్రవారం సంఘం కార్యాలయంలో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ జిల్లాలో 233 ఎంపీటీసీ స్థానాల్లో ఎస్సీలకు కేవలం ఐదు, ఒకే జెడ్పీటీసీ స్థానం కేటాయించడం దారుణమని అన్నారు. మణుగూరు మండలంలో రొటేషన్ ప్రకారం ఈ దఫా జెడ్పీటీసీ స్థానం ఎస్సీలకు ఇవ్వాల్సి ఉండగా, మళ్లీ ఎస్టీలకే కేటాయించారని ఆరోపించారు. కలెక్టర్ పరిశీలన చేసి జనాభా ప్రాతిపదికన ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలు కేటాయించాలని కోరారు. ఇంకా ఈ సమావేశంలో నాయకులు మద్దెల భద్రయ్య, వేర్పుల నరేష్, వేర్పుల సురేష్, బూర్గుల సతీష్, బూర్గుల సంజీవరావు, ముల్క నరేష్, ఏసురత్నం, వేమూరి రవి, ఉల్లోజు బాబీ, బూర్గులవెంకటరత్నం, వేర్పుల శంకర్, దాసరి వెంకన్న తదితరులు పాల్గొన్నారు. మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వర్లు -
9నుంచి ఐదేళ్ల లా కోర్సు సప్లిమెంటరీ పరీక్షలు
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఎల్ఎల్బీ ఐదేళ్ల కోర్సు మొదటి సెమిస్టర్ సప్లిమెంటరీ పరీక్షలు ఈనెల 9వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ రాజేందర్, అదనపు పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ ఆసిం ఇక్బాల్ అలీ తెలిపారు. ఈనెల 9న మొదటి పేపర్, 13న రెండు, 15న మూడు, 17న నాలుగో పేపర్ పరీక్ష ఉంటుందని వెల్లడించారు. ఆయా తేదీల్లో ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఐదో సెమిస్టర్ పరీక్షలు.. ఐదేళ్ల లా కోర్సు ఐదో సెమిస్టర్ సప్లిమెంటరీ పరీక్షలు ఈనెల 8వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు పరీక్షల విభాగం అధికారులు తెలిపారు. 8న మొదటి పేపర్, 10న రెండు, 14న మూడు, 16న నాలుగు, 18న ఐదో పేపర్ పరీక్షలు ఉంటాయని పేర్కొన్నారు. నిర్ణీత తేదీల్లో మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని అధికారులు రాజేందర్, ఆసిం ఇక్బాల్ తెలిపారు. -
రూ.వెయ్యితో బతికేదెలా?
● పెన్షన్ రూ.10 వేలకు పెంచాలని సింగరేణి రిటైర్డ్ ఉద్యోగుల వేడుకోలు ● అధికారులతో సమానంగా వైద్య సేవలు అందించాలని డిమాండ్ సింగరేణి(కొత్తగూడెం): నెలకు రూ.1000 పెన్షన్తో తమ జీవితం ఎలా గడపాలని సింగరేణి విశ్రాంత ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు. కనీస పెన్షన్ రూ.10వేలకు పెంచాలని, అధికారులతో సమానంగా వైద్య సేవలు అందించాలని కోరుతున్నారు. 1998లో ప్రవేశపెట్టిన కోల్మైన్స్ పెన్షన్ స్కీమ్ ప్రకారం కనీస పెన్షన్ రూ.350 నిర్ణయించారు. అయితే ఈ మొత్తాన్ని పెంచాలని 27 ఏళ్లుగా కోల్ పెన్షనర్స్ అసోషియేషన్ నాయకులు ఆందోళన చేయగా రూ.1000కి పెంచారు. అయితే దీనికి డీఏ పెంపు వర్తించకపోవడంతో తాము అర్ధాకలితో అలమటిస్తున్నామని రిటైర్డ్ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిబంధనలు గాలికి.. కోల్ మైన్స్ పెన్షన్ స్కీం చట్ట ప్రకారం ప్రతీ మూడేళ్లకోసారి పింఛన్లను సవరించాలనే నిబంధన ఉంది. ఈ విషయమై పార్లమెంట్లో ప్రవేశపెట్టిన పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సిఫార్సులు అమలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని, పారిశ్రామిక విని యోగదారుల ధరల సూచిక అనుసరించి కరువు భత్యం (డీఏ) అనుసంధానం చేస్తూ పెన్షన్ పెంచాలని రిటైర్డ్ ఉద్యోగులు అంటున్నారు. ప్రతీ ఐదేళ్లకు ఒకసారి జరిగే వేతన ఒప్పందంతో పాటు పెన్షన్ పెంచాలని కోరుతున్నా తమ బాధను ఎవరూ పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. జాతీయ పెన్షన్ ట్రస్ట్ ఏర్పాటు చేయాలి.. కోల్ మైన్స్ ప్రావిడెంట్ ఫండ్ అర్గనైజేషన్ రద్దు చేసి కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ, కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ, కోలిండియా, సింగరేణి ఆధ్వర్యంలో జాతీయ పెన్షన్ ట్రస్ట్ ఏర్పాటు చేయాలని రిటైర్డ్ కార్మికులు, ఉద్యోగులు కోరుతున్నారు. దీంతో పాటు సోషల్ రెస్సాన్స్బిలిటీ, డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్, బొగ్గు యాజమాన్యం సంస్థలవార్షిక లాభాల నుంచి మూడు శాతం పెన్షన్ ఫండ్కు కేటాయించాలని, ఉద్యోగులకు, అధికారులకు ఒకే రకమైన వైద్య విధానం అమలు చేయాలని, హైదరారాద్లో సింగరేణి సూపర్ స్పెషాలిటి ఆస్పత్రి నెలకొల్పి అన్ని రకాల వైద్య సేవలు అందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. -
గాంధీజీ, శాస్త్రి సేవలు చిరస్మరణీయం
మధిర: జాతిపిత మహాత్మా గాంధీ, మాజీ ప్రధాని లాల్ బహుదూర్ శాస్త్రి సేవలు చిరస్మరణీయమని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. గాంధీజీ, శాస్త్రి జయంతి సందర్భంగా మధిరలోని క్యాంపు కార్యాలయంలో వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం భట్టి మాట్లాడుతూ గాంధీజీ పాఇంచిన సత్యం, అహింస, సమానత్వం అనే విలువలు శాశ్వతమైనవని తెలిపారు. ఆయన ఆశయాలు నేటి సమాజానికి ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. అలాగే, లాల్ బహుదూర్ శాస్త్రి ఇచ్చిన జై జవాన్, జై కిసాన్ నినాదం రైతు, సైనికుల గౌరవాన్ని మరింతగా పెంచిందని తెలిపారు. ఆర్ఎస్ఎస్ శతాబ్ది వేడుకలు కామేపల్లి: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ(ఆర్ఎస్ఎస్) శతాబ్ది ఉత్సవాలు శుక్రవారం రాత్రి కామేపల్లిలో నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన స్వయం సేవకులు ప్రత్యేక దుస్తుల్లో పద సంచలన్ చేశారు. అనంతరం సాయిబాబా ఆలయ ఆవరణలో జరిగిన సమావేశంలో జిల్లా సంఘ్ చాలక్ లక్కినేని ప్రసాద్ మాట్లాడారు. వ్యక్తి నిర్మాణమే ఆర్ఎస్ఎస్ లక్ష్యమని తెలిపారు. స్వయం సేవకులు దేశాభివృద్ధి, సామాజిక శ్రేయస్సుకు పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సూరి శివరామకృష్ణ, మోహన్నాయక్, పోలూరి రామచంద్రయ్య, భద్రయ్య, దయానంద్, వెంకటాచారి, పూజల శివకృష్ణ, హన్మంతరావు, జర్పుల రామారావు, భూక్యా శ్రీను తదితరులు పాల్గొన్నారు. టెట్ తీర్పుపై ప్రభుత్వం అప్పీల్ చేయాలి మాజీ మంత్రి దామోదర్రెడ్డికి నివాళి ఖమ్మంమయూరిసెంటర్/కామేపల్లి: మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్రెడ్డి ఇటీవల మృతి చెందగా రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నివాళులర్పించారు. హైదరాబాద్లోని ఆయన ఇంట్లో మృతదేహం వద్ద మంత్రి పొంగులేటి, ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి శుక్రవారం నివాళులర్పించి దామోదర్రెడ్డి కుటుంబీకులను పరామర్శించారు. అలాగే, కామేపల్లి మండలంలోని పలు గ్రామాల్లో దామోదర్రెడ్డి చిత్రపటం వద్ద కాంగ్రెస్ నాయకులు నివాళులర్పించారు. -
మమ్మేలు తల్లీ
అమ్మా మైసమ్మా..కోటమైసమ్మ తల్లి జాతరకు పోటెత్తిన భక్తజనంకారేపల్లి: అమ్మా మైసమ్మా.. మా తల్లీ మైసమ్మా.. మమ్మేలు తల్లీ భక్తజనం తన్మయత్వంతో ఊగిపోయారు. కారేపల్లి మండలం ఉసిరికాయలపల్లిలో కొలువుదీరిన కోట మైసమ్మ తల్లి ఆలయం వద్ద ఏటా దసరాకు జాతర నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. దీంతో జిల్లా నుంచే భద్రాద్రి, మహబూబాబాద్ తదితర జిల్లాల నుంచి భక్తులు ప్రభబండ్లు, వాహనాలో తరలివచ్చారు. వేలాదిగా తరలివచ్చిన భక్తజనంతో జాతర ప్రాంగణం కిక్కిరిసింది. దేవాదాయ ధర్మదాయ శాఖ, పర్సా ట్రస్టు ఆధ్వర్యాన ఈనెల 7వ తేదీ వరకు జరిగే జాతరకు ఏర్పాట్లు చేయగా భక్తులు తల్లిని దర్శించుకున్నారు. కాగా, జాతరకు వచ్చిన భక్తులకు ఆటవిడుపుగా సోలాపూర్ సర్కస్, జాయింట్ వీల్ ఏర్పాటుచేయడంతో చిన్నాపెద్ద తేడా లేకుండా రోజంతా ఉత్సాహంగా గడిపారు. ఖమ్మం రూరల్ ఏసీపీ తిరుపతిరెడ్డి పర్యవేక్షణలో సింగరేణి సీఐ తిరుపతిరెడ్డి, ఎస్ఐ బి.గోపి ఆధ్వర్యాన ఇద్దరు సీఐలు, పదిమంది ఎస్ఐలు, 100మంది కానిస్టేబుళ్లతో బందోబస్తు నిర్వహించారు. పెద్దసంఖ్యలో భక్తులు రావడంతో జాతర ప్రాంగణం నుంచి సోలార్ ప్లాంట్ వరకు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడగా పోలీసులు వాహనాలు మళ్లించారు. కోటమైసమ్మను ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య దంపతులు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, ఇల్లెందు మున్సిపల్ మాజీ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వర్లు దంపతులు దర్శించుకున్నారు. భక్తులకు ఇబ్బందులు ఎదురుకాకుండా ఆలయ ఈఓ గుట్టకింది వేణుగోపాలాచార్యులు, పర్సా ట్రస్టు చైర్మన్ పట్టాభిరామారావు పర్యవేక్షిస్తున్నారు. -
దాతృత్వం అభినందనీయం
సత్తుపల్లి: డబ్బు చాలా మందికి ఉన్నా ప్రజల కోసం రూ.కోట్లు వెచ్చించి సేవా కార్యక్రమాలు నిర్వహించే గుణం ఉండదని.. అలాంటి గుణం కలిగిన దాసరి మధుమోహన్రెడ్డి సేవలు అభినందనీయమని రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. సత్తుపల్లి మండలం గంగారంలో దాసరి మధుమోహన్రెడ్డి నిర్మించిన చాకలి ఐలమ్మ భవనం, యాదవ భవనం, దుర్గాదేవి ఆలయ మండపం, దుర్గమ్మతల్లి ఆర్చి, చర్చితో పాటు ఐదు తాగునీరు బోర్లు, సీసీ కెమెరాలు, యానాధుల కాలనీ చుట్టూ ప్రహరీని ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయితో కలిసి మంత్రి గురువారం ప్రారంభించారు. అలాగే, రూ.కోటి వ్యయంతో వడ్డెర కమ్యూనిటీ భవనానికి శంకుస్థాపన చేశాక మంత్రి మాట్లాడుతూ దాసరి వీరారెడ్డి పేరును చిరస్థాయిగా నిలిపేలా ఆయన మనువడు మధుమోహన్రెడ్డి చేసిన పనులు ఎప్పటికీ గుర్తుంటాయని తెలిపారు. కాగా, వచ్చే విజయదశమికల్లా బేతుపల్లి చెరువుకు గోదావరి జలాలు తీసుకొస్తామని ప్రకటించారు. అనంతరం ఎమ్మెల్యే రాగమయి మాట్లాడగా డీసీసీబీ చైర్మన్ దొండపాటి వెంకటేశ్వరరావు, మాజీ వైస్ ఎంపీపీ దాసరి వెంకట్రామిరెడ్డి(చిట్టినాయన), మార్కెట్ చైర్మన్ దోమ ఆనంద్బాబు, నాయకులు మట్టా దయానంద్, శివ వేణు, దొడ్డా శ్రీనివాసరావు, కావేటి అప్పారావు, కోలగట్ల చెన్నకేశవరావు, ఊకే రమేష్, ఎండీ.కమల్పాషా, ఎస్.కే.మౌలాలి పాల్గొన్నారు. శ్రీనాగమలేశ్వరస్వామి ఆలయంలో ప్రతిష్ఠ సత్తుపల్లిరూరల్: సత్తుపల్లి మండలం రేజర్లలోని శ్రీదుర్గానాగమల్లేశ్వరస్వామి ఆలయంలో ప్రతిష్ఠా వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే రాగమయి, టీజీఐడీసీ చైర్మన్ మువ్వా విజయబాబు ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ నిర్వాహకులు, ప్రజలు పాల్గొన్నారు. రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు -
హైవేకు సర్వీసు రోడ్లు ఏర్పాటుచేయించండి
ఖమ్మం మామిళ్లగూడెం: ఖమ్మం నుంచి ఏపీలోని దేవరపల్లి వరకు నిర్మిస్తున్న గ్రీన్ఫీల్డ్ హైవేకు అవసరమైన చోట సర్వీసు రోడ్లు నిర్మించాలని, లేకపోతే రైతులు ఇబ్బందిపడతారని బీజేపీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు నెల్లూరు కోటేశ్వరరావు పేర్కొన్నారు. ఈమేరకు రోడ్లు నిర్మించేలా కృషి చేయాలని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచంద్రరావుకు హైదరాబాద్లో శుక్రవారం ఆయన వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా కోటేశ్వరరావు మాట్లాడుతూ హైవేతో భూములు రెండుగా చీలినందున సర్వీసు రోడ్లు లేకపోతే పొలాలకు వెళ్లడానికి రైతులు ఇబ్బంది పడతారని తెలిపారు. నాయకులు బండారు నరేష్, యార్లగడ్డ రాఘవరావు పాల్గొన్నారు. -
ఆస్తుల రక్షణ, ప్రయాణికుల భద్రతే లక్ష్యం
ఖమ్మంక్రైం: రైల్వే శాఖకు చెందిన ఆస్తులను రక్షించడమే కాక ప్రయాణికుల భద్రతే లక్ష్యంగా ఆర్పీఎఫ్ పని చేస్తోందని సికింద్రాబాద్ డివిజనల్ కమిషనర్ ఏ.నవీన్కుమార్ స్పష్టం చేశారు. ఖమ్మంలోని ఆర్పీఎఫ్ కార్యాలయాన్ని శుక్రవారం ఆయన తనిఖీ చేశారు. ఆర్పీఎఫ్ పోలీస్ స్టేషన్కు కేటాయించిన గదులు, సిబ్బంది విశ్రాంతికి నిర్మించిన బ్యారక్లను పరిశీలించారు. ఈసందర్భంగా అధికారులతో పలు అంశాలపై సమీక్షించి సూచనలు చేశారు. ఆతర్వాత కమిషనర్ మాట్లాడుతూ ఇటీవల గంజాయి, నిషేధిత మద్యాన్ని రైళ్లలో అక్రమంగా తరలిస్తున్నారనే సమాచారం ఉననందున విస్తృత తనిఖీలు చేపడుతున్నామని తెలిపారు. అంతేకాక రైల్వే ఆస్తులను రక్షించడానికి నిఘా తీవ్రం చేశామని చెప్పారు. ఆర్పీఎఫ్ సీఐ బుర్ర సురేష్గౌడ్, ఏఎఎస్సైలు మోడిన్సా, ప్రసన్నకుమార్, సిబ్బంది పాల్గొన్నారు. ఆర్పీఎఫ్ డివిజనల్ కమిషనర్ నవీన్కుమార్ -
ఆర్టీసీలో స్పెషల్ బాదుడు
● తిరుగు ప్రయాణంలో జనం కష్టాలు ● అత్యధిక బస్సులు హైదరాబాద్కే కేటాయింపు ● గ్రామీణ ప్రాంతాల ప్రజల అవస్థ సత్తుపల్లిటౌన్: దసరా పండుగకు స్వస్థలాలకు వచ్చిన జనం తిరుగు ప్రయాణంలో ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. సరిపడా బస్సులు లేక బస్టాండ్లలో ప్రయాణికులు ఎదురుచూపుల్లో గడుపుతున్నారు. మరోపక్క స్పెషల్ చార్జీల భారంతో పండుగ ఆనందం ఆవిరవుతోందని పలువురు వాపోతున్నారు. ఉమ్మడి జిల్లాలోని సత్తుపల్లి, మధిర, కొత్తగూడెం, భద్రాచలం, మణుగూరు తదితర ప్రాంతాల నుంచి హైదరాబాద్కు వెళ్లే ప్రయాణికుల కోసం అదనపు సర్వీసులు ఏర్పాటు చేశారు. ఖమ్మం నుంచి సైతం అత్యధిక సర్వీసులు రాజధానికే రాకపోకలు సాగిస్తున్నాయి. ఈక్రమాన పలు గ్రామీణ సర్వీసులను రద్దు చేయటంతో నిత్యం రాకపోకలు సాగించే జనం అవస్థ పడాల్సి వస్తోంది. ఫలితంగా ఉమ్మడి జిల్లాలోని చాలా బస్టాండ్లలో శుక్రవారం గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చింది. హైదరాబాద్ సరే.. మిగతా చోట్లకు? ఉమ్మడి జిల్లాలోని వేలాది మంది విద్య, వ్యాపార, ఉద్యోగ, ఉపాధి తదితర అవసరాలకు హైదరాబాద్లో స్ధిరపడ్డారు. వీరంతా దసరా పండుగకు స్వస్థలాలకు వచ్చారు. పండుగ ముగియడంతో శుక్రవారం తిరుగు ప్రయాణం కాగా.. ఆర్టీసీ అధికారులు అత్యధిక బస్సులను హైదరాబాద్కే కేటాయించారు. ఇందులో భాగంగా సత్తుపల్లి డిపో నుంచి హైదరాబాద్ రెగ్యులర్గా నడిచే 25 సర్వీసులే కాక ఇతర మార్గాల్లో రాకపోకలు సాగించే బస్సులనూ అటే కేటాయించారు. ఈ కారణంగాఆర్టీసీకి ఆదాయం పెరిగినా.. గ్రామీణ ప్రాంతాల ప్రజలు మాత్రం సమస్యలు ఎదుర్కొన్నారు. ఇది కాక మరికొన్ని మార్గాల్లో బస్సుల సంఖ్య తగ్గింది. హనుమకొండ నుంచి ఖమ్మంకు నిత్యం రాకపోకలు సాగించే ఎలక్ట్రిక్ బస్సులను సైతం హైదరాబాద్ రూట్లోనే కేటాయించారు. దీంతో ఖమ్మం నుంచి హనుమకొండకు వెళ్లేందుకు శుక్రవారం బస్సులు లేక.. గంటకొకటి చొప్పున వస్తున్న అరకొర బస్సుల్లో సీట్లు దక్కించుకునేందుకు పరుగులు తీయడం కనిపించింది. స్పెషల్ బాదుడు ఇలా.. సత్తుపల్లి నుంచి ఎంజీబీఎస్కు సూపర్ లగ్జరీ బస్సు చార్జీ సాధారణ రోజుల్లో రూ.580 ఉండగా.. ఇప్పుడు రూ.810కి పెంచారు. అలాగే, జీడిమెట్ల చార్జీ రూ.610 నుంచి రూ.860కి, ఈసీఎల్కు రూ.610 నుంచి రూ.860కి, బీహెచ్ఈఎల్కు రూ.610 ఉండగా రూ.860, ఏసీ బస్సులో చార్జీ రూ.760ని రూ.1,070కి పెంచారు. దీంతో ఇప్పటికే పండుగ ఖర్చు భరించిన ప్రజలపై అదనం భారం మోపినట్లయింది.ఖమ్మం రీజియన్లోని డిపోల నుంచి ప్రతిరోజు హైదరాబాద్, ఖమ్మం, విజయవాడ, ఏలూరు, అశ్వారావుపేట రూట్లలో ప్రయాణికుల రాకపోకలతో బస్సులు రద్దీగా ఉంటాయి. ఈ నేపథ్యాన ఆర్టీసీ అధికారులు లక్కీడ్రా స్కీం ప్రారంభించారు. సూపర్లగ్జరీ, డీలక్స్, లహరి, రాజధాని బస్సుల్లో ప్రయాణించే వారు టికెట్ వెనుక భాగాన పేరు, చిరునామా, సెల్ఫోన్ నంబర్ రాసి బస్టాండ్ ప్రాంగణంలోని డబ్బాలో వేయాలి. ఆపై రీజియన్ పరిధిలో ముగ్గురిని ఈనెల 8న లక్కీ డ్రాద్వారా విజేతలుగా ఎంపిక చేస్తామని ప్రకటించి.. విస్తృత ప్రచారం చేస్తున్నారు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణమే సురక్షితం. ప్రయాణికుల రద్దీ ఆధారంగా హైదరాబాద్కు రెగ్యులర్ సర్వీస్లతో పాటు అదనపు బస్సులు నడిపిస్తున్నాం. ఇదే సమయాన ఇతర రూట్లలో రాకపోకలు సాగించే ప్రయాణికులు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకుంటున్నాం. ఒకేసారి అందరూ తిరుగు ప్రయాణం కావడంతో రద్దీ పెరిగింది. ఈ విషయాన్ని గుర్తించి ప్రయాణికులు సహకరించాలి. – వి.సునీత, డిపో మేనేజర్ సత్తుపల్లి -
కలెక్షన్ సెంటర్ను సద్వినియోగం చేసుకోవాలి
ములకలపల్లి : పామాయిల్ రైతుల సౌకర్యార్థం మండల పరిధిలోని జగన్నాథపురంలో ఏర్పాటు చేసిన టీజీ ఆయిల్ఫెడ్ కలెక్షన్ సెంటర్ను సద్వినియోగం చేసుకోవాలని ఆయిల్పామ్ రైతుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆలపాటి రామచంద్రప్రసాద్ అన్నారు. గురువారం ఆయన కలెక్షన్ సెంటన్ను ప్రారంభించి మాట్లాడారు. పామాయిల్ సాగు చేసే రైతులు పంటను పామాయిల్ ఫ్యాక్టరీ వరకు తీసుకెళ్లకుండా కలెక్షన్ పాయింట్లో కూడా విక్రయించవచ్చని తెలిపారు. ఫ్యాక్టరీలో చెల్లించే ధరకే ఇక్కడ కొనుగోలు చేస్తారని చెప్పారు. దీంతో రవాణా ఖర్చులు తగ్గడంతో పాటు దిగుమతి కోసం నిరీక్షించాల్సిన అవసరం ఉండదని తెలిపారు. కార్యక్రమంలో దమ్మపేట ఏఎంసీ చైర్మన్ వాసం రాణి, మాజీ జెడ్పీటీసీలు బత్తుల అంజి, పైడి వెంకటేశ్వరరావు, నాయకులు తాండ్ర ప్రభాకర్ రావు, పర్వతనేని అమర్నాథ్, పువ్వాల మంగపతి, కరుటూరి కృష్ణ, కాసాని నాగప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.ఆయిల్పామ్ రైతుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర ప్రసాద్ -
ముగిసిన శరన్నవరాత్రి ఉత్సవాలు
ఎర్రుపాలెం: మండలంలోని జమలాపురం శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు గురువారంతో ముగిశాయి. తొలుత శ్రీవారికి పంచామృతంతో అభిషేకం నిర్వహించగా.. అలివేలు మంగ అమ్మవారిని శ్రీరాజరాజేశ్వరి దేవి రూపంలో అలంకరించారు. అంతేకాక శ్రీవకుళామాత స్టేడియంలో శమీ పూజ నిర్వహించారు. దసరా పండుగ కావడంతో తెలంగాణ, ఏపీ రాష్ట్రాల భక్తులు పెద్దసంఖ్యలో దర్శించుకున్నారు. చివరగా అర్చకులు మహా పూర్ణాహుతి నిర్వహించారు. ఆలయ ఈఓ కె.జగన్మోహన్రావు, చైర్మన్ ఉప్పల శ్రీరామచంద్రమూర్తి, ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాసశర్మ, అర్చకులు ఉప్పల మురళీమోహన్శర్మ, రాజీవ్శర్మ, వేదపండితులు, సిబ్బంది పాల్గొన్నారు. ఘనంగా గాంధీ జయంతి ఖమ్మం సహకారనగర్: జాతిపిత మహాత్మాగాంధీ జయంతిని గురువారం ప్రభుత్వ కార్యాలయాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ సమావేశ మందిరంలో గాంధీ చిత్రపటానికి అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించి స్వాతంత్య్ర ఉద్యమంలో ఆయన పాత్రను కొనియాడారు. కలెక్టరేట్ ఏఓ కె.శ్రీనివాసరావు, ఉద్యోగులు రాజేష్, వెంకన్న, సీతారామారావు, ఇబ్రహీం తదితరులు పాల్గొన్నారు. స్టాండింగ్ కమిటీలో ఎంపీ ‘వద్దిరాజు’కు మళ్లీ అవకాశం ఖమ్మంవైరారోడ్: పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీల నియామక ప్రక్రియలో భాగంగా రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్రకు మరోమారు అవకాశం దక్కింది. పెట్రోలి యం, సహజ వాయువు స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా వరుసగా మూడోసారి ఆయన ఎన్నికయ్యారు. ఈమేరకు లోక్సభ డిప్యూటీ సెక్రటరీ సుజయ్కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం 31 మంది సభ్యులు ఉండే ఈ కమిటీలో లోక్సభ నుంచి 21 మంది సభ్యులు, రాజ్యసభ నుంచి 10మంది ఎంపీలకు ప్రాతినిధ్యం కల్పిస్తారు. కమ్యూనికేషన్స్, ఐటీ స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా ఖమ్మం ఎంపీ ఖమ్మంమయూరిసెంటర్: కమ్యూనికేషన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డికి వరుసగా రెండోసారి అవకాశం దక్కింది. డాక్టర్ నిషికాంత్ దూబే చైర్మన్గా ఉన్న కమిటీలో ఏడాది క్రితం సభ్యుడిగా ఆయన నియమితులు కాగా, రెండో దఫా కూడా అవకాశం కల్పించారు. లోక్సభ నుంచి 20మంది, రాజ్యసభ ఉంచి పది మంది సభ్యులతో ఏర్పడే ఈ కమిటీలో రెండోసారి అవకాశం దక్కడంపై ఎంపీ రఘురాంరెడ్డికి ఉమ్మడి జిల్లా ప్రజాప్రతి నిధులు, నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. పత్తి కొనుగోళ్లపై నేడు శిక్షణ ఖమ్మంవ్యవసాయం: కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) ద్వారా పత్తి కొనుగోళ్లపై శని వారం కలెక్టరేట్లో వ్యవసాయ శాఖ, మార్కెట్ ఉద్యోగులకు శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి ఎంఏ.అలీం తెలిపారు. ‘కపాస్ కిసాన్ యాప్’ డౌన్లోడ్ చేసుకోవడం, సెల్ నంబర్కు వచ్చే ఓటీపీ ద్వారా లాగిన్ కావడం, సీసీఐ కేంద్రం వద్ద పత్తి అమ్మకానికి స్లాట్ బుకింగ్పై రైతులకు అవగాహన కల్పించేలా ఉద్యోగులకు శిక్షణ ఇస్తామని పేర్కొన్నారు. మండల వ్యవసాయాధికారులు, వ్యవసాయ విస్తర్ణాధికారులు, మార్కెట్ల ఉద్యోగులు పాల్గొనాలని ఆయన సూచించారు. -
ఫుల్జోష్గా దసరా..
వైరా: ఒకే రోజు దసరా, గాంధీ జయంతి రావడంతో వైన్స్, బార్లు మూతపడ్డాయి. దీంతో వైన్స్ నిర్వాహకులు ముందస్తుగా సిద్ధం కావడం, మందుబాబులు కూడా ముందు జాగ్రత్తలు తీసుకోవడంతో అమ్మకంపై ఎలాంటి ప్రభావం పడలేదు. వైరా మద్యం డిపో నుండి సెప్టెంబర్ 29న(సోమవారం), 30న (మంగళవారం) ఉమ్మడి జిల్లాలోని వైన్స్, బార్లకు రూ.42.50 కోట్ల విలువైన మద్యం తీసుకెళ్లడమే ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. సెప్టెంబర్ నెలంతా రూ.185 కోట్ల విలువైన మద్యం తీసుకెళ్లగా.. చివరి రెండు రోజుల్లో రూ.42కోట్లకు పైగా ఉండడం గమనార్హం. ముందుగానే అమ్మకాలు తెలంగాణలో అతిపెద్ద పండుగ అంటే దసరానే గుర్తుకొస్తుంది. బంధుమిత్రులతో కలిసి పండుగ జరుపుకునే పలువురి ఇళ్లలో మందు, విందు ఉంటుంది. కానీ ఈసారి దసరా రోజే గాంధీ జయంతి రావడంతో మందుబాబుల్లో ఆందోళన నెలకొనగా.. అమ్మకాలు ఎలా ఉంటాయోనని ఎకై ్సజ్ అధికారులు ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యాన ఎకై ్సజ్ సర్కిళ్ల వారీగా లక్ష్యాలు విధించి ముందుగా వైరా డిపో నుంచి మద్యం తీసుకెళ్లాలని సూచనలు చేసినట్లు సమాచారం. దీంతో సెప్టెంబర్ 29న రూ.20కోట్లు, 30వ తేదీన రూ 22.50 కోట్ల విలువైన మద్యాన్ని వైన్స్, బార్ల నిర్వాహకులు తరలించడంతో ఎకై ్సజ్ శాఖకు గణనీయమైన ఆదాయం లభించింది. ఇక ఈనెల 1వ తేదీన మాత్రం రూ.కోటి విలువైన మద్యమే తీసుకెళ్లడం గమనార్హం. సాధారణంగా రోజుకు రూ.4కోట్ల నుండి రూ.6కోట్ల విలువైన మద్యం తీసుకెళ్తారు. కానీ 1వ తేదీన గణనీయంగా పడిపోవడానికి కారణాలు ఆరా తీసిన ఎకై ్సజ్ అధికారులు అంతకు ముందు రోజు భారీగా సరుకు తీసుకెళ్లడం.. 2వ తేదీన షాప్ల బంద్తో అమ్మకాలు ఉండవని వ్యాపారులు వెనక్కి తగ్గినట్లు గుర్తించారని సమాచారం. ఉమ్మడి జిల్లాలో 52బార్లు, మూడు క్లబ్లతో పాటుగా 210 వైన్స్కు వైరా డిపో నుంచి మద్యం తీసుకెళ్తారు. ఉమ్మడి జిల్లాలో రూ.42.50 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు -
సంబురాలను పంచిన దసరా
ఖమ్మంగాంధీచౌక్: దసరా పండుగను జిల్లా ప్రజలు గురువారం ఆనందోత్సాహాల నడుమ జరుపుకున్నారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా సంప్రదాయ పద్ధతుల్లో పండుగ నిర్వహించుకున్నారు. శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇస్తూ సంబురాల్లో బాగస్వాములయ్యారు. ఇళ్లలో ప్రత్యేక పూజలు అనంతరం ఇష్టమైన ఆలయాలను దర్శించారు. ఖమ్మంలోని జమ్మిబండపై జరిగిన వేడుకలకు వేలాదిగా జనం హాజరయ్యారు. అలాగే, ఖమ్మం గుట్టపై శ్రీ లక్ష్మీనరసింహస్వామి, శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరీ ఆలయం, శ్రీ గుంటుమల్లేశ్వరస్వామి ఆలయం, శ్రీ వేంకటేశ్వరస్వామి, భక్త ఆంజనేయ స్వామి తదితర ఆలయాలు కూడా కిటకిటలాడాయి. దసరా సందర్భంగా ఆలయాల వద్ద పలువురు వాహన పూజ చేయించుకున్నారు. ఇక శమీ పూజ కోసం ఆలయాలు, పలు ప్రాంతాల్లో ఏర్పాట్లు చేశారు. ఆలయాల్లో జమ్మిచెట్ల వద్ద మహిళలు ప్రత్యేక పూజలు చేశారు. పలువురు తమ కోరికలను కాగితంపై రాసి జమ్మి చెట్టుకు కట్టి మొక్కుకున్నారు. పలుచోట్ల నిర్వహించిన రావణ దహనంలో ప్రజలు పాల్గొన్నారు. జమ్మిబండపై.. ఖమ్మంలోని శ్రీ స్తంబాద్రి లక్ష్మీనరసింహస్వామి వారికి దసరా సందర్భంగా ప్రత్యేక పూజలు జరిగాయి. గుట్టపై ఆలయం నుంచి స్వామి వారిని పల్లకీ సేవగా జమ్మిబండపైకి చేర్చారు. అక్కడ నిర్వహించిన శమీ పూజలో రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొని స్వామిని దర్శించుకున్నారు. ఖమ్మం మేయర్ పునుకొల్లు నీరజ, మార్కెట్ చైర్మన్ యరగర్ల హనుమంతరావు, స్తంభాద్రి ఆలయ ఈఓ కొత్తూరు జగన్మోహన్రావు తదితరులు పాల్గొన్నారు. పోలీస్ హెడ్క్వార్టర్స్లో ఆయుధ పూజ ఖమ్మంక్రైం: జిల్లా పోలీస్ హెడ్క్వార్టర్స్లో దసరా సందర్భంగా సీపీ సునీల్దత్ అధ్వర్యాన ఆయుధ పూజ నిర్వహించారు. ఈసందర్భంగా సీపీ మాట్లాడుతూ జిల్లాలో శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా, ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ పూజల్లో అడిషనల్ డీసీపీలు రామానుజం, కుమారస్వామి, ఏసీపీలు మహేష్, సుశీల్సింగ్, ఆర్ఐలు కామరాజు, శ్రీశైలం, సురేష్, సాంబశివరావు, నాగుల్మీరా, సీఐ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
ఎక్కడెక్కడ.. ఎవరైతే సరి?!
జెడ్పీటీసీ అభ్యర్థుల అన్వేషణలో కాంగ్రెస్ ● చైర్మన్ పదవి కై వసం చేసుకునేలా వ్యూహరచన ● నాలుగే స్థానాలు ఎస్టీలకు.. పదవి ఎస్టీ జనరల్కు రిజర్వ్ ● మంత్రులు, నేతల ఆధ్వర్యాన వడపోతకు కార్యాచరణసాక్షి ప్రతినిధి, ఖమ్మం: జెడ్పీ చైర్మన్ పదవిని కై వసం చేసుకునేలా కాంగ్రెస్ పార్టీ ఇప్పటి నుంచే పావులు కదుపుతోంది. ఇందుకోసం బలమైన అభ్యర్థులను బరిలో నిలిపేలా జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు, ఇన్చార్జి మంత్రి, ఎమ్మెల్యేలు, ఇతర నేతల ఆధ్వర్యాన కసరత్తు మొదలుపెట్టారు. సీఎం రేవంత్రెడ్డి సూచనలతో ఒక్కో జెడ్పీటీసీ స్థానానికి ముగ్గురేసి చొప్పున అభ్యర్థులను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. జెడ్పీ చైర్మన్ పదవి ఎస్టీ జనరల్కు రిజర్వ్ కావడంతో జిల్లాలోని ఆయా స్థానాలకు ప్రాధాన్యత ఏర్పడింది. మొత్తం 20 జెడ్పీటీసీల్లో అత్యధిక స్థానాలతోపాటు ఎస్టీలకు రిజర్వ్ అయిన నాలుగు స్థానాల్లో తమ అభ్యర్థులను గెలిపించుకోవడమే అజెండాగా పార్టీ ముందుకు పోతోంది. విజయావకాశాలే గీటురాయి.. స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా అభ్యర్థులను ఎంపిక చేయాలని కాంగ్రెస్ అధిష్టానం ఇప్పటికే ఆదేశించింది. జెడ్పీటీసీ అభ్యర్థుల ఎంపిక పీసీసీ స్థాయిలో చేయనుండగా.. ఎంపీపీ, ఎంపీటీసీ, సర్పంచ్, వార్డుసభ్యులను జిల్లాస్థాయిలోనే ఎంపిక చేస్తారు. జిల్లా మంత్రులతోపాటు ఇన్చార్జి మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షుడు, ఇతర నేతల సమన్వయంతో ఈ ఎంపిక జరుగుతుంది. ఏయే స్థానంలో ఎవరిని బరిలోకి దింపితే గెలుస్తారనే వివరాలు ఆరా తీస్తున్నారు. రాష్ట్రంలో అధికా రంలో ఉండడం, జిల్లాలోనూ కాంగ్రెస్కు బలం ఉండడంతో 90 శాతానికి పైగా స్థానాలను గెలుస్తామనే ధీమాతో పార్టీ ఉంది. ఎస్టీ స్థానాలే లక్ష్యం జిల్లాలోని మొత్తం 20 జెడ్పీటీసీ స్థానాల్లో నాలుగు ఎస్టీలకు రిజర్వ్ అయ్యాయి. జెడ్పీ చైర్మన్ పదవి ఎస్టీ జనరల్కు రిజర్వ్ కావడంతో ఈ నాలుగు స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపికపై అధిష్టానం శ్రద్ధ పెట్టింది. కూసుమంచి, కొణిజర్ల జెడ్పీటీసీ స్థానాలు ఎస్టీ జనరల్కు, తిరుమలాయపాలెం, సత్తుపల్లి ఎస్టీ మహిళకు రిజర్వ్ అయ్యాయి. జెడ్పీ చైర్మన్గా ఎంపికయ్యేందుకు ఎస్టీ మహిళకు కూడా అర్హత ఉన్న నేపథ్యంలో ఈ నాలుగు స్థానాలే కీలకంగా మారనున్నాయి. ప్రజాదరణ, ఆర్థిక బలంతోపాటు సమకాలీన రాజకీయాలపై అవగాహన, ప్రజలను ఆకట్టుకునే అభ్యర్థులను గుర్తించే పనిలో కాంగ్రెస్ నిమగ్నమైంది. ఏ పార్టీ అత్యధిక స్థానాలు గెలిచినా ఈ నాలుగు స్థానాల నుంచి గెలిచిన వారికే చైర్మన్ పీఠం దక్కనున్నందున కాంగ్రెస్ పార్టీ ఈ స్థానాలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అన్ని స్థానాల్లో పోటాపోటీ జెడ్పీటీసీ స్థానాలతో పాటు ఎంపీటీసీ, ఎంపీపీ, సర్పంచ్, వార్డు సభ్యులుగా పోటీ చేసేందుకు కాంగ్రెస్ పార్టీలో విపరీతమైన పోటీ నెలకొంది. పార్టీ అధికారంలో ఉండడం, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు తమకు కలిసి వస్తాయని ఆశావహులు భావిస్తున్నారు. ఈ నేపథ్యాన పార్టీ కోసం కష్టపడిన తమకు అవకాశం ఇవ్వాలని నేతలను అభ్యర్థిస్తున్నారు. ప్రధానంగా జనరల్ స్థానాల్లో పోటీ మరింత తీవ్రంగా ఉంది. చాలా ఏళ్ల తర్వాత బీసీలకు అత్యధిక స్థానాల్లో పోటీచేసే అవకాశం వచ్చింది. దీంతో ఆయా సామాజిక వర్గం నేతలు మంత్రులు, ఇతర నేతలను కలిసి తమను పరిగణనలోకి తీసుకోవాలని కోరుతున్నారు.కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా జెడ్పీ చైర్మన్ పదవిపైనే దృష్టి పెట్టింది. గత ఎన్నికల్లో జెడ్పీచైర్మన్ పదవి బీఆర్ఎస్ను వరించగా.. ఈసారి ఎలాగైనా దక్కించుకోవాలనే పట్టుదలతో ఉన్నారు. ఇందుకోసం అనుసరించాల్సిన వ్యూహాలకు నేతలు పదును పెడుతున్నారు. జిల్లాలో అత్యధిక జెడ్పీటీసీ స్థానాలు గెలవాలని తద్వారా చైర్మన్ పీఠం దక్కించుకునేలా బలమైన అభ్యర్థులను వడపోత తర్వాతే ఎంపిక చేయనున్నారు. ఒక్కో జెడ్పీటీసీ స్థానం నుంచి ముగ్గురేసి అభ్యర్థులను మంత్రులు, ఇన్చార్జి మంత్రి, ఎమ్మెల్యేలు, స్థానిక నేతలు, ఎంపీ ఏకాభిప్రాయంతో ఎంపిక చేస్తారు. ఇందులో ప్రజాదరణ కలిగి, ఆర్థికంగా బలంగా ఉండడంతో పాటు ఎలాంటి వివాదాలకు తావులేని వారికే ప్రాధాన్యత ఇస్తారు. ఆపై అభ్యర్థుల జాబితాలను 5వ తేదీలోగా పీసీసీకి పంపించాల్సి ఉండడంతో అన్వేషణ జోరుగా సాగుతోంది. -
పాలకవర్గం లేక పట్టింపు కరువు
● నిలిచిన ‘టేకులపల్లి’ సంఘం కార్యకలాపాలు ● రుణాలు, బీమా సౌకర్యం లేక రైతుల ఇబ్బందులుఖమ్మంఅర్బన్: జిల్లాలోని ‘టేకులపల్లి ఆంధ్రాబ్యాంక్ కర్షక సేవా సంఘం లిమిటెడ్’ పాలకవర్గం పదవీకాలం ఆగస్టు 14న ముగిసింది. ఇదే సమయాన పీఏసీఎస్ల పాలకవర్గాల గుడువు ముగియగా ప్రభుత్వం గడువు పొడిగించింది. ఇంకొన్నిచోట్ల పర్సన్ ఇన్చార్జ్లను నియమించారు. కానీ టేకులపల్లి సంఘానికి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో కార్యకలాపాలు నిలిచిపోయాయి. ఫలితంగా రైతులు, సభ్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
ఆలయానికి వెళ్తూ అనంత లోకాలకు..
ఖమ్మంఅర్బన్: పిల్లలతో కలిసి ఆలయానికి వెళ్తున్న మహిళ మార్గమధ్యలోనే రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడింది. ఖమ్మం మమత రోడ్డులో బుధవారం జరిగిన ఈ ప్రమాదంలో వివరాలు... మమత రోడ్డు ప్రాంతానికి చెందిన అనమోలు లోకేశ్వరి(34), తన పిల్లలైన అస్మిత, విరాట్తో కలిసి స్కూటీపై గుడికి బయలుదేరింది. మధ్యలో వాహనం అదుపు తప్పి డివైడర్ను ఢీకొనగా స్కూటీ నడుపుతున్న లోకేశ్వరి తీవ్ర గాయాలతో పడిపోయింది. పిల్లలకు కూడా గాయాలు కాగా స్థానికులు వారిని మమత ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ లోకేశ్వరి మృతి చెందింది. ఈమేరకు ఘటనపై కేసు నమోదుచేసినట్లు ఖమ్మం అర్బన్ సీఐ భానుప్రకాశ్ తెలిపారు. వాహనం ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి..ఖమ్మంరూరల్: మండలంలోని సత్యనారాయణపురం సమీపాన ఖమ్మం – వరంగల్ ప్రధాన రహదారిపై వాహనం ఢీకొనగా గుర్తుతెలియని వృద్ధుడు(60) బుధవారం తెల్లవారుజామున మృతి చెందాడు. సదరు వృద్ధుడు రోడ్డు వెంట నడిచి వెళ్తుండగా వాహనం ఢీకొట్టడంతో తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. ఆయన ఎరుపు రంగు టీ షర్ట్, గీతల లుంగీ ధరించి ఉన్నాడని సీఐ ముష్క రాజు తెలిపారు. మృతదేహాన్ని అన్నం పౌండేషన్ చైర్మన్ శ్రీనివాసరావుసహకారంతో ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. రోడ్డుప్రమాదంలో వ్యక్తి .. కారేపల్లి: ద్విచక్రవాహనాన్ని కారు ఢీకొట్టిన ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఘటనకు సంబంధించి వివరాలు... మండలంలోని పేరుపల్లికి చెందిన సిరికొండ కృష్ణ(40) మోపెడ్పై బుధవారం కారేపల్లి నుంచి స్వగ్రామానికి వెళ్తుండగా రావోజీతండా వద్ద మూలమలుపు సమీపాన పేరుపల్లి నుంచి కారేపల్లి వైపు వస్తున్న కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో కృష్ణ కాలు విరిగి ఓ ఎముక కారు ముందు భాగంలో ఇరుక్కుపోయింది. అంతేకాక తలకు తీవ్ర గాయాలు కావడంతో కృష్ణను ఖమ్మం ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తుండగా మృతి చెందాడు. ఘటనా స్థలంలో కారేపల్లి ఎస్ఐ ఎస్.నవిత పరిశీలించారు. మృతుడికి భార్య ఉమ, ఇద్దరు పిల్లలు ఉన్నారు. రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి -
‘రాంరెడ్డి’తో మృతితో పాతలింగాలలో విషాదం
కామేపల్లి: కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్రెడ్డి(73) బుధవారం రాత్రి మృతి చెందా రు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరా బాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. దామోదర్రెడ్డి స్వగ్రామం జిల్లాలోని కామేపల్లి మండలం పాతలింగాల. దివంగత రాంరెడ్డి నారాయణరెడ్డి–కమలమ్మ దంపతులకు ఆరో సంతానంగా దామోదర్రెడ్డి జన్మించారు. తుంగతుర్తి, సూర్యాపేట నియోజకవర్గాల నుంచి ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన.. మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. ఏళ్లుగా తుంగతుర్తిలో స్థిరపడినా స్వగ్రామమైన పాతలింగాలలో ఏ శుభకార్యం జరిగినా వచ్చేవారు. ఆయన భార్య గతంలోనే మృతి చెందగా, కుమారుడు సర్వోత్తమరెడ్డి ఉన్నారు. కాగా, దామోదర్రెడ్డి మృతితో స్వగ్రామమైన పాతలింగాలలో విషాదం నెలకొంది. దామోదర్రెడ్డి సోదరుడు రాంరెడ్డి గోపాల్రెడ్డి ప్రస్తుతం రాష్ట్ర వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ సభ్యుడిగా కొనసాగుతున్నారు. కాగా, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్రెడ్డి మృతిపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఖమ్మం ఎంపీ రఘురాంరెడ్డి తదితరులు సంతాపం తెలిపారు. మాజీ మంత్రి దామోదర్రెడ్డి కన్నుమూత -
ఇరవై రోజుల్లోగా సీఎంఆర్ పూర్తి
ఖమ్మం సహకారనగర్: పెండింగ్లో ఉన్న సీఎంఆర్(క్లస్టమ్ మిల్లింగ్ రైస్)ను ఇరవై రోజుల్లోగా మిల్లర్లు అందజేయాలని అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. కలెక్టరేట్లో బుధవారం ఆయన రైస్ మిల్లర్లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ గత ఖరీఫ్ సీజన్కు సంబంధించి పెండింగ్ ఉన్న 11,500 మెట్రిక్ టన్నులు రారైస్, 3,500 మెట్రిక్ టన్నుల బాయిల్డ్ రైస్ను ఇరవై పని దినాల్లో ఎఫ్సీఐకి అందించాలని తెలిపారు. ఇదే సమయాన ఎఫ్సీఐ అధికారులు గోదాంలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. ఇక రబీ సీజన్కు సంబంధించి పెండింగ్ ఉన్న 42 వేల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని రోజుకు 600 మెట్రిక్ టన్నుల మేర సరఫరా చేయాలని తెలిపారు. రవాణా చార్జీల బిల్లులను మిల్లర్లు సమర్పిస్తే ప్రభుత్వానికి పంపిస్తామని చెప్పారు. కాగా, రేషన్షాపుల్లో పంపిణీ చేసే బియ్యాన్ని మిల్లర్లు కొనుగోలు చేస్తే పీడీ యాక్ట్ నమోదు చేస్తామని హెచ్చరించిన అదనపు కలెక్టర్.. ఖరీఫ్ ధాన్యం కేటాయింపుల కోసం తప్పనిసరి 10 శాతం బ్యాంకు గ్యారెంటీ సమర్పించాలని సూచించారు. జిల్లా పౌర సరఫరాల సంస్థ మేనేజర్ శ్రీలత, ఎఫ్సీఐ అధికారులు, మిల్లర్ల అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బొమ్మ రాజేశ్వర్రావుతో పాటు పలువురు మిల్లర్లు పాల్గొన్నారు.అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి -
జయ జయహే మహిషాసుర మర్దిని
ఎర్రుపాలెం: తెలంగాణ తిరుపతిగా పేరున్న జమలాపురంలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా గురువారం ఆలయ యాగశాలలోని అమ్మ వారిని మహిషాసుర మర్దిని రూపంలో అలంకరించగా పెద్దసంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. తొలుత స్వామి వారికి అర్చకులు పంచామృతంతో అభిషేకం నిర్వహించారు. ఆలయ ఈఓ కె.జగన్మోహన్రావు, చైర్మన్ ఉప్పల శ్రీరామచంద్రమూర్తి, ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాసశర్మ, అర్చకులు ఉప్పల మురళీమోహన్శర్మ, రాజీవ్శర్మ తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల విధులు పకడ్బందీగా నిర్వహించాలి ఖమ్మం సహకారనగర్: స్థానిక సంస్థల ఎన్నికల విధులకు ఎంపికై న ఉద్యోగులు పకడ్బందీగా నిర్వహించాలని మాస్టర్ ట్రైనర్, జిల్లా ఉపాధి కల్పన అధికారి శ్రీరామ్ సూచించారు. ఖమ్మంలోని డీపీఆర్సీ భవనంలో బుధవారం నోడల్ అధికారులు, రిటర్నింగ్ అధికారులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మాస్టర్ ట్రైనర్ శ్రీరామ్ మాట్లాడుతూ అధికారులు వారి విధులు, నిబంధనలపై సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. హ్యాండ్ బుక్ ఒకటికి, రెండు సార్లు పరిశీలించాలని సూచించారు. నామినేషన్ల స్వీకరణ, స్క్రూటినీ, ఉపసంహరణ, గుర్తుల కేటాయింపు ప్రక్రియలో జాగ్రత్త వహించాలని ఆయన తెలిపారు. మొదటి దరఖాస్తు..ఖమ్మంక్రైం: నూతన ఎకై ్సజ్ పాలసీలో భాగంగా జిల్లాలోని 116 వైన్స్ దుకాణాలకు గాను గత నెల 26వ తేదీ నుండి దరఖాస్తుల స్వీకరణ మొదలైంది. అయితే, ఇన్నాళ్లు ఎవరూ ముందుకు రాకపోగా బుధవారం ఒక దరఖాస్తు నమోదైంది. ఖమ్మం ఎకై ్సజ్స్టేషన్–1 పరిధి రఘునాథపాలెంలోని వైన్షాప్నకు ఈ దరఖాస్తు అందించారు. జిల్లా ఎక్సైజ్ శాఖాధికారి నాగేందర్రెడ్డి, సీఐ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
హద్దులు దాటిన దందా
● అటవీ శాఖ పర్మిట్లో లొసుగులతో స్మగ్లర్ల బరితెగింపు ● అనుమతి ఉన్న కలప మాటున విలువైన కలప తరలింపు ● సైబర్ క్రైంగా గుర్తించి విచారణ చేపట్టిన అటవీ శాఖ ● అటవీ శాఖ ఉద్యోగుల ప్రమేయంపైనా ఆరా ఖమ్మంవ్యవసాయం: అటవీ శాఖ కళ్లు కప్పి యథేచ్ఛగా పొరుగు రాష్ట్రాలకు కొందరు కలపను అక్రమంగా రవాణా చేస్తున్నారు. కలప రవాణాకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ‘నేషనల్ ట్రాన్సిట్ పర్మిట్(ఎన్టీపీసీ)’ నిబంధనల్లో లొసుగుల ఆధారంగా దందాకు పాల్పడుతున్నట్లు బయపడింది. ఎన్టీపీసీ విధానంలో 44జాతుల కలపను అన్ని అనుమతులు, తగిన ఆధారాలతో రవాణా చేసే అవకాశం ఉంది. ఇందుకోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుని, కలప వివరాలు, ఏ ప్రాంతానికి చెందినది, ఏయే సర్వేనంబర్లలో చెట్లు నరికారు తదితర వివరాలు పొందుపర్చాలి. అయితే, కొన్ని లొసుగులను కలప స్మగ్లర్లు తమకు అనుకూలంగా మార్చుకుని అనుమతి ఉన్న కలప మాటున విలువైన కలపను ఉత్తరాది రాష్ట్రాలకు స్మగ్లింగ్ చేస్తున్నారు. ఖమ్మం జిల్లా చింతకాని మండలం అటవీ ప్రాంతం నుంచి అనుమతి ఉన్న కలప పేరిట తరలిస్తున్నట్లు వాహనాన్ని మధ్యప్రదేశ్ రాష్ట్రంలో అటవీ అధికారులు తనిఖీ చేయగా విలువైన సండ్ర కర్ర బయటపడింది. దీంతో అక్కడి అధికారులు ఇచ్చిన సమాచారం ఆధారంగా రాష్ట్ర అటవీ శాఖ కలప విచారణ మొదలుపెట్టింది. 24 పర్మిట్లు.. వందలాది టన్నులు నేషనల్ పర్మిట్ విధానాన్ని అడ్డం పెట్టుకుని సర్కారు తుమ్మ వంటి కలపను రవాణా చేస్తున్నట్లు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుని అక్రమార్కులు అనుమతి పొందారు. ఆపై సండ్రతో పాటు ఇతర విలువైన జాతుల కలపను మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్ తదితర రాష్ట్రాలకు తరలిస్తున్నారు. ఖమ్మం జిల్లా నుంచి కొందరు వ్యాపారులు 24 పర్మిట్లతో వందలాది మెట్రిక్ టన్నుల కలపను రవాణా చేసినట్లు మధ్యప్రదేశ్ అటవీ అధికారులు గుర్తించారు. వీటితో పాటు తెలంగాణలోని పలు ప్రాంతాల నుంచి స్మగ్లింగ్ ముఠా ఉత్తరాది రాష్ట్రాలకు రవాణా చేసినట్లు సమాచారం. సైబర్ క్రైంగా గుర్తింపు కొందరు అక్రమార్కులు అనుమతి లేని కలపను రవాణా చేసిన వ్యవహారాన్ని అటవీ శాఖ సైబర్ క్రైంగా గుర్తించింది. ఆన్లైన్ దరఖాస్తులో వివరాలు తప్పుగా నమోదు చేయడం, అడవి లేని ప్రాంతాలను అటవీ ప్రాంతాలుగా చూపడం, లేని కలపను ఉన్నట్లు సృష్టించడంతో సైబర్ క్రైంగా నిర్ధారించినట్లు తెలిసింది. దీంతో పాటు నిర్దేశించిన కలప మాటున అనుమతి లేని, విలువైన కలప జాతులను రవాణా చేయడాన్ని నేరంగా గుర్తించి ఆయా అంశాలపై విచారణ చేపట్టింది. కాగా, కలప రవాణాకు స్థానిక లారీలు కాకుండా రాజస్థాన్, మహారాష్ట్ర లారీలను వినియోగించినట్లు గుర్తించారు. ఈమేరకు మార్గమధ్యలోని చెక్పోస్టుల వద్ద వివరాలు సేకరిస్తున్నారు. ఉద్యోగుల పాత్ర ఉందా? కలప అక్రమ తరలింపు వ్యవహారంలో అటవీ శాఖ అధికారులు, ఉద్యోగుల ప్రేమేయం ఉందా అన్న అంశంపైనా ఉన్నతాధికారులు దృష్టి సారించారు. కలప రవాణా వాహనాలను అటవీ అధికారులు, టాస్క్ఫోర్స్ బృందాలతో పాటు చెక్పోస్టుల సిబ్బంది తనిఖీ చేయాల్సి ఉంటుంది. అయినప్పటికీ జిల్లా, రాష్ట్రం దాటి లారీలో వెళ్లడంతో సిబ్బంది ప్రమేయం అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈమేరకు ఆయా ప్రాంతాల్లోని ఉద్యోగుల వివరాలు సేకరించి విచారణ చేపడుతున్నారు. కాగా, ఖమ్మం జిల్లాలో అటవీ ప్రాంతం తక్కువగానే ఉండగా పొరుగన ఉన్న భద్రాద్రి, ములుగు, మహబూబాబాద్ జిల్లాల్లో విస్తారంగా ఉన్న అటవీ ప్రాంతం నుంచి విలువైన కలపను దొంగచాటుగా రవాణా చేస్తున్న అంశంపై బయటపడడం చర్చనీయాంశంగా మారింది.నేషనల్ ట్రాన్సిట్ పర్మిట్ విధానాన్ని అడ్డుపెట్టుకొని అక్రమ కలప రవాణాపై రాష్ట్ర వ్యాప్తంగా అటవీ శాఖ అప్రమత్తమైంది. ఇప్పటికే బయటపడిన అక్రమాలపై విచారణ చేపడుతున్నాం. ప్రస్తుతం సేకరించిన ఆధారాల మేరకు ఇంకా ఏయే ప్రాంతాల నుంచి, ఎంత మేర కలప అక్రమ రవాణా జరిగిందనే అంశాన్ని ఉన్నతాధికారులు పరిశీలిస్తున్నారు. ఇదేసమయాన ఉద్యోగుల పాత్రపైనా విచారణ చేస్తున్నాం. – సిద్ధార్థ్ విక్రమ్ సింగ్, జిల్లా అటవీ అధికారి -
వారం నిరీక్షణకు తెర
ఖమ్మంఅర్బన్: ఖమ్మంలోని మున్నేటికి వారం క్రితం కొట్టుకొచ్చిన వ్యక్తి మృతదేహాన్ని బుధవారం ధంసలాపురం వద్ద వెలికితీశారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్కు చెందిన బందెల వెంకటేశ్వర్లు(43) వాగులో చేపలు పట్టేందుకు వెళ్లి గల్లంతయ్యాడు. నాలుగు రోజుల తర్వాత మృతదేహం ప్రకాష్నగర్ చప్టా వద్ద చిక్కుకున్నట్లు త్రీటౌన్ పోలీసులు గుర్తించి గత శనివారం బయటకు తీసేందుకు సిద్ధమైనా వాగు ఉధృతి కారణంగా సాధ్యం కాలేదు. దీంతో అప్పటినుంచి ఆయన కుటుంబ సభ్యులు పడిగాపులు కాస్తున్నారు. కాగా, వరదలో కొట్టుకెళ్తూ బుధవారం ధంసలాపురం సమీపానికి చేరిన మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో ఉండగా, ఖమ్మం అర్బన్ పోలీసులు, అన్నం ఫౌండేషన్ చైర్మన్ శ్రీనివాసరావు బయటకు తీశారు. ఆతర్వాత కర్రకు కట్టుకుని పొదల నడుమ శ్రీనివాసరావు, ఆయన బృందం తీసుకురాగా పంచనామా అనంతరం కుటుంబానికి అప్పగించారు.డోర్నకల్ వాసి మృతదేహం వెలికితీత -
సమస్యలపై పోరాడే అభ్యర్థులను గెలిపించండి
ఖమ్మంమయూరిసెంటర్: నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలపై పోరాడే సీపీఎం అభ్యర్థులను గెలిపించాలని కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం పిలుపునిచ్చారు. ఖమ్మంలోని సుందరయ్య భవనంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు, మండల కార్యదర్శులతో బుధవారం ఆయన స్థానిక సంస్థల ఎన్నికలపై సమీక్షించారు. ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలు జరగకపోవడంతో పాలన వ్యవస్థ గాడి తప్పిందన్నారు. ప్రజాప్రతినిధులే లేకపోవడంతో పాలనలో శూన్యత ఏర్పడి, సమస్యలు పేరుకుపోయాయని తెలిపారు. ఇదే అవకాశంగా కేంద్ర ప్రభుత్వం గ్రామాలకు ఇవ్వాల్సిన నిధులు నిలిపివేసిందన్నారు. కాగా, ప్రజావ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న బీజేపీ, మతోన్మాద శక్తులకు వ్యతిరేకంగా భావసారూప్య పార్టీలు, లౌకిక, ప్రజాస్వామిక శక్తులు, వామపక్ష పార్టీలతో స్థానిక సంస్థల ఎన్నికల్లో కలిసి ముందుకెళ్తామని తమ్మినేని తెలిపారు. ఈమేరకు పార్టీ శ్రేణులు ఎన్నికలకు సిద్ధమై సీపీఎం అభ్యర్థులను గెలిపిస్తే ప్రజలకు అండగా ఉంటారనే నమ్మకం కల్పించాలని సూచించారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు పోతినేని సుదర్శన్రావు, జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, నాయకులు కళ్యాణం వెంకటేశ్వరరావు, మాచర్ల భారతి, బండి రమేష్ తదితరులు పాల్గొన్నారు.సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం -
●శ్రీరామలీలా మహోత్సవ్
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో గురువారం విజయదశమి వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు సిద్ధం చేశారు. రామదాసు కాలం నుంచి ఆలయం తరఫున రామ్లీలా ఉత్సవంగా జరపడం ఆనవాయితీ కాగా, ఈ వేడుకలకు దసరా మండపం వేదిక కానుంది. ఈ సందర్భంగా గురువారం శ్రీ సీతాలక్ష్మణ సమేత రామచంద్రస్వామిని పల్లకీ సేవగా దసరా మండపంలో కొలువుదీర్చి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం జమ్మి చెట్టు వద్ద శమీ, ఆయుధ పూజలు చేస్తారు. రావణాసుర వధగా జరిపే శ్రీ రామలీలా మహోత్సవానికి ఆలయ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. వేడుక నేపథ్యంలో ఎలాంటి ప్రమాదాలు చోటుచేసుకోకుండా పోలీసు, అగ్నిమాపక సిబ్బందికి ప్రత్యేక విధులు కేటాయించారు. -
●వేడుక చూడాలంటే పెద్దమ్మగుడికి వెళ్లాల్సిందే..
పాల్వంచరూరల్ : మండల పరిధిలోని పెద్దమ్మతల్లి ఆలయం దసరా వేడుకలకు ప్రత్యేకంగా నిలుస్తోంది. ఇక్కడ నిర్వహించే దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా సాగుతాయి. చివరి రోజున దసరాను పురస్కరించుకుని శమీ పూజ కూడా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తారు. ఈ పూజలు వీక్షించడానికి తెలంగాణతో పాటు ఏపీ, ఛత్తీస్గఢ్, ఒడిశా, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలివస్తారు. ఈ మేరకు ఆలయ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. కాగా, గతేడాది ఉత్సవాల నిర్వహణకు రూ.10 లక్షల మేర వెచ్చించగా, ఈ సారి కూడా అంతే మొత్తంలో ఖర్చు చేయనున్నట్లు తెలిసింది. నవరాత్రి మహోత్సవాల చివరి రోజైన గురువారం.. పెద్దమ్మతల్లి ఆలయం ఎదుట గల జమ్మి చెట్టు వద్ద ప్రత్యేక పూజలు చేస్తారు. ఇందుకోసం విద్యుద్దీపాలతో అలంకరించడంతో పాటు భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఈఓ రజినీకుమారి వెల్లడించారు. -
శ్రీదుర్గాదేవిగా అమ్మవారి దర్శనం
ఎర్రుపాలెం: మండలంలోని జమలాపురం శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు తొమ్మిది రోజైన మంగళవారం వైభవంగా కొనసాగాయి. తెల్లవారుజామునే స్వామి మూలవిరాట్కు పంచామృతంతో అభిషేకం చేసిన అర్చకులు యాగశాలలోని అమ్మవారిని శ్రీదుర్గాదేవి రూపంలో అలంకరించారు. ఆపై చంఢీహోమం నిర్వహించగా పెద్దసంఖ్యలో భక్తులు అమ్మ వారిని దర్శించుకున్నారు. ఆలయ ఈఓ కె.జగన్మోహన్రావు, చైర్మన్ ఉప్పల శ్రీరామచంద్రమూర్తి, ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాసశర్మ, అర్చకులు ఉప్పల మురళీమోహన్శర్మ, రాజీవ్శర్మ, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా పశువైద్యాధికారిగా డాక్టర్ శ్రీనివాసరావు ఖమ్మంవ్యవసాయం: జిల్లా పశువైద్య, పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ బోడేపూడి పురంధర్ నాలుగు నెలల పాటు వ్యక్తిగత సెలవులో వెళ్లారు. దీంతో జిల్లా పశువైద్యశాల సహాయ సంచాలకులు డాక్టర్ బోడేపూడి శ్రీనివాస్రావు కు జిల్లా పశువైద్య, పశుసంవర్థక శాఖ అధికారి గా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈమేరకు రాష్ట్ర శాఖ డైరెక్టర్ డాక్టర్ బి.గోపి ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, శ్రీనివాసరావు వచ్చే ఏడాది జనవరి 29వరకు జిల్లా అధికారిగా వ్యవహరిస్తారు. పులిగుండాలలో ప్లాస్టిక్పై నిషేధం సత్తుపల్లి: పెనుబల్లి మండలం పులిగుండాల ప్రాంతాన్ని ఎకో టూరిజం విభాగంలో అభివృద్ధి చేయగా, ఈ ప్రాంతంలో ప్లాస్టిక్ను నిషేధించినట్లు ఎఫ్డీఓ వాడపల్లి మఽంజుల తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం సత్తుపల్లిలోని కార్యాలయంలో ఆమె అటవీశాఖ ఆధ్వర్యాన రూపొందించిన ఎకో ఫ్రెండ్లీ స్టిక్కర్లను విడుద ల చేసి మాట్లాడారు. ఈ ప్రాంతానికి వచ్చే పర్యాటకుల నుంచి ప్లాస్టిక్ బాటిళ్లు తీసుకుని గాజు బాటిళ్లు అందిస్తామని తెలిపారు. ఈ విషయంలో పర్యాటకులు సహకరించాలని సూచించారు. ఎఫ్ఎస్ఓ పి.సురేష్కుమార్ పాల్గొన్నారు. కోట మైసమ్మ జాతరకు భారీ బందోబస్తు ‘పొలం బాట’తో సమస్యల పరిష్కారం ఖమ్మంవ్యవసాయం: రైతులకు నాణ్యమైన సేవలు అందించడమే కాక సమస్యల పరిష్కారానికి నిర్వహిస్తున్న ‘విద్యుత్ అధికారుల పొలంబాట’ కొనసాగుతోందని ఎస్ఈ ఇనుగుర్తి శ్రీనివాసాచారి తెలిపారు. ఇప్పటి వరకు నిర్వహించిన కార్యక్రమాల్లో గుర్తించిన సమస్యలను పరిష్కరించామని పేర్కొన్నారు. ఈమేర కు 447 లూజ్ లైన్లు, 226 వంగిన స్తంభాలను సరిచేయగా, 374 చోట్ల మధ్య స్తంభాలు ఏర్పాటు చేశామని తెలిపారు. విద్యుత్ సిబ్బందిని సంప్రదించేందుకు 24 గంటల పాటు అందుబాటులో ఉండే 1912 టోల్ ఫ్రీ నంబర్కు ఫోన్ చేయాలని ఎస్ఈ సూచించారు. -
పకడ్బందీగా ఎన్నికలు
ఖమ్మం సహకారనగర్: జిల్లాలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ, గ్రామపంచాయతీల ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించేలా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తోందని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రెండు విడతల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు, మూడు విడతల్లో గ్రామపంచాయతీ ఎన్నికలు జరగనున్నాయన్నారు. జిల్లాలో రిజర్వేషన్ల ప్రక్రియ పారదర్శకంగా చేపట్టామని తెలిపారు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనందున గ్రామీణ ప్రాంతాల్లో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్(ఎంసీసీ) అమలవుతుందని చెప్పారు. 571 గ్రామపంచాయతీలు, 5,214 వార్డుల ఎన్నికకు జిల్లాలోని 737 ఆవాసాల్లో 5,214 పోలింగ్ స్టేషన్లు గుర్తించామని తెలిపారు. 8,02,690మంది ఓటర్లు ఈ ఏడాది జూలై 10వరకు నమోదైన ప్రకారం జిల్లాలో 8,02,690మంది ఓటర్లు ఉండగా... ఇందులో పురుషులు 3,88,243, మహిళలు 4,14,425, ఇతరులు 22 మంది ఉన్నారని కలెక్టర్ తెలిపారు. పోలింగ్ కేంద్రాలను పంచాయతీ కార్యదర్శులు పరిశీలించి ఎన్నికల నిర్వహణకు అవసరమైన వసతులు ఉన్నాయో, లేదో పరిశీలిస్తారని చెప్పారు. పోలింగ్ సిబ్బందికి ర్యాండమైజేషన్ ద్వారా విధులు కేటాయిస్తామని తెలిపారు. అలాగే, మండల కేంద్రాల్లో నామినేషన్ స్వీకరణకు అవసరమైన ఏర్పాట్లు చేస్తామని వెల్లడించారు. అప్పీల్కు ఒక రోజు నామినేషన్ల పరిశీలన అనంతరం అప్పీల్కు ఒక రోజు కేటాయిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. సోమవారం నుంచే ఎంసీసీ అమల్లోకి వచ్చినందున ప్రతీఒక్కరు ఎన్నికల నియమావళిని పాటించాలని సూచించారు. ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటుచేస్తామని తెలిపారు. తొలుత రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమైన కలెక్టర్.. రిజర్వేషన్ల ఖరారు, ఎన్నికల నిర్వహణకు చేస్తున్న ఏర్పాట్లను వివరించారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణం పూర్తయ్యేలా అందరూ సహకరించాలని కలెక్టర్ సూచించారు. ఈసమావేశాల్లో అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ, జెడ్పీ సీఈఓ దీక్షారైనా, జిల్లా పంచాయతీ అధికారి ఆశాలత, డీఎల్పీఓలు రాంబాబు, విజయలక్ష్మి, డీపీఆర్వో ఎంఏ.గౌస్ తదితరులు పాల్గొన్నారు. అధికారుల నియామకం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం సన్నద్ధమైంది. ఈక్రమాన జోనల్ అధికారులు, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు (ఎఫ్ఎస్టీ), స్టాటికల్ సర్వైలెన్స్ టీమ్(ఎస్ఎస్టీ)లను కలెక్టర్ అనుదీప్ నియమించారు. జోనల్ అధికారులు 40మందితో పాటు 20 ఎఫ్ఎస్టీ బృందాలు, 16 ఎస్ఎస్టీ బృందాలను ఏర్పాటు చేశారు. అలాగే, నోడల్ అధికారులుగా 15మందిని నియమించారు. బృందాల వారీగా సిబ్బంది నియామకం, బ్యాలెట్ బాక్స్ల పరిశీలన, రవాణా, శిక్షణ తదితర బాధ్యతలు అప్పగించారు. -
క్రీడల్లో జిల్లా ఖ్యాతిని నిలబెట్టాలి
ఖమ్మం స్పోర్ట్స్: జిల్లా నుంచి ఎందరో క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించారని.. వారి స్ఫూర్తితో యువత క్రీడారంగంలో ఎదిగి జిల్లా ఖ్యాతిని నిలబెట్టాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలో రూ.50లక్షల కేఎంసీ నిధులతో నిర్మించిన నూతన టేబుల్ టెన్నిస్ హాల్ను మంత్రి మంగళవారం ప్రారంభించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ టేబుల్ టెన్నిస్ క్రీడాకారులకు అన్ని సదుపాయాలు ఉన్నందున రాష్ట్ర, జాతీయస్థాయిలో రాణించాలని తెలిపారు. మరో క్రికెట్ స్టేడియానికి స్థలం కేటాయించినందున ప్రభుత్వానికి సమర్పించేలా నివేదిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. మేయర్ పునుకొల్లు నీరజ, కమిషనర్ అభిషేక్ అగస్త్య, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బాలసాని విజయ్, వీ.సాంబమూర్తితో పాటు పి.రవిమారుత్, కమర్తపు మురళి, ఆర్.ఉదయ్కుమార్, ఎం.డీ.గౌస్ తదితరులు పాల్గొన్నారు. అమ్మవారికి పూజలు ఖమ్మంఅర్బన్: ఖమ్మంలోని పలు డివిజన్లలో శ్రీదేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో మంగళవారం జరిగిన పూజల్లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. 32వ డివిజన్ కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో రథోత్సవానికి హాజరైన మంత్రి, 15వ డివిజన్ అల్లీపురంలో పూజలు చేయడమే కాక 10వ డివిజన్ పర్ణశాల రామాలయం వద్ద బతకమ్మ సంబురాల్లో పాల్గొన్నారు. మేయర్ పునుకొల్లు నీరజ, డిప్యూటీ మేయర్ ఫాతిమా, మార్కెట్ చైర్మన్ యరగర్ల హన్మంతరావు, కార్పొరేటర్లు రావూరి కరుణ, చావా మాధురి, కమర్తపు మురళితో పాటు మేళ్లచెర్వు వెంకటేశ్వర్లు, బాలసాని లక్ష్మీనారాయణ, పువ్వాళ్ల దుర్గాప్రసాద్, సంక్రాంతి నాగేశ్వరరావు, సైదబాబు, నారాయణరావు, నర్సింహారావు తదితరులు పాల్గొన్నారు. -
రిజర్వేషన్.. పరేషాన్
సాక్షిప్రతినిధి, ఖమ్మం: స్థానిక సంస్థల ఎన్నికల్లో అమలుచేస్తున్న రిజర్వేషన్లతో ఆశావహులు పోటీ చేసే అవకాశం కోల్పోతుండగా.. ఆయా కేటగిరీ అభ్యర్థుల కోసం రాజకీయ పార్టీలు అన్వేషించా ల్సిన పరిస్థితి నెలకొంది.గ్రామ పంచాయతీలకు సంబంధించి కొన్నిచోట్ల అభ్యర్థులే కరువయ్యేలా కనిపిస్తోంది. అలాగే చాలా పంచాయతీల్లో రిజర్వ్ కేటగిరిలో ఒకటి, రెండు కుటుంబాలే ఉన్నాయి. ఈ నేపథ్యాన పార్టీలు బలంగా ఉన్నా.. అభ్యర్థులు లేకపోవడం తలనొప్పి తెచ్చి పెట్టేలా కనిపిస్తోంది. ఈ కారణంగా చాలా గ్రామపంచాయతీల్లో ఏకగ్రీవాలు అనివార్యంగా మారనున్నాయి. ఆశలపై నీళ్లు సర్పంచ్, వార్డు సభ్యులుగా బరిలో ఉండాలనే ఆసక్తితో గ్రామీణ ప్రాంతాల్లో పలువురు దశాబ్దాలుగా రాజకీయం చేస్తున్నారు. కానీ రిజర్వేషన్ల వ్యవహారం వారి ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. ఇదే సమయాన రాజకీయాలతో సంబంధం లేకుండా ఇతర పనులు చేసుకుంటున్న వారికి కలిసొస్తోంది. చాలా గ్రామాల్లో రిజర్వ్ స్థానాల్లో ఒకరు, ఇద్దరు మాత్రమే ఆ కేటగిరీ అభ్యర్థులు ఉన్నారు. దీంతో వారే సర్పంచ్, వార్డు సభ్యులుగా ఎన్నిక కావడం లాంఛనంగా మారనుంది. ఇక బీసీలకు రిజర్వ్ అయిన గ్రామపంచాయతీల్లో బీసీ అభ్యర్థి దొరకని పరిస్థితి నెలకొనడం.. గిరిజనులు ఎక్కువగా ఉండే జీపీలు బీసీలకు, ఎస్సీలు లేని చోట్ల ఎస్సీలకు రిజర్వ్ కావడం గమనార్హం. ఎందుకిలా.. రిజర్వేషన్లతో కొన్ని గ్రామపంచాయతీల్లో నెలకొన్న అయోమయ పరిస్థితిపై రాజకీయ పార్టీలు ఆలోచనలో పడ్డాయి. ఆయా పంచాయతీల్లో రిజర్వేషన్కు తగినట్లుగా అభ్యర్థులు అందుబాటులో లేరు. కొన్ని గ్రామాల్లో రిజర్వ్ కేటగిరీలో ఒకరిద్దరే అర్హులు ఉండడంతో వారిని ఆకర్షించేందుకు నాయకులు తంటాలు పడుతున్నారు. సర్పంచ్ ఎన్నికలకు 2018 జనాభా లెక్కలు, బీసీ రిజర్వేషన్ల కోసం 2024 కులగణనను పరిగణనలోకి తీసుకోవడంతో కొన్నిచోట్ల ఇలా జరిగిందనే చర్చ సాగుతోంది. అయితే నిబంధనల మేరకే రిజర్వేషన్లు చేసినందున మార్చడం కుదరదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. అయినా రిజర్వ్ కేటగిరీ జనాభా తమ జీపీల్లో అతి తక్కువగా ఉన్నందున రిజర్వేషన్లు మార్చాలని కొందరు ఇటీవల కలెక్టర్, ఆర్డీఓలకు ఫిర్యాదు చేశారు.కొన్ని రిజర్వ్డ్ స్థానాల్లో ఆ కేటగిరీ అభ్యర్థులు కరువు చింతకాని మండలం రాఘవాపురం సర్పంచ్ పదవి ఎస్సీ మహిళకు రిజర్వ్ అయింది. గ్రామంలో మొత్తం 471 మంది ఓటర్లకు ఒకే ఎస్సీ కుటుంబం ఉంది. ఆ కుటుంబంలో కాంపల్లి కోటమ్మ, ఆమె కుమారుడు దావీదు ఉండడంతో సర్పంచ్గా కోటమ్మ ఏకగ్రీవం కానుంది. ఇక నాలుగో వార్డు ఎస్సీ జనరల్కు రిజర్వ్ కాగా దావీదు ఏకగ్రీవంగా ఎన్నికవడం ఖాయమే. ఫలితంగా తల్లీకొడుకులు సర్పంచ్, వార్డు సభ్యుడిగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. కూసుమంచి మండలం ధర్మాతండా బీసీ జనరల్కు రిజర్వ్ కాగా అక్కడ కుమ్మరికుంట్ల నాగరాజు – శ్రావణి ఇద్దరే బీసీ ఓటర్లు. వీరిది పక్కనే కేశ్వాపురమైనా తండా వద్ద కోళ్ల ఫారం పెట్టుకుని ఇక్కడే ఓటు హక్కు పొందారు. ఇక మంగలి తండా బీసీ మహిళకు రిజర్వ్ కాగా ఆ తండా యువకుడు బీసీ యువతి అనితను వివాహం చేసుకోవడంతో ఆమెకు ఓటు వచ్చింది. ఇదే తండాకు చెందిన మరో యువకుడు బీసీ మైనార్టీ యువతిని వివాహం చేసుకున్న ఆమెకు ఓటు లేకపోవడంతో అనిత ఏకగ్రీవమయ్యే అవకాశముంది. ఇదే మండలం లాల్సింగ్ తండా సర్పంచ్ పదవి బీసీ మహిళకు రిజర్వ్ కాగా అక్కడ ఒకే బీసీ కుటుంబం నుంచి అత్తాకోడళ్లలో ఒకరికి అవకాశముంది. అజ్మీరా హీరామాన్ తండా బీసీ మహిళకు రిజర్వ్ అయితే అక్కడా ఒకే బీసీ కుటుంబం ఉన్నందున ఏకగ్రీవం కానుంది. అయితే, మంగలితండా, హీరామాన్ తండాల్లో ఇద్దరు యువకులు బీసీ యువతులను వివాహం చేసుకున్నా వారికి వేరే చోట ఓటు ఉంది. నామినేషన్ సమయానికి ఇక్కడకు మారితే పోటీ జరగొచ్చు. ఈనేపథ్యాన ధర్మా తండా, లాల్సింగ్ తండా, మంగలితండాలో రిజర్వేషన్ మార్చాలని స్థానికులు కలెక్టర్, ఆర్డీఓను కోరారు. ఏన్కూరు మండలం షెడ్యూల్ ఏరియా కావడంతో అన్ని సర్పంచ్ పదవులు ఎస్టీలకు రిజర్వ్ అవుతున్నాయి. నూకాలంపాడులో 1,046మంది ఓటర్లకు ఒక్క ఎస్టీ కూడా లేరు. కానీ సర్పంచ్ పదవి ఎస్టీ మహిళలకు రిజర్వ్ అయింది. అంతేకాక 1, 2, 3, 4వ వార్డులూ ఎస్టీలకు రిజర్వు కావడంతో ఎన్నిక జరిగే అవకాశం లేదు. దీంతో మిగిలిన నాలుగు వార్డులకు ఎన్నికలు నిర్వహించిన విజేతల్లో ఒకరిని ఉప సర్పంచ్గా ఎన్నుకుని పంచాయతీ పాలన సాగిస్తారు. పెనుబల్లి మండలం గౌరారం సర్పంచ్ పదవితో పాటు నాలుగు వార్డులు ఎస్టీలకు కేటాయించారు. సర్పంచ్, వార్డు సభ్యులుగా పోటీకి ఇద్దరికే అర్హత ఉంది. దీంతో ఇద్దరూ సర్పంచ్ పదవికి సిద్ధమవుతుండగా నాలుగు వార్డులకు ఎన్నిక జరిగే అవకాశం లేదు. రఘునాథపాలెం మండలంలోని ఎన్.వీ.బంజర, రాములుతండా జీపీల్లో అత్యధికం ఎస్టీ ఓట్లు ఉంటే బీసీ ఓటర్లే లేరు. ఎన్.వీ.బంజర బీసీ మహిళ, రాములుతండా సర్పంచ్ పదవి బీసీ జనరల్కు రిజర్వు అయింది. ఈ విషయాన్ని తండాల వాసులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. కారేపల్లి మండలం కొత్తకమలాపురం సర్పంచ్ పదవి ఎస్టీలకు రిజర్వు చేశారు. ఇక్కడ ఎస్టీ ఓటర్లు లేకపోగా, తండా యువకులు ముగ్గురు ఎస్టీ యువతులను కులాంతర వివాహం చేసుకున్నారు. తద్వారా ముగ్గురు ఎస్టీ ఓటర్లు ఉండగా కొర్ర రమ వీఆర్ఏ ఉద్యోగం చేస్తుండడంతో పోటీకి అవకాశం లేదు. మిగిలిన వట్టం ఉమారాణి, సులోచన 2019 ఎన్నికల్లో పోటీ పడగా ఉమారాణి గెలిచింది. ఈసారి కూడా వీరిద్దరే మరోమారు పోటీ పడనున్నారు. -
రెండో ప్రమాద హెచ్చరిక దాటి..
భద్రాచలంటౌన్ : భద్రాచలం వద్ద గోదావరి రెండో ప్రమాద హెచ్చరిక దాటి ఉధృతంగా ప్రవహిస్తోంది. సోమవారం రాత్రి వరకు మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగగా, మంగళవారం తెల్లవారుజామున 3.30 గంటలకు 48 అడుగులకు చేరడంతో కలెక్టర్ జితేష్ వి.పాటిల్ రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఆ తర్వాత గంటగంటకూ పెరుగుతూ మంగళవారం సాయంత్రం 5 గంటలకు 50 అడుగులకు చేరింది. దీంతో అధికారుల అప్రమత్తమై నాలుగు చోట్ల కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. పరీవాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. వరద తీవ్రత ఇంకా పెరిగితే పునరావాస కేంద్రాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నిలిచిన రాకపోకలు.. భద్రాచలం నుంచి చర్ల, వెంకటాపురం రహదారిపైకి వరద నీరు చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. దసరా ఉత్సవాల నేపథ్యంలో భద్రాచలం వచ్చే భక్తులు స్నానాల కోసం గోదావరిలోకి దిగకుండా ఇనుప కంచె, ప్రమాద హెచ్చరిక ప్లెక్సీలను ఏర్పాటు చేశారు. మంగళవారం సాయంత్రం 5 నుంచి 8 గంటల వరకు నీటిమట్టం 50 అడుగుల వద్ద నిలకడగా ఉంది. ఆ తర్వాత స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. ఎగువన పేరూరు వద్ద గోదావరి ప్రవాహం కొంతమేర తగ్గిందని, ఈ క్రమంలో భద్రాచలంలోనూ తగ్గే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. దీంతో రాత్రి 10 గంటలకు కాస్త తగ్గి 49.70 అడుగులుగా నమోదైంది. ముంపు బారిన పంటలు.. గోదావరి నీటిమట్టం పెరుగుతుండడంతో పరీ వాహక ప్రాంత రైతులు ఆందోళన చెందుతున్నారు. వారికి అక్టోబర్ ఎంతో విలువైంది. ఈ నెలలోనే పత్తి, వరి పంటలకు పాట్లు చేయడం సహా మిర్చి సాగు పనులు ప్రారంభిస్తారు. ఈ క్రమంలో వరద నీటితో పంటలు, మిర్చి సాగు చేసే భూములు ముంపునకు గురికావడంతో దిక్కుదోచని స్థితిలో ఉన్నారు. వరి, పత్తి రైతులకు ఈ వరదలు తీవ్ర నష్టాన్ని మిగుల్చుతున్నాయి. గోదావరి పరీవాహక ప్రాంతాలైన చర్ల, దుమ్ముగూడెం, భద్రాచలం, ఆశ్వాపురం, బూర్గంపాడు, మణుగూరుతో పాటు ఏపీలోని పలు మండలాల్లో ఇప్పటికే పంటలు ముంపునకు గురయ్యాయి. -
బీసీలకే పెద్దపీట !
సాక్షిప్రతినిధి, ఖమ్మం: రాష్ట్రప్రభుత్వం కల్పించిన 42 శాతం రిజర్వేషన్లతో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలు అత్యధిక స్థానాల్లో పోటీ చేసే అవకాశం దక్కింది. తద్వారా ఈసారి జెడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎంపీపీ, సర్పంచ్, వార్డు స్థానాల్లో బీసీల ప్రాతిని ధ్యం పెరగనుంది. వార్డు సభ్యులు మినహా మిగి లిన స్థానాల్లో ఎక్కువగా బీసీలకే రిజర్వు అయ్యా యి. దీంతో బీసీ అభ్యర్థులను బరిలో నిలిపేలా పార్టీలు ఇప్పటి నుంచే అన్వేషణ ప్రారంభించాయి. కలిసొచ్చిన రిజర్వేషన్లు రిజర్వేషన్లు కలిసిరావడంతో ఈ ఎన్నికల్లో బీసీలకు పెద్దపీట దక్కనుంది. జెడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీ, సర్పంచ్, వార్డు సభ్యులతో కలిపి జిల్లాలో బీసీలు 1,783 స్థానాల్లో పోటీకి దిగనున్నారు. గ్రామపంచాయతీల్లోని వార్డులు మినహా జెడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎంపీపీ, సర్పంచ్లుగా వీరే అత్యధికంగా ఉంటారు. మొత్తం 5,214 వార్డుసభ్యుల స్థానాల్లో బీసీలకు 1,474 సీట్లు దక్కగా.. జనరల్ కేటగిరీలో 1,644, ఎస్టీలకు 1,161, ఎస్సీలకు 935 స్థానాలు రిజర్వ్ అయ్యాయి. ఫలితంగా గత ఎన్నికలతో పోలిస్తే ఈ ఎన్నికల్లో పోటీ చేసే బీసీ అభ్యర్థుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఇక 20 జెడ్పీటీసీ స్థానాల్లో బీసీలకు ఎనిమిది, 283 ఎంపీటీసీ స్థానాల్లో 103 బీసీలకు, 72 జనరల్కు, 58 ఎస్సీలకు, 50 స్థానాలు ఎస్టీలకు కేటాయించారు. అలాగే 20 ఎంపీపీ స్థానాల్లో ఎనిమిది బీసీలకు కేటాయించారు. జనరల్కు మూడు, ఎస్టీలకు ఐదు, ఎస్సీలకు నాలుగు రిజర్వ్ అయ్యాయి. ఇక 571 గ్రామపంచాయతీల్లో 190 సర్పంచ్ స్థానాలు బీసీలకు, 171 ఎస్టీలకు, 110 ఎస్సీలకు, 100 జనరల్కు ఉన్నాయి. బరిలో నిలిచేందుకు ఉత్సాహం స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటేందుకు బీసీలు ఉత్సాహంతో ఉన్నారు. పలు స్థానాలు రిజర్వ్ కావడంతో కొందరు సామాన్యులు కూడా రాజకీయ అరంగేట్రానికి అవకాశం దక్కినట్లయింది. రాజకీయ పార్టీల్లోని బీసీలు తమ ప్రాంతాల్లోనే కాకుండా రిజర్వ్ అయిన స్థానాల్లో పోటీ చేయాలనే ఆలోచనతో ఉన్నారు. ఈక్రమంలో తమ వారి మద్దతు కూడగట్టుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఫలితంగా కుల సంఘాలకు ప్రాధాన్యత పెరిగింది. స్థానం ఎస్టీ ఎస్సీ బీసీ జనరల్ మొత్తం జెడ్పీటీసీ 04 04 08 04 20 ఎంపీటీసీ 50 58 103 72 283 ఎంపీపీ 05 04 08 03 20 సర్పంచ్ 171 110 190 100 571 వార్డుసభ్యులు 1,161 935 1,474 1,644 5,214మొత్తం 1,391 1,111 1,783 1,823 6,108 -
పెచ్చుమీరిన కాంగ్రెస్ నేతల దౌర్జన్యాలు
ఖమ్మంవైరారోడ్: జిల్లాలో కాంగ్రెస్ నాయకుల అరాచకాలు పెచ్చుమీరిపోయాయని.. బీఆర్ఎస్ శ్రేణులపై అక్రమ కేసులు బనాయించి వేధింపులకు గురిచేస్తున్నారని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ మండిపడ్డారు. అధికార పార్టీ నాయకుల ప్రోద్బలంతో పోలీసులు వేధించడంతోనే తమ పార్టీ నాయకుడు బానోత్ రవి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని తెలిపారు. మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, కందాళ ఉపేందర్రెడ్డి, బానోత్ చంద్రావతి, జెడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్రాజ్తో కలిసి ఖమ్మంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో మంగళవారం వారు మాట్లాడారు. జిల్లా మంత్రులు అభివృద్ధిపై దృష్టి సారించకుండా బీఆర్ఎస్ నాయకులను రాజకీయంగా అణచివేయాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నించే వారిని ఇబ్బంది పెట్టడం నిత్యకృత్యంగా మారిందని తెలిపారు. బీఆర్ఎస్ నాయకుడు రవిని వేధి స్తున్న వారిపై పోలీసులు ఇప్పటివరకు కేసు నమోదు చేయకపోవడం గర్హనీయమన్నారు. అయి తే, అధికార పార్టీ నాయకులు పోలీసుల ద్వారా తమ శ్రేణులపై అణచివేతకు పాల్పడినా స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయఢంకా మోగించడం తథ్యమని ఎంపీ, ఎమ్మెల్సీ స్పష్టం చేశారు. నాయకులు ఉప్పల వెంకటరమణ, ఖమర్, బెల్లం వేణు పాల్గొన్నారు. అనంతరం పోలీస్ కమిషనర్ సునీల్దత్ను కలిసి వినతిపత్రం అందజేశారు. బీఆర్ఎస్ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడుతున్న పోలీసులపై చర్యలు తీసుకుని, వేధింపులకు గురిచేస్తున్న వారిపై కేసు నమోదు చేయాలని కోరారు.ఎంపీ వద్దిరాజు, ఎమ్మెల్సీ మధు -
అవగాహన సదస్సులో ఏపీఓ జనరల్
భద్రాచలం: హిమాచల్ ప్రదేశ్లో జరిగిన నిషేధిత మత్తు పదార్థాలపై అవగాహన సదస్సుకు భద్రాచలం ఐటీడీఏ ఏపీఓ జనరల్ డేవిడ్రాజ్ హాజరయ్యారు. శిక్షణ అనంతరం భద్రాచలం వచ్చిన ఆయన మంగళవారం వివరాలు వెల్లడించారు. గిరిజన యువత గంజాయి, డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా అవగాహన కల్పించారని, రాష్ట్ర ముఖ్య కార్యనిర్వహణ అధికారి నిఖిల, తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ ప్రతిపాదన మేరకు సదస్సులో పాల్గొన్నట్లు పేర్కొన్నారు. త్వరలో మారుమూల ఆదివాసీ గ్రామాల్లో యువకులకు ప్రత్యేక శిక్షణ అందించేలా ప్రతీ గ్రామంలో అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. హిమాచల్ప్రదేశ్ వెళ్లివచ్చిన డేవిడ్రాజ్ -
తెగుళ్ల నివారణపై రైతులకు అవగాహన
వైరా: చింతకాని మండలంలోని కొదుమూరులో పలువురు రైతులు సాగుచేసిన వరి, పత్తి పంటలను మధిర వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు మంగళవారం పరిశీలించారు. వరుస వర్షాలతో పంటలను తెగుళ్లు ఆశించిన పరిశీలించిన వారు యాజ మాన్య పద్ధతులపై సూచనలు చేశారు. పత్తిలో వడ తెగులు నివారణకు కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రాములను లీటర్ నీటిలో కలిపి మొక్క మొదళ్ల చుట్టూ పిచికారీ చేయాలని సూచించారు. అలాగే అల్బేరి యా, ఆకుమచ్చ తెగులు, కొమ్మ ఎండు తెగులు, కా యకుళ్లు తెగులు నివారణ చర్యలను వివరించారు. అంతేకాక వరిలో ఆకుల మీద తుప్పు మచ్చలకు జింక్లోపం కారణమని నిర్ధారించారు. పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ కె.రుక్మిణీదేవి, వైరా కేవీకే ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ టి.సుచరిత, శాస్త్రవేత్తలు కె.నాగస్వాతి, ఫణిశ్రీ పాల్గొన్నారు. -
డైట్ బిల్లులకు మోక్షం ఎప్పుడో?
● నెలల తరబడి బిల్లుల చెల్లింపుల్లో జాప్యం ● అప్పు చేసి విద్యార్థులకు భోజనం పెడుతున్న అధికారులు ● జిల్లా బకాయిలు రూ.11.94 కోట్లకు పైగానే..ఖమ్మంమయూరిసెంటర్: గ్రామీణ ప్రాంతాల్లోని నిరుపేద విద్యార్థులు చదువుకునేలా ప్రభుత్వం సంక్షేమ వసతిగృహాలను ఏర్పాటు చేసింది. ఇక్కడ టిఫిన్, భోజనం కల్పనకు నెలనెలా తరగతి ఆధారంగా మెస్ చార్జీలతో పాటు సబ్బులు, నూనె, జుట్టు కత్తిరించుకునేందుకు కాస్మోటిక్ చార్జీల పేరిట చెల్లించాలి. కానీ ఈ బిల్లులు నెలనెలా మంజూరు కాకపోవడంతో విద్యార్థులే కాక సంక్షేమ అధికారులూ ఇబ్బంది పడుతున్నారు. జిల్లాలోని ఎస్సీ, బీసీ, గిరిజన సంక్షేమ వసతిగృహాలకు ఆరు నెలల నుండి ఎనిమిది నెలల బిల్లులు రాకపోవడంతో అప్పుచేసి మరీ సరుకులు తీసుకురావాల్సి వస్తుందని వార్డెన్లు వాపోతున్నారు. మరోపక్క సబ్బులు, నూనె లేక విద్యార్థుల పరిస్థితి దయనీయంగా మారింది. ఇక ఎస్సీ సంక్షేమశాఖలో పోస్టు మెట్రిక్ విద్యార్థులకు రూ.500 చొప్పున పాకెట్ మనీ కూడా అందడం లేదు. ఖర్చులు ఇలా.. ప్రభుత్వం ఎస్సీ, బీసీ, గిరిజన సంక్షేమ వసతిగృహాల కు విద్యార్థుల సంఖ్య ఆధారంగా బియ్యం సరఫరా చేస్తుంది. ఇతర సరుకుల కోసం మెస్ బిల్లులు ఇస్తుంది. ఈ డబ్బుతోనే వసతిగృహ సంక్షేమ అధికారులు(వార్డెన్లు) వంట గ్యాస్, గుడ్లు, పాలు కొనగోలు చేయడమే కాక అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనా లు, వారానికి రెండు సార్లు చికెన్ సమకూర్చాలి. అయితే, గురుకులాలు, కేజీబీవీలు, ఆదర్శ పాఠశాలల్లో ఇంటర్మీడియట్ బాలికల వసతిగృహాలకు వీటి సరఫరా కోసం టెండర్లు నిర్వహిస్తున్నారు. కానీ వసతిగృహాల్లో ఆ పరిస్థితి లేక ప్రభుత్వం ఇచ్చే మెస్ బిల్లులతోనే వార్డెన్లు సరుకులు తెప్పించాల్సి వస్తోంది. నెలల తరబడి.. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభివృద్ధి శాఖల వసతి గృహాల్లో విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించే విషయంలో శక్తికి మించి శ్రమిస్తున్నామని సంక్షేమాధికారులు చెబుతున్నారు. అయినా డైట్ బిల్లులు నెలల తరబడి మంజూరు కావడం లేదని వాపోతున్నారు. ఫలితంగా అప్పు చేసి సరుకులు కొనుగోలు చేయాల్సి వస్తోందని వెల్లడించారు. శాఖల వారీగా టెండర్లను పిలిచి పాలు, కూరగాయలు, పెరుగు, నిత్యావసరాలు సరఫరా చేయాల్సి ఉన్నా అధిక ధరలు, ఇతర కారణాలతో అమలు కావడం లేదు. ఫలితంగా సంక్షేమాధికారులే బిల్లులు వచ్చినప్పుడు తీసుకోవచ్చని ముందస్తుగా డబ్బు పెట్టి సరుకులు కొనుగోలు చేసి మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం సమకూరుస్తున్నారు. కానీ నెలల తరబడి బిల్లులు రాక అప్పుల పాలవుతుండగా.. ఇంకొందరు ఆస్తులు, బంగారం తాకట్టు పెట్టి వడ్డీల భారం మోస్తున్నారు. బకాయలు రూ.కోట్లలోనే జిల్లాలో 52 ఎస్సీ, 31 బీసీ, 30 ఎస్టీ వసతిగృహా లు, ఆశ్రమ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో చదువుతున్న విద్యార్థులకు పౌష్టికాహారం అందించేందుకు ప్రభుత్వం డైట్ చార్జీలను ఇస్తుంంటుంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక డైట్ బడ్జెట్ పెంచింది. ప్రభుత్వం నిర్ణయించిన డైట్ చార్జీల ప్రకా రం ప్రతీనెలా జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ వసతిగృహాల్లోని విద్యార్థులకు పౌష్టికాహారం అందించేందుకు సుమారు రూ.1.50 కోట్లకు పైగా ఖర్చవుతోంది. కానీ ఈ బిల్లులను కొద్దినెలలుగా మంజూరు చేయకపోవడంతో సుమారు రూ. 11,94, 50,00కు పైగా బకాయి పేరుకుపోయింది. వారికి ఎనిమిది నెలలు.. ఎస్సీ, బీసీ సంక్షేమ శాఖలకు సంబంధించి ఈ ఏడాది ఏప్రిల్ నుండి సెప్టెంబర్ వరకు డైట్ బిల్లులు రావాల్సి ఉండగా.. గిరిజన సంక్షేమశాఖకు సంబందించి ఈ ఏడాది ఫిబ్రవరి నుండి సెప్టెంబర్ వరకు పెండింగ్ ఉన్నాయి. గిరిజన సంక్షేమశాఖలో ఒక పక్కబిల్లులురాక విద్యార్థులకు భోజనం పెట్టేందుకు ఇబ్బందులు ఎదురవుతుంటే, మరో పక్క డైలీవేజ్,ఔట్సోర్సింగ్ కార్మికుల సమ్మెతో అధికా రులపై భారం పడుతోంది. ప్రస్తుతం వంట చేసేందుకు, ఇతర పనులకు వసతిగృహ సంక్షేమ అధికారు లే సొంత ఖర్చుతో కూలీలను సమకూర్చుకుంటున్నా రు. ఈ అంశంపై ఆయా శాఖల అధికారులను వివరణ కోరగా.. ప్రభుత్వం నుంచి బిల్లులు మంజూరు కాగానే మెస్ చార్జీలు చెల్లిస్తామని వెల్లడించడం గమనార్హం.పోస్టు మెట్రిక్ వసతిగృహాలు 11 విద్యార్థుల సంఖ్య 1,600 ప్రీ మెట్రిక్ వసతిగృహాలు 41 విద్యార్థుల సంఖ్య 3,100 ఏప్రిల్ నుండి రావాల్సిన డైట్ చార్జీలు రూ.3,74,02,500 పోస్టు మెట్రిక్ వసతిగృహాలు 11 విద్యార్థుల సంఖ్య 1,250 ప్రీ మెట్రిక్ వసతిగృహాలు 20 విద్యార్థుల సంఖ్య 1,700 ఏప్రిల్ నుండి రావాల్సిన డైట్ చార్జీలు రూ.2,49,47,500 పోస్టు మెట్రిక్ వసతిగృహాలు 12 జనరల్ వసతిగృహాలు 08 ఆశ్రమ పాఠశాలలు 10 మొత్తం విద్యార్థుల సంఖ్య 4,500 ఏప్రిల్ నుండి రావాల్సిన డైట్ చార్జీలు రూ.5,71,00,000 -
205 కేజీల గంజాయి పట్టివేత
బూర్గంపాడు: అక్రమంగా రవాణా చేస్తున్న గంజాయిని మండలంలోని మోరంపల్లిబంజర వద్ద సోమవారం ఎస్ఐ ప్రసాద్ పట్టుకున్నారు. మంగళవారం పాల్వంచ సీఐ సతీశ్ వివరాలు వెల్లడించారు. హరియాణాలోని కురుక్షేత్రకు చెందిన కారుడ్రైవర్ సంజీవకుమార్ తన ఓనర్ ప్రిన్స్కుమార్ ఆదేశాల మేరకు చింతూరుకు వచ్చి, ప్రధాన్ కారా, లఖన్ హంతాల్ వద్ద 205 కేజీల గంజాయి కొనుగోలు చేశాడు. దానిని తన రాష్ట్రానికి తరలిస్తూ మార్గమధ్యలో మోరంపల్లిబంజర వద్ద పోలీసులు పట్టుకున్నారు. గంజాయి, కారును స్వాధీనం చేసుకుని కారు డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. అక్రమ రవాణాకు సంబంధించి కారు ఓనర్ ప్రిన్స్కుమార్, గంజాయి అమ్మిన ప్రధాన్ కారా, లఖన్ హంతాల్పై కేసు నమోదు చేశామని, సంజీవకుమార్ను అరెస్ట్ చేశామని సీఐ వెల్లడించారు. పట్టుబడిన గంజాయి విలువ రూ.1.02 కోట్లు ఉంటుందని ఆయన పేర్కొన్నారు.ఒకరు అరెస్ట్, ముగ్గురిపై కేసు -
గురుకుల నిర్మాణం త్వరగా పూర్తిచేయాలి
బోనకల్: మండలంలోని లక్ష్మీపురంలో యంగ్ ఇండియా సమీకృత గురుకుల పాఠశాల భవన నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. నిర్మాణ పనులను మంగళవారం ఆయన పరిశీలించిన ఆయన మ్యాప్ ఆధారంగా వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ అద్భుతమైన మేధస్సుతో కూడిన మానవ వనరులను అందించడమే యంగ్ ఇండియా సమీకృత గురుకుల పాఠశాలల లక్ష్యమన్నారు. గ్రామీణ విద్యార్థులకు అత్యున్నత విద్యనందించనున్న గురుకుల భవన నిర్మాణంలో రాజీ పడకుండా పూర్తిచేయాలని సూచించారు. తరగతి, వసతి గదులతో పాటు ఉపాధ్యాయులు, సిబ్బంది క్వార్టర్లు మార్చిలోగా పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ ఈఈ బుగ్గయ్య, తహసీల్దార్ రమాదేవి తదితరులు పాల్గొన్నారు.అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి -
ఎన్డీఆర్ఎఫ్ సేవలు అభినందనీయం
ఖమ్మం సహకారనగర్: వరదల వేళ జిల్లాలో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అందించిన సేవలు అభినందనీయమని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి కొనియాడారు. జిల్లాలో మూడునెలలుగా సేవ లు అందించి తిరిగి హైదరాబాద్ వెళ్తున్న బృందం సభ్యులు కలెక్టర్ను మంగళవారం కలిశా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడునెలల పాటు బృందం జిల్లా యంత్రాంగానికి అండగా నిలిచిందని, చింతకానిలో వరద సమయాన నదిలో చిక్కుకున్న పలువురి ప్రాణాలను కాపాడారని తెలిపారు. అలాగే, ఆపద మిత్రులకు శిక్షణ ఇచ్చారని చెప్పారు. ఆలయ ఆర్చి నిర్మాణానికి రూ.1.60 లక్షల వితరణ కల్లూరు: మండలంలోని పేరువంచలో శ్రీ సీతా రామాంజనేయ స్వామి ఆలయానికి ఎదురుగా ఆర్చి నిర్మానం కోసం అంకిరెడ్డి సుధీర్ కుమార్ జ్ఞాపకార్ధం ఆయన కుటుంబీకులు రూ.1.60లక్షల విరాళం అందజేశారు. ఆయన తల్లిదండ్రులు అంకిరెడ్డి కృష్ణారెడ్డి – వరలక్ష్మి, సోదరుడు నరేష్రెడ్డి – స్వప్న ఈ నగదును ఆలయ కమిటీకి అందజేశారు. తాజాగా ఆర్చి నిర్మా ణం పూర్తికావడంతో దాతలను ఆలయ చైర్మన్ వై.రంగారెడ్డి, వైస్ చైర్మన్ కె.శ్రీనివాసరెడ్డి, సభ్యులు కె.సత్యనారాయణరెడ్డి, వనుకూరు ప్రభాకర్రెడ్డి, కె.రవీందర్రెడ్డి అభినందించారు. ఉద్యోగ విరమణ పొందిన పోలీస్ అధికారులకు సన్మానం ఖమ్మంక్రైం: ఉద్యోగ విరమణ చేసిన పోలీసు అధికారులను మంగళవారం పోలీసు కమిషనర్ సునీల్దత్ సన్మానించారు. ఖమ్మంలోని కమిషనర్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సుదీర్ఘ కాలంగా వివి ధ హోదాల్లో ఉద్యోగులు బాధ్యతాయుతంగా సేవలందించారని కొనియాడారు. ఉద్యోగ విరమణ చేసిన వారిలో వైరా ఏసీపీ ఎం.ఏ.రెహమాన్, ఐటీ కోర్ టీమ్ ఎస్సై పి.సత్యనా రాయణ, వీఆర్ ఎస్సై వి.వెంకటేశ్వర్లు, సీఏఆర్ ఆర్ఎస్సై ఎండీ.సలీమ్, ఏన్కూరు ఏఎస్సై జి.వెంకటేశ్వర్లు, సీఎస్బీ హెడ్ కానిస్టేబుల్ ఎస్కే.సయ్యద్ హుస్సేన్, ఖమ్మం సీపీఓ సీని యర్ అసిస్టెంట్ జి.కాంతి ఉన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ రామానుజం, ఆర్ ఐ కామరాజు, పోలీస్ ఉద్యోగుల అసోసియేషన్ ఇన్చార్జ్ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. వైరా ఏపీసీకి సన్మానం వైరా: రెండున్నరేళ్లుగా వైరా ఏసీపీగా విధులు నిర్వర్తిస్తూ ఉద్యోగ విరమణ చేసిన ఎం.ఏ.రెహమాన్ సేవలు మరువలేనివని పలువురు అధికారులు కొనియాడారు. వైరాలో మంగళవారం రెహమాన్ దంపతులను సన్మానించాక అదనపు డీసీపీలు ప్రసాదరావు, రామానుజం మాట్లాడారు. శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తూ పలు కేసుల పరిష్కారంలో కీలకంగా వ్యవహరించారని తెలిపారు. ఏఆర్ అడిషనల్ డీసీపీ కుమారస్వామి, డీసీఆర్బీ ఏసీపీ సాంబరాజు, సీసీఎస్ ఏసీపీ సర్వర్ పాషా, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు. రేషన్ డీలర్ల బంద్ నిర్ణయం వెనక్కి.. ఖమ్మం సహకారనగర్: కమీషన్ విడుదల చేయాలనే డిమాండ్తో రేషన్ డీలర్లు షాప్లను బంద్ చేయాలని నిర్ణయించగా ఆ ఆలోచనను విరమించుకున్నారు. ఉన్నతాధికారులు రాష్ట్ర సంఘం బాధ్యులతో చర్చించి సమస్యలు పరి ష్కరిస్తామని హామీ ఇచ్చిన నేపథ్యాన నిరసన, బంద్ ఆలోచన విరమించుకున్నట్లు రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బానోతు వెంకన్న, షేక్ జానీమి యా ఓ ప్రకటనలో తెలిపారు. దీంతో బుధవా రం నుంచి రేషన్ షాప్ల ద్వారా బియ్యం పంపిణీ జరగనుంది. హోటల్ నిర్వాహకులకు రూ.20వేల జరిమానా ఖమ్మంమయూరిసెంటర్: జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్కు వెళ్లే మార్గంలో ఓ ప్రముఖ హోటల్ నిర్వాహకులకు ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు రూ.20వేల జరిమానా విధించారు. హోటల్లో మంగళవారం తనిఖీ చేయగా సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ సంచులు వినియోగిస్తున్నట్లు గుర్తించారు. అంతేకాక హోటల్లో అపరిశుభ్రంగా ఉండడంతో రూ.20వేల జరిమానా విధించామని కేఎంసీ శానిటరీ సూపర్వైజర్ సాంబయ్య తెలిపారు. -
కొబ్బరికాయ ధరలకు రెక్కలు
ఖమ్మంగాంధీచౌక్: కొబ్బరికాయల ధరలకు రెక్కలొచ్చాయి. శ్రీదేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు జరుగుతుండడం, దసరా సమీపించిన నేపథ్యాన కొబ్బరి కాయలకు డిమాండ్ పెరిగింది. దీంతో ప్రాంతాలు, కాయ సైజు ఆధారంగా ఒక్కో కొబ్బరికాయను రూ.40 నుంచి రూ.50 వరకు విక్రయిస్తున్నారు. కార్పొరేట్ మాల్స్లో రూ.40 చొప్పున విక్రయిస్తుండగా, రిటైల్ దుకాణాల్లో రూ.45, గ్రామాల్లో రూ.50కి అమ్ముతున్నారు. అంతేకాక ఆలయాల వద్ద ఈ ధరలు మరింత ఎక్కువ ఉంటున్నాయి. నిన్నామొన్నటి వరకు వినియక చవితి ఉత్సవాలు సాగగా, ప్రస్తుతం శరన్నవరాత్రి ఉత్సవాలు జరుగుతుండడం.. మరోపక్క భక్తులు భవానీ దీక్ష, అయ్యప్ప దీక్ష ధరిస్తుండడంతో కొబ్బరికాయలకు డిమాండ్ పెరిగింది. ఏపీలోని గోదావరి జిల్లాలు, కేరళ రాష్ట్రం నుంచి ఖమ్మంలోని హోల్సేల్ వ్యాపారులు దిగుమతి చేసుకుని సైజు ఆధారంగా గ్రేడింగ్ అనంతరం జిల్లాతో పాటు భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాలకు సరఫరా చేస్తున్నారు. దిగుబడి తగ్గడంతో.. కొబ్బరి పంట దిగుబడి ఆశించిన మేర లేకపోవడంతోనే డిమాండ్ పెరిగిందని వ్యాపారులు విశ్లేషిస్తున్నారు. దీనికి తోడు ఆద్యాత్మిక కార్యక్రమాల్లో వినియోగం పెరగడం ఇంకో కారణంగా చెబుతున్నారు. గోదావరి జిల్లాలు, కేరళ రాష్ట్రానికిఆర్డర్ చేసినా సమయానికి రావడం లేదని వ్యాపారులు పేర్కొంటున్నారు. పండుగ వేళ రూ.40కి పైగానే విక్రయం -
స్థానిక ఎన్నికల సమరానికి సిద్ధం కండి
ఖమ్మంమయూరిసెంటర్/రఘునాథపాలెం: స్థానిక ఎన్నికల సమరానికి పార్టీ శ్రేణులు సిద్ధం కావాలని సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు సూచించారు. ఖమ్మంలోని సుందరయ్య భవనంలో పార్టీ ఖమ్మం డివిజన్ రఘునాథపాలెం మండల ముఖ్య నాయకులు, పాలేరు డివిజన్ కమిటీ నాయకులతో మంగళవాం ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ స్థానిక ఎన్నికల్లో ప్రజలకు దగ్గరకు ఉండే వారికే విజయం దక్కనున్నందున పార్టీ శ్రేణులు ప్రజాక్షేత్రంలోకి వెళ్లి వారి సమస్యల పరిష్కారానికి పాటుపడాలని తెలిపారు. ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సీపీఎం అనేక పోరాటాలు నిర్వహించిందని చెప్పారు. ఈనేపథ్యాన సీపీఎం అభ్యర్థులకు ప్రజల మద్దతు కచ్చితంగా లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమావేశాల్లో ఖమ్మం, పాలేరు డివిజన్లు, రఘునాథపాలెం మండల కార్యదర్శి వై.విక్రమ్, బండి రమేష్, ఎస్.నవీన్రెడ్డి, నాయకులు సభ్యురాలు బుగ్గవీటి సరళ, బొంతు రాంబాబు, ఎస్.నవీన్రెడ్డి, మహమ్మద్ జబ్బార్, బానోతు నాగేశ్వరరావు, నాగయ్య, షేక్ ఇమామ్, గుగలోత్ కుమార్, కూచిపూడి నరేష్ పాల్గొన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు -
స్థానిక సమరంలో సత్తా చాటుదాం
ఖమ్మంమయూరిసెంటర్: స్థానిక సమరంలో సత్తా చాటేలా పార్టీ నాయకత్వం, కార్యకర్తలు కృషి చేయాలని సీపీఐ జాతీయ సమితి సభ్యుడు బాగం హేమంతరావు పిలుపునిచ్చారు. ఎన్నికలు జరుగుతాయా, లేదా అన్న మీమాంసను పక్కనపెట్టి అభ్యర్థుల ఎంపికలో నిమగ్నం కావాలని సూచించారు. సీపీఐ జిల్లా సమితి సమావేశం మంగళవారం ఖమ్మంలోని పార్టీ కార్యాలయంలో ఏపూరి లతాదేవి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో హేమంతరావు మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణను సీపీఐ స్వాగతిస్తుండగా, రిజర్వేషన్లకు అనుగుణంగా పనిచేయడంతో పాటు కలిసొచ్చే రాజకీయ పార్టీలతో కలిసి సంప్రదింపులు జరపాలని తెలిపారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్, వార్డు మెంబర్ల స్థానాలకు నాయకత్వంతో సంప్రదిస్తూ అభ్యర్థులను ఎంపిక చేయాని సూచించారు. కాగా, పార్టీ శతజయంతి ఉత్సవ ముగింపు సభ డిసెంబర్ 26న జరగనుండగా, ఈనెల 5న ఖమ్మంలో ఆహ్వాన సంఘం సమావేశం నిర్వహిస్తున్నట్లు హేమంతరావు తెలిపారు. పార్టీ జిల్లా కార్యదర్శి దండి సురేష్ కార్యక్రమాల నివేదికతో పాటు జిల్లాలో పోటీ చేయాల్సిన స్థానాల వివరాలను ప్రవేశపెట్టారు. పార్టీ రాష్ట్ర కంట్రోల్ కమిషన్ ఛైర్మన్ మహ్మద్ మౌలానా, జిల్లా సహాయ కార్యదర్శి జమ్ముల జితేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.సీపీఐ జిల్లా సమితి సమావేశంలో బాగం -
బావిలో పడి వ్యక్తి మృతి
ఖమ్మంక్రైం: ఖమ్మంలోని ఓ దాల్మిల్లులో దినసరికూలీగా పనిచేస్తున్న వ్యక్తి మంగళవారం మధ్యాహ్నం ప్రమాదవశాత్తు బావిలో పడగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఏపీలోని ఏలూరు లేదా హనుమాన్ జంక్షన్ పరి సర ప్రాంతాలకు చెందిన 60ఏళ్ల వ్యక్తి పేరు కృష్ణగా తెలుస్తోంది. ఆయనమంగళవారం దాల్మిల్లులో కూలీకి వెళ్లగా అక్కడి బావిలో కాలుజారి పడ్డాడు. దీంతో తోటి కూలీలు బయటకు తీసి ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మతదేహన్ని ఖమ్మం ఆస్పత్రి మార్చురీలో భద్రపర్చగా, ఆయన ఆచూకీ తెలిసిన వారు తమను సంప్రదించాలని ఖమ్మం త్రీటౌన్ పోలీసులు సూచించారు. విద్యుదాఘాతంతో వ్యక్తి .. కామేపల్లి: ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురైన వ్యక్తి మృతిచెందాడు. మండలంలోనిని గరిడేపల్లికి చెందిన మాలోత్ నవీన్(25) ఇంటి చుట్టూ రేకులతో వేసిన ఇంట్లో నివాసం ఉంటున్నాడు. ఈక్రమాన సోమవారం రాత్రి ఫ్యాన్ కు అమర్చిన కరెంట్ వైరు తెగి రేకులకు తాకింది. ఆపై నవీన్ ప్రమాదవశాత్తు రేకులను తాకడంతో షాక్కు గురై అక్కడికక్కడే మృతిచెందాడు. ఆయన భార్య నందిని ఫిర్యాదుతో మంగళవారం పోలీసులు కేసు నమోదు చేశారు. ట్రాక్టర్ కిందపడి యువకుడు.. నేలకొండపల్లి: రెండు బైక్లు ఢీకొనగా కింద పడిన వ్యక్తి పైనుంచి ట్రాక్టర్ వెళ్లడంతో అక్కడిక్కడే మృతి చెందిన ఘటన ఇది. మండలంలోని కోనాయిగూడెంకు చెందిన సుతారీ మేసీ్త్ర కొచ్చేర్ల బాలకృష్ణ(35) రోజుమాదిరిగానే మంగళవా రం పనికి వెళ్లి రాత్రి ఇంటికి బైక్పై వస్తున్నాడు. రాజేశ్వరపురం సాగర్ కాల్వ సమీపాన నేలకొండపల్లి నుంచి కూసుమంచి వెళ్తున్న మరో బైక్ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో బాలకృష్ణ రోడ్డుపై పడగా వెనక నుంచి వచ్చిన ట్రాక్టర్ ఆయన పైనుంచి వెళ్లడంతో అక్కడిక్కిడే మృతి చెందాడు. ఈ ప్రమాదంలో మరో బైక్పై ఉన్న వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. 17 ఏళ్ల బాలుడు అదృశ్యం ఖమ్మంఅర్బన్: ఖమ్మం 7వ డివిజన్ టేకులపల్లికి చెందిన 17ఏళ్ల బాలుడు కానరాకుండా పోయాడు. టేకులపల్లికి చెందిన బొడ్డు రామకృష్ణ కుమారుడు భవానీప్రసాద్ సోమవారం మధ్యాహ్నం ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. ఎక్కడ వెతికినా ఆచూకీ లేకపోవడంతో ఆయన తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఖమ్మం అర్బన్ సీఐ భానుప్రకాశ్ తెలిపారు. -
‘చాంబర్’ ఎన్నికలకు సమాయత్తం
ఖమ్మంగాంధీచౌక్: ఖమ్మం చాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికలకు సమయం ఆసన్నమైంది. ఆఫీస్ బేరర్లు, 19 వ్యాపార శాఖల విభాగాల ప్రతినిధులను మూడేళ్లకోసారి ఎన్నుకుంటారు. ఈమేరకు వ్యాపారులు ప్యానెళ్లుగా ఏర్పడి బరిలో నిలుస్తారు. ఈసారి అధ్యక్షుడిగా కురువెళ్ల ప్రవీణ్కుమార్, ప్రధాన కార్యదర్శిగా గొడవర్తి శ్రీనివాసరావు, ఉపాధ్యక్షుడిగా కురువెళ్ల కాంతారావు, సహాయ కార్యదర్శిగా బాదె రమేష్, కోశాధికారిగా తూములూరి లక్ష్మీనరసింహారావు పోటీ చేసేలా మరికొందరితో ప్యానల్ ఏర్పాటైంది. ఈ ప్యానల్ బాధ్యులు సోమవారం ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో వ్యాపారులను కలిసి తమను గెలిపించాలని అభ్యర్థిచారు. వీరికి మద్దతుగా పత్తిపాక రమేష్, పొలవరపు కోటేశ్వరరావు, మాటేటి రాకేష్, చిలకల ఆదినారాయణ, వడ్డే వెంకటేశ్వర్లు, సోమవరపు సుదీర్కుమార్, ప్రభాకర్, బజ్జూరి రమణా రెడ్డి, బండి సతీష్ సిరికొండ వెంకటేశ్వర్లు, గుడిపూడి నరిసింహారావు ప్రచారంలో పాల్గొన్నారు. -
ప్రజావాణి దరఖాస్తులకు ప్రాధాన్యత
ఖమ్మం సహకారనగర్: ప్రజావాణిలో ప్రజలు ఇచ్చే ప్రతీ ఫిర్యాదును పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్లు పి.శ్రీజ, పి.శ్రీనివాసరెడ్డితో కలిసి ఆయన ఫిర్యాదులు, వినతిపత్రాలు స్వీకరించారు. అనంతరం అధికారులతో సమావేశమై దరఖాస్తుల పరిష్కారంపై సూచనలు చేశారు. సోలార్ విద్యుత్తో ప్రయోజకరం ఖమ్మంవ్యవసాయం: సోలార్ విద్యుత్తో అనేక ప్రయోజనాలు ఉన్నందున అర్హత కలిగిన గృహ వినియోగదారులు ఏర్పాటుచేసుకునేలా అవగాహ న కల్పించాలని కలెక్టర్ అనుదీప్ ఆదేశించారు. కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డితో కలిసి సోమవారం ఆయన అధికారులతో ‘పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన’పై సమీక్షించారు. తొలుత పథకం విధివిధానాలను ఎన్పీడీసీఎల్ ఎస్ఈ శ్రీనివాసాచారి వెల్లడించాక కలెక్టర్ మాట్లాడుతూ ఎక్కువ మంది సోలర్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుచేసుకునేలా అవగాహన కల్పించాలని చెప్పారు. తద్వారా పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందని తెలిపారు. పూర్తిసమాచారం కోసం ఎన్పీడీసీఎల్ హెల్ప్లైన్ 1912 లేదా ఏఈ / డీఈ కార్యాలయాల్లో సంప్రదించేలా ప్రచారం చేయాలని సూచించారు. ఈసమావేశాల్లో డీఆర్వో పద్మశ్రీ, జెడ్పీ సీఈఓ దీక్షారైనా తదితరులు పాల్గొన్నారు. సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతిరూపం ఖమ్మంమయూరిసెంటర్: సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతిరూపంగా బతుకమ్మ పండుగ నిలుస్తోందని.. ప్రకృతిని అమ్మగా కొలిచే ఈ పండుగకు ఎంతో ప్రాధాన్యత ఉందని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. ఖమ్మం పెవిలియన్ మైదానంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో కలెక్టర్ దంపతులు పాల్గొన్నారు. గౌరమ్మ తల్లికి పసుపు, కుంకుమతో పూజించిన వారు మహిళలతో కలిసి బతుకమ్మ ఆడి ఉత్తేజపరిచారు. డీఆర్డీఓ సన్యాసయ్య, వివిధ శాఖ ల అధికారులు, మహిళా ఉద్యోగులు, స్వయం సహాయక సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి -
ఎకై ్సజ్ ఎస్సైగా ఎంపికై న కానిస్టేబుల్
వైరారూరల్: వైరా మండలం గన్నవరం గ్రామానికి చెందిన కారుమంచి విజయ్ గ్రూప్–2 ఫలితాల్లో ఎకై ్సజ్ ఎస్సైగా ఎంపికయ్యాడు. ఆయన బీటెక్ పూర్తిచేశాక 2012లో రైల్వే ట్రాక్మెన్గా, 2014లో ఎకై ్సజ్ కానిస్టేబుల్ ఉద్యోగం సాధించి సత్తుపల్లిలో ఉద్యోగం చేస్తున్నాడు. అయినా పట్టువీడక పరీక్షలకు సిద్ధమవడంతో గ్రూప్–2 ఫలితాల్లో ఎకై ్సజ్ ఎస్సైగా ఎంపికయ్యాడు. విజయ్ తల్లిదండ్రులు కారుమంచి జయరావు, ఎలిశ మ్మ వ్యవసాయ కూలీలుగా జీవనం సాగిస్తూ చదివించారు. 5న సీపీఐ శత వసంతాల సభ సన్నాహాక సమావేశంఖమ్మంమయూరిసెంటర్: సీపీఐశత వసంతాల ముగింపు సభ డిసెంబర్లో ఖమ్మంలో జరగనుండగా, నేపథ్యాన అక్టోబర్ 5న సన్నాహక సమావేశం ఏర్పాటుచేసినట్లు భద్రాద్రి, ఖమ్మం జిల్లాల కార్యదర్శులు ఎస్.కే.సాబీర్ పాషా, దండి సురేష్ తెలిపారు. ఖమ్మం ఎస్ ఆర్ గార్డెన్స్లో పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అధ్యక్షతన జరిగే సమావేశంలో జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా, బినాయ్ విశ్వం, కె.నారాయణ, అజీజ్ పాషా, పువ్వాడ నాగేశ్వరరావు, చాడ వెంకటరెడ్డి హాజ రవుతారని వెల్లడించారు. అలాగే, ఆహ్వాన సంఘ సమావేశానికి తెలంగాణతో పాటు వివిధ ఇతర రాష్ట్రాల నేతలు పల్లా వెంకటరెడ్డి, కె. రామకృష్ణ, ఎం.వీరపాండ్యన్, మహ్మద్ సలీం, సుందరేష్, పర్ష పద్మ, శ్రీనివాస్, ఈటి నర్సింహా, బాగం హేమంతరావు తదితరులు కూడా పాల్గొంటారని తెలిపారు. డీలర్ల సమస్యలు పరిష్కరించాలిఖమ్మం సహకారనగర్: రేషన్ డీలర్ల పెండింగ్ సమస్యలన్నీ పరిష్కరించాలని సంఘం బాధ్యులు కోరారు. కలెక్టరేట్ వద్ద ధర్నాచౌక్లో జిల్లా రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యాన సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం బాధ్యులు మాట్లాడుతూ తమ కు నెలలుగా పెండింగ్ ఉన్న కమీషన్ విడుదల చేయడమే ఇతర సమస్యలు పరిష్కరించాలన్నారు. ధర్నాకు వైరా మాజీ ఎమ్మెల్యే చంద్రావతి సంఘీభావం తెలిపి మాట్లాడుతూ డీలర్ల సమస్యలు పరిష్కారమయ్యే వరకు అండగా నిలుస్తామని తెలిపారు. అనంతరం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టికి వినతిపత్రం అందజేశారు. డీలర్ల సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బానోతు వెంకన్న, షేక్ జానీమియాతో పాటు దుర్గయ్య, మౌలానా తదితరులు పాల్గొన్నారు. -
సరస్వతీదేవిగా అమ్మవారు
ఎర్రుపాలెం: తెలంగాణ తిరుపతిగా పేరున్న జమలాపురంలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో శ్రీదేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు సోమవారం ఎనిమిదో రోజుకు చేరాయి. ఈ సందర్భంగా స్వామికి అర్చకులు తెల్లవారుజామున పంచామృతంతో అభిషేకం చేశారు. ఆతర్వాత యాగశాలలో అమ్మవారిని సరస్వతీదేవి రూపంలో అలంకరించి చంఢీహోమం నిర్వహించడమే కాక పలువురి చిన్నారులకు అక్షరాభ్యాసం జరిపించారు. ఆలయ ఈఓ కె.జగన్మోహన్రావు, చైర్మన్ ఉప్పల శ్రీరామచంద్రమూర్తి, ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాసశర్మ, అర్చకులు ఉప్పల మురళీమోహన్శర్మ, రాజీవ్శర్మ, సిబ్బంది పాల్గొన్నారు. ఆర్టీసీలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ భద్రాచలంటౌన్: ఆర్టీసీలో వేయి మంది డ్రైవర్లు, 743 శ్రామిక్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడిందని, ఉమ్మడి జిల్లాలో అర్హత కలిగిన గిరిజన నిరుద్యోగ యువత దరఖాస్తు చేసుకోవాలని భద్రాద్రి ఐటీడీఏ పీఓ బి.రాహుల్ సూచించారు. www. tgprb. in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. 22 – 40 ఏళ్ల వయస్సు కలిగిన వారు డ్రైవర్లుగా, 18 – 35 ఏళ్ల వయస్సు వారు శ్రామిక్ పోస్టులకు అర్హులని వెల్లడించారు. డ్రైవర్ పోస్టుకు రూ.300, శ్రామిక్ పోస్టుకు రూ.200 చెల్లించి అక్టోబర్ 8నుంచి 28 వరకు దరఖాస్తు చేసుకోవాలని పీఓ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. నాలుగో రోజూ అందని టెండర్లు పండుగ తర్వాతే వైన్స్ దరఖాస్తులు ఖమ్మంక్రైం: 2025–2027 సంవత్సరంనకు గాను జిల్లాలో 116 వైన్స్ షాపుల కేటాయింపునకు షెడ్యూల్ విడుదల చేసిన అధికారులు ఈనెల 26వ తేదీ నుంచి టెండర్ల స్వీకరణకు ఏర్పాట్లు చేశారు. అయితే, నాలుగో రోజైన సోమవారం కూడా జిల్లాని షాప్లకు ఒక్క దరఖాస్తూ రాలేదు. జిల్లావ్యాప్తంగా వైన్స్కు ఖమ్మం ఎకై ్సజ్ స్టేషన్–1లోనే దరఖాస్తుల స్వీకరించనున్నట్లు ప్రకటించారు. కాగా, వ్యాపారులు పలువురు మంచి రోజు చూసుకుని డీడీలు తీస్తున్నా అక్టోబర్ 18వరకు గడువు ఉన్నందున దసరా తర్వాతే టెండర్లు దాఖలు చేయాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఆలోగా ఒకటి, రెండు దరఖాస్తుల వచ్చినా పండుగ తర్వాత ఊపందుకుంటుందని భావిస్తున్నారు. -
విద్యుత్ శాఖకు బకాయిల షాక్
● జిల్లాలో బకాయిలు రూ.143కోట్లకు పైగానే.. ● వసూళ్ల బాధ్యత సిబ్బందికి అప్పగింత.. ● వినియోగదారుల్లో అవగాహనకు మైకులతో ప్రచారంఖమ్మంవ్యవసాయం: జిల్లాలో విద్యుత్ బిల్లు బకాయిలు నానాటికీ పెరుగుతున్నాయి. వివిధ కేటగిరీల్లో విద్యుత్ వినియోగానికి సంబంధించి బకాయిలు రూ.కోట్లలోకి చేరడంతో వసూళ్లపై అధికారులు దృష్టి సారించారు. జిల్లాలో ఎనిమిది కేటగిరీల్లో సుమారు 7 లక్షల విద్యుత్ కనెక్షన్లు ఉండగా.. ఇందులో దాదాపు 5లక్షలు గృహ సర్వీసులు, 1.20 లక్షల వ్యవసాయ కనెక్షన్లు ఉన్నాయి. అలాగే, పరిశ్రమలవి 66 లక్షలు, ఇతరత్రా మరో 13 లక్షల వరకు ఉన్నాయి. అయితే, 5లక్షల గృహ సర్వీసుల్లో 2.88 లక్షల సర్వీసులు గృహజ్యోతి పథకంలో కొనసాగుతుండగా, మరికొందరు తెల్ల రేషన్ కార్డుదారులు సైతం గృహజ్యోతి పథకానికి దరఖాస్తు చేసుకున్నారు. వీరంతా తమకు ఉచిత విద్యుత్ అందుతుందనే భావనతో నెలనెలా బిల్లులు చెల్లించడం లేదు. మిగిలిన కేటగిరీల్లో బకాయిలు పేరుకుపోవడంతో అధికారులు వసూళ్ల బాధ్యతను ఉద్యోగులు, సిబ్బందికి అప్పగించి మైకుల్లో ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వ శాఖలవే అధికం జిల్లాలో 2025 జూలై 31నాటికి విద్యుత్ బకాయిలు రూ.143.32 కోట్ల మేర పెండింగ్ ఉన్నాయి. ఆతర్వాత ఆగస్టు వరకు లెక్కిస్తే ఈ బకాయి మరింత పెరిగే అవకాశముంది. ఇందులో అధికంగా ప్రభుత్వ శాఖలవే ఉండడం గమనార్హం. గ్రామపంచాయితీలు, మున్సిపాలిటీల్లో వీధిలైట్లు, వాటర్ వర్క్స్ అంశాల్లో రూ.83.21 కోట్ల బకాయి ఉండగా.. కేటగిరీ–2లో గృహేతర, వాణిజ్య సర్వీసుల బకాయిలు రూ.30.39 కోట్లు పేరుకుపోయాయి. ఇక గృహాలకు సంబంధించి రూ.13.65 కోట్లు, వ్యవసాయ కనెక్షన్ల బకాయి రూ.11.66 కోట్లు ఉండడంతో వసూళ్లపై విద్యుత్ శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. సెక్షన్ల వారీగా బాద్యతలు బకాయిల వసూళ్లకు విద్యుత్ శాఖ ప్రత్యేక డ్రైవ్లో భాగంగా విద్యుత్ సిబ్బందికి బాధ్యతలు అప్పగించింది. బకాయి జాబితాలను సెక్షన్ల వారీగా అందించి వినియోగదారుల వద్దకు వెళ్లి బిల్లు చెల్లించేలా అవగాహన కల్పించాలని సూచించారు. దీంతో లైన్మెన్లు మొదలు ఆపై ఉద్యోగులు బకాయి జాబితాలతో వినియోగదారులు కలుస్తున్నారు. బకాయి పేరుకుపోతే ప్రతీనెల 6 శాతం వడ్డీ పడుతుందని, తద్వారా బిల్లు పెరుగుతుందని చెబుతూ చెల్లించేలా అవగాహన కల్పిస్తున్నారు. అంతేకాక గృహజ్యోతిపైనా వినియోగదారుల్లో సందేహాలను నివృత్తి చేస్తున్నారు. దీనికి తోడు పలు ప్రాంతాల్లో బిల్లు బకాయి చెల్లించాలని సిబ్బంది మైకుల్లో ప్రచారం చేస్తున్నారు. కేటగిరీల వారీగా విద్యుత్ బకాయిలు (రూ. కోట్లలో) కేటగిరీ బకాయి కేటగిరీ–1 (గృహాలు) 13.65 కేటగిరీ–2 (వాణిజ్య/గృహేతర) 30.39 కేటగిరీ–3 (ఎల్టీ ఇండస్ట్రీ) 3.18 కేటగిరీ–4 (కాటేజెస్ ఇండస్ట్రీస్) 0.01 కేటగిరీ–5 (వ్యవసాయ) 11.66 కేటగిరీ–6 (జీపీలు, మున్సిపాలిటీలు) 83.21 కేటగిరీ–7 (పాఠశాలలు, ఆలయాలు) 0.97 కేటగిరీ–8 (తాత్కాలిక సరఫరా) 0.25 మొత్తం 143.32విద్యుత్ బిల్లు బకాయిలు వసూలు చేసేలా ప్రత్యేక దృష్టి సారించాం. ఇందుకోసం ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతున్నాం. విద్యుత్ సరఫరాతో పాటు బిల్లుల వసూలు బాధ్యత మా శాఖపై ఉంది.. వివిధ కేటగిరీల్లో పేరుకుపోయిన బకాయిలను వసూలు చేసేలా సిబ్బంది కృషి చేస్తున్నారు. – ఇనుగుర్తి శ్రీనివాసాచారి, ఎస్ఈ, ఎన్పీడీసీఎల్ -
అటవీ సంరక్షణ కమిటీలతో జీవనోపాధి
● డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ● 234 మంది సభ్యులకు యూనిట్ల పంపిణీమధిర: అటవీ సంరక్షణ కమిటీలు అటవీ సంరక్షణలో మాత్రమే కాకుండా గ్రామీణ కుటుంబాలకు జీవనోపాధి అవకాశాలు కల్పించడంలోనూ కీలకపాత్ర పోషిస్తున్నాయని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. మధిర అటవీ రేంజ్ పరిధి గుంటుపల్లి, గోపవరం గ్రామ వన సర్కాశన్ సమితి సభ్యుల జీవనోపాధి, సామాజిక, ఆర్థికాభివృద్ధి కోసం యూనిట్లను సోమవారం మధిరలో డిప్యూటీ సీఎం భట్టి పంపిణీ చేసి మాట్లాడారు. ప్రకృతి పరిరక్షణతో పాటు సమాజ సమగ్రాభివృద్ధికి అటవీ సంరక్షణ కమిటీలు కృషి చేస్తున్నాయని తెలిపారు. జిల్లా అటవీ శాఖ అధికారి సిద్ధార్థ విక్రమ్సింగ్ మాట్లాడుతూ అటవీ సంరక్షణ కమిటీల అభివృద్ధికి అన్నిరకాల చేయూతనిస్తున్నామని చెప్పారు. గ్రామీణ యువత, మహిళలకు అందించే యూనిట్లతో వారి ఆర్థిక స్వావలంబన సాధ్యమవుతుందని తెలిపారు. ఈమేరకు 234 మంది సభ్యులకు 115 పవర్ టిల్లర్లు, 10రోటోవేటర్లు, 11ట్రాక్టర్ కల్టివేటర్లు పంపిణీ చేశామని వెల్లడించారు. వ్యవసాయ మార్కెట్ చైర్మన్ బండారు నరసింహారావు, మధిర రేంజ్ ఫారెస్ట్ ఆఫీసర్ బి.శ్రీనివాసరెడ్డి, ఉద్యోగులు పాల్గొన్నారు. స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటాలి చింతకాని: స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అత్యధిక స్థానాల్లో గెలిచేలా నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క సూచించారు. హైదరాబాద్ వెళ్లే క్రమాన చింతకాని మండలం నాగులవంచలో మత్కేపల్లి మార్కెట్ చైర్మన్ అంబటి వెంకటేశ్వరరావు ఇంటి వద్ద ఆయన ముఖ్యనాయకులతో మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లు, పోటీపై సూచనలు చేశారు. అలాగే, రైతుల అభ్యున్నతికి పాటుపడాలని మార్కెట్కు చైర్మన్కు సూచించారు. వైరా ఎమ్మెల్యే రాందాస్నాయక్, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, నాయకులు మడుపల్లి భాస్కర్, కొప్పుల గోవిందరావు, కన్నెబోయిన గోపి, బందెల నాగార్జున్, ఆలస్యం బస్వయ్య, కంభం వీరభద్రం, షేక్ అబ్దుల్ నబీ, తదితరులు పాల్గొన్నారు. -
సమరానికి సైరన్
స్థానిక సంస్థల ఎన్నికలపై నెలకొన్న ఊహాగానాలకు తెరపడింది. ఏడాదిన్నరగా అటు జెడ్పీటీసీ, ఎంపీటీసీ, ఇటు గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణపై అయోమయం నెలకొంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్లను అమలుకు ప్రభుత్వం పంచాయతీ రాజ్ చట్టాన్ని సవరించింది. ఆ తర్వాత ఎన్నికలు నిర్వహించాలని కొందరు కోర్టుకు వెళ్లడంతో.. సెప్టెంబర్ 30లోగా ఎన్నికలు పూర్తి చేయాలని హైకోర్టు తీర్పునిచ్చింది. ఆమేరకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసినా.. రిజర్వేషన్లు తేలకపోవడంతో కొంత ఆలస్యమైంది. ప్రస్తుతం బీసీ రిజర్వేషన్లు ఖరారు కావడంతో రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేసింది. సాక్షిప్రతినిధి, ఖమ్మం: స్థానిక సంస్థల ఎన్నికల సమరానికి ఎన్నికల సంఘం సైరన్ మోగించింది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలతో పాటు గ్రామపంచాయతీ ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేసింది. దీంతో రాజకీయ పార్టీల నాయకులు, ఆశావహుల నిరీక్షణకు తెరపడింది. వచ్చేనెల 9వ తేదీన స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుండగా.. తొలుత రెండు విడతల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు, ఆపై మూడు విడతల్లో జీపీ ఎన్నికలు జరగనున్నాయి. షెడ్యూల్ విడుదలతో కోడ్ అమల్లోకి రాగా, ఎన్నికల సందడి మొదలైంది. అంతా సిద్ధం.. ఎన్నికల ఏర్పాట్లపై యంత్రాంగం దృష్టి సారించింది. ఇప్పటికే పోలింగ్ స్టేషన్లు, ఓటర్ల జాబితా ఖరారు కాగా.. బ్యాలెట్బాక్స్లు, ఇతర సామగ్రి సమకూర్చుకున్నారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు 1,580 పోలింగ్ కేంద్రాలను గుర్తించి 2,814 బ్యాలెట్ బాక్స్లను సిద్ధం చేశారు. గ్రామపంచాయతీలకు 20 శాతం రిజర్వ్తో కలిసి 6,257 బ్యాలెట్ బాక్స్లు అవసరం ఉండగా.. ప్రస్తుతం 3,146 బ్యాలెట్ బాక్స్లు అందుబాటులో ఉన్నాయి. కాగా, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు పీఓలు 1,895, ఓపీఓలు 5,055 అవసరమని గుర్తించారు. జిల్లాలో క్రిటికల్ పోలింగ్స్టేషన్లు 18, సమస్యాత్మక పోలింగ్కేంద్రాలు 138, అతి సమస్యాత్మక కేంద్రాలు 200గా గుర్తించి అక్కడ ప్రత్యేక దృష్టి సారించారు. వచ్చేనెల 9న పరిషత్ నోటిఫికేషన్ జిల్లాలో రెండు విడతల్లో మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు జరగనున్నాయి. మొదటి విడత అక్టోబర్ 9న, రెండో విడత 12న నోటిఫికేషన్ విడుదలవుతుంది. మొదటి విడత అక్టోబర్ 11 వరకు, రెండో విడత 15 వరకు నామినేషన్లు స్వీకరించి, అక్టోబర్ 23, 27వ తేదీల్లో పోలింగ్ నిర్వహిస్తారు. మొత్తం కలిపి నవంబర్ 11న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఆ తర్వాత పంచాయతీ జిల్లాలో మూడు విడతల్లో గ్రామపంచాయతీ ఎన్ని కలు ఉంటాయి. అక్టోబర్ 17, 21, 25వ తేదీల్లో విడతల వారీగా నోటిఫికేషన్లు విడుదల చేస్తారు. ఇక 19, 23, 27వ తేదీ వరకు నామినేన్లు దాఖలు చేసుకోవచ్చు. గ్రామపంచాయతీ పోలింగ్ మొదటి విడత అక్టోబర్ 31న, రెండో విడత నవంబర్ 4న, మూడో విడత 8న నిర్వమిస్తారు. ఏ విడతలోనైనా ఎన్నిక ముగిసిన రోజే ఓట్లు లెక్కించి ఫలితాలను ప్రకటిస్తారు. ఆ రోజే ఉప సర్పంచ్ ఎన్నిక కూడా నిర్వహించాలి. ఏదైనా కారణంతో ఉపసర్పంచ్ ఎన్నిక జరగపోతే మరుసటి రోజు ఎన్నుకుంటారు. జెడ్పీటీసీ స్థానాలు 20ఎంపీటీసీ స్థానాలు 283పోలింగ్స్టేషన్లు 1,580ఓటర్లు 8,02,690పురుషులు 3,88,243మహిళలు 4,14,425ఇతరులు 22గ్రామపంచాయతీలు 571వార్డులు 5,214పోలింగ్ స్టేషన్లు 5,214ఓటర్లు 8,02,691పురుషులు 3,88,244మహిళలు 4,14,425ఇతరులు 22 ఎక్కడెక్కడ... రెండు విడతల్లో పరిషత్ పోరు -
మా హయాంలోనే అభివృద్ధి
నేలకొండపల్లి: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాకే అభివృద్ధి పరుగులు తీస్తోందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. మండలంలోని అమ్మగూడెం, కోనాయిగూడెం, నేలకొండపల్లిల్లో సోమవారం ఉదయం ఆయన బీటీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసి మాట్లాడారు. అలాగే, ఇటీవల మృతి చెందిన వారి కుటుంబాలను పరామర్శించారు. మార్కెట్ చైర్మన్ వెన్నపూసల సీతారాములు, నాయకులు శాఖమూరి రమేష్, భధ్రయ్య, బచ్చలకూరి నాగరాజు, జెర్రిపోతుల అంజిని, బొందయ్య, అడపాల రామారావు, నల్లాని మల్లికార్జున్రావు, రాయపూడి నవీన్, నంబూరి రామారావు, యర్రబోయిన నర్సయ్య, పెంటమళ్ల పుల్లమ్మ, కొచ్చేర్ల శ్రీనివాసరావు, కొమ్మినేని పుష్పావతి, మేకల వెంకటేశ్వర్లు, కొమ్మినేని విజయ్బాబు, కడియాల నరేష్, ఇస్లావత్ బాలాజీ, సుభద్ర తదితరులు పాల్గొన్నారు. బతుకమ్మ వేడుకల్లో మంత్రి కూసుమంచి: మండలంలోని నాయకన్గూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో సోమవారం రాత్రి నిర్వహించిన సద్దుల బతుకమ్మ వేడుకల్లో రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళలతో ఆడిపాడిన ఆయన మాట్లాడారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు బతుకమ్మ పండుగ ప్రతీకగా నిలుస్తోందని మంత్రి తెలిపారు.రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి -
పక్కాగా నిబంధనల అమలు
● ఎన్నికల నియమావళి అమలుపై ప్రత్యేక దృష్టి ● రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని ఖమ్మం సహకారనగర్: ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినందున ఎక్కడ కూడా నియమావళి, నిబంధనలను విస్మరించకుండా యంత్రాంగం పర్యవేక్షించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఐ.రాణి కుముదిని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ అమలు, ఇతర ఏర్పాట్లపై సోమవారం ఆమె వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. జిల్లా నుంచి కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, పోలీస్ కమిషనర్ సునీల్దత్, అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ, కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్య, కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ రాణి కుముదిని మాట్లాడుతూ ఎన్నికల షెడ్యూల్ విడుదలైనందున ప్రవర్తన నియమావళిని అమలు చేయాలన్నారు. ఓటర్లను ప్రభావితం చేసేలా ఎవరు వ్యవహరించినా నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లా కలెక్టర్ అనుదీప్ మాట్లాడుతూ జిల్లాలో పోలింగ్కు బ్యాలెట్ బాక్సులు సమకూర్చుకోగా, ఉద్యోగులకు శిక్షణపై ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ప్రత్యేక బృందాల ఏర్పాటు స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లు, సన్నద్ధతపై అధికారులతో కలెక్టర్ అనుదీప్ సమీక్షించారు. కలెక్టరేట్లో అదనపు కలెక్టర్లు పి.శ్రీజ, పి.శ్రీనివాసరెడ్డితో కలిసి అధికారులతో సమావేశమైన ఆయన పలు సూచనలు చేశారు. నిబంధనలు పక్కాగా అమలయ్యే అధికారులు పర్యవేక్షించాలని సూచించారు. రాజకీయ పార్టీల ఫ్లెక్సీలు తొలగించడమే కాకప్రతీ మండలంలో అవసరమైన బృందాలను ఏర్పాటుచేయాలని తెలిపారు. పోలింగ్ కేంద్రాలను పంచాయతీ కార్యదర్శులు పరిశీలించి వసతులపై నివేదిక ఇవ్వాలని చెప్పారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యాక నామినేషన్ల స్వీకరణ, ఉప సంహరణ, స్క్రుటినీ, గుర్తుల కేటాయింపులో పారదర్శకంగా వ్యవహరించాలని తెలిపారు. ఎన్నికల శిక్షణకు ఉద్యోగులు హాజరుకాకపోతే షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. అనంతరం వానా కాలం ధాన్యం కొనుగోళ్లకు కార్యాచరణ, సీఎంఆర్ సేకరణ, పత్తి కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, ఆన్లైన్లో పంటల నమోదుపై సూచనలు చేశారు. ఈ సమావేశాల్లో జిల్లా రెవెన్యూ అధికారి ఏ.పద్మశ్రీ, జెడ్పీ సీఈఓ దీక్షారైనా, జిల్లా పంచాయతీ అధికారి ఆశాలత తదితరులు పాల్గొన్నారు. -
మళ్లీ పెరిగిన గోదావరి
భద్రాచలంటౌన్ : భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం మళ్లీ పెరిగింది. సోమవారం రాత్రి 10 గంటలకు 46.70 అడుగులకు చేరింది. శనివారం రాత్రి 43అడుగులకు చేరడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. అయితే ఆదివా రం రాత్రి 42.70 అడుగులకు చేరడంతో ప్రమాద హెచ్చరిక ఉపసంహరించారు. సోమవారం ఉద యం నుంచి మళ్లీ పెరగడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. నీటిమట్టం 46 అడుగులకు పైగా నమోదు కావడంతో భద్రాచలం నుంచి చర్లతో పాటు ఏపీలోని పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పరీవాహక ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. నీట మునిగిన తూరుబాక రోడ్డు దుమ్ముగూడెం : గోదావరి ప్రవాహం పెరగడంతో మండలంలోని తూరుబాక వద్ద డైవర్షన్ రోడ్డుపైకి వరద చేరింది. దీంతో రాకపోకలు నిలిపివేశారు. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద వస్తుండడంతో పర్ణశాల, కాశీనగరం, సున్నంబట్టి, దుమ్ముగూడెం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. పర్ణశాల నారచీరల ప్రాంతం నీట మునిగింది.కొనసాగుతున్న మొదటి ప్రమాద హెచ్చరిక -
అంతరాయం లేని విద్యుత్ సరఫరా
బోనకల్: అంతరాయం లేని విద్యుత్ సరఫరాకు కృషి చేస్తున్నట్లు ట్రాన్స్కో ఎస్ఈ ఇనుగుర్తి శ్రీనివాసాచారి అన్నారు. మధిర 132 కేవీ సబ్ స్టేషన్ నుంచి బోనక ల్ సబ్స్టేషన్కు సరఫరా అవుతున్న 33 కేవీ లైన్లకు ప్రత్యామ్నాయంగా పెద్దగోపతి సబ్స్టేషన్ నుంచి రావినూతల వరకు నూతన విద్యుత్ లైన్ ఏర్పాటు చేయగా బ్రేకర్లను ఆదివారం ఆయన ప్రారంభించా రు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మధిర 133 కేవీ సబ్ స్టేషన్ నుంచి సరఫరా అవుతున్న విద్యుత్ లైన్లలో ఏదైనా అంతరాయం ఏర్పడితే పెద్దగోపతి 133 కేవీ సబ్స్టేషన్ నుంచి సరఫరా చేసేందుకు వీలుగా రూ.70లక్షల వ్యయంతో లైన్ ఏర్పాటు చేసినట్లు తెలి పారు. రావినూతల విద్యుత్ కేంద్రం నుంచి జానకీపు రం, మోటమర్రి, సిరిపురం ఉపకేంద్రాలకు నిరంతర విద్యుత్ సరఫరాకు ఇది ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమంలో వైరా డీఈ బండి శ్రీనివాసరా వు, సబ్ డివిజన్ ఏడీఈ పి.కిరణ్కుమార్, ఏఈటీ మనోహర్, బోనకల్ ఏఈ సాయికుమార్ పాల్గొన్నారు.ట్రాన్స్కో ఎస్ఈ శ్రీనివాసాచారి వెల్లడి -
ములుగు డిప్యూటీ కలెక్టర్గా కాకరవాయి వాసి
తిరుమలాయపాలెం: మండలంలోని కాకరవాయి గ్రామానికి చెందిన కొత్తపల్లి ఖుషీల్వంశీ శనివారం రాత్రి హైదరాబాద్ శిల్పకళావేదికలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేతుల మీదుగా డిప్యూటీ కలెక్టర్గా ని యామకపత్రం అందుకోగా వెంటనే పోస్టింగ్ ఇచ్చా రు. ములుగు జిల్లా డిప్యూటీ కలెక్టర్గా నియమితులైన ఆయన సోమవారం బాధ్యతలు స్వీకరించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కాకరవాయి గ్రామానికి చెందిన కొత్తపల్లి శివకుమార్, రేణుక దంపతుల కుమారుడు ఖుషీల్వంశీ ఇప్పటికే నాలు గు కేంద్ర, రాష్ట్ర ఉద్యోగాలు సాధించగా గ్రూప్–1 ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో 63వ ర్యాంకు, రిజర్వేషన్ కేటగిరిలో 3వర్యాంకు సాధించాడు. ఆయన్ను గ్రామస్తులు, అధికారులు అభినందించారు. ఎంపీఓగా పడాల రమేష్.. తల్లాడ: మండడలంలోని బాలపేటకు చెందిన పడాల రమేష్ బాబు గ్రూప్–2లో ప్రతిభ సాధించి ఎంపీఓగా ఎంపికయ్యారు. ఈ మేరకు ఆదివారం ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందాయి. తన తండ్రి చిన్నప్పుడే మృతి చెందగా.. తల్లి, కుటుంబసభ్యుల ప్రోత్సాహంతోనే ఈ ఉద్యోగం సాధించానని రమేష్ తెలిపారు. కో ఆపరేటివ్ ఆసిస్టెంట్ రిజిస్ట్రార్గా.. తల్లాడ మండలం మల్లవరం గ్రామానికి చెందిన దుగ్గిదేవర వెంకటేశ్వరరావు గ్రూప్–2లో ప్రతభ కనబర్చి కో ఆపరేటివ్ అసిస్టెంట్ రిజిస్ట్రార్గా ఎంపికయ్యారు. తండ్రి కాళేశ్వర్రావు చిన్నతనంలోనే చనిపోగా తల్లి రుక్మిణి ప్రోత్సాహంతో కష్టపడి చదివి ఈ కొలువు సాధించానని చెప్పారు. కాగా, ఆయనకు 2018లో పంచాయతీ కార్యదర్శిగా, 2019లో అటవీశాఖలో బీట్ ఆఫీసర్గా, 2020లో విద్యుత్శాఖలో జేఏఓగా ఉద్యోగాలు కూడా రావడం విశేషం. కాగా, నారాయణపురం గ్రామానికి చెందిన రెడ్డెం రామకోటారెడ్డి ఎంపీఓగా, పినపాకకు చెందిన ఎక్కిరాల ప్రశాంత్ కో ఆపరేటివ్ అసిస్టెంట్ రిజిస్ట్రార్గా ఎంపికయ్యారు. ఆటోవాలా కుమారుడు ఎంపీడీఓ.. కల్లూరు: మండలంలోని చెన్నూరు గ్రామానికి చెందిన కంచెపోగు వంశీకృష్ణ గ్రూప్–1లో ప్రతిభ కనబర్చి ఎంపీడీఓ ఉద్యోగం సాధించగా.. సీఎం రేవంత్రెడ్డి చేతులమీదుగా నియామకపత్రం అందుకున్నారు. ఆయన తండ్రి రాములు ఆటో డ్రైవర్ కాగా, తల్లి సుశీల వ్యవసాయ కూలీ. తన చదువుకు తల్లిదండ్రులతో పాటు సోదరుడు నాగరాజు ప్రోత్సాహం, సహాయం దోహద పడ్డాయని వంశీకృష్ణ తెలిపారు. -
9 కి.మీ.. 900 గుంతలు!
పల్లిపాడు – ఏన్కూరు రోడ్డు నిర్మాణానికి ఏడాది క్రితమే ప్రతిపాదనలు పంపించాం. పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్లు ఎవరూ ముందుకు రావడం లేదు. వర్షాలు పూర్తిగా తగ్గే వరకు రోడ్డు మరమ్మతు చేయడం సాధ్యం కాదు. ఇప్పటికే రెండుసార్లు మడ్ మిక్స్తో గుంతలు పూడ్చి వేయించాం. వర్షాలు తగ్గితే రోడ్డు మరమ్మతు చేయిస్తాం. – మోడేపల్లి రమేష్, ఆర్అండ్బీ డీఈ, వైరాకొణిజర్ల: ఉన్నది 9 కిలోమీటర్ల రోడ్డు.. కానీ 900కు పైగా గుంతలున్నాయంటే ఆ రహదారిలో ప్రయాణం ఎలా ఉంటుందో ఊహించుకోండి.. ఈ గుంతల్లో కార్లు, ద్విచక్ర వాహనాలు పడి పలువురు ప్రయాణికులు గాయపడగా, వాహనాలు ధ్వంసమయ్యాయి. అయినా అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదు. పల్లిపాడు టు ఏన్కూరు.. కొణిజర్ల మండలం పల్లిపాడు నుంచి అంజనాపురం, జన్నారం మీదుగా ఏన్కూరు మండల కేంద్రం వరకు 2018లో డబుల్ రోడ్డు నిర్మించారు. ఖమ్మం – భద్రాద్రి జిల్లా కేంద్రం కొత్తగూడేన్ని కలిపేందుకు ఇది దగ్గరి దారి. ప్రస్తుతం ఆ రోడ్డు గుంతలమయం కాగా ప్రయాణం నరకప్రాయంగా మారింది. పల్లిపాడు నుంచి అంజనాపురం వరకు ప్రతీ రెండడుగులకో గుంత చొప్పున రోడ్డు జల్లెడ మాదిరిగా తయారైంది. ఆ తర్వాత నాలుగు కి.మీ.దూరంలో ఏన్కూరు ఉండగా.. ఆ రోడ్డు పరిస్థితి అధ్వానంగానే ఉంది. వర్షాకాలం కావడంతో గోతుల్లో నీరు నిండగా ఎక్కడ గుంత ఉందో తెలియక ప్రయాణికులు ప్రమాదాల బారిన పడుతున్నారు. కొణిజర్ల మండలం తీగలబంజరకు చెందిన ఓ యువకుడు మూడు నెలల క్రితం గుంతను తప్పించబోయి కిందపడి కోమాలోకి వెళ్లి మూడు రోజుల చికిత్స అనంతరం మృతి చెందాడు. లాలాపురానికి చెందిన ఓ యువకుడు కారులో ప్రయాణిస్తుండగా గుంతలో టైరు దిగబడి రిమ్ము పూర్తిగా ధ్వంసం కాగా రూ.50వేలకు పైగా నష్టపోయినట్లు తెలిపాడు. ఇక లాలాపురం – తీగలబంజర మధ్య పగిడేరుకు వరద వస్తే రోడ్డు కొట్టుకుపోయి మరింత ప్రమాదకరంగా మారుతోంది. ఏటిపై నిర్మించిన చప్టాకు రక్షణ గోడలు లేకపోవడంతో వాహనదారులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణిస్తున్నారు. ఈ రోడ్డును హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ పద్ధతిన ప్రభుత్వం 40 శాతం, ప్రైవేట్ సంస్థలు 60 శాతం వాటా ధనంతో పునః నిర్మాణానికి ప్రతిపాదనలు పంపారు. అయితే పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. శిథిలావస్థలో కల్వర్టులు.. 2018లో రోడ్డు నిర్మించినప్పుడు ఆర్అండ్బీ అధికారులు కల్వర్టుల నిర్మాణాలపై ప్రతిపాదనలు రూపొందించకపోవడంతో పాత కల్వర్టులపైనే రోడ్డు వేశారు. ప్రస్తుతం ఆ కల్వర్టులు శిథిలావస్థకు చేరుకున్నాయి. పల్లిపాడు సమీపంలో కల్వర్టు కూలగా పైపువేసి మట్టితో పూడ్చారు. లాలాపురం–తీగలబంజర సమీపంలో కల్వర్టులు కుంగి ఎప్పుడు కూలుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. అంజనాపురం సమీపంలో నిమ్మవాగుపై నిర్మించిన లో లెవల్ చప్టా కూడా కూలేందుకు సిద్ధంగా ఉంది.పల్లిపాడు నుంచి సింగరాయపాలెం వరకు రోజూ ద్విచక్రవాహనంపై తిరుగుతుంటా. ఈ క్రమంలో గుంతలో పడి నా బైక్ ధ్వంసమైంది. రిపేర్ చేయిస్తే రూ.10 వేలు ఖర్చయ్యాయి. రోడ్డు గుంతల మయంగా మారినా అధికారులు పట్టించుకోవడం లేదు. ఈ రోడ్డుపై తిరగాలంటేనే భ యంగా ఉంటోంది. – షేక్ నాగుల్మీరా, సింగరాయపాలెంపల్లిపాడు నుంచి అంజనాపు రం వరకు రోజూ ఆటో తిప్పుతుంటా. ఈ 9 కి.మీ. ప్రయా ణం చేయడానికి గంటకు పైగా పడుతోంది. గుంతల్లో పడి ఆటోలు ప్రమాదాలకు గురవుతున్నాయి. రాత్రి పూట ఈ రోడ్డు మీద ప్రయాణం చేయాలంటే భయపడుతున్నాం. అధికారులు స్పందించి మరమ్మతు చేయాలి. – ముత్తనబోయిన లెనిన్, అటో డ్రైవర్, తీగలబంజర -
వ్యవసాయ మార్కెట్ తనిఖీ
వైరా: స్థానిక వ్యవసాయ మార్కెట్ను రాష్ట్ర గిడ్డంకుల సంస్థ ఛైర్మన్ రాయల నాగేశ్వరరావు ఆదివారం తనిఖీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పేదలకు అందిస్తున్న సన్నబియ్యాన్ని పరిశీలించారు. చౌకదుకాణాలకు సరఫరా చేసే సన్నబియ్యం నాణ్యతను తనిఖీ చేశారు. వ్యవసాయ మార్కెట్ గోదాముల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, టీపీసీపీ ప్రధాన కార్యదర్శి నూతి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. వికాస వేదిక నూతన కమిటీ ఏర్పాటుఖమ్మంగాంధీచౌక్: వికాస వేదిక సాహిత్య సంస్థ నూతన కమిటీని ఆదివారం ఖమ్మంలో ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా గాజుల భారతి శ్రీనివాస్, కార్యదర్శిగా తిరునగరి శ్రీనివాసరావు, కోశాధికారిగా సునీత, గౌరవాధ్యక్షులుగా తులసీదాస్, ఉపాధ్యక్షులుగా మలిశెట్టి కృష్ణమూర్తి, ఐలయ్య, బి నాగేశ్వరరావు, చిన్న హుస్సేన్, పుల్లయ్య, వసంత, సహాయ కార్యదర్శులుగా కట్టెకోల చిన్న నర్సయ్య, నల్ల కృష్ణ, శైలజ, శోభనాద్రి వీరబాబు, సంగమేశ్వరరావు, అధికార ప్రతినిధులుగా కె. కృష్ణారావు, గోవింద్, న్యాయ సలహాదారుగా సాయి శ్రీనిజ ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమానికి బుక్క తస్యనారాయణ అధ్యక్షత వహించగా, నామవరపు కాంతేశ్వరరావు, లెనిన్ శ్రీనివాస్, సాధనాల వెంకటస్వామి నాయుడు, శంకర్ రెడ్డి, వెంకటకృష్ణ, ఆవుల వీర భద్రం, విజయరామరాజు, జయవాసు, రామయ్య, జహీరుద్దీన్, రాజేంద్ర తదితరులు పాల్గొన్నారు. జాతీయ స్థాయి పోటీల్లో మధిర కళాకారులుమధిర: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తెనాలిలో కళల కాణాచి సంస్థ నిర్వహిస్తున్న జాతీయ స్థాయి పద్య నాటక పోటీల్లో మధిర సుమిత్ర యూత్ అసోసియేషన్ కళాకారులు ఆదివారం ప్రదర్శించిన కస్తూరి తిలకం పద్య నాటకం అలరించింది. ఈనెల 27 నుంచి అక్టోబర్ 2 వరకు తెనాలిలో జాతీయస్థాయి పద్య నాటక పోటీలు జరుగుతున్నాయి. ఈ పద్య నాటకానికి డాక్టర్ నిభానుపుడి సుబ్బరాజు దర్శకత్వం వహిస్తూ సోమగిరి పాత్ర ధరించారు. బిల్వమంగళుడిగా చిలువేరు శాంతయ్య, స్థానాపతిగా నరాల సాంబశివారెడ్డి, కాకతీయ రాజుగా రామవరం ప్రసాద్తో పాటు కిషోర్ రెడ్డి, రాజేశ్వరరావు, ఇనపనూరి వసంత్ వివిధ పాత్రలు ధరించారు. ప్రముఖ సినీ సంభాషణ రచయిత బుర్ర సాయిమాధవ్ కళాకారులను అభినందించారు. షిరిడీలో బోనకల్ వాసి ఆత్మహత్యబోనకల్: మండలంలోని రాయన్నపేట గ్రామానికి చెందిన యువ వైద్యుడు మహారాష్ట్రలోని షిరిడీలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. గ్రా మానికి చెందిన మరీదు కిశోర్ – కోటేశ్వరి దంపతుల ఏకై క కుమారుడు వినోద్ (30) రష్యా లో ఎంబీబీఎస్ పూర్తి చేశాడు. పెడియాట్రిక్లో ఎండీ చేసేందుకు గాను మహారాష్ట్రలోని షిరిడీలో ఓ ప్రైవేట్ వైద్య కళా శాలలో చేరాడు. 6 నెలల్లో కోర్సు పూర్తికానుంది. వైద్య కళాశాలలో కొందరు వేధింపులకు గురిచేయడంతో మనస్తాపానికి గురైన వినోద్ గదిలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కుమారుడిని వైద్యుడిగా చూసుకుందామనుకున్న తల్లిదండ్రుల ఆశలు అడియాసలయ్యాయి. మృతదేహాన్ని రాయన్నపేటకు తీసుకొస్తున్నారు. -
మహాచండీ అలంకరణలో అమ్మవారు
జమలాపురంలో కొనసాగుతున్న శ్రీ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఎర్రుపాలెం: తెలంగాణా తిరుపతిగా ప్రసిద్ధి గాంచిన జమలాపురం శ్రీవేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో శ్రీదేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవోపేతంగా సాగుతున్నాయి. ఈ కమ్రంలో అమ్మవారు ఆదివారం మహాచండీ అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అర్చకులు తెల్లవారుజామున శ్రీవారికి పంచామృతాభిషేకం చేశారు. ఆ తర్వాత సౌరసూక్త హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ కె.జగన్మోహన్రావు, చైర్మన్ ఉప్పల శ్రీరామచంద్రమూర్తి, ప్రధానార్చకులు ఉప్పల శ్రీనివాసశర్మ, అర్చకులు ఉప్పల మురళీమోహన్ శర్మ, రాజీవ్శర్మ తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో నేడు మంత్రి పొంగులేటి పర్యటనఖమ్మంమయూరిసెంటర్/నేలకొండపల్లి : రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోమవారం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 10.10 గంటలకు నేలకొండపల్లి మండలం అమ్మగూడెంలో బీటీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారు. 10.40 గంటలకు కొరట్లగూడెంలో పర్యటించనున్నారు. 11.10 గంటలకు కోనాయిగూడెం, 11.40 గంటలకు నేలకొండపల్లిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. మధ్యాహ్నం తర్వాత ఖమ్మం, పాలేరు నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. పామాయిల్ ఫ్యాక్టరీ పనుల పరిశీలనవేంసూరు : మండల పరిధిలోని కల్లూరుగూడెంలో నిర్మిస్తున్న పామాయిల్ ప్యాక్టరీ పనులను ఆయిల్ఫెడ్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఫ్యాకర్టీ నిర్మాణ పనులు త్వరతిగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో జీఎం సుధాకర్ రెడ్డి, ప్రాజెక్ట్ మేనేజర్ శ్రీకాంత్, మేనేజర్ నాగబాబు పాల్గొన్నారు. -
తేలిన ‘పంచాయతీ’
● సర్పంచ్, వార్డు స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు ● గ్రామాల్లో ప్రారంభమైన సందడిఖమ్మం సహకారనగర్ : జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఒక్కో అడుగు ముందుకు పడుతోంది. ఇప్పటికే జిల్లా పరిషత్ చైర్మన్, జెడ్పీటీసీ, ఎంపీపీల రిజర్వేషన్ల ప్రక్రియను అధికారులు శనివారం ప్రకటించగా.. సర్పంచ్, వార్డులు, ఎంపీటీసీ స్థానాల రిజర్వేషన్లను ఆదివారం అధికారికంగా ప్రకటించారు. ఇప్పటి వరకు తమ గ్రామం, వార్డు, ఎంపీటీసీ స్థానం ఎవరికి రిజర్వ్ అవుతుందోనని పల్లె ప్రజలు ఆతృతగా ఎదురుచూడగా, ఈ రిజర్వేషన్ల ప్రక్రియతో గ్రామాల్లో ఎన్నికల సందడి మరింత ఊపందుకోనుంది. 571 జీపీలు, 283 ఎంపీటీసీలు.. జిల్లాలో 571 గ్రామ పంచాయతీలు, 5,214 వార్డులు, 283 ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ప్రకటించారు. ఇందులో షెడ్యూల్, నాన్ షెడ్యూల్ ఏరియా ల వారీగా రిజర్వేషన్ల ప్రక్రియ ఖరారు చేశారు. బీసీల కు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తుండగా ఆ ప్రకారం అధికారులు చర్యలు తీసుకున్నారు. రిజర్వేషన్ల ప్రకటనతో గ్రామాల్లో సందడి వాతావరణం నెలకొంది. -
అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం
● డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క ● అభివృద్ధి పనులకు శంకుస్థాపన బోనకల్ : అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పని చేస్తోందని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క అన్నారు. బోనకల్ మండలం జానకీపురం, నారాయణపురం గ్రామాల్లో ఆదివారం రాత్రి ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. జానకీపురంలో రూ.20లక్షలతో నిర్మించనున్న గ్రామపంచాయతీ కార్యాలయానికి శంకుస్థాపన చేశారు. అనంతరం నారాయణపురంలో బోనకల్, చింతకాని, ముదిగొండ మండలాలకు సంబంధించిన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. రూ.3.33 కోట్లతో రావినూతల – చిన్నబీరవల్లి బీటీ రోడ్డు పనులకు, తూటికుంట్ల ఎస్సీ కాలనీలో రూ.66 లక్షలతో నిర్మించే అంతర్గత సీసీ రోడ్డు నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. చింతకాని మండలంలో రూ.6.95 కోట్లతో నిర్మించే మత్కేపల్లి – తిర్లాపురం రోడ్డు పనులు, నాగిలిగొండ ఎస్సీ కాలనీలో రూ.85 లక్షలతో నిర్మించనున్న అంతర్గత సీసీ రోడ్లు, పాతర్లపాడు ఎస్సీ కాలనీలో రూ.85 లక్షలతో, కోమట్లగూడెం ఎస్సీ కాలనీలో రూ.70 లక్షలతో నిర్మించనున్న అంతర్గత సీసీ రోడ్లు, తిమ్మినేనిపాలెం ఎస్సీ కాలనీలో 62 లక్షల వ్యయంతో నిర్మించనున్న అంతర్గత సీసీ రోడ్లతో పాటు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. రాష్ట్రంలో 70 వేల మంది నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కిందన్నారు. ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చి పేదల గూడుకు సహకారం అందించామన్నారు. తెల్లరేషన్ కార్డుదారులకు సన్నబియ్యం కోసం రూ.13,500 కోట్లు ఖర్చు అవుతున్నా ప్రభుత్వం వెనుకాడడం లేదన్నారు. మధిర నియోజకవర్గ అభివృద్ధికి ఎల్లవేళలా కట్టుబడి ఉంటానని చెప్పారు. అనంతరం గ్రామంలో భారీ ఊరేగింపు నిర్వహించారు. పలు గ్రామాలకు చెందిన వివిధ పార్టీల వారు కాంగ్రెస్లో చేరగా భట్టి వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. ఆయా కార్యక్రమాల్లో కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్యాదవ్, విద్యుత్ ఎస్ఈ శ్రీనివాసాచారి, ఆర్అండ్బీ ఈఈ తామేశ్వర్, పీఆర్ ఈఈ మహేష్బాబు, ఎడీఏ విజయచందర్, డీఎల్పీఓ రాంబాబు, గిడ్డంగుల చైర్మన్ రాయల నాగేశ్వరావు, మధిర, మత్కేపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్లు బండారు నరసింహారావు, అంబటి వెంకటేశ్వర్లు, డీసీసీ అధ్యక్షుడు పి.దుర్గాప్రసాద్, నాయకులు దొండపాటి వెంకటేశ్వరరావు, నూతి సత్యనారాయణ, గాలి దుర్గారావు, పైడిపల్లి కిషోర్కుమార్, బందం శ్రీను, సుధీర్బాబు, బ్రహ్మయ్య, కరివేద సుధాకర్ పాల్గొన్నారు. -
నవ్వించిన ‘ఆనందో బ్రహ్మ’
ఖమ్మంగాంధీచౌక్: నగరంలోని భక్త రామదాసు కళాక్షేత్రంలో ఆదివారం రాత్రి మొగిలి ఎంటర్టైన్మెంట్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఆనందో బ్రహ్మ’కార్యక్రమాలు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాయి. హాస్యనటులు(జబర్దస్త్) అప్పారావు, గడ్డం నవీన్, మోహన్ ప్రేక్షకులను నవ్వించారు. డ్రామా జూనియర్స్ వండర్ కిడ్ గుణసాయి తన స్కిట్స్తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తడాఖా విన్నర్ బాబాషరీఫ్ మిమిక్రీ, ఇంద్రజాలకుడు కేవీ చారీ ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఫైర్ డ్యాన్సర్ ఈశ్వర్ బహదూర్, కమెడియన్ జల్లేపల్లి రమేశ్, మిమిక్రీ సుధాకర్ అభినయం ప్రేక్షకుల మెప్పుపొందింది. బేబీ సుప్రజాదేవి భరతనాట్యం, సంతోష్ అకాడమీ నృత్యాలు అలరించాయి. పంజా మాలతి, ఎస్వీ రమణ, శేఖర్ బాబు, ఎస్.ప్రకాష్, సత్యానందం, గణపతిరాజు పాడిన పాటలు ఉర్రూతలూగించాయి. కార్యక్రమానికి తొలుత నటులు, రచయిత ఎన్.కాంతేశ్వరరావు, మొగిలి ఎంటర్టైన్మెంట్స్ అధినేత మొగిలి గుణకర్ జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం జరిగిన సభకు న్యాయవాది జల్లా లక్ష్మీనారాయణ అధ్యక్షత వహించగా, మిత్రా గ్రూప్స్ చైర్మన్ కురువెళ్ల ప్రవీణ్కుమార్, హార్వెస్ట్ విద్యాసస్థల ప్రతినిధి పార్వతిరెడ్డి, మార్కెటింగ్ శాఖ అధికారి రుద్రాక్షల మల్లేశం, డాక్టర్ కాపా మురళీకృష్ణ తదితరులు మాట్లాడుతూ.. ‘ఆనందో బ్రహ్మ’వంటి కామెడీ కార్యక్రమాలను మొగిలి ఎంటర్టైన్ మెంట్స్ సంస్థ నిర్వహించటం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో వైద్యులు జగదీశ్, నర్సింహారావు, కమర్తపు శ్రీధర్, కొత్తపల్లి శేషు, మద్దెల శివకుమార్, నాగసాయి, విద్యాసాగర్, రవితోష్, రామారావు తదితరులు పాల్గొన్నారు. -
22 కేజీల గంజాయి పట్టివేత
మధిర: అంబారుపేట చెరువుగట్టు సమీపంలో ఆదివా రం ఎకై ్సజ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు 22 కేజీల ఎండు గంజాయిని పట్టుకున్నారు. ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ జనార్దన్రెడ్డి, అసిస్టెంట్ కమిషనర్ గణేశ్, ఏఈఎస్కే తిరుపతి ఆదేశాల మేరకు ఎకై ్సజ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్ఐ సీహెచ్ శ్రీహరిరావు, సిబ్బంది కలిసి అంబారుపేట చెరువు కట్ట సమీపంలో తనిఖీలు నిర్వహించారు. అనుమానాస్పదంగా కనిపించిన సిమెంట్ రంగు సూట్ కేసును పరిశీలించి చూడగా అందులో 22 కేజీల ఎండు గంజాయి లభించింది. పరిసరాల్లో గాలించగా ఎవరూ కనిపించలేదు. విచారణ నిమిత్తం గంజాయిని మధిర ఎకై ్సజ్ స్టేషన్లో అప్పగించారు. తనిఖీల్లో ఎకై ్సజ్ ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది కరీం, బాలు, సుధీర్, వెంకట్, హనుమంతరావు, వీరబాబు, స్వరూప, ఉపేందర్ పాల్గొన్నారు. వ్యక్తి ఆత్మహత్య ఖమ్మంఅర్బన్: నగరంలోని కై కొండాయిగూడెంనకు చెందిన గ్రానైట్ కార్మికుడు గొర్రెపాటి వెంకటేశ్వర్లు (48) ఆర్థిక సమస్యలతో పురుగుమందు తాగి ఆత్మహత్య కు పాల్పడిన ఘటనపై ఖమ్మంఅర్బన్ (ఖానాపురంహవేలి) పోలీస్ స్టేషన్లో ఆదివా రం కేసు నమోదైంది. సీఐ భానుప్రకాశ్ కథనం ప్రకారం.. గొర్రెపాటి వెంకటేశ్వర్లు గ్రానైట్ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఆర్థికసమస్యలతో ఇబ్బంది పడుతున్న ఆయ నఆదివారం ఉదయం పురుగులమందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా చికిత్సపొందుతూ మృతిచెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఓ కుమార్తె వివాహమైంది. మృతుడి సోదరుడు చంద్రశేఖర్ ఫిర్యాదు మేరకు కేసు విచారణ చేపట్టినట్లు సీఐ వివరించారు. -
బతుకమ్మ
బంధాలను పెంచే ఖమ్మంగాంధీచౌక్: రాష్ట్ర సంస్కృతిని ప్రతిబింబించే అతి పెద్ద పండుగ, మహిళల ప్రత్యేక పండుగ బతుకమ్మ. తొమ్మిది రోజుల పాటు బతుకమ్మను పూలతో పేర్చి ఆటపాటలతో సాగే సంబురాలు సద్దుల బతుకమ్మతో ముగుస్తాయి. సాగనంపే సద్దుల బతుకమ్మను పోయిరావమ్మ, మళ్లీ రావమ్మా అంటూ ఊరూ వాడ అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. సోమవారం జరుపుకునే సద్దుల బతుకమ్మకు ఇళ్లన్నీ మహిళలతో కళకళలాడుతున్నాయి. బతుకమ్మ వేడుకలను పుట్టింట్లో జరుపుకోవడం అనాదిగా వస్తున్న ఆనవాయితీ. కొందరు ఏ ప్రాంతంలో ఉన్నా, పొరుగు రాష్ట్రాల్లో, విదేశాల్లో ఉన్నా బతుకమ్మ పండుగ కోసం పుట్టింటికి వచ్చి వేడుకలు నిర్వహిస్తుంటారు. పుట్టి పెరిగిన ఊరు, కలిసి చదువుకున్న స్నేహితులు, బంధువులతో ఆనందంగా గడపడానికి మహిళలు ప్రాధాన్యత ఇస్తారు. పుట్టింటి వారే గాక పొరుగు రాష్ట్రాల నుంచి తెలంగాణకు వచ్చిన కోడళ్లు సైతం అత్తవారి ఇంట్లోనే ఉండి బతుకమ్మ పండుగ జరుపుకోవడానికి ఇష్టపడుతున్నారు. ఏ పండుగకు తల్లిగారింటికి వెళ్లినా బతుకమ్మ పండుగకు మాత్రం అత్తవారి ఇంట్లో ఉండి పూల పండగను జరుపుకోవాలని భావిస్తున్నారు. స్నేహితులు, బంధువులతో కలిసి పరిసర ప్రాంతాల్లో, పచ్చిక బయళ్లలో పూలు కోసుకువచ్చి బతుకమ్మలను పేర్చుతారు. ప్రతి రోజు సాయంత్రం అందమైన దుస్తులు, పట్టు వస్త్రాలు ధరించి బతుకమ్మలను మోస్తూ బ్యాండ్ మేళాలు, డీజే సౌండ్స్, కోలాటాలతో పాటలు పాడుతూ, ఆటలాడుతూ సమీప దేవాలయాలు, జలాశయాల వద్దకు చేరుకొని గౌరమ్మను పూజిస్తూ బతుకమ్మ పాటలతో సంబురాలు జరుపుకుంటున్నారు. సోమవారం జరుపుకునే సద్దుల బతుకమ్మ కోసం విదేశాల నుంచి పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చిన పలువురు మహిళల అభిప్రాయాలతో ప్రత్యేక కథనం.. పూల పండుగకు ఎల్లలు దాటి వస్తున్న మహిళలు -
వాణిజ్య పంటలకు స్వస్తి..
● పందిరి కూరగాయల సాగుతో అధిక లాబాలు ● డ్రిప్ ఇరిగేషన్ ద్వారా అంతరపంటల సాగు ● దశాబ్దకాలంగా ఉద్యానవన పంటలు పండిస్తున్న రైతులు ● పొరుగు రాష్ట్రాలకు వెళ్లి సాగు పద్ధతుల పరిశీలన బోనకల్: పెరిగిన ఖర్చులు, తగ్గుతున్న దిగుబడులు, గిట్టుబాటు ధర లేకపోవడంతో వాణిజ్య పంటలకు స్వస్తి చెప్పి ఉద్యానవన పంటలు సాగుచేస్తూ దశాబ్ద కాలంగా లాభాలు గడిస్తున్నారు. మండలంలోని ముష్టికుంట్ల గ్రామంలో సుమారు 30 మంది రైతులు ఉద్యానవన పంటలను సాగు చేస్తూ లాభాలు ఆర్జిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. తమకు ఉన్న కొద్దిపాటి భూముల్లో కాలానుగుణంగా ఉద్యాన పంటలను సాగు చేస్తున్నారు. మిర్చి, పత్తి, మొక్కజొన్న పంటల దిగుబడి తగ్గడంతో పాటు గిట్టుబాటు ధర లేకపోవడం, సేద్యానికి అయ్యే ఖర్చు పెరగడం, చీడపీడలు ఆశించడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ క్రమంలో వినూత్న రీతిలో కూరగాయల సాగుతో పాటు బంతి, చామంతి, కనకాంబరాలు, గులాబీ, లిల్లీలు, పండ్ల తోటలైన జామ, బొప్పాయి పంటలను అంతర పంటలుగా సాగు చేస్తున్నారు. పందిరి విధానంతో.. తొలకరి జల్లులు పడగానే పత్తివేసే సమయంలో పందిరి విధానంలో కాకర, బీర, దొండ పంటలు వేస్తున్నారు. ప్రస్తుతం కాకర నెల రోజుల నుంచి కోస్తున్నారు. వేసిన 40 రోజుల తరువాత పంట చేతికి వస్తుంది. మొత్తం 90 రోజుల్లో పంట దిగుబడి కాలం పూర్తి అవుతుంది. విత్తనాలను బెంగళూరు నుంచి హైబ్రీడ్ రకం తెప్పించి విత్తారు. ఎకరం బీర, దొండ, కాకర విత్తనాలను కొనుగోలు చేయడానికి రూ.10 – రూ.15 వేలు ఖర్చు వస్తున్నట్లు రైతులు తెలిపారు. పశువుల ఎరువులు, ఇతర పురుగుమందులకు ఎకరానికి రూ.25 వేలు, కూలీలు, ఇతర ఖర్చులు రూ.30 వేలు అవుతున్నట్లు రైతులు తెలిపారు. ఇప్పటివరకు ఎకరాకు 80 క్వింటాళ్లకు పైగా దిగుబడి రావడంతో మండలంలోని పలు గ్రామాల వ్యాపారులతో పాటు ఖమ్మం మార్కెట్కు తరలిస్తున్నారు. సీజన్ పూర్తి అయ్యే వరకు ఎకరానికి రూ.3 లక్షల ఆదాయం వస్తుందని రైతులు తెలిపారు. బీర, బెండ, దొండ, కాకర పూర్తయిన తరువాత అదే భూమిలో టమాట సాగు చేస్తామని రైతులు తెలిపారు. అంతర పంటల సాగు రైతులు డ్రిప్ ఇరిగేషన్ పద్ధతి ద్వారా అంతర పంటలను సాగు చేస్తున్నారు. ఈ ఏడాది బంతిలో అంతర పంటగా బొప్పాయి, గులాబీలో మల్లెలు సాగు చేస్తున్నారు. బంతి 120 రోజుల వ్యవధిలో పెట్టుబడి పోను రూ.లక్ష ఆదాయం వస్తుంది. ప్రస్తుతం వంగ సాగుకు సంబంధించి కింద అడవి వంగ, పైన గ్రాప్టింగ్, అంకూర్ నితీశ్ వంటి వైరెటీ వంగ మొక్కలను హైదరాబాద్లోని ఉద్యానవన నర్సరీ నుంచి తెప్పించి సాగు చేస్తున్నారు. ఇది గత ఏప్రిల్లో వేయగా జూన్ 12 నుంచి కోత కోస్తున్నారు. వారానికి 10 క్వింటాళ్ల చొప్పున కోత కోస్తున్నారు. మొత్తం రూ.3 లక్షల వరకు ఆదాయం రాగా ఖర్చు రూ.1.5 లక్షలు పోతుందని వివరించారు. -
నాలుగు రోజులుగా మున్నేరులో మృతదేహం
● ప్రకాశ్నగర్ చప్టా వద్ద సుడిగుండంలో చిక్కుకుపోయిన వైనం ● క్రేన్ల సాయంతోనూ వెలికితీయలేని పరిస్థితి ● రెస్క్యూ ఆపరేషన్లో పోలీస్, ఫైర్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలుఖమ్మంక్రైం : మహబూబాబాద్ జిల్లా డోర్నకల్కు చెందిన వ్యక్తి నాలుగు రోజుల క్రితం చేపలు పట్టేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు ఆకేరులో పడి గల్లంతుయ్యాడు. ఈ మేరకు కుటుంబసభ్యులు అక్కడి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే ఇటీవల కురుస్తున్న వర్షాలతో మున్నేరు ఉధృతి పెరగడంతో గల్లంతైన వ్యక్తి మృతిచెందగా.. ఖమ్మం నగరంలోని ప్రకాశ్నగర్ చప్టా వద్ద గల సుడిగుండంలో చిక్కుకుని అక్కడే తిరుగుతున్న మృతదేహాన్ని త్రీటౌన్ పోలీసులు గుర్తించారు. శనివారం సాయంత్రం నుంచి మృతదేహాన్ని బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నా మున్నేరు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో అక్కడికి వెళ్లేందుకు ఎవరూ ధైర్యం చేయలేదు. దీంతో ఆదివారం ఉదయం త్రీటౌన్ సీఐ మోహన్బాబు అగ్నిమాపక, ఎన్డీఆర్ఎఫ్ బృందాలకు సమాచారం అందించగా వారు కూడా సాయంత్రం వరకు ప్రయత్నించినా మృతదేహం ఉన్న ప్రాంతానికి చేరుకోలేకపోతున్నారు. రెండు పెద్ద క్రేన్ల ద్వారా వెళ్లినా సాధ్యం కాలేదు. రాత్రంతా అక్కడే కాపలా.. గల్లంతైన వ్యక్తి డోర్నకల్కు చెందిన బందెల వెంకటేశ్వర్లు(43)గా పోలీసులు గుర్తించడంతో అతడి భార్య విజయ, కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. వారు ఖమ్మంలోని ప్రకాశ్నగర్ మున్నేటి ఒడ్డుకు చేరుకుని శనివారం సాయంత్రం నుంచి అక్కడే రోదిస్తూ మృతదేహాన్ని బయటకు తీసుకొస్తారేమోనని ఎదురుచూస్తున్నారు. కాగా, ఆదివారం రాత్రి 7 గంటల సమయంలో మృతదేహం ప్రకాశ్నగర్ నుంచి కొట్టుకుపోయిందని, అది ఎక్కడ తేలేది తెలియదని సీఐ మోహన్బాబు వెల్లడించారు. గల్లంతై నాలుగు రోజులు కావడంతో మృతదేహం కుళ్లిపోయి ఉందన్నారు. మృతదేహం కొట్టుకుపోయిందని తెలియడంతో కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. -
ప్రపంచానికి తెలిసేలా బౌద్ధక్షేత్రం అభివృద్ధి
నేలకొండపల్లి/ఖమ్మం సహకారనగర్: నేలకొండపల్లిలోని బౌద్ధక్షేత్రం చరిత్రను ప్రపంచానికి తెలిసేలా అభివృద్ధి చేయనున్నట్లు రాష్ట్ర పురావస్తు శాఖ డైరెక్టర్ అర్జున్రావు తెలిపారు. బౌద్ధక్షేత్రాన్ని శనివారం పరిశీలించిన ఆయన వివరాలతో కూడిన బోర్డులు తుప్పుపట్టటంతో కొత్తవి ఏర్పాటు చేయాలని, పిచ్చి చెట్లు, మొక్కలను తొలగించాలని ఆదేశించారు. అనంతరం అర్జున్రావు మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి రూ.5 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ఇందులో భాగంగా నేలకొండపల్లిలోని బౌద్ధస్తూపం పరిరక్షణ, అభివృద్ధికి చర్యలు చేపట్టామని చెప్పారు. ఇందుకోసం ఆర్కియాలజీ – టూరిజం శాఖల సమన్వయంతో నివేదిక సిద్ధం చేశామని, త్వరలోనే ప్రైవేట్ భాగస్వామ్యంతో గైడ్లను నియమిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పురావస్తు శాఖ డిప్యూటీ డైరెక్టర్లు నర్సింగ్, నాగరాజు, ఏడీ బుజ్జి, జిల్లా పర్యాటక శాఖ అధికారి సుమన్చక్రవర్తి, తహసీల్దార్ వెంకటేశ్వర్లు, ఆర్ఐ అల్లం రవికుమార్, జీపీఓ జానీమియా పాల్గొన్నారు. అనంతరం అధికారులు ఖమ్మంలో కలెక్టర్ అనుదీప్ను కలిశారు. ఈసందర్భంగా అభివృద్ధి నివేదికను పరిశీలించిన ఆయన రూ.50లక్షల నిధులతో నెలలోగా కార్యాచరణ మొదలుపెట్టాలని సూచించారు. తవ్వకాల్లో బయటపడిన వస్తువులతో మ్యూజియం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రాష్ట్ర పురావస్తు శాఖ డైరెక్టర్ అర్జున్రావు -
కేటీపీఎస్ విస్తరణకు కేంద్రం నుంచి సహకారం
ఎంపీ రఘురాంరెడ్డి లేఖకు కేంద్ర మంత్రి స్పందనఖమ్మంమయూరిసెంటర్: పాల్వంచలోని కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్( కేటీపీఎస్) మరో రెండు యూనిట్ల విస్తరణ, ఆధునికీకరణకు ప్రోత్సాహం అందిస్తామని కేంద్ర విద్యుత్ శాఖ సహాయమంత్రి శ్రీపాద్నాయక్ తెలిపారు. ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో భాగంగా ఆగస్టు 20న ఈ అంశాన్ని లేవనెత్తారు. ఈమేరకు కేంద్ర విద్యుత్ శాఖ సహాయ మంత్రి శ్రీపాద్నాయక్ సానుకూలత వ్యక్తం చేస్తూ తాజాగా ఎంపీ రఘురాంరెడ్డికి లేఖ పంపారు. పాత కేటీపీఎస్ స్టేషన్ వద్ద అందుబాటులో ఉన్న స్థలంలో రెండు 800 మెగావాట్ల యూనిట్ల స్థాపనకు నివేదిక సిద్ధం చేయాలని తెలంగాణ రాష్ట్ర ఇంధన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ టీజీ జెన్కోకు సూచించగా.. నివేదిక రావాల్సి ఉందని అందులో పేర్కొన్నారు. టీజీ జెన్కో నిధులు సమకూరుస్తుందని, ఆపై కేంద్ర ప్రభుత్వం పర్యావరణ అనుమతులను సులభతరం చేయనుండగా, బొగ్గు కేటాయింపునకు సైతం కేంద్రం అవసరమైన మద్దతు ఇస్తుందని కేంద్ర విద్యుత్ శాఖ సహాయ మంత్రి ఆ లేఖలో తెలిపారని ఎంపీ రఘురాంరెడ్డి వెల్లడించారు. ట్యాంక్ బండ్పై సందడే సందడి ఖమ్మం రాపర్తినగర్: ప్రపంచ పర్యాటక శాఖ దినోత్సవ వేడుకలను పర్యాటక శాఖ ఆధ్వర్యాన ఖమ్మంలోని లకారం ట్యాంక్ బండ్పై శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటుచేయగా కళాకారులు తమ ప్రదర్శనలతో హోరెత్తించారు. అంతేకాక మహిళలు బతుకమ్మ ఆడిపాడారు. జిల్లా పర్యాటక శాఖఅధికారి సుమన్ చక్రవర్తి, వివిధ శాఖల అధికారులతో పాటు యువజన సంఘాల బాధ్యులు, స్థానికులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. బొగ్గు ఉత్పత్తికి అంతరాయంసింగరేణి(కొత్తగూడెం): గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో సింగరేణి వ్యాప్తంగా రోజుకు 90 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోతోంది. సంస్థ ఈ ఏడాది 76 మిలియన్ టన్నుల ఉత్పత్తి లక్ష్యంగా నిర్దేశించుకోగా రోజుకు 1.80లక్షల టన్నుల బొగ్గు వెలికితీయాల్సి ఉంటుంది. కానీ వర్షం కారణంగా 90 వేల టన్నుల ఉత్పత్తి మాత్రమే జరుగుతోంది. -
పండుగకు వచ్చేస్తున్నారు !
సద్దుల బతుకమ్మ, దసరా పండుగ సమీపిస్తుండం.. ఉద్యోగులకు శని, ఆదివారం వరుస సెలవులు రావడంతో జనమంతా పిల్లాపాపలతో స్వస్థలాల బాట పట్టారు. దీంతో ఖమ్మంలోని పాత, కొత్త బస్టాండ్లు శనివారం కిటకిటలాడాయి. పండుగకు సొంత గ్రామాలకు వెళ్లే వారే కాక పాఠశాలలు, కళాశాలల నుంచి వెళ్తున్న విద్యార్థులతో బస్టాండ్లలో రద్దీ నెలకొంది. కొన్ని మార్గాల్లో సరిపడా బస్సులు లేక హాల్టింగ్ పాయింట్ వద్దకు వస్తుండగానే సీటు దక్కించుకునేందుకు పోటీ పడ్డారు. – స్టాఫ్ ఫొటోగ్రాఫర్ప్రయాణికులతో రద్దీగా ఉన్న ఖమ్మం పాత బస్టాండ్ -
ఉరి వేసుకుని యువకుడి ఆత్మహత్య
చింతకాని: మండలంలోని పందిళ్లపల్లికి చెందిన మొగిలి నవీన్(22) శనివారం ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయిన ఆయన తల్లితో కలిసి ఉంటున్నాడు. ఇటీవల మద్యానికి బానిసైన నవీన్ తరచూ తల్లితో గొడవ పడుతుండడంతో ఆమె నాలుగు రోజుల క్రితం తల్లిగారింటికి ఏపీలోని వత్సవాయి మండలం డబ్బాకుపల్లి వెళ్లింది. తిరిగి శనివారం పందిళ్లపల్లి వచ్చేసరికి నవీన్ ఇంట్లో చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆమె ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై వీరేందర్ తెలిపారు.200 కేజీల గంజాయి దహనం ఖమ్మంక్రైం: వివిధ కేసుల్లో పట్టుబడిన గంజాయిని శనివారం శాసీ్త్ర య పద్ధతిలో దహనం చేశారు. కమిషనరేట్లోని వివిధ పోలీస్స్టేషన్ల పరిధిలో సీజ్చేసిన 200 కిలోల గంజాయిని అడిషనల్ డీసీపీ ప్రసాద్రావు పర్యవేక్షణలో తల్లాడ మండలం గోపాల్పేటలోని ఏడబ్ల్యూఎం కన్సల్టెన్సీ లిమిటెడ్లో దహనం చేయించారు. ఈ కార్యక్రమంలో టాస్క్ఫోర్స్ ఏసీపీ సత్యనారాయణ, సీసీఆర్ బీ సీఐ స్వామి తదితరులు పాల్గొన్నారు. -
ఒకే ఈతలో రెండు దూడలు జననం
పెనుబల్లి: పెనుబల్లి మండలంలోని ఓ రైతుకు చెందిన గేదె ఒకే ఈతలో రెండు దూడలకు జన్మనిచ్చింది. యడ్లబంజరు గ్రామానికి చెందిన రైతులు సుంకర సత్యనారాయణ –వెంకట నర్సమ్మ ఐదేళ్లుగా పాడిగేదెను పెంచుతున్నా రు. ఈ గేదె శుక్రవారం రాత్రి రెండు దూడలను జన్మినవ్వగా, రెండూ ఆరోగ్యంగా ఉన్నాయి. ఉషూ పోటీల్లో క్రీడాకారులకు పతకాలు ఖమ్మంస్పోర్ట్స్: మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురులో ఇటీవల స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యాన నిర్వహించిన 69వ రాష్ట్రస్థాయి ఉషూ పోటీల్లో జిల్లా క్రీడాకారులు పతకాలు సాధించారు. 60 కేజీల విభాగంలో ఫిర్దోస్ బంగారు పతకం అందుకోగా, 48 కేజీల విభా గంలో ఉమర్ఫారూక్ వెండి పతకం, 40 కేజీల విభాగంలో ఆర్యన్, సంజన, 36 కేజీల విభాగంలో చైత్రవర్షిణి రజత పతకాలు గెలుచుకున్నారని కోచ్ పి.పరిపూర్ణాచారి తెలిపారు. క్రీడాకారులను డీవైఎస్ఓ టి.సునీల్రెడ్డి, ఎస్జీఎఫ్ కార్యదర్శి పూనాటి వెంకటేశ్వర్లు అభినందించారు. డీపీఓగా గోవిందాపురం యువతిబోనకల్: మండలంలోని గోవిందాపురం(ఏ) గ్రామానికి చెంది న భాగం రాము – గీతాదేవి దంపతుల కుమార్తె నిఖిల ఇటీవల వెల్లడైన గ్రూప్–1 ఫలితాల్లో డీపీఓ ఉద్యో గం సాధించింది. రాము కుటుంబం వ్యాపారరీత్యా విజయవాడలో స్థిరపడింది. దూరవిద్య ద్వారా ఎంఏ సోషియాలజీ పూర్తిచేసిన నిఖిల గ్రూప్–1లో రాష్ట్ర స్థాయిలో 92వ ర్యాంకు సాధించగా డీపీఓగా ఎంపికవడంపై గ్రామస్తులు అభినందించారు. అక్రమంగా రవాణా చేస్తున్న పశువులు స్వాధీనం ఖమ్మంక్రైం: ఎలాంటి అనుమతి లేకుండా మినీ వ్యాన్లలో సామర్థ్యనికి మించి పశువులను రవాణా చేస్తుండగా స్వాధీనం చేసుకున్నామని ఖమ్మం త్రీటౌన్ సీఐ మోహన్బాబు తెలిపారు. ప్రకాష్ నగర్ బ్రిడ్జి వద్ద తనిఖీ చేస్తుండగా సుజాత్నగర్ నుంచి మూడు మినీ వ్యాన్లలో 10 ఆవులు, ఐదు పెయ్యదూడలు, ఆరు కోడె దూడలు కలిపి 21 జీవాలను కోదాడకు తరలిస్తున్నట్లు గుర్తించామని పేర్కొన్నారు. ఈమేరకు బాధ్యులను అదుపులోకి తీసుకుని పశువులను టేకులపల్లిలోని గోశాలకు తరలించినట్లు సీఐ తెలిపారు. మున్నేటిలో మృతదేహం ఖమ్మంక్రైం: ఖమ్మం ప్రకాష్ నగర్లోని మున్నేటి వద్ద గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని శనివారం రాత్రి గుర్తించారు. అయితే, మున్నేటి వరద ఉధృతి కారణంగా మృతదేహాన్ని ఆదివారం ఉదయం తీయిస్తామని ఖమ్మం త్రీటౌన్ సీఐ మోహన్బాబు తెలిపారు. మృతుడిని మహబూబాబాద్ జిల్లా గార్ల మండలానికి బందెల వెంకటేశ్వర్లుగా గుర్తించగా, ఆకేరులో చేపలు పడుతూ ప్రమాదవశాత్తు నీళ్లలో జారి పడి ఉండొచ్చని భావిస్తున్నారు. -
బతుకమ్మా.. బతుకు ఇవ్వమ్మా...
ఖమ్మంవైద్యవిభాగం: బతుకమ్మ అంటే పూల పండుగే కాదు.. బతుకుకు భరోసా ఇస్తుందనే ఆశ, విశ్వాసం. ఆ నమ్మకంతోనేమో తలసేమియాతో బాధపడుతున్న చిన్నారులతో ఖమ్మంలోని సంకల్ప వలంటరీ ఆర్గనైజేషన్ కార్యాలయం వద్ద శనివారం బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. ఈక్రమాన తమకోసం నెలనెలా రక్తదానం చేస్తున్న వారిని కాపాడాలని, తమ ఆయుష్షు పెంచాలని వేడుకున్నారు. డాక్టర్ డి.నారాయణమూర్తి, డాక్టర్ డి.వెంకట్, సంస్థ ఫౌండర్ అనిత, వ్యవస్థాపక అధ్యక్షురాలు ప్రొద్దుటూరి చంద్రలీల, బాధ్యులు పొద్దుటూరి పావని, పి.రవిచందర్, పి.ఉదయ్ భాస్కర్, నెల్లూరి ఉపేందర్, అనిత, జాన్సన్ కిడ్స్ స్కూల్ కరస్పాండెంట్ మమత, అనురాధ పాల్గొన్నారు.తలసేమియా చిన్నారులతో ఆటపాట -
పత్తి కొనుగోళ్లకు అడ్డంకులు
● సీసీఐ టెండర్లకు జిన్నింగ్ మిల్లులు దూరం ● నిబంధనలు మార్చాల్సిందేనని డిమాండ్ ● అక్టోబర్ ఆరంభం నుంచి పత్తి కొనుగోళ్లు కష్టమే.. ఖమ్మంవ్యవసాయం: పత్తి పంట సీజన్ ముంచుకొచ్చినా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ఎప్పుడు ఏర్పాటవుతాయో స్పష్టత రావడం లేదు. అక్టోబర్ మొదటి నుంచి పత్తి కొనుగోళ్లు చేయాలని ప్రభుత్వం ఆదేశించగా.. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) జిన్నింగ్ మిల్లుల ఎంపికకు కసరత్తు మొదలుపెట్టింది. అయితే, టెండర్ల దాఖలుకు మిల్లర్లు ముందుకు రావడంలేదు. ఇప్పటికే గ్రామాలు, మార్కెట్లలో పత్తి క్రయవిక్రయాలు మొదలుకాగా గరిష్టంగా రూ.7,500, మోడల్ ధర రూ.6,500, కనిష్టంగా రూ.4,300 ధరే దక్కుతోంది. కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది 8 తేమశాతం కలిగిన పత్తికి గరిష్టంగా క్వింటాకు రూ. 8,110 ధర నిర్ణయించింది. 12 శాతం వరకు తేమ ఉన్న పత్తిని కొనుగోలు చేయాలని నిర్ణయించారు. కానీ ప్రభుత్వ కేంద్రాలు లేకపోవడంతో వ్యాపారులు ధర విషయంలో ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. రెండు సార్లు ఆహ్వానించినా.. ఖమ్మం జిల్లాలోని 2,25,613 ఎకరాల్లో పత్తి సాగు కాగా 27,07,356 క్వింటాళ్లు, భద్రాద్రి జిల్లాలో 2,40,345 ఎకరాల నుంచి 28,05,576 పత్తి దిగుబడి వస్తుందని అంచనా వేశారు. ఏటా సీసీఐ ఆధ్వర్యాన జిన్నింగ్ మిల్లుల్లో పత్తి కొనుగోళ్లు చేపడుతారు. మిల్లులను టెండర్ల ద్వారా ఎంపిక చేయాల్సిఉండడంతో ఈసారి యజమానులు దూరంగా ఉంటున్నారు. ఆగస్టు 9న తొలిసారి టెండర్లు ఆహ్వానించి అదేనెల 31వ తేదీ వరకు గడువు విధించారు. టెండర్ల నిబంధనలను కఠినంగా ఉన్నాయని మిల్లుల యజమానులు రాకపోవడంతో సెప్టెంబర్లో రెండో సారి ఆహ్వానించినా యజమానులు పాల్గొనలేదు. దీంతో మూడోసారి టెండర్ల నిర్వహణకు సీసీఐ సిద్ధమవుతోంది. సీసీఐ నిబంధనల కారణంగానే తాము టెండర్లు దాఖలు చేయడం లేదని మిల్లుల యజమానులు చెబుతుండగా.. మూడోసారి టెండర్లలో మార్పులు చేస్తారా, లేదా అనేది తేలాల్సి ఉంది. కాగా, ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో వ్యవసాయ మార్కెట్ల వారీగా పత్తి కొనుగోళ్లకు జిన్నింగ్ మిల్లులను నోటిఫై చేసిన అధికారులు ప్రభుత్వం, సీసీఐకి ప్రతిపాదించారు. ఖమ్మం జిల్లాలో తొమ్మిది, భద్రాద్రి జిల్లాలో ఆరు మిల్లులను నోటిఫై చేసి కొనుగోళ్లు సాఫీగా జరిగేలా కమిటీలను కూడా నియమించారు. ఇదంతా బాగానే ఉన్నా టెండర్ల ప్రక్రియ ఎటూ తేలకపోవడంతో పత్తి కొనుగోళ్లు ఎప్పుడు మొదలవుతాయో స్పష్టత రావడం లేదు. మరికొన్ని సవాళ్లు పత్తి కొనుగోళ్లకు టెండర్ల ప్రక్రియ ఓ సవాల్గా ఉండగా, వ్యవసాయ శాఖ పంట నమోదు ప్రక్రియ కూడా ఇంకో అడ్డంకిగా మారనుంది. యూరియా కొరత నేపథ్యాన వ్యవసాయ విస్తర్ణాధికారులు ఆ పనుల్లో నిమగ్నమై ఉండగా.. పంట నమోదు ప్రక్రియ పూర్తికాలేదు. వ్యవసాయ శాఖ నమోదు చేసిన సాగు విస్తీర్ణం ఆధారంగా పత్తి కొనుగోళ్లు ఉంటాయి. దీనికి తోడు ఈ ఏడాది కేంద్రప్రభుత్వం ‘కపాస్ కిసాన్ యాప్’ను ప్రవేశ పెట్టింది. రైతులు ఈ యాప్లో పంట విక్రయానికి స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉండడంతో మారుమూల గ్రామాల రైతులకు ఇబ్బంది పడే అవకాశముంది.ప్రభుత్వ ఆదేశాల మేరకు పత్తి కొనుగోళ్లకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ఎంపిక చేసిన మిల్లుల్లో కొనుగోళ్లు సజావుగా సాగేలా వివిధ శాఖల అధికారులతో కమిటీలు నియమించాం. జిన్నింగ్ మిల్లులకు టెండర్ల ప్రక్రియ పూర్తికాగానే పత్తి కొనుగోళ్లు మొదలవుతాయి. – ఎం.ఏ.అలీం, జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి, ఖమ్మం -
సైబర్ మోసం కేసులో నిందితుడి అరెస్ట్
ఖమ్మంక్రైం: ఆన్లైన్లో ట్రేడింగ్లో డబ్బు పెడితే ఎక్కువ లాభాలు వస్తాయని నమ్మించి సుమారు రూ.11లక్షల మేర మోసం చేసిన ఘటనలో ఓ వ్యక్తిని సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపారు. సత్తుపల్లి మండలానికి చెందిన ఓ సివిల్ ఇంజనీర్కు ఫోన్ చేసిన గుర్తుతెలియని వ్యక్తులు ఆన్లైన్లో ట్రేడింగ్లో లాభాలు వస్తాయని నమ్మించారు. ఆపై విడతల వారీగా రూ.11లక్షలు తీసుకోగా, బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు విచారణ చేపట్టారు. ఈమేరకు బాధితుడి నగదులో రూ.2లక్షలు లక్కిరెడ్డి హరిప్రసాద్రెడ్డి ఖాతాలో జమ అయినట్లు గుర్తించి రంగారెడ్డి జిల్లా మణికొండలో శనివారం అరెస్ట్ చేశామని సైబర్ క్రైమ్ డీఎస్పీ ఫణీందర్ తెలిపారు. కేసు విచారణలో కీలకంగా వ్యవహరించిన ఎస్ఐలు రంజిత్కుమార్, విజయ్కుమార్, కానిస్టేబుళ్లు కృష్ణారావు, కిషన్రావును సీపీ సునీల్దత్ అభినందించారు. సైబర్ మోసాలకు గురైన యువకులురఘునాథపాలెం/ఖమ్మం అర్బన్: స్వల్ప పెట్టుబడితో అధిక లాభాలు వస్తాయంటూ నమ్మించిన సైబర్ మోసగాళ్లు ఓ యువకుడిని మోసం చేశారు. రఘునాథపాలెం మండలం ఎన్వీ బంజరుకు చెందిన ధరావత్ వెంకటేశ్ సామాజిక మాధ్యమంలో కనిపించిన ఓ యాప్ను ఇన్స్టాల్ చేసుకున్నాడు. ఆపై రూ.17,500 పెట్టుబడి పెడితే రోజుకు రూ.500 చొప్పున ఏడాది పాటు ఇస్తామనే ప్రకటన నమ్మి ఆయనతో పాటు బంధువులతో గత ఆగస్టులో పెట్టుబడి పెట్టించాడు. అనంతరం యాప్ పనిచేయక పోవడంతో తొమ్మిది మంది రూ.1.45 లక్షలు మోసపోయినట్లు గుర్తించి శనివారం ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేశామని రఘునాథపాలెం సీఐ ఉస్మాన్ షరీఫ్ తెలిపారు. అలాగే, ఖమ్మం శ్రీరాంహిల్స్కు చెందిన కిరణ్కుమార్ ఈనెల 14న హైదరాబాద్ నుంచి వస్తూ చిట్యాల వద్ద టిఫిన్ చేశాడు. అక్కడ బిల్ చెల్లింపునకు ఫోన్పే యాప్ ఉపయోగించగా, అదే రోజు రాత్రి ఆయన రెండు ఖాతాల నుంచి రూ.52వేలు విత్డ్రా అయ్యాయి. దీంతో ఆయన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఖమ్మం అర్బన్ సీఐ భానుప్రకాశ్ తెలిపారు. -
జిల్లాను వీడని వానలు
● అల్పపీడనం కారణంగా అంతటా వర్షం ● కామేపల్లిలో అత్యధికంగా 50.2 మి.మీ.గా నమోదు ఖమ్మంవ్యవసాయం: వానాకాలం నుంచి శీతాకాలంలోకి అడుగిడినా వానలు వీడడం లేదు. వాయువ్య మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారడంతో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గురువారం నుంచి జిల్లాలో వర్ష ప్రభావం కొనసాగుతుండగా, శుక్రవారం రాత్రి కూడా పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. శనివారం మధ్యాహ్నం కూడా ఆకాశం మేఘావృతమై ఉండి అప్పుడప్పుడు చిరు జల్లులు కురిశాయి. ఎగువన కురిసిన వర్షాలతో నదులు, వాగుల్లో వరద చేరి ప్రవాహం పెరుగుతోంది. మహబూబాబాద్, ములుగు, వరంగల్, భద్రాద్రి జిల్లాల్లో కురిసిన వానతో మున్నేటిలో నీటి మట్టం పెరిగింది. శుక్రవారం ఉదయం 8–30 నుంచి శనివారం ఉదయం 8–30 గంటల వరకు కామేపల్లి మండలంలో అత్యధికంగా 50.2 మి.మీ.ల వర్షపాతం నమోదైంది. అలాగే, కారేపల్లిలో 38.2, కల్లూరులో 30.2, ఏన్కూరులో 24, రఘునాథపాలెంలో 15.2, ఖమ్మం రూరల్లో 13.4, సత్తుపల్లిలో 12.6, తల్లాడలో 12.4, కొణిజర్లలో 11.4, ఖమ్మం అర్బన్లో 10.2 మి.మీ. వర్షపాతం నమోదైంది. పొంగిన వాగులు.. నిలిచిన రాకపోకలు రఘునాథపాలెం/కామేపల్లి: రఘనాథపాలెం మండలంలోని పాపటపల్లి–వీ.ఆర్.బంజర గ్రామాల మధ్య బుగ్గ వాగులోకి భారీగా వరద చేరడంతో ఉప్పొంగింది. వంతెనపై నాలుగు అడుగుల మేర వరద చేరడం ప్రవాహం శనివారం తెల్లవారుజాము నుండి రాత్రి వరకు కొనసాగింది. దీంతో ఖమ్మం– డోర్నకల్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. వాహనదారులు ఈ మార్గంలోకి వెళ్లకుండా ఇరువైపులా ట్రాక్టర్లు ఏర్పాటుచేసినట్లు వీ.ఆర్.బంజర పంచాయతీ కార్యదర్శి హిమబిందు తెలిపారు. అలాగే, కామేపల్లి మండలం పొన్నేకల్ బుగ్గవాగుకు వరద భారీగా చేరింది. దీంతో వాగు బ్రిడ్జి పైనుంచి వరద ప్రవహిస్తుండగా లింగాల–డోర్నకల్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. గరిడేపల్లి రైల్వే అండర్ బ్రిడ్జిలోకి వరద చేరడంతో రాకపోకలు స్తంభించాయి. -
అవినీతి రహిత సమాజమే ఆర్టీఐ లక్ష్యం
నేలకొండపలి: అవినీతి రహిత సమాజమే సమాచార హక్కు చట్టం లక్ష్యమని రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషనర్ పీ.వీ.శ్రీనివాస్ తెలిపారు. నేలకొండపల్లిలోని బౌద్ధక్షేత్రాన్ని శనివారం సందర్శించిన ఆయన అక్కడ చరిత్ర తెలిపే బోర్డులు తుప్పుపట్టడం, చెట్లు పెరిగి ఉండడాన్ని గుర్తించారు. అనంతరం స్థానిక సిద్ధార్థ యోగా ఆశ్రమం వద్ద శ్రీనివాస్ మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం ద్వారా రాష్ట్రంలో 17వేల కేసులు పెండింగ్ ఉండగా... 13జిల్లాలో పర్యటించి 7వేలకు పైగా పరిష్కరించామని తెలిపారు. తద్వారా పది జిల్లాలో ఒక్క కేసు లేదని చెప్పారు. వచ్చేనెల 3నుంచి సమాచార హక్కు చట్టం వారోత్సవాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. కాగా, ఎంతో చరిత్ర కలిగిన బౌద్ధక్షేత్రాన్నిమరింత అభివృద్ధి చేసేలా మంత్రి జూపల్లి కృష్ణారావు, పర్యాటక శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్తానని శ్రీనివాస్ వెల్లడించారు. తహసీల్దార్ వి.వెంకటేశ్వర్లు, ఎంఆర్ఐ ఆలస్యం రవి తదితరులు పాల్గొన్నారు. -
ఇక పోటీయే మిగిలింది..
సాక్షిప్రతినిధి, ఖమ్మం: జిల్లా, మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల రిజర్వేషన్ల ప్రక్రియ ముగిసింది. ఎంపీపీ, జెడ్పీటీసీ రిజర్వేషన్లు శనివారం ఖరారయ్యాయి. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ప్రభుత్వం జీఓ జారీ చేయగా గత ఎన్నికలతో పోలిస్తే వారి స్థానాల సంఖ్య పెరిగింది. ఇదే సమయాన జనరల్ స్థానాలు చాలా తగ్గాయి. జిల్లాలోని 20 ఎంపీపీ, జెడ్పీటీసీ స్థానాల్లో ఎనిమిది చొప్పున బీసీలకు దక్కాయి. మిగిలినవి రిజర్వేషన్ ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు కేటాయించగా మిగిలినవి జనరల్కు ఖరారయ్యాయి. మొత్తం స్థానాల్లో మహిళలకు పది జెడ్పీటీసీ, తొమ్మిది ఎంపీపీ స్థానాలు రిజర్వు చేశారు. రిజర్వేషన్ కేటాయింపు ఇలా... జిల్లాలో 20 మండలాలకు గాను ఐదు ఎంపీపీ స్థానాలు ఎస్టీలకు కేటాయించగా.. ఇందులో రెండు ఎస్టీ మహిళలకు రిజర్వ్ అయ్యాయి. అలాగే, నాలుగు స్థానాలు ఎస్సీలకు, రెండు ఎస్సీ మహిళలకు కేటాయించారు. ఇక బీసీలకు 8 స్థానాలు రిజర్వు అయ్యాయి. ఇందులో బీసీ మహిళలకు నాలుగు స్థానాలు వచ్చాయి. ఇవిపోగా జనరల్కు మూడు కేటాయించగా.. ఒకటి మహిళలకు దక్కింది. జెడ్పీటీసీ స్థానాల్లో నాలుగు ఎస్టీలకు కేటాయించగా.. అందులో రెండు ఎస్టీ మహిళలకు రిజర్వ్ అయ్యాయి. ఎస్సీలకు నాలుగు రిజర్వ్ కాగా, అందులో రెండు మహిళలకు వెళ్లాయి. బీసీలకు ఎనిమిది స్థానాలు కేటాయిస్తే అందులో నాలుగు బీసీ మహిళలకు, జనరల్ కేటగిరీలో నాలుగు స్థానాలకు రెండు జనరల్ మహిళలకు రిజర్వ్ అయ్యాయి. మారిన ముఖచిత్రం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టంతో జిల్లాలో రిజర్వేషన్ల ముఖచిత్రం మారింది. ప్రధానంగా జనరల్ స్థానాలు తగ్గాయి. జెడ్పీటీసీకి సంబంధించి 2019లో పది జనరల్ స్థానాలు ఉంటే ఇప్పుడు ఆ సంఖ్య కేవలం నాలుగుకు పరిమితమైంది. గత ఎన్నికల్లో బీసీలకు రెండు స్థానాలే ఉండగా రిజర్వేషన్తో ఎనిమిదికి చేరడం విశేషం. ఎస్సీ, ఎస్టీలకు నాలుగేసి స్థానాలు చొప్పున కేటాయించడంతో ఎలాంటి మార్పు రాలేదు. ఇక ఎంపీపీ స్థానాలకు సంబంధించి 2019లో ఎనిమిది జనరల్ స్థానాలు ఉండగా ప్రస్తుతం మూడే దక్కాయి. బీసీలకు గత ఎన్నికల్లో ఒక్క సీటు కూడా లేకపోగా ఈసారి ఎనిమిది స్థానాలు రిజర్వ్ అయ్యాయి. గత ఎన్నికల్లో ఎస్టీలకు ఆరు కేటాయిస్తే ఈసారి ఐదు, ఎస్సీలకు గత ఎన్నికల్లో ఆరు రిజర్వ్ కాగా.. ఈసారి నాలుగు కేటాయించారు. 571 సర్పంచ్, 283 ఎంపీటీసీ స్థానాలు జిల్లాలో 571 గ్రామపంచాయతీలతో పాటు మండల పరిషత్ ఎన్నికలకు సంబంధించి కూడా రిజర్వేషన్ల ప్రక్రియ కొలిక్కి వచ్చింది. ఈమేరకు 571 సర్పంచ్, 283 ఎంపీటీసీల స్థానాల రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియ ఆర్డీఓ కార్యాలయాల్లో రాత్రి పొద్దుపోయే వరకు కొనసాగింది. అలాగే, 5,214 వార్డుసభ్యుల స్థానాల రిజర్వేషన్ల ప్రక్రియ మండల స్థాయిలో నిర్వహించారు. రాఘవాపురం సర్పంచ్ ఏకగ్రీవమే.. సర్పంచ్ స్థానాలకు రిజర్వేషన్లను అధికారికంగా వెల్లడించకపోయినా... చింతకాని మండలం రాఘవాపురం జీపీ సర్పంచ్ స్థానం ఎస్సీ మహిళకు రిజర్వ్ అయినట్లు తెలిసింది. ఇదే జరిగితే సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవం కానుంది. ఎందుకంటే ఈ గ్రామంలో ఒకే ఎస్సీ కుటుంబం ఉండగా.. అందులో మహిళ కాంపల్లి కోటమ్మ మాత్రమే ఉన్నారు. దీంతో ఆమె ఏకగ్రీవంగా సర్పంచ్ పదవి దక్కించుకోనున్నారు. ప్రస్తుతం కోటమ్మ సీపీఐలో కొనసాగుతున్నారు. కాగా, గత ఎన్నికల్లో రాఘవాపురం సర్పంచ్ స్థానాన్ని జనరల్కు రిజర్వ్ చేయగా అంతా కలిసి సీపీఐ నాయకుడు కొండపర్తి గోవిందరావును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.జెడ్పీటీసీ, ఎంపీపీ స్థానాల రిజర్వేషన్ల ఖరారుకు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆధ్వర్యాన కలెక్టరేట్లో డ్రా తీశారు. వివిధ రాజకీయ పక్షాల నాయకుల సమక్షాన డ్రా నిర్వహించి రిజర్వేషన్లు ప్రకటించారు. అదనపు కలెక్టర్ శ్రీజ, జెడ్పీ సీఈఓ దీక్షారైనా, ఆర్డీఓ జి.నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. జెడ్పీటీసీ, ఎంపీపీలకు సంబంధించిన రిజర్వేషన్ ఖరారుకు డ్రా పూర్తికాగా.. ఎంపీటీసీలు, సర్పంచ్లకు సంబంధించి రిజర్వేషన్ ప్రక్రియ రాత్రి పొద్దుపోయే వరకు కొనసాగుతూనే ఉంది.జిల్లాలో 20 జెడ్పీటీసీ స్థానాలు ఉండగా, జెడ్పీ చైర్మన్ పదవిని ఈసారి ఎస్టీ జనరల్ కేటగిరీకి కేటాయించారు. ఇరవై జెడ్పీటీసీ స్థానాల్లో కూసుమంచి, కొణిజర్ల స్థానాలు ఎస్టీ జనరల్కు, తిరుమలాయపాలెం, సత్తుపల్లి స్థానాలు ఎస్టీ మహిళలకు రిజర్వ్ చేశారు. ఈ నేపథ్యాన ఈ నాలుగు స్థానాల నుంచి జెడ్పీటీసీగా గెలిచిన అభ్యర్థికి చైర్మన్ పదవి దక్కనుంది. అయితే, జనరల్ స్థానాల్లోనూ ఎస్టీలకు బరిలోకి దిగే అవకాశం ఉన్నా జిల్లాలో నాలుగు స్థానాలే ఉండడంతో పోటీ తీవ్రత కారణంగా ఆ అవకాశం రాకపోవచ్చని భావిస్తున్నారు. కాగా, గత ఎన్నికల్లో జెడ్పీ చైర్మన్ స్థానం ఎస్సీలకు రిజర్వ్ చేయగా.. లింగాల కమల్రాజ్ చైర్మన్గా బాధ్యతలు నిర్వర్తించారు.జెడ్పీటీసీ, ఎంపీపీ స్థానాల రిజర్వేషన్లు ఖరారు జెడ్పీటీసీ ఎంపీపీ స్థానం 2019 2025 2019 2025 కూసుమంచి జనరల్ ఎస్టీ ఎస్టీ బీసీ మహిళ తిరుమలాయపాలెం జనరల్ ఎస్టీ మహిళ ఎస్టీ ఎస్సీ మహిళ సత్తుపల్లి జనరల్ ఎస్టీ మహిళ జనరల్ మహిళ ఎస్టీ కొణిజర్ల జనరల్ ఎస్టీ జనరల్ ఎస్టీ మహిళ కల్లూరు జనరల్ ఎస్సీ మహిళ ఎస్సీ బీసీ మహిళ ఎర్రుపాలెం జనరల్ ఎస్సీ ఎస్సీ జనరల్ మహిళ ముదిగొండ బీసీ మహిళ ఎస్సీ జనరల్ ఎస్సీ తల్లాడ జనరల్ ఎస్సీ మహిళ జనరల్ ఎస్సీ మహిళ బోనకల్ ఎస్సీ బీసీ మహిళ ఎస్సీ మహిళ బీసీ ఖమ్మంరూరల్ జనరల్ బీసీ మహిళ జనరల్ బీసీ పెనుబల్లి జనరల్ బీసీ మహిళ జనరల్ ఎస్టీ వైరా ఎస్సీ మహిళ బీసీ ఎస్సీ మహిళ బీసీ నేలకొండపల్లి జనరల్ బీసీ జనరల్ బీసీ వేంసూరు ఎస్సీ మహిళ బీసీ ఎస్సీ బీసీ మహిళ మధిర ఎస్సీ బీసీ మహిళ ఎస్సీ మహిళ బీసీ మహిళ రఘునాథపాలెం ఎస్టీ మహిళ బీసీ ఎస్టీ మహిళ జనరల్ చింతకాని బీసీ జనరల్ జనరల్ ఎస్సీ ఏన్కూరు ఎస్టీ మహిళ జనరల్ ఎస్టీ ఎస్టీ మహిళ కామేపల్లి ఎస్టీ జనరల్ మహిళ ఎస్టీ మహిళ ఎస్టీ సింగరేణి ఎస్టీ జనరల్ మహిళ ఎస్టీ మహిళ జనరల్ -
అనర్హులకు ఇందిరమ్మ ఇళ్లు
ఎంపీడీఓను సస్పెండ్ చేయాలని ధర్నామధిర: అర్హులైన వారికి కాక అనర్హులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసిన ఎంపీడీఓను సస్పెండ్ చేయాలని సీపీఎం నాయకులు, చిలుకూరు గ్రామస్తులు శనివారం మధిర మండల పరిషత్ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. ఈ సందర్భంగా సీపీఎం నాయకులు మందా సైదులు, శీలం నరసింహారావు, పాపినేని రామనరసయ్య మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనల ప్రకారం దివ్యాంగులు, ఒంటరి మహిళలు, వితంతువులు, ఇంటి స్థలం ఉండి ఇల్లు లేని నిరుపేదలు, అద్దె ఇంట్లో నివాసం ఉండే వారికి ఇళ్లు మంజూరు చేయాల్సి ఉండగా ఎంపీడీఓ అందుకు విరుద్ధంగా వ్యవహరించారని ఆరోపించారు. చిలుకూరు గ్రామంలో ఇల్లు ఉన్న వారికే కేటాయించగా నిరుపేదలకు నష్టం జరిగిందని తెలిపారు. అంతేకాక కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కాదనే కారణంతో 34మందికి మొండిచేయి చూపారని విమర్శించారు. ఎంపికలో వసూళ్లకు పాల్పడిన వారి వివరాలు సమర్పించినా ఎంపీడీఓ చర్యలు తీసుకోకపోగా, ఒంటరి మహిళ పేరును అర్హుల జాబితా నుంచి తొలగించారని చెప్పారు. నాయకులు శంకర్రావు, శ్రీరాములు, వెంకటనరసయ్య, రామకిషోర్, లాలు, ధనలక్ష్మి, గోపీనాథ్, మీరాబీ, వజ్రమ్మ, సైదమ్మ, లక్ష్మి పాల్గొన్నారు. -
వీర వనిత చాకలి ఐలమ్మ..
ఖమ్మంమయూరిసెంటర్: వీర వనిత చాకలి ఐలమ్మ ప్రదర్శించిన పోరాట స్ఫూర్తి మార్గదర్శకంగా నిలుస్తుందని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. చాకలి ఐలమ్మ జయంతిని శుక్రవారం ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రి ఎదురుగా ఆమె విగ్రహం వద్ద జిల్లా వెనకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యాన నిర్వహించారు. ఐలమ్మ విగ్రహానికి కలెక్టర్ అనుదీప్ పూలమాలలు వేసి నివాళులర్పించాక మాట్లాడారు. సమాజంలోని అసమానత్వం, దొరల దాష్టీకానికి ఎదురొడ్డి నిర్భయంగా పోరాడిన వీరనారి చాకలి ఐలమ్మ అని, జమీందార్ల పాలనలో వెట్టిచాకిరీకి వ్యతిరేకంగా పోరాడేలా ప్రజల్లో స్ఫూర్తి నింపారని తెలిపారు. జిల్లా వెనకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధికారి జి.జ్యోతి, కార్పొరేటర్ బీ.జీ.క్లెమెంట్, రజక, బీసీ సంఘాల నాయకులు బొడ్డు ఉపేందర్, జక్కుల వెంకటరమణ, కనతాల నరసింహారావు, తుపాకుల ఎలగొండ స్వామి, గజ్జల వెంకన్న, పడిగల కృష్ణవేణి, కృష్ణారావు, రేగళ్ల సీతారాములు, సత్తెనపల్లి శ్రీను పాల్గొన్నారు.జయంతి వేడుకల్లో కలెక్టర్ అనుదీప్ -
మరి ఎవరిది బాధ్యత?
● కేఎంసీ పరిధి ఈఎండీ, ఎఫ్ఎస్డీ చెల్లింపుల్లో సమస్యలు ● పనులు తమ హయాంలో జరగలేదని అధికారుల దాటవేత ● ఇబ్బంది పెట్టొద్దని కాంట్రాక్టర్ల ఆవేదనఖమ్మంమయూరిసెంటర్: ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అభివృద్ధి పనులు చేసే కాంట్రాక్టర్లు విలువలో కొంత నగదును జమ చేయాల్సి ఉంటుంది. ఈఎండీ(ఎర్నేస్ మనీ డిపాజిట్), ఎఫ్ఎస్డీ(ఫరదర్ సెక్యూరిటీ డిపాజిట్)ల రూపంలో కేఎంసీ ఖాతాకు జమ చేస్తే.. పనులు పూర్తయ్యాక నాణ్యతను పరీక్షించి అధికారులు తిరిగి చెల్లిస్తారు. అయితే, కొన్నేళ్లుగా ఈఎండీలు, ఎఫ్ ఎస్డీల చెల్లింపుల్లో జాప్యం జరుగుతోంది. దీంతో పనులు పూర్తిచేసిన కాంట్రాక్టర్లు కేఎంసీ చుట్టు ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇటీవల కమిషనర్ అభిషేక్ అగస్త్య చొరవతో కాంట్రాక్టర్లకు చెల్లింపులు సాఫీ గానే జరిగినా.. కొత్తగా వచ్చిన ఇంజనీరింగ్ అధికా రుల తీరుతో సమస్య మళ్లీ మొదటికి వచ్చింది. ముందుగానే నగదు జమ కాంట్రాక్టర్లకు పనులు కేటాయించే సమయాన అధికారులు ఈఎండీ కట్టించుకుంటారు. ఈఎండీ రూపంలో పని విలువ ఆధారంగా 1 – 1.50 శాతం వరకు కట్టించుకుంటుండగా.. 2.50శాతం ఎఫ్ ఎస్డీగా కేఎంసీ ఖాతాలోనే ఉంచుతున్నారు. పనులు పూర్తయిన ఆరు నెలల నుండి మూడేళ్ల లోపు కాంట్రాక్టర్కు వీటిని తిరిగి చెల్లించాలి. అయితే కేఎంసీలో ఎఫ్ఎస్డీని 2.50 శాతం నుండి 7 శాతం వరకు అంటిపెట్టుకుంటున్నట్లు తెలిసింది. ఇప్పుడు వీటి చెల్లింపులపై అధికారులు – కాంట్రాక్టర్లకు మధ్య వివాదాలు తలెత్తుతున్నాయి. అప్పుడు మేం లేము... ఇటీవల అసిస్టెంట్ ఇంజనీర్(ఏఈ)లుగా కేఎంసీలో బాధ్యతలు చేపట్టిన ఇంజనీరింగ్ అధికారుల తీరును కాంట్రాక్టర్లు తప్పు పడుతున్నారు. గతంలో తాము చేసిన పనులకు సంబంధించి ఈఎండీ, ఎఫ్ఎస్డీ చెల్లించాలని కాంట్రాక్టర్లు ఇంజనీరింగ్ అధికారులను కోరితే.. పనులు జరిగిన సమయాన తాము విధుల్లో లేమంటూ దాటవేత ధోరణి పదర్శిస్తున్నట్లు సమాచారం. కొద్దిరోజులుగా ఏఈల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని కాంట్రాక్టర్లు పేర్కొంటున్నారు. ఇదే సమస్యపై కమిషనర్ను కలిస్తే బిల్లులు చెల్లించేందుకు సుముఖత వ్యక్తం చేసినా అధికారులకు పెడచెవిన పెడుతున్నారని వాపోతున్నారు. పనులు జరిగిన సమయాన ఉన్న అధికారులు ఇప్పుడు ఇతర మున్సిపాలిటీలకు వెళ్లారని, ఉద్యోగుల బదిలీలు సహజమే అయినప్పుడు తమ బిల్లులు ఆపడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. రూ.2 కోట్లకు పైగానే.. గతంలో పూర్తి చేసిన పనులకు సంబంధించి ఈఎండీలు, ఎఫ్ఎస్డీల బకాయి రూ.2 కోట్లకు కేఎంసీ ఖాతాలో ఉన్నట్లు తెలుస్తోంది. పనులు చేసేందుకు రూ.కోట్ల అప్పులు తీసుకొస్తున్న తాము ఈఎండీలు, ఎఫ్ఎస్డీ చెల్లింపుల్లో కేఎంసీ అధికారులు తీరు కారణంగా మరింత ఇబ్బంది పడుతున్నామని కాంట్రాక్టర్లు ఆరోపిస్తున్నారు. ఈఎండీలు, ఎఫ్ఎస్డీలపై ఇంజనీరింగ్ అధికారుల వ్యవహరిస్తున్న తీరుపై కాంట్రాక్టర్లు జట్టుగా జిల్లా ప్రజాప్రతినిధులను కలవాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. ఖమ్మం నగర పాలక సంస్థ కార్యాలయంలో ఓ కాంట్రాక్టర్, ఏఈ మధ్య శుక్రవారం వాగ్వాదం చోటు చేసుకుంది. కమిషనర్ పేషీ వద్ద వీరిద్ద మధ్య మొదలైన మాటల యుద్ధం చివరకు తీవ్ర స్థాయికి చేరింది. అక్కడ ఉన్న సిబ్బంది, ఇతర కాంట్రాక్టర్లు వారిని వారించారు. ఈఎండీలు, ఎఫ్ఎస్డీలు చెల్లించాలని కొద్దిరోజులుగా కోరుతున్నా పట్టించుకోవడం లేదని కాంట్రాక్టర్లు చెబుతున్నారు. ఈవిషయంలోనే ఏఈని అడగగా గతంలో జరిగిన పనులకు సంబంధించి తనకు తెలియదంటూ దాటవేయడంతో వాగ్వాదం జరిగినట్లు సమాచారం. కాగా, కాంట్రాక్టర్, ఏఈ మధ్య వాగ్వాదంపై కొందరు కాంట్రాక్టర్లు కమిషనర్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. -
ఇస్తారా.. ఇవ్వరా?
జోరుగా సన్నధాన్యం సాగు రాష్ట్ర ప్రభుత్వం సన్నధాన్యానికి బోనస్ ప్రకటించడంతో యాసంగిలో రైతులు అటే మొగ్గు చూపారు. సహజంగా ఈ సీజన్లో ఆరుతడి పంటల సాగు చేయాలని వ్యవసాయ అధికారులు సూచిస్తుంటారు. రైతులు కూడా అతి తక్కువ విస్తీర్ణంలో వరి సాగు చేస్తారు. కానీ మద్దతు ధరకు తోడు బోనస్ వస్తుందని సన్నధాన్యాన్నే సాగు చేశారు. ఫలితంగా సాగర్ ఆయకట్టుతో పాటు ఇతర ప్రాంతాల్లో 2,10,830 ఎకరాల్లో వరి సాగు చేస్తే అందులో 1,29,064 ఎకరాల్లో సన్నరకాలే సాగయ్యాయి. 18,893 మంది రైతుల నుంచి సేకరణ యాసంగి సీజన్లో సన్న, దొడ్డు రకాలు కలిపి 54,51,516 క్వింటాళ్ల ధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. మిల్లర్లు, ప్రైవేట్ వ్యాపారుల కొనుగోళ్లు, రైతుల అవసరాలు పోగా 25,84,928 క్వింటాళ్ల సేకరణను లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో సన్న రకాలు 18,53,370 క్వింటాళ్లు ఉన్నాయి. అయితే 18,893 మంది రైతుల నుంచి 12,70,653.60 క్వింటాళ్ల ధాన్యాన్ని పౌర సరఫరాల సంస్థ సేకరించింది. రూ.63.63 కోట్లు బకాయి యాసంగిలో సన్నరకం ధాన్యం సాగు చేయడం ఒక ఎత్తయితే.. ఆ ధాన్యాన్ని విక్రయించడం మరో సమస్యగా మారింది. అయినా మద్దతు ధరకు తోడు క్వింటాకు రూ.500 బోనస్ వస్తుందని రైతులు భరించారు. అమ్మకం పూర్తికాగానే బోనస్ జమ చేస్తామని ప్రభుత్వం ప్రకటించినా ఇప్పటికీ రాకపోవడంతో అన్నదాతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. యాసంగి సీజన్కు సంబంధించి 18,893 మంది రైతులకు రూ.63,63,57,600 బోనస్ అందాల్సి ఉంది. ప్రస్తుతం వానాకలం పంటల సీజన్ కొసాగుతుండడంతో పెట్టుబడికి ఉపయోగపడుతుందనుకున్న బోనస్ రాకపోవడం గమనార్హం. మరో రెండు నెలల్లో ఈ వానాకాలంలో పండించిన ధాన్యం కొనుగోళ్లు కూడా మొదలవుతాయి. ఈ నేపథ్యాన యాసంగి సీజన్ బోనస్ చెల్లించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.కొనుగోలు కేంద్రాల్లో సన్నధాన్యం విక్రయానికి రైతులు అనేక అవస్థలు పడ్డారు. ధాన్యం కాంటాలు సమయానికి జరగక కేంద్రాల్లో రోజుల తరబడి ఉండాల్సి వచ్చింది. తేమ శాతం పేరుతో మిల్లర్లు క్వింటాకు 3 – 5 కేజీల తరుగు తీశారు. మరోవైపు లోడింగ్ కోసం లారీలు రాక ఇబ్బంది పడ్డారు. అకాల వర్షాలతో ధాన్యం తడిస్తే ఆరబెడుతూ కాలం గడిపారు. ఇన్ని అవాంతరాల నడుమ ధాన్యం అమ్మినా బోనస్ రాక ఆవేదన చెందుతున్నారు. ధాన్యం బోనస్ కోసం రైతుల ఎదురుచూపులు యాసంగి సీజన్లో పండించిన ధాన్యాన్ని నేలకొండపల్లి కేంద్రంలో విక్రయించా. 50 క్వింటాళ్ల ధాన్యం అమ్మితే బోనస్ వెంటనే వస్తుందని చెప్పారు. వానాకాలం సాగు ఖర్చులకు బోనస్ ఉపయోగపడుతుందనుకున్నా. కానీ ఇప్పటికీ అందలేదు. బోనస్ కోసంఽ అధికారులను అడిగితే ఏమీ చెప్పడం లేదు. ఇకనైనా చెల్లిస్తే ఖర్చులకు కలిసొస్తుంది. – పోలంపల్లి జాన్, భైరవునిపల్లి, నేలకొండపల్లి మండలం -
మహాలక్ష్మీదేవి అవతారంలో అమ్మవారు
ఎర్రుపాలెం: తెలంగాణ తిరుపతిగా పేరున్న జమలాపురంలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు శుక్రవారం ఐదో రోజుకు చేరాయి. శ్రీవారికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం పద్మావతి అమ్మవారిని మహాలక్ష్మీదేవి అవతారంలో అలంకరించారు. ఈ సందర్భంగా పెద్దసంఖ్యలో భక్తులు దర్శించుకోగా, మహిళలు సామూహిక కుంకుమార్చన చేశారు. ఆలయ ఈఓ జగన్మోహన్రా వు, చైర్మన్ ఉప్పల శ్రీరామచంద్రమూర్తి, ప్రధా నార్చకులు ఉప్పల శ్రీనివాసశర్మ, ముఖ్య అర్చకులు ఉప్పల మురళీమోహన్శర్మ, వేదపండితులు, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు. ఉత్తమ ఫలితాల సాధనే లక్ష్యం ఖమ్మం సహకారనగర్: ఉత్తమ ఫలితాలు సాధించడమే లక్ష్యంగా విద్యార్థులు శ్రద్ధతో చదవాలని, తద్వారా అధ్యాపకులు, తల్లిదండ్రులకు పేరు తీసుకురావాలని ఇంటర్మీడియట్ బోర్డు ప్రత్యేక అధికారి హేమచందర్ సూచించారు. ఖమ్మం ఏఎస్ఆర్ శాంతినగర్ జూనియర్ కళాశాలలో శుక్రవారం నిర్వహించిన పేరెంట్ – టీచర్ సమావేశంలో ఆయన డీఐఈఓ రవిబాబు, డీఎంహెచ్ఓ కళావతిబాయితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణ, ప్రణాళికాయతంగా చదివితే లక్ష్యసాధన సులువవుతుందని తెలిపారు. ఇటీవల రెడ్ రిబ్బన్ క్లబ్ ఆధ్వర్యాన పాట్నాలో నిర్వహించిన రీజినల్ స్థాయి క్విజ్ పోటీలో ప్రథమ స్థానం సాధించిన దేవీశ్రీ ప్రసన్నను సన్మానించారు. అనంతరం విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడి విద్యార్థుల చదువు, హాజరుపై సూచనలు చేశారు. ప్రిన్సిపాల్ గోవిందరావు, అధ్యాపకులు పాల్గొన్నారు. అలాగే, ఖమ్మం నయాబజార్ జూనియర్ కళాశాలలో నిర్వహించిన పేరెంట్స్ – టీచర్స్ సమావేశంలో డీఐఈఓ రవిబాబు మాట్లాడారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మౌలిక వసతులు కల్పించడంతో పాటు విద్యకు ప్రాధాన్యత ఇస్తున్నందున సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రిన్సిపాల్ సత్యనారాయణరెడ్డి, అధ్యాపకులు పాల్గొన్నారు. స్థానిక ఎన్నికల సిబ్బందికి శిక్షణ ఖమ్మం సహకారనగర్: స్థానిక సంస్థల ఎన్నిక ల నిర్వహణకు త్వరలో షెడ్యూల్ విడుదలవుతుందనే సమాచారంతో అధికార యంత్రాంగం సిద్ధమవుతోంది. ఈ మేరకు శుక్రవారం ఖమ్మం టీటీడీసీ సమావేశ మందిరంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి ఆర్ఓ, ఏఆర్ఓలకు శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ దీక్షారైనా హాజరై సూచనలు చేశారు. అలాగే, భక్తరామదాసు కళాక్షేత్రంలో గ్రామపంచాయతీ ఎన్నికలకు ఎంపిక చేసిన ఆర్ఓ, ఏఆర్ఓలకు శిక్షణ ఇవ్వగా జిల్లా పంచాయతీ అధికారి ఆశాలత తదితరులు పాల్గొన్నారు. ఖమ్మం మార్కెట్కు సెలవులు ఖమ్మంవ్యవసాయం: వారాంతంతో పాటు సద్దుల బతుకమ్మ, దుర్గాష్టమి, దసరా, గాంధీ జయంతి సందర్భంగా ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు వరుస సెలవులు ప్రకటించారు. ఈనెల 27, 28వ తేదీల్లో శని, ఆదివారాలు వారాంతపు సెలవులు వచ్చాయి. ఆతర్వాత 29వ తేదీన సోమవారం మార్కెట్ నిర్వహణ కొనసాగుతుంది. ఇక 30వ తేదీ మంగళవారం దుర్గాష్టమి, అక్టోబర్ 1న బుధవారం మహార్నవమి, 2వ తేదీ గురువారం విజయ దశమి, గాంధీజయంతి సందర్భంగా సెలవులు ప్రకటించారు. ఈ విషయాన్ని రైతులు, వ్యాపారులు గుర్తించాలని మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి పి.ప్రవీణ్కుమార్ సూచించారు. -
మహిళలు పోరాటాల్లోకి రావాలి
బోనకల్: పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ, మల్లు స్వరాజ్యం స్ఫూర్తితో మహిళలు పోరాటాల్లోకి రావాలని ఐద్వా రాష్ట్ర కార్యదర్శి మల్లు లక్ష్మి పిలుపునిచ్చారు. బోనకల్ మండలం ముష్టికుంట్లలో ఐద్వా మధిర డివిజన్ మహాసభ పయ్యావుల ప్రభావతి అధ్యక్షతన శుక్రవారం నిర్వహించారు. తొలుత పతాకాన్ని ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బుగ్గవీటి సరళ ఆవిష్కరించగా అమరుల చిత్రపటాల వద్ద నివాళులర్పించాక మల్లు లక్ష్మి మాట్లాడారు. మహిళలు శాస్త్ర, సాంకేతిక రంగాల్లో పురుషులతో పాటు సమానంగా రాణిస్తున్నారన్నారు. ఐద్వా పోరాటాల ఫలితంగానే అనేక హక్కులు సాధించుకున్నామని తెలిపారు. మహిళలు లేకపోతే వ్యవస్థ లేదని వెల్ల డించిన ఆమె బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మహిళలపై దాడులు, వేధింపులు, అత్యాచారాలు, హత్యలు పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం మధిర డివిజన్ కమిటీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా జొన్నలగడ్డ సునీత, కళావతిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సీపీఎం డివిజన్ కార్యదర్శి మడుపల్లి గోపాలరావు, నాయకులు బండి పద్మ, మెరుగు రమణ, జొన్నలగడ్డ సునీత, బంధం వెంకటరాజ్యం, రజిత, కొంగర వెంకటనారాయణ తదితరులు పాల్గొన్నారు.ఐద్వా రాష్ట్ర కార్యదర్శి మల్లు లక్ష్మి -
122 కాదు.. 116 వైన్స్షాపులే..
● గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన అధికారులు ● మిగిలిన షాప్లు హైదరాబాద్కు కేటాయింపు ఖమ్మంక్రైం: నూతన ఎకై ్సజ్ పాలసీలో భాగంగా జిల్లాలోని 122 మద్యం దుకాణాలకు బదులు 116 వైన్స్కే దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఈమేరకు గెజిట్ నోటిఫికేషన్ను జిల్లా ఎకై ్సజ్ శాఖ అధికారులు శుక్రవారం విడుదల చేశారు. ఇందులో భాగంగా వ్యాపారుల నుంచి దరఖాస్తుల స్వీకరణకు ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎకై ్సజ్ అధికారి నాగేందర్రెడ్డి తెలిపారు. ఖమ్మంలోని పోలీస్ ఏసీపీ కార్యాలయం పక్కనే ఉన్న ఎకై ్సజ్ స్టేషన్–1లో అన్ని ఎకై ్సజ్ సర్కిళ్లకు స్టేషన్లకు సంబంధించిన దరఖాస్తులు తీసుకునేందుకు కౌంటర్లు సిద్ధం చేశామని వెల్లడించారు. అక్టోబర్ 18వ తేదీ సాయంత్రం 5గంటల వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపారు. ఆరు షాపుల రద్దు గత ఎకై ్సజ్ పాలసీలో 122 మద్యం దుకాణాలకు దరఖాస్తులు స్వీకరించారు. అయితే, ఈసారి 116 వైన్స్కే గెజిట్ విడుదలైంది. మధిర ఎకై ్సజ్ సర్కిల్ పరిధిలోని ఆరు షాపుల్లో సరైన అమ్మకాలు లేనందున టెండర్లు తగ్గుతాయని భావించినట్లు సమాచారం. దీంతో ఆరు షాపులను హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలోకి మార్చినట్లు తెలిసింది. అలాగే, గతంలో జిల్లా కేంద్రంలో ఆరు క్లస్టర్లు ఉండగా వాటిని ఈసారి మూడింటికి కుదించినట్లు సమాచారం. కాగా, జిల్లాలోని 116వైన్స్ల్లో 18 గౌడ కులస్తులకు, 14 ఎస్సీలకు, ఎనిమిది ఎస్టీలకు రిజర్వ్ చేశారు. -
బీసీల రిజర్వేషన్లపై కేంద్రం నిర్లక్ష్యం
● జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ ● కలెక్టరేట్ ఎదుట ఆమరణ దీక్ష.. విరమింపచేసిన పోలీసులుఖమ్మం మామిళ్లగూడెం: బీసీల రిజర్వేషన్ విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నారాయణవరపు శ్రీనివాస్ ఆరోపించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలనే డిమాండ్తో ఆయనతో పలువురు నాయకులు శుక్రవారం కలెక్టరేట్ ఎదుట ఆమరణ దీక్ష చేపట్టారు. ఈసందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ బీసీలు రాజకీయ, ఉద్యోగ రంగాల్లో నష్టపోకుండా తక్షణమే రిజర్వేషన్లు వర్తింపచేయాలని డిమాండ్ చేశారు. ఈమేరకు బీజేపీ ఎంపీలతో పాటు అన్ని పార్టీల నాయకులు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. కాగా, దీక్షకు సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్ట రాగమయి, డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, కాంగ్రెస్, బీఆర్ఎస్, బీసీ సంఘాల నాయకులు డాక్టర్ దయానంద్, నీరజాదేవి, దోమ ఆనంద్బాబు, సుజలాదేవి, పుచ్చకాయల వీరభద్రం, గుండాల కృష్ణ, బొమ్మ రాజేశ్వరరావు, తెలంగాణ ఉద్యమకారుల ఫోరం చైర్మన్ డాక్టర్ కేవీ.కృష్ణారావు తదితరులు సంఘీభావం తెలిపారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే రాగమయి, డీసీసీ అధ్యక్షుడు దుర్గాప్రసాద్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బీసీల రిజర్వేషన్లపై చిత్తశుద్ధి ఉందని తెలిపారు. అలాగే, వివిధ పార్టీలు, సంఘాల నాయకులు కత్తి నెహ్రూగౌడ్, పెళ్లూరి విజయ్కుమార్, తాటి వెంకటేశ్వర్లు, చిట్టోజు రమేష్, పుల్లయ్య, వరలక్ష్మి, మేడేపల్లి కృష్ణమాచారి, లింగనబోయిన పుల్లారావు, మసనం శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. కాగా, శిబిరం వద్దకు రఘునాథపాలెం పోలీసులు చేరుకుని దీక్షను విరమింపచేశారు. కల్లూరు/కల్లూరు రూరల్: బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ చేపట్టిన ఆమరణ దీక్షకు కల్లూరు మండల కాంగ్రెస్ నాయకులు మద్దతు తెలిపారు. ఈఏరకు కల్లూరు నుంచి కాంగ్రెస్, బీసీ సంఘం నాయకులు లక్కినేని కృష్ణ, పెద్దబోయిన శ్రీనివాసరావు, రాజబోయిన శ్రీనివాసరావు, మట్టా రామకృష్ణ, తోట సుబ్బారావు, పొన్నూరు వెంకటేశ్వరరావు, ఆళ్లకుంట నరసింహారావు, కొడవటి వెంకటేశ్వరరావు, రాచపోయిన శ్రీను, సుబ్బారావు హాజరయ్యారు. -
ఐక్యతతోనే కాపు కార్పొరేషన్ సాధన
ఖమ్మం మామిళ్లగూడెం: మున్నూరు కాపులంతా ఐక్యంగా ఉండడం ద్వారా ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పా టు, నిధుల సాధన సాధ్యమవుతుందని ము న్నూరు కాపు సంఘం రాష్ట అధ్యక్షుడు డాక్టర్ కొండ దేవయ్య తెలిపారు. ఖమ్మంలో శుక్రవారం జరి గిన సంఘం సమావేశంలో ఆయన మాట్లాడుతూ జనాభా లెక్కల సమయాన ప్రతీ ఇంట వివరాలు నమోదు చేయించాలని సూచించారు. అనంతరం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా శెట్టి రంగారావు, ఉపాధ్యక్షుడిగా పసుపులేటి దేవేందర్, కార్యదర్శిగా గోవిందు శ్రీనివాసరావు, సహాయ కార్యదర్శిగా సూరంశెట్టి కిషోర్, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా వేముల కృష్ణప్రసాద్ ను ఎంపిక చేసినట్లు తెలిపారు. ఆతర్వాత దేవయ్యను నాయకులు సత్కరించారు. ఈసమావేశంలో నాయకులు కొత్త సీతారాములు, పోదిల రవికుమార్, జనార్దన్, నాగ భూషణం, శ్రీదేవి, రాపర్తి శరత్, చామకూరి వెంకటనారాయణ, మాడురి పూర్ణ, మడూరి సైదారావు, జేవీఎల్.నరసింహరావు, నరేష్, చెరుకూ రి పూర్ణ, మాదంశెట్టి హన్మంతరావు, విప్లవకుమార్, నరసింహరావు, వెంకటేశ్వర్లు, సోమయ్య, సూర య్య, ఆర్.కే. నాయుడు, జయప్రకాష్ పాల్గొన్నారు. -
మళ్లీ సమ్మెబాట
● కమీషన్ కోసం రేషన్ డీలర్ల నిర్ణయం ● స్పందించకపోతే వచ్చే నెల షాప్లు తెరవబోమని వెల్లడి ● రాష్ట్రం నిధులు వచ్చినా.. కేంద్రం నుంచి బకాయిఖమ్మం సహకారనగర్: రేషన్ డీలర్లు తమకు రావాల్సిన కమీషన్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈనెల 30వ తేదీ వరకు బకాయిలు విడుదల చేయకపోతే వచ్చేనెల షాప్లు తెరిచేది లేదని స్పష్టం చేశారు. ఈమేరకు వచ్చే నెల 1, 2వ తేదీల్లో ఉపవాస దీక్షలు చేపడుతామని, ఆతర్వాత 3వ తేదీ నుంచి దుకాణాలు బంద్ చేస్తామని హెచ్చరిస్తున్నారు. రూ.5కోట్ల మేర బకాయి జిల్లాలోని 21 మండలాల పరిధిలో 748 రేషన్ షాప్లు ఉన్నాయి. ఆయా షాప్ల డీలర్లకు ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు ఆరు నెలలు కమీషన్ అందాల్సి వస్తుంది. ప్రతీనెల కమీషన్ ఇవ్వకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోతున్నారు. క్వింటా బియ్యం ఇచ్చినందుకు కమీషన్గా రూ.140 ఇస్తుండగా అందులో కేంద్రం వాటా రూ.90, రాష్ట్రం వాటా రూ.50గా ఉంది. మొత్తంగా జిల్లా డీలర్లకు రూ.5కోట్ల మేర కమీషన్ బకాయి ఉన్నట్లు సమాచారం. ఇటీవల డీలర్లు సమ్మె చేస్తామని హెచ్చరించడంతో రాష్ట్రప్రభుత్వం తన ఐదు నెలల వాటాను గత నెల చివరలో విడుదల చేసింది. కానీ కేంద్రం నిధులు రాకపోవడంతో డీలర్ల ఖాతాల్లో నగదు జమ కాలేదు. ఈ నేపథ్యాన వచ్చే నెలలో సమ్మె బాట పట్టాలని నిర్ణయించారు. ఇటీవల రాష్ట్రప్రభుత్వం కమీషన్ నిధులు విడుదల చేసింది. కేంద్రం కూడా తక్షణమే విడుదల చేయాలి. కమీషన్ అందక డీలర్లు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డీలర్ల సమస్యలను గుర్తించి కేంద్రప్రభుత్వం ఇకనైనా స్పందించాలి. – బి.వెంకన్న, రేషన్ డీలర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు -
‘క్రిప్టో కరెన్సీ’ కలకలం
● నకిలీ అకౌంట్లతో లావాదేవీలు? ● జిల్లాలోని పలువురి పేరిట వ్యవహారం ఖమ్మంగాంధీచౌక్: జిల్లాలో ‘క్రిప్టో’ కరెన్సీ వ్యవహారం కలకలం రేపుతోంది. పలువురి పాన్ కార్డులను ఉపయోగించి నకిలీ అకౌంట్లతో కొందరు లావాదేవీలు నిర్వహిస్తూ మోసాలకు పాల్పడుతున్న వ్యవహారం చర్చనీయాంశమైది. రైతులు, కూలీలు, డెలివరీ బాయ్స్ పేరిట రూ.కోట్లలో క్రిప్టో కరెన్సీ లావాదేవీలు జరిగినట్లు సమాచారం. హైదరాబాద్, సిద్దిపేట, జగిత్యాలతో పాటు జిల్లాలోని ఖమ్మం, సత్తుపల్లి ఈ వ్యవహారం చోటు చేసుకున్నట్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఖమ్మంకు చెంది ఓ ఫార్మా ఉద్యోగి, సత్తుపల్లిలో రైతు పేరిట రూ.50 కోట్ల వరకు లావాదేవీలు నడిచాయని చెబుతున్నారు. రాష్ట్ర ఆదాయ పన్ను శాఖ ఈ వ్యవహారంపై దృష్టి సారించగా.. ఖమ్మం ఆదాయ పన్నుల శాఖ అధికారులు మాత్రం తమకెలాంటి సమాచారం లేదని వెల్లడించారు. పన్ను చెల్లింపుల్లో మోసాలకు పాల్పడితేనే గుర్తించే అవకాశముందని ఓ ఐటీ అధికారి తెలిపారు. క్రిప్టో కరెన్సీ అంటే... ప్రభుత్వం లేదా బ్యాంకు నియంత్రణ లేకుండా కంప్యూటర్ నెట్వర్క్ ద్వారా కొనసాగే డిజిటల్ కరెన్సీ లేదా డిజిటల్ టోకెన్లను క్రిప్టో కరెన్సీగా వ్యవహరిస్తారు. ఇది ఆన్లైన్లో వ్యక్తుల(పీర్–టు–పీర్) మధ్య నేరుగా చెల్లింపులకు అవకాశం కల్పిస్తుంది. ఈ కరెన్సీ విలువ మార్కెట్ డిమాండ్, సరఫరా ఆధారంగా మారుతుంటుంది. 1990 నుంచి దీని మూలాలు ఉన్నప్పటికీ రహస్యంగా సాగాయి. ఆపై బిట్ కాయిన్ వెలుగులోకి వచ్చింది. వాడుక భాషలో కొందరు దీన్ని వర్చువల్ కరెన్సీగా కూడా పిలుస్తారు. 2018లోనే క్రిప్టోకరెన్సీపై రిజర్వ్బ్యాంకు నిషేధం విధించగా.. పలు ఏజెన్సీలు వేసిన కేసు ఆధారంగా సుప్రీంకోర్టు 2020 మార్చిలో ఈ నిషేధాన్ని ఎత్తివేసింది. ఈ నేపథ్యాన లావాదేవీలు విస్తరిస్తుండగా.. నకిలీ అకౌంట్లలో లావాదేవీలు జరిగినట్లు మొదలైన ప్రచారం జిల్లాలో కలకలం రేపుతోంది.