Khammam
-
మొక్కజొన్న నిల్వలకు భరోసా
ఖమ్మంవ్యవసాయం: ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో మిర్చి క్రయవిక్రయాల కోసం నిర్మిస్తున్న నాలుగు షెడ్లను మొక్కజొన్నల నిల్వలకు వినియోగిస్తున్నారు. మార్క్ఫెడ్ కేంద్రాల్లో కాంటాలు పూర్తయినా తరలింపులో జాప్యమై రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఇంతలోనే అకాల వర్షాల కారణంగా నష్టం జరుగుతోంది. అయితే, మార్క్ఫెడ్కు వివిధ ప్రాంతాల్లో గోదాములు ఉన్నా అవన్నీ నిండి ఉన్నాయి. దీంతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కలెక్టర్ దివాకర్ టీ.ఎస్. ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో నూతనంగా నిర్మించిన నాలుగు షెడ్లను వినియోగించుకోవాలని ఆదేశించారు. ఈమేరకు వివిధ ప్రాంతాల్లో కొనుగోలు చేసిన మొక్కజొన్నలను లారీల్లో తరలిస్తున్నారు. ఇక్కడ నాలుగు షెడ్లలో ఏడు లక్షల బస్తాల మొక్కజొన్న(40 వేల మెట్రిక్ టన్నులు)లు నిల్వ చేసే అవకాశముంది.ఖమ్మం మార్కెట్లోని కొత్త షెడ్లలోకి సరుకులు -
డాన్స్ చేయడమంటే ఇష్టం
ఇల్లెందురూరల్: నాకు చిన్న వయస్సు నుంచి డాన్స్ చేయడమంటే ఎంతో ఇష్టం. ఇంట్లో టీవీలో వచ్చే పాటలకు నృత్యం చేస్తుంటే మా నాన్న సెలవుల్లో శిక్షణకు పంపించేవాడు. ఏటా సెలవుల్లో ఎంతో కొంత నేర్చుకుంటూ ఇంటి వద్ద కూడా ప్రాక్టీస్ చేస్తుంటా. ప్రస్తుతానికి డాన్స్లో కొంత నైపుణ్యం సాధించా. పాఠశాలలో నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాల్లో డ్యాన్స్ చేస్తూ అభినందనలు అందుకోవడం ఆనందాన్ని ఇస్తుంది. ఈ వేసవిలోనూ క్లాస్లకు వెళ్తూ సెలవులను నా అభిరుచికి అనుగుణంగా సద్వినియోగం చేసుకుంటున్నా. – బొంగాని హన్విత, 6వ తరగతి, సుభాష్నగర్ -
సేంద్రియ వ్యవసాయంతో నేల ఆరోగ్యానికి రక్షణ
వైరారూరల్: రైతులు రసాయన ఎరువుల వాడకం తగ్గించి సేంద్రియ సాగు విధానాలపై దృష్టి సారించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనరేట్ అధికారి, రైతు వారం ప్రోగ్రాం అబ్జర్వర్ శివానంద్ సూచించారు. తద్వారా నేల ఆరోగ్యమే కాక రైతుల ఆరోగ్యం బాగుంటుందని తెలిపారు. ‘ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక’ భాగంగా నిర్వహిస్తున్న ‘రైతు వారం’ కార్యక్రమాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా వైరా మండలం ఖానాపురం రైతు వేదికలో ఏర్పాటుచేసిన సమావేశంలో శివానంద్ మాట్లాడుతూ నేల ఆరోగ్యం, సమగ్రతను కాపాడుకుంటేనే సాగుకు అవకాశాలు మెరుగుపడతాయని తెలిపారు. వరిలో సన్న రకాలు, మట్టి పరీక్షకు నమూనా తీసే విధానం, వరి, మొక్కజొన్న కోతల అనంతరం కొయ్యలను కాల్చకుండా నేలలో కలియదున్నితే కలిగే లాభాలు, నానో యూరియా, నానో డీఏపీ ఉపయోగాలపై అవగాహన కల్పించారు. ఆతర్వాత పలువురు రైతులకు భూసార పరీక్ష ఫలితాల కార్డులను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ధనసరి పుల్లయ్య, జిల్లా ఉద్యానశాఖ అధికారి మధుసూదన్, కేవీకే కోఆర్డినేటర్ పావని, ఏడీఏ తమ్ములపల్లి కరుణశ్రీ, ఏఓ మయాన్ మంజుఖాన్, వైరా మార్కెట్ చైర్మన్ బొళ్ల గంగారావు, సర్పంచ్లు భూక్యా బాలాజీ, కారుమంచి ఏసు, మార్కెట్ డైరెక్టర్లు షేక్ మోలాలి, తోటకూర నాగేశ్వరరావు, ఏఈఓ సపావత్ సైదులు తదితరులు పాల్గొన్నారు. డీఎఫ్ఓగా బాధ్యతలు స్వీకరించిన అగర్వాల్ ఖమ్మంవ్యవసాయం: జిల్లా అటవీ అధికారిగా అనూజ్ అగర్వాల్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల ఖమ్మం డీఎఫ్ఓగా ఉన్న సిదార్థ్ విక్రమ్ సింగ్ను నిజామాబాద్కు, వరంగల్ డీఎఫ్ఓ అనూజ్ అగర్వాల్ను ఖమ్మం బదిలీ చేశారు. ఈమేరకు ఆయన బాధ్యతలు స్వీకరించిన అనంతరం కలెక్టర్ దివాకర్ టీఎస్ను మర్యాద పూర్వకంగా కలిశారు. అలాగే, జిల్లాలోని అటవీ అధికారులు, ఉద్యోగులు నూతన డీఎఫ్ఓను కలిసి శుభాకంక్షలు తెలిపారు. నేడు మంగళగూడెంలో ప్రజాదర్బార్ ఖమ్మంరూరల్: ఖమ్మం రూరల్ మండలం మంగళగూడెంలో మంగళవారం ప్రజాదర్బార్ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రామంలోని సీతారామచంద్రస్వామి ఆలయ కళ్యాణ మండపంలో మధ్యాహ్నం 3–30 గంటలకు మొదలయ్యే ప్రజాదర్బార్లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సహా జిల్లా అధికారులు పాల్గొంటారు. ఈమేరకు మంగళగూడెం, పోలిశెట్టిగూడెం, కామంచికల్, పడమటితండా, దారేడు, తీర్థాల, పోలేపట్లి, పల్లెగూడెం, గోళ్లపాడు గ్రామపంచాయతీల ప్రజలు తమ సమస్యలపై దరఖాస్తులు అందించవచ్చని అధికారుల తెలిపారు. ప్రశాంతంగా ఎప్సెట్ ఖమ్మం సహకారనగర్: అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహిస్తున్న ఎప్సెట్ తొలిరోజైన సోమవారం ప్రశాంతంగా ముగి సింది. పరీక్ష నిర్వహణకు ఖమ్మంలో ఏడు కేంద్రాలను ఏర్పాటుచేశారు. ఆయా కేంద్రాల్లో ఉదయం పరీక్షకు 1,910మందిలో 1,756 మంది, మధ్యాహ్నం పరీక్షకు 1,909మంది విద్యార్థుల్లో 1,776మంది హాజరయ్యారని అధికారులు తెలిపారు. సత్తుపల్లిలో రెండు కేంద్రాలు ఏర్పాటుచేయగా ఉదయం పరీక్షకు 250 మందిలో 226మంది, మధ్యాహ్నం పరీక్షకు 500 మందికి గాను 466మంది హాజరయ్యారు. -
విద్యుత్ శాఖకు రూ.12 లక్షల నష్టం
150 ఎకరాల్లో దెబ్బతిన్న ఉద్యానపంటలు ఖమ్మంవ్యవసాయం: జిల్లాలోని పలు మండలాల్లో ఆదివారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన వర్షం కురవగా విద్యుత్ శాఖకు భారీ నష్టం వాటిల్లింది. ఈదురుగాలులతో పలు ప్రాంతాల్లో వృక్షాలు, చెట్ల కొమ్మలు విద్యుత్ లైన్లపై పడ్డాయి. దీంతో స్తంభాలు విరగడమే కాక లైన్లు తెగిపోయాయి. మొత్తం 192 విద్యుత్ స్తంభాలు విరిగిపోగా, రెండు ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతినడంతో రూ.12లక్షల మేర నష్టం వాటిల్లింది. ఈమేరకు ఆదివారం రాత్రి విద్యుత్ అంతరాయం ఏర్పడడంతో ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టారు. అనంతరం సోమవారం మరమ్మతులు పూర్తిచేసి సరఫరాను పునరుద్ధరించారు. బోనకల్, కారేపల్లి తదితర మండలాల్లో పనులను ఎస్ఈ ఇనుగుర్తి శ్రీనివాసాచారి పర్యవేక్షించారు. ● ముదిగొండ: ముదిగొండ మండలంలో ఈదురుగాలుల కారణంగా పలు గ్రామాల్లో దాదాపు 115విద్యుత్ స్తంభాలు విరిగిపోగా, ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతిన్నాయని ఏఈ నారాయణ తెలిపారు.ఈమేరకు కొత్త స్తంభాలను ఏర్పాటు చేసి సరఫరా పునరుద్ధరించామని వెల్లడించారు. మామిడి, అరటి, బొప్పాయి తోటలకూ నష్టం.. ప్రకృతి వైపరీత్యానికి జిల్లాలో 44 మంది రైతులకు చెందిన 150 ఎకరాల్లో ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లిందని అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. నేలకొండపల్లి, చింతకాని, వైరా మండలాలకు చెందిన 32 మంది రైతులకు చెందిన 121 ఎకరాల్లో మామిడి తోటలు, కామేపల్లి, తిరుమలాయపాలెం మండలాల్లో నలుగురు రైతులకు చెందిన 11 ఎకరాల్లో అరటి పంట దెబ్బతిన్నది. అలాగే, కూసుమంచి, తిరుమలాయపాలెం మండలాల్లో 8 మంది రైతులకు చెందిన 18 ఎకరాల్లో బొప్పాయి పంట ధ్వంసమైంది. నష్టంపై అధికారులు ప్రాథమిక అంచనాలు రూపొందించినా, ప్రభుత్వం ఆదేశిస్తే సమగ్ర విచారణ అనంతరం పరిహారం చెల్లించే అవకాశముంది. -
మంత్రులున్నా.. రైతుల కంట కన్నీరే
కొణిజర్ల: ముగ్గురు ప్రధాన శాఖల మంత్రులు ఉన్న జిల్లాలో రైతులు కంటతడి పెట్టే పరిస్థితి నెలకొందని మెదక్ ఎంపీ మాధవనేని రఘునందరావు పేర్కొన్నారు. సకాలంలో మక్కలు, ధాన్యం కొనుగోళ్లు జరగక, కాంటా వేసినా తరలించక అకాల వర్షంతో నష్టపోవాల్సి వస్తుందని తెలిపారు. ఇకనైనా స్పందించి 48 గంటల్లో కొనుగోళ్లు పూర్తి చేయకపోతే మక్కలను కలెక్టరేట్ లేదా వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు క్యాంపు కార్యాలయానికి తరలిస్తామని హెచ్చరించారు. కొణిజర్ల మండలం తనికెళ్లలో మక్కలు, ధాన్యం కొనుగోలు కేంద్రాలను సోమవారం సాయంత్రం ఆయన పరిశీలించి రైతుల సమస్యలను తెలుసుకున్నారు. ఏఓ బాలాజీ, సొసైటీ సీఈఓ వెంకటేశ్వర్లుతో ఎంపీ ఫోన్లో మాట్లాడి సూచనలు చేశారు. తెలంగాణలోనూ కాషాయ జెండా ఎగురవేస్తాం ఖమ్మం మామిళ్లగూడెం: దేశవ్యాప్తంగా 22 రాష్ట్రాల్లో విస్తరించిన ఎన్డీఏ త్వరలో తెలంగాణలోనూ జెండా ఎగురవేయడం ఖాయమని మెదక్ ఎంపీ రఘునందన్రావు ధీమా వ్యక్తం చేశారు. ఖమ్మంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ సాగిస్తున్న అరాచక పాలనకు వ్యతిరేకంగా రాజీలేని పోరాటం చేయడంతో బీజేపీ అధికారం వచ్చిందన్నారు. ఈనెల 10న సాయంత్రం 4 గంటలకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించే సభకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ హాజరవుతున్నందున జయప్రదం చేయాలని ఎంపీ కోరారు. పార్టీ రాష్ట్ర కోశాధికారి దేవకీ వాసుదేవరావు, జిల్లా అధ్యక్షుడు నెల్లూరు కోటేశ్వరరావు, నాయకులు ఉదయ్ప్రతాప్, వాకధాని పుల్లారావుయాదవ్, రుద్ర ప్రతాప్, నాయుడు రాఘవరావు, చిలుకూరు రమేష్, ఈ.వీ.రమేష్, వక్కలంక సుబ్రహ్మణ్యం, పమ్మి అనిత, విజయ రాజు, మందడం సుబ్బారావు, మారుతి బాబురావు, బొబ్బ భాగ్యరెడ్డి, బండారు నరేష్ బాబు, కవిడ మురళి, బండారు సత్యనారాయణ పాల్గొన్నారు.మెదక్ ఎంపీ రఘునందన్రావు -
ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి
ఖమ్మం సహకారనగర్: ధాన్యం కొనుగోళ్లు వేగంగా చేపట్టాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి సూచించారు. హైదరాబాద్ నుంచి సోమవారం ఆయన మంత్రులు వాకాటి శ్రీహరి, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్కుమార్, దుద్దిళ్ల శ్రీధర్బాబుతో కలిసి తెలిపారు. సోమవారం మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి హైదరాబాద్ నుంచి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లతో సమీక్షించారు. రైతులకు ఎప్పటికప్పుడు వాతావరణ సూచనలు జారీ చేయడమే కాక, కేంద్రాల్లో అవసరం మేర టార్పాలిన్లు సిద్ధం చేసుకోవాలని సూచించారు. ఈ వీసీకి జిల్లా నుంచి కలెక్టర్ దివాకర హాజరుకాగా.. అనంతరం అధికారులతో సమావేశమైన కొనుగోళ్లలో సూచనలు, కేంద్రాల్లో ఏర్పాట్లపై సూచనలు చేశారు. రైతులు గన్నీ బ్యాగులు తీసుకువస్తే వాటికి కూడా ప్రభుత్వం నగదు చెల్లిస్తుందనే విషయాన్ని వివరించాలని తెలిపారు. సీపీఓ శ్రీనివాస్, డీఆర్డీఓ శ్రీరామ్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. క్షేత్రస్థాయిలో డీసీఎస్ఓ తనిఖీలు వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచడమే కాక కాంటా పూర్తికాగానే కేటాయించిన మిల్లులకు తరలించాలని జిల్లా పౌరసరఫరాల శాఖాధికారి చందన్కుమార్ సూచించారు. జిల్లాలోని మధిర, సత్తుపల్లి, పెనుబల్లి మండలాల్లో పలు కొనుగోలు కేంద్రాలు, మిల్లులను సోమవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా డీసీఎస్ఓ మాట్లాడుతూ అవసరమైన గన్నీ బస్తాలు సమకూర్చుకోవడమే కాక ధాన్యం తరలింపునకు లారీల కొరత రాకుండా చూడాలన్నారు. ధాన్యం కొనుగోళ్లకు క్రమపద్ధతి పాటిస్తూ, కాంటా కాగానే నిర్దేశిత మిల్లులకు తరలించాలని తెలిపారు. ఆయన తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు పాల్గొన్నారు. -
‘పది’లో గురుకులాల హవా
● ఐదు పాఠశాలల్లో నూరు శాతం ఉత్తీర్ణత ● ఉమ్మడి జిల్లాలోని ఇతరచోట్ల కూడా మెరుగైన ఫలితం నేలకొండపల్లి: క్రమశిక్షణతో కూడిన చదువు... వెనకబడిన పిల్లలపై ప్రత్యేక దృష్టి.. ఉపాధ్యాయుల బోధనకు తోడు అధికారుల నిరంతర పర్యవేక్షణ ఫలితంగా తాజాగా విడుదలైన పదో తరగతి వార్షిక పరీక్షల ఫలితాల్లో ఉమ్మడి జిల్లాలోని సాంఘిక సంక్షేమ గురుకులాల విద్యార్థులు సత్తా చాటారు. ఉమ్మడి జిల్లాలో 20 బాలుర, బాలికల గురుకుల పాఠశాలలు ఉండగా... ఐదింట్లో వంద శాతం ఉత్తీర్ణత నమోదైంది. మిగతా గురుకులాల్లోనూ మెరుగైన ఫలితాలు రావడం విశేషం. కాగా, ఖమ్మం జిల్లాలోని గురుకులాల నుంచి 880 మంది విద్యార్థులు ఎస్సెస్సీ పరీక్షలు రాయగా, 862 మంది ఉత్తీర్ణత సాధించారు. అంతా పేద విద్యార్థులే... సాంఘిక సంక్షేమ శాఖ పరిధిలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 20గురుకుల పాఠశాలలు కొనసాగుతున్నాయి. ఇందులో అత్యధిక శాతం పేద విద్యార్థులే చదువుకుంటున్నారు. మెరుగైన ఫలితాలు వస్తుండడంతో ఏటా ప్రవేశాలకు డిమాండ్ పెరుగుతోంది. మంచి ఫలితాలు వచ్చేలా ఉపాధ్యాయులు, అధికారులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. రోజువారీగా శ్రద్ధ కనబర్చడమే కాక సబెక్టుల వారీగా స్టడీ అవర్స్ నిర్వహిస్తుండడంతో మంచి ఫలితాలు నమోదవుతున్నాయి. పదో తరగతి ప్రారంభంలోనే సామర్ధ్య పరీక్ష నిర్వహించి.. విద్యార్థుల స్థాయిని అంచనా వేస్తారు. అందుకు అనుగుణంగా బోధిస్తూ, వెనుకబడిన వారిపై మరింత శ్రద్ధ పెడుతుండడంతో మెరుగైన స్థాయిలో ఉత్తీర్ణత నమోదవుతోంది. అన్ని చోట్ల మెరుగే... మధిర సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 99శాతం ఉత్తీర్ణత నమోదైంది. అలాగే, ఎర్రుపాలెంలో 98.07, అన్నపరెడ్డిపల్లిలో 98.5, దమ్మపేటలో 98.5, వైరాలో 97 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఇక పాల్వంచలో 96.2, నేలకొండపల్లిలో 96, అడవిమల్లెలలో 96, ముదిగొండలో 95.23, ములకలపల్లిలో 94.8, మణుగూరులో 94.2, పాల్వంచ(సీడీఈ) 94 శాతం, ఇల్లెందులో 93.3, తిరుమలాయపాలెంలో 92.85, భద్రాచలం గురుకుల పాఠశాలలో 89.47శాతంగా ఉత్తీర్ణత నమోదైంది. పదోతరగతి విద్యార్థులకు మొదటి నుంచే ప్రణాళికాయుతంగా పాఠాలు బోధిస్తాం. వెనుకబడిన వారిని గుర్తించేలా పరీక్షలు నిర్వహిస్తాం. అందులో ఫలితంగా ఆధారంగా ప్రత్యేక తరగతులు నిర్వహిస్తాం. ప్రతీ విద్యార్థిపై ప్రత్యేక దృష్టి సారించి బోధిస్తుండడంతో ఈ ఏడాది కూడా మెరుగైన ఫలితాలు సాధించాం. – జి.శ్రీలత, ప్రిన్సిపాల్, నేలకొండపల్లి గురుకుల పాఠశాలటేకులపల్లి, కల్లూరు, దానవాయిగూడెం, సత్తుపల్లి, కూసుమంచి గురుకుల పాఠశాలల్లో ఎస్సెస్సీ విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించారు. -
గర్వం పనికి రాదు..
ఈ వేసవి సెలవుల్లో సత్తుపల్లిలోని మా అమ్మమ్మ గారి ఇంటికి వచ్చా. ప్రతిరోజు రాత్రి భోజనాలయ్యాక నాతో పాటు అన్న పార్ధు, ఇంకొందరు స్నేహితులకు మా అమ్మమ్మ కథ చెబుతుంది. తాజాగా చెప్పిన కథే ఇది. అయితే, ఈ కథ చెప్పే ముందే మా అమ్మమ్మ ఇందులోని నీతిని పాటించాలనే మాట తీసుకుంది. అందుకే మాట ఇచ్చాకే కథ విన్నాం. ఈ కథేమిటో మీరూ చదవండి..సత్తుపల్లిటౌన్: ఒక రోజు సాయత్రం వేళ ఒక మిణుగురు పురుగు తన వెలుగుని చూసి గర్వపడి ప్రపంచానికి నేనే వెలుగును ఇస్తున్నాను అనుకుందంటా. ఇంతలో నక్షత్రాలు వచ్చేసరికి మిణుగురు వెలుగు మాయమైంది. అప్పుడు నక్షత్రాలు మా కాంతితోనే ప్రపంచానికి వెలుగు వస్తుందని గర్వపడ్డాయట. ఆ కాసేపటికే చంద్రుడు వచ్చాడు. అంతలో నక్షత్రాల వెలుగు మాయమైంది. అప్పుడు చంద్రుడు కూడా నా వెలుగే ప్రపంచానికి ఆనందాన్ని ఇస్తుందని బడాయి పోయాడట. సరే తెల్లవారింది. సూర్యుడు రానే వచ్చాడు. సూర్యుడు రావడంతో చంద్రుని వెన్నెల మాయమై పోయింది. అమ్మమ్మ చెప్పిన నీతి కథ -
ఏ ఉద్యోగమూ చిన్నది కాదు..
ఖమ్మంరాపర్తినగర్: నిరుద్యోగ యువత ప్రైవేట్ ఉద్యోగాలను నిర్లక్ష్యం చేయకుండా, అంది వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ భవిష్యత్లో ఉన్నత స్థాయికి చేరాలని కలెక్టర్ దివాకర టీ.ఎస్. సూచించారు. ఉమ్మడి జిల్లాలోని యువతకు ఉపాధి కల్పించే దిశగా ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’లో భాగంగా ఖమ్మం ఎస్ఆర్ గార్డెన్స్లో సోమవారం మెగా జాబ్ మేళా నిర్వహించారు. ఈ మేళాను కలెక్టర్ దివాకర ప్రారంభించి మాట్లాడారు. యువత నిరుద్యోగులుగా ఎక్కువ కాలం ఉండొద్దంటే అందుబాటులో ఉన్న అవకాశాలను చేజిక్కించుకోవాలని తెలిపారు. ప్రైవేట్ ఉద్యోగాలను చిన్నచూపు చూడొద్దని, ప్రారంభంలో వేతనం తక్కువగా ఉన్నా వ్యక్తిగత ప్రతిభతో ఉన్నత స్థాయికి చేరొచ్చన్నారు. తనకు తెలిసిన ఓ వ్యక్తి రూ.12 వేల వేతనంతో ఉద్యోగాన్ని ప్రారంభిస్తే ఎనిమిదేళ్ల తర్వాత రూ.లక్షలు సంపాదించే స్థాయికి చేరాడని ఉదహరించారు. అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ మాట్లాడుతూ ఏదో ఒక ఉద్యోగాన్ని ప్రారంభిస్తే అనుభవం, ఆత్మవిశ్వాసం పెరిగి భవిష్యత్ లక్ష్యాల సాధన సులువవుతుందని తెలిపారు. టాస్క్ సీఈఓ నితిన్కుమార్రెడ్డి, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం డీవైఎస్ఓలు టి.సునీల్కుమార్రెడ్డి, ఎం.పరంధామరెడ్డి, పరిశ్రమల శాఖ జీఎం ప్రవీణ్, ఈడీఎం దుర్గాప్రసాద్, ఎంప్లాయిమెంట్ అధికారి ఎన్.మాధవి, ఏసీపీ రమణమూర్తి, డిప్యూటి డీఎంహెచ్ఓ చందునాయక్, ఆర్డబ్ల్యూఎస్ ఈఈ పుష్పలత, కార్పొరేటర్ లకావత్ సైదులు తదితరులు పాల్గొన్నారు. 2,756మంది హాజరు జాబ్ మేళాలో పాల్గొనేందుకు ఉమ్మడి జిల్లా నుంచి 42,231 రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి. పలువురు రెండు, మూడు ఉద్యోగాలకు రిజిస్ట్రేషన్ చేసుకోగా మొత్తం 2,756మంది హాజరయ్యారు. ఇంట ర్వ్యూల అనంతరం వీరిలో 1,102 మందిని ఉద్యోగాలకు ఎంపిక చేశారు. అయితే, ఇంకొందరిని కూడా ఎంపిక చేసే అవకాశముందని తెలిసింది. తొలిదశలో ఎంపికై న వారికి మరో రెండు దఫాలుగా ఇంటర్వ్యూ చేశాక ఈనెల 23న నియామకపత్రాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. కాగా, జాబ్ మేళాకు పెద్దసంఖ్యలో అభ్యర్థులు హాజరైనా ఎవరూ ఇబ్బంది పడకుండా ఏర్పాట్లు చేశామని డీవైఎస్ఓ సునీల్కుమార్రెడ్డి వెల్లడించారు. మెగా జాబ్మేళాలో 78కంపెనీల బాధ్యులు పాల్గొననుండగా, 3వేల మందికి పైగా ఉపాధి అవకాశాలు ఉన్నాయని అధికారులు ప్రకటించారు. ఈమేరకు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా నిరుద్యోగ యువతీ, యువకులు తరలిరావడంతో ఎస్ఆర్ గార్డెన్స్ కిక్కిరిసింది. కంపెనీల వారీగా స్టాళ్లు ఏర్పాటుచేసి అభ్యర్థుల ధ్రువపత్రాలు పరిశీలిస్తూ ఇంటర్వ్యూలు నిర్వహించారు. -
నూతన షెడ్లలో మొక్కజొన్న నిల్వలు
ఖమ్మంవ్యవసాయం: రైతు ప్రయోజనాల దృష్ట్యా నూతన నిర్మాణాలను వినియోగిస్తున్నామని ఖమ్మం వ్యవసాయ మార్కెట్ చైర్మన్ యరగర్ల హన్మంతరావు తెలిపారు. వైస్ చైర్మన్ తల్లాడ రమేష్తో కలిసి సోమవారం ఆయన మాట్లాడారు. మిర్చి క్రయవిక్రయాల్లో ఇబ్బందులను అధిగమించేలా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రూ.155 కోట్లు కేటాయించగా 15.29 ఎకరాల్లో అధునాతన యార్డు నిర్మాణమవుతోందని తెలిపారు. తొలి దశలో రూ.114 కోట్లతో ఏడు షెడ్లు నిర్మిస్తున్నామని స్తూ, ఇందులో ఆరింటిని మార్కెట్ కార్యకలాపాలకు, మరో షెడ్డును రైతుల విశ్రాంతి, కార్మికుల కోసం కేటాయించనున్నట్లు చెప్పారు. మొదటి దశలో ఇప్పటికే 70 శాతం పనులు పూర్తయ్యాయని తెలిపారు. అలాగే, ధరల వివరాలు ప్రదర్శించేలా డిజిటల్ బోర్డులు, సీసీ కెమెరాలు ఏర్పాచేయడమే కాక వాటర్ ప్లాంట్లు, టాయిలెట్ బ్లాకులు, ఫైర్ వ్యవస్థ, అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ వ్యవస్థ ఉంటుందని వెల్లడించారు. కాగా, యాసంగి మొక్కజొన్న నిల్వలకు ఇబ్బంది రాకుండా మంత్రి తుమ్మల, కలెక్టర్ సూచనలతో మార్కెట్లోని నాలుగు నూతన షెడ్లు కేటాయించామని చైర్మన్ తెలిపారు. మార్కెట్ కార్యదర్శి పి.ప్రవీణ్కుమార్తో పాటు డైరెక్టర్లు రెంటాల ప్రసాద్, బోజెడ్ల సత్యనారాయణ, వెనిగండ్ల బాబూరావు, చెరుకూరి సీతారాములు, బాణోత్ బీమా, మొర్రిమేకల నాగేశ్వరరావు, బాణత్ రమేష్, అంగడాల నర్సింహారావు, షేక్ లతీఫ్, చిట్టిబాబు పాల్గొన్నారు. ఖమ్మం మార్కెట్ చైర్మన్ హన్మంతరావు -
తరలించక... తడిసి ముద్దయి
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ఈ ఏడాది యాసంగిలో మొక్కజొన్న సాగు చేసిన రైతులను అడుగడుగునా సమస్యలు వెంటాడుతున్నాయి. మార్క్ఫెడ్ ఆధ్వర్యాన కొనుగోలు కేంద్రాలు ఏర్పాటులో అశాసీ్త్రయత, ఎకరాకు 26 క్వింటాళ్ల మొక్కజొన్నలే కొనుగోలు చేస్తామనే నిబంధనతో ఇబ్బందులు ఎదురయ్యాయి. అయినా రూ.2,400 మద్దతు ధర కోసం రైతులు మండుటెండల్లో ఎదురుచూశారు. ఆపై కాంటా అయ్యాక గోదాములకు తరలించే వరకు రైతులదే బాధ్యత అని చెప్పడంతో వాహనాల కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూడాల్సి వచ్చింది. ఇంతలోనే ఆదివారం సాయంత్రం పలు ప్రాంతాల్లో అకాల వర్షం కురవగా మొక్కజొన్నలు తడిసి రైతులు నష్టపోయారు. అంచనాలకు మించి సాగు.. ఈ యాసంగిలో నీరు పుష్కలంగా ఉండడం, వాతావరణ సమస్యలు లేకపోవడంతో ఉమ్మడి జిల్లాలో 2.43 లక్షల ఎకరాల్లో రైతులు మొక్కజొన్న సాగు చేశారు. కానీ బహిరంగ మార్కెట్లో క్వింటా మొక్కజొన్నలకు రూ.1,700కు మించి ధర పెట్టలేదు. దీంతో మార్క్ఫెడ్ ఆధ్వర్యాన రూ.2,400 మద్దతు ధరతో కొనుగోలు చేస్తామనే ప్రకటన రావడంతో సంతోషపడ్డారు. ఆతర్వాత కొనుగోళ్లలో పరిమితి, కేంద్రాల ఏర్పాటులో ఇక్కట్లు ఎదురయ్యాయి. ఉమ్మడి జిల్లాలో ప్రస్తుతం 51కేంద్రాల ద్వారా శనివారం వరకు 1.17లక్షల టన్నుల మొక్కజొన్నలు కొనుగోలు చేశారు. ఇంకా 50శాతం మంది రైతులు కేంద్రాల్లో పడిగాపులు కాస్తున్నారు. పెనుభారంగా రవాణా.. కేంద్రాల్లో కొనుగోలు చేసిన మొక్కజొన్నలను ఉమ్మడి జిల్లాతో పాటు సూర్యాపేట, నల్లగొండ జిల్లాల్లో గోదాంలకు తరలించే బాధ్యత కాంట్రాక్టర్లకు అప్పగించారు. కానీ కాంట్రాక్టర్లు సరిపడా లారీలను ఏర్పాటు చేయడం లేదు. దీంతో కాంటా వేసిన వారం నుంచి పదిహేను రోజులు దాటినా లారీల జాడ లేక రైతులు సొంతంగా వాహనాలు మాట్లాడుకుంటున్నారు. ఫలితంగా బస్తాకు రూ.50 చొప్పున లారీకి రూ.వేలల్లో ఖర్చయింది. దీనికి తోడు గోదాంల వద్ద వేచి ఉండాల్సి ఉన్నందున లారీ డ్రైవర్లు అదనపు వసూళ్లకు పాల్పడుతుండడంతో రైతులపై భారం పడుతోంది. అలాగే, బస్తాలు అందుబాటులో లేక రూ.25నుంచి రూ.30వెచ్చించి కొనుగోలు చేయగా, హమాలీ ఖర్చులు కూడా రైతులే భరించారు.మక్క రైతులను వెంటాడుతున్న సమస్యలు ఇరవై రోజుల క్రితం మొక్కజొన్నలను కేంద్రానికి తీసుకొచ్చా. మొత్తం 704 క్వింటాళ్లు కాంటా వేసినా లారీలు లేక ఎగుమతి కావడం లేదు. మార్క్ఫెడ్ నుంచి టన్ను తరలింపునకు రూ.450 చెల్లిస్తున్నా లారీ యజమానులు క్వింటాకు రూ.80 అడుగుతున్నారు. దీంతో టన్నుకు రూ.800 అదనంగా చెల్లించాల్సి వస్తోంది. – షేక్ ఇబ్రహీం, ముష్టికుంట్ల, బోనకల్ మండలంకొణిజర్ల మండలం తనికెళ్లకు చెందిన యాస విష్ణుమూర్తి 12 ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేస్తే 480 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. తనికెళ్ల ఎస్సీ సంక్షేమ వసతిగృహం పక్కన కొనుగోలు కేంద్రానికి పంట తరలించి 170 క్వింటాళ్లు అమ్మాడు. కానీ పంటను తరలించేందుకు లారీలు దొరకడం లేదు. ఒకటి, రెండు లారీలు వచ్చినా.. డ్రైవర్లు, లారీ యజమానులు అదనంగా డబ్బులు ఇచ్చిన వారి పంటే తరలించడంతో విష్ణుమూర్తి పడిగాపులు కాస్తున్నాడు. ఈ కేంద్రంలో 200 మంది రైతులు మొక్కజొన్నలు తీసుకురాగా బస్తాలు లేకపోవడంతో రూ.25 నుంచి రూ.30 వరకు చెల్లించి కొనుగోలు చేశారు. -
నీడనిద్దాం.. నీరు పోద్దాం..
ఇల్లెందురూరల్: భానుడు భగభగ మండుతున్నాడు. పగటి ఉష్ణోగ్రత 45 డిగ్రీలకు చేరువవుతోంది. ఇంట్లో కూలర్, ఫ్యాన్ ఉన్నా మనం ఇబ్బంది పడుతున్నాం. అలాంటిది ఎండలో పక్షులు నీడ, నీటి కోసం విలవిల్లాడుతుండడాన్ని గుర్తించా. అంతేకాక మా ఇంటి పెరడులో ఓ పక్షి ఎండకు సొమ్మసిల్లి పడిపోవడం చూసి జాలేసింది. దీంతో ఇంటి ఆవరణలో ఉన్న చెట్టుకు తాడు కట్టి ఒక మట్టిపాత్ర వేలాడదీశాను. అందులో క్రమం తప్పకుండా చల్లటి నీరు పోస్తున్నా. ఇక్కడకు పక్షులు వచ్చి నీరు తాగి కాసేపు ఉండి వెళ్తున్నాయి. నీరు తాగేందుకు వచ్చిన పక్షులను చూసినప్పుడల్లా నాకెంతో తృప్తిగా ఉంటుంది. మీరూ.. మీ ఇంటి ఆవరణలో చెట్ల కింద ఒక పాత్ర పెట్టి నీరు పోయండి. లేదా చెట్టుకు పాత్రను వేలాడి దీసి నీరు నింపండి. తద్వారా వేసవితాపానికి అల్లాడిపోతున్న పక్షులను ఆదుకునే ప్రయత్నం చేయండి. –కాసాని పార్థసారధి, స్టేషన్బస్తీ, ఇల్లెందు -
నేటి నుంచి ఎప్సెట్
● హాజరుకానున్న 2వేల మందికి పైగా విద్యార్థులు ఖమ్మం సహకారనగర్: జిల్లాలో ఎప్సెట్ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి ఈనెల 4వ తేదీ తేదీ నుంచి 11వ తేదీ వరకు ఎప్సెట్ జరగనుంది. జేఎన్టీయూ ఆధ్వర్యాన ఆన్లైన్ విధానంలో ఈ పరీక్ష నిర్వంచనున్నారు. జిల్లా కేంద్రంలో ఫార్మసీ అండ్ అగ్రికల్చరల్ పరీక్ష నిర్వహణకు ఏడు కేంద్రాలను ఏర్పాటు చేయగా 5,725 మంది విద్యార్థులు హాజరవుతారు. అలాగే, ఇంజనీరింగ్ ప్రవేశపరీక్షకు ఎనిమిది కేంద్రాల్లో 12,174 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఈనెల 4, 5వ తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశపరీక్షలు ఉదయం 9నుంచి 12 గంటల వరకు జరగనుండగా 8–30గంటల వరకే అనుమతిస్తారు. ఇక మధ్యాహ్నం 3నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు జరిగే రెండో సెషన్ పరీక్షలకు 2–30గంటల వరకు అనుమతించనున్నారు. ఇక ఈనెల 9నుంచి 11వ తేదీ వరకు ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలు రెండేసి సెషన్లలో జరుగుతాయి. కాగా, సత్తుపల్లిలో కూడా రెండు కేంద్రాలు ఏర్పాటుచేయగా ఇంజనీరింగ్ పరీక్షకు 3వేల మంది, అగ్రికల్చర్, ఫార్మసీకి పరీక్షకు 1,005మంది విద్యార్థులు హాజరుకానున్నారు. 6న జిల్లాస్థాయి అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు ఖమ్మం స్పోర్ట్స్: జిల్లాస్థాయి అథ్లెటిక్స్ జట్ల ఎంపికకు ఈనెల 6వ తేదీన పోటీలు నిర్వహిస్తున్నట్లు అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి ఎం.డీ.షఫీక్ అహ్మద్ తెలిపారు. ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో బుధవారం ఈ పోటీలు జరుగుతాయని వెల్లడించారు. ఇక్కడ ఎంపిక చేసే అండర్–8, 10, 12, 14, 16, 18, 20, సీనియర్ మహిళలు, పురుషుల జట్లు త్వరలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. ఆసక్తిగల క్రీడాకారులు వయసు ధ్రువీకరణ పత్రాలతో ఉదయం 9గంటలకు రిపోర్టు చేయాలని సూచించారు. రామయ్యకు సువర్ణ పుష్పార్చన భద్రాచలం: భద్రాచల శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం అంతరాలయంలోని మూలమూర్తులకు ఆదివారం అభిషేకం, సువర్ణ పుష్పార్చన జరిపారు. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి చిత్రకూట మండపంలో కొలువుదీరిన స్వామి వారికి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు. వైభవంగా గోదావరి నదీ హారతిభద్రాచలంటౌన్: భద్రాచలంలో ఆదివారం సాయంత్రం గోదావరికి నదీ హారతి సమర్పించారు. భద్రాద్రి బ్రాహ్మణ పురోహిత సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. గణపతి పూజతో ప్రారంభించి, 108 ప్రమిదలతో దీపోత్సవం, అష్టోత్తర శతనామార్చన, శ్రీరామ నామ భజనలు గావించారు. అనంతరం మంత్రోచ్ఛరణల మధ్య గోదావరి మాత, స్వామికి హారతులు సమర్పించారు. అప్రమత్తంగా ఉండాలి.. ● అకాల వర్షాల నేపథ్యాన కలెక్టర్ సమీక్ష ఖమ్మం సహకారనగర్: జిల్లాలో ఆదివారం అకాల వర్షం కురవగా.. సోమ, మంగళవారాల్లో కూడా వర్షసూచనలు ఉన్నందున రైతులు అప్రమత్తంగా ఉండేలా అధికారులు అవగాహన కల్పించాలని కలెక్టర్ దివాకర టీ.ఎస్. సూచించారు. ఆయన ఆదివారం రాత్రి మొక్కజొన్నలు, ధాన్యం కొనుగోళ్లపై అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డితో కలిసి వివిధ శాఖల అధికారులతో జూమ్ మీటింగ్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతులు మక్క కొనుగోలు కేంద్రాలకు గన్నీ బ్యాగులతో వస్తే వాటికీ ప్రభుత్వం చెల్లింపులు చేస్తుందన్నారు. అయితే, కేంద్రాల్లో తడిసిన మక్కలను ఆరబెట్టాకే లోడ్ చేయాలని సూచించారు. కొణిజర్ల, చింతకాని, మద్దులపల్లి ప్రాంతాల్లో నిల్వలు ఎక్కువగా ఉన్నందున త్వరగా గోదాంలకు తరలించాలని తెలిపారు. అంతేకాక మార్క్ఫెడ్ పరిధిలోని కేంద్రాల్లో మక్కలు ఏ మేర తడిసాయో 24 గంటల్లో నివేదిక ఇవ్వాలని చెప్పారు. కాగా, కేంద్రాల్లో నిల్వ ఉన్న మొక్కజొన్నలు, ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచి సరిపడా వాహనాలు, హమాలీలను సమకూర్చుకోవాలని తెలిపారు. అలాగే, కూసుమంచి మండలంలో తడిసిన ధాన్యాన్ని లారీల ద్వారా బాయిల్డ్ రైస్ మిల్లర్లకు తరలించాలని కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో మార్క్ఫెడ్, పౌరసరఫరాల శాఖ, మార్కెటింగ్ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
ప్రశాంతంగా ‘నీట్’
దేశవ్యాప్తంగా వైద్య కళాశాలల్లో ప్రవేశానికి ఆదివారం నిర్వహించిన నీట్ (నేషనల్ ఎలిజిబులిటీ కమ్ ఎంట్రన్స్ టెస్టు) జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. జిల్లా కేంద్రంలో ఏడు పరీక్ష కేంద్రాలు ఏర్పాటుచేశారు. ఈమేరకు 2,762మంది విద్యార్థులకు గాను 2,680 మంది హాజరుకాగా 82మంది గైర్హాజరయ్యారని జిల్లా నోడల్ అధికారి నరేందర్ వెల్లడించారు. – ఖమ్మం సహకారనగర్ఖమ్మం క్రైం: నీట్ పరీక్ష కేంద్రాల వద్ద బందోబస్తును పోలీసు కమిషనర్ సునీల్దత్ పరిశీలించారు. ఖమ్మంలోని శాంతినగర్ కాలేజీ, కేంద్రియ విద్యాలయంను సందర్శించిన ఆయన బందోబస్తుపై పోలీసు సిబ్బందికి సూచనలు చేశారు. ఏసీపీలు రమణమూర్తి, సాంబరాజు తదితరులు పాల్గొన్నారు.11గంటల నుంచే అనుమతి నీట్ మధ్యాహ్నం 2నుంచి 5గంటల వరకు జరగగా విద్యార్థులను ఉదయం 11గంటల నుంచే కేంద్రాల్లోకి అనుమతించారు. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఉదయం 10–30గంటలకల్లా చేరుకున్నారు. ఈమేరకు విద్యార్థుల అడ్మిట్ కార్డులు, ఇతర ధ్రువపత్రాలను క్షుణ్ణంగా పరిశీలించాక అనుమతించారు. కాగా, కేంద్రాల్లోని మధ్యాహ్నం 1–30గంటల తర్వా త అనుమతించేది లేదని ముందుగానే అధికారులు స్పష్టం చేశారు. ఈమేరకు చాలా మంది ముందుగానే వచ్చినా కొందరు మాత్రం హడావుడిగా చేరుకున్నారు. ఇంకొందరు ఆభరణాలు, షూ ధరించి రావడంతో వాటిని తీసివేశాకే లోనకు అనుమతించారు. మరికొందరు ఫొటోలు తీసుకురాకపోవడంతో సెల్ఫోన్లో ఫొటో తీసి సమీపంలోని జిరాక్స్ కేంద్రాలకు బంధువులు పరుగులు తీశారు. ఒకరిద్దరు 1–30గంటల తర్వాత రాగా వారిని అనుమతించలేదు.నీట్లో మంచి మార్కులతో అర్హత సాధిస్తాననే నమ్మకం ఉంది. బయాలజీ ప్రశ్నలు ఈజీగా రాశా. ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టుల్లో పలు క్లిష్టమైన ప్రశ్నలు వచ్చాయి. అయినా నేర్చుకున్న అంశాలకు దగ్గరగా ఉండడంతో బాగానే రాశాను. – గుండ్ల రుచిత ఐశ్వర్య, ఖమ్మంనీట్ మంచిగా రాశా. ప్రశ్నాపత్రంలో బయాలజీ సబ్జెక్ట్కు సంబంధించి ప్రశ్నలు సులభంగా వచ్చాయి. ఫిజిక్స్, కెమిస్ట్రీ మాత్రం కొంచెం కష్టంగా అనిపించింది. అయినా బాగానే రాశాను. మంచి మార్కులు సాధిస్తాననే నమ్మకం ఉంది. – ఏపూరి ప్రేరణ, ఖమ్మం -
బాలభవన్కు ఆహ్వానం !
ఖమ్మంసహకారనగర్: ఖమ్మంలోని బాలభవన్లో ఏటా మాదిరిగానే ఈసారి కూడా వేసవి శిక్షణ శిబిరం ఏర్పాటు చేశారు. చదువుతో సంబంధం లేకుండా 5 – 16 ఏళ్ల లోపుపిల్లలకు ఇక్కడ శిక్షణ ఇస్తారు. ఈ నెల 2న మొదలైన శిక్షణ వచ్చేనెల 10వ తేదీ వరకు కొనసాగుతాయి. ఈ సందర్భంగా బాలభవన్లో డ్రాయింగ్, క్రాఫ్ట్స్, కూచిపుడి నృత్యంతో పాటు నో కాస్ట్ – లో కాస్ట్ అంశాలపై శిక్షణ ఇస్తున్నారు. ఈ శిక్షణ కోసం ప్రతీ అంశానికి రూ.50 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ప్రతిరోజు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కొనసాగే శిక్షణకు 25 మంది హాజరవుతుండగా, ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశముంది.నాలుగు అంశాల్లో మొదలైన శిక్షణ -
అర్హతలే కొలమానం..
కూసుమంచి: ప్రజలు సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా, అధికారులే నేరుగా వచ్చి అర్జీలు స్వీకరించి పరిష్కరించేలా ప్రజాదర్బార్లు నిర్వహిస్తున్నామని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించా రు. ఇదే సమయాన రాజకీయాలకు తావులేకుండా అర్హులందరికీ పథకాలు అందిస్తున్నామని తెలిపా రు. కూసుమంచిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశా ల ఆవరణలో ఆదివారం నిర్వహించిన ప్రజా దర్బార్లో కలెక్టర్ దివాకర టీ.ఎస్, అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజతో కలిసి పాల్గొన్న మంత్రి ప్రజల నుంచి నేరుగా వినతులు స్వీకరించారు. అనంతరం ఆయ న మాట్లాడుతూ తమ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి పాలనను ప్రజల గడప వద్దకే తీసుకొస్తున్నామని తెలిపారు. మండలాలను క్లస్టర్లుగా విభజించి నిర్వహిస్తున్న ప్రజాదర్బార్లలో అందిన ప్రతీ దరఖా స్తును రాజకీయాలకు అతీతంగా పరిష్కరిస్తామని తెలిపారు. సాదా బైనామా, భూమి రికార్డుల వంటి దీర్ఘకాలిక సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడంపై ప్రత్యేక దృష్టి సారించామని వెల్లడించారు. గత ప్రభుత్వ తీరుతోనే... ప్రజాదర్బార్లలో అత్యధికంగా ఇందిరమ్మ ఇళ్ల కోసమే దరఖాస్తులు వస్తున్నాయని, గత ప్రభుత్వ వైఫల్యం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని మంత్రి విమర్శించారు. మే నెలాఖరు నాటికి రెండో దశ ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామని ప్రకటించారు. రాష్ట్రంలో ఇప్పుడు అన్నివర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతుండడంతో సంతోషంగా ఉంటున్నారని తెలిపారు. దీన్ని బీఆర్ఎస్ నాయకులు ఓర్వలేక, అబద్ధాలతో ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారానికే.. తిరుమలాయపాలెం: ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. తిరుమలాయపాలెం మండలం బచ్చోడులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఆదివారం సాయంత్రం నిర్వహించిన ప్రజాదర్బార్లో ఆయన మాట్లాడుతూ తమ ప్రభుత్వం ఏర్పడ్డాక సంక్షేమ పథకా లు అమలు చేయడమే కాక ప్రజల వద్దకే పాలన తీసుకొచ్చామని చెప్పారు. కలెక్టర్ దివాకర మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా పాలేరు నియోజకవర్గంలో ప్రజా దర్బార్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తున్నామని పేర్కొన్నారు. కాగా, ప్రజాదర్బార్ జరుగుతుండగానే బచ్చోడులో గాలి దుమా రంతో కూడిన వర్షం మొదలైంది. అయితే, పెద్దసంఖ్యలో హాజరైన ప్రజలు నిరాశ చెందకుండా పాఠశాల వరండాలో మంత్రి, కలెక్టర్ కూర్చుని దరఖాస్తులు స్వీకరించారు. రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి, మార్కెట్ చైర్మన్ హరినాథ్ బాబు, ఆర్డీఓ శ్రీనివాస్, తహసీల్దార్ సైదులు, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. -
పొలాల్లోకి దూసుకెళ్లిన బస్సు
నేలకొండపల్లి: వర్షం కారణంగా ఆర్టీసీ బస్సు అదుపు తప్పి పంట పొలాల్లోకి దూసుకెళ్లిన ఘటన ఇది. వివరాలిలా ఉన్నాయి. నేలకొండపల్లి మండలం మంగాపురం తండాలో ఆదివారం రాత్రి వర్షం కురిసింది. ఈ సమయాన ఖమ్మం నుంచి గ్రామానికి వచ్చిన బస్సు శివార్లలో అదుపు తప్పగా పొలాల్లోకి దిగింది. దీంతో ప్రయాణికులు ఆందోళనకు గురైనా ఎవరికీ గాయాలు కాలేదు. ఈమేరకు సమాచారం అందుకున్న సర్పంచ్ ధీరావత్ అశోక్రాణి, ధీరావత్ రాధాకృష్ణమూర్తి తదిరతులు చేరుకుని జోరు వర్షం కురుస్తుండగా చీకట్లో సహాయక చర్యలు చేపట్టారు. అప్పటికప్పుడు జేసీబీని రప్పించి బస్సును బయటకు లాగి రోడ్డుపైకి చేర్చారు. అంతేకాక రోడ్డుకు అడ్డంగా పడిన చెట్లను తొలగించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.తృటిలో తప్పిన ప్రమాదం -
అగ్నికి ఆహుతైన మొక్కజొన్న పంట
చింతకాని: మండలంలోని పాతర్లపాడులో ఆదివారం జరిగిన అగ్ని ప్రమాదంలో సుమారు 45 మంది రైతులకు చెందిన 600 క్వింటాళ్ల మొక్క జొన్న పంట కాలిబూడిదైంది. బాధిత రైతులు తెలిపిన వివరాల ప్రకారం.. సాయంత్రం భారీగా వీచిన ఈదురుగాలులతో మొక్కజొన్న చేన్లలో నిప్పంటుకుని మంటలు వ్యాపించాయి. చేన్లలో కుప్ప పోసిన పంటే కాక కల్లాల్లో కాంటా పూర్తయిన మొక్కజొన్న బస్తాలకు సైతం వ్యాపించి కాలిపోయాయి. అగ్నిమాపక శాఖ సిబ్బందికి సమాచారం ఇచ్చేందుకు ప్రయత్నించగా ఫలితం లేక గ్రామపంచాయతీ ట్యాంకర్ను రప్పించినప్పటికీ మంటలు అదుపులోకి రాలేదు. ఘటనలో సుమారు రూ.15 లక్షల నష్టం వాటిల్లిందని రైతులు వాపోయారు. కోత పూర్తయిన మొక్కజొన్న చేన్లలో చెత్తకు నిప్పుపెడుతుండడంతో మంటలు వ్యాపిస్తున్నాయని చెబుతున్నారు. షార్ట్ సర్క్యూట్తో వరి.. రఘునాథపాలెం: మండలంలోని కోయచలకలో ఆదివారం ఓ రైతుకు చెందిన వరి చేను కాలిపోయింది. గ్రామానికి చెందిన మడుపు బ్రహ్మయ్య రెండెకరాల్లో వరి సాగు చేయగా కోతకు సిద్ధంగా ఉంది. ఈ క్రమాన ఆదివారం విద్యుత్ లైన్లో ఏర్పడిన షార్ట్ సర్క్యూట్ వల్ల నిప్పురవ్వలు పొలంలో పడడం మంటలు వ్యాపించాయి. స్థానికులు మంటలు ఆర్పేందుకు ప్రయత్నించినా ఫలితం లేక కోతకు సిద్ధంగా ఉన్న పంట క్షణాల్లోనే అగ్నికి ఆహుతైంది. ఘటనలో రూ.లక్షకు పైగా నష్టం జరిగిందని రైతు బ్రహ్మయ్య వాపోయాడు.45 మంది రైతులకు రూ.15 లక్షల మేర నష్టం -
కృతజ్ఞతలు ఎవరికి తెలపాలి?
సత్తుపల్లిటౌన్: అశోక్ ఇంట్లో దిగులుగా కూర్చున్నాడు. ఆయన భార్య అభిక ఏమిటని ఆరా తీస్తే అశోక్ ఇలా చెప్పుకుంటూ వచ్చాడు. ‘పొద్దున్నే బజారుకు వెళ్లగా నడవలేని ముసలమ్మను బండి ఎక్కించుకున్నా.. ఎక్కడికి వెళ్లాలి అడిగితే పది కిలోమీటర్ల దూరాన గ్రామంలో ఆమె కుమారుడు ఉంటాడని చెబితే అక్కడే దింపాను. ఆ వెంటనే ఇంట్లోకి వెళ్లింది తప్ప నాకు కనీసం కృతజ్ఞతలు చెప్పలే’ అని వెల్లడించాడు. కృతజ్ఞతలు చెప్పించుకోవడం ఇష్టమైన అశోక్.. అడిగిన, అడగని వారికి సాయం చేస్తుంటాడు. ఎవరైనా కృతజ్ఞతలు చెబితే సంతోషిస్తాడు. చెప్పకపోతే దిగాలు పడతాడు. భర్త దిగులుకు గల కారణం తెలుసుకున్న అంబిక ‘ఓస్ ఇంతేనా.. దీనికే దిగులు పడిపోతారా? మనం సాయం చేసిన ప్రతిఒక్కరూ కృతజ్ఞతలు చెప్పాలని రూలేంలేదు. కొందరు పొరపాటుగా, ఇంకొందరు అలవాటుగానే మర్చిపోతా రు. అలాంటివన్నీ పట్టించుకోకూడదు అని అనున యంగా చెప్పింది’. కానీ అశోక్ మాత్రం ‘నాకు సాయం చేసిన చేసిన ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు చెబుతాను.. నీకు తెలుసు కదా?’ అన్నాడు. దీనికి అంబిక స్పందిస్తూ ‘ఆ మాటకొస్తే మనం కృతజ్ఞతలు చెప్పాల్సిన వారు ఇద్దరు ఉన్నారు. వాళ్లకెప్పుడైనా చెప్పామా?’ అని అడిగింది. వారెవరని అశోక్ ఆరా తీయగా ఆమె సమాధానం చెప్పింది. ‘ఒకరు దేశానికి అన్నం పెడుతున్న రైతు. మరొకరు దేశాన్ని కాపాడుతున్న సైనికుడు. వీరికి ఎప్పుడైనా కృతజ్ఞతలు చెబుతున్నామా?’ అని అడిగింది. ‘నిజమే సుమా! రైతు వ్యవసాయం చేయకపోతే మనకు తిండిలేదు. సైనికుడు సరిహద్దులలో కాపలా కాయకపోతే రక్షణే లేదు’ అన్నాడు అశోక్. దీంతో అప్పటి నుంచి అశోక్ ఇతరుల నుంచి కృతజ్ఞతలు ఆశించడం మానివేసి ప్రతిరోజు రైతులు, సైనికులకు కృతజ్ఞతలు చెప్పడం అలవాటుగా మార్చుకున్నాడు.నా పేరు ఆవుల పోతురాజు. సత్తుపల్లికి చెందిన నేను ఇటీవల పదో తరగతి ఉత్తీర్ణత సాధించగా.. వేసవి సెలవుల్లో అమ్మానాన్నలకు పనుల్లో సాయపడుతున్నాను. నాకు కథలు రాయడమంటే చాలా ఇష్టం. పదో తరగతి చదువుతున్నప్పుడు నేను రాసిన కథలతో గార్లపాటి – బొల్లేపల్లి ట్రస్ట్ ‘నాన్నే నీ హీరో’ పేరుతో పుస్తకంగా ముద్రించింది. ఈ వేసవి సెలవుల్లోనూ మరికొన్ని కథలు రాస్తున్నాను. అందులో ఒక కథే ఇది. -
ఎవరెస్టు బేస్క్యాంప్ వద్దకు జిల్లా యువకుడు
● ఐటీడీఏ పీఓ చిత్రంతో కూడిన ఫ్లెక్సీ ప్రదర్శన భద్రాచలం: పెనుబల్లి మండలం వీఎం.బంజరకు చెందిన గిరిజన యువకుడు బి.మోతీకుమార్ ఎవరెస్టు శిఖరం బేస్ క్యాంప్ వద్దకు చేరుకుని సత్తా చాటాడు. అంతేకాక అక్కడ భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి రాహుల్ ఫొటోతో కూడిన ఫ్లెక్సీ ప్రదర్శించాడు. గతంలోనూ మోతీకుమార్ కిలిమంజారో, ఎలబ్రస్ పర్వతాలను అధిరోహించాడు. ప్రస్తుతం సముద్ర మట్టానికి 5,364 మీటర్ల ఎత్తులో ఉన్న ఎవరెస్ట్ పర్వతం బేస్క్యాంప్ వరకు వెళ్లి వచ్చాడు. గిరిజనుల సంక్షేమం, వారి సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు కృషి చేస్తున్న పీఓ రాహుల్పై అభిమానంతో అక్కడ ఆయన చిత్రంతో కూడిన ఫ్లెక్సీ ప్రదర్శించినట్లు వెల్లడించాడు. కాగా, ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించేందుకు సిద్ధమవుతున్న తనకు దాతలు సహకరించాలని కోరాడు. 176 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్ ఎర్రుపాలెం: మండలంలోని బనిగండ్లపాడు, పెద్దగోపవరం, మామునూరు గ్రామాల్లో శనివారం అర్ధరాత్రి ఎన్ఫోర్స్మెంట్, సివిల్ సప్లయీస్ ఓఎస్డీ అంజయ్య, డిప్యూటీ తహసీల్దార్ ప్రసన్న ఆధ్వర్యాన తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పలువురి ఇళ్లలో అక్రమంగా నిల్వ చేసిన 176 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆపై బియ్యాన్ని గోదాంలకు తరలించారు. మామునూరు, పెద్దగోపవరానికి చెందిన లాలా, సుభాని, మల్లికార్జునరావు, తెహరా, లాలుపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. తనిఖీల్లో ఎస్ఐ అజయ్కుమార్, సిబ్బంది సైదులు, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. ప్రమాదవశాత్తు నిప్పు.. ● కాలిపోయిన పాలిహౌస్ కొణిజర్ల: మండలంలోని చిన్నమునగాలలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో శనివారం మంటలు మొదలై మొక్కజొన్న దంటుకు నిప్పంటుకుంది. ఆపై మంటలు అంతకంతకూ పెరుగుతూ సమీపంలోనే ఉన్న మాజీ సర్పంచ్ పాపగంటి నాగభూషణం పాలీహౌస్కు సైతం అంటుకున్నాయి. దీంతో స్థానికులు ఇచ్చిన సమాచారంతో వైరా నుంచి అగ్నిమాపక శాఖ సిబ్బంది చేరుకుని మంటలు ఆర్పివేశారు. అప్పటికే పాలీహౌస్ పాక్షికంగా కాలిపోగా రూ.2 లక్షల మేర నష్టం జరిగినట్లు బాధితుడు తెలిపాడు. -
అకాల వర్షంతో ఆగమాగం
● జిల్లాలో ఈదురుగాలులు, ఉరుములతో కూడిన వాన ● కల్లాల్లో తడిసిన మొక్కజొన్నలు ● వరికి నష్టం.. రాలిన మామిడికాయ ఖమ్మంవ్యవసాయం: జిల్లాలో ఆదివారం సాయంత్రం వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నాయి. అప్పటివరకు ఎండలు ఉక్కిరిబిక్కిరి చేయగా.. సాయంత్రం ఐదు గంటల నుంచి అంతా మారిపోయింది. ఈదురుగాలులకు తోడు ఉరుములు, మెరుపులతో పాటు పలుచోట్ల వర్షం కురిసింది. జిల్లాలో మూడు రోజులుగా 45 డిగ్రీలను దాటి ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా, ఈ వర్షంతో ప్రజలకు ఉపశమనం కలిగింది. కానీ రైతులకు మాత్రం తీరని నష్టాన్ని మిగిల్చింది. పంటలకు ప్రతికూలం యాసంగిలో సాగు చేసిన పంటలు చేతికందుతున్న వేళ ఈదురుగాలులతో కూడిన వర్షం కురవడంతో రైతులకు నష్టం ఎదురైంది. మొక్కజొన్న కోతలు దాదాపు పూర్తి కాగా, వరి కోతలు జోరుగా సాగుతున్నాయి. పాలేరు, మధిర, వైరా ప్రాంతాల్లో వరి కోత దశలో ఉంది. ఈక్రమాన ఈదురుగాలులతో పంట నేలవాలడమే కాక గింజ రాలింది. అంతేకాక పలుచోట్ల కల్లాలు, కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన మొక్కజొన్న, వరి ధాన్యం తడిసిపోయాయి. అలాగే, జిల్లాలో దాదాపు 30 వేల ఎకరాల్లో సాగవుతున్న మామిడికి కూడా నష్టం వాటిల్లింది. ప్రస్తుతం మామిడి కోత దశలో ఉండడంతో ఈదురుగాలుల వల్ల కాయ నేలపాలైంది. కాగా, అకాల వర్షాలు కురుస్తున్న నేపథ్యాన రైతులు అప్రమత్తంగా ఉంటూ, పంటలను రాశులుగా చేసుకుని రక్షించుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి ధనసరి పుల్లయ్య సూచించారు. ఫ్లెక్సీలతో విద్యుత్ సరఫరాకు అంతరాయం జిల్లా కేంద్రంతో పాటు పలు మండలాల్లో ఆదివారం ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. ఈ మేరకు రహదారులు, విద్యుత్ లైన్ల వెంట, భవనాలపై ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు తెగిపోయి విద్యుత్ లైన్లపై పడ్డాయి. దీంతో తరచూ ట్రిప్ అవుతూ సరఫరాకు అంతరాయం ఎదురైంది. ఖమ్మంలోని పలు ప్రాంతాల్లో ఫ్లెక్సీలు విద్యుత్ లైన్లపై పడడంతో సరఫరా నిలిచిపోయింది. దీంతో నగర ఏడీఈ సీహెచ్ నాగార్జున పర్యవేక్షణలో సిబ్బంది రంగంలోకి దిగి ఫ్లెక్సీలను తొలగించి సరఫరా పునరుద్ధరించారు. ఏ శాఖ నియంత్రణ లేక అనధికారికంగా వందల సంఖ్యలో ఫ్లెక్సీలు కడుతుండడంతో ఈ పరిస్థితి ఎదురైంది. -
వైద్య విద్యార్థులు పరిశోధనల వైపు మళ్లాలి
ఖమ్మంవైద్యవిభాగం: వైద్య విద్యార్థులు చదువుకే పరిమితం కాకుండా ఎంబీబీఎస్ దశ నుంచే పరిశోధనలపై దృష్టి సారించాలని అదనపు డీఎంఈ, ఖమ్మం ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ టి.శంకర్ సూచించారు. ఖమ్మం మెడికల్ కాలేజీలో ఆదివారం ఇన్స్టిట్యూషనల్ రీసెర్చ్ సెల్(ఐఆర్సీ), ఇన్స్టిట్యూషనల్ ఎథిక్స్ కమిటీ (ఐఈసీ) సంయుక్త ఆధ్వర్యాన బేసిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషనల్ ఓరియంటేషన్(బ్రియో) కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ శంకర్ మాట్లాడుతూ వైద్య రంగంలో వస్తున్న మార్పులను అందిపుచ్చుకోవాలంటే పరిశోధనలు కీలకమని పేర్కొన్నారు. విద్యార్థుల్లో పరిశోధనలపై ఆసక్తిని పెంచేందుకు కళాశాలలో ఐఆర్సీ, ఐఈసీ విభాగాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఈ ఓరియంటేషన్లో ఖమ్మం, కొత్తగూడెం, సూర్యాపేట ప్రభుత్వ వైద్య కళాశాలలు, మమత మెడికల్ కాలేజీకి చెందిన 60 మంది ఎంబీబీఎస్ విద్యార్థులు పాల్గొన్నారు. మహారాష్ట్రలోని ప్రవారా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్కు చెందిన డాక్టర్ రాహుల్ కుంకులోల్, డాక్టర్ స్వప్నిల్ బోర్సే పలు అంశాలపై అవగాహన కల్పించారు. అలాగే, వైస్ ప్రిన్సిపాళ్లు డాక్టర్ ఎస్.రాజేశ్వర్రావు, డాక్టర్ సరిత, కోఆర్డినేటర్లు డాక్టర్ వినీల, డాక్టర్ సుగుణ మాట్లాడగా వివిధ విభాగాల బాధ్యులు డాక్టర్ బొలిసెట్టి వేణు, డాక్టర్ వెంకటేశ్వరరావు, డాక్టర్ రాధాకృష్ణ శిక్షణ ఇచ్చారు. ‘బ్రియో’లో నాలుగు కాలేజీల విద్యార్థులు -
‘రోడ్డెక్కితేనే రవాణా చేస్తారా?’
బోనకల్: రైతులు రోడ్డెక్కి ఆందోళన చేస్తేనే కొనుగో లు కేంద్రాల నుంచి మొక్కజొన్నలను తరలిస్తారా అని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పోతి నేని సుదర్శన్ ప్రశ్నించారు. మండలంలోని లక్ష్మీపురం, రావినూతలలో మార్క్ఫెడ్ కొనుగోలు కేంద్రాలను ఆదివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం సరఫరా చేయాల్సిన గోనె సంచులను తామే కొనుగోలు చేశామని, చివరికి లారీని కూడా తమనే తెచ్చుకోమంటున్నారని రైతులు ఆయనకు వివరించారు. అనంతరం సుదర్శన్ మాట్లాడుతూ.. జిల్లా నుంచి ముగ్గురు మంత్రులు ఉన్నా రైతుల గోడు పట్టడం లేదని విమర్శించారు. బస్తాలు కొనడమే కాక లారీ డ్రైవర్కు క్వింటాకు రూ.80 అదనంగా చెల్లించాల్సి వస్తోందని తెలిపారు. బోనకల్ మండలంలోని కేంద్రాల్లో వేలాది బస్తాలు కాంటా వేసి ఉండగా, అకాల వర్షాలతో రైతులు ఆందోళన చెందుతున్నందున ఇకనైనా స్పందించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ మందా కరుణ, రైతుసంఘం జిల్లా, మధిర డివిజన్ కార్యదర్శులు బొంతు రాంబాబు, దొండపాటి నాగేశ్వరరావు, నాయకులు మడిపల్లి గోపాల్రావు, కిలారు సురేశ్, మాదినేని వీరభద్రం, గుగులోతు నరేశ్, గుడ్డూరు వెంకటనర్సయ్య పాల్గొన్నారు. -
ఇక్కడే.. ఇక రోజూ!
ఖమ్మం శివార్లలోని వెలుగుమట్ల అర్బన్ పార్క్ ముఖద్వారం ఖమ్మంవ్యవసాయం: పెద్దపులి, సింహాలు, జింకలు, ఎలుగుబంట్లు, మొసళ్లు, నెమళ్లు.. ఇలా ఒకటేమిటి ఏ జంతువునైనా చూడాలంటే జిల్లా వాసులు హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్క్కు వెళ్లాల్సిన పనిలేదు. అంతా అనుకూలిస్తే ఖమ్మంలోనే త్వరలో జూ పార్క్ ఏర్పాటు కానుంది. తద్వారా మన కళ్ల ముందరే సమస్త జంతులోకం కొలువుదీరనుంది. ఖమ్మం శివార్లలో 546 ఎకరాల్లో కొనసాగుతున్న వెలుగుమట్ల అర్బన్ పార్కు పరిధిలో జంతు ప్రదర్శనశాల ఏర్పాటుకు సన్నాహాలు మొదలయ్యాయి. ఇక్కడ జూపార్క్ ఏర్పాటుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించి నివేదిక సిద్ధం చేయాలని అటవీ శాఖను ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యాన అధికారులు రంగంలోకి దిగారు. ఈ మేరకు తమిళనాడుకు చెందిన కన్సెల్టెన్సీ బాధ్యులు మూడు నెలల పాటు వెలుగుమట్ల అర్బన్ పార్క్లోని వృక్షాలు, నీటి వనరులే కాక జంతువుల మనుగడకు ఉన్న అవకాశాలపై అధ్యయనం చేసి వీడియో రూపొందించారు. నిపుణుల బృందం పరిశీలన మంత్రి సూచనలతో జూ పార్క్ ఏర్పాటుకు వెలుగుమట్ల పార్క్ అనుకూలంగా ఉంటుందని జిల్లా అటవీ శాఖ అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఆపై తమిళనాడుకు చెందిన ఓ కన్సల్టెన్సీకి బాధ్యతలు అప్పగించగా.. ఆ బృందంలోని నిపుణులు మూడు నెలల పాటు అధ్యయనం చేశారు. వెలుగుమట్ల అర్బన్ పార్కు పరిధిలోని పుట్టకోట, రుద్రమకోట ప్రాంతా(పార్కు వెనుక భాగం)ల్లో 100 ఎకరాలు జంతు ప్రదర్శన శాల ఏర్పాటుకు అనుకూలంగా ఉంటుందని తేల్చినట్లు సమాచారం. ఈ ప్రాంతంలో జంతువుల జీవనానికి అవసరమైన వనరులు, నీటి వసతి, వాతావరణం ఉండడంతో సమగ్ర నివేదికను రూపొందించారు. అంతేకాక ఓ వీడియోను రూపొందించి అటవీ శాఖకు సమర్పించారు. ఫెన్సింగ్ కూడా ఉండడంతో.. తమిళనాడు కన్సెల్టెన్సీ బృందం ఇచ్చిన నివేదిక ఆధారంగా అటవీ శాఖ అధికారులు జూపార్క్ ఏర్పాటుకు ప్రతిపాదనలు రూపొందించారు. వెలుగుమట్ల అర్బన్ పార్కు పరిధిలోని 100 – 120 ఎకరాల విస్తీర్ణంలో జంతు ప్రదర్శన శాల ఏర్పాటుకు ప్రతిపాదించారు. ఇక్కడ అవసరమైన నిర్మాణాలు, జంతువుల రవాణా తదితర అవసరాలకు రూ.163 కోట్లు అవసరమని ప్రతిపాదనల్లో పేర్కొన్నట్లు తెలిసింది. అంతేకాక అర్బన్ పార్కుకు చెయిన్ ఫెన్సింగ్ ఉండడం కలిసొస్తుందని నివేదికలో పొందుపర్చారని సమాచారం. అనుమతే తరువాయి.. జంతు ప్రదర్శనశాల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వ పరిధిలోని జూఅథారిటీ నుంచి అనుమతి పొందాలి. ఈ నేపథ్యాన వెలుగుమట్ల అర్బన్ పార్కులో జూపార్క్ ఏర్పాటుకు ఉన్న వనరులు, తమిళనాడు బృందం రూపొందించిన వీడియోకు తోడు జిల్లా అధికారులు సిద్ధం చేసిన సమగ్ర నివేదికను జూ అథారిటీకి సమర్పించారు. ఈ నివేదికను పరిశీలించిన కేంద్ర జూ అథారిటీ నుంచి ప్రత్యేక బృందం క్షేత్రస్థాయిలో పరిశీలించాల్సి ఉంటుంది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి కృషి జరుగుతుండగా.. సదరు బృందం వచ్చి సానుకూలత వ్యక్తం చేస్తే జంతు ప్రదర్శన శాల ఏర్పాటుకు రాష్ట్రం తరఫున రంగంలోకి దిగాల్సి ఉంటుంది. ఈవిషయంపై ఇటీవల బదిలీ అయిన జిల్లా అటవీ అధికారి సిద్ధార్థ్ విక్రమ్ సింగ్ మాట్లాడుతూ.. వెలుగుమట్ల అర్బన్ పార్కులో జంతు ప్రదర్శన శాలకు రాష్ట్ర ప్రభుత్వం సుముఖంగా ఉందని తెలిపారు. ప్రాథమికంగా అందుకు అవసరమైన చర్యలు ప్రారంభమయ్యాయని వెల్లడించారు. త్వరలోనే ఖమ్మంలో జంతు ప్రదర్శనశాల వెలుగుమట్ల అర్బన్ పార్కు 546 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఈ పార్క్లో వివిధ జాతుల భారీ వృక్షాలు ఉండడంతో పక్షుల సందడితో పర్యాటకుల రాక నానాటికీ పెరుగుతోంది. సాధారణ రోజుల్లోనే రద్దీ ఉంటుండగా.. ఆదివారం వస్తే కుటుంబాలతో సహా జిల్లా వాసులు వస్తుండడంతో సందడి ఉంటోంది. ఇక్కడ బోటింగ్ ఏర్పాటుకు సన్నాహాలు కూడా జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఖమ్మం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచనలతో జంతు ప్రదర్శనశాల ఏర్పాటుకు అధికారులు అడుగులు వేస్తున్నారు. -
టీజీ ఆర్జేసీ పరీక్షా కేంద్రాల వద్ద ఆంక్షలు
ఖమ్మంక్రైం: టీజీ ఆర్జేసీ ప్రవేశపరీక్ష ఆది వారం జరగనుండగా, పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 ద్వారా ఆంక్షలు అమల్లో ఉంటాయని పోలీసు కమిషనర్ సునీల్దత్ తెలిపారు. కేంద్రాల వద్ద ఉదయం 6నుంచి సాయంత్రం 6గంటల వరకు 200 మీటర్ల దూరం మేర ఐదుగురికి మించి గుంపులుగా ఉండొద్దని.. సమావేశాలు, ర్యాలీలు, ఊరేగింపులను అనుమతించబోమని వెల్లడించారు. అంతేకాక సమీపంలోని ఇంటర్నెట్, జిరాక్స్ సెంటర్లు, స్టేషనరీ దుకాణాలు మూసివేయాలని సూచించారు. అలాగే, కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటుచేయడంతో పాటు ట్రాఫిక్ అంతరాయం కలగకుండా సిబ్బందిని ఏర్పాటుచేస్తున్నట్లు సీపీ తెలిపారు. సబ్ కలెక్టరేట్లోనూ గ్రీవెన్స్ కల్లూరు: కల్లూరులోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఇక నుంచి ప్రతీ సోమవారం గ్రీవెన్స్ డే (ప్రజావాణి) నిర్వహించనున్నట్లు సబ్ కలెక్టర్ అజయ్కుమార్ తెలిపారు. ఈమేరకు డివిజన్ స్థాయిలోని ప్రజలు తమ సమస్యలపై వినతిపత్రాలు, దరఖాస్తులు ఇవ్వొచ్చని వెల్లడించారు. అన్నిశాఖల డివిజన్ స్థాయి అధికారులు ఈ కా ర్యక్రమంలో పాల్గొంటారని ఆయన తెలిపారు. కలెక్టరేట్లో రేపటి ప్రజావాణి రద్దు ఖమ్మం సహకారనగర్: జిల్లా కేంద్రంలో ఈనెల 4వ తేదీ సోమవారం మెగా జాబ్మేళా నిర్వహిస్తున్నందున కలెక్టరేట్లో జరగాల్సిన ప్రజావాణిని రద్దు చేశారు. అధికార యంత్రాంగమంతా జాబ్మేళా నిర్వహణలో పాలుపంచుకోవాల్సి ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు కలెక్టర్ దివాకర టీఎస్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని సూచించారు. ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జిగా జ్యోతిర్మయి ఖమ్మం లీగల్: ఖమ్మం ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జిగా కాకుమాని జ్యోతిర్మయి శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల జరిగిన బదిలీల్లో భాగంగా వేములవాడ కోర్టు నుంచి ఆమె ఖమ్మం బదిలీ అయ్యారు. ఈమేరకు శనివారం ఒకటో అదనపు మెజిస్ట్రేట్ రజనీ నుంచి బాధ్యతలు స్వీకరించారు. కాగా, రైతు కుటుంబానికి చెందిన జ్యోతిర్మయి తిరుపతి మహిళా యూనివర్సిటీ నుంచి 2010 లో లా పట్టా పొందారు. 2010లో కావలి కోర్టులో న్యాయవాదిగా ఎన్రోల్ అయిన ఆమె, 2021లో జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికయ్యారు. తొలుత నాంపల్లి క్రిమినల్ కోర్టులో పోస్టింగ్ రాగా, ఆపై వేములవాడలో పనిచేశాక ఖమ్మం బదిలీ అయ్యారు. ఒక ఏఈ.. రెండు చోట్ల యాప్లో నమోదు క్షేత్రస్థాయికి వెళ్లలేదని సస్పెన్షన్నేలకొండపల్లి: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని దశల వారీగా పరిశీలించాల్సిన ఓ ఏఈ క్షేత్రస్థాయికి వెళ్లకుండా ఇతరులతో పనిచేయించాడు. అదే సమయా న ఏఈ ఇంకో గ్రామంలో వివరాలు నమోదు చేశా డు. ఏకకాలంలో ఒకే మండల వివరాలు నమోదు కావడంతో అధికారులు ఆయనపై ససెన్షన్ వేటు వేశారు. నేలకొండపల్లి గృహ నిర్మాణ శాఖ ఏఈ లింగా తన పరిధిలోని ఓ గ్రామంలో ఇంటి నిర్మాణ వివరాలను పంచాయతీ కార్యదర్శితో యాప్లో నమోదు చేయించాడు. అదే సమయాన ఏఈ ఇంకో గ్రామంలో ఇంటి వివరాలు అప్లోడ్ చేశాడు. దీంతో ఉన్నతాధికారులు ఆరా తీయగా ఏఈ క్షేత్రస్థాయికి వెళ్లలేదని తేలింది. దీంతో ఏఈ లింగాను సస్పెండ్ చేస్తూ గృహ నిర్మాణ శాఖ ఎండీ గౌతమ్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన స్థానంలో యాకేష్ను ఇన్చార్జ్గా నియమించినట్లు ఈఈ శ్రీనివాస్ తెలిపారు. ఎంఈఓ వేతనంలో కోత విధుల్లో నిర్లక్ష్యంపై అదనపు కలెక్టర్ ఆగ్రహం ముదిగొండ: మండలంలోని రాఘవాపురంభవిత కేంద్రాన్ని అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ శనివారం పరిశీలించారు. కేంద్రం మరమ్మతులకు నాలుగు నెలల క్రితం రూ.3 లక్షలు మంజూరైనా ఇప్పటివరకు పనులు పూర్తికాకపోవడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. పర్యవేక్షణలో ఎంఈఓ రమణయ్య లోపం ఉందని భావిస్తూ ఆయనకు పది రోజుల వేతనం కోత విధించాలని సీఎంఓ ప్రవీణ్ను ఆదేశించారు. పాఠశాలల పునఃప్రారంభం నాటికి పనులు పూర్తి చేయించాలని ఆదేశించారు. ఉపసర్పంచ్ సీహెచ్.పార్వతి, వార్డు సభ్యులు మెట్టెల సతీశ్, రమాదేవి పాల్గొన్నారు. -
మార్గదర్శకాల మేరకే పేదలకు గృహాలు
ఖమ్మంగాంధీచౌక్: ప్రభుత్వ మార్గదర్శకాల మేరకే దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నట్లు గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ బి.శ్రీనివాస్ తెలిపారు. కూసుమంచి మండలం పాలేరులో ఇటీవల నిర్వహించిన ప్రజాదర్బార్లో లబ్ధిదారురాలు పిల్లి నీలమ్మ ప్రసంగంపై ప్రచారం జరగడంతో కలెక్టర్ ఆదేశాల మేరకు విచారణ చేపట్టామని ఆయన వెల్లడించారు. ఎంపీడీఓ, గ్రామ పంచాయతీ కార్య దర్శి, హౌసింగ్ ఏఈతో పిల్లి నీలమ్మ ఇంటిని పరిశీలించిన సమయాన బీపీఎల్ వర్గానికి చెందినట్లు గుర్తించారని తెలిపారు. ఆమె దినసరి కూలీ కాగా, భర్త మల్లయ్య మత్స్యకారుడని తేలిందన్నారు. ఆపై ఇందిరమ్మ కమిటీ సిఫారసుతో ఆ కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసినట్లు తెలిపారు. కాగా, ఈ కుటుంబం అవసరాల కోసం కొంత భూమిని విక్రయించగా, ఒక సంతానాన్ని విదేశాలకు పంపేందుకు రుణం తీసుకున్నారని పేర్కొన్నారు. ఆయన ట్యూషన్ఫీజులో ఎక్కువ భాగం విదేశీ యూనివర్సిటీ నుంచి స్కాలర్షిప్ రూపంలో లభించిందని చెప్పారు. ఈక్రమంలోనే నీలమ్మను కూడా విచారించగా మొదటిసారి వేదికపై మాట్లాడడంతో పొరపాటు పడ్డానని వివరించిందని తెలిపారు. తన భర్త మత్స్యకారుడిగా, తాను కూలీ పనులతో పిల్లలను చదివించామే తప్ప ఎవరినీ మోసం చేయనందున తప్పుడు ప్రచారం చేయవద్దని కోరిందని వెల్లడించారు. ఈ మేరకు అసత్య ప్రచారాలను నమ్మవద్దని పీడీ కోరారు. పాలేరులో ఇందిరమ్మ ఇంటిపై సమగ్ర విచారణ -
ప్రజలకు సేవ చేసే అదృష్టం దక్కింది..
● మీరు చేసిన అభివృద్ధి, కాంగ్రెస్ మోసాలను వివరించండి ● బీఆర్ఎస్ కార్పొరేటర్ల సన్మానంలో మాజీ మంత్రి పువ్వాడ ఖమ్మంమయూరిసెంటర్: కార్పొరేటర్లుగా గెలిచి ప్రజలకు సేవ చేసే అదృష్టం లభించడాన్ని ప్రజాప్రస్తానంలో కీలక మైలురాయిగా భావించాలని మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ సూచించారు. ఖమ్మం కార్పొరేషన్ పాలకవర్గం గడువు ఈ నెల 7వ తేదీతో ముగియనుండగా, బీఆర్ఎస్ కార్పొరేటర్లను శనివారం పువ్వాడ సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పదవీకాలం ముగిసినా ప్రజల్లోనే ఉంటూ చేసిన అభివృద్ధిని వివరించడమే కాక కాంగ్రెస్ వచ్చాక జరిగిన మోసాలను వివరించాలని తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో కార్పొరేటర్లుగా గెలిచి ప్రజలకు ఎన్నో సేవలు అందించారని కొనియాడారు. కాగా, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రాజకీయ పరిపక్వత లేని వాళ్లు వెళ్లిపోగా, రాజకీయ అనుభవం ఉన్నవారు తనతో కొనసాగుతున్నారని తెలిపారు. ప్రస్తుతం బీఆర్ఎస్లో కొనసాగుతున్న వారికి పార్టీ నుంచి టికెట్లు ఖాయం చేస్తున్నట్లు ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో సైతం కష్టపడి అత్యధిక స్థానాలు గెలవాలని పిలుపునిచ్చారు. అనంతరం కర్నాటి కృష్ణ, షేక్ మక్బూల్, దండా జ్యోతిరెడ్డి, నాగండ్ల కోటేశ్వరరావు, కూరాకుల వలరాజు, శీలంశెట్టి రమావీరభద్రం, తోట గోవిందమ్మ రామారావు, మాటేటి అరుణ నాగేశ్వరరావు, బిక్కసాని ప్రశాంతిలక్ష్మి జస్వంత్, పసుమర్తి రామ్మోహన్, బుర్రి వెంకట్కుమార్, బుడిగం శ్రీనివాస్, ముక్కాల కమల, పల్లా రోజ్లీనా, పగడాల శ్రీవిద్య తదితరులను సన్మానించారు. డీసీసీబీ, మార్కెట్ మాజీ చైర్మన్లు కూరాకుల నాగభూషణం, గుండాల కృష్ణతో పాటు పగడాల నాగరాజు, ఖమర్, బీరెడ్డి నాగచంద్రారెడ్డి, బత్తుల మురళి, అమరగాని వెంకన్న, మెంతుల శ్రీశైలం, కొత్త వెంకటేశ్వరరావు, కొల్లు పద్మ, షకీనా, ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
ప్రజా వ్యతిరేక విధానాలపై పోరుబాట
ఖమ్మంమయూరిసెంటర్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలపై పోరుబాట పట్టాలని సీపీఐ(ఎంఎల్) మాస్లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు పిలుపునిచ్చారు. ఖమ్మంలో శనివారం నిర్వహించిన పార్టీ శాఖా కార్యదర్శుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో అన్ని వస్తువుల ధరలు పెరగడంతో సామాన్యులు జీవన స్థితి దిగజారిపోతోందని తెలిపారు. అంతేకాక రైతులు తాంగం పండించిన పంటలకు ధరలు లేవని, కొనుగోలు చేసే దిక్కులేదని అన్నారు. ప్రభుత్వాల విధానాలతోనే అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇక వాణిజ్య వినియోగ గ్యాస్ ధరలను భారీగా పెంచడంతో హోటళ్లు మూతపడే పరిస్థితి నెలకొందని తెలిపారు. అంతేకాక రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. నాయకులు గుర్రం అచ్చయ్య, ఆవుల వెంకటేశ్వర్లు, జి.రామయ్య, సీ.వై.పుల్లయ్య, ఆవుల అశోక్, బందెల వెంకయ్య, శివలింగం, వెంకటరెడ్డి, ఝాన్సీ, శిరోమణి, శోభ, గంటా శ్రీను, లాల్మియా, ఎం.నాగేశ్వరరావు, కె.నాగేశ్వరరావు, కే శ్రీను, లక్ష్మణ్, అప్పారావు తదితరులు పాల్గొన్నారు.మాస్లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు -
‘నీట్’ నిర్వహణకు రెడీ..
● నేడు జిల్లాలోని ఏడు కేంద్రాల్లో పరీక్ష ● మధ్యాహ్నం 1.30 గంటల వరకే అనుమతి ఖమ్మంసహకారనగర్: 2025 – 26 విద్యా సంవత్సరానికి వైద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) ఆధ్వర్యాన ఆదివారం నీట్ (నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రన్స్ టెస్టు) నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇప్పటికే అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి పలు శాఖల అధికారులతో సమీక్షించి సూచనలు చేశారు. 2,762 మంది విద్యార్థులు జిల్లాలో నీట్ నిర్వహణకు ఏడు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆయా కేంద్రాల్లో 2,762 మంది పరీక్ష రాయనున్నారు. వీరిలో బాలురు 742 మందే ఉండగా, బాలికలు 2,020 మంది ఉండడం విశేషం. కాగా, ఖమ్మంలోని ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ డిగ్రీ కళాశాలలో 720 మంది, ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో 600, పీఎంశ్రీ కేంద్రియ విద్యాలయంలో 360, ఏఎస్ఆర్ శాంతినగర్ పాఠశాలలో 360, ఎన్నెస్పీ కాలనీ ప్రభుత్వ పాఠశాలలో 360, యూనివర్సిటీ పీజీ కళాశాలలో 360 మంది, నయాబజార్ ప్రభుత్వ పాఠశాలలో 122 మంది విద్యార్థులను కేటాయించారు. పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.20 గంటల వరకు జరుగుతుంది. అయితే, విద్యార్థుల ధ్రువీకరణ పత్రాలను తనిఖీ చేయాల్సి ఉన్నందున ఉదయం 11 నుంచే అనుమతిస్తామని, మధ్యాహ్నం 1.30 గంటల తర్వాత కేంద్రాల్లోకి అనుమతి ఉండదని అధికారులు స్పష్టం చేశారు. ఈ సూచనలు తప్పనిసరి ●పరీక్ష కేంద్రాల గేట్లను మధ్యాహ్నం 1.30 గంటలకు మూసివేస్తారు. ప్రతీ విద్యార్థి ప్రభుత్వం జారీ చేసిన గుర్తింపు కార్డు ఒరిజనల్ కాపీ తీసుకురావాలి. అడ్మిట్కార్డు, రెండు పాస్పోర్టు సైజ్ ఫొటోలు, ఒక పోస్టుకార్డు ఫొటో వెంట తెచ్చుకోవాలి. సొంత వాటర్ బాటిల్ తీసుకురావాలి. కాళ్లకు బూట్లు కాకుండా స్లిప్పర్లు వేసుకెళ్లాలి. ఆభరణాలు, స్మార్ట్వాచ్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకురావొద్దు. హాఫ్ హ్యాండ్ షర్ట్లు మాత్రమే ధరించాలి.నీట్ పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశాం. విద్యార్థుల తనిఖీ, గుర్తింపు కార్డుల పరిశీలనలో జాప్యం జరగకుండా ఉదయం 11 గంటల నుంచే అనుమతిస్తాం. మధ్యాహ్నం 1.30 గంటల తర్వాత అనుమతి ఉండదు. ఈ విషయాన్ని విద్యార్థులు గుర్తించాలి. – నరేందర్, నీట్ జిల్లా నోడల్ అధికారి -
ప్రాధాన్యతా క్రమంలో సమస్యలు పరిష్కరిస్తాం..
సత్తుపల్లి: గ్రామ, మండల, జిల్లాస్థాయి సమస్యలను ఒక్కటొక్కటిగా ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరిస్తామని కలెక్టర్ దివాకర టీఎస్ వెల్లడించారు. సత్తుపల్లి నియోజకవర్గ ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక సమీక్ష ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ అధ్యక్షతన శనివారం నిర్వహించారు. సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. వచ్చే రెండేళ్లల్లో చేయాల్సిన అభివృద్ధిపై ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు. అర్హులైన ప్రతీఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా అధికార యంత్రాంగం పనిచేస్తుందని, రేషన్కార్డు కావాల్సిన వారు ఎప్పుడు దరఖాస్తు చేసుకున్నా జారీ చేస్తామని తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో అల్పాహారం, కాలేజీల్లో మధ్యాహ్న భోజనం అమలు కానున్నందున ప్రవేశాలు పెరిగేలా అందరూ సహకరించాలని సూచించారు. ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే ప్రతీ ఇంటికి రెండు, మూడు పథకాలు ఇచ్చిందని వెల్లడించారు. కాంగ్రెస్ ఏం చేసిందని ప్రశ్నించే వారు ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు. కాగా, కల్లూరు మున్సిపాలిటీలో నిధులు లేక కార్మికులకు ఎనిమిది నెలల వేతనాలు చెల్లించలేదని మున్సిపల్ చైర్మన్ ధరావత్ మోహన్నాయక్ తెలిపారు. ఈ మేరకు ప్రత్యేక గ్రాంట్ మంజూరు, డంపింగ్యార్డ్ ఏర్పాటుపై కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. అలాగే, వేంసూరు మండలం అమ్మపాలెంలో నీటి సమస్యపై సర్పంచ్ కాంతారెడ్డి వివరించగా, ఆర్టీసీ బస్సుల్లో పురుషులకు ప్రత్యేక సీట్లు కేటాయించి, బస్సుల సంఖ్య పెంచాలని డీసీసీ అధికార ప్రతినిధి గంగిశెట్టి ప్రసాద్ సూచించారు. కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్యాదవ్, సత్తుపల్లి మున్సిపల్ చైర్మన్ ఎండీ రెహానాబేగం, మార్కెట్ చైర్మన్లు బాగం నీరజాదేవి, దోమ ఆనంద్బాబు, నాయకులు ఎండీ కమల్పాషా, భీమిరెడ్డి సుబ్బారెడ్డి, గాదె చెన్నారావు, చల్లగుళ్ల నర్సింహారావు, నారాయణవరపు శ్రీనివాస్, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.కలెక్టర్ దివాకర -
పేదలందరికీ సంక్షేమ పథకాలు
● ధాన్యం, మక్కలు అమ్మిన వారంలోగా ఖాతాల్లో నగదు జమ ● రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వైరా: రాష్ట్రంలో కొనసాగుతున్న ప్రజాప్రభుత్వం ద్వారా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందుతాయని రాష్ట్ర రెవెన్యూ, సమాచార, గృహనిర్మాణ శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’లో భాగంగా వైరా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శనివారం జరిగిన నియోజకవర్గ స్థాయి సమీక్షలో ఆయన మాట్లాడారు. గత పాలకులు తెలంగాణను అప్పుల కుప్పగా మార్చారని ఆరోపించారు. పేదలకు ఇల్లు కట్టిస్తే లాభం ఉండదని భావించి కమీషన్ల కోసం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి నిధులు నీళ్ల పాలు చేశారని పేర్కొన్నారు. కానీ తాము అధికారంలోకి వచ్చాక ఆడబిడ్డలు, దళిత, గిరిజనులు, రైతుల పక్షాన నిలుస్తూ పాలన సాగిస్తున్నామని తెలిపారు. ఇది తట్టుకోలేక ప్రతిపక్షాలు తమపై విమర్శలు చేస్తూ తిరిగి వారు అధికారంలోకి వస్తారని పగటి కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. కాగా, ధాన్యం, మక్కలు అమ్మిన రైతులకు వారంలోగా ఖాతాల్లో డబ్బు జమ చేస్తామని పొంగులేటి స్పష్టం చేశారు. గత ప్రభుత్వం చేసిన అప్పులు తీరుస్తూనే సంక్షేమ, అభివృద్ధి పథకాలు అందిస్తున్నామని వెల్లడించారు. వైరా ఎమ్మెల్యే రాందాస్నాయక్ మాట్లాడుతూ.. సంక్షేమ పథకాలు అర్హులకు అందేలా అధికారులు కృషి చేయాలన్నారు. సమావేశంలో మహబూబాబాద్ ఎంపీ బలరామ్నాయక్, కలెక్టర్ దివాకర టీఎస్, మున్సిపల్ చైర్ పర్సన్ డాక్టర్ కాపా చంద్రకళ, వైస్ చైర్మన్ కట్ల సంతోష్, డీఎల్పీఓ రాంబాబు, తహసీల్దార్ సురేశ్, ఎంపీడీఓ సక్రునాయక్, నాయకులు బొర్రా రాజశేఖర్, సూతకాని జైపాల్, శీలం వెంకటనర్సిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఎవరు రాశారీ మరణశాసనం?
ఖమ్మంక్రైం: కుటుంబ కలహాలు పచ్చని సంసారంలో నిప్పులు పోశాయని కొందరు.. ఇద్దరు ఆడపిల్లలు కావడంతో గొడవలు జరిగాయని మరికొందరు.. కట్నం బాకీ ఉండడమే ఘర్షణలకు కారణమని ఇంకొందరు చెబుతున్నా ఆ కుటుంబంలో ఇద్దరు చిన్నారులు సహా నలుగురు మృతి చెందడం విషాదాన్ని నింపింది. అసలు కారణాలపై స్పష్టత రాకున్నా పోలీసుల ప్రాథమిక విచారణలో కొన్ని అంశాలు బయటపడినట్లు తెలుస్తోంది. ఖమ్మంలో నివాసముంటున్న నేలకొండపల్లి మండలానికి చెందిన కణతాల రాము (30) కుటుంబంలో ఈ ఘటన చోటు చేసుకోగా.. ఆయన చిన్నకుమార్తె కూడా మృత్యువుతో పోరాడి ఓడిపోయింది. దీంతో అసలు నిజమేమిటో మిస్టరీగానే మిగిలిపోనుంది. తొలుత ఇద్దరు.. ఖమ్మం బుర్హాన్పురంలో కణతాల రాము(30) తన భార్య రమ్య(28), కుమార్తెలు దివ్యశ్రీ (5), రితిక(3)తో నివాసముండేవాడు. గతనెల 26న ఆయన ఇంటి నుంచి దుర్వాసన వస్తుండడం, ఆయన భార్య రమ్య ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండడంతో స్థానికులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు పరిశీలించారు. అప్పటికే రాము, దివ్య చనిపోయి మూడు రోజులు కావడంతో మృతదేహాలు కుళ్లిపోయినట్లు గుర్తించారు. అదే సమయాన రమ్య, రితిక కూడా అపస్మారక స్థితిలో ఉండడంతో ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రమ్య 30వ తేదీన, హైదరాబాద్ ఆస్పత్రికి తరలించిన రితిక గురువారం రాత్రి మృతి చెందారు. 23వ తేదీన రాము, 24న దివ్యశ్రీ రాము, దివ్యశ్రీ మృతదేహాలను గతనెల 26న(ఆదివారం) గుర్తించినా.. అంతకు మూడు రోజుల ముందే(గురువారం) రాము మృతి చెందాడని సమాచారం. మూడు రోజులుగా భార్యతో గొడవపడుతున్న రాము బయటకు వెళ్లి విషం తాగొచ్చి మృతి చెందగా, ఆయన మృతికి తానే కారణం అనుకుంటారని రమ్య భావించి పిల్లలను బయటకు పంపలేదని సమాచారం. దివ్యశ్రీ ఇంటి పక్కనే వారితో చనువుగా ఉండటం.. ఆమె బయటకు వెళ్తే రాము మృతి విషయం బయటపడుతుందనే భావనతో 24వ తేదీన నిద్రలోనే తల్లి హత్య చేసి ఉంటుందనే నిర్ధారణకు వచ్చినట్లు తెలిసింది. ఇక 25వ తేదీన ఇంట్లోనే మృతదేహాలతో ఉండగా.. 26వ తేదీన ఉదయం చిన్నకుమార్తెను మృతదేహాల వద్దే ఉంచి స్థానికంగా కిరాణం షాపునకు వెళ్లి ఎలుకల మందు తీసుకొచి్చ, ఓఆర్ఎస్లో కలిపి తాను తాగడమే కాక చిన్న కుమార్తె రితికకు కూడా తాగించానని చెప్పినట్లు సమాచారం. అయినా కుమార్తె మృతి చెందకపోవడంతో బలమైన వస్తువుతో ఆమె నెత్తి మీద కొట్టిందని తెలిసింది. మొదటి నుంచి కలహాలే నేలకొండపల్లి అనంతనగర్కు చెందిన రాముకు, నడిగూడెం మండలం వాయిలసింగారానికి చెందిన రమ్యతో ఆరేళ్ల క్రితం వివాహం జరిగింది. తొలుత నేలకొండపల్లిలో ఉన్నా ఆపై ఖమ్మంకు మకాం మార్చారు. ఆది నుంచి వీరి మధ్య ఉన్న కలహాలు రెండో కాన్పులోనూ ఆడపిల్ల పుట్టాక పెరిగాయని తెలిసింది. కొడుకు పుడితే పుట్టువెంట్రుకల కార్యక్రమం స్వగ్రామంలో ఘనంగా నిర్వహించాలని రాము భావించగా.. బిడ్డే పుట్టడంతో ఆమెకు మూడేళ్లు నిండాక కుటుంబం మధ్యే మొక్కు తీర్చుకున్నాడు. రమ్య కుటుంబీకులను పిలవకపోవడంతో ఆమె తరచూ గొడవ పడేదని సమాచారం. అలాగే, పెళ్లి సందర్భంగా ఇస్తామన్న నగదులో రూ.లక్ష, కోదాడలో వంద గజాల స్థలం రమ్య కుటుంబీకులు ఇవ్వకపోవడం కూడా గొడవలకు కారణమని సమాచారం. మూడు రోజులు తిండి లేకుండా.. పోలీసుల విచారణలో భాగంగా గత నెల 23న రాత్రి వంట చేసిన రమ్య.. ఆ తర్వాత మళ్లీ పొయ్యి వెలిగించలేదని బూజు పట్టి ఉన్న అన్నాన్ని చూసి పోలీసులు ఈ భావనకు వచ్చారు. అంటే గురువారం రాత్రి ఇంట్లో ఎవరూ అన్నం లేదని సమాచారం. చివరకు ఇంటి సమీపంలోని వృద్ధురాలు 26వ తేదీన ఉదయం ఇడ్లీలు తీసుకొస్తే తాను తినకపోగా.. చిన్నకూతురుకూ తినిపించలేదని తెలిసింది. ఆమెకు ఎలుకల మందు తాగించినందున ఇడ్లీ తినిపిస్తే మందు విరిగిపోతుందనే భావనకు వచి్చ నట్లు తెలుస్తోంది. అయితే, కుటుంబ కలహాలే తప్ప మరెవరికీ ఘటనలో సంబంధం లేదని పోలీసులు దాదాపు నిర్ధారణకు వచి్చనా.. నలుగురి మృతితో అసలు కారణాలు మాత్రం వారితోనే సమాధి అయినట్లయింది. కాగా, రాము, ఆయన పెద్దకుమార్తె మృతదేహాలకు స్వగ్రామమైన అనంతనగర్లో అంత్యక్రియలు నిర్వహించగా.. రమ్య మృతదేహాన్ని తీసుకురావడానికి ఆయన కుటుంబీకులు అంగీకరించలేదని సమాచారం. దీంతో మార్గమధ్యలోనే వాహనాన్ని వెనక్కి తిప్పి ఖమ్మం తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. గురువారం హైదరాబాద్లో మృతి చెందిన రితిక మృతదేహాన్ని అనంతనగర్కే తీసుకెళ్లి అంత్యక్రియలు పూర్తిచేశారు.అన్నీ అనుమానాలే.. పోలీసులు పరిశీలించిన రోజు కుళ్లిపోయిన స్థితిలో ఉన్న రాము, దివ్యశ్రీ మృతదేహాలు బయటపడ్డాయి. రమ్య పురుగులమందు తాగి ఉండడం, రితిక తలపై గాయాలు ఉండటంతో అనుమానాలు వ్యక్తమయ్యాయి. భర్త, పెద్ద కుమార్తెను రమ్యే హత్య చేసి ఆ తర్వాత చిన్నకుమార్తె హత్యకు సైతం యతి్నంచిందని.. చివరగా తాను పురుగుల మందు తాగినట్లు భావించారు. ఆమెను ఆస్పత్రికి తరలించి కాస్త కోలుకోగానే ఆరా తీయగా కొన్ని వివరాలు చెప్పినట్లు తెలిసింది. -
వాడవాడలా ఎగిరిన ఎర్రజెండా
ఖమ్మంమయూరిసెంటర్/ఖమ్మం వైరారోడ్: మే డే వేడుకలను శుక్రవారం జిల్లా కేంద్రంలో ఘనంగా జరుపుకున్నారు. వివిధ పార్టీలు, సంఘాల ఆధ్వర్యాన ర్యాలీలు, ప్రదర్శనలు నిర్వహించగా.. వాడవాడలా అరుణ పతాకాలు ఎగురవేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కార్మికులు హక్కులు సాధనకు పోరాడాలని పిలుపునిచ్చార. ●సీపీఐ జిల్లా సమితి ఆధ్వర్యంలో ఖమ్మం నెహ్రూనగర్లోని పాత పార్టీ కార్యాలయం నుండి పెవిలియన్ మైదానం వరకు ప్రదర్శన నిర్వహించారు. అనంతరం పార్టీ జిల్లా కార్యదర్శి దండి సురేష్ అధ్యక్షతన జరిగిన సభలో సీపీఐ జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ కె.నారాయణ, జాతీయ సమితి సభ్యులు బాగం హేమంతరావు మాట్లాడారు. నాయకులు మహ్మద్ మౌలానా, జిల్లా సహాయ కార్యదర్శి జమ్ముల జితేందర్రెడ్డి, జానిమియా, మహ్మద్ సలాం, శింగు నర్సింహారావు తదితరులు పాల్గొన్నారు. తొలుత కార్యాలయంలో పార్టీ పతాకాన్ని జిల్లా కార్యదర్శి సురేష్ ఎగురవేశారు. ●సీపీఐ(ఎంఎల్) మాస్లైన్, టీయూసీఐ ఆధ్వర్యంలో మే డే వేడుకలు నిర్వహించారు. పలు ప్రాంతాల్లో జెండాలను పార్టీ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు ఆవిష్కరించి మాట్లాడారు. టీయూసీఐ జిల్లా కార్యదర్శి జి.రామయ్య, పీఓడబ్ల్యూ రాష్ట్ర కార్యదర్శి శిరోమణి, నాయకులు శోభ, భరత్, లక్ష్మ ణ్, కె.శ్రీనివాస్, పాల్గొన్నారు. అలాగే, మాస్లైన్ కార్యాలయంలో పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు ఆవుల వెంకటేశ్వర్లు జెండా ఆవిష్కరించగా నాయకులు ఆవుల అశోక్, ఝాన్సీ, చంటి, చందు పాల్గొన్నారు. ●ఖమ్మం కూరగాయల మార్కెట్ వద్ద తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పోతినేని సుదర్శన్రావు జెండా ఎగురవేసి మాట్లాడారు. అలాగే, సీపీఎం జిల్లా కార్యాలయంలో పార్టీ జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు మేడే జెండాను ఆవిష్కరించగా నాయకులు పాల్గొన్నారు. ●పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో కార్మికులకు అనేక సంక్షేమ పథకాలను అమలు చేసిన కేసీఆర్ కార్మికుల పక్షపాతిగా నిలిచారని మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. ఖమ్మం రైతు బజార్ ఆటో అడ్డా వద్ద బీఆర్టీయూ ఆధ్వర్యాన ఆయన సంఘం జెండా ఆవిష్కరించి మాట్లాడారు. నాయకులు కూరాకుల నాగభూషణం, పగడాల నాగరాజు, కార్పొరేటర్ జ్యోతిరెడ్డితో పాటు పాషా, సత్తార్, బిక్కసాని జస్వంత్, ఖమర్, తాజుద్దీన్, బత్తుల మురళి తదితరులు పాల్గొన్నారు. హక్కుల పరిరక్షణకు పోరాడాలని పిలుపు -
ముందస్తు ఆదాయం భళా !
సత్తుపల్లిటౌన్: మున్సిపాలిటీల్లో ఆస్తిపన్ను ముందస్తుగా రాబట్టేందుకు రాష్ట్ర పురపాలక శాఖ అమలు చేసిన ఎర్లీబర్డ్ పథకానికి ఆశించిన స్థాయిలో కాకున్నా మంచి స్పందనే లభించింది. జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలకు గాను సత్తుపల్లిలో 24.73 శాతం పన్నులు వసూలు కావడంతో ముందంజలో నిలిచింది. ఇక కల్లూరు మున్సిపాలిటీలో కేవలం 8.16 శాతం పన్నులే వసూలయ్యాయి. ఎర్లీ బర్డ్ ద్వారా పన్ను చెల్లించే గడువు ఏప్రిల్ 30వ తేదీతో ముగియగా, గత ఏడాది మాదిరి మరో వారం పొడిగించినట్లు తెలిసింది. ఈ మేరకు శుక్రవారం కూడా సైట్ తెరుచుకున్నందున పొడిగింపు నిజమేనని చెబుతుండగా.. గడువు ముగిసేలోగా ఆస్తిపన్ను రూపంలో మున్సిపాలిటీలకు మరింత ఆదాయం సమకూరనుంది. ఐదు శాతం రాయితీ ముందుగా ఆస్తి పన్ను చెల్లిస్తే ఐదు శాతం రాయితీ వర్తింపజేశారు. ఈ ఆర్థిక సంవత్సరం ఆస్తిపన్ను మొత్తంగా చెల్లిస్తే రాయితీ లభిస్తుందనే అంశంపై మున్సిపాలిటీల అధికారులు ఫ్లెక్సీలు, మైకుల ద్వారా విస్తృత ప్రచారం చేశారు. ఈ మేరకు పలువురు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. అయితే, జనాభా గణనకు కుటుంబాలు, బ్లాక్ల నిర్వహణలో బిల్కలెక్టర్లు, వార్డు ఆఫీసర్లు నిమగ్నం కావడంతో ప్రచారంపై పెద్దగా దృష్టి సారించలేకపోయారు. లేనిపక్షంలో వసూళ్లు మరింత పెరిగేవని చెబుతున్నారు. సత్తుపల్లి ఫస్ట్ ఎర్లీబర్డ్ పథకం అమలులో జిల్లాలోని మున్సిపాలిటీల్లో సత్తుపలి అగ్రస్థానాన నిలిచింది. ఇక్కడ 2,101 మంది రూ.1.58 కోట్ల మేర ఆస్తిపన్ను చెల్లించి ఐదు శాతం రాయితీని సద్వినియోగం చేసుకున్నారు. ఈ మున్సిపాలిటీలో మొత్తం రూ.6.39 కోట్ల ఆస్తి పన్ను డిమాండ్ ఉండగా.. 24.73 శాతం పన్ను ఆర్థిక సంవత్సరం మొదటి నెలలోనే వసూలైంది. ఇక మధిర 14.60 శాతం, వైరా 16.48 శాతం, కల్లూరు 11.70 శాతం, ఏదులాపురం 8.16 శాతం మాత్రమే ముందస్తు ఆదాయం సమకూరింది.మున్సిపాలిటీ పన్ను డిమాండ్ చెల్లించిన ఇళ్లు వసూలైన పన్ను సత్తుపల్లి రూ.6.39 కోట్లు 2,101 రూ.1.58 కోట్లు మధిర రూ.4.59 కోట్లు 1,779 రూ.0.67 లక్షలు వైరా రూ.5.46కోట్లు 1,141 రూ.0.90 లక్షలు కల్లూరు రూ.0.94 కోట్లు 171 రూ.0.11 లక్షలు ఏదులాపురం రూ.8.59 కోట్లు 2,068 రూ.0.70 లక్షలు ఎర్లీ బర్డ్పై విస్తృత ప్రచారం చేశాం. ప్రభుత్వ కార్యాలయాలు, ప్రధాన కూడళ్ల వద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాం. దీంతో మున్సిపల్ పరిధిలోని పలువురు ఐదు శాతం రాయితీని సద్వినియోగం చేసుకుంటూ పన్ను చెల్లించారు. ఈ నిధులతో పట్టణంలో అభివృద్ధి పనులు చేపట్టేందుకు వీలు ఏర్పడుతుంది. –కె.నర్సింహ, కమిషనర్, సత్తుపల్లి -
మహిళా శక్తికి ఇంధనం!
● ఖమ్మంలో టీఎల్ఎఫ్ ఆధ్వర్యాన పెట్రోల్ బంక్ ● ఐఓసీఎల్ సహకారంతో ఏర్పాటుఖమ్మంమయూరిసెంటర్: ఖమ్మం నగరంలోని పొదుపు సంఘాల మహిళలు వ్యాపారంలోకి అడుగుపెట్టనున్నారు. టౌన్ లేవల్ ఫెడరేషన్(టీఎల్ఎఫ్) ఆధ్వర్యాన పెట్రోల్ బంక్ ఏర్పాటుకు అధికారులు నిర్ణయించారు. తద్వారా మహిళా సంఘాల సభ్యులకు ఆర్థికంగా మరింత పటిష్టత చేకూరనుంది. మహిళా సంఘాలకు పెట్రోల్ బంక్ నిర్వహణ బాధ్యతలను అప్పగించనుండగా.. మొదటగా ఖమ్మంలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్(ఐఓసీఎల్) సహకారంతో ఏర్పాటుకు ప్రణాళిక ఖరారైంది. స్థలం ఎంపిక పూర్తి టీఎల్ఎఫ్ ఆధ్వర్యాన బంక్ ఏర్పాటుకు ఇప్పటికే స్థలాన్ని ఎంపిక చేశారు. ఖమ్మం బైపాస్ రోడ్డులోని కొత్త బస్టాండ్ సమీపాన గతంలో హరిత హోటల్ నిర్మాణానికి స్థలం కేటాయించారు. ప్రస్తుతం దాన్ని రద్దు చేసి అక్కడే బంక్ నిర్మాణానికి అధికారులు అనుమతి మంజూరు చేశారు. ఇప్పటికే ఎన్ఓసీ కూడా రావడంతో రెండు రోజుల్లో నిర్మాణ పనులకు భూమి పూజ చేసే అవకాశముంది. అందరూ అతివలే... ఖమ్మం నగర మహిళా సంఘాల ప్రతినిధుల ఆధ్వర్యాన బంక్ ఏర్పాటు చేస్తుండగా నిర్వహణ బాధ్యతలు సైతం వారికే అప్పగిస్తారు. నిర్వహణ మొదలు సిబ్బంది వరకు అందరూ మహిళలనే నియమిస్తారు. బంక్ నిర్వహణ ద్వారా వచ్చే లాభాలు టీఎల్ఎఫ్ ఖాతాలోకి చేరనున్నందున సంఘాల బలోపేతానికి మార్గం ఏర్పడనుంది. కేఎంసీ సహకారం మహిళా సంఘాల ఆధ్వర్యాన ఏర్పాటు చేసే బంక్ నిర్మాణం ఐఓసీఎల్ చేపడుతుండగా.. నిర్వహణకు ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ సహకరించనుంది. అవసరమైన నిధులను కేఎంసీ ద్వారా సర్దుబాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. కేఎంసీ పరిధిలోని మహిళా సంఘాల సభ్యులు ఇప్పటికే పలు రంగాల్లో రాణిస్తుండగా, ప్రస్తుతం పెట్రోల్ బంక్ నిర్వహణ బాధ్యతలతో వారిలో ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచనుంది. మెప్మా అధికారులు ఏర్పాట్ల్లలో నిమగ్నం కాగా, ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే రాష్ట్రంలోనే ఖమ్మం టీఎల్ఎఫ్కు ప్రత్యేక గుర్తింపు లభిస్తుందని అధికారులు భావిస్తున్నారు. -
ఎవరు రాశారీ మరణశాసనం?
ఖమ్మంక్రైం: కుటుంబ కలహాలు పచ్చని సంసారంలో నిప్పులు పోశాయని కొందరు.. ఇద్దరు ఆడపిల్లలు కావడంతో గొడవలు జరిగాయని మరికొందరు.. కట్నం బాకీ ఉండడమే ఘర్షణలకు కారణమని ఇంకొందరు చెబుతున్నా ఆ కుటుంబంలో ఇద్దరు చిన్నారులు సహా నలుగురు మృతి చెందడం విషాదాన్ని నింపింది. అసలు కారణాలపై స్పష్టత రాకున్నా పోలీసుల ప్రాథమిక విచారణలో కొన్ని అంశాలు బయటపడినట్లు తెలుస్తోంది. ఖమ్మంలో నివాసముంటున్న నేలకొండపల్లి మండలానికి చెందిన కణతాల రాము (30) కుటుంబంలో ఈ ఘటన చోటు చేసుకోగా.. ఆయన చిన్నకుమార్తె కూడా మృత్యువుతో పోరాడి ఓడిపోయింది. దీంతో అసలు నిజమేమిటో మిస్టరీగానే మిగిలిపోనుంది. తొలుత ఇద్దరు.. ఖమ్మం బుర్హాన్పురంలో కణతాల రాము(30) తన భార్య రమ్య(28), కుమార్తెలు దివ్యశ్రీ (5), రితిక(3)తో నివాసముండేవాడు. గతనెల 26న ఆయన ఇంటి నుంచి దుర్వాసన వస్తుండడం, ఆయన భార్య రమ్య ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండడంతో స్థానికులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు పరిశీలించారు. అప్పటికే రాము, దివ్య చనిపోయి మూడు రోజులు కావడంతో మృతదేహాలు కుళ్లిపోయినట్లు గుర్తించారు. అదే సమయాన రమ్య, రితిక కూడా అపస్మారక స్థితిలో ఉండడంతో ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రమ్య 30వ తేదీన, హైదరాబాద్ ఆస్పత్రికి తరలించిన రితిక గురువారం రాత్రి మృతి చెందారు. 23వ తేదీన రాము, 24న దివ్యశ్రీ రాము, దివ్యశ్రీ మృతదేహాలను గతనెల 26న(ఆదివారం) గుర్తించినా.. అంతకు మూడు రోజుల ముందే(గురువారం) రాము మృతి చెందాడని సమాచారం. మూడు రోజులుగా భార్యతో గొడవపడుతున్న రాము బయటకు వెళ్లి విషం తాగొచ్చి మృతి చెందగా, ఆయన మృతికి తానే కారణం అనుకుంటారని రమ్య భావించి పిల్లలను బయటకు పంపలేదని సమాచారం. దివ్యశ్రీ ఇంటి పక్కనే వారితో చనువుగా ఉండటం.. ఆమె బయటకు వెళ్తే రాము మృతి విషయం బయటపడుతుందనే భావనతో 24వ తేదీన నిద్రలోనే తల్లి హత్య చేసి ఉంటుందనే నిర్ధారణకు వచ్చినట్లు తెలిసింది. ఇక 25వ తేదీన ఇంట్లోనే మృతదేహాలతో ఉండగా.. 26వ తేదీన ఉదయం చిన్నకుమార్తెను మృతదేహాల వద్దే ఉంచి స్థానికంగా కిరాణం షాపునకు వెళ్లి ఎలుకల మందు తీసుకొచ్చి, ఓఆర్ఎస్లో కలిపి తాను తాగడమే కాక చిన్న కుమార్తె రితికకు కూడా తాగించానని చెప్పినట్లు సమాచారం. అయినా కుమార్తె మృతి చెందకపోవడంతో బలమైన వస్తువుతో ఆమె నెత్తి మీద కొట్టిందని తెలిసింది. మొదటి నుంచి కలహాలే నేలకొండపల్లి అనంతనగర్కు చెందిన రాముకు, నడిగూడెం మండలం వాయిలసింగారానికి చెందిన రమ్యతో ఆరేళ్ల క్రితం వివాహం జరిగింది. తొలుత నేలకొండపల్లిలో ఉన్నా ఆపై ఖమ్మంకు మకాం మార్చారు. ఆది నుంచి వీరి మధ్య ఉన్న కలహాలు రెండో కాన్పులోనూ ఆడపిల్ల పుట్టాక పెరిగాయని తెలిసింది. కొడుకు పుడితే పుట్టువెంట్రుకల కార్యక్రమం స్వగ్రామంలో ఘనంగా నిర్వహించాలని రాము భావించగా.. బిడ్డే పుట్టడంతో ఆమెకు మూడేళ్లు నిండాక కుటుంబం మధ్యే మొక్కు తీర్చుకున్నాడు. రమ్య కుటుంబీకులను పిలవకపోవడంతో ఆమె తరచూ గొడవ పడేదని సమాచారం. అలాగే, పెళ్లి సందర్భంగా ఇస్తామన్న నగదులో రూ.లక్ష, కోదాడలో వంద గజాల స్థలం రమ్య కుటుంబీకులు ఇవ్వకపోవడం కూడా గొడవలకు కారణమని సమాచారం. పోలీసుల విచారణలో భాగంగా గత నెల 23న రాత్రి వంట చేసిన రమ్య.. ఆ తర్వాత మళ్లీ పొయ్యి వెలిగించలేదని బూజు పట్టి ఉన్న అన్నాన్ని చూసి పోలీసులు ఈ భావనకు వచ్చారు. అంటే గురువారం రాత్రి ఇంట్లో ఎవరూ అన్నం లేదని సమాచారం. చివరకు ఇంటి సమీపంలోని వృద్ధురాలు 26వ తేదీన ఉదయం ఇడ్లీలు తీసుకొస్తే తాను తినకపోగా.. చిన్నకూతురుకూ తినిపించలేదని తెలిసింది. ఆమెకు ఎలుకల మందు తాగించినందున ఇడ్లీ తినిపిస్తే మందు విరిగిపోతుందనే భావనకు వచ్చి నట్లు తెలుస్తోంది. అయితే, కుటుంబ కలహాలే తప్ప మరెవరికీ ఘటనలో సంబంధం లేదని పోలీసులు దాదాపు నిర్ధారణకు వచ్చినా.. నలుగురి మృతితో అసలు కారణాలు మాత్రం వారితోనే సమాధి అయినట్లయింది. కాగా, రాము, ఆయన పెద్దకుమార్తె మృతదేహాలకు స్వగ్రామమైన అనంతనగర్లో అంత్యక్రియలు నిర్వహించగా.. రమ్య మృతదేహాన్ని తీసుకురావడానికి ఆయన కుటుంబీకులు అంగీకరించలేదని సమాచారం. దీంతో మార్గమధ్యలోనే వాహనాన్ని వెనక్కి తిప్పి ఖమ్మం తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. గురువారం హైదరాబాద్లో మృతి చెందిన రితిక మృతదేహాన్ని అనంతనగర్కే తీసుకెళ్లి అంత్యక్రియలు పూర్తిచేశారు.పోలీసులు పరిశీలించిన రోజు కుళ్లిపోయిన స్థితిలో ఉన్న రాము, దివ్యశ్రీ మృతదేహాలు బయటపడ్డాయి. రమ్య పురుగులమందు తాగి ఉండడం, రితిక తలపై గాయాలు ఉండటంతో అనుమానాలు వ్యక్తమయ్యాయి. భర్త, పెద్ద కుమార్తెను రమ్యే హత్య చేసి ఆ తర్వాత చిన్నకుమార్తె హత్యకు సైతం యత్నించిందని.. చివరగా తాను పురుగుల మందు తాగినట్లు భావించారు. ఆమెను ఆస్పత్రికి తరలించి కాస్త కోలుకోగానే ఆరా తీయగా కొన్ని వివరాలు చెప్పినట్లు తెలిసింది.కుటుంబంలో మిగిలిన చిన్నారి కూడా మృతి -
కార్మిక హక్కులపై కేంద్రం కగార్ కత్తి
● మోదీ కోసమే కమ్యూనిజాన్ని తిడుతున్న చంద్రబాబు ● సీపీఐ జాతీయ నాయకుడు నారాయణ ఖమ్మంమయూరిసెంటర్: రక్తపు మడుగుల నుంచి పుట్టి ఎనిమిది గంటల పని విధానాన్ని సాధించిన ఎరజ్రెండా ఉనికిని దెబ్బతీసేలా కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని సీపీఐ జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ డాక్టర్ కె.నారాయణ ధ్వజమెత్తారు. ఖమ్మంలో శుక్రవారం నిర్వహించిన మే డే ఉత్సవాల్లో ఆయన మాట్లాడారు. బ్రిటీష్ కాలంలో సాధించుకున్న హక్కులు, పని గంటల చట్టాలను కేంద్రం తుంగలో తొక్కుతోందని మండిపడ్డారు. ఐటీ ఉద్యోగులతో వర్క్ ఫ్రం హోం పేరిట 20–22 గంటల పనిచేయిస్తూ క్లాసిఫైడ్ బానిసలుగా మార్చారని పేర్కొన్నారు. మరోపక్క అడవి బిడ్డలను ఖాళీ చేయించి, సహజ సంపదను కార్పొరేట్ల కు కట్టబెట్టడమే లక్ష్యంగా కేంద్రం ఆపరేషన్ కగార్ చేపట్టిందని ఆరోపించారు. మావోయిజం పేరుతో గిరిజనులను వేధిస్తున్నా.. సిద్ధాంతాన్ని మాత్రం తుపాకులతో అణచలేరన్నారు. కాగా, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ప్రధాని మోదీని ప్రసన్నం చేసుకునేందుకు కమ్యూనిజాన్ని తిడుతున్నారని, ఇది కొంగ జపం లాంటిదేనని నారాయణ ఎద్దేవా చేశారు. కొడుక్కి రాజ్యం అప్పగించి బాబు ప్రధానమంత్రి కావాలని అనుకుంటుండగా, ఆయన ఎంత కాకా పట్టినా మోదీ దగ్గరకు రానివ్వడన్నారు. బీజేపీకి అనుకూలంగా ఉంటే ఎంతటి నేరగాడైనా గంగి గోవులా కనిపిస్తాడని, వ్యతిరేకిస్తే జైలులో పెడతారని దుయ్యబట్టారు. ఇక కేసీఆర్ అహంభావం, కుటుంబ పాలనతోనే బీఆర్ఎస్ సంక్షోభంలో పడిందని తెలిపారు. కేబినెట్లో తెలంగాణ ద్రోహులకు చోటు కల్పించి సెంటిమెంట్ను కేసీఆరే దెబ్బతీశారన్నారు. సొంత కూతురే తండ్రిని విమర్శించే స్థాయికి వారి కుటుంబ కలహాలు చేరాయని పేర్కొన్నారు. దేశంలో దారిద్య్రం లేని ఏకైక రాష్ట్రంగా కేరళ నిలవడానికి లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వ ఘనతేనని నారాయణ కొనియాడారు. సీపీఐ జాతీయ సమితి సభ్యులు బాగం హేమంతరావు, జిల్లా కార్యదర్శి దండి సురేశ్, నాయకులు మహమ్మద్ మౌలానా, జమ్ముల జితేందర్రెడ్డి, జానీమియా, శింగు నర్సింహారావు పాల్గొన్నారు. -
జీపీఎఫ్ చెల్లింపుల ప్రచారంలో వాస్తవం లేదు
ఖమ్మంసహకారనగర్: రాష్ట్ర ప్రభుత్వం పెన్షనర్లకు జీపీఎఫ్ బకాయిలు చెల్లించిందనే ప్రచారంలో వాస్తవం లేదని ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ పెన్షనర్స్ అసోసియేషన్ (పీఆర్పీఏ) జిల్లా కన్వీనర్ యలమద్ది వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. ఖమ్మంలోని పీఆర్టీయూ భవన్లో శుక్రవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అక్టోబర్ 2025 వరకు రిటైర్డ్ అయిన ఉద్యోగుల్లో కేవలం ప్రభుత్వ మేనేజ్మెంట్లోని ఉపాధ్యాయులకే జీపీఎఫ్ బకాయిలు జమ చేశారని తెలిపారు. జిల్లా పరిషత్ పరిధి ఉపాధ్యాయుయులకు చెల్లింపులు జరగలేదని పేర్కొన్నారు. ఇకనైనా ప్రభుత్వం వివక్ష విడనాడి అందరికీ ఏకమొత్తంగా బిల్లులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నాయకులు కందుల వెంకటనరసయ్య, పి.కొండల్రావు, రాజు, లక్ష్మణ్రావు, కొత్త శ్రీనివాసరావు, ఎం.సీతారామయ్య, జీఎస్ నారాయణ, జి.వీరయ్య, ఆర్.సుమతి తదితరులు పాల్గొన్నారు. ఘనంగా లక్ష్మీనర్సింహస్వామి కల్యాణం ఏన్కూరు: ఏన్కూరు మండలం గార్లఒడ్డులో శ్రీ లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో స్వామి వారి కల్యాణాన్ని శుక్రవారం రాత్రి జరిగింది. గతనెల 29 నుంచి ఆలయంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా కల్యాణం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వేణుగోపాలచార్యులు, నాగరాజు ఆచార్యులుతో పాటు వివిధ ప్రాంతాల భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. రిటైర్డ్ పోలీసు ఉద్యోగులకు సన్మానం ఖమ్మంక్రైం: పోలీసు శాఖలో విధులు నిర్వర్తించిన పలువురు ఉద్యోగులు, హోంగార్డులు గురువారం ఉద్యోగ విరమణ చేశారు. ఈ సందర్భంగా వీరిని పోలీస్ కమిషనర్ సునీల్దత్ శుక్రవారం సన్మానించి జ్ఞాపికలు అందజేశారు. ఉద్యోగ విరమణ చేసిన వారిలో ఎస్ఐలు నాగేశ్వరరావు, వెంకటేశ్వరరావు, వేణుగోపాల్రెడ్డి, శ్రీనివాసరావు, ఏఎస్ఐలు ఆర్వీవీ బ్రహ్మచారి, సత్యనారాయణ, హెడ్కానిస్టేబుల్ యాసిన్మియా, హోంగార్డులు లోకమ్మ, వీరస్వామి ఉన్నారు. రిటైర్డ్ ఉద్యోగి చికిత్సకు చేయూత ఖమ్మంక్రైం: ఎస్ఐగా విధులు నిర్వర్తించిన ఉద్యోగ విరమణ చేసిన మౌలానా అనారోగ్యంతో బాధపడుతుండగా పలువురు అండగా నిలిచారు. ఈమేరకు వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న పోలీసు ఉద్యోగులు, రిటైర్డ్ అధికారులు ఆయన చికిత్స కోసం రూ.1.50లక్షలను సమకూర్చారు. ఆయనకు ఆర్థికసాయం అందించిన వారిలో పోలీసు అధికారులు చక్రపాణి, శ్రీనివాస్రెడ్డి, ఎస్వీ.రమణమూర్తి, శేషుకుమార్, పీ.వీ.గణేష్, మోహన్రాజ, నరేష్రెడ్డి, సతీష్, వెంకటరావు, బిల్లా అశోక్ తదితరులు ఉన్నారు. వీరికి రిటైర్డ్ ఉద్యోగుల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు రాధాకృష్ణమూర్తి, వెంకటనారాయణ కృతజ్ఞతలు తెలిపారు. ప్లాట్ పేరుతో మోసంపై కేసు నమోదు రఘునాథపాలెం: మండలంలోని జింకలతండా వద్ద ప్లాట్లో ఇల్లు నిర్మాణం పేరిట డబ్బు తీసుకుని మోసం చేసిన ఘటనపై శుక్రవారం కేసు నమోదైంది. ఓ వెంచర్లోని 130 గజాల ప్లాట్లో ఇల్లు నిర్మిస్తామని చెప్పిన వెంచర్ నిర్వాహకుడు జి.ప్రకాష్ రూ.23లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ మేరకు 2022లో రూ.2.30 లక్షలు తీసుకుని ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్ చేయకపోగా ఇంటి నిర్మాణం కూడా చేపట్టడం లేదని, డబ్బులు తిరిగి ఇవ్వడం లేదని వాసాల అశోక్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ప్రకాష్పై చీటింగ్ కేసు నమోదు చేసినట్లు సీఐ ఉస్మాన్ షరీఫ్ తెలిపారు. బాల్య వివాహాన్ని అడ్డుకున్న అధికారులు నేలకొండపల్లి: మండలంలోని ఓ గ్రామంలో బాలికకు వివాహం జరగనుందనే సమాచారంతో అధికారులు అడ్డుకున్నారు. ఇటీవలే పదో తరగతి పూర్తిచేసిన బాలిక (16)కు ఆమె కుటుంబీకులు వివాహం నిర్ణయించి ఈ నెల 8న ముహూర్తం ఖరారు చేశారు. ఈ విషయమై అందిన సమాచారంతో ఏఎస్ఐ లతీఫ్ షరీఫ్ తదితరులు శుక్రవారం బాలిక ఇంటికి వెళ్లి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. మైనార్టీ తీరకుండా వివాహం చేయడం చట్టరీత్యా నేరమే కాక భవిష్యత్లో ఆరోగ్య సమస్యలు వస్తాయని తెలిపారు. ఆపై బాల్యవివాహం చేయబోమని కుటుంబీకుల నుంచి లేఖ తీసుకున్నారు. పంచాయతీ కార్యదర్శి హరీశ్, జీపీఓ జానకీరాములు, అంగన్వాడీ టీచర్ కళావతి తదితరులు పాల్గొన్నారు. -
కార్మికుల హక్కుల పరిరక్షణకు కట్టుబడి ఉండాలి
●మే డే వేడుకల్లో అదనపు కలెక్టర్ శ్రీజ ఖమ్మంమయూరిసెంటర్: కార్మికుల హక్కుల పరిరక్షణకు ప్రతిఒక్కరూ కట్టుబడి ఉండాలని అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ సూచించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం నిర్వహించిన మే డే వేడుకల్లో ఆమె మాట్లాడు తూ జిల్లా కమ్యూనిస్టు భావజాలానికి నిలయంగా ఉండి అనేక మంది నాయకులను అందించిందని తెలిపారు. కార్మిక రంగంలో మహిళల భాగస్వామ్యం ఎక్కువగా ఉన్నందున, సంఘాల్లోనూ చురుగ్గా పాల్గొనాల్సిన అవసరముందని చెప్పారు. కార్మికుల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలులో ఉన్నందున సద్వి నియోగం చేసుకోవాలని సూచించారు. ఈ మేరకు అర్హులకు పథకాలు అందేలా అధికారులు పర్యవేక్షించాలని తెలిపారు. గత ఏడాదిలో కార్మిక శాఖ ద్వారా 7,498 మంది కార్మికులకు రూ.35.38కోట్ల సాయం అదనపు కలెక్టర్ వెల్ల డించారు. అనంతరం 2025–26 సంవత్సరాని కి సంబంధించి కార్మికశాఖ అమలుచేసిన కార్యక్రమాల వివరాలతో రూపొందించిన బుక్లెట్ను ఆమె ఆవిష్కరించారు. ఉప కార్మిక శాఖ కమిషనర్ కె.విజయభాస్కరరెడ్డి, జిల్లా ఉపాధి కల్పన అధికారి ఎన్.మాధవి, ఉద్యోగులు, కార్మిక సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ–కేవైసీ పూర్తయిన కూలీలకే పనుల కల్పన ఖమ్మంమయూరిసెంటర్: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా ఈ–కేవైసీ చేయించుకున్న కూలీలకు పని కల్పించనున్నట్లు డీఆర్డీఓ కె.శ్రీరామ్ తెలిపారు. ఈమేరకు కూలీలంతా ఈ–కేవైసీ పూర్తిచేయించుకోవాలని సూచించారు. జిల్లాలో ప్రస్తుతం రోజుకు 26వేల మంది కూలీలు పనులకు హాజరవుతున్నారని, గతనెల 15వ తేదీ వరకు చేసిన పని దినాలకు సంబంధించి వేతనాలు విడుదలయ్యాయని వెల్లడించారు. కాగా, ఉద్యానవన పంటలు సాగు చేసే రైతుల కు ఉపాధి హామీ పథకం ద్వారా ఆర్థిక సాయం అందిస్తూ మామిడి, జామ, నిమ్మ, ఆయిల్ పామ్, డ్రాగన్ ఫ్రూట్, వెదురు, జీడి మామిడి, మునగ, కొబ్బరి, సీతాఫలం సాగును ప్రోత్సహిస్తున్నామని వెల్లడించారు. ఈ పథకానికి ఎస్సీ, ఎస్టీ, చిన్న, సన్నకారు రైతులు అర్హులని ఆయన ఓ ప్రకటనలో తెలిపారు. ‘ఎర్లీ బర్డ్’ గడువు పొడిగింపు ఖమ్మంమయూరిసెంటర్: 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆస్తి పన్ను ముందస్తుగా చెల్లించే వారికి రాయితీ కల్పిస్తూ తీసుకొచ్చి న ఎర్లీ బర్డ్ పథకం గడువును ప్రభుత్వం పొడిగించింది. గురువారంతోనే గడువు ముగియగా, ఐదు శాతం రాయితీతో పన్ను చెల్లించేందుకు ఈనెల 7వ తేదీ వరకు అవకాశం కల్పించినట్లు తెలిసింది. ఈవిషయమై స్పష్టమైన ఆదేశాలు రాకున్నా శుక్రవారం కూడా సైట్ తెరుచుకోవడంతో పలువురు సొంతంగా ఆన్లైన్లో, మరికొందరు కేఎంసీ కార్యాలయంలో పన్నులు చెల్లించారు. దీంతో గత ఏడాది మాదిరిగానే గడువు పొడిగించినట్లేనని భావిస్తున్నారు. తద్వారా ఖమ్మం కార్పొరేషన్, జిల్లాలోని మున్సిపాలిటీలకు ముందస్తుగా మరింత ఆదాయం సమకూరనుంది. 4నుంచి వ్యవసాయ ప్రత్యేక కార్యక్రమాలు ఖమ్మం సహకారనగర్: ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’లో భాగంగా ఈనెల 4 నుంచి వ్యవసాయ ప్రత్యేక కార్యక్రమాలు సమర్థవంతంగా నిర్వహించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. మరో మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావుతో కలిసి శుక్రవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ప్రజాపాలన కార్యక్రమాలపై తుమ్మల సూచనలు చేశాక పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి మాట్లాడారు. ధాన్యం అమ్మిన రైతులకు 48 గంటల్లో చెల్లింపులు జరిగేలా చూడాలని ఆదేశించారు. జిల్లా నుంచి కలెక్టర్ దివాకర టీఎస్ మాట్లాడగా అదనపు కలెక్టర్లు డాక్టర్ పి.శ్రీజ, పి.శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. డీఆర్ఓగా రాజేశ్వరి ఖమ్మం సహకారనగర్: జిల్లా రెవెన్యూ అధికారి(డీఆర్ఓ)గా ఎం.రాజేశ్వరికి పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం ఆమె స్పెషల్ డిప్యూటీ కలెక్టర్గా విధులు నిర్వర్త్తిస్తున్నారు. అయితే, డీఆర్ఓగా ఉన్న పద్మశ్రీ గురువారం ఉద్యోగ విరమణ చేశారు. దీంతో డీఆర్ఓగా రాజేశ్వరికి పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ కలెక్టర్ దివాకర శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. -
నిప్పుల కొలిమి..
ఈ సమ్మర్.. వెరీహాట్ ఈ వేసవిలో ఎండలు దడ పుట్టిస్తున్నాయి. ప్రతీ వేసవిలో సాధారణంగా ఏప్రిల్ నుంచి ఎండలు పెరుగుతూ మే నెలలో గరిష్టస్థాయికి చేరతాయి. కానీ ఈసారి మాత్రం మార్చి నుంచే ప్రభావం మొదలై ఏప్రిల్ 20వ తేదీ నాటికి ఉష్ణోగ్రతలు అమాంతం పెరిగాయి. బయటకు వచ్చే పరిస్థితి లేకపోగా, ఇంట్లోనూ విపరీతమైన వేడితో జనం అవస్థ పడుతున్నారు. అటు ఎండ.. ఇటు ఉక్కపోత ఈసారి ఎండలకు తోడు ఉక్కపోత ఎక్కువగా ఉంది. బయటకు వచ్చిన నిమిషాల్లోనే చెమటలు పడుతూ ఒకచోట ఉండలేని పరిస్థితి ఎదురవుతోంది. పది రోజుల నుంచి ఎండల ప్రభావం మరింతగా పెరగగా, ఉదయం 7గంటలకే మొదలై 9గంటలకల్లా ఉధృత రూపం దాలుస్తోంది. ఖమ్మంతోపాటు సత్తుపల్లి, మధిర, వైరా, తల్లాడ, కొణిజర్ల మండలాల్లో ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్నాయి. వేడిగాలులు, సెగలతో పలువురు వడదెబ్బ బారిన పడుతున్నారు. మరింతగా ౖపైపెకి.. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతాయని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరించింది. ఈమేరకు ప్రజలు అప్రమత్తంగా ఉంటూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. మే నెలలో వడగాలుల తీవ్రత ఉండే అవకాశం ఉంది. అడపాదడపా వర్షాలు పడినా.. ఆ తర్వాత ఉక్కపోత, ఎండ మరింత ఇబ్బంది పెట్టనున్నాయి. దీంతో మే నెల ఎలా గడుస్తుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. రెడ్జోన్లోకి.. వాతావారణ శాఖ ఉష్ణోగ్రతల తీవ్రతను నాలుగు రకాలుగా విభజిస్తుంది. 35 – 40 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రత నమోదైతే గ్రీన్, ఎల్లో రేంజ్గా ప్రకటిస్తారు. ఇక 40 – 45 వరకు ఆరెంజ్ అలెర్ట్, 45 డిగ్రీల పైన నమోదైతే రెడ్ జోన్గా నిర్ధారిస్తారు. జిల్లాలోని రెండు ప్రాంతాల్లో శుక్రవారం 45డిగ్రీలు దాటడంతో రెడ్ అలర్ట్లోకి వెళ్లినట్లయింది. ఇక మిగతా వెదర్ స్టేషన్ల పరిధిలోనూ 40 డిగ్రీల పైన ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈనేపథ్యాన ఎండ వేడిమి నుంచి ప్రజలకు ఉపశమనం కలిగించేలా యంత్రాగం చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. ఖమ్మం శ్రీశ్రీ సర్కిల్ నుంచి ఎన్టీఆర్ సర్కిల్ మధ్య నిర్మానుష్యంగా మారిన బైపాస్ రోడ్డుజిల్లా నిప్పుల కొలిమిని తలపిస్తోంది. వారం రోజుల నుంచి సూర్యుడి ప్రతాపం పెరుగుతుండడంతో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో వేడి సెగలతో వృద్ధులు, పిల్లలతో పాటు అన్ని వయస్సుల వారు అల్లాడిపోతున్నారు. ఉదయం 9గంటల నుంచే ఎండ ప్రభావం గరిష్టస్థాయికి చేరి బయటకు రాలేని పరిస్థితి ఉంటోంది. పలు ప్రాంతాల్లో 41 నుంచి 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదవుతుండడం గమనార్హం. ఇక శుక్రవారం పమ్మిలో 45.1 డిగ్రీలు, గుబ్బగుర్తిలో 45 డిగ్రీల ఉష్ణోగ్రతల నమోదయ్యాయి. ఈ సీజన్లో ఇదే అత్యధికమని చెబుతున్నారు. – సాక్షి ప్రతినిధి, ఖమ్మంజిల్లాలో నానాటికీ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ఎండతో పాటు వేడిగాలులు, ఉక్కపోత ఎక్కువగా ఉంటున్నాయి. ఈ సమయాన పిల్లలు, వృద్ధుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. దూర ప్రయాణాలను వీలైనంత తగ్గించుకోవాలి. ఉదయం 11లోపు, సాయంత్రం 5 గంటల తర్వాతే బయటి పనులు చూసుకుంటే మేలు. వేడిని తట్టుకోవడానికి ఎక్కువగా నీళ్లు తాగాలి. వడదెబ్బ బారిన పడితే డీహైడ్రేషన్కి గురవడమే కాక ఎలక్ట్రోలైట్లు తగ్గుతాయి. శరీరంలో సోడియం, పొటాషియం దెబ్బతినకుండా ఓఆర్ఎస్ తాగాలి. ఎవరైనా వడదెబ్బ బారిన పడినట్లు గుర్తించగానే తక్షణమే ఆస్పత్రికి తరలించాలి. – డాక్టర్ డి.నారాయణమూర్తి, వెల్నెస్ సెంటర్ స్పెషలిస్ట్ -
హామీల అమలులో ప్రభుత్వం విఫలం
ఖమ్మంసహకారనగర్: కాంగ్రెస్ ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో ప్రకటించిన హామీలను అధికారంలోకి వచ్చాక అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని ఎస్టీయూటీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జుట్టు గజేందర్ పేర్కొన్నారు. ఖమ్మంలోని సంఘం కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలల్లోనే పీఆర్సీ సిఫారసులు అమలు చేస్తామని చెప్పినా అమలు కాలేదన్నారు. ఇకనైనా పెండింగ్ బిల్లులు ఏకమొత్తంలో విడుదల చేయడంతో పాటు బకాయి పడిన ఐదు డీఏలు విడుదల చేసి నూతన ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ అమలు చేయాలన్నారు. అంతేకాక సీసీఎస్ రద్దు చేయాలని, మోడల్ స్కూల్ టీచర్లకు 010 పద్దు కింద వేతనాలు చెల్లించాలని, కేజీబీవీలు, యూఆర్ఎస్ టీచర్లకు బేసిక్ పే అమలు చేయడంతో పాటు సమ్మె కాలపు వేతనాలు, పెన్షనర్ల బకాయిలు సత్వరం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. కాగా, సమస్యల పరిష్కారానికి జిల్లా కేంద్రాల్లో ఎంప్లాయీస్ జేఏసీ ఆధ్వర్యాన ఈ నెల 5న జరిగే నిరాహార దీక్షలను విజయవంతం చేయాలని గజేందర్ కోరారు. సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ కరామత్అలీ, నాయకులు కత్తి నరసింహారెడ్డి, ఎం.పర్వత్రెడ్డి, శ్రీధర్, సైద, నరేందర్, రాము, జగదీశ్, వెంకటేశ్వర్లు, వనజాకుమారి, రాధాకృష్ణ పాల్గొన్నారు.ఎస్టీయూటీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గజేందర్ -
మొక్కజొన్న కొనుగోళ్లలో మరింత వేగం
● రైతులెవరూ ఆందోళన చెందొద్దు ● పలుచోట్ల కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్ దివాకరఖమ్మంరూరల్: మొక్కజొన్న కొనుగోళ్లలో మరింత వేగం పెరిగేలా అధికారులు పర్యవేక్షించాలని కలెక్టర్ దివాకర టీ.ఎస్. ఆదేశించారు. జిల్లాలోని పలు కొనుగోలు కేంద్రాలను శుక్రవారం పరిశీలించిన ఆయన అధికారులకు సూచనలు చేయడమే కాక రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఏదులాపురం మున్సిపాలిటీ పరిధి మద్దులపల్లి మార్కెట్ యార్డులోని కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసిన సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రవాణా, హమాలీ సమస్యలు తలెత్తకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. వాతావరణంలో మార్పులు వస్తున్నందున నాణ్యమైన మొక్కజొన్నలను మద్దతు ధరతో రెండు, మూడు రోజుల్లో కొనుగోలు చేయాలని ఆదేశించారు. అలాగే, గన్నీ బ్యాగులు, టార్పాలిన్ కవర్లు సమకూర్చుకోవాలని తెలిపారు. రైతులకు ఇబ్బంది రానివ్వం. ●మధిర/చింతకాని: మొక్కజొన్న, ధాన్యం కొనుగోళ్లకు అన్ని ఏర్పాట్లు చేసినందున రైతులు ఆందోళనకు గురికావొద్దని కలెక్టర్ దివాకర టీఎస్ తెలిపారు. మొక్కజొన్న, ధాన్యం కొనుగోళ్లు, రవాణా సమస్యలపై మధిర మార్కెట్ చైర్మన్ బండారు నరసింహారావు ఇటీవల డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దృష్టికి తీసుకెళ్లగా ఆయన సూచనలతో కలెక్టర్ మధిర మార్కెట్లో గోదాంలను పరిశీలించి మాట్లాడారు. గోదాంల్లోకి మొక్కజొన్నలు తరలించేందుకు అనుమతి ఇవ్వాలని మార్కెట్ చైర్మన్ చేసిన వినతికి సానుకూలంగా స్పందించారు. అలాగే, చింతకాని మండలం నాగులవంచలో కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్ మాట్లాడుతూ మొక్కజొన్న కొనుగోళ్లు వేగంగా జరిగేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ఈకార్యక్రమాల్లో జిల్లా మార్కెటింగ్ శాఖాధికారి అలీమ్, మార్క్ఫెడ్ డీఎం శ్యామ్కుమార్, మద్దులపల్లి మార్కెట్ చైర్మన్ భైరు హరినాధ్బాబు, ఏదులాపురం మున్సిపల్ చైర్పర్సన్ అనిత, వైస్చైర్మన్ తమ్మినేని నవీన్, కమిషనర్ ఆళ్ల శ్రీనివాసరెడ్డి, తహసీల్దార్లు ఆర్.రాంబాబు, బాబ్జీప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
చెలరేగిన మంటలు..
● జిల్లాలోని పలు చోట్ల అగ్నిప్రమాదాలు ● ఘటనల్లో పంటలు, ఆస్తుల దగ్ధంచింతకాని: మండలంలోని పలు గ్రామాల్లో శుక్రవారం అగ్నిప్రమాదాలు చోటుచేసుకున్నాయి. బస్వాపురంలో లోయ ఉపేందర్, కుక్కల సైదులు, శ్రీను, ఉస్మాన్కు చెందిన మొక్కజొన్న చేన్లకు ప్రమాదవశాత్తు మంటలు అంటుకుని నాలుగెకరాల్లో పంట దగ్ధమైంది. అలాగే కోలపాటి నాగరాజు, తూము వెంకట్రామారావుకు చెందిన వరి పంట, అవుకు నర్సింహారావు పామాయిల్ తోటలో కొన్ని చెట్లు, తిమ్మినేనిపాలెంలో సామినేని శ్రీనివాసరావు, అప్పారావు, తుళ్లూరు శ్రీనివాసరావు, ఫరీద్కు చెందిన 20 ఎకరాల మామిడి తోటలో చెట్లు, నంజాల మల్లికార్జున్రావు, సత్యానికి చెందిన వరి గడ్డివాములు కాలిపోగా, నామారపు సీతారామ్ ఇంటికి నిప్పంటుకుని కొంతమేర కాలిపోయింది. అలాగే, లచ్చగూడెంలో వంకాయలపాటి కృష్ణకు చెందిన పామాయిల్ తోటకు మంటలు అంటుకుని కొన్ని చెట్లు కాలిపోయాయి. చింతకానిలో బోయిన కోటేశ్వరరావు, ఉపేందర్కు చెందిన గడ్డివాములు, ఉపేందర్ డబ్బా కొట్టు కాలిపోయింది. ఇక దేశబోయిన వెంకటేశ్వర్లుకు చెందిన ట్రాక్టర్ ఇంజన్ మంటల్లో పూర్తిగా కాలిపోగా తీవ్రనష్టం వాటిల్లింది. నాగిలిగొండ, నర్సింహాపురంలో కూడా ప్రమాదాలు జరగగా, అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు. పలువురు రైతులు మొక్కజొన్న చెత్తకు నిప్పు పెడుతుండడంతో మంటలు వ్యాపించి సమీప చేన్లలో పంటలకు నష్టం జరుగుతున్నట్లు తెలుస్తోంది. మధిర/బోనకల్/నేలకొండపలి/ముదిగొండ్ల: మధిర మండలం మాటూరుకు చెందిన దేవిశెట్టి శ్రీనివాసరావు నాలుగెకరాలు కౌలుకు తీసుకొని మొక్కజొన్న సాగు చేశాడు. ఈ చేను పక్కనే సబ్స్టేషన్ నిర్మిస్తుండగా, శుక్రవారం వచ్చిన గాలిదుమ్ముకు తీగలు రాసుకుని నిప్పు రావడమే కాక 11 కేవీ విద్యుత్ వైరు తెగి పడటంతో పంటకు నిప్పు అంటుకుంది. దీంతో కళ్లముందే పంట అగ్నికి ఆహుతైందని శ్రీనివాసరావు వాపోయాడు. అయితే, విద్యుత్ లైన్ల నిర్వహణలో నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని ఆరోపించారు. బోనకల్ మండలం చిరునోములలో గుర్తుతెలియని వ్యక్తులు మొక్కజొన్న దండుకు నిప్పు పెట్టడంతో షేక్ నజీర్ చేనులోని 10 క్వింటాళ్ల మొక్కజొన్న కంకులు కాలిపోయాయి. అలాగే, మోహన్రావు, చింతయ్యకు సంబంధించి ఆయిల్పామ్ తోటకు కూడా నిప్పంటుకుని మొక్కలు దగ్ధమయ్యాయి. అలాగే, నేలకొండపల్లి మండలం ముజ్జుగూడెంలో రైతు గోవింద్కు చెందిన మొక్కజొన్న చేనుకు ప్రమాదవశాత్తు నిప్పంటుకుని కంకులు కాలిపోయాయి. అంతేకాక ముదిగొండ మండలంలోని రాఘవాపురం, ముదిగొండల్లో చేన్లలోని పంట వ్యర్థాలకు ప్రమాదవశాత్తు నిప్పు అంటుకుని గాలుల తాకిడి మంటలు విస్తరించాయి. కల్లాల్లో ఆరబోసిన మొక్కజొన్నల వైపు మంటలు వస్తుండడంతో అగ్నిమాపక శాఖ సిబ్బందికి సమాచారం ఇవ్వగా వారు చేరుకుని స్థానికులతో కలిసి మంటలు ఆర్పారు. షార్ట్ సర్క్యూట్తో ఇల్లు.. కల్లూరురూరల్: మండలంలోని పాయపూర్లో మాదాసు వెంకన్నకు చెందిన ఇంట్లో గురువారం షార్ట్ సర్క్యూట్ ఏర్పడి పూర్తిగా దగ్ధమైంది. గడ్డి ఇల్లు కావడంతో త్వరగా మంటలు అంటుకుని సామగ్రి, నిత్యావసరాలు, బియ్యం కాలి బూడిదయ్యాయి. ఈ సమయాన కుటుంబీకులు ఆరుబయట నిద్రిస్తుండడంతో ప్రమాదం తప్పినట్లయింది. -
నేత్రపర్వంగా గిరిప్రదక్షిణ
ఖమ్మంగాంధీచౌక్: ఖమ్మంలోని శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయ బ్రహ్మోత్సవాల వేళ భక్తుల కోలాహలం నడుమ స్తంభాద్రి గుట్ట చుట్టూ స్వామి వారి ఉత్సవ విగ్రహాల ఊరేగింపుతో నిర్వహించిన గిరి ప్రదక్షిణ కన్నుల పండుగగా సాగింది. స్వామి జన్మనక్షత్రం(స్వాతి నక్షత్రం)ను పురస్కరించుకుని శుక్రవారం పండితుల మంత్రోచ్ఛరణలు, మంగళ వాయిద్యాల నడుమ ఉత్సవ విగ్రహాలను గుట్టపై ఉన్న ఆలయం నుంచి పల్లకీపై కిందకు తీసుకొచ్చారు. ఆతర్వాత నగర పురవీధుల్లో గిరి ప్రదక్షిణ నిర్వహించగా భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం స్వామిని తిరిగి గుట్టపైకి చేర్చాక రాతి కొండపై నక్షత్ర జ్యోతి(దివ్యజ్యోతి)ని వెలిగించారు. ఇక రాత్రి 7–30 గంటలకు దేవాలయంలో స్వామి వారి కల్యాణ మహోత్సవాన్ని పండితులు నిర్వహించారు. ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు, ఈఓ కొత్తూరు జగన్మోహన్రావు పర్యవేక్షణలో జరిగిన కల్యాణానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. -
కాలగర్భంలోకి ఎన్నెస్పీ క్వార్టర్లు
● యాభై ఏళ్ల క్రితం వైరాలో నిర్మాణం ● ప్రస్తుతం చాలావరకు ఆక్రమణలో... ● ప్రజావసరాలకు స్థలం వినియోగించేలా కూల్చివేతకు నిర్ణయం వైరా: వైరాలోని రిజర్వాయర్కు వెళ్లే ప్రధాన రహదారి పక్కనే ఉన్న ఎన్నెస్సీ క్వార్టర్ల తొలగింపునకు రంగం సిద్ధమైంది. ఈనేపథ్యాన అందులో నివాసం ఉంటున్న వారికి ఖాళీ చేయాలని నోటీసులు జారీ చేశారు. ఎన్నెస్పీ కాల్వల నిర్మాణం, ఆతర్వాత సిబ్బంది అవసరాల కోసం 50 ఏళ్ల క్రితం ఇక్కట్లు 40 క్వార్టర్లు నిర్మించారు. రెండెకరాలకు పైగా విస్తీర్ణంలో 1973వ సంవత్సరంలో ఈ క్వార్టర్ల నిర్మాణం జరిగింది. తొలినాళ్లలో లష్కర్లు, ఏఈ స్థాయి అధికారులు నివాసం ఉండేవారు. ఆపై శాఖలో సిబ్బంది తగ్గడం, అందులోనూ ఇతర ప్రాంతాల్లో ఉంటుండడంతో క్వార్టర్లతో ఉపయోగం లేకుండా పోయింది. అక్రమణలో క్వార్టర్లు వైరాలోని ఎన్నెస్పీ క్వార్టర్లలో ప్రస్తుతం నివసిస్తున్న ఏ ఒక్కరు కూడా శాఖ ఉద్యోగులు కాకపోవడంతో గమనార్హం. గతంలో కొందరు సిబ్బందికి కేటాయించగా.. వారు ప్రస్తుతం నివాసం ఉంటున్న వారి నుంచి అద్దె తీసుకుంటున్నట్లు సమాచారం. ఇదేక్రమాన మరికొందరు ఏళ్లుగా నివసిస్తున్నామని చెబుతూ జీఓ 58, 59 ప్రకారం తమకు క్రమబద్ధీకరించాలని దరఖాస్తు చేశారు. అయితే, అధికారులు ఆ దరఖాస్తులను తిరస్కరించారు. అంతేకాక క్వార్టర్లు శిథిలావస్థకు చేరడంతో తొలగించేందుకు కొన్నాళ్ల క్రితం అధికారులు ప్రయత్నించగా కొందరు కోర్టును ఆశ్రయించారు. ఇలా క్వార్టర్ల అంశం వివాదాస్పదంగా ఉంది. ఈనేపథ్యాన క్వార్టర్లను తొలగించి ప్రజా అవసరాల కోసం వినియోగించాలనే భావనతో అధికారులు ఇటీవల సర్వే నిర్వహించారు. ఎన్ని క్వార్టర్లు ఉన్నాయి, అందులో ఎవరు నివసిస్తున్నారు, అక్రమణకు ఎన్ని గురయ్యాయనే అంశంపై ఉన్నతాధికారుల ఆదేశాలతో రెవెన్యూ, నీటిపారుదల, ఆర్అండ్బీ, మున్సిపల్ అధికారులు పరిశీలించి నివేదిక సిద్దం చేశారు. మినీ స్టేడియం నిర్మాణానికి.. శిథిలావస్థలో ఉన్న ఎన్నెస్పీ క్వార్టర్ల తొలగించి మల్టీపర్పస్ మినీ స్టేడియం నిర్మాణానికి మున్సిపాలిటీ అధికారులు ప్రతిపాదించారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఇటీవల వైరాలో పర్యటించినప్పుడు స్థానిక నాయకులు, అధికారులు ఈ ప్రతిపాదనలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. స్టేడియం నిర్మిస్తే అన్నివర్గాలకు ఉపయోగపడే అవకాశముండడంతో ఆయన ఆదేశాల మేరకు నివేదిక సిద్ధం చేసిన అధికారులు.. క్వార్టర్లను తొలగింపునకు ఏర్పాట్లు చేస్తున్నారు. మరో పది రోజుల్లోనే ప్రస్తుతం నివాసం ఉన్న వారిని ఖాళీ చేయించి క్వార్టర్లను తొలగించే అవకాశముంది.వైరాలోని ఎన్నెస్పీ క్వార్టర్లు ఎన్ని శిథిలావస్థకు చేరాయి, ప్రస్తుతం అందులో ఎవరు ఉంటున్నారనే అంశంపై సర్వే చేశాం. అంతేకాక కూల్చివేత కోసం అందులో నివాసం ఉంటున్న వారికి నోటీసులు జారీ చేశాం. త్వరలోనే కూల్చివేత పనులు చేపడుతాం. – సీ.హెచ్ సురేష్, తహసీల్దార్, వైరా -
108 స్కూళ్లు.. వంద శాతం
● ఎస్సెస్సీలో సత్తా చాటిన ప్రభుత్వ విద్యార్థులు ● కొదుమూరు జెడ్పీహెచ్ఎస్ విద్యార్థికి 585 మార్కులు ఖమ్మం సహకారనగర్: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు పదో తరగతి ఫలితాల్లో ప్రతిభ కనబరిచారు. జిల్లాలో 425 ప్రభుత్వ, ప్రభుత్వ అనుబంధ పాఠశాలలు ఉండగా... 108 పాఠశాలల్లో వంద శాతం ఉత్తీర్ణత నమోదుకావడం విశేషం. టాప్ మార్కులు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివి ఉత్తీర్ణత సాధించిన వారిలో పలువురు రాష్ట్ర స్థాయి మార్కులు సాధించారు. చింతకాని మండలం కొదుమూరు జెడ్పీహెచ్ఎస్ విద్యార్థిని షేక్ అబ్దుల్ కలాం 585 మార్కులతో మొదటి స్థానాన నిలిచాడు. ఆతర్వాత ఏన్కూరు టీజీఆర్ఎస్ విద్యార్థిని చంద సాత్విక్ 583మార్కులు, తిరుమలాయపాలెం మండలం జల్లేపల్లి జెడ్పీహెచ్ఎస్ విద్యార్థి మేకల జ్ఞానేశ్వరి 581, కల్లూరు బాలికల పాఠశాల విద్యార్థిని రమణ శివనందిని 579, ఖమ్మం అర్బన్ ప్రభుత్వ బాలికల పాఠశాల విద్యార్థిని కిల్లంపల్లి హాసిని 578, సత్తుపల్లి మండలం సదాశివునిపాలెం విద్యార్థిని గూడే లాస్యప్రసన్న 578, తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలు విద్యార్థిని మూడ్ భరత్ 577, ముదిగొండ మండలం ఎడవల్లి పాఠశాల విద్యార్థి దుశర్ల యశ్వంతి 575, కల్లూరు బాలికల స్కూల్ విద్యార్థిని షేక్ ఫరీదా 575, ఖమ్మం అర్బన్ ఎన్నెస్సీ కాలనీ స్కూల్ విద్యార్థిని వేముల రేవతి 574మార్కులతో మొదటి పది స్థానాల్లో నిలిచారు. ఇక ఏన్కూరు, చింతకాని, సింగరేణి కేజీబీవీల విద్యార్థినిలు కొరివి నందిత, క్యాతం అక్షయ, పున్నద హాసిని వరుసగా 575, 561, 556 మార్కులు సాధించారు. అలాగే, మోడల్ స్కూళ్లకు వచ్చేసరికి టేకులపల్లి, కారేపల్లి విద్యార్థులులోకేశ్వరి 571, నడికొప్పుల లావణ్య 562, మందాల మీనాక్షి 561మార్కులు సాధించి మొదటి మూడు స్థానాల్లో నిలిచారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తుంచడమే కాక నిరంతరం పర్యవేక్షణతో ఉత్తమ ఫలితాలు సాధ్యమయ్యాయని జిల్లా విద్యాశాఖాధికారి చైతన్యజైనీ వెల్లడించారు.ఖమ్మం అర్బన్: ఖమ్మం నగర పరిధిలోని పుట్టకోట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వరుసగా మూడో ఏడాది సైతం పదో తరగతిలో వంద శాతం ఉత్తీర్ణత నమోదైంది. పాఠశాల నుంచి 14మంది పరీక్షలకు హాజరుకాగా అందరూ ఉత్తీర్ణత సాధించారు. ఖమ్మం అర్బన్, రఘునాథపాలెం మండలాల పరిధిలోని 31 ప్రభుత్వ పాఠశాలల్లో పుట్టకోట పాఠశాలలోనూ నూరు శాతం ఫలితాలు సాధించడం విశేషమని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు హెచ్ఎం ఎస్.జ్యోతి, ఉపాధ్యాయులు గురువారం స్వీట్లు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. ఉపాధ్యాయులు రామకృష్ణ, చెన్నారెడ్డి, పాపారావు, శ్రీనివాసరాజు, సుజాత, సుదర్శనాచారి, వసంతరావు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. -
అటవీ నేరాల కట్టడికి ‘పీఓఆర్’
● జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభం ● పోలీసు శాఖలోని ఎఫ్ఐఆర్ తరహాలో నిర్వహణఖమ్మంవ్యవసాయం: నేరాల నియంత్రణకు ఖమ్మం జిల్లా అటవీ శాఖ ఆన్లైన్ పీఓఆర్(ప్రిలిమినరీ ఆఫీస్ రిపోర్ట్) వ్యవస్థకు శ్రీకారం చుట్టింది. పోలీసు శాఖలో ఎఫ్ఐఆర్ తరహాలో ఈ వ్యవస్థ అమలుకు సిద్ధమయ్యారు. జిల్లా అటవీ అధికారి సిద్ధార్థ్ విక్రమ్ సింగ్ నేతృత్వాన పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించారు. అటవీ నేరాల నియంత్రణలో పారదర్శకత, సాంకేతిక ఆధారాల సేకరణ, న్యాయపరమైన అంశాలను బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ విధానాన్ని రూపొందించినట్లు డీఎఫ్ఓ తెలిపారు. అంతేకాక ఈ–పీఆర్ఓ (ఎలక్ట్రానిక్ పంచనామా ఆఫ్ ఆఫీస్ రిపోర్ట్) వ్యవస్థను జిల్లాలోనే పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించారు. తద్వారా చెట్ల నరికివేత, వన్యప్రాణి నేరాలు, అటవీ భూముల ఆక్రమణలు, అక్రమ రవాణాపై ఆన్లైన్ నమోదు, డిజి టల్ కేసు పర్యవేక్షణ విధానం అమల్లోకి రానుంది. నూతన వ్యవస్థతో ప్రయోజనాలు క్షేత్రస్థాయి నుంచే అటవీ నేరాలపై ఆన్లైన్లో కేసు నమోదు చేసే అవకాశం ఏర్పడుతుంది. అంతేకాక పంచనామా, సాక్ష్యాధారాలన్నీ డిజిటల్ విధానంలో నమోదవుతాయి. తద్వారా సిబ్బందిలో పారదర్శకత, జవాబుదారీతనం పెరగడమే కాక ఉన్నతా ధికారుల పర్యవేక్షణ సులువవుతుంది. అంతేకాక సాక్ష్యాధారాలు తారుమారు చేసే పరిస్థితి ఉండదు. డిజిటల్ ఆధారాలతో న్యాయస్థానాల్లో చార్జిషీట్లు దాఖలు చేస్తే నిందితులు తప్పించుకునే వీలుండదు. ఈ సందర్భంగా డీఎఫ్ఓ సిద్ధార్థ్ విక్రమ్సింగ్ మాట్లాడుతూ అడవులు, వన్యప్రాణులు, అటవీ ఉత్పత్తుల రక్షణకు ఈ–పీఓఆర్ వ్యవస్థ తోడ్పాటునిస్తుందని తెలిపారు. ఈ విధానంతో పాలనాపరమైన మార్పులు కూడా చోటుచేసుకుంటాయని చెప్పారు. నూతన విధానాన్ని జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తుండగా, త్వరలోనే రాష్ట్రమంతా అమలయ్యే అవకాశం ఉందని తెలిపారు. -
నృసింహుడి స్తంభోద్భవ దర్శనం
ఖమ్మంగాంధీచౌక్: ఖమ్మంలోని స్వయంభూ శ్రీ స్తంభాద్రి లక్ష్మీనరసింహ స్వామి దేవాలయంలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం స్వామివారు శ్రీ స్తంభోద్భవ దర్శనం జరిగింది. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించగా, భక్తులు బారులుదీరి స్వామిని దర్శించుకున్నారు. కాగా, స్వామి జన్మనక్షత్రం స్వాతి నక్షత్రం సందర్భంగా శుక్రవారం సాయంత్రం గిరి ప్రదక్షిణ నిర్వహించనున్నారు. స్వామివారి ఉత్సవ మూర్తులను కొండపై నుంచి ఊరేగింపుగా తీసుకొచ్చి గిరి ప్రదక్షిణ చేయిస్తారు. ఆ తర్వాత రాత్రి 7–30గంటలకు కొండపై అర్చకులు స్వాతి నక్షత్ర జ్యోతి వెలిగిస్తారని ఈఓ కె.జగన్మోహన్రావు తెలిపారు. ఏదులాపురం కమిషనర్గా మళ్లీ శ్రీనివాసరెడ్డి ఖమ్మంరూరల్: ఏదులాపురం మున్సిపల్ కమిషనర్ మున్వర్ అలీ గురువారం బదిలీ అయ్యారు. ప్రభుత్వం పలువురు కమిషనర్లను బదిలీ చేయగా, ఆయనకు స్థానం కలిగింది. మున్సిపల్ ఎన్నికలకు ముందు ఇక్కడ కమిషనర్గా ఉన్న ఆళ్ల శ్రీనివాసరెడ్డిని నల్లగొండ జిల్లా హాలియా కమిషనర్గా బదిలీ చేయగా, తిరిగి ఏదులాపురానికే కేటాయించారు. ●వైరా: వైరా కమిషనర్గా ఎనిమిది నెలల నుంచి విధులు నిర్వర్తిస్తున్న యు.గురులింగం సైతం బదిలీ అయ్యారు. ఆయనను నల్లగొండ జిల్లా చిట్యాలకు బదిలీ చేయగా, వైరాలో మాత్రం ఎవరినీ నియమించలేదు. ఒకరిద్దరు అధికారుల పేర్లు ప్రతిపాదించిన అధికార పార్టీ నాయకులు వారిలో ఒకరిని కమిషనర్గా తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ●కల్లూరు రూరల్: కల్లూరు మున్సిపాలిటీ కమిషనర్గా సీహెచ్.రాజశేఖర్ నియమితులయ్యారు. గతంలో ఇక్కడ పనిచేసిన రామదుర్గారెడ్డి బదిలీపై వెళ్లాక ఎవరినీ నియమించకపోవడంతో పోస్ట్ ఖాళీగా ఉంది. ప్రస్తుతం గ్రూప్–1 అధికారి అయిన రాజశేఖర్ను కేటాయించారు. మొక్కజొన్నల కొనుగోళ్లు వేగవంతం చేయాలి ఎర్రుపాలెం: నిర్దేశిత కేంద్రాల్లో మొక్కజొన్న కొనుగోళ్లు వేగంగా చేపట్టాలని జిల్లా వ్యవసాయాధికారి ధనసరి పుల్లయ్య ఆదేశించారు. ఎర్రుపాలెంలోని మార్కెట్ గోదాంలో కొనుగోలు కేంద్రాన్ని గురువారం ఆయన తనిఖీ చేసి మాట్లాడారు. కేంద్రాల్లో కొనుగోలు చేసిన మక్కలను మార్కెట్ గోదాంల్లో దిగుమతికి త్వరలోనే అనుమతులు జారీ చేస్తామని తెలిపారు. అనంతరం ఎర్రుపాలెం, రాజులదేవరపాడు, రాజుపాలెంల్లోని ఎరువుల దుకాణాలను డీఏఓ తనిఖీ చేశారు. ఇటీవల కాంప్లెక్స్ ఎరువుల ధరలు పెరిగినా, డీలర్లు పాత స్టాక్ను కొత్త ధరలతో అమ్మొద్దని సూచించారు. ఏఓ బి.సాయిశివ, ఏఈఓలు కె.వంశీ, ఏ.బాలకృష్ణ, సొసైటీ సీఈఓ బి.శివారెడ్డి పాల్గొన్నారు. ‘ఎర్లీ’గా రూ.12 కోట్ల ఆస్తి పన్ను వసూళ్లు ● గతేడాదితో పోలిస్తే రూ.కోటికి పైగా అదనం ఖమ్మంమయూరిసెంటర్: ఆస్తి పన్ను చెల్లింపునకు ప్రభుత్వం ప్రకటించిన ఎర్లీ బర్డ్ స్కీంకు ఖమ్మం నగర వాసుల నుండి మంచి స్పందన లభించింది. 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆస్తి పన్నును ఏప్రిల్ 30వ తేదీలోగా చెల్లిస్తే ఐదు శాతం రాయితీ ప్రకటించారు. దీంతో గడువు ముగిసే సమయానికి ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో ద్వారా రూ.12 కోట్ల మేర పన్నులు వసూలయ్యాయి. 2025–26 ఆర్థిక సంవత్సరంలో ఎర్లీ బర్డ్ స్కీం ద్వారా రూ.10.94 కోట్లు వసూలు కాగా, ఈసారి 17,500 అసెస్మెంట్ల ద్వారా రూ.12 కోట్లు వసూలయ్యాయని అధికారులు వెల్లడించారు. కాగా, గతేడాది మాదిరిగా ఇంకొద్దిరోజులు గడువు పొడిగిస్తే మరో రూ.50 లక్షలకు పైగా ఆదాయం వస్తుందని భావిస్తున్నారు. -
ఇంటి ముంగిట్లోకి పౌష్టికాహారం
● నేటి నుంచి అంగన్వాడీ కేంద్రాలకు వేసవి సెలవులు ● లబ్ధిదారుల ఇళ్ల వద్దే సరుకుల పంపిణీఖమ్మం మయూరిసెంటర్: వేసవి నేపథ్యాన భానుడు ప్రతాపాన్ని చూపిస్తుండడంతో జిల్లా నిప్పుల కొలిమిలా మారుతోంది. గత కొద్దిరోజులుగా 40 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. జిల్లాలోనే కాక రాష్ట్రమంతటా ఇదే పరిస్థితి ఉండడంతో అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారులు, గర్భిణులు, బాలింతల ఆరోగ్యంపై రాష్ట్రప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఎండల తీవ్రత దృష్ట్యా మే 1వ తేదీ(శుక్రవారం) నుంచి 31వ తేదీ వరకు కేంద్రాలకు వేసవి సెలవులు ప్రకటించింది. అయితే, సెలవులు ప్రకటించినా లబ్ధిదారులకు పోషకాహారం విషయంలో అంతరాయం ఏర్పడకుండా ఇంటి వద్దకే సరుకులు అందించాలని ఆదేశించింది. వడదెబ్బ ముప్పు తప్పించేందుకే.. అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు మధ్యాహ్న భోజనం, గుడ్లు, పాలు అక్కడే అందజేస్తారు. కానీ ప్రస్తుతం నమోదవుతున్న ఎండల వేళ చిన్నారులు బయటకు వస్తే వడదెబ్బ తగిలే ప్రమాదం ఉందని వైద్య ఆరోగ్య శాఖ హెచ్చరించింది. పిల్లల్లో రోగనిరోధక శక్తి తక్కువగా ఉండటం వల్ల డీహైడ్రేషన్ బారిన పడే అవకాశం ఉంది. ఈనేపథ్యాన ఐసీడీఎస్ యంత్రాంగం మే నెల మొత్తం కేంద్రాలను మూసివేసి, లబ్ధిదారులకు కోటా ఆధారంగా సరుకులను ఇళ్లకే చేర్చాలని నిర్ణయించింది. నెలకు సరిపడా ఒకేసారి.. మే 1వ తేదీ నుంచి జిల్లాలోని అన్ని కేంద్రాల పరిధిలో లబ్ధిదారులకు పౌష్టికాహారంలో భాగమైన సరుకులు పంపిణీ చేయనున్నారు. ఏడు నెలల నుంచి మూడేళ్ల లోపు పిల్లలకు బాలామృతం ప్యాకెట్లు, కోటా ప్రకారం కోడిగుడ్లు, పాల ప్యాకెట్లు అందిస్తారు. అలాగే, 3 నుండి 6 ఏళ్ల లోపు పిల్లలతో పాటు గర్భిణులు, బాలింతలకు అవసరమైన బియ్యం, కందిపప్పు, వంట నూనె ఇంటికే పంపించనున్నారు. ప్రభుత్వ ఆదేశాలతో లబ్ధిదారులకు సరిపడా సరుకులు అందించేలా జిల్లా సంక్షేమ శాఖ అధికారులు దృష్టి సారించారు. గడువు ముగియడానికి సమీప తేదీతో ఉన్న సరుకులు కాకుండా నాణ్యమైనవి అందించాలని కార్యకర్తలను ఆదేశించారు. అంతేకాక లబ్ధిదారులకు సరుకులు అందించాక వారి సంతకాలు లేదా వేలిముద్రలు సేకరించాలని తెలిపారు.ఎండల దృష్ట్యా ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలకు సెలవులు ఇచ్చింది. ఈ నెలపాటు లబ్ధిదారులకు కావాల్సిన పోషకాహారం, సరుకులను ఇళ్ల వద్దే అందిస్తాం. ఈ అవకాశాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలి. సరుకుల పంపిణీపై నిరంతరం పర్యవేక్షణ ఉంటుంది. – వేల్పుల విజేత, జిల్లా సంక్షేమ అధికారి -
గడువుతో పాటు నాణ్యతా ముఖ్యమే..
● కలెక్టర్ దివాకర టీ.ఎస్. ● రిటైనింగ్ వాల్తో పాటు తీగల వంతెన పనులు పరిశీలనఖమ్మంఅర్బన్: మున్నేటికి ఇరువైపులా రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులను గడువులోపు పూర్తి చేయాలని కలెక్టర్ దివాకర టీ.ఎస్. ఆదేశించారు. ఇదే సమయాన నాణ్యతను నిత్యం పర్యవేక్షించాలని తెలిపారు. ఖమ్మంలో రిటైనింగ్ వాల్, తీగల వంతెన నిర్మాణ పనులతో పాటు భూనిర్వాసితుల కోసం ఏర్పాటు చేస్తున్న లేఔట్ వెంచర్ అభివృద్ధి పనులను గురువారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రాజీవ్ గృహకల్ప, రంగనాయకగుట్ట, ప్రకాష్ నగర్ చెక్డ్యామ్ ప్రాంతాలను పరిశీలించిన కలెక్టర్ అధికారులతో సమీక్షించారు. నిపుణుల కమిటీ సూచించిన డిజైన్ల ప్రకారం రిటైనింగ్ వాల్ నిర్మాణం నాణ్యతతో జరగాలని సూచించారు. బైపాస్ నుంచి తీగల వంతెన వరకు రిటైనింగ్ వాల్ నిర్మాణం యుద్ధప్రాతిపదికన చేపట్టాలని స్పష్టం చేశారు. మిగిలిన చోట్ల కూడా భూ సేకరణ వేగవంతం చేయాలని, ఇదే సమయాన నిర్వాసితులకు ఇచ్చే లేఔట్ను సిద్ధం చేయాలని చెప్పారు. తీగల వంతెన నిర్మాణంలో ఎవరూ నష్టపోకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య, జలవనరులశాఖ, ఆర్అండ్బీ సీఈలు ఎం.వెంకటేశ్వర్లు, యాకూబ్, వివిధ శాఖల అధికారులు అనన్య, రమేష్రెడ్డి, ఉదయ్ప్రతాప్, వాణి, పుష్పలత, శ్రీనివాస్, జయచందర్, వినయేందర్రెడ్డి, టీఎన్జీవోస్ అధ్యక్షుడు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో వేగం ఖమ్మంగాంధీచౌక్: జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగంగా పూర్తయ్యేలా అధికారులు పర్యవేక్షించాలని కలెక్టర్ దివాకర టీ.ఎస్ సూచించారు. కలెక్టరేట్లో గురువారం ఆయన అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజతో కలిసి నిర్మాణాల పురోగతిపై సమీక్షించారు. ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’లో భాగంగా 10వేల ఇళ్ల పూర్తికి కార్యాచరణ రూపొందించినట్లు తెలిపారు. జిల్లాలో మొదటి విడతగా మంజూరైన 16,497 ఇళ్లలో 2,520 పూర్తికాగా, మిగతావి కూడా పూర్తిచేసేలా లబ్ధిదారులకు సహకరించాలని సూచించారు. గృహ నిర్మాణ శాఖ పీడీ బి.శ్రీనివాస్, ఉద్యోగులు పాల్గొన్నారు. -
అవశేషాలకు నిప్పు.. తప్పిన ప్రమాదం
కొణిజర్ల: కొణిజర్ల ఎంపీడీఓ కార్యాలయం సమీపాన మొక్కజొన్న పంట అవశేషాలకు గుర్తుతెలియని వ్యక్తులు గురువారం నిప్పంటించారు. దీంతో అవశేషాలే కాక చుట్టుపక్కల రైతుల చేన్లు, రోడ్డు వెంట పచ్చని చెట్లకు కూడా నిప్పంటుకుని కాలిపోయాయి. సమీపంలో రైతులు మొక్కజొన్న ఆరబోయగా, స్థానికులు ఇచ్చిన సమాచారంతో అగ్నిమాపక శాఖ సిబ్బందికి చేరుకుని మంటలు ఆర్పడంతో నష్టం తప్పింది. ఈ సందర్భగా ఏఓ బాలాజీ పరిశీలించి మాట్లాడుతూ రైతులు అవశేషాలు కాల్చకుండా భూమిలో కలియదున్నాలని, తద్వారా ఎరువులు వేసే ఖర్చు తగ్గుతుందని అవగాహన కల్పించారు. మొక్కజొన్న పంట దగ్ధం కామేపల్లి: చేతికొచ్చిప మొక్కజొన్న పంటకు ప్రమాదవశాత్తు నిప్పుంటుకుని కాలిపోయింది. సాతానిగూడెం జీపీ పరిధి నారాయణపురానికి చెందిన బానోత్ వీరన్న, గుగులోత్ దుర్గాప్రసాద్ నాలుగెకరాల్లో మొక్కజొన్న సాగు చేసి కోతకు సిద్ధమయ్యారు. ఈక్రమాన నిప్పంటుకుని పూర్తిగా కాలిపోయింది. ఎకరాకు రూ.లక్ష చొప్పున నష్టం వాటిల్లిందని వాపోయారు. సమీపంలో ట్రాన్స్ఫార్మర్ ఉండడంతో షార్ట్ సర్కూట్ జరిగిందా, పక్క పొలాల మంట లు అంటుకున్నాయా అనే అనుమానాలతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
మేలు రకం విత్తనాలే ఎంపిక చేసుకోవాలి
మధిర: పంటల సాగు సమయాన రైతులు మేలు రకం విత్తనాలను ఎంపిక చేసుకోవాలని, తద్వారా ఎలాంటి ఇబ్బంది ఎదురుకావాలని మధిర వ్యవసాయ పరిశోధనా శాస్త్రవేత్త రుక్మిణీదేవి తెలిపారు. మండలంలోని మాటూరు రైతువేదికలో గురువారం నిర్వహించిన ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’ సమావేశంలో ఆమె మాట్లాడారు. అవసరానికి మించి యూరియా వాడితే నష్టమే తప్ప లాభం ఉండదని చెప్పారు. అలాగే, పంట మార్పిడి పద్ధతిని అవలంబిస్తూ మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను సాగు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో కీటక శాస్త్రవేత్త నాగస్వాతి, మధిర ఏడీఏ విజయ్చంద్ర, ఏఓ సాయిదీక్షిత్, ఏఈఓ నిఖిత తదితరులు పాల్గొన్నారు. ●వేంసూరు: వేంసూరు మండలం అమ్మపాలెంలో నిర్వహించిన ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’ సదస్సులో అశ్వరావుపేట వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ హేమంత్ కుమార్, పొఫెసర్ డాక్టర్ గీతాంజలి పాల్గొన్నారు. యూరియా, పురుగు మందుల వాడకం తగ్గింపు, పంట మార్పిడితో లాభాలు, సాగునీటి వినియోగంలో పొందుపు తదితర అంశాలపై అవగాహన కల్పించారు. సర్పంచ్ పెద్దగాండ్ల ప్రసన్నతో పాటు ఏఓ వి.రామ్మోహన్, ఏఈఓలు ఎస్.కే.రిమా, సందీప్, స్వాతి పాల్గొన్నారు. ●తిరుమలాయపాలెం: యూరియా అధిక వినియోగంతో భూసారం దెబ్బతింటుందని వైరా కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ వి.చైతన్య తెలిపారు. మండలంలోని హస్నాబాద్ రెతు వేదికలో నిర్వహించిన రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు సదస్సులో ఆమె మాట్లాడారు. రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి సేంద్రియ విధానంలో పంటలు సాగు చేయాలని సూచించారు. ఏఓ నారెడ్డి సీతారాంరెడ్డి సర్పంచ్ కొవ్వూరి పద్మ, ఏఈఓలు కళ్యాణి, ప్రదీప్ పాల్గొన్నారు. -
బాసటగా నిలిచింది..
వార్షిక పరీక్షలకు సిద్ధమయ్యే సమయాన ‘సాక్షి’ మెటీరియల్ బాసటగా నిలిచింది. ఉపాధ్యాయులు చెప్పే పాఠాలతో పాటు ఈ మెటీరియల్ ఆధారంగా సిద్ధమయ్యాను. తద్వారా పరీక్షల్లో 556 మార్కులు సాధించటం సాధ్యమైందని భావిస్తున్నా. – సీహెచ్.తులసి, పాతసెంటర్ హైస్కూల్, సత్తుపల్లి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ‘సాక్షి’ ప్రోత్సాహం అందించింది. ఈ మెటీరియల్తో పాటు ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో నేను 551 మార్కులు సాధించగలిగాను. అలాగే, హెచ్ఎం, ఉపాధ్యాయులు ప్రత్యేక తరగతులు నిర్వహించారు. – ఎం.జీవన్కుమార్, కాకర్లపల్లి హైస్కూల్‘సాక్షి’ ఆధ్వర్యాన రూపొందంచిన మోడల్ పేపర్ల సాయంతో ప్రాక్టీస్ చేయగా 556 మార్కులు సాధించడం ఆనందంగా ఉంది. ఉపాధ్యాయుల బోధనకు తోడు.. మంచి ఫలితాలు నమోదయ్యేలా సాక్షి యాజమాన్యం చేయూత మరువలేనిది. – పొన్నడ హాసిని, కేజీబీవీ, సింగరేణి -
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
చింతకాని: మండలంలోని నాగులవంచ రైల్వేకాలనీ గ్రామానికి చెందిన కాంగ్రెస్ గ్రామ అధ్యక్షుడు కాంపెల్లి శేషగిరిరావు(38) గురువారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఆయన భార్య వసంత, కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం... శేషగిరిరావు కుటుంబానికి అదే గ్రామానికి చెందిన ఓ కుటుంబంతో కొన్నాళ్లుగా గొడవలు జరుగుతున్నాయి. దీంతో పరస్పరం ఫిర్యాదు చేసుకోవడంతో ఇరు కుటుంబాలపై బుధవారం కేసులు నమోదయ్యాయి. ఈక్రమాన గ్రామంలో నిరుపయోగంగా ఉంటున్న ఇంట్లో రేకుల షెడ్డు కడ్డీకి విద్యుత్ వైర్తో శేషగిరిరావు ఉరి వేసుకున్నాడని గురువారం ఉదయం పోలీసులకు సమాచారం అందింది. దీంతో పరిశీలించగా రేకుల షెడ్డు ఆరు అడుగుల ఎత్తే ఉండడం, వైర్లు పూర్తిగా బిగుసుకుపోకపోవడం, మృతదేహం సగం నేలను తాకి ఉండడంతో కుటుంబీకులు అనుమానాలు వ్యక్తం చేశారు. తమ కుటుంబంతో గొడవ ఉన్న వారే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని శేషగిరిరావు భార్య వసంత పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఎస్సై వీరేందర్ ఆధ్వర్యాన దర్యాప్తు చేపట్టారు. ఆయన మృతదేహం వద్ద మత్కేపల్లి మార్కెట్ చైర్మన్ అంబటి వెంకటేశ్వరరావు తదితరులు నివాళులర్పించారు. పేకాట స్థావరంపై పోలీసుల దాడి రఘునాధపాలెం: మండలంలోని వేపకుంటలో పలువురు పేకాట ఆడుతున్నారనే సమాచారంతో పోలీసులు గురువారం తనిఖీ చేపట్టారు. సీఐ ఉస్మాన్ షరీఫ్ ఆధ్వర్యాన చేపట్టిన తనిఖీల్లో నలుగురు పట్టుబడగా, మరో నలుగురు పరారయ్యారు. పట్టుబడిన వారి నుంచి రూ.7,140 నగదు స్వాధీనం చేసుకున్నామని సీఐ తెలిపారు. హత్యేనని కుటుంబీకుల ఆరోపణ -
మండల స్థాయిలో ప్రతిభ చాటా..
‘సాక్షి’ యాజమాన్యం పరీక్షలకు రెండు నెలల ముందు సబ్జెక్టుల మెటీరియల్ అందించింది. తద్వారా తక్కువ సమయంలో మోడల్ పేపర్లు ప్రాక్టీస్ చేశాను. ఇందులో చాలా ప్రశ్నలు వచ్చాయి. ఫలితంగా 542 మార్కులతో నేను మండల స్థాయిలో సత్తా చాటా. – మద్దికుంట్ల మధువిక, జెడ్పీహెచ్ఎస్, ముష్టికుంట్లపరీక్షలకు తక్కువ సమయమే ఉన్నా ‘సాక్షి’ నుంచి అందిన స్టడీ మెటీరియల్ ఆధారంగా మోడల్ పేపర్లు ప్రాక్టీస్ చేశాను. తద్వారా వార్షిక పరీక్షల్లో 540 మార్కులు సాధించగలిగా. ఇన్ని మార్కులు సాధించడానికి మెటీరియల్ ఎంతగానో నాకు ఉపయోగపడింది. – పులిబోయిన కార్తీక్, జెడ్పీహెచ్ఎస్, ముష్టికుంట్లమాకు ‘సాక్షి’ ద్వారా ఇచ్చిన మెటీరియల్ ఎంతో ఉపయోగపడింది. ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్న సమయాన ఈ మెటీరియల్ అందింది. అప్పటి నుంచి ఉపాధ్యాయులు చెప్పే పాఠాలకు తోడు ఇవి చదవడంతో 554 మార్కులు సాధించా. – ఎస్.కే.రబియా భాను, పాతసెంటర్ హైస్కూల్, సత్తుపల్లి -
జీవితంలో ఓడి.. పరీక్షలో పాసై..
● చికిత్స పొందుతున్న బాలిక మృతి ఖమ్మంఅర్బన్: ఖమ్మం కవిరాజనగర్లోని రోడ్డు నెంబర్–12కు చెందిన ధారవల్లి హర్షిత (16) చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది. ఇటీవల పదో తరగతి పూర్తిచేసిన ఆమె ఫోన్ చూస్తుండడంతో గత నెల 24వ తల్లి మందలించగా ఎలుకల మందు మింగింది. దీంతో కుటుంబీకులు ఖమ్మంలో చికిత్స అనంతరం హైదరాబాద్ తరలించగా పరిస్థితి విషమించడంతో మృతి చెందింది. కాగా, పదో తరగతి పరీక్షలు వెలువడిన బుధవారమే హర్షిత మృతి చెందడం.. ఫలితాల్లో ఆమె 530మార్కులతో పాసైనట్లు తేలగా కుటుంబీకులు కన్నీరుమున్నీరయ్యారు. ఘటనపై ఆమె కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో గురువారం కేసు నమోదు చేసినట్లు ఖమ్మంఅర్బన్ పోలీసులు తెలిపారు. గుర్తుతెలియని యాచకుడు మృతి ఖమ్మంక్రైం: ఖమ్మం రైల్వేస్టేసన్ సమీపంలోని మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ వద్ద గుర్తుతెలియని యాచకుడు(35) మృతి చెందాడు. ఈ విషయాన్ని గురువారం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా, వారి సూచనలతో అన్నం ఫౌండేషన్ చైర్మన్ శ్రీనివాసరావు ఆధ్వర్యాన మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. కాగా, మృతుడు కొన్నాళ్లుగా భిక్షాటనతో జీవిస్తూ షాపింగ్ కాంప్లెక్స్ వద్ద పడుకునేవాడని తెలిసింది. యువకుడి ఆత్మహత్య మధిర: మండలంలోని మహాదేవపురానికి చెందిన పాణిది మురళి(22) బుధవారం రాత్రి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆయన తండ్రి మూడేళ్ల క్రితం మృతి చెందగా, తల్లి కూళీ పనులకు వెళ్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. ఈనేపథ్యాన మనస్థాపానికి గురైన మురళి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఘటనపై ఆయన తల్లి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. -
అక్కాచెల్లెళ్లు టాపర్లు..
● చదువులో సత్తా చాటుతున్న ఆటోడ్రైవర్ కుమార్తెలు తిరుమలాయపాలెం: మండలంలోని జల్లెపల్లికి చెందిన ఆటోడ్రైవర్ గాదరి వెంకన్న – సుమలతల కుమార్తెలు హర్షిణి, హాసిని చదువులో సత్తా చాటుతున్నారు. ఆర్థిక పరిస్థితులను లెక్క చేయకుండా పిల్లలిద్దరినీ చదివించేందుకు వెంకన్న మరింత కష్టపడ్డారు. ఈమేరకు ఖమ్మంలోని ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ ఎంపీసీ చదువుతున్న పెద్దకుమార్తె హర్షిణి ఇటీవల విడుదలైన ఫలితాల్లో ఎంపీసిలో 995 మార్కులతో జిల్లా టాపర్గా నిలిచింది. ఇక చిన్న కుమార్తె హాసిని గౌలిదొడ్డి గురుకులంలో పదో తరగతి పూర్తిచేసి తాజాగా 581 మార్కులతో గురుకులంలో రెండో స్థానం సాధించడం విశేషం. ఈ సందర్భంగా హైదరాబాద్లో గురువారం హాసినిని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్ కుమార్ సన్మానించినారు. కలెక్టర్ను కలిసిన టీజీవోస్ నాయకులు ఖమ్మం సహకారనగర్: కలెక్టర్ దివాకర టీఎస్ను తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం(టీజీవోస్) జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కొంగర వెంకటేశ్వరరావు, మోదుగు వేలాద్రి ఆధ్వర్యాన నాయకులు కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్కు వారు శుభాకాంక్షలు తెలిపారు. నాయకులు కొండపల్లి శేషుప్రసాద్, డాక్టర్ పి.విజయ్కుమార్, కనపర్తి వెంకటేశ్వరరావు, బి.హరీష్, డి.బాలాజీ, తాజుద్దీన్, ఎం.సతీష్, బి.శారద, నారి విజయలక్ష్మి, బి.కిషోర్బాబు, శ్రీకాంత్, పి.రామయ్య, పవన్కుమార్, వేణుమాధవ్, రాజశేఖర్గౌడ్, శ్రీనివాసరావు, చందన్కుమార్, రాంబాబు పాల్గొన్నారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం ఖమ్మంమయూరిసెంటర్: ప్రజల నుంచి అందిన సమస్యలు, దరఖాస్తుల పరిష్కారానికి కృషి చేస్తామని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నూతి సత్యనారాయణ గౌడ్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు తెలిపారు. ఖమ్మంలోని కాంగ్రెస్ కార్యాలయంలో గురువారం ప్రజాదర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా వినతులు స్వీకరించాక సత్యనారాయణ, నాగేశ్వరరావు మాట్లాడుతూ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు చర్యలు చేపడతామన్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పీసీసీ చీఫ్ మహేష్కుమార్ గౌడ్ ఆదేశాలతో ప్రజాదర్బార్ నిర్వహించామని తెలిపారు. నాయకులు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, గజ్జెల్లి వెంకన్న, కొత్తా సీతారాములు, దొబ్బల సౌజన్య, వేజండ్ల సాయికుమార్, పుచ్చకాయల వీరభద్రం, బొడ్డు బొందయ్య తదితరులు పాల్గొన్నారు. ‘చెల్లింపులు పూర్తికాలేదు’ ఖమ్మం సహకారనగర్: గత ఏడాది అక్టోబర్ వరకు రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు సమర్పించిన జీపీఎఫ్ బిల్లుల చెల్లింపులు పూర్తికాకున్నా, పూర్తయినట్లు ప్రభుత్వం చేస్తున్న ప్రచారం సరికాదని రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సంఘం(ఎస్జీపీఏటీ) బాధ్యులు పేర్కొన్నారు. ఈ విషయమై జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పరిశ పుల్లయ్య, రాయల రవికుమార్ ఓ ప్రకటన విడుదల చేశారు. -
భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి
ఖమ్మంఅర్బన్: భవిష్యత్ తరాల అవసరాలకు అనుగుణంగా ఖమ్మం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. ఖమ్మం 58వ డివిజన్లో సీసీ రోడ్లు, సైడ్ డ్రెయిన్ల నిర్మాణ పనులకు బుధవారం ఆయన శంకుస్థాపన చేసి మాట్లాడారు. వచ్చే యాభై ఏళ్ల ప్రజావసరాలను దృష్టిలో ఉంచుకుని పనులు చేపడుతున్నందున అధికారులు నాణ్యతపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. మాస్టర్ ప్లాన్ ప్రకారం రహదారుల విస్తరణ జరగాలని తెలిపారు. అలాగే, పరిశుభ్రతలో ప్రస్తుతం మూడో స్థానాన ఉన్న ఖమ్మంను మొదటి స్థానానికి చేర్చేలా యంత్రాంగం కృషి చేయాలని సూచించారు. కాగా, వచ్చేనెల 4న జరగనున్న మెగా జాబ్మేళాలో ఎక్కువ మంది నిరుద్యోగులు పాల్గొనేలా విస్తృత ప్రచారం చేయాలని, ఇందుకోసం అన్ని పార్టీల నాయకులు సహకరించాలని మంత్రి కోరారు. ●ఖమ్మంగాంధీచౌక్: ఖమ్మంలోని శ్రీ స్తంభాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం(గుట్ట)లో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. తొలుత నిర్వాహకులు మంత్రికి స్వాగతం పలకగా ఆయన స్వామికి పూజలు చేసి మాట్లాడారు. ఈ కార్యక్రమాల్లో మేయర్ పునుకొల్లు నీరజ, రాష్ట్ర విత్తన గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, మార్కెట్ చైర్మన్ యరగర్ల హన్మంతరావు, కాంగ్రెస్ నగర అధ్యక్షుడు నాగండ్ల దీపక్చౌదరి, నాయకులు సాధు రమేష్రెడ్డి, శెట్టి రంగారావు, తోటకూరి శివయ్య, మిక్కిలినేని నరేంద్ర, ఆలయ అభివృద్ది కమిటీ సభ్యులు డాక్టర్ ప్రదీప్కుమార్, ఈఓ కొత్తూరు జగన్మోహన్రావు పాల్గొన్నారు. రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు -
జిల్లా అటవీ అధికారిగా అగర్వాల్
ఖమ్మంవ్యవసాయం: జిల్లా అటవీ శాఖాధికారి సిద్ధార్థ్ విక్రమ్సింగ్ బదిలీ అయ్యారు. ఆయనను నిజామాబాద్ జిల్లా డీఎఫ్ఓగా బదిలీ చేయగా, ఆ స్థానంలో వరంగల్ డీఎఫ్ఓ గా ఉన్న అనూజ్ అగర్వాల్ను నియమించారు. రాష్ట్రంలో 12మంది డీఎఫ్ఓలను బదిలీ చేస్తూ రాష్ట్ర అటవీ శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ డాక్టర్ సి.సువర్ణ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో భాగంగా సిద్ధార్థ్ను నిజామాబాద్కు బదిలీ చేసి ఆ స్థానంలో అగర్వాల్ను నియ మించారు. కాగా, సిద్ధార్థ్ డీఎఫ్ఓగా మూడేళ్ల పది నెలల పాటు పని చేశారు. పులిగుండాల ఎకో–టూరిజం ప్రాజెక్టును రాష్ట్రంలో ప్రత్యేక పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దారు.నిజామాబాద్కు సిద్ధార్థ్ విక్రమ్సింగ్ బదిలీ -
పదిలో పెరిగిన ఉత్తీర్ణత
ఖమ్మం సహకారనగర్: పదో తరగతి ఫలితాల్లో జిల్లా విద్యార్థులు గత ఏడాది కంటే మెరుగైన ఫలితాలు నమోదు చేశారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు పలువురు అత్యుత్తమ మార్కులు సాధించారు. గతేడాది నుంచి మార్కుల విధానం అమలవుతుండగా, అత్యధికంగా విద్యార్థులు 500కు పైగా మార్కులు సాధించడం విశేషం. ఈమేరకు బుధవారం విడుదలైన ఫలితాల్లో జిల్లా విద్యార్థులు 95.12శాతం ఉత్తీర్ణత సాధించినట్లు వెల్లడైంది. ఇక ఎప్పటిలాగే బాలుర కంటే బాలికలు ఎక్కువగా ఉత్తీర్ణత సాధించారు. ఇదికాక జిల్లాలోని పలు ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ గురుకులాల్లో ఈసారి వంద శాతం ఉత్తీర్ణత నమోదు కావడం విశేషం. పదో తరగతి ఽఫలితాలు గతేడాది జిల్లాలో 94.47శాతంగా నమోదయ్యాయి. దీంతో జిల్లా రాష్ట్రస్థాయిలో 21వ స్థానాన నిలిచింది. ఈసారి ఉత్తీర్ణత శాతం పెరిగి 95.12 శాతంగా నమోదైంది. అయినప్పటికీ ర్యాంకు మాత్రం 25వ స్థానానికి పడిపోవడం గమనార్హం.కేటగిరీ హాజరైన వారు ఉత్తీర్ణులు శాతం బాలురు 8,737 8,201 93.87 బాలికలు 8,221 7,930 96.46మొత్తం 16,958 16,131 95.12 -
ప్రైవేట్ పాఠశాలల సత్తా
ఎస్సెస్సీ ఫలితాల్లో ఉత్తమ మార్కులుపదో తరగతి వార్షిక పరీక్షల ఫలితాలను ప్రభుత్వం బుధవారం విడుదల చేసింది. ఈ సందర్భంగా జిల్లాలోని పలు ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. వంద శాతం ఉత్తీర్ణత నమోదు కాగా, పలువురు విద్యార్థులు అత్యుత్తమ మార్కులతో రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించారు. ఈ మేరకు ఆయా విద్యార్థులను పాఠశాలల యాజమాన్యాల తో పాటు ఉపాధ్యాయులు అభినందించారు. – ఖమ్మం సహకారనగర్●రెజొనెన్స్ అద్భుత ఫలితాలు●న్యూవిజన్ విజయ పరంపర పదో తరగతి ఫలితాల్లో తమ విద్యార్థులు విజయ పరంపర కొనసాగించారని న్యూవిజన్ విద్యాసంస్థల చైర్మన్ సీ.హెచ్.జీ.కే.ప్రసాద్ తెలిపారు. పసుపులేటి హంసిని 592 మార్కులు సాధించగా, 90 శాతానికి పైగా మార్కులు 290 మంది సాధించారని చెప్పారు. అలాగే, 550 మార్కులు 230 మంది, 500కు పైగా 460 మంది సాధించారని తెలిపారు. ఈ ఏడాది ఫలితాల్లో అన్ని సబ్జెక్టుల్లో నూరు శాతం మార్కులు తమ విద్యార్థులు సాధించడం ఆనందంగా ఉందని తెలిపారు. విద్యార్థులను చైర్మన్తో పాటు డైరెక్టర్లు సీహెచ్.కార్తీక్, డైరెక్టర్ సీహెచ్.గోపీచంద్, ప్రిన్సిపాల్ ఎం.డీ.అబాద్ అలీ, జే.వీ.మైఖేల్, ఉపాధ్యాయులు అభినందించారు.●రెజొనెన్స్ ఇన్ఫో స్కూల్ ప్రభంజనం పదో తరగతి పరీక్ష ఫలితాల్లో వీడీవోస్ కాలనీలోని రెజొనెన్స్ ఇన్ఫో స్కూల్ విద్యార్థులు ప్రభంజనం సృష్టించారని డైరెక్టర్లు ఆర్.వీ.నాగేంద్రకుమార్, కె.శ్రీధర్రావు, నీలిమ తెలి పారు. ఎస్.దినేష్ 583మార్కులు, బి.సాయిబుద్ధకౌషిక్ 576 మార్కులు, సీహెచ్.వంశీతేజ 575, బి.వర్షిత్ 570, పి.శృతి 568, బి.యామిని 568, బి.చరణ్ 567, కె.పూజ 566, జె.జగదీష్ 565, ఎం.డీ.ఎతీషం అలీఖాన్ 564, ఎం.సూరజ్భార్గవ్ 562, ఎ.విశాల్ 562మార్కులు సాధించినట్లు తెలిపారు. ప్రతీఇద్దరిలో ఒకరు 500 మార్కులతో నూరుశాతం ఫలితాలు సాధించారని పేర్కొన్నారు.●శ్రీచైతన్య టాప్ పదో తరగతి పరీక్షా ఫలితాల్లో తమ విద్యార్థులు అగ్రస్థానాన నిలిచారని శ్రీచైతన్య విద్యాసంస్థల చైర్మన్ మల్లెంపాటి శ్రీధర్, డైరెక్టర్ శ్రీవిద్య తెలిపారు. శ్రీచైతన్య పాఠశాలలో విద్యార్థులను అభినందించాక వారు మాట్లాడారు. 600మార్కులకు గాను తమ విద్యార్థి కుంచాల వృత్తికాకృష్ణ 597మార్కులతో అగ్రస్థానాన నిలిచిందని చెప్పారు. అలాగే, వంగవీటి పూజిత లక్ష్మి, అమన్ అమృత 595 మార్కులు సాధించగా, 590కిపైగా 70 మంది, 580పైగా మార్కులు సాధించారని తెలిపారు. ఐఏఎస్ అవుతా.. పదో తరగతిలో 600కి 597మార్కులు సాధించడం ఆనందంగా ఉందని కుంచాల వృత్తికాకృష్ణ వెల్లడించిందని ఐఏఎస్ కావాలన్నదే తన లక్ష్యమని వివరించింది. పాఠశాల యజమాన్యం శ్రీధర్, శ్రీవిద్య ప్రోత్సాహం, తల్లిదండ్రులు నాగలక్ష్మి, నాగరాజు సూచనలతో ఈ విజయం సొంతమైందని తెలిపింది. రోజు 13గంటల పాటు ఉపాధ్యాయుల పర్యవేక్షణలో ఉండడంతో మంచి ఫలితం వచ్చిందని వెల్లడించింది.పదో తరగతిలో తమ విద్యార్థులు అద్భుత ఫలితాలు సాధించారని శ్రీనివాసనగర్లోని రెజొనెన్స్ పాఠశాల డైరెక్టర్ నాగేంద్రకుమార్ తెలిపారు. పాఠశాల ప్రారంభించిన మొదటి బ్యాచ్లోనే వంద శాతం ఉత్తీర్ణత నమోదైందని పేర్కొన్నారు. విద్యార్థులను డైరెక్టర్తోపాటు కరస్పాండెంట్ నీలిమ, ఉపాధ్యాయులు అభినందించారు. -
వచ్చేనెల 4న మెగా జాబ్ మేళా
ఖమ్మం రాపర్తినగర్: ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’లో భాగంగా నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు వచ్చేనెల 4న మెగా జాబ్మేళా నిర్వహించనున్నారు. ఖమ్మం ఎస్ఆర్ గార్డెన్స్లో జరిగే మేళా పోస్టర్లను రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, కలెక్టర్ దివాకర్ టీ.ఎస్ వేర్వేరుగా బుధవారం ఆవిష్కరించి మాట్లాడారు. వచ్చేనెల 4న ఉదయం 9గంటలకు మొదలయ్యే జాబ్మేళాలో 18 – 30 ఏళ్ల వయస్సు కలిగి ఎస్సెస్సీ మొదలు ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీటెక్, బీ ఫార్మసీ, పీజీ చదివిన వారు పాల్గొనవచ్చని తెలిపారు. సుమారు 80 కంపెనీల బాధ్యులు పాల్గొననుండగా 3,200 మందికి ఉద్యోగాలు లభించే అవకాశముందని చెప్పారు. కాగా, నిరుద్యోగులు http://satg.telangana.gov.in/ prajapalana లేదా క్యూర్ కోడ్ ద్వారా పేర్లు నమోదు చేసుకోవాలని డీవైఎస్ఓ టి.సునీల్రెడ్డి సూచించారు. -
సాంకేతికతను అడ్డుపెట్టుకుని రూ.వందల కోట్లు కొల్లగొడుతున్న సైబర్ నేరగాళ్ల ఆట కట్టించేందుకు పోలీసు శాఖ సరికొత్త వ్యూహాన్ని అమలు చేస్తోంది. సైబర్ నేరగాళ్లు బలమైన నెట్వర్క్ ద్వారా ప్రజలను మోసగిస్తున్నారు. ఈ నేపథ్యాన పాత నేరస్తులు, రౌడీషీటర్ల మాదిరిగానే సై
సైబర్ నేరగాళ్లపైనిఘాజిల్లాపై పంజా జిల్లాలో పలువురు సైబర్ నేరగాళ్ల బారిన పడి రూ.లక్షల్లో నష్టపోతున్నారు. లాటరీ వచ్చిందని, బ్యాంక్లో నగదు జమ అయిందని ఓటీపీ అడుగుతూ అకౌంట్ల నుంచి డబ్బు కాజేయడమే కాక, ఇతర రూపాల్లో సైబర్ నేరాలు వెలుగుచూస్తున్నాయి. ఈ ఏడాది సత్తుపల్లి ప్రాంతానికి చెందిన ఓ ముఠా అంతర్జాతీయ స్థాయిలో సైబర్ నేరాలకు పాల్పడుతూ రూ.547 కోట్ల మేరకు లావాదేవీలు జరపడం షాక్కు గురి చేసింది. ఈ ముఠా అంతర్జాతీయ సైబర్ క్రైమ్ నేరస్తులతో జత కలిసి విదేశాల్లో కాల్ సెంటర్లు నిర్వహించినట్లు తేలింది. మ్యాట్రిమోనీ, రివార్డ్ పాయింట్లు, గేమింగ్, బెట్టింగ్, షేర్ మార్కెట్లో పెట్టుబడులు, క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ ఇలా వివిధ రూపాల్లో నిందితులు ప్రజలను మోసగించారు. అంతేకాక స్థానికులతో ఖాతాలు తెరిపించి, వాటి ఆధారంగా లావాదేవీలు జరపడంతో అమాయకులు కేసుల పాలయ్యారు. నేరగాళ్లపై ‘సస్పెక్ట్’ అస్త్రం సైబర్ నేరాల కింద కేసులు నమోదైన వారిపై పోలీసులు సస్పెక్ట్ షీట్ తెరవనున్నట్లు తెలిసింది. ఈ తరహాల నేరాలను అదుపు చేసేందుకు ఈ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. సైబర్ నేరాలకు పాల్పడే వ్యక్తులు జైలు నుంచి విడుదలైన తర్వాత కూడా మళ్లీ మోసాలకు పాల్పకుండా పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా సస్పెక్ట్ షీట్ తెరిచి.. వారి నివాసాల వద్ద ప్రత్యక్ష తనిఖీలు నిర్వహించడమే కాకుండా బ్యాంకు ఖాతాలు, ఆర్థిక లావాదేవీలను నిరంతరం పర్యవేక్షిస్తారని తెలిసింది. అంతేకాక నేరగాళ్ల ఫొటో, చిరునామా, వారు గతంలో చేసిన నేరాల తీరు, కేసుల స్థితిగతుల సమాచారాన్ని ఈ షీట్లో పొందుపరుస్తారు. నిందితుల నివాసం ఉన్న పోలీసు స్టేషన్ అధికారుల వద్ద ఈ వివరాలన్నీ అందుబాటులో ఉంటాయి. తద్వారా అధికారులు మారినప్పటికీ నిఘా మాత్రం నిరంతరం కొనసాగనుంది. నిరంతర పరిశీలన ఒకసారి సస్పెక్ట్ షీట్ నమోదైతే.. సదరు వ్యక్తి పోలీసుల నిఘా నేత్రంలోకి వచ్చినట్టే. నిందితులు నేరస్తుడు జైలు నుంచి బెయిల్పై విడుదలైన వెంటనే ఆ సమాచారం స్థానిక పోలీసులకు చేరుతుంది. ఆపై బీట్ కానిస్టేబుళ్లు, గస్తీ బృందాలు, స్పెషల్ బ్రాంచ్ అధికారులు వారిపై నిఘా పెంచుతారు. నేరస్తుల ప్రతి చర్యను గమనిస్తూ మళ్లీ ఏమైనా నేరాలకు పాల్పడుతున్నారా అని పరిశీలిస్తుంటారు. ఏమైనా అనుమానాస్పద కదలికలు నమోదైతే మరింత అప్రమత్తమై పూర్తి సమాచారాన్ని సేకరిస్తారు. వెబ్సైట్లలో వివరాలు సైబర్ నేరగాళ్ల వివరాలను కేవలం పోలీసుస్టేషన్లకే పరిమితం చేయకుండా.. ప్రజలకు కూడా అందుబాటులోకి తీసుకొస్తారు. నేరగాళ్ల వివరాలు తెలిసేలా పోలీసు శాఖ, ఇతర వెబ్సైట్లలో పొందుపర్చాలని నిర్ణయించినట్లు తెలిసింది. తద్వారా స్థానికులు కూడా వారి విషయంలో అప్రమత్తంగా ఉంటారని చెబుతున్నారు. అయితే, సైబర్ నేరాల కట్టడి పోలీసులతో మాత్రమే సాధ్యం కాదని.. ప్రజలు కూడా అవగాహన పెంచుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.హైదరాబాద్లో పట్టుబడిన ముఠాకు జిల్లాలోని సత్తుపల్లి ప్రాంత వాసులు పలువురితో లింక్లు ఉన్నట్లు పోలీసు విచారణలో తేలింది. ఇందులో ఉడతనేని వికాస్చౌదరి, బొప్పన నాగప్రియ, అడపా రామవెంకట చరణ్, పోట్రు మనోజ్కల్యాణ్, మేడా భానుప్రియ, మేడా సతీష్కుమార్, బొప్పన నాగప్రసాద్, పోట్రు ప్రవీణ్, జుంజునూరి శివకృష్ణ, జొన్నాదుల తిరుమలసాయి తదితరులపై కేసుల నమోదయ్యాయి. వీరంతా రూ.కోట్ల లావాదేవీలకు సంబంధించి కేసుల్లో నిందితులు కాగా, మరికొందరు సైబర్ నేరాలు చేస్తూ పట్టుపడ్డారు.సాంకేతికత ఆధారంగా రూ.కోట్లు కొల్లగొడుతున్న మాయగాళ్లు -
మొదలైన తునికాకు కోత..
● రేటు ఒప్పందం కుదరడంతో సేకరణ ● తొలుత చెట్టుపల్లి యూనిట్లో ప్రారంభం ఇల్లెందు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎట్టకేలకు తునికాకు సేకరణ మొదలైంది. నాలుగు రోజులుగా చెట్టుపల్లి యూనిట్లోని పలు గ్రామాల్లో గిరిజనులు ఆకు సేకరణ ప్రారంభించారు. కొన్నేళ్ల క్రితం వరకు మే డే తర్వాత ఆకు సేకరణ మొదలు పెట్టేవారు. కానీ, రెండేళ్ల నుంచి ముందుగానే ప్రారంభిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈసారి కూడా ఏప్రిల్ మొదటి వారంలో రేటు ఒప్పందం జరగడంతో గిరిజనులు అడవి బాట పడుతున్నారు. పాతికేళ్ల క్రితం పండుగలా.. వేసవి వచ్చిందంటే చాలు పాతికేళ్ల క్రితం వరకు తునికాకు సేకరణ పల్లెల్లో పండుగలా జరిగేది. గిరిజనులు రెండో పంటగా భావిస్తూ వేసవిలో ఆకు సేకరణకు ఆసక్తి చూపేవారు. అంతేకాక రేటు పెంచాలనే డిమాండ్తో ఆందోళనలు, పార్టీల మధ్య చర్చలు కొనసాగేవి. ఇందులో మావోయిస్టులు, ఇతర పార్టీల నేతల ప్రభావం కనిపించేది. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి కానరావడం లేదు. కమ్యూనిస్టు పార్టీల ఆధ్వర్యాన చర్చలు, ఒప్పందాలు జరుగుతున్నాయి. ఈసారి కూడా గుండాల మండలం కాచనపల్లిలో చర్చించి ధర ఖరారు చేశారు. అయితే, కాలక్రమేణా అడవి అంతరించడం, పోడు వ్యవసాయంతో చెట్లు లేకపోవడంతో ఆకు సేకరణ కూడా తగ్గిపోతోంది. ఏపుగా పెరగని తునికాకు తునికాకు సీజన్కు ముందు ఒకటి, రెండు వర్షాలు కురవడం, ఆకు ఏపుగా ఎదగడం పరిపాటిగా ఉండేది. కానీ ఈదఫా వర్షాలు లేకపోవడంతో ఆకు అంత గా ఎదగలేదు. దీంతో ఆకు సేకరణ తక్కువ రోజులే కొనసాగే అవకాశముంది. ప్రస్తుతానికి గుండాల మండలం చెట్టుపల్లిలో సేకరణ మొదలుపెట్టారు. భద్రాద్రి జిల్లాలో.. జిల్లాలో 19 మండలాల్లో పోరాట కమిటీతో కాంట్రా క్టర్లు రేటు ఒప్పందం చేసుకున్నారు. న్యూడెమోక్రసీ, మాస్లైన్, చంద్రన్న వర్గం, సీపీఐ, సీపీఎం, తుడుందెబ్బ, ఆదివాసీ సంఘాల నేతలతో కాంట్రాక్టర్లు ఈ నెల 18న గుండాల మండలం కాచనపల్లిలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా 50 ఆకుల కట్టకు రూ. 3.42 ధర ఖరారైంది. అయితే, భద్రాద్రి జిల్లాలోని 19 మండలాల్లో లభించే తునికాకు నాణ్యతగా ఉంటుంది. దీంతో కాంట్రాక్టర్లు ఆయా మండలాల మీదే ఆధారపడతారు. ప్రస్తు తం పెంచిన ధర కూడా గుండాల, ఆళ్లపల్లి, టేకులపల్లి, పినపాక, కరకగూడెం, మణుగూరు, అశ్వాపురం, బూర్గంపాడు, పాల్వంచ, లక్ష్మీదేవిపల్లి, ముల్కలపల్లి, అన్నపురెడ్డిపల్లి, చండ్రుగొండ, ఇల్లెందు, బయ్యారం, గంగారం, పాకాల, గూడూరు తదితర మండలాల్లో అమలుకానుంది. మిగతా చోట్ల ప్రభుత్వం ఖరారు చేసిన ధర ప్రకారమే చెల్లిస్తారు. -
అదే ఎండ.. ఉక్కపోత
ఖమ్మంవ్యవసాయం: జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. సూర్యుడి ప్రతాపం రోజురోజుకూ పెరుగుతోంది. ఉదయం 9 గంటలకే మొదలవుతున్న ఎండ మధ్యాహ్నం 11 నుంచి సాయంత్రం 4–30 గంటల వరకు గరిష్టస్థాయిలో ఉంటోంది. దీంతో మధ్యాహ్నం వేళ ప్రజలు బయటకు రావడానికి జంకుతున్నారు. దీంతో పగటి వేళ రహదారులపై జన సంచారం తక్కువగా ఉంటోంది. ఉదయం, సాయంత్రం వేళల్లో మాత్రం వ్యాపార సంస్థలు కళకళలాడుతున్నాయి. మరోపక్క ఎండ తీవ్రత కారణంగా ఉక్కపోత ప్రజలను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. 41డిగ్రీలను దాటి... జిల్లాలోని అనేక ప్రాంతాల్లో మంగళవారం గరిష్టస్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఖమ్మం ఖానాపురం, కూసుమంచిలో గరిష్టంగా 41.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మధిర, ఏన్కూరులో 41.7, గుబ్బగుర్తి, పెనుబల్లిలో 41.5, నాగులవంచ, రావినూతల, బాణాపురం, పల్లెగూడెంలలో 41.4, తిమ్మారావుపేటలో 41.1, కల్లూరు, రఘునాథపాలెంలో 41 ఉష్ణోగ్రత నమోదైందని అధికారులు నివేదిక విడుదల చేశారు. ఇక నేలకొండపల్లిలో 40.9, పెద్దగోపతిలో 40.8, బచ్చోడులో 40.6, వైరా, చింతకానిలో 40.5, సత్తుపల్లి ఓసీల వద్ద, గౌరారం, తల్లాడలో 40.4, కొణిజర్లలో 40.2, కలెక్టరేట్, తిరుమలాయపాలెంలో 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అయితే, మంగళవారం సాయంత్రం ఎండ, వడగాలుల ప్రభావం అంతగా లేకపోవడంతో జనం ఊపిరి పీల్చుకున్నారు. -
యువతకు విస్తృత ఉపాధి అవకాశాలే లక్ష్యం
● కలెక్టర్ దివాకర టీ.ఎస్ ● 3,200 ఉద్యోగాల భర్తీకి మే 4న మెగా జాబ్ మేళాఖమ్మం రాపర్తినగర్: ఉమ్మడి జిల్లాలోని నిరుద్యోగ యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నామని ఖమ్మం కలెక్టర్ దివాకర టీ.ఎస్ తెలిపారు. కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో సమావేశమైన ఆయన మాట్లాడారు. సుమారు 80కంపెనీలను ఆహ్వానించి 3,200 పోస్టుల భర్తీ కోసం వచ్చేనెల 4న జాబ్మేళా నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈమేళాకు సుమారు 10వేల మంది నిరుద్యోగులు హాజరయ్యే అవకాశం ఉన్నందున తగిన వేదికను గుర్తించాలని సూచించారు. అంతేకాక యువతను అవగాహన కల్పించేలా విస్తృత ప్రచారం చేయాలని తెలిపారు. అలాగే, వేసవి దృష్ట్యా వైద్యశిబిరం, పార్కింగ్ సదుపాయం కల్పించాలని పేర్కొన్నారు. అంతేకాక దరఖాస్తు చేసుకోవడం, కంపెనీల వారీగా ఖాళీల వివరాలు తెలుసుకునేందుకు క్యూఆర్ కోడ్లు రూపొందించాలని కలెక్టర్తెలిపారు. అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ, డీవైఎస్ఓ సునీల్రెడ్డి, వివిధ శాఖల అధికారులు ప్రవీణ్కుమార్, ఎన్.మాధవి, ఈ.నకుల్రెడ్డి, డాక్టర్ వేణుమాధవ్, దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఇందిరా మహిళా డెయిరీపై ప్రత్యేక దృష్టి ఖమ్మం మయూరిసెంటర్: ఇందిరా మహిళా డెయిరీని విజయవంతం చేసేలా విజయ డెయిరీ నమూనాను అనుసరిస్తూ సమగ్ర ప్రణాళిక అమలు చేయాలని కలెక్టర్ దివాకర టీ.ఎస్ సూచించారు. కలెక్టరేట్లోని మంగళవారం ఆయన అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజతో కలిసి అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇందిరా మహిళా డెయిరీ అమలులో వ్యవస్థీకృత విధానం అమలుచేయాలని, ఇందులో విజయ డెయిరీ ప్రతినిధులను భాగస్వామ్యం చేయాలని తెలిపారు. డెయిరీ ద్వారా దశల వారీగా 40వేల మంది లబ్ధిదారులకు పశువులు పంపిణీ చేసి, రోజుకు 80 వేల లీటర్ల పాలు సేకరించే లక్ష్యం ఖరారు చేసినట్లు చెప్పారు. బీఎంసీ పరిశీలన ముదిగొండ: ముదిగొండలోని ఇందిరా మహిళా డెయిరీ బల్క్ మిల్స్ సెంటర్ను మంగళవారం కలెక్టర్ దివాకర పరిశీలించారు. ఇప్పటివరకు బల్క్ మిల్క్ సెంటర్ వినియోగంలోకి రాకపోవడంపై కారణాలను ఆరా తీశారు. మండలంలో మహిళలకు 24 గేదెలు పంపిణీ చేసినా అధికారులు నిర్లక్ష్యం వహించడం సరికాదన్నారు. డీఆర్డీఓ కొండపల్లి శ్రీరామ్, ఉద్యోగులు సత్యనారాయణ, భాస్కర్రావు, అశోక్, సర్పంచ్ కట్టకూరి ఉపేందర్తో పాటు మెట్టెల సతీష్, రామకృష్ట పాల్గొన్నారు. -
సింథటిక్ ట్రాక్ పనుల్లో వేగం పెంచాలి
ఖమ్మం స్పోర్ట్స్: అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తున్న సింథటిక్ ట్రాక్ పనుల్లో వేగం పెంచి త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని రాష్ట్ర మంత్రి తుమ్మలనాగేశ్వరరావు సూచించారు. ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలో 400 మీటర్ల సింథటిక్ ట్రాక్ పనులను మంత్రి మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాణ్యతలో రాజీ పడకుండా ట్రాక్ను సిద్ధం చేయాలని తెలిపారు. ఈ ట్రాక్ అందుబాటులోకి వస్తే జాతీయ స్థాయి పోటీల నిర్వహణకు అవకాశం ఉంటుందని చెప్పారు. అనంతరం మంత్రి ఖమ్మం 18వ డివిజన్, శ్రీరామ్హిల్స్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమాల్లో నగర మేయర్ పునుకొల్లు నీరజ, డీవైఎస్ఓ టి.సునీల్రెడ్డి, కార్పొరేషన్ అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు -
మహిళా ‘పవర్’!
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థికాభివృద్ధి కోసం ఇప్పటికే బస్సులు ఇప్పించి ఆర్టీసీలో అద్దె ప్రాతిపదికన నడిపిస్తున్నాయి. వీటిలో పాటు పెట్రోలు బంక్లు నిర్వహణలోనూ సానుకూల ఫలితాలు వచ్చాయి. ఈనేపథ్యాన మరో అడుగు ముందుకేసి సోలార్ విద్యుత్ ఉత్పత్తి రంగంలోనూ మహిళా సంఘాల సభ్యులకు అవకాశం కల్పించాలని నిర్ణయించారు.రైతుల స్థానంలో మహిళా సంఘాలు వ్యవసాయ రంగంలో నానాటికీ విద్యుత్ వినియో గం పెరుగుతోంది. దీంతో థర్మల్, హైడల్ పవర్ ప్లాంట్లపై ఒత్తిడి పెరుగుతోంది. ఈనేపథ్యాన వ్యవసాయ రంగంలో సోలార్ విద్యుత్ వాటా పెంచేందుకు కేంద్రం పీఎం కుసుమ్ పేరుతో కొత్త పథకాన్ని అమల్లోకి తెచ్చింది. రైతులు సహకార, సంయుక్త పద్ధతిలో 0.5 మెగావాట్ల నుంచి 2 మెగా వాట్ల వరకు సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకుంటే కేంద్రం ప్రోత్సాహకాలను అందిస్తుంది. కానీ ఈ స్థాయిలో పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలంటే రెండు నుంచి పదిహేను ఎకరాల వరకు స్థలం అవసరమవుతుంది. రైతు సంఘాల దగ్గర ఆ స్థాయిలో భూములు అందుబాటులో లేవు. దీంతో ఇంచుమించు పీఎం కుసుమ్ తరహాలోనే మహిళా సంఘాలతో సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. భద్రాద్రి జిల్లాలో రెండు యూనిట్లు ఇందిరా మహిళా శక్తి పేరుతో స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యాన భద్రాద్రి జిల్లాలో ఒక మెగావాట్ సామర్థ్యం కలిగిన రెండు యూనిట్ల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిచింది. ఈ మేరకు పైలట్ ప్రాజెక్టుగా సుజాతనగర్, ముణుగూరు మండలాలను ఎంపిక చేశారు. మండల సమాఖ్య సభ్యులు బృందంగా ఒక మెగావాట్ సోలార్ పవర్ ప్లాంట్ను నిర్వహిస్తారు. ఈ ప్లాంట్ ఏర్పాటుకు అవసరమైన స్థలాన్ని ప్రభుత్వమే ఎంపిక చేస్తుంది. 25 ఏళ్ల లీజుతో అప్పగించనుంది. పదేళ్ల పాటు పూర్తి ఆదాయం మహిళా సంఘాల ఆధ్వర్యాన ఏర్పాటుచేసే సోలార్ పవర్ ప్లాంట్ నుంచి సగటున ప్రతీరోజు 4,500 యూనిట్ల విద్యుత్ గ్రిడ్కు సరఫరా అవుతుంది. ప్రస్తుతం ఒక్క యూనిట్కు విద్యుత్ సంస్థలు రూ.3.13 చెల్లిస్తున్నాయి. ఈ లెక్కన నెలకు సుమారు రూ.4లక్షల ఆదాయం వస్తుంది. ఇందులో కొంత మొత్తాన్ని ప్లాంట్ నిర్వహణ ఖర్చులకు, మరికొంత భాగాన్ని మహిళా సమాఖ్యలకు కేటాయించి.. సింహభాగాన్ని బ్యాంకు రుణాల చెల్లింపునకు ఉపయోగిస్తారు. ప్రస్తుత అంచనాల ప్రకారం బ్యాంకు రుణం కనిష్టంగా పదేళ్ల నుంచి గరిష్టంగా 15 ఏళ్లలో తీరిపోతుంది. ఆ తర్వాత పదేళ్ల పాటు వచ్చే ఆదాయం మహిళా సమాఖ్యలకే చెందుతుంది. ఈ సొమ్మును స్వయం సహాయ సంఘాల అభ్యున్నతికి ఉపయోగిస్తారు. ఒక మెగావాట్ సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటుకు అందుబాటులో ఉన్నస్థలం, అక్కడి భౌగోళిక పరిస్థితులను ఆధారంగా సగటున రూ.3 కోట్ల వరకు వ్యయమవుతుందని అంచనా వేశారు. ఇందులో పది శాతం పెట్టుబడిని మహిళా సమాఖ్యలు సమకూర్చుకోవాలి. మిగతా 90శాతం పెట్టుబడిని రుణాల రూపంలో బ్యాంకులు అందిస్తాయి. ఈ ప్లాంట్ నుంచి ఉత్పత్తి అయిన విద్యుత్ను గ్రిడ్కు అనుసంధానం చేస్తారు. ఆపై వచ్చే ఆదాయం నుంచి నిర్వహణ ఖర్చులు పోగా నెలకు కొంత చెల్లిస్తే రుణభారం తగ్గుతుంటుంది. ఇప్పటికే ఖమ్మం జిల్లాలో ఎర్రుపాలెం మండలంలో సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు పనులు చివరి దశకు చేరగా, కల్లూరు మండలంలో పనులు శరవేగంగా జరుగుతున్నాయి. భద్రాద్రి జిల్లాకు సంబంధించి మండలాలు, మహిళా సమాఖ్యల ఎంపిక, స్థలం కేటాయింపుపై స్పష్టత రావడంతో త్వరలోనే పనులు మొదలుకానున్నాయి.‘ఇందిరా మహిళాశక్తి’ ద్వారా రెండు యూనిట్లు -
జిల్లా జడ్జిని కలిసిన కలెక్టర్
ఖమ్మం సహకారనగర్: కలెక్టర్గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన దివాకర టీఎస్ మంగవారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.రాజగోపాల్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మొక్క అందజేశారు. అనంతరం జిల్లాకు సంబంధించి పలు అంశాలపై ఇద్దరు చర్చించుకున్నారు. సేవాభావం కలిగి ఉండాలి రైతులు పెట్టుబడి ఖర్చు తగ్గించుకోవాలి ఏన్కూరు: రైతులు ఎరువుల వాడకం.. తద్వారా పెట్టుబడి ఖర్చులు తగ్గించుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి డి.పుల్లయ్య సూచించారు. మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించిన ఆయన సాగవుతున్న పంటలను పరిశీలించాక రాంనగర్ తండాలో రైతులతో సమవేశమయ్యారు. పంటలపై విచక్షణా రహితంగా ఎరువులు, పురుగు మందులు వాడొద్దని తెలిపారు. అంతేకాక పంటల అనంతరం అవశేషాలను కాల్చివేయకుండా కలియదున్నితే మంచి ఫలి తాలు వస్తాయన్నారు. ఆతర్వాత ఏన్కూరు రైతు వేదికలో నిర్వహించిన రైతు నేస్తం కార్యక్రమంలో పాల్గొని వచ్చే వచ్చే వానాకాలం సాగు చేయాల్సిన పంటలపై అవగాహన కల్పించారు. విత్తనాలను డీలర్ల వద్దే కొనుగోలు చేయాలని తెలిపారు. ఏఓ నరసింహారావు, ఏఈఓలు పాల్గొన్నారు. ఖైదీలకు న్యాయసాయం ఖమ్మంలీగల్: సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం ఖైదీల హక్కులు, వేగవంతమైన విచారణ, అవసరమైన చోట బెయిల్ పొందే అవకాశాలపై అవగాహన కల్పించనున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి దేవీమానస తెలిపారు. జిల్లా జైలును మంగళవారం సందర్శించిన ఆమె మాట్లాడారు. ఖైదీలు అనవసరంగా దీర్ఘకాలం జైలులో ఉండకుండా సమయానికి న్యాయసాయం అందిస్తామని తెలిపారు. ఇందుకోసం తరచుగా న్యాయ సహాయ శిబిరాలు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. అనంతరం జైలులోని వసతులను పరిశీలించడమే కాక విచారణ ఖైదీలతో మాట్లాడి వారి సమస్యల పరిష్కారంపై అధికారులకు సూచనలు చేశారు. అధికారులు, న్యాయవాదులు శ్రీధర్, ఖండే వెంకటేశ్వరరావు, తొర్రికొండ శ్రీను పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాలు ప్రారంభం ఖమ్మంగాంధీచౌక్: ఖమ్మంలోని స్వయంభూ శ్రీ స్తంభాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయం(గుట్ట)లో వార్షిక బ్రహ్మోత్సవాలు, కల్యాణ మహోత్సవాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. వచ్చేనెల 2వ తేదీ వరకు జరిగే ఉత్సవాల్లో భాగంగా తొలిరోజు విశ్వక్సేన పూజ, అంకురార్పణ పూజలతో పాటు గరుడ ధ్వజారోహణ నిర్వహించారు. ఆలయ అభివృద్ధి కమిటీ ప్రతినిధులు డాక్టర్ కూరపాటి ప్రదీప్ కుమార్, ఈఓ కొత్తూరు జగన్మోహన్రావు తదితరులు పాల్గొన్నారు. కాగా, బ్రహ్మోత్సవాలకు హాజరుకావాలని కోరుతూ కలెక్టర్ దివాకర టీఎస్, సీపీ సునీల్దత్ను ఆలయ బాధ్యులు మంగళవారం ఆహ్వానించారు. -
మేలైన వ్యవసాయంకోసం..
● ‘రైతు ముగింట్లో శాస్త్రవేత్తలు’ పేరిట సదస్సులు ● ఉమ్మడి జిల్లాలో 72 చోట్ల నిర్వహణ ఖమ్మంవ్యవసాయం: ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా అన్నదాతలకు అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’పేరిట కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. వచ్చే వానాకాలం సీజన్ దృష్ట్యా పంటల సాగు, విత్తనాల ఎంపిక, ఎరువుల వినియోగం తదితర అంశాలపై అవగాహన కల్పించేలా ఈ కార్యక్రమం ద్వారా సదస్సులు నిర్వహిస్తారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వ విద్యాలయం పర్యవేక్షణలో వ్యవసాయ శాఖ ద్వారా మొదలైన ఈ సదస్సులు వచ్చేనెల 23వ తేదీ వరకు కొనసాగుతాయి. ఎరువులు, సుస్థిర ఆదాయం ఎరువుల వినియోగం, సుస్థిర ఆదాయాన్ని పొందేలా, పంటలు సాగుచేసేలా రైతులకు ఈ సదస్సుల్లో అవగాహన కల్పిస్తారు. యూరియా వాడకం తగ్గింపుతో సాగుఖర్చును తగ్గించుకోవాలని.. తద్వారా నేలతల్లి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చనే అంశాన్ని రైతుల్లోకి తీసుకెళ్తారు. ప్రధానంగా వరిలో 75 – 90 కిలోల యూరియాకు బదులు రైతులు 180 కిలోల వరకు వినియోగిస్తున్నారు. దీంతో వ్యయం పెరగడమే కాక భూగర్భ జలాలు విషతుల్యం కావటం, నేలలోని సూక్ష్మ జీవులకు హాని కలుగుతోంది. అవసరం మేరకు రసాయనాలను వినియోగిస్తే ప్రకృతిని రక్షించుకోవచ్చని, పంట మార్పిడి ద్వారా సుస్థిర ఆదాయాన్ని పొందాలని సదస్సుల్లో సూచిస్తారు. అంతేకాక మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలే సాగు చేసేలా చైతన్యం కల్పిస్తారు. అంతేకాకుండా పండ్ల తోటలు, పాడి పరిశ్రమ ఏర్పాటుతో లాభాలపై అవగాహన పెంపొందించాలని నిర్ణయించారు. వరిలో సన్న రకాలు జిల్లాలో వరి ప్రధానమైన పంటగా సాగవుతోంది. మద్దతు ధరకు తోడు ప్రభుత్వం క్వింటాకు రూ.500 బోనస్ చెల్లిస్తుండడంతో రైతులు సన్న రకాల సాగుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ నేపథ్యాన తక్కువ విత్తన వ్యయం, నాణ్యత, విశ్వసనీయత, చీడపీడలను తట్టుకునేలా రకాల ఎంపికపై రైతులకు వివరిస్తారు. వరిలో కూనారం (కేఎన్ఎం 1638), తెలంగాణ సోనా (ఆర్ఎన్ఆర్–15048), సాంబమసూరి (బీపీటీ–5204), సిద్ధి(డబ్ల్యూజీఎల్–44), జైశ్రీరామ్, హెచ్ఎంటీ సోనా వంటి రకాల ప్రత్యేకతలపై అవగాహన కల్పిస్తారు. ఇక కాటన్ దొర సన్నాలు (ఎంటీయూ–1010), కూనారం సన్నాలు (కేఎన్ఎం–118)పై వివరిస్తూ.. పత్తి, మొక్కజొన్న, వేరుశనగ సాగులోతీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తారు. సేంద్రియ వ్యవసాయానికి ప్రాధాన్యత సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించడాన్ని కూడా ఈ సదస్సుల్లో అజెండాగా చేర్చారు. సహజ వనరులు, సుస్థిర వ్యవసాయ విధానాలను అలవర్చుకునేలా రైతులను చైతన్యపర్చాలని నిర్ణయించారు. సేంద్రియ ఎరువులు, జీవన ఎరువులు, పంటల మార్పిడి, జీవ కీటక నియంత్రణ, పచ్చిరొట్ట పంటల పెంపకం, మల్చింగ్, పంట అవశేషాలు నేలలో కలియదున్నడం వంటి అంశాలపై అవగాహన కల్పిస్తారు. ఉమ్మడి జిల్లాలో సదస్సులు ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’కార్యక్రమం ఈ నెల 27న మొదలుకాగా.. ఉమ్మడి జిల్లాలో 72 క్లస్టర్లు, గ్రామాల్లో వచ్చేనెల 23వ తేదీవరకు కొనసాగనుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 52, ఖమ్మం జిల్లాలో 20 సదస్సుల నిర్వహణకు వేదికలు ఖరా రు చేశారు. అశ్వారావుపేట వ్యవసాయ విశ్వవిద్యాలయం అసోసియేట్ డీన్ హేమంత్కుమార్తో కూడిన శాస్త్రవేత్తల బృందంతో పాటు, ఖమ్మం, భద్రాద్రి జిల్లాల కృషి విజ్ఞాన కేంద్రాల, పరిశోధనా స్థానాల శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాఖ అధికారులు సదస్సుల్లో పాల్గొంటున్నారు. ఖమ్మం, భద్రాద్రికొత్తగూడెం జిల్లాల వ్యవసాయాధికారులు ధనసరి పుల్లయ్య, బాబూరావు పర్యవేక్షిస్తున్నారు. -
మద్యం వ్యాపారుల సిండికేట్ ?
అశ్వారావుపేట: అశ్వారావుపేటలో మద్యం వ్యాపారులు సిండికేట్ అవుతున్నట్లు తెలిసింది. గత ఏడాదిడిసెంబర్లో వైన్స్ దక్కించుకున్న వ్యాపారు లు ఇన్నాళ్లు ఎవరికి వారే అన్నట్లు ఉన్నారు. ఆరు వైన్స్ను దక్కించుకున్న వారి రాజకీయ, సామాజిక నేపథ్యాలు వేర్వేరు కావడంతో సిండికేట్ కావడానికి సుముఖత చూపలేదు. ఈ నేపథ్యాన ఎమ్మార్పీకే మద్యం విక్రయాలు కొనసాగుతున్నా యి. అయితే, ఇప్పుడు ఎవరు చొరవ చూపారో తెలియదు కానీ అంతా సిండికేట్ కావాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. ఇదే జరిగితే లైసెన్స్డ్ మద్యం దుకాణాల్లో అత్యధికంగా అమ్ముడయ్యే చీప్లిక్కర్, ఇతర బ్రాండ్ల మద్యం, బీర్లను అమ్మొ ద్దని నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. అంతేకాక క్వార్టర్ సీసాపై ఎమ్మార్పీకి రూ.40 అదనంగా తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలిసింది. అది కూడా ఫుల్ బాటిళ్లనుంచే లూజ్ చేసి ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇదే సమయాన కాస్త ఖరీదైన మద్యం మాత్రం యథావిధిగా అమ్మాలని భావిస్తుండగా.. ఒకటి, రెండు రోజుల్లో చర్చలు కొలిక్కి వచ్చే అవకాశముందని తెలిసింది.ఒక్కో క్వార్టర్పై రూ.40 అదనం -
మొండితోగులో ట్రెంచ్ పనుల అడ్డగింత
ఇల్లెందురూరల్: మండలంలోని మొండితోగు గ్రామంలో అటవీశాఖ పంట చేల వెంట చేపట్టిన ట్రెంచ్ కటింగ్ పనులను గ్రామస్తులు మంగళవారం అడ్డుకున్నారు. నిబంధనలకు అనుగుణంగా పనులు చేస్తున్నామని ఎఫ్ఆర్ఓ చలపతిరావు, డీఆర్ఓ వీరబాబు గ్రామస్తులకు నచ్చజెప్పే పయత్నం చేసినా వారు ససేమిరా అంటూ ట్రెంచ్ కటింగ్ పనులను ముందుకు సాగనీయలేదు. మాజీఎంపీటీసీ పూనెం సురేందర్ అక్కడకు చేరుకొని అటవీశాఖ అధికారులతో చర్చించారు. రైతుల వద్ద పోడు పట్టాలు ఉన్నాయని, మరికొంత మందికి సర్వే ప్రక్రియ పూర్తయి పట్టాల మంజూరు పెండింగ్లో ఉందని గుర్తుచేశారు. అలాంటి వారిని గుర్తించిన తరువాత ట్రెంచ్ కటింగ్ పనులు చేసుకోవా లని అధికారులకు విజ్ఞప్తి చేశారు. దీంతో రైతు ల దరఖాస్తులను పరిశీలించిన తరువాత పను లు కొనసాగిస్తామని అధికారులు తెలపడంతో వివాదం సద్దుమనిగింది. మార్కెట్లో మిర్చి చోరీలు అరికట్టాలని వినతి ఖమ్మంవ్యవసాయం: ఖమ్మం వ్యవసాయ మా ర్కెట్లో మిర్చి దొంగతనాలను అరికట్టడమే కాక మార్కెట్ పరిసరాల్లో చిల్లర కొనుగోళ్లను నిలువరించాలని చాంబర్ ఆఫ్ కామర్స్ మిర్చి శాఖ ప్రతినిధులు కోరారు. మంగళవారం వారు మార్కెట్ చైర్మన్ యరగర్ల హన్మంతరావు, కార్యదర్శి పి.ప్రవీణ్కుమార్కు వినతిపత్రాలు అందించారు. మార్కెట్లో రైతులు విక్రయించిన మిర్చి బస్తాలను కొందరు కోసి దొంగిలిస్తుండడంతో వ్యాపారులకు నష్టం జరుగుతోందని తెలిపారు. అలాగే, పరిసరాల్లో చిల్లర కౌంటర్ల ద్వారా మార్కెట్ ఆదాయానికి గండి పడుతోందని చెప్పారు. కార్యక్రమంలో మిర్చి శాఖ అధ్యక్ష, కార్యదర్శులు మెంతుల శ్రీశైలం, యడ్లపల్లి సతీశ్కుమార్, చాంబర్ ప్రధాన కార్యదర్శి సోమ నర్సింహారావు, ఉపాధ్యక్షుడు బత్తిని నర్సింహారావు తదితరులు పాల్గొన్నారు. రేపు కాంగ్రెస్ కార్యాలయంలో ప్రజాదర్బార్ ఖమ్మంమయూరిసెంటర్: ఖమ్మంలోని కాంగ్రెస్ జిల్లా కార్యాలయంలో ఈనెల 30న ప్రజాదర్బార్ నిర్వహిస్తున్నట్లు పార్టీ జిల్లా అధ్యక్షుడు నూతి సత్యనారాయణగౌడ్ తెలిపారు. గురువారం ఉదయం 10నుంచి సాయంత్రం 4 గంటల వరకు ప్రజల సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేయనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా, నగర, మండలాల బాధ్యులు పాల్గొంటారని ఓ ప్రకటనలో తెలిపారు. నేడు న్యాయవాద సంక్షేమ సంఘం ఎన్నికలు ఖమ్మంలీగల్: ఖమ్మం న్యాయవాద సంక్షేమ సంఘం ఎన్నికలు బుధవారం జరగనున్నాయి. మొత్తం 534 మందికి ఓటు హక్కు కలిగి ఉండగా, ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని ఎన్నికల అధికారులు గుద్దేటి రమేశ్, కూరపాటి శేఖర్ రాజు తెలిపారు. ఆ తర్వాత పోలైన ఓట్లను లెక్కించి ఫలితాలు ప్రకటిస్తామని వెల్లడించా రు. కాగా, నాలుగు డైరెక్టర్ పదవులకు గాను మన్నేపల్లి బసవయ్య, తెరళ గంగాధర్, షేక్ మల్సూర్, కొలకలూరి ప్రసాద్, దొంతబోయిన రామారావు, చెన్నోజు వెంకటరమణాచారి, చింతల వెంకటేశ్వర్లు అలియాస్ వెంకట్ పోటీ పడుతున్నారు. ఎస్ఐఆర్ మ్యాపింగ్లో తేడాలు రావొద్దుఖమ్మంసహకారనగర్: పూర్తిస్థాయి సమాచారంతో ఎస్ఐఆర్ మ్యాపింగ్ కచ్చితంగా పూర్తి చేయాలని హైదరాబాద్ సీఈఓ కార్యాలయ ఎస్డీసీ శ్రీరామ్ప్రసాద్ సూచించారు. ఖమ్మం కలెక్టరేట్లో మంగళవారం ఆయన ఎస్ఐఆర్ మ్యాపింగ్, డేటా సమన్వయంపై అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డితో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా శ్రీరామ్ప్రసాద్ మాట్లాడుతూ.. 2002 నుంచి 2025 వరకు రికార్డులను పరిశీలించి ఎస్ఐఆర్ మ్యాపింగ్ చేపట్టాలని తెలిపారు. ప్రతీ దశలో వివరాలను సరిపోల్చుకోవడం ద్వారా పొరపాట్లు దొర్లవని చెప్పా రు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పనుల పురోగతిని నిరంతరం పర్యవేక్షిస్తూ, బీఎల్ఓలు, సూపర్వైజర్లు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. సమావేశంలో ఎస్డీసీ రాజేశ్వరి, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ రాజు, టీటీ అన్సారి తదితరులు పాల్గొన్నారు. -
●రహదారి వెంట ఆహ్లాదం..
చర్ల మండలంలో రాళ్లగూడెం నుంచి సుబ్బంపేట వరకు ప్రధాన రహదారి వెంట కొన్నేళ్లుగా హరితహారంలో భాగంగా నాటిన మొక్కలు ఏపుగా పెరిగి ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. భద్రాచలం – వెంకటాపురం రాష్ట్రీయ రహదారి–12పై దేవరాపల్లి, కుదునూరు, ఆర్.కొత్తగూడెం, సత్యనారాయణపురం, సి కత్తిగూడెం, కొయ్యూరు, సుబ్బంపేట తదితర గ్రామాల్లో ప్రధాన రహదారికి ఇరువైపులా నాటిన మొక్కలు వృక్షాలుగా మారి కళకళలాడుతున్నాయి. ప్రస్తుతం వేసవి తీవ్రత నేపథ్యాన ఈ మార్గంలో వెళ్తున్న వాహనదారులు కాసేపు ఆగి సేదదీరుతున్నారు. – చర్ల -
డిగ్రీలో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం
దమ్మపేట: కాకతీయ యూనివర్సిటీకి అనుబంధంగా కొనసాగుతున్న దమ్మపేట మండలం అంకంపాలెం గిరిజన సంక్షేమ బాలికల డిగ్రీ కళాశాలలో ప్రవేశాలకు గిరిజన బాలికలు దరఖాస్తు చేసుకోవాలని ఐటీడీఏ పీఓ రాహుల్ సూచించారు. బీఏ (హెచ్ఈపీ), బీఎస్సీ (బీజెడ్సీ, ఎంపీపీఎస్), బీకాం (జనరల్, సీఏ) కోర్సుల్లో ప్రథమ సంవత్సరానికి ప్రవేశాలు కల్పిస్తామని తెలిపారు. ఉచితంగా నాణ్యమైన విద్యతో పాటు భోజనం, వసతి, డిజిటల్ తరగతులు, గ్రంథాలయం, ప్రయోగశాల సౌకర్యాలే కాక అనుభవజ్ఞులైన అధ్యాపకులు ఉన్నందున సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కేజీ గంజాయి స్వాధీనంమణుగూరురూరల్: మండలంలోని కొత్త పద్మగూడెం గ్రామంలోని ఓ ఇంట్లో గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు మణుగూరు సీఐ పాటి నాగబాబు తెలిపారు. మణుగూరు పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో మంగళవారం ఆయన వివరాలు వెల్లడించారు. విశ్వసనీయ సమాచారంతో కొత్త పద్మగూడెంలోని మిడియం గోవింద్ ఇంట్లో తనిఖీ చేయగా 1.085 కేజీల గంజాయి లభ్యమైందని తెలిపా రు. ఈ సందర్భంగా గోవింద్ను అదుపులోకి తీసుకోవడమే కాక ఆయనకు గంజాయి అమ్మిన గుట్టమల్లారం వాసి సాయి అలియాస్ గుట్ట సాయి, కొనుగోలు చేస్తున్న సత్తుపల్లికి చెందిన జుజునూరి సింహాద్రి అలియాస్ సందీప్పై కేసు నమోదు చేసినట్లు సీఐ పేర్కొన్నారు. గోవింద్ను రిమాండ్కు తరలించి, మిగిలిన ఇద్దరు నిందితుల కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో ఎస్ఐ సీహెచ్ నగేశ్, సిబ్బంది పాల్గొన్నారు. అదుపు తప్పి లారీ బోల్తా అశ్వాపురం: మండలంలోని సీతారాంపురం వద్ద మంగళవారం లారీ బోల్తా పడింది. కంకరలోడ్తో మణుగూరు వైపు వెళ్తున్న లారీ సీతారాంపురం వద్ద మణుగూరు – కొత్తగూడెం ప్రధాన రహదారి వెంట అదుపుతప్పి కల్వర్టును ఢీకొంది. ఆపై కాల్వలో బోల్తాపడగా, డ్రైవర్ అప్రమత్తమై కిందకు దూకడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు. పేకాట స్థావరంపై దాడిచండ్రుగొండ: మండలంలోని గుర్రాయిగూడెం శివా రు అటవీ ప్రాంతంలో పేకాట స్థావరంపై కొత్తగూ డెం టాస్క్ఫోర్స్ పోలీసులు మంగళవారం దాడి చేశారు. టాస్క్ఫోర్స్ ఎస్ఐరమాకాంత్ కథనం ప్రకారం.. పక్కా సమాచారం మేరకు తనిఖీలు చేపట్టడంతో పేకాట ఆడుతున్న పదిమంది పట్టుబడ గా, మరో తొమ్మిదిమంది పారిపోయారు. పట్టుబడిన వారి నుంచి రూ.42,460నగదు, సెల్ఫోన్లు, ద్విచక్రవాహనాలను స్వాధీనంచేసుకున్నారు. నింది తులపై కేసు నమోదు చేసినట్లు చండ్రుగొండ ఎస్ఐ శివరామకృష్ణ తెలిపారు. -
తెగిపడిన విద్యుత్ తీగ
వైరా: భారీ వాహనం వెళ్లే క్రమాన విద్యుత్ తీగలకు తాకి తెగిపడడంతో తృటిలో పెనుప్రమాదం తప్పింది. అయితే, ఈ ఘటనతో ఇరువైపులా వాహనాల రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. ఏపీకి చెందిన భారీ ట్రాలీ వాహనం మంగళవారం ఖమ్మం – సత్తుపల్లి జాతీయ రహదారిపై వెళ్తోంది. ఈ క్రమాన వైరా శాంతినగర్ వద్ద విద్యుత్ తీగలకు తగలడంతో అవి తెగి నడి రోడ్డుపై పడ్డాయి. అంతేకాక తీగలకు అనుసంధానంగా ఉన్న స్తంభం సైతం ద్విచక్రవాహనంపై పడి సరఫరా నిలిచిపోయింది. దీంతో ప్రమాదం తప్పినట్లయింది. అయితే, తీగలు రోడ్డుపై పడి ఉండటంతో రోడ్డుకు ఇరువైపులా భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ఈ మేరకు విద్యుత్ అధికారులు చేరుకుని తీగలను తొలగించి మరమ్మతులు చేపట్టగా.. పోలీసులు రాకపోకలను క్రమబద్ధీకరించారు. స్తంభించిన వాహనాల రాకపోకలు -
చదువులో ఆడపిల్లలను ప్రోత్సహించాలి
చండ్రుగొండ: తల్లిదండ్రులు ఎలాంటి వివక్ష చూపకుండా ఆడపిల్లలను సైతం చదువులో ప్రోత్సహించాలని భద్రాద్రి జిల్లా డీఆర్డీఓ విద్యాచందన సూచించారు. చండ్రుగొండలోని కస్తూర్బాగాంధీ విద్యాలయంలో మంగళవారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. వివక్ష లేకుండా మగ పిల్లలతో సమానంగా ఆడపిల్లలను చదువు, అన్ని రంగాల్లో ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. అంతేకాక మైనర్లకు వివాహం చేయడం చట్టరీత్యా నేరమని తెలిపారు. కాగా, యువతులు భవిష్యత్ లక్ష్యాలపై దృష్టి సారించాలే తప్ప సైబర్ నేరాల బారిన పడొద్దని సూచించారు. సదస్సులో డీడబ్ల్యూఓ స్వర్ణలత లెనీనా, కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ కవిత, తహసీల్దార్ జగదీశ్వర్ప్రసాద్, ఎంపీడీఓ బయ్యారపు అశోక్, సీఐ శ్రీలక్ష్మి, సీడీపీఓ సలోమి పాల్గొన్నారు. డీపీఓగా అదనపు బాధ్యతలు సూపర్బజార్(కొత్తగూడెం): భద్రాద్రి జిల్లా పంచాయతీ అధికారి(డీపీఓ)గా డీఆర్డీఓ విద్యాచందన మంగళవారం అదనపు బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా కార్యాలయ ఉద్యోగులు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
కొణిజర్ల: రెండు ద్విచక్రవాహనాలు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో తీవ్రగాయాలపాలైన ఓ వ్యక్తి మృతి చెందాడు. ఎస్ఐ జి.సూరజ్ కథనం ప్రకారం.. మండలంలోని పెద్ద మునగాలకు చెందిన తుప్పతి సత్యనారాయణ (34), చింతల కేశవులు పెద్దగోపతిలోని బంక్లో డీజిల్ కోసం ద్విచక్రవాహనంపై వెళ్తున్నారు. పెద్దగోపతి నుంచి పెద్దమునగాల వైపు రాజారాపు నారాయణ బైక్పై వస్తుండగా.. ఎదురెదురుగా రెండు బైక్లు ఢీకొన్నాయి. ఘటనలో కేశవులు బైక్పై వెనుక కూర్చున్న సత్యనారాయణ ఎగిరి రోడ్డుపై పడటంతో తలకు బలమైన గాయమైంది. కేశవులు, నారాయణ కాళ్లకు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రు లను ఖమ్మం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందు తూ సత్యనారాయణ మృతి చెందాడు. ఆయనకు భార్య త్రివేణి,కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సూరజ్ తెలిపారు. నీళ్ల కోసం వచ్చి నగదు చోరీ దమ్మపేట: తాగునీరు కావాలని వచ్చిన పలువురు నగదు చోరీ చేసిన ఘటన ఇది. మండలంలోని మందలపల్లిలో నూతక్కి రాజశేఖర్ ఇంటికి మంగళవారం నలుగురు మహిళలు, ఓ పురుషుడు వచ్చి తాగడానికి నీరు కావాలని అడిగారు. దీంతో రాజశేఖర్ భార్య రమ్య తన చేతిలోని రూ.2 వేల నగదు కుర్చీలో పెట్టి లోపలికి వెళ్లింది. తిరిగి నీళ్లతో వచ్చేసరికి నగదు, అపరిచిత వ్యక్తులు కనిపించలేదు. ఈ మేరకు రాజశేఖర్ కుటుంబీకులు గ్రామంలో గాలించి వారిని పట్టుకుని అప్పగించగా, కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సాయికిశోర్రెడ్డి తెలిపారు. -
ఆలయాలను పరిశీలించిన అధికారులు
చింతకాని: డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క మండలంలోని పలు ఆలయాల అభివృద్ధికి అడుగులు పడుతున్నాయి. ఈ మేరకు సీతంపేటలోని శ్రీగజగిరి లక్ష్మీనర్సింహాస్వామి, నాగులవంచలోని అంకమ్మతల్లి ఆలయాలను దేవాదాయ శాఖాధికారులు మంగళవారం పరిశీలించారు. శ్రీ గజగిరి లక్ష్మీనర్సింహాస్వామి ఆలయం ముందు మహామండపం, కల్యాణ మండపం, అతిథిగృహాలు, కళావేదిక, ఆలయ గోపురం నిర్మాణమే కాక కోనేరు అభివృద్ధి చేయాలని ప్రతిపాదించారు. అలాగే, నాగులవంచలోని అంకమ్మ తల్లి ఆలయ పునర్నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేసేందుకు అధికారులు పరిశీలించారు. కార్యక్రమంలో దేవాదాయ శాఖ అసిస్టెంట్ స్తపతి శివశంకర్, ఏఈ వెంకటరమణ, ఆలయ ఈఓ చుండూరు రామకోటేశ్వరరావు, మత్కేపల్లి మార్కెట్ చైర్మన్ అంబటి వెంకటేశ్వరరావు, నాగులవంచ సర్పంచ్ నారగాని రాంబాయి, ఆలయ కమిటీ చైర్మన్ ముత్తినేని వెంకటేశ్వర్లుతో పాటు వెచ్చా మంగపతిరావు, సిరిసాని రమణప్రసాద్, వెగ్గళం పాండురంగాచారి, సామినేని రామారావు, ఆళ్ల పానకాలరావు, కంభం వీర భద్రం, ఆలస్యం బస్వయ్య, మద్దినేని వెంకటేశ్వరరావు, ఏ.రవి, ఎస్.సైదులు పాల్గొన్నారు. -
బూడిదంపాడులో మొక్కజొన్న పంట దగ్ధం
రఘునాథపాలెం: మండలంలోని బూడిదంపాడులో మంగళవారం సాయంత్రం మొక్కజొన్న పంట అగ్నికి ఆహుతైంది. గ్రామానికి చెందిన రైతు గుమ్మడి సత్యం చేనుకు తొలుత మంటలు అంటుకోగా.. ఆ తర్వాత విస్తరిస్తూ పక్కన ఉన్న నలుగురు రైతులకు చెందిన చేలకు కూడా మంటలు అంటుకున్నాయి. మొత్తం ఐదెకరాల్లో పంట నష్టం జరిగినట్లు సమాచారం. సాయంత్రం ఐదు గంటల సమయాన మంటలు మొదలుకాగా స్థానికులు అదుపుచేసే ప్రయత్నం చేసినా సాధ్యం కాలేదు. దీంతో అగ్నిమాపక శాఖకు సమాచారం ఇవ్వడంతో ఉద్యోగులు చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. కాగా, అగ్ని ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది. -
బదిలీ కలెక్టర్కు ఘన సన్మానం
ఖమ్మంసహకారనగర్: ఖమ్మం కలెక్టర్గా విధులు నిర్వర్తిస్తూ ఇటీవల బదిలీపై వెళ్లిన అనుదీప్ దురిశెట్టిని జిల్లా అధికార యంత్రాంగం మంగళవారం ఘనంగా సత్కరించింది. తొలుత నూతన కలెక్టర్ దివాకర.. అనుదీప్కు పుష్పగుచ్ఛం అందించి అభినందించారు. అనంతరం అధికారులు మాట్లాడుతూ కలెక్టర్గా అనుదీప్ సేవలను కొనియాడారు. అదనపు కలెక్టర్లు శ్రీజ, శ్రీనివాసరెడ్డి, కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్యాదవ్ తదితరులు మాట్లాడాక సన్మానించారు. టీఎన్జీవోస్, టీజీవోస్ నాయకులతో పాటు జెడ్పీ సీఈఓ దీక్షారైనా, డీఆర్వో పద్మశ్రీ, కలెక్టరేట్ ఏఓ కె.శ్రీనివాసరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
మహిళ ఆత్మహత్యాయత్నం
మధిర: మధిర లడకబజార్లోని తన ఇంటి ముందు మెట్లను మున్సిపల్ సిబ్బంది అన్యాయంగా కూల్చివేశారని ఆరోపిస్తూ వల్లాపురపు జానకిరామయ్య కుటుంబీకులు నిరసన తెలిపారు. ఆయన భార్య నాగరాణి, ఆమె సోదరుడు బాలాజీ, కుటుంబీకులు మంగళవారం రైల్వే గేట్ సమీపాన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే నాగరాణి ఒంటిపై పెట్రోల్ పోసుకోవడంతో స్థానికులు అడ్డుకొని పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు చేరుకుని వారిని పోలీస్ స్టేషన్కు తరలిస్తుండగా జరిగిన పెనుగులాటలో బాలాజీ చేతికి గాయమైంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎందరో ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకున్నా పట్టించుకోకుండా, తమ ఇంటి ముందు మెట్లను మాత్రం ముందస్తు సమాచారం, నోటీసులు ఇవ్వకుండా మున్సిపల్ సిబ్బంది కూల్చివేశారని ఆరోపించారు. కమిషనర్ తమకు న్యాయం చేయకపోతే ఆత్మహత్యే శరణ్యమని తెలిపారు.మున్సిపల్ సిబ్బంది మెట్లు కూల్చారని ఆవేదన -
కలెక్టర్ను కలిసిన సంఘాల నాయకులు
ఖమ్మం సహకారనగర్/ఖమ్మం అర్బన్/ఖమ్మం మామిళ్లగూడెం: కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన దివాకర టీఎస్ను టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు గుంటుపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యాన ఉద్యోగులు మంగళవారం కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా కార్యదర్శి కొణిదన శ్రీనివాసరావుతో పాటు జైపాల్, యర్రా రమేష్, అస్లాం ఖాన్, లలితకుమారి, తాళ్లూరి శ్రీకాంత్, కోనార్ హరికృష్ణ, రాధికారెడ్డి, రుక్మారావు, ఫజల్, సైదులు, రాజ్కుమార్, చంద్రశేఖర్ పాల్గొన్నారు. అలాగే, రైస్ మిల్లర్ల అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బొమ్మ రాజేశ్వరరావు ఆధ్వర్యాన కలెక్టర్ను సన్మానించడంతో పాటు మిల్లర్ల సమస్యలను వివరించారు. అంతేకాక నూతన కలెక్టర్ దివాకరను రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ వెలిగేటి చంద్రమోహన్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయన వెంట సొసైటీ సభ్యులు జెల్లా వెంకటేశ్వర్లు, మూలగుండ్ల శ్రీహరి, కొత్త సత్యనారాయణరెడ్డి, గజేంద్రుల నాగేశ్వరరావు, గట్టు మోహన్రావు, షకీల్ అహ్మద్ తదితరులు ఉన్నారు. -
కొక్కోరోకో.. మళ్లీ కుదేలు
● కోళ్ల ఉత్పత్తి పెరగడంతో ధర పతనం ● ఎగుమతులు లేక గుడ్డుకూ గడ్డుకాలమే.. ● పౌల్ట్రీ పరిశ్రమల నిర్వహణ భారంతో రైతులకు నష్టాలుఖమ్మంవ్యవసాయం: కోళ్ల పరిశ్రమలు నిర్వహిస్తున్న వారి పరిస్థితి దయనీయంగా మారింది. కోళ్ల ఉత్పత్తి పెరగటంతో డిమాండ్ పడిపోయి ధర పతనం కాగా.. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యాన ఎగుమతులు లేక గుడ్డుకు సైతం గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఇక వేసవిలో పరిశ్రమల నిర్వహణ ఖర్చులు పెరిగి నష్టాలను చవిచూడక తప్పడం లేదని వాపోతున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఖమ్మం, వైరా, సత్తుపల్లి, కల్లూరు, పెనుబల్లి, తల్లాడ, మధిర, ఎర్రుపాలెం, ఖమ్మం రూరల్, రఘునాథపాలెం, కొణిజర్ల, కొత్తగూడెం, సుజాత్నగర్, మణుగూరు తదితర ప్రాంతాల్లో బ్రాయిలర్, లేయర్ కోళ్ల పరిశ్రమలు ఉన్నాయి. ఉమ్మడి జిల్లాలో 60 లక్షల సామర్ధ్యం కలిగిన బ్రాయిలర్ పరిశ్రమలు, ఐదు లక్షల సామర్థ్యం లేయర్ పరిశ్రమలు కొనసాగుతున్నాయి. నిర్వహణ భారం హ్యచరీలో కోడి పిల్ల ధర రూ.65కు చేరడంతో దాణాగా వినియోగించే సోయాబీన్ ధరలు సైతం పెరిగాయి. సుమారు 2 కిలోల బరువుతో కోడి పెంపకానికి దాణా ఖర్చు రూ.160 అవుతుండగా.. ఇతర ఖర్చులు రూ.30 వరకు ఉంటాయి. మొత్తంగా రెండు కిలోల కోడి పెంపకానికి రూ.255 వరకు వుతుంటే... ప్రస్తుతం పౌల్ట్రీ వద్ద రెండు కిలోల లైవ్ బర్డ్ ధర రూ.196గానే ఉంది. ఫలితంగా ఒక్కో కోడి రూ.60.. వేలాదిగా కోళ్లతో పరిశ్రమలను నిర్వహించే వారు రూ.లక్షల్లో నష్టపోతున్నారు. వేసవిలో కోళ్ల పరిశ్రమ నిర్వహణ ఇబ్బందిగా మారింది. ఇటీవల కోళ్లకు ధర పెరగడంతో అంతా ఆసక్తి చూపగా ఉత్పత్తి ఒకేసారి వచ్చి ధరపై ప్రభావం పడింది. పరిశ్రమ వద్ద కిలో లైవ్ బర్డ్ ధర రూ.98 దాటకపోగా.. 35 వేల కోళ్ల పెంపకంతో దాదాపు రూ.20 లక్షలు నష్టం వాటిల్లుతోంది. – కర్నాటి వెంకటేశ్వరరెడ్డి, తక్కెళ్లపాడుఓ వైపు కోడి పిల్లలు, దాణా ధరలు, నిర్వహణ ఖర్చులు పెరుగుతున్నా.. ఉత్పత్తి పెరగటం, పోటీ కారణంగా కోళ్ల ధరలు తగ్గుతున్నాయి. ఈ ప్రభావం పరిశ్రమల నిర్వాహకులను కోలుకోలేని దెబ్బతీస్తుంది. వేసవిలో కోళ్ల పెంపకానికి ఖర్చు మరింత పెరిగి నష్టాలే వస్తున్నాయి. – రావి బాబూరావు, పౌల్ట్రీ నిర్వాహకుడు, ఖమ్మంగతేడాది నవంబర్ నుంచి చికెన్ ధరలు పెరిగాయి. దీపావళి, క్రిస్మస్, నూతన సంవత్సరం, సంక్రాంతి, సమ్మక్క–సారలమ్మ జాతరతో పాటు శుభ ముహూర్తాలు ఉండటంతో ఓ దశలో కిలో చికెన్ ధర రూ.350కు చేరింది. మార్చి వరకు డిమాండ్ ఉండడంతో పౌల్ట్రీల నిర్వాహకులు ఉత్పత్తిని పెంచారు. దీంతో ఏప్రిల్ ఆరంభం నుంచి కోళ్ల ఉత్పత్తి గణనీయంగా పెరగడంతో డిమాండ్ తగ్గి ధరపై ప్రభావం పడింది. సమ్మక్క–సారలమ్మ జాతర సమయంలో పరిశ్రమ వద్ద కిలో కోడి ధర ఓ దశలో రూ.180 పలకగా.. ఆ తర్వాత రూ.150కి.. గత వారం నుంచి రూ.98కు పడిపోయింది. ఈ ధర రైతులకు ఎంతమాత్రం గిట్టుబాటు కాకున్నా నష్టాలను చవిచూస్తూనే విక్రయించక తప్పటం లేదు. ఇదే సమయాన చికెన్ కంపెనీలు, షాపుల నిర్వాహకులు మాత్రం డిమాండ్ ఆధారంగా కిలో చికెన్ను రూ.210 నుంచి రూ.230 వరకు విక్రయిస్తున్నారు. యుద్ధ ప్రభావం కోడిగుడ్ల ధరపై పడింది. రవాణా జరకగ, ఎగుమతులకు అవకాశాలు లేకపోవటంతో ఇక్కడ ఉత్పత్తి అయ్యే గుడ్డుకు డిమాండ్ పడిపోయింది. గత ఏడాది జూలై నుంచి సెప్టెంబర్ వరకు గుడ్డు రిటైల్ ధర ప్రాంతాల వారీగా రూ.8 నుంచి రూ.9 వరకు పలికింది. ఆ తర్వాత ధర పతనమవుతూ ప్రస్తుం కోళ్ల పరిశ్రమల వద్ద రూ.4.70కు మించి పలకడం లేదు. ఇలా లేయర్ కోళ్ల పరిశ్రమల రైతులు నష్టాలను చవిచూడక తప్పని పరిస్థితి ఎదురవుతోంది. -
ధాన్యం కొనుగోళ్లలో జాప్యం వీడాలి
మధిర : ధాన్యం, మొక్కజొన్న కొనుగోళ్లలో ప్రభుత్వం తీవ్ర జాప్యం చేస్తోందని మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు జూలకంటి రంగారెడ్డి విమర్శించారు. ఇకనైనా జాప్యాన్ని విడనాడి కొనుగోళ్లలో వేగం పెంచాలని డిమాండ్ చేశారు. మధిర వ్యవసాయ మార్కెట్లో సోమవారం రైతులతో మాట్లాడిన ఆయన సమస్యలు తెలుసుకున్నారు. గన్నీ బ్యాగులు, కాటాలు, రవాణాలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని రైతులు చెప్పారు. ఈ సందర్భంగా రంగారెడ్డి మాట్లాడుతూ ప్రతీ ధాన్యపు గింజ కొనుగోలు చేస్తామన్న ప్రభుత్వం హామీ అమలు కావడం లేదన్నారు. అలాగే, కౌలు రైతుల సమస్యలు వెంటనే పరిష్కరించి షరతులు లేకుండా ధాన్యం, మొక్కజొన్న కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. నాయకులు పొన్నం వెంకటేశ్వరరావు, మడుపల్లి గోపాలరావు, శీలం నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. -
కేంద్రం తీరుతోనే మహిళా బిల్లుకు తూట్లు
● ఇంధన కష్టాలకు కేంద్రమే కారణం ● సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీ.వీ.రాఘవులు, విజ్జూకృష్ణన్కొణిజర్ల: దేశ మహిళలను మోసగించేలా మహిళా బిల్లు పార్లమెంట్లో వీగిపోవడానికి మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వమే కారణమని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీ.వీ.రాఘవులు, విజ్జూకృష్ణన్ విమర్శించారు. డీలిమిటేషన్కు మహిళా బిల్లును ముడిపెట్టడంతో ఈ పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. వైరా మున్సిపాలిటీ పరిధి మండలంలోని లాలాపురంలో సీపీఎం సీనియర్ నాయకుడు సంక్రాంతి మధుసూదన్రావు ప్రథమ వర్ధంతి సభ సోమవారం నిర్వహించగా ఆయన చిత్రపటం వద్ద నివాళులర్పించడమే కాక జీవితచరిత్ర పుస్తకాన్ని నాయకులు ఆవిష్కరించారు. అనంతరం రాఘవులు, విజ్జూకృష్ణన్ మాట్లాడుతూ పశ్చిమబెంగాల్ ఎన్నికలే లక్ష్యంగా కేంద్రప్రభుత్వం డీజిల్, పెట్రోలు ధరలు పెంచకుండా కంపెనీలపై ఒత్తిడి తీసుకురావడంతో కొరత ఏర్పడిందన్నారు. ఫలితంగా సామాన్యులు ఇబ్బంది పడడమే కాక వ్యవసాయ రంగం, ధాన్యం కొనుగోళ్లు మందగించాయని తెలిపారు. ఇక ఇరాన్ నుంచి రావాల్సిన చమురు ఓడలను అమెరికా అడ్డుకున్నా ప్రధాని మోదీ ట్రంప్కు మోకరిల్లి నోరు మెదపడం లేదని విమర్శించారు. రాష్ట్రంలో అస్తవ్యస్తం రాష్ట్రంలో పరిపాలన సరిగా లేక అస్తవ్యస్తంగా మారిందని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం విమర్శించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం ప్రభుత్వాన్ని విమర్శించే స్థాయికి పరిపాలన దిగజారిందన్నారు. ఇకనైనా హామీల అమలుపై పాలకలు దృష్టి సారించాలన్నారు. కాగా, ప్రజాక్షేత్రంలో ప్రజల కోసం పనిచేసే నాయకుల అవసరం ఉందని.. అలాంటి నాయకుడు మధుసూదనరావును ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. నాగర్కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లు రవి మాట్లాడుతూ యూపీ, బీహార్, గుజరాత్ వంటి రాష్ట్రాలకు దేశ సంపదను దోచి పెట్టేందుకు బీజేపీ ప్రభుత్వం డీలిమిటేషన్ పేరుతో కుట్రలు చేస్తోందని ఆరోపించారు. సంక్రాంతి పురుషోత్తమరావు అధ్యక్షతన నిర్వహించిన ఈ సభలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు పోతినేని సుదర్శనరావు, జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావుతో పాటు వివిధ పార్టీలు, సంఘాల నాయకులు సోమయ్య, భారతి, మల్లెంపాటి వీరభద్రం, బొంతు రాంబాబు, భూక్యా వీరభద్రం, చింతనిప్పు సులోచన, తాళ్లపల్లి కృష్ణ, కొప్పుల కృష్ణయ్య, చింతనిప్పు చలపతిరావు, సంక్రాంతి చంద్రశేఖర్, పువ్వాళ్ల దుర్గాప్రసాద్, వడ్డె నారాయణరావు, మధుసూధనరావు కుటుబీకులు సామ్రాజ్యం, రవి, రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
వైరా: వైరాలో ఎదురెదురుగా రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్న ఘటనలో ఓ యువకుడు మృతి చెందాడు. వైరా మండలం ముసలిమడుగుకు చెందిన వేల్పుల చందు(18), వినోద్ సోమవారం ద్విచక్రవాహనంపై ఖమ్మం వెళ్తున్నారు. వీరి వాహనాన్ని హనుమాన్ బజార్ వద్ద ఎదురుగా బైక్పై వచ్చిన శ్రీనివాస్ ఢీకొట్టాడు. ఘటనలో చందుకు తీవ్ర గాయాలు కాగా 108లో ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తుండగా మృతి చెందాడు. ఆయన కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రామారావు తెలిపారు. చోరీ కేసుల్లో నిందితుడి అరెస్టు కారేపల్లి: తాళం వేసి ఉన్న ఇళ్లలో చోరీలకు పాల్పడి, తప్పించుకు తిరుగుతున్న నిందితుడిని కారేపల్లి పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. ఎస్ఐ బి.గోపి తెలిపిన వివరాలు... ఖమ్మం ఖిల్లా బజార్కు చెందిన ఎండీ.మతిన్ కారేపల్లి పరిధిలో మూడు, మధిర, బోనకల్, పెద్దపల్లి మండలాల్లో ఒక్కో చోరీ కేసులో నిందితుడిగా ఉన్నాడు. ఈమేరకు విచారణ చేపట్టిన కారేపల్లి పోలీసులు ఆయనను కారేపల్లి ఆటోస్టాండ్ వద్ద సోమవారం అరెస్టు చేశారు. ఈ సందర్భంగా మతిన్ నుంచి మూడు తులాల బంగారం, 20తులాల వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించినట్లు ఎస్సై తెలిపారు. -
50 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్
కల్లూరు రూరల్: ఎవరికీ అనుమానం రాకుండా వరిగడ్డిలో దాచిన 50 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని ఉద్యోగులు సోమవారం స్వాధీనం చేసుకున్నారు. కల్లూరు మండలం ముగ్గు వెంకటాపురం – పెనుబల్లి మండలంలోని కుప్పినకుంట్ల మధ్య వాగు పక్కన బియ్యం నిల్వలు ఉన్నాయనే సమాచారంతో జీపీఓ నాగరాజు, సిబ్బంది తనిఖీలు చేపట్టారు. దీంతో గడ్డిలో దాచిన బస్తాలు లభించగా ట్రాక్టర్లో కల్లూరులోని గోదాంకు తరలించారు. రెండు రోజుల క్రితమే కల్లూరు మండలంలోని మూడు షాపుల్లో రికార్డులకు మించి బియ్యం ఉండడంతో అధికారులు షాప్లను సీజ్ చేశారు. అలాగే, ముగ్గు వెంకటాపురం నుంచి రెండు రోజుల క్రితమే 6.50 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని ఏపీకి తరలిస్తుండగా పట్టుకున్నారు. మళ్లీ సోమవారం గ్రామ శివార్లలో 50 క్వింటాళ్ల బియ్యం పట్టుబడడంతో ఈ గ్రామం కేంద్రంగా దందా సాగుతోందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.వాగు పక్కన గడ్డిలో నిల్వలు -
ఆలయ నిర్మాణానికి రూ.లక్ష విరాళం
రఘునాధపాలెం: మండలంలోని వీ.వీ.పాలెంలో కంఠమహేశ్వర – సూరమాంబ దేవాలయ నిర్మాణానికి గ్రామానికి చెందిన ఉయ్యాల వెంకట నర్సయ్య రూ.లక్ష విరాళం అందజేశారు. ఆయన గతంలో రూ.75వేలు అందించగా, మిగతా రూ.25వేలను సోమవారం అందించారని కమిటీ బాధ్యులు తెలిపారు. ఈ సందర్భంగా ఆయనకు ఆలయ కమిటీ సభ్యులు, గౌడ సంఘం నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. సొసైటీ కార్యాలయానికి తాళం వేసి నిరసనతల్లాడ: నెల రోజులుగా వరి ధాన్యం కొనుగోలు చేయకపోవడాన్ని నిరసిస్తూ తల్లాడ మండలం నూతనకల్ సొసైటీ కార్యాలయానికి సోమవారం రైతులు తాళం వేశారు. తెలంగాణ రైతు సంఘం అధ్యక్షుడు కళ్యాణపు కృష్ణయ్య, తూము శ్రీనివాసరావు ఆధ్వర్యాన రైతులు సోమవారం ఆంధోళన చేపట్టారు. నెల రోజులుగా రైతులు కొనుగోలు కేంద్రంలో ధాన్యం ఆరబోసి పడిగాపులు కాస్తున్నా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఈమేరకు నూతనకల్ సొసైటీ సిబ్బందిని బయటకు పంపించి తాళం వేశారు. మాజీ సర్పంచ్ తూము శ్రీనివాసరావుతో పాటు శెట్టిపల్లి లక్ష్మణ్రావు, వేమిరెడ్డి సీతారామిరెడ్డి, నాయుడు శ్రీనివాసరావు, రైతులు పాల్గొన్నారు. మృత్యువుతో పోరాటంలో ఓటమి 52రోజులుగా చికిత్స పొందుతున్న విద్యార్థి మృతి నేలకొండపల్లి: ఇంటర్ పరీక్షలు రాసి ఇంటికి వస్తుండగా రోడ్డు ప్రమాదంలో గాయపడిన విద్యార్థి చికిత్స పొందుతూ మృతి చెందాడు. నేలకొండపల్లి మండలానికి చెందిన విద్యార్థులు మార్చి 6న ఇంటర్ పరీక్ష రాసి బైక్లపై వస్తుండగా కారు ఢీకొట్టింది. ఘటనలో ఆరుగురికి తీవ్రగాయాలు కాగా ఆతర్వాత ఐదు రోజులకు కోరట్లగూడెంకు చెందిన అభిరామ్ మృతి చెందాడు. అలాగే, ఆరెగూడెంకు చెందిన బోయిన ఉదయ్(18)కు ఖమ్మం ఆస్పత్రిలో చికిత్స చేయిస్తుండగా 52 రోజులుగా మృత్యువుతో పోరాడుతున్న ఆయన సోమవారం కన్నుమూయడం కుటుంబంలో విషాదాన్ని నింపింది. రెండేళ్లుగా పరారీలో ఉన్న బ్యాంక్ మేనేజర్ అరెస్ట్ ఖమ్మంక్రైం: విదేశీ విద్య కోసం రుణాల పేరిట రూ.3.50కోట్లు కాజేసి రెండేళ్లుగా తప్పించుకుని తిరుగుతున్న బ్యాంక్ మేనేజర్ను సోమవారం ఖమ్మం వన్టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. భద్రాచలానికి చెందిన కొంగర రామకృష్ణ ఖమ్మం వైరారోడ్లో కొనసాగిన ఇండస్ ఇండో బ్యాంక్ మేనేజర్గా పనిచేసేవాడు. చదువు కోసం విదేశాలకు వెళ్లాలనుకునే విద్యార్థులు వస్తే అకౌంట్ తెరిపించి, ఇతర బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించేవాడు. తద్వారా వచ్చే కమీషన్ను స్టార్ పవర్ ఏజెన్సీ ద్వారా తన భార్య, ఇతరుల అకౌంట్లలో జమ చేయించుకున్నాడు. ఇలా జమ చేయించుకున్న రూ.3.50కోట్లలో కొంత షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టి నష్టపోగా, మిగిలిన డబ్బు సొంతానికి వాడుకున్నాడు. చివరకు కేతిరెడ్డి జయచంద్రారెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో 2024లో పోలీసులు కేసు నమోదు చేయగా రామకృష్ణ అప్పటి నుంచి పరారీలో ఉన్నాడు. ఈమేరకు సాంకేతిక ఆధారాలతో గుర్తించి ఆయనను సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామని సీఐ కరుణాకర్ తెలిపారు. ఆయిల్పామ్ తోట దగ్ధం ఖమ్మంరూరల్: మండలంలోని ఆరెంపులలో బండి నరేష్కు చెందిన ఆయిల్పామ్ తోట నిప్పంటుకుని దగ్ధమైంది. ఆయన రెండెకరాల్లో ఆయిల్పామ్ సాగు చేస్తున్నాడు. అయితే సోమవారం ఈ తోట పక్కనే సాగైన మొక్కజొన్న చేనుకు గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. దీంతో ఎగిసిన మంటలు ఆయిల్పామ్ మొక్కలకే కాక నీరు సరఫరా చేసే పైప్లైన్కు అంటుకుని పూర్తిగా కాలిపోయాయి. పంట చేతికందే దశలో జరిగిన ప్రమాదంలో తీవ్రంగా నష్టపోయాయనని నరేష్ ఆవేదన వ్యక్తం చేశాడు. -
బంక్ వద్ద వైర్ తాకి గాయాలు
తిరుమలాయపాలెం: పెట్రోల్ బంక్ వద్ద రోడ్డుపై కట్టిన వైరు తాకడంతో ఓ యువకుడి మెడకు తీవ్ర గాయాలయ్యాయి. మండలంలోని బచ్చోడుకు చెందిన నందిపాటి ఉపేందర్ ఆదివారం రాత్రి దమ్మాయిగూడెం నుండి మోటార్సైకిల్పై బచ్చోడు వైపు వెళ్తున్నాడు. బీరోలు సమీపాన బంక్ వద్ద వాహనాలు రాకుండా నిర్వాహకులు రోడ్డుకు అడ్డంగా వైర్ కట్టారు. చీకట్లో వైర్ కనిపించక ఉపేందర్ ముందుకు వెళ్లడంతో ఆయన మెడకు తీవ్ర గాయమైంది. దీంతో ఆయనను ఆస్పత్రికి తరలించగా, బంక్ యజమాని నిర్లక్ష్యంతోనే ఈ ఘటన జరిగిందని పేర్కొంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
మొక్కజొన్న పంట దగ్ధం
చింతకాని/కొణిజర్ల: చింతకాని మండలం సీతంపేటలో కౌలు రైతు కప్పల పాండుకు చెందిన మూడెకరాల మొక్కజొన్న పంట సోమవారం అగ్ని ప్రమాదంలో దగ్ధమైంది. మూడెకరాల్లో సాగు చేసిన పంటకు ప్రమాదవశాత్తు మంటలు అంటుకున్నాయి. దీంతో అగ్నిమాపక శాఖ సిబ్బందికి సమాచారం ఇవ్వగా వారు వచ్చేసరికి రూ.2లక్షల విలువైన పంట కాలిపోయింది. ఈమేరకు స్థానికులతో కలిసి సిబ్బంది చుట్టుపక్కల పంటలకు అంటుకోకుండా మంటలు ఆర్పివేశారు. ఇక కొణిజర్లలో కొమ్మినేని సుధాకర్, సామినేని అనంతరాములు, బొడ్డు రాములు 70క్వింటాళ్ల మొక్కజొన్నలను కల్లాల్లో ఆరబోశారు. కాగా, సమీపంలోని పలువురి చేన్లలో మిగిలి ఉన్న దంటుకు గుర్తుతెలియని వ్యక్తులు నిప్పంటించడంతో మంటలు ఎగిసిపడి సమీపంలోని మొక్కజొన్న చేలకు వ్యాపించడమే కాక ముగ్గురు రైతులు కల్లాల్లో ఆరబోసిన మక్కలు సైతం కాలిపోయాయి. దీంతో రైతులు అప్రమత్తమై జేసీబీలతో మట్టి కట్టలు పోయించడంతో మంటలు విస్తరించలేదు. ఇంతలోనే వైరా నుంచి అగ్నిమాపక శాఖ సిబ్బంది చేరుకుని ఆర్పివేశారు. కాగా, ఈ ఘటనలో రైతులు పొలాలకు నీరు అందించేందుకు ఏర్పాటుచేసిన పైపులు సైతం కాలిపోయాయి.సీతంపేటలో ప్రమాదం, కొణిజర్లలో అనుమానం -
ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన లారీ
తిరుమలాయపాలెం: ఆగి ఉన్న లారీని వెనక నుంచి మరో లారీ ఢీకొట్టడంతో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ఏపీ నుంచి బొప్పాయి లోడుతో వరంగల్ వెళ్తున్న లారీలో తిరుమలాయపాలెం మండలం గోపాయిగూడెం స్టేజీ వద్ద డీజిల్ అయిపోవడంతో పక్కన ఆపారు. ఈక్రమాన వెనక నుంచి వచ్చిన మరో లారీ బలంగా ఢీకొట్టడంతో రెండో లారీలోని ఇద్దరు డ్రైవర్లకు గాయాలయ్యాయి. కాగా, బొప్పాయి లోడ్ లారీలోని కాయలు చెల్లాచెదురుగా పడడంతో ఆ మార్గంలో వెళ్తున్న వారు తీసుకెళ్లేందుకు పోటీపడ్డారు. ఈమేరకు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడగా పోలీసులు చేరుకుని సరిదిద్దారు. కాగా, క్షతగాత్రుల వివరాలు తెలియరాలేదని ఎస్ఐ జగదీష్ తెలిపారు. బొప్పాయికాయలు తీసుకునేందుకు ఎగబడిన జనం -
ఆమె కూడా మృతి
ఖమ్మం క్రైం: ఖమ్మం జిల్లా కేంద్రంలో ఆదివారం రాత్రి భర్త, పెద్ద కుమార్తె అనుమానాస్పద మృతి కేసులో ఏకైక సాక్ష్యంగా ఉన్న భార్య కూడా మృతి చెందింది. ఖమ్మంలోని నివాసంలో కణతాల రాము, ఆయన పెద్దకుమార్తె దివ్యనైని మృతదేహాలను ఆదివారం రాత్రి గుర్తించగా అపస్మారక స్థితిలో ఉన్న ఆయన భార్య రమ్య, చిన్నకుమార్తె దీక్షిత ఆస్పత్రిలో చికిత్స పొందుతుండటం తెలిసిందే. భర్త, పెద్ద కుమార్తె మృతదేహాలతో మూడు రోజులుగా ఇంట్లోనే ఉన్న రమ్య.. చిన్నకుమార్తెను సైతం హత్య చేయడానికి ప్రయత్నించినట్లు సమాచారం.ఈ ఘటనలను ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు రమ్య కూడా కొద్ది మోతాదులో పురుగుల మందు తాగినట్లు తెలిసింది. దీంతో ఖమ్మం జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమెను ఏసీపీ రమణమూర్తి, టూటౌన్ సీఐ బాలకృష్ణ విచారించగా పొంతనలేని సమాధానాలు చెప్పగా ఏదో విషయాన్ని దాస్తోందని వారు గుర్తించినట్లు సమాచారం. ఈ క్రమంలోనే సోమవారం రాత్రి రమ్య పరిస్థితి విషమించి మృతి చెందింది.దీంతో చిన్న కుమార్తె మాత్రమే మిగిలినట్లయింది. ఈ మరణాలపై రాము సోదరుడు ఉపేందర్ ఫిర్యాదుతో పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. రాము, దివ్యనైని శరీరంపై బలమైన గాయాలు ఉండటంతో రమ్యకు ఇంకెవరైనా సహకరించారా అనే కోణంలోనూ విచారణ చేపట్టారు. మరోవైపు నేలకొండపల్లి మండలం కోనాయిగూడెంలో కణతాల రాము, ఆయన కుమార్తె దివ్యనైని అంత్యక్రియలను బంధువులు సోమవారం నిర్వహించారు. -
క్రీడా శిక్షణకు వేళాయె..
● మండల కేంద్రాల్లో 21 కేంద్రాలు ● జిల్లా కేంద్రంలో 23 కేంద్రాల ఏర్పాటు ఖమ్మం స్పోర్ట్స్: జిల్లాలో ఈ ఏడాది వేసవిలో క్రీడా శిక్షణా శిబిరాల నిర్వహణకు అధికారులు కార్యాచరణ రూపొందించారు. శిక్షణ కోసం సీనియర్ పీడీలు, పీఈటీలు, కోచ్లను ఏర్పాటు చేశారు. అండర్–14 విభాగం బాలబాలికలకే ఈసారి ప్రాధాన్యత ఇవ్వనుండగా.. ప్రధానంగా ఔత్సాహిక క్రీడాకారులను గుర్తించి మెరుగైన శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. వేసవి ముగిశాక ఇందులో ప్రతీ క్రీడాంశం నుంచి పది మందిని ఎంపిక చేసి దీర్ఘకాలిక శిక్షణ ఇప్పించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. 44 శిబిరాలు ఈ ఏడాది జిల్లా కేంద్రంతో పాటు మండల కేంద్రాల్లో 44 శిక్షణ శిబిరాల ఏర్పాటుకు నిర్ణయించారు. ఇందులో 21 కేంద్రాలు గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటుచేస్తారు. మరో 23 కేంద్రాలను జిల్లా కేంద్రంలో కొనసాగించనున్నారు. ఇందులో కొన్ని మినహా మిగతా అన్ని క్రీడాంశాల్లో ఫీజుల వసూలు చేస్తారు. గ్రామీణ ప్రాంతాలకు వచ్చేసరికి బాల్ బ్యాడ్మింటన్ (బోనకల్), బ్యాడ్మింటన్ శిక్షణను కల్లూరు, వైరా, మధిర స్టేడియంలో ఏర్పాటుచేస్తారు. అలాగే, వాలీబాల్ శిక్షణ శిబిరాలు ముదిగొండ, కల్లూరు, మధిర మినీ స్టేడియంలు, గుదిమళ్ల(ఖమ్మం రూరల్), తిమ్మరావుపేటలో, హ్యాండ్బాల్ శిక్షణ కొదుమూరులో, నెట్బాల్ శిక్షణకు ఏదులాపురంలో ఏర్పాటుచేయనున్నారు. ఇక ఫుట్బాల్ శిక్షణ కోసం మల్లెమడుగు, వీవీపాలెం, కల్లూరు మినీ స్టేడియం, కబడ్డీ శిక్షణ మల్లెమడుగు, కల్లూరు, మధిరలో, నెట్బాల్ శిక్షణ బచ్చోడు(తిరుమాలాయపాలెం)లో, ఖో–ఖో శిక్షణ శిబిరం కొదుమూరులో, టేబుల్ టెన్నిస్ శిక్షణకు తల్లాడలో, అథ్లెటిక్స్ కల్లూరులో, యోగా శిక్షణకు అయ్యగారిపేట శిబిరాలు ఏర్పాటుచేస్తారు. అలాగే, ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో అథ్లెటిక్స్, బాస్కెట్బాల్, బ్యాడ్మింటన్, వాలీబాల్, ఫుట్బాల్, జిమ్నాస్టిక్స్, స్కేటింగ్, ఉషూ, టెన్నిస్, స్విమ్మింగ్, వెయిట్లిఫ్టింగ్, ఆర్చరీ, టేబుల్ టెన్నిస్, ఖో–ఖో, హ్యాండ్బాల్, నెట్బాల్, క్రికెట్, హ్యాండ్బాల్, తైక్వాండో క్రీడాంశాల్లో శిక్షణ శిబిరాలు ఉంటాయి. ఇవికాక బాస్కెట్బాల్ శిక్షణ పెవిలియన్ గ్రౌండ్, సెయింట్ జోసెఫ్ హైస్కూల్లో ఉంటుంది. ఈమేరకు ఔత్సాహిక క్రీడాకారులు పేర్లు నమోదు చేసుకోవాలని డీవైఎస్ఓ టి.సునీల్రెడ్డి సూచించారు. -
అధికారులు తవ్వారు... అక్రమార్కులు పూడ్చారు!
పాల్వంచరూరల్: మండల పరిధిలోని తోగ్గూడెంలో నిబంధనలకు విరుద్ధంగా క్వారీల్లో మైనింగ్ నిర్వహిస్తున్నారు. అక్రమ మైనింగ్ను అరికట్టేందుకు క్వారీకి వెళ్లే దారిలో ఇటీవల ఎస్ఐ సురేష్, మైనింగ్ శాఖ అధికారులు కలిసి కందకాలు తవ్వించారు. ఆ తర్వాత పర్యవేక్షణ మరిచిపోయారు. అదే అదునుగా క్రషర్ల నిర్వాహకులు కందకాలను పూడ్చి క్వారీలను నిర్వహిస్తున్నారు. బ్లాస్టింగ్ అనుమతులు లేకున్నా పట్టపగలు శక్తివంతమైన జిలిటెన్ స్టిక్స్తో బండరాళ్లను పగులగొట్టి లారీల్లో క్రషర్ మిల్లులకు తరలిస్తున్నారు. బండరాళ్లను క్రషింగ్ చేసి కంకరను విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. మైనింగ్ ఏడీ స్పందించి క్వారీల వద్ద ప్రత్యేక చెక్ పోస్టు ఏర్పాటు చేయాలని ఆ ప్రాంత ప్రజలు కోరుతున్నారు. ఈ విషయమై మైనింగ్ ఏడీ దినేష్ను ఫోన్ ద్వారా వివరణ కోసం ప్రయత్నించగా.. అందుబాటులోకి రాలేదు. కందకాలు పూడ్చి క్వారీలో మైనింగ్ -
ధ్వజస్తంభ పునః ప్రతిష్టాపనలో అపశృతి
● విరిగి పడిన రాతి ధ్వజస్తంభం ● నలుగురికి గాయాలుబూర్గంపాడు: సారపాకలోని వినాయకుడి గుడి వద్ద ఆదివారం నిర్వహించిన ధ్వజస్తంభ పునఃప్రతిష్టాపనలో అపశృతి చోటుచేసుకుంది. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో రాతిశిలతో చేసిన ధ్వజస్తంభాన్ని క్రేన్ సాయంతో పునఃప్రతిష్ట చేసేందుకు ఏర్పాట్లు చేశా రు. వేడుకకు భక్తులు పెద్దసంఖ్యలో హాజరయ్యా రు. వేదపండితులు మంత్రోచ్ఛరణలతో భక్తుల జయజయ నామస్మరణలతో ధ్వజస్తంభ ప్రతిష్ట వైభవంగా జరిగింది. అయితే ధ్వజస్తంభం ఒకపక్కకు వంగి ఉండటతో క్రేన్తో సరిచేస్తుండగా రాతి ధ్వజస్తంభం మధ్యకు విరిగిపడింది. క్రేన్ రోప్ కట్టిఉండటంతో విరిగిన ధ్వజస్తంభం నెమ్మదిగా కిందపడిపోయింది. ఈ క్రమంలో కొందరు భక్తులకు గాయాలయ్యాయి. దీంతో భక్తులు భయాందోళనకు గురయ్యారు. గాయపడిన నలుగురిని భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించారు. వందలాది మంది భక్తులు ఉన్నప్పుడు జరిగిన ఈ ఘటనలో నలుగురికి మాత్రమే స్వల్పగాయాలు కావటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. భద్రాచలంలో చికిత్స భద్రాచలంఅర్బన్: గాయపడ్డ మహిళ, ఇద్దరు చిన్నారులను చికిత్స నిమిత్తం భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించారు. మహిళకు తీవ్ర గాయాలు కావడంతో పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. -
బలి తీసుకుంటున్న ఎండ
● ఉమ్మడి జిల్లాలో గరిష్టస్థాయిలో ఉష్ణోగ్రతల నమోదు ● పెరుగుతున్న వడదెబ్బ మరణాలు ● అయినా అవగాహన చర్యలు శూన్యం చుంచుపల్లి: రాష్ట్రంలోని మిగతాప్రాంతాల్లో పోలిస్తే ఉమ్మడి జిల్లాలో గరిష్టస్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండకు తోడు వడగాలుల ప్రభావం ఉండడంతో నానాటికీ వడదెబ్బ మరణాలు చోటుచేసుకుంటున్నాయి. గడిచిన వారం రోజులుగా పగటి ఉష్ణోగ్రతలు అమాంతం పెరగడంతో వృద్ధులు, రైతులు, పిల్లలు, ఉపాధి కూలీలు తట్టుకోలేకపోతున్నారు. ఇటీవల ఉమ్మడి జిల్లాలో 44.1 డిగ్రీలను దాటి ఉష్ణోగ్రత నమోదవుతోంది. ఉదయం నుంచి రాత్రి ప్రభావం ఉంటుండడంతో తప్పనిసరి బయటకు వస్తున్న వారు వడదెబ్బ బారిన పడుతున్నారు. అవగాహన.. అంతంతే ఉమ్మడి జిల్లాలో గరిష్ట స్థాయిలో ఎండల నేపథ్యాన రోజువారీ పనుల కోసం బయటికి వెళ్లేవారు వడదెబ్బ బారినపడే ప్రమాదం ఉంది. ఈక్రమాన అన్ని రకాల రక్షణ చర్యలు చేపట్టాలని ప్రభుత్వం కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసినా... ఉమ్మడి జిల్లాలో అలాంటి చర్యలేవీ కనిపించడం లేదు. పట్టణాలు, గ్రామాల్లో విస్తృతంగా చలివేంద్రాలు ఏర్పాటు చేయడమే కాక ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేయాల్సిన అవసరం ఉంది. అలాగే, వైద్యులతో సదస్సులు ఏర్పాటుచేసి ఎండ సమయాన తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వడదెబ్బకు గురైతే చికిత్సపై అవగాహన కల్పించాలి. ఇలాంటివి జరకపోవడం.. పలువురు వడదెబ్బ బారినపడి మృతి చెందుతుండడం కలిచివేస్తోంది. విపత్తు నిధి కింద పరిహారం వడదెబ్బతో మృతి చెందే వారి కుటుంబాలకు ప్రభుత్వం రాష్ట్ర విపత్తు సహాయనిధి కింద పరి హారం చెల్లిస్తోంది. ఈ పరిహారం గతంలో రూ.50వేలే ఉండగా.. ఆపద్బంధు పేరుతో రూ.4 లక్షలు పరిహారం చెల్లించనున్నట్లు గతేడాది ఉత్తర్వులు జారీ చేసింది. ఎవరైనా వడదెబ్బతో మృతి చెందితే స్థానిక వైద్యాధికారి ధ్రువీకరించాలి. ఆపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేసి పంచనామా నిర్వహిస్తారు. వడదెబ్బతో మృతి చెందినట్లు నిర్ధారణ కోసం తప్పనిసరిగా శవపరీక్ష నిర్వహించాలి. ఈ నివేదిక ఆధారంగా ఎఫ్ఆర్, మరణ ధ్రువపత్రం, పంచనామా నివేదికలను తహసీల్లో అందిస్తే వైద్యాధికారి, ఎస్ఎచ్ఓ, తహసీల్దార్లతో కూడిన కమిటీ ఆర్డీఓకు.. అక్కడి నుంచి కలెక్టర్ నివేదిక పంపించి పరిహారం మంజూరు చేస్తారు. అయితే ఈ పరిహారంపైనా చాలామందికి అవగహన లేకపోవడంతో దూరమవుతున్నారు.అశ్వాపురం మండలం జగ్గారానికి చెందిన రైతు మాదినేని బాబు(57) ఆదివారం చేను వద్దకు వెళ్లగా వడదెబ్బతో మృతి చెందాడు. చండ్రుగొండ మండలం గానుగపాడుకు చెందిన వ్యవసాయ కూలీ పణితి వెంకటేశ్వర్లు(57) ఈనెల 23న ఎండ తీవ్రతతో వడదెబ్బ తగిలి మృతి చెందాడు. ఈనెల 22న వైరా మండలం గరికపాడుకు చెందిన సుంకర వెంకటేశ్వర్లు(75) ఉపాధి పనులకు వెళ్లి వస్తూ, కల్లూరు మండలం గోపాలకుంటకు చెందిన ఫఠాన్ అమీన్భీ(75) ఇంట్లోనే ఎండదెబ్బతో గురై మృతి చెందాడు. ఇదేరోజు గేదేలను మేపడానికి వెళ్లిన పినపాక మండలం పోతిరెడ్డిపల్లి వాసి వెంకటేశ్వర్లు(51) సైతం మృత్యువాత పడ్డాడు. ఈనెల 20న కల్లూరు అంబేడ్కర్ నగర్కు చెందిన కూలీ పాలవలస రాజు(68), ఎర్రుపాలెం మండలం రాజుపాలేనికి చెందిన స్వర్ణ నర్సింహరావు(62) మృతి చెందారు. ఈనెల 19న చింతకాని మండలం నాగిలిగొండకు చెందిన వ్యవసాయ కూలీ మీరా(42), దమ్మపేట మండలం వడ్లగూడెంకు చెందిన పల్లెపు వెంకటలక్ష్మి(60) వడదెబ్బతో మృత్యువాత పడింది. ఈనెల 17న వైరా మండలం విప్పలమడకకు చెందిన మేడా లక్ష్మి(65), నాగులవంచకు చెందిన ఏ.ధనలక్ష్మి(40) ఎండ తీవ్రతతో అస్వస్తతకు గురై మృతి చెందారు. ఈనెల 14న కొణిజర్ల మండలం తణికెళ్లకు చెందిన ముత్యాల సత్యవతి(55) మిర్చి ఏరేందుకు వెళ్లి వడదెబ్బ లక్షణాలతో తీవ్ర అస్వస్తతకు గురై ఇంటివద్ద కుప్పకూలి మృతి చెందింది.ఎండల నేపథ్యాన 70 ఏళ్లు పైబడిన వారు, పిల్లలు ఉన్న వారు ఉదయం 10నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇంట్లోనే ఉండడం శ్రేయస్కరమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాక ప్రతిరోజు మూడు నుంచి ఐదు లీటర్ల నీరు తాగాలని, నీటిలో నిమ్మకాయ రసం, ఉప్పు లేదా పంచదార కలిపి తాగితే ఉపశమనం లభిస్తుందని చెబుతున్నారు. తప్పనిసరై బయటకు వచ్చినా తగిన జాగ్రత్తలు తీసుకుని వడదెబ్బ నుంచి రక్షణ పొందాలని సూచిస్తున్నారు. -
పనిమంతులు!
భానుడు నిప్పుల వర్షం కురిపిస్తున్నా ఉపాధి హామీ పథకం పనులకు గ్రామీణులు పోటెత్తుతున్నారు. తెల్లవారుజామునే పనికి వస్తున్నారు. ఈక్రమంలోనే జిల్లాలో పనులకు వస్తున్న వారిలో మహిళల సంఖ్య అధికంగా ఉంటుండడం విశేషం. ఉపాధి హామీ పనుల్లోనూ తామే మేటి అని నిరూపిస్తున్న ఆడపడుచులు.. పురుషులకు దీటుగా చెమట చిందిస్తూ పనిదినాలను పూర్తి చేస్తున్నారు. జిల్లాకు నిర్దేశించిన భారీ లక్ష్యంతో పోలిస్తే క్షేత్రస్థాయిలో పనులకు వ్యత్యాసం ఉండడం.. వడగాల్పుల సెగలతో ఉపాధి లక్ష్యం కుదేలవుతున్న వేళ.. కేవలం మహిళా కూలీల శ్రమతో పథకం ముందుకు సాగుతోంది. – ఖమ్మం మయూరిసెంటర్మహిళలే యాక్టివ్.. జిల్లాలో యాక్టివ్గా ఉన్న కూలీల్లో అత్యధికులు మహిళలే కావడం విశేషం. ప్రస్తుతం ఉన్న 2,70,821 మంది యాక్టివ్ కూలీల్లో 1,57,605 మంది మహిళలే కావడం వారి భాగస్వామ్యాన్ని చాటిచెబుతోంది. ఏప్రిల్లో ప్రభుత్వం నిర్దేశించిన 9.93 లక్షల పనిదినాల లక్ష్యాన్ని చేరుకోవడం ఉష్ణోగ్రతల కారణంగా గగనంగా మారింది. ఈనెల ముగియడానికి నాలుగు రోజులే ఉండగా.. ఇప్పటివరకు కేవలం 1.2394,011 పనిదినాలే పూర్తయ్యాయి. ఇందులో సింహభాగం అంటే 70 వేలకు పైగా పనిదినాలను మహిళా కూలీలే పూర్తి చేసి జిల్లా గౌరవాన్ని చాటుతున్నట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ఎండల ప్రభావంతో వెనకబాటు ప్రస్తుత వేసవిలో ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పెరగడం ఉపాధి పనుల నిర్వహణపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఏప్రిల్కు సంబంధించి ప్రభుత్వం జిల్లాకు 9.93 లక్షలకు పైగా పనిదినాల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. అయితే భానుడి సెగలతో కూలీల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. గతంలో ఏప్రిల్ నెలలో అత్యధిక పనిదినాలను పూర్తి చేసేవారు. కానీ ఈ ఏడాది ఏప్రిల్ ముగిసేందుకు నాలుగు రోజుల సమయమే ఉన్నా లక్ష్యంలో కనీసం సగం కూడా చేరకపోవడం గమనార్హం. ఇప్పటి వరకు జిల్లాలో కేవలం 1,23,462 పనిదినాలే పూర్తికావడం ద్వారా కేవలం 10 – 11 శాతంగానే నమోదైంది. పర్యవేక్షణతోనే లక్ష్య సాధన ఉపాధి హామీ పథకంలో ప్రభుత్వ లక్ష్యం మేర పనిదినాలు పూర్తి చేయాలంటే జిల్లా అధికారులు మొదలు క్షేత్ర స్థాయిలో ఫీల్డ్ అసిస్టెంట్లు, పంచాయతీ కార్యదర్శుల నిరంతర పర్యవేక్షించాల్సి ఉంటుంది. కానీ ఫీల్డ్ అసిస్టెంట్ల కొరత, ఉపాధి హామీ పథకం సిబ్బందికి వేతనాల్లో జాప్యం తదితర కారణాలతో పర్యక్షణ కొరవడి పనులు మందకొడిగా సాగుతున్నాయని తెలుస్తోంది. ఇకనైనా అధికారులు గ్రామీణ ప్రాంతాల్లో పనులపై కూలీలకు అవగాహన కల్పించడమే కాక పాటు క్షేత్ర స్థాయిలో సౌకర్యాలు కల్పిస్తే లక్ష్యసాధన సులువు కానుంది.చెమట చిందిస్తున్న చైతన్యమూర్తులు -
బీటెక్ విద్యార్థినికి రూ.78వేల ఆర్థికసాయం
కల్లూరు: నిరుపేద విద్యార్థిని బీటెక్ చదువుతుండగా, ఆమె ఫీజు ఇతర అవసరాల కోసం స్ఫూర్తి ఫౌండేషన్ ఆధ్వర్యాన ఆదివారం రూ.78 వేల ఆర్థికసాయం అందచేశారు. పాతికేళ్ల క్రితం కేరళ నుంచి వచ్చి కల్లూరు స్థిరపడిన గార్నెట్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. ఆయన భార్య నాగమణి ఓ ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేస్తుండగా కుమార్తె మోరియర్ డయానా బీటెక్ చదువుతుంది. ఆమె ఫీజు కట్టలేని పరిస్థితుల్లో ఉండడంతో స్ఫూర్తి ప్రతినిధి వరకా రామారావును సంప్రదించగా ఎన్ఆర్ఐల చేయూతతో ఆయన రూ.78 వేలు అందజేశారు. పోలీసుల దాతృత్వం తల్లాడ: తల్లాడ మండలం మల్లారం గ్రామం నుంచి పోలీసు శాఖలో ఉన్న పలువురు దాతృత్వం చాటుకున్నారు. గ్రామానికి చెందిన షేక్ యాకుబ్ పాషాకు కాలు ఇటీవల రోడ్డు ప్రమాదంలో విరగగా కదల్లేని స్థితిలో ఉన్నాడు. ఆయన కుటుంబం పరిస్థితిని గమనించిన మల్లారం పోలీసులు ఆదివారం రూ.20 వేల ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో గాదెరంజిత్, కుంచం రాంప్రసాద్, దుగ్గి దేవర ముత్యాలరావు, పసుపులేటి ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు. మూడు నెలల బియ్యం తరలింపులో ముందంజ నేలకొండపల్లి: ప్రభుత్వం ఈసారి మూడు నెలల బియ్యాన్ని రేషన్షాపుల ద్వారా లబ్ధిదారుల పంపిణీ చేస్తోంది. ఈనేపథ్యాన షాప్లకు సకాలంలో బియ్యం చేర్చడంలో జిల్లాలోనే నేలకొండపల్లి మండల లెవల్ స్టాక్ పాయింట్ ఆదర్శంగా నిలిచింది. ఇక్కడి స్టాక్ పాయింట్ పరిధిలో కూసుమంచి, నేలకొండపల్లి, ముదిగొండ మండలాలు ఉండగా, 119 షాప్లకు 3,900 మెట్రిక్ టన్నుల బియ్యం సరఫరా చేశారు. అనుకున్న సమయం కంటే ముందుగానే తరలించిన ఉద్యోగులు, హమాలీలను జిల్లా సివిల్ సప్లయీస్ అధికారులు అభినందించారు. ఈమేరకు ఆదివారం పాయింట్ ఇన్చార్జ్ గుగులోత్ లక్ష్మణ్ను సిబ్బంది సన్మానించారు. ట్రాక్టర్ బోల్తా పడడంతో డ్రైవర్ మృతి నేలకొండపల్లి: ప్రమాదవశాత్తు ట్రాక్టర్ బోల్తా పడగా డ్రైవర్ మృతి చెందిన ఘటన మండలంలో ఆదివారం చోటు చేసుకుంది. నేలకొండపల్లి మండలం చెరువుమాధారం గ్రామానికి చెందిన యడవల్లి నాగేశ్వరరావు(51) ఆదివారం ట్రాక్టర్ డ్రైవింగ్ చేస్తూ వెళ్తున్నాడు. బుద్ధారం–చెరువుమాధారం రహదారిలో ప్రమాదవశాత్తు ట్రాక్టర్ అదుపు తప్పి పల్టీ కొట్టడంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో స్థానికులు నేలకొండపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఇందిరమ్మ ఇంటి కోసం తప్పుడు పత్రాలుచింతకాని: తప్పుడు ధృవీకరణ పత్రాలు సమర్పించి తమకు దక్కాల్సిన ఇందిరమ్మ ఇంటిని మరో మహిళ దక్కించుకుందని చింతకాని మండలం నాగిలికొండకు చెందిన పామర్తి లక్ష్మీతిరుపతమ్మ ఫిర్యాదు చేసింది. అదే గ్రామానికి చెందిన పామర్తి కళావతిపై ఆమె ఆదివారం పోలీసులకు ఫిర్యాదు అందజేసింది. దీంతో కళావతితో పాటు ఆనాటి గ్రామ పంచాయతీ కార్యదర్శి అనిల్పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై వీరేందర్ తెలిపారు. వేధింపుల కేసు నమోదుమండలంలోని రామకృష్ణాపురం గ్రామానికి చెందిన దాసరి సందీప్కుమార్, ఆయన తల్లిదండ్రులు సంపత్, భారతిపై పోలీసులు ఆదివారం వేధింపుల కేసు నమోదు చేశారు. సందీప్ భార్య సౌమ్యను ఆయనతో పాటు మామ సంపత్, అత్త భారతి వేధిస్తున్నట్లు బాధితురాలు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశామని ఎస్సై తెలిపారు. -
భూమికి బలం..
రైతుకు భారంఖమ్మంవ్యవసాయం: సేంద్రియ పద్ధతిలో భూసారాన్ని పెంచేందుకు అవకాశం ఉన్న పచ్చిరొట్ట సాగుకు ప్రోత్సాహం కొరవడుతోంది. నాణ్యమైన పంటల ఉత్పత్తికి తోడ్పడే పచ్చిరొట్ట విత్తనాలకు ప్రభుత్వం ఏటేటా రాయితీలను తగ్గిస్తోంది. ఇదే సమాయన విత్తనాల ధరలు పెరుగుతుండడంతో పచ్చిరొట్ట సాగు రైతులకు భారంగా మారుతోంది. అంఏకాక తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ ద్వారా పచ్చిరొట్ట విత్తనాల పంపిణీకి నిధుల కేటాయింపు ఉన్నప్పటికీ కొంత మేరకు మాత్రమే రాయితీలకు వినియోగిస్తున్నారు. మరోపక్క సమయానికి విత్తనాలు అందుబాటులోకి రావడం లేదు. ఇలా రకరకాల కారణాలతో భూమికి మేలు చేస్తూ అధికోత్పత్తులకు దోహదపడే పచ్చిరొట్ట సాగు కూడా రైతుల నుంచి దూరమయ్యే పరిస్థితులు దాపురించాయి. కర్బనం తక్కువగా... తెలంగాణలోని భూముల్లో సేంద్రియ కర్బనం తక్కువగా ఉందని నిపుణులు గుర్తించారు. ఈనేపథ్యాన సేంద్రియ కర్బనం పెంచాల్సిన అవసరముందని నిపుణులతో పాటు, ప్రభుత్వం కూడా చెబుతోంది. పచ్చిరొట్ట సాగు చేసి భూమిలో కలియదున్నడం ద్వారా అంతరాలను సరిచేసే అవకాశం ఉంటుంది. కానీ ఐదేళ్లుగా పచ్చిరొట్ట విత్తనాల పంపిణీ తగ్గడంతో దాదాపు రాష్ట్రమంతటా పచ్చిరొట్ట సాగు విస్తీర్ణం గణనీయంగా పడిపోతోంది. రాయితీ తగ్గి.. ధరలు ౖపైపెకి.. పచ్చిరొట్ట విత్తనాలపై రాయితీ గడిచిన మూడేళ్ల కాలంలో 65 శాతం నుంచి 50 శాతానికి పడిపోయింది. ఐదేళ్ల క్రితం వివిధ రకాల పంటల విత్తనాలకు రాయితీలు ఎత్తివేసిన ప్రభుత్వం పచ్చిరొట్ట విత్తనాల విషయంలో అదే తీరు అవలంబిస్తోంది. జీలుగు, జనుము, పిల్లి పెసర వంటి పచ్చిరొట్ట విత్తనాలకు 2023లో 65 శాతం రాయితీ ఇవ్వగా, 2024లో 60 శాతానికి, 2025లో 50 శాతానికి కుదించారు. ఇదే సమయాన పచ్చిరొట్ట విత్తన ధరలు పెరుగుతున్నాయి. 2023లో 30 కిలోల జీలుగు విత్తన బ్యాగ్ రైతు వాటా రూ.842 ఉంటే 2025లో ఏకంగా రూ. 2,137కు పెరిగింది. జనుము 40 కిలోల బ్యాగ్ ధర రూ.1,225 నుంచి రూ. 2,510కు, పిల్లి పెసర 20 కిలోల విత్తనాల బ్యాగ్ ధర రూ. 703 నుంచి రూ.2,055కు పెరగడం గమనార్హం. నిధులు వృథా ప్రభుత్వం కేటాయిస్తున్న బడ్జెట్లో 50 శాతమే పచ్చిరొట్ట విత్తనాల రాయితీలకు వినియోగిస్తున్నారు. గత ఏడాది ప్రభుత్వం రూ.130 కోట్లు కేటాయిస్తే.. విత్తనాల సబ్సిడీకి రూ.67 కోట్లను మాత్రమే తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ వినియోగించింది. ఫలితంగా మిగిలిన రూ.63 కోట్ల నిధులు వృథా అయ్యాయి. సగానికి పడిపోయిన సాగు ఐదేళ్ల కాలంలో పచ్చిరొట్ట విత్తనాల పంపిణీ క్రమంగా తగ్గుతుండగా, సాగు విస్తీర్ణం కూడా పడిపోతోంది. 2021లో రాష్ట్రంలో 1.75 లక్షల క్వింటాళ్ల విత్తనాలను పంపిణీ చేస్తే 14.45 లక్షల ఎకరాల్లో పంట సాగైంది. ఇక 2022లో 1.66 లక్షల క్వింటాళ్లే పంపిణీ చేయగా 13.66 లక్షల ఎకరాల్లో, 2023లో 1.27 లక్షల క్వింటాళ్ల విత్తనాలతో 10.46 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేశారు. అలాగే, 2024లో 1.16 లక్షల క్వింటాళ్లు పంపిణీ చేయగా 9.31 లక్షల ఎకరాల్లో, 2025లో 0.87 లక్షల క్వింటాళ్ల విత్తనాలే పంపిణీ చేయగా పచ్చిరొట్ట సాగు 7.05 లక్షల ఎకరాలకు పరిమితమైంది. అంటే 2021తో పోలిస్తే 2025కు వచ్చే సరికి పచ్చిరొట్ట సాగు విస్తీర్ణం రాష్ట్రంలో సగానికి పడిపోయింది. ఎరువుల లభ్యత లేని ఈ సమయంలోనైనా పచ్చిరొట్ట విత్తనాల రాయితీని పెంచి పంపిణీ చేస్తే ప్రయోజనం ఉంటుందని చెబుతున్నారు. ఈపాటికే రావాలి... పచ్చిరొట్ట విత్తనాలు సమయానికి రైతులకు అందడం లేదు. తొలకరికి ముందుగానే మే మొదటి వారంలో విత్తనాలను అందుబాటులోకి తీసుకురా వాలి. కానీ ఈసారి కూడా ఆ పరిస్థితి కానరావడం లేదు. అకాల వర్షాలకు రైతులు దుక్కలు చేసుకొని భూసారాన్ని పెంచుకునేందుకు పచ్చిరొట్ట విత్తనాలు వేసుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే, విత్తనాల లభ్యత లేక ఈ ఏడాది కూడా సాగుకు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.పచ్చిరొట్ట విత్తనాలపై తగ్గుతున్న రాయితీలు సంవత్సరం రాయితీ శాతం రైతు వాటా (విత్తన బ్యాగ్కు.. రూ.ల్లో) జీలుగు జనుము పిల్లిపెసర 2023 65 842 1,225 703 2024 60 1,116 1,448 1,084 2025 50 2,137 2,510 2,055 -
డిప్యూటీ సీఎం, మంత్రిని కలిసిన కలెక్టర్
ఖమ్మం సహకారనగర్: కలెక్టర్గా నియమితులైన టీఎస్ దివాకర ఆదివారం ఖమ్మం వచ్చారు. ఈ సందర్భంగా జిల్లా పర్యటనలో ఉన్న డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన పుష్పగుచ్ఛాలు అందించగా వారు అభినందించారు. అనంతరం కలెక్టర్ను మంత్రి తుమ్మల సత్కరించారు. నేడు, రేపు మంత్రి తుమ్మల పర్యటన ఖమ్మంఅర్బన్: రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రెండు రోజుల పాటు జిల్లాలో పర్యటించనున్నారు. సోమవారం ఉదయం ఖమ్మం 16వ డివిజన్ ధంసలాపురం కాలనీలో సీసీ డ్రెయిన్లు, రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశాక రఘునాథపాలెం రైతు వేదికలో జరిగే ‘రైతు ముంగిట్లోకి శాస్త్రవేత్తలు’ కార్యక్రమంలో పాల్గొంటారు. అలాగే, మంగళవారం ఖమ్మం 18వ డివిజన్ శ్రీరామ్నగర్, శ్రీరామ్హిల్స్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలకు మంత్రి హాజరవుతారు. నేడు ‘రైతు ముంగిట్లోకి శాస్త్రవేత్తలు’ వైరా/రఘునాథపాలెం: పంటల సాగు, విత్తనాల ఎంపిక, సాంకేతిక వినియోగం తదితర అంశాలపై రైతులకు అవగాహన కల్పించేందుకు సోమవారం ‘రైతు ముంగిట్లోకి శాస్త్రవేత్తలు’ పేరిట కార్యక్రమం నిర్వహించనున్నారు. రఘునాథపాలెంలోని రైతువేదికలో ఉదయం జరిగే కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొంటారని వైరా కేవీకే కోఆర్డినేటర్ డాక్టర్ టి.పావని తెలిపారు. అలాగే, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు హాజరై రైతులకు అవగాహన కల్పిస్తారని వెల్లడించారు. ఈమేరకు ఏర్పాట్లను డీఏఓ పుల్లయ్య, రఘునాథపాలెం ఏఓ కె.ఉమామహేశ్వరరెడ్డి తదితరులు ఆదివారం పరిశీలించారు. ముగిసిన ఓపెన్ స్కూల్ పరీక్షలు ఖమ్మం సహకారనగర్: తెలంగాణ ఓపెన్ స్కూల్ పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు ఆదివారంతో ముగిసినట్లు డీఈఓ చైతన్య జైనీ, ఓపెన్ స్కూల్ ఉమ్మడి ఖమ్మం జిల్లా కో ఆర్డినేటర్ కూరపాటి మంగపతిరావులు ఒక ప్రకటనలో తెలిపారు. పదో తరగతి పరీక్షలకు 918 మందికి గాను 772 మంది హాజరయ్యారని, 146 మంది గైర్హాజరయ్యారని పేర్కొన్నారు. ఇంటర్మీడియట్లో 1,509 మందికిగాను 1,285మంది హాజరు కాగా, 224 మంది గైర్హాజరైనట్లు వివరించారు. 28 నుంచి ప్రాక్టికల్ పరీక్షలు ఓపెన్ స్కూల్ ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు ఈ నెల 28నుంచి మే 5వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. ‘దుమ్ముగూడెం’ వద్ద నిలకడగా గోదావరిఅశ్వాపురం: మండల పరిధిలోని కుమ్మరిగూడెంలో ఉన్న దుమ్ముగూడెం ఆనకట్ట వద్ద గోదావరి నీటిమట్టం పది రోజులుగా నిలకడగా కొనసాగుతోంది. గత శుక్రవారం 48.5 మీటర్ల నీటిమట్టం నమోదైంది. ఆనకట్ట సమీపంలో ఉన్న మిషన్ భగీరథ ఇంటేక్ వెల్ నుంచిజిల్లా వ్యాప్తంగా గ్రామాలకు మిషన్ భగీరథ పథకం ద్వారా రోజూ 150ఎంఎల్డీ నీరు సరఫరా చేస్తారు. భారజల కర్మాగారం ఇంటేక్వెల్ ద్వారా నీరు సేకరిస్తారు. 49.5 మీటర్లు నీటి మట్టం ఉంటే ఆనకట్ట అలుగుపోస్తుంది. నీటిమట్టం 47 మీటర్ల దిగువకు పడిపోతే తాగునీటి సరఫరాకు ఇబ్బందులు ఎదురవుతాయి. గతేడాది ఏప్రిల్ రెండో వారంలో ఇదే పరిస్థితి ఎదురైతే నీటిపారుదల శాఖ అధికారులు ఎగువ ప్రాంతాల నుంచి నీటిని వదిలారు. పది రోజులుగా నీటిమట్టం నిలకడగా ఉందని ఎగువ ప్రాంతంలోని లక్ష్మి, సమ్మక్క, సాగర్ బ్యారేజీల నుంచి కొంత ఇన్ఫ్లో ఉన్నందున, ప్రస్తుతానికి తాగునీటికి ఢోకా లేదని మిషన్ భగీరథ అధికారులు చెబుతున్నారు. -
అభివృద్ధి, సంక్షేమంలో వెనకాడేది లేదు..
ముదిగొండ: ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ప్రజలకు సౌకర్యాలు కల్పించడంతో పాటు పథకాల అమలులో వెనకాడేది లేదని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ముదిగొండ మండలం మేడేపల్లిలో రూ 9కోట్ల వ్యయంతో చేపట్టే బీటీ రోడ్ల నిర్మాణాలకు డిప్యూటీ సీఎం ఆదివారం రాత్రి శంకుస్ణాపన చేశారు. తొలుత గ్రామ నాయకులు, కార్యకర్తలు ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం స్థానిక ఆలయంలో పూజలు చేసిన భట్టి.. మేడేపల్లి–గోకినేపల్లి, మేడేపల్లి–యడవల్లి లక్ష్మీపురం వరకు రహదారుల నిర్మాణానికి శంకుస్థాపన చేసి మాట్లాడారు. అభివృద్ధి నిరంతర ప్రక్రియ అని.. ఎక్కడ ఏ వసతులు కల్పించాలన్నా నిధులు మంజూరు చేస్తామని తెలిపారు. అనంతరం అనారోగ్యంతో బాధపడుత్ను పలువురిని ఆయన పరామర్శించగా, ధాన్యం, మొక్కజొన్న కొనుగోళ్లు చేయాలని, గన్నీ సంచులు సమకూర్చాలని రైతులు కోరారు. ఈ మేరకు మార్క్ఫెడ్ అధికారులకు డిప్యూటీ సీఎం భట్టి సూచనలు చేశారు. గిడ్డంగులు, హస్తకళల సంస్థల చైర్మన్లు రాయల నాగేశ్వరరావు, నాయుడు సత్యనారాయణ, వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నూతి సత్యనారాయణగౌడ్, నాయకులు, ప్రజాప్రతినిధులు కొండబాల కోటేశ్వరరావు, సామి నేని వెంకటేశ్వరరావు, సామినేని రమేష్, చెరుకుపల్లి జగన్నాధం, శ్రీనివాసరావు, జూలకంటి సంజీవరెడ్డి, పసుపులేటి దేవేంద్రం, దేవరపల్లి ఆదినారాయణ రెడ్డి, బాబురాంరెడ్డి, రాఘవ పాల్గొన్నారు.డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క -
భద్రగిరిలో జీర్ణోద్ధరణ
● ఉపాలయాల్లో మూర్తులకు కళావాహన ● పూజల్లో పాల్గొన్న త్రిదండి చిన్నజీయర్ స్వామిభద్రాచలం: భద్రగిరి శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం అభివృద్ధిలో ప్రధాన ఘట్టం ఆదివారం ఆవిష్కృతమైంది. ఆలయ నిర్మాణం అనంతరం ఏకకాలంలో 15 ఉపాలయాల్లోని 72 మూలమూర్తులు, మూడు గోపురాలకు ఒకే రోజు కళావాహన నిర్వహించడం తొలిసారని రిటైర్డ్ అర్చకులు పేర్కొంటున్నారు. ఆలయ అభివృద్ధిలో భాగంగా ఉపాలయాలు, ఆళ్వార్ల గుడులను తొలగించాల్సి వస్తోంది. దీంతో మూలమూర్తులను తరలించేందుకు కళావాహన చేపట్టారు. జీర్ణోద్ధరణకు అర్చకులు మూలమూర్తుల వద్ద అనుజ్ఞ తీసుకున్నారు. ఈ కార్యక్రమానికి త్రిదండి చినజీయర్ స్వామి హాజరయ్యారు. అనంతరం ఆలయ భక్త రామదాసు, భద్రగిరి మహర్షి, శ్రీ లక్ష్మీతాయారు అమ్మవారు, ఇతర ఉపాలయాల్లో కళావాహన చేశారు. 60 మంది రుత్విక్కులతో.. వివిధ ఆలయాల నుంచి వచ్చిన 60మంది రుత్వి క్కులు, ఆలయ అర్చకులు మేళతాళాల నడుమ పవిత్ర గోదావరి నుంచి పుణ్య జలాలను తీసుకొచ్చి యాగశాలలో పూజలు చేశారు. కళావాహన అనంతరం విగ్రహాలను కదిలించారు. శ్రీలక్ష్మీతాయారు, గోదాదేవి అమ్మవార్లను ప్రధాన ఆలయ ముఖమండపం వద్ద భక్తుల దర్శనార్థం ఉంచుతా మని, ఇతర మూర్తులను రంగనాయకుల గుట్టపై ధ్యానమందిరంలో నిర్మించిన తాత్కాలిక బాలాలయంలో కొలువుదీర్చుతామని అధికారులు తెలి పారు. కాగా, మధ్యాహ్నంవరకు స్వామివారి దర్శ నం నిలిపివేయగా, సమాచారం తెలియని, దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు వేచి చూశారు. భక్త రామదాసుకు ప్రాధాన్యం ప్రపంచ వ్యాప్తంగా ఆగమ శాస్త్రం ప్రకారం భద్రాచలం రామాలయానికి ఎంతో ప్రాముఖ్యత ఉందని త్రిదండి చినజీయర్ స్వామి అన్నారు. కళావాహన అనంతరం ఆలయ విలేకర్లతో మాట్లాడారు. రామయ్య స్వామి ఆలయం నిర్మించిన భక్త రామదాసుకు నూతన ఆలయ అభివృద్ధిలో కీలక ప్రాధాన్యం కల్పించాలన్నారు. ప్రధానాలయంలో రామయ్యకు ఒక వైపు శ్రీ లక్ష్మీతాయారు అమ్మవారు, మరో వైపు గోదాదేవి, లక్ష్మీతాయారు అమ్మవారికి ఎదురుగా భక్త రామదాసు విగ్రహం ఏర్పాటు చేయాలని ప్రతిపాదించినట్లు వివరించారు. నిత్యం రామయ్యతో పాటు రామదాసుకు పూజలు జరగాలన్నారు. ఆలయ అభివృద్ధి అనంతరం ఉపాలయాలన్నీ ఒక వైపు, ఆళ్వార్లు మరోవైపు ఒకే చోట భక్తులకు దర్శనానికి ఉంటారని తెలిపారు. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు పూజల్లో పాల్గొని, ఈఓను పనుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆలయ ఈఓ దామోదర్రావు దంపతులు, ఏఈఓ లు శ్రవణ్కుమార్, భవాని రామకృష్ణ, ఉత్సవ కమిటీ బాధ్యులు కోటి శ్రీమన్నారాయణాచార్యులు, అమరవాది మురళీకృష్ణమాచార్యులు, రిటైర్డ్ ప్రధానాచార్యులు పొడిచేటి రామచంద్రాచార్యులు, పొడిచేటి సీతారామానుజాచార్యులు, ప్రధాన అర్చకులు విజయరాఘవన్, కోటి రామ స్వరూప్లు, స్థానాచార్యులు స్థలశాయి, వేదపండితులు కృష్ణమాచార్యులు తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వాస్పత్రులపై పర్యవేక్షణ పెరగాలి
సూపర్బజార్(కొత్తగూడెం): ప్రభుత్వ వెద్యశాలలపై మరింత పర్యవేక్షణ పెరగాలని కొత్తగూడెం శాసనసభ సభ్యుడు కూనంనేని సాంబశివరావు హెచ్చరించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మాట్లాడారు. ఆస్పత్రుల్లో మందుల కొరత లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, సామాన్య ప్రజలకు ప్రభుత్వ ఆస్పత్రులపై నమ్మకం కలిగించాలని సూచించారు. వైద్యశాలల్లో సదుపాయాలు సమకూర్చాలని చెప్పారు. జిల్లా వైద్యశాఖ అధికా రి తుకారాం రాథోడ్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. వృద్ధురాలికి గాయాలుటేకులపల్లి: ఇంటి గోడ కూలి శతాధిక వృద్ధురాలికి తీవ్రగాయాలైన ఘటన ఆదివారం జరిగింది. మండలంలోని కొత్తతండా జి గ్రామంలో ఆదివారం రాత్రి 110 సంవత్సరాల మహిళ బోడ అస్లీ కుటుంబ సభ్యులతో కలిసి ఉంది. ఒక్కసారిగా గోడకూలి పడటంతో ఆమె తల, ముఖానికి తీవ్ర గాయాలు అయ్యాయి. 108 ద్వారా కొత్తగూడెం ఏరియా ఆస్పత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు -
భర్త, కూతురిని చంపి.. మూడు రోజులుగా మృతదేహాలతో?
ఖమ్మం క్రైం: తెలంగాణలోని ఖమ్మం బుర్హాన్పురంలో దారుణం చోటుచేసుకుంది. ఓ ఇంట్లో తండ్రీ కుమార్తె మృతి చెందగా.. తల్లి, మరో కూతురు అపస్మారక స్థితిలో ఉండడాన్ని ఆదివారం రాత్రి పోలీసులు గుర్తించారు. నేలకొండపల్లి మండలం అనంతనగర్కు చెందిన కణతల రాము(29) ఓ దినపత్రికలో జర్నలిస్ట్ కాగా భార్య రమ్య, కుమార్తెలు దివ్య నైనీ(5), దీక్షితతో కలిసి బుర్హాన్పురంలో ఉంటున్నాడు. నాలుగైదు రోజులుగా రాముకు ఆయన కుటుంబ సభ్యులు ఫోన్చేసినా ఎత్తకపోగా.. ఆయన భార్య రమ్య ఫోన్ ఎత్తి ఆయనకు ఆరోగ్యం బాగా లేక తాను మాట్లాడుతున్నట్లు చెబుతోంది.ఆదివారం ఉదయం ఒక మహిళ రమ్య ఇంటికి వచ్చి పిలవగా.. రమ్య దుప్పటి కప్పుకుని బయటకు వచ్చి రాము అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరినట్లు చెప్పింది. ఇంట్లో దుర్వాసనపై ఆరా తీయగా.. ఇంట్లో ఎవరికీ బాగాలేకపోవడంతో శుభ్రం చేయలేదని బదులిచ్చింది. కాగా, ఆదివారం రాత్రి రమ్య సోదరుడు వీరి ఇంటికి వచ్చి తలుపు కొట్టగా.. స్పందన లేకపోవడం, దుర్వాసన వస్తుండటంతో పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు ఇంటి తలుపులు పగులగొట్టి చూడగా మంచం కింద రాము, కూతురు దివ్యనైనీ మృతదేహాలు కనిపించాయి. గది నిండా రక్తం ఉంది. అప్పటికే ఇద్దరి మృతదేహాలు కుళ్లిపోయాయి. మంచం పక్కనే రమ్య, చిన్నకూతురు దీక్షిత అపస్మారక స్థితిలో ఉండటంతో ఆస్పత్రికి తరలించారు. మూడు రోజులపాటు మృతదేహాలతో ఇంట్లోనే రమ్య ఉన్నా అబద్ధం ఆడుతున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. భర్త, కుమార్తెను హత్య చేసి గుట్టురట్టు కాకుండా ఎలుకల మందు కాస్త తాగి, చిన్న కూతురుకు కూడా తాగించి ఉంటుందని భావిస్తున్నారు. చిన్న కూతురు తలపై గాయాలు ఉండటంతో ఆమెను కూడా హత్య చేయడానికి పథకం రూపొందించి ఉంటుందని భావిస్తున్నారు. మూడు రోజుల క్రితమే వారు మృతి చెందితే భయపడి తాను బయటకు చెప్పలేదని అంగీకరించినా.. కారణాలు చెప్పలేదని తెలిసింది. -
‘పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ గ్యాస్పై వదంతులు నమ్మొద్దు’
హైదరాబాద్: తెలంగాణలో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ గ్యాస్ సరఫరాకు నిల్వలు సమృద్ధిగా ఉన్నట్లు రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ అధికారులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. వినియోగదారులు ఎటువంటి అపోహలకు గురి కావద్దని సూచించారు. రోజుకి 9,574 కిలోలీటర్ల పెట్రోల్, 14,457 కిలో లీటర్ల డీజిల్ మొత్తం 24 వేల కిలో లీటర్ల పైగా పెట్రోల్, డీజిల్ను బంకుల ద్వారా వాహనదారులకు పోస్తున్నట్లు తెలిపారు. అలాగే వినియోగదారులకు 2 లక్షల 22 వేల కు పైగా ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లు డెలివరీ చేస్తున్నట్లు తెలిపారు. పెట్రోల్,డీజిల్ సరఫరా, గ్యాస్ డెలివరీలపై పౌర సరఫరాల శాఖ టోల్ ఫ్రీ నెంబర్ 1967కు ఫోన్ చయొచ్చని కోరారు.కాగా, రెండు రోజులపాటు బంకుల్లో పెట్రోల్, డీజిల్ ఉండదన్న వదంతులతో ఖమ్మం నగరంలో వాహనదారుల పెట్రోల్ బంక్ల ముందు క్యూ కట్టారు. రాత్రి నుంచి వాహనదారులు పెట్రోల్ బంకుల ముందు నిలబడుతున్నారు. కొన్ని బంకులు మూసివేసి ఉండటంతో వాహనదారుల్లో ఆందోళన మొదలై బంకుల ముందు క్యూ కడుతున్నారు. పెట్రోల్, డీజిల్ దొరకదని అపోహలతో కొంతమంది వ్యక్తులు క్యాన్లలో నింపుకుని పోతున్న వీడియోలు వైరల్గా మారాయి. కొన్ని రోజుల క్రితం హైదరాబాద్ సహా పలు నగరాల్లోనూ ఇటువంటి ఘటనలే చోటుచేసుకున్న విషయం తెలిసిందే. -
మా సంకల్పం
ప్రజలకు మేలేసాక్షిప్రతినిధి, ఖమ్మం: ‘పేద ప్రజల సంక్షేమానికి భద్రత, భరోసా కల్పించడమే అజెండాగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నాయకత్వంలోని మా ప్రభుత్వం పనిచేస్తోంది. సమస్యలను పరిష్కరిస్తూ ప్రజలకు మేలు చేసే సంకల్పంతో ఉన్నాం.’ అని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. పాలేరు నియోజకవర్గంలోని నేలకొండపల్లి మండలం రాయగూడెం, తిరుమలాయపాలెం మండలం సుబ్లేడు గ్రామాల్లో శనివారం ఏర్పాటుచేసిన ప్రజాదర్బార్ కార్యక్రమాలను మంత్రి ప్రారంభించి ప్రజల నుంచి వినతులను నేరుగా స్వీకరించారు. అనంతరం పొంగులేటి మాట్లాడుతూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండా గ్రామాలకే అధికారులను పంపించి సమస్యలను పరిష్కరించేలా ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందన్నారు. ప్రజాపాలన, ప్రగతి ప్రణాళికలో భాగంగా ప్రతీ వారం ఒక శాఖ ఆధ్వర్యాన గ్రామాల నుంచి అందిన సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల కోసమే అధికం.. నేలకొండపల్లి మండలంలో వచ్చిన దరఖాస్తుల్లో దాదాపు 55 శాతం ఇందిరమ్మ ఇళ్ల కోసమే అందాయని మంత్రి తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయడంతో ప్రజల్లో విశ్వాసం పెరిగిందన్నారు. ఈమేరకు మే నెలలో రెండో విడత, ఆ తర్వాత విడతలవారీగా అర్హులైన పేదలందరికీ ఇళ్లు అందిస్తామని తెలిపారు. ధరణి కారణంగా ఏర్పడిన భూ సమస్యలను భూభారతి ద్వారా పరిష్కరించే ప్రయత్నం జరుగుతోందని, సాదాబైనామా దరఖాస్తులు కూడా పరిష్కరిస్తామని మంత్రి చెప్పారు. సమస్యలు వింటూ.. వినతులు స్వీకరిస్తూ ప్రజాదర్బార్ ద్వారా అందిన ప్రతీ దరఖాస్తుకు పరి ష్కారం చూపిస్తామని మంత్రి స్పష్టం చేశారు. ఆసరా పెన్షన్, రేషన్కార్డులు, రోడ్లు, డ్రెయినేజీ వంటి సమస్యలను క్రమపద్ధతిలో పరిష్కారిస్తామన్నారు. సుబ్లేడులో పోలీస్ స్టేషన్ మంజూరుకు ప్రభుత్వ అనుమతి తీసుకుని త్వరలోనే శంకుస్థాపన చేస్తానని హామీ ఇచ్చారు. నేలకొండపల్లి మండలం రాయగూడెంలో జరిగిన ప్రజాదర్బార్లో రాయగూడెం, అజ య్తండా, చెరువుమాదారం, మంగాపురంతండా, అప్పల నరసింహాపురం, బుద్ధారం, కట్టుకాచారం, కొంగర, రాజారాంపేట, భైరవునిపల్లి గ్రామపంచా యతీల ప్రజలతో మంత్రి భేటీ అయి వారి సమస్యలు వింటూ వినతులు స్వీకరించారు. కాగా, ప్రజాదర్బార్కు అన్ని శాఖల అధికారులు హాజరైనందున వినతులను పరిశీలించి సమస్యల పరిష్కారానికి పనిచేస్తారని తెలిపారు. సమస్యల్లో అనుకూలమైనవి అక్కడే పరిష్కరిస్తామని, సమయం పడితే అదే విషయాన్ని వివరిస్తామని చెప్పారు. సమస్య న్యాయమైనదైతే.. వ్యక్తిగతంగా ఉపయోగపడినా, గ్రామం, ప్రాంతానికి ఉపయోగపడినా పరిష్కరించే బాధ్యత తాను తీసుకుంటానని తెలిపారు. మంచి చేసే అంశంలో అందరూ భాగస్వాములు కావాలని స్థానిక ప్రజా ప్రతినిధులకు మంత్రి సూచించారు. ఈ కార్యక్రమాల్లో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, పోలీస్ కమిషనర్ సునీల్దత్, అదనపు కలెక్టర్లు డాక్టర్ పి.శ్రీజ, పి.శ్రీనివాసరెడ్డి, మిషన్ భగీరథ ఈఎన్సీ కృపాకర్రెడ్డి, సీఈ సురేష్, ఎన్పీడీసీఎల్ సీఈ రాజుచౌహాన్, డీపీఓ రాంబాబు, డీఆర్డీఓ శ్రీరామ్, ఆర్డీఓ శ్రీనివాస్, తహసీల్దార్లు రాంప్రసాద్, లూథర్ విల్సన్, డీఎల్పీఓ విజయలక్ష్మి ఎంపీడీఓ సిలార్సాహెబ్, వ్యవసాయ మార్కెట్, ఆత్మ కమిటీల చైర్మన్లు వి.సీతారాములు, చావా శివరామకృష్ణ, సర్పంచ్లు పాల్గొన్నారు.ప్రతీ దరఖాస్తుకు పరిష్కారం చూపుతాం -
జమలాపురంలో శ్రీవారికి ప్రత్యేక పూజలు
ఎర్రుపాలెం: మండలంలోని జమలాపురం శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు జరిగాయి. తెల్లవారుజామున స్వామి మూలవిరాట్తో పాటు ఆలయ ప్రాంగణంలోని స్వామివారి పాదానికి అర్చకులు పంచామృతంతో అభిషేకం నిర్వహించారు. ఆతర్వాత స్వామి, అలివేలు మంగ, పద్మావతి అమ్మవార్లను పట్టువస్త్రాలతో అలంకరించి పెద్దసంఖ్యలో హాజరైన భక్తుల సమక్షాన నిత్యకల్యాణం, పల్లకీ సేవ జరిపించారు. ఈకార్యక్రమంలో ఈఓ జగన్మోహన్రావు, వ్యవస్థాపక దర్మకర్త ఉప్పల విజయదేవశర్మ, ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాసశర్మ, ఉద్యోగులు, అర్చకులు సోమయ్య, కృష్ణప్రసాద్, మురళీమోహన్శర్మ, రాజీవ్శర్మ తదితరులు పాల్గొన్నారు. బాధ్యతలు స్వీకరించిన న్యాయసేవా సంస్థ కార్యదర్శి ఖమ్మం లీగల్: జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శిగా దేవీమానస శనివారం బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు నాలుగో అడిషనల్ న్యాయమూర్తిగా పనిచేస్తున్న ఆమె ఇటీవలే న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శిగా బదిలీ అయ్యారు. ఈమేరకు దేవీమానస శనివారం రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ అందించే పథకాలను ప్రజలకు చేరువ అయ్యేలా కృషి చేయడమే కాక కక్షిదారులకు సత్వర న్యాయం అందేలా పనిచేస్తానని ఈ సందర్భంగా ఆమె వెల్లడించారు. దోమలను తరిమేస్తేనే మలేరియా నిర్మూలన ఖమ్మం మామిళ్లగూడెం: దోమలు పెట్టకుండా, కుట్టకుండా చూసుకోవడం ద్వారా మలేరియా నుంచి రక్షించుకోవచ్చని జిల్లా మలేరియా అధికారి డాక్టర్ సుబ్బారావు తెలిపారు. ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా శనివారం ఖమ్మంలో అర్బన్ మలేరియా విభాగం ఆధ్వర్యాన అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సుబ్బారావు మాట్లాడుతూ దోమల పెరుగుదలను అరికట్టడం వల్లే మలేరియాను అంతం చేయగలమని తెలిపారు. ఈ విషయాన్ని అందరూ బాధ్యతగా భావించి ఇళ్లు, పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. జ్వరం, చలి, వణుకు, ఒళ్లు నొప్పులు తదితర లక్షణాలు ఉంటే పరీక్ష చేయించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగులు వేణుగోపాల్, మహ్మద్ మన్నన్, ఇతగాని వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. రేపటి నుంచి ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’అశ్వారావుపేట: రైతులకు సలహాలు సూచనలు చేసేందుకు వ్యవసాయ కళాశాల ఆధ్వర్యంలో సోమవారం నుంచి రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం చేపట్టినట్లు కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ హేమంత్కుమార్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అశ్వారావుపేట వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్తలు 9 బృందాలుగా ఏర్పడి నాలుగు వారాల పాటు రైతుల వద్దకు వెళ్లి అవగాహనా కార్యక్రమాలు చేపడతారని పేర్కొన్నారు. 72 గ్రామాల్లో వ్యవసాయ, అనుబంధ అధికారులతో కార్యక్రమాలు నిర్వహిస్తామని వివరించారు. రామయ్యకు సువర్ణ తులసీ అర్చనభద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో స్వామివారి మూలమూర్తులకు శనివారం సువర్ణ తులసీ అర్చన పూజలు చేశారు. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం మేళతాళాల నడుమ గర్భగుడి నుంచి ఊరేగింపుగా తీసుకొచ్చి బేడా మండపంలో కొలువుదీర్చారు. విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం అనంతరం కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి కల్యాణాన్ని శాస్త్రోక్తంగా జరిపారు. వేసవి సెలవులు కావడంతో భక్తుల రద్దీ పెరుగుతోంది. -
కలెక్టర్గా టీఎస్ దివాకర
● ప్రస్తుత కలెక్టర్ అనుదీప్ హైదరాబాద్కు బదిలీ ● జిల్లాలో సుమారు 11నెలల పాటు విధులు ● ఈసీఆర్ విజయం.. భూదాన్ వివాదం ఖమ్మం సహకారనగర్: జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి బదిలీ అయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా పలువురు ఐఏఎస్లను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ జాబితాలో అనుదీప్ కూడా ఉండగా.. ఆయనకు ఐటీఈ అండ్ సీ జాయింట్ సెక్రటరీగా పోస్టింగ్ ఇచ్చారు. ఇదే సమయాన తెలంగాణ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీగా అదనపు బాధ్యతలు నిర్వర్తించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఆయన స్థానంలో ములుగు కలెక్టర్గా ఉన్న టీఎస్ దివాకరను జిల్లాకు కేటాయించారు. ఏడాది లోపే.. కలెక్టర్గా అనుదీప్ గత ఏడాది జూన్ 13న జిల్లాలో బాధ్యతలు స్వీకరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందేలా పర్యవేక్షించారు. ఇందులో భాగంగానే ప్రాథమిక పాఠశాలల పిల్లల కోసం ప్రవేశపెట్టిన ఎవ్రీ ఎవరీ చైల్డ్ రీడ్స్(ఈసీఆర్)తో మంచి ఫలితాలు వచ్చాయి. వేలాది మంది విద్యార్థులు ఇంగ్లిష్ అక్షరాలు మొదలు వాక్యాలు చదివే స్థాయికి చేరుకున్నారు. అంతేకాక ప్రభుత్వాస్పత్రుల్లో మెరుగైన వసతుల కల్పనలోనూ కీలకంగా వ్యవహరించారు. అలాగే, గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణ, ఫార్మర్ రిజిస్ట్రీ అమలుతో పాటు రెవెన్యూ సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. ఇదే సమయాన ఖమ్మం వెలుగుమట్లలోని భూదాన్ భూముల్లో ఇళ్ల కూల్చివేత రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే, అక్కడ ఇళ్లు కోల్పోయిన కొందరికి ప్రభుత్వం స్థలాలు, ఇళ్లు మంజూరు చేయడంతో వివాదం సద్దుమణిగింది. దివాకర.. ములుగు నుంచి ఖమ్మం ములుగు కలెక్టర్గా ప్రస్తుతం విధులు నిర్వర్తిస్తున్న టీఎస్ దివాకరను జిల్లా కలెక్టర్గా నియమించారు. 2017 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన ఆయన గతంలో జగిత్యాల జిల్లా అదనపు కలెక్టర్గా పనిచేశారు. క్షేత్రస్థాయిలో పర్యటనలు, ప్రజా సమస్యలను స్వయంగా పరిశీలించడం, పరిష్కరించడంలో ప్రత్యేక గుర్తింపు సాధించారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధి, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేయడంలో చురుగ్గా వ్యవహరిస్తారనే గుర్తింపు ఉంది. ముుులుగు జిల్లా కలెక్టర్గా ఆసియాలోనే అతిపెద్ద జాతరైన మేడారం సమ్మక్క – సారలమ్మ జాతర నిర్వహణలో కీలకపాత్ర పోషించారు. అంతేకాక అక్కడ గిరిజన ప్రాంతాల్లో విద్య, వైద్యం, ఆరోగ్యం పట్ల ప్రత్యేక దృష్టి సారించారు. ప్రభుత్వ పాఠశాలలు, ఆస్పత్రుల్లో వసతుల కల్పన, పనితీరు మెరుగుపర్చడమే కాక ప్రజావాణిలో అందే ఫిర్యాదులకు త్వరగా పరిష్కారం చూపిస్తూ ప్రజలు మన్ననలు పొందారు. -
‘కళావాహన’కు అంకుర్పారణ
భద్రాచలం: భద్రగిరి శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం చరిత్రలో ఆదివారం కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. ఆలయంలో కళావాహన కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు చిన్నజీయర్ స్వామి శనివారం రాత్రి భద్రాచలం చేరుకున్నారు. కళావాహనకు సంబంధించి శనివారం అంకురార్పణ జరపగా, వైదిక పరమైన పూజా కార్యక్రమాల నేపథ్యంలో ఆలయంలో ఆదివారం మధ్యాహ్నం వరకు భక్తులకు దర్శనాలు, ఆర్జిత సేవలను నిలిపివేయనున్నారు. కళావాహన, జీర్ణోద్ధరణకు అనుమతి ఆలయ అభివృద్ధిలో భాగంగా తొలి విడతలో ఆలయ కాంప్లెక్స్ విస్తరణ చేపట్టారు. దీంతో ఆలయ ప్రాంగణంలోని భద్రమహర్షి గుడి, శ్రీ లక్ష్మీతాయారు అమ్మవారి ఉపాలయం, ఆళ్వార్లు, ఇతర ఉపాలయాలను తొలగించనున్నారు. ఈ నేపథ్యంలో ఆయా గుడుల్లోని మూలమూర్తుల జీర్ణోద్ధరణకు ఆదివారం అంతరాలయంలోని మూలమూర్తుల అనుజ్ఞ(అనుమతి) తీసుకోనున్నారు. అనంతరం మూలమూర్తులను కలశాలలోకి ఆవాహనం చేసే కళావాహనను భక్తిశ్రద్ధలతో జరపనున్నారు. ఆ తర్వాత 72 మూర్తులను ఏక కాలంలో రంగనాయకుల గుట్టపై తాత్కాలికంగా నిర్మించిన బాలాలయానికి తరలించనున్నారు. శ్రీ లక్ష్మీతాయారు, గోదాదేవి అమ్మవార్ల విగ్రహాలను ప్రధానాలయంలో ముఖమండపం వద్ద కొలువుదీర్చనున్నారు. వైదిక కార్యక్రమాన్ని వైభవోపేతంగా జరిపేందుకు రాష్ట్రంలోని పలు ఆలయాల నుంచి 30 మంది రుత్విక్కులను భద్రాచలం పిలిపించనున్నారు. ఆలయంలో ఈ కార్యక్రమాన్ని జరిపే బాధ్యతలను కోటి శ్రీమన్నారాయణాచార్యులు, అమరవాది మురళీకృష్ణమాచార్యులుకు అప్పగించారు. ఆలయ రిటైర్డ్ ప్రధానాచార్యులు పొడిచేటి రామచంద్రాచార్యులు సూచనలను అందించనున్నారు. కాగా, ఈ కార్యక్రమం సజావుగా సాగేందుకు మధ్యాహ్నం 3 గంటల వరకు భక్తులకు దర్శనాలు, ఇతర ఆర్జిత సేవలు నిలిపివేస్తున్నట్లు ఈఓ దామోదర్రావు ప్రకటనలో తెలిపారు. ఘనంగా అంకురార్పణ కళావాహనకు ఆలయ అర్చకులు శనివారం సాయంత్రం అంకురార్పణ చేశారు. మేళతాళాలు, అర్చకుల వేద మంత్రాల నడుమ తీర్థె బిందెతో పవిత్ర గోదావరి జలాలను తీసుకొచ్చారు. అనంతరం అర్చకులు అంకురార్పణకు అంతరాలయంలోని మూలమూర్తుల వద్ద అనుజ్ఞ తీసుకున్నారు. ఆ తర్వాత బేడా మండపంలో అర్చకులు, వేద పండితులు విష్ణు సహస్రనామార్చన జరిపారు. ఉపాలయాల్లోని మూలమూర్తులకు అభిషేకం నిర్వహించారు.భద్రగిరి ఆలయాన్ని తొలుత భక్త రామదాసు నిర్మించగా, కాలక్రమంలో అనేక మార్పులు జరిగాయి. 1960 తర్వాత గోపురం పనులు చేపట్టారు. తర్వాత మిథిలా స్టేడియం, గ్యాలరీలు ఏర్పాటు చేశారు. తాజాగా ఆలయంలో అభివృద్ధి పరంగా సమూల మార్పులు జరగనున్నాయి. ప్రధాన అంతరాలయం మినహా అన్ని చోట్ల మార్పులు జరగనున్నాయి. అభివృద్ధి పనుల్లో భాగంగా ఆలయ ప్రాంగణంలో ఉన్న ఉపాలయాలు, ఆళ్వార్ల మూర్తుల తరలింపును వైదికపరంగా నిర్వహించనున్నారు. నేడు భద్రగిరిలో ఆవిష్కృతం కానున్న మహా ఘట్టం -
రోడ్డెక్కిన బస్సులు..
● సమ్మె విరమణతో విధుల్లోకి కార్మికులు ● రీజియన్లో వంద శాతం బస్సులు నడిపించిన అధికారులు ఖమ్మంమయూరిసెంటర్: ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ ప్రభుత్వం ముందు ఉంచిన డిమాండ్ల పరిష్కారంపై సానుకూలంగా స్పందన రావడంతో శుక్రవారం అర్ధరాత్రి ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించా రు. ఈమేరకు శనివారం మొదటి షిఫ్ట్ నుంచి ఆర్టీసీ బస్సులన్నీ యథావిధిగా నడిచాయి. సమస్యల పరి ష్కారానికి ప్రభుత్వం హామీ ఇవ్వడంతో రీజియన్లోని అన్ని డిపోలకు తెల్లవారుజామున 4–30 గంటల నుండే కార్మికులు విధులకు హాజరయ్యారు. అన్ని రూట్లకు ప్రారంభం సమ్మె కారణంగా ఈనెల 22 నుండి 24వ తేదీ వరకు హైదరాబాద్, నల్లగొండ, విజయవాడ, రాజమండ్రి, బెంగుళూరు వంటి దూర ప్రాంతాలకు బస్సులను నిలిపివేశారు. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ఈమేరకు శనివారం అన్ని రూట్లతో పాటు ఉదయం 5 గంటల నుంచే హైదరాబాద్కు బస్సులను ప్రారంభించారు. రీజియన్లో 538 బస్సులకు గాను అన్నీ దశల వారీగా సాయంత్రం వరకు రోడ్డెక్కాయి. ఆర్టీసీ, అద్దె బస్సులు బస్టాండ్లకు చేరడం, ప్రయాణికులు రావడంతో బస్టాండ్లు కళకళలాడాయి. -
●ప్రజల గుమ్మం వద్దకే పాలన
తిరుమలాయపాలెం: ప్రజాసమస్యల పరిష్కారం కోసం తమ ప్రభుత్వం ప్రజల గుమ్మం వద్దకే వస్తోందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. తిరుమలాయపాలెం మండలం సుబ్లేడులో 13గ్రామపంచాయతీలకు సంబంధించి ప్రజాదర్బార్లో మంత్రి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించాక మాట్లాడారు. ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఇబ్బంది రాకుండా అమలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలు ఇచ్చే దరఖాస్తులకు జవాబుదారీ తనం ఉండేలా రశీదు ఇస్తూ మూడు నెలల్లో పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. కొత్త మండలాల ప్రక్రియ జరిగితే నియోజకవర్గంలోని రెండు ప్రాంతాల్లో ఒక మండలం ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. కాగా, దరఖాస్తులను అక్కడికక్కడే శాఖల వారీగా అధికారులు ఆన్లైన్లో నమోదు చేయడమే కాక సెల్ఫోన్కు మెసేజ్ వెళ్లేలా ఏర్పాటు చేశారు. కాగా, రాయగూడెం ప్రజాదర్భార్లో 1,119, సుబ్లేడులో 548 దరఖాస్తులు అందాయి. -
గణన.. ఫటాఫట్ !
ప్రారంభం కానున్న జనాభా లెక్కల సేకరణ ● అందుబాటులోకి ’సెల్ఫ్ ఎన్యుమరేషన్’ పోర్టల్ ● సొంతంగా వివరాల నమోదుకు అవకాశం ● ఇంటికి వచ్చే ఎన్యుమరేటర్కు ఐడీ చెబితే చాలు..ఖమ్మం మయూరిసెంటర్: కేంద్రప్రభుత్వం చేపడుతున్న జనాభా లెక్కల సేకరణకు రంగం సిద్ధమైంది. 2027 జనగణన ఈసారి పూర్తిస్థాయిలో డిజిటల్ పద్ధతిలో జరగనుంది. గతంలో ఎన్యుమరేటర్లు ఇంటికి వచ్చి పదుల సంఖ్యలో ప్రశ్నలు అడుగులూ రాతపూర్వకంగా సమాధానాలు నమోదు చేసుకునేవారు. దీంతో ఒక్కో ఇంట్లో వివరాలు నమోదుకు గంటల తరబడి సమయం పట్టేది. కానీ ఈసారి పూర్తిగా యాప్ ద్వారా చేపట్టనున్నారు. దీనికి తోడు ఈసారి ఎవరికి వారే వివరాలను స్వయంగా నమోదు చేసుకునేందుకు ‘సెల్ఫ్ ఎన్యుమరేషన్’ (స్వయం గణన) సదుపాయాన్ని ప్రభుత్వం కల్పించింది. రెండు దశల్లో ప్రక్రియ జనాభా లెక్కల సేకరణ రెండు దశల్లో సాగనుంది. మొదటి దశలో ’హౌస్ లిస్టింగ్’(ఇళ్ల జాబితా నమోదు) చేపడతారు. ఇందులో ఇంటి యజమాని పేరు, ఇంట్లో ఉన్న సౌకర్యాల వివరాలను సేకరిస్తారు. రెండో దశలో జనాభా గణన జరుగుతుంది. మొదటి దశ ప్రక్రియ వచ్చేనెల 11నుంచి జూన్ 9 వరకు జరగనుండగా.. అంతకుముందే స్వీయగణన నమోదుకు అవకాశం కల్పించారు. నమోదు ఇలా.. జనగణన డిజిటల్ పద్ధతిలో జరుగుతుండడంతో ప్రజలు తమ వివరాలను యాప్లో నమోదు చేసే అవకాశాన్ని కల్పించారు. ఎన్యుమరేటర్లు ఇంటికి రాకముందే, ఆన్లైన్ పోర్టల్లో వివరాలు సమర్పించవచ్చు. కుటుంబ యజమాని తన మొబైల్ నంబర్ ద్వారా se.censes.gov.in పోర్టల్లో లాగిన్ అవ్వాలి. ఒక ఫోన్ నంబర్ ఒక కుటుంబానికి మాత్రమే పరిమితం. అంతేకాక యజమాని పేరు ఒకసారి నమోదు చేశాక మార్చడానికి వీలుండదు. ఈమేరకు పోర్టల్లో జిల్లా, ల్యాండ్మార్క్ ఎంచుకున్నాక... మ్యాప్పై ఇంటి కచ్చితమైన స్థానాన్ని గుర్తించాలి. ఆపై ప్రశ్నలకు సమాధానాలు పూర్తి చేసి సబ్మిట్ చేయాలి. యాజమాని పేరు తప్ప ఇతరత్రా ఏమైనా తప్పులు ఉంటే సరిదిద్దుకునే(ఎడిట్) అవకాశం కూడా ఉంది. ఈ పోర్టల్ ఆదివారం నుంచి వచ్చేనెల 10వ తేదీ వరకు ప్రతీరోజు ఉదయం 6నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు అందుబాటులో ఉంటుంది. 31 ప్రశ్నలు సెల్ నంబర్ ఎంటర్ చేయడం ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆపై రాష్ట్రం, జిల్లా, ప్రాంతం, చిరునామా తదితర వివరాలను పొందుపర్చాలి. అయితే, కచ్చితమైన చిరునామాను గూగుల్ మ్యాప్స్ ద్వారా కూడా నమోదు చేయొచ్చు. అనంతరం జన గణనకు సంబంధించి మొత్తం 31రకాల ప్రశ్నలు ఉంటాయి. మీరు ఎలాంటి ఇంటిలో ఉంటున్నారు.. సొంతమా, అద్దె గృహమా? ఇంట్లో ఎన్ని వాహనాలు ఉన్నాయి. కులం, వృత్తి తదితర సమాచారం అందించాలి. ఇందులో 7, 9వ ప్రశ్నలు తప్ప మిగిలిన వాటికి సంబంధించిన వివరాలు నమోదు చేశాక డ్రాఫ్ట్లో సేవ్ అవుతాయి. మరోసారి అంతా సరిచూసుకుని సక్రమమేనని నిర్ధారించుకున్నాక సబ్మిట్ చేయొచ్చు. ఎస్ఈ ఐడీ తప్పనిసరి సెల్ఫ్ ఎన్యుమరేషన్లో భాగంగా వివరాల నమోదు పూర్తయ్యాక 11 అంకెలతో కూడిన ’సెల్ఫ్ ఎన్యుమరేషన్ ఐడీ’ (ఎస్ఈ ఐడీ) జనరేట్ అవుతుంది. ఇది సెల్ఫోన్కు ఎస్ఎంఎస్ రూపంలో కూడా వస్తుంది. భవిష్యత్లో ఇంటికి వచ్చే ఎన్యుమరేటర్కు ఈ ఐడీ చెబితే వివరాలు మరోమారు చెప్పే అవసరం లేకుండా పని వేగంగా పూర్తవుతుంది. ఆపై వారు వివరాలన్నీ సరిచూసుకుని ప్రభుత్వానికి చేరచేస్తారు.ప్రభుత్వం జనగణన ప్రక్రియలో వివరాలను స్వయంగా నమోదు చేసుకునే అవకాశం ఇచ్చింది. ఖమ్మం నగర వాసులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఈ పోర్టల్ను ఉపయోగించడం వల్ల సమయం ఆదా అవుతుంది. ఎన్యూమరేటర్లకు మరోసారి వివరాలు చెప్పాల్సిన అవసరం ఉండదు. పోర్టల్లో వివరాలను జాగ్రత్తగా నమోదు చేసి, ఎన్యూమరేటర్కు ఎస్ఈ ఐడీ చెబితే సరిపోతుంది. – అభిషేక్ అగస్త్య, కమిషనర్, కేఎంసీ -
రోడ్డు ప్రమాదంలో ఐదుగురికి తీవ్ర గాయాలు
బోనకల్: మండల పరిధిలోని వైరా – జగ్గయ్యపేట ప్రధాన రహదారిపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురికి తీవ్ర గాయలయ్యాయి. ఏపీలోని గుంటూరుకు చెందిన గరికపాటి నవీన్, గరికపాటి విజయలక్ష్మి (62), నెమలిగంటి దాసు, అశోక్, సుబాకర్ ఖమ్మంలో జరిగిన శుభకార్యానికి ఇన్నోవా కారులో వచ్చారు. తిరిగి స్వస్థలానికి వెళ్తుండగా బోనకల్ బ్రాంచ్ కెనాల్ వద్ద ముందు ఉన్న వాహనాన్ని ఓవర్టేక్ చేసే క్రమాన జగ్గయ్యపేట వైపు నుంచి వస్తున్న లారీ ఢీకొట్టింది. ఘటనలో వాహనంలో ఉన్న ఐదుగురికి తీవ్ర గాయాలు కాగా, స్థానిక పీహెచ్సీలో ప్రథమ చికిత్స అనంతరం 108 వాహనంలో ఖమ్మం తరలించారు. సీఐ మధు బోనకల్కు చేరుకుని ప్రమాద వివరాలను సేకరించారు. కాగా, క్షతగాత్రులకు ఖమ్మం ఆస్పత్రిలో చికిత్స అందిస్తుండగా పరిస్థితి విషమించడంతో విజయలక్ష్మి మృతి చెందింది. ఆమె భర్త నవీన్కు కూడా తీవ్ర గాయాలు కావడంతో పరిస్థితి విషమించగానే ఉందని తెలిసింది. కాగా, ఖమ్మం జిల్లా అమ్మపాలెంకు చెందిన నవీన్ కొన్నేళ్ల క్రితం గుంటూరు వెళ్లి స్థిరపడ్డారు.చికిత్స పొందుతూ మహిళ మృతి -
నైపుణ్యాలు మెరుగుపర్చుకోవాలి
భద్రాచలం: సమ్మర్ క్యాంపుల్లో విద్యార్థులు నైపుణ్యాలను మెరుగుపర్చుకోవాలని భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, ఐటీడీఏ పీఓ రాహుల్ అన్నారు. శనివారం భద్రాచలంలోని గిరిజన సంక్షేమ శాఖ బాలికల ఆశ్రమ పాఠశాలలో ఉమ్మడి ఖమ్మం జిల్లా గిరిజన ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాల గిరిజన విద్యార్థులకు చేపట్టిన సమ్మర్ క్యాంపును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వేసవి శిక్షణ శిబిరాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పీఓ రాహుల్ మాట్లాడుతూ మే నెల 9వ తేదీ వరకు క్యాంపు కొనసాగుతోందని పేర్కొన్నారు. విద్యార్థులు సబ్జెక్ట్లతోపాటు యోగా, డ్యాన్స్, వివిధ క్రీడలు, బొమ్మల పెయింటింగ్, కుట్లు, అల్లికలు, ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్, వ్యాసరచన పోటీలు తదితర అంశాల్లో శిక్షణ ఇవ్వనున్నారు. ట్రైబల్ వెల్ఫేర్ డీడీ అశోక్ మాట్లాడుతూ ఐటీడీఏవ్యాప్తంగా 200 మందిని బాలబాలికలను ఎంపిక చేశామని, బాలికలకు బాలికల గిరిజన సంక్షేమ శాఖ పాఠశాలలో, బాలురకు వికాసం పాఠశాలలో సమ్మర్ క్యాంపులు ఏర్పాటు చేశామని వివరించారు. అనంతరం విద్యార్థులకు క్రీడా పరికరాలు అందజేశారు. అధికారులు రమేష్, అలివేలు మంగతాయారు, సుభద్ర, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, పీఓ రాహుల్ -
విద్యుత్ బిల్లులు ఆన్లైన్లో...
ఖమ్మంవ్యవసాయం: విద్యుత్ బిల్లుల చెల్లింపునకు డిస్కంలు రూపొందించిన ఆన్లైన్ విధానానికి వినియోగదారులు ప్రాధాన్యత ఇస్తున్నారు. అందరి చేతుల్లో స్మార్ట్ ఫోన్లు ఉండడంతో కార్యాలయానికి వెళ్లే అవసరం లేకుండా ఇంటి వద్ద ఉండే బిల్లులు చెల్లిస్తున్నారు. అంతేగాక ప్రభుత్వాలు నగదు రహిత చెల్లింపులను ప్రోత్సహిస్తుండడం మరో కారణంగా తెలుస్తోంది. గతంలో విద్యుత్ బిల్లుల చెల్లింపునకు ఆ శాఖ కార్యాలయాలు, కౌంటర్ల వద్ద వినియోగదారులు బారులు దీరేవారు. ప్రసుత్తం చాలామంది ఆన్లైన్లో చెల్లిస్తుండడంతో కౌంటర్లు వెలవెలపోతున్నాయి. గతంలో పోలిస్తే ౖపైపెకి... టీజీఎన్పీడీసీఎల్ యాప్, టీ వ్యాలెట్, గూగుల్ పే, ఫోన్పే తదితర డిజిటల్ ప్లాట్ ఫామ్ల ద్వారా విద్యుత్ బిల్లులు చెల్లిస్తున్నారు. 2024–25 ఆర్దిక సంవత్సరంలో జిల్లాలోని 14,18,030 మంది వినియోగదారులు ఆన్లైన్లో విద్యుత్ బిల్లులు చెల్లించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇక 2025–26 ఆర్థిక సంవత్సరానికి వచ్చేసరికి ఈ సంఖ్య 17,03,813కు చేరింది. అంటే ఏడాది కాలంలో చెల్లింపుదారుల సంఖ్య దాదాపు 3లక్షలు పెరగడం విశేషం. ఏటా వేసవిలో బయటకు వచ్చే పరిస్థితి లేకపోవడంతో ఆన్లైన్లో చెల్లించేందుకు పలువురు ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ఈవిషయమై ఎస్ఈ ఇనుగుర్తి శ్రీనివాసాచారి మాట్లాడుతూ విద్యుత్ బిల్లులను ఆన్లైన్లో చెల్లించడం సురక్షితంగానే కాక పారదర్శకంగా ఉంటుందని తెలిపారు. ఎండల తీవ్రత దృష్ట్యా వినియోగదారులు కౌంటర్ల వద్ద ఇబ్బంది పడకుండా ఆన్లైన్లో చెల్లించడంపై దృష్టి సారించాలని సూచించారు.క్రమక్రమంగా పెరుగుతున్న చెల్లింపులు -
భార్యను కత్తితో పొడిచిన భర్త..
చండ్రుగొండ: వివాహేతర సంబంధం కొనసాగిస్తోందనే అనుమానంతో భర్త కట్టుకున్న భార్యనే కత్తితో పొడిచాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె శనివారం మృతిచెందింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. మండలంలోని అయన్నపాలెం గ్రామానికి చెందిన బొప్పి నాగరాజు తన భార్య బొప్పి పున్నేశ్వరి (42)ని.. వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానంతో ఈ నెల 21వ తేదీన కత్తితో పొడిచాడు. తీవ్రంగా గాయపడిన ఆమెను తొలుత కొత్తగూడెం ఆస్పత్రికి.. అక్కడి నుంచి ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున మృతి చెందింది. మృతురాలి సోదరి చాపలమడుగు చంద్రకళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శివరామకృష్ణ తెలిపారు. మృతురాలికి ఇద్దరు కుమారులున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి.. -
● రైతు సంఘం రాష్ట్ర మహాసభల్లో తీర్మానం ● 93 మందితో నూతన కమిటీ ఎన్నిక
రైతు సమస్యలపై ఉద్యమాలు రుద్రంపూర్: భవిష్యత్లో రైతు సమస్యలపై ఉద్యమించాలని రైతు సంఘం మహాసభల్లో తీర్మానించారు. ఈ నెల 23 నుంచి కొత్తగూడెంలో నిర్వహిస్తున్న రైతు సంఘం రాష్ట్ర మహాసభలు శనివారం ముగిశాయి. మహాసభల్లో పలు తీర్మానాలను ఆమోదించారు. అనంతరం సంఘం నాయకులు విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. రైతులకు సంబంధించిన 30 అంశాలపై తీర్మానాలు రూపొందించినట్లు తెలిపారు. వ్యవసాయ ప్రణాళికను శాసీ్త్రయంగా రూపొందించాలని, పంటలకు సక్రమంగా సాగునీరు అందించాలని, భూభారతి, ధరణి చట్టాలను సరిచేయాలని, పోడు సాగుదారులకు రుణాలు మంజూరు చేయాలని, దేశవ్యాప్తంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటాలకు సిద్ధం కావాలని మహాసభల్లో తీర్మానించినట్లు వివరించారు. మొక్కజొన్నకు కనీస మద్దతు ధర రూ. 2400 చెల్లించాలని కోరారు. ఈ నెల 27వ తేదీ నుంచి మే 5వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శిస్తామని తెలిపారు. నూతన కమిటీ ఎన్నిక మహాసభలో 93 మంది నూతన రాష్ట్ర కమిటీని ఎన్నుకున్నారు. రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా పోతినేని సుదర్శన్రావు, కార్యదర్శిగా తీగల సాగర్, ఉపాధ్యక్షులుగా జూలకంటి రంగారెడ్డి, ప్రొఫెసర్ ఆరిబండి ప్రసాదరావు, పి.జంగారెడ్డి, నంద్యాల నర్సింహా రెడ్డి, రమేష్, కందాల ప్రమీల, మల్లు నాగార్జునరెడ్డి, ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, శెట్టి వెంకన్న, ఎం.శ్రీనివాస్, తుమ్మల వెంకటరెడ్డి, వర్ణ వెంకటరెడ్డి, సహాయ కార్యదర్శులుగా అన్నవరపు సత్యనారాయణ, బొంతు రాంబాబు, శీలం ఫకీరమ్మ, లెల్లల బాలకృష్ణ, ఉడుత రవీందర్, వీరేపల్లి వెంకటేశ్వర్లు, మాటూరి బాలరాజ్ గౌడ్, ఈసంపల్లి బాబు, వెంకటేశ్, బాల్రెడ్డి, కొక్కెరపాటి పుల్లయ్య, వెంకట్, మావో, దుబ్బాక రాంచందర్, చందు నాయక్, కోశాధికారిగా మూడుశోభన్లను ఎన్నుకున్నారు. -
తెలంగాణను కాపాడుకునే బాధ్యత అందరిది..
ఖమ్మంమామిళ్లగూడెం: అన్ని వర్గాల వారు పోరాడి తెలంగాణను సాధించుకోగా, గత సీఎం కేసీఆర్ పాలన కారణంగా ఆగమైనందున కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని తెలంగాణ రాష్ట్రీయ లోక్దళ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్కుమార్ అన్నారు. ఖమ్మం మామిళ్లగూడెంలో జిల్లా పార్టీ కార్యాలయాన్ని శనివారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్తో కలిసి తాను చురుకై న పాత్ర పోషించానని తెలిపారు. అయితే, తెలంగాణ ఏర్పడ్డాక దళితులకు సీఎం పదవిపై మాట తప్పిన కేసీఆర్ ముఖ్యమంత్రిగా కుటుంబ పాలన కొనసాగించారని విమర్శించారు. ప్రస్తుతం రేవంత్రెడ్డి అయినా ప్రజాభీష్టం మేరకు పాలన కొనసాగించాలని సూచించారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి బీరప్ప, రాష్ట్ర, జిల్లాల నాయకులు కె.గిరీశ్, రాజ్కుమార్రెడ్డి, డాక్టర్ విక్రమ్శర్మ, డాక్టర్ సోమగాని నరేందర్, జానీ మహమ్మద్, ఎం.వెంకటేశ్వరాచారి, ఎన్.భాస్కరరావు, సుధాకర్యాదవ్, నర్సింహారావు తదితరులు పాల్గొన్నారు. టీఆర్ఎల్డీ అధ్యక్షుడు దిలీప్కుమార్ -
పర్ణశాలలో జిల్లా జడ్జి పూజలు
ఖమ్మంఅర్బన్: ఖమ్మం ఇందిరానగర్లోని పర్ణశాల శ్రీసీతారామచంద్ర స్వామి దేవాలయాన్ని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.రాజగోపాల్ దంపతులు శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా వారికి అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలకగా, స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత వేద పండితులు ఆశీర్వచనం, ప్రసాదాలు అందజేశారు. ఆలయ ఈఓ వీవీ నర్సింహారావు, అర్చకులు కృష్ణకిషోర్, సిబ్బంది వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ పశువైద్య దినోత్సవంలో పలువురికి సన్మానం ఖమ్మంవ్యవసాయం: ప్రపంచ పశువైద్య దినోత్సవాన్ని శనివారం జిల్లాలో నిర్వహించారు. ఈసారి ‘పశు వైద్యులు – ఆహార, ఆరోగ్య రక్షకులు’నినాదంతో నిర్వహించగా, ఖమ్మంలోని జిల్లా పశువైద్య, పశుసంవర్థక శాఖ కార్యాలయంలో జిల్లా పశుసంవర్థక, పశువైద్యాధికారి డాక్టర్ బోడేపూడి పురంధర్ మాట్లాడారు. పశువులు వ్యాధుల బారిన పడకుండా వ్యాక్సిన్లు ఇవ్వడం, చికిత్స చేయడంలో వైద్యులు, సిబ్బంది పాత్ర కీలకమని తెలిపారు. అనంతరం ఉద్యోగ విరమణ చేసిన డాక్టర్ వేణుమనోహర్రావు, జగత్కుమార్రెడ్డి, కేవీ నారాయణ, ఆర్.శ్రీనివాసరావు, ఏనుగు భాను, పశువైద్యుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు రమేశ్బాబును సన్మానించారు. కార్యక్రమంలో వైద్యాధికారులు రమణి, అరుణ, పండరి బాబు, కిషోర్, పశువైద్యుల సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు అనంతు హరీశ్, రాకేశ్కుమార్తో పాటు రఘుపతి, గంగాధర్, భువనేశ్, రాంజీ, జగ్గూలాల్, శ్రీనివాస్నాయక్, నాగమణి, స్వాతిలత, కిషోర్ తదితరులు పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి సత్తుపల్లిరూరల్: ద్విచక్ర వాహనం, లారీ ఢీకొన్న ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. వేంసూరు మండలం అడసర్లపాడు గ్రామానికి చెందిన శీలం పృథ్వీ (25) శనివారం ద్విచక్రవాహనంపై సత్తుపల్లి వైపు వస్తున్నాడు. ఈ క్రమాన మండలంలోని రేజర్ల వద్ద ఆయన వాహనాన్ని ఎదురుగా వచ్చిన లారీ ఢీకొట్టడంతో తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. సత్తుపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గుర్తుతెలియని వ్యక్తి.. ఖమ్మంక్రైం: అపస్మారక స్థితిలో ఉన్న గుర్తుతెలియని వ్యక్తి (40)కి చికిత్స అందిస్తుండగా మృతి చెందాడు. ఖమ్మం జిల్లాఆస్పత్రి ఆవరణలో శుక్రవారం రాత్రి సదరు వ్యక్తి అపస్మారక స్థితిలో పడి ఉండగా సిబ్బంది ఆస్పత్రిలో చేర్చుకుని చికిత్స ప్రారంభించారు. ఈ క్రమాన ఆయన మృతి చెందగా మృతదేహన్ని మార్చురీలో భద్రపరిచి కుటుంబీకుల వివరాల కోసం ఆరా తీస్తున్నట్లు ఖమ్మం టూ టౌన్ సీఐ బాలకృష్ణ తెలిపారు. కాగా, సదరు వ్యక్తి తన పేరు మల్లేశ్ అని మాత్రమే చెప్పాడని, ఆచూకీ తెలిసిన వారు పోలీస్స్టేషన్లో సంప్రదించాలని సూచించారు. జామాయిల్ తోటలో అగ్ని ప్రమాదం రఘునాథపాలెం: మండలంలోని బూడిదంపాడులో శనివారం జామాయిల్ (యూకలిప్టస్) తోటలో అగ్ని ప్రమాదం జరిగింది. గ్రామానికి చెందిన రైతు తుమ్మలపల్లి వెంకటేశ్వర్లు జామాయిల్ సాగు చేస్తుండగా, మధ్యాహ్నం అకస్మాత్తుగా చెలరేగిన మంటలు అంతకంతకూ విస్తరించాయి. దీంతో స్థానికులు ఇచ్చిన సమాచారంతో అగ్నిమాపక శాఖ అధికారి బి.కోదండరామిరెడ్డి ఆధ్వర్యాన సిబ్బంది చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అప్పటికే సుమారు రెండు ఎకరాల్లో చెట్లు కాలిపోగా రూ.లక్ష వరకు నష్టం వాటిల్లిందని అధికారులు తెలిపారు. సహాయక చర్యల్లో అగ్నిమాపక శాఖ సిబ్బంది నరసింహారావు, సత్యనారాయణ, గోపీకృష్ణమాచారి, మోహన్ పాల్గొన్నారు. -
విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల తనిఖీలు
కల్లూరురూరల్: కల్లూరు మండలంలోని కొర్లగూడెం, ఖాన్ఖాన్పేట, పేరువంచ రేషన్ దుకాణాల్లో శనివారం విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా కొర్లగూడెం దుకాణంలో 12.5 క్వింటాళ్లు, పేరువంచలో 168 క్వింటాళ్లు, ఖాన్ఖాన్పేట రేషన్ దుకాణంలో 128 క్వింటాళ్ల బియ్యం రికార్డుల కంటే అదనంగా ఉన్నట్లు గుర్తించి మూడు దుకాణాలను సీజ్ చేశారు. అంతేకాక డీలర్లపై 6–ఏ కేసు నమోదు చేశారు. తనిఖీల్లో విజిలెన్స్ ఓఎస్డీ అంజయ్య, సివిల్ సప్లయీస్ ఆర్ఐ నరేశ్, ఏఎస్ఐ వెంకటకృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు. 6.50 టన్నుల బియ్యం స్వాధీనం మండలంలోని ముగ్గు వెంకటాపురం నుంచి ట్రాక్టర్లో అక్రమంగా తరలిస్తున్న 6.50 టన్నుల రేషన్ బియ్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గ్రామం నుంచి బియ్యం తరలిస్తున్నారనే సమాచారంతో శనివారం తెల్లవారుజామున జీపీఓ నాగరాజు, జూనియర్ అసిస్టెంట్ రామకృష్ణ, సిబ్బంది తనిఖీలు చేపట్టారు. ఈ మేరకు రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకోవడంతో పాటు ట్రాక్టర్ యజమానిపై కేసు నమోదు చేశారు.మూడు రేషన్ షాపులు సీజ్ -
ఎన్ఎఫ్బీఎస్ పథకంలో మార్పులు
● బాధ్యతలు ఎంపీడీఓలకు, కమిషనర్లకు అప్పగింత ● రెవెన్యూ అధికారుల పని ఒత్తిడితో నిర్ణయం అశ్వాపురం: కుటుంబంలో పెద్ద దిక్కు.. యజమాని మృతి చెందితే ఆ కుటుంబాన్ని ఆదుకునేందుకు ఉద్దేశించిన జాతీయ కుటుంబ ప్రయోజన పథకం (ఎన్ఎఫ్బీఎస్)లో ప్రభుత్వం మార్పులు చేపట్టింది. ఈ పథకం అమలుకు సంబంధించిన పూర్తి బాధ్యతలు, నిధుల విడుదల ప్రక్రియ ఇకపై మండలాల్లో ఎంపీడీఓల పరిధిలోకి, మున్సిపాలిటిల్లో కమిషనర్ల పరిధిలోకి మారుస్తూ ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. తహసీల్దార్ కార్యాలయాల్లో పెండింగ్ తహసీల్దార్ కార్యాలయాల్లో జాతీయ కుటుంబ ప్రయోజన పథకం దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. గతంలో వీటి పరిశీలన, ఆమోదం, ప్రభుత్వానికి నివేదించడం అంతా రెవెన్యూ శాఖ పరిధిలోనే ఉండేది. రెవెన్యూ అధికారులు పని ఒత్తిడి కారణంగా క్షేత్రస్థాయిలో విచారణలోనూ, నిధుల విడుదలలోనూ పథకం అమలులో తీవ్ర జాప్యం జరుగుతోందని ప్రభుత్వం గుర్తించింది. హైదరాబాద్ మినహా మిగిలిన అన్ని జిల్లాల్లో బాధ్యతలను ఎంపీడీఓలు, పురపాలికల కమిషనర్లకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. గ్రామ పంచాయతీల ద్వారా వచ్చే దరఖాస్తులను ఎంపీడీఓలు పరిశీలించి త్వరితగతిన నిధులు విడుదల అయ్యేలా చర్యలు తీసుకుంటారు. 18 నుంచి 60 ఏళ్ల లోపు.. ఈ పథకం కింద అర్హత పొందిన కుటుంబాలకు ప్రభుత్వం రూ.20 వేలు ఆర్థిక సాయాన్ని అందిస్తుంది. కుటుంబానికి ఆధారమైన వ్యక్తి 18 నుంచి 60 ఏళ్ల లోపు వయస్సు ఉండి మృతి చెంది ఉండాలి. లబ్ధిదారులు స్థానిక గ్రామ పంచాయతీల ద్వారా ఎంపీడీఓ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి. పంచాయతీ కార్యదర్శుల ద్వారా విచారణ వేగవంతంగా జరిగే అవకాశం ఉంది.కుటుంబ యజమాని మరణిస్తే ఎన్ఎఫ్బీఎస్ పథకానికి దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్హత ఉంటే పథకం ద్వారా ఆర్థికసాయం అందజేస్తాం. ఈ పథకం బాధ్యతలు ఇటీవల ప్రభుత్వం ఎంపీడీఓలకు అప్పగించింది. అర్హులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి. – ముత్యాలరావు, ఎంపీడీఓ, అశ్వాపురం -
ఇంధనం కొరత!
ఖమ్మంసహకారనగర్: ఇరాన్ – అమెరికా యుద్ధ ప్రభావం జిల్లాను తాకినట్లు స్పష్టంగా అర్థమవుతోంది. జిల్లాలో నాలుగు రోజులుగా పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడగా.. శుక్ర, శనివారాల్లో మరింత తీవ్రమైంది. బంక్లకు ఇంధనం స్టాక్ రాకపోవడంతో జిల్లాల్లోని పలుచోట్ల మూసివేశారు. కొన్ని బంక్ల్లోనే పెట్రోల్, డీజిల్ ఉండగా, అక్కడ వాహనదారులు బారులు దీరుతున్నారు. జిల్లాలో 220 బంక్లు జిల్లాలోని 21 మండలాల పరిధిలో 220 పెట్రోల్ బంక్లు ఉన్నాయి. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్), ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఓసీఎల్), హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్పీసీఎల్)తో పాటు ఎస్సార్, రిలయన్స్ కంపెనీల బంక్లు కొనసాగుతున్నాయి. జిల్లా వాహనదారులు రోజువారీగా సుమారు 1.50 లక్షల లీటర్ల పెట్రోల్, 3.50 లక్షల లీటర్ల డీజిల్ ఉపయోగిస్తున్నట్లు అంచనా. అయితే, ఇరాన్ – అమెరికా యుద్ధం కారణంగా గతంలో మాదిరి ఇంధనం సరఫరా కాకపోవడమే కొరతకు కారణమనే ప్రచారం జరుగుతోంది. కొన్ని మూత.. ఇంకొన్ని చోట్ల క్యూ గత నాలుగు రోజులుగా పెట్రోల్, డీజిల్ కొరత కారణంగా చాలామంది బంక్లను మూసివేశారు. జిల్లా కేంద్రంతో పాటు పట్టణాల్లో ఈ పరిస్థితి కనిపిస్తోంది. అయితే, గ్రామీణ ప్రాంతాల్లోని బంక్ల్లో మాత్రం స్టాక్ ఉండగా.. వాహనదారులు క్యూ కడుతున్నారు. ఖమ్మం, వైరా, మధిర, సత్తుపల్లి తదితర ప్రాంతాలతో పాటు నిత్యం రద్దీగా ఉండే కొణిజర్ల, తల్లాడ, పెనుబల్లి, ఏన్కూరు తదితర మండలాల్లోని బంక్ల్లో శుక్రవారం ఉదయమే ఇంధనం స్టాక్ అయిపోవడంతో నో స్టాక్ బోర్డులు ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్రంలోని కొన్ని బంక్లు తెరిచి ఉన్నా శనివారం సాయంత్రానికి అక్కడ కూడా స్టాక్ అయిపోయినట్లు తెలుస్తోంది. ఈ విషయమై సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరగడం, మున్ముందు మరింత కొరత ఏర్పడుతుందనే భావనతో శనివారం సాయంత్రం నుంచి వినియోగదారులు క్యూ కట్టారు. ఏపీ నుంచి కూడా.. తెలంగాణతో పోలిస్తే ఏపీలో నాలుగు రోజుల నుంచి ఇంధనం కొరత ఏర్పడినట్లు తెలుస్తోంది. ఫలితంగా చాలావరకు బంక్లు మూతపడ్డాయని సమాచారం. దీంతో ఏపీ సరిహద్దుగా ఉన్న జిల్లాలోని ప్రాంతాలకు అక్కడి వాహనదారులు వస్తున్నారు. దీంతో ఈ ప్రాంతంలోని బంక్ల్లో కూడా పెట్రోల్, డీజిల్ నిల్వలు అడుగంటుతున్నాయని తెలిసింది.సత్తుపల్లిటౌన్: జిల్లాలోని పలు బంక్ల్లో పెట్రోల్, డీజిల్ స్టాక్ లేక ఒక్కో బంక్ను శుక్రవారం నుంచి మూసివేస్తున్నారు. ఈ విషయమై విస్తృత ప్రచారం జరగడంతో వాహనదారులు బెంబేలెత్తిపోయారు. సత్తుపల్లిలోని రెండు బంక్ల్లో మాత్రమే పెట్రోల్, డీజిల్ ఉండడంతో శనివారం వాహనదారులు బారులుదీరారు. క్యూ కట్టి మరీ పెట్రోల్, డీజిల్ పోయించుకోవడం కనిపించింది. అయితే, యుద్ధం ప్రభావంతో స్టాక్ రావడం లేదా, ఇతర కారణాలు ఉన్నాయా అనేది తెలియరాలేదు. జిల్లాలోని చాలావరకు పెట్రోల్ బంక్ల్లో పెట్రోల్, డీజిల్ కొరత ఉందనే అంశం మా దృష్టికి వచ్చింది. కంపెనీల బాధ్యులతో మాట్లాడి కొరతకు కారణాలపై ఆరా తీస్తాం. ఇదే సమయాన జిల్లాకు రోజువారీ డిమాండ్కు అనుగుణంగా ట్యాంకర్లు వచ్చేలా చర్యలు తీసుకుంటాం. –చందన్కుమార్, డీసీఎస్ఓ జిల్లాలోని పలు బంక్ల్లో ‘నో స్టాక్’ బోర్డులు -
కార్పొరేట్ల కోసం బీజేపీ ఒప్పందాలు
రుద్రంపూర్: కార్పొరేట్ సంస్థల కోసం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంటోందని ఏఐకేఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి విజూ కృష్ణన్ విమర్శించారు. కొత్తగూడెంలోని సామినేని రామారావునగర్, కాసాని ఐలయ్య ప్రాంగణంలో నిర్వహిస్తున్న తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర మహాసభలు శుక్రవారం రెండో రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమెరికాతో మోదీ ప్రభుత్వం చేసుకున్న సామ్రాజ్యవాద అనుకూల ఒప్పందాలు భారతదేశంలో ఉత్పత్తి దారులు, రైతులకు తీవ్రనష్టమని అన్నారు. ఐక్య పోరాటాలతో ఈ ఒడంబడికలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ట్రంప్ ఏకపక్షంగా ఒడంబడిక ప్రకటించిన వెంటనే నరేంద్రమోదీ విజయం సాధించినట్లు పేర్కొనడం విడ్డూరమన్నారు. మనదేశ ఉత్పత్తులు అమెరికాకు ఎగుమతిచేస్తే 18 శాతం పన్ను వేస్తుండగా, అమెరికా ఉత్పత్తులు పన్ను లేకుండా పాలకులు దిగుమతి చేసుకుంటున్నారని ఆరోపించారు. ఆ దేశంలో ఏటా ఒక్కో రైతుకు రూ.20 లక్షలకు సబ్సిడీ ఇస్తుండగా, ఇక్కడ సగటున రూ.34 వేలు మాత్రమే వస్తున్నట్లు వివరించారు. విదేశీ ఒప్పందాలతో భారతీయ రైతులకు తీరని నష్టమని తెలిపారు. జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య మాట్లాడుతూ పంటమార్పిడి ఉద్యమంలా సాగాలని సూచించారు. రైతుల మేలు కోసం ప్రభుత్వాలు మెరుగైన విధానాలు తీసుకురావాలన్నారు. కుటుంబ ఆదాయం, ఖర్చుల మధ్య భారీ వ్యత్యాసాల వల్ల రైతులు క్రమంగా సంక్షోభంలోకి కూరుకుపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి పోవాలని ఆకాంక్షించారు. సభలో సీనియర్నేత సారంపల్లి మల్లారెడ్డి, ప్రొఫెసర్ ఆరుబండి ప్రసాదరావు, నాయకులు టి.సాగర్, జంగారెడ్డి, కందాల ప్రమీల, శోభనానాయక్, మచ్చా వెంకటేశ్వర్లు, నున్నా నాగేశ్వరరావు, ఏ.కనకయ్య తదితరులు పాల్గొన్నారు. ఏఐకేఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి విజూకృష్ణన్ -
పేదల భూములు కబ్జా చేసిన చరిత్ర వారిదే..
ఖమ్మంమయూరిసెంటర్: గుడిసెలు వేసుకుని జీవిస్తున్న పేదలను ఖాళీ చేయించి ఆ భూములను కబ్జా చేసిన చరిత్ర పువ్వాడ అజయ్కుమార్కు ఉందని కాంగ్రెస్ జిల్లా, నగర అధ్యక్షులు నూతి సత్యనారాయణగౌడ్, నాగండ్ల దీపక్ చౌదరి, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు ఆరోపించారు. ఖమ్మంలోని కాంగ్రెస్ జిల్లా కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ మెడికల్ కాలేజీ పేరుతో భూములను ఆక్రమిస్తే గతంలో అధికారులు కూల్చివేశారని గుర్తుచేశారు. అదే అజయ్కుమార్ ఇప్పుడు మంత్రులు భట్టి, తుమ్మల, పొంగులేటిపై విమర్శలు చేయడం గర్హనీయమని పేర్కొన్నారు. కాగా, ఆర్టీసీ కార్మికుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని వారు తెలిపారు. కార్మికులెవరూ తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని కోరారు. ఇక రైతుల విషయంలో బీఆర్ఎస్ నాయకులది మొసలి కన్నీరు అని విమర్శించారు. ఇప్పటికే జిల్లాలో వరి ధాన్యం, మొక్కజొన్న కొనుగోళ్లు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. ఈ సమావేశంలో నాయకులు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, పుచ్చకాయల వీరభద్రం, దొబ్బల సౌజన్య, యర్రం బాలగంగాధర్ తిలక్, బాణాల లక్ష్మణ్, పాలకుర్తి నాగేశ్వరరావు, సయ్యద్ ముజాహిద్ హుస్సేన్, కల్వకుంట్ల గోపాల్, ఏలూరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
నాణ్యమైన విద్యుత్ సరఫరాకు కృషి
తిరుమలయపాలెం: అంతరాయాలు లేని నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడమే లక్ష్యంగా ప్రణాళిక రూపొందించామని విద్యుత్ శాఖ ఎస్ఈ ఇనుగుర్తి శ్రీనివాసాచారి తెలిపారు. మండలంలోని హైదర్సాయిపేట విద్యుత్ సబ్స్టేషన్కు బ్యాక్ ఫీడింగ్ సప్లై కోసం ఏర్పాటుచేసిన నూతన లైన్ను శుక్రవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఈ ప్రాంతంలో అంతరాయం ఏర్పడితే ప్రత్యామ్నాయంగా సరఫరా కోసం మహబూబాబాద్ జిల్లా మరిపెడ నుంచి హైదర్సాయిపేట సబ్ స్టేషన్ వరకు రూ.80లక్షల వ్యయంతో 6.3 కి.మీ. నూతన లైన్ ఏర్పాటుచేశామని తెలిపారు. తద్వారా పలు గ్రామాలకు నిరంతరంగా, ఇంకొన్ని గ్రామాలకు అవసరమున్నప్పుడు సరఫరా చేయొచ్చని చెప్పారు. డీఈలు బి.వెంకటేశ్వరరావు, భద్రుపవార్, ఉద్యోగులు బాబూరావు, కోక్యానాయక్, నరేందర్రెడ్డి, కిలారు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
వంతెనపై ట్రాఫిక్ ఆంక్షలు, వాహనాల దారి మళ్లింపు
ఖమ్మంక్రైం: ఖమ్మంలోని చర్చి కంపౌండ్ వంతెనపై మరమ్మతుల దృష్ట్యా రాకపోకలను వన్ వేలో అనుమతించనున్నట్లు ట్రాఫిక్ సీఐ సత్యనారాయణ తెలిపారు. చర్చి కాంపౌండ్ నుంచి ప్రకాష్నగర్ వైపు వన్ వే అమలు కానున్నందున, వాహనాలను దారి మళ్లించనున్నట్లు వెల్లడించారు. ఈమేరకు వెంకటగిరి క్రాస్ నుంచి వచ్చే భారీ వాహనాలు, లారీలు, టిప్పర్లు, ట్రాక్టర్లను కోదాడ క్రాస్, బైపాస్ వైపు మళ్లిస్తామని తెలిపారు. అలాగే, కార్లు, ఆటోలు, ద్విచక్ర వాహనాలు ప్రకాష్నగర్లోని కొత్త పోలీస్ కమిషనర్ కార్యాలయం, బోస్ బొమ్మ సెంటర్, గాంధీ చౌక్, పీఎస్ఆర్ రోడ్డు, నయాబజార్ వైపు వెళ్లాలని సూచించారు. ఇక ముదిగొండ నుండి ఖమ్మం వచ్చే వాహనదారులు వెంకటగిరి క్రాస్ వద్ద గ్రీన్ ఫీల్డ్ హైవే మీదుగా వస్తూ ధంసలాపురం ఎగ్జిట్ దగ్గర దిగి శ్రీరామ్హిల్స్, ముస్తఫానగర్ మీదుగా ఖమ్మం చేరుకోవాల్సి ఉంటుందని తెలిపారు. ఏటీసీ కోర్సులతో ఉపాధి అవకాశాలు ఖమ్మం మామిళ్లగూడెం: అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ల(ఏటీసీ)లోని కోర్సులు పూర్తిచేయడం ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని అధికారులు తెలిపారు. సంక్షేమ వా రోత్సవాలలో భాగంగా శుక్రవారం ఖమ్మంలోని బీసీ స్టడీసర్కిల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ యువతకు నైపుణ్యాభివృద్ధిపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆయా సంక్షేమ శాఖల అధికారులు గ్రేసమ్మ, వెంగల్రావు, ఎం. వీరన్న, ఎండీ.అబ్దుల్ రవూఫ్ మాట్లాడుతూ పోటీ ప్రపంచంలో చదువుతో పాటు అదనపు కోర్సులు పూర్తిచేస్తే నైపుణ్యాలు పెరిగి ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. ఈకార్యక్రమంలో బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ శ్రీలత, కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ రావు పాల్గొన్నారు. 27న ‘నిధి ఆప్కే నికట్’ ఖమ్మం సహకారనగర్: సంస్థల యజమానులు, ఉద్యోగులు, పెన్షనర్ల సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకు ఈనెల 27న ‘నిధి ఆప్కే నికట్’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ప్రాంతీయ కమిషనర్ వై.డీ. శ్రీనివాస్ తెలిపారు. సత్తుపల్లిలోని మున్సిపాలిటీ కార్యాలయంలో 27న ఉదయం 9–30నుంచి సాయంత్రం 4గంటల వరకు కార్యక్రమం జరుగుతుందని పేర్కొన్నారు. ఉద్యోగులు, యజమానులు, పెన్షనర్లకు సంస్థ ద్వారా అందుతున్న సేవలపై అవగాహన కల్పించడమే కాక సమస్యల పరిష్కారంపై సూచనలు చేస్తామని వెల్లడించారు. లాటరీ పేరిట రూ.1.50లక్షలకు టోకరా కారేపల్లి: తక్కువ ధరలకే సబ్బులు ఇస్తాం.. సబ్బులు కొనుగోలు చేసిన వారు లక్కీ లాటరీలో రూ.లక్షలు గెలుచుకోవచ్చని ఓ వ్యక్తి మాయమాటలు చొప్పి రూ.1.50లక్షల మేర వసూలు చేసిన ఘటన మండలంలోని గాదెపాడులో వెలుగు చేసింది. ఏపీకి ఓ వ్యక్తి ఇటీవల గాదెపాడుకు రా గా, తక్కువ ధరతో నాణ్యమైన సబ్బులు విక్రయిస్తున్నట్లు నమ్మబలికాడు. అంతేకాక సబ్బులు కొన్న వారు లాటరీలో రూ.లక్షలు బహుమతిగా గెలుచుకోవచ్చని తెలిపాడు. దీంతో పలువురు సబ్బులు కొనుగోలు చేయగా ఫోన్నంబర్లు తీసుకుని వెళ్లిపోయాడు. ఆతర్వాత ఫోన్ చేసి లాటరీ తగిలిందని చెబుతూ రూ.20వేలు, రూ.30వేల చొప్పున ఫోన్పే ద్వారా డిపాజిట్ చేస్తే రూ.లక్ష ఖాతాలో జమ అవుతుందని చెప్పడంతో పలు వురు రూ.1.50లక్షల మేరచెల్లించారు.కానీ డబ్బు జమ కాకపోగా, సదరు వ్యక్తి పొంతన లేని సమాధానాలు చెబుతుండడంతో మోసపోయామని గుర్తించారు. దీంతో గ్రామానికి చెందిన రాయల మాధవరావు తదితరులు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ బి.గోపి తెలిపారు. ప్రమాద ఘటనపై కేసు నమోదుచింతకాని: రోడ్డుప్రమాదానికి కారణమైన వ్యక్తిపై పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశా రు. చింతకాని మండలం మత్కేపల్లికి చెందిన పెనుగొండ తిరుపతిరావు ఈనెల 13వ తేదీన ద్వి చక్ర వాహనంపై పందిళ్లపల్లి వెళ్తున్నాడు. ఇదేసమయాన ఖమ్మం వైపు నుండి ద్విచక్ర వాహనంపై అతివేగంగా వచ్చిన నిఖిల్ జగన్నాధపురం సమీపాన తిరుపతిరావు వాహనాన్ని ఢీకొట్టాడు. ఘటనలో తిరుపతిరావుకు తీవ్ర గాయాలు కాగా ఖమ్మంలో చికిత్స అనంతరం హైదరాబాద్ తరలించారు. ఈమేరకు ఆయన తల్లి జ్యోతి ఫిర్యాదుతో నిఖిల్పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై వీరేందర్ తెలిపారు. -
ఆర్టీసీని దిగజారుస్తున్న ప్రభుత్వం
ఖమ్మం మామిళ్లగూడెం: ఆర్టీసీ ఆస్తులను ప్రైవేట్పరం చేయాలనే ఆలోచన దుర్మార్గమని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి అన్నారు. రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికుల సమ్మెకు తమ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తోందని వెల్లడించారు. ఈమేరకు ఖమ్మం ఆర్టీసీ డిపో వద్ద కార్మికుల సమ్మె శిబిరాన్ని సందర్శించిన ఆయన మాట్లాడారు. ప్రభుత్వాలు మారినా ఆర్టీసీ కార్మికుల తలరాతలు మారకపోగా, సంస్థ ప్రైవేటీకరణ కుట్రలు ముమ్మరంగా సాగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్టీసీని కేసీఆర్ ప్రభుత్వం నాశనం చేస్తే.. ప్రస్తుత రేవంత్రెడ్డి ప్రభుత్వం మరింత దిగజారుస్తోందని విమర్శించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆర్టీసీ సమస్యలపై గొంతెత్తిన రేవంత్రెడ్డి, కోదండరామ్ వంటి నాయకులు ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారో చెప్పాలన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణమనేది ప్రభుత్వ పథకమైనందున పూర్తి భారాన్ని ప్రభుత్వం భరించాలే తప్ప ఆర్టీసీ నెత్తిన రుద్దడం సరి కాదని పేర్కొన్నారు. జిల్లా నుంచి మంత్రులు ఉన్నా ఆర్టీసీ కార్మికుల సమ్మె, వారి సమస్యలను పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు. శాశ్వత పరిష్కారానికి యత్నం దేశ చరిత్రలో మహిళా సాధికారతకు బాటలు వేస్తూ ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ’నారీ శక్తి వందన్ అధినియం’ బిల్లు ఒక సువర్ణ అధ్యాయమే కాక కీలక అడుగుగా నిలిచిందని ఎంపీ విశ్వేశ్వర్రెడ్డి తెలిపారు. గత 27 ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న ఈ అంశానికి మోదీ శాశ్వత పరిష్కారం చూపే ప్రయత్నం చేశారని చెప్పారు. దీనిని ప్రతిపక్షాలు కేవలం రాజకీయ కోణంలో కాకుండా సామాజిక మార్పుగా చూస్తే బాగుండేదని అన్నారు. ఖమ్మంలో శుక్రవారం ఆయన మా ట్లాడుతూ రిజర్వేషన్లపై కాంగ్రెస్ వైఖరి పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టిన రోజు తేలిపోయిందన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరు కోటేశ్వరరావు, రాష్ట్ర కోశాధికారి దేవకీ వాసుదేవరావు, నాయకులు గోంగూర వెంకటేశ్వరరావు, వి.పుల్లారావు యాద వ్, మందడపు సుబ్బారావు, మేకల నాగేందర్, గుత్తా వెంకటేశ్వర్లు, వేరెల్లి రాజేష్, రవిరాథోడ్, నకరికంటి వీరభద్రం, రవిగౌడ్, దొడ్డా అరుణ, అత్తి విజయరెడ్డి, అనిత, రజినీరెడ్డి, స్వర్ణకుమారి, మందా సరస్వతి, మణి, ఫణికుమారి, నాగమణి తదితరులు పాల్గొన్నారు.చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి -
6.556 కిలోల గంజాయి స్వాధీనం
ఖమ్మంరూరల్: మండలంలోని తల్లంపాడు శివారులో పోలీసులు చేపట్టిన తనిఖీల్లో కారులో తరలిస్తున్న 6.556 కిలోల గంజాయి లభించింది. ఖమ్మం రూరల్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు... విజయవాడకు చెందిన జయరాం, తేజ వద్ద గంజాయి కొనుగోలు చేసిన తరపరెడ్డి భాస్కర్మణికుమార్, తోట సిరి బస్సులో ఖమ్మం తీసుకొచ్చారు. ఆపై ఖమ్మంలో కొంత గంజాయిని ఓ వ్యక్తికి అప్పగించి మిగతాది కోదాడకు చెందిన శివరామ, శ్రీరామ్ సహకారంతో అద్దె కారులో హైదరాబాద్ తరలిస్తున్నారు. హైదరాబాద్ బేగంపేటలోని ప్రణయ్కు గంజాయి అందించేందుకు వెళ్తుండగా పోలీసులు చేపట్టిన తనిఖీల్లో పట్టుబడ్డారు. ఈమేరకు గంజాయి, కారు స్వాధీనం చేసుకుని నిందితులను అరెస్ట్ చేసి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ముష్క రాజు తెలిపారు. -
గురుకులాలు పిలుస్తున్నాయ్!
నేలకొండపల్లి: సాంఘిక సంక్షేమ శాఖ బాలికల గురుకుల జూనియర్ కాలేజీలు నాణ్యమైన విద్యకు చిరునామాగా నిలుస్తున్నాయి. పాఠ్యాంశాల బోధనే కాక జేఈఈ, నీట్, ఎప్సెట్కు ప్రత్యేక శిక్షణ ఇస్తుండడంతో విద్యార్థినులు అటు ఇంటర్లో, ఇటు పోటీ పరీక్షల్లో ప్రతిభ చాటుతున్నారు. ఈమేరకు గురుకులాల్లో 2026–28 విద్యా సంవత్సరానికి గాను ఇంటర్లో ప్రవేశానికి దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. ఆధునాతన తరగతి గదులు, విశాలమైన మైదానాలతో పాటు నిష్టాతులైన అధ్యాపకులు ఉన్నందున కాలేజీల్లో చేరాలని అధ్యాపకులు విస్తృత ప్రచారం చేస్తున్నారు. బాలురకు మూడు, బాలికలకు పది జిల్లాలో 13 సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల కాలేజీలు ఉన్నాయి. ఇందులో మూడు బాలుర కాలేజీలు కాగా, పది బాలికలకు 10 కాలేజీలు కొనసాగుతున్నాయి. ఒక్కో కాలేజీలో గ్రూప్కు రెండు సెక్షన్ల చొప్పున 80 మందికి ప్రవేశాలు కల్పించే అవకాశముంది. మొత్తంగా జిల్లాలోని అన్ని గురుకులాల్లో 1,040 సీట్లు ఉండగా, పరీక్షలో వచ్చే మార్కుల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. కాగా, ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించే గడువు శనివా రంతో ముగియనుంది. 2025–26లో పదో తరగతి చదివిన విద్యార్థులనే అర్హులుగా పరిగణనలోకి తీసుకుంటారు. విద్యతోపాటు క్రీడల్లో ప్రోత్సాహం గురుకుల కాలేజీల్లో నాణ్యమైన విద్యతో పాటు క్రీడల్లోనూ విద్యార్థులకు తర్ఫీదు ఇస్తున్నారు. విశాలమైన మైదానాలు ఉండడంతో ఉదయం, సాయంత్రం ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నారు. కాలేజీల విద్యార్థులు పలువురు రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడాపోటీల్లో రాణించారు. నేలకొండపల్లి సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల కాలేజీ విద్యార్థినులు చదువుతో పాటు క్రీడాపోటీల్లో సత్తా చాటారు. అంతేకాక ప్రాక్టికల్స్ కోసం అన్ని పరికరాలతో కూడిన ల్యాబ్లు, కంప్యూటర్ బోధనకు సైతం ఆధునిక కంప్యూటర్లు ఉన్నందున ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకోవాలని అధ్యాపకులు సూచిస్తున్నారు. సాంఘిక సంక్షేమ శాఖ పరిధి లోని గురుకుల కాలేజీల్లో నాణ్యమైన విద్య అందుతుంది. ప్రైవేట్ కాలేజీలతో పోలిస్తే అనుభవజ్ఞులైన అధ్యాపకులు ఉన్నా రు. అంతేకాక ప్రాక్టికల్స్, కంప్యూటర్ బోధనకు అత్యాధునిక ల్యాబ్లు ఉన్నా యి. ఇటీవల పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవాలి. – జి.శ్రీలత, ప్రిన్సిపాల్, నేలకొండపల్లి గురుకుల కాలేజీ -
ఇంట్లోనే నల్లబెల్లం తయారీ!
నేలకొండపల్లి: ఇంకొకరి వద్ద కొనుగోలు చేయడం.. ఆపై రవాణా ఇక్కట్లు, మళ్లీ అధికారుల కన్నుగప్పి అమ్మాలంటే తిప్పలు.. ఇవన్నీ ఎందుకుని భావించాడో, ఏమో కానీ ఓ వ్యక్తి ఇంట్లోనే నల్లబెల్లం తయారీకి శ్రీకారం చుట్టాడు. ఆపై బెల్లాన్ని గుడుంబా తయారీదారులకు విక్రయిస్తున్నాడు. ఎకై ్సజ్ టాస్క్ఫోర్స్ బృందం, నేలకొండపల్లి స్టేషన్ ఉద్యోగులు గురువారం రాత్రి నేలకొండపల్లి మండలం కోనాయిగూడెంలోని బొమ్మిశెట్టి శ్రీనివాస్ ఇంట్లో చేపట్టిన ఈ తనిఖీల్లో విషయం బయటపడింది. సదరు వ్యక్తి నల్లబెల్లం తయారీ చేసి గుడుంబా తయారీదారులకు విక్రయిస్తున్నాడనే సమాచారంతో తనిఖీలు చేపట్టారు. ఈమేరకు శ్రీనివాస్ ఇంట్లో నల్లబెల్లం తయారీకి ఉపయోగిస్తున్న ముడిపదార్ధాలతో పాటు అమ్మకానికి సిద్ధంగా ఉన్న 1,944 కిలోల నల్లబెల్లంను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు ఏఈఎస్ వేణుగోపాల్రెడ్డి శుక్రవారం వివరాలు వెల్లడించారు. గుడుంబా తయారీకి కావాల్సిన పదార్థాలు అమ్మే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తనిఖీల్లో డీటీఎఫ్ సీఐ కరుణశ్రీ, నేలకొండపల్లి సీఐ రమేష్, ఎస్సై లత, ఉద్యోగులు పాల్గొన్నారు.టాస్క్ఫోర్స్ తనిఖీల్లో 1,944 కిలోల బెల్లం స్వాధీనం -
ఆలయ విస్తరణ మార్కింగ్ పరిశీలన
భద్రాచలంటౌన్: భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయ విస్తరణ పనుల్లో భాగంగా ఆర్అండ్బీ అధికారులు చేపట్టిన మార్కింగ్ ప్రక్రియను శుక్రవారం తహసీల్దార్ ధనియాల వెంకటేశ్వర్లు పరిశీలించారు. ఆలయం చుట్టూ ప్రభుత్వం సేకరించిన భూమి, మాఢ వీధుల విస్తరణపై ఆర్అండ్బీ అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ ఆలయ పునరుద్ధరణ కోసం గతంలోనే నిబంధనల ప్రకారం భూసేకరణ పూర్తి చేసి, నిర్వాసితులకు పరిహారం అందించామని తెలిపారు. సేకరించిన భూమిని పంచనామా నిర్వహించి దేవాదాయ శాఖకు అప్పగించినట్లు పేర్కొన్నారు. రూ.351 కోట్లతో చేపట్టనున్న ఆలయ పునర్నిర్మాణ పనులు ఈనెల 26 నుంచి ప్రారంభం కానున్నాయని ఆయన వివరించారు. కేరళ మోడల్ అంగన్వాడీ పరిశీలనపాల్వంచరూరల్: మండల పరిధిలోని తోగ్గూడెంతండాలో నీతి అయోగ్ నిధులు రూ.15 లక్షలతో కేరళ మోడల్లో నూతనంగా నిర్మించిన అంగన్వాడీ కేంద్రాన్ని శుక్రవారం కేంద్ర మంత్రిత్వశాఖ అడిషనల్ సెక్రటరీ డి.సాయిబాబు సందర్శించి పరిశీలించారు. భవన సమూదాయ ప్రయోజనాలు, కేంద్రంలో ఆరోగ్యం, విద్య, పోషణ, ప్రాథమిక వసతులపై ఆరా తీశారు. అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు ఆటవస్తువులు అందుబాటులో ఎందుకు ఉంచలేదని సిబ్బందిని ప్రశ్నించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ బొగ్గనారాయణ, ఎంపీఓ కేశవరావు, సీడీపీఓ లక్ష్మీప్రసన్న, గ్రామపంచాయతీ కార్యదర్శి రవికుమార్ పాల్గొన్నారు. -
సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎంపీ రవిచంద్ర
ఖమ్మంవైరారోడ్: అనారోగ్యంతో బాధపడుతూ ప్రైవేట్ చికిత్స చేయించుకున్న వారికి తన సిఫారసుతో మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎంపీ వద్దిరాజు రవిచంద్ర పంపిణీ చేశారు. ఖమ్మం బుర్హాన్పురంలోని క్యాంపు కార్యాలయంలో శుక్రవా రం ఆయన 19మందికి రూ.8.50 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులతో పాటు ఇద్దరికి రూ.4 లక్షల విలువైన ఎల్ఓసీ పత్రాలను అందజేసి మాట్లాడారు. పలువురి కుటుంబాలకు పరామర్శ ఇటీవల మృతి చెందిన పలువురి కుటుంబాలను రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర శుక్రవారం పరామర్శించారు. ధంసలాపురంలోని అగ్రహారంలో ఆళ్లవెంకటరెడ్డి, శ్రీరామ్హిల్స్లో కమర్తపు బతు కమ్మ, మధిరలో ఆది వెంకటేశ్వర్లు (పెద్దబ్బాయ్) చిత్రపటాల వద్ద ఎంపీ నివాళులర్పించారు. వీరి కుటుంబీకులు శేషవర్ధన్రెడ్డి, అంజిరెడ్డి, బీరెడ్డి నాగచంద్రారెడ్డి, సత్యవర్ధన్రెడ్డి, కమర్తపు మురళి, రవీందర్, కూరపాటి వెంకటేశ్వర్లు, డాక్టర్ కూరపాటి ప్రదీప్ను పరామర్శించారు. ఈకార్యక్రమాల్లో జెడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్రాజు, మధిర మార్కెట్ మాజీ చైర్మన్ చిత్తారు నాగేశ్వరరావు, నాయకులు, ప్రజాప్రతినిధులు వెన్నంశెట్టి అప్పారావు, అరిగే శ్రీనివాసరావు, యాసా రామారావు, ఎల్.గోపాల్రావు, సాగర్, గుణచరిత్, మహేష్ తదితరులు పాల్గొన్నారు. -
ఓటీటీలో భద్రాద్రి క్షేత్ర దర్శిని డాక్యుమెంటరీ
భద్రాచలంటౌన్: దక్షిణ అయోధ్యగా విరాజిల్లుతున్న భద్రాద్రి క్షేత్ర మహిమను చాటిచెప్పే భద్రాద్రి క్షేత్ర దర్శిని డాక్యుమెంటరీ విడుదల చేసినట్లు చిత్ర బృందం శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. శ్రీ సీతారామచంద్ర స్వామివారి దివ్యక్షేత్ర చరిత్ర ను, ఆధ్యాత్మిక వైభవాన్ని కళ్లకు కట్టేలా రూపొందించిన చిత్రాన్ని ఓటీటీ వేదికగా ‘ఆహా’లో ప్రసారం చేస్తున్నారు. డాక్యుమెంటరీకి కృష్ణ ప్రభాత్ శర్మ వివరణ అందించగా, సాయి భారతి నిర్మాతగా వ్యవహరించారు. అభిలాష్ దర్శకత్వ పర్యవేక్షణలో, వెంకట్ ఛాయాగ్రహణంలో ఈ చిత్రం రూపుదిద్దుకుంది. శ్రీ వెంకట్ సంగీతాన్ని అందించారు. -
ప్రభుత్వం ఇకనైనా దిగిరావాలి
సాక్షిప్రతినిధి, ఖమ్మం: జిల్లాలో మొక్కజొన్న, వరి అత్యధిక విస్తీర్ణంలో సాగు చేసిన రైతులు మంచి దిగుబడులు సాధించినా.. ప్రభుత్వం తీరుతో వారిలో ఆనందం లేకుండా పోయిందని మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ పేర్కొన్నారు. ఆంక్షలు లేకుండా మొక్కజొన్న, వరి ధాన్యం కొనుగోలు చేయాలనే డిమాండ్తో శుక్రవారం బీఆర్ఎస్ ఆధ్వర్యాన కలెక్టరేట్ వద్ద ఽమహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పువ్వాడ మాట్లాడుతూ ప్రభుత్వం పంటలను కొనుగోలు చేయకుండా ఇబ్బంది పెడితే రైతుల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. నాడు మఖ్యమంత్రిగా కేసీఆర్ చివరి గింజ వరకు కొనుగోలు చేయడమే కాక రైతుబంధు, రైతు బీమా, ఉచిత కరెంట్ అమలుచేశారని తెలిపారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం పంట ఉత్పత్తులు కొనుగోలు చేయకపోగా పథకాలను కూడా సక్రమంగా అమలుచేయడం లేదని ఆరోపించారు. పంట కొనుగోళ్ల తీరును పరిశీలిస్తే పార్టీలు మారడం తప్ప మంత్రి తుమ్మలకు ఎలాంటి అనుభవం లేదని రైతులు అంటున్నారని ఎద్దేవా చేశారు. జిల్లా నుంచి ముగ్గురు మంత్రులు ఉన్నా రైతుల గోడు పట్టించుకోకపోవడం సరికాదన్నారు. ఈమేరకు జిల్లా ప్రజలు ప్రభుత్వం తీరును గుర్తించి కేసీఆర్ను మరోమారు సీఎంగా చేసేందుకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ వైఫల్యంతోనే... రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర విమర్శించారు. రాష్ట్రంలో ఎండలు మండుతుంటే మొక్కజొన్నలో తేమ ఉందని క్వింటాకు 5 కేజీలు తరుగు తీయడం దారుణమన్నారు. మాజీ సీఎం కేసీఆర్ రైతును రాజుగా చేసేందుకు అనేక పథకాలు అమలుచేశారన్నారు. కానీ కాంగ్రెస్ కౌలుదారులకు కూడా రైతు భరోసా ఇస్తామని చెప్పి అసలు రైతులకే ఇవ్వడం లేదని తెలిపారు. ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ మాట్లాడుతూ ఆరుగాలం కష్టించి పంటను పండించినా కొనుగోలు చేయకుండా ప్రభుత్వం రైతులు ఉసురు తీసుకుంటుందని మండిపడ్డారు. అత్యధిక దిగుబడి వచ్చినా కొనుగోళ్ల ప్రణాళికా లేక ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. అనంతరం అన్ని ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేయాలని కోరుతూ నాయకులు అదనపు కలెక్టర్ శ్రీనివాస్రెడ్డి వినతిపత్రం అందజేశారు. ఈ ధర్నాలోమాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, కందాల ఉపేందర్రెడ్డి, జెడ్పీ, డీసీసీబీ మాజీ చైర్మన్లు లింగాల కమల్రాజు, కూరాకుల నాగభూషణం, నాయకులు గుండాల కృష్ణ, పగడాల నాగరాజుయాదవ్, బిచ్చాల తిరుమలరావు, బొమ్మెర రామ్మూర్తి, ఉప్పల వెంకటరమణ, బచ్చువిజయ్కుమార్, శీలంశెట్టి వీరభద్రం, తోట రామారావు, కూరాకుల వలరాజు, బెల్లం వేణు, షేక్షకీనా, ఆరెంపుల వీరభద్రం తదితరులు పాల్గొన్నారు.లేకపోతే రైతుల ఆగ్రహానికి గురికాక తప్పదు -
నేరుగానే!
ఎన్నిక లేదు..సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ప్రభుత్వ నిర్ణయంతో ఉమ్మడి జిల్లాలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల(పీఏసీఎస్) పాలకమండళ్ల భర్తీ ఇకపై నామినేటెడ్ విధానంలో జరగనుంది. సంఘాల పదవీకాలం ముగిసి చాన్నాళ్లు కాగా, ఇన్చార్జి అధికారుల పాలన కొనసాగుతోంది. ఈ దశలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోగా, పీఏసీఎస్ల చైర్మన్, వైస్ చైర్మన్, డైరెక్టర్లను ప్రభుత్వం నామినేటెడ్ పద్ధతిలో భర్తీ చేయనుంది. అయితే, ఎంపికలో ఎమ్మెల్యేల పాత్ర కీలకం కానుండడంతో కాంగ్రెస్లోని ఆశావహులు తమ వంతు ప్రయత్నాలను మొదలుపెట్టారు. ఏడాదిగా ఇన్చార్జిల పాలనే.. ఖమ్మం డీసీసీబీ పరిధిలో ఉమ్మడి జిల్లాలో 101 పీఏసీఎస్లు ఉన్నాయి. ఖమ్మం జిల్లాలో 76, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 21తో పాటు మహబూబాబాద్ జిల్లాలో రెండు, ములుగు జిల్లాలో రెండు కొనసాగుతున్నాయి. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా రైతులకు తక్కువ వడ్డీకి రుణాలు ఇవ్వడంతో పాటు ఎరువులు, విత్తనాల అమ్మకం, పంట ఉత్పత్తుల భద్రతకు గోదాంల సదుపాయాలు కల్పిస్తాయి. అంతేకాక ధాన్యం కొనుగోలు బాధ్యతలు కూడా నిర్వర్తిస్తున్నాయి. అయితే, పీఏసీఎస్ల పాలక మండళ్ల పదవీకాలం గత ఏడాది ఫిబ్రవరిలో ముగిసింది. అప్పటి నుంచి ఇన్చార్జి అధికారుల పర్యవేక్షణలోనే సంఘాలు కొనసాగుతున్నాయి. పీఏసీఎస్ టూ డీసీసీబీ... ఇప్పటి వరకు పీఏసీఎస్ల పాలకమండళ్లు ఎన్నికల ప్రక్రియ ద్వారా కొలువుదీరనున్నాయి. సహకార సంఘాల్లో సభ్యులుగా ఉన్న రైతులు తమ ఓటు ద్వారా 10 – 12 మంది డైరెక్టర్లను ఎన్నుకుంటారు. వీరు పీఏసీఎస్ చైర్మన్లు, వైస్ చైర్మన్లను.. ఆపై చైర్మన్లు డీసీసీబీ డైరెక్టర్లను, వారు డీసీసీబీ చైర్మన్, వైస్ చైర్మన్ను ఎన్నుకునే విధానం కొనసాగుతోంది. దీంతో గ్రామంలో ఉన్న రైతు నుంచి జిల్లా కేంద్రంలో ఉన్న డీసీసీబీ వరకు అనుబంధం ఉండి.. రుణాలు, ఎరువులు, విత్తనాల కొనుగోళ్ల ప్రక్రియ సాఫీగా సాగేది. నామినేటెడ్కు ‘జై’ ఇకపై పీఏసీఎస్లకు ఎన్నికలు నిర్వహించకుండా నామినేటెడ్ పద్ధతిలో పదవులు భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమాన డైరెక్టర్లు, చైర్మన్, వైస్ చైర్మన్లనే కాక.. డీసీసీబీ, డీసీఎంఎస్లో ఇదే తరహాలో పాలక మండళ్లను నియమించనున్నట్లు తెలిసింది. ఇందుకోసం ఎమ్మెల్యేల ప్రతిపాదనలు కీలకం కానున్నాయి. జిల్లా మంత్రులు, ఇన్చార్జి మంత్రులు కూడా ఇందులో భాగం కానున్నారు. మంత్రివర్గంలో నిర్ణయం తీసుకున్నాక పోస్టుల భర్తీ మొదలుపెట్టనున్నట్లు తెలుస్తోంది. ఈక్రమాన అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు పదవుల భర్తీపై కసరత్తు మొదలుపెట్టినట్లు తెలిసింది.ఉమ్మడి జిల్లాలో అధికార పార్టీ నాయకులు పలువురు నామినేటెడ్ పదవుల కోసం ఎదురుచూస్తున్నారు. రోజులు గడుస్తున్న కొద్దీ తమకు పదవులు దక్కుతాయో, లేదోనన్న ఆందోళన వారిలో పెరిగిపోతోంది. ఈక్రమాన పీఏసీఎస్ల రూపంలో కొన్ని పదవులైనా భర్తీ చేయొచ్చనే భావనకు ప్రభుత్వం వచ్చినట్లు తెలుస్తుండగా.. ఆశావహుల్లోనూ ఆనందం వ్యక్తమవుతోంది. ఉమ్మడి జిల్లాలోని పీఏసీఎస్ చైర్మన్ల రూపంలోనే 101 మందికి.. ఒక్క ఖమ్మం జిల్లాలో 76 మందికి అవకాశం దక్కనుంది. మే నెలాఖరుకల్లా నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. తద్వారా నిరాశతో ఉన్న పార్టీ శ్రేణులను సంతృప్తిపరిచినట్లు అవుతుందనే భావనలో ఉన్నట్లు సమాచారం. ఏదీఏమైనా ప్రభుత్వ నిర్ణయంతో జిల్లాలో రాజకీయ వేడి మొదలుకాగా.. ఏదో ఒక పదవి దక్కించుకోవాలనే ఉద్దేశంతో నాయకుల నుంచి కార్యకర్తల వరకు స్థానిక ఎమ్మెల్యేలు, జిల్లా మంత్రులను కలిసేలా రంగం సిద్ధం చేసుకుంటున్నారు. పీఏసీఎస్లకు నామినేటెడ్ పద్ధతిలో పాలకమండళ్లు -
కొనసాగిన నిరసనలు..
మూడోరోజుకు చేరిన ఆర్టీసీ కార్మికుల సమ్మె ● సూపర్వైజర్లు కూడా విధుల బహిష్కరణ ● సంఘీభావం తెలిపిన పార్టీలు, సంఘాల నాయకులు ఖమ్మంమయూరిసెంటర్: అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారం, హామీలు అమలు చేయాలనే డిమాండ్తో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె మూడో రోజైన శుక్రవారం నిరసనలతో కొనసాగింది. తొలి రెండు రోజులు డిపోగేట్ల వద్ద నిరసనలు తెలిపిన కార్మికులు శుక్రవారం ఖమ్మం పాత బస్టాండ్ వద్ద మయూరిసెంటర్లో నోటికి నల్ల రిబ్బన్లు ధరించి మానవహారంగా ఏర్పడ్డారు. కాగా, కార్మికుల సమ్మెకు మద్దతుగా రీజియన్లోని అన్ని డిపోల అకౌంట్, పరిపాలన విభాగాల్లోని సూపర్వైజర్లు సైతం విధులు బహిష్కరించారు. దీంతో ఖమ్మం డిపో మేనేజర్ కార్యాలయం గేటుకు వేసిన తాళాలు శుక్రవారం తెరుచుకోలేదు. పార్టీల సంఘీభావం ఖమ్మం డిపో వద్ద ఆర్టీసీ కార్మికుల నిరసనకు పలు పార్టీల నాయకులు సంఘీభావం తెలిపారు. సీపీఐ, బీజేపీ, న్యూడెమోక్రసీ నాయకులు మద్దతు పలికి సమస్యలు పరిష్కారం అయ్యేవరకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. సీపీఐ జాతీయ సమితి సభ్యుడు బాగం హేమంతరావు మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికులు న్యాయమైన డిమాండ్లను నెరవేర్చకుంటే మరో ఉద్యమం తప్పదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కార్మికులు 41 రోజుల క్రితమే సమ్మె నోటీసు ఇచ్చినా ప్రభుత్వం స్పందించకపోవడం సరికాదన్నారు. కాగా, కార్మికుల సమ్మెతో బస్సులన్నీ నడవకపోగా, నడిచిన బస్సులు కూడా కొద్దిరూట్లలో.. అదీ సమయపాలన లేకపోవడంతో ప్రయాణికులు గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చింది. హైదరాబాద్, భద్రాచలం రూట్లలో వెళ్లే ప్రయాణికులు ప్రైవేటు వాహనాలు ఆశ్రయించారు. ఇక సాయంత్రం దాటాక కోదాడ, కొత్తగూడెం, సూర్యాపేట వంటి ప్రధాన రూట్లలో బస్సులు లేక అవస్థ పడుతున్నారు. బందోబస్తు.. పర్యవేక్షణ పోలీసులతో పాటు ఆర్టీసీ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ విభాగ అధికారులు, సిబ్బంది కార్మికుల నిరసనలను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. కార్మికులు క్షణికావేశానికి లోనుకాకుండా సూచనలు చేస్తున్నారు. సమస్యలు పరిష్కారం అవుతాయని, ఆవేదనకు గురికావొద్దని నిరసన శిబిరాల వద్ద కార్మికులకు నచ్చజెప్పారు. పాత బస్టాండ్లో అధికారులు ముందుజాగ్రత్తగా ఓ అంబులెన్స్ ఏర్పాటుచేశారు. రోడ్డెక్కిన 330 బస్సులు కార్మికులంతా సమ్మెలో ఉండడంతో అధికారులు ఔట్ సోర్సింగ్ కార్మికులు, తాత్కాలిక సిబ్బంది, అద్దె బస్సుల డ్రైవర్లతో కొన్ని బస్సులను నడిపారు. రీజియన్లో 538 బస్సులకు గాను శుక్రవారం 330 బస్సులు రోడ్డెక్కాయి. తద్వారా 61 శాతం బస్సులను నడిపించామని అధికారులు వెల్లడించారు. అయితే, గురువారంతో పోలిస్తే శుక్రవారం బస్సుల సంఖ్య తగ్గడం గమనార్హం. -
వైరా రిజర్వాయర్ కాల్వ కరకట్టపై ఫెన్సింగ్
వైరా: వైరాలో రిజర్వాయర్ కాల్వ వద్ద ప్రమాదాలు జరగకుండా కరకట్ట వెంట ఫెన్సింగ్ ఏర్పాటుకు మున్సిపల్ పాలకవర్గం నిర్ణయించింది. ఈమేరకు 6, 9వ వార్డుల్లోని ఇందిరమ్మ కాలనీ పక్కనే రిజర్వాయర్ కాల్వకు ఫెన్సింగ్ ఏర్పాటు చేయనున్నారు. ఈక్రమాన మున్సి పల్ చైర్ పర్సన్ డాక్టర్ కాపా చంద్రకళ, మున్సి పల్ ఏఈ శ్రీమాన్య శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. చైర్మన్ కట్ల సంతోష్, శానిటరీ ఇన్స్పెక్టర్ గుగులోత్ వీరన్న, నాయకులు డాక్టర్ కాపా మురళీకృష్ణ పాల్గొన్నారు. బీఎస్ఎన్ఎల్ సేవలు మెరుగుపడాలి ఖమ్మంమయూరిసెంటర్: గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లో బీఎస్ఎన్ఎల్ సిగ్నల్ సమస్యలను పరిష్కరించి, వినియోగదారులకు వేగవంతమైన ఇంటర్నెట్ సేవలు అందించాలని టెలిఫోన్ అడ్వైజరీ కమిటీ(టీఏసీ) సభ్యులు కోరారు. ఖమ్మంలోని ఎంపీ రఘురాంరెడ్డి క్యాంపు కార్యాలయంలో శుక్రవారం టీఏసీ సభ్యుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు ఉమ్మినేని కృష్ణ, ఇమామ్ భాయ్, రంజిత్నాయక్, మచ్చా రామారావు, సత్యనారాయణరెడ్డి తదితరులు సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. కూసుమంచి, బోనకల్, చింతకాని మండలాలతో పాటు గోవిందాపురం, వైరా, బ్రాహ్మణపల్లి, ఉప్పలమడక, ఖమ్మం రూరల్ మండలం కస్నాతండా, ఖమ్మంలోని ఇందిరానగర్, గోశాల ప్రాంతాల్లో నెట్వర్క్ పరిధి విస్తరణ, సమస్యల పరిష్కారానికి మరిన్ని టవర్లు ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే, ఖమ్మం బీఎస్ఎన్ఎల్ కార్యాలయంలో సిమ్కార్డులు నిరంతరం అందుబాటులో ఉంచాలని సూచించారు. టీఏసీ సభ్యుల విజ్ఞప్తులపై సంస్థ డీజీఎం రాజశేఖర్, ఏజీఎం స్పందిస్తూ అవసరమైన చోట కొత్త టవర్లు ఏర్పాటుచేస్తామని, ఎంపీ రఘురాంరెడ్డి సూచనలతో పెండింగ్ సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు. ఫార్మర్ రిజిస్ట్రీ వేగవంతం చేయాలి ఎర్రుపాలెం: రైతుల వివరాలను నమోదు చేసే ప్రక్రియ(ఫార్మర్ రిజిస్ట్రీ)లో వేగం పెంచాలని జిల్లా వ్యవసాయ అధికారి ధనసరి పుల్లయ్య ఆదేశించారు. మండలంలోని కాచారం, ఎర్రుపాలెంల్లో పంటలను పరిశీలించిన ఆయన రైతులంతా వివరాలు నమోదు చేసుకునేలా ఏఈఓలు అవగాహన కల్పించాలని సూచించా రు. ఆతర్వాత డీఏఓ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే సంక్షేమ పథకాలు పొందడమే కాక వచ్చే సీజన్లో యూరియా బుకింగ్ కోసం ఫార్మర్ రిజిస్ట్రీ పోర్టల్లో నమోదు చేసుకోవడం తప్పనిసరి చెప్పారు. తద్వారా 11 అంకెల రైతు గుర్తింపు సంఖ్య లభి స్తుందని చెప్పారు. ఎర్రుపాలెం మండలంలో ఇంకా 2,622 రైతులు మిగిలినందున మీ సేవా కేంద్రాల్లో లేదా ఏఈఓలను సంప్రదించాలని డీఏఓ తెలిపారు. ఏఓ బోయినపల్లి సాయిశివ, ఏఈఓలు బాలకృష్ణ, వంశీ పాల్గొన్నారు. ‘ఉద్యమ్’ రిజిస్ట్రేషన్ తప్పనిసరి ఖమ్మంమయూరిసెంటర్: మహిళా వ్యాపారులు తమ ఆధార్ నంబర్ను ‘ఉద్యమ్’ పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేయించుకోవడం తప్పనిసరని మెప్మా పీడీ నళిని పద్మావతి తెలిపారు. రిజిస్ట్రేషన్ విధానంపై మెప్మా అధికారుల భక్తరామదాసు కళాక్షేత్రంలో శుక్రవారం ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. రిజిస్ట్రేషన్ ద్వారా వ్యాపారులకు సులువుగా రుణాలు మంజూరవుతాయని తెలిపారు. ఈ విషయమై మహిళా సంఘాల్లోని సభ్యులకు ఆర్పీలు అవగాహన కల్పించాలని సూచించారు. ఇంకా ఈ సమావేశంలో టీఎంసీ జి.సుజాత, సీఓలు సల్మా, ఉపేంద్ర, పలువురు ఉద్యోగులు పాల్గొన్నారు. -
స్వయం ఉపాధి కోర్సులతో ఆర్థికాభివృద్ధి
భద్రాచలం: గిరిజన నిరుద్యోగ యువత స్వయం ఉపాధి పథకాలపై దృష్టి సారించాలని, తద్వారా ఆర్థికాభివృద్ధి సాధ్యమవుతుందని ఐటీడీఏ ప్రాజెక్టు అఽధికారి బి.రాహుల్ తెలిపారు. భద్రాచలం ఐటీడీఏ ప్రాంగణంలోని వైటీసీలో ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’లో భాగంగా శుక్రవారం గిరిజన నిరుద్యోగ యువతకు ఏర్పాటుచేసిన ఉచిత శిక్షణ, అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. పోటీ ప్రపంచంలో వృత్తి నైపుణ్యాలు పెంచుకుంటే ప్రైవేట్ రంగంలో సైతం ఉపాధి అవకాశాలు లభించనున్నందున ఐటీడీఏ ఇచ్చే శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ సదస్సుకు 170 మంది యువతీ, యువకులు హాజరుకాగా.. ఐటీ హెల్ప్డెస్క్ అటెండెంట్ కోర్సుకు 45 మంది, జూనియర్ సాఫ్ట్వేర్ డెవలపర్ కోర్సుకు ఎనిమిది మంది, ఎంబ్రాయిడరీ మిషన్ ఆపరేటర్ శిక్షణకు 20 మంది, డేటా ఎంట్రీ ఆపరేటర్ కోర్సుకు 35 మంది, టైలరింగ్ శిక్షణకు 52 మంది ఆసక్తి చూపారని పీఓ తెలిపారు. వీరికి మూడు నుంచి ఆరు నెలల పాటు శిక్షణ ఇవ్వడమే కాక ఉచిత భోజన, వసతి కల్పిస్తామని వెల్లడించారు. ఈసమావేశంలో సర్పంచ్ పూనెం కృష్ణ, ట్రైబల్ వెల్ఫేర్ డీడీ అశోక్, ఏఓ సున్నం రాంబాబు, జేడీఎం హరికృష్ణ, వైటీసీ సెంటర్ ఇన్చార్జ్ శ్రీను తదితరులు పాల్గొన్నారు. -
సమస్యలకు తక్షణ పరిష్కారం
● నేడు రాయగూడెం, సుబ్లేడులో ప్రజాదర్బార్ ● పాల్గొననున్న మంత్రి పొంగులేటి, హాజరుకానున్న అధికారులు నేలకొండపల్లి/తిరుమలాయపాలెం: ప్రజల సమస్యలను తెలుసుకుని తక్షణ పరిష్కారం చూపించడమే లక్ష్యంగా రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సూచనలతో శనివారం ప్రజాదర్బార్ నిర్వహిస్తున్నారు. పాలేరు నియోజకవర్గంలోని నేలకొండపల్లి మండలం రాయగూడెం, తిరుమలాయపాలెం మండలం సుబ్లేడులో జరగనున్న ప్రజాదర్బార్ సమావేశాల్లో మంత్రి పొంగులేటి స్వయంగా పాల్గొంటారు. అంతేకాక అన్ని శాఖల అధికారుల హాజరుకానుండగా, ప్రజల సమస్యలను తెలుసుకుని అక్కడికక్కడే పరిష్కరించనున్నారు. ఏర్పాట్లను పరిశీలించిన అదనపు కలెక్టర్ రాయగూడెం, సుబ్లేడులో ప్రజాదర్బార్ ఏర్పాట్లను అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి గురువారం పరిశీ లించారు. రాయగూడెం క్లస్టర్లో అజయ్తండా, రాయగూడెం, చెరువుమాధారం, మంగాపురంతండా, అప్పలనరసింహాపురం, బుద్ధారం, కట్టుకాచా రం, కొంగర, రాజారాంపేట, బైరవునిపల్లి పంచా యతీల ప్రజలు పాల్గొని తమ సమస్యలు విన్నవించనున్నందున ఇబ్బందులు రాకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు. రెవెన్యూ, భూ సమస్యలు, ఇంది రమ్మ ఇళ్లు, కొత్త రేషన్కార్డులతో పాటు మౌలిక వసతులపై వినతిపత్రాలు ఇస్తే పూర్తి సమాచారంతో సమాధానాలు చెప్పేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. ఆతర్వాత అధికారులతో సమావేశమై ఏర్పాట్లపై సమీక్షించారు. రాయగూడెంలో ఉదయం 8గంటలకు, సుబ్లేడులో మధ్యాహ్నం 3–30గంటలకు ప్రజాదర్బార్ ఉంటుందని తెలిపా రు. జిల్లా పంచాయతీ అధికారి రాంబాబు, జెడ్పీ డిప్యూటీ సీఈఓ శ్రీనివాసరెడ్డి, డీఎల్పీఓ విజయలక్ష్మి తదితరులు పాల్గొనగా.. ఆతర్వాత సర్పంచ్లతోనూ సమావేశమై సూచనలు చేశారు. ఈ సమావేశాల్లో తహసీల్దార్ పి.రాంప్రసాద్, లూథర్ విల్సన్, ఎంపీడీఓలు ఎం.యర్రయ్య, సిలార్సాహెబ్, ఎంపీఓ శివ, వివిధ శాఖల అధికారులు, నాయకులు రామసహాయం నరేష్రెడ్డి పాల్గొన్నారు. కాగా, రెండు చోట్ల ప్రజాదర్బార్లో పాల్గొనే వారికోసం వేయిమందికి చొప్పున భోజన ఏర్పాట్లు చేస్తుండగా, వేసవి నేపథ్యాన తాగునీరు, మజ్జిగ సమకూర్చనున్నారు. -
ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యాయత్నం
● కుటుంబ కలహాలే కారణమని పోలీసులకు ఫిర్యాదు ● ఆర్టీసీ సమ్మె నేపథ్యాన ఆందోళన ఖమ్మంమయూరిసెంటర్: ఖమ్మం రీజియన్లోని భద్రాచలం ఆర్టీసీ డిపోలో డ్రైవర్గా పనిచేస్తున్న గూడూరు లింగారెడ్డి గడ్డిమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్న తరుణాన ఆయన గడ్డి మందు తాగినట్లు తెలియగానే అధికారులు, కార్మికులు ఉలిక్కిపడ్డారు. లింగారెడ్డిని చికిత్స నిమిత్తం కుటుంబీకులు ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. కుటుంబ కలహాలతోనే.. పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. ఖమ్మం డిపో వద్ద గురువారం జరిగిన నిరసనలో పాల్గొన్న లింగారెడ్డి సాయంత్రం 4 గంటలకు ఏదులాపురం మున్సిపాలిటీ నాయుడుపేటలోని నివాసానికి వెళ్లాడు. ఇంటి బయటే ద్విచక్రవాహనం నిలిపి బండిలో ఉన్న గడ్డిమందు తీసి భార్య ముందే తాగాడు. దీంతో ఆయన భార్య జయమ్మ అడ్డుకుంటూ ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఈ విషయం తెలియగానే టూటౌన్ పోలీసులు ఆస్పత్రికి వెళ్లి లింగారెడ్డి, ఆయన భార్య స్టేట్మెంట్ రికార్డు చేశారు. లింగారెడ్డి తన భార్య పెడుతున్న ఇబ్బందులతో ఆత్మహత్యాయత్నం చేసినట్లు చెప్పాడని వెల్లడించారు. ఆయన భార్య జయమ్మ మాత్రం మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని ఆమెకు డబ్బులు ఇస్తుండడమే కాక.. ఇప్పుడు తన పేరు బద్నాం చేస్తున్నాడని ఆరోపించింది. కాగా, ఆస్పత్రికి ఆర్టీసీ ఆర్ఎం ఎ.సరిరామ్ చేరుకొని లింగారెడ్డితో మాట్లాడాక ఉన్నతాధికారులకు సమాచారం చేరవేశారు. అయితే, లింగారెడ్డి ఆత్మయత్యాయత్నం సోషల్ మీడియాలో వైరల్ కాగా.. కార్మికులు, నేతలు పెద్ద సంఖ్యలో ఆస్పత్రికి చేరుకున్నారు. పోలీసులు బందోబస్తు నిర్వహించారు. -
పార్టీ బలోపేతానికి క్రమశిక్షణతో కృషి చేయాలి
ఖమ్మంమయూరిసెంటర్: పదవుల్లో నియమితులైన నాయకులు క్రమశిక్షణతో పనిచేస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నూతి సత్యనారాయణగౌడ్ సూచించారు. ఖమ్మంలోని పార్టీ కార్యాలయంలో గురువారం జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. తొలుత ఇటీవల మరణించిన పీసీసీ సభ్యుడు మహమ్మద్ జావిద్, మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు సయ్యద్ ముజాహిద్ హుస్సేన్ సతీమణి గౌసియా హుస్సేని, మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావుకు సంతాపం ప్రకటించారు. అనంతరం సత్యనారాయణ మాట్లాడుతూ.. పదవుల్లో ఉన్న వారు ప్రజల సమస్యలు తెలుసుకోవడమే కాక ప్రభుత్వ పథకాలు, అభివృద్ధిని వివరించాలని సూచించారు. ప్రజలు వారి సమస్యలను నేరుగా చెప్పుకునేలా ప్రతీ గురువారం పార్టీ జిల్లా కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను గ్రామాల్లో ప్రతి గడపకూ చేరవేసే కార్యక్రమం తీసుకుంటున్నామన్నారు. కాగా, బూత్ లెవెల్ ఏజెంట్ల నియామకం, కమిటీల ఏర్పాటు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల సమాయత్తంపై చర్చించగా.. ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా ఉన్నందున సమ్మె విరమించాలని సత్యనారాయణ కోరారు. సమావేశంలో జిల్లా కార్యవర్గ బాధ్యులు తూములూరి లక్ష్మీనరసింహారావు, మలీదు హైమావతి, వేమిరెడ్డి సుధాకర్రెడ్డి, కాపా సుధాకర్, కళ్లెం వెంకటరెడ్డి, కిలారి అనిల్కుమార్, సయ్యద్ ముజాహిద్ హుస్సేన్, కంచర్ల వెంకటనర్సయ్య, రామసహాయం హరితారెడ్డి, పులిబండ్ల చిట్టిబాబు, దొడ్డా పుల్లయ్య, బానోతు రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.డీసీసీ అధ్యక్షుడు సత్యనారాయణగౌడ్ -
ఆర్టీసీ కార్మికులపై నిర్లక్ష్యం తగదు..
సత్తుపల్లి: ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదని సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య విమర్శించారు. సత్తుపల్లి డిపో గేటు ఎదుట కార్మికుల ధర్నాకు గురువారం ఆయన సంఘీభావం తెలిపి మాట్లాడారు. కేసీఆర్ హయాంలో కార్మికులకు ఇబ్బందులు రాకుండా ప్రభుత్వం అండగా నిలిచిందని తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వం వెంటనే కార్మికులతో చర్చించి సమ్మె విరమణకు కృషి చేయాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ మాజీ చైర్మన్ కూసంపూడి మహేశ్, నాయకులు మల్లూరు అంకమరాజు, ఎస్కే చాంద్పాషా, రఫీ, వల్లభవనేని పవన్, విజయ్, ప్రకాశరావు, చంటి, రఘు, అద్దంకి అనిల్, కృష్ణ పాల్గొన్నారు. ●కల్లూరురూరల్/వేంసూరు: యాసంగిలో రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం తక్షణమే కొనుగోలు చేయాలని మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఆధ్వర్యాన రైతులు కల్లూరులో గురువారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సండ్ర మాట్లాడుతూ.. సన్న ధాన్యానికి బోనస్ ఇవ్వాల్సి వస్తుందనే ప్రభుత్వం కొనుగోళ్లలో జాప్యం చేస్తోందని ఆరోపించారు. అయితే, ప్రభుత్వ తీరుతో రైతులు ప్రైవేట్ వ్యాపారులకు ధాన్యం అమ్ముకుని నష్టపోతున్నారని తెలిపారు. జిల్లాలో 308 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెబుతున్నా కనీసం ఐదు కేంద్రాల్లో కూడా కొనుగోళ్లు మొదలుకాలేదని చెప్పారు. మొక్కజొన్న కొనుగోళ్లలోనూ ప్రభుత్వం విఫలమైందని పేర్కొన్నారు. మాజీ జెడ్పీటీసీ కట్టా అజయ్కుమార్, నాయకులు డాక్టర్ లక్కినేని రఘు, పెద్దబోయిన మల్లేశ్వరరావు, బోబోలు లక్ష్మణ్రావు, సూర్యనారాయణ, సయ్యద్ రపూఫ్, మేకల కృష్ణ, కాటంనేని వెంకటేశ్వరరావు, రవి, పేడకంటి రామకృష్ణ, ఎండీ ఇస్మాయిల్, రాజ్కుమార్, ఇంతియాజ్ పాల్గొన్నారు. కాగా, బీఆర్ఎస్ వేంసూరు మండల కార్యదర్శి కంటే వెంకటేశ్వరరావు సతీమణి జానకమ్మ ఇటీవల మృతి చెందగా సండ్ర వెంకటవీరయ్య నివాళులర్పించారు. నాయకులు పాలా వెంకటరెడ్డి, పగుట్ల వెంకటేశ్వరరావు, యర్రా రమేశ్, వెంకటకృష్ణారెడ్డి పాల్గొన్నారు.మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య -
మొక్కజొన్న చేను దగ్ధం
నేలకొండపల్లి: మండలంలోని గువ్వలగూడెంలో గురువారం ప్రమాదవశాత్తు మొక్కజొన్న చేను దగ్ధమైంది. గ్రామంలో రైతు గురవయ్య సాగు చేస్తున్న మొక్కజొన్న చేనులో మంటలు చెలరేగి కాలిపోయింది. స్థానికులు మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తూనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వగా వారు చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఘటనలో దాదాపు రెండు ఎకరాల చేను దగ్ధమైందని బాధిత రైతు వెల్లడించాడు. బైక్ను ఢీకొట్టిన ట్రాక్టర్ : మహిళ మృతికామేపల్లి: ట్రాక్టర్ డ్రైవర్ నిర్ల్యక్షం కారణంగా ఓ మహిళ ప్రాణాలు పోయాయి. ఈ ఘటన మండలంలోని పాతలింగాల స్టేజీ వద్ద గురువారం చోటుచేసుకుంది. కారేపల్లి మండలం మాధారం గ్రామానికి చెందిన వేముల గోవింద్రరాజు – భాగ్యమ్మ (35) దంపతులు ద్విచక్రవాహనంపై కూలీ పని నిమిత్తం వెళ్తున్నారు. పాతలింగాల చెరువు నుంచి మట్టి లోడ్ చేసుకుని, ట్రాక్టర్ను డ్రైవర్ మడ్డి వేణుబాబు అతివేగంగా, అజాగ్రత్తగా నడుపుతూ బైక్ను ఢీకొట్టాడు. దీంతో వెనుక కూర్చున్న భాగ్యమ్మ ఎగిరిపడగా, ఆమె తలపై నుంచి ట్రాక్టర్ ఇంజన్ టైరు వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందింది. గోవింద్రరాజు స్వల్పగాయాలతో బయటపడ్డాడు. కాగా, భాగ్యమ్మ మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించకుండా ఆమె కుటుంబానికి న్యాయం చేయాలంటూ బంధువులు మధ్యాహ్నం వరకు ఘటనాస్థలివద్ద నిరసన తెలిపారు. దీంతో సీఐ సాగర్, ఎస్ఐ శ్రీకాంత్ చేరుకుని బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని నచ్చజెప్పి పోస్టుమార్టం నిమిత్తం ఖమ్మం తరలించారు. కారేపల్లి సబ్ పోస్టాఫీస్లో చోరీకి యత్నం కారేపల్లి: గుర్తుతెలియని వ్యక్తులు కారేపల్లి సబ్ పోస్టాఫీస్లో చోరీకి యత్నించి విఫలమయ్యారు. స్థానిక రైల్వే స్టేషన్ రోడ్డులో ఉన్న సబ్ పోస్టాఫీస్ ప్రధాన ద్వారం తాళాన్ని బుధవారం అర్ధరాత్రి పగులగొట్టిన దుండగులు లోనకు ప్రవేశించారు. ఆపై బీరువా పగలకొట్టి చూడగా విలువైన వస్తువులు లభించకపోవడంతో సుత్తి, కటింగ్ మిషన్, స్క్రూ డ్రైవర్ ఆధారంగా లాకర్ (క్యాష్ చెస్ట్)ను తెరిచేందుకు ప్రయత్నించినట్లు తెలిసింది. అయితే, లాకర్ తెరుచుకోకపోవడంతో టేబుల్లో ఉన్న కాస్త చిల్లర తీసుకుని వెళ్లినట్లు సమాచారం. గురువారం ఉదయం వచ్చిన సిబ్బంది చోరీ జరిగిందని గుర్తించగా, సబ్ పోస్ట్మాస్టర్ ప్రశాంత్ ఫిర్యాదు మేరకు కారేపల్లి ఎస్ఐ బి.గోపి సిబ్బందితో చేరుకుని దర్యాప్తు చేపట్టారు. -
కాలేజీ విద్యార్థుల కోసం హాస్టల్
ఏన్కూరు: ఏన్కూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల కోసం బాయ్స్ హాస్టల్ ఏర్పాటు చేయనున్నట్లు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి రవిబాబు తెలిపారు. నారాయణ, బసవమ్మ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు డాక్టర్ శెట్టిపల్లి నాగేశ్వరరావును గురువారం ఆయన కలిశారు. ఈ సందర్భంగా కళాశాలలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థుల వివరాలతో కూడిన కరపత్రాన్ని విడుదల చేసి మాట్లాడారు. విద్యార్థుల కోసం ఏర్పాటుచేయనున్న హాస్టల్ వచ్చే విద్యాసంవత్సరం అందుబాటులోకి వస్తుందని తెలిపారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఎం.సింహాచలం, అధ్యాపకులు కిషోర్, శివ, నవీన్, లావణ్య పాల్గొన్నారు. -
గోదాం నిర్మాణంతో రైతులకు మేలు
కల్లూరురూరల్: గ్రామీణ ప్రాంతాల్లో గోదాములు నిర్మిస్తే రైతులు పండించిన పంట నిల్వలకు దోహదపడుతాయని అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి తెలిపారు. కల్లూరు మండలం ఎర్రబోయినపల్లిలో గోదాం నిర్మాణ ప్రతిపాదిత స్థలాన్ని గురువారం ఆయన కల్లూరు సబ్కలెక్టర్ అజయ్యాదవ్తో కలిసి పరిశీలించారు. అనంతరం రైతులతో సమావేశం కాగా వారు పలు సమస్యలను విన్నవించారు. ఆ తర్వాత ఎన్నెస్సీ ప్రాంతంలోని డంపింగ్ యార్డ్ ప్రతిపాదిత స్థలం, చెన్నూరులో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్కు రోడ్డు నిర్మాణ ప్రాంతాన్ని పరిశీలించారు. అధికారులకు సూచనలు చేశారు. సర్పంచ్ శ్రీనివాసరావు, తహసీల్దార్ బ్రహ్మేశ్వరరావు, గిర్దావర్ సుజాత పాల్గొన్నారు. సమస్యలు పరిష్కరించాలని వినతి ఖమ్మంసహకారనగర్: పలు శాఖల్లో రెండేళ్ల సర్వీస్ పూర్తి చేసుకొని తిరిగి రెవెన్యూ శాఖలో జీపీఓలుగా విధులు నిర్వర్తిస్తున్న వారిని రెగ్యులరైజ్ చేయడమే కాక ఇతర సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ గ్రామపాలన అధికారుల సంఘం (టీజీపీఓ) జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మన్నె గురుమూర్తి, చీమటి వీరబాబు కోరారు. గురువారం అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డికి వినతిపత్రం అందజేసి మాట్లాడారు. పెండింగ్ ఇంక్రిమెంట్లు విడుదల చేయడమే కాక డిపార్ట్మెంటల్ టెస్టు పాసైన వారికి సర్వే శిక్షణ ఇప్పించాలని కోరారు. నాయకులు నెల్లూరి లవన్కుమార్, అన్వర్, రవికుమార్, వీరన్న, వీరభద్రం, కోటయ్య, అనిల్కుమార్ తదితరులు పాల్గొన్నారు.ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలించిన అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి -
మనమూ అవుదాం.. హీరో..
● క్షతగ్రాతులను ‘గోల్డెన్ అవర్’లో తరలిస్తే రూ.లక్ష వరకు నజరానా ● 2021లో ‘గుడ్ సమారిటన్’ను అమల్లోకి తెచ్చిన కేంద్రం ● నగదు, ధ్రువప్రతం అందజేత వైరా: జిల్లాలో నిత్యం ఎక్కడోచోట జరిగే రహదారి ప్రమాదాల్లో పలువురు మత్యువాత పడుతున్నారు. ప్రమాదం జరిగిన గంటలోపు అందించే సాయాన్ని గోల్డెన్ అవర్గా పరిగణిస్తారు. ఈ సమయంలో చికిత్స అందించ గలిగితే మరణాల శాతాన్ని సగానికి పైగా తగ్గించవచ్చనేది వైద్యుల అంచనా. కానీ, ప్రమాదాలు జరిగినపుడు అక్కడే ఉన్న చాలామంది క్షతగాత్రులను ఆస్పత్రులకు తీసుకెళ్లడానికి వెనుకంజ వేస్తున్నారు. పోలీస్ కేసుల భయమే ఇందుకు కారణం. ప్రజల్లో నెలకొన్న ఇలాంటి భయాన్ని పోగొట్టేందుకు కేంద్ర ప్రభుత్వం నడుం బిగించింది. రోడ్డు ప్రమాద బాధితులకు చికిత్స అందించే వారిని రహ–వీర్ (రహదారి హీరో), గుడ్ సమారిటన్ పేరుతో ప్రోత్సహించడమే కాకుండా నజరానా, ప్రత్యేక గుర్తింపు ఇవ్వనుంది. వేధింపులు లేకుండా చర్యలు రహదారి ప్రమాదాల్లో గాయపడిన వారిని ఎవరైనా మానవతా దృక్పథంతో ఆస్పత్రికి తీసుకువెళ్లి సాయం అందిస్తే వారిని పోలీసులు, ఆస్పత్రి సిబ్బంది వేధించకుండా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆపదలో ఉన్నవారి ప్రాణాలు కాపాడిన వ్యక్తికి చట్టపరమైన రక్షణ కల్పిస్తోంది. పోలీసుల వేధింపుల భయం లేకుండా ‘రహ–వీర్’సేవలందించాలని కేంద్ర ప్రభుత్వం కోరుతోంది. ఏడాది వ్యవధిలో ఐదుసార్లు.. రోడ్డు ప్రమాదం జరిగిన గంటలోపే క్షతగాత్రులకు వైద్యం అందిస్తే వారి ప్రాణాలను రక్షించే అవకాశం ఎక్కువగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. కీలకమైన గోల్డెన్ అవర్లో బాధితులను ఆస్పత్రికి తరలించిన వ్యక్తులను కేంద్ర రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ (మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్) రహ–వీర్ పురస్కారంతో సత్కరించనుంది. ఏడాది వ్యవధిలో ఐదుసార్లు ఈ నగదు పారితోషికాన్ని పొందవచ్చని రవాణా, పోలీసు అధికారులు చెబుతున్నారు. ఏడాది కాలంలో ఎక్కువసార్లు అవార్డు పొందినవారిని గుర్తించి కేంద్ర మంత్రిత్వ శాఖకు సిఫార్సు చేస్తామని అధికారులు తెలిపారు. వారిలో 10 మందికి జాతీయ స్థాయిలో అవార్డు ప్రకటించి రూ.లక్ష నగదు పారితోషికంతోపాటు జాతీయస్థాయి ప్రశంసాపత్రాన్ని అందజేస్తారని పేర్కొన్నారు. ప్రజల్లో బాధ్యతారాహిత్యాన్ని తగ్గించి ప్రమాదాలు జరిగినప్పుడు వెంటనే క్షతగాత్రులను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించిందని అధికారులు చెబుతున్నారు. నమోదు ఇలా.. బాధితులను ఆస్పత్రికి తరలించిన తర్వాత సదరు వైద్యుడి నుంచి ధ్రువీకరణ పత్రం తీసుకోవాల్సి ఉంటుంది. అనంతరం పోలీసులు విచారణ చేపట్టి అధికారిక లెటర్ ప్యాడ్లో రహ–వీర్ పేరు, మొబైల్ నంబర్, చిరునామా, ప్రమాదం జరిగిన ప్రదేశం, తేదీ, సమయం, బాధితులను కాపాడడంలో అతను ఎలా సహాయం చేశారనే వివరాలు నమోదు చేస్తారు. రశీదు కాపీని సంబంధిత పోలీస్ స్టేషన్ ద్వారా అప్రూవల్ కమిటీకి పంపిస్తారు. అప్రూవల్ కమిటీలో జిల్లా మెజిస్ట్రేట్, ఎస్పీ, వైద్యాధికారి, రవాణాశాఖ అధికారి ఉంటారు. కమిటీ ఎంపిక చేసిన వ్యక్తులకు రహ–వీర్ అవార్డు మొత్తాన్ని రవాణాశాఖ ద్వారా వారి ఖాతాల్లోకి జమచేస్తారు. రూ.లక్షన్నర వరకు ఉచితవైద్యం రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారు ఏ ఆస్పత్రికి వెళ్లినా తక్షణమే వైద్యం అందించాలని కేంద్ర ప్రభు త్వం కఠిన నిబంధనలు అమలు చేస్తోంది. ఎలాంటి షరతులు, ముందస్తు చెల్లింపులు లేకుండా బాధితులకు రూ.1.50 లక్షల విలువైన వైద్యాన్ని ఆస్పత్రులు వెంటనే అందించాల్సి ఉంటుంది. ఈ మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వమే నేరుగా ఆస్పత్రులకు చెల్లిస్తుంది. ఈ విధానంతో ఆర్థిక స్తోమతతో సంబంధం లేకుండా నిరుపేదలకూ వైద్యసాయం అందుతుంది.రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు ప్రజలు తమ వంతు బాధ్యతగా సహాయక చర్యలు చేపట్టాలి. ప్రజలకు ‘గోల్డెన్ అవర్’పై విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నాం. ప్రమాద సమాచారాన్ని అందిస్తే పోలీస్స్టేషన్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ప్రమాదం జరిగిన వెంటనే డయల్ 100కు లేదా పోలీస్ కంట్రోల్ రూమ్కు సమాచారం అందిస్తే పోలీసులు చేరుకుంటారు. సమాచారం ఇచ్చిన వారికి ఎలాంటి వేధింపులు ఉండవు. – ఎస్.సారంగపాణి, ఏసీపీ, వైరా -
కేసీఆర్ను బదనాం చేసేందుకే కమిషన్
ఖమ్మంవైరారోడ్: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను రాజకీయంగా ఎదుర్కోలేక బదనాం చేసేందుకు కాళేశ్వరంపై ప్రభుత్వం విచారణ కమిషన్ ఏర్పాటు చేస్తే.. హైకోర్టు తీర్పుతో ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలిందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ పేర్కొన్నారు. ఖమ్మంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ కాళేశ్వరాన్ని కేవలం మూడేళ్లలో పూర్తి చేసి తెలంగాణను కోటి ఎకరాల మాగాణిగా మార్చారని తెలిపారు. అయితే, మేడిగడ్డలోని రెండు పిల్లర్లు కుంగిపోతే, మొత్తం ప్రాజెక్టు కూలిపోయిందని ప్రస్తుత ప్రభుత్వం ప్రచారం చేసి, కమిషన్లు ఏర్పాటు చేసి, కేసీఆర్, హరీశ్రావును ఇబ్బంది పెట్టాలని యత్నించినా ఎదురుదెబ్బ తగిలిందని పేర్కొన్నారు. డీసీసీబీ మాజీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, నాయకులు బెల్లం వేణుగోపాల్, పగడాల నాగరాజు, తాజుద్దీన్, నాయకులు ముత్యాల వెంకటప్పారావు, పగడాల నరేందర్, లింగనబోయిన సతీశ్, ఈదుల రాజేశ్, బెల్లంకొండ గోపి, మహమ్మద్ రఫీ, కృష్ణ ప్రసాద్, పోలిపాంగు వెంకట్, ఉప్పల వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు -
ఆర్టీసీలో కొనసాగిన సమ్మె
● రెండో రోజు డిపోల వద్ద కార్మికుల నిరసనలు ● ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో బస్సులు నడిపిన అధికారులు ● ప్రయాణికులకు తప్పని ఇబ్బందులు ఖమ్మంమయూరిసెంటర్: డిమాండ్ల పరి ష్కారం కోసం ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె గురువారం రెండో రోజుకు చేరింది. ఈ సందర్భంగా కార్మికులు విధులను బహిష్కరించి అన్ని డిపోల వద్ద నిరసన తెలపడమే కాక బస్సులు బయటకు రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఖమ్మం డిపో వద్ద నిరసనకు రాజకీయ, కార్మిక సంఘాల నాయకులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా యూని యన్ నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం స్పందించే వరకు వెనకడుగు వేసేదిలేదని స్పష్టం చేశారు. కార్మికులకు బీఆర్ఎస్ జిల్లా, నగర అధ్యక్షులు తాత మధుసూదన్, పగడాల నాగరాజు తదితరులు మద్దతు తెలిపి మాట్లాడుతూ సమస్యలు పరిష్కారమయ్యే వరకు కార్మికులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కార్మికుల ఆందోళనలతో డిపోల వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొన్నా, పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ప్రత్యామ్నాయ వ్యూహాలు కార్మికుల సమ్మెతో ప్రయాణికులకు ఇబ్బంది కలగొద్దనే భావనతో అధికారులు తాత్కాలికంగా డ్రైవర్లు, కండక్టర్లను నియమించారు. ఈక్రమాన ఖమ్మం డిపో నుండి బుధవారం అర్ధరాత్రి దాటాక 32 బస్సులను కొత్త, పాత బస్టాండ్కు చేర్చారు. ఇందులో ఆర్టీసీ బస్సులు 32, అద్దె వాహనాలు 63 బస్సులను గురువా రం వివిధ రూట్లలో తిప్పారు. అలాగే, రీజి యన్లో మొత్తం 479 బస్సులకు గాను అధికా రులు 351 బస్సులను నడిపించారు. ప్రయాణికుల అవస్థలు అధికారులు కొన్నిరూట్లలో పరిమిత సంఖ్యలోనే బస్సులు నడిపించగా, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రధానంగా హైదరాబాద్ వంటి ప్రధాన రూట్లలో బస్సులు లేక ప్రైవేటు వాహనాలు, రైళ్లను ఆశ్రయించాల్సి వచ్చింది. ఇక నల్లగొండ, వరంగల్, మిర్యాలగూడ, విజయవాడ రూట్లలో బస్సులు లేకపోవడంతో ప్రయాణికులు గంటల తరబడి బస్టాండ్లలో వేచి ఉన్నారు. బస్సులు నడిచిన రూట్లలోనూ ప్రైవేట్ డ్రైవర్లు కావడంతో ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు.ఖమ్మంక్రైం: ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యాన ఖమ్మం కొత్త బస్టాండ్ను పోలీసు కమిషనర్ సునీల్దత్ పరిశీలించారు. ఈ సందర్భంగా బందోబస్తుపై పోలీసులకు సూచనలు చేశారు. బస్సులు, ఇతర ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించే వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే, ప్రైవేట్ డ్రైవర్లకు రక్షణ కల్పిస్తామని, నిర్భయంగా విధులు నిర్వర్తించాలని తెలిపారు. ఏసీపీ రమణమూర్తి, టూటౌన్ సీఐ బాలకృష్ణ పాల్గొన్నారు. -
ఇస్కాన్ ఆలయానికి 4–30 ఎకరాల భూమి
ఖమ్మంఅర్బన్: ఖమ్మంకు మరింత ఆధ్యాత్మిక శోభ సంతరించుకునేలా ఇస్కాన్ ఆలయ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం 4–30 ఎకరాల భూమి ని కేటాయించింది. రఘునాథపాలెం మండల పరిధిలో అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘానికి ఈ భూమి కేటాయిస్తూ గురువారం జరిగిన మంత్రిమండలి సమావేశంలో ఆమోదం తెలిపారు. బలరామ, కృష్ణ ఆలయంతో పాటు ఆశ్రమం, భజన మందిరం నిర్మాణానికి జీఓ 571 ద్వారా మార్కెట్ విలువ ఆధారంగా భూమి కేటాయిస్తారు. కలెక్టర్ ద్వారా ప్రతిపాదనలు రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాలతో ఇస్కాన్ ఆలయ నిర్మాణానికి కలెక్టర్ ప్రతిపాదనలు సమర్పించారు. ఈమేరకు భూపరిపాలన ప్రధాన కమిషనర్ పరిశీలించి ప్రభుత్వానికి నివేదించగా మంత్రివర్గ సమావేశంలో ఆమోదం తెలిపారు. ఈ స్థలంలో ఆలయంతో పాటు గోశాల, నిత్యాన్నదాన సత్రం నిర్మించడమే కాక కాక యోగా, ధ్యానం శిక్షణ, భగవద్గీత బోధన నిర్వహించనున్నారు. అంతేకాక యువత, మహిళలకు వ్యక్తిత్వ వికాసం, సాధికారత, సహజ వ్యవసాయంపై అవగాహన కల్పించాలనే ప్రతిపాదనలు ఉన్నాయని సంస్థ బాధ్యులు చెబుతున్నారు. ఈమేరకు సీఎం రేవంత్రెడ్డితో పాటు మంత్రివర్గానికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి పొంగులేటి పూజలు కూసుమంచి: మండలంలోని లింగారం తండాలో శ్రీ ఆభయాంజనేయ స్వామి ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠాపన సందర్భంగా గురువారం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పూజలు చేశారు. గ్రామస్తులు పాడిపంటలు, సుఖసంతోషాలతో సుభిక్షంగా ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు. సర్పంచ్ పుష్పవతి, గ్రామస్తులు పాల్గొన్నారు. చార్ధామ్ యాత్రికులు జాగ్రత్తలు పాటించాలి ఖమ్మంవైద్యవిభాగం: ఉత్తరాఖండ్లోని చార్ధామ్ యాత్రకు వెళ్తున్న జిల్లావాసులు ఆరోగ్యపరమైన జాగ్రత్తలు పాటించాలని డీఎంహెచ్ఓ రామారావు సూచించారు. విపరీతమైన చలి, ఆక్సిజన్, గాలి పీడనం ఉండటం వల్ల అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉందని తెలిపారు. ఈమేరకు యాత్ర మొదలయ్యే నెల ముందు నుంచే ప్రతిరోజూ 20 – 30 నిమిషాల నడక, 5 – 10 నిమిషాల శ్వాస వ్యాయామాలు అలవాటు చేసుకోవాలని, 55 ఏళ్లు పైబడిన, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారు వైద్యులు అనుమతి ఇస్తేనే యాత్ర ప్రారంభించాలని చెప్పారు. ఉన్ని దుస్తులు, రెయిన్ కోట్లు, పల్స్ ఆక్సిమీటర్, థర్మామీటర్ వెంట తీసుకెళ్లడమే కాక ప్రతీ రెండు గంటలకు ఒకసారి 5 – 10 నిమిషాల విరామం తీసుకోవాలని, రోజుకు కనీసం రెండు లీటర్ల నీరు తాగుతూ పోషకాహారం తీసుకోవాలని తెలిపారు. అత్యవసర పరిస్థితిలో 104 హెల్ప్లైన్ నంబర్కు ఫోన్ చేయాలని డీఎంహెచ్ఓ ఓ ప్రకటనలో సూచించారు. అవార్డుల కోసం నామినేషన్లు ఆహ్వానం ఖమ్మంమయూరిసెంటర్: ఉత్తమ భద్రతా ప్రమాణాలు పాటిస్తున్న పరిశ్రమలు, సంస్థలకు మే డే సందర్భంగా రాష్ట్రప్రభుత్వం అవార్డులు ప్రకటించనుందని కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ విజయభాస్కర్ తెలిపారు. ఈమేరకు అర్హత కలిగిన సంస్థల యాజమాన్యాలు ఈనెల 27వ తేదీలోగా జిల్లా ఉప కమిషనర్ కార్యాలయంలో నామినేషన్ పత్రాలు అందజేయాలని సూచించారు. పనుల్లో వేగం పెరగాలి.. -
అస్తిత్వ పోరాటం
సాక్షిప్రతినిధి, ఖమ్మం: ఒకప్పుడు విత్తన భాండాగారంగా పేరుగాంచిన రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ నేడు అస్తిత్వ పోరాటం చేస్తోంది. రైతులకు రాయితీపై నాణ్యమైన విత్తనాలను అందిస్తూ అండగా నిలవాల్సిన ప్రభుత్వ సంస్థ.. సబ్సిడీల ఎత్తివేతతో క్రమంగా నిర్వీర్యమవుతోంది. దీన్ని ఆసరాగా చేసుకుంటున్న ప్రైవేట్ కంపెనీలు గుత్తాధిపత్యాన్ని చెలాయిస్తూ నకిలీ, కల్తీ దందాకు తెర లేపుతున్నాయి. ఇవికాక సబ్సిడీలు లేక రైతులు అధిక ధర చెల్లించాల్సి వస్తోంది. కొన్ని కంపెనీలు తక్కువ ధరతో విత్తనాలను విక్రయిస్తున్నా అవి నాణ్యమైనవి కాకపోవడంతో పంటలు దెబ్బతిని తీవ్రంగా నష్టపోతున్నారు. వచ్చే వానాకాలం నాటికై నా సంస్థపై ప్రభుత్వం దృష్టి సారిస్తే జిల్లా రైతాంగానికి మేలు జరగనుంది. పంట ఉత్పత్తుల కోసం... డిమాండ్కు తగిన విధంగా పంటల సాగుకు వీలుగా రైతులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం విత్తనాభివృద్ధి సంస్థను ఏర్పాటు చేసింది. ఈ సంస్థ ప్రాంతాల వారీగా శాస్త్రవేత్తలు, నిపుణుల సూచనలతో రైతులను ప్రోత్సహించి విత్తనోత్పత్తిని కూడా చేయిస్తోంది. వరిలో సాంబమసూరి తదితర రకాలను కొందరు రైతులతో నిర్ణీత విస్తీర్ణంలో విత్తనోత్పత్తి కోసం సాగు చేయించడం ఆనవాయితీగా వస్తోంది. ఆ విస్తీర్ణంలో 28 క్వింటాళ్ల దిగుబడి వస్తే విత్తనాభివృద్ధి సంస్థ కొనుగోలు చేసి ప్రాసెసింగ్ తర్వాత విత్తనాలుగా రైతులకు విక్రయిస్తుంది. తద్వారా రైతులందరూ అధిక దిగుబడి సాధించడం సాధ్యమయ్యేది. ప్రైవేట్ కంపెనీల హవా సబ్సిడీలు ఎత్తివేయడంతో మార్కెట్లోకి ప్రైవేట్ కంపెనీలు దూసుకొచ్చాయి. ప్రభుత్వం నిర్ణయించిన ధర కన్నా తక్కువకు విత్తనాలను విక్రయిస్తున్నాయి. 30 కేజీల వరి విత్తనాల బ్యాగ్ ప్రభుత్వం రూ.1,100గా ధర నిర్ణయిస్తే.. ప్రైవేట్ కంపెనీలు రూ.1,050కే అందిస్తున్నాయి. దీంతో రైతులంతా అటే మొగ్గు చూపుతున్నారు. ఈక్రమంలోనే కొందరు నకిలీ, కల్తీ విత్తనాలను కూడా విక్రయిస్తూ రైతులను ముంచుతున్నారు. ఈ యాసంగి సీజన్లో సత్తుపల్లి ప్రాంతంలో పలువురు వరి సాగు చేసిన రైతులు, ఇంకొందరు మొక్కజొన్న రైతులు కూడా నష్టపోయారు. నష్టాల ఊబిలో సంస్థ.. ఓవైపు సబ్సిడీలు ఎత్తివేయడం, ప్రైవేట్ కంపెనీలు రంగంలోకి దిగడంతో విత్తనాభివృద్ధి సంస్థ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. ఈ సంస్థ ద్వారా అమ్మే విత్తనాలకు సబ్సిడీ లేక ధర పెరగడంతో రైతులు ఆసక్తి చూపడం లేదు. నాణ్యమైన, మేలైన విత్తనాలని తెలిసినా ప్రైవేట్ కంపెనీలు అంతకంటే ధర తగ్గిస్తుండడంతో రైతులు అటే మొగ్గు చూపుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రాసెసింగ్ యూనిట్లు, విక్రయ కేంద్రాలు, విత్తనోత్పత్తి చేసే యంత్రాలు ఉన్నా అమ్మకాలు తగ్గడంతో సంస్థ పరిస్థితి నానాటికీ క్షీణిస్తోంది. అమ్మకాలు లేక వరి, పప్పుధాన్యాల విత్తనాల నిల్వలు పెరిగిపోతున్నాయి. ఫలితంగా కొంతైనా నష్టాలను పూడ్చుకునేందుకు సీజన్ అయిపోగానే సీడ్ను నాన్ సీడ్గా మార్చి తక్కువ ధరకు విక్రయించాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. ఇకనైనా విత్తనాభివృద్ధి సంస్థ ద్వారా సబ్సిడీపై విత్తనాల విక్రయానికి ప్రభుత్వం దృష్టి సారిస్తే అటు సంస్థకు, అటు రైతులకు మేలు జరగనుంది.విత్తనాభివృద్ధి సంస్థ లోగోరైతులకు అండగా నిలిచేలా విత్తనాభివృద్ధి సంస్థ సబ్సిడీపై పీఏసీఎస్ల ద్వారా విత్తనాలను అందించింది. వరి కిలోకు రూ.5, అపరాల పంటలైన పెసర, కంది, మినుము, సోయాబీన్ వంటి పంటలకు రూ.50 శాతం సబ్సిడీ అమలయ్యేది. వేరుశనగ వంటి నూనె గింజల పంటలకు సైతం ప్రభుత్వం సబ్సిడీలను ఇచ్చింది. 2020 ఏడాది వరకు సాఫీగానే సాగిన ఈ ప్రక్రియ ద్వారా రైతులకు తక్కువ ధరతో నాణ్యమైన విత్తనాలు లభించేవి. కానీ ప్రభుత్వం విత్తనాభివృద్ధి సంస్థ ద్వారా సబ్సిడీలను ఎత్తేయడంతో బహిరంగ మార్కెట్లో ఏది నాణ్యమైన విత్తనమో తెలుసుకునే అవకాశం రైతులకు ఉండడం లేదు.సబ్సిడీల తొలగింపుతో కునారిల్లుతున్న విత్తనాభివృద్ధి సంస్థ


