Khammam
-
విషాదంగా మారిన విహార యాత్ర
ఖమ్మంక్రైం: వేసవిలో స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళ్తున్న హైదరాబాద్ యువకుడు ఖమ్మంలో రైలు నుంచి జారి పడి మృతి చెందాడు. హైదరాబాద్లోని గోషామహల్ ప్రాంతానికి చెందిన పలువురు సింహపురి ఎక్స్ప్రెస్లో శనివారం రాత్రి ఆంధ్రప్రదేశ్లోని చీరాల బయలుదేరారు. రైలు ఖమ్మం చేరాక సంజయ్కుమావత్ (21), వినాయక్ నీటి కోసం కిందకు దిగారు. ఎక్కడా నీరు లేకపోవడం.. వీరు ప్లాట్ఫాంపై చూస్తుండగా రైలు కదిలింది. వీరి బోగి దాటడంతో వినాయక్ ఆగిపోగా, తలుపులు వేసి ఉన్న ఏసీ బోగి ఎక్కేందుకు సంజయ్ ప్రయత్నం చేశాడు. రాడ్ పట్టుకుని ఎంత పిలిచినా పలకకపోవటంతో ప్లాట్ఫాం దాటి 100 మీటర్లు వెళ్లాక అదుపుతప్పి కింద పడ్డాడు. దీంతో రైలులోని స్నేహితులు సంజయ్కు ఫోన్ చేస్తే వేరే వ్యక్తులు ఎత్తి ఆయనకు తీవ్రగాయాలయ్యాయని చెప్పగా చైన్లాగి వారు దిగొచ్చారు. అప్పటికే సంజయ్ రెండు కాళ్లు తెగి తీవ్ర రక్తస్రావమై మృతి చెందగా ఆయన తండ్రి చాట్రారామ్కు ఫోన్లో సమాచారం ఇచ్చారు. జీఆర్పీ హెడ్కానిస్టేబుల్ శ్రీనివాస్, అన్నం ఫౌండేషన్ చైర్మన్ అన్నం శ్రీనివాసరావు కలిసి మృతదేహాన్ని మార్చురీకి తరలించారు.రైలు నుంచి జారిపడి హైదరాబాద్ యువకుడు మృతి -
దహించివేస్తున్న అగ్నికీలలు
చింతకాని: మండలంలోని తిమ్మినేనిపాలెం, రామకృష్ణాపురం, బస్వాపురంల్లో ఆదివారం మంటలు చెలరేగగా మామిడిచెట్లతో పాటు మొక్కజొన్న పంట దగ్ధమైంది. పంట పొలాలను శుభ్రం చేసుకునే క్రమాన రైతులు మొక్కజొన్న చెత్తకు నిప్పు పెట్టడంతో ఈదురుగాలులకు మంటలు వ్యాపించి మామిడి తోటలకు అంటుకున్నాయి. దీంతో తిమ్మినేనిపాలెంలో చెరుకూరి నాగేశ్వరరావు, వెంకటేశ్వర్లు, నంజాల మాధవరావుకు చెందిన 11 ఎకరాల్లోని మామిడి చెట్లు కాలిపోయాయి. అలాగే కూచిపూడి రవికుమార్ పొలంలో నిల్వ చేసిన 50 క్వింటాళ్ల మొక్కజొన్న రాశి దగ్ధమైంది. ఈ క్రమాన మంటలు తిమ్మినేనిపాలెం నుంచి సీతంపేట వెళ్లే రహదారి పక్కన ఉన్న చెట్లకు అంటుకోగా గ్రామపంచాయతీ ట్యాంకర్ల ద్వారా ఆర్పే ప్రయత్నం చేసినా ఫలితం లేక అగ్నిమాపక సిబ్బంది చేరుకుని అదుపు చేశారు. కాలిన మోటార్లు, పైపులు నేలకొండపల్లి: నేలకొండపల్లి మండలం ఆరెగూడెం గ్రామంలో ఓ రైతు ఆదివారం మొక్కజొన్న తోటలో వ్యర్థాలకు నిప్పు పెట్టాడు. వడగాలులతో ఆ మంటలు ఎగిసిపడి సమీపంలోని రైతులు దొడ్డారపు ఉపేందర్, చింతమళ్ల ఆనంద్, చింతమళ్ల రమేశ్, వడ్లమూడి ప్రమోద్, వడ్లమూడి గాంధీ, రేవతి, దొడ్డారపు వెంకటేశ్వర్లుకు చెందిన పొలాల్లో మోటార్లు, పైపులైన్లకు అంటుకుని పూర్తిగా కాలిపోయాయి. ఈ ఘటనతో తాము భారీగా నష్టపోయా మని వారు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సుబాబుల్ తోటలు బోనకల్/ఏన్కూరు: బోనకల్ మండలంలోని మోటమర్రిలో ఆదివారం జరిగిన అగ్ని ప్రమాదంలో దాదాపు 40 ఎకరాల్లో సుబాబుల్ తోట కాలిపోయింది. కొందరు రైతులు చెత్తకు నిప్పంటించి వెళ్లిపోవడంతో సుబాబుల్ తోటకు మంటలు వ్యాపించాయి. దీంతో గ్రామ రైతులు కంచేటి ప్రసాద్, బత్తినేని తిరుపతిస్వామి, బత్తినేని నీరజ, మేడ రామారావు, మేడ అప్పారావు, పారా గంగాధర్కు చెందిన తోటలు దగ్ధమయ్యాయి. అలాగే, ఏన్కూరు మండలం తిమ్మారావుపేటలో ఆదివారం 11 ఎకరాల సుబాబుల్ తోట దగ్ధమైంది. గ్రామవాసి సిరిపురపు సుదర్శన్రావుకు చెందిన తోట సమీపాన వరికొయ్యలకు పెట్టిన మంటలు అంటుకుని పూర్తిగా కాలిపోయింది. షార్ట్ సర్క్యూట్తో.. ఎర్రుపాలెం: మండలంలోని వెంకటాపురంలో ఆదివారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా వేముల వెంకటేశ్వరరావు, కూడెల్లి నాగేశ్వరరావు, చాపా వెంకటేశ్వరరావు, నున్నా సురేశ్ తదితర రైతులకు చెందిన జామాయిల్ తోటలు దగ్ధమయ్యాయి. దాదాపు ముప్పై ఎకరాల్లోని చెట్లు కాలిపోయి రూ.40 లక్షల నష్టం వాటిల్లిందని రైతులు వాపోయారు. అలాగే, రామాపురంలో నలుగురు రైతులకు చెందిన ఆరు ఎకరాల్లోని సుబాబుల్ తోటలు షార్ట్ సర్క్యూట్తో కాలిపోవడంతో రూ.6 లక్షల నష్టం వాటిల్లిందని తెలిపారు. 12 ఎకరాల్లో మామిడితోట పెనుబల్లి: పెనుబల్లి మండలం గంగదేవిపాడు శివారులో అజ్మీరా రాములు, బానోతు జగన్, మాలోతు హతీరామ్కు చెందిన 12ఎకరాల మామిడితోటకు నిప్పంటుకుని చెట్లు పూర్తిగా కాలిపోయాయి. అలా గే, కంటే రామచందర్రావుకు చెందిన ఇంజన్, ట్రిప్ పైప్స్, మోటార్ ఇంజన్ కూడా దగ్ధమయ్యా యి. మామిడితోటలు కాలిపోవడంతో రైతులకు సుమారు రూ.7 లక్షల నష్టం జరిగిందని తెలిపారు.పలు ప్రాంతాల్లో మామిడి, సుబాబుల్ తోటలు, పంటలు దగ్ధం -
ప్రాణాలు తీస్తున్న ఎండ, వడగాలులు
మధిర: మధిర మండలం ఇల్లూరు గ్రామానికి చెందిన కొరివి అచ్చయ్య(90) వడదెబ్బ బారిన పడి ఆదివారం మృతి చెందాడు. ఇటీవల అధిక ఉష్ణోగ్రతలతో అస్వస్థతకు గురైన ఆయనకు చికిత్స చేయిస్తుండగానే పరిస్థితి విషమించి మృతి చెందాడని కుటుంబ సభ్యులు తెలిపారు. పైనంపల్లిలో ఒకరు.. నేలకొండపల్లి: నేలకొండపల్లి మండలం పైనంపల్లికి చెందిన బీమాల వెంకటేశ్వర్లు (43) గ్రామాల్లో పాత ఇనుము, ప్లాస్టిక్ సీసాలు ఏరుకుంటూ అమ్ముకుని జీవనం సాగిస్తున్నాడు. రోజులాగే ఆదివారం బోదులబండ – నేలకొండపల్లి మధ్య ప్లాస్టిక్, ఇనుము ముక్కలు ఏరుకునేందుకు వెళ్లాడు. ఎండ తీవ్రతతో వడదెబ్బకు గురైన ఆయన మార్కెట్ సమీపాన కుప్పకూలి మృతి చెందాడు. ఖమ్మంక్రైం: ఖమ్మం పాత బస్టాండ్లో గురుజాల కొండలు (50) వడదెబ్బతో మృతి చెందాడు. భిక్షాటనతో జీవిస్తున్న ఆయన మృతి సమాచారంతో అన్నం ఫౌండేషన్ చైర్మన్ శ్రీనివాసరావు సహకారంతో మృతదేహాన్ని మార్చురీకి తరలించినట్లు వన్టౌన్ పోలీసులు తెలిపారు. అశ్వారావుపేటరూరల్: అశ్వారావుపేట మున్సిపాలిటీ పరిధి ఫైర్కాలనీకి చెందిన ఎస్కే షాహిదా (65) తీవ్రమైన ఎండలు, వడగాలుల కారణంగా అస్వస్థతకు గురి కాగా కుటుంబీకులు ఆస్పత్రికి తరలించారు. అప్పటికే పరిస్థితి విషమించి మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు. ఆమెకు ఓ కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. కాగా, కుమారుడు ఏడాదిన్నర క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. మామిడిగుండాలలో మహిళ.. ఇల్లెందురూరల్: ఇల్లెందు మండలం మామిడిగుండాలకు చెందిన ముక్తి పూర్ణ (35) వడదెబ్బకు గురై ఆదివారం మృతి చెందిందని ఆమె భర్త వీరస్వామి వెల్లడించారు. వారం రోజులుగా అధిక ఉష్ణోగ్రత, ఉక్కపోతను భరించలేని ఆమె శనివారం సాయంత్రం సొమ్మసిల్లి పడిపోయింది. దీంతో కుటుంబీకులు ఇల్లెందులో చికిత్స అనంతరం ఖమ్మం తరలించగా, చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున మృతి చెందింది. బూర్గంపాడు మండలంలో ఇద్దరు.. బూర్గంపాడు: వడదెబ్బ కారణంగా బూర్గంపాడు మండలంలో ఆదివారం ఇద్దరు మృతిచెందారు. బూర్గంపాడులోని ఓ ఫాస్ట్ఫుడ్ సెంటర్లో మాస్టర్గా పనిచేస్తున్న కుక్కునూరు మండలం మిట్టగూడెం గ్రామానికి చెందిన నోముల వంశీకృష్ణ (33) శనివారం మధ్యాహ్నం ఎండతీవ్రతతో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. వైద్యం కోసం కొత్తగూడెం తరలించగా పరిస్థితి విషమించి ఆదివారం మృతి చెందాడు. అలాగే, సారపాక ప్రధానకూడలి సమీపాన ఆదివారం ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పరిశీలించిన పోలీసులు మృతుడిని ఛత్తీస్గఢ్కు చెందిన వలస ఆదివాసీ కూలీగా భావిస్తూ వడదెబ్బతోనే మృతి చెందాడనే నిర్ధారణకు వచ్చారు. పాల్వంచ/చర్ల: ఎండదెబ్బతో గుర్తు తెలియని వ్యక్తి (50) పాల్వంచలో మృతి చెందాడు. సదరు వ్యక్తి మృతదేహాన్ని రోడ్డు పక్కన గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కాగితాలు ఏరుకుని జీవించే ఆయన వివరాలు తెలియరాలేదని ఎస్ఐ నాగరాజు తెలిపారు. అలాగే, చర్ల మండలం గోదావరి తీరం సమీపాన కోరెగడ్డ లంకల్లో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని గుర్తించారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఎస్ఐ నర్సిరెడ్డి పరిశీలించగా, దుస్తులు లేని సదరు వ్యక్తి మృతదేహం కుళ్లిపోగా, పది రోజుల క్రితం వడదెబ్బతో మృతి చెంది ఉంటాడని నిర్ధారణకు వచ్చారు. దీంతో సదరు వ్యక్తి మృతదేహాన్ని అక్కడే ఖననం చేశారు. పారిశుద్ధ్య కార్మికుడు.. చుంచుపల్లి: మండలంలోని రుద్రంపూర్ గ్రామపంచాయతీ పారిశుద్ధ్య కార్మికుడు ఎన్.రజినీకాంత్(36) ఆదివారం వడదెబ్బతో మృతి చెందాడు. పనికి వెళ్లిన ఆయన ఆదివారం మధ్యాహ్నం ఇంటికి వస్తూ తల తిప్పినట్లవుతోందని స్థానికులకు చెబుతూ లోపలికి వెళ్లాడు. భార్య, పిల్లలు ఊరికి వెళ్లడంతో ఎవరూ లేరు. కాసేపటికి ఇంటి తలుపులు తెరిచే ఉండడంతో స్థానికులు చూడగా రజినీకాంత్ అపస్మారక స్థితిలో ఉండడంతో 108లో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. పాల్వంచ మండలంలో ఇద్దరు... పాల్వంచ/పాల్వంచరూరల్: పాల్వంచ మండలం నారాయణరావుపేట పరిధి ఎస్సీకాలనీకి చెందిన రింగు అనసూర్య (46) భద్రాచలంలో ఉన్న కుమార్తె, కుమారుడి వద్దకు శనివారం వెళ్లి ఆదివారం తిరుగు ప్రయాణమైంది. బస్సులో నాగారం స్టేజీ వద్ద దిగిన ఆమె ఆటో కోసం నిరీక్షిస్తుండగా ఎండతీవ్రతతో స్పృహ కోల్పోగా స్థానికులు గ్రామానికి తీసుకెళ్లేలోగా మృతి చెందింది. అలాగే, పాల్వంచ ఒడ్డుగూడెంకు చెందినచందన బోయిన మల్లయ్య (73) వడదెబ్బ తగిలి మృతి చెందాడు. ఆయనకు భార్య, ముగ్గురు కొడుకులు ఉన్నారు. తిరుమలాయపాలెం: మండలంలోని తెట్టెలపాడు గ్రామానికి చెందిన ఐతరాజు భారతమ్మ (60) ఆదివారం మృతి చెందింది. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె వారం రోజులుగా ఎండల తీవ్రత తాళలేక కన్నుమూసింది. ఆమెకు కుమారుడు కోటేశ్వరరావు ఉన్నారు. భద్రాచలంలో ఇద్దరు.. భద్రాచలంటౌన్: భద్రాచలంలోని ఒకే కాలనీకి చెందిన ఇద్దరు వడదెబ్బ తాకి మృతి చెందారు. సుభాష్నగర్ కాలనీకి చెందిన మాటూరి సావిత్రి (71) ఇంట్లోనే వడదెబ్బకు గురై ప్రాణాలు కోల్పోయింది. అదేకాలనీకి చెందిన కండె వెంకన్న (42) తీవ్ర అస్వస్థతకు గురై ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. కూసుమంచిలో.. కూసుమంచి: మండలంలోని గట్టుసింగారానికి చెందిన ఎలక్ట్రీషియన్ దుంపల సాయిచరణ్ ( 31) రెండు రోజుల క్రితం వడదెబ్బకు గురై ఆదివారం మృతిచెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.వడదెబ్బతో 16 మంది మృతి -
మీటర్లు గిరగిరా !
ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయికి చేరాయి. కొద్దిరోజులుగా జిల్లాలో 45 డిగ్రీలకుపైగా ఎండ తీవ్రత నమోదవుతోంది. ఈక్రమాన ఉపశమనం కోసం ఫ్యాన్లు, కూలర్లు, ఏసీల వినియోగం పెరగడంతో విద్యుత్ వినియోగం అదే స్థాయిలో పెరుగుతోంది. మే నెలలో ఎండలు ఎక్కువగా ఉండడం సహజమే అయినా, గత ఏడాదితో పోలిస్తే మరింత పెరగడంతో విద్యుత్ వినియోగం గరిష్టస్థాయికి చేరుతోంది. – ఖమ్మం వ్యవసాయంతిరగాల్సిందే.. ఎండ తీవ్రత నుంచి రక్షణ కోసం ప్రజలు ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలను వినియోగిస్తున్నారు. ఇవి ఉదయం మొదలు రాత్రి వరకు నిరంతరాయంగా తిరుగుతుండడంతో విద్యుత్ వినియోగం పెరుగుతోంది. ఎన్పీడీసీఎల్ నుంచి ప్రతీ సర్కిల్లో విద్యుత్ కనెక్షన్లు, కేటగిరీని పరిగణనలోకి తీసుకుని సీజన్ల వారీగా విద్యుత్ కోటా నిర్దేశిస్తారు. భూగర్భ జలాలు, జలాశయాల్లో నీరు ఉండడంతో ఈ యాసంగిలో రైతులు పెద్దమొత్తంలో పంటలు సాగు చేశారు. వీటికి మోటార్ల ద్వారా నీరు అందించే క్రమాన గరిష్టస్థాయిలో విద్యుత్ వినియోగం నమోదైంది. అయితే, ఈనెల మొదటి వారంకల్లా యాసంగి పంటల కోతలు పూర్తయ్యాయి. అయినా ఎండల ప్రభావంతో గృహ వినియోగం గణనీయంగా పెరగగా కోటాకు మించి విద్యుత్ వినియోగం జరుగుతోందని భావిస్తున్నారు. అంతకు మించి.... ఖమ్మం విద్యుత్ సర్కిల్(జిల్లా) పరిధిలో 2025 ఏడాదికి మించి ఈ ఏడాది విద్యుత్ వినియోగం నమోదవుతోంది. 2025 మే నెలలో ఖమ్మం సర్కిల్కు నిత్యం 4.93 మిలియన్ యూనిట్ల విద్యుత్ సరఫరా చేశారు. ఈ కోటా ఆధారంగా మే 1నుంచి 20వ తేదీ వరకు 98.60 మిలియన్ యూనిట్లకు బదులు 99.17 మిలియన్ యూనిట్ల వినియోగం జరిగింది. అంటే కోటాకు మించి 0.57 మిలియన్ల యూనిట్లు ఎక్కువగా వినియోగించారు. ఇక ఈ ఏడాది మాత్రం కోటా తగ్గించి నిత్యం 4.83 మిలియన్ యూనిట్లుగా నిర్దేశించారు. కానీ ఈనెల 1 నుంచి 20వ తేదీ వరకు 96.56 మిలియన్ల యూనిట్లకు బదులు 104.34 మిలియన్ యూనిట్లు.. అంటే కోటాకు మించి 7.78 మిలియన్ యూనిట్లు ఎక్కువగా వినియోగించడం గమనార్హం. మూడింట్లో ఎక్కువ.. రెండింట తక్కువ జిల్లాలో ఖమ్మం టౌన్, ఖమ్మం రూరల్, సత్తుపల్లి విద్యుత్ డివిజన్ల పరిధిలో కోటాకు మించి విద్యుత్ వినియోగిస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇటీవల విద్యుత్ డివిజన్ల పునర్విభజనలో భాగంగా మధిర డివిజన్ ఏర్పాటైంది. ఇందులోకి వైరా డివిజన్ నుంచి పలు ప్రాంతాలను కలపడంతో ఈ రెండు డివిజన్లలో కోటా కన్నా తక్కువ విద్యుత్ వినియోగం జరుగుతోంది. ఇదే సమయాన ఖమ్మం టౌన్లో మాత్రం గణనీయంగా పెరిగింది. ఈనెల 1 నుంచి 20వ తేదీ వరకు 23.34 మిలియన్ యూనిట్ల కోటాకు 37.13 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం జరిగింది. ఖమ్మం రూరల్ డివిజన్లో అదనంగా 4.17 మిలియన్ యూనిట్లు, సత్తుపల్లి డివిజన్లో 6.43 మిలియన్ యూనిట్ల విద్యుత్ను కోటాకు మించి వినియోగించారు. మరోపక్క వైరా, మధిర డివిజన్లలో కోటా కంటే తక్కువ వినియోగంతో ఆదా అయినట్లయింది.ఎండల వేళ గరిష్టస్థాయిలో విద్యుత్ వినియోగం -
గ్రామదీపికల సేవలకు బ్రేక్
● జీతాల పెంపు, ఉద్యోగ భద్రత కోసం పోరుబాట ● ఐదు డిమాండ్లు నెరవేర్చాలంటూ నిరసనలు ● ప్రత్యామ్నాయాలపై యంత్రాంగం నజర్ ఖమ్మంమయూరిసెంటర్: గ్రామీణ ప్రాంతాల్లో స్వయం సహాయక సంఘాల బలోపేతం, మహిళల ఆర్థికాభివృద్ధికి వారధిలా నిలిచే విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్ల (వీఓఏ–గ్రామదీపికలు) సమ్మె జిల్లాలో రోజురోజుకూ ఉధృతమవుతోంది. జేఏసీ పిలుపు లో భాగంగా ఐదు ప్రధాన డిమాండ్లను పరిష్కరించాలంటూ ఈ నెల 18వ తేదీ నుంచి గ్రామదీపికలు చేపట్టిన నిరసనలు ఆదివారం ఏడోరోజుకు చేరాయి. సమ్మె ప్రభావంతో పొదుపు సంఘాల లావాదేవీలు, అంతర్గత లెక్కల నిర్వహణ, ఇతర పరిపాలనా సేవలు పాక్షికంగా నిలిచిపోయాయి. సమస్యల సుడిగుండంలో.. గ్రామాల్లో మహిళలను సంఘాలుగా ఏర్పాటు చేయడం, వారికి అవసరమైన రుణాలు ఇప్పించడం, రికార్డులు, సమావేశాల నిర్వహణ బాధ్యతలను గ్రామదీపికలు నిర్వర్తిస్తుంటారు. దశాబ్దాలుగా సంఘాల నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తున్న వీరు తమకు కనీస గౌరవం దక్కడం లేదని చెబుతున్నారు. ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయికి చేర్చేందుకు కృషి చేస్తున్నా తమ సమస్యలను పరిష్కరించడం లేదని వాపోతున్నారు. ఇవీ డిమాండ్లు ప్రస్తుత ధరల నేపథ్యాన తమకు ఇచ్చే రూ.5 వేలు గౌరవ వేతనం సరిపోవడం లేదని, దీన్ని రూ.20 వేలకు పెంచాలని వీఓఏలు డిమాండ్ చేస్తున్నారు. అంతేకాక వేతనాలను విలేజ్ ఆర్గనైజేషన్ ద్వారా చెల్లిస్తుండడంతో ఇబ్బందిగా మారినందున ఆరు నెలలకోసారి ఇవ్వకుండా ప్రతినెలా ఖాతాల్లోనే జమ చేయాలని కోరుతున్నారు. అలాగే, ఉద్యోగ భద్రత, రూ.5 లక్షల బీమా, వివరాల నమోదుకు ఉచితంగా ట్యాబ్లను అందజేయాలని, అర్హులైన వారికి పదోన్నతులు ఇవ్వడమే కాక హెచ్ఆర్ పాలసీ తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు. పాక్షికంగానే విధులు.. సమ్మె ప్రభావంపై అధికారులు, సంఘాల నేతల నుంచి భిన్నమైన గణాంకాలు అందుతున్నాయి. జిల్లాలో 966 మంది వీఓఏలకు గాను 500 మంది వరకు సమ్మె నోటీసు ఇచ్చి ప్రత్యక్షంగా ఆందోళనల్లో పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. ఖమ్మం రూరల్, గోళ్లపాడు, తిరుమలాయపాలెం తదితర ప్రాంతాల్లో సమ్మె తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఆయా లాగిన్ ఐడీలను అధికారులు తాత్కాలికంగా నిలిపివేసినట్లు సమాచారం. అయితే మధిర, కారేపల్లి వంటి మండలాల్లో కొందరు వీఓఏలు యథావిధిగా విధులకు హాజరవుతున్నట్లు తెలిసింది. అయినా సంఘాల నిర్వహణ దెబ్బతినకుండా ఉండేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై అధికారులు దృష్టి సారించారు. వచ్చేనెల 2 వరకు గడువు ప్రభుత్వం నుంచి తమ డిమాండ్లపై వచ్చేనెల 2వ తేదీ లోగా సానుకూల స్పందన రాకపోతే పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని వీఓఏల ప్రతినిధులు హెచ్చరించారు. సమస్యలు పరిష్కారమయ్యేంత వరకు వెనకడుగు వేసే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తున్నారు. అయితే గ్రామ దీపికలు రెండు వర్గాలుగా విడిపోయినట్లు తెలుస్తోంది. మధిర, కారేపల్లి మండలాల్లో వీఓఏలు సమ్మెకు దూరంగా ఉండగా.. కొన్ని మండలాల్లో పూర్తిగా సమ్మెలోకి వెళ్లడం గమనార్హం. -
కేజీబీవీల్లో ‘సమ్మర్’ సందడి!
● ఉమ్మడి జిల్లాలోని రెండుచోట్ల క్యాంప్లు ● సృజనాత్మకత అంశాల్లో విద్యార్థినులకు శిక్షణ ● భోజనం, వసతి కల్పన, ప్రత్యేక ఇన్స్ట్రక్టర్ల నియామకంసెలవుల్లో ఊర్లకు వెళ్లడం, లేదా ఇంట్లోనే గడిపేవాళ్లం. కానీ ఈసారి సమ్మర్ క్యాంప్నకు రావడం ఉత్సాహంగా ఉంది. ఇక్కడ కంప్యూటర్ డీకోడింగ్, స్పోకెన్ ఇంగ్లిష్తో పాటు యోగా, ఇతర అంశాలు నేర్పిస్తున్నారు. మాలో భయాన్ని పోగొట్టి ఇంగ్లిష్ సులువుగా, ధైర్యంగా మాట్లాడేలా ఇక్కడ శిక్షణ ఇస్తున్నారు. –పద్మ, విద్యార్థిని, జూలూరుపాడు క్యాంప్ చిన్నప్పటి నుంచి డ్రాయింగ్, కుట్లు, అల్లికలు అంటే ఇష్టం. ఈ క్యాంపులో వాటిని నేర్పిస్తున్నారు. వీటితో పాటు గణితం సులువుగా చేసేలా సూత్రాలు చెబుతున్నారు. అన్ని కేజీబీవీల విద్యార్థినులు రావడంతో కుటుంబంలా కలిసిపోయాం. ఈ శిక్షణతో చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణిస్తాననే నమ్మకం ఏర్పడింది. –కావేరి, విద్యార్థిని, లచ్చగూడెం కేజీబీవీ క్యాంప్ కేజీబీవీ విద్యార్థినుల్లో అద్భుతమైన సృజనాత్మకత, ప్రతిభ దాగి ఉన్నాయి. వీటిని వెలికితీసి ఆల్రౌండర్లుగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో క్యాంపులను ఏర్పాటు చేశాం. ఆటలకే పరిమితం కాకుండా లలిత కళలు, భవిష్యత్కు అవసరమయ్యే కంప్యూటర్, స్పోకెన్ ఇంగ్లిష్ అంశాల్లో ఇన్స్ట్రక్టర్ల ద్వారా ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తున్నాం. –అన్నామణి, జీసీడీఓ భద్రాద్రి జిల్లాకరకగూడెం: వేసవి సెలవులు వృథా కాకుండా కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాల్లోని బాలికలకు సృజనాత్మక రంగాల్లో శిక్షణ ఇస్తున్నారు. ఏడాదంతా పుస్తకాలకే పరిమితమయ్యే వీరిలో నైపుణ్యాలను వెలికితీయడమే కాక కొత్త అంశాలు నేర్చుకునేలా సమ్మర్ క్యాంపులు ఏర్పాటు చేశారు. సంగీతం నుంచి కంప్యూటర్ వరకు, యోగా నుంచి చిత్రలేఖనం వరకు పలు అంశాల్లో రెసిడెన్షియల్ విధానంలో ఈ శిక్షణ కొనసాగుతోంది. జూలూరుపాడు, లచ్చగూడెంలో శిబిరాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు కేజీబీవీలో జిల్లాస్థాయి ప్రత్యేక సమ్మర్ క్యాంప్ ఏర్పాటు చేశారు. జిల్లాలోని 14 కేజీబీవీల్లో 6 నుంచి 9వ తరగతి ఉత్తీర్ణులైన 120 మంది విద్యార్థినులు ఇందులో పాల్గొంటున్నారు. అలాగే, ఖమ్మం జిల్లా చింతకాని మండలంలోని లచ్చగూడెం కేజీబీవీలో 60 మంది విద్యార్థినులకు శిక్షణ కొనసాగుతోంది. రెండు శిబిరాల్లో కలిపి 16 మంది మహిళా ఇన్స్ట్రక్టర్లను నియమించగా, భోజనం, వసతి సౌకర్యాలను కూడా కల్పించారు. ఈ నెల 11వ తేదీన మొదలైన శిబిరాలు నేడు (సోమవారం) ముగియనున్నాయి. ఉదయం యోగా.. సాయంత్రం ఆటలు రోజంతా శిక్షణ ఇస్తే విద్యార్థినుల్లో ఆసక్తి తగ్గే అవకాశముందని భావించిన అధికారులు విభిన్నమైన అంశాలు నేర్చుకునేలా టైమ్ టేబుల్ రూపొందించారు. ఉదయం 6–30 నుంచి 7–30 వరకు యోగాసనాలు, ఆ తర్వాత 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు విద్యా నైపుణ్యాలు, లలిత కళల్లో శిక్షణ ఇస్తున్నారు. ఇక సాయంత్రం 5 నుంచి 7 గంటల వరకు రకరకాల క్రీడల్లో శిక్షణ కొనసాగుతోంది. బహుముఖ నైపుణ్యాల సమాహారం సమ్మర్ క్యాంప్ కేవలం ఆటలకే పరిమితం కాకుండా విద్యార్థినులను మేటిగా తీర్చిదిద్దేలా పలు అంశాలను ఇందులో చేర్చారు. సంగీతం, నృత్యం, చిత్రలేఖనం, గణిత సూత్రాలు, కంప్యూటర్ డీకోడింగ్, స్పోకెన్ ఇంగ్లిష్, కుట్లు అల్లికలు నేర్పిస్తున్నారు. దీంతో విద్యార్థినులు సైతం ఉత్సాహంగా నేర్చుకుంటున్నారు. -
నేడు మంత్రి తుమ్మల పర్యటన
ఖమ్మంఅర్బన్: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సోమవారం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు సత్తుపల్లి మండలంలోని యాతాలకుంటలో టన్నెల్తో పాటు ఎస్ఆర్ఎల్ఐపీ కాలువ పనులను మంత్రి పరిశీలిస్తారు. ప్రాజెక్టు, కాల్వల నిర్మాణ పురోగతిపై అక్కడే అధికారులతో సమీక్షించనున్నారు. పీఈ సెట్ పరిశీలకులుగా వెంకన్న ఖమ్మం స్పోర్ట్స్: తెలంగాణ ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్(పీఈ సెట్) పరిశీలకులుగా ఖమ్మంకు చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ బి.వెంకన్న నియమితులయ్యారు. ఖమ్మం ఎస్ఆర్అండ్బీజీఎన్ఆర్ కళాశాలలో విధులు నిర్వర్తిస్తున్న ఆయనను పరిశీలకుడిగా నియమిస్తూ పీఈ సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ రాజేష్కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈనెల 31నుంచి జూన్ 3వ తేదీ వరకు శాతవాహన యూనివర్సిటీ ఆధ్వర్యాన జరిగే పీఈ సెట్ నిర్వహణలో ఆయన పాలుపంచుకోనున్నారు. బెస్ట్ అవైలబుల్ స్కూళ్ల ఎంపికకు దరఖాస్తులు ఖమ్మం మామిళ్లగూడెం: గిరిజన బాలురు, బాలికలకు 3నుంచి 8వ తరగతి వరకు ప్రవేశాలు కల్పించే బెస్ట్ అవైలబుల్ స్కూళ్ల పథకం కింద ఇంగ్లిష్ మీడియం ప్రైవేట్ పాఠశాలల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు గిరిజన సంక్షేమ శాఖ డీడీ ఎన్.విజయలక్ష్మి తెలిపారు. గత ఐదేళ్లుగా 7, 10వ తరగతి పరీక్షల్లో 90 శాతం కంటే ఎక్కువ ఉత్తీర్ణత, కనీసం 50 శాతం మొదటి తరగతి ఫలితాలు నమోదై, తరగతి గదులు, హాస్టళ్లు, క్రీడా సదుపాయాలు, ప్రయోగశాలలు, లైబ్రరీ, ఫర్నిచర్ కలిగిన స్కూళ్ల బాధ్యులు దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించారు. ఈమేరకు ఆసక్తి, అర్హత కలిగిన పాఠశాలల యజమాన్యాలు కలెక్టరేట్లోని తమ కార్యాలయంలో ఈనెల 30వ తేదీ సాయంత్రం 5గంటల్లోగా దరఖాస్తులు సమర్పించాలని డీడీ ఓ ప్రకటనలో సూచించారు. ఆపై దరఖాస్తుల పరిశీలన, అర్హత కలిగిన పాఠశాలలను ఎంపిక చేయనుండగా, విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ప్రభుత్వం నుంచి నిర్ణీత మొత్తంలో నిధులు విడుదలవుతాయని తెలిపారు. టీజీవోస్ రాష్ట్ర అధ్యక్షుడితో భేటీ ఖమ్మం సహకారనగర్: తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం(టీజీవోస్) రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావును తెలంగాణ పబ్లిక్ హెల్త్ డాక్టర్ల అసోసియేషన్ జిల్లా కార్యవర్గ బాధ్యులు ఆదివారం కలిశారు. జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు శ్రీకాంత్, బాలకృష్ణ ఆధ్వర్యాన ఆయనను కలిసి రాష్ట్ర ప్రభుత్వ వైద్యులు ఎదుర్కొంటున్న సమస్యలను విన్నవించారు. అనంతరం అసోసియేషన్ను టీజీవోస్కు అనుబంధంగా చేర్చడంపై చర్చించారు. ఈ కార్యక్రమంలో ప్రతినిధులు రాంబాబు, శ్రీనివాస్, సుబ్బారావు, శ్రవణ్కుమార్, రమేష్, రత్న మనోహర్, సాయి, రాధాకృష్ణ, అనిత, స్రవంతి, నవ్యకాంత్, అవినాష్, అర్జున్, గౌతమ్ పాల్గొన్నారు. నేడు హెచ్డీఎస్ సమావేశం ● అభివృద్ధి పనులపై సమీక్ష, తీర్మానాలు ఖమ్మంవైద్యవిభాగం: ఖమ్మం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి అభివృద్ధి కమిటీ (హెచ్డీఎస్) సమావేశం సోమవారం జరగనుంది. కలెక్టర్ దివాకర టీఎస్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో ఆస్పత్రి అభివృద్ధిపై చర్చించి 37 తీర్మానాలను ఆమోదించే అవకాశం ఉంది. ప్రధానంగా జనరల్ ఆస్పత్రికి మంజూరైన రూ.5.96 కోట్ల ఆరోగ్యశ్రీ నిధులతో సర్జికల్, ఎలక్ట్రానిక్ పరికరాల కొనుగోలు, పెండింగ్ బిల్లుల చెల్లింపుపై నిర్ణయం తీసుకోనున్నారు. అంతేకాక ప్రస్తుత భవనం ఆస్పత్రి అవసరాలకు సరిపోవడం లేదు. దీంతో రూ.123 కోట్ల వ్యయంతో భవనంపైన అదనంగా రెండు ఫ్లోర్లు, పాత భవనం స్థానంలో కొత్త భవనం నిర్మాణంపైనా హెడీఎస్ సమావేశంలో చర్చించనున్నారు. అంతేకాక పలు విభాగాల్లో 218 పోస్టుల భర్తీ, ప్రత్యేక సెక్యూరిటీ ఔట్ పోస్ట్ ఏర్పాటు, ఎంఆర్ఐ మిషన్, ల్యాప్రోస్కోపిక్ సెట్, స్మార్ట్ కిచెన్, టీహబ్లో కొత్త యంత్రాలు, సోలార్ ఎనర్జీ సిస్టమ్ ఏర్పాటు తదితర అంశాలపై చర్చించి ఆమోదించే అవకాశముంది. -
దీక్ష శిబిరంలో స్పృహ కోల్పోయిన వీఓఏ
తిరుమలాయపాలెం: సమస్యల పరిష్కారం కోసం వీఓఏలు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా తిరుమలాయపాలెం దీక్షా శిబిరంలో బచ్చోడుకు చెందిన వీఓఏ పోలిశెట్టి అరుణ ఎండ తీవ్రతకు తోడు ఆహారం, నీరు తీసుకోకపోవడంతో స్పృహ కోల్పోయింది. దీంతో సహచరులు ఆమెను సీహెచ్సీకి తరలించి చికిత్స చేయించారు. కాగా, మండుటెండలో దీక్ష కొనసాగిస్తున్నా కనీస వేతనం అమలు, ఉద్యోగ భద్రత, పెండింగ్ బకాయిల చెల్లింపు, సంక్షేమ పథకాల అమలుపై ప్రభుత్వం స్పందించకపోవడం సరికాదని పేర్కొన్నారు. కాగా, చికిత్స పొందుతున్న అరుణను నాయకులు మందడి ఇజ్రాయిల్, సీపీఎం మండల కార్యదర్శి శ్రీను తదితరులు పరామర్శించారు. భార్యను తీవ్రంగా కొట్టిన భర్త చికిత్స పొందుతూ మృతి ఇల్లెందు: మద్యం మత్తులో భార్యను భర్త తీవ్రంగా కొట్టడంతో ఆమె మూడు రోజుల అనంతరం మృతిచెందింది. ఈ ఘటన ఆదివారం పట్టణంలో చోటుచేసుకుంది. 15వ నంబర్ బస్తీకి చెందిన రాకేశ్లోద్ తన భార్య సుమలోద్ను ఈ నెల 21న తీవ్రంగా కొట్టాడు. దీంతో సుమలోద్ కుటుంబ సభ్యులు వైద్యశాలకు తీసుకెళ్లి చికిత్స చేయించి ఇంటికి తీసుకొచ్చారు. 24న తెల్లారుజామున 5 గంటల సమయంలో సుమలోద్ నిద్రలేవపోవడంతో మళ్లీ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కాగా, తన చెల్లి సుమలోధ్ను బావ రాకేశ్లోధ్ తీవ్రంగా కొట్టడం వల్లే మృతి చెందినదని సోదరుడు రిషికాంత్లోద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాగా, మృతురాలికి ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. సీఐ టి.సురేశ్ కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఆటోడ్రైవర్ ఆత్మహత్య సూపర్బజార్ (కొత్తగూడెం): రామవరం వనందాస్గడ్డకు చెందిన ఆటోడ్రైవర్ చెన్నుమల్ల నాగేశ్వరరావు (53) ఆనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులతో ఆదివారం ఇంటి పక్కన చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. నాగేశ్వరరావు అనారోగ్యంతో బాధపడుతూ చికిత్సకు డబ్బులు లేక జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి అన్న వెంకటేశ్వర్లు ఫిర్యాదు చేయగా టూటౌన్ ఎస్ఐ రాజశేఖర్ కేసు నమోదు చేశారు. -
సూరీడి ప్రతాపం
● ఉష్ణోగ్రతలు మరింత ౖపైపెకి.. ● ఎర్రుపాలెంలో గరిష్టంగా 46.4 డిగ్రీలుగా నమోదుఖమ్మంవ్యవసాయం: ఎండలు ఏ మాత్రం తగ్గకపోవడంతో జిల్లా అగ్నిగుండాన్ని తలపిస్తోంది. ఆరు రోజులుగా ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయిలోనే నమోదవుతున్నాయి. ఈమేరకు శుక్రవారం 16 ప్రాంతాలు రెడ్ అలర్ట్ జోన్లో ఉండగా, శనివారం 24 ప్రాంతాలు కొనసాగాయి. ఇక ఆదివారం ఆ సంఖ్య 29కి పెరగ డం గమనార్హం. జిల్లాలో ఆదివారం గరిష్టంగా 46.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఎండకు తోడు మధ్యాహ్నం వడగాలులు, రాత్రికూడా వేడి ప్రభావం కొనసాగుతుండడంతో ప్రజలు విలవిల్లాడుతున్నారు. -
మెరుగైన సేవలు అందించడమే లక్ష్యం
ఖమ్మంమయూరిసెంటర్: సుడా, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్లుగా బాధ్యతలు స్వీకరించిన పువ్వాళ్ల దుర్గాప్రసాద్, ఎండీ.ఖాదర్ బాబా తమ పదవుల ద్వారా ప్రజలకు మరింత మేలు చేయడమే లక్ష్యంగా పని చేయాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సూచించారు. ఏ పదవి దక్కినా ప్రజలకు సేవ చేయడానికి పాటుపడితే గుర్తింపు లభిస్తుందని తెలిపారు. సుడా, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ల అభినందన సభ ఖమ్మంలో డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ అధ్యక్షతన ఆదివారం నిర్వహించారు. ఈ సభలో భట్టి మాట్లాడుతూ దేశ స్వాతంత్య్ర సమరానికి ముందే గ్రంథాలయాలు ప్రజల్లో చైతన్యం నింపాయని తెలిపారు. ముఖ్యంగా ఖమ్మం, సూర్యాపేట, జనగాం ప్రాంతాలు ఆ ఉద్యమాలకు కేంద్ర బిందువులుగా నిలిచాయన్నారు. అంత చరిత్ర కలిగిన గ్రంథాలయాల సంస్థకు చైర్మన్గా బాధ్యతలు స్వీకరిస్తున్న మహమ్మద్ ఖాదర్ బాబా ప్రజలకు సేవ చేసేలా మంత్రులు, ఎమ్మెల్యేలు సహకరిస్తారని తెలిపారు. కాగా, పదేళ్ల పాటు కష్టకాలంలో కూడా పార్టీని వీడని కార్యకర్తలను ప్రభుత్వం ఎప్పటికీ మర్చిపోదని డిప్యూటీ సీఎం చెప్పారు. కష్టపడిన నేతలకు పదవులు రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ పార్టీ కోసం ఏళ్లుగా కష్టపడిన నాయకులకు నేడు సుడా, జిల్లా గ్రంథాలయ సంస్థల చైర్మన్ పదవులు దక్కడం సంతోషకరమని తెలిపారు. నిబద్ధత, నిజాయితీతో పనిచేస్తే రాష్ట్ర నాయకత్వం తప్పకుండా గుర్తింపు ఇస్తుందన్నారు. ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి మాట్లాడుతూ ముగ్గురు మంత్రులు ఉమ్మడి జిల్లా అభివృద్ధికి కృషి చేస్తున్నారని తెలిపారు. అప్పుల భారం ఉన్నా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలులో ప్రభుత్వం వెనుకాడడం లేదని చెప్పారు. సుడా చైర్మన్ పువ్వాళ్ల దుర్గాప్రసాద్ మాట్లాడుతూ పదవులను ఆశించకుండా పార్టీ అభివృద్ధి కోసం కృషి చేశానని వెల్లడించారు. సుడా చైర్మన్గా తనను నియమించిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులకు కృతజ్ఞతలుతెలిపారు. తొలుత కాంగ్రెస్ జిల్లా కార్యాలయం నుంచి భారీ ర్యాలీ నిర్వహించగా, సభలో దుర్గాప్రసాద్, ఖాదర్ బాబాను డిప్యూటీ సీఎం తదితరులు ఘనంగా సన్మానించారు. ఎమ్మెల్సీ శంకర్నాయక్, ఎమ్మెల్యేలు డాక్టర్ మట్ట రాగమయి, రాందాస్ నాయక్, కూనంనేని సాంబశివరావు, రాష్ట్ర గిడ్డంగులు, హస్తకళల సంస్థల చైర్మన్లు రాయల నాగేశ్వరరావు, నాయుడు సత్యనారాయణ, మాస్లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు బాగం హేమంతరావు, సీపీఐ జిల్లా కార్యదర్శి దండి సురేష్ తదితరులు పాల్గొన్నారు.పదవుల ద్వారా సేవ చేస్తేనే గుర్తింపు -
కాంగ్రెస్, బీఆర్ఎస్ దగా పార్టీలు
● రైతుల కడుపు కొడుతున్న రాష్ట్రప్రభుత్వం ● బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నారపరాజు రామచంద్రరావుఖమ్మంమయూరిసెంటర్: రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, ప్రతిపక్షంలోని బీఆర్ఎస్ పార్టీలు రెండూ ప్రజలను వంచిస్తున్న దగా పార్టీలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నారపరాజు రామచంద్రరావు పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా కేంద్రంలో రెండు రోజులుగా నిర్వహిస్తున్న ‘పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహాబియాన్’ శిక్షణ తరగతులు ఆదివారం ముగియగా ఆయన పాల్గొని మాట్లాడారు. జిల్లాలోని 27 మండలాలకు సంబంధించి 12ముఖ్యమైన అంశాలపై వక్తల ద్వారా శ్రేణులకు శిక్షణ ఇప్పించామని రామచంద్రరావు తెలిపారు. బీజేపీలో కీలకమైన క్రమశిక్షణను పాటిస్తూ దేశహితమే లక్ష్యంగా పనిచేయాలని ఆయన సూచించారు. పశ్చిమబెంగాల్లో బలమైన శక్తిగా ఎదిగిన తమ పార్టీ త్వరలోనే తెలంగాణలోనూ కాషాయ జెండా ఎగరవేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఆ అప్పులను నేటి ప్రభుత్వం తీర్చింది.. క్రూడాయిల్ ధరలు అంతర్జాతీయంగా పెరిగాయే తప్ప కేంద్రం పెంచలేదని, కేంద్ర ప్రభుత్వం కేవలం 3శాతం భారాన్ని మోపాల్సి వచ్చిందని రామచంద్రరావు వివరించారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఒక్క గ్యారంటీని పూర్తిస్థాయిలో అమలు చేయకున్నా ముఖ్యమంత్రి వందసార్లు ఢిల్లీ చుట్టూ తిరిగారని అన్నారు. మక్కలు, ధాన్యం పండించిన రైతాంగం మద్దతు ధర లేక నష్టాల్లో కూరుకుపోతుంటే సర్కార్ పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు బేడీలు వేస్తే, నేటి కాంగ్రెస్ వారిని రోడ్డున పడేసిందన్నారు. కాగా, కాక్రోచ్ పార్టీకి సపోర్ట్ చేస్తున్న బీఆర్ఎస్ తేలు కుట్టే పార్టీ అని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఏకంగా పాకిస్థాన్తో చేతులు కలుపుతోందని విమర్శించారు. సీతారామ ప్రాజెక్ట్ డిజైన్ను మారుస్తూ జాప్యం చేస్తున్నారని, సమ్మక్క బారేజ్ సహా ప్రాజెక్టులన్నీ నిలిచిపోతున్నాయని ఆరోపించారు. రాబోయే ఖమ్మం మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే రూ.కోట్లలో కేంద్ర నిధులు వెచ్చించి నగర రూపురేఖలు మార్చేస్తామని హామీ ఇచ్చారు.ఖీ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు, రాష్ట్ర కోశాధికారి దేవకీ వాసుదేవరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహిపాల్ రెడ్డి, నాయకులు పాల్గొన్నారు. -
చిట్టి చేతులు.. చిత్రకళలు
● చిత్రలేఖనం శిక్షణపై విద్యార్థుల ఆసక్తి ● బొమ్మలు గీయడం, రంగులు వేయడంలో తర్ఫీదు ఖమ్మంగాంధీచౌక్: చిత్రకళ అంటే అందమైన బొమ్మలు గీయడం, వాటికి రంగులు అద్దడం. భావాలు, ఆలోచనలను వ్యక్తీకరించే చిత్రకళపై చిన్నారులు ఆసక్తి పెంచుకుంటున్నారు. పెన్సిల్, సిరాతో బొమ్మలు గీయడమే కాక రంగులతో అందంగా మలిచే ఈ కళ మెదడుకు పదును పెడుతుంది. అందుకే పలు పాఠశాలల్లో డ్రాయింగ్ను విద్యలో భాగంగా నేర్పిస్తున్నారు. ప్రస్తుతం వేసవి సెలవులు కావడం ఆసక్తి ఉన్న విద్యార్థులు మాస్టర్ల వద్ద నేర్చుకుంటున్నారు. ఖమ్మం ముస్తఫానగర్కు చెందిన జె.సంతోష్కుమార్ చిత్రకళలో ప్రావీణ్యంతో అనేక అవార్డులు సాధించడమే కాక గిన్నీస్బుక్ రికార్డులో స్థానం దక్కించుకున్నారు. కళ్లతో చూసే ఏ దృశ్యాన్ని అయినా ఐదు నిమిషాల్లో కుంచైపె చేర్చే నైపుణ్యం కలిగిన ఆయన పిల్లలకు చిత్రలేఖనం నేర్పిస్తున్నారు. -
ఆసుపాక వాసికి అరుదైన అవకాశం
అశ్వారావుపేటరూరల్: మండలంలోని ఆసుపాక గ్రామానికి చెందిన డాక్టర్ కున్సోత్ అశోక్ కుమార్కు జాతీయ స్థాయిలో అరుదైన అవకాశం దక్కింది. కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జన జాతీయ గరిమ ఉత్సవ్లో భాగంగా బిర్సా లైవ్స్ ఇన్ న్యూ భారత్ వీక్ కార్యక్రమాన్ని వచ్చే నెల 2వ తేదీన ఢిల్లీలో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా 40 మందితో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేరుగా భేటీ కానున్నారు. కాగా, రాష్ట్రపతితో భేటీ కార్యక్రమానికి ఎస్టీ కేటగిరీలో పీహెచ్డీ పూర్తి చేసిన వారిని ఎంపిక చేయగా, ఈ విభాగంలో అశ్వారావుపేట మండలం ఆసుపాక గ్రామానికి చెందిన డాక్టర్ కున్సోత్ అశోక్ కుమార్ ఎంపిక అయ్యారు. ప్రస్తుతం అశోక్ కుమార్ ఖమ్మంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల లెక్చరర్గా పనిచేస్తున్నారు. జూన్ 2న రాష్ట్రపతితో భేటీకి ఎంపిక -
50 క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనం
తల్లాడ: అక్రమంగా తరలిస్తున్న 50 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని తల్లాడ మండలం నారయ్య బంజర సమీపాన పోలీసులు ఆదివారం తెల్లవారుజామున స్వాధీనం చేసుకున్నారు. ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా జయంతి వీరులపాడు మండలం జయంతి గ్రామానికి చెందిన కాజా రామారావు కల్లూరు మండలం చండ్రపట్ల నుంచి 50 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని మినీ వ్యాన్లో లోడ్ చేసుకుని వెళ్తున్నాడు. ఈ క్రమాన నారయ్య బంజరు వద్ద తనిఖీల్లో గుర్తించి బియ్యంతో పాటు కలకొడిమకు చెందిన డ్రైవర్ తాళ్లూరి సునీల్, డీసీఎం వ్యాన్ను స్వాధీనం చేసుకున్నారు. బియ్యాన్ని సివిల్ సప్లయీస్ అధికారులకు అప్పగించి కేసు నమోదు చేసినట్లు ఎస్ఐఎన్ వెంకటకృష్ణ తెలిపారు. బావిలో పడి రైతు గల్లంతు వైరారూరల్: మండలంలోని తాటిపూడిలో ప్రమాదవశాత్తు బావిలో పడిన రైతు గల్లంతయ్యాడు. గ్రామానికి చెందిన రైతు నన్నెబోయిన వెంకటేశ్వర్లు (45) ఆదివారం తన గేదెలను మేత కోసం పొలాలకు తీసుకెళ్లాడు. అక్కడ గేదెలు నీరు తాగేందుకు బావిలో దిగి కొట్టుకుంటున్నాయి. ఈ క్రమాన వెంకటేశ్వర్లు వాటిని అదిలించేందుకు కర్ర విసరగా గేదెలు ఒడ్డుకి ఎక్కాయి. ఆపై బావిలో కర్రను తీసుకునేందుకు రాళ్లు విసిరిన ఆయన దగ్గరకు రాగానే కిందకు వంగగా అదుపుతప్పి బావిలో పడ్డాడు. ఆయనకు ఈత రాకపోవడంతో కేకలు వేస్తుండగా సమీపంలో ఉన్న ఓ మహిళ వచ్చి తన చీర వేసి వెంకటేశ్వర్లును కాపాడే ప్రయత్నం చేసినా ఫలితం దక్కక నీట మునిగిపోయాడు. ఆయన కోసం రాత్రి వరకు గాలించినా ఆచూకీ లభించలేదు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. -
మహిళా సర్పంచ్పై కాంగ్రెస్ నేత వీరంగం
మధిర: అభివృద్ధి పనుల విషయమై పంచాయతీరాజ్ ఏఈతో మహిళా సర్పంచ్ మాట్లాడుతుండగా అదే గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు వీరంగం సృష్టించిన ఘటన శనివారం మండలంలోని మల్లవరంలో చోటుచేసుకుంది. మల్లవరంలోని ఎస్టీకాలనీలో అభివృద్ధి పనులకు ఎస్టీ సబ్ప్లాన్ నుంచి రూ.25 లక్షల నిధులు మంజూరయ్యాయి. అయితే, కనీస సమాచారం లేకుండా పంచాయతీరాజ్ ఏఈ యశ్వంత్ కొలతలు వేస్తుండగా సర్పంచ్, సీపీఎం పార్టీకి చెందిన మందడపు లక్ష్మి ప్రశ్నించారు. దీంతో ఆయన పొరపాటు జరిగిందని, మరోసారి వస్తాయని వెళ్లిపోతుండగా కాంగ్రెస్ నాయకుడు కరివేద రాంబాబు ‘మీకు చెప్పేది ఏమిటి, మా ఇష్టం’అంటూ సర్పంచ్తో వాగ్వాదానికి దిగాడు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఏ గ్రామానికి వెళ్లినా పార్టీలకతీతంగా ప్రజాప్రతినిధులను గౌరవిస్తారని, కానీ ఇక్కడ రాంబాబు తీరు అందుకు విరుద్ధంగా ఉండడాన్ని పలువురు తప్పుపట్టారు. చివరకు ఏఈ రోడ్డు కొలతలు తీసుకోకుండానే వెనుదిరిగాడు. సోదరుల ఇళ్లలో 10తులాల బంగారం చోరీ రఘునాథపాలెం: మండలంలోని కోయచలక గ్రామానికి చెందిన అన్నాదమ్ముళ్లు పెరుమాళ్లపల్లి విజయ్, శేఖర్ ఇళ్లలో చోరీ జరిగింది. ఈ నెల 19వ తేదీన కుటుంబ సభ్యులంతా ఇళ్లకు తాళాలు వేసి బంధువుల ఇంట్లో శుభకార్యానికి వెళ్లారు. శనివారం వచ్చేసరికి ఇంటి తలుపులు, బీరువాల తాళాలు పగులగొట్టి ఉన్నాయి. ఈ మేరకు విజయ్ ఇంట్లోని బీరువాలో 8.50 తులాలు, ఆయన సోదరుడి ఇంట్లో తులంన్నర బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్లు గుర్తించారు. బాధితుల ఫిర్యాదు మేరకు రఘునాథపాలెం సీఐ ఉస్మాన్ షరీఫ్, ఎస్ఐ నరేశ్తో క్లూస్టీం బృందం పరిశీలించి దర్యాప్తు చేపట్టారు. నాగులవంచలో.. చింతకాని: మండలంలోని నాగులవంచలో ఇటీవల జరిగిన చోరీపై శనివారం కేసు నమోదైంది. గ్రామానికి చెందిన మందా వెంకటమ్మ తన బంగారు పుస్తెలతాడును ఈ నెల 18న రాత్రి బీరువాలో భద్రపరిచి ఆరుబయట పడుకుంది. తెల్లవారేసరికి ఇంటి తలుపులు తెరిచి ఉండగా, బీరువాలోని రెండు తులాల బంగారు పుస్తెలతాడు కనిపించలేదు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వీరేందర్ తెలిపారు. చెత్త సేకరణలో మార్పు రావాలి ● కంపోస్ట్ డెవలప్మెంట్ ఆఫీసర్ హేమలత ఖమ్మంమయూరిసెంటర్: నగరాలు, పట్టణాల్లో చెత్త నిర్వహణ మరింత సమర్థవంతంగా సాగేలా ఉద్యోగులు బాధ్యతగా పని చేయాలని సీడీఎంఏ కంపోస్ట్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఎ.హేమలత సూచించారు. ఖమ్మం డంపింగ్ యార్డ్లో ఉమ్మడి జిల్లాలోని మున్సిపాలిటీల అధికారులు, సిబ్బందికి తడి – పొడి చెత్త వేరు చేయడం, తడి చెత్తను సేంద్రియ ఎరువుగా మార్చే విధానంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా హేమలత మాట్లాడుతూ.. ఇంటిస్థాయి నుంచే తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరిస్తే శాశ్వత వ్యర్థాల నిర్వహణ సాధ్యమవుతుందని తెలిపారు. తడి చెత్తను ఎరువుగా మార్చడం వల్ల డంపింగ్ యార్డ్లపై భారం తగ్గి, పర్యావరణ పరిరక్షణకు తోడ్పడుతుందని చెప్పారు. అలాగే, పొడి చెత్తను రీసైక్లింగ్కు పంపించడం ద్వారా జీరో వేస్ట్ సిటీ లక్ష్యాన్ని సులువుగా సాధించవచ్చన్నారు. కేఎంసీ డిప్యూటీ, అసిస్టెంట్ కమిషనర్లు కె.శ్రీనివాసరావు, మున్సిపాలిటీల కమిషనర్లు, ఉద్యోగులు సంపత్కుమార్, శ్రీకాంత్, నరసింహ, కె.సుజాత, ప్రసాద్రావు, రాజశేఖర్, దిలీప్రెడ్డి, బెల్లం రాధిక, ఎం.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
క్రీడల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి
ఖమ్మంస్పోర్ట్స్: జిల్లా కేంద్రంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో క్రీడాకారులకు అన్ని వసతులు ఉన్నాయని కలెక్టర్ దివాకర టీ.ఎస్. వెల్లడించారు. ఈ మేరకు మరిన్ని వసతుల కల్పన, క్రీడాకారుల శిక్షణపై ప్రత్యేక దృష్టి సారించామని వెల్లడించారు. ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’లో భాగంగా నిర్వహించిన యువజన, క్రీడోత్సవాలు శనివారం ముగియగా, కలెక్టరేట్లో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా 4వ తేదీన నిర్వహించిన జాబ్మేళాలో ఎంపికై న 599 మంది అభ్యర్థుల్లో 310 మందికి ఆఫర్ లెటర్లు అందజేయడమే కాక సీఎంకప్ – 2025 రాష్ట్రస్థాయి పోటీల్లో విజయం సాధించిన 79 మంది క్రీడాకారులు, ఈ నెల 21న నిర్వహించిన పోటీల్లో విజేతలుగా నిలిచిన 432 మందికి పతకాలు అందజేశాక మాట్లాడారు. క్రీడారంగంలో రాష్ట్రంలోనే జిల్లా అగ్రస్థానాన నిలుస్తుండగా క్రీడాకారులు మరింత సత్తాచాటాలని ఆకాంక్షించారు. పర్యాటక ప్రాంతాలపై అవగాహన పర్యాటక రంగ అభివృద్ధికి యువత పాటుపడుతూ ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ దివాకర సూచించారు. పర్యాటక వారోత్సవాల సందర్భంగా కలెక్టరేట్లో టూరిజం కిట్లను ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. పర్యాటక రంగ అభివృద్ధితో స్థానికులకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని తెలిపారు. కార్యక్రమాల్లో అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ, డీవైఎస్ఓ తుంబూరు సునీల్రెడ్డి, పరిశ్రమల శాఖ జీఎం ప్రవీణ్కుమార్, జిల్లా ఉపాధి కల్పన శాఖాధికారి ఎన్.మాధవి, ఉద్యోగులు ఉదయ్కుమార్, ఎండీ గౌస్, నరేశ్నాయక్, జె.చంద్రశేఖర్, ఆజాద్ తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ దివాకర టీ.ఎస్. -
కిన్నెరసాని వెళ్లొద్దామా..!
● మినీ ఊటీని తలపించేలా ప్రకృతి అందాలు ● పర్యాటక కేంద్రం, జలాశయంలో బోటుషికారు పాల్వంచరూరల్: వేసవి సెలవులు ముగింపు దశకు చేరుతున్నాయి. కానీ పిల్లలు, పెద్దలు సరదాగా విహార యాత్రలకు వెళ్దామంటే మండుతున్న ఎండలు బెంబేలెత్తిస్తున్నాయి. ఈ నేపథ్యాన ఉమ్మడి ఖమ్మం జిల్లా వాసులు ఒక రోజు కేటాయిస్తే మినీ ఊటీని తలపించే పాల్వంచ మండలం కిన్నెరసానిలో ఆటపాటలతో ఆనందంగా గడిపే అవకాశముంది. అంతేకాక పర్యావరణ విజ్ఞానం కూడా పెరుగుతుంది. కిన్నెరసానిలోని ప్రత్యేకతల వివరాలతో కథనం.. ఆహ్లాదం.. జీవవైవిధ్యం అడుగడుగునా ఆహ్లాదాన్ని పంచే అటవీ అందాలతోపాటు జీవవైవిధ్యం కిన్నెరసాని సొంతం. కొండకోనలు, పచ్చని చెట్లు, జలాశయం, వన్యప్రాణులతో చూడచక్కని ప్రకృతి అందాలకు నిలయంగా నిలుస్తోంది. ఎత్తయిన కొండలు, గుట్టలు, కిన్నెరసాని జలాశయం మధ్య చూడచక్కని ద్వీపాలే కాక వన్య ప్రాణులను కనులారా చూడొచ్చు. ఇక్కడ పర్యాటకుల కోసం తొమ్మిది కాటేజీలు, అద్దాలమేడ ఉన్నాయి. ఇలా చేరుకోవాలి.. ఖమ్మం నుంచి పాల్వంచ 90 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. పాల్వంచకు వచ్చాక అంబేడ్కర్ సెంటర్ నుంచి 12 కిలోమీటర్ల దూరం వెళ్తే కిన్నెరసాని ప్రాజెక్టు వస్తుంది. అక్కడ ప్రకృతి అందాలతో నిండిన జలాశయం, జింకల పార్కు ఉంది. అంతేకాక కిన్నెరసానికి సమీపాన మందెరకలపాడు అటవీ ప్రాంతంలో జలపాతం ఉంది. ఇక్కడ నుంచి తిరిగి భద్రాచలం వెళ్లే మార్గంలో పెద్దమ్మతల్లి ఆలయాన్ని దర్శించుకోవచ్చు. అయితే, ములుగు లక్నవరంలో మాదిరి కిన్నెరసానిలో కూడా నీళ్ల మధ్య వంతెన నిర్మాణం చేపట్టంతో పాటు హోటళ్లు, వసతి గృహాలను నిర్మిస్తే పర్యాటకుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. అంతేకాక కిన్నెరసాని వెళ్లడానికి బస్సు సౌకర్యం కల్పించేలా అధికారులు దృష్టి సారించాలి. కిన్నెరసాని రిజర్వాయర్లో పర్యాటకుల సౌకర్యార్థం బోటు షికారు అందుబాటులో ఉంది. అంతేకాక డీర్పార్క్లోని జింకలు, జలాశయం అందాలను చూస్తూ మైమరిచిపోవచ్చు. అలాగే, ప్రాజెక్టు కింది భాగంలో డీర్పార్కు ఎదుట చిల్డ్రన్ పార్కులో పిల్లలు ఆడుకునేందుకు అనేక ఆట వస్తువులు ఉంటాయి. ఇవేకాక పర్యాటక కేంద్రంలో పలు రకాల జంతువుల బొమ్మలను ఏర్పాటు చేశారు. -
భానుడి భగభగలు
● రెడ్జోన్లోనే జిల్లాలో 24 ప్రాంతాలు ● వైరా, పల్లెగూడంలో 46.1 డిగ్రీల ఉష్ణోగ్రతఖమ్మంవ్యవసాయం: జిల్లాపై భానుడి భగభగలు కొనసాగుతున్నాయి. శనివారం 24 ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ స్థాయిలో ఉష్ణోగ్రత నమోదైంది. అత్యధికంగా వైరా ఏఆర్ఎస్, ఖమ్మం రూరల్ మండలం పల్లెగూడెంలో 46.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, జిల్లాలోని 42 వెదర్ స్టేషన్లలో 44నుంచి 46.1 డిగ్రీల ఉష్ణోగ్రతల నమోదు కావడం గమనార్హం. ఎండ వేడికి తోడు వడగాలులతో ప్రజలు విలవిల్లాడిపోతున్నారు. పగటి వేళ ఇళ్ల నుంచి ఎవరూ బయటకు రావడం లేదు. ఇక రాత్రి కూడా వేడి ప్రభావం కొనసాగుతుండడంతో ఇళ్లలో ఉండేందుకు సైతం అవస్థ ఎదురవుతోంది. వడగాలులు వీస్తున్న నేపథ్యాన మధ్యాహ్నం 12నుంచి సాయంత్రం 4 గంటల వరకు ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. దాహంగా లేకపోయినా తరచూ నీరు, ఓఆర్ఎస్, మజ్జిగ తాగాలని సూచిస్తున్నారు. ప్రజలు జాగ్రత్తలు పాటించాలి ఖమ్మం సహకారనగర్: జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నందున వడదెబ్బ తగలకుండా ప్రజలు అవసరమైన జాగ్రత్తలు పాటించాలని కలెక్టర్ దివాకర టీ.ఎస్. ఒక ప్రకటనలో సూచించారు. అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం వేళ చిన్నారులు, వయోవృద్ధులు, గర్భిణులు బయటికి రావొద్దని తెలిపారు. ఒకవేళ వచ్చినా గొడుగు లేదా టోపీతో పాటు , సన్నని లేత రంగు కాటన్ వస్త్రాలు ధరించాలని పేర్కొన్నారు. అందరూ సరిపడా తాగునీరు తీసుకోవాలని, ఎండలో పనిచేసే కార్మికులు తరచుగా నీటితో పాటు ఓఆర్ఎస్ ద్రావణం తీసుకుంటే వడదెబ్బ బారిన పడకుండా కాపాడుకోవచ్చని తెలిపారు. అధిక చమట, దాహం, బలహీనత, తల తిప్పడం, కండరాలు పట్టేయడం వంటి లక్షణాలు కనిపిస్తే వడదెబ్బగా భావించి ఆస్పత్రికి వెళ్లాలని సూచించారు. -
రేపు మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుల నియామకం
ఖమ్మంమామిళ్లగూడెం: కాంగ్రెస్ అనుబంధ మైనారిటీ సెల్ జిల్లా కమిటీలను రద్దు చేసి కొత్త కమిటీల నియామకాలు వేగవంతం చేయాలని రాష్ట్ర మైనార్టీ సెల్ చైర్మన్ మహ్మద్ ఇర్ఫాన్ అలీ సూచించారు. ఈ మేరకు ఉమ్మడి జిల్లా పరిశీలకుడిగా సయ్యద్ హజ్మ తుల్లా ఖాద్రీని నియమించారని డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణగౌడ్ తెలిపారు. ఇందులో భాగంగా జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్ష ఎన్నిక ప్రక్రియ ఈ నెల 25న డీసీసీ కార్యాలయంలో చేపడుతున్నట్లు వెల్లడించారు. ఆసక్తి ఉన్న ముస్లిం మైనార్టీ నాయకు లు దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. ముగిసిన బ్యాడ్మింటన్ టోర్నీ ఖమ్మంస్పోర్ట్స్: ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియం, సీక్వెల్ క్లబ్లో నిర్వహించిన జిల్లాస్థాయి బ్యాడ్మింట న్ పోటీలు శనివారం ముగిశాయి. పోటీలను బ్యాడ్మింటన్ అసోసియేషన్ జిల్లా ప్యాట్రన్లు సుదర్శన్రావు, రవిమారుత్, అధ్యక్ష, కార్యదర్శులు కర్నాటి వీరభద్రం, వి.చంద్రశేఖర్తో పాటు కమర్తపు ముర ళి, కొంగర శ్రీనివాస్, శ్రీనివాస్ ప్రారంభించారు. రాత్రి జరిగిన ముగింపు సమావేశంలో ఖమ్మం ఏసీపీ రమణమూర్తి పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు. పలు విభాగాల్లో జరిగిన పోటీల్లో 26 జట్లు పాల్గొన్నాయి. ఈ పోటీల్లో గెలిచినవారు త్వర లో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని వెల్లడించారు. -
వడదెబ్బతో ఐదుగురు మృతి
మండుతున్న ఎండలకు తోడు వడగాలులతో జనం వడదెబ్బ బారిన పడుతున్నారు. వివిధ పనులపై బయటకు వెళ్లిన వారే కాక ఇళ్లలో ఉంటున్న వృద్ధులు సైతం ఎండ తట్టుకోలేక అస్వస్థతకు గురవుతున్నారు. ఈనేపథ్యాన ఉమ్మడి జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో శనివారం వడదెబ్బకు ఐదుగురు మృతి చెందారు.పిండిప్రోలులో వృద్ధురాలు.. తిరుమలాయపాలెం: మండలంలోని పిండిప్రోలు గ్రామానికి చల్లా లచ్చమ్మ(87) వడదెబ్బతో మృతి చెందింది. ఎండల తీవ్రతతో శుక్రవారం రాత్రి తీవ్ర అనారోగ్యానికి గురై కన్నుమూసింది. లచ్చమ్మకు ఐదుగురు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. ఆమె మృతదేహం వద్ద సర్పంచ్ కామల్ల సువార్త తదితరులు నివాళులర్పించి కుటుంబీకులను పరామర్శించారు. మల్లెలమడుగులో వృద్ధురాలు.. అశ్వాపురం: అశ్వాపురం మండలం మల్లెలమడుగు గ్రామానికి చెందిన జెట్టి పుల్లమ్మ(68) వడదెబ్బతో శనివారం తెల్లవారుజామున మృతి చెందింది. ఎండల తీవ్రతకు శుక్రవారం ఆమె అస్వస్థతకు గురికాగా కుటుంబ సభ్యులు భద్రాచలం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె కన్నుమూసింది. భవన నిర్మాణ కార్మికుడు.. పాల్వంచ: పాల్వంచ పరిధి కరవాగు గ్రామానికి చెందిన భవన నిర్మాణ కార్మికుడు పులి వెంకటేశ్వరరావు(38) శనివారం ఎండదెబ్బతో మృతి చెందాడు. వడదెబ్బ బారిన పడిన ఆయనకు వాంతులు అయి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తుండగా మృతి చెందాడు. ఆయనకు భార్య, తల్లి ఉన్నారు. మత్స్య సహకార సంఘం సభ్యుడు.. జూలూరుపాడు: జూలూరుపాడు మండలం కరివారిగూడెంకు చెందిన ధరావత్ నరసింహారావు(45) వడదెబ్బతో శనివారం మృతి చెందాడు. సుజాతనగర్ మండలం సింగభూపాలం చెరువు మత్స్య సహకార సంఘం సభ్యుడైన ఆయన కొద్దిరోజులుగా చేపల వేటకు వెళ్తున్నాడు. ఈనెల 20వ తేదీన చేపల వేటకు వెళ్లిన నర్సింహారావు ఎండ తీవ్రతతో అస్వస్థతకు గురికాగా చికిత్స పొందుతుండగానే పరిస్థితి విషమించి మృతి చెందాడు. ఆయనకు భార్య చంద్రకళ, ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. సారపాకలో ఓ వ్యక్తి.. బూర్గంపాడు: సారపాక ప్రధాన రహదారిలోని మటన్షాపు పక్కన ఓ వ్యక్తి మృతదేహాన్ని శనివారం రాత్రి స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వడదెబ్బకు గురైన రక్తపు వాంతులతో మృతి చెందినట్లు భావిస్తున్నారు. ఆయన వద్ద గుర్తింపు కార్డు ఆధారంగా భద్రాచలానికి చెందిన అలుగునూరి నరేష్గా గుర్తించినట్లు ఎస్ఐ మేడా ప్రసాద్ తెలిపారు. మృతుడు కొత్తగూడెంలోని పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగంలో ఆఫీస్ సబార్టినేట్గా పనిచేస్తున్నట్లు తెలిసింది. -
వర్షాలు వచ్చేలోగా పూర్తిచేయాలి
రఘునాథపాలెం: వర్షాలు మొదలైతే పొలాల్లో యంత్రాలు తిరగడానికి ఇబ్బంది ఎదురుకానున్నందున ఆలోపే పైప్లైన్ నిర్మాణ పనులు పూర్తి చేయాలని జలవనరుల శాఖ సీఈ మంగళపూడి వెంకటేశ్వర్లు ఆదేశించారు. రఘునాథపాలెం మండలం పాపటపల్లి ప్రాంతంలో కొనసాగుతున్న మంచుకొండ లిఫ్ట్ ఇరిగేషన్ పైప్లైన్ పొడిగింపు పనులను శనివారం ఆయన పరిశీలించారు. సాగర్ ప్రధాన కాల్వపై మంచుకొండ లిఫ్ట్ ఇరిగేషన్ పథకం మొదటి దశ పనులు ఇప్పటికే పూర్తికాగా, రూ.40 కోట్లతో మరో 35 చెరువులకు నీరు అందించేలా పైప్లైన్ పొడిగింపు పనులు చేపడుతున్నారు. ఈ పనులను పరిశీలించిన సీఈ మాట్లాడుతూ.. గ్రావిటీ ద్వారా చెరువులకు సాగర్ నీరు తరలించేలా పైప్లైన్ నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేయాలని తెలిపారు. సీఈ వెంట ఈఈ అనన్య, డీఈ ఝాన్సీ, ఏఈలు తదితరులు ఉన్నారు. కాగా, ఖమ్మం మార్కెట్ చైర్మన్ యరగర్ల హన్మంతరావు, సొసైటీ చైర్మన్ తాత రఘురాం, నాయకులు కేలోతు దేవ్సింగ్, బానోత్ కోటేశ్నాయక్, తేజావత్ వెంకన్న, రామయ్య, రామారావు, రవీందర్ పనులపై సీఈతో చర్చించారు. -
పాలిసెట్లో జిల్లా విద్యార్థుల సత్తా
ఖమ్మంసహకారనగర్: పాలిసెట్ ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. ఈ సందర్భంగా జిల్లా విద్యార్థులకు రాష్ట్రస్థాయి టాప్–15 జాబితాలో స్థానం దక్కింది. ఎంపీసీ విభాగంలో మధిర మండలం సుందరయ్యనగర్కు చెందిన కందూరి ఆదిత్యశౌరి, సత్తుపల్లి మండలం అయ్యగారిపేటకు చెందిన మహ్మద్ మహమూబ్ అర్ఫాజ్ అలీ రాష్ట్రస్థాయి ఒకటో ర్యాంకు సాధించడం విశేషం. ఇక ఎంబైపీసీ విభాగంలో అర్ఫాజ్ అలీ రాష్ట్రస్థాయిలో ఆరో స్థానాన నిలిచాడు. జిల్లాలో మొదటి మూడు స్థానాలు.. జిల్లా స్థాయిలో విభాగాల వారీగా మొదటి మూడు స్థానాల్లో నిలిచిన విద్యార్థుల వివరాలు ఇలా ఉన్నాయి. ఎంబైపీసీ విభాగంలో అయ్యగారిపేటకు చెందిన మహబూబ్ అర్ఫాజ్ అలీ, ఖమ్మం గాంధీచౌక్కు చెందిన మారెళ్ల హర్షవర్ధన్, న్యూలక్ష్మీపురానికి చెందిన పెరుమాళ్ల నవదీప్ మొదటి మూడు స్థానాల్లో నిలిచారు. అలాగే, ఎంపీసీ విభాగంలో సుందరయ్యనగర్కు చెందిన కందూరి ఆదిత్యశౌరి, అయ్యగారిపేటకు చెందిన మహబూబ్ అర్ఫాజ్ అలీ జిల్లా మొదటి ర్యాంకు దక్కించుకోగా, ఖమ్మం ధంసలాపురానికి చెందిన లియాఖత్ అర్షియాఖాన్, కల్లూరుకు చెందిన ఇనపల సహస్ర రెండు, మూడో స్థానాలు దక్కించుకున్నారు. విద్యార్థులకు అభినందనలు సత్తుపల్లి/మధిర: పాలిసెట్ ఎంపీసీ విభాగంలో సత్తుపల్లి విశ్వశాంతి విద్యాలయం విద్యార్థి అర్ఫాజ్ అలీ, మధిర సెయింట్ఫ్రాన్సిస్ స్కూల్ విద్యార్థి ఆదిత్యశౌరి రాష్ట్రస్థాయి మొదటి ర్యాంకు సాధించగా పలువురు అభినందించారు. వీరిద్దరు 120కి 120 మార్కులతో రాష్ట్రస్థాయిలో అగ్రస్థానాన నిలిచారు. విద్యార్థులను ఎంఈఓ రాజేశ్వరరావు, పాఠశాలల యాజమాన్యం, హెచ్ఎంలు, ఉపాధ్యాయులు పి.నాగేశ్వరరావు, మేరీ థామస్, ఆన్ బేబీ, వెంకటనారాయణ అభినందించారు. ఈ సందర్భంగా అర్ఫాజ్ మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల సూచనలు పాటిస్తూ చదవడంతో ఈ విజయం సాధ్యమైందని తెలిపారు. భవిష్యత్లో ఉన్నత స్థాయికి చేరడమే లక్ష్యమని చెప్పారు. అలాగే, ఆదిత్యశౌరి మాట్లాడుతూ.. కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్గా స్థిరపడాలనే లక్ష్యంతో ఉన్నట్లు వెల్లడించాడు.ఇద్దరికి రాష్ట్రస్థాయి మొదటి ర్యాంకు -
నేడు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటన
ఖమ్మంమయూరిసెంటర్: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆదివారం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 11గంటలకు ఖమ్మంలో అధికారులు, ప్రజాప్రతినిధులతో ఆయన సమావేశమవుతారు. ఆతర్వాత 11–30 గంటలకు సుడా చైర్మన్ దుర్గాప్రసాద్ అభినందన సభలో పాల్గొంటారు. సాయంత్రం చింతకాని మండలంలోని పలు గ్రామాల్లో అభివృద్ధి పనులకు భట్టి శంకుస్థాపన చేస్తారు. సీఎంఆర్ఎఫ్తో పేదల ఆరోగ్యానికి భరోసా ● ఖమ్మం ఎంపీ రఘురాంరెడ్డి ఖమ్మంమయూరిసెంటర్: కార్పొరేట్, ప్రైవేట్ ఆస్పత్రుల్లో అత్యవసర చికిత్స చేయించుకుని పేదలకు అండగా నిలిచేలా రాష్ట్ర ప్రభుత్వం సీఎంఆర్ఎఫ్ పథకాన్ని అమలుచేస్తోందని ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి తెలిపారు. ఉమ్మడి జిల్లాలోని ఏడు నియోజకవర్గాలకు చెందిన 150మందికి ఆయన సిఫారసుతో మంజూరైన రూ.44లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎంపిక శనివారం ఖమ్మంలో అందజేశారు. ఈ సందర్భంగా రఘురాంరెడ్డి మాట్లాడుతూ దరఖాస్తులను వేగవంతంగా పరిశీలించి చెక్కులు మంజూరయ్యేలా కృషి చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం వంద మంది ఆటోడ్రైవర్లకు ఎంపీ ఖాకీ చొక్కాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాల్లో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, సుడా చైర్మన్ పువ్వాళ్ల దుర్గాప్రసాద్, డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మద్దినేని స్వర్ణకుమారి, నాయకులు కొప్పుల చంద్రశేఖర్, ఉమ్మినేని కృష్ణ, రంజిత్నాయక్, వడ్డెబోయిన నర్సింహారావు, గోసు మధు, రాంపుడి రోశయ్య, గుమ్మా రోశయ్య, ఎస్డీ.గౌస్, ఇమ్మడి తిరుపతిరావు, స్ఫూర్తి ఓం రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. జమలాపురంలో ప్రత్యేక పూజలు ఎర్రుపాలెం: తెలంగాణ తిరుపతిగా పేరున్న జమలాపురంలోని శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు జరిగాయి. స్వామి మూలవిరాట్తో పాటు ఆలయంలోని శ్రీవారి పాదానికి అర్చకులు పంచామృతంతో అభిషేకం నిర్వహించారు. అలాగే, స్వామి, అలివేలు మంగ, పద్మావతి అమ్మవార్లను పట్టువస్త్రాలతో అలంకరించి నిత్యకల్యాణం, శ్రీవారికి పల్లకీ సేవ జరిపించారు. వేసవి సెలవులు కావడంతో రెండు రాష్ట్రాల నుంచి పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొని స్వామిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఈకార్యక్రమంలో ఆలయ ఈఓ జగన్మోహన్రావు, వ్యవస్థాపక ధర్మకర్త ఉప్పల విజయదేవశర్మ, ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాసశర్మ, ఉద్యోగులు సోమయ్య, కృష్ణప్రసాద్తో పాటు అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు. రామయ్యకు సువర్ణ తులసీ అర్చనభద్రాచలం: భద్రాచలంలోని శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం అంతరాలయంలోని మూలమూర్తులకు శనివారం సువర్ణ తులసీ అర్చన జరిపారు. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికై బేడా మండపంలో కొలువుదీరిన స్వామి వారికి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. అలాగే, స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించిన అర్చకులు నిత్యకల్యాణ మహోత్సవాన్ని శాస్త్రోక్తంగా జరిపారు. -
ఆస్పత్రులకు అండగా
జీజీహెచ్కు రూ.5.96 కోట్ల నిధులు ● సత్తుపల్లి, పెనుబల్లి, మధిర హాస్పిటళ్లకు కూడా.. ● పరికరాల కొనుగోలు, ఇతర అవసరాలకు వినియోగం ● ఉన్నతాధికారుల నిర్ణయంతో మెరుగుపడనున్న సౌకర్యాలు జిల్లా జనరల్ ఆస్పత్రిఖమ్మంవైద్యవిభాగం: జిల్లా జనరల్ ఆస్పత్రితో పాటు ఏరియా ఆస్పత్రుల్లో కనీస వసతుల కల్పనకు కొన్నాళ్లుగా నిధులు లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రభుత్వం నుండి నిధులు రాక కార్యాలయాల్లో తెల్లపేపర్లు కొనుగోలుకు కూడా సమస్య ఎదురవుతోంది. ఈనేపథ్యాన ఉన్నతాధికారులు ఉపశమనం కలిగించేలా నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల జిల్లాలోని పలు ప్రభుత్వ ఆస్పత్రులకు ఆరోగ్యశ్రీ నిధులు విడుదల కాగా, వీటిని పరికరాలు, చికిత్స, శస్త్రచికిత్సలకు అవసరమైన సామగ్రి, ఆక్సిజన్తో పాటు అత్యవసర పెండింగ్ బిల్లుల చెల్లింపునకే వినియోగించాలని నిర్ణయించారు. ఈ విషయమై వైద్య, ఆరోగ్య శాఖ – కుటుంబ సంక్షేమ శాఖ ముఖ కార్యదర్శి డాక్టర్ క్రిస్టినా జెడ్ చోంగ్తూ ఆదేశాలు జారీ చేశారు. పెద్దాస్పత్రికి అత్యధికం.. ఆరోగ్యశ్రీ సేవల్లో ఖమ్మం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి ముందు నిలుస్తోంది. ఇక్కడికి ఉమ్మడి జిల్లా నుంచే కాక సరిహద్దుల్లోని సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల నుంచి కూడా చికిత్స కోసం వస్తుంటారు. ఆర్థోపెడిక్, జనరల్ సర్జరీ, కార్డియాలజీ, కంటి, గైనిక్, చిన్నారులకు ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం అందుతోంది. అయితే, ఆరోగ్యశ్రీ బిల్లులు గత నెల వరకు రూ.12 కోట్ల మేర పెండింగ్ ఉండగా, గత నెలలో రూ.5,96,37,578 విడుదలయ్యాయి. ఈ నిధులు విడుదల సందర్భంగా ఆస్పత్రి అభివృద్ధికి కేటాయించాలని ఉన్నతాధికారులు జిల్లా కలెక్టర్కు సూచిస్తూ ఆస్పత్రి అభివృద్ధి సొసైటీ అకౌంట్లో జమ చేశారు. అంతేకాక ఏయే పరికరాలు కొనుగోలు చేయాలో కూడా నివేదిక పంపించారు. వివిధ విభాగాల్లో సర్జికల్ పరికరాల కొనుగోలుకు రూ.1,61,25,000 వెచ్చించాల్సి ఉండగా, వినికిడి లోపంతో బాధపడే వారికి అమర్చే ఎలక్ట్రానిక్ పరికరాలు, మూత్రపిండాలు, రక్తనాళాల చికిత్సకు అవసరమయ్యే పరికరాలకు రూ.3,06,03,500, ఇంకొన్ని విభాగాల్లో పరికరాల కొనుగోలుకు రూ.82లక్షలు, పెండింగ్ బిల్లుల చెల్లింపునకు రూ.47,09,078 కేటాయించాలని సూచించారు. అత్యాధునిక పరికరాలు పెనుబల్లి కమ్యూనిటీ హెల్త్ సెంటర్, సత్తుపల్లి, మధిర ఏరియా ఆస్పత్రులకు కూడా ఆరోగ్యశ్రీ నిధులు విడుదలయ్యాయి. ఆయా నిధులను ఆస్పత్రిలో పరికరాల కొనుగోలు, అభివృద్ధికే వెచ్చించాలని ఆదేశాలు అందాయి. పెనుబల్లి సీహెచ్సీకి రూ.20,95,738 విడుదల కాగా, ఆల్ట్రాసౌండ్, ఈసీజీ యంత్రాలు, ఆపరేషన్ టేబుల్ – హైడ్రాలిక్ మెజర్, శాడోలెస్ ల్యాంప్ సీలింగ్ టైప్ సింగిల్ – డోమ్ తదితర పరికరాలు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. సత్తుపల్లి ఏరియా ఆస్పత్రికి మంజూరైన రూ.43,81,737 నిధులతో ఐసీయూ వెంటిలేటర్, అనస్తీషియా వర్క్ స్టేషన్, ఆల్ట్రా సౌండ్ మిషన్, ఈసీజీ మిషన్, ఆపరేషన్ టేబుల్ – హైడ్రాలిక్ మెజర్ తదితర పరికరాలు కొనుగోలుకు అనుమతి ఇచ్చారు. అంతేకాక మధిర ఆస్పత్రికి రూ.18,06,737 ఆరోగ్యశ్రీ నిధులు విడుదల కాగా ఈసీజీ మిషన్, అనస్తీషియా వర్క్ స్టేషన్, ఆపరేషన్ టేబుల్ హైడ్రాలిక్ మెజర్, సక్షన్ అపార్టస్ – ఎలక్ట్రికల్, డెఫిబ్రిలేటర్లు కొనుగోలు చేయాలని అధికారులు సూచించారు.ఆరోగ్యశ్రీ నిధులతో పెద్దాస్పత్రిలో వైద్య సేవలు మరింత మెరుగు పడనున్నాయి. కలెక్టర్ ఆదేశాలతో ఆస్పత్రికి కావా ల్సిన పరికరాలు త్వరలో కొనుగోలు చేస్తాము. ఈనెల 25న కలెక్టర్ అధ్యక్షతన జరిగే ఆస్పత్రి అభివృద్ధి సొసైటీ సమావేశంలో ఈ అంశంపై చర్చించి అజెండా ఆమోదించే అవకాశం ఉంది. తద్వారా ఏమేం పరికరాలు కొనుగోలు చేయాలో స్పష్టత వస్తుంది. – నరేందర్, మెడికల్ సూపరింటెండెంట్, జిల్లా జనరల్ ఆస్పత్రి -
అందరి సమన్వయంతోనే అభివృద్ధి
ఖమ్మం సహకారనగర్: ప్రజాప్రతినిధులు, అధికారుల సమన్వయంతోనే జిల్లా సమగ్రాభివృద్ధి సాధ్యమవుతుందని కలెక్టర్ దివాకర టీ.ఎస్. తెలిపారు. ‘ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక’పై ఖమ్మంలోని భక్త రామదాసు కళాక్షేత్రంలో నిర్వహించిన జిల్లా స్థాయి సమావేశంలో కలెక్టర్ దివాకర మాట్లాడారు. గత రెండున్నరేళ్లుగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు, లక్ష్యాలను ప్రజలకు వివరించేందుకు 99 రోజుల ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభ సమయాన లబ్ధిదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నా స్థానిక ప్రజాప్రతినిధుల సహకారం, ఇందిరా మహిళాశక్తి ద్వారా రుణాలతో నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలోనే అత్యధికంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు జిల్లాలో పూర్తయ్యాయని తెలిపారు. ఇటీవల ఎన్నికై న సర్పంచ్లు, మున్సిపల్ చైర్మన్లు, వార్డు సభ్యులు ప్రజలకు మరింత చేరువై సేవలు అందించాలని సూచించారు. జిల్లాలో అధిక ఉష్ణోగ్రతల నేపథ్యాన ఎక్కువ సంఖ్యలో చలివేంద్రాలు ఏర్పాటుచేయించాలని తెలిపారు. అలాగే, మొక్కలు నాటడం, పారిశుద్ధ్య నిర్వహణ, వచ్చే విద్యాసంవత్సరం అల్పాహారం, మధ్యాహ్న భోజనం పథకం అమలు, దివ్యాంగులకు బ్యాటరీ ఆధారిత వాహనాల పంపిణీపై సూచనలు చేశారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ, వివిధ శాఖల అధికారులు దీక్షారైనా, శ్రీరామ్, రాంబాబు, జ్యోతి, రామారావు, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఓటర్లుగా అర్హులైన పౌరులందరి పేర్లు జాబితాలో ఉండేలా ఎస్ఐఆర్ మ్యాపింగ్ విజయవంతంగా నిర్వహించేందుకు రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని కలెక్టర్ దివాకర టీ.ఎస్. సూచించారు. కలెక్టరేట్లోని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అర్హులకు చోటు కల్పించడం, అనర్హుల పేర్లు తొలగించే లక్ష్యంతో ప్రత్యేక ఎస్ఐఆర్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జూన్ 25నుంచి మొదలయ్యే ఈ కార్యక్రమం అక్టోబర్ 1న తుది ఓటరు జాబితా ప్రచురణతో ముగుస్తుందని చెప్పారు. ఈమేరకు బూత్ లెవల్ అధికారులు ప్రతీ ఇంట ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ చేయడమే కాక వివరాల సేకరణ, అభ్యంతరాల స్వీకరణ, పరిష్కారంలో సహకరించాలని తెలిపారు. ఆధార్ నంబర్ ఇవ్వడం పూర్తిగా ఐచ్చికమని వెల్లడించిన కలెక్టర్... ఫారం నింపడంలో ఇబ్బందులు ఎదురైతే బీఎల్వోలు, పోర్టల్ సేవలను వినియోగించుకోవాలని, ఇతర రాష్ట్రాలు, విదేశాల్లో ఉన్న ఓటర్ల తరఫున కుటుంబీకులు ఫారాలు సమర్పించవచ్చని చెప్పారు. అదనపు కలెక్టర్ పి.శ్రీజ, కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్, కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్య పాల్గొన్నారు.కలెక్టర్ దివాకర టీ.ఎస్. -
అదే ఎండ.. అంతే మంట
● పల్లెగూడెంలో అత్యధికంగా 46.3 డిగ్రీల ఉష్ణోగ్రత ● రెడ్ జోన్లో జిల్లాలోని 16 ప్రాంతాలుసాక్షిప్రతినిధి, ఖమ్మం: జిల్లాపై సూర్యుడి ప్రతాపం కొనసాగుతోంది. రెండు రోజులుగా నమోదవుతున్న మాదిరిగానే శుక్రవారం కూడా అత్యధికంగా 46.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మొత్తంగా 16 ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ స్థాయిలో ఎండ కొనసాగింది. ఎండకు తోడు వడగాలులు ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. అయితే, గురువారంతో పోలిస్తే శుక్రవారం ఉష్ణోగ్రతల్లో స్వల్ప తేడా నమోదైనా ఎండ, వేడిగాలులు మాత్రం అలాగే కొనసాగాయి. జిల్లాలోని 42 వెదర్ స్టేషన్లలో 43.5 నుంచి 46.3 డిగ్రీల మేర ఉష్ణోగ్రత నమోదు కావడం గమనార్హం.ప్రాంతం ఉష్ణోగ్రత పల్లెగూడెం 46.3 చింతకాని 46.2 ఖమ్మం ఖానాపురం పీఎస్ 46.2 కలెక్టరేట్ 46.1 పమ్మి 46.1 బచ్చోడు 46.1 కాకరవాయి 45.9 బాణాపురం 45.8 ఎర్రుపాలెం 45.5 తిమ్మారావుపేట 45.4 ముదిగొండ 45.3 ఏన్కూరు 45.2 రఘునాథపాలెం 45.1 నేలకొండపల్లి 45.1 వైరా 45.1 పెద్దగోపతి 45 -
రంగుల కళ..
ఖమ్మంగాంధీచౌక్: ప్రకృతి, సృజనాత్మకతను మేళవించి అందమైన రూపాలను సృష్టించే అద్భుతమైన ప్రక్రియ రంగుల కళ. పలు విద్యాసంస్థల్లో ఈ కళపై ప్రత్యేక శిక్షణ ఇస్తుండగా పిల్లలు కూడా ఆసక్తిగా నేర్చుకుంటున్నారు. వేసవి సెలవుల్లో పలువురు శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఖమ్మం రోటరీనగర్లోని కేంబ్రిడ్జ్ మాంటిస్సోరి ప్రీ స్కూల్లో చిన్నారులకు ఉదయం, సాయంత్రం నామమాత్రపు ఫీజుతో ప్రత్యేక తరగతులు బోధిస్తున్నారు. ఇక్కడ కాంక్ట్రీట్ ఆర్ట్ మేకింగ్, కలరింగ్ యాక్టివిటీ నిర్వహిస్తున్నారు. జంతువులు, పూలు, పండ్ల బొమ్మలపై సహజత్వంతో కూడిన రంగులు వేయడం, పలు చిహ్నాలకు రంగులు దిద్దిటం వంటివి నేర్పుతున్నారు. ఈ కళ పిల్లల్లో చేతి కదలికలు, మెదడు వికాసం, చేతి, కళ్ల సమన్వయాన్ని పెంచడమే కాక ఆత్మవిశ్వాసం, స్వీయ వ్యక్తీకరణ అభివృద్ధి చెందుతుందని చెబుతున్నారు. ఈ శిక్షణతో పిల్లలు కాట్బోర్డు ముక్కలు, టిష్యూ పేపర్స్, కలర్ పెయింట్స్, గమ్, వాటర్, మార్కర్స్ వంటి వాటితో టెక్చర్ వంటి ఆర్ట్స్ వేస్తున్నారు. -
కథ.. కనిపించింది..
సత్తుపల్లిటౌన్: ఇద్దరు స్నేహితులైన విద్యార్థులు. ఇందులో ఒకరు ఆవుల పోతురాజు, మరొకరు జొన్నలగడ్డ భానుప్రకాష్. వీరు ఇటీవలే సత్తుపల్లి ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో పదో తరగతి పూర్తి చేశారు. ఈ పాఠశాల తెలుగు ఉపాధ్యాయుని ఎన్సీహెచ్ రమాదేవి మార్గదర్శకత్వంలో తమ ప్రతిభకు మెరుగులు దిద్దుకుంటున్నారు. గత ఏడాది ఆవుల పోతురాజు ‘నాన్నే నా హీరో’పేరిట కథలు రాయగా గార్లపాటి – బొల్లేపల్లి ట్రస్ట్ పుస్తకంగా ప్రచురించింది. ఈ కథలన్నీ చదివిన భానుప్రకాశ్కు ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్పై ఆసక్తి ఉండడంతో ఒక కథను రెండున్నర నిమిషాల నిడివితో వీడియో రూపొందించాడు. ఇంట్లోని సెల్ఫోన్, తెలిసిన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని ఈ వీడియో తయారుచేయగా.. ఉపాధ్యాయుని రమాదేవి ద్వారా తెలుసుకున్న గార్లపాటి – బొల్లేపల్లి ట్రస్ట్ బాధ్యులు బి.మధుసూదన్రాజు, జి.రామకృష్ణ వివరాలు తెలుసుకున్నారు. చాట్ జీపీటీ ద్వారా కథను అప్లోడ్ చేయడం, కథకు అవసరమైన చిత్రాలు, సన్నివేశాలు ఎంపిక చేసుకోవడం, వాయిస్ ఓవర్ జతపర్చడం ఇవన్నీ చేయడానికి మూడు, నాలుగు రోజులు పట్టిందని భానుప్రకాశ్ వివరించాడు. అయితే, సొంతంగా సెల్ఫోన్ లేదని.. ఉంటే కనుక ఇంకా త్వరగా చేయగలనని తెలిపాడు. ప్రస్తుతం పోతురాజు రాసిన ‘నాన్నే నా హీరో’పుస్తకంలోని ఓ కథను వీడియో రూపొందించగా.. మిగతా కథలకు కూడా వీడియోలు తయారు చేయాలనుకుంటున్నట్లు భానుప్రకాష్ వెల్లడించాడు. -
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
ఖమ్మం వైద్యవిభాగం: ప్రస్తుతం జిల్లాలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్ఓ డి.రామారావు సూచించారు. వేసవిలో పిల్లలు, పెద్దలు, గర్భిణులతో పాటు వృద్ధులు వడదెబ్బ బారిన పడే ప్రమాదం ఉన్నందున మధ్యాహ్న సమయాన బయటకు రాకపోవడమే మంచిదని తెలిపారు. పిల్లల్లో జ్వరం, తలనొప్పి, వాంతులు, తలతిరగడం. అలసట, అధిక దాహం, చర్మం ఎరుపుగా మారటం, వేగంగా శ్వాస తీసుకోవడం, మూర్ఛ వంటి లక్షణాలు కనిపిస్తే చల్లని ప్రదేశంలో ఉంచి ఓఆర్ఎస్ లేదా నీరు ఇవ్వాలని సూచించారు. అయినా పరిస్థితిలో మార్పు రాకపోతే సమీప ఆస్పత్రికి తరలించాలని తెలిపారు. వైద్య, ఆరోగ్య శాఖ ద్వారా ప్రజలను అప్రమత్తం చేస్తూనే వడదెబ్బ బారిన పడకుండా అవగాహన కల్పిస్తున్నామని ఆయన వెల్లడించారు. ఈ జాగ్రత్తలు తప్పనిసరి మధ్యాహ్నం 12నుంచి సాయంత్రం 4గంటల వరకు తప్పనిసరైతే తప్ప బయటకు వెళ్లొద్దని డీఎంహెచ్ఓ సూచించారు. బయటకు వెళ్తే బయటకు వెళ్లేటప్పుడు గొడుగు, టోపీ లేదా తువ్వాలు ఉపయోగించమే కాక తగినంత నీరు, ఓఆర్ఎస్, మజ్జిగ, కొబ్బరి నీళ్ల వంటి ద్రవాలు తరచూ తీసుకోవాలని తెలిపారు. గర్భిణీ సీ్త్రలు ఎక్కువసేపు ఎండలో ఉండొద్దని, తరచూ నీరు, పోషక ద్రవాలు తీసుకోవాలని చెప్పారు. అలసట, తల తిరగడం, వాపు లేదా ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది ఎదురైతే వైద్యులను సంప్రదించాలని తెలిపారు. ఇక వృద్ధుల్లో రక్తపోటు, డయాబెటిస్, గుండె జబ్బులు ఉన్నవారు మందులు క్రమం తప్పకుండా తీసుకోవాలని సూచించారు. డీహైడ్రేషన్ రాకుండా తరచుగా ద్రవపదార్థాలు తీసుకోవాలని తెలిపారు.డీఎంహెచ్ఓ రామారావు -
కేఎంసీకి ఏఐ సొబగులు
సాక్షిప్రతినిధి, ఖమ్మం: ఖమ్మం నగర ముఖచిత్రం సమూలంగా మార్పు చెందేలా ఏఐ – ఐసీసీసీ (ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్) ఏర్పాటుకానుంది. రాష్ట్రంలోని హైదరాబాద్ అవతలి ప్రాంతాలను సమాంతరంగా అభివృద్ధి చేయాలన్న ప్రభుత్వ ఆలోచనలతో ఖమ్మం – వరంగల్ – కరీంనగర్ గ్రోత్ కారిడార్ ప్రాజెక్టు రూపుదిద్దుకుంటోంది. ఈ ప్రాజెక్టుతో ఐటీ, సాంకేతిక రంగాల్లో పలు మార్పులు చోటు చేసుకోనున్నాయి. మొత్తం రూ.166.44 కోట్లతో చేపట్టే ఈ ప్రాజెక్టుకు హడ్కో నుంచి సూత్రప్రాయంగా ఆర్థిక ఆమోదం లభించింది. ఇప్పటికే డీపీఆర్ సైతం సిద్ధం కాగా, ప్రధాన కమాండ్ కంట్రోల్ సెంటర్ను ఖమ్మంలోనే ఏర్పాటు చేసేలా అడుగులు పడుతున్నాయి. విపత్తులు ఏర్పడితే స్పందించేందుకు కొంత సమయం పడుతోంది. దీనివల్ల నష్టతీవ్రత పెరుగుతోంది. ఈనేపథ్యాన సమస్య వచ్చినప్పుడు సత్వర స్పందన, సమస్య రాకముందే గుర్తించేలా కమాండ్ కంట్రోల్ రూమ్ ఉపయోగపడనుంది. మూడు కార్పొరేషన్లు, 23 మున్సిపాలిటీలు ఖమ్మంలో ఏర్పాటయ్యే కంట్రోల్ రూమ్ పరిధిలోకి వస్తాయి. ఇక ఇప్పటివరకు వేర్వేరుగా ఉన్న 18 రకాల మున్సిపల్ విభాగాల(రెవెన్యూ, ట్రాఫిక్, డ్రెయినేజీల వ్యర్థాల నిర్వహణ, తాగునీరు, భద్రత, పౌర సేవలు వంటివి)ను ఒకే గొడుగు కిందికి తీసుకొస్తారు. ఈ ప్రాజెక్టుకు అర్బన్ ఛాలెంజ్ ఫండ్ ద్వారా నిధులు సమకూర్చనుండగా 25 శాతం కేంద్రం, మిగిలిన 75 శాతం నిధులను రాష్ట్రప్రభు త్వం, హడ్కో రుణాల ద్వారా వెచ్చిస్తారు. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రజలకు వేగవంతమైన సేవలు అందుబాటులోకి రానున్నాయి. పౌరులు చేసే ఫిర్యాదుల పరిష్కారం గతంలో కన్నా మూడు రెట్లు వేగంగా జరుగుతుందని అధికారులు చెబుతున్నారు. ఎక్కడైనా సాంకేతిక లోపాలు తలెత్తినా వాటిని 94 శాతం వేగంగా గుర్తించి సరిచేసే వీలుంటుంది. ఖమ్మం నగరాన్ని ఐటీ హబ్గా మార్చడమే కాకుండా.. మున్సిపల్ సేవల్లో డిజిటల్ విప్లవాన్ని తీసుకురావడంలో ఏఐ – ఐసీసీసీ గ్రోత్ కారిడార్ మైలురాయిగా నిలుస్తుందని చెబుతున్నారు. ఏఐ – ఐసీసీసీ ప్రాజెక్టు డీపీఆర్ సిద్ధమైంది. ఖమ్మంలో ఏర్పాటు చేసే కమాండ్ కంట్రోల్ సెంటర్ కోసం అనుకూలమైన స్థలాన్ని త్వరలోనే గుర్తిస్తాం. ఇందుకు సంబంధించి నేడు కన్సల్టెంట్లతో భేటీ ఉంది. స్థలం ఖరారు కాగానే టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి పనులను ప్రారంభిస్తాం. ఈ కారిడార్ ఏర్పాటుతో ప్రజల సమస్యలు వేగంగా పరిష్కారం కావడమే కాక విపత్తులు, ఇతర సమస్యలను సత్వరం గుర్తించే వీలు ఏర్పడుతుంది. – అభిషేక్ అగస్త్య, కమిషనర్, కేఎంసీవరంగల్, కరీంనగర్ కార్పొరేషన్లలో ఇప్పటికే ఏఐ – ఐసీసీసీ సౌకర్యం అందుబాటులో ఉంది. ఈక్రమాన ప్రస్తుత గ్రోత్ కారిడార్ ప్రాజెక్టులో ఖమ్మం ప్రధాన కేంద్రం(హబ్)గా అవతరించనుంది. ఖమ్మం నుంచి వరంగల్, కరీంనగర్ వైపు వెళ్లే రహదారులతో పాటు చుట్టుపక్కల ఉండే మూడు కార్పొరేషన్లు, 23 మున్సిపాలిటీలు, ఏడు జిల్లాలు, మూడు డెవలప్మెంట్ అథారిటీలను కలుపుతూ కారిడార్ ఏర్పాటుకానుండగా.. మొత్తం నెట్వర్క్ను పర్యవేక్షించే ప్రధాన ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్(ఐసీసీసీ) ఇక్కడే ఏర్పాటుచేస్తారు. ప్రాజెక్టుకు సంబంధించి కన్సల్టెంట్లతో చర్చలు, కంట్రోల్రూమ్ స్థలఖరారుపై కన్సల్టెంట్లతో చర్చించేందుకు శనివారం కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్య హైదరాబాద్ వెళ్తున్నారు. స్థలం ఖరారయ్యాక టెండర్ల ప్రక్రియ మొదలుకానుంది. ‘ఖమ్మం – వరంగల్ – కరీంనగర్’ గ్రోత్ కారిడార్తో మహర్దశ -
నేటి నుంచి విత్తన వారోత్సవాలు
మధిర: రైతులకు నాణ్యమైన విత్తనాలను సమకూర్చడమే లక్ష్యంగా శనివారం నుంచి ఈనెల 30వ తేదీ వరకు విత్తన వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు మధిర వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ రుక్మిణిదేవి తెలిపారు. రానున్న వానాకాలం సీజన్కు అవసరమైన కంది, పెసర, మినుము తదితర పంటల విత్తనాల ను ఈ వారోత్సవాల్లో రైతులు పొందొవచ్చని వెల్లడించారు. పెసర విత్తనాలు కిలో రూ.180, మినుము విత్తనాలు రూ.180, కందుల విత్తనాలు రూ.200చొప్పున విక్రయిస్తామని తెలి పారు. అలాగే, వరి విత్తనాలు కిలో రూ.75, మొక్కజొన్న విత్తనాలు కిలో రూ.147 చొప్పు న అందుబాటులో ఉన్నాయని వివరించారు. ఆసక్తి ఉన్న వారు వివరాలకు పరిశోధన స్థానంలో సంప్రదించాలని రుక్మిణిదేవి సూచించారు. రేపు సుడా, గ్రంథాలయ చైర్మన్ల అభినందన సభ ఖమ్మంమయూరిసెంటర్: ఇటీవల సుడా, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్లుగా నియమితులైన పువ్వాళ్ల దుర్గాప్రసాద్, మహ్మద్ ఖాదర్ బాబా అభినందన సభ ఆదివారం నిర్వహిస్తున్నట్లు కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నూతి సత్యనారాయణ గౌడ్ తెలిపారు. ఖమ్మంలోని ఎస్ఆర్ గార్డెన్స్లో ఉదయం 11 గంటలకు సభ మొదలవుతుందని వెల్లడించారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, వాకిటి శ్రీహరి, ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు పాల్గొనే సభకు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని కోరారు. డీఆర్వోగా రాంమూర్తి ఖమ్మం సహకానగర్: జిల్లా రెవెన్యూ అధికారి(డీఆర్వో)గా సీహెచ్.రాంమూర్తి నియమితులయ్యారు. ఈమేరకు ప్రభుత్వ కార్యదర్శి డీఎస్.లోకేష్కుమార్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో డీఆర్వోగా ఉన్న పద్మశ్రీ ఉద్యోగ విరమణ చేశారు. ఈ స్థానంలో తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్లో డిప్యూటేషన్పై అసిస్టెంట్ జనరల్ మేనేజర్గా విధులు నిర్వర్తిస్తున్న రాంమూర్తిని నియమించారు. ఆయన ఒకటి, రెండు రోజుల్లో బాధ్యతలు స్వీకరించనున్నారు. డీఎల్పీఓల నియామకం ఖమ్మం సహకారనగర్: ఖమ్మం, కల్లూరు డివిజనల్ పంచాయతీ అధికారులను నియమిస్తూ అదనపు కలెక్టర్ పి.శ్రీజ ఉత్తర్వులు జారీ చేశారు. ఖమ్మం డీఎల్పీఓగా ఉన్న రాంబాబు ప్రస్తుతం జిల్లా పంచాయతీ అధికారి(డీపీఓ)గా విధులు నిర్వర్తిస్తున్నారు. దీంతో కల్లూరు డీఎల్పీఓ విజయలక్ష్మికి ఖమ్మం డీఎల్పీఓగా, వైరా ఎంపీఓ డి.రాజేశ్వరికి కల్లూరు డీఎల్పీఓగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. రామయ్యకు పుష్యమి పట్టాభిషేకంభద్రాచలం: భద్రాచలంలోని శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం అంతరాలయంలోని మూలమూర్తులు శుక్రవారం స్వర్ణకవచాల అలంకరణతో దర్శనమిచ్చారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో స్వామికి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామికి కంకణ ధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు. అనంతరం పుష్యమి నక్షత్రం కావడంతో పట్టాభిషేకోత్సవం నిర్వహించారు. -
పొగ కమ్మేయడంతో ట్యాంకర్ను ఢీకొట్టిన బస్సు
వైరారూరల్: మండలంలోని గొల్లపూడి – పాలడుగు గ్రామాల మధ్య శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రాంతంలో వరి కోతలు పూర్తిచేసిన రైతులు వ్యర్థాల నిర్మూలనకు మంట పెట్టగా సుమారు 30 ఎకరాల పొలాలకు నిప్పంటుకోవడమేకాక ఆరు ఎకరాల మేర నర్సరీ కాలిపోయింది. దీంతో వైరా – జగ్గయ్యపేట రాష్ట్రీయ రహదారిపై దట్టంగా పొగలు అలుముకున్నాయి. ఈ క్రమాన హైదరాబాద్ నుంచి మధిర వెళ్తున్న ఎక్స్ప్రెస్ డ్రైవర్ రోడ్డు పక్కన ఆగిన ఆయిల్ ట్యాంకర్ను పొగ కారణంగా గుర్తించక ఢీకొట్టాడు. ఈ ఘటనలో డ్రైవర్, కండక్టర్తో పాటు ఆరుగురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. వైరా ఎస్ఐ పి.రామారావు, సిబ్బందితో చేరుకుని క్షత్రగాత్రులను ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. ఆపై అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పగా, రహదారిపై ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. -
వడదెబ్బతో 11మంది మృతి
ఉమ్మడి జిల్లాలో ఎండల తీవ్రత కారణంగా పలువురు అస్వస్థతకు గురవుతున్నారు. ఈమేరకు వడదెబ్బకు గురైన 11మంది మృతి చెందారు. ● ఖమ్మంక్రైం: ఖమ్మంలో గుర్తుతెలియని యాచకుడు (65) వడదెబ్బతో మృతి చెందాడు. జీఆర్ ఆయిల్స్ ఎదురుగా రోడ్డుపై యాచకుడు మృతి చెందినట్లు అందిన సమాచారంతో పోలీసులు చేరుకుని అన్నం ఫౌండేషన్ చైర్మన్ శ్రీనివాసరావు సహకారంతో మార్చురీకి తరలించి పంచనామా అనంతరం అంత్యక్రియలు నిర్వహించారు. ● ఖమ్మం బొక్కలగడ్డకు చెందిన నాగయ్య(55) కాల్వొడ్డులో పూల దుకాణంలో పనిచేస్తున్నాడు. ఆయన అస్వస్థతకు గురై మృతి చెందాడు. అలాగే, పరిగిముక్కల కాలనీకి చెందిన అచ్యుత్రావు(70) తీవ్ర అస్వస్థతతో కన్నుమూశాడు. ● కొణిజర్ల: పనిప్రదేశంలో వడదెబ్బకు గురైన ఉపాధి కూలీ పాముల శ్రీను (53) మృతి చెందాడు. కొణిజర్లకు చెందిన శ్రీను పలువురితో కలిసి ఫీడర్ చానల్ పనులకు వెళ్లాడు. అక్కడ అస్వస్ధతకు గురవడంతో సహచరులు కొణిజర్ల ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఎంపీడీఓ .ఉపేంద్రయ్య, ఏపీఓ అమ్మాజాన్, సర్పంచ్ పుష్పావతి, పంచాయతీ కార్యదర్శి రమేశ్ వివరాలు ఆరా తీయగా, కుటుంబీకుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ● ఖమ్మంమామిళ్లగూడెం: ఖమ్మం ముస్తఫానగర్కు చెందిన షేక్ సలీం(42) వడదెబ్బతో మృతి చెందాడు. ఎలక్ట్రిక్ పనులు చేసే ఆయన రోజులాగే పనికి వెళ్లి అస్వస్థతకు గురై మృతి చెందాడు. ఆయనకు భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు. ● చింతకాని: చింతకాని మండలం పాతర్లపాడుకు చెందిన పుట్టపర్తి భద్రమ్మ(60) వడదెబ్బతో శుక్రవారం మృతి చెందింది. చింతచిగురు అమ్మడానికి వెళ్లిన ఆమె ఎండ తీవ్రతకు వడదెబ్బ బారిన పడి కన్నుమూసిందని కుటుంబీకులు తెలిపారు. ● ఖమ్మంఅర్బన్: ఖమ్మం ముస్తఫానగర్కు చెందిన యార్లగడ్డ గోవర్దన్రావు(70) వడదెబ్బతో మృతి చెందాడు. శానిటరీ పనులతో జీవనం సాగిస్తున్న ఆయన శుక్రవారం బయటకు వెళ్లిన సమయాన ఎండతో అస్వస్థతకు గురయ్యాడు. దీంతో సీపీఐ వన్టౌన్ కార్యాలయం వద్ద రేకుల షెడ్డు కిందకు కూర్చుని అపస్మారక స్థితికి చేరాడు. సమాచారం అందుకున్న పోలీసులు వచ్చేసరికి మృతి చెందాడు. ● మధిర: మధిర మండలం ఇల్లూరుకు కోట నిరంజన్(60) వడదెబ్బతో మృతి చెందాడు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. నందిగామ మండలం తక్కెలపాడు, వీర్లపాడులో ఇద్దరు బంధువుల అంత్యక్రియలకు ఇటీవల నిరంజన్ హాజయ్యాడు. ఇంటికి వచ్చాక అస్వస్థతకు గురైన ఆయన కుటుంబీకులు ఖమ్మం ఆస్పత్రికి తరలించగా, వడదెబ్బకు తోడు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందని వైద్యులు నిర్ధారించారు. రెండు రోజుల చికిత్స అనంతరం శుక్రవారం మృతి చెందాడు. ● గుండాల: వడదెబ్బతో తీవ్ర అస్వస్థతకు గురైన మండలంలోని లింగగూడెంకు చెందిన జనగం రాంబాబు(43) మృతి చెందాడు. ఆయన ఖమ్మంలో ఉంటూ ఆటో నడుపుతూ జీవిస్తున్నాడు. గురువారం ఆటో నడిపిన ఆయన ఇంటికి వచ్చేసరికి అస్వస్థతకు గురయ్యాడు. కుటుంబీకులు ఆస్పత్రికి తరలించే సరికి చికిత్స పొందుతూ మృతి చెందాడు. కాగా, రాంబాబుకు భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. ● ఇల్లెందు: మండలంలోని ఆజాద్గర్కు చెందిన పురోహితుడు ముక్కవరపు వెంకటేశ్వర్లు (65) వడదెబ్బతో మృతి చెందారు. కొత్త లింగాలలో ఓ దశదినకర్మ కార్యక్రమం చేసిన ఆయన ఇంటికి వచ్చేసరికి అస్వస్థతకు గురవడంతో ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లాడు. ఎవరైనా సహాయకులను తీసుకురావాలని హాస్పిటల్ వర్గాలు సూచించగచినా, కుటుంబీకులు హైదరాబాద్లో ఉండడంతో వెంకటేశ్వర్లు సమీపంలోని హోటల్ వద్ద సేదతీరే ప్రయత్నం చేశాడు. ఆ సమయాన గుండెపోటు రావటంతో కుప్పకూలిపోగా ఆస్పత్రిలోకి తీసుకెళ్లి పరీక్షించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ● చర్ల: మండలంలోని దానవాయిపేటకు చెందిన దాగం సీతమ్మ(60) వడదెబ్బతో మృతి చెందింది. శుక్రవారం చర్లకు వెళ్లి తిరిగి వస్తుండగా ఎండ తీవ్రతతో అస్వస్థతకు గురై కుప్పకూలింది. స్థానికులు ఆస్పత్రికి తరలించే లోపే కన్నుమూసింది. -
ఎవరు ఆదేశిస్తే మాకేంటి ?
● మిల్లుల్లో ధాన్యం క్వింటాకు ఐదు కేజీల కోత ● ‘ఏ’గ్రేడ్ సైతం కామన్ గ్రేడ్గా నమోదుతో మరింత నష్టం తిరుమలాయపాలెం: కాంటా పూర్తయ్యాక మిల్లులకు తరలించిన ధాన్యంలో ఎలాంటి కోత విధించొద్దని, ఎక్కడైనా తరుగు తీస్తే మిల్లులను సీజ్ చేస్తామన్న మంత్రులు, అధికారుల హెచ్చరికలు బేఖాతరు అవుతున్నాయి. రైతులు ధాన్యాన్ని తూర్పార పట్టి కేంద్రాల ద్వారా మిల్లులకు తరలించినా క్వింటాకు ఐదు కిలోల తరుగు తీస్తూ దోపిడీకి పాల్పడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. తిరుమలాయపాలెం మండలంలోని పలు ప్రాంతాల నుంచి సేకరించిన ధాన్యాన్ని మహ్మదాపురంలోని లోకేశ్వర ఇండస్ట్రీస్ (రైస్మిల్లు)కు తరలిస్తున్నారు. అయితే, మిల్లు నిర్వాహకులు క్వింటాకు ఐదు కిలోల చొప్పున తరుగు తీస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఇదేమిటని అడిగితే ఇతర ప్రాంతాల్లో ఎనిమిది కిలోల తరుగు తీస్తున్నారు.. తాము ఐదు కిలోలే తీస్తున్నట్లు చెబుతున్నారని పేర్కొ న్నారు. తరుగుకు అంగీకరించకపోతే దిగుమతి చేయబోమని చెబుతున్నారని వాపోయారు. 547 కాదు 517 బస్తాలే.. కొనుగోలు కేంద్రాల్లో గోనె సంచి దారంతో కలిపి 40.600 కేజీలకు బదులు 41.250 కేజీల కాంటా వేస్తున్నారు. దీంతో రైతులు క్వింటాకు 1.5 కేజీలు మేర నష్టపోతున్నారు. ఇక మిల్లులో ఐదు కేజీల తరుగుతో నష్టం 6.5 కేజీలకు చేరుతోంది. అంతేకాక సన్న ధాన్యానికి గ్రేడ్ ‘ఏ’కింద క్వింటాకు రూ.2,389 చెల్లించాల్సి ఉన్నా మిల్లర్లు కామన్ గ్రేడ్ (దొడ్డు రకం)గా నమోదు చేయడంతో రూ.2,369 మాత్రమే లభిస్తోంది. ఎదుళ్లచెరువు కేంద్రం నుంచి మిల్లుకు 547 బస్తాల ధాన్యం పంపిస్తే 517 బస్తాలుగానే రశీదు ఇచ్చారు. అంటే బస్తాకు 40 కిలోల చొప్పున 1,200 కిలోలు (12 క్వింటాళ్ల) మేర తరుగు తీసినట్లయింది. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు. కొనుగోలు కేంద్రం నుంచి మహ్మదాపురంలోని మిల్లుకు ధాన్యం లారీలు పంపిస్తే మాకు, రైతులకు సమాచారం లేకుండానే క్వింటాకు ఐదు కేజీల కోత విధించారు. అలాగే, సన్నరకం ధాన్యం పంపిస్తే కామన్ గ్రేడ్గా నమోదు చేసి బిల్లులు ఇస్తున్నారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం. – పేరం సత్యనారాయణ, సీఈఓ, తిరుమలాయపాలెం సొసైటీ -
సొసైటీకి తాళం వేసిన రైతులు
చింతకాని: కాంటా అయిన మొక్కజొన్న బస్తాలను గోదాంలకు తరలించేందుకు లారీలు సమకూర్చడం లేదని ఆరోపిస్తూ పలువురు రైతులు శుక్రవారం చింతకాని సొసైటీ కార్యాలయానికి తాళం వేసి నిరసన తెలిపారు. మొక్కజొన్న కాంటాలు వేసి నెల దాటినా సొసైటీ సిబ్బంది లారీలు సమకూర్చడం లేదని పేర్కొన్నారు. లారీల ఏర్పాటుకు నియమించిన ఏజెంట్లు వారికి ఇష్టం వచ్చిన రైతుల సరుకు మాత్రమే ఎగుమతి చేయిస్తున్నారని వాపోయారు. అయితే, సరిపడా లారీలను ఏర్పాటు చేస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో తాళం తీసిన రైతులు ఆందోళన విరమించారు. -
ఉరి వేసుకుని వివాహిత ఆత్మహత్య
తిరుమలాయపాలెం: మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తి.. తన భార్యను శారీరకంగానే కాక మానసికంగా హింసిస్తుండడంతో తట్టుకోలేక ఆమె ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని గోల్తండాకు చెందిన గుగులోత్ భారతి – రంగా పెద్దకుమార్తె మీనాక్షి (35) వివాహం పదిహేనేళ్ల క్రితం ఇదే గ్రామానికి చెందిన బానోతు శివాజీతో జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు ఉండగా, శివాజీ విద్యుత్శాఖలో కాంట్రాక్టు పనులు చేస్తూ ఏడాదిగా ఖమ్మంలో ఉంటున్నాడు. అక్కడ మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఆయన మీనాక్షిని చిత్రహింసలకు గురిచేస్తున్నాడని తెలిసింది. గురువారం రాత్రి కూడా గొడవ జరగగా మీనాక్షి ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడిందని ఆమె తల్లి ఆరోపించింది. అల్లుడు శివాజీ, ఆయనతో సంబంధం కలిగిన మహిళతో పాటు ఆయన తల్లిదండ్రులపై చర్యలు తీసుకోవాలని ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదుచేసినట్లు ఎస్ఐ కె.జగదీశ్ తెలిపారు. కాగా, బీమా డబ్బుల కోసమే మీనాక్షిని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. విద్యుత్ కాంట్రాక్ట్ పనులకు ఉపయోగించే ట్రాక్టర్, ఇతర యంత్రాలను మీనాక్షి పేరిట కొనుగోలు చేసి బీమా చేయించినట్లు సమాచారం. ఈ క్రమాన బీమా ప్రయోజనాల కోసం శివాజీ హత్య చేశాడని బంధువులు ఆరోపిస్తున్నారు. ఇటీవల మీనాక్షిని చిత్రహింసలకు గురిచేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భర్త వేధింపులే కారణమని తల్లి ఆరోపణ -
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం
కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన ఖమ్మం – వరంగల్ – కరీంనగర్ గ్రోత్ కారిడార్ ప్రాజెక్టులో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్(ఐఓటీ), భౌగోళిక సమాచార వ్యవస్థ(జీఐఎస్), ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) ఇంజన్ల కలయికతో కూడిన టెక్స్టాక్ను ఉపయోగించనున్నారు. కారిడార్ పరిధిలో సుమారు 200 స్మార్ట్ పోల్స్తోపాటు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత సీసీ టీవీ కెమెరాలను ఏర్పాటు చేస్తారు. ఖమ్మం, వరంగల్, కరీంనగర్ కార్పొరేషన్లలో అధునాతన సీసీ టీవీలు ఏర్పాటుచేయడమే కాక పోలీసులు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను సైతం కమాండ్ కంట్రోల్ రూమ్కు కనెక్ట్ చేస్తారు. తద్వారా ట్రాఫిక్ నియంత్రణ, విపత్తులు ఎదురైనప్పుడు పర్యవేక్షణకు సులువు కానుంది. అలాగే, ముఖ్యమైన ప్రాంతాల్లో మైక్లు, టీవీలు ఏర్పాటు చేసి అత్యవసర సమయాల్లో ప్రజలకు సూచనలు చేస్తారు. -
జామాయిల్, మామిడి తోటలు దగ్ధం
ఎర్రుపాలెం: మండలంలోని వెంకటాపురం గ్రామపంచాయతీ పరిధి రాజుపాలెం, తాటిగూడెంల్లో శుక్రవారం జరిగిన అగ్ని ప్రమాదంలో పలువురు రైతుల జామాయిల్, మామిడి తోటలు దగ్ధమయ్యాయి. గ్రామానికి చెందిన తల్లపురెడ్డి కోటిరెడ్డి, బసివిరెడ్డి, చిన్నసైదులు, మీరాబీ, జైనాబీ, బాజీవళీకి చెందిన 6–30 ఎకరాల్లోని జామాయిల్ తోటలు, బొగ్గుల లక్ష్మి, బూసుపల్లి శ్రీనివాసరెడ్డికి చెందిన 1.30 ఎకరాల మామిడి తోటలు కాలిపోయాయి. అయితే, అగ్ని ప్రమాదానికి కారణం తెలియాల్సి ఉంది. ఈ ఘటనలో రూ.12 లక్షల మేర నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరారు. 60ఎకరాల సుబాబుల్ తోట.. బోనకల్: మండలలోని మోటమర్రిలో శుక్రవారం గుర్తుతెలియని వ్యక్తులు మొక్కజొన్న దంటుకు నిప్పు పెట్టారు. ఈ మంటలు వ్యాపించగా మేడ రామారావు,మేడ అప్పయ్య, బత్తినేని తిరుపతిస్వామి, పారా గంగాధర్రావు, కంచేటి ప్రసాద్కు చెందిన సుమారు 60ఎకరాల్లో సుబాబుల్ తోటలు అగ్నికి ఆహుతయ్యాయి. గాలితీవ్రతతో మంటలు ఆర్పే పరిస్థితి లేక రెండేళ్లుంగా కష్టపడి పోయించిన తోటలు కాలిపోయి నష్టపోయామని బాధిత రైతులు వాపోయారు. చోరీలకు పాల్పడుతున్న నిందితుడి అరెస్ట్ ఖమ్మంఅర్బన్: ఒంటరిగా వెళ్తున్న మహిళలే లక్ష్యంగా చైన్స్నాచింగ్లకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర నిందితుడిని ఖమ్మం అర్బన్ పోలీసులు అరెస్ట్ చేశారని నగర ఏసీపీ రమణమూర్తి తెలిపారు. ఖమ్మం అర్బన్ పోలీసుస్టేషన్లో శుక్రవారం ఆయన వివరాలు వెల్లడించారు. శ్రీశ్రీ సర్కిల్ వద్ద శుక్రవారం వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా నంబర్ ప్లేట్ లేని బైక్పై వెళ్తున్న వ్యక్తి పోలీసులను చూసి పారిపోయే ప్రయత్నం చేశాడు. దీంతో ఆయనను అదుపులోకి తీసుకుని విచారించగా ఏపీలోని గుంటూరు జిల్లా అంకిరెడ్డిపాలెంకు చెందిన పట్నా ల వెంకటదుర్గ ప్రభు అలియాస్ అఖిల్గా తేలింది. జిమ్ ట్రైనర్గా పనిచేసే ఆయన రుణాల ఈఎంఐలు చెల్లించడం, విలాసవంతమైన జీవితం కోసం డబ్బు సరిపోక చోరీలను ఎంచుకున్నట్లు అంగీకరించాడని ఏసీపీ తెలిపారు. ఏపీలోని బాపట్ల జిల్లా కర్లపాలెం, పల్నాడు జిల్లా నరసరావుపేట, ఒంగోలు జిల్లా అద్దంకి, గుంటూరు జిల్లా పొన్నూరు ప్రాంతాల్లో ఆయనపై కేసులు ఉన్నాయని వెల్లడించారు. ఇటీవల ఖమ్మం వచ్చిన అఖిల్ శ్రీరాంనగర్ రోడ్డు నంబర్–7లో ఆటో దిగి వెళ్తున్న మహిళ మెడలోనుంచి చోరీకి యత్నించాడని చెప్పారు. ఆమెను చంపేస్తానని బెదిరించి గొలుసు లాక్కుని పారిపోయే క్రమాన గొలుసు జారి కింద పడిందని తెలిపారు. ఈ కేసు విచారిస్తుండగా పట్టుబడ్డాడని ఏసీపీ వెల్లడించారు. సమావేశంలో సీఐ భానుప్రకాష్, ఎస్ఐలు పాల్గొన్నారు. -
‘ధరణి’ తిప్పలు తప్పిస్తున్నాం..
సత్తుపల్లి: గత ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు, ధరణి పోర్టల్లోని లోపాలతో పేదలు, రైతాంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోగా.. భూభారతి చట్టం ద్వారా ఆ సమస్యలన్నీ పరిష్కరిస్తున్నామని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి వెల్లడించారు. నాడు దొరల గడీల్లో బందీ అయిన భూరికార్డులను విడిపించి, భూములపై పేదలకు సర్వాధికారాలు కల్పించడమే ఈ చట్టం లక్ష్యమని తెలిపారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో గురువారం ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’లో భాగంగా నిర్వహించిన ప్రజాదర్బార్లో మంత్రి పొంగులేటి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సత్తుపల్లి, వేంసూరు, పెనుబల్లి మండలాల ప్రజల నుంచి ఆయన దరఖాస్తులు, వినతిపత్రాలు స్వీకరించారు. అనంతరం మాట్లాడుతూ.. రూపాయి లంచం లేకుండా అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయడమే కాక, నిర్మాణంలో దశల వారీగా ప్రతీ సోమవారం బిల్లులు చెల్లిస్తున్నామని తెలిపారు. మొదటి విడతలో మంజూరైన 4.50 లక్షల ఇళ్లలో 1.5 లక్షల ఇళ్లు పూర్తికాగా, జూన్ నాటికి మరో లక్ష ఇళ్లు పూర్తి చేస్తామన్నారు. అంతేకాక జూన్ 2న రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరు కార్యక్రమం సీఎం రేవంత్రెడ్డి చేతుల మీదుగా ప్రారంభమవుతుందని చెప్పారు. అర్హులైతే చాలు గులాబీ కార్యకర్తలకు కూడా ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని, ఇళ్లు రాని పేదలు బాధపడొద్దని.. విడతల వారీగా అందరికీ మంజూరు చేస్తామని మంత్రి ప్రకటించారు. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి, టీజీఐడీసీ చైర్మన్ మువ్వా విజయబాబు, కలెక్టర్ దివాకర టి.ఎస్. తదితరులు పాల్గొన్నారు. -
రికార్డు స్థాయిలో విద్యుత్ వినియోగం
ఖమ్మంవ్యవసాయం: జిల్లా కేంద్రంలో గురువారం రికార్డు స్థాయిలో విద్యుత్ వినియోగం నమోదైంది. మధ్యాహ్నం 3గంటల సమయాన గరిష్టంగా 102 మెగావాట్ల విద్యుత్ వినియోగం జరగగా, ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో ఇదే అత్యధికమని శాఖ ప్రకటించింది. గత ఏడాది మే 21న 95ఎండబ్ల్యూ విద్యు త్ వినియోగం జరగగా, ఈ ఏడాది అంతకు మించి ఏడు మెగావాట్ల(7.37శాతం) విద్యుత్ వినియోగం జరిగింది. ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో ఎనిమిది విద్యుత్ సెక్షన్ల గాను 1.50 లక్షల విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. ఇందులో గృహావసరాలవే కాక వాణిజ్య, పరిశ్రమల కనెక్షన్లు కూడా అధికంగానే ఉంటాయి. ఎండ తీవ్రతతోనే.. జిల్లాలో రెండు రోజులుగా గరిష్టస్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గురువారం ఖమ్మంలో 46.2 డిగ్రీలుగా నమోదు కావడంతో ప్రజలు అల్లాడిపోయారు. వడగాలులతో బయటకు రాలేక ఇళ్లలో ఉంటుండడంతో ఫ్యాన్లు, కూలర్లు, ఏసీల వినియో గం పెరిగి.. అదే స్థాయిలో విద్యుత్ వినియోగం నమోదవుతుంది. ఈ సందర్భంగా ఖమ్మం టౌన్ డీఈ(ఆపరేషన్స్) నంబూరి రామారావు మాట్లాడు తూ ఎండ తీవ్రత కారణంగా అవసరమైన ఉపకరణాలను వినియోగించుకోక తప్పని పరిస్థితి ఎదురవుతున్నా, ఈ సమయాన ఇతర విద్యుత్ వినియోగాన్ని తగ్గించుకోవాలని సూచించారు.మధ్యాహ్నం 3గంటలకు 102మెగావాట్లుగా నమోదు -
త్వరలో కొత్త ఆసరా పింఛన్లు
ఖమ్మంరూరల్/కూసుమంచి: రాబోయే మంత్రివర్గ సమావేశంలో కొత్త ఆసరా పింఛన్ల మంజూరుపై కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తూనే మౌలిక వసతుల కల్పనే ధ్యేయంగా రాష్ట్రప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు. ఏదులాపురం మున్సిపాలిటీ 14వ వార్డులో రూ.4.20కోట్ల వ్యయంతో నిర్మించే రోడ్డు పనులకు కలెక్టర్ దివాకరతో కలిసి మంత్రి శంకుస్థాపన చేసి మాట్లాడారు. తెల్దారుపల్లి ప్రాంతంలో ఇప్పటికే రూ.9కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు. ఎన్నికల హామీలన్నింటినీ ప్రభుత్వం క్రమపద్ధతిలో నెరవేరుస్తోందని చెప్పారు. అలాగే, కూసుమంచి మండలం నర్సింహులగూడెం నుంచి గోపతండా వరకు రూ.7.15 కోట్లతో నిర్మించే బీటీ రోడ్డు పనులకు కూడా మంత్రి శంకుస్థాపన చేసి మాట్లాడారు. ఎంపీగా ఉన్న సమయాన రహదారి సమస్యలతో ప్రజల ఇబ్బందులను చూశానని, ఇప్పుడు అవకాశం రావడంతో నిధులను మంజూరు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమాల్లో మున్సిపల్ చైర్పర్సన్ పోకబత్తిని అనిత, కమిషనర్ ఆళ్ల శ్రీనివాసరెడ్డి, ఆర్డీఓ శ్రీనివాస్, వైస్చైర్మన్ తమ్మినేని నవీన్, పీఆర్ ఏఈ వెంకటరెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
కొనుగోలు కేంద్రంలో 20బస్తాల ధాన్యం దగ్ధం
ఖమ్మంరూరల్: మండలంలోని తీర్థాలలో రైతులు వరి కొయ్యలకు గురువారం మంట పెట్టడంతో నిప్పు రవ్వలు ఎగిసిపడి సమీపంలోని ధాన్యం కొనుగోలు కేంద్రానికి వ్యాపించాయి. దీంతో కొనుగోలు కేంద్రంలోని 20 బస్తాల మేర ధాన్యం కాలిపోయింది. మంగళగూడెంకు చెందిన రైతు వీరెల్లి విక్రమ్ 85బస్తాల ధాన్యాన్ని కేంద్రానికి తీసుకురాగా, 45 రోజులుగా కాంటా వేయకపోవడంతో కేంద్రంలోనే నిరీక్షిస్తున్నాడు. ఈక్రమాన గురువారం మధ్యాహ్నం చుట్టుపక్కల రైతులు పొలాల్లో కొయ్యలకు నిప్పటించడంతో అవి కేంద్రానికి వ్యాపించి ధాన్యం బస్తాలకు మంట అంటుకుంది. సమీపంలోని రైతులు స్పందించేలోగా రూ.40వేల విలువైన 20 ధాన్యం బస్తాలు కాలిపోయాయి. ఈ విషయం తెలిసిన అక్కడకు చేరుకుని ఏదులాపురం సొసైటీ ఉద్యోగులపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎప్పటికప్పుడు కాంటా వేయకపోవడంతో ఈ ప్రమాదం జరిగిందని ఆరోపించారు. అనంతరం తహసీల్దార్ వినయేందర్రెడ్డి చేరుకుని కేంద్రంలోని ధాన్యం కాంటా వేసి గోదాంకు తరలించాలని ఆదేశించారు. సుబాబుల్ తోట.. కామేపల్లి: ప్రమాదవశాత్తు సుబాబుల్ తోటకు నిప్పుంటుకుని కాలిపోయిన ఘటన మండలంలో గురువారం చోటుచేసుకుంది. కెప్టెన్బంజర గ్రామానికి చెందిన కమ్మ నాగమణికి చెందిన 12ఎకరాల్లో సుబాబుల్ తోట ఉండగా, సమీపంలోని ఓ రైతు పంట వ్యర్థాలకు అంటించిన నిప్పు ఎగిసిపడి తోటను అంటుకుంది. దీంతో మంటలు ఎగిసిపడి తోటంతా కాలిపోయింది. మంటలు చుట్టుపక్కల చేలకు వ్యాపించకుండా సర్పంచ్ ఆరెం అచ్చమ్మ జీపీ ట్యాంకర్ ద్వారా నీరు చల్లిస్తుండగా, అగ్నిమాపక శాఖ సిబ్బంది చేరుకుని మంటలను అదుపు చేశారు. ఘటనలో రూ.50 లక్షల మేర ఆస్తి నష్టం జరిగిందని రైతు నాగమణి వాపోయారు. అలాగే, పండితాపురంలో ఓ రైతు మొక్కజొన్న చెత్తకు నిప్పు పెట్టడంతో గాలికి మంటలు ఎగిసిపడి పక్కనే ఉన్న నర్సరీ షెడ్కు అంటుకున్నాయి. ఈ ఘటనలో పైపులతో పాటు షెడ్ నెట్ కొంత భాగం కాలిపోయింది.45 రోజులుగా కాంటా వేయకపోవడంతో నష్టం -
ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారానికి కృషి
ఖమ్మంమయూరిసెంటర్: ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తులను మంత్రులు, అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి పాటుపడతామని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నూతి సత్యనారాయణ గౌడ్ తెలిపారు. ఖమ్మంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో గురువారం ప్రజావాణి నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు దివ్యాంగులు రాగా, డీసీసీ అధ్యక్షుడు వారి వద్దకే వెళ్లి దరఖాస్తులు స్వీకరించారు. అనంతరం సత్యనారాయణ మాట్లాడుతూ ప్రజావాణిలో అందిన 20 దరఖాస్తులను పరిష్కరిస్తామని తెలిపారు. కాంగ్రెస్ కిసాన్, ఓబీసీ, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు మొక్క శేఖర్గౌడ్, పుచ్చకాయల వీరభద్రం, బొడ్డు బొందయ్య, నాయకులు కిలారి అనిల్ కుమార్, దామా స్వరూప, ఇజ్జగాని శ్రీలత, బ్రహ్మారెడ్డి, ప్రతిభారెడ్డి, ఆరెంపుల రవి, ముక్రం అలీఖాన్, భవాని, కాపా సుధాకర్ పాల్గొన్నారు.బైక్లతో స్టంట్లు చేస్తున్న ఇద్దరి అరెస్ట్ కూసుమంచి: సోషల్ మీడియాలో రీల్స్ కోసం రహదారులపై బైక్లతో ప్రమాదకరంగా స్టంట్లు చేసిన ఇద్దరిని ఖమ్మం టాస్క్ఫోర్స్, కూసుమంచి పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. మండలంలోని పెరికసింగారం గ్రామానికి చెందిన మాధవరపు శివరామకృష్ణ, కోక్యాతండాకు చెందిన బాలుడు గురువారం ఖమ్మం – సూర్యాపేట జాతీయ రహదారిపై బైక్లపై స్టంట్లు చేస్తూ ఇతరులకు ఇబ్బంది కలిగించారు. ఈ అంశంపై అందిన సమాచారంతో ఇద్దరిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నట్లు టాస్క్ఫోర్స్ ఏసీపీ సత్యనారాయణ తెలిపారు. రోడ్లపై బైక్లతో ప్రమాదకరంగా విన్యాసాలు చేయడం నేరమని, తల్లిదండ్రులు వారి పిల్లల ప్రవర్తనను గమనించాలని సూచించారు. సైబర్ మోసంపై కేసు నమోదు చింతకాని: గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్కు పంపిన లింక్పై క్లిక్ చేయడంతో వ్యాపారి రూ.39,180 నగదు కోల్పోయాడు. చింతకానికి చెందిన వ్యాపారి వేముల కొండలరావు ఫోన్ పేకు ఈనెల 6వ తేదీన ఓ వ్యక్తి లింక్ పంపించాడు. అది ఓపెన్ చేయగా రెండు విడతలుగా ఖాతా నుంచి రూ.39,180 బదిలీ అయ్యాయి. దీంతో తాను మోసపోయినట్లు గుర్తించిన కొండల్రావు గురువారం ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై వీరేందర్ తెలిపారు. డీసీసీ అధ్యక్షుడు సత్యనారాయణ -
బావిలో ఈతకు వెళ్లి యువకుడి మృతి
ఖమ్మంఅర్బన్: ఖమ్మం 15వ డివిజన్ కొత్తగూడెంకు చెందిన నారసాని రమణనాయుడు(28) గురువారం బావిలో ఈతకు వెళ్లగా నీట మునిగి మృతి చెందాడు. కొత్తగూడెం – అల్లీపురం మధ్య వ్యవసాయ బావిలో ఈత కోసం రమణతో ఎనిమిది మంది వెళ్లారు. కొద్దిసేపటికి అందరూ ఒడ్డుకు చేరుకోగా, నాయుడు మరోసారి ఈతకు దిగినట్లు తెలిసింది. ఆతర్వాత బయటకు రాకపోవడంతో మిత్రులు గాలిస్తూనే కుటుంబీకులకు సమాచారం అందించారు. దీంతో గ్రామస్తులు, కుటుంబ సభ్యులు చేరుకుని గాలింపు చేపట్టారు. ఇదే సమయాన పోలీ సులు కూడా చేరుకున్నారు. చివరకు రాత్రి పొద్దుపోయాక ఆయన మృతదేహం బయటపడింది. రమణనాయుడు తల్లిదండ్రులు మృతి చెందగా, చెల్లెలితో కలిసి ఆయన నాయనమ్మ వద్ద ఉంటున్నాడు. -
విద్యుదాఘాతంతో బాలిక మృతి
తల్లాడ: కుటుంబ పెద్ద మృతి చెందడంతో బిడ్డే లోకంగా ఆమె తల్లి మరో గ్రామానికి వెళ్లి పనులతో జీవనం సాగిస్తోంది. ఇంతలోనే బిడ్డ కూడా విద్యుత్ షాక్తో కన్నుమూయడం ఆ తల్లికి విషాదాన్ని మిగిల్చింది. తల్లాడ మండలం నారాయణపురంలో జరిగిన ఈ ఘటన వివరాలిలా.. నారాయణపురానికి ఖమ్మంపాటి కార్తీక(8) గురువారం యాదవుల బజార్లో నిర్మిస్తున్న భవనం వద్ద ఆడుకునేందుకు వెళ్లింది. అక్కడ కిందకు ఉన్న వైర్లను ప్రమాదవశాత్తు తాకడంతో ఆమె షాక్కు గురై గాయపడింది. దీంతో కార్తీకను వైరాలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్థారించారు. బాలిక స్వగ్రామం వైరా మండలం పుణ్యపురం కాగా, ఆమె తండ్రి ఇటీవల మృతి చెందడంతో బతుకుదెరువు కోసం తల్లి వెంకటమ్మ నారాయణపురం వచ్చి హోటల్లో పనిచేస్తోంది. భర్త మృతి చెందిన కొన్నాళ్లకే కుమార్తె కూడా కన్నుమూయడంతో ఆమె రోదనలు మిన్నంటాయి. 20 కేజీల గంజాయి స్వాధీనం ● బస్సులో హైదరాబాద్ తీసుకెళ్తున్న నిందితులు ఖమ్మంక్రైం: ఒడిశా రాష్ట్రం మల్కాన్గిరి నుంచి హైదరాబాద్కు ట్రావెల్ బస్లో తరలిస్తున్న గంజాయిని ఖమ్మం టూటౌన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సీఐ బాలకృష్ణ తెలిపిన వివరాలు.. మల్కాన్గిరికి చెందిన రంజాన్కార ఇటుకల వ్యాపారం చేస్తూ హైదరాబాద్కు గంజాయి తరలించేవాడు. ఆయన తమ్ముడైన రాజన్ఖారాతో పాటు రమేష్ నాగులుకు డబ్బు ఆశ చూపి హైదరాబాద్కు గంజాయి తరలించేలా ఒప్పించాడు. అంతేకాక మల్కన్గిరి నుంచి వెళ్లే బస్సు డ్రైవర్లు అరవింద్ గైన్, బిసంక మల్లిక్తో మాట్లాడి రెండు గంజాయి బ్యాగ్లను హైదరాబాద్ తీసుకెళ్తే రూ.10వేలు ఇస్తానని చెప్పాడు. దీంతో గంజాయి బ్యాగ్లను డ్రైవర్ క్యాబిన్లో దాచి పెట్టి తీసుకెళ్తుండగా ఖమ్మం బైపాస్లోని ఓ కల్యాణ మండపం వద్ద బస్సు ఆగిపోయింది. ఈక్రమాన పోలీసులు తనిఖీ చేయగా రూ.10లక్షల విలువైన 20.985 కేజీల గంజాయి పట్టుబడింది. దీంతో నలుగురిని అరెస్ట్ చేయడమే కాక బస్సును సీజ్ చేసినట్లు సీఐ తెలిపారు. 3.225 కిలోలు... ఖమ్మం కొత్త బస్టాండ్ వద్ద గురువారం ఎకై ్సజ్ అధికారులు చేపట్టిన తనిఖీల్లో 3.225 కిలోల గంజాయి లభించింది. గంజాయి కలిగిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా ఖమ్మం రూరల్ మండలం శ్రీనివాసనగర్లో నివాసముంటున్న పల్లి విక్రమ్గా తేలింది. ఆయన ఒడిశాలో గంజాయి కొనుగోలు చేసి హైదరాబాద్ తీసుకెళ్తున్నట్లు అంగీకరించాడు. విక్రమ్పై గతంలోనూ రెండు కేసులు ఉన్నాయని ఎక్సైజ్ అధికారులు తెలిపారు. తనిఖీల్లో ఎకై ్సజ్ ఇన్స్పెక్టర్ బి.కృష్ణ, ఖమ్మం–1 స్టేషన్ ఎస్హెచ్ఓ కె.సాయిబాబాతో పాటు ఎస్సై, పలువురు సిబ్బంది పాల్గొన్నారు. -
మసీదులో వేసవి శిక్షణ
ఖమ్మం మామిళ్లగూడెం: ఖమ్మం ఇందిరానగర్ (ఏక్ మినార్) మసీదులో విద్యార్థులకు నమాజ్ పద్ధతులను ఆచరణాత్మకంగా నేర్పించడమే కాక సూరాలను కంఠస్థం చేయించేందుకు నెల రోజులుగా వేసవి శిక్షణ శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరం గురువారం ముగియగా ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. మొదటి నాలుగు స్థానాల్లో నిలిచిన ఎస్.కే.అర్హన్కు సైకిల్, ఎస్.కే.అర్ఫాన్కు రూ.2 వేలు, మూడు, నాలుగు బహుమతులుగా సాద్ అమీన్, ఆఖిబ్కు రూ.వేయి చొప్పున అందించి అభినందించారు. మసీదు కమిటీ అధ్యక్షుడు సయ్యద్ యూసుఫ్ అలీతో పాటు యాకూబ్పాషా, గౌసుద్దీన్, ఇమామ్, ఖతీబ్ హాఫిజ్, మహ్మద్ అమీరుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. కాళేశ్వరంలో పుష్కరాల విధుల్లో జిల్లా ఉద్యోగులు ఖమ్మంగాంధీచౌక్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో జరుగుతున్న సరస్వతి నది అంత్య పుష్కరాల విధులకు ఉమ్మడి జిల్లాకు చెందిన దేవాదాయ, ధర్మాదాయ శాఖ అధికారులు, ఉద్యోగులను కేటాయించారు. ఉమ్మడి జిల్లా అసిస్టెంట్ కమీషనర్ మేకల వీరస్వామితో పాటు వివిధ ఆలయాల్లో పనిచేస్తున్న ఈఓలు, ఉద్యోగులు, సిబ్బంది, ఆఫీస్ సబార్డినేట్లు మొత్తం 10మందికి అక్కడ డ్యూటీలు వేశారు. ఈనెల 21నుంచి 26వ తేదీ వరకు ఉమ్మడి జిల్లా ఉద్యోగులు స్నాన ఘట్టాలు, విశ్రాంతి కేంద్రాలు, అన్నప్రసాదం, తాగునీటి పంపిణీ విధులు నిర్వర్తించనున్నారు. వడదెబ్బతో మహిళ మృతి ఖమ్మం అర్బన్: ఖమ్మం పదో డివిజన్ సుందరయ్యకాలనీకి చెందిన కొత్తపల్లి సీత(51) వడదెబ్బతో మృతి చెందింది. కూలీ పనులతో జీవనం సాగించే ఆమె గురువారం ఉదయం పనికి వెళ్లి మధ్యాహ్నం ఇంటికి వచ్చి పడుకుంది. అనంతరం అపస్మారక స్థితికి చేరగా కుటుంబీకులు పరిశీలించేసరికి అప్పటికే మృతి చెందింది. తీవ్ర ఎండలతో వడదెబ్బ తగిలి మృతి చెందినట్లు భావిస్తున్నారు. సీత భర్త ఏడాది మృతి చెందగా, ఒక కుమార్తె వివాహం అయింది. ప్రస్తుతం సీత తన అత్తతో కలిసి నివాసముంటోంది. పశువుల అక్రమ రవాణా అడ్డగింత పెనుబల్లి: పశువులను అక్రమంగా తరలిస్తున్న డీసీఎం వ్యాన్ను వీఎం బంజర పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎస్సై కె.వెంకటేష్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. వీఎం బంజర పోలీస్స్టేషన్ వద్ద వాహనాల తనిఖీ చేస్తుండగా పశువుల లోడ్తో వెళ్తున్న డీసీఎం వ్యాన్ పట్టుబడింది. ఏపీలోని పార్వతీపురం నుంచి హైదరాబాద్లోని అంబర్పేటకు 15గిత్తలను తరలిస్తున్నట్లు తేలగా స్వాధీనం చేసుకున్నారు. పశువులను అక్రమంగా రవాణా చేస్తున్న అనకాపల్లి జిల్లా సీతారాంపురానికి చెందిన వ్యాన్ డ్రైవర్ ముల్లి నూకరాజు, నొక్కి దీవన్ కుమార్ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెంకటేష్ వివరించారు. -
పెంపు మంచిదే కానీ..
ఖమ్మం సహకారనగర్/ఇల్లెందు రూరల్: రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ నియామకాలకు సంబంధించిన వయో పరిమితిని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఉద్యోగాలకు 34ఏళ్లుగా వయో పరిమితిని తాజాగా 44ఏళ్లకు పెంచారు. ఈ నిర్ణయంపై 34ఏళ్ల వయస్సును సమీపాన ఉన్న వారిలో హర్షం వ్యక్తమవుతోంది. ఇన్నాళ్లు కష్టపడినా ఉద్యోగాలు దక్కించుకోలేకపోయిన తమకు మరిన్ని అవకాశాలు దక్కుతాయనే భావనతో ఉన్నారు. ఇక కొత్తగా డిగ్రీ, పీజీలు పూర్తిచేసిన వారు మాత్రం తమకు పోటీ పెరుగుతుందని చెబుతున్నారు. ఇప్పటికే ఒక్కో ఉద్యోగానికి వందలు, వేల సంఖ్యలో పోటీ ఉండగా వయో పరిమితి పెంపుతో ఇది మరింత పెరుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికే ఒక్కో ఉద్యోగానికి వందల, వేల మంది పోటీ పడుతున్నారు. వయోపరిమితి పెంపుతో పోటీ పెరుగుతుంది. ఫలితంగా యువతకు అవకాశాలు దెబ్బతింటాయనే ఆందోళన ఉంది. ఈ అంశంపై ప్రభుత్వం పరిశీలించి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. – భట్టు నవ్య, ఖమ్మంఉద్యోగ వయో పరిమితిని 44ఏళ్లకు పెంచడం యువతలో ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుత పోటీ నేపథ్యాన ఈ నిర్ణయం యువత భవిష్యత్ను దెబ్బతీసేలా ఉంది. ప్రభుత్వం పునఃసమీక్షించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతాం. – వంగూరి వెంకటేష్, పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి, ఖమ్మంఉద్యోగాల వయోపరిమితి పెంపుపై భిన్నాభిప్రాయాలు -
ఔత్సాహికుల్లో నూతనోత్సాహం
ఖమ్మం స్పోర్ట్స్: ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు కొనసాగుతున్నాయి. ఔత్సాహిక క్రీడాకారులు ఎక్కువగా వస్తుండడంతో స్టేడియంలో సందడి నెలకొంటోంది. వీరికి కోచ్లు శిక్షణ ఇస్తూనే.. సెలవులు ముగిశాక కూడా వచ్చేలా ప్రోత్సహిస్తున్నారు. ప్రస్తుతం పటేల్ స్టేడియంలో 14 క్రీడాంశాల్లో శిక్షణ కొనసాగుతుండగా.. ఒక్కో క్రీడాంశంలో 30 – 60 మంది క్రీడాకారులు హాజరవుతున్నారు. అథ్లెటిక్స్, ఆర్చరీ, టేబుల్ టెన్నిస్, వాలీబాల్, ఫుట్బాల్, హ్యాండ్బాల్, స్కేటింగ్, స్విమ్మింగ్, క్రికెట్, ఉషూ, బాస్కెట్బాల్, లాన్ టెన్నిస్, ఖో–ఖో, కబడ్డీ అంశాల్లో శిక్షణ కొనసాగుతోంది. రెండేసి సార్లు పోటీలు శిక్షణ ముగిసే నాటికి రెండేసి సార్లు పోటీలు నిర్వహించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా ఓ సారి, వేసవి క్రీడా శిబిరాల్లో భాగంగా ఇంకోసారి పోటీలు నిర్వహించనుండడంతో ఔత్సాహికులు ఆసక్తిగా హాజరవుతున్నారు. అంతేకాక విజేతలకు బహుమతులు అందించాలని స్పోర్ట్స్ అథారిటీ నిర్ణయించింది.ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలోనే కాక జిల్లా వ్యాప్తంగా వేసవి క్రీడా శిక్షణా శిబిరాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే పలు చోట్ల శిబిరాలు సందర్శించి సాఫీగా సాగేలా సూచనలు చేశాం. జిల్లా కేంద్రంలోనే అత్యధిక క్రీడాంశాల్లో శిక్షణా శిబిరాలు జరుగుతున్నాయి. క్రీడాకారులను ఉత్సాహపరిచేలా పోటీలను కూడా నిర్వహిస్తున్నాం. తద్వారా అందులో ప్రతిభావంతులను గుర్తించి సెలవులు ముగిశాక కూడా శిక్షణకు వచ్చేలా ప్రోత్సహిస్తున్నాం. – టి.సునీల్రెడ్డి, డీవైఎస్ఓ పటేల్ స్టేడియంలో ముమ్మరంగా క్రీడా శిక్షణ -
ఈత కొలనులో మళ్లీ సందడి
ఇల్లెందు లేక్ వ్యూ పార్క్లోని ఈత కొలనులో చాన్నాళ్ల తర్వాత సందడి మొదలైంది. మున్సిపాలిటీ నిధులు రూ.కోటితో కొలనును నిర్మించారు. గత ఏడాది నిర్వహణ సాఫీగానే సాగినా ఆ తర్వాత మూత పడింది. ప్రస్తుత మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్ మళ్లీ తెరిపించి పర్యవేక్షణను ఒకరికి అప్పగించారు. దీంతో వారం నుంచి చిన్నాపెద్ద తేడా లేకుండా ఉదయం, సాయంత్రం వేళల్లో పెద్దసంఖ్యలో వస్తున్నారు. కొందరు కొత్తగా ఈత నేర్చుకుంటుండగా.. ఇప్పటికే ఈత వచ్చిన మరికొందరు దాన్ని కొనసాగిస్తున్నారు. – ఇల్లెందు -
ముందస్తు జాగ్రత్తలతోనే...
వరదల వంటి విపత్తుల నివారణకు ముందస్తుగా తీసుకునే జాగ్రత్తలే కీలకమని కలెక్టర్ దివాకర తెలిపారు.గురువారం శ్రీ 21 శ్రీ మే శ్రీ 2026భగ్గుమంటోంది..బయటకు రావాలంటే భయమే... ఈ వేసవిలో మార్చి నుంచే భానుడి ప్రతాపం ప్రారంభమైంది. సహజంగా మార్చిలో ఎండ సాధారణంగానే నమోదై, ఏప్రిల్లో తీవ్రత పెరుగుతుంటుంది. కానీ ఈ ఏడాది మాత్రం మార్చి మొదటి వారం నుంచే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపించడం మొదలు పెట్టాడు. మార్చి, ఏప్రిల్ నెలల్లో 40 – 42 డిగ్రీల మధ్యలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గతంలో ఎండ తీవ్రత ఉన్నా గాలిలో తేమశాతం ఉండడంతో ఇబ్బందులు ఉండేవి కావు. ఈసారి మాత్రం తీవ్రమైన ఉక్కపోత, వడగాలులు ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ఉదయం 7గంటల నుంచి ఎండ మొదలై 11 గంటల తర్వాత గరిష్ట స్థాయికి చేరుతోంది. ఇక రాత్రి 10 గంటలు దాటినా వేడిగాలులు తగ్గడం లేదు. ఫలితంగా ప్రయాణాలు చేసే వారు, అత్యవసర పరిస్థితుల్లో బయటకు వచ్చే జనాలు తట్టుకోలేకపోతున్నారు. ఇళ్లలో ఉన్నా ఫ్యాన్లు, కూలర్లు ఏ మాత్రం ఊరటనివ్వడం లేదు. ఈనెల మొదటి నుంచే.. మార్చి, ఏప్రిల్ మాసాల్లో విపరీతంగా ఉన్న ఎండలు.. మే వచ్చే వరకు మరింతగా పెరిగాయి. ఈ నెలలో దాదాపు ప్రతినిత్యం 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గతంలో అకాల వర్షాలతో ప్రజలు వేసవిలో ఉపశమనం లభించేది. కానీ ఈసారి ఒకటి, రెండు సార్లు కొద్దిపాటి వర్షం మినహా అకాల వర్షాలు లేకపోవడంతో వేడి, వడగాలులు వేధిస్తున్నాయి. రెండు డిగ్రీలు పెరిగి.. వాతావరణ శాఖ రెండు, మూడు రోజుల పాటు ఎండ తీవ్రత ఉంటుందని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. ఆ హెచ్చరికలకు అనుగుణంగానే మంగళ, బుధవారాల్లో భానుడు నిప్పులు చెరిగాడు. బుధవారం అత్యధికంగా రెండు ప్రాంతాల్లో 46.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మొత్తం 42 వెదర్ స్టేషన్లలోనూ అత్యధిక ఉష్ణోగ్రతలు ఉండడం, 28 వెదర్స్టేషన్ల వద్ద రెడ్ ఎలర్ట్ స్థాయలో నమోదు కావడం గమనార్హం. ఈమేరకు రానున్న నాలుగైదు రోజులు కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.జిల్లాలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతల నమోదు -
నిప్పంటుకుని కోళ్ల దాణా లారీ దగ్ధం
తిరుమలాయపాలెం: సుదూర ప్రయాణం, రాత్రయినా ఎండ వేడి తగ్గకపోవడంతో కోళ్లదాణా తరలిస్తున్న ఓ లారీకి మంటలు అంటుకుని పూర్తిగా దగ్ధమైంది. తిరుమలాయపాలెం మండలం మాదిరిపురం వద్ద మంగళవారం అర్ధరాత్రి దాటాక ఈ ప్రమాదం జరిగింది. మహారాష్ట్ర నుంచి విజయవాడకు కోళ్ల దాణా తరలిస్తున్న లారీ మాదిరిపురం వద్దకు రాగానే బ్యాటరీలో మంటలు మొదలయ్యా యి. ఆపై డీజిల్ ట్యాంకుకు అంటుకుని లారీ అంతా వ్యాపించాయి. దీంతో అప్రమత్తమైన లారీ డ్రైవర్, క్లీనర్ బయటకు దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. ఆపై వాహనదారులు మరిపెడ అగ్నిమాపక శాఖ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో రెండు వాహనాలతో చేరుకుని ఉద్యోగులు మంటలను అదుపుచేశారు. అయితే, రోడ్డుపై లారీ ఆగిపోవడం, మంటలు ఎగిసిపడుతుండడంతో ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. దీంతో ఎస్ఐ కె.జగదీశ్, సిబ్బందితో చేరుకుని, సహాయక చర్యలు చేపట్టి, జేసీబీతో లారీని పక్కకు తప్పించి రాకపోకలను పునరుద్ధరించారు. వరుస అగ్నిప్రమాదాలు ఎండల తీవ్రతకు తోడు త్వరగా గమ్యం చేరాలనే డ్రైవర్ల భావనతో ప్రమాదాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. ఇటీవల మండలంలోని మేకలతండా వద్ద బొగ్గు లారీ, ఆలుగడ్డ లారీలు ఢీకొని మంటలు వ్యాపించగా ఇద్దరు డ్రైవర్లు సజీవ దహనమయ్యారు. ఈ ఘటన మరువకముందే మంగళవారం అర్ధరాత్రి కోళ్లదాణా తరలిస్తున్న లారీ కూడా అగ్ని పమాదంలో కాలిపోయింది. వేసవి నేపథ్యాన ఇంజన్ వేడి ఎక్కి ప్రమాదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. డ్రైవర్, క్లీనర్ దూకడంతో తప్పిన ప్రాణనష్టం -
మెడికల్ షాపుల బంద్ సంపూర్ణం
ఖమ్మంవైద్యవిభాగం: ఆలిండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్, డ్రగ్గిస్ట్ (ఏఐఓసీడీ) పిలుపు మేరకు జిల్లాలో బుధవారం మెడికల్ షాపుల బంద్ పాటించారు. ఫార్మసిస్టులు, డిస్ట్రిబ్యూటర్లు సైతం మద్దతు తెలపడంతో జిల్లావ్యాప్తంగా మందుల దుకాణాలు మూతపడ్డాయి. కాగా, మెడికల్ షాపులు మూతబడడంతో సాధారణ రోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయితే, ఆస్పత్రుల వద్ద అత్యవసర మందుల అమ్మకానికి షాపులు తెరిచి ఉంచటంతో చికిత్స పొందుతున్న వారికి మాత్రం సమస్య తలెత్తలేదు. కాగా, పలు ప్రాంతాల్లో ఆలిండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్, డ్రగ్గిస్ట్ నాయకులు ర్యాలీలు నిర్వహించి నిరసన తెలిపారు. ఆన్లైన్ అమ్మకాలతో ప్రజలకు ఇబ్బందులు వస్తున్నాయని, ప్రిస్కిప్షన్ లేకుండా మత్తు మందులు కూడా విక్రయిస్తుండడంతో పలువురు ప్రాణాపాయం ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. కరోనా టైంలో కేంద్ర ప్రభుత్వం ఆన్లైన్ విక్రయాలకు అనుమతి ఇవ్వడం సరైనదే అయినా, ప్రస్తుతం మాత్రం ఆమోదయోగ్యం కాదని తెలిపారు. ఇకనైనా ప్రజారోగ్యాన్ని పరిగణనలోకి తీసుకుని ఆన్లైన్ విక్రయ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. -
ఇంటి నంబర్.. ‘బై’పాస్
సాక్షిప్రతినిధి, ఖమ్మం: ఖమ్మం నగరపాలక సంస్థ(కేఎంసీ) పరిధిలో ఆక్రమణదారుల అక్రమాలకు అడ్డూఅదుపూ లేకుండా పోతోంది. అధికారుల నిర్లక్ష్యం, సాంకేతిక లోపాలు వారికి కలిసొస్తుండడంతో ప్రభుత్వ, ప్రైవేట్ స్థలాలను యథేచ్ఛగా కబ్జా చేస్తున్నారు. తప్పుడు ధ్రువపత్రాలు సృష్టించి స్థలాలు రిజిస్ట్రేషన్ చేయించుకోవడమే కాక మున్సిపల్ రికార్డుల్లోనూ నమోదు చేయించుకుంటున్నారు. ఒకరిద్దరు సిబ్బందిని గుప్పిట్లో పెట్టుకుని దరఖాస్తులు డీమ్డ్ అప్రూవల్ అయ్యేలా చూసుకుంటున్నారనే విమర్శలున్నాయి. కొందరు సిబ్బంది నిర్వాకంతో ఒకే డోర్ నంబర్ మూడు, నాలుగు ఇళ్లకు మంజూరవుతుండగా.. కొన్ని సందర్భాల్లో ఒకే డోర్ నంబర్తో నాలుగైదు అసెస్మెంట్ నంబర్లు జారీ అవుతున్నాయి. సాంకేతిక లోపాలతో సులువుగా.. ఇంటి నంబర్ కావాలంటే సంబంధిత ధ్రువపత్రాలతో సీడీఎంఏ సైట్లో దరఖాస్తు చేసుకోవాలి. అనంతరం ఆ పత్రాలను కేఎంసీ కార్యాలయంలో సమర్పించాలి. అయితే ఇటీవల ఆస్తుల కొనుగోలు తర్వాత రిజిస్ట్రేషన్ సమయాన ఐజీఆర్ఎస్ నుంచి నేరుగా ఇంటి నంబర్లు మంజూరవుతున్నాయి. దీంతో కొందరు ఆక్రమించుకున్న స్థలంలో ఇళ్లు ఉన్నట్లు, ఆ స్థలానికి తమ పేరుతో డాక్యుమెంట్లు సృష్టించి రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు. ఈ విధానంతో నేరుగా ఇంటి నంబర్ వస్తుండడం అక్రమార్కులకు కలిసొస్తోంది. దీనిని పరిశీలించి అడ్డుకట్ట వేయాల్సిన అధికారులు అధికారులు పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. ఇక సీడీఎంఏలో ఉన్న సాంకేతిక లోపాలను మరికొందరు ఆసరాగా చేసుకుని బై నంబర్లతో దరఖాస్తులకు డీమ్డ్ అప్రూవల్ పొందుతున్నారు. ఈ కారణంగా అనుమతులు లేకుండా చేపట్టిన నిర్మాణాలు, కబ్జా స్థలాల్లోని నిర్మాణాలకు నంబర్లు జారీ అవుతున్నాయి. ఏ స్థలమైనా కబ్జా ఖమ్మం నగర నడిబొడ్డున ఖాళీ స్థలాలు దొరకకపోవడంతో అక్రమార్కుల కన్ను శివారు ప్రాంతాలపై పడింది. విలీన గ్రామాలు, నగర శివారు డివిజన్లలో ఈ ‘బై నంబర్ల’ దందా యథేచ్ఛగా సాగుతోంది. ఖాళీ స్థలాలు కనిపిస్తే చాలు నిర్మాణం చేపట్టడమో లేదా తప్పుడు డాక్యుమెంట్లతో నంబర్లు పొందడమో చేస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ స్థలాలనే తేడా లేకుండా లొసుగులు, సరిహద్దు వివాదాలు ఉన్నవి కాజేసేందుకు ఇంటి నంబర్లను ఆయుధంగా మార్చుకుంటున్నారు. నిఘా కరువై.. ప్రభుత్వ స్థలాలు ఆక్రమణకు గురవుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. స్థలాల పరిరక్షణలో మున్సిపల్, రెవెన్యూ శాఖలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండడంపై ఆరోపణలు వస్తున్నాయి. ఆన్లైన్లో ఒకే నంబర్ ఇద్దరు, ముగ్గురి పేరిట కేటాయింపు జరుగుతున్నా సాఫ్ట్వేర్ ఎందుకు అలర్ట్ చేయడం లేదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. బాధితులు కార్యాలయాల చుట్టూ తిరిగి లిఖితపూర్వకంగా ఫిర్యాదు ఇస్తే తప్ప అధికారుల్లో కదలిక రావడం లేదు. ఎవరూ ఫిర్యాదు చేయకపోతే ‘బై’పాస్ వ్యవహారం గుట్టుచప్పుడు కాకుండా సాగిపోతూనే ఉంది. ఇప్పటికై నా కేఎంసీ ఉన్నతాధికారులు ప్రత్యేక నిఘా పెట్టి, డోర్ నంబర్ల కేటాయింపునకు క్షేత్రస్థాయి పరిశీలన తప్పనిసరి చేయాలని నగరవాసులు కోరుతున్నారు. కేఎంసీలో పలు ఇళ్లకు ఒకే డోర్ నంబర్ వెలుగుమట్ల రెవెన్యూ ప్రాంతంలో వేర్వేరు యాజమానులకు చెందిన మూడు ఇళ్లకు 17–4–35/1/ఏ/1 డోర్ నంబర్ కేటాయించారు. ఈ ఇంటి నంబర్లోని యజమానుల్లో ఒకరి పేరిట ఇల్లు రెసిడెన్షియల్, మరో ఇద్దరి పేరిట నంబర్లు నాన్ రెసిడెన్షియల్ కేటగిరీలో ఉన్నాయి. రఘునాథపాలెం బైపాస్ రోడ్డులోని ఎన్నెస్పీ ప్రధాన కాలువ పక్కన నిర్మించిన ఇంటికి సైతం ఇదే నంబర్ ఉండడం గమనార్హం. ఈ ఇంటి నంబర్ వెలుగుమట్లగా రెవెన్యూగా చూపిస్తున్నా ఏ ప్రాంతమనేది సీడీఎంఏ సైట్లో లేదు. ఇలాంటి సాంకేతిక లోపాలు అక్రమార్కులకు కలిసొస్తున్నాయి. -
‘స్వచ్ఛ’ నిధుల వెల్లువ
● ఉమ్మడి జిల్లాలోని రెండు కార్పొరేషన్లకు మంజూరు ● జాబితాలో ఐదు మున్సిపాలిటీలు కూడా..ఖమ్మంమయూరిసెంటర్: ఉమ్మడి జిల్లాలోని కార్పొరేషన్లు, పలు మున్సిపాలిటీలకు స్వచ్ఛ భారత్ మిషన్(అర్బన్) 2.0 కింద వివిధ అభివృద్ధి పనుల కోసం రాష్ట్రప్రభుత్వం భారీగా నిధులు విడుదల చేసింది. 2026–27 ఆర్థిక సంవత్సరానికి గాను ఉమ్మడి జిల్లాలోని రెండు కార్పొరేషన్లతో పాటు వివిధ మున్సిపాలిటీలకు ఈ నిధుల కేటాయింపు జరిగింది. మున్సిపల్ పరిపాలనా శాఖ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం డీఆర్సీసీ, డంపింగ్ యార్డుల్లో నిర్మాణ సామర్థాల పెంపు, సమాచార – విద్య – సమాజ భాగస్వామ్య ప్రచారం, ఘన వ్యర్థాల నిర్వహణ కోసం ఈ నిధులను కేటాయించారు. కాగా, బడ్జెట్ను నిర్దేశించిన విభాగాలకు మాత్రమే వినియోగించాలని స్పష్టం చేశారు. ఈ నిధుల విడుదలతో ఉమ్మడి జిల్లాలోని పట్టణాల్లో స్వచ్ఛత పనులు వేగవంతం కానున్నాయి. నిధుల్లో అత్యధికంగా ఖమ్మం కార్పొరేషన్కు రూ.95లక్షలు, ఆతర్వాత కొత్తగూడెం కార్పొరేషన్కు 79లక్షలు కేటాయించారు. ఇక మున్సిపాలిటీల్లో ఇల్లెందుకు రూ.77లక్షలు, మధిరకు రూ.27.20లక్షలు, మణుగూరుకు రూ.20.05లక్షలు, సత్తుపల్లికి రూ.18లక్షలు, వైరాకు రూ.10లక్షలు మంజూరయ్యాయి. -
25 వరకు రెండో విడత ‘దోస్త్’ అడ్మిషన్లు
ఖమ్మంసహకారనగర్: ఖమ్మంలోని ఎస్ఆర్అండ్బీజీఎన్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్)లో డిగ్రీ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలకు రిజిస్ట్రేషన్లు కొనసాగుతున్నాయని ప్రిన్సిపాల్ డాక్టర్ మహ్మద్ జాకిరుల్లా తెలిపారు. ‘దోస్త్’సైట్ ద్వారా ఈ నెల 25వ తేదీ వరకు రెండో విడత రిజిస్ట్రేషన్లకు అవకాశం ఉందని వెల్లడించారు. అలాగే, 26వ తేదీ వరకు వెబ్ఆప్షన్లు నమోదు చేయాల్సి ఉంటుందని తెలిపారు. కాగా, మొదటి దశలో నమోదు చేసుకున్న వారు ఈ నెల 23 వరకు రిపోర్ట్ చేయాలని సూచించారు. జాతీయస్థాయి షూటింగ్బాల్ పోటీలకు ఎంపికమధిర: రాష్ట్రస్థాయి షూటింగ్ బాల్ పోటీల్లో జిల్లా జట్టు తరఫున పాల్గొన్న మధిరలోని శ్రీనిధి స్కూల్ విద్యార్థులు వేమిరెడ్డి కార్తీక్రెడ్డి, టి.అభిషేక్ ప్రతిభ కనబరిచి జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ నెల 29, 30, 31వ తేదీల్లో గుంటూరులో జరిగే జాతీయస్థాయి షూటింగ్ బాల్ పోటీల్లో తెలంగాణ జట్టు తరఫున వీరు ప్రాతినిధ్యం వహించనున్నారు. విద్యార్థులను పాఠశాల సెక్రటరీ, కరస్పాండెంట్ బి.అంజన్బాబు, డైరెక్టర్ సీహెచ్ చందు, వైస్ ప్రిన్సిపాల్ డి.శ్రీనివాసరావు, పీడీ ప్రవీణ్కుమార్ అభినందించారు. మార్కెట్ ఉద్యోగుల్లో ఇద్దరికి పదోన్నతిఖమ్మంవ్యవసాయం: వ్యవసాయ మార్కెట్లలో గ్రేడ్–3 కార్యదర్శులు ఇద్దరికి బుధవారం గ్రేడ్–2 కార్యదర్శులుగా పదోన్నతి లభించింది. రాష్ట్రవ్యాప్తంగా 14 మంది గ్రేడ్–3 కార్యదర్శులకు పదోన్నతులు కల్పించి పోస్టింగ్ ఇవ్వగా జాబితాలో ఉమ్మడి జిల్లా నుంచి ఇద్దరు ఉన్నారు. భద్రాద్రి జిల్లా దమ్మపేట గ్రేడ్–3 కార్యదర్శి తాడేపల్లి కిరణ్కుమార్కు పదోన్నతి కల్పించి ఖమ్మం మార్కెట్లో, బూర్గంపాడు మార్కెట్ కార్యదర్శి డి.నిర్మలకు గ్రేడ్–2 కార్యదర్శిగా పదోన్నతి కల్పించి ఏన్కూరు మార్కెట్లో పోస్టింగ్ ఇస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.‘ఏకలవ్య’లో సీటు దొరకడం అదృష్టంపాల్వంచరూరల్: గిరిజన విద్యార్థులకు మెరుగైన బోధన అందిస్తున్న ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీల్లో సీటు లభించడాన్ని అదృష్టంగా భావించాలని గిరిజన గురుకులాల ఆర్సీఓ అరుణకుమారి తెలిపారు. ఉమ్మడి జిల్లాలోని ఏకలవ్య గురుకులాల్లో ప్రవేశాల కోసం గిరిజన బాలబాలికలకు పాల్వంచలోని రామవరం కాలేజీలో బుధవారం కౌన్సెలింగ్ నిర్వహించారు. ఆర్సీఓ మాట్లాడుతూ ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్ ఈసీలో 299 సీట్లకు గాను 123 మంది బాలురు, 146మంది బాలికలకు ప్రవేశాలు కల్పించామని తెలిపారు. ప్రిన్సిపాళ్లు, ఉద్యోగులు పాల్గొన్నారు. -
ముందస్తు జాగ్రత్తలతోనే విపత్తులకు చెక్
● మ్యాన్హోల్స్ మూసివేత, ప్రమాదకర ప్రాంతాల గుర్తింపు ● సన్నద్ధతపై సమీక్షలో కలెక్టర్ దివాకర ఖమ్మంసహకారనగర్: సరైన ప్రణాళిక, ముందస్తు జాగ్రత్తలతో వరదల వంటి విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చని కలెక్టర్ దివాకర టీఎస్ తెలిపారు. కలెక్టరేట్లో బుధవారం ఆయన ఖమ్మం, ఏదులాపురం మున్సిపాలిటీలు, పలు శాఖల అధికారులతో విపత్తుల సన్నద్ధతపై సమీక్షించారు. గత అనుభవాలను పరిశీలిస్తే ఖమ్మం, ఏదులాపురం ప్రాంతాలపై వరదల ప్రభావం అధికంగా పడుతున్నందున మున్నేటి ప్రవాహం స్థాయి ఆధారంగా హెచ్చరికలు జారీ చేయడం, లోతట్టు, ముంపు ప్రాంతాల ప్రజలను ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించడంపై ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. ఇందుకోసం అవసరమైన సామగ్రిని ముందుగా సిద్ధం చేసుకోవాలని తెలిపారు. అంతేకాక మున్సిపల్ ప్రాంతాల్లో మ్యాన్హోళ్లను పూర్తిస్థాయిలో పరిశీలించి మూసివేయాలని చెప్పారు. ఈ సమావేశంలో ఖమ్మం, ఏదులాపురం కమిషనర్లు అభిషేక్ అగస్త్య, శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. పారదర్శకంగా పింఛన్ లబ్ధిదారుల పరిశీలన చేయూత పెన్షనర్ల గుర్తింపునకు చేపడుతున్న లైవ్ అథెంటికేషన్లో పారదర్శకత పాటించాలని కలెక్టర్ దివాకర టీఎస్ ఆదేశించారు. హైదరాబాద్ నుంచి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి దాన కిషోర్ ఉపాధి హామీ పనులు, చేయూత పింఛన్ సర్వే, జాతీయ కుటుంబ ప్రయోజన పథకం అమలుపై వీసీ ద్వారా సూచనలు చేశారు. ఈ వీసీకి జిల్లా నుంచి కలెక్టర్ దివాకర, అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ హాజరయ్యారు. అనంతరం జిల్లా అధికారులతో సమావేశమైన కలెక్టర్ మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం ద్వారా ప్రతీ గ్రామపంచాయతీలో కనీసం 20 పనులను గుర్తించాలని, ఇందులో అంగన్వాడీ భవనాలు, పాఠశాలల ప్రహరీలు, వీఓ, జీపీ భవనాలకు ప్రాధాన్యత ఇస్తూ కూలీలు ఎక్కువగా హాజరయ్యేలా అవగాహన కల్పించాలని సూచించారు. అలాగే, దివ్యాంగుల సదరం కేంద్రాల్లో అవసరమైన పరికరాల ఏర్పాటు, జాతీయ కుటుంబ ప్రయోజన పథకం అమలుపై సూచనలు చేశారు. సమావేశంలో డీఆర్డీఓ శ్రీరామ్, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు, ఏపీఓలు పాల్గొన్నారు. -
కార్యకర్తలే బీఆర్ఎస్కు బలం
ఖమ్మంవైరారోడ్: లక్షలాదిగా ఉన్న కార్యకర్తలే బీఆర్ఎస్కు బలమని, కేసీఆర్ను తిరిగి ముఖ్యమంత్రిగా చేయడమే లక్ష్యంగా అందరూ పనిచేయాలని మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పిలుపునిచ్చారు. ఖమ్మంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఎమ్మెల్సీ, పార్టీ ప్రధాన కార్యదర్శి తక్కెళ్లపల్లి రవీందర్రావు అధ్యక్షతన ఖమ్మం, మధిర, వైరా, ఇల్లెందు నియోజకవర్గాలకు సంబంధించి సభ్యత్వ నమోదు మండల ఇన్చార్జిల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పువ్వాడ మాట్లాడుతూ కేసీఆర్ పాలనలో అమలు చేసిన సంక్షేమ పథకాలు ప్రజలకు చిరస్థాయిగా గుర్తుండిపోతాయన్నారు. అలాగే, రెండు దశాబ్దాలుగా ఉద్యమకారులు, కార్యకర్తలు, నాయకులు పార్టీకి అందించిన సేవలు మరువలేనివని పేర్కొన్నారు. ఈ స్ఫూర్తితో మండల ఇన్చార్జిలు పార్టీ సభ్యత్వ నమోదును విజయవంతంగా ముందుకు తీసుకువెళ్లాలని సూచించారు. ఇన్చార్జిలకు భవిష్యత్లో పార్టీ ప్రాధాన్యత కల్పిస్తుందని, పదవులు లేకపోయినా సేవలందిస్తున్న కార్యకర్తలు, నాయకులకు అన్ని వేళలా పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే హరిప్రియ, డీసీసీబీ మాజీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, నాయకులు పగడాల నాగరాజు, గుండాల కృష్ణ, దిండిగల రాజేందర్, ఖమర్, మంజుల, గిరిబాబు తదితరులు పాల్గొన్నారు. -
అమ్మమ్మ చెప్పిన కథ
కరకగూడెం: ఒక అడవిలో చిట్టి అనే కుందేలు ఉండేది. చాలా చురుకు గా ఉండే ఈ కుందేలుకు ఒక చెడు అలవాటు కూడా ఉంది. ఎవరినైనా చూసినా చిన్నచూపు చూడడం, వెక్కిరించడం చేసేది. అడవిలోని జంతువులన్నీ దాని మాటలకు బాధపడేవి. ఓరోజు సాయంత్రం అడవిలో భారీ వర్షం వచ్చింది. గాలి బలంగా వీస్తూ చీకటి కమ్మేసింది. దీతో కుందేలు తన గూటికి వెళ్లే దారి మర్చిపోయింది. ఎంత పరుగెత్తినా దారి కనిపించక ఇప్పుడు ఏం చేయాలంటూ భయంతో ఏడవడం మొదలుపెట్టింది. అప్పుడే దగ్గరలో చిన్నగా వెలుగు కనిపించింది. అది ఒక మిణుగురుపురుగు. కుందేలమ్మా ఎందుకు భయపడుతున్నావు అని అడిగింది. నా గూటికి వెళ్లే దారి కనిపించడం లేదు.. నువ్వు నాకు సాయం చేస్తావా అని కుందేలు వేడుకుంది. దీంతో మిణుగురు పురుగు నవ్వుతూ నేను చిన్నదాన్నేకావచ్చు.. కానీ నా వెలుగు నీకు దారి చూపుతుంది. నాతో రా అంటూ ముందుగా ఎగురుతూ వెళ్లింది. ఆ వెనుకాల కుందేలు వెళ్తూ కొద్దిసేపటికి గూటి వద్ద చేరుకుంది. ఆనందంతో నువ్వు ఎంత చిన్నదానివైనా నాకు పెద్దసాయం చేశావు. నేనునిన్ను ఎప్పు డూ చిన్నచూపు చూసేదాన్ని.. నన్ను క్షమించు అంది. అంతేకాక ఆ రోజు నుంచి కుందేలు ఎవరినీ తక్కువగా చూడకుండా అందరితో మంచిగా ఉండసాగింది. -
కుక్కల గోస తప్పేనా ?!
ఖమ్మంమయూరిసెంటర్: జిల్లా కేంద్రంతో పాటు ఇతర పట్టణాలు, గ్రామాల్లో వీధి కుక్కల స్వైరవిహారం రోజురోజుకూ పెరుగుతోంది. రాత్రీపగలు తేడా లేకుండా రోడ్లపై నడవాలంటేనే జనం వణికిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. గుంపులుగా తిరిగే కుక్కలు పిల్లలు, వృద్ధులపై దాడి చేస్తుండడంతో బెంబేలెత్తిపోతున్నారు. ఈ నేపథ్యాన వీధి కుక్కల నియంత్రణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తాజా తీర్పు జిల్లాలో సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతుందనే ఆశాభావం వ్యక్తమవుతోంది. ప్రమాదకరమైన, పిచ్చి కుక్కలకు కారుణ్య మరణం ప్రసాదించాలనే సూచనతో కుక్కల నియంత్రణ జరుగుతుందనే చర్చ ప్రారంభమైంది. కేఎంసీలో నామమాత్రమే ఖమ్మం నగరంలో 10వేలకు పైగా కుక్కలు ఉన్నట్లు తెలుస్తుండగా.. జిల్లా వ్యాప్తంగా సుమారు లక్ష వీధి కుక్కలు ఉంటాయని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే, ఖమ్మంలో కుక్కల సంతాన నియంత్రణ కోసం యానిమల్ బర్త్ కంట్రోల్ (ఏబీసీ) కేంద్రం ఏర్పాటుచేయగా, సంతతిని అరికట్టే శస్త్రచికిత్సలు నిరంతరం కాకుండా నామమాత్రంగా సాగుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. వీధి కుక్కలను పట్టుకుని శస్త్రచికిత్స చేసి వదిలేయకుండా వాటి సంరక్షణ కోసం ప్రత్యేక షెల్టర్లు ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కానీ నగరంలో ఆశ్రయాలు(షెల్టర్లు) లేక కుక్కల సంచారం తగ్గడం లేదు. సరిహద్దు చిక్కులు ఖమ్మం నగరాన్ని ఆనుకుని ఉన్న ఏదులాపురం మున్సిపాలిటీలో సమస్య మరింత జఠిలంగా మారింది. ఏదులాపురం మున్సిపాలిటీలో కుక్కలకు శస్త్రచికిత్స చేయడానికి సెంటర్ లేదు. అక్కడి కుక్కలను ఖమ్మం తరలించాలంటే సరిహద్దు సమస్యలు తలెత్తుతున్నాయి. దీంతో పాటు చుట్టుప్రక్కల గ్రామాల్లోనూ ఇదే తరహా సమస్య నెలకొంది. ఫలితంగా పక్క మున్సిపాలిటీలు, గ్రామాల్లో కుక్కల సంతతి పెరుగుతూ ఖమ్మంలోకి ప్రవేశిస్తున్నాయి. ఆదేశాలైనా అమలయ్యేనా.. సుప్రీంకోర్టు తాజాగా ప్రభుత్వం, స్థానిక సంస్థలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ప్రజల భద్రతకు ముప్పుగా మారిన ప్రమాదకరమైన, పిచ్చి కుక్కలకు కారుణ్య మరణం ప్రసాదించేలా అనుమతిచ్చింది. వీధి కుక్కల నియంత్రణకు ప్రతీ జిల్లాలో కనీసం ఒక ఏబీసీ ఏర్పాటు చేయాలని, ఆస్పత్రుల్లో యాంటీ రేబిస్ వ్యాక్సిన్లు తగినంతగా సమకూర్చాలని ఆదేశించింది. సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలను అమలు చేస్తే కుక్కలను నియంత్రించవచ్చనే చర్చ జరుగుతోంది. అయితే, కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసి వదిలేయకుండా ప్రతీ మున్సిపాలిటీలో వీధి కుక్కల కోసం షెల్టర్లు ఏర్పాటు చేస్తేనే బెడద తగ్గుతుంది. ●నేలకొండపల్లి మండలంలోని ముజ్జిగూడెంలో ఫిబ్రవరి 28న ఒకేరోజు ఎనిమిది మందిపై కుక్క దాడి చేసింది. ఇందులో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. వీరిందరికీ గాయాలు కావడంతో ఆస్పత్రి పాలయ్యారు. ●కల్లూరు ప్రైమరీ హెల్త్ సెంటర్, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ల పరిధిలో నెలకు సుమారు 40 – 50 కుక్క కాటు బాధితులు వస్తున్నారు. ఇక మండలంలోని ఇతర గ్రామాల్లో నెలకు కనీనం 35మంది కుక్క కాటు కేసులు నమోదవుతున్నాయి. ప్రభుత్వపరంగా వీధి కుక్కలకు వేసక్టమీ ఆపరేషన్లు కానీ యాంటీ రేబిస్ వ్యాక్సిన్లు కానీ చేయడం లేదు. ●పెనుబల్లి మండలంలో రోజూ 8మంది కుక్క కాటుకు గురవుతున్నట్లు అంచనా. పెనుబల్లి ఆస్పత్రిలో సగటున ఆరుగురు, లంకాసాగర్ పీహెచ్సీలో ఇద్దరు యాంటీ రేబిస్ వ్యాక్సిన్ తీసుకుంటున్నారని గణాంకాలు చెబుతున్నాయి. ●ఖమ్మం యానిమల్ బర్త్ కంట్రోల్ కేంద్రంలో జనవరి నుంచి ఏప్రిల్ వరకు 1,064 కుక్కలకు శస్త్రచికిత్స చేశారు. ప్రస్తుతం రోజుకు పది కుక్కలకు శస్త్రచికిత్స చేస్తున్నట్లు తెలుస్తోంది. -
రామదాసు మందిరంలో కంచి పీఠాధిపతి
నేలకొండపల్లి: కంచి కామకోటి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి స్వామి నేలకొండపల్లి భక్తరామదాసు మందిరాన్ని మంగళవారం సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. తొలుత స్వామికి పూజారి, భక్తులు స్వాగతం పలికారు. పూజల అనంతరం ఆయన ఆశీర్వచనాలు అందజేసి అనుగ్రహ భాషణం చేశారు.బీఏఎస్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం ఖమ్మంమయూరిసెంటర్: బెస్ట్ అవైలబుల్ స్కూళ్ల(రెసిడెన్షియల్, నాన్ రెసిడెన్షియల్)లో 1, 5వ తరగతుల్లో ప్రవేశానికి అర్హులైన షెడ్యూల్డ్ కులాల విద్యార్థినీ, విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ డీడీ జి.జ్యోతి తెలిపారు. ఒకటో తరగతి(నాన్ రెసిడెన్షియల్ / డే స్కాలర్స్)లో 128 సీట్లు, 5వ తరగతి(రెసిడెన్షియల్) లో 131 సీట్లు ఉన్నాయని వెల్లడించారు. కుటుంబ వార్షిక ఆదా యం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షల లోపు, పట్టణ ప్రాంతాల్లోనైతే రూ.2 లక్షల లోపు ఉండాలని, డిగ్రీ, అంత కంటే ఎక్కువ చదువుకున్న వారి పిల్లలు అనర్హులని స్పష్టం చేశారు. ఒక కుటుంబం నుంచి ఒకరికే అర్హత ఉంటుందని, ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఎస్సీ ఉపకులాల వారీగా కేటగిరీ–1కు ఒక శాతం, కేటగిరీ–2కు 9శాతం, కేటగిరీ–3కు ఐదు శాతం సీట్లు కేటాయిస్తామని వెల్లడించారు. విద్యార్థులు జూన్ 6వ తేదీలోగా కలెక్టరేట్లోని తమ కార్యాలయంలో అన్ని ధ్రువపత్రాలు జత చేసిన దరఖాస్తులు సమర్పించాలని డీడీ సూచించారు. అటవీ శాఖలో 38 మంది బదిలీ 21, 22వ తేదీల్లో సర్కిల్ స్థాయిలో ట్రాన్స్ఫర్లు ఖమ్మంవ్యవసాయం: సాధారణ బదిలీల్లో భా గంగా జిల్లా అటవీ శాఖ పరిధిలో 38 మంది ఉద్యోగులకు స్థానచలనం కలిగింది. జిల్లా అట వీ శాఖాధికారి అనూజ్ అగర్వాల్ ఆధ్వర్యాన నిర్వహించిన ప్రక్రియలో సభ్యులుగా ఖమ్మం, సత్తుపల్లి డివిజన్ల అధికారులు కృష్ణప్రసాద్, మంజుల, వరంగల్ ఫ్లయింగ్ స్క్వాడ్ ఎఫ్డీఓ చంద్రశేఖర్ వ్యవహరించారు. ఈమేరకు అర్హతలు, నిబంధనల ఆధారంగా 38మంది ఉద్యోగులను జిల్లా పరిధిలో బదిలీ చేశారు. ఇందులో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు(ఎఫ్బీఓ) 28 మంది, జూనియర్ అసిస్టెంట్లు, ఆఫీస్ సబార్డినేట్లు ఐదుగురు చొప్పున ఉన్నారు. ఇక భద్రాద్రి అటవీ సర్కిల్ పరిధిలో బదిలీల ప్రక్రియ ఈనెల 21, 22వ తేదీల్లో వరంగల్ సీసీఎఫ్ కార్యాలయంలో జరగనుంది. ఆ సమయాన సెక్షన్ ఆఫీసర్లు, డిప్యూటీ రేంజ్ ఆఫీసర్లు, సీనియర్ అసిస్టెంట్లు, సూపరింటెండెంట్స్ స్థాయి ఉద్యోగుల కౌన్సెలింగ్, బదిలీ ఉంటుంది. పశు వైద్య శాఖలో 21 మంది.... జిల్లా పశువైద్య, పశు సంవర్థక శాఖ పరిధిలో మంగళవారం 21మంది ఉద్యోగులను బదిలీ చేశారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న 21 మంది ఆఫీస్ సబార్డినేట్ల బదిలీకి, జిల్లా పశు సంవర్థక, పశువైద్యాధికారి బోడేపూడి పురంధర్ ఆధ్వర్యాన కౌన్సెలింగ్ నిర్వహించారు. ఢిల్లీలో అంతర్జాతీయ డ్యామ్ సేఫ్టీ సదస్సు ఉమ్మడి జిల్లా నుంచి ఇద్దరు సీఈల హాజరు ఖమ్మంఅర్బన్: ‘డ్యామ్ సేఫ్టీ, రిజర్వాయర్ల పరిరక్షణ’ తదితర అంశాలపై ఢిల్లీలో అంతర్జాతీయ స్థాయి సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో తెలంగాణ రాష్ట్రం నుంచి ఉమ్మడి జిల్లాకు చెందిన జలవనరుల శాఖ సీఈలు ఇద్దరు పాల్గొన్నారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం సీఈలు మంగళపూడి వెంకటేశ్వర్లు, శ్రీనివాసరెడ్డి సదస్సుకు హాజరయ్యారు. అతివృష్టి, అనావృష్టి పరిస్థితుల్లో డ్యామ్ల భద్రత, రిజర్వాయర్ల పరిరక్షణ, నీటి నిల్వల నిర్వహణ, అత్యవసర సమయాల్లో నీటి సంరక్షణ చర్యలు, విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని మెరుగు పరిచే విధానాలపై నిపుణులు అవగాహన కల్పించారు. అలాగే, డ్యామ్ల భద్రతకు సంబంధించిన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, ముందస్తు జాగ్రత్తలు, విపత్తు నిర్వహణ చర్యలపైనా చర్చించారు. తెలంగాణ తరఫున పాల్గొన్న సీఈలు ఇద్దరు రాష్ట్రంలోని రిజర్వాయర్ల నిర్వహణకు సంబంధించి అంశాలను సదస్సులో వివరించారు. -
స్నేహితుడి కుటుంబానికి అండగా..
కుమార్తె వివాహానికి రూ.5.60 లక్షలు ఖమ్మంమామిళ్లగూడెం: కలిసి చదువుకున్న స్నేహితుడు ఈ లోకాన్ని విడిచి వెళ్లినా, ఆ బంధాన్ని మరిచిపోకుండా ఆయన కుమార్తె వివాహానికి అండగా నిలిచి మిత్రధర్మాన్ని చాటిచెప్పారు. ఖమ్మానికి చెందిన మున్సిపాలిటీ ఉద్యోగి ఎండీ మహబూబ్అలీ 2013లో గుండెపోటుతో మృతి చెందాడు. ఆయన కుమార్తెకు వివాహనం నిశ్చయమైంది. దీంతో ఖమ్మం జమ్మిబండలోని జ్యోతి బాలమందిర్ 1986–87 బ్యాచ్లో మహబూబ్తో కలిసి చదువుకున్న వారు అండగా నిలవాలని నిర్ణయించుకున్నారు. తలా కొంత జమ చేయగా సమకూరిన రూ.5.60 లక్షలను మంగళవారం ఖమ్మంలో జరిగిన మహబూబ్ కుమార్తె వివాహంలో అందజేశారు. ఎన్ఆర్ఐలైన డాక్టర్ సుధాకర్, నాగుబండి ముత్యాలరావు, చింతలపూడి శ్రీకాంత్, ఎం.మాధవి, శివాజీతో పాటు స్థానికంగా ఉంటున్న డాక్టర్ రామరాజు, ఆర్.సత్యనారాయణ, పవన్ తదితరులు ఈ నగదు సమకూర్చగా పలువురు కృతజ్ఞతలు తెలిపారు. -
విద్యుత్ అంతరాయాలకు బ్రేక్
● ఏబీ స్విచ్ల ద్వారా త్వరగా లోపాలు గుర్తింపు ● జిల్లావ్యాప్తంగా ఏర్పాటుకు మొదలైన పనులు ఖమ్మంవ్యవసాయం: విద్యుత్ అంతరాయాలకు అడ్డుకట్ట వేసేందుకు ఏబీ(ఎయిర్ బ్రేక్) స్విచ్లను ఏర్పాటు చేస్తున్నారు. గ్రామాలు, పట్టణాల్లో విద్యుత్ అంతరాయం ఏర్పడినప్పుడు లైన్ మొత్తం విద్యుత్ సరఫరా నిలిపివేయకుండా కేవలం సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ వద్ద నిలిపేసి, మిగిలిన ప్రాంతానికి సరఫరా కొనసాగించేందుకు ఇవి ఉపయోగపడతాయి. ఈ విధానంతో విద్యుత్ అంతరాయాలను గణనీయంగా తగ్గించవచ్చని చెబుతున్నారు. ఇప్పటికే ఖమ్మం విద్యుత్ సర్కిల్ పరిధిలో 821 ఏబీ స్విచ్లను ఏర్పాటు చేయగా, మిగతా ప్రాంతాల్లోనూ పనులు కొనసాగుతున్నాయి. ఇదీ ఉపయోగం విద్యుత్ లైన్లలో సాంకేతిక లోపాలు, చెట్ల కొమ్మలు తగలడం, భారీ వర్షాలు, ఈదురు గాలులు వంటి కారణాలతో ఏర్పడే అంతరాయాలను ఏబీ స్విచ్ల ద్వారా తక్షణమే గుర్తించవచ్చు. గతంలో చిన్న అంతరాయం ఏర్పడినా మొత్తం గ్రామం లేదా ఫీడర్ పరిధిలోని కాలనీలన్నింటికీ విద్యుత్ సరఫరా నిలిచిపోయేది. ప్రస్తుతం ఏబీ స్విచ్ల వల్ల సమస్య ఉన్న ప్రాంతంలో మాత్రమే సరఫరా నిలిపివేసి, మిగతా ప్రాంతాలకు విద్యుత్ అంతరాయం లేకుండా సరఫరా కొనసాగిస్తారు. సమస్య ఎక్కడ ఏర్పడిందో సులభంగా గుర్తించి మరమ్మతు పనులు వేగంగా చేపట్టే అవకాశం ఏర్పడుతుంది. తరచూ ఎదురయ్యే ట్రిప్పింగ్ సమస్యలు గణనీయంగా తగ్గి విద్యుత్ నాణ్యత మెరుగుపడుతోంది. మరమ్మతు పనుల సమయంలో విద్యుత్ నియంత్రణ సులభమై సిబ్బంది భద్రత మరింత పెరుగుతుందని చెబుతున్నారు. విద్యుత్ వినియోగదారులకు నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్ సరఫరా అందించాలనే లక్ష్యంతో టీజీఎన్పీడీసీఎల్ అధునాతన విధానాలకు ప్రాధాన్యం ఇస్తోంది. మెరుగైన సేవలు అందించడం కోసం ఆధునిక సాంకేతికతతో విద్యుత్ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తున్నాం. –ఇనుగుర్తి శ్రీనివాసాచారి, ఎస్ఈ, ఖమ్మం -
రైతులకు హైకోర్టు ఊరట
కారేపల్లి: సింగరేణి మండలంలోని ఉసిరికాయలపల్లి గ్రామ రైతులకు ఊరటనిచ్చేలా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వ్యవసాయ భూములపై హక్కులు కలిగిన రైతులను చట్టబద్ధమైన ప్రక్రియ లేకుండా బలవంతంగా తొలగించరాదని కోర్టు స్పష్టం చేసింది. రైతుల పేర్లతో పట్టాదార్ పాసు పుస్తకాలు, రికార్డ్ ఆఫ్ రైట్స్ పత్రాలు ఉన్నప్పటికీ సరైన భూసేకరణ ప్రక్రియ లేకుండానే స్వాధీనం చేసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని టేకులగూడెం సర్పంచ్ గుమ్మడి సందీప్ చొరవతో పలువురు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఇరుపక్షాల వాదన విన్న హైకోర్టు ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ అవసరమని చెబుతూ ప్రతివాదులను కౌంటర్ అఫిడవిట్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను జూన్ 22కు వాయిదా వేసింది. అంతవరకు చట్టప్రకారం తప్ప రైతులను వారి భూముల నుంచి బలవంతంగా తొలగించరాదని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఆన్లైన్లో అవగాహన ఖమ్మంరాపర్తినగర్: ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’లో భాగంగా యువజన క్రీడావారోత్సవాలు నిర్వహిస్తుండగా యువత కోసం ప్రత్యేక ఆన్లైన్ సదస్సు ఏర్పాటు చేశారు. ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో మంగళవారం సదస్సు నిర్వహించగా యువత పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో ఉపాధి, నైపుణ్యాభివృద్ధి అవకాశాలపై నిపుణులు ఆన్లైన్ ద్వారా అవగాహన కల్పించారు. నైపుణ్య శిక్షణ కోర్సులు, కీడా విశ్వవిద్యాలయంలో ప్రవేశాలు, అగ్నివీర్ రిక్రూట్మెంట్ ప్రక్రియను వివరించారు. డీవైఎస్ఓ టి.సునీల్రెడ్డి మాట్లాడుతూ.. యువజన క్రీడోత్సవాల్లో ప్రతీ ఒక్కరు భాగస్వాములు కావాలని కోరారు. కాగా, బుధవారం ఉదయం 9 గంటలకు డీపీఆర్సీ భవన్లో యువత నాయకత్వ లక్షణాలు, సామాజిక బాధ్యత, ప్రజాస్వామ్య అవగాహనపై జరిగే సదస్సుకు యువత అధిక సంఖ్యలో హాజరుకావాలని సూచించారు. బాలికల సంరక్షణ అందరి బాధ్యత ఖమ్మంమయూరిసెంటర్: యవ్వనదశలో ఉన్న ఆడపిల్లలను సంరక్షించుకోవాల్సిన బాధ్యత సమాజంపై ఉందని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డి.రామారావు పేర్కొన్నారు. ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’లో భాగంగా మంగళవారం ఖమ్మం వెంకటేశ్వరానగర్ అర్బన్ హెల్త్ సెంటర్లో మెప్మా పరిధిలోని స్వయం సహాయక సంఘాల సభ్యులతో పాటు బాలికలు, తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడుతూ.. బాల్యదశ నుంచి కౌమార దశకు మధ్యలో ఉండే ఆడపిల్లల్లో వచ్చే మార్పులకు అనుగుణంగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సమతుల్య ఆహారం తీసుకోకుంటే ఎదురయ్యే ఆరోగ్య సమస్యలపై అవగాహన కల్పిస్తూనే వారి కదలికలను గమనించాలని చెప్పారు. అలాగే, కేన్సర్ కట్టడికి 15 ఏళ్ల లోపు పిల్లలకు ప్రభుత్వం ఇస్తున్న హెచ్పీవీ వ్యాక్సిన్ వేయించాలని సూచించారు. మెప్మా, వైద్య, ఆరోగ్యశాఖ ఉద్యోగులు జి.సుజాత, దేవిశ్రీ, జి.ఉపేంద్ర, జడ్ఎస్ జయపాల్, ముదసర్, హసీనా, షమీమ్, కావ్య, రహీంబీ, సంధ్య, శారద తదితరులు పాల్గొన్నారు. -
‘ఇంటిగ్రేటెడ్’ నిర్మాణాలు త్వరగా పూర్తిచేయాలి
అదనపు కలెక్టర్ శ్రీజ ఖమ్మంరూరల్: అన్ని కార్యాలయాలు ఒకేచోట కొలువుదీరేలా నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ భవన సముదాయం పనుల్లో వేగం పెంచి త్వరగా పూర్తి చేయించాలని అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ సూచించారు. ఏదులాపురం మున్సిపాలిటీ పరిధి తరుణీహాట్లో రూ.22 కోట్లతో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ కార్యాలయాల నిర్మాణాన్ని మంగళవారం ఆమె పరిశీలించి మాట్లాడారు. నాణ్యతలో రాజీ పడకుండా పర్యవేక్షిస్తూనే వేగంగా పనులు జరిగేలా చూడాలని తెలిపారు. ఈ సముదాయం పూర్తయితే 17 విభాగాల కార్యాలయాలు ఒకేచోట ఉంటాయని, పెద్దసంఖ్యలో ప్రజలు రానున్నందున తాగునీటి సౌకర్యం కల్పించడమే కాక వెయిటింగ్ హాళ్లు కూడా నిర్మిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ పోకబత్తిని అనిత, కమిషనర్ ఆళ్ల శ్రీనివాసరెడ్డి, తహసీల్దార్ వినయేందర్రెడ్డి, ఎంఈఓ మూడ్ శ్రీనివాస్, ఆర్అండ్బీ డీఈ భగవాన్ పాల్గొన్నారు. -
అందరి దృష్టి కంప్యూటర్పై!
ఖమ్మంసహకారనగర్: ఆధునిక యుగంలో రోజురోజుకూ కంప్యూటర్ వినియోగం పెరుగుతోంది. కార్యాలయాలు, వ్యాపారాల్లోనే కాక చదువులోనూ కంప్యూటర్ కీలకంగా మారింది. ఈనేపథ్యాన పాఠశాలల విద్యార్థుల్లో వేసవి సెలవుల్లో కంప్యూటర్ల ప్రాథమిక కోర్సులు నేర్చుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈనేపథ్యాన కంప్యూటర్ ఇన్స్టిట్యూట్లలో సెలవుల్లో ప్రత్యేక శిక్షణ ఇస్తుండగా.. పాఠశాల స్థాయి నుంచి కళాశాల స్థాయి వరకు విద్యార్థులు నేర్చుకుంటున్నారు. కంప్యూటర్ శిక్షణ పొందుతున్న విద్యార్థులు కంప్యూటర్ కోర్సు నేర్చుకుంటున్నా. కొత్త విషయాలు తెలుసుకుంటుంటే ఉత్సాహంగా ఉంది. ఈ కోర్సుల వల్ల భవిష్యత్లో మంచి ఉపయోగం ఉంటుందని చెప్పారు. సెలవులు వృథా కాకుండా శిక్షణకు హాజరవుతున్నాను. –ఫర్హాన్, విద్యార్థి పాఠశాలల్లో కంప్యూటర్ కోర్సులు నేర్పిస్తారు. కానీ అందరితో పాటే నేర్చుకునే క్రమాన ఇబ్బంది కావొద్దని ముందుగానే శిక్షణ తీసుకుంటున్నా. పాఠశాల స్థాయి నుంచే నేర్చుకుంటే పెద్ద చదువులకు వెళ్లేటప్పటికి ఇబ్బంది కాదని చెబుతున్నారు. –నయోనిక, విద్యార్థిని -
హాలిడే ట్రిప్..
హలో ఫ్రెండ్స్. నా పేరు కురసం కల్పన. సత్తుపల్లిలో 8వ తరగతి చదువుతున్న నేను, మా కుటుంబం వేసవి సెలవుల్లో హైదరాబాద్ వెళ్లాం. అక్కడ ముందుగా చార్మినార్ చూశాం. శతాబ్దాల నాటి ఈ కట్టడం చాలా అద్భుతంగా ఉంది. ఇది చూసి చాలా ఆశ్చర్యానికి గురయ్యా. అంతేకాక గోల్కొండ కోటను కూడా సందర్శించాం. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ భారీ విగ్రహాన్ని చూశా. ట్యాంక్బండ్తో పాటు హుస్సేన్సాగర్లో గౌతమ బుద్ధుడి విగ్రహాన్ని చూశాం. గతంలోనూ హైదరాబాద్ వెళ్లినా, ఇవన్నీ చూడడం ఇదే మొదటిసారి. మీరు కూడా వేసవి సెలవుల్లో ఎక్కడెక్కడకు వెళ్లారో ఆ వివరాలను అందరితో పంచుకోండి. –సత్తుపల్లిటౌన్ -
పొదుపు ఫలితం
సత్తుపల్లిటౌన్: రాఘవపురం అనే గ్రామంలో అన్నదమ్ములు రవి, బంటి ఉండేవారు. ఓరోజు వాళ్ల నాన్న ఇద్దరినీ జాతరకు తీసుకొని వెళ్లాడు. అక్కడ ఒక దుకాణంలో బొమ్మ బంటికి ఎంతో నచ్చింది. దానిని కొని పెట్టమని వాళ్ల నాన్నని అడిగితే కొనిచ్చాడు. రవి వైపు తిరిగి ‘నీకేం కావాలి’అని అడిగితే ‘నాకు ఏమీ వద్దు. కానీ ఆ డబ్బులు నాకు ఇవ్వు.. ముంతలో దాచుకుంటాను’అన్నాడు రవి. దీంతో వాళ్లనాన్న కొంత డబ్బు ఇచ్చాడు. ఆ నగదును జాగ్రత్తగా ముంతలో దాచుకున్నాడు రవి. ఎప్పుడు, ఎవరు డబ్బు ఇచ్చినా వృథా ఖర్చు పెట్టకుండా.. జాగ్రత్తగా దాచుకోవడం మొదలుపెట్టాడు. అలా కొంత డబ్బు జమ అయింది. ఓరోజు బంటి ఆడుకుంటున్నప్పుడు కాలికి ఏదో గుచ్చుకున్నట్లు అనిపించింది. కానీ దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. కొద్దిరోజుల తర్వాత అక్కడ బాగా నొప్పి చేసింది. వాళ్ల నాన్న అడిగితే కాలికి ఏదో గుచ్చుకుందని చెప్పాడు. దీంతో ఆస్పత్రికి తీసుకెళ్లితే డాక్టర్ పరీక్ష చేసి కాలికి ఆపరేషన్ చేయాలని చెప్పాడు. ఆ వెంటనే వాళ్ల నాన్న బ్యాంకుకు వెళ్లి దాచిన డబ్బు తీసుకువచ్చాడు. కానీ ఆపరేషన్కు ఆ నగదు సరిపోలేదు. దీంతో ఏం చేయాలా అని ఆలోచిస్తుండగా రవి తాను దాచుకున్న డబ్బు తీసుకువచ్చి తండ్రికి ఇచ్చాడు. వాళ్ల నాన్న ఎంతో సంతోషించి ముద్దాడాడు. ఆ డబ్బు తీసుకువెళ్లి ఆస్పత్రిలో చెల్లించగానే బంటికి ఆపరేషన్ చేయగా, కొద్దిరోజుల్లోనే నయమైంది. జరిగిన విషయమంతా తెలుసుకున్న బంటి అప్పటి నుంచి తాను కూడా డబ్బు పొదుపు చేయడం అలవాటుగా మార్చుకున్నాడు. నీతి: పొదుపు చేయడాన్ని చిన్నతనం నుంచే అలవరుచుకోవాలి. చిన్నమొత్తాలతో పొదుపు చేయడం మొదలైతే అవే భవిష్యత్లో పెద్దమొత్తంగా మారతాయి. భవిష్యత్ అవసరాలకు ఎంతగానో ఉపయోగపడతాయి. ఎం.అభినయ్, ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల, సత్తుపల్లి -
స్టాక్ పాయింట్లలో డీఎం తనిఖీ
కారేపల్లి: రైతుల నుంచి కొనుగోలు చేసిన మొక్కజొన్నలను భద్రపరుస్తున్న స్టాక్ పాయింట్ను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మార్కెటింగ్ శాఖ డీఎం జె.నరేందర్ మంగళవారం తనిఖీ చేశారు. కారేపల్లి మండలంలోని అప్పాయిగూడెం గోదాముతో పాటు జిన్నింగ్ మిల్ స్టాక్ పాయింట్లను ఆయన పరిశీలించారు. కారేపల్లిలో సోమవారం రాత్రి రైతులు ఆందోళనకు దిగిన నేపథ్యాన వైరా ఎమ్మెల్యే రాందాస్నాయక్ సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. మొక్కజొన్నలను స్థానికంగానే దిగుమతి చేయడానికి ఉన్న అవకాశాలు పరిశీలించాలని కోరారు. దీంతో డీఎం గోదాంలను పరిశీలించి నిల్వకు ఉన్న అవకాశాలపై చర్చించారు. సొసైటీ డైరెక్టర్ అడ్డగోడ ఐలయ్యతో పాటు బొంతు రాంబాబు, బొల్లు హన్మంతరావు పాల్గొన్నారు. -
కబ్జాకు రాజమార్గం
ఇంటి నంబర్ కావాలంటే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్, భవన నిర్మాణ అనుమతులు, ఈసీ(భూమి ఎవరి పేరు మీద ఉన్నదనే పత్రం.), ఆధార్కార్డు జత చేసి దరఖాస్తు చేసుకోవాలి. ఆపై వార్డు ఆఫీసర్ లేదా బిల్ కలెక్టర్లు ఆర్ఐతో కలిసి భూమిని క్షేత్రస్థాయిలో పరిశీలించి హద్దులను నిర్ధారించాలి. అంతా సవ్యంగా ఉంటే ఆ తర్వాత దరఖాస్తు రెవెన్యూ ఆఫీసర్ లాగిన్కు, అక్కడి నుంచి కమిషనర్ లాగిన్కు వెళ్లాక పరిశీలించి అనుమతిస్తారు. 2024 జనవరి నుంచి ఇప్పటి వరకు కార్పొరేషన్ పరిధిలో ఇలా 1,464 అసెస్మెంట్ నంబర్లు కేటాయించారు.సాక్షి ప్రతినిధి, ఖమ్మం: సామాన్యుడు రూపాయి, రూపాయి పోగేసి కొనుగోలు చేసిన స్థలంలో ఇంటి నిర్మాణం చేపట్టి నంబర్ తీసుకోవాలంటే సవాలక్ష డాక్యుమెంట్లు జత చేయాలి. రోజుల తరబడి కార్యాలయం చుట్టూ తిరగాలి. కానీ కొందరు ఏకంగా ప్రభుత్వ స్థలాలకే ఇంటి నంబర్లు సులువుగా సంపాదిస్తున్నారు. ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని ఎన్నెస్పీ భూములకు చాలామంది గతంలో ఇలా నంబర్లు తీసుకోవడం, ఇంకా కొందరు తీసుకుంటుండడం గమనార్హం. ఖమ్మం 14వ డివిజన్ గొల్ల గూడెంలోని పాత గ్రామపంచాయతీ భవన సముదాయ స్థలానికి ఇంటి నంబర్ కేటాయించిన ఉదంతం తాజాగా వెలుగు చూసింది. ఇలా జరగడానికి అధికారుల నిర్లక్ష్యం, క్షేత్రస్థాయిలో పరిశీలన లేకపోవడమే కారణంగా తెలుస్తోంది. ఇది అక్రమార్కులకు కలిసి వస్తుండడంతో ప్రభుత్వ స్థలాల్లో ఇంటి నిర్మాణాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. డిమాండ్ ఉన్న ప్రాంతాలే లక్ష్యంగా.. గతంలో ప్రభుత్వాలు నిరుపేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించాయి. అయితే కొందరు ఆయా సర్వే నంబర్లలోనే కాక సమీప ప్రాంతంలోకి వెళ్లి కబ్జా చేస్తూ ఆ భూమే తమకు ప్రభుత్వం కేటాయించిందనే వాదనను తెరపైకి తెస్తున్నారు. కొందరు ఆక్రమణదారులు భూ యజమానులతో కలిసి డిమాండ్ ఎక్కువగా ఉన్న భూమే లక్ష్యంగా ఇలా వ్యవహరిస్తునట్లు తెలుస్తోంది. ఫలితంగా రూ.కోట్ల విలువైన ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి. ఖమ్మం ఎల్బీనగర్లోని పవర్ ప్లాంట్ సమీపాన ఓ వ్యక్తికి 2004లో ఇంటి స్థలం ఇచ్చారు. సదరు వ్యక్తి అక్కడ కాకుండా గజం రూ.30వేల విలువైన ఎన్నెస్పీ ప్రధాన కాల్వ కట్ట పక్కన ఉన్న స్థలంలో ఇళ్లు కట్టాడు. రఘునాథపాలెం బైపాస్ ప్రధానరోడ్డుకు, వైరా, ఖమ్మం ప్రధాన రహదారికి సమీపాన ఈ ఇంటికి కార్పొరేషన్ నుంచి ఇంటి నంబర్ కూడా వచ్చింది. గతంలో ఇదే స్థలంలో నిర్మాణాన్ని అధికారులు కూల్చివేసినా మళ్లీ నిర్మించి నంబర్ సాధించడం గమనార్హం. ప్రభుత్వ భూములకు నంబర్లు! ప్రభుత్వ భూములకు కూడా ఇంటి నంబర్లు కేటాయించిన అంశం వెలుగుచూడడంపై సర్వత్రా ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. క్షేత్ర స్థాయిలో పరిశీలించాల్సిన అధికారుల నిర్లక్ష్యం, ఆక్రమణలపై రెవెన్యూ అధికారులు పట్టింపులేని తనమే ఇందుకు కారణమని తెలుస్తోంది. సర్వే నంబర్ ఒకచోట.. భూమి మరోచోట చూపిస్తున్నా పట్టించుకోవడం లేదని సమాచారం. కొత్త నిబంధనల ప్రకారం ఇంటినంబర్ కోసం దరఖాస్తు చేసుకున్న 15 రోజుల్లో ప్రక్రియ పూర్తి చేయాలి. అంతా సవ్యంగా ఉంటే నంబర్ కేటాయించడం, ఏవైనా లొసుగులు ఉంటే ఈ గడువులోగా జరిగిపోవాలి. అలా జరగని పక్షంలో డీమ్డ్ అప్రూవల్ అవుతుంది. అంటే 15రోజుల్లోపు ఏ చర్య తీసుకోకపోతే ఇంటి నంబర్ కేటాయింపు జరుగుతుంది. 2021–2023 మధ్య కాలంలో ఇలా చాలా అప్రూవల్స్ జరిగాయని తెలుస్తోంది. అప్పట్లో దీనిపై విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదులు అందడంతో విచారణ చేపట్టి ఓ రెవెన్యూ ఇన్స్పెక్టర్ను సస్పెండ్ చేసినట్లు తెలిసింది. రఘునాథపాలెం బైపాస్ రోడ్డులో ఎన్నెస్పీ ప్రధాన కాల్వ పక్కన నిర్మించిన ఇంటికి నంబర్ కేటాయించిన అంశంపై పరిశీలన చేయిస్తాం. అనుమానం ఉన్న మిగతా ఇంటి నంబర్లను కూడా పరిశీలించాలని వార్డు ఆఫీసర్ను ఆదేశిస్తాం. గొల్లగూడెంలోని పంచాయతీ కార్యాలయ సముదాయానికి నంబర్ ఇచ్చిన అంశంపై ఇప్పటికే విచారణకు ఆదేశించాం. – అభిషేక్ అగస్త్య, కమిషనర్, కేఎంసీకార్పొరేషన్ పరిధిలోని ఎన్నెస్పీ భూముల్లో ఆక్రమణలకు అంతులేకుండా పోయింది. ఖాళీ భూమి కనిపిస్తే చాలు తప్పుడు పత్రాలు డాక్యుమెంట్లు సృష్టించడం.. ఆ స్థలాన్ని కబ్జా చేయడం రోజుల వ్యవధిలో పూర్తవుతోంది. ఆక్రమణలు జరుగుతున్నా రెవెన్యూ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండడంతో కబ్జాదారులు దూసుకెళ్తున్నారు. ఆ భూములను రిజిస్ట్రేషన్ చేయించుకోవడంతోపాటు ఇంటి నంబర్లు తీసుకోవడం, ఆపై స్థలాన్ని అమ్మడమా, లేదా నిర్మాణం చేపట్టడమో చకచకా జరిగిపోతోంది. ప్రభుత్వ స్థలాల్లో ఇంటి నిర్మాణ అనుమతులు -
క్షేత్రస్థాయిలో ప్రతీ దరఖాస్తు పరిశీలన
ప్రజాదర్బార్ అర్జీలపై కలెక్టర్ దివాకరనేలకొండపల్లి: పాలేరు నియోజకవర్గంలో నిర్వహిస్తున్న ప్రజాదర్బార్ల్లో అందుతున్న దరఖాస్తుల క్షేత్రస్థాయి పరిశీలన వారంలోగా పూర్తి చేయాలని కలెక్టర్ దివాకర టీ.ఎస్. ఆదేశించారు. నేలకొండపల్లి తహసీల్లో అధికారులతో ఆయన దరఖాస్తుల పరిశీలనపై సమీక్షించారు. దరఖాస్తులను ఏ ప్రాతిపదికన విభజించారు, పరిశీలనకు నిర్దేశించుకున్న లక్ష్యాలపై ఆరా తీశాక కలెక్టర్ మాట్లాడారు. నేలకొండపల్లి మండలంలోని మూడు క్లస్టర్లలో ప్రజాదర్బార్ల ద్వారా 636 దరఖాస్తులు అందిన నేపథ్యాన ఏ ఒక్కటి తిరస్కరించకుండా పరిష్కరించాలని ఆదేశించారు. కాకరవాయిలో సమగ్ర భూసర్వే పరిశీలన తిరుమలాయపాలెం: మండలంలోని కాకరవాయిలో పైలట్ ప్రాజెక్టుగా నిర్వహిస్తున్న సమగ్ర భూ సర్వేను కలెక్టర్ దివాకర పరిశీలించారు. భూమి హద్దులు, రికార్డుల నమోదు, మ్యాపింగ్పై ఆరా తీశాక ఆయన మాట్లాడుతూ భూసర్వే పారదర్శకంగా, కచ్చితత్వంతో నిర్వహించాలని సర్వేయర్లకు సూచించారు. ఈ సర్వే పూర్తయితే భూవివాదాలు తగ్గడంతో పాటు రైతులకు భూమి హక్కులపై రక్షణ ఉంటుందని చెప్పారు. గ్రామస్తులు కూడా సర్వే సిబ్బందికి సహకరించాలని కోరారు. అలాగే, ప్రజా దర్బార్ వినతుల పరిష్కారంపై ఉద్యోగులకు సూచనలు చేశారు. ఈ సందర్భంగా సుద్దవాగుతండాలో సమస్యలపై సర్పంచ్ బానోతు రవి కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. ఆర్డీఓ శ్రీనివాస్, సర్వే ల్యాండ్ రికార్డ్స్ ఏడీ రాజేందర్, తహసీల్దార్లు పి.రాంప్రసాద్, లూథర్ విల్సన్, ఎంపీడీఓ షేక్ సిలార్ సాహెబ్, ఉద్యోగులు కనకం నరసింహారావు, ఆలస్యం మధుసూదన్రావు, అల్లం రవికుమార్, సుధీర్, పవన్, లక్ష్మణ్ ఎంపీఓ ప్రభాకర్రెడ్డి, సర్పంచ్ గూడూరు ఉపేందర్ పాల్గొన్నారు. గ్రీన్ ఎనర్జీ వినియోగాన్ని విస్తృతపర్చాలి ఖమ్మంవ్యవసాయం: జిల్లాలో గ్రీన్ ఎనర్జీ విని యోగం విస్తృతంగా పెరిగేలా సోలార్ పవర్పై అవగాహన కల్పించాలని కలెక్టర్ దివాకర టీ.ఎస్. ఆదేశించారు. ఎన్పీడీసీఎల్, టీజీ రెడ్కో అధికారులతో కలెక్టరేట్లో సమావేశమైన ఆయన మాట్లాడుతూ గిరిజన గ్రామాల్లో విద్యుత్ సౌకర్యం అందుబాటులోకి రావాలని, అవసరమైన ప్రాంతాల్లో సోలార్ ప్యానెళ్లు ఏర్పాటుచేయాలని తెలిపారు. అలాగే, అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలకు విద్యుత్ కనెక్షన్లు ఇవ్వాలని సూచించారు. ఇక మధిరలో అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబుల్ లైన్ల ఏర్పాటు పనులు చేపట్టే క్రమాన కేబుల్, ఇంటర్నెట్ సంస్థలే కాక మున్సిపల్ ఉద్యోగులతో సమన్వయం చేసుకోవాలని చెప్పారు. ఆతర్వాత సబ్ స్టేషన్ల నిర్మాణ పనులు, ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా సోలార్ ప్రాజెక్టుల నిర్మాణం, మోడల్ సోలార్ విలేజ్ పథకం కింద ఎంపికైన గ్రామాల్లో పనులపై కలెక్టర్ సూచనలు చేశారు. ఈ సమావేశంలో ఎన్పీడీసీఎల్ ఎస్ఈ శ్రీనివాసచారి, డీఈలు బాబూరావు, రామారావు, నాగేశ్వరరావు, రమేష్, భద్రుపవార్, శ్రీనివాసరావు, రెడ్కో జీఎం అజయ్ పాల్గొన్నారు.ఖమ్మంసహకారనగర్: ధాన్యం దిగుమతిలో జాప్యం జరగకుండా కట్టుదిట్టమైన పర్యవేక్షణతో సజావుగా కొనసాగుతున్నాయని కలెక్టర్ దివాకర టీ.ఎస్. స్పష్టం చేశారు. ‘సాక్షి’ లో ఈనెల 17న కల్లూరు, ముదిగొండ మండలాల్లో ధాన్యం కొనుగోళ్ల అంశంపై ‘దళారులే దిక్కు’, ‘దోచేస్తున్నారు’ శీర్షికలతో వచ్చిన కథనాలపై ఆయన స్పందించారు. కల్లూరు మార్కెట్ యార్డు(ఖాన్ఖాన్పేట) కేంద్రానికి ఇప్పటివరకు 1,400 టన్నుల ధాన్యం రాగా 1,336 టన్నులు కొనుగోలు చేసి మిల్లులకు తరలించామని తెలిపారు. మిగతా ధాన్యాన్ని తరలించేలా లారీలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. జిల్లాలో 309 కేంద్రాలకు ఇప్పటివరకు 1,10,961 టన్నుల ధాన్యం రాగా, అందులో 1,00,931 టన్నుల కొనుగోలు చేశామని వెల్లడించారు. అంతేకాక 97,719 టన్నుల ధాన్యాన్ని మిల్లులకు తరలించి, మిగిలిన 3,211 టన్నుల ధాన్యం తరలింపునకు వాహనాలు సమకూరుస్తున్నట్లు తెలిపారు. -
భానుడి మంటలు.. మరింత
● జిల్లాలో గరిష్టంగా 44.8 డిగ్రీల ఉష్ణోగ్రత ● వేడితో అల్లాడిపోతున్న ప్రజలుఖమ్మంవ్యవసాయం: భానుడు భగ్గుమంటున్నాడు. వాతావరణ శాఖ ముందుగా హెచ్చరించినట్లుగానే జిల్లాలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. సోమవారం జిల్లాలో 31.9 – 43.4 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదు కాగా, మంగళవారం 41.3 – 44.8 డిగ్రీలకు చేరడం గమనార్హం. ప్రస్తుతం 40–45 డిగ్రీల మధ్య అప్రమత్తత స్థాయిలో ఉష్ణోగ్రత నమోదవుతుండగా, ఉదయం 9 గంటల నుంచే ప్రభావం మొదలై 11 గంటలకల్లా తీవ్ర స్థాయికి చేరుతోంది. ప్రజల ఇక్కట్లు మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఎండ, వడగాలుల ప్రభావం కొనసాగుతుండడంతో జనం అల్లాడిపోతున్నారు. పగటి పూట ప్రజలు ఇళ్లకే పరిమితమవుతున్నారు. దీంతో రహదారులు నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. అలాగే, పిల్లలు, వృద్ధులు నీరసించిపోతున్నారు. ఇక రైతులు, వ్యవసాయ కూలీలు, నిర్మాణ రంగ కార్మికులు ఉదయం, సాయంత్రం మాత్రమే పని చేస్తున్నారు. ఎండలు, వడగాలుల తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య, ఆరోగ్యం, వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. ప్రాంతం ఉష్ణోగ్రత (డిగ్రీల్లో) తిమ్మారావుపేట 44.8పమ్మి, గుబ్బగుర్తి 44.5బాణాపురం 44.2కలెక్టరేట్ 43.9వైరా, నేలకొండపల్లి 43.8కాకరవాయి 43.7ప్రకాష్నగర్, కూసుమంచి 43.6ఖానాపురం 43.5ఎర్రుపాలెం, మధిర 43.4తల్లాడ, రావినూతల 43.2బచ్చోడు, కుర్నవల్లి 43.1కొణిజర్ల 43 -
చల్లగా.. కడుపు నిండుగా!
● రోజురోజుకూ ౖపైపెకి బీర్ల విక్రయం ● బార్లు, వైన్స్లకు ఐదు నెలల్లో రూ.177 కోట్ల విలువైన సరుకు ● ఎండ వేడికి తోడు ఐపీఎల్తో డిమాండ్ వైరా: ఉమ్మడి జిల్లాలో ఎండల తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. ఏ రోజూ 40డిగ్రీలకు తగ్గకుండా ఉష్ణోగ్రత నమోదవుతోంది. దీంతో ప్రజలు వేసవి తాపం నుండి సేదతీరేందుకు శీతల పానీయాలు, కొబ్బరి బొండాలు, చెరుకు రసం వంటివి సేవిస్తున్నారు. ఇదే సమయాన మందుబాబులు మాత్రం బీర్లపైనే మక్కువ కనబరుస్తున్నారు. జనవరి 1వ తేదీ నుండి ఈనెల 19వ తేదీ వరకు వైరాలోని ఐఎంఎల్ డిపో నుంచి ఉమ్మడి జిల్లాలోని బార్లు, వైన్స్లకు రూ.177.45 కోట్ల విలువైన 8.73 లక్షల కేసుల బీర్లు తీసుకెళ్లారంటే ఎంత మేర డిమాండ్ ఉందో అర్థమవుతుంది. మ్యాచ్ చూస్తూ చిల్ అవుతూ.. బార్లు, వైన్స్ల్లో ఎల్ఈడీ స్క్రీన్లు అమర్చి మందుబాబుల కోసం ఐపీఎల్ మ్యాచ్లను ప్రదర్శిస్తున్నారు. దీంతో నిత్యం వెళ్లే వారు కాకుండా యువకులు సైతం చేరుకుని బీర్లు తాగుతూ.. మ్యాచ్లు చూస్తూ ఎంజాయ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే అదునుగా భావించిన బార్లు, వైన్స్ నిర్వాహకులు బీర్లపై ఎంఆర్పీకి అదనంగా మరో రూ.40 జోడిస్తున్నారని సమాచారం. ఈ విషయమై ఎకై ్సజ్ శాఖ అధికారులు తనిఖీలు చేయడమైతే ఎక్కడా చోటు చేసుకోలేదు. రానున్న రోజుల్లో ఎండలు పెరిగితే బీర్లకు మరింత డిమాండ్ పెరుగుతుందనే అంచనాల నేపథ్యాన ధరల కట్టడిపై దృష్టి సారించాలని బీరు బాబులు కోరుతున్నారు. -
ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టాలి..
ఖమ్మంమయూరిసెంటర్: యుద్ధాల పేరుతో ప్రజలపై భారాలు మోపుతున్న కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడడమే పుచ్చలపల్లి సుందరయ్యకు ఇచ్చే ఘన నివాళి అని సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మంలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి నివాళులర్పించాక నాగేశ్వరరావు మాట్లాడారు. క్రూడాయిల్ ధరలు పెరిగినప్పుడు ఇంధన ధరలు పెంచుతున్న ప్రభుత్వం, తగ్గినప్పుడు మాత్రం స్పందించడం లేదన్నారు. అంతేకాక ప్రజలు పొదుపు చర్యలు పాటించాలని ప్రధాని సూచించడం గర్హనీయమన్నారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు ఎం.సుబ్బారావు, మాచర్ల భారతి, బండి రమేశ్, మెరుగు సత్యనారాయణ, నందిపాటి మనోహర్, పి.ఝాన్సీ, బండారు రమేశ్, తుమ్మ విష్ణువర్దన్, నెల్లూరి వీరబాబు, ఆర్.ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు. అలాగే, సీపీఎం త్రీటౌన్ కమిటీ ఆధ్వర్యాన పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి నిర్వహించారు. పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు వై.విక్రమ్, నాయకులు యర్రా శ్రీనివాసరావు, భూక్యా శ్రీనివాసరావు మాట్లాడగా మాజీ కార్పొరేటర్లు యర్రా గోపి, యల్లంపల్లి వెంకట్రావ్, పార్టీ నాయకులు బండారు రమేశ్, వజినేపల్లి శ్రీనివాసరావు, పత్తిపాక నాగసులోచన, ఎస్కే సైదులు, యర్రా మల్లికార్జున్, ఎస్కే ఇమామ్ పాల్గొన్నారు. తద్వారా సుందరయ్యకు నివాళి -
సరదాగా ఈత
వేసవి వచ్చిందంటే ఈత కొట్టేందుకు యువకులు ఉత్సాహం చూపుతారు. పట్టణాల్లో స్విమ్మింగ్ పూల్స్ ఉన్నా గ్రామాల్లో మాత్రం వ్యవసాయ బావులనే ఎంచుకుంటారు. సెలవులు తోడవడంతో పెద్దలతో పాటు పిల్లలు కూడా ఈత నేర్చుకునేందుకు బావుల వద్ద బారులు దీరుతున్నారు. ఈక్రమాన పిల్లలకు క్యాన్లు కట్టి మెళకువలు నేర్పిస్తున్న పెద్దలు ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తిరుమలాయపాలెం మండలం ఎదుళ్లచెరువులోని ఓ వ్యవసాయ బావిలో పిల్లలు, పెద్దలు ఈత కొడుతున్న దృశ్యాలే ఇవి. – తిరుమలాయపాలెం -
డల్నెస్ సేవలు
ఖమ్మంవైద్యవిభాగం: ఉమ్మడి జిల్లాలోని ఉద్యోగులు, పాత్రికేయులు, పెన్షనర్ల కోసం జిల్లా ప్రభుత్వాస్పత్రిలో ఎనిమిది ఏళ్ల క్రితం వెల్నెస్ సెంటర్ ఏర్పాటు చేశారు. ఇక్కడ ప్రత్యేక ఆరోగ్య పథకం ద్వారా వైద్య సేవలు అందించాల్సి ఉంది. ఏళ్లు గడిచినా మెరుగైన సేవలు మాత్రం అందుబాటులోకి రావట్లేదు. ఎంతో వ్యయ ప్రయాసలతో ఉమ్మడి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడకు వచ్చే వారికి తాత్కాలిక సేవలు కూడా అందక నిరాశ చెందుతున్నారు. తరచూ మందుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఎప్పుడు ఏ మందులు అందుబాటులో ఉంటాయో తెలియని పరిస్థతి నెలకొంది. వెల్నెస్ సెంటర్కు ఆరోగ్యశ్రీ ట్రస్ట్ నుంచి మందులు సరఫరా చేస్తున్నా, ఇండెంట్ పెట్టాక చాలా కాలానికి అందజేస్తున్నారు. రోజుకు 200 మందికి పైగానే.. ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వెల్నెస్ సెంటర్కు వైద్యసేవల కోసం ఉద్యోగులు, పెన్షనర్లు, జర్నలిస్టులు వస్తుంటారు. ఇక్కడ రోజూ 200 – 250 మంది వరకు వైద్య సేవలు పొందుతుంటారు. ఎక్కువ మంది దీర్ఘకాలిక వ్యాధులైన షుగర్, బీపీతో పాటు నరాల బలహీనత, జ్వరం, ఇతర సీజనల్ వ్యాధులతో బాధపడేవారు ఉంటారు. కాళ్లు, కీళ్ల నొప్పులు, వృద్ధాప్య సమస్యలతో బాధపడే రిటైర్డ్ ఉద్యోగులు అధికంగా వస్తుంటారు. సెంటర్లో జనరల్ మెడిసిన్, ఫిజియోథెరపీ, డెంటల్ తదితర సేవలు మాత్రమే అందుతున్నాయి. అన్ని రకాల మందులు కూడా అందుబాటులో లేవు. కనీసం బీపీ చూసే టెక్నీషియన్ కూడా లేడు. దీంతో సెంటర్కు వచ్చేవారు గగ్గోలు పెడుతున్నారు. జలుబు, దగ్గు మాత్రలు సైతం ఇక్కడ దొరకట్లేదు. దూరప్రాంతాల నుంచి వచ్చే ఒకేసారి నెలకు సరిపోను మందులు తీసుకుంటారు. కానీ అవి అందుబాటులో లేకపోతే ప్రైవేట్లో కొనుగోలు చేస్తూ రూ.వేలల్లో నష్టపోవాల్సి వస్తుందని వాపోతున్నారు. ల్యాబ్ పరీక్షలకు ఇక్కట్లే వెల్నెస్ సెంటర్లో సౌకర్యాల లేమి కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఓపీ, ఇతర విభాగాల్లో కూర్చోటానికి కూడా కుర్చీలు లేవు. సెంటర్కు వచ్చే వారికి రక్త పరీక్షలు నిర్వహించే ల్యాబ్ టెక్నీషియన్ ఒకరే ఉండటంతో ఆయన సెలవులో వెళ్తే పరీక్షలు నిలిచిపోతున్నాయి. దీంతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వారు నిరాశకు గురవుతున్నారు. ముగ్గురు ఫార్మాసిస్టులకు ఇద్దరు, నలుగుగురు డేటా ఎంట్రీ ఆపరేటర్లకు ఇద్దరు, నలుగురు స్టాఫ్నర్సులకు ఇద్దరు, ముగ్గురు మెడికల్ ఆఫీసర్లకు ఇద్దరే విధులు నిర్వర్తిస్తుండడంతో సక్రమంగా వైద్య సేవలు అందడంలేదు. -
ఆరు రోజులు.. అగ్నిగుండమే
ఖమ్మంవ్యవసాయం: రానున్న ఆరు రోజుల్లో ఎండ తీవ్రత మరింతగా పెరగనుంది. ఈ నెల 19 నుంచి 24వ తేదీ వరకు ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయిలో నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న ఉష్ణోగ్రతలపై మరో 1 నుంచి 2 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని కూడా తెలిపింది. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో 40–45 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరో 1 నుంచి 2 డిగ్రీలు పెరిగితే హెచ్చరిక స్థాయికి చేరే అవకాశం ఉంది. ఉదయం 9 గంటల నుంచే ఎండ తీవ్రత ప్రభావం చూపుతోంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందని, అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ సూచించింది. ఎండ తీవ్రతతో పాటు, వడగాలులు కూడా వీచే అవకాశం ఉందని పేర్కొంది. పమ్మి, రావినూతలలో గరిష్టంగా 43.4 డిగ్రీలు ఖమ్మం జిల్లాలోని దాదాపు అన్నిప్రాంతాల్లో సోమవారం 40–45 డిగ్రీల మధ్య అప్రమత్తత స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా పమ్మి, రావినూతలలో 43.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. బాణాపురంలో 43.2, నేలకొండపల్లిలో 43.1, తిమ్మారావుపేట, గుబ్బగుర్తిలో 43, కొణిజర్ల, తల్లాడ, కలెక్టరేట్లలో 42.5, మధిర, ప్రకాష్నగర్, నాగులవంచలో 42.1, గేటుకారేపల్లిలో 41.8, పల్లెగూడెం, వైరా, ఖానాపురంలలో 41.7, మధిర(ఏఆర్ఎస్), కుర్నవల్లిలో 41.6, ముదిగొండ, సిరిపురంలో 41.5, ఏన్కూరు, వైరా(ఏఆర్ఎస్), చింతకానిలో 41.4, సత్తుపల్లి, కూసుమంచి, ఎర్రుపాలెంలో 41.1, రఘునాథపాలెంలో 40.9, పెద్దగోపతిలో 40.7, పెనుబల్లి 40.6, ఖమ్మం ఎన్ఎస్పీ 40.5, సత్తుపల్లి ఓసీ 40.3, సదాశివునిపాలెం, వేంసూరు, లింగాలలో 40.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తగిన జాగ్రత్తలు తప్పని సరి మండుటెండల్లో తగిన జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉందని వైద్యులు సూచిస్తున్నారు. ఎండ సమయంలో బయట తిరిగితే వాంతులు, విరోచనాలు సంభవించే అవకాశం ఉందని చెబుతు న్నారు. బయటకు వెళ్తే తలను టోపీ లేదా టవల్తో రక్షించుకోవాలని సూచిస్తున్నారు. ఎండ తీవ్రతకు శరీరం నీరసించకుండా తరచూ నీరు తాగటం, నిమ్మరసం, కొబ్బరి నీళ్లు, మజ్జిగ, ఓఆర్ఎస్ ద్రావణం తాగాలని సూచిస్తున్నారు. -
ఫిర్యాదులకు పరిష్కారం చూపండి..
ఖమ్మంసహకారనగర్: ప్రజలు అందిస్తున్న ఫిర్యాదులను పరిశీలించి సత్వరమే పరిష్కారం చూపాలని కలెక్టర్ దివాకర టీఎస్ అన్నారు. సోమవారం ప్రజావాణిలో భాగంగా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్లు శ్రీజ, శ్రీనివాసరెడ్డితో కలిసి ఫిర్యాదులను స్వీకరించారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ దీక్షారైనా, కలెక్టరేట్ ఏఓ శ్రీనివాసరావు, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. ఫిర్యాదుల్లో కొన్ని.. ● నగరంలోని 16వ డివిజన్ అగ్రహారం – సీతారాంపురం కాలనీ వాసులు అగ్రహారం పాత గేటు వద్ద రైల్వే అండర్ బ్రిడ్జి పనులు ప్రారంభించి నాలుగేళ్లు అయిందని, పనులు పూర్తిగా ఆగిపోయి రెండేళ్లు అయిందని, ఇటు అగ్రహారం, అటు ధంసలాపురం కొత్తకాలనీ ప్రజలు రాకపోకలకు ఇబ్బంది పడుతున్నారని, పనులు పూర్తి చేయాలని ఆ ప్రాంత వాసులు ఎం.వెంకటేశ్వర్లు, టి.అప్పిరెడ్డి, ఆళ్ల అంజిరెడ్డి, సీహెచ్ కోటేశ్వరరావు విన్నవించారు. ● వేంసూర్ మండలం మర్లపాడులో సీసీ డ్రెయిన్ నిర్మించాలని గ్రామస్తులు విన్నవించారు. ● కొణిజర్ల మండలం రాజ్యతండాకు చెందిన టి.సునీత, బి.కృష్ణ, సత్యనాగేంద్ర ముగ్గురికి కలిపి గుండ్రాతిమడుగు రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 46/ఊ/2/1/2లో కొంత భూమి ఉందని, వీటి మార్కెట్ విలువ అధికంగా ఉందని దీనిని తగ్గించాలని విన్నవించారు. ● టీహబ్ డయాగ్నస్టిక్ సెంటర్లో ఔట్సోర్సింగ్ ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేస్తున్నప్పుడు టెర్మినేషన్ పద్ధతిలో విధుల నుంచి తొలగించారని, తిరిగి తనకు ఉద్యోగం ఇప్పించాలని ఖమ్మం నగరానికి చెందిన మహ్మద్ అబ్దుల్ కరీమ్ కోరారు. -
స్వయం ఉపాధికి ప్రోత్సాహం
సత్తుపల్లిటౌన్: అంతరించి పోతున్న హస్తకళల నిపుణులకు స్థిరమైన జీవనోపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు తెలంగాణ హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ నాయుడు సత్యనారాయణ అన్నారు. సత్తుపల్లి ప్రభుత్వ బాలికల పాఠశాల ప్రాంగణంలో సోమవారం కేంద్ర జౌళి మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేసి మాట్లాడారు. డాక్టర్ మట్టా దయానంద్, మేనేజర్ ఎస్.రాజేష్, ప్రవీణ్కుమార్, మున్సిపల్ చైర్పర్సన్ ఎండీ రెహానా కమల్పాషా, వైస్ చైర్మన్ బొంతు సుమలత, గాదె చెన్నారావు, వెంకటనారాయణరెడ్డి, హెచ్ఎం నాగేశ్వరరావు, ఏఎంసీ చైర్మన్లు, దోమ ఆనంద్బాబు, భాగం నీరజ, పింగళి సామేలు పాల్గొన్నారు. ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానంఖమ్మంమయూరిసెంటర్: మైనారిటీ మహిళలకు అసిస్టెంట్ బ్యూటీ థెరపిస్ట్ కోర్సులో ఉచిత శిక్షణకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి ముహమ్మద్ ముజాహిద్ ఒక ప్రకటనలో తెలిపారు. ముస్లిం, సిక్కు, జైన, బౌద్ధ, పార్సీ మైనారిటీ మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 26వ తేదీ లోగా దరఖాస్తులు అందజేయాలని కోరారు. 18 నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన మహిళలు అర్హులని, ఇతర వివరాలకు 97040 03002 నంబర్లో సంప్రదించాలని పేర్కొన్నారు. నిరుద్యోగులకు రైసెట్ కేంద్రంలో..ఖమ్మంరూరల్: ఏదులాపురం మున్సిపాలిటీలోని వరంగల్క్రాస్ రోడ్లో ఉన్న రైసెట్ కేంద్రంలో నిరుద్యోగులకు వివిధ కోర్సుల్లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్టు రైసెట్ మేనేజర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. బ్యూటీపార్లర్, టైలరింగ్, మగ్గం కోర్సులలో నెల రోజుల పాటు శిక్షణ ఇస్తామని, ఆసక్తి ఉన్న వారు ఈ నెల 23, 24వ తేదీల్లో తరుణీ హాట్లో పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా చెందిన యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నేటి నుంచి కేంద్రియ విద్యాలయలో వేసవి శిబిరం ఖమ్మంరూరల్: పోలేపల్లిలో ఉన్న కేంద్రియ విద్యాలయలోని విద్యార్థులకు నేటి నుంచి ఈ నెల 26 వరకు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు భారతీయ భాషా వేసవి శిబిరం నిర్వహిస్తున్నట్లు విద్యాలయ ప్రిన్సిపాల్ కవీంద్రరాయ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థుల్లో భారతీయ భాషలు, సంస్కృతి, సృజనాత్మకత, సంభాషణా నైపుణ్యాలను ప్రోత్సహిస్తామని పేర్కొన్నారు. భాషా అభ్యసన తరగతులు, కథలు వినిపించడం, సాంస్కృతిక కార్యక్రమాలు, సామూహిక చర్చలు, జానపద గీతాలు, క్విజ్ వంటి అనేక ఆసక్తికర కార్యక్రమాలు శిబిరంలో ఉంటాయని తెలిపారు. సర్పంచ్లకు అవగాహనఖమ్మం సహకారనగర్: ఘన వ్యర్థాల నిర్వహణపై జిల్లాలోని సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శులు, ఎంపీడీఓలు, ఎంపీఓలతో సోమవారం సమావేశం నిర్వహించారు. అవగాహన కల్పించారు. గ్రామ పంచాయతీ సేవలపై పలు సూచనలు చేసినట్లు డీపీఓ రాంబాబు తెలిపారు. -
వేసవి శిక్షణ శిబిరాల సందర్శన
వేంసూరు/కల్లూరు/సత్తుపల్లిరూరల్: పలు మండలాల్లో నిర్వహిస్తున్న వేసవి శిక్షణ శిబిరాలను అధికారులు సోమవారం సందర్శించారు. వేంసూరు మండలంలోని కందుకూరు పీఎంశ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న శిక్షణ శిబిరాన్ని సోమవారం జిల్లా ప్లానింగ్ కోఆర్డినేటర్ రామకృష్ణ, ఏఎంఓ ప్రభాకర్రెడ్డి పరిశీలించారు. హెచ్ఎం బొంతు శ్రీనివాసరావు పాల్గొన్నారు. అలాగే, కల్లూరులోని శిబిరాన్ని ఏఎంఓ పి.ప్రభాకర్రెడ్డి, ప్లానింగ్ ఆఫీసర్ చంద్రశేఖర్, ఎంఈఓ పి.నివేదిత సందర్శించి, విద్యార్థులకు సూచనలు చేశారు. కోచ్ వీరరాఘవయ్య పాల్గొన్నారు. అలాగే, సత్తుపల్లి ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న శిబిరాన్ని ఏఎంఓ ప్రభాకర్రెడ్డి పరిశీలించారు. హెచ్ఎం నాగేశ్వరరావు, ఉపాధ్యాయులు వెంకటేశ్, శ్రీను, చిట్టికుమారి, రాజ్యలక్ష్మి పాల్గొన్నారు. -
అప్రమత్తంగా వ్యవహరించాలి
ఖమ్మం సహకారనగర్: వరద తదితర విపత్తుల సమయంలో అధికారుల సూచనలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ దివాకర టీఎస్ సూచించారు. విపత్తుల నిర్వహణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సోమవారం మున్నేరు పరీవాహక ప్రాంతంలో వరద ప్రమాదాల మాక్ ఎక్సర్సైజ్ నిర్వహించారు. వర్షాకాలంలో సంభవించే అత్యవసర పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ నుంచి సమాచారం అందిన వెంటనే వివిధ శాఖలు స్పందించాల్సిన తీరు, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలింపు, రెస్క్యూ బృందాల పని, రిలీఫ్ క్యాంపులు, వైద్య సేవలు తదితర అంశాలపై మాక్ ఎక్సర్సైజ్లో ప్రదర్శనలు చేపట్టారు. ఇందులో భాగంగా ఆపద మిత్ర వలంటీర్ల సహకారంతో ప్రజలను రామ్ లీలా ఫంక్షన్ హాల్లోని పునరావాస కేంద్రానికి చేర్చారు. మాక్ ఎక్సర్సైజ్ను పరిశీలించిన కలెక్టర్ పలు సూచనలు చేశారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, రెవెన్యూ, మున్సిపల్, వైద్య ఆరోగ్య, విద్యుత్, పోలీస్, టీఎస్టీడీ, అగ్నిమాపక, పశుసంవర్ధక శాఖ, వివిధ శాఖల అధికారులు, ప్రజలు సమన్వయంతో పనిచేస్తే ప్రాణ, ఆస్తి నష్టం నివారించవచ్చని చెప్పారు. సాధారణంగా ప్రజలు నీరు కళ్లకు కనిపించే వరకు ఇళ్లను ఖాళీ చేయరని, ఈ ధోరణిలో మార్పు రావాల్సిన అవసరం ఉందన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అభిషేక్ అగస్త్య, ఇతర అధికారులు శ్రీనివాస్ రెడ్డి, శ్రీనివాస్, బి. మరియాదాస్, ప్రదీప్ కుమార్, వివిధ శాఖల అధికారులు, ఆపద మిత్ర వలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. పోస్టర్ల ఆవిష్కరణ ఖమ్మం రాపర్తినగర్: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా సోమవారం నుంచి ఈ నెల 23 వరకు నిర్వహిస్తున్న పర్యాటక వారోత్సవాల పోస్టర్ను కలెక్టర్ దివాకర టీఎస్ ఆవిష్కరించారు. డీవైఎస్ఓ టి. సునీల్ రెడ్డి, తెలంగాణ టూరిజం అసిస్టెంట్ ఇంజనీర్ నరేష్, టూరిజం ఉద్యోగి చంద్రశేఖర్ ఆజాద్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు. -
న్యాయవాదికి డాక్టరేట్
ఖమ్మంలీగల్: ఖమ్మం కోర్టులో న్యాయవాదిగా విధులు నిర్వర్తిస్తున్న భూక్య రమేశ్.. సన్రైజ్ యూనివర్సిటీ, అల్వార్ (రాజస్థాన్) నుంచి న్యాయశాస్త్రంలో పీహెచ్డీ పట్టా పొందారు. ‘క్రిమినల్ ట్రయల్స్లో సాక్షులు, నిపుణులపై న్యాయ అధ్యయనం’అనే అంశంపై ఆయన పరిశోధన పూర్తి చేసి 2026 మే 14న నిర్వహించిన పరీక్షలో ఉత్తీర్ణులవడంతో యూనివర్సిటీ డాక్టరేట్ అందించింది. ఉత్సాహంగా 5కే రన్ షురూ ఖమ్మంస్పోర్ట్స్: ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా సోమవారం నగరంలోని సర్దార్ పటేల్ స్టేడియం నుంచి ప్రారంభమైన 5కే రన్ లకారం ట్యాంక్బండ్ వరకు నిర్వహించారు. 500 మందికి పైగా క్రీడాకారులు, యువకులు, పెద్దలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీవైఎస్ఓ సునీల్రెడ్డి మాట్లాడుతూ.. క్రీడలతో యువతలో క్రమశిక్షణ, ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా ప్రతిభ చూపితే జాతీయ, అంతర్జాతీయస్థాయిలో రాణించవచ్చని చెప్పారు. కార్యక్రమంలో అథ్లెటిక్స్ అకాడమీ కోచ్ ఎండీ గౌస్, డీఎస్ఏ మేనేజర్ ఉదయ్కుమార్, క్రీడా సంఘాల ప్రతినిధులు గోవిందరెడ్డి, వీవీఎస్ మూర్తి, మతిన్ తదితరులు పాల్గొన్నారు. కాగా, స్టేడియంలో చిన్నారులు ప్రదర్శించిన ఎరోబిక్స్, పిరమిడ్స్, యోగా ఆకట్టుకున్నాయి. ఈనెల 23వ తేదీ వరకు ప్రకటించిన ఆంశాలను నిర్వహించేలా చర్యలు తీసుకుంటామని డీవైఎస్ఓ టి.సునీల్రెడ్డి తెలిపారు. ఆర్డర్ రాలేదు.. డబ్బులు పోయాయి.. పెనుబల్లి: చెవుడు తగ్గేందుకు మాత్రల కోసం ఆర్డర్ చేస్తే ఆ మాత్రలు రాకపోగా సైబర్ నేరగాళ్లు రూ.76 వేలు స్వాహా చేసిన ఘటన ఇది. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని ముత్తగూడెంనకు చెందిన ఓ వ్యాపారి గత ఏడాది నవంబర్లో ఫేస్బుక్లో వచ్చిన ప్రకటన ఆధారంగా చెవుడు తగ్గేందుకు క్యాష్ ఆన్ డెలివరీ విధానంలో మాత్రలు ఆర్డర్ చేయగా అందలేదు. ఈ ఏడాది ఫిబ్రవరిలో గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి తప్పుడు అడ్రస్ ఇవ్వడంతో కేసు నమోదైందని, కేసు కొట్టివేయడానికి డబ్బులు కావాలని అడగ్గా.. గత ఫిబ్రవరి 25వ తేదీన రూ.5 వేలతోపాటు విడతల వారీగా రూ.76 వేలు పంపాడు. వేధింపులు ఆగకపోవడం, కేసు నమోదు అబద్ధమని తేలడంతో సదరు వ్యాపారి ఇచ్చిన ఫిర్యాదుతో సోమవారం కేసు నమోదు చేసినట్లు వీఎం బంజర పోలీసులు వెల్లడించారు. -
ధర్మవాణికి 22 అర్జీలు
ఖమ్మంగాంధీచౌక్: ఉమ్మడి ఖమ్మం జిల్లా దేవాదాయ, ధర్మాదాయ శాఖ సోమవారం నూతనంగా ప్రారంభించిన ‘ధర్మవాణి’ కార్యక్రమానికి వివిధ అంశాలపై 22 అర్జీలు వచ్చాయి. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల దేవాదాయ, ధర్మాదాయ శాఖకు చెందిన ఉద్యోగులు, అర్చకులు వేతన సమస్యలపై ఫిర్యాదులను అందించారు. వేతన బకాయిలు చెల్లించాలని, గ్రాట్యూటీ, పదోన్నతులు, ఉద్యోగ నియామకాలు చేపట్టాలని విన్నవించారు. ఖమ్మం అర్బన్, ఎర్రుపాలెం, నేలకొండపల్లి, మధిర, ఏన్కూరు, కల్లూరు, పాల్వంచ తదితర ప్రాంతాల అర్చకులు, ఉద్యోగులు తమ సమస్యలను విన్నవించారు. ఖమ్మం నగరంలోని శ్రీ గుంటు మల్లేశ్వర స్వామి ఆలయంలో తాను 2022లో రూ. 25 వేలు విరాళంగా అందించానని, ఆ వివరాలను ఆలయ శిలాఫలకంపై ముద్రించలేదని ఓ భక్తుడు ఫిర్యాదు చేశాడు. దేవాదాయ, ధర్మాదాయ ఉమ్మడి జిల్లా అసిస్టెంట్ కమిషనర్ మేకల వీరస్వామి అర్జీలు స్వీకరించారు. ప్రాధాన్యత క్రమంలో సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. వేతన సమస్యలపై ఉద్యోగులు, అర్చకుల ఫిర్యాదులు -
ఆ భవనం మాది..?
ఖమ్మంఅర్బన్: 14వ డివిజన్ గొల్లగూడెంలో ఉన్న ప్రభుత్వ కార్యాలయ భవన (పాత గ్రామ పంచాయతీ భవనం) సముదాయ స్థలాన్ని కొందరు రిజిస్ట్రేషన్ చేయించుకుని, ప్రభుత్వ భవనానికి మున్సిపాలిటీలో ఇంటి నంబర్ పొందిన విషయం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో చర్చనీయాంశంగా మారింది. కార్పొరేషన్ కాక ముందు గొల్లగూడెం గ్రామపంచాయతీ కార్యాలయం కొనసాగిన భవనంలో ప్రస్తుతం హెల్త్ సెంటర్ ఉంది. ఇటీవల కొందరు ఆ స్థలం తమదేనని పేర్కొంటూ రిజిస్ట్రేషన్ పత్రాలు సృష్టించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లో ఇంటి నంబర్ కూడా పొందినట్లు సమాచారం. అప్పట్లో భవన సముదాయం ప్రాంతంలో వెంచర్ వేశారని, నిర్వాహకులు గ్రీన్ బెల్ట్గా చూపించడంతో 2012లో గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి నాటి ఎమ్మెల్యే, ఇప్పటి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శంకుస్థాపన చేశారు. తర్వాత భవనం నిర్మించారు. కాగా, ప్రస్తుతం భవనానికి సంబంధించిన ప్రాపర్టీ ట్యాక్స్ అసెస్మెంట్ నోటీస్ బయటకు రావడంతో గ్రామస్తులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ భవన సముదాయ స్థలానికి ఎలా రిజిస్ట్రేషన్ జరిగిందని, మున్సిపల్ అధికారులు ఎలాంటి పరిశీలన లేకుండానే ఇంటి నంబర్ మంజూరు చేశారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సోమవారం జరిగిన గ్రీవెన్స్లో మాజీ కార్పొరేటర్ కూరాకుల వలరాజు ఆధ్వర్యంలో కొందరు కమిషనర్కు ఫిర్యాదు చేశారు. సుమారు 280 గజాలకు పైగా ఉండే ఈస్థలం దాదాపు రూ.60 లక్షలకు పైగానే ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. భూమి యజమాని ద్వారా ఒకరు రూ.20 లక్షలకు కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేయించుకొని ఇంటి నంబర్ పొందినట్లు చెబుతున్నారు. ఇటీవల ఆ భవనం వద్దకు కొందరు వచ్చి గోడపై ఉన్న శంకుస్థాపన, ప్రారంభం నాటి శిలాఫలకాన్ని ధ్వంసం చేస్తుండగా స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి ఆ వ్యక్తిని పోలీస్ స్టేషన్కు తరలించినట్లు తెలిసింది. ఈ విషయంపై కార్పొరేషన్ ఆర్ఐ సుధాకర్ను వివరణ కోరగా గ్రీవెన్స్లో ఫిర్యాదు అందిందని, వార్డు ఆఫీసర్, ఆర్ఐని విచారణ చేసి పత్రాలను సేకరించాలని అదేశించామని, నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
ప్రమాణాలపై ప్రభావం
చేతిరాత శారీరక, మానసిక శ్రమతో కూడినదే అయినా విద్యార్థి మనో వికాసానికి దోహదపడుతుంది. కానీ నేటితరం పిల్లలు చదువుపై చూపిస్తున్న శ్రద్ధ రాతపై చూపడం లేదు. పిల్ల ల్లో చేతిరాతలో నైపుణ్యం తగ్గితే విద్యాప్రమాణాలపై ప్రభావం పడుతుంది. – చిన్నప్పయ్య, ప్రిన్సిపాల్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఇల్లెందు నిరంతర సాధన చేతిరాతను మెరుగుపర్చుకోవడంలో కీలకపాత్ర పోషిస్తుంది. ప్రతీ విద్యార్థి ప్రాథమిక చదువు పూర్తయ్యే వరకు ఫోర్ రూల్, సింగిల్ రూల్ నోట్బుక్స్ సొంతంగా నిర్వహించుకోవాలి. సెలవుల్లో తల్లిదండ్రులు ప్రోత్సహిస్తే సత్ఫలితాలు అందుకోవచ్చు. – బాలు, ఉపాధ్యాయుడు, మర్రిగూడెం, ఇల్లెందు మండలం -
●కృష్ణవేణికి ర్యాంక్ల పంట
ఎప్సెట్ ఫలితాల్లో తమ విద్యార్థులు ర్యాంకులతో ప్రభంజనం సృష్టించారని కృష్ణవేణి కళాశాల డైరెక్టర్లు గొల్లపుడి జగదీష్, మాచవరపు కోటేశ్వరరావు, యార్లగడ్డ వెంకటేశ్వరరావు తెలిపారు. ఇంజనీరింగ్, ఇతర విభాగాల్లో ఏ.శిశిర్ సాయి రాష్ట్ర స్థాయి 39వ ర్యాంక్ సాధించగా, ఎస్ఎస్.లక్ష్మి 77, ఎస్.గిరీశ్వర్రెడ్డి 213, జేఎల్ఎస్.మైత్రేయి 330, ఈ.హర్షిత్ 364, ఏ.మోక్షితసాయి 464, జె.చరణ్తేజ్ 549, ఎం.సాయి సాత్విక 604, ఆర్.మేదిని 1,165, జి.ప్రహర్ష 1,431, కె.భరత్ కుమార్ 1,508, పి.కావేరి 1,547, ఎం.జశ్వంత్సాయి 1,560, ఎస్.డీ.సామ్యా సమర్ 1,595, పి.హర్షవర్థన్ 1,631, పి.జశ్వంత్కుమార్ 1,740, ఎం.వెంకటేశ్వర్లు 1,896వ ర్యాంక్లు సాధించారన్నారు. ఈ కార్యక్రమంలో డీన్ ఏలూరి వంశీకృష్ణ, ఏఓ నిరంజన్కుమార్ పాల్గొన్నారు. -
రూ.కోటి స్వాహా కేసులో సైబర్ నేరస్తుడి అరెస్ట్
ఖమ్మంక్రైం: ఆన్లైన్ ట్రేడింగ్, ఇన్వెస్ట్మెంట్ పేరిట నమ్మించి రూ.కోటి మేర మోసం చేసిన కేసులో ఒకరిని అరెస్ట్ చేసినట్లు సైబర్ క్రైమ్ పోలీసులు తెలి పారు. జిల్లాకు చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగి వాట్సాప్కు ప్రకటన పంపించి, ఆన్లైన్లో పెట్టుబడి పెడితే అధిక లాభాలు నమ్మించారు. దీంతో ఆమె ముందుకు రాగా ట్రేడింగ్ లింక్ల ద్వారా సుమారు రూ.కోటి మేర సైబర్ నేరస్తులు కాజేశా రు. బాధితురాలి ఫిర్యాదుతో సైబర్ క్రైమ్ పోలీసులు విచారణ చేపట్టి, ఆమె ఖాతా నుంచి రూ.13లక్షలు ఏపీలోని మొగల్తూరుకు చెందిన కడలి చంద్రశేఖర్ ఖాతాలో జమ అయినట్లు గుర్తించారు. దీంతో నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించగా, మిగతా నిందితుల కోసం గాలిస్తున్నట్లు సైబర్ క్రైమ్ డీఎస్పీ ఫణీందర్ తెలిపారు. కేసు విచారణలో కీలకంగా వ్యవహరించిన డీఎస్పీతో పాటు సీఐ రవికుమార్, ఎస్ఐలు రంజిత్కుమార్, విజయ్కుమార్, సిబ్బందిని సీపీ సునీల్దత్ అభినందించారు. -
●రెజొనెన్స్ జయకేతనం
ఎప్సెట్ ఫలితాల్లో తమ విద్యార్థులు రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించారని రెజొనెన్స్ కళాశాల డైరెక్టర్లు ఆర్.వీ.నాగేంద్రకుమార్, కె.శ్రీధర్రావు తెలిపారు. విద్యార్థులను అభినందించాక వారు వివరాలు వెల్లడించారు. ఇంజనీరింగ్ విభాగంలో ఎల్.రామ్మోహన్రెడ్డి 591వ ర్యాంక్, ఎం.డీ.నిఖత్ పర్వీన్ 868, కె.సంతోష్ 1,772, ఎం.హారిక 2,387, ఎం.మోక్షిత 3349, ఎస్.లిఖిత 4,286, జి.భరత్చంద్ర 5,470, ఎం.మన్వితశ్రీ 5,871, బి.సంయుత 6,723, అగ్రికల్చర్ విభాగంలో కె.సింధు 673, ఎం.పద్మ వచన్ 1,979, కె.హారిక రెడ్డి 2,121, విష్ణు 3,295, కె.నవ్య 4,971, టి.శ్రీలహరి 6,987, సీహెచ్.ధన్యత 9,002, షేక్ రంషా రూహి 9,136వ ర్యాంకు సాధించారని వెల్లడించారు. ఈ సమావేశంలో ప్రిన్సిపాళ్లు సతీష్, భాస్కర్రెడ్డి, అధ్యాపకులు పాల్గొన్నారు. -
పింఛన్ బెనిఫిట్లు చెల్లించి ప్రాణభిక్ష పెట్టండి
రిటైర్డ్ హెచ్ఎం వెంకయ్య వినతిఖమ్మం మామిళ్లగూడెం: ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తూ ఏడాది క్రితం ఉద్యోగ విరమణ చేసిన తాను కేన్సర్ తో పాటు ఇతర వ్యాధులతో ఇబ్బంది పడుతుండగా.. ప్రభుత్వం నుంచి రిటైర్మెంట్ బెని ఫిట్లు అందక కోసం చికిత్స కోసం తల్లాడుతున్నానని ఖమ్మంకు చెందిన చెరుకుపల్లి వెంకయ్య వాపోయారు. ఈమేరకు బెనిఫిట్లు చెల్లించి తనకు ప్రాణ భిక్ష ప్రసాదించాలని ఆయన కోరారు. ఖమ్మంలో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో వెంకయ్య మాట్లాడుతూ భద్రాద్రి జిల్లా అశ్వరావుపేట పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తూ రిటైర్ అయిన తనకు దాదాపు రూ.60 లక్షలు రావాల్సి ఉందని తెలిపారు. తన గుండెకు రక్తప్రసరణ సక్రమంగా జరగక రెండు స్టంట్లు వేశారని, దీనికి తోడు కేన్సర్ బారిన పడ్డానని చెప్పారు. ఇప్పటికే ఉన్న డబ్బు చికిత్సకు ఖర్చు చేయగా, ఇంకా రూ.10 లక్షలు అవసరమని వైద్యులు చెప్పారన్నారు. ప్రాణా పాయ పరిస్థితిలో ఉన్నందున బెనిఫిట్లు విడుదల చేసి తన ప్రాణం కాపాడాలని వెంకయ్య కోరారు. ఈ సమావేశంలో వివిధ సంఘాల నాయకులు కొత్తపల్లి గురుప్రసాద్, మాడుపల్లి బాబు, అల్లంకి జయపాల్, తెల్లపూట జమాలయ, మేళ్లచెరువు బాబు, కోటపింజర రాము, చెరుకుపల్లి మురళి, దూరి జయరాజు, తెల్లూరి యాదగిరి, మన్నె గురుమూర్తి, కోట ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు. -
కథారచనల్లో మెళ కువలు నేర్పుతున్నా..
ఆంగ్ల మాధ్యమ విద్యాప్రభావంతో మాతృభాషకు ప్రాధాన్యత తగ్గుతున్న నేటి తరుణంలో మాతృభాష అయిన తెలుగు ఉపాధ్యాయురాలిగా విద్యార్థుల్లో ఆసక్తి పెంచేలా నా వంతు ప్రయత్నం చేస్తున్నా. అందులో భాగంగా విద్యార్థులతో కథలను విరివిగా చదివించడమే కాక, కథా కార్యశాలల ద్వారా కథా రచనలో మెళకువలను నేర్పించి విద్యార్థులే స్వయంగా కథలు రాసేలా ప్రోత్సహిస్తున్నా. ఆ ప్ర యత్నంలో భాగంనే గత ఏడాది మా పాఠశాల విద్యార్థి ఆవుల పోతురాజు రాసిన కథలతో ‘నాన్నే నా హీరో’ కథా సంకలనం వెలువడింది. అలాగే శతక సాహిత్యంలో పేరెన్నికగన్న వేమన శతకాన్ని నేర్పించి బాల అవధాన కార్యక్రమాన్ని నిర్వహించాం. మున్ముందు వివిధ ప్రక్రియల్లో మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని భా విస్తున్నాం. ఇందుకు సహకరిస్తున్న పాఠశాల హెచ్ఎం, గార్లపాటి–బొల్లేపల్లి ట్రస్ట్ నిర్వాహకులకు నా కృతజ్ఞతలు. – సత్తుపల్లి టౌన్ -
●శ్రీచైతన్య ప్రభంజనం
ఎప్సెట్ ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో తమ విద్యార్థులు అత్యుత్తమ ర్యాంక్లతో ప్రభంజనం సృష్టించారని శ్రీచైతన్య విద్యాసంస్థల చైర్మన్ మల్లెంపాటి శ్రీధర్, డైరెక్టర్ శ్రీవిద్య తెలిపారు. రాష్ట్రస్థాయిలో బి.సాయి చరణ్ 8వ ర్యాంక్ సాధించగా, ఎల్.అక్షయ గుణ 60వ ర్యాంక్తో అగ్రస్థానాన నిలిచారన్నారు. అలాగే, ఎం.అక్షర 85వ ర్యాంక్, ఎం.వర్ష 148, కె.మణిశంకర్ 204, ఎస్.శ్రీనిధి 244, పి.అర్షిత 290, కె.హాసిని 341, డి.సాయి ప్రణవ్ 374, బి.శ్రీనిధి 377, వి.స్నేహిత 482, ఎం.అమాన్ శ్రీసాయి 525, జి.గీతిక 560, ఎనమన్మోయి 629, వై.హాషిష్ 639, ఎన్.భార్గవ్ 677, బి.ప్రణయ్ 715వ ర్యాంక్ సాధించారన్నారు. ఇంకా 100 లోపు ముగ్గురు, 500లోపు 11 మంది, వేయి లోపు 25మంది, 2వేల లోపు 42మంది, 5వేల లోపు 108 మంది ర్యాంక్లు సాధించారని తెలిపారు. విద్యార్థులను చైర్మన్, డైరెక్టర్తో పాటు అకడమిక్ డైరెక్టర్ సాయిగీతిక, డీజీఎం చేతన్, డీన్లు వర్మ, జె.కృష్ణ, ఏజీఎంలు బ్రహ్మం, జి.ప్రకాష్, గోపాలకృష్ణ అభినందించారు. -
నేను రాసిన కవిత
భయపడకు నేస్తం! బతుకు ఒకదారి ప్రయత్నం చూపును రహదారి అడ్డు గోడలుంటాయి మరి చూసుకుని పోవాలి సరాసరి కష్టాలు వస్తేనేం భయపడకు నేస్తమా అధిగమిస్తేనే పోగలం ముందుకు భాగ్యమున్నప్పుడు ఎగిరిపడకు గర్వాన్ని అణచుకుంటే గెలుపు నీదే సుమా!– జె.భానుప్రకాష్, ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల, సత్తుపల్లి – సత్తుపల్లి టౌన్అపదలో ఉన్న వారికి సాయం చేయి బాధలో ఉన్న వారికి సంతోషాన్ని కలగజేయి.. మనిషి బతుకన్నాక మంచిని చేయి మూర్ఖత్వం నీకు ససేమిరా వలదోయి.. -
వానాకాలం సాగుకు సై..
వానాకాలం పంటల సాగుకు జిల్లా వ్యవసాయ శాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. జిల్లాలోని వనరుల ఆధారంగా పంటల సాధారణ సాగు విస్తీర్ణం అంచనాలను రూపొందించారు. ఎప్పటిలాగే రానున్న వానాకాలంలో సీజన్లోనూ వరి, పత్తి పంటలతో పాటు మిర్చి, పెసర, మొక్కజొన్న, మినుము, కంది, వేరుశనగ సాగవుతాయని గుర్తించారు. – ఖమ్మంవ్యవసాయంపంటల వారీగా ప్రణాళిక ఖరారు ● అన్నీకలిపి 6.47లక్షల ఎకరాల్లో సాగవుతాయని అంచనా ● ఈసారి కూడా వరి, పత్తికే అగ్రస్థానం ● సరిపడా విత్తనాలు, ఎరువులు సమకూర్చేలా సన్నాహాలువానాకాలం సాగుకు సంబంధించి పంటల వారీగా అంచనాలు రూపొందించాం. అందుకు అనుగుణంగా విత్తనాలు, ఎరువులు అందుబాటులోకి తీసుకొచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నాం. జిల్లాలో తొలుత సాగు మొదలుపెట్టే పత్తి విత్తనాలను సమకూర్చేందుకు సన్నాహాలు ప్రారంభించాం. అలాగే, భూసారాన్ని పెంచే పచ్చిరొట్ట విత్తనాలు కూడా సరఫరా చేస్తాం. – ధనసరి పుల్లయ్య, జిల్లా వ్యవసాయాధికారి జిల్లాలోని 21 మండలాల్లో పంటల సాగుకు 6,47,754 ఎకరాల భూమి అనువుగా ఉందని వ్యవసాయ శాఖ గుర్తించింది. గత ఏడాది అన్నీ కలిపి 6,17,858.31 ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగయ్యాయి. కానీ రానున్న సీజన్లో దాదాపు 30 వేల ఎకరాలు పెరిగే అవకాశముందని భావిస్తూ 6.45ఎకరాల్లో పంటలు సాగవుతాయనే నిర్ధారణకు వచ్చారు. ఇందులో ప్రధాన పంట అయిన వరి 3,20,301 ఎకరాల్లో సాగవుతుందని అంచనాల్లో పొందుపరిచారు. ఇక మరో ప్రధాన పంట పత్తి 2,69,715 ఎకరాల్లో సాగయ్యే అవకాశముందని భావిస్తున్నారు. ఈ అంచనాల ఆధారంగా గత ఏడాదితో పోలిస్తే వరి 15 వేల ఎకరాల్లో, పత్తి 13 వేల ఎకరాల్లో పెరగనుంది. అంతేకాక పత్తి, మిర్చికి ధర ఆశాజనకంగా ఉండడంతో రైతులు మొగ్గు చూపే అవకాశముంది. ఈమేరకు మిర్చి సాగు 33 వేల ఎకరాలుగా ప్రణాళికలో పొందుపర్చారు. రెండేళ్ల క్రితం వరకు జిల్లాలో 1.06 లక్షల ఎకరాల్లో మిర్చి సాగయ్యేది. కానీ ధర పతనం కావటం, విదేశీ ఎగుమతులు లేకపోవడంతో ఏటేటా తగ్గుతూ వస్తోంది. అయితే, ఈ ఏడాది మిర్చికి మంచి ధర రావడంతో వానాకాలంలో సాగు పెరుగుతుందని భావిస్తున్నారు. వానాకాలం సాగయ్యే పంటలకు అనుగుణంగా విత్తన ప్రణాళికలను సైతం వ్యవసాయ శాఖ సిద్ధం చేసింది. వరి విత్తనాలు 80 వేల క్వింటాళ్ల మేర అందుబాటులో తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ వద్ద వరి, పెసర, మినుము, కంది వంటి విత్తనాలు అందుబాటులో ఉన్నాయి. ఇక 2.69 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేయనుండగా, ఎకరాకు రెండు చొప్పున 5.38 లక్షల విత్తన ప్యాకెట్లకు గాను 6.74 లక్షల విత్తన ప్యాకెట్లను అందుబాటులో తీసుకొచ్చేలా చర్యలు చేపట్టారు. అంతేకాక తొలకరి వర్షాలు కురవగానే రైతులు భూసారాన్ని పెంచేలా సాగు చేసే పచ్చిరొట్ట ఎరువుల విత్తనాలు సమకూర్చనున్నారు. ఈ విత్తనాలను పీఏసీఎస్, ఆగ్రోస్ సంస్థల ద్వారా రైతులకు సరఫరా చేస్తారు. -
●రైతులే హమాలీలు
వేంసూరు: ఆరుగాలం శ్రమించి, చెమట చిందించి పండించిన పంటను అమ్ముకునేందుకు రైతులు పడుతున్న అగచాట్లు అన్నీఇన్ని కావు. అయితే, వేంసూరు మండలంలో రైతుల ఆవేదన వర్ణనాతీతంగా మారింది. మండలంలోని కల్లూరుగూడెం సివిల్ సప్లయీస్ గోదాంకు వెళ్లే దారి లేక రెండేళ్లుగా నిరూపయోగంగా ఉంది. దీంతో కొనుగోలు కేంద్రాల్లో మొక్కజొన్నలు పేరుకుపోతున్నాయనే విషయం తెలుసుకున్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సూచనలతో గోదాంను వినియోగంలోకి తీసుకొచ్చారు. దీంతో రైతులు సంతోషించగా.. మండలంతో పాటు జిల్లాలోని ఇతర మండలాల్లో కొనుగోలు చేసిన మొక్కజొన్నలను ట్రాక్టర్లు, లారీల్లో తీసుకురావడం మొదలైంది. కానీ కేవలం 20మంది హమాలీలే ఉండడం, వందల సంఖ్యలో వాహనాలు వస్తుండడంతో దిగుమతిలో జాప్యం జరిగి రోజుల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది. ఈ కారణంగా ట్రాక్టర్ల యజమానులు రైతుల నుంచి రోజుకు రూ.వేయి మొదలు రూ.1,500 వరకు వెయిటింగ్ చార్జీ డిమాండ్ చేస్తున్నారు. కొందరు రైతులు డబ్బు చెల్లించే పరిస్థితి లేక ఎవరి మొక్కజొన్న బస్తాలను వారే అన్లోడ్ చేసుకోవడం మొదలుపెట్టారు. అంతేకాక పైరవీ చేసే వ్యక్తులు, రాజకీయ పలుకుబడి వారి మక్కలు తొలుత అన్లోడ్ చేస్తున్నారని శనివారం వాగ్వాదం జరగగా తహసీల్దార్ మాణిక్రావు నచ్చజెప్పారు. -
చేయూత.. పరీక్ష !
ఖమ్మంమయూరిసెంటర్: ప్రభుత్వం అందిస్తున్న ‘చేయూత’ పెన్షన్ల పంపిణీలో అనర్హులను తొలగించేందుకు అధికారులు సాంకేతికతను వినియోగించుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా లబ్ధిదారులను సరిచూసేందుకు ఎఫ్ఆర్ఎస్(ఫేస్ రికగ్నైజ్డ్ సిస్టమ్ – ముఖ గుర్తింపు విధానం)ను ప్రారంభించారు. గ్రామీణ, మున్సిపాలిటీల్లో ఈ ప్రక్రియ ఏకకాలంలో సాగుతోంది. ఇందుకోసం ప్రభుత్వం రూపొందించిన యాప్ల ద్వారా ఆధార్ నంబర్ సహా లబ్ధిదారుల లైవ్ ఫొటోను నమోదు చేస్తారు. జిల్లాలో ప్రస్తుతం 1,76,950 మందికి చేయూత పెన్షన్ల ద్వారా ప్రభుత్వం నెలకు రూ.42 కోట్లు విడుదల చేస్తోంది. మరణించిన వారి గుర్తింపునకే ప్రాధాన్యం పింఛన్ జాబితాలో మరణించిన వారిని గుర్తించేందుకు ఎఫ్ఆర్ఎస్ విధానాన్ని అమలు చేస్తున్నారు. లబ్ధిదారులు ప్రస్తుతం జీవించి ఉన్నారా, లేదా అనేది క్షేత్రస్థాయిలో నిర్ధారించుకుని.. ఎవరైనా మరణిస్తే పేరు తొలగిస్తారు. తద్వారా కేవలం అర్హులైన వారికే ప్రభుత్వ సాయం అందుతుందని చెబుతున్నారు. ఈనెల 15వ తేదీన మొదలైన డ్రైవ్ జూన్ 15వ తేదీ వరకు కొనసాగనుంది. వారికే బాధ్యతలు గ్రామీణ ప్రాంతాల్లో చేయూత లబ్ధిదారుల వివరాలను యాప్లో నమోదు చేసే బాధ్యత పంచాయతీ కార్యదర్శులు, ఐకేపీ సిబ్బందికి అప్పగించారు. మున్సిపాలిటీల్లో వార్డు ఆఫీసర్లు, మెప్మా సిబ్బంది ఈ విధులు నిర్వర్తిస్తారు. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లో మాత్రం శానిటరీ ఇన్స్పెక్టర్లకు బాధ్యతలను అప్పగించాలని కమిషనర్ నిర్ణయించినట్లు తెలిసింది. జనగణన, ఎస్ఐఆర్ వంటి కార్యక్రమాలతో పాటు కార్పొరేషన్లోని వివిధ పనులతో వార్డు ఆఫీసర్లు తీరిక లేకుండా ఉన్న నేపథ్యాన ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఆయా ఉద్యోగులు నేరుగా పెన్షన్లు అందుకుంటున్న వారి ఇళ్లకు వెళ్లి తమ ఫోన్లోని యాప్ ద్వారా ఆధార్ నంబర్ నమోదు చేస్తారు. ఆ తర్వాత లబ్ధిదారుడి ఫొటోతీసి ఆధార్ డేటాబేస్లోని ఫొటోతో సరిపోల్చుకుంటూ (బయోమెట్రిక్ ఫేస్ అథెంటికేషన్) ప్రక్రియ పూర్తి చేస్తారు. తొలిరోజు సాంకేతిక సమస్యలు జిల్లాలో చేయూత లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో ఉండటంతో వెరిఫికేషన్ ప్రక్రియకు నెల గడువు విధించారు. లబ్ధిదారులందరినీ లైవ్లో గుర్తించాల్సి ఉండటంతో ఈ గడువు నిర్దేశించారు. అయితే సర్వే ప్రారంభమైన తొలి రోజు యాప్లో కొన్ని సాంకేతిక లోపాలు తలెత్తినట్లు సిబ్బంది చెబుతున్నారు. అయినా వాటిని సరిచేసుకుంటూ సర్వే కొనసాగించేలా అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఆ తర్వాత అర్హులకు.. ప్రభుత్వం కొత్త పెన్షన్లు ఇస్తామని చెప్తున్నా.. ఎప్పటి నుంచి అనేది ప్రకటించలేదు. జిల్లాల్లో అనర్హులతో పాటు చనిపోయిన వారి పెన్షన్లు తొలగిస్తే కొత్త వారికి చోటు కల్పించవచ్చని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో మృతుల పేరిట కూడా పింఛన్లు విడుదలవుతున్నాయని అధికారులు నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. ప్రస్తుత సర్వే ద్వారా వారిని గుర్తించి తొలగిస్తే.. కొత్త పెన్షన్లు మంజూరు చేసే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాల్లో చర్చ జరుగుతుంది. -
ఏదులాపురంలో ఎప్పుడూ అంతే..
● ధాన్యం, మక్కల కొనుగోళ్లలో దండుకునుడే లక్ష్యం ● వ్యాపారులకు రెండు చేతులా ఉద్యోగుల సహకారం ● రైతులు పంట తీసుకొస్తే మాత్రం కాంటాల్లో జాప్యంఖమ్మంరూరల్: ఏదులాపురం సొసైటీ అధికారులు, సిబ్బంది తీరు మారుతుందనే ఎన్నటికీ నెరవేరేలా కనిపించడం లేదు. తప్పులపై తప్పులు చేస్తూ రైతులను ముప్పు తిప్పలు పెట్టే ఉద్యోగులను ఇదేమిటని ప్రశ్నిస్తే... ‘మేం అంతా బాగా చేస్తున్నాం కదా... ఎందుకు మారాలి’ అని వారికి వారే సర్టిఫికెట్ ఇచ్చుకోవడం ఆనవాయితీగా మారింది. గత ఖరీఫ్ సీజన్లో తరుగు పేరిట రైతుల నుండి అందిన కాడికి దోచుకున్నది చాలదన్నట్లు ఈ యాసంగి మక్కల కొనుగోళ్లలోనూ అదే తీరుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. గత ఏడాది ధాన్యం కొనుగోళ్ల సమయాన అక్రమాలు బయటపడడంతో సొసైటీలోని ఓ ఉద్యోగిని సస్పెండ్ చేశారు. అయినా తీరు మార్చుకోకపోవడం గమనార్హం. వీరికి మద్దులపల్లి మార్కెట్లోని కొందరు సిబ్బంది జత కలవడం రైతుల ఇక్కట్లు మరింత పెరగడానికి కారణమైంది. ఉచిత కాంటాలకు తిలోదకాలు పంట ఉత్పత్తుల విక్రయానికి మార్కెట్కు తీసుకొస్తే నిబంధనల ప్రకారం ఉచితంగా కాంటా వేయాలి. కానీ మద్దులపల్లి వ్యవసాయ మార్కెట్లో మాత్రం వే బ్రిడ్జి నిర్వాహకులు రైతులు తెచ్చే మక్కల తూకం వేయడానికి డబ్బు వసూలు చేస్తున్నారనే విమర్శలున్నాయి. ఒక్కో ట్రాక్టర్కు రూ.100 నుంచి రూ.200 వసూలు చేస్తూ, ఇదేమిటని రైతులు అడిగితే ‘పైవాళ్లే తీసుకోమంటున్నారు’ అని సిబ్బంది చెబుతున్నారని సమాచారం. ఇదికాక కొందరు సిబ్బంది రాత్రి వేళ దొడ్డిదారిన ట్రాక్టర్ల లోడ్ను నేరుగా కాంటా వద్దకు తీసుకెళ్తున్నారనే ఆరోపణలు వచ్చాయి. దీంతో మార్కెట్ చైర్మన్ ఆ మార్గంలో ట్రెంచ్ కొట్టించడం సిబ్బంది పనితీరుకు నిదర్శనంగా నిలుస్తోంది. రైతులను కాదని.. కొందరు వ్యాపారులు గ్రామాల్లో రైతుల వద్ద తక్కువ ధరకు మక్కలను కొనుగోలు చేసి ట్రాక్టర్లలో మద్దులపల్లి మార్కెట్కు తరలిస్తున్నారు. ఇప్పటికే అక్కడ రైతులు మక్కల కాంటా కోసం రోజుల తరబడి రేయింబవళ్లు పడిగాపులు కాస్తున్నారు. వీరందరినీ కాదని వ్యాపారులు తెచ్చిన మక్కలను మాత్రం ఉద్యోగులు క్షణాల్లో కొనుగోలు చేసి కాంటా వేయడం కళ్ల ముందే జరిగిపోతుంటుంది. ఇందుకు గాను వ్యాపారుల నుంచి క్వింటాకు రూ.100 నుంచి రూ.200 వరకు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వసూళ్లపై ఆగ్రహం వే బ్రిడ్జి వద్ద కాంటాపేరుతో ఉద్యోగులు, హమాలీలు అక్రమ వసూళ్లకు పాల్పడతున్నారని ఆగ్రహిస్తూ మక్కల రైతులు నాలుగు రోజుల క్రితం పెద్దతండాలోని గోదాం వద్ద ఆందోళన చేపట్టారు. ట్రక్కుకు రూ.300, బస్తాకు రూ.6 దిగుమతి ఖర్చుల పేరిట వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ఇవికాక ట్రక్కుకు అదనంగా రూ.500 కూడా అడుగుతున్నారని వాపోయారు. గోదాం ఉద్యోగులు, హమాలీలు ఒక్కటై డబ్బు ఇచ్చిన వారి పంటనే కాంటా వేయడం, దిగుమతి చేస్తున్నారని ఆరోపించారు. అలాకాక నిరాకరిస్తే ఆ రైతుల ట్రాక్టర్లను గోదాం లోపలికి అనుమతించకుండా రోజుల తరబడి నిలిపేస్తున్నారని విమర్శించారు.ఏ వ్యాపారి నుంచి కూడా మా సిబ్బంది డబ్బు తీసుకోవడంలేదు. వ్యాపారులు తీసుకొచ్చిన మక్కలను కూడా కొనుగోలు చేయడంలేదు. బయట ఒకరిద్దరు రైతులతో మాట్లాడుకుని వ్యవహారం చేస్తే మాకేం సంబంధం? రైతులు నేరుగా మక్కలు అమ్మకానికి తీసుకొస్తే అన్నీ సరిచూశాకే కాంటా వేస్తున్నాం. డబ్బు కూడా రైతుల ఖాతాల్లోనే జమ అవుతుంది. – మహమద్ అలీ, సీఈఓ, ఏదులాపురం సొసైటీ -
ప్రియుడితో ప్రేమ పెళ్లి.. ఇద్దరితో వివాహేతర సంబంధం..
మధిర: భర్తకు దూరంగా ఉంటున్న ఓ మహిళకు ఇద్దరితో పరిచయం ఏర్పడింది. ఇద్దరితో ప్రేమాయణం నడిపింది. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య మొదలైన ఘర్షణ.. సదరు మహిళ హత్యకు దారి తీసింది. ఈ ఘటన ఖమ్మం జిల్లాలోని మధిర మండలంలో శనివారం చోటుచేసుకుంది. ఈ ఘటనలో మృతురాలిని కల్పనగా గుర్తించారు.ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం మేడూరుకు చెందిన గోపిశెట్టి కల్పన (27), మైలవరం మండలం బొర్రగూడెంకు చెందిన డేరంగుల నాగరాజు 2021లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు జన్మించాక మనస్పర్దలతో వేర్వేరుగా ఉంటున్నారు. ఆపై కల్పన కొంతకాలం తిరువూరులో, ప్రస్తుతం మధిరలోని ఒక ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలో పనిచేస్తోంది. ఈ క్రమంలో వాయిద్యకారుడు విజయభాస్కర్తో ఆమెకు పరిచయం ఏర్పడ్డాక, కొన్నాళ్లకు తిరువూరులోని ద్విచక్ర వాహనాల షోరూమ్లో పనిచేసే గంపలగూడెం మండలం కనుమూరుకు చెందిన యార్లగడ్డ చెన్నారావుతో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయమై విజయభాస్కర్, చెన్నారావు మధ్య కొంతకాలంగా వివాదం జరుగుతోంది. ప్రస్తుతం మేడూరులోని పుట్టింట్లో ఉంటూ మధిర వచ్చి వెళ్లే కల్పన రోజులాగే శనివారం కూడా బయలుదేరింది.ఇద్దరం కలిసి మాట్లాడుదాం..కల్పన విషయమై మాట్లాడే పని ఉందని, ఆమె కూడా వస్తున్నందున రావాలని చెన్నారావు.. విజయభాస్కర్కు ఫోన్ చేసి చెప్పాడు. దీంతో, తొలుత చెన్నారావు, కల్పన ద్విచక్ర వాహనంపై మధిర మండలం కృష్ణాపురం సమీపాన వెంచర్లోకి వెళ్లారు. ఆ లొకేషన్ను విజయభాస్కర్కు షేర్ చేయడంతో ఆయన కాసేపయ్యాక బయలుదేరాడు. అయితే, తొలుత వెళ్లిన చెన్నారావు, కల్పన మధ్య జరిగిన వాగ్వాదంతో ఆమెను హత్య చేసినట్లు తెలుస్తోంది. ఆపై చెన్నారావు వెళ్లిపోగా, కాసేపటికి లొకేషన్ ఆధారంగా చేరుకున్న విజయభాస్కర్కు ఇద్దరూ కనిపించకపోవడంతో వెనుదిరిగాడు.కొద్దిసేపయ్యాక కల్పన మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మధిర సీఐ మధు, సిబ్బంది చేరుకుని పంచనామా నిర్వహించారు. అంతేకాక మృతురాలి భర్త నాగరాజు, ఆమెతో పరిచయం ఉన్న విజయభాస్కర్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా, హత్య అనంతరం పరారైన చెన్నారావు.. కల్పన సోదరుడి సెల్ఫోన్కు పలు అంశాలపై వాట్సప్ మెసేజ్లు చేసినట్లు తెలిసింది. ఈ మేరకు మృతురాలి తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నామని సీఐ వెల్లడించారు. కాగా, కల్పన వివాహేతర సంబంధం కారణంగా ఆమె కుమారుడు ఒంటరైపోయాడని స్థానికులు చెబుతున్నారు. -
ప్రకృతి ఒడిలో పసితనం!
● ఇంటర్నెట్, స్మార్ట్ఫోన్లకు దూరంగా గొత్తికోయ చిన్నారులు ● అడవే ఆటస్థలం.. ప్రకృతే ఆటబొమ్మ బొమ్మలాటలో నిమగ్నమైన పిల్లలు రైలు బండి ఆడుతూ... చెట్ల కొమ్మే జారుడుబండగా..కరకగూడెం: వేసవి సెలవులు వచ్చాయంటే పట్టణాలు, మైదాన ప్రాంతాల పిల్లలు ఇళ్లకే పరిమితమై స్మార్ట్ఫోన్లు, టీవీలు, వీడియో గేమ్స్తో పాటు ఇండోర్ గేమ్స్తో కాలక్షేపం చేస్తుంటారు. ఉదయమో, సాయంత్రమో కాసేపు అలా బయటకు వచ్చి ఆడుకుంటారు. కానీ, అడవిని నమ్ముకుని బతికే గొత్తికోయ గూడేల్లో పిల్లల ముచ్చట్లే వేరు. వీరంతా అడవి ఒడిలోనే స్వేచ్ఛగా విహరిస్తూ ప్రకృతిని ఆస్వాదిస్తున్నారు. ఈత కాయల వేట.. గొత్తికోయ గ్రామాల్లోని చిన్నారులకు ఈత చెట్లే వేసవి పిక్నిక్ స్పాట్లు. కుటుంబ సభ్యులతో కలిసి ఉదయాన్నే గుంపులుగా ఈత చెట్ల వద్దకు వెళ్లి కాయలను ఏరుకుంటూ, తింటూ గడుపుతారు. ప్రకృతి ప్రసాదించిన తీయని పండ్లను సేకరించడమే వారికి పెద్ద ఆట. మట్టిబొమ్మలు, చికుబుకు రైళ్లు వీరి ఆటల్లో ప్లాస్టిక్ బొమ్మలు, ఖరీదైన గ్యాడ్జెట్లు ఉండవు. అడవిలో దొరికే మట్టి, రాళ్లు, ఆకులతోనే బొమ్మలాట ఆడుకుంటారు. ఒకరినొకరు పట్టుకుని చికుబుకు.. అంటూ రైలు బండి ఆడుతూ ప్రకృతి ఒడిలో పరుగులు తీస్తున్నారు. ఇవికాక వాటర్ రోలర్ను తోసుకుంటూ గడపడం, పెద్ద చెట్ల కొమ్మలను జారుడు బండల్లా మార్చుకుని జారుతూ సందడి చేస్తుండడం కనిపిస్తోంది. ఈత చెట్టు కింద కాయలు ఏరుతున్న చిన్నారులు -
మహిళా డెయిరీపై కార్యాచరణ
ఖమ్మంమయూరిసెంటర్: ఇందిరా మహిళా డెయిరీ నిర్వహణకు సమగ్ర కార్యాచరణ సిద్ధం చేసి, పక్కాగా అమలు చేయాలని కలెక్టర్ దివాకర టీ.ఎస్. అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో శనివారం ఆయన అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజతో కలిసి ఇందిరా మహిళా డెయిరీపై అధికారులతో సమీక్షించారు. తొలుత కలెక్టర్ ఈ కార్యక్రమానికి సంబంధించి బడ్జెట్ త్వరగా విడుదల చేయాలని ఎస్సీ, ఎస్టీ అభివృద్ధి, మైనారిటీ శాఖల ఉన్నతాధికారులతో కలెక్టర్ ఫోన్లో కోరారు. అనంతరం ఆయన మహిళా డెయిరీకి అవసరమైన మౌలిక వసతులు, ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టాల్సిన పనులకు అనుమతులు, గేదెల పంపిణీ, పశువుల షెడ్ల నిర్మాణంపై సూచనలు చేశారు. డీఆర్డీఓ శ్రీరామ్, సీపీఓ శ్రీనివాస్, బీసీ, ఎస్సీ, మైనార్టీ అభివృద్ధి శాఖల అధికారులు జి.జ్యోతి, ముజాహిద్, పశు సంవర్థక శాఖ అధికారి డాక్టర్ బి పురంధర్, పంచాయతీరాజ్ ఈఈ మహేష్, విజయ డెయిరీ డీడీ కె.రవికుమార్తో పాటు జయశ్రీ, ఎస్.విజయ్చంద్ర పాల్గొన్నారు. పారదర్శకంగా ఎస్ఐఆర్ ఖమ్మం సహకారనగర్: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్ఐఆర్) కార్యక్రమాన్ని పారదర్శకంగా, నిష్పాక్షికంగా చేపట్టాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి.సుదర్శన్రెడ్డి ఆదేశించారు. హైదరాబాద్ నుంచి శనివారం వీసీ ద్వారా ఎస్ఐఆర్, మ్యాపింగ్ పురోగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా సుదర్శన్రెడ్డి మాట్లాడుతూ ఎస్ఐఆర్ షెడ్యూల్ ప్రకారం జూన్ 15నుంచి 24 వరకు సన్నాహక చర్యలు, శిక్షణ చేపట్టాలని తెలిపారు. ఇక జూన్ 25నుంచి జూలై 24 వరకు బీఎల్ఓలు ప్రతీ ఇంటిని సందర్శించి ఓటర్ల వివరాలను ధ్రువీకరించే సమయాన పకడ్బందీగా వ్యవహరించాలని చెప్పారు. ఆపై జూలై 31న ము సాయిదా ఓటరు జాబితా విడుదల చేసి, అభ్యంతరాలు స్వీకరించి పరిష్కరించాక తుది జాబితాను అక్టోబర్ 1న ప్రచురించనున్నట్లు తెలిపారు. జిల్లా నుంచి వీసీకి హాజరైన కలెక్టర్ దివాకర మాట్లాడుతూ జిల్లాలో ఎస్ఐఆర్ మ్యాపింగ్ ప్రక్రియలో పురోగతి, ఇతర అంశాలను వివరించారు. ఆతర్వాత అధికారులతో సమావేశమైన ఆయన నివాసాలకు వెళ్లినప్పుడు ధ్రువపత్రాలు లేకపోతే ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం వ్యవహరించాలని సూచించారు. అదనపు కలెక్టర్ పి.శ్రీజ, కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్య, కల్లూరు సబ్కలెక్టర్ అజయ్యాదవ్, ఆర్డీఓ శ్రీనివాస్, ఎన్నికల విభాగం ఉద్యోగులు రాజు, అన్సారీ పాల్గొన్నారు. లైసెన్స్డ్ సర్వేయర్లకు విస్తృత ఉపాధి లైసెన్స్డ్ సర్వేయర్లకు భవిష్యత్లో విస్తృత ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉందని కలెక్టర్ దివాకర తెలిపారు. అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డితో కలిసి లైసెన్స్డ్ సర్వేయర్లతో సమావేశమైన ఆయన మాట్లాడుతూ భూ భారతి పోర్టల్ మ్యాపింగ్ అమల్లోకి వచ్చినందున తిరుమలాయపాలెం మండలంలో రీ సర్వే నిర్వహిస్తున్నామన్నారు. ఇందులో కొందరు సర్వేయర్లను వినియోగించుకుంటామని, రానున్న రోజుల్లో అన్ని గ్రామాల్లో అమల్లోకి వస్తే సర్వేయర్లకు పని, ఆదా యం లభిస్తాయన్నారు. ప్రైవేట్ వ్యక్తులు సర్వేలు చేయించుకున్నా ఆదాయం వస్తుందని తెలిపారు. అయితే, క్షేత్రస్థాయిలో తప్పు చేస్తే లైసెన్స్ రద్దుచేస్తామన్నారు. విధానమైన నిర్ణయాలు, సమస్యలపై ప్రభుత్వానికి తెలియచేస్తామని వెల్లడించారు. సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడీ రాజేందర్ పాల్గొన్నారు. ధాన్యం దిగుమతుల్లో జాప్యం లేదు ధాన్యం దిగుమతుల్లో ఎక్కడా జాప్యం జరగడం లేదని కలెక్టర్ దివాకర స్పష్టం చేశారు. ‘సాక్షి’లో శనివారం ‘దిగుమతుల్లో జాప్యం’ శీర్షికన ప్రచురితమైన కథనంపై స్పందించిన ఆయన ప్రకటన విడుదల చేశారు. జిల్లాలో 309 కేంద్రాల ద్వారా కొనుగోళ్లు జరుగుతున్నాయని, ఆపై ధాన్యాన్ని మిల్లులకు తరలిస్తున్నామని తెలిపారు. నేలకొండపల్లి మండలంలోని రాజేశ్వరపురం మిల్లులోనూ 80మంది హమాలీల ద్వారా రోజుకు 30 – 32 లారీల మేర దిగుమతులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. నిల్వలు పేరుకుపోకుండా పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యాన పర్యవేక్షిస్తున్నందున రైతులు అపోహలకు గురికావొద్దని సూచించారు.కలెక్టర్ దివాకర టీఎస్ -
మున్నూరుకాపుల సంక్షేమానికి కృషి
ఖమ్మంమామిళ్లగూడెం: మున్నూరుకాపుల సంక్షేమానికి కృషి చేస్తూ ప్రత్యేక శ్రద్ధ వహించినట్లు మున్నూరు కాపు సంక్షేమ సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర తెలిపారు. ఖమ్మంలో శనివారం జరిగిన సంఘం జిల్లా విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. కులస్తులు ఐక్యంగా ఉంటూ అందరి సంక్షేమానికి పాటుపడాలని తెలిపారు. జిల్లా అధ్యక్షుడిగా వీరభద్రం సంఘం సమావేశంలో మున్నూరు కాపు సంక్షేమ సంఘం జిల్లా కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా శీలంశెట్టి వీరభద్రం ఏకగ్రీవంగా ఎన్నికవగా, ప్రధాన కార్యదర్శిగా పసుపులేటి దేవేంద్రం, కోశాధికారిగా మడూరి పూర్ణచంద్రరావు, గౌరవ అధ్యక్షుడిగా కొత్త సీతారాములు ఎన్నికయ్యారు. అలాగే, యువజన విభాగం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా తోట రమేష్, మాటేటి కిరణ్ కుమార్, మహిళా విభాగం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా పగడాల మంజుల, తోట సుజలారాణిని ఎన్నుకోగా ఎంపీ రవిచంద్ర సత్కరించారు. ఇంకా ఈ సమావేశంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆకుల గాంధీ, నాయకులు గుండాల కృష్ణ, కొత్తా సీతారాములు, మేకల భిక్షమయ్య, కనకం జనార్దన్, పొదిల రవికుమార్, శెట్టి రంగారావు, లక్కినేని రఘు, గీతా వెంకన్న, పొన్నం వెంకటేశ్వర్లు, బచ్చు విజయ్కుమార్, జాబిశెట్టి శ్రీనివాసరావు, ఆళ్ల కృష్ణ, మారిశెట్టి వెంకటేశ్వరరావు, తోట గణేష్, తోట రామారావు, మాటి నాగేశ్వరరావు, తోట వీరభద్రం పాల్గొన్నారు. -
హలీడే ట్రిప్..
హలో ఫ్రెండ్స్.. నా పేరు ధ్రువన్ తేజ్. ఐదో తరగతి చదువుతున్నా. మా కుటుంబం ఈ వేసవి సెలవుల్లో కర్ణాటక రాష్ట్రంలో టూర్కు వెళ్లాం. మొదటగా మైసూర్ ప్యాలెస్ చూశా. చాలా అద్భుతంగా ఉంది. అక్కడే శ్రీచాముండేశ్వరి ఆలయాన్ని దర్శించుకున్నాం. ఆ తర్వాత కోయంబత్తూర్లోని ఈషా ఫౌండేషన్, ఓరొయానో మాల్ను చూశాను. ఈ ప్రదేశాలన్నీ చాలా బాగున్నాయి. నేను నా కుటుంబ సభ్యులం చాలా ఆనందంగా గడిపాం. అలాగే ఎండ నుంచి ఉపశమనం కలిగిస్తూ చల్లగా ఉండే ఊటీకి వెళ్లాం. అక్కడకు వెళ్లగానే చల్లని వాతావరణం చాలా.. చాలా నచ్చింది. అక్కడే రోజ్ గార్డెన్, చాక్లెట్ ఫ్యాక్టరీ కూడా చూశాం. రోజ్గార్డెన్ ఇంకా బాగా నచ్చింది. ఈ టూర్ని చాలా బాగా ఎంజాయ్ చేశాను. మీరు కూడా సెలవుల్లో ఎంజాయ్ చేస్తున్నారని అనుకుంటున్నా. – సత్తుపల్లి టౌన్ -
మామిడి మంట
● ధరల పెరుగుదలతో పచ్చడి ప్రియం ● మార్కెట్లోకి అరకొరగా మామిడికాయలు ● ఇతర సామగ్రి ధరతో బెంబేలు మధిర: వాతావరణ ప్రతికూల పరిస్థితులకు తోడు చీడపీడలు ఆశించడంతో ఈ ఏడాది మామిడి దిగుబడి పడిపోయింది. దీంతో మే నెల రాగానే పచ్చడి కాయలతో పాటు ఇతర రకాల అమ్మకాలు జోరందుకోవాల్సి ఉన్నా ఈసారి ఆ పరిస్థితి కానరావడం లేదు. పలు కారణాలతో పచ్చడి పెట్టుకునే రకాలు మార్కెట్లో అరకొరగానే లభిస్తున్నాయి. చిన్న రసాలు, పెద్ద రసాలు, జలాలు, తెల్లగులాబీ వంటి రకాలను పచ్చడి తయారీకి ఉపయోగిస్తారు. కానీ, కొరత కారణంగా ఒక్కో కాయ రకాల ఆధారంగా రూ.20 నుంచి రూ.50కి పైగా ధర పలుకుతోంది. దీనికి ఇతర సామగ్రి ధరలు కూడా పెరగడంతో జనం పచ్చడి పెట్టడానికి వెనుకడుగు వేస్తున్నారు. తెగుళ్ల బెడదతో మామిడి సీజన్ ప్రారంభంలో తేనెమంచు పురుగు ఆశించి పూత రాలిపోయింది. కొన్ని చెట్లకు పలుచగా కాయలు కాసినా వాటికి మంగు రావడంతో పాటు పండు ఈగ పురుగు ఆశించింది. దీంతో దిగుబడిపై ప్రభావం పడింది. గతంలో ఒక్కో చిన్న రసం, పెద్ద రసం చెట్టుకు వేయికిపైగా కాయలు కాసేవి. కానీ ఈ ఏడాది ప్రతికూల పరిస్థితుల నేపథ్యాన కొన్ని చెట్లు కాయలే కాయకపోగా మరికొన్ని చెట్లకు పలుచగా ఉన్నాయి. మంగు వచ్చిన మామిడికాయలు పచ్చడికి పనికి రాకపోవడంతో ఉన్న కొద్దిపాటి కాయలకు డిమాండ్ పెరిగిది. స్థానికంగా కొరత కారణంగా ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా నూజివీడు, విస్సన్నపేట, ఎ.కొండూరు తదితర మండలాల నుంచి చిరువ్యాపారులు పచ్చడి మామిడి కాయలు తీసుకొచ్చి విక్రయిస్తున్నారు. ఏవీ ఆ ఘుమఘుమలు? దాదాపుగా మామిడికాయ పచ్చడి తినని వారెవరూ ఉండరు. మధ్యతరగతి, సామాన్య కుటుంబాల్లో ఉదయం పనులు, కూలీకి వెళ్లేవారు పచ్చడితో భోజనం చేసి బయలుదేరతారు. మిగతా కుటుంబాల్లోనూ ఏటా వేసవిలో పచ్చడి పెట్టుకోవడం ఆనవాయితీ. ఏడాదంతా నిల్వ ఉండేలా మామిడి పచ్చడి పెట్టడం కనిపించేది. కానీ ఈసారి కాయల కొరత, సామగ్రి ధరల పెరుగుదలతో ఆ పరిస్థితి కానరావడం లేదు. కొందరు పచ్చడి పెట్టినా 100కు బదులు 50, 50కి బదులు ఇరవై కాయలతో సరిపెట్టుకుంటున్నారు. ధరాఘాతం ఏడాది పాటు నిల్వ ఉండే మామిడి పచ్చడి తయారీకి ఉపయోగించే పదార్థాల ధరలు మండిపోతున్నాయి. చిన్న కాయ అయినా ముక్కలు కొట్టడానికి రూ.5 నుంచి రూ.10 తీసుకుంటున్నారు. ఇదికాక నూనె, కారం, ఉప్పు, వెల్లుల్లిపాయలు, ఆవాలు, మెంతుల ధరలు ఏటేటా పెరుగుతున్నాయి. ఇక పచ్చడి పెట్టేందుకు అవసరమైన లావు రకం మిర్చి కేజీ రూ.500 పైగా పలుకుతుండడం గమనార్హం. అంతేకాక వెల్లుల్లిపాయలు రూ.230, మెంతులు రూ.160, పల్లీ నూనె రూ.190, నువ్వుల నూనె రూ.410 మేర ధర పలుకుతున్నాయి. -
నేటి నుంచి కాకరవాయిలో సమగ్ర భూసర్వే
తిరుమలాయపాలెం: సమగ్ర భూసర్వే ద్వారా రైతులు ఎదుర్కొంటున్న భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఖమ్మం ఆర్డీఓ ఎన్.శ్రీనివాస్ తెలిపారు. సమగ్ర సర్వే కోసం పైలెట్ ప్రాజెక్టుగా ఎంపికై న మండలంలోని కాకరవాయిలో శనివారం నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. గ్రామంలో ఆదివారం నుంచి క్లస్టర్ల వారీగా భూసర్వే చేపట్టనున్నందున రైతులు పాత పత్రాలు, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు, పాస్బుక్స్ తదితర ఆధారాలతో సహకరించాలని కోరారు. ఈ సర్వే ద్వారా భూసమస్యలు పారదర్శకంగా పరిష్కారమవడమే కాక అనుభవదారులుగానే మిగిలిన రైతులకు పూర్తి స్థాయి యజమాన్య హక్కులు అందుతాయని చెప్పారు. తహసీల్దార్ లూథర్ విల్సన్, డీటీ సుధీర్, ఆర్ఐలు పవన్కుమార్, లక్ష్మణ్, సర్పంచ్ గూడురు ఉపేందర్, పంచాయతీ కార్యదర్శి అంజయ్య తదితరులు పాల్గొన్నారు. రవాణాశాఖలో సేవలకు అంతరాయం ఖమ్మంక్రైం: జిల్లాలోని అన్ని రవాణాశాఖా కార్యాలయాల్లో శనివారం సేవలకు అంతరాయం ఏర్పడింది. హైదరాబాద్ ప్రధాన కార్యాలయంలోని సర్వర్లు డౌన్ కావడంతో ఈ పరిస్థితి ఎదురైందని అధికారుల ద్వారా తెలిసింది. ఈమేరకు ఖమ్మం, వైరా, సత్తుపల్లి రవాణా శాఖ కార్యాలయాల్లో సేవలు నిలిచిపోవడంతో వాహనదారులు కాసేపు వేచి ఉండి వెనుదిరిగారు. అయితే, శనివారం స్లాట్లు బుక్ చేసుకున్న వాహనాదారులు సోమవారం సేవలు పొందొచ్చని ఇన్చార్జ్ ఆర్టీఓ శ్రీనివాస్ తెలిపారు. ఖమ్మం ఆర్డీఓ శ్రీనివాస్ -
అత్యుత్సాహంతో అభాసుపాలు
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: జిల్లా కేంద్రంలోని కూడళ్లలో అనుమతి లేకుండా చేపడుతున్న నిర్మాణాలతో పాలకులు అభాసుపాలవుతున్నారన్న చర్చ జరుగుతోంది. లకారం ట్యాంక్బండ్ వద్ద మాజీ ప్రధాని పీ.వీ.నరసింహా రావు విగ్రహం ఉన్న ఆవరణలోనే మంత్రి తుమ్మల 40 ఏళ్ల ప్రస్థానానికి సంబంధించి పైలాన్ నిర్మాణం చేపట్టారు. ఇది మాజీ ప్రధానిని అగౌరవపర్చడమేనని బ్రాహ్మణ సంఘం నాయకులు శుక్రవారం నిరసన తెలపగా... ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో రాత్రికి రాత్రి నిర్మాణాన్ని తొలగించారు. 2020లో ఏర్పాటు మాజీ ప్రధాని, భారతరత్న పీ.వీ.నరసింహారావును గౌరవిస్తూ 2020లో ఆయన 100వ జయంతి ఉత్సవాలను గత ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. ఆ సమయాన ఖమ్మం లకారం ట్యాంక్బండ్ వద్ద పీవీ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అంతేకాక చుట్టూ రెయిలింగ్ పెట్టి మొక్కలు నాటి ఫౌంటెన్లు ఏర్పాటు చేశారు. 40 ఏళ్ల ప్రస్థానానికి గుర్తుగా.. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మంత్రిగా తొలిసారి ప్రమాణం స్వీకారం చేసి 40 ఏళ్లు పూర్తవడంతో కొందరు నేతలు పైలాన్ నిర్మాణానికి సిద్ధమయ్యారు. దీనికి అనుమతి లేకపోగా, పీవీ విగ్రహం వెంటే నిర్మిస్తుండడంతో ఆయన అభిమానులు, బ్రాహ్మణ సంఘం బాధ్యులు శుక్రవారం నిరసనకు దిగి కార్పొరేషన్ అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. అలాగే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలు, విదేశాల్లో బ్రాహ్మణసంఘం నేతలు సైతం అభ్యంతరం చెబుతూ జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. రాత్రికి రాత్రే తొలగింపు మాజీ ప్రధానిని గౌరవించాల్సిన వ్యక్తులు, ఆయన ప్రాతినిధ్యం వహించిన కాంగ్రెస్ పార్టీ నేతలే విగ్రహం వెంటే పైలాన్ నిర్మిస్తుండడం చర్చనీయాంశంగా మారింది. జిల్లా ఉన్నతాధికారులకు బ్రాహ్మణ సంఘం నేతలు, అభిమానుల నుంచి ఫిర్యాదులు అందడంతో తొలగింపుపై కేఎంసీ అధికారులకు ఆదేశించినట్లు సమాచారం. దీంతో శుక్రవారం అర్ధరాత్రి 12 గంటల తర్వాత సిబ్బందితో సగం మేర పూర్తయిన పైలాన్ను తీయించారు. బ్రాహ్మణసంఘం పాలాభిషేకం లకారం సర్కిల్లోని పీవీ విగ్రహానికి శనివారం సాయంత్రం ఖమ్మం నగర బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యాన పాలాభిషేకం చేశారు. విగ్రహం వద్ద చేపట్టిన పైలాన్ నిర్మాణాన్ని తొలగించడంపై హర్షం వ్యక్తం చేశారు. అధ్యక్షుడు మారంరాజు రాధాకృష్ణ, మాటూరి లక్ష్మీనారాయణ, ఊటుకూరు వెంకట రవికాంత్, పర్చా రంగారావు, జమలాపురం కేశవరావు, చాగంటి రామకృష్ణ, ఊటుకూరు చంద్రశేఖరరావు, సూరావర్జుల వాసు, శ్రీకాంత్, సరస్వతి కుమార్, దేవులపల్లి నరసింహారావు, వల్లూరు విజయ్కుమార్, సత్యనారాయణచార్యులు, శ్రీధర్ పాల్గొన్నారు.కొందరు కార్యకర్తల అత్యుత్సాహంతోనే ఇలా జరిగింది. మాజీ ప్రధాని పీ.వీ.నరసింహారావు వంటి మహోన్నత వ్యక్తిని కించపరిచేలా ఎలాంటి చర్యలు ఉండకూడదు. కార్యకర్తలు ప్రచార ఆర్భాటం కన్నా ప్రజలకు ఉపయోగపడే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై దృష్టి సారించాలి. పైలాన్ నిర్మిస్తున్నారనే విషయం తెలియగానే తొలగించాలని కేఎంసీ కమిషనర్ను ఆదేశించా. –తుమ్మల నాగేశ్వరరావు, వ్యవసాయ శాఖ మంత్రి -
విజయ డెయిరీకి పూర్వ వైభవం తీసుకురాలి
ఖమ్మంవ్యవసాయం: ఖమ్మం విజయ డెయిరీకి తిరిగి పూర్వవైభవం తీసుకొచ్చి, రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దేలా చర్యలు చేపట్టాలని రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. హైదరాబాద్లో శనివారం ఆయన విజయ డెయిరీ చైర్మన్ గుత్తా అమిత్రెడ్డి, మేనేజింగ్ డైరెక్టర్ కె.చంద్రశేఖర్రెడ్డితో పాటు అధికారులతో సమీక్షించారు. జిల్లాలో పాల ఉత్పత్తి, సేకరణ, రైతులకు మద్దతు ధర, మహిళల భాగస్వామ్యంపై సమగ్ర ప్రణాళిక రూపొందించాలని సూచించారు. ఉమ్మడి జిల్లాలో పాడి పరిశ్రమకు అపారమైన అవకాశాలు ఉన్నందున రైతుల్లో విశ్వాసం పెంపొందిస్తే పాల సేకరణ పెరుగుతుందని తెలిపారు. అలాగే, మహిళల భాగస్వామ్యాన్ని పెంచితే లక్ష్యాలను సాధించవచ్చన్నారు. అనంతరం చైర్మన్ అమిత్రెడ్డి మాట్లాడుతూ డెయిరీ అభివృద్ధికి ప్రణాళికలను సిద్ధం చేశామని తెలిపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నాణ్యమైన పాల సేకరణకు విస్తృత అవకాశాలు ఉన్నందున, డెయిరీ అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తామని పేర్కొన్నారు. ఈ సమీక్షలో వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్, సహకార శాఖ రిజిస్ట్రార్ రాహుల్రాజ్, విజయ డెయిరీ జనరల్ మేనేజర్ మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు.సమీక్షలో రాష్ట్ర మంత్రి తుమ్మల -
శ్రీవారికి నిత్యకల్యాణం, పల్లకీసేవ
ఎర్రుపాలెం: మండలంలోని జమలాపురం శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం అర్చకులు, వేదపండితులు ప్రత్యేక పూజలు చేశారు. తెల్లవారుజామున గర్భగుడిలోని స్వామి విగ్రహంతో పాటు ఆలయ ప్రాంగణంలోని శ్రీవారి పాదానికి పంచామృతంతో అభిషేకం నిర్వహించారు. అనంతరం స్వామి, అలివేలు మంగ, పద్మావతి అమ్మవార్లను పట్టువస్త్రాలతో అలంకరించి నిత్యకల్యాణం జరిపించారు. అలాగే, పెద్దసంఖ్యలో హాజరైన భక్తుల సమక్షాన పల్లకీ సేవ నిర్వహించారు. ఈకార్యక్రమంలో ఆలయ ఈఓ జగన్మోహన్రావు, వ్యవస్థాపక ధర్మకర్త ఉప్పల విజయదేవశర్మ, ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాసశర్మ, ఉద్యోగులు సోమయ్య, కృష్ణప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. గిరిజన గురుకులాల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్ భద్రాచలంటౌన్: ఉమ్మడి జిల్లాలోని గిరిజన బాలుర గురుకుల కాలేజీల్లో ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాలు కల్పించేందుకు భద్రాచలం గిరిజన సంక్షేమ గురుకుల కళాశాలలో శనివారం కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ ప్రక్రియను గిరిజన సంక్షేమ గురుకులాల రీజినల్ కోఆర్డినేటర్ బి.అరుణకుమారి పర్యవేక్షించారు. మొత్తం 539 సీట్లకు గాను దరఖాస్తుల పరిశీలన అనంతరం 480 మంది విద్యార్థులను ఎంపిక చేసి కృష్ణసాగర్, కిన్నెరసాని, దమ్మపేట, గుండాల, సింగరేణి, తిరుమలాయపాలెం కళాశాలల్లో సీట్లు కేటాయించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాళ్లు బీ.ఎల్.నారాయణరావు, జి.హరికృష్ణ, భాస్కర్, ఎం.దేవదాస్, రమేష్, సీతారాం నాయక్, పద్మావతి, హేమలత తదితరులు పాల్గొన్నారు. జేఈఈ పరీక్షా కేంద్రాల వద్ద ఆంక్షలు ఖమ్మంక్రైం: జేఈఈ(అడ్వాన్స్డ్) పరీక్షలు ఆదివారం జరగనున్న నేపథ్యాన కేంద్రాల వద్ద ఉదయం 5–30నుంచి రాత్రి 8–30గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని పోలీసు కమిషనర్ సునీల్దత్ తెలిపారు. ఈమేరకు కేంద్రాలకు 200మీటర్ల దూరం వరకు ఐదుగురికి మించి గుంపులుగా ఉండొద్దని సూచించారు. అలాగే, సభలు, ర్యాలీలు, డీజేలతో ఊరేగింపులు, ధర్నాలకు అనుమతి ఉండదని తెలిపారు. అంతేకాకుండా కేంద్రాల పరిసరాల్లోని ఇంటర్నెట్, జిరాక్స్ షాపులు, స్టేషనరీ దుకాణాలు మూసివేయాలని సూచించారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీపీ ఓ ప్రకటనలో వెల్లడించారు. రాజీకి అనుకూలమైన కేసులు పరిష్కరించాలి ఖమ్మంలీగల్: రాజీకి అనుకూలమైన కాంపౌండబుల్ కేసులను గుర్తించి జాతీయ లోక్అదాలత్లో పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఖమ్మం మహిళా కోర్టు న్యాయమూర్తి ఉసికల శీనయ్య సూచించారు. వచ్చేనెల 20న నిర్వహించనున్న లోక్ అదాలత్పై శనివారం ఆయన పోలీసు అధికారులతో సమీక్షించారు. లోక్అదాలత్ విజయవంతం అయ్యేలా పోలీసు అదికారులలు సహకరించాలని సూచించారు. స్టేషన్ల పరిధిలో రాజీకి పరిష్కారానికి అనువైన కేసులను గుర్తించి ఇరుపక్షాలను సమన్వయం చేస్తే ఫలితం ఉంటుందని తెలిపారు. అనంతరం డీఎల్ఎస్ఏ కార్యదర్శి పి.దేవీమానస మాట్లాడుతూ జాతీయ లోక్ అదాలత్ ద్వారా కేసులు త్వరగా పరిష్కారమవుతాయని వెల్లడించారు. -
పోరాటాలతోనే హక్కుల సాధన
వైరా: మహిళలు పోరాటాల ద్వారా హక్కులు సాధించుకోగా, ప్రస్తుత పాలకుల విధానాలపైనా బహుముఖ పోరాటాలకు సిద్ధం కావాలని తెలంగాణ రాష్ట్ర మహిళా సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నేదునూరి జ్యోతి పిలుపునిచ్చారు. సమాఖ్య జిల్లా మహాసభలు శనివారం వైరాలో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా జ్యోతి మాట్లాడుతూ.. మహిళల్లో ప్రగతి శీల మార్పుల దిశగా సమాఖ్య పని చేస్తోందన్నారు. ప్రస్తుత పార్లమెంట్ సభ్యులకు అనుగుణంగా మహిళలకు రిజర్వేషన్లు కల్పించే అవకాశం ఉన్నా, కేంద్ర ప్రభుత్వం బిల్లు పేరిట చేస్తున్న యత్నాల్లో అవకాశవాదం దాగి ఉందని చెప్పారు. కాగా, బీజేపీ పాలనలో మహిళలపై అఘాయిత్యాలు పెరిగాయని, బీజేపీ పాలిత ప్రాంతాల్లో కనీస న్యాయం అడగడాన్ని కూడా నేరంగా పరిగణిస్తున్నారని తెలిపారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కొడుకు ఓ యువతిపై అఘాయిత్యం చేసినా ప్రజాప్రతినిధులు, పోలీసులు వ్యవహరిస్తున్న తీరు ఆక్షేపణీయమని చెప్పారు. ఇక కాంగ్రెస్ మహిళలకు హామీ ఇచ్చినట్లుగా నెలకు రూ.2,500, కల్యాణలక్ష్మి ద్వారా తులం బంగారం హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. వైరా మున్సిపల్ చైర్ పర్సన్ డాక్టర్ కాపా చంద్రకళ మాట్లాడుతూ.. మహిళా చైతన్యంతోనే సమాజంలో మార్పు వస్తుందని తెలిపారు. సమావేశానికి పోటు కళావతి, దండి శ్రీజ, సీహెచ్ సీతామహాలక్ష్మి, బేబీ రాణి అధ్యక్ష వర్గంగా వ్యవహరించగా, నాయకులు యర్రా బాబు, దొండపాటి రమేశ్, ఏపూరి లతాదేవి, తాటి నిర్మల, బత్తినేని నీరజ, నల్లమోతు శైలజ, మందడపు రాణి, కర్నాటి నళిని, ఏపూరి పద్మ, కారం కోటమ్మ, లలిత, లక్ష్మి, రంజాన్బీ తదితరులు పాల్గొన్నారు.మహిళా సమాఖ్య జిల్లా సభల్లో రాష్ట్ర కార్యదర్శి జ్యోతి -
మాట్లాడుకుందామని పిలిచి హత్య?
● వెంచర్లో ప్రాణాలు కోల్పోయిన మహిళ ● వివాహాతేర సంబంధాలే కారణమని అనుమానాలుమధిర: భర్తకు దూరంగా ఉంటున్న ఓ మహిళకు ఇద్దరితో పరిచయం ఏర్పడింది. వీరిద్దరి మధ్య మొదలైన ఘర్షణ ఆ మహిళ హత్యకు దారి తీసినట్లు తెలుస్తోంది. మధిర మండలంలో శనివారం చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలు.. ఏపీలో ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం మేడూరుకు చెందిన గోపిశెట్టి కల్పన (27) – మైలవరం మండలం బొర్రగూడెంకు చెందిన డేరంగుల నాగరాజు 2021లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు జన్మించాక మనస్పర్దలతో వేర్వేరుగా ఉంటున్నారు. ఆపై కల్పన కొంతకాలం తిరువూరులో, ప్రస్తుతం మధిరలోని ఒక ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలో పనిచేస్తోంది. ఈ క్రమాన వాయిద్యకారుడు విజయభాస్కర్తో ఆమెకు పరిచయం ఏర్పడ్డాక, కొన్నాళ్లకు తిరువూరులోని ద్విచక్ర వాహనాల షోరూమ్లో పనిచేసే గంపలగూడెం మండలం కనుమూరుకు చెందిన యార్లగడ్డ చెన్నారావుతో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయమై విజయభాస్కర్, చెన్నారావు మధ్య కొంతకాలంగా వివాదం జరుగుతోంది. ప్రస్తుతం మేడూరులోని పుట్టింట్లో ఉంటూ మధిర వచ్చివెళ్లే కల్పన రోజులాగే శనివారం కూడా బయలుదేరింది. ఇద్దరం కలిసి మాట్లాడుదాం.. కల్పన విషయమై మాట్లాడే పని ఉందని, ఆమె కూడా వస్తున్నందున రావాలని చెన్నారావు.. విజయభాస్కర్కు ఫోన్ చేసి చెప్పాడు. ఈ క్రమాన తొలుత చెన్నారావు, కల్పన ద్విచక్ర వాహనంపై మధిర మండలం కృష్ణాపురం సమీపాన వెంచర్లోకి వెళ్లారు. ఆ లొకేషన్ను విజయభాస్కర్కు షేర్ చేయడంతో ఆయన కాసేపయ్యాక బయలుదేరాడు. అయితే, తొలుత వెళ్లిన చెన్నారావు, కల్పన మధ్య జరిగిన వాగ్వాదంతో ఆమెను హత్య చేసినట్లు తెలుస్తోంది. ఆపై చెన్నారావు వెళ్లిపోగా, కాసేపటికి లొకేషన్ ఆధారంగా చేరుకున్న విజయభాస్కర్కు ఇద్దరూ కనిపించకపోవడంతో వెనుదిరిగాడు. కొద్దిసేపయ్యాక కల్పన మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మధిర సీఐ మధు, సిబ్బంది చేరుకుని పంచనామా నిర్వహించారు. అంతేకాక మృతురాలి భర్త నాగరాజు, ఆమెతో పరిచయం ఉన్న విజయభాస్కర్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా, హత్య అనంతరం పరారైన చెన్నారావు.. కల్పన సోదరుడి సెల్ఫోన్కు పలు అంశాలపై వాట్సప్ మెసేజ్లు చేసినట్లు తెలిసింది. ఈ మేరకు మృతురాలి తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నామని సీఐ వెల్లడించారు. -
రేపు మాక్ ఎక్సర్రైజ్
ఖమ్మంసహకారనగర్: వరదలు, ఇతర ప్రమాదాలు ఎదురైనప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సహాయక చర్యలపై ప్రణాళిక కోసం సోమవారం మాక్ ఎక్సర్సైజ్ నిర్వహిస్తున్నట్లు అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి తెలిపారు. కలెక్టరేట్లో శనివారం ఆయన పలు శాఖల అధికారులతో సమావేశమై మాట్లాడారు. సోమవారం ఉదయం 8 గంటలకు మాక్ ఎక్సర్సైజ్కు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సూచించారు. జాతీయ విపత్తుల నిర్వహణ అథారిటీ సూచనలు, గత అనుభవాల దృష్ట్యా మున్నేటి వరదలు లేదా ఇతర విపత్తులు ఎదురైనప్పుడు యంత్రాంగం స్పందించాల్సిన తీరుపై మాక్ ఎక్సర్సైజ్ ఉంటుందని తెలిపారు. ఎస్ఐలు ఎ.విశ్వతేజ, పి.వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు. రైస్ మిల్లును తనిఖీ చేసిన డీసీఎస్ఓ ముదిగొండ: మండలంలోని వనంవారికిష్టాపురంలో రైస్మిల్లును డీసీఎస్ఓ చందన్కుమార్ శనివారం తనిఖీ చేశారు. మేడేపల్లికి చెందిన రైతు ఊటుకూరు సైదులు సదరు మిల్లులో క్వింటా ధాన్యానికి ఏడు కిలోల తరుగు తీస్తున్నారని సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఈ వీడియో వైరల్ కావడంతో డీసీఎస్ఓ విచారణ చేపట్టారు. ధాన్యం తూర్పార పట్టాకే తీసుకురావాలని చెప్పామే తప్ప తరుగు తీయలేదని మిల్లు యజమాని బదులిచ్చాడు. ఆ తర్వాత రైతు వాంగ్మూలం కూడా సేకరించిన డీసీఎస్ఓ, రైతులను అనవసరంగా ఇబ్బంది పెట్టొద్దని సూచించారు. సివిల్ సప్లయీస్ డీటీ నాగలక్ష్మి, ఆర్ఐ కల్యాణి, జీపీఓ బాలకృష్ణ పాల్గొన్నారు. ఖాతా నుంచి రూ.లక్ష స్వాహా సీపీ కార్యాలయం ఎదుట హల్చల్ ఖమ్మంక్రైం: మద్యం మత్తులో ఓ వ్యక్తి పోలీస్ కమిషనర్ కార్యాలయం ముందు శనివారం హడావుడి చేశాడు. ప్రకాష్నగర్ ప్రాంతానికి చెందిన పందిరి శివ కొంతకాలంగా భార్యతో గొడవపడి దూరంగా ఉంటున్నాడు. ఈనేపథ్యాన తననెవరూ పట్టించుకోవడం లేదని, న్యాయం చేయాలని కోరుతూ మద్యం మత్తులో వచ్చిన ఆయన ఒంటిపై పెట్రోల్ పోసుకోన్నాడు. దీంతో అక్కడ విధులు నిర్వర్తిస్తున్న సిబ్బంది అడ్డుకోబోగా వారిపైనా దురుసుగా ప్రవర్తించాడు. ఈమేరకు శివను బలవంతంగా పోలీస్స్టేషన్కు తరలించి కేసు నమోదు చేసినట్లు త్రీటౌన్ సీఐ మోహన్బాబు తెలిపారు. -
సైకిల్పై స్కూల్కు వెళ్తా..
మమ్మీ, డాడీ ఈ సెలవుల్లో సైకిల్ కొనిచ్చారు. దీంతో తొలుత డాడీ సాయంతో సైకిల్ తొక్కడం నేర్చుకున్నా. ఇప్పుడు సొంతంగానే సైకిల్ తొక్కగలుగుతున్నా. అయినా రోడ్లపైకి వెళ్లకుండా ఉదయం, సాయంత్రం వీధిలోనే ప్రాక్టీస్ చేస్తున్నా. సెలవుల్లో ఫ్రెండ్స్ అందరం సైకిల్ తొక్కుతుండగా.. స్కూల్కు కూడా ఈసారి సైకిల్పైనే వెళ్తాను. –అంజన్కుమార్, బెస్తకాలనీ, శ్రీనివాసనగర్, ఖమ్మం సైకిళ్లపై క్రేజీ ఎన్నటికీ తగ్గదు. చిన్నారులు మొదలు పెద్దల వరకు సైకిల్పై మోజు చూపుతున్నారు. నడక నేర్చుకునే పిల్లల నుంచి అన్ని వయసుల వారికి అనుగుణంగా అందుబాటులో ఉన్నాయి. అబ్బాయిలు, అమ్మాయిలకు వేర్వేరు మోడళ్లు లభిస్తాయి. వేసవి సెలవులు మొదలు స్కూళ్లు ప్రారంభమయ్యే వరకు అమ్మకాలు ఎక్కువగా ఉంటాయి. –అబ్దుల్ హమీద్, సైకిల్ స్టోర్స్, కస్బాబజార్, ఖమ్మం -
‘సుడా’లో సవాళ్ల స్వాగతం!
● అనుమతుల్లో జాప్యం.. అసంపూర్తిగా మాస్టర్ ప్లాన్ ● మరోపక్క ఉద్యోగులు, సిబ్బంది కొరత ● జిల్లా వ్యాప్తంగా విస్తరించినా అన్నీ సమస్యలే ఖమ్మంమయూరిసెంటర్: స్తంభాద్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(సుడా) నూతన సారథికి సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. గత 29 నెలలకు పైగా కమిటీ లేకపోవడంతో అధికార యంత్రాంగమే బండిని నెట్టుకొచ్చింది. ఇటీవల చైర్మన్గా పువ్వాళ్ల దుర్గాప్రసాద్ను నియమించగా త్వరలోనే పూర్తిస్థాయి పాలకవర్గం కొలువుదీరనుంది. ఖమ్మం నగరంతో పాటు సుడా పరిధిలోని ప్రాంతాల అభివృద్ధిపై పాలకవర్గం దృష్టి సారిస్తే తప్ప గాడిన పడే అవకాశం లేదు. ఈనెల 13న ఎలాంటి హడావుడి లేకుండా సుడా చైర్మన్ పువ్వాళ్ల దుర్గాప్రసాద్ బాధ్యతలు చేపట్టారు. ఇకపై పరిపాలనపైనా దృష్టి సారిస్తే సమస్యలు పరిష్కారానికి నోచుకుంటాయి. మాస్టర్ ప్లాన్.. ఏళ్ల నాటి నిరీక్షణ ‘సుడా’ పరిధిలోని ప్రజలు, రియల్టర్లు ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న ప్రధాన అంశం మాస్టర్ ప్లాన్. ఖమ్మం నగరం శరవేగంగా విస్తరిస్తున్నా పాత మాస్టర్ ప్లాన్ ఇంకా పైనల్ పబ్లికేషన్ దశకు చేరలేదు. నగరంలోని రెండు ప్రాంతాలకు సంబంధించి ప్లాన్లో మార్పులు చేయాలని పలువురు కోర్టుకు వెళ్లడంతో ఆటంకం ఎదురైనట్లు తెలుస్తోంది. తద్వారా చుట్టుపక్కల ప్రాంతాల్లో అభివృద్ధి కుంటుపడుతోంది. మాస్టర్ ప్లాన్ను త్వరగా ఆమోదించి గెజిట్ విడుదల చేయించడం కొత్త చైర్మన్ ముందున్న అతిపెద్ద సవాల్గా చెబుతున్నారు. అనుమతుల్లో పారదర్శకత సుడా పరిధి విస్తరించిన తర్వాత వెంచర్లు, భారీ భవన నిర్మాణాలకు అనుమతుల జారీలో అనేక ఆరోపణలు వెల్లువెత్తాయి. గతంలో పాలకవర్గం లేని సమయంలో జారీ అయిన కొన్ని అనుమతులపై విమర్శలు వచ్చాయి. నిబంధనలకు విరుద్ధంగా వెంచర్లు వెలిశాయనే ఫిర్యాదులు ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా బాధ్యతలు చేపట్టే వారు వీటన్నింటినీ క్షేత్రస్థాయిలో పరిశీలించి, పారదర్శకమైన పాలనను అందించాల్సి ఉంది. కేఎంసీ ఉద్యోగులే ... గత ప్రభుత్వ హయాంలో సుడా పాలకవర్గం ఉన్నప్పుడు డీసీసీబీ బ్యాంక్ భవనంలోని ఓ భాగాన్ని కార్యాలయంగా మార్చుకున్నారు. పాలకవర్గం రద్దయ్యాక అక్కడి నుంచి ఖాళీ చేసి ఫర్నీచర్ను కేఎంసీకి చేర్చారు. తిరిగి ఇటీవల చైర్మన్ బాధ్యతలు స్వీకరించాక అదే భవనంలో కార్యలాపాలు నిర్వహించేందుకు అధికారులు నిర్ణయించారు. ఈమేరకు చైర్మన్ సూచనలతో అవసరమైన మరమ్మతులు మొదలుపెట్టారు. అయితే భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ‘సుడా’కు కొత్త కార్యాలయాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. మరోవైపు ప్రత్యేకంగా ఉద్యోగులు కూడా లేకపోవడంతో కేఎంసీ అధికారులే అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. దీనివల్ల ఫైళ్ల కదలికలో తీవ్ర జాప్యం జరుగుతోంది. కొత్త పాలకవర్గం చొరవ తీసుకుని ప్రత్యేక ఉద్యోగులు, సాంకేతిక సిబ్బందిని నియమించుకుంటేనే దరఖాస్తుల పరిశీలన, అనుమతుల్లో జాప్యాన్ని అరికట్టవచ్చు. దృష్టి సారిస్తేనే.. సుడా చైర్మన్ తొలుత పెండింగ్ ఫైళ్లను పరిష్కరించాల్సిన అవసరం ఉందని ఉద్యోగవర్గాలు పేర్కొంటున్నాయి. సుడా పరిధిని జిల్లా అంతటికీ విస్తరించిన నేపథ్యాన నిబంధనల అమలు, అతిక్రమణలపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాక ఆదాయ వనరులను పెంచుకోవాలి. ఇటీవల సుడా నిధులను అభివృద్ధి పనులకు కాకుండా, ప్రభుత్వ కార్యాలయాలు, అధికారుల సౌకర్యాల కోసం వెచ్చించారనే విమర్శలు వస్తున్నందున మార్పులపై దృష్టి సారించాలి. 2017లో ఏర్పాటు, 2024లో విస్తరణ స్తంభాద్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటయ్యాక ఖమ్మం నగరంతో పాటు చుట్టుప్రక్కల ప్రాంతాలు అభివృద్ధిలో దూసుకెళ్తున్నాయి. 2017 అక్టోబర్ 24న గత ప్రభుత్వం ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్తో పాటు వైరా మున్సిపాలిటీ, కూసుమంచి, ఖమ్మంరూరల్, ముదిగొండ, చింతకాని, కొణిజర్ల, రఘునాథపాలెం మండలాల్లోని 44 గ్రామపంచాయతీలను కలిపి 573 చదరపు కిలోమీటర్ల వైశాల్యంతో సుడాను ఏర్పాటు చేసింది. ఆ తర్వాత 2024 అక్టోబర్ నెలలో పరిధిని విస్తరించారు. దీంతో కామేపల్లి, ఏన్కూర్, కారేపల్లి మండలాలు మినహా జిల్లాలోని అన్ని మండలాల గ్రామపంచాయతీలను చేర్చారు. 17 మండలాల పరిధిలోని 279 గ్రామపంచాయతీలు, మధిర, సత్తుపల్లి మున్సిపాలిటీలను సుడాలో విలీనం చేయగా.. పరిధి పెరిగిన నేపథ్యాన అభివృద్ధి, పరిపాలనను పర్యవేక్షించడం కొత్త పాలకవర్గానికి సవాల్గా మారనుంది.ఖమ్మంవ్యవసాయం: ఖమ్మం గట్టయ్యసెంటర్లోని డీసీసీబీ బ్రాంచ్ భవనం మొదటి అంతస్తులో ‘సుడా’ కార్యాలయాన్ని తాత్కాలికంగా కొనసాగించేందుకు సీఈఓ ఎన్.వెంకటఆదిత్య అనుమతించారు. సుడా చైర్మన్ పువ్వాళ్ల దుర్గాప్రసాద్ అభ్యర్థనతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ‘సుడా’ సొంత భవనం ఏర్పాటుచేసుకునేంత వరకు గతంలో మాదిరి బ్రాంచ్ భవనంలోని మొదటి అంతస్తులో కొనసాగింపుకు అవకాశం కల్పించారు. -
తెలిసిన నిజం..
సత్తుపల్లిటౌన్: రామాపురం అనే గ్రామంలో స్నేహితులు రాజు, రాము ఉండేవారు. ఇద్దరూ ఒకే పాఠశాలలో చదువుతూ ఆటపాటల్లోనూ ఉత్సాహంగా పాల్గొంటూ బహుమతులు గెలిచేవారు. ఓసారి రాజు రాష్ట్రస్థాయి ఖో–ఖో పోటీలు ఎంపికయ్యాడని తెలిసి రాము సంతోషించాడు. కానీ అదే పాఠశాలలో చదువుతున్న సోముకు ఇది నచ్చలేదు. రాజుతో స్నేహం పెంచుకుని పిజ్జా, బర్గర్ వంటివి కొనిచ్చేవాడు. ఇది గమనించిన రాము.. రాజును కలిసి జంక్ఫుడ్ ఎక్కువగా తినడం మంచిది కాదని హెచ్చరించాడు. కానీ సోము మాత్రం తనతో స్నేహాన్ని రాము తట్టుకోవడం లేదని చెబుతూ ఇద్దరి మధ్య విభేదాలు సృష్టించాడు. ఒకరోజు వాళ్ల వ్యాయామ ఉపాధ్యాయుడు రాజు, మరికొందరితో ఖో–ఖో సాధన చేయిస్తున్నాడు. సోము కూడా అందులో పాల్గొన్నాడు. కొన్నాళ్లుగా జంక్ ఫుడ్ తింటున్న రాజు బరువు పెరిగి వేగంగా పరిగెత్తలేక కడుపునొప్పితో కిందపడిపోయాడు. అప్పుడు సోము.. జంక్ ఫుడ్ ఎక్కువగా తినడం వల్లే పరిగెత్త లేకపోతున్నావు, ఇలా జరగాలనే తాను జంక్ఫుడ్ అలవాటు చేయించానని చెప్పాడు. దీంతో రాము తన స్నేహితుడు రాజు పరిస్థితి చూసి బాధతో కుంగిపోయాడు. ఆ వెంటనే రాజును ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించాడు. కొన్నాళ్లకు రాజు కోలుకోగా.. తన తప్పు తెలుసుకోవడమేకాక జంక్ఫుడ్ మానేసి వ్యాయామ ఉపాధ్యాయుడు, రాము సాయంతో ఖో–ఖో మరింత సాధన చేసి రాష్ట్రస్థాయిలో ప్రథమ బహుమతి సాధించాడు. అంతేకాక జంక్ఫుడ్తో ఎదురయ్యే నష్టాలను మరికొందరికి వివరించి దానికి దూరంగా ఉండేలా అవగాహన కల్పించడం మొదలుపెట్టాడు.నీతి: స్నేహితులు, శతృవులు ఎవరో గుర్తించి అందుకు అనుగుణంగా మెదిలితే కష్టాలు దరిచేరవు. -
ప్రమాదవశాత్తు బాలుడు మృతి
సత్తుపల్లిరూరల్: ద్విచక్రవాహనంపై పెట్టి ఉన్న ఇనుప పైపులు పడడంతో బాలుడు మృతి చెందిన ఘటన సత్తుపల్లి మండలం సిద్ధారంలో శుక్రవారం చోటుచేసుకుంది. సిద్ధారం గ్రామానికి చెందిన తడికమళ్ల రాజేశ్ – సంతోషి కుమారుడు చైతన్య (20 నెలలు)ను ఇంటి ముందు గంధం రాములు ఇంట్లో ఆడుకునేందుకు తీసుకెళ్లారు. అక్కడ బాలుడు ఆడుకుంటూ బైక్ దగ్గరకు వెళ్లాడు. అది ఒరగడంతో వాహనానికి పెట్టి ఉన్న 150 కేజీల బరువైన మోటార్లు తీసే చైన్ బ్లాక్ పైపులు చైతన్యపై పడగా అక్కడికక్కడే మృతి చెందాడు. అప్పటివరకు కళ్ల ముందు ఆడుకున్న చిన్నారి మృతితో తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. రోడ్డు ప్రమాదంలో ఒకరు... నకిరేకల్: రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన నల్లగొండ జిల్లా నకిరేకల్ మండలం చందంపల్లి శివారులోని జాతీయ రహదారిపై శుక్రవారం చోటుచేసుకుంది. ఖమ్మం జిల్లా చింతకాని మండలం నాగిలికొండకు చెందిన ఆరిగోట్ల ప్రభాకర్(46) తన భార్య మమతతో కలిసి హైదరాబాద్లో తాము పనిచేస్తున్న ఏరియా మౌలాలీకి బైక్పై బయలుదేరారు. మార్గమధ్యలో నకిరేకల్ మండలం చందంపల్లి శివారు జాతీయ రహదారిపై ప్లైఓవర్ వంతెన వద్దకు రాగానే వెనుక నుంచి గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఘటనలో భార్యభర్తలకు తీవ్రగాయాలు కాగా ప్రభాకర్ను నకిరేకల్ ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు. ఘటనపై ఆయన భార్య మమత ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వీరబాబు తెలిపారు. డీజే శబ్దంతో అపస్మారక స్థితిలోకి.. తల్లాడ: బంధువుల ఇంట పెళ్లి వేడుకల సందర్భంగా డీజే శబ్దానికి అనుగుణంగా నృత్యం చేస్తున్న యువకుడు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఆస్పత్రికి తీసుకెళ్లగా మెదడులో రక్తం కట్టిందని చెప్పడంతో కుటుంబీకులు చికిత్సకు చేతిలో నగదు లేక ఆవేదన చెందుతున్న ఘటన ఇది. తల్లాడ మండలం నారాయణపురం ఎస్సీకాలనీకీ చెందిన 18 ఏళ్ల సంగసాని పార్థు సమీప బంధువు ఇంట్లో పెళ్లి సందర్భంగా గురువారం రాత్రి డీజే పాటలకు మరికొందరు యువకులతో నృత్యం చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీంతో ఖమ్మంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి మెదడులో రక్తం గడ్డ కట్టిందని, మెరుగైన చికిత్స నిమిత్తం వైద్యుల సూచనతో హైదరాబాద్ తీసుకెళ్లారు. ఇప్పటికే చికిత్సకు రూ.50 వేలు వరకు ఖర్చవగా, మరో రూ.6 లక్షలు అవుతుందని చెప్పడంతో నిరుపేదలైన పార్థు కుటుంబీకులు దిక్కుతోచని స్థితి ఎదుర్కొంటున్నారు. డీజే శబ్దం తీవ్రతే పార్థు అనారోగ్యానికి కారణమని తెలుస్తుండగా, రెక్కాడితే కానీ డొక్కాడని వ్యవసాయ కూలీ కుటుంబం కావడంతో చికిత్స కోసం దాతలు చేయూతనివ్వాలని కోరుతున్నారు. అక్రమంగా తరలిస్తున్న 50 గోవుల పట్టివేత తిరుమలాయపాలెం: బక్రీద్ నేపథ్యాన గోవుల అక్రమ రవాణాను అరికట్టేందుకు పోలీసులు విస్తృత తనిఖీలు చేపడుతున్నారు. కాగా, లారీ, వ్యాన్లలో అక్రమంగా తరలిస్తున్న 50 గోవులను పట్టుకున్నారు. మండలంలోని సుబ్లేడు క్రాస్ వద్ద ఏర్పాటు చేసిన చెక్పోస్టు సమీపాన తిరుమలాయపాలెం ఎస్ఐ కూచిపూడి జగదీశ్, సిబ్బంది శుక్రవారం తెల్లవారుజామున తనిఖీలు చేపట్టారు. ఖమ్మం నుంచి వరంగల్ వైపునకు వెళ్తున్న లారీ, వ్యాన్లో 50 గోవులను అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించారు. ఈ మేరకు హైదరాబాద్, ఏపీకి చెందిన వాహనాల డ్రైవర్లు షేక్ జమీల్, కోన ముస్లీతో పాటు పశువులను తరలిస్తున్న శేఖర్గౌడ్ను అరెస్ట్ చేసి గోవులను పండితాపురం తరలించినట్లు ఎస్ఐ తెలిపారు.మెదడులో రక్తం గడ్డ కట్టడంతో ప్రాణాపాయం -
ఐటీఐల్లో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం
ఖమ్మం సహకారనగర్: ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐలతో పాటు ప్రభుత్వ ఐటీఐలోని అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్(ఏటీసీ)లో మొదటి దఫా ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కన్వీనర్, టేకులపల్లిలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్ ఏ.శ్రీనివాసరావు తెలిపారు. ఆసక్తి, అర్హతలు ఉన్న విద్యార్థులు https:/iti.telangana.gov.in వెబ్సైట్ ద్వారా ఈనెల 25నుంచి ఆగస్టు 8వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. సర్టిఫికెట్ల పరిశీలన అనంతరం మెరిట్ ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుందని ఆయన ఓ ప్రకటనలో తెలిపారు. డీఎల్ఈడీ కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు భద్రాచలంటౌన్: భద్రాచలంలోని ప్రత్యేక గిరిజన డీఎల్ఈడీ కళాశాలలో 2026–28 విద్యాసంవత్సరానికి తెలుగు మీడియంలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఐటీడీఏ పీఓ బి.రాహుల్ తెలిపారు. ఏజెన్సీ షెడ్యూల్ ప్రాంత గిరిజన అభ్యర్థులు ఈనెల 31లోగా దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించారు. ఇంటర్లో 45 శాతం మార్కులతో ఉత్తీర్ణులైన వారు అర్హులని, 50 సీట్లను మెరిట్, రిజర్వేషన్ల ఆధారంగా భర్తీ చేస్తామని పేర్కొన్నారు. భద్రాచలం డీఎల్ఈడీ కళాశాలతో పాటు ఏటూరునాగారం, ఉట్నూరు, మన్ననూరు ఐటీడీఏ కార్యాలయాల్లో దరఖాస్తులు ఉచితంగా లభిస్తాయని, వివరాలకు 99595 75539, 86390 84543 నంబర్లలో సంప్రదించాలని పీఓ సూచించారు. ప్రశాంతంగా గురుకుల కళాశాలల ప్రవేశపరీక్ష ఖమ్మంమయూరిసెంటర్: తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులాల్లో ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాలకు శుక్రవారం నిర్వహించిన పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. భద్రాద్రి జోన్ ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని 9 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించినట్లు జోనల్ అధికారి కె.అలివేలు వెల్లడించారు. ఖమ్మం జిల్లాలోని ఆరు కేంద్రాల్లో 2,519 మంది విద్యార్థులకు గాను 2,232 మంది, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మూడు కేంద్రాల్లో 1,217 మంది విద్యార్థులకు గాను 1,014 మంది హాజరయ్యారని తెలిపారు. పంట వ్యర్థాలను కాల్చొద్దు వైరా: రైతులు పంట వ్యర్థాలను కాల్చడం ద్వారా భూసారాన్ని పాడు చేసుకోవద్దని జిల్లా వ్యవసాయ శాఖాధికారి డి.పుల్లయ్య సూచించా రు. వైరా మండలం సోమవరం గ్రీన్ఫీల్డ్ హైవే పక్కన నిప్పంటిన వరి కొయ్యలను శుక్రవారం ఆయన ఆర్పివేయించారు. అనంతరం డీఏఓ వరి కొయ్యలను కాల్చడం వల్ల జరిగే నష్టాలను రైతులకు వివరించారు. మంటలతో భూసారాన్ని పెంచే సూక్ష్మ జీవులు చనిపోవడమే కాక, సమీపంలోని పంట నిల్వలకు నష్టం జరుగుతుందని తెలిపారు. ఈమేరకు రైతులెవరైనా నిప్పంటిస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు. వైరా ఏఓ మయాన్ మంజుఖాన్, ఏఈఓ మేడా రాజేష్ పాల్గొన్నారు. డెంగీ నివారణకు విస్తృత అవగాహన ఖమ్మంవైద్యవిభాగం: డెంగీ బారిన పడకుండా ప్రజల్లో విస్తృత అవగా హన కల్పించడం ద్వారా వ్యాధి కట్టడికి కృషి చేస్తున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి రామారావు తెలిపారు. జాతీయ డెంగీ దినోత్సవాన్ని శనివారం నిర్వహించనుండగా, శుక్రవారం ఖమ్మంలో ఆయన మాట్లాడారు. డెంగీపై ప్రజల్లో అవగాహన కల్పించడం, నివారణ చర్యలను విస్తృతం చేయడమే ఈ దినోత్సవం ముఖ్య ఉద్దేశ్యమని తెలిపారు. శుభ్రమైన నిల్వ నీటిలో పెరిగి, పగటి సమయాన మాత్రమే కుట్టే దోమల ద్వారా డెంగీ వ్యాప్తి చెందుతుందని చెప్పారు. జాగ్రత్తలు తప్పనిసరి డెంగీ నివారణను ప్రజలు వ్యక్తిగత బాధ్యతగా భావించాలని డీఎంహెచ్ఓ సూచించారు. ఇంటి పరిసరాలు, కూలర్లు, డ్రమ్ములు, పూలకుండీలు, కొబ్బరి చిప్పలు, టైర్లలో నీరు నిల్వ ఉండకుండా చూడాలని తెలిపారు. అలాగే, దోమల నివారణ కోసం దోమ తెరలు వినియోగించాలని, డెంగీ లక్షణాలు కనిపిస్తే స్వీయ వైద్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలని చెప్పారు. ప్రధానంగా పిల్లలు, వృద్ధుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. కాగా, వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యాన లార్వా నిరోధక, ఫాగింగ్, ప్రత్యేక పారిశుద్ధ్య చర్యలు చేపడుతున్నట్లు డీఎంహెచ్ఓ రామారావు తెలిపారు. -
ఉపాధి తగ్గుతోంది..
గత రెండు, మూడేళ్లుగా జిల్లాలోని కూలీలను మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఆదుకోలేకపోతోంది. జిల్లాకు కేటాయిస్తున్న పనిదినాల సంఖ్యలో హెచ్చుతగ్గులతో ఈ పరిస్థితి వస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ పనులు లేని సమయాన ఈ పథకం ద్వారా వేలాది కుటుంబాలు లబ్ధిపొందాయి. జిల్లాలోని 20 మండలాల్లో పెద్ద సంఖ్యలో కూలీలు హాజరవుతుండటంతో అధికారులు అదే స్థాయిలో పనిదినాల లక్ష్యాలను కేటాయిస్తూ వచ్చారు. కానీ ఆ పరిస్థితి క్రమేణా మారిపోతోంది. ఇక జూలై 1నుంచి వీబీజీ–రామ్జీ పథకం అమల్లోకి జిల్లాపై మరింత ప్రభావం పడుతుందని చెబుతున్నారు. – సాక్షిప్రతినిధి, ఖమ్మంపనిదినాల్లో హెచ్చుతగ్గులు గత ఐదేళ్ల లక్ష్యాలను పరిశీలిస్తే పనిదినాల సంఖ్యలో వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి. కరోనా కన్నా ముందు జిల్లాలో 70 లక్షల నుంచి 80 లక్షల పనిదినాలను కేటాయించినా కూలీల డిమాండ్ నేపథ్యాన పూర్తయ్యాయి. కానీ 2021 –22లో జిల్లాకు 64 లక్షల పనిదినాలు కేటాయిస్తే 65.63 లక్షల పనిదినాలు పూర్తి చేశారు. ఆ మరుసటి ఏడాది 54 లక్షలకు కుదించగా.. 57.80 లక్షల పనిదినాలు, 2023–24లో కేవలం 46 లక్షల పనిదినాలను లక్ష్యంగా కేటాయించగా.. అధిక డిమాండ్తో 54.79 లక్షల పనిదినాలను కల్పించారు. ఇక 2024–25 ఏడాదిలో పనిదినాల సంఖ్య 62.17 లక్షలకు పెంచారు. కానీ 60.24 లక్షల మంది కూలీలకు పనులు చూపించారు. గత ఏడాది (2025–26) మాత్రం 34.9 లక్షల పనిదినాలనే ఖరారు చేయడంతో 35.57 లక్షల మంది కూలీలు పనులకు వెళ్లారు. నెలన్నరే గడువు జిల్లాలో 3,05,336 జాబ్ కార్డులు ఉండగా, 6,28,717 మంది కూలీలు ఉన్నారు. ప్రస్తుతం 71,573 కుటుంబాలకు చెందిన 1,08,078 మంది కూలీలు పని కావాలని కోరుతున్నట్లు వెబ్సైట్ ద్వారా తెలుస్తోంది. యంత్రాంగం మాత్రం 31,112 కుటుంబాలకే పని కల్పిస్తోంది. రోజువారీగా 60వేల మందికే పని దొరుకుతుండడం గమనార్హం. మరోపక్క ఈనెలాఖరు నాటికి జిల్లాకు 16.89 లక్షల పనిదినాల లక్ష్యాన్ని ప్రభుత్వం కేటాయిస్తే కేవలం 5.85 లక్షలే పూర్తయ్యాయి. పాత పథకం మరో నెలన్నర మాత్రమే కొనసాగనుండగా.. కొత్త పథకం వస్తే లక్ష్యాలు మారనున్నాయి. ప్రభుత్వం కేటాయించిన లక్ష్యాలకు అనుగుణంగా కూలీలకు పని కల్పిస్తే వారికి మేలు జరగడంతో పాటు జిల్లాకు నిధులు మంజూరవుతాయి. కార్యదర్శులకే బాధ్యత గ్రామాల్లో ఉపాధి పనులకు సంబంధించి పూర్తి బాధ్యతలను జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ పంచాయతీ కార్యదర్శులకు అప్పగించింది. పనుల డిమాండ్ స్వీకరణ, కల్పన, సౌకర్యాల ఏర్పాటు, మేట్ల ద్వారా హాజరు నమోదు బాధ్యతలన్నీ వీరే నిర్వర్తించాల్సి ఉంటుంది. కానీ ఇప్పటికే అనేక పనులతో సతమతమవుతున్న కార్యదర్శులకు ఈ బాధ్యతలు తలకు మించిన భారంలా మారాయి. గతంలో ఫీల్డ్ అసిస్టెంట్లు ఈ పనులు చేయగా, చాలా గ్రామాల్లో వారు లేకపోవడంతో కార్యదర్శులకు అప్పగించినట్లు తెలుస్తోంది.మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో సమూల మార్పులు చేసిన కేంద్ర ప్రభుత్వం జూలై ఒకటి నుంచి వీబీజీ–రామ్జీ (వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్ గ్రామీణ్) పథకాన్ని అమల్లోకి తీసుకొస్తోంది. దీనిపై పూర్తిస్థాయిలో ఇంకా మార్గదర్శకాలు విడుదల కాలేదు. వంద రోజుల పనిదినాలను 125 రోజులకు మారుస్తున్నట్లు కేంద్రం చెబుతున్నా.. కొన్ని కార్మికసంఘాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుతం జిల్లాకు కేటాయిస్తున్న పనిదినాలే కొత్త పథకంలోనూ రావాలంటే కూలీలతో పనులు ఎక్కువగా చేయించాలి. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకుని మే, జూన్ నెలల్లో యంత్రాంగం భారీ స్థాయిలో పనులను కల్పించాల్సిన అవసరముంది.ఏటేటా పడిపోతున్న పనిదినాల సంఖ్య కూలీలకు పని విషయంలో కేంద్రం నిబంధనలు కఠినం చేస్తోంది. ఇన్నాళ్లు 90 శాతం నిధులను కేంద్రమే భరించగా ఇప్పుడు 60శాతానికి పరిమితం చేస్తుంది. రాష్ట్రప్రభుత్వం 40శాతం కేటాయించాల్సి రావడంతో అనుకున్న స్థాయిలో పనుల కల్పన కష్టమే. – బాగం హేమంతరావు, రాష్ట్ర అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర రైతుసంఘంకేంద్రం ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చేలా కొన్నేళ్లుగా నిధులు సరిగా కేటాయించడం లేదు. కొన్నిసార్లు నిధులు కేటాయించినా విడుదల చేయడం లేదు. కొత్త పథకంతో కూలీలు హక్కులు కోల్పోతారు. రాష్ట్ర ప్రభుత్వ వాటా పెంచడంతో పనులు తగ్గుతాయి. – పోతినేని సుదర్శన్రావు, రాష్ట్ర అధ్యక్షుడు, రాష్ట్ర రైతు సంఘం -
భగ్గుమంటున్న భానుడు
ఖమ్మంవ్యవసాయం: భానుడు భగ్గుమంటున్నాడు. జిల్లా నిప్పుల కుంపటిగా మారడంతో జనం అల్లాడిపోతున్నారు. కొద్దిరోజులుగా ఉష్ణోగ్రత 40–45 డిగ్రీల మధ్య నమోదవుతోంది. శుక్రవారం కూడా గరిష్టంగా 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడం గమనార్హం. ఎండ తీవ్రతకు వడదెబ్బ మరణాలు సంభవిస్తుండగా, పశుపక్షాదులు సైతం ఇబ్బంది పడుతున్నాయి. ఉదయం 9గంటల నుంచే ఎండ తీవ్రత మొదలై సాయంత్రం 5గంటల వరకు కొనసాగుతోంది. మధ్యాహ్నం వేళ ఎండకు తోడు వడగాలులతో జనం బయటకు వచ్చే పరిస్థితి ఉండడం లేదు. ఎండ ప్రభావం కారనంగా రైతులు, కూలీలు, నిర్మాణ రంగ కార్మికులు అవస్థ పడుతున్నారు. తిమ్మారావుపేటలో గరిష్టం జిల్లాలోని ఏన్కూరు మండలం తిమ్మారావుపేటలో శుక్రవారం గరిష్టంగా 43.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే, గౌరారం, బాణాపురంలో 43.8, పమ్మిలో 43.7, రావినూతలలో 43.6, గుబ్బగుర్తిలో 43.5, సిరిపురం, కలెక్టరేట్, ఏన్కూరులో 43.2, వైరాలో 43, మధిరలో 42.9, వైరా ఏఆర్ఎస్లో 42.7, నాగులవంచలో 42.6, తల్లాడలో 42.5, ఖానాపురంలో 42.4, చింతకాని, కుర్నవల్లిలో 42.3, నేలకొండపల్లిలో 42.2, ఎర్రుపాలెంలో 42.1, ప్రకాష్నగర్, కొణిజర్లలో 42 డిగ్రీలుగా నమోదైంది. అంతేకాక ముదిగొండ, మధిర ఏఆర్ఎస్లో 41.9, కల్లూరులో 41.7, గేటు కారేపల్లిలో 41.5, పెద్దగోపతి, రఘునాథపాలెం, లింగాలలో 41.3, ఖమ్మం ఎన్ఎస్పీ గెస్ట్హౌస్, బచ్చోడులో 41.1, సత్తుపల్లి, పంగిడిలో 41, సత్తుపల్లి ఓసీ, కూసుమంచిలో 40.9, కాకరవాయిలో 40.8, మంచుకొండలో 40.6, తిరుమలాయపాలెం, గాంగారంలో 40.5, వేంసూరు, సదాశివునిపాలెంలో 40.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.ఎండ తీవ్రతతో జనం ఉక్కిరిబిక్కిరి -
మోత మోగింది..
ఖమ్మంసహకారనగర్: అందరూ భావిస్తున్నట్లుగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. ఇరవై రోజుల క్రితం పెట్రోల్, డీజిల్కు ఇక్కట్లు వచ్చినప్పుడే ధరల పెంపునకు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారనే ప్రచారం జరిగింది. దీన్ని నిజం చేసేలా శుక్రవారం ఉదయం పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగినట్లు బంక్ల నిర్వాహకులు ప్రకటించారు. దీంతో విషయం తెలియక బంక్లకు వచ్చిన వినియోగదారులు నివ్వెరపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. 223 బంక్లు, 8 లక్షల లీటర్ల వినియోగం జిల్లాలో అన్ని కంపెనీలవి కలిపి 223 పెట్రోల్ బంక్లు ఉన్నాయి. వీటి పరిధిలో రోజుకు పెట్రోల్ 3 లక్షల లీటర్ల అమ్మకాలు జరుగుతాయి. అంతేకాక డీజిల్ సుమారు 5 లక్షల లీటర్ల అమ్మకాలు జరుగుతాయని అంచనా. ప్రస్తుతం పెట్రోల్ లీటర్ ధర రూ.107.94 ఉండగా రూ.3.39 పెంపుతో రూ.111.33కు చేరింది. ఇక లీటర్ డీజిల్ ధర రూ.96.13 ఉండగా, రూ.3.27 పెంపుతో రూ.99.13కి పెరిగింది. 2022 అక్టోబర్ తర్వాత ధరలు పెరగడం ఇదే తొలిసారని చెబుతున్నారు. ఈ పెంపుతో రోజుకు పెట్రోల్ వినియోగదారులపై సుమారు రూ.9 లక్షలకు పైగా, డీజిల్ వాహనదారులకు రూ.15 లక్షలకు మించి అదనపు భారం పడనుంది. సామాన్యుల జీవితాలపై భారం పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో సామాన్య ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల పెరుగుదల, రూపాయి విలువ పడిపోవడం, రవాణా ఖర్చులు అధికమవడం వంటి కారణాలతో ఇంధన ధరలు పెరిగినట్లు తెలుస్తోంది. అయితే, ఈ పెంపుదల ప్రజల జీవనంపై నేరుగా పడనుంది. ముఖ్యంగా ఆటో, క్యాబ్ డ్రైవర్లు, రైతులు, చిన్న వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. డీజిల్ ధరలు పెరగడంతో సరుకు రవాణా ఖర్చులు అధికమై.. కూరగాయలు, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఇక పెట్రోల్ ధర పెరిగిన కారణంగా ఉద్యోగులు, చిరువ్యాపారుల నెలవారీ ప్రయాణ ఖర్చుల్లో తేడా రానుంది. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ పనుల కోసం ట్రాక్టర్లు, మోటార్లు నిర్వహించే రైతులు కూడా ధరల పెంపుతో ఇబ్బంది పడనున్నారు.పెట్రోల్, డీజిల్ ధర లీటర్పై రూ.3కు పైగా పెంపు కొద్దిరోజులు పెట్రోల్ దొరక్క ఇబ్బందులు పడ్డాం. ఆ సమస్య తీరిందనుకునేలోపే ధరలు పెంచి సామాన్యులపై భారం మోపారు. ఇప్పటికే జీవనవ్యయం పెరిగి బయటకు వెళ్లాలంటే భయపడాల్సిన పరిస్థితి ఉంది. ఇంతలోనే లీటర్ పెట్రోల్ పై రూ.3కు పైగా పెంచడంతో మరింత భారం పడనుంది. –మొక్క సురేశ్, వాహనదారుడు, ఖమ్మం -
కేసీఆర్ లక్ష్యంగా జాతీయ పార్టీల కుట్ర
సాక్షిప్రతినిధి, ఖమ్మం: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యంగా రెండు జాతీయ పార్టీలు కుట్రలు చేస్తున్నాయని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఉమ్మడి జిల్లా పార్టీ సభ్యత్వ నమోదు ఇన్చార్జి తక్కెళ్లపల్లి రవీందర్రావు, మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. ఖమ్మంలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, కందాల ఉపేందర్రెడ్డితో కలిసి వారు మాట్లాడారు. ఈ సందర్భంగా తక్కెళ్లపల్లి మాట్లాడుతూ స్థానిక ఎన్నికల్లో గెలుపుతో కాంగ్రెస్ నేతలు సంబురపడుతున్నా, అన్నిరంగాల్లో విఫలమైన ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని పేర్కొన్నారు. కేసీఆర్ను ఓడించి తప్పు చేశామని, బీఆర్ఎస్ ప్రతిపక్ష పాత్ర సమర్థవంతంగా పోషించాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. బీఆర్ఎస్ విచ్ఛిన్నం, కేసీఆర్ కుటుంబ విభజన కోసం కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఇక ఆధిపత్యం కోసం కుట్రలు, కుతంత్రాలతో జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు పోరాడుతున్నారన్నారు. కాగా, ఉమ్మడి జిల్లాలో పార్టీ ఓటమికి కారణాలను విశ్లేషించడమే కాక, వచ్చే ఎన్నికల్లో పది స్థానాలు కై వసం చేసుకునేలా కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు. ఈమేరకు బూత్స్థాయిలో పార్టీ నిర్మాణంపై దృష్టి సారించగా, డిజిటలైజేషన్ పద్ధతిలో సభ్యత్వ నమోదుకు నియోజకవర్గాల వారీగా ఇన్చార్జిలను నియమించి శిక్షణ ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే, ఐదుగురు సభ్యులతో మండల సమన్వయ కమిటీలు ఉంటాయని తెలిపారు. మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ మాట్లాడుతూ పార్టీ నిర్మాణం కోసం నేతలందరం సమన్వయంతో పనిచేస్తామని చెప్పారు. పార్టీపై మమకారంతో ఉండే కార్యకర్తలను సభ్యులుగా చేర్చుకోవాలని సూచించారు. కోర్ కేడర్ను తిరిగి పార్టీలోకి తీసుకు రావాల్సిన అవసరం ఉందని చెప్పారు. ప్రతిపక్షంలో ఉన్నందున కేసులు పెడుతుండగా, రాబోయే రోజుల్లో మరింత ఒత్తిడి ఎదురైనా తట్టుకుని నిలబడతామని తెలిపారు. ఎవరైనా అలిగినా, తమపై కోపం ఉన్నా అన్నీ మర్చిపోదామని, పార్టీ నిర్మాణమే లక్ష్యంగా పాటుపడతానని వెల్లడించారు. ఇంకా ఈ సమావేశంలో జెడ్పీ, డీసీసీబీ మాజీ చైర్మన్లు లింగాల కమల్రాజ్, కూరాకుల నాగభూషణం, నాయకులు గుండాల కృష్ణ, పగడాల నాగరాజు, బీరెడ్డి నాగచంద్రారెడ్డి, బత్తుల మురళి, కర్నాటి కృష్ణ, జ్యోతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
128 కేజీల గంజాయి స్వాధీనం
వైరా: ఒడిశా నుంచి తమిళనాడుకు తరలిస్తున్న 128 కేజీల గంజాయిని వైరా పోలీసులు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. వైరాలో శుక్రవారం ఏసీపీ సారంగపాణి వివరాలు వెల్లడించారు. ఎస్ఐ పుష్పాల రామారావు, సిబ్బందితో కలిసి సోమవరం ఆంజనేయస్వామి ఆలయం వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా గోనె బస్తాలతో ద్విచక్రవాహనాలపై వస్తున్న ముగ్గురు అనుమానాస్పదంగా కనిపించారు. వీరిని ఆపి సంచుల్లో పరిశీలించగా 64 ప్యాకెట్లలో ఉన్న 128 కేజీల గంజాయి బయటపడింది. ఒడిశాలోని మల్కాన్గిరి రాబాకాలనీకి చెందిన మనుయాల్ బోత్రా, కమర్గూడా గ్రామానికి చెందిన లక్ష్మణ్ కేలో, ఏపీలోని అనకాపల్లి జిల్లా నాతవరానికి చెందిన చిటికల సన్యాసినాయుడు కలిసి ఒడిశా నుంచి తమిళనాడు రాష్ట్రానికి గంజాయి తరలిస్తున్నట్లు గుర్తించారు. సమావేశంలో సీఐ వెంకటప్రసాద్, ఎస్ఐ పి.రామారావుతో పాటు సిబ్బంది పాల్గొన్నారు. నల్లమందు, ఎండు గంజాయి.. ఖమ్మంరూరల్: ఏదులాపురం మున్సిపాలిటీ పరిధి ఖమ్మం – వరంగల్ మార్గంలో నల్లమందు, ఎండుగంజాయి అమ్ముతున్న ఇద్దరిని ఎకై ్సజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టుకున్నారు. ఏసీఎం (నల్లమందు), గంజాయి వినియోగం, అమ్మకాలు చేపడుతున్నారనే సమాచారంతో ఉద్యోగులు తనిఖీలు చేపట్టారు. ఈ మేరకు రాజస్థాన్కు చెందిన రన్వీర్సింగ్ వద్ద నల్లమందు, ఎండు గంజాయి లభ్యమైంది. ఆయన మూత్రం శాంపిళ్లు పరీక్షించగా పాజిటివ్గా తేలడమే కాక, అక్కడే ఉన్న గుర్రాలపాడు వాసి ఎస్కే కరీంపాషా కూడా గంజాయి తీసుకున్నట్లు నిర్ధారణ అయింది. ఈ మేరకు నిందితులపై చర్యల నిమిత్తం ఖమ్మం ఎకై ్సజ్ స్టేషన్–2లో అప్పగించినట్లు సీఐ శ్రీనివాస్ తెలిపారు. తనిఖీల్లో సిబ్బంది జమాల్షరీఫ్, తిరుపతి, వీరబాబు, ప్రసన్నకుమార్, జాయిరాం, రాజు తదితరులు పాల్గొన్నారు.ఒడిశా నుంచి తమిళనాడుకు తరలిస్తున్న నిందితులు -
నెట్బాల్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక
ఖమ్మంస్పోర్ట్స్: నెట్బాల్ అసోసియేషన్ జిల్లా నూతన కార్యవర్గాన్ని శుక్రవారం ఖమ్మంలో ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షురాలిగా సీహెచ్.దీప్తి, చీఫ్ ప్యాట్రన్గా రామసహాయం పార్వతీరెడ్డి, చైర్మన్గా డాక్టర్ రవికుమార్, కార్యదర్శిగా ఎన్.ఫణికుమార్ ఎన్నికయ్యారు. ఈ కమిటీ నాలుగేళ్ల పాటు కొనసాగుతుందని తెలిపారు. అనంతరం పార్వతీరెడ్డి మాట్లాడుతూ.. జిల్లాలో నెట్బాల్ అభివృద్ధికి కృషి చేయడమే కాక జిల్లా క్రీడాకారులు జాతీయస్థాయికి ఎదిగేలా తర్ఫీదు ఇప్పిస్తామని వెల్లడించారు. ఐకేపీలో ఆగడాలపై మహిళల ఫిర్యాదు పొట్టేళ్ల దాడిలో గాయపడిన కాపరి మృతి పెనబల్లి: పొట్టేళ్లు పోట్లాడుకుంటుంటే విడదీసే యత్నంలో గాయపడిన జీవాల కాపరి చికిత్స పొందుతూ మృతి చెందాడు. పెనుబల్లి మండలం ఉప్పలచిలకకు చెందిన చిల్లిముంత కుటుంబరావు(50) గొర్రెల కాపరిగా జీవనం సాగిస్తున్నాడు. ఈనెల 10వ తేదీన మందను తీసుకెళ్లే క్రమాన మందలోని రెండు పొట్టేలు పోట్లాడుకుంటుంటే విడదీసే ప్రయత్నం చేశాడు. దీంతో ఆయనను ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. కుటుంబీకులు ఆయనకు పెనుబల్లి ప్రాథమిక చికిత్స అనంతరం ఖమ్మం తరలించినా పరిస్థితి మెరుగపడక వరంగల్ తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. ఆయనకు భార్య, ఒక కుమార్తె ఉండగా, కుటుంబీకుల ఫిర్యాదుతో కేసు నమోదుచేసినట్లు వీఎం.బంజర ఎస్ఐ కె.వెంకటేష్ తెలిపారు. -
●సంస్కృతికి ప్రతిబింబం.. సంగీతం
ఖమ్మంగాంధీచౌక్: భారతీయ సంస్కృతికి సంగీతం ప్రతిబింబంలా నిలుస్తుంది. అనేక రకాల వాయిద్యాలు శబ్దాన్ని సృష్టించి సంగీతాన్ని పలకిస్తాయి. ఈ నేపథ్యాన చిన్నతనంపై సంగీతంపై ఆసక్తి పెంచుకుంటున్న విద్యార్థులు వేసవి సెలవుల్లో వాయిద్యాలు నేర్చుకునేందుకు ముందుకొస్తున్నారు. పిల్లల ఆసక్తికి అనుగుణంగా ఖమ్మంలోని శ్రీ రామకృష్ణ విద్యాలయంలో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. హార్మోనియం, తబలా, కంజర తదితర పరికరాలతో పాటు సంగీతంలో రేణుక శిక్షణ ఇస్తున్నారు. సంగీతం భారతీయ సంస్కృతిని నేర్పడమే కాక విద్యార్థుల్లో ఏకాగ్రతను పెంపొందిస్తుందని రేణుక చెబుతున్నారు. సెలవుల్లో రద్దీ దృష్ట్యా ఉదయం వేళ మూడు బ్యాచ్లుగా శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. -
●తరుగు తీస్తున్నారు సార్..
కూసుమంచి: యాసంగిలో రైతులు పండించిన ధాన్యం చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని రాష్ట్ర భారీ నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్కుమార్రెడ్డి తెలిపారు. కూసుమంచి మండలం పాలేరులో ఐకేపీ ఆధ్వర్యాన ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి ఆయన పరిశీలించారు. ఈక్రమాన పలువురు రైతులు ధాన్యం తరలించేందుకు బస్తాకు రూ.5 వరకు వసూలు చేస్తున్నారని, మిల్లర్లు ఐదు కిలోల వరకు తరుగు తీస్తున్నారని వివరించారు. దీంతో స్పందించిన మంత్రులు తక్షణ చర్యలు చేపట్టాలని కలెక్టర్ దివాకర, సీపీ సునీల్దత్ను ఆదేశించారు. లారీల రవాణా ఖర్చులు ప్రభుత్వమే చెల్లిస్తున్నందున రైతులు ఎవరికీ రూపాయి ఇవ్వొద్దని తెలిపారు. అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి, డీఆర్డీఓ శ్రీరామ్, జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి ఎం.ఏ.అలీమ్, పౌర సరఫరాల సంస్థల ఇన్చార్జి డీఎం సునీల్రెడ్డి, డీసీఓ గంగాధర్, తహసీల్దార్ సైదులు, ఏడీఏ సతీష్ పాల్గొన్నారు. -
దివ్యాంగ చిన్నారుల భరోసా
ఖమ్మంసహకారనగర్: భవిత కేంద్రాలు ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులకు భరోసాగా నిలుస్తున్నాయని జిల్లా విద్యాశాఖ కమ్యూనిటీ మొబిలైజింగ్ ఆఫీసర్(సీఎంఓ) బాజోజు ప్రవీణ్కుమార్ తెలిపారు. ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’లో నిర్వహిస్తున్న విద్యా వారోత్సవాల సందర్భంగా గురువారం ఆయన ఖమ్మం నయాబజార్లోని భవితా కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఐఈఆర్పీలు, ఫిజియోథెరపిస్టులతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశమయ్యారు. ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థుల కోసం నిష్ణాతులైన సిబ్బందిని నియమించినందున చికిత్స, బోధనపై దృష్టి సారించాలని తెలిపారు. ఉన్నతాధికారుల చొరవతో నూతన భవనాలు, వసతులు, బోధన ఉపకరణాలు సమకూరుతున్నాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఐఈఆర్పీలు సుభద్ర, రామ్సింగ్ తదితరులు పాల్గొన్నారు. -
తల్లిదండ్రుల వద్దకే ఉపాధ్యాయులు!
కొణిజర్ల: ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’లో భాగంగా విద్యా వారోత్సవాలు కొనసాగుతున్నాయి. ఇందులో షెడ్యూల్ ప్రకారం గురువారం తల్లిదండ్రుల నిర్వహించాల్సి ఉండగా మండలంలోని సింగరాయపాలెం పీఎంశ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సమావేశానికి ఆశించిన స్థాయిలో హాజరుకాలేదు. దీంతో జిల్లా అకడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ పెసర ప్రభాకరరెడ్డి, సర్పంచ్ వేము నాగరాజు, ఉపసర్పంచ్ సురభి కృష్ణ, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ జహీద, హెచ్ఎం కె.లక్ష్మీనారాయణ ఎదురుచూసినా ఫలితం కానరాలేదు. కారణమేమిటని ఆరా తీయగా గ్రామస్తులు ఎక్కువ మంది ఉపాధి హామీ పనులకు వెళ్లినట్లు తెలిసింది. దీంతో ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులే ఊరి చివరి ఫీడర్ఛానల్ పూడికతీత పనుల వద్దకు వెళ్లారు. అక్కడే తల్లిదండ్రులతో సమావేశమై తమ పాఠశాలలో విద్యార్థుల ప్రగతి, అందుతున్న బోధన అంశాలను వివరించారు.ఉపాధి హామీ పని ప్రదేశంలో సమావేశం -
గిరిజన విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్య
భద్రాచలం: గిరిజన సంక్షేమ శాఖ పాఠశాలల్లో విద్యార్ధులకు కార్పొరేట్ స్థాయిలో నాణ్యమైన విద్య అందిస్తున్నామని భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి.రాహుల్ తెలిపారు. గిరిజన సంక్షేమ శాఖ బెస్ట్ అవైలబుల్ పాఠశాలల్లో ప్రవేశానికి గురువారం ఐటీడీఏ కార్యాలయంలో లాటరీ ద్వారా విద్యార్థులను ఎంపిక చేశారు. ఈ సందర్భంగా పీఓ మాట్లాడుతూ రెండు జిల్లాల నుంచి 621 దరఖాస్తులు అందగా, తల్లిదండ్రుల సమక్షాన పారదర్శకంగా ఎంపిక చేశామని తెలిపారు. ఇందులో ఎవరైనా విద్యార్థులు చేరకపోతే వెయిటింగ్ లిస్టులో ఉన్న వారికి అవకాశం ఇస్తామని చెప్పారు. ట్రైబల్ వెల్ఫేర్ డీడీ అశోక్, బీఈడీ కళాశాల ప్రిన్సిపాల్ భవాని, సీఓఈ కళాశాల ప్రిన్సిపాల్ పద్మావతి, ఉద్యోగులు రమేష్, రాములు, సత్యవతి తదితరులు పాల్గొన్నారు. 18నుంచి కేంద్ర పథకాలపై అవగాహన ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్, ధర్తి ఆబా జనజాతి గ్రామ ఉత్త్కర్ష అభియాన్ తదితర కేంద్ర పథకాల పరిధిలోకి వచ్చే గ్రామాల్లో ఈనెల 18నుంచి 25వరకు అవగాహన సదస్సులు నిర్వహించాలని కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ అడిషనల్ సెక్రటరీ సమిదా సింగ్ సూచించారు. న్యూఢిల్లీ నుంచి గురువారం ఆమె వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులకు సూచనలు చేశారు. ఈ సందర్భంగా భద్రాచలం నుంచి పీఓ రాహుల్ మాట్లాడుతూ గొత్తికోయలు, గిరిజన కుటుంబాలకు పథకాలపై అవగాహన కల్పించడమే కాక ఆధార్ నమోదు, జీవనోపాధి పథకాల మంజూరుకు క్యాంపులు ఏర్పాటుచేస్తామని తెలిపారు. ఏపీఓ డేవిడ్రాజ్, అధికారులు గన్యానాయక్, పాయం శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
మళ్లిస్తాం..
వాహనాలన్నీఖమ్మం సహకారనగర్: జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు వేగంగా జరిగేలా పకడ్బందీగా చర్యలు తీసుకుంటూ చివరి గింజ వరకు సేకరిస్తామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి వెల్లడించారు. రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉమ్మడి జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి గురువారం ఆయన ఖమ్మం కలెక్టరేట్లో ధాన్యం కొనుగోళ్లపై సమీక్షించారు. ఏటా సీజన్లో బిహార్, పశ్చిమ బెంగాల్ నుంచి హమాలీలు వస్తారని, ప్రస్తుతం అక్కడి పరిస్థితుల కారణంగా వారు రాకపోవడంతో కొరత ఏర్పడిందన్నారు. దీనికి తోడు ఎండల కారణంగా హమాలీలు పగటి వేళ పనిచేయలేక పోతున్నారన్నారు. ఈమేరకు సమస్యను పరిష్కరించేందుకు గాను జిల్లా స్థాయిలో చర్యలు చేపడుతున్నామని తెలిపారు. కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యం తరలింపు వేగంగా జరిగేలా రానున్న 15 రోజుల పాటు ఇసుక, సిమెంట్ తదితరాల రవాణాపై నియంత్రణ విధించి లారీలు, డీసీఎంలను ధాన్యం రవాణాకే వినియోగించాలని నిర్ణయించినట్లు చెప్పారు. అంతేకాక నిల్వ సామర్థ్యాన్ని పెంచేలా చర్యలు చేపట్టామన్నారు. కొందరు మిల్లర్లు క్వింటాకు ఐదు, ఆరు కిలోల వరకు కోత విధిస్తున్నారనే సమాచారం ఉందని, ఇకనైనా వారు తీరు మార్చుకోకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాష్ట్రవ్యాప్తంగా యాసంగిలో 65 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయగా, 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా నిర్దేశించుకున్నామని తెలిపారు. ఇందుకోసం రూ.22 వేల కోట్లు కేటాయించగా, ఇప్పటికే 30 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసి రైతులకు రూ.4,800 కోట్లు జమ చేశామని తెలిపారు. మిల్లులు సీజ్ చేస్తాం.. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ రైతుల సంక్షేమం కోసం అవసరమైతే ప్రభుత్వం కొంత నష్టాన్ని భరించేందుకై నా సిద్ధంగా ఉందని వెల్లడించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ధాన్యానికి మద్దతు ధరతో పాటు సన్నధాన్యం క్వింటాకు రూ.500 బోనస్ చెల్లిస్తున్నామని చెప్పారు. రైతులు రికార్డు స్థాయిలో వరి సాగు చేయడంతో దిగుబడి కూడా అలాగే వచ్చిందన్నారు. ధాన్యంతో పాటు మొక్కజొన్న కొనుగోళ్లపై ప్రతిపక్షాల తప్పుడు ప్రచారాన్ని రైతులు నమ్మొద్దని కోరారు. ఎక్కడైనా రైస్ మిల్లర్లు అక్రమంగా తరుగు తీసినట్లు తెలిస్తే మిల్లులను సీజ్ చేస్తామని హెచ్చరించారు.ఖమ్మం కలెక్టర్ దివాకర టీ.ఎస్. మాట్లాడుతూ జిల్లాలో మొదలైన 309 కొనుగోలు కేంద్రాలకు ఇప్పటి వరకు 94,961 మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చిందని తెలిపారు. ఇందులో 80 వేల మెట్రిక్ టన్నులను కొనుగోలు చేసి గోదాములకు తరలించామని చెప్పారు. భద్రాద్రి కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ జిల్లాలో 167 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించామని తెలిపారు. జిల్లాలో పంట కోత ఆలస్యంగా ప్రారంభమైనందున కొనుగోళ్లు ప్రస్తుతం వేగం పుంజుకుంటున్నాయని వెల్లడించారు. కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ రైతులు ధాన్యం విక్రయంలో ఇబ్బంది పడకుండా అధికారులు పర్యవేక్షించాలని చెప్పారు. కొనుగోలు కేంద్రాలు, మిల్లుల్లో తాలు, తరుగు పేరుతో ఎలాంటి కోతలు విధించకుండా అధికారులు కఠినంగా వ్యవహరించాలని సూచించారు. వైరా ఎమ్మెల్యే రాందాస్నాయక్ మాట్లాడుతూ ప్రతిపక్షాలు రైతులను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నందున రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ సమావేశంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, ఖమ్మం సీపీ సునీల్దత్, అదనపు కలెక్టర్లు డాక్టర్ పి.శ్రీజ, పి.శ్రీనివాసరెడ్డి, డి.వేణుగోపాల్, భద్రాద్రి ఎస్పీ బి.రోహిత్ రాజ్, సబ్ కలెక్టర్లు మ్రిణాల్ శ్రేష్ఠ, అజయ్యాదవ్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ, సుడా చైర్మన్లు రాయల నాగేశ్వరరావు, పువ్వాళ్ల దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
729 మందికి ఇళ్లు నిర్మించాల్సిందే..
ఖమ్మంఅర్బన్: ఖమ్మం వెలుగుమట్ల గుట్టపై కూల్చివేతలతో సర్వం కోల్పోయిన 729మంది బాధితులకు అక్కడే ఇళ్లు నిర్మించాలని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ రాష్ట్ర జేఏసీ చైర్మన్ డాక్టర్ విశారదన్ మహారాజ్ డిమాండ్ చేశారు. ఖమ్మం టీటీడీసీ హాల్లో గురువారం కె.కృష్ణారావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బాధితుల తరఫున చేపట్టిన ఆందోళనలతో దిగొచ్చిన ప్రభుత్వం 311 మందికి పట్టాలు ఇచ్చిందన్నారు. అయితే, మరో 101 మందికి గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసి, ఇంకో 317 మందిని అనర్హులుగా ప్రకటించడం సరికాదన్నారు. ఇళ్లు కోల్పోయిన 729 మందికి వెలుగుమట్లలోనే పట్టాలు, ఇళ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పందించకపోతే మరో ఉద్యమానికి సిద్ధమవుతామని తెలిపారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ రాష్ట్ర కార్యదర్శి పొడకంటి రాంబాబు మాట్లాడుతూ.. భూదాన్ భూమిలో కార్యాలయాల నిర్మాణ ఆలోచనను విరమించుకుని బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో బాధితుల కమిటీ కన్వీనర్ ఉదయ్తో అమిత్, నవ్య, పాషా, బండి నాగేశ్వరరావు, మేడి బసవయ్య, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
ఎట్టకేలకు మోక్షం!
● బుగ్గపాడు ఫుడ్పార్క్లో కదలిక ● రూ.600 కోట్లతో ఆక్వా పరిశ్రమల ఏర్పాటుకు ఎంఓయూ ● ప్రారంభమైతే 3వేల మందికి ప్రత్యక్ష ఉపాధి సత్తుపల్లి: రాష్ట్రంలోనే తొలిసారి ఆక్వా పరిశ్రమలకు అడుగు పడింది. ఇదికూడా జిల్లాలోని సత్తుపల్లి మండలం బుగ్గపాడు ఫుడ్పార్కులో ఏర్పాటుకానుండడం విశేషం. రూ.650 కోట్ల వ్యయంతో ఇక్కడ ఫుడ్పార్కులో రెండు ఆక్వా(రొయ్య) పరిశ్రమల ఏర్పాటుకు నిర్ణయించారు. సుమారు 84 ఎకరాల విస్తీర్ణంలో చేపలు, రొయ్య ఫీడ్(దాణా) తయారీకి ఒక పరిశ్రమ, రొయ్యల ప్రాసెసింగ్, ఎగుమతులకు మరో పరిశ్రమ స్థాపనకు దీపక్ నెక్స్జన్ కంపెనీ ముందుకొచ్చింది. ఈ పరిశ్రమలు ప్రారంభమైతే సుమారు మూడు వేల మందికి ప్రత్యక్ష ఉపాధి లభించనుంది. ఇదే కంపెనీ ఏపీలోని హనుమాన్ జంక్షన్లో ఈ ఫ్యాక్టరీ ఏర్పాటుచేయగా, బుగ్గపాడు పార్క్లో ఏడాదిలోపు అందుబాటులోకి వచ్చే అవకాశముందని చెబుతున్నారు. రైతులకు ప్రోత్సాహం ఆక్వా పరిశ్రమలు నిలదొక్కుకోవాలంటే సమీపాన రొయ్యల చెరువులు ఏర్పాటుచేయాల్సి ఉంటుంది. ఈమేరకు సత్తుపల్లి, చుట్టుపక్కల ప్రాంతాల్లోని సుమారు 2వేల ఎకరాల్లో చెరువుల ఏర్పాటుకు రైతులను ప్రోత్సహిస్తారు. ఇక్కడి భూమి చేపలు, రొయ్యల చెరువుల ఏర్పాటుకు అనుకూలంగా ఉండడాన్ని కలిసొచ్చే అంశంగా చెబుతున్నారు. రొయ్యల చెరువులకు ీఫీడ్(దాణా) కూడా అందించి ఉత్పత్తిని పెంచేలా కంపెనీ యాజమాన్యం కృషి చేయనుంది. దాణా కోసం ఈ ప్రాంతంలో పండే మొక్కజొన్న, సోయా ఉత్పత్తులకు సైతం డిమాండ్ వస్తుంది. అయితే, స్థానికంగా రొయ్యలు అందుబాటులోకి వచ్చే వరకు ఏపీ నుంచి రొయ్యలను తీసుకొచ్చి ప్రాసెసింగ్ చేసి ఎగుమతి చేస్తారు. చైనా, జపాన్, ఇండోనేషియా, అమెరికా దేశాలకు ఆక్వా ఉత్పత్తులను పంపించే అవకాశముంది. ఇటీవల ప్రారంభమైన గ్రీన్ఫీల్డ్ హైవే బుగ్గపాడు ఫుడ్పార్క్కు 24 కి.మీ. దూరంలోనే ఉండడంతో పోర్ట్లకు రవాణా సులభమవుతుందని భావిస్తున్నారు. వైఎస్సార్ హయాంలో ప్రారంభం దివంగత వైఎస్.రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఆయన చేతుల మీదుగా 2008 జనవరి 27న 203 ఎకరాల విస్తీర్ణంలో బుగ్గపాడు ఫుడ్పార్క్ ఏర్పాటు చేశారు. ఇందులో 60 ఎకరాలను మౌలిక వసతులకు కేటాయించి రూ.119 కోట్లతో పనులు చేపట్టారు. మిగిలిన 143 ఎకరాల్లో రూ.10 కోట్లతో రహదారులు, ప్రహరీ, ఆఫీస్ భవనం నిర్మాణం చేశారు. కాగా, ఫుడ్పార్క్లో గతేడాది నుంచి వైఅండ్వై కంపెనీ మామిడి ప్రాసెసింగ్, జ్యూస్ కంపెనీని ఏర్పాటు చేసినా ఇది కేవలం సీజన్లోనే నడుస్తోంది. ఇప్పుడు రెండు ఆక్వా పరిశ్రమలు ప్రారంభం కానుండడంతో స్థానికులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడనున్నాయి. సీఎం సమక్షాన ఒప్పందం ఫుడ్పార్క్ను అభివృద్ధిలో భాగంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గతేడాది పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబుతో కలిసి పరిశ్రమల మేళా ఏర్పాటు చేశారు. దీంతో పలు కంపెనీలు దరఖాస్తు చేసుకున్నాయి. ఇటీవల దీపక్ నెక్స్జన్ కంపెనీ యాజమాన్యం.. సీఎం రేవంత్రెడ్డి, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, దుద్దిళ్ల శ్రీధర్బాబు సమక్షాన రెండు పరిశ్రమల ఏర్పాటుకు ఒప్పందం చేసుకుంది. తెలంగాణలోనే తొలి ఆక్వా పరిశ్రమలు కావడంతో ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం అందిస్తామని తెలిపారు. ఏపీకి సత్తుపల్లి సరిహద్దుగా ఉండడంతో అక్కడి రైతుల మాదిరి ఇప్పటికే కొందరు స్థానిక రైతులు ఆక్వా పరిశ్రమపై ఆసక్తితో చేపలు, రొయ్యల చెరువుల తవ్వకానికి ముందుకొస్తున్నారు. త్వరలో సీఎం రేవంత్రెడ్డి చేతుల మీదుగా ఫ్యాక్టరీ శంకుస్థాపన కార్యక్రమం జరగనుంది. -
రైతాంగానికి ఇంకాస్త ‘మద్దతు’
● వరి క్వింటాకు రూ.72, పత్తికి రూ.557 పెరిగిన ధర ● జిల్లాలో అత్యధికంగా సాగయ్యే రెండు పంటలివే.. ● మొక్కజొన్న ధరపై రైతుల్లో పెదవి విరుపు ఖమ్మంవ్యవసాయం: జిల్లాలో ప్రధానంగా సాగయ్యే పంటలకు మద్దతు ధర పెరిగింది. ఏటా మాదిరిగానే కేంద్ర ప్రభుత్వం వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకొని పంటలకు మద్దతు ధరలను నిర్ణయిస్తుంది. 2026–27 సంవత్సరానికి కూడా వివిధ పంటలకు కనీస మద్దతు ధరలను ప్రకటించింది. ఇందులో భాగంగా ధాన్యం, పప్పు దినుసులు, నూనె గింజలు, వాణిజ్య పంటల ధరలు పెంచింది. జిల్లాలో అన్నీ కలిపి ఆరు లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతుండగా.. ఇందులో వరి, పత్తి పంటలు ప్రధానంగా ఉంటాయి. వర్షాలు అనుకూలించి, జలాశయాల్లో సమృద్ధిగా నీరు ఉంటే వానాకాలంలో వరి 3.20 లక్షల ఎకరాల్లో, పత్తి 2.69 లక్షల ఎకరాల్లో సాగవుతుంది. ఇక పెసర 18 వేల ఎకరాల్లో, కంది, మినుము, వేరుశనగ వంటి పంటలు కూడా సాగవుతాయి. వరి ధర రూ.2,461 వరి రకాల వారీగా గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది కేంద్రం క్వింటాకు రూ.72 పెంచింది. గ్రేడ్–ఏ రకానికి గత ఏడాది రూ.2,389 ఉంటే ఈ ఏడాది రూ.2,461 చేరింది. ఇక సాధారణ రకాలకు గత ఏడాది రూ.2,369గా ఉన్న ధర రూ.2,441కు పెరుగుతుంది. పత్తి క్వింటాకు రూ.557 పెంచడంతో రూ.8,110 నుంచి రూ.8,667కు చేరనుంది. మొక్కజొన్నకు కేవలం రూ.10 అపరాల పంటలకు ఈ ఏడాది కేంద్రం అరకొరగానే మద్దతు ధర పెంచింది. పెసలకు కేవలం రూ.12 మాత్రమే పెంచడంతో రూ.8,768 నుంచి రూ.8,780కు చేరుతుంది. కందులకు మాత్రం రూ.450 పెంచడంతో గతేడాది రూ.8వేలు ఉన్న మద్దతు ధర ఈ ఏడాది రూ.8,450కు పెరుగుతుంది. మినుములకు సైతం రూ.400 పెంచగా రూ.7,800 నుంచి 8,200కు చేరనుంది. జిల్లాలో అక్కడక్కడ సాగుచేసే వేరుశనగ పంటకు రూ.254 ను పెంచింది. కాగా, జిల్లాలో యాసంగి పంటగా మొక్కజొన్నను విస్తారంగా సాగు చేస్తారు. కానీ ఈ పంటకు కేవలం రూ.10 మాత్రమే పెంచారు. దీంతో గత ఏడాది క్వింటాకు రూ.2,400 ఉన్న మద్దతు ధర ఈ ఏడాది రూ.2,410కు చేరుతుంది. పెరుగుతున్న పెట్టుబడులు పంటల సాగుకు ఏటేటా పెట్టుబడులు పెరుగుతున్నాయి. యంత్రాలు, డీజిల్, ఎరువులు, క్రిమిసంహారక మందుల ధరలు ౖపైపెకి వెళ్తున్నాయి. వీటికి తోడు నిత్యావసర ధరలు పెరగడంతో కూలీల ధరలు పెరుగుతున్నాయి. ఇదే సమయాన కేంద్రప్రభుత్వం పెరిగిన పెట్టుబడులను పరిగణనలోకి తీసుకోకుండా పంటల ధరలు నిర్ణయించడంపై రైతుల్లో ఆవేదన వ్యక్తమవుతోంది. జిల్లాలో ప్రధానంగా సాగయ్యే వరి, పత్తి పంటలకు పెట్టుబడులు పెరిగాయని, అందుకు అనుగుణంగా మద్దతు ధరలు పెరగడం లేదని చెబుతున్నారు. మొక్కజొన్న పరిస్థితి కూడా అలాగే ఉన్నందున మద్దతు ధరలు మరికొంత పెంచాలని కోరుతున్నారు. -
ఆలయాల్లో చోరీ చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్
కల్లూరు: రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు ఆలయాల్లో చోరీలకు పాల్పడిన ముఠాను కల్లూరు పోలీసులు అరెస్ట్ చేశారు. ఈమేరకు కల్లూరులో గురువారం ఏసీపీ వసుంధర యాదవ్ వివరాలు వెల్లడించారు. ఎస్సై డి.హరిత సిబ్బందితో కలిసి బుధవారం సాయంత్రం తనిఖీలు చేపట్టారు. ఏపీలోని కృష్ణా జిల్లా మైలవరం మండలం ఓబులపాలెంకు చెందిన బోలుసు ఏసుబాబు అలియాస్ మానికల ఏసుబాబు, ఎన్టీఆర్ జిల్లా చాట్రాయి మండలం కోటపాడుకు చెందిన చేవూరి ఆదినారాయణ, వేంసూరు మండలం ఎర్రగుంటపాడుకు చెందిన తుమ్మల మురళితో పాటు మరో వ్యక్తి రెండు ద్విచక్రవాహనాలపై వెళ్తూ పోలీసులను చూసి పారిపోయే ప్రయత్నం చేశారు. వీరిని వెంబడించి అదుపులోకి తీసుకున్నాక వేలిముద్రల ఆధారంగా పరిశీలించాక ఇద్దరి వేలిముద్రలు డేటాబేస్లో పాత నేరుస్తులతో మ్యాచ్ అయ్యాయి. తెలంగాణ – ఆంధ్రప్రదేశ్ సరిహద్దు కల్లూరు మండలం చెన్నూరు, చిన్నకోరుకొండి, తల్లాడ మండలం వెంకటగిరి, మధిర మండలంలోని మల్లారం, ఏపీలో విసన్నపేట ఆంజనేయస్వామి దేవాలయం, పెనుబల్లి పోస్టాఫీసులో చోరీ చేసినట్లు తేలడంతో రిమాండ్కు తరలించారు. నిందితులను అరెస్ట్ చేయడంలో కీలకంగా వ్యవహరించిన ఎస్ఐ హరిత, సిబ్బందిని నాగేంద్రబాబు, సత్యనారాయణ, నరసింహారావును ఏసీపీ వసుంధర అభినందించారు. -
హార్టికల్చర్ హబ్గా పేట
అశ్వారావుపేట: రానున్న కాలంలో అశ్వారావుపేట హార్టికల్చర్ హబ్గా మారుతుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. కొండా లక్ష్మణ్ ఉద్యాన పరిశోధనా కేంద్రం(హెచ్ఆర్ఎస్)లో తాత్కాలికంగా కేటాయించిన భవనంలో ప్రభుత్వ ఉద్యాన కళాశాలను గురువారం ప్రారంభించారు. అనంతరం ఆయిల్ పామ్ ఫ్యాక్టరీలో ఏర్పాటు చేసిన ఆయిల్పామ్ రైతుల ఆత్మీయ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 70 ఎకరాల్లో శాశ్వత భవనాలు నిర్మించి కళాశాలకు అధునాతన సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు. ఆయిల్ పామ్ గెలల ధర టన్నుకు రూ.25వేలు వచ్చేలా కృషి చేస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానల వల్ల తెలంగాణ రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. మొక్కజొన్నను కొనుగోలు చేస్తున్న ఏకై క రాష్ట్రం తెలంగాణ మాత్రమేనన్నారు. అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ కూడా మాట్లాడారు. ఉద్యాన యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ రాజిరెడ్డి, వ్యవసాయ శాఖ డైరెక్టర్ డాక్టర్ ఎన్.గోపి, ఆయిల్ఫెడ్ ఎండీ యాస్మిన్ బాషా, వ్యవసాయ విశ్వవిద్యాల వైస్ చాన్స్లర్ ఏ.జానయ్య, వ్యవసాయ, సహకార శాఖల కార్యదర్శి సురేంద్ర మోహన్ తదితరులు పాల్గొని ప్రసంగించారు. భక్తుల ఆకాంక్షలకు తగ్గట్టుగా ఆలయాభివృద్ధి భద్రాచలం: దక్షిణ అయోధ్యగా విరాజిల్లుతున్న భద్రగిరి దివ్యక్షేత్రాన్ని భక్తుల ఆకాంక్షలకు తగినట్లుగా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. గురువారం రామాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఇరిగేషన్, ఆర్అండ్బీ, దేవస్థానం ఈఓ దామోదర్రావులతో సమావేశమై ఆలయ అభివృద్ధి పనులపై చర్చించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, ఖమ్మం సుడా చైర్మన్ పువ్వాడ దుర్గాప్రసాద్, భద్రాచలం సర్పంచ్ పూనెం కృష్ణ, చల్లగుళ్ల నాగేశ్వరరావుతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు -
రైతులు ఇబ్బంది పడకుండా మక్కల కొనుగోళ్లు
కూసుమంచి: రైతులు పండించిన మొక్కజొన్నలు మొత్తం కొనుగోలు చేస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ డైరెక్టర్ డాక్టర్ గోపి తెలిపారు. కేంద్రాల్లో రైతులు ఇబ్బంది పడకుండా కొనుగోళ్లు వేగంగా చేపట్టడమే కాకుండా గోదాంలకు తరలిస్తామని వెల్లడించారు. కూసుమంచి మండలం జీళ్లచెరువులో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని గురువారం ఆయన తనిఖీ చేశారు. ఈసందర్భంగా రైతులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. మక్కల కాంటా పూర్తయి రోజులు దాటుతున్నా గోదాములకు తరలించడం, ఫలితంగా వేచి ఉండాల్సి వస్తోందని రైతులు వివరించారు. దీంతో హమాలీల సంఖ్య పెంచడంతో పాటు రవాణాకు సరిపడా వాహనాలు సమకూర్చాలని డైరెక్టర్ అధికారులకు సూచించారు. రెండు, మూడు రోజుల్లో సమస్యలను అధిగమిస్తామని తెలిపారు. ఈకార్యక్రమంలో ఏడీఏ సతీష్, ఏఓ వాణి, చేగొమ్మ సొసైటీ కార్యదర్శి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. గీతకార్మికులకు సేఫ్టీ కిట్లు పంపిణీ సత్తుపల్లి: సత్తుపల్లి నియోజకవర్గంలోని ఐదు మండలాలకు కల్లుగీత కార్మికులకు గురువారం కాటమయ్య రక్ష సేఫ్టీ కిట్లు పంపిణీ చేశారు. బీసీ సంక్షేమ శాఖ, ఎకై ్సజ్ శాఖల ఆధ్వర్యాన సత్తుపల్లిలో జరిగిన కార్యక్రమంలో డీపీఈఓ నాగేందర్రెడ్డి అందజేసి మాట్లాడారు. గీత కార్మికులు వృత్తిలో ప్రమాదాల బారిన పడకుండా ఈ కిట్లు ఉపయోగపడతాయని తెలిపారు. ఎకై ్సజ్ సీఐ ప్రవీణ్కుమార్రెడ్డి, ఎస్సై శేఖర్, బీసీ సంక్షేమాధికారి బజ్జూరి వెంకటేశ్వరరావు, గౌడసంఘం జిల్లా అధ్యక్షుడు రావుల గోపీగౌడ్తో పాటు మొక్కా తిరుపతిరావు, సున్నం నరసింహారావు, రామకృష్ణ, వెంకటేశ్వర్లు, రాఘవ, మల్లయ్య, ఆదినారాయణ, రామారావు, శ్రీనివాసరావు సిబ్బంది పాల్గొన్నారు. రెడ్క్రాస్లో సభ్యత్వంతో సేవాభావం ఖమ్మం మామిళ్లగూడెం: మానవ సేవే మాధవసేవ అన్న భావనతో ఇండియన్ రెడ్ క్రాస్ సంస్థ చేపడుతున్న కార్యక్రమాల్లో పాలుపంచుకునేలా సభ్యత్వం తీసుకోవాలని జిల్లా కార్మిక శాఖ ఉప కమిషనర్ కె.విజయభాస్కర్రెడ్డి సూచించారు. సీపీఓ శ్రీనివాస్, జిల్లా ఉపాధి కల్పన అధికారి ఎన్.మాదవి, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వైస్ చైర్మన్ ఆర్.రవీందర్రావుతో కలిసి గురువారం కలెక్టరేట్లో సభ్యత్వ నమోదును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులు రెడ్క్రాస్లో సభ్యత్వం తీసుకుని సేవా కార్యక్రమాల్లో భాగం కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో గుదిమళ్ల సూర్యప్రకాశ్రావు, కె.సత్యనారాయణరెడ్డి, ఏ.స్పందన, ఉప్పలయ్య, నర్సయ్య, తాతా రాఘవయ్య, సుధాకర్, షకీల్ అహ్మద్ పాల్గొన్నారు. శిశుగృహలో న్యాయమూర్తి ఖమ్మం లీగల్: ఖమ్మంలోని శిశుగృహను జిల్లా న్యాయ సేవాసంస్థ కార్యదర్శి పి.దేవీమానస గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల సంక్షేమం, వారికి అందుతున్న వసతులపై వివరాలు తెలుసుకున్నారు. అలాగే, పిల్లలతో మాట్లాడి చదువు, ఆరోగ్యంపై ఆరా తీశారు. కష్టపడి చదువుకుని ఉన్నతస్థాయికి చేరాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీడీపీఓ విష్ణువందన తదితరులు పాల్గొన్నారు. -
పశుగ్రాసం.. విషపూరితం
● మొక్కజొన్న, జొన్నలో ‘నైట్రేట్’ ● జిల్లాలోని పశువులు, ఇతర జీవాల్లో ప్రభావం గుర్తింపు ● రైతులు అప్రమత్తంగా లేకపోతే నష్టం ఖమ్మంవ్యవసాయం: పశువులకు మేతగా వేసే గ్రాసాలు ప్రాణసంకటంగా మారుతున్నాయని పశుసంవర్థక, పశువైద్య శాఖ గుర్తించింది. మొక్కజొన్న, జొన్న, సూడాన్ గడ్డి, పొద్దు తిరుగుడు తదితర పశుగ్రాసాల్లో నైట్రేట్ ప్రభావం ఎక్కువగా ఉంటోందని తేల్చారు. ఇందులో విషప్రభావం కారణంగా పశువులు, గేదెలు, ఆవులు, గొర్రెలు, మేకలు నీరసించడంతో పాటు ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది పడడంతోపాటు ఫిట్స్ వంటి లక్షణాలతో మృత్యువాత పడుతున్నాయి. జిల్లాలో మునుపెన్నడూ లేని విధంగా ఈ యాసంగిలో 2.26 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశారు. పంట కోత పూర్తవడంతో ఆ భూముల్లోని పచ్చిక, ఎండిన గ్రాసంలో జీవాలను మేపుతున్నారు. మొక్కజొన్న గ్రాసం విషపూరితమైనదనే అవగాహన లేక ఇలా చేస్తుండగా పశువులు అనారోగ్యం బారిన పడడమే కాక అక్కడక్కడా మృతి చెందుతున్నాయి. ఈమేరకు జిల్లా పశు వ్యాధి నిర్ధారణ ప్రయోగశాల డాక్టర్ మహ్మద్ రుబీనా నైట్రేట్ పశుగ్రాసం తిన్న పశువుల లక్షణాలు, చికిత్స, నివారణ వంటి విషయాలను వివరించారు. ఇవీ లక్షణాలు.. నైట్రేట్ కలిగిన పశుగ్రాసం తిన్నాక పశువులు, జీవాల్లో నీరసం వంటి లక్షణాలు 3 – 8 గంటల్లో కనిపిస్తాయి. ఒక్కసారిగా మందలో ఎక్కువ శాతం జీవాలు ఎలాంటి లక్షణాలు లేకుండా మృత్యువాత పడతాయి. మేతలో నైట్రేట్ శాతం ఆధారంగా ఈ లక్షణాలు కనిపిస్తాయి. కళ్లలో శ్లేష్మ పొర నీలి రంగులోకి మారడం, అధికంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడడం, సరిగ్గా నిలబడలేక పోవడం, వణకడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. విరోచనాలు, సొల్లు కారడం, పొట్ట ఉబ్బరం, రక్తం మట్టి రంగులోకి మారడం వంటి లక్షణాల ద్వారా గుర్తించొచ్చు. చనిపోయే ముందు కాళ్లు గాలిలో కొట్టుకోవడం, ఫిట్స్ వంటివి కనిపిస్తాయి. చికిత్స.. నైట్రేట్ విష ప్రభావాన్ని వెంటనే గుర్తిస్తే జీవాలను కాపాడుకోవచ్చు. జీవాలను ప్రభావిత పొలాల్లో మేపడం వెంటనే ఆపాలి. ఎండుగడ్డి, తగినంత నీరు అందించాలి. ప్రథమ చికిత్సగా బొగ్గుపొడిలో గుడ్డు, మెగ్నీషియం ఆకై ్సడ్, టాన్నిక్ ఆమ్లం కలిపి తాగించాలి. ఆపై పశువైద్యుల సలహా మేరకు మందులను వాడాలి. నివారణ.. లేత జొన్న, మొక్కజొన్న మేయకుండా చూడాలి. కరువు తర్వాత, మబ్బు పట్టిన రోజుల్లో కోసిన మొక్కజొన్న కాడలను మేతగా వేయొద్దు. మేతలో నత్రజని శాతం మట్టి, వాతావరణంపై ఆధారపడి ఉంటుంది. ఒకే గ్రామంలోని మొక్కజొన్న పొలంలో మేసి పశువులు, జీవాలు అనారోగ్యానికి గురైతే ఆ గ్రామంలోని ఇతర పొలాల్లోనూ మేతకు వదలొద్దు. వర్షాలు కురిసిన వారం వరకు పశువులకు మొక్కజొన్న, జొన్నను మేపకూడదు. లేత ఆకుల్లోనే కాక ముదిరిన కాండంలోనూ ఎక్కువ శాతం నత్రజని ఉంటుంది. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకుని మొక్కజొన్న కోత తర్వాత పశువులను మేపేటప్పుడు జాగ్రత్త వహించాలి. పొలాలకు నత్రజనిని వినియోగించిన కొన్ని రోజుల వరకు పశువులను మేపకపోవడం మేలు. -
భగీరథ్ను అరెస్ట్ చేయాలి..
ఖమ్మంమయూరిసెంటర్: బాలికను వేధించి అత్యాచారానికి పాల్పడిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్ను పోక్సో చట్టం కింద అరెస్ట్ చేయాలని మాస్లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు డిమాండ్ చేశారు. ఖమ్మంలోని రామనర్సయ్య విజ్ఞాన కేంద్రంలో సోమవారం ఆయన మాట్లాడారు. కేంద్ర మంత్రిగా చట్టాన్ని కాపాడాల్సిన బండి సంజయ్ ఆయన కుమారుడు తప్పును రాజకీయ కుట్రగా చిత్రీకరించడం దుర్మార్గమన్నారు. అలాంటి వ్యక్తి మంత్రి పదవిలో కొనసాగే అర్హత లేనందున రాజీనామా చేయకపోతే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. కాగా, బాధితురాలిని రాత్రి 12 గంటల వరకు స్టేషన్లో ఉంచి, ఆమైపెనే తప్పుడు కేసు పెట్టడం పోలీసు వ్యవస్థ ఎంతగా దిగజారిందో తెలియజేస్తోందన్నారు. భగీరథ్ను అరెస్ట్ చేయాలనే డిమాండ్తో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు తెలపనున్నట్లు వెల్లడించారు. కాగా, వరి ధాన్యం, మొక్కజొన్న కొనుగోళ్లలో నిబంధనలను సడలించి పంట మొత్తం కొనుగోలు చేయకపోతే రైతుల పక్షాన పోరాటాలు ఉధృతం చేస్తామని రంగారావు హెచ్చరించారు. ఈ సమావేశంలో పీఓడబ్ల్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శిరోమణి, నాయకులు ఆవుల వెంకటేశ్వర్లు, సీ.వై.పుల్లయ్య, జి.రామయ్య, ఆవుల అశోక్, ఝాన్సీ, శోభ తదితరులు పాల్గొన్నారు.మాస్లైన్ రాష్ట్ర కార్యదర్శి రంగారావు -
కరాటేతో స్వీయరక్షణ
స్వీయ రక్షణకు బాలికలు తప్పకుండా కరాటే శిక్షణ తీసుకోవాలి. జిల్లా స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యాన కరాటే శిక్షణ ఇస్తున్నందుకు కృతజ్ఞతలు. రెండేళ్లుగా కరాటే నేర్చుకుంటున్నా.. బ్లాక్బెల్ట్కు ఎంపికయ్యాను. – వర్షి, సత్తుపల్లికరాటే నేర్చుకోవటం వల్ల ఫిట్నెస్తో పాటు చదువులోనూ ఏకాగ్రత పెరుగుతుంది. భయపడకుండా బయటకు వెళ్లగలుగుతారు. బాలికలు తప్పకుండా కరాటే నేర్చుకొని ప్రావీణ్యం సాధించాలి. – కె.ప్రణీత్య, సత్తుపల్లివేసవి సెలవుల్లో కరాటే శిక్షణకు వస్తూ సద్వినియోగం చేసుకుంటున్నా. ఇది నాకు క్రమశిక్షణ నేర్పింది. ఏదైనా ఆపద వస్తే ఎదిరించగలననే ధైర్యం కలుగుతుంది. ఆత్మవిశ్వాసం పెంపొందుతుంది. – ఆఫ్రిన్, సత్తుపల్లి -
క్రేజీ.. కరాటే
● ఆత్మరక్షణలో కీలకం ● శిక్షణ ఇప్పించడంపై తల్లిదండ్రుల ఆసక్తి ● కిటకిటలాడుతున్న ఉచిత శిక్షణ శిబిరంకరాటే శిక్షణలో మెళకువలతో నేర్పిస్తున్నారు. శరీరాన్ని, మనస్సును ఉత్సాహపరుస్తుంది. ఆత్మవిశ్వాసం పెంపొందుతుంది. చదువులోనూ ఏకాగ్రత కన్పిస్తుంది. కరాటే వల్ల శారీరక ధృడత్వం లభిస్తుంది. – హేమచంద్ర, సత్తుపల్లి శారీరకంగా, బలంగా మారేందుకు కరాటే దోహదపడుతుంది. మానసికంగా, ధైర్యంగా ఉండడంతో పాటు ఆపదను దాటగలమనే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కరాటే శిక్షణకు విద్యార్థులు ఉత్సాహం చూపిస్తున్నారు. – వి.పిచ్చయ్య, కరాటే మాస్టర్, సత్తుపల్లిసత్తుపల్లిటౌన్: ప్రస్తుత సమాజ పోకడలను పరిశీలిస్తే ఆడపిల్లలు తమను తాము రక్షించుకునేందుకు ఎల్లవేళలా సిద్ధంగా ఉండాల్సి వస్తోంది. ఎవరో వస్తారని చూడకుండా ఆత్మరక్షణకు సిద్ధమయ్యేలా కరాటే ఉపకరిస్తుంది. దీంతో వేసవి సెలవులను కరాటేలో ప్రావీణ్యం సంపాదించుకునేలా సద్వినియోగం చేసుకుంటున్నారు. ఈక్రమాన సత్తుపల్లిలోని జేవీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానం పరిసరాలు అలర్ట్.. బో అరుపులతో మార్మోగుతున్నాయి. విద్యాసంస్థలకు సెలవులు మొదలైనప్పటినుంచి ప్రతిరోజు ఉదయం విద్యార్థులకు మాస్టర్ వి.పిచ్చయ్య ఉచిత శిక్షణ ఇస్తున్నారు. కరాటేతో ఆత్మరక్షణతో పాటు మానసిక ఉల్లాసం, శారీరక ధృడత్వం, ఏకాగ్రత పెరుగుతుందని చెబుతున్నారు. ఈ నేపథ్యాన పిల్లలకు కరాటే శిక్షణ ఇప్పించేందుకు తల్లిదండ్రులు ముందుకొస్తున్నారు. బాలికలకు ఆత్మరక్షణ విద్య అవసరమని గుర్తించడంతో ఆసక్తి నెలకొనగా.. నిత్యం 50 – 60 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. -
పేదల ఆత్మగౌరవాన్ని కాపాడేలా పాలన
● భూసమస్యల పరిష్కారానికి ‘భూభారతి’ ● ప్రజాదర్బార్లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మంరూరల్/ఖమ్మంమయూరిసెంటర్: గడిచిన రెండేళ్లలో అర్హులైన పేదలందరికీ సంక్షేమ పథకాలను అందిస్తూ వారి ఆత్మగౌరవాన్ని కాపాడేలా పాలన సాగిస్తున్నామని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఏదులాపురం మున్సిపాలిటీ, ఖమ్మం మున్సిపాలిటీ పరిధిలోని పాలేరు నియోజకవర్గ డివిజన్లలో గురువారం నిర్వహించిన ప్రజాదర్బార్లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి దరఖాస్తులు, వినతిపత్రాలు స్వీకరించిన పొంగులేటి మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలు మొదలు ఆడబిడ్డల ఉచిత ప్రయాణం వరకు ప్రతీ హామీని నెరవేరుస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వం పదేళ్ల పాలనలో పేదల సొంతింటి కలను విస్మరించగా, తాము అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదే 4.5 లక్షల ఇళ్లను మంజూరు చేశామన్నారు. అలాగే, భూ సమస్యల పరిష్కారం కోసం భూభారతి చట్టం ద్వారా ధరణితో ఎదురైన కష్టాలను తొలగిస్తున్నామని పేర్కొన్నారు. ప్రజాదర్బార్ల ద్వారా చిన్నచిన్న సమస్యలను వేదికపైనే పరిష్కరించేలా అధికారుల ను ఆదేశించామని, మిగతావి వారంనుంచి మూడు నెలల్లోపరిష్కరిస్తామని వెల్లడించారు. రెండేళ్ల క్రితం పోలిస్తే నియోజకవర్గంలో అనేక అభివృద్ధి పనులు చేశామని, ఇంకా కొన్ని రోడ్లు వేయాల్సి ఉందని, ఆ పనులు కూడా పూర్తయ్యాకే ప్రజల ముందుకు వచ్చి ఓట్లు అడుగుతానని పొంగులేటి స్పష్టం చేశారు. మాటలు చెప్పడం కాదు.. పనిచేసి చూపించడమే తన నైజమని ఉద్ఘాటించారు. కలెక్టర్ దివాకర టీ.ఎస్. మాట్లాడుతూ.. ఇప్పటివరకు క్లస్టర్ స్థాయిలో నిర్వహించిన ప్రజాదర్బార్ల ద్వారా సుమారు 16 వేల దరఖాస్తులు అందాయని తెలిపారు. ఇందులో ప్రతీ దరఖాస్తును అత్యంత ప్రాధాన్యతతో పరిశీలిస్తూ ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. కాగా, ఇందిరమ్మ ఇల్లు మంజూరైన లబ్ధిదారురాలు జయలక్ష్మి, మమత మాట్లాడుతూ.. ప్రస్తుతం సొంత ఇంట్లో ఆనందంగా జీవిస్తున్నామ ని తెలిపారు. అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ, ఏదులాపురం మున్సిపల్ చైర్పర్సన్ పి.అనిత, మద్దులపల్లి మార్కెట్ చైర్మన్ హరినాథ్బాబు, కేఎంసీ, ఏదులాపురం కమిషనర్లు అభిషేక్ అగస్త్య, శ్రీనివాసరెడ్డి, అడిషనల్ డీసీపీ రామానుజం, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. జూన్లో వనజీవి స్మారకవనానికి శంకుస్థాపన పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా లక్షలాది మొక్కలు నాటి సంరక్షించిన పద్మశ్రీ వనజీవి రామయ్య స్మారక వనానికి జూన్లో శంకుస్థాపన చేయనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ప్రజాదర్భార్లో రామయ్య సతీమణి జానమ్మ మంత్రిని కలిసి తన గోడు చెప్పుకోగా మంత్రి స్పందించారు. స్మారకవనం ఏర్పాటుకు తక్షణమే స్థలాన్ని సేకరించాలని కలెక్టర్ దివాకర టీ.ఎస్.ను ఆయన ఆదేశించారు. -
మొక్కజొన్న పొలాల్లో అగ్నిప్రమాదం
ఖమ్మంఅర్బన్: ఖమ్మం నగర పరిసరాల్లో గురువారం రెండు చోట్ల మొక్కజొన్న పొలాల్లో మంటలు చెలరేగాయి. గొల్లగూడెం–రాజన్నపేట వెళ్లే దారిలోని మొక్కజొన్న పొలాల్లో గుర్తుతెలియని వ్యక్తులు నిప్పంటించినట్లు తెలిసింది. వడగాలులకు మంటలు వేగంగా వ్యాపించి పొలాల్లోని డ్రిప్ ఇరిగేషన్ పైపులు కాలిపోయాయి. అదే సమయాన వీ.వీ.పాలెం సొసైటీ పరిధి అల్లీపురం–పుట్టకోట రోడ్డులోని మొక్కజొన్న కొనుగోలు కేంద్రం సమీపాన కూడా మంటలు చెలరేగాయి. కేంద్రంలో వేల బస్తాల మొక్కజొన్న నిల్వ ఉండటంతో రైతులు ఆందోళన చెందారు. ఈమేరకు సొసైటీ చైర్మన్ రావూరి సైదుబాబు ఇచ్చిన సమాచారంతో అగ్నిమాపక శాఖ సిబ్బంది చేరుకుని మంటలను ఆర్పడంతో ప్రమాదం తప్పింది. -
రైతు సమస్యలపై దేశవ్యాప్త ఆందోళన
ఇల్లెందు: దేశ వ్యాప్తంగా రైతుల పాత రుణాలు రద్దు చేయాలని, వడ్డీ లేని రుణాలు అందజేయాలని, సాగుకు సమగ్ర ఖర్చుల ప్రాతిపదికన కనీస మద్దతు ధరలను నిర్ణయించి గ్యారంటీ చట్టాన్ని చేయాలని అఖిల భారత ఐక్య రైతు సంఘం(ఏఐయూకేఎస్) జాతీయ అధ్యక్ష, కార్యదర్శులు విమల్ త్రివేది, కిచ్చెల రంగయ్య డిమాండ్ చేశారు. గురువారం ఇల్లెందులోని చండ్ర కిష్ణమూర్తి విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మహాసభల తీర్మానాలను వెల్లడించారు. రైతాంగ సమస్యల పరిష్కారం కోసం జూన్ 1 నుంచి 7 వరకు దేశ వ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చినట్లు తెలిపారు. 2026–27 ఖరీఫ్ సీజన్కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధరలు లోపభూయిష్టంగా ఉన్నాయని, కార్మిక చట్టాల స్థానంలో నాలుగు లేబర్ కోడ్లు తీసుకురావడాన్ని తీవ్రంగా ఖండించారు. కల్తీ లేని విత్తనాలు సరఫరా చేయాలని, రబీలో తడిచిన మొక్కజొన్నను కొనుగోలు చేయాలని, పోలవరం నిర్వాసితులకు పరిహారం అందించాలని, ఆదివాసీలపై అక్రమ కేసులను రద్దు చేయాలని కోరారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్, వెనిజుల, క్యూబా ఇతర దేశాలపై దాడులను తీవ్రంగా ఖండించారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య, చండ్ర అరుణ, అమర్లపూడి రాము, బుర్ర వెంకన్న తదితరులు పాల్గొన్నారు. -
ఉరి వేసుకుని యువతి ఆత్మహత్య
ఖమ్మంరూరల్: ఏదులాపురం మున్సిపాలిటీ పరిధి శ్రీసిటీకి చెందిన పయ్యావుల ఉమామహేశ్వరి(17) ఇంట్లో ప్యాన్కు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఆమె తల్లి అనారోగ్యం బారిన పడగా బాధపడుతున్న ఉమామహేశ్వరి చదువులో ఒత్తిడి ఎదుర్కొంటోందని సమాచారం. దీంతో బుధవా రం రాత్రి ఇంట్లో ఫ్యాన్కు ఉరి వేసుకోగా, కొంతసేపటికి గుర్తించిన కుటుంబ సభ్యులు ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం మృతి చెందింది. ఆమె తండ్రి ఫిర్యాదు మేరకుతో కేసు నమోదు చేసినట్లు సీఐ ముష్క రాజు తెలిపారు. ఎలుకల పేస్ట్ తిని వృద్ధురాలు.. మండలంలోని ఎం.వెంకటాయపాలెంకు చెందిన వడ్లమూడి గురవమ్మ(75) ఎలుకల పేస్ట్ తిని ఆత్మహత్య చేసుకుంది. వృద్ధాప్యానికి తోడు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె ఈనెల 9న ఎలుకల పేస్ట్ తిని అపస్మారక స్థితిలోకి వెళ్లింది. కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేర్పించగా పరిస్థితి గురువారం మృతి చెందడంతో కేసు నమోదు చేసినట్లు సీఐ ముష్క రాజు తెలిపారు. వాగులో మునిగి యువకుడు మృతి బోనకల్: మండలంలోని ఆళ్లపాడుకు చెందిన ముంగి వెంకట్రావు(20) ఈతకు వెళ్లగా ప్రమాదవశాత్తు నీట మునిగి మృతి చెందాడు. కూలీ పనులతో జీవనం సాగించే ఆయన గురువారం స్నేహితులతో కలిసి కలకోటలోని పెద్దవాగు వద్దకు వెళ్లాడు. అక్కడ ఈతకు దిగగా, ఇటీవల రోడ్డు పనుల కోసం తవ్విన గుంతలో నీరు నిల్వ ఉన్న విషయం తెలియక మునిగిపోయాడు. స్నేహితులు ఆయనను బయటకు తీసి 108లో మధిర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. గేదెలను కాపాడబోయి రైతు.. తల్లాడ: మండలంలోని కుర్నవలిలో వాగులో పడిన గేదెలను కాపాడే క్రమాన నీట మునిగి ఓ రైతు మృతి చెందాడు. గ్రామానికి చెందిన గొర్రెపాటి పుల్లారావు(33) గేదెలను గురువారం ఉదయం కుర్నవల్లి వాగు సమీపాన మేతకు తీసుకెళ్లాడు. అక్కడ నీళ్ల కోసం గేదెలు వాగులోకి దిగాయి. అవి లోతులోకి వెళ్తుండడంతో కాపాడేందుకు పుల్లారావు వాగులోకి దిగాడు. అక్కడ గుండాన్ని గమనించక ఆయన మునిగిపోయి మృతి చెందాడు. సమీప రైతులు కాసేపటికి ఈ విషయాన్ని గుర్తించి ఆయన మృతదేహాన్ని బయటకు తీశారు. పుల్లారావుకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. -
చేపల కోసం తూముల ధ్వంసం
కల్లూరురూరల్: చెరువుల నిండా నీరు ఉండడంతో వచ్చే సీజన్లో వర్షాలు ఆలస్యమైనా సాగుకు డోకా ఉండదని రైతులు ఆశతో ఉన్నారు. కానీ, కొందరు చెరువులోవేట కష్టంగా మారిందని తూములు పగలగొట్టి నీటిని బయటకు వృథాగా పంపిన వైనమిది. కల్లూరు మండలంలోని చిన్నకోరుకొండి, వేంపల్లి చెరువులో చేపలు పెంచతున్న వ్యాపారులు నీళ్లు నిండుగా ఉండడం వేట ఆలస్యమవుతోందని భావించినట్లు తెలిసింది. దీంతో మంగళవారం రాత్రి తూములు పగలగొట్టి పక్కనే ఉన్న వరిమడుల్లోకి నీరు వదిలిపెట్టారు. ఫలితంగా ఆయకట్టు పరిధిలోకి చేరిన నీటిని బుధవారం ఉదయం రైతులు గుర్తించి సమాచారం ఇవ్వగా జల వనరుల శాఖ డీఈ వెంకటేశ్వరరావు, ఏఈ చేరుకుని అడుకట్ట వేయించారు. వరి మడులు నీటితో నిండడంతో దుక్కులు దున్నే అవకాశం లేదని, ఖరీఫ్లో వర్షాలు ఆలస్యమైతే పరిస్థితి ఏమిటని రైతులు ఆవేదన చెందుతున్నారు. కాగా, తూములు పగలగొట్టిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కొణిజర్ల మండలంలో... కొణిజర్ల: చేపల వేట కోసం కొందరు చెరువులో నీరు ఖాళీ చేస్తున్నారు. కొణిజర్లలోని ఊర చెరువు, చీకటి చెరువులో రెండు రోజులుగా రెండు తూముల ద్వారా భారీగా నీరు బయటకు పంపిస్తున్నారు. ఏటా చేపల వేట కోసం చెరువులో నీటిని వృథా చేస్తున్నా ఒకరిద్దరు రైతులు మినహా అటు ప్రజాప్రతినిధులు కానీ, జలవనరుల శాఖ అఽధికారులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. వేసవిలో పశువులకు తాగునీరు, వానాకాలంలో రైతులు నార్లు పోసుకునేందుకు చెరువులో నీరు ఉండాలి. కానీ చేపల వేటగాళ్లు ఎవరికీ అనుమానం రాకుండా రాత్రివేళ తూములు తెరిచి నీళ్లు బయటకు వదులుతున్నారు. ఫలితంగా చెరువులు ఖాళీ కావడమే కాక నీరు వృథాగా పొలాల్లోకి, ఏటిలోకి చేరుతోంది. ఇకనైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి చెరువులు ఖాళీ చేయకుండా పర్యవేక్షించాలని రైతులు కోరుతున్నారు. -
● గోదాముల కొరత
ఖమ్మంవ్యవసాయం: మొక్కజొన్నల నిల్వలకు గోదాముల సమస్య తలెత్తింది. జిల్లాలో 1.99 లక్షల మెట్రిక్ టన్నుల మక్కలు కొనుగోలు చేయాలని ప్రభుత్వం మార్క్ఫెడ్ను ఆదేశించింది. ఇప్పటివరకు 40 కేంద్రాల ద్వారా 1.89 లక్షల మెట్రిక్ టన్నుల పంట కొనుగోలు చేశారు. కానీ జిల్లాలో అవసరమైన గోదాములు లేక ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో నూతనంగా నిర్మించిన మిర్చి మోడల్ మార్కెట్లోని ఐదు షెడ్లలో 25వేల మెట్రిక్ టన్నుల పంట నిల్వ చేశారు. ఆపై ఖమ్మం రూరల్ మండలం మద్దులపల్లి మార్కెట్లోని షెడ్లలో 3 వేల మెట్రిక్ టన్నులు, కూసుమంచి మండలం కల్లూరుగూడెం గోదాముల్లో కూడా నిల్వ చేస్తున్నారు. అయినా ఇంకా పంట ఉండడంతో రైస్ మిల్లులు, ఫంక్షన్ హాళ్లు, పాత సినిమా హాళ్లను పరిశీలిస్తున్నారు. ఇవికాక పొరుగు జిల్లాలైన సూర్యాపేట, నల్లగొండ, ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా చిలుకూరు ప్రాంతాల్లో ఉన్న గోదాములను లీజ్కు తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. -
కొనుగోలు చేసిన ధాన్యం మిల్లులకు..
కొణిజర్ల: రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని గురువారం మిల్లులకు తరలిస్తామని పౌర సరఫరాల సంస్థ జిల్లా ఇన్చార్జ్ మేనేజర్ సునీల్రెడ్డి తెలిపారు. మండలంలోని లాలాపురంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం ఆయన తహసీల్దార్ ఎన్.అరుణ, ఏఓ డి.బాలాజీతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులు ధాన్యాన్ని మిల్లులకు తరలించాక క్వింటాకు 10 కేజీల తరుగు కింద తీస్తున్నారని, అందుకు ఒప్పుకుంటేనే మిల్లర్లు దిగుమతి చేసుకుంటున్నారని చెప్పారు. అంతేకాక దిగుమతి ఆలస్యమైన లారీల అద్దె కూడా తమపైనే వేస్తున్నారని తెలిపారు. ఇకనైనా స్పందించి కొనుగోళ్లలో వేగం పెంచి సరిపడా లారీలు సమకూర్చాలని కోరగా సునీల్రెడ్డి ప్రతీ బస్తా మిల్లుకు తరలించేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. -
ఖమ్మం ప్రజల ఆశీస్సులతోనే ఈ స్థాయికి..
ఖమ్మంఅర్బన్: దివంగత సీఎం ఎన్టీఆర్ ఆశీస్సులు, తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల సహకారానికి తోడు ఖమ్మం జిల్లా ప్రజల ప్రేమాభిమానాలతోనే తాను ఈ స్థాయికి చేరానని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. మంత్రిగా తొలిసారి ఆయన ప్రమాణ స్వీకా రం చేసి 40 ఏళ్లు పూర్తయిన సందర్భంగా బుధవారం ఖమ్మం డిగ్రీ కాలేజీ మైదానంలో ఏర్పాటు చేసిన అభినందన సభలో తుమ్మల మాట్లాడారు. సామాన్యుడినైన తనకు గత 45 ఏళ్లుగా అవకాశాలు కల్పించిన ప్రజలు, ప్రోత్సహించిన నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలకు, తాను ఉన్న వ్యవస్థ, నాయకత్వానికి చేదోడుగా నిలుస్తూ, అధికారాన్ని సామాన్యులు, కష్టజీవుల సంక్షేమానికి వినియోగిస్తానని చెప్పారు. నిజాయితీతో కూడిన రాజకీయాలకే తాను కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. కాగా, మంత్రి తుమ్మల తన ప్రసంగంలో భావోద్వేగానికి లోనయ్యారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ.. ప్రజాసేవే లక్ష్యంగా మంత్రి తుమ్మల పని చేశారని తెలిపారు. ఎన్నికల సమయంలోనే కాక సాధారణ రోజుల్లోనూ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని కొనియాడారు. ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య మాట్లాడుతూ.. ఆదివాసీల అభివృద్ధికి తుమ్మల కృషి చేశారని తెలిపారు. ఆదివాసీల సంక్షేమం, గ్రామాల అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనపై శ్రద్ధ చూపారని చెప్పారు. ఇంకా సభలో వివిధ పార్టీలు, ఉద్యోగ, ప్రజాసంఘాల నాయకులు బాగం హేమంతురావు, ఎండీ.సలాం, డాక్టర్ వాసిరెడ్డి రామ నాథం, గడిపల్లి కవిత, ఏలూరి శ్రీనివాసరావు, నూతి సత్యనారాయణ, రాయల నాగేశ్వరరావు తదితరులు మాట్లాడారు. ఇంకా కార్యక్రమంలో శ్రీవాసవి కన్యకాపరమేశ్వరి ఆలయ అధ్యక్షులు మేళ్లచెరువు వెంకటేశ్వరరావుతో పాటు నాయకులు తుమ్మల యుగంధర్, నాగండ్ల దీపక్చౌదరి, పువ్వాళ్ల దుర్గాప్రసాద్, రావూరి సైదబాబు, సాధు రమేశ్రెడ్డి, చండ్రా రాంబాబు, గుత్తా వెంకటేశ్వర్లు, యరగర్ల హనుమంతురావు, దిరిశాల చిన్న వెంకటేశ్వర్లు, సంక్రాంతి నాగేశ్వరరావు, దేవ్సింగ్, దండి సురేశ్ తదితరులు పాల్గొన్నారు. తొలుత నాయకన్గూడెం నుంచి సభావేదిక వద్దకు ర్యాలీగా చేరుకోగా, మార్గమధ్యలో ఎన్టీఆర్ విగ్రహానికి తుమ్మల పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఖమ్మంసహకారనగర్: మంత్రిగా 40 ఏళ్ల ప్రస్థానం పూర్తయిన సందర్భంగా తుమ్మల నాగేశ్వరరావును టీజేఏసీ బాధ్యులు బుధవారం సన్మానించారు. టీజేఏసీ రాష్ట్ర సెక్రటరీ జనరల్ ఏలూరు శ్రీనివాసరావు, జిల్లా చైర్మన్, టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు గుంటుపల్లి శ్రీనివాసరావు, కార్యదర్శి కొణిదెన శ్రీనివాసరావు, జైపాల్, రుక్మారావు తదితరులు పాల్గొన్నారు. అభినందన సభలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు -
మక్కల నిల్వలకు అదనపు గోదాములు
ఖమ్మంవ్యవసాయం: మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేసిన మొక్కజొన్నల నిల్వ కోసం ప్రస్తుతం అందుబాటులో ఉన్న గోదాంలే కాక అదనపు గోదాంలను సిద్ధం చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ దివాకర టీ.ఎస్ తెలిపారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో మొక్కజొన్న నిల్వలను బుధవారం ఆయన అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కాంటాలు కాగానే గోదాంలకు మక్కలు తరలించేలా సరిపడా హమాలీలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అందుబాటులో ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ గోదాంలను పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకురావాలని తెలిపారు. ఖమ్మం మార్కెట్ చైర్మన్ యరగర్ల హన్మంతరావు, వైస్ చైర్మన్ తల్లాడ రమేష్, జిల్లా మార్కెటింగ్ అధికారి అలీం తదితరులు పాల్గొన్నారు. సాఫీగా ధాన్యం కొనుగోళ్లు కూసుమంచి: రైతులు ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోళ్లు సాఫీగా సాగేలా అధికారులు పర్యవేక్షించాలని కలెక్టర్ దివాకర ఆదేశించారు. పాలేరులో ఐకేపీ ఆధ్వర్యాన ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సీపీ సునీల్దత్, అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డితో కలిసి ఆయన తనిఖీ చేశారు. అకాల వర్షాలతో రైతులు నష్టపోకుండా ధాన్యాన్ని కాంటా వేసి మిల్లులకు తరలించాలని తెలిపారు. ఆపై ఆన్లైన్లో నమోదు చేస్తే రైతులకు సకాలంలో నగదు జమ అవుతుందని చెప్పారు. ఎండల దృష్ట్యా కేంద్రాల్లో తాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లను సమకూర్చాలని ఆదేశించారు. జిల్లా పౌర సరఫరాల సంస్థ ఇన్చార్జి మేనేజర్ సునీల్రెడ్డి, డీఆర్డీఓ శ్రీరాం, జిల్లా పౌర సరఫరాల శాఖాధికారి చందన్కుమార్, తహసీల్దార్ సైదులు పాల్గొన్నారు.కలెక్టర్ దివాకర టీ.ఎస్. -
గిన్నిస్ రికార్డ్ ప్రదర్శనలో రిటైర్డ్ కండక్టర్
మధిర: మధిరకు చెందిన రిటైర్డ్ ఆర్టీసీ కండక్టర్ రెంటపల్లి ఫ్రాన్సిస్ గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించాడు. హైదరాబాద్లో ఫిబ్రవరి 2న జరిగిన కార్యక్రమంలో 22 దేశాల నుంచి 2 వేల మంది కీబోర్డు ప్రదర్శన ఇచ్చారు. ఇందులో ప్రతిభ కనబర్చిన 777 మందిని రికార్డుకు ఎంపిక చేయగా ఫ్రాన్సిస్కు స్థానం దక్కింది. ఈ మేరకు 8వ తేదీన విజయవాడలో హల్లెల్ మ్యూజిక్ స్కూల్ వ్యవస్థాపకులు దండంగి అగస్టీన్ ఆయనకు రికార్డు పత్రం, పతకాన్ని బహూకరించారు. హెచ్పీఎస్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం ఖమ్మంమయూరిసెంటర్: రామాంతపూర్, బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూళ్లలో మొదటి తరగతిలో ప్రవేశానికి అర్హులైన ఎస్సీ విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖాధికారి జి.జ్యోతి తెలిపారు. జిల్లాకు రెండు సీట్లు కేటాయించగా.. రామాంతపూర్, బేగంపేటలో ఒక్కో సీటు అందుబాటులో ఉందని వెల్లడించారు. వయస్సు, వార్షిక ఆదా యం ఆధారంగా అన్ని సర్టిఫికెట్లతో కలెక్టరేట్ లోని తమ కార్యాలయంలో ఈ నెల 29వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా దరఖాస్తులు అందించాలని సూచించారు. జిల్లా కోటా కంటే ఎక్కువ దరఖాస్తులు వస్తే జూన్ 1వ తేదీన లాటరీ ద్వారా విద్యార్థులను ఎంపిక చేస్తామని తెలిపారు. ఆయిల్పామ్ సాగుతో లాభాలుఖమ్మంఅర్బన్: ప్రస్తుత పరిస్థితుల్లో సంప్రదాయ పంటలకు బదులు ఆయిల్పామ్ సాగు రైతులకు లాభదాయకంగా మారుతోందని రాష్ట్ర ఉద్యాన శాఖ డైరెక్టర్ యాస్మిన్బాషా తెలిపారు. జిల్లా పర్యటనలో భాగంగా బాలాపేటలోని పలువురు రైతుల ఆయిల్పామ్ క్షేత్రాలను బుధవారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడుతూ.. ఆయిల్పామ్ సాగుచేస్తే తక్కువ నిర్వహణ ఖర్చు లతో అధిక ఆదాయం పొందే అవకాశముందని తెలిపారు. శాఖ జాయింట్ డైరెక్టర్ సరోజినీదేవి, జిల్లా ఉద్యాన శాఖాధికారి ఎంవీ మధుసూదన్, పట్టు పరిశ్రమశాఖ డీడీ ముత్యాలు, రైతులు మానుకొండ రాధాకిశోర్, కుర్ర సతీశ్ తదితరులు పాల్గొన్నారు. -
మోదీ విధానాలు దేశానికి ప్రమాదకరం
ఖమ్మంమయూరిసెంటర్: ప్రధాని మోదీ అవలంబిస్తున్న విధానాలు దేశానికి ప్రమాదకరంగా మారుతున్నాయని సీపీఐ జాతీయ సమితి సభ్యుడు బాగం హేమంతరావు అన్నారు. పార్టీ జిల్లా సమితి సమావేశం బుధవారం ఖమ్మంలో జరగగా ఆయన మాట్లాడారు. ఓట్ల తొలగింపు, ఎన్నికల కమిషన్ విధానం, ప్రలోభాలు తదితర అంశాలు బీజేపీ గెలుపు వెనక దాగి ఉన్నాయన్నారు. దేశంలో ధరలు పెరుగుతుండగా, ఇతర సమస్యలను పరిష్కరించకుండా ప్రతీ సమస్యకు కర్మ ఫలమే పరిష్కారమనే వాదనను బీజేపీకి తెరపైకి తీసుకొస్తోందని తెలిపారు. సమస్యలను పరిష్కరించకుండా హిందుత్వ నినాదంతో ప్రజల మధ్య విభజన రేఖ తీసుకురావడం ద్వారా లబ్ధి పొందాలనే లక్ష్యం దాగి ఉందని చెప్పారు. కాగా, రాష్ట్రంలో రైతు భరోసా పూర్తిస్థాయిలో అందక రైతులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని తెలిపారు. అంతేకాక ధాన్యం, మొక్కజొన్నల కొనుగోళ్లలోనూ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. మొక్కజొన్నలు కొని రెండు నెలలు దాటినా రైతుల ఖాతాల్లో నగదు జమ కావడం లేదని తెలిపారు. కాగా, పార్టీ ప్రజా సంఘాల బలోపేతమే లక్ష్యంగా పనిచేయాలని హేమంతరావు కోరారు. జిల్లా కార్యదర్శి దండి సురేశ్ కార్యక్రమాల నివేదికను ప్రవేశపెట్టగా పార్టీ రాష్ట్ర కంట్రోల్ కమిషన్ చైర్మన్ మహ్మద్ మౌలానా, నాయకులు జమ్ముల జితేందర్రెడ్డి, పావులూరి మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు. సీపీఐ జిల్లా కౌన్సిల్ సమావేశంలో హేమంతరావు -
మరింత వేగంగా అభివృద్ధి పనులు
మధిర: మధిర మున్సిపాలిటీ పరిధిలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను మరింత వేగంగా చేపట్టాలని అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ సూచించారు. మధిరలో అభివృద్ధి పనులను బుధవారం పరిశీలించిన ఆమె అధికారులతో సమీక్షించారు. పనులు వేగంగా చేపట్టడమే కాక నాణ్యత లోపించకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. పనుల సమయాన ప్రజలు ఇబ్బంది పడకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయించాలని తెలిపారు. మున్సిపల్ చైర్పర్సన్ సామినేని సుజాత రామనాథం, కమిషనర్ సంపత్ కుమార్, నాయకులు, కౌన్సిలర్లు మిర్యాల వెంకటరమణ గుప్తా, వేమిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, పారుపల్లి విజయకుమార్, తలుపుల వెంకటేశ్వర్లు, బాణావత్ వెంకటరమణ నాయక్, యన్నం కోటేశ్వరరావు, దోర్నాల రవికుమార్, బండారు నరసింహారావు, మైలవరపు చక్రి పాల్గొన్నారు. -
జిల్లా.. గరం, గరం
ఖమ్మంవ్యవసాయం: జిల్లాలో ఉష్ణోగ్రతలు నానాటికీ పెరుగుతుండడంతో అగ్నిగుండాన్ని తలపిస్తోంది. కొద్ది రోజులుగా 40 – 45 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా, బుధవారం గరిష్టంగా 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఉదయం 8గంటలకే మొదలవుతున్న ఎండ గంటగంటకు పెరుగుతూ మధ్యాహ్నం వడగాలులు కూడా వీస్తున్నాయి. ఇక ఉదయం, రాత్రి తేడా లేకుండా ఏసీలు, కూలర్లు వినియోగిస్తుండడంతో విద్యుత్ వినియోగం పెరిగి అంతరాయాలు చోటు చేసుకుంటున్నాయి. సరఫరాలో ఎలాంటి సమస్య లేదని, విద్యుత్ వినియోగం పెరగడంతో అవాంతరాలు వస్తున్నాయని ఉద్యోగులు చెబుతున్నారు. తిమ్మారావుపేటలో గరిష్టం ఏన్కూరు మండలం తిమ్మారావుపేటలో బుధవారం గరిష్టంగా 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే, బాణాపురంలో 43.8, గుబ్బగుర్తిలో 43.7, సిరిపురంలో 43.5, పమ్మిలో 43.3, ఏన్కూరులో 43.1, చింతకాని, ఎర్రుపాలెంలో 42.4, పెద్దగోపతిలో 42.2, గౌరారంలో 42.1 ఉష్ణోగ్రత నమోదైంది. ఇక కల్లూరులో 41.9, నేలకొండపల్లి, ఖమ్మం ఖానాపురం, ప్రకాష్నగర్ల్లో 41.8, కూసుమంచి, రావినూతలలో 41.7, తల్లాడ, కొణిజర్లలో 41.6, వైరాలో 41.5, వైరాలో 41.4, కుర్నవల్లిలో 41.3, నాగులవంచ, ఖమ్మం కలెక్టరేట్ వద్ద 41.2, మధిర 41.1, పల్లెగూడెం, ముదిగొండలో 41, పెనుబల్లిలో 40.8, బచ్చోడు, తిరుమలాయపాలెంలో 40.7, గేటు కారేపల్లి, మధిరలో 40.6, పంగిడిలో 40.5, లింగాల 40.3, రఘునాథపాలెంలో 40.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జనానికి అవస్థలు ఎండ తీవ్రతతో మధ్యాహ్నం వేళ జనం బయటకు రావాలంటే జంకుతున్నారు. దీంతో ప్రధాన రహదారులు బోసిపోయి కనిపిస్తున్నాయి. రేకులు, పెంకుటిళ్లలో నివసించేవారే ఎండ తీవ్రతకు అల్లాడిపోతున్నారు. ప్రధానంగా రైతులు, కూలీలు, నిర్మాణ రంగ కార్మికులు పనుల్లో ఇబ్బంది పడుతున్నారు. ఎండల కారణంగా ఇటీవల వడదెబ్బ బారిన పడుతున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది. ఈనేపథ్యాన నిర్మాణ రంగం. వ్యవసాయ కూలీలు, ఉపాధి హామీ పనులకు వెళ్లే వారు ఎండ తీవ్రత నేపథ్యాన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు.గరిష్టంగా 44 డిగ్రీల ఉష్ణోగ్రత -
ప్రతీ దరఖాస్తుకు పరిష్కారం చూపుతాం
కూసుమంచి: ‘ఇది ప్రజల ప్రభుత్వం.. యంత్రాంగమే మీ ముందుకు వచ్చి దరఖాస్తులు స్వీకరిస్తోంది.. ప్రతీ సమస్యకు పరిష్కారం చూపే బాధ్యత తీసుకుంటున్నందున ధైర్యంగా ఉండాలి’ అని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సూచించారు. కూసుమంచి మండలం జీళ్లచెరువులో బుధవారం నిర్వహించిన ప్రజాదర్బార్లో ఆయన కలెక్టర్ దివాకర టీ.ఎస్.తో కలిసి ప్రజల నుంచి వినతులు, దరఖాస్తులు స్వీకరిస్తారు. అనంతరం మంత్రి పొంగులేటి మాట్లాడుతూ ప్రజలకు పాలన మరింత చేరువ చేసేందుకు పాలేరు నియోజకవర్గంలో ప్రజాదర్బార్కు శ్రీకారం చుట్టామని తెలిపారు. ప్రతీ మండలాన్ని మూడు క్లస్టర్లుగా విభజించి ప్రజాదర్బార్ నిర్వహిస్తుండగా ఇప్పటి వరకు పది క్లస్టర్లలో జరిగాయన్నారు. కొన్ని సమస్యలను అక్కడికక్కడే పరిష్కరిస్తుండగా, మిగిలిన వాటిని మూడు నెలల్లో పరిష్కరించడమే లక్ష్యంగా నిర్దేశించామని తెలిపారు. రాష్ట్రంలోని పేదలందరికీ గూడు సమకూర్చాలనే భావనతో ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నామన్నారు. త్వరలోనే రెండో విడత ఇళ్ల మంజూరు ఉంటుందని తెలిపారు. రైతుల భూసమస్యల పరిష్కారం కోసం భూభారతి పోర్టల్ను తీసుకొచ్చామని వెల్లడించారు. పాలేరు నియోజకవర్గంలో అన్ని వసతులు కల్పించి అన్ని రంగాల్లో అభివృద్ది చేయడమే తన లక్ష్యమని మంత్రి పొంగులేటి తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డితో పాటు వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఇందిరమ్మ గృహప్రవేశంలో... నేలకొండపల్లి: నేలకొండపల్లి ఎస్సీ, బీసీ కాలనీలో నిర్మాణం పూర్తయిన ఇందిరమ్మ గృహ ప్రవేశం బుధవారం జరగగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారురాలు అందిమళ్ల నాగరాణి ఇంటిని ప్రారంభించి నూతన వస్త్రాలు అందజేశారు. ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న సొంతింటి కల నెరవేర్చిన మంత్రికి రుణపడి ఉంటామని ఆమె తెలిపారు. అలాగే, ఆచార్లగూడెంలో నిర్మించిన ఆలయంలో మంత్రి పూజలు చేసి అన్నదానాన్ని ప్రారంభించారు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కొడాలి గోవిందరావు, సర్పంచ్ కొలికపొంగు ఉప్పలమ్మతో పాటు నాయకులు పాల్గొన్నారు. -
అగచాట్లు
అడ్డంకులు..ముదిగొండ సొసైటీలో ఆన్లైన్ కోసం వేచి ఉన్న రైతులు సాక్షి ప్రతినిధి, ఖమ్మం: కొనుగోళ్లలో జాప్యం, అడుగడుగునా సమస్యలతో మొక్కజొన్న ఎందుకు సాగు చేశామా అని రైతులు ఆవేదన చెందుతున్నారు. కోత మొదలు గోదాంకు తరలించే వరకు ఎదురవుతున్న అడ్డంకులు వారిని ఇబ్బంది పెడుతున్నారు. ఇవి ఇలా కొనసాగుతుండగానే ప్రభుత్వం తాజాగా ఒక సొసైటీ రోజుకు 2వేల క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేయాలని చెప్పినట్లు తెలుస్తుండడం గుదిబండలా మారనుంది. వీటన్నింటికీ తోడు కౌలు రైతులను ఆన్లైన్ సమస్య వేధిస్తోంది. ఆన్లైన్లో జాప్యం ఈ యాసంగిలో ఉమ్మడి జిల్లాలో 2.43 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేయగా, ఎకరానికి 40 – 45 క్వింటాళ్ల దిగుబడి వచ్చినా ప్రైవేట్ వ్యాపారులు క్వింటాకు రూ.1,700కు మించి ధర పెట్టలేదు. దీంతో ప్రభుత్వం క్వింటాకు రూ.2,400 మద్దతు ధరతో మార్క్ఫెడ్ ద్వారా కొనుగోళ్లకు సిద్ధమైంది. ఇక అడపాదడపా కురిసిన అకాల వర్షాలతో మొక్కజొన్న పంట కిందకు వాలింది. దీంతో కింద పడ్డ కంకులు మిషన్తో కోయడం సాధ్యం కాక కూలీల రూపంలో అదనపు భారం పడింది. ఆపై పంట అమ్ముకునేందుకు వెళ్తే సకాలంలో ఆన్లైన్ కాక రైతులు రోజుల తరబడి వేచి ఉంటున్నారు. ఇక కౌలు రైతులు పాస్పుస్తకం, ఆధార్కార్డుతో వెళ్లి ఏఈఓ దగ్గర ధ్రువపత్రం తీసుకున్నాక ఆన్లైన్లో డీఎం అనుమతి తీసుకోవాలి. ఆతర్వాత సొసైటీలో వేలిముద్ర వేయడానికి చాలా సమయం పడుతోంది. సర్వర్ మొరాయిస్తుండడంతో జాప్యం జరుగుతుండగా.. కొన్నిచోట్ల ఏఈఓలు చేసిన క్రాప్ బుకింగ్, క్షేత్రస్థాయి పంటకు తేడా రావడంతో ఇబ్బంది పడుతున్నారు. కాంటాలు కాక.. లారీలు లేక.. కొనుగోలు కేంద్రాలకు మక్కలు తీసుకొచ్చిన రైతులు కాంటాల కోసం రోజుల తరబడి నిరీక్షిస్తున్నారు. గన్నీ బ్యాగ్లు ఇవ్వకపోవడంతో రైతులే రూ.26 చొప్పున కొనుగోలు చేయాల్సి వస్తోంది. కొన్నిచోట్ల కల్లాల్లో మొక్కజొన్నలను నిల్వ చేయగా.. ఎండ వేడికి నిప్పంటుకుంటోంది. ఇలాగే బోనకల్, చింతకాని మండలాల్లో పంట అగ్నికి ఆహుతైంది. మరోపక్క లారీల కొరతతో గోదాంలకు తరలింపులో జాప్యం జరుగుతోంది. స్థానికంగా గోదాంలకై తే టన్నుకు రూ.450, సూర్యాపేటలోని గోదాంలకు రూ.500 నుంచి రూ.550 మాత్రమే లారీలకు ఇస్తున్నారు. కానీ అన్లోడ్ చేయడానికి రోజుల తరబడి వేచి ఉండాల్సి రావడంతో లోడ్కు రూ.16వేలే వేస్తున్నాయంటూ లారీల యాజమానులు ముందుకు రావడం లేదు. క్వింటాకు రూ.100 నుంచి రూ.120 ఇచ్చే రైతుల సరుకు తీసుకెళ్తుండగా, అలా ఇవ్వలేని రైతులు పడిగాపులు కాస్తున్నారు. రెండు వేల క్వింటాళ్లేనట.. మార్క్ఫెడ్ తాజాగా కొత్త నిబంధన అమలులోకి తెచ్చినట్లు తెలుస్తోంది. కాంటా అయిన మొక్కజొన్నలను తీసుకెళ్లిన లారీలు రకరకాల కారణాలతో గోదాంల వద్ద నిలిచిపోతున్నాయి. దీంతో ఒక్కో సొసైటీ రోజుకు రెండు వేల క్వింటాళ్లే కొనుగోలు చేయాలనే నిబంధన తీసుకొచ్చినట్లు సమాచారం. అంతవరకే ట్రక్ షీట్లు జారీ చేస్తుండడం రైతులు వేచి ఉంటున్నారు. ఇదంతా ఒక ఎత్తయితే విక్రయించిన పంటకు సకాలంలో నగదు జమ కాక రైతులు ఆవేదన చెందుతున్నారు.మొక్కజొన్న విక్రయానికి రైతుల అవస్థలు


